breaking news
-
భవిష్యత్తులో కొదవలేని బిజినెస్ ఇదే..
భారతదేశం కాలుష్యాన్ని తగ్గించేందుకు చర్యలు చేపడుతోంది. అందులో భాగంగా ఎలక్ట్రిక్ వాహనాల తయారీని పెంచుతోంది. ఈవీలో ప్రధానపాత్ర పోషించేది బ్యాటరీలే. వీటిలో లిథియం బ్యాటరీలను ఎక్కువగా వాడుతున్నారు. భవిష్యత్తులో వీటి సామర్థ్యం తగ్గాక తిరిగి రీసైక్లింగ్ చేసే వ్యవస్థను రూపొందించాలి. ప్రస్తుత రీసైక్లింగ్ మౌలిక సదుపాయాలు భవిష్యత్ డిమాండ్లను తీర్చలేవని నిపుణులు అంచనా వేస్తున్నారు. అందుకు తగ్గట్టుగా స్థిరమైన వ్యవస్థను ఏర్పరచాలని సూచిస్తున్నారు. ఈమేరకు ప్రభుత్వం మరిన్ని స్టార్టప్లను ప్రోత్సహించాలని చెబుతున్నారు.కార్లలో ఉపయోగించే లిథియం అయాన్ బ్యాటరీలు సగటున 7-8 సంవత్సరాలు పనిచేస్తాయి. కస్టమర్ల వినియోగాన్ని బట్టి ఒక దశాబ్దం వరకు మన్నిక రావొచ్చు. అన్ని రకాల లిథియం అయాన్ బ్యాటరీల్లో లిథియం ఫెర్రో ఫాస్ఫేట్, నికెల్ మాంగనీస్ కోబాల్ట్ ఆక్సైడ్ (ఎన్ఎంసీ), లిథియం నికెల్ కోబాల్ట్ అల్యూమినియం ఆక్సైడ్(ఎన్సీఏ)లను విరివిగా వాడుతారు. భారత్లో ఈవీలు వేగంగా విస్తరిస్తున్నాయి. దాంతో ఈ దాతువుల వినియోగం సైతం పెరుగుతోంది.ప్రధాన సమస్యలివే..ఈ బ్యాటరీల తయారీలో రెండు ప్రధాన సమస్యలున్నట్లు నిపుణులు అంచనా వేస్తున్నారు. ఒకటి.. బ్యాటరీల్లో వాడే రసాయన దాతువులను సంగ్రహించడం. రెండు.. ఈ బ్యాటరీలను వాడిన తర్వాత ఆయా దాతువులను భూమిలో వేస్తే కలిగే ప్రమాదాలను నివారించడం. ఈ సమస్యలకు ‘రిసైక్లింగ్’ పరిష్కారమని నిపుణులు సూచిస్తున్నారు. ప్రస్తుతం రీసైక్లింగ్ పద్ధతుల్లో హైడ్రోమెటలర్జీ, పైరోమెటలర్జీ, డైరెక్ట్ రీసైక్లింగ్, ఇంటిగ్రేటెడ్ కార్బోథర్మల్ రిడక్షన్ వంటి మెకానికల్ ప్రక్రియలు అనుసరిస్తున్నారు. ఈ పద్ధతుల్లో బ్యాటరీలను కంప్రెస్ చేయడం, ముక్కలు చేయడం, ప్రత్యేక ద్రావకాలు లేదా వేడితో కరిగించి విలువైన పదార్థాలను వెలికితీస్తారు. ఈ ప్రక్రియనంతటిని ‘బ్లాక్ మాస్’ అని పిలుస్తారు. భారత్లో పైరోమెటలర్జీ(అధిక ఉష్ణోగ్రతల వద్ద బ్యాటరీలను కరిగించడం)తో పోలిస్తే తక్కువ ఉద్గారాలతో కూడిన హైడ్రోమెటలర్జికల్(ప్రత్యేక ద్రావణాలతో కరిగించడం) ప్రక్రియను ఎక్కువగా వాడుతున్నారు. ఇందులో దాదాపు 95 శాతం యానోడ్, కేథోడ్లను సంగ్రహిస్తున్నారు. దేశీయంగా 80% హైడ్రోమెటలర్జీ ప్రక్రియనే వాడుతున్నారు.స్టార్టప్లు అందిపుచ్చుకోవాల్సిందే..అభివృద్ధి చెందుతున్న ఈవీ రంగంలో రి మరిన్ని స్టార్టప్లకు అవకాశం ఉంది. ఈవీ తయారీ వైపే కాకుండా బ్యాటరీ రీసైక్లింగ్ విభాగంలోనూ కంపెనీలు పుట్టుకొచ్చే అవకాశం ఉన్నట్లు నిపుణులు చెబుతున్నారు. భవిష్యత్తులో రాబోయే ఈ ట్రెండ్ను స్టార్టప్లు అందిపుచ్చుకోవాలని చెబుతున్నారు. ఈవీ రంగంలో పెట్టుబడి పెట్టే వెంచర్ కాపిటలిస్ట్లు ఈ విభాగాన్ని కూడా గమనించాలని సూచిస్తున్నారు. -
Ranu Bombai Ki Ranu: ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ..
రేపల్లె మళ్లీ మురళి విన్నది.. ఆ పల్లె కళే పలుకుతున్నది.. ఆ జానపదం ఘల్లుమన్నది.. ఆ జాణ జతై అల్లుకున్నది.. అని రచయిత సిరివెన్నెల సీతారామశాస్త్రి అన్నట్లు.. గత కొంత కాలంగా తెలుగు ఫోక్ సాంగ్స్ సరికొత్త ట్రెండ్ సెట్ చేస్తున్నాయి. తెలుగు జానపదాలు సోషల్ మీడియాలో టాప్ ట్రెండింగ్లో ఉన్నాయి. ఒకప్పుడు సినిమా పాటలు వైరల్గా మారేవి.. కానీ ప్రస్తుతం మన జానపద పాటలు వైరల్గా మారి సోషల్ మీడియాను ఓ ఊపు ఊపేస్తున్నాయి. అంతేకాకుండా.. స్థానికంగానే కాకుండా దేశంలోని ఇతర నగరాల్లో సైతం ప్రముఖ కార్యక్రమాల్లో తెలుగు ఫోక్ సాంగ్స్ హైలైట్గా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు మొదలు మిస్ వరల్డ్ పోటీలను సైతం తెలుగు ఫోక్సాంగ్స్ అలరించాయి. సోషల్ మీడియాలో సైతం వైరల్గా మారడంతో ఈ పాటలకు మానిటైజేషన్ ఎక్కువగా జరిగి ప్రైవేట్ ఆల్బమ్స్కు సైతం లక్షల్లో రెమ్యూనరేషన్ వస్తుండటం విశేషం. అనాదిగా తెలుగు జానపద పాటలకున్న విశిష్టత, ప్రశస్తి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదు. సంప్రదాయ ప్రైవేట్ ఆల్బమ్లతో యువత గుండెల్లో ఒక నిర్దిష్ట స్థానం ఏర్పరుచుకున్నాయి. అయితే ఈ మధ్య ఓ మెట్టు ఎగబాకి సినిమా పాటలను సైతం దాటి వైరల్గా మారుతుండడం విశేషం. ఎంతలా అంటే ఒక పాటకు 40, 50 లక్షల ఆదాయం సంపాదించేంతలా..!! ఈ పాటలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడం, ఎక్కువ వ్యూయర్ప్తో రెమ్యూనరేషన్ లభించడం ఈ తరం యువతకు కలిసొచి్చంది. ఇందులో భాగంగానే సినిమా పాటల మాదిరిగానే సెట్లు వేసి మరీ ప్రైవేటు ఆల్బమ్స్ షూట్ చేస్తున్నారు. ఊర్లో పెళ్లి బరాత్లు, పండుగలు, పబ్బాల్లో అలరించే ఈ పాటలు కొత్త రంగులు అద్దుకున్నాయి. యూట్యూబ్తో పాటు ఇన్స్టా, ఫేస్బుక్లో ఈ పాటలు, పాటల రీల్స్ సందడి చేస్తూ ఆదాయ మార్గాలుగా మారుతున్నాయి. వైరల్గా మారిన ఈ ఫోక్ సాంగ్స్లో నటించిన నటీనటులు, సింగర్లు, మ్యూజిక్ డైరెక్టర్లు ప్రస్తుతం సోషల్ సెలబ్రెటీలుగా మారుతున్నారు. గతంలో ఇదే దారిలో వచ్చి సినిమా అవకాశాలు పొందిన మంగ్లీ, రామ్ మిర్యాల గురించి విధితమే. కానీ ఈ తరం ఫోక్ ఆరి్టస్టులు సినిమాలతో పాటు ప్రైవేటు ఆల్బమ్స్తోనే మంచి ఆదాయాలను పొందటం విశేషం. ఒకప్రైవేటు ఆల్బమ్తో కోటి రూపాయలకు పైగా వ్యూయర్షిప్ రెమ్యునరేషన్ పొందిన తెలుగు పాటలున్నాయి. ఇది ఈ తరం ఔత్సాహికులకు కళతో పాటు ఆదాయమార్గాలను చేరువ చేస్తున్నాయి. ఇటీవలి కాలంలో వైరల్ అయినవి.. కాపోల్లింటికాడ..: 2023లో విడుదలైన ఈ పాట రీల్స్లో, ఫేస్బుక్, యూట్యూబ్లో సూపర్ హిట్ అనే చెప్పాలి. ఈ పాట ఇన్స్టా కవర్స్, డ్యాన్స్ ఛాలెంజ్లకు కారణమైంది. సిటీలో ఈ ట్రెండింగ్ కల్చర్కు కారణమైనవాటిలో ఈ సాంగ్ కూడా ఒకటి. ఓ పిలగ వెంకటి..: 2024లో విడుదలైన ఈ పాట యూట్యూబ్, ఇన్స్టా రీల్స్లో హాట్ ట్రెండ్ అయ్యింది. ఈ పాటలోని బీట్, లిరిక్స్ యువతతో పాటు అన్ని వర్గాల వారినీ ఆకర్షించింది. ఈ పాటతో వేల సంఖ్యలో రీల్స్ సోషల్ మీడియాను నింపేశాయి. కమలాపూరం రోడ్డాట..: మార్చి 2025లో విడుదలైన ఈ ఫోక్ జోక్ ట్యూన్ ఈ మధ్య కాలంలో ఇన్స్టా రీల్స్, రీమిక్స్ వీడియోల్లో సంచలనంగా మారింది. ఇందులోని గ్రామీణ సన్నివేశాలు, బీట్ మాధ్యంలోని హుక్లతో ఈ పాట క్రియేటర్లు, డీజే వర్క్షాప్లలో హైలైట్గా నిలిచింది. రాను బొంబైకి రాను..: అద్దాల మేడలున్నవే అంటూ మొదలయ్యే ఈ పాట.. రాను ముంబైకి రాను అంటూ ఈ ఏడాది ట్రెండింగ్ సాంగ్గా మారింది. ఈ పాట దేశంలోనే కాదు ఇతర దేశాల్లోనూ, బాలివుడ్ షోలలోనూ వైరల్గా మారింది. లైఫ్స్టైల్.. సోషల్ స్ట్రీమింగ్.. ఈ పాటలు గతంలో టిక్టాక్, ప్రస్తుతం యూట్యూబ్, క్యాప్కట్, ఇన్స్టాల్లో వైరల్గా మారుతున్నాయి. కొన్ని పాటలకు బ్రాండెడ్ వీడియో అలాగే లైవ్ ఈవెంట్ల ద్వారా ఆదాయం వస్తోంది. ఒక్క పాటతో పార్ట్ టైమ్ సెలబ్రిటీగా మారిన క్రియేటర్లు ఎందరో. ఈ ప్రభావంతో గ్రామీణ ఆవిష్కరణలుగా ప్రైవేట్ ఆల్బమ్స్ నిలుస్తున్నాయి. వీటికి సహకార వేదికలు, స్టేజ్ షోస్, వెబ్స్ట్రీమ్స్ ద్వారా ఆరి్టస్టులు దేశ–అంతర్జాతీయ స్థాయిలకు వెళ్లే అవకాశాలు పెరుగుతున్నాయి. హైబ్రిడ్ ఫ్యూజన్తో ఫోక్ + ఎలక్ట్రో బ్యాండ్లుగా అవతరిస్తున్నాయి. తెలుగు ఫోక్ సాంగ్స్ తాజాగా దేశవ్యాప్తంగా లైఫ్స్టైల్ ఈవెంట్స్లో ప్రధాన ఆకర్షణగా నిలుస్తున్నాయి. క్రికెట్ మ్యాచ్లు, బాలీవుడ్ షోలు, మిస్ వరల్డ్ వేదికలపై ఫోక్ ఘనంగా ఆవిష్కృతమవుతోంది. ఈ ఆదరణ దృష్ట్యా రవితేజ వంటి సినీ హీరోలు తమ సినిమాల్లో ఫోక్ సాంగ్స్ను జతచేస్తున్నారు. మరికొందరు అన్ని పాటలూ ఫోక్సాంగ్స్ పెట్టుకున్న సందర్భాలూ లేకపోలేదు. -
ఫొటో తీస్తానని.. నదిలోకి నెట్టేసి..
కృష్ణా: కొత్తగా పెళ్లయిన జంట.. బైక్పై వెళ్తూ మాంచి లొకేషన్ కనిపిస్తే ఫొటోలు తీసుకోవాలని ముచ్చటపడ్డారు. వారు వెళ్తున్న దారిలో కృష్ణానదిపై గుర్జాపూర్ బ్రిడ్జి వచి్చంది. అదే మంచి స్పాట్ అనుకొని ఫొటోలు దిగటానికి సిద్ధమయ్యారు. భర్త తన భార్యకు ఫోన్ ఇచ్చి.. తనను ఫొటోలు తీయాలని కోరి వెళ్లి బ్రిడ్జి అంచున నిలబడ్డాడు. భార్య కూడా ఫొటోలు తీస్తూనే భర్త వద్దకు వెళ్లి ఒక్కసారిగా అతన్ని నదిలోకి తోసేసింది. బిక్కచచ్చిపోయారు భర్త నీళ్లలో పడి కొట్టుకుపోతూ.. నదిలో ఓ రాయిని పట్టుకొని ప్రాణాలు కాపాడుకున్నాడు. అతడి కేకలు విని జాలర్లు రక్షించి పైకి తీసుకొచ్చారు. అయితే, భార్యే తనను నదిలోకి తోసిందని భర్త చెబుతుండగా, లేదులేదు.. అతడే నదిలో పడిపోయాడని భార్య వాదిస్తోంది. ఏం చేయాలో తెలియని పోలీసులు తలలు పట్టుకున్నారు. ఈ ఘటన శనివారం తెలంగాణ– కర్ణాటక సరిహద్దులో నారాయణపేట జిల్లాలో ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై చోటుచేసుకుంది. ప్రమాదమా? హత్యాయత్నమా? కర్ణాటకలోని రాయచూర్ జిల్లాలో ఉన్న శక్తినగర్కు చెందిన తాతప్ప (23)కు యాద్గిర్ జిల్లాలోని వడిగేరి గ్రామానికి చెందిన గెట్టెమ్మ (20)తో మూడు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం ఇద్దరు బైక్పై వడిగేరికి వెళ్లి శనివారం ఉదయం తిరుగు పయనమయ్యారు. మార్గమధ్యలో కృష్ణానదిపై ఉన్న గుర్జాపూర్ బ్రిడ్జిపై ఫొటోలు దిగాలని భావించారు. భర్త తన ఫోన్ను భార్య చేతికి ఇచ్చి ఫొటో తీయమని చెప్పి ఆయన బ్రిడ్జి చివరన నిలబడ్డాడు. గెట్టెమ్మ ఫొటో తీస్తున్నట్లు నమ్మించి భర్తను నదిలోకి తోసేసింది. తర్వాత భర్త తల్లికి ఫోన్ చేసి తాతప్ప నదిలో పడిపోయాడని చెప్పింది. నదిలో పడిన తాతప్ప బ్రిడ్జి పక్కనే కొద్ది దూరంలో ఉన్న రాయిపైకి చేరి ‘నన్ను రక్షించండి.. నా భార్య పారిపోకుండా పట్టుకోండి’అంటూ కేకలు వేశాడు. దీంతో సమీపంలో చేపలు పడుతున్న జాలర్లు గమనించి తాతప్పను తాడు సహాయంతో ఒడ్డుకు చేర్చారు. పైకి వచి్చన తాతప్ప.. భార్యే తనను నదిలోకి తోసేసిందని ఆగ్రహం వ్యక్తంచేయగా.. భార్య మాత్రం తాను తోయలేదని, ఆయనే ప్రమాదవశాత్తు నదిలో పడిపోయాడని వాదించింది. ఈ విషయమై శక్తినగర్ రూరల్ పోలీస్స్టేషన్ ఎస్ఐ బస్వరాజ్ను వివరణ కోరగా ఘటన జరిగిన విషయం వాస్తవమేనని తెలిపారు. భార్యాభర్తల మధ్య పంచాయితీ ఉందని, వారి కుటుంబ సభ్యులు మాట్లాడుకొని ఆదివారం ఫిర్యాదు ఇస్తామని చెప్పారని వివరించారు. -
తిరుగులేని హీరోయిన్.. పగతో శవాన్ని కూడా వదలని స్టార్ హీరో
నటశిరోమణి 'పుసుపులేటి కన్నాంబ' 1934 నుంచి 1965 వరకు దక్షిణాదిన తిరుగులేని తెలుగు తార. నేటి తరానికి ఈ అద్భుత నటి కథ పరిచయం చేయాల్సిందే. ఇప్పటికీ ఆమె శవం ఎక్కడ అనేది ఒక మిస్టరీనే.. కన్నాంబ పుట్టింది (1912) ఏలూరు. పెరిగింది గుంటూరులో. పెద్ద కుటుంబం. పేరున్న కుటుంబం. తండ్రి తోడబుట్టినవాళ్లు 17 మంది. కుటుంబం మొత్తానికి కన్నాంబ ఒక్కతే కూతురు. మిగతావాళ్లంతా మగపిల్లలే. అమ్మానాన్న, పెదనాన్నలు, బాబాయ్ల మధ్య అల్లారు ముద్దుగా పెరిగింది. ఐదో తరగతి వరకూ చదువుకున్న కన్నాంబకు వీధి నాటకాలు చూడటం ఇష్టం. బయట నాటకం చూడటం, ఇంటికొచ్చాక ఆ డైలాగులు చెప్పి, ఇంటిల్లిపాదినీ నవ్వించడం. 11వ ఏట నాటకాలు చూడటం మొదలుపెట్టి, ఆ తర్వాత 'నావెల్ నాటక సమాజం'లో చేరి, బాల తారగా పలు పాత్రలు చేసింది. 1935లో 'హరిశ్చంద్ర' సినిమా ద్వారా వెండితెరకు పరిచయమయ్యారు కన్నాంబ. ఆ చిత్రంలో హరిశ్చంద్రుడి భార్య చంద్రమతి పాత్ర చేశారామె. తొలి చిత్రంలోనే అద్భుతమైన నటన కనబర్చి మంచి పేరు తెచ్చుకున్నారు.తప్పు చేస్తే నన్ను నేను చంపేసుకుంటా: కన్నాంబ'సినిమా పరిశ్రమ మనకు సూటవ్వదు. మాయా ప్రపంచం...' హీరోయిన్ అవుతానన్నప్పుడు కన్నాంబ తల్లిదండ్రులు అన్న మాటలివి. అనుకున్నది సాధించాలనే పట్టుదలతో పెరిగిన అమ్మాయి. పద్ధతులు తెలిసిన అమ్మాయి కన్నాంబ. అందుకే అమ్మానాన్నకు మాటిచ్చింది... ‘ఎక్కడా తప్పటడుగు వేయను’ అని. 'నేను ఎవరికీ లొంగను. మీరు తలవొంచుకునే పరిస్థితులు తీసుకు రాను. ఒకవేళ నేను తలవొంచే పరిస్థితి వస్తే నన్ను నేను చంపేసుకుంటాను' కూతురి మాటలు విన్న కన్నాంబ తల్లిదండ్రులు సినిమాల్లోకి వెళ్లడానికి అనుమతిచ్చారు. అలా సినీ ఇండస్ట్రీలో అడుగుపెట్టి వందకు పైగా సినిమాల్లో నటించారు.మొదటి సినిమా తర్వాత కన్నాంబ వెనక్కి తిరిగి చూసుకోలేదు. ‘ద్రౌపది వస్త్రాపహరణం, కనకతార, పల్నాటి యుద్ధం, అనార్కలి, దక్షయజ్ఞం, తోడి కోడళ్లు’ తదితర చిత్రాల్లో నటించారామె. సినిమాలు ప్రారంభమైన రోజుల్లో అంటే 30, 40వ దశకంలో ఆమె ఒక సంచలన నటి. ఆమె అందానికి అందరూ ఫిదా అయిపోయారు. భారీ సినిమాల్లో ఛాన్సులు, పేరుతో పాటు డబ్బు అన్నీ వచ్చేశాయి. అయినప్పటికీ కన్నాంబ కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు.కన్నాంబకు సమస్యగా మారిన తమిళ నటుడుకన్నాంబ కెరీర్ సాఫీగా సాగలేదు. అప్పటి ఓ ప్రముఖ తమిళ నటుడు ఈవిడకు సమస్య అయ్యాడు. కన్నాంబను లొంగదీసుకోవాలన్నది అతని లక్ష్యం. ‘ఎవరికీ లొంగను. ఎవరి దగ్గరా తలవంచను’ అని తల్లిదండ్రులకు ఇచ్చిన మాటను నిలబెట్టుకున్నారు. ఇప్పుడు ‘క్యాస్టింగ్ కౌచ్’ అంటూ పలువురు కథానాయికలు తమకు ఎదురైన చేదు అనుభవాలను చెబుతున్నారు. అప్పట్లో కన్నాంబకు జరిగింది కూడా ఇదే. ఆ నటుడిని ఎదిరించినందుకు గాను ఆమెకు మెల్లిగా అవకాశాలు తగ్గాయి. చివరికి ఆ నటుడు కన్నాంబ భర్తనూ వదిలిపెట్టలేదు. కన్నాంబ భర్త కడారు నాగభూషణం సినీ నిర్మాత, దర్శకుడు కూడా. ఈ ఇద్దరూ పెళ్లి చేసుకున్నాక ‘శ్రీ రాజరాజేశ్వరీ ఫిలిం’ కంపెనీ స్థాపించి పలు తెలుగు, తమిళ చిత్రాలు నిర్మించారు. వాటిలో ‘సుమతి, పాదుకా పట్టాభిషేకం, సతీ సక్కుబాయి, శ్రీకృష్ణతులాభారం’ తదితర చిత్రాలున్నాయి ఈ చిత్రాలకు కడారు నాగభూషణమే దర్శకుడు. బయటి దర్శకులతోనూ సినిమాలు తీశారు. భర్త దర్శకత్వంలో కన్నాంబ నటించారు కూడా.'కన్నాంబ'పై పగపెంచుకున్నాడుకన్నాంబ, నాగభూషణంలు మంచితనానికి చిరునామా అన్నట్లుగా ఉండేవాళ్లట. అడిగినవాళ్లకు కాదనకుండా డబ్బు ఇవ్వడం, సాక్షి సంతకం పెట్టడం లాంటివి వీళ్లకు నష్టాన్ని కలిగించాయి. ఏ నటుడి వల్ల అయితే అవకాశాలు కోల్పోయారో అదే నటుడితో ఓ సినిమా తీసి, నష్టాలపాలయ్యారు. ఆ నటుడితో రెండు మూడు సినిమాలను తమ బేనర్లో నిర్మించడానికి కన్నాంబ, నాగభూషణంలు ఒప్పందం కుదుర్చుకున్నారు. ఫస్ట్ సినిమా తీసినప్పుడు తన స్నేహితుడి బేనర్కి ఆ సినిమాని ఇవ్వమని నటుడు కోరితే కాదనకుండా ఇచ్చేశారు. అయితే 30 శాతం మాత్రమే చెల్లించి, మిగతా 70 శాతం డబ్బు ఇవ్వకపోయినా కన్నాంబ దంపతులు అతనితో రెండో సినిమా తీయడానికి సిద్ధపడ్డారు. ఆ సినిమా సగంలో ఉండగానే అతనికి రాజకీయాల వైపు మక్కువ ఏర్పడి, మిగతాది పూర్తి చేయకపోవడంతో నష్టం మిగిలింది. ‘‘ఏ వ్యక్తి మీద అయినా వారి జీవితాన్ని నాశనం చేసేంత కోపం ఉండకూడదు. కానీ తన అమ్మమ్మపై ఆ నటుడు పగబట్టాడని పేరు చెప్పుకుండా కన్నాంబ మనవడు గతంలో ఒకసారి అన్నారు. ఆమె కెరీర్ని నాశనం చేయడంతో పాటు తన తాతగారికీ అవకాశాలు లేకుండా చేశాడని కన్నాంబ మనవడు పసుపులేటి దేవీ చౌదరి అన్నారు.కన్నాంబ శవం మాయం'ఆత్మబలం' (1964) కన్నాంబ చివరి సినిమా. అదే ఏడాది మే 7న ఆమె తుది శ్వాస విడిచారు. ఏ అనార్యోగమూ లేదు. బతికున్న రోజుల్లో జ్వరం అనేది ఎరగని కన్నాంబ ప్రశాంతంగా కన్ను మూశారు. అయితే దురదృష్టం ఏంటంటే.. మనిషి చనిపోయాక కూడా ఆ నటుడు పగ తీర్చుకున్నాడని దేవీ చౌదరి అంటున్నారు. కన్నాంబ భౌతికకాయాన్ని ఖననం చేశారు. అక్కడ సమాధి కట్టించాలన్నది కుటుంబ సభ్యుల ఆలోచన. అయితే ఈలోపే శవం మాయమైంది. శరీరం మీద ఉన్న నగల కోసం దొంగలే మాయం చేశారని కొందరు అంటే, కాదు ఇది ఆ నటుడి పనే అని మనవడు తెలిపారు. ఏం జరిగిందో దేవుడికే ఎరుక. ఆమె శవాన్ని ఎత్తుకెళ్లి, నగలన్నీ తీసేసి శవాన్ని ఎక్కడో పారవేశారు అన్న వార్తలు వెలుగులోకి వచ్చాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినప్పటికీ, ఆ శవం ఏమైందో ఇప్పటికి తెలియదు. ఇది ఆమె జీవితంలోని విషాద ఘట్టంగా, తెలుగు సినీ చరిత్రలో ఒక విషాదకథగా నిలిచిపోయింది. -
డ్రైవర్ దారుణ హత్యపై కూటమి గప్చుప్!
సాక్షి టాస్క్ఫోర్స్ : తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి జనసేన ఇన్చార్జి కోట వినుత మాజీ డ్రైవర్ శ్రీనివాసులు అలియాస్ రాయుడు దారుణ హత్య ఎంతో కలకలం సృష్టించినా అటు జనసేన అధినేత పవన్కళ్యాణ్కు గానీ, ఇటు కూటమి ప్రభుత్వానికి గానీ ఈ ఘటన ఏమాత్రం పట్టడంలేదు. అతిసామాన్య కుటుంబానికి చెందిన శ్రీనివాసులును కోట వినుత ఆమె భర్త చంద్రబాబు మరో ముగ్గురితో కలిసి అతికిరాతకంగా మట్టుబెట్టిన విషయం తెలిసిందే. అయితే, ఈ ఘటనపై ముఖ్యనేతలెవరూ స్పందించకపోవడంపై విమర్శలు వస్తున్నాయి. తమిళ మీడియాలో కూడా ఈ ఉదంతంపై వరుస కథనాలు వస్తున్నప్పటికీ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగానీ, జనసేన అధినేతగానీ ఇప్పటివరకు నోరువిప్పలేదు. అయితే, మృతుడు కుటుంబ సభ్యులు మాత్రం పవన్ రావాలి.. తమకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. తాజాగా.. ఆదివారం మృతుడి సోదరి కీర్తి మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ.. తనకున్న ఒకే ఒక్క సోదరుడు శ్రీనివాసులు అని.. అతన్ని పొట్టన పెట్టుకున్నారంటూ కన్నీరుమున్నీరవుతోంది. దీన్ని ఇక్కడితో వదిలేస్తే రేపు ఇంకోటి జరుగుతుందని.. తమకు న్యాయం జరగాల్సిందేనని ఆమె పట్టుబడుతోంది. అంతేకాక.. ‘నా అన్నను నాకు లేకుండా చేశారు. మా అన్నను చంపిన వాళ్లను ప్రాణాలతో వదలం. పవన్ రావాలి.. మాకు న్యాయం చేయాలి. న్యాయం జరిగే వరకూ పోరాటం చేస్తాం. మా అన్నను చంపిన వాళ్లకు కఠినంగా శిక్ష పడాల్సిందే’.. అని చెప్పింది. -
Air India Crash: అర్ధరాత్రి హఠాత్తుగా మేల్కొంటూ... ‘ఏకైక’ ప్రయాణికుని దుస్థితి
అహ్మదాబాద్: విశ్వాస్ కుమార్ రమేష్... జూన్ 12న జరిగిన అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన ఏకైక ప్రయాణికుడు. ఈయన ప్రస్తుతం తీవ్ర గాయాలతో పోరాడుతున్నాడు. ఈ ప్రమాదంలో అతని సోదరుడు అజయ్ సహా 270 మంది మరణించారు. ప్రమాదం జరిగిన కొద్దిసేపటికి బయటకు వచ్చిన ఫుటేజ్లో రమేష్ రక్తంతో తడిసి, అంబులెన్స్ వైపు కుంటుకుంటూ వస్తున్నట్లు కనిపించింది. ప్రమాదం జరిగి, నెల రోజులు గడిచిన దరిమిలా విశ్వాస్ కుమార్ రమేష్ ఎటువంటి పరిస్థితిలో ఉన్నాడు?అహ్మదాబాద్-లండన్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంలో ప్రాణాలతో బయటపడిన విశ్వాస్ కుమార్ రమేష్ ఇప్పటికీ ఆ విషాదాన్ని మరువలేకపోతున్నాడు. ఈ ఘటన రమేష్ను మానసికంగా ఎంతగానో కుంగదీసింది. అతని బంధువు సన్నీ మీడియాతో మాట్లాడుతూ ‘ప్రమాదం నాటి దృశ్యాలు రమేష్ను వెంటాడుతున్నాయి. అతను ఊహించని రీతిలో ప్రమాదం నుంచి తప్పించుకోవడం, అతని సోదరుని మరణం మొదలైన జ్ఞాపకాలు అతనిని వెంటాడుతున్నాయి. విదేశాలలో ఉంటున్న మా బంధువులు.. రమేష్ తాజా పరిస్థితి గురించి ఆరా తీస్తున్నారు. అయితే రమేష్ ఎవరితోనూ మాట్లాడటం లేదు. విమాన ప్రమాదం, అతని సోదరుని మరణం దరిమిలా అతనికి అయిన గాయం ఇంకా మానలేదు. రమేశ్ కొన్నిసార్లు హఠాత్తుగా అర్ధరాత్రి మేల్కొంటున్నాడు. తరువాత నిద్రపోవడం లేదు. చికిత్స కోసం మేము అతనిని రెండు రోజుల క్రితం మానసిక వైద్యనిపుణుని వద్దకు తీసుకెళ్లాం. అతనికి ఇప్పుడే చికిత్స ప్రారంభమైనందున, లండన్ వెళ్లేందుకు ఎటువంటి ప్లాన్ వేసుకోలేదు’ అని తెలిపారు.జూన్ 17న రమేష్ అహ్మదాబాద్ సివిల్ హాస్పిటల్ నుండి డిశ్చార్జ్ అయ్యాడు. ఆయన దూరదర్శన్కు ఇచ్చిన ఇంటర్వ్యూలో, విమానం టేకాఫ్ అయిన కొన్ని సెకన్లలోనే కూలిపోయిందని వివరించాడు. తన సీటు, 11ఏ.. ఎడమ వైపున ఉన్న అత్యవసర తలుపుకు దగ్గరగా ఉందని తెలిపారు. జూన్ 12న గుజరాత్ మాజీ ముఖ్యమంత్రి విజయ్ రూపానీతో సహా 242 మంది ప్రయాణికులు, సిబ్బందితో లండన్కు వెళ్తున్న ఎయిర్ ఇండియా విమానం అహ్మదాబాద్లోని మెడికల్ కాలేజీ కాంప్లెక్స్లోకి కూలిపోయింది. -
ఒక్క మార్కుతో ఓటమి.. అయినా ఆగని కలల ప్రయాణం
ఒక్క మార్కుతోనే కానిస్టేబుల్ ఉద్యోగానికి ఎంపికవలేదని కుంగిపోలేదా యువతి.. చదువు, ఉద్యోగ ప్రయత్నాలతో పాటు.. తండ్రికి సాయంగా మేకలు కాసేందుకు రోజూ అడవిబాట పడుతోంది. పెద్దపల్లి జిల్లా సబ్బితం గ్రామానికి చెందిన నూనె నర్సయ్యకు కొడుకు, కూతురు ఉన్నారు. చదువుల్లో రాణిస్తూనే కూతురు కల్యాణి తండ్రికి సాయంగా మేకలతో ఊరి పొలిమేరల్లోని గుట్టల్లోకి వెళ్తోంది. ఆర్మీ పరీక్షల కోసం సిద్ధమవుతున్నానని, ఈసారి ఉద్యోగం తనదేనని ధీమాగా చెప్పింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, పెద్దపల్లి ట్రాక్టర్పై సీతక్క ప్రయాణం ఏటూరునాగారం: ములుగు జిల్లా ఏటూరునాగారం మండలం ఎలిశెట్టిపల్లి గ్రామానికి సరైన రోడ్డు మార్గం లేదు. రాష్ట్ర ప్రభుత్వం విద్యాశాఖ ద్వారా ఎలిశెట్టిపల్లి గ్రామంలో రూ.15 లక్షలతో ప్రాథమిక పాఠశాల భవనం నిర్మించింది. కానీ ఎలిశెట్టిపల్లి గ్రామానికి రోడ్డు మార్గం లేదు. దీంతో పాఠశాల భవనం ప్రారంభోత్సవానికి.. మంత్రి సీతక్క ట్రాక్టర్పై కూర్చొని జంపన్నవాగు దాటి వెళ్లారు. ఈ వాగుపై వంతెన నిర్మించాలని అక్కడి ప్రజలు మంత్రిని వేడుకున్నారు. వంతెన నిర్మాణానికి తనవంతు కృషి చేస్తానని ఆమె హామీ ఇచ్చారు. -
స్టాక్మార్కెట్లో కొత్త ఇండెక్స్ ప్రారంభం
బీఎస్ఈ అనుబంధ సంస్థ అయిన ఏషియా ఇండెక్స్ తాజాగా బీఎస్ఈ ఇన్సూరెన్స్ పేరిట కొత్త సూచీని ప్రారంభించింది. బీఎస్ఈ 1000 ఇండెక్స్లోని బీమా రంగం కింద వర్గీకరించిన సంస్థలు ఈ సూచీలో ఉంటాయి. దీని బేస్ వేల్యూ 1000గా, తొలి వేల్యూ డేట్ 2018 జూన్ 18గా ఉంటుంది. వార్షికంగా రెండు సార్లు (జూన్, డిసెంబర్) ఈ సూచీలో మార్పులు, చేర్పులు చేస్తారు. ప్యాసివ్ వ్యూహాలను పాటించే ఈటీఎఫ్లు, ఇండెక్స్ ఫండ్లకు ఇది ప్రామాణికంగా ఉంటుంది. ప్రాంతీయ భాషల్లో సీడీఎస్ఎల్ ఐపీఎఫ్ పోర్టల్ పెట్టుబడులపై ఇన్వెస్టర్లలో అవగాహన పెంపొందించేందుకు సీడీఎస్ఎల్ ఇన్వెస్టర్ ప్రొటెక్షన్ ఫండ్ (సీడీఎస్ఎల్ ఐపీఎఫ్) తాజాగా ప్రాంతీయ భాషల్లో ఆన్లైన్ ప్లాట్ఫాంను ప్రా రంభించింది. ఇందులో తెలుగు, హిందీ, తమిళం, పంజాబీ తదితర 12 భాషల్లో కంటెంట్ ఉంటుంది.తొలిసారిగా ఇన్వెస్ట్ చేస్తున్న వారితో పాటు పెట్టుబడులు పెట్టాలనే అలోచనతో ఉన్న పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లోని భావి ఇన్వెస్టర్లకు కూడా ఈ వెబ్సైట్ ఉపయోగకరంగా ఉంటుంది. సీడీఎస్ఎల్ఐపీఎఫ్డాట్కామ్లోని ఈ కంటెంట్ను ఉచితంగా పొందవచ్చని సంస్థ సెక్రటేరియట్ సుధీష్ పిళ్లై తెలిపారు. -
ఈ వారం మీ రాశి ఫలాలు ఎలా ఉన్నాయంటే..
మేషం...మీ అవసరాలకు తగినంతగా డబ్బు అందుకుంటారు. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులతో వివాదాలు తీరి సఖ్యతతో మెలగుతారు. ఆరోగ్యపరమైన చికాకులు కొంత బాధిస్తాయి. దూరపు బంధువుల సూచనలు పాటిస్తారు. ఆస్తి విషయాలలో ఒప్పందాలు. ఒక ఆహ్వానం సంతోషం కలిగిస్తుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగులకు అనుకూల మార్పులు ఉండవచ్చు. పారిశ్రామికవేత్తలకు విదేశీ పర్యటనలు. వారం చివరిలో వృథా ఖర్చులు. మిత్రులతో కలహాలు. తెలుపు, నీలం రంగులు. సుబ్రహ్మణ్యేశ్వరుని పూజించండి.వృషభం...విద్యార్థులకు నూతన అవకాశాలు దక్కుతాయి. ప్రముఖ వ్యక్తులు పరిచయమవుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయులు అన్ని విధాలా సహాయం అందిస్తారు. ఆర్థిక వ్యవహారాలు గతం కంటే మెరుగుపడతాయి. పాతమిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాహనాలు కొనుగోలు చేస్తారు. తీర్థయాత్రలు చేస్తారు. స్థిరాస్తి విషయంలో అగ్రిమెంట్లు చేసుకుంటారు. వ్యాపారాలు విస్తరణలో అవాంతరాలు తొలగుతాయి. ఉద్యోగాలలో మరింత గుర్తింపు రాగలదు. రాజకీయవర్గాలకు శుభవార్తలు అందుతాయి. వారం ప్రారంభంలో వ్యయప్రయాసలు. బంధువిరోధాలు. గులాబీ, ఆకుపచ్చ రంగులు. దక్షిణామూర్తి స్తోత్రాలు పఠించండి.మిథునం...ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. పరిచయాలు మరింతగా పెరుగుతాయి. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. ప్రముఖుల నుంచి కీలక సమాచారం అందుతుంది. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. దూరపు బంధువులను కలుసుకుంటారు. భూవివాదాలు కొలిక్కి వస్తాయి. కొత్త కాంట్రాక్టులు దక్కుతాయి. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. కోర్టు కేసులు కొన్ని పరిష్కారమవుతాయి. విద్యార్థులు, నిరుద్యోగులకు భవిష్యత్తుపై భరోసా ఏర్పడుతుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. కొత్త పెట్టుబడులు అందుతాయి. ఉద్యోగాలలో చిక్కులు తొలగుతాయి. కళారంగం వారికి ఆకస్మిక విదేశీ పర్యటనలు. వారం ప్రారంభంలో ధనవ్యయం. కుటుంబంలో చికాకులు. ఎరుపు, నేరేడు రంగులు. రాఘవేంద్రస్తుతి మంచిది.కర్కాటకం...ఆర్థిక లావాదేవీలు ఆశాజనకంగా ఉండి రుణాలు కూడా తీరుస్తాయి. ప్రముఖుల నుంచి ఆహ్వానాలు అందుతాయి. ఆస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. చిరకాల ప్రత్యర్థులు మిత్రులుగా మారతారు. పాతజ్ఞాపకాలు గుర్తుకు వస్తాయి. సభలు,సమావేశాలలో పాల్గొంటారు. ముఖ్యమైన పనులు విజయవంతంగా సాగుతాయి. సంగీత, సాహిత్య విషయాలపై ఆసక్తి చూపుతారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. వ్యాపారాలు అనుకున్నంతగా లాభిస్తాయి. ఉద్యోగాలలో ఒడిదుడుకుల నుంచి బయటపడతారు. పారిశ్రామికవర్గాల వారికి మరింత ఉత్సాహవంతంగా ఉంటుంది. వారం మధ్యలో అనారోగ్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.సింహం....అనుకున్న మేరకు డబ్బు చేతికందుతుంది. ముఖ్యమైన పనుల్లో విజయం సాధిస్తారు. శ్రమ పెరిగినా ఫలితం కనిపిస్తుంది. దూరప్రాంతాల నుంచి శుభవార్తలు. స్థిరాస్తి వివాదాలు పరిష్కారదశకు చేరతాయి. మీ ప్రతిపాదనలు కుటుంబసభ్యులు అంగీకరిస్తారు. విద్య, ఉద్యోగావకాశాలు దక్కించుకుంటారు. గృహ నిర్మాణయత్నాలు కలసివస్తాయి. తీర్థయాత్రలు చేస్తారు. వ్యాపారాలు ఉత్సాహవంతంగా సాగుతాయి. ఉద్యోగాలలో అనుకూల మార్పులు తథ్యం. పారిశ్రామికవర్గాలకు కొత్త లైసెన్సులు లభిస్తాయి. వారం చివరిలో ధనవ్యయం. అనారోగ్యం. ఎరుపు, లేత ఆకుపచ్చ రంగులు. గణేశాష్టకం పఠించండి.కన్య....వ్యూహాత్మక వైఖరితో అనుకున్న విజయాలు సాధిస్తారు. పరపతి పెరుగుతుంది. ఆశ్చర్యకరమైన విషయాలు తెలుస్తాయి. చిన్ననాటి మిత్రులను కలుసుకుంటారు. వాహనాలు, భూములు కొనుగోలు చేస్తారు. విద్యార్థులకు విద్యావకాశాలు దక్కుతాయి. కోర్టు వ్యవహారం ఒకటి అనుకూలిస్తుంది. ఆర్థిక లావాదేవీలు సంతృప్తినిస్తాయి. సభలు, సమావేశాలలో పాల్గొంటారు. చాకచక్యంతో కొన్ని సమస్యలు పరిష్కరించుకుంటారు. వ్యాపారాలలో అభివృద్ధి కనిపిస్తుంది. ఉద్యోగాలలో అనుకున్న లక్ష్యాలు సాధిస్తారు. కళారంగం వారికి కొత్త అవకాశాలు. వారం ప్రారంభంలో ఆరోగ్యభంగం. శ్రమా«ధిక్యం. బంధువిరోధాలు. నీలం, నేరేడు రంగులు. నృసింహస్తోత్రాలు పఠించండి.తుల....కొత్త పనులు చేపట్టి సకాలంలో పూర్తి చేస్తారు. ఆత్మీయుల నుంచి శుభవార్తలు అందుతాయి. స్థిరాస్తి వివాదాలు పరిష్కారమవుతాయి. ఆస్తి వివాదాల నుంచి గట్టెక్కుతారు. ఆలోచనలు కార్యరూపం దాలుస్తాయి. భూములు, వాహనాలు కొనుగోలు చేస్తారు. ప్రముఖులు పరిచయమవుతారు. చిన్ననాటి సంఘటనలు గుర్తుకు తెచ్చుకుంటారు. నిరుద్యోగులకు ఇంటర్వ్యూలు అందుతాయి. వ్యాపారాలు సజావుగా సాగుతాయి. ఉద్యోగాలలో ఇబ్బందులు, చికాకులు తొలగుతాయి. పారిశ్రామికవర్గాలకు ఊహించని విదేశీ పర్యటనలు ఉంటాయి. వారం మధ్యలో ధనవ్యయం. అనారోగ్యం. గులాబీ, నేరేడు రంగులు. శివాష్టకం పఠించండి.వృశ్చికం...చేపట్టిన కార్యక్రమాలు సకాలంలో పూర్తి చేస్తారు. బంధువులతో వివాదాలు తీరతాయి. ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది. ప్రతి విషయంలోనూ సన్నిహితుల సాయం అందుతుంది. భూములు, వాహనాలు కొంటారు. ఇంటిలో శుభకార్యాలపై చర్చలు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. పలుకుబడి మరింత పెరుగుతుంది. వ్యాపారాలు ఉత్సాహంగా సాగుతాయి. ఉద్యోగులకు ఒక ముఖ్య సమాచారం అందుతుంది. రాజకీయవేత్తలకు కొత్త పదవులు దక్కే అవకాశం. వారం మధ్యలో అనారోగ్యం. కుటుంబంలో సమస్యలు. పసుపు, లేత గులాబీ రంగులు. హనుమాన్ ఛాలీసా పఠించండి.ధనుస్సు...రాబడి కొంత తగ్గి రుణాలు చేస్తారు. ఆలోచనలు స్థిరంగా ఉండవు. కుటుంబసభ్యులతో తగాదాలు ఏర్పడతాయి. పనుల్లో ప్రతిబంధకాలు. మీపై ఆధిపత్యానికి ప్రత్యర్థులు యత్నిస్తారు. పుణ్యక్షేత్రాలు సందర్శిస్తారు. ఇంతకాలం పడిన శ్రమ ఫలించదు. ఆస్తి వివాదాలు, కోర్టు కేసులు ఇబ్బంది కలిగిస్తాయి. వ్యాపారాలు మందకొడిగా సాగుతాయి. ఉద్యోగులకు మార్పులు అనివార్యం. పారిశ్రామికవేత్తలకు నిరాశాజనకంగా ఉంటుంది. వారం చివరిలో కుటుంబంలో చికాకులు. అనారోగ్యం. గులాబీ, లేత ఎరుపు రంగులు. విష్ణుసహస్రనామ పారాయణ చేయండి.మకరం...ఆర్థిక లావాదేవీలు ఉత్సాహంగా సాగుతాయి. అనుకున్న పనులు విజయవంతంగా సాగుతాయి. బంధువులు, ఆప్తుల నుంచి శుభవార్తలు వింటారు. ఉద్యోగ యత్నాలు ముమ్మరం చేస్తారు. ఒక సమాచారం ప్రభావితం చేస్తుంది. దీర్ఘకాలిక సమస్య నుంచి బయటపడతారు. అనుకున్న ఆశయాలు సాధిస్తారు. బంధువులను కలుసుకుంటారు. వ్యాపారాలు పుంజుకుంటాయి. లాభాలు అందుతాయి. ఉద్యోగులకు ఇంక్రిమెంట్లు రాగల సూచనలు. కళాకారులకు నూతనోత్సాహం.వారం ప్రారంభంలో ధనవ్యయం. మానసిక అశాంతి. ఆకుపచ్చ, నేరేడు రంగులు. ఆదిత్య హృదయం పఠించండి.కుంభం...ఇంతకాలం పడిన శ్రమ అనుకూలిస్తుంది. ముఖ్యమైన కార్యక్రమాలు విజయవంతంగా పూర్తి చేస్తారు. సంఘంలో విశేష గౌరవం పొందుతారు. ముఖ్యుల నుంచి ఒక కీలక సమాచారం అందుతుంది. విద్యార్థులకు ఆశించిన ఫలితాలు దక్కుతాయి. వాహనాలు, గృహం కొనుగోలు చేస్తారు. వ్యాపారులకు లాభాలు దక్కుతాయి. ఉద్యోగులకు పైస్థాయి నుంచి ప్రశంసలు. కళాకారులకు అవార్డులు, సన్మానాలు. వారం మధ్యలో ఆస్తి వివాదాలు. వృథా ఖర్చులు. ఆకుపచ్చ, లేత ఎరుపు రంగులు. గణేశ్ స్తోత్రాలు పఠించండి.మీనం...బంధువుల నుంచి శుభవార్తలు. రాబడి ఆశాజనకంగా ఉంటుంది. పనులు సజావుగా సాగుతాయి. పలుకుబడి కలిగిన వారితో పరిచయాలు. చిన్ననాటి మిత్రులను కలుసుకుని ఉత్సాహంగా గడుపుతారు. వాక్చాతుర్యంతో అందర్నీ ఆకట్టుకుంటారు. మీ నిర్ణయాలు ధైర్యంగా వెల్లడిస్తారు. విద్యార్థులకు నూతన విద్యావకాశాలు. ఇంటి నిర్మాణాలు చేపట్టే వీలుంది. వ్యాపారాలు విస్తరిస్తారు. ఉద్యోగాలలో అనుకూల మార్పులు ఉంటాయి. కళాకారులకు ప్రభుత్వం నుంచి ఆహ్వానాల అందుతాయి. వారం చివరిలో అనుకోని ఖర్చులు. కుటుంబంలో చికాకులు. నీలం, పసుపు రంగులు. శివపంచాక్షరి పఠించండి. -
కొత్త ఇన్సూరెన్స్ ప్లాన్.. 100 ఏళ్ల వరకూ బీమా రక్షణ
బంధన్ లైఫ్ ఇన్సూరెన్స్ కంపెనీ వినూత్నమైన బీమా ప్లాన్ను ప్రవేశపెట్టింది. ఇందులో 100 ఏళ్ల వయసు వరకు జీవిత బీమాను తీసుకోవచ్చు. పాలసీ కాలవ్యవధిలోపు పాలసీదారు మరణించినట్టయితే వారసులకు ఏక మొత్తం బీమా పరిహారాన్ని చెల్లిస్తుంది. అంతేకాదు అక్కడినుంచి క్రమం తప్పకుండా ఆదాయాన్ని చెల్లిస్తుంటుంది. గడువు తీరిన మెచ్యూరిటీ ప్రయోజనాలు కూడా లభిస్తాయి.కనీసం మూడు నెలల వయసు నుంచే ఈ పాలసీ తీసుకోవచ్చు. ఇలా తల్లిదండ్రులు, సంరక్షకులు చిన్న వయసు నుండే తమ పిల్లల కోసం ఆర్థిక రక్షణ కల్పించేందుకు వీలుంటుంది. విద్య, వివాహం లేదా ఇల్లు కొనుగోలు వంటి అవసరాలకు ఈ పాలసీ సహాయపడుతుంది. ఈ ఇన్సూరెన్స్ ప్లాన్ అనువైన చెల్లింపు ఎంపికలతోపాటు మహిళా పాలసీదారులకు అదనపు రాబడిని కూడా అందిస్తుంది.స్వల్ప, దీర్ఘకాలిక ఆర్థిక అవసరాలను తీర్చేలా ఈ ప్లాన్ను రూపొందించారు. కస్టమర్లు తమకు సౌకర్యవంతమైన ఆదాయ చెల్లింపు ఎంపికలను ఎంచుకోవచ్చు లేదా తరువాతి దశలో ఆదాయాన్ని కూడబెట్టి ఉపసంహరించుకోవచ్చు. రోజువారీ ఖర్చులను నిర్వహించడం, అత్యవసర నిధిని నిర్మించడం లేదా భవిష్యత్తు లక్ష్యాల కోసం పొదుపు చేయడం, ప్రణాళిక వ్యక్తిగత అవసరాలకు అనుగుణంగా ఉంటుంది.