Kutami Prabhutvam
-
నిద్ర లేచిన కూటమి ప్రభుత్వం.. సాయి కృష్ణ కేసులో CI సస్పెండ్
-
వంగలపూడి అనితపై వేటు..?
-
ఫేస్ బుక్ అకౌంట్ బ్లాక్ చేసింది వాళ్లే ఇదిగో ప్రూఫ్స్ ...?
-
పెన్షన్ దారులకు బిగ్ షాక్ ఇచ్చిన చంద్రబాబు..!
-
YSRCP నేతలు మీడియాతో మాట్లాడద్దు..! కూటమి వింత ఆంక్షలు
-
జిత్తులమారి లెక్కలు.. కూటమి అవినీతి బయటపెట్టిన కేంద్రం
-
ఆర్టీసీని ప్రైవేటీకరించే కుట్రలో కూటమి రంగం సిద్ధం
-
వైఎస్ జగన్ సంచలన ట్వీట్
సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి సంచలన ట్వీట్ చేశారు. ఏపీ చరిత్రలోనే అతిపెద్ద కుంభకోణంగా డీఎస్సీ రిక్రూట్మెంట్ను అభివర్ణిస్తూ కూటమి ప్రభుత్వంపై ఆయన ధ్వజమెత్తారు. చంద్రబాబు, నారా లోకేశ్లు కలిసి ఓ మెగా స్కామ్కు రూపకల్పన చేసిన పాలసీ ప్రాజెక్ట్ అని ఘాటుగా విమర్శలు గుప్పించారు. అలాగే.. ఈ వ్యవహారంపై థర్డ్ పార్టీ ఏజెన్సీతోనే విచారణ జరిపించాలంటూ ఆయన డిమాండ్ చేశారు.వైఎస్ జగన్ ఎక్స్లో ఇలా ట్వీట్ చేశారు.. ఏపీలో 16,000 టీచర్ పోస్టుల భర్తీ కోసం చేపట్టిన డీఎస్సీ ప్రక్రియలో పారదర్శకతను కాపాడే పాత వ్యవస్థను చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా ధ్వంసం చేసింది. ప్రశ్నపత్రాల తయారీ, పరీక్ష నిర్వహణ వంటి కీలక బాధ్యతలను వేర్వేరు విభాగాల నుంచి తొలగించి, SCERT డైరెక్టర్కు కేంద్రీకరించడం ద్వారా ఒకే చోట అధికారం కేంద్రీకృతమైంది. దీని వల్ల అక్రమాలకు దారి తీసింది.అలాగే, అత్యంత గోప్యంగా ఉండాల్సిన ప్రశ్నపత్రాల తయారీ, అప్లోడ్ పనులను ఔట్సోర్సింగ్ సిబ్బందికి అప్పగించడం తీవ్రమైన లోపమని జగన్ పేర్కొన్నారు. ఈ ప్రక్రియలో పాల్గొన్న ఒక ఔట్సోర్సింగ్ ఉద్యోగి అదే పరీక్షలో టాప్ ర్యాంక్ సాధించడం “పేపర్ లీక్కు స్పష్టమైన సంకేతం” అని ఆయన ప్రస్తావించారు. ఆ వ్యక్తికి తరువాత ఉద్యోగం ఇవ్వకపోవడం, అతని వివరాలను మెరిట్ లిస్టు నుంచి తొలగించడం వంటి అంశాలు అనుమానాలకు తావిస్తున్నాయని అన్నారు.మరోవైపు ఫలితాల ప్రకటనలో కూడా పారదర్శకత లేకపోయిందని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో మాదిరిగా కలెక్టర్ కార్యాలయాల్లో మెరిట్ లిస్టులు ప్రదర్శించకుండా, కేవలం ఆన్లైన్లో మాత్రమే ప్రకటించడం వల్ల అభ్యర్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని ఆయన అన్నారు. సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తయినప్పటికీ తుది జాబితాలో పేర్లు లేకపోవడం “వ్యవస్థ వైఫల్యానికి నిదర్శనం” అని వ్యాఖ్యానించారు.క్రీడా కోటా నియామకాల విషయంలో కూడా పెద్ద మార్పులు చేసి, పరీక్ష రాయకుండానే నియామకాలు జరిపేలా విధానాలను మార్చారని, తరువాత ఆ విధానాన్ని తిరిగి వెనక్కి తీసుకోవడం ద్వారా “బ్యాక్డోర్ ఎంట్రీకి దారి తీసిన విధాన ప్రయోగం” జరిగిందని జగన్ కూటమి ప్రభుత్వంపై మండిపడ్డారు. ఈ క్రమంలోనే.. వెలుగులోకి వచ్చిన ఒక వీడియో ఘటనను కూడా ఆయన ప్రస్తావించారు. టీచర్ పోస్టు కోసం జరిగిన బేరసారాల వీడియోను పోస్ట్ చేశారు. అయితే ఈ వీడియోపై కేవలం టోకెన్ కేసు నమోదు చేసి, సరైన దర్యాప్తు జరిపించలేదని జగన్ పేర్కొన్నారు.ఈ మొత్తం డీఎస్సీ ప్రక్రియను “దశలవారీగా జరిగిన బడా స్కామ్”గా అభివర్ణించిన వైఎస్ జగన్.. ప్రభుత్వ యంత్రాంగం పారదర్శకతను కోల్పోయిందని అన్నారు. రాష్ట్రంలోని దర్యాప్తు సంస్థలు ప్రభుత్వ నియంత్రణలో ఉన్నందున నిజాలు వెలికితీయడానికి స్వతంత్ర సంస్థ అయిన సీబీఐ విచారణ తప్పనిసరి అని ఆయన డిమాండ్ చేశారు. ఇదిలా ఉంటే.. తాజాగా ఆయన నిర్వహించిన ప్రెస్మీట్లో ఈ అంశాల్నే ప్రధానంగా ప్రస్తావించడం గమనార్హం.The so-called 'Mega' DSC was a carefully engineered policy sketch for a 'Mega' scam, a dark operation by CM Chandrababu and his son Nara Lokesh as Minister-in-charge, grievously damaging the lives of meritorious aspirants. Lakhs of aspirants are in anguish today, shedding tears… pic.twitter.com/8yZ6jvhPwb— YS Jagan Mohan Reddy (@ysjagan) June 13, 2026 -
ప్యాకేజీ స్టార్ కాదు.. ఇప్పుడు క్యాబేజీ స్టార్!
సాక్షి, తిరుపతి: సూపర్ సిక్స్ హామీలన్నీ గాలికి కొట్టుకుపోయానని.. వెన్నుపోటు వీరుడు చంద్రబాబు మహిళలను సైతం మోసం చేశారని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి రోజా అన్నారు. నగిరి నియోజకవర్గంలో ఆమె ఆధ్వర్యంలో గురువారం వైఎస్సార్సీపీ "వెన్నుపోటుకు రెండేళ్లు" నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా భారీ బైక్ ర్యాలీ చేపట్టిన ఆమె.. కూటమి ప్రభుత్వ రెండేళ్ల పాలనపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు.ప్రజలకు ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను చంద్రబాబు పూర్తిగా గాలికొదిలేశారని రోజా అన్నారు. ఎన్నికల సమయంలో ప్రజలకు ఎన్నో హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తర్వాత వాటి అమలుపై దృష్టి పెట్టలేదని విమర్శించారు. ఈ సందర్భంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్పైనా ఆమె వ్యంగ్యాస్త్రాలు సంధించారు.ఒకప్పుడు ప్యాకేజీ స్టార్గా ఉన్న పవన్.. ఇప్పుడు క్యాబేజీ స్టార్గా మారిపోయారని ఆమె ఎద్దేవా చేశారు. ప్రజా సమస్యలపై స్పందించాల్సిన వ్యక్తి.. తన బాధ్యతలను విస్మరించారన్నారు. సుగాలి ప్రీతి కేసులో న్యాయం చేస్తానని గతంలో ప్రకటించిన పవన్.. ఇప్పటి వరకు బాధిత కుటుంబానికి న్యాయం చేయలేదని రోజా గుర్తుచేశారు. ఇక.. మహిళల సంక్షేమం విషయంలోనూ కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని రోజా విమర్శించారు. మహిళలకు అండగా ఉంటామని చెప్పిన చంద్రబాబు సర్కార్.. చివరకు వారికే వెన్నుపోటు పొడిచిందని వ్యాఖ్యానించారు.అలాగే వైఎస్ జగన్ మోహన్రెడ్డి పాలనతో పోల్చుకుంటే.. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వం 10 శాతం పనితీరును కూడా సాధించలేకపోయిందని అన్నారామె. కరోనా వంటి క్లిష్ట పరిస్థితుల్లో కూడా వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను అమలు చేశారని, కానీ ప్రస్తుత ప్రభుత్వం సాధారణ పరిస్థితుల్లోనూ హామీలను నెరవేర్చలేకపోతోందని రోజా మండిపడ్డారు. ఈ నిరసన సందర్భంగా అందరికీ చంద్రబాబు పంగనామాలు పెట్టారంటూ సింబాలిక్గా నిరసనలు నిర్వహించారామె. -
కూటమి అవినీతి.. సంచలన ఆధారాలతో TDP ఎమ్యెల్యే
-
తిరుపతిలో పొలిటికల్ హీట్
సాక్షి, తిరుపతి: నియోజకవర్గంలో ఇవాళ రాజకీయ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో ‘‘వెన్నుపోటుకు రెండేళ్లు" అంటూ వైఎస్సార్సీపీ భారీ నిరసన కార్యక్రమాలు చేపట్టబోతోంది. అదే సమయంలో.. ఎన్డీయే విజయోత్సవ సభను నిర్వహిస్తుండడం.. దానికి కూటమి పెద్దలు హాజరు అవుతుండడం చర్చకు దారి తీసింది.తిరుపతిలో పొలిటికల్ హీట్ నెలకొంది. అధికార ఎన్డీయే కూటమి నిర్వహిస్తున్న విజయోత్సవ సభకు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్, మంత్రి నారా లోకేశ్ హాజరవుతున్నారు. అదే సమయంలో ఇటు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు భూమన కరుణాకర్రెడ్డి, ఆయన తనయుడు భూమన అభినయ్రెడ్డి ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించేందుకు వైఎస్సార్సీపీ ఏర్పాట్లు చేసింది.చంద్రబాబు వెన్నుపోటుకు రెండేళ్లు నిరసన కార్యక్రమాల షెడ్యూల్ను వైఎస్సార్సీపీ ముందుగానే ప్రకటించిన సంగతి తెలిసిందే. గురువారం ప్రెస్మీట్లో కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా చేయాలని పార్టీ కేడర్కు, ప్రజలకు పిలుపు కూడా ఇచ్చారు. అయితే..వైఎస్సార్సీపీ కార్యక్రమాలు జరగనున్న రోజునే తిరుపతి సమీపంలోని దామినీడులో ఎన్డీయే విజయోత్సవ సభ ఏర్పాటు కావడం రాజకీయంగా ప్రాధాన్యం సంతరించుకుంది. రెండు పక్షాలు ఒకేసారి భారీ కార్యక్రమాలకు సిద్ధమవుతుండటంతో జిల్లా యంత్రాంగం అప్రమత్తమైంది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా వెయ్యి మందికి పైగా పోలీసులను మోహరించినట్లు సమాచారం. కీలక కూడళ్లు, సభా ప్రాంగణాలు, ర్యాలీ మార్గాల్లో భారీ భద్రతా ఏర్పాట్లు చేపట్టారు. -
మానవత్వం చూపించాల్సిన చోట అమానవీయంగా ప్రవర్తిస్తారా?
సాక్షి, విశాఖపట్నం: వైజాగ్ స్టీల్ప్లాంట్ కార్మికుల పరిస్థితిపై అందరూ ఆలోచించాల్సిన తరుణం వచ్చిందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. ఇక్కడి కార్మికులకు తొలి నుంచి అండగా నిలిచింది వైఎస్సార్సీపీనేనని.. ఇప్పుడు కూటమి పాలనలో వాళ్ల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైందని అన్నారాయన. బుధవారం సెవెన్హిల్స్ ఆస్పత్రిలో విశాఖ స్టీల్ప్లాంట్ ప్రమాద బాధితులను పరామర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు.స్టీల్ ప్లాంట్ ప్రమాదం బాధాకరం. ప్రమాదంలో 9 మంది చనిపోయారు. గాయపడ్డ ఐదుగురిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. 95 శాతం కాలిన గాయాలతో ఒకరు చికిత్స పొందుతున్నారు అని ఆయన అన్నారు. వైఎస్సార్సీపీ హయాంలో కార్మికుల పరిస్థితి ఎలా ఉంది?.. కూటమి హయాంలో ఎలా ఉందో గమనించాలి. విశాఖ స్టీల్ప్లాంట్ ప్రైవేటీకరణను వైఎస్సార్సీపీ అడ్డుకుంది. ఈ విషయంలో గట్టిగా పోరాటం చేశాం. ప్రైవేటీకరణ వద్దని ప్రధాని మోదీకి రెండు లేఖలు రాశాం.(2021 ఫిబ్రవరి 6, మార్చి 9న రాసిన నాటి లేఖలను ఆయన చదివి వినిపించారు). ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా అసెంబ్లీలో తీర్మానం కూడా చేశాం అని గుర్తు చేశారాయన. మా ప్రభుత్వం దిగిపోయే నాటికి 28 వేల మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. కానీ, ఈ రెండేళ్లలో 10,500 మందిని తొలగించారు. 6,500 మంది కాంట్రాక్ట్ ఉద్యోగులను తొలగించారు. వీఆర్ఎస్ పేరుతో 1,800 మందిపై ఒత్తిడి చేశారు. మొత్తంగా.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల సంఖ్యను 16 వేలకు కుదించారు. కూటమి హయాంలో.. స్టీల్ ప్లాంట్ ఉద్యోగుల పరిస్థితి దారుణంగా ఉంది. నాలుగు నెలల జీతాలు బకాయిలు పెట్టారు. ఉద్యోగుల జీతాలకు ప్రొడక్షన్కు లింకు పెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో ఉద్యోగుల క్వార్టర్స్లో యూనిట్ విద్యుత్కు 50 పైసలే చార్జ్ చేసేవాళ్లం. కూటమి వచ్చాక యూనిట్కు రూ.8.50పైసలకు పెంచారు. ఉద్యోగుల్ని క్వార్టర్స్ను వదిలిపోయేలా చేశారు. బోనస్, మెడికల్ ఫెసిలిటీస్ ఏం లేవు. ప్యాకేజీ ఇచ్చామని కూటమి పెద్దలు చెబుతున్నారు. అది మెయింటెనెన్స్ కోసం కాదు.. బలవంతంగా బయటకు పంపేందుకు ఇచ్చిన ప్యాకేజీ. ఉద్యోగుల బాగోగుల కోసం ఏ ప్యాకేజీ ఇవ్వలేదు అని వైఎస్ జగన్ అన్నారు. ఇంత దారుణమా?స్టీల్ ప్లాంట్ ప్రమాదానికి ఉద్యోగులు కారణం కాదు. లిక్విడ్ మెటల్ బ్లాస్ట్ అవ్వడంతోనే జరిగింది. కానీ, కేంద్ర, రాష్ట్రాలు స్పందిస్తున్న తీరు దారుణం. 14 నెలల కిందట ఇదే తరహాలో ప్రమాదం జరిగింది. పెంటయ్య అనే కార్మికుడు మరణించాడు. నెలలోపే ఉద్యోగం ఇస్తామని మాట ఇచ్చారు. ఇప్పటి వరకు పరిహారం కూడా ఇవ్వలేదు.. ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదు అని జగన్ గుర్తు చేశారు. అధికారుల్ని అడిగితే ఫైల్ పోయిందని అంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇంత దారుణంగా వ్యవహరిస్తోంది. లోకేశ్ అసలు మనిషేనా?ఇంత ప్రమాదం జరిగితే.. ఇలాంటి సమయంలో మానవత్వం చూపించాలి. చంద్రబాబు నాయుడు తనయుడు, మంత్రి లోకేశ్ దారుణంగా మాట్లాడారు. నిన్న ఆయన మాటలు చూస్తే ఆశ్చర్యం వేసింది. లోకేశ్ లాంటి మనుషులు కూడా ఉంటారా? అనిపించింది. బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏం పరిహారం ఇస్తారో చెప్పమంటే కూడా స్పందించలేదు అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు.ప్రమాద బాధితులకు పరిహారం విషయంలో మంత్రి నారా లోకేష్ చాలా విచిత్రంగా మాట్లాడాడు. ప్రమాదంలో చనిపోయిన ఉద్యోగుల కుటుంబాలకు మొత్తం రూ.1.72 కోట్లు వస్తాయని చెబుతున్నావు. అది రెగ్యులర్గా వచ్చేది. ‘బోడి’ మీరిచ్చేది ఏమిటి? మరి ప్రభుత్వం నుంచి ఏం ఇస్తున్నట్లు? ఆ రూ.1.72 కోట్లు అది వారి హక్కు. ఇంకా ఉద్యోగులకు రావాల్సిన గ్రూప్ ఇన్సూరెన్స్, ప్రావిడెంట్ ఫండ్, గ్రాట్యుటీ, రిస్క్ ఇన్సూరెన్స్.. అన్నీ కలిపి రూ.1.45 కోట్లు వస్తాయి. మరోవైపు సంస్థ తన వంతుగా రూ.25 లక్షలు ఇస్తుంది. ఇంకా ప్రధాని సహాయనిధి నుంచి రూ.2 లక్షల చొప్పున వస్తుంది. మరి ‘బోడి’ రాష్ట్ర ప్రభుత్వం ఏమిస్తోంది. మీకు మీరుగా ఒక్క రూపాయి కూడా ఇవ్వడం లేదు. వాళ్లకు హక్కుగా వచ్చేది వస్తోంది తప్ప, రాష్ట్ర ప్రభుత్వంగా మీరు ఇస్తున్నది ఏమీ లేదు.ఇదీ చదవండి: మీ ఇంట్లో ఎవరూ చనిపోలేదు కదా!మీరు ఇవ్వకుంటే.. మేమొచ్చాక ఇస్తాంగతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఈ తరహాలోనే ఫ్యాక్టరీ ప్రమాదం జరిగినప్పుడు స్పాట్లో రూ.కోటి రూపాయల పరిహారం అందించాం. బాధిత కుటుంబాలకు తక్షణమే ఆదుకున్నాం. మరి ఇప్పుడు చంద్రబాబు ప్రభుత్వ స్పందిస్తున్న తీరు దారుణంగా ఉంది. బాధితులకు రావాల్సినవి కాకుండా మీరు ఏం చేస్తున్నారు?. రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఒక్క రూపాయి ప్రకటించలేదు. కేంద్రం, పీఎం రిలీఫ్ ఫండ్ నుంచే పరిహారం ప్రకటించారంతే. స్టీల్ప్లాంట్ బాధితులకు కూటమి ప్రభుత్వం కోటి రూపాయల పరిహారం ఇవ్వాలి. బాధిత కుటుంబాలకు ఉద్యోగం కూడా ఇవ్వాలి. చంద్రబాబు ప్రభుత్వం ఆ పని చేయకుంటే.. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ పరిహారం మేమే అందిస్తాం అని వైఎస్ జగన్ ప్రకటించారు. -
కూటమి నిర్లక్ష్యమే ఉక్కు ప్రమాదానికి కారణమా....!
-
ప్రజలను ముంచిన ప్రభుత్వం కూటమి నల్ల చొక్కా వేసుకొని నిరసన తెలిపిన భూమన
-
ఉత్త ప్రచారానికే 40 కోట్లు!
ప్రభుత్వ పాలనలో పారదర్శకత ఒకవైపు, ప్రచార వ్యూహాలు మరోవైపు ఉండే సున్నితమైన సరిహద్దు ఇప్పుడు మరోసారి చర్చకు దారితీసింది. ఏపీలో సోషల్ మీడియా ప్రచారం పేరుతో భారీ నిధుల కేటాయింపు జరిగిందన్న అంశం రాజకీయ వర్గాల్లోనూ, నెటిజన్ల మధ్యనూ తీవ్ర చర్చకు కారణమవుతోంది.సాక్షి, విజయవాడ: చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం డిజిటల్ పబ్లిసిటీ కోసం తాజాగా పరిపాలనా అనుమతులు జారీ చేసింది. సోషల్ మీడియా వేదికల ద్వారా ప్రచారం కోసం దాదాపు 40 కోట్ల రూపాయల నిధులు విడుదల చేసినట్లు తెలుస్తోంది. ఈ నిధులను డిజిటల్ కార్పొరేషన్ ద్వారా వినియోగించనున్నట్లు అధికార వర్గాలు పేర్కొంటున్నాయి.అయితే ప్రచారం కోసం ఇంత భారీ వ్యయం ఇప్పుడు అవసరమా? అనే చర్చ జోరందుకుంది. రాష్ట్ర ఆర్థిక పరిస్థితి, అప్పుల భారంపై ఇప్పటికే విమర్శలు కొనసాగుతున్న నేపథ్యంలో.. ఈ నిర్ణయం మరింత రాజకీయ చర్చకు దారితీసింది. అంతేకాకుండా ప్రధాని మోదీ సూచించిన పొదుపు సూత్రాలను పాటిస్తామని గతంలో చంద్రబాబు ప్రకటించిన విషయాన్ని ప్రస్తావిస్తూ.. ఇప్పుడు భారీ ప్రచార వ్యయంపై విపక్షాలు విమర్శలు గుప్పించే అవకాశం లేకపోలేదు.చంద్రబాబు కూటమి అధికారంలోకి వచ్చి తాజాగా రెండేళ్లు పూర్తైంది. ఈ కాలంలో ఏపీలో అభివృద్ధి, సంక్షేమం.. రెండూ పడకేశాయి. ఈ పరిస్థితుల్లో ప్రజా ప్రయోజనాలకన్నా వ్యక్తిగత ప్రచారానికే ఎక్కువ ప్రాధాన్యం ఇస్తున్నారన్న వాదన కూడా ముందుకు వస్తోంది. ఇప్పటికే టీడీపీ అనుకూల మీడియా, సోషల్ మీడియా టీంలు చంద్రబాబు విషయంలో ఎంత హడావిడి చేస్తున్నదో తెలిసిందే. ఇప్పుడు ప్రభుత్వ విభాగం ద్వారా ఆ పనిని ముమ్మరం చేయాలని చంద్రబాబుకు తనయుడు, మంత్రి నారా లోకేష్ సూచించినట్లు తెలుస్తోంది. మరోవైపు దుబారా విమర్శను అంగీకరించకుండా.. డిజిటల్ యుగంలో ప్రభుత్వ కార్యక్రమాలు ప్రజలకు వేగంగా చేరాలంటే సోషల్ మీడియా ప్రచారం అవసరమేనని అధికార వర్గాలు సమర్థించుకుంటున్నాయి. -
చంద్రబాబుకి షాకిచ్చిన రాజధాని రైతులు
సాక్షి, తాడేపల్లి: అమరావతి రాజధాని భూముల అంశం మరోసారి రాష్ట్ర రాజకీయాల్లో వేడి రాజేసింది. భూసేకరణను వ్యతిరేకిస్తూ రాజధాని రైతులు వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డిని కలిసేందుకు సిద్ధమయ్యారు. అయితే ఈ సమయంలోనే ఉన్నపళంగా ఆ గ్రామాల్లో సీఆర్డీఏ గ్రామసభ నిర్వహించడం తీవ్ర దుమారం రేపింది. ఇది “కుట్ర రాజకీయాలే”నని చెబుతూ.. చంద్రబాబు సర్కార్కు రైతులు షాకిచ్చారు. గ్రామసభల్ని బహిష్కరిస్తూ నిర్ణయం తీసుకున్నారు. రాజధాని ప్రాంత రైతులు మరోసారి తమ సమస్యలతో రోడ్డెక్కారు. పెనుమాక, ఉండవల్లి ప్రాంత రైతులు తమ భూములపై కొనసాగుతున్న వివాదాలు, నోటిఫికేషన్లు, నోటీసులపై తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమకు తెలియకుండానే భూసేకరణ నోటిఫికేషన్లు జారీ చేశారని, భూములు ఇవ్వాల్సిందేంటూ అధికారులు ఒత్తిడి తెస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారు.తమ సమస్యలను నేరుగా మాజీ సీఎం వైఎస్ జగన్కు చెప్పుకోవడానికి రైతులు సిద్ధమవుతున్న తరుణంలోనే హఠాత్తుగా పెనుమాకలో సీఆర్డీఏ అధికారులు గ్రామసభ నిర్వహించడం మరింత చర్చనీయాంశంగా మారింది. “రాజధానికి భూమి ఇవ్వాలి” అనే పేరుతో సమావేశాలు పెట్టి తమపై ఒత్తిడి తెస్తున్నారని రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.జగన్తో సమావేశం ఉన్న రోజే గ్రామసభ నిర్వహించడాన్ని రైతులు అనుమానాస్పదంగా చూస్తున్నారు. తమ గొంతు నొక్కే ప్రయత్నంగా ఇది మారిందని, ప్రభుత్వ వైఖరి వేధింపులుగా ఉందని వారు మండిపడుతున్నారు. అంతేకాదు.. గ్రామసభకు టీడీపీ నేతలను పిలవడంపైనా అభ్యంతరాలు వ్యక్తం చేశారు. రైతుల నిలదీతతో అధికారులు నీళ్లు నమిలారు. ఆపై చేసేది లేక టీడీపీ నేతలు, అధికారులు గ్రామసభ నిర్వహించకుండానే వెళ్లిపోయారు. ఇప్పుడు ఈ అంశంలో న్యాయం చేయాలని కోరుతూ రైతులు వైఎస్ జగన్ను కలవబోతున్నారు. మరోవైపు భూసేకరణ ప్రక్రియలో భాగంగా నోటీసులు ఇచ్చారని అధికారులు చెబుతున్నప్పటికీ, రైతులు మాత్రం “తొలి విడతలోనే భూములు ఇచ్చాం… మళ్లీ భూములు ఎలా ఇవ్వాలి?” అంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. భూములు లేకపోతే ఎలా బతికేదని ప్రశ్నిస్తున్నారు. ఈ పరిణామాల మధ్య తమ బాధలను నేరుగా జగన్ దృష్టికి తీసుకెళ్లేందుకు రైతులు ముందుకు రావడం, మరోవైపు అదే సమయంలో గ్రామసభ నిర్వహణకు ముందుకు రావడం.. ఆ సభను రైతులు బహిష్కరించడం.. రాజధాని రాజకీయాల్లో కొత్త దుమారానికి దారి తీసింది. -
చేతికి వచ్చి చేజారిన ఉద్యోగం... ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీలో బయటపడుతున్న లీలలు
-
ప్రతి టూర్లో ఓ సీన్.. ప్రతి సీన్కు ఓ ట్రోల్!
ఈ మధ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు, చేష్టలు విచిత్రంగా ఉంటున్నాయి. పొయ్యి వెలిగించకుండానే చేపల కూర వండడం మరీ విడ్డూరం. ఇలాంటి చేష్టలతో చంద్రబాబు ప్రజల దృష్టిలో మరీ పలుచనవుతున్నారు. ప్రజలను కలుసుకోవడం, వారి కష్ట సుఖాలు తెలుసుకునే ప్రయత్నం చేయడం తప్పు కాదు. కానీ.. వీటికి ఓ నాటకీయత అబ్బితేనే వస్తుంది సమస్య. ‘మత్సకారుల సేవ’ కార్యక్రమంలో భాగంగా ఆయన ఓ మత్సకార కుటుంబం ఇంటికి వెళ్లారు. వెళ్లడానికి ముందు ఒక నలుగురైదుగురు మత్సకార మహిళల నుంచి చేపలు కొంటున్న ఒక సీన్ సృష్టించారు. అక్కడ నుంచి ఆయన మత్సకారుడి ఇంటికి వెళ్లి చేపల కూర చేయించారు.ఆ క్రమంలో ఆ ఇల్లంతా కలియదిరిగారు. వారితో మాట కలిపారు. ఈ క్రమంలోనే అప్పటివరకూ కూర్చుని ఉన్న బాబు అకస్మాత్తుగా లేచి కిచెన్లో పొయ్యి మీద ఉన్న చేప ముక్కలను కలియ తిప్పారు. అప్పుడే కూర వండుతున్నట్లు కనిపించాలని అనుకున్నారు. కానీ.., స్టవ్ వెలిగించడం మర్చి పోయారు. దాంతో సోషల్ మీడియా దీన్ని ఒక లాఫింగ్ పీస్ చేసేసింది. స్టవ్ వెలిగించకుండానే చేపల కూర వండుతున్న ముఖ్యమంత్రి అని, సార్..స్టవ్ మర్చిపోయారు సార్..అని ఇదంతా డ్రామా, స్క్రిప్ట ప్రకారం షూట్ చేశారని మరి కొందరు కామెంట్లు చేశారు. ఆ తర్వాత ఆయన కూడా ఆ ఇంటివారితో కలిసి ఒక స్పూన్తో ఒకటి, రెండు ముక్కలు తీసుకున్నట్లు కనిపించింది. ఆయన ఇంటికి రావడానికి ముందు ఆ రహదారిలో ఎవరూ లేకుండా జాగ్రత్తపడ్డారు. కారు దిగినప్పటి నుంచి ప్రతి సన్నివేశంలో ఆయన నటించారన్న భావన సోషల్ మీడియాలో వ్యక్తం అయింది. ఎందుకంటే తొలి నుంచి ఆయన కెమెరా మైక్ పెట్టుకుని ఉంటే, మత్సకార కుటుంబంలో కూడా ఒకరిద్దరికి మైక్ పెట్టి ఉందట. ఈ రకంగా చేయడం వల్ల ప్రజలకు వచ్చే లాభం ఏమిటి? అన్న చర్చ జరగవచ్చు. ముఖ్యమంత్రి జనసామాన్యంలో కలిసి పోతున్నారు అనిపించుకోవడానికి ప్రయత్నిస్తున్నట్లుగా ఉంది. 2024లో నాలుగోసారి ముఖ్యమంత్రి అయ్యాక చంద్రబాబుకు తనపై తనకే అంత నమ్మకం ఉన్నట్లు లేదు. చేసిన వాగ్దానాలను అమలు చేయలేకపోయారు. దాంతో ఆత్మరక్షణలో పడిపోయి ఇలాంటి జిమ్మిక్కులు చేసి ప్రజలను డైవర్ట్ చేయాలని అనుకుంటున్నట్లు ఉంది. కాని ఆ స్క్రీప్ట్లో పొరపాటు వల్ల దొరికిపోతున్నారన్న అభిప్రాయం పలువురు వ్యక్తం చేస్తున్నారు. టీ షాపుకు వెళ్లడం, ఒక ఇంటికి వెళ్లి తానే టీ, కాఫీ తయారు చేస్తున్నట్లు కనిపించడం, టీ తయారీ గురించి చర్చిస్తుండడం, ఒక బడ్డీ కొట్టు వద్దకు వెళ్లడం, తాటి ముంజెలు కొనుగోలు చేసి సతీసమేతంగా తినడం, జగన్ టైమ్లో నిర్మించిన గృహానికి వెళ్లి అక్కడ నేమ్ ప్లేట్ పెట్టడం తదితర దృశ్యాలు సోషల్ మీడియాను బాగానే ఆకర్షిస్తాయి. కాని అంతిమంగా ఆయనకు అది రాజకీయ ప్రయోజనం కలిగించడం లేదు. ప్రతిసారి నటిస్తున్నారన్న వ్యంగ్యోక్తులకు గురి అవుతున్నారు. ఈ వయసులో ఇన్ని విన్యాసాలు అవసరమా అని మరికొందరు ప్రశ్నిస్తున్నారు. అయితే ఈ సందర్భంగా కొన్ని ఇబ్బందికర పరిస్థితులు కూడా ఎదురయ్యాయి. ఒక ఇంటికి వెళ్లినప్పుడు వారు తమకు పెన్షన్ రావడం లేదని, మరో చోట్ సొంత ఇల్లు లేదని, ఇంకోచోట తనకు ఉద్యోగం ఇప్పించాలని కోరుకున్నారు. సంబందిత జిల్లా కలెక్టర్కు వాటిని నెరవేర్చాలని ఆయన ఆదేశాలు ఇచ్చి వెళ్లిపోతున్నారు. కాని కొన్నిసార్లు అవి ఏ కారణం వల్లనైనా కాని అమలు కావడం లేదట.దాంతో ఈ మధ్య ఒక వ్యక్తి తనకు సీఎం వాగ్దానం చేసి ఆరు నెలలు అయినా అది నెరవేరలేదంటూ రోడ్డుపై ఆందోళనకు దిగాడు. ప్రతి నిత్యం ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ ల ద్వారా ఎక్కడో చోటకు వెళ్లినప్పుడు ఆయన ఏదో ప్రత్యేక కార్యక్రమం పెట్టుకుని జనాన్ని ఆకర్షించడానికి తెగ ఆరాటపడుతున్నారు. అందుకు తగ్గ ఏర్పాట్లు చేసుకుంటున్నారు కాని, కొన్నిసార్లు అవి వికటించి లాఫింగ్ స్టాక్ అవుతున్నాయని కొందరు టీడీపీ కార్యకర్తలు బాధపడుతున్నారు. గత అనుభవాల రీత్యానేమో తెలియదు కాని, ఇటీవల ఆయన వెళ్లిన ఇంటిలో ఉన్నవారిని మీకేం కావాలని అడుగుతున్నట్లు కనిపించలేదు. ఏదో పిచ్చాపాటి కబుర్లు చెప్పి వచ్చేస్తున్నారు. కాసేపు ఆ కుటుంబం వారితో పొగిడించుకుంటున్నారు.నిజానికి ఇలాంటి సందర్భాలలో తన ప్రభుత్వం గురించి వారు ఏమి అనుకుంటున్నది అడిగి అభిప్రాయ సేకరణ చేసుకుంటే బాగుండేది. తాను సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అంటున్న నేపథ్యంలో వారు కూడా అలాగే ఫీల్ అవుతున్నారా?లేదా? అన్నది తెలుసుకుని ఉండాల్సింది. ఇవన్ని మైక్ పెట్టుకుని అడగడం ఇబ్బంది కనుక, వారితో వ్యక్తిగతంగా మాట్లాడి జనాభిప్రాయం గమనించి ఉండాల్సింది. ఆడబిడ్డ నిధి కింద ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పినా, ఇవ్వలేకపోతున్నానని, అయినా మీరు సంతృప్తిగానే ఉన్నారా అని ప్రశ్నించి ఉండాల్సింది. చంద్రబాబు నాయుడు 1995లో ముఖ్యమంత్రి అయ్యాక ప్రజలలో తన పరపతి పెంచుకోవడం కోసం ఆకస్మిక తనిఖీల పేరుతోనో, మరో పేరుతోనో టూర్ చేస్తుండే వారు. తొలుత సీరియస్ గానే జరిగినా, రాను, రాను అవి కూడా షో పుటప్ల గానే మారిపోయాయి. కావలి వద్ద ఉన్న జువ్వలదిన్నె సందర్శించడానికి కూడా కారణం లేకపోలేదు. అంతకు కొద్దిరోజుల ముందు మాజీ సీఎం వైఎస్ జగన్ అక్కడకు వెళ్లి ప్రభుత్వానికి ఒక వార్నింగ్ ఇచ్చారు. జగన్ హయాంలో నిర్మించిన ఫిషింగ్ హార్బర్ భూమి లో కొంత భాగాన్ని ఒక ప్రైవేటు సంస్థకు అప్పగించడాన్ని ఇటు మత్సకారులు వ్యతిరేకిస్తున్నారు. అలాగే తమిళనాడు నుంచి కొందరు వచ్చి దొంగచాటుగా ఆంధ్ర ప్రాంత మత్స్య సంపదను కొల్లగొడుతుంటే, వారిని పట్టుకుని బోట్లను స్వాధీనం చేసుకున్నారు. కాని తదుపరి ఏపీ ప్రభుత్వం వాటిని వదలివేయడంపై తీవ్ర అసంతృప్తి ఏర్పడింది. టీడీపీ ఎంపీ, పి బీదా మస్తాన్ రావు ప్రోద్బలంతోనే బోట్లు వదలి వేశారని మత్స్య కారులు అప్పట్లో ఆరోపించారు. ఈ క్రమంలో ఆ మత్సకారుల వద్దకు జగన్ వెళ్లి వారికి భరోసా ఇచ్చి వచ్చారు. లోకేశ్ జువ్వలదిన్న సందర్శిన తర్వాతే కొద్ది రోజులకు బోట్లను వదలి వేశారని జగన్ ఆరోపించారు. ఫిషింగ్ హార్బర్ స్థలాన్ని కొంతమేర ప్రైవేటుకు కట్టబెడితే ఊరుకోబోమని, తాను అధికారంలోకి వచ్చాక దానిని స్వాధీనం చేసుకుని మత్సకారలకే కేటాయిస్తామని హామీ ఇచ్చారు. జగన్ సభకు జనం వెళ్లకుండా ప్రభుత్వం ఎంత కట్టడి చేసినా, అది బాగా సక్సెస్ అయింది. ఈ నేపథ్యంలో దాని ప్రభావం రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న మత్సకార వర్గంపై పడకుండా ఉండేందుకు చంద్రబాబు ఈ ప్రయత్నం చేశారనిపిస్తుంది. ఆ క్రమంలోనే తీరం మనదే, బోటు మనదే, వేట మనదే అంటూ పంచ్ డైలాగులు చెప్పి తృప్తి పరచడానికి యత్నించారు. ఆ రకంగా జగన్ రాక తమకు ఉపయోగపడిందని, చంద్రబాబు ఈ మాటలు అనక తప్పలేదని మత్సకారులు భావిస్తున్నారు. అది నిజమే అనిపిస్తుంది.1983లో ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీని స్థాపించినప్పుడు తరచుగా వివిధ చిత్రమైన రీతులలో కనిపించే వారు. రోడ్డుపై స్నానం చేస్తున్న ఫోటోలు అప్పట్లో బాగా పాపులర్ అయ్యాయి. ఆ రోజుల్లో కాంగ్రెస్ లో మంత్రిగా ఉన్న చంద్రబాబు.. సినీ నటుల పార్టీని ఎవరు పట్టించుకుంటారని విమర్శించే వారు. సీన్ కట్ చేస్తే ఆ తర్వాతి కాలంలో ఆయనే టీడీపీని కైవసం చేసుకుని, తానే రాజకీయంగా రకరకాల సన్నివేశాలలో నటిస్తుండడం విశేషం. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
వైఎస్సార్సీపీ కీలక సమావేశం.. జగన్ స్పీచ్ హైలైట్స్
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ విస్తృతస్థాయి సమావేశం జరిగింది. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో బుధవారం ఉదయం జరిగిన ఈ సమావేశానికి కీలక నేతలు, పార్టీ రీజనల్ కో–ఆర్డినేటర్లు, జిల్లా అధ్యక్షులు, ఎంపీలు, పార్లమెంట్ కో–ఆర్డినేటర్లు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కో–ఆర్డినేటర్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా పలు కీలకాంశాలపై ఆయన కేడర్కు దిశానిర్దేశం చేశారు.. వైఎస్ జగన్ స్పీచ్ హైలైట్స్చంద్రబాబు రెండేళ్ల పాలన ఎలా ఉందో అందరికీ తెలుసుబాబు షూరిటీ.. మోసం గ్యారెంటీ అని రుజువైందిజగన్ కంటే ఎక్కువ పథకాలు ఇస్తానని బాబు నమ్మించారుమేనిఫెస్టోను చెత్తబుట్టలో వేసిన ఘనత చంద్రబాబుదికూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తైందిమూడోసారి కూడా బడ్జెట్ ప్రవేశపెట్టారుసూపర్-6, సూపర్-7 లేదుఆడబిడ్డ నిధికి నిధుల్లేవు18 ఏళ్లు నిండిన అక్కచెల్లెమ్మెలకు ఏడాదికి రూ.18 వేలు లేవు50 ఏళ్లు నిండిన వాళ్లకు పెన్షన్ కూడా ఇవ్వలేనిరుద్యోగ భృతిలోనూ మోసం చేశారుఎవరైనా ప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరిగిపోతోందిమావిగన్ అంటే చంద్రబాబు అక్కడే పడిపోయేలా ఉన్నారువ్యాట్ తగ్గించుకోమంటే బీపీ ఎందుకు?పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తామని హామీ ఇచ్చారుతగ్గించకపోగా.. బాదుడు మొదలుపెట్టారుఎన్నికల సమయంలో మీరు ఇచ్చిన హామీనే కదా? ఎందుకు తగ్గించడం లేదురాష్ట్ర పన్నులతో తగ్గించుకోవచ్చు కదా చంద్రబాబూ!తగ్గించమంటే బాబుకి బీపీ పెరుగుతోందిఇప్పటికీ హామీల అమలు లేదుచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమంచి చేశానని చెప్పుకునే స్థితిలో ఆయన లేరుమేనిఫెస్టో అడ్రస్ కనిపించదుఏం చేయలేదు కాబట్టే డైవర్షన్ పాలిటిక్స్కు దిగారుగొడ్డళ్లు కత్తులు,కటార్లంటూ కొత్త డైవర్షన్ తీసుకొచ్చారుప్రజలను పిచ్చోళ్లని చంద్రబాబు అనుకుంటున్నారుకానీ, తెలివైన వాళ్లని గుర్తించాలివైఎస్సార్ పాలనలో, వైఎస్సార్సీపీ హయాంలోనే జనాలకు మంచి జరిగింది.. ఆ విషయం కాలర్ ఎగరేసి మరీ చెప్పగలంవెన్నుపోటుకు రెండేళ్లు.. బుక్లెట్ ఆవిష్కరణచంద్రబాబువి వెన్నుపోటు కాదు.. వెన్నుపోట్లుసూపర్సిక్స్, సూపర్ సెవెన్ మోసాలను ప్రజలకు వివరించేలా వైఎస్సార్సీపీ నిరసన కార్యక్రమాలుచంద్రబాబు మోసాలు, అవినీతి, దుర్మార్గాలు వివరించేలా బుక్లెట్ విడుదలబుక్లెట్ విడుదల చేసిన వైఎస్ జగన్చంద్రబాబు మోసాల్ని ప్రజలకు వివరిస్తూ.. మొదటి ఏడాది ర్యాలీ నిర్వహించాం: వైఎస్ జగన్రెండో ఏడాది కూడా గొప్పగా ఆ కార్యక్రమాలు నిర్వహించాం: వైఎస్ జగన్జూన్ 4 నుంచి 12 దాకా.. వెన్నుపోటుకు రెండేళ్లు కార్యక్రమం నిర్వహిద్దాం: వైఎస్ జగన్జూన్ 4న.. మండల కేంద్రాల్లో వైఎస్సార్సీపీ నిరసనలు: వైఎస్ జగన్8 లేదా 9వ తేదీన నియోజకవర్గ హెడ్క్వార్టర్స్ టౌన్హాల్లో సదస్సులు: వైఎస్ జగన్12న.. ప్రతీ నియోజకవర్గంలో చంద్రబాబు వెన్నుపోటు పాలనకు నిరసనగా ర్యాలీలు: వైఎస్ జగన్ఎండలు, సర్ కార్యక్రమం, గ్రామస్థాయి పార్టీ బలోపేతం తదిరత అంశాల్ని పరిగణనలోకి తీసుకుని ఈ షెడ్యూల్: వైఎస్ జగన్ఎమ్మెల్యే దగ్గరి నుంచి ప్రతీ ఒక్కరూ ఈ నిరసనల్లో భాగం కావాలి: వైఎస్ జగన్కార్యక్రమాలను స్వయంగా నేనే పర్యవేక్షిస్తా: వైఎస్ జగన్ప్రజల నిరసన సెగలు చంద్రబాబుకి తగలాలి: వైఎస్ జగన్జగన్ కీలక వ్యాఖ్యలు ఏపీలో త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు రాబోతున్నాయిచంద్రబాబు కుట్ర రాజకీయాలు అందరికీ తెలుసుమున్పిపల్ కార్పొరేషన్ ఉపఎన్నికల్లో ఆ కుట్రలు చూశాంపోలీసులను అడ్డం పెట్టుకొని ఏ విధంగా ప్రజాస్వామ్యం ఖూనీ చేశారో చూశాంఅందుకే.. స్థానిక సంస్థల ఎన్నికలను ప్రతిష్టాత్మకంగా తీసుకోవాలిప్రతీ కార్యకర్తకు పార్టీ అండగా నిలిచిందన్న నమ్మకం కలగాలిఆ నమ్మకం కలిగితేనే కార్యకర్తలు మీకు తోడుగా ఉంటారుచంద్రబాబు ఎన్ని కుట్రలు చేసినా వైఎస్సార్సీపీ జెండా ఎగరాలిఎక్కడ కూడా ఏకగ్రీవం కాకూడదు.. అదే జరిగితే చాలా సీరియస్గా తీసుకుంటాంఏకగ్రీవం జరిగిందంటే ఇన్చార్జిలు ఫెయిల్ అయ్యారన్నమాటఇప్పటికే గ్రామ కమిటీలు, అనుబంధ కమిటీలు ఏర్పాటయ్యాయివీరందరితో కలిసి సరైన అభ్యర్థులను ఎంపిక చేయాలివైఎస్సార్సీపీ హయాంలో అందిన పథకాలు.. కూటమిలో ఎలా రద్దయ్యాయో ప్రజలకు వివరించాలిబాబు వెన్నుపోటు పాలన గురించి ప్రతీ ఇంట చర్చ జరగాలిస్థానిక సంస్థల ఎన్నికలను కచ్చితంగా సీరియస్గా తీసుకోవాలిసర్ ప్రక్రియ గురించి.. బెంగాల్, తమినాడు ఎన్నికలను అంతా చూశారుసర్ ద్వారా బెంగాల్, తమిళనాడులో లక్షల ఓట్లు తీసేశారుమమతా బెనర్జీ పోటీ చేసిన భవానీపూర్లో 45 వేలకు పైగా ఓట్లు తొలగించారుఆమె 15 వేల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో స్టాలిన్ పోటీ చేసిన కొలతూర్లో 71 వేల ఓట్లు తొలగించారుఆయన ఓడింది 8 వేల ఓట్ల తేడాతో.. ఈ అంశాలను జాగ్రత్తగా పరిగణనలోకి తీసుకోండి91 లక్షల ఓట్లు బెంగాల్లో తొలగించారుమమతా బెనర్జీ పార్టీ 31 లక్షల ఓట్ల తేడాతో ఓడారుతమిళనాడులో 74 లక్షల ఓట్లు తీసేశారుస్టాలిన్ పార్టీ 17 లక్షల ఓట్ల తేడాతో ఓడారుకాబట్టి సర్ అంశాన్ని సీరియస్గా తీసుకోవాలిఓట్లు పెరగడం వల్ల మనం ఓడాం.. ఓట్లు తగ్గడం వల్ల వాళ్లు ఓడారుకుప్పంలో కళ్లెదుటే అది కనిపించిందిఏపీలో ఓట్లు హిస్టరీ అండ్ మిస్టరీమనం అనుకున్న నియోజకవర్గం నుంచి 50 ఓట్లు తొలగించినా చాలూ.. -
కూటమిలో కొట్లాట.. మంత్రి వర్సెస్ ఎమ్మెల్యే...
-
గుడ్డలతో గొంతులు కోసే.. తడి గుడ్డల పార్టీ !
-
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు దుర్మార్గపు పాలనలో రాష్ట్ర ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. సంక్షోభ సమయంలోనూ ప్రజల గురించి ఆలోచించకుండా చంద్రబాబు స్కామ్లు చేసుకుంటూ పోతున్నాడని ఆగ్రహం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో నెలకొన్న దారుణ పరిస్థితులపై గురువారం పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. బాబుకి బీపీ పెరుగుతోందిఇచ్చిన హామీలకూ చంద్రబాబు వెన్నుపోటు పొడిచారుప్రజల బాగోగులను గాలికి వదిలేశారుఎవరైనా ప్రశ్నిస్తే కేసులతో అణగదొక్కుతున్నారురాష్ట్రాన్ని జంగిల్ రాజ్గా మార్చేశారురెండేళ్లలో ఏం మంచి చేశారో చంద్రబాబు చెప్పాలిఈ రెండేళ్లలో బాబు ప్రొగ్రెస్ ఒక్కటే.. ‘‘చంద్రబాబు షూరిటీ మోసం గ్యారంటీ’’రాష్ట్రంలో విచ్చలవిడిగా అవినీతి, దోపిడీ జరుగుతోందిచంద్రబాబు మాత్రం డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారుతప్పులను ప్రశ్నిస్తే ఆయనకు బీపీ పెరుగుతోందిమావిగన్ అంటే చంద్రబాబుకి గుండె ఆగిపోయేలా ఉందిచంద్రబాబు సీఎంగా ఉండడం ఏపీ చేసుకున్న దురదృష్టంఏపీకి రాజధాని లేకుండా చేస్తున్నారుచంద్రబాబు నిర్ణయాలతో భవిష్యత్తులో కూడా రాజధాని లేకుండా చేస్తున్నారు రోడ్లు, నీరు, డ్రైనేజీ, మౌలిక సదపాయాలకే రూ.2 లక్షల కోట్లు ఖర్చు అవుతుందిఆచరణ సాధ్యం కాదని తెలిసినా ముందుకు వెళ్తున్నారుస్కామ్ల కోసమే చంద్రబాబు ముందుకు వెళ్తున్నారుఇప్పటికే అమరావతి కోసం రూ.47, 387 కోట్ల అప్పుచేశారుఖజానా నుంచి రూ.9,200 కోట్లు ఖర్చు చేయబోతున్నారుస్కామ్ల కోసం రాష్ట్ర ప్రజల వెన్ను విరుస్తున్నారుప్రశ్నిస్తే చంద్రబాబుకి బీపీ పెరుగుతోందిరాజధాని ఉండాలనే మావిగన్ ప్రతిపాదించాంరాష్ట్ర పరిస్థితుల దృష్ట్యా మావిగన్ను ప్రత్యామ్నాయంగా చూపించాంఅమరావతి అయితే జీరో నుంచి మొదలుపెట్టాలిమావిగన్లో అన్నీ ఉన్నాయిప్రజలు కూడా మావిగన్కు మద్దతు పలికారుఅది తట్టుకోలేకనే చంద్రబాబు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారుతాను మాట్లాడిందే కాకుండా మంత్రులతో బూతులు మాట్లాడిస్తున్నారుఅమరావతిలో విచ్చలవిడి దోపిడీనేరూ.1200 కోట్లతో అసెంబ్లీ, హైకోర్టు, సెక్రటేరియట్ ఉన్నా.. పర్మినెంట్ పేరిట మళ్లీ అన్నీ కొత్తగా కడతానంటున్నారుమళ్లీ ఇవే నిర్మాణాలకు కొత్త టెండర్లు పిలిచారు.. కానీ, పాత వాళ్లకే టెండర్లు కట్టబెట్టారుకొత్తగా నిర్మిస్తున్న ఐదు బిల్డింగుల దోపిడీ చూసి జనం నివ్వెరపోతున్నారుభవన డిజైన్లకే రూ.401 కోట్లు ఖర్చు చేశారుఈ ఐదు బిల్డింగులకు అయ్యే మొత్తం ఖర్చు రూ. 10,665 కోట్లు.. అంటే ప్రస్తుతం చదరపు అడుగుకు రూ. 20, 427 ఆ? పాత లెక్క రూ. 5వేల లోపే ఉందివాటి ఫర్నీచర్, ఇంటీరియర్ ఇంకా అదనపు ఖర్చులన్నమాట.. అంటే ఇప్పుడు చదరపు అడుగుకు రూ.30 వేలు దాటుతుందన్నమాటఫైవ్స్టార్ హంగులతో కూడా చదరపు అడుగు రూ.4,500 లోపే అవుతుందితెలంగాణలో రూ.615 కోట్లతో కేసీఆర్ సచివాలయం కట్టారుమన సెక్రటేరియట్కు మాత్రం ఇంత ఖర్చా? ఎందుకు??కొత్త అసెంబ్లీ, కొత్త హైకోర్టు అంటూ మళ్లీ భారీగా ఖర్చు చేయబోతున్నారుఅమరావతిలో రోడ్ల వ్యయం చూస్తే కళ్లు తిరుగుతాయికిలోమీటర్ ఖర్చు రూ.24 కోట్లు అవుతుందని కేంద్రమే చెప్పిందిఅమరావతిలో కిలో మీటర్ ఖర్చు రూ.53 కోట్లు అవుతోందిఅమరావతిలో ప్లాట్ల స్కామ్ జరుగుతోందిచంద్రబాబు తన మనుషులకు రోడ్ల పక్క భూములు ఇప్పించారుసామాన్యులకు మాత్రం చెరువులు, కుంటల్లో ఇస్తున్నారు50 వేల ఎకరాలు సరిపోవని మళ్లీ లాక్కుంటున్నారుఇదంతా విచ్చలవిడిగా చేస్తున్న దోపిడీనేవీటన్నింటిని ఆధారాలతో సహా బయటపెడితే చంద్రబాబుకి బీపీ వస్తోందిచంద్రబాబూ.. ఎవరిదయ్యా గొడ్డలి పార్టీ?మా పార్టీ కార్యకర్త పెద్ద దస్తగిరి చనిపోతే మాపైనే బురద జల్లుతున్నారుజాతరలో గొడవ వల్లే దస్తగిరి చనిపోయారని ఆయన భార్య చెప్పిందిటాపిక్ డైవర్ట్ చేసేందుకు కథలు అల్లుతున్నారువైఎస్సార్సీపీపై బుదర జల్లాలని చూస్తున్నారుకల్పిత కథతో కేసు పెట్టి వైసీపీ వాళ్లనే అరెస్ట్ చేయాలని చూస్తున్నారుచంద్రబాబూ.. ఎవరిది గొడ్డలి పార్టీ? ఎవరిది గన్ కల్చర్? ఎవరివి హత్యా రాజకీయాలు?మా తాత, నాన్న, చిన్నాన్న ముగ్గురు చనిపోయారు.. మేం బాధితులంమా తాత రాజారెడ్డి చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడే హత్యకు గురయ్యారుమా తాతను చంపింది టీడీపీ వాళ్లు కాదా?అధికార దుర్వినియోగం చేసి ఆ హంతకులను చంద్రబాబే రక్షించారుమా నాన్న రాజశేఖర్రెడ్డి విషయంలోనూ అదే జరిగిందిఅసెంబ్లీకి ఎలా వస్తావో చూస్తానని మా నాన్నను ఉద్దేశించి చంద్రబాబు అన్నారుతర్వాత 4 రోజులకే ఆయన హెలికాఫ్టర్ ప్రమాదంలో చనిపోయారుఅవసరమైతే అసెంబ్లీలో క్లిప్పింగులు చూడండిమా నాన్న మృతి విషయంలో అనుమానాలు ఇప్పటికీ నివృత్తి కావాల్సి ఉందిమా చిన్నాన్న వివేకాను అవినాష్ చంపించాడంటూ ప్రచారం చేశారుఅవినాష్ కోసం వివేకా కృషి చేశారుఅలాంటి వివేకాను అవినాష్ చంపించారని బురద చల్లారుచంపానని చెప్పిన దస్తగిరి ఇవాళ బయట దర్జాగా కార్లలో తిరుగుతున్నాడుఈ కేసులో నిందితుడైన దస్తగిరికి లాయర్.. చంద్రబాబు లాయర్ అయిన లూథ్రానేక్రిమినల్ బ్రెయిన్ ఎవరిదో చంద్రబాబే చెప్పాలినందమూరి బాలకృష్ణ గన్తో ఇద్దరిని కాల్చేయలేదా?ఎవరిది గన్ కల్చరో చెప్పాలిఈ కేసులో సాక్ష్యం దొరకకూడదని వాచ్మన్ను బండరాయితో కొట్టి చంపారుహరికృష్ణ ప్రమాదంలో చనిపోతే పరామర్శకు వెళ్లి చంద్రబాబు కేటీఆర్తో పొత్తుల గురించి మాట్లాడారుఎవరివి శవ రాజకీయాలో చంద్రబాబు చెప్పాలిరాజకీయ జీవితం ఇచ్చిన సొంతమామకే వెన్నుపోటు పొడిచారుపేదల ఇళ్ల పట్టాల కోసం దీక్ష చేస్తుంటే అర్ధరాత్రి వంగవీటి రంగాను నరికి చంపారుఈ కేసు ప్రధాన నిందితుడు వెలగపూడి రామకృష్ణ ఇప్పుడు టీడీపీ ఎమ్మెల్యేఎన్డీఆర్పై దాడి చేసి మల్లెల బాబ్జీ లాడ్జిలో శవమై తేలాడుతనకు ఇవ్వాల్సిన డబ్బు ఇవ్వలేదని బాబ్జీ జేబులో ఓ లెటర్ దొరికిందిమల్లెల బాబ్జీ కేసులో అసలు విచారణే జరగలేదుచంద్రబాబుది రాక్షస రాజకీయంవిజయవాడలో ఎన్కౌంటర్ అనే పత్రిక పెట్టి టీడీపీ అవినీతిని ప్రశ్నించిన పింగళి ధశరథ్రామ్ దారుణ హత్యకు గురయ్యారుఈ హత్య కేసులోనూ వేళ్లన్నీ చంద్రబాబు వైపే చూపించాయిబాబు గురించి దగ్గుబాటి వెంకటేశ్వరరావు పుస్తకాలు రాశారుచంద్రబాబు కుట్రలన్నీ దగ్గుబాటి అప్పుడే చెప్పారుమాది విలువలతో కూడిన రాజకీయంచంద్రబాబు కుట్ర రాజకీయాలు చేస్తుంటే.. మేం విలువలు, విశ్వసనీయతతో రాజకీయం చేస్తున్నాంమా తాతను చంపిన వాళ్లు ఇప్పటికీ ప్రశాంతంగా ఉన్నారు.. మేం చెడ్డోళ్లమైతే వాళ్లు ఉండేవాళ్లా?జగన్ నైజానికి ఇదే నిదర్శనంచంద్రబాబులా మాకు హత్య రాజకీయాలు నేర్పించలేదుచంద్రబాబుకి బహుశా ఇవే చివరి ఎన్నికలుఈ వయసులోనూ ఇలాంటి దౌర్భగ్యపు రాజకీయాలు చేయడానికి సిగ్గుగా అనిపించడం లేదా?స్కామ్ వాళ్లది.. కేసు మా నేతపైనజంగిల్రాజ్లో హత్యారాజకీయాలు నడుస్తున్నాయిఈ రెండేళ్లలో వైఎస్సార్సీపీ వాళ్లను దారుణంగా చంపారువినుకొండలో రషీధ్ను నడిరోడ్డుపై నరికి చంపారుచంద్రబాబుకు ఎప్పు ఇబ్బంది వచ్చినా అబద్ధం సృష్టిస్తారుబాబు మంత్రులు అడ్డగోలుగా మాట్లాడుతున్నారుఆయన హయాంలోనే కల్తీ మద్యం ఘటన జరిగిందికానీ, మా పార్టీ నేత పేరును కేసులో చేర్చారుటీడీపీ తరఫున పోటీ చేసిన జయచంద్రారెడ్డి అనుచరులు కల్తీ మద్యం చేస్తూ దొరికారుచేసింది చంద్రబాబు అనుచరులతే కేసు మాత్రం ఈ దందాను బయటపెట్టిన జోగి రమేశ్ పై పెట్టారుతప్పుడు కేసుతో 83 రోజులు జైల్లో పెట్టారుబెయిల్పై బయటకు వస్తే యాసిడ్ బాటిల్స్ దాడి చేశారుదాడికి పాల్పడిన వాళ్లకు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారుకల్తీ మద్యం కేసును ఎంత దారుణంగా మార్చారో అంతా చూశారుమామిళ్లపల్లిలో తప్పు వాళ్లదేమామిళ్లపల్లిలో పోలీసులు దౌర్జన్యం చేశారుకాపు సామాజిక వర్గానికి చెందిన ఐదుగురు రైతులు గోడౌన్లో పంట నిలవ చేసుకున్నారుమామిళ్లపల్లిలో ఎక్కడా తప్పు జరగలేదని వాళ్లకూ తెలుసుఅయినా గోడౌన్ అంబటి మురళిదని ప్రచారం చేశారుగోడౌన్లోనూ వైఎస్సార్సీపీ జెండాలను టీడీపీవాళ్లే పెట్టారుఅక్రమంగా నిల్వచేశారని తప్పుడు కేసులు పెట్టారుగోడౌన్ను కూడా సీజ్ చేశారుగిట్టుబాటు ధర ఇస్తే రైతులు పంటను గోడౌన్లో ఎందుకు పెట్టుకుంటారు?పరామర్శించేందుకు వెళ్లిన నేతలపై దౌర్జన్యం చేశారుమహిళలపై కూడా పోలీసులు దౌర్జన్యంగా ప్రవర్తించారుఏపీలో సోషల్ మీడియా సెన్సార్ఏపీలో సోషల్ మీడియా పైనా కూడా ఆంక్షలు పెడుతున్నారుప్రజలు తమ అభిప్రాయాలు స్వేచ్ఛగా చెప్పే అవకాశం లేదుప్రభుత్వ తప్పిదాలపై పోస్టులు పెడుతుంటే ఆ కంటెంట్ను కనపడకుండా చేస్తున్నారుసోషల్ మీడియా కూడా సెన్సార్ చేస్తున్నారుకార్యకర్తలపై తప్పుడు కేసులు పెడుతున్నారుఎఫ్ఐఆర్ చేసి సోషల్ మీడియా ప్లాట్ఫారమ్లకు పంపిస్తున్నారుచంద్రబాబు పెట్రో మాయఎన్నికలకు ముందు సూపర్ సిక్స్, సెవెన్ అన్నారుపెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని చెప్పి ఏపీ ప్రజలకు వెన్నుపోటు పొడిచారు2015లో పెట్రోల్పై 31 శాతం వ్యాట్తో పాటు, అలాగే డీజిల్పై 22.5 శాతం వ్యాట్తో అదనంగా 4 రూపాయిలు పెంచారుకోవిడ్లాంటి మహమ్మరి టైంలోనూ రోడ్ సెస్ కింద మేం పెంచింది రూపాయి మాత్రమేకానీ, వైఎస్సార్సీపీ హయాంలో పెట్రోల్ రేట్లు అడ్డగోలుగా ఉన్నాయంటూ నానాయాగీ చేశారుఅప్పట్లో బాబు, లోకేష్, పవన్లు పొలిటికల్ డ్రామా చేశారుఎన్నికల టైంలో అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ రేట్లు తగ్గిస్తాం అని తండ్రీకొడుకులు చంద్రబాబు, లోకేష్లు ప్రకటించారుటీడీపీ మేనిఫెస్టోలోనూ ఇంధన ధరల తగ్గింపు ఉందిరెండేళ్లైనా పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గలేదుగత నెలలో బంకుల వద్ద బారులు తీరారుఇంధన సంక్షోభంలోనూ చంద్రబాబు స్కామ్లు చేస్తున్నారుఆ టైంలో అమరావతి కాంట్రాక్టర్లకు బల్క్ల్లో ఇప్పించాలని కోరారుచంద్రబాబుకి చీవాట్లు పెడుతూ కేంద్రం లేఖ పంపిందిరిటైల్ బంకుల్లో ఎలా డీజిల్ అడుగుతారని చెప్పిందిఆ టైంలోనూ ప్రజల గురించి కాకుండా కాంట్రాక్టర్ల గురించి ఆయన ఆలోచించారుహామీలు నెరవేర్చకపోగా ప్రజల్ని ఇబ్బంది పెట్టారుఇప్పటికైనా క్షమాపణలు చెప్పి ధరలు తగ్గించాలిపెట్రోల్ లీటర్కు రూ.8 తగ్గించాల్సిందే మినిమమ్ డ్యూటీ మరిచిన పోలీసులుపొదుపు చర్యల పేరుతో చంద్రబాబు ప్రజల చెవిలో పువ్వులు పెడుతున్నారువాళ్లు మాత్రం విమానాల్లో తిరుగుతున్నారుఏపీలో విచ్చలవిడిగా గంజాయి, డ్రగ్స్ అమ్ముతున్నారుఏ కాలేజీలో చూసినా గంజాయి కనిపిస్తోందిరాష్ట్రంలో మాత్రం పోలీసులకు కనిపించడం లేదువ్యతిరేకంగా మాట్లాడితే తప్పుడు కేసులు పెడుతున్నారుపోలీసులు కనీస విధులు కూడా మరిచిపోయారుమా హయాంలో దిశ యాప్తో మహిళలకు రక్షణ కల్పించాం గ్రామాల్లో చంద్రబాబుపై ఆగ్రహంచంద్రబాబు నోరు తెరిస్తే అబద్దం.. మోసంఏపీ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారుసూపర్ సిక్స్ హామీలన్నీ మోసాలుగా తేలాయిమా హయాంలోనీ పథకాలన్నీ నిలిపివేశారుపొదుపు సంఘాల పరిస్థితి దారుణంగా ఉందిపంటలకు గిట్టుబాటు ధర లేదు.. ఇన్ఫుట్ సబ్సీడీ లేదు.. ఈ క్రాప్ లేదుమొక్కజోన్న, పొగాకు, శనగ రైతులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు చేస్తున్నారుకేంద్రం ఇచ్చేది కాకుండా.. అన్నదాన సుఖీభవకు ఏడాదికి రూ.20 వేలు ఇస్తామన్నారు.. అంటే ప్రతీ రైతుకు రూ. 40 వేలు ఇవ్వాలిఆడబిడ్డ నిధి కింద ప్రతినెలా రూ.1500 ఇస్తామన్నారునిరుద్యోగికి రూ.3 వేల భృతి అన్నారు.. అంటే ఈ రెండేళ్లలో ఒక్కో నిరుద్యోగికి రూ.72 వేలు బాకీ పడ్డారుఏపీలో ఎక్కడికి వెళ్లినా మహిళలకు ఫ్రీ బస్సు అన్నారు16 కేటగిరీల్లో ఐదింటికి మాత్రమే అనుమతించారుఇప్పుడు దానికి కూడా కోత పెడుతున్నారు12 డిపోలను ప్రైవేట్పరం చేశారుఆర్టీసీ బస్సుల స్థానంలో ప్రైవేట్ బస్సులు తెస్తారంటఎలక్ట్రిక్ బస్సులు తెచ్చి.. దానికి ఫ్రీ పథకం వర్తించదని చెబుతున్నారుభవిష్యత్తులో ఫ్రీ బస్సు ఉండదు.. ఆర్టీసీ ఉండదుమా హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇచ్చాంబాబు హయాంలో 6 లక్షల పెన్షన్లు తొలగించారుఅమ్మ ఒడి పథకంలో 20 లక్షల మందికి కోత పెట్టారుహామీలు అమలు చేస్తామని స్వయంగా బాండ్లు పంపిణీ చేశారుగ్రామాల్లో చంద్రబాబుపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారుఆ హామీల సంగతి ఏమైందని చంద్రబాబును ప్రజలు నిలదీస్తున్నారుఉద్యోగులను దారుణంగా మోసం చేశారుమా హయాంలో ఉద్యోగులకు ఏనాడూ ఇబ్బందులు కలగలేదుసంతానమే సంపదట.. మరి లోకేష్ సంగతేంటి?ముగ్గురిని నలుగురిని కనండి అంటూ చంద్రబాబు ప్రొత్సహిస్తున్నారురూ. 30 వేలు, రూ.40 వేలు నగదు ప్రొత్సాహకం ఇస్తామని మభ్యపెడుతున్నారుసూపర్ సిక్స్, సెవెన్ హామీల తర్వాతే ఆ మాట మాట్లాడమని ప్రజలు మొత్తుకుంటున్నారుచంద్రబాబుకు ఒక్కడే కొడుకు.. లోకేష్కు ఒక్కడే కొడుకుబాబు చెప్పేవి కనీసం ఆయన కొడుకు అయినా పాటించాలి కదాప్రజలు మాత్రం ముగ్గురు, నలుగురు కనాలటవాళ్లు మంచి చదువుకోకూడదటఇదేం దిక్కుమాలిన ఆలోచన?విద్య, వైద్యం, వ్యవసాయం ఏనాడూ మా హయాంలో మూలన పడలేదుపిల్లలకు మేనమామలా మంచి చదవులు చదివించాఇవాళ.. కనీసం గోరుమద్దలు కూడా అందని పరిస్థితిసరైన ఆహారం అందక ఆస్పత్రి పాలవుతున్నారువ్యవస్థలన్నీ ఇంత దారుణంగా, అద్వాన్నంగా ఉంటే.. పిల్లలు కనమని పిలుపు ఇవ్వడమేంటి?మహిళలను పిల్లల్ని కనే మెషీన్లుగా చంద్రబాబు చూడడం దుర్మార్గంకుటుంబాలు బాగుండాలంటే మహిళలు బాగుండాలియస్ లోకేస్.. బోత్ ఆర్ నాట్ సేమ్బోత్ ఆర్ నాట్ సేమ్ అని లోకేష్ సినిమా డైలాగులు కొడుతున్నాడుఅవును.. బోత్ ఆర్ నాట్ సేమ్వెన్నుపోటుతో పార్టీని లాక్కుని ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మీదిప్రజామద్దతుతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన చరిత్ర మాదిప్రజలకు ద్రోహం.. వాడుకోవడం .. వదిలేయడం మీ క్యారెక్టర్ఇచ్చిన మాట నిలబెట్టుకోవడం మా క్యారెక్టర్పనులు చేసి చూపించడం మా స్టైల్.. పబ్లిసిటీ చేసుకోవడం మీ స్టైల్బటన్ నొక్కి ప్రజలకు డబ్బులు వేసిన చరిత్ర మాదిరెండేళ్లలో పథకాలు రద్దు చేసిన చరిత్ర మీదివిద్య, వైద్యం, ఆరోగ్యం, వ్యవసాయం.. ప్రజల చెంతకు పాలన, మహిళా సాధికారికత, మహిళా రక్షణ.. వీటిని ఆచరణలో చూపించడం మేం చేశాంఅందుకే బోత్ ఆర్ నాట్ సేమ్వైఎస్సార్సీపీ మీడియా ప్రధాన కార్యదర్శి శ్రీహరి అరెస్ట్పై విలేకరుల ప్రశ్నకు స్పందిస్తూ..ప్రజాస్వామ్యంలో ఏది ఇస్తావో అల్టిమేట్గా అదే తిరిగి వస్తుందిప్రతీ పోలీసుకు విజ్ఞప్తి చేస్తున్నాచంద్రబాబు ప్రలోభాలు, భయంతోనూ పోలీసులు పని చేయొద్దురేపు ప్రభుత్వం మారాక ఎంక్వైయిరీ ఉంటుందితప్పు చేసిన అధికారుల్ని చట్టం ముందు నిలబెడతాంసప్తసముద్రాల అవతల ఉన్నా వదిలిపెట్టం.. తీసుకొస్తాం ఆయన రాష్ట్రంలో ఆయనకే పలుకుబడి ఎక్కువగా ఉంటుంది కదా.. టీవీకే అధినేత విజయ్ వైఎస్ జగన్ ఫొటో పట్టుకోవడం, తమిళనాడు ఎన్నికల్లో విక్టరీ సాధించడంపై విలేకరులు అడిగిన ప్రశ్నకు వైఎస్ జగన్ స్పందన -
మామిళ్లపల్లిలో మళ్లీ పోలీసుల దౌర్జన్యకాండ
సాక్షి, గుంటూరు: మామిళ్లపల్లిలో ఖాకీల దౌర్జన్యకాండ కొనసాగుతోంది. బుధవారం ఉదయం రైతుల పరామర్శకు ప్రయత్నించిన వైఎస్సార్సీపీ దళిత నేత జూపూడి ప్రభాకర్ పట్ల పోలీసులు దురుసుగా ప్రవర్తించారు.ఈ క్రమంలో మరీ దుర్మార్గంగా వ్యవహరించడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తున్నాయి.మామిళ్లపల్లి రైతుల పరామర్శ కోసం జూపూడి ఈ ఉదయం పొన్నరూ వైఎస్సార్సీపీ ఇంచార్జి అంబటి మురళి ఇంటికి వెళ్లారు. అయితే ఆ సమాచారం అందుకున్న పోలీసులు మురళి ఇంట్లోకి దూసుకెళ్లారు. జూపూడిని బలవంతంగా బయటకు లాక్కొచ్చారు. రైతుల పరామర్శకు వెళ్లడానికి వీల్లేదని.. అందుకు ఎలాంటి అనుమతుల్లేవని చెబుతూ పోలీసు వాహనం ఎక్కించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశాయి. అయితే మహిళలను సైతం నెట్టేసిన పోలీసులు ఆయన్ని వాహనంలోకి ఎక్కించి తరలించారు. పోలీసుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళనకు దిగాయి. సమాచారం అందుకున్న రైతులు అక్కడికి చేరుకుని కూటమి సర్కార్కు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. దీంతో ఆ ప్రాంతంలో ఉద్రిక్తత నెలకొంది.గుంటూరు జిల్లా పొన్నూరు నియోజకవర్గం మామిళ్లపల్లిలో ఈ మధ్య కాలంలో రాజకీయ ఉద్రిక్తతలు చోటు చేసుకున్నాయి. న్యాయం చేయాలని కోరిన మొక్కజొన్న రైతులపై టీడీపీ ఎమ్మెల్యే ధూళిపాళ్ల నరేంద్ర కుమార్ దాడులు చేయించడంతో పాటు అక్రమ కేసులు బనాయించారని వైఎస్సార్సీపీ అంటోంది. అదే సమయంలో.. అక్రమ కేసులకు భయపడాల్సిన అవసరం లేదని రైతులకు భరోసా ఇస్తోంది. చలో మామిళ్లపల్లిని నిర్వహించి రైతులకు సంఘీభావం తెలపడంతో పాటు వైఎస్సార్సీపీ నేతలు రైతుల్ని స్వయంగా కలిసి పరామర్శించేందుకు ప్రయత్నిస్తున్నారు. అయితే కూటమి సర్కార్ పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తూ కుట్రలు చేస్తోంది. మొన్న మాజీ మంత్రి జోగి రమేశ్, ఇవాళ జూపూడి ప్రభాకర్లను రైతుల్ని కలవనీయకుండా అడ్డుకుంది. -
ఇంకెంత పెరగాలి బాబుగారూ?
పశ్చిమాసియా యుద్ధ ప్రభావంతో.. దేశంలో పెట్రోల్ రేట్లు పెంచక తప్పని పరిస్థితి నెలకొందని కేంద్రం చెబుతోంది. అదే సమయంలో సామాన్యులపై భారం పడకుండా చూడమని రాష్ట్రాలకు సూచిస్తోంది. ఈ నేపథ్యంలో పలు రాష్ట్రాలు చర్యలు చేపట్టాయి. అయితే.. ఎన్డీయే ప్రభుత్వం(కూటమి) ఉన్న ఆంధ్రప్రదేశ్లో దేశంలోనే అత్యధికంగా పెట్రో ధరలు ఉండడం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. ఆంధ్రప్రదేశ్లో పెట్రోలు, డీజిల్ ధరలు దేశంలోని అన్ని రాష్ట్రాల కంటే ఎక్కువగా ఉన్నాయి. ఈ విషయం గణాంకాలే చెబుతున్నాయి. తాజాగా మంగళవారం పెంచిన 90 పైసల పెంపుతో దేశవ్యాప్తంగా రేట్లు ఇలా ఉన్నాయి. ఢిల్లీలో లీటర్ పెట్రోల్ రూ98.63, డీజిల్ రూ91.50గా ఉంది. తెలంగాణలో పెట్రోల్ రూ111.36(హైదరాబాద్), డీజిల్ రూ99.53, మరో పొరుగు రాష్ట్రం తమిళనాడులో పెట్రోల్ రూ.104.66, డీజిల్ రూ.96.22, ఇటు కర్ణాటకలో పెట్రోల్ రూ.106.82, డీజిల్ రూ.94.82గా ఉన్నాయి. ఏపీ విజయవాడలో లీటర్ పెట్రోల్ రూ.114.48, డీజిల్ రూ.102.17కి చేరుకుంది. ఇటు విశాఖపట్నంలో లీటర్ పెట్రోల్ రూ.112.96, డీజిల్ రూ.100.32 పైసలకు చేరుకుంది. అంటే.. దేశంలోనే వాహనదారులకు పెద్ద భారంగా ఏపీలో రేట్లు ఉన్నాయన్నమాట. ఢిల్లీతో పోలిస్తే విజయవాడలో పెట్రోల్ ధర లీటరుకు సుమారు రూ.17 ఎక్కువగా ఉండటం గమనార్హం. ఈ వ్యత్యాసానికి ప్రధాన కారణం రాష్ట్ర ప్రభుత్వం విధించే వ్యాట్ (Value Added Tax). యుద్ధ నేపథ్యంతో ఆయిల్ కంపెనీలు రేట్లు పెంచినా.. రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించకపోవడం వల్ల ఏపీలో ధరలు అత్యధికంగా ఉన్నాయి. అయితే.. ప్రజలపై పడుతున్న ఈ భారాన్ని తగ్గించేందుకు రాష్ట్ర ప్రభుత్వం తక్షణ చర్యలు తీసుకోవాలని డిమాండ్ పెరుగుతోంది. సార్వత్రిక ఎన్నికలకు ముందు పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని హామీ ఇచ్చిన చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ వాగ్దానాన్ని నిలబెట్టుకోలేదని ప్రజలు మండిపడుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు చేపట్టి, పెట్రోలు–డీజిల్ ధరలను తక్షణమే తగ్గించాలని డిమాండ్ చేసింది. ప్రజలతో కలిసి పార్టీ నేతలు కలెక్టర్లు, సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు, తహసీల్దార్లకు డిమాండ్ పత్రాలు అందజేశారు. నిరసన కార్యక్రమాల్లో అన్ని వర్గాల ప్రజలు కదంతొక్కడం, పెట్రో బాదుడుపై గళమెత్తడం ఆగ్రహాన్ని స్పష్టంగా చూపిస్తోంది.మొత్తం మీద.. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎదుర్కొంటున్న పెట్రోల్, డీజిల్ ధరల భారమే “ఏపీలోనే అత్యధికం” అనే వాస్తవాన్ని ప్రతిబింబిస్తోంది. ఇది కేవలం ఆర్థిక సమస్య మాత్రమే కాదు, ప్రజా జీవనంపై నేరుగా ప్రభావం చూపుతున్న సంక్షోభమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ పరిస్థితుల్లో రాష్ట్ర స్థాయిలో వ్యాట్ తగ్గించడం తప్పనిసరి అని ఆర్థిక నిపుణులు చంద్రబాబు సర్కార్కు సూచిస్తున్నారు.తాజా పెంపు తర్వాత ప్రధాన నగరాల్లో కొత్త ధరలు ఇలా ఉన్నాయి:ఢిల్లీ: పెట్రోల్ ₹98.63, డీజిల్ ₹91.50ముంబై: పెట్రోల్ ₹107.40, డీజిల్ ₹93.86హైదరాబాద్: పెట్రోల్ ₹111.36, డీజిల్ ₹99.53కోల్కతా: పెట్రోల్ ₹109.31, డీజిల్ ₹95.85చెన్నై: పెట్రోల్ ₹104.66, డీజిల్ ₹96.22బెంగళూరు: పెట్రోల్ ₹106.82, డీజిల్ ₹94.82పాట్నా: పెట్రోల్ ₹109.40, డీజిల్ ₹95.61జైపూర్: పెట్రోల్ ₹108.89, డీజిల్ ₹94.32తిరువనంతపురం: పెట్రోల్ ₹111.24, డీజిల్ ₹100.09చండీగఢ్: పెట్రోల్ ₹98.16, డీజిల్ ₹86.28విజయవాడ (ఏపీ): పెట్రోల్ ₹114.48, డీజిల్ ₹102.17విశాఖపట్నం(ఏపీ): పెట్రోల్ ₹112.96, డీజిల్ ₹100.32 -
ఫ్లాష్బ్యాక్ తిరగేస్తే!
దేశ ప్రధాని నరేంద్ర మోదీ మొదలుకొని ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు వరకూ ప్రముఖులంతా పొదుపు మంత్రం పఠిస్తున్నారు. అదే సమయంలో కేంద్ర ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలపై రేట్లు భారీగా పెంచేశారు. ధరల దెబ్బకు ప్రజలు ఎలాగూ ఆయిల్ వినియోగం తగ్గించుకోక తప్పదు. అలాంటప్పుడు ప్రభుత్వాల దుబారా ఖర్చుల మాటేమిటి?.. మోదీ చెప్పిన ఎనిమిది, తొమ్మిది సూత్రాలతో పరిస్థితి మారదన్నది స్పష్టం. ఆయన బంగారం కొనవద్దన్నారు. మరి... ఈ రంగంపై ఆధారపడ్డ ఐదున్నర కోట్ల మంది జీవనోపాధి మాటేమిటి అని బంగారం పరిశ్రమ సంఘాలు ప్రశ్నిస్తున్నాయి. ఆ వెంటనే కేంద్రం బంగారం దిగుమతి సుంకాన్ని 15 శాతానికి పెంచేసింది. దీంతో ఇది కొంత మెరుగేమోననే అభిప్రాయం వ్యక్తమైంది. ఇక పొదుపు మంత్రం పఠించారు. ప్రభుత్వపరంగా వాహనాల వాడకం తగ్గించుకోవడం ఆరంభించారు. మంచిదే. కానీ ఇప్పటివరకూ దుబారా చేసినట్టు ప్రభుత్వమే ఒప్పుకున్నట్లు అయ్యింది. ఇక ఏపీలోనైనా ఈ వాహనాల వినియోగం అట్టహాసంగా ఉంటోంది. ముఖ్యమంత్రి చంద్రబాబుతోపాటు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, కీలక మంత్రి లోకేశ్లు హెలికాఫ్టర్లు, ప్రత్యేక విమానాలు వాడినట్లుగా దేశంలో మరే రాష్ట్రంలో వాడరని చెబుతున్నారు. సీఎం ఒక్కరికే ఉన్న ఈ వెసలుబాటు ఇప్పుడు డిప్యూటీలకు, మంత్రులకు కూడా ఎలా సాధ్యమవుతోందో తెలియదు. మంత్రివర్గ సమావేశంలో పొదుపుపై సూత్రాలు చెప్పిన కాసేపటికి లోకేశ్ ప్రత్యేక విమానంలో పుట్టపర్తి వెళ్లారట. ఎన్నికలకు ముందు చంద్రబాబు, లోకేశ్లు పెట్రోల్, డీజిల్ ధరలపై తీవ్ర విమర్శలు గుప్పించే వారు. ఆ ధరలకు ఆనాటి ముఖ్యమంత్రి జగనే కారణమని ఆరోపించే వారు. తాము అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిళ్లపై ఉన్న పన్నులు తగ్గిస్తామని హామీ ఇచ్చారు. లోకేశ్ యువగళం పాదయాత్ర సందర్భంలో కర్ణాటకలోని ఒక పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి, అక్కడి ధరకు, ఏపీలో ఉన్న ధరకు తేడాను చెప్పి విమర్శలు గుప్పించారు. అది జరిగి రెండేళ్లు దాటుతున్నా, అధికారంలో ఉన్న వీరెవరూ ఆ ఊసే ఎత్తడం లేదు. ఇప్పుడు దేశంలోనే అత్యధిక ధర ఏపీలోనే. పెట్రోల్ రేటు రూ.113 కాగా.. డీజిల్ ధర రూ.99 లకు చేరింది. తమిళనాడు సుమారు రూ.9, కర్ణాటక కన్నా సుమారు రూ.ఏడు ఎక్కువ. ఇప్పుడైనా రాష్ట్ర పన్నులను తగ్గించి ఆయిల్ ధరలను నియంత్రించాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. ప్రభుత్వ విషయానికి వస్తే, రెండు లేదా మూడు వాహనాలు, సీఎం కాన్వాయిలలో సరిపోతే, ఇంతకాలం ఎందుకు అన్ని వాహనాలు వాడారన్నదానికి జవాబు దొరకదు. ప్రతి శుక్రవారం ‘నో వెహికిల్ డే’ పాటించాలని, మంత్రుల విదేశీ పర్యటనలు తగ్గించాలని, ప్రత్యేక విమనాలు అదుపు చేయాలని మంత్రివర్గ సమావేశంలో నిర్ణయించారట. విశేషం ఏమిటంటే చంద్రబాబు ఒక కార్యక్రమంలో మాట్లాడుతూ సెక్యూరిటీ పేరుతో ఎక్కువ వాహనాలను వాడడం ఫాషన్ అయిందని అన్నారు. ఈ మాట ఈ రెండేళ్లలో ఏనాడైనా అన్నారా? అధికారులకు హెచ్చరిక చేసి తన కాన్వాయిలో ఇంతకాలం వాహన శ్రేణిని తగ్గించారా అంటే అదేమీ లేదు. చంద్రబాబు చెప్పడానికి, చేయడానికి ఉన్న తేడాను పలువురు గుర్తు చేసుకున్నారు. అవసరమైతే సచివాలయానికి సైకిళ్లపై రావాలని చంద్రబాబు సూచించారట. విజయవాడ, లేదా గుంటూరు, మంగళగిరి ప్రాంతాలలో నివసిస్తున్న మంత్రులు, సిబ్బంది సైకిళ్లపై రావాలంటే ఎన్ని గంటల సమయం పడుతుందో ఊహించుకోవచ్చు. అది అసలు ఆచరణ సాధ్యమేనా? ఏదో ప్రజల కోసం ఇలాంటి డైలాగులు చెబుతుంటారు. వర్క్ ఫ్రం హోం గురించి కూడా ఆలోచిస్తున్నారు. ఢిల్లీ వంటి రాజధాని నగరాలలో ఇది సాధ్యమేమో కాని, గ్రామీణ ప్రాంతం అధికంగా ఉండే ఏపీలో అది ఎంత ఉపయోగమో చెప్పలేం. ఎన్నికల ప్రచారంలో సాఫ్ట్ వేర్ ఉద్యోగులకోసం వర్క్ ఫ్రం హోమ్ స్టేషన్లు ఏర్పాటు చేస్తామని, ఇళ్ల వద్దనే ఉండి పని చేసుకోవచ్చని చంద్రబాబు విపరీత ప్రచారం చేశారు. ప్రస్తుతం ఆ మాటే ఆయన నుంచి వినిపించడం లేదు. కేవలం ప్రభుత్వ వాహనాల వినియోగం తగ్గించడం వల్ల ఆదా అయ్యే చమురు వ్యయం మరీ ఎక్కువేమీ కాదు. అదే ఏపీ సర్కార్ కనుక ఆయిల్ పై ఉన్న పన్నులు తగ్గిస్తే ఐదున్నర కోట్ల మంది ప్రజలకు ఉపయోగం జరుగుతుంది. అప్పుడు ప్రభుత్వాన్ని కూడా అభినందిస్తారు.అలా చేయకపోతే ప్రభుత్వం చెబుతున్న పొదుపు ఒకరకంగా సముద్రంలో నీటి బొట్టు వంటిదే అనుకోవాలి. కేవలం చమురులోనే అధిక వ్యయం అవుతోందా? అంటే కాదనే చెప్పాలి. ప్రభుత్వ పరంగా సాగే ఇతర దుబారా వ్యయం ఇంతా అంతా కాదు.దాని గురించి మాత్రం ప్రభుత్వ పెద్దలు ఎవరూ మాట్లాడడం లేదు. అంతదాకా ఎందుకు ముఖ్యమంత్రి నివసిస్తున్న ఉండవల్లి నివాసానికి, ఢిల్లీలోని నివాసానికి ఎన్ని కోట్లు ఖర్చు చేస్తున్నది వార్తలు వచ్చాయి కదా!. తాజాగా ఢిల్లీలోని ఇంటి కోసం రూ.6.5 కోట్లు వ్యయం చేయడానికి జీవో ఇచ్చారు. కొద్ది రోజుల క్రితమే మంత్రులు సింగపూర్ టూర్ చేసి వచ్చారు. అదంతా వృథా వ్యయమని విపక్ష వైఎస్సార్సీపీ విమర్శించింది. ఈ నెలాఖరున మరో మంత్రి కొల్లు రవీంద్ర విదేశీ పర్యటన పెట్టుకున్నారు. ఇక అన్నిటికి మించి అమరావతి పేరుతో జరుగుతున్న దుబారా ఉంటోందన్నది సర్వత్రా వ్యక్తం అవుతున్న అబిప్రాయం. అమరావతికి ప్రభుత్వ డబ్బు రూపాయి ఖర్చు చేయనవసరం లేదని చంద్రబాబు పదే,పదే చెప్పేవారు. అధికారంలోకి వచ్చాక మాత్రం ప్రభుత్వమే బడ్జెట్లో ఆరు వేల కోట్లు కేటాయించింది. అంతేకాక సుమారు రూ.47 వేల కోట్ల అప్పులు చేశారు. వాటిలో అత్యధిక భాగం డాలర్ల రూపంలోనే ప్రపంచ బ్యాంక్, ఏడీబీ వంటి సంస్థలు ఇస్తున్నాయి. వడ్డీతో సహా డాలర్ల రూపంలో చెల్లించాల్సి ఉండవచ్చు. అప్పుడు ఈ వ్యయం ఎంత అవుతుందో ఊహించుకోవచ్చు. పోనీ ఆయా కాంట్రాక్ట్ పనులనైనా పొదుపుగా చేస్తున్నారా అంటే ఇప్పటికే ఉన్న సచివాలయం, అసెంబ్లీ, హైకోర్టు వంటి వాటికి కొత్త భవనాల కోసం మళ్లీ వేల కోట్లు వ్యయం చేయబోతున్నారు. అందరికి అందుబాటులో ఉన్న గన్నవరం వద్ద విమానాశ్రయాన్ని కాదని ఎక్కడో మారుమూల మరో 4600 ఎకరాలలో కొత్త ఎయిర్పోర్టు ఏర్పాటు చేస్తారట. ఇందుకోసం తొలిదశలో రూ.3400 కోట్లు ఖర్చు పెడతారట. రాజధాని పేరుతో దేశంలో ఎక్కడా లేని విధంగా చదరపు అడుగుకు రూ.14 వేల నుంచి రూ.18 వేల వరకు వెచ్చిస్తున్నారంటే ఏమనుకోవాలి? కేవలం భవనాల అద్దాల కోసం రూ.2540 కోట్లు వ్యయం చేయడమా అని అంతా నోరు వెళ్లబెడుతున్నారు. అమరావతి నిర్మాణాలలో భారీ అవినీతి ఉందని విపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఔటర్ రింగ్ రోడ్డు పేరుతో 140 మీటర్ల వెడల్పు రోడ్డు వేస్తారట. దీనికి పాతికవేల కోట్ల వ్యయం అవుతుందని చెబుతున్నారు. రెండో దశ భూ సేకరణ అంటేనే పెద్ద స్కామ్ అని టీడీపీ మద్దతుదారైన రిటైర్డ్ ఐపిఎస్ అధికారి ఏబీ వెంకటేశ్వరరావు చెబుతున్నారు.దానికి ప్రభుత్వం నుంచి సమాధానమే రావడం లేదు.ఈ నేపథ్యంలో ఏదో పబ్లిసిటీ కోసం పొదుపు చర్యలు కాకుండా కాంక్రీట్ గా అమరావతి పేరుతో సాగుతున్న దుబారాను అరికట్టే రీతిలో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకుంటే అంతా స్వాగతిస్తారు. మరి ఇందుకు చంద్రబాబు ప్రభుత్వం సిద్దమవుతుందా?అంటే అనుమానమే!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
విచ్చలవిడి మద్యం అమ్మకాలతోనే ఇలాంటి దారుణాలు
సాక్షి, తాడేపల్లి: మద్యం నియంత్రణలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని.. ఫలితంగా అమాయకుల ప్రాణాలు పోతున్నాయని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. శనివారం ఉదయం కాకినాడలో జరిగిన రోడ్డు ప్రమాదంపై ఆయన దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. పని ప్రదేశంలో టిప్పర్ ఢీ కొట్టటంపై ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. ప్రమాదంలో ఐదుగురు మహిళా కూలీలు మృతి చెందటం బాధాకరమన్నారు. మృతుల కుటుంబాలకు సంతాపం తెలిపిన ఆయన.. ఘటనకు కూటమి ప్రభుత్వమే కారణమంటూ ధ్వజమెత్తారు. ‘‘టిప్పర్ డ్రైవర్ మద్యం తాగి వాహనం నడిపారన్న వార్త ఆందోళన కలిగించింది. రాష్ట్రంలో రాత్రింబవళ్లు విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. అందుకే ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయి. మద్యం నియంత్రణలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. అక్రమ మద్యం విక్రయాలు, పర్యవేక్షణ లోపంతో అమాయక ప్రజలు ప్రాణాలు కోల్పోతున్నారు’’ అని జగన్ ఆవేదన వ్యక్తం చేశారు. .. ‘‘ఉపాధి హామీ పనులకు వెళ్లే పేద మహిళలు ప్రాణాలు కోల్పోయే పరిస్థితులు రావడం ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనం. పని ప్రదేశాల వద్ద కనీస భద్రతా చర్యలు లేకపోవడం దురదృష్టకరం. మృతి చెందిన కుటుంబాలకు తక్షణ ఆర్థికసాయం అందించాలి. క్షతగాత్రులకు మెరుగైన వైద్యం అందించాలి. బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకోవాలి’’ అని కూటమి ప్రభుత్వాన్ని వైఎస్ జగన్ డిమాండ్ చేశారు. కాకినాడ జిల్లాలో శనివారం ఉదయం ఘోర రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఉపాధి పనులకు వెళ్తున్న కూలీలు కొవ్వూరు బ్రిడ్జి వద్ద రోడ్డు దాటుతుండగా టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో నలుగురు అక్కడికక్కడే మృతి చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా.. క్షతగాత్రులను కాకినాడ జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ మరొకరు మరణించారు. మృతుల్లో నలుగురు మహిళలు, ఒక పురుషుడు ఉన్నారు. వీళ్లను చీడిగ గ్రామస్తులుగా పోలీసులు నిర్ధారించారు. -
చంద్రబాబు దుర్మార్గ పాలనకు బలం మీడియానే: పొన్నవోలు
సాక్షి, తాడేపల్లి: రాష్ట్రంలో దుర్మార్గమైన పరిస్థితి రాజ్యమేలుతోందని వైఎస్సార్సీపీ లీగల్ వ్యవహారాల ప్రధాన కార్యదర్శి, మాజీ ఏఏజీ పొన్నవోలు సుధాకర్రెడ్డి అన్నారు. ఏపీలో ప్రస్తుత పరిస్థితులపై శనివారం గుంటూరు తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో పొన్నవోలు మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో ప్రజాస్వామ్యం లేదు. పోలీస్ రాజ్ మాత్రమే నడుస్తోంది. కూటమి పాలనలో పోలీస్ వ్యవస్థ నిర్వీర్యమైంది. అక్రమాలు, అవినీతిపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతున్నారు. సామాన్యులు సైతం ఇబ్బందులు పడుతున్నారు. ప్రజా సమస్యలను గాలికొదిలేసి చంద్రబాబు నియంత పాలన చేస్తున్నారు. చంద్రబాబు బలం మీడియానే. మీడియాను అడ్డుపెట్టుకుని అరాచక పాలన కొనసాగిస్తున్నారు అని పొన్నవోలు మండిపడ్డారు. -
ప్యాలెస్ కోసం నారా వారి స్కెచ్.. ఎర్రచందనం దొంగలతో బాబు, లోకేశ్
-
ఏపీ ఎన్నికలు ఇప్పటికీ ఓ మిస్టరీనే!
సాక్షి, అనంతపురం: ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికలపై ప్రముఖ రాజకీయ ఆర్థిక విశ్లేషకులు పరకాల ప్రభాకర్ మరోసారి ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఆ ఎన్నికల్లో ఓటింగ్ శాతంపై అనుమానాల్ని ఎందుకనో ఎన్నికల సంఘం ఇప్పటిదాకా నివృత్తి చేయలేకపోయిందని అన్నారాయన. శనివారం అనంతపురంలో ఆయన మాట్లాడుతూ.. 2024లో ఆంధ్రప్రదేశ్లో జరిగిన ఎన్నికలు ఓ మిస్టరీ. నేను లేవనెత్తిన అనుమానాలకు ఎన్నికల సంఘం నుంచి సమాధానాలు లేవు. సుమారు 3,500 పోలింగ్ కేంద్రాల్లో అర్ధరాత్రి సమయంలో పెద్ద ఎత్తున ఓటింగ్ జరిగింది. అసలు 12 శాతం అదనంగా ఓట్లు ఎక్కడి నుంచి వచ్చాయి?. కొన్ని పోలింగ్ కేంద్రాల్లో 100కు 132 శాతం పోలింగ్ నమోదైంది.. ఇది ఎలా సాధ్యం?. ఆ అనుమానాలు నివృత్తి చేసే బాధ్యత ఎన్నికల సంఘం పై లేదా?..సాధారణంగా.. సాయంత్రం 6 గంటల లోపు పోలింగ్ కేంద్రాల్లో ఉన్న వారికే ఓటు అవకాశం ఉంటుంది. ఏపీలో తెల్లవారుజామున 2 గంటల వరకు పోలింగ్ జరిగిందని ఎన్నికల సంఘం చెబుతోంది. సాయంత్రం 6 గంటల నుంచి తెల్లవారుజామున 2 గంటల దాకా క్యూలైన్ లో ఉండి చివరగా ఓటు వేసిన వారు ఎవరు. అర్ధరాత్రి సమయంలో 8 గంటలు క్యూలైన్లో ఉండి ఓటు వేసిన వారి వివరాలు ఇస్తే... పాద పూజ చేస్తా అని ప్రభాకర్ అన్నారు. -
కూటమిని కూలుస్తాం.. జగన్ను మళ్లీ సీఎం చేస్తాం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: తప్పుడు వాగ్దానాలతో రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని కూలదోసే దాకా తగ్గేదే లేదంటున్నారు వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు. తనపై బనాయించిన అక్రమ కేసుల విచారణలో భాగంగా గురువారం ఆయన జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన చేసిన పని వైస్సార్సీపీ శ్రేణుల్లో ఫుల్ జోష్ నింపింది. తొలుత గండి వీరాంజనేయ దేవస్థానానికి వెళ్లిన అంబటి అక్కడ ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఇడుపులపాయలోని వైఎస్సార్ఘాట్ను సందర్శించి మహానేత రాజశేఖర్రెడ్డికి పూలమాలతో నివాళులర్పించారు. ఈ సందర్భంగా.. రాష్ట్ర ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని ప్రజాస్వామ్య పద్ధతిలోనే కూలుస్తామని ఆయన ప్రతిజ్ఞ చేశారు. వైఎస్ జగన్ను మళ్లీ అధికారంలోకి తెచ్చే వరకూ అలుపెరగని పోరాటం చేస్తామని.. ఈ పోరాటంలో ఎన్ని కుట్రలు, దాడులు, కేసులు, జైళ్లు ఎదురైనా ధైర్యంగా పోరాడతామని.. వైఎస్సార్ సాక్షిగా ఇదే నా ప్రతిజ్ఞ అని అన్నారాయన.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ అంబటి రాంబాబుపై అక్రమ కేసు బనాయించింది కూటమి ప్రభుత్వం. ఈ వ్యవహారంలో అంబటి తన వ్యాఖ్యలకు వివరణ ఇచ్చుకుని క్షమాపణలు కూడా చెప్పారు. అయినా కూడా వినకుండా టీడీపీ గూండాలు ఆయన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసి విధ్వంసం సృష్టించాయి. ఈ కేసులో ఎవరినీ అరెస్ట్ చేయకపోగా.. టీడీపీ నేతల ఫిర్యాదు నేపథ్యంతో అంబటిపైనే కేసులు నమోదు చేసి అరెస్ట్ చేశారు. రెండువారాల పాటు రాజమండ్రి జైల్లో ఉన్న ఆయన బెయిల్పై విడుదలయ్యారు. అప్పటి నుంచి దాడి చేసిన వాళ్లపై, కస్టడీలో తనను టార్చర్ చేసిన పోలీసు అధికారులపై చర్యలు కోరుతూ ధర్మ పోరాటం చేస్తున్నారు. అయితే ఇప్పుడు ఈ కేసుల విచారణలో భాగంగా.. వేంపల్లి, పులివెందుల పోలీస్ స్టేషన్లలో ఇవాళ విచారణకు అంబటి హాజరవుతున్నారు. -
మా బుక్స్ పడేసి.. బయటకి లాక్కొచ్చి ఇల్లు కూలగొట్టారు
-
దస్తగిరి హత్య కేసులో చంద్రబాబు మాట విని నవ్వులపాలైన ఎల్లో బ్యాచ్
-
ఉద్యోగుల్ని రాజకీయంగా వాడుకున్నదే చంద్రబాబు: వెంకట్రామిరెడ్డి
సాక్షి, తాడేపల్లి: ప్రభుత్వ ఉద్యోగులను రాజకీయంగా వాడుకున్న చరిత్ర చంద్రబాబుదేనని ఏపీ సచివాలయ ఉద్యోగుల సంఘం మాజీ అధ్యక్షుడు వెంకట్రామిరెడ్డి అన్నారు. తనను అన్యాయంగా విధుల నుంచి తొలగించారంటూ ఆయన మంగళవారం మీడియా ద్వారా మాట్లాడారు. పచ్చ మీడియా జర్నలిస్టులు ఇష్టమొచ్చినట్లు మాట్లాడుతున్నారు. నేను ఎలాంటి ఎన్నికల ప్రచారం చేయలేదని గతంలో అధికారులు రిపోర్ట్ ఇచ్చారు. నా డిస్మిస్ తప్పని ప్రతీ ఐఏఎస్కు తెలుసు. నన్ను డిస్మిస్ చేసింది కేవలం ఉద్యోగులను భయపెట్టడానికే. కానీ, కూటమి ప్రభుత్వ బెదిరింపులకు ఉద్యోగులు భయపడరు. ఉద్యోగులను రాజకీయంగా వాడుకుందే చంద్రబాబు. గతంలో ఏపీ ఉద్యోగులను తీసుకెళ్లి బీజేపీకి వ్యతిరేకంగా కర్ణాటకలో ఎన్నికల ప్రచారం చేయించారు. ఆ సమయంలో ఉద్యోగుల చేత ప్రధాని మోదీని చంద్రబాబు తిట్టించారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల సమయంలో ఉద్యోగుల కోసం ఇచ్చిన హామీలేమయ్యాయి?. ఎప్పుడు అమలు చేస్తారు??.. అధికారంలోకి వచ్చాక కూటమి ప్రభుత్వం ఉద్యోగుల కోసం ఏం చేసింది??. ఈ ప్రభుత్వం వచ్చాక కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు 15వ తేదీ పైనే జీతాలు పడుతున్నాయి.. .. ఉద్యోగులకు వైఎస్ జగన్ ఇచ్చిన హామీలను నెరవేర్చారు. ఉద్యోగులపట్ల వైఎస్ జగన్ చాలా హుందాగా వ్యవహరించారు. ఉద్యోగులకు చాలా రకాలుగా మేలు చేశారు. కూటమి ప్రభుత్వం కంటే వైఎస్సార్సీపీ ప్రభుత్వం 100 రెట్లు మేలు అని వెంకట్రామిరెడ్డి అన్నారు. పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ విభాగంలో అసిస్టెంట్ సెక్రెటరీగా విధులు నిర్వహిస్తున్న వెంకట్రామిరెడ్డిని ఉద్యోగం నుంచి తొలగిస్తూ సోమవారం ఏపీ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో వైఎస్సార్సీపీకి ఆయన అనుబంధంగా పని చేశారని.. ఎన్నికల సమయంలోనూ పార్టీ కోసం ప్రచారం చేశారని.. తద్వారా సర్వీసు నిబంధనలు ఉల్లంఘించారని పేర్కొంటూ ఆయనపై చర్యలు తీసుకున్నట్లు సాధారణ పరిపాలన శాఖ పేర్కొంది. -
అంబటి రాంబాబుపై మరో కేసు నమోదు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ నేతలపై కూటమి ప్రభుత్వ కుట్రలు కొనసాగుతున్నాయి. గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబుపై తాజాగా మరో అక్రమ కేసు నమోదు అయ్యింది. ఆయన ట్రాఫిక్కు అంతరాయం కలిగించారన్నది ఈసారి పోలీసుల వాదన. తన నివాసంపై దాడి చేసి విధ్వంసం చేసిన టీడీపీ గూండాలను అరెస్ట్ చేయాలని.. కస్టడీలో తనను హింసించిన పోలీసు సిబ్బందిపై చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేస్తున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో గుంటూరు కలెక్టరేట్ ఎదుట ఆయన శనివారం ఈ దీక్ష చేశారు. అయితే.. ఆయన అనుమతి తీసుకోలేదని.. పైగా ఆ దీక్ష వల్ల ట్రాఫిక్కు అంతరాయం కలిగిందని పేర్కొంటూ నగరంపాలెం పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ శ్రేణులు భగ్గుమంటున్నాయి. ‘‘నా ఇంటిపై దాడి చేసి నన్నే 18 రోజులు రాజమండ్రి జైలు పెట్టారు. అరెస్టు చేశాక పోలీస్ స్టేషన్లో(నల్లపాడు) నన్ను హింసించాలని ప్రయత్నించారు. మరి దాడి చేసినవాళ్లను 18 నిమిషాలైనా జైల్లో పెట్టారా?. పోలీసుల సమక్షంలోనే నా ఇంటిపై దాడి జరిగింది. గుంటూరులో ఎప్పుడూ ఇలాంటి దాడులు జరగలేదు. గుంటూరులో ఇళ్లపై దాడి చేసే సంస్కృతిని పెమ్మసాని తీసుకొచ్చారు. చంద్రబాబు, లోకేష్, పెమ్మసాని ఆదేశాలతోనే నా ఇంటిపై దాడి జరిగింది. వాళ్లను వదిలిపెట్టే ప్రసక్తే లేదు. టీడీపీ నేతలు నన్ను భయపెట్టలేరు. టీడీపీ నేతల బెదిరింపులకు వైఎస్సార్సీపీ నేతలు భయపడరు. ప్రాణాలకు తెగించైనా మీ సంగతి చట్టబద్దంగా తేలుస్తా. దాడిపై న్యాయ పోరాటం... ప్రజా పోరాటం చేస్తా. నేను చేస్తుంది ధర్మపోరాటం. ఎవరినీ వదిలే ప్రసక్తే లేదు’’ అని అంబటి రాంబాబు దీక్ష సందర్భంగా ప్రసంగించారు. -
నిరాహార దీక్షకు దిగిన అంబటి రాంబాబు
సాక్షి, గుంటూరు: వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి అంబటి రాంబాబు శనివారం వేకువఝామున జిల్లా కలెక్టరేట్ వద్ద నిరాహార దీక్షకు దిగారు. తనను కస్టడీలో హింసించిన పోలీసులు సస్పెండ్ చేయాలని.. తన ఇల్లు, ఆఫీస్పై దాడి చేసిన వారిని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేస్తున్నారాయన. అంబటి దీక్షకు వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి సంఘీభావం ప్రకటించారు. ఆయనకు మద్దతుగా వైఎస్సార్సీపీ శ్రేణులు దీక్షా శిబిరానికి తరలి వస్తున్నాయి. సాయంత్రం దాకా ఈ దీక్ష కొనసాగనుంది.ముఖ్యమంత్రి చంద్రబాబుపై అవమానకర వ్యాఖ్యలు చేశారని ఆరోపిస్తూ.. టీడీపీ శ్రేణులు నవభారత్ నగర్లోని అంబటి నివాసం, కార్యాలయాన్ని ముట్టడించాయి. తన వ్యాఖ్యలపై ఆయన వివరణ ఇచ్చినా కూడా గుంపుగా వచ్చి ఇంటిపై రాళ్లు రువ్వి, అక్కడున్న వాహనాలను ధ్వంసం చేసి విధ్వంసంతో వీరంగం సృష్టించాయి. ఆపై నాటకీయ పరిణామాల నడుమ అంబటిని పోలీసులు అరెస్ట్ చేశారు(జనవరి 31న). అంబటి రాంబాబు అరెస్ట్ ఏపీలో రాజకీయ కలకలం రేపింది. ఆయన్ని బయటకు రానివ్వకుండా పలు కేసులను తెరపైకి తెచ్చింది కూటమి ప్రభుత్వం. చివరకు న్యాయ వ్యవస్థ జోక్యంతో ఆయన రెండు వారాల తర్వాత(ఫిబ్రవరి 18న) రాజమండ్రి సెంట్రల్ జైలు నుంచి రిలీజ్ అయ్యారు. -
పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం: సజ్జల
సాక్షి, తాడేపల్లి: ఏపీలో చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు పోలీసు వ్యవస్థ నడుచుకుంటోందని వైఎస్సార్సీపీ స్టేట్ కో–ఆర్డీనేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి అన్నారు. వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి పూడి శ్రీహరి అక్రమ అరెస్ట్.. నిర్బంధంపై సజ్జల బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్రకార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ‘‘పూడి శ్రీహరి అరెస్టును ఖండిస్తున్నాం. సివిల్ డ్రెస్సులో వచ్చి అక్రమంగా అరెస్ట్ చేశారు. పోలీసులు సివిల్ డ్రస్లో వచ్చి అరెస్ట్ చేయడమేంటి?. పైగా నోటీసులు ఇవ్వకుండానే శ్రీహరిని తమ వెంట తీసుకెళ్లారు. కుటుంబ సభ్యులతో పాటు పార్టీ వర్గాల్లో ఆందోళన నెలకొంది. శ్రీహరి ఉగ్రవాది కాదు.. గతంలో జర్నలిస్టుగా పని చేశారు. కేసులకు సంబంధించి ఎఫ్ఐఆర్లు కూడా ఇవ్వడం లేదు. సుప్రీం కోర్టు ఆదేశాలను సైతం పోలీసులు ధిక్కరిస్తున్నారు. చంద్రబాబు అండ్ కో చెప్పినట్లు వింటూ తప్పుడు కేసులు బనాయిస్తున్నారు. పూడి శ్రీహరి అరెస్ట్పై డీజీపీ సమాధానం చెప్పాలి’’ అని సజ్జల డిమాండ్ చేశారు. ‘‘అక్రమ అరెస్టులకు భయపడేది లేదు. ఈ వ్యవహారంలో చట్ట ప్రకారం ముందుకు వెళ్తాం. నిబంధనలు పాటించని పోలీసులపై వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక చర్యలు తీసుకుంటుంది. అందరినీ గుర్తు పెట్టుకుంటాం.. ఎవరూ తప్పించుకోలేరు’’ ఈ సందర్భంగా సజ్జల హెచ్చరించారు. -
రెండేళ్లైనా జువ్వలదిన్నెను ఎందుకు అప్పగించలేదు?: వైఎస్ జగన్
సాక్షి, నెల్లూరు: రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలకు జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ మరో ఉదాహరణ అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం ఫిషింగ్ హార్బర్ను పరిశీలించి.. స్థానిక మత్య్సకారులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించారు. వాళ్ల సమస్యలు అడిగి తెలుసుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ‘‘మా ప్రభుత్వ(వైఎస్సార్సీపీ) హయాంలో రూ.26 వేల కోట్లతో పోర్టుల అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టాం. రాష్ట్రంలో నాలుగు కొత్త పోర్టుకు శ్రీకారం చుట్టాం. పది ఫిషింగ్ హార్బర్లు, ఆరు ఫిష్ ల్యాండ్ సెంటర్లతో మత్స్యకారుల జీవన ప్రమాణాలు మెరుగుపడడానికి కృషి చేశాం. అన్ని రకాల అనుమతులతో పోర్టులను ప్రారంభించాం. మారిటైం బోర్డు తీసుకొచ్చి పనులు వేగవంతం చేశాం. 2024 మార్చి 12న జువ్వలదిన్నెను వర్చువల్గా ప్రారంభించాం. 1,250 మెకనైజ్డ్ బోట్లు అందించాలనుకున్నాం. మళ్లీ అధికారంలోకి వచ్చి ఉంటే ఆ బోట్లు మత్స్యకారులకు అందేవే. మచిలీపట్నం, మూలపేట పోర్టుల పనులు కూడా 35 శాతం పూర్తి చేశాం. కాకినాడ పోర్టు పనులు కూడా వేగవంతం చేశాం. రామాయపట్నం పోర్టు పనులు కూడా దాదాపు పూర్తయ్యాయి. ఏపీ ఎకనామిక్ గ్రోత్కు ఊతం ఇచ్చేలా ప్రణాళికలు చేశాం. మరి మిగిలిన పనులను కూటమి సర్కార్ ఎందుకు పూర్తి చేయడం లేదు?. జువ్వలదిన్నెలో 41 వేల టన్నుల మత్స్య సంపద దొరుకుతుంది. ఈ ప్రాజెక్టు పూర్తై రెండేళ్లు గడుస్తోంది. దీనిని ప్రధాని జాతికి అంకితం చేసి ఏడాదిన్నరకు పైనే అవుతోంది. అయినా మత్స్యకారులకు ఎందుకు అప్పగించలేదు? అని చంద్రబాబు సర్కార్ను వైఎస్ జగన్ నిలదీశారు.మత్స్యకారుల నుంచి చంద్రబాబు ఏనాడూ ఆలోచన చేయలేదు. మత్స్యకారులకు మేలు చేయకపోగా.. పొట్టపై తంతున్నారు. జువ్వలదిన్నె నుంచి మత్స్యకారులను తరిమేందుకు కుట్రలు జరుగుతున్నాయి. స్థానిక మత్స్యకారులు తమిళనాడు బోట్లను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. మార్చి 12న మంత్రి నారా లోకేష్ జువ్వలదిన్నెను సందర్శిస్తే.. 16న సీజ్ చేసిన బోట్లు ఎత్తుకెళ్లిపోయారు. బోట్లు ఎత్తుకెళ్లిన కేసులో ఒక్కరినైనా అరెస్ట్ చేశారా?. అధికారంలో ఉన్న పెద్దలే దొంగతనం చేసి తీసుకెళ్లారు కాబ్టి ఎవరినీ అరెస్ట్ చేయలేదు. సీజ్ చేసిన బోట్లను బీదా సోదరులు అక్రమంగా అప్పగించారు. టీడీపీ ఎంపీ, ఎమ్మెల్యేలు.. మత్స్యకారుల కడుపు కొట్టేందుకు ఇంత మంది ఏకమవుతున్నారు. బోట్లు ఎత్తుకెళ్లిన వారికి సీఎం కొడుకు ఆశీస్సులు ఉన్నాయి. కళ్లుమూసి తెరిచే లోపే మూడేళ్లు గడిచిపోతాయి. వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమే. అధికారంలోకి రాగానే ప్రైవేట్ డిఫెన్స్ కంపెనీని ఇక్కడి నుంచి తరలిస్తాం. జువ్వలదిన్నె మాత్రమే కాదు మొత్తం పది ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల సొంతం. ఫిషింగ్ హార్బర్లు మత్స్యకారుల హక్కు. హార్బర్లను మత్స్యకారుల నుంచి చంద్రబాబు తాత కూడా తీయలేడు’’ అని వైఎస్ జగన్ స్పష్టం చేశారు. -
జగన్ పర్యటన.. జువ్వలదిన్నెలో పోలీసుల ఓవరాక్షన్
సాక్షి, నెల్లూరు రూరల్: మత్స్యకారుల సమస్యలు విని వారికి అండగా నిలిచే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి కావలి నియోజకవర్గంలోని జువ్వలదిన్నెలో ఇవాళ(బుధవారం) పర్యటించబోతున్నారు. అయితే ఈ పర్యటనకు కూటమి ప్రభుత్వం అడుగడుగునా ఆటంకం కలిగించే ప్రయత్నాలు చేస్తోంది. పోలీసు వ్యవస్థను ప్రయోగిస్తోంది.జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్పరం చేయాలని చంద్రబాబు ప్రభుత్వం కుట్రలు చేస్తున్న సంగతి తెలిసిందే. దీనికి తోడు బయటి నుంచి వచ్చే పడవలకూ మద్దతు ఇస్తూ స్థానిక మత్స్యకారుల పొట్టకొట్టే ప్రయత్నాలు చేస్తోంది. దీంతో తీవ్ర ఆందోళనలకు మత్స్యకారులు సిద్ధమయ్యారు. ఈ నేపథ్యంతో వాళ్లను కలిసి భరోసా ఇచ్చేందుకు వైఎస్ జగన్ జువ్వలదిన్నెకు వెళ్తున్నారు. అయితే.. జగన్ రాక నేపథ్యంలో జువ్వలదిన్నె పోలీసు ఆంక్షల వలయంగా మారింది. ఫిషింగ్ హార్బర్ వైపు ఎవరినీ వెళ్లనీయకుండా పోలీసులు అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. మత్స్యకారులను సైతం అటువైపు అనుమతించడం లేదు. చివరకు మీడియాకు సైతం అనుమతి లేదని చెబుతున్నారు. ఈ ఆంక్షలపై వివరణ కోరితే.. కలెక్టర్ ఎస్పీ ఆదేశాల మేరకు ఈ ఆంక్షలు అని పోలీసులు చెబుతున్నారు. అయితే ఈ ఆంక్షలపై వైఎస్సార్సీపీ నేతలు మండిపడుతున్నారు.ఇదీ చదవండి: జువ్వలదిన్నెకు జగనన్న.. కూటమిలో ఉలిక్కిపాటు -
జువ్వలదిన్నెకు వైఎస్ జగన్.. కూటమిలో ఉలిక్కిపాటు
సాక్షి, నెల్లూరు రూరల్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జువ్వలదిన్నె పర్యటన కూటమి ప్రభుత్వంలో వణుకు పుట్టిస్తోంది. గత నెల రోజులుగా తీరప్రాంతంలో పరిస్థితులు నివురు గప్పిన నిప్పులా ఉన్నాయి. ఇప్పుడేమో.. రేపటి జగన్ పర్యటనతో తారాస్థాయికి చేరిన ప్రభుత్వ వ్యతిరేకత బయటపడుతుందన్న ఆందోళనలో చంద్రబాబు ప్రభుత్వం ఉంది. మత్స్యకారుల విషయంలో టీడీపీ పెద్దల వ్యవహారంతో ఆ పార్టీ పునాదులే కూలిపోతున్నాయి. తీర ప్రాంతంలో టీడీపీ జెండా పీకేసేందుకు మత్స్యకారులు సన్నద్ధమవుతున్నారు. జువ్వలదిన్నె ఫిషింగ్ హార్బర్ను ప్రైవేట్ కంపెనీకి అప్పగించడం, తమను దోచుకుంటున్న పాండిచ్చేరి మెకనైజ్డ్ బోట్లను వదిలేయడం వంటి ఘటనలు మత్స్యకారుల్లో తీవ్ర ఆగ్రహాన్ని రేపాయి. పైగా టీడీపీ రాజ్యసభ సభ్యుడు బీద మస్తాన్రావు ఈ కుట్రలకు కారణమని ఆరోపణలు రావడంతో, ఆయనను తీరప్రాంతంలో నిషేధిస్తూ, ఆయనతో కానీ, కుటుంబ సభ్యులతో కానీ మాట్లాడితే భారీ జరిమానా విధించేలా మత్స్యకార పెద్దలు తీర్మానించడం(దురాయి విధింపు) సంచలనం సృష్టించింది. ఈ తరుణంలో.. జగన్ రాక మత్స్యకారుల పోరాటానికి మరింత బలం చేకూర్చే అవకాశం కనిపిస్తోంది. ఫిషింగ్ హర్బర్ను సందర్శించడంతో పాటు ఆయన మత్స్యకారులతో ముఖాముఖి కానున్నారు. తమ ప్రభుత్వం వచ్చాక న్యాయం చేస్తామని స్పష్టమైన హామీ ఇచ్చే సూచనలు కనిపిస్తున్నాయి. అదే అదనుగా జగన్ ఇచ్చే భరోసాతో మత్స్యకారులు తమ పోరాటాన్ని మరింత ఉదృతం చేయాలని భావిస్తున్నారు. తమ భవిష్యత్ బతుకులకు వెన్నుపోటు పొడిచి ఛిద్రం చేస్తున్న వాళ్లను వదిలే ప్రసక్తే లేదని మత్స్యకారులు అంటున్నారు. జగన్ పర్యటన తర్వాత కావలి నియోజకవర్గంలోని మత్స్యకార గ్రామాలు తమ భవిష్యత్ కార్యాచరణపై ఓ నిర్ణయం తీసుకోనున్నాయి. తెలుగు దేశం పార్టీని తీర ప్రాంతంలో సమూలంగా నిషేధించడంతో పాటు వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీని గంగలో కలిపేస్తామని తీర్మానం చేయబోతున్నాయట. జగన్ రాకతో ఉమ్మడి నెల్లూరుతో పాటు ప్రకాశం, గుంటూరుల నుంచి కూడా భారీగా మత్స్యకారులు తరలి రావొచ్చని అంచనాలున్నాయి. ఈ పరిణామాలను నిశీతంగా పరిశీలిస్తున్న కూటమి ప్రభుత్వం.. జగన్ పర్యటనకు మత్స్యకారులు స్వచ్చందంగా తరలి రాకుండా తమదైన కుట్రలను ప్రయోగించే అవకాశం లేకపోలేదు. -
అమరావతి అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు
సాక్షి, కర్నూలు: అమరావతి గురించి పదే పదే మాట్లాడుతున్న ముఖ్యమంత్రి చంద్రబాబు.. రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా? అని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి బుగ్గన రాజేంద్రనాథ్ ప్రశ్నించారు. కేవలం అమరావతి డిజైన్ల పేరిట వందల కోట్ల అవినీతి జరుగుతోందని అంటున్నారాయన. మంగళవారం కర్నూలులో ఆయన మీడియాతో మాట్లాడారు. మెడికల్ కాలేజీలు పూర్తి చేయడానికి కూటమి ప్రభుత్వం వద్ద రూ.5 వేల కోట్లు కూడా లేవా?. ప్రభుత్వ ఉద్యోగులకు చెల్లించడానికి జీతాలకు డబ్బులు లేవని మీరే(చంద్రబాబును ఉద్దేశించి..) అంటారు. అమరావతిలో మాత్రం లక్షల కోట్లు పెట్టాలంటారు. దేశంలో ఎక్కడా లేని విధంగా అమరావతిలోనే నిర్మాణ ఖర్చులు ఎక్కువ. కేవలం డిజైన్ల పేరుతోనే రూ.400 కోట్ల అవినీతి జరుగుతోంది. అమరావతి గురించి చంద్రబాబు పదే పదే మాట్లాడుతున్నారు. మరి రాష్ట్రంలో వెనుకబడిన ప్రాంతాల గురించి ఏనాడైనా మాట్లాడారా?. కనీసం ఆలోచన అయినా చేశారా?. అమరావతికి లక్షల కోట్లు అవసరమైతే.. మావిగన్కు కేవలం రూ. 10-20 వేల కోట్లు చాలు. అమరావతి పనుల్లో అంతులేని అవినీతి జరుగుతోంది. రైతులకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. జరుగుతున్న అవినీతి చూసి దేవుళ్లు కూడా భయపడతారు’’ అని బుగ్గన అన్నారు. టీడీపీ, జనసేన ప్రధాన కార్యాలయాలు ఉండేది నేషనల్ హైవే పక్కనే కదా!. శ్రీబాగ్ ఒడంబడికి అంటే టీడీపీ నేతలకు తెలుసా?. పెద్ద మనుషుల ఒప్పందం అంటే చంద్రబాబుకి తెలుసా?. రాజ్యాంగంలో ఆదేశిక సూత్రాలు అనేవి ఉంటాయి. కనీసం చంద్రబాబుకి వాటి గురించైనా తెలుసా?. మావిగన్, వికేంద్రీకరణ అంటే చంద్రబాబుకి ఎందుకు కోపం?. కేంద్రం 2014 ఏప్రిల్ 25న శివరామకృష్ణన్ కమిటీ వేసింది. ఇప్పుడు ఉన్న అమరావతి ప్రాంతం రాజధానికి పనికి రాదని ఆ కమిటీ చెప్పింది కదా’’ అని బుగ్గన గుర్తు చేశారు. -
రాజధాని హైదరాబాద్ లో కట్టుకుందాం మీకు సౌకర్యంగా ఉంటది రాచమల్లు సెటైర్లు
-
ఇదీ టీడీపీ నేతల చిల్లర వ్యవహారం
సాక్షి, వైఎస్సార్ జిల్లా: ముఖ్యమంత్రి రిలీఫ్ ఫండ్ కుంభకోణంలో తెలుగు దేశం నేతలు కొత్త నాటకానికి తెర తీశారు. బాధితుడు ఎల్లయ్య కుటుంబ సభ్యుడొకరు తమకు బాకీ ఉన్నాడని.. ఆ అప్పు కిందే అతని ఖాతాలో జమ అయిన సొమ్ము నుంచి రూ. 8 లక్షలు తీసుకున్నామని ఇప్పుడు కవరింగ్ చేసుకునే ప్రయత్నాలు చేస్తున్నారు. రాజంపేట కుందా నెల్లూరు గ్రామానికి చెందిన తుంటి ఎల్లయ్య అనే వ్యక్తి రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి కన్ను పోగొట్టుకున్నాడు. బాధితునికి ముఖ్యమంత్రి సహాయ నిధి కింద రూ. 14 లక్షలు మంజూరు అయ్యింది. అయితే ఆ డబ్బులు ఇప్పిస్తామని తెలుగు దేశం పార్టీ నేతలు ఎల్లయ్యను బ్యాంకుకు తీసుకెళ్లారు. అటుపై అతనితో సంతకాలు పెట్టించుకుని.. డబ్బులు అకౌంట్లో పడ్డాయని చెప్పి పంపించారు. అయితే.. ఇంటికొచ్చాక ఫోన్ చూసి ఎల్లయ్యకు మతిపోయే విషయం చెప్పారు కుటుంబ సభ్యులు. ఎల్లయ్య అకౌంట్కు తొలుత రూ. 14 లక్షలు జమ కాగా.. ఆ వెంటనే 20 నిమిషాల వ్యవదిలో రూ.8 లక్షలు బదిలీ అయ్యాయి. ఆ బదిలీ అయ్యింది టీఎన్ఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వేణుగోపాల్ అకౌంట్కేనని తెలిసింది. దీంతో ఎల్లయ్య టీడీపీ నేతలను నిలదీశాడు. అయితే.. తమకూ ఖర్చులు ఉంటాయని, అందరికి పర్సెంటేజీలు ఇవ్వాలని టీడీపీ నేతలు చెప్పడంతో ఎల్లయ్య తీవ్ర ఆవేదనకు గుయ్యాడు. ఫేక్ ప్రామిసరీ నోట్తో?విషయం వెలుగులోకి రావడంతో టీడీపీ నేతల తీరుపై విమర్శలు వెల్లువెత్తాయి. టీడీపీకి చెందిన కొందరు నేతలే ఈ స్కాంను తీవ్రంగా తప్పుబట్టారు. దీంతో అక్రమార్కులు కొత్త డ్రామాకు దిగారు. బాధితుడు ఎల్లయ్యకు బావమరిది అయిన శశికుమార్కు అప్పు ఇచ్చామని, ఆ సొమ్మునే వడ్డీతో సహా తాము తీసుకున్నామని చెబుతూ ఓ ప్రామిసరీ నోటును చూపిస్తున్నారు. అక్కడితో ఆగకుండా.. తనకు అన్యాయం జరిగిందని చెప్పిన బాధితుడితోనే బలవంతంగా అబద్ధాలు చెప్పించే ప్రయత్నం చేశారు. తనకు మతిస్థిమితం సరిగా లేదని.. తన బావమరిది నిజంగానే అప్పు తీసుకున్నాడంటూ చెప్పించే ప్రయత్నం చేశారు. అయితే.. శశికుమార్ వివరణతో టీడీపీ నేతల చిల్లర వ్యవహారం మొత్తం వెలుగులోకి వచ్చింది. తాను ఎలాంటి అప్పు చేయలేదని.. పైగా ఆ ప్రామిసరీ నోట్లో సంతకం తెలుగులో ఉందని.. తాను ఇంగ్లీష్లో సంతకం చేస్తానని.. ఆ నోట్ ఫేక్ అని శశికుమార్ వివరణ ఇస్తూ ఓ వీడియో రిలీజ్ చేశాడు. దీంతో తెలుగు తమ్ముళ్లు తప్పు మీద తప్పు చేస్తున్నట్లు స్పష్టమవుతోంది.చంద్రబాబుకు సీపీఐ లేఖరాజంపేటలో వెలుగు చూసిన కుంభకోణం నేపథ్యంలో.. సీఎం రిలీఫ్ ఫండ్ అక్రమాల సంగతి తేల్చాలంటూ సీఎం చంద్రబాబుకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్య ఓ లేఖ రాశారు. టీడీపీ నేతలకు సీఎం సహాయక నిధి ఒక ఆదాయ వనరుగా మారిందన్నారు తీవ్ర వ్యాఖ్యలే చేశారాయన. ‘‘మీ పార్టీలో ఒక టీం ఇదే పనిగా పెట్టుకుంది. అధికారులు కూడా వీళ్లకు సహకరిస్తున్నారు. ఒక్క రాజంపేట నియోజకవర్గంలో 6 మండలాల్లో తెలుగుదేశం నేతలు ముఖ్యమంత్రి సహాయ నిధులతో జేబులు నింపుకుంటున్నారు. ఆర్థిక సహాయం ఎంత అందినా.. రూ.6 లక్షలే ఇస్తామని టీడీపీ నేతలు చెబుతుండడం దోపిడీకి పరాకాష్ట. తమకు ఖర్చులు ఉంటాయని.. అందరికీ పర్సంటేజ్లు ఇవ్వాలని బహిరంగంగా చెప్పుకుంటున్నారు. ఇలా చేతివాటం ప్రదర్శిస్తున్న మీ పార్టీ నేతలపై తక్షణం చర్యలు తీసుకోవాలని, ఇలాంటివి పునరావృతం కాకుండా చూసుకోవాలి’’ అని చంద్రబాబును ఈశ్వరయ్య లేఖలో కోరారు. -
'మావిగన్' దెబ్బకు మైండ్ బ్లాంక్..
-
నా పాదయాత్రలో బాబుకి రోజుకో సినిమా: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: దోచుకో.. పంచుకో.. తినుకో.. అనే కాన్సెప్ట్తోనే రాష్ట్రంలో చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్తో జరిగిన భేటీలో ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. వచ్చే ఏడాది నా పాదయాత్ర ఉంటుంది. పాదయాత్రలో ప్రజలతో మమేకం అవుతాను. నా పాదయాత్ర ప్రారంభమైన తర్వాత వైఎస్సార్సీపీ శ్రేణులు చంద్రబాబుకు ప్రతిరోజూ సినిమా చూపించడం ఖాయం అని వైఎస్ జగన్ అన్నారు. ఎప్పటిలాగే చంద్రబాబు తెచ్చిన ఎన్నికల మేనిఫెస్టో చెత్త బుట్టలోకి వెళ్లిపోయింది. సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ మోసాలుగా తేలిపోయాయి. మన ప్రభుత్వంలో తీసుకొచ్చిన పథకాలన్నీ చంద్రబాబు రద్దు చేశారు. గ్రామీణ ఆర్థిక వ్యవస్థను చిన్నాభిన్నం చేశారు. రాష్ట్రంలో అన్ని రంగాల్లో తిరోగమనం కనిపిస్తోంది. మన పాలనలో రూ.3.31 లక్షల కోట్ల అప్పు చేస్తే.. అందులో డీబీటీ(సంక్షేమం పేరిట నేరుగా లబ్ధిదారుల ఖాతాల్లోకి జమ) ద్వారా రూ.2.73 లక్షల కోట్లు ఇచ్చాం. కానీ చంద్రబాబు ఈ రెండేళ్లలోనే రూ.3.52 లక్షల కోట్లు చేశారు. చంద్రబాబు తెచ్చిన అప్పులన్నీ ఎవరి జేబుల్లోకి పోయాయి? అని వైఎస్ జగన్ నిలదీశారు. -
మావిగన్పై మరోసారి వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు
సాక్షి, తాడేపల్లి: రాజధాని విషయంలో తాము ఆచరణాత్మక పరిష్కారం చూపామని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఉద్ఘాటించారు. బుధవారం తాడేపల్లిగూడెం నియోజకవర్గ పార్టీ కేడర్ భేటీలో మావిగన్ ప్రతిపాదనపై మరోసారి కీలక వ్యాఖ్యలు చేశారాయన. చంద్రబాబు ప్రభుత్వం రాష్ట్రానికి రాజధాని ఎప్పటికీ లేకుండా చేస్తోంది. అమరావతి పేరుతో రైతులను, ప్రజలను మోసం చేస్తోంది. కాంట్రాక్టులతో కమీషన్లు దండుకోవడానికే ఈ అమరావతి. అధికారంలోకి వచ్చిన మొదటి రోజు నుంచే మేం రాజధాని వస్తుందని చెప్పాం. రాజధాని బెస్ట్ ఆప్షన్గా ప్లాన్ ఏ కింద.. విశాఖపట్నంను చెప్పాం. న్యాయ రాజధానిగా కర్నూల్ను చెప్పాం. అమరావతిని శాసన రాజధానిగా చెప్పాం. అదీ వద్దనుకుంటే ప్లాన్ బీగా మచిలీపట్నం, విజయవాడ, గుంటూరులతో కూడిన 110 కి.మీ కారిడార్ను మావిగన్(MAVIGUN)ను సూచించాం. అమరావతి పేరుతో రూ.2 లక్షల కోట్ల భారం వేసే బదులులో అందులో 10 శాతం పెట్టుబడి పెడితే మావిగన్లో అద్భుతాలు సౌకర్యాలు కల్పించొచ్చు. కానీ, చంద్రబాబు మావిగన్ను వద్దంటున్నారు. ఎందుకంటే చంద్రబాబు చెప్పే ఆ అమరావతి.. అతిపెద్ద దోపిడీ గని కాబట్టి. హైదరాబాద్, చెన్నై, బెంగళూరులో పైవ్స్టార్ చదరపు అడుగుకు రూ.4,500 మాత్రమే. కానీ, అమరావతిలో మాత్రం రూ.14,000 కట్టబెడుతున్నారు. దీనిని దోపిడీ కాక మరేమంటారు? అని వైఎస్ జగన్ అన్నారు. -
ఏపీ అప్పుల తప్పుడు లెక్కలపై గవర్నర్కు ఫిర్యాదు
సాక్షి, తాడేపల్లి: కూటమి ప్రభుత్వం చేస్తున్న అప్పులపై వైఎస్సార్సీపీ సీనియర్ నేత, మండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ ఏపీ గవర్నర్కు ఫిర్యాదు చేశారు. పూర్తి వాస్తవాలు, గణాంకాల వివరాలతో బుధవారం ఏపీ గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్కు ఓ లేఖ రాశారాయన. ఏటేటా కూటమి ప్రభుత్వం భారీగా అప్పులు చేస్తోంది. విపరీతంగా అప్పులు చేస్తూ తప్పుడు లెక్కలు చూపుతున్నారు. వివిధ కార్పొరేషన్ ల ద్వారా కూడా భారీగా అప్పు చేస్తున్నారు. కానీ ఆ వివరాల్లో తప్పుడు సమాచారం చూపుతున్నారు. ప్రభుత్వం ఇస్తున్న తప్పుడు సమాచారంపై చర్యలు తీసుకోవాలి అని బొత్స మొత్తం ఏడు పేజీల ఆ ఫిర్యాదు లేఖలో పేర్కొన్నారు. -
ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గపు మాటలు: వైఎస్ జగన్
సాక్షి, తాడేపల్లి: మహిళలను ఉద్దేశించి ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ చేసినవి దుర్మార్గపు వ్యాఖ్యాలని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. బుధవారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో నిర్వహించిన తాడేపల్లిగూడెం అసెంబ్లీ నియోజకవర్గ కేడర్ సమావేశంలో ఆయన కూటమి పాలనలో మహిళలపై జరుగుతున్న అరాచకాలపై మరోసారి స్పందించారు. వైఎస్సార్సీపీ శ్రేణుల భార్యల పట్ల ఇంత దుర్మార్గంగా మాట్లాడతారా?. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణవి దుర్మార్గంగా మాట్లాడారు. రాధాకృష్ణ మాట్లాడింది తప్పని చెప్పకుండా.. చంద్రబాబు, లోకేష్, పవన్లు సమర్థిస్తారా?. మహిళల పట్ల ఈ ప్రభుత్వానికి గౌరవం లేదు. కూటమి నేతలే మహిళల్ని వేధిస్తున్నారు. జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అరాచకాలను ప్రశ్నిస్తే.. బాధిత మహిళను పోలీసుల సమక్షంలోనే కొట్టారు. ఎస్పీ ఆఫీసులోకి ఎమ్మెల్యే చొరబడడం ఏంటి?. దానికి చంద్రబాబు పంచాయితీ చేశారు. కేజీబీవీ ప్రిన్సిపాల్ను వేధించిన కూన రవిపై చర్యలేవి?. మహిళలతో అశ్లీల వీడియో కాల్స్ మాట్లాడిన గుంటూరు ఈస్ట్ ఎమ్మెల్యే అహ్మద్పై చర్యలేవి?. మంత్రి సంధ్యారాణి పీఏ మీద ఏం చర్యలు తీసుకున్నారు?. తిరిగి బాధిత మహిళపైనే కేసులు పెట్టారు. టీటీడీ చైర్మన్ ఒక మహిళ జీవితంతో ఆడుకుంటే చర్యలు లేవు. పైగా చంద్రబాబు ఆయన్ని తన వెంటేసుకుని తిరుగుతున్నారు. ఒకర్ని చూసుకుని ఇంకొకరు తయారయ్యారు’’ అని వైఎస్ జగన్ అన్నారు. -
ఆంధ్రప్రదేశ్లో నేటి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్... 3 వేల కోట్ల రూపాయల బకాయిలు రాకపోవడంతో...
-
Butta Renuka: ఎవరి చెవిలో పూలు పెడుతున్నారు.. నీ కుట్రలకు ఎవ్వరూ భయపడరు
-
కూటమికి మేకు దించుతాం.. కొడాలి నాని మాస్ వార్నింగ్
-
డిజైన్లకు ఏకంగా 401 కోట్ల 54 లక్షల రూపాయలు... ‘అమరావతి గవర్నమెంట్ కాంప్లెక్స్’ డిజైన్ల వ్యయంలో రికార్డు బద్ధలు కొట్టిన చంద్రబాబు సర్కారు
-
ఏపీలో సైదాపురం గనుల లీజుకు కూటమి సర్కారు సై... ఎన్జీటీలో కేసు నడుస్తున్నా లెక్క చేయని ప్రభుత్వ పెద్దలు
-
పేర్ని కిట్టు ప్లెక్సీలపై కూటమి నేతల కడుపు మంట
-
పూటకో మాటతో నిరుద్యోగులతో చంద్రబాబు సర్కారు ఆటలు... జాబ్ కేలండర్ పేరిట లీకులిస్తూ మోసం
-
చంద్రబాబు హామీలన్నీ మోసాలే... ఒంగోలు నియోజకవర్గ పార్టీ స్థానిక సంస్థల ప్రజా ప్రతినిధులు, కార్యకర్తల భేటీలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ధ్వజం
-
కూటమి నేతల నీచపు పనులపై YS జగన్ సంచలన రియాక్షన్
-
కూటమి ప్రభుత్వంలో దేశ డ్రగ్స్ రాజధానిగా మారిన ఏపీ
-
రైతులతో చంద్రబాబు కూటమి ప్రభుత్వం తొండాట.. పేరుకే అన్నదాత సుఖీభవ, ఆచరణలో అంతా మోసం
-
చంద్రబాబు ఉప ప్రధానా! రెండు గంటలు ఎడాపెడా వాయించిన జగన్
-
దోచుకో పంచుకో తినుకో విధానం వల్లే గణనీయంగా తగ్గిన ఆంధ్రప్రదేశ్ ఆదాయం... కూటమి ప్రభుత్వంపై వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆగ్రహం
-
పెంచలయ్య దొంగతనం చేసిన దేవుడి సొమ్ము ఎంత తెలుసా?
-
పరకామణిలో దొంగలు పడ్డారు. కోటి రూపాయల విలువైన బంగారం, వెండి కానుకల చోరీపై బాబు సర్కార్ మౌనం.
-
భవిష్యత్ అభివృద్ధి శూన్యం... ఏపీలో చంద్రబాబు ప్రభుత్వ పాలనను తూర్పారబట్టిన కాగ్
-
ఆంధ్రప్రదేశ్లో అంగన్వాడీలపై ఆటవిక దాడి... మహిళా దినోత్సవ వేళ చంద్రబాబు మార్కు గిఫ్ట్
-
అడ్డంగా దొరికిపోయిన కూటమి.. మండలి చైర్మన్ సంతకం ఫోర్జరీ..
-
తిరుమల లడ్డూ ప్రసాదం, రాయలసీమ లిఫ్ట్పై ఏపీ శాసన మండలిలో చర్చించకుండా పలాయనం చిత్తగంచిన చంద్రబాబు కూటమి ప్రభుత్వం
-
ఏపీలో వ్యవసాయం.. బాబు సర్కారులో అపాయం
-
కూటమి పాలనపై బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఘాటు వ్యాఖ్యలు
-
లడ్డూ కల్తీ జరిగింది చంద్రబాబు హయాంలోనే!
సాక్షి, హైదరాబాద్: తిరుమల లడ్డూ విషయంలో కూటమి నేతలు అదే పనిగా దుష్ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ నేత మార్గాని భరత్ అన్నారు. శనివారం ఉదయం హైదరాబాద్ ప్రెస్క్లబ్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. ‘‘కలియుగ దైవం శ్రీవారి మహా ప్రసాదం లడ్డూలో జంతువుల కొవ్వు వాడారనడానికి నోరెలా వస్తోంది?. లడ్డూలో ఎలాంటి కొవ్వు లేదని ఎన్డీడీబీ, ఎన్డీఆర్ఐ నివేదికలు చెప్తున్నాయి. ఇప్పుడేమో లడ్డూ ప్రసాదంలో బాత్రూమ్ కెమికల్స్ వాడారంటూ అసత్యాలు ప్రచారం చేస్తున్నారు’’ అని కూటమి నేతలపై మండిపడ్డారు. తిరుమల ప్రసాదాన్ని రాజకీయాలకు వాడుకొని భ్రష్టు పట్టిస్తున్నారు. హిందువుల మనోభావాలు దెబ్బతీస్తున్నారు. జంతువుల కొవ్వు కలిసిందని వ్యాఖ్యానిస్తూ అపచారం చేస్తున్నారు. చంద్రబాబూ.. వెంటనే మీ మాటను వెనక్కి తీసుకోండి. బాత్ రూమ్ క్లీనర్కు వాడే రసాయనాలు వాడారని ఆరోపిస్తున్న మీది నోరా? ఇంకా ఏమైనా ?. 2018లో టీటీడీ హయంలో గీ ఫ్లేవర్ హెన్హన్సర్ ఎందుకు కొన్నారు ? ఆర్టిఫీషియల్ ఎందుకు కొనుగోలు చేశారు ?ఫ్లేవర్ గీ కోసం అరోమా కలుపడానికి 78 వేల కేజీలు కొనడానికి 2018లో చంద్రబాబు హయంలో టెండర్లు పిలిచారు. ఫ్లేవర్ హెన్హన్సర్ అంటే ఏంటి?. తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్ఠ దెబ్బ తీసే విధంగా చంద్రబాబు వ్యవహరిస్తున్నారు. మనిషి అన్నవారు దేవుడి ప్రసాదంలో జంతువుల కొవ్వు కలుపుతారా ?. చంద్రబాబు హయాంలో రూ. 3 కోట్లతో ఫ్లేవర్ గీ కోసం అరోమా కలిపింది వాస్తవం కాదా ?తిరుమల తిరుపతి దేవస్థానంపై నమ్మకం ఉంది కాబట్టే ప్రతిష్ట దెబ్బ తినకుండా మేం సుప్రీం కోర్టును ఆశ్రయించాం. టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు సీబీఐ శాంపిల్స్ తీసుకుంది. టీడీపీపై దుష్ప్రచారం చేసిన వారు నిందితులు. రాష్ట్రానికి సీఎంగా పనిచేస్తూ వెంకటేశ్వర స్వామి ప్రతిష్ట దెబ్బతీస్తున్నారు. జంతువుల కొవ్వు కలవలేదు అనేది సుస్పష్టం. తప్పులన్నీ వారు చేసి.. నిందలు మాపై వేస్తున్నారుటీటీడీ శ్రీవాణి ట్రస్ట్ ద్వారా 2,500 దేవాలయాలను జగన్ నిర్మించారు. చంద్రబాబు హయంలో ఎన్ని దేవాలయాలను కట్టారు?. పుష్కరాల సమయంలో ఆయన 40 దేవాలయాలను కూల్చారు. వాటిని వైఎస్ జగన్ అధికారంలోకి రాగానే కట్టించారు. హిందూ ధర్మంపై మాకున్న నమ్మకం ఇది. దేవుడు దగ్గర నుంచి ఎవరు తప్పించుకోలేరు’’ అని మార్గాని భరత్ అన్నారు. -
జనసేనలో మరింత ముదిరిన ముసలం
జనసేనలో అధినేతకు, ఆ పార్టీ కార్యకర్తలకు అంతరం పెరుగుతోందా? పార్టీని గంపగుత్తగా టీడీపీకి అనుబంధ సంస్థగా చేసేందుకు అధినేత పవన్ కల్యాణ్ చేస్తున్న ప్రయత్నాలను కార్యకర్తలు నిరసిస్తున్నారా?. తిరుమల లడ్డూ వ్యవహారంలో పార్టీ వైఖరిని స్పష్టం చేయడంలోనూ పవన్ విఫలమయ్యారన్న అసంతృప్తి కేడర్లో కనిపిస్తోందా?. ప్రతిపక్ష పార్టీకి చెందినవాడైనప్పటికీ సాటి కాపు నేతపై టీడీపీ గూండాలు దాడి చేస్తే మాటమాత్రంగానైనా ఖండించలేకపోవడం జనసేన బలహీనతైపోయిందని వారు వాపోతున్నారా? ఇటీవలి పరిణామాలను గమనిస్తే.. ఈ ప్రశ్నలన్నింటికీ సమాధానం అవుననే చెప్పాలి. ఆంధ్రప్రదేశ్లో జనసేన పార్టీ ఇటీవల సమావేశమైంది. రాజకీయ పరిణామాలపై, అధికార టీడీపీ నేతలు వైసీపీ నేతలపై చేసిన దాడులపై చర్చించాలనుకున్నారు. కానీ.. ఎవరూ ఏ ప్రశ్న వేసే అవకాశమే ఇవ్వకుండా అధినేత పవన్ ఆ సమావేశం నుంచి ఆగ్రహంగా వెళ్లిపోయారు. కొంచెం సినిమాటిక్ డ్రామాగా అనిపించవచ్చు కానీ.. పవన్ తెలుగుదేశం పార్టీకి మేలు చేసేందుకే ఇలా వ్యవహరించి ఉంటారన్న విశ్లేషణ వినిపిస్తోంది. అధికారంలోకి వచ్చింది మొదలు పలు సందర్భాల్లో పవన్ చంద్రబాబు, లోకేష్లకు వత్తాసుగా నిలబడటం.. ఎన్ని అరాచకాలు జరిగినా.. సొంత పార్టీ కార్యకర్తలు నేతలను టీడీపీ వాళ్లు అవమానిస్తున్నా పట్టించుకోకపోవడంపై మొదటి నుంచి కూడా జనసేనలో అసంతృప్తి కనిపిస్తూనే ఉంది. తమకంటూ సొంత అస్తిత్వం, వ్యక్తిత్వం లేకుండా పోతున్నాయని ఆ పార్టీ నేతలు తరచూ చెబుతూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో అంబటి రాంబాబు ఇంటిపై టీడీపీ గూండాలు దాడులు చేయడం... తదనంతరం అంబటి కుమార్తె పవన్ను ఉద్దేశించి ఓ సూటి ప్రశ్న వేయడాన్ని జనసేన కార్యకర్తలు ప్రస్తావిస్తున్నారు. ఈ ప్రశ్నలు పవన్ కనీస సమాధానం కూడా ఇవ్వలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బహుశా... పార్టీ వారందరి జాతకాలు తన వద్ద ఉన్నాయని పవన్ చెప్పినట్లే.. పవన్ సహా జనసేన వారందరి జాతకాలు చంద్రబాబు వద్ద ఉన్న కారణంగానే ప్రశ్నించలేకపోతున్నారని కొందరు చమత్కరిస్తున్నారు. తిరుమల లడ్డూ ప్రసాదంలో జంతు కొవ్వు కలిసిందని హిందువులు నమ్మే దేవదేవునికి అపచారం కలిగేలా మాట్లాడిన చంద్రబాబుకు మద్దతుగా పవన్ కల్యాణ్ సనాతని వేషం కట్టి దుర్గగుడి మెట్లు కడిగి, తిరుపతి వెళ్లి ‘‘అన్ అపాలజిటిక్ హిందూ’’ అని గంభీర ప్రకటనలు చేశారు. ఇక్కడే పవన్ తప్పటడుగు వేశారు. చంద్రబాబు ఏమి చెబితే అది గుడ్డిగా చేయకుండా కొంచెం ఆలోచించి, వాస్తవాలు తెలుసుకునే ప్రయత్నం చేసి ఉంటే ఆయనకు, జనసేనకు అపకీర్తి వచ్చేది కాదు. కానీ చంద్రబాబుతో పోటీ పడి అయోధ్యకు కూడా లక్ష కల్తీ లడ్లు వెళ్లాయని నిరాధార ఆరోపణ చేశారు. నిబద్దత ఉన్న నేత అయితే వెంటనే పొరపాటు జరిగిందని ప్రకటించి ఉండేవారు. కాని చంద్రబాబు దారిలోనే నడుస్తూ పవన్ ఆ విషయాన్ని దాటవేశారు. సుప్రీంకోర్టు నియమించిన సిట్ కూడా జంతుకొవ్వు కలవలేదని స్పష్టం చేయడం, టీడీపీ హయాంలోనే బోలే బాబా కంపెనీ వచ్చిందని, 2019-24 మధ్య తిరుమల లడ్డూలో కల్తీ జరిగిందనడానికి ఎలాంటి ఆధారాలు లేకపోవడం, కూటమి ప్రభుత్వం వచ్చాక ఒకసారి వెనక్కి పంపిన నెయ్యి టాంకర్లను తిరిగి వాడారన్న విషయం వెలుగులోకి రావడం.. చంద్రబాబు, పవన్ల పరువు తీశాయి. అయినా చంద్రబాబు తన స్టైల్ లోనే బుకాయించసాగారు. ఈ దశలో అయినా పవన్ కళ్యాణ్ కాస్త హేతుబద్దంగా ఆలోచించి ఉంటే పార్టీ క్యాడర్కు సరైన సంకేతం వెళ్లి ఉండేది. అలా చేయకపోగా పార్టీ జనరల్ బాడీ సమావేశం పెట్టి జనసేన నేతలు, కార్యకర్తలు ఎందుకు లడ్డూ అంశంలో వైసీపీని విమర్శించడం లేదని ప్రశ్నించారు. అంతేకాదు.. అంబటి రాంబాబు, జోగి రమేష్ల ఇళ్లపై టీడీసీ వారు చేసిన దాడి, సృష్టించిన విధ్వంసాన్ని కూడా సమర్ధించే దశకు పవన్ వెళ్లారు. అంబటి కారుపై తొలుత కర్రలతో దాడి చేసి, నీచమైన రీతిలో బూతులు తిట్టిన టీడీపీ వారిని ఒక్క మాట అనకుండా.. అంబటినే తప్పు పట్టిన రీతిలో పవన్ మాట్లాడడం మరింత ఆవేదన మిగిల్చింది. ఈ నేపథ్యంలోనే అంబటి రాంబాబు కుమార్తె మౌనిక మాట్లాడుతూ తాము కూడా కాపు బిడ్డలమేనని, తమపైకి మహిళలని కూడా చూడకుండా కులం పేరు ప్రస్తావించి దాడి చేశారని, తన తండ్రిని హత్య చేయడానికి యత్నించారని, దీనిని సమర్ధిస్తారా అని పవన్ను ప్రశ్నించారు. అంతేకాక అసలు పవన్ తల్లిని దూషించింది ఎవరో ఆయనకు తెలియదా అని వ్యంగ్యంగా అన్నారు. మాజీ మంత్రి ముద్రగడ పద్మనాభం కూడా అంబటి ఇంటిపై టీడీపీ గూండాలు దాడి చేయడాన్ని తీవ్రంగా తప్పుడుతూ కాపులను వేధించడమే చంద్రబాబు లక్ష్యమా అని ప్రశ్నించారు. ఈ విషయాలపై కూడా పవన్ స్పందించలేదు. మొత్తం ఇష్యూని చర్చించి పార్టీ పరంగా ఒక అవగాహనకు రావల్సిన పరిస్థితి కాకుండా,అసలు ప్రశ్నించడానికే వీలు లేదన్నట్లుగా పవన్ ప్రవర్తించారు. ఇక్కడే క్యాడర్కు, పవన్కు మధ్య అంతరం బాగా పెరిగినట్లు అర్థం అవుతోంది. ప్రశ్నించడానికి వచ్చిన జనసేన కేవలం టీడీపీకి భజనసేనగా మారిపోవడం ఏమిటన్న అంతర్మథనం జనసేన కార్యకర్తలలో ఏర్పడింది. పవన్ కళ్యాణ్ వ్యవహార శైలికి భిన్నంగా కొంతమంది జనసేన కార్యకర్తలు, నాయకులు ధైర్యంగా వాస్తవ పరిస్థితిపై ఆలోచించడం, మాట్లాడడం ఆరంభించారు. ఆ పార్టీకి చెందిన ఒక మహిళా న్యాయవాది రజని టీవీ డిబేట్లలో మాట్లాడుతూ టీడీపీ తీరును ఆక్షేపించారు. పుటుక్కున అధికారం మారితే పరిస్థితి ఎలా ఉంటుందో తెలుసా? అని ఆమె ప్రశ్నించారు. ఈ రోజు టీడీపీ వారు కర్రలతో వస్తున్నారు.. రేపు వైసీపీ వారు కత్తులతో వస్తారని హెచ్చరించారు. అసలు లడ్డూపై ఫ్లెక్సీలు పెట్టడం, అంబటిపై దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు? రేపటి పరిణామాలను ఆలోంచుకుని వ్యవహరించాలని అంటూ ‘‘పచ్చ తమ్ముళ్లూ.. గుర్తు పెట్టుకోండి..’’ అని ఆమె స్పష్టం చేశారు. పవన్కు ఈ మాత్రం విజ్ఞత లేదా ధైర్యం లేకుండా పోయిందేమిటా అనే భావన జనసేనలో ఏర్పడింది. లాయర్ రజని చెప్పిన విషయాలను పరిగణనలోకి తీసుకోకుండా ఆమె పార్టీకి దూరం అయ్యేలా జనసేన వ్యవహరించింది. ఈ వ్యవహారంలోనే కాకుండా రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ విషయంలో కూడా పవన్ సరైన రీతిలో స్పందించలేకపపోయారన్న అభిప్రాయం పార్టీలో ఉంది. ఏదో కమిటీ వేసి కాలయాపన చేయడం ఏమిటన్న భావన కూడా ఉంది. మహిళలకు సంబంధించి పవన్ విపక్షంలో ఉన్నప్పుడు చేసిన ప్రసంగాలేమిటి? ఇప్పుడు స్పందిస్తున్న వైనం ఏమిటన్న ప్రశ్న వస్తోంది. పైగా నేతలు ఎలా అప్రమత్తంగా ఉండాలో సూచిస్తూ ప్రకటన చేయడంపై అంతా విస్తుపోయారు. ఇప్పటికే టీడీపీ వారు విలువ ఇవ్వడం లేదని, నామినేషన్ పదవులలో అన్యాయం జరుగుతోందని రగులుతున్న జనసేన కార్యకర్తలలో ఈ తాజా పరిణామాలు మరింత బాధ కలిగిస్తున్నాయి. అందువల్లే పవన్ కల్యాణ్ తాను ఏమి చెప్పినా పాటించాలని ఎన్నిసార్లు చెప్పినా క్యాడర్ మాత్రం సీరియస్ గా తీసుకోవడం లేదు. పవన్ కల్యాణ్ మాట్లాడితే పదిహేనేళ్లు టీడీపీకి మద్దతు ఇస్తామని ప్రకటించడం, దానికి తగ్గట్లే టిడిపి వారు చేసే తప్పులను భుజనా వేసుకోవడం వంటివి కూడా వారికి నచ్చడం లేదు.కేవలం టిడిపిని మోయడానికే తాము ఉన్నామా అన్న ఆవేదనను పలువురు నేతలు, ముఖ్య కార్యకర్తలు, కాపు సామాజికవర్గ నేతలు వ్యక్తం చేస్తున్నారు. పార్టీ పదవులకు రాజీనామా చేసిన సీనియర్ నేత బొలిశెట్టి సత్య ఒక విషయం వెల్లడించారు.పార్టీకి పనిచేసే వారికి పదవులు దక్కలేదని, పదవులు వచ్చినవారికి జనసేన పేరు తగిలించారని వ్యాఖ్యానించారు. ఈ నేపథ్యంలో జనసేన పార్టీలో అధినేతకు, క్యాడర్ కు మధ్య పెరుగుతున్న అంతరం ఏ పరిణామాలకు దారి తీస్తుందన్నది చర్చనీయాంశంగా మారింది.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మాజీ మంత్రి జోగి రమేష్ పై కూటమి సర్కార్ కక్షసాధింపు
-
జంగిల్రాజ్పై ప్రశ్నిస్తున్నందుకే గూండా దాడులు... ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబు సర్కారు అరాచకాలపై వైఎస్ జగన్మోహన్రెడ్డి మండిపాటు
-
దమ్మున్నోడి దెబ్బ.. ఒక్కడిని ఎదుర్కోవడానికి 9 మంది ప్రెస్ మీట్
-
చంపేస్తారా..? రోజా ఉగ్రరూపం!
-
ఏపీ కూటమి ప్రభుత్వానికి ఇదో గట్టి హెచ్చరిక!
మూలకు నెట్టేసి కొట్టే ప్రయత్నం చేస్తే పిల్లి కూడా పులిలా తిరగబడుతుందట. ఆంధ్రప్రదేశ్లో ప్రజలు కూడా ఇప్పుడు పులుల్లా తిరగబడే పరిస్థితి వచ్చేసింది. అణచివేతలు, అడుగుఅడుగునా నిర్బంధాలతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ గుంటూరు పర్యటనను అడ్డుకునేందుకు టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నాలన్నీ బెడిసికొట్టడం తాజా తార్కాణం. టీడీపీ అరాచక శక్తుల దాడి బాధితుడైన వైసీపీ నేత అంబటి రాంబాబును పరామర్శకు ఈ స్థాయిలో జనాదరణ లభిస్తుందని ఎవరూ ఊహించలేదు. కేవలం 30 కిలోమీటర్ల దూరం ప్రయాణించేందుకు ఆరేడు గంటల సమయం పట్టిందంటే పరిస్థితి ఏమిటన్నది అర్థం చేసుకోవచ్చు. పైగా ప్రజల్లో వ్యతిరేకత తీవ్రంగా ఉందని ఇంటెలిజెన్స్ వర్గాల ద్వారా తెలుసుకున్న కూటమి ప్రభుత్వం ఈ పర్యటనను ఎలాగైనా అడ్డుకోవాలని శతధా ప్రయత్నించింది. జగన్ టూర్లో పాల్గొనడానికి వెళుతున్నారనుకుంటే చాలు.. ప్రజలను స్టేషన్లకు తరలించారన్న వార్తలొస్తున్నాయి. వైసీపీ కార్యకర్తలను, నేతలను ఇళ్లకే పరిమితం చేసేందుకూ ప్రయత్నాలు జరిగాయి. ఇళ్లపై నోటీసులు అతికించడం, కొందరిని గృహ నిర్బంధంలో ఉంచడం కూడా తెలియవచ్చింది. కానీ.. ఇవన్నీ జనాదరణ ముందు వెలవెలబోయాయి. జగన్ను చూసేందుకు, ఆయన వెంట నడిచేందుకు జనం ఉరకలెత్తారు. ఏడాదిన్నరగా మభ్యపెట్టేందుకు కూటమి ప్రభుత్వం చేసిన ప్రయత్నం.. రెడ్బుక్ పేరిట సాగిస్తున్న దమనకాండలకు విసుగెత్తిన ప్రజలు ఇక చాలన్నట్టుగా రోడ్లపైకి వచ్చారు. జగన్తోనే మేము అన్న స్పష్టమైన సంకేతం ఇచ్చారు. తమ అసహనాన్ని తెలియచేశారు. అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శిస్తానని మాత్రమే వైఎస్ జగన్ చెప్పారు. జనం తరలి రావాలన్న పిలుపు ఎక్కడా ఇవ్వలేదు. అయినా ఆయన పర్యటన అంటే చాలు.. రహదారులు జన సంద్రమవుతున్నాయి. జగన్ కార్యక్రమాలలో ఆయన ప్రసంగం ఒక ఎత్తయితే ఆయన కోసం తరలివచ్చే జన తరంగాలు ఇంకో ఎత్తు. ఇది కేవలం అభిమానం ఒక్కటితోనే సాధ్యమయ్యేది కాదు. అధికారంలో ఉన్న ప్రభుత్వానికి ఒక హెచ్చరిక. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ, ఇష్టారాజ్య ధోరణలు కుదరవని ప్రజలిస్తున్న స్పష్టమైన సందేశం. జెన్-జీ నేతృత్వంలో నేపాల్లో జరిగిన తిరుగుబాటు లాంటిదన్నమాట. టీడీపీ గూండాలు మాజీ మంత్రి, వైసీపీ నేత అంబటి రాంబాబు ఇంటిపై జరిపిన దాడి, మరో మాజీ మంత్రి జోగి రమేశ్ ఇంటిపై పెట్రోలు బాంబులు విసరడం వంటి ఘటనలు సామాన్యులను సైతం ఆలోచించేలా చేశాయనడంలో సందేహం లేదు. శాంతి భద్రతలను కాపాడాల్సిన ప్రభుత్వమే అరాచకశక్తులకు అండగా నిలబడటమూ వారిని కలవరానికి గురి చేసింది. ఏడాదిన్నర కాలంగా కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీలను నెరవేర్చడం కంటే.. వైసీపీ నేతలు, కార్యకర్తలపై అక్రమాలకు పాల్పడటంపైనే ఎక్కువ దృస్టి పెట్టిందన్న సత్యం కూడా ప్రజలకు బోధపడినట్టు ఉంది. రెడ్బుక్ అమలు సంగతి సరేసరి. జగన్ గుంటూరులో అంబటి రాంబాబు కుటుంబ సభ్యులను పరామర్శించిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ.. అంబటి టీడీపీ వారి బూతులకు స్పందించారే మినహా తనంత తాను దూషించలేదని స్పష్టం చేశారు. ఇదే విషయమై అంబటి వివరణ కూడా ఇచ్చిన విషయాన్ని గుర్తు చేశారు. టీడీపీ మహిళా ఎమ్మెల్యే దంపతులు అంబటి ఇంటిపై దాడి చేయించి విధ్వంసం సృష్టించి, పార్టీ ఆఫీస్ను దగ్దం చేసిన ఘటనను విశ్లేషించి దీనంతటి కారణం ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన కుమారుడు లోకేశ్, వారి రెడ్ బుక్ అని ఆయన స్పష్టం చేశారు. చంద్రబాబు విషపు విత్తనాలు నాటుతున్నారని, అవి పెరిగి చెట్లుగా మారితే టీడీపీకే నష్టమని కూడా హెచ్చరించారు. తిరుమల లడ్డూలో జంతు కొవ్వు లేదని సీబీఐ స్పష్టం చేసినా కులమతాలను రెచ్చగొట్టేలా కూటమి నేతలు ఫ్లెక్సీలు కట్టడం ఏమిటని నిలదీశారు. జగన్ ప్రశ్నలకు ఇప్పటివరకూ సమాధానం లేదు. పైగా చంద్రబాబు, పవన్ కళ్యాణ్, లోకేశ్లు లేని ఆరోపణలు మళ్లీ, మళ్లీ చేసి తిరుమల ఆలయానికి తీరని అపచారం చేస్తున్నారని, అప్రతిష్ట తెస్తున్నారని భక్తులు బాధపడుతున్నారు. అయినా వారు ఆ దిశగా ఆలోచించకుండా ఏదో కొత్త కమిటీ అంటూ మరో డ్రామాకు తెరదీస్తున్నారు. వారికి ఎల్లో మీడియా వంతపాడుతూ ప్రజల మనసులను కలుషితం చేయడానికి విశ్వయత్నం చేస్తోంది. అయితే ప్రజలు విజ్ఞతతో ఆలోచిస్తున్నారన్న విషయం నిఘా నివేదికలలో బయటపడుతోంది. ఈ నేపధ్యంలో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ లు ఏకాంత మంతనాలు జరిపి తర్జనభర్జన పడినట్లు కనిపిస్తుంది.ఎల్లో మీడియా ద్వారా జగన్ కుట్రలు చేస్తున్నారని, దీనిపై జనంలోకి వెళ్లాలని వారు భావించారని రాయించారు. నిజానికి జంతు కొవ్వు ఆరోపణ మొదలు, నెయ్యి కల్తీ అంటూ ఫ్లెక్సీలు పెట్డడం, వైసీపీ నేతలపై,వారి ఇళ్లపై దాడులు చేయించడం వరకు కుట్రలు చేస్తున్నది టీడీపీ వారైతే, ఎల్లో మీడియా మాత్రం వైసీపీ అంటూ చంద్రబాబు పాటను ప్రజలలోకి తీసుకువెళ్లాలని చూస్తూ రోజురోజుకు దిగజారుతోంది. జాతీయ మానవ హక్కుల సంఘం, హైకోర్టు ఇటీవల చేసిన వ్యాఖ్యలు ప్రభుత్వానికి గుణపాఠం కలగాలి. ఏపీలో జంగిల్ రాజ్ అంటే ఆటవిక పాలన సాగుతున్న తీరును వైసీపీ ఎంపీలు సాక్ష్యాధారాలతో చూపించగలిగారు. దాంతో ఫ్యాక్ట్ కమిటీని వేస్తామని కమిషన్ ఛైర్మన్ రామసుబ్రహ్మణ్యం చెప్పారని వార్తలు వచ్చాయి. అలాగే సాల్మన్ అనే వైసీపీ కార్యకర్త టీడీపీ వారి చేతిలో హత్యకు గురవడం, దళితులను గ్రామంలోకి రానివ్వకుండా టీడీపీ వారు అడ్డుకుంటున్న వైనంపై ఎస్సీ, ఎస్టీ కమిషన్ ఆందోళన వ్యక్తం చేసిందన్న సమాచారం వచ్చింది. ఇక ఏపీ పోలీసులు తప్పుడు కేసులు పెట్టి వైసీపీ కార్యకర్తలను రోడ్డుపై నడిపిస్తూ అవమానిస్తున్న తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. టీడీపీ వారు ఎంత పెద్ద నేరాలు చేసినా, పట్టించుకోకపోగా, కొన్నిచోట్ల వారికి పోలీసులే అండగా ఉంటున్న వైనం ప్రజలందరికి తెలిసిపోయింది.కూటమి ఇచ్చిన హామీలను విస్మరించి జనాన్ని మభ్య పెట్టడానికి పూనుకోవడం, విశాఖలో రూ.ఐదు వేల కోట్ల విలువైన భూమిని తమ బంధువైన లోక్సభ సభ్యుడు శ్రీభరత్ కాలేజీకి కట్టబెట్టడానికి సిద్దపడడం, ఇలా అనేక అంశాలలో ప్రజలకు కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత వస్తోంది.నేరుగా స్పందించలేని పరిస్థితి ఉంది కనుక, తమ వద్దకు వచ్చిన జగన్పై అభిమానం కనబరచడమే కాకుండా, తమ మద్దతు ఇవ్వడం ద్వారా ప్రభుత్వంపై తమ అసంతృప్తిని వ్యక్తం చేశారని భావించవచ్చు.ఇప్పటికైనా చంద్రబాబు సర్కార్ కళ్లు తెరుస్తుందా?ఇంకా కుట్రలనే నమ్ముకుంటుందా?,, :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
జంగిల్రాజ్పై ఆగ్రహం.. జగన్ పర్యటనల్లో జనవాహిని
ఏపీలో రెడ్బుక్ రాజ్యాంగంతో కూటమి ప్రభుత్వపు ఆటవిక పాలన కొనసాగుతోంది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను నెరవేర్చకపోగా.. తప్పుడు ప్రచారాలు, దాడులు, అరెస్టులతో ప్రతీకార రాజకీయాలు నడిపిస్తోంది. జనం ఈ జంగిల్రాజ్పై ఆగ్రహంతో ఊగిపోతున్నారు. ఈ క్రమంలోనే జగన్ వెంట నడుస్తున్నారు. కూటమి అధికారంలోకి వచ్చిన తర్వాత జగన్ వెళ్లిన ప్రతీ చోటకు జనం తండోపతండాలుగా తరలి వస్తున్నారు. కూటమిని నమ్మి మోసపోయామని వాపోతున్నారు. మంచి ప్రభుత్వమంటూ ముంచేస్తోందని, పైగా శాంతి భద్రతలు ఘోరంగా దెబ్బ తిన్నాయని చెబుతున్నారు. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ పోరాటాలకు మద్దతు ప్రకటిస్తున్నారు. ఇది సాధారణంగానే కూటమి ప్రభుత్వానికి సహించడం లేదు. అందుకే జనాలను జగన్ దగ్గరగా వెళ్లకుండా.. శతవిధాల ప్రయత్నిస్తోంది. మొన్న గుంటూరు.. ఇవాళ ఇబ్రహీంపట్నం.. మొత్తం పోలీసుల ఆంక్షల వలయమే. కేవలం జగన్ వస్తున్నారని.. వైఎస్సార్సీపీ శ్రేణులు తరలి రాకూడదనేది వాళ్ల కూటమి ఆలోచన. కానీ, ఆ కుట్రను భగ్నం చేస్తూ జనాలు స్వచ్ఛందంగా తరలి వస్తున్నారు. ఎంతలా అంటే.. జగన్ను దగ్గరుండి వాళ్లే ముందుకు తీసుకెళ్లేలా!.జగన్ పర్యటనలతో కూటమి ప్రభుత్వం వణుకుతోంది. చివరి నిమిషంలో రూట్ మార్చమని నోటీసులు ఇచ్చారు. చంద్రబాబు ఆదేశించినంత మాత్రాన పోలీసులు అత్యుత్సహాం ప్రదర్శించడం ఎందుకు?. జగన్ పర్యటనకు జనం స్వచ్ఛందంగా తరలి వస్తారు అని జోగి రమేష్ అన్నారు. జగన్ పర్యటనకు రూట్మ్యాప్ ముందే సమర్పించాం. అయినా చివరి నిమిషంలో కావాలనే రూట్మ్యాప్ మార్చమని నోటీసులు ఇచ్చారు. వైఎస్ జగన్కు వచ్చే జనాదరణను ఆపాలని పోలీసులు ప్రయత్నిస్తున్నారు. ప్రభుత్వం, పోలీసులు ఎన్ని ప్లాన్లు వేసినా.. జనాన్ని ఆపలేరు. జగన్ అభిమానుల్ని ఆపే శక్తి ప్రభుత్వానికి లేదు అని వెల్లంపల్లి శ్రీనివాస్ అన్నారు. జగన్ పర్యటనకు జనం రాకుండా చేయాలని కూటమి ప్రభుత్వం పోలీస్ వ్యవస్థను ప్రయోగిస్తోంది. కానీ, అది జరిగే పని కాదు. ఏం జరిగినా.. జగన్ వెంటే జనం ఉంటారు అని జోగి రమేష్ కుటుంబాన్ని పరామర్శించిన మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. -
జంగిల్ రాజ్ కు జనం వార్నింగ్
-
గూండాలను వేసుకొచ్చి దాడి చేయిస్తావా? గల్లా మాధవిపై జగన్ ఫైర్
-
అంబటి రాంబాబు అన్న చేసిన తప్పేంటి?
-
రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!
వైఎస్ జగన్మోహన్రెడ్డిని ప్రజల నుంచి దూరం చేయడానికి కూటమి ప్రభుత్వం ఎన్ని ఎత్తులు.. ఎన్ని కుయుక్తులు పన్నుతున్నా అవేవీ ఫలించడం లేదు. ప్రభుత్వం ఎత్తులు వేసే కొద్దీ ప్రజాభిమానం వెల్లువెత్తుతోంది తప్ప ఇసుమంతైన తగ్గడం లేదు. కేవలం 40 కిలోమీటర్ల ప్రయాణానికి 6 గంటకు పైనే సమయం.. రాష్ట్ర చరిత్రలోనే కనీవినీ ఎరుగని దృశ్యమిది!తెలుగుదేశం గుండాల దాడిలో విధ్వంసానికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటికి వెళ్లి ఆయన్ని పరామర్శించేందుకు తాడేపల్లిలో బయలుదేరిన వైఎస్ జగన్ 40 కిలోమీటర్ల దూరంలో ఉన్న గుంటూరు చేరేందుకు దాదాపు ఏడు గంటల సమయం పట్టింది. జననేతకు అడుగడుగునా వేలాదిమంది అభిమానులు కార్యకర్తలు నీరాజనం పట్టారు. నిన్నటికి నిన్న తెలుగుదేశం ఎమ్మెల్యేలు, మంత్రులు మీడియాలో మాట్లాడుతూ ఎవరికైనా దమ్ముంటే గుంటూరు రావాలని వస్తే వాళ్ళ లెక్క తేలుస్తామని హెచ్చరించారు. ఈసారి మేం చేసే విధ్వంసం చూస్తే వారి ఆస్తులు అమ్ముకున్న రికవరీ కాలేరు అంటూ గమ్మత్తైన వార్నింగులు ఇచ్చారు. అయితే ఇవేవీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ శ్రేణులను, బాబు జంగిల్ రాజ్ పాలనపైనా ఆగ్రహంతో ఉన్న సామాన్య ప్రజలను కానీ ఆపలేకపోయాయి. తాడేపల్లి, వడ్డేశ్వరం, నాగార్జున యూనివర్సిటీ, కాజా టోల్ గేటు, మంగళగిరి మీదుగా గుంటూరు చేరుకున్న వైఎస్ జగన్ వెంట అశేషమైన ప్రజావాహిని తరలి వెళ్లింది. పోలీసులు ఎక్కడికి అక్కడ చెక్పోస్టులు ఏర్పాటు చేసి ప్రజలను నియంత్రించాలని చూసినప్పటికీ వేలాదిగా కార్లు మోటార్ సైకిళ్లలో అభిమానులు జగన్ను అనుసరించారు. తిరుమల లడ్డు అంశాన్ని రాజకీయం చేసి.. ప్రజల్లో వైఎస్సార్సీపీని, జగన్ను పలుచన చేయడానికి చంద్రబాబు ఆయన మీడియా ఎన్నో ఎత్తులు వేసింది. కానీ, అవేవీ ప్రజలను ప్రభావితం చేయలేకపోయాయని జగన్ వెంట ఇవాళ నడిచిన జనాన్ని చూస్తే అర్థమవుతుంది.కూటమి ప్రభుత్వంపై ప్రజావ్యతిరేకతప్రభుత్వ ఏర్పడిన కేవలం రెండేళ్లలోనే ప్రజల్లో ఎంత వ్యతిరేకత ఎన్నడూ చూడలేదని జగన్ పర్యటనను దూరం నుంచి చూస్తున్న కొందరు పోలీసులే చెబుతున్నారు. జగన్ వెంట వేలాదిగా వచ్చిన వాళ్లంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు మాత్రమే కాదని, సామాన్యమైన ప్రజలు మహిళలు యువత విద్యార్థులు సైతం ఉన్నారని ఇది కచ్చితంగా ప్రతి ప్రభుత్వ వ్యతిరేకతకు నిదర్శనం అని ఇంటెలిజెన్స్ వర్గాలు కూటమి ప్రభుత్వానికి నివేదికలు అందిస్తున్నట్లు సమాచారం. జగన్ వెంట జనం సాధారణమైన విషయమే. కానీ, కూటమి ప్రభుత్వం వచ్చాక వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పలు ఆందో ళనలు ఉద్యమాలు చేపట్టింది. అంతేకాకుండా అధినేత వైఎస్ జగన్ సైతం పలు పరామర్శలు, ఇతర కార్యక్రమాలకు హాజరయ్యారు. ఈ సందర్భంలో కూడా ప్రజలు అభిమానులు విపరీతంగా ఆయన వెంట పరుగులు తీసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ఇప్పుడు వైయస్ జగన్ గుంటూరు పర్యటన మొత్తం రాష్ట్రాన్ని కుదిపేసింది అని పోలీసు వర్గాల్లోనే అంతర్గత చర్చ నడుస్తోంది. తెలుగుదేశం ప్రభుత్వం, ఆ పార్టీ అధినేత చంద్రబాబు ఈ జనాదరణను చూసి కచ్చితంగా భయపడరంటారా?. వైఎస్ జగన్ వెంట ఇసుకేస్తే రాలనంత జనం చూస్తుంటే ఇది మరో ప్రజా ఉద్యమంలా ఉందని తటస్థ ప్రజానీకం అభిప్రాయపడుతున్నారు.::సిమ్మాదిరప్పన్న -
హక్కుల సంఘం దృష్టికి ఏపీ జంగిల్ రాజ్
సాక్షి, ఢిల్లీ: ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం కొనసాగిస్తున ఆటవిక పాలనను వైఎస్సార్సీపీ, జాతీయ మానవ హక్కుల సంఘం దృష్టికి తీసుకెళ్లింది. బుధవారం ఆ పార్టీ నేతల బృందం ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ జస్టిస్ రమాసుబ్రమణ్యంను కలిసి అరాచక పాలన గురించి ఆధారాలతో సహా వివరించింది. తాజాగా మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ ఇళ్లపై జరిగిన దాడులను, అలాగే.. గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో తమ కార్యకర్త మందా సాల్మన్ రాజును టీడీపీ శ్రేణులు ఎలా హత్య చేశాయో మానవ హక్కుల సంఘం చైర్మన్ దృష్టికి తీసుకెళ్లింది. అంతేకాదు.. టీడీపీ నేతలు తమ పార్టీ వాళ్లను ఎలా చంపాలని చూశాయో తెలియజేస్తూ.. దాడులకు సంబంధించిన ఫొటోలు, వీడియోలను ఆయన ముందు ఉంచింది. ఫిర్యాదును స్వీకరించిన చైర్మన్ సానుకూలంగా స్పందించినట్లు తెలుస్తోంది.ఎన్హెచ్ఆర్సీ చైర్మన్ను కలిసిన బృందంలో ఎంపీలు వైవీ సుబ్బారెడ్డి, మిథున్ రెడ్డి, గురుమూర్తి, బాబురావు, మేడా రఘునాథ్ రెడ్డి, సుభాష్ చంద్రబోస్, అయోధ్య రామిరెడ్డి, తనూజా రాణి, ఎస్సీ సెల్ ప్రెసిడెంట్ సుధాకర్ బాబు, మాజీ మంత్రులు మేరుగ నాగార్జున, ఆదిమూలం సురేష్, ఎమ్మెల్సీ ఇజ్రాయిల్, ఎమ్మెల్యే చంద్రశేఖర్ , ఎమ్మెల్సీఅరుణ్ కుమార్ , మాజీ ఎమ్మెల్సీజూపూడి ప్రభాకర్ రావు తదితరులు ఉన్నారు.వైఎస్సార్సీపీ ప్రధాన కార్యదర్శి జూపూడి ప్రభాకర్ రావు మాట్లాడుతూ.. టీడీపీ చేస్తున్న దాడుల పైన దర్యాప్తు చేయాలని ఎన్హెచ్ఆర్సీని కోరాం. టీడీపీ దాడులపై దర్యాప్తు చేసేందుకు చైర్మన్ అంగీకరించారు. డీజీపీ ద్వారా నివేదిక తెప్పించుకుంటానని అన్నారు. త్వరలోనే దర్యాప్తు కమిటీ రాష్ట్రానికి వస్తుందని భావిస్తున్నాం. చంద్రబాబు అనే నరహంతకుడు ప్రజల్ని చంపేస్తున్నారు. ఈ ఆటవిక పాలన నేపథ్యంలో రాష్ట్రపతి పాలన విధించాలి అని కేంద్రాన్ని కోరుతున్నాం. మాజీ మంత్రి మేరుగ నాగార్జున మాట్లాడుతూ.. ఏపీలో దళితుల పైన దాడులు పెరిగిపోయాయి. రాష్ట్రంలో జరుగుతున్న దాడులు హత్యలను మానవ హక్కుల సంఘానికి వివరించాం. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ల పైన పెట్రోల్ బాంబులు వేసి చంపేయాలని చూశారు. దళితులపై దాడులు ఏమాత్రం జరుగుతున్న పట్టించుకోవడం లేదు. మాజీ మంత్రి ఆదిమూలం సురేష్ మాట్లాడుతూ.. ఏపీలో రాజ్యాంగ వ్యవస్థ పనిచేయడం లేదు. పోలీసులు ప్రేక్షక పాత్ర పోషిస్తున్నారు. అందుకే జాతీయ మానవ హక్కుల సంఘం ఆశ్రయించాం. వైఎస్సార్సీపీ మద్దతుదారులపై దాడులు, హత్యలు చేస్తున్నారు. ఏపీలో జరుగుతున్న దారుణాలపై నిజనిర్ధారణ కమిటీ వేయాలని కోరాం. డీజీపీ ద్వారా నివేదిక తీసుకోవాలని విజ్ఞప్తి చేశాం. ఏపీలో సంపూర్ణంగా మానవ హక్కుల ఉల్లంఘన జరిగింది. మందా సాల్మన్ రాజు సోదరుడు మాట్లాడుతూ.. మాలాంటి దుస్థితి ఏ కుటుంబానికి రాకూడదు. మా గ్రామంలో శాంతిభద్రతలు నెలకొల్పాలని వేడుకుంటున్నాం. మానవ హక్కు సంఘానికి నివేదిక ఇచ్చాం. -
ఏపీలో జంగిల్రాజ్కు వ్యతిరేకంగా ఒక్కటైన జనం
ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వంపై ప్రజాగ్రహం వెల్లువెత్తింది. జంగిల్ రాజ్కు వ్యతిరేకంగా జనం అంతా ఒక్కటయ్యారు. బుధవారం గుంటూరులో పోలీసుల ఆంక్షలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. రోడ్లపైకి భారీ సంఖ్యలో చేరి వైఎస్ జగన్ వెంట కదులుతూ చంద్రబాబు సర్కార్పై తీవ్ర వ్యతిరేకతను కనబరుస్తున్నారు. సాక్షి, తాడేపల్లి: వైఎస్ జగన్ మోహన్రెడ్డి గుంటూరు పర్యటనలో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా స్పష్టంగా కనిపించింది. టీడీపీ గూండాల చేతిలో దాడికి గురైన మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని పరామర్శించాలని చూస్తే.. కూటమి ప్రభుత్వం కుట్రపూరితంగా పోలీస్ వ్యవస్థను రంగంలోకి దించి ఆ పర్యటనను విఫలం చేసే ప్రయత్నాలకు దిగింది. అర్ధరాత్రి వైఎస్సార్సీపీ నేతలకు నోటీసులిచ్చి మరీ బెదిరింపులకు దిగింది. గుంటూరుకు వెళ్లే రోడ్లన్నింటినీ పోలీసు చెక్పోస్టులతో నింపేయించింది. వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు.. ఆఖరికి అభిమానులను సైతం అడ్డుకునేందుకు శతవిధాల ప్రయత్నించింది. కానీ.. ఈ పరిణామాలన్నింటిని ప్రజలు నిశితంగా పరిశీలించారు. ఇప్పటికే తారాస్థాయికి చేరుకున్న టీడీపీ అరాచకాలను చూసి అసహ్యింంచుకుంటున్న జనం.. ఇప్పుడు మరో అడుగు ముందుకు వేశారు. ఏపీలో జంగిల్రాజ్కు వ్యతిరేకంగా జనం ఒక్కటయ్యారు. జగన్ పర్యటనను అడ్డుకోవాలని కూటమి ప్రభుత్వం తీవ్రంగా ప్రయత్నిస్తే.. పోలీసుల ఆంక్షల వలయాల్ని చేధించుకుని స్వచ్ఛందంగా.. భారీగా, వేల సంఖ్యలో రోడ్లపైకి చేరుకున్నారు. పోలీసులు ఎప్పటిలాగే జగన్ పర్యటనలో భద్రత కల్పించకుండా దూరంగా ఉంటే.. ఆ జననేతకు జనమే సాదర స్వాగతం పలికారు. గుంటూరు పర్యటనలో అరుదైన దృశ్యాలు కనిపించాయి. జనం స్వచ్ఛందంగా ముందుండి వైఎస్ జగన్ కాన్వాయ్ను ముందుకు నడిపించారు. జగన్ రాక నేపథ్యంలో గుంటూరు వెళ్లే రోడ్లన్నీ జనసంద్రంగా మారాయి. ఈ పరిణామాలను చూస్తున్న రాజకీయ విశ్లేషకులు.. ఇది కూటమి ప్రభుత్వంపై పెల్లుబికిన ప్రజాగ్రహమేనని, జగన్ వెంటనే తాము ఉన్నామంటూ ఇచ్చిన సంకేతాలని అంటున్నారు. -
దాడులు చేస్తే చూస్తూ ఊరుకోం : వైఎస్ జగన్
చంద్రబాబు ఆటవిక పాలనలో వైఎస్సార్సీపీ నేతలకు రక్షణ కరువైంది. వరుసగా అక్రమ కేసులు.. అరెస్టులు.. విచారణల పేరుతో ప్రతీకార రాజకీయాలు కొనసాగిస్తోంది కూటమి ప్రభుత్వం. ఈ క్రమంలో ఇప్పుడు ఏకంగా హత్యలకు కూడా కుట్ర పన్నుతోంది.. అందుకే వైఎస్సార్సీపీ శ్రేణులకు ధైర్యం చెప్పేందుకు వైఎస్ జగన్ రంగంలోకి దిగారు. -
‘ఏపీలో రాష్ట్రపతి పాలన విధించండి’
సాక్షి,ఢిల్లీ: ఏపీలో కూటమి ఆటవిక పాలనను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ పార్లమెంట్ ఎదుట ధర్నా చేపట్టింది. మంగళవారం ఉదయం వైఎస్సార్సీపీ ఎంపీలు ఫ్లెక్సీలతో ఆందోళనకు దిగారు. ఏపీ శాంతి భద్రతల వ్యవహారంలో జోక్యం చేసుకోవాలని.. అవసరమైతే రాష్ట్రపతి పాలన విధించాలని నినాదాలు చేశారు.ఏపీలో ఆటవిక పాలన కొనసాగుతోంది. ప్రతిపక్ష నేతల ఇళ్లపై దాడులు పరిపాటిగా మారాయి. కేంద్రం వెంటనే జోక్యం చేసుకోవాలి. శాంతి భద్రతలను పరిరక్షించాలి. రాష్ట్రపతి పాలన విధించాలి అని వైఎస్సార్సీపీ ఎంపీలు కేంద్రాన్ని కోరారు. ఏపీలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచే రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో ప్రతీకార రాజకీయాలు మొదలయ్యాయి. వైఎస్సార్సీపీ నేతలను లక్ష్యంగా చేసుకుని.. అక్రమ కేసులు, అరెస్టులు చేయించడమే కాదు.. హత్యలకూ పాల్పడుతున్నారు. ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా వదలడం లేదు. ఈ క్రమంలోనే.. మాజీ మంత్రులు అంబటి రాంబాబు, జోగి రమేష్ నివాసాలపై అధికార టీడీపీ దాడులు చేసింది. ఈ జంగిల్ రాజ్పై చట్టబద్ధంగా, అహింసా పద్ధతుల్లో వైస్సార్సీపీ పోరాటాన్ని ప్రారంభించింది. ఇప్పటికే ఈ పరిస్థితులను కేంద్ర హోం శాఖ కార్యదర్శి దృష్టికి తీసుకెళ్లింది వైఎస్సార్సీపీ. త్వరలో హోంమంత్రి అమిత్ షాను కలసి పరిస్థితులను ఆయనకు వివరించాలని భావిస్తోంది.కూటమి పాలనలో ఇప్పటిదాకా.. అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారుజోగిరమేష్ ఇంటిపై దాడి చేశారువలభనేని వంశీ ఇంటిపై దాడి చేశారుకొడాలి నాని ఇంటిపై దాడి చేశారుపేర్ని నాని ఇంటిపై దాడి చేశారుముద్రగడ ఇంటిపై దాడి చేశారునల్లపురెడ్డి ప్రశన్న కుమార్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుకామిరెడ్డి నాని ఇంటిపై దాడి చేశారుకేతిరెడ్డి పెద్దారెడ్డి ఇంటిపై దాడి చేశారుఅబ్బయ్య చౌదరి ఇంటిపై దాడి చేశారుభూమన కరుణాకర్ రెడ్డి ఇంటిపై దాడి చేశారుహిందూపుర్ వైసీపీ ఆఫీస్ పై దాడి చేశారుదాడిశెట్టి రాజాపై దాడి చేశారుఉప్పల హారికా, ఉప్పల రాముపై దాడి చేశారుదేవినేని అవినాష్ పై దాడికి యత్నించారుచిత్తూరు రెడ్డప్ప ఇంటిపై దాడి చేశారుమార్గాని భరత్ ఆఫీస్ పై దాడివిడదల రజినీపై దాడికి యత్నం నంబూరి శంకర్రావు ఆఫీసుపై దాడిఎమ్మెల్సీ రమేష్ యాదవ్ పై దాడిడెక్కన్ క్రానికల్ ఆఫీస్ పై దాడి చేశారు సాక్షి ఆఫీసులపై దాడి చేశారు -
మరీ ఇంతలా దిగజారాలా?
ఏపీలో కూటమి నేతల ప్రసంగాలకు వాస్తవిక పరిస్థితులకు మధ్య అస్సలు పోలికే ఉండటం లేదు. ఆఖరికి రాష్ట్ర గవర్నర్ అబ్దుల్ నజీర్ చేత కూడా అబద్ధాలు వల్లెవేయించడం కూటమి నేతల దిగజారుడు తనానికి పరాకాష్టగా చెప్పుకోవాలి. గణతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ చేసిన ప్రసంగంలో కొన్నేళ్లుగా రాష్ట్రానికి స్పష్టమైన దిశ లేకుండా పోయిందని చదివించారు. పెట్టుబడిదారుల్లో నమ్మకం క్షీణించిందని గత ప్రభుత్వంపై విమర్శలు చేయించారు. కూటమి ప్రభుత్వం అభివృద్ధి, పునరుద్ధరణ లక్ష్యంగా ఆవిష్కరణ, సంస్కరణలు, సమీక్షలు చేస్తోందని, వాటి ఫలితాలు స్పష్టంగా కనిపిస్తున్నాయని గవర్నర్తో పలికించారు. రాష్ట్రం కోలుకుంటోందని, మార్పు వైపు ప్రయాణం మొదలైందని, స్వర్ణాంధ్ర సాధనకు పది సూత్రాలను అమలు చేస్తున్నామని అనిపించారు. గవర్నర్ మాటలలో కొత్తదనం లేకపోవడం ఒక ఎత్తు అయితే.. గత ప్రభుత్వంపై బురదచల్లడం, కూటమి ప్రభుత్వం ఏదో చేస్తోందన్న భ్రమ కల్పించడానికి ఈ ప్రసంగాన్ని వాడుకోవడం ఇంకో ఎత్తు. సాధారణంగా గణతంత్ర, స్వాతంత్ర దినోత్సవాల వంటి జాతీయ ఉత్సవాలలో అధికార పార్టీ ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను ఎంత మేరకు అమలు చేసింది చెబుతూంటారు. గవర్నర్ ప్రసంగంలో ఆ భాగం ఉన్నట్లు మీడియాలో కనిపించలేదు. సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ చంద్రబాబు తరచు అసత్యాలను ప్రచారం చేస్తుంటారు. గవర్నర్తో కూడా ఆ మాట చెప్పించి ఉండకపోతే అది మంచి విషయమే.. ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, ఏభై ఏళ్లకే పెన్షన్ తదితర హామీలు ఇప్పటికైతే గాలికి వదిలేసినట్టుగానే ఉంది. కూటమి ప్రభుత్వం తీసుకు వచ్చిన ఆవిష్కరణలు ఏమిటో, అభివృద్ది పునరుద్దరణ ఎక్కడ జరిగిందో ఎవరికి కనిపించదు. జగన్ ప్రభుత్వం తీసుకు వచ్చిన పలు వ్యవస్థలను నీరు కార్చడం, వాటి పేర్లు మార్చి తామే కనిపెట్టినట్లు ప్రచారం చేసుకుంటున్నారు. గత ప్రభుత్వం చేపట్టిన ఓడరేవులు, మెడికల్ కాలేజీలు నిర్మాణం నిలిపి వేయడం అభివృద్ది ఎలా అవుతుంది? గవర్నర్ తన స్పీచ్లో రాష్ట్రంలో మార్పు మొదలైందని అనడంలో కూటమి ఉద్దేశం ఏమిటో కాని ఆ మార్పు ప్రజలకు అనుకూలమైనదా? వ్యతిరేకమైనదా? అన్నది సమీక్షించుకోవాలి. విశాఖపట్నంలో తమ సమీప బంధువు, లోక్సభ సభ్యుడు శ్రీభరత్కు చెందిన గీతం కాలేజీ ఆక్రమించిన 54 ఎకరాల ప్రభుత్వ భూమిని క్రమబద్దీకరించడానికి కార్పొరేషన్ చర్చ లేకుండా తీర్మానం చేయడం ఈ ప్రభుత్వం తీసుకువచ్చిన మార్పు కాబోలు. ఇందుకోసం ఫిరాయింపుల ద్వారా విశాఖ మేయర్ స్థానాన్ని కైవసం చేసుకోవడం మరో మార్పుగా భావించాలి. ఈ భూమి విలువ సుమారు రూ.ఐదువేల కోట్లు అంటున్నారు. ప్రజలు ఏమైనా అనుకుంటారేమో అన్న చిన్నపాటి సంశయాన్ని కూడా వదిలేసి అధికారం అండగా బంధుప్రీతికి పాల్పడటం కూటమి తాలూకూ లేటెస్ట్ మార్పు. రిటైర్డ్ ఐఎఎస్ అధికారి ఈఎఎస్ శర్మ వంటి వారి అభ్యంతరాలను పెడచెవిన పెట్టడం మరో మార్పు. విశాఖలో ఒక మీడియా సంస్థకు కోట్ల విలువైన ప్రభుత్వ భూమి కట్టబెట్టారని వార్తలు వచ్చాయి. ఇదే విశాఖలో వేలాది మంది నివసిస్తున్న దేవాలయ, ప్రభుత్వ భూములను రెగ్యులైరైజ్ చేయకపోవడం గీతం కాలేజీ యాజమాన్యంతోపాటు కొందరు నేతలు,పలుకుబడి కలిగిన వ్యక్తులు కబ్జా చేసిన భూములను గత వైసీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటే, వాటిని ఆక్రమణదారులకే ధారాదత్తం చేయడానికి వెనుకాడకపోవడం ఏ రకమైన మార్పో? వైసీపీ పాలన సమయంలో విజయసాయిరెడ్డి బంధువులు భూమి కొనుగోలు చేసినా, అదంతా దందా అని ప్రచారం చేసిన ఎల్లో మీడియా, ఇప్పుడు ఈ కబ్జాలకు వంత పాడుతుండడం కూడా మార్పే. గవర్నర్ ప్రసంగం ద్వారా అమరావతి రాజధానితోనే అన్ని జరిగిపోతాయన్న భ్రమ కల్పించే యత్నం చేశారు. ఆ క్రమంలో మళ్లీ సుమారు లక్షన్నర ఎకరాల భూమిని సేకరించడానికి ప్రభుత్వం తలపెట్టడంపై అక్కడి ప్రజలు, ముఖ్యంగా రైతుల గుండెల్లో రైళ్లు పరుగెడుతున్న దానిపై మాత్రం భరోసా ఇచ్చినట్లు కనిపించలేదు. కేంద్రం ఏదో అమరావతిని అవకాశాల గని అని పేర్కొందని ఎల్లో మీడియా తెలిపింది. ఒకప్పుడు కాణి ప్రభుత్వ ఖర్చు లేకుండా సెల్ఫ్ ఫైనాన్స్ కాపిటల్ అని ప్రచారం చేసిన చంద్రబాబు ఇప్పుడు అమరావతిని అప్పుల ఊబిలో దింపుతున్నారని పలువురు నిపుణులు వ్యాఖ్యానిస్తున్నారు. అది నిజమా? కాదా? అన్న దానిపై గవర్నర్తో వివరణ ఇప్పించి ఉంటే సబబుగా ఉండేది!. పేదరికం లేని సమాజం, ఉపాధి నైపుణ్యం, జనాభా నిర్వహణ, నీటి భద్రత, రైతులకు అగ్రిటెక్, ప్రపంచస్థాయి లాజిస్టిక్స్, వ్యయ నియంత్రణ, స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్, స్వచ్ఛాంధ్ర, సేఫ్ ఆంధ్ర, డీప్ టెక్ అండ్ స్మార్ట్ గవర్నెన్స్ అంటూ పడికట్టు పదాలను గవర్నర్ స్పీచ్ వాడారు. వీటితో ఏపీ స్వర్ణాంధ్రగా మారిపోతుందని ప్రజలను నమ్మమంటున్నారు. కాని ఇది నిత్యం చెప్పే అబద్దాలలో భాగమేనని ప్రజలకు తెలియదా! సమాన అవకాశాలు కల సమాజాన్ని నిర్మిస్తున్నామని గవర్నర్తో చెప్పించారంటే అంతకన్నా పెద్ద అసత్యం ఉంటుందా? ప్రభుత్వం నిర్మించవలసిన మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారు. విశాఖలో అతి ఖరీదైన ప్రభుత్వ భూములను పెద్ద, పెద్ద కంపెనీలకు వారు అడగకపోయినా 99 పైసలకే కట్టబెడుతున్నారు. ఇది అన్నిటికంటే అతి పెద్ద మార్పుగా ఏపీ ప్రజలు చూస్తున్నారు. గతంలో ఇలాంటివి ఎన్నడూ జరగలేదు. వేల కోట్ల రూపాయల అప్పులు తెచ్చి కేవలం అమరావతిలోనే వ్యయం చేస్తున్నారు. హామీలు అమలు చేయండంటే పీపీపీ అంటున్నారు. అప్పులు, అవస్థలు ప్రజలకు, ప్రభుత్వ సంపదను కొంతమంది బడాబాబులకు అప్పగిస్తున్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్న తీరుతో ఎంతటి అరాచక పరిస్థితులు నెలకొన్నాయో క్షీణించిన శాంతిభద్రతలు చెబుతాయి. చివరికి అనుచితమైన విద్వేషపూరిత రాతలన్న ఫ్లెక్సీలకు టీడీపీ గూండాలు కర్రలు పట్టుకుని కాపలా కాస్తుంటే, పోలీసులు భద్రత కల్పించడమే మహా మార్పు. పంతొమ్మిది నెలల్లో తెచ్చిన రూ.మూడు లక్షల కోట్లకుపైగా అప్పులతో రాష్ట్రం పరిస్థితి ప్రమాదకరంగా మారిందని ఆర్థికవేత్తలు ఆందోళన చెందుతున్నారు. ఈ నేపథ్యంలో ఏపీ సేఫ్ గా ఉందని అనుకోవాలా? లేక అన్సేఫ్గా మారుతోందని భయం కలుగుతుందా?:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట
సాక్షి, ఢిల్లీ: సుప్రీం కోర్టులో సాక్షి టీవీకి ఊరట లభించింది. ఏపీ ఫైబర్నెట్లో సాక్షి చానెల్ తొలగించడంపై విచారణ జరపాలని డీటీ శాట్ను సోమవారం సర్వోన్నత న్యాయస్థానం ఆదేశించింది. దీంతో సాక్షిపై కక్షగట్టి.. మీడియా స్వేచ్ఛను హరించాలని చూస్తున్న చంద్రబాబు సర్కార్కు భారీ షాక్ తగిలినట్లైంది. ఏపీలో చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. ఏపీ ఫైబర్ నెట్ నుంచి సాక్షి టీవీ చానెల్ను తొలగించారు. పైగా సాక్షి టీవీని ప్రసారం చేయొద్దంటూ ఎంఎస్వోలపై ప్రభుత్వం ఒత్తిడి చేస్తూ వస్తున్నారు. ఈ క్రమంలో అక్రమ తొలగింపు వ్యవహారంపై సాక్షి యాజమాన్యం టీడీశాట్, సుప్రీం కోర్టును ఆశ్రయించింది. ఈ క్రమంలో టీడీశాట్కు ఆదేశాలను కూడా ఏపీ ప్రభుత్వం పట్టించుకోకపోవడం గమనార్హం. అయితే.. టీడీశాట్ లేవనెత్తిన అంశాలను పరిశీలిస్తామని సుప్రీం కోర్టు తెలిపింది. అవసరమైతే మళ్లీ తమను ఆశ్రయించవచ్చని సుప్రీం కోర్టు ఈ సందర్భంగా సాక్షి యాజమాన్యానికి సూచించింది. సుప్రీం కోర్టు ఆదేశాలతో ఈ నెల 12న సాక్షి టీవీ పిటిషన్ను టీడీ శాట్ విచారణ జరపనుంది. టీడీశాట్ (TDSAT) అంటే Telecom Disputes Settlement and Appellate Tribunal. ఇది భారతదేశంలో టెలికాం రంగానికి సంబంధించిన వివాదాలను పరిష్కరించడానికి, అప్పీలు వినడానికి ఏర్పాటు చేసిన ప్రత్యేక న్యాయస్థానం. -
నేడు వైఎస్సార్సీపీ కీలక సమావేశాలు
సాక్షి, తాడేపల్లి: టీడీపీ ఆరాచకాలు తారాస్థాయికి చేరి వైఎస్సార్సీపీ నేతలపై, నివాసాలపై దాడులు జరుగుతున్న నేపథ్యంలో.. వైఎస్సార్సీపీ ఇవాళ కీలక సమావేశాలు నిర్వహించనుంది. ఉమ్మడి గుంటూరు, కృష్ణా జిల్లాల నేతలతో సీనియర్లు సజ్జల రామకృష్ణారెడ్డి, బొత్స సత్యనారాయణ భేటీ కానున్నారు. అలాగే తిరుమల ప్రసాదం విషయంలో టీడీపీ చేస్తున్న దుష్ప్రచారం నేపథ్యంలోనూ మరో సమావేశం నిర్వహించనుంది.కేంద్ర కార్యాలయంలో జరగనున్న ఈ భేటీలో వైఎస్సార్సీపీ నేతలపై జరుగుతున్న దాడులు, పోలీసులు పెడుతున్న అక్రమ కేసులు, టీడీపీ గూండాల హింసాకాండపై సజ్జల, బొత్స.. జిల్లాల నేతలతో సమీక్ష నిర్వహించనున్నారు. యధేచ్చగా సాగుతున్న అరాచకాలను అహింసా మార్గంలో ఎదుర్కొవడం.. చట్టపరమైన ఫిర్యాదులు తదితర అంశాలపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. బ్రాహ్మణ నాయకులతోనూ.. తిరుమల లడ్డూ ప్రసాదంపై టీడీపీ విష ప్రచారం ముదుతున్న వేళ.. బ్రహ్మణ నేతలతోనూ సజ్జల, బొత్స భేటీ కానున్నారు. తిరుమల మహా ప్రసాద అంశంతోపాటు కూటమి ప్రభుత్వం ఆలయాల ప్రతిష్టను దెబ్బతీస్తున్న వైనంపైనా చర్చించే అవకాశం కనిపిస్తోంది. -
బాబోయ్.. ఇదేం పాలన అంటున్న కూటమి అభిమానులు!
ఆంధ్రప్రదేశ్లో ఆటవిక రాజ్యం (జంగిల్ రాజ్) నడుస్తోందని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వ్యాఖ్యానించారు. ఏడాదిన్నర కూటమి పాలనపై జగన్ చేసిన ఈ ఘాటు వ్యాఖ్య అన్ని విధాలుగా తగినదే. రాజకీయాల్లో తన అనుభవం చాలా పెద్దదని తరచూ చెప్పుకుంటూ తిరిగే చంద్రబాబు నాయుడు పాలన ఇంత అధ్వాన్నంగా, నాసిరకంగా చేయగలరని బహుశా ఆయన అభిమానులు కూడా ఊహించి ఉండకపోవచ్చు. ప్రజాస్వామ్య విలువలకు కూటమి పాలనలో నిత్యం తిలోదకాలే. ప్రతిపక్ష పార్టీ నేతలపై కక్షసాధింపులు నిత్యకృత్యమవుతున్నాయి. ఈ కారణంతోనే ఒకప్పుడు టీడీపీకి మద్దతుగా నిలిచిన ఓ మిత్రుడు కూడా ‘‘అబ్బే ఇదేం పాలనండి.. చాలా ఘోరంగా ఉంది. మళ్లీ వచ్చేది వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీనే’’ అని చెప్పగలుగుతున్నారు. పల్నాడు ప్రాంతానికి వెళ్లి వచ్చిన తరువాత ఆయనీ వ్యాఖ్య చేయడం గమనార్హం. అసలక్కడ ప్రభుత్వమనేది ఒకటుందా? పనిచేస్తుందా? అన్న అనుమానం వచ్చిందని, ఎటు చూసినా అధికార పార్టీ కార్యకర్తల అరాచకాలే దర్శనమిస్తున్నాయని వివరించారు. ఈ అంచనా ఈయన ఒక్కరిదే కాదు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో అక్కడి అరాచకాలను ప్రత్యక్షంగా చూసిన చాలామంది ఇదే మాట అంటున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీపై సాగుతోన్న అణచివేత ధోరణి, అక్రమ కేసులు, అరెస్టులపై ప్రజల్లోనూ తీవ్రమైన నిరసన వ్యక్తమవుతోంది. టీడీపీ, జనసేన, బీజేపీల కూటమి ఎన్నికలకు ముందు ఇచ్చిన హామీలను నెరవేర్చేకపోగా.. అన్నీ చేసేశామని ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి నిత్యం బొంకుతూండటం, మంత్రి లోకేశ్ అహంభావ పూరిత ప్రకటనలు, జనసేన అధినేత, ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానని ఊదరగొట్టిన ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ నిమ్మకు నీరెత్తినట్లు ఉంటూండటం ప్రజల నైరాశ్యానికి కారణమన్న విశ్లేషణ వినిపిస్తోంది. హంగు, ఆర్భాటాలు, వసతులు కల్పించి విధేయుడిగా మార్చుకోవడం ద్వారా పవన్ ప్రశ్నించలేని స్థితికి చేర్చారని అంచనా. కానీ చంద్రబాబుకు తన కుమారుడిని నియంత్రించే శక్తి లేకుండా పోయిందన్నది టీడీపీలో ఒక వర్గం అభిప్రాయం. లోకేశ్, ఆయన అనుచరుల పెత్తనాన్ని సీనియర్లు జీర్ణించుకోలేకపోతున్నారని పార్టీ వర్గాలే వ్యాఖ్యానిస్తున్నాయి. తనకు సంబంధం లేని హోం శాఖపై లోకేశ్ పెత్తనం చేస్తున్న తీరు, ఆయా శాఖలన్నిటిని పర్యవేక్షిస్తున్నారన్న భావన, టీడీపీ ఎమ్మెల్యేలు, ఇతర నేతలు చంద్రబాబును కాకుండా లోకేశ్ను పొగడడానికే ప్రాధాన్యం ఇస్తున్నారన్న అభిప్రాయం ప్రజలలో వ్యక్తం అవుతోంది. ఈ స్థితిలో ఏపీలో జంగిల్ రాజ్ ఏర్పడిందన్న జగన్ వ్యాఖ్యను చాలామంది సమర్థిస్తున్నారు. ఈ మధ్యకాలంలో పలువురు టీడీపీ ఎమ్మెల్యేలు అవినీతికి పాల్పడడం, ఇసుక, మద్యం, మైనింగ్లలో దందాలు చేస్తూ ఇష్టారాజ్యంగా సంపాదిస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పోలీసు వ్యవస్థ అచేతనంగా ఉంటోంది. కోడిని కోశారంటూ వైపీసీ కార్యకర్తలపై కేసులు పెట్టి కొందరిని అరెస్టు చేసి రోడ్డుమీద నడిపించిన వైనం ఆటవిక పాలనకు దర్పణంగా నిలబడుతోందన్నది ఆ పార్టీ విమర్శ. అదే సమయంలో సంక్రాంతి సందర్భంగా టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, నేతలు బీభత్సంగా కోడిపందాలు ఆడించి, వందల కోట్ల రూపాయల మేర పందాలు నడిపించినా పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ముఖ్యమైన పదవులలో ఉన్న కొందరు దగ్గరుండి కత్తులు కట్టించి కోడి పందాలు జరపడం, అక్కడ అన్ని రకాల జూదాలు నిర్వహించడం, పలు చోట్ల పోలీసులు కూడా వారిలో భాగస్వాములయ్యారన్న విమర్శలు రావడం వంటివి కళ్లెదుటే కనిపిస్తాయి. భారీ ఎత్తున బరులు తయారు చేసి, వేలాది మంది అక్కడ జమ కూడుతున్నా పోలీసులు అసలు పట్టించుకోలేదంటేనే ఇది ఎంత అధ్వాన్న పాలన అన్నది విదితమవుతోందని ప్రజలు చెప్పుకుంటున్నారు. విశేషం ఏమిటంటే హైదరాబాద్ తదితర ప్రాంతాల నుంచి అనేక మంది, కొంతమంది మహిళలు సైతం భారీ ఎత్తున డబ్బు సంచులతో అక్కడకు వెళ్లి పందాలు కాసినా, పోలీసు వ్యవస్థ కాని, ఈడి వంటి సంస్థలు కాని అటువైపు కన్నెత్తి చూడలేదు. ఇలా చేస్తున్న వారెవ్వరిని పట్టుకుని రోడ్డుమీద నడిపించలేదు. రికార్డింగ్ డాన్స్ల పేరుతో అశ్లీల నృత్యాలు చేస్తున్నా పోలీసులు ఆపలేదు.పైగా ఒక అధికారి ఎలా పాటపాడాలో, డాన్స్ చేయాలో చేసి చూపించారట. మంత్రి వాసంశెట్టి సుభాష్ ఆ రికార్డు డాన్స్లో భాగస్వామి అవడంపై లోకేశ్ ఆగ్రహించారట. చివరికి పులివెందులలో కూడా టీడీపీ నేత మూడు కోట్లు వసూలు చేసి కోడి పందాలు నిర్వహించారని జగన్ వెల్లడించారు. ఈ నేపథ్యంలోనే ఆయన చంద్రబాబు ప్రభుత్వానికి జంగిల్ సర్కార్ అని పేరు పెట్టారు. ఇక ఎమ్మెల్యేలు కొందరు మహిళలను లైంగిక వేధింపులకు గురి చేస్తున్న తీరును కూడా జగన్ ప్రస్తావించారు. కూన రవికుమార్, నజీర్, ఆదిమూలం తదితర ఎమ్మెల్యేలపై వచ్చిన అభియోగాలను ప్రస్తావించారు. ఇటీవలే రైల్వేకోడూరు జనసేన ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ఒక మహిళను ఏడాదిన్నరగా వేధించిన వైనం, వివాహం చేసుకుంటానని మోసం చేసిన తీరు కూడా వివరించి అసలు వీళ్లు మనుషులేనా అని జగన్ ప్రశ్నించారు.ఈ ఘటనకు సంబంధించి చంద్రబాబు, పవన్ కళ్యాణ్, డీజీపీలతో సహా పలువురు అధికారులకు బాధితురాలు మొరపెట్టుకున్నా, ఎవరూ స్పందించలేదట. దాంతో ఆమె బహిరంగంగానే తన ఆవేదనను తెలియ చేసింది. ఫలితంగా కూటమి పరువు మొత్తం పోయింది. మహిళల గౌరవానికి భంగం రానివ్వమని బోలెడన్న కబుర్లు చెప్పిన చంద్రబాబు, పవన్, లోకేష్.. ఈ ముగ్గురు నేతలు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా నోరు విప్పడం లేదు. జనసేన ఎమ్మెల్యే పై వచ్చిన ఆరోపణల గురించి మీడియా ప్రశ్నించబోగా పవన్ కళ్యాణ్ అక్కడ నుంచి తప్పించుకుని వెళ్లిపోవడం విమర్శలకు దారి తీసింది. దాంతో గతంలో ఆయన మహిళల రక్షణకు సంబంధించిన వీడియోలను చూపుతూ ఇలా పలాయనం చిత్తగించడం తగునా అని సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. ఒక మంత్రిగారి పీఏపై ఆరోపణలు చేసిన మహిళను జైలుకు పంపడం, మంత్రి కుమారుడు స్వయంగా జూదం ఆడుతూ దొరికిపోవడం, మరో ఎమ్మెల్యే కుమారుడు డ్రగ్స్తో పట్టుబడడం.. ఒక టీడీపీ ఎమ్మెల్యే జనసేన మహిళా నేత ప్రైవేటు వీడియోలను తీయించారన్న అభియోగాలు రావడం, వైఎస్సార్సీపీ మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై ఏకంగా ఒక మహిళా ఎమ్మెల్యే నేతృత్వంలో దాడి చేయడం, విధ్వంసం సృష్టించడం వంటివి ఈ ప్రభుత్వం జంగిల్ రాజ్ గా మారిన విషయాన్ని తేటతెల్లం చేస్తున్నాయని అంటున్నారు. ఈ మధ్యనే పల్నాడులో సాల్మన్ అనే వైసీపీ కార్యకర్తను టీడీపీ గూండాలు హత్య చేశారు. పిన్నెల్లి గ్రామానికి చెందిన సుమారు వంద కుటుంబాలను గ్రామంలోకి రానివ్వకుండా తరిమేశారట. ఇలా ఒకటి కాదు.అనేక అరాచకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ఇవన్ని వింటుంటే ఏపీలో పరిస్థితి ఎవరికైనా ఆందోళన కలిగిస్తుంది. ప్రజలు అసహ్యించుకుంటున్నారు. జంగిల్ రాజ్ అన్న పేరు అతికినట్టు సరిపోతుందన్నమాట!:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ప్రశ్నిస్తే ఇళ్లు తగలబెడతారా.. ఈ నిప్పే మీ ప్రభుత్వాన్ని దహిస్తుంది
-
ఏపీలో రాషపతి పాలన..! వెంటనే కేంద్ర బలగాలను దింపండి..
-
చంద్రబాబు, లోకేష్ డైరెక్షన్లోనే ఇదంతా..!
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు ఆటవిక పాలనలో వైఎస్సార్సీపీ నేతలకు భద్రత లేకుండా పోయిందని.. పట్టపగలే టీడీపీ నేతలు గూండాగిరికి దిగుతూ ప్రజలను భయాందోళనలకు గురి చేస్తున్నారని.. ఆ పార్టీ మండిపడుతోంది. రాష్ట్రంలో పరిస్థితులు ఎంతగా దిగజారిపోయాయో.. మాజీ మంత్రి అంబటి రాంబాబుపై జరిగిన హత్యాయత్నమే ఉదాహరణ అని అంటున్నాయి. ఈ క్రమంలో ఆయనపై అక్రమ కేసును బనాయించడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు ఆ పార్టీ నేతలు.. శ్రీకాకుళం:తాలిబాన్ పాలనలా.. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఫైర్చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి దాడులు.. తప్పుడు కేసులురాష్ట్రంలో మహిళలు, చిన్నారులకు రక్షణ ఉందా?అంబటిపై హత్యాయత్నం దారుణంచంద్రబాబు 40 ఏళ్ల అనుభవంతో ఏపీని ఆటవిక ప్రదేశ్గా మార్చారుతిరుమల లడ్డులో యానిమల్ ఫ్యాట్ లేదని సీబీఐ రిపోర్టు ఇచ్చిందిఇప్పుడు కూటమి నేతలు సీబిఐ రిపోర్ట్ తప్పు అంటూ మాట్లాడుతున్నారుహోమంత్రి సైతం సిట్ రిపోర్ట్ తప్పు అంటుంది.. అంటే సీబీఐ అయితే తప్పు మీ సిట్ అయితేనే కరెక్టా.. ఎంత దౌర్భాగ్యంచంద్రబాబు కళ్లల్లో ఆనందం చూడడం కోసమే మంత్రులు ఇలా మాట్లాడుతున్నారుఅబద్దపు ప్రచారాలతో టీడీపీ నేతలు ఫ్లెక్సీలు కట్టారుపోలీసులు నేతలకు భయపడి ఫోన్లు లిఫ్ట్ చేయడం లేదు.కర్రలతో తిరుగుతుంటే.. కనీసం పోలీసులు అడ్డుకోలేకపోయారు.. తాలిబాన్ పాలనలా ఉందిపోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు తూర్పుగోదావరి.. రాష్ట్రంలో పరిణామాలు చూస్తే ప్రజాస్వామ్యంలో ఉన్నామా?.. హిట్లర్ పాలనలో ఉన్నామా? అనే అనుమానం కలుగుతుందిఎన్నికలు పూర్తయిన నాటినుంచి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు అంతమొందిచాలనే ప్రయత్నం జరుగుతుంది ఆలోచనతోనే వ్యవస్థ నడుస్తోందిపోలీసులు గుప్పెట్లో పెట్టుకుని అరాచకం సృష్టిస్తున్నారుటీటీడీ వైభవాన్ని కూడా రాజకీయ స్వప్రయోజనాల కోసం మసకబార్చే ప్రయత్నం చేస్తున్నారుదేశంలో ప్రధానమైన ల్యాబ్లలో జరిగిన పరీక్షల్లో.. తిరుమల లడ్డూలో ఎటువంటి కొవ్వు కలవలేదనే స్పష్టమైన రిపోర్ట్ వచ్చాయిదీంతో చంద్రబాబు నియంతలా మారి హింసకు పాల్పడుతున్నారువరుసగా.. విడదల రజని, బొల్లా బ్రహ్మనాయుడు, అంబటి రాంబాబు లపై దాడులు చేశారుఅంబటి రాంబాబు ఇంటిపై దాడి చేసి వాహనాలను పగలగొట్టి దగ్ధం చేశారు. అంబటి రాంబాబును అంతమందించాలని కుట్రకు చంద్రబాబు లోకేష్ దగ్గర ఉంటే డైరెక్షన్ ఇచ్చారు. స్థానిక మహిళా ఎమ్మెల్యే కూడా దగ్గరుండి ఈ విధ్వంసం సృష్టించారురానున్న రోజుల్లో కచ్చితంగా తెలుగుదేశం పార్టీ నాయకులు మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది...ప్రజల్లో ఆగ్రహం వస్తే ఏ వ్యవస్థ అడ్డుకోలేదు..చంద్రబాబు కాపులను ఎప్పుడూ ఓట్ల కోసం ఉపయోగించుకుంటాడుఓట్లు దండుకుని అధికారంలోకి వచ్చి కాపు నాయకులను తొక్కేసే ప్రయత్నం చేస్తారురాష్ట్రంలో బలమైన నాయకుడుగా ఎదుగుతున్న వంగవీటి రంగాను నడి రోడ్డుపై నరికేసే పైసాచికానందం పొందారుఎన్నికల హామీల నెరవేర్చమని అడిగిన ముద్రగడ పద్మనాభ ఇంటిపైకి వేలమంది పోలీసులను పంపి మహిళలను అనరాని మాటలు మాట్లాడి ఈడ్చుకెళ్లారు..చంద్రబాబు లోకేష్ ల డైరెక్షన్లోనే అంబటి ఇంటిపై దాడి జరిగింది.. ఇది సహించదగినది కాదు..కుట్రకు డైరెక్షన్ ఇచ్చిన వారినుంచి ఎవరెవరైతే పాల్గొన్నారో వారందరిపై కేసులు నమోదు చేయాలిరాష్ట్రంలో అటవీక పాలన నడుస్తుందిరాష్ట్రంలో పోలీసులకు ప్రభుత్వం జీతాలు ఇస్తుందా? ఎన్టీఆర్ ట్రస్ట్ నుంచి ఇస్తున్నారా?ఎక్కడపడితే అక్కడ కేసులు పెట్టి సోషల్ మీడియా వాళ్ళని తీవ్రంగా ఇబ్బందులు పెట్టారుకార్యకర్తలకు కత్తులు, కర్రలు ఇచ్చి మేము చూసుకుంటాం అని చెప్పటం సరికాదు...డీజీపి స్పందించాలి... కనీసం ఫోన్ కూడా ఎత్తకపోవడం దారుణం...చంద్రబాబే అధికారంలో శాశ్వతంగా ఉంటారని అనుకుంటున్నారేమో!2029 లో వైఎస్ఆర్సిపి మళ్ళీ అధికారంలోకి వస్తే మీ పరిస్థితి ఏంటి?మీరు చేసే ప్రతి తప్పు కౌంట్ అవుతుంది...అవసరమైతే జైల్ భరోలా.. పోలీస్ స్టేషన్ భరో చేస్తాంకాపు నాయకులను అడగదొక్కేందుకు ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను అందరు గమనించాలిఅంబటి రాంబాబు కు మోరల్ సపోర్ట్ ఇచ్చేందుకు వెళదామంటే మా ఇంటి ని పోలీసులు చుట్టుముట్టారు:::మాజీ ఎమ్మెల్యే జక్కంపూడి రాజాఢిల్లీఅంబటి రాంబాబు పై హత్యాయత్నం పై కేంద్ర ప్రభుత్వ పెద్దలను కలుస్తున్నాంఫస్ట్ టీడీపీ వాళ్ళే అంబటి రాంబాబు పై దాడి చేసి పచ్చి బూతులు తిట్టారుఇది వరకు నాపై దాడి చేసినప్పుడు ఒక్క కేసు పెట్టలేదు-ఎంపీ మిథున్ రెడ్డితిరుపతి:అంబటి పై నిన్న జరిగిన దాడి ప్రజాస్వామ్యం పై దాడిఇరు రాష్ట్రాల్లో మంచి పేరున్న నాయకుడు మాజీ మంత్రి అంబటి పై దాడి అత్యంత హేయమైనది, నీచ మైనదిఅంబటి ఇంటిపైకి టీడీపీ నేతల్ని జల్లికట్టులో ఎద్దుల్లా వదిలారు.. అంబటి పై హత్యాయత్నం చేశారుతాను చేసిన వ్యాఖ్యలకు అంబటి వివరణ కూడా ఇచ్చారుఅయినా పోలీసులు సమక్షంలో టీడీపీ బరితెగించించింది ప్రతీకార ద్వేషంతో హంతకముఠా దాడులు చేస్తోందిప్రతి మండల కేంద్రంలో లడ్డూ వివాదంలో ఫ్లెక్సీలు పెట్టించారుకాపు నాయకులపై దాడి లక్ష్యంగా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోంది::భూమన కరుణాకర్రెడ్డి న్యూఢిల్లీ..మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ శ్రేణులు జరిపిన దాడిని వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. ఈ విషయమై కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు చేసినట్లు వెల్లడించారాయన. ‘‘ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ప్రజాస్వామ్యం ఉందా లేదా అనే అనుమానాలు కలుగుతున్నాయి. కూటమి ప్రభుత్వం పనితీరు రాక్షస పాలనను తలపిస్తోంది. టీడీపీ గుండాలు, కార్యకర్తలు వేల సంఖ్యలో అంబటి రాంబాబు ఇంటిపై దాడి చేశారు. దాదాపు 5 గంటల పాటు వీరంగం సృష్టించి ఇంటిని ధ్వంసం చేశారు. పోలీసులు కేవలం ప్రేక్షక పాత్ర పోషించారు. కనీసం దాడిని ఆపే ప్రయత్నం కూడా చేయలేదు. మా అధినేత వైఎస్ జగన్ మోహన్రెడ్డి సూచనల మేరకు.. రాష్ట్ర పరిస్థితులను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తాం. ఒక మాజీ మంత్రికే ప్రాణ రక్షణ కరువైందన్న విషయాన్ని కేంద్ర హోం మంత్రి అమిత్షాతో పాటు, ఆ శాఖ కార్యదర్శికి కలిసి వివరిస్తాం అని అన్నారాయన. -
అంబటిపై హత్యాయత్నం.. కేంద్ర హోం శాఖకు ఫిర్యాదు
సాక్షి, ఢిల్లీ: వైఎస్సార్సీపీ సీనియర్ నేత, ఏపీ మాజీ మంత్రి అంబటి రాంబాబుపై టీడీపీ గూండాల దాడి, ఆపై ఆయన్నే అరెస్ట్ చేయడాన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోంది. గుంటూరులో టీడీపీ గుండాగిరిపై ఆదివారం కేంద్ర హోంశాఖకు ఫిర్యాదు చేసింది. వైఎస్సార్సీపీ పార్లమెంటరీ నేత వైవీ సుబ్బారెడ్డి ఈ మేరకు ఆ వివరాలు వెల్లడించారు. రాష్ట్రంలో పోలీసులు రూల్ ఆఫ్ లా ను గాలికి వదిలేశారు. ప్రతిపక్షల నేతల ప్రాణాలకు రక్షణ లేకుండా పోయింది. మాజీ మంత్రి అంబటి రాంబాబు పై హత్యాయత్నం జరిగింది. రాళ్లు కర్రలతో ఆయన ఇంటిపై దాడికి దిగారు. ఆస్తులు వాహనాలన్నిటిని ధ్వంసం చేశారు. పక్కా ప్రణాళికతోనే ఈ దాడి జరిగింది. కాపాడాల్సిన పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. ఫలితంగా హింస ఇంకా కొనసాగుతోంది. ఈ వివరాలతో కేంద్ర హోం శాఖ కార్యదర్శి గోవింద్ మోహన్కి ఫిర్యాదు చేశాం. ఏపీలో శాంతిభద్రతల పునరుద్ధరణకు వెంటనే జోక్యం చేసుకోవాలని కోరాం.. ..ఏపీలో ప్రతిపక్ష నేతలను లక్ష్యంగా చేసుకుని దాడులు చేస్తున్నారు. పోలీసు వ్యవస్థ స్వతంత్రంగా పనిచేయడం లేదు. దాడుల్ని నియంత్రించేందుకు పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదు. అందుకే కేంద్ర హోంశాఖ వెంటనే జోక్యం చేసుకొని శాంతిభద్రతలను చక్కదిద్దాలి. పరిస్థితులు మరింత దిగజారకుండా తగిన చర్యలు తీసుకోవాలి’’ అని లేఖ ద్వారా కేంద్రాన్ని కోరినట్లు వైవీ సుబ్బారెడ్డి పేర్కొన్నారు. -
గుంటూరులో టీడీపీ జంగిల్ రాజ్
పల్నాడులో మాజీ మంత్రి విడదల రజినిపై దాడికి యత్నించిన టీడీపీ గూండాలు.. ఇవాళ గుంటూరులో రెచ్చిపోయారు. తిరుమల లడ్డూ ప్రసాద విషయంలో కూటమి ప్రభుత్వ విష ప్రచారం తప్పని సీబీఐ నివేదికతో తేలిన సంగతి తెలిసిందే. ఈ నేపథ్యంలో గోరంట్లలో పాప ప్రక్షాళన కార్యక్రమం నిర్వహించేందుకు మాజీ మంత్రి, గుంటూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు అంబటి రాంబాబు బయల్దేరారు. అయితే.. గుంటూరు సెంటర్లో ఆయన్ని అడ్డుకున్న టీడీపీ గూండాలు.. దాడికి యత్నించారు. అయితే తృటిలో ఆయన ఆ దాడి నుంచి బయటపడ్డారు . అయితే దాడి సమయంలో కర్రలు, రాడ్లతో టీడీపీ కేడర్ హల్చల్ చేసింది. పోలీసులు అక్కడ ఉండగానే వాటిని పట్టుకుని అక్కడంతా కలియ దిరిగింది. పట్టపగలే ఇలా సంచరిస్తుండడంతో.. ప్రజలంతా భీతిల్లిపోయారు. పోలీసులైనా వాళ్లను అడ్డుకునే ప్రయత్నం కూడా చేయలేదని అంటున్నారు. మరోవైపు ప్లాన్ ప్రకారమే తనపై దాడికి యత్నించారన్న అంబటి రాంబాబు.. ఇటు పోలీసుల తీరుపైనా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ‘‘రాష్ట్రంలో చంద్రబాబు అరాచకాలు సృష్టిస్తున్నారు. కూటమి వేసిన ఫ్లెక్సీలకు పోలీసులు కాపలా కాయడం చూస్తుంటే.. అసలు పోలీస్ వ్యవస్థ బతికే ఉందా? అనే అనుమానాలు కలుగుతున్నాయి’’ అని ఆవేదన వ్యక్తం చేశారాయన. ::సాక్షి ప్రతినిధి, గుంటూరు -
కూటమి మహాపచారంపై YSRCP పాప ప్రక్షాళన
-
CheviReddy: కూటమిపై తిరుగుబాటు.. రాబోయే స్థానిక ఎన్నికల్లో గుణపాఠం
-
నారా లోకేష్ కార్యాలయ ముట్టడికి యత్నం
సాక్షి, విజయవాడ: జాబ్ క్యాలెండర్ విడుదల చేయాలని, నిరుద్యోగ భృతిని అందించాలని శుక్రవారం అఖిల భారత యువజన సమాఖ్య(AIYF) చేపట్టిన చలో విజయవాడ ఉద్రిక్తతలకు దారి తీసింది. కూటమి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో కొందరు యువకులు మంత్రి నారా లోకేష్ క్యాంప్ కార్యాలయానికి ముట్టడించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో పోలీసులు వాళ్లను అడ్డుకునేందుకు అన్ని విధాల ప్రయత్నించారు. బారికేడ్లను అడ్డు వేయగా.. వాటిని తోసుకుని కొందరు యువకులు ముందుకు వెళ్లే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలో ఇరు వర్గాల మధ్య తోపులాట చోటు చేసుకోవడంతో ధర్నా చౌక్ వద్ద పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను ఇకనైనా అమలు చేయాలంటూ ఈ సందర్భంగా ఏఐవైఎఫ్ నేతలు డిమాండ్ చేస్తున్నారు. -
ఏపీలో భూ రీసర్వే జగన్ విజనే.. భేష్
సాక్షి, ఢిల్లీ: తప్పుడు ప్రచారాలతో కాలం వెల్లదీస్తున్న కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం మింగుడు పడని పరిణామం ఒకటి చోటు చేసుకుంది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఇవాళ ఆర్థిక సర్వే ప్రవేశపెట్టిన సంగతి తెలిసిందే. అయితే ఆ ఆర్థిక సర్వేలో వైఎస్ జగన్ మోహన్రెడ్డి విజన్ను కేంద్రం కొనియాడింది. వ్యవసాయ రంగంలో.. 2021లో వైఎస్ జగన్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంస్కరణలను కేంద్ర ఆర్థిక సర్వే ప్రశంసించింది. ‘‘2021లో అప్పటి ఏపీ ప్రభుత్వం భూ రీసర్వే ప్రాజెక్టును చేపట్టింది. డ్రోన్ టెక్నాలజీని ఉపయోగించి జీఐఎస్ సహాయంతో ట్యాంపర్ ప్రూఫ్ డిజిటల్ ల్యాండ్ టైటిల్స్ ఇచ్చారు. మొత్తం 6,901 గ్రామాల్లో ఈ రీసర్వే జరిపారు. మొత్తంగా 81 లక్షల భూముల పునః సర్వే జరిగింది. దాదాపు 86 వేల భూ సరిహద్దు వివాదాలు పరిష్కారం అయ్యాయి’’ అని ఆర్థిక సర్వే ప్రత్యేకంగా ప్రస్తావించింది. దీంతో.. చంద్రబాబు అబద్ధాలు పార్లమెంట్ సాక్షిగా మరోసారి పటాపంచలు అయ్యాయి. భూ సర్వే జగన్ విజనేనంటూ కేంద్రం కూడా బాబుకి షాకిచ్చినట్లైంది. -
చంద్రబాబు, పవన్ పని.. గోవిందా! (ఫొటోలు)
-
కూటమి నేతలున్నారు జాగ్రత్త
-
చెవిరెడ్డి భాస్కర్రెడ్డికి బెయిల్ మంజూరు
సాక్షి, విజయవాడ: వైఎస్సార్సీపీ నేత, చంద్రగిరి మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డికి ఊరట లభించింది. అక్రమ మద్యం కేసులో ఆంధ్రప్రదేశ్ హైకోర్టు గురువారం చెవిరెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. భాస్కర్రెడ్డితో పాటు సజ్జల శ్రీధర్రెడ్డి, వెంకటేష్ నాయుడులకు సైతం బెయిల్ ఇచ్చింది.వేల కోట్ల రూపాయల మద్యం కుంభకోణం జరిగిందని.. ఇందులో చెవిరెడ్డి భాస్కర్రెడ్డి పాత్ర కూడా ఉందంటూ జూన్17వ తేదీన సిట్ బెంగుళూరులో అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. అయితే అలాంటి కుంభకోణానికే ఆస్కారమే లేదని.. ఇదంతా కూటమి ప్రభుత్వ కుట్రేనని వైఎస్సార్సీపీ మొదటి నుంచి చెబుతూ వస్తోంది. ఈ క్రమంలో అనారోగ్యంతో భాధపడుతున్నప్పటికీ కూడా చెవిరెడ్డి సుబ్బారెడ్డిని ఇబ్బంది పెట్టింది కూటమి ప్రభుత్వం. చివరకు 226 రోజుల తర్వాత ఆయనకు బెయిల్ ద్వారా ఉపశమనం లభించింది. సిట్ అభియోగాలుడిస్టిలరీలు, మద్యం సరఫరా కంపెనీల నుంచి కొల్లగొట్టిన సొత్తులో కొంత మొత్తాన్ని ప్రధాన నిందితుడిగా ఉన్న రాజ్ కేసిరెడ్డి నుంచి చెవిరెడ్డి భాస్కర్రెడ్డి అందుకున్నారని.. ఆ సొమ్మును గత అసెంబ్లీ ఎన్నికల టైంలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు చేరవేసినట్లు చంద్రబాబు ప్రభుత్వం వేసిన సిట్ తన అభియోగాల్లో పేర్కొంది. ఈ వ్యవహారంలో కర్త, కర్మ, క్రియగా చెవిరెడ్డి భాస్కరరెడ్డి వ్యవహరించారంటూ అభియోగం నమోదు చేసింది. ఈ కేసులో ఆయన్ని ఏ-38గా, భాస్కరరెడ్డి తనయుడు మోహిత్రెడ్డిని ఏ-39 నిందితులుగా పేర్కొనడం గమనార్హం. -
ఎల్లో మీడియా వారు సమర్పించు..
ఆంధ్రప్రదేశ్లో ప్రైవేటీకరణ ప్రమాదకర స్థాయికి చేరుతోంది. ప్రజా సంక్షేమం కోసం వైఎస్ జగన్ ప్రభుత్వం చేపట్టిన వివిధ ప్రాజెక్టులను ప్రైవేటు వారికి రాసివ్వడానికి కూటమి ప్రభుత్వం భూమిక సిద్ధం చేస్తోంది. ఇందుకు ఎల్లోమీడియా ఈనాడు విషపూరిత కథనాల ప్రచురణతో తన వంతు తోడ్పాటు అందిస్తోంది. ప్రైవేటీకరణ సర్వరోగ నివారిణి అన్నట్టు తప్పుడు ప్రచారం చేస్తూ ప్రజలను మభ్యపెట్టే పనిలో పడింది. ‘అభివృద్ది కోసమే పీపీపీ’ అంటూ ఇటీవల ప్రచురించిన కథనం ఈ కోవలోనిదే. వీటి ప్రకారం.. వైఎస్ జగన్ హయాంలో చేపట్టిన వైద్య కళాశాలలతోపాటు పోర్టులు తదితర ప్రాజెక్టులు కూడా ప్రైవేటుపరం కానున్నాయి. ఏకంగా రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ ప్రాజెక్టులను ప్రైవేట్ సంస్థల చేతుల్లో పెట్టేందుకు కూటమి ప్రయత్నిస్తున్నట్లు.. ఇందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కొంత నిధి కేటాయిస్తుందని ఈనాడు రాసుకొచ్చింది. ఇదంతా చూస్తుంటే ‘‘ఆంధ్రప్రదేశ్ ఫర్ సేల్’’ అనిపించకతప్పదు. ప్రైవేట్ వ్యక్తులు లేదా సంస్థలకు అప్పనంగా ప్రజల సొమ్ము అప్పగించి వారి సంపద పెంచే ప్రయత్నం ప్రభుత్వమే చేస్తోండటం గమనార్హం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పుకోవాలి. రాష్ట్రంలోని 17 మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే ఆలోచన చేసినప్పుడు కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజాగ్రహం పెల్లుబికింది. ఈ తరుణంలోనే ఈనాడు ఇలాంటి కథనం ప్రచురించడం విషయాన్ని పక్కదారి పట్టించేందుకే అని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. ఒడిశాలో బీజేపీ ప్రభుత్వం కూడా సొంతంగా వైద్యకళాశాలలను నిర్మిస్తుంటే.. చత్తీస్గఢ్లోనూ ప్రభుత్వమే కళాశాలల నిర్వహణ బాధ్యతలు తీసుకుంటోంది. కానీ ఏపీలో మాత్రం అన్ని వసతులూ సమకూర్చి సిద్ధం చేసిన కాలేజీలను ప్రైవేటు వారికి ధారాదత్తం చేస్తారట. దశాబ్దాల పాటు ప్రజారోగ్యాన్ని కాపాడగల వైద్యకళాశాలకు రూ.5,000 కోట్లు కేటాయించలేక... రూ. 50,000 కోట్ల విలువైన ఆస్తులను ప్రైవేటు వారికి అప్పగిస్తారన్న మాట. అన్నీ సిద్ధంగా ఉన్న కాలేజీలకు టెండర్లు పిలిస్తే అది ప్రభుత్వ సమర్థత అని పొగిడే స్థాయికి ఈనాడు దిగజారిపోయింది. పైగా పేదవాడి ఆరోగ్యానికి భరోసానిచ్చే వైద్యకళాశాలలను కట్టడం వైసీపీ ప్రభుత్వ అసమర్థతని కూడా నిస్సిగ్గుగా రాసుకుంది ఈనాడు. అలాగే రాష్ట్ర వాణిజ్య ముఖచిత్రాన్ని మార్చేయగల సామర్థ్యమున్న పోర్టుల నిర్మాణంపై కూడా ఈనాడు జగన్ ప్రభుత్వంపై ఆడిపోసుకుంది. ప్రైవేటు వారికి అప్పగించడాన్ని సమర్థతగా చెబుతోంది. ఐదేళ్ల వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలన తరువాత రాష్ట్రాన్ని మౌలిక వసతుల సమస్య వేధిస్తోందని ఈనాడు రాసింది. మరి... మెడికల్ కాలేజీలు, పోర్టులు, గ్రామ, గ్రామాన సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, విలేజ్ క్లినిక్స్, నాడు-నేడు కింద బడులు, ఆస్పత్రుల బాగుచేత వంటివన్నీ మౌలిక వసుతులు ఎలా కాకుండా పోయాయో కూడా ఈనాడు వివరించి ఉండాల్సింది. రిషికొండపై జగన్ రూ.250 కోట్లతో సర్వాంగ సుందరమైన భవనాన్ని నిర్మించి ప్రభుత్వానికి ఒక ఆస్తిని సమకూరిస్తే దాన్ని ప్రైవేటువారికి అప్పగించడం చాలా గొప్ప విషయమని ఆత్మవంచన చేసుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం పీపీపీ కింద ప్రాజెక్టుల చేపట్టడానికి ప్రతిపాదనలు అడిగితే ఏపీ రూ.1.15 లక్షల కోట్ల విలువైన ప్రాజెక్టులను కోరిందట. విచిత్రంగా ఈ జాబితాలో ప్రభుత్వం ఇప్పటికే వేల కోట్ల రూపాయలు వ్యయం చేసిన మూలపేట, రామాయంపేట పోర్టులు ఉన్నాయి. రామాయంపేట పోర్టులో ఒక బెర్త్ పూర్తయ్యేదశలో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం దాన్ని నిలిపేసింది. తాడేపల్లిగూడెం, తుని, ఒంగోలు, నాగార్జునసాగర్, కుప్పం, అమరావతి ఎయిర్ పోర్టులు పీపీపీ పద్ధతిలో చేపట్టేందుకు ప్రతిపాదించారు. కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద ఇప్పటికే నిర్మించిన విమానాశ్రయానికి విమానాలే రాని పరిస్థితి ఉంటే.. ఇప్పుడు ఈ చిన్న పట్టణాలకు ఎవరు వస్తారు? విశాఖ, విజయవాడ విమానాశ్రయాలే నష్టాలలో ఉన్నాయి. కాబట్టి కేవలం ప్రభుత్వ రాయితీలు, బ్యాంకు రుణాలకు ఆశపడి మాత్రమే ఎవరైనా ఈ చిన్న పట్టణాల్లో విమానాశ్రయాలు కట్టేందుకు వస్తారని విశ్లేషకులు అంటున్నారు. ఆ తర్వాత బ్యాంకు రుణాలను ఎగవేసినా అడిగేవారు ఉంటారా?అన్నది సందేహం. దేశంలో ఎన్ని లక్షల కోట్ల రూపాయల బ్యాంకు రుణాలను కేంద్రం మాఫీ చేసిందో అందరికి తెలిసిందే. తెలుగుదేశం, బీజేపీలకు చెందిన కొందరు ప్రముఖులు వందల కోట్ల రూపాయల మేర బ్యాంకులకు రుణాలు ఎగవేసి హాపీగా పదవులలో ఉంటున్నారు కదా! ఈ ప్రైవేటీకరణ ప్రతిపాదనలు అమలైతే ఆ జాబితాలోకి మరింత మంది చేరవచ్చేమో! వీటితోపాటు అప్పర్ సీలేర్లో తాగునీటి సరఫరా ప్రాజెక్టు, డొంకరాయి నీటి పరషరా పథకం ప్రైవేటువారికి అప్పగిస్తారట. వారు ఈ స్కీమ్ను అమలు చేశాక డబ్బులు తిరిగి రాబట్టడం కోసం ఎంత వసూలు చేస్తారో తెలియదు. అమరావతి ప్రపంచ స్థాయి క్రీడా ప్రాంగణం, తిరుపతి క్రీడా ప్రాంగణం, తిరుపతి బస్టాండ్ మొదలైనవి ప్రైవేట్ పరం చేసే ఆలోచన ఉన్నట్టు ఈనాడు తన కథనంలో చెప్పింది. వీటన్నిటిలో ఒకటి అరా ఏమైనా పూర్తి అవుతాయేమో చెప్పలేం. ఏ ప్రైవేటు వ్యక్తి తన సొంత డబ్బు వినియోగించి ప్రజలకు సేవ చేయడు. లాభాలు వస్తాయనుకుంటే పెట్టుబడులు పెడతాడు. ఆ పెట్టుబడులలో అధిక శాతం బ్యాంకు రుణాల రూపంలోనే తీసుకుంటారు. ఎటూ కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు ఇచ్చే రాయితీ సొమ్ము వస్తుంది. అయినా నడపలేక చేతులెత్తేస్తే చేసేదేమీ ఉండదు. బాగా నడిచేవి ఉంటే అవన్ని ప్రైవేటు వారికి సొంత ఆస్తులుగా మారతాయి. పైగా వాటిని వినియోగించేవారి నుంచి ముక్కుపిండి రుసుం వసూలు చేస్తారు. రోడ్లకు, పేదవాడికి ఉపయోగపడే వైద్యకళాశాలలకు తేడా లేకుండా ఎల్లో మీడియా ప్రజలను మోసం చేయాలని ప్రయత్నిస్తోంది. గతంలో సహకార డెయిరీలు, చక్కెర కర్మాగారాలు ఉండేవి. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయాల్లోనే వాటిలో అధిక భాగం మూతపడడమో, లేక ప్రైవేటు వ్యక్తుల పరమో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఏభైకి పైగా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటుపరం చేస్తే, వాటిలో అధిక భాగం రియల్ ఎస్టేట్ వెంచర్లుగా మారి వారికి సంపద తెచ్చిపెట్టాయి. స్థూలంగా చూస్తే లాభాలు వస్తే ప్రైవేటుకు, నష్టాలు వస్తే ప్రభుత్వానికి అన్నమాట. ఇదే అభివృద్ది అని జనం మోసపోవడం తప్ప చేసేది ఏమీ ఉండదు. ఆ ప్రక్రియ మళ్లీ మొదలవుతోందా!. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
మహిళలకు వేధింపులు.. సోషల్మీడియాలో షాకింగ్ వీడియోలు.. జంగిల్ రాజ్లా ఏపీ
సాక్షి, తాడేపల్లి: చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోందని.. ఇప్పటిదాకా ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా? అని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ప్రశ్నించారు. ఎన్నికల హామీల పేరిట అన్నివర్గాలను మోసం చేశారని.. దుర్మార్గమైన పాలనతో ఆటవిక రాజ్యం నడుస్తోందని ధ్వజమెత్తారు. బుధవారం భీమవరం నియోజకవర్గ కేడర్తో భేటీ అయిన వైఎస్ జగన్ కీలక వ్యాఖ్యలు చేశారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చి దాదాపు రెండేళ్లు అవుతోంది. ఈ బడ్జెట్తో కలిపి మూడు బడ్జెట్లు పెట్టినట్టు అవుతుంది. ఈరెండేళ్లలో చంద్రబాబునాయుడు వల్ల ప్రజలకు ఒక్క మంచైనా జరిగిందా?. గతంలో ఒక మాట చెప్తే.. ఆమాటమీద నిలబడే ప్రభుత్వం ఉండేది. మేనిఫెస్టోను పవిత్రగ్రంధంగా భావించాం. మాట ఇస్తే దాన్ని నిలబెట్టుకోవాలన్న తప, తాపత్రయం ఉండేది. క్రమం తప్పకుండా ప్రతినెలా ప్రజలను ఆదుకున్నాం. కోవిడ్ లాంటి సంక్షోభం ఉన్నా.. ఏ పథకాన్ని ఎగరగొట్టలేదు. ప్రతి హామీని నిలబెట్టుకున్నాం. ప్రభుత్వ సమస్యలకన్నా ప్రజల సమస్యలనే ప్రాధాన్యతగా తీసుకున్నాం. ఎన్ని సమస్యలున్నా చిరునవ్వుతో ప్రజలను ఆదుకున్నాం. ఇవాళ్టికీ సగర్వంగా చెప్పగలం. 👉చంద్రబాబు వచ్చాక మన ప్రభుత్వంలో ఉన్న పథకాలన్నీ రద్దైపోయాయి. చంద్రబాబు చెప్పిన సూపర్ సిక్స్, సూపర్ సెవెన్ అబద్ధాలుగా తేలిపోయాయి. చంద్రబాబుగారిలో ప్రజలను మోసం చేయడం ఇంకెవ్వరికీ సాధ్యంకాదు. ఇలాంటి మాటలు చెప్తే.. వేరొకరిపైన 420 కేసులు పెడతారు. చివరకు గ్యాస్ సిలెండర్లలోకూడా చంద్రబాబు మోసాలు చేశారు. మన హయాంలో ఐదేళ్లలో, కోవిడ్ ఉన్నా దాదాపు రూ. 3.32 లక్షల కోట్లు అప్పులు చేశాం. అందులో 2.73లక్షల కోట్లు ప్రజల ఖాతాల్లో వేశాం. ఎవరికి డబ్బులు వెళ్లాయో వారి బ్యాంకు ఖాతాలు, ఆధార్ కార్డుల పరంగా చూపగలం. రెండేళ్లు తిరక్కముందే చంద్రబాబు రూ. 3లక్షల కోట్లు అప్పు చంద్రబాబు చేశాడు. మరి ఆ డబ్బు ఎక్కడకు పోయింది? ఎవరికి పోయింది?. దోచుకో.. పంచుకో.. తిను.. పద్ధతి జరుగుతోంది. ప్రతిచోటా విచ్చలవిడిగా అవినీతి జరుగుతోంది. ప్రభుత్వానికి రావాల్సిన ఆదాయం రావడంలేదు. చంద్రబాబుగారు, ఆయన మనుషుల జేబుల్లోకి ఆదాయాలు పోతున్నాయి..👉మద్యంలో పెద్ద ఎత్తున అవినీతి జరుగుతోంది. మద్యం షాపులన్నీ.. చంద్రబాబుగారి మనుషులే. బెల్టుషాపులు కూడా వారివే. దగ్గరుండి బెల్టుషాపులు నడిపిస్తున్నారు. ఎమ్మార్పీ రేట్లకు లిక్కర్ అమ్మడం లేదు. బెల్టుషాపులు దగ్గరకు వెళ్లేసరికి రూ. 20-30లు పెంచి అమ్ముతున్నారు. నాలుగైదు బాటిళ్లకు ఒక కల్తీ బాటిల్ అమ్ముతున్నారు:👉మన హయాంలో ఇసుక నుంచి ప్రభుత్వానికి రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. ఐదేళ్లపాటు ప్రభుత్వానికి ఆదాయం వచ్చింది. ఇప్పుడు ఎక్కడైనా ఇసుక ఉచితంగా వస్తోందా?. డబుల్ రేట్లకు ఇసుక అమ్ముతున్నారు. ప్రభుత్వానికి వచ్చే ఆదాయం సున్నా. సిలికా, క్వార్ట్జ్, లెటరైట్.. ఏ ఖనిజాన్నైనా కొల్లగొడుతున్నారు. మొన్న సంక్రాంతిరోజు చూస్తే.. ప్రభుత్వమా? జంగిల్రాజ్ అన్నట్లు అనిపించింది. సోషల్మీడియాలో వీడియోలు చూస్తే ఆశ్చర్యం వేసింది. మొబైల్ రికార్డింగ్ డ్యాన్స్లు నడిపారు. తాగరా.. తాగి చిందేయరా.. అన్న రీతిలో జరిగాయి. ఆటవిక రాజ్యంలో ఉన్నామా? అనిపిస్తోంది. కోడిపందాలు నడపడానికి వేలం పాటలు నిర్వహించారు:పులివెందులలోనూ కోడిపందాలకు వేలంపాటలు పెట్టారు. ప్రభుత్వమే దగ్గరుండి చేయిస్తోంది. ఎమ్మెల్యేలు, చంద్రబాబు, లోకేష్, పోలీసు అధికారులు పంచుకున్నారు:భీమవరం డీఎస్పీమాటలు వింటే ఆశ్చర్యం వేసింది. ‘‘ఊపేయ్.. కుదిపేయ్..’’ అని అంటున్నాడాయన. మనం ఏ సమాజంలో ఉన్నామో.. అర్థంకావడంలేదు. రాష్ట్రం జంగిల్ రాజ్ అయ్యింది. బరితెగింపునకు అడ్డులేకుండా పోయింది. విచ్చలవిడి తనం ఊహించని స్థాయికి వెళ్లిపోయింది. మహిళలపై అఘాయిత్యాలు👉చంద్రబాబుగారు, ఆయనకు మద్దతు ఇస్తున్న ఎమ్మెల్యేలు ఏస్థాయికి వెళ్లారో తెలియడంలేదు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళను బెదిరించి, భయపెట్టాడు. ఆముదాలవలస అమ్మెల్యే కూనరవికుమార్ వేధింపులు భరించలేక ఆత్మహత్యాయత్నం చేసుకుంది. సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం మహిళను బలాత్కారం చేసి చివరకు అధికార దుర్వినియోగం కేసును క్లోజ్ చేయించుకున్నాడు. మంత్రి సంధ్యారాణి పీఏపై ఒక ప్రభుత్వ ఉద్యోగి అయిన మహిళ ఫిర్యాదు చేస్తే.. అరెస్టు చేయాల్సిందిపోయి, బాధిత మహిళను జైలుకు పంపారు. మరో మంత్రి వాసంశెట్టి సుభాష్ రికార్డింగ్ డ్యాన్సులు వేశాడు. 👉రాష్ట్రం జంగిల్ రాజ్లా మారిపోయింది. విచ్చలవిడి తనం కనిపిస్తోంది. మరోవైపు రాజకీయ కక్షలకు పాల్పడుతున్నారు. తప్పుడు కేసులు పెట్టి, తప్పుడు సాక్ష్యాలు క్రియేట్ చేస్తున్నారు. వ్యవస్థలన్నీ కుదేలైపోయాయి. గత 8 త్రైమాసికాలుగా ఫీజు రియింబర్స్ మెంట్ రావడంలేదు. పిల్లలు చదువులు మానేస్తున్న పరిస్థితి:ఆస్తులు అమ్ముకుంటే తప్ప పిల్లలను చదివించుకోలేని పరిస్థితి. వసతి దీవెనకింద డబ్బులు ఇవ్వలేదు. మన ప్రభుత్వంలో క్రమం తప్పకుండా డబ్బులు ఇచ్చాం. ఇప్పుడున్న ప్రభుత్వపు గోరుముద్దలో నాణ్యత లేదు. హాస్టళ్లలో కల్తీ ఆహారం తిని ప్రాణాలు పోగొట్టుకుంటున్న పరిస్థితి. ఆరోగ్యశ్రీ పూర్తిగా నిర్వీర్యం అయిపోయింది. ఏ రైతుకూ ఏ పంటకూ గిట్టుబాటు ధరలేదు. యూరియాకూడా రైతులకు దొరకడంలేదు. రైతులకు రెండేళ్లలో రూ.40వేలు ఇవ్వాలి. రూ.10వేలు ఇచ్చారు. ఆక్వారైతులకు మనం రూ.1.5కే కరెంటు ఇచ్చాం. రూ.3600 కోట్లు సబ్సిడీ ఇచ్చాం. ఇవాళ ఒక్కపైసాకూడా ఇవ్వలేదు. వ్యవసాయం, వైద్యం, చదువులు ఇవ్వలేకపోతే ప్రభుత్వ ఉండి ఎందుకు?:దుర్మార్గ పాలనలో వైయస్సార్సీపీ కార్యకర్తలు ప్రజల తరఫున గట్టిగా నిలబడుతున్నారు. ప్రజలు ఈసారి చంద్రబాబు ప్రభుత్వాన్ని ఫుట్బాల్లా తంతారు. ఒకటిన్నర సంవత్సరం నేను పాదయాత్రలో ప్రజలమధ్యే ఉంటాం. మొత్తం 150 నియోజకవర్గాల్లో పాదయాత్ర చేస్తాను. భీమవరంలో క్యాడర్ చెక్కుచెదరలేదు. గ్రామ స్థాయిలో కమిటీ నిర్మాణం బలంగా జరగాలి. జగన్ 2.Oలో కార్యకర్తలకు పెద్దపీట ఉంటుంది. నేను కూడా పాలన మీద ఎక్కవ దృష్టిపెట్టాను. కార్యకర్తలకు చేయాల్సింది చేయలేకపోయి ఉండొచ్చు. రాబోయే కాలంలో కార్యకర్తలకే పెద్దపీట ఉంటుంది. కార్యకర్తల ద్వారా ప్రజలకు మరింత మంచి జరుగుతుంది’’ అని జగన్ అన్నారు. -
పేర్ని నానిపై మరో కేసు నమోదు
సాక్షి, కృష్ణా: వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి పేర్ని నాని(వెంకట్రామయ్య)పై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు ఆపడం లేదు. తాజాగా ఆయనపై మరో కేసు నమోదు చేయించింది. చంద్రబాబు, పవన్లపై అనుచిత వ్యాఖ్యలు చేయడమే అందుకు కారణమని పోలీసులు చెబుతున్నారు. నూజివీడులో జరిగిన వైఎస్సార్ విగ్రహావిష్కరణ సందర్భంగా సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్లపై పేర్ని నాని విమర్శలు గప్పించారు. అయితే రాజకీయ విమర్శలను.. దూషణలుగా పేర్కొంటూ టీడీపీ నేతలు మచిలీపట్నంలోని ఇనగుదురుపేట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆయన వ్యాఖ్యలు వైషమ్యాలు రెచ్చగొట్టేలా ఉన్నాయంటూ ఫిర్యాదులో పేర్కొన్నారు. దీంతో బీఎన్ఎస్ సెక్షన్లు.. 196 (1), 353 (2), 351 (2), 352 కింద కేసు నమోదు అయ్యింది.ఈ పరిణామంపై వైఎస్సార్సీపీ తీవ్రంగా మండిపడుతోంది. ఇది ముమ్మాటికీ అక్రమ కేసు కిందకు వస్తుందని చెబుతోంది. కూటమి నేతలు అభ్యంతకర వ్యాఖ్యలు చేస్తున్నా.. అరాచకాలకు పాల్పడుతున్నా.. వైఎస్సార్సీపీ ఎన్ని ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోని పోలీసులు టీడీపీ నేతల ఫిర్యాదునకు సత్వరమే స్పందించడమేంటని నిలదీస్తోంది. ఇదిలా ఉంటే.. పేర్ని నానిపై కూటమి కక్ష సాధింపులకు దిగడం ఇదేం తొలిసారి కాదు. గతంలో రేషన్ బియ్యం కేసుతో పాటు సీఐ యేసు బాబుతో పీఎస్లోనే గొడవకు దిగారని, మంత్రి అనగాని ప్రసాద్ను అవమానించారని.. ఇలా రకరకాల కేసులతో ఇబ్బంది పెట్టాలని చూసింది. -
తెలుగు ఎన్నారైలపై ‘మీనింగ్లెస్’ వ్యాఖ్యలు!
ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేసే వ్యాఖ్యలు చిత్ర విచిత్రంగా ఉంటాయి. ఈ విషయం చాలాకాలంగా అందరికీ తెలుసు కానీ.. తాజాగా దావోస్లో ఆయన తెలుగుదేశం అభిమానుల సమావేశంలో చేసిన వ్యాఖ్య మాత్రం ప్రవాస భారతీయులను బిత్తరపోయేలా చేసింది. ఎందుకంటే.. 195 దేశాల్లో ఈరోజు తెలుగు వాళ్లు ఉండేందుకు తానెప్పుడో ముప్ఫై ఏళ్ల క్రితం తీసుకున్న నిర్ణయమే కారణమి ఆయనగారు వాకృచ్ఛారు మరి!. నిజానిజాలతో సంబంధం లేదు.. ఎవరు ఏమనుకుంటారన్న విషయమూ పట్టదు!. చదువుకోసం లేదంటే ఉద్యోగం కోసం విదేశాలకు వెళ్లడం ఆయా కుటుంబాలు తీసుకునే నిర్ణయం. వారి కష్టం. ఉపాధి కోసం విదేశాలకు వెళ్లాలని ఎవరైనా ఎందుకు అనుకుంటారు?. ఉన్నచోట లేదా దేశంలో సరైన అవకాశాలు లేకపోతేనే కదా!. విదేశాల నుంచి యువత భారత్కు రాకపోవడానికి కూడా అక్కడ మంచి అవకాశాలు ఉండటమే కారణం. బతుకుతెరువు కోసం చాలామంది తెలుగువాళ్లు దశాబ్దాల క్రితమే అమెరికాకు వలస వెళ్లారు. వెళుతున్నారు కూడా. అది తప్పు కాదు కానీ.. అదంతా తనవల్లే అని చంద్రబాబు వంటి వారు చెప్పడం మాత్రం దారుణం.అమెరికాలో తెలుగువాళ్లు కాస్తో, కూస్తో మెరుగ్గా ఉండవచ్చు. పైగా డాలర్ మారకపు విలువ ఎక్కువ ఉండటం కూడా ఒక ఆకర్షణ. కానీ డొనాల్డ్ ట్రంప్ అధ్యక్షుడైన తరువాత వీసా దొరకడమే పెద్ద సమస్యగా మారింది. ఆర్థిక కారణాలను పక్కనబెడితే ఏ దేశంలోనైనా విదేశీయులు రెండో తరగతి పౌరులుగానే జీవించాల్సి వస్తుంది. విదేశీయులకు అమెరికాలో గ్రీన్ కార్డు రావడానికి, ఆ దేశ పౌరుడు అయ్యేందుకు ఎంత వ్యయం చేయాలో, ఎన్ని సంవత్సరాలు ఆగాలో అందరికి తెలుసు.అదేమీ గొప్ప సంగతి కాదు. పైగా విదేశాలకు వెళ్లడం అన్నది చంద్రబాబు కనిపెట్టింది కాదు!!. స్వాతంత్రం రాక ముందు నుంచి ఉన్నదే.. ..1970వ దశకంలో భారత ప్రభుత్వం మేధో వలసను ఆపేందుకు రకరకాల ప్రయత్నాలు చేసింది. అంటే మన మేధస్సు ఇతర దేశాలకు కాకుండా దేశాభివృద్ధికి దోహదపడాలన్న ఆలోచనలు చేశారు. అయినా వలసలు ఆగలేదు. ఇది నిజానికి భారత్కు ప్రతిష్ట కాదు. ఉదాహరణకు సత్య నాదెళ్ల మైక్రోసాఫ్ట్ సీఈవోగా అమెరికా దేశానికి ఉపయోగపడుతున్నారు. ఆ కంపెనీ విస్తరణలో భాగంగానే మన దేశంలో కూడా పెట్టుబడులు పెడుతుండవచ్చు. అలాగే గూగుల్ సీఈవో సుందర్ పిచ్చాయ్, ప్రముఖ వైద్యుడు నోరి దత్తాత్రేయుడు వంటివారు మరికొందరు ఉండవచ్చు. కాని అలాంటి మేధావులను మనం ఎందుకు ఇక్కడే ఉంచి వారికి అవకాశాలు కల్పించలేకపోయాం అన్నదాని గురించి ఆలోచించకుండా అదే గొప్ప విషయం అన్నట్లు చెబుతుండడం యువతను మభ్య పెట్టడమే. అమెరికా తర్వాత మన భారతీయులు, అందులోను తెలుగువారు ఇంగ్లండ్, సింగపూర్, దుబాయి వంటి దేశాలకు ఉపాధి నిమిత్తం వెళుతుంటారు. గల్ఫ్ దేశాలలో ప్రత్యేకించి అంతగా చదువు లేనివారు వెళ్లి ఎన్ని కష్టాలు పడుతున్నది తెలిసిందే. ఒంటెలు, గొర్రెలు కాపలా కాసే ఉద్యోగాలలో ఉంటున్నారు. నిర్మాణ రంగంలో చాకిరి చేస్తున్నారు. చివరికి అక్కడి షేక్లు, ఇతర వ్యాపారుల వద్ద బానిసలుగా బతుకుతున్న ఘట్టాలు కోకొల్లలు.విదేశీ వ్యామోహాన్ని అడ్డు పెట్టుకుని పలు ఏజెన్సీలు యువతను మోసం చేస్తూనే ఉన్నాయి. ఇక్కడ చదువుకుంటున్నప్పుడు అటు చీపురు ఇటు వేయడానికి నామోషీగా ఫీల్ అయ్యేవారు అమెరికా తదితర దేశాలకు వెళ్లినప్పుడే వారే బాత్రూములు శుభ్రం చేయవలసిన పరిస్థితికి బాధ పడుతుంటారు. మాల్స్లో, పెట్రోల్ బంకుల్లో చిన్న, చిన్న ఉద్యోగాలు చేస్తూ కాలం వెళ్లదీసేవారు చాలామంది ఉన్నారు. ఉక్రెయిన్, రష్యా యుద్ధంలో ప్రాణాలు కోల్పోయిన భారతీయులు కూడా ఉన్న సంగతి తెలిసిందే. సైబర్ ఫ్రాడ్ కారణంగా కొన్ని దేశాలకు వెళ్లి అక్కడ చిక్కుకుపోయిన వారిని మన దేశం వెనక్కి తీసుకు వస్తుంటుంది. పర్యాటకం కోసం విదేశాలకు వెళ్లడం వేరు. వ్యాపారం, లేదా మంచి ఉద్యోగం వస్తే వెళ్లవచ్చు. కాని విదేశాలపై మోజుతో వెళ్లి చాలామంది అవస్థలు పడుతున్నారు. అలాంటప్పుడు.. అమెరికా నుంచి వెనక్కి రావచ్చు కదా అని అడిగితే మన తెలుగువారు ఏమి చెబుతారో తెలుసా! ఇక్కడ రూల్స్ సరిగా ఉండవు. భారత్లో అవినీతి ఎక్కువ అని. వాటిని సరి చేయడానికి చంద్రబాబు వంటివారు చేసిన కృషి ఏమి ఉంది? పైగా అబద్దపు హామీలు, అక్రమాలతో ఎన్నికలలో గెలవడం వంటివి చేయడానికి వెనుకాడరు. తెలంగాణ ఉద్యమం రావడానికి నిరుద్యోగం కూడా ఒక కారణం అని ఈ రాష్ట్ర నేతలు చెబుతారు. మాజీ సీఎం కేసీఆర్ ఉద్యమ సమయంలో మహబూబ్ నగర్, కరీంనగర్ తదితర ప్రాంతాల నుంచి యువత అరేబియా దేశాలకు వెళ్లి నానా అగచాట్లు పడుతున్నారని, ముంబై వంటి నగరాలకు వలస పోతున్నారని వారందరిని వెనక్కి వచ్చేలా చేస్తామని అనేవారు. పాలమూరులో కొన్ని ఇరిగేషన్ ప్రాజెక్టులు చేపట్టడం ద్వారా ఆ వలసలను ఆపగలిగామని అంటారు. మరి ఏపీలో సైతం కోనసీమసహా పలు ప్రాంతాల యువకులు లక్షల మంది ఎక్కడైనా సరే ఉద్యోగమంటూ వస్తే చాలని ఎదురు చూసేవాళ్లు ఉన్నారు. అవన్నీ ఎందుకు హైదరాబాద్ నగరంలో స్థిపరడిన ఆంధ్ర ప్రాంతం వారికి వ్యతిరేకంగా ఉద్యమాలు ఎందుకు వచ్చాయి?. పొట్టచేత పట్టుకుని వచ్చారని, కడుపు కొడుతున్నారని ఎందుకు తెలంగాణ ఉద్యమంలో విమర్శించే వారు. తెలంగాణలోనే ఆంధ్రులు ఒకరకంగా రెండో తరగతి పౌరులుగా ఉండే పరిస్థితి ఉండిందా? లేదా?. చంద్రబాబు వాదన ప్రకారం మన రాష్ట్రం నుంచి బెంగుళూరు, చెన్నై, ముంబై తదితర ప్రాంతాలకు వెళ్లి ఉద్యోగాలు, కూలి, నాలి చేసుకుని బతకడం కూడా ఆయన గొప్పే అనుకోవాలి. కుప్పం నుంచి రోజూ వేల మంది బెంగుళూరు వెళుతుంటారు. బీహారు, జార్ఖండ్ వంటి రాష్ట్రాల నుంచి వేల మంది ఏపీ, తెలంగాణలకు వచ్చి నిర్మాణ పనులు, ఇతర చిన్న,చిన్న కూలీ పనులు చేసుకుంటున్నారు. వారంతా అలా వెళ్లడం తన ఘనతే అని ఆ రాష్ట్రాల ముఖ్యమంత్రులు భావించగలుగుతారా? అలాగే చంద్రబాబు చెప్పేది కూడా అర్థంలేని విషయం. పోనీ చంద్రబాబు వల్లే విదేశాలకు వెళ్లారన్నది కూడా అర్ధరహితం. ఎప్పటి నుంచో ఉన్నదే. ఎన్.టి.రామారావు విదేశాలలో ఉన్న తెలుగు వారు వెనక్కి రావాలని పిలుపు ఇచ్చి వారితో పెట్టుబడులు పెట్టించడానికి ఎన్ రిచ్ అనే ఎన్.ఆర్.ఐ. సంస్థను స్థాపించారు. 1960లలోనే అనేక మంది వైద్యులు భారత్ నుంచి అమెరికా తదితర దేశాలకు వెళ్లి స్థిరపడ్డారు. ఉమ్మడి ఏపీలో 1992లోనే నేదురుమల్లి జనార్ధనరెడ్డి టైమ్ లో అమీర్పేటలో ఉన్న మైత్రివనం భవనంలో సాఫ్ట్ వేర్ టెక్నాలజీ పార్కు ఉండేది. అక్కడ నుంచి మాదాపూర్ వైపు తరలించడానికి ఆనాటి ప్రధాని రాజీవ్ గాంధీని తీసుకు వచ్చి శంకుస్థాపన చేయించారు. భారత్ కంప్యూటర్ యుగం ఆరంభమైంది అప్పటి నుంచి. చంద్రబాబు 2000వ సంవత్సంలో హైటెక్ సిటీ అనే పేరుతో ఒక భవనాన్ని నిర్మించారు. అప్పటికే దేశంలోని బెంగుళూరు, ముంబై, చెన్నై నగరాలు ఐటి రంగంలో ప్రసిద్ది గాంచాయి. వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రభుత్వం ఫీజ్ రీయింబర్స్ మెంట్ స్కీమ్తో ఇంజనీరింగ్ విద్య పేద వర్గాలకు బాగా అందుబాటులోకి వచ్చింది. ఆ కారణంగానే తాము చదువుకుని విదేశాలకు వెళ్లి స్థిరపడ్డామని పలువురు చంద్రబాబు ప్రకటనపై స్పందిస్తూ సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు. 2000 సంవత్సరం నాటికే లక్షలాది మంది తెలుగువారు విదేశాలలో ఉద్యోగార్థం వెళ్లారన్నది వాస్తవం. కాని అదంతా తమ క్రెడిట్ అని ఆరోజుల్లో ఏ ముఖ్యమంత్రి చెప్పుకోలేదు. కాని చంద్రబాబు మాత్రం ప్రతిదానిని, తమ తల్లిదండ్రుల శ్రమని సైతం తన క్రెడిట్లో జమ చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నారని ఎన్నారైలు వ్యాఖ్యానిస్తున్నారు. చంద్రబాబు చెప్పినట్లు నిజంగానే 195 దేశాలలో తెలుగువారు వెళ్లి ఉద్యోగాలు చేస్తున్నారంటే ఆ మేరకు ఏపీ వెనుకబడి ఉందని అర్థం కాదా?::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
టీడీపీ ఎమ్మెల్యే మూడే ‘మూడు’!
సాక్షి, శ్రీ సత్యసాయి: ఆయనో ఎమ్మెల్యే. ఆ పార్టీ జిల్లాకు అధ్యక్షుడు కూడా. ఈ రెండే కాకుండా.. తిరుమల తిరుపతి దేవస్థానంలో బోర్డు సభ్యుడిగానూ ఉన్నాడు. అందుకేనేమో నియోజకవర్గంలో ప్రజలు గుక్కెడు నీటి కోసం రోడ్డెక్కుతుంటే పట్టించుకునే తీరికలో లేడేమో అంటూ సెటైర్లు పేలుతున్నాయి. మడకశిర టీడీపీ ఎమ్మెల్యే ఎంఎస్ రాజు నిర్లక్ష్య వైఖరిపై ప్రజల్లో తీవ్ర అసహనం పెరిగిపోతోంది. ఎండకాలం ఇంకా రాక మనుపే.. తాగునీటి సమస్యలతో నియోజకవర్గ ప్రజలు రోడ్డెక్కుతున్నారు. వరుసగా.. బేగార్లపల్లి, వడ్రపాళ్యం, కొడగార్లగుట్ట, కూగిరినపాళ్యం, జమ్మలబండ, రాళ్లపల్లి గ్రామాల్లో మహిళల నిరసనలు చేపట్టారు. తాగునీటి సమస్య తీర్చాలని డిమాండ్ చేస్తున్నారు. గత కొన్నిరోజులుగా మడకశిరలో ఖాళీ బిందెలతో బైఠాయించి మహిళలు నిరసన తెలుపుతున్నారు. రోజుల తరబడి కార్యాలయాల చుట్టూ తిరిగినా ఫలితం లేకపోయిందని, తమ కన్నీటి కష్టాలు తీర్చే నాథుడే లేకుండా పోయారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రతి రోజూ ఏదో ఒక చోట తాగునీటి కోసం ఆందోళన జరుగుతునే ఉన్నాయంటున్నారు. తాజాగా.. బోరు మోటర్ చెడిపోవడంతో మడకశిర పట్టణంలోని 18వ వార్డుకు 15 రోజులుగా తాగునీరు సరఫరా కావడం లేదు. ప్రతి రోజూ మున్సిపల్ కార్యాలయానికి వెళ్లడం, కనిపించిన ప్రతి అధికారినీ వేడుకోవడం మామూలైపోయింది. దీంతో రిపబ్లిక్ డే నాడు.. మహిళలంతా ఖాళీబిందెలతో రోడ్డెక్కారు. బేగార్లపల్లి క్రాస్లోని హిందూపురం ప్రధానరోడ్డుపై బైఠాయించి నిరసన తెలిపారు. గంటసేపు ఆందోళన చేశారు. తాగునీటి సమస్యను పరిష్కరించాలని నినాదాలు చేశారు. దీంతో రాకపోకలకు అంతరాయం కలిగింది. విషయం తెలుసుకున్న స్థానిక ఎస్ఐ లావణ్య వెంటనే అక్కడికి చేరుకుని మహిళలతో చర్చించారు. అధికారులతో మాట్లాడి వెంటనే తగు చర్యలు తీసుకుని తాగునీటి సమస్య పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించి ఆందోళన విరమించారు. రెండు రోజుల క్రితం రొళ్ల మండలంలోని కేజీగుట్ట, కొడగార్లగుట్ట గ్రామాలకు చెందిన మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని జాతీయ రహదారిపై ఆందోళన చేపట్టారు. అదే విధంగా మడకశిర పట్టణంలోని వడ్రపాళ్యంలో తాగునీటి సమస్యపై మహిళలు హిందూపురం ప్రధానరోడ్డుపై నిరసన తెలిపారు. గుడిబండ మండలం ఎస్ఎస్ గుండ్లులో కూడా మహిళలు తాగునీటి సమస్యను పరిష్కరించాలని నిరసన తెలిపారు.కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి నియోజకవర్గంలో చిన్నచిన్న సమస్యలు పరిష్కారానికి నోచుకోలేకపోతున్నాయి. ప్రజల సమస్యలపై దృష్టిసారించకుండా.. అనవసర విషయాలపై ఎమ్మెల్యే ఆర్భాటం ఎక్కువైందని స్థానికులు మండిపడుతున్నారు. -
కరెంట్ చార్జీలపై ఏపీ సర్కారు కహానీ. చార్జీలు తగ్గిస్తామంటూనే 20వేల కోట్ల రూపాయల భారం
-
వెలిగొండ ఆశలపై నీళ్లు... నల్లమలసాగర్ నిర్వాసితులకు పునరావాసం కల్పించడంలో చంద్రబాబు సర్కార్ ఘోర వైఫల్యం
-
గుండెపోటుతో చనిపోవడానికా మీకు ఓట్లు వేసింది
-
జూదం చట్టబద్ధమా?
సాక్షి, అమరావతి: ‘జూదం అనేది చట్టబద్ధమా..?’ అని చంద్రబాబు సర్కారును వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సూటిగా ప్రశ్నించారు. సంక్రాంతి పండుగ సందర్భంగా టీడీపీ కూటమి ఎమ్మెల్యేలు దాదాపు ప్రతి నియోజకవర్గంలోనూ దగ్గరుండి జూదాలు (గ్యాంబ్లింగ్) నడిపించారని.. ఈ వ్యవహారంలో రూ.2 వేల కోట్లు చేతులు మారాయని మీడియా ప్రతినిధులు అడిగిన ఓ ప్రశ్నకు సమాధానంగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ఇందులో చంద్రబాబు, టీడీపీ ఎమ్మెల్యేలు, పోలీసులు కూడా వాటాలు పంచుకున్నారని ఆరోపించారు.ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి చట్టవ్యతిరేక కార్యక్రమాలను ప్రోత్సహించడం ఏమిటని నిలదీశారు. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా..? ఇది అవినీతి కాదా..? ఇది లూటీ కాదా..? అంటూ సీఎం చంద్రబాబును నిలదీశారు. గురువారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మీడియాతో మాట్లాడిన వైఎస్ జగన్... విలేకరులు అడిగిన పలు ప్రశ్నలకు సూటిగా, స్పష్టంగా సమాధానాలు చెప్పారు. ఇవన్నీ అవినీతి కాదా..? కళ్ల ముందు టీడీపీ కూటమి నేతలు చేస్తున్న అవినీతి స్పష్టంగా కనిపిస్తున్నప్పటికీ తాము నిజాయితీపరులమనే భ్రమను కల్పించే యత్నాలు చేస్తున్నారని వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘రాష్ట్రంలో ప్రతి గ్రామంలో, వాడవాడనా బెల్ట్ షాపులు కనిపిస్తున్నాయి. పర్మిట్ రూమ్లు వెలిశాయి. వాటిలో ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు మద్యం అమ్ముతూ దోచుకుంటున్నారు. ఇది అవినీతి కాదా? ఇసుక అమ్మకాలతో వైఎస్సార్సీపీ హయాంలో ఏటా ప్రభుత్వ ఖజానాకు రూ.750 కోట్లు ఆదాయం వచ్చేది. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఉచిత ఇసుక అని మభ్యపెడుతూ ఎడాపెడా దోచేస్తున్నారు. నాటికీ, నేటికీ ఇసుక ధర చూస్తే రెట్టింపు అయ్యింది. ప్రభుత్వ ఖజానాకు పైసా ఆదాయం రావడం లేదు. దోచేస్తున్న డబ్బు అంతా చంద్రబాబు, టీడీపీ నేతల జేబుల్లోకి వెళ్తోంది. ఇది అవినీతి కాదా? ఇసుకే కాదు.. సిలికా, క్వార్ట్ ్జలేటరైట్ లాంటి సహజ వనరులను ఎలాంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా తవ్వేస్తూ టీడీపీ మాఫియా దోచుకుంటోంది. ఇది అవినీతి కాదా..? మా హయాంలో విద్యుత్ యూనిట్ అత్యంత చౌకగా రూ.2.49 చొప్పున కొనుగోలు చేస్తే చంద్రబాబు రాద్ధాంతం చేశారు. మరి ఇప్పుడు యూనిట్ రూ.4.60 వంతున కరెంట్ కొనుగోలు చేస్తున్నారు. రూ.2.49 ఎక్కడ..? రూ.4.60 ఎక్కడ..? ఇది అవినీతి కాదా..? అమరావతిలో నిర్మాణాల పేరుతో జరుగుతున్నది ఏమిటి..? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? చదరపు అడుగుకు రూ.10 వేలు.. రూ.12 వేలు.. రూ.13 వేలు ఖర్చు చేస్తున్నారు. హైదరాబాద్, బెంగళూరు వంటి నగరాల్లో ఫైవ్ స్టార్ సదుపాయాలతో చదరపు అడుగు రూ.4 వేలకే నిర్మించి ఇస్తున్నారు. ఇప్పుడు చెప్పండి.. రాజధాని నిర్మాణంలో జరుగుతోంది అవినీతి కాదా..? ఈ అవినీతిపై జర్నలిస్టులు, ప్రజాస్వామ్యవాదులు, మేధావులు ప్రభుత్వాన్ని నిలదీయాలి’ అని వైఎస్ జగన్ కోరారు. బాబు సర్కారు అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తామనే భయంతోనే.. అసెంబ్లీ సమావేశాలకు వైఎస్సార్సీపీ సభ్యులు హాజరవడంపై అనేక సందర్భాల్లో గతంలోనే స్పష్టమైన సమాధానాలు చెప్పానని మరో ప్రశ్నకు జవాబుగా వైఎస్ జగన్ పేర్కొన్నారు. ‘అసెంబ్లీలో ఉన్నది రెండే పక్షాలు.. ఒకటి అధికారపక్షం.. రెండోది ప్రతిపక్షం వైఎస్సార్సీపీ. మరి.. వైఎస్సార్సీపీని ప్రతిపక్షంగా గుర్తించకుండా స్పీకర్ను అడ్డుకుంటున్నదెవరు? ప్రతిపక్ష నేత హోదా ఇస్తే, సభా నాయకుడికి మాట్లాడేందుకు ఎంత సమయం ఇస్తారో అంత సమయం నాకూ ఇవ్వాల్సి వస్తుంది.. చంద్రబాబు ప్రభుత్వ అవినీతి, అక్రమాలు, వైఫల్యాలపై నిలదీస్తాననే భయంతోనే ప్రతిపక్ష నేత హోదా ఇచ్చేందుకు జంకుతున్నారు. ప్రతిపక్ష నేత హోదా ఇవ్వకుండా 175 మంది ఎమ్మెల్యేల తరహాలోనే కేవలం 5 నిమిషాలే సమయం ఇస్తామంటే ప్రజల గొంతును వినిపించే అవకాశం ఉండదు. ప్రజల గొంతుకను బలంగా వినిపించాలనే లక్ష్యంతోనే ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది..’ అని వైఎస్ జగన్ పునరుద్ఘాటించారు. -
చంద్రబాబూ.. ఎప్పుడైనా విన్నావా? చూశావా? చేశావా?
సాక్షి, తాడేపల్లి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు క్రెడిట్ చోరీ యత్నాలను మరోసారి ఎండగట్టారు మాజీ ముఖ్యమంత్రి, వైస్సార్సీపీ పార్టీ అధినేత వై.ఎస్.జగన్ మోహన్ రెడ్డి. రాష్ట్రంలో ఇటీవలి పరిణామాలు, చంద్రబాబు ప్రభుత్వ దాష్టీకాలను తీవ్రంగా విమర్శించిన జగన్, తమ హయాంలో జరిగిన భూ రీసర్వేను తన ఖాతాలో వేసుకునేందుకు చంద్రబాబు నిస్సిగ్గుగా చేస్తున్న ప్రయత్నాలు ప్రజలముందుంచారు. తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయంలో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ...‘‘ఈ భూమండలంపై క్రెడిట్ చోరీ అత్యంత సమర్థంగా చేయగలిగిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది చంద్రబాబు నాయుడు మాత్రమే. అవసరానికి రంగులు మార్చే ఊసరవెల్లి కూడా ఈయన్ను చూసి సిగ్గుపడాల్సిందే. అంత దారుణమైన మోసాలు చేస్తున్నారు.’’ అని జగన్ విమర్శించారు. ఏడాదిన్నరగా అధికారంలో ఉన్నప్పటికీ రైతు సమస్యలు తీర్చాలన్న ఆలోచన ఆయనకు అస్సలు లేకుండా పోయిందని, 2019-2024 మధ్యకాలంలో తాము చేపట్టిన భూ రీసర్వేను కూడా తన ఖాతాలోకి వేసుకునే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. ‘‘నిజానికి.. రీసర్వే ఆలోచన నాకు పాదయాత్ర సమయంలోనే వచ్చింది. రైతులు విన్నవించిన అనేక సమస్యలకు ఈ రీసర్వే పరిష్కారం కాగలదని భావించాను. అప్పట్లో రాష్ట్రంలో సర్వేయర్లు లేరు, భూముల సర్వేకు తగిన టెక్నాలజీ కూడా లేదు’’ అని జగన్ గుర్తు చేశారు. ఈ నేపథ్యంలోనే అధికారంలోకి వస్తే సమగ్ర భూ సర్వే చేయిస్తానని తాను 2019నాటి మేనిఫెస్టోలో హామీ ఇచ్చామని, ఇచ్చిన హామీకి కట్టుబడి 2020 డిసెంబరు 21న దాన్ని ప్రారంభించామని వివరించారు. రైతులకు మేలు చేసే ఏ ఆలోచన కూడా చంద్రబాబుకు అస్సలు రాదని.. వచ్చిందల్లా భూములను నిషేధిత జాబితా (22ఏ)లో పెట్టడం మాత్రమేనని ఎద్దేవా చేశారు. ‘‘నాలుగుసార్లు సీఎంగా ఉండి.. ఎనిమిది పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా? చంద్రబాబూ ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?’’ అని ప్రశ్నించారు. ‘‘ఆంధ్రప్రదేశ్లో సమగ్ర భూ సర్వే సువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ మహా యజ్ఞం. వివాదాల్లేకుండా, అత్యంత పారదర్శకంగా భూముల రీ సర్వే జరగింది. ఎవరూ మార్చలేని విధంగా భూ రికార్డులు సిద్ధం చేశాం. భూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాం. అందుకు ప్రభుత్వం పూచీకత్తుగా నిలిచింది. రైతుల పాస్బుక్కుల్లోనూ క్యూఆర్ కోడ్ వంటి అత్యాధునిక ఫీచర్లను పొందుపరిచాం.’’ అని జగన్ తెలిపారు. విప్లవాత్మకమైన చర్యలు..ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ప్రజా సంక్షేమం కోసం తాను చేసిన ప్రయత్నాలు, తీసుకున్న చర్యలను జగన్ సవివరంగా వివరించారు. గ్రామాల్లో సచివాలయ నిర్మాణాలు మొదలుకొని, వాటిల్లో ఒక్కోదాంట్లో పది మంది సిబ్బంది నియామకాలను కూడా ఆయన గుర్తు చేశారు. సమగ్ర భూ సర్వే విజయవంతం అయ్యేందుకు రికార్డు స్థాయిలో 40 వేల మంది సిబ్బందిని పురమాయించామని చెప్పారు. సిబ్బంది మొత్తానికి ఆధునిక టెక్నాలజీపై శిక్షణ ఇప్పించేందుకు సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం కూడా చేసుకున్నామని, హెలికాప్టర్లు, డ్రోన్లతో సర్వే నిర్వహించామని జగన్ వివరించారు. ‘‘మా హయాంలోనే మొదటిసారి డ్రోన్లతో సర్వే జరిగింది. కోట్ల సర్వే రాళ్లను ఉచితంగా రైతులకు అందించాం. వాటిపై భూసర్వే-భూరక్ష అని రాయించాం’’ అని తెలిపారు. సర్వేలో ఎక్కడా రాజీ పడలేదని, భూమి కొలతల్లో ఐదు సెంటీమీటర్ల తేడా కూడా లేకుండా కచ్చితమైన సర్వే చేశామన్నారు. ఇందుకోసం రూ.ఆరు వేల కోట్లు ఖర్చయినా వెనుకాడలేదని... ఈ కృషిని గుర్తించే కేంద్ర ప్రభుత్వం ప్లాటినమ్ గ్రేడ్ ఇచ్చిందని, రూ.400 కోట్ల రాయితీ కూడా వచ్చిందని తెలిపారు. 2023 డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. అయినాసరే.. చంద్రబాబు తన పాత అలవాటు ప్రకారం ‘‘అంతా నేను చేశాను’’ అంటున్నారని విమర్శించారు.ఆంధ్రప్రదేశ్లో తన హయాంలో జరిగిన భూముల రీసర్వేను ఎన్నో రాష్ట్రాలు, కేంద్ర ప్రభుత్వ సంస్థలు కొనియాడాయని జగన్ తెలిపారు. కేరళ, ఉత్తరాఖండ్, మహారాష్ట్ర అధికారులు కూడా అధ్యయనం జరిపారని, సర్వే ఆఫ్ ఇండియా, నీతి ఆయోగ్, సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ ఈ సర్వేను ఎంతగానో మెచ్చుకున్నారని చెప్పారు. చంద్రబాబు రాక్షసపాత్ర...భూముల రీసర్వే విషయంలో చంద్రబాబు పాత్ర రాక్షసుడికి ఏమాత్రం తగ్గదని, ఎల్లోమీడియా అసిస్టెంట్ రాక్షస పాత్ర పోషించిందని జగన్ విమర్శించారు. ఎన్నికల సమయంలో ఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా భూ సర్వేపై రైతులను భయపెట్టారని, ఇప్పుడు కూడా దుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్ను తన ఖాతాలో వేసుకోవాలని చంద్రబాబు భావిస్తున్నారని అన్నారు. అయితే నిజాలను ఎంతో కాలం దాచిపెట్టగలరని ప్రశ్నించారు. ‘‘చంద్రబాబు సర్వే రాళ్లు కూడా లేకుండా సర్వే అంటున్నారు. ఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారు పాస్బుక్కుల విషయంలో మమల్ని అనుసరిస్తున్నాడు. కాకపోతే రంగు మార్చాడంతే. మార్చేందుకు వీల్లేని పాస్బుక్కులు ఇచ్చేందుకు మేము ప్రయత్నించాం. ఇప్పుడు విపరీతమైన తప్పులు ఉంటున్నాయి. మేము పాతిన సర్వే రాళ్లను తొలగించేందుకు ఏకంగా రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారు. సర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది ఈ వ్యవహారం. మేము ఒక బృహత్తర లక్ష్యంతో మొదలుపెట్టిన భూముల సర్వేను చంద్రబాబు ప్రభుత్వమిప్పుడు నీరుగారుస్తోంది’’ అని వివరించారు. -
వైఎస్ జగన్ ప్రెస్మీట్.. హైలైట్స్
వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయం నుంచి మీడియాతో మాట్లాడారు. చంద్రబాబు క్రెడిట్ చోరీ, పల్నాడు గురజాల నియోజకవర్గంలోని పిన్నెల్లి గ్రామంలో జరిగిన దారుణ ఘటన.. తదితర అంశాలపై పలు కీలక విషయాలను ఆయన వివరించారు. జగన్ ప్రెస్మీట్ హైలైట్స్భూమండలం మీద క్రెడిట్ చోరీ చేయగలిగిన ఒకే ఒక్క వ్యక్తి చంద్రబాబుఊసరవెల్లి కూడా చంద్రబాబుని చూసి సిగ్గుపడుతుంది. అంతటి దారుణమైన మోసాలు చేస్తున్నారాయనరైతుల సమస్యలు తీర్చాలన్న కనీస ఆలోచన కూడా ఆయనకు లేదుభూముల రీసర్వే చేయాలన్న ఆలోచన కూడా బాబుకు ఏనాడూ రాలేదురీసర్వే ఆలోచన నాకు నా పాదయాత్రలోనే వచ్చిందిరైతన్నలు లేవనెత్తిన సమస్యల నుంచి పరిష్కారమే రీసర్వేమేం అధికారంలోకి రాకముందు సర్వేయర్లు లేరుభూములు సర్వే చేసే టెక్నాలజీ కూడా లేదుసవాలక్ష భూ సమస్యలకు పరిష్కారం చేయడమే రీసర్వే22ఏలో భూములు పెట్టడం మాత్రమే చంద్రబాబుకు తెలుసువందేళ్ల కిందట బ్రిటీషర్లు భూ సర్వేలు చేశౠరుమేం అధికారంలోకి వస్తే సమగ్ర భూసర్వే చేయిస్తామని 2019 మేనిఫెస్టోలో పెట్టాంచెప్పినట్లుగానే.. 2020 డిసెంబర్ 21న భూ రీసర్వే మొదలుపెట్టాంసువర్ణ అక్షరాలతో లిఖించదగ్గ గొప్ప అధ్యాయం ప్రారంభించాంభూ సర్వేను మహాయజ్ఞంలా చేపట్టాంవివాదాలు లేని విధంగా పాదర్శకంగా భూములు రీసర్వే చేశాంరికార్డులు ట్యాంపర్ చేయలేని విధంగా సంస్కరించాంభూ యజమానులకు శాశ్వత యాజమాన్య పత్రాలు ఇచ్చాంప్రభుత్వం పూచీకత్తుగా పత్రాలు రైతులకు అందించాంఅడ్వాన్స్డ్ ఫీచర్లతో రైతులకు పాస్బుక్లు ఇచ్చాం.. ఆ పాస్బుక్కుల్లో క్యూఆర్ కోడ్ పెట్టాంనాలుగుసార్లు సీఎంగా ఉండి.. 80 పదుల వయసు దగ్గర పడుతున్న చంద్రబాబుకి ఏనాడైనా ఇలాంటి ఆలోచన వచ్చిందా?చంద్రబాబు ఇలాంటిది ఏనాడైనా విన్నావా? చూశావా? చేశావా?సమగ్ర సర్వే చేసిన మేం చేసిన ప్రతీది రికార్డే.. ఇది ఎవరూ తుడిచిపెట్టలేనిది గ్రామాల్లో సచివాలయాలు నిర్మించాం. వాటిల్లో పది మంది చొప్పున సిబ్బందిని నియమించాం. సర్వే కోసం రికార్డు స్థాయిలో సిబ్బందిని పురమాయించాం. సుమారు 40 వేల మంది సిబ్బంది శ్రమ, కృషి దాగుంది ఈ మహాయజ్ఞంలో. టెక్నాలజీపై అవగాహన కోసం వీళ్లకు శిక్షణ ఇప్పించాం. సర్వే ఆఫ్ ఇండియాతో ఒప్పందం చేసుకున్నాం. సర్వేలో హెలికాప్టర్లు, డ్రోన్లు ఉపయోగించాం. డ్రోన్లతో సర్వే జరిగింది మా హయాంలోనే. కోట్ల సర్వే రాళ్లను గ్రామాలను తరలించాం. వాటిని ఉచితంగా రైతులకు ఇచ్చాం. వాటిపై భూసర్వే-భూరక్ష అని రాయించాం. 5 సెం.మీల తేడా లేకుండా సర్వే జరిపాం. విదేశాల్లో కూడా చేయలేని ప్రయత్నాలు చేశాం. ఇది మహా యజ్ఞం అంటే.. భూముల రీసర్వేకు రూ.6 వేల కోట్లు ఖర్చు చేశాం. ఈ కృషిని మెచ్చి కేంద్రం ప్లాటినమ్డ్ గ్రేడ్ ఇచ్చింది. మా పని వల్ల కేంద్రం నుంచి రూ.400 కోట్ల రాయితీ వచ్చింది. కానీ చంద్రబాబు అదంతా తన వల్లే అని చెప్పుకుంటున్నారు2023 డిసెంబర్లో పార్లమెంట్ సాక్షిగా కేంద్రమే ఈ ప్రకటన చేసింది భూముల రీసర్వేను నీతి ఆయోగ్ ప్రశంసించిందికేరళ, ఉత్తరాఖండ్ అధికారులు సర్వేను అధ్యయనం చేశారుమహరాష్ట్ర అధికారులు అధ్యయనం చేసి ప్రశంసించారుఅసోం కూడా మా సహకారం కోరిందిసర్వే ఆఫ్ ఇండియా అప్పటి డైరెక్టర్ మేం చేపట్టిన సర్వేను మెచ్చుకున్నారుచంద్రబాబుది రాక్షస పాత్ర.. ఎల్లో మీడియాది అసిస్టెంట్ రాక్షస పాత్రఐవీఆర్ఎస్ కాల్స్ ద్వారా ఎన్నికల సమయంలో రైతులను భయపెట్టారుదుష్ప్రచారంతో భూ సర్వే క్రెడిట్ను చంద్రబాబు తన ఖాతాలో వేసుకోవాలనుకుంటున్నారునిజాలను ఎంతో కాలం దాచిపెట్టలేరు సర్వే రాళ్లు లేకుండా.. చంద్రబాబు సర్వే చేయిస్తున్నారుఏ రాయి పడితే ఆ రాయి పెట్టి సర్వే అంటున్నారుపాస్ బుక్ల విషయంలో మేం చేసిందే చేస్తున్నారు.. మేం ఇచ్చిన వాటికే కేవలం రంగు మార్చారంతేట్యాంపర్ చేయలేని పాస్బుక్లు ఇవ్వాలన్నదే మా తపనపైగా వాటిల్లో విపరీతమైన తప్పులు ఉంటున్నాయిమేం పాతిన రాళ్లపై ఉన్న పేర్లను తొలగిస్తున్నారు.. ఇందుకోసం రూ.15 కోట్లు ఖర్చు చేస్తున్నారుసర్వే అంటే ఏంటో కూడా తెలియదు అన్నట్లు సాగుతోంది చంద్రబాబు సర్కార్ వ్యవహారంసర్వే అంతిమ లక్ష్యాన్ని నీరుగారుస్తోంది చంద్రబాబు సర్కార్ 22 ఏ గురించి చంద్రబాబు మాట్లాడితే ఆశ్చర్యమేస్తోంది22 ఏలో అడ్డగోలుగా భూములు పెట్టిన చరిత్ర బాబుదేగ్రామ, వార్డు సచివాలయాల్లో రిజిస్ట్రేషన్ సేవలు గాలికొదిలేశారురూ.55.79 మేం పట్టాదారు పాస్బుక్కు ఇస్తే.. చంద్రబాబు రూ.76 ఇస్తున్నారుకమీషన్లు తీసుకుని పట్టదారు పాస్బుక్లు ఇస్తున్నారు చుక్కల భూముల సమస్యలను కూడా మేం పరిష్కరించాం. ఇనాం భూములపై లక్షా 60 వేల మందికి హక్కులు కల్పించాం. 1.54 లక్షల ఆదివాసీలకు 3.26 లక్షల ఎకరాలపై హక్కులు కల్పించాంచంద్రబాబు ఇవేవీ చేయకపోగా.. అదంతా తన పనిగా చెప్పుకుంటున్నారు చంద్రబాబు, ఆయన ఎల్లో ముఠా.. రాక్షసుల కంటే దారుణంగా ఉన్నారుపల్నాడు జిల్లా పిన్నెల్లిలో దారుణం జరిగిందిప్రజలు ఊర్లు విడిచి వెళ్లాల్సిన పరిస్థితికి రెడ్బుక్ రాజ్యాంగం చేరింది.. ఇది సిగ్గుపడాల్సిన పరిస్థితిఊరిలో తిరిగి అడుగుపెట్టడానికి ప్రజలు కోర్టుల్లో కేసులు వేస్తున్నారు రెడ్బుక్ రాజ్యాంగాన్ని చంద్రబాబు దగ్గరుండి ప్రొత్సహిస్తున్నారు. సాల్మన్ ఒక దళితుడు.. ఒక సామాన్యుడు. తన భార్య అనారోగ్యం బారిన పడిందని సొంత గ్రామం పిన్నెల్లి వెళ్తే.. సాల్మన్ను రాడ్లతో కొట్టి చంపేశారు.చికిత్స పొందుతూ ఆ మనిషి చనిపోతే.. కనీసం మృతదేహాన్ని ఊరిలోకి కూడా రానివ్వలేదు. మా పార్టీ నేతలు పోరాడితేగానీ అంత్యక్రియలకు అనుమతించలేదు. తన పాలనలో చంద్రబాబు విషపు గింజలు నాటాడు. చంద్రబాబు చెడ్డ అలవాట్లు ఉన్న వ్యక్తి . పిన్నెల్లి ఘటనలో.. సీఐ, ఎస్సైలు, ఎస్సీ, ఎమ్మెల్యే, చంద్రబాబు కూడా దోషే. ఎల్లకాలం చంద్రబాబు ప్రభుత్వం ఉండదు. ఇది ఆయన గుర్తిస్తే మంచిది. పిన్నెల్లి ఉదంతంపై కోర్టులను.. మానవ హక్కుల సంఘాలను ఆశ్రయిస్తాం కూటమి వచ్చాక.. రాష్ట్రంలో వాడవాడలా బెల్ట్ షాపులు వెలిశాయిఎమ్మార్పీ కంటే ఎక్కువ రేట్లకు అమ్ముతున్నారుఉచిత ఇసుక పేరుతో దోచేస్తున్నారుమా హయాంలో ఇసుకతో రూ.750 కోట్ల ఆదాయం ప్రతీ ఏడాది వచ్చేదికూటమి ప్రభుత్వంలో మైనింగ్ దోపిడీ జరుగుతోందిదోపిడీలో కింద నుంచి పైవరకు వాటాలు వెళ్తున్నాయిప్రైవేట్ వాళ్లకు భూములు ఇవ్వడమేకాదు.. నిర్మాణ ఖర్చులూ ఇస్తున్నారుభూములు ఇవ్వడమే పెద్ద స్కామ్.. నిర్మాణ ఖర్చులనేది ఇంకా పెద్ద స్కామ్అమరావతిలో నిర్మాణాల పేరుతో జరిగేది ఏంటి? నిర్మాణాలకు ఎంత ఖర్చు చేస్తున్నారు? సంక్రాంతి పండుగకు కూటమి ఎమ్మెల్యేలు దగ్గరుండి జూదాలను నడిపించారు. దాదాపు ప్రతీ నియోజకవర్గంలో ఇది జరిగింది. ఈ తతంగంతో సుమారు రూ.2 వేల కోట్ల రొటేషన్ జరిగింది. జూదం అనేది చట్టబద్దమా?. ప్రభుత్వమే దగ్గరుండి ఇలాంటి వాటిని ప్రొత్సహించడమేంటి?. ఇది ప్రజలను తప్పుడు మార్గంలో దోచుకోవడం కిందకు రాదా?.. ఇది అవినీతి కిందకే వస్తుంది కదా.. లూటీ కదా!.. రాష్ట్రంలో మేం తప్ప మరో ప్రతిపక్ష పార్టీ లేదనే విషయాన్ని అంతా గుర్తించాలి సభలో మైక్ ఇచ్చే పరిస్థితులు లేనందునే ప్రధాన ప్రతిపక్ష హోదా కోసం పోరాటం చేయాల్సి వస్తోంది -
వైఎస్ జగన్ను కలిసిన పిన్నెల్లి గ్రామస్తులు
సాక్షి, తాడేపల్లి: గురజాల నియోజకవర్గం పిన్నెల్లి గ్రామంలో వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్ దారుణ హత్యకు గురైన సంగతి తెలిసిందే. టీడీపీ గూండాల చేతుల్లో దారుణంగా హత్యకు గురైన సాల్మన్ ఉదంతాన్ని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి తీవ్రంగా ఖండించి.. బాధిత కుటుంబానికి ఆసరాగా ఉంటామని ప్రకటించారు కూడా. ఈ క్రమంలో పిన్నెల్లి గ్రామస్తులు బుధవారం వైఎస్ జగన్ను కలిశారు. పిన్నెల్లి గ్రామస్తులతో పాటు బాధిత కుటుంబం కూడా తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ క్యాంపు కార్యాలయానికి వచ్చింది. తమ తండ్రిని రాజకీయ కక్షతోనే అత్యంత కిరాతకంగా చంపారని సాల్మన్ కుమారులు మరియదాసు, భిక్షం(ప్రవీణ్), కుమార్తె రాహేలు జగన్ వద్ద వాపోయారు. తండ్రి మరణంతో తమ కుటుంబం రోడ్డున పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. వాళ్లను ఓదార్చిన జగన్.. అధైర్య పడొద్దని, పార్టీ అన్ని విధాలుగా ఆదుకుంటుందని భరోసా ఇచ్చారు. మరోవైపు.. అక్రమ కేసులు పెడతామని టీడీపీ గూండాలు, పోలీసులు తమను ఎలా బెదిరించారనే విషయాన్ని గ్రామస్తులు జగన్కు తెలియజేశారు. ప్రభుత్వ దన్నుతో చట్టాన్ని చేతుల్లోకి తీసుకుని, వ్యవస్ధలు దిగజార్చేలా వ్యవహరిస్తున్న పోలీసుల తీరును ఈ సందర్భంగా తీవ్రంగా తప్పుబట్టారాయన. ఎవరూ భయపడవద్దని.. ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. ఇలాంటి వేధింపులను ధైర్యంగా ఎదుర్కోవాలని.. పార్టీ తరఫున లీగల్ సెల్ అవసరమైన న్యాయ సహాయం అందిస్తుందని చెప్పారు. పిన్నెల్లి గ్రామస్తుల వెంట గురజాల మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి యెనుముల మురళీధర్ రెడ్డి, స్ధానిక నాయకులు, లీగల్ సెల్ సభ్యులు ఉన్నారు.చల్లా నాగరాజుకు భరోసా.. పల్నాడు జిల్లా గురజాల నియోజకవర్గం తేలుకుట్ల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త చల్లా నాగరాజు.. 2024 అక్టోబర్లో టీడీపీ గూండాల చేతిలో తీవ్రంగా గాయపడ్డాడు. అసెంబ్లీ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ పోలింగ్ ఏజెంట్గా ఉన్నందుకు రాడ్లతో దాడిచేసి, నాగరాజు రెండు కాళ్ళు విరగ్గొట్టి తీవ్రంగా గాయపరిచారు. తనపై టీడీపీ గూండాలు ఏ విధంగా దాడిచేశారనేది, తన కుటుంబాన్ని ఎలా ఇబ్బందులు పెడుతున్నారనేది వైయస్ జగన్కు వివరించాడు. రెండు కాళ్ళు విరిగిపోవడంతో వీల్ ఛైర్కే పరిమితమై కుటుంబ పోషణ తీవ్ర ఇబ్బందిగా ఉందని జగన్ దృష్టికి తీసుకెళ్లాడు. నాగరాజు పరిస్థితికి చలించిపోయిన వైఎస్ జగన్.. పార్టీ తరపున ఆదుకుంటామని భరోసా ఇచ్చారు. -
అది ముమ్మాటికీ ఎన్టీఆర్ను అవమానించడమే!
తెలుగుదేశం వ్యవస్థాపకుడు, మాజీ ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు భారీ విగ్రహం కోసం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేస్తామని ప్రకటించడం తీవ్ర విమర్శలకు గురవుతోంది. ఎన్టీఆర్ అంటే అందరికి గౌరవమే. అందుకే ఒక జిల్లాకు ఆయన పేరు పెట్టి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పదమూడేళ్లపాటు సీఎంగా ఉన్న చంద్రబాబు కూడా చేయని పనిచేసి ఎన్టీఆర్ అభిమానుల మన్ననలు పొందారు. చంద్రబాబుకు నిజంగానే ఎన్టీఆర్పై అభిమానం ఉంటే ఓకే కానీ.. ప్రజాధనాన్ని ఇలా ఖర్చుపెట్టడం ఆక్షేపణీయమే. ఒకరకంగా చంద్రబాబు నిర్ణయం ఎన్టీఆర్ను అవమానించినట్లే కూడా. ఎందుకంటే.. ప్రభుత్వ సొమ్ముకు పాలకులు ధర్మకర్తలుగా వ్యవహరించాలని రామరావు తరచూ చెప్పేవారు. ఇష్టం వచ్చినట్లు ఖర్చు చేయడం సరికాదని అనేవారు. పైగా గుజరాత్లో రూ.3,500 కోట్లతో పటేల్ విగ్రహాన్ని, మహారాష్ట్రలో రూ.మూడు వేల కోట్లతో ఛత్రపతి శివాజీ విగ్రహాన్ని ఏర్పాటు చేయడాన్ని ఇదే చంద్రబాబు తీవ్రంగా వ్యతిరేకించిన విషయం ఇక్కడ చెప్పుకోవాలి. విగ్రహాలకు అంత సొమ్ము ఇచ్చిన ప్రభుత్వం అమరావతికి రూ.1500 కోట్లు మాత్రమే ఇస్తుందా? అని అప్పట్లో బాబుగారు నిలదీశారు కూడా. ఇప్పుడు ఆ జోరు లేదనుకోండి.ఎన్టీఆర్ విగ్రహానికి ఏకంగా రూ.1750 కోట్లు ఖర్చు చేసే విషయమై జనసేనలోనూ అసమ్మతి ఉన్నట్లుగా ఉంది. ఆ పార్టీ మద్దతుదారులు కొందరు శ్రీకృష్ణదేవరాయలు, వంగవీటి రంగా విగ్రహాలను ఎందుకు పెట్టరని ప్రశ్నిస్తూ వీడియోలు చేస్తున్నారు. హైదరాబాద్లో టాంక్ బండ్ వద్ద ఎన్టీఆర్ దుబారా లేకుండా పలువురు తెలుగు ప్రముఖుల విగ్రహాలను ఏర్పాటు చేసినా అప్పట్లో కాంగ్రెస్ పార్టీ ఆయన్ను తెగ విమర్శించింది. ఇప్పుడు ఏపీ ప్రభుత్వం ఒకపక్క నిధులు లేవని నిత్యం వాపోతూ, ఇంకోపక్క ఇలా విగ్రహానికి అంత ఖర్చు పెట్టడంపై అందరి అభ్యంతరం. చిత్రమేమిటంటే ఎన్టీఆర్ను సీఎం పదవి నుంచి ఎవరు కూలదోశారో వారే ఇప్పుడు భారీ విగ్రహం పెడతామని చెబుతున్నారు. ఒకప్పుడు ఎన్టీఆర్కు విలువలు లేవని, సినిమా వాళ్ల రాజకీయాలు అయిపోయాయని ఇంటర్వ్యూలు ఇచ్చి చంద్రబాబు నాయుడు తీవ్ర విమర్శలు చేస్తే, తన అల్లుడైన ఆయనపై ఎన్టీఆర్ పరుష వ్యాఖ్యలు చేశారు. తమిళనాడులో తిరునల్వేలిలో స్టాలిన్ ప్రభుత్వం డీఎంకే వ్యవస్థాపకుడు కరుణానిధి విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి ప్రయత్నిస్తే సుప్రీంకోర్టు నో చెప్పింది. పార్టీ సొమ్ముతో విగ్రహం పెట్టుకోవచ్చని తెలిపింది. అయితే ఏపీలో బహుశా ఆ ఇబ్బంది రాకుండా ఉండడానికి దానిని ఒక సాంస్కృతిక కేంద్రంగా చూపించి, మరికొందరి విగ్రహాలు పెడతామని చెబుతారేమో తెలియదు. మరో విశేషం ఏమిటంటే ఎన్టీఆర్ను తన కార్టూన్ల ద్వారా అవమానించిన ప్రముఖ కార్టూనిస్టు శ్రీధర్కు చంద్రబాబు ప్రభుత్వం సలహాదారు పదవి ఇచ్చిందని కొందరు విమర్శిస్తుంటారు. ఎన్టీఆర్ విగ్రహం వద్ద ఏర్పాటయ్యే ఆయన ఫోటోల ఎగ్జిబిషన్లో ఈ కార్టూన్లు కూడా పెడతారా? అని కొందరు సోషల్ మీడియాలో చమత్కరిస్తున్నారు. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత విజయవాడ-గుంటూరు మధ్య రాజధాని ఏర్పాటు చేస్తామని చంద్రబాబు తెలిపినప్పుడు.. దానికి ఎన్టీఆర్ క్యాపిటల్ సిటీ అని పేరు పెట్టాలని టీడీపీ సీనియర్ నేత గోరంట్ల బుచ్చయ్య చౌదరి ప్రభుత్వానికి ఒక లేఖ రాశారు. దానిపై చంద్రబాబు ఆగ్రహం వ్యక్తం చేశారని అప్పట్లో వార్తలు వచ్చాయి. రామోజీరావు ప్రతిపాదించిన అమరావతి అనే పేరును చంద్రబాబు ఖాయం చేశారు. ప్రస్తుతం ఏపీ ప్రభుత్వం ఆర్థిక సంక్షోభాన్ని ఎదుర్కుంటోంది. ఏడాదిన్నర కాలంలోనే రూ.మూడు లక్షల కోట్ల అప్పులు చేసి రికార్డు సృష్టించింది. జగన్ ప్రభుత్వం తీసుకువచ్చిన మెడికల్ కాలేజీలను పూర్తి చేయలేక ప్రైవేటుపరం చేయడానికి ప్రయత్నిస్తున్నారు. ప్రజలందరికి ఉపయోగపడే పనులకు నిధులు లేకపోతే, ఎన్టీఆర్ విగ్రహస్థాపనకు రూ.1750 కోట్లు ఎక్కడ నుంచి వస్తున్నాయని పలువురు సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు. జగన్ ప్రభుత్వం విశాఖలోని రిషికొండపై అత్యంత ఆధునిక రీతిలో సుమారు రూ.250 కోట్లతో భవనాలు నిర్మిస్తే డబ్బులు వేస్ట్ అయ్యాయని చంద్రబాబు విమర్శించారు. నిజంగానే ఏడాదిన్నరగా నిరర్ధకంగా ఉంచారు. విశాఖ ఉక్కు కర్మాగారాన్ని ప్రైవేటుపరం చేయవద్దని కార్మికులు అడుగుతుంటే, వారిని మందలించే రీతిలో మాట్లాడుతూ ప్రజల కట్టే పన్నులను బాధ్యతగా వాడవద్దా? అని ఆగ్రహం వ్యక్తం చేశారు. కాని అమరావతి పేరుతో వేల కోట్ల అప్పు తీసుకు వస్తున్నారు. భవనాల నిర్మాణానికి, విగ్రహాల ఏర్పాటుకు ఇష్టారీతిన దుబారా చేస్తున్నారన్న విమర్శలు వస్తున్నాయి. ఇదంతా ప్రజల పన్నుల నుంచి చెల్లించవలసిందే కదా అన్న ప్రశ్నకు వారు సమాధానం ఇవ్వడం లేదు. గత టర్మ్లో చంద్రబాబు ప్రభుత్వం రాజధాని ప్రాంతంలో అంబేద్కర్ విగ్రహన్ని ఏర్పాటు చేస్తామంటూ కొంత ఖర్చు చేసింది కాని, పనులు ముందుకు తీసుకువెళ్లలేదు. ఆ తర్వాత వచ్చిన జగన్ ప్రభుత్వం మారుమూల విగ్రహం పెట్టడం కన్నా, విజయవాడ నడిబొడ్డున విగ్రహం ఏర్పాటు చేసి విజ్ఞాన కేంద్రంగా తీర్చి దిద్దితే బాగుంటుందని భావించి నిర్మాణం చేసింది. ఆ అంబేద్కర్ విగ్రహం వద్దకు చంద్రబాబు లేదంటే పవన్ కళ్యాణ్ ,ఇతర కూటమి నేతలు అక్కడికి వెళ్లకపోగా.. దానిని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. చివరికి అక్కడ పారిశుధ్య పనులు నిర్వహించేవారికి సైతం జీతాలు సరిగా ఇవ్వడం లేదు. అలాంటివారు ఇప్పుడు నీరుకొండ వద్ద ఎన్టీఆర్ విగ్రహాన్ని, ఫోటో ఎగ్జిబిషన్ వంటి వాటిని ఏర్పాటు చేస్తామని అంటున్నారు. నీరుకొండలో 1986 ప్రాంతంలో రెండు సామాజికవర్గాల మధ్య ఘర్షణలు జరిగాయి. అప్పుడు ఎన్టీఆర్ ప్రభుత్వమే ఉండేది. అలాంటి చోట ఆయన విగ్రహం ఏర్పాటు ఏమిటన్నది కొందరి ఆక్షేపణ. కాగా కొన్నివర్గాలు మరికొన్ని డిమాండ్లు తీసుకు వస్తున్నాయి. ఆంధ్ర రాష్ట్ర ఏర్పాటుకు ఆమరణ దీక్ష చేసి ప్రాణాలు వదిలిన పొట్టి శ్రీరాములు విగ్రహాన్ని నెలకొల్పాలని కొంతమంది కోరుతుంటే.. మాజీ ఎమ్మెల్యే వంగవీటి రంగా పేరుతో స్మృతి వనం ఏర్పాటు చేయాలని జనసేన మద్దతుదారులు డిమాండ్ చేస్తున్నారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం ఏమి చేస్తుందో తెలియదు కాని, ఎన్టీఆర్ విగ్రహానికి రూ.1750 కోట్లు వ్యయం చేయడానికిపూనుకోవడంపై మాత్రం తీవ్ర విమర్శలు వస్తున్నమాట నిజం.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
స్వచ్ఛంద పంటల బీమాకూ మంగళం. చంద్రబాబు ప్రభుత్వ నిర్వాకం
-
గలీజు కతలు.. కూటమి పెద్దలది ఎంత తెలివో!
ఆంధ్రప్రదేశ్లో జూదాల జాతర! రెండు వేల కోట్ల పందాలు! మందు బాబులకు పండగే! మూడు రోజుల్లో 438 కోట్ల రూపాయల మద్యం తాగేశారు! గోవా నుంచి క్లబ్ డాన్సర్లు! అశ్లీల నృత్యాలు! కాసినోలు, గుండాట! ఇలాంటి శీర్షికలతో మీడియాలో వచ్చిన వార్తలు చూస్తే ఏమనుకోవాలి? రాష్ట్రం ముందుకెళుతోందనా? లేక దిగజారిపోతోందనా?.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రభుత్వం వీటన్నింటినీ చోద్యం చూస్తున్నట్లు వ్యవహరించడం, వినోదమని ప్రచారం చేసుకోవడం, పరోక్షంగా సమర్థిస్తూండటం చూసి ప్రముఖ సామాజికవేత్త సునీత కృష్ణన్ చేసిన వ్యాఖ్యలు.. పరిస్థితి ఎంత నీచంగా ఉందో చెబుతున్నాయి. ‘ఏపీలో పలుచోట్ల రికార్డింగ్ డాన్సుల పేరుతో సాగుతున్న అనాగరిక చర్యలు మనిషికి ఉండవలసిన కనీస హుందాతనాన్ని దెబ్బతీస్తున్నాయి. యువతులతో అర్ధనగ్న నృత్యాలు చేయిస్తుంటే, సమాజం దానిని ఎంజాయ్ చేయడం భయానకం. ఇటువంటి అసహ్యకరమైన సంస్కతిని ఉపేక్షించకుండా ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని మనవి" అని సునీత కృష్ణన్ ముఖ్యమంత్రి చంద్రబాబును ఉద్దేశించి ట్వీట్ చేశారు. సంక్రాంతి పండుగ పేరుతో ఏపీలో ఏ స్థాయిలో చట్ట వ్యతిరేక పనులు జరిగాయో, పోలీసు వ్యవస్థ ఎంత అచేతనంగా మిగిలిపోయిందో, భారతీయ సంస్కృతిని ఏ రకంగా పతనావస్తకు తీసుకువెళ్లింది.. అనేది సునీత చేసిన ఈ వ్యాఖ్య అద్దం పడుతుంది. హిందూ ధర్మ పరిరక్షణ అని స్వార్ధ రాజకీయాల కోసం నిత్యం ప్రచారం చేస్తున్న చంద్రబాబు, సనాతని వేషం కట్టి ప్రజలను మభ్య పెట్టే యత్నం చేసే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, రెడ్బుక్ అంటూ అరాచకాలకు ప్రోత్సాహం ఇచ్చే మంత్రి లోకేశ్లకు ఏపీలో సంక్రాంతి పండుగ పూట మూడు రోజులపాటు సాగిన ఈ అకృత్యాలు ఏవీ కనిపించలేదు. కొందరు టీడీపీ, జనసేన ఎమ్మెల్యేలు, వారి అనుచరులు కొన్ని చోట్ల నిర్వహించిన అశ్లీల నృత్యాల భాగోతాలు, కోట్ల రూపాయల పందాలు, మద్యం పారించిన తీరు.. ఇన్ని జరిగాక కూడా ఏపీలో మంచి పాలన ఉందని ఎవరైనా చెప్పగలరా?.. వైసీపీ కార్యకర్తలు కొందరు కోడిని బహిరంగంగా కోయడం నేరం అంటూ కేసులు పెట్టి, హింసించి, రోడ్డు మీద నడిపించి శాడిజాన్ని ప్రదర్శించిన పోలీసులకు ఈ మూడు రోజులు సాగిన హింసాకాండ, అరాచకాలు, దందాలు కనిపించకపోవడం విశేషం. ఇలాంటి వాటిని అరికట్టవలసిన రక్షక భటులు, వాటికి రక్షణగా నిలబడ్డారు. యూట్యూబ్ జర్నలిస్టు ఒకరు ఈ వికృతాలను వివరిస్తూ ఉయ్యూరు వద్ద ఒక బరి ఏర్పాటు చేసి, గోవా నుంచి డాన్సర్లను అందుబాటులో ఉంచారని ఒకొక్కరి నుంచి రూ.లక్ష చొప్పున వసూలు చేశారని తెలిపారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం లాంటిచోట్ల కళ్లెదుటే క్యాంపులు కనిపించినా పోలీసులు కిమ్మనలేదు. కోనసీమ జిల్లాలో జనసేన ఎమ్మెల్యే అనుచరుడు ఒకరు క్లబ్ డాన్సర్ల పట్ల ఎంత అనుచితంగా వ్యవహరించింది తెలిపే వీడియో వైరల్ అయింది. కొందరు కోట్లలో పందాలు వేస్తే, ఎల్లో మీడియా నిస్సిగ్గుగా వాటిని పండగ, సంబరమంటూ ప్రొజెక్టు చేసింది. పందాలు అనేవి నిషేధం. ఏపీలో పందాల వార్తలు, ఎవరు ఎంత పందెం కాసిందీ బహిరంగంగా తెలిసినా పోలీసు వ్యవస్థ సంబంధం లేదన్నట్లు ప్రవర్తించిందంటే ఏమనుకోవాలి?.. ఎల్లో మీడియా అంచనా ప్రకారమే ఈ పందాల విలువ రూ.2,000 కోట్లు. తెలంగాణ వాసుల రాకతో జోష్ వచ్చిందని ఓ ఎల్లో పత్రిక సంబరపడింది. గుండాట, పేకాటలలోనే రూ.500 కోట్లు, కృష్ణా జిల్లాలో రూ.800 కోట్ల పందాలు జరిగాయట. బాపట్లలో రూ.200 కోట్ల కోడిపందాలు సాగాయి. తాడేపల్లిగూడెంలో ఒక్క పందంలో రూ.1.53 కోట్లు పెట్టారట. అందులో ఒక వ్యక్తి గెలిస్తే, మరో వ్యక్తి దానిని కోల్పోయారు. ఇలా పందాలలో ఎన్ని కుటుంబాలు నాశనం అయ్యాయో చెప్పలేం. మొబైల్ వాన్లు తిప్పి మరీ మద్యాన్ని అధిక ధరలకు అమ్మించారట. వీటిలో ఏదీ చట్ట సమ్మతం కాదు. హైకోర్టు సైతం వీటిని అదుపు చేయాలని ఆదేశాలు ఇచ్చింది. అయినా ప్రభుత్వానికి, పోలీసు వ్యవస్థకు చీమ కుట్టినట్లు కూడా లేకుండా పోయింది. వైసీపీ ప్రభుత్వ హయాంలో గుడివాడలో ఒక టెంట్ వేసి కోడిపందాలు జరిపితే తెలుగుదేశం పార్టీ ఎంత గొడవ చేసింది అందరికి తెలుసు. అక్కడ క్యాసినో జరిగిందంటూ పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. మాజీ మంత్రి కొడాలి నానిపై ఎల్లో మీడియా పలు ఆరోపణలు చేస్తూ దుష్ప్రచారం చేసింది. ఈసారి అంతకుమించి సెటప్లు పెట్టినా, ఎమ్మెల్యేలు స్వయంగా వీటిని పర్యవేక్షించినా ఈ ఎల్లో మీడియాకు సంబరంగా కనిపించింది. ఈ మొత్తం ప్రక్రియలో పోలీసులకు బాగా గిట్టుబాటైందని వార్తలు వచ్చాయి. జూదం, పందాలు, అశ్లీల నృత్యాలు విచ్చలవిడిగా సాగిపోతుంటే, వాటిని నిలుపుదల చేయడానికి ఆదేశాలు ఇవ్వవలసిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు దానిని డైవర్ట్ చేయడానికి మీడియాకు ఒక లీక్ ఇవ్వడం హైలైట్ గా చెప్పాలి. ఆచార వ్యవహారాలు, సంస్కృతి, సంప్రదాయాలను మర్చిపోతే మన జాతికి ఉనికి ఉండదని చంద్రబాబు అన్నారట. అన్ని జిల్లాలలో ఘనమైన ఆటపాటలు, ఉత్సవాలను ప్రభుత్వం ప్రోత్సహించిందట. రాష్ట్రంలోని పల్లెలు కళకళలాడాయట. చూడండి.. ఎంత తెలివో!.. ఒకపక్క అశ్లీల న్యత్యాలతో సంస్కృతిని నాశనం చేస్తుంటే, జూద పందాలతో ప్రజలు ఆర్ధికంగా చితికిపోతుంటే వాటి గురించి మాట మాత్రం వ్యాఖ్యానించకుండా.. ఈనాడు వంటి ఎల్లో మీడియాను అడ్డం పెట్టుకుని సుభాషితాలు వల్లించినట్లు లీక్ ఇచ్చుకున్నారన్నమాట. ఇదంతా కేవలం జూద జాతరతో తనకు సంబంధం లేదని జనం అనుకోవాలన్నదే ఆయన ఉద్దేశం అన్నది తెలుస్తూనే ఉంది. ప్రభుత్వ పెద్దలు ఆదేశిస్తేనే పోలీసులు ఇలాంటి వ్యవహారాలను చూసిచూడనట్లు పోతారన్నది బహిరంగ రహస్యం. ఈసారి అది మరీ శృతి మించి ఇలాంటి అకృత్యాలకు పోలీసులే కాపలాగా ఉన్నారన్న అభిప్రాయం ప్రజలలో కలగడం అత్యంత దురదృష్టకరం. ఈ నేపధ్యంలో సునీతా కృష్ణన్ చేసిన ఒక్క వ్యాఖ్యతో రాష్ట్రం పరువు గంగలో కలిసింది. అశ్లీల నృత్యాల హోరులో బ్రాండ్ ఇమేజీ కొట్టుకు పోయింది.:::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
ఆంధ్రప్రదేశ్లో సంక్రాంతి సందర్భంగా జూదాల జాతర.. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో విచ్చలవిడిగా మద్యం ప్రవాహం
-
పవన్ను సైడ్ చేసి మరీ క్రెడిట్ చోరీ
ఒక భవనానికి ‘సిటీ’ అని పేరు పెడితే ఆ నగరమంతా పేరు పెట్టిన వ్యక్తి నిర్మించినట్లేనా? శంకుస్థాపన చేసి తరువాత దానిని పట్టించుకోకపోయినా, పూర్తి చేయకపోయినా క్రెడిట్ మాత్రం పొందగలుగుతారా? ఇతరుల విషయమేమో తెలియదు కానీ.. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, తెలుగుదేశం పార్టీ విషయంలో మాత్రం ఒప్పుకోవాలేమో. లేదంటే మీడియా బలంతో విరుచుకుపడుతుంటారు. భోగాపురం విమానాశ్రయం విషయంలో చంద్రబాబు ప్రభుత్వం చిక్కుముళ్లు వేసి దిగిపోతే జగన్ ఆ ముళ్లన్నీ విప్పి కార్యరూపం దాల్చేలా చేయగలిగారు. అప్పట్లో జగన్ చెప్పినట్లే 2026 కల్లా ఇది పూర్తి కావడం విశేషం. కాకపోతే చంద్రబాబు ప్రభుత్వానికి దానిని ప్రారంభించే అవకాశం వచ్చింది. అంత మాత్రాన జగన్ పాత్ర ఏమీ లేదన్న భావన కల్పించే ప్రయత్నం అభ్యంతరకరం. ఇందులో మేజర్ క్రెడిట్ అంతా జగన్దే అనే అభిప్రాయం ఉంది. కరోనా రెండేళ్లు లేకుండా ఉంటే జగనే ప్రారంభించి ఉండేవారేమో!. హైటెక్ సిటీ విషయంలోనూ ఇంతే. దానికా పేరు, పరిసర ప్రాంతాలకు సైబరాబాద్ అన్న నామకరణం జరిగింది మొదలు.. అంతా బాబే చేశాడన్న ప్రచారం జరిగిపోయింది.. జరుగుతూనే ఉంది. రెండు దశాబ్దాల క్రితం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ సీఎంగా చంద్రబాబు ఉన్నారు. ఆ తరువాత చాలా అభివృద్ది జరిగింది. వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో జరిగినన్ని పనులు మరే ప్రభుత్వంలోను జరిగి ఉండకపోవచ్చు. ఔటర్ రింగ్ రోడ్డు, పీవీ నరసింహరావు ఎక్స్ప్రెస్ హైవే, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ట్, హైదరాబాద్ నగరంలో రోడ్లు, పలు వంతెనల నిర్మాణం వైఎస్ హయాంలోనే జరిగాయి. ఆ తర్వాత కేసీఆర్ సీఎంగా ఉండగా నగరంలో పలు ప్రాంతాల్లో ఫ్లైఓవర్లు, అండర్పాస్లు, నిర్మాణమైన సంగతి తెలిసిందే. ప్రస్తుత సీఎం కూడా ఫ్యూచర్ సిటీ పేరుతో అభివృద్ధి పనులు భారీ ఎత్తున చేపట్టారు. ఇది నిరంతర ప్రక్రియ. కానీ.. తెలుగుదేశం పార్టీ మాత్రం తనకు ముందర, తన తర్వాత జరిగిన అభివృద్దిని సైతం తమ కృషిగానే ప్రచారం చేసుకోగలదు. హైదరాబాద్లో నిజంగానే అంత అభివృద్ది జరిగి ఉంటే, విభజిత ఏపీలో కూడా ఎందుకు అభివృద్ది జరగలేదన్న దానికి జవాబు ఇవ్వరు. గత వైసీపీ ప్రభుత్వం తీసుకువచ్చిన అనేక వ్యవస్థలను తామే తెచ్చామన్న భావన కల్పించేందుకు చంద్రబాబు ప్రభుత్వం వాటి పేర్లు మారుస్తోంది. జగన్ టైమ్లో విశాఖను కార్యనిర్వాహక రాజధానిగా ప్రకటించి దేశంలోనే ప్రముఖ నగరంగా అభివృద్ది చేయాలని తలపెడితే అడ్డు పడింది తెలుగుదేశం పార్టీనే కదా!. ఇదే జరిగి ఉంటే ఇప్పుడు అమరావతి కోసం మరీ లక్ష కోట్ల వ్యయం చేయాల్సిన అవసరం ఉండేది కాదు. పైగా నగరం వేగంగా అభివృద్ది చెందేది. తద్వారా కొత్త విమానాశ్రయానికి ప్రయాణికుల సంఖ్య గణనీయంగా పెరిగేది. విశాఖలోని ప్రస్తుత విమానాశ్రయం రక్షణ శాఖది. దాన్ని పౌరసేవలకూ వాడుతున్నారు. ఎప్పటికైనా కొత్త ఎయిర్ పోర్టు ఏర్పాటు చేసుకోవలసిందే. ఈ క్రమంలో ఈ ప్రతిపాదన వచ్చింది. చంద్రబాబు ప్రభుత్వం 15 వేల ఎకరాల భూమి సేకరించాలని ప్రతిపాదించడంతో పెద్ద వివాదమైంది. రైతులు తీవ్రంగా వ్యతిరేకించారు. పైగా పరిహారంపై కూడా నిరసనలు వ్యక్తమయ్యాయి. కోర్టులో కేసులు వేశారు. అప్పట్లో విపక్ష నేతగా వైఎస్ జగన్ రైతులకు మద్దతిచ్చారు. టీడీపీ నేతల భూదందాను బహిర్గతం చేశారు. ఈ ఆందోళనల ఫలితంగా చంద్రబాబు ప్రభుత్వం దిగివచ్చింది. ఐదువేల ఎకరాలు చాలన్న నిర్ణయానికి వచ్చింది. ఆ రోజుల్లో జనసేన అధినేత పవన్ కళ్యాణ్ భోగాపురం ఎయిర్ పోర్టు భూసేకరణ తీరుపై మండిపడ్డారు. తెలుగుదేశంపై అవినీతి ఆరోపణలు చేశారు. తెలుగుదేశం నేతలు, టీడీపీ మీడియా పవన్ విమర్శల గురించి మాట్లాడకుండా, ఈ ఎయిర్ పోర్టును జగన్ వ్యతిరేకించినట్లు అబద్దపు ప్రచారం చేస్తోంది. టీడీపీ సోషల్ మీడియా కూడా చంద్రబాబే మొత్తం ఎయిర్ పోర్టు నిర్మాణం చేసినట్లు బిల్డప్ ఇచ్చే ప్రయత్నం చేసింది. దానికి తగ్గట్లే కేంద్ర పౌర విమానయాన మంత్రి కింజరాపు రామ్మోహన్ నాయుడు కూడా ట్రయల్ రన్ సందర్భంగా మాట్లాడుతూ ఇదంతా చంద్రబాబు విజన్ అని చెప్పారు. కానీ.. జగన్ మాత్రం పద్దతిగా కామెంట్ చేస్తూ ఎయిర్ పోర్టు యాజమాన్యం అయిన జీఎంఆర్ సంస్థను అభినందించారు. ఏపీ అభివృద్దిలో ఇది ఒక మైలురాయి అని వ్యాఖ్యానించారు. తమ పాలనలో వేగంగా అనుమతులు పొందే యత్నం చేశామని పేర్కొన్నారు. భూములు ఇచ్చిన రైతులకు పునరావాసం, భూ సేకరణ కోసం రూ.960 కోట్లు ఖర్చు చేసిందని ఆయన గుర్తు చేసుకున్నారు. టీడీపీ దీనిని కూడా సహించలేకపోయింది. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు భూములు ఇవ్వద్దని రెచ్చగొట్టారని తప్పుడు ఆరోపణ చేసింది. కాంట్రాక్ట్ సంస్థ జీఎంఆర్ను బెదిరించారని కూడా ఈ మీడియా రాసింది. అదే నిజమైతే జీఎంఆర్ అధినేత గ్రంధి మల్లిఖార్జునరావు భోగాపురం ఎయిర్ పోర్టుకు జగన్ శంకుస్థాపన చేసిన సందర్భంలో ఆయనే మళ్లీ ప్రారంభోత్సవం చేయాలని ఎలా కోరారు?. శంషాబాద్ ఎయిర్పోర్టును వైఎస్ రాజశేఖరరెడ్డి శంకుస్థాపన చేశారని, పూర్తి అయ్యాక ఆయనే ప్రారంభోత్సవం చేశారని స్వయంగా మల్లిఖార్జునరావు ఆ సభలో తెలిపారు. ఇప్పుడు సంబంధిత వీడియో వైరల్ అవుతోంది. అంతేకాదు.. జగన్ ఆ రోజుల్లో రైతుల తరపున నిలబడి అన్నివేల ఎకరాల భూమి అవసరం లేదని, న్యూయార్క్ తదితర చోట్ల ఎంత భూమి ఎయిర్ పోర్టు నిర్మాణానికి వాడారో తెలిపారు. బాగా రద్దీ ఉండే అనేక ఎయిర్ పోర్టులు వెయ్యి నుంచి రెండువేల ఎకరాలలో ఉన్న మాట వాస్తవమే కదా! జగన్ ముఖ్యమంత్రి అయిన తర్వాత భూ సేకరణను 2500 ఎకరాలకు పరిమితం చేసి రైతులలో ఆందోళన తగ్గించారు. భూములు కోల్పోయినవారికి ఎకరాకి రూ.12.5 లక్షల బదులు రూ.28 నుంచి రూ.36 లక్షల వరకు చెల్లించారు. చంద్రబాబు అనుమతులతో సంబంధం లేకుండా 2019 ఎన్నికలకు ముందు శంకుస్థాపన చేస్తే జగన్ ముఖ్యమంత్రిగా కేంద్రం నుంచి అన్ని అనుమతులు సాధించి, చంద్రబాబు టైమ్లో ఉన్న చిక్కు ముళ్లను విప్పి, కేసుల పరిష్కారం చేసి, రైతులకు కూడా అసంతృప్తి లేకుండా చేసి నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. చంద్రబాబు గతంలో కూడా కుప్పం, నెల్లూరు జిల్లాలోను విమానాశ్రయాలకు శంకుస్థాపన చేశారు. కుప్పంలో అయితే ఎనిమిది నెలల్లో పూర్తి చేసేస్తామని ప్రకటించారు. ఈ టర్మ్లో అప్పుడే 18 నెలలు పూర్తి అయినా ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా అది ఉండిపోయింది. అంతేకాదు. కొందరు విజయవాడ మెట్రో 2019కల్లా పూర్తి చేస్తామని చంద్రబాబు హడావుడి చేశారు. కాని అది అడుగు కూడా ముందుకు పడలేదు. చంద్రబాబు పూర్తి చేయలేకపోయిన కనకదుర్గ గుడి వద్ద ఫ్లై ఓవర్ను జగన్ ప్రభుత్వం పూర్తి చేయించింది. అలాగే కృష్ణా వరద రాకుండా కృష్ణలంక ప్రాంతంలో భారీ రిటైనింగ్ వాల్ ను జగన్ ప్రభుత్వమే నిర్మించింది. చంద్రబాబు ట్రాక్ రికార్డు అత్యధిక సందర్భాల్లో.. శంకు స్థాపనలు,ప్రచారాలకే పరిమితం. వైఎస్ రాజశేఖరరెడ్డి, జగన్లు తాము చేపట్టిన ప్రాజెక్టులను పూర్తి అయ్యే దిశగా అడుగులు వేశారు. అందులో భోగాపురం ఎయిర్ పోర్టు ఒకటి. కనుక దీని క్రెడిట్ లో సింహభాగం జగన్కే దక్కుతుందని చెప్పొచ్చు.::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత. -
సంక్రాంతి సంబురాలు.. అడ్డంగా దోచేస్తున్న కూటమి నేతలు
ఏపీలో సంక్రాంతి సంబురాలను కూటమి నేతలు పూర్తి జూదంగా మార్చేశారు. ప్రత్యేకించి.. టీడీపీకి చెందిన నేతలు ప్రజల పండుగను విపరీతంగా క్యాష్ చేసుకుంటున్నారు. హైకోర్టు ఆదేశాలను బేఖాతరు చేస్తూ కోడిపందేలు ఆటలు నిర్వహిస్తున్నారు. మంత్రులు, అధికార పార్టీ ఎమ్మెల్యేలు తమ అనుచరులతో నడిపిస్తున్నారు. మరోవైపు.. అర్ధరాత్రి దాకా అశ్లీల నృత్యాలను టీడీపీ, జనసేన నేతలు దగ్గరుండి నిర్వహిస్తుండడం చర్చనీయాంశమైంది. కూటమి నేతల ఆ దోపిడీ ఎలా ఉందంటే.. ఆంధ్రప్రదేశ్ హైకోర్టు సంక్రాంతి సందర్భంగా కోడి పందేలు, జూదంపై కఠిన ఆదేశాలు జారీ చేసింది. ఆ జిల్లాల కలెక్టర్లు, పోలీసు అధికారులు కట్టడి చేయాలని.. అవసరమైతే సెక్షన్ 144 అమలు చేయాలని సూచించింది. తమ ఆదేశాలు ఉల్లంఘించి కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే దాడులు చేసి డబ్బును సీజ్ చేయాలని కూడా ఆదేశించింది. కానీ.. కూటమి నేతలకు భయపడుతున్న పోలీసులు ఆ పక్కకు కూడా పోవడం లేదు. సీఎం సభ రేంజ్లో..ఒక పక్క.. ఉమ్మడి.. కృష్ణా, గుంటూరు, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, విశాఖ జిల్లాలు ఈ సంక్రాంతికి మునుపటిలాగే కోడిపందాలు, పేకాట, జూదానికి ప్రధాన అడ్డాలుగా మారాయి. సీఎం సభలకు వేసే జర్మన్ హ్యాంగర్స్ వేసి మరీ పందేల కోసం భారీగా ఏర్పాట్లు చేశారు. మీడియాను బరుల చుట్టుపక్కలకూ కూడా రానివ్వడం లేదు. ఆఖరికి.. సెల్ఫోన్లతో వీడియోలు తీయకుండా ప్రైవేట్ సైన్యాన్ని ఏరపాటు చేస్తున్నారు. వీఐపీలు రిఫ్రెష్ కావడానికి కారవాన్లు ఏర్పాటు చేస్తున్నారు. కోడి పందాలతో పాటు పేకాట గుండాటతోపాటు మరికొన్ని ఆటలు నిర్వహిస్తున్నారు. గెలిచిన వారికి కార్లు, బైకులు బహుమతులుగా ఇస్తున్నారు. అలా కోట్ల రూపాయలు చేతులు మారుతున్నాయి. కేవలం మూడు రోజుల్లోనే రూ.2000 కోట్లకు దాకా జూద క్రీడలు నిర్వహించినట్లు సమాచారం. మరోవైపు.. ఏరులై పారతున్న..మరోవైపు.. కోడి పందేల బరుల దగ్గరే బెల్ట్ షాపులు వెలిశాయి. అవి వైన్ షాపులను తలపిస్తున్నాయి. కూటమి నేతలు, వాళ్ల అనుచరులే వాటిని నడిపిస్తున్నారు. మద్యం ప్రియుల వీక్నెస్ను క్యాష్ చేసుకుంటూ లిక్కర్ను ఏరులై పారిస్తున్నారు. లిక్కర్ క్వార్టర్ బాటిల్ మీద అదనంగా రూ.50 , బీర్ బాటిల్ పై రూ.100 వసూలు చేస్తున్నారు. తద్వారా కోట్ల రూపాయల్ని వెనకేసుకుంటున్నారు. ఇంత జరుగుతున్నా.. ఎక్సైజ్ పోలీసులు ఆ వైపు కన్నెత్తి చూడడం లేదు.డాన్స్ బేబీ డాన్స్ఇంకోవైపు.. సాంస్కృతిక కార్యక్రమాల పేరిట యువతులతో రికార్డింగ్ డ్యాన్సులు చేయిస్తున్నారు. కూటమి నేతలైతే ఆ డ్యాన్సర్లతో కలిసి హుషారుగా గంతులేస్తున్నారు. కొందరైతే.. యువతులను దుస్తులు విప్పమంటూ ఎంకరేజ్ చేస్తున్నారు. ఈ క్రమంలో డాన్సర్లతో ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తిస్తున్న ఉదంతాలు చోటు చేసుకుంటున్నాయి. ఇందుకు సంబంధించిన వీడియోలు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ప్రధానంగా డా. బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలోని కొత్తపేట, రాజోలు, అమలాపురం సహ పలు ప్రాంతాల్లో అర్ధరాత్రి దాకా ఈ తంతు జరుగుతోంది. రాజోలులో ఎమ్మెల్యే వరప్రసాద్ అనుచరుడు దగ్గురుండి మరీ డ్యాన్సులు నిర్వహించినట్లు తెలుస్తోంది. ఈ అశ్లీల వ్యవహారాలను అడ్డుకోవాల్సిన పోలీసులు పత్తా లేకుండా పోయారు. నెట్టింట చర్చ.. రచ్చ..ఈ బాగోతాలపై నెట్టింట జోరుగా చర్చ నడుస్తోంది. కోడి పందేలు, గుండాట.. ఆ ప్రాంగంలోనే మందు బాబుల వీరంగం తాలుకా వీడియోలు నెట్టింట కనిపిస్తున్నాయి. అశ్లీల నృత్యాలను ప్రస్తావిస్తూ.. తెలుగు రాష్ట్రాలకు చెందిన కొందరు నెట్టింట పరస్పరం విమర్శలు గుప్పించుకుంటున్నారు. అదే సమయంలో.. వీటి కోసం తెలంగాణ నుంచి భారీగా తరలి వస్తున్నారనే విషయాన్ని కూడా ప్రముఖంగా ప్రస్తావిస్తున్నారు. మొత్తంగా కూటమి ప్రభుత్వం సంబురాల పేరిట గబ్బు పట్టిస్తోందని పలువురు మండిపడుతున్నారు. -
సంక్రాంతి సంబరాలను జూదంగా మార్చేసిన కూటమి నేతలు... ఏపీలో పండుగ వేళ యథేచ్ఛగా దోపిడీ... 2 రోజుల్లోనే వెయ్యి కోట్ల రూపాయల జూదం .
-
టీడీపీ గూండాల దాడి.. వైఎస్సార్సీపీ కార్యకర్త కన్నుమూత
సాక్షి, పల్నాడు జిల్లా: గురజాల నియోజకవర్గంలో దారుణం జరిగింది. టీడీపీ గూండాల దాడిలో తీవ్రంగా గాయపడిన వైఎస్సార్సీపీ కార్యకర్త సాల్మన్.. చికిత్స పొందుతూ కన్నుమూశాడు. దీంతో ఆ కుటుంబం శోక సంద్రంలో మునిగిపోయింది. పిన్నెల్లి గ్రామానికి చెందిన సాల్మన్ మొదటి నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా ఉంటున్నాడు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఊరు వదిలి వెళ్లిపోవాలని సాల్మన్కు తెలుగుదేశం నాయకులు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో ప్రాణభయంతో కుటుంబంతో సహా బ్రహ్మణపల్లికి మకాం మార్చాడు. అయితే.. వైఎస్సార్సీపీ నేతలు ధైర్యం చెబుతుండడంతో రెండు నెలల కిందట సాల్మన్ కుటుంబం తిరిగి పిన్నెల్లికి వచ్చే ప్రయత్నం చేసింది. ఈ క్రమంలో కొందరు స్థానికుల సాయంతో టీడీపీ నేతలు వాళ్లను అడ్డుకున్నారు. పంచాయితీ తర్వాత చివరకు సాల్మన్ మినహా కుటుంబ సభ్యులను మాత్రమే ఊర్లో ఉండేందుకు అనుమతి ఇచ్చారు. అయితే.. సాల్మన్ భార్య ఈ మధ్య అస్వస్థతకు గురైంది. దీంతో.. ఈనెల 10వ తేదీన పిన్నెల్లి వెళ్లి ఆమెను చూడటానికి సాల్మన్ ప్రయత్నించాడు. రావొద్దన్నా.. ఎందుకు వచ్చావ్ అంటూ టీడీపీ గూండాలు ఆయన్ని చితకబాదారు. తీవ్ర గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు గుంటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న టైంలోనే కోమాలోకి వెళ్లిన సాల్మన్.. చివరకు నాలుగు రోజుల తర్వాత ఈ ఉదయం కన్నుమూశాడు. ఈ ఘటనపై స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు.సాల్మన్పైనే కేసు!సాల్మన్ మృతి చెందిన విషయం తెలిసి మాజీ ఎమ్మెల్యే కాసు మహేష్ రెడ్డి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఎమ్మెల్యే యరపతినేని శ్రీనివాసరావు, దాచేపల్లి సీఐ పొన్నూరు భాస్కర్ అండతోనే ఈ హత్య జరిగిందని మండిపడ్డారు. ‘‘కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పిన్నెల్లి గ్రామానికి చెందిన వందలాది కుటుంబాలు బయటికి వెళ్లిపోయాయి. సాల్మన్ కూడా బయటే బతుకుతున్నాడు. టీడీపీ నేతల చేతిలో తీవ్రంగా గాయపడిన కోమాలోకి వెళ్లిన సాల్మన్పైనే కేసు పెట్టారు. ఈ కేసులో సీఐ పనికిమాలిన సెక్షన్స్ పెట్టాడు. రేపు పిన్నెల్లిలోనే సాల్మన్ అంత్యక్రియలు జరిపి తీరుతాం. చంద్రబాబు, లోకేష్లు మీడియా ముందు నీతులు చెప్పడం కాదు.. పిన్నెల్లి అంశంపై మాట్లాడండి అంటూ మహేష్ రెడ్డి హితవు పలికారు. -
స్కిల్ స్కామ్ కేసు అలా ముగిసింది..
సాక్షి, విజయవాడ: అధికార దుర్వినియోగంలో చంద్రబాబు అరుదైన ఘనత సాధించారు. తనపై ఉన్న కేసులను మాఫీ చేసుకునే ప్రయత్నంలో వరుస విజయాలు సాధించుకుంటూ పోతున్నారు. నిందితుడిగా 53 రోజులపాటు జైలు శిక్ష అనుభవించిన స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును మొత్తానికి క్లోజ్ చేయించుకున్నారు. ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడిపై ఉన్న స్కిల్ స్కామ్ కుంభకోణం కేసును విజయవాడ ఏసీబీ కోర్టు కొట్టేసింది. ఈ కేసును కొట్టేయాలని కోరుతూ సీఐడీ తుది నివేదికను కోర్టులో ఫైల్ చేసింది. విచారణ జరిపిన న్యాయస్థానం.. చివరకు ‘మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్’గా పరిగణిస్తూ ఈ తీర్పు ఇచ్చింది. దీంతో చంద్రబాబు సహా 35 మందికి ఊరట దక్కినట్లయ్యింది.ఆంధ్రప్రదేశ్లో 2014–2019 చంద్రబాబు సీఎంగా ఉండగా.. ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (APSSDC) ప్రాజెక్టులో నిధుల దుర్వినియోగం జరిగిందనే ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో 2018లో ఏపీ సీఐడీ కేసు నమోదు చేసి విచారణ జరిపింది. 2023కల్లా ఈ కేసు దర్యాప్తు ముమ్మర స్థాయికి చేరుకుంది. స్కామ్ జరిగిన మాట వాస్తవమేనని తేల్చింది. ఫేక్ కంపెనీల ద్వారా సుమారు రూ.371 కోట్ల నిధులు మళ్లించబడ్డాయని నిర్ధారించింది. అలా ఈ కేసులో మాజీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడి నిందితుడిగా పేర్కొంటూ సెప్టెంబర్ 9, 2023లో అరెస్ట్ చేశారు. దీంతో ఈ కేసు దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది.కేసు దర్యాప్తులో ఉండడంతో కోర్టు బెయిల్ నిరాకరించింది. దీంతో ఆయన రాజమండ్రి సెంట్రల్ జైల్లో రిమాండ్ ఖైదీగా గడిపారు. ఆ సమయంలో ఆయన్ని సీఐడీ కస్టడీకి తీసుకుని విచారణ జరిపింది కూడా. మరోవైపు.. ఈ కేసును ఈడీ సైతం విచారణ జరిపి పలువురి ఆస్తులను సైతం జప్తు చేసింది. అనారోగ్య కారణాలు చూపిస్తూ 53 రోజుల తర్వాత బెయిల్పై బయటకు వచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ముఖ్యమంత్రి అయ్యాక కేసు కొట్టేయించుకోవడానికి సీఐడీతో పిటిషన్ వేయించారు. గతంలో స్కిల్ కేసులో అన్ని ఆధారాలు ఉన్నాయని చెప్పిన ఏపీ సీఐడీ.. ఇప్పుడు ఇంత తీవ్రమైన కేసులో ఏమాత్రం నేరం జరిగినట్లు ఎలాంటి ఆధారాలు లేవని పేర్కొనడం గమనార్హం. ఇటు చంద్రబాబు అధికార దుర్వినియోగంపై న్యాయ నిపుణులు సైతం విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా కేసులు మూయించుకోవడంపై అభ్యంతరాలు వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు.. ఇది అధికార దుర్వినియోగానికి పరాకాష్ట అని వైఎస్సార్సీపీ ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. -
ఏపీ యువతకు బాబు వెన్నుపోటు
సాక్షి, తాడేపల్లి: యువత ఏకాగ్రత, లక్ష్యంతో కృషి చేస్తే దేశం బలపడుతుందని స్వామి వివేకానంద నమ్మారని.. కానీ, ఆంధ్రప్రదేశ్లో యువత మాత్రం అందుకు భిన్నంగా దుర్భర పరిస్థితుల్ని ఎదుర్కొంటోందని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. జాతీయ యువజన దినోత్సవం సందర్భంగా చంద్రబాబు మోసాలను ప్రస్తావిస్తూ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు.చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వ పాలనలో 8 త్రైమాసికాలకు గానూ ఫీజు రీయింబర్స్మెంట్లు, రూ.4,900 కోట్ల విద్యా దీవెన (Vidya Deevena), రూ2,200 కోట్ల వసతి దీవెన (Vasathi Deevena) బకాయిలు పేరుకుపోయాయని.. అలాగే నెలకు రూ.3,000 నిరుద్యోగ భృతి (మేనిఫెస్టో వాగ్దానం) చొప్పున 2 సంవత్సరాలుగా చెల్లింపులు లేవని గుర్తు చేశారు. ఆన్లైన్ సర్టిఫికేషన్ కోర్సులు నిలిపివేత గురించి ప్రత్యేకంగా ప్రస్తావించారు. ఈ మోసం ద్వారా యువతను తమ లక్ష్యాలను సాధించకుండా అడ్డుపడుతున్నారని మండిపడ్డారు. ఏపీలో కూటమి పాలన పరిస్థితులు యువత భవిష్యత్తును ప్రమాదంలోకి నెట్టేస్తున్నాయని ఆందోళన వ్యక్తం చేసిన వైఎస్ జగన్.. మేనిఫెస్టో వాగ్దానాలను ఉల్లంఘించి చంద్రబాబు యువతకు వెన్నుపోటు పొడిచారని మండిపడ్డారు. ఇకనైనా మేల్కొని యువత తమ లక్ష్యాలను సాధించేందుకు అవసరమైన సహకారం అందించాలని.. వివేకానందుడి ప్రముఖ సూక్తిని ఒకదానిని(Arise, Awake, and facilitate..) ప్రస్తావిస్తూ చంద్రబాబు ప్రభుత్వానికి వైఎస్ జగన్ హితవు పలికారు. Swami Vivekananda believed that if the youth work with focus and a goal, India grows stronger. On this National Youth Day, we remember his call.Is the state government allowing the youth to achieve this goal?In reality, the state of Andhra Pradesh's youth is grim:• 8…— YS Jagan Mohan Reddy (@ysjagan) January 12, 2026 -
ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో రెండేళ్లుగా భారీగా తగ్గిపోతున్న విద్యార్థుల సంఖ్య... ప్రైవేటు స్కూళ్లలో పెరిగిన చేరికలు
-
ఆంధ్రప్రదేశ్లో దారి దోపిడీకి పచ్చజెండా... సంక్రాంతి వేళ ప్రైవేట్ ట్రావెల్స్ ఆగడాలకు తలాడిస్తున్న కూటమి ప్రభుత్వం
-
సుప్రీంకోర్టు ఆదేశాలు బేఖాతరు... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు ఆంధ్రప్రదేశ్ సీఐడీ పన్నాగం...
-
ఏపీలో మద్యం ప్రియులకు షాక్
సాక్షి, విజయవాడ: మద్యం ప్రియులకు కూటమి ప్రభుత్వం షాక్ ఇచ్చింది. సంక్రాంతి పండుగ నుంచి మద్యం ధరలు పెంచేందుకు అనుమతులు ఇచ్చింది. ఈ మేరకు ఇవాళ జరిగిన కేబినెట్ సమావేశం ఆమోదం తెలిపింది. బాటిల్ పై ఏకంగా రూ. 10 ధర బాదుడుకు చంద్రబాబు సర్కార్ నిర్ణయం తీసుకుంది. ఎన్నికల సమయంలో మధ్యం ధరలు తగ్గిస్తానని మద్యం ప్రియులకు హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఇప్పుడు సంపద సృష్టిలో భాగంగా బాదుడుకు సిద్ధమయ్యారు. గతంలోనూ బాటిల్పై రూ.10 పెంచి.. ఇప్పుడు మరోసారి అదీ పండుగపూటనే పెంచాలని నిర్ణయించారు. దీంతో ఏడాదికి రూ.1,391 కోట్లు మందు బాబులపై భారం పడనుంది. ఈ నిర్ణయం ఇండియన్ మేడ్ ఫారిన్ లిక్కర్(IMFL), ఫారిన్ లిక్కర్ (FL)కు వర్తింపజేయాలని భావిస్తోంది. దీంతో.. 70 శాతం మద్యం బాటిళ్లపై ధరలు పెరగనున్నాయి. లిక్కర్ సిండికేట్కి దాసోహం.. లిక్కర్ సిండికేట్తో కుమ్మక్కు అయిన చంద్రబాబు నాయుడు.. ప్రభుత్వ ఆదాయానికి గండి కొడుతున్నారు సిండికేట్కు అనుగుణంగా నిర్ణయాలు అమలు చేస్తున్నారు. తాజాగా కేబినెట్ భేటీలో బార్లకు అదనపు రిటైల్ ట్యాక్స్ తొలగించేయాలని నిర్ణయించారు. దీంతో.. ఏడాదికి 340 కోట్లు బార్ల సిండికేట్కి లబ్ధి చేకూరనుంది. గత చంద్రబాబు పాలనలోనూ.. ప్రివిలైజ్ ట్యాక్స్ రద్దు చేశారు. ఈ దఫా కూటమి ప్రభుత్వంలో ఏఆర్ఈటీని రద్దు చేశారు. ఈ నిర్ణయాలపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తున్నాయి. మంత్రులపై మళ్లీ సీరియస్మంత్రుల తీరుపై సీఎం చంద్రబాబు మళ్లీ సీరియస్ అయ్యారు. మంత్రులెవ్వరూ ఏ పని చేయడం లేదని.. తమ పని తీరు మార్చుకోవాలంటూ అసహనం వ్యక్తం చేశారు. ‘‘నేనే నెలకు రెండు, మూడుసార్లు పార్టీ ఆఫీస్కు రావాల్సి వస్తోంది. వినతులు ఏమాత్రం తగ్గడం లేదు. పార్టీ కోసం ఐదేళ్లు కష్టపడ్డవారి వివరాలు ఇవ్వడం లేదు. పార్లమెంట్ కమిటీలు కూడా నేనే పూర్తి చేశానంటే జిల్లా మంత్రుల పనితీరు ఏంటో అర్థమవుతోంది’’ అంటూ ఎప్పటిలాగే అసంతృప్తిని మంత్రులపై నెట్టేశారాయన. -
పోలవరంపై వ్యాఖ్యలు.. చంద్రబాబుకు అంబటి చురకలు
సాక్షి, తాడేపల్లి: ప్రాజెక్టులను నిర్మించిన చరిత్ర చంద్రబాబుకి లేదని.. అలాంటిది కేంద్రం నిర్మించాల్సిన పోలవరం ప్రాజెక్టును తాను ఎందుకు తీసుకున్నారో ఇప్పటికైనా చెప్పాలని వైఎస్సార్సీపీ నేత, మాజీ మంత్రి అంబటి రాంబాబు అంటున్నారు. పోలవరంపై చంద్రబాబు తాజా వ్యాఖ్యలపై అంబటి బుధవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో మాట్లాడుతూ కౌంటర్ ఇచ్చారు. ‘‘డయాఫ్రమ్ వాల్ కొట్టకుపోవడానికి వైఎస్సార్సీపీనే కారణమంటూ చంద్రబాబు చెబుతున్నారు. పదే పదే అబద్ధాలు చెప్పడం ఆయనకు అలవాటే. పోలవరాన్ని చంద్రబాబు ఏటీఎంలా వాడుకున్నారని స్వయంగా ప్రధాని మోదీనే అన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ విషయంలో.. ఆంధ్రా ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టారు. రాయలసీమ ప్రజల గుండెలపై చంద్రబాబు కొట్టారు’’ అని అంబటి వ్యాఖ్యానించారు. ఇంకా ఆయన ఏమన్నారంటే.. ‘‘డయాఫ్రమ్ వేయాలంటే కాపర్ డ్యామ్స్ కట్టాలన్న జ్ఞానం కూడా చంద్రబాబుకి లేదు. అలాంటప్పుడు కాపర్ డ్యాం వేయకుండా ఢయాఫ్రం ఎలా వేశారో ఆయన సమాధానం చెప్పాలి. నది డైవర్ట్ చేశాం, స్పిల్ వే పూర్తి చేశాం.. కాపర్ డ్యామ్స్ కట్టిన ఘనత జగన్ ప్రభుత్వానికే దక్కుతుంది. అలాంటిది జగన్ 2 శాతమే పూర్తి చేశారని అబద్ధాలు చెబుతున్నారు. ఆ అబద్ధాతో ప్రజలను నమ్మించడానికి ప్రయత్నిస్తున్నారు.ప్రాజెక్టులను చంద్రబాబు సర్వనాశనం చేస్తున్నారు. పోలవరం అనేది వైఎస్సార్ కలల పంట. కానీ, చంద్రబాబు పట్టిసీమను కాంట్రాక్టర్లకు దోచిపెట్టడానికి కట్టారు. పోలవరం ఎత్తును 45.72 నుండి 41.15 కు కుదించారు. పోలవరాన్ని బ్యారేజ్ చేస్తున్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అనవసరమని చంద్రబాబు అంతకుముందు ఎందుకు చెప్పలేదు. రేవంత్ రెడ్డి చెప్పిన తర్వాతే అనవసరమని గుర్తొచ్చిందా?.. ఏపి ప్రజల హక్కును తాకట్టు పెట్టి తెలంగాణతో సత్సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం లేదు. అసలు రేవంత్ రెడ్డిని కాంగ్రెస్ లో పంపి కుళ్ళు రాజకీయాలు చేస్తుంది చంద్రబాబే. తెలంగాణలో టిడీపీ బలపడటం కోసమే ఏపి, రాయలసీమ ప్రజలకు అన్యాయం చేస్తున్నారు. రాష్ట్ర ప్రయోజనాలు తాకట్టు పెడుతున్నారు.మేం రెడీపోలవరంపై చర్చుకు మేం సిద్ధం. మీ జలవనరుల శాఖా మంత్రిని పంపించండి అని చంద్రబాబుకు అంబటి రాంబాబు సవాల్ విసిరారు. ‘‘రాయలసీమ ప్రత్యేక రాష్ట్రం కావాలన్న డిమాండ్ ఎప్పటి నుండో ఉంది. అయితే ఆ డిమాండ్ సరైంది కాదని మా ఉద్దేశం. చంద్రబాబు నాయుడు లక్ష ఎకరాల్లో రాజధానిని కట్టాలనుకోవడమే దురదృష్టకరం. అంత కెపాసిటీ మన రాష్ట్రానికి లేదు. అంత నగరాన్ని నిర్మించాల్సిన అవసరం లేదు. కృష్ణా నది మట్టం కంటే తక్కువ ఉన్న ప్రాంతాన్ని రాజధానికి ఎంపిక చేయడం దుర్మార్గం.చంద్రబాబు తాను దోచిన డబ్బుల్లో సగం పవన్ బ్రదర్కు ఇస్తున్నారు. ఆ డబ్బుల లెక్కలు చూసేది లోకేషే. చంద్రబాబు పాలనపై ఏడాదిన్నర లోనే చాలా వ్యతిరేకత వచ్చింది. జగనే బెటర్ ప్రజలు అనుకుంటున్నారు. మళ్ళీ జగన్ వస్తాడని అందరు అనుకుంటున్నారు అని అంబటి అన్నారు. -
భూమి కనపడితే చాలు డాకుమెంట్స్ తారుమారు వెంకటగిరి భూ కబ్జాలపై నేదురుమల్లి ఫైర్
-
ఇవాళ మంగళవారం.. దేశంలోకెల్లా ఏపీ సరికొత్త రికార్డు!
సాక్షి, అమరావతి: ఇవాళ మంగళవారం. షరా మామూలుగా కూటమి సర్కార్ చేయాల్సింది చేసింది. అయితే తాజా అప్పుతో సరికొత్త రికార్డు సృష్టించింది చంద్రబాబు ప్రభుత్వం. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర తిరగకుండానే.. ఏపీ అప్పు రూ.3 లక్షల కోట్లకు చేరింది. వారం కిందటే రూ.4 వేల కోట్ల అప్పు చేసిన బాబు సర్కార్(డిసెంబర్ 31 నాటికి 2,93,269 కోట్ల అప్పులు).. ఇవాళ మరో రూ.6,500 కోట్ల అప్పు తెచ్చింది. తద్వారా అత్యధిక అప్పులు చేసిన రాష్ట్రంగా ఏపీ, అత్యధిక అప్పులు చేస్తోన్న సీఎంగా చంద్రబాబు రికార్డు సృష్టించారు. వీటిల్లో.. బడ్జెటరీ అప్పులు రూ. 1,71,637 కోట్లు కాగా, . బడ్జెట్ బయట అప్పులు రూ.1,27,632 కోట్లు. 2024-25 ఆర్థిక సంవత్సరం మార్చి వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.81,597 కోట్లు కాగా, 2025-26 ఆర్థిక సంవత్సరంలో నవంబర్ వరకు కాగ్ నిర్ధారించిన అప్పు రూ.77,040 కోట్లుగా ఉంది. ఆ అప్పుల చిట్టాను ఓసారి పరిశీలిస్తే.. డిసెంబర్లో.. డిసెంబర్ 2న తెచ్చిన అప్పులు రూ.3,000 కోట్లుడిసెంబర్ 30న తెచ్చిన అప్పు రూ.4,000 కోట్లుజనవరి 6న తెచ్చిన అప్పు రూ.6,500 కోట్లుబడ్జెట్ బయట కార్పొరేషన్ల ద్వారా రూ.80,245 కోట్లు అప్పుఏపీ మార్క్ ఫెడ్ 19,900 కోట్లుజలజీవన్ మిషన్ కార్పొరేషన్ 10,000 కోట్లుఏపీఎండీసీ 9,000 కోట్లుఏపీఐఐసీ 8,500 కోట్లుపౌరసరఫరాల సంస్థ 7,000 కోట్లుఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 6,710 కోట్లుఏపీ బెవరేజస్ కార్పొరేషన్ (బాండ్లు) 5,750 కోట్లుఏపీసీపీడీసీఎల్, ఏపీ ఎస్ పి డిసి ఎల్ 5,473 కోట్లునాబార్డు నుండి డిస్కమ్స్ 3,762 కోట్లుఎస్ బీఐ ద్వారా ఏపీ పవర్ ఫైనాన్స్ కార్పొరేషన్ 2,000 కోట్లుబ్యాంకుల నుండి విద్యుత్ సంస్థలు 1,150 కోట్లుఏపీ విమానాశ్రయాల అభివృద్ధి కార్పొరేషన్ 1,000 కోట్లుఅమరావతి పేరుతో 47,387 కోట్లు అప్పులుప్రపంచ బ్యాంకు, ఎడిబి ద్వారా 15,000 కోట్లుహడ్కో ద్వారా అప్పు 11,000 కోట్లుఎన్ ఏ బి ఎఫ్ డి ద్వారా 7,500 కోట్లునాబార్డు ద్వారా అప్పు 7,387 కోట్లుకే ఎఫ్ డబ్ల్యూ అప్పు 5,000 కోట్లుఏ పీపీ ఎఫ్ సీఎల్ 1500 కోట్లుజగన్ హయాంలో అప్పులపై తప్పుడు ప్రచారంగత ఏపీ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో.. జగన్ ప్రభుత్వం రూ.14 లక్షల కోట్లప్పులు చేసిందని, ఏపీని మరో శ్రీలంక చేస్తున్నారంటూ చంద్రబాబు తప్పుడు ప్రచారాలు మొదలుపెట్టారు. అయితే అధికారంలోకి వచ్చాక.. కిందటి ఏడాది గవర్నర్ ప్రసంగంలో ఆ అప్పును రూ.10 లక్షల కోట్లుగా వినిపించారు. ఆ వెంట శ్వేత పత్రం పేరిట హడావిడి చేసి రిలీజ్ చేసి రూ.12.93 లక్షల కోట్లు అని ప్రచారం చేశారు. చివరికి బడ్జెట్కి వచ్చేసరికి ఆ అప్పులు మొత్తం రూ.6,46,531 కోట్లుగా చెప్పారు. చివరాఖరికి.. జగన్ హయాంలో చేసిన అప్పు కేవలం రూ.3,39,580 కోట్లు మాత్రమేనని.. వైఎస్సార్సీపీ ప్రభుత్వం దిగిపోయేనాటికి ఏపీ అప్పులు రూ.5,19,192 కోట్లు అని స్వయంగా ఆర్థిక మంతత్రి పయ్యావుల అసెంబ్లీలో చేసిన ప్రకటన బాబు దుర్మార్గమైన ప్రచారాన్ని బద్ధలు కొట్టింది. -
సీమ ఎత్తిపోతలకు చంద్ర‘గ్రహణం’. పర్యావరణ అనుమతిపై కేంద్ర అటవీ, పర్యావరణ శాఖ నిర్దేశించిన సమాచారాన్ని ఇవ్వని చంద్రబాబు సర్కార్
-
ఇచ్చింది తీసుకో..! నో డైలాగ్స్.. ఓన్లీ సైలెన్స్..!
-
ఏపీలో ప్రభుత్వ పెద్దల మిస్సింగ్
సాక్షి, విజయవాడ: ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఆశ్చర్యకర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, అలాగే మంత్రి నారా లోకేష్, ఇంకొందరు మంత్రులు గత కొన్ని రోజులుగా ప్రజలకు, మీడియాకు అందుబాటులో లేరు. నాలుగు రోజులుగా వీరి పర్యటనలపై ఎలాంటి అధికారిక సమాచారం లేకపోవడం ప్రజల్లో అనుమానాలు, ఆందోళనలు రేకెత్తిస్తోంది.కూటమి పార్టీల అనుకూల మీడియా వర్గాలు చంద్రబాబు విదేశాలకు వెళ్లారని చెబుతున్నప్పటికీ, ఆయన ఏ దేశంలో ఉన్నారు, ఎందుకు వెళ్లారు అనే విషయంపై అధికారికంగా టీడీపీ నోరు మెదపడం లేదు. ఇదే పరిస్థితి పవన్ కళ్యాణ్ది కూడా. ఉప ముఖ్యమంత్రి ఎక్కడ ఉన్నారన్నది స్పష్టత లేకపోవడంతో ప్రజల్లో చర్చలు మరింత వేడెక్కుతున్నాయి. ఇటు పవన్ కల్యాణ్ తన శాఖలకు సంబంధించిన ఏదో మొక్కుబడి ప్రకటన చేశారే తప్ప.. అధికార వర్గాలతో టచ్లో లేరని సమాచారం. అయితే అనూహ్యంగా ఆయన కొత్త సినిమా ప్రకటన మాత్రం చేశారు.వారం రోజుల క్రితమే నారా లోకేష్ కూడా గాయబ్ అయ్యారు. ఆయన కేబినెట్ సమావేశానికి హాజరుకాలేదు. అఫ్కోర్స్.. ఇది మొదటి నుంచి ఉండేదే. అయితే ఇప్పుడు కొత్తగా.. ఇతర మంత్రులు కూడా ముఖ్య నేతల బాటలోనే అజ్ఞాతంగా వెళ్లిపోవడం రాజకీయ వర్గాల్లో పెద్ద చర్చనీయాంశంగా మారింది.ప్రభుత్వ పెద్దలు ఉన్నపళంగా రాష్ట్రాన్ని వదిలి వెళ్లిపోవడం ప్రజల్లో ఆందోళన కలిగిస్తోంది. ముఖ్యంగా రాష్ట్రంలో అనేక ససమస్యలు పరిష్కారం కోసం ఎదురుచూస్తున్న సమయంలో, ముఖ్య నేతలు కనిపించకపోవడం ప్రజలకు అసహనాన్ని కలిగిస్తోంది. మరోవైపు, ప్రభుత్వ పెద్దల పర్యటనలపై జారీ చేసిన జీవోలను కూడా రహస్యంగా ఉంచడం, అధికారిక ప్రకటనలు ఇవ్వకపోవడం అనుమానాలను మరింత పెంచుతోంది. కొత్త సంవత్సరం సందర్భంగా.. ప్రజలకు సోషల్ మీడియాలో, పార్టీ తరఫున ప్రకటనల ద్వారా శుభాకాంక్షలు తెలియజేశారు కూటమి పెద్దలు. అయితే ప్రభుత్వపరంగా.. పాలనాపరంగా ఈ ఏడాదికి సంబంధించిన కీలక సమీక్షల నిర్వహణ, నిర్ణయాలు తీసుకోవాల్సిన టైంలో ఉన్నపళంగా వాళ్లు రాష్టం నుంచి గాయబ్ కావడం హాట్ టాపిక్గా మారింది.వ్యక్తిగత జీవితాలను సమయం కేటాయించడం తప్పు కాకపోయినా.. దానికంటూ ఓ లిమిట్ ఉంటుందని కొందరు నెటిజన్లు గుర్తు చేస్తున్నారు. ఉన్నపళంగా ఒక్కసారిగా అంతా ఒక్కసారి మాయం కావడం వెనుక అసలు కారణం ఏమిటి, వారు ఎక్కడ ఉన్నారు అనే ప్రశ్నలకు సమాధానం కోసం ఎదురుచూస్తున్నారు. -
పేరు పోలవరం.. ఊరు రంపచోడవరం
ఆంధ్రప్రదేశ్లో ఇప్పటివరకు 26 జిల్లాలు ఉండగా కూటమి ప్రభుత్వ మార్కాపురం, పోలవరం జిల్లాల ఏర్పాటు నిర్ణయంతో 28కి చేరింది. పునర్వ్యవస్థీకరణలో భాగంగా చేసిన మార్పులు నేటి(బుధవారం) నుంచి అమల్లోకి రానున్నాయి. కేవలం రాజకీయ ప్రయోజనాల కోసం జిల్లాలు, రెవెన్యూ డివిజన్లను అస్తవ్యస్తంగా పునర్వ్యవస్థీకరించింది చంద్రబాబు ప్రభుత్వం. వివాదాస్పద రీతిలో.. అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చారు. కొత్తగా అడ్డరోడ్డు జంక్షన్, అద్దంకి, పీలేరు, మడకశిర, బనగానపల్లె రెవెన్యూ డివిజన్లు ఏర్పాటయ్యాయి. రాజంపేట పార్లమెంటు నియోజకవర్గ ప్రాంతాన్ని గత ప్రభుత్వం అన్నమయ్య పేరుతో జిల్లాగా ఏర్పాటు చేస్తే.. చంద్రబాబు దాన్ని రద్దు చేసి చీలికలు పీలికలు చేశారు. ఆ పార్లమెంటు నియోజకవర్గాన్ని మూడు ముక్కలు చేసి మూడు జిల్లాల్లో కలపడంతో అక్కడి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మొదట అన్నమయ్య జిల్లాలో ఉన్న తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాలు, చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గంతో కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటు చేస్తున్నట్లు ప్రాథమిక నోటిఫికేషన్ ఇచ్చారు. తుది నోటిఫికేషన్ నాటికి ఆ జిల్లాలో మిగిలిన రాయచోటిని మదనపల్లె జిల్లాలోనూ, రాజంపేటను వైఎస్సార్ కడప, రైల్వేకోడూరు నియోజకవర్గాన్ని తిరుపతి జిల్లాలోనూ కలిపి దానికి రూపురేఖలు లేకుండా చేశారు. తాళ్లపాక కడపలోకి!రాజంపేట ప్రాంతాన్ని అన్నమయ్య జిల్లా నుంచి వేరు చేసి అన్నమయ్య పేరును మదనపల్లె జిల్లాకు పెట్టారు. నిజానికి ఇప్పుడు కొత్తగా ఏర్పాటు చేసిన మదనపల్లె జిల్లాకు అన్నమయ్య పేరు పెట్టినా దాంతో ఆయనకు సంబంధం లేదు. అన్నమయ్య స్వస్థలం రాజంపేట ప్రాంతంలోని తాళ్లపాక. ఆ నియోజకవర్గాన్ని వైఎస్సార్ కడప జిల్లాలో కలిపారు. కానీ ఆయన పేరును పక్కన ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పెట్టారు. పోలవరం లేకుండానే.. ఎన్నికల సమయంలో రాయచోటిలో నిర్వహించిన సభలో ఎట్టి పరిస్థితుల్లోనూ రాయచోటిని జిల్లా కేంద్రంగానే కొనసాగిస్తామని, దాన్ని మార్చబోమని అక్కడి ప్రజలకు చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆ హామీకి తిలోదకాలిచ్చి, ఇప్పుడు జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకి మార్చేశారు. అన్నమయ్య పుట్టిన ప్రాంతంతో సంబంధం లేని ప్రాంతానికి ఆయన పేరు పెట్టినట్లే.. పోలవరంతో సంబంధం లేని ప్రాంతంతో ఒక జిల్లా ఏర్పాటు చేసి పోలవరం పేరు పెట్టారు. అల్లూరి సీతారామరాజు జిల్లాను రెండు ముక్కలు చేసి కేవలం రంపచోడవరం నియోజకవర్గంతో పోలవరం జిల్లాను ఏర్పాటు చేశారు. అల్లూరి జిల్లాలో ఉన్నదే మూడు నియోజకవర్గాలు కాగా దాన్ని విడగొట్టి కొత్త జిల్లా ఏర్పాటు చేయడంపై ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. ఒరిజినల్ పోలవరం ఏలూరు జిల్లాలో ఉండగా, రాజకీయ లబ్ధి కోసం చంద్రబాబు రంపచోడవరం కేంద్రంగా ఏర్పాటు చేసిన కొత్త జిల్లాకు పోలవరం పేరు పెట్టారు. ఈ నిర్ణయంతో పోలవరం పేరుపై గందరగోళం నెలకొనడంతోపాటు రంపచోడవరం పేరుకి ప్రాధాన్యత తగ్గిపోనుంది. ఒకే ప్రాంతాన్ని రంపచోడవరం, పోలవరంగా పిలవాల్సిన పరిస్థితి ఏర్పడనుంది.శాస్త్రీయత లేకుండా..బాపట్ల జిల్లాలో ఉన్న అద్దంకి నియోజకవర్గాన్ని ప్రకాశం జిల్లాలో కలిపి బాపట్ల ప్రాధాన్యాన్ని తగ్గించారు. మార్కాపురం, కనిగిరి, ఎర్రగొండపాలెం, గిద్దలూరు నియోజకవర్గాలతో మార్కాపురం జిల్లా ఏర్పాటు చేసినా అది స్థానిక ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా లేదనే వాదన వినిపిస్తోంది. 2023లో శాస్త్రీయ పద్ధతిలో పార్లమెంటు నియోజకవర్గాలను జిల్లాలుగా ఏర్పాటు చేయగా ఇప్పుడు వాటిని అస్తవ్యస్తంగా మార్చి శాస్త్రీయత లేకుండా చేశారు. చంద్రబాబు తనకు రాజకీయంగా పట్టు లేని ప్రాంతాలను దెబ్బతీసేలా పునర్విభజన చేపట్టినట్లు స్పష్టమవుతోంది. అదే సమయంలో తమ ప్రాంతాలుగా చెప్పుకునే ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, అనంతపురం తదితర జిల్లాలను మాత్రం కదల్చకపోవడం ద్వారా పునర్విభజనలో కచ్చితంగా రాజకీయ ప్రయోజనాలు ఉన్నాయని స్పష్టమవుతోంది. జిల్లాల సరిహద్దులు, రెవెన్యూ డివిజన్ల మార్పులు, మండలాల మార్పులు సైతం టీడీపీ ప్రయోజనాలకు అనుగుణంగానే జరిగినట్లు తేటతెల్లమైంది. -
వివాదాస్పదంగా చంద్రబాబు విదేశీ పర్యటన!
సాక్షి, అమరావతి: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడి విదేశీ పర్యటన వివాదాస్పదంగా మారింది. అటు ప్రభుత్వ, ఇటు అధికార వర్గాలనే విస్మయానికి గురి చేస్తూ ఈ ఉదయం ఆయన లండన్ వెళ్లినట్లు సమాచారం. అయితే.. న్యూఇయర్ సెలబ్రేషన్స్ కోసమే ఆయన వెళ్లి ఉంటారని అటు టీడీపీ వర్గాలు జోరుగా కూడా చర్చించుకోవడం కొసమెరుపు. ఉండవల్లి నుంచి హైదరాబాద్కు.. అక్కడి నుంచి అటే లండన్కు అత్యంత రహస్యంగా సాగింది ఆయన పర్యటన. అయితే.. పదేపదే విదేశీ పర్యటల వెనుక మతలబు ఏంటనే చర్చ జోరందుకుంది ఇప్పుడు. ఈ ఏడాదిలో ఇప్పటికే చంద్రబాబు ఆరుసార్లు విదేశాలకు వెళ్లారు. సీఎం హోదాలో పెట్టుబడుల సాధన పేరు చెప్పి.. కుటుంబ సభ్యులతో వ్యక్తిగతంగా పర్యటించిన సందర్భాలే ఉన్నాయి. అయితే.. సీఎం హోదాలో ఉండి కూడా అంత రహస్యంగా పర్యటనలు చేయడం ఎందుకు? అనే చర్చ మొదలైంది ఇప్పుడు. అటు చంద్రబాబు తనయుడు నారా లోకేష్ కూడా తరచూ రహస్య పర్యటనలు చేస్తుండడం.. కనీస సమాచారం లేకపోవడం తెలుగు దేశం పార్టీలోనూ తీవ్రచర్చనీయాంశంగా మారుతోంది. ప్రస్తుతం లోకేష్ విదేశీ పర్యటనలోనే ఉన్నాడు. అందుకే నిన్నటి ఏపీ కేబినెట్ భేటీకి కూడా హాజరు కాలేదు. రాష్ట్రం ఆర్ధిక ఇబ్బందుల్లో ఉన్నా కూటమి నేతలు చంద్రబాబు, పవన్, నారా లోకేష్లు మాత్రం విలాసాల విషయంలో ‘తగ్గేదే లే’ అంటున్నారు. ఒకవైపు అడ్డగోలుగా అప్పులు చేస్తూనే.. ప్రత్యేక విమానాలు, హెలికాఫ్టర్ల ఖర్చుతో రాష్ట్ర ఖాజనాకు చిల్లు పెడుతుండడం సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలకు దారి తీస్తోంది. -
‘శ్రీకాంత్రెడ్డి జిల్లాను తెస్తే.. నువ్వు ముక్కలు చేస్తావా?’
సాక్షి, అన్నమయ్య జిల్లా: జిల్లాను నిలబెట్టలేకపోతే మీసం తీసుకుంటా అంటూ.. మంత్రి రాంప్రసాద్ రెడ్డి గతంలో తొడగొట్టి మరీ చెప్పిన మాటలు నెట్టింట ఇప్పుడు వైరల్ అవుతున్నాయి. రాయచోటిలో ఆయన తీరుపై అసంతృప్తి.. క్రమక్రమంగా ఆగ్రహ జ్వాలలుగా మారుతోంది. తాజాగా రాయచోటిని మదనపల్లిలో కలపడంపై కేబినెట్లో సంతకం చేసిన మంత్రి రాంప్రసాద్రెడ్డి.. బయటకు వచ్చి కంటతడి పెట్టారు. అయితే ఆయనది డ్రామా అంటూ రాయచోటి ప్రజలు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ‘‘నాడు గడికోట శ్రీకాంత్రెడ్డి మంత్రి పదవిని తృణప్రాయంగా వదులుకుని రాయచోటికి జిల్లాను తెచ్చారు. దానిని నిలబెడతానని.. లేకుంటే మీసం తీసేస్తానంటూ రాంప్రసాద్రెడ్డి శపథం చేశారు. ఈ క్రమంలో.. ఇప్పుడు మీసం తీసేస్తారంటూ అంటూ రాజకీయ ప్రత్యర్థులు సెటైరలు సంధిస్తున్నారు. శ్రీకాంత్రెడ్డి పదవీ త్యాగంతో జిల్లాను తీసుకొస్తే..రాంప్రసాద్రెడ్డి మంత్రి పదవి కోసం జిల్లాను ముక్కలు చేశాడంటున్న రాయచోటి ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలో.. జిల్లా కేంద్రంలో రాయచోటిని తొలగించి మదనపల్లికి మార్చడంపై ఇటు ముస్లిం మత పెద్దల నుంచి తీవ్ర అభ్యంతరం వ్యక్తం అవుతోంది. శుక్రవారం జిల్లా కేంద్రం మార్పునకు నిరసగా ర్యాలీ చేపట్టాలని నిర్ణయించాయి. ప్రభుత్వ పెద్దలు పునరాలోచన చేయాలని.. అన్నమయ్య జిల్లాలోనే యధావిధిగా కొనసాగించాలని మత పెద్ద సర్కాజి షర్ఫుద్దీన్ హుస్సేని విజ్ఞప్తి చేశారు. ఒకవేళ జిల్లా కేంద్రంగా రాయచోటిని కొనసాగించలేని పక్షంలో రాయచోటిని కడప జిల్లాలోనే కొనసాగించాలని డిమాండ్ చేస్తున్నారాయన. ‘‘జిల్లా కేంద్రం లేనప్పుడు పన్నుల భారం కూడ తోలగించి రాయచోటిను వైఎస్ఆర్ జిల్లాలో విలీనం చేయండి అని కోరుతున్నారాయన. -
కేసుల మాఫీపై నయా రోల్మోడల్!
ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఇంకో అక్రమ ట్రెండ్కు తెరతీశారు. తమపై ఉన్న కేసుల నుంచి తప్పించుకునే విషయంలో ఇతర అవినీతి నేతలందరికీ రోల్ మోడల్ అవుతున్నారు. ఎందుకంటే.. 2014-19 మధ్యకాలంలో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఆయన చేసిన స్కామ్లపై పెట్టిన కేసులను తానే ఎత్తేసుకుంటున్నారు మరి! రాష్ట్ర నేర విచారణ సంస్థ సీఐడీ అన్ని కోణాల్లో విచారించిన తరువాత పెట్టిన కేసులివి. ప్రభుత్వ ఉన్నతాధికారుల మేరకు నమోదైనవి. చంద్రబాబు వీటిల్లో కొన్నింటిపై ముందస్తు బెయిల్ సంపాదించుకుంటే ఒక కేసులో మాత్రం జైలుకెళ్లారు. కానీ.. 2024లో అధికారంలోకి వచ్చిందే తడవు చంద్రబాబు అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఫైబర్ నెట్, మద్యం స్కామ్ కేసులను ఎత్తేయించుకున్నారు. తాజాగా స్కిల్ స్కామ్ కేసునూ లేకుండా చేసుకునేందుకు ప్రయత్నిస్తున్నారు. యువకుల్లో నైపుణ్యాలను పెంపొందించేందుకు ఉద్దేశించిన పథకంలో చంద్రబాబు అక్రమాలకు పాల్పడ్డారన్నది ఈ స్కిల్స్కామ్. అంతర్జాతీయ సంస్థ సీమెన్స్, రాష్ట్ర ప్రభుత్వం కలిసి పనిచేస్తాయని ప్రతిపాదించారు. రాష్ట్ర ప్రభుత్వం పది శాతం అంటే రూ.300 కోట్లు పెడితే.. సీమెన్స్ రూ.3000 కోట్లు పెడుతుందని ఊరించారు. పైగా సీమెన్స్ కంపెనీ పైసా చెల్లించకుండానే ప్రభుత్వం రూ.330 కోట్లు కట్టేసింది. పుణేలోని జీఎస్టీ అధికారులు ఈ తేడాను గుర్తించారు. సీమెన్స్ అసలు, జీఎస్టీ రెండూ కట్టలేదని సమాచారమిచ్చినా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోలేదు. ఈలోపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ రంగంలోకి దిగడంతో అసలు విషయం బట్టబయలైంది. అసలు సీమెన్స్ కంపెనీ ఈ ఒప్పందంలో భాగమే కాదన్న బోగస్ వ్యవహారంపై కేసు నమోదు చేసింది. కొందరిని అరెస్టు చేసింది. స్కిల్ డెవలప్మెంట్ ప్రాజెక్టు లావాదేవీలతో తమకు సంబంధం లేదని సీమెన్స్ స్పష్టం చేసింది. సీమెన్స్ మాజీ అధికారి ఒకరు మొత్తం కథ నడిపినట్లు విచారణలో తేలింది. రాష్ట్ర ప్రభుత్వం తనకు తెలియకుండా ఇందులో చిక్కుకుందా? లేక కుట్రపూరితంగానే జరిగిందా అన్న అంశం పరిశీలనకు వచ్చింది. ఆ సందర్భంలోనే ఆర్థిక శాఖ అధికారులు అభ్యంతరం వ్యక్తం చేసినా.. ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం తన వంతు వాటా రూ.330 కోట్లు డిజిటెక్ అనే కంపెనీకి విడుదల చేసిందని వెల్లడైంది. సీఎం కోరినట్లుగా నిధులు విడుదల చేస్తున్నామని అధికారులు ఫైళ్లలోనే రాశారు. కేబినెట్తో సంబంధం లేకుండా ఈ భారీ మొత్తం దుర్వినియోగమైందని సీఐడీ గుర్తించింది. ఈ స్కామ్లో భాగస్వాములన్న అభియోగంపై అధికారులు కొందరిని అరెస్టు చేసింది. సీఎం హోదాలో చంద్రబాబు పాత్ర సాంతం నిర్ధారణ అయ్యాక ఆయనను కూడా అరెస్టు చేసింది. దీంతో రిమాండ్ రిపోర్టు ఆధారంగా ఏసీబీ కోర్టు న్యాయమూర్తి చంద్రబాబును జైలుకు పంపారు. ఈ కేసులో పలు షెల్ కంపెనీలకు ఈ స్కామ్ డబ్బు వెళ్లిందని, అక్కడి నుంచి సుమారు రూ.70 కోట్లు టీడీపీ బ్యాంక్ ఖాతాలోకి చేరాయని సీఐడీ అధికారులు కనిపెట్టారు. సీఐడీ ఇంత పక్కాగా దర్యాప్తు చేసినా టీడీపీ, జనసేనలు ఇదో అక్రమ కేసు అనే ప్రచారం చేశాయి. ఎల్లో మీడియా కూడా చంద్రబాబును అరెస్టు చేస్తారా? అంటూ చిందులు తొక్కింది. చివరికి న్యాయమూర్తిపై కూడా అభ్యంతకరమైన కథనాలు ప్రచురించింది. చివరకు చంద్రబాబు కేసుతో నిమిత్తం లేకుండా..ఆనారోగ్య కారణాలు చూపి హైకోర్టులో బెయిల్ పొందాల్సి వచ్చింది. హైకోర్టు కూడా కొన్ని షరతులతో బెయిల్ మంజూరు చేయడం.. విడుదలైన మరుక్షణమే చంద్రబాబు వాటిని బేఖాతరు చేయడం జరిగిపోయాయి. అది వేరే సంగతి.ఈ నేపథ్యంలో 2024లో చంద్రబాబు ముఖ్యమంత్రి అయిన తరువాత తన కేసులను ఎలా తొలగించుకునే బాధ్యతను ఒక లీగల్ ప్రముఖుడికి అప్పగించారని గతంలో వార్తలు వచ్చాయి. అంతకంటే ముందు చంద్రబాబు వైసీపీ ప్రభుత్వంలో ఈ స్కామ్లపై విచారణ జరిపిన అధికారులపై, వైసీపీ నేతలపై రకరకాల కేసులు సృష్టించారు. పలువురిని అరెస్టు చేసి, ప్రజల దృష్టి మళ్లించారు. ఇంకో వైపు తన కేసుల మాఫీకి చర్యలు తీసుకున్నారు. అంతేకానీ... తాను ఎలాంటి తప్పు చేయలేదని నిరూపించుకోవడానికి సిద్దపడలేదు. వెనుకటి రోజుల్లో తాను టెక్నికల్గా, లీగల్గా దొరకనని సభలలో అంటుండే వారు. కాని గత ప్రభుత్వం సాక్ష్యాలతో సహా కేసులు పెట్టడంతో వాటి నుంచి బయట పడడానికి చంద్రబాబు కోర్టు విచారణ బదులు కొత్తమార్గం కనిపెట్టారు. మద్యం, ఫైబర్నెట్ స్కామ్లలో తనపై ఫిర్యాదు చేసిన అధికారులను భయపెట్టి ఉపసంహరణ పిటిషన్లు వేయించారు. ఇది బెయిల్ కండిషన్లు ఉల్లంఘించడమేనని న్యాయ నిపుణులు చెబుతున్నారు. స్కిల్ స్కామ్లో ‘మిస్టేక్ ఆఫ్ ప్యాక్ట్స్’ అని ఇంకో వ్యూహం ప్రయోగించారు. అప్పటి స్కిల్ కార్పొరేషన్ ఎండీకి ఒక నోటీసు పంపి, ఈ కేసు ఉపసంహరణలో ఏమైనా అభ్యంతరాలు ఉంటే తెలియ చేయాలని కోరారట. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ఈ టైమ్లో ఎవరు అభ్యంతరం చెబుతారు? నిజానికి అప్పటి కార్పొరేషన్ ఛైర్మన్ అజయ్ రెడ్డి స్కామ్పై ఫిర్యాదు చేశారట. కాని ఆయన అభిప్రాయం తీసుకోవడం లేదట. ఇలా అధికారంలో ఉన్నవారు తమపై వచ్చిన అవినీతి కేసులను తొలగించుకునే రీతిని న్యాయ వ్యవస్థ అంగీకరిస్తుందా అన్నది చర్చనీయాంశం. సుప్రీం కోర్టు గతంలో ఇచ్చిన ఒక తీర్పు ప్రకారం కింది కోర్టులు ఇలాంటి వాటిపై నిర్ణయాలు చేయరాదు. హైకోర్టులో జరగాలి. చిత్రమేమిటంటే ఇంతవరకు చంద్రబాబుకు చెందిన రెండు కేసుల ఉపసంహరణకు సంబంధించిన ఆదేశాల సర్టిఫైడ్ కాపీలు న్యాయ స్థానం కూడా ఇవ్వడం లేదట. ఎందుకు కోర్టు ఇలా గోప్యత పాటిస్తుంది అనేదానిపై సోషల్ మీడియాలో పలు విశ్లేషణలు వచ్చాయి. ఇప్పటికే స్కిల్ కేసును ఈడీ అధికారులు విచారించారు. కాని కేంద్రంలో, రాష్ట్రంలో మారిన రాజకీయాలు, రెండు చోట్ల కూటమి ప్రభుత్వాలే ఉన్న రీత్యా వారికి వ్యతిరేకంగా కేసును ముందుకు సాగనివ్వదని భావిస్తున్నారు. ఈడీతో నిమిత్తం లేకుండా సీఐడీ ఈ కేసును ఎలా నీరుకార్చుతుందన్న ప్రశ్న వస్తుంది. సీఐడీ అప్పట్లో ఎలా కేసు పెట్టి అరెస్టు చేసింది? ఇప్పుడు అదే సీఐడీలో అధికారులు మారిపోతే కేసే ఉండకుండా పోతుందా? చట్టప్రకారం ఇది చెల్లుబాటు అవుతుందా అన్న చర్చలు సాగుతున్నాయి. వచ్చే ఎన్నికలతో వైఎస్సార్సీపీ అధికారంలోకి వస్తే అప్పుడు ఈ కేసులన్నీ మళ్లీ ఓపెన్ అయ్యే అవకాశం ఉంటుందా? అనే మీమాంస కూడా ఉంది. దీనికి న్యాయ నిపుణులు అవుననే చెబుతున్నారు. ఇలా అధికారంలో ఉన్న వారు కేసు తీసివేసుకునే పద్ధతి ఉంటే భవిష్యత్తులో ఏ రాజకీయ నేత అయినా అధికారం సాధించుకుంటే అన్నీ మాఫ్ అవుతాయన్న భావన కలగదా?. గతంలో బీహారు ముఖ్యమంత్రి లాలూ ప్రసాద్ యాదవ్ను గడ్డి స్కామ్లో సీబీఐ అరెస్టు చేసి జైలులో పెట్టింది. ఆయన పదవికి రాజీనామా చేయగా, సతీమణి రబ్రీదేవి సీఎం అయ్యారు. కేసు విచారణ తర్వాత ఆయనకు శిక్ష పడింది. అలాగే హర్యానా ముఖ్యమంత్రిగా ఓం ప్రకాష్ చౌతాల కూడా టీచర్ల నియామక వ్యవహారంలో అక్రమాలకు పాల్పడ్డారన్న అభియోగంపై శిక్షకు గురై జైలు జీవితం గడపాల్సి వచ్చింది. మరికొందరు నేతలు కూడా విచారణను ఎదుర్కున్నారు. వారికి కూడా ఇలాంటి కేసు ఉపసంహరణ మార్గాలకు సంబందించిన ఐడియాలు వచ్చి ఉంటే జైలుకు వెళ్లవలసిన అవసరం ఉండేది కాదేమో!. బహుశా ఇలాంటి వాటినన్నటిని పరిగణనలోకి తీసుకుని చంద్రబాబు లీగల్ టీమ్ వ్యూహాత్మకంగా అసలు కేసులు విచారణకే రాకుండా చేయడం ద్వారా వీటి నుంచి బయటపడవచ్చని భావించినట్లు ఉంది. అందుకు తగ్గట్లు ఆయా కేసులలో గతంలో ఫిర్యాదు చేసిన అధికారులతోనే కేసును విరమింప చేయిస్తున్నారు. లేదంటే ఇలా మిస్టేక్ ఆఫ్ ఫ్యాక్ట్స్ పేరుతో కొత్త వ్యూహం అమలు చేయాలని అనుకుని ఉండవచ్చు. ఇప్పటికే రెండు కేసుల నుంచి బయటపడ్డ చంద్రబాబు స్కిల్ స్కామ్ కు కూడా అదే ప్లాన్ చేసినట్లు అనుకోవాలి. ఏది ఏమైనా చంద్రబాబు టీమ్ వేసిన ఈ ప్లాన్ దేశంలోని ఇతర నేతలకు ఒక మార్గం చూపినట్లవుతుందా, న్యాయ వ్యవస్థ ఇలాంటి పెడపోకడలకు చెక్ పెడుతుందా? పెట్టదా?అనేవి ఆసక్తికరమైన అంశాలుగా ఉన్నాయి. :::కొమ్మినేని శ్రీనివాసరావు, సీనియర్ జర్నలిస్ట్, రాజకీయ వ్యవహారాల వ్యాఖ్యాత -
ఆంధ్రప్రదేశ్లో బాదుడే బాదుడు...ప్రజలపై పన్నుల మోత మోగిస్తున్న చంద్రబాబు ప్రభుత్వం...
-
ఏపీ రాజధానిలో అన్నదాత గుండె ఆగింది... ప్రభుత్వం ఒత్తిడి వల్ల గుండెపోటుతో కుప్పకూలిన రైతు దొండపాటి రామారావు
-
వైఎస్సార్సీపీ ర్యాలీ అడ్డగింత.. మచిలీపట్నంలో ఉద్రిక్తత
సాక్షి, కృష్ణా జిల్లా: పోలీసుల ఆంక్షలతో మచిలీపట్నంలో శుక్రవారం ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. వంగవీటి మోహన రంగా వర్ధంతి పేరిట రాజకీయ పార్టీలు ర్యాలీలు నిర్వహించాయి. ఈ క్రమంలో వైఎస్సార్సీపీ ర్యాలీని మాత్రమే పోలీసులు అడ్డుకోవడంతో వాగ్వాదం చోటుచేసుకుంది. మాజీ మంత్రి పేర్ని నాని (Perni Nani) ఆధ్వర్యంలో వంగవీటి రంగా వర్ధంతి కోసం రామానాయుడుపేట నుంచి వైఎస్సార్సీపీ భారీ ర్యాలీకి ప్లాన్ చేసింది. అయితే.. ఈ ర్యాలీకి పోలీసులు ఆంక్షలు విధించారు. కూటమి నేతల ర్యాలీ ఉందని.. ఆ తర్వాతే మీ ర్యాలీ నిర్వహించుకోవాలని పార్టీ శ్రేణులకు తేల్చి చెప్పారు. అయితే తాము వేరే రూట్లో ర్యాలీ పెట్టుకున్నా ఎందుకు అడ్డుకుంటున్నారంటూ పోలీసులను పేర్ని నాని నిలదీశారు.వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు నుంచి కూటమి ర్యాలీకి అనుమతి ఇచ్చామని.. ఇరవర్గాలు తారసపడితే ఉద్రిక్తతలు తలెత్తే అవకాశం ఉందని పోలీసులు పేర్ని నానికి వివరించే ప్రయత్నం చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ ఆఫీస్ ముందు బారికేడ్లు, అదనపు బలగాలు ఏర్పాట్లు చేసినట్లు సీఐ ఏసుబాబు వివరించారు. ఈ వివరణతో పేర్ని నాని మండిపడ్డారు. పోలీసుల తీరు.. ‘పచ్చ’పాత ధోరణిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ క్రమంలో అక్కడ టెన్షన్ వాతావరణం నెలకొంది. చివరకు పేర్ని నాని డిమాండ్తో దిగొచ్చిన పోలీసులు ర్యాలీకి అనుమతి ఇవ్వడంతో పరిస్థితి చక్కబడింది. -
ఆంధ్రప్రదేశ్ గ్రామాలకు గ్రహణం. కేంద్ర నిధులపై బాబు సర్కారు ఆంక్షలు
-
ప్రైవేట్ కే మెడికల్ కాలేజీలను కట్టబెట్టాలని నిర్ణయం
-
ఆంధ్రప్రదేశ్లో మళ్లీ యూరియా కష్టాలు... చంద్రబాబు సర్కారు అలసత్వంతో రబీలోనూ రైతన్నకు తప్పని తిప్పలు
-
తుస్సుమన్న పీపీపీ బిడ్డింగ్.. జగన్ విజయానికి సూచిక
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటు సంస్థలకు ఇవ్వడాన్ని మేం సహించం... దీనివెనుక పెద్ద ఆర్థిక కుంభకోణం ఉన్నది. ఎంతో కష్టపడి మేం ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకొస్తే వాటిని చేతగాని చంద్రబాబు ప్రభుత్వం నడపలేక ప్రయివేటుకు ఇచ్చేస్తున్నది. దీన్ని మేం గట్టిగా వ్యతిరేకిస్తున్నాం. ఈ కుంభకోణాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లి వారి మద్దతును కూడా కూడగట్టాం. కోటికిపైగా సంతకాలు సేకరించాం.. .. మళ్ళీ చెబుతున్నాం.. మా మాట కాదని ఎవరైనా మెడికల్ కాలేజీలు తీసుకోవడానికి బిడ్డింగ్ వేస్తె మాత్రం తీవ్ర పరిణామాలు తప్పదు. మేం అధికారంలోకి వస్తే మళ్ళీ కాలేజీలు వెనక్కి తీసుకోవడమే కాకుండా వారిపై చర్యలు తీసుకుంటాం అంటూ మాజీ ముఖ్యమంత్రి వైయస్ జగన్ చేసిన ప్రకటన లాంటి హెచ్చరిక ప్రయివేటు మెడికల్ కాలేజీల గుండెల్లో రైళ్లు పరుగులెత్తించింది. అందుకేనేమో ప్రైవేట్ మెడికల్ కాలేజీల యాజమాన్యాలు.. కార్పొరేట్ సంస్థలు ఏవీ పెద్దగా ఈ అంశంలో ముందుకు రాలేదు.వాస్తవానికి మార్కాపురం.. మదనపల్లి, పులివెందుల, ఆదోని మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ఇచ్చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పిలిచింది. అయితే ఆదోని కాలేజీకి మాత్రమే కిమ్స్ యాజమాన్యం దరఖాస్తు చేసుకున్నది. అంటే మొత్తం నాలుగు కాలేజీలకు గాను ఒకటే దరఖాస్తు వచ్చింది. మిగతా మూడు కాలేజీలకు ఒక్క దరఖాస్తు కూడా రాకపోవడం గమనార్హం.ఈ పరిణామం చూస్తుంటే వైఎస్ జగన్ చెప్పిన మాట ప్రకారం అయన చేసి తీరతారన్న నమ్మకం, మళ్ళీ అయన వస్తే కాలేజీలు వెనక్కి తీసుకుంటారన్న భయం కలగలిపి వారిని ఈ బిడ్డింగ్ నుంచి వెనకడుగు వేసేలా చేసిందని అంటున్నారు. రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులు, తెలుగుదేశం ప్రభుత్వం పని తీరు.. వివిధ వర్గాల్లో వెల్లువెత్తుతున్న వ్యతిరేకత ఇవన్నీ క్రోడీకరించి చూసుకుంటున్న మెడికల్ వ్యాపారవేత్తలు ఈ విషయంలో ఒక అవగాహనకు వచ్చినట్లు భావిస్తున్నారు. రాష్ట్రంలో వైయస్ జగన్ ఎప్పుడు ఏ పర్యటన చేపట్టినా వెల్లువెత్తుతున్న జనాభిమానం ఒకవైపు.. అటు రైతులు,, మహిళలు.. విద్యార్థులు.. యువత వంటి వర్గాల్లో జగన్ పట్ల పెరుగుతున్న సానుకూలత, అదే తరుణంలో చంద్రబాబు ప్రభుత్వం పట్ల పెరుగుతున్న వ్యతిరేకతలను క్రోడీకరించి మెడికల్ వ్యాపారులు పరిస్థితిని అర్థం చేసుకున్నట్లు తెలుస్తోంది. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వం పట్ల ఇంత వ్యతిరేకత వస్తే రానున్న మూడేళ్ళలో ఇది మరింత పెరగడం తధ్యమని, అది కూటమి ఓటమిని, వైఎస్ జగన్ విజయాన్ని ఆపడం ఎవరి తరం కాదని భావించిన బిడ్డర్లు ఇక ఈ అంశం జోలికి పోకూడదని నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. వైఎస్ జగన్ గెలుపు తథ్యం, అదే జరిగితే కోట్లు పెట్టుబడి పెట్టి తెచ్చుకున్న ఈ కాలేజీలను ప్రభుత్వం మళ్ళీ వెనక్కి తీసుకుంటే భారీగా నష్టపోతామన్న భయంతోనే వారు వెనకడుగు వేసినట్లు విశ్లేషకులు చెబుతున్నారు. మొత్తానికి మెడికల్ వ్యాపారులు ముందు చూపుతో వేసిన వెనకడుగు.. వైఎస్ జగన్ విజయానికి సూచనే అని తేల్చేశారు.:::సిమ్మాదిరప్పన్న -
ఆంధ్రప్రదేశ్లో చంద్రబాబుపై కేసుల కథ కంచికి... ‘స్కిల్’ కుంభకోణం కేసు మూసివేతకు కూటమి సర్కార్ పన్నాగం
-
కూటమి పాలనలో పెన్షన్ల కోసం దివ్యాంగుల కష్టాలు (ఫొటోలు)
-
రెవెన్యూ ఫిర్యాదులపై ఏమాత్రం స్పందించని చంద్రబాబు సర్కారు. కబ్జాలు, సరిహద్దు సమస్యలు, అక్రమాలతో లక్షలాది మంది సతమతం
-
కూటమి కుట్రలు పటాపంచలు.. YSRCPలోకి భారీగా చేరికలు
-
‘చంద్రబాబుపై కేసీఆర్ మాట్లాడింది వంద శాతం కరెక్ట్’
సాక్షి, విశాఖపట్నం: కూటమి ప్రభుత్వం మీద వ్యతిరేకత పెరుగుతోందని.. అందుకే వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయని మాజీ మంత్రి గుడివాడ అమర్నాథ్ అన్నారు. సోమవారం వైఎస్సార్సీపీలోకి భారీ చేరికల కార్యక్రమం జరిగింది. అయితే ఆ సమయంలో అనుమతులు నిరాకరణ పేరుతో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది తాళం వేశారు. ఈ పరిణామాలపై స్పందిస్తూ ఆయన కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ప్రభుత్వం మీద వ్యతిరేకతతో పెద్ద ఎత్తున వైఎస్సార్సీపీలోకి చేరికలు జరుగుతున్నాయి. అనుమతి తీసుకున్న తర్వాత చిల్డ్రన్ ఏరియా థియేటర్ ఇవ్వకపోవడాన్ని ఖండిస్తున్నాం. దళితులు వైఎస్సార్సీపీలో చేరకూడదా?.. దళితులకు చిల్డ్రన్ ఏరినా ధియేటర్లో అడుగుపెట్టే అర్హత లేదా?. దళితులంటే అంత చిన్న చూపా చంద్రబాబు? అని గుడివాడ ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్ జగన్ అంటే కూటమి నేతల భయపడుతున్నారని.. చంద్రబాబు లోకేష్, టీడీపీ బచ్చాలు ఎందుకు పనికిరారని అన్నారాయన. చంద్రబాబు కోసం కేసిఆర్ చేసిన వ్యాఖ్యలను గుడివాడ అమర్నాథ్ సమర్థించారు. ‘‘కేసీఆర్ ఎన్నడూ అబద్దాలు మాట్లాడలేదు. అందుకే ఆయన అంత పెద్ద నేత అయ్యారు. చంద్రబాబుపై ఆయన చేసిన వ్యాఖ్యలను నేను పూర్తిగా ఏకీభవిస్తున్నా. ప్రభుత్వంలో ఉండి ప్రజల కోసం ఆలోచించాలి.. కొడుకు, కుటుంబం కోసం కాదు’’ అని అన్నారాయన. అంతకు ముందు.. చేరికల కార్యక్రమం సమయంలో ఆఖరి నిమిషంలో వీఎంఆర్డీఏ చిల్డ్రన్ ఏరినా సిబ్బంది అనుమతి నిరాకరిస్తూ గేటుకు తాళం వేశారు. ఈ క్రమంలో గేటు ముందు వైఎస్సార్సీపీ నేతలు ధర్నాకు దిగారు. కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేయడంతో పోలీసులు ఎంట్రీ ఇచ్చారు. దీంతో పరిస్థితి స్వల్ప ఉద్రిక్తంగా మారింది. కూటమి నేతల ఒత్తిడితోనే అనుమతి నిరాకరించారని.. వైఎస్సార్సీపీ చేరికలను చూసి కూటమి నేతల భయపడుతున్నారని.. అధికారులు నిష్పక్షపాతంగా వ్యవహరించాలని వైఎస్సార్సీపీ నేత కేకే రాజు ఈ సందర్భంగా వ్యాఖ్యానించారు.కేసీఆర్ ఏమన్నారంటే.. చంద్రబాబు మాటలు విని.. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తెలంగాణకు అన్యాయం చేసింది. పాలమూరులో చెరువులను బాగు చేయాలని కేంద్రానికి మేం అధికారంలో ఉన్నప్పుడు లేఖలు రాశాం. అయితే.. చంద్రబాబు మాటలు విని కేంద్రం అన్యాయం చేసింది. కనీసం పట్టించుకోలేదు. బీజేపీ పాలకులు శనిలా దాపురించారు. -
పెరిగిన జగన్ క్రేజ్.. టెన్షన్ లో కూటమి నేతలు
-
పేదల బియ్యం సంచుల్లో పందికొక్కులు 'రేషన్ స్మగ్లర్లు'


