సాక్షి,తాడేపల్లి:చంద్రబాబు హయాంలో రాష్ట్రానికి రాబడులు తగ్గాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ఆర్థిక విధ్వంసంపై విమర్శలు గుప్పించారు.
రాష్ట్ర ఆదాయం తగ్గింది.. అప్పులు పెరిగాయి
నేను చెప్పిన విషయాలనే కాగ్ రిపోర్టు చెప్పింది
2023-2024లో ప్రభుత్వం చేసిన ఖర్చు 2,36,486 కోట్లు
2023-2024లో రాబడులు రూ.1,70,767 కోట్లు
చంద్రబాబు వచ్చాక తొలి ఏడాది ఖర్చు రూ.2,49,906కోట్లు
చంద్రబాబు వచ్చాక రాబడులు రూ.1,68,024 కోట్లు మాత్రమే
చంద్రబాబు హయాంలో రెవిన్యూ లోటు రూ.60,285కోట్లు
రాష్ట్ర ఆదాయం తగ్గింది, ఖర్చులు పెరిగాయి.
చంద్రబాబు వచ్చాక రెవిన్యూ లోటు 56శాతం పెరిగింది
చంద్రబాబు వచ్చాక రాబడులు తగ్గాయి
చంద్రబాబు వచ్చాక ద్రవ్య లోటు 30శాతం పెరిగింది
కోవిడ్ ఉన్నా.. ఆదాయాలు తగ్గినా నెరవేర్చుతూ హామీలు నెరవేర్చాం.
కానీ చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత సీన్ మారింది
చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత అప్పులు అమాంతం పెంచారు
నెట్ బారో సీలింగ్ పరిధి దాటింది
రాష్ట్ర ప్రభుత్వాలు ఎంత వరకు అప్పు తీసుకోవచ్చో కేంద్ర ప్రభుత్వం విధించే పరిమితి నెట్ బారో సీలింగ్ పరిధి దాటింది
చంద్రబాబు అండ్ కో దోచిపెట్టడమే సరిపోతుంది
మట్టిని,ఇసుక,భూములు,లిక్కర్ దేన్ని వదలడం లేదు
అన్నీంట్లో దోపిడీయే
ప్రభుత్వానికి ఆదాయానికి ఎలా వస్తుంది
ప్రజలకు సంక్షేమం ఎలా అందుతుంది
వీళ్ల దోపిడికి వైజాగ్లో జరిగిన భూదోపిడీయే నిదర్శనం
ఇలా చేస్తే ఆదాయాలు వస్తాయి.
చంద్రబాబు పాలనకు ఆయన బిల్డప్కు తేడా చూపించే మరో చరిత్ర
ఓవైపు మాపై తప్పుడు ప్రచారాలు చేస్తారు
అప్పులు చేస్తారు
ఆ అప్పులు బయట పడకుండా దాచేస్తే ప్రయత్నం చేస్తారు
కాగ్ రిపోర్టులో అప్పులు రూ.81,082.51 కోట్లు
కానీ అసెంబ్లీలో రూ.60,485.40 కోట్లు
సుమారు 20వేల కోట్లు వ్యత్యాసం ఉంది


