సాక్షి, తాడేపల్లి: మోసాలతో, కుంభకోణాలతో చంద్రబాబు అండ్ కో ఆంధ్రప్రదేశ్ను అడ్డంగా దోచుకుంటున్నారని.. పైగా గోబెల్స్ ప్రచారాలతో ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నం చేస్తున్నారని వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి అన్నారు. గురువారం తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియా సమావేశం నిర్వహించి.. పలు అంశాలపై మాట్లాడారు.
వైఎస్ జగన్ ప్రెస్మీట్ హైలైట్స్
అమరావతిలో భూములు ఎవరూ కొనకూడదు.. అమ్మకూడదని చట్టంలో ఉంది
కానీ బాబు, ఆయన బినామీలు స్కామ్లు చేస్తూనే ఉన్నారు
ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన డబ్బును దోచేశారు
బ్లాక్ లిస్టులో ఉన్న కంపెనీకి ఫైబర్ను కట్టుబెట్టి వందల కోట్లు దోచిపెట్టారు
కేబినెట్ ఆమోదం లేకుండా ప్రివలేజ్ ఫీజులు రద్దు చేశారు
ప్రివిలేజ్ ఫీజు రద్దు ఫైల్పై బాబే సంతకం చేశారు
చంద్రబాబుకు దేవుడు.. ప్రజలే బుద్ధి చెబుతారు
చంద్రబాబు బరితెగింపు
2014-19 మధ్య చంద్రబాబు స్కామ్లు
ఆషామాషీ స్కాములు కావవి!
స్కిల్ స్కామ్ కేసును కేంద్రం కూడా గుర్తించింది
స్కిల్ స్కామ్లో 370 కోట్లు షెల్ కంపెనీలకు తరలించారు
చంద్రబాబు, బినామీలతో అమరావతి భూకుంభకోణం
ఇసుక స్కామ్తో వందల కోట్లు దోచిపెట్టారు
వివిధ కేసులలో బెయిల్ మీద ఉన్న చంద్రబాబు
చంద్రబాబు అవినీతిపై ఫిర్యాదు చేసిన అధికారుల్ని బెదిరించారు
అబద్ధపు వాంగ్మూలాలు ఇప్పించారు
బెయిల్ షరతులను ఉల్లంఘిస్తూ బరితెగింపు
బెదిరించి తనపై ఉన్న కేసుల్ని మూసేయించుకుంటున్నారు
ఉచితం పేరుతో కోట్ల విలువైన స్కామ్లు చేస్తున్నారు
బాబు అండ్కో గోబెల్స్ను మించి పోయారు
వీటిని ప్రజల దృష్టికి తీసుకెళ్లడం ఆగదు
అశోక్ గజపతిని ఎందుకు విచారణ జరపలేదు?
చంద్రబాబు హయాంలో సింహాచలం ఆలయంలో చోరీ
సెప్టెంబర్ 1 ఆలయ ఉద్యోగులే చోరీకి పాల్పడ్డారు
రమణ, సురేష్.. ఇద్దరికీ స్టేషన్ బెయిల్ ఇచ్చి వదిలేశారు
అలా ఎందుకు వదిలేశారు?.. ఇద్దరినీ జైల్లో ఎందుకు పెట్టలేదు
విచారణ జరిపి ఆస్తుల్ని స్వాధీనం ఎంఉదకు చసుకోలేదు
సింహాచలం ఆలయ ధర్మకర్త అశోక్ గజపతి
అశోక్ గజపతిని ఎందుకు విచారించలేదు
సుబ్బారెడ్డి, అశోక్ గజపతిలకు చెరో న్యాయమా?
పరకామణి కేసులో..
పరకామణిలో గతంలో ఏం జరిగిందో ఎవరికి తెలుసు?.
పరకామణి దొంగ.. లెక్కింపులో ఎన్నో ఏళ్లుగా ఉన్నాడు.
జీయర్ స్వామి మఠంలో క్లర్క్గా పని చేశాడు.
ఆ దొంగ దగ్గర 9 డాలర్లు పట్టుబడ్డాయి.
దొంగను మేం పట్టుకున్నాం.. మీరెందుకు పట్టుకోలేదు.
ఈ కేసులో దొంగ దొరికినప్పుడు కేసు నమోదు అయ్యింది. కేసు కోర్టులకూ వెళ్లాయి.
నిందితుడి కుటుంబ సభ్యులు ప్రాయశ్చితంగా రూ.14 కోట్లు విలువైన ఆస్తులన్నీ రాసిచ్చేశారు.
దేవుడి సోమ్ము దొంగల పాలు కాకూడదని రూ.23 కోట్లతో సాంకేతికతను జోడించాం. ప్రతీచోట సీసీ కెమెరాలు పెట్టించాం.
టీటీడీలో పారదర్శక వ్యవస్థ తీసుకొస్తే మాపైనే నిందలు వేస్తున్నారు.
పరకామణి కేసులో.. జడ్జిలపైనే వర్ల రామయ్యలాంటి వాళ్లు నిందలేశారు.
కేసు పట్టుకున్న వ్యక్తిని మరణించేలా చేశారు.
ఆ మరణాన్ని కూడా రాజకీయం చేయాలనుకున్నారు.
ఎల్లో మీడియాతో ఫేక్ కథనాలు రాయించారు.
ఇది ధర్మమేనా?
వాళ్లంతా టీడీపీ మనుషులే..
లడ్డూ ప్రసాదంలో వాస్తవాల కోసం వైవీ సుబ్బారెడ్డి కేసు వేశారు
నిజాలు బయటకు రావాలని సుప్రీం కోర్టును ఆశ్రయించారు
అప్పన్న అనే వ్యక్తి సుబ్బారెడ్డి పీఏ కాదు
టీడీపీ ఎంపీ వేమారెడ్డి అనుచరుడు.. ఏపీ భవన్ ఉద్యోగి
లడ్డూ దర్యాప్తు కోసం ఏర్పాటు చేసిన సిట్లో అంతా టీడీపీ వాళ్లే
ప్రత్యక్షంగా, పరోక్షంగా తెలుగు దేశం పార్టీతో సంబంధాలు ఉన్నవాళ్లే
టీడీపీని గెలిపించడానికి శాయశక్తుల కృషి చేసినవాళ్లే.
బాబు మాఫియా కలెక్షన్లలో వీళ్లంతా భాగమే
దేవుడిని కూడా రాజకీయాల్లోకి లాగుతున్నారు
దేవుడంటే భయం, భక్తి లేకుండా చంద్రబాబు మాట్లాడుతున్నారు
నెయ్యిలో జంతువుల కొవ్వు కలిసిందని.. లడ్డూలు తయారు చేశారని ఆరోపణలు చేశారు
ఆ నెయ్యితో లడ్డూలు తయారయ్యాయని.. భక్తులు తిన్నారని ఆధారాలు ఉన్నాయా?
తిరుమలకు వచ్చే ఏ ట్యాంకర్ అయినా సరే.. గుర్తింపు సర్టిఫికెట్తోనే రావాలి
సర్టిఫికెట్ మాత్రమే కాదు.. టీటీడీ ల్యాబ్ల్లోనూ పరీక్షలో నెగ్గాలి
ఆ పరీక్షల్లో రిజెక్ట్ అయితే వెనక్కి పంపిస్తారు
మా హయాంలో 18 సార్లు వెనక్కి పంపించాం
పకడ్బందీగా ప్రొటోకాల్ ఉన్నప్పుడు తప్పెలా జరుగుతుంది?
బాబు అధికారంలోకి వచ్చాక.. జులైలో 4 ట్యాంకర్లు వెనక్కి పంపారు
మళ్లీ ఆ ట్యాంకర్లే ఆగస్టులో తిరిగి వచ్చాయని.. లడ్డూ ప్రసాదంలో వాడారని రిమాండ్ రిపోర్టులో సిట్ పేర్కొంది
టీటీడీ చైర్మన్, ఈవో ఏం చేస్తున్నారు?
ఇదే నిజమైతే.. ఎవరిని లోపల వేయాలి?.. ఇది చంద్రబాబు వైఫల్యం కాదా?
తారాస్థాయికి చంద్రబాబు కక్షా రాజకీయాలు
ఉద్దేశపూర్వకంగా వైఎస్సార్సీపీ నేతలపై కేసులు.. అరెస్టులు
చెవిరెడ్డిని జైలుకు పంపారు
మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించారు
మిథున్రెడ్డి బెయిల్ టైంలో ఎందుకు అరెస్ట్ చేశారో? అని జడ్జి ప్రశ్నించారు
కాకాణి, శ్రీకాంత్, వంశీ.. వాళ్లను అరెస్ట్ చేశారు
పోసాని లాంటి సామాన్యుడ్ని, కొమ్మినేని లాంటి సీనియర్ జర్నలిస్టును, చివరికి సోషల్ మీడియా యాక్టివిస్టులను వేధించారు
మంత్రి సంద్యారాణి పీఏ వ్యవహారంలో ఆధారాలున్నా చర్యలు లేవు
వాట్సాప్ మెసేజ్లు కళ్ల ముందే కనిపిస్తున్నా పోలీసుల్లో చలనం లేదు
ఆధారాలు చూపించినా ఇప్పటిదాకా కేసు పెట్టలేదు
పైగా వార్త రాసిన సాక్షి, సాక్షి విలేఖరిపై కేసులు పెట్టి నోటీసులు పంపించారు
పిన్నెల్లి సోదరులపై తప్పుడు కేసులు పెట్టారు
రిగ్గింగ్ అడ్డుకున్నందుకే పిన్నెల్లిని జైల్లో పెట్టారు
టీడీపీ ఆధిపత్య పోరు ఘటనను.. రాజకీయ ప్రతీకారానికి వాడుకుంటున్నారు
టీడీపీ వాళ్లు హత్య చేసుకుంటే.. పిన్నెల్లిని ఇరికించారు
చంపింది.. చంపబడ్డవాళ్లు.. టీడీపీ వాళ్లేనని పోలీసులే స్వయంగా చెప్పారు
టీడీపీ గొడవల వల్లేనని ఎస్పీ స్వయంగా ట్వీట్ చేశారు
చంద్రబాబు పాలనలో పిన్నెల్లిపై పెట్టిన కేసులు 16
విశాఖలో వైఎస్సార్సీపీ విద్యార్థి నాయకుడు కొండా రెడ్డిని దొంగ కేసులో అరెస్ట్ చేశారు
కొండా రెడ్డిపై గంజాయి కేసు పెట్టారు
ఆశ్చర్యం ఏంటంటే.. అరెస్ట్ చేసింది ఓ చోట.. నేరం జరిగిందని చెప్పింది మరో చోట
ఇలాంటి రాజకీయాలతో వ్యవస్థలు బతుకుతాయా?
అన్యాయంగా వైఎస్సార్సీపీ వాళ్లను జైలుకు పంపారు
లిక్కర్ కేసులో బెయిల్ మీద ఉన్న వ్యక్తి చంద్రబాబు
అప్పుడు ఏదైతే స్కామ్ చేశారో.. ఇప్పుడు సీఎంగా అదే పని చేస్తున్నారు
అలాంటి వ్యక్తి తన కేసుల్ని నీరుగార్చేందుకు.. మధ్యలో ఉన్న మా ప్రభుత్వ పాలసీని తప్పుగా ప్రచారం చేస్తున్నారు
లేని కేసుతో .. చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అరెస్టులు చేశారు
మా హయాంలో పని చేసిన అధికారులనూ అరెస్ట్ చేశారు
మిథున్రెడ్డి బెయిల్ సమయంలో ఎందుకు అరెస్ట్ చేశారు?అని జడ్జే ప్రశ్నించారు


రెడ్బుక్ వెర్రితలలు వేస్తోంది
రాష్ట్రమంతా కల్తీ లిక్కర్ నడుపుతోంది టీడీడీవాళ్లే
మంత్రులు, ఎమ్మెల్యేల మనుషులతోనే ఆ దందా నడిచింది
కుటీర పరిశ్రమ లాగా.. రాష్ట్రంలో ప్రతీ మూలా నడిపించారు
మా పార్టీకి చెందిన జోగి రమేష్పై తప్పుడు కేసు పెట్టారు
జోగి రమేష్ను అరెస్ట్ చేసి జైల్లో పెట్టారు
జోగి రమేష్ కొడుకును కూడా ఇబ్బంది పెడుతున్నారు
వాళ్ల పార్టీకి చెందిన నిందితులనే ఇప్పటిదాకా అరెస్ట్ చేయలేదు
వీళ్లదే ప్రభుత్వం.. వీళ్లదే స్కామ్
కల్తీ మద్యం కేసుల్లో.. తయారు చేసింది, పంచింది.. దోచుకుంది.. అంతా వాళ్లే
రెడ్బుక్ పాలనలో కల్తీ మద్యం తయారు చేసే దమ్ము వేరే పార్టీ వాళ్లకు ఉంటుందా? నమ్మేలా ఉందా ఇది?
తప్పుడు ఆధారాలతో.. సాక్ష్యాలతో.. వైఎస్సార్సీపీ వాళ్లను జైల్లో పెడుతున్నారు



ఉద్యోగులను చంద్రబాబు దారుణంగా మోసం చేశారు
పీఆర్సీ లేదు.. ఐఆర్ లేదు
చంద్రబాబు రూ.31 వేల కోట్లు బకాయి పడ్డారు
ఏపీసీవోఎస్తో వైఎస్సార్సీపీ హయాంలో ఒకటో తేదీనే జీతాలిచ్చాం
బాబు హయాంలో ఏపీసీవోఎస్ను నీరుగార్చారు
రెండు , మూడు నెలలకు కూడా ఏవీసీవోఎస్లో జీతాల్లేవు
ఉద్యమాల్ని ఖాతరు చేయకుండా స్కామ్లు చేస్తున్నారు
జీతాలు పెరగొద్దని పీఆర్సీ చైర్మన్ను కూడా నియమించలేదు
ఐదు డీఎలు పెండింగ్లో ఉన్నాయి.. కేవలం ఒక డీఏ మాత్రమే ఇచ్చారు.. మిగతావి వాయిదాల్లో ఇస్తారట!
రిటైర్ అయ్యాక ఎరియర్స్ ఇస్తామన్నది బాబు ప్రభుత్వం మాత్రమే
విశాఖ స్టీల్కు సొంత గనుల్లేకనే ఈ నష్టాలు
మిట్టల్ అనే ప్రైవేట్ వ్యక్తి కోసం చంద్రబాబు సొంత గనులు ఇవ్వాలని అడుగుతారు
కానీ, విశాఖ స్టీల్కు మాత్రం అడగరు.. ప్రభుత్వ ప్లాంట్ను పట్టించుకోరు
అందుకే గనులు ఇవ్వాలని మేం అసెంబ్లీలో తీర్మానం చేశాం
ప్రైవేటీకరణ కాకుండా ఆపేశాం
స్టీల్ ప్లాంట్ విషయంలో మాములు దగా చేయలేదు
ఎన్నికల ముందు.. నాడు.. కాపాడుకుంటా.. కలిసి పోరాడతాం అని చెప్పారు
ఇప్పుడేమో.. ఇంట్లో పడుకుంటే జీతాలివ్వాలా?.. తమాషాలొద్దంటూ సీరియస్
పీడీ యాక్టులు పెట్టి విశాఖ ఉద్యోగులను లోపల వేస్తారట!
దటీజ్ చంద్రబాబు
ప్రైవేటీకరణపై కోటి సంతకాలతో కోర్టుకెళ్తాం
- గవర్నర్ను కలుస్తాం.. కోర్టులో పిటిషన్ వేస్తాం
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ సూపర్ స్కామ్
- లాభం ప్రైవేట్వాళ్లకు.. భారం ప్రభుత్వం, ప్రజలకా?
- ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఉద్యమం
- కోటి సంతకాలతో 16న గవర్నర్ను కలుస్తాం
- ఆ పత్రాలతోనే కోర్టులో పిటిషన్ సైతం వేస్తాం
ఆరోగ్యశ్రీని పూర్తిగా నిలిపివేసి.. ఖూనీ చేశారు
నెలకు రూ.300 కోట్లు అవుతుంది
అలా ఏడాదికి అయ్యే ఖర్చు రూ.3600 కోట్లు
కానీ, ప్రభుత్వ ఆస్పత్రులను చంద్రబాబు హతం చేస్తున్నారు
బకాయిలు విడుదల చేయకపోవడంతో నెట్వర్క్ ఆస్పత్రులు సర్వీసులను ఆపేశాయి
104, 108లు స్కామ్గా మారిపోయాయి
పేదలకు వైద్య సాయం అందేదెలా?
సంజీవని పేరుతో డ్రామాకు తెర తీశారు
ఇంకోవైపు.. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పెద్ద స్కామ్గా నడుస్తోంది
కొత్త కాలేజీలను ప్రైవేటీకరణ చేయడం ఒక స్కామ్ అయితే..
ప్రైవేటీకరణ తర్వాత పని చేసే సిబ్బందికి ప్రభుత్వ జీతాలట!
ఇది మరో పెద్ద స్కామ్.. బాబు ఇచ్చిన బొనాంజా
భూమి, బిల్డింగ్, స్టాఫ్.. జీతాలు అన్నీ ప్రభుత్వానివే.. కానీ, ఓనర్లు ప్రైవేట్వాళ్లు
భారం ప్రజలమీదకు.. లాభాలు ప్రైవేట్ వాళ్లకా??
నేటి తరం ఆస్తి చదువు
పిల్లల్ని చదివించేందుకు చంద్రబాబు ముందుకు రావడం లేదు
స్కూళ్లలో డ్రాప్ అవుట్స్ పెరుగుతున్నాయి
నాడు-నేడును పూర్తిగా ఆపేశారు
ఇంగ్లీష్ మీడియాన్ని ఆపేశారు
ఫీజు రియంబర్స్మెంట్, వసతి బకాయిలు కోట్లలో పెరిగిపోయాయి
తల్లికి వందనం పేరిట మోసానికి పాల్పడ్డారు
వైఎస్సార్సీపీలో జరిగిన మంచిని చంద్రబాబు నిలిపివేశారు
కలుషిత ఆహారం.. నీరు.. సరైన వసతులు లేక పిల్లల ప్రాణాలు పోతున్నాయి
అనారోగ్యంతో 29 మంది పిల్లలు చనిపోయారు
వందలాది మంది పిల్లలు ఆస్పత్రి పాలయ్యారు
చిన్నారుల జీవితాలను చంద్రబాబు ఛిద్రం చేస్తున్నారు
చంద్రబాబు పాలనలో.. ఇది ఎవరూ జీర్ణించుకోలేని విషయాలు




గోబెల్స్కే మెంటార్ మన చంద్రబాబు
సూపర్ సిక్స్.. సూపర్ సెవెన్.. అన్నీ మోసాలే
పెన్షన్లు.. సిలిండర్లు.. ఇలా ఏ ఒక్క హామీని నెరవేర్చలేదు
అయినా కూడా హామీలన్నీ నెరవేర్చామని ప్రచారం
హిట్లర్ కాలంలోని జోసెఫ్ గోబెల్స్ ప్రపంచానికి తెలుసు
అబద్ధపు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారం అంటుంటాం
అందుకే చంద్రబాబు ప్రచారాలకు గోబెల్స్ ప్రచారాలు అని పేరు
కానీ, ఆ గోబెల్సే చంద్రబాబు నుంచి చాలా నేర్చుకోవాలి
ఇలాంటివి చేస్తున్న చంద్రబాబు మీద చీటింగ్ కేసు పెట్టి జైల్లో వేయాలి

గతంలో.. వైఎస్సార్సీపీ హయాంలో ఎలా ఉండేది?
ఆర్బీకేలు అద్భుతంగా పని చేసేవి
రైతులకు గిట్టుబాటు ధర కోసం ఆరాట పడ్డాం
బాబు పాలనలో రైతులను దళారులను మోసం చేస్తున్నారు
చంద్రబాబేమో చోద్యం చూస్తున్నారు
ఇచ్చిన హామీలు మోసం.. రైతుల పరిస్థితి దయనీయం.. టాపిక్ డైవర్ట్ కోసం రైతన్నా మీ కోసం అంటూ డ్రామాలు
జీవితంలో రైతుల కోసం ఏం చేయని చంద్రబాబు.. బోగస్ ప్రచారాలకు దిగారు
ఘోరాతి ఘోరంగా ఉంది చంద్రబాబు పాలన


దిత్వా తుపాను గురించి ముందస్తు సమాచారం ఉంది
పంట కోతలకు సిద్ధంగా ఉందనీ తెలుసు
అయినా చంద్రబాబు ప్రభుత్వం నష్టాన్ని నివారించలేకపోయింది
మా హయాంలో ఇలాంటి విపత్తులు వస్తే పరిస్థితి ఎలా ఉండేది?
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో.. తక్షణ చర్యల ఉండేవి
రైతులు ఎలా పోయినా ఫర్వాలేదని చంద్రబాబు అనుకుంటున్నారు
కేజీ అరటికి రూ.50 పైసలా?
వరి, కొబ్బరి, పత్తి.. ప్రతి పంట పరిస్థితి ఇదే..
రైతులు ఎలా బతికేది?.. ఇంత ఘోరంగా పాలన సాగుతోంది
చంద్రబాబు అనే వ్యక్తి అసలేం చేస్తున్నాడు? నిద్రపోతున్నాడా?.. సీఎంగా ఉండి ఎందుకు?..
రైతులకు చంద్రబాబు ఇచ్చిన హామీలన్నీ మోసాలే
రెండేళ్లలో రూ.40 వేల పంట సాయం ఇవ్వాలి.. కానీ, రూ.10 వేలే ఇచ్చారు
18 నెలల బాబు పాలనలో 17 ప్రకృతి విపత్తులు
కూటమి పాలనలో రైతుల జీవితాలు ఛిన్నాభిన్నం
రూ.1,100 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ బకాయిలు
వైఎస్సార్సీపీ హయాంలో హక్కుగా ఉచిత పంటల బీమా
వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.7,000 కోట్ల ఉచిత పంటల బీమా
చంద్రబాబు పాలనలో ఉచిత పంటల బీమా పేరిట మోసం
84 లక్షల మంది రైతులు ఉంటే.. 19 లక్షల మందికే ఇన్సూరెన్స్
ఇన్సూరెన్స్ డబ్బులు ఎప్పుడు ఇస్తారో తెలీదు
ఇన్పుట్ సబ్సిడీలు ఎప్పుడిస్తారో తెలియదు
దయనీయంగా ఏపీ కౌలు రైతుల పరిస్థితి
మరి గతంలో ఎలా ఉండేది?..
వైఎస్సార్సీపీ హయాంలో పండుగలా వ్యవసాయం
62 శాతం మంది వ్యవసాయంపై ఆధారపడి ఉన్నారు
చంద్రబాబు హయాంలో దండుగగా మారిన వ్యవసాయం
మోంథా తుపానును పీకపట్టి చంద్రబాబు, లోకేష్, పవన్లే ఆపినట్లు బిల్డప్ ఇచ్చారు
తుపాను తర్వాత కూడా రైతులకు న్యాయం చేయలేదు
నష్టపోయిన రైతులకు పైసా సాయం అందించలేదు
పైగా పంట నష్టాన్ని దారుణంగా తగ్గించారు
సేవ్ ఆంధ్రప్రదేశ్లా.. పాలన
రాష్ట్ర ప్రజలకు కూటమి ప్రభుత్వం గురించి చాలా విషయాలు తెలియాల్సి ఉంది
నాణేనికి రెండో వైపు ఎలా ఉందో ప్రజలకు తెలియజేయాల్సిన అవసరం ఉంది
రాష్ట్రంలో సేవ్ ఆంధ్రా పాలన జరుగుతున్నది
రాష్ట్రం మొత్తం దేశం వైపు చూడాలి
రైతు సంతోషంగా ఉంటేనే రాష్ట్రం సంతోషంగా ఉంటుంది
రైతు, రైతు కూలీ సంతోషంగా లేకపోతే రాష్ట్రం ఎదగదు


