breaking news
-
చరిత్ర సృష్టించిన టీమిండియా.. ప్రపంచంలోనే తొలి జట్టుగా
ఇంగ్లండ్తో ఐదు మ్యాచ్ల టెస్టు సిరీస్లో భారత జట్టు తమ ఆశలను సజీవంగా ఉంచుకుంది. మాంచెస్టర్ వేదికగా ఇంగ్లండ్ జరిగిన నాలుగో టెస్టును టీమిండియా డ్రా ముగించింది. ఓటమి తప్పదనుకున్న మ్యాచ్లో భారత బ్యాటర్లు అద్బుతం చేశారు.రవీంద్ర జడేజా (107 నాటౌట్), వాషింగ్టన్ సుందర్ (101 నాటౌట్), కెప్టెన్ శుబ్మన్ గిల్ (103), కేఎల్ రాహుల్(90) తమ విరోచిత పోరాటాలతో భారత్ను ఓటమి నుంచి గటెక్కించారు. 174/2 ఓవర్నైట్ స్కోరుతో చివరి రోజు ఆటను ప్రారంభించిన టీమిండియా.. 4 వికెట్ల నష్టానికి 425 పరుగులు చేసింది. తొలుత రాహుల్, గిల్ అడ్డుగోడగా నిలవగా.. ఆ తర్వాత వాషింగ్టన్ సుందర్, జడేజా ఇంగ్లండ్ బౌలర్ల సహనాన్ని పరీక్షించారు.వీరిద్దరిని ఔట్ చేయడం ఇంగ్లీష్ బౌలర్ల తరం కాలేదు. ఆఖరికి ఇంగ్లండ్ ప్లేయర్లు దిగొచ్చి డ్రాకు అంగీకరించాలని భారత ప్లేయర్లను కోరారు. కానీ జడేజా, సుందర్లు తమ సెంచరీలు పూర్తియ్యాక డ్రా అంగీకరించారు. ఇక ఈ మ్యాచ్ను డ్రా ముగించిన భారత జట్టు ఓ అరుదైన రికార్డును తమ పేరిట లిఖించుకుంది.👉ఒక టెస్టు సిరీస్లో అత్యధిక సార్లు 350కు పైగా పరుగులు చేసిన జట్టుగా టీమిండియా వరల్డ్ రికార్డు సృష్టించింది. ప్రస్తుతం ఇంగ్లండ్తో జరుగుతున్న సిరీస్లో భారత్ 7 సార్లు 350+ స్కోర్లు సాధించింది. ఇంతకుముందు ఈ రికార్డు ఆస్ట్రేలియా పేరిట ఉండేది.ఆస్ట్రేలియా మూడు టెస్టు సిరీస్లలో 6 సార్లు 350కు పైగా పరుగులు చేసింది. ఆసీస్ చివరగా 1980లో ఇంగ్లండ్తో జరిగిన టెస్టు సిరీస్లో 6 సార్లు 350+ స్కోర్లు చేసింది. తాజా మ్యాచ్తో ఆసీస్ ఆల్టైమ్ రికార్డును భారత్ బ్రేక్ చేసింది.👉ఒక టెస్ట్ సిరీస్లో నలుగురు భారత బ్యాటర్లు 400 కంటే ఎక్కువ పరుగులు చేయడం ఇదే తొలిసారి. ఈ సిరీస్లో శుబ్మన్ గిల్, రిషబ్ పంత్, రవీంద్ర జడేజా 400కు పైగా పరుగులు చేశారు.చదవండి: చాలా సంతోషంగా ఉంది.. అందుకే వారు షేక్ హ్యాండ్స్ ఇవ్వలేదు: గిల్ -
నాన్నా.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయకు
మహబూబ్ నగర్ జిల్లా: ‘నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చెయ్యొద్దంటూ ప్రాథేయపడినా ఆ తండ్రి కనికరించలేదు. సభ్యసమాజం తల దించుకునేలా మృగంలా మారి కన్న కూతురిపైనే దారుణ అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నారాయణపేట జిల్లా మరికల్ మండలంలోని ఓ గ్రామంలో జరిగిన ఈ ఘటన ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఎస్ఐ రాము కథనం ప్రకారం.. కుర్వ కుర్మయ్యకు ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. వీరు మక్తల్లోని ప్రభుత్వ హాస్టల్లో ఉంటూ చదువుకుంటున్నారు. అయితే చిన్న కూతురు (10)కు రెండు నెలల క్రితం కుక్క కరవటంతో చికిత్స చేయించి గ్రామంలోని ప్రభుత్వ పాఠశాలలోనే 5వ తరగతి చదివిస్తున్నారు. ఈ నెల 25న తల్లి కూలీ పనులకు, తండ్రి మేకల దగ్గరకు వెళ్లాడు. చిన్న కూతురు పాఠశాల నుంచి వచ్చి సాయంత్రం ఇంట్లో చదువుకుంటుండగా ఇంటికి వచ్చిన తండ్రి కుర్మయ్య.. ఒంటరిగా ఉన్న కూతురిపై అఘాయిత్యానికి ఒడిగట్టాడు. నాన్న.. నీ కాళ్లు మొక్కుతా.. నన్ను ఏమీ చేయొద్దని ప్రాథేయపడినా కనికరించలేదు. ఇంట్లో నుంచి బాలిక అరుపులు విన్న చుట్టుపక్కల వారు వచ్చి బాలికను కాపాడారు. అప్పటికే బాలికకు తీవ్ర రక్తస్రావమైంది. కూలీ పనులు ముగించుకొని ఇంటికి వచ్చిన తల్లికి జరిగిన విషయాన్ని చెప్పగా.. గ్రామంలోని ఆర్ఎంపీకి చూపించారు. పరిస్థితి విషమంగా ఉందని ఆర్ఎంపీ చెప్పగా.. భార్యాభర్తల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దీంతో కుర్మయ్య భార్యను కొట్టి గ్రామం నుంచి పరారయ్యాడు. బాలిక పరిస్థితి మరింత విషమంగా మారడంతో అదే రోజు రాత్రి మరికల్ ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాథమిక చికిత్స అనంతరం మహబూబ్నగర్కు తీసుకెళ్లాలని చెప్పగా.. కుటుంబ సభ్యులు మరుసటి రోజు శనివారం మహబూబ్నగర్ జనరల్ ఆస్పత్రికి బాలికను తీసుకెళ్లారు. పరీక్షించిన వైద్యులు పోలీసు కేసు అయితేనే చికిత్స చేస్తామని చెప్పడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. ఆదివారం తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. పరారీలో ఉన్న నిందితుడిని పట్టుకోవడానికి పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. -
అల్లు అరవింద్కు 'మహావతార్ నరసింహా' వరం
పవన్ కల్యాణ్ నటించిన 'హరి హర వీరమల్లు' వంటి పెద్ద సినిమానే ఒక యానిమేషన్ సినిమా వెనక్కు నెట్టేసింది. కేవలం ఒక్కరోజు గ్యాప్లో వచ్చిన 'మహావతార్ నరసింహా' చిత్రం తెలుగులో దుమ్మురేపుతుంది. బాక్సాఫీస్ వద్ద రోజురోజుకు కలెక్షన్స్ పెంచుకుంటూ ఈ చిత్రం దూసుకుపోతుంది. ప్రస్తుతం రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎక్కడ చూసిన ఈ చిత్రం ట్రెండ్ కనిపిస్తోంది. బుక్ మై షోలో ఏకంగా కేవలం తెలుగులోనే ప్రతి గంటకు పది వేలకు పైగా టికెట్లు అమ్ముడుపోతున్నాయి. అయితే, ఈ చిత్రాన్ని తెలుగు రైట్స్ కొనుగోలు చేసింది నిర్మాత అల్లు అరవింద్. గీతా ఆర్ట్స్ బ్యానర్ నుంచి జులై 25న తెలుగులో విడుదల చేశారు. ఈ మూవీ ఆయనకు భారీ లాభాలను తెచ్చిపెడుతుంది.'మహావతార్ నరసింహా' చిత్రం మొదటి రోజు కేవలం ప్రపంచవ్యాప్తంగా అన్ని భాషలతో కలిపి రూ. 1.75 కోట్ల నెట్ మాత్రమే రాబట్టింది. సినిమాకు మంచి టాక్ రావడంతో రోజురోజుకు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఇప్పటి వరకు కేవలం నాలుగు రోజుల్లోనే రూ. 22 కోట్ల నెట్ రాబట్టి రికార్డ్ క్రియేట్ చేసింది. గ్రాస్ పరంగా చూస్తే రూ. 31 కోట్లగా ఉండవచ్చని అంచనా.. అయితే, తెలుగులో 4రోజులకు గాను రూ. 8 కోట్ల నెట్ కలెక్ట్ చేసినట్లు తెలుస్తుంది.ప్రస్తుతం ప్రతిరోజు కలెక్షన్స్ పెరుగుతున్నాయి. ఏకంగా వీరమల్లు చిత్రాన్ని తొలగించి 'మహావతార్ నరసింహా' చిత్రాన్ని ప్రదర్శిస్తున్నారు. దీంతో మరింత కలెక్షన్స్ పెరగవచ్చని ఇండస్ట్రీ వర్గాలు అంచనా వేస్తున్నాయి. సినిమా పూర్తి రన్ అయ్యేసరికి తెలుగులోనే సుమారు రూ. 20 కోట్లకు పైగా కలెక్షన్స్ రాబట్టవచ్చని అంచనా ఉంది. అల్లు అరవింద్ గతంలో కూడా కాంతార, 2018 వంటి చిత్రాలను తెలుగులో రిలీజ్ చేసి మంచి ఫలితాలను అందుకున్నారు. ఇప్పుడు ‘మహావతార నరసింహ’తో ఆయన జాక్పాట్ కొట్టారని నెటిజన్లు చెబుతున్నారు. -
ఈ అప్పులు, హమీల అమలు ఎందుకు సార్! రాష్ట్రాన్నే దత్తత ఇచ్చేస్తే పోలా!!
ఈ అప్పులు, హమీల అమలు ఎందుకు సార్! రాష్ట్రాన్నే దత్తత ఇచ్చేస్తే పోలా!! -
రేవ్ పార్టీకి పిలుస్తాడు.. రేప్ చేస్తాడు
సాక్షి ప్రతినిధి, గుంటూరు: తెలుగు రాష్ట్రాల్లో కలకలం రేపిన కొండాపూర్ రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్కుమార్గా అక్కడి టాస్క్ ఫోర్స్ పోలీసులు గుర్తించారు. అతడి స్వస్థలం గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గ పరిధిలోని కాజ. అశోక్కుమార్ వారాంతాల్లో ఏపీ నుంచి హైదరాబాద్కు యువతులను తీసుకెళుతుంటాడు. రేవ్ పార్టీల్లో వారితో అసభ్య నృత్యాలను చేయించడం, ఆపై డ్రగ్స్ మత్తులో ఉన్న యువతులపై అత్యాచారానికి పాల్పడటం అతడి నైజమని పోలీసులు గుర్తించారు.అదే గ్రామానికి చెందిన సాయి అనే యువకుడు కూడా అశోక్కుమార్కు రేవ్ పార్టీల్లో సహకరిస్తున్నట్టు సమాచారం. ఈ నేపథ్యంలోనే కొండాపూర్ ఎస్వీ సర్విస్ అపార్టుమెంట్లో రేవ్ పార్టీ జరుగుతోందన్న పక్కా సమాచారంతో తెలంగాణ టాస్క్ ఫోర్స్, ఎక్సైజ్ పోలీసులు మెరుపు దాడి నిర్వహించి 9 మందిని అరెస్ట్ చేసి 9 కార్లను సీజ్ చేసిన సంగతి తెలిసిందే. రేవ్ పార్టీ కీలక సూత్రధారి అప్పికట్ల అశోక్కుమార్ నుంచి డ్రగ్స్, గంజాయి, కండోమ్స్ స్వాధీనం చేసుకున్నారు. డ్రగ్స్ అలవాటు ఉన్న యువతులనే అశోక్కుమార్ లక్ష్యంగా చేసుకుని రేవ్ పార్టీలు నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. అశోక్కుమార్ వైజాగ్లోని గీతం యూనివర్సిటీలో హోటల్ మేనేజ్మెంట్ చదివాడు. వ్యసనాలకు బానిసగా మారిన అతడు కొంతకాలంగా ఈ దందాలో దిగినట్టు పోలీసులు గుర్తించారు. కొరియర్ సర్వీస్లో పనిచేస్తున్న ఒక యువకుడు పార్సిల్ ద్వారా గంజాయి విక్రయించేవాడని, అతడితో అశోక్కుమార్ ఉండేవాడని పోలీసుల విచారణలో తేలింది. ఆ తర్వాత అశోక్కుమార్ కొరియర్ ద్వారా గంజాయి విక్రయించేవాడని సమాచారం. ఇతను ప్రముఖులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. గతంలో ఓ గంజాయి కేసు నుంచి అశోక్ను తప్పించారని చెబుతున్నారు. అశోక్ కాజ సమీపంలోని ఓ వర్సిటీ విద్యార్థులకు కూడా గంజాయి విక్రయిస్తున్నట్టు విశ్వసనీయ సమాచారం. -
డిప్యూటీ సీఎం డ్యూటీ.. వెంటనే సీఎం డ్యూటీ
సాక్షి, అమరావతి : ‘సార్.. రాత్రి వరకు డ్యూటీ చేశాను. గంటల తరబడి కాన్వాయ్ వెహికిల్ డ్రైవింగ్ చేశాను. కనీసం రెస్ట్ తీసుకోలేదు. మళ్లీ ఇప్పుడే డ్రైవింగ్ విధులకు వెళ్లాలంటే కష్టం’ అని పోలీస్ వాహనం డ్రైవర్ చెప్పినప్పటికీ ఉన్నతాధికారులు ఏమాత్రం పట్టించుకోలేదు. ‘సీఎం టూర్.. డ్యూటీ చేయాల్సిందే’ అని ఆదేశించారు. పోనీ ఆ పోలీస్ వాహనం కండీషన్ సరిగా ఉందా అంటే అదీ లేదు. ఉన్నతాధికారుల ఆదేశంతో తప్పనిసరి పరిస్థితుల్లో డ్యూటీ చేశారు ఆ డ్రైవర్. ఫలితంగా తీవ్రమైన రోడ్డు ప్రమాదం.. ఇద్దరు డీఎస్పీలు దుర్మరణం.. డ్రైవర్తోపాటు ఓ అదనపు ఎస్పీకి తీవ్ర గాయాలు. పోలీసు శాఖలో తీవ్ర విషాదం మిగిల్చిన రోడ్డు ప్రమాదం వెనుక అసలు కారణమిది. పోలీసు శాఖలో ఉన్నతాధికారుల నిర్వాకమే పోలీసు అధికారులను బలి తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు సింగపూర్ వెళుతున్నందున నిఘా విధుల కోసం విజయవాడ నుంచి అదనపు ఎస్పీ కోకా దుర్గా ప్రసాదరావు, డీఎస్పీలు మేక చక్రధరరావు, జల్లు శాంతారావులను హైదరాబాద్ వెళ్లాలని ఉన్నతాధికారులు శుక్రవారం ఆదేశించారు. కానీ వారికి కేటాయించిన పోలీసు వాహనం సరైన కండిషన్లో లేదు. ఆ వాహనం శుక్రవారం అర్ధరాత్రి దాటాక తెలంగాణలోని కొర్లవహడ్ టోల్ గేటు వద్దకు రాగానే మొరాయించింది.పోలీసు అధికారులు ఆ విషయాన్ని హైదరాబాద్లోని తమ ఉన్నతాధికారులకు తెలిపారు. దాంతో హైదరాబాద్ నుంచి మరో స్కారి్పయో వాహనాన్ని పంపిస్తామని చెప్పారు. అందుకోసం డ్రైవర్ రెడ్డిచర్ల నరసింహరాజును ఆ వాహనం తీసుకుని వెళ్లాలని ఆదేశించారు. ఆయన అప్పుడే డిప్యూటీ సీఎం కాన్వాయ్ విధులు ముగించుకుని వచ్చారు. వరుసగా గంటల తరబడి డ్రైవింగ్ చేశాను.. బాగా అలసిపోయాను అని చెప్పారు. కానీ ఉన్నతాధికారులు వినిపించుకోలేదు. సమకూర్చిన స్కార్పియో వాహనం అయినా సరిగా ఉందా అంటే ఆ వాహనం కండిషన్ కూడా బాగోలేదు. డ్రైవర్ అలసిపోయినందునే ప్రమాదంఉన్నతాధికారుల ఆదేశాలతో తప్పనిసరై డ్రైవర్ నరసింహరాజు ఆ డొక్కు స్కార్పియోతో కొర్లవహడ్ వెళ్లారు. అదనపు ఎస్పీ, ఇద్దరు డీఎస్పీలతోసహా హైదరాబాద్కు తిరుగు ప్రయాణమయ్యారు. అప్పటికే గంటల తరబడి డ్రైవింగ్ చేసి బాగా అలసిపోయి ఉన్న నరసింహరాజు కళ్లు మూతలు పడుతున్నా అతి కష్టంగా డ్రైవింగ్ చేశారు. శనివారం తెల్లవారుజామున 4.45 గంటలకు కైతాపురం వద్ద రోడ్డుపై ఎదురుగా సడన్గా ఆగిన లారీని గుర్తించలేక పోయారు. చివరి నిముషంలో పక్కకు తప్పుకునే యత్నంలో స్కారి్పయో డివైడర్పైకి ఎక్కి పల్లిటిలు కొట్టి రోడ్డుకు అవతలి వైపు పడింది. అదే సమయంలో హైదరాబాద్ నుంచి విజయవాడ వైపు వస్తున్న ట్యాంకర్ ఈ వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో డీఎస్పీలు మేక చక్రధరరావు, జల్లు శాంతారావులు అక్కడికక్కడే మృత్యువాత పడ్డారు. అదనపు ఎస్పీ దుర్గా ప్రసాదరావు పరిస్థితి విషమంగా ఉంది. డ్రైవర్ నరసింహరాజు తీవ్రంగా గాయపడ్డారు. ఈ నేపథ్యంలో పోలీసుల ప్రాణాలతో ప్రభుత్వం చెలగాటం ఆడుతోందని పోలీసు కుటుంబాలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. వీక్లీ ఆఫ్లూ ఇవ్వకుండా, గంటల తరబడి డ్యూటీ చేసి అలసిపోయినా విశ్రాంతి ఇవ్వకుండా డ్యూటీలు వేస్తున్నారని మండిపడుతున్నారు. సీఎం, డిప్యూటీ సీఎం పర్యటనలు సాఫీగా సాగితే చాలా.. పోలీసు కుటుంబాలు ఏమైపోయినా పర్వాలేదా అని నిలదీస్తున్నారు. -
ఈ రాశి వారికి శుభవార్తలు.. ఆర్థికాభివృద్ధి
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, దక్షిణాయనం, వర్ష ఋతువు శ్రావణ మాసం, తిథి: శు.పంచమి రా.12.43 వరకు, తదుపరి షష్ఠి, నక్షత్రం: ఉత్తర రా.8.33 వరకు, తదుపరి హస్త, వర్జ్యం: తె.5.38 నుండి 7.12 వరకు (తెల్లవారితే బుధవారం), దుర్ముహూర్తం: ఉ.8.12 నుండి 9.04 వరకు, తదుపరి రా.10.59 నుండి 11.43 వరకు,అమృతఘడియలు: ప.12.55 నుండి 2.36 వరకు, నాగ పంచమిసూర్యోదయం : 5.40సూర్యాస్తమయం : 6.31రాహుకాలం : ప.3.00 నుండి 4.30 వరకుయమగండం : ఉ.9.00 నుండి 10.30 వరకు మేషం..... ఇంటాబయటా ప్రోత్సాహం. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. కొన్ని సమస్యలు తీరతాయి. ఆహ్వానాలు అందుతాయి. వ్యాపార విస్తరణ. ఉద్యోగులకు హోదాలు.వృషభం.... మిత్రులు, బంధువులతో విభేదాలు. ఆర్థిక ఇబ్బందులు. ఆకస్మిక ప్రయాణాలు. అనారోగ్యం. వ్యాపారాలలో నిరుత్సాహం. ఉద్యోగులకు ఒత్తిడులు.మిథునం.... రుణాలు చేస్తారు. ఆకస్మిక ప్రయాణాలు. బంధువులతో తగాదాలు. అనారోగ్యం. ఆలయ దర్శనాలు. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు.కర్కాటకం... కొత్త పనులకు శ్రీకారం. శుభవార్తలు. ఆర్థికాభివృద్ధి. నిరుద్యోగుల యత్నాలు సఫలం. వాహనయోగం. చర్చలు సఫలం. వ్యాపారాలు, ఉద్యోగాలలో అనుకూలత.సింహం... అనుకున్న పనులు మందగిస్తాయి. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. మిత్రులతో కలహాలు. దూరప్రయాణాలు. ఆరోగ్యసమస్యలు. వ్యాపారాలు, ఉద్యోగాలు సామాన్యంగా ఉంటాయి.కన్య....పనులు సజావుగా సాగుతాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం. పరిచయాలు పెరుగుతాయి. సన్మానయోగం. దైవచింతన. వ్యాపార వృద్ధి. ఉద్యోగులకు ఉన్నతహోదాలు.తుల... బంధువులతో విభేదాలు. ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. శ్రమాధిక్యం. దైవదర్శనాలు. అనారోగ్యం. వ్యాపారాలు, ఉద్యోగాలలో కొన్ని మార్పులు.వృశ్చికం... పనులు సజావుగా పూర్తి చేస్తారు. ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉంటాయి. చిన్ననాటి మిత్రుల కలయిక. దైవదర్శనాలు. వ్యాపార, ఉద్యోగాలు ఉత్సాహవంతంగా సాగుతాయి.ధనుస్సు.. వ్యవహారాలు విజయవంతంగా సాగుతాయి. విందువినోదాలు. పరిచయాలు పెరుగుతాయి. బంధువుల కలయిక. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు ఆశాజనకంగా ఉంటాయి.మకరం.... కుటుంబసభ్యులతో తగాదాలు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. అనుకోని ఖర్చులు. ఆలయ దర్శనాలు. వ్యాపారాలలో ఒడిదుడుకులు. ఉద్యోగులకు మార్పులు.కుంభం... మిత్రుల నుంచి ఒత్తిడులు. ఆలయ దర్శనాలు. అనారోగ్యం. ఏ పని కూడా ముందుకు సాగదు. కుటుంబంలో ఒత్తిడులు. దూర ప్రయాణాలు. వ్యాపారాలు, ఉద్యోగాలలో చికాకులు.మీనం... సంఘంలో గౌరవం. వస్తులాభాలు. చిన్ననాటి మిత్రులతో ఉత్సాహంగా గడుపుతారు. నిరుద్యోగులకు శుభవార్తలు. వ్యాపార, ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. -
TCS layoffs: రంగంలోకి కేంద్ర ప్రభుత్వం!
టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) 12,000 మందికిపైగా ఉద్యోగులను తొలగించబోతున్నట్లు చేసిన ప్రకటన దేశ టెక్ పరిశ్రమలో ప్రకంపనలు సృష్టించింది. దీంతో దేశంలోని ఐటీ ఉద్యోగుల్లో ఆందోళన ఆవరించింది. కాగా టీసీఎస్ లేఆఫ్ల ప్రకటన తరువాత జరుగుతున్న పరిణామాలను కేంద్ర ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని సంబంధిత వర్గాలు తెలిపాయి.బాధిత ఉద్యోగులకు ఎంప్లాయిమెంట్ లింక్డ్ ఇన్సెంటివ్ వంటి కార్యక్రమాలు ఉపాధి కల్పనను పెంచడానికి ఎలా సహాయపడతాయనే దానిపై కేంద్ర ఐటీ శాఖ దృష్టి సారించినట్లు తెలుస్తోంది. అదే సమయంలో నైపుణ్యం పెంపు, రీస్కిల్లింగ్కు ప్రాధాన్యం ఇస్తున్నట్లు ఆయా వర్గాలను ఉటంకిస్తూ ఎకనమిక్స్ టైమ్స్ కథనం పేర్కొంది.ఈ మొత్తం పరిస్థితిని ఐటీ మంత్రిత్వ శాఖ నిశితంగా పరిశీలిస్తోందని, టెక్ కంపెనీతో సంప్రదింపులు జరుపుతోందని సంబంధిత వర్గాలు తెలిపాయి. తొలగింపులపై మంత్రిత్వ శాఖ ఆందోళన చెందుతోంది. ఇది ఎందుకు జరుగుతోంది.. అంతర్లీన కారణాలను అర్థం చేసుకోవడానికి పరిశీలిస్తుంది.భారతదేశపు అతిపెద్ద ఐటీ సేవల సంస్థ అయిన టీసీఎస్ ఈ సంవత్సరం 12,261 మంది ఉద్యోగులను తొలగించనున్న నేపథ్యంలో ఈ వైఖరి ప్రాముఖ్యతను సంతరించుకుంది. ఈ ప్రభావం ఎక్కువగా మిడిల్, సీనియర్ గ్రేడ్ ఉద్యోగులపై పడుతుంది. 2025 జూన్ 30 నాటికి టీసీఎస్ ఉద్యోగుల సంఖ్య 6,13,069గా ఉంది. ఇటీవల ముగిసిన ఏప్రిల్-జూన్ త్రైమాసికంలో 5,000 మంది ఉద్యోగులు జతయ్యారు. -
భూకంపం వస్తోంది.. జాగ్రత్త..!
ఫోన్ అంటే కాల్స్, మెసేజెస్, వినోదమేనా? అంతకు మించి.. చూడ్డానికి చిన్న పరికరమే కావొచ్చు కానీ కొన్ని సందర్భాల్లో ప్రాణాలను కాపాడే సంజీవని కూడా. అవును మీరు చదువుతున్నది నిజమే. భూకంప కేంద్రం నుంచి తీవ్రత చుట్టుపక్కల ప్రాంతాలకు విస్తరించేలోపే.. విపత్తు రాబోతోందని యూజర్లను హెచ్చరించే వ్యవస్థ ఆండ్రాయిడ్ ఫోన్లలో ఉంది. మొబైల్లోని యాక్సిలరేషన్ సెన్సార్ల ఆధారంగా పనిచేసే ఈ వ్యవస్థ ప్రపంచంలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు సందేశాల రూపంలో హెచ్చరిస్తోంది.– సాక్షి, స్పెషల్ డెస్క్ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్ (ఏఈఏ) వ్యవస్థను ఆండ్రాయిడ్ ఆపరేటింగ్ సిస్టమ్ను అభివృద్ధి చేసిన టెక్నాలజీ దిగ్గజం గూగుల్ 2020 నుంచి ఆండ్రాయిడ్ ఫోన్లలో పరిచయం చేసింది. ప్రాథమిక (ప్రైమరీ వేవ్స్), ద్వితీయ (సెకండరీ వేవ్స్) భూకంప తరంగాలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. ఏఈఏ సిస్టమ్ ఇప్పటి వరకు 98 దేశాలలో భూకంప ప్రభావిత ప్రాంతాలలో నివసించే ప్రజలకు హెచ్చరికలను పంపింది. ఇప్పటి వరకు 18,000 పైచిలుకు భూకంప సంఘటనలకు సంబంధించి 79 కోట్లకుపైగా అలర్ట్స్ జారీ చేసింది. ఈ వ్యవస్థ ఇప్పుడు నెలకు సగటున 60 హెచ్చరికలను పంపుతోంది. దాదాపు 1.8 కోట్ల మంది కనీసం ఒక హెచ్చరికనైనా అందుకుంటున్నారు. ప్రపంచవ్యాప్తంగా 250 కోట్ల మంది ఆండ్రాయిడ్ యూజర్లకు ఈ సేవలు అందుబాటులో ఉన్నాయి. గూగుల్, యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా బర్కిలీ సీస్మాలజీ ల్యాబొరేటరీ మూడు సంవత్సరాలుగా ఈ వ్యవస్థ పనితీరు, పద్ధతులను వివరిస్తూ డేటాను విడుదల చేశాయి.సెకన్ల ముందు హెచ్చరిక..భూకంపం వచ్చే కొన్ని సెకన్ల ముందు యూజర్లకు ఏఈఏ హెచ్చరిక సందేశాన్ని పంపుతుంది. భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. భూ ప్రకంపనలను గుర్తించడానికి ఫోన్లోని యాక్సిలెరోమీటర్ సాయంతోనే భూ ప్రకంపనలను ఈ వ్యవస్థ గుర్తిస్తుంది. భూకంప తరంగాలు ఫోన్ను చేరగానే ఆ సమాచారాన్ని గూగుల్ సర్వర్లకు పంపుతుంది. ఒక ప్రాంతంలోని ఇతర ఫోన్ల నుంచి కూడా ఇలాంటి సమాచారమే వస్తే భూకంపం సంభవించినట్టు గూగుల్ నిర్ధారిస్తుంది. అత్యంత తీవ్రంగా భూమి కంపించకముందే ప్రభావిత ప్రాంతంలో.. ఆండ్రాయిడ్ ఫోన్ను వాడుతున్న వారికి ఈ వ్యవస్థ హెచ్చరికలను పంపుతుంది. భూకంప తరంగాల కంటే వేగంగా హెచ్చరికలను ప్రసారం చేయడానికి ఏఈఏ కాంతి వేగాన్ని ఉపయోగిస్తుంది.యూఎస్తో మొదలు..ఏఈఏ వ్యవస్థ తొలుత 2020లో యూఎస్లో మొదలైంది. 2021లో న్యూజిలాండ్, గ్రీస్లో, ఆ తర్వాత మిగిలిన దేశాలకు విస్తరించారు. ఈ వ్యవస్థ హెచ్చరించిన సంఘటనల్లో 2023లో టర్కీ–సిరియా (రిక్టర్ స్కేల్పై తీవ్రత 7.8), ఫిలిప్పీన్స్ (6.7), నేపాల్ (5.7), 2025 ఏప్రిల్లో టర్కీలో 6.2 తీవ్రతతో సంభవించిన భూకంపాలు ఉన్నాయి. ఇప్పటివరకు గుర్తించిన సంఘటనలలో 2,000 కంటే ఎక్కువ తీవ్ర భూకంపాలు ఉన్నాయి. ఇక ఏఈఏ బృందం 2023 ఫిబ్రవరి–2024 ఏప్రిల్ మధ్య 15 మందిని సర్వే చేస్తే.. 79% మంది ఈ హెచ్చరికలు చాలా ఉపయోగకరంగా ఉన్నాయని తెలిపారు. భూకంపం రాకముందే హెచ్చరిక అందుకున్నట్టు 5.4 లక్షల మంది చెప్పడం విశేషం.కోట్లాది మందికి..2023 నవంబర్లో ఫిలిప్పీన్స్లో 6.7 తీవ్రతతో భూకంపం సంభవించినప్పుడు.. భూకంపం ప్రారంభమైన 18.3 సెకన్ల తర్వాత ఈ వ్యవస్థ మొదటి హెచ్చరికను పంపింది. అత్యంత తీవ్ర ప్రకంపనలు సంభవించిన భూకంప కేంద్రానికి దగ్గరగా ఉన్నవారికి 15 సెకన్లపాటు మెసేజులు పంపారు. దూరంగా ఉన్నవారికి, తక్కువ ప్రకంపనలు వచ్చిన ప్రాంత యూజర్లకు ఒక నిమిషంపాటు అలర్ట్స్ జారీ చేశారు. ఇలా మొత్తంగా 25 లక్షల మందిని అప్రమత్తం చేశారు. 2023 నవంబర్లో నేపాల్లో 5.7 తీవ్రతతో భూకంపం వచ్చినప్పుడు కోటి మందికిపైగా హెచ్చరికలు అందాయి. 2025 ఏప్రిల్లో టర్కీలో భూమి కంపించడం ప్రారంభమైన 8 సెకన్ల తర్వాత మొదటి అలర్ట్ జారీ అయింది. ఈ ఘటనలో 1.1 కోట్ల మందికిపైగా ఈ సందేశాలు అందుకున్నారు.అలర్ట్స్ అందుకోవాలంటే వినియోగదారులు వైఫై లేదా సెల్యులార్ డేటా కనెక్టివిటీని కలిగి ఉండాలి. ఆండ్రాయిడ్ ఎర్త్క్వేక్ అలర్ట్, లొకేషన్ సెట్టింగ్స్ రెండూ ఆన్లో ఉండాలి.భూకంప తీవ్రత సాధారణంగా ఉండే అవకాశం ఉంటే ‘మీరు జాగ్రత్త’ అని, ముప్పు తీవ్రరూపం దాల్చే అవకాశం ఉంటే ఆడియో రూపంలో వార్నింగ్తోపాటు పారాహుషార్ అంటూ హెచ్చరిస్తుంది. -
ఘోరం, అన్యాయం, అక్రమం! మీ ప్రమేయం లేకుండానే కాల్పుల విరమణ జరిగింది సార్!