breaking news
YSR District Latest News
-
రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీలకు డీఏవీ భారతి స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 24వ తేదీన రాజంపేటలోని ప్రభుత్వ పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి బాల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్తుత్యమ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆయన వివరించారు. ఈ నెల 29 నుంచి 31వ తేదీ వరకు ప్రకాశం జిల్లా చేవూరులో జరిగే రాష్ట్ర స్థాయి బాల్ బ్యాడ్మింటన్ సీనియర్ విభాగం పోటీల్లో ఆ విద్యార్థిని పాల్గొంటుందన్నారు. భారతి సిమెంట్స్ సీఎంఓ సాయి రమేష్, హెచ్ఆర్ గోపాల్రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. -
టీడీపీలో భగ్గుమన్న వర్గ విభేదాలు
● భూ వివాదంపై టీడీపీ మండల అధ్యక్షుడిపై దాడి ● పోలీసు స్టేషన పక్కనే పరస్పరం రాళ్లు రువుకున్న టీడీపీ నాయకులు ● ప్రేక్షక ప్రాత వహించిన పోలీసులుపెండ్లిమర్రి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో వాటాల కోసం.. భూ ఆక్రమణల కోసం నిత్యం కుమ్ములాటలు ఎక్కువయ్యాయి. ముఖ్యంగా తెలుగు తమ్ముళ్ల మధ్యే వర్గ విభేదాలు భగ్గుమంటున్నాయి. తాజాగా పెండ్లిమర్రి మండంలో వాటాల కోసం పోలీసుల ముందే ఇరువర్గాలు గొడవలకు దిగన ఘటన చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. పెండ్లిమర్రి మండల టీడీపీలో మంగళవారం వర్గ విభేదాలు భగ్గుమన్నాయి. భూ వివాదంలో జోక్యం చేసుకున్నాడని టీడీపీ మండల అధ్యక్షుడు గంగిరెడ్డిపై అదే పార్టీకి చెందిన టీడీపీ నాయకులు మల్లికార్జునరెడ్డి, సాంబశివారెడ్డి, శివారెడ్డి దాడి చేశారు. దాడిలో గంగిరెడ్డికి స్వల్ప గాయాలయ్యాయి. పెండ్లిమర్రి గ్రామానికి చెందిన మల్లికార్జునరెడ్డికి కోరవాండ్లపల్లె బీసీ కాలనికి చెందిన యాదవులకు గత కొంత కాలం నుంచి భూవివాదం నడుస్తోంది. ఈ వివాదంలో టీడీపీ మండల అధ్యక్షుడు జోక్యం చేసుకుటున్నాడని అతనిపై దాడికి దిగారు. కొద్దిసేపటికి ఇరువర్గాల వారు అనుచరులను పిలుపించుకొని పోలీసు స్టేషన్ పక్కనే రాళ్లు, కర్రలతో పరస్పరం దాడులు చేసుకున్నారు. దాడుల్లో ఇరువర్గాల వారికి గాయాలయ్యాయి. పోలీస్ స్టేషన్ సమీపంలోనే ఇరువర్గాలు దాడులు చేసుకుంటున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహిస్తూ మిన్నకుండిపోయారు. గొడవ పూర్తిగా ముగిసిన తర్వాత పోలీసు బలగాలను పిలిపించి మమ అనిపించారు. -
రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో రాణించిన సునంద
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ కాలనీకి చెందిన చౌడం సునంద రాష్ట్ర స్థాయి యోగాసన పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారు. ఈ నెల 21 నుంచి 25 వరకు తాడేపల్లి గూడెం సరస్వతి విద్యాలయం ప్రత్తిపాడులో జరిగిన 6వ రాష్ట్ర స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025 పోటీల్లో పాల్గొన్న సునంద 35–40 ఏజ్ గ్రూప్లోని ట్రెడిషనల్ ఆసనాల పోటీల్లో ప్రథమ స్థానంలో నిలిచి బంగారు పతకం అందుకున్నారు. అలాగే ట్విస్టింగ్ ఆసనాల పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి రజత పతకం సాధించారు. కాగా సెప్టెంబర్ నెలలో ఛత్తీస్ఘడ్లో జరిగే జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై న సునందను పలువురు భారతి పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు అభినందించారు. -
బ్రహ్మంసాగర్లో పడి మహిళ మృతి
బ్రహ్మంగారిమఠం: మండల పరిధిలోని సోమిరెడ్డిపల్లె పంచాయతీ నరసన్నపల్లి గ్రామానికి చెందిన మడక లక్ష్మిదేవి(39) అనే మహిళ మంగళవారం బ్రహ్మంసాగర్లో గల్లంతై మృతి చెందింది. బాధితులు, కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. ఇటీవల లక్ష్మీదేవి కూతురు అకస్మాత్తుగా మృతి చెందింది. అప్పటి నుంచి మానసికంగా బాధపడుతున్న లక్ష్మిదేవి తన కుమారుడు స్వరూప్ను వెంటబెట్టుకుని మంగళవారం తెల్లవారుజామున బ్రహ్మంగారి దర్శనం కోసం ఊరి నుంచి వెళ్లింది. ఈ క్రమంలో బ్రహ్మంగారిమఠం సమీపంలోని బ్రహ్మంసాగర్లో స్నానం చేస్తుండగా గల్లంతైంది. తన కుమారుడి ద్వారా ఈ విషయం విషయం తెలుసుకున్న గ్రామస్థులు సంఘటనా స్థలానికి చేరుకుని లక్ష్మీదేవి మృతదేహాన్ని వెలికి తీశారు. మృతురాలి భర్త మడక రమణయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు. -
ఇద్దరు ఘరానా దొంగల అరెస్టు
కడప అర్బన్ : ఇళ్లలో చోరీలకు పాల్పడుతున్న ఇద్దరు ఘరానా దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 383 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు, 30 వేల రూపాయల నగదు స్వాధీనం చేసుకున్నట్లు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. మంగళవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కడప రవీంద్ర నగర్కు చెందిన సయ్యద్ ఇర్ఫాన్, కడప నగరం బాచరావు వీధికి చెందిన షేక్ ఇబ్రహీం ఖలీలుల్లా గతంలో సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలో ఓ చోరీ కేసులో నిందితులుగా ఉన్నారని తెలిపారు. చోరీలకు పాల్పడిన నాలుగు ఘటనల్లో నిందితులు నేరాన్ని అంగీకరించారని తెలిపారు. చిన్న చౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని ఎన్జీఓ కాలనీలో ఒక ఇంటిలో ఇద్దరూ కలిసి దొంగతనానికి పాల్పడగా, సయ్యద్ ఇర్ఫాన్ రవీంద్రనగర్, మురాదియానగర్ ప్రాంతాల్లోని రెండు ఇళ్లలో బంగారు, వెండి వస్తువులను దొంగిలించినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 43 గ్రాముల బరువు గల బంగారు ఆభరణాలు, 340 గ్రాముల బరువు గల వెండి వస్తువులు, రూ. 30,000 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. మంగళవారం తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులోని నానాపల్లి క్రాస్ రోడ్డులో సయ్యద్ ఇర్ఫాన్, షేక్ ఇబ్రహీమ్ ఖలీలుల్లాను అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వరరెడ్డి, రవికుమార్, హెడ్ కానిస్టేబుళ్లు వేణుగోపాల్, శివకుమార్, కానిస్టేబుళ్లు ఖాదర్ హుస్సేన్, ప్రదీప్ కుమార్, ఓబులేసు, సుధాకర్ యాదవ్, మాధవరెడ్డి, రంతుబాషాలకు రివార్డుల కోసం సిఫార్సు చేస్తున్నామని తెలిపారు.383 గ్రాముల బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం -
బైకు అదుపు తప్పి ఒకరి మృతి
సిద్దవటం : మండలంలోని కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. ఆయన మాట్లాడుతూ బద్వేల్కు చెందిన షేక్ నాయబ్రసూల్(22), పి.హర్షవర్ధన్ అనే యువకులు కడప నుంచి మంగళవారం సాయంత్రం ద్విచక్రవాహనంలో బద్వేల్కు బయలుదేరారు. వారు అతివేగంగా ప్రయాణిస్తూ కంట్రోల్ చేసుకోలేక సిద్ధవటం మండలం కనుమలోపల్లి గ్రామ సమీపంలోని కామాక్షమ్మ గుడి వద్ద రోడ్డు పక్కన ఉన్న సూచిక బోర్డును ఢీకొని రోడ్డు పక్క చెట్లలో ఎగిరిపడ్డారు. ఈ ప్రమాదంలో బద్వేల్లోని మహబూబ్నగర్కు చెందిన షేక్ నాయబ్రసూల్ తలకు బలమైన గాయం తగలడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ వెనక కూర్చున్న బద్వేల్లోని మహబూబ్నగర్కు చెందిన పి.హర్షవర్ధన్కు తీవ్ర గాయాలయ్యాయి. ఇతన్ని వైద్యం కోసం పోలీసులు 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిద్ధవటం ఎస్ఐ మహమ్మద్రఫీ ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి, నాయబ్రసూల్ మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు.మరొకరికి గాయాలు -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం
కొండాపురం : మండల పరిధిలోని లావనూరు సమీపంలో సాయిబాబాగుడి దగ్గర మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో రామాంజనేయులు(24), శివకుమార్ (27) దుర్మరణం చెందారు. వీరు బైకుపై వస్తుండగా స్కార్పియో వాహనం ఢీ కొన్నట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. అనంతపురం జిల్లా యల్లనూరు మండలంలోని దుగ్గుపల్లె వద్ద పంప్ హౌస్లో నాలుగురోజుల నుంచి అక్కడ పని చేసి తిరిగి కొండాపురానికి బైకుపై వస్తుండగా లావనూరు వద్ద స్కార్పియో వాహనం ఢీ కొంది. రామంజనేయులు అక్కడికక్కడే మృతి చెందాడు. శివకుమార్ను 108 వాహనంలో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతులు అనంతపురం జిల్లా పెనుగొండకు చెందినవారని ఎస్ఐ తెలిపారు. ఈ ఘటనపై కేసు నమోదు చేశామన్నారు. -
బాకీ చెల్లించలేదని దళిత యువకుడి హత్య
దువ్వూరు : బాకీ చెల్లించలేదని దళిత యువకుడిని హత్య చేసిన ఘటన దువ్వూరు మండలం మదిరేపల్లె గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మదిరేపల్లె గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పాలగిరి చెన్నయ్య (29) అదే గ్రామానికి చెందిన అమ్మిరెడ్డి సంజీవరెడ్డి అనే వ్యక్తి వద్ద పనులకు వెళ్లేవాడు. ఈ క్రమంలో అవసర నిమిత్తమై డబ్బు అప్పుగా తీసుకుని చెల్లించేవాడు. మూడు నెలల క్రితం సంజీవరెడ్డి నుంచి చెన్నయ్య రూ.లక్ష అప్పుగా తీసుకున్నాడు. రెండు నెలల క్రితం తనకు అవసరం ఉందని డబ్బు ఇవ్వాలని సంజీవరెడ్డి అడుగగా తన వద్ద ఇప్పుడు డబ్బు లేదని చెప్పడంతో చెన్నయ్య, సంజీవరెడ్డి గొడవపడ్డారు. ఈ క్రమంలో ఈనెల 24న సాయంత్రం 4 గంటల సమయంలో చెన్నయ్య ఇంటి దగ్గరికి సంజీవరెడ్డి వచ్చి గుడిపాడు గ్రామంలో పని ఉంది పోయి వద్దాం రా అని పిలుచుకుని వెళ్లాడు. అదే రోజు రాత్రి చిన్నసింగనపల్లె – మనేరాంపల్లె మధ్యలో నారుపల్లె మోహన్రెడ్డి తోట వద్ద చెన్నయ్యపై సంజీవరెడ్డి విచక్షణా రహితంగా దాడిచేసి మోటార్ బైక్తో తొక్కించాడు. రాత్రి 9 గంటల సమయంలో చెన్నయ్య చిన్నాన్న కొడుకు పాలగిరి యోనాకు సంజీవరెడ్డి ఫోన్ చేసి మీ వాన్ని కొట్టిపడేసినా.. ఆస్పత్రికి తీసుకెళ్లాలని చెప్పాడు. చెన్నయ్య బంధువులు సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే తీవ్ర గాయాలతో అపస్మారక స్థితిలో చెన్నయ్య పడి ఉన్నాడు. వెంటనే వారు ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అక్కడి వైద్యులు మెరుగైన వైద్యం కోసం రిమ్స్కు తీసుకెళ్లాలని సూచించడంతో అక్కడి తీసుకెళ్లారు. రిమ్స్ నుంచి కర్నూలు తీసుకెళ్లగా అక్కడ పరిస్థితి విషమించండంతో తిరుపతి రుయా ఆస్పత్రికి అంబులెన్స్లో తరలిస్తుండగా మార్గమధ్యంలో చెన్నయ్య పలకకపోవడంతో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. సోమవారం రాత్రి 11 గంటలకు ప్రభుత్వ ఆస్పత్రి వైద్యులు పరీక్షించి చెన్నయ్య మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతునికి భార్య శిరీష, ఇద్దరు కుమార్తెలు మహిమరాణి, మేఘన ఉన్నారు. విషయం తెలుసుకున్న మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రిలో చెన్నయ్య మృతదేహాన్ని పరిశీలించి, మండలంలోని మదిరేపల్లె గ్రామానికి వచ్చి సంఘటన స్థలాన్ని పరిశీలించి గ్రామస్తులను విచారించారు. ఈ సంఘటనపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటి, హత్య కేసు నమోదు చేశామని, నిందితుడు సంజీవరెడ్డిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. కుటుంబాన్ని పోషించే కొడుకు హత్యకు గురికావడంతో చెన్నయ్య తల్లిదండ్రులు, భార్యా, పిల్లలు కన్నీరుమున్నీరయ్యారు. నిందితుడిని కఠినంగా శిక్షించి న్యాయం చేయాలని వారు కోరారు. -
కౌన్సెలింగ్ ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్ : కడప నగర శివార్లలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో సోమవారం నిర్వహించిన తొలి విడత కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. ఇందులో భాగంగా బీఎఫ్ఏ ఫోర్ ఇయర్స్ డిగ్రీ ఫైన్ ఆర్ట్స్ కోర్సులకు కౌన్సెలింగ్ను నిర్వహించారు. ఇందులో భాగంగా 70 శాతం విద్యార్థులు కౌన్సిలింగ్కు హాజరై వీసీ డాక్టర్ జి.విశ్వనాఽథ్ కుమార్ చేతుల మీదుగా విద్యార్థులు సీట్ అలాట్మెంట్ పొందారు. సెప్టెంబర్ 3న రెండవ దశ కౌన్సెలింగ్ డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్యూలో సెప్టెంబర్ 3న బీఎఫ్ఎ/బి డిజైన్ కోర్సులకు 2వ దశ కౌన్సెలింగ్ ఉంటుందని వీసీ తెలిపారు. మరింత సమాచారం కోసం www.yrrafuac.in వైబ్సెటును సందర్శించాలని ఆయన తెలిపారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు ప్రాధాన్యతకడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికకు అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఆయా ఫిర్యా దు లపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరి ష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశించారు. సోమ వారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’ (పీజీఆర్ఎస్) నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 120 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాము ఖి మాట్లాడారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం పాల్గొన్నారు.డీసీసీ బ్యాంకు అభివృద్ధికి కృషి చేయాలి– ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కడప అగ్రికల్చర్ : డీసీసీ బ్యాంకు అభివృద్ధికి ఉద్యోగులంతా సమిష్టిగా కృషి చేయాలని ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు పేర్కొన్నారు. సోమవారం కడపలోని డీసీసీ బ్యాంకును బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డితో కలిసి ఆకస్మికంగా సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన బ్యాంకు స్థితిగతుల గురించి అరా తీశారు. అనంతరం చైర్మన్ అధ్యక్షతన సమీక్షా సమావేశం నిర్వహించారు. జిల్లా రైతాంగానికి డీసీసీ బ్యాంకు అండగా నిలవాలని అందుకు ఎన్ని కోట్ల రుణాలు కావాలన్నా కడపకు మంజూరు చేసేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. డీసీసీ బ్యాంకు సీఈఓ రాజామణి, డీజీఎం ప్రతాప్రెడ్డి పాల్గొన్నారు.28న డీఎస్సీ అభ్యర్థులసర్టిఫికెట్ల పరిశీలనకడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ –2025 అభ్యర్థులకు ఈనెల 28వ తేదీ ఉదయం 8 గంటల నుంచి ఒరిజినల్ సర్టిఫికెట్ల పరిశీలన కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ సర్టిఫికెట్ల పరిశీలన కడప బాలాజీనగర్లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాల వేదికగా నిర్వహించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు పరిశీలన నిమిత్తం తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని తెలిపారు. గణపతి ఆకృతిలో విద్యార్థులు కలసపాడు : వైఎస్సార్ కడప జిల్లాలోని కలసపాడులో సెయింట్ ఆంటోని ఇంగ్లీషు మీడియం ఉన్నత పాఠశాలలో వినాయక చవితి ఉత్సవాల్లో భాగంగా సోమవారం విద్యార్థులు గణపతి ఆకృతిలో ప్రదర్శన ఇచ్చారు. ఈ సందర్భంగా పాఠశాల కరస్పాండెంట్ చిత్తా రాజశేఖర్రెడ్డి మాట్లాడుతూ సర్వ మతాలకు అతీతంగా పండుగల సందర్భంలో విద్యార్థుల్లోని సృజనాత్మకతను వెలికి తీసేందుకు ఇలాంటి కార్యక్రమాలు చేపడుతున్నట్లు తెలిపారు. గ్రామాల్లో మట్టితో తయారు చేసిన విగ్రహాలను పూజించాలని సూచించారు. -
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : గణేష్ ఉత్సవాల్లో మట్టి వినాయక ప్రతిమలను వినియోగించి పర్యావరణ పరిరక్షణలో భాగస్వామ్యం కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సోమవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గణేష్ ఉత్సవాల్లో పర్యావరణ సహిత మట్టి విగ్రహాల వాడకాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో అవగాహన పెంచేలా.. రాష్ట్ర పర్యావరణ నియంత్రణ మండలి వారు రూపొందించిన పోస్టర్లను కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా పొల్యూషన్ కంట్రోల్ బోర్డు అధికారులు కలెక్టర్కు మట్టి వినాయకుడి ప్రతిమను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో మట్టివిగ్రహాల వినియోగాన్ని ప్రోత్సహిస్తూ ప్రజల్లో పూర్తి స్థాయి అవగాహన పెంచేలా రాష్ట్ర కాలుష్య నియంత్రణ మండలి ప్రత్యేక చర్యలు తీసుకుంటోందన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ (ిపీఓపీ) విగ్రహాలను వాడడం వల్ల చెరువులు, నదులు, ఇతర జల వనరులు కాలుష్యం అవుతున్నాయన్నారు. జిల్లా పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ, జెడ్పీ సీఈవో ఓబులమ్మ, పశుసంవర్ధక శాఖ జిల్లా అధికారి డా. శారద, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, తదితర జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
కబోది..ప్రభుత్వమిది
రెండు కాళ్లు చచ్చుబడి వీల్చైర్పై ఒకరు.. రెండు కర్రల సాయంతో కష్టంగా మరొకరు.. కళ్లు కనబడక ఇంకొకరు... మాట వినబడక మరొకరు.. భారాన్ని.. దూరాన్ని లెక్కజేయకుండా కలెక్టరేట్కు వచ్చారు. వారు నడుస్తుంటే గస బుసలుకొడుతోంది.. అయినా అడుగాపకుండా కలెక్టరేట్ వైపు అడుగులేస్తున్నారు.. ‘ఏంటవ్వా’ అని పలకరిస్తే.. ‘ఏమైంది పెద్దాయనా’ అని మాట కలిపితే.. ‘మా పింఛనీ తీసేసినారంటయ్యా’ అని దీనంగా చెప్పారు. ఆ క్షణంలో తెలియకుండానే వారి కళ్లల్లోంచి కన్నీళ్లు రాలిపడ్డాయి.. నాకు 45 శాతం వైకల్యం ఉన్నప్పుడు 2010 ఆగస్టు 16వ తేది రిమ్స్ వైద్యులు సర్టిఫికెట్ ఇవ్వడంతో పెన్షన్ వచ్చేది. ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చాక వెరిఫికేషన్ పేరుతో 40 శాతం కన్నా తక్కువ వైకల్యం ఉందంటూ నోటీసులు జారీ చేసి పింఛన్ తొలగించడం అన్యాయం. – బత్తుల చిన్నవెంకటేశు, కొండూరు బీసీ కాలనీ, అట్లూరు మండలం నేను రూ. 200 ఉన్నప్పటినుంచి పెన్షన్ తీసుకుంటున్నాను. అప్పట్లో 90 శాతం వైకల్యం ఉన్నట్లు సర్టిఫికెట్ ఇచ్చారు. కూటమి ప్రభుత్వం వచ్చాక రీ వెరిఫికేషన్ పేరుతో 70 శాతమే వైకల్యం ఉందంటూ సర్టిఫికెట్జారీ చేయడం ఆశ్చర్యంగా ఉంది. ఇదంతా పెన్షన్ మొత్తాన్ని తగ్గించేందుకు చేస్తున్న కార్యక్రమం. – చిన్నగుర్రప్ప, మైలవరం నాకు 90 శాతం వైకల్యం ఉన్నట్లు 2007లో సర్టిఫికెట్ ఇచ్చారు. ఇప్పుడు 64 శాతం ఉన్నట్లు పేర్కొనడం చాలా ఆశ్చర్యంగా ఉంది. నా ఫొటోకు బ దులుగా వేరే మహిళ ఫోటో జతపరిచి సర్టిఫికెట్ ఇచ్చారు. పాత పెన్షన్ పునరుద్ధరించాలి. – డి.అఫ్జల్, శ్రీనివాసనగర్, ప్రొద్దుటూరు ఈ చిత్రంలో వీల్చైర్లో కనిపిస్తున్న వ్యక్తి పేరు షరీప్. పులివెందుల నియోజకవర్గం వేల్పుల. ఐదేళ్ల్ల క్రితం పక్షవాతంతో మంచంలో పడ్డాడు. రెండు కాళ్లు, చేతులు పనిచేయక పోవడంతో దివ్యాంగుల పెన్షన్ వస్తుంది. పెన్షన్తో పూట గడవడం ఇబ్బందిగా మారడంతో భార్య ఫకృన్నిసా వ్యవసాయం కూలిగా పని చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు కుమార్తెలు కలిగిన వీరికి కూటమి ప్రభుత్వం పిడుగులాంటి వార్త చెప్పింది. రీవెరిఫికేషన్ పేరుతో సదరం సర్టిఫికెట్ తెచ్చుకోమని అధికారులు కడప జీజీహెచ్కు రిఫర్ చేశారు. రెండో సారి నెల ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికీ పంపించారు. ప్రయాస పడి అక్కడ కూడా రీ వెరిఫికేషన్ కు హాజరయ్యా రు. చివరికి ఈ నెలలో మీకు పెన్షన్ రాదూ అని చెప్పడంతో పాపం షరీఫ్ కుటుంబ సభ్యులు భార్య, పిల్లలతో కలెక్టరేట్కుకు వచ్చారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడుకు తాము పడిన బాధలు తెలియజేశారు. ఎన్నో వ్యయ ప్రయాస పడి వేల్పుల నుంచి ఆటోలో 1500 రూపాయిలు బాడుగా చెల్లించుకొని వచ్చామని.. దయ చూపి తన భర్తకు దివ్యాంగుల పెన్షన్ పునరుద్ధరణ చేయండి సార్ అంటూ తన చిన్నారులకు చూపిస్తూ షరీఫ్ భార్య ఫకృన్నీసా కంటనీరు పెట్టింది. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
దివ్యాంగుల పెన్షన్ తొలగింపు దుర్మార్గం
కడప సెవెన్రోడ్స్ : తాము అధికారంలోకి వస్తే పెన్ష న్లు పెంచుతామని హామీలు గుప్పించిన చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చాక దివ్యాంగుల పెన్షన్లను తొలగించడం దుర్మార్గమని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. పెన్షన్ల తొలగింపు వల్ల ముఖ్యమంత్రి చంద్రబాబు చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. వైఎస్సార్ సీపీ దివ్యాంగుల విభాగం ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. వంద శాతం వైకల్యం ఉన్న వారికి కూడా 40 శాతానికి తగ్గిస్తూ పెన్షన్ ఎగ్గొట్టే కార్యక్రమానికి కూటమి ప్రభుత్వం దిగజారిందని మండిపడ్డారు. రానున్న ఎన్నికల్లో కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పాలని పిలుపునిచ్చారు. దివ్యాంగుల విభా గం జిల్లా అధ్యక్షుడు అహ్మద్బాష సచివాలయ కార్యదర్శుల ద్వారా నోటీసులు జారీ చేసి సెప్టెంబరు నెల నుంచి పెన్షన్ తొలగిస్తున్నట్లు తెలుపడం దారుణమని విమర్శించారు. తొలగించిన పెన్షన్ను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్చేశారు. తాను ప్రశ్నించే వ్యక్తిని అంటూ చెప్పుకొచ్చిన పవన్ కల్యాణ్ ఇప్పుడు ఎందుకు మౌనముద్ర దాల్చారని నిలదీశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు షఫీ, పాకా సురేష్, అక్బర్ అలీ, అజ్మతుల్లాఖాన్, పార్టీ నాయకులు శ్రీరంజన్రెడ్డి, యానాదయ్య, గౌస్బాషా, పులి సునీల్కుమార్, సీహెచ్ వినోద్కుమార్, బూసిపాటి కిశోర్కుమార్, మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీవుల్లా, బీసీ సెల్ జిల్లా ఉపాధ్యక్షుడు సుంకేసుల బాదుల్లా, మహిళా విభాగం నాయకులు టీపీ వెంకట సుబ్బమ్మ, పత్తి రాజేశ్వరి, వైఎస్ సాయిబాబా, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షురాలు సునీతరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ధర్నాలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం -
పరిష్కారం అభూతకల్పనే!
● రెవెన్యూలో పేరుకుపోతున్న ఫిర్యాదులు ● గడువులోపు పరిష్కారం వట్టిమాటే! ● రెవెన్యూ కార్యాలయాల చుట్టూ జనం ప్రదక్షిణలు కడప సెవెన్రోడ్స్ : కలెక్టరేట్లో ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వచ్చే అర్జీలు బుట్టదాఖలవుతున్నాయి. పరిష్కారానికి నోచుకక మూలనపడుతున్నాయి. వస్తున్న అర్జీల్లో సగంపైన రెవెన్యూశాఖకు సంబంధించినవే ఉన్నాయి. ముఖ్యంగా ఆన్లైన్, అసైన్మెంట్, ఫ్రీ హోల్డ్ భూముల సమస్య, సర్వే, ఆక్రమణలు, రీ సర్వేలో భూమి విస్తీర్ణం తగ్గడం, తప్పుడు రిజిస్ట్రేషన్లు వంటి సమస్యలు అధికంగా వస్తున్నా యి. కలెక్టరేట్కు వచ్చిన ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించామంటూ అధికారుల నుంచి ఆదేశాలు వెళుతున్నా క్షేత్ర స్థాయిలో అవి అమలు కావడం లేదు. దీంతో వచ్చిన వారే మళ్లీమళ్లీ గ్రీవెన్స్సెల్ చుట్టూ తిరుగుతున్నారు. అందులో కొన్ని.... దాల్మియా ఫ్యాక్టరీ నిర్మాణం వల్ల నవంబరు నుంచి మార్చి వరకు వచ్చే దుమ్ము, ధూళి వల్ల పంటలు దెబ్బతింటున్నాయి. వంకకు అడ్డంగా ఫ్యాక్టరీ గోడ నిర్మించడం వల్ల వర్షాకాలంలో మా పొలాల్లో నీరంతా నిలుస్తోంది. సర్వే నెంబరు 352లోని 9.15 ఎకరాలు ముంపునకు గురవుతోంది. – విజయభాస్కర్రెడ్డి, నవాబుపేట, మైలవరంప్రభుత్వం నిర్వహించిన రీ సర్వే తర్వాత మా భూములకు 1బీ, పాసుపుస్తకాలు రావడం లేదు. ఇందువల్ల అనేక ప్రభుత్వ సౌకర్యాలు కోల్పోవాల్సి వస్తోంది. ఎన్నిమార్లు అధికారుల చుట్టూ తిరిగినా పరిష్కరిస్తామంటూ చెప్పడమే తప్ప ఇంతవరకు మాకు న్యాయం జరగడం లేదు. – దొడ్డా సంజీవరాయుడు, మైలవరం మండలం2006లో దాల్మియా సిమెంటు కర్మాగారం కోసం 15 ఎకరాల భూమి కోల్పోయాం. అప్పట్లో ఎకరా రూ. 2 లక్షలు ఉన్నప్పటికీ ఉద్యోగం ఇస్తారన్న ఆశతో మా తండ్రి రామసుబ్బారెడ్డి భూములు అప్పగించారు. మా తండ్రికి ఉద్యోగం ఇవ్వలేదు. నాకు తగిన అర్హత వయస్సు వచ్చాక ఉద్యోగం ఇస్తామని చెప్పినా ఇంతవరకు లేదు. ఫ్యాక్టరీ రెండవదశ విస్తరణపై మార్చి 27వ తేది నిర్వహించిన పబ్లిక్ హియరింగ్ కార్యక్రమానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి వచ్చినపుడు ఆయన దృష్టికి నా సమస్య తీసుకెళ్లాను. కానీ ఇప్పటికీ ఎలాంటి ప్రయోజనం కనిపించలేదు. – ఎర్రబోను నాగార్జునరెడ్డి, నవాబుపేట, మైలవరం మండలం సర్వే నెంబరు 138/సీ1 లో 1.84 ఎకరాలు నా పేరిట ప ట్టా ఉంది. ఎమ్మెల్యే పుట్టా సు ధాకర్ యాదవ్ ప్రోదల్బంతో తహసీల్దార్ వచ్చి కంచె వేసి బోర్డు పాతారు. ఆ స్థలాన్ని అగ్రవర్ణాలకు కట్టబెట్టాలని చూస్తున్నారు. – వెంకటయ్య,టి.కొత్తపల్లె, మైదుకూరు భూతమాపురం–తలమంచిపట్నం మధ్య రహదారిని ఆక్రమించి దాల్మియా యాజమాన్యం బ్లాస్టింగ్ చేస్తోంది. దీంతో వంక ద్వారా వచ్చే నీళ్లు ఆగిపోయాయి. ఓపెన్ బ్లాస్టింగ్ వల్ల సమస్యలు వస్తున్నాయి. – శివశంకర్రెడ్డి, రైతు, దుగ్గనపల్లె -
కడప టీడీపీలో అసమ్మతి మంటలు !
సాక్షి ప్రతినిధి, కడప : కడప టీడీపీలో అసమ్మతి మంటలు చెలరేగాయి. తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడిని మార్పు చేయాల్సిందిగా త్రిసభ్య కమిటీకి ఫిర్యాదులు వెల్లువెత్తాయి. సోమవారం హరితా హోట ల్ పార్లమెంటు స్థాయి త్రిసభ్య కమిటీ సమావేశం అందుకు వేదికై ంది. ప్రభుత్వంలోకి వచ్చి 14నెలలు పూర్తయినా నామినేటెడ్ పోస్టులు భర్తీ చేయలేదని, కార్యకర్తలు న్యాయం చేయలేకున్నామని ఆవేదన వ్యక్తమైంది. వివరాలు ఇలా ఉన్నాయి. ఎమ్మెల్యే జయనాగేశ్వర రెడ్డి, ఎమ్మెల్సీ బీదా రవిచంద్రా, కమ్మ కార్పొరేషన్ చైర్మన్ నాదెండ్ల బ్రహ్మం త్రిసభ్య కమిటీ టీడీపీ సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఎమ్మెల్సీ బీదా రవిచంద్ర మాట్లాడుతూ 20 ఏళ్ల తర్వాత కడపలో ఏడు స్థానాలను కై వసం చేసుకున్నామని,సమీకరణలో జరిగిన లోపాల కారణంగా బద్వేలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని వెల్లడించారు. సమావేశంలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి మాట్లాడుతూ జిల్లాలో ఎమ్మెల్యే సీట్లు లభించినా కార్యకర్తలకు నామినేటెడ్ పోస్టులు దక్కలేదని వివరించారు. వైఎస్సార్సీపీ పాలనలో కమలాపురం నియోజకవర్గంలో 25 మందికి పదవులను ఇచ్చారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి 14 నెలలు గడుస్తున్న ఎలాంటి పదవులు రాలేదని వివరించారు. జమ్మలమడుగు ఇన్చార్జ్ భూపేష్రెడ్డి మాట్లాడుతూ కార్యకర్తలకు పదువులు లేకపోవడంతో తీవ్ర అసంతృప్తితో ఉన్నారని తెలిపా రు. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి మాట్లాడు తూ వైఎస్సార్సీపీ తమపై దుష్ప్రచారం చేస్తోందని... ఇది అంతర్గత సమావేశం పార్టీకి ఇబ్బందులు తలెత్తకుండా వ్యాఖ్యానించాలని చెప్పుకొచ్చారు. జిల్లా అధ్యక్షుడిపై ఫిర్యాదుల పరంపర... త్రిసభ్య కమిటీ దృష్టికి జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డిపై ఫిర్యాదులు చేసినట్లు సమాచారం. జిల్లా అధ్యక్షుడిని మార్చాలంటూ అప్పుడే పార్టీకి ప్రయోజనమని పలువురు వివరించినట్లు సమాచారం. ఆమేరకు కొందరు పుత్తా నరసింహారెడ్డికి జిల్లా అధ్యక్షపదవి అప్పగించాల్సిందిగా సూచించిగా, పార్టీని నమ్ముకొని ఉన్న గోవర్ధన్రెడ్డికి కట్టబెట్టాలని మరికొందరు అభ్యర్థించినట్లు సమాచారం. తద్వారా పార్టీ కార్యకర్తలకు మంచి మేసేజ్ ఇచ్చినట్లు కూడా అవుతోందని వివరించినట్లు తెలుస్తోంది. మరికొంత మంది హరిప్రసాద్ పేరు సూచించి కాపు సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇచ్చినట్లు అవుతుందని వివరించినట్లు సమాచారం. అన్ని విషయాలు అధిష్టానం దృష్టికి తీసుకెళ్తామని త్రిసభ్య కమిటీ సభ్యులు సూచించినట్లు తెలుస్తోంది. టీడీపీ పార్లమెంటు స్థాయి సమావేశంలో బహిర్గతం 14 నెలలు అవుతున్నా నామినేటెడ్ పోస్టుల భర్తీ ఏదీ? ధ్వజమెత్తిన మాజీ ఎమ్మెల్సీ పుత్తా, జమ్మలమడుగు ఇన్ఛార్జి భూపేష్ జిల్లా అధ్యక్షుడు వాసును మార్చాల్సిందిగా ఫిర్యాదులు అధ్యక్ష రేసులో పలువురు సీనియర్లు -
జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టినా ఎమ్మెల్యేపై చర్యల్లేవు
ప్రొద్దుటూరు : జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తిట్టిన అనంతపురం ఎమ్మెల్యే దగ్గుబాటి ప్రసాద్పై ప్రభుత్వం ఇంత వరకు తగిన చర్యలు తీసుకోలేదని ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆక్షేపించారు. ఇటీవల రాష్ట్రంలోని అనేక ప్రాంతాల్లో అధికార పార్టీ ఎమ్మెల్యేలు మహిళలపై దాడులకు పాల్పడుతున్నా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పట్టించుకోవడం లేదని విమర్శించారు. సోమవారం తన స్వగృహంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో సంక్షేమం, అభివృద్ధి లేకపోయినా భరించగలిగామని, సీ్త్రలకు స్వేచ్ఛ, గౌరవం, భద్రత లేకపోతే ఎలా అని ప్రశ్నించారు. పాలకులే కీచకులయ్యారని విమర్శించారు. గతంలో చంద్రబాబు సతీమణి భువనేశ్వరిని విమర్శించినప్పుడు తాను ఖండించానన్నారు. తల్లి ఎవరికై నా తల్లేనన్నారు. ఎన్టీఆర్ తల్లి పాదాలను ఎమ్మెల్యే కన్నీటితో కడిగి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. కనీసం జూనియర్ ఎన్టీఆర్ అభిమానులు ధర్నా చేయడానికి, ప్రెస్మీట్ పెట్టడానికి కూడా ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదన్నారు. కేవలం జూనియర్ ఎన్టీఆర్పై అసూయతోనే చంద్రబాబు, లోకేష్ ఇలా చేస్తున్నారని, జూనియర్ ఎన్టీఆరే ఎన్టీఆర్కు అసలైన వారసుడన్నారు. ఎమ్మెల్యేలపై ఎందుకు చర్యలు తీసుకోలేదు రాష్ట్ర వ్యాప్తంగా అనేక చోట్ల టీడీపీ ఎమ్మెల్యేలు మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తించినా, మాట్లాడినా, ఉద్యోగులపై దాడి చేసినా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని రాచమల్లు నిలదీశారు. ఇప్పటికై నా స్థాయిని చూడకుండా తప్పు చేసిన వారిపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. పోలీసులు తమ ఉద్యోగ బాధ్యతలు నిర్వహించకుండా అధికార పార్టీకి గుమస్తాలుగా, బానిసలుగా పని చేస్తుండటం సిగ్గుపడాల్సిన విషయమన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, కౌన్సిలర్లు ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, రాగుల శాంతి, లావణ్య, నాయకుడు బీఎన్ఆర్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు
దువ్వూరు/ఖాజీపేట/జమ్మలమడుగు : ఎరువుల దుకాణాల యజమానులు యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తప్పవని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ జె.శ్రీనివాసరావు హెచ్చరించారు. దువ్వూరు, ఖాజీపేట మండలాల్లోని పలు ఎరువుల దుకాణాలను సోమవారం విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. గోడౌన్లలో స్టాక్ను తనిఖీ చేశారు. దువ్వూరులోని కాశినాయన ట్రేడర్స్, వెంకటేశ్వర ట్రేడర్స్, జువారి జై కిసాన్ ట్రేడర్స్లలో, చింతకుంట, కానగూడూరు, గుడిపాడుల్లోని రైతు సేవా కేంద్రాలను అధికారులు తనిఖీ చేశారు. జిల్లాలో 3,350 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వ ఉందని, మండలంలోని రైతు సేవా కేంద్రాల్లో 20 మెట్రిక్ టన్నులు, ప్రైవేటు డీలర్ల వద్ద 72 మెట్రిక్ టన్నుల యూరియా నిల్వలు ఉన్నాయన్నారు. విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ శివన్న, మైదుకూరు వ్యవసాయశాఖ ఏడీఏ కృష్ణమూర్తి, మండల వ్యవసాయాధికారి అమరనాథరెడ్డి, ఏఎస్ఐ భూషణం, వ్యవసాయశాఖ, పోలీసు సిబ్బందిఖాజీపేట ఏఓలు సుమంత్ కుమార్రెడ్డి, నాగార్చన, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు, ఏడీ అనిత, ఏఓ శ్రీకాంత్రెడ్డి పాల్గొన్నారు.విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అడిషనల్ ఎస్పీ జె. శ్రీనివాసరావు -
స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు
● స్కూటీని ఢీకొన్న ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు● ఇద్దరు యువకుల దుర్మరణంకడప అర్బన్ : కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం సమీపంలో ఈనెల 24వ తేదీన రాత్రి సమయంలో కడప వైపు నుంచి స్కూటీలో వెళుతున్న ఇద్దరు యువకులను, తిరుపతి వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మోదుగుల నవీన్కుమార్ (22), అతని స్నేహితుడు అంచల చరణ్ (20)లు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఈ సంఘటన రెండు కుటుంబాల్లోనూ, స్నేహితులను విషాదంలో నింపింది. మరణించిన ఇద్దరిలో నవీన్కుమార్ హోటల్ మేనేజ్మెంట్ కోర్సు పూర్తి చేసి ఉద్యోగం చేస్తున్నాడు. తండ్రి శ్రీహరి, తల్లి సుజితలు. శ్రీహరి ఐరన్ మార్ట్ల వద్ద ఆటో బాడుగకు తిప్పుతూ జీవనం సాగిస్తున్నాడు. వీరికి నవీన్కుమార్ కంటే ముందు ఓ కుమారుడు ఉండేవాడు. ఆ పిల్లాడు చిన్న వయసులోనే అనారోగ్యంతో మృతి చెందాడు. వీరు శంకరాపురంలో నివాసం ఉంటున్నారు. అదే ప్రాంతానికి చెందిన సెంట్రింగ్ పనిచేస్తూ జీవనం సాగిస్తున్న రవి, విజయల కుమారుడు అంచల చరణ్ కొత్త బస్టాండ్ సమీపంలో ఓ దుకాణంలో మెకానిక్గా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. చరణ్కు డిగ్రీ చదువుతున్న షాలిని అనే చెల్లెలు ఉంది. రెండు కుటుంబాల్లోనూ ఒక్కొక్కరే కుమారులు. వీరిద్దరు ఈనెల 24వ తేదీన రాత్రి సైనిక్ నగర్లో ఉంటున్న నవీన్కుమార్ బంధువుల ఇంటికి పనిమీద బయలు దేరారు. కడప కేంద్ర కారాగారం సమీపంలోకి వెళ్లగానే ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సు ఢీకొనడంతో స్కూటీలో నుంచి ఎగిరిపడి ముందు భాగాన చరణ్ తల తగలగానే తీవ్రంగా గాయపడ్డాడు. నవీన్కుమార్ కూడా తీవ్రంగా గాయపడి ఇద్దరూ అక్కడికక్కడే దుర్మరణం చెందారు. అదే మార్గంలో వెళుతున్న నవీన్కుమార్ తండ్రి శ్రీహరి స్నేహితుడు ప్రమాదం గురించి ఫోన్ చేసి సమాచారం ఇచ్చారు. దీంతో ఇద్దరి తల్లిదండ్రులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. అప్పటికే మరణించడంతో తీవ్రంగా విలపించారు. తల్లిదండ్రులకు ఈ దుర్ఘటన కడుపుకోతనే మిగిల్చింది. సంఘటన స్థలాన్ని పరిశీలించిన తరువాత మృతదేహాలను వెంటనే రిమ్స్కు తరలించారు. సోమవారం మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించి తల్లిదండ్రులకు అప్పగించారు. మృతుల కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ట్రాఫిక్ సీఐ జావేద్ తెలిపారు. -
ధర్నాలతో దద్దరిల్లిన కలెక్టరేట్
కడప సెవెన్రోడ్స్ : సమస్యల పరిష్కారం కోసం వివిధ వర్గాల వారు ధర్నాలు చేపట్టడంతో సోమవారం కలెక్టరేట్ దద్దరిల్లిపోయింది. దివ్యాంగులు ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏపీ ఎమ్మార్పీఎస్ (దండు వీరయ్య మాదిగ) నాయకులు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఆ సంఘం నాయకులు బీసీ గంగులు, ఆంజనేయులు, నాగభూషణం మాట్లాడుతూ దివ్యాంగుల జనాభా దామాషా మేరకు ఆరుశాతం పైబడి ఉద్యోగాల్లో రిజర్వేషన్ సౌకర్యం కల్పించాలని కోరారు.ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ నాయకులు సహదేవుడు, నరసింహులు, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. పెన్షనర్లకు న్యాయం చేయాలి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనర్లు, ఈపీఎస్–95 పెన్షనర్ల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ నాయకులు సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా అసోసియేషన్ నాయకులు మాట్లాడుతూ ఈపీఎస్–95 పెన్షనర్లకు కనీస పెన్షన్ రూ.9 వేలు డీఏతో కలిపి చెల్లించాలన్నారు. 8వ పీఆర్సీ కమిషనర్ను నియమించి మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. ఎన్పీఎస్, యూపీఎస్, సీపీఎస్లను రద్దు చేసి ఓపీఎస్ను అమలు చేయాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయ పెన్షనర్లకు సంబంధించి ప్రభుత్వం చెల్లించాల్సిన రూ. 20 వేల కోట్ల బకాయిలు తక్షణమే చెల్లించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెన్షనర్ల అసోసియేషన్ జిల్లా ప్రధాన కార్యదర్శి రామ్మూర్తినాయుడు, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం నాయకులు ఎ.రఘునాథ్రెడ్డితోపాటు ఇతర నాయకులు, పెన్షనర్లు పాల్గొన్నారు. నారా లోకేష్ రాజీనామా చేయాలి విద్యారంగ సమస్యలు పరిష్కరించలేని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని, పెండింగ్ లో ఉన్న ఫీజు రీఎంబర్స్మెంట్ నిధులను వెంటనే విడుదల చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు రాహుల్ రవి డిమాండ్ చేశారు. సోమవారం విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం చలో కలెక్టరేట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఇప్పటికే 14 నెలలు గడుస్తున్నా కనీసం విద్యార్థులకు ఇచ్చిన హామీలు కానీ, విద్యారంగ సమస్యలు కానీ పరిష్కరించకపోవడం సిగ్గుచేటన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అజయ్, రాజశేఖర్ రెడ్డి, జిల్లా కమిటీ సభ్యులు మోహన్, జెర్మియా, చారి, నగర ఉపాధ్యక్షులు శ్రీనివాస్, అఖిలేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఎస్ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు( రివైజ్డ్)
కడప రూరల్ : పులివెందుల ఎస్ఐ నారాయణపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు పులివెందులలోని ఇస్లాంపురం వీధికి చెందిన సులోచన తెలిపారు. సోమవారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ ఒక నెల క్రితం ఎవరో ఏదో చెప్పారని ఎస్ఐ నారాయణతో పాటు ఇద్దరు కానిస్టేబుళ్లు తన ఇంటికి వచ్చారని అన్నారు. తనకు సంబంధం లేని అంశాలను అడగడంతో తెలియదని చెప్పానని తెలిపారు. ఆ ఎస్ఐ తన పట్ల దురుసుగా ప్రవర్తించడంతో పాటు కొట్టారని పేర్కొన్నారు. ఆయన బీరువా బీగాలు అడిగాడని, లేవని చెప్పడంతో బీరువాను పగుల గొట్టి అందులో ఉన్న రూ 1.39 లక్షలు తీసుకెళ్లారని ఆరోపించారు. మా అమ్మకు ఆరోగ్యం బాగా లేనందున, బంగారం కుదువ పెట్టి డబ్బు తెచ్చామన్నారు. అమ్మ వైద్యం కోసం తెచ్చిన డబ్బును ఆ ఎస్ఐ తీసుకెళ్లారని ఆరోపించారు. తాను ఏదైనా తప్పు చేసి ఉంటే విచారణ చేపట్టి, చర్యలు తీసుకోవాలని అలా కాకుండా ఇష్టానుసారంగా వ్యవహరించడం ఏమిటని ప్రశ్నించారు. ఈ విషయమై సోమవారం కడపలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. తనకు ఆ ఎస్ఐ నుంచి రక్షణ కల్పించడంతో పాటు న్యాయం చేయాలని వేడుకున్నారు. జై హిందుస్ధాన్ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు గోవర్ధన్రెడ్డి మాట్లాడుతూ బాధితురాలికి న్యాయం జరిగేలా చూడాలని కోరారు. కానిస్టేబుల్ అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలనకడప అర్బన్ : కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపికై న అభ్యర్థుల నియామక ప్రక్రియలో భాగంగా, అభ్యర్థుల ధ్రువీకరణ పత్రాల పరిశీలన కార్యక్రమాన్ని సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ పరిశీలనకు మొత్తం 352 మంది అభ్యర్థులకు గాను 190 మంది సివిల్, ఏపీఎస్పీ అభ్యర్థులు హాజరయ్యారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ కానిస్టేబుల్ ఉద్యోగాలకు ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా, నిష్పక్షపాతంగా నిర్వహిస్తున్నామన్నారు. సరైన ధ్రువీకరణ పత్రాలు ఉన్న అభ్యర్థులకే ఉద్యోగం వస్తుందని, తప్పుడు పత్రాలు ఉన్నట్లయితే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్.పి (ఎ.ఆర్) బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, ఆర్ఐలు వీరేష్, టైటస్, శివరాముడు, ఏఓ కె.వెంకటరమణ, సూపరింటెండెంట్లు ఎస్.గౌస్ పీర్, సురేష్ బాబు, సీనియర్ అసిస్టెంట్ బి.శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. భర్త, బంధువులు వేధిస్తున్నారని ఫిర్యాదు కడప అర్బన్ : కడప నగరంలోని మరియాపురానికి చెందిన వసంతకు, కలికిరికి చెందిన ప్రవీణ్కుమార్కు 12 సంవత్సరాల క్రితం వివాహమైంది. భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. వసంత, తన భర్తతోపాటు, అత్త, బంధువులు వేధిస్తున్నారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు వారిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప తాలూకా సీఐ టి.రెడ్డెప్ప తెలిపారు. రిమ్స్ మార్చురీలో రెండు మృతదేహాలుకడప అర్బన్ : కడప రిమ్స్ మార్చురీలో రెండు గుర్తు తెలియని మృతదేహాలున్నాయి. ఎవరైనా సరైన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు. -
పింఛన్ల తొలగింపుపై దివ్యాంగుల ధర్నా
పులివెందుల టౌన్ : రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగుల పింఛన్లు తొలగించినందుకు నిరసనగా దివ్యాంగుల సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో పులివెందుల ఆర్డీఓ కార్యాలయం ఎదుట సోమవారం దివ్యాంగులు ధర్నా నిర్వహించారు. అన్యాయంగా తొలగించిన అర్హులైన దివ్యాంగుల పింఛన్లు పునరుద్ధరించాలని కోరారు. కాళ్లు, చేతులు, కళ్లు కోల్పోయి దయనీయమైన పరిస్థితుల్లో జీవిస్తున్న దివ్యాంగుల పొట్టగొట్టి, సూపర్ సిక్స్ అంటూ ఇతర వర్గాలకు సొమ్ములను ధారపోయడం ఎంతవరకు సమంజసమన్నారు. తమ ఉసురు తప్పక తగులుతుందన్నారు. తొలగించిన పింఛన్లను పునరుద్ధరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఆందోళన కార్యక్రమాలు చేపడతామని హెచ్చరించారు. అనంతరం ఆర్డీఓకు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో దివ్యాంగుల సంఘాల ఐక్యవేదిక కార్యవర్గ సభ్యులు శీలం సునీల్ కుమార్, రామకృష్ణ, చాగలేటి శివప్రసాద్, చాగలేటి ఉమాదేవి, రామససుబ్బయ్య, రామాంజనేయులు, ఈశ్వరయ్య, రవి, అశ్విని, స్వర్ణలత, తులసి, రాజమ్మ, తదితరులు పాల్గొన్నారు. -
ఏమిటీ అన్యాయం?
మైలవరం : ఆమె జన్మతః అంధురాలు. రెండు కళ్లు బొత్తిగా కనిపించవు. బాల్యం నుంచి వికలాంగుల పెన్షన్ అందుకుంటున్న ఆమెకు ప్రస్తుతం 49 సంవత్సరాల వయసు. పుట్టుకతోనే అంధురాలు కావడంతో ఆమెకు వివాహం కాలేదు. నేటికి ఒంటరి మహిళగానే బతుకు బండిని నెట్టుకు వస్తూ జీవన పోరాటం చేస్తోంది. ఆమె పెన్షన్ అందుకుంటున్న మూడు దశాబ్దాల కాలంలో ఎన్నో ప్రభుత్వాలు మారాయి.. ఏ ఒక్కరూ ఆమె పెన్షన్పై కత్తి కట్టలేదు. అలాంటిది చంద్రబాబు సర్కార్ ఏమంటూ వచ్చిందో గాని పుట్టు అంధురాలైన ఆమె పెన్షన్ను ఉన్నపళంగా నిలిపి వేసింది. వందశాతం అంధత్వం ఉన్న ఆ అంధురాలి పింఛన్ నిలిపివేయటానికి అధికారులకు చేతులు ఎలా వచ్చాయో అని ప్రజల నుంచి ప్రశ్నల వర్షం కురుస్తూనే ఉంది. పాపం దస్తగిరమ్మ..! మైలవరం మండలం చిన్న వెంతుర్ల గ్రామానికి చెందిన దస్తగిరమ్మకు పుట్టుకతోనే చూపు లేదు. వందశాతం అంధత్వం ఉన్నట్లు ఎప్పుడో వైద్యులు ధ్రువీకరించారు. ఆ తర్వాత పలుమార్లు జరిపిన వైద్యపరీక్షల్లో కూడా వంద శాతం అంధత్వం ఉన్నట్లే ధ్రువీకరణ పత్రాలు ఇస్తూ వచ్చారు. గత 30 సంవత్సరాలుగా ఆమె పెన్షన్ అందుకుంటూనే ఉంది. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తర్వాత బోగస్ పెన్షన్ల ఏరివేతలో భాగంగా దివ్యాంగులందరికి తాజాగా వైద్య పరీక్షలు చేయించారు. దస్తగిరమ్మకు ఈ ఏడాది మార్చి నెలలో వైద్య పరీక్షలు చేసి పంపించారు. అంతా సవ్యంగా జరిగిందన్న తరుణంలో నాలుగు రోజుల క్రితం దస్తగిరమ్మకు పెన్షన్ నిలిపి వేస్తున్నట్లు నోటీసులు అందాయి. విషయం ఏమిటని ఆరాతీస్తే తాజాగా వైద్య పరీక్షలు నిర్వహించిన ఆ వైద్య మహానుభావుడు ఆమెకు కేవలం 20 శాతం మాత్రమే అంధత్వం ఉన్నట్లు ధ్రువీకరించాడట. ఆ సర్టిఫికెట్ ఆధారంగా రెండు కళ్లులేని ఆమెకు సంబంధింత అధికారులు సైతం కళ్లు మూసుకుని పెన్షన్ పెరికేశారు. ఆమె గోడు ఎవరికి చెప్పుకోవాలి? పుట్టుకతో అంధురాలైన దస్తగిరమ్మకు బాల్యంలోనే తల్లి చనిపోయింది. వృద్ధుడైన తండ్రి దస్తగిరి చెంతనే ఆమె జీవనం సాగిస్తోంది. అవివాహితురాలైన ఆమెకు పింఛన్ ఒక్కటే ఆధారం. పింఛన్ వస్తుండటంతో ఆమెకు ఏ ప్రభుత్వ పథకం వర్తించదు. రెండు కన్నులు కనిపించకపోవడంతో పొలం పనులకు సైతం ఆమె వెళ్లలేని పరిస్థితి తండ్రికి భారం కాకుండా ఇంట్లోనే ఉంటూ తన పని తానే చేసుకుంటుంది. అంతటి దయనీయ జీవితం గడుపుతున్న ఆమెకు పింఛన్ నిలిపివేసి ప్రభుత్వం సాఽధించింది ఏమిటి. వైద్యులు తిరిగి పరీక్షలు నిర్వహించి ఆమె పింఛన్ పునరుద్ధరించాలంటే కనీసం రెండు మూడు నెలల సమయం తర్వాత దరఖాస్తు చేసుకుంటే తిరిగి పింఛన్ అర్హత ఉంటే పింఛన్ పునరుద్ధరిస్తామని అధికారులు చెబుతున్నారు. ఈ తతంగం జరిగే సరికి రెండు మూడు నెలల కాలం గడిచిపోతుంది. ఆ మధ్యలో ఆమెకు పింఛన్ ఎవరిస్తారు? ఒకటో తేదీన పరిస్థితి ఏమిటి. ఆమెకు కాదు వైద్యులకే అంధత్వం పుట్టుకతో వచ్చినట్లు ఉంది. ఆమెకు చంద్రబాబు నాయుడు సర్కార్ పుణ్యమా అంటూ పింఛన్ తొలగించడం ముక్కున వేలు వేసుకునేలా చేసింది. చివరకు అధికారులు సైతం నివ్వెర పోతున్నారు. సరిగ్గా రెండు నెలల క్రితం వైద్య పరీక్షలు నిర్వహించిన వైద్యుడికి ఈమె అంధత్వం కనిపించలేదా. లేదా పరీక్షలు చేయకుండానే ఏసీ రూముల్లో కూర్చొని గుడ్డిగా సర్టిఫికెట్ మంజూరు చేశారా అనేది అంతుచిక్కని ప్రశ్నగా మారింది. ఏది ఏమైనా దివ్యాంగుల జీవితంతో చెలగాటమాడటం ఎంత వరకు సమంజసమని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. రెండు కళ్లులేని పుట్టు అంధురాలికి పెన్షన్ నిలిపివేత ఐదు నెలలక్రితం వైద్య పరీక్షలు.. తాజాగా నోటీసులు దివ్యాంగులపై కక్షగట్టిన సర్కార్ దురాగతానికి ఇదో తార్కాణం -
విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
జమ్మలమడుగు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి సోమవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. సోమవారం ఆయన పోలీసు స్టేషన్కు వెళ్లారు. ఈనెల 12వ తేదీన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని అక్రమంగా అరెస్టు చేసి కడపకు తీసుకెళుతున్న సమయంలో సుధీర్రెడ్డి అడ్డు తగిలినందుకు పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ కేసులో మాజీ ఎమ్మెల్యేను 16వతేదీన హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. అయితే అనారోగ్యం కారణంగా రాలేనంటూ న్యాయవాదుల చేత నోటీసులు పంపించి 20వ తేదీ హాజరవుతానని తెలిపారు. 20వతేదీ పోలీసు స్టేషన్కు వెళ్లగా ఉన్నతాధికారులు ఎవ్వరూ లేకపోవడంతో తిరిగి 25వ తేదీ హాజరు కావాలంటూ నోటీసులు ఇచ్చారు. ఈమేరకు ఆయన సోమవారం విచారణకు హాజరు కాగా సీఐ విశ్వనాథ్ విచారించి స్టేషన్ బెయిల్తో సుధీర్రెడ్డిని పంపించారు. -
హైకోర్టు ఆదేశాలతో ఫిట్పర్సన్ బదిలీ
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం ఫిట్ పర్సన్ శంకర్బాలాజీని హైకోర్టు ఆదేశాలతో దేవదాయ శాఖ కమిషనర్ బదిలీ చేశారు. ఆయన స్థానంలో స్థానిక మఠం మేనేజర్కు బాధ్యతలు అప్పజెప్పారు. మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వర స్వామి 2021 సంవత్సరం మే 18న శివైక్యం చెందారు. మఠాధిపతి నియామకంలో మఠాధిపతి పెద్ద భార్య కుమారులు, రెండవ భార్య మధ్య వివాదం కావడంతో పరిపాలన వ్యవహారాల కోసం మఠాధిపతి స్థానంలో దేవదాయ ధర్మాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్గా ఉన్న శంకర్బాలాజీని మఠం ఫిట్పర్సన్గా నియమించింది. దాదాపు మూడేళ్ల కాలంలో ఫిట్పర్సన్గా బి.మఠంలో రూ.10 కోట్ల నిధులతో పలు అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు. ఆయన చేస్తున్న కొన్ని పనులు నిబంధనలకు విరుద్ధంగా ఉన్నాయని పూర్వపు మఠాధిపతి రెండవ భార్య మారుతీ మహాలక్షుమ్మ అభ్యంతరం వ్యక్తం చేస్తూ వచ్చారు. ఆయనను బి.మఠం ఫిట్పర్సన్గా తొలగించాలని మారుతీ మహాలక్షుమ్మ హైకోర్టును ఆశ్రయించారు. ఈ నేపథ్యంలో శంకర్బాలాజీని ఫిట్పర్సన్ బాధ్యతల నుంచి తొలగించాలని దేవదాయ కమిషనర్ను హైకోర్టు ఆదేశించింది. దీంతో ఆయనను బదిలీ చేసి మఠం మేనేజర్ ఈశ్వరాచారికి బాధ్యతలు అప్పజెప్పారు. -
ఖర్చును కంట్రోల్ చేద్దాం
● టోల్ గేట్ల ఫీజు బాధ తప్పినట్టే ● రూ.3000తో పొందే అవకాశం ● ఏడాది లేదా రెండు వందల ట్రిప్పులకు చెల్లుబాటుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జాతీయ రహదారులపై ప్రయాణం చేసేటప్పుడు మనకు వివిధ ప్రాంతాల్లో టోల్ గేట్లు కనిపిస్తాయి. అక్కడ టోల్ చార్జి చెల్లించి ముందుకు వెళ్లాల్సి ఉంటుంది. నాలుగు చక్రాలు ఆపైన పెద్ద వాహనాలన్నీ ఈ టోలు కట్టాల్సిందే. మనం వెళ్లే దారిలో ఎన్ని చోట్ల టోల్ గేట్లు ఉంటే అక్కడ డబ్బులు చెల్లించాల్సి ఉంటుంది. ఇలా ఒక్కొక్క ట్రిప్పునకు టోల్ గేట్ ఇరువైపులా కలిపి 90 రూపాయల నుంచి 200 రూపాయలు ఖర్చు అవుతుంది. కానీ ఇక నుంచి ఆ భారం లేకుండా జాతీయ ఉపరితల రవాణా సంస్థ (ఎన్హెచ్) స్వాతంత్య్ర దినోత్సవం రోజు ఏడాది పాసు విధానం తీసుకు వచ్చింది. కార్లు, జీపులు, వ్యాన్లు తదితర వాణిజ్యేతర వాహనాలకు ఇది వర్తిస్తుంది. ఒకసారి పాస్ తీసుకుంటే ఏడాది పాటు లేదా 200 ట్రిప్పులకు అవకాశం ఉంటుంది. ఒక టోల్ గేట్ దాటితే ఒక ట్రిప్పుగా పరిగణిస్తారు. ఆ దారిలో నాలుగు గేట్లు దాటి తిరిగి వెనక్కి వస్తే మొత్తం ఎనిమిది ట్రిప్పులు అయినట్టు లెక్క. దేశవ్యాప్తంగా 1150 టోల్ గేట్లు.. గతంలో నగదు రూపంలో టోల్ ఫీజు వసూలు చేయగా తర్వాత ఫాస్టాగ్ వచ్చింది. దీని వల్ల టోల్ గేట్ల వద్ద ట్రాఫిక్ జామ్ చాలా వరకు తగ్గిపోయింది. దేశవ్యాప్తంగా సుమారు 1150 వరకు టోల్ గేట్లు ఉన్నాయని అంచనా. ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో 40 నెంబర్ జాతీయ రహదారిపై ఖాజీపేట మండలం దుంపలగట్టు వద్ద, రాయచోటి పరిధిలోని బండపల్లి వద్ద టోల్ గేట్లు ఉన్నాయి. పాస్ పొందే విధానం.. ఇప్పటికే ఫాస్టాగ్ ఉన్న వాహన యజమానులు తమ ఖాతా నుంచి ఫాస్టాగ్ పాస్ పొందవచ్చు. ఆగస్టు 15 నుంచి పెద్ద ఎత్తున వీటిని కొనుగోలు చేస్తున్నారు. అయితే ఈ పాస్ సొంత కార్లు, వాహనాలకు మాత్రమే వర్తిస్తుంది. బస్సులు, టాక్సీలు, లారీలు, రవాణా వాణిజ్య వాహనాలకు చెల్లదు. ట్రావెల్స్ వినియోగించే కార్లకు, జీపులకు కూడా వర్తించదు. ఈ ఫాస్టాగ్ ఏడాది నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా నిర్వహించే జాతీయ రహదారులు జాతీయ ఎక్స్ప్రెస్ రహదారుల్లోని టోల్ ప్లాజాలలో పనిచేస్తుంది. డిజిటల్ రూపంలోనూ.. ఫాస్టాగ్ ఏడాది పాస్ను డిజిటల్గా తీసుకోవచ్చు. రాజ మార్గ్ యాత్ర యాప్ సెల్ ఫోన్లో డౌన్లోడ్ చేసుకుని పొందవచ్చు. లేదా నేషనల్ హైవే అథారిటీ ఆఫ్ ఇండియా అధికారిక వెబ్సైట్ ద్వారా కూడా లభిస్తుంది. దీనికోసం రూ. 3వేలు చెల్లించాలి. సంబంధిత వాహనాలకు చెల్లుబాటు అయ్యే ఫాస్టాగ్ ఉండాలి. బ్లాక్ లిస్టులో ఉండకూడదు. సంబంధిత వాహన రిజిస్ట్రేషన్ నెంబర్ వివరాలు నమోదు చేసుకోవాలి. రూ. 3వేలు చెల్లించిన తర్వాత ఏడాది పాస్ సంబంధిత వాహన ప్రస్తుత ఫాస్ట్ ట్రాక్ లింక్ అవుతుంది. ఈ పాస్ ఏడాదికాలం లేదా 200 ట్రిప్పులు మాత్రమే పనిచేస్తుంది. ఈ రెండింటిలో దీని గడువు ముందైనా ఇంకా పనిచేయదు. ఈ పాస్ వల్ల టోల్ చార్జీలు బాగా తగ్గుతాయి. ఉపయోగాలు ఇవే.. కేంద్ర రవాణా ఉపరితల మంత్రిత్వ శాఖ ఈ ఫాస్టాగ్ ఏడాది పాస్ను ప్రవేశపెట్టింది. జాతీయ రహదారిపై సొంత వాహనాల్లో ప్రయాణించే వారికి దీనివల్ల ఎంతో ప్రయోజనం ఉంటుంది. ముఖ్యంగా ప్రయాణంలో టోల్గేట్ భారం బాగా తగ్గించుకోవచ్చు. -
గిడుగు అడుగుజాడలు మార్గదర్శకాలు
కడప ఎడ్యుకేషన్: గిడుగు రామమూర్తి పంతుల అడుగు జాడలు అందరికీ మార్గదర్శకాలని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. ఆదివారం సీపీ బ్రౌన్ గ్రంఽథాలయంలో ముందస్తు తెలుగుభాషా దినోత్సవాన్ని జిల్లా రాష్ట్రీయ ఉపాధ్యాయ పండిత పరిషత్తు ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. తొలుత గిడుగు వెంకటరామమూర్తిపంతులు చిత్రపటానికి పులమాలలు వేసి నివాళు లు అర్పించారు. పండిత పరిషత్తు జిల్లా అధ్యక్షుడు ఎఫ్ఎంఎస్ ఖాదర్ అధ్యక్షత వహించిన సభకు విశిష్ట అతిథిగా డీఈఓ షేక్ షంషుద్దీన్ హాజరై మాట్లాడారు. మాతృభాష తెలుగుకు ఏ భాషా సాటిరాదన్నారు. గిడుగు రామమూర్తి పండితులు తెలుగు భాషాభివృద్ధికి చేసిన కృషి తరతరాలు గుర్తుంచుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పండిత పరిషత్తు రాష్ట్ర అధ్యక్షుడు సంపత్కృష్ణ , పండిత పరిషత్తు రాష్ట్ర ప్రధాన కార్యదర్శి రవిచంద్ర , రాష్ట్రబాధ్యులు రమేష్, రాష్ట్ర అదనపు నరసింహారెడ్డి, పద్మానాభయ్య మాట్లాడారు. అనంతరం వంద మంది తెలుగు ఉపాధ్యాయులను సత్కరించారు. డీఈఓ షేక్ షంషుద్దీన్ -
గంజాయి వినియోగం, విక్రయాలపై తనిఖీలు
కడప అర్బన్ : జిల్లాను గంజాయి రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పకడ్బందీ చర్యలు చేపడుతున్నారు. ఇందులో భాగంగా ఆదివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా గంజాయి సేవించే, విక్రయించే అవకాశమున్న ప్రాంతాలు, ప్రదేశాలలో ప్రత్యక్షంగా పర్యవేక్షిస్తూ అనుమానాస్పద వ్యక్తుల కోసం ఆరా తీశారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పద వ్యక్తులను క్షుణ్ణంగా విచారిస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా గంజాయి రవాణా, వినియోగం, విక్రయాలు చేస్తే కఠిన చర్యలు తప్పవని జిల్లా ఎస్పీ హెచ్చరించారు. -
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా పవిత్ర ప్రతిష్ట
ఒంటిమిట్ట: ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండోరోజు ఆదివారం పవిత్ర ప్రతిష్ట శాస్త్రోక్తంగా జరిగింది. ఇందులో భాగంగా సీతాలక్ష్మణ సమేత శ్రీరాములవారి ఉత్సవర్లను యాగశాలకు వేంచేపు చేశారు. అక్కడ విష్వక్సేనారాధన, పుణ్యహవచనం, శాత్తుమొర, నివేదన, కుంభారాధన నిర్వహించారు. అనంతరం యాగశాలలో పవిత్రమాలలకు ఉపచారాలు జరిపారు. ప్రదక్షిణగా సన్నిధికి వేంచేపు చేశారు. ధ్రువమూర్తులకు, కౌతుకమూర్తులకు, స్నపనమూర్తులకు, విశ్వక్సేనులవారికి, గరుడాళ్వార్కు, యాగశాలలోని హోమగుండాలకు, ధ్వజస్తంభానికి , ఆలయం ఎదురుగా ఉన్న భక్తసంజీవరాయస్వామికి పూజలు నిర్వహించారు. -
సెంచురీ పానెల్స్ పరిశ్రమలో విజిలెన్స్ ఏఎస్పీ ఆకస్మిక తనిఖీ
గోపవరం : సెంచురీ పానెల్స్ పరిశ్రమలో విజిలెన్స్ అడిషనల్ ఎస్పీ శ్రీనివాసరావు ఆదివారం ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్లో యూరియా కొరత అధికంగా ఉండటంతో విజిలెన్స్ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. అందులో భాగంగా సెంచురీ పానెల్స్ పరిశ్రమలో యూరియా డంప్ అవుతుందని సమాచారం రావడంతో విజిలెన్స్ సీఐ శివన్న, ఏఓ విజయరావు, బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య, ఎస్ఐ శ్రీకాంత్, వ్యవసాయ సిబ్బందితో కలిసి ఆకస్మిక తనిఖీ నిర్వహించారు. ఈ యూరియా కేవలం పరిశ్రమలో వినియోగం కోసమే వాడుతున్నట్లు అధికారులు నిర్ణయించారు. ఈ తనిఖీల్లో పరిశ్రమ జీఎం రమేష్ కుమార్రెడ్డి, వ్యవసాయ విస్తరణ అధికారి ఓబయ్య ఉన్నారు. -
దారిమళ్లిన నాంధేడ్ వీక్లీ!
● ఉత్తరతెలంగాణాకు రైలు కనెక్టివిటీ ● మదనపల్లె, పీలేరులోహాల్టింగ్ సదుపాయం రాజంపేట: ప్రస్తుతం నాంధేడ్ నుంచి ధర్మవరం మధ్య నడుస్తున్న (07189/17190) వీక్లీ ప్రత్యేక రైలు దారిమళ్లనుంది. ఈ రైలు ఇప్పుడు నిజామాబాద్, కామారెడ్డి, చర్లపల్లె, నల్గొండ, నడికుడి, పిడుగురాళ్ల, వినుకొండ, నంద్యాల, ఎర్రగుంట్ల , కడప , తిరుపతి, పాకాల మార్గాల్లో నడిచేది. వచ్చే నెల నుంచి ఈ రైలు నిజమాబాద్, పెద్దపల్లె, వరంగల్ , విజయవాడ, గుడూరు, తిరుపతి, పాకాల మీదుగా నడపనున్నారు. ● మొదటిసారిగా పీలేరు, మదనపల్లె, కదిరి నుంచి ఉత్తర తెలంగాణాలోని జగిత్యాల, కరీంనగర్, పెద్దపల్లె, వరంగల్తో పాటు ఖమ్మం జిల్లాకు కూడా అనుసంధానం ఏర్పడింది. ప్రస్తుతం ఈ ప్రాంతాల నుంచి పీలేరు, కలికిరి , మదనపల్లె, కదిరి వెళ్లడానికి నేరుగా సౌకర్యం లేదు. ఇప్పుడు ఈ ప్రత్యేకరైలుతో తెలంగాణా రాష్ట్రంలోని నిజామాబాద్, మహబూబ్నగర్, నల్గొండ, వికరాబాదు, గద్వాల ప్రాంతాలలో ఇప్పటికే మదనపల్లె, పీలేరు, కలికిరి అనుసంధానమై ఉన్నాయి. ● నాంధేడ్ ప్రత్యేక రైలుతో ఉత్తర తెలంగాణాతో మదనపల్లె , పీలేరుకు రైలుసౌకర్యం లభించినట్లైంది. సెప్టెంబర్ 7, 14, 21, 28 తేదీల్లో ఎగువమార్గంలో నాలుగుట్రిప్లు, 07190 నంబరుతో ధర్మవరం నుంచి నాంధేడ్ ప్రత్యేక వీక్లీ ఎక్స్ప్రెస్రైలు వయా మదనపల్లె, పీలేరు, పాకాల, తిరుపతి, గూడూరు, విజయవాడ,వరంగల్, పెద్దపల్లె, కరీంనగర్, నిజామాబాద్ మీదుగా నడవనుంది. రైలునడిచేదిలా.. ● నాంధేడ్ నుంచి ధర్మవరం వీక్లీ ప్రత్యేక ఎక్స్ప్రెస్రైలు 07189 నంబరుతో 5, 12, 19, 26 తేదీల్లో నాంధేడ్లో సాయంత్రం 4.30గంటలకు బయలుదేరి, మరుసటిరోజు సాయంత్రం ధర్మవరం జంక్షన్కు 5గంటలకు చేరుకుంటుంది. అన్నమయ్య జిల్లాలో పీలేరు, మదనపల్లెరోడ్లో హాల్టింగ్ సదుపాయం కల్పించారు. ● 07190 నంబరు గలం నాంధేడ్ ప్రత్యేకరైలు(వయా తిరుపతి–విజయవాడ–పెద్దపల్లి)మీదుగా వెళ్లేటప్పుడు ఆదివారం ఉదయం మదనపల్లెరోడ్డు నుంచి 7.30గంటలకు, పీలేరు నుంచి 8.30 నిమిషాలకు బయలుదేరుతుంది. ● 07189 నాంధేడ్ నుంచి ధర్మవరం వీక్లీ ప్రత్యేకరైలు శనివారం మధ్యాహ్నం పీలేరులో 12.30 నిమిషాలకు, మదనపల్లె రోడ్ 1.15 నిమిషాలకు బయలుదేరేలా టైమింగ్స్ను ఏర్పాటుచేశారు. ఇప్పటికే ఈ రైలుకు సంబంధించి ఐఆర్టీఎస్ పోర్టల్లో బుకింగ్ సౌకర్యం ప్రారంభమైంది. -
లాడ్జీలను తనిఖీ చేసిన పోలీసులు
కడప అర్బన్ : నేర నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలను అరికట్టేందుకు పటిష్టమైన చర్యలలో భాగంగా కడప వన్ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని లాడ్జీలను పోలీసులు ఆకస్మికంగా తనిఖీ చేశారు. లాడ్జీలలో బస చేసే వ్యక్తుల నుంచి ఆధార్ కార్డులు, ఇతర వివరాల కోసం సరైన రిజిస్టర్ నిర్వహించాలని నిర్వాహకులకు సూచించారు. చట్ట విరుద్ధంగా ఎవరికీ గదులు ఇవ్వరాదని, లాడ్జి పరిసరాలు స్పష్టంగా కనిపించేలా తప్పనిసరిగా సి.సి.కెమెరాలను ఏర్పాటు చేసుకోవాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు లాడ్జిల్లో బస చేసిన సమయంలో పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు.ఈ తనిఖీలలో కడప వన్ టౌన్ ఎస్.ఐ. అమరనాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా జూనియర్ బాల,బాలికల షూటింగ్ బాల్ జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ : మదనపల్లె పట్టణం పుంగనూరు రోడ్డులోని గ్రీన్వ్యాలీ స్కూల్లో ఆదివారం జిల్లా షూటింగ్ బాల్ బాల,బాలికల జట్ల ఎంపిక జరిగింది. జిల్లా నలుమూలల నుంచి సుమారు వందమంది క్రీడాకారులు పాల్గొన్నారని అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు సెప్టెంబర్ నెలలో నెల్లూరు జిల్లా బుచ్చిరెడ్డిపాలెంలో జరిగే రాష్ట్ర స్థాయి టోర్నమెంటులో పాల్గొంటారని తెలిపారు. జిల్లా అసోసియేషన్ చైర్మన్ జునైద్ అక్బరీ అభినందించారు. కార్యక్రమంలో ఏషియన్ గోల్డ్ మెడలిస్టు యూసుఫ్, అసోసియేషన్ సభ్యులు భారతి, మండల స్కూల్ గేమ్స్ కో ఆర్డినేటర్ శివశంకర్, సెలక్షన్ కమిటీ సభ్యులు కుమార్ నాయక్, జయంత్, తిరుమలేష్, పీడీలు గురు, మణి, లత, మంజుల, చిన్నప్ప, మౌనిక పాల్గొన్నారు. -
‘అగ్నివీర్’కు 159 మంది అర్హత
తిరుపతి రూరల్ : అగ్నివీర్ ఆర్మీ రిక్రూట్మెంట్ రాత పరీక్షలో ఎస్వీ డిఫెన్స్ అకాడమికి చెందిన 159 మంది విద్యార్థులు అర్హత సాధించినట్లు ఆ అకాడమి చైర్మన్ బి.శేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ రాత పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికి ఉచితంగా ఫిజికల్ ట్రైనింగ్ ఇచ్చామని, వారు ఉద్యోగంలో చేరడానికి అవసరమైన సహకారం అందిస్తామన్నారు. అర్హత సాధించిన విద్యార్థులను ప్రత్యేకంగా అభినందించారు. నేడు, రేపు కానిస్టేబుల్ అభ్యర్థుల పత్రాల పరిశీలనకడప అర్బన్ : కానిస్టేబుల్ ఉద్యోగాల ఎంపిక ప్రక్రియకు హాజరైన అభ్యర్థుల్లో, సివిల్, ఏపీఎస్పీ, విభాగాల్లో తుది రాత పరీక్షలో ఎంపికై న పురుష, మహిళా అభ్యర్థులు ఈనెల 25, 26 తేదీలలో ఉదయం 9 గంటలకు సంబంధిత పత్రాలతో కడపలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో హాజరు కావాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 25వ తేదీ హాల్టికెట్ నెంబర్ 4001160 నుంచి 4206930 వరకు, 26వ తేదీ హాల్టికెట్ నెంబర్ 4214369 నుంచి 4504602 వరకు అభ్యర్థులు హాజరు కావాలని సూచించారు. రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీగుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఉదయం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. కుల మతాలకు అతీతంగా భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. భూ వివాదంలో వ్యక్తిపై దాడి మదనపల్లె రూరల్ : భూ వివాదం కారణంగా దాయాదుల మధ్య జరిగిన గొడవలో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. మాలేపాడు పంచాయతీ దొనబైలుకు చెందిన కట్టప్ప కుమారుడు నాగరాజు(45) వ్యవసాయం చేస్తూ జీవిస్తున్నాడు. అతను వ్యవసాయం చేస్తున్న పొలానికి సంబంధించి గత కొంత కాలంగా దాయాదులతో వివాదం ఉంది. ఈ క్రమంలో ఆదివారం దాయాదులైన చంద్ర, మల్లికార్జున, విశ్వనాథ్ గొడవకు దిగారు. నాగరాజును కర్రలతో కొట్టారు. ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
లోకేష్ పర్యటనకు ఏర్పాట్ల పరిశీలన
చింతకొమ్మదిన్నె: చింతకొమ్మదిన్నె మండల కేంద్రంలోని జెడ్పీ హైస్కూల్ ఆవరణలో అధునాతన వసతులతో నిర్మించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ ను ఆదివారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ ఎస్పీ అశోక్ కుమార్తో కలిసి పరిశీలించారు. సెప్టెంబర్ 2న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ జిల్లాలో పర్యటించనున్న నేపథ్యంలో నూతన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్ను మంత్రిచే ప్రారంభించేందుకు సన్నాహక ఏర్పాట్ల కోసం ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ తో కలిసి పరిశీలించారు. పాఠశాల ప్రాంగణంలో భద్రతా ఏర్పాట్లపైనా ఎస్పీతో చర్చించారు. కార్యక్రమంలో ఆర్డీఓ జాన్ ఇర్విన్, డీఈఓ షంషుద్దీన్, ఆగ్రోస్ డీఎం జోయల్ విజయ్ కుమార్, ఎస్ఎస్ఏ, సంబంధిత శాఖల ఇంజనీరింగ్ అధికారులు, విద్యాశాఖ, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాల పరిశీలన పెండ్లిమర్రి: మండల కేంద్రానికి సమీపంలో నూతనంగా రూ.12కోట్ల నిధులతో నిర్మించిన ఆదర్శ ప్రభుత్వ డిగ్రీ కళాశాల భవనాలను ఆదివారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ అశోక్కుమార్ పరిశీలించారు. డిగ్రీ కళాశాల భవన నిర్మాణ పనులు పూర్తి అయ్యాయి. సెప్టెంబర్ 2న విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ చేతుల మీదుగా ప్రారంభోత్సవ ఏర్పా ట్లు చేస్తున్నారు. ముందస్తుగా వారు కళాశాల భవనాలను, కళాశాల పరిసరాలను పరిశీలించి కళా శాల ప్రిన్సిపల్తో, అధికారులతో మాట్లాడారు. కళాశాల ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, తహశీల్దార్ అనురాధ పాల్గొన్నారు. -
సర్టిఫికెట్ల పరిశీలన ఎప్పుడు!
కడప ఎడ్యుకేషన్: ఉపాధ్యాయ పోస్టులకు సంబంధించిన డీఎస్సీ –25 మెరిట్ జాబితాను ప్రభుత్వం విడుదల చేయడంతో అభ్యర్థుల్లో మరో టెన్షన్ మొదలైయింది. ఎన్ని మార్కులకు కటాఫ్ అవుతుందనే టెన్షన్ అభ్యర్థుల్లో ఆందోళన కలిగిస్తోంది. అభ్యర్థులు తమకు వచ్చిన మార్కులు, ర్యాంకులపై లెక్కలేసుకుంటున్నారు. రిజర్వేషన్లు, లోకన్, నాన్ లోకల్ అంచనాల్లో తలమునకలవుతున్నారు. ముఖ్యంగా రిజర్వేషన్ అభ్యర్థుల్లో ఏ కేటగిరిలో రోస్టర్ ఎక్కడ మొదలై ఎక్కడ ఆగిపోతుందనే దానిపై అభ్యర్థుల్లో ఉత్కంఠ నెలకొంది. కాగా.. మెరిట్ జాబితా విడుదలయినా.. సెలక్షన్ జాబితాపై మాత్రం ఇంకా స్పష్టత రాలేదు. ఆయా పోస్టులకు ఎంపికై న అభ్యర్థులకు నేరుగా మెసేజ్లు వెళతాయని అధి కారులు చెబుతున్నారు. మెరిట్ జాబితా తరహాలోనే సెలెక్షన్ జాబితాలు కూడా ప్రదర్శించాలని అభ్యర్థులు కోరుతున్నారు. మరోవైపు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ ఎప్పటి నుంచి ప్రారంభమవుతుందనే విషయంలో అభ్యర్థుల్లో ఆందోళన నెలకొంది. ఈ నెల 25 నుంచి వెరిఫికేషన్ ప్రారంభమవుతుందనే చర్చ సాగుతున్న నేపథ్యంలో దూర ప్రాంతాల్లో ఉండే అభ్యర్థులు కొంత ఇబ్బందులు పడాల్సి వస్తుందని ఆందోళన చెందుతున్నారు. ముఖ్యంగా కులం, ఆదాయ, స్టడీ తదితర సర్టిఫికెట్లు తెచ్చుకావాలంటే ఇబ్బందులు ఎదురవుతాయని అభ్యర్థులు వాపోతున్నారు. దీనిపై డీఈఓతో మాట్లాడగా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ తేదీపై ఇంకా స్పష్టత రాలేదని తెలిపారు. సర్టిఫికెట్ల పరిశీలనకు సిద్ధం.. ఉమ్మడిజిల్లాలో 705 పోస్టులకు ఎంపికై న అభ్యర్థుల సర్టిఫికెట్లు పరిశీలనకు కడప బాలాజీనగర్లోని యస్వీ ఇంజనీరింగ్ కళాశాలలో ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా పోస్టులతోపాటు, జోనల్, రాష్ట్రస్థాయి పోస్టులకు ఎంపికై న జిల్లా అభ్యర్థులు కూడా సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయించుకోవాల్సి ఉంటుంది. ఈ మేరకు సర్టిఫికెట్ల వేరిఫికేషన్ కోసం 17 టీంలతోపాటు 30 మంది వలంటీర్లను సిద్ధం చేసినట్లు అధికారులు వివరించారు. ఈ మేరకు వారికి శిక్షణ కూడా ఇచ్చారు. వీరంతా అభ్యర్థులకు సంబంధించి విద్యార్హత, కులం, ఆదాయం, స్థానిక ధ్రువపత్రాలను పరిశీలించనున్నారు. -
నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట ధర్నా
కడప కార్పొరేషన్: దివ్యాంగుల పింఛన్లను రద్దు చేయడానికి ప్రభుత్వం చేస్తున్న ప్రయత్నాలను నిరసిస్తూ సోమవారం కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించనున్నట్లు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఒక ప్రకటనలో పేర్కొంది. కడపలో దివ్యాంగ పింఛన్లు కోల్పోయిన వారు, సచివాలయ వెల్పేర్ సెక్రటరీ ద్వారా నోటీసులు అందుకున్న వారితో ఉదయం 9:30 నుంచి 12:00 గంటల వరకు కలెక్టరేట్ ఎదుట ధర్నా ఉంటుందని వివరించారు. ఈ కార్యక్రమంలోపార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మేయర్ కే.సురేష్ బాబు, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డితో పాటు రాష్ట్ర స్థాయి నాయకులు, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, జిల్లా, నగర అనుబంధ విభాగాల అధ్యక్షులు, నగర కమిటీ, మండల జోన్ కమిటీల ముఖ్య నాయకులు పాల్గొంటారని తెలిపారు. రాజంపేట:సికింద్రాబాద్–తిరుపతి (07009/ 10) మధ్య నడుస్తున్న ప్రత్యేకరైలుకు రాజంపేటలో హాల్టింగ్ ఇస్తూ ఆదివారం దక్షిణమధ్యరైల్వే ఉత్తర్వులు విడుదల చేసింది. దీపావళి, దసరా పండుగలను పురస్కరించుకొని రద్దీని తగ్గించేందుకు ప్రత్యేకరైలును తీసుకొస్తున్నారు. వచ్చేనెల 4 నుంచి 25 వరకు ఈ రైలు నడుస్తుంది. నాలుగు సర్వీసులతో ప్రయాణికులకు అందుబాటులో ఉంటుంది. ఈ రైలు వయా కాచిగూడా, మహబూబ్నగర్, గద్వాల్, కర్నూల్, ద్రోణాచాలం, ఎర్రగుంట్ల, కడప మీదుగా తిరుపతికి నడపనున్నారు. కడప సెవెన్రోడ్స్: నగరంలోని హోటళ్లు, రెస్టారెంట్ నిర్వాహకులు ఖచ్చితంగా ఆహార నాణ్యతా ప్రమాణాలు పాటించాలని ఫుడ్ సేఫ్టీ అధికారి హరిత ఆదేశించారు. నగరంలోని ద్వారక ఫ్యామిలీ రెస్టారెంట్ను ఆదివారం ఆమె తన సిబ్బందితో కలిసి తనిఖీ చేశారు. వంట గదిని పరిశీలించారు. రెస్టారెంట్లో వండిన చికెన్ బిర్యానీ తదితర వంటకాల శాంపిల్స్ సేకరించి ల్యాబ్కు పంపారు. రెస్టారెంట్లో పరిశుభ్రత లోపించడంతో ఆమె యాజమాన్యానికి నోటీసులు జారీ చేశారు. నిర్వాహకులు ఖచ్చితంగా ఫుడ్ సేఫ్టీ నిబంధనలు పాటించాలని ఆదేశించారు. కడప సెవెన్రోడ్స్: ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. కాల్ సెంటర్ను సద్వినియోగం చేసుకోండి ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వా రం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని వివరించారు. -
ఘనంగా గంధోత్సవం
కడప సెవెన్రోడ్స్: కడప పెద్ద దర్గాలో ఆదివారం గంధోత్సవం ఘనంగా నిర్వహించారు. దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్షా అమీనుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుస్సేనీ చిష్టి ఉల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాన్ని మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. తొలి రోజున ఆదివారం గంధోత్సవంలో భాగంగా దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా మహమ్మద్ మహమ్మదుల్ ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ తన స్వగృహం నుంచి ఫకీర్ల మేళతాళాలతో గంధాన్ని తీసుకొచ్చారు. అనంతరం దర్గా గురువుల మజార్ వద్ద సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు, ఫాతెహా చేశారు. హాజరైన భక్తులకు ప్రసాదాన్ని పంపిణీ చేశారు. ఉత్సవాల్లో భాగంగా సోమవారం ఉరుసు, మంగళవారం తహలీల్ ఫాతెహా నిర్వహించనున్నారు. ఉరుసు ఉత్సవాల్లో పాల్గొనేందుకు జిల్లాతోపాటు ఇతర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చి గురువుల ఆశీస్సులు పొందారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
బద్వేలు అర్బన్ : స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స నిమిత్తం చేరిన ఓ వ్యక్తి మృతి చెందినట్లు అర్బన్ సీఐ ఎస్.లింగప్ప తెలిపారు. స్థానిక ఆర్టీసీ బస్టాండు ఆవరణలో రెండు రోజుల క్రితం అపస్మారక స్థితిలో పడి ఉన్న ఓ యువకుడిని 108 సహాయంతో ప్రభుత్వాసుపత్రిలో చేర్పించగా చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. ఆసుపత్రిలో చేర్చిన సమయంలో తన పేరు బాషా అని, తన స్వగ్రామం చాగలమర్రి అని మాత్రమే తెలిపాడు. మృతుని బంధువులు ఎవరైనా గుర్తిస్తే అర్బన్ పోలీసులకు సంప్రదించాలని ఆయన కోరారు. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలుకడప అర్బన్ : ఇటీవల ఎంపికై న స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(ఎస్.సి.టి.పి.సి)కు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని (డి.టి.సి) ఆదివారం తెల్లవారుజామున జిల్లా ఎస్పీఈ.జి అశోక్ కుమార్ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలోని వసతి ఏర్పాట్లను, తరగతి గదులను, కార్యాలయ గదులను, మైదానం, అంతర్గత రహదారులను, బాటిల్ అబ్బాకల్ పరికరాలను పరిశీలించారు. డి.టి.సి డీఎస్పీ అబ్దుల్ కరీంకు పలు సూచనలు చేశారు. కలకలం రేపుతున్న క్షుద్ర పూజలు సింహాద్రిపురం : మండల కేంద్రంలో క్షుద్ర పూజలు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ కలకలం రేపుతున్నాయి. మండల కేంద్రంలో ఈద్గా సమీపంలో వెన్నపూసపల్లెకు వెళ్లె దారిలో క్షుద్ర పూజలు పలుమార్లు జరుపుతున్నట్లు ప్రజలు పేర్కొంటున్నారు. ఇది ఎవరు చేస్తున్నారు.. ఎందుకు చేస్తున్నారో అర్థం కాక ఆ దారిన తరచూ వెళ్లే రైతులు, అలాగే మహిళలు భయాందోళనకు గురవుతున్నారు. పోలీసులు దీనిపై సమగ్ర దర్యాప్తు చేసి చర్యలు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్
కడప అర్బన్ : శారీరక దృఢత్వం, సంపూర్ణ ఆరోగ్యానికి సైక్లింగ్ ఎంతో దోహదపడుతుందని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పేర్కొన్నారు. ఫిట్ ఇండియా కార్యక్రమంలో భాగంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉత్తర్వుల మేరకు కడప నగర శివార్లలోని ఊటుకూరు సర్కిల్ నుంచి మౌంట్ ఫోర్ట్ స్కూల్ వరకూ 6 కి.మీ నిర్వహించిన సైకిల్ ర్యాలీని జిల్లా ఎస్పీ ప్రారంభించారు. స్వయంగా ఎస్పీ పాల్గొని పోలీస్ అధికారులు, సిబ్బందిలో ఉత్సాహాన్ని నింపారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ సైక్లింగ్ సహజ సిద్ధమైన వ్యాయామమని తెలిపారు. ప్రతి ఆదివారం పోలీసులు, ప్రజలు సైక్లింగ్ను అలవాటుగా చేసుకుని శారీరక దృఢత్వం, ఆరోగ్యాన్ని కాపాడుకునే విధంగా చేయడమే ఈ కార్యక్రమ ముఖ్య లక్ష్యమన్నారు. సైక్లింగ్ వల్ల గుండె ఆరోగ్యం మెరుగుపడటమే కాకుండా, ఒత్తిడిని తగ్గించడానికి, మానసిక ప్రశాంతతకు సాయపడుతుందన్నారు. కార్యక్రమంలో ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య , ఏ.ఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ దారెడ్డి భాస్కర్ రెడ్డి, సి.కె. దిన్నె సి.ఐ. నాగభూషణం, డి.సి.ఆర్.బి ఇన్స్పెక్టర్ ఈశ్వర్ రెడ్డి, ఆర్.ఐ లు శివరాముడు, టైటస్, వీరేష్, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ డి.కె. జావీద్, చిన్నచౌకు సి.ఐ. ఓబులేసు, చెన్నూరు సి.ఐ. కృష్ణారెడ్డి, కడప టూ టౌన్ సి.ఐ. సుబ్బారావు, సి.కె. దిన్నె ఎస్.ఐ శ్రీనివాసుల రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
సాఫ్ట్వేర్ ఉద్యోగి ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని వసంతపేటలో ఉమ్మడిశెట్టి లక్ష్మీప్రసాద్ (34) అనే సాఫ్ట్వేర్ ఉద్యోగి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ పోలీసులు తెలిపిన మేరకు ఉమ్మడిశెట్టి వెంకటసుబ్బన్న వస్త్ర దుకాణంలో గుమాస్తాగా పని చేస్తున్నాడు. అతనికి ముగ్గురు కొడుకులు, ఒక కుమార్తె ఉన్నారు. వారిలో చిన్న కుమారుడైన ఉమ్మడిశెట్టి లక్ష్మీప్రసాద్ హైదరాబాద్లో సాఫ్ట్వేర్ ఉద్యోగం చేసేవాడు. రెండేళ్ల క్రితం ఎర్రగుంట్లకు చెందిన చంద్రకళ అనే సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్న యువతితో వివాహమైంది. పెళ్లైన వారం రోజుల నుంచే వారి మధ్య విభేదాలు తలెత్తడంతో ఇద్దరు వేర్వేరుగా ఉంటున్నారు. పెద్దలు పంచాయతీ చేసినా వారి మధ్య సఖ్యత కుదరలేదు. గతంలో లక్ష్మీప్రసాద్ హైదరాబాద్లో ఆత్మహత్యా యత్నం చేశాడు. కొన్ని రోజుల తర్వాత అతని కిడ్నీ చెడిపోవడంతో డయాలసిస్ చేయిస్తున్నారు. తన ఆరోగ్యం కుదుట పడలేదని, చనిపోవాలనిపిస్తోందని అతను తల్లిదండ్రులతో చెప్పగా వారు ధైర్యం చెబుతూ వచ్చారు. ఈ క్రమంలో ఈ నెల 22న అతను హైదరాబాద్ నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. శనివారం రాత్రి భోజనం చేసిన తర్వాత అతను మిద్దైపెకి వెళ్లి పడుకున్నాడు. రాత్రి పొద్దుపోయాక కుటుంబ సభ్యులు చూడగా లక్ష్మీప్రసాద్ ఫ్యాన్కు ఉరి వేసుకుని వేలాడుతూ కనిపించాడు. అతన్ని వెంటనే ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. తండ్రి వెంకటసుబ్బన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
హెచ్ఎంల సమస్యల పరిష్కారానికి కృషి
కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రధానోపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తామని ప్రధానోపాధ్యాయుల సంఘం జిల్లా అధ్యక్షుడు వెంకటసుబ్బరెడ్డి, ప్రధాన కార్యదర్శి చంద్రశేఖర్రావు పేర్కొన్నారు. ఆదివారం కడపలోని డీసీఈబీ హాల్లో అన్ని మండలాల ప్రధానోపాధ్యాయుల ఆధ్వర్యంలో పూర్వ అధ్యక్ష, కార్యదర్శులతోపాటు కార్యవర్గం సమక్షంలో నూతన జిల్లాస్థాయి ఎన్నికలు జరిగాయి. రాష్ట్ర గౌరవాధ్యక్షుడు జీవీ నారాయణరెడ్డి, నెల్లూరు జిల్లా నుంచి ఎన్నికల పరిశీలకుడిగా శ్రీనివాసులు, బుజయ్యలు హాజరయ్యారు. ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షుడిగా జి.వెంకటసుబ్బారెడ్డి(జెడ్పీ హైస్కూల్, బద్వేల్) ప్రధాన కార్యదర్శిగా డి. చంద్రశేఖరరావు (జమ్మలముడుగు ఎంఈఓ–2) కోశాధికారిగా బి.శ్రీనివాస్ రెడ్డి (ఉర్దూ జెడ్పీ హైస్కూల్ పెన్నానగర్, ప్రొద్దుటూరు), రాష్ట్ర గౌరవాధ్యక్షుడిగా జి.విజయ భాస్కర్ రెడ్డి(ఉర్దూ జెడ్పీ హైస్కూల్, సర్వర్ఖాన్పేట, ఖాజీపేట) డివిజనల్ అధ్యక్షులు, కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిలర్లుగా బి. రామకృష్ణయ్య(జెడ్పీ హైస్కూల్ పెద్దకూడాల) లక్ష్మినారాయణరెడ్డి(జెడ్పీ హైస్కూల్ తొండలదిన్నె) ప్రతాపరెడ్డి( బి.మఠం హైస్కూల్) మహిళా విభాగంలోని సభ్యులను, లీగల్ కమిటీ, ఆడిట్ కమిటీలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. -
స్నేహితుల మధ్య ఘర్షణ
కమలాపురం : కమలాపురం మండలం రామచంద్రాపురం వద్ద స్నేహితుల మధ్య జరిగిన వాగ్వాదం ఘర్షణగా మారింది. ఈ నేపథ్యంలో కత్తితో దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన చోటు చేసుకుంది. పోలీసులు, స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కమలాపురం మండలం చదిపిరాళ్లకు చెందిన శివారెడ్డికి, వల్లూరు మండలం పెద్దపుత్తకు చెందిన గోవర్ధన్ రెడ్డి రూ.4500 బాకీ ఉన్నాడు. ఆ డబ్బు సోమవారం ఇస్తానని చెప్పడానికి ఆదివారం గోవర్ధన్ రెడ్డి రామచంద్రాపురం వద్ద ఉన్న శివారెడ్డి వద్దకు వెళ్లాడు. అయితే తనకు ఇప్పుడే కావాలని శివారెడ్డి చెప్పాడు. ఈ నేపథ్యంలో కట్ట గ్రామానికి చెందిన ఆది, నాగరాజు, వినోద్, చరణ్ తేజ్తో పాటు మరి కొందరు రామచంద్రాపురం వద్దకు చేరుకున్నారు. అక్కడ ఏమి జరిగిందో తెలియదు గాని స్నేహితులైన గోవర్ధన్ రెడ్డి, నాగరాజు మధ్య వాగ్వాదం జరిగింది. ఇంతలో నాగరాజుపై గోవర్ధన్ రెడ్డి కత్తితో దాడి చేశాడు. ఈ ఘటనలో నాగరాజుకు గొంతు వద్ద తీవ్ర గాయమైంది. వెంటనే అతన్ని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం రిమ్స్కు తీసుకెళ్లారు. కాగా జరిగిన ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు.కత్తితో దాడి–గాయాలు -
గండి అంజన్నకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పూజలు
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామిని శ్రావణ మాసం చివరి శనివారం సాయంత్రం కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య ఆధ్వర్యంలో ఆలయ అర్చకులు ఆయనకు పూర్ణ ఫలంతో స్వాగతం పలికారు. అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు చేయించారు. కార్యక్రమంలో ఎంపీపీ మాధవీబాలకృష్ణ, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి రామాంజులరెడ్డి, మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షుడు రుషి కేశవరెడ్డి, స్థానిక సర్పంచ్ నరసింహులు, శేషారెడ్డి, పాలకమండలి సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
పెద్ద దర్గాకు ఉత్సవ శోభ
కడప సెవెన్రోడ్స్ : భక్తుల పాలిట కొంగుబంగారమై నిలుస్తూ ప్రముఖ ఆధ్యాత్మిక పర్యాటక సూఫీ పుణ్య క్షేత్రమైన కడప పెద్దదర్గాకు ఉరుసు శోభ చేకూరింది. ఈనెల 24వ తేదీ నుంచి మూడు రోజులపాటు దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హుస్సేనీ చిష్టి ఉల్ ఖాద్రి సాహెబ్ ఉరుసు ఉత్సవాన్ని నిర్వహించనున్నారు. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం గంధోత్సవం, సోమవారం ఉరుసు, మంగళవారం తహలీల్ ఫాతెహా నిర్వహిస్తారు. ఉరుసురోజు ఖవ్వాలీ కచేరీ నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో దర్గాతోపాటు దర్గా ఆవరణం విద్యుద్దీపాలతో కాంతులీనుతూ భక్తులను ప్రత్యేకంగా ఆకర్శిస్తోంది. నేటి నుంచి ఉరుసు -
వక్ఫ్ భూముల లీజుకు వేలం
కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని ఏపీ స్టేట్ వక్ఫ్బోర్డుకు సంబంధించిన కొన్ని భూములను ఒక ఏడాదిపాటు గుత్తకు సాగు చేసుకోవడానికి వేలం పాట నిర్వహించనున్నట్లు డీఆర్వో విశ్వేశ్వరనాయుడు తెలిపారు. కలెక్టరేట్ ఆవరణలోని డి.బ్లాక్లో ఉన్న జిల్లా మైనార్టీ సంక్షేమ అధికారి కార్యాలయంలో బహిరంగ వేలం జరుగుతుందన్నా రు. ఇందులో పాల్గొనదలిచిన వారు వక్ఫ్బోర్డు జిల్లా ఇన్స్పెక్టర్, కడప పేరిట రూ. 10 వేల బయాన చెల్లించి పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వేలంలో సాగుభూములు దక్కించుకున్న వారు వెంటనే గుత్త మొత్తం చెల్లించి తగిన రశీదు పొందాలన్నారు. ప్రొద్దుటూరు మండలం మోడెంపల్లె మసీదుకు సంబంధించిన తాళ్లమాపురం గ్రామం, అలాగే అదే గ్రామంలోని అసూర్ఖానాకు చెందిన భూములను ఈనెల 26వ తేది మధ్యాహ్నం 2 గంటలకు వేలం వేస్తారన్నారు. పెండ్లిమర్రి మండలం గంగనపల్లె, ముద్దురెడ్డిపల్లె మసీదు, అసూర్ఖానాలకు సంబంధించిన భూములు అదేరోజు వేలం వేస్తామన్నారు. పులివెందుల మండలం పోల్లేపల్లె గ్రామానికి చెందిన అసూర్ఖానా భూములు, ఖాజీపేట మండలం తుడుములపల్లె గ్రామ సర్వే నెంబర్లలోని అసూర్ఖానా భూములకు వేలం పాట నిర్వహిస్తామని వివరించారు. -
ఆంధ్రకేసరి.. మన్నించాలి మరి!
కూటమి నేతల మాటకు.. చేతలకు పొంతనే ఉండదు. ప్రచార ఆర్భాటాలు మినహా ఆచరణలో చేసేదేమీ ఉండదు. ఇదిగో కడప నగరం ఏడురోడ్ల కూడలిలోని మన ప్రకాశం పంతులుగారి నిలువెత్తు విగ్రహమే ఇందుకు సాక్ష్యం. స్వాతంత్య్ర సంగ్రామంలో తన సర్వస్వాన్ని ధార పోసిన మహోన్నత నాయకుడు ఆంధ్రకేసరి టంగుటూరి ప్రకాశం పంతులు. ఉమ్మడి ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా పని చేశారు. ఆయన జయంతిని కూటమి ప్రభుత్వం అధికారిక ఉత్సవంగా నిర్వహిస్తామని గొప్పలు చెప్పింది. ఆచరణలోకి వచ్చేసరికి చేతులు దులిపేసుకుంది. సమయం లేదో.. ఉత్సవంగా చేయాలన్న మనసే రాలేదోగానీ అటు అధికారులు.. ఇటు నాయకులు జయంతి వేళ ఒక్క దండ కూడా వేసింది లేదు. పాత పూల దండతోనే దర్శనం ఇస్తున్న విగ్రహాన్ని చూసిన స్థానికులు ‘మన్నించు.. పంతులు గారూ’ అంటూ మౌనంగా వెళ్లారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపు అమానుషం
పులివెందుల: రాష్ట్రంలోని దివ్యాంగుల పింఛన్లను కూటమి ప్రభుత్వం తొలగించడం అమానుషమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. శనివారం పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం దాదాపుగా 4లక్షల పింఛన్లను తొలగించిందన్నారు. అదేమని ప్రశ్నిస్తే కుంటి సాకులు చెబుతోందన్నారు. చంద్రబాబు నాయుడు దివ్యాంగులతో కూడా రాజకీయాలు చేయడం నీచమైన చర్యగా అభివర్ణించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో 66 లక్షలకుపైగా పింఛన్లు అందజేసేదని, అయితే ప్రస్తుత ప్రభుత్వం 62లక్షల పింఛన్లు పంపిణీ చేస్తోందన్నారు. అలాగే ఈ ప్రభుత్వంలో రైతన్నలకు ఎరువులు కూడా లభించడంలేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా తీవ్రమైన యూరియా కొరత ఏర్పడిందన్నారు. ప్రభుత్వం సరఫరా చేస్తున్న యూరియాను అధికార పార్టీ నాయకులు పక్కదారికి మళ్లిస్తున్నారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేశామంటూ ప్రభుత్వం గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. అరకొరగా సంక్షేమ పథకాలు అందజేసి అన్ని పథకాలు అమలు చేస్తున్నామని తెలుగుదేశం పార్టీ నాయకులు, ఎల్లో మీడియా ప్రచారం చేసుకుంటున్నారన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. వైఎస్సార్సీపీ నాయకులకు పరామర్శ గత జెడ్పీటీసీ ఎన్నికల సందర్భంగా ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు వేల్పుల రాములపై టీడీపీ గూండాలు అమానుషంగా దాడి చేసిన విషయం విదితమే. దాడి చేసిన వారిని అరెస్టు చేయకుండా తిరిగి వైఎస్సార్సీపీ నాయకులపై పోలీసులు ఎస్సీ, ఎస్టీ కేసు, అటెంప్డ్ మర్డర్ కేసు నమోదు చేసిన సంగతి తెలిసిందే. ఈ కేసులో పులివెందుల సబ్జైలులో రిమాండ్లో ఉన్న వైఎస్సార్సీపీ నాయకులైన మనోహర్, గుండాలయ్య, చంద్రబాబు, మునిచంద్ర, ఎస్.గంగిరెడ్డి, అంకాల్రెడ్డి, గోపాల్, క్రిష్టిపాటి గంగిరెడ్డిలను శనివారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ములాఖత్ ద్వారా సబ్జైలులో కలిశారు. ఈ సందర్భంగా వారిని ధైర్యంగా ఉండాలని, పార్టీ తరపున అండగా ఉంటామని భరోసా ఇచ్చినట్లు తెలిసింది. ప్రజల సమస్యలపై అధికారులకు ఫోన్ చేస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ములాఖత్ అనంతరం సబ్జైలు నుంచి బయటకు వస్తున్న ఎంపీ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఏఎఫ్యూలో రేపు కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంలో 25న బీఎఫ్ఏ (ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, శిల్పం, బి. డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు వీసీ విశ్వనాథ్కుమార్ తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో హాజరు కావాలని తెలిపారు. మరింత సమాచారం కోసం www.ysrafu.ac.in వెబ్సైట్ను సందర్శించాలని తెలిపారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలల ఇన్స్టంట్ పరీక్షల ఫలితాలను శనివారం వైవీయూ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు విడుదల చేశారు. ఈ సందర్భంగా రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ, పరీక్షల నియంత్రణ అధికారి ఆచార్య కేఎస్వీ కృష్ణారావుతో కలసి మాట్లాడారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ, బ్యాచిలర్ ఆఫ్ ఒకేషనల్ ఐదు సెమిస్టర్ల పరీక్షలకు1,012 మంది విద్యార్థులు హాజరు కాగా 977 మంది ఉత్తీర్ణత సాధించారని వెల్లడించారు. పీజీ కోర్సులలో ప్రవేశాలకు అనువుగా ఫలితాలు విడుదల చేశామని తెలిపారు. విద్యార్థులు ఫలితాల కోసం https:www.yvuexams.in/ resu lts.aspx అనే వైబ్సెట్ను సందర్శించాలని ఆచార్య కృష్ణారావు సూచించారు. ఈ కార్య క్రమంలో సహాయ పరీక్షల నియంత్రణ అధి కారి డాక్టర్ గణేష్ నాయక్ పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో ఎరువులు, యూరియా అధిక ధరలు అరికట్టడంతోపాటు ఎరువుల బ్లాక్ మార్కెట్కు అడ్డుకోవడానికి వ్యవసాయశాఖ అధికారులు వ్యవసాయశాఖ అధికారితోపాటు పోలీసు, విజిలెన్స్ డిపార్టమెంట్కు చెందిన అధికారులతో కలిసి టీమ్లను ఎంపిక చేసింది. ఈ టీమ్లలో వ్యవ సాయ డివిజన్ వారిగా ఆయా డివిజన్ ఏడీలతోపాటు పోలీసు సర్కిల్ ఇన్స్పెక్టరు, విజిలెన్స్ డిపార్టుమెంట్కు సంబంధించి ఒక అధికారితో కలిసి టీమ్లను ఏర్పాటు చేశారు. జిల్లాలో ఎనిమిది వ్యవసాయ డివిజన్లకు 8 టీమ్లను ఏర్పాటు చేశారు. ఈ టీమ్స్ కలిపి జిల్లావ్యాప్తంగా ఆయా ఆయా వ్యవసాయ డివిజన్ల పరిధిలో ఎరువులను అధిక ధరలకు అమ్మినా, ఎరువులను బ్లాక్ మార్కెట్కు తరలించినా చర్యలు తీసుకోనున్నారు. ఎరువులను బ్లాక్ మార్కెటింగ్ చేస్తే ... కడప అర్బన్: ‘యూరియా ఎరువును దాచిపెట్టడం (హోర్డింగ్) , బ్లాక్ మార్కెటింగ్’ను నివారించేందుకు ప్రత్యేక దాడులు చేయనున్నట్లు విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ కడప రీజినల్ అధికారి ఏ. శ్రీనివాసరావు శనివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. యూరియాను దారి మళ్లించడం, అక్రమంగా నిల్వ చేయడం లేదా బ్లాక్ మార్కెటింగ్ చేయడం చట్టవిరుద్ధమని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెట్ చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
● ఇంటి పట్టాల కోసం ఇచ్చిన భూమి సైతం...
నంద్యాలంపేట సర్వే నంబర్ 854/1, సర్వే నంబర్ 840లో ప్రభుత్వ భూమి చదును చేసిన టీడీపీ నేతలుసాక్షి ప్రతినిధి, కడప: మైదుకూరు నియోజకవర్గంలో తెలుగుతమ్ముళ్లు అక్రమార్కుల అవతారమెత్తారు. చెరువులు, వాగులు, పోరంబోకు ప్రభుత్వ భూములను చెరబట్టారు. అధికార పార్టీ ఎమ్మెల్యే పేరు చెబుతూ అక్రమంగా స్వాధీనం చేసుకుంటున్నారు. జాండ్లవరం గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు మరింత దూకుడు ప్రదర్శిస్తున్నారు. నంద్యాలంపేట రెవెన్యూ గ్రామ పరిఽధిలో సర్వేనంబర్ 859లో 16 ఎకరాలు, సర్వే నంబర్ 840లో 70 ఎకరాల భూమికి కంచె వేశారు. తాజాగా సర్వే నంబర్ 854/1లో 1.61 ఎకరాలు అస్సెస్పీ వేస్ట్ ల్యాండ్ (ఏడబ్ల్యూ) చదును చేశారు. దాని సమీపంలోని సర్వే నంబర్ 840లో ఉన్న మరింత భూమిని కలుపుకొని సుమారు నాలుగెకరాలు, ప్రభుత్వం స్వాధీన అనుభవంలో భూమిని తాజాగా డోజర్లతో చదును చేసి తెలుగుతమ్ముళ్లు వశపర్చుకుంటున్నారు. నేషనల్ హైవే రహదారి పక్కలో ఉన్న ఆ పొలం ఎకరం రూ.50 లక్షలకు తక్కువ లేకుండా పలుకుతోంది. అలాంటి భూమి అన్యాక్రాంతమవుతున్నా, రెవిన్యూ యంత్రాంగం పట్టించుకోవడం లేదు. కనీసం అటువైపు కన్నెత్తి చూడడం లేదు. పట్టా రద్దు భూమి సైతం.. 2022లో డీకేటీ పట్టా రద్దు చేసిన భూమిని 2024లో ప్రభుత్వ ఏడబ్ల్యూ ల్యాండ్గా గుర్తించారు. 2025లో అదే భూమి తెలుగుతమ్ముళ్లు వశమైంది. ఎకరం రూ.50లక్షలు చేసే ప్రభుత్వ భూమి ఆన్యాక్రాంతమైంది. సర్వే నంబర్ 854/1లో 1.61 ఎకరాలు బొడికే లక్ష్మిదేవి పేరిట డీకేటీ పట్టా నెం.294/1414, జనవరి 20, 2005న జారీ అయ్యింది. పట్టాదారు పాసుపుస్తకం కూడా మంజూరైంది. ఆ భూమిలో తాము పంట పెట్టలేని ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్నామని డీకేటీ పట్టా రద్దు చేయాల్సిందిగా అప్పటి తహసీల్దార్ ప్రేమంత్కుమార్కు బొడికే లక్ష్మిదేవి ఆర్జీ పెట్టుకున్నారు. ఆ మేరకు 2022 జనవరి 25న డీకేటీ పట్టా రద్దు చేస్తూ తహశీల్దారు ఉత్తర్వులు జారీ చేశారు. అదే భూమిని 2024 జనవరి 11న ఏడబ్ల్యూ ల్యాండ్గా గుర్తిస్తూ అప్పటీ తహసీల్దార్ అనురాధ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రభుత్వ భూమిగా సూచిక బోర్టు కూడా ఏర్పాటు చేశారు. కూటమి సర్కార్ వచ్చిన తర్వాత అదే భూమి తెలుగుతమ్ముళ్లు వశమైంది. తాజాగా జాండ్లవరం గ్రామానికి చెందిన టీడీపీ నేత ఒకరు స్వాధీనం చేసుకొని చదును చేస్తున్నారు. నంద్యాలంపేట రెవెన్యూ పొలంలో భూములు యథేచ్ఛగా కబ్జాకు గురవుతున్నాయి. జగనన్న కాలనీ కోసం సర్వే నంబర్ 859లో 16 ఎకరాలు నిర్ణయించారు. ఎకరం రూ.20 లక్షలు విలువ చేసే ఈ స్థలాన్ని పేదలకు ఇండ్ల స్థలాల కోసం అప్పటి ప్రభుత్వం నిర్ణయించింది. వ్యక్తిగత కేటాయింపులు కూడా చేశారు. ఈ తరుణంలో కొంతమంది కోర్టును ఆశ్రయించి, ఆభూమిలో పట్టాలు ఇవ్వకుండా అడ్డుకున్నారు. ప్రస్తుతం వ్యవహారం కోర్టులో ఉండగా జాండ్లవరం గ్రామానికి చెందిన తెలుగుతమ్ముళ్లు ఆ భూమిని చదును చేసి స్వాధీనం చేసుకున్నారు. అలాగే సర్వే నంబర్ 840లో 70 ఎకరాలు బ్రహ్మంసాగర్ నిర్వాసితుల కోసం కేటాయించారు. ఆ భూమికి ఏకంగా ఫెన్సింగ్ వేశారు. ప్రభుత్వ భూమిలో ఫెన్సింగ్ వేస్తున్నారని గ్రామస్థాయి రెవెన్యూ సిబ్బంది ప్రశ్నిస్తే వారిపై నోటి దురుసుతనం ప్రదర్శించినట్లు తెలుస్తోంది. జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగానికి ఫిర్యాదులున్నా, నోరుమెదపలేదు. కోట్లాది రూపాయాలు విలువ చేసే ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం అవుతున్నా కనీస స్పందన లేదు. చట్టం తెలుగుతమ్ముళ్లు చుట్టం కావడమే అందుకు ప్రధాన కారణంగా పరిశీలకులు వెల్లడిస్తున్నారు. -
ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలకు అంకురార్పణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో ఆగస్టు 24 నుంచి 26వ తేదీ వరకు జరుగనున్న పవిత్రోత్సవాలకు శనివారం సాయంత్రం శాస్త్రోక్తంగా అంకురార్పణ జరిగింది.ఇందులో భాగంగా సాయంత్రం 6 గంటల నుంచి మేధిని పూజ, మృత్సంగ్రహణం, అంకుకార్పణ ఘట్టాలు నిర్వహించారు. యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక జరిగే దోషాల వల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడురోజులపాటు పవిత్రోత్సవాలు జరుపుతుంటారు. పవిత్రోత్సవాలలో భాగంగా ఆగస్టు 24న యాగశాలలో పవిత్ర ప్రతిష్ట, శయానాధివాసం, 25న పవిత్ర సమర్పణ, 26న వైదిక కార్యక్రమాలు, పూర్ణాహుతితో పవిత్రోత్సవాలు ముగియనున్నాయి. కార్యక్రమంలో ఆలయ సూపరిటెండెంట్ హనుమంతయ్య, టెంపుల్ ఇన్స్పెక్టర్ నవీన్, అర్చకులు పాల్గొన్నారు. గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉదయం అర్చకులు అభిషేకాలు, అర్చనలు జరిపారు. తోమాల సేవ, ఏకాంతసేవ నిర్వహించారు. ఈసందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. చారిత్రాత్మాక గుర్రంకొండ కోటలోని శ్రీ నృసింహస్వామి ఆలయంలో అర్చనలు, అభిషే కాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో ఆలయాలకు తరలివచ్చారు. స్వామివారిని దర్శించుచుకొన్నారు. -
● ఒకే ఇంట్లో ముగ్గురికి టీచర్ కొలువులు
కృషి, పట్టుదలతోపాటు ప్రణాళిక ఉంటే సాధించలేనిదంటూ ఏమీ ఉండదని కడప నగరానికి చెందిన ఒక కుటుంబం నిరూపించింది. ఒకరా ఇద్దరా ఒకే కుటుంబం నుంచి ముగ్గురు అభ్యర్థులు ఉత్తమ ర్యాంకులు సాధించి టీచర్ ఉద్యోగాలకు ఎంపికై భళా అనిపించారు. ఇందులో భార్యభర్తలతోపాటు ఆడబిడ్డ ఉండడం విశేషం. సనావుల్లా స్కూల్ అసిస్టెంట్ ఫిజిక్స్లో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించాడు. అలాగే అతని భార్య నజీహా కరీమ్ 84.07 మార్కులతో ఉర్దూ విభాగంలో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించగా.. సనావుల్లా చెల్లెలు సయ్యద్ రేష్మా ఉర్దూ ఎస్జీటీ విభాగంలో 20వ ర్యాంకు సాధించడం విశేషం. -
సర్టిఫికెట్ల పరిశీలనకు ఏర్పాట్లు పూర్తి
కడప ఎడ్యుకేషన్: డీఎస్సీ –2025లో అర్హత సాధించిన ఉపాధ్యాయ అభ్యర్థుల సర్టిఫికెట్ల పరిశీలనకు జిల్లా విద్యాశాఖ సమాయత్తమైంది. ర్యాంకు సాధించిన అభ్యర్థులకు వారి వ్యక్తిగత లాగిన్ ఐడీల ద్వారా కాల్ లెటర్లు అందుతాయని ఇదివరకే అధికారులు స్పష్టం చేశారు. అభ్యర్థులు తమ వ్యక్తిగత లాగిన్ ద్వారా కాల్లెటర్ను డౌన్లోడ్ చేసుకుని తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లతోపాటు ఇటీవల తీసుకున్న కులధ్రువీకరణ పత్రం, గెజిటెడ్ అధికారితో ధ్రువీకరించిన మూడు సెట్ల సర్టిఫికెట్ జిరాక్స్లు, 5 పాస్పోర్టు సైజు ఫొటోలు తీసుకుని వారికి కేటాయించిన తేదీల్లో సర్టిపికెట్ల వెరిఫికేషన్కు వ్యక్తిగతంగా హాజరు కావాల్సి ఉంటుంది. వెరిఫికేషన్కు హాజరుకాకముందే సంబంధిత సర్టిఫికెట్లను వెబ్సైట్లో అప్లోడ్ చేయా ల్సి ఉంటుంది, అభ్యర్థులు తమకు కేటాయించిన తేదీ, సమయానికి సర్టిఫికెట్ వెరిఫికేషన్కు తప్పనిసరిగా హాజరు కావాలి. అలా హాజరు కాని లేదా అర్హత లేని అభ్యర్థుల అభ్యర్థిత్వం రద్దు చేయబడుతుందని అధికారులు స్పష్టం చేశారు. ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పరిశీలన కేంద్రంగా ఎంపిక... డీఎస్పీ అభ్యర్థులకు త్వరలో జరగబోయే సర్టిఫికెట్ల వెరిఫికేషన్ కోసం విద్యాశాఖ కడప బాలాజీ నగర్లోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలను ఎంపిక చేసింది. సర్టిఫికెట్ల పరిశీలన కోసం విద్యాశాఖ, రెవెన్యూశాఖ అధికారులను 68 మందితో 17 టీముల సిద్ధం చేశారు. వీరితోపాటు 30 మంది వలంటీర్లును కూడా అందుబాటులో ఉంచారు. జమ్మలమడుగు: ఎర్రగుంట్ల జిల్లా పరిషత్లో చదువుకున్న నలుగురు విద్యార్థులు ఫిజికల్ డైరెక్టర్లుగా డీఎస్సీలో ఉద్యోగాలు సాధించినట్లు పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రామాంజనేయుల రెడ్డి పేర్కొన్నారు. సెలెక్టు అయిన వారిలో చంద్రకాంత్ మూడవర్యాంకు, తాజుద్దీన్ 20వ ర్యాంకు, ఆరిఫ్ మహమ్మద్ 25, జగదీష్కుమార్ 56 ర్యాంకులు సాధించారని పేర్కొన్నారు. డీఎస్సీ మెరిట్ జాబితా విడుదల కడపలో ఒకే కుటుంబంలో ముగ్గురికి ఉపాధ్యాయ ఉద్యోగాలు ఓ మారుమూల పల్లెలో నివాసం.. పైగా గృహిణి.. ఇద్దరు పిల్లలు. అలాగని ఆమె అక్కడితో ఆగి పోలేదు. తన ఇద్దరు పిల్లల పోషణ చూసుకుంటూనే ఆన్లైన్లో కోచింగ్ తీసుకున్నారు. ప్రస్తుత డీఎస్సీ సోషియల్ సబ్జెక్టులో జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించింది. ఆమే దువ్వూరు మండలం బుక్కాయపల్లె గ్రామానికి చెందిన అప్పల్రెడ్డి భాగ్యలక్ష్మి. ఇంటి వద్దే ఉంటూ ఆన్లైన్ కోచింగ్ తీసుకుని కష్టపడి చదివి జిల్లా ఫస్ట్ ర్యాంకు సాధించడంపై ఆమె కుటుంబ సభ్యులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. బాగ్యలక్ష్మి భర్త సునీల్కుమార్రెడ్డి ఒక ప్రైవేటు కంపెనీలో ఉద్యోగం చేస్తున్నాడు. -
స్ఫూర్తి ప్రదాత ప్రకాశం పంతులు
కడప సెవెన్రోడ్స్ : స్వాతంత్య్ర సమర యోధుడు టంగుటూరి ప్రకాశం పంతులు స్ఫూర్తి ప్రదాత అని, భవిష్యత్ తరాలకు ఆదర్శ ప్రాయులని నేషనల్ హైవే స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి అన్నారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు 154వ జయంతి ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రానికి మొదటి ముఖ్యమంత్రిగా పని చేసిన టంగుటూరి ప్రకాశం పంతులు నిరుపేద కుటుంబంలో పుట్టి, కష్టపడి చదువుకుని ఉన్నత స్థాయికి చేరుకున్నారని తెలిపారు. ఆంధ్ర రాజకీయాల్లో ప్రముఖంగా వెలుగొందిన వ్యక్తుల్లో ప్రకాశం పంతులు ఒకరని తెలిపారు. ఆయన పేరు మీద రాజమండ్రిలో ప్రకాశం బ్యారేజ్ నిర్మించారని, నిజాయితీకి నిలువెత్తు నిదర్శనం ప్రకాశం పంతులు అని కొనియాడారు. స్వాతంత్య్ర సమరయోధుడిగా, న్యాయవాదిగా, రాజకీయ వేత్తగా, రచయితగా, సంపాదకుడిగా రాణించి ఆంధ్ర రాష్ట్రానికి జాతీయ స్థాయిలో ఎనలేని కీర్తి తీసుకొచ్చారని కొనియాడారు. యువత ఆయన అడుగుజాడల్లో నడవాలని ఆకాంక్షించారు. అంతకుముందు ఆంధ్ర కేసరి టంగుటూరి ప్రకాశం పంతులు చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ కార్యక్రమంలో మెప్మా పీడీ కిరణ్ కుమార్, స్టెప్ సీఈఓ సాయి గ్రేస్, ఐసీడీఎస్ అధికారి రమాదేవి పాల్గొన్నారు. ఆంధ్ర కేసరికి ఘన నివాళి కడప అర్బన్: శ్రీఆంధ్ర కేసరిశ్రీ టంగుటూరి ప్రకాశం పంతులు జయంతిని పురస్కరించుకుని శనివారం కడప నగరంలోని జిల్లా పోలీస్ కార్యాలయంలో ఏ.ఆర్. అదనపు ఎస్.పి. బి.రమణయ్య ప్రకాశం పంతులు చిత్రపటానికి ఘనంగా నివాళులు అర్పించారు. స్వాతంత్య్ర ఉద్యమంలో ఆయన త్యాగాన్ని కొనియాడారు. కార్యక్రమంలో ఎ.ఆర్. డీఎస్పీ శ్రీనివాస రావు, డీపీఓ ఏ.ఓ కె.వెంకటరమణ, ఆర్.ఐ లు వీరేష్, టైటస్, శివరాముడు, శ్రీశైల రెడ్డి, ఆర్.యస్.ఐ లు, డీపీఓ సిబ్బంది పాల్గొన్నారు. మాట్లాడుతున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి ప్రకాశం పంతులు చిత్రపటం వద్ద నివాళులర్పిస్తున్న ఏ.ఆర్. అదనపు ఎస్పీ -
గండి క్షేత్రంలో ముగిసిన శ్రావణ మాస ఉత్సవాలు
అమావాస్య కారణంగా చివరి శనివారం భారీగా తగ్గిన భక్తుల రద్దీ చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రావణ మాసం చివరి శనివారం భక్తుల సంఖ్య భారీగా తగ్గింది. ఇందుకు అమావాస్యే కారణమని పలువురు చర్చించుకుంటున్నారు. జిల్లా నలుమూలల నుంచే కాకుండా పొరుగు జిల్లాల నుంచి సైతం భక్తులు వచ్చి స్వామిని దర్శించుకొని పరవశించి పోయారు. వాహనాలను పోలీసులు అద్దాలమర్రి క్రాస్, ఇడుపులపాయ క్రాస్ల వద్దనే నిలిపి వేశారు. దీంతో భక్తులు కాలినడకన గండికి చేరుకొని దర్శించుకున్నారు. కొందరు భక్తులు వేంపల్లె, చక్రాయపేట, నాగలగుట్టపల్లె, వేముల తదితర ప్రాంతాల నుంచి కాలినడకన వచ్చి తమ మొక్కులు తీర్చుకున్నారు. భక్తుల కోసం గండి శ్రీవాసవీ నిత్యాన్నదాన సత్రంతో పాటు పలు చోట్ల దాతలు పెద్ద ఎత్తున అన్నదానాలు చేశారు. ఉత్సవాల సందర్భంగా ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య చైర్మన్ కావలి కృష్ణతేజ, పాలకమండలి సభ్యులతో పాటు ఆర్కేవ్యాలీ సీఐ ఉలసయ్య, ఆర్కేవ్యాలీ ఎస్ఐ రంగారావు ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రఘుస్వామి, వేద పారాయణం రామ మోహనశర్మలు స్వామిని ప్రత్యేకంగా అలంకరించారు. వైభవంగా స్వామి వారి క్షేత్రోత్సవం, ఆస్థానం శ్రావణ మాసం ఉత్సవాల ముగింపు సందర్భంగా స్వామివారి క్షేత్రోత్సవం, ఆస్థానం కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. ప్రత్యేక పల్లకిలో పూలాలంకరణ మధ్య ఉత్సవ మూర్తి విగ్రహాన్ని ఉంచి మంగళ వాయిద్యాల మధ్య ఊరేగించారు. అనంతరం ఆస్థానం నిర్వహించి ఈ ఏడాది శ్రావణ మాస ఉత్సవాలను ముగించారు. -
ఎమ్మార్పీ ధరకంటే అధికంగా అమ్మితే చర్యలు
ప్రొద్దుటూరు : ఎమ్మార్పీ ధరకంటే ఎక్కువ ధరకు యూరియా అమ్మితే వ్యవసాయ శాఖ తీసుకునే చర్యలకు వ్యాపారులు సిద్ధంగా ఉండాలని, దుకాణాల వద్ద నోటీసు బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించినట్లు వ్యవసాయశాఖ జిల్లా సంయుక్త సంచాలకులు చంద్రానాయక్ తెలిపారు. ఆయన శనివారం ప్రొద్దుటూరులోని పలు ఎరువుల దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనల ప్రకారం యూరియా బస్తా రూ.266.50 చొప్పున మాత్రమే అమ్మాలని తెలిపారు. జిల్లాలో యూరియా కొరత లేదన్నారు. యూరియా నిల్వలను పరిశీలించేందుకు ప్రత్యేకంగా వ్యవసాయ శాఖ, పోలీసులతో కలసి విజిలెన్స్ మానిటరింగ్ టీంను ఏర్పాటు చేశామన్నారు. కార్యక్రమంలో ఏడీఏ అనిత, సీఐ వేణుగోపాల్, డీసీటీఓ ఖాజామొహిద్దీన్, ఏఓ వరహరికుమార్ పాల్గొన్నారు. ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్ అధికారుల ఆకస్మిక తనిఖీ మైదుకూరు : మైదుకూరులోని ఎరువుల దుకాణాల్లో విజిలెన్స్, వ్యవసాయాధికారులు శనివారం ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. రికార్డుల్లో తేడాలు ఉండటంతో పలు దుకాణాల యాజమానులకు నోటీసులిచ్చారు. పట్టణంలోని శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఫెర్టిలైజర్స్, శ్రీసాయి లక్ష్మీ ఫెర్టిలైజర్స్ అండ్ పెస్టిసైడ్స్ దుకాణాల్లో రికార్డులను, ఎరువుల ధరలు ఎమ్మార్పీ ముద్రణ విషయాలను పరిశీలించారు. స్టాక్ రికార్డుల్లో తేడాలు ఉండటంతో దుకాణ యాజమానులకు అమ్మకాలను నిలిపేస్తూ నోటీసులిచ్చారు. శ్రీలక్ష్మీ వేంకటేశ్వర ఫెర్టిలైజర్స్ దుకాణంలో రూ.53,385 విలువైన 9.41 టన్నుల యూరియా, శ్రీసాయి లక్ష్మీ ఫెర్టిలైజర్స్, పెస్టిసైడ్స్ దుకాణంలో రూ.53,300 విలువైన 10 టన్నుల యూరియాను అమ్మకూడదని అధికారులు నోటీసులో పేర్కొన్నారు. -
ఇక అంతా స్పీడ్ పోస్టే !
● పోస్టల్ శాఖలో సెప్టెంబర్ ఒకటి నుంచి రిజిస్టర్ పోస్టు రద్దు ● ట్రాకింగ్ సిస్టంతో విస్తృత సేవలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : దశాబ్దాలుగా పోస్టల్ శాఖలో సేవలందిస్తున్న రిజిస్టర్డ్ పోస్ట్ రద్దవుతోంది. ఈ నెలాఖరుకు రిజిస్టర్డ్ పోస్ట్ అనేది పోస్టల్ శాఖ నుంచి అంతర్ధానం కానుంది. రిజిస్టర్డ్ పోస్టును స్పీడు పోస్టులో విలీనం చేయడం ద్వారా ఈ విధానం రద్దు కానుంది. కొత్త విధానం సెప్టెంబర్ ఒకటవ తేదీ నుంచి దేశ వ్యాప్తంగా పోస్టల్ శాఖ అమలులోకి తీసుకురానుంది. ఇకనుంచి స్పీడ్ పోస్ట్ పార్సిల్ సేవలు అందించనున్నాయి. స్పీడ్ పోస్ట్ అనేది పోస్టల్ శాఖలో విస్తృత సేవలు అందిస్తోంది. కొత్తగా స్పీడ్ పోస్ట్లో ట్రాకింగ్ సిస్టం కూడా అందుబాటులోకి వచ్చింది. పార్సెల్ బుక్ చేసిన వ్యక్తికే కాకుండా దానిని అందుకోనున్న వ్యక్తి మొబైల్ ఫోన్కు పూర్తి సమాచారంతో కూడిన మెసేజ్ వస్తుంది. బుక్ పార్సిల్ ఎక్కడుంది. ఎప్పటికి అందుతుంది వంటి వివరాలు మొబైల్ ఫోన్లో చూసుకునే వెసులుబాటు కల్పించింది. సరికొత్త టెక్నాలజీ దిశగా.. పోస్టల్ శాఖ ఇప్పటి వరకు అమలవుతున్న టెక్నాలజీ విధానాలకు స్వస్తి పలికి సరికొత్త సాంకేతిక ఆధునికతతో కూడిన ఏపీటీ 2.0 ద్వారా సేవలందిస్తోంది. జులై నెలకు ముందు పోస్టల్ శాఖ మొత్తం సేవలు కోర్ ఇంటిగ్రేటెడ్ సిస్టమ్, కోర్ బ్యాంకింగ్ సిస్టమ్ ద్వారా అందేవి. వీటినే అడ్వాన్స్్డ్ టెక్నాలజీతో ఉన్న ఏపిటీ 2.0 అమలులోకి తెచ్చింది. కడప డివిజన్ పోస్టల్ కార్యాలయంలో పోస్టల్ సేవలను ఏపీకి 2.0 అందించడమే కాదు వచ్చే సెప్టెంబర్ ఒకటో తేదీ నుంచి విలీనమైన స్పీడ్ పోస్ట్ ద్వారా సాంకేతిక సౌకర్యాలతో సేవలందించేందుకు డివిజన్లో అన్ని ఏర్పాట్లు చేశారు. కడప డివిజన్ పోస్టల్ కార్యాలయంలో 2 ప్రధాన కార్యాలయాలు ఉన్నాయి. 54 సబ్ పోస్టాఫీసులు, 395 బ్రాంచి పోస్టాఫీసులు ఉన్నాయి. వీటిలో స్పీడ్ పోస్ట్ సేవలు అందుబాటులోకి రానున్నాయి. -
డ్వాక్రా సంఘాల పర్యవేక్షణ బాధ్యత ఎవరిది?
● లక్షల రూపాయల డబ్బులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ● ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో వెలుగు చూస్తున్న పర్యవేక్షణ లోపాలు ప్రొద్దుటూరు : డ్వాక్రా సంఘాల నిర్వహణకు సంబంధించి ప్రభుత్వం ప్రత్యేకంగా అధికారులను నియమించింది. కింది స్థాయి నుంచి పై స్థాయి వరకు వివిధ హోదాల్లో అధికారులు పనిచేస్తున్నారు. వేతనాలతోపాటు కమీషన్లను దండుకుంటున్నారు. అయినా తరచూ డ్వాక్రా సంఘాల నిర్వహణలో లోపాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. తద్వారా డ్వాక్రా సభ్యులు నష్టపోతున్నారు. ప్రొద్దుటూరు మున్సిపాలిటీకి సంబంధించి మెప్మా పరిధిలో 2814 డ్వాక్రా సంఘాలు ఉన్నాయి. వీటి నిర్వహణకు సంబంధించి ప్రతి నెల వేతనాలు తీసుకునే ఆర్పీలు, సీఓలతోపాటు మున్సిపాలిటీకి సంబంధించి ప్రత్యేక అధికారి ఉన్నారు. ప్రభుత్వాలు చాలా ఏళ్లుగా డ్వాక్రా సంఘాలకు సంబంధించి అధిక ప్రాధాన్యత ఇస్తున్నాయి. వివిధ రకాలుగా సహాయ సహకారాలను ప్రత్యక్షంగా, పరోక్షంగా అందిస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో డ్వాక్రా సంఘాల రుణమాఫీ (వైఎస్సార్ ఆసరా), రుణాల వడ్డీ మాఫీ పథకాన్ని అమలు చేశారు. ఇలా చేయాలి.. ప్రతి నెలా కింది స్థాయిలో ప్రతి డ్వాక్రా గ్రూప్కు సంబంధించి ఆర్పీ ఆధ్వర్యంలో సభ్యుల సమావేశాన్ని నిర్వహించాలి. గత నెలలో జరిగిన వివరాలను చర్చించడంతోపాటు బ్యాంకులకు డబ్బు జమ చేసిన రశీదులను తీర్మానంలో పొందుపరచాలి. ఆర్పీతోపాటు గ్రూప్ లీడర్లు, సభ్యులు తీర్మానంలో సంతకాలు చేయాలి. ప్రతినెలా ఆర్పీ పది మంది సభ్యులను హాజరుపరిచి పొదుపు, అప్పు, వడ్డీ వివరాలను వివరించాలి. ప్రతినెలా ఒక్కో సభ్యురాలు బ్యాంక్కు వెళ్లి కంతుల డబ్బును చెల్లించాలి. చెల్లించిన రశీదులను మరుసటి నెలలో నిర్వహించే సమావేశం తీర్మానం పేజీలో అతికించాలి. తీర్మానంలోనే గ్రూప్ సభ్యులు ఇప్పటి వరకు ఎంత డబ్బు చెల్లించారు అనే వివరాలను రాయాల్సి ఉంటుంది. ఇంత పకడ్బందీగా ఆర్పీ గ్రూప్లను నిర్వహించాల్సి ఉంటుంది. ప్రతి నెలా ఆర్పీలకు సంబంధించి ఎస్ఎల్ఎఫ్ సమావేశాన్ని సీఓ నిర్వహిస్తారు. ఈ సమావేశానికి ప్రతి గ్రూపు నుంచి ఒక లీడర్, ఒక సభ్యురాలు హాజరు కావాల్సి ఉంటుంది. అయితే కింది స్థాయిలోనే పర్యవేక్షణ గాడి తప్పిందనేదానికి ఉదాహరణ ఇది. పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన నూరె షబా డ్వాక్రా గ్రూప్కు సంబంధించి వెలుగు చూసిన సంఘటన. లక్షల రూపాయలను లీడర్లు స్వాహా చేసినట్లు ప్రచారం జరుగుతోంది. ఎంత అనే విషయం అలా ఉంచితే డ్వాక్రా సంఘాల్లో ఈ సమస్య హాట్ టాపిక్గా మారింది. గత సోమవారం బ్యాంక్ అధికారులు, మెప్మా అధికారులు శ్రీనివాసనగర్లోని డ్వాక్రా గ్రూప్ లీడర్ల ఇళ్ల వద్దకు వెళ్లగా వారు ఇంటికి తాళాలు వేసిన విషయాన్ని గుర్తించారు. తర్వాత లీడర్ల కుటుంబ సభ్యులతో అధికారులు మాట్లాడారు. ఏడాదిగా డ్వాక్రా సభ్యులకు సంబంధించిన సొమ్మును బ్యాంకులో జమ చేయకుండా వాడుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఏడాది కాలంగా డబ్బు దుర్వినియోగం అయి ఉంటే ఎందుకు అధికారులు ముందు జాగ్రత్త చర్యలు తీసుకోలేదని ప్రశ్నిస్తున్నారు. ఆర్పీ ప్రతినెలా సభ్యులతో సమావేశం నిర్వహించి యాప్లో ఫొటోతోపాటు గ్రూప్ సభ్యుల తీర్మానం పత్రాలను అప్లోడ్ చేయాల్సి ఉంది. సక్రమంగా కంతులు చెల్లించకపోతే బ్యాంక్ అధికారులు ఇంత కాలం ఎందుకు చర్యలు తీసుకోలేదు. పైగా ప్రతి ఏడాది ప్రతి గ్రూప్కు సంబంధించి అధికారులు ఆడిట్ చేయిస్తున్నారు. గత ఏడాది ఆడిట్లో ఈ విషయాలు వెలుగు చూడలేదా, అసలు ఆడిట్ చేయించలేదా అనే ప్రశ్న తలెత్తుతోంది. పోలీస్ స్టేషన్కు చేరిన పంచాయితీ నూరె షబా స్వశక్తి సంఘంలో జరిగిన అవకతవకలపై సభ్యులు నాలుగు రోజుల క్రితం టూటౌన్ పోలీసులను ఆశ్రయించారు. ఈ విషయంపై పోలీసులు విచారణ చేపట్టారు. డ్వాక్రా సంఘాల నిర్వహణ గురించి మున్సిపాలి టీలో కొంత మంది ఆర్పీలు పట్టించుకోవడం లేదని విమర్శలు ఉన్నాయి. ప్రతినెల డ్వాక్రా గ్రూప్కు సంబంధించి పుస్తకాలు రాసేందుకు కొంత మంది ఆర్పీలు రూ.100 నుంచి రూ.200 వసూలు చేస్తున్నారు. అలాగే బ్యాంక్ లోన్ ఇప్పించిన సందర్భాల్లో 5 శాతం చొప్పున కమీషన్ వసూలు చేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇవే కాకుండా గ్రూప్ సభ్యులను ఆసరాగా చేసుకుని సొంత వ్యాపారాలు చేస్తున్నారు. నూరె షబా స్వశక్తి సంఘంపై వచ్చిన ఆరోపణలకు సంబంధించి మెప్మా టీఈ మహాలక్ష్మిని వివరణ కోరగా సోమవారం గ్రూప్ లీడర్ల ఇళ్ల వద్దకు వెళ్లిన మాట వాస్తవమేనన్నారు. ఎంత డబ్బు వాడుకున్నారనే విషయంపై నివేదిక తయారు చేసి ఉన్నతాధికారులకు పంపామన్నారు. గ్రూప్ లీడర్లను వివరణ కోరగా తమ గ్రూప్కు సంబంధించిన తీర్మానం బుక్లతోపాటు బ్యాంక్ పాస్ పుస్తకాలు ఆర్పీ దగ్గరే ఉన్నాయని తెలిపారు. నాలుగు రోజుల క్రితం పాస్ పుస్తకాలను తమకు ఇచ్చారన్నారు. ప్రతి విషయాన్ని తాము ఆర్పీకి ఎప్పటికప్పుడు తెలియజేశామని పేర్కొన్నారు. స్థానిక అధికారులను కాకుండా ప్రత్యేక అధికారులచేత విచారణ చేయిస్తే అసలు విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. -
దివ్యాంగుల పెన్షన్ల తొలగింపు దారుణం
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలో దివ్యాంగుల పెన్షన్లను రాష్ట్ర ప్రభుత్వం రీ వెరిఫికేషన్ పేరిట తొలగిస్తుండటం దారుణమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా విమర్శించారు. ఇది ఏమాత్రం మానవత్వం లేని ప్రభుత్వమని ధ్వజమెత్తారు. శనివారం కడపలోని తన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మంచానికే పరిమితమైన వారు, తలసేమియాతో బాధపడుతున్న వారు, డయాలసిస్ బాధితులు, వికలాంగులకు ఎన్నో ఏళ్లుగా పెన్షన్లు అందుతున్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 14 నెలలు గడిచినా ప్రజలకు చేసిన మేలు ఏదీ లేకపోగా పెన్షన్లు తొలగిస్తోందని విమర్శించారు. తాము రూ. 3 వేలు ఉన్న పెన్షన్ రూ. 4 వేలకు పెంచామని ఓవైపు గొప్పలు చెప్పుకుంటూ మరోవైపు కోత విధిస్తున్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం నుంచి దిగిపోయే సమయానికి రాష్ట్రంలో 66,34,000 పెన్షన్లు ఉన్నాయని, బాబు అధికారంలోకి వచ్చిన తర్వాత 62,19,000కు తగ్గిపోయాయని పేర్కొన్నారు. అంటే సుమారు 4.50 లక్షల పెన్షన్లు తొలగించారని తెలిపారు. కడప అసెంబ్లీ నియోజకవర్గంలో 3,160 దివ్యాంగ పెన్షన్లు ఉండగా, ప్రస్తుతం రీ వెరిఫికేషన్ పేరిట ఆగస్టు నెలలోనే 634 మందికి తొలగిస్తూ నోటీసులు జారీ చేశారన్నారు. రాష్ట్రంలో లక్ష పైబడి వికలాంగుల పేర్లతో దొంగ పెన్షన్లను పొందుతున్నారని స్పీకర్ అయ్యన్నపాత్రుడు, మంత్రి కొండపల్లి శ్రీనివాస్లు మాట్లాడటం అన్యాయమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అర్హత లేకున్నా మంజూరు చేసిన బోగస్ పెన్షన్లను మాత్రమే తొలగిస్తున్నామంటూ ప్రభుత్వం చెప్పడంలో ఏమాత్రం నిజం లేదన్నారు. జగన్మోహన్రెడ్డి విపరీతంగా అప్పులు చేసి రాష్ట్రాన్ని శ్రీలంకగా మారుస్తున్నారంటూ నాడు చంద్రబాబు విమర్శించారన్నారు. జగన్ హయాంలో 3 లక్షల 33 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చి సంక్షేమ పథకాలు అమలు చేశారన్నారు. చంద్రబాబు 14 నెలలకే లక్షా 87 వేల కోట్లు అప్పులు తీసుకొచ్చినా సంక్షేమ పథకాల్లో కోత విధిస్తున్నారని, మిగతా డబ్బులు ఎక్కడికి వెళుతున్నాయని ప్రశ్నించారు. కార్పొరేటర్ షఫీ, నాయకులు దాసరి శివ, శ్రీరంజన్రెడ్డి, సీహెచ్ వినోద్కుమార్, టక్కోలు రమేష్రెడ్డి, తోట కృష్ణ, బసవరాజు, గౌస్బాషా, మునిశేఖర్రెడ్డి పాల్గొన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడు
– వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి కడప కార్పొరేషన్ : తిరుమల, తిరుపతి దేవస్థానం చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు అనర్హుడని వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. శనివారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇదివరకు వైవీ సుబ్బారెడ్డి, పుట్టా సుధాకర్ యాదవ్, ఆదికేశవులు నాయుడు, భూమన కరుణాకర్రెడ్డిలాంటి వారు టీటీడీ చైర్మన్లుగా ఉండి పార్టీలకతీతంగా దైవభక్తితో సేవ చేశారన్నారు. ప్రస్తుత చైర్మన్ బీఆర్ నాయుడు రాజకీయాలు మాట్లాడుతూ, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఆయన సతీమణి భారతిరెడ్డిలపై వివాదాస్పద వ్యాఖ్యలు చేయడం దారుణమన్నారు. ఆయన చైర్మన్గా ఎంపికై న నాటి నుంచి ఏదీ కలిసి రావడం లేదని, కల్తీ లడ్డు వ్యవహారం దేశాన్ని కుదిపేసిందని, టికెట్ల విక్రయాల్లో గోల్మాల్, దర్శనం సమయంలో తోపులాటలో ఆరుగురు భక్తులు చనిపోయారని, అన్నప్రసాదాల్లో జెర్రి రావడం, గోవులకు సరైన వైద్యం, ఆహారం అందించకుండా 191 గోవులు చనిపోవడానికి కారణమయ్యారన్నారు. ఈ వరుస సంఘటనల వల్ల ఏం చేయాలో దిక్కుతెలియక వైఎస్ జగన్కు దైవభక్తి లేదని, భారతీరెడ్డి తలనీలాలు సమర్పించాలని మాట్లాడుతున్నారన్నారు. లోకేష్ సతీమణి, నారా భువనేశ్వరి ఏమైనా తలనీలాలు సమర్పించారా అని ప్రశ్నించారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్, వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షేక్ షఫీ పాల్గొన్నారు. -
సెంచురీ పానెల్స్ పరిశ్రమను పరిశీలించిన ఆర్డీఓ
గోపవరం : సెంచురీ పానెల్స్ పరిశ్రమను ఆర్డీఓ చంద్రమోహన్ శనివారం పరిశీలించారు. తహసీల్దార్ త్రిభువన్రెడ్డి, ఏడీఏ వెంకటసుబ్బయ్య, ఏఓ విజయరావుతో కలిసి పరిశ్రమలో జరుగుతున్న పనులను పరిశ్రమ ప్రతినిధుల ద్వారా తెలుసుకున్నారు. అలాగే ప్రస్తుతం యూరియా కొరత ఉన్నందున పరిశ్రమలో ఉపయోగించే యూరియాపై ఆరా తీశారు. పరిశ్రమలో ఉపయోగించే యూరియాను కూడా స్థానిక వ్యవసాయాధికారుల ద్వారా తనిఖీలు నిర్వహించారు. వ్యవసాయానికి వాడే యూరియా కాదని నిర్ధారించారు. అనంతరం పరిశ్రమలో తయారు చేస్తున్న వివిధ ఉత్పత్తులను పరిశీలించారు. -
నిరీక్షణకు తెర
కడప ఎడ్యుకేషన్: డిగ్రీ ప్రవేశాలకు సంబంధించి గత నాలుగు నెలల నుంచి నెలకొన్న సందిగ్ధానికి ఎట్టకేలకు ఉన్నత విద్యామండలి గ్రీన్ సిగ్నల్ ఇచ్చి నిరీక్షణకు తెరదించింది. దీంతో డిగ్రీ ప్రవేశాలకు ఎదురు చూసే విద్యార్థులు ఊపిరి పీల్చుకున్నారు. ఇంటర్ ఫలితాలు ఏప్రిల్ మాసంలో విడుదలైనా సింగల్, డబుల్ మేజర్ అంటూ దాదాపు నాలుగు నెలలపాటు కాలయాపన చేసిన ఉన్నత విద్యామండలి 20వ తేదీన నోటిఫికేషన్ను విడుదల చేసింది. నూతన జాతీయ విద్యా విధానం అమల్లో భాగంగా సమూల మార్పులతో డిగ్రీ కోర్సులను తీర్చిదిద్ది గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమల్లోకి తెచ్చింది. ఆన్లైన్ అడ్మిషన్స్ సింగల్ మేజర్ సబ్జెక్టునే యూజీలో కొనసాగిస్తూ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాలని తెలిపింది. ఈ మేరకు జిల్లాలో డిగ్రీ అడ్మిషన్ల పక్రియ ప్రారంభమయింది. 24 నుంచి వెబ్ ఆప్షన్లకు అవకాశం... డిగ్రీ ప్రవేశాలకు ఈనెల 26వ తేదీలోపు విద్యార్థులు ఆన్లైన్ అడ్మిషన్స్ మోడ్యూల్ ఫర్ డిగ్రీ కాలేజెస్(ఓఎంఎమ్డిసీ) వెబ్సైట్లో ఆన్లైన్ పద్ధతిలో తమకు అనుకూలమైన కళాశాలలో డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఇందులో భాగంగా 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పునకు వెసులుబాటు కల్పించింది. 31వ తేదీన మెరిట్, రిజర్వేషన్ల ప్రాతిపదికన సీట్లు కేటాయింపు చేయనున్నారు. సెప్టెంబర్ 1వ తేదీ ఆయా కళాశాలల్లో సీట్లు సాధించిన విద్యార్థులు రిపోర్టు చేసి అదే రోజు తరగతులకు హాజరు కావాల్సి ఉంటుంది, జిల్లాలో 76 కళాశాలలలో అడ్మిషన్లు... జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు, ఎయిడెడ్ కళాశాలల్లో ఎట్టకేలకు ప్రవేశాలు ప్రారంభం కావడంతో విద్యార్థులు, తల్లిదండ్రులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు నెట్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. జిల్లాలో 76 డిగ్రీ కళాశాలలు ఉండగా ఇందులో 10 వేలకుపైగా డిగ్రీల సీట్లు భర్తీకానున్నాయి. అడ్మిషన్ల ప్రక్రియ దాదాపు నాలుగు నెలలపాటు ఆలస్యం కావడంతో జిల్లాలో చాలా ప్రైవేటు కళాశాలల యాజమాన్యాలు అడ్మిషన్లు 50 శాతం మేర జరిగినట్లు తెలుస్తోంది. ఫీజు వివరాలు ఇలా... డిగ్రీలో అడ్మిషన్లకు సంబంధించి రిజిస్ట్రేషన్ సమయంలో ప్రాసెసింగ్ఫీజు రూపంలో ఓసీ విద్యార్థులు రూ 400, బీసీ రూ. 300, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులు రూ. 200 చొప్పన చెల్లించాల్సి ఉంటుంది. అన్ని ధ్రువపత్రాలను ఆన్లైన్లో అప్లోడ్ చేసిన విద్యార్థులు వారి పరిశీలనకు హెల్పలైన్ కేంద్రాలకు వెళ్లాల్సిన అవసరం లేదు. రిజిస్ట్రేషన్ చేసుకున్న విద్యార్థులు కళాశాలలు ఎంపిక చేసుకునేందుకు ఈ నెల 24వ తేదీ నుంచి 28వ తేదీ వరకు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్లు నమోదు చేసుకోవాల్సి ఉంది, ఆప్షన్లు మార్చుకునేందుకు 29వ తేదీ అవకాశం ఉంటుంది. హెల్ప్డెస్క్లు ఏర్పాటు? డిగ్రీలో ప్రవేశాల కోసం ఇప్పటికే ఆఫ్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల అప్లికేషన్స్కు ప్రత్యేక హెల్ప్లైన్ డెస్క్లను ఏర్పాటు చేసి ఆయా కళాశాలల అధ్యాపకులు ఆన్లైన్ చేయనున్నట్లు తెలిసింది. ఆఫ్లైన్లో దరఖాస్తు చేసుకోని అభ్యర్థులు నేరుగా ఆన్లైన్లో చేసుకోవచ్చని తెలిసింది. దరఖాస్తు చేసుకునే క్రమంలో సమస్యలు ఎదురైనా, తెలియకపోయినా సమీపంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలల్లోని హెల్ప్డెస్క్ను సంప్రదించి సందేహాలు నివృత్తి చేసుకునే అవకాశం కల్పించనున్నట్లు తెలిసింది. జిల్లాలో కళాశాలల వివరాలు ఇలా... వేలకు పైగా అడ్మిషన్లకు సంబంధించిన ఆన్లైన్ ప్రక్రియలో భాగంగా సర్వర్ సరిగా పనిచేయడం లేదని పలువురు విద్యార్థులు తెలిపారు. దానికితోడు అధిక పత్రాలను అప్లోడ్ చేయాల్సి రావడంతో మధ్యమధ్యలో సర్వర్ సరిగా పనిచేయక ఇబ్బందులకు గురి చేస్తోందని విద్యార్థులు పేర్కొన్నారు. ఇందులో టీసీ, ఎస్ఎస్సి మెమో, ఇంటర్ మెమో, 6 నుంచి 12వ తరగతి వరకు సంబంధించిన స్టడీ సర్టిఫికెట్స్, ఫొటో సిగ్నేచర్ పత్రాలను అప్లోడ్ చేయాల్సి రావడంతో ఆన్లైన్ సరిగా పనిచేయడం లేదని పలువురు అభ్యర్థులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎట్టకేలకు డిగ్రీ ప్రవేశాలకుగ్రీన్ సిగ్నల్ ఊపిరి పీల్చుకున్న విద్యార్థులు ఈనెల 26వ తేదీ వరకుఆన్లైన్ దరఖాస్తులు -
ఎరువులు అందుబాటులో ఉన్నాయి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఎరువులు అందుబాటులో ఉన్నాయని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి స్పష్టం చేశారు. శుక్రవారం స్థానిక కలెక్టరేట్లో యూరియా లభ్యతపై జాయింట్ కలెక్టర్ అదితిసింగ్తో కలిసి జిల్లా కలెక్టర్ విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో ఇప్పటి వరకు ఆర్ఎస్కేలలో 3700 టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. ప్రైవేట్ ఎరువుల డీలర్స్ నిబంధనల ప్రకారం మాత్రమే ఎరువులను విక్రయించాలన్నారు. బల్క్స్టాక్ పెట్టుకుని కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు చేపడతామన్నారు. డీలర్స్ రైతుల డిమాండ్ను ఆసరాగా చేసుకుని అనవసరమైన వేరే ఉత్పత్తులను, పోషకాలను లింక్ చేసి అమ్మితే చర్యలు తీసుకొని, వారి లైసెన్సును రద్దు చేస్తామని హెచ్చరించారు. ఆర్ఎస్కేలలో, ప్రైవేటు ఫర్టిలైజర్ షాపులలో యూరియా అందుబాటులో ఉంటుందని తెలిపారు. ఎక్కడైనా యూరియా కొరత ఏర్పడితే 24 గంటల్లో దగ్గర ఉన్న ఆర్ఎస్కే ద్వారా అందజేస్తామని తెలిపారు. రైతుల సహాయార్థం కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని తెలిపారు. అవసరమైతే కంట్రోల్ రూమ్ నెంబర్లు 8331057300, 9491940106, 8919081933 లలో సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ శాఖ జేడీ చంద్రా నాయక్, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు తదతరులు పాల్గొన్నారు. బ్రహ్మంసాగర్ పరిశీలన బ్రహ్మంగారిమఠం: తెలుగు గంగలో అంతర్భాగమైన బ్రహ్మంసాగర్ను శుక్రవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరు, ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఇన్చార్జి ఎస్ఈ వెంకటరామయ్యలు పరిశీలించారు. సాగర్ లో నీటిమట్టం , ఇన్ఫ్లో, అవుట్ఫ్లో , కుడి, ఎడమ కాలువలు పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే సుధాకర్యాదవ్తో కలిసి సాగునీటి కాలువలకు సంబంధించిన మ్యాప్ను పరిశీలించారు. సాగర్ ఆయకట్టు వివరాల గురించి అధికారులను కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ సాగర్కు నీరు వస్తుంది కానీ తగిన ఆయకట్టుకు నీరు సరిగా అందకపోవడంతో రైతులు ఇబ్బందులు పడుతున్నారు. ఇందుకోసం పంట కాలువలు తప్పనిసరిగా ఉండాలని అధికారులకు తెలిపారు. ఇందుకోసం అధికారులు ప్రతిపాదనలు సిద్ధంచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్, బద్వేల్ డివిజన్ ఈఈ మధు సూదన్ రెడ్డి, డీఈఈలు, ఏఈఈలు, తహసీల్దార్ కార్తీక్, ఇన్చార్జి ఎంపీడీఓ వీరకిషోర్, డీటీ జాన్స్, బి.మఠం సింగల్ విండో అధ్యక్షుడు నేలటూరు సాంబశివారెడ్డి పాల్గొన్నారు. రైతు సేవా కేంద్రం తనిఖీ బ్రహ్మంసాగర్ పరిశీలన అనంతరం బద్వేల్కు వెళ్లే దారిలో ఉన్న చౌదరవారిపల్లె రైతు సేవాకేంద్రంను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరు తనిఖీ చేశారు. అనంతరం చౌదరవారిపల్లె, జి,నరసింహపురం రైతులతో మాట్లాడారు. యూరియా కోసం వచ్చిన రైతులు వ్యవసాయ సమస్యలను వివరించారు. యారియా కొరతలేకుండా చూడాలని వ్యవసాయ శాఖ అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయశాఖ అధికారి చంద్రానాయక్ పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ఒంటిమిట్ట అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ అభివృద్ధికి బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థానం వారు ప్రత్యేక నిపుణుల బృందం ఏర్పాటు చేశారు. ఇందులో భాగంగా శుక్రవారం ఒంటిమిట్టలో ఎక్కడెక్కడ ఏ పనులు చేస్తే భక్తులకు సౌకర్యంగా ఉంటుందో టీటీడీ సివిల్ విభాగం అధికారులతో కలిసి ప్రత్యేక నిపుణుల బృందం ప్రణాళిక అధికారి రాముడు, ఆర్కిటెక్చర్ అనిల్ పరిశీలించారు. ఈ సందర్భంగా రామాలయ పరిసరాల్లోని రామ కుటీరం, శృంగిశైలి పర్వతం, ఒంటిమిట్ట చెరువు, రామతీర్థం, నాగేటితిప్ప పర్వతం, కల్యాణ వేదిక ప్రాంతం, వావిలి కొలను సుబ్బారావు కుటీరాన్ని సందర్శించారు. అనంతరం ప్రణాళిక అధికారి రాముడు మాట్లాడుతూ విజయవాడలో జాతీయ స్థాయిలో గుర్తింపు పొందిన స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ నిపుణుల సంస్థ వారి పరిశీలనలో ఎక్కడ అభివృద్ధి జరిగితే భక్తులకు సౌకర్యంగా ఉంటుందో ప్రణాళిక రూపొందించి రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ దృష్టికి తీసుకువెళ్తామన్నారు. ఈ పరిశీలనలో అన్నదాన కాంప్లెక్స్, క్యూ కాంప్లెక్స్, ఒంటిమిట్ట చెరువును ట్యాంక్ బండ్ చేయడం, చెరువులో శ్రీరాముడి భారీ విగ్రహం ప్రతిష్టించడం, శృంగిశైలి పర్వతం చుట్టూ గిరి ప్రదక్షిణ చేయించడం, శ్రీరామ ప్రాజెక్ట్, పార్వేటి ఉత్సవం జరిగే నాగేటి తిప్ప పర్వతాన్ని అందంగా తీర్చిదిద్దడం, ఒంటిమిట్ట క్షేత్రానికి విచ్చేసే భక్తులు ఉండేందుకు వసతులు కల్పించడం, ఒంటిమిట్టలో ఎండ తీవ్రతను తగ్గించేందుకు ఎక్కువ ప్లాంటేషన్ చేయించి, సాధారణ ఉష్టోగ్రత కంటే 6 డిగ్రీలు తగ్గించేలా చర్యలు తీసుకోవడం వంటివి తమ దృష్టిలో ఉన్నాయన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సివిల్ విభాగం ఎస్ఈ మనోహర్, ఈఈ సుమతి, ఏఈ అమర్నాథ్రెడ్డి సాల్గొన్నారు. ప్రత్యేక నిపుణుల బృందం పరిశీలన -
రూ.10 కోట్లకు వ్యాపారి ఐపీ
ముద్దనూరు: మండలంలోని ఉప్పలూరు గ్రామానికి చెందిన ఓ వ్యక్తి కోట్లాది రూపాయలు అప్పులు చేసి ఐపీ పెట్టినట్లు సమాచారం. మెడికల్ ఏజన్సీ వ్యాపారం నిర్వహిస్తూ పలువురి వద్ద భారీగా సదరు వ్యక్తి అప్పులు చేసినట్లు తెలుస్తోంది. గత వారం రోజుల నుంచి ఈ వ్యాపారి కోట్లాది రూపాయలకు ఐపీ పెట్టినట్లు బాధితులకు తెలియడంతో పలువురు పోలీసులను ఆశ్రయించినట్లు సమాచారం. మెడికల్ ఏజన్సీ నిర్వహిస్తూ సుమారు రూ.10ల వడ్డీకి కూడా అప్పులు తీసుకున్నట్లు, దీంతో అప్పులు అధికమైనట్లు వినికిడి. ఐపీ పెట్టిన వ్యక్తికి విజయవాడ, అనంతపురం, కడప, తాడిపత్రి, ముద్దనూరు మండలాలకు చెందిన సుమారు 20 మంది వరకు అప్పులు ఇచ్చినట్లు, ఇతను సుమారు రూ.10 కోట్ల మేర అప్పులు చేసినట్లు ప్రస్తుతానికి బయటపడినట్లు తెలుస్తోంది. భారీగా అప్పులు చేసి ఐపీ పెట్టిన సమాచారం అందడంతో బాధితులు బెంబేలెత్తుతున్నారు. మదనపల్లె సిటీ: మదనపల్లె పట్టణ సమీపాన ఉన్న పుంగనూరురోడ్డులోని గ్రీన్వ్యాలీ పాఠశాలలో ఈ నెల 24న జిల్లా బాల,బాలికల షూటింగ్బాల్ జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా షూటింగ్ బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. క్రీడాకారులు ఉదయం 9 గంటలకు హాజరు కావాలని ఆమె పేర్కొన్నారు. 2006 ఏప్రిల్ 1 తరువాత పుట్టినవారు అయి ఉండాలన్నారు. ఆధార్కార్డు తీసుకుని రావాలన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్ నంబర్ : 6281881022ను సంప్రదించాలని వివరించారు. రాయచోటి జగదాంబసెంటర్: విద్యార్థుల్లో కళాత్మక నైపుణ్యాలు పెంపొందించడమే లక్ష్యంగా 12 అంశాలతో కళా ఉత్సవ్ – 2025 పోటీలు నిర్వహిస్తున్నట్లు కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. స్థానిక డైట్ కళాశాలలో కళా ఉత్సవ్ – 2025కు సంబంధించిన రిజిస్ట్రేషన్లను శుక్రవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాత్ర సంగీతం, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి 12 అంశాల్లో పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి కడప జిల్లాలోని 50 మండలాలకు చెందిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9, 10, 11, 12వ తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులని వివరించారు. పోటీల్లో పాల్గొనే వారు రాయచోటి డైట్ కళాశాలలో వ్యక్తిగతంగా గానీ 9440246825 నంబర్కు వాట్సాప్ ద్వారా గానీ, గూగుల్ ఫామ్ ద్వారా గానీ తమ పేర్లు నమోదు చేసుకోవాలని వివరించారు. -
చేయి తడిపితేనే.. ఫైల్ ముందుకు
● అవినీతికి కేరాఫ్ మైలవరం తహసీల్దార్ కార్యాలయం ● ప్రతి పనికీ ఒక రేటు ● చేయి తడపకుంటే నెలల తరబడి సాగదీత ● అధికారులపై సిబ్బంది, సిబ్బందిపై అధికారుల సాకులు మైలవరం : మైలవరం మండల తహసీల్దార్ కార్యాలయంలో అవినీతి మడుగులో కూరుకుపోయింది. ఇక్కడ సామాన్య రైతులకే కాదు.. అధికార పార్టీనేతలకు కూడా సైతం పనులు కావడంలేదు. అది అక్రమమైనా.. సక్రమమైనా చేయి తడిపితేనే ఫైల్ ముందుకు కదులుతుంది. లేదంటే ఎన్ని ఆధారాలు చూపిన నెలలు తరబడి దానిని సాగదీస్తునే ఉంటారు. సచివాలయాలు వదిలి మండల కేంద్రంలోనే తిష్ట జగన్ ప్రభుత్వ హాయంలో ఆయా గ్రామాల సచివాలయాల్లో క్రమం తప్పకుండా కనిపించే వీఆర్వోలు ఇప్పుడు మండల తహసీల్దార్ కార్యాలయం వదిలి వెళ్లడంలేదు. వీరికి మండల తహసీల్దార్ కార్యాలయం సైతం ఆసనాలు సైతం ఏర్పాటు చేశారు. వాస్తవానికి గ్రామస్థాయి అధికారులు ఆయా గ్రామాల ప్రజలకు అందుబాటులో ఉండాలనే ఉద్దేశ్యంతో జగన్ ప్రభుత్వం గ్రామ సచివాలయాలను నెలకొల్పింది. వీఆర్వోలకు సైతం అందులో ఒక టేబుల్ , కుర్చి ఏర్పాటు చేసి ప్రతి రోజు అక్కడే హాజరు వేయాలని నిబంధనలు పెట్టింది. దీంతో జగన్ ప్రభుత్వ హాయంలో ప్రతి రోజు వీఆర్వోలు గ్రామ సచివాయాలకు వెళ్లుతూ సాయంత్రం ఐదు గంటల వరకు ప్రజలకు అందుబాటులో ఉండేవారు. ఏమంటూ కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వచ్చిందో గ్రామ సచివాయాలు పూర్తిగా నిర్వీర్యం అయ్యాయి. ముఖ్యంగా మైలవరం మండలానికి చెందిన ఒక్క వీఆర్వో కూడా రోజు సచివాయానికి వెళ్లడంలేదు. వీరంతా మండల కేంద్రంలోని తహశీల్దార్ కార్యాలయంలో తిష్టవేసి కార్యాలయాన్ని అక్కడినుంచే కార్యాకలాపాలను నడిపిస్తున్నారు. పల్లె ప్రజలకు ఏ చిన్న అవసరం వచ్చిన తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లవలసిందే. అక్కడ ప్రతి పనికి ఒక రేటు నిర్ణయిస్తున్నారు. అడిగినంత ముట్టజేబితే ఏ ఆధారాలు లేకపోయిన నిమిషాల్లో పూర్తి చేసి పంపిస్తున్నారు. చేయి తడకపోతే అది ఎంత సక్రమమైన ఫైల్ అయినా వారు కోరిన ఆధారాలు అన్నింటిన్ని సమర్పించినప్పటికీ నెలలతరబడి సాగదీస్తూనే ఉంటారు తప్ప పనిమాత్రం ససేమిరా చేయ్యరు. పై పెచ్చు అధికారులు మీద సిబ్బంది సిబ్బంది మీద అధికారులు ఒకరిపై ఒకరు సాకులు చెబుతూ పొద్దుపొచ్చుతున్నారు. ఉన్నతాధికారులు దృష్టిసారించలేరనే ధీమా ఇక్కడ పనిచేస్తున్న అధికారులు, సిబ్బంది సాక్ష్యాత్తు తహసిల్దార్ను సైతం తప్పుదోవ పట్టించిన సంఘటనలు చాలా ఉన్నాయి. అయినప్పటికి తహసీల్దార్ కూడా తప్పు చేసిన సిబ్బందిని మందలించలేకపోతున్నారన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. దీంతో ఇక్కడ సిబ్బంది ఆడింది ఆట పాడింది పాటగా చెలామణి అవుతుంది. ఇటివల చనిపోయిన వ్యక్తి పేరుతో ఓ వ్యక్తి ఫిర్యాదు ఇస్తే దానిని స్వీకరించిన అధికారులు సాక్షాత్తు తహసీల్దార్ సంతకంతోనే బాధిత రైతులకు నోటీసులు జారీ చేశారు. విచారణకు హాజరైన బాధితులు చనిపోయిన వ్యక్తి ఎలా ఫిర్యాదు చేస్తాడని ప్రశ్నించిన అక్కడ సిబ్బంది ఏమాత్రం తొణకకుండా మరో సారి విచారణకు రావాలంటూ హుకుం జారీ చేశారు. ఈ సంఘటనపై సాక్షి దినపత్రికలో ప్రముఖంగా వార్త ప్రచురితం కావడంతో ఉలికి పడ్డ అధికారులు ఆ ఫైల్ను మూసివేశారే తప్ప తమ తీరును మార్చుకోలేదు. అందుకు కారణం ఉన్నతాధికారులు ఈ కార్యాలయం వైపు కన్నెత్తి చూడటంలేదని భావన కలుగుతోంది. -
బాధితులకు న్యాయం చేయాలి
బి.కోడూరు : వివిధ సమస్యలపై పోలీసుస్టేషన్కు వచ్చే బాఽధితులకు సత్వరమే న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం మండల కేంద్రంలోని బి.కోడూరు పోలీసుస్టేషన్ను ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్టేషన్కు వచ్చే సమస్యలను జిల్లా కేంద్రానికి రాకుండా స్టేషన్లోనే పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐను ఆదేశించారు. సీసీటీఎన్ఎస్ను అప్గ్రేడ్ చేయాలని ఎస్ఐని ఆదేశించడంతో పాటు శక్తిస్కీంల ఏర్పాటు గురించి ఎస్ఐని అడిగి తెలుసుకున్నారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉచితంగా వినియోగంచేలా చర్యలు తీసుకోవాలని ఎస్ఐను ఆదేశించారు. స్టేషన్ పరిధిలో సీసీ కెమెరాల ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మట్కా, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్ తదితర అసాంఘీక కార్యకలాపాలు జరగకుండా కఠినంగా వ్యవహరించాలన్నారు. ఆన్లైన్ మోసాలపై ప్రజలను చైతన్యపరిచే కార్యక్రమాలు గ్రామాల్లో నిర్వహించాలని సూచించారు. ఉమెన్ హెల్ప్డెస్క్ను పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. పెండింగ్ కేసులు త్వరగా విచారించి పరిష్కరించాలన్నారు. రికార్డులు అప్డేట్ చేసుకోవాలని సూచించారు. సిబ్బందితో మాట్లాడి వారికి కేటాయించిన విధుల గురించి తెలుసుకున్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పగలు, రాత్రి ముమ్మరంగా గస్తీ నిర్వహించాలన్నారు. ఆయన వెంట మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్, ఎస్ఐ వెంకటసురేష్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలి చాపాడు : పోలీసుస్టేషన్ కు వచ్చే ఫిర్యాదు దారుల సమస్యలను అడిగి తెలుసుకుని వారికి న్యాయం చేయాలని ఎస్సీ అశోక్కుమార్ పేర్కొన్నారు. స్థానిక పోలీసుస్టేషన్ను శుక్రవారం ఎస్సీ ఆకస్మిక తనిఖీ చేశారు. పోలీసుస్టేషన్కు వచ్చిన పలువురు ఫిర్యాదుదారులతో వారి సమస్యలపై మాట్లాడారు. ఉమెన్ హెల్ప్ డెస్క్ను పరిశీలించి కేసుల రికార్డులు, పెండింగ్ కేసులపై ఆరాదీశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పోలీసుస్టేషన్కు న్యాయం కోసం వచ్చే ఫిర్యాదుల సమస్యలను తెలుసుకుని న్యాయం జరిగేలా చర్యలు తీసుకోవాలన్నారు. మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జి.అశోక్కుమార్ -
డీఎస్సీ సర్టిఫికెట్ల పరిశీలనకు విద్యాశాఖ కసరత్తు
● త్వరలో సర్టిఫికెట్ల పరిశీలన ● కడపలోని ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాల పరిశీలన కేంద్రంగా ఎంపిక కడప ఎడ్యుకేషన్ : మెగా డీఎస్సీ –2025 అభ్యర్థుల ఒరిజినల్ సర్టిఫికెట్స్ పరిశీలనకు విద్యాశాఖ కసరత్తు చేస్తున్నారు. ఇందుకోసం కడప బాలాజీనగర్లోని ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలను పరిశీలన కేంద్రంగా నిర్వహించుటకు అధికారులు నిర్ణయించారు. ఈ మేరకు అభ్యర్థులు వారి టీమ్ల వారిగా పరిశీలన నిమిత్తం ఎస్వీ ఇంజనీరింగ్ కళాశాలలకు హాజరుకావాలని విద్యాశాఖ అధికారులు సూచించారు. అభ్యర్థులు తప్పని సరిగా వారి వారి లాగిన్లో htt pr://apdrc.apcfrr.in వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకుని అభ్యర్థులు తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్స్తోపాటు 5 పాస్ పోర్టు ఫోటోలతో పరిశీలనకు హాజరు కావాలి. 17 టీములు ఏర్పాటు ష్త్ర సర్టిఫికెట్ల పరిశీలకు సంబంధించి జిల్లా విద్యాశాఖ, రె వెన్యూ అధికారులు దాదాపు 68 మంది 17 టీముల వె రిఫికేషన్ సభ్యులతోపాటు 30 మంది వలంటీర్లు అందబాటులో ఉంచి పరిశీలనకు సిద్ధం చేస్తున్నారు. అభ్య ర్థులు వయస్సు మరియు అర్హతలకు సంబంధించిన అన్ని రకముల సర్టిఫికెట్స్తో పాటు అవసరమయిన ఒరిజినల్ పత్రాలు వెంట తెచ్చుకోవాల్సి ఉంటుంది. ఒరిజినల్ సర్టిఫికెట్లు సిద్ధంగా చేసుకోవాలి డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులంతా తమకు సంబంధించిన ఒరిజినల్ సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలి. అభ్యర్థులంతా వెబ్సైట్ ద్వారా ఇంటిమేషన్ లెటర్ను డౌన్లోడ్ చేసుకోవాలి. ఒరిజినల్ సర్టిఫికెట్స్తో పాటు 5 పాస్పోర్టు ఫొటోలు తీసుకురావాలి. పరిశీలన సమయంలో సంబంధిత పత్రాలు అన్ని అందజేయాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
ఆ ముగ్గురికి మాత్రం చార్జిమెమోలా?
– కడప కేంద్ర కారాగారంలోనైతే ‘ఏడుగురు’ సస్పెన్షనా కడప టాస్క్ఫోర్స్ : వైఎస్ఆర్ జిల్లాలో జైళ్లశాఖ అధికారుల చర్యలు ఒక్కో వ్యవహారంలో ఒక్కో విధంగా వ్యవహరిస్తున్నారనీ ఆరోపణలు వినిపిస్తున్నాయి. కడప కేంద్ర కారాగారంలో ఇటీవల పిడియాక్ట్ రిమాండ్ ఖైదీ జాకీర్ వద్ద దశల వారిగా 12 సెల్ఫోన్లు, ఒక చార్జర్ లభించాయి. ఈ సంఘటన ను చక్కదిద్దడానికి క్రమశిక్షణా చర్యల క్రింద ఇద్దరు డిప్యూటీ సూపరింటెండెంట్లు, ఇద్దరు జైలర్లు, ముగ్గురు వార్డర్లను సస్పెన్షన్ చేస్తూ విచారణ అధికారిగా వచ్చిన డిఐజీ ఎ.ఆర్ రవికిరణ్ నివేదిక మేరకు రాష్ట్ర డిజి సస్పెన్షన్ వేటు వేశారు. తరువాత రోజుల తరబడిగా విచారణ కొనసాగుతోంది. సాక్షాత్తు రాష్ట్ర డిజి అంజనీకుమార్ కడప కేంద్ర కారాగారంకు వచ్చి విచారణ చేశారు. తరువాత ఇటీవల ప్రొద్దుటూరు సబ్జైలుకు చోరీల కేసుల్లో మహమ్మద్ రఫీ అనే 32 కేసులున్న నిందితుడిని రిమాండ్కు తరలించారు. ఈనెల 16తేదీన తెల్లవారు జామునే రిమాండ్ఖైదీ పరారయ్యాడు. వారిపై విచారణ అధికారి హుటాహుటిన వెళ్లి సమగ్రంగా విచారణ చేపట్టారు. ఈ క్రమంలోనే అక్కడ పనిచేస్తున్న ముగ్గురికి ‘చార్జ్మెమోలు’ ఇచ్చి ‘మమ’ అనిపించారు. కడప కేంద్ర కారాగారంలో ఏడుగురిని ‘బాధ్యతా రాహిత్యం’గా వ్యవహరించారనీ నివేదికను పంపగా సస్పెన్షన్ చేశారు. రిమాండ్ ఖైదీని కడప కేంద్ర కారాగారంకు పంపించినా, ప్రొద్దుటూరు సబ్ జైలు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించినా ‘రిమాండ్ ఖైదీ పరారీ’ సంఘటన జరిగి వుండేది కాదనీ భావిస్తున్నారు. ప్రొద్దుటూరులోని ముగ్గురు సిబ్బందిలో ఒక హెడ్ వార్డర్కు కూటమి ప్రభుత్వానికి చెందిన ఓ ఎమ్మెల్యే అండదండలున్నాయనీ సమాచారం. రెండు సచివాలయాల్లో జిల్లా టాస్క్ఫోర్స్ టీం పర్యటన ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని చౌడూరు, కామనూరు గ్రామాల సచివాలయాల్లో శుక్రవారం డీపీఎంఓ డాక్టర్ శశిభూషణ్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా టాస్క్ఫోర్స్ టీం పర్యటించింది. ఈ సందర్భంగా డీపీఎంఓ డాక్టర్ శశిభూషణ్రెడ్డి మాట్లాడుతూ సీ్త్ర గర్భవతిగా నమోదైనప్పటి నుంచి సుఖప్రసవం అయ్యేవరకు అన్ని రకాల ఆరోగ్య సేవలను వైద్యాధికారులు, సిబ్బంది చూసుకోవాల్సిన బాధ్యత ఉందన్నారు. వైద్య సిబ్బందికి ఆశా, అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలు సహకరించాలని తెలిపారు. ప్రతి ఒక్కరికి ఆయుష్మాన్ భారత్ హెల్త్ అకౌంట్ ఉండాలని, దీని వలన రాబోయే రోజుల్లో ప్రభుత్వ, ప్రైవేటు ఆస్పత్రుల్లో ఎంతో ఉపయోగం ఉంటుందన్నారు. అనంతరం ఓపీ రికార్డులను పరిశీలించారు. కార్యక్రమంలో కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ శ్రీనివాస్, ఈపీఎంయూ నారాయణ, ఎంఐఎస్ రాజశేఖర్, డీపీహెచ్ఎన్ఓ శాంతిలత, సీహెచ్ఓ కృష్ణమ్మ, సూపర్వైజర్ బీఏ వరప్రసాద్, చంద్రకళ, సీహెచ్ఓలు తదితరులు పాల్గొన్నారు. ప్రణాళికబద్ధంగా వృద్ధి సాధించాలి – జేసీ అదితిసింగ్ కడప సెవెన్రోడ్స్ : ప్రణాళికబద్ధంగా జిల్లా వృద్ధి రేటు 15 శాతానికి పెంచేందుకు కృషి చేయాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ వివిధ శాఖల అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో నిర్వహించిన సమావేశంలో ఆమె మాట్లాడారు. అన్ని రంగాల్లో వృద్ధి రేటు సాధించాలన్నారు. జిల్లాలో ఉత్పాదతకను పెంచేందుకు కృషి చేయాలన్నారు. పర్యాటక, పశుసంవర్ధకశాఖ, పట్టుపరిశ్రమ, వైద్య ఆరోగ్యం, మార్కెటింగ్, ఆయుష్, ఇరిగేషన్, పరిశ్రమలు, పంచాయతీరాజ్ శాఖలు సూచికల ఆధారంగా సాధించిన లక్ష్యాలను, రానున్న సంవత్సరానికి టార్గెట్లపై జేసీ చర్చించారు. కార్యక్రమంలో సీపీఓ హజరతయ్య, పరిశ్రమలశాఖ జీఎం చాంద్బాష, ఐసీడీఎస్ అధికారి రమాదేవి, పశుసంవర్దకశాఖ జేడీ శారదమ్మ, పర్యాటక అధికారి సురేష్, ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. -
విద్యుదాఘాతంతో రైతు మృతి
మైలవరం : మండలపరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన ఏరాసీ సుబ్బరామిరెడ్డి (59) విద్యుదా ఘాతంతో మృతిచెందిన సంఘటన శుక్రవారం మండలంలో చోటు చేసుకొంది. పోలీస్ల వివరాల మేరకు.. పెన్నానదిలో తన పొలం కోసం వేసుకున్న బోర్ వద్ద స్టాటర్ తోలగించడానికి వెళ్లి పొరపాటున కరంట్ వైర్లను పట్టుకొని సుబ్బిరామిరెడ్డి మృతి చెందినట్లు తెలిపారు. మైలవరం రిజర్వాయర్ ద్వారా పెన్నానదికి నీరు వదలడంతో తన స్టాటర్ మునిగిపోతుందనే ఉద్దేశంతో తీసివేయాలని వెళ్లి విద్యుత్ ప్రమాదంతో మృతి చెందాడని తెలిపారు. బైకు ఢీకొని ఇద్దరికి గాయాలు వేంపల్లె : వేంపల్లె – కడప రోడ్డులో గుర్తుతెలియని బైకు ఢీకొట్టడంతో ఇద్దరికి గాయాలయ్యాయి. శుక్రవారం తెల్లవారుజామున 3గంటలకు ప్రొద్దుటూరు నుంచి చక్రాయపేట మండలంలో ఉన్న గండి క్షేత్రానికి నడుచుకుంటూ 13 మంది బయలుదేరారు. వేంపల్లె దగ్గర సమీపంలో గుర్తుతెలియని బైకు ఒకసారిగా మీదకు వచ్చింది. దీంతో ఎం.అంజి కుమార్, వాసు తలలకు తీవ్ర గాయాలయ్యాయి. వారి వెనుక వస్తున్న కొందరు గమనించి ప్రథమ చికిత్స కోసం వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బైకు ఢీకొట్టిన వారు అక్కడ నుండి బైకును తీసుకొని పారిపోయారు. గండిక్షేత్రంలో ఉన్న వారి బంధువులకు సమాచారం తెలపడంతో హుటాహుటినా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి వచ్చారు. పోలీసులు సీసీ పుటేజీల ఆధారంగా ఢీకొట్టిన బైకును కనుగొని న్యాయం చేయాలని బాధితులు కోరుతున్నారు. 108 అంబులెన్స్లో ప్రసవం సింహాద్రిపురం : మండలంలోని రామగిరి గ్రామానికి చెందిన రోషిణి అనే మహిళను శుక్రవారం రెండవ కాన్పు నిమిత్తం 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలిస్తుండగా పురిటి నొప్పులు ఎక్కువ్వవయ్యాయి. 108 వాహన సిబ్బంది ఈంటీ గంగాధకర్, పైలెట్ చిరంజీవిలు అంబులెన్స్లోనే జాగ్రత్తగా ప్రసవం చేశారు. పండంటి ఆడబిడ్డ పుట్టింది. తల్లికి తగిన వైద్యం అందించి తల్లీ బిడ్డలను క్షేమంగా పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చేర్పించారు. దీంతో 108 అంబులెన్స్ సిబ్బందిని ప్రజలు అభినందించి హర్షం వ్యక్తం చేశారు. గంజాయి వినియోగం, విక్రయాలపై ఆకస్మిక తనిఖీలు కడప అర్బన్ : ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా గంజాయి వినియోగం, విక్రయాలపై డీఎస్పీల ఆధ్వర్యంలో శుక్రవారం ఆకస్మిక తనిఖీలను నిర్వహించారు. గంజాయి సేవించే, విక్రయించే అవకాశమున్న ప్రాంతాలు, ప్రదేశాలలో అత్యాధునిక డ్రోన్ కెమెరాల ద్వారా ప్రత్యక్షంగా పోలీస్ అధికారులు పర్యవేక్షించారు. గంజాయి రవాణా చేసినా, విక్రయించినా కఠిన చర్యలు తప్పవనని ఎస్పీ ఈ.జి అశోక్ కుమార్ హెచ్చరించారు. కిరాణా షాపులు, గోడౌన్లు, పాడుబడ్డ క్వార్టర్లు, భవనాలలో గంజాయి సేవించే, విక్రయించే వారి కోసం సిబ్బందితో అణువణువూ అన్వేషిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలు జరిగే అవకాశం ఉన్న ప్రాంతాలను జల్లెడ పడుతున్నారు. అనుమానాస్పదంగా సంచరించే వారిపై నిఘా ఉంచడంతో పాటు గంజాయిని సేవించే వారిని గుర్తించేందుకు విస్తత చర్యలు చేపట్టారు. ప్రజలు గంజాయి లేదా ఇతర మాదకద్రవ్యాల గురించిన సమాచారాన్ని టోల్ ఫ్రీ నెంబర్ 1972 కు సమాచారం ఇవ్వాలని కోరారు. -
కాళ్లు అరిగేలా తిరుగుతున్నా పనిచేయడంలేదు
తమ సొంత భూమిని ఆన్లైన్లో నమోదు చేయించుకోవాలని శుక్రవారం మైలవరం తహసీల్దార్ కార్యాలయానికి వచ్చిన ఓ అధికార పార్టీ కార్యాకర్తను సాక్షి పలుకరించగా ఇక్కడి రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యాన్ని పూసగుచ్చినట్లు వివరించారు. మా అబ్బ బండల పెద్ద బికారి కొన్ని సంవత్సరాల క్రితం దూ దేకుల పెద్దయ్యతో భూమిని కొనుగోలు చేశాడు. చిన్న వెంతుర్ల పొలంలో 669/2 సర్వేనంబర్ 1.12 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న భూమికి హక్కుదారుడిగా మా అబ్బపేరు రెవెన్యూ రికార్డుల్లో కనిపించడంలేదు. ఇందుకు సంబంధించి రిజిస్ట్రేషన్ కాగితాలతోపాటు ఈసీ, ఆర్హెచ్ ధృవ పత్రాలను రెవెన్యూ అధికారులకు అందజేశాను. అయినప్పటికి అధికారులు సిబ్బందిపై సాకులు చెబుతూ కాలయాపన చెస్తున్నారే తప్ప రెవెన్యూ రికార్డుల్లో మా అబ్బపేరును చేర్చడంలేదు. అన్ని ఆధారాలు సమర్పించిన ఈ ఫైల్ వందశాతం సక్రమమైనని తెలిసిన అధికార పార్టీకార్యకర్తలమైన తమనే కార్యాలయం చుట్టూ తిప్పుకుకంటున్నారు. ఏ పలుకు బడి లేని సామాన్య ప్రజల పనులు ఏ మేరకు జరుగుతాయో మీరే చెప్పాలి. మైలవరం తహసీల్దార్ కార్యాలయంలో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరిపించి అధికారులపై చర్యలు తీసుకోవడంతోపాటు కార్యాలయంలో సంవత్సరాల తరబడి పనిచేస్తున్న వారిని ఇక్కడి నుంచి బదిలి చేసి మొత్తం ప్రక్షాళన చేయాలని కోరుకుంటున్నా. – బండల ఇబ్రహీం, చిన్న వెంతుర్ల, మైలవరం -
విద్యార్థి ఆత్మహత్యపై పూర్తి దర్యాప్తు చేయాలి
వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో గురువారం తెల్లవారుజామున హాస్టల్లోని బాత్రూంలో కిటికీకి ఉరి వేసుకుని జి.నరసింహనాయుడు అనే విద్యార్థి ఆత్మహత్య చేసుకున్న విషయం అందరికి తెలిసిందే. అయితే మృతుడి ఆత్మహత్యపై బంధువులు పలు అనమానాలు వ్యక్తం చేస్తున్నారు. శ్రీకాకుళం జిల్లా ఎచ్చర్ల మండలం షేర్ మహమ్మదాపురం గ్రామం నుంచి మృతుని చిన్నాన్న ఉమా మహేశ్వరరావు, బంధువులు శుక్రవారం ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి చేరుకున్నారు. సంఘటన స్థలాన్ని వారు పరిశీలించి పలు అనుమానాలు వ్యక్తం చేసి ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. తండ్రి చనిపోయినా తల్లి రాజులమ్మ కష్టపడి చదివిస్తుండేది. తమ పిల్లవాడు బాగా చదివేవాడని, మంచి మార్కులు వచ్చేవని తెలిపారు. ఇంటర్మీడియట్ ఫస్టియర్ (పీయూసీ–1) లో కూడా 7.5 గ్రేడింగ్ పాయింట్లు వచ్చాయని, ఆత్మహత్య చేసుకునే అంత పిరికివాడు కాదని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేంపల్లె ప్రభుత్వాసుపత్రి మార్చురీలో నరసింహనాయుడు మృతదేహాన్ని చిన్నాన్న, బంధువులు చూసి బోరున విలపించారు. విద్యార్థి ఆత్మహత్యపై పలు అనుమానాలు ఉన్నాయని.. పూర్తి దర్యాప్తు నిర్వహించాలని పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ ఉలసయ్యలను వారు కోరారు. ఆర్కే వ్యాలీ క్యాంపస్లో ఉన్న వారు ఆత్మహత్యకు ఎవరైనా సరే తప్పు చేసి ఉంటే వారి పైన కఠినంగా శిక్షించాలని కోరారు. వేంపల్లె ప్రభుత్వాసుపత్రిలో ఉన్న నరసింహనాయుడు మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి తమ స్వగృహానికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో డైరెక్టర్ స్పందించి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో విద్యార్థికి ఎటువంటి ఇబ్బందులు లేవని తెలిపారు. గత కొన్ని నెలలుగా విద్యార్థి మూడీగా ఉంటున్నట్లు సహచార విద్యార్థులు తమ దృష్టికి తీసుకొచ్చారాన్నారు. అంతేకాకుండా తనకు ట్రిపుల్ ఐటీలో చదవడం ఇష్టంలేదని, నర్సింగ్ చదవాలని స్నేహితులతో చెప్పేవాడన్నారు. విద్యార్థి మొబైల్లో ఉన్న నోట్ బుక్లో ‘ఐ వాంట్ టు డై’ సారీ మమ్మీ అని కూడా వ్రాశారని పోలీసుల దర్యాప్తులో తేలిందని చెప్పుకొచ్చారు. అయితే కళాశాల యాజమాన్యం, అటు పోలీసులు పూర్తి విచారణ చేయించి మృతుని కుటుంబానికి ఏమి న్యాయం చేస్తారో వేచి చూడాలి. అనుమానాలు వ్యక్తం చేస్తున్న మృతుడి బంధువులు -
ఉపాధ్యాయ సమస్యలపై ముఖ్యమంత్రికి వినతి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల పదోన్నతులు , సర్వీసు రూల్స్ సమస్యల పరిష్కారం కోసం ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ప్రభుత్వ విప్ ఆదినారాయణరెడ్డితో కలసి గురువారం రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడును కలిసి వినతిపత్రం అందజేశారు. ఏకీకృత సర్వీసు నిబంధనలు కొన్ని సాంకేతిక కారణాలతో అమలు కాకపోవడం వల్ల దశాబ్దాలుగా ఉపాధ్యాయులకు పదోన్నతులు దొరకడం లేదన్నారు. ఈ సమస్యను పరిష్కరించి పదోన్నతులు కల్పించాలని విన్నవించారు. అలాగే 223 జీఓను రద్దు చేసి పాఠశాల సహాయకులకు జూనియర్ అధ్యాపకులుగా పదోన్నతి కల్పించాలని కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పింఛను పథకం వర్తింపజేయాలని ముఖ్యమంత్రికి విన్నవించారు. -
మట్టి విగ్రహాలతో పర్యావరణ పరిరక్షణ
కడప సెవెన్రోడ్స్: సహజ రంగులతో తయారు చేసిన మట్టి గణేష్ విగ్రహాలను వాడి వాటిని ప్రోత్సహించాలని, పర్యావరణ పరిరక్షణకు మన వంతు బాధ్యతగా చేయూతను అందిద్దామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. సహజ రంగులతో మట్టి విగ్రహాలను తయారు చేయడం స్వచ్ఛతకు ఒక చిహ్నమే గాక ఖర్చుకూడా తగ్గి ఆర్థికంగా కూడా కొంత వెసులుబాటు కలుగుతుందన్నారు. ప్రజలు వినా యకుని పండుగను పర్యావరణానికి అనుకూలంగా. జరుపుకోవాలని సూచించారు. మన చెరువులు,జలవనరులకు నష్టం కలిగించే వ్యర్థ పదార్థాల వినియోగం తగ్గించాలన్నారు. చెరువులు, సరస్సులు జలాశయాలు, జీవరాశుల మనుగడ ముఖ్యమని వాటి సంరక్షణ మనందరి బాధ్యత అన్నారు. వినాయక విగ్రహాల తయారీలో కృత్రిమ రంగులు, విషపదార్థాల వినియోగం వల్ల జలవనరులు కాలుష్యానికి గురవుతున్నాయన్నారు. ప్రతి ఒక్కరూ మట్టితో తయారుచేసిన వినాయకుని ప్రతిమలను వినియోగించాలని ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ కోరారు. మట్టి గణపతితో పర్యావరణానికి మేలు: జేసీ అదితిసింగ్ వినాయక చవితి పండుగకు మట్టి విగ్రహాలు వినియోగించి పర్యావరణాన్ని కాపాడాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ ప్రజలకు పిలుపునిచ్చారు. గురువారం ఈ అంశంపై డీవైఎఫ్ఐ రూపొందించిన వాల్పోస్టర్లను తన చాంబర్లో ఆమె ఆవిష్కరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ప్రజలు భాగస్వాములు కావాలన్నారు. ప్లాస్టర్ ఆఫ్ ప్యారీస్ వల్ల నీటి కాలుష్యం అధికంగా జరిగే ప్రమాదముందన్నారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు చిన్ని, వీరనాల శివకుమార్, డీవైఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు నరసింహా, సహాయ కార్యదర్శి ఆదిల్, నగర కార్యదర్శి విజయ్, వంశీ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
24 నుంచి పెద్దదర్గాలో ఉరుసు ఉత్సవాలు
కడప సెవెన్రోడ్స్ : మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తూ కడప నగరంలో ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రంగా విరాజిల్లుతున్న అమీన్పీర్ దర్గాలో ఉరుసు ఉత్సవాలను నిర్వహిస్తున్నట్లు దర్గా ప్రతినిధులు తెలిపారు. దర్గా 10వ పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా అమీనుల్లా మొహమ్మద్ మొహమ్మదుల్ హు స్సేనీ చిష్టివుల్ ఖాద్రి ఉరుసు ఉత్సవాల్లో భా గంగా ఈనెల 24న గంధం, 25న ఉరుసు, 26న తహలీల్ ఫాతెహా ఉంటుందన్నారు. ఉరు సు రోజు ప్రముఖ ఖవ్వాల్ మేరాజ్ వార్సీచే గొప్ప ఖవ్వాలీ కచేరి నిర్వహిస్తామన్నారు. మోటారు వైర్ల చోరీమైదుకూరు : మైదుకూరు శివార్లలో వనిపెంట రోడ్డులో ఉన్న పొలాల్లో వ్యవసాయ మోటారు వైర్లను గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. స్థానిక ఇందిరమ్మ కాలనీ సమీపంలోని పొలాల వద్దకు సంబంధిత రైతులు గురువారం ఉదయం వెళ్లగా మోటారుకు అమర్చిన స్టార్టర్ వైర్లను కత్తిరించి ఉండటం గమనించారు. దుండగుల పనిగా భావించి రైతులు లబోదిబోమంటున్నారు. ఇటీవలే ఈ ప్రాంతంలో దుండగులు మోటార్ వైర్లను చోరీ చేయడంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. -
కూల్చిన డాబాను పరిశీలించిన బలిజ సంఘం నాయకులు
దువ్వూరు : మండలంలోని ఇడమడక గ్రామంలో జాతీయ రహదారి సమీపంలో ఉన్న నగరి శ్రీకాంత్ డాబాను సోమవారం ఉదయం రెవెన్యూ, పోలీసు అధికారులు దౌర్జన్యంగా కూల్చివేశారు. విషయం తెలుసుకున్న బలిజ సంఘం వ్యవస్థాపక జాతీయ అధ్యక్షుడు తిరుమలశెట్టి రెడ్డిశేఖర్ రాయల్, రాయలసీమ అధ్యక్షుడు సమతం రాము గురువారం కూల్చిన డాబాను పరిశీలించారు. అనంతరం శ్రీకాంత్ కుటుంబ సభ్యులను పరామర్శించి సంఘటన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 25 ఏళ్లుగా శ్రీకాంత్ ఈ డాబాను నిర్వహిస్తున్నాడని, ఏ శాఖకు అభ్యంతరం లేనిది కేవలం అధికార పార్టీ నాయకులకే డాబా అడ్డం వచ్చిందా అని ప్రశ్నించారు. శ్రీకాంత్ కుటుంబ సభ్యులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం చేస్తామని తెలిపారు. -
పది రోజులవుతున్నా నా కొడుకు జాడలేదు
ప్రొద్దుటూరు క్రైం : సుమారు 10 రోజులు అవుతోంది.. ఇంత వరకు నా కుమారుడి జాడ తెలియలేదు.. నీళ్లలో కొట్టుకొని పోతే ఎక్కడో ఒక చోట కనిపించాలి కదా.. ఇన్ని రోజులైనా అతని ఆచూకీ తెలియలేదు.. ముగ్గురు స్నేహితులే నా కుమారుడిని చంపేశారు.. అంటూ బాలుడి తల్లి, బంధువులు రోదిస్తున్నారు. మిట్టమడివీధికి చెందిన నాయుని విక్రం(18) అనే యువకుడు ఈ నెల 12న రామేశ్వరంలోని పెన్నానదిలో గల్లంతైన విషయం తెలిసిందే. ఈ ఘటనపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ క్రమంలో విక్రం కుటుంబ సభ్యులు గురువారం రాత్రి రూరల్ పోలీస్ స్టేషన్కు వెళ్లారు. పోలీసు అధికారులతో మాట్లాడిన అనంతరం స్టేషన్ బయట వారు గురువారం రాత్రి మీడియా ఎదుట తమ ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడికి నీళ్లంటే భయమని.. అలాంటి వ్యక్తిని ముగ్గురు స్నేహితులు వెంకటసాయి, శివలింగయ్య, మత్తయ్యలు బలవంతంగా పెన్నానదికి తీసుకెళ్లారన్నారు. మధ్యాహ్నం 3 గంటలకు విక్రం నీళ్లలో గల్లంతయ్యాడని, అయితే ముగ్గురు స్నేహితులు మాత్రం సాయంత్రం 6 గంటల సమయంలో పోలీసులకు తెలిపారన్నారు. వెంటనే డయల్ 100కు ఫోన్ చేసి ఉంటే పోలీసులు వచ్చి కాపాడేవారని తల్లి రుక్మిణీ వాపోయింది. ఒక చెప్పు నీళ్లలో పడిపోతే దాని కోసం విక్రం నీళ్లలో దిగడంతో కొట్టుకొని పోయినట్లు స్నేహితులు చెబున్నారని, అయితే తన కుమారుడి రెండు చెప్పులు బయటనే ఉన్నాయని ఆమె తెలిపారు. చెల్లెలు పరీక్షల్లో ఫెయిల్ కావడంతో విక్రం నీళ్లలో దూకాడని మరొక స్నేహితుడు చెప్పాడన్నారు. విక్రంకు చెల్లెలు లేదని, తనకు ఇద్దరూ కుమారులేనని రుక్మిణీ తెలిపింది. అక్కడ జరిగినదానికి, స్నేహితులు చెప్పే మాటలకు పొంతన లేదన్నారు. దీంతో వారిపై అనుమానాలు బలపడుతున్నాయని బంధువులు అంటున్నారు. తన కుమారుడిని వాళ్లే బలవంతంగా తీసుకెళ్లి నీళ్లలో తోసేశారని తల్లి ఆరోపిస్తోంది. పోలీసులు ఇప్పటికై నా లోతుగా దర్యాప్తు జరిపి తన కుమారుడి జాడ కనిపెట్టాలని ఆమె కోరుతోంది. -
వరిలో కాలి బాటలు తీయాలి
మైదుకూరు : వరిలో కాలిబాటలు తీయాలని జిల్లా వ్యవసాయాధికారి ఎం.చంద్రానాయక్ సూచించారు. ఇండి గ్యాప్ – పొలంబడి కార్యక్రమంలో భాగంగా గురువారం మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాలెం గ్రామం వద్ద రైతు రంగయ్య పొలంలోకి దిగిన జిల్లా వ్యవసాయాఽధికారి రైతులతో మాట్లాడుతూ వరి నాటే సమయంలో కాలిబాటలు తీయడం వల్ల పంటకు గాలి వెలుతురు బాగా అందుతాయని పేర్కొన్నారు. దీని వల్ల చీడపీడలు కూడా సోకకుండా ఉంటాయని తెలిపారు. కార్యక్రమంలో మండల వ్యవసాయాధికారి బాలగంగాధర్రెడ్డి, ప్రకృతి వ్యవసాయ విభాగం సిబ్బంది బాలయ్య, ఆదినారాయణ, ఎఫ్పీఓ పాల్గొన్నారు. ఎరువుల దుకాణం తనిఖీ అనంతరం మైదుకూరులోని శ్రీనివాస్ ట్రేడర్స్ ఫర్టిలైజర్ దుకాణాన్ని జిల్లా వ్యవసాయాధికారి చంద్రానాయక్ తనిఖీ చేశారు. దుకాణంలో ఎరువుల నిల్వలు అమ్మకాల వివరాలున్న రికార్డులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వ్యాపారులు యూరియాను అధిక ధరలకు అమ్మితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రైతులకు సరిపడా యూరియా నిల్వలు అందుబాటులో ఉన్నాయని రైతులు అవసరమైన మోతాదులో వాడాలని సూచించారు. రైతులు పురుగు మందులు విత్తనాలు కొనుగోలు చేసినప్పుడు షాపు యజమానులు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలని సూచించారు. ఎవరైనా నిబంధనలు అతిక్రమిస్తే చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
కలెక్టర్ దృష్టికి చియ్యపాడు దళితవాడ పాఠశాల సమస్య
చాపాడు : చియ్యపాడు గ్రామంలోని దళతవాడలో గల ఎంపీపీ స్కూల్ సమస్యను జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ దృష్టికి తీసుకెళతానని జిల్లా విద్యాశాధికారి షంషుద్దీన్ పేర్కొన్నారు. చియ్యపాడు దళతవాడకు చెందిన స్థానికులు, విద్యార్థులు సోమవా రం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ను కలిశారు. ఈ మేరకు ఆయన ఆదేశాలతో గురువారం డీఈఓ చియ్యపాడు దళితవాడ పాఠశాలను సందర్శించి ఇక్కడి గ్రామస్తులతో మాట్లాడా రు. వీరి అభిప్రాయాలను కలెక్టర్ దృష్టికి తీసుకెళతానన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఏ.శ్యాంసుందర్రెడ్డి, స్థానిక నాయకులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు ఆత్మహత్యపై ఆర్డీఓ విచారణ
దువ్వూరు : మండలంలోని ఇడమడక గ్రామానికి చెందిన రంగాగాళ్ల బుజ్జి అనే కౌలు రైతు గత ఏడాది మే 6న ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనపై గురువారం జమ్మలమడుగు ఆర్డీఓ సాయిశ్రీ ఇడమడక గ్రామంలో మృతుడి కుటుంబ సభ్యులను విచారించారు. ఆత్మహత్య చేసుకున్న రైతుకు భార్య, నలుగురు ఆడ పిల్లలు, ఒకు కుమారుడు ఉన్నారు. 8 ఎకరాల పొలం కౌలుకు తీసుకుని సాగు చేయగా నష్టాలు రావడంతో బుజ్జి ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు ఆర్డీఓకు తెలిపారు. కూలి నాలి చేసుకుంటూ జీవిస్తున్నామని తమను ఆదుకోవాలని కోరారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపి రైతు కుటుంబానికి న్యాయం చేస్తామని ఆర్డీఓ తెలిపారు. కార్యక్రమంలో మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, దువ్వూరు తహసీల్దార్ సంజీవరెడ్డి, వ్యవసాయాధికారి అమరనాథరెడ్డి, ఆర్ఐ జాన్సన్, వీఆర్ఓ హరి తదితరులు పాల్గొన్నారు. మిద్దైపె నుంచి పడి వ్యక్తి మృతిమైలవరం : మండల పరిధిలోని మాధవాపురం గ్రామానికి చెందిన కొండయ్య(53) అనే రైతు మిద్దైపె నుంచి పడి మృతి చెందాడు. గురువారం తెల్లవారు జామున పని నిమిత్తం మిద్దె ఎక్కి దిగుతుండగా పొరబాటున జారి కింద పడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే స్థానికులు జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యు లు తెలిపారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కొండయ్య మృతదేహానికి నివాళులు అర్పించారు. ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమికరాజంపేట : నేటి సమాజంలో ఫార్మసీ రంగానిదే ప్రధాన భూమిక అని అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి అన్నారు. గురువారం జాతీయ స్థాయి సదస్సులో మొదటి బహుమతి సాధించిన రుక్సానా బేగం, అధ్యాపకురాలు సుష్మితను ఆయన అభినందించి, జ్ఞాపికను అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మసీ విద్యతో ఉజ్వల భవిష్యత్తు ఉందన్నారు. ఫార్మసీ రంగంలో రాణిస్తే దేశ, విదేశాలలో ఉపాధి అవకాశాలు మెండుగా ఉన్నాయన్నారు. అన్నమాచార్య ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత మాట్లాడారు. కార్యక్రమంలో అన్నమాచార్య ఫార్మసీ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు
కడప అర్బన్ : వినాయక చవితి పండుగ ప్రారంభం నుంచి నిమజ్జనం వరకు, ప్రజలు పోలీస్ శాఖకు పూర్తి సహకారం అందించాలని జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ సూచించారు. జిల్లాలోని వినాయక ఉత్సవాలకు గణేష్ ఉత్సవ్.నెట్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో సింగిల్ విండో విధానంలో మాత్రమే అనుమతులు పొందాలన్నారు. కేవలం మట్టి గణపతి విగ్రహాలు మాత్రమే ఉపయోగించాలన్నారు. ప్రతి మంటపం వద్ద సీసీ కెమెరాలు, అగ్ని ప్రమాద నివారణ సామగ్రి,ఫస్ట్ ఎయిడ్ బాక్స్ తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. ఊరేగింపుల సమయంలో భక్తి గీతాలు, శాంతి సందేశాలు, సాంస్కృతిక కార్యక్రమాలు మాత్రమే నిర్వహించాలని పేర్కొన్నారు. ఇతర మతస్తుల మనో భావాలను దెబ్బతీయకుండా, సోదరభావంతో, పరస్పర గౌరవంతో ఉత్సవాలు జరపాలని సూచించారు. వివాదాస్పద, మతపరమైన లేదా రాజకీయ ఉద్రిక్తత ఉన్న ప్రదేశాల్లో మంటపాలు ఏర్పాటు చేయకూడదన్నారు. ఇతరులను రెచ్చగొట్టే ప్రసంగాలు, నినాదాలు, పాటలు, వ్యాఖ్యలు చేయకూడదన్నారు.జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ -
విద్యుదాఘాతంతో రైతు మృతి
దువ్వూరు : మండలంలోని చిన్నబాకరాపురం గ్రామంలో విద్యుదాఘాతంతో రైతు మృతి చెందిన సంఘటన గురువారం జరిగింది. పోలీసుల కథనం మేరకు.. చిన్నబాకరాపురం గ్రామానికి చెందిన చింతల శ్రీనివాసులు(52) తన పొలంలో అరటి పంటకు నీటి తడులు ఇచ్చేందుకు మోటార్ ఆడకపోవడంతో కనెక్షన్ సరిగా లేదని గుర్తించాడు. ట్రాన్స్ఫార్మర్కు విద్యుత్ వైర్ను తగిలిస్తుండగా ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్ తగిలి రైతు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి రెండు ఎకరాల సొంత పొలం ఉండగా, ఐదు ఎకరాలు కౌలుకు తీసుకుని అరటి, మొక్క జొన్న, వరి పంటలను సాగు చేస్తున్నాడు. మృతుడికి భార్య శివమ్మ, కూతురు చందు ఉన్నారు. కూతురుకు ఇటీవలే వివాహం అయింది. వ్యవసాయంపైనే ఆధారపడి జీవిస్తున్నారు. కుటుంబ పెద్ద మరణించడంతో భార్య శివమ్మ, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఈ సంఘటనపై మృతుడి భార్య శివమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామని ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. -
●విద్యుత్ భద్రతా నియమాలు పాటించాలి
కడప కార్పొరేషన్: వినాయక చవితి పర్వదిన సందర్భంగా ప్రజలు విద్యుత్ భద్రతా నియమాలను విధిగా పాటించాలని జిల్లా విద్యుత్ శాఖ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ కోరారు. గురువారం విద్యుత్ భవన్లోని తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. వినాయక పందిళ్లను విద్యుత్ లైన్లకు సమీపంలో వేయరాదని, దీనివల్ల విద్యుత్ ప్రమాదాలు జరిగే అవకాశాలు అధికంగా ఉంటాయన్నారు. భారీ విగ్రహాలతో ఊరేగింపులు చేసేటప్పుడు విద్యుత్ లైన్ల వద్ద జాగ్రత్తగా ఉండాలని, అవసరమైతే విద్యుత్తు సిబ్బంది సహకారం తీసుకొని విద్యుత్ను ఆఫ్ చేయించుకొని ముందుకు సాగాలన్నారు. విద్యుత్ భూతంతో సమానమని చిన్న తప్పిదమే పెను విషాదానికి దారి తీస్తుందని హెచ్చరించారు. వినాయక పందిళ్లకు ఉపయోగించే విద్యుత్ వైర్లను అతుకులు లేకుండా, నాణ్యమైన విద్యుత్ ఉపకరణాలు ఉపయోగించాలన్నారు.విద్యుత్తు లైన్లు, ట్రాన్స్ఫార్మర్ల వద్ద పందిళ్లు ఏర్పాటు చేయకూడదన్నారు. డెకరేషన్ లైట్లు కట్టుకొనుటకు ఇనుప పైపులు, కడ్డీలు వాడరాదని, కొయ్యలు, ప్లాస్టిక్ పైపులు వాడాలన్నారు. సూచనలు, విద్యుత్ భద్రతా నియమాలను పాటించి వినాయక చవితి ఉత్సవాలను సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. -
అందని లైసెన్సు కార్డులు.. తప్పని అవస్థలు!
రోడ్డెక్కిన వాహనదారులను దోచుకునేందుకు కూటమి ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు జారీ చేయకుండా చలానా పేరుతో కోట్లు దోపిడీ చేస్తోంది. డిజిటల్ టెక్నాలజీకి తానే ఆద్యుడునని చెప్పుకునే సీఎం చంద్రబాబు తిరిగి ఫిజికల్ విధానాన్ని అమలులోకి తెచ్చారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాహనదారులకు కార్డుల భారం లేకుండా డిజిటల్ విధానాన్ని అమలు చేశారు. ఫిజికల్ కార్డు లేకపోయినా యాప్ ఓపెన్ చేసి చూపించినా సరిపోయేది. కూటమి ప్రభుత్వం వచ్చి దోపిడీకి తెర తీసింది. కడప వైఎస్ఆర్ సర్కిల్ : డ్రైవింగ్ ఆర్సీ కార్డుల విషయంలో వాహనదారుల పరిస్థితి సంకటంగా మారింది. కార్డుల కోసం రాష్ట్ర ప్రభుత్వానికి డబ్బులు చెల్లించినా జారీ చేయని పరిస్థితి. రవాణా శాఖలో సేవలు సులభతరం చేశామని కార్యాలయానికి రాకుండా అన్ని సేవలు మీ ముంగిట పొందవచ్చని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వం లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం రవాణా కార్యాలయాల చుట్టూ తిప్పుకుంటోంది. వాహనం రోడ్డు ఎక్కితే చాలు లైసెన్స్, ఆర్సీలు చూపించమని అటు రవాణా శాఖ అధికారులు, ఇటు పోలీసు అధికారులు దబాయిస్తున్నారు. కార్డుల కోసం డబ్బులు చెల్లించామని కార్డులు ఇంకా ఇవ్వలేదని చెప్పినా చలానా రాసి చేతిలో పెడుతున్నారు. కొంతమంది వ్యాలెట్ యాప్లో నుంచి డౌన్లోడ్ చేసుకున్న కార్డు చూపితే అది అసలో.. నకిలీనో తమకు తెలియదు కార్డు ఉంటే చూపించు వదిలేస్తామని చెబుతున్నారు. కార్డుల భారం తగ్గించిన వైఎస్సార్సీపీ ప్రభుత్వం జిల్లా రవాణాశాఖ కార్యాలయంతో పాటు పులివెందుల, బద్వేల్, ప్రొద్దుటూరు పరిధిలో రవాణా శాఖ కార్యాలయాలు ఉన్నాయి. ప్రతిరోజు జిల్లా వ్యాప్తంగా సగటున 500 పైగా వాహన రిజిస్ట్రేషన్లు పరిమితి లైసెన్సులు జారీ చేస్తుంటారు. ఫిజికల్ కార్డుల కోసం ప్రభుత్వాలు అదనంగా ప్రతి కార్డుకు రూ.235 వసూలు చేసేవి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం వాహనదారులపై కార్డుల భారం తొలగించింది. డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డుల కోసం సెల్ఫోన్లో వ్యాలెట్ యాప్లు అందుబాటులో ఉంచింది. పోలీస్, రవాణాశాఖ అధికారులు అడిగినప్పుడు సేవ్ చేసుకున్న కార్డు చూపితే సరిపోతుంది. పొరపాటున కార్డు మర్చిపోతే వాహన చోదకులపై చలాన్ రాసే పరిస్థితి ఉండడంతో ఈ విధానానికి స్వస్తి పలికింది. డిజిటల్ విధానాన్ని అమలులోకి తెచ్చింది. ప్రస్తుతం వాహనం రోడ్డెక్కితే చాలు పోలీసు, రవాణా శాఖ అధికారులు డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు చూపించమని వేధిస్తున్నారంటూ వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కార్డులకు డబ్బులు చెల్లించి డౌన్లోడ్ చేసుకున్న కార్డు చూపితే సరిపోతుందని ప్రభుత్వ మార్గదర్శకాలు ఎక్కడా లేకపోవడంతో ఒరిజినల్ కార్డులు చూపించాలని లేదంటే కేసులు, చలానాలు రాస్తామని చెబుతున్నారు. కొంతమంది అధికారులు వాహనదారులు డౌన్లోడ్ చేసుకున్న కార్డులు చూపితే మిన్నకుంటున్నారు. ఎక్కువ మంది అధికారులు జరిమానా విధిస్తుండటంతో వాహనదారులు లబోదిబోమంటున్నారు. కార్డులు ఎప్పుడు ఇస్తారో తెలియని పరిస్థితి ఉంది. కనీసం సెల్ఫోన్లో డౌన్లోడ్ చేసుకున్న డ్రైవింగ్ లైసెన్స్, ఆర్సీ కార్డులు చూపించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాలు జారీ చేయాలని వాహనదారులు కోరుతున్నారు. అలాగే కార్డులను త్వరగా ముద్రించి వాహనదారులకు అందజేయాలని పలువురు డిమాండ్ చేస్తున్నారు. లైసెన్స్, ఆర్సీ కార్డుకు రూ.235 చెల్లింపు డిజిటల్ టెక్నాలజీకి తానే ఆద్యుడునని గొప్పలు చెప్పుకునే చంద్రబాబు గత ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన డిజిటల్ విధానానికి స్వస్తి పలకడమే కాకుండా వాహనదారులను దోచుకుంటున్నారు. గత ఏడాది నవంబర్ నుంచి మళ్లీ కార్డుల జారీ కోసం ప్రత్యేకంగా డబ్బులు చెల్లించడం ప్రారంభించారు. లైసెన్స్ జారీ రిజిస్ట్రేషన్ సమయంలో ప్రభుత్వ చలానాతో పాటు కార్డుకు ప్రత్యేకంగా రూ.235 వసూలు చేస్తున్నారు. గతే ఏడాది నవంబర్ నుంచి డబ్బులు చెల్లించిన వాహనదారులకు ఇంతవరకు కార్డులు అందలేదు. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 50 వేలకు పైగా లైసెన్స్, ఆర్సీ కార్డులు రావాల్సి ఉందని రవాణాశాఖ అధికారులు చెబుతున్నారు. ఇదంతా వాహనదారులను దోపిడీ చేసేందుకు ప్రభుత్వం మాస్టర్ స్కెచ్ వేసినట్లు అర్థమవుతోంది. కార్డుల విషయంలో నేటికీ రాష్ట్ర ప్రభుత్వానికి స్పష్టత లేదు. కార్డుల ముద్రణ రాష్ట్ర ప్రభుత్వమే చేపట్టాలా ఏదైనా సంస్థకు అప్పజెప్పాలా అనే సందిగ్ధంలో ఉన్నట్లు తెలుస్తోంది. ఏదిఏమైనా కార్డులు ఎప్పుడు ముద్రిస్తాదో.. మాకు ఎప్పుడు వస్తాయో అంటూ వాహనదారులు ఎదురు చూస్తున్నారు. గత ఏడాది నవంబరు నుంచి వాహనదారులకు అందని లైసెన్స్ కార్డులు లైసెన్స్ జారీకి ప్రభుత్వ చలనాతోపాటు కార్డుకు రూ. 234 వసూలు కార్డులు జారీ చేయకుండా చలానా పేరుతో కోట్లలో దోపిడీ డిజిటల్ విధానానికి స్వస్తి పలికిన చంద్రబాబు సర్కార్ జిల్లా వ్యాప్తంగా 50 వేల వరకు లైసెన్స్, ఆర్సీ కార్డుల పెండింగ్ -
సేవలు సంతృప్త స్థాయిలో అందాలి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం ద్వారా ప్రజలకు సంతృప్త స్థాయిలో సేవలు అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా అధికారులను ఆదేశించారు. వివిధ అంశాలపై గురువారం చీఫ్ సెక్రటరీ విజయానంద్ కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు సక్రమంగా సేవలు అందుతున్నాయా? లేదా? అనే విషయమై అన్ని శాఖల జిల్లా అధికారులు క్షేత్రస్థాయిలో ప్రత్యేక పర్యవేక్షణ నిర్వహించాలన్నారు. ప్రభుత్వ పథకాలు, అభివృద్ధి కార్యక్రమాల అమలుపై ప్రతివారం సమీక్షలు నిర్వహించాలన్నారు. ప్రస్తుత వర్షాకాలంలో పారిశుద్ద్య కార్యక్రమాలను పటిష్టంగా జరిగేలా చూడాలన్నారు. స్వచ్చాంధ్ర అవార్డులను సాధించేందుకు ఎంపీడీఓలు, మున్సిపల్ కమిషనర్లు ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. వర్షాకాలంలో నీటి నిల్వ కారణంగా ఇసుక సేకరణ సాధ్యం కాదని.. ఇప్పటినుంచే అవసరమైన మేర నిల్వలు పెంచుకోవాలని కోరారు. భూగర్బ జల వనరులను పెంపొందించుకోవడంతోపాటు సమ్మ ర్ స్టోరేజీ ట్యాంకులను పూర్తిగా నింపే చర్యలు చేపట్టాలన్నారు. కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, మున్సిపల్ కమిషనర్ మనోజ్రెడ్డి, సీపీఓ హజరతయ్య ఇతర అధికారులు పాల్గొన్నారు. -
తల్లి కారు అద్దాలను ధ్వంసం చేసిన కొడుకు
ప్రొద్దుటూరు క్రైం : తనకు ఇష్టం లేకున్నా చెల్లెలు పెళ్లి జరిపించిందనే కోపంతో స్వయాన తల్లికి చెందిన కారు అద్దాలను కుమారుడు ధ్వంసం చేశాడు. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. వేంపల్లె మాగెన్నగారి వనిత బంగారు అంగళ్ల వీధిలో నివాసం ఉంటున్నారు. ఆమెకు కుమార్తె లక్ష్మీసౌమినితో పాటు కుమారుడు ఉన్నారు. ఐదేళ్ల క్రితం ఆమె భర్త చనిపోయాడు. ఈ ఏడాది మార్చిలో ప్రేమించిన వ్యక్తితో కుమార్తె పెళ్లి జరిపించారు. అయితే ఈ పెళ్లి కుమారుడికి ఇష్టం లేదు. దీంతో తల్లి, కుమారుడి మధ్య తరచూ గొడవలు జరిగేవి. ఈ కారణంగా కుమారుడు తల్లి నుంచి దూరంగా దొరసానిపల్లెలో నివాసం ఉంటున్నాడు. వనిత మోడంపల్లెలోని లక్ష్మీనరసింహస్వామి ఆలయం వద్ద కొత్తగా ఇల్లు కడుతోంది. తన టయోటా అర్బన్ క్రూజర్ కారును నిలిపి ఉండగా గురువారం సాయంత్రం తన కుమారుడితో పాటు మరో ముగ్గురు వ్యక్తులు వచ్చి కారు అద్దాలను ధ్వంసం చేశారు. అంతేగాక చంపుతామని వనితను బెదిరించారు. ఈ మేరకు ఆమె రాత్రి టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. -
విద్యార్థుల సర్టిఫికెట్ల పరిశీలన
కడప వైఎస్ఆర్ సర్కిల్: క్రీడా పాఠశాలలో ప్రవేశాలకు అర్హత సాధించిన విద్యార్థుల సర్టిఫికెట్లను పరిశీలించామని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. క్రీడాపాఠశాలలో నాలుగో తరగతి ప్రవేశానికి అర్హత సాధించిన 19 విద్యార్థులకు 18 మంది, 5వ తరగతిలో 33 మంది విద్యార్థులకు గాను 29 మంది హాజరైనట్లు తెలిపారు. విద్యార్థుల ఒరిజినల్ సర్టిఫికెట్లతో పాటు పలు పత్రాలను పరిశీలించారు. రాష్ట్రంలో క్రీడా పాఠశాలకు ఎంపికై న విద్యార్థులు వారి తల్లిదండ్రులు రావడంతో క్రీడా పాఠశాల ప్రాంగణం సందడి నెలకొంది. కాగా విద్యార్థుల సర్టిఫికెట్లను క్రీడా పాఠశాలలోని కోచ్లు క్షుణ్ణంగా పరిశీలించారు. -
పింఛన్లు తొలగించే కుట్ర
పోరుమామిళ్ల: దివ్యాంగ పెన్షన్లను తొలగించేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నిందని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి ఆరోపించారు. గురువారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే వృద్ధాప్య పెన్షన్ హామీని గాలికొదిలేసిన కూటమి ప్రభుత్వం ప్రస్తుతం వస్తున్న పెన్షన్లను తొలగించే పనిలో పడిందని మండిపడ్డారు. తొలివిడతగా దివ్యాంగ, ఆరోగ్య పెన్షన్లపై కన్నేసిందన్నారు. ఇందులో భాగంగానే పది, పదిహేనేళ్లుగా పెన్షన్ తీసుకుంటున్న వికలాంగులు సైతం మళ్లీ సదరం సర్టిఫికెట్ల్ల కోసం దరఖాస్తు చేసుకుని, వైద్య పరీక్షలు చేయించుకోవాల్సి వస్తోందని... ఇప్పుడు వైకల్యం శాతం 40 కంటే తగ్గిందన్న సాకుతో చాలా మంది పెన్షన్లను తొలగిస్తున్నారని ఆయన మండిపడ్డారు. దివ్యాంగులను మానవతా దృక్పథంతో ఆదుకోవాల్సిందిపోయి వారి బతుకులతో ఆటలాడుకుంటోందని ధ్వజమెత్తారు. వారిపై ఎందుకంత కక్షపూరితంగా వ్యవహరిస్తున్నారో చెప్పాలని ప్రశ్నించారు. అప్పుడు అర్హులు ఇప్పుడు అనర్హులా అని ఆయన నిలదీశారు. అప్పటి సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి హయాంలో రూ.200లు పెన్షన్ తీసుకున్న వికలాంగులు ఇప్పుడు అర్హత లేదని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. అప్పుడు, ఇప్పుడూ రెండుసార్లూ తనిఖీలు చేసింది వైద్యులే కదా, ఇప్పుడు అంగవైకల్యం తగ్గిందని ధృవీకరిస్తున్న ఈ డాక్టర్లది తప్పా లేక అప్పుడు ఇచ్చిన వైద్యులది తప్పా అని ప్రజలే ప్రశ్నిస్తున్నారన్నారు. వైకల్యశాతం తక్కువ, తాత్కాలిక వైకల్యం కారణంగా పెన్షన్ నిలిపివేయనున్నట్లు మండల పరిషత్, మున్సిపల్ కార్యాలయాల నుంచి నోటీసులు అందచేయడం ఆందోళన కలిగిస్తోందన్నారు. నోటీసులు అందుకున్న వారు అర్హులుగా భావిస్తే తమ వివరాలను ఎంపీడీఓ, మున్సిపల్ కార్యాలయాలలో అప్పీలు చేసుకోవడానికి అష్టకష్టాలు పడుతున్నారన్నారు. ఇప్పటికైనా ప్రభుత్వం వెంటనే తుది నిర్ణయం తీసుకుని దివ్యాంగుల పెన్షన్లను పునరుద్ధరించాలని ఆయన డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి -
చదువుపై ఆసక్తి తరిగి.. జీవితంపై విరక్తి కలిగి..
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ క్యాంపస్లో నిర్వహిస్తున్న ఒంగోలు ట్రిపుల్ ఐటీ విద్యార్థి గురుగుబీలి నరసింహనాయుడు (17 చదువుకోవడం ఇష్టంలేక ఆత్మహత్య చేసుకున్నాడు. దీంతో ఇడుపులపాయలో ఉన్న ఆర్కే వ్యాలీ, ఒంగోలు క్యాంపస్లలో విషాద ఛాయలు అలుముకున్నాయి. శ్రీకాకుళం జిల్లా ఏడ్చల్ మండలం షేర్ మహమ్మదాపురం గ్రామానికి చెందిన అప్పలనాయుడు, రాజులమ్మ దంపతుల కుమారుడు నరసింహనాయుడు ఇడుపులపాయ క్యాంపస్లోని ఒంగోలు ట్రిపుల్ ఐటీలో పీయూసీ–2 (ఇంటర్ ద్వితీయ సంవత్సరం) చదువుతున్నాడు. ఇడుపులపాయ క్యాంపస్లోని పాపాగ్ని వసతి గృహంలో మరో ఐదుగురు విద్యార్థులతో కలిసి హాస్టల్ గదిలో ఉంటున్నాడు. గురువారం తెల్లవారుజామున హాస్టల్ గదిలో ఉన్న బాత్రూం కిటికీకి తాడుతో ఉరివేసుకున్నాడు. నరసింహనాయుడు బాత్రూంలో నుంచి ఎంతసేపటికి రాకపోవడంతో తోటి విద్యార్థులు తలుపులు కొట్టగా పలకకపోవడంతో అనుమానంతో సెక్యూరిటీ సిబ్బందికి సమాచారమందించారు. దీంతో సెక్యూరిటీ సిబ్బంది, ట్రిపుల్ ఐటీ అధికారులు తలుపులు పగలగొట్టి చూడగా కిటికీకి నరసింహనాయుడు వేలాడుతున్నాడు. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే విద్యార్థి మృతి చెందాడని వైద్యులు ధ్రువీకరించారు.చదువులో మంచి పట్టు..నరసింహనాయుడుకు చదువులో మంచి పట్టు ఉన్నప్పటికీ మనస్థాపానికి గురయ్యాడు. ఇంటర్ మొదటి సంవత్సరంలో మంచి మార్కులు సాధించినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా తెలిపారు. అయితే విద్యార్థి ట్రిపుల్ ఐటీలో చదవడం ఇష్టం లేనట్లు తెలిసింది. తాను నర్సింగ్ చేయాలని అనుకుంటున్నట్లు తోటి విద్యార్థులతో చెప్పేవాడు. తండ్రి అప్పలనాయుడు ఇటీవల మృతి చెందగా, తల్లి రాజులమ్మ నర్సుగా పనిచేస్తూ విద్యార్థిని చదివించేది. నరసింహనాయుడు పదవ తరగతిలో 566 మార్కులు సాధించి 2024లో ఒంగోలు ట్రిపుల్ ఐటీలో సీటు దక్కించుకున్నాడు. అయితే ఆ విద్యార్థికి త్రిబుల్ ఐటీ చదవడం ఇష్టం లేదు. నర్సింగ్ చేయాలన్నదే తన ఆశయంగా పెట్టుకున్నాడు. ట్రిపుల్ ఐటీలో చదవడం ఇష్టం లేక అప్పుడప్పుడు తోటి విద్యార్థులతో తాను ఆత్మహత్య చేసుకుంటానని చెబుతుండేవాడని తెలిసింది. విద్యార్థి గత నాలుగు రోజులుగా ముభావంగా ఉండేవాడని తోటి విద్యార్థులు డైరెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. దీంతో విద్యార్థి సెల్ ఫోన్ను పోలీసులు స్వాధీనం చేసుకొని ఎవరెవరితో చాటింగ్ చేశాడో, ఫోన్ మాట్లాడాడో అన్న కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. ట్రిపుల్ ఐటీ అధికారులు ఆర్కే వ్యాలీ పోలీస్ స్టేషన్లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి సీఐ ఉలసయ్య దర్యాప్తు చేస్తున్నారు.విద్యార్థి ఆత్మహత్య చేసుకోవడం బాధాకరం..ఇడుపులపాయ క్యాంపస్లో ట్రీపుల్ ఐటీ విద్యార్థి నరసింహ నాయుడు ఆత్మహత్య చేసుకోవడం చాలా బాధకరమని ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పేర్కొన్నారు. వేంపల్లె ప్రభుత్వ ఆసుపత్రిలో ఉన్న నరసింహ నాయుడు మృతదేహన్ని రాంగోపాల్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ధ్రువకుమార్ రెడ్డి, టీఎన్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు బొజ్జా తిరుమలేష్, సీపీఐ ఏరియా కార్యదర్శి వెంకటరాములు, బ్రహ్మయ్య, మాజీ జెడ్పీటీసీ సభ్యుడు డాక్టర్ ఎస్ఎఫ్ బాషా వేర్వేరుగా సందర్శించారు. ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఎవరైనా మానసికంగా ఇబ్బందులు పడుతుంటే అలాంటి వారికి అధికారులు కౌన్సెలింగ్ ఇవ్వాలని సూచించారు. మృతి చెందిన విద్యార్థి కుటుంబ సభ్యులకు విద్యాశాఖ మంత్రి లోకేష్ ప్రగాఢ సానుభూతి తెలిపారు. -
●2 బార్లకు నోటిఫికేషన్ విడుదల
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో గీత కులాలకు సంబంధించిన 2 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. బుధవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ జిల్లా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. కడప కార్పొరేషన్ పరిధిలో –1, ప్రొద్దుటూరు మున్సి పాలిటీలో –1 బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశామని పేర్కొన్నారు. దరఖాస్తు రుసుం ఫీజు నాన్ రీఫండబుల్ రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు కలిపి మొత్తం రూ. 5.10 లక్షలు చెల్లించాలన్నారు. దరఖాస్తులను ఈనెల 29వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల చేసుకోవాలన్నారు. 30న కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి ఎంపికై న అభ్యర్థులకు సమాచారం అందిస్తామన్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సూపరింటెండెంట్ రవికుమార్ పాల్గొన్నారు. -
అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు
ప్రొద్దుటూరు క్రైం: నూతన బార్ పాలసీ ప్రకారం ఇక నుంచి బార్లలో అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం అమ్మకాలు జరుగుతాయని కడప ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. డిప్యూటీ కమిషనర్, ఈఎస్ రవికుమార్ బుధవారం ప్రొద్దుటూరు ఎకై ్సజ్ స్టేషన్కు వచ్చారు. స్థానికంగా ఉన్న పాత బార్ల యజమానులతో నిర్వహించిన సమావేశంలో వారు మాట్లాడారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 41 బార్లకు దరఖాస్తులు ఆహ్వానించినట్లు తెలిపారు. కడప జిల్లాలో 29, అన్నమయ్య జిల్లాలో 12 బార్లు ఉన్నాయన్నారు. ఈ నెల 26లోగా దరఖాస్తులు చేసుకోవాలని, 28న బార్లకు డ్రా తీయనున్నట్లు తెలిపారు. గతంలో ప్రొద్దుటూరులోని బార్లకు లైసెన్స్ ఫీజు రూ. 1.45 కోట్లు ఉండగా ఇప్పుడు రూ. 55 లక్షలకు తగ్గించినట్లు చెప్పారు. సమయ పాలన పాటించని మద్యం షాపులు, బార్లపై చర్యలు తీసుకుంటామన్నా రు. ప్రొద్దుటూరులో గంజాయి అక్రమ రవాణా నిరోధానికి కృషి చేస్తున్న ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డిని అభినందించారు. -
నీట్ పీజీ మెడికల్ పరీక్షలో శ్రావణికి 975వ ర్యాంకు
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని బుసిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన గజ్జల ఆంజనేయరెడ్డి, గజ్జల సుమిత్ర దంపతుల కుమార్తె గజ్జల శ్రావణి 19న విడుదలైన జాతీయ స్థాయి నీట్ మెడికల్ పీజీ పరీక్షలో 627 మార్కులతో 975వ ర్యాంకు సాధించారు. ఈమె తండ్రి భాకరాపేటలోని ఏపీఎస్పీ 11వ బెటాలియన్లో హెడ్ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్నారు.ఇరువర్గాలపై కేసు నమోదుకాశినాయన : మండలంలోని సావిశెట్టిపల్లె గ్రామంలో స్థలం విషయంలో ఇరువర్గాల వారు కొట్లాడుకోవడంతో ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు బుధవారం ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. వెంబడి పోలయ్య, వెంబడి సత్యరాజులు స్థలం విషయంలో గొడవ పడ్డారని, పోలయ్య వర్గంలో ఏడుగురిని, సత్యరాజు వర్గంలో 12 మందిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు.వ్యక్తికి గాయాలు..మండలంలోని సావిశెట్టిపల్లె గ్రామానికి చెందిన విష్ణు తేజ గ్రామంలోని డంపింగ్ యార్డు వద్ద మేకలను మేపుకొంటున్నాడు. అదే సమయంలో డంపింగ్ యార్డులో శ్రీను, యువ, వినయ్లు మొక్కలు పెంచుతుండగా కుండీలు పగిలిపోయాయి. అక్కడే ఉన్న విష్ణు తేజ కుండీలు పగిలిపోతే ఇబ్బంది కదా అని అడిగినందుకు నువ్వు ఎవడ్రా మాకు చెప్పేందుకు అని విష్ణు తేజపై దాడి చేయడంతో తలకు గాయాలయ్యాయి. వినయ్తోపాటు మరో ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యోగేంద్ర తెలిపారు.గాయపడిన యువకుడి మృతిజమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు– ప్రొద్దుటూరు రహదారిలో పల్సర్ బైక్లో ప్రొద్దుటూరుకు వెళుతుండగా రోడ్డు నిర్మాణ పనుల కోసం రోడ్డుపై నిలబెట్టిన డ్రమ్ములను ఢీకొన్న ఘటనలో మంచాల నవీన్ (20) అనే యువకుడు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ హైమావతి తెలిపారు. పట్టణంలోని ఎస్సీ కానీకి చెందిన మంచాల నవీన్ కూలి పనులు చేసుకొనేవాడు. సొంత పనుల నిమిత్తం మంగళవారం రాత్రి బైక్లో ప్రొద్దుటూరుకు వెళుతుండగా మార్గమధ్యంలో గొరిగెనూరు గ్రామ శివార్లలో పనుల కోసం నిలబెట్టిన డ్రమ్ములను ఢీకొన్నాడు. ఈ సంఘటనలో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో సిబ్బంది వెళ్లి ప్రొద్దుటూరుకు తరలించారు. పరిస్థితి విషమించడంతో కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడి తండ్రి ఓబులేసు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఆమె తెలిపారు.మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహంప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వ్యక్తి(65) ఒకరు మృతి చెందాడు. రెండు రోజుల కిత్రం అనారోగ్యంతో ఆస్పత్రికి వచ్చిన అతనికి జీఈ వార్డులో చేర్పించి చికిత్స అందించారు. ఈ క్రమంలో ఆరోగ్యం క్షీణించడంతో అతను మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. మృతుడికి సంబంధించిన బంధువులు జిల్లా ఆస్పత్రిలో సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వర్గాలు తెలిపాయి. -
విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యే
జమ్మలమడుగు : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్రెడ్డి బుధవారం పోలీసుల విచారణకు హాజరయ్యారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఈనెల 12వ తేదీన అక్రమంగా అరెస్టు చేసి పులివెందుల నుంచి కడపకు తరలిస్తున్నామని చెప్పి రూటు మార్చి ఎర్రగుంట్ల మీదుగా వెళ్తుండటంతో మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి పోలీసు వాహనానికి అడ్డుపడ్డారు. దీంతో పోలీసులు సుధీర్రెడ్డితో పాటు మరో వంద మందిపైన కేసులు నమోదు చేస్తున్నట్లు ప్రకటించారు. తొలుత ఈనెల 16వతేదీన విచారణకు రావాలంటూ పోలీసులు నోటీసులు ఇచ్చారు. అ యితే అనారోగ్యం కారణంగా 20వతేదీ హాజరవుతానని న్యాయవాదుల ద్వారా పోలీసులకు సమాచారం ఇచ్చారు. అయితే బుధవారం పోలీసు స్టేషన్లో విచారణకు హాజరైన మాజీ ఎమ్మెల్యేను అధికారులు ఎవ్వరూ లేకపోవడంతో విచారించలేమని చెప్పి తిరిగి ఈనెల 25వతేదీన రావాలంటూ నోటీసులు ఇచ్చారు.పట్టపగలే బంగారు దుకాణానికి కన్నం– 25 తులాల బంగారు నగలు చోరీప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని మోక్షగుండం వీధిలో పట్టపగలే బంగారు దుకాణానికి దొంగలు కన్నం వేశారు. మహబూబ్షరీఫ్కు చెందిన షాపులో సుమారు 25 తులాల మేర బంగారును ఎత్తుకెళ్లారు. పోలీసులు తెలిపిన మేరకు.. శ్రీనివాసనగర్కు చెందిన దరూబాయిగారి మహబూబ్షరీఫ్ కొన్నేళ్ల నుంచి దర్గాబజార్ సమీపంలోని మోక్షగుండం వీధిలో బంగారు నగల తయారీ షాపును నిర్వహిస్తున్నాడు. బుధవారం మధ్యాహ్నం 2 గంటల సమయంలో షెట్టర్కు తాళం వేసి భోజనం చేసేందుకు ఇంటికి వెళ్లాడు. తిరిగి 4.30 గంటల సమయంలో దుకాణం తెరిచేందుకు రాగా షెట్టర్ తాళం తీసి ఉంది. దీంతో పూర్తిగా షెట్టర్ తీసి చూడగా పెట్టెలో బంగారు నగలు కనిపించలేదు. నగలు తయారు చేసేందుకు కస్టమర్ల నుంచి తీసుకున్న సుమారు 25 తులాల మేర ఉన్న బంగారు కనిపించలేదు. మెయిన్ బజార్లోని వ్యాపారులు, స్వర్ణకారులందరూ మధ్యాహ్న సమయంలో దుకాణాలను మూసి ఇళ్లకు వెళ్తారు. ఆ సమయంలో వీధులన్నీ నిర్మానుష్యంగా ఉంటాయి. ఈ క్రమంలో దొంగలు నకిలీ తాళాలతో తాళం తీసి చోరీకి పాల్పడి ఉంటారని పోలీసులు భావిస్తున్నారు. సమాచారం అందుకున్న వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. క్లూస్ టీం సిబ్బంది బంగారు షాపులో వేలి ముద్రలను సేకరించారు. సీసీ కెమెరాల ఆధారంగా నిందితులను గుర్తించేందుకు పోలీసులు ప్రయత్నిస్తున్నారు. నగల తయారీ షాపు యజమాని మహబూబ్షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పూర్ణాహుతితో ముగిసిన దేవునికడప బాలాలయం
బాలాలయంలో స్వామి, అమ్మవార్ల ప్రతిష్ఠ దర్శనానికి క్యూలో నిలిచిన భక్తులు కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో బుధవారం శాస్త్రోక్తంగా నిర్వహించిన పూర్ణాహుతి కార్యక్రమంతో బాలాలయ నిర్మాణం పూర్తయింది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో ఆలయ జీర్ణోద్ధరణ పనులు చేపట్టాలని నిర్ణయించారు. ఇందులో భాగంగా తొలి దశ కింద రూ.15 లక్షలతో బాలాలయ నిర్మాణాన్ని పూర్తి చేశారు. బుధవారం ఉదయం 9.30 గంటలకు మహాపూర్ణాహుతి, అనంతరం తులాలగ్నంలో బాలబింబ ప్రతిష్ఠ, బాలాలయ సంప్రోక్షణ కార్యక్రమాలను పాంచరాత్ర ఆగమ సలహాదారు రాజేష్ భట్టర్, మయూరం కృష్ణమోహన్, తివిక్రమ్, కృష్ణ తరుణ్ నిర్వహించారు. అనంతరం బాలాలయంలో వెలిసిన స్వామి, అమ్మవార్లను పెద్ద సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. కార్యక్రమాలను టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యత
● వినాయక చవితి ఉత్సవాల నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు ● క్రికెట్ బెట్టింగ్, మట్కా, గ్యాంబ్లింగ్ నిరోధంపై ప్రత్యేక దృష్టి ● బైకులపై ఓవర్ స్పీడ్, సైలెన్సర్ మార్చి తిరిగే వారు, స్టంట్స్ చేసేవారికి దండన ● నేరసమీక్షా సమావేశంలో జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కడప అర్బన్ : మిస్సింగ్ కేసులపై ప్రత్యేక దృష్టి సారించి అత్యధిక ప్రాధాన్యతతో కేసులను ఛేదించేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశించారు. బుధవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మిస్సింగ్ కేసులను ఛేందించేందు కోసం ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. వినాయక చవితి పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని సూచించారు. మహిళలు, బాలికలపై నేరాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలన్నారు. పెండింగ్ లో ఉన్న మహిళల పట్ల జరిగిన కేసులను త్వరితగతిన పరిష్కరించాలన్నారు. శక్తి యాప్ వినియోగంపై అవగాహన కల్పించాలని, కళాశాలలు, పాఠశాలల వద్ద శక్తి టీముల ద్వారా ఈవ్ టీజింగ్ జరగకుండా తగిన చర్యలు చేపట్టాలన్నారు. డ్రోన్ కెమెరా ద్వారా నిఘా ఉంచాలని ఈవ్ టీజింగ్ చేసేవారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాలైన క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జిల్లాలో ఎక్కడా జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని చెప్పారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా కేసుల్లో నిందితులను అరెస్ట్ చేసేందుకు ప్రత్యేక పోలీస్ టీమ్స్ ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సైబర్ నేరాలపై ప్రజలను చైతన్య పరుస్తూ విస్తృతంగా అవగాహనా కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ కార్యక్రమం లో భాగంగా పాఠశాలలు, కళాశాలల సమీపంలో పొగాకు ఉత్పత్తులు, గంజాయి, మాదక ద్రవ్యాల విక్రయాలపై సమీప దుకాణాల్లో విస్తృతంగా తనిఖీలు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలన్నారు. గంజాయి సేవించే అవకాశం ఉన్న శివారు ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచాలని చెప్పారు. ట్రాన్స్పోర్ట్ కార్యాలయాల గోడౌన్లలో ఆకస్మిక తనిఖీలు నిర్వహించాలన్నారు. బైకులపై ఓవర్ స్పీడ్, సైలెన్సర్ మార్చి తిరిగే వారు, ప్రమాదకర స్టంట్స్ చేసే ఆకతాయిలపై చట్టపరమైన చర్యలు తీసుకుని, కౌన్సెలింగ్ ఇవ్వాలన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నిరంతర నిఘా ఉంచడంతో పాటు కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్న్ నిర్వహించాలని పేర్కొన్నారు. పెండింగ్లో ఉన్న పలు కేసులపై నిశితంగా సమీక్ష జరిపి పోలీస్ అధికారులకు పలు సూచనలు చేశారు. ఎస్సీ,ఎస్టీ అట్రాసిటీ కేసుల్లో విచారణ పురోగతిని అడిగి తెలుసుకున్నారు. విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దష్టి సారించాలన్నారు. డాబాలు, హోటళ్లు, లాడ్జిలు, బస్స్టాండ్లు, రైల్వే స్టేషన్ లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. దొంగతనాలు, ఇతర నేరాలు జరగకుండా పగలు, రాత్రి గస్తీని పెంచాలని ఆదేశించారు. పాత నేరస్తుల కదలికలపై నిఘా ఉంచాలని, మరోమారు నేరాలకు పాల్పడకుండా చూడాలని తెలిపారు. ఈ సమావేశంలో అదనపు ఎస్.పి(పరిపాలన) కె.ప్రకాష్ బాబు , స్పెషల్ బ్రాంచ్,కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, డీటీసీ డీఎస్పీలు సుధాకర్, ఎ.వెంకటేశ్వర్లు, పి.భావన, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వర రావు, మురళి నాయక్, అబ్దుల్ కరీం, జిల్లాలోని సీఐలు, కడప సబ్ డివిజన్లోని ఎస్ఐలు పాల్గొన్నారు. విధి నిర్వహణలో ప్రతిభ కనబరిచిన వారికి ప్రశంసాపత్రాలు అందజేశారు. -
24 నుంచి ఒంటిమిట్టలో పవిత్రోత్సవాలు
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి వారి ఆలయంలో పవిత్రోత్సవాలు ఈనెల 24 నుంచి 26వ తేదీ వరకు జరుగుతాయని టీడీడీ అధికారులు బుధవారం తెలిపారు. ఇందుకోసం ఏర్పాట్లు పూర్తి చేసినట్లు చెప్పారు. ఆగస్టు 23వ తేది సాయంత్రం ఆరు గంటలకు అంకుకార్పణతో ఈ ఉత్సవాలు ప్రారంభమవుతాయన్నారు.సంప్రదాయం ప్రకారం జాతశౌచం, మృతశౌచం వంటి వేళల్లో ఆలయ ప్రవేశం నిషిద్ధమని, అయినా యాత్రికుల వల్ల, సిబ్బంది వల్ల తెలియక దోషాలు జరుగుతుంటాయని, ఇలాంటి వాటివల్ల ఆలయ పవిత్రతకు ఎలాంటి లోపం రానీయకుండా నివారించేందుకు ప్రతి ఏడాది మూడు రోజులపాటు పవిత్రోత్సవాలు నిర్వహించడం ఆనవాయితీ అని తెలిపారు. ఇందులో భాగంగా ఆగస్టు 24న ఉదయం చతుష్టానార్చన, పవిత్ర ప్రతిష్ట, సాయంత్రం పవిత్రహోమం, నివేదన, శాత్తుమొర జరగుతాయన్నారు. 25న ఉదయం పవిత్ర సమర్పణ, సాయంత్రం యాగశాలలో వైదిక కార్యక్రమాలు నిర్వహిస్తారన్నారు. 26న ఉదయం మహాపూర్ణాహుతి, పవిత్ర విసర్జన, కుంభప్రోక్ష, సాయంత్రం శ్రీ సీతా లక్ష్మణ సమేత శ్రీ కోదండరామస్వామి ఉత్సవర్ల ఊరేగింపు జరుగుతుందని టీటీడీ అధికారులు తెలిపారు. -
అన్ని మండలాల్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్లు
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలైన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్స్ 90 రోజుల్లోనే జిల్లా లోని అన్ని మండలాల్లో అమలులోకి రానున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లో యూనిక్గా ఏర్పాటు కానున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల ప్రణాళిక, డిజైన్ల గురించి కలెక్టర్ జేసీ అదితిసింగ్తో కలిసి సంబంధిత అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా విజయ్ ఆర్కిటెక్చర్ ఇంజనీరింగ్ వారు రూపొందించిన సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవనాల నిర్మాణాల డిజైన్లను పవర్ పాయింట్ ద్వారా కలెక్టర్ పరిశీలించారు. నూతనంగా రూపుదిద్దుకోనున్న స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణాలు అన్ని మండలాల్లో ఒకే డిజైన్ తో ఉండాలని సంబంధిత ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. ఇప్పటికే కడప నగరంలో నిర్వహణలో ఉన్న స్మార్ట్ కిచెన్ రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని, అదే స్ఫూర్తితో జిల్లాలోని అన్ని మండలాల్లో స్మార్ట్ కిచెన్ షెడ్లను ఏర్పాటు చేసేందుకు ప్రణాళికను రూపొందించాలన్నారు. ఈ షెడ్ల నిర్మాణాన్ని వెంటనే ప్రారంభించి 60 రోజుల్లో సివిల్ వర్క్ పూర్తి చేసి, మరో 15 రోజుల్లో అన్ని రకాల పరికరాలను ఏర్పాటు చేసి ట్రయిల్ రన్ నిర్వహించాలన్నారు. సీపీఓ హజరతయ్య, డీఈఓ షంషుద్దీన్, డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, హౌసింగ్ పీడీ రాజా రత్నం, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్, ఎస్ఎస్ఏ, సంబంధిత శాఖల అధికారులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి 60 రోజుల్లో నిర్మాణాలు పూర్తి -
బీజేపీకి సింగారెడ్డి రాజీనామా
కడప కోటిరెడ్డిసర్కిల్ : కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ సింగారెడ్డి శ్రీరామచంద్రారెడ్డి బీజేపీకి రాజీనామా చేశారు. బుధవారం కడపలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలోని బీజేపీ నాయకుల తీరును నిరసిస్తూ తాను బీజేపీ ప్రాథమిక , క్రియాశీలక సభ్యత్వాలతోపాటు కేంద్ర ప్రభుత్వ పథకాల ప్రచార కమిటీ కన్వీనర్ పదవికి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు. ఈ మేరకు రాజీనామా పత్రాన్ని పార్టీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా, రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్కు ఫ్యాక్స్, వాట్సాప్ ద్వారా పంపానని వివరించారు. తాను 12 ఏళ్లుగా బీజేపీలో, అంతకుముందు 12 ఏళ్లు రైతు ఉద్యమాలను చేపట్టానని తెలిపారు. తన పదవీ కాలంలో పార్టీలో మానసిక క్షోభ అనుభవించానన్నారు. బీజేపీలో అంతర్గత ప్రజాస్వామ్యం లోపించిందని తెలిపారు. స్వార్థ రాజకీయాల కారణంగా సాధారణ నాయకులను పార్టీలో ఎదగనీయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. -
సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో కళా ఉత్సవ్–2025 పోటీలు
రాయచోటి: ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా స్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలను రాయచోటి డైట్ ప్రాంగణంలో సెప్టెంబర్ 11, 12వ తేదీల్లో నిర్వహించనున్నట్లు అన్నమయ్య జిల్లా విద్యాశాఖాధి కారి సుబ్రమణ్యం తెలిపారు. బుధవారం డైట్లో దీనికి సంబంధించిన పోస్టర్లను డీఈఓ ఆధ్వర్యంలో ఆవిష్కరించారు. గాత్ర, వాయిద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, సంప్రదాయ కథ చెప్పడం వంటి విభాగాలలో విద్యార్థుల ప్రతి భను వెలికితీయడం, కళా రూపాలను ప్రోత్స హించడమే ఈ పోటీల ప్రధాన ఉద్దేశమన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలల్లో చదువుతున్న 9,10, 11,12 తరగతుల విద్యార్థులు పోటీలకు అర్హులను వివరించారు. ఇతర వివరాలకు జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి, ఫోన్ నెంబరు. 9440246825లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు తిరుపతి శ్రీనివాస్, శివ భాస్కర్, వెంకట సుబ్బారెడ్డి, గిరిబాబు యాదవ్, కేదర్నాథ్, శివప్రసాద్, మోహన్ నాయక్ పాల్గొన్నారు.ఐటీఐలో ప్రవేశానికి 26 తుది గడువు కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో మూడవ దఫా అడ్మిషన్స్కు ఈ నెల 26తో గడువు ముగుస్తుందని డీఎల్టీసీ అసిస్టెంట్ డైరెక్టర్ రత్నరాజు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐటీఐలో ఎలక్ట్రిషియన్, ఫిట్టర్, మిషనిస్టు, మోటార్ మెకానిక్, టర్నర్, డీజిల్ మెకానిక్, వెల్డర్తోపాటు కార్పెంటర్ ట్రేడ్లలో సీట్లు ఉన్నాయని వివరించారు. ఆసక్తి కలిగిన విద్యార్థులు తమ సర్టిఫికెట్స్, ఒక ఫొటో తదితర వివరాలతో ఐటీఐ సర్కిల్లోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐ కార్యాలయంలో సంప్రదించాలని ఏడి రత్నరాజు తెలిపారు. వివరాలకు 85559 58200, 99482 78611 నెంబర్లలో సంప్రదించాలని సూచించారు.కడప అర్బన్: కడప నగరంలోని జిల్లా మైనార్టీ సెల్ విభాగం కార్యాలయంలో గతంలో జిల్లా అధికారిగా పనిచేసిన షేక్ ఇమ్రాన్, జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన మస్తాన్వల్లీతో కలిసి రూ. 2కోట్ల 48 లక్షల మేరకు నిధులను స్వాహా చేసినట్లు ప్రస్తుతం జిల్లా అధికారిగా పనిచేస్తున్న షేక్ హిదాయతుల్లా ఒన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు పై ఇద్దరిపైనా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ఒన్టౌన్ సీఐ బి. రామకృష్ణ తెలియజేశారు.కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వైస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ఈ నెల 25న కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని విశ్వ విద్యాలయం వీసీ విశ్వనాథకుమార్ తెలిపారు. ఇందులో భాగంగా బీఎఫ్ఏ (ఫోర్ ఇయర్స్ డిగ్రీ) ఫైన్ ఆర్ట్స్ (యానిమేషన్, అప్లైడ్ ఆర్ట్, పెయింటింగ్, ఫొటోగ్రఫీ, శిల్పం, బి.డెస్ ఇంటీరియర్ డిజైన్) కోర్సులకు కౌన్సెలింగ్ ఉంటుదని వివరించారు. దరఖాస్తు చేసుకొన్న విద్యార్థులు తమ ఒరిజినల్ సర్టిఫికెట్స్తో 25వ తేదీ తప్పకుండా హాజరు కావాలని తెలిపారు. ఎవరైనా దర ఖాస్తు చేసుకోని వారు కూడా డైరెక్ట్ అడ్మిషన్స్ కోసం ఒరిజినల్ (అసలు ధృవపత్రాలు) సర్టిఫికెట్స్ తో హాజరుయి అదే రోజు అడ్మిషన్స్ పొందవచ్చుని తెలిపారు. సమాచారం కోసం www.ysrafu.ac.inను సందర్శించాలని వీసీ విశ్వనాథ్కుమార్ తెలిపారు.కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డి ఫార్మసీ రెండేళ్ల కోర్సులో ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 23 వరకు గడువు పొడగించినట్లు ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వారికి వందశాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయని పేర్కొన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు తప్పక పదో తరగతి, ఇంటర్ మార్కుల జాబితాలు, అభ్యర్థి ఫొటో, సంతకం, ెపేరెంట్స్ సంతకం, స్టడీ సర్టిఫికెట్, ఎస్సీ, ఎస్టీ, బీసీ సర్టిఫికెట్స్ ఆన్లైన్లో ఆప్లోడ్ చేసి రూ, 400 ఆన్లైన్ ఫీజు చెల్లించి దరఖాస్తు చేసు కోవాలని తెలిపారు. వివరాల కోసం 94401 44057, 98853 55377 నెంబర్లను సంప్రదించాలని ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. -
పనుల్లో నాణ్యత లోపిస్తే చర్యలు
కడప కోటిరెడ్డిసర్కిల్: అమృత్ భారత్ స్టేషన్ పథకంలో భాగంగా కడప రైల్వేస్టేషన్లో రూ. 25 కోట్లతో జరుగుతున్న అభివృద్ధి పనులను సకాలంలో పూర్తి చేయాలని దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సంజయ్కుమార్ శ్రీవాత్సవ అధికారులను ఆదేశించారు. బుధవారం రేణిగుంట నుంచి గుంతకల్లుకు వెళుతూ మార్గంమధ్యలో కడపలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పనుల్లో నాణ్యత లోపిస్తే కఠిన చర్య లు ఉంటాయని హెచ్చరించారు. అనంతరం ఆయ న పనుల తీరును పరిశీలించారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తా, సీనియర్ డీసీఎం మనోజ్, సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్, సీనియర్ డీఎస్టీఈ చంద్రశేఖర్, సీనియర్ డీఈఎన్ శ్రీనివాసులు, సీసీఐ జనార్దన్, స్టేషన్ మేనేజర్ శేఖర్ కుమార్, ఆర్పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. దక్షిణ మధ్య రైల్వే జీఎం సంజయ్కుమార్ శ్రీవాత్సవ -
ఈ క్రాప్ నమోదు షురూ
కడప అగ్రికల్చర్: ఖరీఫ్లో సాగు చేసే పంటల వివరాలను గుర్తించేందుకు చేపట్టిన ‘ఈ క్రాప్’ నమోదుకు ప్రభుత్వం ఎట్టకేలకు శ్రీకారం చుట్టింది. ఈ మేరకు జిల్లా వ్యవసాయశాఖ అధికారులు చర్యలు చేపట్టారు. ప్రభుత్వం రైతులకు అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు సక్రమంగా అందుకోవాలంటే ప్రతి రైతు ఖచ్చితంగా ఈ – పంట నమోదు చేసుకుని ఉండాల్సిందే. లేకుంటే వ్యవ సాయ పంటలకు సంబంధించిన ప్రభుత్వ పథ కాలు వర్తించవు. ఈ పక్రియ ప్రస్తుతం జిల్లాలో ముమ్మరంగా జరుగుతుంది. వ్యవసాయ, రెవెన్యూ శాఖల సమన్వయంతో... జిల్లాలో వ్యవసాయ, రెవెన్యూశాఖల సమన్వయంతో ఈ క్రాపు నమోదుకు శ్రీకారం చుట్టారు. ఆరుగాలం కష్టపడి పండించిన పంటలను రైతు లు అతివృష్టి, అనావృష్టితో ఎప్పకప్పుడు నష్ణపోతున్నారు. ప్రకృతి వైపరీత్యాల సమయంలో వారు పరిహారం పొందేందుకు అధికారులు చుట్టూ తిరిగేవారు. ఈ క్రాపు నమోదుతో నష్టపోయిన ప్రతి రైతుకు పరిహారం అందించేలా గత ప్రభుత్వం చర్యలు తీసుకుంది. ముఖ్యంగా పారదర్శకత కోసం గత వైస్సార్ ప్రభుత్వం జియో ఫిన్సింగ్ విధానం అమల్లోకి తెచ్చింది. దీంతో ఖచ్చితంగా రైతు పొలం వద్దకే వెల్లి వివరాలను నమోదు చేస్తేనే యాప్లో నమోదు అవుతుంది. దీనివల్ల ప్రభుత్వానికి ఖచ్చితమైన సమాచారం చేరుతుంది. ఈ– పంట ద్వారా రైతులకు ప్రభుత్వ పథకాలు నేరుగా అందనున్నాయి. వర్షాభావంతో తగ్గిన ఆరుతడి పంటలు... జిల్లాలో ఆరుతడి పంటలైన మొక్కజొన్న , మిను ము పంటలు అక్కడక్కడ తెడతెరిపిలేని వర్షాల కారణంగా దెబ్బతిన్నాయి. ఈ పంటలకు ఈ పంట నమోదు చేస్తేనే నష్టపరిహారం అందే అవ కాశం ఉంది. రైతులందరూ తప్పకుండా తాము సాగుచేసిన ప్రతి పంటకు ఈ పంట నమోదు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో ఈ క్రాపు నమోదు పరిస్థితి ఇలా... జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సీజన్కు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన పంటల సాధారణ సాగు 309253.88 ఎకరాలుకాగా ఇప్పటి వరకు 58878.08 ఎకరాల్లో వివిధ పంటలు సాగయ్యాయి. ఇందులో 19వ తేదీ వరకు 30833.22 ఎకరాల్లో ఈ పంటనమోదు పూర్తరుంది. ఈ క్రాపు నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రతి రైతు ఈ క్రాపు చేయించుకోవాలి ఖరీప్ సీజన్లో పంటలు సాగు చేసిన ప్రతి రైతు ఖచ్చితంగా ఈ పంట నమోదు చేయించుకోవాలి. ఈ పంట నమోదులో ఎలాంటి తప్పులు లేకుండా యంత్రాంగం ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తుంది. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి జిల్లావ్యాప్తంగా ప్రారంభమైన ఈ పంట నమోదు సెప్టెంబర్ 15 వరకు నమోదుకు గడువు -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
అట్లూరు : బద్వేలు నియోజకవర్గంలో ప్రభుత్వ భూమి ఎక్కడ కనిపిస్తే అక్కడ కూటమి నాయకులు, కార్యకర్తలు వాలిపోతున్నారు. మండల పరిధిలోని ఎస్.వెంకటాపురం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. అయితే టీడీపీకి చెందిన ఓ కార్యకర్త గత రెండు రోజులుగా యంత్రాలతో చదును చేస్తున్నాడు. రెవెన్యూ అధికారులకు తెలిసినా చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. గతంలో ఈ భూమిలో ఇది ప్రభుత్వ భూమి, ఎవరైనా ఆక్రమిస్తే చర్యలు తప్పవని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసినప్పటికీ అధికారం మాదే కదా హెచ్చరిక బోర్డులు ఏమవుతాయని అతిక్రమించి చదును చేయడం మండల ప్రజలను విస్మయానికి గురిచేసింది. గతంలో ఈ భూమి ప్రజా ప్రయోజనాల అవసరాల కోసమని కేటాయించామని, అయితే వైఎస్సార్సీపీ నుంచి టీడీపీలోకి వచ్చిన వ్యక్తి ఈ విలువైన భూమిని ఆక్రమించడం ఏమిటని స్థానిక టీడీపీ నాయకులే ఆరోపిస్తున్నారు. తహసీల్దార్కు ఫిర్యాదు.. టీడీపీ కార్యకర్త సర్వే నంబర్ 60, 61 లలో సుమారు పది ఎకరాల ప్రభుత్వ భూమిని కబ్జా చేస్తున్నారని బుధవారం స్థానిక తహసీల్దారుకు ఎస్.వెంకటాపురం కాలనీకి చెందిన యేసన్న, ఈశ్వరయ్య ఆధ్వర్యంలో కాలనీ వాసులు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ప్రభుత్వ భూమిని కాపాడి కాలనీ వాసుల ప్రయోజనాలకు ఉంచాలని కోరారు. తహసీల్దార్ వివరణ.. ఈ విషయమై తహసీల్దార్ సుబ్బలక్షుమ్మను వివరణ కోరగా విషయం తెలిసిన వెంటనే అక్కడికి సిబ్బందిని పంపించి పనులు నిలుపుదల చేయించామన్నారు. సంబంధిత వ్యక్తి తనకు ఆ భూమిపై హక్కు పత్రాలు ఉన్నాయని వివరణ ఇచ్చారని, సంబంధిత పత్రాలను పరిశీలించిన తర్వాత ఆర్డీఓకు నివేదిక పంపుతామన్నారు. ఉన్నతాధికారుల ఆదేశాలు వచ్చేంత వరకు ఆ భూమిలో ఎలాంటి ఆక్రమణలు జరగకుండా చర్యలు చేపడతామని తెలిపారు. -
ఘనంగా రవీంద్రనాథ్రెడ్డి జన్మదిన వేడుకలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి జన్మదిన వేడుకలు కడప నగరంలో ఘనంగా జరిగాయి. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలు ఆయనకు పుష్ఫగుచ్ఛాలు అందజేసి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి ఆధ్వర్యంలో భారీ కేక్ తెచ్చి, గజమాల వేసి పుట్టిన రోజు శుభాకాంక్షలు తెలిపారు. యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర ఆధ్వర్యంలో భారీ కేక్ తెచ్చి ఆయనతో కట్ చేయించి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్ అసోసియేషన్ తరపున వి. నాగేంద్రారెడ్డి, రమేష్ రెడ్డి ఆధ్వర్యంలో జ్ఞాపిక అందజేశారు. ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఆర్. వెంకట సుబ్బారెడ్డి, మైనార్టీ నాయకుడు దస్తగిరి, పార్టీ నాయకులు ఎస్. వెంకటేశ్వర్లు, దాసరి శివప్రసాద్, టీపీ వెంకట సుబ్బమ్మ, రామ్మోహన్రెడ్డి, సీహెచ్ వినోద్, మేసా ప్రసాద్, షఫీవుల్లా, షేక్ షఫీ, ఆర్. చెన్నయ్య, బండి ప్రసాద్, శ్రీరంజన్రెడ్డి, బాలస్వామిరెడ్డి, వేణుగోపాల్ నాయక్, బీహెచ్ ఇలియాస్, త్యాగరాజు, పత్తి రాజేశ్వరి తదితరులు శుభాకాంక్షలు తెలిపారు. -
దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై నిరాహార దీక్ష చేపడతా
ప్రొద్దుటూరు : రాష్ట్ర వ్యాప్తంగా దివ్యాంగుల పింఛన్ల తొలగింపుపై తాను నిరాహార దీక్ష చేపడతానని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వానికి దివ్యాంగుల ఉసురు తప్పక తగులుతుందన్నారు. ఆయన పింఛన్లను తొలగించిన దివ్యాంగులతో కలసి బుధవారం సాయంత్రం తన స్వగృహంలో విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర వ్యాప్తంగా 66.39 లక్షల పింఛన్లు ఉండగా, ఇప్పుడు 62.19 లక్షల పింఛన్లు మాత్రమే ఉన్నాయని, 4.19 లక్షల పింఛన్లను ప్రభుత్వం తొలగించిందన్నారు. గత 14 నెలల్లో ప్రభుత్వం ఒక్కరికీ కొత్త పింఛన్ మంజూరు చేయలేదని పేర్కొన్నారు. అలాగే గత ఎన్నికల సందర్భంగా చంద్రబాబు 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు కొత్త పింఛన్లను ఇస్తామని ఇచ్చిన హామీ ఇప్పటికీ అమలు చేయకపోవడాన్ని బట్టి పేదలపై ఆయనకు ఏ మాత్రం ప్రేమ ఉందో అర్థమవుతోందన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గానికి సంబంధించి 581 మందికి పింఛన్లను తొలగిస్తూ అధికారులు నోటీసులు ఇచ్చారన్నారు. రాష్ట్రంలో ప్రభుత్వం వైఎస్సార్సీపీ కార్యకర్తలు, నాయకులను టార్గెట్ చేసి ఇబ్బందులు పెడుతుందని అనుకున్నామే కానీ ఓటేసిన సాధారణ పేదలను కూడా ఇబ్బంది పెడుతోందన్నారు. ఆర్భాటంగా ప్రకటించిన ప్రభుత్వం జగన్ మోహన్రెడ్డి ప్రభుత్వంలో మంచం మీద నుంచి లేవలేని వారికి రూ.10వేలు, పెరాలసిస్ వ్యాధి గ్రస్తులకు రూ.5వేలు పింఛన్ ఇస్తుండగా, చంద్రబాబు మంచం మీద ఉన్న వారికి రూ.15వేలు, పెరాలసిస్ వ్యాఽధి గ్రస్తులకు రూ.10వేలు చొప్పున పెంచుతున్నట్లు ఆర్భాటంగా ప్రకటించారని రాచమల్లు తెలిపారు. ఇప్పడు ఈ విధంగా వికలత్వం శాతం తక్కువగా ఉందని అసలుకే ఎసరు పెట్టారన్నారు. 1998 నుంచి వరుసగా నేదురుమల్లి జనార్దన్రెడ్డి, వైఎస్ రాజశేఖరెడ్డి, చంద్రబాబు నాయుడు హయాంలో పింఛన్లు తీసుకుంటున్న దివ్యాంగులను ఇప్పుడు పింఛన్కు అర్హులు కాదని తొలగించడం దారుణమన్నారు. తొలగించిన పింఛన్ల ద్వారా ఏడాదికి రూ.3,600 కోట్లు ప్రభుత్వానికి మిగులుతుందన్నారు. దివ్యాంగుల నోటి కాడ అన్నం తీసిన ఈ ప్రభుత్వం పుట్టగతులు లేకుండా పోతుందని, వారి శాపనార్థాలే ప్రభుత్వాన్ని నాశనం చేస్తాయన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, చింపిరి అనిల్కుమార్, సత్యం పాల్గొన్నారు. -
బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరమే
ఖాజీపేట : ప్రభుత్వం చేపట్టబోతున్న బనకచర్ల ప్రాజెక్టు మరో కాళేశ్వరంగా మారుతుందని మాజీ మంత్రి డాక్టర్ డీఎల్ రవీంద్రారెడ్డి విమర్శించారు. ఖాజీపేటలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బనకచర్ల ప్రాజెక్టుకు సుమారు రూ.80వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. చిన్న చిన్న ప్రాజెక్టులు చాలా ఉన్నాయని వాటిని పూర్తి చేయాలన్నారు. రాజోలు జలాశయం నిర్మాణానికి రూ.1,300 కోట్లు నిధులు అవసరమని చెప్పారని, దానికే నిధులు లేనప్పుడు బనకచర్ల ప్రాజెక్టుకు ఎక్కడ నుంచి వస్తాయని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లా రాజంపేట వద్ద ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు మరమ్మతుల కోసం, అలాగే నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టులకు నిధులు కేటాయించి పూర్తి చేయాలని సూచించారు. ప్రజల కనీస అవసరాలను ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. వాట్సాప్ పాలన, క్వాంటామ్ వ్యాలీ, పీ–4, ఏఐ... ఇలా హైటెక్ ఆలోచనలు మంచివే అయినా, అమలు తీరు ఎలానో చూడాలన్నారు. ప్రభుత్వం వచ్చి రెండేళ్లవుతున్నా ఒక్క కొత్త పింఛను ఇవ్వలేదని, ఒక్క ఇల్లు కూడా కట్టలేదని విమర్శించారు. మైదుకూరు నియోజక వర్గంలో రోడ్లు దారుణంగా ఉన్నాయన్నారు. ప్రభుత్వాస్పత్రిలో మందులు సక్రమంగా లేక ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. క్షేత్ర స్థాయిలో మంత్రులు పల్లెల్లో తిరిగితే వాస్తవాలు తెలుస్తాయన్నారు. సంక్షేమ పథకాలతోపాటు ప్రజల కనీస అవసరాలను గుర్తించి పనులు చేయకపోతే కూటమి పాలన కూడా తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. మాజీ మంత్రి డీఎల్ రవీంద్రారెడ్డి -
ఫిలాటెలి స్కాలర్షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప పోస్టల్ డివిజన్ పరిధిలో 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దీన్దయాళ్ స్పర్శ యోజన ఫిలాటెలి స్కాలర్ షిప్ పథకాన్ని సద్వినియోగం చేసుకోవాలని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ రాజేష్ తెలిపారు. బుధవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 2025 –26 విద్యా సంవత్సరానికి ఈ స్కాలర్షిప్ పథకాన్ని ప్రకటించారన్నారు. మంచి విద్యా రికార్డు, ఫిలాటెలి అభిరుచి కలిగిన విద్యార్థులకు ఫిలాటెలి క్విజ్, ప్రాజెక్ట్ ఆధారంగా స్కాలర్షిప్ ఇస్తారన్నారు. నెలకు రూ. 500 చొప్పున ఏడాదికి రూ. 6 వేలు ఇస్తారన్నారు. ప్రభుత్వ లేదా గుర్తింపు పొందిన ప్రైవేట్ పాఠశాలలో 6, 9 తరగతుల మధ్య చదువుతూ ఉండాలన్నారు. పాఠశాలలో ఫిలాటెలీ క్లబ్ సభ్యుడిగా ఉండటం లేదా వ్యక్తిగత ఫిలాటెలి డిపాజిట్ ఖాతా కలిగి ఉండాలన్నారు. ఈ ఫిలాటెలి రాత పరీక్ష సెప్టెంబర్ 30న ఉంటుందన్నారు. అర్హులైన విద్యార్థులు సెప్టెంబర్ 16 లోపల దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. పూర్తి వివరాలకు పోస్టాఫీసులో సంప్రదించవచ్చన్నారు. -
శభాష్.. వివేక్
– కుందూలో కొట్టుకుపోతున్న వృద్ధురాలిని కాపాడిన యవకుడు రాజుపాళెం : పాపం.. ఆ అవ్వకు ఎంత కష్టమొచ్చిందో.. ఎవరికీ చెప్పుకునే మార్గం లేదో.. ఏమో.. జీవితంపై విరక్తి చెంది కుందూ నదిలో దూకింది. అదే సమయంలో ఆ మార్గంలో వెళ్తున్న ఓ యువకుడు గమనించి సాహసం చేసి నీళ్లలోకి దూకి ఆమెను రక్షించాడు. వివరాలు ఇలా.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలం మల్లెవేముల గ్రామానికి చెందిన గుర్రమ్మ (68) రాజుపాళెం మండలం వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో దూకేందుకు అటువైపు వెళ్లింది. అయితే ఆ సమయంలో కుమ్మరపల్లె గ్రామానికి చెందిన భజంత్రి వివేకానంద ద్విచక్ర వాహనంలో ఆ దారిలో వెళుతున్నాడు. వృద్ధురాలు నీళ్ల వైపు వెళ్తుండటం గమనించి తన వాహనాన్ని ఆపి ఆమెను అనుసరించాడు. అంతలోనే ఆమె కుందూ నది పాత వంతెన మెట్ల వద్ద నీళ్లలో కొట్టుకుపోతూ కనిపించింది. వెంటనే ఏమాత్రం ఆలోచించకుండా భారీగా ప్రవహిస్తున్న నీళ్లలోకి దూకి వృద్ధురాలిని బయటకు తీశాడు. ఎందుకు నదిలో దూకాల్సి వచ్చిందని వివేక్ ఆమెను అడుగగా సమాధానం చెప్పలేక పోయింది. ఈ విషయాన్ని ఎస్ఐ వెంకటరమణకు, సచివాలయ ఉద్యోగులకు వివేక్ తెలపడంతో వెంటనే వారంతా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. గుర్రమ్మ వివరాలను ఎస్ఐ అడిగి తెలుసుకొని కుమారులను, బంధువులను పిలిపించారు. చికిత్స నిమిత్తం చాగలమర్రిలోని ఆసుపత్రికి తరలించారు. ఆమె కోలుకోవడంతో కుమారుడు ఇంటికి తీసుకెళ్లినట్లు తెలిసింది. కాగా, వృద్ధురాలిని కాపాడిన వివేక్ను ఎస్ఐతో పాటు ఇన్చార్జి తహసీల్దార్ మనోహర్రెడ్డి, మహిళా పోలీసు షాహిదా, సచివాలయ ఉద్యోగులు, గుర్రమ్మ బంధువులు ప్రశంసించారు. -
ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో తీవ్ర జాప్యం
కడప కార్పొరేషన్ : చింతకొమ్మదిన్నె మండలం, మామిళ్లపల్లె పంచాయతీ, ఇందిరానగర్లో నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసులో విచారణ తీవ్ర ఆలస్యమవుతోందని ఇందిరానగర్కు చెందిన పల్లం చంద్రయ్య, ఆయన భార్య రామలక్ష్మ్ము ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం వారు ఎస్సీ, ఎస్టీ సెల్ డీఎస్పీకి వినతి పత్రం సమర్పించారు. ఇందిరానగర్లో కిరాణాషాపు నడుపుతూ తాము జీవిస్తున్నామని, వివిధ వస్తువులు కొనేందుకు షాపు వద్దకు జనం వస్తుంటారన్నారు. దీన్ని జీర్ణించుకోలేని అగ్రవర్ణాల వారు అక్కడి నుంచి తమ షాపు తీయించాలని కులం పేరుతో దూషించి, దౌర్జన్యం చేస్తున్నారన్నారు. దీనిపై తాను ఎస్సీ, ఎస్టీ కమిషన్కు ఫిర్యాదు చేశానని, ఈ మేరకు సీకే దిన్నె పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి ఉన్నారన్నారు. మూడు నెలలు అవుతున్నా ఈ కేసుపై విచారణ జరక్కపోవడంతో అగ్రవర్ణాల వారు మరింత రెచ్చిపోతూ తమ కుటుంబాన్ని నానా రకాలుగా ఇబ్బంది పెడుతున్నారని, సాక్షులను కూడా బెదిరిస్తున్నారన్నారు. విచారణ త్వరగా పూర్తి చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో బాధితుల వెంట మహాజన రాజ్యం పార్టీ అధ్యక్షుడు సంగటి మనోహర్, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
ఆ ఒక్కరు సెలవు పెడితే!
కడప ఎడ్యుకేషన్: విద్యార్థి దశలో ప్రాథమిక విద్య ఎంతో కీలకం. ఇక్కడ బలమైన పునాది పడితేనే జీవితంలో నిలదొక్కుకోగలుగుతారు. అలాంటి ప్రాథమి క విద్యపై కూటమి సర్కార్ నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. ప్రభు త్వ విద్యను నీరుగార్చి ప్రైవేటు విద్యారంగానికి ప్రయోజనం కలిగే లా చర్యలు తీసుకుంటోందన్న విమర్శ ఉంది. ఇప్పటికే పిల్లలు లేక జిల్లావ్యాప్తంగా 27 పాఠశాలలు మూతపడగా.. ప్రస్తుతం జిల్లాలోని 701 పాఠశాలల్లో ఏకోపాధ్యాయులు సేవలందిస్తుండడం ఆందోళనకరంగా మారింది. ఈ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులు సెలవు పెడితే విద్యార్థుల చదువులు అటకెక్కే పరిస్థితి నెలకొందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రాథమిక పాఠశాల వివరాలు ఇలా... జిల్లావ్యాప్తంగా 1659 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. అందులో 48,461 మంది విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అందులో 701 స్కూళ్లు ఏకోపాధ్యాయ పాఠశాలలు నడుస్తున్నాయి. ఈ స్కూళ్ల నిర్వహణతోపాటు విద్యార్థులకు ఇంగ్లిష్, తెలుగు, లెక్కలు ఇలా అన్ని సబ్జెక్టులను ఒక్కరే బోధించాల్సి వస్తోంది.ఈ పరిస్థితి చూస్తే ప్రభుత్వ బడుల్లో చదువెలా సాగుతుందో ఇట్టే అర్థం చేసుకోవచ్చని ఉపాధ్యాయ సంఘాల నాయకులు, మేధావులు చెబుతున్నారు. మండలాల వారీగా ఏకోపాధ్యాయ పాఠశాలలు జిల్లావ్యాప్తంగా 701 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. ఇందులో మండలాల వారీగా అట్లూరులో 19, బి.కోడూరులో 17, బి.మఠంలో 19, బద్వేల్లో 31, సీకేదిన్నెలో 14, చక్రాయపేటలో 32, చాపాడులో 28, చెన్నూరులో 16, కడపలో 15, దువ్వూరులో 19, గోపవరంలో 20, జమ్మలమడుగులో 14, కలసపాడులో 16, కమలాపురంలో 28, ఖాజీపేటలో 32, కొండాపురంలో 18, లింగాలలో 10, ముద్దనూరులో 18, మైదు కూరులో 35, మైలవరంలో 27, పెద్దముడియంలో 13, పెండ్లిమర్రిలో 28, పోరుమామిళ్లలో 22, ప్రొద్దుటూరులో 22, పులివెందుల్లో 9, రాజుపాలెంలో 15, కాశినాయనలో 10, సిద్దవటంలో 18, సింహాద్రిపురంలో 20, తొండూరులో 17, వీఎన్పల్లిలో 19, వల్లూరులో 24, వేంపల్లిలో 11, వేములలో 13, ఒంటిమిట్టలో 9, ఎర్రగుంట్లలో 21 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయి. పిల్లల చదువేం కావాలి.. జిల్లాలో ఏకోపాధ్యాయ పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు ఏదైనా అత్యవసర పనుల మీద సెలవు పెడితే.. విద్యార్థుల చదువు పరిస్థితేందటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. ఇదివరకు సమీపంలోని స్కూల్ నుంచి డిప్యూటేషన్పై మరో ఉపాధ్యాయుడిని నియమించేవారు. ఇప్పుడా పరిస్థితి కూడా లేనట్లు తెలిసింది. దీంతో అయ్యవారు సెలవు పెడితే విద్యార్థులకు కూడా అప్రకటిత సెలవు ఇచ్చేస్తున్నట్లు సమాచారం. లేదంలే ఎమ్మార్సీ పరిధిలో పనిచేసే సీఆర్పీలు అక్కడికి వెళ్లి పాఠశాలలను నిర్వహించాల్సి ఉంటుంది. ఇలా జరగడం వల్ల విద్యార్థులకు ప్రాథమిక విద్య బోధన కుంటుపడక తప్పదని ఆరోపణలు ఉన్నాయి. పాఠశాలకు రెగ్యులర్ టీచర్ సెలవు పెట్టినప్పుడు వేరొక టీచర్ బోధించడం తరువాత మరోక టీచర్ బోధించడం వంటి సమస్యలతో పిల్లలకు కొంతమేర ఇబ్బందికర వాతావరణం చోటు చేసుకుంటుందని తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం 20 మందికి ఒక ఉపాధ్యాయులు ఉండాలి. 20 మంది విద్యార్థులు దాటితే ఒక హెచ్ఓంతోపాటు ఇద్దరు ఉపాధ్యాయులు ఉండాల్సి ఉంటుంది. కానీ ఒకే ఉపాధ్యాయుడు ఉండటం వల్ల బోధనలు కష్టతరంగా మారనుంది, అటు బోధన, ఇటు పర్యవేక్షణ చేయడం ఇబ్బందికరంగా మారుతోందని ఏకోపాధ్యాయులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. అధికారులు స్పందించి ఏకోపాధ్యాయ పాఠశాలల పట్ల స్పందించా లని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. 1 నుంచి 5వ తరగతుల వరకు ఒక్కరే బోధన కూటమి అడ్డగోలు నిర్ణయాలతో అగమ్యగోచరంగా చదువులు జిల్లావ్యాప్తంగా 701 ఏకోపాధ్యాయ పాఠశాలలు ప్రాథమిక పాఠశాలలో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులు చదువుకుంటున్నారు. వీరికి చదువు చెప్పడం ఎంత కష్టమో వారిని పర్యవేక్షించడం అంతకన్నా కష్టమని ఉపాద్యాయు లు చెబుతున్నారు. ఇద్దరు ముగ్గురు ఉపాధ్యాయులు ఉన్న స్కూళ్లో ఈ సమస్యను ఎదుర్కొవడం పెద్ద కష్టమేమి కాదు. కానీ ఏకోపాధ్యా య స్కూళ్లలో పర్యవేక్షణ చేయలేక ఉపాధ్యాయులు చేతులెత్తేస్తున్నట్లు సమాచారం. -
మాజీ సైనికుల కోసం న్యాయ సేవల క్లినిక్ ప్రారంభం
కడప అర్బన్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ ఆధ్వర్యంలో కడప నగరంలోని జిల్లా సైనిక బోర్డులో బుధవారం మాజీ సైనికుల కోసం న్యాయ సేవల క్లినిక్ను ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని మాట్లాడుతూ న్యాయ సంబంధ సమస్యల పరిష్కారం కోసం ఈ క్లినిక్ను సందర్శించవచ్చన్నారు. ఒక ప్యానల్ న్యాయవాది, ఒక పారా లీగల్ వలంటీర్ అందుబాటులో ఉంటారన్నారు. వీరు ప్రతి సోమ, శుక్రవారాల్లో మాజీ సైనికుల సమస్యలను తెలుసుకుని వారికి తగు సలహాలను ఇస్తారన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్, డిప్యూటీ చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్లు ఎమ్.శాంత, ఎన్.చంద్రకాంతమ్మ, ఎం.వినయ్ కుమార్, అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ పి.మనోహర్, ఎం సౌజన్య, ఎన్. నీలకంఠేశ్వర రెడ్డి, షేక్ అక్బర్ అలీ, ఏఎస్.రవితేజ, కడప మాజీ సైనికుల సంక్షేమ బోర్డు వైస్ ప్రెసిడెంట్ ఆర్.సుధాకర్ రెడ్డి, పారా లీగల్ వలంటీర్ బీవీ గోపాల్ రెడ్డి, మాజీ సైనికులు పాల్గొన్నారు. -
దెబ్బతిన్న గ్యాస్ పైపులైన్లు
– శరవేగంగా పునరుద్ధరించిన సంస్థ కడప కార్పొరేషన్ : కడప నగరంలో అనధికార తవ్వకాల వల్ల రెండు చోట్ల దెబ్బతిన్న గ్యాస్ పైపులైన్లను థింక్ గ్యాస్ సంస్థ శరవేగంగా మరమ్మతులు చేసి పునరుద్ధరించింది. మంగళవారం ఆ సంస్థ ఒక పత్రికా ప్రకటన విడుదల చేసింది. డ్రైనేజీ నిర్మాణ సమయంలో మారుతీనగర్లో నాగార్జున స్కూల్ సమీపంలో 20 మి.మీ తక్కువ పీడన పైపులైన్ దెబ్బతిందని, అలాగే వైఎస్సార్ కాలనీ గంగమ్మ ఆలయం సమీపంలో రోడ్డు తవ్వకం వల్ల 32 మి.మీ తక్కువ పీడన సహజ వాయువు పైపులైన్ దె దెబ్బతినిందన్నారు. ఈ రెండు ఘటనల వల్ల గ్యాస్ సరఫరాలో అంతరాయం ఏర్పడిందన్నారు. వెంటనే రంగంలోకి దిగిన థింక్ గ్యాస్(గతంలో ఏజీఅండ్పీ ప్రథమ్) అత్యవసర ప్రతిస్పందన బృందం ప్రభావిత ప్రాంతాలకు చేరుకొని మరమ్మతులు చేసి, గ్యాస్ సరఫరాను పునరుద్ధరించామన్నారు. తద్వారా ప్రజల భద్రతకు ఎలాంటి ముప్పు వాటిల్లకుండా చర్యలు తీసుకున్నామని చెప్పారు. అదే సమయంలో పైపులైన్ దెబ్బతినడానికి కారణమైన వారిపై తగు చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. గ్యాస్ లీకేజీలు, ప్రమాదాలను నివారించడానికి ఏ విధమైన రోడ్డు తవ్వకం పనులకు ముందు అయినా ‘డయల్ బిఫోర్ యు డిగ్’ – 1800 2022 999 కు కాల్ చేయాల్సిందిగా కోరారు. -
24న టీటీసీ ఽఽథియరీ పరీక్ష
కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని మున్సి పల్ హైస్కూల్లో ఈ నెల 24వ తేదీ టీటీసీ థియరీ పరీక్ష నిర్వహించనున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఆ రోజు ఉదయం 11 గంటల నుంచి మద్యాహ్నం 1 గంట వరకు, అదే రోజు 2 గంటల నుంచి 3 గంటల వరకు , అదే విధంగా సాయంత్రం 3.30 గంటల నుంచి 4.30 గంటల వరకు పరీక్షలు జరుగుతాయని వివరించారు. ఇలా వరుసగా మూడు సెషన్స్గా మూడు పరీక్షలు ఉంటాయని వెల్లడించారు. విద్యార్థులు తమ హాల్టికెట్లను www.bre.ap.gov.inలో డౌన్లోడ్ చేసుకోవాలని తెలిపారు. విద్యార్థులు వారి హాల్టికెట్తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదేని గుర్తింపుకార్డుతో ఒక గంట ముందుగా పరీక్షా కేంద్రానికి హాజరుకావాలని డీఈఓ సూచించారు. కడప ఎడ్యుకేషన్: కడప నగర శివార్లలోని డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ౖఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్లానింగ్, ఫైన్ ఆర్ట్స్ విభాగాలకు సంబంధించిన 2,4,6వ సెమిష్టర్ రెగ్యులర్ ఫలితాలను యూనివర్సిటీ ఉపకులపతి ఆచార్య జి. విశ్వనాథ్కుమార్ మంగళవారం విడుదల చేశారు. ఈ 2,4,6 సెమిస్టర్ పరీక్షలకు సంబంధించి 162 మంది విద్యార్థులకుగాను 134 మంది ఉత్తీర్ణత సాధించగా 28 మంది ఫెయిల్ అయ్యారని తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనివర్సిటి అదనపు పరీక్షల నియంత్రణాధికారి ఫణీంద్రరెడ్డి, సహాయ పరీక్షల నియంత్రణాధికారి ఉదయ్ప్రకాష్రెడ్డి,నారాపురెడ్డి తదితరులు పాల్గొన్నారు. నేడు యాఖూబియా బగ్దాదియా ఉరుసు కడప ఎడ్యుకేషన్: కడప నగరంలోని షాహీపేటలో బగ్దాదియా పీఠం ఆధ్వర్యంలో బుధవారం హజరత్ మౌలానా సయ్యద్ షా మహమ్మద్ యాఖూబ్ బగ్దాది సాహెబ్ 26వ ఉరుసు నిర్వహించనున్నట్లు పీఠాధిపతి హజరత్ మహ మ్మద్ అలీ బగ్దాదీ తెలిపారు. ఉరుసు సందర్భంగా సాయంత్రం అసర్ నమాజు తర్వాత ఖురాన్ పఠనం, జల్సా అజ్మత్ ఏ ఔలియా, రాత్రి ఫాతెహా తదితర కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు వెల్లడించారు. హజరత్ యాఖూబ్ బగ్దాది సాహెబ్ స్థాపించిన జామియా ఇస్లామియా మదరసాలో పిల్లలకు ఉచిత విద్య తది తర కార్యక్రమాలు కొనసాగుతున్నాయని వివరించారు. ప్రతి ఒక్కరూ పాల్గొని ఉరుసును విజయవంతం చేయాలని నిర్వాహకులు కోరారు. -
ఘన స్వాగతం
సాక్షి రాయచోటి: రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ప్రజల్లో అభిమానం ఉప్పొంగింది. ఆయన రాకతో అన్నమయ్య జిల్లాలో సందడి వాతావరణం నెలకొంది. రాజంపేట పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్లో పండుగ వాతావరణం కనిపించింది. ఎస్టేట్లోని ఆకేపాటి స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన వివాహ రిసెప్షన్ కార్యక్రమానికి పార్టీ నేతలతోపాటు కార్యకర్తలు, అభిమానులు, ఆకేపాటి కుటుంబీకులు, బంధవులతో ఆ ప్రాంతం కళకళలాడింది. మాజీ సీఎం హెలీప్యాడ్లో అడుగు పెట్టినప్పటి నుంచి.. తిరుగు ప్రయాణం అయ్యే వరకు చుట్టూ ఎక్కడ చూసినా జగనిన్నాదాలతో హోరెత్తింది. మరోపక్క యువత, పార్టీ శ్రేణులు సీఎం.. సీఎం..అంటూ నినదించారు. ఇసుకేస్తే రాలనంత జనంతో కిక్కిరిసిపోయింది.నూతన వధూవరులకు ఆశీర్వాదంఅన్నమయ్య జిల్లా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి సోదరుడు, నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి, సుజనల కుమారుడు ఆకేపాటి అనురాగ్రెడ్డి, వరదీక్షితరెడ్డిలను మంగళవారం రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీర్వదించారు. ఆకేపాటి ఎస్టేట్ లోని స్వగృహం వద్ద ఏర్పాటు చేసిన రిసెప్షన్ కార్యక్రమానికి హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించారు. ఈ సందర్భంగా ఆకేపాటి అమర్నాథరెడ్డి సతీమణి అమరజ్యోతమ్మ, అనిల్కుమార్రెడ్డి కుటుంబ సభ్యులను వైఎస్ జగన్కు పరిచయం చేశారు. అనంతరం వారితో కాసేపు ముచ్చటించారు.జనమే జనంరాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం ఉదయం 11.25 గంటల ప్రాంతంలో బాలిరెడ్డిపల్లె సమీపంలోని హెలీప్యాడ్లో దిగిన దగ్గరి నుంచి.. ఆకేపాటి ఎస్టేట్ వరకు ఎక్కడ చూసినా జనమే కనిపించారు. కడప–రేణిగుంట ప్రధాన రహదారిలోని ఆకేపాటి ఎస్టేట్కు వెళ్లే దారి అంతా కూడా వాహనాలతోనే కనిపించింది. హెలీప్యాడ్ చుట్టూ పార్టీ శ్రేణులు, కార్యకర్తలు జెండాలు చేతబూని జగన్.. జగన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. మరోపక్క సీఎం.. సీఎం.. అంటూ కూడా కేరింతలు కొట్టారు. హెలీప్యాడ్తోపాటు చుట్టూ మిద్దెల మీద నిలుచొని జగన్ను తిలకించారు. హెలీప్యాడ్ నుంచి ఆకేపాటి ఎస్టేట్ వరకు సుమారు కిలోమీటరుకు పైగా రోడ్డు వెంట ఎక్కడ చూసినా జనమే కనిపించారు. ఎస్టేట్లో అయితే జన నీరాజనం కనిపించింది. ఇసుకేస్తే రాలనంత జనంతో ఎటువైపు చూసినా పార్టీ శ్రేణులు, ఆకేపాటి బంధువులు, స్నేహితులతో ఆ ప్రాంతమంతా రద్దీగా మారింది. వైఎస్ జగన్పై పూలవర్షం కురిపిస్తుండగా.. ఆయన అలా ముందుకు కదిలారు. వైఎస్ జగన్ రాకతో సందడే సందడిఅడుగడుగునా జన నీరాజనంహెలీప్యాడ్ వద్ద కిక్కిరిసిన అభిమానులు‘ఆకేపాటి’ వారి రిసెప్షన్కుహాజరైన జననేతనూతన వధూవరులకు ఆశీర్వాదంహోరెత్తిన జగన్నినాదాలుమాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి హెలీప్యాడ్లో వైఎస్సార్ సీపీ నేతలు ఘన స్వాగతం పలికారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డితోపాటు ఇతర నాయకులు సాదర స్వాగతం పలికారు. కొంతమంది నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి అధి నేతకు ఆహ్వానం పలికారు. అనంతరం హెలీప్యాడ్ నుంచి నేరుగా రిసెప్షన్కు మాజీ సీఎం పయనమయ్యారు. అడుగుడుగునా వైఎస్ జగన్కు జనాలు బ్రహ్మరథం పడుతూ ఘన స్వాగతం పలికారు. కార్యక్రమానంతరం వైఎస్ జగన్ బెంగళూరుకు తిరుగు పయనమయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటన రాజంపేట పరిధిలో విజయవంతంగా ముగియడంతో పార్టీ శ్రేణుల్లో కొత్త ఉత్సాహం కనిపిస్తోంది. -
శాంతియుతంగా గణేష్ ఉత్సవాల నిర్వహణ
కడప సెవెన్రోడ్స్: శాంతియుత, ఆహ్లాదకర వాతావరణంలో వినాయక ఉత్సవాలను విజయవంతంగా నిర్వహించేందుకు శాంతి కమిటీ సభ్యులు సమన్వయ సహకారాలు అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. జిల్లాలో గణేష్ ఉత్సవాల నిర్వహణపై కలెక్టర్ అధ్యక్షతన మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్ లో శాంతి కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి కలెక్టర్తోపాటు ఎస్పీ అశోక్ కుమార్, జేసీ అదితి సింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మత సామరస్యానికి ప్రతీకగా మన జిల్లా ప్రసిద్ధి చెందిందన్నారు. అన్ని మతాల ప్రజల సహకారంతో అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేసి గణేష్ ఉత్సవాలలో ఎలాంటి పొరపాట్లకు ఆస్కారం లేకుండా ఉత్సవాలు విజయవంతం చేయాలన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ప్రతి ఒక్కరూ మట్టివిగ్రహాలనే పూజించాలన్నారు. ఇతరులకు ఇబ్బంది కలగకుండా ప్రభుత్వం నిర్దేశించిన మేరకు మాత్రమే సౌండ్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ఉత్సవ నిర్వాహకులను ఆదేశించారు. నిమజ్జనం జరిగే ప్రాంతంలో గజ ఈతగాళ్లను, సిద్ధంగా ఉంచాలని మత్స్యశాఖ అధికారులను ఆదేశించారు. నిమజ్జనానికి వెళ్లే దారిలో, సమీపంలో ఉన్న మద్యం దుకాణాలను మూసివేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. నిమజ్జనం మార్గంలో కరెంట్ తీగలు, కేబుల్ వైర్లు అడ్డు రాకుండా చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. గణేష్ ఉత్సవాలకు సంబంధించి.. ఎక్కడైనా ఏవైనా సమస్యలు ఎదురైతే వెంటనే అధికారులకు, పోలీసు సిబ్బందికి సమాచారమివ్వలన్నారు. అనవసరమైన విషయాలను అత్యుత్సాహంతో సోషల్ మీడియాలలో యువత పోస్ట్ చేయడం వంటి చర్యలను అరికట్టేలా శాంతి కమిటీ సభ్యులు చర్యలు తీసుకోవాలన్నారు. డివిజస్ స్థాయిలో కోఆర్డినేట్ మీటింగ్ నిర్వహించాలన్నారు. 108, మెడికల్ క్యాంపులను ఏర్పాటు వైద్యాధికారులు ఏర్పాటు చేయాలన్నారు. గ్రామ పంచాయతీలో వసతులు కల్పించాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు.మున్సిపల్ కమిషనర్ శానిటేషన్ పై పూర్తి దృష్టి సారించాలన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ వినాయక చవితి పండుగను ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా భక్తి భావంతో జరుపుకునేందుకు అంద రూ సమన్వయంతో ముందుకు సాగాలన్నారు. అన్ని వర్గాల ప్రజలకు, శాంతిభద్రతలకు, మతసామరస్యానికి ఇబ్బంది కలగకుండా వినాయక ఉత్సవాలు నిర్వహించాలన్నారు. ప్రాంతాల, వీధుల వారీగా ఏర్పాటు చేస్తున్న ఉత్సవాల నిర్వహణ కమిటీ సభ్యులు ముందస్తుగా సంబంధిత అధికారుల వద్ద అనుమతులు తీసుకోవాలన్నారు. ఉత్సవ కమిటీ ఆర్గనైజర్స్ పూర్తి వివరాలు ఆన్లైన్ యాప్ ద్వారా అప్లై చేసుకోవాలన్నారు. కడపలో దాదాపు 250, ప్రొద్దుటూరులో దాదాపు 150 సీసీ కెమెరాలు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ సందర్భంగా గణేష్ ఉత్సవాల నిర్వహణలో శాంతి భద్రతల ఏర్పాట్లపై పలువురు శాంతి కమిటీ సభ్యుల అభిప్రాయాలను జిల్లా కలెక్టర్ స్వీకరించారు. ఈ సమావేశంలో ఆర్డీవోలు జాన్ ఐర్విన్, చంద్రమోహన్, సాయి శ్రీ,కడప కార్పొరేషన్ కమిషనర్ మనోజ్ రెడ్డి,పోలీసు అధికారులు, గణేష్ ఉత్సవ కేంద్ర కమిటీ అధ్యక్షుడు మునగా సతీష్, జనరల్ సెక్రటరీ కేవీ లక్ష్మినారాయన రెడ్డి, జిల్లా వీహెచ్పీ అధ్యక్షుడు చెన్నకృష్ణారెడ్డి, శాంతి కమిటీ సభ్యులు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మట్టి విగ్రహాలనే పూజించాలి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్లాన్ లేకుండా అక్రమ నిర్మాణాలు
● కల్యాణ మండపం, షాపు రూముల ఏర్పాటు ● చోద్యం చూస్తున్న నగరపాలక ప్లానింగ్ అధికారులు కడప కార్పొరేషన్ : కడప నగరంలో ఎలాంటి ప్లా న్ లేకుండా నిర్మాణాలు చేపడుతున్నా నగరపాలక టౌన్ ప్లానింగ్ అధికారులు చోద్యం చూస్తు న్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. నగర శివార్లలో ఇందిరానగర్ సమీపంలో ఉన్న సాయిబాబా నగర్(ఎస్టీ కాలనీ)లో ఇందిరాగాంధీ హయాంలో యానాదులకు ఇళ్ల స్థలాలు ఇచ్చారు. ప్రస్తుతం ఈ కాలనీలో 60 కుటుంబాలు నివాసం ఉంటు న్నాయి. ఇక్కడ నివాస గృహాలకు తప్పా పాఠశా ల, అంగన్వాడీ కేంద్రం తదితర వాటికి స్థలాలు లేవు. కానీ అధికార పార్టీకి చెందిన అగ్రవర్ణాల వారు ఈ కాలనీలో ప్రవేశించి సుమారు 0.20 సెంట్లలో కల్యాణ మండపం, షాపు రూములు నిర్మించారు. ఈ షాపు రూములను వైన్ షాపులకు బాడుగకు ఇచ్చారు. అయితే ఎలాంటి ప్లాన్ అప్రూవల్స్ లేకుండా నిర్మించిన ఈ నిర్మాణాల పట్ల నగరపాలక అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం విమర్శలకు తావిస్తోంది. మామిళ్లపల్లె గ్రామ పొలం సర్వే నంబర్ 729లో నివాస గృహాలకు మాత్రమే కేటాయించిన స్థలాలను, వంక పొరంబోకు స్థలాలను ఆక్రమించి వ్యాపార సముదాయాలను నిర్మించడం పట్ల ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. ఈ ప్రాంతంలో రిమ్స్తోపాటు ఇతర హాస్పిటల్స్, విద్యాసంస్థలు నెలకొనడంతో భూములకు విలువ పెరిగింది. దీంతో ప్రభుత్వం ఇచ్చిన స్థలాలను అమ్మడం, కొనడం నేరమైనా సరే పేదలకు పదో పరకో ఇచ్చి స్వాధీనం చేసుకుంటున్నారని తెలుస్తోంది. దొంగ డాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాలను ఆక్రమించినట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇలాంటి అక్రమ నిర్మాణాల పట్ల టౌన్ప్లానింగ్ అధికారులు ఎందుకు ఉదాసీన వైఖరి అవలంబిస్తున్నారనే ప్రశ్న ఉత్పన్నమవుతోంది. ఇప్పటికై నా అక్రమ నిర్మాణాలను తొలగించి ప్రజా ప్రయోజనాలకు ఉపయోగించాలని పలువురు కోరుతున్నారు. సాయిబాబా నగర్లో ఆక్రమించేందుకు చదును చేసిన స్థలం సాయిబాబా నగర్(ఎస్టీ కాలనీ)లో ప్లాన్ లేకుండా చేపట్టిన నిర్మాణాలు -
తొమ్మిది నెలలుగా జీతాలు లేని కాంట్రాక్టు సిబ్బంది
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో కాంట్రాక్టు పద్ధతిపై పనిచేస్తున్న సిబ్బందికి తొమ్మిది నెలలుగా జీతాలు ఇవ్వనందుకు ఏఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం జరిగింది. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా మాట్లాడుతూ జీతాలు ఇవ్వాలని అనేక పర్యాయాలు గ్రీవెన్సెల్లో, సర్వశిక్ష అభియాన్ అధికారులకు విన్నవించుకున్నా ఎవరూ పట్టించుకోకపోవడం దారుణమన్నారు. వేతనాలు అందక కుక్లు, అసిస్టెంట్ కుక్లు, వాచ్మెన్లు, పార్ట్ టైమ్ టీచర్ల కుటుంబాల పరిస్థితి దారుణంగా ఉందన్నారు. విద్యార్థులకు ఎలాంటి అసౌకర్యం, ఆటంకం కలిగించకుండా విధులు నిర్వహిస్తూ వస్తున్న సిబ్బందికి వేతనాలు చెల్లించే విషయంలో మంత్రి నారా లోకేష్ తక్షణమే జోక్యం చేసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం జాయింట్ కలెక్టర్ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. -
యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్మితే చర్యలు
కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఎరువుల దుకాణ యజమానులెవరైనా యూరియాను ఎమ్మార్పీ కంటే అధిక రేటుకు అమ్మితే చర్యలు తప్పవని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ హెచ్చరించారు. మంగళవారం కడప ఏఓ సురేష్కుమార్రెడ్డి, జేడీఏ కార్యాలయ వ్యవసాయ అధికారి గోవర్దన్లతో కలిసి కడపలోని మహేశ్వరి ఫర్టిలైజర్ ప్లాంట్తో పాటు పలు ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన స్టాక్ రిజిస్టర్, ఎరువుల నిల్వలను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఎరువుల దుకాణదారులందరు తప్పని సరిగా స్టాక్ రిజిస్టర్ను నిర్వహించాలన్నారు. అలాగే ఎరువుల ధరల బోర్డును షాపులో ఏర్పాటు చేయాలని ఆదేశించారు. దీంతోపాటు ఎరువుల గ్రౌండ్ బ్యాలెన్స్కు, ఈ పాస్ మిషన్ బ్యాలెన్స్కు ఎలాంటి తేడా లేకుండా చేసుకోవాలని సూచించారు. నేటి నుంచి కోర్టులలో పోస్టుల భర్తీకి రాత పరీక్ష కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా కోర్టులలో వివిధ విభాగాలలో ఖాళీగా ఉన్న పోస్టులకు రాత పరీక్షలు ఈనెల 20వ తేదీ నుంచి 24వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పరీక్షలు కడప నగర శివార్లలోని శ్రీనివాస ఇంజినీరింగ్ కళాశాల, కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, కేఎల్ఎం ఇంజినీరింగ్ కళాశాల, కేఓఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. అలాగే రాయచోటిలో శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాల, భాస్కర్ ఇంజినీరింగ్ కళాశాలలో, ప్రొద్దుటూరులో శ్రీ రాజేశ్వరి ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహిస్తారన్నారు. ఈ పరీక్షలు ప్రతిరోజు మూడు షిఫ్ట్లలో ఉంటాయన్నారు. అభ్యర్థులు హాల్ టికెట్, ఒక గుర్తింపు కార్డును తీసుకొని రావాలన్నారు. పరీక్ష ప్రారంభానికి 15 నిమిషాలు ముందే హాజరు కావాలని, నిర్ణీత సమయం దాటిన తర్వాత లోనికి అనుమతించరని స్పష్టం చేశారు. ఫుట్బాల్ విజేత వైఎస్సార్ కడప జిల్లా జట్టు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏపీ సబ్ జూనియర్ బాలికల అంతర్ జిల్లా ఫుట్బాల్ టోర్నమెంట్ విజేతగా కడప జిల్లా జట్టు నిలిచింది. ఇటీవల అన్నమయ్య జిల్లాలోని మదనపల్లెలో జరిగిన ఈ టోర్నమెంటులో జిల్లా బాలికలు అత్యుత్తమ ప్రతిభ కనబరిచి విజేతలుగా నిలిచారు. ఫైనల్ మ్యాచ్లో అనంతపురంపై 3–0 తేడాతో గెలిచారు. ఈ టోర్నమెంటులో ప్రతిభ కనబరిచిన క్రీడాకారిణులు రాష్ట్ర జట్టుకు ఎంపికై ఛత్తీస్ఘడ్ రాష్ట్రం నారాయణపూర్లో జరిగే సబ్ జూనియర్ బాలికల జాతీయ ఫుట్బాల్ ఛాంపియన్ షిప్లో రాష్ట్రానికి ప్రాతినిధ్యం వహించనున్నారు. కాగా రాష్ట్ర జట్టుకు ఎంపికై న వారిలో బి.భార్గవి (గోల్ కీపర్), వై.అశ్విని, ఆర్బీ మైథిలి, సాద్విక, నవ్యశ్రీ, వర్షితారెడ్డి ఉన్నారు. -
అధికారులూ.. ఈ ఆక్రమణ కనిపించలేదా!
● మైదుకూరులో కేసీ కెనాల్ స్థలంలో వాటల్ ప్లాంట్ నిర్వహణ ● అధికార పార్టీ అండ ఉంటే అధికారులు పట్టించుకోరా ● వైఎస్సార్సీపీ నేతల డాబా అయితే కూల్చేస్తారా..! సాక్షి టాస్క్ఫోర్స్ : అధికార పార్టీ అండదండలుంటే ఎలాంటి తప్పు జరిగినా.. స్థలాలు ఆక్రమణకు గురైనా అధికారులు పట్టించుకోకపోవడం .. అదే ప్రత్యర్థి పార్టీ వర్గీయులైతే.. అధికార పార్టీ ఒత్తిడి ఉంటే బాధితుడికి నష్టం కలిగించే దుశ్చర్యకు ఏమాత్రం వెనుకాడకపోవడం అధికారులకు నిత్యకృత్యమైంది. మైదుకూరు నియోజకవర్గం దువ్వూరు మండలం ఇడమడక సమీపంలో వైఎస్సార్సీపీ నేత నగరి శ్రీకాంత్కు చెందిన డాబాను సోమవారం రెవెన్యూ, పోలీసు అధికారులు కూల్చేశారు. గతంలో ప్రభుత్వం ఇచ్చిన పట్టా ఉన్నప్పటికీ లెక్క చేయని అధికారులు తెల్లవారుజామున 5 గంటలకు జేసీబీ పెట్టించి కూల్చి వేసి లక్షల్లో నష్టం కలిగించారు. అయితే మైదుకూరులో మాత్రం కేసీ కాలువ పక్కనే దానికి సంబంధించిన స్థలంలో ఏకంగా మినరల్ వాటర్ ప్లాంట్ను ఏర్పాటు చేసి దాని ద్వారా లక్షలు సంపాదిస్తున్నా.. దీనిపైన ఫిర్యాదు అందినా ఆ వైపు సాగునీటి అధికారులు గానీ, రెవెన్యూ అధికారులు గానీ కన్నెత్తి చూడకపోవడం శోచనీయం. మైదుకూరు పట్టణం నంద్యాల రోడ్డులో సంతకు వెళ్లే దారిలో రోడ్డు పక్కనే ఉండే కేసీ కెనాల్ అనుబంధమైన కొండపేట కాలువ స్థలంలో ఏడాది క్రితం మైదుకూరు మున్సిపల్ చైర్మన్ మాచనూరు చంద్ర బంధువు సుబ్బారావు తనకు కావాల్సిన ఓ కుటుంబానికి కేసీ కెనాల్ స్థలంలో వాటర్ ప్లాంట్ పెట్టించాడు. దీని ద్వారా మినరల్ వాటర్ వ్యాపారం చేస్తూ లక్షలు సంపాదిస్తున్నారు. కేసీ కెనాల్ స్థలంలో కడప– కర్నూలు జాతీయ రహదారి పక్కనే 5 సెంట్ల వరకూ స్థలం ఆక్రమించి వాటర్ ప్లాంట్ నిర్మించుకుని దర్జాగా వ్యాపారం చేసుకుంటున్నారు. దీని వెనకాలే సొంత స్థలాల్లో కొందరు ఇళ్ల నిర్మాణాలు చేపట్టారు. వారు సొంత స్థలాల్లో ఇళ్లు నిర్మించుకున్నప్పటికీ వారికి దారి లేకుండా ఈ వాటర్ ప్లాంట్ అడ్డుగా నిర్మించారు. ఇది ప్రభుత్వ స్థలం కావడంతోనే విద్యుత్ శాఖ అధికారులు ట్రాన్స్ఫార్మర్ను సైతం ఇక్కడ ఏర్పాటు చేశారు. అధికార పార్టీ అండదండల వల్లనే ఈ వాటర్ ప్లాంట్పై అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని, ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కేసీ కెనాల్ స్థలం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో రెండు వారాల నుంచి వర్షాలు కొనసాగుతూనే ఉన్నా యి. కడప, ప్రొద్దుటూరు లాంటి పట్టణాల్లో అధిక వర్షాల కారణంగా లోతట్టు ప్రాంతాలు నీటితో నిండి జనాలు అవస్థలు పడుతున్నారు. మంగళవారం ఆర్థరాత్రి నుంచి కురిసిన వర్షాల వివరాలు ఇలా ఉన్నా యి. పోరుమామిళ్లలో అత్యధికంగా 23.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే కలసపాడులో 11 , సింహాద్రిపురంలో 8.2, పెద్దముడియంలో 6.4 , కాశినాయన, వేములలో 6 , కొండాపురం, సిద్దవటంలో 3.6, జమ్మలమడుగులో 3.4, వేంపల్లిలో 3.2, ఎర్రగుంట్లలో 3, కమలాపురంలో 2.4, కడపలో 2.2, బి.మఠంలో 2 , మైదుకూరు, దువ్వూరులలో 1.8, ముద్దనూరులో 1.6, బద్వేల్లో 1.2, అట్లూరులో 0.8 మి.మీ వర్షపాతం నమోదైంది. -
పెన్నా ప్రాంతంలో డ్రోన్లతో పర్యవేక్షణ
కడప అగ్రికల్చర్ : అల్పపీడనం కారణంగా జిల్లావ్యాప్తంగా పది రోజుల నుంచి వర్షాలు కొనసాగుతున్నా యి. ఈ వర్షాలతో గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు, రైతు లు విసిగివేసారి పోతున్నారు. నిన్నామొన్నటి వరకు వర్షాల కోసం ఎదురుచూసిన అన్నదాతలు నేడు ఈ వర్షాలు వద్దుబాబోయ్ అనే పరిస్థితికి చేరుకున్నారు. వరుసగా పడుతున్న వర్షాలతో గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పూర్తిగా పారిశుధ్యం లోపించింది. దీంతో దోమల బెడద అధికమై జనాలు జ్వరాల బారిన పడుతున్నారు. ఇక అన్నదాతల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. నిత్యం కురుస్తున్న వర్షాలకు భూమి తడారక ఆరుతడి పంటలు ఎర్రగా మారి దెబ్బతింటున్నా యని రైతన్నలు ఆందోళన చెందుతున్నారు. పంటల్లో కనీసం కలుపు మొక్కలను తీద్దామన్నా కష్టతరంగా మారిందని వాపోతున్నారు. జిల్లాలో 65 హెక్టార్లలో పంటలకు నష్టం... జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు, వ్యవసాయ, ఉద్యాన పంటలకు నష్టం వాలిల్లుతోంది. ఇందులో భాగంగా పెద్దముడియం మండలంలో 25 హెక్టార్లలో, మొక్కజొన్న, 20 హెక్టార్లలో కమలాపురం మండలంలో 20 హెక్టార్లలో మినుమపంటలకు నష్టం వాలిటినట్లుగా వ్యవసాయశాఖ గుర్తించింది. ఇలా వర్షం ఇలాగే కొనసాగితే ఇంకా మొక్కజొన్నతోపాటు మినుము, ఉల్లి, పత్తి, పూల పంటలకు కూడా నష్టం వాలిట్లే అవకాశం ఉంది. విద్యుత్ శాఖ హెచ్చరిక... మైదుకూరు పోరుమామిళ్ల రోడ్డులో సోమవారం ఎర్రచెరువు దగ్గర పొలం పనుల నిమిత్తం మోటా రు వేస్తుండగా విద్యుత్ షార్ట్ సర్యూట్ అయి పవన్కుమార్(38) అనే రైతు మృతి చెందాడు. ఈ నేపథ్యంలో వర్షాలకు సంబంధించి తీసుకోవలసిన జాగ్రత్తల గురించి విద్యుత్తుశాఖ హెచ్చరికలతో పాటు పలు సూచనలు జారీ చేసింది. వర్షపు వేళ విద్యుత్ స్తంభాలు, ట్రాన్స్ఫార్మర్లు, ఎలక్ట్రిక్ తీగలు, ఇతర పరికరాల దగ్గర గుమికూడదని తెలిసింది. ఎక్కడైనా విద్యుత్ తీగలు తెగి పడివుంటే 1912 నంబర్కి సమాచారం ఇవ్వాలని సూచించారు. పాత ఇళ్లు, మట్టి మిద్దెలతో అప్రమత్తం మైదుకూరు: జడివానతో జిల్లాలో పలు ప్రాంతాల్లో మట్టి మిద్దెలు కూలుతున్నాయి. మట్టి, పాత మిద్దెలు ఉన్న వారు వర్షాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. ఇటీవల జమ్మలమడుగు ప్రాంతంలో ఇళ్లు కూలాయి. తాజాగా మైదుకూరులో ఓబులమ్మ అనే ఒంటరి మహిళ మట్టి మిద్దె కూలిపోయింది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం... అల్పపీడనం కారణంగా సోమవారం తెల్లవారుజా మున నుంచి జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిసాయి. ఇందులో భాగంగా దువ్వూరులో అత్యదికంగా 25.2 మి.మీ వర్షం కురిసింది. అన్నదాతల్లో అలజడి దెబ్బతింటున్న మొక్కజొన్న, ఉల్లి, మినుము పంటలు జిల్లాలో 65 హెక్టార్లలో మొక్కజొన్న, మినుము పంటలకు నష్టం మైదుకూరులో మోటారు వేస్తుండగా షార్ట్ సర్కూట్తో రైతు మృతి ప్రొద్దుటూరు క్రైం : భారీ వర్షాలకు కుందూ, పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. ఒక్కసారిగా నీటి ఉధృతి పెరగడంతో నది పరివాహక ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. కొన్ని రోజుల క్రితం పెన్నా నదిలోకి వెళ్లిన వృద్ధ దంపతులు నీరు పెరగడంతో ఒడ్డుకు రాలేకపోయారు. నీళ్లలో చిక్కుకున్న వారిని రూరల్ పోలీసులు, అగ్నిమాపక రెస్క్యూ టీం సభ్యులు కాపాడారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ఎస్పీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు రూరల్ పోలీసులు నదీ పరివాహక ప్రాంతాల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం రూరల్ సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ కేసీ రాజులు డ్రోన్ కెమెరాలతో పర్యవేక్షణ చేశారు. పెన్నా నీటి ప్రవాహ సమీపంలో ఉన్న ప్రజలను సురక్షిత ప్రాంతాలకు వెళ్లేలా సూచనలు చేశారు. నీళ్లలో ఇంకా ఎవరైనా చిక్కుకున్నారా, నీటి ప్రవాహం ఎంత వరకు ఉందనే దానిపై కెమెరాల ద్వారా పరిశీలించారు. పెన్నా నది ఉధృతంగా ప్రవహిస్తుండటంతో రామేశ్వరంలోని ఆర్టీపీపీ రహదారిలో రాకపోకలను నిలిపే శారు. ప్రజలు వెళ్లకుండా బందోబస్తు ఏర్పాటు చేశారు. కనీస అవగాహన లేకుండా నీటి ప్రవాహంలో వెళ్లరాదని ప్రజలకు రూరల్ సీఐ బాలమద్దిలేటి సూచించారు. -
అయ్యోర్లపై పని భారం !
కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం వచ్చాక విద్యా శాఖ తీరు అధ్వానంగా మారింది. అడ్డగోలు, అసంబద్ధ నిర్ణాయాలు అమలు చేస్తుండడంతో విద్యా ప్రమాణాలు రోజురోజుకు తీసికట్టుగా మారుతున్నా యి. తాజాగా ప్రస్తుతం నిర్వహిస్తున్న అసెస్మెంట్ పరీక్షలకు సంబంధించిన జవాబు పత్రాల్లో కాకుండా అసెస్మెంట్ పుస్తకాల పేరుతో ఉపాధ్యాయులకు అందచేస్తున్నారు. ఈ కొత్త పరీక్షల విధానం ఉపాధ్యాయులకు భారంగా మారడంతోపాటు సర్కారు బడు ల్లో విద్యా ప్రమాణాలు మరింత దిగజారుస్తోంది. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న అయ్యవార్లకు ఇదో అదనపు భారంగా మారంది. దీంతో విద్యావేత్తలు, ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఫార్మెటివ్ అసెస్మెంట్(ఎ్ఫ్ఏ–1) పరీక్షల్లో అమల్లోకి తెచ్చిన అసెస్మెంట్ బుక్ ఉపాధ్యాయ లోకానికి గందరగోళానికి గురి చేస్తోంది. జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలలో 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 11,29,796 అసెస్మెంట్ పుస్తకాలను ఉపాధ్యాయులకు అందజేయనుంది. పాఠశాలకు చేరిన అసెస్మెంట్ బుక్స్... రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి అసెస్మెంట్ పుస్తకాలను విద్యాశాఖ ద్వారా పాఠశాలకు పంపించారు. సర్కారు బడుల్లో నిర్వహించే త్రైమాసిక, అర్థవార్షిక, వార్షిక పరీక్షలను ఎఫ్ఏ–1,2,3,4లుగా, ఎస్ఏ–1,2లుగా నిర్ణయించారు. ఈ పరీక్షలను విద్యార్థులు మూల్యాంకన పుస్త కాలలో రాసేందుకు వీలుగా 1,2వ తరగతులకు మూ డు పుస్తకాలు, 3,4,5 తరగతులకు నాలుగు , 6,7 తరగతులకు ఆరు, 8,9,10 తరగతులకు ఏడు చొప్పున 11,29,796 పుస్తకాలను అందచేయనున్నారు. ఉపాధ్యాయుల నుంచి తీవ్ర వ్యతిరేకతఈ ఏడాదిలో జరిగే అన్ని పరీక్షల వివరాలను ఈ మూల్యాంకన పుస్తకంలో నమోదు చేసేందుకు ఏడాదంతా ఈ పుస్తకాన్ని ఉపాధ్యాయులు భద్రంగా ఉంచాలి. గతంలో తెల్ల కాగితాలపై పరీక్షలు రాస్తే ఉపాధ్యాయులు ఇంటికి తీసుకెళ్లి మూల్యాంకనం చేసేవారు. మార్కులు నమోదుతో పని పూర్తి అయ్యేది. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి తీసుకెళ్లే అవకాశం లేదు, వీటిని భద్రపరచడం తలకుమించిన భారమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. ఏకపక్షంగా ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు వల్ల విద్యావ్యవస్థ గాడితప్పుతోందని విమర్శిస్తున్నాయి. ఫార్మెటివ్, సమ్మెటివ్ ఆసెస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులు రాయాలి. పరీక్షలు రాసిన తర్వాత వాటిని దిద్ది అందులోనే ఉన్న ఓఎమ్మార్ సీట్లో మార్కులు చేయడంతోపాటు ఓఎమ్మార్ షీట్ను విద్యాశాఖ ఇచ్చిన యాప్లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాలి. దీనిపై ఉపాధ్యాయలు, సంఘ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మూల్యాంకన పుస్తకం పరీక్షల సంస్కరణల పేరుతో పిల్లలకు మూల్యాంకన పుస్తకాలు ఈ ఏడాది నుంచి అమల్లోకి తెచ్చిన విద్యాశాఖ బడుల్లోనే మూల్యాంకనం చేయాల్సి రావడంతో బోధనకు అడ్డంకులు వ్యతిరేకిస్తున్న ఉపాధ్యాయ సంఘాలు 11,27,796 ఉమ్మడిజిల్లాకు మంజూరైన అసెస్మెంట్ బుక్స్ -
అంతర్జాతీయ సదస్సుకు వైవీయూ ఆచార్యుడికి ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వ విద్యాలయంలోని భూ విజ్ఞానశాస్త్ర విభాగంలో ఆచార్యుడిగా పనిచేస్తున్న ఎన్. జయరాజుకు యూకే లోని స్కాట్లాండ్ సెయింట్ ఆండ్రూస్ యూనివర్శిటీ నిర్వహించనున్న అంతర్జాతీయ సదస్సులో పాల్గొనేందుకు ఆహ్వానం అందింది. ఈ నెల 19 నుంచి 22 తేదీ వరకు జరిగే సదస్సులో ఆయన పాల్గొననున్నారు. ‘భారతదేశ తూర్పు తీరంలోని కొ న్ని ప్రాంతాల నుంచి సముద్ర కాలుష్యాన్ని విశ్లేషించడానికి మలస్కన్ షెల్స్ వినియోగం’ అనే అంశంపై పరిశోధనా పత్రాన్ని సమర్పించనున్నారు. ఈయనకు అంతర్జాతీయ సదస్సుకు ఆహ్వానం అందడంపై వైవీయూ వైస్ చాన్స్లర్ అల్లం శ్రీనివాస రావు తదితరులు అభినందనలు తెలిపారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాలలో ఎమ్మెస్సీ ఎర్త్ సైన్స్ విభాగంలో ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు సంచాలకులు టి.లక్ష్మి ప్రసాద్ తెలిపారు. ఈ కోర్సుల్లో పట్టభద్రులైన వారికి మంచి ఉద్యోగ అవకాశాలు ఉన్నాయని తెలిపారు. కోర్సులో ప్రవేశానికి ఇంటర్మీడియట్ ఎంపీసీ, బైపీసీలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు అర్హులన్నారు. ఆసక్తిగల విద్యార్థులు రిజిస్ట్రేషన్, ఇతర వివరాలకు 89855 97928, 99854 42196 నంబర్లను సంప్రదించాలని సూచించారు. వీఆర్ఏలతో భర్తీ చేయాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : తహసిల్దార్ కార్యాలయాల్లో ఖాళీగా ఉన్న అటెండర్, వాచ్మెన్, రికార్డ్ అసిస్టెంట్, పోస్టులను అర్హులైన వీఆర్ఏలతో భర్తీ చేయాలని ఏపీ వీఆర్ఏ వెల్ఫేర్ అండ్ సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొమ్మద్ది ఈశ్వరయ్య అధికారులకు విజ్ఞప్తి చేశారు. సోమవారం నగరంలోని వీఆర్ఏ అసోసియేషన్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. చాలా ఏళ్ల నుంచి తహసీల్దార్ కార్యాలయాల్లో పోస్టులు ఖాళీగా ఉండడం వల్ల వీఆర్ఏలతో అనధికారికంగా డ్యూ టీలు చేయిస్తున్నారని తెలిపారు.ఈ విషయం ఇది వరకే జిల్లా అధికారులకు విన్నవించామని తెలిపారు. పోస్టులను భర్తీ చేయకపోవడంతో డ్యూటీ చేస్తున్న వీఆర్ఏలపై ఆర్థిక భారం పడుతోందన్నారు ఈ కార్యక్రమంలో అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు పుల్లయ్య పాల్గొన్నారు. డీ ఫార్మసీ ప్రవేశాలకు నేటితో గడువు పూర్తి – ప్రిన్సిపల్ సీహెచ్ జ్యోతి కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ, ప్రైవేటు పాలిటెక్నిక్లలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి డి ఫార్మసీ కోర్సులో ప్రవేశాలకు దరఖాస్తు చేసుకునేందుకు 19వ తేదీతో గడువు ముగుస్తుందని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ ఫార్మసీ కోర్సు పూర్తి చేసిన వారికి వందశాతం ఉపాధి, ఉద్యోగ అవకాశాలు ఉంటాయ ని చెప్పారు. కోర్సులో ప్రవేశం పొంది రేషన్కార్డు, ఇన్కమ్ సర్టిఫికెట్ కలిగి ఉన్న పేద విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్, స్కాలర్షిప్లు అందుతాయని తెలిపారు. ప్రవేశాలకు సంబంధించి మరిన్ని వివరాల కోసం 94401 44057, 98853 55377 నెంబర్లను సంప్రదించాలని తెలిపారు. -
నిషేధిత జాబితాలో సమరయోధుడి భూమి
● రికార్డుల్లో సవరించినా ఎన్ఓసీ ఇవ్వని దేవదాయ శాఖ అధికారులు ● మామూళ్ల కోసం ఏళ్ల తరబడి తిప్పుకుంటున్న వైనం కడప సెవెన్రోడ్స్ : స్వాతంత్య్ర సమరయోధుల త్యాగాల వల్లే నేడు మనం స్వేచ్ఛగా జీవిస్తున్నాం. అలాంటి సమరయోధుల త్యాగాలను స్మరించుకుంటూ వారిని గౌరవించాల్సిన బాధ్యత నేటి తరంపై ఉంది. కొంతమంది అధికారులు గౌరవించడం అటుంచి వారి కుటుంబ సభ్యులను వేధిస్తోంది. జిల్లాకు చెందిన ఓ సమరయోధునికి ప్రభుత్వం ఇచ్చిన భూమికి ఎన్ఓసీ జారీ చేయకుండా మామూళ్ల కోసం ఆయన కుటుంబ సభ్యులను ఏళ్ల తరబడి తిప్పుకుంటున్న వైనం వెలుగులోకి వచ్చింది. వివరాల్లోకి వెళితే... ఎర్రగుంట్ల మండలం చిలమకూరు గ్రామానికి చెందిన ఆలూరు పక్కీరప్ప మహాత్మాగాంధీ పిలుపు మేరకు స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్నారు. 1921లో మహాత్మాగాంధీ జిల్లాను సందర్శించిన సందర్భంలో పక్కీరప్ప కూడా శాంతియాత్రలో పాల్గొన్నారు. 1941లో జరిగిన వ్యక్తి సత్యాగ్రహం, 1942లో జరిగిన క్విట్ ఇండియా ఉద్యమంలో క్రియాశీలకంగా పాల్గొన్నారు. అజ్ఞాతంతో ఉంటూ కార్యకలాపాలు నిర్వహించారు. మోతుబరి కుటుంబానికి చెందిన తన నివాసంలో సాటి స్వాతంత్య్ర సమరయోధులకు ఆశ్రయం కల్పించడంతోపాటు ప్రజల్లో దేశ భక్తిని పెంపొందించేందుకు ఎన్నో కార్యక్రమాలు నిర్వహించారు. స్వాతంత్య్రం సిద్ధించిన తర్వాత ప్రభుత్వం 1951లో చాపాడు మండలం కుచ్చుపాప గ్రామం సర్వే నెంబరు 20/1లో 2.54 ఎకరాలు, 20/2లో 2.50 ఎకరాలు కలిపి మొత్తం 5 ఎకరాల 4 సెంట్ల వ్యవసాయ భూమిని పక్కీరప్పకు పట్టాగా ఇచ్చింది. 1999 నవంబరు 5వ తేదీ పక్కీరప్ప మరణించారు. ప్రభుత్వం ఇచ్చిన భూమిని ఆయన భార్య దస్తగిరమ్మ పేరిట బదలాయించిన రెవెన్యూ అధికారులు.. ఆ భూమి దేవదాయశాఖకు చెందినదిగా పేర్కొంటూ నిషేధిత జాబితాలో చేర్చారు. మైదుకూరు సబ్ రిజిస్ట్రార్ ద్వారా 2011లో ఈ విషయం తెలుసుకున్న పక్కీరప్ప కుటుంబ సభ్యులు అవాక్కయ్యారు. అప్ప టి చాపాడు తహసీల్దార్ను సంప్రదించారు. పొరపాటున ఆ భూమిని నిషేధిత జాబితాలో ఉంచారని తహ సీల్దార్ తెలిపారు. సదరు సర్వే నెంబర్లలోని భూమిని దేవదాయశాఖ నుంచి తొలగిస్తూ జారీచేసిన ఉత్తర్వుల నకలు పక్కీరప్ప కుటుంబ సభ్యులకు ఇచ్చారు. దీంతో నిరభ్యంతర పత్రం (ఎన్ఓసీ) ఇవ్వాలంటూ 2021 ఫిబ్రవరి 4వ తేదీ పక్కీరప్ప భార్య దస్తగిరమ్మ కడప దేవదాయ ధర్మదాయశాఖ సహాయ కమిషనర్ను కోరింది. ఈ విషయాన్ని పరిశీలించిన సహాయ కమిషనర్ సదరు సర్వే నెంబర్లలోని భూమికి ఎన్ఓసీ జారీ చేయాల్సిందిగా కోరుతూ విజయవాడలోని కమిషనర్కు నివేదిక పంపారు. ఇదిలాఉండగా 2021 ఫిబ్రవరి 25న పక్కీరప్ప భార్య దస్తగిరమ్మ మరణించారు. పక్కీరప్ప కుమారులు ఆలూరి శరత్బాబు, అజయ్బాబు ఈ విషయంపై మైదుకూరు సబ్ రిజిస్ట్రార్ను సంప్రదించగా, తమకు ఇంతవరకు ఎన్ఓసీ రాలేదని బదులిచ్చారు. దీంతో కథ మళ్లీ మొదటికి రావడంతో 2025 జులై 4వ తేదీ దేవదాయశాఖ సహా య కమిషనర్ను సంప్రదించి ఎన్ఓసీ జారీ చేయాలంటూ శరత్బాబు, అజయ్బాబు కోరారు. సహాయ కమిషనర్ ఈ భూమిపై మళ్లీ నివేదిక పంపాలంటూ ఈఓ టెంపుల్స్–2 ప్రొద్దుటూరు ఇన్స్పెక్టర్ను కోరా రు. కేవలం మామూళ్లు కోసం ఉద్దేశపూర్వకంగానే దేవదాయశాఖ అధికారులు జాప్యం చేస్తున్నట్లు తెలుస్తోంది. తమ సమస్యను యేటా జరిగే స్వాతంత్య్ర దినోత్సవంలో మంత్రుల దృష్టికి తీసుకు వెళుతున్నా పరిష్కారం లభించలేదని బాధితులు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు స్పందించి ఎన్ఓసీ జారీ చేయడం ద్వారా సమరయోధుని కుటుంబానికి న్యాయం చేయాలని పలువురు కోరుతున్నారు. -
అర్జీదారుల సమస్యలను పరిష్కరించాలి
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన అర్జీలను క్షుణ్ణంగా పరిశీలించి అర్జీదారులు సంతృప్తి స్థాయిలో పరిష్కారం ఉండేలా చర్య లు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పీజీఆర్ఎస్లో అందిన పరిష్కారంలో అధికారులు ప్రత్యేక శ్రద్ధ పెట్టి పనిచేయాలని ఆదేశించారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. కొన్ని ఫిర్యాదులు ఇలా.. ● విచారణ చేయకుండానే వికలాంగుల పెన్షన్ రద్దు చేశారని, తనకు తిరిగి పెన్షన్ మంజూరు చేయగలరని కడప చెమ్ముమియాపేటకు చెందిన ఖలీల్ బాషా అర్జీ అందజేశారు. ● మైదుకూరు మండలం బొండ్లవరం గ్రామానికి చెందిన కె.నాగ మునయ్య తన భూమిలో ఫోర్జరీ పత్రాలతో ఇచ్చిన విద్యుత్ కనెక్షన్ తొలగించాలని విన్నవించారు. ● జమ్మలమడుగు బొమ్మేపల్లి గ్రామానికి చెందిన ఎం రెడ్డప్ప నాయక్ తనకు తల్లికి వందనం పథకం మంజూరు చేయగలరని కోరారు. ● తొండూరు మండలం మల్లెల గ్రామానికి చెందిన బి చంద్రశేఖర్ రెడ్డి గ్రామంలోని 4వ రేషన్ షాప్ను రద్దు చేసే మూడవ షాపుకు ఇవ్వాలని కోరారు. సమర్థవంతంగా ‘ఆకాంక్షిత జిల్లా’ కార్యక్రమాలు దేశంలోని వెనుకబడిన జిల్లాలను అభివృద్ధి చేయ డం ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ ముఖ్య ఉద్దేశ్యమని, జిల్లాలో ఈ కార్యక్రమాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలని సంబంధిత అధికారులను కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లో జిల్లాలో ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ అమలు తీరుపై సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వివిధ విభాగాలలో దేశ వ్యాప్తంగా వైఎస్సార్ కడప జిల్లా ర్యాంకు 63గా ఉందని, ఏపీలో ఆస్పిరేషనల్ జిల్లాలైన వైఎస్సార్ కడప, పార్వతి పురం, అల్లూరి సీతారామరాజు జిల్లాలలో మన జిల్లా 73.6 స్కోర్ తో మొదటి స్థానంలో ఉందని తెలిపారు. ప్రజల ఆరో గ్య సంరక్షణలో 35వ ర్యాంక్, విద్యలో 100, వ్యవసా యంలో 24, ఆర్థికాభివృద్ధిలో 71,మౌలిక సదు పాయాలలో 34వ ర్యాంక్ లో ఉన్నామని తెలిపారు. నీతి ఆయోగ్ వారు ఆస్పిరేషనల్ డిస్ట్రిక్ట్ ప్రోగ్రామ్ లో కనబరిచిన ఇండికేటర్స్ ఆధారంగా ఆయా శాఖ ల అధికారులు ఈ అంశం పై అవగాహన పెంచుకొ ని సరైన వివరాలను అందివ్వాలని ఆదేశించారు. -
దేవునికడప ఆలయ జీర్ణోద్ధరణ పనులు ప్రారంభం
● బాలాలయ నిర్మాణానికి శ్రీకారం ● అంకురార్పణ పూజల నిర్వహణ కడప సెవెన్రోడ్స్ : దేవుని కడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ జీర్ణోద్ధరణ పనుల ప్రక్రియ సోమవారం సాయంత్రం ప్రారంభమైంది. బాలాలయ సంప్రోక్షణకు శాస్త్రోక్తంగా అంకురార్పణ, బాలబింబాలకు జలాధివాసం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. టీటీడీ డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ అధికారి ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆల య ఇన్స్పెక్టర్ పి.ఈశ్వర్రెడ్డి పర్యవేక్షించారు. మూడు రోజులపాటు ఈ కార్యక్రమాలు నిర్వహించి బుధవారం బాలాలయాన్ని భక్తులకు అందుబాటులోకి తీసుకు వస్తారు. తిరుమల–తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి, పద్మావతి అమ్మవారు, అండాళమ్మ వారి గర్భాలయాన్ని, విమాన గోపురాన్ని, రాజ గోపురాలకు మరమ్మతులు చేపడుతున్నారు. దీంతో స్వామి, అమ్మవార్ల మూల విరాట్కు బదులుగా గర్భాలయం ఎదురుగా మండపంలో బాలాలయం నిర్మాణం చేపట్టారు. జీర్ణోద్ధరణ పనులు పూర్తయ్యే వరకు భక్తులు బాలాలయంలో స్వామి, అమ్మవార్లను దర్శించుకోవాల్సి ఉంటుంది. స్వామి, అమ్మవార్లకు నిర్వహించే నిత్య, నైమిత్తిక, కామ్య కై ంకర్యాలు యథావిధిగా బాలాలయంలో నిర్వహిస్తారు. ● రాష్ట్రంలోని ప్రముఖ ఆధ్యాత్మిక క్షేత్రాల్లో దేవుని కడప ఆలయం ఒకటి. తిరుమల తొలిగడపగా పేరు న్న ఈ ఆలయంలోని స్వామిని జనమే జయ మహా రాజు ప్రతిష్ఠించారని చెబుతారు. కై ఫీయత్తుల ప్రకారం తిరుపతిలోని గోవిందరాజుల స్వామి ఆలయ రాజగోపురం, దేవుని కడప ఆలయ రాజగోపురం ఒకేసారి నిర్మించినట్లు తెలుస్తోంది. ఇక్కడి ఆలయంలోని రాజగోపురంతోపాటు ముఖ మండపం, గర్భాలయం, అంతరాళం, ప్రాకారం, మట్లి అనంత భూపాలుడు నిర్మించినట్లు తెలుస్తోంది. వైదుంబులు, ఓరిగంటి రాజులు, వల్లూరు పాలకులు, సంబెటరాజులు, సాళు వ, సంగమ, తులువ వంశీకులు ఈ క్షేత్రం అభివృద్ధికి ఎంతో కృషి చేశారు. శ్రీకృష్ణ దేవరాయలు పలుమార్లు కడప రాయుడిని దర్శించినట్లు చరిత్ర చెబుతోంది. పురా తన ఆలయం కావడంతో టీటీడీ జీర్ణోద్ధరణ పనులకు శ్రీకారం చుట్టింది. -
ప్రజా ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృతం కాకుండా ఆయా ఫిర్యాదులపై క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం’ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి వచ్చిన 149 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖి మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా ఫిర్యాదుల గురించి సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన చట్ట ప్రకారం విచారణ జరిపి బాధితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న పరిష్కార చర్యలు, పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామిరెడ్డి, పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ -
పాఠశాల విలీనాన్ని ఆపాలి
కడప సెవెన్రోడ్స్ : చాపాడు మండలం చియ్యపాడు గ్రామ ఎస్సీ కాలనీలో ఎన్నో ఏళ్ల నుంచి ఉన్న పాఠశాలను మోడల్ స్కూలు పేరుతో వేరే చోటికి తరలించడం తగదని, తక్షణమే దీనిని ఆపాలని కోరుతూ సోమవారం కలెక్టరేట్ ఎదుట విద్యార్థులు, తల్లిదండ్రులు ఆందోళన నిర్వహించారు. సుమారు ఒకటిన్నర కిలోమీటరు దూరంలో ఉన్న మోడల్ స్కూలులో తమ పాఠశాలను విలీనం చేస్తే విద్యార్థులు తీవ్ర ఇబ్బందులకు గురవుతారని ఆందోళన వ్యక్తం చేశారు. మోడల్ స్కూలుకు వెళ్లే దారిలో ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. కనుక తమ పాఠశాలను తమ కాలనీలోనే ఉంచాలన్నారు. ఇందుకు కారణమైన ఎంఈఓను తక్షణమే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు బీఎస్ కర్ణమాదిగ, తప్పెట హరిబాబు, పీఆర్ఎస్వైఎఫ్ జిల్లా కన్వీనర్ ఓరుగంటి నాగేంద్రబాబు, ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర కార్యదర్శి మునెయ్య తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఆకేపాడుకు వైఎస్ జగన్ రాక
కడప కార్పొరేషన్/రాజంపేట : అన్నమయ్య జిల్లా, రాజంపేట మండలం ఆకేపాడుకు ఈనెల 19వ తేదీ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రానున్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి సోదరుడి కుమారుడి వివాహ రిసెప్షనన్లో ఆయన పాల్గొననున్నారు. మంగళవారం ఉదయం 11.30 గంటలకు వైఎస్ జగన్ రాజంపేట మండలం బాలిరెడ్డిగారిపల్లె హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడినుంచి రోడ్డు మార్గాన ఆకేపాడు చేరుకుని, ఆకేపాటి ఎస్టేట్స్లో ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి సోదరుడు అనిల్కుమార్ రెడ్డి కుమారుడి వివాహ రిసెప్షన్లో పాల్గొంటారు. అనంతరం అక్కడి నుంచి తిరుగు పయనమవుతారు. హెలిప్యాడ్ పరిశీలన వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి ఆకేపాడుకు చేరుకోనున్నారు. ఇందుకోసం హెలీప్యాడ్ సిద్ధం చేశారు. సోమవారం ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి హెలీప్యాడ్ను పరిశీలించారు.ఎమ్మెల్యే వెంట స్ధానిక వైఎస్సార్సీపీనేతలు పాల్గొన్నారు. -
జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్ విడుదల
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో 27 బార్లకు నోటిఫికేషన్ విడుదల చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు తెలిపారు. సోమవారం నగరంలోని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జిల్లా కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కడప కార్పొరేషన్ పరిధిలో–12, ప్రొద్దుటూరు మున్సిపాలిటీలో–7, బద్వేల్ మున్సిపాలిటీలో–2, మైదుకూరు మున్సిపాలిటీలో–1, పులివెందుల మున్సిపాలిటీలో–2, ఎర్రగుంట్ల నగర పంచాయతీ, కమలాపురం నగర పంచాయతీకి ఒక్కొక్కటి చొప్పున బార్ల ఏర్పాటుకు నోటిఫికేషన్ విడుదల చేశామన్నారు. ఆన్లైన్, ఆఫ్లైన్ పద్ధతిలో దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు రుసుం ఫీజు నాన్ రీఫండబుల్ రూ.5 లక్షలు, ప్రాసెసింగ్ ఫీజు రూ.10 వేలు కలిపి మొత్తం రూ. 5.10 లక్షలు చెల్లించాలన్నారు. ఈనెల 26వ తేదీ సాయంత్రం 5 గంటల లోపల దరఖాస్తు చేసుకోవాలన్నారు. 28న జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో డ్రా తీసి ఎంపిక చేస్తామన్నారు. ఒక బార్ కోసం నాలుగు లేదా అంతకు పైగా దరఖాస్తులు వస్తే జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో లాటరీ పద్ధతిలో ఎంపిక చేస్తామన్నారు. ఎంపికై న వారు మొదటి వాయిదాను ఒక రోజులోనే చెల్లించాలన్నారు. బార్ నిర్ణీత గడువు 3 సంవత్సరాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, సూపరింటెండెంట్ రవికుమార్ పాల్గొన్నారు. -
హామీల అమలులో ‘సూపర్ ఫెయిల్యూర్’
కడప కార్పొరేషన్ : సూపర్ సిక్స్ హామీలు సూపర్ సక్సెస్గా అమలు చేశామని ప్రభుత్వం చెప్పుకోవడం సిగ్గుచేటని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎన్నికల హామీలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం ‘సూపర్ ఫెయిల్యూర్’ అని ఎద్దేవా చేశారు. కొన్ని పత్రికలు, టీవీల్లో సూపర్ సిక్స్ హామీలను సూపర్ సక్సెస్గా అమలు చేశానని చెబుతుంటే ప్రజలు నవ్వుకుంటున్నారన్నారు. పిల్లి పాలు తాగుతూ ఎవరూ చూడలేదని అనుకున్న చందంగా అరకొర హామీలు అమలు చేస్తూ అన్నీ చేశామని చెప్పుకోవడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఈవీఎంల మోసంతోనే ఈ ప్రభుత్వానికి ఎక్కువ సీట్లు వచ్చాయని, అయినా వైఎస్సార్సీపీకి 42 శాతం ఓట్లు వచ్చాయన్నారు. రాష్ట్రంలో ప్రజల తరుపున పోరాడే నిజమైన ప్రతిపక్షం వైఎస్సార్సీపీ ఒక్కటేనని, తమ పోరాటం వల్లే అరకొర పథకాలైనా అమలు చేశారన్నారు. పింఛన్ మొత్తాన్ని వెయ్యి రూపాయలు పెంచి 5లక్షల పింఛన్లు కోత కోశారని, మరో పది లక్షలు కోత విధించేందుకు సర్వే చేశారని, అర్హులు ఎవరైనా ఉంటే మళ్లీ అప్పీలు చేసుకోవాలని నంగనాచి మాటలు చెబుతున్నారని ధ్వజమెత్తారు. 60–70 శాతం వైకల్యం ఉన్నవారికి కూడా పింఛన్లు తీసేస్తున్నారని, ఆ పాపం ఊరికే పోదన్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని హామీ ఇచ్చారని, ఇంతవరకూ ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేదన్నారు. రాష్ట్రంలో 82లక్షల మంది విద్యార్థులు ఉంటే 52లక్షల మందికే తల్లికి వందనం అమలు చేశారని, మధ్యాహ్న భోజనం పథకం, విద్యాకానుక, వసతి దీవెన పథకాలను ఎత్తేసి విద్యా వ్యవస్థను సర్వనాశనం చేశారన్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి రైతులు దారుణంగా మోసపోయారని, కేంద్ర సాయంతో సంబంధం లేకుండా రూ.20వేలు ఇస్తామని చెప్పి...రూ.7వేలు ఇచ్చి సరిపుచ్చారన్నారు. యూరియా, ఎరువులు, విత్తనాలు లేక రైతులు విలవిల్లాడుతున్నారన్నారు. రైతులు పండించిన పంటలకు మద్దతు ధర కూడా ఇవ్వడం లేదని, పంట నష్టం సంభవిస్తే నష్ట పరిహారం ఊసే లేదన్నారు. ఎన్నికల ముందు ఉచిత బస్సు ప్రయాణం అని చెప్పి రాష్ట్రంలో ఎక్కడికై నా పోవచ్చని ఊదరగొట్టారని, ఇప్పుడు హైర్ బస్సులు, ఏసీ బస్సులు, డీలక్స్, సూపర్ లగ్జరీ వంటి ఏ బస్సుల్లోనూ ఉచిత ప్రయాణం లేదని షరతులు పెట్టారన్నారు. ఘాట్ ఉన్నా, స్పెషల్ సర్వీసుల్లో కూడా ఉచిత ప్రయాణం లేదన్నారు. 18 ఏళ్లు నిండిన ప్రతి మహిళకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు ఇస్తామని ఇంతవరకూ ఇవ్వలేదని, దాన్ని పీ4 పథకంలో అంతర్భాగం చేశామని చెబుతున్నారన్నారు. 20లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి, దాన్ని స్కిల్ డెవెలప్మెంట్ కార్పొరేషన్కు అప్పగించారన్నారు. కరెంటు చార్జీలు పెంచబోమని చెప్పి, ఇప్పటికి మూడు సార్లు పెంచారని చెప్పారు. రాష్ట్రంలో శాంతిభద్రతలు కనుమరుగయ్యాయన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు మహిళలను వేధిస్తూ లైంగిక దాడులకు పాల్పడుతున్నారన్నారు. త్వరలోనే ప్రజలు ఈ ప్రభుత్వానికి బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్ కుమార్, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు యానాదయ్య, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎస్. వెంకటేశ్వర్లు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఎన్. శివరామ్, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షేక్ షఫీ, పార్టీ జిల్లా కార్యదర్శి మునిశేశేఖర్రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
ఉపాధ్యాయులను బోధనకు దూరం చేసేందుకే..
విద్యారంగంలో ప్రభుత్వం ప్రవేశపెడుతున్న రోజుకో సరికొత్త విధానం ఉపాధ్యాయులను బోధనకు దూరం చేయడమే. విద్యార్థులకు పరీక్షలు నిర్వహించేందుకు ప్రత్యేకంగా మూల్యాంకన పుస్తకం రూపొందించడం హంగు ఆర్బాటలకే తప్ప ప్రత్యేకంగా ఒనగూరేదేమి లేదు. బోధనకంటే మూల్యంకన పుస్తకం దిద్దటానికి, దానిని స్కాన్ చేయడానికి, ఇతర విషయాలు రాయటానికే సమయమంతా సరిపోతుంది. పాత విధానమే మెరుగ్గా ఉంది. – మాదన విజయ కుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ప్రభుత్వ పాఠశాలల్లో కొత్తగా తీసుకువచ్చిన మూల్యాంకన పుస్తక విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులపై మూల్యాంకన పుస్తకాలు ఇచ్చి అదనపు భారం మోపడం పద్ధతికాదు, ప్రయోగాలు ఎందుకు చేస్తున్నారో అర్థం కావడం లేదు. ప్రభుత్వం పునరాలోచన చేసి ఈ విధానాన్ని రద్దు చేయాలి. – సంగమేశ్వరరెడ్డి, ఎస్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి. -
విద్యుదాఘాతంతో యువ కౌలు రైతు మృతి
మైదుకూరు : సొంత పొలానికి తోడు మరికొంత కౌలుకు తీసుకుని వ్యవసాయం చేసి కుటుంబాన్ని అభివృద్ధి చేసుకోవాలనుకున్న ఆ యువ రైతు కలలను విద్యుత్ రూపంలో వచ్చిన మృత్యువు కల్లలు చేసింది. వ్యవసాయాన్ని నమ్ముకుని జీవితాన్ని ఆనందమయం చేసుకోవాలనుకున్న అతన్ని చిన్న వయసులోనే మృత్యువు కబళించింది. మైదుకూరులో సోమవారం పొలం వద్ద మోటారు వేస్తుండగా విద్యుదాఘాతానికి గురై రాటాల పవన్కుమార్ (38) అనే యువ కౌలు రైతు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డ మండలం బాచేపల్లెకు చెందిన రాటాల లక్ష్మీనారాయణకు ముగ్గురు కుమారులు. వారిలో రెండో కుమారుడు పవన్కుమార్కు 11 ఏళ్ల కిందట మైదుకూరుకు చెందిన లక్ష్మీదేవితో వివాహమైంది. బాచేపల్లెలో సొంత పొలం ఒక ఎకరాకు తోడు మరో రెండు ఎకరాలు కౌలుకు తీసుకుని పవన్కుమార్ పంటలు సాగు చేస్తున్నాడు. మూడేళ్ల కిందట మైదుకూరుకు నివాసాన్ని మార్చి ఇక్కడ కొందరి రైతుల పొలాన్ని కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నాడు. స్థానిక ఎర్రచెరువు ప్రాంతంలో కౌలుకు తీసుకున్న పది ఎకరాల పొలంలో వరి నాటాల్సి ఉంది. సోమవారం పొలాన్ని వరి నాటేందుకు సిద్ధం చేయడానికి బాడుగ ట్రాక్టర్ను పిలుచుకొని వెళ్లాడు. పొలానికి తగినంత నీరు పెట్టేందుకు ఉదయం 11 గంటల ప్రాంతంలో మోటారు ఆన్ చేశాడు. విద్యుత్ ఘాతానికి గురై విలవిల్లాడుతూ పవన్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. అదే సమయంలో భర్తకు భోజనం తీసుకుని పొలం వద్దకు వెళ్లిన భార్య లక్ష్మీదేవి ఆ దృశ్యాన్ని చూసి కుప్పకూలిపోయింది. భర్త మృతదేహం వద్ద కన్నీరు మున్నీరైంది. మృతి చెందిన కౌలు రైతు పవన్కుమార్కు ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి పవన్ కుమార్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వం అన్ని విధాలా ఆదుకోవాలని బంధువులు కోరారు. -
కేసీ పరిధిలో సాగని పనులు
కడప అగ్రికల్చర్ : కేసీ కాలువ పరిధిలో చాలా మంది రైతులు వరి పంటనే ఎక్కువగా సాగు చేస్తారు. జిల్లా వ్యాప్తంగా కేసీ కాలువ పరిధిలో 92 వేల ఎకరాలకు పైగా విస్తీర్ణం ఉంది. కానీ కేసీ కాలువకు నీరు వచ్చినా వరిసాగు పనులు అంతగా ఊపు అందుకోలేదు. ఇప్పుడిప్పుడే కేసీ కాలువ కింద రైతులు నారుమడులు సాగు చేసే పనుల్లో బిజీగా ఉన్నారు. బోరుబావుల కింద ముందుగా నారుమడులు సాగు చేసుకున్న రైతులు మాత్రం వరినాట్లు చేపట్టగా మిగతా రైతులు ఎవరు కూడా వరినాట్లను అంతగా చేపట్టలేదు. నదీ పరివాహక, ప్రాజెక్టుల పరిధిలో కూడా వరి నాట్ల సాగు అంతగా ముమ్మరం కాలేదు. జిల్లా వ్యాప్తంగా వరి సాధారణ సాగు 30804 హెక్టార్లకు ఇప్పటి వరకు 6568.08 హెక్టార్లలో మాత్రమే వరిపంటను సాగు చేశారు. అంటే 21.32 శాతం మేర వరిసాగు అయింది.. దీంతోపాటు ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో కూడా వరిసాగు అంతగా ఊపందుకోలేదు. ఏదిఏమైనా ఈ నెలాఖరుతోపాటు సెప్టెంబర్ మొదటి, రెండో వారంలో వరిసాగు పనులు ఊపందుకోనున్నాయి. జిల్లాలోని ప్రాజెక్టు పరిధిలో నత్తనడకన.. జిల్లాలోని ప్రాజెక్టుల పరిధిలో కూడా వరిసాగు నత్తనడకన సాగుతోంది. ఇందులో భాగంగా కొండాపురం మండలంలో సాధారణసాగు 413 హెక్టార్లకుగాను ఇప్పటి వరకు కేవలం 25 హెక్టార్లలో వరి సాగైంది. అలాగే బి.మఠంలో 1610 హెక్టార్లకు 720 హెక్టార్లలో, కలసపాడులో 1005 హెక్టార్లకు 111 హెక్టార్లలో, పోరుమామిళ్లలో 1152 హెక్టార్లకు 251 హెక్టార్లలో, బి.కోడూరులో 1056 హెక్టార్లకు 70 హెక్టార్లలో, మైలవరంలో 250 హెక్టార్లకు కేవలం ఒక హెక్టారులో మాత్రమే వరిపంట సాగైంది. నదీ పరివాహక ప్రాంతాల్లో అంతంతగానే .. జిల్లాలోని నదీ పరివాహక ప్రాంతాలకు సంబంధించి కూడా వరినాట్లు అంతంత మాత్రంగానే సాగుతున్నాయి. ఇందులో భాగంగా రాజుపాలెంలో సాధారణసాగు 759 హెక్టార్లకు కేవలం 30 హెక్టార్లలో వరిపంట సాగైంది. అలాగే ప్రొద్దుటూరులో 1481 హెక్టార్లకు 70 హెక్టార్లు, జమ్మలమడుగులో 1093 హెక్టార్లకు 520 హెక్టార్లలో, కమలాపురంలో 373 హెక్టార్లకు 272.5 హెక్టార్లలో, వల్లూరులో 1047 హెక్టార్లకు 450 హెక్టార్లలో, చెన్నూరులో 1180 హెక్టార్లకు 529 హెక్టార్లలో, వేంపల్లిలో 450 హెక్టార్లకు 332.84 హెక్టార్లలో, చక్రాయపేటలో 1071 హెక్టార్లకు 321హెక్టార్లలో, సిద్దవటంలో 930 హెక్టార్లకు 905 హెక్టార్లలో, ఒంటిమిట్టలో 261 హెక్టార్లకు 147 హెక్టార్లలో వరిపంట సాగైంది. కేసీ కాలువ కింద అరకొరగానే.. జిల్లాలోని కేసీ కాలువ పరిధిలోని మండలాల్లో కూడా వరినాట్ల సాగు అరకొరగానే సాగుతోంది. దువ్వూరు మండలంలో సాధారణ సాగు 2585 హె క్టార్లు ఉంటే ఇప్పటికి కేవలం 30 హెక్టార్లలో కూడా వరిపంటను సాగు చేయలేదు. అలాగే మైదుకూరు మండలంలో కూడా 1192 హెక్టార్లకు గాను 8 హెక్టార్లలో వరిపంట సాగైంది. అలాగే ఖాజీపేట మండలంలో 3220 హెక్టార్లకు 20 హెక్టార్లలో, రాజుపాలెంలో 759 హెక్టార్లకుగాను 30 హెక్టార్లలో వరిపంట సాగైంది. అయితే ఇటీవలే చాలా మంది రైతులు నా రుమడులను సాగు చేశారు. ఆగస్టు చివరిలో అలాగే సెప్టెంబర్ మొదటి, రెండో వారాల్లో కేసీ కాలువ పరిధిలో వరినాట్ల సాగు ముమ్మరం కానుంది. కేసీ కింద ఇప్పుడిప్పుడే నారు మడుల సాగులో రైతన్నలు ప్రాజెక్టులు, నదీ పరివాహక ప్రాంతాల్లో సాగు అంతంతమాత్రమే 30,804 హెక్టార్ల సాధారణ సాగుకు 6568.27 హెక్టార్లలో వరిసాగు 21.32 శాతం మేర సాగైన వరి పంట నారుమడులు, వరిసాగు పనుల్లో రైతులునారుమడి సాగు చేశాను.. ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం డ్యాం నిండింది. దీంతో కేసీ కాలువకు రెండు వారాల క్రితమే నీటిని వదిలారు. దీంతో కేసీ కింద రైతులంతా నారుమడులను సాగు చేసే పనిలో బిజీగా ఉన్నారు. నేను కూడా వారం క్రితం నాడు మడిని చల్లాను. మరో రెండు, మూడు వారాల్లో వరిసాగును ప్రారంభిస్తా. – చిరంజీవిరెడ్డి, రైతు, బి. కొత్తపల్లి, ఖాజీపేట మండలంలక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం.. ఏడాది వరిపంట లక్ష్యానికి మంచి సాగయ్యే అవకాశం ఉంది. ఇటీవల వర్షాభావ పరిఽస్థితుల్లో వరిసాగు తగ్గుతుందేమో అనుకున్నాం. కానీ ఎగువ ప్రాంతాల్లో కురిసిన వర్షాలకు శ్రీశైలం డ్యాం నిండింది. దీంతో కేసీ కాలువకు ఇటీవలే నీరు విడుదల చేశారు. ఇక కేసీ పరిధిలోని రైతులందరూ ముమ్మరంగా వరిమడులను సాగు చేసుకుంటున్నారు. మరో పదిహేను రోజుల్లో వరినాట్ల సాగు ముమ్మరం కానుంది. ఈ ఏడాది లక్ష్యానికి మించి సాగయ్యే అవకాశం ఉంది. – చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి -
సెంట్రల్ జైలులో అవినీతి కిరణం!
సాక్షి ప్రతినిధి, కడప : సత్ప్రవర్తన నేర్పించాల్సిన సిబ్బంది స్వయంగా ఖైదీలకు తప్పుడు నడతను అలవాటు చేస్తున్నారు. డబ్బులు ఇస్తే ఎంజాయ్ చేసేందుకు కావాల్సిన సదుపాయాలు సమకూరుస్తున్నారు. ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా? అన్నట్లుగా అవినీతి ‘కిరణం’ అండ చూసుకుని సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. పెట్రోల్ బంకులో చోటుచేసుకున్న అవినీతి విషయంలో ఇప్పటికీ చర్యల్లేవు. వెరసి కడప సెంట్రల్ జైలులో తప్పు మీద తప్పులు దొర్లుతున్నాయి. కడప కేంద్ర కారాగారం తరచూ వార్తల్లోకి ఎక్కుతోంది. ఖైదీలకు కావాల్సిన సదుపాయాలు కల్పించడంలో ఓ ఉన్నతాధికారిది అందెవేసిన చేయిగా చెప్పుకొస్తున్నారు. గతంలో కొందరు ఖైదీలకు ఏకంగా 600 రోజులు ఉపశమనం కల్పించినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ విషయమై లోకాయుక్తకు ఫిర్యాదులు వెళ్లినా నిష్ప్రయోజనమే అయింది. ఉన్నతాధికారి భయాందోళనలకు గురి చేయడంతో సిబ్బంది మౌనం దాల్చారు. ఖైదీలచే నిర్వహిస్తున్న పెట్రోల్ పంపులో సుమారు రూ.7లక్షలు అవినీతికి ఆస్కారమిచ్చారనే ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో ఓ డిప్యూటీ జైలర్ను బాధ్యుడిని చేస్తూ నివేదికలు ఇచ్చారు. ఇప్పటి వరకూ ఎలాంటి చర్యలు లేవు. అలాగే కేంద్ర కారాగారం చుట్టూ కాంపౌండ్ వాల్ నిర్మించేందుకు రూ.3.15 కోట్లు ప్రిజనర్స్ డెవలప్మెంట్ నిధి ద్వారా మంజూరు చేశారు. అందులో మెటీరియల్ కొనుగోలు కమిటీతో సంబంధం లేకుండా రూ.1. 3 కోట్లు ఏకంగా హెడ్ ఆఫీసును తప్పుదారి పట్టించి ప్రొసీజర్స్ను ఉల్లంఘించారు. ఇలాంటివి తరచూ చోటుచేసుకుంటుండడంతో సిబ్బంది సైతం పెడదారి పట్టినట్లు సమాచారం. సీఎంఓకు ఫిర్యాదుల పరంపర.. కడప సెంట్రల్ జైలు ఉన్నతాధికారి ఒకరు ఇష్టానుసారంగా వ్యవహరించారని ప్రొసీజర్స్ ఉల్లంఘించారని, సివిల్ వర్క్స్లో అవినీతికి పాల్పడ్డారని అనేక ఫిర్యాదులు చేస్తూ సీఎం చంద్రబాబునాయుడు, హోంమంత్రి, ప్రిన్సిపల్ సెక్రెటరీ, విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్కు ఫిర్యాదులు వెళ్లాయి. ఇదివరకూ పర్యవేక్షణాధికారిగా పనిచేసి అవినీతికి పాల్పడిన వ్యక్తికే అదనపు బాధ్యతలు కూడా కట్టబెట్టారని చర్యలు తీసుకోవాల్సిందిగా పలువురు ఫిర్యాదుల పరంపరను కొనసాగిస్తున్నట్లు సమాచారం. పెట్రోల్ బంక్లో రూ.7లక్షలు విలువైన ఆయిల్ స్వాహా కాంపౌండ్ వాల్ నిర్మాణంలో నిబంధనలు పాటించని వైనం ఇష్టారాజ్యంగా ప్రవర్తించిన ఓ ఉన్నతాధికారి దొంగ చేతికి తాళమిచ్చినట్లుగా అదనపు బాధ్యతలు -
లారీ ఢీ కొని యువకుడి మృతి
చాపాడు : మైదుకూరు–ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని కేతవరం గ్రామ సమీంపలో సోమవారం లారీ ఢీ కొని మండలంలోని కేతవరం గ్రామానికి చెందిన ఎల్లనూరు సునీల్కుమార్(31)అనే యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఎల్లనూరు ఓబయ్య, వీరమ్మ దంపతుల కుమారుడు సునీల్ కుమార్ ఉదయం 10గంటల సమయంలో కేఏ01ఏవీ 8756 నెంబరు గల బైక్లో మైదుకూరుకు వెళుతుండగా ప్రొద్దుటూరు వైపు నుంచి వస్తున్న టీఎల్ 88జే 2621 నెంబరు గల లారీ బైక్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో సునీల్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనపై చాపాడు పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఐదుగురు బైక్ దొంగల అరెస్టుజమ్మలమడుగు : బైకుల చోరీకి పాల్పడుతున్న ఐదుగురు యువకులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. సోమవారం స్థానిక అర్బన్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. గత నెల 10వతేదీన ప్రొద్దుటూరు రఽహదారిలో హోండా యాక్టివా చోరీకి గురైందంటూ బాధితుడు కొక్కొకోల రామమోహన్ ఫిర్యాదు చేశాడన్నారు. ఈ ఫిర్యాదు మేరకు దర్యాప్తు చేపట్టగా సోమవారం తమకు దొంగల సమాచారం అందిందన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులోని ఎస్ఆర్ పెట్రోల్బంకు వద్ద సిబ్బంది వాహనాలు తనిఖీ చేస్తుండగా ఐదుగురు యువకులు తమ సిబ్బందిని చూసి వాహనాలు వెనక్కి తిప్పుకుని వెళుతుండటంతో సిబ్బంది పట్టుకున్నారన్నారు. వారిని విచారించగా బైకుల దొంగతనాలు చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి వద్ద నుంచి పది లక్షల రూపాయల విలువ గల 9 బైకులు స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ వెల్లడించారు. ఈ సమావేశంలో సీఐ లింగప్ప, ఎస్ఐ హైమావతి, దేవదాసు, రియాజ్, నాగేంద్ర, శివ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ భూములు పేదలకు పంచాలికడప సెవెన్రోడ్స్ : జిల్లాలో అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను గుర్తించి అర్హులైన గ్రామీణ పేదలకు ఒక్కో కుటుంబానికి మూడు ఎకరాలు వ్యవసాయ భూమిగా పంపిణీ చేయాలని సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య డిమాండ్ చేశారు. రాష్ట్ర పిలుపులో భాగంగా సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో ఐదు వేల ఎకరాల భూమి కబ్జాకు గురైందని పేర్కొన్నారు. సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమిని కాపాడి అర్హులకు పంపిణీ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జకరయ్య, రమణ, సీఆర్వీ ప్రసాద్, డబ్ల్యు రాము, ఆంజనేయులు, గంగయ్య, రామాంజనేయులు, సుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
గీత కులాలకు మద్యం బార్ల కేటాయింపు
కడప సెవెన్రోడ్స్ : జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆధ్వర్యంలో జిల్లాలోని రెండు బార్లను గీత కులాల వారికి లాటరీ పద్ధతిలో కేటాయించారు. సోమవారం కలెక్టరేట్లో కడప మునిసిపల్ కార్పొరేషకు సంబంధించి ’గౌడ్’ ఉపకులాలకు, ప్రొద్దుటూరు మునిసిపాలిటీ ’ఈడిగ’ ఉపకులాల వారికి లాటరీ ద్వారా కేటాయించారు. ఈ కార్యక్రమంలో ఎక్సైజ్శాఖ డిప్యూటీ కమిషనర్ జయరాజు, జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ అధికారి రవి కుమార్, జిల్లా ఈడిగ సంఘం సెక్రటరీ సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఐదుగురు
● సబ్జైలులో స్పష్టంగా కనిపిస్తున్న భద్రతాలోపం ● ముగ్గురు సిబ్బందిపై సస్పెన్షన్ వేటు ?ప్రొద్దుటూరు క్రైం : సిబ్బంది ముగ్గురు.. ఖైదీలు ఆరుగురు. ఇది సినిమా టైటిల్ కాదు. ప్రొద్దుటూరు సబ్జైల్లో ఉన్న ఖైదీలు, విధుల్లో ఉన్న సిబ్బంది సంఖ్య. సబ్జైల్లో వివిధ కేసులకు సంబంధించి ఐదుగురు రిమాండు ఖైదీలుగా శిక్ష అనుభవిస్తున్నారు. ముగ్గురు సిబ్బంది విధుల్లో ఉన్నా ఐదుగురిలో ఒక ఖైదీ గోడ దూకి పారిపోయాడు. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. సబ్జైల్లో ఉన్న రిమాండు ఖైదీ మహ్మద్రఫీ శనివారం ఉదయం జైలు గోడ దూకి పారిపోయిన విషయం తెలిసిందే. ఈ ఘటనతో జైల్లో భద్రతా లోపాలు ఉన్నట్లు స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా తక్కువ మంది ఖైదీలు ఉన్నప్పుడు వారిపై నిఘా ఎక్కువగా ఉంటుంది. అయితే ఇక్కడున్న సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరించడంతో 20 అడుగులు మేర ఉన్న గోడ దూకి దొంగ చాకచక్యంగా తప్పించుకున్నాడు. ముఖ్యంగా గోడ చుట్టూ విద్యుత్ తీగలు కూడా ఉన్నాయి. వీటి గుండా దొంగ తప్పించుకొని వెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాలలో స్పష్టంగా కనిపిస్తున్నట్లు పోలీసు అధికారులు చెబుతున్నారు. అయితే విద్యుత్ తీగలను తగలకుండా అతను తప్పించుకొని వెళ్లే విధానాన్ని చూసి పోలీసు అధికారులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఖైదీ గత నేరచరిత్రను ఉన్నతాధికారులకు చెప్పని సిబ్బంది .. నిందితులను అరెస్ట్ చేసిన అనంతరం కోర్టు ఆదేశాల మేరకు పోలీసులు వారిని స్థానికంగా ఉన్న సబ్జైలుకు తరలిస్తారు. జైలుకు తరలించిన తర్వాత అతను పాత నేరస్తుడైతే పోలీసులు ఈ విషయాన్ని జైలు అధికారులకు తెలియజేస్తారు. లేదా రిమాండు రిపోర్టు ఆధారంగా వారి నేర చరిత్రను జైలు అధికారులు తెలుసుకుంటారు. వారిపై ఉన్న కేసుల ఆధారంగా కోర్టు సూచనతో సబ్జైల్లో ఉంచాలా లేక జిల్లా కేంద్రానికి తరలించాలా అనేది ఉన్నతాధికారులు నిర్ణయం తీసుకుంటారు. రాజుపాళెం మండలంలోని టంగుటూరు గ్రామంలో పట్టపగలే చోరీ చేస్తూ పట్టుబడిన మహమ్మద్రఫీని ఈ నెల 13న రాజుపాలెం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండు నిమిత్తం ప్రొద్దుటూరు సబ్జైలుకు తరలించారు. ఇతను అనేక జిల్లాల్లో చోరీలు చేశాడు. నిందితుడిపై 25కు పైగా కేసులు ఉన్నాయి. టంగుటూరు గ్రామంలో చోరీ చేస్తున్న సమయంలో అడ్డు వచ్చిన ఇంటి యజమానిపై మహమ్మద్రఫీ దాడి చేయడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. కరుడుగట్టిన నేరస్తుడైన అతని గత నేర చరిత్ర గురించి పోలీసులు సబ్జైలు అధికారులకు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే మహమ్మద్రఫీపై ఉన్న పాత కేసుల గురించి ఇక్కడి సిబ్బంది జిల్లా జైళ్లశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లలేదని విశ్వసనీయ సమాచారం. కాగా ప్రొద్దుటురు సబ్జైలు నుంచి పారిపోయిన రిమాండు ఖైదీ మహమ్మద్రఫీ కోసం త్రీ టౌన్ పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. సీసీ కెమెరాల ఆధారంగా అతని జాడ కోసం అన్వేషిస్తున్నారు. నేడో రేపో సస్పెన్షన్ ఉత్తర్వులు? రిమాండు ఖైదీ తప్పించుకున్న ఘటనపై ఉన్నతాధికారులు సీరియస్గా ఉన్నారు. రిమాండులో ఐదుగురు మాత్రమే ఖైదీలు ఉన్నా సరైన పర్యవేక్షణ చేయలేదని అధికారులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయాన్ని తీవ్రంగా పరిగణిస్తున్నారు. ఖైదీ పారిపోయిన ఘటనపై జిల్లా సబ్జైళ్ల అధికారి అమర్బాషా విచారణ చేసి పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. విధుల్లో నిర్లక్ష్యం వహించిన ఇన్చార్జి సూపరింటెండెంట్తో పాటు మరో ఇద్దరిపై వేటు పడే అవకాశం ఉంది. శాఖాపరమైన చర్యలకు సంబంధించిన ఆదేశాలు నేడో, రేపో వచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. కాగా 2021లో జమ్మలమడుగు సబ్జైలు నుంచి మహమ్మద్రఫీ తప్పించుకొని పోలేదని, అతనికి బెయిల్ రావడంతో జైలు నుంచి విడుదల చేసినట్లు జిల్లా సబ్ జైళ్ల అధికారి అమర్బాషా తెలిపారు. -
రోడ్డుప్రమాదంలో ఇద్దరికి తీవ్రగాయాలు
గాయపడిన నజీర్ఖాన్, అమరనాథ్మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి పరిస్థితి విషమించిన ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. సీటీఎం పంచాయతీ నేతాజీకాలనీకి చెందిన నజీర్ఖాన్ (40) రైల్వేక్వార్టర్స్కు చెందిన అమరనాథ్ (38) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చారు. తిరిగి రాత్రి సీటీఎంకు వెళుతుండగా మార్గమధ్యలో శానిటోరియం వద్ద వేగంగా వెళ్లి ముందు వెళుతున్న ట్రాక్టర్ను ఢీకొని, పక్కనే వస్తున్న కారుపై పడ్డారు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితులను తిరుపతికి రెఫర్ చేశారు. -
ప్రవక్త జీవితంపై రాత పోటీ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్ : మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపైన సెప్టెంబర్ 21వ తేదీన రాత పోటీ పరీక్షలను నిర్వహిస్తున్నామని కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ఎఫ్ ఎం ముక్తార్ అహ్మద్ తెలిపారు. ఆదివారం కడప నగరంలోని అఫ్సర్ కాలనీలో ఉన్న కార్యాలయంలో కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఆధ్వర్యంలో విశ్వ కారుణ్యమూర్తి ప్రవక్త మొహమ్మద్ (సల్లెల్లాహు అలైహి వసల్లం) వారి జీవిత చరిత్రపై నిర్వహించే రాత పరీక్ష పోటీలకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రపై ఉర్దూ, ఇంగ్లీష్, తెలుగు భాషలలో రాత పరీక్ష పోటీలు నిర్వహించనున్నామని తెలిపారు. ఆన్లైన్ అప్లికేషన్ కోసంం http://Seerat.ciwskadapa.org/ సదుపాయాన్ని సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో కడప ఇస్లామిక్ వెల్ఫేర్ సొసైటీ ఉపాధ్యక్షుడు సయ్యద్ హిదాయతుల్లా, ధర్మ పరిచయ కమిటీ డైరెక్టర్ సయ్యద్ అహ్మద్ బాబు భాయ్ తదితరులు పాల్గొన్నారు. -
డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలి
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీ 2003 ఉపాధ్యాయులకు పాత పెన్షన్ వర్తింపజేయాలని వైఎస్సార్ కడప జిల్లా డీఎస్సీ 2003 ఉపాధ్యాయుల ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్ కోరారు. 2003 డీఎస్సీ ఉపాధ్యాయులకు పాత పెన్షన్ కోసం ఈ నెల 25వ తేదీ విజయవాడలో మహా ధర్నా నిర్వహిస్తున్నామని తెలిపారు. ఇందుకు సంబంధించిన పోస్టర్ను ఆదివారం కడప ఎన్జీఓ భన్లో ఏపీ ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు బి. శ్రీనివాసులు, ప్రధాన కార్యదర్శి రవికుమార్, పీఆర్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మోపూరి శివారెడ్డి, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు ఇలియాస్బాషా, ఏపీటీఎఫ్–1938 జిల్లా ప్రధాన కార్యదర్శి అబ్దుల్లా, యూటీఎఫ్ జిల్లా కోశాధికారి నరసింహారావు, వైఎస్సార్టీఏ రాష్ట్ర నాయకుడు సజ్జల రమణారెడ్డి, ఏపీటీఎఫ్ 257 జిల్లా నాయకుడు రామచంద్రారెడ్డి, ఆపస్ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు, డీఎస్సీ 2003 ఫోరం జిల్లా కన్వీనర్లు ఉదయ భాస్కర్, వీరప్రతాప్, శోభారాణి తదితరులు మాట్లాడారు. ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్,సుధాకర్, ప్రవీణ్కిరణ్, నాగేశ్వరెడ్డి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ప్రారంభం
కడప కార్పొరేషన్ : కడప నగరం శంకరాపురంలో అంధుల పాఠశాల ఎదురుగా నూతనంగా ఏర్పాటు చేసిన ఏషియన్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ను హైదరాబాద్కు చెందిన ఏఐజీ గ్రూప్ ఆఫ్ హాస్పిటల్స్ చైర్మన్, పద్మ విభూషణ్ డాక్టర్ డి. నాగేశ్వర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అత్యాధునిక వైద్య పరికరాలు, నిపుణులైన వైద్యులతో మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ ఏర్పాటు చేసిన డాక్టర్ జి. రితేష్రెడ్డి, డాక్టర్ శ్రావ్యా రెడ్డిలకు అభినందనలు తెలిపారు. ఇక్కడ 24 గంటలు అందుబాటులో ఉండే వైద్య సేవలను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ జి. మాధవరెడ్డి, డాక్టర్ శ్రీదేవి, కాంట్రాక్టర్ ఎం.నాగసుబ్బారెడ్డి, ఎం. మునిరెడ్డి, పలువురు వైద్యులు, తదితరులు పాల్గొన్నారు. -
బ్రౌన్ గ్రంథాలయానికి బీరువా, పుస్తకాల బహూకరణ
కడప ఎడ్యుకేషన్ : తప్పెట్ల కొత్తపల్లికి చెందిన దివంగత మల్లిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి జ్ఞాపకార్థం బీరువాను, ఆయన వ్యక్తిగత గ్రంథాలయంలోని వంద పుస్తకాలను ఆయన కుమారుడు, పెన్నా సిమెంట్స్ విశ్రాంత జనరల్ మేనేజర్ మల్లిరెడ్డి సుబ్బారెడ్డి ఆదివారం సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రానికి బహూకరించారు. సహాయ పరిశోధకులు డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ్ణశాస్త్రి, గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణ రావు, ఎన్.రమేశ్రావు, జూనియర్ అసిస్టెంట్ ఆర్.వెంకటరమణ వాటిని స్వీకరించారు. పరిశోధన కేంద్రం సంచాలకులు ఆచా ర్య జి.పార్వతి మాట్లాడుతూ వారు బహూకరించిన విలువైన గ్రంథాల్లో విష్ణు పురాణం, వామన పురాణం, శ్రీమద్భాగవతం (వ్యాసుడు), ఆంధ్ర మహాభారతం, పోతన భాగవతం, శివరాత్రి మాహాత్మ్యం, శ్రీమద్భగవద్గీత, ఆంధ్రవాల్మీకి రామాయణం, కాళికాంబా సప్తశతి తదితర పుస్తకాలు ఉన్నాయన్నారు. అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణమదనపల్లె రూరల్ : పశ్చిమబెంగాల్వాసి అనుమానాస్పద మృతిపై సమగ్ర విచారణ చేస్తున్నట్లు రైల్వే సీఐ అశోక్కుమార్ తెలిపారు. ఆదివారం పశ్చిమబెంగాల్వాసి ఖదీర్ మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు అప్పగించారు. ఉపాధికోసం పశ్చిమబెంగాల్ ముర్షీదాబాద్ ఇమామ్నగర్కు చెందిన ఎస్.కే.మైముల్ కుమారుడు ఎస్.కే.ఖదీర్(30) మదనపల్లెకు వచ్చి రోడ్డు, భవననిర్మాణ పనులు చేస్తూ కురబలకోట మండలం రైల్వేబ్రిడ్జి సమీపంలో షెడ్ నిర్మించుకుని మరో ఇద్దరితో కలిసి ఉంటున్నాడు. నెలరోజుల క్రితం స్వగ్రామానికి వెళ్లి తిరిగి వచ్చాడు. ఈనెల 15 శుక్రవారం తనకు పరిచయస్తుడైన ఆటోడ్రైవర్తో కలిసి ఇంటి నుంచి వెళ్లాడు. శనివారం మదనపల్లె మండలం సీటీఎం రైల్వే అండర్బ్రిడ్జి సమీపంలో శవమై కనిపించాడు. ఆటోడ్రైవర్ ఆచూకీ కోసం గాలిస్తున్నట్లు సీఐ తెలిపారు. అన్ని కోణాల్లోనూ కేసు విచారిస్తున్నామన్నారు. పోస్టుమార్టం నివేదిక అనంతరం మృతికి గల కారణాలు తెలుస్తాయన్నారు. ఇంటిలో చోరీగాలివీడు : మండల కేంద్రమైన గాలివీడులోని గౌతమ్ స్కూలు సమీపంలో శనివారం రాత్రి ఓ ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు బీగాలు పగులగొట్టి చోరీకి పాల్పడిన సంఘటన జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఆటో డ్రైవర్ ఎం.మల్లయ్య శనివారం తన అత్తగారింటికి వెళ్లడంతో గమనించిన గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులగొట్టి అల్మారాలో ఉన్న రూ. 3 లక్షల నగదు, 12 తులాల బంగారు నగలను అపహరించినట్లు బాధితుడు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు ఎస్ఐ రామకృష్ణ సంఘటన స్థలానికి చేరుకుని అక్కడి పరిస్థితులు పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు. దొంగతనం చేసిన నగదు, బంగారు ఆభరణాల రశీదుల వివరాలను స్టేషన్లో సమర్పించాలన్నారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ మండల ప్రజలు ఊర్లకు వెళ్లే సమయంలో విలువైన వస్తువులు ఇళ్లలో పెట్టరాదని, బ్యాంకు లాకర్లో భద్ర పరుచుకోవాలన్నారు. అలాగే ఊర్లకు వెళ్లే సమయంలో సమాచారం పోలీసు స్టేషన్లో తెలియజేస్తే ఆ ఇంటిపై పోలీసుల నిఘా ఉంటుందన్నారు. ప్రస్తుతం జరిగిన సంఘటనపై పూర్తి విచారణ జరిపి కేసు నమోదు చేస్తామన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని కేశలింగాయపల్లెకు సమీపంలో రోడ్డు నిర్మాణంలో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో పడి స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుగ్గిళ్ల జగదీష్ (18) అనే యువకుడు మృతి చెందాడు. శనివారం అర్ధరాత్రి దాటిన తర్వాత జరిగిన ఈ సంఘటన గురించి పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఇందిరమ్మ కాలనీకి చెందిన ఏడుగురు 20 ఏళ్లలోపు యువకులు మండలంలోని గంజికుంటలో ఓ వివాహ వేడుక సందర్భంగా డీజే ఏర్పాటు చేసినట్టు తెలుసుకున్నారు. శనివారం రాత్రి కాలనీ నుంచి రెండ బైకుల్లో గంజికుంటకు వెళ్లారు. రాత్రి 12 గంటల తర్వాత గంజికుంట నుంచి వారు తిరిగి వస్తుండగా కేశలింగాయపల్లె సమీపంలో మైదుకూరు – తాడిచర్ల రోడ్డు విస్తరణ పనుల్లో భాగంగా తవ్విన కల్వర్టు గుంతలో నలుగురు ప్రయాణిస్తున్న బైక్ పడిపోయింది. బైక్పై ఉన్న ముగ్గురికి స్వల్పగాయాలు కాగా జగదీష్ తలకు తీవ్ర గాయమైంది. అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్లు వైద్యులు చెప్పారు. సంఘటనపై మృతుడి తండ్రి నరసింహులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. -
సౌదీ అరేబియాలో కుమార్లకాల్వ వాసి మృతి
చక్రాయపేట : జీవనోపాధి కోసం సౌదీ అరేబియాకు వెళ్లిన చక్రాయపేట మండలం కుమార్లకాల్వకు చెందిన షేక్ నూర్బాషా(38) మృతి చెందాడు. ఆదివారం భారత కాలమానం ప్రకారం మధ్యాహ్నం 12–30 గంటలకు మృతి చెందినట్లు అక్కడ ఉన్న అతని మిత్రులు కుటుంబీకులకు సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి నూర్బాషా బంధువులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఇతను బతుకు దెరువు నిమిత్తం 15 సంవత్సరాల క్రితం సౌదీ అరేబియాలోని దమామ్కు వెళ్లాడు. ఐదు నెలల క్రితం సెలవుపై స్వగ్రామానికి వచ్చి భార్యా బిడ్డలు, బంధుమిత్రులతో హాయిగా గడిపి తిరిగి దమామ్ వెళ్లాడు. ఆదివారం విధులకు హాజరయ్యేందుకు కాలకృత్యాలు తీర్చుకునేందుకు బాత్ రూమ్లోకి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడిపోయాడు. బాత్రూం నుంచి ఎంత సేపటికి రాకపోవడంతో మిత్రులు వెళ్లి చూడగా కిందపడి మృతిచెంది ఉన్నాడు. ఈ విషయాన్ని నూర్బాషా మిత్రులు కుమార్లకాల్వలోని కుటుంబీకులకు ఫోన్ ద్వారా తెలియజేశారు. విషయం తెలియగానే వారు కన్నీరు మున్నీరుగా విలపించారు. మృతుడికి భార్య గౌసియా, ఆర్షియా, రియాజ్, రిజ్వాన్ అనే 10 సంవత్సరాల లోపు పిల్లలు, వృద్ధురాలైన తల్లి ఉన్నారు. మృతదేహాన్ని కుమార్ల కాల్వకు రప్పించేందుకు కృషి చేయాలని అధికార పార్టీ నేతలను కోరినట్లు మృతుడి బంధువు మిఠాయిగిరి కరీముల్లా తెలిపారు. -
ఓసీలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలి
కలసపాడు : ఓసీలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లు మంజూరు చేయాలని అఖిల భారత రెడ్డి సంఘం రాష్ట్ర అధ్యక్షుడు నారుపల్లె జగన్మోహన్రెడ్డి కోరారు. ఆదివారం మండలంలోని రెడ్డిపల్లెలో ఆయన మాట్లాడుతూ ఓసీ జాబితాలో ఉన్న రెడ్లు, బ్రాహ్మణులు, కమ్మ, బలిజ, ఆర్యవైశ్య తదితర ఎన్నో కులాల్లో నిరుపేదలైన వారు ఉన్నారన్నారు. వారికి సరైన ఉద్యోగ అవకాశాలు లేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు. కేంద్ర ప్రభుత్వం 10 ఎకరాల లోపు భూమి ఉన్న వారికి ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్ మంజూరు చేయాలని సూచించిందన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయడం లేదన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం నిరుపేదలైన ఓసీలకు ఈడబ్ల్యూఎస్ సర్టిఫికెట్లను మంజూరు చేసి విద్య, ఉద్యోగ అవకాశాలు కల్పించాలని, నిరుద్యోగ భృతి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో అఖిల భారత రెడ్డి సంఘం నాయకులు అమ్మిరెడ్డి వెంకటనాగిరెడ్డి, ఎర్రగుంట్ల నాగమోహన్రెడ్డి, తుమ్మల కొండారెడ్డి, గువ్వల వెంకట సుబ్బారెడ్డి, పోలక సుబ్బారెడ్డి, రామమోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
విష జ్వరంతో విద్యార్థి మృతి
వేంపల్లె : వేంపల్లె పట్టణం శ్రీరాం నగర్ వీధిలోని ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్న విద్యార్థి బింగి రఘువరన్ ఆదివారం సాయంత్రం విష జ్వరంతో మృతి చెందాడు. కళాశాల రోడ్డులోని శ్రీరామ్నగర్లో నివాసముంటున్న బింగి ఓబులేసు, భారతిలకు ఇద్దరు పిల్లలు ఉండగా, రఘువరన్ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో 4వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం విద్యార్థికి జ్వరం రావడంతో వేంపల్లెలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రులలో చూపించినట్లు తండ్రి ఓబులేసు తెలిపారు. రఘువరన్కు జ్వరం తగ్గకపోవడంతో కడప రిమ్స్కు తరలించి చికిత్స చేసి మెదడుకు జ్వరం సోకినట్లు వైద్యులు చెప్పడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్, రుయాకు తీసుకెళ్లారు. అయితే స్విమ్స్, రూయాలో బెడ్లు లేకపోవడంతో తిరిగి కడప రిమ్స్కు తీసుకొచ్చి రఘువరన్కు చికిత్స చేయించారు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పాఠశాల ఉపాధ్యాయులు విద్యార్థి మృతదేహం వద్ద నివాళులర్పించి కుటుంబ సభ్యులను ఓదార్చారు. శ్రీరామ్నగర్ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
బద్వేలు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి
బద్వేలు అర్బన్ : బద్వేలు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని, లేనిపక్షంలో బ్రహ్మంగారిపేరుతో ప్రత్యేక జిల్లాను ఏర్పాటు చేయాలని ప్రజా సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బద్వేలు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలోకి చేర్చుతున్నట్లు ప్రచారం జరుగుతున్న నేపథ్యంలో ఆదివారం స్థానిక ఎన్జీవో హోంలో ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో సీనియర్ న్యాయవాది దేవిరెడ్డి బ్రహ్మారెడ్డి, బీసీ సంఘం నాయకుడు బి.సి.రమణ మాట్లాడుతూ బద్వేలు నియోజకవర్గాన్ని అన్నమయ్య జిల్లాలో చేర్చడం వలన నియోజకవర్గ ప్రజలు అనేక రకాల వ్యయప్రయాసలకు గురికావాల్సి వస్తుందని అన్నారు. జిల్లాలో అత్యంత వెనుకబడిన ప్రాంతమైన బద్వేలు నియోజకవర్గాన్ని అభివృద్ధి చేయాల్సిందిపోయి వేరొక జిల్లాలోకి మార్చడం తగదన్నారు. బద్వేలు నియోజకవర్గ ప్రజల మనోభావాలను గుర్తించి బద్వేలు నియోజకవర్గాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలని, అలా కుదరని పక్షంలో బద్వేలు నియోజకవర్గంతో పాటు గిద్దలూరు వరకు ఉన్న గ్రామాలు, ఆత్మకూరు సమీపంలోని ఉదయగిరి వరకు ఉన్న గ్రామాలతో పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి పేరుతో ప్రత్యేక జిల్లాగా ఏర్పాటు చేయాలని కోరారు. సమావేశంలో బద్వేలు పట్టణాభివృద్ధి సొసైటీ అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు, పూలే అంబేడ్కర్ రాజ్యాధికార సమితి రాష్ట్ర నాయకుడు పిచ్చయ్య, సీనియర్ దళిత నాయకుడు ఓ.ఎస్.వి.ప్రసాద్, బలిజ సంఘం నాయకుడు కిరణ్, బీజేపీ నాయకుడు వెంకటసుబ్బయ్య, బీఎస్పీ నాయకుడు గౌస్పీర్, కవి ఇరుపోతు శ్రీనివాసవర్మ, సోమశిల వెనుకజలాల సాధన సమితి అధ్యక్షుడు చంద్రశేఖర్ యాదవ్, పెన్షనర్స్ అసోసియేషన్ కార్యదర్శి రమణయ్య, ఉపాధ్యాయ సంఘం నాయకులు సి.రామచంద్రారెడ్డి, ఆవులవెంకట్, ప్రైవేటు పాఠశాలల, కళాశాలల అసోసియేషన్ నాయకులు నాగేశ్వర్రావు, చంద్రఓబుల్రెడ్డి, శంకర్రెడ్డి, మస్తాన్రెడ్డి, సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధుల పట్ల ఆదరణ చూపాలి
కడప సెవెన్రోడ్స్ : జీవిత చరమాంకంలో ఉన్న వృద్ధుల పట్ల ప్రతి ఒక్కరూ ఆదరణ చూపుతూ వారికి తమవంతుగా తోడ్పాటు అందించాలని ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు ఎం. బాలకష్ణారెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు సి.వెంకటరెడ్డి, రాష్ట్ర మాజీ కార్యదర్శి పి.రామసుబ్బారెడ్డిలు సూచించారు. ఆదివారం ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే) 69వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా కడప నగరంలోని జడ్పీ కాంప్లెక్స్లో ఉన్న ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జర్నలిస్టుల సమస్యలు, సంక్షేమం కోసం ఎప్పటికప్పుడు పోరాటం చేసే యూనియన్గా కొనసాగుతున్న ఏపీయూడబ్ల్యుజే వద్ధుల సమక్షంలో వ్యవస్థాపక దినాన్ని జరుపుకోవడం ఆనందంగా ఉందన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తల్లిదండ్రులే మన జీవితానికి పునాది వేశారని, మన బాల్యంలో తల్లిదండ్రులు చూపిన ప్రేమను తిరిగి ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు. వృద్ధులను మనం ఆదరించడం ద్వారా చిన్నపిల్లలకు కూడా మానవత్వపు విలువలు తెలియజేసిన వారమవుతామన్నారు. ప్రేమాలయం నిరాశ్రయుల వసతి గృహం మేనేజర్ శ్రీనివాసులురెడ్డి, పాత్రికేయలు శివరాం, ఆంజనేయులు, శ్రీనివాసులు, పెన్నేరు శర్మ, మౌలా, నాగరాజు, సర్దార్, వీరనారాయణ, దేవేంద్ర తదితరులు పాల్గొన్నారు.ఏపీయూడబ్ల్యుజే నాయకులు -
వైఎస్ జగన్ పర్యటన ఖరారు!
రాజంపేట: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 19న రాజంపేట మండలం ఆకేపాడు రానున్నారు. ఆయన పర్యటన షెడ్యూల్ ఖరారు అయిందని రాజంపేట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి ఆదివారం విలేకర్లకు తెలిపారు.రాజంపేట ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జరుగుతున్న ఆకేపాటి సాయిఅనురాగ్రెడ్డి, వరదీక్షితా నవదంపతుల రిసెప్షన్కు వైఎస్ జగన్మోహన్రెడ్డి విచ్చేసి, నవదంపతులను ఆయన ఆశీర్వదించనున్నారన్నారు. ఆకేపాటి ఎస్టేట్లో రిసెప్షన్ వేడుక జరగుతుందని తెలిపారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెంగళూరు నుంచి రాజంపేటకు హెలీక్యాప్టర్లో వస్తారన్నారు. ఇందుకోస హెలీప్యాడ్ సిద్ధం చేస్తున్నామన్నారు. ఉదయం పది గంటలకు బయలుదేరుతారన్నారు. తిరిగి ఆకేపాడు ఎస్టేట్ నుంచి 12.35 గంటలకు బయలుదేరి బెంగళూరుకు వెళతారన్నారు. వైఎస్జగన్మోహన్రెడ్డి వస్తున్న తరుణంలో భారీగా ప్రజలు వచ్చే అవకాశం ఉందని,, అందుకు తగ్గట్టుగా ఏర్పాట్లు చేస్తున్నామని ఆకేపాటి అనిల్రెడ్డి తెలిపారు.పర్యటన వివరాలు..ఉదయం 10గంటలకు బెంగళూరులోని యలహంక నుంచి బయలుదేరుతారు. రోడ్డుమార్గంలో 10.20కి చేరుకుంటారు, 10.30గంటలకు జక్కురు ఎయిర్డ్రోమ్ నుంచి హెలీక్యాప్టర్లో బయలుదేరుతారు. 11.30గంటలకు ఆకేపాడులోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గంలో 11.40గంటలకు ఆకేపాటి ఎస్టేట్కు చేరుకుంటారు. 12 గంటల నుంచి 12.15 వరకు ఆకేపాటి ఎస్టేట్లో ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్రెడ్డి తనయుడు రిసెప్షన్ వేడుకల్లో పాల్గొంటారు. 12.25కు హెలీప్యాడ్కు చేరుకుంటారు. 12.35కు జక్కూరు ఎయిర్డ్రోమ్ బెంగళూరుకు చేరుకుంటారు. అక్కడి నుంచి 1.40 గంటలకు బయలుదేరి 2గంటలకు యలహంకలోని రెసిడెన్సీకి చేరుకుంటారు. -
● కలెక్టర్ గారూ.. మీరేం చెప్పదలుచుకున్నారు!
కడప సెవెన్రోడ్స్: పంద్రాగస్టు రోజు కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి, జిల్లా అధికారుల మధ్య తలెత్తిన వివాదం ఇంకా సమసిపోలేదు. ఇరువర్గాలు పరస్పరం విమర్శనాస్త్రాలు సంధించుకుంటున్నాయి. కలెక్టర్ ఈ అంశాన్ని ప్రభుత్వానికి నివేదించాలని రెవెన్యూ అధికారులు పట్టుబడుతున్నారు. ఈ మొత్తం వివాదానికి కారణమైన ప్రొటోకాల్ అంశం మరోమారు చర్చనీయాంశంగా మారింది. రెవెన్యూ అధికారులు తొలి నుంచి ప్రొటోకాల్ గాలికి వదిలేసి అధికార టీడీపీ నేతలతో సాగిల పడే ధోరణే ఇంతవరకు తీసుకొచ్చిందనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. ఎలాంటి ప్రొటోకాల్ లేని టీడీపీ నేతలకు ప్రభుత్వ కార్యక్రమాలు, జిల్లా సమీక్షా కమిటీ లాంటి ముఖ్యమైన సమావేశాల్లో పెద్దపీట వేస్తూ వస్తున్నారు. ఎమ్మెల్యే భర్తకు ప్రభుత్వ హోదానా! తెలుగుదేశం పార్టీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డికి ఎటువంటి ప్రభుత్వ హోదా లేదు. ఆయనేం ప్రజాప్రతినిధి కాదు. అయినా ‘ఎమ్మెల్యే భర్త’గా డీఆర్సీ సహా ప్రతి ప్రభుత్వ కార్యక్రమాల్లో వేదికపై దర్శనమిస్తుంటారు. అంతటితో ఆగకుండా అధికారులకు ఆదేశాలు జారీ చేస్తుంటారు. ప్రభుత్వ వేదికల నుంచి రాజకీయ విమర్శలు గుప్పించినా కలెక్టర్ సహా ఏ అధికారి అడ్డు చెప్ప లేదు. పలుమార్లు ఈ విషయాలు పత్రికల్లో ప్రచురితమైనా అధికారులు స్పందించలేదు. ఇప్పుడు తమవంతు వచ్చేసరికి ప్రొటోకాల్ గురించి మాట్లాడితే దాని విలువ ఏముంటుందనే ప్రశ్న లు ఉత్పన్నమవుతున్నాయి. ఎద్దుల ఈశ్వర్రెడ్డి ప్రస్తావన జిల్లాకు చెందిన ఎద్దుల ఈశ్వర్ రెడ్డి ప్రముఖ స్వాతంత్య్ర సమరయోధుడు, ఓమారు ఎమ్మెల్సీ గా, నాలుగు పర్యాయాలు కడప లోక్సభ సభ్యునిగా ప్రజలకు విశేష సేవలు అందించిన కమ్యూనిస్టు నాయకుడు. ఆయన ఎంపీగా ఉన్నప్పుడు ఏదైనా ప్రజా సమస్యలపై కలెక్టర్ వద్దకు వచ్చినపుడు తొలుత చీటీ రాసి పంపించేవారట. ‘నేరుగా వెళ్లండి సార్...’ అంటూ అధికారులు చెప్పినా సున్నితంగా తిరస్కరించేవారు. కలెక్టర్ అనుమతి వచ్చాకే చాంబర్లోకి వెళ్లి సమస్యను విన్నవించేవారు. ఆయన హూందాతనం గురించి ఈ సందర్భంగా పలువురు సీనియర్ ఉద్యోగులు, నగర పౌరులు చర్చించుకుంటున్నారు. జిల్లాకు చెందిన ప్రజాప్రతినిధులు తొలుత ప్రొటోకాల్ క్రమాన్ని తెలుసుకుని హుందాగా ప్రవర్తిస్తే బాగుంటుందని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్వాతంత్య్ర దినోత్సవ కార్యక్రమంలో మంత్రి, కలెక్టర్, ఎస్పీ మాత్రమే వేదికపై కూర్చొవాల్సి ఉంటుందని రెవెన్యూ అధికారులు ప్రొటోకాల్ను ఊటంకిస్తూ మాట్లాడుతున్నారు. అలాంటపుడు వేదికపై ప్రత్యేకంగా కుర్చీవేసి ఆశీనులు కావాలంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డిని ఆహ్వానించడమంటే నిబంధనలు ఉల్లంఘించడం కాదా? ప్రొటోకాల్ లేదని స్పష్టంగా తెలిసినా డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, జాయింట్ కలెక్టర్ అదితిసింగ్లే కాకుండా స్వయంగా కలెక్టరే వెళ్లి ఎమ్మెల్యేను వేదికపైకి ఆహ్వానించడాన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలి? పైగా ప్రొటోకాల్ విషయంలో భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు జరగకుండా అప్రమత్తతో, ప్రత్యేక శ్రద్దతో వ్యవహరించాలంటూ కలెక్టర్ శ్రీధర్ శనివారం టెలీ కాన్ఫరెన్స్ ద్వారా రెవెన్యూ అధికారులకు ఉద్భోదించడం ఏమిటనే ప్రశ్నలు వ్యక్తమవుతున్నాయి. ఎమ్మెల్యే మాధవి రెడ్డి జాయింట్ కలెక్టర్పై, ఆమె భర్త శ్రీనివాసులురెడ్డి డీఆర్వోపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేసినా దిక్కులేదంటే ఇక తమకేదైనా జరిగితే ఎవరు పట్టించుకుంటారని కిందిస్థాయి అధికారులు చర్చించుకుంటున్నారు. ఇలా ఉదాసీనంగా వ్యవహరిస్తే భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం అయ్యే అవకాశం ఉంటుందని వారు ఆందోళన చెందుతున్నారు. రెవెన్యూ తీరు వల్లే కడప ఎమ్మెల్యే కుర్చీ రగడ ఏ హోదా లేకున్నాడీఆర్సీ సమావేశాల్లో టీడీపీ నేతలకు పెద్దపీట అదే మర్యాద కోసం స్వాతంత్య్ర వేడుకల్లో అధికారులపై చిందులు తొలుతే అడ్డుకట్ట వేసి ఉంటే ఈ పరిస్థితి తలెత్తేతి కాదు -
పు డ మి ప ర వ శం
నల్లని మబ్బు బరువాపుకోలేక చినుకై నేలవాలింది.. నేల తల్లి పచ్చని కోక కట్టి ఎంచక్కా మురిసిపోయింది.. తరువులు తన్మయంగా ఊగిపోతుంటే.. చెరువులు గలగలల సరాగాల్లో ‘మునిగి’ తేలుతుంటే.. తెల్లని మేఘమొకటి కొండచాటుగా ఆ అందాన్ని చూసి తరిచింది.. జడిపట్టిన వానకు కొండాకోన తడిసిముద్దయ్యాయి. నదీ పరీవాహక ప్రాంతాలు ఇదిగో ఇలా పచ్చగా కనువిందు చేస్తున్నాయి. ఆదివారం కడప– సిద్దవటం మార్గంలోని మాచుపల్లె వద్ద కనిపించిన ప్రకృతి దృశ్యమిద. ఉధృతంగా ప్రవహిస్తున్న పెన్నా -
అధికారుల ఉదాసీనతే కారణం
ప్రభుత్వ కార్యక్రమాలు, సమావేశాల సందర్భంగా ఏ హోదా లేని టీడీపీ నాయకులు వేదికలను పంచుకున్నారు. ఇందుకు కలెక్టర్ మొదలు ఏ అధికారి అభ్యంతరం చెప్పలేదు. దీంతో తాను ఏం చేసినా చెల్లుతుందనే భావన నాయకుల్లో ఏర్పడింది. ఇప్పటికైనా అధికారులు ప్రొటోకాల్ను సమర్థవంతంగా అమలు చేస్తే ఇలాంటివి పునరావృతం కావు. – కేసీ బాదుల్లా, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు, కడప అధికారుల వైఖరే కారణం అధికారులు అధికారులుగా వ్యవహరించాలి. అలా కాకుండా అధికార పార్టీ నాయకుల అడుగులకు మడుగులొత్తితే ఇలాంటి పరిణామాలే ఎదురవుతాయి. తాము ప్రజా సేవకులన్న విషయాన్ని పూర్తిగా మరిచిపోయారు. బాధ్యతగల ప్రజాప్రతినిధులు హుందాగా వ్యవహారించడం అలవర్చుకోవాలి. – సీఆర్వీ ప్రసాద్, జిల్లా కన్వీనర్, హేతువాద సంఘం, కడప