Live Updates
కోటి సంతకాలు.. కోట్ల గళాలు
ర్యాలీల విజయవంతంపై వైఎస్ జగన్ హర్షం
- ‘కోటి సంతకాల సేకరణ’ తరలింపులో భాగంగా వైఎస్సార్సీపీ చేపట్టిన ర్యాలీలు విజయవంతపై వైఎస్ జగన్ హర్షం
- ర్యాలీలకు హాజరైన అందరికీ కృతజ్ఞతలు తెలిపిన జగన్
- సేవ్ మెడికల్ కాలేజీల హ్యాష్ ట్యాగ్ తో ట్వీట్ చేసిన జగన్
- ఇది కేవలం ప్రభుత్వ వైద్య కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేసిన ఉద్యమం మాత్రమే కాదు;
- చంద్రబాబు నాయుడు ప్రజావ్యతిరేక విధానాలపై ప్రజలు ఇచ్చిన ఘనమైన తీర్పు.
- ప్రజాప్రయోజనాలను ఫణంగా పెడుతూ, వారికి ద్రోహం చేస్తూ ఆయన తీసుకున్న నిర్ణయాలను ఖండిస్తూ, ఒక కోటికి పైగా పౌరులు స్వచ్ఛందంగా ముందుకు వచ్చి సంతకాలు చేశారు.
The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how… pic.twitter.com/umPRjU20xa
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025
కాకినాడ జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా సంతకాల సేకరణ
కాకినాడ:
- ఉద్యమంలా మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ
- జిల్లా వ్యాప్తంగా 4 లక్షలకు పైగా సంతకాల సేకరణ
- జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయం నుండి కేంద్ర వైఎస్సార్సీపీ కార్యాలయంకు తరలింపు
- భానుగుడి సెంటర్ నుండి బాలాజీ సెంటర్ వరకు భారీ ర్యాలీ
ర్యాలీ లో పాల్గోన్న ఉత్తరాంధ్ర రిజనల్ కోఆర్డినేటర్ కురసాల కన్నబాబు, జిల్లా అధ్యక్షులు దాడిశెట్టి రాజా నియోజకవర్గం ఇన్ఛార్జులు ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డి, వంగా గీతా,తోట నరసింహం, దవులూరి దొరబాబు, ముద్రగడ గిరిబాబు, జడ్పీ ఛైర్మన్ వేణుగోపాల రావు. పార్లమెంటు పరిశీలకులు సూర్యనారాయణ రాజు
The one-crore signatures campaign launched by the YSR Congress Party against the privatisation of medical colleges has become a historic and resounding success. The massive rallies with the display of the signatures held in all 26 district headquarters stand as clear proof of how… pic.twitter.com/umPRjU20xa
— YS Jagan Mohan Reddy (@ysjagan) December 15, 2025
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాలో..
డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లా:
- అమలాపురంలో వైఎస్సార్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటి సంతకాల ప్రతులు పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు
- హై స్కూల్ సెంటర్ నుండి నల్ల వంతున అంబేద్కర్ విగ్రహం వరకు భారీ ర్యాలీ నిర్వహించిన నేతలు కార్యకర్తలు
- పార్టీ జిల్లా అధ్యక్షుడు చిర్ల జగ్గిరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమానికి హాజరైన వైఎస్ఆర్సిపి నేతలు, ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్సీలు, మాజీ ఎంపీ
పార్వతీపురంలో భారీ ర్యాలీ
- పార్వతీపురంలో మెడికల్ కాలేజ్లు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల పత్రాల తరలింపు కార్యక్రమం, భారీ ర్యాలీ
- వైఎస్ఆర్ విగ్రహానికి పూల మాల వేసి నివాళులు అర్పించి ర్యాలీ ప్రారంభించిన ఎమ్మెల్సీ పాలవలస విక్రాంత్, మాజీ డిప్యూటీ సిఎంలు రాజన్న దొర, పాముల పుష్పశ్రీవాణి, మాజీ ఎమ్మెల్యేలు వి కళావతి, అలజంగి జోగారావు
విద్యకు చంద్రబాబు సర్కార్ తూట్లు: ధర్మాన ప్రసాదరావు
- శ్రీకాకుళం: సమాజంలో అసమానతలు తగ్గాలంటే..
- అందరికీ విద్య అందాలని ప్రాథమిక హక్కుగా పెట్టారు
- దానికి తూట్లు పొడిచే కార్యక్రమం ఇప్పుడు నెమ్మదిగా జరుగుతుంది
- విద్యను ప్రైవేట్ వ్యక్తులకు ఇవ్వమని ఏ రాజకీయ పార్టీ, కమిటీ రికమెండ్ చేస్తుందా?
- మెడికల్ కాలేజీలకు భూములు ప్రభుత్వానివి
- టెక్నికల్, నాన్ టెక్నికల్, టీచింగ్ స్టాఫ్ జీతాలు ప్రభుత్వం ఇస్తాదట
- కలెక్షన్ ఏమో చంద్రబాబు పెట్టిన మనుషులు తీసుకుంటారట
- అరకొరగా ఉన్న ప్రభుత్వ కళాశాలలు కూడా తీసేసి పేదవాడు చదువుకోకుండా చేయటం ధర్మమేనా?
- విద్య, వైద్యం ప్రభుత్వం చేతుల్లో ఉండాలి
- విద్యను ప్రైవేట్ వ్యక్తులకు ఇచ్చి పీకలు కోసే పని చేయకండి
- ఈ ప్రభుత్వం ఎన్నికలు రావడమే ఆలస్యం.. తట్టబుట్ట సద్దుకుంటుంది.
తాడేపల్లి చేరుకున్న తొలి వాహనం
- కోటి సంతకాల ప్రతులతో వచ్చిన ఎన్టీఆర్ జిల్లా వాహనం
- స్వాగతం పలికిన పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్చార్జ్ లేళ్ల అప్పిరెడ్డి
- ఎన్టీఆర్ జిల్లాలో నమోదైన 4.32 లక్షల సంతకాలను అప్పిరెడ్డికి అందజేసిన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
అనకాపల్లి
వైసీపీ కార్యాలయం నుంచి రింగ్ రోడ్డు మీదుగా నాలుగు రోడ్ల జంక్షన్ వరకూ ర్యాలీ.
- భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు.. ప్రజలు.
- ర్యాలీకి హాజరైన మాజీ మంత్రులు గుడివాడ అమర్నాథ్, బూడి ముత్యాల నాయుడు.. మాజీ ఎమ్మెల్యేలు కరణం ధర్మ శ్రీ, అదీప్ రాజ్, ఉమా శంకర గణేష్, జోగులు.. మాజీ ఎంపీ డా.సత్యవతి.. అనకాపల్లి సమన్వయకర్త భరత్, పార్లమెంట్ ఇంచార్జ్ బొడ్డేడ ప్రసాద్ తదితరులు హాజరు.
గుడివాడ అమర్నాథ్ కామెంట్స్
- అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల సంతకాలు సేకరించాం.
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.
- పేద వాడి కడుపు నింపే కార్యక్రమం ఈ ప్రభుత్వం చెయ్యడం లేదు.
- ఈ ప్రభుత్వం అడుగడుగునా పేదల కడుపు కొడుతుంది.
నెల్లూరు
- కోటి సంతకాల ర్యాలీలో స్వల్ప అస్వస్థతకు గురైన నెల్లూరు పార్లమెంటు పరిశీలకుడు జంకా వెంకటరెడ్డి
- చికిత్స అనంతరం మెరుగుపడ్ట ఆరోగ్యం
పేదలకు అండ వైఎస్ జగన్, కార్పోరేట్లకు అండ చంద్రబాబు
అన్నమయ్య జిల్లా
అన్మమయ్య జిల్లాలో కోటి సంతకాల సేకరణ సూపర్ సక్సెస్.
కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా రాయచోటిలో హోరెత్తిన నినాదాలు.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ఆపాలంటూ కదం తొక్కిన ప్రజానీకం.
ప్రేదప్రజలకు అండ వైఎస్ జగన్, కార్పోరేట్లకు అండ చంద్రబాబు.
సీఎం డౌన్, డౌన్ అంటూ నినాదాలు
చిత్తూరు - కర్నూలు జాతీయ రహదారిలో శివాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు కొనసాగిన ర్యాలీ
కోటి మంది కూటమి ప్రభుత్వం వద్దని సంతకాలు చేశారు: అవినాష్
విజయవాడ
18 నెలల పాలనలోనే కోటి మంది కూటమి ప్రభుత్వం వద్దని సంతకాలు చేశారు.
4లక్షల 20 వేల మంది ఎన్టీఆర్ జిల్లా నుంచి సంతకాలు చేసి పంపుతున్నాం.
మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేస్తే ఊరుకోం.
మెడికల్ కాలేజీల నిర్మాణ పనులు ఆపేసి బినామీలకు ప్రభుత్వం అమ్మేస్తుంది.
చంద్రబాబు ప్రభుత్వానికి నూకలు చెల్లాయి.
వైఎస్ జగన్ నాయకత్వంలో పిపిపి నిర్ణయం వెనక్కి తీసుకునే వరకు పోరాటం చేస్తాం.
-అవినాష్, ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షులు
ఈ ప్రభుత్వం అడుగడుగునా పేదల కడుపు కొడుతుంది: గుడివాడ అమర్నాథ్
అనకాపల్లి
అనకాపల్లి జిల్లా వ్యాప్తంగా 4 లక్షల సంతకాలు సేకరించాం.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి.
పేద వాడి కడుపు నింపే కార్యక్రమం ఈ ప్రభుత్వం చెయ్యడం లేదు.
ఈ ప్రభుత్వం అడుగడుగునా పేదల కడుపు కొడుతుంది.
-గుడివాడ అమర్నాథ్
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమా..? చంద్రబాబూ ఖబర్దార్: లేళ్ళ అప్పిరెడ్డి
తాడేపల్లి
చంద్రబాబూ ఖబర్దార్
ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడవద్దు
మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేస్తే జనం సహించరు
కోటికి పైగా సంతకాలతో ప్రజలు నిసన తెలిపారు
ఒక ఉద్యమంగా కోటి సంతకాల కార్యక్రమం జరిగింది
కోటి 30 లక్షల మంది సంతకాల రూపంలో తమ నిరసన తెలిపారు
ప్రజల నిరసనను అర్థం చేసుకోకపోతే ప్రజా కోర్టులో చంద్రబాబుకు గుణపాఠం తప్పదు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ
అల్లూరి జిల్లా
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా భారీ ర్యాలీ.
ర్యాలీలో పాల్గొన్న ఎమ్మెల్యేలు విశ్వేశ్వర రాజు మత్స్యలింగం జడ్పీ చైర్ పర్సన్ సుభద్ర భాగ్యలక్ష్మి.
బ్రోకర్లకు,నీకు చందాలిచ్చే వారికి మెడికల్ కాలేజీలు తాకట్టు పెట్టొద్దు
కృష్ణాజిల్లా
- మచిలీపట్నం నుంచి వైసిపి కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతులు తరలింపు
- కోనేరు సెంటర్ లో కోటి సంతకాల ప్రతులతో బయల్దేరిన వాహనాన్ని జెండా ఊపి ప్రారంభించిన వైసిపి నేతలు, మాజీ మంత్రి, పేర్ని నాని
- నీ బ్రోకర్లకు,తాబేదార్లకు,నీకు చందాలిచ్చే వారికి మెడికల్ కాలేజీలు తాకట్టు పెట్టొద్దు
- డబ్బులు కట్టి ఆసుపత్రుల్లో వైద్యం చేయించుకుంటే తప్పేంటని కొందరు టిడిపి నేతలు మాట్లాడుతున్నారు
- బసవతారకం క్యాన్సర్ ఆసుపత్రిలో ఒక్కరికైనా ఉచితంగా వైద్యం చేస్తున్నారా
- పేదలు డబ్బులు లేకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో వైద్యం దొరుకుతుందా
- చిత్తూరు ప్రభుత్వాసుపత్రిని చంద్రబాబు అపోలో వాళ్లకు అమ్మేశాడు
- అపోలో వాళ్లు వెంటనే మెడికల్ కాలేజీ పెట్టుకున్నారు
- టిడిపి నేతలు అధికార మదంతో మాట్లాడొద్దు
- ఓట్ల కోసం వెళ్లినపుడు జనం వద్దకు రకరకాల వేషాలతో వెళ్లి ఓట్లు అడుక్కున్నారు
- ప్రశ్నించే వాడు ప్రశ్నించడు
- జనం సొమ్ముతో విమానాలు, హెలీకాప్టర్లలో తిరుగుతారు
- మాట్లాడితే గల్లా పెట్టె ఖాళీ అంటున్నారు
- రెండున్నర లక్షల కోట్లు అప్పు చేశారు
- తన 40 ఏళ్ల సీనియారిటీలో చంద్రబాబు ఒక్క మెడికల్ కాలేజి అయినా కట్టాలనే ఆలోచన చేశారా
- జగన్ 17 మెడికల్ కాలేజీలు తెచ్చారు
- 7 కాలేజీలు పూర్తిచేసి...10 నిర్మాణం మొదలుపెట్టారు
- జగన్ నిర్ణయం వల్ల ఉచితంగా పేదలకు మెడికల్ విద్య అందుతోంది
- 10 మెడికల్ కాలేజీలను 66 ఏళ్ల పాటు తన బ్రోకర్లకు చంద్రబాబు అప్పనంగా అప్పగించాడు
- రెండేళ్ల పాటు మెడికల్ కాలేజీలు, ఆసుపత్రుల్లో పని చేసేవారికి జీతాలిస్తామంటున్నాడు
- ఇంతకంటే దోపిడీ ఏముంది
- నువ్వెలాగూ కట్టలేకపోయావ్
- జగన్ కట్టిన కాలేజీలను ఎలా అమ్ముతావ్ చంద్రబాబు
- ఎన్నికల ముందు జగన్ మెడికల్ సీట్లు అమ్మేశారని తప్పుడు ప్రచారం చేశారు
- ఈరోజు చంద్రబాబు,లోకేష్ చిలకపలుకులు పలుకుతున్నారు
- ఎందుకు మీకు అంత అధికారమధం
- చంద్రబాబు,లోకేష్ కు డబ్బులు పోగేసుకోవాలనే తప్పుడు రోగం పట్టుకుంది
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి పైచిలుకు సంతకాలు సేకరించాం
- 18వ తేదీన కోటి సంతకాలను గవర్నర్ కు అందజేస్తాం
- చంద్రబాబు మాటలు విని మెడికల్ కాలేజీలను కబళించాలని చూస్తే ఫలితం అనుభవిస్తారని హెచ్చరిస్తున్నాం
- ఉప్పాల హారిక ,కృష్ణాజిల్లా జడ్పీ చైర్ పర్సన్
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పై ప్రజా ఉద్యమం చేపట్టాం
- అన్ని వర్గాల ప్రజలు మాతో చేయి కలిపారు
- ప్రజామోదంతో కోటి సంతకాలు చేపట్టాం
- కోటి సంతకాలను గవర్నర్ కు అందిస్తాం
- కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలి
- మాజీ ఎమ్మెల్యే,సింహాద్రి రమేష్ బాబు
- చంద్రబాబు అంటేనే మోసం
- మోసగాడని తెలిసి కూడా చంద్రబాబుని ఎన్నుకున్నారు
- చంద్రబాబే అధికారంలో ఉండాలని కోరుకునే వాళ్లు కూడా ఇప్పుడు ఆయన్ని వ్యతిరేకిస్తున్నారు
- పిపిపి పోరుతో చంద్రబాబు మోసం చేస్తున్నాడు
- జగన్ సీఎంగా ఉండుంటే బాగుండని జనం భావిస్తున్నారు
- మాజీ ఎమ్మెల్యే,కైలే అనిల్ కుమార్
- ఎన్నికల ముందు చంద్రబాబు, ఆయన పుత్రుడు,దత్తపుత్రుడు బోల్డన్ని కబుర్లు చెప్పారు
- చంద్రబాబు అపరిచితుడిలా మారాడు
- రాష్ట్రాన్ని పప్పూ బెల్లాల్లా అమ్మేస్తున్నాడు
- ఇదే కోనేరు సెంటర్ లో నిలబడి చంద్రబాబు చాలా కబుర్లు చెప్పాడు
- ఈరోజు మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నాడు
- మెడికల్ కాలేజీలు అమ్మితే తప్పేంటని టిడిపి మంత్రులు అడుగుతున్నారు
- మీరు మట్టి,ఇసుక అమ్మినట్లు మెడికల్ కాలేజీలను అమ్మేయాలనుకోవడం దుర్మార్గం
వైయస్ జగన్ మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరం చేస్తారు: కన్నబాబు
విశాఖపట్నం
విశాఖలో ప్రారంభమైన కోటి సంతకాల ర్యాలీ కార్యక్రమం.
జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం హైవే వరకు భారీ ర్యాలీ.
జిల్లా నుంచి కేంద్ర పార్టీ కార్యాలయానికి సంతకాల పత్రాలను వాహనాల మీద పంపిణీ.
ర్యాలీలో పెద్ద ఎత్తున పాల్గొన్న వైయస్ఆర్సీపీ శ్రేణులు యువత విద్యార్థులు.
గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు.
కన్నబాబు పాయింట్స్
చంద్రబాబు ఒక నియంత.
మెడికల్ కాలేజీలను తన బినామీలకు కట్టబెడుతున్నారు.
పేదవాడు ఆరోగ్యం కోసం మెడికల్ కాలేజీలను వైఎస్ జగన్ ఏర్పాటు చేశారు.
వైయస్ జగన్ అధికారంలోకి వచ్చిన తర్వాత మెడికల్ కాలేజీలను ప్రభుత్వ పరం చేస్తారు.
నాలుగు సార్లు సీఎం గా పనిచేసిన చంద్రబాబు ఒక మెడికల్ కాలేజీని కూడా నిర్మించలేదు.
ఉత్తరాంధ్ర భూములను కారు చౌకగా అమ్మేస్తున్నారు.
ఎకరా భూమి 99 పైసలు ఇచ్చే చంద్రబాబు, పేదవానికి గజం 99 రూపాయలకు ఇస్తారా.
తాడేపల్లి చేరుకున్న తొలి వాహనం
తాడేపల్లి
తాడేపల్లి చేరుకున్న తొలి వాహనం
కోటి సంతకాల ప్రతులతో వచ్చిన ఎన్టీఆర్ జిల్లా వాహనం
స్వాగతం పలికిన పార్టీ కేంద్ర కార్యాలయ ఇన్ఛార్జి లేళ్ల అప్పిరెడ్డి
ఎన్టీఆర్ జిల్లాలో నమోదైన 4.32 లక్షల సంతకాలను అప్పిరెడ్డికి అందజేసిన జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
శ్రీ సత్యసాయి జిల్లా
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు ఉషాశ్రీచరణ్.
పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా నిరసన ప్రదర్శన.
పాల్గొన్న మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, దుద్దుకుంట శ్రీధర్ రెడ్డి, కదిరి సమన్వయకర్త మక్బూల్, హిందూపురం సమన్వయకర్త దీపిక, మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ భారీ బైక్ ర్యాలీ
అనంతపురం
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ అనంతపురంలో భారీ బైక్ ర్యాలీ
వైఎస్సార్ సీపీ జిల్లా కార్యాలయం నుంచి బుక్కరాయసముద్రం వైఎస్సార్ విగ్రహం దాకా నిరసన ప్రదర్శన
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు మాజీ ఎమ్మెల్యే అనంత వెంకటరామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు కేతిరెడ్డి పెద్దారెడ్డి విశ్వేశ్వరరెడ్డి, మెట్టు గోవిందరెడ్డి, మాజీ ఎంపీలు తలారి రంగయ్య, గోరంట్ల మాధవ్
కోటి సంతకాల సేకరణ ప్రతులతో భారీ ర్యాలీ
శ్రీ సత్యసాయి జిల్లా
పుట్టపర్తిలో భారీ ర్యాలీ నిర్వహించిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ.
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిరసిస్తూ నిరసన ప్రదర్శన.
కోటి సంతకాల సేకరణ ప్రతులతో భారీ ర్యాలీ.
పుట్టపర్తి వైఎస్సార్ సీపీ కార్యాలయం నుంచి సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ దాకా ప్రదర్శన.
పాల్గొన్న వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షురాలు, మాజీ మంత్రి ఉషాశ్రీచరణ్, కదిరి సమన్వయకర్త మక్బూల్, హిందూపురం సమన్వయకర్త దీపిక, మాజీ ఎమ్మెల్యేలు తోపుదుర్తి ప్రకాష్ రెడ్డి, దుద్ధుకుంట శ్రీధర్ రెడ్డి, , మడకశిర సమన్వయకర్త ఈరలక్కప్ప.
తాడేపల్లి బయలుదేరిన కోటి సంతకాల ప్రతులు
విజయవాడ
విజయవాడలో జెండా ఊపి వాహనాన్ని ప్రారంభించిన పార్టీ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్
హాజరైన ఏడు అసెంబ్లీ నియోజకవర్గాల సమన్వయ కర్తలు, మేయర్ భాగ్యలక్ష్మి
ఏడు అసెంబ్లీ నియోజకవర్గాలలో భారీగా నమోదైన సంతకాలు
ఎన్టీఆర్ జిల్లాలోనే దాదాపు 4.50 లక్షల సంతకాలు నమోదు
తాడేపల్లి బయలుదేరిన కోటి సంతకాల ప్రతులు
ఇది ప్రారంభం మాత్రమే.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై తీవ్రస్థాయిలో ఉద్యమిస్తాం
తూర్పుగోదావరి జిల్లా
రాజమండ్రి రూరల్ కోటి సంతకాల ప్రతుల తరలింపు కార్యక్రమం
హాజరైన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు వేణుగోపాలకృష్ణ, కోఆర్డినేటర్లు జక్కంపూడి రాజా, మార్గాన్ని భరత్, డాక్టర్ సూర్యనారాయణ రెడ్డి, తలారి వెంకట్రావు, శ్రీనివాస్ నాయుడు, డాక్టర్ గూడూరు శ్రీనివాస్, షర్మిల రెడ్డి పార్టీ నాయకులు కార్యకర్తలు.
వేణుగోపాలకృష్ణ కామెంట్స్....
ప్రభుత్వం మెడికల్ కళాశాలు ప్రైవేటీకరణ చేయాలన కూటమి ప్రభుత్వ ఆలోచనలను ఎట్టి పరిస్థితుల్లో జరగనివ్వం.
వైయస్ జగన్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా నాలుగున్నర లక్షల సంతకాల సేకరణ జరిగింది.
కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజల తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు.
పేదవాడికి వైద్యం అందాలంటే వైద్య కళాశాలలు ప్రభుత్వ అధీనంలోనే ఉండాలి.
లక్షల కోట్లు అప్పులు చేస్తున్న చంద్రబాబు వైద్య కళాశాలలకు 5000 కోట్లు మంజూరు చేయలేకపోతున్నారు.
కూటమి ప్రభుత్వం, సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు
కృష్ణాజిల్లా
మచిలీపట్నం నుంచి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి కోటి సంతకాల ప్రతుల తరలింపు
కోటి సంతకాల ప్రతులున్న బాక్సులను స్వయంగా వాహనంలోకి లోడ్ చేసిన కృష్ణాజిల్లా వైసిపి అధ్యక్షులు , మాజీ మంత్రి , పేర్ని నాని , మాజీ ఎమ్మెల్యేలు సింహాద్రి రమేష్ బాబు,కైలే అనిల్ కుమార్, మచిలీపట్నం వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ పేర్ని కిట్టు,పెడన వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ ఉప్పాల రాము , పెనమలూరు వైఎస్సార్సీపీ ఇంఛార్జ్ దేవభక్తుని చక్రవర్తి, గుడివాడ ,గన్నవరం వైసిపి నేతలు.
మచిలీపట్నంలోని వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి కోనేరు సెంటర్ వరకూ ర్యాలీ
ర్యాలీలో భారీగా పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని వెనక్కి తీసుకోవాలని డిమాండ్
కూటమి ప్రభుత్వం,సీఎం చంద్రబాబు డౌన్ డౌన్ అంటూ నినాదాలు
ప్రభుత్వ వ్యతిరేక నినాదాలతో హోరెత్తిన మచిలీపట్నం
జెండా ఊపి ర్యాలిని ప్రారంభించిన ఆదిమూలపు సురేష్
ప్రకాశం
మెడికల్ కాలేజీల ప్రయివేటి కరణకు వ్యతిరేకంగా కొండేపిలో సంతకాల సేకరణ పత్రాలతో పాటు ఒంగోలులో జరుగు ర్యాలికి బయలుదేరిన వాహనాలను జెండా ఊపి ప్రారంభించిన మాజీ మంత్రి ఆదిమూలపు సురేష్
నంద్యాల జిల్లా
వైఎస్సార్సీపీ చేపట్టిన మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేస్తున్న ప్రజా ఉద్యమం కోటేసంతకాల కార్యక్రమానికి భారీ స్పందన.
వైఎస్సార్సీపీ ఇచ్చిన పిలుపుకు ప్రజల నుండి విశేష స్పందన.
నంద్యాలలో భారీగా తరలివచ్చిన ప్రజలు, వైఎస్సార్సీపీ నాయకులు , కార్యకర్తలు , అభిమానులు.
ప్రజా ఉద్యమం కోటి సంతకాలకు ప్రజల నుండి అందిన పత్రాలను గవర్నర్ కు సమర్పించేందుకు భారీ కార్యక్రమం.
నంద్యాల జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం నుండి కోటి సంతకాల పత్రాలను లారీలో వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమానికి భారీ సంఖ్యలో హాజరైన వైసిపి శ్రేణులు.
ఈ ప్రజా ఉద్యమంలో నంద్యాల జిల్లా అధ్యక్షుడు కాటసాని రాంభూపాల్ రెడ్డి , శిల్పా చక్రపాణి రెడ్డి , కాటసాని రామిరెడ్డి , ఎమ్మెల్సీ కల్పలతా రెడ్డి ,ఇషాక్ భాషా , డాక్టర్ దారా సుధీర్ పాల్గొన్నారు.
భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు.. ప్రజలు
అనకాపల్లి
- వైసీపీ కార్యాలయం నుంచి ప్రారంభమైన ర్యాలీ.
- భారీగా హాజరైన వైసీపీ శ్రేణులు.. ప్రజలు.
- రింగ్ రోడ్డు మీదుగా అనకాపల్లి బైపాస్ వరకూ కొనసాగనున్న ర్యాలీ.
పవన్ కళ్యాణ్ చేతకాని తనంతో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ
తిరుపతి
కూటమి ప్రభుత్వం, పవన్ కళ్యాణ్ చేతకాని తనంతో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ చేస్తున్నారు.
ఒకప్పుడు అయోధ్యలో రామాలయానికి ప్రతి ఒక్కరు ఓ ఇటుక ఇచ్చారు.
కోట్ల ఇటుకలు చేరి రామాలయం నిర్మించారు.
నేడు మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా రాష్ట్రంలో ప్రజలు సంతాకలతో కూటమి ప్రభుత్వానికి బుద్ది చెప్తారు.
- మాజీ ఎంఎల్యే బియ్యపు మధుసూదన్ రెడ్డి
ర్యాలీని ప్రారంభించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు
విశాఖపట్నం
విశాఖలో ప్రారంభమైన కోటి సంతకాల ర్యాలీ కార్యక్రమం.
జిల్లా నుంచి కేంద్ర పార్టీ కార్యాలయానికి పంపనున్న సంతకాల పేపర్లు.
లక్ష్యానికి మించి జరిగిన సంతకాల సేకరణ.
ప్రజా ఉద్యమంలో స్వచ్ఛందంగా భాగస్వామ్యమైన అన్ని వర్గాల ప్రజలు.
జీవీఎంసీ గాంధీ విగ్రహం నుంచి మద్దిలపాలెం హైవే వరకు భారీ ర్యాలీ.
ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ శ్రేణులు యువత విద్యార్థులు.
గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి ర్యాలీని ప్రారంభించిన ఉత్తరాంధ్ర రీజనల్ కోఆర్డినేటర్ కన్నబాబు, కేకే రాజు.
ర్యాలీలో పాల్గొన్న నియోజకవర్గ సమన్వయకర్తలు మల్ల విజయప్రసాద్ దేవాన్, మొల్లి అప్పారావు, ఎమ్మెల్సీ వరుదు కళ్యాణి రవీంద్రబాబు, కదిరి బాబురావు, కాయల వెంకటరెడ్డి, మాజీ మేయర్ హరి వెంకట కుమారి కార్పొరేటర్లు.
కడపలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ
వైఎస్సార్ జిల్లా
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కదం తొక్కిన వైఎస్సార్సీపీ శ్రేణులు
జిల్లా పార్టీ కార్యాలయం నుంచి వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ
జెండా ఊపి కోటి సంతకాల సేకరణ ప్రతులను కేంద్ర కార్యాలయానికి పంపిన నేతలు
ర్యాలీలో పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, నియోజకవర్గ ఇంచార్జీలు, ఎమ్మెల్సీ, ఎమ్మెల్యేలు
హోరెత్తిన విజయవాడ
విజయవాడ
కోటి సంతకాల ప్రతులతో భారీ ర్యాలీ
ఎన్టీఆర్ జిల్లా అధ్యక్షుడు దేవినేని అవినాష్ ఆధ్వర్యంలో ర్యాలీ
బిఎస్ఎన్ఎల్ సెంటర్ నుండి శిఖామని సెంటర్ వరకు కిటకిటలాడిన రోడ్లు
ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రయివేటీకరణకు వ్యతిరేకంగా నినాదాలు
తిరుపతి
చంద్రబాబు సొంత నియోజకవర్గంలో మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పై స్వచ్చందంగా సంతకాలు చేసారు
ప్రజల నుండి మెడికల్ ప్రైవేటీకరణ పై వ్యతిరేకత పెరిగింది
చంద్రబాబు ఇప్పటికైన కళ్లు తెరిచి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ రద్దు చెయ్యాలి
కోటి సంతకాలతో గవర్నర్ త్వరలో మా నాయకుడు వైఎస్ జగన్ కలుస్తారు.
గవర్నర్ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిలుపుదల చేస్తారని ఆశిస్తున్నాను
భవిష్యత్తులో ఉద్యమం మరింత ఉదృతంగా ఉంటుంది.
- ఎంఎల్సీ భరత్
చంద్రబాబు అన్ని వ్యవస్థలు విచ్చిన్నం చేసారు: ఆర్కే రోజా
తిరుపతి
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ కోటి సంతకాల సేకరణ.
ఉమ్మడి చిత్తూరు జిల్లాలో సేకరించిన సంతకాల సేకరణ కరపత్రాలను నేడు బారీ ర్యాలీగా విజయవాడ తరలింపు.
ప్రజల నుండి మెడికల్ కాలేజ్ ప్రైవేటీకరణ పై నిరసనలు స్వచ్చందంగా మద్దతు తెలిపారు.
చంద్రబాబు కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ పాలన తప్ప ప్రజా పాలన చెయ్యడం లేదు.
ఆంధ్ర ఎందరో సీఎం అయినా మొదటిసారి సీఎంగా 17 మెడికల్ కాలేజ్ ను అనుమతి తీసుకొచ్చారు.
వైఎస్ జగన్ పేరు చెరిపేయాలని చంద్రబాబు కూటమి ప్రభుత్వం మెడికల్ కలేజ్ లను ప్రైవేటీకరణ చేస్తుంది.
విద్యార్థుల జీవితాలతో నాశనం చేస్తుంది కూటమి ప్రభుత్వం.
కూటమి పాలనలో వారు చేసిన సర్వేలోనే అందరు మంత్రులకు రెడ్ మార్క్ వచ్చింది.
విద్యావ్యవస్థను నారా లోకేష్ నాశనం అయితే, వ్యవసాయాన్ని అచ్చం నాయుడు నాశనం చేసారు.
చంద్రబాబు రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు విచ్చిన్నం చేసారు.
- ఆర్కే రొజా
కోటి సంతకాల సేకరణ ప్రతుల వాహన ర్యాలీ ప్రారంభించిన పెద్దిరెడ్డి
తిరుపతి
వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చిత్తూరు,తిరుపతి జిల్లా కార్యాలయం వద్ద జెండా ఊపి కోటి సంతకాలు సేకరణ ప్రతులు వాహన ర్యాలీ ప్రారంభించిన రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్ర రెడ్డి.
కార్యక్రమంలో పాల్గొన్న వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తిరుపతి,చిత్తూరు జిల్లా అధ్యక్షుడు భూమన కరుణాకరరెడ్డి, మాజీ మంత్రి ఆర్ కే రోజా, మాజీ డిప్యూటి సీఎం నారాయణ స్వామి, విజయనంద రెడ్డి, ఎమ్మెల్సీలు సిపాయి సుబ్రమణ్యం, భరత్, జీడి నెల్లూరు నియోజకవర్గం ఇంచార్జ్ కృపాలక్ష్మి, సత్యవేడు నియోజకవర్గం ఇంచార్జ్ నూకతోటి రాజేష్, చంద్రగిరి నియోజకవర్గం ఇంచార్జ్ చెవిరెడ్డి మోహిత్ రెడ్డి, శ్రీకాళహస్తి నియోజకవర్గం ఇంచార్జ్ బియ్యపు మధుసూదన్ రెడ్డి, పూతలపట్టు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సునీల్, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటే గౌడ
కృష్ణాజిల్లా
పెడన నియోజకవర్గంలో కోటి సంతకాల ప్రతులను తరలింపు కార్యక్రమని నియోజవర్గం ఇన్చార్జి ఉప్పాల రాము ఆధ్వర్యంలో పెడన నుండి మచిలీపట్నం వరకు ర్యాలీ
ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు: విజయానంద రెడ్డి
చిత్తూరు
తిరుపతి చిత్తూరు జిల్లాలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయం వద్దకు చిత్తూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఇంచార్జి ఏం.సి. విజయనంద రెడ్డి నేతృత్వంలో 150 కార్లు తో భారీ ర్యాలీ
కూటమి ప్రభుత్వం పాలనలో ప్రజా వ్యతిరేక విధానాలు పై ప్రజలు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.
- విజయానంద రెడ్డి
అనకాపల్లి
మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే పేదవారికి సూపర్ స్పెషాలిటీ వైద్యం అందుతుంది..
పిల్లలు డాక్టర్ అవ్వాలని తల్లితండ్రులు కలలు కంటారు..
మెడికల్ కాలేజీలు మన రాష్ట్రనికి చాలా అవసరం..
జగన్ గారు కేంద్రంతో మాట్లాడి కాలేజీలు మంజూరు చేయించారు.
ఈ పోరాటం ఇక్కడితో ఆగదు.
- డా. సత్యవతి మాజీ ఎంపీ
చంద్రబాబు పేదలకు విద్యా, వైద్యం దూరం చేస్తున్నాడు: చక్రవర్తి
కృష్ణా జిల్లా
పెనమలూరు నియోజకవర్గంలో కోటి సంతకాల ప్రతులు తరలింపు కార్యక్రమం.
సమన్వయకర్త దేవభక్తుని చక్రవర్తి ఆధ్వర్యంలో కానూరు నుండి మచిలీపట్నం వరకు ర్యాలీ.
ర్యాలీ లో పాల్గొన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు.
చక్రవర్తి కామెంట్స్
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ పూర్తిగా వ్యతిరేకిస్తున్నాం.
చంద్రబాబు బినామిలకు కట్టబెట్టేందుకే పీపీపీ విధానం.
చంద్రబాబు పేదలకు విద్యా, వైద్యం దూరం చేస్తున్నాడు.
జిల్లా అధ్యక్షులు పేర్ని నాని నేతృత్వంలో కోటి సంతకాల ప్రతులు తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపుతాం.
ఈనెల 18 జగనన్నతో కలిసి గవర్నర్ ను కలుస్తాం.
బైకులు, కార్లలో ర్యాలీగా ఏలూరు జిల్లా కేంద్రానికి తరలి వెళ్లిన కార్యకర్తలు
ఏలూరు జిల్లా
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటు కరణ వ్యతిరేకిస్తూ వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం
కైకలూరు నియోజకవర్గం నుండి ఏలూరు జిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో బైకులు, కార్లలో ర్యాలీగా ఏలూరు జిల్లా కేంద్రానికి తరలి వెళ్లిన కార్యకర్తలు
ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహారిస్తుంది: బూడి ముత్యాల నాయుడు
అనకాపల్లి
మెడికల్ కాలేజీల విషయంలో ప్రభుత్వం మూర్ఖంగా వ్యవహారిస్తుంది.
కోటి సంతకాల సేకరణకు విశేష స్పందన వచ్చింది.
పేద వారికి విద్య, వైద్యం అందాలని జగన్ ప్రభుత్వ రంగంలో మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు.
కోటి సంతకాల సేకరణతో ప్రజల అభిప్రాయం స్పష్టం అయ్యింది.
-బూడి ముత్యాల నాయుడు, మాజీ ఉప ముఖ్యమంత్రి
ప్రతులున్న బాక్సులను స్వయంగా వాహనంలోకి లోడ్ చేసిన పేర్ని నాని
కృష్ణాజిల్లా
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల ప్రజా ఉద్యమం
మచిలీపట్నం నుంచి వైఎస్ఆర్సీపీ కేంద్ర కార్యాలయానికి తరలివెళ్లనున్న కోటి సంతకాల ప్రతులు
కోటి సంతకాల ప్రతులున్న బాక్సులను స్వయంగా వాహనంలోకి లోడ్ చేసిన కృష్ణాజిల్లా వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు, మాజీ మంత్రి, పేర్ని నాని, మచిలీపట్నం వైఎస్ఆర్సీపీ ఇంఛార్జి పేర్ని కిట్టు, వైఎస్ఆర్సీపీ నేతలు, శ్రేణులు
కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి భారీగా కనిపిస్తున్న ప్రజాస్పందన
తూర్పుగోదావరి జిల్లా
రాజమండ్రి రూరల్ బొమ్మూరు జిల్లా కార్యాలయం నుండి వైఎస్ఆర్సీపీ శ్రేణుల ఆధ్వర్యంలో కోటి సంతకాలు ప్రతులను కేంద్ర కార్యాలయానికి తరలించే కార్యక్రమం
ఏడు నియోజకవర్గాల నుండి పెద్ద సంఖ్య తరలి వచ్చిన వైఎస్ఆర్సీపీ నాయకులు కార్యకర్తలు
బొమ్మూరు నుండి కోటిపల్లి బస్టాండ్ మీదుగా రైలు కమ్ రోడ్డు బ్రిడ్జి పై కొవ్వూరు వరకు కొనసాగనున్న భారీ బైక్ ర్యాలీ
కోటి సంతకాల ప్రజా ఉద్యమానికి భారీగా కనిపిస్తున్న ప్రజాస్పందన
జోగి రాజీవ్ ఆధ్వర్యంలో తరలి వెళ్తున్న మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు
ఎన్టీఆర్ జిల్లా
- విజయవాడ జిల్లా కేంద్రంలో జరగనున్న కోటి సంతకాల పత్రాలు తరలింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు ఇబ్రహీంపట్నం వైఎస్ఆర్సీపీ కార్యాలయం నుండి జోగి రాజీవ్ ఆధ్వర్యంలో తరలి వెళుతున్న మైలవరం నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ శ్రేణులు.
కోటి సంతకాల కార్యక్రమం ర్యాలీకి అనుమతి నిరాకరణ
విజయనగరం జిల్లా
మెడికల్ కాలేజ్ ల ప్రైవేటీకరణ కు వ్యతిరేకంగా వైఎస్ఆర్సీపీ చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమం ర్యాలీకి అనుమతి నిరాకరించిన విజయనగరం ఇంచార్జ్ డీఎస్పీ ఆర్ గోవింద రావు.
పోలీస్ ఆక్ట్ 1861 సెక్షన్ 30 అమలు లో ఉందని, ర్యాలీ కి నిరాకరించిన పోలీసులు.
ఈ మేరకు ఈ రోజు ఉదయం ప్రకటన విడుదల చేసిన పోలీస్ శాఖ.
వైఎస్ఆర్ జంక్షన్ వద్దకు భారీగా చేరుకున్న వైఎస్ఆర్సీపీ కార్యకర్తలు, విద్యార్థులు.
సీదిరి అప్పలరాజును అడ్డుకున్న కాశీబుగ్గ పోలీసులు
శ్రీకాకుళం
పలాస జాతీయ రహదారి లక్ష్మిపురం టోల్ ప్లాజా వద్ద మాజీ మంత్రి డాక్టర్ సీదిరి అప్పలరాజును అడ్డుకున్న కాశీబుగ్గ పోలీసులు
100 కార్లలో ఏలూరు జిల్లా కేంద్రానికి తరలి వెళ్తున్న కార్యకర్తలు
ఏలూరు జిల్లా
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటుకరణ వ్యతిరేకిస్తూ వైసిపి చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం
నూజివీడు నియోజకవర్గం నుండి మాజీ ఎమ్మెల్యే మేక వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో సుమారు 100 కార్లలో ఏలూరు జిల్లా కేంద్రానికి తరలి వెళ్తున్న కార్యకర్తలు
ఏలూరు జిల్లా కేంద్రం నుండి తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి పంపనున్న పత్రాలు
విసన్నపేట నుండి తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు
ఎన్టీఆర్ జిల్లా:
విజయవాడ జిల్లా కేంద్రంలో జరగనున్న కోటి సంతకాల పత్రాలు తరలింపు కార్యక్రమంలో పాల్గొనేందుకు విసన్నపేట నుండి తరలి వెళ్లిన వైఎస్సార్సీపీ శ్రేణులు.
ర్యాలీకి 100 వాహనాలలో బయలుదేరిన వైఎస్సార్సీపీ శ్రేణులు
అన్నమయ్య జిల్లా
- రైల్వే కోడూర్ మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో
- జిల్లా కేంద్రంలో ప్రజా ఉద్యమం కోటి సంతకాల వినతి పత్రాల ర్యాలీకి 100 వాహనాలలో బయలుదేరిన వైఎస్సార్సీపీ శ్రేణులు
జిల్లా కార్యాలయానికి తరలించిన కోటి సంతకాల పత్రాలు
ఎన్టీఆర్ జిల్లా:
- ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ విధానాన్ని వ్యతిరేకిస్తూ వైసిపి చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమం కార్యక్రమం.
- నియోజకవర్గ కేంద్రాల నుండి జిల్లా కార్యాలయానికి తరలించిన కోటి సంతకాల పత్రాలు.
- నేడు జిల్లా కేంద్రం నుండి తాడేపల్లి లోని కేంద్ర కార్యాలయానికి పంపనున్న పత్రాలు.
- తిరువూరు నియోజకవర్గం నుండి ఇన్చార్జ్ నల్లగట్ల స్వామి దాస్ ఆధ్వర్యంలో కార్లలో భారీ ఎత్తున తరలివెళ్లిన నాయకులు, కార్యకర్తలు.
కోటి సంతకాల సేకరణలో మరో అడుగు
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ప్రజా పోరాటం
- నేడు రాష్ట్రవ్యాప్తంగా.. అన్ని జిల్లా కేంద్రాల్లో భారీ ర్యాలీలు
- పెద్ద ఎత్తున తరలిరానున్న పార్టీ శ్రేణులు
- కాసేపట్లో జెండా ఊపి ర్యాలీని ప్రారంభించనున్న కీలక నేతలు
- సంతకాలతో ఉన్న ప్రతులు తాడేపల్లి వైఎస్సార్సీపీ కార్యాలయానికి తరలింపు
- 18న గవర్నర్ జస్టిస్ నజీర్తో వైఎస్ జగన్ భేటీ
- కోటి సంతకాల సేకరణ ప్రతుల వివరాలను గవర్నర్కు వివరించనున్న వైఎస్ జగన్
- మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను ఆపించాలని గవర్నర్ను కోరనున్న మాజీ సీఎం వైఎస్ జగన్
డీజీపీ అనుమతి కోరిన వైఎస్సార్సీపీ
- వాహనాల ర్యాలీకి అనుమతివ్వండి
- ఏపీ డీజీపీని కోరిన వైఎస్సార్సీపీ
- కోటి సంతకాల ప్రతులున్న వాహనాల ర్యాలీలకు అనుమతివ్వాలని లేఖ రాసింది.
- లేఖ రాసిన పార్టీ ప్రధాన కార్యదర్శి, ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి
- ఇప్పటికే ర్యాలీల్లో పాల్గొనద్దంటూ జిల్లాల్లో పోలీసులు నోటీసుల జారీ
- ఈ విషయాన్ని కూడా డీజీపీ దృష్టికి తీసుకెళ్లిన వైఎస్సార్సీపీ
కేసులు పెట్టినా.. ఆగం!
- ర్యాలీల్లో పాల్గొంటే కేసులంటూ బెదిరింపులు..
- ర్యాలీలను అడ్డుకోవడానికి పోలీసులను ఉసిగొల్పిన చంద్రబాబు సర్కారు
- ర్యాలీల్లో పాల్గొనవద్దని.. పాల్గొంటే కేసులు పెడతామంటూ వైఎస్సార్సీపీ నేతలు, విద్యార్థులు, ప్రజాసంఘాల నేతలకు జిల్లాల్లో పోలీసులు నోటీసులు
- బెదిరింపులను ఏమాత్రం ఖాతరు చేయని ప్రజలు
- ర్యాలీ వైపు భారీగా అడుగులు
- ర్యాలీ అనంతరం.. సంతకాల పత్రాలు ఉన్న వాహనాలను జిల్లా కేంద్రాల నుంచి తాడేపల్లిలోని పార్టీ కేంద్ర కార్యాలయానికి తరలింపు
ఆ వ్యతిరేకతను ప్రపంచానికి తెలియజేసేలా..
- తుది అంకానికి చేరుకున్న వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం
- కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండటాన్ని నిరసిస్తూ 175 నియోజకవర్గాల్లోనూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు
- ఆయా నియోజకవర్గాల నుంచి ఇప్పటికే జిల్లా కేంద్రాల్లోని వైఎస్సార్సీపీ కార్యాలయాలకు ఆ పత్రాల తరలింపు
- ఇవాళ జిల్లా కేంద్రాల్లో కోటి సంతకాల పత్రాలతో ప్రజల ఆకాంక్షలను ప్రతిబింబించేలా భారీ ర్యాలీలు
- కొత్త మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ప్రజల్లో పెల్లుబుకుతున్న వ్యతిరేకతను చాటిచెప్పేలా ర్యాలీని నిర్వహించనున్న వైఎస్సార్సీపీ
కోటి సంతకాల ఉద్యమం వైపు.. దేశం చూపు
- పేదలకు నాణ్యమైన వైద్యం, సూపర్ స్పెషాలిటీ వైద్యసేవలను అందకుండా చేసే నిర్ణయం
- పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేస్తూ.. రూ.లక్ష కోట్ల ప్రజల ఆస్తులను బినామీలకు కట్టబెట్టే ప్రయత్నం
- ‘నీకింత నాకింత’ అంటూ పంచుకు తినేందుకు చంద్రబాబు సర్కారు ఆరాటం
- కొత్త ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తుండడాన్ని వ్యతిరేకిస్తూ కోటి మందికి పైగా ప్రజలు సంతకాలు
- దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారిన ప్రజా ఉద్యమం
కోటి సంతకాల ప్రతులతో నేడు ర్యాలీలు
- నేడు జిల్లా కేంద్రాల్లో వైఎస్సార్సీపీ ర్యాలీలు
- కోటి సంతకాల ప్రతులతో ర్యాలీలు
- మెడికల్ కాలేజీల ప్రవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ పూర్తి
- నియోజకవర్గాల నుండి జిల్లా కేంద్రాలకు వచ్చిన సంతకాల పత్రాలు
- ఆ వాహనాలతో జిల్లా కేంద్రాల్లో ర్యాలీలు
- అనంతరం తాడేపల్లి కేంద్ర కార్యాలయానికి తరలింపు
- ర్యాలీల అనుమతి కోరుతూ డీజీపికి లేఖ రాసిన వైఎస్సార్సీపీ
- ర్యాలీలు సజావుగా సాగేందుకు విజ్ఞప్తి
- 18న గవర్నర్ ని కలవనున్న వైఎస్ జగన్
- కోటి సంతకాలను గవర్నర్కి అందించనున్న జగన్
- ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను నిలిపివేయాలని కోరనున్న జగన్


