-
గ్యాస్ బుకింగ్ టైమ్లో మార్పు.. కేంద్రం క్లారిటీ
సోషల్ మీడియాలో ఎల్పీజీ (LPG) రీఫిల్ బుకింగ్పై వస్తున్న వార్తలపై కేంద్ర పెట్రోలియం మంత్రిత్వ శాఖ స్పందించింది. గ్యాస్ సిలిండర్ బుకింగ్ సమయ పరిమితుల్లో మార్పులు చేశారంటూ జరుగుతున్న ప్రచారంలో ఏమాత్రం నిజం లేదని కేంద్రం స్పష్టం చేసింది. ఈ మేరకు బుధవారం ఒక ప్రకటన విడుదల చేస్తూ వినియోగదారుల ఆందోళనలను పటాపంచలు చేసింది.వైరల్ వార్తల్లో ఏముంది?గడిచిన కొన్ని రోజులుగా సోషల్ మీడియాలో ఒక వార్త విపరీతంగా చక్కర్లు కొడుతోంది. దాని ప్రకారం.. ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే ప్రధానమంత్రి ఉజ్వల యోజన (PMUY) కనెక్షన్లకు 45 రోజులు, నాన్ పీఎంయూవై సింగిల్ సిలిండర్ కనెక్షన్లకు 25 రోజులు, అదే డబుల్ సిలిండర్ కనెక్షన్కు అయితే 35 రోజులు గ్యాప్ తప్పనిసరిగా ఉండేలా మార్పులు చేసినట్లు ప్రచారం జరిగింది.కేంద్రం, ఐవోసీఎల్ వివరణఈ వార్తలను కేంద్ర ప్రభుత్వం పూర్తిగా కొట్టిపారేసింది. అటువంటి నిబంధనలేవీ తీసుకురాలేదని, పాత పద్ధతే కొనసాగుతుందని వివరించింది. ప్రస్తుతం ఉన్న నిబంధనల ప్రకారం.. కనెక్షన్లతో సంబంధం లేకుండా ఒకసారి గ్యాస్ సిలిండర్ బుక్ చేసుకున్నాక మళ్లీ మరోసారి గ్యాస్ బుక్ చేసుకోవాలంటే పట్టణ ప్రాంతాల్లో 25 రోజులు, గ్రామీణ ప్రాంతాల్లో 45 రోజులు వ్యవధి ఉండాలి.ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ లిమిటెడ్ (IOCL) కూడా స్పందిస్తూ, దేశంలో గ్యాస్ నిల్వలు పుష్కలంగా ఉన్నాయని, సరఫరాలో ఎలాంటి కొరత లేదని స్పష్టం చేసింది. "తప్పుడు సమాచారాన్ని నమ్మవద్దు, ప్రచారం చేయవద్దు. గ్యాస్ కొరత ఏర్పడుతుందనే భయంతో అనవసరంగా ముందస్తు బుకింగ్లు చేసుకోవాల్సిన అవసరం లేదు." అని పెట్రోలియం మంత్రిత్వ శాఖ వెల్లడించింది.Reports claiming changes in LPG refill booking timelines are incorrect. There is no change in the existing timelines (25 days in urban areas / 45 days in rural areas), and LPG supplies remain adequate across the country. Please rely only on official sources and avoid panic…— Indian Oil Corp Ltd (@IndianOilcl) March 25, 2026 -
ఆట మళ్లీ షురూ.. ధరలు రివర్స్!
ఇటీవల కాలంలో స్థిర ఆదాయం సమకూర్చే కమోడిటీ మార్కెట్లపైపు పెట్టుబడిదారులు మొగ్గు చూపుతున్నారు. అందులో భాగంగా బంగారం ధరల్లో మార్పులు వస్తున్నాయని నిపుణులు చెబుతున్నారు. యుద్ధం నేపథ్యంలో ఒక్కసారిగా భారీగా పడిన పసిడి, వెండి ధరలు ఈరోజు మార్కెట్లో తిరిగి పుంజుకుంటున్నట్లు తెలుస్తుంది. రిటైల్ ఇన్వెస్టర్లు కాకుండా కేంద్ర బ్యాంకులు బంగారం కొనుగోలు, అమ్మకాల ర్యాలీలో పాల్గొంటేనే ధరలు అధికంగా ప్రభావితం అవుతాయని కొందరు అంచనా వేస్తున్నారు. దేశంలోని ప్రధాన నగరాల్లో ఈరోజు బంగారం, వెండి ధరలు(Today Silver Rate) ఎలా ఉన్నాయో కింద తెలుసుకుందాం.(Disclaimer: పైన పేర్కొన్న బంగారం, వెండి ధరలు సూచనపూర్వకమైనవి మాత్రమే. వీటిపై జీఎస్టీ, టీసీఎస్, ఇతర పన్నులు, సుంకాలు అదనంగా ఉండవచ్చు. ఖచ్చితమైన ధరల కోసం మీ స్థానిక నగల దుకాణంలో సంప్రదించండి.) -
ఇక ఆరంభం.. తారుమారైన గోల్డ్ రేటు!
వారం రోజులుగా భారీగా తగ్గుతున్న బంగారం ధరలకు ఒక్కసారిగా బ్రేక్ పడింది. దీంతో పసిడి ధరల పరుగు మళ్లీ మొదలైంది. ఈ కథనంలో దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం ధరలు ఎలా ఉన్నాయి?, ఉదయం ధరలకు.. సాయంత్రం ధరలకు మధ్య వ్యత్యాసం ఎలా ఉంది? అనే వివరాలు ఈ కథనంలో తెలుసుకుందాం.హైదరాబాద్, విజయవాడలలో.. ఈ రోజు (మార్చి 24) ఉదయం 1,40,350 రూపాయల వద్ద ఉన్న తులం బంగారం ధర.. సాయంత్రానికి 1,42,910 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది. 22 క్యారెట్ల ధర 1,28,650 రూపాయల నుంచి 1,31,000 రూపాయల (రూ.2560 పెరిగింది) వద్దకు చేరింది.ఢిల్లీలో కూడా బంగారం ధరల్లో స్వల్ప మార్పులు జరిగాయి. తులం 24 క్యారెట్ల రేటు రూ.1,40,500 నుంచి రూ.143060 వద్దకు చేరింది. 22 క్యారెట్ల 10 గ్రాముల గోల్డ్ రేటు 128800 రూపాయల నుంచి రూ.131150 వద్దకు చేరింది. దీన్నిబట్టి చూస్తే.. గోల్డ్ రేటు గంటల వ్యవధిలో ఎంతలా మారిందో స్[స్పష్టంగా అర్థం చేసుకోవచ్చు.చెన్నై విషయానికి వస్తే.. ఈ నగరంలో 24 క్యారెట్ల తులం బంగారం రూ.970 తగ్గి.. 144560 రూపాయలు వద్ద, 22 క్యారెట్ల రేటు 900 రూపాయలు తగ్గి, రూ.132500 వద్దకు చేరింది. మొత్తం మీద పడిపోతున్నాయన్న బంగారం ధరలు మళ్లీ పుంజుకున్నాయి.వెండి ధరలు ఇలాబంగారం బాటలోనే వెండి అన్నట్లు.. ఉదయం కేజీపైన రూ.10000 తగ్గి రూ.2.40 లక్షల వద్ద ఉన్న సిల్వర్.. సాయంత్రానికి రూ.2.50 లక్షలకు చేరుకుంది. అంటే వెండి కూడా పెరుగుదలవైపు అడుగులు వేస్తున్నట్లు స్పష్టంగా అర్థమవుతోంది. -
అందరికీ విమాన ప్రయాణం ఫ్రీ అంటే పోలా.. గెలిచిన తర్వాత హామీల సంగతి దేవుడెరుగు!!
-
ఎట్టకేలకు ఓటీటీలోకి 'అవతార్ 3' సినిమా
'అవతార్' సినిమాల గురించి సినీ ప్రేక్షకులకు ప్రత్యేక పరిచయం అక్కర్లేదు. ఇప్పటివరకు మూడు భాగాలు రిలీజ్ కాగా.. మరో రెండు పార్ట్ థియేటర్లలోక రావాల్సి ఉంది. అయితే 2009లో వచ్చిన తొలి పార్ట్ అద్భుతమైన హిట్ కాగా.. 2022లో వచ్చిన సీక్వెల్ పర్లేదు బాగానే ఉందనే రెస్పాన్స్ అందుకుంది. గతేడాది డిసెంబరులో రిలీజైన మూడో పార్ట్ చాలా మందికి నచ్చలేదు. కానీ కలెక్షన్స్ మాత్రం రూ.12 వేల కోట్లకు పైనే వచ్చాయి. అందరూ ఈ మూవీ గురించి దాదాపు మర్చిపోయారు. ఇలాంటి టైంలో ఓటీటీలోకి వచ్చేందుకు సిద్ధమైంది.(ఇదీ చదవండి: ధురంధర్ 2 ఎఫెక్ట్.. స్టార్ హీరో సినిమా వాయిదా)జేమ్స్ కామెరూన్ తీసిన మూడో భాగం 'అవతార్ ఫైర్ అండ్ యాష్'.. గతేడాది డిసెంబరు 19న పెద్దగా అంచనాల్లేకుండానే థియేటర్లలోకి వచ్చింది. అనుకున్నట్లే పెద్దగా మెప్పించలేకపోయింది. గ్రాఫిక్స్ బాగున్నప్పటికీ మళ్లీ అదే టైపు స్టోరీ కావడంతో జనాలు లైట్ తీసుకున్నారు. కొందరు మాత్రం చూశారు. అలా కొన్నాళ్ల పాటు థియేటర్లలో ప్రదర్శితమైంది. ఇప్పుడు దాదాపు మూడు నెలల తర్వాత అంటే ఈ నెల 31 నుంచి అమెజాన్ ప్రైమ్, ఆపిల్ టీవీ ప్లస్ ఓటీటీల్లో అద్దె ప్రాతిపదికన స్ట్రీమింగ్ కానుంది.అమెజాన్ ప్రైమ్లో ఇంగ్లీష్లో మాత్రమే స్ట్రీమింగ్ కానుంది. ఇకపోతే మన దగ్గర డిజిటల్ హక్కుల్ని దక్కించుకున్న హాట్స్టార్లో ఏప్రిల్ లేదా మే నెలలో ప్రాంతీయ భాషలైన తెలుగు, తమిళ, కన్నడ, హిందీలోనూ అందుబాటులోకి వచ్చే అవకాశముందని మాట్లాడుకుంటున్నారు. మరి మన దగ్గర థియేటర్లలో రూ.225 కోట్ల మేర వసూళ్లు మాత్రమే రాబట్టిన ఈ చిత్రం ఓటీటీలో ఎలాంటి స్పందన అందుకుంటుందో చూడాలి?'అవతార్ 3' విషయానికొస్తే.. రెండో పార్ట్ 'అవతార్: ద వే ఆఫ్ వాటర్' సంఘటనల తర్వాత జేక్ సల్లీ (శ్యామ్ వర్తింగ్టన్), నేతిరి (జో సల్దానా) జంట తమ పెద్ద కొడుకు కోల్పోయిన బాధలో ఉంటారు. పిల్లలతో కలిసి జీవిస్తుంటారు. తన వల్లే సోదరుడు చనిపోయాడనే అపరాధ భావంతో జేక్ కొడుకు లోక్ ఉంటాడు. రెండో భాగంలో చనిపోయిన కల్నల్ క్వారిచ్ (స్టీఫెన్ లాంగ్).. నావీ తెగకు చెందిన వ్యక్తిలా మళ్లీ వచ్చి జేక్పై ప్రతీకారానికి సిద్ధమవుతాడు. ఈసారి కల్నల్కి అగ్ని తెగకు చెందిన నాయకురాలు వరంగ్ (ఊనా చాప్లిన్) తోడవుతుంది. వీళ్లకు ఆర్డీఏ బృందం కూడా తోడవుతుంది. మరి ఇంతమంది శత్రువుల్ని జేక్ కుటుంబం ఎలా ఎదుర్కొంది? చివరకు ఏమైందనదే మిగతా స్టోరీ.(ఇదీ చదవండి: మహేశ్-రాజమౌళి 'వారణాసి' సెట్స్ ఇవే.. వీడియోలు వైరల్) -
పాకిస్థాన్కు ఇరాన్ బిగ్ షాక్!
టెహ్రాన్: పాకిస్థాన్కు ఇరాన్ షాకిచ్చింది. హర్మూజ్ జలసంధిలో పాక్ నౌక్ను ఇరాన్ అడ్డుకుంది. అమెరికా-ఇరాన్ మధ్య తామే మధ్యవర్తిత్వం వహిస్తున్నామంటూ పాక్ గొప్పలు చెబుతోంది. ఇరాన్ తాము చెప్పినట్లే వింటోంది అంటూ బీరాలు పలికింది. ఈ క్రమంలో హర్మూజ్ జలసంధిలో పాక్ నౌకలకు అనుమతి లేదంటూ ఇరాన్ వాటిని అడ్డుకుంది. ఇరాన్లోని హోర్ముజ్ జలసంధి వద్ద అనుమతి లేకుండా ప్రయాణించడానికి ప్రయత్నించిన కంటైనర్ నౌక సీలెన్ ను ఇరాన్ నావికాదళం వెనక్కి తిప్పింది. ఈ నౌక పాకిస్తాన్లోని కరాచీకి వెళ్తుండగా, అవసరమైన అనుమతులు లేకపోవడంతో ఇరాన్ అధికారుల చర్యలు అంతర్జాతీయ వాణిజ్యంపై దృష్టిని ఆకర్షించాయి.ఇరాన్లోని కాబూల్ రాయబార కార్యాలయం ప్రకటన ప్రకారం.. సీలెన్ అనే కంటైనర్ నౌకను ఇస్లామిక్ రివల్యూషనరీ గార్డ్ కార్ప్స్ (IRGC) నేవీ వెనక్కి తిప్పింది. నౌక చట్టపరమైన ప్రోటోకాళ్లను పాటించకపోవడం, హర్మూజ్ జలసంధి గుండా వెళ్లేందుకు అవసరమైన అనుమతి లేకపోవడమే ఇందుకు కారణమని స్పష్టం చేసింది. ‘ఈ జలసంధి గుండా ఏ నౌక అయినా ప్రయాణించాలంటే ఇరాన్ సముద్రాధికారులతో పూర్తి సమన్వయం అవసరం’ఉందని పునరుద్ఘాటించింది. ఈ సంఘటనతో పాకిస్తాన్కు వెళ్తున్న వాణిజ్య నౌకలపై ప్రభావం పడే అవకాశం ఉంది. హర్మూజ్ జలసంధి మూసివేత లేదా నియంత్రణ కఠినతరం అయితే, చమురు ధరలు, వాణిజ్య సరఫరా గొలుసుపై గణనీయమైన ప్రభావం చూపవచ్చు. ఇరాన్ తీసుకున్న ఈ చర్య, ప్రాంతీయ భద్రతా పరిస్థితులు ఎంత సున్నితంగా ఉన్నాయో మరోసారి గుర్తు చేసింది.ఇరాన్ తాజా నిర్ణయం ద్వారా రెండు ముఖ్యమైన సందేశాలు ఇచ్చింది. సముద్ర మార్గాలపై తన సార్వభౌమాధికారాన్ని కాపాడుకుంటుందనే సంకేతం ఇచ్చింది. దీంతో పాటు ప్రాంతీయ ఘర్షణల మధ్య తన నియంత్రణను మరింత బలపరుస్తుందనే ఉద్దేశాన్ని వ్యక్తం చేసింది. తద్వారా పాకిస్తాన్, ఇతర వాణిజ్య భాగస్వాములు ఈ సంఘటనను గమనించి, భవిష్యత్తులో ఇలాంటి సమస్యలు తలెత్తకుండా ఇరాన్తో సమన్వయం పెంచుకోవాల్సిన అవసరం ఉందని నిపుణులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. -
ఇళ్లలోని బంగారాన్ని బయటకు తీయించాలి!!
దేశంలోని ఇళ్లు, దేవాలయాల్లో నిరుపయోగంగా పడి ఉన్న భారీ బంగారు నిల్వలను ఆర్థిక సాధనాలుగా (Financial Assets) మార్చే ప్రక్రియను కేంద్ర ప్రభుత్వం వేగవంతం చేయాలని కేంద్ర మాజీ మంత్రి, పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సభ్యుడు పి.పి. చౌదరి పేర్కొన్నారు. అసోచామ్ (ASSOCHAM) నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ.. బంగారం 'ఆర్థికీకరణ' (Financialization) ద్వారా దిగుమతులపై ఆధారపడటం తగ్గుతుందని, తద్వారా కరెంట్ ఖాతా లోటు (CAD)పై ఒత్తిడి తగ్గుతుందని అభిప్రాయపడ్డారు.ఆర్థిక వ్యవస్థలో కీలక పాత్రరత్నాలు, ఆభరణాల రంగం భారతదేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా ఉందని చౌదరి గుర్తుచేశారు. దేశ మొత్తం సరుకుల ఎగుమతుల్లో ఈ రంగం వాటా 15 శాతం ఉందన్నారు. దాదాపు 50 లక్షల మందికిపైగా ఈ రంగం ఉపాధి కల్పిస్తోందన్నారు.50 వేల టన్నుల బంగారం నిల్వలునేషనల్ స్టాక్ ఎక్స్ఛేంజ్ (NSE) చీఫ్ బిజినెస్ డెవలప్మెంట్ ఆఫీసర్ శ్రీరామ్ కృష్ణన్ మాట్లాడుతూ, భారతీయ ఇళ్లు, దేవాలయాల్లో కలిపి సుమారు 25,000 నుండి 50,000 టన్నుల బంగారం ఉన్నట్లు అంచనా అని తెలిపారు. "మన దగ్గర పటిష్టమైన ప్లాట్ఫాం, సాంకేతికత, సామర్థ్యం ఉన్నాయి. అయితే ఎలక్ట్రానిక్ గోల్డ్ రసీదుల (EGR) వినియోగాన్ని పెంచడానికి ఉన్న అడ్డంకులను తొలగించాల్సిన అవసరం ఉంది" అని ఆయన పేర్కొన్నారు.అడ్డంకిగా 3% జీఎస్టీభౌతిక బంగారాన్ని డిపాజిట్ చేసి, షేర్ల మాదిరిగా స్టాక్ ఎక్స్ఛేంజీలలో వర్తకం చేసేందుకు ఈజీఆర్ విధానాన్ని సెబీ (SEBI) అందుబాటులోకి తెచ్చింది. అయితే, బంగారాన్ని సరెండర్ చేసే సమయంలో విధిస్తున్న 3 శాతం జీఎస్టీ (GST) దీని విస్తరణకు ప్రధాన అడ్డంకిగా మారిందని కృష్ణన్ వివరించారు. ఈ సమస్య పరిష్కారానికి సంబంధించి ఎన్ఎస్ఈ ఇప్పటికే ప్రభుత్వానికి ఒక శ్వేతపత్రాన్ని సమర్పించిందని వెల్లడించారు.పెరుగుతున్న డిమాండ్.. పుంజుకుంటున్న గోల్డ్ లోన్స్గత రెండేళ్లలో బంగారం ధరలు 30 శాతం పెరిగినప్పటికీ, ఆభరణాలకు డిమాండ్ తగ్గలేదని ఇక్రా (ICRA) ప్రతినిధి జితిన్ మక్కర్ తెలిపారు. ప్రధాన జ్యువెలరీ రిటైలర్లు 2025-26 ఆర్థిక సంవత్సరాల్లో తమ స్టోర్ నెట్ వర్క్ ను 20 శాతం మేర పెంచుకోవాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. బ్యాంకులు, ఎన్బీఎఫ్సీల గోల్డ్ లోన్ పోర్ట్ఫోలియో గతంలో రూ. 1 లక్ష కోట్లు ఉండగా, ఇప్పుడు రూ. 4 లక్షల కోట్లకు చేరడం గమనార్హం.తప్పనిసరి హాల్మార్కింగ్, 'ఇండియన్ గుడ్ డెలివరీ స్టాండర్డ్స్' వంటి నిబంధనలు దేశీయ బంగారంపై నమ్మకాన్ని పెంచాయని, ఇది దిగుమతుల నియంత్రణకు దోహదపడుతుందని నిపుణులు విశ్లేషించారు. -
‘అది వివక్ష కాదు.. ఆచారం’
న్యూఢిల్లీ: కేరళలోని శబరిమల అయ్యప్ప స్వామి ఆలయంలో మహిళల ప్రవేశంపై కొనసాగుతున్న సుదీర్ఘ వివాదంలో ట్రావెన్కోర్ దేవస్వం బోర్డు (టీడీబీ) తన వైఖరిని స్పష్టం చేస్తూ, సుప్రీంకోర్టులో కీలక వివరణ ఇచ్చింది. 10 నుండి 50 ఏళ్ల మధ్య వయస్సు గల మహిళలపై ఉన్న నియంత్రణ అనేది లింగ వివక్ష కిందకు రాదని, అది ఆలయ సంప్రదాయంలో భాగమని బోర్డు కోర్టుకు విన్నవించింది.నైష్ఠిక బ్రహ్మచర్యమే ప్రాతిపదికగా..శబరిమలలో కొలువైన అయ్యప్ప స్వామిని ‘నైష్ఠిక బ్రహ్మచారి’గా భక్తులు ఆరాధిస్తారని దేవస్వం బోర్డు తన వాదనలో పేర్కొంది. స్వామివారికి ఆధ్యాత్మిక శక్తి అనేది ఆయన ఆచరించిన తపస్సు, ఇంద్రియ నిగ్రహం, బ్రహ్మచర్యం ద్వారానే లభిస్తుందని.. ఈ క్రమశిక్షణను భక్తులు కూడా పాటిస్తారని వివరించింది. దేశవ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా అయ్యప్ప ఆలయాలు ఉన్నప్పటికీ, శబరిమల ప్రత్యేకత ఈ ‘నైష్ఠిక బ్రహ్మచర్యమే’నని బోర్డు స్పష్టం చేసింది. ఈ నేపథ్యంలోనే 10 నుంచి 50 ఏళ్ల మధ్య వయసున్న మహిళల ప్రవేశంపై నియంత్రణలు ఉన్నాయని, అయితే 10 ఏళ్లలోపు బాలికలు, 50 ఏళ్లు దాటిన మహిళల ప్రవేశానికి ఎలాంటి అభ్యంతరం లేదని గుర్తు చేసింది.అంతర్జాతీయ పరిశోధనల ప్రస్తావనతన వాదనను బలపరుచుకునేందుకు దేవస్వం బోర్డు అంతర్జాతీయ స్థాయి పరిశోధనా పత్రాలను సుప్రీంకోర్టుకు సమర్పించింది. 1987లో ఒట్టావాలోని కార్లెటన్ యూనివర్శిటీకి చెందిన రాధికా శేఖర్ సమర్పించిన థీసిస్తో పాటు, 2003లో ‘రాయల్ ఆంత్రోపాలజికల్ ఇనిస్టిట్యూట్’ ప్రచురించిన అధ్యయనాలను బోర్డు గుర్తు చేసింది. ఈ పరిశోధనల ప్రకారం.. శబరిమలలో వయోపరిమితి అనేది పురాతన మతపరమైన ఆచారమే తప్ప, సమానత్వ హక్కులను కాలరాయడం కాదని బోర్డు ‘సుప్రీం’లో వాదించింది. ఒక సమూహాన్ని లేదా వర్గాన్ని ‘మతపరమైన శాఖ’గా గుర్తించాలా వద్దా అనేది కేవలం చట్టపరమైన అంశమే కాదని, అది వాస్తవాలతో కూడిన విషయమని బోర్డు అభిప్రాయపడింది. డాక్యుమెంటరీ ఆధారాలను క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతనే కోర్టు దీనిపై నిర్ణయం తీసుకోవాలని కోరింది.ఇది కూడా చదవండి: ‘వెయిటింగ్ లిస్ట్’లో వందే భారత్ స్లీపర్ -
రింకూ సింగ్కు ప్రభుత్వ ఉద్యోగం.. జీతం ఎంతంటే?
టీ20 వరల్డ్కప్ విన్నర్, టీమిండియా స్టార్ క్రికెటర్ రింకూ సింగ్కు అరుదైన గౌరవం దక్కింది. రింకూ సింగ్ను రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ (RSO)గా ఉత్తర ప్రదేశ్ ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం లక్నోలోని లోక్ భవన్లో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో నియామక పత్రాన్ని రింకూకు ముఖ్యమంత్రి యోగి ఆదిత్యనాథ్ అందజేశారు.కాగా వరల్డ్కప్ సమయంలో రింకూ తండ్రి మరణించినప్పటికి.. అంత్యక్రియలు ముగిసిన వెంటనే తిరిగి జట్టుతో చేరి తన అంకిత భావాన్ని చాటుకున్నాడు. రింకూ ఈ టోర్నీలో మొత్తం 5 ఇన్నింగ్స్లో 24 పరుగులు మాత్రమే చేశాడు. అయితే చాలా మ్యాచ్లలో అతడు ఆఖరిలో బ్యాటింగ్కు వచ్చాడు. పాక్పై కేవలం 4 బంతుల్లోనే 11 పరుగులు చేశాడు.ఓ వైపు గుండె నిండా బాధ ఉన్నప్పటికి.. భారత్ సాధించిన చారిత్రత్మక విజయంలో రింకూ భాగమయ్యాడు. దీంతో అతడి అంకితభావానికి గుర్తింపుగా రాష్ట్ర ప్రభుత్వం ఈ ఉద్యోగంతో సత్కరించింది. ఉత్తరప్రదేశ్లో రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్ పోస్ట్ గ్రూప్-ఏ కిందికి వస్తుంది. జీతం, అలవెన్సులతో కలిపి రూ. 70,000 వరకు చేతికి అందుతుంది. ఇక రింకూ సింగ్తో పాటు అంతర్జాతీయ స్థాయిలో పతకాలు సాధించిన మరో ఐదుగురు అథ్లెట్లకు కూడా ప్రభుత్వం ఉద్యోగాలను ప్రకటించింది.నియమాక పత్రాలు అందుకున్న వారు వీరేరింకూ సింగ్: రీజినల్ స్పోర్ట్స్ ఆఫీసర్రాజ్కుమార్ పాల్ (హాకీ): పారిస్ ఒలింపిక్స్లో కాంస్య పతకం గెలిచిన హాకీ జట్టు సభ్యుడు రాజ్కుమార్ పాల్ను డీఎస్పీ గా నియమించారు.ప్రవీణ్ కుమార్ (పారా హైజంప్): పారాలింపిక్ స్వర్ణ పతక విజేత ప్రవీణ్ కుమార్కు కూడా డీఎస్పీ హోదా కల్పించారు.అజిత్ సింగ్, సిమ్రాన్: పారాలింపిక్స్ పతక విజేతలు అజిత్ సింగ్, సిమ్రాన్లను జిల్లా పంచాయతీ రాజ్ ఆఫీసర్లుగా నియమించారు.లక్ష్మణ్, రాణి లక్ష్మీబాయి పురస్కారాలు:ఉద్యోగాలతో పాటు 2024-25 సంవత్సరానికి గాను తొమ్మిది మంది క్రీడాకారులకు రాష్ట్ర అత్యున్నత పురస్కారాలైన లక్ష్మణ్ అవార్డు, రాణి లక్ష్మీబాయి అవార్డులను అందజేశారు. వీరికి రూ. 3.11 లక్షల నగదు బహుమతితో పాటు కాంస్య విగ్రహాన్ని బహూకరించారు. క్రీడల్లో రాణించే వారికి ప్రభుత్వ ఉద్యోగాలు, నగదు ప్రోత్సాహకాలు అందించే కొత్త పథకంలో భాగంగా ఈ నియామకాలు జరిగాయి.చదవండి: IND vs SA: సౌతాఫ్రికా టూర్కు భారత జట్టు ప్రకటన -
కివీస్ కెప్టెన్ శతకం.. చిత్తుగా ఓడిన సౌతాఫ్రికా
సొంతగడ్డపై సౌతాఫ్రికా మహిళల జట్టుతో జరిగిన టీ20 సిరీస్లో న్యూజిలాండ్ జట్టు దుమ్మురేపింది. ఇప్పటికే టీ20 సిరీస్ను సొంతం చేసుకున్న కివీస్ మహిళలు తాజాగా చివరి టీ20లోనూ విజయం సాధించి 4-1తో సిరీస్ చేజేక్కించుకొని స్పష్టమైన ఆధిపత్యం కనబరిచింది. క్రైస్ట్చర్చి వేదికగా బుధవారం జరిగిన ఐదో టీ20లో సౌతాఫ్రికా మహిళల జట్టు చిత్తుగా ఓడిపోయింది. తొలుత బ్యాటింగ్ చేసిన న్యూజిలాండ్ నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 194 పరుగులు చేసింది. కెప్టెన్ అమేలియా కెర్ (55 బంతుల్లో 105; 19 ఫోర్లు, 1 సిక్సర్) అంతర్జాతీయ టీ20 కెరీర్లో తొలి సెంచరీతో ఆకట్టుకోగా.. బ్రూక్ హాలిడే (26), జార్జియా పిల్మర్ (27) కీలక ఇన్నింగ్స్ ఆడారు. సఫారీ బౌలర్లలో కాకా, తుమి సెకుహునేలు చెరో 3 వికెట్లు పడగొట్టారు. అనంతరం 195 పరుగుల టార్గెట్తో బరిలోకి దిగిన సౌతాఫ్రికా వుమెన్ 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 102 పరుగులు మాత్రమే చేసింది. అన్నిరే డెర్క్సెన్ (23) టాప్ స్కోరర్గా నిలవగా మిగతా బ్యాటర్లు పరుగులు సాధించడంలో విఫలమయ్యారు. నూజిలాండ్ బౌలర్లలో లియా తాహుహు 3 వికెట్లు తీయగా, సోఫీ డివైన్, అమేలియా కెర్లు చెరో 2 వికెట్లు పడగొట్టారు. ఆల్రౌండ్ ప్రదర్శనతో అదరగొట్టిన అమేలియా కెర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’తో పాటు ‘ప్లేయర్ ఆఫ్ ది సిరీస్’ అవార్డులు గెలుచుకుంది. ఇరుజట్ల మధ్య తొలి వన్డే ఆదివారం జరగనుంది.రికార్డులకు పాతర..ఈ మ్యాచ్లో సెంచరీ ద్వారా అమేలియా కెర్ పలు రికార్డులను తన పేరిట లిఖించుకుంది. ఐదో టీ20లో సెంచరీ చేయడం ద్వారా అంతర్జాతీయ క్రికెట్లో తొలి టీ20 సెంచరీ మార్క్ను అందుకుంది. అంతేకాదు టీ20 క్రికెట్లో వరుసగా 11సార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేసిన తొలి బ్యాటర్గా అమేలియా కెర్ చరిత్రకెక్కింది. సఫారీలతో జరిగిన నాలుగో టీ20లోనే ఈ రికార్డు అందుకున్నప్పటికీ తాజాగా సెంచరీతో తన రికార్డును మరింత మెరుగుపరుచుకుంది. అమేలియా కెర్ కంటే ముందు చమేరీ ఆటపట్టు, రెబెక్కా బ్లేక్లు చెరో 9సార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. పురుషుల క్రికెట్లో భారత క్రికెటర్లు రోహిత్ శర్మ, అభిషేక్ శర్మలు చెరో ఏడుసార్లు 30 ప్లస్ స్కోర్లు నమోదు చేశారు. గత 11 ఇన్నింగ్స్ల్లో 669 పరుగులు చేసిన అమేలియా బౌలింగ్లోనూ 12 వికెట్లు పడగొట్టింది. ఇటీవలే మహిళల టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా వెయ్యి పరుగులు, వంద వికెట్లు తీసిన తొలి మహిళా క్రికెటర్గా అమేలియా కెర్ నిలిచింది.చదవండి: క్రికెటర్ నుంచి చైర్మన్ దాకా.. ఎవరీ ఆర్యమాన్ బిర్లా?
