సాక్షి, ఢిల్లీ: వైఎస్ వివేకానంద రెడ్డి హత్య కేసులో సునీతా రెడ్డికి చుక్కెదురైంది. వివేకానంద రెడ్డి హత్య కేసులో తదుపరి దర్యాప్తు అవసరం లేదని తాజాగా సీబీఐ మరోసారి స్పష్టం చేసింది. ఇప్పటికే మూడో సప్లిమెంటరీ ఛార్జ్ షీట్ దాఖలు చేశామని వెల్లడించింది. దీంతో, సునీతారెడ్డి దాఖలు చేసిన అన్ని పిటిషన్లను సుప్రీంకోర్టు డిస్మిస్ చేసింది.



