breaking news
-
ఆరాధ్య బచ్చన్ కేసు: ‘ఇంటి పేరు ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా’
ఆన్లైన్లో తనపై తప్పుడు వార్తలు, అసత్య ప్రచారం జరుగుతోందంటూ బాలీవుడ్ నటి ఐశ్వర్యరాయ్ కుమార్తె ఆరాధ్య బచ్చన్ దాఖలు చేసిన పిటిషన్పై ఢిల్లీ హైకోర్టు కీలక వ్యాఖ్యలు చేసింది. ఒక ప్రముఖ కుటుంబానికి చెందిన ఇంటి పేరు ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? ఆ ప్రతిష్ఠ తరతరాలకు సంక్రమిస్తుందా? అనే అంశాలపై న్యాయస్థానం ప్రశ్నలు లేవనెత్తింది.2023లో ఆరాధ్య బచ్చన్, తన తండ్రి అభిషేక్ బచ్చన్తో కలిసి ఢిల్లీ హైకోర్టును ఆశ్రయించారు. తన ఆరోగ్యంపై యూట్యూబ్లో తప్పుడు వీడియోలు ప్రచారం చేస్తున్నారని ఆమె పిటిషన్లో పేర్కొన్నారు. కొన్ని వీడియోల్లో తీవ్ర అనారోగ్యంతో ఆస్పత్రిలో చేరిందని, మరికొన్నింటిలో ఆరాధ్య మరణించిందని కూడా ప్రచారం చేసినట్లు ఆరోపించారు.ఈ కేసును విచారిస్తున్న జస్టిస్ అనూప్ జైరామ్ భంభానీ.. ఒక వ్యక్తి తన ప్రతిభ, కృషి, విజయాల ద్వారా సంపాదించుకున్న పేరు, ప్రతిష్ఠను ట్రేడ్మార్క్తో పోల్చవచ్చా? అలాంటప్పుడు ఆ పేరు ప్రతిష్ఠ తదుపరి తరాలకు బదిలీ అవుతుందా? అనే ప్రశ్నను అడిగారు.తప్పుడు ప్రచారం చేశారంటూ..ఆరాధ్య తరఫున వాదించిన న్యాయవాది ప్రవీణ్ ఆనంద్ మాట్లాడుతూ.. ఈ వివాదం కేవలం ఆరాధ్య వ్యక్తిగత ప్రతిష్ఠకు మాత్రమే సంబంధించినది కాదన్నారు. బచ్చన్ కుటుంబానికి చెందిన పేరు, ఫొటోలను ఉపయోగించి ఆమెకు క్యాన్సర్ వచ్చిందని, ఆమె మరణించిందని తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు.ఈ కేసులో మూడు ప్రధాన అంశాలను పరిశీలించాలని హైకోర్టు నిర్ణయించింది. కుటుంబ పేరుకు సంబంధించిన ప్రతిష్ఠ తరతరాలకు వర్తిస్తుందా? తప్పుడు వార్తలు హక్కుల ఉల్లంఘనగా పరిగణించవచ్చా? పరువునష్టం మేధో సంపత్తి హక్కుల పరిధిలోకి వస్తుందా? అనే అంశాలపై విచారణ చేపట్టనుంది. -
ప్రాణహాని ఉంది.. రక్షణ కల్పించండి
మదనపల్లె టౌన్ : తాము ఇద్దరము ప్రేమించి పెళ్లి చేసుకున్నాం. దగ్గరి బంధువులు అయినప్పటికీ, తమ ప్రేమను పెద్దలు అంగీకరించలేదు. దీంతో ఇంటి నుంచి పారిపోయి ప్రేమ పెళ్లి చేసుకున్నాం. తాము పెళ్లి చేసుకోవడం జీర్ణించుకోలేక ఆరు నెలల కూడా తిరగకనే హత మారుస్తామని వార్నింగ్లు ఇస్తున్నట్లు ఓ ప్రేమ జంట బుధవారం మదనపల్లె జిల్లా ఎస్పీ కార్యాలయానికి వచ్చి ఎస్పీని రక్షణ కొరింది. వివరాలు.. అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లె నియోజకవర్గం లోని పీటీఎం మండలం, కాట్నగల్లు కు చెందిన వెంకటరమణ కుమార్తె పి ఐశ్వర్య (19) అదే ఊరికి చెందిన మురళిని ఇటీవల ప్రేమ వివాహం చేసుకుంది. అయితే ఇష్టం లేని పెళ్లి చేసుకున్నారని తమ తల్లిదండ్రులు వెంకటరమణ, విజయమ్మ, సంధ్యలు తాము ఎక్కడికి వెళ్లి వస్తున్నా వెంటాడుతూ చంపడానికి ప్రయత్నిస్తున్నారు కన్నీటిపర్వంతమయ్యారు. తమకు ప్రాణ రక్షణ కల్పించాలని జిల్లా ఎస్పీని ఆశ్రయించి న్యాయం కోసం అభ్యర్థించారు. జిల్లా ఎస్పీ స్పందించి పేటీఎం పోలీసులకు సమాచారం ఇచ్చారు అయితే అప్పటికే పీటీఎంలో పంచాయతీలు కూడా జరిగాయని, పోలీసుల ను కూడా తమ పెద్దలు ఎదురిస్తున్నారని, ఎస్పీ జోక్యం చేసుకుని న్యాయం చేయాలని కోరారు. -
ఇదేం బ్యాటింగ్.. ముసలోళ్ల జట్టు: ఆసీస్పై పాంటింగ్ ఫైర్
బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఆస్ట్రేలియా ఆట తీరుపై ఆ జట్టు మాజీ కెప్టెన్ రిక్కీ పాంటింగ్ ఆగ్రహం వ్యక్తం చేశాడు. చెత్త బ్యాటింగ్తో తొలిరోజే ప్రత్యర్థి ముందు తలవంచారని మండిపడ్డాడు. కాగా దాదాపు 23 ఏళ్ల తర్వాత ఆసీస్ గడ్డపై టెస్టు మ్యాచ్ ఆడుతున్న బంగ్లాదేశ్ అనూహ్య ప్రదర్శనతో చెలరేగింది. డార్విన్లోని మరారా స్టేడియంలో బలహీన ప్రత్యర్థిపై బరిలోకి దిగిన కంగారూ బ్యాటింగ్ ఆర్డర్ కుప్పకూలింది.బంగ్లాదేశ్ పేస్ బౌలర్లు చెలరేగడంతో తొలి టెస్టు మొదటి ఇన్నింగ్స్లో ఆసీస్ 53 ఓవర్లలో కేవలం 198 పరుగులకే ఆలౌటైంది. ఒంటరి పోరాటం చేసిన స్టీవ్ స్మిత్ (109 బంతుల్లో 71; 7 ఫోర్లు, 1 సిక్స్) అర్ధ సెంచరీ సాధించగా, మిగతా బ్యాటర్లంతా విఫలమయ్యారు. బంగ్లా పేసర్ హసన్ మహమూద్ (6/55) ఆరు వికెట్లతో కంగారూలను పడగొట్టగా... మరో ఇద్దరు పేసర్లు ఇబాదత్ హుసేన్, తస్కీన్ అహ్మద్ చెరో 2 వికెట్లు తీశారు.ఇదేం బ్యాటింగ్?ఈ నేపథ్యంలో రిక్కీ పాంటింగ్ ఆస్ట్రేలియా బ్యాటర్లను విమర్శించాడు. ‘‘తొలి సెషన్లో పిచ్ కాస్త భిన్నంగా ఉందని ఒప్పుకొంటాను. అయినా సరే ఆసీస్ బ్యాటర్లు స్థాయికి తగ్గట్లు ఆడలేదు. ముఖ్యంగా టాపార్డర్ బ్యాటర్లు టెక్నికల్గా ఎన్నో తప్పులు చేశారు.ఇందుకు వారికి క్షమాపణే లేదు. ఏదేమైనా ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకోవడం నన్ను ఆశ్చర్యపరిచింది. వార్మప్ మ్యాచ్లో బంగ్లాదేశ్పై 54 పరుగుల తేడాతో గట్టెక్కిన తర్వాత కూడా ఇలాంటి నిర్ణయం ఎందుకు తీసుకున్నారో అర్థం కాలేదు.ముందుగా ఆసీస్ బౌలింగ్ చేస్తే పరిస్థితి వేరుగా ఉండేది’’ అని రిక్కీ పాంటింగ్ విమర్శించాడు.ముసలోళ్ల జట్టుఅదే విధంగా.. ఆసీస్ ప్రస్తుత జట్టుపై స్పందిస్తూ.. ‘‘నాకు తెలిసి 1928 తర్వాత బంగ్లాదేశ్తో తొలి టెస్టులో ఆడిన జట్టే అత్యధిక మంది ‘వృద్ధుల’తో నిండిన జట్టు అనుకుంటా. కామెరాన్ గ్రీన్ (27 ఏళ్లు) తప్ప మిగిలిన వారంతా 30 ఏళ్లు పైబడిన వారే. జట్టు పునర్నిర్మాణంలో భాగంగా కఠిన నిర్ణయాలు తీసుకోకతప్పదు. షెఫీల్డ్ షీల్డ్ టోర్నీలో యువ బ్యాటర్లు అద్భుతంగా ఆడుతున్నారు. అయినా సరే వారికి అవకాశాలు ఇవ్వడం లేదు’’ అని పాంటింగ్ సెలక్టర్ల తీరును తప్పుబట్టాడు.తేలిపోయిన బ్యాటర్లుకాగా గురువారం నాటి తొలిరోజు ఆటలో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న తర్వాత ఆసీస్ బ్యాటర్లు పూర్తిగా తడబడ్డారు. పరిస్థితులు సీమ్ బౌలింగ్కు అనుకూలంగా ఉండటంతో పాటు దాదాపు ఎనిమిది నెలల తర్వాత టెస్టు ఆడుతున్న జట్టులో ఆ ప్రభావం కనిపించింది. తొలి సెషన్లోనే వెదరాల్డ్ (23), హెడ్ (22), లబుషేన్ (1), గ్రీన్ (13) వెనుదిరిగారు. లంచ్ తర్వాత స్మిత్, కేరీ (19) ఐదో వికెట్కు 55 పరుగులు జోడించి జట్టును ఆదుకునే ప్రయత్నం చేశారు.అయితే తక్కువ వ్యవధిలో కేరీతో పాటు వెబ్స్టర్ (12), కమిన్స్ (9), స్టార్క్ (1) అవుటయ్యారు. మరో ఎండ్లో 76 బంతుల్లో హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్న స్మిత్ ఆ తర్వాత వేగంగా ఆడే ప్రయత్నంలో 9వ వికెట్గా పెవిలియన్ చేరగా, కొద్ది సేపటికే లయన్ (7) అవుట్తో ఇన్నింగ్స్ ముగిసింది. బంగ్లాదేశ్ టెస్టు క్రికెట్ చరిత్రలో ఒక ఇన్నింగ్స్లో పేసర్లే 10 వికెట్లు తీయడం ఇది రెండోసారి మాత్రమే.ఆధిక్యంలో బంగ్లాదేశ్ఇదిలా ఉంటే.. తొలిరోజు వికెట్ నష్టానికి 96 పరుగులు చేసిన బంగ్లాదేశ్.. రెండోరోజూ జోరు కొనసాగించింది. శుక్రవారం నాటి రెండో రోజు పూర్తయ్యేసరికి 110 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 351 పరుగులు చేసింది. తద్వారా తొలి ఇన్నింగ్స్లో ఆసీస్ కంటే 153 పరుగుల ఆధిక్యంలో నిలిచింది. చదవండి: ముందు బయటకు నడువ్: స్టార్క్ ఆగ్రహం -
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్!
మళ్లీ మీకు ఇబ్బంది లేకుండా ఇంటి ముందే ఆఫీసు తెరిచార్సార్! -
కార్మికశాఖ దగ్గరకు ఐటీ ఉద్యోగులు.. స్పందించిన విప్రో
ప్రముఖ ఐటీ సంస్థ విప్రోలో ఉద్యోగాల కోసం ఎంపికైన 200 మందికి పైగా విద్యార్థులు, యువ ఇంజనీర్ల ఆన్బోర్డింగ్ ఆలస్యంపై వివాదం ముదిరింది. ‘ఎలైట్ హైరింగ్ 2025’ కార్యక్రమం కింద ఎంపికైన అభ్యర్థులను నెలల తరబడి వేచి ఉండేలా చేస్తున్నారంటూ ఐటీ ఉద్యోగుల సంఘం నాసెంట్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎంప్లాయీస్ సెనేట్ (NITES) కేంద్ర కార్మిక, ఉపాధి మంత్రిత్వ శాఖను ఆశ్రయించింది. ఆగస్టు 13న కార్మిక శాఖ మంత్రి మన్సుఖ్ మాండవీయకు లేఖ రాసిన నైట్స్.. ఈ వ్యవహారంలో తక్షణ జోక్యం చేసుకోవాలని కోరింది.ఆఫర్ లెటర్ ఇచ్చినా.. జాయినింగ్ డేట్ లేదునైట్స్ వివరాల ప్రకారం.. బాధిత అభ్యర్థులు ఫిబ్రవరి 2025లో విప్రో క్యాంపస్ రిక్రూట్మెంట్ ప్రక్రియలో పాల్గొని టెక్నికల్, వాయిస్ అసెస్మెంట్లను పూర్తి చేశారు. ఇంటర్వ్యూ ప్రక్రియ అనంతరం 2025 జూలైలో ఆఫర్ లెటర్లు, ఆగస్టులో లెటర్స్ ఆఫ్ ఇంటెంట్ (LOI) అందుకున్నారు. నిర్ణీత గడువులోనే వాటిని అంగీకరించారు. అయితే ఆ తర్వాత వారి నియామక ప్రక్రియ ముందుకు సాగలేదని సంఘం ఆరోపించింది.డిసెంబర్ 2025లో అభ్యర్థులు మరోసారి విప్రో నిర్వహించిన సర్వే ద్వారా కంపెనీలో చేరేందుకు తమ ఆసక్తిని ధ్రువీకరించారు. అనంతరం మార్చి 2026లో కోడిలిటీ టెక్నికల్ అసెస్మెంట్ నిర్వహించగా, అందులోనూ ఉత్తీర్ణులయ్యారు. మార్చి 24న క్లియరెన్స్ సమాచారం అందిందని నైట్స్ పేర్కొంది. మార్చి 25న బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ లింక్ అందగా, మార్చి 26న అభ్యర్థులు ఆ ప్రక్రియను పూర్తి చేశారు. చిరునామా ధ్రువీకరణకు సంబంధించిన ప్రశ్నను కూడా అదే రోజు పరిష్కరించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. విప్రో పోర్టల్లో బ్యాక్గ్రౌండ్ వెరిఫికేషన్ 100 శాతం పూర్తయి, ‘No Action Required’గా కనిపించిందని సంఘం తెలిపింది.అన్ని నియామక దశలను పూర్తి చేసినప్పటికీ ఇప్పటివరకు నిర్దిష్ట జాయినింగ్ తేదీ ఇవ్వలేదని నైట్స్ ఆరోపించింది. బాధితులు విప్రో హెచ్ఆర్, ఆన్బోర్డింగ్ హెల్ప్డెస్క్లతో పాటు ఇతర అధికారిక మార్గాల ద్వారా పలుమార్లు సంప్రదించినా స్పష్టమైన సమాధానం రాలేదని పేర్కొంది. విద్యాసంస్థలు, ట్రైనింగ్ అండ్ ప్లేస్మెంట్ అధికారులు కూడా విప్రో క్యాంపస్ సంబంధిత సిబ్బందిని సంప్రదించినా సమస్య పరిష్కారం కాలేదని తెలిపింది.ఉద్యోగం వస్తుందనే ఆశతో కొందరు ఇతర అవకాశాలను వదులుకున్నారని, దీంతో విద్యా ఖర్చులు, వసతి, రోజువారీ అవసరాలు, కుటుంబ బాధ్యతల విషయంలో ఆర్థిక ఒత్తిడిని ఎదుర్కొంటున్నారని నైట్స్ పేర్కొంది. దీర్ఘకాలంగా స్పష్టత లేకపోవడం అభ్యర్థుల్లో మానసిక ఆందోళనకు కూడా కారణమవుతోందని తెలిపింది.కార్మిక శాఖను ఏం కోరిందంటే..విప్రోతో ఈ అంశాన్ని చర్చించి బాధిత అభ్యర్థులందరి ప్రస్తుత స్థితిని స్పష్టం చేయాలని నైట్స్ కార్మిక శాఖను కోరింది. ఆఫర్ లెటర్లు, LOIలు ఇప్పటికీ చెల్లుబాటులో ఉన్నాయా? ఆలస్యానికి అసలు కారణం ఏమిటి? ఆన్బోర్డింగ్ ఎప్పటిలోగా పూర్తవుతుంది? అనే అంశాలపై కంపెనీ నుంచి స్పష్టమైన సమాధానం తీసుకురావాలని విజ్ఞప్తి చేసింది. ఇక కొందరి అభ్యర్థిత్వాలను ముందుకు తీసుకెళ్లకూడదని కంపెనీ నిర్ణయిస్తే, వారిని నిరవధికంగా ఎదురుచూడనివ్వకుండా నిర్ణయం, కారణాలను లిఖితపూర్వకంగా తెలియజేయాలని కూడా కోరింది.విప్రో స్పందన ఇదీ..మరోవైపు, ఫ్రెషర్లను ఆన్బోర్డ్ చేయడానికి తాము కట్టుబడి ఉన్నామని విప్రో స్పష్టం చేసింది. కంపెనీ వ్యాపార అవసరాలకు అనుగుణంగా నియామక ప్రక్రియ కొనసాగుతుందని, తదుపరి అప్డేట్లను అభ్యర్థులకు తెలియజేస్తామని తెలిపింది. అయితే, ఈ వివాదంపై విప్రో నుంచి వచ్చిన ఈ స్పందనలో నిర్దిష్ట జాయినింగ్ తేదీ లేదా 200 మందికి పైగా అభ్యర్థుల కోసం టైమ్లైన్ వెల్లడించలేదు. -
సైలెంట్గా ఓటీటీలోకి వచ్చిన తెలుగు థ్రిల్లర్ సినిమా
ఓటీటీలోకి ఎప్పటికప్పుడు కొత్త సినిమాలు వస్తూనే ఉంటాయి. ఈ వారం అలా హార్టిన్, మిస్టర్ వర్క్ ఫ్రమ్ హోమ్, ఫారెస్ట్ గార్డ్ లాంటి తెలుగు మూవీస్తో పాటు.. కాక్ టెయిల్ 2, కాటలన్, భారత భాగ్య విధాత, ఆరూపి లాంటి వేరే భాషల చిత్రాలు స్ట్రీమింగ్లోకి వచ్చేశాయి. వీటితో పాటు ఓ తెలుగు సైకలాజికల్ థ్రిల్లర్ సినిమా ఎలాంటి ప్రకటన లేకుండా ఓటీటీలోకి వచ్చేసింది. ఇంతకీ దీని సంగతేంటి? ఎందులో చూడొచ్చు?(ఇదీ చదవండి: 'అగధ' మూవీ రివ్యూ)జగపతిబాబు, లయ, హృతిక శ్రీనివాస్ ప్రధాన పాత్రలు చేసిన సినిమా 'వదలా'. ఆల్రెడీ పెళ్లి చేసుకున్న ఓ మగాడిపై అతి వ్యామోహం అనే కాన్సెప్ట్తో దీనిని తీశారు. గత నెల 17న థియేటర్లలో రిలీజైంది. ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయింది. ఇప్పుడిది సడన్గా అమెజాన్ ప్రైమ్ ఓటీటీలో అందుబాటులోకి వచ్చింది.'వదలా' విషయానికొస్తే.. యోగి సిద్ధార్థ్ (జగపతిబాబు) ఓ డాక్టర్. భార్య ప్రియ (లయ). తన ఇద్దరు పిల్లలతో సంతోషంగా బతుకుతుంటాడు. 20 ఏళ్లుగా ఎలాంటి గొడవలు లేకుండా అన్యోన్యంగా సాగిపోతున్న వీళ్ల దాంపత్య జీవితంలోకి అముద (హృతిక శ్రీనివాస్) అనే యువతి వస్తుంది. ఓ రోడ్డు ప్రమాదంలో గాయపడిన ఈమెని సిద్ధార్థ్ చికిత్స చేసి కాపాడతాడు. అలా ఇతడిపై ఆరాధాన భావంతో ఆ కుటుంబానికి దగ్గరైన ఆమె.. తర్వాత సిద్ధార్థ్ని ఎలాగైనా తన సొంతం చేసుకోవాలని నిర్ణయించుకుంటుంది.ఈ క్రమంలోనే భార్యాభర్తల కాపురంలో చిచ్చుపెట్టేందుకు ఓ ప్లాన్ వేస్తుంది. గుర్తు తెలియని నంబర్ల నుంచి సిద్ధార్థ్.. అతని భార్యకి ఫోన్లు, సందేశాలు పంపుతూ సైకోలా వేధించడం మొదలు పెడుతుంది. మరి ఆ తర్వాత ఏమైంది? అసలు అముద ఎవరు? ఆమె కథేంటి? ఈ సైకో యువతి నుంచి తన కుటుంబాన్ని సిద్ధార్థ్ ఎలా కాపాడుకున్నాడు? అనేది మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: ఓటీటీలోకి రోజా రీఎంట్రీ సినిమా) -
12 సీట్లతో మొదలై రెండేళ్లలోనే రూ. 350 కోట్ల బిజినెస్
ఒక సాదాసీదా దోశ వ్యాపారాన్ని కోట్ల రూపాయల స్థాయికి చేర్చడం అంటే సామాన్యమైన విషయం కాదు. ఫుడ్ బిజినెస్లో కోట్ల రూపాయలు సంపాదించాలంటే కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టాల్సిన అవసరం లేదు. వడ్డించే వంటకాన్ని సరిగ్గా, పరిశుభ్రంగా అందిస్తే వ్యాపారం విజయవంతం కావచ్చని ముంబైలోని బెన్నె దోస రెస్టారెంట్ నిరూపించిందని పారిశ్రామికవేత్త హర్ష గోయెంకా అంటున్నారు. బెన్నె దోశ లేదా వెన్న దోశ విజయ రహస్యాన్ని విశ్లేషిస్తూ దాని సక్సెస్ స్టోరీని సోషల్ మీడియాలో షేర్ చేయడంతో ఇది నెటిజనులను బాగా ఆకట్టుకుంటోంది.ముంబైలోని బాంద్రాలో కేవలం 12 సీట్ల సామర్థ్యంతో ప్రారంభమైన ‘బెన్నె’ (Benne) దోశ కేఫ్, ప్రస్తుతం రూ. 350 కోట్ల విలువైన బ్రాండ్గా ఎదిగి సరికొత్త రికార్డు సృష్టించింది. ఇదే ప్రముఖ పారిశ్రామికవేత్త హర్ష్ గోయెంకాను ఆకర్షించింది. ప్రముఖ దోశల చైన్ అయిన 'బెన్నె' ఇంత భారీ విజయం సాధించడానికి కారణమని తాను నమ్మే విషయాలను గోయెంకా విశ్లేషించారు. ఒక నిర్దిష్టమైన మెనూ, తెలివైన నిర్వహణ, అందుబాటు ధరలు, అన్నింటికన్నా ముఖ్యంగా, ఆ బ్రాండ్ చుట్టూ అల్లుకున్న ఎమోషన్ లాంటి అంశాలను ఆయన పేర్కొన్నారు.దావణగెరె-శైలి బెన్నె (వెన్న) దోశ స్పెషల్ : చాలా మందికి అలవాటైన పెద్ద, పలుచని, కరకరలాడే దోశలలా కాకుండా, ఈ కర్ణాటక స్టైల్ దోశ విభిన్నంగా ఉంటుంది. చిన్నగా, లోపల మెత్తగా ఉండి, వెన్నతో నిండుగా ఉంటుంది. ఈ విలక్షణమైన శైలే బెన్నెకు ఒక ప్రత్యేక గుర్తింపును ఇచ్చింది.Why has ‘Benne’ succeeded so spectacularly?- One hero product: Davangere-style butter dosa- Small menu, easy to perfect and replicate- Electronic self order + self service creates engagement - Affordable enough to become a habit- Long queues created social media buzz-… pic.twitter.com/VcpMCEX2lB— Harsh Goenka (@hvgoenka) August 9, 2026 అఖిల్ అయ్యర్, శ్రియా నారాయణ్ అనే భార్యాభర్తలు ప్రారంభించిన ఈ స్టార్టప్, దేశంలోని ప్రముఖ క్విక్ సర్వీస్ రెస్టారెంట్ (QSR) బ్రాండ్లకు గట్టి పోటీనిస్తోంది. ముంబైలో అథెంటిక్ కర్ణాటక/బెంగళూరు శైలి దావణగెరె బెన్నె దోశ దొరకకపోవడంతో, ఈ రుచిని అందరికీ అందించాలనే ఆశయంతో ఈ జంట స్వయంగా కేఫ్ పెట్టాలనుకున్నారు. 2024 లో ముంబైలోని బాంద్రాలో కేవలం 12 మంది కూర్చునే చిన్న అవుట్లెట్తో ప్రయాణం మొదలైంది. సాంప్రదాయ దక్షిణ భారత శైలి హోటల్ అయిన దానికి వారు 'బటర్' అని పేరు పెట్టారు.ఇదీ చదవండి: 10 ఏళ్లకు స్లైల్ మార్చిన ఇన్స్టా, నెటిజన్ల స్పందన వైరల్ దీని విజయానికి గల ప్రధాన కారణాలలో ఒకటి, వారు దావణగెరె శైలి వెన్న దోశను తమ కాన్సెప్ట్గా చేసుకోవడమే అంటారు హర్ష గోయెంకా. సాధారణ రెస్టారెంట్లలా వంద రకాల మెనూ కాకుండా, కేవలం 'దావణగెరె స్టైల్ బెన్నె దోశ'పైనే పూర్తి ఫోకస్ పెట్టారు. అంతేకాదు సరైన చట్నీ రుచి కోసం ఎన్నో ప్రయోగాలు చేశారు, సాంప్రదాయ రుచి కోసం ప్రత్యేకంగా కర్ణాటక నుండి కాస్ట్ ఐరన్ పెనాలను తెప్పించారు. సిబ్బందికి శిక్షణ ఇవ్వడం, వ్యాపారం పెరిగేకొద్దీ అదే పద్ధతిని, రుచిని అందించేలా జాగ్రత్త వహించారు. క్విక్-సర్వీస్ రెస్టారెంట్కు, ఆ సరళత మరో పెద్ద ప్రయోజనం. ఫలితం ఈ కేఫ్ రోజుకు 800 పైగా దోసలు విక్రయిస్తూ, నెలకు రూ.1 కోటి రాబడిని అందుకుంటోంది.ఇక బెన్నే ఎలక్ట్రానిక్ సెల్ఫ్-ఆర్డరింగ్, సెల్ఫ్-సర్వీస్ను ఉపయోగిస్తుంది, దీనివల్ల విస్తృతమైన టేబుల్ సర్వీస్ అవసరం తగ్గడమే కాకుండా, కస్టమర్లను కూడా ఈ ప్రక్రియలో పాలుపంచుకునేలా చేస్తుంది. తద్వారా క్యూలో నిల్చునే కష్టాలు లేకుండా, రెస్టారెంట్కు ప్రజలకు త్వరగా సేవ చేయడానికి కూడా వీలు కల్పిస్తుంది. అయినా ఈ రెస్టారెంట్ వద్ద ఆహార ప్రియులు బారులు తీరిన వైనం ఈ వెన్న దోశ క్రేజ్కు అద్దం పట్టాయి. అంతేనా దీపికా పడుకోన్, రణవీర్ సింగ్ వంటి సెలబ్రిటీలు రెస్టారెంట్ను సందర్శించడం, సోషల్ మీడియా పోస్టులు ఆసక్తిని మరింత పెంచాయి. ఇపుడీ బెన్నె దోశ ఖ్యాతి ముంబైలో అనేక శాఖలతో పాటు, ఢిల్లీలోని బ్రాంచ్లో కూడా వెలుగొందుతోంది. -
'కొంచెమైనా సిగ్గుండాలి.. కూతురి వయసున్న అమ్మాయితో'
బాలీవుడ్ నటుడు గోవిందా వ్యవహారం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. ఇన్నాళ్లు గోవిందాను వెనకేసుకొచ్చిన సునీత.. ఈ సారి మాత్రం గట్టిగానే కడిగేస్తోంది. ఇటీవల గోవిందా నటి కోమల్ రాణి స్వర్ణకర్తో కనిపించడంతో సునీత ఫైరవుతోంది. తన కూతురు వయసున్న అమ్మాయితో తిరుగుతున్నాడు.. గోవిందాకు కొంచెమైనా సిగ్గుండాలని ప్రశ్నించింది.ఇటీవల ముంబయి విమానాశ్రయంలో గోవిందాతో పాటు నటి కోమల్ రాణి స్వర్ణకర్ జంటగా కనిపించింది. ఆ తర్వాత వీరిద్దరిపై సోషల్ మీడియాలో రూమర్స్ మొదలయ్యాయి. వీరిద్దరు డేటింగ్లో ఉన్నారా? అంటూ నెట్టింట చర్చ మొదలైంది. ఇది చూసిన కొందరు గోవిందా భార్య సునీత అహుజాను ప్రశ్నించారు. దీంతో ఆమె తనదైన శైలిలో స్పందించింది. అసలు వీళ్లిద్దరు సినిమా తీయకుండానే ప్రమోషన్స్ చేస్తున్నారా? అంటూ మండిపడింది. అతను తన కూతురి వయస్సులో ఉన్న అమ్మాయితో తిరుగుతున్నాడు... కనీసం కొంచెమైన సిగ్గుండాలి కదా సునీత నిలదీసింది.కోమల్ రాణి స్వర్ణకర్ ఎవరు?కోమల్ రాణి స్వర్ణకర్ బాలీవుడ్లో ఎంట్రీకి సిద్ధమైంది. గోవింద ఇటీవలే 'రూపా', 'దునియాదారి' చిత్రాలను ప్రకటించారు. వీటిలో 'రూపా' చిత్రంలో రాణి స్వర్ణకర్ను కథానాయికగా పరిచయం చేశారు. ఈ ప్రాజెక్టులను గోవిందానే నిర్మిస్తున్నారు. దీంతో గోవింద రాబోయే రెండు ప్రాజెక్టులలోనూ ఆమె భాగమయ్యే అవకాశం ఉందని తెలుస్తోంది. -
కియోసాకి ప్రశ్న.. ఘాటుగా స్పందించిన నెటిజన్లు!
తరచుగా పెట్టుబడులకు సంబంధించిన విషయాలను వెల్లడించే రాబర్ట్ కియోసాకి, తాజాగా ఉద్యోగ జీవితం గురించి చెప్పారు. ''జీవితం అంటే కేవలం ఉదయం 9 నుంచి సాయంత్రం 5 వరకు పని చేసి, నెలాఖరులో జీతం తీసుకోవడమేనా?'' అని ప్రశ్నించారు.చాలామంది చిన్నప్పటి నుంచి ఒకే విధమైన మార్గంలో వెళ్తుంటారు. చదువు.. ఉద్యోగం.. జీతం.. ఖర్చులు.. మళ్లీ ఉద్యోగం. ఇలా సంవత్సరాలు గడిచిపోతాయి. మనం డబ్బు సంపాదిస్తున్నాం, కుటుంబాన్ని చూసుకుంటున్నాం, బాధ్యతలు నిర్వర్తిస్తున్నాం. కానీ ఒక సమయంలో మనల్ని మనమే ''నేను అసలు ఎందుకు ఇలా జీవిస్తున్నాను? నా జీవితానికి అర్థం ఏమిటి?'' అని బహుశా ఆలోచించకపోవచ్చు.ఇదే విషయాన్ని కియోసాకి చెబుతూ.. నేను పని చేస్తున్నానంటే, అది ''కేవలం డబ్బు సంపాదించడానికి మాత్రం కాదు. జీవిత లక్ష్యాన్ని నెరవేర్చుకోవడానికి చేస్తున్నా'' అని పేర్కొన్నారు. అంటే మనం చేసే పని మనకు డబ్బు మాత్రమే కాకుండా, ఒక సంతృప్తిని, ఒక ఉద్దేశ్యాన్ని కూడా ఇవ్వాలని ఆయన ఉద్దేశ్యం.కియోసాకి ట్వీట్ సోషల్ మీడియాలో వైరల్ అయిన తరువాత.. నెటిజన్లు తమదైన రీతిలో స్పందించారు. కొందరు ఆయన మాటలతో ఏకీభవించినప్పటికీ.. మరికొందరు వ్యతిరేకించారు.చాలామంది ఉదయం 9 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు ఉద్యోగం చేస్తున్నారు. కుటుంబాన్ని పోషించడం, పిల్లలకు మంచి భవిష్యత్తు ఇవ్వడం లక్ష్యంగా ముందుకు సాగుతున్నారు అని అన్నారు. జీవిత లక్ష్యం అంటే ఏదో పెద్ద విజయం సాధించడంలో దొరకదు. కొన్నిసార్లు, ఒక సాధారణ పనిని నిలకడగా, చక్కగా చేయడంలో కూడా అది లభిస్తుందని ఇంకొందరు అన్నారు.9 to 5 for just $?Found it interesting my last X had so few loves relative to number of views.My previous X was dedicated to working to fulfill your spirit’s mission…your life’s purpose….for the gift of life.Working 9 to 5 just for $…seems to me…. to be an empty life.…— Robert Kiyosaki (@theRealKiyosaki) August 14, 2026 -
మహేశ్ బాబు మేనల్లుడి సినిమా.. మరో టీజర్ వచ్చేసింది
మహేష్ బాబు మేనల్లుడు అశోక్ గల్లా, శ్రీ గౌరీప్రియ జంటగా నటిస్తున్న అమెరికా బ్యాక్డ్రాప్ లవ్స్టోరీ చిత్రం 'VISA-వింటారా సరదాగా'. ఈ చిత్రానికి ఉద్భవ్ దర్శకత్వం వహిస్తున్నారు. ఈ చిత్రాన్ని సితార ఎంటర్టైన్మెంట్స్, ఫార్చూన్ ఫోర్ సినిమాస్ బ్యానర్లపై నాగవంశీ, సాయి సౌజన్య సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఇప్పటికే రిలీజైన సాంగ్స్, టీజర్ అభిమానులను ఆకట్టుకున్నాయి.తాజాగా ఈ మూవీ నుంచి మరో టీజర్ రిలీజ్ చేశారు మేకర్స్. ఈ టీజర్ చూస్తుంటే లవ్ అండ్ కామెడీ ఎంటర్టైనర్గా తెరకెక్కించినట్లు తెలుస్తోంది. ఈ ప్రేమ కథ మొత్తం అమెరికాలోనే తెరకెక్కించారు. ముఖ్యంగా సత్య, రోహిణి కామెడీ టీజర్లో అలరిస్తోంది. ఈ చిత్రంలో రాహుల్ విజయ్, శివాత్మిక రాజశేఖర్, హర్ష చెముడు కీలక పాత్రల్లో నటిస్తున్నారు. ఈ మూవీకి విజయ్ బుల్గానిన్ సంగీతమందిస్తున్నారు.
