పులివెందుల: అరటి రైతుల కష్టాలు విన్న వైఎస్‌ జగన్‌ | YS Jagan To Interact And Assures Support To Banana Farmers During His Pulivendula Visit, More Details | Sakshi
Sakshi News home page

YS Jagan Pulivendula Tour: అరటి రైతుల కష్టాలు విన్న వైఎస్‌ జగన్‌

Nov 26 2025 6:39 AM | Updated on Nov 26 2025 12:11 PM

Pulivendula: YS Jagan Will Console Banana Farmers

సాక్షి, వైఎస్సార్‌ జిల్లా: పులివెందుల పర్యటనలో భాగంగా.. బ్రహ్మణపల్లి అరటి రైతులను వైఎస్సార్‌సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్‌ జగన్‌ మోహన్‌రెడ్డి కలిశారు. వైఎస్‌ జగన్‌కు రైతులు ఆకుపచ్చ కండువా కప్పి తోటల పరిశీలనకు ఆహ్వానించారు. సాగు నష్టాన్ని స్వయంగా వైఎస్‌ జగన్‌ పరిశీలిస్తూ.. వాళ్ల కష్టాలను అడిగి తెలుసుకుంటున్నారు.

ఎకరానికి లక్షల పెట్టుబడి పెట్టి సాగు చేస్తే.. రెట్టింపు నష్టాలు వాటిల్లుతున్నాయని పలువురు రైతులు ఆయన వద్ద వాపోయారు. ప్రభుత్వం నుంచి ఎలాంటి సహకారం అందడం లేదని ఈ సందర్భంగా వైఎస్‌ జగన్‌ దృష్టికి తీసుకెళ్లారు. 

జగన్‌ హయాంలో అరటి రైతుల కోసం రూ. 20.15 కోట్లతో ఈ భవనాన్ని ప్రారంభించారు. ప్రతిరోజూ 32 టన్నుల సామర్థ్యం కలిగిన ప్రత్యేక టబ్‌లో అరటి కాయలను శుభ్రపరిచే యూనిట్‌తో పాటు 45 కిలోవాట్ల కూలింగ్ ఛాంబర్, 30.6 కిలోవాట్ల కోల్డ్ స్టోరేజ్, ఆరు కూలింగ్ సెల్స్‌ ఇక్కడ ఏర్పాటు చేశారు. మార్కెట్లలో తగిన ధర లభించే వరకు రైతులు అరటి, నారింజ పండ్లను 40 రోజుల పాటు నిల్వ చేసుకునే కెపాసిటితో నిర్మించారు. అలాగే.. ప్లాంట్ ఆవరణలో 60 మెట్రిక్ టన్నుల సామర్థ్యంతో వే బ్రిడ్జ్ నిర్మించారు. అయితే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే దుర్మార్గంగా దీనిని మూసేయించింది. 

ఇదీ చదవండి: బాబు పాలనలో గిల‘గెల’!

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement