ప్రకాశం: ఏపీలో ఎక్కడ చూసినా గంజాయే దొరుకుతుందని వైఎస్సార్సీపీ రాజ్యసభ సభ్యులు వైవీ సుబ్బారెడ్డి విమర్శించారు. ఏపీలో గంజాయిపై ప్రభుత్వానికి నియంత్రణ లేదన్నారు. పోలీసుల కారులోనే గంజాయి తరలిస్తుంటే.. ప్రభుత్వం ఏమి చేస్తోందని ప్రశ్నించారు వైవీ సుబ్బారెడ్డి. అద్దంకి పోలీసు కారులో గంజాయి బయటపడితే ప్రభుత్వం ఎందుకు స్పందించడం లేదని నిలదీశారు.
ఓటర్ల జాబిజా ప్రత్యేక సవరణ(సర్) ప్రక్రియ ద్వారా 45 లక్షల ఓట్లు తొలగించినట్లు తెలుస్తోందని, మరో 40 లక్షల ఓటర్లకు నోటిసులు ఇచ్చారన్నారు. ఈ వ్యవహారంలో పారదర్శకతపై ఎన్నికల అథారిటీకి తమ పార్టీ తరుఫున లేఖ రాశామని వైవీ సుబ్బారెడ్డి స్పష్టం చేశారు.


