సాక్షి, తాడేపల్లి: వైఎస్సార్సీపీ ఎంపీలతో ఆ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సమావేశమయ్యారు. పార్లమెంట్ బడ్జెట్ సమావేశాల్లో లేవనెత్తాల్సిన అంశాలపై చర్చిస్తున్నారు.
కాగా, అంతకుముందు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వైఎస్ జగన్ మీడియాతో మాట్లాడారు. రీసర్వే వాస్తవాలు.. దానిపై కూటమి దుష్ప్రచారం, రెడ్బుక్ రాజ్యాంగం, రాజకీయ హత్యలపై మాట్లాడారు. ఈ మధ్య రీసర్వేపై చంద్రబాబు మాట్లాడుతున్న మాటలు వింటుంటే, ఈ భూమండలం మీద, ఇంత దారుణంగా క్రెడిట్ చోరీ చేయగలిగే వారు ఎవరైనా ఉంటారా? అనిపిస్తుందంటూ వైఎస్ జగన్ దుయ్యబట్టారు.

చివరకు ఊసరవెల్లి కూడా చంద్రబాబును చూసి సిగ్గుపడుతుందని.. ఆ స్థాయిలో ఆయన అబద్ధాలు చెబుతున్నాడంటూ వైఎస్ జగన్ మండిపడ్డారు. ‘‘నాలుగుసార్లు సీఎంగా పని చేసిన చంద్రబాబుకు ఏనాడూ, కనీసం భూరీసర్వే చేయించాలన్న ఆలోచన వచ్చిందా? ఆ విధంగా ప్రజల కష్టాలు తీర్చాలని ఆయన ఏనాడూ ఆలోచించలేదు. కానీ, ఈరోజు ఆయన మాటలు వింటుంటే సిగ్గనిపిస్తుంది. ఆ విధంగా క్రెడిట్ చోరీ చేస్తున్నాడు’’ అంటూ వైఎస్ జగన్ ఆగ్రహం వ్యక్తం చేశారు.


