breaking news
-
‘ఇడుపు కాయితం’ వివాదం.. ట్రెండింగ్లో తెలంగాణ పిల్ల
‘ఇడుపు కాయితం’.. ఇప్పుడు సోషల్ మీడియాలో ఎక్కడ చూసిన ఈ సినిమా టైటిల్ గురించే చర్చ. ఈ సినిమాని ఏపీలో తెలుగులో డబ్ చేసి రిలీజ్ చేస్తారా అని కొంతమంది నెటిజన్స్ కామెంట్ చేయడంతో ఈ వివాదం మొదలైంది. మా యాసని అవమానిస్తారా అంటూ తెలంగాణ నెటిజన్స్, మెధావులు ఫైర్ అవుతున్నారు. టైటిల్ని అవమానిస్తూ వెతకారంగా పెట్టిన పోస్టులకు కౌంటర్గా తెలంగాణ నెటిజన్స్ పోస్టులు పెడుతున్నారు. ఇలా ఈ వ్యవహారం ఇప్పుడు రెండు రాష్ట్రాల నెటిజన్స్ మధ్య పెద్ద చర్చకు తెరలేపింది. అయితే ఈ క్రమంలో ‘ఇడుపు కాయితం’ హీరోయిన్ నాగదుర్గ గురించి కూడా ఆరా తీస్తున్నారు. ఆమె చేసిన ఫోక్ సాంగ్స్ వీడియో క్లిప్పులు నెట్టింట వైరల్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో నాగదుర్గ నేపథ్యం గురించి, ఆమె కెరీర్ గురించి ఆసక్తికర విషయాలు..→ తెలంగాణ జానపద పాటలకు ఈ మధ్య ఆదరణ పెరిగింది. సినిమాల్లోనూ తెలంగాణ ఫోక్ సాంగ్స్ని వాడుతున్నారు. సోషల్ మీడియా పుణ్యమా అని పల్లె మట్టివాసనలు గల ఎంతో మంది కళాకారులు వెలుగులోకి వస్తున్నారు. వారిలో డిజిటల్ స్క్రీన్పై, యూట్యూబ్ జానపద గీతాల్లో మిలియన్ల కొద్దీ వ్యూస్ రాబడుతూ 'ఫోక్ స్టార్'గా గుర్తింపు తెచ్చుకున్న నృత్యకారిణి నాగదుర్గ (గుత్తా నాగదుర్గ) ఒకరు.→ నాగదుర్గ స్వస్థలం నల్గొండ జిల్లా అడ్డగూడూరు. ఆమె తల్లిదండ్రులు గుత్తా చలపతిరావు, వాసవి దంపతులు ఉద్యోగరిత్యా నల్గొండ పట్టణంలో స్థిరపడ్డారు. పదో తరగతి వరకు నల్గొండలోనే చదివిన నాగదుర్గ.. ఇంటర్, డిగ్రీ, పీజీ హైదరాబాద్లో పూర్తి చేశారు. పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ నుండి కూచిపూడి నృత్యంలో మాస్టర్స్ (పీజీ) పూర్తి చేశారు.→ నాగదుర్గకు చిన్నతనం నుంచే నృత్యంపై విపరీతమైన ఆసక్తి ఉండేది. స్థానిక రామాలయంలో జరిగే భజనలు, నృత్యాలను చూసి ఇంటికొచ్చాక చున్నీ కట్టుకుని డాన్స్ ప్రాక్టీస్ చేసేదట. కూతురిలోని ఈ తపనను గమనించిన తల్లి వాసవి.. ఆమెను నాట్యం వైపు నడిపించడంలో కీలక పాత్ర పోషించారు. ఈ విషయాన్ని ఓ ఇంటర్వ్యూలో నాగదుర్గనే చెప్పారు.జానపదంతో జాతకం మారింది→ కూచిపూడి బ్యాక్గ్రౌండ్ ఉన్న నాగదుర్గ కోవిడ్ సమయంలో జానపద గీతాల వైపు అడుగులు వేసింది. కోవిడ్ టైమ్లో అప్పటికే యూట్యూబ్లో రిలీజ్ అయిన 'ధన్ ధన ధన్' అనే ఫోక్ సాంగ్కి స్టెప్పులేసి ఆ వీడియోని తన యూట్యూబ్ ఛానల్లో పోస్ట్ చేసిందట. అది చూసే తొలి పాట ‘తిన్నా తీరం పడతలే’ చాన్స్ వచ్చింది. ఫోక్ డ్యాన్సర్గా ఎంట్రీ ఇచ్చిన తొలి పాటనే సూపర్ హిట్ అయింది. యూట్యూబ్లో మిలియన్ల కొద్ది వ్యూస్ వచ్చాయి. ఆ తర్వాత నాగదుర్గు జాతకమే మారిపోయింది.→ కూచిపూడి నేర్చుకోవడం వల్ల నాగదుర్గకు ముఖ కవళికలు (ఎక్స్ప్రెషన్స్) పలకడం చాలా సులువైంది. జానపద పాటల్లోని ఎనర్జిటిక్ స్టెప్స్కు తన క్లాసికల్ హావభావాలను జోడించి ఆమె చేసిన డ్యాన్స్ వీక్షకులను కట్టిపడేసింది. అందుకే ఆమె చేసిన తొలి సాంగ్ ‘తిన్నా తీరం పడతలే’ నుంచి ఇటీవల వచ్చిన ‘లగారే సౌండ్ సాలా’ వరకు ప్రతి పాట మిలియన్ల వ్యూస్ సాధించాయి. ఆమె కట్టు బొట్టు, పల్లెటూరి పడచులా అమాయకత్వంతో కూడిన క్యూట్ ఎక్స్ప్రెషన్స్ సోషల్ మీడియాలో ఆమెను స్టార్ను చేశాయి.→ నాగదుర్గకు గ్లామర్ దుస్తుకంటే సాంప్రదాయ చీరకట్టు, హాఫ్ శారీస్ అంటేనే ఇష్టం. స్క్రీన్పై కూడా మితిమీరిన గ్లామర్కు ఆమె ఒప్పుకోరు. అందుకే చాలా సినిమా అవకాశాలను వదులుకుంది.→ సినిమా ఇండస్ట్రీలో తనకు రెబల్ స్టార్ ప్రభాస్ అంటే ఎనలేని అభిమానమని, ఆయన సినిమాలో ఒక చిన్న పాత్ర దొరికినా చాలని ఓ ఇంటర్వ్యూల్లో నాగదుర్గ చెప్పింది.→ తెలుగులోలో కలివి వనం అనే సినిమాతో వెండితెర ఎంట్రీ ఇచ్చింది. తమిళంలో ‘లవ్ ఓ లవ్’ అనే సినిమా చేసింది. ఇప్పుడు ప్రియదర్శి జోడిగా ఇడుపు కాయితం అనే సినిమాలో ఛాన్స్ కొట్టేసింది. ఈ చిత్రాన్ని సుకుమార్, బన్నీ వాసు సంయుక్తంగా నిర్మిస్తున్నారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ ఇటీవల రిలీజ్ చేశారు. ఇందులో ‘శ్రీలత’ అనే తెలంగాణ పల్లెటూరి అమ్మాయి పాత్రలో కనిపించనుంది. ఈ సినిమా టైటిలే ఇప్పుడు నెట్టింట నాగదుర్గను ట్రెండింగ్గా మార్చింది. -
టోక్యో: సిగ్నల్ పడలేదు.. ఎర్ర చీర చూసి ఆగిపోయారంతే!
టోక్యో: జపాన్ రాజధాని టోక్యో వీధుల్లో ఒక అద్భుతమైన దృశ్యం ఆవిష్కృతమైంది. భారతీయ సంప్రదాయ చీరకట్టు గొప్పదనాన్ని ప్రపంచానికి చాటిచెప్పేలా ఒక భారతీయ మహిళ చేసిన ప్రయత్నం ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. సాధారణంగా వెస్ట్రన్, మోడ్రన్ దుస్తులకు అలవాటు పడిన జపాన్ ప్రజల మధ్యలోకి, ఒక భారతీయ నారి ఎర్రటి చీర కట్టుకుని అడుగుపెట్టడంతో అక్కడి స్థానికులు ఆశ్చర్యంతో నోరెళ్లబెట్టారు. ఈ అరుదైన దృశ్యాన్ని చూసి వారు చూపు తిప్పుకోలేకపోయారు.వైరల్ వీడియో విశేషాలు‘wanderfullyflying’ అనే ఇన్స్టాగ్రామ్ పేజీలో కాజల్ అనే భారతీయ మహిళ ఈ వీడియోను పంచుకున్నారు. ఆమె జపాన్ వీధుల్లో ఎంతో హుందాగా, ఆత్మవిశ్వాసంతో ఎర్రటి చీర ధరించి నడుస్తూ కనిపించారు. మోడ్రన్ ప్రపంచంలో నివసించే జపనీయులకు ఈ సాంప్రదాయ చీరకట్టు ఒక సరికొత్త అనుభూతిని ఇచ్చింది. ఆమె నడుస్తుంటే దారి పొడుగునా జనం ఆగి మరీ ఆమె వైపు చూడటం ఈ వీడియోలో స్పష్టంగా కనిపిస్తోంది.స్థానికుల ఆశ్చర్యం.. సెల్ఫీల సందడిఈ వీడియో కేవలం సాధారణ చూపులకే పరిమితం కాలేదు. కాజల్ చీరకట్టును చూసి ముగ్ధులైన స్థానికులు కొందరు ఆమెతో మాట్లాడటానికి ముందుకు వచ్చారు. అంతేకాదు, భారత్కు చెందిన ఈ సాంప్రదాయ దుస్తుల అందాన్ని మెచ్చుకుంటూ, ఆమెతో కలిసి ఫోటోలు, సెల్ఫీలు దిగడానికి ఆసక్తి చూపించారు. విదేశీయులు మన సంస్కృతిని ఇంతగా గౌరవించడం, ఆనందించడం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంటోంది.సంస్కృతిని అనుసంధానిస్తూ..చీర అనేది కేవలం ఒక వస్త్రం మాత్రమే కాదు.. అది మన భారత సంస్కృతికి ప్రతీక అని కాజల్ తన పోస్ట్లో పేర్కొన్నారు. వేర్వేరు దేశాల ప్రజలను, వారి భావాలను ఒకచోట చేర్చడానికి, పరస్పరం అనుసంధానించడానికి సంస్కృతి అనేది ఒక అందమైన మార్గమని ఆమె అభిప్రాయపడ్డారు. ఈ వైరల్ వీడియో ప్రస్తుతం ఇన్స్టాగ్రామ్లో మిలియన్ల కొద్దీ వీక్షణలతో దూసుకుపోతూ, భారతీయ సంస్కృతి వైభవాన్ని అంతర్జాతీయ స్థాయిలో మరోసారి చాటిచెబుతోంది. -
ముడి చమురుకు బై బై.. భారత్లోకి జపాన్ మిథేన్ పవర్
న్యూఢిల్లీ: క్లీన్ మొబిలిటీ (స్వచ్ఛమైన రవాణా) రంగంలో భారత్, జపాన్ దేశాలు ఒక భారీ విప్లవానికి తెరలేపాయి. పెరుగుతున్న ఇంధన అవసరాలను తీరుస్తూనే, కాలుష్యానికి అడ్డుకట్ట వేసేలా సుమారు 1,000 మిథేన్ ప్లాంట్ల ఏర్పాటుకు ఇరు దేశాలు ఉమ్మడి వ్యూహాన్ని రచిస్తున్నాయి. జపాన్ ప్రధాని సనాయే తకైచి మూడు రోజుల భారత పర్యటనలో భాగంగా ఈ కీలక ఒప్పందం కుదిరే అవకాశం ఉందని అంతర్జాతీయ మీడియా కథనాలు వెల్లడించాయి.1,000 మిథేన్ ప్లాంట్లు – సరికొత్త రవాణా విప్లవంఈ ప్రతిపాదిత భాగస్వామ్యం ద్వారా భారతదేశంలో మిథేన్ ఉత్పత్తి కేంద్రాలను భారీగా విస్తరించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. దేశవ్యాప్తంగా ప్లాంట్ల సంఖ్యను దాదాపు 1,000కి పెంచనున్నారు. ఈ ప్లాంట్ల ద్వారా ఉత్పత్తి అయ్యే బయోగాస్ను (మిథేన్) సీఎన్జీ వాహనాలకు ఇంధనంగా ఉపయోగిస్తారు. ఇది దేశంలో పర్యావరణహిత రవాణా వ్యవస్థను మరింత బలోపేతం చేయడమే కాకుండా, ముడి చమురు దిగుమతులపై భారత్ ఆధారపడటాన్ని గణనీయంగా తగ్గిస్తుంది.రంగంలోకి సుజుకి – గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్భారత ప్యాసింజర్ వాహన మార్కెట్లో అగ్రగామిగా ఉన్న జపనీస్ ఆటోమొబైల్ దిగ్గజం ‘సుజుకి మోటార్’ ఈ ప్రాజెక్టులో అత్యంత కీలక పాత్ర పోషించనుంది. జపాన్ ప్రభుత్వానికి చెందిన ‘గ్లోబల్ సౌత్ అసిస్టెన్స్ ప్రోగ్రామ్’ మద్దతుతో సుజుకి ఇప్పటికే భారత్లో బయోగాస్ ఉత్పత్తి ప్రాజెక్టులను ప్రారంభించింది. ప్రస్తుతం భారతదేశంలో కొత్త ప్యాసింజర్ వాహనాల విక్రయాలలో సీఎన్జీ వాహనాల వాటా 20 శాతానికి పైగా ఉండటంతో, ఈ కొత్త ఇంధన లభ్యత సీఎన్జీ వాహనాల వినియోగాన్ని మరింత పెంచనుంది.మోదీ-తకైచి సదస్సు – వ్యూహాత్మక బంధంగత ఏడాది అక్టోబరులో బాధ్యతలు చేపట్టిన తర్వాత జపాన్ ప్రధాని సనాయే తకైచి భారత్లో పర్యటించడం ఇదే తొలిసారి. ఈ పర్యటనలో భాగంగా ఆమె ప్రధానమంత్రి నరేంద్ర మోదీతో ఉన్నత స్థాయి ద్వైపాక్షిక చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల మధ్య ఉన్న సాంప్రదాయ దౌత్య సంబంధాలలో భాగంగా జరగనున్న ఈ భేటీలో ఆర్థిక భద్రత, స్వచ్ఛమైన ఇంధనం, ఆర్థిక వృద్ధి వంటి అంశాలపై ప్రధానంగా దృష్టి సారించనున్నారు. మారుతున్న అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాల నేపథ్యంలో భారత్తో సంబంధాలు తమకు ఎంతో కీలకమని జపాన్ భావిస్తోంది.ఇది కూడా చదవండి: చేతిరాత బాగోలేదని నవ్వితే.. పప్పులో కాలేసినట్లే! -
జస్ట్ 24 వారాల్లో 25 కిలోలు తగ్గింది..! నిలకడగా ఆ మూడు అలవాట్లు..
బరువు తగ్గడానికి ఎల్లప్పుడూ కఠినమైన ఆహార నియమాలు లేదా తీవ్రమైన వ్యాయామాలు అవసరం లేదని కొందరు ఫిట్నెస్ ఔత్సాహికులు నిరూపిస్తున్నారు. కేవలం నిలకడతో జీవనశైలి మార్పులను అనుసరిస్తే చాలంటున్నారు. తాజాగా మరో ఫిట్నెస్ నిపుణుడు అలా చేసే జస్ట్ ఆరు నెలల్లో 25 కిలోలు పైనే తగ్గి చూపించాడు. తన శరీరాకృతిని స్లిమ్గా మార్చుకోవడానికి సహాయపడిన ఆచరణాత్మక నియామాలను ఇన్స్టాగ్రామ్ వేదికగా పంచుకున్నారు. అవేంటంటే..ఫిట్నెస్ నిపుణుడు జీషన్అలీ తాను సులభమైన జీవనశైలి మార్పులతోనే 25 కిలోలు పైనే తగ్గానని అన్నారు. కడుపు నిండినట్లు అనిపించకపోవడమే అధికంగా తినాలనే కోరికలను రేకెత్తిస్తుందని అన్నారు. ఫలితంగా జింక్ ఫుడ్పైకి మనసు మళ్లుతుందని అన్నారు. అందుకోసం తాను జస్ట్ మూడు నియమాలను పాటించానని అన్నారు.నిద్రకు ప్రాధాన్యత ఇవ్వండి..నీరు తాగండి..నిద్ర నీరు రహస్య ఆయుధాలని నొక్కి చెబుతున్నాడు. తాను ప్రతి రాత్రి 10:30 గంటలకల్లా పడుకునేవాడినని, రోజూ మూడు నుంచి నాలుగు లీటర్ల నీరు తాగేవాడినని అన్నారు. ఇక్కడ ఎక్కువ నిద్ర, ఎక్కువ నీరు అంటే.. ఎక్కువ శక్తి, తక్కువ ఆకలి అని చెప్పారు. ప్రతిరోజు ఒక దినచర్యను పాటించడం..అంటే నిద్ర, జిమ్, వాకింగ్లకు సమాన ప్రాధాన్యతి ఇస్తూ చేయాలి. ముందుగా ప్లాన్ చేసుకుని అనుసరిస్తే..సవ్యంగా ఉంటుంది లేదంటే ఆ ప్లాన్ కాగితానికే పరిమితం అవుతుందని అంటున్నారు.తగినంత ప్రోటీన్ తీసుకోండి..అతని బరువు తగ్గే ప్రయాణంలో ఆకలిని నియంత్రించడంలో ప్రోటీన్ కీలకపాత్ర పోషిస్తుందని అంటున్నారు. తాను తక్కువ ఆహారం తీసుకున్నప్పటికీ..ప్రోటీన్ మాత్రం రోజుకి 180–200 గ్రాములకు పరిమితం చేశానని అన్నారు. కండరాలను కాపాడుకోవడానికి, ఆకలి కోరికలు తగ్గించుకోవడానికి, అలాగే జీవక్రియను మెరుగ్గా ఉంచడానికి ఇది ఉపకరిస్తుందని అన్నారు. దీనివల్ల పొట్టకొవ్వు వేగంగా తగ్గుతుందని చెబుతున్నారు. అలా 46 ఏళ్ల వయసులో 24 వారాల్లో తాను 101 కేజీల నుంచి 76 కేజీలకు తగ్గానని చెప్పారు. View this post on Instagram A post shared by Zee Ali - South Asian Health and Fitness Expert (@_zeeali1)గమనిక: ఇది కేవలం అవగాహన కోసం మాత్రమే ఇచ్చాం. పూర్తి వివరాలకు వ్యక్తిగత వైద్యులు లేదా నిపుణులను సంప్రదించడం ఉత్తమం. (చదవండి: 'టైప్రైటర్'తో అద్భుతమైన చిత్రం..! ఆ క్రియేటివిటీకి మాటల్లేవ్ అంతే) -
నిర్మాతతో టాలీవుడ్ హీరోయిన్ నిశ్చితార్థం.. ఫొటోలు వైరల్
మళ్లీ శుభకార్యాల సీజన్ మొదలైపోయింది. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు పెళ్లి, నిశ్చితార్థం లాంటివి చేసుకుంటున్నారు. ఇప్పుడీ లిస్టులో టాలీవుడ్కి చెందిన హీరోయిన్ చేరిపోయింది. తమిళ నిర్మాతతో గత కొన్నేళ్లుగా ప్రేమలో ఉన్న ఈ బ్యూటీ.. ఇప్పుడు సింపుల్గా నిశ్చితార్థం చేసుకుంది. అందుకు సంబంధించిన ఫొటోలని సోషల్ మీడియాలో షేర్ చేసింది.(ఇదీ చదవండి: 'బాహుబలి ద టార్చ్ బేరర్' రివ్యూ.. 123 నిమిషాలు గూస్ బంప్స్)స్వతహాగా కన్నడ హీరోయిన్ అయిన షర్మిలా మండ్రే.. 2007 నుంచి దక్షిణాది భాషల్లో సినిమాలు చేస్తోంది. తెలుగులో అయితే 2013లో అల్లరి నరేశ్ హీరోగా చేసిన 'కెవ్వు కేక' మూవీలో నటించింది. తమిళంలోనూ హీరోయిన్ కమ్ నిర్మాతగా పలు సినిమాలు చేసింది. మరి ఎప్పుడు ప్రేమలో పడిందో ఏమో గానీ తమిళ నిర్మాత సుధాన్ సుందరంతో రహస్యంగా రిలేషన్ మెంటైన్ చేసింది.కొన్నిరోజుల క్రితమే షర్మిల-సుధాన్ డేటింగ్ సంగతి బయటపడింది. ఇప్పుడు సదరు రూమర్స్ నిజం చేస్తూ కుటుంబ సభ్యులు, సన్నిహితుల సమక్షంలో నిశ్చితార్థం చేసుకున్నారు. ప్రస్తుతం తమిళంలో ఓ మూవీ చేస్తున్న షర్మిల.. బహుశా ఈ ఏడాదిలోనే పెళ్లి కూడా చేసుకోవచ్చు. సుధాన్ సుందరం విషయానికొస్తే విజయ్ సేతుపతి 'మహారాజా' నిర్మించింది ఈయనే.(ఇదీ చదవండి: గుడ్ న్యూస్ చెప్పిన డైరెక్టర్ నాగ్ అశ్విన్) -
చరిత్ర సృష్టించిన వెస్టిండీస్ స్టార్లు.. టెస్టు హిస్టరీలోనే తొలిసారి
సొంతగడ్డపై శ్రీలంకతో తొలి టెస్టులో వెస్టిండీస్ పటిష్ట స్థితిలో నిలిచింది. నార్త్ సౌండ్ వేదికగా గురువారం మొదలైన మ్యాచ్లో టాస్ గెలిచిన విండీస్ తొలుత బౌలింగ్ చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో బ్యాటింగ్కు దిగిన శ్రీలంకను తొలి ఇన్నింగ్స్లో 308 పరుగులకే ఆలౌట్ చేసింది.లంకను కట్టడి చేసి..లంక బ్యాటర్లలో దినేశ్ చండీమాల్ అర్ధ శతకం (54)తో ఆకట్టుకోగా.. కెప్టెన్ ధనంజయ డి సిల్వ శతకం (120) సాధించాడు. మిగిలిన వారిలో కుశాల్ మెండిస్ 43 పరుగులతో రాణించాడు. వెస్టిండీస్ బౌలర్లలో జస్టిన్ గ్రీవ్స్ మూడు, కేమార్ రోచ్, అల్జారీ జోసెఫ్, షమార్ జోసెఫ్ తలా రెండు వికెట్లు తీయగా.. జేడన్ సీల్స్కు ఒక వికెట్ దక్కింది.అనంతరం తమ తొలి ఇన్నింగ్స్ మొదలుపెట్టిన వెస్టిండీస్ స్వల్ప వ్యవధిలోనే ఓపెనర్లు జాన్ కాంప్బెల్ (39), బ్రాండన్ కింగ్ (31) వికెట్లు కోల్పోయింది. వన్డౌన్లో వచ్చిన కేవమ్ హాడ్జ్ (16) కూడా నిరాశపరిచాడు.ఆమిర్ డబుల్ సెంచరీవికెట్ కీపర్ బ్యాటర్ జాషువా డా సిల్వా (20) విఫలం కాగా.. జస్టిన్ గ్రీవ్స్ (3) ఇలా వచ్చి అలా వెళ్లాడు. ఇలాంటి తరుణంలో నాలుగో నంబర్ బ్యాటర్ ఆమిర్ జాంగూ, కెప్టెన్ రోస్టన్ ఛేజ్ వెస్టిండీస్ ఇన్నింగ్స్ను గాడినపెట్టారు. మూడో రోజు ఆట ముగిసేసరికి ఆమిర్ 373 బంతుల్లో 19 ఫోర్లు, 3 సిక్సర్ల సాయంతో ఏకంగా 233 పరుగులు సాధించాడు.రోస్టన్ జస్ట్ మిస్ఇక రోస్టన్ ఛేజ్ 324 బంతులు ఎదుర్కొని 13 ఫోర్లు, 2 సిక్స్ల సాయంతో 194 పరుగులు రాబట్టాడు. అయితే, దురదృష్టవశాత్తూ తృటిలో డబుల్ సెంచరీ చేజార్చుకున్నాడు. అల్జారీ జోసెఫ్ 21, షమార్ జోసెఫ్ 17 (నాటౌట్) పరుగులు చేశారు. ఫలితంగా 160.5 ఓవర్లలో తొమ్మిది వికెట్ల నష్టానికి 626 పరుగుల భారీ స్కోరు సాధించిన వెస్టిండీస్.. తమ తొలి ఇన్నింగ్స్ను డిక్లేర్ చేసింది.401 పరుగుల పార్ట్నర్షిప్ఇదిలా ఉంటే.. శ్రీలంకతో తొలి టెస్టు సందర్భంగా ఆమిర్ జాంగూ- రోస్టన్ ఛేజ్ ప్రపంచ రికార్డు సాధించారు. టెస్టు క్రికెట్ చరిత్రలోనే ఆరో వికెట్కు అత్యధిక భాగస్వామ్యం నెలకొల్పిన జోడీగా నిలిచారు. ఈ ఇద్దరూ కలిసి ఏకంగా 401 పరుగుల పార్ట్నర్షిప్ సాధించి తమ పేర్లను చరిత్ర పుటల్లో లిఖించుకున్నారు.ఇంతకు ముందు ఈ రికార్డు ఇంగ్లండ్ జోడీ జానీ బెయిర్స్టో- బెన్ స్టోక్స్ పేరు మీద ఉండేది. సౌతాఫ్రికాతో 2016 నాటి టెస్టులో వీరు ఆరో వికెట్కు 399 పరుగులు జోడించారు. ఇప్పుడు బెయిర్స్టో-స్టోక్స్ను ఆమిర్- రోస్టన్ అధిగమించారు. ఇక మూడో రోజు ఆట ముగిసే సరికి శ్రీలంక వికెట్ నష్టానికి 15 పరుగులు చేసింది. విండీస్ కంటే 303 పరుగులు వెనుకబడి ఉంది. చదవండి: భారత్తో మ్యాచ్.. శ్రీలంక టార్గెట్ ఎంతంటే? -
నటుడిని వరించిన లాటరీ.. సరదాగా టికెట్స్ కొంటే
మన దగ్గర లాటరీ కల్చర్ తక్కువగానీ కేరళలో లాటరీ టికెట్స్ కొనడం లాంటివి చాలా సాధారణమైన విషయం. సామాన్యుల నుంచి సెలబ్రిటీల వరకు లాటరీ టికెట్స్ కొనుగోలు చేస్తూ, అప్పుడప్పుడు బహుమతులు, నగదు గెలుచుకుంటూ ఉంటారు. ఇప్పుడు కూడా నటుడు బాల.. సరదాగా లాటరీ టికెట్స్ కొంటే అదృష్టం వరించింది. అందుకు సంబంధించిన వీడియోని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు.(ఇదీ చదవండి: 'ఇడుపు కాయితం' అంటే ఏంటి? తెలంగాణ vs ఆంధ్రా)'మంచి ఆలోచనలో ఉంటే మంచి విషయాలే జరుగుతాయి. మా ఫాంహౌస్ నుంచి ఎర్నాకుళం వస్తుండగా ఓ వృద్ధుడు లాటరీ టికెట్స్ అమ్ముతూ కనిపించారు. ఆయనకు సాయం చేయాలనే ఉద్దేశంతో నాలుగు టికెట్స్ కొన్నాను. లాటరీ గెలవాలనే ఆశతో ఈ టికెట్స్ కొనలేదు. మీకు సాయం చేయడానికే కొంటున్నాను అని ఆయనతో చెప్పాను. ఆ వయసులోనూ ఆయన కష్టపడుతుండటం చూసి నేను టికెట్స్ కొన్నా. కానీ నేను కొన్న నాలుగు టికెట్స్కి గిఫ్ట్స్ రావడం ఎంతో ఆనందంగా ఉంది. మీరు తప్పకుండా లాటరీ గెలుస్తారని ఆ తాత నాతో చెప్పిన మాట నిజమైంది. ఇది పెద్ద మొత్తం కాకపోవచ్చు కానీ భగవంతుడి అనుగ్రహం ఉంటేనే లాటరీ గెలవగలం' అని బాల చెప్పుకొచ్చాడు.అయితే బాల దంపతులు లాటరీ గెలవడం కొత్తేం కాదు. గతేడాది 'కారుణ్య లాటరీ'లో ఈ నటుడి భార్య రూ.25 వేలు గెలుచుకుంది. 'భాగ్యలత లాటరీ'లోనూ మరో రూ.100 గెలుచుకుంది. ఇప్పుడు బాల కూడా లాటరీలో బహుమతులు గెలుచుకోవడం చూస్తుంటే వీళ్లకు అదృష్టం రాసిపెట్టినట్లు ఉంది.(ఇదీ చదవండి: విజయ్.. నెలకు 20 రోజులు మాత్రమే) View this post on Instagram A post shared by Filmactor Bala (@actorbala) -
ఈత చెట్టు.. కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత..
ఈత చెట్టు రూపురేఖలు ఖర్జూరపు చెట్టుకు అతి దగ్గరగా ఉంటాయి. పుష్పించే విధానం, పండ్ల గుత్తులూ ఒకేలాగ ఉంటాయి. ఈ చెట్టు తెలియని వారుండరు. తరతరాల నుండి గుర్తున్న చెట్లల్లో ఈత చెట్టు ఒకటి. పల్లెవాసులకే కాకుండా పట్టణవాసులకూ సుపరిచితమైన చెట్టు ఈత. దీని ఔషధ విలువల వల్ల ఈ చెట్టుకు చాలా ప్రాచుర్యమున్నది. దీన్ని ‘సిల్వర్ డేట్ పాం’ అని కూడా పిలుస్తుంటారు.ఉనికి..ఈ చెట్టు సుమారు 4 నుండి 15 మీటర్ల ఎత్తు పెరుగుతుంది. పూత–కాత మాత్రం కొంత అటు–ఇటు అయినా (పరిస్థితులను బట్టి) ఏప్రిల్ నుండి ఆగష్టు మధ్య ఉంటుంది. తేమ ఎక్కువగా ఉన్న నేలల్లో పెరుగుతుంది. అట్లని ఇతర నేలల్లో రాదని కాదు. ఈత పల్లపుప్రాంతాల్లో కూడ వస్తుంది. ఎక్కువగా వాగులు, వంకలు ఉన్న దగ్గర పెరుగుతుంది. వీటి స్వస్థలం దక్షిణ పాకిస్తాన్, ఇండియా, శ్రీలంక, నేపాల్, భూటాన్, మైన్మార్, బంగ్లాదేశ్, మారిషస్, చగోస్ ఆర్చిపిలాగై, పుర్టోరికో, ‘లీవర్డ్ ఐలాండ్’లు.ఈత చెట్టు సముద్రమట్టానికి 1300 మీటర్ల ఎత్తువరకు ఉండే ప్రాంతాలలో కూడా రాగలదు. దీని కాయలు ఆకు పచ్చరంగులో ఉండి పక్వానికి వచ్చిన తరువాత పసుపు రంగుకు, పండుగా మారినప్పుడు కాషాయ రంగుకు మారతాయి. ఈత చెట్లు దేశంలో ఇంచుమించు అన్ని రాష్ట్రాల్లో ఉన్నాయి. వీటి జీవితకాలం దాదాపు 40–60 సంవత్సరాలు. కానీ కల్లు గీసే చెట్లు త్వరగా చనిపోతాయి. ఈత చెట్లపై ఆధారపడి కొన్ని వేల కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి.ఉపయోగాలుఈత ఆకులతో రకరకాల వస్తువులను తయారు చేస్తారు. చాలా మందికి ఇది ఉపాధి కూడా (చాపలు, ఈత పొరకలు, చిన్న చిన్న ఆట వస్తువులు)గుడిసెల పైకప్పుకు ఈ ఆకులను ఉపయోగిస్తారు.మొగిలోన పిండి పదార్థం రుచిగా ఉంటుందని గ్రామస్తులు దాన్ని సేకరించి వాడుతారు. మొగి తీయడం వల్ల చెట్టు చనిపోయే ఆస్కారం ఉంటుంది. ఈ మొద్దును రెండుగా చీల్చి మధ్యన ఉన్న భాగాన్ని తీసి అనేక విధాలుగా వాడుతారు. (ఉ: చిన్న చిన్న కాలువలు దాటటానికి అడ్డంగావేస్తారు. దానిపై కాలినడక సాగిస్తారు. పందిళ్లకు పోల్స్గా వాడుతారు.ప్రధానంగా ఈత చెట్టు నుండి ‘నీరా, కల్లు’ తీస్తారు. ఉదయం సూర్యోదయం కాకముందు చెట్టు నుండి తీసేది ‘నీరా’. ఆ తర్వాత నీరా పులిసి కల్లుగా మారుతుంది. నీరాకు మార్కెట్లో చాలా మంచి డిమాండ్ ఉంది.నీరాను సేవించడం వల్ల కిడ్నీలోని రాళ్ళు కరిగి పోతాయని ప్రజల ప్రగాఢ విశ్వాసం.నీర నుండి ‘ఈత బెల్లాన్ని’ తయారు చేస్తారు. ఇది ఆరోగ్యానికి మంచిదని ఆయుర్వేద వైద్యులు అంటారు.ఈత పండ్లు రుచిగా ఉంటాయి.ఈత పండ్ల నుండి జామ్, జల్లి వంటి విలువ ఆధారిత పదార్ధాలను తయారు చేస్తారు.ఈ పండ్లు తినడం వల్ల బ్యాక్ పెయిన్, పిరుదులపై కండరాలు పట్టినట్లు ఉంటే తగ్గుతాయి. (ఇవి టానిక్ లా పనిచేస్తాయి).పండ్లు కూడా ఎన్నో పోషక విలువలు కలవి.చెట్లను ల్యాండ్ స్కేపింగ్లో అందం కోసం నాటుతారు.వేర్లను పండ్ల నొప్పులను, నర్వస్ డెబిలిటీ, హెల్మింథియాసిస్ జబ్బులను నయం చేయటానికి ఉపయోగిస్తారు.నీరాను ఎండకాలంలో తాగితే చలువ చేకూర్చుతుంది. ఇందులో కూడా అనేక పోషక విలువలున్నవి.ఔషధంగా ఈతకు ప్రత్యేకత ఉంది. ఉదర సంబంధిత జబ్బులు, జ్వరాలు, మూర్ఛ, అజీర్తి, హృదయ సంబంధిత జబ్బులను నయం చేయటంలో ఈత నీరా గాని, బెల్లంగాని, మొగి గాని వాడుతారు.నీరాలోని ఇనుము వంటి సూక్ష్మపోషకాలు, బి12 వంటి విటమిన్లు రోగులకు చాలా మంచిది. రెగ్యులర్ గా సేవిస్తే వారిలో రక్తశుద్ధి జరిగి హిమోగ్లోబిన్ పెరుగుతుంది.పండ్లలో ఉండే కాల్షియం ఎముకలు, దంతాల పటుత్వానికి దోహద పడుతుంది.ఈతకు పెద్ద ఈత, ఈత అని రెండు పేర్లున్నాయి. ఇంగ్లిష్: వైల్డ్ డేట్ పాం, డేట్ సుగర్ పాం, ఇండియన్ వైల్జ్ డేట్, ఇండియన్ వైన్ పామ్ అస్సామీ: ఖాజురి;ఉర్దూ: ఖాజర్;ఒరియా: ఖర్జుర్;గుజరాతీ: ఖజ్జార్, ఖజా; కన్నడ: ఇచలు;తమిళంలో: ఇచం, పేరియా, ఇలచం;బెంగాలీ: ఖర్జూర, ఖఝూర్; పంజాబీ: ఖజుర్;మణిపురి: తంగటప్; మరాఠీ: సెండి, బైచంగ్, ఖర్జూర్, షిండ్రీ, షింధీ;మలయాళం: కట్టింతా, కట్టింతై, నీలన్ తెంట్ హిందీ: ఖజూర్;సంస్కృతం: ఖర్జూరహా, ఖర్జూర్ నేపాలీ: ఖండేలా, ధడ అంటారు.నల్లమల అడవులు:నలమలప్రాంతంలో ఈత చెట్లు ఉన్నాయి. ఇవి అంది నేలల్లో (చౌడు నేలల్లో) కూడా ఉన్నాయి. దేశంలో అనేక రాష్ట్రాలలో ఉన్నాయి. అడవిలోని సెలయేర్లు/వంకలు/ డొంకల దగ్గర ఉన్న వాటిలో పోషక విలువల్లో వ్యత్యాసం ఉండవచ్చు. కాబట్టి వీటిపై పరిశోధన చేపట్టి కొత్త వంగడాల అన్వేషణ మొదలు కావలసిన అవసరం ఎంతైనా ఉంది.ఈ చెట్టు కల్లు, పండ్లకే కాకుండా విలువాధారిత ఉత్పత్తులపై శోధించగలితే ఎంతో లాభసాటిగా ఉంటుంది. ఈ విధంగా చేస్తే ఈత వనాలతో ఉపాధి దొరుకుతుంది. ఇప్పటికే కొందరు ఈత వనాలు పెంచి కేవలం నీరా–కల్లు కోసమే ఉపయోగిస్తున్నారు. ఈత చెట్లు తెలుగు రాష్ట్రాల్లోని అడవుల్లో కూడా ఉన్నాయి.- డాక్టర్ మొరుపోజు పద్మయ్య, విశ్రాంత ప్రధాన శాస్త్రవేత్త, ఐసీఏఆర్ – ఐఐఓఆర్, రాజేంద్రనగర్, హైదరాబాద్. మొబైల్: 94407 08924నిర్వహణ: పంతంగి రాంబాబు, సాక్షి సాగుబడి డెస్క్ -
లంక-ఏతో మ్యాచ్.. భారీ ఆధిక్యం దిశగా ఇండియా-ఏ
గాలే వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న అనధికారిక టెస్టులో ఇండియా-ఏ జట్టు భారీ ఆధిక్యం దిశగా సాగుతోంది. ఓవర్నైట్ స్కోరు 48/0తో నాలుగో రోజు ఆటను ప్రారంభించిన ఇండియా-ఏ జట్టు 45 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. తొలి ఇన్నింగ్స్లో విఫలమైన దేవదత్ పడిక్కల్ (67) అర్ధసెంచరీ సాధించాడు. ఓపెనర్ ఆయుష్ పాండే 38 పరుగులు చేసి దులజ్ సముదితా బౌలింగ్లో వెనుదిరిగాడు. అంతకముందు సాయి సుదర్శన్ (7) తక్కువ స్కోరుకే ఔటయ్యాడు. ప్రస్తుతం తొలి ఇన్నింగ్స్ 172 పరుగుల ఆధిక్యం కలుపుకొని 271 పరుగుల లీడ్లో కొనసాగుతోంది. టీ సెషన్ వరకు వీలైనంత ఎక్కువ పరుగులు చేసి లంక-ఏ ముంగిట 400కు పైగా లక్ష్యాన్ని ఉంచాలని ఇండియా-ఏ భావిస్తోంది. అంతకముందు శ్రీలంక-ఏ తమ తొలి ఇన్నింగ్స్లో 330 పరుగులకు ఆలౌటైంది. నువానిదు ఫెర్నాండో (84), ఆషెన్ బండారా (70), కెప్టెన్ సహన్ అరాచిగె (72) అర్ధశతకాలతో రాణించారు. ఇండియా-ఏ బౌలర్లలో అకిబ్ నబీ 4 వికెట్లతో చెలరేగగా, యష్ ఠాకూర్, హర్ష్ దూబే చెరో 2 వికెట్లు తీశారు. తొలి ఇన్నింగ్స్లో ఇండియా-ఏ జట్టు 452 పరుగులకు ఆలౌట్ అయిన సంగతి తెలిసిందే. ధ్రువ్ జురేల్తో పాటు ఓపెనర్ సాయి సుదర్శన్ భారీ శతకాలతో మెరిశారు. -
త్రిషకు డిప్యూటీ సీఎం ఇచ్చినా ఆశ్చర్యం లేదు!
సాక్షి, చెన్నై: సొంత స్నేహాలు, సినిమా సంబంధాల కోసమే ప్రభుత్వ పదవులను పంచుతున్న సీఎం జోసఫ్ విజయ్, రానున్న రోజుల్లో నటి త్రిషకు డిప్యూటీ సీఎం పదవిని ప్రకటించినా ఆశ్చర్యపడాల్సిన అవశ్యం లేదని అన్నాడీఎంకే సీనియర్ నేత, మాజీ మంత్రి ఆర్బీ ఉదయకుమార్ ఎద్దేవా చేశారు. శనివారం ఆయన ఓ వీడియో రికార్డింగ్ సందేశం విడుదల చేస్తూ, సీఎం విజయ్ నేతృత్వంలోని తమిళనాడు ప్రభుత్వంపై విమర్శలు గుప్పించారు.సినిమా వాళ్లకే అధికార కేంద్రాలా? ప్రభుత్వ పదవుల నియామకాలపై ఉదయకుమార్ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తూ తమిళనాడులోని 8 కోట్ల మంది ప్రజల హక్కులను ఢిల్లీలో పరిరక్షించేందుకే రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి అనే ప్రతిష్టాత్మక పదవి ఉందన్నారు. తమిళనాడులో అర్హులైన వారెవరూ ఈ పదవికి దొరకలేదా అని ప్రశ్నిస్తూ, తనతో సినిమాలు తీసిన వారికి, తన చిత్రాల్లో నటించిన వారికి, తన పర్సనల్ మేనేజర్లు జగదీష్ పళనిస్వామి, జాన్ ఆరోగ్యస్వామి, విష్ణురెడ్డి, రాధన్ పండిట్, వెంకట్ నారాయణ వంటి వారికే సీఎం విజయ్ ప్రభుత్వ పదవులు ఇచ్చుకుంటూ పోతున్నారని ఆరోపించారు. ఇదే ధోరణి కొనసాగితే త్వరలోనే త్రిషను కూడా ఉప ముఖ్యమంత్రిని చేస్తామని ఆయన ప్రకటించవచ్చని ఎద్దేవా చేశారు.అన్నాడీఎంకే వర్గాలకు పదవులు మరోవైపు.. ప్రస్తుతం తిరుక్కళుక్కున్రం తూర్పు యూనియన్ కార్యదర్శిగా ఉన్న చెంగల్పట్టు తూర్పు జిల్లా ఎంజీఆర్ జి.కె.బాబు, అసోసియేషన్ కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈమేరకు అన్నాడీఎంకే ప్రధాన కార్యదర్శి ఎడపాడి పళనిస్వామి ఒక ప్రకటనలో తెలిపారు. తిరుక్కళుకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ కార్యదర్శిగా బాధ్యతలు నిర్వహిస్తున్న కె.ఆర్.సెల్వంను ఆ పదవి నుంచి తొలగిస్తున్నారు. ప్రస్తుతం యూనియన్ లీగ్ డిప్యూటీ సెక్రటరీగా ఉన్న పి. ముకుందన్, తిరుక్కలకుండ్రం వెస్ట్ యూనియన్ లీగ్ సెక్రటరీగా, చెంగల్పట్టు తూర్పు జిల్లా మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శిగా మధురాంతకం పంచాయతీ యూనియన్ కమిటీ అధ్యక్షురాలు గీత, అజయ్ మోహన్కుమార్ తిరుపోరూర్ ఉత్తర యూనియన్ కార్యదర్శిగా నియమితులయ్యారని తెలిపారు.
