YS Jagan: భారత నౌకాదళ సిబ్బందికి శుభాకాంక్షలు | Indian Navy Day 2025: YS Jagan Convey Wishes to Navy Force | Sakshi
Sakshi News home page

నేవీ డే: భారత నౌకాదళ సిబ్బందికి వైఎస్‌ జగన్‌ శుభాకాంక్షలు

Dec 4 2025 10:06 AM | Updated on Dec 4 2025 10:14 AM

Indian Navy Day 2025: YS Jagan Convey Wishes to Navy Force

సాక్షి, తాడేపల్లి: ఇండియన్‌ నేవీ డే సందర్భంగా.. దేశ నౌకాదళ సిబ్బందికి వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌మోహన్‌రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ‘‘మన సముద్ర తీరాలను కాపాడటంలో నౌకాదళ సిబ్బంది పాత్ర అసమానమైనది. దేశ ప్రయోజనాలను కాపాడేందుకు.. సముద్రాలపై వారు చూపుతున్న ధైర్యం,  దృఢ సంకల్పానికి అభినందనలు అంటూ ఎక్స్‌ ఖాతాలో ఓ ట్వీట్‌ చేశారాయన.

దేశానికి నౌకా దళాల విజయాలు, దేశ రక్షణలో వారి పాత్రను గుర్తుచేసుకొవటానికి ప్రతీ ఏటా డిసెంబర్‌ 4వ తేదీని నేవీ డేగా జరుపుతారు. తీర ప్రాంతాల్లో నేవీ ప్రత్యేక విన్యాసాలు నిర్వహిస్తారు.

మరి ఈ తేదీనే ఎందుకంటే.. 1971 ఇండో-పాక్‌ యుద్ధ సమయంలో డిసెంబరు 4న భారత నేవీ అతిపెద్ద పాకిస్తానీ నౌకాశ్రయం కరాచీ పోర్టుపై మెరుపుదాడి చేసి మూడు ఓడలను ముంచేసింది. ఆపరేషన్ ట్రైడెంట్‌గా ఇది చరిత్రలో నిలిచిపోయింది. అందుకే.. ఆ తేదీ జ్ఞాపకార్ధంగా భారతదేశంలో నేవీ డే నిర్వహిస్తుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement