సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మౌలానా అబుల్ కలాం ఆజాద్ వర్ధంతి నిర్వహించారు. మౌలానా అబుల్ కలాం ఆజాద్ చిత్రపటానికి పూలమాలలు వేసి వైఎస్సార్సీపీ నేతలు నివాళులర్పించారు. వైఎస్సార్సీపీ గ్రీవెన్స్ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు నారాయణమూర్తి, ఎస్సీ సెల్ నేత కొమ్మూరి కనకారావు, స్టూడెంట్స్ వింగ్ వర్కింగ్ ప్రెసిడెంట్ రవిచంద్ర తదితరులు హాజరయ్యారు.



