breaking news
Kutami Prabhutvam
-
బొత్స అంటే బ్రాండ్..! స్పీచ్ ఇరగదీసిన బొత్స అనూష
-
పోరాటం ఫలించింది.. సాక్షి టీవీ దెబ్బకు దిగొచ్చిన కూటమి సర్కార్
-
ఈ ఆటలేంటి చంద్రబాబూ?: వైఎస్ జగన్ ఫైర్
సాక్షి, తాడేపల్లి: ఏపీ మెగా డీఎస్సీ స్కామ్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి మరోసారి స్పందించారు. వెరిఫికేషన్ పేరుతో అసలేం సాధించారంటూ కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏడు దశలు పెట్టినా.. ఒక్కో కేసులో ఒక్కో అంశం బయటపడుతోందన్నారు. ఉపాధ్యాయ అభ్యర్థుల భవిష్యత్తుతో చంద్రబాబు సర్కార్ ఆటలాడుతోందంటూ సోషల్ మీడియా వేదికగా మండిపడ్డారు.“వెరిఫికేషన్? నో, నో.. ఏడు దశల వెరిఫికేషన్!” అంటూ జగన్ ట్వీట్ చేశారు. ముందుగా విజేతల జాబితాను పరిశీలిస్తే.. అందులో సంబంధిత అభ్యర్థుల పేర్లు కనిపించడం లేదని పేర్కొన్నారు. ఆ తర్వాత ఖోఖో అధికారులను సంప్రదిస్తే.. సర్టిఫికెట్ నకిలీదని తేలిందని ఆరోపించారు. అంతేకాకుండా నాగార్జున యూనివర్సిటీని సంప్రదిస్తే.. అసలు ఆ క్రీడా కార్యక్రమమే జరగలేదని తేలిందని జగన్ పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను న్యాయమైన, పారదర్శకమైన నియామక ప్రక్రియగా ఎలా పిలుస్తారని ప్రశ్నించారు.𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻? 𝗡𝗼, 𝗡𝗼 : 𝟳 𝗦𝘁𝗮𝗴𝗲𝘀 𝗼𝗳 𝗩𝗲𝗿𝗶𝗳𝗶𝗰𝗮𝘁𝗶𝗼𝗻!Teacher aspirants’ careers have become a joke for you, @ncbn Garu ?𝗖𝗮𝘀𝗲 𝟭: Check the winners’ list: 𝗢𝗼𝗽𝘀! 𝗧𝗵𝗲 𝗻𝗮𝗺𝗲𝘀 𝗮𝗿𝗲𝗻’𝘁 𝘁𝗵𝗲𝗿𝗲.𝗖𝗮𝘀𝗲 𝟮: Check with Kho-Kho… pic.twitter.com/NShMVPrVmh— YS Jagan Mohan Reddy (@ysjagan) September 12, 2026కేసు–1: మెరిట్ లిస్టులో పేర్లు పరిశీలిస్తే.. అసలు పేర్లే కనిపించ లేదు. కేసు–2: ఖో-ఖో అధికారులను సంప్రదిస్తే ఆ సర్టిఫికెట్ నకిలీదని చెబుతున్నారు. కేసు–3: నాగార్జున యూనివర్సిటీలో ఆరా తీస్తే అసలు ఆ స్పోర్ట్స్ ఈవెంటే జరగలేదని తేలింది. మరి 7 దశల్లో వెరిఫికేషన్ చేశామన్న ప్రభుత్వం.. ఆ తనిఖీలు ఎక్కడ చేశారు?, ఏం తనిఖీ చేశారు? అని ప్రశ్నించారు. ఇలాంటి పరిస్థితుల్లో డీఎస్సీ ప్రక్రియను నిష్పక్షపాతంగా.. పారదర్శకంగా నిర్వహించామని ఎలా చెప్పగలరు? అని అన్నారు. ఈ లోపాలే డీఎస్సీ అక్రమాలకు అవకాశం కల్పించలేదా? దీనికి నైతిక బాధ్యతను మీరు తీసుకోరా?” అంటూ చంద్రబాబును ఉద్దేశించి వైఎస్ జగన్ ప్రశ్నించారు. #MegaDSCScam హ్యాష్ట్యాగ్తో ఆయన ఈ ట్వీట్ చేశారు.ఇదీ చదవండి: ఆ జీవోల మాయ ఏంటో అసలు! -
మీలాంటి వాళ్ల వల్లే కాక్రోచ్ లు పుట్టకొస్తారు.. కూటమిపై విరుచుకుపడ్డ YS జగన్
-
మా డిమాండ్స్ అన్ని చెత్త బుట్టలో... ప్రజలకు ఎలా న్యాయం చేస్తుంది
-
దొంగ సర్టిఫికెట్లు.. ఫ్యామిలీ ప్యాకేజీలా ఉద్యోగాలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ స్కామ్లో వాస్తవాలు బయటపడుతున్నా.. దాన్ని కప్పిపుచ్చేందుకు కూటమి ప్రభుత్వం పడరాని పాట్లు పడుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. స్పోర్ట్స్ కోటాలో అర్హతలు లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని, ఏడుసార్లు వెరిఫికేషన్ చేసిన తర్వాతే నియామకాలు చేపట్టామని అధికారుల ద్వారా చెప్పిస్తూ ఇప్పుడు కవర్అప్ చేసుకునే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు.గురువారం తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. టెట్ పాస్ కాకుండానే కొందరికి ఉద్యోగాలు ఎలా ఇచ్చారని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఏ పరీక్ష రాయకుండానే విశాఖపట్నంకు చెందిన యోగేశ్వరరావుకు స్పోర్ట్స్ కోటాలో ఎస్జీటీ ఉద్యోగం ఇచ్చారని ఆరోపించారు. ఆయనతో పాటు ఆయన సోదరికి కూడా ఉద్యోగం ఇచ్చారని, కుటుంబం మొత్తానికీ ‘ఫ్యామిలీ ప్యాకేజీ’లా పోస్టులు కట్టబెట్టారని విమర్శించారు. ఈ వ్యవహారంలో స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (శాప్) కీలకంగా వ్యవహరించిందన్నారు.యోగేశ్వరరావు, మోహినీదేవి పేర్లు తాము నిర్వహించిన ఈవెంట్లో లేవని తెలంగాణ ఖోఖో అసోసియేషన్ స్పష్టం చేసిందని జగన్ తెలిపారు. అయినప్పటికీ వారు పోటీల్లో పాల్గొన్నట్లు చూపించి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ప్రగడ కల్యాణి విషయంలోనూ ఇదే తరహా వ్యవహారం జరిగిందన్నారు. ఆమె కబడ్డీ పోటీలో పాల్గొన్నట్లు పేర్కొన్నప్పటికీ.. 2003లో నాగార్జున యూనివర్సిటీలో సౌత్జోన్ కబడ్డీ పోటీలు జరిగాయని, కాబట్టి ఆమె సమర్పించింది నకిలీ సర్టిఫికెట్గా తేలిందని ఆయన చెప్పారు.ఈడిగ ప్రభాకర్ వ్యవహారాన్ని కూడా జగన్ ప్రస్తావించారు. ఆయన టెట్కు క్వాలిఫై కాలేదని, కనీస విద్యార్హత కూడా లేదని డీఈవో స్వయంగా వెల్లడించారని తెలిపారు. అయినా ఉద్యోగం ఎలా వచ్చిందని ప్రశ్నించారు.మరోవైపు ‘ఏడుసార్లు వెరిఫికేషన్ అయ్యాకే ఉద్యోగాలు ఇచ్చాం’ అని అధికారులు డీఎస్సీ స్కాం గురించి ప్రెస్మీట్ పెట్టి చెప్పారని వైఎస్ జగన్ గుర్తు చేశారు. డీఎస్సీ స్కామ్పై ప్రశ్నలు తలెత్తిన తర్వాత.. కొందరు అభ్యర్థులు చాలాసార్లు టెట్ రాసి ఉండొచ్చని, అందువల్ల ఉద్యోగం వచ్చి ఉండొచ్చంటూ కవర్అప్ చేసే ప్రయత్నం చేస్తున్నారని విమర్శించారు. అసలు ఆ వెరిఫికేషన్ కూడా బోగస్ అని ఆయన అభివర్ణించారు. ఇలా తప్పుడు సర్టిఫికెట్లు, అర్హతలు, స్పోర్ట్స్ కోటా నియామకాలపై వస్తున్న ఆరోపణలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందన్నారు.ఇదీ చదవండి: ఆధారాలు చూపిస్తే అక్రమ కేసులా? -
కాక్రోచ్లు పుట్టుకొచ్చేది ఇందుకే..: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు కుంభకోణాల చరిత్రలో.. డీఎస్సీ స్కామ్ అనేది ఓ ఆణిముత్యమని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఎద్దేవా చేశారు. గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో జరిగిన ప్రెస్మీట్లో డీఎస్సీ అంశాలపై ఆయన సుదీర్ఘంగా మాట్లాడారు.డీఎస్సీ స్కామ్ను దగ్గరుండి నిర్వీర్యం చేస్తున్నారు. కొడుకు నారా లోకేశ్ను కాపాడుకోవాలనే ఆరాటంలో చంద్రబాబు ఉన్నారు. నిరుద్యోగుల జీవితాలతో ఆటలాడుతున్నారు. వ్యవస్థలపై నమ్మకం లేకుండా చేస్తున్నారు. ఇలాంటి స్కామ్ల వల్లే కాక్రోచ్లు(కాక్రోచ్ జనతా పార్టీ.. జెన్జీ ఉద్యమంను ఉద్దేశించి) పుట్టుకొస్తున్నాయి అని వైఎస్ జగన్ అన్నారు.వ్యవస్థలు చెడగొట్టినప్పుడే కాక్రోచ్లు వస్తాయి. ఇలాంటి స్కామ్లతో కాక్రోచ్లు రాక తప్పదు. ఆఖరికి నాలాంటి వాడు కూడా కాక్రోచ్ అవుతాడు అని వైఎస్ జగన్ కామెంట్ చేశారు.డీఎస్సీ కుంభకోణంలో పై నుంచి కింది స్థాయి వరకు కుమ్మక్కయ్యారు. తప్పుడు సర్టిఫికెట్లతో ఉద్యోగాలిచ్చేశారు అని ఖమ్మం(తెలంగాణ)లో జరగని ఈవెంట్లతో ఉద్యోగాలిచ్చిన కేసును ఆధారాలతో సహా చూపించారు. ఆ జూడో అసోషియేషన్ అధ్యక్షుడు ఎవరో కాదు.. చంద్రబాబు దగ్గరి బంధువు.. నారా లోకేశ్ తోడల్లుడు.. టీడీపీ ఎంపీ భరత్ అని చెప్పారు. సాఫ్ట్ బాల్ విషయంలోనూ ఇదే జరిగిందని.. దాని అధ్యక్షుడు ఎమ్మెల్యే కూన రవి అని గుర్తు చేశారు. వీటి ఆధారంగా దొంగ సర్టిఫికెట్లు గుర్తించినట్లు ఆధారాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని.. కుంభకోణం జరిగిందనడానికి ఇంతకంటే నిదర్శనం ఏముంటుందని వైఎస్ జగన్ అన్నారు.ఇదీ చదవండి: డీఎస్సీ స్కాంతో బాబుకి హైబీపీ -
జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం: వైఎస్ జగన్
సాక్షి, గుంటూరు: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. స్థానిక ఎన్నికలు ఎప్పుడు, ఎలా జరిగినా పార్టీ శ్రేణులు గట్టిగా నిలబడి పోరాడాలని పిలుపునిచ్చారు. అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగం, అక్రమ కేసులు, అరెస్టులు వంటి పరిస్థితులను ఎదుర్కొనేందుకు కార్యకర్తలు సిద్ధంగా ఉండాలని సూచించారు. బుధవారం పర్చూరు నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన సమావేశంలో జగన్ మాట్లాడారు. స్థానిక ఎన్నికలు జరుగుతాయో లేదో కూడా తెలియని పరిస్థితి ఉందన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు కల్పిస్తామంటూ చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నం వెనుక ఎన్నికలను వాయిదా వేయాలన్న ఉద్దేశం ఉందని వ్యాఖ్యానించారు. ఆ రిజర్వేషన్లను కోర్టు కొట్టివేస్తుందని ప్రభుత్వానికి ముందే తెలుసని, దానిని సాకుగా చూపి ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ‘‘రేపు జరిగేది కురుక్షేత్ర సంగ్రామం. స్థానిక ఎన్నికల్లో జరిగే అధికార దుర్వినియోగం, పోలీసు బలగాల ప్రయోగంపై కసి వచ్చే సాధారణ ఎన్నికల్లో కనిపించాలి’’ అని అన్నారు. ఓట్లపై కూడా అనుమానాలు..ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియపైనా జగన్ ప్రశ్నలు సంధించారు. ఇప్పటికే 44 లక్షల ఓట్లు గల్లంతయ్యాయని ప్రభుత్వ వర్గాలే చెబుతున్నాయని పేర్కొన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో స్థానిక సంస్థల ఎన్నికలు నిజంగా సజావుగా జరుగుతాయా? అని ప్రశ్నించారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా వైఎస్సార్సీపీ ప్రజలకు అండగా ఉంటుందని స్పష్టం చేశారు. “ఎన్నికలు సాఫీగా జరిగితే వైఎస్సార్సీపీదే విజయం. సాఫీగా జరగనివ్వకపోయినా గట్టిగా పోరాడదాం. స్థానిక ఎన్నికల్లో మీరు గట్టిగా నిలబడాలి” అని పార్టీ కార్యకర్తలకు పిలుపునిచ్చారు.రోజుకో డ్రామా.. డైవర్షన్ పాలిటిక్స్చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్నంతకాలం ఎన్నికలు సాఫీగా సాగే అవకాశం లేదని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై అక్రమ కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం, జైలుకు పంపడం జరుగుతోందని ఆరోపించారు. ‘‘రోజుకో డ్రామా.. రోజుకో నటన.. డైవర్షన్ పాలిటిక్స్’’ అంటూ కూటమి ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.స్థానిక ఎన్నికలు కేవలం రాజకీయ పార్టీలకు సంబంధించినవి కావని, అవి ప్రధానంగా కార్యకర్తల ఎన్నికలని జగన్ అన్నారు. గ్రామస్థాయిలో ప్రజలకు కార్యకర్తలే అండగా ఉంటారని, అలాంటి కార్యకర్తలకు పార్టీ కూడా అండగా నిలవాలని సూచించారు. దౌర్జన్యంతో ఎప్పటికీ పాలకులు రాజ్యం చేయలేరని వ్యాఖ్యానించారు.నంద్యాల ఉప ఎన్నికను గుర్తుచేస్తూ..పర్చూర్ కేడర్ వద్ద తన గత రాజకీయ అనుభవాలను కూడా వైఎస్ జగన్ ప్రస్తావించారు. 2017లో తాను పాదయాత్ర ప్రారంభించడానికి ముందు నంద్యాల ఉప ఎన్నిక జరిగిందని గుర్తుచేశారు. తీవ్ర అధికార దుర్వినియోగం కారణంగా వైఎస్సార్సీపీ 35 వేల ఓట్ల తేడాతో ఓడిపోయిందని అన్నారు. 2014–19 మధ్య తమ పార్టీకి చెందిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీలను చంద్రబాబు తీసుకున్నారని జగన్ ఆరోపించారు. ఆ తర్వాత తాను పాదయాత్ర చేపట్టానని, ప్రజల్లో పెద్ద ఎత్తున స్పందన వచ్చిందని తెలిపారు. 2019 ఎన్నికల్లో ప్రజలు స్పష్టమైన తీర్పు ఇచ్చారని గుర్తుచేశారు. నాడు తమ పార్టీ నుంచి తీసుకెళ్లిన 23 మంది ఎమ్మెల్యేలు, ముగ్గురు ఎంపీల సంఖ్యకే చంద్రబాబు పార్టీ పరిమితమైందని వ్యాఖ్యానించారు.మంచి చేసి ఓటు అడగాలి..పాలకులు ప్రజలకు మంచి చేసి, ఆ పనులను చూపించి ఓట్లు అడగాలని జగన్ అన్నారు. అలా చేసినప్పుడే దేవుడి ఆశీస్సులు, ప్రజల ఆదరణ లభిస్తాయని పేర్కొన్నారు. ఎల్లవేళలా అబద్ధాలు, దౌర్జన్యాలను ప్రజలు హర్షించబోరని అన్నారు. ‘‘జరగబోయేది కురుక్షేత్ర సంగ్రామం. ఆ సంగ్రామంలో మీరంతా ప్రజలకు తోడుగా నిలబడాలి.. పోరాడాలి’’ అని వైఎస్సార్సీపీ శ్రేణులకు జగన్ పిలుపునిచ్చారు.ఇదీ చదవండి: అర్హతే లేనివారికి టీచర్ పోస్టులా? -
లోకేశ్.. ఇది సిగ్గు చేటు: కొండా రాజీవ్
సాక్షి, తాడేపల్లి : దేశంలో ఎక్కడా లేని విధంగా దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఇవ్వటం ఏపీలోనే చూస్తున్నామని వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి కొండా రాజీవ్ అన్నారు. డీఎస్సీలో అవకతవకలు జరిగినట్లు సాక్ష్యాలు బయటపడినా.. ఎదురు దాడి చేయడం సిగ్గుచేటని మండిపడ్డారాయన. మంగళవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. డీఎస్సీలో అక్రమాలు చేసి టీడీపీ నేతలు దొరికి పోయారు. సాక్ష్యాలు బయటపడినా ఎదురుదాడి చేయటం సిగ్గుచేటు. డీఎస్సీ అక్రమాలపై విచారణ జరిగితే నారా లోకేష్ జైలుకే వెళ్తారు. అక్రమాలు బయట పడినా లోకేష్ పై చంద్రబాబు ఎందుకు చర్యలు తీసుకోలేదు?. ఒకప్పుడు వైఎస్ జగన్పై ఆరోపణలు చేస్తే సీబీఐతో విచారణ జరిపించుకోమని వైఎస్ఆర్ సవాల్ చేశారు. మరి లోకేష్ పై ఆధారాలతో బయటపడినా ఎందుకు వెనుకేసుకు వస్తున్నారు?. చంద్రబాబు వెంటనే లోకేష్తో రాజీనామా చేయించాలి అని రాజీవ్ అన్నారు.. దొంగ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు ఉవ్వటం ఏపీలోనే చూస్తున్నాం. మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపై కూడా సీబీఐ విచారణకు మేం సిద్ధమంటున్నా కూడా వాళ్ల దగ్గరి నుంచి స్పందన లేదు. రాష్ట్రంలో ఇన్ని దారుణాలు జరుగుతుంటే పవన్ కళ్యాణ్ ఏం చేస్తున్నారు?. ఉద్యోగం ఇచ్చే ముందు సర్టిఫికేట్ల విచారణ చేయాలి. కానీ ఇష్టానుసారం ఉద్యోగాలు అమ్మేసుకుని ఇప్పుడు సర్టిఫికేట్ల విచారణ చేస్తామంటారా?. ఫేక్ సర్టిఫికేట్లతో ఉద్యోగాలు పొందిన వారిని ప్రభుత్వం ఎందుకు కాపాడుతోంది?. వారిపై చర్యలు తీసుకుబే దమ్ము ప్రభుత్వానికి లేదు. ఒకవేళ చర్యలు తీసుకుంటే ఫేక్ వాళ్లు బయటకు వచ్చి ఎవరికి ఎంత డబ్బులు ఇచ్చారో బయట పెడతారోనని భయం.. .. పైగా ప్రశ్నించిన మీడియాపై కేసులు పెడతున్నారు. నారా లోకేష్ సవాల్పై చర్చించటానికి మా మాజీ మంత్రులు సిద్ధమే. అది చూసి ఆయన భయంతో పారిపోయారు. సవాల్ చేసిన నారా లోకేష్ మహిళలను అడ్డం పెట్టి మాట్లాడించటం ఎందుకు?. ఇది సిగ్గుచేటు అని కొండా రాజీవ్ అన్నారు.ఇదీ చదవండి: జనసేనకు షాకిచ్చిన టీడీపీ -
మీ పోస్టులు చాలా ‘అమెచ్యూరిష్’గా ఉంటున్నాయ్!
కూటమిలోని టీడీపీ, జనసేన కార్యకర్తల మధ్య సోషల్ మీడియా వేదికగా రగులుతున్న వివాదం పోనుపోను మరింత ముదురుతోంది. ముఖ్యంగా డీఎస్సీ వ్యవహారంపై ఇరుపార్టీల కార్యకర్తలు పరస్పరం పోస్టులు.. ఒకనొక దశలో పెద్దల మీద మీమ్స్, ట్రోల్స్తో విరుచుకుపడే స్థాయికి చేరుకున్నాయి. ఈ దశలో జనసేనను ఉద్దేశిస్తూ టీడీపీ డబుల్ మేసేజ్ ఇవ్వడం ఏపీ రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది. సోషల్ మీడియాలో కొట్టుకుంటున్న కార్యకర్తలకు.. ఇరు పార్టీల అధిష్టానాలు స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాయనేది జరుగుతున్న ప్రచారం. అయితే ఈ విషయంలో జనసేనదే మొత్తం తప్పు అనే లైన్లో టీడీపీ ఓ ప్రకటన విడుదల చేయడం గమనార్హం. దానిని కాస్త నిశీతంగా పరిశీలిస్తే.. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వైఫల్యాల్ని.. జనసేనకు ఆపాదిస్తూ ఐటీడీపీ తన సపోర్టింగ్ పేజీలతో కొన్ని పోస్టులు చేయించింది. దీనిపై జనసేన భగ్గుమంది. ‘మీ బురదలోకి మమ్మల్నెందుకు లాగుతారు?’ అంటూ కౌంటర్ పోస్టులతో నిలదీసింది. అంతటితో ఆగకుండా.. చంద్రబాబు, నారా లోకేశ్ను టార్గెట్ చేసుకుని మీమ్స్ ప్రచారం చేసింది. అయితే అప్పటికే.. ఓ సినిమా కోసం సీనియర్ ఎన్టీఆర్ అమెచ్యూరిష్ డైలాగ్పై ఉద్దేశపూర్వక ట్రోలింగ్ నడిచిన సంగతి తెలిసిందే. ఆ పరిణామం ఆ సినీ ఫ్యామిలీపై ఎన్టీఆర్ అభిమానులు గుర్రుగా ఉన్నారు. అయితే దీనిని క్యాష్ చేసుకోవాలని భావించిన ఐటీడీపీ.. తన కౌంటర్లను మరింత పదును పెట్టింది. ఏకంగా పవన్ కల్యాణ్ సినీ, పొలిటికల్ కెరీర్ ఫెయిల్యూర్స్ను ప్రస్తావిస్తూ వరుస పోస్టులు చేసింది. అదే సమయంలో.. టీడీపీలోనే ఇంకో వర్గం నుంచి సీనియర్ నటుడు, పవన్ సోదరుడు చిరంజీవిని ఉద్దేశించి పోస్టులు వచ్చాయి. అయితే టీడీపీ నాయకత్వాన్ని టార్గెట్ చేస్తూ జనసేన కార్యకర్తలు మీమ్స్, ట్రోల్స్ చేయడం, ఇప్పుడు రాజకీయంగా ఇరకాటంలో పడేసిన డీఎస్సీ అంశంపైనా వరుసగా పోస్టులు పెట్టడంపై టీడీపీ అసంతృప్తితో ఉన్నట్లు తెలుస్తోంది. ఈ వరుస పరిణామాలతో కూటమి పెద్దలు రంగంలోకి దిగారు. ఇరుపార్టీల కార్యకర్తలు సోషల్ మీడియా వేదికగా పరస్పరం విమర్శలు, దూషణలకు దిగొద్దని సూచనలు ఇచ్చారు. ప్రభుత్వం చేపడుతున్న పాలసీలు, అభివృద్ధి కార్యక్రమాలు, పరిపాలనకు సంబంధించిన అంశాలపై ఒకరిపై ఒకరు కామెంట్లు చేయొద్దని.. తద్వారా ప్రత్యర్థులకు అవకాశం ఇచ్చినట్లు అవుతుందని టీడీపీ సందేశం ఇచ్చింది. కూటమి భాగస్వామ్య పార్టీల మధ్య విభేదాలు తలెత్తేలా సోషల్ మీడియా పోస్టులు పెట్టడం సరికాదని స్పష్టం చేసింది. ముఖ్యంగా.. జనసేన కార్యకర్తలు చేస్తున్న కొన్ని పోస్టులతో ప్రభుత్వ ప్రతిష్ట దెబ్బతింటోందని టీడీపీ పేర్కొంది. మరీ ముఖ్యంగా చంద్రబాబు కుటుంబంపై జనసేన కార్యకర్తలు చేసిన అవమానకరమైన, అసభ్యకరమైన వ్యాఖ్యల విషయాన్ని ఆ పార్టీతో మాట్లాడినట్లు తెలిపింది. ఇలాంటి అమెచ్యూరీష్ వ్యాఖ్యలు, పోస్టులకు దూరంగా ఉండాలని సూచించింది. ‘మన మధ్య మనమే సోషల్ మీడియాలో పోస్టులతో పోరాటం చేసుకోవడం సరికాదు’ అని టీడీపీ స్పష్టం చేసింది. టీడీపీ, జనసేన కార్యకర్తలు పరస్పరం విమర్శలు, దూషణలు చేసుకోకుండా కూటమి ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని సూచించింది.అదే సమయంలో టీడీపీ పార్టీకి, టీడీపీ కార్యకర్తల ఆత్మగౌరవానికి భంగం కలిగించే ఎటువంటి చర్యలనూ సహించబోమని పార్టీ పేర్కొనడం గమనార్హం. ఇది జనసేనకు ఇండైరెక్ట్ వార్నింగేనన్న చర్చ జోరందుకుంది. ఇప్పటికే పదవులు, ప్రాధాన్యత విషయంలో జనసేన కేడర్ క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలు ఎదుర్కొంటోంది. ఈ తరుణంలో.. కూటమిగా కలిసి పనిచేయాలంటూ ఒకవైపు బుజ్జగిస్తూనే.. టీడీపీ జోలికి వస్తే ఊరుకునేది లేదన్న సంకేతాన్ని మరోవైపు బహిరంగంగానే ఇవ్వడాన్ని జనసైనికులు తట్టుకోలేకపోతున్నారు.దీంతో కూటమిలో అంతర్గత విభేదాలను చక్కదిద్దేందుకు పెద్దలు ప్రయత్నాలు చేస్తున్నప్పటికీ.. సోషల్ మీడియాలో మాత్రం టీడీపీ–జనసేన కార్యకర్తల మధ్య పోస్టుల యుద్ధం కొనసాగుతుండటం రాజకీయంగా చర్చనీయాంశంగా మారింది.ఇదీ చదవండి: మేయర్ సీటు.. రచ్చ రాజేయడం ఖాయం! -
లోకేశ్ అంకెల గారడీపై వైఎస్ జగన్ ఆగ్రహం
సాక్షి, అమరావతి: చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. వాస్తవ పరిస్థితులను.. గణాంకాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టిస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ తాజా అక్షరాస్యత రేటుపై చేసిన వ్యాఖ్యలను ప్రస్తావిస్తూ.. 2026 సంవత్సరానికి సంబంధించిన గణాంకాలే ఇంకా వెలువడలేదని, అలాంటప్పుడు పెరిగిందని ఎలా చెబుతారని ప్రశ్నించారు.గణాంకాలు ఏం చెబుతున్నాయంటే.. 2023-24 పీరియాడిక్ లేబర్ ఫోర్స్ సర్వే (PLFS) నివేదిక ప్రకారం.. ఏపీలో ఏడేళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న వారి అక్షరాస్యత రేటు 72.6 శాతంగా ఉంది. 2018-19లో ఇది 69.1 శాతంగా ఉన్నట్లు వైఎస్ జగన్ తన ఎక్స్ ఖాతా ద్వారా వాస్తవాలను బయటపెట్టారు.2025లోనూ తగ్గిందే..2025 జనవరి నుంచి డిసెంబర్ వరకు నిర్వహించిన సర్వే ఆధారంగా కేంద్ర గణాంకాల శాఖ విడుదల చేసిన పీఎల్ఎఫ్ఎస్ వార్షిక నివేదికలో ఏపీ అక్షరాస్యత రేటు 71.4 శాతంగా నమోదైందని జగన్ వెల్లడించారు. ఈ నివేదికను 2026 జూలై 2న విడుదల చేశారని తెలిపారు. దీంతో 2024లో 72.6 శాతం ఉన్న అక్షరాస్యత.. 2025లో 71.4 శాతానికి తగ్గిందని, మరి 2026లో 82.1 శాతానికి ఎలా చేరిందో ప్రభుత్వం వివరించాలని డిమాండ్ చేశారు.𝗜𝘁’𝘀 𝘀𝗵𝗼𝗰𝗸𝗶𝗻𝗴 𝘁𝗼 𝘀𝗲𝗲 𝘁𝗵𝗲 𝗲𝘅𝘁𝗲𝗻𝘁 𝗼𝗳 𝗺𝗶𝘀𝗶𝗻𝗳𝗼𝗿𝗺𝗮𝘁𝗶𝗼𝗻 𝗽𝗿𝗼𝗽𝗮𝗴𝗮𝗻𝗱𝗮 𝗯𝘆 𝘁𝗵𝗲 𝗽𝗿𝗲𝘀𝗲𝗻𝘁 𝗔𝗻𝗱𝗵𝗿𝗮 𝗣𝗿𝗮𝗱𝗲𝘀𝗵 𝗚𝗼𝘃𝗲𝗿𝗻𝗺𝗲𝗻𝘁.The Minister of education claims that the literacy rate increased from 72.6% in 2024 to… pic.twitter.com/6yzdtMCVjV— YS Jagan Mohan Reddy (@ysjagan) September 4, 2026‘ఇది తప్పుడు ప్రచారం’..2026 సంవత్సరం ఇంకా పూర్తికాకముందే ఆ ఏడాది అక్షరాస్యత గణాంకాలను కూటమి ప్రభుత్వం ఎలా ప్రకటించిందని జగన్ ప్రశ్నించారు. స్పష్టమైన అధికారిక గణాంకాలు అందుబాటులో ఉన్నప్పటికీ తప్పుడు లెక్కలు చెప్పడం ద్వారా రాష్ట్ర ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేయడం దురదృష్టకరమని విమర్శించారు.ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న చేరికలు..ఇదే సమయంలో రాష్ట్రంలో విద్యా రంగానికి సంబంధించి మరో ఆందోళనకరమైన అంశాన్ని జగన్ ప్రస్తావించారు. కేంద్ర విద్యాశాఖకు చెందిన యూడైస్ (UDISE) గణాంకాల ప్రకారం.. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల చేరికలు తగ్గుతుండగా, ప్రైవేటు పాఠశాలల్లో చేరికలు పెరుగుతున్నాయని అన్నారు. ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాల పిల్లలకు నాణ్యమైన విద్యను మరింత అందుబాటులోకి తీసుకురావడంపై ప్రభుత్వం దృష్టి పెట్టాల్సిన అవసరం ఉందన్నారు.‘విద్యాశాఖపై దృష్టి పెట్టండి’..విద్యారంగాన్ని బలోపేతం చేయడంపై దృష్టి పెట్టాల్సిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. తప్పుడు గణాంకాలతో ప్రచారం చేసుకోవడంపై కాకుండా శాఖ పనితీరుపై శ్రద్ధ పెట్టాలని జగన్ సూచించారు. ‘రెడ్బుక్ పాలన’పై దృష్టి పెట్టడం కంటే విద్యాశాఖను సమర్థంగా నిర్వహించడంపై ఎక్కువ సమయం కేటాయించడం మంచిదని ఎద్దేవా చేశారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో తీసుకొచ్చిన విధాన మార్పులపై ఇప్పటికే విమర్శలు వస్తున్నాయని పేర్కొన్న జగన్.. ప్రభుత్వ పాఠశాలల్లో తగ్గుతున్న విద్యార్థుల సంఖ్యపై ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. అక్షరాస్యతపై ప్రభుత్వం చెబుతున్న లెక్కలకు, కేంద్ర ప్రభుత్వ గణాంకాలకు మధ్య ఉన్న వ్యత్యాసంపై స్పష్టత ఇవ్వాలని చంద్రబాబు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదీ చదవండి: అసలు మోదీ, పవన్ ఎవరబ్బా? -
హూ ఈజ్ మోదీ.. పవన్?
సాక్షి, విశాఖపట్నం: ‘హూ ఈజ్ మోదీ? ఆయన నాకంటే సీనియరా? నాకంటే ఎక్కువసార్లు ముఖ్యమంత్రి అయ్యారా? ‘ప్రశ్నిస్తానని చెప్పి పార్టీ పెట్టిన పవన్ కల్యాణ్కు.. రాష్ట్రానికి అన్యాయం చేస్తున్న కేంద్రం, ప్రధాని మోదీ ఎందుకు కనిపించడం లేదు? ఉదయం ఒక మాట, సాయంత్రం ఒక మాట మాట్లాడతాడు. ఆయనకంటూ ఒక విధానం, ఒక స్టాండ్ లేదు.’ ఇవి కూటమిగా ఏర్పడకముందు చంద్రబాబు మొదటి నాలుక పలికిన పలుకులు. కట్ చేస్తే.. కూటమిగా ఏర్పడిన తర్వాత.. ‘నరేంద్ర మోదీ 21వ శతాబ్దపు నవభారత దార్శనికుడు. సరైన సమయంలో దేశానికి సరైన నాయకుడు దొరికారు. ఆయన నాయకత్వంలో పనిచేయడం నాకెంతో గర్వకారణం.’ ‘పవన్ కల్యాణ్ నిఖార్సైన నాయకుడు, నిజాయితీపరుడు. ఆయనకు పదవుల మీద, ప్యాకేజీల మీద వ్యామోహం లేదు’. ఇదీ.. చంద్రబాబు రెండో నాలుక సూక్తులు. అందితే జుట్టు.. అందకపోతే వెన్నుపోటు.. అని చంద్రబాబు మరోసారి నిరూపించారు. ఎన్నికల్లో గెలుపు కోసం అబద్ధాలతో ఎవరితోనైనా జట్టులు కట్టే బాబు.. ఎన్నికలు అయ్యాక మాత్రం.. ఏరు దాటాక.. అన్న చందంగా వ్యవహరించడం పరిపాటిగా మారిందని మరోసారి బుద్ధిని బయటపెట్టారు. ఎన్నికలకు ముందు మోదీ దేవుడు.. పవన్ తమ్ముడంటూ అంటకాగిన చంద్రబాబు.. ఇప్పుడు వారిని పక్కన పెట్టేయడం హాట్ టాపిక్గా మారింది. మోదీ, పవన్ బొమ్మలు మాయం! రాష్ట్రంలో ఇంటింటికీ పంచుతున్న ‘కూటమి ప్రభుత్వం.. సంక్షేమ విజయాలు’ కరపత్రాల్లో ప్రధాని మోదీ, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ఫొటోలను నిర్దాక్షిణ్యంగా మాయం చేశారు. సినిమా హిట్టయ్యే దాకా హీరోలు కావాలి.. కలెక్షన్లు వచ్చాక పోస్టర్పై తన బొమ్మ మాత్రమే ఉండాలి అన్నట్లుగా బాబు చేస్తున్న ఈ సింగిల్ క్రెడిట్ సోలో పెర్ఫార్మెన్స్.. నిన్నటి దాకా ‘మా మోదీ, మా పవన్’ అన్న నోటితోనే, నేడు కరపత్రాల సాక్షిగా ‘హూ ఈజ్ మోదీ.. హూ ఈజ్ పవన్’ పార్ట్–2 డ్రామాకు తెరతీసినట్లుగా కనిపిస్తోందన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కింగ్ మేకర్లు కరివేపాకయ్యారా? కూటమి అంటే ఎన్నికల ముందు ఓట్లు వేయించుకోవడానికి మాత్రమేననీ.. తీరా విజయాల క్రెడిట్ తీసుకునే సమయానికి అంతా తన సోలో పెర్ఫార్మెన్సే అని చంద్రబాబు మరోసారి నిరూపించుకున్నారు. ఉత్తరాంధ్ర వీధుల్లో తిరుగుతున్న ఆ కరపత్రం పేరుకే ‘కూటమి’ విజయాలు. కానీ అందులో ప్రధాని మోదీ కానీ.. పవన్ ఫొటో కానీ కనిపించడం లేదు. కేవలం తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేశ్ ఫొటోలు మాత్రమే ముద్రించుకోవడం గమనార్హం. సొమ్ము ఢిల్లీది.. సోకు బాబోరిది! రాష్ట్రంలో ఏ చిన్న సంక్షేమ పథకం అమలు చేయాలన్నా.. కేంద్రం ఇచ్చే నిధులు, రుణాలు విదిలిస్తే తప్ప పూట గడవని పరిస్థితి. ఢిల్లీ నుంచి వస్తున్న వేల కోట్ల రూపాయలతోనే రాష్ట్రంలో హడావిడి డ్రామా నడుస్తోంది. కానీ ప్రచారానికి వచ్చేసరికి మాత్రం టీడీపీ ఫోజులు కొడుతూ డప్పు కొట్టుకుంటోంది. మోదీ పంపిన నిధులతో జరిగిన పనులన్నింటినీ తన క్రెడిట్లో వేసుకుంటూ, కరపత్రాల్లో మోదీ ఫొటోకు మాత్రం తెలివిగా కత్తెర వేసేశారు. ఈ ‘పచ్చ’ పైత్యాన్ని చూసి అటు కమలనాథులు, ఇటు జనసైనికులు అగ్గిమీద గుగ్గిలవుతున్నారు. ఇదంతా చూస్తుంటే రాష్ట్ర ప్రజలకు 2018 నాటి ఫ్లాష్బ్యాక్ గుర్తుకొస్తోందని మండిపడుతున్నారు. అధికార మదంతో అప్పుడే అహంకారం తలకెక్కితే, ఈ కరపత్రాల మంటలు రేపు టీడీపీ పునాదులకే ఎసరు పెడతాయంటూ బీజేపీ రాష్ట్ర ధారి్మక సెల్ ప్రతినిధి విజయ శంకర్ ఫణీంద్ర ఆగ్రహం వ్యక్తం చేయడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. చదవండి: నరసన్నపేటలో పోటీ చేస్తా.. నీ సంగతి చూస్తా.. -
మాట ఇచ్చి తప్పింది మీరు మమల్ని ఎందుకు అరెస్ట్ చేస్తున్నారు..?
-
AP: మేము అస్సలు తగ్గం..! పల్లె-పల్లెకు రైతులతో వంట వార్పు కార్యక్రమం
-
అభివృద్ధి పేరుతో పేదల పొట్ట కొట్టడం కరెక్ట్ కాదు
-
చిలకలూరిపేటలో కొనసాగుతున్న హైటెన్షన్
సాక్షి, పల్నాడు: చిలకలూరిపేటలో రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన వారి కుటుంబాలకు కూటమి ప్రభుత్వం వెంటనే న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన శుక్రవారం ఉదయం కూడా కొనసాగుతోంది. మృతుల కుటుంబ సభ్యులతో పాటు దళిత సంఘాల నాయకులు, వేలూరు గ్రామస్తులు నిన్న సాయంత్రం నుంచి పెద్ద ఎత్తున నిరసన కొనసాగిస్తున్నారు. దీంతో ఎన్ఆర్టీ సెంటర్లోని చెన్నై–కోల్కతా జాతీయ రహదారిపై ఉద్రిక్త వాతావరణం కొనసాగుతోంది.మృతుల కుటుంబాలను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని, బాధిత కుటుంబాలకు న్యాయం చేయాలని ఆందోళనకారులు డిమాండ్ చేస్తున్నారు. తమ సమస్యలు పరిష్కరించే వరకు నిరసన విరమించే ప్రసక్తే లేదని దళిత సంఘాల నాయకులు స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వంతో పాటు చిలకలూరిపేట ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.చిలకలూరిపేటలో నిన్న సాయంత్రం 4.30 గంటల నుంచి ఆందోళన కొనసాగుతుండగా.. జాతీయ రహదారిపై సుమారు 12 గంటలుగా బైఠాయించడంతో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ప్రమాదంలో తమ కుటుంబ సభ్యులను కోల్పోయిన బాధలో ఉన్నామని.. ప్రభుత్వం వెంటనే స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.ఎమ్మెల్యే రావాల్సిందే..తమ వద్దకు ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు స్వయంగా వచ్చి న్యాయం చేస్తామని హామీ ఇవ్వాలని మృతుల కుటుంబ సభ్యులు డిమాండ్ చేస్తున్నారు. ఎమ్మెల్యే తమ వద్దకు వచ్చే వరకు ఆందోళన కొనసాగిస్తామని తేల్చి చెప్పారు. ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు బాధిత కుటుంబాల సమస్యలను పరిష్కరించడంలో వెంటనే చొరవ చూపాలని దళిత సంఘాలు కోరుతున్నాయి.సంబంధిత వార్త: చిలకలూరిపేటలో ఘోర ప్రమాదం.. ఏడుగురి దుర్మరణంఅధికారులతో చర్చలుఅంతకు ముందు.. ఆందోళన నేపథ్యంలో రాత్రి 11 గంటల సమయంలో డీఎస్పీ, ఆర్డీఓ సంఘటనా స్థలానికి చేరుకుని మృతుల కుటుంబ సభ్యులతో చర్చలు జరిపారు. ఆందోళన విరమించాలని అధికారులు కోరినప్పటికీ.. ఎమ్మెల్యే ప్రత్తిపాటి పుల్లారావు తమ వద్దకు వచ్చి స్పష్టమైన హామీ ఇవ్వాల్సిందేనని కుటుంబ సభ్యులు పట్టుబట్టారు. దీంతో సెంటర్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగానే కొనసాగుతోంది.ఎంపీ మాటతో భగ్గుమన్న దళిత సంఘాలుచిలకలూరిపేట రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన కుటుంబ సభ్యులను పరామర్శించడానికి చిలకలూరిపేట ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లిన టీడీపీ ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయలకు నిరసన సెగ తగిలింది. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేసిన మృతుని బంధువులతో.. వినతిపత్రం ఇవ్వండి అంటూ ఎంపీ శ్రీకృష్ణదేవరాయలు అన్నారు. దీంతో ఎంపీ తీరు పట్ల మృతుల కుటుంబ సభ్యులు, దళిత సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేశారు. దళితులు చనిపోతే న్యాయం చేయడానికి వినతిపత్రం ఇవ్వాలా? అంటూ ఎంపీని వారు ప్రశ్నించారు. తమకు న్యాయం చేయాలని ఎంపీ ముందు నినాదాలు చేయడంతో పరిస్థితి తీవ్రంగా మారింది.ఇదీ చదవండి: మూడేళ్ల కొడుకుని వంతెనపై వదిలి.. -
పోలీసులే ఇలా ఉంటే ప్రజలు ఇంక ఎవరిని నమ్మాలి?: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: కూటమి పాలనలో ఓ వైపు తప్పుడు కేసులు, వేధింపులు కొనసాగుతుంటే.. మరోవైపు రకరకాల మాఫియాలు నడుస్తున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాష్ట్రంలో యథేచ్ఛగా నడుస్తున్న దందాల గురించి మాట్లాడారు.రాష్ట్రంలో అంతా మాఫియానే కనిపిస్తోంది. అమరావతి పేరుతో బిల్డింగ్ల స్కామ్ నడుస్తోంది. విలువైన భూములను కొల్లగొడుతున్నారు. వీటికి తోడు విచ్చలవిడిగా డ్రగ్స్, గంజాయి, బెల్ట్ షాపులు అందునా కల్తీ మద్యం రాష్ట్రంలో ప్రతీ చోటా కనిపిస్తోంది. ప్రకాశం జిల్లా అద్దంకిలో జరిగిన ఘటన మరీ దారుణమని వైఎస్ జగన్ అన్నారు. శాంతి భద్రతలు ఎలా ఉన్నాయో చెప్తోంది.ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులే అక్రమాలకు పాల్పడుతున్నారు. వాటిల్లో వాటాదారులుగా మారిపోతున్నారు. ప్రకాశం జిల్లా అద్దంకిలో.. మత్తులో పోలీసులే యాక్సిడెంట్ చేసి ప్రజలకు పట్టుబడ్డారు. కారులో గంజాయి, లిక్కర్, ఖాకీ యూనిఫాం దొరికాయి. డ్రైవర్తో సహా మరో ఇద్దరూ పోలీసులు మత్తులోనే ఉన్నారు. సీఐ వచ్చి వీడియోలు తీసే జనాల్ని తీయొద్దని బెదిరించారు. అలాంటప్పుడు ప్రజలు ఎవరికి ఫిర్యాదు చేయాలని, ప్రజలు ఎవరిని నమ్మాలి? అని వైఎస్ జగన్ నిలదీశారు.పైగా అద్దంకి ఘటనను కవర్అప్ చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేశారు. పోలీసు అధికారులు ఒక్కొక్కరు ఒక్కోలా ప్రకటనలు చేశారు. వాళ్ల మాటలకు ఎఫ్ఐఆర్కు పొంతనే లేదు(ఈ సందర్భంగా దర్శి డీఎస్పీ బాలమురళీకృష్ణ, ప్రకాశం ఎస్పీ హర్షవర్ధనరాజుల వేర్వేరు స్టేట్మెంట్ల వీడియోలను ప్రదర్శించారు). ఇలాంటి పోలీసులను జైలుకు పంపకుండా.. తప్పుడు సాక్ష్యాలతో కాపాడాలని చూస్తున్నారు. కూటమి పాలనలో అద్దంకి ఘటనే కాదు.. కృష్ణలంక సాయికృష్ణ, విజయవాడ క్రాంతికుమార్ కేసులు ఈ వ్యవస్థలు ఎంతగా దిగజారిపోయాయో చెబుతున్నాయని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.వైఎస్సార్సీపీ హయాంలో గంజాయిని కట్టడి చేశాం. గంజాయి కేసుల్లో 13,210 మంది అరెస్ట్ చేశాం. 11 వేల ఎకరాల్లో గంజాయి పంటల్ని ధ్వంసం చేశాం.ఆపరేషన్ పరివర్తన్ పేరుతో గిరిజనులను గంజాయి సాగుకి దూరం చేశాం. ప్రత్యేకంగా ఎస్ఐబీని ఏర్పాటు చేశాం అని వైఎస్ జగన్ గుర్తు చేశారు. ఇప్పుడు.. చంద్రబాబు పాలనలో సర్వం దోపిడీ మయం.. గంజాయి మయం. కూటమి పాలనలో అందరూ కలిసి దందాలు చేస్తున్నారని అన్నారు. ఎమ్మెల్యేలకు ఇంత, చినబాబు.. పెదబాబుకి ఇంత అని వాటేలేసుకుంటున్నారు. చంద్రబాబు హయాంలో ఒకే ఒక పంటకు గిట్టుబాటు ధర లభిస్తోంది.. అది గంజాయే అని వైఎస్ జగన్ ఎద్దేవా చేశారు.ఇదీ చదవండి: కోర్టులకు వెళ్లేది చంద్రబాబే.. వద్దని చెప్పేది బాబే! -
నార్లు ఎండుతున్నా.. చంద్రబాబు ధ్యాసంతా వాటి మీదే: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: నార్లు ఎండిపోతున్నా రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం ముందుకు రావడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో కరువు పరిస్థితులు నెలకొన్నా దాన్ని గుర్తించేందుకు కూడా ఆయన ఇష్టపడటం లేదని అన్నారు. జూన్, జులైలోనే 52 శాతం లోటు వర్షపాతం నమోదైనట్లు ప్రభుత్వ గణాంకాలే వెల్లడిస్తున్నాయని వైఎస్ జగన్ వెల్లడించారు.బుధవారం మీడియా సమావేశంలో వైఎస్ జగన్ మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు పంటల బీమా ప్రీమియం చెల్లించలేదని గుర్తు చేశారు. కూటమి పాలనతో ఇప్పటిదాకా రైతులకు సుమారు రూ.3 వేల కోట్ల నష్టం జరిగిందన్నారు. 2025 అక్టోబర్లో మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిన్నా.. ఇప్పటివరకు రైతులకు ఒక్క పైసా కూడా అందలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటల బీమా పథకాన్ని రద్దు చేయడంతో పాటు రైతులకు సున్నావడ్డీ పథకాన్ని కూడా నిలిపివేశారని అన్నారు.తమ ప్రభుత్వ హయాంలో రైతుల కోసం రూ.7,800 కోట్లు ఖర్చు చేసి అండగా నిలిచామని జగన్ గుర్తు చేశారు. అయితే బాబు పాలనలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేకుండా చేశారని, పంటలు దెబ్బతిన్న రైతులకు ఇప్పటివరకు ఎలాంటి సాయం అందించలేదని తెలిపారు. వర్షాభావ పరిస్థితులు ఉన్నప్పుడు రైతులకు ప్రత్యామ్నాయ పంటలు, ఉచిత విత్తనాలు ఎందుకు అందించలేదని ప్రశ్నించారు. రైతుల సమస్యలపై దృష్టి పెట్టాల్సిన ప్రభుత్వం డైవర్షన్, రెడ్బుక్ రాజకీయాలపై దృష్టి సారిస్తోందని జగన్ విమర్శించారు. మంత్రులు ప్రచార ఆర్భాటాలకే పరిమితమయ్యారని, తమ ప్రభుత్వంపై తప్పుడు ప్రచారం చేయడంపైనే చంద్రబాబు దృష్టి ఉందని పేర్కొన్నారు. కరువు పరిస్థితుల్లో ప్రజలు, రైతులను ఆదుకునేందుకు చంద్రబాబు ప్రభుత్వం వద్ద ఎలాంటి ప్రణాళిక ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు. సీఎంగా తాను ఏం చేస్తున్నానో చంద్రబాబు ఆత్మపరిశీలన చేసుకోవాలని వైఎస్ జగన్ సూచించారు.ఇదీ చదవండి: చంద్రబాబు అలా చేస్తే మనదే విజయం: వైఎస్ జగన్ -
తీవ్రకరువులో కుంభకర్ణుడి మాదిరిగా చంద్రబాబు తీరు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ సవాల్ విసిరితే ఇప్పటిదాకా చంద్రబాబు ప్రభుత్వం నుంచి సమాధానమే రాలేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అంటున్నారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై బుధవారం ఆయన తాడేపల్లిలో మీడియా ద్వారా మాట్లాడారు. ‘‘రాష్ట్రంలో కరువు తీవ్రంగా ఉంది. మొత్తం 28 జిల్లాల్లో లోటు వర్షపాతం నమోదైంది. రాయలసీమతో పాటు కోస్తాలోనూ తీవ్ర కరువు నెలకొంది. అంత తీవ్ర పరిస్థితులు ఉన్నా చంద్రబాబు స్పందించడం లేదు. పైగా కుంభకర్ణుడిలా నిద్ర నటిస్తున్నారు. జూన్ నుంచి ఇప్పటిదాకా 52 శాతం వర్షపాతం నమోదైంది. మొత్తం 688 మండలాల్లో 625 మండలాల్లో లోటు వర్షపాతం ఉంది. అయినా రైతులను ఆదుకునే చర్యలేవీ చేపట్టలేదు....ఎల్నినో ఎఫెక్ట్ ఉంది అని తెలుసు. జూన్లో తక్కువ వర్షాలు పడ్డాయని తెలుసు. జులైలోనూ అదే పరిస్థితి. అయినా పంటలకు నీళ్లు ఇస్తామని ఫోజులు ఇచ్చారు. వీళ్లు నీళ్లు ఇస్తారనే నమ్మకంతో రైతులు పెట్టుబడులు పెట్టారు. ఫలితంగా.. ఎకరాకు 15 వేలు నష్టపోయారు. కరువు డేంజర్ బెల్స్ మోగుతున్న చంద్రబాబు కనీసం స్పందించడం లేదు అని వైఎస్ జగన్ అన్నారు.ఒకవైపు వర్షాలు లేక సంక్షోభం వస్తే మరోవైపు నీటిని విడుదల విషయంలో చంద్రబాబు మానవత్వం లేకుండా వ్యవహరిస్తున్నారని వైఎస్ జగన్ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా రాయలసీమ విషయంలో ఆయన మరీ దుర్మార్గంగా వ్యవహరిస్తున్నారని తెలిపారు. శ్రీశైలం జలాశయంలో నీటితో తెలంగాణ, ఇటు కరువులో రైతుల గురించి ఆలోచించకుండా ఎడాపెడా విద్యుత్ ఉత్పత్తి మీద చంద్రబాబు దృష్టి సారించారని జగన్ ధ్వజమెత్తారు. అవకాశమున్నా పొత్తిరెడ్డిపాడు ద్వారా రాయలసీమకు నీరు ఇవ్వడానికి బాబుకు చేతులు రాలేదని వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. రానున్న రోజుల్లో పరిస్థితి మరింత తీవ్రంగా ఉండబోతోంది. సెప్టెంబర్ 15 తర్వాత వర్షాలు తగ్గుముఖం పడతాయని వాతావరణ శాఖ చెబుతుంది. ఆ తర్వాత పరిస్థితి ఏంటి?. రాయలసీమకు నీరు ఎలా ఇస్తారు? అని కూటమి ప్రభుత్వాన్ని నిలదీశారు. ఇదీ చదవండి: అదే గనుక జరిగితే వైఎస్సార్సీపీదే విజయం -
స్థానిక ఎన్నికలపై వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: స్థానిక సంస్థల ఎన్నికలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. ఎన్నికలు స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా గనుక జరిగితే కూటమికి వ్యతిరేకంగా ప్రజలు స్పష్టమైన తీర్పు ఇస్తారని ఆయన అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ ముఖ్యనేతలతో భేటీ అయిన వైఎస్ జగన్.. పలు కీలక వ్యాఖ్యలు చేశారు.‘‘ఇవి కేవలం గెలుపోటములకు సంబంధించిన ఎన్నికలు కావు. మన కార్యకర్తల కోసం నిలబడాల్సిన ఎన్నికలు. ఎన్నికలు స్వేచ్ఛగా జరిగితే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా జనం ఓటేస్తారు. అందుకే చంద్రబాబు ఎన్నికలను నిష్పక్షపాతంగా జరగనివ్వరు. స్థానిక ఎన్నికలను నేతలు ఆషామాషీగా తీసుకోవద్దు. బలమైన అభ్యర్థులను నిలబెడదాం. గతంలో.. ఎంపీటీసీ, మున్సిపాలిటీ, జడ్పీ చైర్మన్, మేయర్ ఎన్నికల్లో అధికార దుర్వినియోగం, దౌర్జన్యాలు, ప్రలోభాలు చూశాం. అధికార పార్టీ ఎన్ని దౌర్జన్యాలు చేసినా నాయకుడు తనతోనే ఉన్నాడనే భరోసా ప్రతి కార్యకర్తకు కలగాలి. ఇప్పుడు కార్యకర్తకు అండగా నిలబడితేనే, రేపు సాధారణ ఎన్నికల్లో అతడు రెట్టించిన ఉత్సాహంతో పార్టీ కోసం పనిచేస్తాడు’’ అని వైఎస్ జగన్ అన్నారు.ప్రత్యక్ష ఎన్నికలు–బలమైన అభ్యర్థులుస్థానిక సంస్థల పదవులకు ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహిస్తామని ప్రభుత్వం చేస్తున్న ప్రకటన ఒకరకంగా మనకు అనుకూలమే. అందుకే బలమైన అభ్యర్థులను నిలబెట్టాలి. ప్రధాన పదవికి బలమైన అభ్యర్థి ఉంటే మిగిలిన ఎంపీటీసీలు, కార్పొరేటర్లు, వార్డు అభ్యర్థులకు పర్యవేక్షణతోపాటు బలం లభిస్తుంది. అవసరమైన చోట కార్యకర్తలకు అండగా నిలిచేందుకు కుటుంబ సభ్యులను పోటీకి దింపడానికీ వెనకాడవద్దు. ప్రజల గొంతు వినిపించేలా, పార్టీ కార్యకర్తలకు భరోసా కల్పించేలా ప్రతి స్థానంలో పోటీ జరగాలిఏకగ్రీవాలకు అంగీకరిస్తే కఠిన నిర్ణయంఏ నియోజకవర్గంలోనూ పోటీ లేకుండా ఏకగ్రీవాలకు ఆస్కారం ఉండకూడదు. స్థానిక ఎన్నికల్లో ఎక్కడైనా ఏకగ్రీవాలు జరిగితే, తదుపరి అసెంబ్లీ ఎన్నికల్లో అక్కడున్న కో-ఆర్డినేటర్ పార్టీ అభ్యర్థులు కాలేరు. ప్రతి నియోజకవర్గంలో ఎక్కడెక్కడ అభ్యర్థులను నిలబెట్టారో ఎన్నికల అనంతరం నివేదికలు తెప్పించుకుంటా. అభ్యర్థులను నిలబెట్టడమే కాకుండా వారికి ఎమ్మెల్యే అభ్యర్థులు ఎంత బలంగా మద్దతిచ్చారన్నదానిపైనా నివేదికలు తీసుకుంటా. కార్యకర్తల ఎన్నికల్లో మనం గట్టిగా నిలబడితేనే, మన ఎన్నికల్లో కార్యకర్తలు మన కోసం గట్టిగా నిలబడతారు.గ్రామస్థాయి ప్రచార కార్యక్రమం“వెన్నుపోటు పార్టీ–వెన్నుపోటు పాలన”పై గ్రామ కమిటీలు, అనుబంధ విభాగాలు ప్రతి గ్రామంలో ప్రచారం చేయాలి. ప్రతి కార్యకర్త ఇంటింటికీ వెళ్లి వైఎస్సార్సీపీ పాలనకు, కూటమి పాలనకు మధ్య తేడాను వివరించాలి. ఇంటింటి ప్రచారానికి అవసరమైన పూర్తి సమాచారాన్ని, ప్రచార సామగ్రిని పార్టీ అందిస్తుంది. కార్యక్రమాలన్నీ నిర్దిష్ట తేదీలు, షెడ్యూల్, వ్యవస్థీకృత కార్యాచరణ ప్రకారం జరగాలి.14–15 లక్షల గుర్తింపు కార్డులుపార్టీ కేడర్ కోసం దాదాపు 14–15 లక్షల గుర్తింపు కార్డులు సిద్ధమయ్యాయి. గ్రామస్థాయి కమిటీలు, అనుబంధ విభాగాల కార్యకర్తల వరకు గుర్తింపు కార్డులను పంపిణీ చేస్తాం. జిల్లా, నియోజకవర్గ, మండల స్థాయుల్లో సమావేశాలు నిర్వహించి గుర్తింపు కార్డులు అందించాలి. సమావేశాల్లో గుర్తింపు కార్డులతోపాటు ఇంటింటి ప్రచార సామగ్రినీ కేడర్కు పంపిణీ చేయాలి. గుర్తింపు కార్డుల్లో క్యూఆర్ కోడ్ ఉంటుంది; కార్యకర్తలు తమ ఫోన్లలోనే సమాచారాన్ని పొందవచ్చు. సెప్టెంబరు 5,6,7 తేదీల్లో ఒకరోజు ఏదో ఒకరోజు జిల్లాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. సెప్టెంబరు 8,9,10,11 తేదీల్లో ఏదో ఒకరోజు అసెంబ్లీ నియోజవకర్గాల స్థాయి సమావేశాలు నిర్వహిద్దాం. ఇక మండల, వార్డు, డివిజన్ స్థాయిల్లో సెప్టెంబరు 12 నుంచి 22 వరకూ సమావేశాలు నిర్వహిద్దాం. లీగల్, మీడియా సెల్స్ యాక్టివ్గా ఉండాలిప్రతి నియోజకవర్గంలో లీగల్ సెల్, మీడియా సెల్లను వెంటనే బలోపేతం చేయాలి. పోటీ జరగకుండా అడ్డుకునేందుకు అధికార పార్టీ కేడర్పై దౌర్జన్యాలకు దిగే అవకాశం ఉంది; కార్యకర్తలను రక్షించుకోవాలి. నియోజకవర్గ స్థాయిలో సమర్థులైన న్యాయవాదులను ఒక వేదికపైకి తీసుకొచ్చి కార్యకర్తలకు అందుబాటులో ఉంచాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర లీగల్ సెల్స్ పరస్పరం అనుసంధానమై పనిచేయాలి. అవసరమైన కేసులను హైకోర్టు వరకు తీసుకెళ్లేందుకు సమన్వయ వ్యవస్థ ఉండాలి. పోలీసుల వేధింపులకు గురయ్యే కార్యకర్తలను న్యాయపరంగా రక్షించాల్సిన బాధ్యత పార్టీ తీసుకోవాలి. నియోజకవర్గ, జిల్లా, రాష్ట్ర స్థాయి లీగల్, మీడియా వ్యవస్థలన్నీ ఒకే యూనిట్గా పనిచేయాలి.సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యంప్రతి నియోజకవర్గంలో సోషల్ మీడియాకు అత్యంత ప్రాధాన్యం ఇవ్వాలి. పార్టీలో సోషల్ మీడియాలో చురుగ్గా ఉన్నవారిని గుర్తించి, మిగిలిన వారినీ యాక్టివేట్ చేయాలి. యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వంటి వేదికలపైకి మొత్తం పార్టీ కేడర్ను తీసుకురావాలి. సోషల్ మీడియా ఖాతాలు ఎలా ప్రారంభించాలి, ఎలా యాక్టివేట్ చేయాలి, ఎలా నిర్వహించాలనే అంశాలపై శిక్షణ ఇవ్వాలి. జగన్ 2.0 సూపర్ యాప్, వైయస్సార్సీపీ టాక్స్, పార్టీ సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రజల్లోకి సందేశం తీసుకెళ్లాలి. పార్టీకి సంబంధించిన యూట్యూబ్ ఛానళ్లు, సోషల్ మీడియా వ్యవస్థలను సమర్థంగా ఉపయోగించుకోవాలి. పార్టీ కేడర్కు వాస్తవ సమాచారం, అవసరమైన న్యూస్ కంటెంట్ నిరంతరం అందాలి. నియోజకవర్గాల్లోని సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లను వ్యక్తిగతంగా కలిసి పార్టీకి మద్దతుగా నిలవాలని కోరాలి. ఎందుకంటే.. ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ5 వంటి ప్రతికూల మీడియా వ్యవస్థలతో మనం యుద్ధం చేస్తున్నాం.నాయకులకు హెచ్చరికనియోజకవర్గాల్లో మీడియా, సోషల్ మీడియా, లీగల్ సెల్స్పై యాక్టివ్గా లేని నాయకులు ఇప్పటికైనా గేర్ మార్చాలి. నాయకులు కార్యకలాపాలను తమ నియంత్రణలోకి తీసుకోకపోతే కార్యకర్తలు నష్టపోతారు. ఇంటింటి ప్రచారం ద్వారా ప్రతి కుటుంబానికి వైయస్సార్సీపీ–కూటమి పాలన మధ్య తేడాను వివరించాలి.ఈగోలకు తావులేదుస్థానిక ఎన్నికల్లో ఓటర్ల సంఖ్య తక్కువగా ఉంటుంది కాబట్టి అభ్యర్థి వ్యక్తిగత బలం అత్యంత కీలకం. అభ్యర్థుల ఎంపికలో భావోద్వేగాలు, వ్యక్తిగత ఈగోలను పక్కనపెట్టి అందరినీ కలుపుకొని వెళ్లాలి. తొమ్మిది ఓట్లతో గెలిచిన సందర్భాలు, తొమ్మిది ఓట్లతో ఓడిన సందర్భాలూ ఉన్నాయి. కాబట్టి ప్రతి ఓటూ కీలకమే. “జో జీతా వహీ సికందర్”.. గెలుపే ముఖ్యం, గెలుపు కోసం ఈగోలను పక్కన పెట్టాలి. ప్రతి గ్రామంలో పార్టీని బలంగా కన్సాలిడేట్ చేసి, సమర్థుడైన కార్యకర్త చుట్టూ ఏకాభిప్రాయం సృష్టించాలి. రాబోయే 60–70 రోజులు నాయకులు తమ నియోజకవర్గాలను దాటి వెళ్లకుండా పూర్తిగా స్థానిక ఎన్నికలపైనే దృష్టిపెట్టాలి. సరైన శ్రద్ధ, పూర్తి స్థాయి కార్యాచరణ ఉంటే స్థానిక ఎన్నికల్లో గెలుపు జెండా ఎగరేస్తాంవాళ్ల పేర్లు డిజిటల్ బుక్లోకి..పోలీసు అధికారులు పదవిని దుర్వినియోగం చేయకుండా న్యాయంగా, ధర్మంగా వ్యవహరించాలి. కానీ అలా జరగడం లేదు. కార్యకర్తలను వేధించే, అన్యాయం చేసే అధికారుల వివరాలను నమోదు చేయాలి. చట్టవిరుద్ధంగా వ్యవహరించిన అధికారులపై భవిష్యత్తులో చట్టప్రకారం చర్యలు తప్పవు. ప్రతి పోలీసు అధికారి రాజకీయ ఒత్తిళ్లకు తలొగ్గకుండా తటస్థంగా వ్యవహరించాలని కోరుతున్నాం. పోలీసు వ్యవస్థలో నిష్పాక్షికత తీసుకురావడానికి పార్టీ నాయకులు గట్టి ప్రయత్నం చేయాలి అని వైఎస్ జగన్ దిశానిర్దేశం చేశారు.ఇదీ చదవండి: ఆలయాల విధ్వంసం.. పవన్ కంటికి కనిపించడం లేదా? -
రెడ్ జోన్ లో కూటమి.. షాక్ లో పవన్
-
రెండేళ్లకే మోగుతున్న రెడ్ సైరన్.. ఈ కూటమి ప్రభుత్వ పతనం ప్రారంభమైంది
-
మీరెన్ని కేసులు పెట్టినా.. నా గొంతు ఆగదు: అంబటి
సాక్షి, గుంటూరు: తనపై నమోదైన కేసులన్నీ ప్రస్తుతం ఎఫ్ఐఆర్ దశలోనే ఉన్నాయని, ఇప్పటివరకు ఛార్జ్షీట్లు దాఖలు చేయలేదని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబు అన్నారు. ఒకే ఘటనకు సంబంధించి పలు కేసులు నమోదు చేసి తనను వేధించాలని చూస్తున్నారని చెప్పారు. రాజకీయ విమర్శలు చేసినందుకే కేసులు పెడుతున్నారని, వాటికి భయపడేది లేదని స్పష్టం చేశారు.తనపై వరుస కేసుల వ్యవహారంపై మాజీ మంత్రి అంబటి రాంబాబు మంగళవారం ఉదయం మీడియాతో మాట్లాడారు. కేంద్రమంత్రి పెమ్మసాని చంద్రశేఖర్పై సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు సీఐడీతో పాటు మరో కేసు నమోదు చేశారని, ఇటీవల పట్టాభిపురం పోలీసులు కూడా తనపై కేసు పెట్టారని తెలిపారు. తన అధికారిక యూట్యూబ్ ఛానల్లో ‘ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచిన పార్టీ’ అంటూ పాటను పోస్టు చేశానని చెప్పారు. చంద్రబాబు తరచూ ‘గొడ్డలి పార్టీ’ అంటూ విమర్శలు చేస్తున్న నేపథ్యంలో దానికి కౌంటర్గా ‘వెన్నుపోటు పార్టీ’ అంటూ రాజకీయ వ్యంగ్యంతో పోస్టు చేశానన్నారు.ఎన్టీఆర్ మీద కృష్ణ సినిమాలే తీశారువైఎస్ జగన్ మోహన్రెడ్డిపై ఏఐ వీడియోలతో అత్యంత అవమానకరంగా పోస్టులు పెట్టిన వారిపై తాను ఫిర్యాదు చేసినా ఇప్పటివరకు కేసులు నమోదు చేయలేదని అంబటి ఆరోపించారు. అధికార పార్టీకి ఒక న్యాయం, ప్రతిపక్షానికి మరో న్యాయమా? అని ప్రశ్నించారు. రాజకీయ విమర్శలు, వ్యంగ్యాలు ప్రజాస్వామ్యంలో సాధారణమేనన్నారు. పోలీసులు నిష్పక్షపాతంగా ఎందుకు వ్యవహరించలేకపోతున్నారని అంబటి నిలదీశారు.‘‘రాజకీయ విమర్శలు చెయ్యకూడదా?. ఎన్టీఆర్ సీఎంగా ఉన్నప్పుడు ఆయనపై వ్యంగంగా అనేక చర్యలు కనిపించాయి. ఎన్టీఆర్ను పోలిన వేషధారణతో క్యారెక్టర్తో హీరో కృష్ణ ఏకంగా సినిమాలు తీశారు. ఆ కాలంలో ఇలాంటివేవీ జరగలేదే’’ అని అంబటి గుర్తు చేశారు.‘కేసులకు భయపడేది లేదు’కేసులతో బెదిరించాలని చూస్తే తాను భయపడబోనని అంబటి అన్నారు. పోలీసుల వాహనంలో గంజాయి దొరికిన ఘటనపై కూడా తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. సత్తెనపల్లి, చిలకలూరిపేట, రేపల్లె ప్రాంతాలలో పేకాట క్లబ్బులు నడుస్తున్నాయి. ఐజీ త్రిపాఠికి వాటాలు వస్తున్నాయి. పోలీసులే గంజాయి అమ్మి ఐజీకి డబ్బులు ఇస్తున్నారు. అందరూ కుమ్మక్కై వాటాలు పంచుకుంటున్నారు అని అన్నారు. రఘురామకృష్ణరాజుపై ఫిర్యాదు చేసినా కేసు నమోదు చేయలేదని అంబటి పేర్కొన్నారు. చంద్రబాబు ఆధ్వర్యంలో నడుస్తోంది టీడీపీ కాదని, ‘వెన్నుపోటు పార్టీ’ అని విమర్శించారు. తనపై ఎన్ని కేసులు పెట్టినా రాజకీయ విమర్శలు చేయడం ఆపబోనని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: బాలయ్య తంతారేమోనని భయపడి.. -
పవన్కు ఇవేవీ కనిపించడం లేదా?: భూమన
సాక్షి, తిరుపతి: పురాతన ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని వైఎస్సార్సీపీ నేత, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకరరెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇంత జరుగుతున్నా.. సనాతనిగా తనను తాను చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఇవేవీ కనిపించడం లేదా? అని నిలదీశారు. మంగళవారం ఈ వ్యవహారం భూమన కరుణాకర్ స్పందించారు. కడప–చెన్నై రహదారి వెంట ఉన్న అనేక ఆలయాలను కూల్చివేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే రేణిగుంట–రైల్వే కోడూరు మార్గంలో వందల ఏళ్ల చరిత్ర కలిగిన ఆంజనేయస్వామి ఆలయాన్ని కూల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం అనుమతించడంపై తీవ్రంగా మండిపడ్డారు.అంజనేయపురం గ్రామానికి ఆ ఆలయం వల్లే ఆ పేరు వచ్చిందని భూమన పేర్కొన్నారు. తొలి వాగ్గేయకారుడు అన్నమయ్య తిరుమలకు అడవి మార్గంలో వెళ్తూ ఇక్కడి స్వయంభూ ఆంజనేయస్వామిని పూజించిన చరిత్ర ఉందన్నారు. బ్రిటిష్ కాలంలో 1871లోనే అంజనేయపురంలో రైల్వే స్టేషన్ ఏర్పాటు చేశారని గుర్తుచేశారు.‘తెల్లోడు కాపాడితే.. నల్లోడు కూల్చేస్తున్నాడు’బ్రిటిష్ పాలకులు ఆలయాలను సంరక్షిస్తే.. స్వాతంత్య్రం వచ్చిన తర్వాత పాలకులు వాటిని కూల్చేందుకు సిద్ధమవుతున్నారని భూమన వ్యాఖ్యానించారు. తిరుపతి–చెన్నై మార్గంలోని నగరి సమీపంలోని కీలపట్టు సర్కిల్లో ఆంజనేయస్వామి ఆలయాన్ని ఇప్పటికే కూల్చివేశారని చెప్పారు. 1993లో చిరంజీవి చేతుల మీదుగా ప్రారంభమైన ఆలయాన్ని ఇప్పుడు ధ్వంసం చేశారని ఆరోపించారు.‘పవన్కు కనిపించడం లేదా?’సనాతన ధర్మ పరిరక్షకుడిగా చెప్పుకునే డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్కు ఆలయాల ధ్వంసం కనిపించడం లేదా? అని భూమన ప్రశ్నించారు. ‘‘అన్న ఆలయాన్ని ప్రారంభిస్తే.. తమ్ముడు అధికారంలో ఉండగా అదే ఆలయాన్ని కూల్చివేశారు. ఇదేనా సనాతన ధర్మ పరిరక్షణ?’’ అంటూ నిలదీశారు. చంద్రబాబు ప్రభుత్వం ఆలయాలను ధ్వంసం చేయడమే లక్ష్యంగా పెట్టుకుందన్న భూమన.. ఆలయాల పరిరక్షణ కోసం ప్రజలతో కలిసి వైఎస్సార్సీపీ పెద్ద ఎత్తున పోరాటం చేస్తుందని స్పష్టం చేశారు.ఇదీ చదవండి: రఘురామరాజుపై కేసు ఏదీ? -
కూటమి సర్కార్ పై ఉద్యోగుల దండయాత్ర...!
-
ఈసారైనా.. ఎన్నికలు జరిగేనా?
తాడేపల్లిగూడెం(పశ్చిమగోదావరి ): కోర్టు కేసులున్న మున్సిపాలిటీల్లో ఈ సారైనా ఎన్నికలు జరుగుతాయా.. ప్రతిపాదిత విలీన గ్రామాలతో కలిపి ఎన్నికలు నిర్వహిస్తారా.. కోర్టు కేసులు ఎత్తేసి, ప్రత్యేక ఆదేశాలతో పాత వార్డులతోనే ఎన్నికలకు వెళతారా.. జిల్లాలో కోర్టు అభ్యంతరాలున్న పాలకొల్లు, తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెంలో ఎన్నికలు జరిగే అవకాశాలున్నాయా.. ఇది ప్రస్తుతం అంతటా జరుగుతున్న చర్చ.. వీటిలో తాడేపల్లిగూడెం మున్సిపాలిటీ ఎన్నిక జరిగే అవకాశాలున్నా, వాటిని ఆపడానికి కూటమి నాయకుల తరఫున ఎవరైనా ప్రయత్నిస్తున్నారా.. అంటే అవుననే సమాచారం తెలుస్తోంది. గతంలో 35 వార్డులుగా ఉన్న తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో 5 సమీప గ్రామాలను (కొండ్రుపోలు, ఎల్.అగ్రహారం, కుంచనపల్లి, ప్రత్తిపాడు, పడాల) విలీనం చేస్తూ వార్డుల సంఖ్యను 40కి పెంచేందుకు ప్రతిపాదించారు. అయితే దీనిని వ్యతిరేకిస్తూ దాఖలైన కేసుల వల్ల గత ఏడేళ్లుగా ఇక్కడ ఎన్నికలు జరగక ప్రత్యేక అధికారుల పాలన కొనసాగుతోంది. అలాగే ప్రతిపాదిత ఐదు గ్రామాలకు కూడా సర్పంచ్ ఎన్నికలు నిర్వహించలేదు. ఇదిలా ఉండగా ప్రభుత్వం విడుదల చేసిన జీఓలో కోర్టు కేసులున్న 23 మున్సిపాలిటీలు మినహా మిగిలిన వంద మున్సిపాలిటీల్లో ఎన్నికలు నిర్వహించనున్నట్టు పేర్కొంది. గవర్నర్ ఆర్డినెన్స్ మాటేంటి? మున్సిపాలిటీల్లో సమీప గ్రామాల విలీన ప్రతిపాదనలకు సంబంధించి 2021 జనవరి 12న అప్పటి గవర్నర్ ఆర్డినెన్స్ ఇచ్చారు. దీని ప్రకారం ప్రతిపాదిత పంచాయతీలను మున్సిపాలిటీలో విలీనం చేసుకోవచ్చని చెబుతున్నారు. వీటిని సవాల్ చేస్తూ కేసులు వేసిన వారు కోర్టును ఆశ్రయించినా గతంలో వాటిని కొట్టేసినట్టు సమాచారం. 1న వాదనలు : తాడేపల్లిగూడెం మున్సిపాలిటీలో ఐదు గ్రామాల విలీనానికి సంబంధించి వచ్చేనెల 1న హైకోర్టులో వాదనలు జరుగనున్నాయి. విశ్వసనీయ సమాచారం ప్రకారం.. గతంలో ఈ కేసులను కోర్టులో దాఖలు చేసిన న్యాయవాది ప్రభుత్వ నియామక పోస్టులోకి వెళ్లడంతో ఆయన నుంచి కేసులను కేసులు వేసిన వారు వెనక్కి తీసుకున్నారని తెలుస్తోంది. వాస్తవానికి అప్పట్లో కేసులు వేసిన వారు టీడీపీ సానుభూతిపరులుగా చెబుతున్నారు. ప్రస్తుతం ఆ పార్టీ ఇక్కడ ఎన్నికలు జరగాలని ఆకాంక్షిస్తోంది. కూటమి వ్యూహం.. ‘చిదంబర’ రహస్యం తాడేపల్లిగూడెం మున్సిపల్ ఎన్నికల విషయంలో కూటమి వ్యూహం చిదంబర రహస్యంగా ఉంది. ఈ ఎన్నికను రెండేళ్ల కూటమి పాలనకు రిఫరెండంగా భావిస్తున్నట్టు ఆయా నాయకుల ఆలోచనలు కనిపిస్తున్నాయి. సూపర్ సిక్స్ హామీలు పూర్తిస్థాయిలో అమలు కాకపోవడంతో పరాభవం తప్పదనే భయం ఉన్నట్టు తెలుస్తోంది. ఈ క్రమంలో కూటమిలో కీలక నాయకుడు ఒకరు జిల్లాలోని తీరప్రాంతానికి చెందిన పేరొందిన హైకోర్టు లాయర్ ద్వారా తాడేపల్లిగూడెం ఎన్నిక నిలుపుదలకు కేసు వేయించినట్టు సమాచారం. -
ఈడీ సోదాల పేరుతో కొత్త నాటకాలు!
సాక్షి, హైదరాబాద్: కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఆయన కుటుంబానికి సంబంధించిన హైదరాబాద్, కడప ప్రాంతాల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారులు సోదాలు నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. ఇన్నేళ్లుగా సాగుతున్న వివేకా హత్య కేసులో మరో కేంద్ర దర్యాప్తు సంస్థ రంగంలోకి రావడంపై రాజకీయంగా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సోదాల పేరుతో కూటమి ప్రభుత్వం సరికొత్త నాటకానికి తెర తీసిందా?అనే చర్చ జోరందుకుంది. .వివేకానందరెడ్డి హత్యకు సంబంధించిన ఆర్థిక లావాదేవీలపై దర్యాప్తులో భాగంగా ఈడీ అధికారులు శుక్రవారం ఉదయం ఏపీ, తెలంగాణలో పది చోట్ల ఏకకాలంలో తనిఖీలు చేపట్టారు. హైదరాబాద్లో రెండు, వైఎస్సార్ జిల్లాలోని నాలుగు ప్రాంతాల్లో సోదాలు జరిగినట్లు సమాచారం. హైదరాబాద్ కోకాపేటలోని ఎంపీ అవినాష్ రెడ్డి నివాసంలోనూ ఈడీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆ సమయంలో ఆయన నివాసంలోనే ఉన్నట్లు తెలుస్తోంది. అవినాష్తో పాటు శంకర్రెడ్డి నివాసాల్లోనూ తనిఖీలు జరిగినట్లు తెలుస్తోంది. అటు పులివెందులలో అవినాష్ రెడ్డి తండ్రి భాస్కర్రెడ్డి నివాసాల్లోనూ సోదాలు జరుగుతున్నట్లు సమాచారం. ఇంతకీ ఈడీ ఎందుకు?వివేకానందరెడ్డి హత్య కేసు దర్యాప్తును సీబీఐ చేపట్టి ఇప్పటికే చార్జ్షీట్లు, అనుబంధ చార్జ్షీట్లు దాఖలు చేసింది. 2026 మార్చిలో సుప్రీంకోర్టులో సీబీఐ తరఫు న్యాయవాది మూడో అనుబంధ చార్జ్షీట్ దాఖలైనట్లు వెల్లడించారు. తదుపరి దర్యాప్తు అవసరం లేదన్న సీబీఐ వాదనను పరిగణనలోకి తీసుకున్న సుప్రీంకోర్టు.. వివేకా కుమార్తె సునీతారెడ్డి దాఖలు చేసిన మరింత దర్యాప్తు కోరిన పిటిషన్ను పక్కన పెట్టింది. ఇలాంటి సమయంలో వివేకా హత్యకు సంబంధించిన మనీలాండరింగ్ కోణాన్ని ఈడీ ప్రత్యేకంగా దర్యాప్తు చేయడం ఇప్పుడు చర్చకు దారితీసింది.‘మళ్లీ ఇదేంటి?’వివేకా హత్య కేసు ఇప్పటికే సుదీర్ఘకాలంగా రాజకీయ, న్యాయపరమైన వివాదాలకు కేంద్రంగా ఉంది. సీబీఐ దర్యాప్తు, చార్జ్షీట్లు, కోర్టు విచారణల తర్వాత ఇప్పుడు ఈడీ సోదాలు జరగడంతో.. ఇదే కేసును మరో కోణంలో మళ్లీ తెరపైకి తీసుకొస్తున్నారా? అనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. వివేకా హత్య కేసు.. మళ్లీ ఫోకస్లోకి2019 మార్చిలో పులివెందులలో వైఎస్ వివేకానందరెడ్డి హత్యకు గురయ్యారు. తొలుత రాష్ట్ర దర్యాప్తు సంస్థ విచారణ చేపట్టగా.. అనంతరం సీబీఐకి కేసు అప్పగించారు. 2020లో సీబీఐ దర్యాప్తు ప్రారంభించింది. 2021లో తొలి చార్జ్షీట్, ఆ తర్వాత అనుబంధ చార్జ్షీట్లు దాఖలయ్యాయి. కేసు విచారణను ఆంధ్రప్రదేశ్ నుంచి హైదరాబాద్లోని ప్రత్యేక సీబీఐ కోర్టుకు బదిలీ చేయాలని 2022లో సుప్రీంకోర్టు ఆదేశించింది. అప్పటి నుంచి సీబీఐ విచారణ కొనసాగుతుండగా.. విచారణ ముగించామని, ఇంక లోతైన దర్యాప్తేదీ అవసరం లేదని చెప్పినా.. ఇప్పుడు ఈడీ రంగంలోకి దిగడం అనుమానాలకు తావిస్తోంది. ఇదీ చదవండి: దమ్ము లేని ప్రభుత్వమిది -
జనసేన నేత బొలిశెట్టి శ్రీనివాస్ కూటమిపై సంచలన వ్యాఖ్యలు
-
బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండానే తండ్రీకొడుకుల బ్యాటింగ్: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: తప్పు చేశారు అని క్లియర్ కట్గా ఉన్నా.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు కూటమి ప్రభుత్వం ఒప్పుకోవడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో ఆయన డీఎస్సీ అవకతవకల అంశంపై మీడియా సమావేశంలో మాట్లాడారు. డీఎస్సీ అక్రమాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఆ ఆధారాలు ప్రజల ముందు ఉంచాం. ఆ అవకతకవలపై సీబీఐ విచారణ జరిపించాల్సిందే. చట్టసభల్లో ప్రధాన ప్రతిపక్షానికి సమయం ఇవ్వాల్సి వస్తుందని తమకు ఆ హోదా ఇవ్వడం లేదు. కౌన్సిల్లోనూ మాట్లాడడానికీ సమయం ఇవ్వడం లేదు. బౌలింగ్, ఫీల్డింగ్ లేకుండా తండ్రీకొడుకులు బ్యాటింగ్ చేస్తున్నారు అని చంద్రబాబు, నారా లోకేశ్లను ఉద్దేశించి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. డీఎస్సీలో అక్రమాలపై పోరాడుతున్నాం. అందుకే తమ హయాంలో నిర్వహించిన ఏపీపీఎస్సీ గ్రూప్-1పై కూటమి ప్రభుత్వం తప్పుడు ఆరోపణలు చేసింది. ప్రశ్నిస్తే గింజుకుంటున్నారు తప్ప.. తప్పు ఒప్పుకోవడం లేదు. అసెంబ్లీలో మాట్లాడతారు కానీ.. మండలిలో మాట్లాడరు. తప్పులను ప్రతిపక్షం ఎత్తి చూపుతుందని చంద్రబాబుకు భయం అని వైఎస్ జగన్ అన్నారు.డీఎస్సీ పేపర్ తయారీ, నిర్వహణ ఒకే అధికారి చేతిలో పెట్టారు. స్వయంగా ఈ విషయాన్ని లోకేశ్ సభలో అంగీకరించారు. ప్రశ్నాపత్రం తయారీ బాధ్యత ఎస్సీఈఆర్టీది. పరీక్ష నిర్వహణ డీఎస్సీ కన్వీనర్ది. రెండూ ఒకే వ్యక్తి చేతిలో పెడితే పారదర్శకత ఉంటుంందా?. ఏపీ డీఎస్సీ నియామక చరిత్రలోనే రెండు బాధ్యతలు ఒకే అధికారి చేతికి ఎప్పుడూ ఇవ్వలేదు. ఇక్కడే డీఎస్సీ స్కామ్కు బీజం పడింది. అందుకే సీబీఐ విచారణ అడుగుతున్నాం. ఒకే వ్యక్తి చేతిలో రెండు బాధ్యతలు ఎందుకు పెట్టారు?. ఇలా చేయడం లీకేజీకి తెర తీసినట్లు కాదా? అని వైఎస్ జగన్ నిలదీశారు.ఆ లీకులు నవీన్ ఒక్కడి దగ్గరే ఆగాయా?నవీన్ తన ర్యాంకును, ఉద్యోగానికి సంబంధించిన అంశాలను ప్రస్తావిస్తూ విద్యాశాఖకు లేఖ కూడా రాశారని జగన్ తెలిపారు. మొదటి మెరిట్ జాబితాలో నవీన్కు ఫస్ట్ ర్యాంక్ వచ్చిందని, ఈ విషయాన్ని అసెంబ్లీ సాక్షిగా ప్రభుత్వం కూడా అంగీకరించిందని చెప్పారు. అలాంటప్పుడు ఫస్ట్ ర్యాంకర్కు ఉద్యోగం ఎందుకు ఇవ్వలేదని ప్రశ్నించారు.వెరిఫికేషన్కు హాజరు కాలేదనే కారణంతో నవీన్కు ఉద్యోగం ఇవ్వలేదని ప్రభుత్వం చెబుతోందని వైఎస్ జగన్ అన్నారు. అదే నిజమైతే.. తనకు ఉద్యోగం ఇవ్వలేదంటూ నవీన్ కోర్టును ఎందుకు ఆశ్రయించాడని ప్రశ్నించారు. అంతేకాకుండా రెండో మెరిట్ జాబితాలో నవీన్ పేరు లేకుండా ఎలా విడుదల చేశారని నిలదీశారు.పేపర్ లీకేజీ వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకే చంద్రబాబు, లోకేశ్ అబద్ధాలు చెబుతున్నారని వైఎస్ జగన్ అన్నారు. ముందుగానే నవీన్ పేరును మెరిట్ జాబితా నుంచి తొలగించారని అన్నారు. ప్రశ్నాపత్రం తయారీ విభాగంలో పనిచేసే ఉద్యోగికి ఫస్ట్ ర్యాంక్ రావడంపై అనుమానాలు వ్యక్తం చేశారు. నవీన్ ఒక్కడి వరకే పేపర్ లీక్ పరిమితమైందా? లేక ఇంకా ఎంతమందికి చేరింది? అని వైఎస్ జగన్ ప్రశ్నించారు. నవీన్ విషయంలోనే ఇలా జరిగిందా? డీఎస్సీ వ్యవహారంలో మరెవరైనా లబ్ధి పొందారా? అనే అంశాలపైనా సమగ్ర దర్యాప్తు జరగాల్సిన అవసరం ఉందని.. అందుకే సీబీఐ దర్యాప్తు కోరుతున్నామని చెప్పారు. -
మంత్రులపై మండలి చైర్మన్ ఫైర్
-
మూడో రోజూ పారిపోయిన కూటమి
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల నేపథ్యంలో అసెంబ్లీ మూడోరోజు సమావేశాల మూడో రోజూ కూడా దద్దరిల్లింది. ఈ అంశంపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే చైర్మన్ తిరస్కరణతో ఎమ్మెల్సీలు చర్చకు పట్టుబడుతూ ఆందోళనకు దిగారుఅప్డేట్స్మీడియా పాయింట్ వద్ద మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణమూడో రోజు కూడా కూటమి పారిపోయే వైఖరి అవలంభించింది..బయట మేకపోతు గంబీర్యం ప్రదర్శిస్తుంది.డీఎస్సీపై సీబీఐ ఎంక్వయిరీ వెయ్యాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలనీ డిమాండ్ చేస్తున్నాం.. ప్రభుత్వ స్పందించడం లేదురాష్ట్ర చరిత్రలో కొత్త సంప్రదాయంకి తెర తీస్తోందిడిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో పాలక పార్టీ బయటకి వెళ్ళిపోయిందిసభా సంప్రదాయం పాలక పక్షం అమలు చేయాలి5 కోట్ల మందికి బాధ్యత వహించాలని వెన్నుపోటు పార్టీకి లేదు..ఒంటెద్దు పోకడతో ప్రవర్తిస్తుందిరూల్ బుక్స్, చట్టాలు, సంప్రదాయాలు ఎక్కడ వున్నాయి?మేము చెప్పింది మీరు చేయండి అని మాత్రమే కూటమి అంటుంది.. ఇష్టా రాజ్యాంగ వ్యవహరిస్తుంది..సభా సంప్రదాయాలు తెలియని వ్యక్తుల దగ్గర మాకు అవసరం ఎందుకు ఇచ్చావ్ దేవుడా? అని సభ్యులు బాధ పడుతున్నారు..పెద్ద పెద్ద మాటలు చెప్పడం కాదు.. ఆచరించాలి.రాబోయే తరాలకు ఏం మెసేజ్ ఇవ్వాలని అనుకొంటున్నారు.. వీళ్లా? మనకు నాయకులు..బీసీలకు జగన్ 50శాతం అమలు చేశారు..బీసీ లకు రిజర్వేషన్ పై కోర్ట్ కి వెళ్ళింది వెన్నుపోటూ పార్టీ నేతలు..డీఎస్సీ మీద జీవో ఎందుకు మార్చమని చెప్పాడు.. అమ్ముకోవడానికి కదా?14 నుండి 19 వరకు ఎంతమంది బీసీ లకు చంద్రబాబు పదవులు ఇచ్చారో రేపు మాట్లాడతా..మంత్రి నాదెండ్ల మనోహర్ ఏకంగా చైర్మన్నే డిక్టేట్ చేస్తారుసభలో చర్చించిదే మండలి లో చర్చించమని అడుగుతున్నాం..ప్రజలు తెలిసో తెలియకో అధికారం ఇచ్చారు.. మాకు నచ్చినట్లు చేస్తాంటే కుదరదు..సభను పొడిగించామని కోరుతున్నాం..గ్రూప్ 1 పరీక్ష పై చర్చమని, ఎంక్వయిరీ వేయమని అడుగుతున్నామని గ్రూప్ 1 పేరు ఎత్తడం మానేశారు..ఎమ్మెల్సీ బొమ్మి ఇజ్రాయల్ కామెంట్లు..తూమాటి మాధవరావు మండలి డిప్యూటీ ఛైర్మన్గా ఏకగ్రీవమయ్యారుఆయన్ని చైర్లో కూర్చోబెట్టాల్సిన సమయంలో అధికారపక్షం అగౌరవంగా వ్యవహరించిందినాదెండ్ల మనోహర్, మరో మంత్రి సభ రూల్స్ ను నేర్పాలని చూశారు.. అలాంటి వారు సభా మర్యాదలను పాటించలేదుమండలి చరిత్రలో ఈరోజు చీకటి రోజునాలుగు సార్లు సీఎం అని చెప్పుకునే చంద్రబాబు డిప్యూటీ ఛైర్మన్ ను చైర్ లో కూర్చోబెట్టడానికిన మనసు రాలేదుడీఎస్సీలో విచారణకు రమ్మంటే లోకేష్ రావడం లేదుస్పోర్ట్స్ కోటాలో పరీక్ష రాశాకే ఉద్యోగమిచ్చామని అధికారులు చెప్పారుస్పోర్ట్స్ కోటా వారికి ఏ పరీక్షా పెట్టలేదని లోకేష్ చెబుతున్నారువ్యవసాయ శాఖ మంత్రి లేకుండా వ్యవసాయం పై చర్చిస్తారువిద్యాశాఖ మంత్రికి బదులు ఫైనాన్స్ మంత్రి సమాధానం చెబుతాడుఓడలరేవులో ఏడుగురు మత్స్యకారులు గల్లంతయ్యారు15 రోజులైనా మత్స్యకారుల ఆచూకీ తెలియలేదుప్రభుత్వం ఏం చేస్తోందిమత్స్యకారులు గల్లంతైన ఘటనకు ప్రభుత్వమే బాధ్యత తీసుకోవాలిఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్ మాట్లాడుతూ..డీఎస్సీ పై మూడవ రోజు కూడా వాయిదా తీర్మానాన్ని తిరస్కరించారుఈ రాష్ట్రంలోని నిరుద్యోగులకు ఈ ప్రభుత్వం ఎలాంటి సంకేతాలు ఇవ్వాలనుకుంటోందినిజానిజాలను చర్చించేందుకు మండలిలో అవకాశం లేకుండా చేయడం దురదృష్టకరండిప్యూటీ ఛైర్మన్ కుర్చీని అధికారపక్షం అగౌరవపరిచిందిమండలి పట్ల అధికారపక్షానికి ఎంత గౌరవముందో తేలిపోయిందిబీసీ బిల్లు పెట్టి అసెంబ్లీలో చర్చించారుబలహీన వర్గాలకు మంచి చేయాలని ఈ ప్రభుత్వం ఆలోచన చేయడం లేదుస్థానిక ఎన్నికలను వాయిదా వేసేందుకు ప్రభుత్వం ఆలోచన చేస్తోందిజగన్ మోహన్ రెడ్డి జనరల్ పోస్టుల్లోనూ బిసిలకు అవకాశం కల్పించారుజీవో లేకపోయినా 36% బిసిలకు అవకాశం కల్పించిన మహానాయకుడు జగన్బీసీలే వెన్నుముక అని నమ్మిన నాయకుడు జగన్50 ఏళ్లకే బీసీలకు పెన్షన్లు ఇస్తామని చంద్రబాబు చెప్పారుఅధికారంలోకి వచ్చి రెండేళ్లైన బీసీలకు పెన్షన్ ఇవ్వలేదుజగన్ బీసీ కులాలకు కార్పొరేషన్లు కల్పిస్తే.. చంద్రబాబు హేళన చేశారుఇప్పుడు తమ మనుషులతో అవే కార్పొరేషన్లను భర్తీ చేసుకున్నారుమేయర్, జడ్పీ ఛైర్మన్లకు డైరెక్ట్ ఎన్నికలు నిర్వహిస్తామనడం దుర్మార్గంతమ మనుషులకు మేలు చేయడం కోసమే ప్రత్యక్ష ఎన్నికలు నిర్వహించాలనుకుంటున్నారుఎమ్మెల్సీ ఇసాక్ బాషా మాట్లాడుతూ..మంత్రి లోకేష్ అసెంబ్లీలో చెప్పిన మాటలు మండలికి వచ్చి ఎందుకు చెప్పరు?డీఎస్సీ అక్రమాల పై చర్చకు రాకుండా పారిపోతున్నారుఈరోజు సభలో చోటుచేసుకున్న ఘటన దురదృష్టకరంమండలి చరిత్రలో ఎన్నడూ లేని విధంగా అధికారపక్షం వ్యవహరించిందిరూల్స్ బుక్ తీసుకొచ్చిన మంత్రి నాదెండ్ల మనోహర్ కు సభా మర్యాదలు తెలియదా?స్పీకర్ గా చేసిన వ్యక్తికి సభ రూల్స్ గుర్తులేదా?మండలి మీడియా పాయింట్ వద్ద రమేశ్ యాదవ్ కామెంట్లు.. బీసీలకు ‘వెన్నుపోటు పార్టీ’ వెన్నుపోటు పొడుస్తుంది..34 శాతం బీసీ రిజర్వేషన్ మీద సభలో హైడ్రామా నడిపారుగత ప్రభుత్వం 34శాతం బీసీ లకు రిజర్వేషన్ అమలు చేస్తున్నట్లు జీవో విడుదల చేసిందివెన్నుపాటు పార్టీ ప్రతాప్ రెడ్డి అనే నాయకుడితో కోర్టులో రిట్ పిటిషన్ వేశారు..పార్టీ పరంగా బీసీ లకు 50శాతం సీట్లు ఇచ్చిన నేత జగన్..18 స్థానాలు ఎమ్మెల్సీ ఖాళీలు అయితే 11 బీసీ లకు ఇచ్చిన నేత జగన్..మున్సిపాలిటి, జిల్లా పరిషత్, కార్పొరేషన్ లో అత్యధిక ప్రాధాన్యత కల్పించారు..జగన్ ఇద్దరు బీసీలను డిప్యూటీ సీఎంగా చేశారు..కూటమి ప్రభుత్వం బీసీలకు డిప్యూటీ సీఎం ఇవ్వలేదు..కల్లబొల్లి కబుర్లు చెబుతూ చంద్రబాబు బీసీలను ఓటు బ్యాంకు గా చూస్తున్నాడుబీసీలకు చంద్రబాబు వెన్నుపోటూ పొడుస్తూనే వున్నాడు..136 కులాలను తీసుకొచ్చి 56 కార్పొరేషన్లు ఏర్పాటు చేశారుకోర్టుకు పొతే నిలవదని చంద్రబాబుకి తెలిసి అసెంబ్లీలో బిల్లు పెట్టాడు..బీసీలకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో పెద్ద పీఠ వేశారు..చంద్రబాబుకి చిత్త శుద్ధి ఉంటే మంత్రి మండలిలో డిప్యూటీ సీఎం పదవి ఇవ్వాలి..బీసీ రిజర్వేషన్ బిల్లుపై చర్చ కి ప్రభుత్వం సిద్ధమా?మీడియా పాయింట్ వద్ద కౌరు శ్రీనివాస్ కామెంట్లు.. 2019 నుండి 2024 వరకు బీసీలకు అన్యాయం చేసారని చంద్రబాబు మాట్లాడుతున్నారురాష్ట్రంలో 139 బీసీ కులాలు ఉన్నాయని గుర్తించిన నేత జగన్ఆ కులాలకు పదవి ఇచ్చిన నేత జగన్కూటమి బీసీలను ముందుకు తీసుకొని వెళ్లిన దాకలాలు లేవుబీసీలను ఏ విధంగా గుర్తించాలని అని ఆలోచించిన నేత జగన్రాజశేఖర్ రెడ్డి, జగన్ హయాంలోనే బీసీలకు న్యాయం జరిగిందిఅన్ని పధకాలు బీసీలతో పాటు ఎస్సీఎస్టీలకు అందేలా చేసిన వ్యక్తి జగన్బీసీలు రాజకీయ పరంగా అభివృద్ధి చెందాలి అంటే.. మళ్లీ జగన్ సీఎం కావాలివైఎస్ జగన్కు ధన్యవాదాలు: తూమాటిమండలి డిప్యూటీ ఛైర్మన్గా తూమాటి మాధవరావుబాధ్యతలు స్వీకరించిన వెంటనే మాట్లాడిన తూమాటినాకు డిప్యూటీ ఛైర్మన్ గా అవకాశం కల్పించిన జగన్ మోహన్ రెడ్డికి ధన్యవాదాలుమండలి ఛైర్మన్, విపక్షనేత, సభ్యులకు ధన్యవాదాలుప్రజాస్వామ్యంలో శాసన వ్యవస్థకు అత్యంత ప్రాధాన్యం ఉందిశాసనమండలి విలువలను కాపాడుతాబొత్స కామెంట్లు.. శాసన మండలిలో కూటమి ఎమ్మెల్సీల దుస్సంప్రదాయండిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో బయటకు వెళ్లిపోయిన కూటమి సభ్యులుడిప్యూటీ చైర్మన్గా ఎన్నికైన తూమాటి మాధవరావుకు బొత్స అభినందనలుమండలిలో వెన్నుపాటు పార్టీ నేతల తీరు బాధాకరం: బొత్సకూటమి వ్యవహరిస్తున్న తీరు బాగోలేదు: బొత్సఅధికార పార్టీ సభ్యులు సభను గౌరవించలేదు.. అగౌరవ పరిచారు: బొత్సడిప్యూటీ చైర్మన్ ఎన్నిక సమయంలో అధికార పక్షం లేకపోవడం సరికాదు: బొత్ససభా సాంప్రదాయాలను తుంగలో తొక్కారు: బొత్సనాదెండ్ల ప్రవర్తనను చాలాసార్లు గమనించా: బొత్సపొరపాటు జరిగితే చెప్పాలిగానీ.. చైర్మనే హిత బోధ చేయడం ఏంటి?: బొత్సడీఎస్సీపై చర్చించాలన్నదే మా డిమాండ్: బొత్సనిబందనలు ఒక్కరికే కాదు.. అందరికీ వర్తిస్తాయి: బొత్సఅధికార సభ్యులు అహంకారంతో వ్యవహరిస్తున్నారు: బొత్స మంత్రులపై బొత్స ఆగ్రహంమండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావుఏపీ శాసన మండలి డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావువైఎస్సార్సీపీ తరఫున ఏకైక నామినేషన్తూమాటి ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటించిన చైర్మన్ కొయ్యే మోషేనురాజుఅభినందనలు తెలిపిన వైఎస్సార్సీపీ సభ్యులుఆ వెంటనే డిప్యూటీ చైర్మన్ బాధ్యతలు స్వీకరించిన తూమాటివాయిదా అనంతరం తిరిగి ప్రారంభమైన శాసన మండలిసభలో మంత్రుల తీరుపై ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ఆగ్రహంవైఎస్సార్స్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనంచైర్మన్నే ఆదేశించేలా వ్యాఖ్యలుచైర్మన్పట్ల మంత్రి నాదెండ్ల వ్యవహరించిన తీరుపై బొత్స మండిపాటుప్రొసీజర్ బుక్ తెచ్చి.. తానేం తప్పుగా మాట్లాడలేదంటూ మంత్రి నాదెండ్ల బుకాయింపుసభ్యులు పోడియం వద్దకు వస్తే చర్యలు తీసుకోరా? అని ప్రశ్నించిన నాదెండ్లచైర్మన్ సీటును మంత్రులు గౌరవించాల్సి ఉంటుందని నాదెండ్లకు బొత్స హితవుప్రారంభం.. ఆ వెంటనే వాయిదాడీఎస్సీ అంశంపై చర్చ జరపాలని వైఎస్సార్సీపీ, కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తోంది. శాసనసభలో సమాధానం ఇచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్.. మండలికి వచ్చి అదే సమాధానం చెప్పాలని కోరుతోంది. అవకతవకలు జరిగిన మాట వాస్తవమని.. తప్పు ఒప్పుకుని నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని అంటోంది. అదే సమయంలో.. ఈ వ్యవహారంపై సీబీఐతో విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. అయితే ప్రభుత్వం తరఫున నుంచి వైఎస్సార్సీపీ సభ్యుల ప్రశ్నలకు ఎలాంటి సమాధానం రావడం లేదు. కేవలం దాటవేత ధోరణి మాత్రమే కనిపించింది. దీంతో వైఎస్సార్సీపీ సభ్యుల చైర్మన్ పోడియంను చుట్టుముట్టడంతో.. ఆయన మండలిని కాసేపు వాయిదా వేశారు.మంత్రులకు చైర్మన్ చురకలువైఎస్సార్సీపీ సభ్యుల డీఎస్సీ డిమాండ్తో కూటమి మంత్రులకు ఏం చేయాలో పాలుపోలేదు. సమాధానం ఇవ్వలేక.. గట్టి గట్టిగా అరుస్తూ ఏవేవో స్టేట్మెంట్లు ఇచ్చారు. చివరకు మండలిని సరిగ్గా నడపాలంటూ చైర్మన్ కొయ్యే మోషేనురాజు మీద అసహనం ప్రదర్శించారు. మండలిని ఎలా నిర్వహించాలో మీకు తెలియదా? అంటూ మంత్రి నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యానించారు. మంత్రి పార్థసారథి ఓ అడుగు ముందుకేసి వైఎస్సార్సీపీ సభ్యుల్ని సస్పెండ్ చేయాలంటూ డిమాండ్ చేశారు. అయితే మంత్రుల కమాండింగ్పై చైర్మన్ అసంతృప్తి వ్యక్తం చేశారు. సభను ఎలా నడపాలో తనకు చెప్పాల్సిన అవసరం లేదంటూ మంత్రులందరికీ చురకలంటించారు.నల్ల కండువాతో..అంతకు ముందు.. మండలి సమావేశానికి ముందు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు మెడలో నల్ల కండువాలు వేసుకుని ర్యాలీగా వచ్చారు. ‘మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ’ అంటూ నినాదాలు చేస్తూ మండలికి చేరుకున్నారు. అయితే ఎమ్మెల్సీల నిరసన ర్యాలీని పోలీసులు అడ్డుకోవడంతో కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. పోలీసుల తీరుపై ఎమ్మెల్సీలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ రోడ్డుపైనే బైఠాయించి నిరసన తెలిపారు.మండలి సమావేశం ప్రారంభమైన తర్వాత డీఎస్సీలో జరిగిన అక్రమాలపై చర్చించాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు చంద్రశేఖర్రెడ్డి, కల్పలతారెడ్డి, రామచంద్రారెడ్డి వాయిదా తీర్మానం ఇచ్చారు. అయితే మండలి చైర్మన్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. దీంతో డీఎస్సీ అంశంపై చర్చకు అనుమతించాలని వైఎస్సార్సీపీ సభ్యులు పట్టుబడుతున్నారు.పొంతన లేని సమాధానాలు: లేళ్ల అప్పిరెడ్డిఈ సందర్భంగా ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతూ.. డీఎస్సీ నియామక ప్రక్రియలో అక్రమాలు జరిగాయన్నారు. డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఒకే వ్యక్తిని నియమించడంపై ప్రశ్నలు లేవనెత్తారు. మంత్రి నారా లోకేశ్ చెబుతున్న మాటలకు విద్యాశాఖ అధికారులు చెబుతున్న విషయాలకు పొంతన లేదని విమర్శించారు.ఎన్ఓసీ తీసుకోలేదని లోకేశ్ చెబుతుంటే.. ఎన్ఓసీ తీసుకున్నానంటూ నవీన్ కోర్టును ఆశ్రయించారని అప్పిరెడ్డి పేర్కొన్నారు. ఉద్యోగాలను లక్షల రూపాయలకు విక్రయించారనే ఆరోపణలు ఉన్నాయని, డీఎస్సీ అక్రమాలపై ప్రభుత్వం సీబీఐ విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. అలాగే.. పీవీ సింధు తరహాలోనే మిగతా వాళ్లకు స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలిచ్చామని చెబుతున్నారని, నియామకాల ప్రక్రియకు ఈ స్టేట్మెంట్కు సంబంధం ఏమైనా ఉందా? అని నిలదీశారు. ‘లోకేశ్ మండలికి వచ్చి సమాధానం చెప్పాలి’డీఎస్సీ అక్రమాలపై తాము ఆందోళన చేస్తున్నా ప్రభుత్వంలో ఎలాంటి చలనం కనిపించడం లేదని అప్పిరెడ్డి విమర్శించారు. లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. సవాళ్లు విసరడం తప్ప తమ ప్రశ్నలకు సమాధానం చెప్పడం లేదన్నారు. ఎవరూ ప్రశ్నించరనే ఉద్దేశంతోనే అసెంబ్లీలో మాట్లాడుతున్నారని, మండలిలో మాత్రం చర్చకు ఎందుకు రావడం లేదని ప్రశ్నించారు.డీఎస్సీ కన్వీనర్, ఎస్సీఆర్టీ డైరెక్టర్గా ఇద్దరు ఉండాల్సిన అవసరం లేదని ప్రభుత్వం చెబుతోందని.. అలాంటప్పుడు విద్యాశాఖ, శాప్ అధికారులను ఎందుకు బదిలీ చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. అధికారులందరినీ బదిలీ చేసినప్పుడు సంబంధిత మంత్రి లోకేశ్ను కూడా పదవి నుంచి తొలగించాలి కదా అని వ్యాఖ్యానించారు.డీఎస్సీకి సంబంధించిన అన్ని అంశాలపై చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు స్పష్టం చేశారు. ప్రభుత్వం ఎంత దూరం తప్పించుకున్నా విద్యార్థులు, నిరుద్యోగుల కోసం తమ పోరాటం కొనసాగుతుందని అన్నారు. ప్రభుత్వం తన వైఖరిని మార్చుకోకపోతే ప్రజలు, యువతే ప్రభుత్వాన్ని మార్చేందుకు సిద్ధంగా ఉన్నారని హెచ్చరించారు. -
నారా లోకేశ్ అట్టర్ఫ్లాప్ షో!
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య భారీగా తగ్గిపోయింది. గత మూడేళ్లలో ఏకంగా 5,88,419 మంది విద్యార్థులు తగ్గినట్లు.. మంగళవారం స్వయంగా విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ శాసనమండలిలో వెల్లడించారు. దీంతో వైఎస్ జగన్ ప్రభుత్వ హయాంలో ప్రభుత్వ విద్యాసంస్థల్లో ఉన్న విద్యార్థుల సంఖ్యతో పోలిస్తే.. ఆ సంఖ్య గణనీయంగా తగ్గినట్లు గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి.వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వ పాఠశాలలు, విద్యాసంస్థల్లో 1వ తరగతి నుంచి ఇంటర్ వరకు 40,50,031 మంది విద్యార్థులు ఉన్నట్లు ప్రభుత్వం పేర్కొంది. లోకేశ్ తాజా ప్రకటనలో ఆ సంఖ్య గణనీయంగా.. ప్రస్తుతం 34,61,612కు పడిపోయింది. అంటే మొత్తం 5,88,419 మంది విద్యార్థులు తగ్గిపోయారు.మండలిలో ప్రశ్నకు సమాధానంగా..ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్యపై శాసనమండలిలో వైఎస్సార్సీపీ సభ్యులు అడిగిన ప్రశ్నకు మంత్రి నారా లోకేశ్ ఈ వివరాలను వెల్లడించారు. ఒకటో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థుల సంఖ్యకు సంబంధించిన గణాంకాలను ప్రభుత్వం సభ ముందుంచింది. నిన్న.. వివాదాస్పదమైన డీఎస్సీ అంశంలోనూ అవకతవకలు జరిగినట్లు ఆయన పరోక్షంగా అంగీకరించిన సంగతి తెలిసిందే. దీంతో ఎడ్యుకేషన్ మినిస్టర్గా లోకేశ్ అట్టర్ఫ్లాప్ షో కొనసాగుతున్నట్లు స్పష్టమవుతోంది.విద్యాశాఖపై చర్చ..నారా లోకేశ్ విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత.. ఏపీలో విద్యా వ్యవస్థ పరిస్థితి మరీ దారుణంగా తయారైంది.ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక వసతులు, విద్యా ప్రమాణాలు, ప్రైవేటు పాఠశాలల వైపు విద్యార్థుల మళ్లింపు వంటి అంశాలపై చర్చకు ఈ గణాంకాలు దారితీశాయి. ప్రభుత్వ విద్యాసంస్థల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంపై వైఎస్సార్సీపీ ప్రశ్నలు లేవనెత్తే అవకాశం కనిపిస్తోంది. -
ఏపీ శాసన మండలి వాయిదా
డీఎస్సీ అక్రమాల అంశంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆందోళనతో ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ సమావేశాలు వరుసగా రెండో రోజు హోరెత్తాయి. ఎమ్మెల్సీల నిరసనలతో శాసన మండలి దద్దరిల్లుతోంది.AP అసెంబ్లీ సమావేశాల అప్డేట్స్ముగిసిన బీఏసీ సమావేశం.. మండలి వాయిదాశాసన మండలి సమావేశాలు రేపటికి వాయిదాడీఎస్సీపై చర్చకు కూటమి ప్రభుత్వం తర్జన భర్జనచర్చకు సిద్ధమంటూనే.. డేట్, టైం ఫిక్స్ చేయని వైనంఎల్నినో చర్చ తర్వాత డీఎస్సీ చర్చపై చర్చిస్తామంటున్న కూటమిముందే చర్చించాలని పట్టుబడుతున్న వైఎస్సార్సీపీడిప్యూటీ చైర్మన్ పోస్ట్కి నామినేషన్ వేసిన తుమాటి శాసన మండలి డిప్యూటీ చైర్మన్ ఎన్నికకు నామినేషన్లుఎన్నికల బరిలో వైఎస్సార్సీపీనామినేషన్ దాఖలు చేసిన ఎమ్మెల్సీ తుమాటి మాధవరావుఅసెంబ్లీ కార్యదర్శి వద్ద నామినేషన్ దాఖలుపాల్గొన్న మండలి ప్రతిపక్ష నేత బొత్స, వైసీపీ ఎమ్మెల్సీ లు కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల ఆగ్రహంమీడియా పాయింట్ వద్ద తోట త్రిమూర్తులు కామెంట్స్.. డీఎస్సీపై చర్చ జరగాలని పట్టుబడుతుంటే లోకేష్ వెనక్కి వెళ్ళిపోయాడు..సభలో చర్చించి నోట్ ఇచ్చిన చప్పట్లు కొట్టుకొన్నారు..లోకేష్ చంద్రబాబు ని, చంద్రబాబు లోకేష్ ని సభలో పొగుడుకొన్నాడు.డీఎస్సీపై అక్రమాలపై ప్రశ్నించేది ఎవరు?మండలి లో మేము ప్రశ్నిస్తామని కూటమి నేతలు రావడం లేదు..డీఎస్సీ అక్రమాలపై జగన్ ఆధారాలతో బయట పెట్టారు..అవినీతి జరకపోతే చర్చించండి..6నెలలకు అసెంబ్లీ జరపాలి కాబట్టి మామ అనిపిస్తున్నారు..రైతులు కష్టాలపై మేము ప్రశ్నిస్తున్నాం..ప్రజలకు చెప్పేది ఎమ్ లేక ప్రతిపక్షం లేని సభలో చప్పట్లు కొట్టుకొంటున్నారు..టీడీపీ నేతలు గ్రామాల్లో తిరిగిటే 10 మంది కూడా ఉండడం లేదు..ఆడబిడ్డ నిది ఎక్కడని మహిళలు, రైతు భరోసా కోసం రైతులు గ్రామాల్లో అడుగుతున్నారు..ప్రజల ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక మొహం చాటస్తున్నారు..అమరావతి లో దాచుకు తింటున్నారు కాబట్టి అమరావతి గురించి మాట్లాడుతున్నారు..మొండితోక అరున్ కామెంట్లు..DSC పై చర్చకి వాయిదా తీర్మానం ఇచ్చాం..గ్రూప్ ఆఫ్ మినిస్టర్స్ వొచ్చారు.. Dsc పై చర్చిస్తరని ఆశించం.లోకేష్ కాదు.. లీకేష్ తన మంత్రులతో పారిపోయాడు.స్పోర్ట్స్ కోటాలో రాత పరీక్ష లేదని అబద్ధం చెప్పావ్..పీవీ సింధూకి పరీక్ష నిర్వహించకుండా ఇచ్చామమని లోకేష్ చెప్పాడు.సరేగానీ చర్చిద్దాం అంటే లీకేష్ ముందుకు రావడం లేదుసత్యం రామలింగ రాజు మేనేజ్మెట్ కోటాలో చదివాడో అలాగే స్పోర్ట్స్ కోటాలో కూడా అలాగే జాబ్ లు ఇచ్చాడు..హోమ్ శాఖ ఏవిధంగా కేంద్ర గణాంకాలులో దిగజారిందో అలాగే విద్యా శాఖ కుడా దిగజారుతుంది..మూడేళ్లు లీకేష్ విద్యాశాఖ మంత్రిగా ఉంటే విద్యాశాఖ ర్యాంక్ కూడా పడిపోతుంది..డీఎస్సీతో పాటు మా హయాంలో జరిగిన ఏపీపీఎస్సీపైనా సీబీఐ విచారణ జరిపిద్దాంఅవకతవకలు జరిగినట్లు కనిపిస్తోంది కాబట్టి లీకేష్ రాజీనామా చేయాలి..లీకేష్ మేనేజ్మెంట్ కోట కింద ఇచ్చిన 400స్పోర్ట్స్ కోట సీట్లు రద్దు చేయాలి..4 రోజులు సభ పెడితే ప్రజా సమస్యలు ఎక్కడ చర్చకి వస్తాయి..లీకేష్ స్కామ్ పై జనసేన, బీజేపీ మాట్లాడాలి..వాళ్ల స్టాండ్ ఏంటో బీజేపీ, జనసేనలు చెప్పాలి..ప్రశ్నించానికి పార్టీ పెట్టానని చెప్పిన పవన్ ఈ లీకేజ్ పై లీకేష్ ని ప్రశ్నించాలి..బీఏసీ సమావేశంలో డీఎస్సీపై చర్చించాలని పట్టుబడుతున్నాం..వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు: మంచ నాగమల్లేశ్వరికూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ అధికార ప్రతినిధి మంచ నాగమల్లేశ్వరి ఫైర్అసెంబ్లీ వేదిక శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ అడిగిన ప్రశ్నలకు కూటమి ప్రభుత్వం సమాధానం చెప్పలేకపోయింది.బొత్స సత్యనారాయణ పై మంత్రి అచ్చెన్నాయుడు ఇష్టానుసారంగా మాట్లాడుతున్నారు..మంత్రిగా విఫలమైన అచ్చెన్నాయుడు కంటే దద్దమ్మ మరొకరు లేరు.బొత్స సత్యనారాయణ కు మంత్రి అచ్చెన్నాయుడు క్షమాపణ చెప్పాలి.లేదంటే అచ్చెన్నాయుడు ఇంటిని ముట్టడిస్తాము..అచ్చెన్నాయుడు నోరు అదుపులో పెట్టుకొని మాట్లాడాలి..బొత్సా సత్యనారాయణ కు లోకేష్ కు నక్కకు నాగలోకానికి ఉన్నత తేడా ఉంది.బొత్స సత్యనారాయణ విద్య శాఖ మంత్రిగా ఉన్న సమయంలో మన రాష్ట్ర విద్యార్ధులు ఐక్యరాజ్య సమితిలో అడుగుపెట్టారు..దద్దమ్మ ప్రభుత్వం అధికారంలో ఉందని రాష్ట్ర ప్రజలు అభిప్రాయపడుతున్నారు.540 మంది రైతులు కూటమి పాలనలో చనిపోయారు.వాస్తవాలు మాట్లాడితే జీర్ణించుకోలేక పోతున్నారు.నారా లోకేశ్కు వైఎస్ అవినాష్రెడ్డి సవాల్నారా లోకేశ్కు సవాల్ విసిరిన కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిలోకేష్ తో చర్చకు మేము సిద్ధమని అభ్యర్థులే సవాల్ విసురుతున్నారుముందు వాళ్ళకి సమాధానం చెప్పు లోకేష్..గోల్డ్ మెడలిస్ట్ దుర్గయ్య విసిరిన సవాళ్లకు సమాధానం చెప్పుదుర్గయ్య నీతో చర్చకు సిద్ధం అంటున్నాడు..నువ్వు సిద్ధమా..?పరీక్ష లేకుండా స్పోర్ట్స్ కోటా ఎంపిక చేసి..ఆ తర్వాత ఆ జీవో రద్దు చేశారునిన్న అసెంబ్లీలో లోకేష్ ఇచ్చిన వివరణ ఆయన్ని నవ్వుల పాలు చేసిందిఅంతర్జాతీయ క్రీడాకారిణి పీవీ సింధుతో పోల్చడం చాలా దారుణంమీ కోన రవి, భరత్ ఇచిన సర్టిఫికెట్ తో ఉద్యోగం పొందిన వారు..పీవీ సింధు ఒకటేనా...?నీతో చర్చకు జగన్ అవసరం లేదు...మా పేర్ని నాని వస్తున్నారునీకు దమ్ముంటే పేర్ని నానితో చర్చకు సిద్ధమా..?చరిత్రలో ఎన్నడూ లేని అక్రమాలు చేసి..ఇప్పుడు సన్నాయి నొక్కులు నొక్కుతున్నారుకోర్టులో ఉన్న అభ్యర్ధుల కేసులే నీకు ప్రశ్నలు..వాటికి సమాధానం చెప్పు లోకేష్టెట్ సమస్యపై మాతో పాటు ఉపాధ్యాయులు కేంద్రమంత్రిని కలిస్తే వేధింపులా...?టీచర్లపై అక్రమ సస్పెన్షన్ ఎత్తివేయాలి...లేదంటే వారికి అండగా మేము ఉద్యమిస్తాండీఎస్సీపై విచారణ జరిపించాల్సిందే: వైఎస్సార్సీపీశాసన మండలిలో దద్దరిల్లిన డీఎస్సీ నినాదాలుమెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ.. వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలుమండలిని కాసేపు వాయిదా వేసిన చైర్మన్మరో రెండు రోజులు పొడిగించండి: బొత్స విజ్ఞప్తినాలుగు రోజులపాటు కొనసాగనున్న ఏపీ అసెంబ్లీ సమావేశాలుఇవాళ రెండో రోజు కొనసాగుతున్న సమావేశాలుమండలి చైర్మన్కు విపక్ష నేత బొత్స విజ్ఞప్తిఎల్నినోపై చర్చ అవసరం లేదా?ఎరువులు దొరక్క, గిట్టుబాటు ధర లేక రైతులు ఇబ్బంది పడుతున్నారని చెబుతోందే మేంఅసెంబ్లీ సమావేశాలు మరో రెండు రోజులు పొడిగించండిపయ్యావుల పక్కనే లోకేశ్అసెంబ్లీకి వచ్చిన విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ పయ్యావుల పక్కనే గప్చుప్గా కూర్చున్న లోకేశ్ లోకేశ్ మౌనంగా కూర్చోవడంపై మండలిలో బొత్స అభ్యంతరంమండలిలో సమాధానం చెప్పాలంటూ నిలదీతకౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు?: బొత్సమేం డీఎస్సీ అంటే.. ఏపీపీఎస్సీలో ఏదో జరిగిందని అంటున్నారు. మా హయాంలో నిర్వహించిన గ్రూప్-1పై సీబీఐతో విచారణ చేయించుకోండిడీఎస్సీపై ప్రభుత్వం సమాధానం చెప్పే పరిస్థితి కనిపించడం లేదుప్రభుత్వం మండలిలో ఎందుకు మాట్లాడడం లేదు?శాసన సభలో చెప్పిన విషయాలేవో.. ఇక్కడ మండలిలో చెప్పాలి.. మేం అదే అడుగుతున్నాంఒకవేళ అవినీతి జరిగితే.. అక్రమాలపై సీబీఐ విచారణ వేయాలిమంత్రి లోకేశ్ రాజీనామా చేయాలిశాసన మండలిలో గందరగోళండీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని పట్టుచర్చ జరగాలంటూ వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంతిరస్కరించిన మండలి చైర్మన్సభలో ఆందోళనకు దిగిన వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలువైఎస్సార్సీపీ ఎమ్మెల్సీల నినాదాలతో మండలిలో గందరగోళం -
ఎమ్మెల్సీల ర్యాలీ.. ఏపీ అసెంబ్లీ వద్ద ఉద్రిక్తత
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఆవరణలో మంగళవారం ఉదయం స్వల్ప ఉద్రిక్తత నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై చర్చకు పట్టుబడుతూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ర్యాలీగా అసెంబ్లీకి వచ్చారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకోవడంతో వాగ్వాదం చోటు చేసుకుంది. సీబీఐ అక్రమాలపై విచారణ జరిపించాలని, మంత్రి నారా లోకేశ్రాజీనామా చేయాలంటూ నినాదాలు చేస్తూ వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు ఫ్లెక్సీలతో గేటు వద్ద నుంచి ర్యాలీగా బయల్దేరారు. ఆ సమయంలో పోలీసులు వాళ్లను అడ్డుకుని బారికేడ్లు అడ్డుపెట్టారు. దీంతో ఆగ్రహం వ్యక్తం చేసిన ఎమ్మెల్సీలు.. పోలీసులతో వాగ్వాదానికి దిగారు. అసెంబ్లీలో చర్చిస్తామన్న వాళ్లు.. కౌన్సిల్ నుంచి ఎందుకు పారిపోతున్నారు? అని మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ ప్రశ్నించారు. డీఎస్సీ అంశంపై మండలిలో చర్చ జరపాల్సిందేనని ఆయన కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. రెండో రోజు అసెంబ్లీ సమావేశాలు భాగంగా ‘డీఎస్సీ అక్రమాలపై చర్చ’కు వైఎస్సార్సీపీ శాసన మండలిలో వాయిదా తీర్మానం ఇచ్చింది. -
డీఎస్సీ అక్రమాలపై దద్దరిల్లిన ఏపీ శాసన మండలి
సాక్షి, అమరావతి: ఏపీ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు.. వాయిదాల పర్వంతో మొదలైంది. కూటమి ప్రభుత్వంలో మెగా డీఎస్సీ పేరిట జరిగిన అక్రమాలపై శాసనమండలి దద్దరిల్లింది. ఈ అంశంపై వాయిదా తీర్మానం ఇచ్చిన ప్రతిపక్ష వైఎస్సార్సీపీ.. చైర్మన్ తిరస్కారంతో చర్చకు పట్టుబట్టింది. ‘‘ప్రభుత్వం అంటే అందరికీ న్యాయం చేయాలి. కానీ, మూడు లక్షల మందిని డీఎస్సీ రిక్రూట్మెంట్ పేరిట మోసం చేశారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాల్సిందే. స్పోర్ట్స్ కోటా పేరుతో వాళ్లకు నచ్చినవాళ్లకు ఉద్యోగాలు ఇచ్చుకున్నారు. ఈ అక్రమాలపై సభలో చర్చ జరగాల్సిందే. ఏపీపీఎస్సీపై కూడా చర్చకు మేం సిద్ధంగా ఉన్నాం’’ అని విపక్ష నేత బొత్స సత్యనారాయణ స్పష్టం చేశారు. ఈ తరుణంలో ప్రభుత్వం వర్గాల నుంచి సరైన సమాధానం రాకపోవడంతో.. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని నినాదాలు చేశారు. పరీక్షలు రాయకుండా ఉద్యోగాలు ఎలా ఇస్తారని ప్రశ్నించారు. మెగా డీఎస్సీ కాదు.. దగా డీఎస్సీ అంటూ ప్రతిపక్ష సభ్యుల ఆందోళనతో మండలిని చైర్మన్ కాసేపు వాయిదా వేశారు. మంత్రుల అసహనండీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ ప్రశ్నలకు సమాధానం చెప్పలేక మంత్రుల అసహనం వ్యక్తం చేశారు. విపక్ష నేతకు మైక్ ఎలా ఇస్తారంటూ మంత్రి నాదెండ్ల మనోహర్, మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజును ప్రశ్నించారు. మరో మంత్రి అచ్చెన్నాయుడు విపక్ష నేత బొత్సపై నోరు పారేసుకున్నారు. బొత్సను ఉద్దేశించి దద్దమ్మ అంటూ వ్యాఖ్యానించారు. అంతటితో ఆగకుండా.. గొడ్డలి పార్టీ అంటూ వైఎస్సార్సీపీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు. ఈ వ్యాఖ్యలపై వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. -
సీదిరి అప్పలరాజు కు బెయిల్
-
కూటమికి మొట్టికాయలు సీదిరి అప్పలరాజుకు బెయిల్
-
400 మంది YSRCP నేతలపై అక్రమ కేసులు..
-
అమరావతి ఎప్పటికీ పూర్తి కాదు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: అమరావతి పేరిట అడ్డగోలు నిర్మాణాలు.. వాటిపై వ్యయాలు, చంద్రబాబు చేస్తున్న తప్పుడు ప్రకటనలపై వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. అమరావతి పేరుతో భారీగా ఖర్చు చూపిస్తూ అడ్డగోలుగా దోచుకుంటున్నారని.. ప్రజాధనాన్ని దుర్వినియోగం చేయడమే కాకుండా, అప్పులు సైతం చేస్తున్నారని చేస్తున్నారన్నారు. శుక్రవారం గుంటూరులో మీడియాతో మాట్లాడిన ఆయన.. చంద్రబాబు ప్రభుత్వ తీరుపై మండిపడ్డారు.ఏడేళ్లలో అమరావతికి చంద్రబాబు చేసిందేమీ లేదని అంబటి రాంబాబు అన్నారు. ఇప్పుడు అద్భుత నగరం నిర్మిస్తున్నామంటూ ప్రచారం చేసుకుంటున్నారని.. ఇది మార్కెటింగ్ తప్ప మరొకటి కాదన్నారు. అమరావతి అనేది ఎప్పటికీ పూర్తి కాదన్నారు. మరోవైపు ఖర్చులను భారీగా పెంచుతున్నారని మండిపడ్డారు. ‘‘అమరావతి అంటే అద్భుత నగరం కాదు.. అవినీతి, దోపిడీకి కేంద్రం’’ అంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు.రోడ్ల నిర్మాణంపై ప్రశ్నలుఅమరావతిలో రోడ్ల నిర్మాణ వ్యయాలపై అంబటి రాంబాబు అనుమానాలు వ్యక్తం చేశారు. కిలోమీటర్ రోడ్డుకు రూ.180 కోట్ల వరకు ఖర్చు చూపిస్తున్నారన్నారు. దేశంలోనే కాదు.. ప్రపంచంలోని ఏ దేశంలోనూ రోడ్ల కోసం ఇంత భారీగా ఖర్చు చేయరని అన్నారు. 21.77 కిలోమీటర్ల రోడ్డుకు రూ.1,519 కోట్లు చంద్రబాబు ఖర్చు చేస్తున్నారని.. రూ.100 కోట్లలో పూర్తయ్యే పనులను అంచనాలు పెంచి రూ.356 కోట్లకు తీసుకెళ్లారని విమర్శించారు. చదరపు మీటర్ రోడ్డుకు రూ.10 లక్షలు ఖర్చు చేయడం ఏమిటని ఆశ్చర్యం వ్యక్తం చేశారు.రైతుల పరిస్థితిపై ప్రశ్నలురాజధాని కోసం భూములు ఇచ్చిన అమరావతి రైతుల పరిస్థితిపైనా అంబటి ప్రశ్నలు లేవనెత్తారు. రైతులకు ఇచ్చిన హామీలు నెరవేర్చారా? లే అవుట్లు అందించారా? అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. పొలాలు ఇచ్చినందుకు రైతులు బాధపడే పరిస్థితి వచ్చిందని వ్యాఖ్యానించారు.‘‘అద్దాల భవనాల పేరుతో వేల కోట్లు’’అమరావతిలో అద్దాల భవనాలు, భారీ నిర్మాణాల పేరుతో వేల కోట్ల రూపాయలు ఖర్చు చేస్తున్నారని అంబటి అన్నారు. తాత్కాలిక స్టీల్ బ్రిడ్జి కోసం రూ.80 కోట్లు ఖర్చు చేయడం ఏంటని ప్రశ్నించారు. అమరావతిలో చదరపు అడుగు ధర రూ.20 వేల నుంచి రూ.22 వేల వరకు పెరిగిందని దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం ఎలా సాధ్యమని ప్రశ్నించారు.‘‘బాబు, లోకేశ్లకు చెప్పే ధైర్యం ఉందా?’’అమరావతిలో జరుగుతున్న వ్యయాలపై ప్రజలు, మేధావులు ఆలోచించాలని అంబటి రాంబాబు కోరారు. అప్పులు తీసుకువచ్చి వాటిలోనూ కమీషన్లు దండుకుంటున్నారంటూ చంద్రబాబు, ఆయన తనయుడు నారా లోకేశ్పై మండిపడ్డారు. వైఎస్సార్సీపీ లేవనెత్తుతున్న ప్రశ్నలకు సమాధానం చెప్పే ధైర్యం చంద్రబాబుకు ఉందా అని సవాల్ చేశారు. అమరావతి పేరుతో జరుగుతున్న దోపిడీని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించాలని అంబటి రాంబాబు పిలుపునిచ్చారు. -
ఆ ఇద్దరి బంధం తెగిందా..?
-
బాబు కార్యక్రమానికి పవన్ డుమ్మా.. అసలేం జరిగింది?
-
బాబు రాయబారం ఫెయిల్.. ఝలక్ ఇచ్చిన పవన్!
సాక్షి, అమరావతి: అమరావతి కార్యక్రమాలను కూటమి అత్యంత ప్రతిష్టాత్మకంగా భావిస్తున్న వేళ.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం ఇప్పుడు రాజకీయంగా కొత్త చర్చకు తెరలేపింది. సీఎం చంద్రబాబు నాయుడు స్వయంగా పాల్గొన్న కీలక కార్యక్రమానికి పవన్ కావాలనే దూరంగా ఉన్నారంటూ అధికార, రాజకీయ వర్గాల్లో ఆసక్తికర చర్చ సాగుతోంది.గురువారం అమరావతిలో స్టీల్ బ్రిడ్జి, ఎమ్మెల్యేల క్వార్టర్లు, సీడ్ యాక్సిస్ రోడ్డు వంటి కీలక ప్రాజెక్టుల ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో సీఎం చంద్రబాబు పాల్గొన్నారు. అయితే అదే సమయంలో పవన్ కల్యాణ్ విశాఖపట్నం పర్యటనకు వెళ్లడం చర్చనీయాంశమైంది. ఏనుగుల కార్యక్రమం ఉందంటూ ఉదయమే ఆయన విశాఖకు వెళ్లినట్లు తెలుస్తోంది. అదీ షెడ్యూల్లో హడావిడిగా చేర్చుకుని మరీ.. ప్రభుత్వ వర్గాలకు సరైన సమాధానం ఇవ్వకుండానే!.నారాయణ రాయబారం విఫలం!పవన్ కల్యాణ్ కార్యక్రమానికి హాజరయ్యేలా చేయడానికి అమరావతి పనుల్ని చూసుకుంటున్న మంత్రి నారాయణను చంద్రబాబు రంగంలోకి దింపారు. ఈ క్రమంలోనే నిన్న పవన్తో నారాయణ భేటీ అయినట్లు సమాచారం. ఎలాగైనా అమరావతి కార్యక్రమానికి రావాలని ఆయన కోరినప్పటికీ.. చివరకు పవన్ తన నిర్ణయాన్ని మార్చుకోలేదన్న చర్చ సాగుతోంది. విశాఖ పర్యటనకు వెళ్లడంతో ఆ ప్రయత్నాలు ఫలించలేదనే సంకేతాలు వెలువడుతున్నాయి.చంద్రబాబుపై తగ్గిన పవన్ స్పందనలుగత కొంతకాలంగా చంద్రబాబు, టీడీపీ ప్రభుత్వ వ్యవహారాలపై పవన్ కల్యాణ్ స్పందనలు తగ్గడం కూడా రాజకీయ పరిశీలకుల దృష్టిని ఆకర్షిస్తోంది. గతంలో చంద్రబాబును ఆకాశానికి ఎత్తిన పవన్.. ఈ మధ్యకాలంలో అలాంటి స్టేట్మెంట్లకు దూరంగా ఉంటున్నారు. అంతేకాదు పాలనాపరమైన అంశాలు, పార్టీ వ్యవహారాల్లోనూ తన దారి తనదే అన్నట్లు వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో.. బాబును పొగడాల్సి వస్తుందనే అమరావతి వంటి కీలక కార్యక్రమానికి ఆయన దూరంగా ఉన్నారా? అని చర్చించుకుంటున్నారు.ఎమ్మెల్యేల క్వార్టర్ల అంశమే కారణమా?పవన్ కల్యాణ్ అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉండటానికి ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణంపై ఉన్న అభ్యంతరాలే కారణమన్న ప్రచారం కూడా రాజకీయ వర్గాల్లో సాగుతోంది. నిర్మాణ వ్యయాల పెంపు, అంచనాల మార్పులపై ఆయన అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. ఖర్చుల విషయంలో మరింత పారదర్శకత అవసరమని పవన్ వర్గం భావిస్తున్నట్లు తెలుస్తోంది.ఎమ్మెల్యేల క్వార్టర్ల నిర్మాణానికి సంబంధించిన అంశంపై పవన్ గతంలోనూ అధికార యంత్రాంగానికి కొన్ని సూచనలు చేసినట్లు సమాచారం. ఈ నేపథ్యంలోనే ఆయన అమరావతి కార్యక్రమానికి దూరంగా ఉన్నారా? అనే దానిపై జనసేన స్పందించాల్సి ఉంది.వరుస గైర్హాజరులతో పెరుగుతున్న చర్చఇటీవల జరిగిన కొన్ని కీలక సమావేశాలకు కూడా పవన్ కల్యాణ్ గైర్హాజరు కావడం రాజకీయ వర్గాల్లో ఆసక్తిని పెంచింది. ఇప్పటికే పలు కేబినెట్ సమావేశాలకు(మూడు సార్లు) ఆయన దూరంగా ఉన్నారు. అయితే ఈమధ్యలో ప్రధాని నరేంద్ర మోదీ ముఖ్యఅతిథిగా హాజరైన భోగాపురం ఎయిర్పోర్టు కార్యక్రమానికి మాత్రం పవన్ హాజరయ్యారు. ఆ వేదికపై కూడా చంద్రబాబు కంటే ప్రధాని మోదీనే ప్రసన్నం చేసుకునేందుకు పవన్ ఎక్కువ తాపత్రయపడ్డారన్న రాజకీయ వ్యాఖ్యలు వినిపించాయి.నాదెండ్ల ప్రకటనతో మరింత ఆసక్తిమరోవైపు పవన్ గైర్హాజరుపై టీడీపీ–జనసేన కూటమి నేతలు ఆచితూచి స్పందిస్తున్నారు. బహిరంగంగా ఎలాంటి విభేదాలను ప్రస్తావించకపోయినా.. ఈ పరిణామాలపై మౌనం పాటిస్తున్నారు. ఇదే సమయంలో అమరావతి కార్యక్రమానికి పవన్ దూరంగా ఉండగా.. జనసేన సీనియర్ నేత, మంత్రి నాదెండ్ల మనోహర్తో అమరావతిపై ఒక మొక్కుబడి ప్రకటన ఇప్పించడం కూడా చర్చకు దారితీసింది.అసలు పవన్ దూరం వెనుక కారణం ఏమిటి? నిజంగానే కూటమిలోని కొన్ని అంశాలపై ఆయన అసంతృప్తిగా ఉన్నారా? అన్న ప్రశ్నలు ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో హాట్ టాపిక్గా మారాయి. -
కర్నూలులో వైఎస్ జగన్ పర్యటనను అడ్డుకునే కుట్ర
సాక్షి, కర్నూలు: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన నేపథ్యంలో రాజకీయ వాతావరణం వేడెక్కింది. జగన్ పర్యటనను అడ్డుకునేందుకు, జనం రాకుండా చేసేందుకు కూటమి ప్రభుత్వం మళ్లీ పోలీసుల ద్వారా ఆంక్షలు విధించింది. ఈ పరిణామంపై పార్టీ శ్రేణులు, అభిమానులు మండిపడుతున్నారు. ఆలూరు ఎమ్మెల్యే విరూపాక్షి అక్రమ అరెస్టు నేపథ్యంలో ఆయనను పరామర్శించేందుకు వైఎస్ జగన్ గురువారం కర్నూలు జిల్లాకు రానున్నారు. జైలులో ములాఖత్ ద్వారా ఎమ్మెల్యేకు ధైర్యం చెప్పనున్నారు. అనంతరం మీడియాతో మాట్లాడే అవకాశం ఉంది. అయితే ఈ పర్యటనకు వైఎస్సార్సీపీ శ్రేణులు దూరంగా ఉండాలంటూ పోలీసులు హెచ్చరికలు జారీ చేస్తున్నారు.కఠిన చర్యలు ఉంటాయ్: ఎస్పీజిల్లాలో ఇప్పటికే 30 యాక్ట్ అమల్లో ఉందని కర్నూలు ఎస్పీ విక్రాంత్ పాటిల్ తెలిపారు. ఎలాంటి ర్యాలీలు, సభలు, రోడ్షోలు నిర్వహించేందుకు అనుమతి లేదని స్పష్టం చేశారు. కేవలం జగన్ కాన్వాయ్ వెళ్లేందుకు మాత్రమే అనుమతి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. నిబంధనలు ఉల్లంఘించి రోడ్షోలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు.ఆంక్షలపై వైఎస్సార్సీపీ మండిపాటుములాఖత్ను త్వరగా ముగించాలంటూ పోలీసులు సమయం ఇవ్వడం, అలాగే జగన్ కాన్వాయ్ను కిలోమీటర్ దూరమే ఆపేయాలని పోలీసులు చెప్పడంపై వైఎస్సార్సీపీ నేతలు తీవ్రంగా స్పందిస్తున్నారు. ప్రజలను జగన్కు దూరంగా ఉంచేందుకే చంద్రబాబు ప్రభుత్వం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆరోపిస్తున్నారు. గత రెండేళ్లుగా వైఎస్ జగన్ పర్యటనల సమయంలో ఇదే విధంగా ఆంక్షలు, బారికేడ్లు, కేసుల భయంతో ప్రజలను అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయని విమర్శిస్తున్నారు. అయితే.. అభిమానాన్ని ఆపలేరుజగన్ పర్యటనలకు వచ్చిన నేతలపై, కార్యకర్తలపై కక్ష సాధింపు రాజకీయాల్లో భాగంగానే తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారని మండిపడుతున్నారు. ఎన్ని ఆంక్షలు విధించినా జగన్ను కలిసేందుకు, ఆయనకు మద్దతు తెలిపేందుకు కర్నూలు ప్రజలు తరలివస్తారని వైఎస్సార్సీపీ నేతలు చెబుతున్నారు. ఈ పర్యటన కూడా విజయవంతమవుతుందని అంటున్నారు. జగన్ భద్రతపై ఆందోళనమాజీ సీఎం హోదాలో ఉన్న జగన్కు జెడ్ ప్లస్ భద్రత ఉన్నప్పటికీ, ఆయన పర్యటనలకు అవసరమైన భద్రత కల్పించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. ఇటీవలే వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్ర హోం మంత్రి అమిత్ షాను కలిసి రాష్ట్రంలో వైఎస్ జగన్ పర్యటనల సందర్భంగా ఎదురవుతున్న సమస్యలను వివరించారు. భద్రతా అంశాలు, పోలీసుల ఆంక్షలపై తమ ఆందోళనలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. దీనిపై అమిత్ షా సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది. -
కూన రవికుమార్, భరత్ బండారం బయటపెట్టిన వరుదు కళ్యాణి
-
“ప్రజా సమస్యలపై పోరాడతాం”.. వైఎస్ జగన్ వ్యూహంతో వైఎస్సార్సీపీ
సాక్షి, తాడేపల్లి: ప్రజా సమస్యలపై చట్టసభలో గళం విప్పాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చట్టసభ్యులకు సూచించారు. అసెంబ్లీ సమావేశాల నేపథ్యంలో పార్టీ బుధవారం పార్టీ కేంద్ర కార్యాలయంలో శాసనసభా పక్ష సమావేశం నిర్వహించిన ఆయన.. ప్రజా సమస్యలపై పోరాటానికి సభ్యులు సిద్ధంగా ఉండాలని దిశానిర్దేశం చేశారు. అనంతరం మీటింగ్ సారాంశాన్ని వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలిలో ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ మీడియాకు తెలియజేశారు..డీఎస్సీ నియామకాల్లో స్పోర్ట్స్ కోటా పేరుతో మెరిట్ అభ్యర్థులకు అన్యాయం జరిగిందని బొత్స సత్యనారాయణ అన్నారు. డీఎస్సీ అక్రమాలపై ఆధారాలున్నా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం లేదన్నారు ఈ అంశంపై పోరాటం కొనసాగుతుందని, ప్రభుత్వాన్ని చట్టసభలో నిలదీస్తామని తెలిపారు. నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తామని పేర్కొన్నారు.అభివృద్ధిపై వైఎస్సార్సీపీ విమర్శలురాష్ట్రంలో అభివృద్ధి ఎక్కడ కనిపిస్తోందని బొత్స ప్రశ్నించారు. అభివృద్ధి అనేది ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుటుంబ సభ్యులు, టీడీపీ నేతలకే పరిమితమైందని విమర్శలు చేసింది. ప్రజల సమస్యలు, ఉద్యోగుల ఇబ్బందులపై కూడా సమావేశాల్లో ప్రస్తావిస్తామని స్పష్టం చేశారు. ఉద్యోగ సంఘాలు తమ సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాలని కోరుతున్నాయని, వారి సమస్యలపై కూడా పార్టీ తరఫున మాట్లాడతామని తెలిపారు.ప్రతిపక్ష హోదాపై పోరాటంఅసెంబ్లీలో ఉన్నవి రెండే పక్షాలు.. మూడోది లేదు కదా. అలాంటిది 40 శాతం ఓట్లు సాధించిన వైఎస్సార్సీపీకి ప్రధాన ప్రతిపక్ష హోదా ఎందుకు ఇవ్వడం లేదు? అని చంద్రబాబు ప్రభుత్వాన్ని బొత్స ప్రశ్నించారు. ప్రజా తీర్పును గౌరవించకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందన్నారు. వైఎస్సార్సీపీని ప్రధాన ప్రతిపక్షంగా గుర్తించేందుకు ప్రభుత్వం ముందుకు రావడం లేదని, అలాగని చట్టంలో ఉంటే డిస్క్వాలిఫై చేయాలని బొత్స కోరారు.‘‘రాజ్యాంగబద్ధంగానే పోరాడుతున్నాం. ఎక్కడా చట్టాన్ని చేతుల్లోకి తీసుకోవడం లేదు. అయినా ప్రభుత్వాన్ని ఫేక్ పోలీసులతో నడిపిస్తున్నారు. చంద్రబాబు రాష్ట్రానికి సీఎం కావడం మన ఖర్మ. అందరి తరఫున అడుగుతాం. అన్ని ఆధారాలు చూపిస్తాం. అన్ని విషయాలపై ప్రభుత్వాన్ని నిలదీస్తాం’’ అని బొత్స తెలిపారు. మండలి వరకే.. ప్రధాన ప్రతిపక్ష హోదా ఇవ్వకపోవడంపై నిరసనగా వైఎస్సార్సీపీ శాసనసభ సమావేశాలకు దూరంగా ఉంటున్న సంగతి తెలిసిందే. ఈసారి కూడా అదే నిర్ణయించింది. అయితే శాసన మండలి సమావేశాలకు హాజరై ప్రజా సమస్యలపై పోరాడాలని నిర్ణయించింది. ఇక మండలిలో పార్టీ తరఫున డిప్యూటీ చైర్మన్గా తూమాటి మాధవరావును ఎంపిక చేస్తూ నిర్ణయం తీసుకుందని తెలుస్తోంది. -
ఏపీ విద్యాశాఖలో టెండర్ల గోల్మాల్
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ విద్యాశాఖలో కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాలకు సరుకుల సరఫరా టెండర్ల వ్యవహారం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. విద్యార్థినులకు అవసరమైన నిత్యావసర వస్తువుల సరఫరా కోసం చేపట్టిన టెండర్ల ప్రక్రియపై పలు అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. భారీగా గోల్మాల్ జరుగుతుందనే చర్చ జోరందుకుంది.సెంట్రలైజ్డ్ టెండర్ విధానం పేరుతో భారీ స్థాయిలో కాంట్రాక్టుల కేటాయింపులు జరిగాయి. టీడీపీ నేతలు చెప్పిన వాళ్లకే టెండర్లు ఖరారు చేసినట్లు తెలుస్తోంది. అలాగే స్థానికంగా జరిగే కొనుగోళ్లకు బదులుగా మొత్తం ప్రక్రియను కేంద్రీకరించడం వల్ల పారదర్శకతపై సందేహాలు తలెత్తుతున్నాయి. ఇక.. కేజీబీవీ పాఠశాలలకు సరుకుల సరఫరా కోసం దాదాపు రూ.178 కోట్ల విలువైన టెండర్లను కేవలం నలుగురు కాంట్రాక్టర్లకు అప్పగించినట్లు సమాచారం. ఈ ఎంపిక విధానం, సరఫరా ధరలపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది.ధరల నిర్ణయంపై అభ్యంతరాలుసరుకుల ధరల విషయంలోనూ ప్రశ్నలు లేవనెత్తుతున్నారు. మార్కెట్ ధరలతో పోలిస్తే కొన్ని వస్తువులకు రేట్లు పెంచేసి.. ఎక్కువ ధరలు నిర్ణయించారనే విమర్శలు వస్తున్నాయి. ముఖ్యంగా కోడిగుడ్డు ధర విషయంలో మధ్యాహ్న భోజన పథకంలో ఉన్న ధరలతో పోల్చుతూ పలువురు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అంతేకాదు.. చిల్లర సామాన్ల విషయంలోనూ చినబాబు టీం దోపిడీకి దిగిందనే విమర్శలూ వెల్లువెత్తున్నాయి.విద్యార్థుల కోసం ఉద్దేశించిన నిధులు సక్రమంగా వినియోగించాల్సిన అవసరం ఉందని, ప్రతి రూపాయి ఖర్చుపై పారదర్శకత ఉండాలని డిమాండ్లు వినిపిస్తున్నాయి.కేంద్రీయ బండార్కు టెండర్పై చర్చఈ టెండర్లలో కేంద్రీయ బండార్కు అవకాశం కల్పించడంపై కూడా విమర్శలు వినవస్తున్నాయి. గతంలో విజిలెన్స్ సంబంధిత అంశాలు ప్రస్తావనకు వచ్చిన సంస్థకు మళ్లీ అవకాశం ఇవ్వడంపై కొందరు అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. అయితే టెండర్ల ప్రక్రియ నిబంధనల ప్రకారమే జరిగిందా? అర్హతల పరిశీలన ఎలా జరిగింది? అనే అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది.16 నుంచి కొత్త సరఫరా వ్యవస్థకొత్తగా ఎంపికైన కాంట్రాక్టర్ల ద్వారా ఈ నెల 16 నుంచి కేజీబీవీ పాఠశాలలకు సరుకుల సరఫరా ప్రారంభం కానుంది. ఈ నేపథ్యంలో టెండర్ల ఎంపిక, ధరల నిర్ణయం, సరుకుల నాణ్యతపై మరింత చర్చ సాగుతోంది. కేజీబీవీ విద్యార్థినుల అవసరాలకు సంబంధించిన ఈ సరఫరా వ్యవస్థలో ఎలాంటి లోపాలకు తావులేకుండా ప్రభుత్వం పర్యవేక్షణ పెంచాలని పలువురు కోరుతున్నారు.చిల్లర సరుకుల కొనుగోలు నుంచి కోట్ల రూపాయల టెండర్ల వరకు.. విద్యాశాఖలో ఈ వ్యవహారం ఇప్పుడు రాజకీయ రగడకు కారణమవుతోంది. అసలు టెండర్ల ప్రక్రియలో ఏం జరిగింది? అనేదానిపై ప్రభుత్వం ఇవ్వబోయే వివరణపై అందరి దృష్టి నెలకొంది. -
DSC అక్రమాలపై కూటమి నేతలు ఎందుకు మాట్లాడట్లేదు..?
-
ప్రియాంక కేసు.. నిందితుల కాల్ డేటా ఏదీ?: మార్గాని భరత్
సాక్షి, రాజమహేంద్రవరం: మెడికో ప్రియాంక హత్య కేసులో నిందితులను కాపాడే అదృశ్య శక్తులు ఉన్నాయా? అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ నేత, మాజీ ఎంపీ మార్గాని భరత్. ఈ కేసులో నిజాలేమైనా దాచారా? అంటూ చంద్రబాబు సర్కార్పై ఆయన మండిపడ్డారు. సమాధానం చెప్పాలంటూ కూటమికి పది ప్రశ్నలు సంధించారు. డాక్టర్ ప్రియాంకను అత్యంత దారుణంగా హత్య చేసిన ఘటన తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర కలకలం రేపింది. ఇంతటి తీవ్రమైన ఘటనను మొదట్లో ఎందుకు తక్కువ చేసి చూపించే ప్రయత్నం జరిగిందని ఆయన కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం రాజమండ్రిలో ఆయన మీడియాతో మాట్లాడుతూ..‘మూడు రోజులు నిందితులు ఎక్కడున్నారు?’ఈ ఘటనలో పోలీసులు వ్యవహరించిన తీరుపై అనుమానాలు ఉన్నాయని మాజీ ఎంపీ ఆరోపించారు. మూడో తేదీన ఘటన జరిగితే.. ఆరో తేదీన నిందితులను అరెస్ట్ చేసినట్లు పోలీసులు ప్రకటించారని, ఆ మధ్య మూడు రోజులు నిందితులు ఎక్కడ ఉన్నారని ప్రశ్నించారు. వారిని ఎవరైనా దాచారా? దాచితే ఎవరి అండ ఉందో బయటపెట్టాలని డిమాండ్ చేశారు.‘చిన్న యాక్సిడెంట్గా ఎలా చెబుతారు?’డాక్టర్ ప్రియాంక మృతిని మొదట చిన్న ప్రమాదంగా పేర్కొనడంపై భరత్ అభ్యంతరం వ్యక్తం చేశారు. పోలీసులు తొలుత ర్యాష్ డ్రైవింగ్ కింద కేసు నమోదు చేశారని, హత్య అంశం వెలుగులోకి వచ్చిన తర్వాతే సెక్షన్లు ఎందుకు మార్చారని ప్రశ్నించారు. తాము ఆందోళన చేపట్టే వరకు కేసు తీవ్రతను ఎందుకు గుర్తించలేదని నిలదీశారు.‘నిందితుల ఫోన్ డేటా ఎందుకు సేకరించలేదు?’హత్య జరిగిన రోజు రాత్రి నిందితులు ఎవరెవరితో మాట్లాడారో, ఎవరిని సంప్రదించారో తెలుసుకోవడానికి ఫోన్ డేటాను ఎందుకు పరిశీలించలేదని భరత్ ప్రశ్నించారు. ఘటన వెనుక ఉన్న శక్తులను బయటకు తీసుకురావాల్సిన బాధ్యత పోలీసులపై ఉందన్నారు.‘మద్యం మత్తులో జరిగిన ఘటనగా ఎలా చెబుతారు?’స్థానిక ఎమ్మెల్యే ఘటనను మద్యం మత్తులో జరిగిన హిట్ అండ్ రన్ కేసుగా పేర్కొనడంపై కూడా భరత్ స్పందించారు. ఒక మనిషి ప్రాణం పోయిన ఘటనను కేవలం ప్రమాదంగా ఎలా చూస్తారని భరత్ ప్రశ్నించారు. సోషల్ మీడియా పేజీలు ఎందుకు మూగబోయాయి?రెండు రాష్ట్రాల్లో చర్చకు వచ్చిన ఈ ఘటనపై రాజమహేంద్రవరం సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్లు, పేజీలు ఎందుకు స్పందించలేదని భరత్ ప్రశ్నించారు. వారిపై ఎవరి ఒత్తిడి ఉందో చెప్పాలని డిమాండ్ చేశారు.‘అధికార పార్టీ ఆదేశాలతోనే కప్పిపుచ్చే ప్రయత్నం’ఈ ఘటనలో అధికార పార్టీ ఒత్తిళ్లు ఉన్నాయంటూ మార్గాని భరత్ ఆరోపించారు. నిందితులు ఘటన అనంతరం వెళ్లిన మార్గాల్లో సీసీ కెమెరాలను ఎందుకు పరిశీలించలేదని ప్రశ్నించారు. పోలీసులు వారికి సంబంధించిన వివరాలు ముందుగానే తెలుసుకున్నా.. ఆలస్యంగా అరెస్ట్ చేసినట్లు చూపించారని ఆరోపించారు.సీఐపై చర్యలు ఎందుకు లేవు?ఇంతటి వివాదం నెలకొన్నప్పటికీ ప్రకాష్నగర్ సీఐపై ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని భరత్ ప్రశ్నించారు. కేసులో పూర్తి నిజాలు బయటకు రావాలంటే సమగ్ర దర్యాప్తు అవసరమని అన్నారు. -
పోలీస్ VS కాసు మహేష్ రెడ్డి
-
సుద్దపూస కబుర్లు వద్దు కూటమికి వల్లభనేని వార్నింగ్
-
చంద్రబాబు సర్కార్ పిరికిపంద చర్య
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన కార్యక్రమాలు కూటమి ప్రభుత్వంపై రాజకీయ ఒత్తిడిని పెంచాయి. అయితే ఇవాళ రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన ర్యాలీలను అడ్డుకోవడం, నేతలను అదుపులోకి తీసుకోవడం.. పలు చోట్ల లాఠీఛార్జీలు చేయడంపై వైఎస్సార్సీపీ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. నిరసనలను అడ్డుకోవడం చంద్రబాబు ప్రభుత్వ పిరికితనానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.డీఎస్సీ నియమకాల్లో జరిగిన అవినీతికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయడం, ఈ వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు కోరుతూ అభ్యర్థులు, డీఎస్సీ సంఘాలతో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు పిలుపునిచ్చింది. ఈ నేపథ్యంలో పలుచోట్ల పోలీసులు ముందస్తు చర్యలు చేపట్టారు. ర్యాలీలు, నిరసనలకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నం చేశారు.పులివెందులలో లాఠీఛార్జ్.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి నియోజకవర్గంలో పోలీసులు దౌర్జన్యకాండకు పాల్పడ్డారు. పులివెందులలో ఆర్డీవోకు వినతి పత్రం ఇవ్వడానికి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులపై లాఠీ ఛార్జ్ చేశారు. దీంతో పలువురికి గాయాలు కాగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. ఆ సమయంలో కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు వినిపించాయి. అంతకు ముందు.. ఎంపీ అవినాశ్రెడ్డికి ర్యాలీ నిర్వహించడానికి వీల్లేదంటూ పోలీసులు నోటీసులు అందించారు.చీపురుపల్లిలో బొత్సకు అడ్డంకులుచీపురుపల్లిలో నిర్వహించాల్సిన నిరసన కార్యక్రమానికి వెళ్తున్న సీనియర్ నేత, మండలిలో విపక్షనేత బొత్స సత్యనారాయణను పోలీసులు అడ్డుకున్నారు. శాంతియుతంగా నిరసన తెలిపే హక్కు ఉన్నప్పటికీ పోలీసులు అడ్డుకోవడం సరికాదని బొత్స మండిపడ్డారు. రోడ్డుపైనే ఆయన ఆందోళన చేపట్టారు. కొడాలి నాని హౌస్ అరెస్ట్మాజీ మంత్రి కొడాలి నానిని గుడివాడ పోలీసులు హౌస్ అరెస్ట్ చేశారు. డీఎస్సీ అంశంపై నిరసనల్లో పాల్గొనకుండా ముందస్తుగా చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ కార్యకర్తలు, ఆయన అభిమానులు మండిపడుతున్నారు.అటు రాజమండ్రిలోనూ మాజీ ఎంపీ భరత్ ఆధ్వర్యంలో నిరసనలు జరుగుతుండగా.. పోలీసులు ర్యాలీని అడ్డుకున్నారు. దీంతో పోలీసుల తీరుపై ఆయన మండిపడ్డారు. విశాఖలో అరెస్టులువిశాఖపట్నంలోని మారియట్ సెంటర్ వద్ద నిరసనకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలను పోలీసులు అడ్డుకున్నారు. కేకే రాజు సహా పలువురిని అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.విజయవాడలో దేవినేని ర్యాలీకి అడ్డంకులువిజయవాడలో దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని పోలీసులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అనుమతి లేదంటూ పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు బారికేడ్లు దాటేందుకు ప్రయత్నించడంతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి.అవనిగడ్డలోనూ అడ్డగింతఅవనిగడ్డలోనూ వైఎస్సార్సీపీ నేతల నిరసన కార్యక్రమాన్ని పోలీసులు అడ్డుకున్నారు. రాష్ట్రవ్యాప్తంగా ప్రజల సమస్యలపై గొంతెత్తే హక్కును ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించింది.తిరుపతిలో భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో.. గన్నవరంలో వల్లభనేని వంశీ ఆధ్వర్యంలో ర్యాలీలు జరుగుతున్నాయి. నెల్లూరు, కర్నూల్, అనంతపురం, అవనిగడ్డ.. ఇలా పలు చోట్ల వైఎస్సార్సీపీ ర్యాలీలు నిర్వహించకుండా పోలీసులు అడ్డుపడుతున్నారు. నిరసన తెలియజేస్తున్న వాళ్లపైకి లాఠీ ప్రయోగిస్తున్నారు.‘శాంతియుత నిరసనలకు ఎందుకు అభ్యంతరం?’డీఎస్సీ అంశంపై శాంతియుతంగా ర్యాలీలు నిర్వహిస్తే ప్రభుత్వం ఎందుకు భయపడుతోందని వైఎస్సార్సీపీ నేతలు ప్రశ్నిస్తున్నారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని, దాన్ని అడ్డుకోవడం సరికాదని అన్నారు. -
అనంత పోలీసుల దౌర్జన్యం.. రోడ్డుపైనే పెద్దిరెడ్డి బైఠాయింపు
సాక్షి, అనంతపురం: ఏపీలో దగా డీఎస్సీపై ప్రజాపోరు కొనసాగుతోంది. వైఎస్సార్సీపీ ఆధర్వ్యంలో పోరాటం ఉధృతమైంది. అయితే శాంతియుతంగా నిర్వహిస్తున్న ర్యాలీలను మాత్రమే కాదు.. ఈ దౌర్జన్యకాండను నిలదీస్తున్న వైఎస్సార్సీపీ నేతలను సైతం పోలీసులు అడ్డుకుంటున్నారు. ఈ క్రమంలో సోమవారం ఉదయం తాడిపత్రి నియోజకవర్గం ముచ్చుకోట వద్ద ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. తాడిపత్రిలో ఇవాళ యువత ర్యాలీకి మాజీ ఎమ్మెల్యే పెద్దారెడ్డి ఏర్పాట్లు చేశారు. అయితే పోలీసులు మాత్రం అధికార టీడీపీ కార్యక్రమం ఉందంటూ ఆ ర్యాలీని అడ్డుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న పుంగనూరు ఎమ్మెల్యే, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తాడిపత్రికి బయల్దేరారు. మార్గమధ్యంలో ముచ్చుకోట వద్ద పోలీసులు ఆయన్ని అడ్డుకోవడంతో.. ఆయన రోడ్డుపైనే బైఠాయించి ఆయన నిరసన తెలియజేశారు. పోలీసులను నిలదీసిన పెద్దిరెడ్డిశాంతియుతంగా నిర్వహించే కార్యక్రమాలను ఎలా అడ్డుకుంటారని పోలీసులను పెద్దిరెడ్డి ప్రశ్నించారు. ప్రజాస్వామ్యంలో నిరసన తెలిపే హక్కు ప్రతి ఒక్కరికీ ఉందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా పోలీసులతో మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు.. మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి మధ్య వాగ్వాదం జరిగింది.డీఎస్సీ అంశంపై ప్రభుత్వంపై విమర్శలుసాక్షితో మాట్లాడిన పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.. వైఎస్సార్సీపీ ర్యాలీలను అడ్డుకోవడం దుర్మార్గమని ఆరోపించారు. “మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ ఎందుకు జరపడం లేదు? మంత్రి లోకేశ్ కనుసన్నల్లోనే డీఎస్సీలో అక్రమాలు జరిగాయి. నైతిక బాధ్యతగా ఆయన రాజీనామా చేయాలి” అని డిమాండ్ చేశారు.హైవేపై బైఠాయింపుపోలీసుల తీరుకు నిరసనగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు అనంతపురం-తాడిపత్రి హైవేపై బైఠాయించారు. పోలీసుల వ్యవహారశైలిపై నేతలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ నేతలు వెంకటరెడ్డి, విశ్వేశ్వర్రెడ్డి కూడా పోలీసుల తీరును తప్పుబట్టారు. శాంతియుత కార్యక్రమాలను అడ్డుకోవడం సరికాదని మండిపడ్డారు. -
నాపైనా, నా భర్త పైన కక్ష సాధింపు... కూటమిపై విరుచుకుపడ్డ MLC కల్పలత
-
పాలన ఎలా ఉందో వాళ్లనే అడుగు: బాబుపై బుగ్గన ఫైర్
సాక్షి, హైదరాబాద్: చంద్రబాబు విడుదల చేస్తున్న శ్వేతపత్రాలు వాస్తవాలను ప్రతిబింబించేవి కావని.. అవి కేవలం రాజకీయ జిమ్మిక్కులేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ అంటున్నారు. చంద్రబాబు మాటలకు, చేతలకు ఎలాంటి సంబంధం ఉండదని ఎద్దేవా చేశారు. హైదరాబాద్లోని సోమాజిగూడ ప్రెస్క్లబ్లో శనివారం నిర్వహించిన మీడియా సమావేశంలో బుగ్గన, కూటమి ప్రభుత్వంపై ఆగ్రహం వ్యక్తం చేశారు.ప్రజలకు అరచేతిలో స్వర్గం చూపించేలా చంద్రబాబు హామీలు ఇస్తారని, కానీ ఆచరణలో పరిస్థితులు భిన్నంగా ఉంటాయన్నారు. ప్రొగ్రెస్ కార్డు అనే కాన్సెప్ట్ తెచ్చిన చంద్రబాబు.. అది తనకు తానే ఇచ్చుకుంటున్నాడని, కానీ అది ఇవ్వాల్సింది ప్రజలని బుగ్గన గుర్తు చేశారు. చంద్రబాబుకు అనుకూలంగా వ్యవహరించే మీడియా కూడా అదే తరహాలో ప్రచారం చేస్తోందని మండిపడ్డారు. ‘హైదరాబాద్ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు?’చంద్రబాబు హైదరాబాద్ అభివృద్ధి గురించి చెప్పుకునే తీరుపై బుగ్గన వ్యంగ్యాస్త్రాలు సంధించారు. హైదరాబాద్ను తానే నిర్మించానన్నట్లుగా చెప్పుకోవడం సరికాదన్నారు. “చంద్రబాబు హైదరాబాద్ను కడితే.. కుతుబ్ షా ఏం చేసినట్లు? చంద్రబాబు బిర్యానీ కనిపెడితే.. ఇరానీయులు ఏం చేసినట్లు?. అందరినీ అమెరికాకు తానే పంపానని అంటారు.. ఇతర రాష్ట్రాల వాళ్లను కూడా ఆయనే పంపారా?” అంటూ వ్యాఖ్యానించారు. చంద్రబాబు ప్రకటనలు, రాజకీయ వ్యాఖ్యలు చూస్తే ఇతర దేశాల్లో అయితే ఆయనను పబ్లిక్ లైఫ్ నుంచి వెల్లగొట్టేవారని బుగ్గన అన్నారు.వాళ్లను అడిగితే సరిపోదా?.. కూటమి ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం తెలుసుకోవాలని బుగ్గన సూచించారు. చంద్రబాబు పాలన ఎలా ఉందో మహిళలను అడిగితే చెబుతారని, నిరుద్యోగులు, విద్యార్థులు, కార్మికులు, ప్రభుత్వ ఉద్యోగులను అడిగినా వాస్తవ పరిస్థితి తెలుస్తుందని అన్నారు. రాష్ట్రంలో రైతులు సమస్యలతో రోడ్డెక్కుతున్నారని గుర్తు చేశారు. చంద్రబాబు పాలనపై ప్రజల్లో అసంతృప్తి పెరుగుతోందని విమర్శించారు. ఆయన సభలకు వచ్చిన ప్రజలు మధ్యలోనే వెళ్లిపోతున్నారని వ్యాఖ్యానించారు.ఆరోగ్యశ్రీపై విమర్శలురాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకం సరిగా అమలు కావడం లేదని బుగ్గన ఆరోపించారు. ప్రజా సంక్షేమ పథకాల విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం చూపుతోందని అన్నారు. రైతులు, విద్యార్థులు, మహిళలు ఎదుర్కొంటున్న సమస్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.జగన్ జనాదరణపై వ్యాఖ్యలుచంద్రబాబు మీటింగ్ పెడితే జనం మధ్యలో వెళ్లిపోతున్నారన్న బుగ్గన.. వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బయటకు వస్తే లక్షలాది మంది ప్రజలు తరలివస్తున్నారని అంటున్నారు. అది చూసి చంద్రబాబు ప్రభుత్వం ఇబ్బంది పడుతోందని అన్నారు. ప్రజల్లో తమ పార్టీకి ఇంకా ఆదరణ ఉందని పేర్కొన్నారు. -
YSRCP శిబిరాన్ని తొలగించిన కూటమి
-
ఏపీలో కొనసాగుతున్న టీడీపీ రాక్షస క్రీడ
సాక్షి, అమరావతి: డీఎస్సీ అవకతవకలపై వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలు కూటమి ప్రభుత్వానికి వణుకు పుట్టిస్తున్నాయి. నైతిక బాధ్యత వహిస్తూ నారా లోకేశ్ రాజీనామా చేయాలని, అలాగే సీబీఐతో దర్యాప్తు చేయించాలనే డిమాండ్లకు ఇటు డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలు కూడా మద్దతు ప్రకటిస్తున్నాయి. దీంతో కూటమి పెద్దలు ఏం చేయాలో అర్థంకాక తలలు పట్టుకుంటున్నారు. ఈ క్రమంలో దుష్ట రాజకీయానికి తెర తీశారు. ఏపీవ్యాప్తంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. ఈ క్రమంలో.. ఇవాళ రెండో రోజు కూడా పలు చోట్ల దీక్షను భగ్నం చేసే కుట్రలు కొనసాగుతున్నాయి. ఓవైపు పోలీసుల రూపంలో ఆటంకాలు కలిగిస్తున్న కూటమి ప్రభుత్వం.. మరోవైపు టీడీపీ గూండాలతో దౌర్జన్యకాండకు దిగుతోంది. ఈ రాక్షస క్రీడపై వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడుతున్నాయి. డీఎస్సీ వ్యవహారంపై దెందులూరు నియోజకవర్గం మాదేపల్లిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు వెళ్తున్న మాజీ ఎమ్మెల్యే అబ్బయ్య చౌదరిని పోలీసులు అడ్డుకున్నారు. ఇప్పటికే పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలను అదుపులోకి తీసుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. మాదేపల్లిలో ఏర్పాటు చేసిన దీక్షా టెంట్ను టీడీపీ గూండాలు తొలగించారని తెలుస్తోంది. ఆపై వైఎస్సార్సీపీ కార్యాలయం వద్ద భారీగా పోలీసులు మోహరించగా.. అబ్బయ్య చౌదరి నేలపై బైఠాయించి నిరసన కొనసాగించారు.తునిలో ఎండలోనే దీక్షలుకాకినాడ జిల్లా తుని నియోజకవర్గం తొండంగిలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షల టెంట్లను పోలీసులు తొలగించారు. రాత్రి కార్పొరేషన్ బ్యాంక్ సమీపంలో ఏర్పాటు చేసిన టెంట్ను, అనంతరం ఉదయం జియో కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మరో టెంట్ను తొలగించినట్లు తెలిపింది. టీడీపీ నేతల సూచనతోనే పోలీసులు ఈ పని చేశారని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు. అయితే టెంట్లు తొలగించినా వెనక్కి తగ్గేది లేదని వైఎస్సార్సీపీ శ్రేణులు స్పష్టం చేశాయి. ఎండలోనే బైఠాయించి తమ నిరసన కొనసాగిస్తున్నారు.విజయవాడ వెస్ట్లో ఉద్రిక్తత!విజయవాడ వెస్ట్లో వైఎస్సార్సీపీ నిర్వహిస్తున్న రిలే దీక్షా శిబిరం వద్ద ఉద్రిక్తత చోటుచేసుకుంది. టీడీపీ నేత బుద్ధా వెంకన్న దీక్షా ప్రదేశానికి చేరుకుని వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టేలా నినాదాలు చేశారు. శాంతియుతంగా నిరసన చేస్తున్న కార్యకర్తలను రెచ్చగొట్టి గొడవ సృష్టించే ప్రయత్నం చేశారు. నిన్న మల్లాది విష్ణు ఆధ్వర్యంలో జరిగిన దీక్ష వద్ద కూడా ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నది తెలిసిందే. టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా అక్కడికి రావడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. మహిళలపై దాడులు జరగ్గా.. బోండా అనుచరుడు ఒకడు జుగుప్పాసకంగా వ్యవహరించాడు. మహిళా జర్నలిస్టుల మీద దాడి జరుగుతున్నా కూడా.. పోలీసులు చూస్తూ ఉండిపోయారు.కూటమి ప్రభుత్వం ఎన్ని కుట్రలు చేసినా.. టీడీపీ శ్రేణులు ఎంత బరితెగించినా వైఎస్సార్సీపీ శ్రేణులు మాత్రం వెనక్కి తగ్గడం లేదు. డీఎస్సీ నియామకాల్లో జరిగిన అవినీతి, అవకతకవలకు నారా లోకేశ్ కచ్చితంగా రాజీనామా చేయాలని, జాతీయ దర్యాప్తు సంస్థతో ఈ వ్యవహారంపై విచారణ జరిపించాల్సిందేనని పట్టుబడుతోంది. -
అరాచక ప్రదేశ్లో బాబు సర్కార్.. నూకలు చెల్లాయ్
సాక్షి, కృష్ణా/తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్లో డీఎస్సీ అక్రమాల ఆరోపణలపై కొనసాగుతున్న రాజకీయ వేడి మరింత పెరిగింది. గురువారం విజయవాడలో వైఎస్సార్సీపీ దీక్షా శిబిరంపై జరిగిన దాడి ఘటనను ప్రస్తావిస్తూ మాజీ మంత్రి పేర్ని నాని కూటమి ప్రభుత్వంపై తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. బాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయని, తప్పుడు పనులు, రౌడీయిజానికి ప్రజలు త్వరలోనే సమాధానం చెబుతారని వ్యాఖ్యానించారు.కృష్ణాడెల్టాకు సాగునీరు ఇవ్వాలని కోరుతూ అవనిగడ్డలో పులిగడ్డ ఆక్విడెక్ట్ వేదికగా మాజీ ఎమ్మెల్యే సింహాద్రి రమేష్ నిరాహారదీక్ష చేపట్టారు. ఈ దీక్షకు సంఘీభావం తెలిపిన మాజీ మంత్రి పేర్నినాని అనంతరం మీడియాతో మాట్లాడారు. ‘‘బోండా ఉమా అధికార మదంతో మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు శిబిరంపై దాడి చేశారు. దీక్షా శిబిరంలో కోడిగుడ్లు విసరడం, షామియానాలు ధ్వంసం చేయడం వంటి చర్యలకు పాల్పడ్డారు. అధికార పార్టీ నేతలు రౌడీయిజాన్ని ప్రోత్సహిస్తున్నారు అని మండిపడ్డారు.“బోండా ఉమా లాంటి వంద మంది రౌడీలను పోగేసుకుని చంద్రబాబు, లోకేష్ శునకానందం పొందొచ్చు. కానీ ఆ ఆనందం ఎన్నో రోజులు ఉండదు. మీ పాపాలన్నీ శిశుపాలుడి పాపాల మాదిరిగా లెక్కిస్తున్నారు” అంటూ పేర్ని నాని ఘాటు వ్యాఖ్యలు చేశారు.ప్రభుత్వంపై విమర్శలు చేస్తే ఇంటికొచ్చి కొడతామంటూ బెదిరింపులకు పాల్పడుతున్నారన్న ఆయన.. “మీ చేతనైంది చేసుకోండి.. ఎంతమందిని కొడతారో చూస్తాం” అంటూ సవాల్ విసిరారు. దాడులతో తమకు జరిగే నష్టం ఏమీ లేదని, ప్రజల్లో ప్రభుత్వంపై వ్యతిరేకత పెరుగుతోందని అన్నారు. ఈ క్రమంలో బోండా ఉమాను ఉద్దేశించి పేర్ని నాని తీవ్ర వ్యాఖ్యలు చేశారు. “మీ కార్యకర్తలే మీ ఇళ్లకు వచ్చి ప్రశ్నించకుండా చూసుకోండి” అంటూ హెచ్చరించారు. అధికార దర్పంతో చేసే చర్యలకు ప్రజలు తగిన సమాధానం చెబుతారని పేర్కొన్నారు.ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చారు: లేళ్ల అప్పిరెడ్డిఇటు విజయవాడ ఘటనపై తాడేపల్లిలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి కూడా ప్రభుత్వంపై తీవ్ర విమర్శలు చేశారు. ఆంధ్రప్రదేశ్ను అరాచక ప్రదేశ్గా మార్చారని, అక్రమాలు, అన్యాయాలకు కేంద్రంగా మారిందని ఆరోపించారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా ఆందోళన చేస్తున్న వారిపై దాడులు చేయడం దారుణమని అన్నారు. మంత్రి నారా లోకేష్ ఆధ్వర్యంలోనే ఎమ్మెల్యే బోండా ఉమా దాడులకు దిగారని ఆరోపించారు. దీక్షా శిబిరంలో మహిళలు, విద్యార్థులపై దాడి చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధమని మండిపడ్డారు.ఆందోళనకారులపై మూత్రం పోశారనే ఆరోపణలను ప్రస్తావిస్తూ.. ఇది అత్యంత నీచమైన చర్య అని విమర్శించారు. పోలీస్ కమిషనర్ కార్యాలయానికి సమీపంలోనే ఘటన జరగడం రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితికి అద్దం పడుతోందని అన్నారు. దాడి చేసిన వారిని వదిలి.. మల్లాది విష్ణును అరెస్ట్ చేశారని, పోలీసులు అధికార పార్టీకి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ప్రజాస్వామ్యాన్ని విశ్వసిస్తుందని, అందుకే తమ కార్యకర్తలు సంయమనం పాటిస్తున్నారని తెలిపారు. ఈ క్రమంలో బెదిరింపులు, దాడులకు భయపడబోమని స్పష్టం చేశారు.డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని లేళ్ల అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. తమ డిమాండ్లు నెరవేరే వరకు ఆందోళనలు కొనసాగుతాయని స్పష్టం చేశారు. పోలీసులు అధికార పార్టీకి వత్తాసు పలికితే న్యాయపోరాటం చేస్తామని ఆయన హెచ్చరించారు. -
వైఎస్సార్సీపీ గర్జనతో టీడీపీలో వణుకు
సాక్షి, అమరావతి: డీఎస్సీ అక్రమాల వ్యవహారం ఏపీ రాజకీయాలను వేడెక్కించింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని.. సీబీఐ దర్యాప్తునకు ఆదేశించాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షలకు కూటమి ప్రభుత్వం బెదిరిపోయింది. ఈ క్రమంలోనే.. పోలీసులను ప్రయోగించింది. అయినా పోరాటం ఆగకపోవడంతో నేరుగా టీడీపీ గుండాలను రంగంలోకి దించింది. డీఎస్సీ అవకతకవలపై పోరాటాలను వైఎస్సార్సీపీ ఉదృతం చేసింది. ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు చేపట్టిన వైఎస్సార్సీపీ.. నియోజకవర్గాల వారీగా రిలే దీక్షలకు పిలుపునిచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు, సంఘాలతో కలిసి పార్టీ యువజన విభాగం ఆధ్వరంలో గురువారం నుంచి నాలుగు రోజులపాటు ఈ దీక్షలు మొదలయ్యాయి. అయితే లోకేశ్ ఆదేశాలతో రంగంలోకి దిగిన పోలీసులు.. దీక్షకు అనుమతి లేదంటూ అడ్డుకునే ప్రయత్నాల చేశారు. అంతటితో ఆగకుండా.. టెంట్లను సైతం పీకేసి వెళ్లిపోయారు. అయితే.. పలు చోట్ల దీక్షలు సజావుగా సాగడంతో కూటమి ప్రభుత్వం భరించలేకపోయింది. ఈ క్రమంలోనే టీడీపీ గూండాలను దీక్షా శిబిరాలపైకి ఉసిగొల్పింది. దీంతో రాష్ట్రంలో పలు దీక్షా శిబిరాల వద్ద ఉద్రిక్త పరిస్థితులు చోటుచేసుకున్నాయి. ఇందుకు విజయవాడలో జరిగిన దౌర్జన్యకాండే ఉదాహరణగా నిలిచింది. విజయవాడలోని దీక్షా శిబిరాలపై టీడీపీ ఎమ్మెల్యే బోండా ఉమా నేరుగా దాడి చేశారు. కొందరు వ్యక్తులు టమాటాలు, కోడిగుడ్లు, రాళ్లతో దాడులకు పాల్పడ్డారు. నిరసన కార్యక్రమం కోసం ఏర్పాటు చేసిన టెంట్లను తొలగించారు. అక్కడ ఉన్న మహిళా కార్యకర్తలపై కూడా దాడులు చేశారు. మహిళా జర్నలిస్టులను, పోలీసులను కూడా వదలకుండా దాడులు చేశారు. మరో అడుగు ముందుకు వేసి.. ఓ అనుచరుడు నీచంగా ప్రవర్తించాడు. దీక్షా శిబిరం పై నుంచి అక్కడున్నవాళ్లపై మూత్రం పోశాడు. ఏపీలో ఇవాళ చాలా చోట్ల ఇలాంటి దృశ్యాలే కనిపించాయి. ఆ సమయాల్లో.. పోలీసులు తగిన చర్యలు తీసుకోలేదు. ప్రజాస్వామ్య పద్ధతిలో నిర్వహిస్తున్న నిరసనలకు రక్షణ కల్పించాల్సింది పోయి.. ప్రేక్షక పాత్ర వహించారు. దాడులను అడ్డుకోవడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారు. అయితే.. ఏం జరిగినా తమ పోరాటం ఆగబోదని వైఎస్సార్సీపీ అంటోంది. అరెస్టులు.. దాడులు తమని ఆపవని అంటోంది. డీఎస్సీ కుంభకోణానికి కూటమి ప్రభుత్వం బాధ్యత వహించాలంటోంది. నైతిక బాధ్యత వహిస్తూ లోకేశ్ రాజీనామా చేయాలని, సీబీఐ విచారణకు ఆదేశించాలని.. చంద్రబాబు ప్రభుత్వం దిగి వచ్చేదాకా పోరాటం ఆగదని కుండబద్దలు కొడుతోంది. -
లోకేశ్ ఆదేశాలు.. పోలీసులు సమక్షంలో రెచ్చిపోతున్న టీడీపీ గూండాలు
డీఎస్సీ-2025 నియామకాల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారాలపై వైఎస్సార్సీపీ పోరుబాట చేపట్టింది. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, డీఎస్సీ వ్యవహారంపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తోంది. ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన నిరసన దీక్షలను అడ్డుకునేందుకు పోలీసులు రంగంలోకి దించింది కూటమి ప్రభుత్వం. అయినప్పటికీ పలు జిల్లాల్లో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి.. YSRCP DSC Porubata Updatesఏపీలో జంగిల్రాజ్వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలను భగ్నం చేసేందుకు కూటమి సర్కార్ యత్నంపోలీసుల సమక్షంలోనే కొనసాగుతున్న దౌర్జన్యకాండవైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులకు పాల్పడుతున్న టీడీపీ గూండాలుకీలక నేతలు దీక్షా శిబిరాలకు వెళ్లకుండా అడ్డగింతపోలీసుల సమక్షంలోనే దీక్షా టెంట్లను పీకేస్తున్న టీడీపీ శ్రేణులుఅడ్డుపడుతున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడులుపలు నియోజకవర్గాల్లో తీవ్ర ఉద్రిక్తతలువిజయవాడలో అమానుషం.. అత్యంత నీచంగా వ్యవహరించిన బోండా ఉమా అనుచరులుదీక్షా శిబిరం పైనుంచి మూత్రం పోసిన బోండా అనుచరుడుమహిళలపై సైతం దాడులకు పాల్పడుతున్న టీడీపీ రౌడీలుబోండా ఉమా దౌర్జన్యం.. దాడికి యత్నండీఎస్సీ పరీక్షల్లో అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ విజయవాడ ముత్యాలపాడులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు, వైసీపీ కార్యకర్తలు దీక్షల్లో పాల్గొన్నారు. దీక్ష శిబిరాన్ని సెంట్రల్ ఎమ్మెల్యే బోండా ఉమా ధ్వంసం చేశారు. దీంతో అక్కడకు చేరుకున్న పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకునే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైస్సార్సీపీ, టీడీపీ కార్యకర్తల మధ్య తోపులాట చోటుచేసుకుంది. టీడీపీ నాయకులు గుడ్లు విసిరి దాడులకు పాల్పడ్డారు. అనంతపురం జిల్లా యాడికిలో ఉద్రిక్తతడీఎస్సీ అక్రమాలపై యాడికి మండల కేంద్రంలో వైఎస్సార్సీపీ నేతలు చేపట్టిన నిరసన దీక్ష ఉద్రిక్తతకు దారితీసింది. దీక్షా శిబిరాన్ని టీడీపీ నేతలు తొలగించారు. జేసీ వర్గీయుల కవ్వింపు చర్యలతో పాటు దౌర్జన్యం జరిగిందని తెలిపింది. శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వైఎస్సార్సీపీ నేతలను పోలీసులు అరెస్ట్ చేశారని పేర్కొంది. ఈ ఘటనను వైఎస్సార్సీపీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే కేతిరెడ్డి పెద్దారెడ్డి తీవ్రంగా ఖండించారు.ఏలూరు జిల్లాలో.. డీఎస్సీ-2025 అవకతవకలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ కైకలూరులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. ఏలూరు రోడ్డులో నిర్వహించిన దీక్షలకు జిల్లా అధ్యక్షుడు, కైకలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు నాయకత్వం వహించారు. ఈ కార్యక్రమంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారానికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని, విద్యా దీవెన, వసతి దీవెన బకాయిలు చెల్లించాలని, నిరుద్యోగ భృతి అమలు చేయాలని డిమాండ్ చేశారు.పులివెందులలో.. కూటమి ప్రభుత్వం నిర్వహించిన డీఎస్సీలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్ జిల్లా పులివెందులలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. స్థానిక ఆర్డీవో కార్యాలయం వద్ద నాలుగు రోజుల పాటు దీక్షలు కొనసాగనున్నాయి. దీక్షలో కూర్చున్న డీఎస్సీ అభ్యర్థులు, వైఎస్సార్సీపీ నాయకులకు పూలమాలలు వేసి పార్టీ నేత వైఎస్ మధురెడ్డి దీక్షలను ప్రారంభించారు.రేపల్లెలో ఉద్రిక్తత..డీఎస్సీ స్కామ్కు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ రేపల్లె తాలూకా సెంటర్లో వైఎస్సార్సీపీ నిరసన దీక్ష చేపట్టింది. నియోజకవర్గ సమన్వయకర్త పీటా మోహన్కృష్ణ ఆధ్వర్యంలో జరిగిన దీక్షను పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో పోలీసులు, వైఎస్సార్సీపీ కార్యకర్తల మధ్య వాగ్వాదం, తోపులాట చోటుచేసుకుంది. దీంతో అక్కడ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. పీటా మోహన్కృష్ణను అరెస్టు చేసేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు.అనంతపురం జిల్లాలో.. మెగా డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ ఏపీ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ వెంటనే రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. అనంతపురం మున్సిపల్ కార్పొరేషన్ కార్యాలయం ఎదుట నిర్వహించిన ఈ దీక్షల్లో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరపాలని, నిరుద్యోగులకు న్యాయం చేయాలని ఈ సందర్భంగా పార్టీ నేతలు డిమాండ్ చేశారు.శ్రీ సత్యసాయి జిల్లాలో..డీఎస్సీ అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ ధర్మవరంలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. తహసీల్దార్ కార్యాలయం వద్ద నిర్వహించిన దీక్షల్లో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు పాల్గొన్నారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వారు డిమాండ్ చేశారు.ఎన్టీఆర్ జిల్లాలో జెన్జీ నిరసనలుతిరువూరు నియోజకవర్గ కేంద్రం బోసుబొమ్మ సెంటర్లో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఏపీ జెన్-జెడ్ రిలే నిరాహార దీక్షలు ప్రారంభమయ్యాయి. యువజన, విద్యార్థి విభాగాల నాయకులు, పార్టీ నేతలు దీక్షలో పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి నల్లగట్ల స్వామిదాస్ పూలమాలలు వేసి దీక్షలను ప్రారంభించారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరపాలని, స్పోర్ట్స్ కోటాలో అర్హత లేని వారికి ఉద్యోగాలు ఇచ్చారని ఆరోపించారు. ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు విడుదల చేయాలని, నిరుద్యోగులకు రూ.3 వేల భృతి అందించాలని డిమాండ్ చేశారు.వైఎస్సార్ జిల్లాలో..2025లో జరిగిన డీఎస్సీ అక్రమాలపై జమ్మలమడుగులో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేపట్టారు. మైలవరం మండలానికి చెందిన విద్యార్థులు దీక్షలో పాల్గొనగా, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి వారికి సంఘీభావం తెలిపారు. డీఎస్సీ వ్యవహారంపై సమగ్ర విచారణ జరిపించాలని వైఎస్సార్సీపీ నేతలు డిమాండ్ చేశారు.ఏపీ వ్యాప్తంగా కొనసాగుతున్న దీక్షలు.. నేటి నుండి వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలురాష్ట్రమంతటా అన్ని నియోజకవర్గాల్లో కొనసాగుతున్న దీక్షలుడీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ జరిపించాలని.. మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ఇప్పటికే పలు రూపాల్లో నిరసనలు తెలిపిన వైఎస్సార్సీపీకలెక్టర్లకు వినతి పత్రాలు, నిరసన ప్రదర్శనలు, టౌన్ హాలు సమావేశాలుఈరోజు నుండి 9 వరకు నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలుప్రభుత్వం స్పందించకుంటే 10న పెద్ద ఎత్తున నిరసన ర్యాలీలకు నిర్ణయంనంద్యాల జిల్లాలో.. ఆత్మకూరు ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్ష చేపట్టింది. దీక్షలో శ్రీశైలం మాజీ ఎమ్మెల్యే శిల్పా చక్రపాణిరెడ్డి, వైసీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. డీఎస్సీలో జరిగిన అక్రమాలు, అమలు కాని నిరుద్యోగ భృతి, పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలకు బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని శిల్పా చక్రపాణిరెడ్డి డిమాండ్ చేశారు.నెల్లూరు జిల్లాలో..కోవూరులో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు కొనసాగుతున్నాయి. వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి రాష్ట్ర పీఏసీ సభ్యుడు, మాజీ ఎమ్మెల్యే నల్లపురెడ్డి ప్రసన్నకుమార్రెడ్డి, ఆయన కుమారుడు రజిత్రెడ్డి దీక్షలో కూర్చున్నారు. మెగా డీఎస్సీ స్కాంపై సీబీఐ విచారణ జరిపించాలని, డీఎస్సీ లీకేజీ వ్యవహారంలో మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. నిరుద్యోగ భృతి వెంటనే అందించాలని కోరారు.తిరుపతిలో భూమన నేతృత్వంలో దీక్షలు..మెగా డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరిపించాలని డిమాండ్ చేస్తూ తిరుపతిలో వైఎస్సార్సీపీ రిలే నిరాహార దీక్షలు చేపట్టింది. పాత మున్సిపల్ కార్యాలయం ఎదుట భూమన కరుణాకరరెడ్డి, భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన దీక్షల్లో నిరుద్యోగులు, పార్టీ యువజన, విద్యార్థి విభాగాల నాయకులు పాల్గొన్నారు. మెగా డీఎస్సీలో అక్రమాలు జరిగాయని ఆధారాలతో సహా వెల్లడించినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. రాష్ట్రవ్యాప్తంగా యువత రోడ్డెక్కి నిరసనలు తెలుపుతున్నారని, డీఎస్సీ వ్యవహారానికి బాధ్యత వహిస్తూ మంత్రి నారా లోకేశ్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు.గురజాలలో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని బ్రహ్మనాయుడు సర్కిల్లో రిలే దీక్ష దీక్షకు సిద్ధమైన వైఎస్సార్సీపీ యువజన విద్యార్థి విభాగందీక్షా శిబిరాన్ని ఏర్పాటు చేస్తే ఊరుకోమని హుకుం జారీ చేసిన పోలీసులుకనీసం దీక్ష శిబిరం ఏర్పాటు కూడా చెయ్యనివ్వని పోలీసులుదీక్ష శిబిరానికి సంబంధించిన టెంటును వెనుక పంపిచేసిన పోలీసులుబాపట్ల జిల్లా వేమూరులో.. అమృతలూరులో పోలీసుల ఓవరాక్షన్డీఎస్సీ స్కాంపై లోకేష్ రాజీనామా చేయాలని దీక్ష చేయడానికి రెడీ యువజన విభాగ నాయకులుదీక్షా శిబిరాన్ని తొలగించడానికి ప్రయత్నించిన పోలీసులుఅడ్డుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు.. ఉద్రిక్తతమాచర్లలో దీక్షకు అడ్డంకులుపల్నాడు జిల్లా మాచర్లలో డీఎస్సీ అక్రమాలపై నిరసనగా దీక్ష చేపట్టేందుకు మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి తన సొంత స్థలం వద్ద శిబిరం ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. అయితే పోలీసులు అక్కడికి చేరుకుని ఏర్పాట్లను అడ్డుకున్నారు. “మా సొంత స్థలంలో దీక్ష చేసుకుంటాం.. దానికి కూడా అనుమతి లేదా?” అంటూ పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా నిరసనలు జరుగుతున్నప్పుడు తమ దీక్షను మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు.గుంటూరులో టెంట్ తొలగింపుగుంటూరు జిల్లాలోనూ డీఎస్సీ వ్యవహారంపై నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ నేతలు సిద్ధమయ్యారు. పొన్నూరులో తహసీల్దార్ కార్యాలయం ఎదుట దీక్షా శిబిరం ఏర్పాటు చేసేందుకు ప్రయత్నించగా.. పోలీసులు అడ్డుకున్నారని ఆ పార్టీ నేతలు తెలిపారు. శిబిరానికి వేసిన టెంట్ను పోలీసులు తొలగించారని మండిపడ్డారు. కనిగిరిలోనూ ఉద్రిక్తతమార్కాపురం జిల్లా కనిగిరిలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం ఏర్పాటు చేసిన రిలే దీక్ష శిబిరాన్ని పోలీసులు తొలగించారు. పట్టణంలో సాధారణంగా ధర్నాలు నిర్వహించే ప్రదేశంలోనే టెంట్ ఏర్పాటు చేశామని, అయినప్పటికీ డీఎస్పీ ఆధ్వర్యంలో పోలీసులు వచ్చి తొలగించారని పేర్కొన్నారు. డీఎస్సీ అక్రమాలపై శాంతియుతంగా నిరసన తెలిపేందుకు ప్రయత్నిస్తున్న జెన్జీ విద్యార్థులను అడ్డుకోవడం సరికాదని వైఎస్సార్సీపీ కనిగిరి ఇన్చార్జి ధద్దాల నారాయణ యాదవ్ విమర్శించారు.డీఎస్సీ అక్రమాలపై వైఎస్సార్సీపీ రణభేరిడీఎస్సీ-2025 నియామకాల్లో పారదర్శకత లేదంటున్న వైఎస్సార్సీపీ.. విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు, వివిధ సంఘాలతో కలిసి ఆందోళనలు కొనసాగించాలని నిర్ణయించింది. పార్టీ నేతలు ఈ పోరాటానికి మద్దతు ప్రకటించారు. ఈ నెల 10న విద్యార్థులతో భారీ ర్యాలీ నిర్వహించేందుకు కూడా సిద్ధమయ్యారు.మరోవైపు.. ఈ నిరసనల నేపథ్యంలో చంద్రబాబు ప్రభుత్వం అప్రమత్తమై పోలీసులను రంగంలోకి దించడం గమనార్హం. నిరసనలను అణచివేసేందుకు అధికార యంత్రాంగాన్ని ఉపయోగిస్తున్నారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. -
మాచర్లలో పోలీసుల ఓవరాక్షన్.. పిన్నెల్లితో వాగ్వాదం
సాక్షి, పల్నాడు: మాచర్లలో ఉద్రిక్త వాతావరణం చోటుచేసుకుంది. డీఎస్సీ పరీక్షల్లో అవకతవకలు, పేపర్ లీకేజీ వ్యవహారంపై విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ఇవాళ రాష్ట్రవ్యాప్త నిరాహార దీక్షల్లో నిర్వహించనుంది. ఇందులో భాగంగా మాచర్లలో ఏర్పాటు చేసిన దీక్షా శిబిరాన్ని గతరాత్రి పోలీసులు అడ్డుకున్నారు.మాజీ ఎమ్మెల్యే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి సొంత స్థలం వద్ద దీక్ష నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ కార్యకర్తలు ఏర్పాట్లు చేపట్టారు. అయితే శిబిరం ఏర్పాటు చేస్తున్న సమయంలో పోలీసులు అక్కడికి చేరుకుని అనుమతి లేదంటూ అడ్డుకున్నారు. దీంతో పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, పోలీసుల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది.“సొంత స్థలంలో దీక్ష చేసుకునే హక్కు కూడా లేదా?”ఈ సందర్భంగా పిన్నెల్లి రామకృష్ణారెడ్డి పోలీసులను ప్రశ్నించారు. రాష్ట్రవ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసన దీక్షలు చేపడుతుంటే మాచర్లలో మాత్రమే ఎందుకు అడ్డుకుంటున్నారని నిలదీశారు. తన సొంత స్థలంలో శాంతియుతంగా దీక్ష నిర్వహించుకుంటామని స్పష్టం చేశారు. అయితే పోలీసులు మాత్రం అనుమతులు లేకుండా దీక్ష నిర్వహించేందుకు వీల్లేదని తేల్చి చెప్పారు. సొంత స్థలమైనప్పటికీ శాంతిభద్రతల దృష్ట్యా అనుమతి అవసరమని పేర్కొంటూ ఏర్పాట్లను నిలిపివేశారు.నేడు వైఎస్సార్సీపీ నిరసనలుడీఎస్సీ నియామకాల్లో అవకతవకలు జరిగాయని ఆరోపిస్తూ వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా నిరాహార దీక్షలకు పిలుపునిచ్చింది. ఈ వ్యవహారంపై నైతిక బాధ్యత వహిస్తూ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అయితే ఇటు మాచర్లలో దీక్షా శిబిరం ఏర్పాట్లను పోలీసులు అడ్డుకోవడంతో రాజకీయ వాతావరణం వేడెక్కింది. వైఎస్సార్సీపీ నేతలు దీనిని ప్రభుత్వ అణచివేతగా మండిపడుతున్నారు. -
రాసిపెట్టుకోండి.. ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు
ఒక నాయకుడి అసలైన బలం.. జనం. అందుకే వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏ పర్యటనకు వెళ్లినా ప్రజా స్పందనపై రాజకీయ వర్గాల్లో ఆసక్తి నెలకొంటుంది. జగన్ పర్యటనలను నియంత్రించేందుకు చంద్రబాబు ప్రభుత్వం పోలీసులను ముందుంచి ఆంక్షలు విధిస్తోంది. అయితే, ప్రతిసారీ ప్రజల నుంచి వస్తున్న స్పందన ఆ ప్రయత్నాలకు భిన్నమైన చిత్రాన్ని చూపిస్తోంది. తాజాగా తూర్పు గోదావరి జిల్లా దేవరపల్లి పర్యటన మరోసారి ఇదే చర్చకు వేదికైంది. గత రెండేళ్లుగా.. కూటమి ప్రభుత్వంలో పొగాకు రైతులు గిట్టుబాటు ధర లేక ఇబ్బందులు పడుతున్నారంటూ వారి సమస్యలను తెలుసుకునేందుకు జగన్ దేవరపల్లి పర్యటన చేపట్టారు. రైతులను పరామర్శించడంతో పాటు పొగాకు యార్డ్ను పరిశీలించారు. అయితే ఈ పర్యటనకు పోలీసులు పలు ఆంక్షలు విధించిన నేపథ్యంలో.. జనసందోహం మాత్రం తగ్గలేదు.బారికేడ్లు, భద్రతా ఏర్పాట్లు, నియంత్రణ చర్యలు ఉన్నప్పటికీ జగన్ను చూసేందుకు అభిమానులు, పార్టీ కార్యకర్తలు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. రోడ్ల వెంట, పర్యటన మార్గాల్లో జనం బారులు తీరడం కనిపించింది. ఈ క్రమంలో.. ఓ మహిళ ప్రదర్శించిన ఫొటో అందరి దృష్టిని ఆకర్షించింది. “ఆంధ్ర రాష్ట్రానికి ఒక్కడే రారాజు” అంటూ జగన్ చిత్రాన్ని చూపించడం సోషల్ మీడియాలోనూ చర్చకు దారితీసింది. చుట్టుపక్కల మహిళలు, కార్యకర్తలు ఆ ఫొటోను పైకి ఎత్తి పట్టుకోగా.. పలువరు ఆ ఫొటోతో సెల్ఫీల కోసం ఎగబడ్డారు. అదే సమయంలో.. రాసిపెట్టుకోండి 2029లో జగనే సీఎం, వైఎస్ జగన్ మా దేవుడు అంటూ కొందరు ఫ్లెక్సీలు ప్రదర్శించారు. తమ నాయకుడిపై ఉన్న ఆదరణకు ఇదే నిదర్శనమంటూ పలువురు వ్యాఖ్యానిస్తున్నారు.జగన్ పర్యటనలపై ప్రభుత్వం గత రెండేళ్లుగా ఆంక్షలు విధిస్తోంది. కేసులు పెడతామని నేతలను, ఆ వైపు వెళ్లనీయకుండా సాధారణ ప్రజలను ఇబ్బండి పెడుతోంది. అదేసమయంలో సరైన భద్రత కల్పించకుండా.. డ్రామాలు ఆడుతోంది. అయితే బారికేడ్లు, ఫెన్సింగ్లు ఏర్పాటు చేసినా ప్రజల అభిమానం మాత్రం తగ్గడం లేదు. రాజకీయంగా చూస్తే.. ప్రతి పర్యటనలోనూ కనిపిస్తున్న జన స్పందన వైఎస్సార్సీపీకి బలాన్ని చేకూరుస్తోంది. అధికారంలో ఉన్నా.. ప్రతిపక్షంలో ఉన్నా.. నాయకుడిపై అభిమానం ఉంటే జనాలు స్వచ్ఛందంగా తరలివస్తారనే వాదనకు జగన్ పర్యటనలే ఉదాహరణగా నిలుస్తున్నాయి. -
చంద్రబాబుకి ప్రభుత్వ ఉద్యోగులు డెడ్ లైన్
-
KGVB స్కూల్స్ లో కూటమి భారీ కుంభకోణం
-
ఉత్తరాంధ్రలో జగన్ వెంటే జనం.. కూటమిలో కలవరం?
వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇటీవలి కాలంలో ఏ ప్రాంతానికి వెళ్లినా అశేష జనం తరలివచ్చి ఆయనకు స్వాగతం చెబుతున్న తీరు సహజంగానే టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులకు ఆందోళన కలిగిస్తుంది. శ్రీకాకుళం వద్ద అంపోలు జైలులో ఉన్న మాజీ మంత్రి సిదిరి అప్పలరాజును పరామర్శించడానికి వెళ్లారు. ఈ టూర్ను రెండు రకాలుగా చూడాల్సి ఉంటుంది. ఒకటి ఉత్తరాంధ్రలో ప్రజల అభిమానం చూరగొనడం ఒక ఎత్తు అయితే, అప్పలరాజు కుటుంబాన్ని, అలాగే ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతులను అణచివేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను జగన్ వివరించిన వైనం మరో ఎత్తుగా ఉంది. విశాఖ వరకు విమానంలో వెళ్లి, అక్కడ నుంచి రోడ్డు మార్గాన వాహనంలో ప్రయాణం చేశారు. ఆ క్రమంలో వివిధ ప్రాంతాలలో ,రోడ్డు పక్కన జనం తండోపతండాలుగా గుమికూడడం, ఆయనతో కరచాలనం చేయాలని తహతహడలాడడం, పోలీసులు అడ్డుకుంటున్నా,పొలాలనుంచి వాగులు,వంకలు దాటుకుంటూ జగన్ కలుసుకోవడం గమనించిన వారెవరికైనా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ గత ఎన్నికలలో ఓడిపోయిందంటే నమ్మబుద్ది కాదు. ప్రముఖ మేధావి పరకాల ప్రభాకర్ చెప్పినట్లు గత ఎన్నికలలో ఏభై లక్షల ఓట్ల గోల్ మాల్ తతంగం ఏదో జరిగి ఉండాలని చాలామంది విశ్వసిస్తున్నారు. జగన్ ప్రభుత్వం జనానికి మేలు చేయకపోతే, ఈ స్థాయిలో వివిధ వర్గాలవారు ముఖ్యంగా,పేద,మద్య తరగతి ప్రజలు తరలిరారు. అంతేకాక కూటమి ప్రభుత్వం తన వాగ్దానాలను అరకొరగా మాత్రమే అమలు చేసి, అనేక హామీలను ఎగవేసిన వైనం, రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితి బాగా క్షీణించడం, రెడ్ బుక్ పేరుతో అరాచక పాలన సాగిస్తుండడం వంటివి బాగా ప్రభావం చూపుతున్నట్లు అనిపిస్తుంది. అందుకే జగన్ కోసం జనం అంత పెద్ద ఎత్తున వచ్చారనుకోవాలి. విశాఖ ఎయిర్ పోర్టు మొదలు ఆయా చోట్ల ఆయనను నిలిపి తమ సమస్యలను విన్నవించారు. ప్రజలు పెద్ద ఎత్తున వస్తుండడంతో ఆయన వాహనం దిగి వారికి అభివాదం చేస్తూ ముందుకు సాగారు. భోగాపురం విమానాశ్రయం వద్ద ధాంక్యూ జగన్ సర్ అంటూ కొంతమంది ప్లకార్డులు ప్రదర్శించారు.భోగాపురం విమానాశ్రయం నిర్మాణానికి జగన్ చేసిన కృషిని వారు గుర్తు చేసుకున్నారు. కొన్ని చోట్ల దివ్యాంగులు వచ్చి తమ గోడు వెళ్లబోసుకున్నారు. జగన్ టూర్లో జనం లేకుండా చేయాలని పోలీసులు విశ్వయత్నం చేయకపోలేదు.అనేక చోట్ల రోడ్లపైకి రానివ్వకుండా, ఆయనను కలుసుకునే అవకాశం ఇవ్వకుండా తాడుతో వెనక్కి నెట్టేయడం వంటివి చేశారు. అయినా అభిమానులు వాటన్నిటిని తోసుకుంటూ జగన్ వెంట పరుగులు తీశారంటే అతిశయోక్తి కాదు. కూటమి ప్రభుత్వంపై ప్రజలలో కలిగిన విరక్తికి ఇది దర్పణం పడుతోందన్న విశ్లేషణలు వస్తున్నాయి.జనం ఒత్తిడితో నిర్ణీత టైమ్ కన్నా జగన్ ఆలస్యంగా జైలు వద్దకు చేరుకోవడంతో అప్పలరాజును కలుసుకోలేకపోయారు. కాని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శించి జగన్ ధైర్యం చెప్పి వచ్చారు. వారితో కలిసి మీడియాతో మాట్లాడారు.మరో కోణం చూస్తే అప్పలరాజు మాజీ మంత్రి. ఆయన మత్సకార వర్గానికి చెందినవారు. ఆయా అంశాలపై చక్కని క్లారిటీతో మాట్లాడుతుంటారు. ప్రభుత్వంపై విమర్శలు చేస్తుంటారు. ఎవరైతే సమర్దంగా వైఎస్సార్సీపీ పక్షాన పనిచేస్తుంటారో వారి గొంతు నొక్కడానికి కూటమి ప్రభుత్వం గత రెండేళ్లుగా రకరకాల కుట్రలు చేస్తున్న విషయం అందరికి తెలిసిందే. ఏ చిన్న అవకాశం వచ్చినా వైఎస్సార్సీపీ మద్దతుదారులను జైళ్లలోకి పంపిస్తున్నారు.అయినా వారు వెనక్కి తగ్గకపోవడం కూటమి ప్రభుత్వానికి ఆందోళనగా మారింది. అప్పలరాజు కుమారుడు ఆరవ్ బైక్ నడుపుతున్నప్పుడు ఒక రోడ్డు ప్రమాదం జరిగింది. దాని కారణంగా గొర్రెల కాపరి ఒకరు మరణించారు. అది దురదృష్టకర ఘటన. ఇంతవరకు కేసు పెట్టడాన్ని జగన్ తప్పుపట్టలేదు. కాని ఆ ఆరవ్ పై హత్యకేసు బనాయించడంపై జగన్ బాధపడ్డారు. ఆయన కొద్ది రోజుల క్రితం విశాఖ వచ్చినప్పుడు కూడా తప్పుపట్టారు.ఇక అప్పలరాజుపై సాక్ష్యాలు తారుమారు యత్నం చేశారంటూ కేసు పెట్టి జైలులో నిర్భంధించారు. ఆరవ్ కు బెయిల్ వచ్చింది కాని, అప్పలరాజు ఇంకా జైలులోనే ఉన్నారు.ఈ సందర్భంగా బాదిత కుటుంబాన్ని ఆదుకోవడానికి అప్పలరాజు చేసిన ప్రయత్నాలను కూడా జగన్ వివరించారు.ఈ కేసును కుల వివాదంగా చంద్రబాబు ప్రభుత్వం మార్చడానికి చేసిన ప్రయత్నాన్ని జగన్ తీవ్రంగా ఖండించారు. ఇదంతా చంద్రబాబు దుర్మార్గపు ఆలోచనకు ప్రతిబింబమని ఆయన మండిపడ్డారు. మరణించిన వ్యక్తి యాదవ వర్గానికి చెందినవారు కనుక, మంత్రి పార్ధసారధిని పలాస పంపించిన వైనాన్ని, ఆ సామాజికవర్గానికి చెందిన కొందరితో ర్యాలీలు చేయించడాన్ని జగన్ ఆక్షేపించారు.పోనీ యాదవుల పట్ల ప్రభుత్వం ఏమైనా సానుకూలంగా ఉందా అంటే ప్రకాశం జిల్లాలో ఒక ఘటనలో ఫిర్యాదు చేసిన యాదవులపైనే కూటమి ప్రభుత్వం ఎదురు కేసు పెట్టిన వైనాన్ని ఉదహరించారు.అంతేకాక విశాఖలో వైఎస్సార్సీపీ యాదవ మహిళకు మేయర్ పదవి ఇస్తే ,ఆమెను పదవినుంచి దించేశారని జగన్ విమర్శించారు. రోడ్డు ప్రమాద ఘటనలన్నిటిలోను ఒకే రకంగా వ్యవహరిస్తున్నారా?అని జగన్ వేసినప్రశ్న సమంజసంగానే ఉంది. చాలా కేసులు అసలు పోలీస్ స్టేషన్ వరకు రావు. కొన్ని కేసులలో అయితే స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపిన సందర్భాలు ఉన్నాయి. అధికార పార్టీకి చెందినవారెవరైనా ఇలాంటి ప్రమాద ఘటనలలో ఉన్నా,వారిపై కేసులే పెట్టరు.అందుకు కొన్ని ఉదాహరణలను కూడా జగన్ పేర్కొన్నారు. ఇచ్చాపురం ఎమ్మెల్యే కారులో ఉండగానే ప్రమాదం జరిగిందని, అలాగే పాతపట్నం ఎమ్మెల్యే కుమారుడు కారు నడుతుండగా యాక్సిడెంట్ అయిందని, ఆ ఘటనలలో ఎవరిపైన కేసులు పెట్టారని జగన్ వేసిన ప్రశ్నకు సమాధానం లేదు. ఒక్కొక్కరికి ఒక న్యాయం అమలు చేయడం అంటే విషపు విత్తనాలు నాటడమేనని జగన్ అభిప్రాయపడ్డారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు హింసాత్మక సంఘటనలు జరిగినా, వాటిలో టీడీపీవారు నిందితులుగా ఉంటే తూతూ మంత్రంగా కేసులు పెట్టడం చేస్తున్నారు.లేదా అసలు కేసులే పెట్టడం లేదు. జనసేనకు చెందినవారు పోలీస్ స్టేషన్ లపై వరసగా నాలుగురోజుల పాటు దాడులు చేసినా కేసులు లేకపోవడాన్ని ప్రజలంతా గమనించారు. అప్పలరాజును పరామర్శించడానికి జగన్ వెళ్లడాన్ని చంద్రబాబు తప్పుపట్టారు. చిత్రమేమిటంటే తాను ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు ఆయా కేసులలో నిందితులను పరామర్శించడానికి వెళ్లారు.ఆయనే కాదు.ఇతర టీడీపీ నేతలు కూడా అలా చేసిన ఉదాహరణలు ఉన్నాయి.అదేమీ తప్పుకాదు.కాని వైఎస్సార్సీపీవారు చేస్తే మాత్రం టీడీపీ విమర్శలు చేస్తుంటుంది. ఇక తనపై ఉన్న కేసుల్లో సాక్ష్యులను మేనేజ్ చేసి వారితోనే కేసులను ఉపసంహరించేలా చంద్రబాబు చేస్తున్నారని వైఎస్సార్సీపీ విమర్శిస్తోంది. మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో ఆయా కేసులను చంద్రబాబు ఎత్తివేయించుకుంటున్న తీరును వైఎస్సార్సీపీ నేతలు గుర్తు చేస్తున్నారు. ఒక ఫ్యాక్షన్ హత్య జరిగితే,దానికి రాజకీయ రంగు పులిమి స్వయంగా చంద్రబాబే వెళ్లి ఆ హతుడి పాడె మోశారు.పుంగనూరు వద్ద టీడీపీ కార్యకర్తలు పోలీసులపై దాడి చేశారు. ఆ సందర్భంలో పోలీస్ వాహనాన్ని కూడా దగ్ధం చేశారు. రాళ్లదాడిలో ఒక పోలీస్ కానిస్టేబుల్ కన్ను కూడా పోయింది. ఆ కేసు నిందితులను చంద్రబాబు పరామర్శించారా? లేదా? అవన్ని ఎందుకు చంద్రబాబుపైనే రెండు హత్యాయత్నం కేసులు నమోదు అయి ఉన్నాయే!అవి కాకుండా మరికొన్ని క్రిమినల్ కేసులు ఉన్నాయి. ఎంతసేపు ఎదుటివారిపై ఆరోపణలు చేసి చంద్రబాబు వాటి గురించి ఎందుకు మాట్లాడరు? గతంలో గౌరు వెంకటరెడ్డి అనే నేత కాంగ్రెస్ లో ఉండేవారు. ఆయనకు ఒక కేసులో శిక్షపడి జైలులో ఉన్నప్పుడు వైఎస్ రాజశేఖరరెడ్డి పరామర్శకు వెళితే, అప్పుడు కూడా చంద్రబాబు విమర్శలు చేశారు.ఆ తర్వాత కాలంలో గౌరు వెంకటరెడ్డి, చరిత దంపతులను టీడీపీలో చేర్చుకుని చరితకు టీడీపీ టిక్కెట్ కూడా ఇచ్చారు. అలా ఉటుంది ఆయన రాజకీయం. చంద్రబాబు ఏమి చేసినా రైటు, ప్రత్యర్ధులు ఏమి చేసినా తప్పు అన్నట్లుగా వ్యవహరిస్తుంటారు. ఇదంతా ఏమిటంటే మీడియా మేనేజ్ మెంట్ తనకు తెలిసినంతగా మరెవ్వరికి తెలియదన్నదే ఆయన నమ్మకం కాబట్టి అనుకోవాలి. సమయం అయిపోయిందని జైలులో ఉన్న అప్పలరాజును కలుసుకునే అవకాశం అధికారులు జగన్కు ఇవ్వలేదు. ఒక మాజీ ముఖ్యమంత్రి స్వయంగా వెళితే, ప్రభుత్వం కొంత బ్రాడ్ మైండ్తో అప్పలరాజుతో ములాఖత్కు అవకాశం ఇచ్చి ఉంటే హుందాగా ఉండేది. రెడ్ బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న ప్రభుత్వం నుంచి అలాంటివి ఆశించడం అత్యాశే అవుతుందేమో!- కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
సీదిరి అప్పలరాజును కూటమి ఎందుకు టార్గెట్ చేసింది
-
ధర్మాన ప్రసాదరావు కీలక వ్యాఖ్యలు
సాక్షి, విశాఖపట్నం: చేయనిది చెప్పుకోవడం.. వేరొకరు చేసిన అభివృద్ధిని తమ ఖాతాలో వేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి అలవాటేనని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి ధర్మాన ప్రసాదరావు ఎద్దేవా చేశారు. భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం చుట్టూ రాజకీయ క్రెడిట్ వార్లో భాగంగా.. ధర్మాన కీలక వ్యాఖ్యలు చేశారు. ఎయిర్పోర్ట్ పునాది నుంచి నిధుల కేటాయింపుల దాకా అప్పటి జగన్ ప్రభుత్వం కీలక చర్యలు తీసుకుందని ఆయన గుర్తు చేశారు.బుధవారం విశాఖపట్నంలో మీడియాతో మాట్లాడిన ధర్మాన.. భోగాపురం ఎయిర్పోర్ట్పై కూటమి ప్రభుత్వం చేసుకుంటున్న ప్రచారంపై స్పందించారు. ఎయిర్పోర్ట్ నిర్మాణానికి వైఎస్ జగన్ ప్రభుత్వం అన్ని రకాల సహకారం అందించిందని, ప్రాజెక్టును ముందుకు తీసుకెళ్లేందుకు అవసరమైన చర్యలు చేపట్టిందని చెప్పారు.భోగాపురం ఎయిర్పోర్ట్ నిర్మాణానికి అవసరమైన కీలక అనుమతులను వైఎస్ జగన్ హయాంలోనే సాధించామని ధర్మాన తెలిపారు. ప్రాజెక్టుకు సంబంధించిన ప్రక్రియలను వేగవంతం చేసి, నిర్మాణానికి అనుకూల వాతావరణం కల్పించామని పేర్కొన్నారు. ఎయిర్పోర్ట్ కోసం జగన్ ప్రభుత్వం రూ.1200 కోట్ల నిధులు కేటాయించిందని ఆయన చెప్పారు. ప్రాజెక్టు పనులు నిర్ణీత సమయంలో పూర్తయ్యేలా అప్పటి ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందన్నారు.జగన్ ప్రభుత్వం వేసిన పునాదులే ఇవిభోగాపురం ఎయిర్పోర్ట్ను తామే పూర్తి చేశామని కూటమి ప్రభుత్వం చెప్పుకోవడం సరికాదని ధర్మాన విమర్శించారు. వైఎస్ జగన్ ప్రభుత్వం చేసిన ప్రయత్నాల వల్లే ఈ ప్రాజెక్టు సాధ్యమైందని అన్నారు. "భోగాపురం ఎయిర్పోర్ట్కు జగన్ ప్రభుత్వం పునాది వేసింది. అవసరమైన అనుమతులు, సదుపాయాలు, నిధుల విషయంలో కీలక నిర్ణయాలు తీసుకుంది" అని ధర్మాన పేర్కొన్నారు.భోగాపురంపై కొనసాగుతున్న క్రెడిట్ ఫైట్ఉత్తరాంధ్ర అభివృద్ధిలో కీలక ప్రాజెక్టుగా నిలిచిన భోగాపురం అంతర్జాతీయ విమానాశ్రయం ఇప్పుడు రాజకీయ చర్చకు కేంద్రంగా మారింది. వైఎస్ జగన్ హయాంలోనే ప్రాజెక్టు వేగం పుంజుకుందని వైఎస్సార్సీపీ చెబుతుండగా.. కూటమి ప్రభుత్వం అదంతా తమ క్రెడిటేనంటూ సోషల్ మీడియాలో ఉత్త ప్రచారం చేసుకుంటోంది. కీలక వ్యాఖ్యలుఉత్తరాంధ్ర నిధులను అమరావతికి ఖర్చు పెడుతున్నారు. ప్రజల ఆలోచనలకు విరుద్ధంగా అమరావతిలో పెట్టుబడుతు పెడుతున్నారు. చంద్రబాబు విధానాలతో మళ్లీ విభజన వాదం బలపడే పరిస్థితులు వచ్చాయి. మరో రాష్ట్ర విభజన డిమాండ్ వచ్చినా ఆశ్చర్యపోనవసరం లేదు. ఉత్తరాంధ్రను నిర్లక్ష్యం చేయడం మంచిది కాదు. -
ఏ చట్టాన్ని ఉల్లంఘించలేదు.. నేనూ బాధితుడినే: తమ్మినేని
సాక్షి, శ్రీకాకుళం: భూ కొనుగోలు వ్యవహారంలో గత కొన్నిరోజులుగా తనపై వస్తున్న తప్పుడు ప్రచారంపై వైఎస్సార్సీపీ నేత, మాజీ స్పీకర్ తమ్మినేని సీతారాం స్పందించారు. తాను ఎప్పుడూ చట్టాన్ని ఉల్లంఘించలేదని, భూమి కొనుగోలులో ఎలాంటి అక్రమ మార్గాన్ని అనుసరించలేదని స్పష్టం చేశారు. డాక్యుమెంట్ రైటర్లు, మధ్యవర్తులు చూపించిన పత్రాలను పరిశీలించిన తర్వాతే భూమిని కొనుగోలు చేశామని తెలిపారు.భూమి రిజిస్ట్రేషన్ ప్రక్రియ పూర్తిగా నిబంధనల ప్రకారమే జరిగిందని తమ్మినేని పేర్కొన్నారు. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో పత్రాల పరిశీలన అనంతరం రిజిస్ట్రేషన్ జరిగిందని, ఆ సమయంలో ఎలాంటి అభ్యంతరాలు నమోదు కాలేదని చెప్పారు.వివాదం తెలిసిన వెంటనే కోర్టును ఆశ్రయించాంకొనుగోలు చేసిన భూమిపై వివాదం ఉన్న విషయం తెలిసిన వెంటనే తాము కూడా చట్టపరమైన మార్గాన్ని ఎంచుకున్నామని తమ్మినేని తెలిపారు. గత ఏడాదిన్నర కాలంగా ఈ వ్యవహారం సివిల్ కోర్టులో విచారణలో ఉందని చెప్పారు. ‘‘ఈ భూ వ్యవహారంలో మేము కూడా బాధితులమే. సివిల్ వివాదం కొనసాగుతుండగానే క్రిమినల్ కేసు నమోదు చేయడం ఆశ్చర్యంగా ఉంది’’ అని ఆయన వ్యాఖ్యానించారు.దర్యాప్తుకు పూర్తిగా సహకరిస్తాంతనపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి చట్టపరంగా కోర్టు ముందు వాదనలు వినిపిస్తామని తమ్మినేని తెలిపారు. దర్యాప్తు సంస్థలకు పూర్తిగా సహకరిస్తామని, అవసరమైన అన్ని పత్రాలను సమర్పిస్తామని చెప్పారు. నిజం ఎప్పటికైనా బయటకు వస్తుందన్న నమ్మకం ఉందని, న్యాయవ్యవస్థపై తనకు పూర్తి విశ్వాసం ఉందని మాజీ స్పీకర్ పేర్కొన్నారు.భూ వ్యవహారంపై రాజకీయంగా చర్చతమ్మినేని సీతారాం వ్యాఖ్యలు ప్రస్తుతం శ్రీకాకుళం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారాయి. భూ కొనుగోలు వ్యవహారంలో ఆరోపణలు, కేసుల నేపథ్యంలో ఆయన వివరణ ఇచ్చారు. అయితే చట్టపరమైన ప్రక్రియ ద్వారా అన్ని విషయాలు స్పష్టమవుతాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు.తమ్మినేని దంపతులను అరెస్ట్ చేయొద్దు: హైకోర్టు ఫోర్జరీ డాక్యుమెంట్లతో భూమిని రిజిస్టర్ చేయించుకున్నారన్న ఆరోపణలపై శ్రీకాకుళం గ్రామీణ పోలీసులు నమోదు చేసిన కేసులో తమ్మినేని సీతారాం, ఆయన సతీమణి వాణికి హైకోర్టు ఊరట లభించింది. వారిద్దరికీ మధ్యంతర ముందస్తు బెయిల్ మంజూరు చేసింది. తదుపరి విచారణ వరకు వారిద్దరినీ అరెస్ట్ చేయవద్దని పోలీసులను ఆదేశించింది. పోలీసుల దర్యాప్తునకు సహకరించాలని ఆయన్ని ఆదేశించింది. ఈ నెల 29న 10 గంటలకు దర్యాప్తు అధికారి ముందు హాజరు కావాలని స్పష్టం చేసింది. వాణి వయసు 65 ఏళ్లు కావడంతో ఆమె విషయంలో చట్ట ప్రకారం నడుచుకోవాలని పోలీసులకు తేల్చి చెప్పింది. కాగా, ఇదే కేసులో నిందితుడిగా ఉన్న సీతారాం కుమారుడు వెంకట శ్రీరాం చిరంజీవి నాగుకు అరెస్ట్ నుంచి రక్షణ కల్పించేందుకు హైకోర్టు నిరాకరించింది. తదుపరి విచారణను ఆగస్టు 17కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తి డాక్టర్ జస్టిస్ యడవల్లి లక్ష్మణరావు సోమవారం మధ్యంతర ఉత్తర్వులు జారీ చేశారు. భూమి రిజిస్ట్రేషన్తో సీతారాం, ఆయన భార్య వాణికి సంబంధం లేదన్న సీనియర్ న్యాయవాది చిత్తర్వు రఘు వాదనతో న్యాయమూర్తి ఏకీభవించారు. -
మరో పోరాటానికి YSRCP సిద్ధం.. విద్యార్థి విభాగం ఆధ్వర్యంలో నిరసనలు
-
పార్లమెంట్ను తాకిన ఏపీ మెగా డీఎస్సీ స్కామ్!
సాక్షి, న్యూఢిల్లీ: ఆంద్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం నిర్వహించిన మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై వైఎస్సార్సీపీ పార్లమెంట్లో ఆందోళన వ్యక్తం చేసింది. టీచర్ల నియామకాల్లో అక్రమాలు జరిగాయని చెబుతూ.. ఈ వ్యవహారంపై కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ)తో విచారణ జరపాలని డిమాండ్ చేసింది. ఈ మేరకు పార్లమెంట్ ఉభయ సభల్లో వాయిదా తీర్మాన నోటీసులు ఇచ్చింది.రాజ్యసభలో వైఎస్సార్సీపీ ఎంపీ వైవీ సుబ్బారెడ్డి గురువారం వాయిదా తీర్మాన నోటీసు ఇవ్వగా.. లోక్సభలో ఎంపీ గురుమూర్తి ఇదే అంశంపై నోటీసు అందించారు. మెగా డీఎస్సీలో జరిగినట్లు చెబుతున్న అవకతవకలపై ఉభయ సభల్లోనూ తక్షణ చర్చ చేపట్టాలని వారు కోరారు.16 వేల టీచర్ పోస్టుల భర్తీలో అక్రమాలు!ఏపీలో సుమారు 16 వేల టీచర్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియలో పారదర్శకత లోపించిందని వైఎస్సార్సీపీ అంటోంది. రిక్రూట్మెంట్ ప్రక్రియను ఔట్సోర్సింగ్ ఉద్యోగులతో నిర్వహించారని, దీనిపై అనుమానాలు ఉన్నాయని పేర్కొంది. టీచర్ల నియామకాల్లో నిబంధనలు పాటించలేదని, అర్హులైన అభ్యర్థులకు అన్యాయం జరిగిందని ఆవేదన వ్యక్తం చేసింది.స్పోర్ట్స్ కోటాలో మరీ దారుణంస్పోర్ట్స్ కోటా పేరుతో భారీ స్థాయిలో అక్రమాలు జరిగాయని వైఎస్సార్సీపీ వాయిదా తీర్మానంలో పేర్కొంది. డబ్బులు తీసుకుని స్పోర్ట్స్ కోటా కింద ఉద్యోగాలు ఇచ్చారనే ఫిర్యాదులు ఉన్నాయని పేర్కొన్నారు. నిజమైన అర్హులకు అవకాశాలు దక్కలేదని అన్నారు.మెరిట్ జాబితాలపై ప్రశ్నలుగతంలో మాదిరిగా జిల్లా వారీగా మెరిట్ జాబితాలను విడుదల చేయలేదని వైఎస్సార్సీపీ అంటోంది. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేసుకున్న అభ్యర్థుల్లో కొందరిని కూడా ఎంపిక చేయలేదని పేర్కొంది. ఈ మొత్తం వ్యవహారంపై సమగ్ర దర్యాప్తు అవసరమని, పారదర్శకత కోసం సీబీఐ విచారణ జరపాలని వైఎస్సార్సీపీ ఎంపీలు డిమాండ్ చేశారు.ఏపీలో మెగా డీఎస్సీ నియామక ప్రక్రియపై రాజకీయంగా దుమారం కొనసాగుతోంది. చంద్రబాబు, విద్యా శాఖ మంత్రి నారా లోకేష్లు పెద్ద కుంభకోణానికి పాల్పడ్డారనే విమర్శలు వినిపిస్తున్నాయి. నియామక ప్రక్రియ ఏ దశలోనూ సజావుగా సాగలేదని.. పైగా అర్హులకు తీవ్ర అన్యాయం జరిగిందని వైఎస్సార్సీపీ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వంపై మీడియా సమావేశంలో ఇదివరకే ధ్వజమెత్తిన సంగతి తెలిసిందే. -
మాజీ మంత్రి సీదిరి అప్పలరాజుకు రిమాండ్
సాక్షి, శ్రీకాకుళం: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత సీదిరి అప్పలరాజు అరెస్ట్ వ్యవహారం శ్రీకాకుళం జిల్లాలో రాజకీయ ఉద్రిక్తతలకు దారితీసింది. యాక్సిడెంట్ సంబంధిత కేసులో ఆయన పేరును ఏ3గా చేర్చి.. సెక్షన్లను మార్చేసి మరీ అక్రమంగా అరెస్ట్ చేశారని వైఎస్సార్సీపీ మండిపడుతోంది. మరోవైపు రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదని, వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారని అప్పలరాజు సతీమణి శ్రీదేవి ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు తమ కుటుంబాన్ని కేసుల పేరుతో వేధిస్తున్నారని భార్య శ్రీదేవి మండిపడ్డారు. యాక్సిడెంట్ కేసును హత్య కేసుగా మార్చడం బాధాకరమన్నారు. ఈ తరుణంలో ఆయన ఆరోగ్యం బాగోలేకపోవడంతో కుటుంబ సభ్యులు, ఇటు అనుచరులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. పీఎస్లోనే సీదిరి అప్పలరాజుకు వైద్యపరీక్షలు నిర్వహించారు. సీదిరి అప్పలరాజుకు పలాస కోర్టు.. 14 రోజుల జ్యుడీషియల్ రిమాండ్ విధించింది. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలు ఆయన్ని కలవనీయకుండా పోలీసులు అడ్డుకుంటుండడంతో కాశీబుగ్గ పీఎస్ పరిధిలో ఉద్రిక్తత నెలకొంది.రోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించి నమోదైన కేసులో పోలీసులు అప్పలరాజును బుధవారం సాయంత్రం అదుపులోకి తీసుకుని కాశీబుగ్గ పోలీస్స్టేషన్కు తరలించారు. ఆ సమయంలో ఆయన్ని చొక్కా పట్టుకుని లాక్కెల్లినట్లు ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. అలాగే రాత్రంత కాశీబుగ్గ స్టేషన్లోనే ఇబ్బందికర పరిస్థితుల్లో ఆయన్ని ఉంచినట్లు తెలుస్తోంది. దీంతో ఈ అరెస్ట్ రాజకీయ కక్షసాధింపులో భాగమని వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.వైద్య పరీక్షల కోసం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి..మాజీ మంత్రి సీదిరి అప్పలరాజును వైద్య పరీక్షల నిమిత్తం పలాస ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిన పోలీసులు. భద్రతా ఏర్పాట్ల మధ్య సీదిరిని ఆస్పత్రికి తీసుకొచ్చారు పోలీస్ బృందం. వైద్య పరీక్షల తర్వాత సీదిరి అప్పలరాజును మేజిస్ట్రేట్ ముందు హాజరుపరిచారు. అప్పలరాజు తరలింపుతో పలాసలో ఉద్రిక్త వాతావరణం నెలకొంది.ధర్మాన కృష్ణదాస్ను అడ్డుకున్న పోలీసులు..పోలీసుల తీరుపై వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాశీబుగ్గ పీఎస్ దగ్గర భారీగా పోలీసులు మోహరించారు. దీంతో అక్కడ ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ధర్మాన కృష్ణదాస్ను అడ్డుకున్న పోలీసులు.. సీదిరి అప్పలరాజును కలిసేందుకు వైఎస్సార్సీపీ నేతలను అనుమతించలేదు.పలాసలో ఉద్రిక్తతఅప్పలరాజు అరెస్ట్ నేపథ్యంలో పలాసలో ఆందోళనలు కొనసాగుతున్నాయి. ఆయన అరెస్ట్కు నిరసనగా పలాసలో వైఎస్సార్సీపీ శ్రేణులు భారీ ర్యాలీ నిర్వహిస్తున్నాయి. పోలీస్స్టేషన్ నుంచి మూడు రోడ్ల జంక్షన్ వరకు సాగిన ఆందోళనలో ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ ఉదయం జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి పార్టీ కార్యకర్తలు పలాసకు చేరుకుంటున్నారు.‘వైద్యం అవసరమైన సమయంలో అరెస్ట్ చేశారు’‘‘రెండు రోజులుగా ఆయన ఆరోగ్యం బాగోలేదు. వైద్య చికిత్స అవసరమైన సమయంలోనే పోలీసులు అరెస్ట్ చేశారు. రోడ్డు ప్రమాదం కేసును నేరపూరిత హత్య కేసుగా మార్చడం బాధాకరం. రాజకీయ కక్షతోనే అరెస్ట్ చేశారు’’ అని అప్పలరాజు భార్య శ్రీదేవి ఆవేదన వ్యక్తం చేశారు. తన భర్త, కుమారుడిపై కావాలనే అక్రమ కేసులు నమోదు చేశారని ఆమె పేర్కొన్నారు. న్యాయం జరుగుతుందనే నమ్మకంతో పోరాటం కొనసాగిస్తామని తెలిపారు.వైఎస్ జగన్ ఆగ్రహంమాజీ మంత్రి సీదిరి అప్పలరాజు అరెస్ట్పై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందించారు. ప్రశ్నించే నాయకుల గొంతు నొక్కేందుకు అరెస్టులు చేస్తున్నారని ఆరోపించారు. ఒక రోడ్డు ప్రమాదాన్ని రాజకీయ కక్ష సాధింపుల కోసం ఉపయోగిస్తున్నారని, అరెస్టులతో వైఎస్సార్సీపీని భయపెట్టలేరని జగన్ పేర్కొన్నారు. ప్రజల కోసం పోరాడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు పార్టీ అండగా ఉంటుందని తెలిపారు.కేసు విషయంలో రాజకీయ దుమారంరోడ్డు ప్రమాద ఘటనకు సంబంధించిన కేసులోనే అప్పలరాజును అరెస్ట్ చేసినట్లు పోలీసులు చెబుతుండగా.. ఇది కక్షసాధింపు చర్యేనని వైఎస్సార్సీపీ అంటోంది. ఈ వ్యవహారం ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పలరాజు ఆరోగ్యం, అరెస్ట్ పరిణామాలు, పలాసలో కొనసాగుతున్న నిరసనలపై ఉత్కంఠ కొనసాగుతోంది. -
నెలిమర్ల నిర్వాసితులపై ఎందుకంత కక్ష..?
-
జత్వానీ కేసులో కూటమి సర్కార్కు షాక్!
సాక్షి, విజయవాడ: ముంబై జూనియర్ ఆర్టిస్ట్ కాదంబరీ జత్వానీ కేసులో కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఈ కేసులో సీఐడీ దాఖలు చేసిన ఛార్జ్షీట్లో సంచలన విషయాలు బయటకు వచ్చాయి. ఆమెను పెద్ద బ్లాక్మెయిలర్గా పేర్కొన్న సీఐడీ.. బెదిరింపుల ద్వారా భారీ మొత్తంలో డబ్బులు వసూలు చేసినట్లు తేల్చేసింది.కుక్కల విద్యాసాగర్ నుంచి బ్లాక్మెయిల్ ద్వారా డబ్బులు తీసుకున్నట్లు దర్యాప్తులో గుర్తించింది. సుమారు రూ.1.31 కోట్లు బ్లాక్మెయిల్ చేసి వసూలు చేసిందని.. ఇందుకు సంబంధించిన బ్యాంకు లావాదేవీలను సాంకేతిక ఆధారాలతో పరిశీలించినట్లు అధికారులు తెలిపారు. అయితే ఈ మొత్తం వ్యవహారంలో జత్వానీ కుటుంబ సభ్యుల పాత్ర లేదని సీఐడీ ఛార్జ్షీట్లో పేర్కొన్నట్లు తెలుస్తోంది. ఐపీఎస్ అధికారులపై చర్యల అంశంగతంలో జత్వానీని వేధించారంటూ కూటమి నేతలు తీవ్ర ఆరోపణలు చేసిన విషయం తెలిసిందే. అయితే.. జత్వానీ కేసును అడ్డుపెట్టుకుని గత వైఎస్సార్సీపీ హయాంలో పని చేసిన పోలీసు అధికారులను వేధించేందుకు పెద్ద కుట్ర జరిగిందని తాజా పరిణామాలతో స్పష్టమవుతోంది. జత్వానీని ఏపీకి తీసుకొచ్చి అధికారులపై తప్పుడు కేసులు పెట్టించారని, ఆమెకు అనుకూలంగా ఎల్లో మీడియా ప్రచారం చేసిందని విమర్శలు ఆ సమయంలో వెల్లువెత్తాయి. అంతేకాదు ఐపీఎస్ అధికారులపై కూటమి అధికారంలోని వచ్చాక తీసుకున్న చర్యలను కూడా రాజకీయ కక్ష సాధింపుగా అభివర్ణించారు. విద్యాసాగర్కు నోటీసులుసీఐడీ ఛార్జ్షీట్ నేపథ్యంలో కుక్కల విద్యాసాగర్కు నోటీసులు జారీ చేసినట్లు సమాచారం. కేసు దర్యాప్తులో భాగంగా పలు కీలక అంశాలపై అధికారులు విచారణ కొనసాగిస్తున్నారు.జత్వాని లేఖతో మరో మలుపుసీఐడీ ఛార్జ్షీట్ నేపథ్యంలో జత్వాని ఓ లేఖ విడుదల చేసింది. తనను ఈ వ్యవహారంలో బలిపశువును చేశారని ఆమె అందులో పేర్కొన్నట్లు తెలుస్తోంది. అయితే అడ్డంగా దొరికిపోయాక టీడీపీ, దాని అనుకూల మీడియా మళ్లీ కొత్త డ్రామాకు తెర తీస్తున్నట్లు స్పష్టమౌతోంది.జత్వానీ కేసు గతంలో రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. అప్పట్లో టీడీపీ మంత్రులు, ఎమ్మెల్యేలు జత్వానీకి మద్దతుగా నిలవడం రాజకీయ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఆ తర్వాత ఆమెకు స్టార్ హోటళ్లలో వసతి, విమాన ప్రయాణాలు, ప్రోటోకాల్ సౌకర్యాలు కల్పించడం కూడా హాట్టాపిక్గా మారింది. అంతేకాకుండా విజయవాడ దుర్గగుడిలో ప్రోటోకాల్ దర్శనం కల్పించడం తీవ్ర చర్చకు దారితీసింది. అయితే తాజాగా సీఐడీ ఛార్జ్షీట్లో జత్వానీపై బ్లాక్మెయిల్ ఆరోపణలు, ఆర్థిక లావాదేవీలకు సంబంధించిన అంశాలు వెలుగులోకి రావడంతో.. కూటమి ప్రభుత్వం హడావుడి చేసి అభాసుపాలైందనే చర్చ నడుస్తోంది.జత్వాని కేసు నేపథ్యంలో అప్పటి కీలక పోలీసు అధికారులపై చర్యలు తీసుకున్న విషయం తెలిసిందే. డీజీపీ స్థాయి అధికారి పీఎస్ఆర్ ఆంజనేయులు, విజయవాడ మాజీ సీపీ క్రాంతిరాణా టాటా, డీసీపీ విశాల్ గున్నీ, ఏసీపీ హనుమంతరావులపై కేసులు నమోదు చేసి సస్పెండ్ చేశారు. తాజాగా సీఐడీ ఛార్జ్షీట్లో పేర్కొన్న అంశాలతో ఈ కేసు మరోసారి రాజకీయ, న్యాయ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. -
బాబు పాలనలో మహిళలకు రక్షణ లేదు
గుంటూరు ఎడ్యుకేషన్: చంద్రబాబు ప్రభుత్వ పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికార మదంతో టీడీపీ నేతలు, కార్యకర్తలు రౌడీల్లా వ్యవహరిస్తున్నారని, పోలీసులు వారికి చుట్టాల్లా మారారని ధ్వజమెత్తారు. గుంటూరు కృష్ణబాబుకాలనీలో టీడీపీ నాయకుడు మల్లెల మూర్తి మహిళను వివస్త్రను చేసిన సంఘటనలో బాధితురాలిని వైఎస్సార్సీపీ మహిళా నేతలు పరామర్శించారు. ఆమె నివాసానికి వెళ్లిన మహిళా నేతలు జరిగిన ఘటన గురించి బాధితురాలితో మాట్లాడి, ఆమెకు ధైర్యం చెప్పారు.అధైర్యపడవద్దని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాము వచ్చామని, న్యాయం జరిగే వరకూ అన్ని విధాలుగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. బాబు పాలనలో మహిళలపై జరుగుతున్న దాడులకు నిరసనగా మంగళవారం రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల్లో బీఆర్ అంబేడ్కర్ విగ్రహాలకు వినతి పత్రాలు ఇస్తామని ప్రకటించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ అధ్యక్షురాలు, ఎమ్మెల్సీ వరుదు కల్యాణి, రాష్ట్ర మహిళా విభాగ వర్కింగ్ ప్రెసిడెంట్ కాకాణి పూజితారెడ్డి, మాజీ మంత్రి విడదల రజిని, కృష్ణా జెడ్పీ చైర్పర్సన్ ఉప్పాల హారిక, విజయవాడ నగర మాజీ మేయర్ రాయన భాగ్యలక్ష్మి, పార్టీ గుంటూరు నగర అధ్యక్షురాలు షేక్ నూరి ఫాతిమా మీడియాతో మాట్లాడుతూ, ‘బోరు పంపు రిపేరు కోసం టీడీపీ నేత మల్లెల మూర్తి అడిగిన రూ.10 వేలు ఇవ్వనందుకు ఒక మహిళపై తన కుటుంబంతో సహా తొమ్మిది మంది దాడికి పాల్పడడం దారుణం.మహిళా ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలోనే ఒక మహిళపై ఇంత అమానుషం చోటుచేసుకోవడం చంద్రబాబు ప్రభుత్వానికి సిగ్గుచేటు. సీసీ కెమెరాలు ఉండటం వల్లనే ఈ కేసు పెట్టారు. లేదంటే కేసే ఉండేదికాదు. రాష్ట్రంలో ప్రతిరోజూ మహిళలపై అకృత్యాలు చోటుచేసుకుంటున్నాయి. రాజ్యాంగం అన్నా, చట్టం అన్నా ఎటువంటి భయం లేకుండా టీడీపీ నేతలు, కార్యకర్తలు అచ్చోసిన అంబోతుల్లా రెచ్చిపోతున్నారు. గుంటూరు ఘటనకు బాధ్యులైన వారందరిపై కఠిన చర్యలు తీసుకోవాలి. తప్పులు చేస్తున్న వారిని రక్షించుకుంటూపోతే 2029లో వైఎస్ జగన్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక లెక్కలు తేలుస్తాం’ అని హెచ్చరించారు.నేడు రాష్ట్రవ్యాప్తంగా నిరసనలుసాక్షి, అమరావతి: టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రాష్ట్రంలో మహిళలపై దాడులు, హత్యలు, అత్యాచారాలు పెరిగిపోయాయని.. వాటిని నిరసిస్తూ మంగళవారం రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలకు దిగనున్నట్లు ఎమ్మెల్సీ, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు వరుదు కళ్యాణి చెప్పారు. బాధితులకు న్యాయం చేయాలని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ మహిళా విభాగం ఆధ్వర్యంలో మంగళవారం ఉదయం 10 గంటలకు రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాల్లోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ విగ్రహాల వద్ద నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వైఎస్సార్సీపీ శ్రేణులు ఈ కార్యక్రమాల్లో పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
గుంటూరు బాధితురాలికి వైఎస్సార్సీపీ నేతల పరామర్శ
సాక్షి, గుంటూరు: ఏపీలో మహిళలకు రక్షణ లేకుండా పోయిందని వైఎస్సార్సీపీ మహిళా నేతలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని కృష్ణబాబు కాలనీలో జరిగిన కీచక ఘటనపై వాళ్లు తీవ్రంగా స్పందించారు. సోమవారం బాధితురాలి కుటుంబాన్ని పరామర్శించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ.. చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తడంతో పాటు పోలీసుల తీరును తీవ్రంగా తప్పుబట్టారు.వైఎస్సార్సీపీ మహిళా అధ్యక్షురాలు వరుదు కళ్యాణి, మాజీ మంత్రి విడదల రజిని, కాకాని పూజిత, నూరి ఫాతిమా, ఉప్పాల హారిక తదితర నేతలు బాధిత కుటుంబాన్ని కలిశారు. బాధితురాలికి ధైర్యం చెప్పి, పార్టీ అండగా ఉంటుందని హామీ ఇచ్చారు.“ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారు”ఈ సందర్భంగా మాజీ మంత్రి విడదల రజిని కూటమి ప్రభుత్వంపై, పోలీసులపై తీవ్ర స్థాయిలో మండిపడ్డారు. బాధితురాలు ముందుగానే పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోలేదని ఆరోపించారు. “మహిళను వివస్త్రను చేసి కొట్టారు. ఏపీలో బిహార్ కంటే దారుణమైన పరిస్థితులు ఉన్నాయి. బాధితురాలి ఫిర్యాదును పోలీసులు పక్కన పెట్టారు. టీడీపీ నేతలు, కార్యకర్తలు గూండాల్లా వ్యవహరిస్తున్నారు. మహిళపై టీడీపీ నేత దౌర్జన్యంగా వ్యవహరించారు” అని రజిని విమర్శించారు.రాష్ట్రంలో మహిళలపై వరుస దాడులు జరుగుతున్నాయి. టీడీపీ నేతలు అధికార మదంతో వ్యవహరిస్తున్నారు. ఇక్కడ మహిళపై టీడీపీ నేత దౌర్జన్యంగా ప్రవర్తించాడు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. కూటమి ప్రభుత్వం రక్షణ కల్పించడంలో విఫలమైంది. గూండా రాజ్యం నడుస్తోంది అని వరుదు కల్యాణి ఆగ్రహం వ్యక్తం చేశారు.మహిళల భద్రతపై ప్రశ్నలురాష్ట్రంలో మహిళల భద్రతపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని వైఎస్సార్సీపీ మహిళా నేతలు డిమాండ్ చేశారు. ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. జరిగింది ఇదే.. గుంటూరు కృష్ణబాబు కాలనీలో చోటుచేసుకున్న ఘటన.. సంచలన చర్చకు దారి తీసింది. బాధితురాలి ఫిర్యాదు ప్రకారం.. ఈ నెల 15వ తేదీ రాత్రి ఆమె తన ఇంటి ముందు ఉన్న కుళాయి నుంచి మోటార్ ద్వారా నీటిని పట్టుకుంటుండగా వివాదం మొదలైంది. 21వ డివిజన్ టీడీపీ కార్యదర్శి మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన కుటుంబ సభ్యులు నీటి విషయంలో ఆమెతో వాగ్వాదానికి దిగారు. అనంతరం ఆమె ఇంట్లోకి వెళ్లే ప్రయత్నం చేయగా.. మూర్తి సోదరి, ట్రాన్స్జెండర్ మాధవి దాడి చేసి కొట్టారు.ఆ తర్వాత ఆమెపై దాడి చేస్తూ దుస్తులు చింపివేసి అవమానించారు. రోడ్డుపైనే తనను వివస్త్రగా ఉంచి దౌర్జన్యానికి పాల్పడ్డారు. ఆమె వేడుకున్నా కనికరించలేదు. స్థానిక మహిళలు జోక్యం చేసుకుని బాధితురాలికి దుస్తులు అందించి ఆదుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు ఈ నెల 16న పోలీసులకు ఫిర్యాదు చేయగా.. మల్లెల వెంకటరమణమూర్తి, ఆయన సోదరి సహా తొమ్మిది మందిపై కేసు నమోదు చేశారు. -
ఏపీ లాకప్డెత్లపై లోక్సభలో చర్చకు నోటీసు
సాక్షి, న్యూఢిల్లీ: పార్లమెంట్ వర్షాకాల సమావేశాలు నేటి నుంచి (సోమవారం) ప్రారంభం కానున్నాయి. ఈ నేపథ్యంలో.. తొలిరోజే ఆంధ్రప్రదేశ్లో శాంతిభద్రతల పరిస్థితి, పోలీసుల వేధింపులు, లాకప్ డెత్ల అంశాలను లేవనెత్తేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. ఈ మేరకు లోక్సభలో వాయిదా తీర్మానం నోటీసును తిరుపతి ఎంపీ గురుమూర్తి ఇచ్చారు.ఏపీలో ఇటీవల చోటుచేసుకున్న పలు కస్టడీ మరణాలు, పోలీసుల తీరుపై చర్చకు అనుమతించాలని ఆయన నోటీసుల్లో కోరారు. గాదె సాయి కృష్ణ, ఏడుకొండలు, మాల గంగమ్మ, క్రాంతి కుమార్, దరియా హుస్సేన్ వంటి కేసులను ప్రస్తావిస్తూ.. రాష్ట్రంలో శాంతిభద్రతల పరిస్థితిపై సభ దృష్టికి తీసుకురావాలని నోటీసులో పేర్కొన్నారు. అలాగే.. మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు, లైంగిక వేధింపుల అంశాలపైనా చర్చకు అవకాశం కల్పించాలని వైఎస్సార్సీపీ తరఫున ఆయన విజ్ఞప్తి చేశారు. ఇటీవల ఏపీలో చోటుచేసుకున్న కొన్ని లాకప్ డెత్ ఘటనలు రాజకీయంగా కూడా తీవ్ర చర్చకు దారితీశాయి. పోలీసుల వ్యవహారశైలి, కస్టడీలో ఉన్న వ్యక్తుల రక్షణ, న్యాయ ప్రక్రియపై పలు ప్రశ్నలు తలెత్తుతున్న నేపథ్యంలో ఈ అంశాలను జాతీయ స్థాయిలో ప్రస్తావించాలని వైఎస్ జగన్ ఎంపీలకు సూచించారు. రాష్ట్రంలో ప్రజల భద్రతకు సంబంధించిన అంశాలు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని, వీటిపై పార్లమెంట్లో చర్చ అవసరమని ఎంపీలు భావిస్తున్నారు. ఏపీ శాంతిభద్రతల అంశంపై వైఎస్సార్సీపీ ఇచ్చిన నోటీసును స్పీకర్ అనుమతిస్తారా? అనేది ఆసక్తిగా మారింది. అదే గనుక జరిగితే.. కూటమి ప్రభుత్వ అరాచకాలపై చర్చతో లోక్సభ హీటెక్కే అవకాశాలు ఉన్నాయి. -
రంగంలోకి దిగనున్న జగన్... విశాఖలో మహాధర్నా
-
కూటమి నేతల చెవుల్లో తుప్పు వదిలేలా చెప్తున్నా..
-
ఇక వెనక్కి తగ్గం.. కచ్చితంగా పోటీ చేస్తాం: నాదెండ్ల
ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కూటమి భవిష్యత్ సమీకరణాలపై మరోసారి చర్చ మొదలైంది. అసెంబ్లీ ఎన్నికల్లో టీడీపీ, జనసేన, బీజేపీ కలిసి పోటీ చేసి అధికారాన్ని దక్కించుకున్న విషయం తెలిసిందే. ఈ క్రమంలో కూటమి ఐక్యతను కొనసాగించడమే లక్ష్యంగా నేతలు తరచూ సమన్వయ వ్యాఖ్యలు చేస్తూ వస్తున్నారు. అయితే తాజాగా జనసేన కీలక నేత, మంత్రి నాదెండ్ల మనోహర్ చేసిన వ్యాఖ్యలు స్థానిక సంస్థల ఎన్నికల వేళ కొత్త చర్చకు దారితీశాయి.“అసెంబ్లీ ఎన్నికల్లో కూటమి కోసం నాలుగు అడుగులు వెనక్కి వేశాం.. స్థానిక ఎన్నికల్లో అదే ఫార్ములా ఉండదు. పార్టీ బలం ఉన్న చోట తప్పకుండా పోటీ చేస్తాం” అంటూ మనోహర్ చేసిన వ్యాఖ్యలు జనసేన భవిష్యత్ వ్యూహామా? అనే సంకేతాలుగా కనిపిస్తున్నాయి.రాష్ట్రంలోని జనసేన నేతలకు అవకాశాలు కల్పించాల్సిన అవసరం ఉందని నాదెండ్ల మనోహర్ అన్నారు. నాయకత్వం బలంగా ఉన్న ప్రాంతాల్లో కచ్చితంగా పోటీ చేస్తామని స్పష్టం చేశారు. అసెంబ్లీ ఎన్నికల్లో కూటమిని బలోపేతం చేయడమే లక్ష్యంగా నాలుగు అడుగులు వెనక్కి వేశామని.. అదే విధానాన్ని స్థానిక ఎన్నికల్లోనూ కొనసాగిస్తామని భావిస్తే పొరపాటని పేర్కొన్నారు. పార్టీ నాయకత్వాన్ని క్షేత్రస్థాయిలో మరింత పెంచుకునేలా ఎన్నికలకు సిద్ధం కావాలని శ్రేణులకు పిలుపునిచ్చారు. అదే సమయంలో కూటమి పార్టీల మధ్య సమన్వయం కొనసాగిస్తూ ముందుకు సాగాలని సూచించారు.అసెంబ్లీ ఫార్ములా.. స్థానిక ఎన్నికల్లో వద్దు!అసెంబ్లీ ఎన్నికల్లో అధికార మార్పే ప్రధాన లక్ష్యంగా జనసేన సీట్ల విషయంలో భారీ రాజీకి వెళ్లింది. తక్కువ స్థానాల్లో పోటీ చేసినప్పటికీ మెరుగైన ఫలితాలు సాధించింది. దీంతో పార్టీ కేడర్లో కొత్త ఉత్సాహం వచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థల ఎన్నికలు పార్టీ బలం పెంచుకునేందుకు కీలక అవకాశమని జనసేన భావిస్తున్నట్లు కనిపిస్తోంది. స్థానిక ఎన్నికల్లో గ్రామ, మండల, జిల్లా స్థాయిలో పార్టీ నిర్మాణాన్ని బలోపేతం చేయాలని జనసేన చూస్తోంది. అందుకే బలమైన ప్రాంతాల్లో పోటీకి సిద్ధం కావాలనే సంకేతాలను నేతలు ఇస్తున్నారు.పవన్ వ్యూహానికి భిన్నమా?మరోవైపు.. చంద్రబాబు నాయకత్వంలోనే కూటమి ముందుకు సాగాలని.. రాబోయే ఎన్నికల్లోనూ అధికారం దక్కించుకోవాలని జనసేన అధినేత పవన్ కల్యాణ్ పలుమార్లు ఆశాభావం వ్యక్తం చేశారు. కూటమిలో విభేదాలకు తావు లేకుండా, సమన్వయంతో ముందుకు సాగాలనే వైఖరిని ఆయన ప్రదర్శిస్తున్నారు. ఈ నేపథ్యంలో నాదెండ్ల మనోహర్ వ్యాఖ్యలు కూటమిలో కొత్త చర్చకు కారణమయ్యాయి. ఇది కూటమి నుంచి దూరమయ్యే సంకేతమా? లేదంటే పార్టీ విస్తరణలో భాగమైన వ్యూహాత్మక అడుగులా? అనే ప్రశ్నలు రాజకీయ వర్గాల్లో వినిపిస్తున్నాయి.జనసేనలో పెరుగుతున్న ఆశలుఅసెంబ్లీ ఎన్నికల తర్వాత జనసేన కేడర్లో రాజకీయ ప్రాధాన్యత పెరిగింది. ప్రభుత్వంలో భాగస్వామ్యం రావడంతో పాటు, పార్టీకి కేటాయించిన పదవులు, బాధ్యతలు కూడా పెరిగాయి. ఈ నేపథ్యంలో స్థానిక స్థాయిలో కూడా తమకు తగిన ప్రాతినిధ్యం దక్కాలని జనసేన నాయకులు కోరుకుంటున్నారు. టీడీపీతో పొత్తు ఉన్నప్పటికీ.. తమ పార్టీని స్వతంత్రంగా బలోపేతం చేసుకోవాల్సిన అవసరం ఉందనే భావన జనసేనలో కనిపిస్తోంది.టీడీపీ ఆధిపత్యంపై కేడర్లో అసంతృప్తి?కొన్ని ప్రాంతాల్లో టీడీపీ ఆధిపత్యంపై జనసేన కార్యకర్తల్లో అసంతృప్తి ఉందనే చర్చ సాగుతోంది. తమ పార్టీకి తగిన గుర్తింపు, అవకాశాలు దక్కడం లేదనే భావన కొందరు నేతల్లో ఉన్నట్లు తెలుస్తోంది. అయితే పవన్ కల్యాణ్ మాత్రం కేడర్ను నొప్పిస్తూ.. కూటమి ఐక్యతకు ప్రాధాన్యత ఇస్తూ శ్రేణులను సమన్వయం చేస్తున్నారు.వివాదమా.. వ్యూహమా?నాదెండ్ల వ్యాఖ్యలను కూటమిలో విభేదాలుగా చూడాలా? లేక స్థానిక ఎన్నికల్లో పార్టీ బలం పెంచుకునే సహజ రాజకీయ వ్యూహంగా చూడాలా? అనేది రాబోయే రోజుల్లో స్పష్టమయ్యే అవకాశం ఉంది. ప్రధానంగా నాదెండ్ల వ్యాఖ్యలపై పవన్ ఎలా స్పందిస్తారనేది ఇక్కడ కీలకం కానుంది. -
కిర్లంపూడి: అంబటి రాంబాబుపై కేసు నమోదు
సాక్షి, కాకినాడ: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ నేత అంబటి రాంబాబుపై కిర్లంపూడి పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ప్రముఖ కాపు ఉద్యమ నేత ముద్రగడ పద్మనాభం అంత్యక్రియల సందర్భంగా పోలీసుల విధులకు ఆటంకం కలిగించారని ఆరోపిస్తూ పోలీసులు ఫిర్యాదు చేయడంతో ఎఫ్ఐఆర్ నమోదు అయ్యింది.ముద్రగడ పద్మనాభం మృతిచెందిన అనంతరం ఆయన కుటుంబ సభ్యులు ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించడాన్ని తిరస్కరించారు. తమ కుటుంబ నిర్ణయం మేరకే అంతిమ కార్యక్రమాలు జరపాలని స్పష్టం చేశారు. అయితే.. ప్రభుత్వం తరఫున పోలీసులు అధికార లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు.ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ముద్రగడ అంత్యక్రియల సమయంలో.. గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించే సమయంలో అంబటి రాంబాబు, మరికొందరు వైఎస్సార్సీపీ నేతలు అభ్యంతరం వ్యక్తం చేశారు. అయితే అధికార లాంఛనాలు నిర్వహిస్తున్న పోలీసులను అడ్డుకునే ప్రయత్నం చేశారని, ఉన్నతాధికారుల సమక్షంలోనే విధులకు ఆటంకం కలిగించారని పోలీసులు ఆరోపించారు.ఈ ఘటనపై ఏఆర్ ఎస్ఐ వెలుదూటి అప్పలరాజు, పలువురు కానిస్టేబుళ్లు ఫిర్యాదు చేశారు. గార్డ్ ఆఫ్ హానర్ ఇస్తున్న సమయంలో అంబటి రాంబాబు పోలీసులను తోసివేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు తెలిపారు. ఉద్దేశపూర్వకంగానే ఈ చర్యలకు పాల్పడ్డారని ఆరోపించారు. దీంతో అంబటి రాంబాబుతో పాటు మరికొందరు వైఎస్సార్సీపీ నేతలపై బీఎన్ఎస్ 132, 3(5) సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. మరోవైపు.. వైఎస్సార్సీపీ నేతలు ఈ కేసును ఖండిస్తున్నారు. ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను వద్దని స్పష్టంగా చెప్పినప్పటికీ.. ప్రభుత్వం బలవంతంగా గార్డ్ ఆఫ్ హానర్ నిర్వహించిందని ఆరోపిస్తున్నారు. కుటుంబ సభ్యుల అభిప్రాయాన్ని గౌరవించాల్సిన ప్రభుత్వం.. అందుకు విరుద్ధంగా వ్యవహరించిందని విమర్శిస్తున్నారు. -
చంద్రబాబు సిండికేట్లను కూకటివేళ్లతో పెకలిస్తాం: వైఎస్ జగన్
సాక్షి, పశ్చిమ గోదావరి: కూటమి పాలనలో రైతాంగం తీవ్ర అవస్థలు పడుతోందని.. ఒక్క పంటకు గిట్టుబాటు ధర లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం భీమవరంలో అక్వా రైతులతో ముఖాముఖి కార్యక్రమం సందర్బంగా ఆయన చంద్రబాబు ప్రభుత్వంపై ధ్వజమెత్తారు.అక్వా రంగం సమస్యల సుడిగుండంలో కూరుకుపోయింది. అక్వా రైతులు దీనావస్థలో ఉన్నారు. ధరల పెరుగుదల హేతుబద్ధంగా ఉండాలి. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ పోతున్నారు. దున్నపోతు మీద వర్షం పడినట్లుగా ఉంది చంద్రబాబు ప్రభుత్వం తీరు అని జగన్ మండిపడ్డారు. చంద్రబాబు అధికారంలోకి వస్తే సిండికేట్లకు పండగే పండగ.. రైతన్నలకు కన్నీరే. ఇప్పుడు అదే జరుగుతోంది. రాష్ట్రంలో చంద్రబాబు సానుభూతిపరులే సిండికేట్గా ఏర్పడ్డారు. ఫీడ్, సీడ్ రేట్లు చంద్రబాబు మనుషులే ఫైనల్ చేస్తారు. చంద్రబాబు సిండికేట్ రాష్ట్రాన్ని నడిపిస్తోంది. ఆ సిండికేట్ చేతుల్లో రైతులు నలిగిపోతున్నారు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.అక్వా రంగంలో ఐదు లక్షల మందికి ఉపాధి కల్పిస్తోంది. అందుకే మా ప్రభుత్వంలో రెగ్యులేటరీ బోర్ (అప్సడా) ఏర్పాటు చేశాం. సీడ్, ఫీడ్ మార్కెటింగ్లో సమస్యలు వస్తే పరిష్కరించాం. అక్వా రైతులకు యూనిట్కు రూ.1.50కే విద్యుత్ అందించాం. రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించి ఆదుకున్నాం. మద్దతు ధర తగ్గకుండా మానిటర్ చేశాం. ఐదేళ్లలో సబ్సీడీ కింద రూ.3,306 కోట్లు చెల్లించాం. ఇందులో చంద్రబాబు ఎగ్గొట్టిన రూ.401 కోట్ల బకాయిల్ని మేమే చెల్లించాం. ఫీడ్రేట్లు, ధరల విషయంలో ఎప్పటికప్పుడు మానిటర్ చేశాం. 35 అక్వా ప్రాంతాల్లో ఇంటిగ్రేటెడ్ ల్యాబ్లు పెట్టాం. ఆర్బీకేల పరిధిలో ఫిషరీస్ అసిస్టెంట్లను నియమించాం. మా హయాంలో అక్వా ఎగుమతుల విలువ రూ.20 వేల కోట్లు. బెస్ట్ మెరైన్ స్టేట్ అవార్డు కూడా అందుకున్నాం అని జగన్ గుర్తు చేశారు.కానీ, చంద్రబాబు మేం తెచ్చిన చట్టాన్ని నిర్వీర్యం చేశారు. ఇప్పుడు ఏపీలో అక్వా రైతులు పరిస్థితి దయనీయంగా మారింది. ఈ రోజు కేజీ రొయ్య కౌంట్ రూ.230 దాటని పరిస్థితి. నాలుగు నెలల్లో ఫీడ్పై కేజీకి 14-16 రూపాయలు ఎడా పెడా పెంచేశారు. ఏకపక్షంగా ధరలు పెంచొద్దని అనేకసార్లు చెప్పాం. ఇష్టానుసారం ఫీడ్ ధరలు పెంచుకుంటూ వచ్చారు. రేట్లు పెంచితే పెంచారు.. తగ్గినప్పుడు తగ్గించరా?. ముష్టి వేసినట్లు రూ.2 లు తగ్గిస్తే సరిపోతుందా?. చంద్రబాబు తీరు వంద కొరడా దెబ్బలు కాదు.. 98 కొరడా దెబ్బలే అన్నట్లు ఉంది అని వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.పోనీ.. చంద్రబాబు అక్వా రైతులకు ఇచ్చిన హామీలను నెరవేర్చారా?. చంద్రబాబు ప్రతీ అడుగు మోసం.. మోసం. నరసాపురంలో మేం తెచ్చిన ఫిషరీస్ వర్సిటీని నిలిపివేశారు. రూపాయిన్నర విద్యుత్కు కోత పెట్టారు. రైతులకు ఇవ్వాల్సిన 12 వేల విద్యుత్కనెక్షన్లు పెండింగ్లో ఉన్నాయి. అక్వా రైతులకు కొత్తగా ట్రాన్స్ఫార్మర్లు ఇవ్వడం లేదు. ఫలితంగా.. జనరేటర్లు పెట్టుకుని సాగు చేసే పరిస్థితి ఏర్పడింది. ఆఖరికి.. భీమవరం మెడికల్ కాలేజీ పనులు కూడా నిలిపివేశారు అని జగన్ అన్నారు.అక్వా రైతుల కష్టాలు నాకు తెలుసు.. నేనున్నాను. రైతుల కోసం ఉద్యమబాట పడతాం. మూడేళ్ల తర్వాత మన రైతు ప్రభుత్వం వస్తుంది. అప్సడాకు పూర్వవైభవం తెస్తాం. చంద్రబాబు సిండికేట్ను కూకటి వేళ్లతో సహా పెలికిస్తాం’’ అని వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. -
కూటమి పెద్దలకు షాక్.. ప్రభుత్వ లాంఛనాల్ని తిరస్కరించిన ముద్రగడ కుటుంబం
సాక్షి, కాకినాడ: కాపు ఉద్యమ నేత, మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం అంత్యక్రియలను ప్రభుత్వ లాంఛనాలతో నిర్వహించాలని కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన కుటుంబ సభ్యులు తిరస్కరించారు. బతికున్న సమయంలో ముద్రగడను అనేక విధాలుగా అవమానించారని.. ఇప్పుడు అధికారిక గౌరవాలు, సానుభూతి అవసరం లేదని స్పష్టం చేశారు.కాకినాడ జిల్లా కిర్లంపూడిలో బుధవారం మీడియాతో మాట్లాడిన వైఎస్సార్సీపీ నేత జక్కంపూడి రాజా.. ముద్రగడ పద్మనాభం ఏనాడూ అధికారం కోసం పాకులాడిన వ్యక్తి కాదని అన్నారు. ఆయన అంత్యక్రియలకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని కుటుంబ సభ్యులు నిర్ణయించినట్లు తెలిపారు. నివాస ఆవరణలోనే హిందూ సంప్రదాయాల ప్రకారం ఆయనకు అంత్యక్రియలు నిర్వహించనున్నట్లు సమాచారం.‘బతికున్నప్పుడు వేధించారు’ముద్రగడ పద్మనాభంను గతంలో అనేక రకాలుగా వేధించి, అవమానించారని జక్కంపూడి రాజా అన్నారు. ఆయన కుటుంబ సమస్యల విషయంలోనూ అసభ్యంగా ప్రవర్తించారని విమర్శించారు. “ముద్రగడ అధికారం వెంట పరిగెత్తిన వ్యక్తి కాదు. ప్రజా సమస్యలపై పోరాడిన నాయకుడు. ఆయన బతికున్నప్పుడు ఇబ్బందులకు గురిచేసి.. ఇప్పుడు మృతి తర్వాత మొసలి కన్నీరు కార్చాల్సిన అవసరం లేదు” అని జక్కంపూడి రాజా వ్యాఖ్యానించారు.ప్రభుత్వ నిర్ణయం.. కుటుంబం తిరస్కరణముద్రగడ పద్మనాభం ఇటీవల కన్నుమూయడంతో.. ఆయన అంత్యక్రియలను అధికారిక లాంఛనాలతో నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ మేరకు అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ముద్రగడ నాలుగుసార్లు ఎమ్మెల్యేగా, ఒకసారి లోక్సభ సభ్యుడిగా, మంత్రిగా పనిచేసిన సేవలను గుర్తిస్తూ ఈ నిర్ణయం తీసుకున్నట్లు ప్రభుత్వం తెలిపింది. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్తో మాట్లాడిన అనంతరం సీఎం చంద్రబాబు ఈ నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. అయితే.. ఈ ప్రభుత్వ నిర్ణయాన్ని ముద్రగడ కుటుంబ సభ్యులు అంగీకరించలేదు. తమకు ప్రభుత్వ లాంఛనాలు అవసరం లేదని స్పష్టం చేశారు.కాపు ఉద్యమంలో కీలక పాత్రముద్రగడ పద్మనాభం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక నేతగా గుర్తింపు పొందారు. కాపు రిజర్వేషన్ల ఉద్యమంతో రాష్ట్రవ్యాప్తంగా ఆయన పేరు చర్చకు వచ్చింది. ఎమ్మెల్యేగా, ఎంపీగా, మంత్రిగా పనిచేసిన ఆయన రాజకీయ జీవితంలో పలు కీలక పరిణామాలకు కేంద్రబిందువుగా నిలిచారు. ప్రస్తుతం ముద్రగడ కుటుంబం ప్రభుత్వ లాంఛనాలను తిరస్కరించడంపై రాజకీయ వర్గాల్లో చర్చ జరుగుతోంది. -
కూటమి వల్ల రైతు గుండె ఆగింది
-
చంద్రన్న బోడిగుండు పథకం!
సాక్షి, అమరావతి: ‘ఎన్నికల సమయంలో చంద్రబాబు ఉద్యోగులకు ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చలేదు. కానీ ఉద్యోగుల కోసం చంద్రన్న బోడిగుండు పథకాన్ని అమలు చేస్తున్నారు’ అని ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య అధ్యక్షుడు, సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు కే వెంకట్రామిరెడ్డి విమర్శించారు. ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పోలీసులు, పెన్షనర్లకు ఇచ్చిన హామీలు నెరవేర్చకపోగా, వారికి రెగ్యులర్గా రావాల్సిన డీఏలు, ఐఆర్, పీఆర్సీ వంటివి కూడా ఇవ్వకుండా ఉద్యోగులు అందరికీ నున్నగా క్షవరం చేసే కార్యక్రమం విజయవంతంగా అమలు చేస్తున్నారని వాపోయారు. చంద్రబాబు బోడిగుండు పథకం అమలు చేస్తున్నారంటూ వెంకట్రామిరెడ్డి సహా మరో ఇద్దరు నేతలు అందరిముందర గుండ్లు చేయించుకున్నారు. ఉద్యోగులు కోల్పోయింది రూ. 37 వేల కోట్లకు పైమాటే..ప్రతినెలా ఉద్యోగులకు చంద్రబాబు గారి ప్రభుత్వం చేస్తున్న క్షవరం విలువ అక్షరాలా రూ.1500 కోట్లని తెలిపారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రెండు సంవత్సరాలలో ఉద్యోగులకు చేసిన మొత్తం క్షవరం విలువ సుమారు రూ.37 వేల కోట్లని చెప్పారు. ఇవి తాను ప్రభుత్వాన్ని విమర్శించడం కోసం చెప్పడంలేదని, పూర్తి లెక్కలు ఇస్తున్నానని చెప్పి ఆ వివరాలు విడుదల చేశారు. ఈ రూ.37 వేల కోట్లు కేవలం కూటమి రెండు సంవత్సరాల పాలనకు సంబంధించిన బకాయిలు, ఎగవేతలు మాత్రమేనన్నారు. ఉద్యోగులను ఈ స్థాయిలో ముంచిన ఘనత గతంలో ఎవరికీ లేదన్నారు. అమరావతికి సోకులు.. తుగ్లక్ పాలనకు నిదర్శనం..ఉద్యోగులకు రూ.37 వేల కోట్ల బకాయిలు ఇవ్వకుండా అమరావతిలోని భవనాల సోకులకు వేల కోట్ల రూపాయలు ఖర్చు పెడుడుతున్నారని తెలిపారు. అమరావతిలో ప్రభుత్వ భవనాల ముందు పక్క బిగించే అద్దాల కోసం రూ.2,500 కోట్లు ఖర్చు పెడుతోందని, చదరపు అడుగుకు అద్దాల కోసం రూ.5 వేలు ఖర్చు పెడుతోందన్నారు. ఈ భవనాల నిర్మాణం సోకులు, అన్నీ కలిపి చదరపు అడుగుకి రూ.20 వేల ఖర్చు పెడుతున్నారని తెలిపారు. ఒక పక్క ఉద్యోగులకు వేల కోట్ల రూపాయిలు బకాయిలు పెట్టి, అమరావతిలో సోకులకు రూ.వేల కోట్లు ఖర్చు బెట్టడం తుగ్లక్ పాలన కాదా అని ప్రశ్నించారు. ఆర్థికేతర అంశాల్లో ప్రభుత్వం ఉద్యోగులపై సానుకూలంగా లేదన్నారు. ఆత్మహత్యలే మేలనుకుంటున్నారు..ప్రభుత్వం పెట్టే టార్చర్ భరించలేక గత జూన్ నెలలో 10 మంది ఉద్యోగులు ఆత్మహత్యలు, గుండెపోటుతో చనిపోయారని తెలిపారు. మరో ఐదుగురు ఆత్మహత్యాయత్నం చేశారన్నారు. ప్రభుత్వ ఉద్యోగం చేయలేమంటూ ఉద్యోగులు ఆత్మహత్యలు చేసుకుంటున్నారంటే వారు ఎంత నరకయాతన అనుభవిస్తున్నారో అర్థం చేసుకోవాలని ప్రజలను కోరారు.ప్రధానంగా గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల పరిస్థితి రాజరికపు కాలం నాటి బానిసల కంటే హీనంగా ఉందని, వారికి ఇంక్రిమెంట్లు, ప్రమోషన్లు లేవని అయినా అడిగే దిక్కు లేదన్నారు. గత ప్రభుత్వం 3 నెలలకు ఒకసారి జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ మీటింగు పెట్టి ఉద్యోగుల సమస్యలు వినేదని, ఇప్పుడు ఉద్యోగుల సమస్యలు వినే వారు కూడా లేరన్నారు. ఉద్యోగులకు ఇంత అన్యాయం జరుగుతున్నా ఉద్యోగ సంఘాల నాయకులు సరిగా స్పందించడం లేదన్నారు. -
బాబుపై తిరగబడ్డ సొంత ఎమ్మెల్యే యార్లగడ్డ
-
'జగనన్న వస్తానన్నారు.. ధైర్యం వచ్చింది'
సాక్షి, విశాఖపట్నం: బోటు ప్రమాదం బాధితులను పరామర్శించేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం విశాఖలో పర్యటించనున్నారు. ఈ నేపథ్యంలో ప్రమాదం నుంచి ప్రాణాలతో బయటపడిన బోటు డ్రైవర్ చిన్నా.. సాక్షి టీవీతో మాట్లాడారు. ప్రభుత్వం నుంచి ఇప్పటివరకు ఎలాంటి ఆర్థిక సాయం అందలేదని ఆవేదన వ్యక్తం చేసిన ఆయన.. జగన్ ఓదార్పు ఎంతో ధైర్యం ఇచ్చిందని అంటున్నారు. బోటు పూర్తిగా దగ్ధమవడంతో జీవనాధారం కోల్పోయా. ఈ ప్రభుత్వం ఎలాంటి సాయం అందించలేదు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నా. ఈ కష్ట సమయంలో జగనన్న నాతో ఫోన్లో మాట్లాడి ధైర్యం చెప్పారు. "నీకు అండగా ఉంటాను.. సాయం చేస్తాను" అని ఆయన హామీ ఇచ్చారని చెప్పారు. ఆయన మాటలతో ఎంతో ధైర్యం వచ్చింది. రేపు ఆయన విశాఖకు వస్తున్నారని తెలిసి సంతోషంగా ఉంది అని చిన్నా అన్నారు. అలాగే..గతంలో కూడా బోటు ప్రమాదాలు జరిగినప్పుడు జగన్ ప్రభుత్వం బాధితులను ఆదుకుందని చిన్నా గుర్తుచేశారు. అప్పట్లో దెబ్బతిన్న బోట్లకు సుమారు 80 శాతం వరకు ఆర్థిక సాయం అందించారని పేర్కొన్నారు. ఇప్పుడు కూడా తమకు న్యాయం జరుగుతుందనే ఆశతో ఎదురుచూస్తున్నామని చెప్పారు.వైఎస్ జగన్ పర్యటన సందర్భంగా బాధితులను కలిసి వారి సమస్యలు తెలుసుకోవడంతో పాటు, పార్టీ తరఫున అండగా ఉంటామని హామీ ఇచ్చే అవకాశం ఉందని వైఎస్సార్సీపీ వర్గాలు చెబుతున్నాయి. -
రైతులపై బాబు మరో బాంబు
-
ఉద్యోగులకు చంద్రన్న బోడిగుండు
సాక్షి, విజయవాడ: చంద్రబాబు ప్రభుత్వంపై ఉద్యోగ సంఘాల నిరసన మరోసారి తెరపైకి వచ్చింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడం లేదనే అసంతృప్తితో.. ఏపీ గవర్నమెంట్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ వినూత్న రీతిలో నిరసన చేపట్టింది. సోమవారం నగరంలో ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో కార్యక్రమం నిర్వహించింది.రెండేళ్లు దాటినా ఉద్యోగులకు ఇచ్చిన హామీలు నెరవేరలేదని ఫెడరేషన్ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ నిరసనలో భాగంగా ఫెడరేషన్ ఛైర్మన్ వెంకట్రామిరెడ్డి గుండు చేయించుకున్నారు. ఆయనతో పాటు పలువురు ఉద్యోగులు కూడా ఇదే తరహాలో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా.. బాబు సర్కార్పై వాళ్లు ఆగ్రహం వ్యకక్తం చేశారు. ఉద్యోగులకు ప్రభుత్వం నుంచి రావాల్సిన పలు ఆర్థిక ప్రయోజనాలు పెండింగ్లో ఉన్నాయని ఫెడరేషన్ ఆరోపించింది. పీఆర్సీ, ఐఆర్, డీఏలు, ఇతర బకాయిలను వెంటనే చెల్లించాలని డిమాండ్ చేసింది. ఐదు డీఏలు పెండింగ్లో ఉన్నాయని, ఐఆర్ విషయంలోనూ ప్రభుత్వం ఉద్యోగులకు అన్యాయం చేసిందని నేతలు విమర్శించారు. సరెండర్ లీవ్లకు సంబంధించిన చెల్లింపులు కూడా నిలిచిపోయాయని ఆరోపించారు.నెలకు రూ.1500 కోట్లు క్షవరం.. ప్రభుత్వం ఉద్యోగుల ప్రయోజనాలను పట్టించుకోవడం లేదని ఫెడరేషన్ నేతలు మండిపడ్డారు. ప్రతి నెలా రూ.1500 కోట్ల మేర ఉద్యోగులకు రావాల్సిన ప్రయోజనాలు నిలిపివేస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాలు ఉద్యోగులకు కూడా పూర్తిగా తెలియకుండా ప్రభుత్వం వ్యవహరిస్తోందని(క్షవరం చేస్తోందని) విమర్శించారు.వలంటీర్ల హామీలపైనా ప్రశ్నలుఉద్యోగులతో పాటు వలంటీర్లకు ఇచ్చిన హామీలను కూడా ప్రభుత్వం అమలు చేయలేదని ఫెడరేషన్ ఆరోపించింది. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను నెరవేర్చే వరకు తమ పోరాటం కొనసాగుతుందని స్పష్టం చేసింది. ‘చంద్రన్న బోడిగుండు’ పేరుతో నిర్వహించిన ఈ నిరసన రాజకీయ వర్గాల్లోనూ చర్చకు దారితీసింది. ప్రభుత్వంపై ఒత్తిడి పెంచేందుకు ఉద్యోగ సంఘాలు మరిన్ని కార్యక్రమాలు చేపట్టే అవకాశం ఉందని తెలుస్తోంది. -
తెలంగాణలోనూ రెడ్బుక్ అరాచకమా?: వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే చంద్రశేఖర్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి నాగార్జున యాదవ్ అరెస్ట్ వ్యవహారం రెండు తెలుగు రాష్ట్రాల్లో రాజకీయ దుమారం రేపుతోంది. తెలంగాణ పోలీసులు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా అక్రమంగా అదుపులోకి తీసుకున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ పరిణామంపై ఎర్రగొండపాలెం(ప్రకాశం) వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తీవ్రంగా స్పందించారు. "తెలంగాణలోనూ రెడ్బుక్ అరాచకమే నడుస్తోందా?" అంటూ ప్రశ్నించారు. నోటీసులు ఇవ్వకుండానే అరెస్ట్ చేయడం ఎలా సాధ్యమైంది? అని ఎమ్మెల్యే తాటిపర్తి చంద్రశేఖర్ తెలంగాణ పోలీసులను నిలదీస్తున్నారు. ‘‘చట్టపరమైన ప్రక్రియను పక్కనబెట్టి అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి విరుద్ధం. 41(A) నోటీసులు ఇవ్వకుండా ఒక వ్యక్తిని అదుపులోకి తీసుకోవడం చట్టబద్ధమేనా?. ఏపీ తరహాలో తెలంగాణలోనూ రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తోందా?.. వెంటనే నాగార్జున యాదవ్ను విడుదల చేసి, ఈ ఘటనపై వివరణ ఇవ్వాలి’’ అని ఆయన డిమాండ్ చేశారు. గుంటూరులోని తన మామ ఇంట్లో ఉన్న నాగార్జున యాదవ్ను ఆదివారం తెలంగాణ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాము హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్స్టేషన్కు చెందిన సిబ్బందిమని చెబుతూ.. స్థానిక నల్లపాడు పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చామని కుటుంబ సభ్యులకు తెలిపారు. అయితే అరెస్ట్కు సంబంధించి ఎలాంటి నోటీసులు ఇవ్వలేదని, కారణాలను కూడా స్పష్టంగా చెప్పలేదని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. ఎవరని ప్రశ్నించినందుకు.. నాగార్జున యాదవ్ భార్యతో పోలీసులు దురుసుగా ప్రవర్తించారని తెలుస్తోంది. బూతులు తిడుతూ ఆయన్ని బలవంతంగా తీసుకెళ్లారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. జిల్లా ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చినా స్పందన రాలేదని నాగార్జున కుటుంబ సభ్యులు వాపోయారు.ఒకే రోజులో మూడు పోలీస్స్టేషన్లు తిప్పి..నాగార్జున యాదవ్ను మొదట గుంటూరులోని నల్లపాడు పోలీస్స్టేషన్కు తీసుకెళ్లిన పోలీసులు.. అక్కడి నుంచి హైదరాబాద్లోని పురానా హవేలీ టాస్క్ఫోర్స్ కార్యాలయానికి తరలించినట్లు సమాచారం. అక్కడ కొంతసేపు ఉంచిన అనంతరం బేగంబజార్ పోలీస్స్టేషన్కు తీసుకెళ్లారు. ఒకే రోజులో మూడు ప్రాంతాలకు తిప్పి తీవ్ర వేధింపులకు గురిచేశారని వైఎస్సార్సీపీ నేతలు ఆరోపిస్తున్నారు.ఏ కేసులో అరెస్ట్?తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డిపై లైవ్ డిబేట్లో అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారనే ఆరోపణలతో ఈ కేసు నమోదైంది. అడ్వకేట్ కైలాష్ సజ్జన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జూలై 10న హైదరాబాద్లోని బేగంబజార్ పోలీస్స్టేషన్లో నాగార్జున యాదవ్, ఇతరులపై కేసు నమోదు చేశారు. లైవ్ చర్చలో నాగార్జున యాదవ్ ముఖ్యమంత్రిని ఉద్దేశించి చేసిన వ్యాఖ్యలు అవమానకరంగా ఉన్నాయని, ప్రజల్లో విద్వేషాన్ని రెచ్చగొట్టేలా ఉన్నాయని ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ ఫిర్యాదు ఆధారంగా భారతీయ న్యాయ సంహిత (BNS)లోని 192, 352, 353(1), 353(2) సెక్షన్ల కింద పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితే, ఈ వ్యవహారం వెనుక ముమ్మాటికీ రాజకీయ ప్రతీకారమే ఉందని వైఎస్సార్సీపీ అంటోంది. ప్రభుత్వాన్ని నిలదీసినందుకు కక్ష గట్టిన చంద్రబాబు సర్కార్.. రెండేళ్ల కిందటి నాటి వ్యాఖ్యలను ఇప్పుడు బయటకు తీసి కేసు నమోదు చేయించారని, చట్టపరమైన నిబంధనలను పాటించకుండా అరెస్ట్ చేశారని ఆ పార్టీ నేతలు విమర్శిస్తున్నారు. ఆంధ్రప్రదేశ్లో ప్రభుత్వాన్ని విమర్శిస్తున్న నాయకులను లక్ష్యంగా చేసుకుని కేసులు పెడుతున్నారని, ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వాన్ని కూడా ఇందుకు వినియోగిస్తున్నారని ఆ పార్టీ నేతలు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వ సహకారంతో ఈ చర్యలు చేపట్టిందని అంటున్నారు. -
బాబును నమ్ముకుంటే జనసేన మునిగినట్టే!: కొడాలి నాని
సాక్షి, కృష్ణా: యూట్యూబర్ ప్రశ్న రావణ్ అరెస్ట్ వ్యవహారంపై మాజీ మంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేత కొడాలి నాని మరోసారి స్పందించారు. ఈ కేసుతో వైఎస్సార్సీపీకి ఎలాంటి సంబంధం లేదని ఉద్ఘాటించిన ఆయన.. టీడీపీ, జనసేనపై తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. కమ్మ కులానికి చెందిన రావణ్ను.. ఐడెంటిటీ మార్చి దళితుడిగా.. క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ మీడియా, సోషల్ మీడియా తీవ్రంగా ప్రయత్నించిందటూ సంచలన వ్యాఖ్యలే చేశారాయన.రావణ్ పేరు రావణ్.. జోసఫ్ కాదు. అతను క్రిస్టియన్ కాదు. కుటుంబ సభ్యుల అభిప్రాయాలను కూడా పట్టించుకోకుండా అతడి ఐడెంటిటీని టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా మార్చేసింది. కమ్మ సామాజిక వర్గానికి చెందిన వ్యక్తిని దళితుడిగా, క్రిస్టియన్గా చూపించేందుకు టీడీపీ, ఎల్లో మీడియా ప్రయత్నించాయి అని అన్నారు. అరెస్ట్, బెయిల్పై ప్రశ్నలురావణ్ అరెస్టు తర్వాత పవన్ కళ్యాణ్ అత్యవసర సమావేశం ఏర్పాటు చేసి సెక్షన్లు చదివారు. అయితే జనసేన కార్యకర్తలు పెట్టిన కేసుల్లో బెయిల్ రావడానికి ఎవరు సహకరించారో చెప్పాలి. “జగన్ గానీ, మేము గానీ ఎవరికీ ఫోన్ చేసి బెయిల్ ఇప్పించమని చెప్పలేదు. చంద్రబాబు పాత్ర లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అని ప్రశ్నించారు. తెలుగు దేశం పార్టీ ఇకనైనా స్టోరీలు ఆపాలని.. ఈ బురద మాపై జల్లవద్దని నాని హితవు పలికారు.అతని వీడియోలే అన్నీ చెబుతాయిరావణ్ గత వీడియోలను పరిశీలిస్తే అతను ఎవరికీ అనుకూలంగా ఉన్నారో అర్థమవుతుందని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు, లోకేష్, బాలకృష్ణలపై ఒక్క మాట కూడా మాట్లాడలేదు. చిన్న సోషల్ మీడియా పోస్టులకే అరెస్టులు చేసే టీడీపీ ప్రభుత్వం.. రావణ్ విషయంలో ఎందుకు చర్యలు తీసుకోలేదని కొడాలి నాని ప్రశ్నించారు. “మావోయిస్టులకు మద్దతుగా పోస్ట్ పెట్టారని ఏడాది తర్వాత కేసులు పెట్టి అరెస్ట్ చేయడం ఏంటి? ఇంతకాలం గుడ్డి గుర్రానికి పళ్లు తోముతున్నారా? టీడీపీ మద్దతు లేకుండా నాలుగు కేసుల్లో బెయిల్ వస్తుందా?” అంటూ పశ్నలు గుప్పించారు.జనసేనపై వ్యాఖ్యలుచంద్రబాబును నమ్ముకుంటే జనసేన మునిగిపోతుందని.. రావణ్ వ్యవహారమే అందుకు ఉదాహరణ అని అన్నారు.“పిఠాపురం పోలీస్ స్టేషన్లోనే డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట చెల్లడం లేదు. బిగ్బాస్ ఏం చెబితే పోలీసులు అదే చేస్తున్నారు. డిప్యూటీ సీఎం, డమ్మీ సీఎం పరిస్థితి ఇదే. యాక్టింగ్ సీఎం లోకేష్ మాటలే చెల్లుబాటు అవుతాయి” అంటూ ఘాటు వ్యాఖ్యలు చేశారు.మతాల మధ్య చిచ్చు పెట్టొద్దుహిందూ, క్రిస్టియన్ వర్గాలు కలిసిమెలిసి జీవిస్తున్నాయని కొడాలి నాని అన్నారు. ఒకే కుటుంబంలో రెండు మతాలకు చెందిన వారు ఉన్నారని, రాజకీయ ప్రయోజనాల కోసం మతాల మధ్య విభేదాలు సృష్టించే ప్రయత్నాలు చేయొద్దని సూచించారు. దానివల్ల ఎలాంటి ప్రయోజనం ఉండబోదని చెప్పారు.ఆ మాటకు కట్టుబడి ఉన్నా2029 ఎన్నికల్లో పరుశురాముడి గొడ్డలితో జగన్, చంద్రబాబు ప్రభుత్వాన్ని, టీడీపీని రాజకీయంగా సమాధి చేస్తామని గతంలో చేసిన వ్యాఖ్యలకు కట్టుబడి ఉన్నామని కొడాలి నాని అన్నారు. చంద్రబాబు ఇచ్చే కట్టెలు కొట్టడానికి కూడా పనికిరాని తుప్పు గొడ్డలి మాకు అవసరం లేదు అంటూ కొడాలి నాని వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు. -
రౌడీలను పెంచి పోషించేది కూటమి.. వాటాల రాజ్యం పోతేనే..
-
చంద్రబాబు బీచ్ షాక్స్ ప్లాన్, జగన్ ఏమన్నారంటే..
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో ప్రజలకు విశ్రాంతి, వినోదానికి కేంద్రాలుగా ఉండాల్సిన బీచ్లను కూడా చంద్రబాబు ప్రభుత్వం వదలడం లేదని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. బీచ్ షాక్స్ పేరుతో కొత్త మద్యం సంస్కృతికి ప్రభుత్వం తెరలేపుతోందని, ఇది రాష్ట్ర సామాజిక వాతావరణానికి ప్రమాదకరమని గుర్తు చేశారు.తాడేపల్లిలో బుధవారం నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడిన జగన్, బీచ్ షాక్స్ పేరుతో మద్యం విక్రయాలను ప్రోత్సహించడం వెనుక ప్రభుత్వ ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బీచ్లు కుటుంబ సభ్యులు, చిన్నారులతో కలిసి ప్రశాంతంగా గడిపే ప్రదేశాలుగా ఉండాలే తప్ప, మద్యం విక్రయాల కేంద్రాలుగా మారకూడదన్నారు."బీచ్ షాక్స్ పేరుతో మద్యం అమ్ముతారా? ఇలాంటి పరిస్థితుల్లో కుటుంబం మొత్తం కలిసి బీచ్కు ఎలా వెళ్తారు?" అని జగన్ బాబు సర్కార్ను ప్రశ్నించారు. ప్రభుత్వం రాష్ట్రంలో కొత్త మద్యం సంస్కృతిని తీసుకొస్తోందని, దీనివల్ల కుటుంబాలు బహిరంగ ప్రదేశాలకు వెళ్లడానికే సంకోచించే పరిస్థితి ఏర్పడుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రభుత్వ నిర్ణయాలను ఎవరైనా ప్రశ్నిస్తే అక్రమ కేసులు నమోదు చేయడం, వేధింపులకు గురిచేయడం, లాకప్ డెత్లు వంటి ఘటనలు చోటుచేసుకుంటున్నాయని జగన్ ఆరోపించారు. "చంద్రబాబుకు అసలు మానవత్వం ఉందా?" అని ప్రశ్నిస్తూ ప్రభుత్వ తీరుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు.రాష్ట్రానికి కొత్త పరిశ్రమలు, విదేశీ పెట్టుబడులు తీసుకురావడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని జగన్ విమర్శించారు. పెట్టుబడులను ఆకర్షించే దిశగా చర్యలు తీసుకోవాల్సింది పోయి, అవినీతి, దోపిడీ రాజకీయాలకే ప్రాధాన్యం ఇస్తోందని ఆరోపించారు. "రాష్ట్రానికి విదేశీ పెట్టుబడులు రావడం లేదు. కానీ దోచుకున్న సొమ్ము మాత్రం విదేశాలకు వెళ్తోంది" అంటూ చంద్రబాబు ప్రభుత్వంపై వైఎస్ జగన్ ధ్వజమెత్తారు. -
హేరామ్.. సేవ్ ఆంధ్రా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ఏపీలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు ప్రభుత్వం కుల, మత ప్రతిపాదికన దారుణమైన రాజకీయాలు చేస్తోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు.ఎస్ఐఆర్ (స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్) ప్రక్రియ పేరుతో ప్రభుత్వం చేస్తున్న కుట్ర ఓట్ల తొలగింపుతోనే ఆగిపోలేదని, రాష్ట్రంలో కుల, మతాల పేరుతో విభజన రాజకీయాలకు తెరలేపిందని జగన్ అన్నారు. గ్రామాల నుంచి పట్టణాల వరకు ఇలాంటి పరిణామాలు కనిపిస్తున్నాయని, అధికార పదవుల్లో ఉన్నవారే దళితులు, దళిత క్రైస్తవులు, ఇతర బడుగు, బలహీన వర్గాలను లక్ష్యంగా చేసుకుని అవమానకర వ్యాఖ్యలు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.బడుగు, బలహీన వర్గాలను బహిరంగంగా కించపరుస్తుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు ఎందుకు స్పందించడం లేదని జగన్ ప్రశ్నించారు. ఇలాంటి ఘటనలపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, వాటిని పరోక్షంగా ప్రోత్సహిస్తున్నట్లు కనిపిస్తోందని విమర్శించారు. రాష్ట్రంలో కులాల మధ్య చిచ్చుపెట్టి, మత విద్వేషాలను రెచ్చగొట్టి సామాజిక సామరస్యాన్ని దెబ్బతీసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. ఈ పరిస్థితులపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని కోరుతూ.. "హే రామ్.. సేవ్ ఆంధ్రా" అంటూ పిలుపునిచ్చారు.దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? వద్దా? అనే అంశంపై ప్రస్తుతం దేశవ్యాప్తంగా చర్చ జరుగుతోందని జగన్ గుర్తుచేశారు. ఈ అంశంపై జస్టిస్ బాలకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తోందని చెప్పారు. తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు మతాన్ని రిజర్వేషన్లతో ముడిపెట్టడం సరికాదని అసెంబ్లీలో తీర్మానం చేశామని, అదే అంశంపై జస్టిస్ బాలకృష్ణన్ కమిటీకి కూడా అధికారికంగా తమ అభిప్రాయాన్ని తెలియజేశామని వెల్లడించారు.ఈ నేపథ్యంలో దళిత క్రైస్తవుల రిజర్వేషన్ల విషయంలో చంద్రబాబు వైఖరి ఏమిటో రాష్ట్ర ప్రజలకు స్పష్టం చేయాలని జగన్ డిమాండ్ చేశారు. "చేతనైతే ప్రజలకు మంచి చేయండి.. విద్వేషాలను మాత్రం రెచ్చగొట్టొద్దు" అంటూ చంద్రబాబుకు వైఎస్ జగన్ హితవు పలికారు. -
విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: ‘‘ఎక్కడా నైతిక విలువల్లేవ్.. మానవత్వం మరిచిపోయి ప్రవర్తిస్తున్నారు. జంగిల్రాజ్ అంటే ఎక్కడో బిహార్లో లేదు.. ఇక్కడ ఆంధ్రప్రదేశ్లోనే చంద్రబాబు పాలన రూపంలో కనిపిస్తోంది’’ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గత 18 నెలలుగా వరుసగా కొనసాగుతున్న అరాచకాలే అందుకు నిదర్శనమని అన్నారాయన. బుధవారం తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ.. బాబు జంగిల్రాజ్పై ధ్వజమెత్తారు. బాబు పాలనలో బాధితులే నిందితులు. ఆశ్చర్యం అనిపించినా.. అదే నిజం. ఇటీవల రాజధాని రైతులు నన్ను కలిశారు. తమ గోడును వెల్లబోసుకున్నారు. వారి కోరిక మేరకు మా పార్టీ తరఫున ఓ ప్రత్యేక కమిటీతోపాటు లీగల్ టీంను ఏర్పాటు చేశాం. రైతుల ఆహ్వానం మేరకు వాళ్లు అక్కడ పర్యటించబోయారు. అయితే.. టీడీపీ గూండాలు వాళ్లను అడ్డుకుని దాడులు చేశారు. మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, ఇతర వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నానికి పాల్పడటంతో పాటు భౌతిక దాడులు చేశారు. దాడిలో ఓ కానిస్టేబుల్కు సైతం గాయాలయ్యాయి. టీడీపీ గూండాలే ఆ దాడి చేసినట్లు స్పష్టమైన ఆధారాలున్నాయి.(లోకేష్తో దాడికి పాల్పడ్డ టీడీపీ నేతలు దిగిన ఫొటోలను వైఎస్ జగన్ ప్రదర్శించారు..) ఆశ్చర్యకరంగా దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాల్సింది పోయి, బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపైనే పోలీసులు కేసులు నమోదు చేశారని మండిపడ్డారు. ఈ అల్లర్లలో ఒక్క టీడీపీ నేతను అరెస్ట్ చేయలేదని.. చంద్రబాబు పాలన తీరుకు నిదర్శనమని జగన్ అన్నారు. బాధితులకే నిందలు మోపడం, వారిపైనే కేసులు పెట్టడం ఇప్పుడు సాధారణంగా మారిపోయిందని అన్నారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి పరిస్థితులు ప్రమాదకరమని, రాష్ట్రంలో న్యాయవ్యవస్థ, శాంతిభద్రతల పరిస్థితిపై ప్రజలు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు.భూమి ఇవ్వని రైతులను భూసేకరణపేరుతో వేధిస్తున్నారు. కొడవీటి వాగును బలవంతంగా రైతుల పొలాల్లోకి తరలించారు. రాజధాని ప్రాంత రైతులు అడుగుతున్న దాంట్లో తప్పేముంది? ఇంకా భూముల అవసరం ఏముంది?. భూములు లాక్కుని ఎందుకు వెళ్లగొడుతున్నారని రైతులు అడుగుతున్నారు?. రైతులు పడే అవస్థలు బయటకు రావొద్దనే చంద్రబాబు ఈ డ్రామాలు ఆడుతున్నారు. రైతులకే కాదు.. ఆయన పాలనలో ఎవరికీ రక్షణ లేదు. పశ్నిస్తే రౌడీ షీటర్లు అని ముద్ర వేస్తున్నారు. ఎన్టీఆర్ బతికే ఉంటే.. ఆయనకు ప్రశ్నించే సమయం ఉండి ఉంటే.. ఆయన్ని కూడా చంద్రబాబు రౌడీ షీటర్ అనేవారేమో. విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉంటారు. వైఎస్ జగన్ అన్నారు. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..
సాక్షి, తాడేపల్లి: ఏపీలో శాంతిభద్రతల పరిస్థితి, చంద్రబాబు నాయుడి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మీడియా సమావేశంలో కీలక వ్యాఖ్యలు చేశారు. బాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చట్టాన్ని, పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు. బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోందని మండిపడ్డారు. చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు. SIR పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించే ప్రక్రియ జరుగుతోందన్నారు. హే రామ్.. సేవ్ ఆంధ్రా అని జగన్ వ్యాఖ్యానించారు. వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్..కూటమి ప్రభుత్వం రాక ముందు ఏపీలో ప్రజా సంక్షేమం గురించే చర్చ జరిగేది.మా హయాంలో సంక్షేమం గురించి చర్చ జరిగింది.చంద్రబాబు వచ్చాక రెడ్బుక్ అరాచకం, కస్టోడియల్ డెత్స్, హామీల మోసాలపై చర్చ జరుగుతోంది.రాష్ట్రంలో రూల్ ఆఫ్ లా పక్కకు పోయింది.పోలీసు స్టేషన్లకు పోవాలంటే భయపడే పరిస్థితులు ఉన్నాయి.బాబును ప్రశ్నిస్తే అణచివేసేందుకు ప్రయత్నిస్తున్నారు. చంద్రబాబు చేస్తున్న టాపిక్ డైవర్షన్ల మీదనే అంతటా చర్చ జరుగుతోంది.న్యాయం, ధర్మం గాడితప్పి వ్యవస్థ దిగజారిపోయింది.ఏపీలో రూల్ ఆఫ్ ఫియర్ రాజ్యమేలుతోంది.చంద్రబాబు దోపిడీని, అవినీతిని, దుర్మార్గపు పరిపాలనను ప్రశ్నిస్తే గొంతు నొక్కేస్తున్నారు.కూటమి గుప్పిట్లో వ్యవస్థలు.. సాయికృష్ణ, క్రాంతికుమార్, గంగమ్మ, తిరుపతమ్మ, కళావతి వంటి ఘటనలు..రాష్ట్రంలో భయానక వాతావరణానికి అద్దం పడుతున్నాయి.జర్నలిస్టులు సహా ఎవరు ప్రశ్నించినా అణచివేస్తున్నారు.చట్టాన్ని, పోలీసు వ్యవస్థను తన గుప్పిట్లో పెట్టుకున్నారు.ఎవరూ ఏం చేయలేరు అన్నట్టుగా ప్రవర్తిస్తున్నారు.కస్టడీలోనే చంపి మృతదేహం కూడా మాయం చేశారు.కనీసం కుటుంబ సభ్యులకు బూడిద కూడా ఇవ్వలేదు.చంద్రబాబు ఇంటికి ఆమడ దూరంలో ఈ ఘటన జరిగింది.రాష్ట్ర ప్రజలు నెవ్వెరపోయే ఘటనలు జరుగుతున్నాయి.చంద్రబాబును ఎవరూ ప్రశ్నించకూడదట.ప్రశ్నిస్తే ఎల్లో మీడియాతో వ్యక్తిత్వ హననం చేయిస్తారు.క్రిమినల్స్కు మద్దతిస్తారా అంటూ ఎదురుదాడి చేస్తున్నారు.బాబు తానా అంటే.. ఎల్లో మీడియా తందానా అంటోంది. ఎల్లో మీడియా తందానా..రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా?.సాయికృష్ణను మొదట రౌడీషీటర్ అన్నారు.రౌడీషీటర్ని వెనకేసుకుని వస్తారా అన్నారు.ప్రజల నుంచి ఛీత్కారాలు రావడంతో కవర్ చేసుకునే ప్రయత్నం చేశారు.సాయికృష్ణ కుటుంబ సభ్యులను పిలిపించుకుని చంద్రబాబు మొసలి కన్నీరు కార్చారు.46 రోజులు సాయికృష్ణ కేసును తొక్కిపెట్టారు.బాధ్యులపై ఎలాంటి చర్యలు తీసుకున్నారు?చెప్పాల్సిన బాధ్యత సీఎంగా చంద్రబాబుకు లేదా?.సాయికృష్ణ రిమాండ్ రిపోర్టు చూస్తే అంతా తెలుస్తుంది.పైవాళ్లను ఎలా కాపాడుతున్నారో స్పష్టంగా కనిపిస్తోంది.చంద్రబాబు, ఆయన పార్ట్నర్ను సూటిగా ప్రశ్నిస్తున్నా.రాష్ట్రంలో ఇలాగే అరాచకాలు, దారుణాలు కొనసాగిస్తామని అధికారిక ప్రకటన చేయగలరా?? సీపీ, డీజీపీ బాధ్యులు కారా?సీఐని సీపీ కాపాడుతాడు.. సీపీని డీజీపీ కాపాడుతాడు..డీజీపీని చంద్రబాబు కాపాడుతారు.సీపీ ఆధ్వర్యంలో పనిచేసే టాస్క్ఫోర్స్ కృష్ణలంక పీఎస్లో సాయికృష్ణను అప్పగించింది.సాయికృష్ణ బంధువులు డీజీపీకి మొరపెట్టుకున్నా పట్టించుకోలేదు.కోర్టులో ప్రవేశపెట్టలేదని అడిగితే సీపీ పట్టించుకోలేదు.ఈ ఘటనలన్నీ దిగజారిపోతున్న వ్యవస్థకు అద్దం పడుతున్నాయి.మరణ వాంగ్మూలానికి విలువ లేదా?.ఒక తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా?.కన్న కొడుకు కోసం ఒక తల్లి పడే వేదనకు విలువ లేదు.జగన్ వెళ్లిన నాలుగు రోజులకు గానీ అరెస్ట్లు జరగలేదు.చిన్నచిన్న వాళ్లను అరెస్ట్చేశారు.జగన్ వెళ్లకపోయి ఉంటే సాయికృష్ణ కేసే ఉండేది కాదు.క్రాంతి కుమార్ వీడియోలు వైరల్ అవుతున్నాయి.క్రాంతి కుమార్ మరణ వాంగ్మూలానికి విలువ లేదా?.మరో తల్లి పెట్టుకున్న అర్జీకి విలువ లేదా?.మే ఒకటో తేదీ నుంచి జూన్ ఒకటి వరకు సీసీ ఫుటేజ్ లేదట.18 నెలలుగా సీసీ ఫుటేజ్ తొలగించినట్టు కానిస్టేబుల్ అరెస్ట్ రిమాండ్ రిపోర్టులో పేర్కొన్నారు.18 నెలల్లో ఎన్ని అరాచకాలు జరిగాయో?.సీఐ, సీపీ, డీజీపీని, చంద్రబాబును ఎందుకు బాధ్యులను చేయవద్దు?.ఈ కేసులో చంద్రబాబుకు ఉన్న ఇంట్రస్ట్ ఏంటి?.నేరాన్ని కప్పిపెట్టిన సీపీ, డీజీపీ బాధ్యులు కారా?. డీజీపీ, సీపీ ఫుటేజీ ఏమైంది?..పీఎస్లో సీసీ ఫుటేజ్ డిలీట్ చేస్తే కమాండ్ కంట్రోల్ ఫుటేజ్ ఏమైంది?.డీజీపీ, సీపీ ఫుటేజీ ఏమైంది?.విజయవాడ ప్రధాన కూడళ్లలో సీసీ ఫుటేజ్ ఏమైంది?.మృతదేహాన్ని ఎక్కడికి తీసుకెళ్లారో తెలుసుకోవచ్చు కదా?.సిట్ ఈ దిశగా ఎందుకు పనిచేయలేదు?.క్లౌడ్ సర్వర్లలో 90 రోజుల వరకు ఫుటేజ్ ఉంటుంది.క్లౌడ్ సర్వర్లలో ఫుటేజ్ ఎందుకు స్వాధీనం చేసుకోలేదు.పోలీసు బాస్ల కాల్ రికార్డులు పరిశీలించారా? లేదా?.కానిస్టేబుల్స్ ఫోన్లు నాగ్పూర్లో అమ్మారని పేర్కొన్నారు.విజయవాడలో సామన్యుడి పరిస్థితి ఏంటి?.హెడ్క్వార్టర్లలోనే ఇలా పరిస్థితి ఉంటే.. మిగతా చోట్ల పరిస్థితి ఏంటి?మానవ హక్కులకు విలువ ఎక్కడుంది?.కోర్టులను తప్పుదోవ పట్టించడం చంద్రబాబకు అలవాటే. ఆంధ్రలోనే జంగిల్రాజ్..బాధితులే నిందితులా?.చంద్రబాబు పాలనలో బాధితులే నిందితులు అవుతున్నారు.రైతుల కోరిక మేరకు అమరావతిలో మా పార్టీ నేతలు పర్యటించారు.వైఎస్సార్సీపీ నేతలపై దాడి చేసి తిరిగి వాళ్లపైనే కేసులు పెడుతున్నారు.రాజధాని రైతులంతా ఇటీవల నన్ను కలిశారు.మా పార్టీ నేతలపై హత్యాయత్నం చేశారు.మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, నేతలపై దాడులు చేశారు.చంద్రబాబు చేసే దారుణాలపై ప్రశ్నించడం తప్పా?.భూమి ఇవ్వని రైతులను భూసేకరణ పేరుతో వేధిస్తున్నారు.భూమి ఇవ్వని రైతుల పొలాలను ధ్వంసం చేస్తున్నారు.రైతుల పొలాల్లో అక్రమంగా మట్టి తవ్వి దోపిడీ చేస్తున్నారు.కొండవీటి వాగు నీటికి పొలాల్లోకి బలవంతంగా మళ్లించారు.విలన్లు సినిమాల్లో ఉండరు.. చంద్రబాబు రూపంలో ఇక్కడే ఉన్నారు.అమరావతిలో రైతుల తరఫున నిలబడితే నిందితులుగా చిత్రీకరిస్తున్నారు.మా పార్టీ నేతలపైనే దాడి చేసి, మాపైనే కేసులు పెడుతున్నారు.రైతులకు సంఘీభావం తెలిపిన మా పార్టీ నేతలంతా రౌడీషీటర్లా?.పోలీసుల సమక్షంలోనే రాళ్లతో దాడి చేశారు. కార్ల అద్దాలు పగలగొట్టారు.రెండేళ్లుగా రెడ్బుక్ పాలనలో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోంది.జంగిల్ రాజ్ ఎక్కడో బీహార్లో లేదు.. ఆంధ్రాలోనే కనిపిస్తోంది.కేంద్రం కళ్లెదుటే అమరావతిలో దోపిడీ..చంద్రబాబును ఎవరు ప్రశ్నించినా రౌడీషీటర్ల ముద్ర వేస్తారు.ఎన్టీఆర్ ఉండి బాబును ప్రశ్నించినా రౌడీషీటర్ ముద్ర వేసేవారు.ఉండవల్లిలో దాడులు చేసింది టీడీపీ నేతలే.పోలీసుల సమక్షంలోనే రాడ్లతో దాడులు చేశారు.తప్పులు చేసేది మీరు.. కేసులు మాత్రం మాపై పెడుతున్నారు.దాడులు చేసిన ఒక్క టీడీపీ నేతను కూడా అరెస్ట్ చేయలేదు.రాజధాని రైతులు ఏం తప్పు చేశారు.అమరావతి పేరుతో ఇప్పటికే వేలాది ఎకరాలు తీసుకున్నారు.ఇంకా భూములు ఎందుకు అని రైతులు అడుగుతున్నారు.బాబు బినామీలకు కట్టబెట్టడానికే మళ్లీ భూసేకరణ.కేంద్ర ప్రభుత్వ ఆఫీసులకు చదరపు అడుగుకు రూ.4645గా నిర్ణయించింది.అదే చంద్రబాబు మాత్రం సెక్రటేరియట్ కోసం రూ.20439 ఖర్చు చేస్తున్నారు.కేంద్రం కళ్లెదుటే అమరావతిలో దోపిడీ జరుగుతోంది. చంద్రబాబు పాలన.. మోసం గ్యారంటీ..ఇన్పుట్ సబ్సిడీకి చంద్రబాబు మంగళం పాడారు.ఉచిత పంటల బీమా కింద రూ.3500 కోట్ల బకాయిలు పెట్టారు.రైతులకు చేసిన మోసాలే.. బాబు గ్యారంటీలుగా కనిపిస్తున్నాయి.వరుసగా రెండో ఏడాది పొగాకు ధరలు పడిపోయాయి.మా హయాంలో మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేవాళ్లం.పొగాకు రైతులకు మా హయాంలో భరోసా ఉండేది.రాష్ట్రంలో ఎక్కడ చూసినా రైతు సమస్యలే కనిపిస్తున్నాయి.రాష్ట్రంలో ఏ పంటకూ గిట్టుబాటు ధర లేదు.రైతుల సమస్యలు చంద్రబాబుకు పట్టవు.రైతుల ధరల స్థిరీకరణ నిధికి అరకొర నిధులే.మా హయాంలో మూడువేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి పెట్టాం.ఆర్బీకే పరిధిలోనే రైతులు సమస్యలను పరిష్కరించే వాళ్లం.మా హయాంలో ప్రతి పంటకు గిట్టుబాటు ధర ఉండేది.ఉచిత పంటల బీమా పూర్తిగా రద్దు చేశారు.పొగాకు రైతులను ఆదుకున్నామని ఎల్లో మీడియాలో ఊదరగొట్టారు.రాష్ట్ర పాలనను చంద్రబాబు గాలికొదిలేశారు.చంద్రబాబు చేసేది అవినీతి, దోపిడీ, రెడ్బుక్రాష్ట్రంలో ఆక్వా రంగం కుదేలైంది.మేము ఆక్వా రంగంలో చట్టం తెచ్చి రైతులను ఆదుకున్నాం.అసలు చంద్రబాబు పాలన చేస్తున్నాడా? లేదా?:మా ప్రభుత్వం ఒక చట్టంచేసి, సీఎం ఛైర్మన్గా “APSADA అప్సడా’ ఏర్పాటు చేస్తే ఫీడు, సీడుసహా, ఆక్వా కొనుగోలు ధరలను రెగ్యులేట్ చేశాంఅలాంటిది అప్సడా అంగీకారం లేకుండానే, రైతుల ఆమోదం లేకుండానే,చట్టాన్ని బేఖాతరు చేస్తూ కంపెనీలన్నీ కూడా కార్టెల్ కింద తయారయ్యాయి.ఏప్రిల్ ఒక దఫా, జూన్లో మరో దఫా మొత్తం కిలోకు ఫీడ్ ధర రూ.14 -16ల వరకూ ధరలు పెంచారు.మరోవైపు ఈ కార్టెల్ సిండికేట్ వల్ల, ఫీడ్ ధరలు ఓవైపు, మరోవైపు రేట్లు చూస్తే,పంట చేతికి వచ్చే సమయానికి రేట్లు క్రాష్ చేస్తున్నారు. 100 కౌంట్ రొయ్యలు రూ.270 నుంచి రూ.220- 240 మధ్య పడిపోయాయి.రైతుల తీవ్ర ఆందోళనలు, వారికి మద్దతుగా పోరాటాలు చేస్తామన్న మన పార్టీ నుంచి హెచ్చరికల నేపథ్యంలోకిలోకు రూ.4లు తగ్గిస్తామంటూ హడావిడి చేశారు.తన ఎల్లోమీడియాలో పెద్ద పెద్ద అక్షరాలతో రాయించుకున్నాడు.తీరాచూస్తే తగ్గింది కేవలం రూ.2లు.వాళ్లు పెంచింది రూ.14-16లు.తగ్గింది కేవలం రూ.2లు. పెంచింది ఎక్కడ? తగ్గించింది ఎక్కడ?.మామిడి రైతులకు అన్యాయం..గత ఏడాది మామిడి ధర విషయంలో నెలకొన్న సంక్షోభం మన కళ్లముందే చూశాం.పంట అంతా అయిపోయాక చివర్లో రైతులకు కిలోకు రూ.12లు ఇస్తామన్నారు.రూ.4లు రాష్ట్ర ప్రభుత్వం, రూ.8లు కంపెనీలు.కానీ ఏ కంపెనీ కూడా రూ.8లు రేటు ఇవ్వలేదు.రూ.4-5లతో సరిపెట్టాయి.ఇవ్వాళ్టికీ రైతులకు పూర్తిస్థాయిలో చెల్లింపులు చేయలేదు.రైతులు రోడ్డెక్కడంతోపాటు, వారికి మద్దతుగా నేను కూడా బంగారుపాళ్యం వెళ్లి, అక్కడ పరిస్థితులను స్వయంగా చూశానుమళ్లీ ఈ ఏడాది అదే పరిస్థితి కనిపిస్తోంది:ఒక కిలో మామిడికి రైతులు పెట్టే పెట్టుబడి సుమారు రూ.15లు అయితే,ఇవాళ తోతాపురి మామిడిని దారుణంగా కిలో సుమారుగా రూ.5లకు కొనుగోలు చేస్తున్నారు.ధరలు పతనం కావడంతో పక్క రాష్ట్రం కర్ణాటక రాష్ట్రం గత ఏడాదిలానేఈ ఏడాది కూడా రైతులకు మేలు చేసేలా కేంద్రం సహాయ సహకారాలు తీసుకుంది.1.3లక్షల టన్నుల తోతాపురి మామిడి కొనుగోలుకు కిలో రూ.17.50ల చొప్పున ధర నిర్ణయిస్తూ,MIS కింద, PDPS కింద కొనుగోలుకు కేంద్రం ముందుకు వచ్చింది.కేంద్ర ప్రభుత్వంలో భాగస్వామి, కేంద్ర మంత్రి కుమార స్వామి జూన్ 24న లేఖరాస్తే,జూన్ 25న కేంద్ర వ్యవసాయశాఖ మంత్రి శివరాజ్సింగ్ చౌహాన్ నుంచి మామిడి కొనుగోలుకు సానుకూల స్పందన వచ్చింది.మరి చంద్రబాబు ముందుగా ఆపని ఎందుకు చేయలేదు?మన రాష్ట్రంలో కూడా మామిడి రైతులకు ధర రావడం లేదని చంద్రబాబుకు తెలుసు. అయినా నిద్ర లేవలేదు. కుమారస్వామి పార్టీలానే ఈయనా కేంద్రంలో భాగస్వామి. ఈయనకీ కేంద్రంలో మంత్రులున్నారు.అక్కడ కుమారస్వామి జూన్ 24 లేఖరాసిన తర్వాత, కేంద్రం స్పందించడం, ఇది మీడియాలోనూ, సోషల్ మీడియాలోనూ రావడం జరిగింది.చంద్రబాబు తీరిగ్గా జూన్ 28న లేఖ రాశారు.ఇది రాష్ట్రంలో రైతుల మీద చంద్రబాబుకు ఉన్న ధ్యాస. ఆ రాసిన లేఖలో కూడా రైతులకు మేలుచేసే దిశగా దృష్టిపెట్టలేదు.కర్ణాటకలో రైతునుంచి కొనుగోలు చేసే మామిడికి కేంద్ర ప్రభుత్వం కిలోకు రూ.17.50లు నిర్ణయిస్తే,ఆ ధర ఇక్కడ కూడా ఇవ్వమని అడగకపోగా, కిలోకు రూ.4లు ఇస్తామని, ఆడబ్బు కేంద్రం నుంచి ఇవ్వాలంటూ మాత్రమే రాశాడు.చంద్రబాబు తన వారైన గల్లాఫుడ్స్, శ్రీని ఫుడ్స్ వీరికే న్యాయం జరగాలి అన్నట్టుగా వ్యవహరిస్తాడు. SIR పేరుతో ఓట్ల తొలగింపు..బీచ్లను కూడా చంద్రబాబు వదలడం లేదు.బీచ్ షాక్స్ పేరుతో మద్యం అమ్ముతారా?.బీచ్లకు కుటుంబం అంతా కలిసి వెళ్లగలరా?.ఎస్ఐఆర్ పేరుతో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్టు తొలగించే కుట్ర జరుగుతోంది.ఎన్యుమరేషన్ ఫామ్స్ ఇవ్వకుండా ఇచ్చేసినట్టు రాస్తున్నారు.చంద్రబాబుకు మానవతం ఉందా?.స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు తొలగిస్తారా?.పేదవాడి ఓట్లు తొలగిస్తే సంక్షేమ పథకాలు ఎలా వస్తాయి?.సిటిజన్షిప్ లేకుండా చేసే కార్యక్రమం చేస్తున్నారు.ఈఆర్వో హోదాలో నెల్లూరు మున్సిపల్ కమిషనర్ అధికార దుర్వినియోగం.ఓట్ల తొలగింపుపై అధికారులతో మంత్రులు మాట్లాడుతున్నారు. హే రామ్.. సేవ్ ఆంధ్రా..కులాలు, మతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయం చేస్తున్నారు.బడుగు, బలహీనవర్గాలను కించపరిస్తే సీఎం ఏం చేస్తున్నారు??రాష్ట్రంలో మత విద్వేషాలు రెచ్చగొడుతున్నారు.దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు ఇవ్వాలా? లేదా?.రిజర్వేషన్లపై బాలకృష్ణన్ కమిటీ అధ్యయనం చేస్తుంది.మతం, రిజర్వేషన్కు ముడిపెట్టడం సరికాదని తీర్మానం చేశాం.స్వార్థ రాజకీయాల కోసం పేదవాడి ఓటు తొలగిస్తారా?.రాష్ట్రంలో పరిస్థితులు అత్యంత దారుణంగా ఉన్నాయి.హే రామ్.. సేవ్ ఆంధ్రా..బాలకృష్ణన్ కమిటీకి రిప్రజెంటేషన్ ఇచ్చాం.దళిత క్రైస్తవుల రిజర్వేషన్లపై చంద్రబాబు స్టాండ్ ఏంటి?.బాబూ.. చేతనైతే మంచి చెయ్.. విద్వేషాలు రెచ్చగొట్టొద్దు. -
సంక్షేమ పథకాలు గెలిపించలేవు: పవన్ కల్యాణ్
సాక్షి, మంగళగిరి: జనసేన అధినేత, రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. "సంక్షేమ పథకాలతోనే ఎన్నికల్లో గెలవలేం" అంటూ ఆయన చేసిన వ్యాఖ్యలు రాజకీయంగా తీవ్ర చర్చనీయాంశంగా మారాయి. ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన సంక్షేమ హామీల అమలుపై ప్రభుత్వం అనుసరిస్తున్న వైఖరికి ఈ వ్యాఖ్యలు అద్దం పడుతున్నాయనే చర్చ జోరందుకుంది. శనివారం మంగళగిరిలో జరిగిన జనసేన సమావేశంలో మాట్లాడిన పవన్ కల్యాణ్.. సంక్షేమ పథకాలను పార్టీ గౌరవిస్తుందన్నారు. అయితే అవసరమే అయినప్పటికీ అవే ఎన్నికల్లో విజయాన్ని కట్టబెట్టవన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం భారీ ఎత్తున సంక్షేమ కార్యక్రమాలు అమలు చేసినప్పటికీ ఓడిపోయిందని ఆయన వ్యాఖ్యానించారు. అయితే పవన్ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా మరో కోణంలో చర్చకు దారి తీస్తున్నాయి. ఎందుకంటే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా.. ఎన్నికల ప్రచారంలో అత్యంత ప్రతిష్ఠాత్మకంగా ప్రకటించిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ హామీల్లో కీలకమైనవి ఇప్పటికీ అమలులోకి రాలేదు. ఎన్నికల సమయంలో ప్రజలకు చంద్రబాబు, పవన్లు స్వయంగా బాండ్లు రాసిచ్చి మరీ హామీలు ఇచ్చారు. అయితే అధికారంలోకి వచ్చి ఇన్నిరోజులైనా అమలు చేయడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి.ఈ అంశంపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి చంద్రబాబు ప్రభుత్వాన్ని నిలదీస్తూ ఉన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను ఎందుకు అమలు చేయడం లేదని, ప్రజలను ఎందుకు మోసం చేస్తున్నారని ఆయన ప్రశ్నిస్తున్నారు. సూపర్ సిక్స్ హామీలు నెరవేర్చాలని వైఎస్సార్సీపీ పదేపదే డిమాండ్ చేస్తూ.. పోరాటాలు చేస్తోంది.మరోవైపు రాష్ట్రం తీవ్ర అప్పుల్లో ఉందని చెబుతున్న చంద్రబాబు... ఇంకోవైపు భారీగా కొత్త అప్పులు చేస్తూనే, సంక్షేమ హామీల అమలుకు నిధులు లేవని చెబుతున్న తీరు విమర్శలకు తావిస్తోంది. ఇలాంటి సమయంలో పవన్ కల్యాణ్ చేసిన సంక్షేమంతోనే ఓట్లు రావు అనే వ్యాఖ్యలు.. ఎన్నికల హామీల అమలుపై ప్రభుత్వం చేతులెత్తేసిన సంకేతాలుగా రాజకీయ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను పూర్తిగా అమలు చేయడం జరగదని పరోక్షంగా పవన్ అంగీకరించినట్లుగా ఈ వ్యాఖ్యలు కనిపిస్తున్నాయని వారు చెబుతున్నారు.ఇదీ చదవండి: ఏపీలో మీ ఓటు ఉండాలంటే..! -
‘అక్కచెల్లెమ్మల జీవితాలతో చంద్రబాబు చెలగాటం’
సాక్షి, అమరావతి: ప్రభుత్వ పాఠశాలల్లో మధ్యాహ్న భోజనం వండుతున్న వేలాది మంది అక్కచెల్లెమ్మల జీవితాలతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెలగాటం ఆడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపడ్డారు. 'స్మార్ట్ కిచెన్స్' పేరుతో పార్టీ అనుచరుల పొట్టలు నింపుతూ, దాదాపు 85 వేల మంది మహిళలను రోడ్డున పడేసే కుట్ర జరుగుతోందని అన్నారాయన.ఈ మేరకు శనివారం 'ఎక్స్' వేదికగా వైఎస్ జగన్ స్పందించారు. ప్రభుత్వ పాఠశాలల్లో గత 20 ఏళ్లకు పైగా మధ్యాహ్న భోజనం వండుతున్న మహిళలు ఎంతోమంది ఉన్నారని, అలాంటి వారి ఉపాధిని ఒక్కసారిగా దూరం చేసే ప్రయత్నం జరుగుతోందని విమర్శించారు.మధ్యాహ్న భోజన కార్మికులకు గత రెండు నెలలుగా జీతాలు కూడా చెల్లించడం లేదని జగన్ అంటున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే వారి గౌరవ వేతనాన్ని రూ.1,000 నుంచి రూ.3,000కు పెంచామని గుర్తు చేశారు. ఎన్నికల సమయంలో ఇంకా మెరుగైన వేతనాలు ఇస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం.. ఇప్పుడు ఆ మాటను నిలబెట్టుకోకుండా, స్మార్ట్ కిచెన్స్ పేరుతో వారినే తొలగించే ప్రయత్నం చేస్తోందని మండిపడ్డారు.గవర్నమెంటు స్కూళ్లలో మధ్యాహ్న భోజనం వండుతున్న దాదాపు 85వేల అక్కచెల్లెమ్మల జీవితాలతో @ncbn గారు చెలగాటం ఆడుతున్నారు. దాదాపు 20ఏళ్లకు పైబడి పనిచేస్తున్నవారు, వీరిలో చాలామంది ఉన్నారు. ఇప్పుడు, స్మార్ట్ కిచెన్స్ పేరుతో తన పార్టీవారి పొట్టలు నింపుతూ, అక్కచెల్లెమ్మలను మాత్రం రోడ్డున…— YS Jagan Mohan Reddy (@ysjagan) June 27, 2026మధ్యాహ్న భోజన కార్మికుల తరఫున వైఎస్సార్సీపీ పోరాడుతుందని, వారికి అండగా నిలుస్తుందని జగన్ స్పష్టం చేశారు. ఇప్పటికే బకాయిపడ్డ రెండు నెలల జీతాలను వెంటనే విడుదల చేయాలని, ఎన్నికల హామీ మేరకు వారి వేతనాలను కూడా పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. స్మార్ట్ కిచెన్స్ పేరుతో ఉపాధి కోల్పోయే పరిస్థితి ఏర్పడితే వేలాది పేద మహిళల కుటుంబాలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటాయని, ప్రభుత్వం తన నిర్ణయాన్ని పునఃసమీక్షించాలని జగన్ కోరారు. -
ప్రచారానికి ఇంత ఖర్చా?
వ్యాపార సంస్థలు తమ వస్తువులను, సేవలను ప్రచారం చేసుకోవడం వ్యాపార వృద్ధికి అవసరం. కానీ ప్రజల ఓట్లతో ఎన్నికైన ప్రభుత్వాలు తమ గురించీ, తమ పథకాల గురించీ విపరీతంగా ప్రచారం చేసుకోవడం, దానికోసం వేల కోట్ల ప్రజాధనాన్ని వెచ్చించడం సమంజసమేనా?2026–27లో ఆంధ్రప్రదేశ్ ఆర్థిక లోటు రూ. 75,868 కోట్లు (జీఎస్డీపీలో 3.8%). కేంద్ర ఆర్థిక సంఘం నిర్దేశించిన 3% పరిమితిని మించిపోయింది. మొత్తం బకాయి అప్పులు జీఎస్డీపీలో 36% వద్ద ఉన్నాయి. రెవెన్యూ లోటు 1.1%. ఏటా వేల కోట్ల అప్పు తీసుకుంటూ, కేంద్ర గ్రాంట్లపై అధికంగా రాష్ట్రం ఆధారపడుతోందని కాగ్ నివేదికలు, బడ్జెట్ పత్రాలు స్పష్టం చేస్తున్నాయి. ఇంత తీవ్రమైన ఆర్థిక ఒత్తిడిలోనూ ప్రచార ఖర్చులు తగ్గకపోగా పెరగడం విడ్డూరం.ఆంధ్రప్రదేశ్లో టీడీపీ నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అమరావతి పునర్నిర్మాణం, పెట్టుబడుల ఆకర్షణ, పాలనా విజయాల ప్రచారం కోసం విపరీతంగా ఖర్చు చేస్తోంది. 2025 సెప్టెంబర్ 10న అనావృష్టి పీడిత అనంతపురంలో ‘సూపర్ సిక్స్ – సూపర్ హిట్’ పేరుతో నిర్వహించిన భారీ బహిరంగ సభ ఈ ప్రచార పర్వానికి నిదర్శనం. హామీలు పూర్తిగా నెరవేరకుండానే విజయోత్సవం జరుపుకోవడాన్ని ‘పీఆర్ మాయాజాలం’.పెట్టుబడులను ఆహ్వానించే పేరుతో 2025 నవంబర్ 14–15న విశాఖపట్నంలో నిర్వహించిన సీఐఐ పార్ట్నర్షిప్ సమ్మిట్ను ప్రతిపక్ష వైఎస్ఆర్సీపీ ‘ముందుగా సిద్ధం చేసిన ప్రచార ప్రహసనం’గా అభివర్ణించింది. అమరావతి, పోలవరం, విశాఖ ఉక్కు కర్మాగారం వంటి ప్రాజెక్టుల పునరుద్ధరణను హడావుడిగా ప్రచారం చేయడం, దావోస్లో రూ. 10 లక్షల కోట్ల హరిత ఇంధన పెట్టుబడుల వాగ్దానం గురించి ప్రచారం చేయడం కోసం ఎంత ఖర్చు చేస్తున్నారో ఊహించడం కష్టమేమీ కాదు.సుప్రీం కోర్టు ఏం చెప్పింది?ఈ ఖర్చులు కేవలం దుబారా మాత్రమే కాదు, చట్టపరమైన నిబంధనలకూ విరుద్ధం. 2015 మే 13న ‘కామన్ కాజ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా’ (రిట్ పిటిషన్ నం. 13/2003) కేసులో జస్టిస్ రంజన్ గొగోయ్ నేతృత్వంలోని ధర్మాసనం, ప్రభుత్వ ప్రక టనల నియంత్రణకు స్పష్టమైన మార్గదర్శకాలు జారీచేసింది. వాటి ప్రకారం ప్రకటనలు ప్రభుత్వ రాజ్యాంగ, చట్టపరమైన బాధ్యతలకు సంబంధించిన సమాచారం కోసమే ఉండాలి; వ్యక్తులను లేదా రాజకీయ పార్టీలను కీర్తించడానికి కాదు. వ్యక్తిపూజ ‘ప్రజాస్వామ్య ప్రభుత్వానికి సరాసరి విరుద్ధం’ అని కోర్టు పేర్కొంది.ఖర్చు పొదుపుగా, పన్ను చెల్లింపుదారుల సొమ్ముకు గరిష్ఠ విలువ లభించేలా ఉండాలి. ముఖ్యంగా, ప్రతి శాఖా, ప్రభుత్వ రంగ సంస్థా తన ప్రకటనల బడ్జెట్ను బహిర్గతం చేసి కాగ్ ఆడిట్కు లోబడాలి. ప్రక టనల కంటెంట్ను పర్యవేక్షించేందుకు ప్రతి రాష్ట్రమూ ముగ్గురు సభ్యుల కమిటీని (సీసీఆర్జీఏ) ఏర్పాటు చేయాలని కోర్టు ఆదేశించింది. చాలా రాష్ట్రాల్లో లాగానే ఇక్కడా ఈ కమిటీలు సమర్థంగా పనిచేయడం లేదు. ప్రకటనల బడ్జెట్ను బహిర్గతం చేయకపోవడం, ఆడిట్కు లోబడకపోవడం, కోర్టు నిర్దేశించిన పారదర్శకతా సూత్రాన్ని తుంగలో తొక్కడం ఏపీలో స్పష్టంగా కనిపిస్తోంది.చదవండి: చీకటి ఎల్లకాలమూ ఉండదు!సోషల్ మీడియాలోనూ ప్రభుత్వ ఖాతాలు, ప్రాయోజిత ప్రకటనలు పెద్దఎత్తున నడుస్తున్నాయి. ఫలితంగా సామాన్య ప్రజలు అవాస్తవ సమాచారానికి, అతిశయోక్తులకు బలవుతూ వాస్తవానికి దూరమవుతున్నారు. అంతిమంగా, ఈ ఆర్భాటపు ప్రచారానికి అయ్యే ఖర్చును భరిస్తున్నది ఎవరు? ప్రజలే. ప్రభుత్వం సుప్రీం కోర్టు మార్గదర్శకాలను గౌరవించి, నిజమైన అభివృద్ధివైపు మళ్లాలి. లేకుంటే, ఈ ‘ప్రచార పర్వం’ ప్రజాధనానికి తూట్లు పొడుస్తూనే ఉంటుంది.– డాక్టర్ కొత్తపల్లి శ్రీనివాస వర్మ సీనియర్ జర్నలిస్ట్ -
అమృత్ 2.0 పనుల్లో చంద్రబాబు నిలువు దోపిడీ
-
జనసేన నేతలవి బుర్ర తక్కువ మాటలు: అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ కాపు నేతలంతా భేటీ అయితే చంద్రబాబు, పవన్ కల్యాణ్లకు ఉలిక్కిపాటు ఎందుకని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు ప్రశ్నిస్తున్నారు. గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసు ఇండియాలోనే అరుదైన కేసుగా అభివర్ణిస్తూ.. సంచలన వ్యాఖ్యలు చేశారాయన. మంగళవారం గుంటూరులో అంబటి మీడియాతో మాట్లాడుతూ.. ‘‘నేను చాలా స్పష్టంగా చెబుతున్నా.. సాయికృష్ణను చంపేశారు. ఎవరో పెద్ద నేరస్థుడిని రక్షించేందుకు అతన్ని బలి చేశారు. సీబీఐ దర్యాప్తు జరిగితేనే నిజాలు బయటకు వస్తాయి అని అంబటి వ్యాఖ్యానించారు. ఇది దేశంలోనే అరుదైన కేసు. బుర్రలేని జనసేనవాళ్లు సాయికృష్ణను చంపడం కరెక్టేనని మాట్లాడుతున్నారు సాయికృష్ణ మీద 2 కేసులే ఉన్నాయి. కానీ, పవన్ కల్యాణ్ 22 కేసులు ఉన్నాయని అంటున్నారు. శిక్షించడానికి పోలీసులు ఎవరు? శిక్షలు చట్టబద్ధంగా ఉండాలి. నేను సాయికృష్ణను కొట్టారని ఫొటోలు ఇచ్చాను. ఒకవేళ అతను బతికి ఉంటే చెప్పండి.... సాయికృష్ణ లాకప్ డెత్ కేసును మేకప్ చేసే కార్యక్రమంలో ఉన్నారు. చట్ట ప్రకారం.. 18 నెలలపాటు సీసీటీవీ ఫుటేజీలు భద్రపరచాలి. కానీ, కృష్ణలంక పీఎస్లో సీసీ ఫుటేజీ మాయం కావడం ఆందోళనకరమైన విషయం. ఈ విషయాన్ని ఎల్లో మీడియా సైతం ప్రచురించింది. నిందిత పోలీసులను కాపాడటానికే సీసీటీవీ ఫుటేజీలు మాయం చేశారు. .. జనసేన నేతలు కల్లు తాగిన కోతుల్లా చిందులు వేస్తున్నారు. బుర్ర తక్కువ మాటలు మాట్లాడుతుంటారు. ఈ హత్యాకాండకు, సీఐ నాగరాజుకు మద్దతుగా మాట్లాడుతున్నారు. ఈ వ్యవహారంపై ఆ పార్టీలోని కాపు నేతలే ఎందుకు మాట్లాడుతున్నారు?. మిగతా కులాల నేతలు ఎందుకు మాట్లాడడం లేదు? అని అంబటి ప్రశ్నించారు... చంపడం, బూడిద చేయడం.. సాక్ష్యాధారాలు లేకుండా చేయడం.. ఇదేంటి?. ఎవరో పెద్ద నేరస్థుడిని కాపాడడానికే సాయికృష్ణను బలిచేశారు. చంద్రబాబు వేసిన సిట్తో ఏం ఒరగదు. సాయికృష్ణ లాకప్ డెత్ కేసును సీబీఐకి అప్పగించాలి. సీబీఐ, ఎన్ఐఏ లాంటి దర్యాప్తు సంస్థలతో విచారణ జరిపిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయి. బాధితులకు న్యాయం జరుగుతుంది’’ అని అంబటి తేల్చి చెప్పారు. -
నిద్ర లేచిన కూటమి ప్రభుత్వం.. సాయి కృష్ణ కేసులో CI సస్పెండ్
-
వంగలపూడి అనితపై వేటు..?
-
ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ చేసింది వాళ్లే ఇదిగో ప్రూఫ్స్ ...?
-
పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు..!
-
YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు
-
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో కూటమి రంగం సిద్ధం
-
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్లు కలిసి ఓ మెగా స్కామ్కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్!
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయానని.. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మహిళలను సైతం మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆమె ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్సీపీ "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఆమె.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఒకప్పుడు ప్యాకేజీ స్టార్గా ఉన్న పవన్.. ఇప్పుడు క్యాబేజీ స్టార్గా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తి.. తన బాధ్యతలను విస్మరించారన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని రోజా గుర్తుచేశారు. ఇక.. మహిళల సంక్షేమం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సర్కార్.. చివరకు వారికే వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు.అలాగే వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనతో పోల్చుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని అన్నారామె. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లోనూ హామీలను నెరవేర్చలేకపోతోందని రోజా మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా అందరికీ చంద్రబాబు పంగనామాలు పెట్టారంటూ సింబాలిక్గా నిరసనలు నిర్వహించారామె. -
కూటమి అవినీతి.. సంచలన ఆధారాలతో TDP ఎమ్యెల్యే
-
తిరుపతిలో పొలిటికల్ హీట్
సాక్షి, తిరుపతి: నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు" అంటూ వైఎస్సార్సీపీ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. అదే సమయంలో.. ఎన్డీయే విజయోత్సవ సభను నిర్వహిస్తుండడం.. దానికి కూటమి పెద్దలు హాజరు అవుతుండడం చర్చకు దారి తీసింది.తిరుపతిలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార ఎన్డీయే కూటమి నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నారు. అదే సమయంలో ఇటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ఏర్పాట్లు చేసింది.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాల షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రెస్మీట్లో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పార్టీ కేడర్కు, ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. అయితే..వైఎస్సార్సీపీ కార్యక్రమాలు జరగనున్న రోజునే తిరుపతి సమీపంలోని దామినీడులో ఎన్డీయే విజయోత్సవ సభ ఏర్పాటు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు పక్షాలు ఒకేసారి భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. కీలక కూడళ్లు, సభా ప్రాంగణాలు, ర్యాలీ మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా?
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్సార్సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్హిల్స్ ఆస్పత్రిలో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. కూటమి హయాంలో.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్కు లింకు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్లో యూనిట్ విద్యుత్కు 50 పైసలే చార్జ్ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్ను వదిలిపోయేలా చేశారు. బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్ జగన్ అన్నారు. ఇంత దారుణమా?స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది. లోకేశ్ అసలు మనిషేనా?ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.ఇదీ చదవండి: మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా!మీరు ఇవ్వకుంటే.. మేమొచ్చాక ఇస్తాంగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచే పరిహారం ప్రకటించారంతే. స్టీల్ప్లాంట్ బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని వైఎస్ జగన్ ప్రకటించారు. -
కూటమి నిర్లక్ష్యమే ఉక్కు ప్రమాదానికి కారణమా....!
-
ప్రజలను ముంచిన ప్రభుత్వం కూటమి నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలిపిన భూమన
-
ఉత్త ప్రచారానికే 40 కోట్లు!
ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఒకవైపు, ప్రచార వ్యూహాలు మరోవైపు ఉండే సున్నితమైన సరిహద్దు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. ఏపీలో సోషల్ మీడియా ప్రచారం పేరుతో భారీ నిధుల కేటాయింపు జరిగిందన్న అంశం రాజకీయ వర్గాల్లోనూ, నెటిజన్ల మధ్యనూ తీవ్ర చర్చకు కారణమవుతోంది.సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పబ్లిసిటీ కోసం తాజాగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం కోసం దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వినియోగించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ప్రచారం కోసం ఇంత భారీ వ్యయం ఇప్పుడు అవసరమా? అనే చర్చ జోరందుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై ఇప్పటికే విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. అంతేకాకుండా ప్రధాని మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు భారీ ప్రచార వ్యయంపై విపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు.చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి తాజాగా రెండేళ్లు పూర్తైంది. ఈ కాలంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. రెండూ పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన కూడా ముందుకు వస్తోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా టీంలు చంద్రబాబు విషయంలో ఎంత హడావిడి చేస్తున్నదో తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ విభాగం ద్వారా ఆ పనిని ముమ్మరం చేయాలని చంద్రబాబుకు తనయుడు, మంత్రి నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు దుబారా విమర్శను అంగీకరించకుండా.. డిజిటల్ యుగంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరాలంటే సోషల్ మీడియా ప్రచారం అవసరమేనని అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. -
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
-
ప్రతి టూర్లో ఓ సీన్.. ప్రతి సీన్కు ఓ ట్రోల్!
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు, చేష్టలు విచిత్రంగా ఉంటున్నాయి. పొయ్యి వెలిగించకుండానే చేపల కూర వండడం మరీ విడ్డూరం. ఇలాంటి చేష్టలతో చంద్రబాబు ప్రజల దృష్టిలో మరీ పలుచనవుతున్నారు. ప్రజలను కలుసుకోవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ.. వీటికి ఓ నాటకీయత అబ్బితేనే వస్తుంది సమస్య. ‘మత్సకారుల సేవ’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మత్సకార కుటుంబం ఇంటికి వెళ్లారు. వెళ్లడానికి ముందు ఒక నలుగురైదుగురు మత్సకార మహిళల నుంచి చేపలు కొంటున్న ఒక సీన్ సృష్టించారు. అక్కడ నుంచి ఆయన మత్సకారుడి ఇంటికి వెళ్లి చేపల కూర చేయించారు.ఆ క్రమంలో ఆ ఇల్లంతా కలియదిరిగారు. వారితో మాట కలిపారు. ఈ క్రమంలోనే అప్పటివరకూ కూర్చుని ఉన్న బాబు అకస్మాత్తుగా లేచి కిచెన్లో పొయ్యి మీద ఉన్న చేప ముక్కలను కలియ తిప్పారు. అప్పుడే కూర వండుతున్నట్లు కనిపించాలని అనుకున్నారు. కానీ.., స్టవ్ వెలిగించడం మర్చి పోయారు. దాంతో సోషల్ మీడియా దీన్ని ఒక లాఫింగ్ పీస్ చేసేసింది. స్టవ్ వెలిగించకుండానే చేపల కూర వండుతున్న ముఖ్యమంత్రి అని, సార్..స్టవ్ మర్చిపోయారు సార్..అని ఇదంతా డ్రామా, స్క్రిప్ట ప్రకారం షూట్ చేశారని మరి కొందరు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ ఇంటివారితో కలిసి ఒక స్పూన్తో ఒకటి, రెండు ముక్కలు తీసుకున్నట్లు కనిపించింది. ఆయన ఇంటికి రావడానికి ముందు ఆ రహదారిలో ఎవరూ లేకుండా జాగ్రత్తపడ్డారు. కారు దిగినప్పటి నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన నటించారన్న భావన సోషల్ మీడియాలో వ్యక్తం అయింది. ఎందుకంటే తొలి నుంచి ఆయన కెమెరా మైక్ పెట్టుకుని ఉంటే, మత్సకార కుటుంబంలో కూడా ఒకరిద్దరికి మైక్ పెట్టి ఉందట. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? అన్న చర్చ జరగవచ్చు. ముఖ్యమంత్రి జనసామాన్యంలో కలిసి పోతున్నారు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు తనపై తనకే అంత నమ్మకం ఉన్నట్లు లేదు. చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయి ఇలాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఉంది. కాని ఆ స్క్రీప్ట్లో పొరపాటు వల్ల దొరికిపోతున్నారన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీ షాపుకు వెళ్లడం, ఒక ఇంటికి వెళ్లి తానే టీ, కాఫీ తయారు చేస్తున్నట్లు కనిపించడం, టీ తయారీ గురించి చర్చిస్తుండడం, ఒక బడ్డీ కొట్టు వద్దకు వెళ్లడం, తాటి ముంజెలు కొనుగోలు చేసి సతీసమేతంగా తినడం, జగన్ టైమ్లో నిర్మించిన గృహానికి వెళ్లి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టడం తదితర దృశ్యాలు సోషల్ మీడియాను బాగానే ఆకర్షిస్తాయి. కాని అంతిమంగా ఆయనకు అది రాజకీయ ప్రయోజనం కలిగించడం లేదు. ప్రతిసారి నటిస్తున్నారన్న వ్యంగ్యోక్తులకు గురి అవుతున్నారు. ఈ వయసులో ఇన్ని విన్యాసాలు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక ఇంటికి వెళ్లినప్పుడు వారు తమకు పెన్షన్ రావడం లేదని, మరో చోట్ సొంత ఇల్లు లేదని, ఇంకోచోట తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుకున్నారు. సంబందిత జిల్లా కలెక్టర్కు వాటిని నెరవేర్చాలని ఆయన ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. కాని కొన్నిసార్లు అవి ఏ కారణం వల్లనైనా కాని అమలు కావడం లేదట.దాంతో ఈ మధ్య ఒక వ్యక్తి తనకు సీఎం వాగ్దానం చేసి ఆరు నెలలు అయినా అది నెరవేరలేదంటూ రోడ్డుపై ఆందోళనకు దిగాడు. ప్రతి నిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ ల ద్వారా ఎక్కడో చోటకు వెళ్లినప్పుడు ఆయన ఏదో ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని జనాన్ని ఆకర్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాని, కొన్నిసార్లు అవి వికటించి లాఫింగ్ స్టాక్ అవుతున్నాయని కొందరు టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. గత అనుభవాల రీత్యానేమో తెలియదు కాని, ఇటీవల ఆయన వెళ్లిన ఇంటిలో ఉన్నవారిని మీకేం కావాలని అడుగుతున్నట్లు కనిపించలేదు. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పి వచ్చేస్తున్నారు. కాసేపు ఆ కుటుంబం వారితో పొగిడించుకుంటున్నారు.నిజానికి ఇలాంటి సందర్భాలలో తన ప్రభుత్వం గురించి వారు ఏమి అనుకుంటున్నది అడిగి అభిప్రాయ సేకరణ చేసుకుంటే బాగుండేది. తాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అంటున్న నేపథ్యంలో వారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా?లేదా? అన్నది తెలుసుకుని ఉండాల్సింది. ఇవన్ని మైక్ పెట్టుకుని అడగడం ఇబ్బంది కనుక, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి జనాభిప్రాయం గమనించి ఉండాల్సింది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పినా, ఇవ్వలేకపోతున్నానని, అయినా మీరు సంతృప్తిగానే ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలలో తన పరపతి పెంచుకోవడం కోసం ఆకస్మిక తనిఖీల పేరుతోనో, మరో పేరుతోనో టూర్ చేస్తుండే వారు. తొలుత సీరియస్ గానే జరిగినా, రాను, రాను అవి కూడా షో పుటప్ల గానే మారిపోయాయి. కావలి వద్ద ఉన్న జువ్వలదిన్నె సందర్శించడానికి కూడా కారణం లేకపోలేదు. అంతకు కొద్దిరోజుల ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడకు వెళ్లి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. జగన్ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూమి లో కొంత భాగాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని ఇటు మత్సకారులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే తమిళనాడు నుంచి కొందరు వచ్చి దొంగచాటుగా ఆంధ్ర ప్రాంత మత్స్య సంపదను కొల్లగొడుతుంటే, వారిని పట్టుకుని బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాని తదుపరి ఏపీ ప్రభుత్వం వాటిని వదలివేయడంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. టీడీపీ ఎంపీ, పి బీదా మస్తాన్ రావు ప్రోద్బలంతోనే బోట్లు వదలి వేశారని మత్స్య కారులు అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలో ఆ మత్సకారుల వద్దకు జగన్ వెళ్లి వారికి భరోసా ఇచ్చి వచ్చారు. లోకేశ్ జువ్వలదిన్న సందర్శిన తర్వాతే కొద్ది రోజులకు బోట్లను వదలి వేశారని జగన్ ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కొంతమేర ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోబోమని, తాను అధికారంలోకి వచ్చాక దానిని స్వాధీనం చేసుకుని మత్సకారలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా, అది బాగా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్సకార వర్గంపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఆ క్రమంలోనే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ పంచ్ డైలాగులు చెప్పి తృప్తి పరచడానికి యత్నించారు. ఆ రకంగా జగన్ రాక తమకు ఉపయోగపడిందని, చంద్రబాబు ఈ మాటలు అనక తప్పలేదని మత్సకారులు భావిస్తున్నారు. అది నిజమే అనిపిస్తుంది.1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తరచుగా వివిధ చిత్రమైన రీతులలో కనిపించే వారు. రోడ్డుపై స్నానం చేస్తున్న ఫోటోలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు.. సినీ నటుల పార్టీని ఎవరు పట్టించుకుంటారని విమర్శించే వారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతి కాలంలో ఆయనే టీడీపీని కైవసం చేసుకుని, తానే రాజకీయంగా రకరకాల సన్నివేశాలలో నటిస్తుండడం విశేషం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ కీలక సమావేశం.. జగన్ స్పీచ్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై ఆయన కేడర్కు దిశానిర్దేశం చేశారు.. వైఎస్ జగన్ స్పీచ్ హైలైట్స్చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసుబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైందిజగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారుమేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదికూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైందిమూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారుసూపర్-6, సూపర్-7 లేదుఆడబిడ్డ నిధికి నిధుల్లేవు18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలేనిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారుఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోందిమావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారువ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారుతగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారుఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదురాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోందిఇప్పటికీ హామీల అమలు లేదుచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమంచి చేశానని చెప్పుకునే స్థితిలో ఆయన లేరుమేనిఫెస్టో అడ్రస్ కనిపించదుఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారుగొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారుప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారుకానీ, తెలివైన వాళ్లని గుర్తించాలివైఎస్సార్ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలోనే జనాలకు మంచి జరిగింది.. ఆ విషయం కాలర్ ఎగరేసి మరీ చెప్పగలంవెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్లెట్ ఆవిష్కరణచంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లుసూపర్సిక్స్, సూపర్ సెవెన్ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలుచంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ విడుదలబుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించాం: వైఎస్ జగన్రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించాం: వైఎస్ జగన్జూన్ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిద్దాం: వైఎస్ జగన్జూన్ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు: వైఎస్ జగన్8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్క్వార్టర్స్ టౌన్హాల్లో సదస్సులు: వైఎస్ జగన్12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు: వైఎస్ జగన్ఎండలు, సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్: వైఎస్ జగన్ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి: వైఎస్ జగన్కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: వైఎస్ జగన్ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి: వైఎస్ జగన్జగన్ కీలక వ్యాఖ్యలు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయిచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమున్పిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆ కుట్రలు చూశాంపోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో చూశాంఅందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలిప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్న నమ్మకం కలగాలిఆ నమ్మకం కలిగితేనే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారుచంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలిఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు.. అదే జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటాంఏకగ్రీవం జరిగిందంటే ఇన్చార్జిలు ఫెయిల్ అయ్యారన్నమాటఇప్పటికే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటయ్యాయివీరందరితో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలివైఎస్సార్సీపీ హయాంలో అందిన పథకాలు.. కూటమిలో ఎలా రద్దయ్యాయో ప్రజలకు వివరించాలిబాబు వెన్నుపోటు పాలన గురించి ప్రతీ ఇంట చర్చ జరగాలిస్థానిక సంస్థల ఎన్నికలను కచ్చితంగా సీరియస్గా తీసుకోవాలిసర్ ప్రక్రియ గురించి.. బెంగాల్, తమినాడు ఎన్నికలను అంతా చూశారుసర్ ద్వారా బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారుమమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45 వేలకు పైగా ఓట్లు తొలగించారుఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్లో 71 వేల ఓట్లు తొలగించారుఆయన ఓడింది 8 వేల ఓట్ల తేడాతో.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి91 లక్షల ఓట్లు బెంగాల్లో తొలగించారుమమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారుస్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడారుకాబట్టి సర్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలిఓట్లు పెరగడం వల్ల మనం ఓడాం.. ఓట్లు తగ్గడం వల్ల వాళ్లు ఓడారుకుప్పంలో కళ్లెదుటే అది కనిపించిందిఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీమనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలూ.. -
కూటమిలో కొట్లాట.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే...
-
గుడ్డలతో గొంతులు కోసే.. తడి గుడ్డల పార్టీ !
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు స్కామ్లు చేసుకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబుకి బీపీ పెరుగుతోందిఇచ్చిన హామీలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజల బాగోగులను గాలికి వదిలేశారుఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారురాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారురెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలిఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందిచంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుతప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోందిమావిగన్ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉందిచంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టంఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారుచంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందిఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారుస్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారుఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారుఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారుస్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారుప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోందిరాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించాంరాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాంఅమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలిమావిగన్లో అన్నీ ఉన్నాయిప్రజలు కూడా మావిగన్కు మద్దతు పలికారుఅది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారుతాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారుఅమరావతిలో విచ్చలవిడి దోపిడీనేరూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా.. పర్మినెంట్ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారుమళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారుకొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారుభవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారుఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 20, 427 ఆ? పాత లెక్క రూ. 5వేల లోపే ఉందివాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాటఫైవ్స్టార్ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుందితెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారుమన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు??కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారుఅమరావతిలో రోడ్ల వ్యయం చూస్తే కళ్లు తిరుగుతాయికిలోమీటర్ ఖర్చు రూ.24 కోట్లు అవుతుందని కేంద్రమే చెప్పిందిఅమరావతిలో కిలో మీటర్ ఖర్చు రూ.53 కోట్లు అవుతోందిఅమరావతిలో ప్లాట్ల స్కామ్ జరుగుతోందిచంద్రబాబు తన మనుషులకు రోడ్ల పక్క భూములు ఇప్పించారుసామాన్యులకు మాత్రం చెరువులు, కుంటల్లో ఇస్తున్నారు50 వేల ఎకరాలు సరిపోవని మళ్లీ లాక్కుంటున్నారుఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనేవీటన్నింటిని ఆధారాలతో సహా బయటపెడితే చంద్రబాబుకి బీపీ వస్తోందిచంద్రబాబూ.. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ?మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురద జల్లుతున్నారుజాతరలో గొడవ వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన భార్య చెప్పిందిటాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారువైఎస్సార్సీపీపై బుదర జల్లాలని చూస్తున్నారుకల్పిత కథతో కేసు పెట్టి వైసీపీ వాళ్లనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారుచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు.. మేం బాధితులంమా తాత రాజారెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యారుమా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా?అధికార దుర్వినియోగం చేసి ఆ హంతకులను చంద్రబాబే రక్షించారుమా నాన్న రాజశేఖర్రెడ్డి విషయంలోనూ అదే జరిగిందిఅసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారుతర్వాత 4 రోజులకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారుఅవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగులు చూడండిమా నాన్న మృతి విషయంలో అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావాల్సి ఉందిమా చిన్నాన్న వివేకాను అవినాష్ చంపించాడంటూ ప్రచారం చేశారుఅవినాష్ కోసం వివేకా కృషి చేశారుఅలాంటి వివేకాను అవినాష్ చంపించారని బురద చల్లారుచంపానని చెప్పిన దస్తగిరి ఇవాళ బయట దర్జాగా కార్లలో తిరుగుతున్నాడుఈ కేసులో నిందితుడైన దస్తగిరికి లాయర్.. చంద్రబాబు లాయర్ అయిన లూథ్రానేక్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలినందమూరి బాలకృష్ణ గన్తో ఇద్దరిని కాల్చేయలేదా?ఎవరిది గన్ కల్చరో చెప్పాలిఈ కేసులో సాక్ష్యం దొరకకూడదని వాచ్మన్ను బండరాయితో కొట్టి చంపారుహరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి చంద్రబాబు కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడారుఎవరివి శవ రాజకీయాలో చంద్రబాబు చెప్పాలిరాజకీయ జీవితం ఇచ్చిన సొంతమామకే వెన్నుపోటు పొడిచారుపేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి వంగవీటి రంగాను నరికి చంపారుఈ కేసు ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేఎన్డీఆర్పై దాడి చేసి మల్లెల బాబ్జీ లాడ్జిలో శవమై తేలాడుతనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని బాబ్జీ జేబులో ఓ లెటర్ దొరికిందిమల్లెల బాబ్జీ కేసులో అసలు విచారణే జరగలేదుచంద్రబాబుది రాక్షస రాజకీయంవిజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పింగళి ధశరథ్రామ్ దారుణ హత్యకు గురయ్యారుఈ హత్య కేసులోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయిబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారుచంద్రబాబు కుట్రలన్నీ దగ్గుబాటి అప్పుడే చెప్పారుమాది విలువలతో కూడిన రాజకీయంచంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే.. మేం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నాంమా తాతను చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు.. మేం చెడ్డోళ్లమైతే వాళ్లు ఉండేవాళ్లా?జగన్ నైజానికి ఇదే నిదర్శనంచంద్రబాబులా మాకు హత్య రాజకీయాలు నేర్పించలేదుచంద్రబాబుకి బహుశా ఇవే చివరి ఎన్నికలుఈ వయసులోనూ ఇలాంటి దౌర్భగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా?స్కామ్ వాళ్లది.. కేసు మా నేతపైనజంగిల్రాజ్లో హత్యారాజకీయాలు నడుస్తున్నాయిఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ వాళ్లను దారుణంగా చంపారువినుకొండలో రషీధ్ను నడిరోడ్డుపై నరికి చంపారుచంద్రబాబుకు ఎప్పు ఇబ్బంది వచ్చినా అబద్ధం సృష్టిస్తారుబాబు మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారుఆయన హయాంలోనే కల్తీ మద్యం ఘటన జరిగిందికానీ, మా పార్టీ నేత పేరును కేసులో చేర్చారుటీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుచరులు కల్తీ మద్యం చేస్తూ దొరికారుచేసింది చంద్రబాబు అనుచరులతే కేసు మాత్రం ఈ దందాను బయటపెట్టిన జోగి రమేశ్ పై పెట్టారుతప్పుడు కేసుతో 83 రోజులు జైల్లో పెట్టారుబెయిల్పై బయటకు వస్తే యాసిడ్ బాటిల్స్ దాడి చేశారుదాడికి పాల్పడిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారుకల్తీ మద్యం కేసును ఎంత దారుణంగా మార్చారో అంతా చూశారుమామిళ్లపల్లిలో తప్పు వాళ్లదేమామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారుకాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు రైతులు గోడౌన్లో పంట నిలవ చేసుకున్నారుమామిళ్లపల్లిలో ఎక్కడా తప్పు జరగలేదని వాళ్లకూ తెలుసుఅయినా గోడౌన్ అంబటి మురళిదని ప్రచారం చేశారుగోడౌన్లోనూ వైఎస్సార్సీపీ జెండాలను టీడీపీవాళ్లే పెట్టారుఅక్రమంగా నిల్వచేశారని తప్పుడు కేసులు పెట్టారుగోడౌన్ను కూడా సీజ్ చేశారుగిట్టుబాటు ధర ఇస్తే రైతులు పంటను గోడౌన్లో ఎందుకు పెట్టుకుంటారు?పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై దౌర్జన్యం చేశారుమహిళలపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారుఏపీలో సోషల్ మీడియా సెన్సార్ఏపీలో సోషల్ మీడియా పైనా కూడా ఆంక్షలు పెడుతున్నారుప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదుప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్ను కనపడకుండా చేస్తున్నారుసోషల్ మీడియా కూడా సెన్సార్ చేస్తున్నారుకార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారుఎఫ్ఐఆర్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు పంపిస్తున్నారుచంద్రబాబు పెట్రో మాయఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అన్నారుపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు, అలాగే డీజిల్పై 22.5 శాతం వ్యాట్తో అదనంగా 4 రూపాయిలు పెంచారుకోవిడ్లాంటి మహమ్మరి టైంలోనూ రోడ్ సెస్ కింద మేం పెంచింది రూపాయి మాత్రమేకానీ, వైఎస్సార్సీపీ హయాంలో పెట్రోల్ రేట్లు అడ్డగోలుగా ఉన్నాయంటూ నానాయాగీ చేశారుఅప్పట్లో బాబు, లోకేష్, పవన్లు పొలిటికల్ డ్రామా చేశారుఎన్నికల టైంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్లు ప్రకటించారుటీడీపీ మేనిఫెస్టోలోనూ ఇంధన ధరల తగ్గింపు ఉందిరెండేళ్లైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదుగత నెలలో బంకుల వద్ద బారులు తీరారుఇంధన సంక్షోభంలోనూ చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారుఆ టైంలో అమరావతి కాంట్రాక్టర్లకు బల్క్ల్లో ఇప్పించాలని కోరారుచంద్రబాబుకి చీవాట్లు పెడుతూ కేంద్రం లేఖ పంపిందిరిటైల్ బంకుల్లో ఎలా డీజిల్ అడుగుతారని చెప్పిందిఆ టైంలోనూ ప్రజల గురించి కాకుండా కాంట్రాక్టర్ల గురించి ఆయన ఆలోచించారుహామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారుఇప్పటికైనా క్షమాపణలు చెప్పి ధరలు తగ్గించాలిపెట్రోల్ లీటర్కు రూ.8 తగ్గించాల్సిందే మినిమమ్ డ్యూటీ మరిచిన పోలీసులుపొదుపు చర్యల పేరుతో చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారువాళ్లు మాత్రం విమానాల్లో తిరుగుతున్నారుఏపీలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారుఏ కాలేజీలో చూసినా గంజాయి కనిపిస్తోందిరాష్ట్రంలో మాత్రం పోలీసులకు కనిపించడం లేదువ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారుపోలీసులు కనీస విధులు కూడా మరిచిపోయారుమా హయాంలో దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం గ్రామాల్లో చంద్రబాబుపై ఆగ్రహంచంద్రబాబు నోరు తెరిస్తే అబద్దం.. మోసంఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారుసూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా తేలాయిమా హయాంలోనీ పథకాలన్నీ నిలిపివేశారుపొదుపు సంఘాల పరిస్థితి దారుణంగా ఉందిపంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఇన్ఫుట్ సబ్సీడీ లేదు.. ఈ క్రాప్ లేదుమొక్కజోన్న, పొగాకు, శనగ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారుకేంద్రం ఇచ్చేది కాకుండా.. అన్నదాన సుఖీభవకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. అంటే ప్రతీ రైతుకు రూ. 40 వేలు ఇవ్వాలిఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 ఇస్తామన్నారునిరుద్యోగికి రూ.3 వేల భృతి అన్నారు.. అంటే ఈ రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ పడ్డారుఏపీలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు16 కేటగిరీల్లో ఐదింటికి మాత్రమే అనుమతించారుఇప్పుడు దానికి కూడా కోత పెడుతున్నారు12 డిపోలను ప్రైవేట్పరం చేశారుఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తెస్తారంటఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి.. దానికి ఫ్రీ పథకం వర్తించదని చెబుతున్నారుభవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు.. ఆర్టీసీ ఉండదుమా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాంబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారుఅమ్మ ఒడి పథకంలో 20 లక్షల మందికి కోత పెట్టారుహామీలు అమలు చేస్తామని స్వయంగా బాండ్లు పంపిణీ చేశారుగ్రామాల్లో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుఆ హామీల సంగతి ఏమైందని చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారుఉద్యోగులను దారుణంగా మోసం చేశారుమా హయాంలో ఉద్యోగులకు ఏనాడూ ఇబ్బందులు కలగలేదుసంతానమే సంపదట.. మరి లోకేష్ సంగతేంటి?ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారురూ. 30 వేలు, రూ.40 వేలు నగదు ప్రొత్సాహకం ఇస్తామని మభ్యపెడుతున్నారుసూపర్ సిక్స్, సెవెన్ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారుచంద్రబాబుకు ఒక్కడే కొడుకు.. లోకేష్కు ఒక్కడే కొడుకుబాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదాప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలటవాళ్లు మంచి చదువుకోకూడదటఇదేం దిక్కుమాలిన ఆలోచన?విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ మా హయాంలో మూలన పడలేదుపిల్లలకు మేనమామలా మంచి చదవులు చదివించాఇవాళ.. కనీసం గోరుమద్దలు కూడా అందని పరిస్థితిసరైన ఆహారం అందక ఆస్పత్రి పాలవుతున్నారువ్యవస్థలన్నీ ఇంత దారుణంగా, అద్వాన్నంగా ఉంటే.. పిల్లలు కనమని పిలుపు ఇవ్వడమేంటి?మహిళలను పిల్లల్ని కనే మెషీన్లుగా చంద్రబాబు చూడడం దుర్మార్గంకుటుంబాలు బాగుండాలంటే మహిళలు బాగుండాలియస్ లోకేస్.. బోత్ ఆర్ నాట్ సేమ్బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ సినిమా డైలాగులు కొడుతున్నాడుఅవును.. బోత్ ఆర్ నాట్ సేమ్వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీదిప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మాదిప్రజలకు ద్రోహం.. వాడుకోవడం .. వదిలేయడం మీ క్యారెక్టర్ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్పనులు చేసి చూపించడం మా స్టైల్.. పబ్లిసిటీ చేసుకోవడం మీ స్టైల్బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాదిరెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీదివిద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం.. ప్రజల చెంతకు పాలన, మహిళా సాధికారికత, మహిళా రక్షణ.. వీటిని ఆచరణలో చూపించడం మేం చేశాంఅందుకే బోత్ ఆర్ నాట్ సేమ్వైఎస్సార్సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్పై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..ప్రజాస్వామ్యంలో ఏది ఇస్తావో అల్టిమేట్గా అదే తిరిగి వస్తుందిప్రతీ పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నాచంద్రబాబు ప్రలోభాలు, భయంతోనూ పోలీసులు పని చేయొద్దురేపు ప్రభుత్వం మారాక ఎంక్వైయిరీ ఉంటుందితప్పు చేసిన అధికారుల్ని చట్టం ముందు నిలబెడతాంసప్తసముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. తీసుకొస్తాం ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కదా.. టీవీకే అధినేత విజయ్ వైఎస్ జగన్ ఫొటో పట్టుకోవడం, తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ సాధించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందన -
మామిళ్లపల్లిలో మళ్లీ పోలీసుల దౌర్జన్యకాండ
సాక్షి, గుంటూరు: మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఈ క్రమంలో మరీ దుర్మార్గంగా వ్యవహరించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి ఈ ఉదయం పొన్నరూ వైఎస్సార్సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి చేరుకుని కూటమి సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. న్యాయం చేయాలని కోరిన మొక్కజొన్న రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దాడులు చేయించడంతో పాటు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్సీపీ అంటోంది. అదే సమయంలో.. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇస్తోంది. చలో మామిళ్లపల్లిని నిర్వహించి రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు వైఎస్సార్సీపీ నేతలు రైతుల్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూటమి సర్కార్ పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తూ కుట్రలు చేస్తోంది. మొన్న మాజీ మంత్రి జోగి రమేశ్, ఇవాళ జూపూడి ప్రభాకర్లను రైతుల్ని కలవనీయకుండా అడ్డుకుంది. -
ఇంకెంత పెరగాలి బాబుగారూ?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో.. దేశంలో పెట్రోల్ రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో సామాన్యులపై భారం పడకుండా చూడమని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. అయితే.. ఎన్డీయే ప్రభుత్వం(కూటమి) ఉన్న ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా మంగళవారం పెంచిన 90 పైసల పెంపుతో దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ98.63, డీజిల్ రూ91.50గా ఉంది. తెలంగాణలో పెట్రోల్ రూ111.36(హైదరాబాద్), డీజిల్ రూ99.53, మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పెట్రోల్ రూ.104.66, డీజిల్ రూ.96.22, ఇటు కర్ణాటకలో పెట్రోల్ రూ.106.82, డీజిల్ రూ.94.82గా ఉన్నాయి. ఏపీ విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.48, డీజిల్ రూ.102.17కి చేరుకుంది. ఇటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.112.96, డీజిల్ రూ.100.32 పైసలకు చేరుకుంది. అంటే.. దేశంలోనే వాహనదారులకు పెద్ద భారంగా ఏపీలో రేట్లు ఉన్నాయన్నమాట. ఢిల్లీతో పోలిస్తే విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.17 ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ (Value Added Tax). యుద్ధ నేపథ్యంతో ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచినా.. రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ఏపీలో ధరలు అత్యధికంగా ఉన్నాయి. అయితే.. ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, పెట్రోలు–డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసింది. ప్రజలతో కలిసి పార్టీ నేతలు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కడం, పెట్రో బాదుడుపై గళమెత్తడం ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తోంది.మొత్తం మీద.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్ ధరల భారమే “ఏపీలోనే అత్యధికం” అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రజా జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న సంక్షోభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించడం తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చంద్రబాబు సర్కార్కు సూచిస్తున్నారు.తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹114.48, డీజిల్ ₹102.17విశాఖపట్నం(ఏపీ): పెట్రోల్ ₹112.96, డీజిల్ ₹100.32 -
ఫ్లాష్బ్యాక్ తిరగేస్తే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే. కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాలలో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్ల ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్ కనుక ఆయిల్ పై ఉన్న పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా!. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం లేదని చంద్రబాబు పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. అమరావతి నిర్మాణాలలో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే ఇలాంటి దారుణాలు
సాక్షి, తాడేపల్లి: మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో టిప్పర్ ఢీ కొట్టటంపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజమెత్తారు. ‘‘టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపారన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మద్యం నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్రమ మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లోపంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. .. ‘‘ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీళ్లను చీడిగ గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. -
చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ రాజ్ మాత్రమే నడుస్తోంది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారు. చంద్రబాబు బలం మీడియానే. మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని పొన్నవోలు మండిపడ్డారు. -
ప్యాలెస్ కోసం నారా వారి స్కెచ్.. ఎర్రచందనం దొంగలతో బాబు, లోకేశ్
-
ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్ అన్నారు. -
కూటమిని కూలుస్తాం.. జగన్ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
మా బుక్స్ పడేసి.. బయటకి లాక్కొచ్చి ఇల్లు కూలగొట్టారు
-
దస్తగిరి హత్య కేసులో చంద్రబాబు మాట విని నవ్వులపాలైన ఎల్లో బ్యాచ్
-
ఉద్యోగుల్ని రాజకీయంగా వాడుకున్నదే చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయంగా వాడుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారంటూ ఆయన మంగళవారం మీడియా ద్వారా మాట్లాడారు. పచ్చ మీడియా జర్నలిస్టులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదని గతంలో అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. నా డిస్మిస్ తప్పని ప్రతీ ఐఏఎస్కు తెలుసు. నన్ను డిస్మిస్ చేసింది కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే. కానీ, కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడరు. ఉద్యోగులను రాజకీయంగా వాడుకుందే చంద్రబాబు. గతంలో ఏపీ ఉద్యోగులను తీసుకెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయించారు. ఆ సమయంలో ఉద్యోగుల చేత ప్రధాని మోదీని చంద్రబాబు తిట్టించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీలేమయ్యాయి?. ఎప్పుడు అమలు చేస్తారు??.. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏం చేసింది??. ఈ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 15వ తేదీ పైనే జీతాలు పడుతున్నాయి.. .. ఉద్యోగులకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ఉద్యోగులపట్ల వైఎస్ జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. ఉద్యోగులకు చాలా రకాలుగా మేలు చేశారు. కూటమి ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 100 రెట్లు మేలు అని వెంకట్రామిరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైఎస్సార్సీపీకి ఆయన అనుబంధంగా పని చేశారని.. ఎన్నికల సమయంలోనూ పార్టీ కోసం ప్రచారం చేశారని.. తద్వారా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. -
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కుట్రలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా మరో అక్రమ కేసు నమోదు అయ్యింది. ఆయన ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్నది ఈసారి పోలీసుల వాదన. తన నివాసంపై దాడి చేసి విధ్వంసం చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని.. కస్టడీలో తనను హింసించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన శనివారం ఈ దీక్ష చేశారు. అయితే.. ఆయన అనుమతి తీసుకోలేదని.. పైగా ఆ దీక్ష వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని పేర్కొంటూ నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ‘‘నా ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైలు పెట్టారు. అరెస్టు చేశాక పోలీస్ స్టేషన్లో(నల్లపాడు) నన్ను హింసించాలని ప్రయత్నించారు. మరి దాడి చేసినవాళ్లను 18 నిమిషాలైనా జైల్లో పెట్టారా?. పోలీసుల సమక్షంలోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని అంబటి రాంబాబు దీక్ష సందర్భంగా ప్రసంగించారు. -
నిరాహార దీక్షకు దిగిన అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం వేకువఝామున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్లోని అంబటి నివాసం, కార్యాలయాన్ని ముట్టడించాయి. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినా కూడా గుంపుగా వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసంతో వీరంగం సృష్టించాయి. ఆపై నాటకీయ పరిణామాల నడుమ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు(జనవరి 31న). అంబటి రాంబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. ఆయన్ని బయటకు రానివ్వకుండా పలు కేసులను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. చివరకు న్యాయ వ్యవస్థ జోక్యంతో ఆయన రెండు వారాల తర్వాత(ఫిబ్రవరి 18న) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. -
పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. నిర్బంధంపై సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం. సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు సివిల్ డ్రస్లో వచ్చి అరెస్ట్ చేయడమేంటి?. పైగా నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. శ్రీహరి ఉగ్రవాది కాదు.. గతంలో జర్నలిస్టుగా పని చేశారు. కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు ధిక్కరిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు వింటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్పై డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని సజ్జల డిమాండ్ చేశారు. ‘‘అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. నిబంధనలు పాటించని పోలీసులపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం.. ఎవరూ తప్పించుకోలేరు’’ ఈ సందర్భంగా సజ్జల హెచ్చరించారు. -
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ నిలదీశారు.మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
జగన్ పర్యటన.. జువ్వలదిన్నెలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు రూరల్: మత్స్యకారుల సమస్యలు విని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో ఇవాళ(బుధవారం) పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తోంది.జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు బయటి నుంచి వచ్చే పడవలకూ మద్దతు ఇస్తూ స్థానిక మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తీవ్ర ఆందోళనలకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది. ఫిషింగ్ హార్బర్ వైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మత్స్యకారులను సైతం అటువైపు అనుమతించడం లేదు. చివరకు మీడియాకు సైతం అనుమతి లేదని చెబుతున్నారు. ఈ ఆంక్షలపై వివరణ కోరితే.. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇదీ చదవండి: జువ్వలదిన్నెకు జగనన్న.. కూటమిలో ఉలిక్కిపాటు -
జువ్వలదిన్నెకు వైఎస్ జగన్.. కూటమిలో ఉలిక్కిపాటు
సాక్షి, నెల్లూరు రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. గత నెల రోజులుగా తీరప్రాంతంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడేమో.. రేపటి జగన్ పర్యటనతో తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల వ్యవహారంతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయి. తీర ప్రాంతంలో టీడీపీ జెండా పీకేసేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, తమను దోచుకుంటున్న పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను వదిలేయడం వంటి ఘటనలు మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. పైగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు ఈ కుట్రలకు కారణమని ఆరోపణలు రావడంతో, ఆయనను తీరప్రాంతంలో నిషేధిస్తూ, ఆయనతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడితే భారీ జరిమానా విధించేలా మత్స్యకార పెద్దలు తీర్మానించడం(దురాయి విధింపు) సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. జగన్ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫిషింగ్ హర్బర్ను సందర్శించడంతో పాటు ఆయన మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే అదనుగా జగన్ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తమ భవిష్యత్ బతుకులకు వెన్నుపోటు పొడిచి ఛిద్రం చేస్తున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని మత్స్యకారులు అంటున్నారు. జగన్ పర్యటన తర్వాత కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. తెలుగు దేశం పార్టీని తీర ప్రాంతంలో సమూలంగా నిషేధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గంగలో కలిపేస్తామని తీర్మానం చేయబోతున్నాయట. జగన్ రాకతో ఉమ్మడి నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరుల నుంచి కూడా భారీగా మత్స్యకారులు తరలి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్ పర్యటనకు మత్స్యకారులు స్వచ్చందంగా తరలి రాకుండా తమదైన కుట్రలను ప్రయోగించే అవకాశం లేకపోలేదు. -
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు. -
రాజధాని హైదరాబాద్ లో కట్టుకుందాం మీకు సౌకర్యంగా ఉంటది రాచమల్లు సెటైర్లు
-
ఇదీ టీడీపీ నేతల చిల్లర వ్యవహారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కుంభకోణంలో తెలుగు దేశం నేతలు కొత్త నాటకానికి తెర తీశారు. బాధితుడు ఎల్లయ్య కుటుంబ సభ్యుడొకరు తమకు బాకీ ఉన్నాడని.. ఆ అప్పు కిందే అతని ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి రూ. 8 లక్షలు తీసుకున్నామని ఇప్పుడు కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట కుందా నెల్లూరు గ్రామానికి చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. ఇంటికొచ్చాక ఫోన్ చూసి ఎల్లయ్యకు మతిపోయే విషయం చెప్పారు కుటుంబ సభ్యులు. ఎల్లయ్య అకౌంట్కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అకౌంట్కేనని తెలిసింది. దీంతో ఎల్లయ్య టీడీపీ నేతలను నిలదీశాడు. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. ఫేక్ ప్రామిసరీ నోట్తో?విషయం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీకి చెందిన కొందరు నేతలే ఈ స్కాంను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్రమార్కులు కొత్త డ్రామాకు దిగారు. బాధితుడు ఎల్లయ్యకు బావమరిది అయిన శశికుమార్కు అప్పు ఇచ్చామని, ఆ సొమ్మునే వడ్డీతో సహా తాము తీసుకున్నామని చెబుతూ ఓ ప్రామిసరీ నోటును చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. తనకు అన్యాయం జరిగిందని చెప్పిన బాధితుడితోనే బలవంతంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని.. తన బావమరిది నిజంగానే అప్పు తీసుకున్నాడంటూ చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే.. శశికుమార్ వివరణతో టీడీపీ నేతల చిల్లర వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. తాను ఎలాంటి అప్పు చేయలేదని.. పైగా ఆ ప్రామిసరీ నోట్లో సంతకం తెలుగులో ఉందని.. తాను ఇంగ్లీష్లో సంతకం చేస్తానని.. ఆ నోట్ ఫేక్ అని శశికుమార్ వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు తప్పు మీద తప్పు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.చంద్రబాబుకు సీపీఐ లేఖరాజంపేటలో వెలుగు చూసిన కుంభకోణం నేపథ్యంలో.. సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల సంగతి తేల్చాలంటూ సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఓ లేఖ రాశారు. టీడీపీ నేతలకు సీఎం సహాయక నిధి ఒక ఆదాయ వనరుగా మారిందన్నారు తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ‘‘మీ పార్టీలో ఒక టీం ఇదే పనిగా పెట్టుకుంది. అధికారులు కూడా వీళ్లకు సహకరిస్తున్నారు. ఒక్క రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాల్లో తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి సహాయ నిధులతో జేబులు నింపుకుంటున్నారు. ఆర్థిక సహాయం ఎంత అందినా.. రూ.6 లక్షలే ఇస్తామని టీడీపీ నేతలు చెబుతుండడం దోపిడీకి పరాకాష్ట. తమకు ఖర్చులు ఉంటాయని.. అందరికీ పర్సంటేజ్లు ఇవ్వాలని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్న మీ పార్టీ నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’’ అని చంద్రబాబును ఈశ్వరయ్య లేఖలో కోరారు. -
'మావిగన్' దెబ్బకు మైండ్ బ్లాంక్..
-
నా పాదయాత్రలో బాబుకి రోజుకో సినిమా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. మన పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ(సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ) ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
మావిగన్పై మరోసారి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్ను మావిగన్(MAVIGUN)ను సూచించాం. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ అన్నారు. -
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఓ లేఖ రాశారాయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గపు మాటలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినవి దుర్మార్గపు వ్యాఖ్యాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో ఆయన కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మరోసారి స్పందించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల భార్యల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గంగా మాట్లాడారు. రాధాకృష్ణ మాట్లాడింది తప్పని చెప్పకుండా.. చంద్రబాబు, లోకేష్, పవన్లు సమర్థిస్తారా?. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. కూటమి నేతలే మహిళల్ని వేధిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తే.. బాధిత మహిళను పోలీసుల సమక్షంలోనే కొట్టారు. ఎస్పీ ఆఫీసులోకి ఎమ్మెల్యే చొరబడడం ఏంటి?. దానికి చంద్రబాబు పంచాయితీ చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధించిన కూన రవిపై చర్యలేవి?. మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అహ్మద్పై చర్యలేవి?. మంత్రి సంధ్యారాణి పీఏ మీద ఏం చర్యలు తీసుకున్నారు?. తిరిగి బాధిత మహిళపైనే కేసులు పెట్టారు. టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో ఆడుకుంటే చర్యలు లేవు. పైగా చంద్రబాబు ఆయన్ని తన వెంటేసుకుని తిరుగుతున్నారు. ఒకర్ని చూసుకుని ఇంకొకరు తయారయ్యారు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
-
Butta Renuka: ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు.. నీ కుట్రలకు ఎవ్వరూ భయపడరు
-
కూటమికి మేకు దించుతాం.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
డిజైన్లకు ఏకంగా 401 కోట్ల 54 లక్షల రూపాయలు... ‘అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్’ డిజైన్ల వ్యయంలో రికార్డు బద్ధలు కొట్టిన చంద్రబాబు సర్కారు


