-
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్!
కానీ.. ప్రపంచంలో ఎవరి మీద ఎవరు దాడి చేస్తున్నా చూస్తూ ఎంజాయ్ చేస్తాం అంతేగా సార్! -
ఈ రాశి వారికి అందరిలోనూ గౌరవం పెరుగుతుంది.. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం
గ్రహం అనుగ్రహం: శ్రీ విశ్వావసు నామ సంవత్సరం, ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు జ్యేష్ఠ మాసం, తిథి: బ.తదియ ప.2.32 వరకు, తదుపరి చవితి, నక్షత్రం: ఉత్తరాషాఢ రా.11.41 వరకు, తదుపరి శ్రవణం, వర్జ్యం: ఉ.7.09 నుండి 8.48 వరకు, తదుపరి రా.3.43 నుండి 5.20 వరకు, దుర్ముహూర్తం: ఉ.6.02 నుండి 7.13 వరకు, అమృతఘడియలు: సా.4.54 నుండి 5.46 వరకు; రాహుకాలం: ఉ.9.00 నుండి 10.30 వరకు, యమగండం: ప.1.30 నుండి 3.00 వరకు, సూర్యోదయం: 5.28, సూర్యాస్తమయం: 6.30. మేషం: శ్రమ ఫలిస్తుంది. సోదరులతో ఉత్సాహంగా గడుపుతారు. ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు తొలగుతాయి. దైవచింతన.వృషభం: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో వివాదాలు. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలలో ఒత్తిడులు. పనుల్లో ప్రతిబంధకాలు.మిథునం: కుటుంబసభ్యులతో స్వల్ప వివాదాలు. ధనవ్యయం. ఆరోగ్యభంగం. వృత్తి, వ్యాపారాలు నిరుత్సాహపరుస్తాయి. శ్రమ పెరుగుతుంది. ఆకస్మిక ప్రయాణాలు.కర్కాటకం: అందరిలోనూ గౌరవం పెరుగుతుంది. సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఉద్యోగ ప్రయత్నాలు అనుకూలిస్తాయి. వ్యాపారాలు లాభిస్తాయి. ఉద్యోగాలలో మరింత ఉత్సాహం. కీలక నిర్ణయాలు.సింహం: పలుకుబడి పెరుగుతుంది. వస్తు, వస్త్రలాభాలు. ప్రముఖుల నుంచి శుభవార్తలు. ఆస్తి లాభం. దైవదర్శనాలు. పరిచయాలు పెరుగుతాయి. వృత్తి, వ్యాపారాలు సాఫీగా సాగుతాయి.కన్య: కొన్ని పనులు వాయిదా. శ్రమాధిక్యం. ఆధ్యాత్మిక చింతన. వృత్తి, వ్యాపారాలలో మార్పులు. దూరపు బంధువుల కలయిక. స్థిరాస్తి వివాదాలు.తుల: వ్యవహారాలు మందగిస్తాయి. ధనవ్యయం. కుటుంబసభ్యులతో మాటపట్టింపులు. ఇంటాబయటా సమస్యలు. నిర్ణయాలు మార్చుకుంటారు. ఆలయ దర్శనాలు.వృశ్చికం: పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. విందువినోదాలు. ఆస్తి వివాదాల పరిష్కారం. శుభవార్తలు. వస్తులాభాలు. వృత్తి, వ్యాపారాలు సాదాసీదాగా ఉంటాయి.ధనుస్సు: ఆర్థిక పరిస్థితి నిరాశ కలిగిస్తుంది. ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. స్వల్ప అనారోగ్యం. పనుల్లో జాప్యం. వృత్తి, వ్యాపారాలు గందరగోళంగా ఉంటాయి.మకరం: సన్నిహితులతో ఆనందంగా గడుపుతారు. ఆహ్వానాలు రాగలవు. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. వాహనయోగం. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి.కుంభం: ఆర్థిక లావాదేవీలు నిరుత్సాహపరుస్తాయి. అనుకోని సంఘటనలు. వృత్తి, వ్యాపారాలు మందగిస్తాయి. శ్రమాధిక్యం. పనులు ముందుకు సాగవు.మీనం: కొత్త పనులు చేపడతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఆర్థికాభివృద్ధి. కీలక నిర్ణయాలు. శుభకార్యాలలో పాల్గొంటారు. వృత్తి, వ్యాపారాలు సజావుగా సాగుతాయి. -
జియో 3 కొత్త రీఛార్జ్ ప్లాన్లు.. తక్కువ ఖర్చుతో ఎక్కువ వ్యాలిడిటీ
రిలయన్స్ జియో భారతదేశపు అతిపెద్ద టెలికాం సంస్థ. దేశంలోని మొబైల్ యూజర్లలో ఎక్కువ మంది జియోను వినియోగిస్తున్నారు. మీరు కూడా జియో యూజర్ అయి ఉండి, లాంగ్ బవ్యాలిడిటీతో తక్కువ ఖర్చులో రీఛార్జ్ ప్లాన్ కోసం చూస్తున్నట్లయితే, ఈ సమాచారం మీ కోసమే. 84 రోజులు అంటే దాదాపు మూడు నెలలు వ్యాలిడిటీతో మంచి ప్రయోజనాలను అందించే మూడు రీఛార్జ్ ప్లాన్లను జియో ఇటీవల ప్రవేశపెట్టింది.జియో రూ.799 ప్లాన్జియో రూ .799 ప్లాన్ వ్యాలిడిటీ 84 రోజులు. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం లభిస్తుంది. దీంతోపాటు రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. దీనితో పాటు, జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో పొందవచ్చు.జియో రూ.859 ప్లాన్ఈ ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ వ్యాలిడిటీ ఉన్నన్నిరోజులూ అపరిమిత ఉచిత కాలింగ్ ప్రయోజనం ఆస్వాదించవచ్చు. దీంతోపాటు రోజుకు 2 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్లు లభిస్తాయి. అంతే కాకుండా జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్తో ఆనందించవచ్చు.👉 ఇదీ చదవండి: రూ.200 లోపే రీచార్జ్.. 2 నెలలుపైగా వ్యాలిడిటీజియో రూ.889 ప్లాన్జియో రూ .889 ప్లాన్ కూడా 84 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఇందులో అపరిమిత ఉచిత కాలింగ్, రోజుకు 1.5 జీబీ డేటా, 100 ఉచిత ఎస్ఎంఎస్ ప్రయోజనాలు లభిస్తాయి. దీంతో పాటు జియో హాట్స్టార్కు ఉచిత యాక్సెస్ కూడా ఈ ప్లాన్లో చేర్చారు. అలాగే జియో సావన్కు కూడా ఉచిత యాక్సెస్ను కూడా వినియోగదారులు పొందుతారు. -
రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 3.64% పెంపు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు శుభవార్త తెలిపింది. ఉద్యోగుల డియర్నెస్ అలవెన్స్ (డీఏ)ను 3.64 శాతం పెంచింది. పెంచిన డీఏ 2023 జనవరి 1వ తేదీ నుంచి వర్తిస్తుందని ఆర్థిక శాఖ ముఖ్యకార్యదర్శి సందీప్కుమార్ సుల్తానియా శుక్రవారం జారీచేసిన జీవోలు 78, 79లో పేర్కొన్నారు. ప్రస్తుతం ప్రభుత్వ ఉద్యోగులకు డీఏ 26.39 శాతం ఇస్తుండగా.. తాజాగా పెంపుతో 30.03 శాతానికి చేరుతుంది.తాజాగా పెంచిన డీఏను జూన్ నెల వేతనంతో జూలైలో ఇస్తారు. 2023 జనవరి 1వ తేదీ నుంచి 2025 మే 31 వరకు ఇవ్వాల్సిన డీఏ బకాయిలను ఉద్యోగుల జీపీఎఫ్ ఖాతాల్లో జమచేస్తారు. పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు డీఏ బకాయిలను 28 వాయిదాల్లో చెల్లిస్తారు.సీపీఎస్ (కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్) ఉద్యోగులకు 10 శాతం డీఏ బకాయిలను ప్రాన్ ఖాతాల్లో జమచేస్తారు. మిగిలిన 90 శాతం బకాయిలను 28 వాయిదాల్లో జూన్ నెల వేతనంతో నెలవారీగా చెల్లిస్తామని ఉత్తర్వుల్లో వెల్లడించారు. 1 జూలై 2023 నుంచి పెండింగ్లో ఉన్న డీఏ అమలుకు సంబంధించిన ఉత్తర్వులను ప్రత్యేకంగా ఆరు నెలల తర్వాత జారీ చేయనున్నట్లు ప్రభుత్వం స్పష్టం చేసింది. -
కొత్త ఫోనొచ్చింది.. రూ.10 వేలకే పవర్ఫుల్ 5జీ ఫోన్
తక్కువ బడ్డెట్లో స్మార్ట్ఫోన్లు తయారు చేసే లావా మరోసారి బడ్జెట్ లో శక్తివంతమైన ఫ్లాగ్ షిప్ ఫోన్ ను లాంచ్ చేసింది. లావా స్టోర్మ్ ప్లే 5జీ (Lava Storm Play 5G) ఫోన్ను భారత మార్కెట్లోకి విడుదల చేసింది. రూ.10,000 కంటే తక్కువ ధరకే హై ఎండ్ స్పెసిఫికేషన్లను ప్రవేశపెట్టిన డివైజ్ ఇది. బడ్జెట్ సెగ్మెంట్లో ప్రపంచంలోనే అత్యంత శక్తివంతమైన డైమెన్సిటీ 7060 చిప్సెట్, ఎల్పీపీడీడీఆర్5 ర్యామ్, యూఎఫ్ఎస్ 3.1 స్టోరేజ్, 120 హెర్ట్జ్ డిస్ప్లే వంటి ఫీచర్లు ఇందులో ఉన్నాయి. లావా స్టోర్మ్ ప్లే 5జీ ధరఈ లావా ఫోన్ 6 జీబీ ర్యామ్ + 128 జీబీ స్టోరేజ్తో ఒకే ఒక వేరియంట్లో లాంచ్ అయింది. ఈ ఫోన్ ధరను కేవలం రూ.9,999గా నిర్ణయించారు. రూ.9,999 ప్రారంభ ధరతో ఈ స్మార్ట్ ఫోన్ జూన్ 24 నుంచి అమెజాన్ లో తొలి సేల్ కు అందుబాటులో ఉండనుంది.ఫీచర్లు..స్పెసిఫికేషన్లులావా స్టార్మ్ ప్లే 5జీ మీడియాటెక్ కొత్త డైమెన్సిటీ 7060 5జీ ప్రాసెసర్తో పనిచేస్తుంది. ఇది గేమింగ్ కోసం మంచి పనితీరును అందిస్తుంది.ఇందులో 6 జీబీ ఫాస్ట్ ఎల్పీడీడీఆర్5 ర్యామ్ ఇవ్వగా 6 జీబీ వర్చువల్ ర్యామ్తో మరింత విస్తరించుకోవచ్చు. అంటే మొత్తం 12 జీబీ ర్యామ్ లభిస్తుంది. ఇక స్టోరేజ్ కోసం 128 జీబి యూఎఫ్ఎస్ 3.1 ఇంటర్నల్ స్టోరేజ్ లభిస్తుంది.ఇందులో 6.75 అంగుళాల హెచ్డీ+ డిస్ప్లేను ఇచ్చారు. కెమెరా సెటప్ విషయానికొస్తే, 50 మెగాపిక్సెల్ సోనీ ఐఎంఎక్స్ సెన్సార్తో డ్యూయల్ రియర్ కెమెరా ఉంది. ముందువైపు 8 మెగాపిక్సెల్ సెల్ఫీ కెమెరా ఇచ్చారు.లావా స్టార్మ్ ప్లేలో 5000 ఎంఏహెచ్ భారీ బ్యాటరీ ఉంది. ఇది 18 వాట్ ఫాస్ట్ ఛార్జింగ్కు సపోర్ట్ చేస్తుంది.సైడ్ ఫింగర్ ప్రింట్ సెన్సార్, యూఎస్బీ-సీ పోర్ట్, 3.5 ఎంఎం ఆడియో జాక్, డ్యుయల్ సిమ్ 5జీ సపోర్ట్, ఐపీ64 రేటింగ్ వంటి ప్రత్యేకతలున్నాయి.అన్నిటికంటే ముఖ్యమైన విషయం ఏంటంటే ఈ ఫోన్ క్లీన్ ఆండ్రాయిడ్ 15తో ఎలాంటి బ్లోట్ వేర్ లేకుండా, అంటే అనవసరమైన యాప్స్, పాప్ అప్ యాప్స్ లేకుండా పనిచేస్తుంది.2 సంవత్సరాల పాటు 1 ప్రధాన ఓఎస్ అప్ డేట్, సెక్యూరిటీ అప్ డేట్ లను అందిస్తామని కంపెనీ హామీ ఇస్తోంది. -
బాలయ్య మీసం ఊడింది..వీడియో వైరల్
సినిమా హీరోలు చాలా మంది విగ్గు పెట్టుకోవడం తెలిసిందే. పాత్రలకు తగినట్టు తమ అభిమానులను ఆకట్టుకొనేందుకు చాలా మంది విగ్గులు పెట్టుకొని నటిస్తుంటారు. అయితే రజనీకాంత్ లాంటి కొంతమంది హీరోలు ఇలాంటి విగ్గులు కేవలం సినిమాల వరకే పరిమితం చేస్తుంటారు. నిజ జీవితంలో వయసు తగ్గట్లుగా ప్రవర్తిసూ..సాధారణ వ్యక్తులాగానే జీవితాన్ని కొనసాగిస్తారు. మరికొంతమంది అయితే సినిమాల్లోనే కాదు..బయట కుడా విగ్లోనే తిరుగుతారు. వయసు మీద పడినా..అభిమానుల ముందు కుర్రాడిలా కనిపించేందుకు ఫేక్ మీసాలు.. విగ్గులు ధరిస్తుంటారు. అవి లేకుండా బయట కాలు కూడా పెట్టరు. అలాంటి నటుల్లో నందమూరి బాలకృష్ణ(Nandamuri Balakrishna) ఒకరు. విగ్గు, పెట్టుడు మీసాలు లేకుండా ఆయన బయట తిరగలేరు.ఈ విషయం అందరికి తెలిసిందే. తాజాగా మరోసారి ఆయకున్నది పెట్టుడే మీసాలే అన్న విషయం బయటకు వచ్చింది. ఓ స్టేజ్పై ఆయన మాట్లాడుతుండగా.. మూతికి అతికించుకున్న ఫేక్ మీసాలు ఊడిపోయాయి. అందరి ముందే గమ్ తెప్పించుకొని మీసాలు అతికించుకొని తన ప్రసంగాన్ని కొనసాగించాడు.నందమూరి బాలకృష్ణ ఇటీవల తన 65వ పుట్టిన రోజు(జూన్ 10)ని బసవతారకం ఆస్పత్రిలో అభిమానుల సమక్షంలో ఘనంగా జరుకున్నాడు. కత్తిని గాల్లో తిప్పుతూ కేకు కట్ చేసి అభిమానులను అలరించాడు. అనంతరం ఆయన ఫ్యాన్స్ని ఉద్దేశించి మాట్లాడాడు. తన స్పీచ్లో ఎప్పటిలాగానే తన బ్లడ్ వేరు..బ్రీడ్ వేరు అని ఊదరగొట్టాడు. అయితే బాలయ్య ఇలా మాట్లాడుతన్న సమయంలో తన పెట్టుడు మీసం కాస్త ఊడిపోయింది. దీంతో కాస్త షాకయిన బాలయ్య.. వెంటనే తేరుకొని గమ్ ఇవ్వండంటూ సిబ్బందిపై గరం గరం అయ్యాడు.గమ్ ఇవ్వగానే వెనక్కి తిరిగి మీసాలను అతికించుకొని, మళ్లీ తన ప్రసంగాన్ని కొనసాగించాడు. దీనికి సంబంధించిన వీడియో ఇప్పుడు నెట్టింట వైరల్గా మారింది. ‘ఈ వయసులో విగ్గులు, పెట్టుడు మీసాలు అవసరమా?’, ‘మనదంతా ఓపెన్ బుక్ అని ప్రతిసారి చెప్పే బాలయ్య..ఇలా బయట ఫేక్ మీసాలు పెట్టుకొని తిరగాల్సిన అవసరం ఏముంది?’, ‘సినిమాల్లో ఎలాగో తప్పదు.. నిజ జీవితంలో అయినా సహజంగా బతుకొచ్చు కదా?’ అని నెటిజన్స్ కామెంట్ చేస్తున్నారు.Papam Bulbul Balayya 😂😂😂Chusukovali kada Mental 😜🤡 pic.twitter.com/9Dqp6BNf20— We Love Chiranjeevi (@WeLoveMegastar) June 11, 2025బాలకృష్ణ గమ్ము గమ్ము అని అడుగుతుంటే ఎందుకబ్బా స్పీచ్ మధ్యలో bubblegum లేక chewing gum అడుగుతున్నాడని మొదట అర్థం కాలేదు తర్వాత అర్థమయింది 😁😁 pic.twitter.com/etuvYFQX5I— Dr.Pradeep Reddy Chinta (@DrPradeepChinta) June 11, 2025 -
నీ ప్రేమకు దిష్టి తగలొద్దు.. ముద్దులతో ముంచెత్తిన నిహారిక
అమ్మతో పంచుకోలేనవి, నాన్నతో చెప్పుకోలేనివి, సోదరుడు/సోదరితో మాట్లాడలేనివి.. ఏవైనా సరే ఈ ఒక్క వ్యక్తి దగ్గర మాత్రం నిర్మొహమాటంగా మాట్లాడేస్తారు. మొహమాటాలకు అస్సలు తావుండదు. అతడే ఫ్రెండ్.. ఏ సమయంలోనైనా, ఎలాంటి పరిస్థితుల్లోనైనా అండగా ఉండేవాడే నిజమైన స్నేహితుడు. నమ్మి దోచుకునేవారికంటే నిజాయితీగా మసులుకునే ఫ్రెండ్ ఒక్కరున్నా చాలనుకునేవారు చాలామంది.ఫ్రెండ్స్ గ్యాంగ్మెగా డాటర్ నిహారిక (Niharika Konidela)కు అలా చెప్పుకునే స్నేహితులు ముగ్గురున్నారు. వారే వితికా షెరు, మహాతల్లి జాహ్నవి, అంబటి భార్గవి. ఈ నలుగురు కలిశారంటే ప్రపంచాన్నే మర్చిపోతారు. తాజాగా వితికా షెరు (Vithika Sheru).. నిహారికకు పెద్ద సర్ప్రైజ్ ప్లాన్ చేసింది. తనకోసం ఏం చేయాలా? అని ఆలోచించగా ఓ మంచి ఐడియా తట్టింది. నిహారిక పాటరీ స్టూడియోను అందంగా మార్చేసింది. భార్గవితో కలిసి ఆ పాటరీ గదిలోని ఓ గోడకు రంగు వేసింది. తర్వాత అక్కడున్న వస్తువుల్ని కొన్ని తీసేయించి అందంగా సర్దింది. కొన్ని పూలమొక్కల్ని కూడా గదిలో అలంకరించింది.నిహారికకు తెలియకుండా..ఈ సందర్భంగా ఓ ఆసక్తికర విషయం చెప్పింది. నిహారిక, నేను ఒకే టీచర్ దగ్గర పాటరీ (మట్టి పాత్రలు తయారు చేయడం) నేర్చుకున్నాం. మేము ఫ్రెండ్స్ అయ్యాక ఈ విషయం తెలుసుకున్నాం. నేను కుమ్మరి పనిలో బేసిక్స్ మాత్రమే వచ్చు. కానీ నిహారిక, భార్గవి డిగ్రీలు చేసేశారు అని చెప్పుకొచ్చింది. ఈ మేకోవర్ అంతా నిహారికకు తెలియకుండా చేసింది. తీరా ఆ పాటరీ స్టూడియోకు వచ్చిన నిహారిక.. తన గదిని అంత అందంగా మార్చిన వితికాను ముద్దులతో ముంచెత్తింది.దిష్టి తగలొద్దువితికా చేసిన పనిని మెచ్చుకుంటూ నిహారిక సోషల్ మీడియాలో ఎమోషనల్ పోస్ట్ పెట్టింది. నీకు, నీ ప్రేమకు ఏ దిష్టీ తగలకూడదు. తన ప్రేమను కాదనడం కష్టం అన్నంతగా ప్రేమిస్తుంది. నా జీవితాన్ని అందంగా మార్చినందుకు థాంక్యూ. నేను ఇంటికి తిరిగి వచ్చినప్పుడు కాస్తంత బాధలో ఉన్నాను. కానీ, నువ్వు చేసిన పని చూశాక నాపై కురిపిస్తున్న ప్రేమకు ముగ్ధురాలినైపోయాను. నువ్వెప్పుడూ నీ చుట్టూ ఉండే జనాల్ని ఎంతో స్పెషల్గా ఫీలయ్యేలా చేస్తావ్. చెప్పలేనంత ప్రేమ కురిపిస్తావ్. దీన్ని నేను గ్రాంటెడ్గా తీసుకోను.. నా జీవితంలోకి వచ్చిన నిన్ను అనునిత్యం ప్రేమిస్తూనే ఉంటాను. ఐ లవ్యూ బేబీ.. అని రాసుకొచ్చింది. ఇది చూసిన అభిమానులు.. వితికా లాంటి ఫ్రెండ్ దొరకడం అదృష్టం అని కామెంట్లు చేస్తున్నారు.చదవండి: శూర్పణఖగా ప్రియాంక అవుట్.. రకుల్తో డీల్? -
ఎయిరిండియా విమానంలో మంచు లక్ష్మి.. క్షేమం అంటూ పోస్ట్
గుజరాత్లోని అహ్మదాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి టేకాఫ్ అయిన కొన్ని క్షణాలకే ఎయిరిండియా విమానం కుప్పకూలింది. ఈ ప్రమాదం వందల కుటుంబాల్లో పెను విషాదాన్ని నింపింది. అయితే, తాజాగా సినీ నటి మంచు లక్ష్మి( Manchu Lakshmi ) సోషల్మీడియాలో ఒక పోస్ట్ చేసింది. ఎయిరిండియా విమానంలో తాను ప్రయాణించానని ఆమె చెప్పింది. చాలామంది తనకు ఏమైనా ప్రమాదం జరిగిందా అనే ఆందోళనతోనే కాల్స్ చేస్తున్నారని పేర్కొంది. దీంతో ఆమె అసలు విషయాన్ని చెబుతూ ఒక వీడియోతో పాటు ఎక్స్ పేజీలో పోస్ట్ చేసింది.'విమాన ప్రమాదం జరిగిన రోజే ఎయిరిండియా ఫ్లైట్లో నేను ప్రయాణించిన మాట వాస్తవమే.. కానీ, నేను ముంబై నుంచి లండన్ వెళ్లాను. అహ్మదాబాద్లో జరిగిన విషాదకరమైన విమాన ప్రమాదంతో నేను తీవ్ర దిగ్భ్రాంతికి గురయ్యాను. నేను లండన్ చేరిన వెంటనే ఈ వార్త తెలుసుకున్నాను. చాలా మంది అమాయకులు ప్రాణాలు కోల్పోయారు, ఇది నిజంగా బాధాకరమైనది. ఈ విషాదంలో ఇంకా ఎక్కువ మంది రెసిడెంట్ డాక్టర్లు ప్రాణాలు కోల్పోయినట్లు విని నా గుండె పగిలిపోయింది. నేను ఈరోజు ఎయిర్ ఇండియాలో లండన్కు వెళ్లానని నమ్మలేకపోతున్నాను. ఈ రోజు ఊహించుకోవడానికి చాలా బాధాకరమైనది. మన ప్రాణాలు ఒక క్షణంలో ఎలా ముగిసిపోతాయి అనేది ఇదొక ఉదహారణ. ఇలాంటి ప్రమాదాలు జరిగినప్పుడు మనమేంటో అర్థం అవుతుంది. బాధిత కుటుంబాలందరికీ నా ప్రగాఢ సానుభూతి.' అని మంచు లక్ష్మి తెలిపింది.Devastated by the tragic flight crash in Ahmedabad. So many innocent lives gone, it’s truly painful. My heart breaks as I hear about even more resident doctors who have lost their lives in this tragedy…Can’t believe I just flew to London today on Air India God is Great. This…— Manchu Lakshmi Prasanna (@LakshmiManchu) June 12, 2025 -
Air India Plane Crash: 15 ఏళ్లకు కలుసుకుని.. అంతలోనే కనుమరుగై..
అహ్మదాబాద్: గుజరాత్లోని అహ్మదాబాద్లో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయినవారికి ప్రపంచం యావత్తూ సంతాపం తెలుపుతోంది. ఈ ప్రమాదంలో అయినవారిని కోల్పోయినవారు తీవ్ర ఆవేదనలో ఉన్నారు. ఒక్కో బాధిత కుటుంబానిది ఒక్కో విషాద గాథ. వీటిని వింటున్నప్పుడు ఎవరికైనా కళ్లు చమర్చరకమానవు. ఎయిర్ ఇండియా విమానం ఏI 171 ప్రమాదంలో మరణించిన 242 మందిలో 37 ఏళ్ల జావేద్, అతని భార్య మరియం, వారి ఐదేళ్ల కుమారుడు, నాలుగేళ్ల కుమార్తె కూడా ఉన్నారు.తల్లితో పండుగ చేసుకునేందుకు వచ్చి..15 ఏళ్ల తరువాత ఈద్ అల్-అధా పండుగను తమ తల్లితో కలిసి చేసుకునేందుకు జావేద్ నలుగురు తోబుట్టువులు తమ కుటుంబాలతో సహా అహ్మదాబాద్కు తరలివచ్చారు. ఈ విధంగా కుటుంబంలోని అందరూ కలుసుకునేందుకు వారు ఏళ్ల తరబడి ఎదురు చూశారు. అయితే ఈ విమాన ప్రమాదం వారి కుటుంబాన్ని తీవ్ర విషాదంలోకి నెట్టివేస్తుందని వారు ఆ సమయంలో గ్రహించలేకపోయారు. ఈ ప్రమాదంలో జావేద్ కుటుంబమంతా ప్రాణాలు కోల్పోయిందనే సంగతిని హృద్రోగంతో బాధపడుతూ, త్వరలో చికిత్స చేయించుకోబోతున్న అతని తల్లికి చెప్పేందుకు ఎవరూ ధైర్యం చేయలేకపోతున్నారు.దీనికి ఎవరు బాధ్యులు?తమ కుటుంబంలో నెలకొన్న విషాదం గురించి జావేద్ సోదరుడు ఇంతియాజ్ మీడియాతో మాట్లాడుతూ ‘అహ్మదాబాద్ సివిల్ ఆస్పత్రిలో బాధితులను గుర్తించేందుకు వారి నమూనాలను సేకరిస్తున్నారని అధికారులు తెలిపారు. మా సోదరుడు సంతోషంగా వేడుకలు చేసుకునేందుకు అహ్మదాబాద్ వచ్చాడు. ఇప్పుడు మేము నలుగురు కుటుంబ సభ్యులను కోల్పోయాం. దీనికి ఎవరు బాధ్యులు? ఈ ప్రమాదంలో 240 మందికి పైగా ప్రయాణికులు మృతిచెందారు. విమానం బయలుదేరిన కొద్ది సెకెన్లకే అది కూలిపోయింది. ఇది ఎలా జరిగింది? 11 ఏళ్ల క్రితం చదువుకునేందుకు యూకే వెళ్లిన నా సోదరుడు మరియంను వివాహం చేసుకుని, బ్రిటిష్ పౌరునిగా మారాడు.‘అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్’మా అమ్మతో ఈద్ వేడుక చేసుకునేందుకు జావేద్ ఇక్కడికి వచ్చాడు. అమ్మకి రెండు వారాల్లో గుండె ఆపరేషన్ జరగాల్సివుంది. మేమంతా గత 15 ఏళ్లుగా ఎప్పుడూ కలిసివుండలేదు. మా అమ్మకి ఇంకా ఆ విషయం చెప్పలేదు. జావేద్ను ఆస్పత్రిలో చేర్చినట్లు చెప్పాం. మా కుటుంబం ఇద్దరు చిన్నారులను కూడా కోల్పోయింది. ఇది మాకు తీరని విషాదం. గురువారం రాత్రి జావేద్ మృతదేహాన్ని గుర్తించేందుకు రక్త నమూనాను ఇచ్చాను. మృతదేహాలు గుర్తుపట్టలేనంతగా కాలిపోయాయని అధికారులు చెబుతున్నారు. డీఎన్ఏ రిపోర్టు వచ్చాకనే మా సోదరుణ్ణి గుర్తించగలుగుతాం. ఆదివారం నాటికి రిపోర్టు వస్తుందని చెబుతున్నారు’ అని ఇంతియాజ్ తెలిపారు. ప్రమాదం జరిగిన సమయంలో విమానంలో ఉన్న 242 మంది ప్రయాణికులలో 241 మంది మృతిచెందారు. ఇది కూడా చదవండి: వింత రైల్వే వంతెన.. భయపెడుతున్న 90 డిగ్రీల మలుపు.. -
లైఫ్ అంతా అల్లు అర్జున్కు కాపలా కాయడమే సరిపోయింది: బన్నీ వాసు
బన్నీ వాసు (Bunny Vas)ది పశ్చిమ గోదావరి జిల్లాలోని పాలకొల్లు. కామన్ ఫ్రెండ్ ద్వారా అల్లు అర్జున్ పరిచయమవ్వడం, అతడితో స్నేహం కుదరడంతో గీతా ఆర్ట్స్లో పని చేశాడు. అనంతరం అల్లు అర్జున్, అల్లు అరవింద్ కలిసి స్థాపించిన గీతా ఆర్ట్స్ 2 సంస్థలో పార్ట్నర్ అయ్యాడు. నిర్మాతగా తెలుగు ఇండస్ట్రీకి ఎన్నో హిట్ సినిమాలందించాడు. ఈ మధ్య తన స్నేహితులతో కలిసి బీవీ వర్క్స్ పేరుతో కొత్త నిర్మాణ సంస్థ ప్రారంభించాడు. ఈ బ్యానర్లో బన్నీ వాసు మిత్ర మండలి అనే సినిమా నిర్మిస్తున్నాడు.నా తండ్రికన్నా నీతోనే ఎక్కువ..గురువారం (జూన్ 12న) ఈ మూవీ టీజర్ రిలీజ్ చేశారు. ఈ సందర్భంగా బన్నీ వాసు మాట్లాడుతూ.. నా జీవితంలో మా తండ్రితో కన్నా ఎక్కువగా మీ (అల్లు అరవింద్)తోనే ఉన్నాను. మా ఇంట్లో కన్నా మీ ఇంట్లోనే ఎక్కువగా ఉన్నాను. అలాంటిది ఈ రోజు ఇక్కడివరకు ఎదిగిన మమ్మల్ని చూస్తుంటే మీకెంత గర్వంగా ఉందో, మిమ్మల్ని చూస్తుంటే మాకూ అంతే సంతోషంగా ఉంది. మా జీవితంలో అల్లు అరవిందే గాడ్ ఫాదర్. ఇంత సపోర్ట్ ఇచ్చి, ఈ జీవితాన్ని ప్రసాదించినందుకు థాంక్యూ సో మచ్ సర్.బన్నీకి కాపలా కాయడమే..మేమందరం మంచి సినిమాలు తీస్తున్నామంటే అది అరవింద్గారు మాకు నేర్పిన శిక్షణ, విద్య అని చెప్పుకొచ్చాడు. సరిగ్గా అప్పుడే యాంకర్ స్రవంతి.. లైఫ్లో ఏ అమ్మాయికైనా ప్రపోజ్ చేశారా? వాళ్లు పడిపోయారా? అని అడిగింది. అందుకు బన్నీ వాసు ఏ అమ్మాయి నాకు పడిపోలేదు, పైగా తిట్లు తిన్నాను అని రిప్లై ఇచ్చాడు. అక్కడితో ఆగకుండా.. నేను 19 ఏళ్ల వయసులో అరవింద్గారి దగ్గరకు వచ్చాను. అప్పటినుంచి నన్ను బన్నీగారి దగ్గర వాచ్మెన్గా పెట్టారు. నా జీవితమంతా ఆయనకు కాపలా కాయడమే సరిపోయింది. నా లైఫ్లో లవ్ పార్ట్ ఏదైనా మిస్సయిందంటే దానికి అరవింద్, బన్నీనే కారణం అని నవ్వుతూ చెప్పాడు.చదవండి: పచ్చబొట్టు వేయించుకున్న సురేఖావాణి.. బిల్డప్ దేనికంటూ ట్రోలింగ్