breaking news
YSR District Latest News
-
యువతి అదృశ్యం
మైదుకూరు : పట్టణంలోని బద్వేలు రోడ్డుకు చెందిన 23 ఏళ్ల యువతి కనిపించడం లేదని యువతి తల్లి నాగసుబ్బమ్మ సోమవారం మైదుకూరు అర్బన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆరు నెలల కిందట డిగ్రీ పూర్తి చేసి ఇంటి వద్దనే ఉంటున్న తన కుమార్తె ఆదివారం ఇంటి నుండి బయటకు వెళ్లి తిరిగి రాలేదని తల్లి ఫిర్యాదులో పేర్కొన్నారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిలింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామంలో విద్యుదాఘాతానికి గురై యామవరం మధు (48) అనే వ్యక్తి మంగళవారం సాయంత్రం మృతి చెందాడు. ఈయన గత 20ఏళ్లుగా పార్నపల్లె గ్రామానికి చెందిన గొర్తి రాఘవయ్య పొలంలో పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సాయంత్రం 4.30 ప్రాంతంలో పొలంలో పనులు చేస్తుండగా కరెంట్ వచ్చిన వెంటనే మోటార్ ఆన్ చేయడానికి స్టార్టర్ వద్దకు వెళ్లాడు. స్టార్టర్ను తాకగానే విద్యుత్ సరఫరా అయ్యి అపస్మారక స్థితిలో పడిపోయాడు. వెంటనే అక్కడ ఉన్న రాఘవయ్య, స్థానికులు 108 వాహనం ద్వారా పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ డాక్టర్ పరీక్షించి మధు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు. ఎరువుల దుకాణాల తనిఖీరాజంపేట రూరల్ : పట్టణంలోని పలు విత్తన, ఎరువుల దుకాణాలను రాజంపేట ఏడీఏ ప్రజాపతి మల్లికార్జునతో కలిసి జిల్లా సహాయ వ్యవసాయ సంచాలకులు (ఏడీఏ) మస్జీద్ అహమ్మద్ సోమవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లో రికార్డులను పరిశీలించారు. పలు దుకాణాల్లో ఫారం ఓలో సమయం మించిపోవటం వల్ల రూ.33, 12,881 లక్షల విలువ గల ఎరువుల అమ్మకాలను నిలుపుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ డీలర్లు తమ అమ్మకాల వివరాలను ఏపీఏఐఎంఎస్ అప్లికేషన్లో డీలర్ తప్పనిసరిగా పొందుపరచాలని తెలిపారు. డీబీటీ, స్టాక్ రిజిస్టర్, గ్రౌండ్ బ్యాలెన్స్ ప్రతి రోజు ట్యాలీ చేసుకోవాలని సూచించారు. ప్రతి రైతుకు కొనుగోలుకు సంబంధించి రసీదును ఇవ్వాలని ఆదేశించారు. ఈ తనిఖీలలో ఎంఏఓ జీ.నాగలక్ష్మీ, ఏఈఓ సురేష్, బీటీఎం సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. -
ఆటో ను ఢీ కొన్న లారీ.. ముగ్గురికి గాయాలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ సీతారాముల కల్యాణ వేదిక సమీపంలో ఆటో ను లారీ ఢీ కొట్టిన ఘటనలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు..ఉమ్మడిగుంటపల్లి గ్రామానికి చెందిన కృష్ణయ్య ఆటోలో ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకొని ఒంటిమిట్ట నుంచి భాకరాపేటకు వెళుతుండగా శ్రీ సీతారాముల కల్యాణ వేదిక వద్దకు రాగానే కోడూరులో సిమెంట్ అన్లోడ్ చేసి, తిరిగి కమలాపురానికి వెళుతున్న లారీ ఆటోను వెనుక వైపు నుంచి ఢీ కొట్టింది. దీంతో ఆటో రోడ్డు పక్కనే ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ఘటనలో ఆటో డ్రైవర్ కృష్ణ(45)కు తలకు బలమైన గాయమైంది. కాలు విరిగింది. ప్రయాణికులు మలకాటిపల్లికి చెందిన కృష్ణయ్య(63), తప్పెటవారిపల్లికి చెందిన లక్షుమ్మలకు తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను 108 లో కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తుపాన్ వాహనం ఢీకొని.. పులివెందుల రూరల్ : పులివెందులలోని సెంట్రల్ బోలేవార్డులో ఆదివారం జరిగిన రోడ్డుప్రమాదంలో ఒక వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. వివరాలు..పట్టణంలోని క్రిస్టియన్లైన్ కాలనీకి చెందిన ప్రశాంత్ ఆసుపత్రికి వెళ్లి తిరిగి ఇంటికి వస్తుండగా ఎదురుగా వస్తున్న తుపాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ప్రశాంత్ కాలు విరిగింది.అతన్ని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ ప్రసాదరావు తెలిపారు. -
చర్చి స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి
చాపాడు : మండలంలోని శ్రీరాములపేటలో ఉన్న చర్చి స్థలం ఆక్రమణపై చర్యలు తీసుకోవాలని ఎమ్మార్పీఎస్ మండల అధ్యక్షుడు రమేష్ పేర్కొన్నారు. ఈ మేరకు స్థానిక మండల రెవెన్యూ కార్యాలయం వద్ద సోమవారం దళితులు ఆందోళన నిర్వహించారు. అనంతరం తహసీల్దార్ రమాకుమారికి వినతి పత్రం అందజేశారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా ఆక్రమణదారులపై చర్యలు తీసుకుని, ప్రభుత్వ స్థలాలను కాపాడాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీరాములపేట దళితులు పాల్గొన్నారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి మైదుకూరు : పట్టణంలోని బద్వేలు రోడ్డులో సోమవారం గుర్తు తెలియని వాహనం ఢీకొని మండలంలోని సుంకులుగారిపల్లెకు చెందిన అంబటి శివశంకర్రెడ్డి (38) అనే వ్యక్తి మృతి చెందాడు. ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్న శివశంకర్రెడ్డి మైదుకూరుకు వ్యక్తిగత పనిపై వచ్చి తిరిగి బైక్పై గ్రామానికి వెళుతుండగా బద్వేలు రోడ్డులోని టీటీడీ కల్యాణ మండపం సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. స్థానికులు సమాచారం ఇవ్వడంతో 108 అంబులెన్స్ సిబ్బంది అతన్ని చికిత్స కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళుతుండగా మార్గమధ్యలో ఆయన మృతి చెందాడు. శివశంకర్రెడ్డికి భార్య శ్రీలత, 9, 6వ తరగతి చదువుతున్న ఇద్దరు కుమార్తెలు, ఒకటో తరగతి చదువుతున్న ఓ కుమారుడు ఉన్నారు. ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్య పీలేరు రూరల్ : ఉరివేసుకుని వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం ఇందిరా నగర్లో చోటుచేసుకుంది. ఎస్ఐ లోకేష్ కథనం మేరకు వివరాలిలా వున్నాయి. ఇందిరానగర్లో కాపురం ఉంటున్న సురేష్ ఆచారికి సుగుణ(30)తో తొమ్మిదేళ్ల క్రితం వివాహం జరిగింది. ఏమి జరిగిందో తెలియదు కానీ సోమవారం రాత్రి ఇంటిలో తలుపు వేసుకుని ఫ్యాన్కు ఉరివేసుకుంది. ఎంతకూ తలుపు తీయకపోవడంతో అత్త నీలంబరి కిటికీలోంచి చూసింది. సుగుణ ఉరివేసుకుని వేలాడుతుండగా గమనించి కేకలు వేసింది. దీంతో ఇరుగు పొరుగు వారు వచ్చి తలుపులు పగులగొట్టి చూడగా అప్పటికే సుగుణ మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రైతును కాటేసిన పామువాల్మీకిపురం : గుర్రంకొండ మండలం టి.రాచపల్లి పంచాయతీ దిగువబురుజుపల్లిలో ఓ రైతును పాము కాటేసిన సంఘటన సోమవారం చోటు చేసుకుంది. వివరాలు.. టి.రాచపల్లికి చెందిన రైతు రమణారెడ్డి (59) సోమవారం తన పొలం వద్ద వ్యవసాయ పనులు చేస్తుండగా నాగుపాము కాటేసింది. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు బాధితుడిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇందులో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 141 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు దివ్యాంగుల వద్దకే జిల్లా ఎస్పీ వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. అర్జీలను పరిశీలించిన ఎస్పీ పోలీస్ అధికారులతో ఫోనన్ లో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి. ఎస్పీ ఎన్. సుధాకర్, డి.టి.సి డి.ఎస్పీ అబ్దుల్ కరీం, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఇమాంవలీ చికిత్స పొందుతూ ఆదివారం రాత్రి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు...రాజంపేట నుంచి కడప వైపు వెళుతున్న బైక్ను కడప నుంచి రాజంపేట వెళుతున్న కారు ఢీ కొట్టడంతో రాజంపేట కు చెందిన బైక్లోని ఇమాంవలీ, శ్రీరాములకు గాయపడ్డారు. వీరిని 108 లో కడప రిమ్స్ కు తరలించారు. ఇమాంవలీ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తమిళనాడులోని వేలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఇమాంవలీ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. డిప్యూటీ తహసీల్దార్పై సస్పెన్షన్ వేటుముద్దనూరు : స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో డిప్యూటీ తహసీల్దారుగా విధులు నిర్వర్తిస్తున్న వరదకిషోర్రెడ్డిపై సస్పెన్షన్ వేటు పడింది. ఈమేరకు సోమవారం ఉత్తర్వులు వెలువడ్డాయి.జూన్ 18న కడపలో కూటమి ఆధ్వర్యంలో బాబు పాలనకు రెండేళ్ల కార్యక్రమం నిర్వహించారు.ఈ సభలో మండలంలోని కాండ్లోపల్లె గ్రామానికి చెందిన సతీష్రెడ్డి అనే యువకుడు వీఆర్ఏ ఉద్యోగం ఇప్పిస్తామని కూటమి నాయకులు తనను మోసం చేసారని ఆరోపిస్తూ పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో వీఆర్ఏ పోస్టుకు రూ.4 లక్షల 50వేలు వసూలుచేసినట్లు ఆరోపణలు వచ్చాయి.ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఆదేశాల మేరకు ఆర్డీవో శిరీష ముద్దనూరులో విచారణచేపట్టారు.విచారణ అనంతరం స్థానిక డిప్యూటీ తహసీల్దారు వరదకిషోర్రెడ్డిని సస్పెండ్చే స్తూ కలెక్టర్నుంచి ఉత్తర్వులు వెలువడినట్లు తహసీల్దారు అలీఖాన్ తెలిపారు.మండలంలో ఔట్సోర్సింగ్ పద్ధతిలో ఐదుగురిని వీఆర్ఏ పోస్టుల్లో నియమించినట్లు,వీరి వద్దనుంచి డబ్బులు వసూలుచేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తిన విషయం తెలిసిందే. బాధ్యతల స్వీకరణకడప రూరల్ : జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో సోమవారం ఆఫీసు సూపరిండెంట్గా నాగేంద్ర, చంద్రహాసుడు బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవిబాబును మర్యాదపూర్వకంగా కలిశారు. రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే బదిలీ రాజంపేట : రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామ్నాథ్ హెగ్డే సోమవారం బదిలీ అయ్యారు. ఈ మేరకు రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీచేసింది. పదోన్నతిపై విజయవాడ లా అండ్ ఆర్డర్ అడ్మిన్గా బదిలీ అయ్యారు. 2025లో జనవరిలో రాజంపేట ఏఎస్పీగా బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి పలు కేసులను చేధించారు. బైక్ ఢీకొని మహిళ దుర్మరణం కలికిరి : రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి చెందిన ఘటన సోమవారం మండల పరిధిలో చోటు చేసుకుంది. వివరాలు.. మండలంలోని టి.సండ్రావారిపల్లికి చెందిన ఇందాదుల్లా భార్య వహీదా(53) టి.సండ్రావారిపల్లి వద్ద పీలేరు–చిత్తూరు జాతీయ రహదారిలో రోడ్డు దాటుతోంది. పీలేరు వైపు నుంచి వేగంగా వచ్చిన ఓ ద్విచక్రవాహనం ఆమెను ఢీకొని వెళ్లింది. ఈ ప్రమాదంలో వహీదా తలకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు కలికిరి పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం విక్రేత అరెస్ట్ గుర్రంకొండ : ప్రభుత్వ పాఠశాల వద్ద మద్యం విక్రయిస్తున్న బెల్టుషాపు నిర్వాహకుడిని పోలీసులు అరెస్ట్ చేసిన సంఘటన మండలంలోని మర్రిపాడులో జరిగింది. స్థానిక జెడ్పీహైస్కూల్ పరిసరాల్లోని ఓ చిల్లర దుకాణంలో గత కొంతకాలంగా బెల్టుషాపు నిర్వహిస్తున్నారు. ఈవిషయమై గ్రామస్తుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ రవీంద్రబాబు దాడులు నిర్వహించారు. ఈదాడులో దుకాణంలో అమ్మకానికి సిద్ధంగా ఉంచిన పది మద్యం సీసాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. బెల్టుషాపు నిర్వాహకుడు ఖాదరవలీపై కేసు నమోదు చేశామన్నారు. -
ప్రజా ఫిర్యాదులపై బాధ్యతగా స్పందించాలి
కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా అందిన ఫిర్యాదులపై బాధ్యతాయుతంగా స్పందిస్తూ అర్జీదారులకు సంతృప్త స్థాయిలో నాణ్యమైన పరిష్కారాన్ని అందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ అర్జీల పరిష్కారంలో అధికారులు అలసత్వం వీడి శ్రద్ధ పెట్టి పనిచేయాలని, అర్జీలకు అర్జీ నాణ్యమైన పరిష్కారం అందించాలనన్నారు. ● సకాలంలో విద్యార్థులకు పాఠ్యపుస్తకాలు అందించాలని ఆర్ఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షులు సి.వంశీ కోరారు. జిల్లాలోని కార్పొరేట్, ప్రైవేటు పాఠశాలల ఫీజల దోపిడీపై చర్యలు తీసుకోవాలన్నారు. ● ఏళ్ల తరబడి ప్రొద్దుటూరులో ఎంఈఓగా విధులు నిర్వర్తిస్తున్న సావిత్రమ్మను బదిలీ చేయాలని డీవైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వీరనాల శివకుమార్ కోరారు. ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థలకు ఆమె వత్తాసు పలుకుతోందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సిఇఓ సుబ్రమణ్యం, ఇంచార్జి డీపీవో వెంకటసుబ్బయ్య, డిఆర్డిఏ పిడి జి.రాజ్యలక్ష్మి, డీఎస్ఓ రఘురాం, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. ‘సర్’లో భాగస్వాములు కావాలి భారత ఎన్నికల సంఘం చేపడుతున్న ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (సర్) కార్యక్రమంలో అందరూ భాగస్వాములుకావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. స్వయం సహాయక సంఘాల సభ్యులు చురుకుగా పాల్గొని ఓటరు జాబితాను మరింత ఖచ్చితంగా రూపొందించేందుకు సహకరించాలన్నారు. ఇప్పటికే ఎన్యుమరేషన్ ఫారం (ఈఎఫ్) పూరించిన వారు ఆలస్యం చేయకుండా తమ ఆర్పీ/యానిమేటర్ ద్వారా లేదా నేరుగా బూత్ స్థాయి అధికారి (బీఎల్ఓ)కి అందజేయాలని సూచించారు. ఫారం సమర్పించని పక్షంలో డ్రాఫ్ట్ ఓటరు జాబితాలో పేరు నమోదుకాకపోయే అవకాశం ఉంటుందని తెలిపారు. 2002లో కుటుంబ సభ్యులు ఓటరుగా నమోదై ఉంటే వారి వివరాలు అందుబాటులో ఉంచాలని తెలిపారు. 2002 నాటి ఓటరు వివరాలు తెలియకపోయినా, అప్పట్లో ఓటు వేసిన గ్రామం లేదా పట్టణం పేరు తెలిస్తే బీఎల్ఓ సహకారం అందిస్తారని పేర్కొన్నారు. ప్రతి అర్హత కలిగిన పౌరుడు ఈ కార్యక్రమంలో భాగస్వామి కావడం ప్రజాస్వామ్యాన్ని మరింత బలోపేతం చేస్తుందని, అందరూ బాధ్యతగా సహకరించాలని కలెక్టర్ కోరారు. -
యథేచ్ఛగా ఇసుక దోపిడీ
సిద్దవటం : సిద్దవటం హైలెవెల్ వంతెన వద్ద కొన్ని రోజులుగా రాత్రివేళ యథేచ్ఛగా ఇసుక దోపిడీ జరుగుతోంది. వంతెనకు అతి సమీపంలోని పెన్నానదిలో ఇసుక తవ్వకాలు జరుగుతుండటంతో గోతులు పడుతున్నాయి. నిబంధనల మేరకు వంతెనకు వంద మీటర్ల దూరంలో తవ్వకాలు జరపకూడదు. కానీ ప్రతిరోజు ట్రాక్టర్యజమానులు ఇక్కడ ఇసుక తవ్వకాలు జరిపి కడపకు అక్రమంగా తరలిస్తున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. స్పందించని పోలీసు, రెవెన్యూశాఖలు సిద్దవటం పోలీస్స్టేషన్కు కూతవేటు దూరంలోనే ఇసుక అక్రమరవాణా జరుగుతోంది. పోలీసులు అప్పుడప్పుడు మాత్రమే అక్కడ ప్రాంతాలలోని ట్రాక్టర్లను అదుపులోకి తీసుకుంటున్నారే తప్ప పూర్తిగా నివారణ చర్యలు తీసుకోలేదని విమర్శలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారులు ఇసుక అక్రమరవాణాను అరికట్టడంలో పూర్తిగా విఫలమయ్యారని పలువురు పెదవి విరుస్తున్నారు. వంతెన సమీపంలో ఇసుక తవ్వకాలు జరపడం వల్ల భవిష్యత్తులో హైలెవెల్ వంతెనకు ప్రమాదం జరిగే అవకాశాలు ఉన్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి ఇసుక తవ్వకాలు జరగకుండా చూడాలని స్థానికులు కోరుతున్నారు.పట్టించుకోని అధికారులు -
పాఠశాలకు రూ. లక్షా పదివేల ఆర్ఓ ప్లాంట్
పోరుమామిళ్ల : మండలంలోని సిద్దవరం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు సోమవారం పూర్వ విద్యార్థి కాకర్ల వెంకట బాలకృష్ణ రూ.1,10,000 విలువ చేసే ఆర్ఓ ప్లాంట్ అందచేశారు. సోమవారం బాలకృష్ణ, విశాలాక్షి దంపతుల చేతుల మీదుగా దీనిని ప్రారంభించారు. ఈ సందర్భంగా హెడ్మాష్టర్ గంగయ్య అధ్యక్షతన జరిగిన సమావేశంలో దాత బాలకృష్ణ మాట్లాడుతూ సాఫ్ట్వేర్ ఉద్యోగం చేస్తున్నానని, ఇక్కడ చదువుతున్నపుడు పాఠశాలలో సదుపాయాలు, ఉపాధ్యాయులు తల్లిదండ్రుల ఆలోచనలు నన్ను ప్రభావితం చేశాయని, అందులో భాగంగా విద్యార్థులు శుద్ధజలం తాగేందుకు ఆర్ఓ ప్లాంట్ అందచేశానన్నారు. మరో సాఫ్ట్వేర్ ఉద్యోగి, పూర్వ విద్యార్థి ఢాకాల బాలచంద్ర మాట్లాడుతూ పదో తరగతిలో 2027లో మొదటి మూడు స్థానాల్లో మార్కులు సాధించిన విద్యార్థులకు రూ. 15 వేలు, రూ. 10 వేలు, రూ. 5 వేలు నగదు బహుమతులు అందచేస్తానని తెలిపారు. ఉపాధ్యాయులు రామమోహన్రెడ్డి, బాషా మాట్లాడుతూ మేము చదివేటపుడు 7 వ తరగతి వరకే ఉండేదని, ఫ్లోరైడ్ అధికంగా ఉన్నందువల్ల తాగునీటికి ఇబ్బంది పడేవారమన్నారు. ఇప్పుడు బాలకృష్ణ ఆర్ఓ ప్లాంట్తో మంచి పని చేశారని తెలిపారు.పూర్వ విద్యార్థి దాతృత్వంతో విద్యార్థులకు శుద్ధజలం -
జగన్ను ఎదుర్కొనలేక బాబు డైవర్షన్ పాలిటిక్స్!
జమ్మలమడుగు : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ వైఫల్యాలపై వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంధిస్తున్న సూటి ప్రశ్నలకు సమాధానాలు చెప్పలేక ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఉద్దేశపూర్వకంగానే డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని వైఎస్సార్సీపీ జమ్మలమడుగు నియోజకవర్గ ఇన్ఛార్జ్, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి తీవ్రంగా మండిపడ్డారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. మీరు చేసిన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు, ప్రజల్లో వస్తున్న తీవ్ర వ్యతిరేకతను తట్టుకోలేకనే ప్రతిసారీ వివేకానందరెడ్డి కేసును తెరపైకి తెస్తున్నారని ధ్వజమెత్తారు. సీబీఐ మీ చేతుల్లోనే ఉన్నా నిరూపించలేరెందుకు? ‘కేంద్రంలో మీ సపోర్టుతోనే మోదీ ప్రభుత్వం నడుస్తోంది. సీబీఐ అనేది కేంద్ర ప్రభుత్వ సంస్థ. అంతటి పెద్ద దర్యాప్తు సంస్థ కూడా ఈ కేసులో అవినాష్రెడ్డి, జగన్మోహన్రెడ్డిల ప్రమేయం ఉందని ఎక్కడా చెప్పలేదు. అయినా నీవు కుక్కలాగా అరుస్తున్నావు ఆదీ! ఈ కేసు గురించి ఇంకా ఎన్ని సంవత్సరాలు మాట్లాడి రాజకీయం చేస్తారు? నీకు కనీస సిగ్గు ఉండాలి‘ అంటూ ఎమ్మెల్సీ అత్యంత ఘాటుగా ధ్వజమెత్తారు. గతంలో వైఎస్సార్సీపీ సింబల్ మీద గెలిచి, ఆ తర్వాత స్వార్థం కోసం టీడీపీలోనికి జంప్ అయిన చరిత్ర ఆదినారాయణరెడ్డిది అని రామసుబ్బారెడ్డి గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ తరఫున ఎమ్మెల్సీగా నిలబడిన వైఎస్ వివేకానందరెడ్డిని ఓడగొడితే.. జిల్లాలో వైఎస్ కుటుంబాన్ని దెబ్బతీయవచ్చని చంద్రబాబు నాయుడు వద్ద ప్లాన్ చెప్పి, ఇక్కడి ఎంపీటీసీలను, కౌన్సిలర్లను బెదిరించి, బలవంతంగా ఓట్లు వేయించి వివేకానందరెడ్డిని ఓడించిన ద్రోహివి నీవని, అలాంటి నీకు వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదన్నారు. రాజకీయాల నుంచి తప్పుకుంటా.. భూపేష్రెడ్డికి సవాల్! టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి తమపై చేసిన దారుణమైన ఆరోపణలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి తీవ్రంగా ఖండించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి గారు హెలికాప్టర్ ప్రమాదంలో మరణించినప్పుడు, రామసుబ్బారెడ్డి తమ గ్రామంలో డిన్నర్లు (విందులు) చేసుకున్నారంటూ భూపేష్రెడ్డి అత్యంత దారుణమైన అసత్య ఆరోపణలు చేశారని మండిపడ్డారు. ‘భూపేష్రెడ్డీ.. చేసిన ఆరోపణ నిజమని నీవు నిరూపిస్తే నేను తక్షణమే నా రాజకీయాల నుంచే శాశ్వతంగా తప్పుకుంటాను, మరి నిరూపించలేకపోతే నీవు రాజీనామా చేస్తావా?‘ అంటూ ఎమ్మెల్సీ బహిరంగ సవాల్ విసిరారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, గోవిందు, బోనం సురేష్, రాఘవేంద్ర, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వివేకాను ఓడించిన ద్రోహి ఆదినారాయణరెడ్డి వైఎస్ కుటుంబంపై మాట్లాడే అర్హత లేదు వైఎస్సార్ మరణంపై అసత్యాలు చెప్తే ఊరుకోం నిజం నిరూపిస్తే రాజీనామాకు సిద్ధమంటూ భూపేష్రెడ్డికి సవాల్! ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
ఆమె కళ్లు సజీవం
సింహాద్రిపురం: ఆమె గుండె ఆగినా.. నలుగురు చూసే లోకాన్ని మరో ఇద్దరి కళ్ల ద్వారా చూడాలని ఆ కుటుంబం భావించింది. భార్య అకాల మరణంతో ఆ ఇల్లాలు లేని లోటు ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపినా.. ఆ దుఃఖంలోనూ మరో ఇద్దరి జీవితాల్లో వెలుగులు నింపేందుకు ఆ భర్త తీసుకున్న నిర్ణయం ప్రతి ఒక్కరినీ కదిలించింది. మండల కేంద్రమైన సింహాద్రిపురానికి చెందిన రాగిపిండి వీరనారాయణమ్మ సోమవారం అకస్మాత్తుగా గుండెపోటుకు గురై కన్నుమూశారు. భార్య హఠాన్మరణంతో ఆమె భర్త మురళీరెడ్డితో పాటు కుటుంబ సభ్యులంతా కన్నీరుమున్నీరయ్యారు. అంతటి ఘోరమైన శోకంలోనూ మురళీరెడ్డి మానవీయతను చాటుకున్నారు. తన భార్య భౌతికంగా దూరమైనా, ఆమె నేత్రాలు ఇద్దరు అంధుల జీవితాల్లో వెలుగులు నింపాలని భావించారు. తక్షణమే ఆమె కళ్లను దానం చేయాలని సంకల్పించి, కడపలోని ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి సమాచారం అందించారు.భర్త ఆశయానికి గౌరవమిస్తూ ఎల్వీ ప్రసాద్ నేత్రాలయ వైద్య సిబ్బంది తక్షణమే సింహాద్రిపురానికి చేరుకున్నారు. మృతురాలు వీరనారాయణమ్మ పార్థివ దేహం నుంచి అత్యంత పవిత్రంగా కార్నియాలను (నేత్రాలను) సేకరించి భద్రపరిచారు. తమ కళ్లముందే ప్రాణం విడిచిన భార్య నేత్రాలను దానం చేసి, సమాజానికి ఒక గొప్ప సందేశాన్ని ఇచ్చిన భర్త మురళీరెడ్డి ఉదాత్తమైన హృదయాన్ని స్థానిక ప్రజలు అభినందించారు. వీరనారాయణమ్మకు ఘన నివాళులర్పించారు. -
● గొంతెండిన.. గోస
చేతిలో రంగు రంగుల ప్లాస్టిక్ బిందెలు ఉన్నాయి.. కానీ వాటిల్లో గుక్కెడు తాగడానికి చుక్క నీరు లేదు! వాతావరణం అనుకూలించక ఎండలు మండిపోతున్న ఈ రోజుల్లో దాహార్తిని తీర్చాల్సిన ప్రభుత్వ కుళాయిలు పూర్తిగా ఎండమావులుగా మారడంతో.. సిద్దవటం మండలంలో సామాన్య దళిత కుటుంబాలు నీటి కోసం అల్లాడిపోతున్నాయి. మండల పరిధిలోని వంతాటిపల్లి గ్రామం ఎస్సీ కాలనీలో పది రోజులుగా తాగునీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో సోమవారం స్థానిక మహిళలు, యువకులు, వృద్ధులు ఖాళీ బిందెలను ప్రదర్శిస్తూ వీధుల్లోకి వచ్చి తమ నిరసనను, నిస్సహాయతను తెలియజేశారు.్ఙపది రోజులుగా కుళాయిల్లో చుక్క నీరు రావడం లేదు సామీ.. చిన్న పిల్లలను పట్టుకుని దాహంతో ఎలా బతకాలి?్ఙ అంటూ కాలనీ మహిళలు కన్నీరుమున్నీరవుతున్నారు. గ్రామంలో తాగునీరు రాకపోవడంతో నిత్యం వంట వండుకోవడానికి, తాగడానికి మైళ్ల దూరంలో ఉన్న పంట పొలాల్లోని వ్యవసాయ బోర్ల వద్దకు కాలినడకన వెళ్లి నీటిని మోసుకురావాల్సిన దుస్థితి దాపురించిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ ఘోరమైన తాగునీటి సమస్యపై స్థానిక గ్రామ పంచాయతీ అధికారులకు పలుమార్లు మొరపెట్టుకున్నా.. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా ప్రత్యామ్నాయ నీటి సరఫరా చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించారని మండిపడ్డారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి యుద్ధప్రాతిపదికన తమ కాలనీకి తాగునీటి సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. వీరి తాగునీటి సంక్షోభంపై శ్రీసాక్షిశ్రీ మండల విస్తరణాధికారి మెహతాబ్ యాస్మిన్ను వివరణ కోరగా.. సదరు కాలనీకి నీరందించే బోర్ల మోటారు హఠాత్తుగా రిపేరుకు గురైందని, అందుకే సరఫరా ఆగిపోయిందని తెలిపారు. రెండు రోజుల్లోనే పను లు పూర్తి చేసి తాగునీటి సమస్యను శాశ్వతంగా పరిష్కరిస్తామని ఆమె హామీ ఇచ్చారు. – సిద్దవటం -
● పచ్చని.. ఆశ
ఇల్లు కట్టుకోవడానికి మనుషులు పరుగులు పెడుతుంటే.. అడవులను సృష్టించడానికి ఈ యువకుడు సైకిల్ తొక్కుతున్నాడు. దేశవ్యాప్తంగా పచ్చదనాన్ని పెంపొందించి, గ్లోబల్ వార్మింగ్ ముప్పును తగ్గించాలనే బృహత్తర సంకల్పంతో తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన ముత్తు సెల్వన్ అనే యువకుడు అసాధారణ సైకిల్ యాత్రను కొనసాగిస్తున్నాడు. ఈ ‘గ్రీన్ ఇండియా’ సైకిల్ యాత్ర సోమవారం ఎర్రగుంట్లకు చేరుకోవడంతో స్థానిక సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నాగమురళి ఆయనకు ఘన స్వాగతం పలికారు. ముత్తు సెల్వన్ బయోటెక్నాలజీ చదివిన విద్యాధికుడు. పర్యావరణ పరిరక్షణ కోసం 2021లో ప్రారంభించిన ఈ సుదీర్ఘ సైకిల్ యాత్ర ఇప్పటివరకు పొరుగు దేశమైన నేపాల్తో పాటు భారతదేశంలోని 23 రాష్ట్రాల ద్వారా దిగ్విజయంగా సాగింది. దేశవ్యాప్తంగా మొత్తం 44,000 కిలోమీటర్ల మేర ప్రయాణించడమే లక్ష్యంగా పెట్టుకోగా.. ఇప్పటికే 39,000 కిలోమీటర్ల యాత్రను విజయవంతంగా పూర్తి చేశాడు. పర్యావరణ సందేశాల బోర్డులతో కూడిన ఆయన ప్రత్యేక సైకిల్ ఏకంగా 122 కిలోల బరువు ఉంటుంది. ఇంత భారీ బరువును మోస్తూ, నిరంతరం సైకిల్ తొక్కుతూ దేశవ్యాప్తంగా 11 లక్షల మొక్కలు నాటించాలనేది ఆయన సంకల్పం. యాత్ర సాగుతున్న మార్గాల్లోని ఆయా మండలాల అధికారులు, ప్రజల సహకారంతో ఇప్పటివరకు 8.64 లక్షల మొక్కలను నాటించి పచ్చదనానికి ఊపిరి పోశాడు. 2027 నాటికి ఈ యాత్ర ఢిల్లీకి చేరుకోవడంతో ముగుస్తుంది. ఈ సందర్భంగా ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ.. ముత్తు సెల్వన్ చేస్తున్న సాహసయాత్ర అమో ఘమైనదని, నేటి సమాజానికి ఆదర్శనీయమని కొనియాడారు. పర్యావరణాన్ని కాపాడుకోవడానికి ప్రతి ఒక్కరూ కనీసం ఒక మొక్కనైనా నాటాలని ముత్తు సెల్వన్ పిలుపునిచ్చారు. – ఎర్రగుంట్ల -
చెరువులో లభ్యమైన ద్విచక్ర వాహనం
బద్వేలు అర్బన్ : బద్వేలు – పోరుమామిళ్ల రహదారిలోని లక్ష్మీపాలెం సమీపంలో గల బద్వేలు పెద్ద చెరువులో సోమవారం నీట మునిగి ఉన్న ఓ గుర్తు తెలియని ద్విచక్ర వాహనాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే విషయాన్ని అర్బన్ పోలీసులకు సమాచారం ఇవ్వడంతో అర్బన్ పోలీసుస్టేషన్ కానిస్టేబుల్ ఓబులేసు స్థానిక యువకుల సహకారంతో చెరువులోకి దిగి ద్విచక్ర వాహనాన్ని బయటికి తీశారు. బైక్ ఆనవాళ్లను బట్టి చాలా రోజుల క్రితమే చెరువులో పడిపోయి ఉన్నట్లు అనుమానిస్తున్నారు.దీనికి సంబంధించిన ఛాసీస్ నెంబర్ ఆధారంగా రిజిస్ట్రేషన్ నంబర్, యజమాని వివరాలు పోలీసులు సేకరిస్తున్నారు. ఎక్కడైనా దొంగిలించిన వాహనాన్ని ఆధారం లేకుండా చేసేదానికి ఇక్కడ పడేశారా లేక ఎవరైనా ప్రమాదవశాత్తు ద్విచక్ర వాహనంతో సహా పడిపోయారా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
కాపురానికి తీసుకెళ్లాలని భర్త ఇంటి ముందు భార్య ధర్నా
ప్రొద్దుటూరు క్రైం : తనను కాపురానికి తీసుకెళ్లాలని కోరుతూ ఓ వివాహిత భర్త ఇంటి ముందు ధర్నాకు దిగిన ఘటన ప్రొద్దుటూరులోని మక్కా మసీదు వీధిలో ఆదివారం జరిగింది. ప్రొద్దుటూరులోని డీసీఎస్సార్ కాలనీకి చెందిన ఆదిల్లాకు ఐదేళ్ల క్రితం ఆర్ట్స్కాలేజీ రోడ్డులోని మక్కా మసీదు వీధికి చెందిన షారూఖ్ హుస్సేన్తో వివాహమైంది. ఆ సమయంలో 25 తులాల బంగారు, 10 లక్షల నగదు కట్నంగా ఇచ్చారు. ప్రస్తుతం వారికి రెండేళ్ల కుమార్తె సైజా ఉంది. ఈ క్రమంలో ఈ ఏడాది క్రితం భర్త షారూక్హుస్సేన్ భార్య ఆదిల్లాను పుట్టింట్లో వదలాడు. అప్పటి నుంచి కనిపించకుండా తిరుగుతున్నట్లు బాధిత మహిళ తెలిపింది. ఊళ్లో ఉన్నాడో లేడో కూడా తెలియదని ఆమె అంటోంది. దీంతో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి ఆదివారం భర్త ఇంటి ముందు నిరసనకు దిగింది. తన అత్త సాహిల్బాను వల్లనే తన భర్తతో విభేదాలు వచ్చినట్లు ఆదిల్లా ఆరోపిస్తోంది. బంధువులు చెప్పినా అత్త, భర్త వినిపించుకోలేదని ఆమె అంటోంది. ఇంటి వద్ద ధర్నా చేస్తున్న సమయంలో కుమార్తె తండ్రి కోసం గేట్ తట్టడం అందరినీ కలచివేసింది. వన్టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి ఘటనా స్థలానికి చేరుకొని బాధితురాలితో మాట్లాడారు. ఏదైనా ఉంటే పోలీస్స్టేషన్కు వచ్చి ఫిర్యాదు చేస్తే విచారణ చేసి తగు చర్యలు తీసుకుంటామన్నారు. ఎస్ఐ సూచనతో ఆదిల్లా కుటుంబ సభ్యులు అక్కడి నుంచి వెళ్లిపోయారు. -
రుణ పరపతి పెరిగింది
స్కేల్ ఆఫ్ పైనాన్స్ కమిటీ ఉత్తర్వుల మేరకు 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రుణ పరపతి పెరిగింది. చిన్న, సన్నకారు, వరి, ఉద్యానవన రైతులతోపాటు ఎఎంఎస్ఎంఈఓ, వ్యక్తిగత రుణాలు అందించనున్నాయి. గత ఏడాదికంటే ఈ ఏడాది రుణ పరపతి పెంచాలని రాష్ట్ర బ్యాంకర్ల కమిటీ నిర్ణయించింది. నిర్దేశిత లక్ష్యం నెరవేరేలా బ్యాంకర్లకు అన్ని మార్గ దర్శకాలు అందించనున్నాయి. అన్ని వర్గాలకు సంబంధించి అర్హత ఉన్న వారికి రుణాలను అందచేయనున్నారు. – జి. జనార్థనమ్, లీడ్ బ్యాంక్ మేనేజర్, కడప -
సర్ పట్ల అప్రమత్తంగా ఉండాలి
– ఎంపీ మిథున్రెడ్డి, ఎమ్మెల్యే అమరనాధరెడ్డి సిద్దవటం : శ్రీసర్శ్రీ పట్ల వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు అప్రమత్తంగా ఉండాలని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాధరెడ్డిలు సూచించారు. సిద్దవటం మండలంలోని మూలపల్లి గ్రామంలోని వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఉపాసి వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ ఉపాసి శ్రీకాంత్రెడ్డి ఆదివారం నిర్వహించిన మాచుపల్లిలో వెలసిన సయ్యద్ షావలి దర్గా మొక్కుబడి కార్యక్రమానికి ఎంపీ, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్వరలో జరగనున్న స్థానికసంస్థల ఎన్నికలకు వైఎస్ఆర్సీపీ శ్రేణులు ఇప్పటి నుంచే సమాయాత్తం అవ్వాలని దిశా నిర్దేశం చేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకులు ఉపాసి వెంకటరమణారెడ్డి, జడ్పీటీసీ ఉపాసి శ్రీకాంత్రెడ్డి, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి రాజేశ్వరిరెడ్డి, ఉప మండలాధ్యక్షులు నారపురెడ్డి శ్రీనివాసులురెడ్డి, వైసీపీ మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, వైసీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కోటపాటి పెంచలయ్య, రైతు విభాగం జిల్లా జనరల్ సెక్రటరీ పల్లె సుబ్బరామిరెడ్డి, యువ నాయకులు జ్యోతి శివారెడ్డి, జ్యోతి లక్ష్మీరెడ్డి, రాజంపేట నియోజకవర్గ రైతు విభాగం అధ్యక్షులు కెవి సుబ్బయ్య, రాజంపేట వైఎస్ఆర్సీపీ అధ్యక్షులు బత్తల భక్తుడు, ఎంపీటీసీ చంద్రశేఖర్రెడ్డి, డేరంగుల శివయ్య, కోఆప్షన్ సభ్యులు సయ్యద్ నూర్, ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, నడివీధి సుధాకర్, కృష్ణచైతన్య, కుప్పం సుబ్బారెడ్డి, గోపాలస్వామి, మాచునూరు సుబ్బారెడ్డి, గోచి యల్లయ్యయాదవ్, నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
ఫైల్ కదిలేదెప్పుడు.. పులి అడుగు పడేదెన్నడు?
రాజంపేట : రాష్ట్రంలోని వన్యప్రాణుల సంరక్షణలో అత్యంత కీలకమైన ’టైగర్ కారిడార్’ ఏర్పాటు ప్రక్రియ ఎట్టకేలకు తుది దశకు చేరుకుంది. రాజంపేట పరిధిలోని కడప, నెల్లూరు జిల్లాల సరిహద్దు అటవీ ప్రాంతంలో ఇటీవల పులుల సంచారం గణనీయంగా పెరిగిన నేపథ్యంలో, అటవీశాఖ ఈ బృహత్తర ప్రాజెక్టుపై ప్రత్యేక దృష్టి సారించింది. నాగార్జునసాగర్–శ్రీశైలం పులుల అభయారణ్యం నుంచి తిరుపతి శేషాచలం అడవుల వరకు పులుల సురక్షిత రాకపోకల కోసం ప్రతిపాదించిన ఈ టైగర్ కారిడార్ ప్రాజెక్టు తుది నివేదికను కేంద్ర ప్రభుత్వం ఆమోదం కోసం పంపారు. ఈ మెగా ప్రాజెక్టు పూర్తిగా కేంద్ర ప్రభుత్వం పరిధిలోనిది కావడంతో, దీనికి సంబంధించిన నిధులు, తదుపరి అటవీ అభివృద్ధి కార్యక్రమాలన్నీ కేంద్రమే చేపట్టనుంది. నాలుగు జిల్లాల పరిధిలో.. 1500 చదరపు కిలోమీటర్లు! ఈ ప్రతిపాదిత దక్షిణ కారిడార్ మార్గం దాదాపు నాలుగు జిల్లాల పరిధిలో 1,500 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణంలో అటవీ ప్రాంతాన్ని అనుసంధానించనుంది. వైఎస్సార్ కడప, నంద్యాల, తిరుపతి, నెల్లూరు జిల్లాల సరిహద్దులు ఇందులో భాగం కానున్నాయి. నంద్యాల జిల్లా ఆత్మకూరు రేంజ్లో పులుల సంచారం ఇప్పటికే అధికారికంగా నమోదు కాగా, అక్కడి నుంచి నెల్లూరు జిల్లాలోని రాపూరు, వెంకటగిరి రేంజ్లు మరియు తిరుపతి శేషాచలం అడవుల వైపు పులులు సురక్షితంగా వెళ్లేందుకు ఈ ‘దక్షిణ కారిడార్ మార్గం’ అత్యంత కీలకంగా మారనుంది. పులుల ఆవాసానికి కేరాఫ్.. లంకమల్లేశ్వర అభయారణ్యం! వైఎస్సార్ కడప జిల్లాలోని శ్రీ లంకమల్లేశ్వర వన్యప్రాణి అభయారణ్యం పులుల శాశ్వత ఆవాసానికి అత్యంత అనువైన ప్రాంతంగా అటవీశాఖ అధికారులు గుర్తించారు. ఈ అభయారణ్యం పరిధిలోని బద్వేలు, సిద్ధవటం అటవీ ప్రాంతాలు.. నెల్లూరు జిల్లాలోని ఆత్మకూరు, ఉదయగిరి రేంజ్లతో సరిహద్దులను పంచుకుంటూ ఆనుకొని ఉన్నాయి. భౌగోళికంగా, జీవవైవిధ్య పరంగా ఎంతో అనుకూలమైన ఈ రూట్ను టైగర్ కారిడార్కు ప్రధాన హృదయభాగంగా భావిస్తున్నారు. వెలిగొండ అడవుల్లో జంట పులుల కదలికలపై కన్ను! నల్లమల అడవుల్లో పులుల సంఖ్య పెరగడంతో అవి ఇప్పుడు జిల్లా సరిహద్దు వైపు విస్తరిస్తున్నాయి. నెల్లూరు–కడప సరిహద్దుల్లోని వెలిగొండ అటవీ ప్రాంతంలో.. ముఖ్యంగా ఆత్మకూరు, ఉదయగిరి రేంజ్ పరిధిలో ప్రస్తుతం ఒక ఆడపులి, ఒక మగపులి (జంట పులులు) సంచరిస్తున్నట్లు అధికారులు సీసీ కెమెరాల ద్వారా గుర్తించారు. ఈ నేపథ్యంలో లంకమల్లేశ్వర క్షేత్రంతో పాటు సరిహద్దు అడవుల్లో అత్యాధునిక సీసీ కెమెరా ట్రాప్లను ఏర్పాటు చేసి పులుల కదలికలను నిరంతరం గమనిస్తూ, ఆ నివేదికలను ఎప్పటికప్పుడు కేంద్రానికి పంపుతున్నారు. డిసెంబరులో మళ్లీ పులుల గణనగత ఏడాది సరిహద్దు అటవీ ప్రాంతాల్లో అధికారులు పులుల గణన చేపట్టినప్పటికీ సాంకేతిక కారణాల వల్ల కచ్చితమైన లెక్కలు తేలలేదు. ఈ నేపథ్యంలో రాబోయే డిసెంబరు నెలలో అత్యంత శాసీ్త్రయ పద్ధతిలో మళ్లీ పులుల గణన చేపట్టేందుకు అటవీశాఖ సన్నాహాలు చేస్తోంది. కెమెరా ట్రాప్ల ద్వారా లభించే నాణ్యమైన డేటా ఆధారంగా ఈ సరిహద్దు ప్రాంతాల్లో పులుల కచ్చితమైన సంఖ్యను, వాటి వలస మార్గాలను అధికారికంగా రికార్డు చేయనున్నారు. ఈ ప్రాజెక్టుకు కేంద్రం నుంచి గ్రీన్ సిగ్నల్ లభిస్తే రాయలసీమ, నెల్లూరు అటవీ ప్రాంతాలు అంతర్జాతీయ స్థాయిలో గుర్తింపు పొందుతాయి. -
రేపు జిల్లాస్థాయి ఫుట్బాల్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడపలోని ప్రభుత్వ జూనియర్ ఆర్ట్స్ కళాశాల మైదానంలో ఈ నెల 7న జిల్లాస్థాయి జూనియర్ ఫుట్బాల్ బాల బాలికల ఎంపికలను నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు డేనియల్ ప్రదీప్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2011 జవరి 1 నుంచి 2012 డిసెంబర్ మధ్య జన్మించి ఉండాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే వారు ఆధార్ కార్డు, జనన ధృవీకరణ పత్రం తీసుకురావాలన్నారు. జిల్లాస్థాయికి ఎంపికై న క్రీడాకారులు ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ నిర్వహించే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుదని ఆయన తెలిపారు. పులివెందుల వాసికి నంది అవార్డు పులివెందుల రూరల్ : పులివెందులలోని బ్రాహ్మణపల్లి రోడ్డు శ్రీరామ హాలు సమీపంలో నివాసముంటున్న సువర్ణకు స్వర్ణ నంది అవార్డు లభించింది. ఆమె గత కొంతకాలంగా తన నివాసం వద్ద చెక్కభజనను విద్యార్థులు, మహిళలకు ఉచితంగా నేర్పిస్తోంది. ఆమె ప్రతిభను గుర్తించి అవార్డుకు ఎంపిక చేశారు. హైదరాబాద్లోని బిర్లా ఆడిటోరియంలో జరిగిన కార్యక్రమంలో సినీ నటుడు ధనరాజ్, విమానం సినిమా దర్శకుడు శివప్రసాద్ల చేతుల మీదుగా అవార్డు అందుకున్నారు. డ్రైవర్కు గాయాలు సిద్దవటం : సిద్దవటం–బద్వేల్ ప్రధాన రహదారి అటవీ ప్రాంతంలో లారీ అదుపు తప్పి బోల్తాపడటంతో డ్రైవర్కు గాయాలయ్యాయి. వివరాలలోకి వెళ్లితే.. సిద్దవటం–బద్వేల్ ప్రధాన రహదారి అటవీ ప్రాంతంలోని సాహెబ్ బావి సమీపాన శనివారం రాత్రి కావలి నుంచి కడపకు వెళ్తున్న మినీ లారీ కల్వర్టు దగ్గర అదుపు తప్పి బోల్తాపడింది. ఈ ఘటనలో డ్రైవర్ రాజేష్కు గాయాలయ్యాయి. కడప నుంచి కావలిలో సూపర్–కె మార్కెట్ ఫ్యాన్సీ స్టోర్లకు నిత్యావసర వస్తువులు అందించి వస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ ఘటనపై మండల ఎస్ఐ హారిక ఆధ్వర్యంలో పోలీసులు విచారిస్తున్నారు. ఒంటిమిట్ట: కడప–చైన్నె జాతీయ రహదారిపై ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు..రాజంపేట నుంచి కడప వైపు ఏపీ 39 ఎఫ్వై 5092 నంబర్ గల బైక్లో వెలుతున్న రాజంపేట కు చెందిన ఇమాంవలి(47), శ్రీరాం(32)లను మండలంలోని కొండమాచుపల్లి గ్రామానికి చెందిన మోహన్ ఏపీ 39 యుఏ 6772 నెంబర్ గల కారులో కొండమాచుపల్లి నుంచి రాజంపేట వైపు వెలుతుండగా ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో బైక్లోని ఇమాంవలి, శ్రీరాంలు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గాయపడిన వారిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. -
ఓటు కోసం కోటి తిప్పలు
ఓటర్ల గుండె ఘోష శ్రీకడప నగరంలో ఎన్యుమరేషన్ ప్రక్రియ అస్తవ్యస్తంగా మారడంపై సామాన్య ఓటర్లు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. శాస్త్రినగర్కు చెందిన సుబ్బరాయుడు మాట్లాడుతూ.. ఈ ఎన్యుమరేషన్ పత్రాలు ఎలా భర్తీ చేయాలో చదువుకున్న వారికి సైతం అర్థం కావడం లేదని, ఫారాలలో తప్పులు రాస్తుంటే బీఎల్ఓలు తిరస్కరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల సంఘం గడువు పొడిగిస్తే తప్ప జాబితా సక్రమంగా ఉండదన్నారు. అదే ప్రాంతానికి చెందిన వల్లూరు నారాయణమ్మ మాట్లాడుతూ.. తమ డివిజన్లో 2002 నాటికి ఓటు లేనివారు చాలామంది ఉన్నారని, ఇప్పుడు వారి తల్లిదండ్రుల ఓటు ఎక్కడుందో తెలియక వేలాది మంది అవస్థలు పడుతున్నందున గడువు పెంచాలని డిమాండ్ చేశారు. సున్నపుబట్టీల వీధికి చెందిన బేల్దారి కూలి మబ్బు సుశీల ఆవేదన వెళ్లగక్కుతూ.. శ్రీనాకు చదువు రాదు, ఆరోగ్యం బాలేదు. ఫారాలు భర్తీ చేయడం తెలియక అధికారుల వద్దకు పోతే.. ఫోన్ నంబర్లు, డోర్ నంబర్లతో పాటు 2002 నాటి ఓటు వివరాలు తేవాలంటున్నారు, ఈ బాధలు మేము పడలేం్ఙ అంటూ కన్నీటిపర్యంతమయ్యారు. అక్కాయపల్లెకు చెందిన అద్దెదారు గంగాధర్ మాట్లాడుతూ.. బాడుగ ఇళ్లలో ఉంటూ తరచూ ఇళ్లు మారే తాము పాత నంబర్లు ఎక్కడి నుంచి తేవాలని, ఈ సాకుతో ఎక్కడ తమ ఓటు హక్కును తొలగిస్తారోనని భయపడుతున్నామన్నారు. కడప సెవెన్రోడ్స్:ఓటు హక్కు నమోదు, సవరణల కోసం నిర్వహించిన స్పెషల్ క్యాంపెయిన్ క్షేత్రస్థాయిలో ప్రహసనంగా మారింది. శని, ఆదివారాల్లో ప్రత్యేక క్యాంపులు నిర్వహించాలని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించినప్పటికీ..కిందిస్థాయి యంత్రాంగం వాటిని పూర్తిగా బేఖాతరు చేసింది. పనీపాట వదిలేసి, రోజుమొత్తం కేంద్రాల చుట్టూ తిరుగుతున్నా ఓటు నమోదు కాకపోవడంతో, శ్రీఈ ఓటు లేకున్నా మానె.. ఈ బాధలు పడలేము సర్!్ఙ అంటూ కడప నగరవాసులు ఆగ్రహం వెళ్లగక్కుతున్నారు. పత్తాలేని సిబ్బంది.. మరియాపురం, కాగితాలపెంట పరిసర ప్రాంతాల్లోని పోలింగ్ కేంద్రాల వద్ద బూత్ లెవెల్ అధికారులు, సహాయక సిబ్బంది సామూహికంగా విధులకు డుమ్మా కొట్టారు. మరియాపురంలోని సెయింట్ జోసెఫ్స్ బాలుర తెలుగు మీడియం హైస్కూలులో 15, 16 నెంబర్ల పోలింగ్ కేంద్రాల కోసం షామియానా వేసినా.. రెండు రోజులుగా ఒక్క అధికారీ రాలేదు. పక్కనే ఉన్న సెయింట్ జోసెఫ్స్ ఇంగ్లీషు మీడియం హైస్కూలులోని 27, 28, 29, 30, 31 నెంబర్ల కేంద్రాల వద్ద స్పెషల్ క్యాంపెయిన్ ఆనవాళ్లే లేవు. మరియాపురంలోని బాలికల ఎలిమెంటరీ స్కూలు, హైస్కూల్లోని 17, 23, 24, 25, 26, 53 కేంద్రాలు మరియు కాగితాలపెంట ఉర్దూ పాఠశాల వద్ద కూడా ఇదే పరిస్థితి కనిపించింది. అద్దె ఇళ్ల ఓటర్లకు 2002 నిబంధనల శాపం! ఇంటింటికీ ఎన్యుమరేషన్ పత్రాలైతే అందాయి కానీ, వాటిని ఎలా నింపాలో తెలియక సామాన్యులు అవస్థలు పడుతున్నారు. దరఖాస్తుదారులు తెలియక తప్పులు చేస్తుంటే చెప్పే నాథుడు లేడు, తీరా వాటిని బీఎల్ఓల వద్దకు తీసుకెళ్తే తిరస్కరిస్తున్నారు. సిటిజన్ సర్వీసు పోర్టల్ తెలియక నిరుపేదలు నెట్ సెంటర్లలో డబ్బులు వృథా చేసుకుంటున్నారు. దీనికి తోడు, ఏకంగా పాతికేళ్ల క్రితం నాటి, అంటే 2002 నాటి ఇంటి నంబర్లు, ఓటరు స్లిప్పులను తేవాలంటూ బీఎల్ఓలు కొర్రీలు పెడుతున్నారు. బతుకుదెరువు కోసం ఏటా ఇళ్లు మారే తాము, ఆ పాతికేళ్ల క్రితం నాటి పాత స్లిప్పులను ఎక్కడి నుంచి తీసుకురావాలని అద్దె ఇళ్ల నిరుపేద కుటుంబాలు అధికారులను నిలదీస్తున్నాయి. జాడలేని సహాయ కేంద్రాలు ఎన్యుమరేషన్ పత్రాలను పూరించడం, 2002 జాబితాను పరిశీలించడం కోసం ప్రతి పోలింగ్ కేంద్రం వద్ద ప్రత్యేక సహాయ కేంద్రాలు ఏర్పాటు చేశామని కలెక్టర్ ప్రకటించినా.. క్షేత్రస్థాయిలో అవి ఎక్కడా కంటికి కనిపించలేదు. సహాయ కేంద్రాల వద్ద ఉండాల్సిన ఆర్పీలు, ఆశా వర్కర్లకు అసలు ఫారాల భర్తీ, డిజిటైజేషన్పై కనీస అవగాహన లేదు. పలుచోట్ల రాజకీయ పార్టీల బూత్ లెవెల్ ఏజెంట్లు కూడా ఓటర్లకు సహకరించడం లేదు.ప్రభుత్వ షెడ్యూల్ ప్రకారం జూలై 14వ తేదీ నాటికి ఓటర్ల వివరాల డిజిటైజేషన్ ప్రక్రియ పూర్తి కావాల్సి ఉంది. దీనిపై ఉన్నతాధికారులు రోజూ ఒత్తిడి తెస్తున్నా.. సహాయక సిబ్బంది రాకపోవడంతో దరఖాస్తులు తీసుకోవడం నుంచి డిజిటైజ్ చేయడం వరకు అన్నీ తామే ఒంటరిగా చేసుకోవాల్సి వస్తోందని, గడువులోపు లక్ష్యాలు పూర్తయ్యే అవకాశమే లేదని స్వయంగా బీఎల్ఓలే ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విధులను గాలికొదిలేసిన క్షేత్రస్థాయి అధికారులపై కలెక్టర్ కఠిన చర్యలు తీసుకోకపోతే, కడప నగరంలో వేలాది మంది నిరుపేదలు తమ ఓటు హక్కును కోల్పోయే ప్రమాదం పొంచివుంది. గంగాధర్ టైగర్ కారిడార్.. నిమ్మకు నీరెత్తినట్లున్న అధికారులు స్పెషల్ క్యాంపెయిన్లో ‘బీఎల్ఓ’ల సామూహిక డుమ్మా పాతికేళ్ల క్రితం నాటి డాక్యుమెంట్ల కోసం అద్దెదారులపై కొర్రీలు కలెక్టర్ ఉత్తర్వులు బేఖాతరు ‘హెల్ప్డెస్క్’లు వట్టి మాటేనా? -
రైతుకు అండగా.. రుణాలు మెండుగా
కడప అగ్రికల్చర్: జిల్లా రైతాంగానికి, చిన్న తరహా పరిశ్రమల అభివృద్ధితోపాటు ఇతర రుణాల మంజూరు విషయంలో అధికార యంత్రాంగం చొరవ చూపుతోంది. ఆరుగాలం శ్రమించి పంటలు పండించే రైతన్నలకు బ్యాంకులు ఆర్థికంగా వెన్నుదన్నుగా నిలుస్తున్నాయి. పెరుగుతున్న పెట్టుబడి రుణాలకు అనుగుణంగా పంటలసాగును బట్టి రైతులకు రుణాలను అందించనున్నారు. రైతులకు అందించే పంటల రుణ పరపతిని ఈ ఏడాది పెంచుతూ స్కేల్ ఆఫ్ పైనాన్స్ నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయం మేరకు పంట రుణ పరపతి పెరగనుంది. కాకపోతే ఈ ఏడాది ఎల్నినో కారణంగా వర్షపాతం తక్కువగా నమోదు కానున్నటు తెలిసింది. దీంతో అనుకున్న మేర పంటలు సాగవుతాయా లేక సాగు తగ్గుతుందా అనే విషయంలో సందిగ్థత నెలకొంది 2026–27కు ఇవ్వనున్న రుణాల వివరాలు.... తాజాగా పెరిగిన రుణ పరిమితి మేరకు జిల్లాలో అన్ని రంగాలకు సంబంధించి 2026–27 అర్థిక సంవత్సరంలో రూ.30,610 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించారు.ఇందులో ప్రాధాన్యతా రంగానికి రూ. 23,744 కోట్లు, ప్రాధాన్యేతర రంగానికి రూ. 6867 కోట్లు కేటాయించారు. ఇందులో వ్యవసాయరంగానికి అత్యధికంగా రూ. రూ. 18816 కోట్లు కేటాయించారు. పంట రుణాలకు రూ. 11630 కోట్లుకాగా, వ్యవసాయ టర్మ్లోన్లకు రూ. 6,168 కోట్లు, అనుబంధ వ్యవసాయ కార్యకలాపాలకు రూ. 952 కోట్లు, వ్యవసాయ మౌలిక వసతులకు రూ. 66 కోట్లు ప్రతిపాదించారు. ● వ్యవసాయేతర సూక్ష్మ చిన్న, మధ్య తరహా పరిశ్రమల(ఎంఎస్ఎంఈ) అభివృద్ధికి రూ. 4088 కోట్లు కేటాయించారు. ఇందులో మైక్రో ఎంటర్ప్రైజెస్కు రూ.2808, స్మార్ట్ ఎంటర్ప్రైజెస్కు రూ. 1039 కోట్లు, మీడియం ఎంటర్ప్రైజెస్కు రూ. 213 కోట్లు, ఆదర్స్కు రూ. 27 కోట్లు కేటాయించారు. ● విద్యా రుణాలకు రూ. 115 కోట్లు, గృహ రుణాలకు రూ. 220 కోట్లు, సామాజిక మౌలిక వసతులకు రూ. 10 కోట్లు, పునరుత్పాదక రంగానికి 46 కోట్లు, ఇతర ప్రాధాన్యతా బంగాలకు రూ. 447 కోట్లు కేటాయించారు. ● అగ్రికల్చర్(ఎన్పిఎస్) కింద రూ. 45 కోట్లు, ఎడ్యుకేషన్ (ఎన్పీఎస్) కింద రూ. 36 కోట్లు, హౌసింగ్ (ఎన్పీఎస్) కింద రూ. 610 కోట్లు, పర్సనల్ లోన్లు(ఎన్పిఎస్) 2126 కోట్లు, అదర్ ఎన్పీఎస్ కింద రూ. 420 కోట్లు ఇలా ఈ ఏడాది మొత్తంగా జిల్లాలోని అన్ని బ్యాంకుల పరిధిలో రూ. 30610 కోట్లు రుణాలను అందించడమే లక్ష్యంగా అధికారులు నిర్థారించారు. 2026–27 ఏడాదికి రుణ ప్రమాణిక వివరాలు ఇలా.... రుణాలు ఏడాది టార్గెట్ (రూ.కోట్లలో) వ్యవసాయం, అనుబంధాలకు 18816 పరిశ్రమలకు 4088 ఇతర రుణాలు 839 నాన్ ప్రియార్టి రుణాలు 6867 2020 నుంచి పంట రుణాల (రూ. కోట్లలో) వివరాలు.. ఏడాది లక్ష్యం మంజూరు శాతం 2020–21 5500 5354 97 2021–22 6600 7729 117 2022–23 4541 4979 109 2023–24 6676 7171 107 2024–25 7003 8913 127 2025–26 8798 11639 132 2026–27 11630 – – పంటలకు పెరిగిన రుణ పరపతి.. జిల్లా వార్షిక ప్రణాళిక ఆమోదం బ్యాంకులకు చేరిన స్కేల్ ఆఫ్ పైనాన్స్ నివేదికలు పంటలకు పెరిగిన రుణ పరపతి ఎకరాకు (రూ.లలో) పంట పేరు 2025–26 2026–27 వరి 46000– 52000 52000– 55000 పత్తి 48000–55000 52000–57000 జొన్న 23500– 25000 25000– 27000 మొక్కజొన్న 45000– 47000 47000–49000 సజ్జలు 22000– 24000 24000– 36000 కందులు 24000– 29000 27000– 32000 మినుము 26000– 30000 27000–31000 పెసలు 22000– 24000 24000–27000 శనగ 34000– 37000 35000–38000 సన్ప్లవర్ 26000–30000 30000–32000 వేరుశనగ 38000– 41000 41000–44000 పసుపు 115000–125000 117000–130000 మామిడి 49000–55000 56000–67000 బొప్పాయి 110000–120000 120000–130000 -
విచ్చలవిడిగా గ్రావెల్ ఇసుక తరలింపు
జమ్మలమడుగు: మండల పరిధిలోని ముద్దనూరు వైపు ఉన్న కొండ ప్రాంతంలో విచ్చలవిడిగా గ్రావెల్ను తవ్వేస్తున్నారు. పెన్నానదిలో నుంచి ట్రాక్టర్, టిప్పర్ల ద్వారా భారీగా తరలిస్తున్నారు. డివిజన్ స్థాయి అధికారి ఉన్నా వాటి గురించి ఏమాత్రం పట్టించుకోవడంలేదు. ఇప్పటికే కొండ ప్రాంతాన్ని అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నారు. ఇసుక, గ్రావెల్ అక్రమ తరలింపును ఆరికట్టేవారెవరు అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. జిల్లా కలెక్టర్ సైతం పెన్నానది నుంచి ఇసుక తరలింపును నిషేధించారు. అయినా ఫలితం లేదు. రెచ్చిపోతున్న మందుబాబులు పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని పలు ప్రాంతాల్లో మందు బాబులు ఇష్టారాజ్యంగా ప్రవర్తిస్తున్నారు. రెండు రోజులు క్రితం పులివెందుల అర్బన్, రూరల్ పోలీస్ స్టేషన్లలో పోలీసుల వాహనాల అద్దాలను పగులగొట్టారు. ఆదివారం పట్టణంలోని వెంకటేశ్వర స్వామి గుడి సమీపంలో మద్యం మత్తులో రోడ్డుపై అడ్డంగా పడుకొని వికృత చేష్టలు చేయడంతో ట్రాఫిక్ అంతరాయం కలిగింది. పక్కనే ఉన్న హోంగార్డు నాయక్ జోక్యం చేసుకుని మత్తులో ఉన్న వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు. వేధింపులు తాళలేక మహిళ ఆత్మహత్య బి.కోడూరు : మండలంలోని ఐత్రంపేట గ్రామానికి చెందిన సిద్దుఅనూష (24) ఆదివారం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు ఐత్రంపేట గ్రామానికి చెందిన సిద్దురామసుబ్బారెడ్డి, నారాయణమ్మలకు కుమార్తె అనూషకు ఒంటిమిట్ట గ్రామానికి చెందిన టి.సాయినాఽథ్రెడ్డితో ఆరు నెలల క్రితం వివాహమైంది. అప్పటినుంచి వరకట్నం కోసం అత్త, మామ, భర్త అనూషను వేధిస్తుండేవారని, మనస్తాపం చెంది రెండు నెలల క్రితం ఐత్రంపేటకు వచ్చింది. ఆదివారం మనోవేదనకు గురై జీవితం మీద విరక్తితో ఇంట్లో ఎవరూ లేని సమయంలో పురుగుల మందు తాగింది. గమనించిన చుట్టుపక్కల వారు తల్లి నారాయణమ్మ, తమ్ముడు శ్రీనాఽథ్లకు సమాచారం ఇచ్చారు. దీంతో వారు వచ్చి చూసేసరికి అనూష అపస్మారకస్థితిలో పడి ఉంది. వెంటనే ద్విచక్ర వాహనంపై పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. తొగటవీర క్షత్రియ సంఘం జిల్లా కమిటీ ప్రమాణ స్వీకారం ప్రొద్దుటూరు కల్చరల్: తొగటవీర క్షత్రియులు రాజకీయంగా, సామాజికంగా ఎదగడానికి అంతా ఐకమత్యంతో ముందుకు సాగాలని కదిరి నియోజకవర్గ శాసనసభ్యుడు కందికుంట వెంకట ప్రసాద్ పిలుపునిచ్చారు. స్థానిక శ్రీ తొగటవీర క్షత్రియ కల్యాణ మండపంలో ఆదివారం తొగటవీర క్షత్రియ సంఘం జిల్లా నూతన కార్యవర్గ కమిటీ ప్రమాణ స్వీకార ఉత్సవం అత్యంత వైభవంగా జరిగింది. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మోడెం వీరాంజనేయప్రసాద్ సమక్షంలో జిల్లా అధ్యక్షుడిగా బండారు సూర్యనారాయణ, కార్యనిర్వాహక అధ్యక్షుడిగా చౌడం జొల్లు కొండయ్య, ప్రధాన కార్యదర్శిగా బొల్లు సోమశేఖర, కోశాధికారిగా పల్లా భాస్కర్, కార్యనిర్వాహక కార్యదర్శిగా రామచంద్రుడు ప్రమాణస్వీకారం చేశారు. నూతనంగా ప్రమాణ స్వీకారం చేసిన జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ మాట్లాడుతూ.. తనపై నమ్మకంతో ఈ బాధ్యతను అప్పగించిన కులబాంధవులందరికీ ధన్యవాదాలు తెలిపారు. జిల్లా అంతటా సంఘాన్ని బలోపేతం చేయడానికి నిరంతరం శ్రమిస్తానని, ప్రతి నియోజకవర్గ, మండల స్థాయిలో త్వరలోనే కమిటీలను ఏర్పాటు చేస్తానని ప్రకటించారు. పేద కులస్థుల సంక్షేమానికి, నిరుద్యోగ సమస్యల పరిష్కారానికి తన వంతు ఆర్థిక, సామాజిక తోడ్పాటునందిస్తానని స్పష్టం చేశారు. ఈ వేడుకలో అఖిలభారత తొగటవీరక్షత్రియ సంఘం ఉపాధ్యక్షుడు బండారు రఘురామయ్య, సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మిశెట్టి కృష్ణమూర్తి, మహిళా నాయకురాలు జయశ్రీ లతో పాటు వివిధ జిల్లాల అధ్యక్షులు మోందపల్లి బాబు, వెంకటనారాయణ, పురం మల్లయ్య, దాసరి శ్రీరాములు, కొప్పుల సత్యనారాయణ, బండి శ్రీనివాసులతో పాటు భారీ సంఖ్యలో కులబాంధవులు పాల్గొని నూతన కమిటీకి అభినందనలు తెలిపారు. -
మార్చి అన్నారు.. మర్చిపోయారు
● కాంట్రాక్టర్, అధికారుల నిర్లక్ష్యంతో నత్తనడకన ఆయుష్ సెంటర్ల నిర్మాణం ● జిల్లాలో 13 భవనాల్లో 9 పూర్తి ● నాలుగు కేంద్రాల్లో పనులు పెండింగ్ ప్రొద్దుటూరు క్రైం : కేంద్ర ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న ఆయుష్ సెంటర్ల భవనాల పనులు అధికారుల పర్యవేక్షణలోపం, కాంట్రాక్టర్ నిర్లక్ష్యంతో తీవ్ర జాప్యానికి గురవుతున్నాయి. రాయలసీమలో 41 ఆయుష్ సెంటర్ల నిర్మాణం చేపట్టగా, కడప జిల్లాలో 13 భవనాలకు ఆమోదం లభించింది. వీటిలో ఇప్పటివరకు 9 భవనాల నిర్మాణం పూర్తయింది. అయితే ప్రొద్దుటూరు, పుల్లంపేట, చిలంకూరు, కందిమల్లాయపల్లె ప్రాంతాల్లో నిర్మాణంలో ఉన్న నాలుగు భవనాలు ఇప్పటికీ పూర్తి కాలేదు. పనులు నత్తనడకన సాగుతున్నాయి. పూర్తి కాని పనులు సుమారు రూ. 50 లక్షల కేంద్ర ప్రభుత్వ నిధులతో ఆయుష్ సెంటర్లను నిర్మిస్తున్నారు. ప్రొద్దుటూరులోని జిల్లా ఆస్పత్రి ప్రాంగణంలో ఆయుష్ సెంటర్ కోసం స్థలాన్ని కేటాయించారు. ఇక్కడ ఈ ఏడాది ఫిబ్రవరి నెలలో భవన నిర్మాణ పనులను ప్రారంభించారు. మార్చి నెలాఖరకు పూర్తి చేస్తామని అధికారులు చెబుతూ వస్తున్నారు. అయితే జూలై వచ్చినా ఇంత వరకు పనులు పూర్తి చేయలేదు. నత్తనడకన సాగుతున్నాయి. సంబంధిత కాంట్రాక్టర్ పనులు చేయడంలో నిర్లక్ష్యం వహిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. పోటా పోటీగా బీజేపీ నాయకుల ప్రచారం రాష్ట్రంలో 150 ఆయుష్ సెంటర్ల నిర్మాణం చేపడుతున్నామని కూటమి ప్రభుత్వం గొప్పలు చెప్పుకుంటోంది. కేంద్ర ప్రభుత్వ నిధులతో వీటి నిర్మాణం జరుగుతున్నా కూటమి ప్రభుత్వం వీటి గురించి పెద్దగా ప్రచారం చేసుకుంటోంది. ఇక ప్రొద్దుటూరులో అయితే టీడీపీ, బీజేపీ నాయకులు ప్రచారం చేసుకోవడంలో పోటీ పడుతున్నారు. ప్రొద్దుటూరు ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ స్వస్థలం. దీంతో ఆయుష్ సెంటర్ మంత్రి చొరవతోనే మంజూరైందని బీజేపీ నాయకులు చెప్పుకుంటుండగా.. టీడీపీ నాయకులు మాత్రం ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి కృషితో ప్రభుత్వం మంజూరు చేసినట్లు చెబుతున్నారు. వారి ప్రచార ఆర్భాటం, వ్యక్తిగత గొప్పలు ఆయుష్ సెంటర్ భూమిపూజ రోజున తేటతెల్లమైంది. ఈ కార్యక్రమానికి విచ్చేసిన జిల్లా ఆస్పత్రి అభివృద్ధి కమిటి సభ్యుడు, ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీ పాలకమండలి సభ్యుడు డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ మంత్రి సత్యకుమార్ చొరవతోనే ఆయుష్ సెంటర్, యునాని మెడికల్ కాలేజీ ప్రొద్దుటూరుకు మంజూరైందని చెప్పగా.. టీడీపీ నాయకుడు బద్వేలి శ్రీనివాసులరెడ్డి, తదితరులు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కృషి వల్ల ఆయుష్ సెంటర్, యునాని మెడికల్ కాలేజీ మంజూరు అయినట్లు చెప్పారు. సొంత ప్రచారం కోసం, పేరు కోసం ప్రాకులాడే ఇరుపార్టీల నాయకులు ఆయుష్ భవన నిర్మాణ విషయంలో కొంత మేర శ్రద్ధ తీసుకొని వుంటే ఈ పాటికి పూర్తయ్యేదని పట్టణ ప్రజలు చర్చించుకుంటున్నారు. అగ్గిపెట్టె సైజులో ఉందంటూ అధికారుల పెదవి విరుపు ఇక్కడ 1042 చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించే ఈ సెంటర్ అగ్గిపెట్టె సైజులో ఉన్నట్లు ఆ శాఖ అధికారులే పెదవి విరుస్తున్నారు. ఇంత తక్కువ విస్తీర్ణంలో నిర్మాణమైన భవనంలో మూడు విభాగాలను ఎలా నిర్వహించాలని వారు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. యునాని, ఆయుర్వేద విభాగాలకు పెద్ద మొత్తంలో మందులు వస్తుంటాయని, మందుల స్టాకు వచ్చినప్పుడు ఇరుకై న ఫార్మసీ గదిలో వాటిని నిల్వ చేయడం కష్టమంటున్నారు. భవిష్యత్తులో మందుల నిల్వ విషయంలో ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉందని వారు చెబుతున్నారు. ఆయుష్సెంటర్లో హోమియో, యునాని, ఆ యుర్వేం ఓపీ కన్సల్టెంట్ విభాగాలు, ఒక ఫార్మసీ, పేసెంట్లు వేచి ఉండటానికి హాల్ నిర్మాణం చేపడుతున్నారు. ఒకే సెంటర్లో 3 విభాగాల వైద్యం కోసం వచ్చే ప్రజలతో ప్రస్తుతం నిర్మాణం జరుగుతున్న భవనం సరిపోదని ప్రజలు చెబుతున్నారు. కాగా ఉన్నతాధికారులు వస్తున్నారని తెలిసి పనులు పూర్తి కాకున్నా కాంట్రాక్టర్ పెయింట్ వేశారు. ఈ విషయంపై ఆయుష్ రీజినల్ డిప్యూటీ డైరెక్టర్ నాగమునినాయక్ మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న ఆయుష్ సెంటర్ల నిర్మాణాలను త్వరలో పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు.ఇటీవల కమిషనర్ జూమ్ మీటింగ్ నిర్వహించి పనుల జాప్యంపై ఈఈ, ఇతర అధికారులకు క్లాస్ పీకారు. రాయలసీమ వ్యాప్తంగా మంజూరైన 41 సెంటర్లలో అన్ని ప్రాంతాల్లో పూర్తి కాగా కడప జిల్లాలో 4 చోట్ల పెండింగ్లో ఉన్నాయన్నారు. -
11న జిల్లా వ్యాప్తంగా లోక్ అదాలత్
కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశానుసారం ఈ నెల 11న జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని తెలిపారు. తన చాంబర్లో శనివారం ఆమె కడప న్యాయమూర్తులతో లోక్ అదాలత్ నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా కృషి చేయాలని తెలిపారు. అలాగే ట్రాఫిక్ రూల్స్ ఉల్లంఘించిన వారు వారిపై ఉన్న పెండింగ్ చలానాలను ఈ లోక్ అదాలత్లో సెటిల్ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యాప్తంగా తమ పరిధిలో ఉన్న జాతీయ లోక్ అదాలత్ బెంచ్లలో నమోదు చేసుకోవాలని వివరించారు. ఈ కార్యక్రమంలో మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి ఎన్.శాంతి, 6 అదనపు జిల్లా న్యాయమూర్తి, ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి యం.శ్రీనివాసులు నాయక్, పోక్సో కోర్టు న్యాయమూర్తి యం.ఎ.సోమశేఖర్, అదనపు సీనియర్ సివిల్ న్యాయమూర్తి జి.సి.ఆసిఫా సుల్తానా, సీనియర్ సివిల్ న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి పి.కోటేశ్వరరావు, మొదటి అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి ఎం రేష్మ, రెండవ అడిషనల్ జూనియర్ సివిల్ న్యాయమూర్తి మదిర ఈశ్వర్ వేంకట ప్రసాద్, మొబైల్ కోర్టు న్యాయమూర్తి ఆశాప్రియ, మూడవ అదనపు జూనియర్ సివిల్ న్యాయమూర్తి జి.విజయలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఆదీ.. నువ్వసలు మనిషివేనా?
● అధికారం ఉంటేనే నువ్వు ఆదినారాయణరెడ్డి.. లేకపోతే నిక్కర్ నారాయణవే ● కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపాటుకడప కార్పొరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని జంతువుతో పోల్చి అవమానిస్తావా.. ఆదినారాయణరెడ్డీ.. నువ్వసలు మనిషివేనా.. అంటూ కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. శనివారం తన వివాసంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన ఆదినారాయణరెడ్డి వ్యాఖ్యలపై నిప్పులు చెరిగారు. ‘లెక్చరర్గా పని చేశావే ఆ మాత్రం సంస్కారం లేదా.. వైఎస్ఆర్ పెట్టిన భిక్షతో రాజకీయంగా ఎదిగావని మర్చిపోయావా’ అని ప్రశ్నించారు. ‘గతంలో శివారెడ్డికి భయపడి హైదరాబాద్ నుంచి గుండ్లకుంట మీదుగా పోవాలంటే చుట్టూ తిరిగిపోయేవాడివి.. అప్పట్లో వైఎస్ఆర్ మీకు బండ్లు కొనిచ్చి అన్ని విధాలుగా అండగా నిలిస్తే గతాన్ని మర్చిపోయి ఆ కుటుంబాన్నే దూషిస్తున్నావు, ఆయన విగ్రహాన్ని కూలదోశావు.. ఇది నీ రాజకీయ పతనానికి నాంది’ అని హెచ్చరించారు. ‘అధికారముంటేనే నీవు ఆది నారాయణరెడ్డి.. లేకపోతే నిక్కర్ నారాయణవు మాత్రమే’ అంటూ ఎద్దేవా చేశారు. ‘వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు మాకు ఎవరినీ వేధించే ఉద్దేశం లేదు.. నిన్ను ఎక్కువగా కూడా ఊహించుకోలేదు.. అందుకే నన్నేం పీకలేకపోయారని విర్రవీగుతున్నావ్.. నీవు మాట్లాడే ప్రతి మాటకు భవిష్యత్లో సమాధానం చెబుతామని’ హెచ్చరించారు. ‘రాబోయే రోజుల్లో మీ ఊర్లోనే నీవు ధ్వంసం చేసిన చోటనే వైఎస్సార్ విగ్రహాన్ని మళ్లీ ఎంతో ఘనంగా ప్రతిష్టిస్తామని, అప్పుడు నీవు ఏ దేశానికి, రాష్ట్రానికి పారిపోతావో పోవాలని’ సూచించారు. -
నిర్దేశిత సమయానికి భోజనం సరఫరా
బద్వేలు అర్బన్ : బద్వేలులోని పలు ప్రభుత్వ పాఠశాలలకు స్మార్ట్కిచెన్ ద్వారా అందించే మధ్యాహ్న భోజనం ఆలస్యమై విద్యార్థులు ఆకలితో అలమటించిన విషయంపై సాక్షి దినపత్రికలో శనివారం ప్రచురితమైన ‘స్మార్ట్ కిచెన్ .. కడుపులు మాడ్చెన్’ కథనానికి జిల్లా, మండల విద్యాశాఖాధికారులు స్పందించారు. ఘటనపై జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయం నుంచి ఆరా తీయడంతోపాటు వివరణ ఇవ్వాలని ఆదేశించినట్లు తెలిసింది. అలాగే మండల పరిఽధిలోని ఆయా ప్రాథమిక, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలలకు శనివారం ఉదయం 11–30 గంటలకే అన్ని పాఠశాలలకు మధ్యాహ్న భోజనాన్ని సరఫరా చేశారు. -
టీడీపీ, జనసేన నేతలవి బూతు మాటలు
ప్రొద్దుటూరు : సభ్యసమాజం తలదించుకునేలా టీడీపీ, జనసేన పార్టీల నేతలు మాట్లాడుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన శనివారం తన స్వగృహంలో మీడియాతో మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్తోపాటు మంత్రులు పార్టీ నేతలందరిదీ ఇదే తీరుగా ఉందన్నారు. రెండు రోజుల క్రితం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిని ఉద్దేశించి మాట్లాడుతూ చెప్పుతో కొడతానని మాట్లాడటం దేనికి నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఓ సభలో మాజీ ముఖ్యమంత్రి జగన్ను ఉద్దేశించి మాట్లాడుతూ మీ అమ్మ మొగుడు ఇచ్చాడా, మీ నాన్న మొగుడు ఇచ్చాడా, మీ నానమ్మ మొగుడు ఇచ్చాడా అని మాట్లాడటం సరైనది కాదన్నారు. పవన్కళ్యాణ్ తమను ఉద్దేశించి మాట్లాడుతూ వైసీపీ నాకొడకల్లారా చెప్పుతో కొడతానని వేదికపై చెప్పులు కూడా చూపించారన్నారు. ఈ సందర్భంగా రాచమల్లు స్పీకర్ అయ్యన్న పాత్రుడు, మంత్రి అచ్చెన్నాయుడు, మంత్రి నారా లోకేష్ మాట్లాడిన మాటలను వీడియో ద్వారా ప్రదర్శించారు. టీడీపీ నాయకుడు ఆర్పీ మాజీ మంత్రిని రోజాను ఉద్దేశించి మాట్లాడుతూ రోజా కొవ్వును తిరుపతి లడ్డులో కలిపారని వ్యంగ్యంగా మాట్లాడటం దేనికి నిదర్శనమన్నారు. రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ ముస్లిం మహిళ గురించి చేసిన విమర్శలపై ముస్లింలందరూ స్పందించాల్సిన అవసరం ఉందన్నారు. ప్రజా ప్రతినిధి అయి ఉండి ఇంతటి నిస్సిగ్గుగా ఎలా మాట్లాడగలిగారన్నారు. ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ప్రభుత్వ ఉద్యోగులను ఉద్దేశించి అసభ్యకరంగా బూతు పదాలు మాట్లాడారన్నారు. సినీ నటుడు పృధ్వీరాజ్ మహిళల గురించి వ్యంగ్యంగా మాట్లాడారన్నారు. పులిపర్తి నానిపై చర్యలు తీసుకోవాలి చంద్రగిరి ఎమ్మెల్యే పులిపర్తి నానిపై ముఖ్యమంత్రి చంద్రబాబు చర్యలు తీసుకోవాలని రాచమల్లు శివప్రసాదరెడ్డి డిమాండ్ చేశారు. రిటైర్డు ప్రభుత్వ ఉద్యోగికి సంబంధించిన రూ.40కోట్లు విలువైన 3.17 ఎకరాల భూమిని పులిపర్తి నాని కబ్జా చేశారన్నారు. దీనికి స్థానిక వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి చెవిరెడ్డి మోహిత్రెడ్డి మద్దతు తెలపగా ఆయనను కూడా ఎమ్మెల్యే దూషించారన్నారు. గత రెండేళ్ల పాలనలో టీడీపీ, జనసేన నాయకులు ఏ వేదికను ఎక్కినా బూతు మాటలు, రోత పనులు చేయడం ఆనవాయితీ అయిందన్నారు. భావితరాల పిల్లలకు ఇవ్వాల్సింది ఇలాంటి సందేశమేనా అని రాచమల్లు ప్రశ్నించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి -
మా కోడళ్ల పరిస్థితి ఏమిటి.. సర్?
కాశినాయన: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్) ఇంటింటి సర్వే ప్రక్రియ మహిళా ఓటర్లను, ముఖ్యంగా మెట్టింటికి వచ్చిన కోడళ్లను తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. 2002 తర్వాత వివాహమై అత్తగారిళ్లకు వచ్చిన కోడళ్ల ఓట్ల నమోదుపై సరికొత్త నిబంధనలు ముంచుకురావడంతో గ్రామీణ, గిరిజన ప్రాంతాల్లో తీవ్ర గందరగోళం నెలకొంది. పుట్టింటి ఆధారాలు తప్పనిసరి జిల్లాలో మొత్తం 20,56,660 మంది ఓటర్లు ఉండగా, వారిలో దాదాపు 50 శాతం మంది మహిళా ఓటర్లే ఉన్నారు. ఈ మహిళల్లో కనీసం 40 శాతం మంది పెళ్లిళ్లు చేసుకుని అత్తవారి ఇళ్లకు వచ్చిన కోడళ్లేనని అధికారుల అంచనా. ప్రస్తుతం సాగుతున్న ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా వీరంతా తమ ఓట్లను మ్యాపింగ్ చేసుకోవా ల్సి ఉంటుంది. అయితే, మెట్టినింటికి వచ్చి న మహిళలు ఓటర్ల జాబితాలో కొనసాగా లంటే పుట్టింటి ఆధారాలు చూపించాలని అధికారులు నిబంధనలు పెట్టారు. బూత్ లెవెల్ అధికారులు ఇంటింటికి వచ్చినప్పు డు కోడళ్ల వివరాలు అడుగుతూ.. వివాహానికి ముందు వారి స్వగ్రామంలో తల్లిదండ్రు ల ఓట్లకు సంబంధించిన ఓటరు లిస్టులోని వివరాలను లేదా పుట్టింటి పాత ఐడీ కార్డులను తీసుకొస్తేనే ఇక్కడ ఉన్న మహిళల ఓట్లకు మ్యాపింగ్ చేస్తామని స్పష్టం చేస్తున్నారు. దశాబ్దాలుగా కాపురం ఉంటూ అన్ని ఎన్నికల్లోనూ ఓటు వేసిన మహిళలను.. ఇప్పుడు పుట్టింటి ఆధారాలు అడుగుతుండటంతో, పాత రికార్డులు లభించక వేలాది మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. గిరిజన ఓటర్లకే పెద్ద దెబ్బ ఈ కఠిన నిబంధనల వల్ల వెనుకబడిన వర్గాలతో పాటు ముఖ్యంగా గిరిజన ఓటర్లకు భారీ గండిపడే ప్రమాదం పొంచి ఉంది. గిరిజన ఓటర్లు ఎక్కువ శాతం మంది ఒకే చోట స్థిరంగా నివాసం ఉండే అవకాశం లేదు. పొట్టకూటి కోసం, జీవనోపాధి కోసం వారు తరచూ రాష్ట్రాలు, జిల్లాలు, ఊర్లు మారు తూ వలస వెళ్తుంటారు. దీనికి తోడు గిరిజ నుల్లో ఎక్కువ శాతం మంది నిరక్షరాస్యులై ఉంటారు. ఈ రెండు ప్రధాన కారణాల వల్ల (వలసలు, చదువు లేకపోవడం) వారు దశాబ్దాల నాటి పుట్టింటి పాత రికార్డులను భద్రపరుచుకోలేకపోయారు. ఫలితంగా, గిరిజన మహిళల ఓట్లు మ్యాపింగ్కు నోచుకునే అవకాశం ఉండకపోవచ్చుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. -
పోలీస్ కుటుంబాలకు కారుణ్య నియామక ఉద్యోగాలు
కడప అర్బన్ : జిల్లాలో ఇటీవల కాలంలో మరణించిన పోలీస్ సిబ్బంది.. కుటుంబ సభ్యులకు కారుణ్య ఉద్యోగ నియామక పత్రాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అందజేశారు. అనారోగ్యంతో మరణించిన డి.మల్లికార్జున (ఏఆర్ ఎస్ఐ) కుమార్తె డి.మల్లికకు, వేర్వేరు రోడ్డు ప్రమాదాలలో మరణించిన ఎస్.సతీష్ కుమార్ రాజు(సివిల్ కానిస్టేబుల్) సతీమణి అఖిలభారతి, బి.ముకుందర(సివిల్ కానిస్టేబుల్) సతీమణి పి.భారతికి జిల్లా పోలీస్ కార్యాలయంలో జూనియర్ ఆఫీస్ అసిస్టెంట్లుగా నూతనంగా ఉద్యోగం మంజూరు చేయగా జిల్లా ఎస్పీ నియామక ఉత్తర్వులు అందజేసి వారిని అభినందించారు. విధుల్లో తక్షణమే జాయిన్ అవ్వాలని, ఎలాంటి సమస్య వచ్చినా తమను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. కార్యక్రమంలో డీపీఓ ఏఓ జి.సుజాత, సూపరింటెండెంట్ శ్రీనివాస నాయక్ పాల్గొన్నారు. -
‘కూటమి’ కక్షసాధింపు వల్లే స్టీల్ప్లాంటు ఆగింది
● 2018లో శంకుస్థాపన చేసిన కంబాలదిన్నె వద్ద ఎందుకు ప్రారంభించలేదు ● చంద్రబాబు క్రెడిట్ చోరీ ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం కక్షసాధింపు వల్లే రెండేళ్లపాటు స్టీల్ప్లాంటు పనులు ఆగిపోయాయని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అన్నారు. శనివారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర విభజన తర్వాత తన ప్యాకేజీ కోసం కేంద్రం ఇస్తామన్న ప్రత్యేక ప్యాకేజీ, స్టీల్ ప్లాంటును తాకట్టు పెట్టింది చంద్రబాబేనని తూర్పారబట్టారు. 2018లో ఎన్నికల స్టంట్లో భాగంగానే కంబాలదిన్నె వద్ద స్టీల్ప్లాంటుకు శంకుస్థాపన చేశారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గొప్ప సంకల్పంతో స్టీల్ప్లాంటుకు భూమిపూజ చేశారన్నారు. భూసేకరణ, నీటి కేటాయింపులు, విద్యుత్, అంతర్గత రోడ్లు, పర్యావరణ అనుమతులు, సీఎఫ్ఈ వంటి వాటి కోసం రూ.700 కోట్లు ఖర్చు చేశారన్నారు. జేఎస్డబ్ల్యూ వంటి దేశంలోనే అతిపెద్ద సంస్థను కడపకు తీసుకొచ్చారన్నారు. దీన్ని చంద్రబాబు తన ఘనతగా చెప్పుకోవ డం సిగ్గుచేటన్నారు. ఇది క్రెడిట్ చోరీ కాదా...చరిత్రను వక్రీకరించే ప్రయత్నం కాదా అని ధ్వజమెత్తారు. అన్ని అనుమతులు, మౌళిక వసతులు ఉన్న స్టీల్ ఫ్యాక్టరీని చంద్రబాబు ప్రభుత్వం కక్షసాధింపులో భాగంగానే రెండేళ్లు ఆపిందన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ది ఉంటే రెండేళ్లలో ఉక్కు పరిశ్రమను పూర్తి చేసి మాట నిలుపుకోవాలన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, పార్టీ నాయకులు బీహెచ్ ఇలియాస్, బసవరాజు, తోటక్రిష్ణ, కంచుపాటి బాబు పాల్గొన్నారు. -
యువతకు సువర్ణావకాశం
కడప ఎడ్యుకేషన్: భారత ప్రభుత్వ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ‘మై భారత్’ డిజిటల్ వేదిక ద్వారా, 2026 జూలై 1 నుంచి ఆగస్టు 15 వరకు దేశవ్యాప్తంగా 5 కోట్ల మంది యువతీ యువకులను నమోదు చేసే లక్ష్యంతో ప్రత్యేక ఇంటెన్సివ్ రిజిస్ట్రేషన్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కడప జిల్లా యువ అధికారి దీపక్ జేమ్స్ తెలిపారు. ఈ సందర్బంగా అయన మై భారత్ కార్యాలయం నందు శనివారం పోస్టర్ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ వేదిక ద్వారా 15–29 ఏళ్ల లోపు యువత ఉచిత నైపుణ్యాభివృద్ధి శిక్షణ, అనుభవాత్మక అభ్యాసం మరియు జాతీయ స్థాయి స్వచ్ఛంద సేవా అవకాశాలతో పాటు కేంద్ర ప్రభుత్వ గుర్తింపు పత్రాలను పొందవచ్చు. ఈ కార్యక్రమంలో కళాశాలలు, ఎన్ఎస్ఎస్, ఎన్సీసీ విభాగాలు క్రియాశీలకంగా పాల్గొని యువతను పెద్ద ఎత్తున రిజిస్టర్ చేయించాలని ఆయన పిలుపునిచ్చారు. httpr://mybharat.gov.in పోర్టల్లో లేదా మైబారత్ మొబైల్ యాప్ ద్వారా ఉచితంగా నమోదు చేసుకోవచ్చు. రామయ్యకు స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ఆలయ అర్చకులు మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ ఆలయ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్కి సమర్పించారు. పట్టువస్త్రాలను, బంగారు ఆభరణాలు మూల విరాట్కి తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. మల్లయ్యకొండకు రూ.7.44 లక్షల హుండీ ఆదాయం తంబళ్లపల్లి: తంబళ్లపల్లి మల్లయ్యకొండ స్వామి వారికి భక్తులు సమర్పించిన హుండీ కానుకల ద్వారా రూ.7.44,790 లక్షలు ఆదాయం సమకూరినట్లు ఆలయ ఏఓ మునిరాజ తెలిపారు. ఫిబ్రవరి 18 నుంచి శనివారం వరకు భక్తులు హుండీలో సమర్పించిన కానుకలను లెక్కించామన్నారు. ఈ కార్యక్రమంలో ఆలయ ఇన్స్పెక్టర్ కొండ కిట్ట, కూటమి నాయకులు పాల్గొన్నారు తగ్గిన టమాట ధర సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు తగ్గాయి. శనివారం అత్యధిక ధర కిలో రూ.15, అతి తక్కువ ధర కిలో రూ.9 పలికింది. మార్కెట్కు విక్రయానికి అత్యధికంగా 1,530 టన్నుల టమాట వచ్చింది. కాగా ధరలు తగ్గుదలపై రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రస్తుతం సీజన్ ముగింపు దశలో ఉండగా ధర తగ్గింది. అయితే విక్రయానికి వచ్చిన టమాట అధికంగా ఉండటం విశేషం. దీన్నిబట్టి చూస్తే టమాట దిగుబడులు ఇంకా భారీగా వచ్చేలా కనిపిస్తోంది. ఇప్పటిదాక మార్కెట్కు వచ్చిన అత్యధిక టమాట గత ఆదివారం 1,630 టన్నులు వచ్చింది. -
వ్యాపారం ద్రోహచింతన కారాదు !
● ‘తాళి’ తెంచే లాభం తనకొద్దంటున్న చిరు వ్యాపారి ● గల్లా పెట్టె నిండకపోయినా పర్లేదు.. తోటి మానవుల ఆరోగ్యమే ముఖ్యం ● తన అంగట్లో బీడీలు, సిగరెట్లు, గుట్కాల అమ్మకాలను పూర్తిగా నిషేధించిన ఖాదర్ బాషా వ్యాపారం అంటేనే లాభనష్టాల బేరీజు. రూపాయి పెట్టుబడి పెడితే రెండు రూపాయల లాభం ఎక్కడ వస్తుందా అని వెతుక్కోవడం. అందుకే వ్యాపారం ద్రోహచింతన అనే నానుడి ప్రజల్లో నాటుకుపోయింది. మరీ ముఖ్యంగా గ్రామాల్లో కిరాణా కొట్టు, బడ్డీ కొట్టు నడిపేవారి రోజువారీ సంపాదన పెరగాలంటే బీడీలు, సిగరెట్లు, గుట్కాల అమ్మకాలే ప్రధాన ఆధారం. వాటిలో వచ్చే లాభం అంతా ఇంతా కాదు. కానీ, చక్రాయపేటకు చెందిన చిరు వ్యాపారి ఖాదర్ బాష మాత్రం వీటికి పూర్తిగా భిన్నం. వ్యాపారం అంటే కేవలం సమాజానికి ద్రోహం చేయడం, నలుగురిని రోగాల పాలు చేయడం కాదని ఆయన నిరూపించారు. గత ఎనిమిది నెలలుగా ఆయన తన అంగట్లో వీటికి ‘నో ఎంట్రీ’ బోర్డు పెట్టేశారు.్ఙఎందుకయ్యా.. మంచి లాభాలు వచ్చే వ్యాపారాన్ని వదులుకున్నావు?్ఙ అని అడిగితే, ఆయన చెప్పిన సమాధానం వింటే ఎవరికై నా గుండె కరుగక మానదు. ‘లాభం వస్తుంది నిజమే సార్.. కానీ దాంతో పాటు పాపం కూడా వస్తుంది కదా!’ అంటాడు ఖాదర్ బాష నిష్కల్మషమైన నవ్వుతో. ‘మన దగ్గరకు వచ్చి బీడీలు, సిగరెట్లు, గుట్కాలు కొనుక్కుపోతారు. వాటి ద్వారా ఆరోగ్యాలు పాడవుతాయి, క్యాన్సర్ వంటి భయంకరమైన రోగాలు వస్తాయి. రేపు పొద్దున వాటితో ఆ కుటుంబ యజమాని చనిపోతే వాల్ల భార్యాబిడ్డలు అనాథలు అవుతారు. వారికి దిక్కెవరు? ఆ పాపం అంతా మనల్ని చుట్టుకోదా? అందుకే ఆ డబ్బు నాకొద్దు అనుకున్నా. దేవుడు కూడా మనం మంచిగ ఉంటే మంచే చేస్తాడు. అందరూ బాగుండాలని నేను అల్లాను ప్రార్థన చేస్తా’ అంటూ తన అంతరంగాన్ని ఆవిష్కరించాడు.సమాజంలో నైతిక విలువలు కరువైపోతున్న ఈ రోజుల్లో, కేవలం తోటి మానవుల క్షేమం కోసం తన లాభాలను త్యాగం చేసిన ఖాదర్ బాష నిజంగా అభినందనీయుడు. ‘వ్యాపారంలో మానవత్వం’ అంటే ఇదేనేమో! – మురళీధర్, చక్రాయపేట. -
పదోన్నతికి.. గడువు గండం!
● నేటితో ముగియనున్న కాల పరిమితి ● ఉద్యోగుల్లో ఆందోళన ● ఇదీ వైద్య ఆరోగ్యశాఖ పరిస్థితికడప రూరల్ : కడప వైద్య ఆరోగ్య శాఖ (జోన్ –4) ప్రాంతీయ కార్యాలయం పరిధిలోని ఉద్యోగులకు ఈ నెల 5వ తేదీ నాటికి పదోన్నతులు చేపట్టడానికి గడువు ముగియనుంది. దీంతో రాయలసీమ జిల్లాల్లో పని చేస్తున్న ఉద్యోగులకు ‘ప్రమోషన్ టెన్షన్’పట్టుకుంది. ఫలితంగా కడప ప్రాంతీయ కార్యాలయంలో.. అర్హులు, ఆశావహులైన ఉద్యోగులతో సందడిగా మారింది. కొనసాగుతున్న జోన్ల విభజన ప్రక్రియ ఈ శాఖ పరిధిలోకి వచ్చే ఉద్యోగుల పదోన్నతుల క్యాలెండర్కు సంబంధించి ఏటా సెప్టెంబర్ నుంచి ఆగస్టు వరకు పదోన్నతుల ప్రక్రియ జరుగుతుంది. అయితే కేంద్ర ప్రభుత్వం ఆదేశాల కారణంగా జోన్ల విభజన ప్రక్రియ కొనసాగుతోంది. అందులో భాగంగా పదోన్నతుల క్యాలెండర్ ఒక నెల ముందుగానే ముగిసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఈ నెల 5వ తేదీ లోపల పదోన్నతుల ప్రక్రియను ముగించాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో ఇటు వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగులు.. అటు ప్రమోషన్కు అర్హులైన ఉద్యోగులతోపాటు ఆశావహులైన ఉద్యోగుల్లో టెన్షన్ నెలకొంది. ఫలితంగా డాక్టర్ రామగిడ్డయ్య రీజనల్ డైరెక్టర్గా ఉన్నప్పుడే శర వేగంగా కొన్ని క్యాడర్ల ప్రమోషన్లు జరిగాయి. ఏఎన్ఎం నుంచి స్టాఫ్నర్స్గా జరగాల్సిన పదోన్నతులు నిలిచిపోయాయి. అలాగే మరికొన్ని ప్రమోషన్లు కూడా అయిపోయాయి. ఈ తరుణంలో డాక్టర్ రామగిడ్డయ్య జూన్ 30వ తేదీన పదవీ విరమణ చెందారు. అనంతరం రీజినల్ డైరెక్టర్గా ఈ నెల రెండవ తేదీన డాక్టర్ గీతాబాయి బాధ్యతలు చేపట్టారు. అధికారుల ఆదేశం ప్రకారం యథావిధిగా పదోన్నతులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగా ఈనెల 3వ తేదీ 267 మందికి ఏఎన్ఎం నుంచి (జీఎన్ఎంగా ట్రైనింగ్ చేసిన వారికి) స్టాఫ్ నర్స్గా పదోన్నతులు కల్పించారు. మొత్తం 267 మందిలో 80 మందికి పైగా పదోన్నతులు పొందారు. వారంతా ప్రధాన ప్రాంతాలైన ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి, మెడికల్ కాలేజీల్లో విధులను చేపట్టనున్నారు. అలాగే మరికొన్ని కేడర్లకు కూడా పదోన్నతులు జరిగాయి. కొనసాగింపుపై ఊహాగానాలు ప్రస్తుతం వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం ఉద్యోగులు గడువులోపు అర్హులైన వారికి ప్రమోషన్లు ఇవ్వడానికి కసరత్తు చేస్తున్నారు. సమయం తక్కువగా ఉన్నందున అనుమతుల కోసం విజయవాడకు వెళ్లి రావడానికి ఆలస్యం కానుంది. అందువల్ల ఈ– ఆఫీస్ ద్వారా పదోన్నతులకు అనుమతులు పొందడానికి ప్రయత్నం చేస్తున్నారు. అక్కడ నుంచి అనుమతులు రాగానే మరి కొన్ని కేడర్లకు పదోన్నతులు కల్పించనున్నారు. కాగా పదోన్నతులకు గడువు ముగియనున్న నేపథ్యంలో, ప్రమోషన్కు గడువు పొడిగిస్తారనే ఊహాగానాలు కూడా జోరుగా సాగుతున్నాయి. జోన్ల విభజన జరుగుతున్న నేపథ్యంలో, ప్రమోషన్కు కాలయాపన జరిగితే, మళ్లీ పదోన్నతి పొందడానికి ఆలస్యం అవుతుందని ఉద్యోగులు టెన్షన్ పడుతున్నారు. ఏది ఏమైనాప్పటికీ జోన్ –4 పరిధిలోని వైద్య ఆరోగ్యశాఖ ఉద్యోగుల్లో పదోన్నతుల ‘గడువు గండం’ పట్టుకుంది. -
రా.. గాంధీబొమ్మ దగ్గర చూసుకుందాం!
జమ్మలమడుగు : ‘నీవు అధికార పక్షం .. నేను ప్రతిపక్షం.. రా.. జమ్మలమడుగు పాత బస్టాండ్లోని గాంధీ విగ్రహం దగ్గర చూసుకుందాం.. ఇష్టం వచ్చినట్లు మాట్లాడితే చూస్తూ ఊరుకునేది లేదు’ అని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వార్నింగ్ ఇచ్చారు. సున్నపురాళ్లపల్లె గ్రామంలో వైఎస్ జగన్మోహన్రెడ్డిపై ఆది చేసిన విమర్శలకు ఎమ్మెల్సీ కౌంటర్ ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ‘రాష్ట్రానికి పట్టిన దరిఽద్రుడు ఎవరైనా ఉన్నారంటే ఆది నీవే అని తెలుసుకో’ అన్నారు. ‘నియోజకవర్గంలో దేవగుడి రాజ్యాంగాన్ని అమలు చూస్తూ బాబాయ్ అబ్బాయ్లు దండుకుంటున్నారని, అదిసరిపోక క్లబ్బులు.. బెల్టుషాపులు నడిపిస్తున్నారు. అలాంటి నీ బతుక్కి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి ఉందా’ అని ప్రశ్నించారు. ‘గంజాయి, డ్రగ్స్ తీసుకుని నీ కొడుకు మూడు సార్లు పోలీసులకు పట్టుబడ్డాడు. సొంత నీ కుమారుడిని సరిదిద్దుకోలేని నీవు దరిద్రుడివి’ అని తెలుసుకో అన్నారు. పులివెందులలో గతంలో సినిమా చూపించాను.. మళ్లీ చూపిస్తాను అంటావా.. పోలీసులను అడ్డుపెట్టుకోకుండా పులివెందులలో అడుగుపెట్టే ధైర్యం కూడా లేదు నీకు.. అక్కడి ఓటర్లతో కాకుండా జమ్మలమడుగు నుంచి ఓటర్లను తీసుకునిపోయి వారితో ఓట్లు వేయించి గొప్పగా చెప్పుకుంటున్నావు.. దీనికి నీవు భారీ మూల్యం చెల్లించుకోక తప్పదని గుర్తుపెట్టుకో’ అని హెచ్చరించారు. ప్రజలు కూడా గమనించాలని, జమ్మలమడుగు నియోజకవర్గంలో అక్రమాలు చేస్తూ దోపిడీలకు పాల్పడుతూ అనకొండలాగా పెరిగిపోతున్న దేవగుడి కుటుంబాన్ని నాలుగు సార్లు గెలిపించారని.. ఇకపై మీరు గెలిపిస్తే ఆ అనకొండలు మిమ్మల్ని కూడా వదలవని, అప్పుడు తాము కూడా ఏమీ చేయలేని పరిస్థితి వస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, బీసీసెల్ రాష్ట్ర కార్యదర్శి లక్షుమయ్య, సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్యే ఆదికి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి వార్నింగ్ -
స్కౌట్స్తో విద్యార్థుల సమగ్ర వికాసం
రాయచోటి: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ కార్యకలాపాలు విద్యార్థుల్లో క్రమశిక్షణ, సామాజిక బాధ్యత మరియు సమగ్ర వికాసాన్ని పెంపొందించడంలో కీలక పాత్ర పోషిస్తాయని అన్నమయ్య జిల్లా డీఈఓ డాక్టర్ కె.సుబ్రమణ్యం అన్నారు. రాయచోటిలోని జిల్లా కార్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన వార్షిక కార్యకలాపాల క్యాలెండర్ను ఆవిష్కరించిన ఆయన, జిల్లాలోని అన్ని పాఠశాలల్లో ఈ ప్రణాళికను సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. ఈ సమగ్ర వార్తను సాక్షిలో చదవవచ్చు. ఈ కార్యక్రమంలో ఎన్టీఏ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాసరాజు, గైడ్ కెప్టెన్ రేఖ, స్కౌట్ మాస్టర్లు మురళీమోహన్, పీరయ్య, స్కౌట్స్ అండ్ గైడ్స్ సభ్యులు, యూనిట్ లీడర్లు పాల్గొన్నారు.అన్నమయ్య జిల్లా డీఈఓ డాక్టర్ కె.సుబ్రమణ్యం -
అల్లూరి సీతారామరాజుకు ఘన నివాళి
కడప అర్బన్ : స్వాతంత్య్ర సమరయోధుడు, మన్యం వీరుడు అల్లూరి సీతారామరాజు 125వ జయంతి వేడుకలు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు శనివారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అల్లూరి సీతారామరాజు చిత్రపటానికి అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్బాబు పూల మాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు, ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. డబ్బు తీసుకొని స్థలాన్ని చూపించని వ్యక్తిపై కేసు ప్రొద్దుటూరు క్రైం : డబ్బు తీసుకొని విక్రయించిన స్థలాన్ని చూపించని ఇరగంరెడ్డి రాజశేఖర్రెడ్డిపై రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. రాజశేఖర్రెడ్డి పట్టణ శివారులోని రైల్వేస్టేషన్ సమీపంలో వెంచర్ వేశాడు. అందులో 4.5 సెంట్ల స్థలాన్ని 2002లో భారతి అనే మహిళకు రూ.10 లక్షలకు విక్రయించాడు. అయితే ఆ స్థలాన్ని చూపించకపోగా డబ్బులు కూడా ఆమెకు తిరిగి ఇవ్వలేదు. దీంతో మోసపోయానని గ్రహించిన బాధితురాలు భారతి రూరల్ పోలీసులను ఆశ్రయించింది. దీంతో ఇరగంరెడ్డి రాజశేఖర్రెడ్డిపై శనివారం కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణం ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు దాటుతున్న సమయంలో కారు ఢీకొని కడపకు చెందిన షేక్ మహబూబ్హుస్సేన్ (51) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. కడపకు చెందిన మహబూబ్బాషా జిల్లాలోని దర్గాలు, మసీదులకు వెళ్తుంటాడు. అతనికి భార్యా పిల్లలెవరూ లేకపోవడంతో అన్మదమ్ముల వద్దనే ఉంటున్నాడు. ఈ క్రమంలో శనివారం ఆర్టీసీ బస్సులో కడప నుంచి ప్రొద్దుటూరుకు వచ్చాడు. రాజీవ్ సర్కిల్లో రోడ్డు దాటుతున్న అతన్ని కారు ఢీకొనడంతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ భాస్కర్ తెలిపారు. అన్న క్యాంటీన్లో మహిళ మృతిరాయచోటి : రాయచోటి ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అన్న క్యాంటీన్లో షేక్ ఖాసింబీ (40) అనే మహిళ మృతి చెందింది. శనివారం మధ్యాహ్నం క్యాంటీన్లో భోజనం చేస్తున్న సమయంలోనే అక్కడే కుప్పకూలి ప్రాణం కోల్పోయింది. ఆరేళ్ల కిందట ప్రొద్దుటూరు నుంచి రాయచోటికి వచ్చిన షేక్ ఖాసింబీకి భర్త బాదుల్లా, ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. రాయచోటి టౌన్ మాసాపేట ఇండియన్ పెట్రోల్ బంక్ వెనుకవైపున నివాసం ఉంటూ యాచక వృత్తిలో కొనసాగుతున్నారు. రోజు వారీగా యాచక వృత్తిని ముగించుకొని శనివారం మధ్యాహ్నం 1:30 గంటలకు అన్న క్యాంటీన్ లోకి భోజనానికి వెళ్లింది. ప్లేటులో భోజనం పెట్టుకుని తింటుండగా ఆమె ఒక్కసారిగా అక్కడికి అక్కడే కుప్పకూలి పడిపోయింది. -
రేషన్ దుకాణంపై విజిలెన్స్ దాడులు
బద్వేలు అర్బన్ : స్థానిక సిద్దవటం రోడ్డులోని శ్రీకృష్ణదేవరాయనగర్లో గల ఎఫ్సి షాపు నంబర్ 7లో శనివారం విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు దాడులు నిర్వహించారు. శ్రీకృష్ణదేవరాయనగర్లోని రేషన్ దుకాణంలో రేషన్ సరుకులు సక్రమంగా పంపిణీ చేయడం లేదని వచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్ తనిఖీలు నిర్వహించారు. 2629 కిలోల బియ్యం, 365 కిలోల జొన్నలు ఎక్కువగా ఉండటంతోపాటు 43.50 కిలోల చక్కెర తక్కువగా ఉన్నట్లు వారు గుర్తించారు. సరుకులను వీఆర్ఓకు అప్పగించి రేషన్ దుకాణాన్ని సీజ్ చేశారు. అగ్ని ప్రమాదం– రూ.2 లక్షల నష్టంకొండాపురం : మండల పరిధిలోని లావనూరు గ్రామంలో బొగ్గులు కాల్చేందుకు సిద్ధంగా ఉన్న కట్టెలు శనివారం అగ్నికి ఆహుతయ్యాయి. జమ్మలమడుగు అగ్నిమాపక శాఖ అధికారి చంద్రశేఖరప్ప వివరాల మేరకు.. లావనూరు గ్రామంలో ఓ బొగ్గుల బట్టి వద్ద నిల్వ ఉన్న కట్టెలకు ప్రమాదవశాత్తు మంటలు అంటుకున్నాయి. స్థానికులు సమాచారం ఇవ్వడంతో జమ్మలమడుగు నుంచి అగ్నిమాపక సిబ్బంది ఫైర్ ఇంజిన్తో ఘటన స్థలాన్ని వచ్చి మంటలను అదుపు చేశారు. బాధితుడికి రూ.2 లక్షల వరకు నష్టం వాటిల్లింది. రోడ్డు ప్రమాదంలో యువకుడికి గాయాలుచాపాడు : ప్రొద్దుటూరు – మైదుకూరు జాతీయ రహదారిలోని అల్లాడుపల్లె క్రాస్ రోడ్డు సమీపంలో గల పెట్రోలు బంకు ఎదురుగా శనివారం రోడ్డు ప్రమాదం జరిగింది. మైదుకూరు వైపు బైకుపై వెళుతున్న దినేష్ అనే యువకుడు రోడ్డు దాటుతున్న బైక్ను తప్పించబోయి ప్రమాదవశాత్తు కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు తీవ్ర గాయమైన దినేష్ను స్థానికులు 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. -
జిల్లా అభివృద్ధిపై కూటమి వివక్ష
● నాటి సీఎం వైఎస్సార్ తర్వాత జగన్తోనే ప్రగతి ● ‘జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం’ రౌండ్ టేబుల్ సమావేశంలో వక్తలుకడప రూరల్ : ‘జిల్లా అభివృద్ధిపై వివక్ష చూపుతున్నారు. దీంతో జిల్లా వెనుకబడి ఉంది. సహజ వనరులు సమృద్ధిగా ఉన్నా, ప్రగతి మాత్రం కనిపించడం లేదు. నికర జలాలు.. పరిశ్రమల సాధన, రాజకీయ చైతన్యంతో అభివృద్ధి సాధ్యమవుతుంది’ అని వక్తలు తెలిపారు. శనివారం స్థానిక బీసీ భవన్లో పట్టుపోగుల పవన్ కుమార్ అధ్యక్షతన ‘జిల్లా అభివృద్ధి, ఆత్మగౌరవం, జిల్లా ఇప్పటికీ వెనుకబడిన జిల్లాల జాబితాలో ఉంది, కారణాలు ఏమిటి’ అనే అంశంపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ అభివృద్ధి అంటే సామాన్యుడి ఆదాయం పెంచే విధంగా ఉండాలన్నారు. ఖనిజాలతో విలువైన జిల్లాగా మారిన కడపపై వివక్ష రాజకీయాలు సాగడం దురదృష్టకరమని తెలిపారు. కడప ఉమ్మడి జిల్లాకు లక్ష కోట్లు కేటాయిస్తే అభివృద్ధి జరుగుతుందన్నారు. డీసీసీ మాజీ జిల్లా అధ్యక్షుడు నజీర్ అహ్మద్ మాట్లాడుతూ వైఎస్ రాజశేఖర్రెడ్డి కారణంగానే జిల్లాలో అభివృద్ధి పరుగులు పెట్టిందన్నారు. అనంతరం ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు మాత్రమే అభివృద్ధి జరిగిందన్నారు. ఎప్పుడు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినా జిల్లాలో అభివృద్ధి కనిపించలేదని అన్నారు. రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ అధ్యక్షుడు రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 1995 నుంచి పేదరికాన్ని రూపుమాపుతామని చెబుతూనే వస్తున్నారని, కానీ ఆచరణలో చూపించడం లేదని విమర్శించారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక అధ్యక్షుడు నారాయణ మాట్లాడుతూ పోరాటాల ద్వారానే ప్రగతి సాధ్యపడుతుందని తెలిపారు. కార్యక్రమంలో వివిధ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు చలపతి, సంగటి మనోహర్, చంద్రమౌళి, ఓబులేశు యాదవ్, సీఆర్వీ ప్రసాద్, అంజి తదితరులు పాల్గొన్నారు. -
వరినారు పోద్దామంటే వణుకు పుడుతోంది
‘బోర్ల కింద సాగు చేద్దామని అప్పోసప్పో చేసి విత్తన వడ్లు తెచ్చుకుని సిద్ధంగా ఉంచాం. కానీ వానదేవుడు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నాడు. ఒకవేళ సాహసించి నారుమడి పోశాక వానలు కురవకపోతే, బోర్లలో నీరు అడుగంటిపోతే పెట్టిన పెట్టుబడంతా బుగ్గిపాలవుతుంది. ముందుకు వెళ్లాలో, వెన క్కు తగ్గాలో తెలియక నారుమడి పోసేందుకు తీవ్ర ద్వివిధావస్థలో (డైలమాలో) కొట్టుమిట్టాడుతున్నాం.’ – వీరభద్రారెడ్డి, రైతు, ఏటూరు. ‘పత్తి విత్తనాలు వేయడానికి ఒక మంచి పదును వాన కోసం ఆకాశం వైపు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నాం. రోజురోజుకూ వానదేవుడు ఊరిస్తూ వెనక్కే వెళ్తున్నాడు తప్ప వంగి ఒక్క చినుకు కురిపించడం లేదు. ఆకాశమంతా కారుమబ్బులతో నిండి వర్షం వస్తుందేమోనని ఆశ రేపుతోంది.. కానీ విపరీతమైన ఈదురు గాలులు వచ్చి ఆ మేఘాలను కాస్తా తేల్చేస్తున్నాయి. ఈ ఏడాది మా బతుకులు ఏమవుతాయో ఆ దేవుడికే తెలియాలి.’ – గొంగటి శ్రీనివాసులరెడ్డి, రైతు, కోర్రపాడు గ్రామం (రాజుపాలెం మండలం) -
కడపలో మత్స్యశాఖ అధికారి ఇంటిపై ఏసీబీ దాడులు
కడప అర్బన్: తిరుపతి జిల్లాలో మత్స్య శాఖ అధికారిగా పనిచేస్తున్న నంద్యాల రెడ్డయ్యను తిరుపతి ఏసీబీ అధికారులు మూడు లక్షల లంచం తీసుకుంటుండగా శుక్రవారం ప్రత్యక్షంగా పట్టుకున్నారు. ఆయన నివాసం కడపలోని నాగరాజుపేటలో ఉండగా కడప ఏసీబీ సీఐ హాసం ఆధ్వర్యంలో సిబ్బంది దాడులు నిర్వహించారు. రెడ్డయ్య భార్య ప్రైవేట్ వసతి గృహాన్ని నిర్వహిస్తున్నారు. అక్కడ కూడా అధికారులు తనిఖీలు చేపట్టారు. విలువైన డాక్యుమెంట్లు స్వాధీనం చేసుకున్నారు. మధ్యాహ్నం నుంచి రాత్రి దాకా సోదాలు కొనసాగుతూనే ఉన్నాయి. గతంలో కడప మత్స్యశాఖ అధికారిగా కూడా ఈయన పనిచేశారు. ప్రస్తుతం ఆయన తిరుపతిలో విధులు నిర్వహిస్తుండగా అక్కడ మూడు లక్షలు లంచం తీసుకుంటూ ఉండగా పట్టుబడ్డాడు. ఒకేసారి తిరుపతి,కడపలలో తనిఖీలు చేపట్టారు. -
జిల్లా ఆస్పత్రిలో ట్రాన్స్జెండర్ హల్చల్
డాక్టర్లా చైర్లో కూర్చొని, పేషెంట్ల నుంచి రక్తం సేకరిస్తూ రీల్స్ చిత్రీకరణ ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పతిల్రో ఓ ప్రైవేట్ వ్యక్తి డాక్టర్ కుర్చీలో కూర్చొని రీల్స్ చిత్రీకరిస్తూ హల్చల్ చేశాడు. రీల్స్ను అతనే సోషల్ మీడియాలో పోస్టుచేసి వైరల్ చేయడం చర్చనీయాంశమైంది. జిల్లా ఆస్పత్రిలోని క్యాజువాలిటీలో ఓ వ్యక్తి డ్యూటీ డాక్టర్ సీట్లో కూర్చొని రోగులను పరీక్షిస్తున్నట్లు రీల్స్ తీసుకున్నాడు. అంతేగాక ఆస్పత్రిలోని పేషెంట్ల నుంచి రక్తం సేకరించడం, ఆస్పత్రిలోని పలు విభాగాల్లో హల్చల్ చేస్తూ వీడియాలు తీసుకున్నాడు. ఈ వీడియాలు వైరల్గా మారడంతో వైద్యాధికారుల దృష్టికి వెళ్లింది. ఈ విషయంపై జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ ఆనంద్బాబును వివరణ కోరగా.. సామాజిక మాధ్యమాల్లో వీడియో పోస్టు చేసిన వ్యక్తితో ఆస్పత్రికి ఎలాంటి సంబంధం లేదన్నారు. అతను ఒక ట్రాన్స్జెండరని, అతని పేరు లక్కీ అని తెలిపారు. అతను ఆస్పత్రిలోని ఏఆర్టీ సెంటర్లో ఎన్జీఓగా పని చేస్తున్నట్లు పేర్కొన్నారు. అతను నర్సింగ్ విద్యార్థిగా చెప్పుకుంటున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. వాస్తవానికి అతను నర్సింగ్ స్టూడెంట్ కాదని చెప్పారు. ఒక ప్రైవేట్ వ్యక్తి ప్రభుత్వాసుపత్రిలో రీల్స్ చిత్రీకరించిన ఘటనపై ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం ఉన్నట్లు భావించి ఆ సమయంలో డ్యూటీలో ఉన్న హెడ్ నర్స్, సెక్యూరిటీ సిబ్బందితో సహా 8 మందికి షోకాజ్ నోటీసు జారీ చేసినట్లు సూపరింటెండెంట్ తెలిపారు. ఎవరైనా ఆస్పత్రిలో ఇష్టానుసారంగా ప్రవర్తిస్తే ఔట్పోస్టు పోలీసులకు తెలిపాలని సిబ్బందికి సూచించామన్నారు. డ్యూటీ డాక్టర్ కుర్చీలో కూర్చొని రీల్స్ తీసుకున్న లక్కీ, పేషెంట్ నుంచి రక్తం సేకరిస్తూ.. -
వైఎస్సార్విగ్రహం కూల్చివేత దారుణం
– రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి రాజంపేట: పార్టీ మారితే అభిమానం మారుతుందా అని.. జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడిలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం కూల్చివేతపై రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ప్రశ్నించారు. రాజంపేటలోని తన కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ దేవగుడిలో కూటమి పార్టీ అనుచరులు వైఎస్సార్ విగ్రహం కూల్చివేయడం దారుణమన్నారు. ఇలాంటి దౌర్జన్యకర సంఘటనలు ఎక్కడి జరిగినా అది విషసంస్కృతిగా భావించాల్సిన వస్తుందన్నారు. దేవగుడి సోదరులకు దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి రాజకీయ ఉజ్వలభవిష్యత్తు కల్పించారన్నారు. అటువంటి విషయాన్ని మరిచి మహానేత విగ్రహాన్ని కూల్చివేయడం దారుణచర్యగా భావించాల్సి వస్తోందన్నారు. దివంగత సీఎం వైఎస్సార్, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే నైతిక హక్కు ఆదినారాయణరెడ్డి లేదని మేడా తెలిపారు. -
స్మార్ట్ కిచెన్.. కడుపులు మాడ్చెన్
● భోజనం సరఫరా ఆలస్యం ● ఆకలితో అలమటించిన విద్యార్థులు బద్వేలు అర్బన్ : ఏపీ ప్రభుత్వం ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ విధానంలో భాగంగా కేంద్రీకృత వంటశాల నుంచి వివిధ పాఠశాలలకు సరఫరా చేసే భోజనం ఆలస్యం కావడంతో విద్యార్థులు ఆకలితో అలమటించారు. గురువారం చాలా పాఠశాలలకు రెండు గంటల పాటు ఆలస్యంగా భోజనం అందగా శుక్రవారం కూడా కొన్ని పాఠశాలలకు గంట ఆలస్యంగా భోజనం అందింది. బద్వేలు మండల పరిధిలో 5 జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలు, 4 మండల పరిషత్ ప్రాథమికోన్నత పాఠశాలలు, 55 ప్రాథమిక పాఠశాలలు ఉన్నాయి. వీటిలో దాదాపు 3580 మంది విద్యార్థులు విద్యను అభ్యసిస్తున్నారు. ఈ పాఠశాలలకు ఏపీ ప్రభుత్వం నూతనంగా ప్రవేశపెట్టిన స్మార్ట్ కిచెన్ ద్వారా డొక్కాసీతమ్మ మధ్యాహ్న భోజన పథకం పంపిణీ చేసేందుకు గాను చిన్నకేశంపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో స్మార్ట్ కిచెన్ నిర్మించారు. మొదటి విడతలో మండల పరిధిలోని 37 ప్రాథమిక పాఠశాలలు, ఒక ప్రాథమికోన్నత పాఠశాల, ఒక జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలోని 930 మంది విద్యార్థులకు మధ్యాహ్న భోజనం అందించేందుకు మూడు రూట్లను విభజించి మూడు వాహనాలను ఏర్పాటు చేశారు. ప్రాథమిక పాఠశాలల్లో మధ్యాహ్నం 12–15 గంటల నుండి 1 గంట లోపు, ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో 12–30 గంటల నుండి 1–15 గంటల లోపు మధ్యాహ్న భోజనాన్ని అందించాల్సి ఉంది. అయితే తొలిరోజు స్మార్ట్ కిచెన్లో సాంకేతిక సమస్యలు, భోజనాన్ని సరఫరా చేసే వాహన డ్రైవర్ల అవగాహనలేమితో కొన్ని పాఠశాలలకు దాదాపు రెండు గంటలు ఆలస్యంగా భోజనం అందింది. శుక్రవారం కూడా పలు పాఠశాలలకు దాదాపు గంట ఆలస్యంగా భోజనం అందింది. అబ్బరాతివీధి ఉర్దూ ప్రాథమిక పాఠశాల, రాజుగారివీధి, బంకపాలెం పాఠశాలలతో పాటు రామ్నగర్ ప్రాథమిక పాఠశాలలో భోజనం ఆలస్యంగా అందింది. స్మార్ట్కిచెన్ నుండి పట్టణానికి దూరంగా ఉన్న రామ్నగర్ ప్రాథమిక పాఠశాలకు రెండు గంటలకు భోజనం అందింది. భోజనం సరఫరా చేసే వాహనాల సంఖ్య తక్కువగా ఉండటంతో పాటు స్మార్ట్కిచెన్లో సాంకేతిక సమస్యల కారణంగా మధ్యా హ్న భోజనం సరఫరా ఆలస్యమైనట్లు తెలిసింది. రామ్నగర్ పాఠశాలకు మధ్యాహ్నం 2 గంటలు సమయంలో భోజనం అందించేందుకు వచ్చిన వాహనం అబ్బరాతివీధిలో ఉర్దూ ప్రాథమిక పాఠశాలలో 1–45 గంటలకు భోజనం చేస్తున్న విద్యార్థులు -
క్రెడిట్ చోరీలో చంద్రబాబు దిట్ట
– ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజం పులివెందుల : క్రెడిట్ చోరీ చేయడంలో చంద్రబాబును మించినవారు లేరని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. శుక్రవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ వెలిగొండ ప్రాజెక్టు స్వప్నాన్ని సాకారం చేసిన ఘనత దివంగత వైఎస్సార్, ఆయన తర్వాత వైఎస్ జగన్మోహన్రెడ్డిలకే దక్కుతుందన్నారు. 1996 ఎన్నికలప్పుడు ఓట్ల కోసం వెలిగొండ ప్రాజెక్టుకు శంకు స్థాపన చేసిన చంద్రబాబు ఆ తర్వాత ప్రాజెక్టు గురించి పట్టించుకున్న పాపాన పోలేదని ఆరోపించారు. మహానేత వైఎస్సార్ సీఎంగా ఉన్న సమయంలో వెలిగొండ ప్రాజెక్టుకు జలయజ్ఞం పనులలో భాగంగా రూ.3,581.58కోట్లు వెచ్చించి ప్రాజెక్టుకు సంబంధించి సింహభాగం పనులు పూర్తి చేశారని పేర్కొన్నారు. వైఎస్సార్ మరణం తర్వాత వచ్చిన ప్రభుత్వాలు కూడా ప్రాజెక్టుపై నిర్లక్ష్యం వహించాయన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రాజెక్టుకు సంబంధించి మొదటి సొరంగం పనులలో మిగిలిన 2,883 కి.మీ పనులను 2021 జనవరి నాటికి పూర్తి చేశారని వివరించారు. అలాగే రెండవ సొరంగం పనులు సైతం 7,685కిలోమీటర్లు 2024 జనవరి నాటికి పూర్తయ్యాయన్నారు. అంతేకాకుండా హెడ్ రెగ్యులేటర్ పనులను కూడా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే పూర్తి చేసినట్లు తెలిపారు. చంద్రబాబు తానేదో చేసినట్లుగా చెప్పుకోవడం విడ్డూరంగా ఉందని మండిపడ్డారు. ఎస్ఐఆర్ ప్రక్రియపై అప్రమత్తంగా ఉండాలి ఎస్ఐఆర్ ప్రక్రియపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఈ పది రోజులు కీలకంగా భావించి క్రమశిక్షణతో పనిచేయాలని సూచించారు. ఫారం–7పై ప్రతి ఒక్కరూ దృష్టి సారించాలన్నారు. ఓటు హక్కు ఉన్న ప్రతి ఒక్కరూ ఓటును కాపాడుకోవాల్సిన బాధ్యత మన అందరిపై ఉందన్నారు. న్యాయం చేయండి సారూ.. పులివెందుల పట్టణంలోని క్రిష్టియన్లైన్కు సంబంధించిన బాధితులు శుక్రవారం ఎంపీని కలిశారు. తన కుమార్తె మోక్షిత (11)కు కడుపు నొప్పి రాగా స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా.. అక్కడ వైద్యం వికటించి మృతి చెందిందని తండ్రి ప్రేమ్ కన్నీటిపర్యంతమయ్యారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. స్పందించిన ఎంపీ పోలీసులకు ఫోన్ చేసి బాధితులకు న్యాయం చేయాలని ఆదేశించారు. -
ఇది ప్రారంభం కాదు...పునః ప్రారంభం
సాక్షి ప్రతినిఽధి కడప : జమ్మలమడుగు నియోజకవర్గంలో సున్నపురాళ్లపల్లె వద్ద జేఎస్డబ్ల్యూ ఆధ్వర్యంలో చేపట్టిన స్టీల్ప్లాంటు ప్రారంభోత్సవం నేడు జరిగింది కాదని....అంతకుముందే వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు జరిగిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి అన్నారు. శుక్రవారం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇది ప్రారంభోత్సం కాదని..పునః ప్రారంభోత్సవమని ఎద్దేవా చేశారు. రాయలసీమలో స్టీల్ ప్లాంటు ఏర్పాటు చేసేందుకు మొగ్గుచూపిన జిందాల్ సంస్థకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఉక్కు పరిశ్రమకు తొలి అడుగుపడిందని, భూముల కేటాయింపు, నీటి కేటాయింపు, పర్యావరణ అనుమతులు, విద్యుత్, రోడ్డు కనెక్టివిటీ వంటి మౌలిక సదుపాయాలన్నీ అప్పుడే పూర్తి చేశారన్నారు. 2019 డిసెంబరులో స్టీల్ ప్లాంటును ప్రారంభించినప్పటికీ కరోనా వల్ల 2023లో స్టీల్ ప్లాంటు పనులు రూ. 1000 కోట్లతో శరవేగంగా జరిగాయన్నారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 25 నెలలు ఈ పనులు ఎందుకు ఆపారో ప్రజలకు చెప్పాల్సిన బాధ్యత ముఖ్యమంత్రి, మంత్రులపై ఉందన్నారు. స్టీల్ ప్లాంటు ప్రారంభోత్సవం సందర్భంగా సీఎం చంద్రబాబు, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చేసిన వ్యాఖ్యలు తీవ్ర అభ్యంతకరమన్నారు. ‘ఆది’ మాటలు సంస్కారహీనం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి సంస్కార హీనంగా మాట్లాడుతున్నారని రాచమల్లు శివప్రసాద్రెడ్డి మండిపడ్డారు. ఆదినారాయణరెడ్డి బుద్ధి దరిద్రపు, వంకర బుద్ధి అని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ సింహంలా గర్జించేవాడని తెలిపారు. గజ్జికుక్కలాగా మొరిగేది ఆదినారాయణరెడ్డేనని విమర్శించారు. రాయలసీమ ప్రజలను వైఎస్ కుటుంబం కన్నబిడ్డల్లాగా భావిస్తుందని, అది ఇక్కడి ప్రజలందరికీ బాగా తెలుసన్నారు. కరువు రక్కసితో అల్లాడుతున్న రాయలసీమపై చంద్రబాబు సవతితల్లి ప్రేమ చూపిస్తారని, జగన్ మాత్రమే సొంత బిడ్డలాగా చూసుకుంటాడన్నారు. 2018లో కంబాలదిన్నెలో స్టీల్ప్లాంటు ప్రారంభోత్సవం సందర్బంగా ఏడాదిలోపు పనులను పూర్తి చేస్తానని చంద్రబాబు చెప్పారని, ఇంతవరకు పనులు పూర్తి కాలేదన్నారు. నేడు కన్యతీర్థంలో రూ. వెయ్యి కోట్లతో వైఎస్ జగన్ అభివృద్ది చేసిన స్టీల్ ప్లాంటుకు చంద్రబాబు పునః ప్రారంభోత్సవం చేశారేతప్ప సొంతంగా చేసింది ఏమి లేదన్నారు. రెండేళ్లుగా స్టీల్ ప్లాంట్ పనులు ఎందుకు ఆపారో చెప్పాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్ రెడ్డి -
ఎన్నాళ్లకు వస్తావే..వానా !
● ఆకాశం వైపు రైతన్న చూపులు ● కారుమబ్బుల కవ్వింపు.. ఎండల ఉడికింపు కడప అగ్రికల్చర్: పంటకాలం ప్రారంభమై నెల రోజులు గడుస్తున్నా జిల్లాలో వరుణుడి కరుణ లభించకపోవడంతో అన్నదాతల పరిస్థితి దయనీయంగా మారింది. జూన్ నెలలో కురవాల్సిన సాధారణ వర్షపాతం కంటే చాలా తక్కువగా నమోదు కావడం సాగును దెబ్బతీసింది. ఆకాశంలో రోజురోజుకూ మబ్బులు కమ్ముకొస్తున్నా, అరకొర చినుకులు రాలడమే తప్ప పూర్తిస్థాయిలో వర్షం కురవడం లేదు. ఒకపక్క ఎండలు, మరోపక్క మబ్బులతో కూడిన ఈ విభిన్న వాతావరణం రైతన్నలను ఉక్కిరిబిక్కిరి చేస్తోంది. సాగు పనులు ముందుకు సాగక, అప్పటికే విత్తిన పంటలు కళ్లముందే ఎండిపోతాయేమోననే ఆందోళనలో రైతాంగం మల్లగుల్లాలు పడుతోంది. సమయం ముంచుకొస్తోంది.. జిల్లాలో ప్రధాన వాణిజ్య పంట అయిన వేరుశనగ సాగుకు సమయం అత్యంత వేగంగా ముంచుకొస్తోంది. సాంకేతికంగా జులై 15వ తేదీతో వేరుశనగ పంట సాగు గడువు ముగియనుంది. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్లో మొత్తం 4,446 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సి ఉండగా.. నెల రోజులు గడిచినా ఇప్పటివరకు కేవలం 766 హెక్టార్లలోనే విత్తనాలు పడ్డాయి. అంటే ఇంకా ఏకంగా 3,680 హెక్టార్లలో సాగు కావాల్సి ఉంది. ఈ పక్షం రోజుల్లో అనుకున్న మేర వర్షం కురిస్తే కొంతమేర సాగవుతుంది, లేకుంటే ఈ ఏడాది వేరుశనగ సాగు ప్రశ్నార్థకంగా మారనుంది. 22 శాతం వర్షపాత లోటు ఇప్పటి వరకు జిల్లాలో వర్షాలు ఏమాత్రం ఆశాజనకంగా లేవు. అధికారిక గణాంకాల ప్రకారం జూన్ నెలలో జిల్లా సాధారణ వర్షపాతం 68.2 మి.మీ నమోదు కావాల్సి ఉండగా, కేవలం 49.8 మి.మీ వర్షం మాత్రమే కురిసింది. ఈ భారీ వర్షపాత లోటు కారణంగా చాలా ప్రాంతాల్లో రైతులు అసలు విత్తనం విత్తాలా వద్దా? విత్తితే రాబోయే రోజుల్లో ఎలాంటి విపత్తు ముంచుకొస్తుందోనని తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. బోర్ల కింద సాగు చేసినా తప్పని సెగబోర్ల కింద సాగు చేసిన రైతులకూ తప్పని సెగ వర్షాలు లేక వర్షాధార రైతులు అల్లాడుతుంటే, మరోవైపు బోరుబావుల కింద సాగు నమ్ముకున్న రైతాంగంలోనూ వణుకు మొదలైంది. వర్షాలు పడకుండా ఇదే పరిస్థితి కొనసాగితే భూగర్భ జలాలు పూర్తిగా పడిపోయి, బోర్లలో నీరు అడుగంటిపో తుందేమోనని ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో ఎఫెక్ట్.. మేఘాల కవ్వింపు చర్యలు ఈ సారి ‘ఎల్నినో’ తీవ్ర ప్రభావం చూపుతుందని వాతావరణ శాస్త్రవేత్తలు హెచ్చరించిన విషయం ఇపుడు క్షేత్రస్థాయిలో స్పష్టంగా కనిపిస్తోంది. ఉన్నపళంగా కారుమేఘాలు కమ్మేయడం, భారీగా వాన పడుతుందని ఆశపడేలోపే ఆ మేఘం కాస్తా తేలిపోవడం నిత్యకృత్యమైంది. లేదంటే తుంపరలా వచ్చి అలా కవ్వించి వెళుతోంది. పడితే ఒకే చోట వర్షం కురవడం, పడని చోట అసలు చినుకు కూడా రాలని విచిత్ర పరిస్థితి నెలకొంది. ఖరీఫ్ సాగుపై అనావృష్టి దెబ్బ.. జూన్ ముగిసేనాటికి నమోదైన వ్యవసాయ శాఖ అధికారిక గణాంకాలే జిల్లాలోని సాగు తీవ్రతకు అద్దం పడుతున్నాయి. జిల్లావ్యాప్తంగా ఈ ఖరీఫ్లో మొత్తం 76,496 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా.. ఇప్పటివరకు కేవలం 7,552 హెక్టార్లలోనే (సుమారు 10 శాతం) సాగు కావడం గమనార్హం. వేరుశనగ సాగు విస్తీర్ణం 4,446 హెక్టార్లు లక్ష్యం అయితే 766 హెక్టార్లు మాత్రమే అయింది. గడప ముందు ‘కరువు’ ముప్పుప్రస్తుత అనావృష్టి పరిస్థితి ఇలాగే కొనసాగితే, వేసిన అరకొర పంటలు కళ్లముందే ఎండిపోయే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రత్యామ్నాయ ప్రణాళికలు సిద్ధం చేయాలని, వర్షాధార రైతాంగాన్ని ఆదుకోవాలని రైతు సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. వర్షాలు వస్తాయనే ఆశతో ఇప్పటికే పలువురు రైతులు అప్పోసప్పో చేసి, వడ్డీలకు తెచ్చి పలు ఆరుతడి పంటలను సాగు చేసుకున్నారు. వాన దేవుడు కరుణించకపోతే ప్రస్తుతం సాగు చేసిన పంటల కోసం పెట్టిన ఖర్చంతా నేలపాలవుతాయని అన్నదాతలు ఆవేదన చెందుతున్నారు. పట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేకపోవడంతో రైతాంగంలో అప్పుల భయం పట్టుకుంది. -
వైద్యం వికటించి చిన్నారి మృతి
పులివెందుల రూరల్ : పులివెందులలోని నగరిగుట్ట క్రిస్టియన్లైన్కు చెందిన ప్రేమ్ కుమార్తె మోక్షిత (11) కొంతకాలంగా కడుపు నొప్పితో బాధపడుతోంది. గురువారం కడుపు నొప్పి ఎక్కువ కావడంతో తల్లిదండ్రులు ముద్దనూరు రోడ్డులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ వైద్యులు ఇంజెక్షన్ వేసి కడపకు తీసుకెళ్లాలని చెప్పారు. కడప తీసుకెళ్లి ఆసుపత్రిలో చికిత్స అందించేలోపే మోక్షిత మృతి చెందినట్లు బంధువులు, తల్లిదండ్రులు తెలిపారు. దీంతో వారు పులివెందుల పట్టణంలోని ఆ ప్రైవేట్ ఆసుపత్రి ఎదుట ఆందోళన చేపట్టారు. వైద్యుల నిర్లక్ష్యం కారణంగానే మోక్షిత మృతి చెందిందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ శ్రీరామ్ సంఘటనా స్థలానికి చేరుకుని ఎలాంటి గొడవలు జరగకుండా వైద్యులతోపాటు మృతురాలు మోక్షిత తల్లిదండ్రులు, బంధువులతో మాట్లాడారు. ఆందోళకారులను శాంతింపజేశారు. ఆసుపత్రి వద్ద తల్లిదండ్రులు, బంధువుల ఆందోళన -
మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
పులివెందుల రూరల్ : మహిళలు పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని డీఆర్డీఏ ఏపీఎం ఆంజనేయులు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభా భవనంలో సెర్ఫ్ డీఆర్డీఏ, టాటా ఇన్నోవేషన్ హబ్ సంయుక్త సహకారంతో ఔత్సాహిక మహిళా పారిశ్రామికవేత్తలకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డ్వాక్రా మహిళా సంఘం సభ్యులు చిన్న తరహా పరిశ్రమల ఏర్పాటు చేయడం ద్వారా స్థిరమైన ఆదాయం పొందవచ్చన్నారు. ఏపీఎం గురురాజు మా ట్లాడుతూ బ్యాంకుల ద్వారా రుణాలు, సీ్త్రనిధి రుణా లు ఎస్సీ, ఎస్టీ మహిళలకు ఉన్నతి రుణాల ద్వారా చిన్న తరహా పరిశ్రమల ప్రోత్సాహకానికి నిధులు స మకూర్చనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో ఎస్వీఈ పీ బ్లాక్ మేనేజర్ వెంకటస్వామి, ఎస్వీఈపీ మెంటర్ వహఋదా, సీఆర్పీలు, తదితరులు పాల్గొన్నారు. -
బి.మఠం మేనేజర్ పీపీఎన్ ప్రసాద్ నియామకం రద్దు
బ్రహ్మంగారిమఠం: శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి మేనేజర్గా బాధ్యతలు చేపట్టిన పీపీఎన్ ప్రసాద్ నియామకం చెల్లదంటూ ఎండోమెంట్ కమిషనర్ ఉత్తర్వులు ఇచ్చారు. జూన్ 30న పదవీవిరమణ పొందిన ఈశ్వరాచారి స్థానంలో నూతన మేనేజర్గా మఠాధిపతి వెంకటాద్రిస్వామి 27న పీపీఎన్ ప్రసాద్ పేరును తెలియజేస్తూ కమిషనర్కు ప్రతి పాదనలు పంపారు. అక్కడ నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకముందే మఠాధిపతి ఆదేశాలు ఇచ్చారని పీపీఎన్ ప్రసాద్ ఈనెల 1న బాధ్యతలు చేపట్టారు. పీపీఎన్ ప్రసాద్ ఎలా మేనేజర్గా వస్తాడని కొంత మంది ఎండోమెంట్ అధికారులకు ఫిర్యాదు చేయడంతో నియామకాన్ని రద్దు చేస్తున్నట్లు శుక్రవారం ఎండోమెంట్ కమిషర్ మఠాధిపతికి ఉత్తర్వులు జారీచేశారు. ప్రస్తుతం మేనేజర్ నియామకం జరిగేవరకు ఎండోమెంట్ ఏసీ ఇన్చార్జి మేనేజర్గా వ్వవహరిస్తారని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. ఇందులో ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ ప్రమేయం ఉందని బి.మఠంలో చర్చించుకుంటున్నారు. చోరీ కేసులో నిందితుడికి జైలు శిక్ష వేంపల్లె : వేంపల్లె పట్టణ పరిధిలోని దుకాణంలో చోరీ చేసిన సంఘటనలో మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డి అనే వ్యక్తికి 6నెలల జైలు శిక్ష, రూ.2వేల జరిమానా విధించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. గత ఏడాది నవంబర్ 17న పులివెందులకు చెందిన మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డి వేంపల్లెలోని దుకాణానికి ఉన్న తాళాలు పగలకొట్టి రూ.12వేల విలువ చేసే ఎంఐ టీవీని దొంగలించాడు. అప్పట్లో కల్లూరి హరికృష్ణ అనే వ్యక్తి ఫిర్యాదు చేయడంతో ఎస్ఐ తిరుపాల్ నాయక్ కేసు నమోదు చేశారు. ఈమేరకు మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డిని పట్టుకొని అతని వద్ద ఉన్న టీవీని స్వాధీనం చేసుకుని రిమాండ్ కు పంపినట్లు సీఐ తెలిపారు. రిమాండ్ లో ఉన్న వ్యక్తిపై చార్జిషిట్ దాఖలు చేయగా శుక్రవారం పులివెందుల కోర్టులో జరిగిన వాదనల్లో నేరం రుజువు కావడంతో నిందితుడికి 6నెలలు జైలు శిక్షతోపాటు రూ.2వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి చంద్రశేఖర్ రెడ్డి తీర్పు ఇచ్చారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.మధుసూదన ఆచారి, సీఐ నరసింహులు, వేంపల్లె ఎస్ఐ తిరుపాల్ నాయక్, సాక్షులను కోర్టులో సకాలంలో హాజరుపరిచి నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ బాబా ఫకృద్దీన్లను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి కొండాపురం: విద్యుదాఘాతంతో వ్యక్తి మృతిచెందాడు.శుక్రవారం ఎస్ఐ వివరాల మేరకు కొండాపురం మండలంలోని లావనూరు గ్రామానికి చెందిన ఓ రైతు పొలంలో మోటర్ పనిచేయలేదు.స్టార్టర్ వద్ద సమస్య రావడంతో ఎలక్ట్రీషియన్ పనిచేస్తుండగా మంగలి రామంజినేయులు(44) విద్యుత్ షాక్కు గురై మృతి చెందాడు.మృతిదేహన్ని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వృద్ధురాలిని బెదిరించిన వ్యక్తిపై కేసు కడప అర్బన్: కడప పాత బస్టాండ్లో ఓ లాడ్జి వద్ద లక్ష్మమ్మ అనే వద్ధురాలిని రవి అనే వ్యక్తి కత్తితో బెదిరించి రూ.3 వేలు లాక్కుని వెళ్లాడు. నంద్యాల జిల్లా రుద్రవరానికి చెందిన లక్ష్మమ్మ ఈనెల రెండో తేదీన తిరుపతి వెళ్లేందుకు కడపకు వచ్చింది. కడప నుంచి రాజంపేటకు వెళ్లింది. అక్కడ నుంచి బస్సు లేకపోవడంతో తిరిగి కడపకు వచ్చింది. ఆ సమయంలో రవి అనే వ్యక్తి పరిచయమయ్యాడు. వృద్ధురాలిని కడపకు తీసుకొచ్చి శుక్రవారం తిరుపతికి బస్సు ఎక్కించి పంపిస్తానని చెప్పాడు. కడప పాత బస్టాండ్ తీసుకురాగానే ఓ లాడ్జి వద్దకు తీసుకెళ్లి కత్తితో బెదిరించాడు. ఆమె దగ్గర రూ. 3వేలు లాక్కొని పరారైపోయాడు. ఈ సంఘటనపై వృద్ధురాలి ఫిర్యాదు మేరకు సీఐ తిమ్మారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ అమర్నాథ్ రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
పరిహారం ఊసెత్తని బాబు!
జమ్మలమడుగు: ప్రతిపక్ష నేతగా ఇచ్చిన హామీని సీఎం హోదాలో అమలు చేస్తారేమోనని ఆశగా ఎదురుచూసిన గండికోట ముంపు బాధితులకు మరోసారి నిరాశే ఎదురైంది. చంద్రబాబు నోట పరిహారం మాటే కరువైంది. ఫలితంగా గండికోట ముంపువాసుల గుండెల్లో బాధ గూడు కట్టుకుంది. ఉక్కు ఫ్యాక్టరీ శంకుస్థాపన కోసం శుక్రవారం సున్నపురాళ్లపల్లి గ్రామానికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు హాజరయ్యారు. దీంతో పలువురు గండికోట ముంపు బాధితులు ఎన్నో ఆశలతో సభకు చేరుకున్నారు. సీఎం చంద్రబాబు నాయుడేమో ఎప్పట్లాగే ఊకదంపుడు ఉపన్యాసంతో సరిపెట్టారు. పైగా ‘మీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి గండికోట ముంపువాసుల సమస్యను నాదృష్టికి తీసుకువచ్చారు. గతంలో గండికోట ముంపువాసులకు పరిహారం ఇచ్చింది నేనే’ అంటూ గొప్పలు పలికారు. ప్రస్తుతం ఇవ్వాల్సిన పరిహారంపై ఒక్క మాటైనా చెప్పలేకపోయారు. సీఎం నోట పరిహారం మాటే రాకపోవడంతో బాధితులు నిట్టూర్చారు. ఇక రాజోళి ప్రాజెక్టు ముంపువాసుల పరిహారం విషయంలోనూ సరైన సమాధానం ఇవ్వకపోవడంతో ఆ ప్రాంత రైతులు సైతం తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. ఎన్నికల సమయంలో వైఎస్సార్సీపీ నాయకులు ఇస్తున్న 12.5 లక్షల కంటే అదనంగా ఎకరాలకు 24 లక్షల రూపాయలు ఇప్పిస్తామని హామి ఇచ్చారు. ఇంత వరకు హామీ నెరవేర్చలేదు. ఇప్పుడైనా తమకు పరిహారం అందుతుందని భావించిన రాజోలి రైతులకు సైతం చంద్రబాబు నాయుడు మొండి చేయి చూపడంతో మండిపడ్డారు. సుదూర ప్రాంతాలనుంచి సభకు తరలివచ్చిన గండికోట, రాజోళి ముంపువాసులు బిక్కమొహం వేసుకుని ఇంటిబాట పట్టారు. గండికోట ముంపు బాధితుల పరిహారం హామీని విస్మరించిన సీఎం బాధితుల్లో గూడు కట్టుకున్న నిరాశ ఇబ్బందులు పడ్డ జనం.. సీఎం సభకు కార్యకర్తలు, నాయకులకు, మహిళ సంఘాలను తరలించేందుకు కూటమి నాయకులు నానా అవస్థలు పడ్డారు. వివిధ ప్రాంతాల డిపోల నుంచి భారీగా ఆర్టీసీ బస్సులను పంపించారు. దీంతో బస్సులు లేక ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒక్క జమ్మలమడుగు డిపో పరిధి నుంచి 25 బస్సులు వివిధ ప్రాంతాల సర్వీసులను రద్దు చేసి చంద్రబాబు సభకు తరలించారు. దీంతో గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు అవస్థలు పడ్డారు. కాగా పట్టణంలోని వీధుల్లో బస్సులు ఇరుక్కు పోయాయి. ఓ బస్సు ఆటోను ఢీకొనడంతో అంబాభవాని దేవాలయం వద్ద ట్రాఫిక్ జాం అయింది. -
వైఎస్సార్ విగ్రహం చేయి విరగ్గొట్టిన దుండగులు
పోలీసులకు ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ శ్రేణులు సింహాద్రిపురం : వైఎస్సార్ కడప జిల్లా సింహాద్రిపురం మండలం పైడిపాలెం గ్రామ సమీపంలో ఉన్న జీకేఎల్ఐ గెస్ట్ హౌస్ వద్ద ఉన్న వైఎస్సార్ విగ్రహానికి చేయిని దుండగలు విరగ్గొట్టగా.. అక్కడ ప్రారంభించిన శిలాఫలాకాన్ని ధ్వంసం చేసిన ఘటన గురువారం అర్థరాత్రి చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. ప్రతి రైతు ముఖంలో చిరునవ్వు చూడాలన్న ధ్యేయంతో దివంగత మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ఆయన సొంత ఆలోచనలతో సింహాద్రిపురం మండలంతోపాటు తొండూరు మండలానికి తాగు, సాగునీరు అందించాలన్న ధృడ సంకల్పంతో పైడిపాలెం రిజర్వాయర్ ప్రాజెక్టు పనులు శరవేగంగా పూర్తి చేయించారు. ప్రస్తుతం ఆయా మండలాల్లోని రైతులకు తాగు, సాగునీరు కష్టాలు తొలగిపోయాయి. వైఎస్సార్ చలువతో ఆయన గుర్తింపుగా జీకేఎల్ఐ గెస్ట్ హౌస్ వద్ద పైడిపాలెం గ్రామస్తులు వైఎస్సార్ విగ్రహాన్ని ఏర్పాటు చేసి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిచేత ప్రారంభించారు. అయితే గురువారం సాయంత్రం వరకు బాగా ఉన్న వైఎస్సార్ విగ్రహానికి శుక్రవారం తెల్లవారుజామున ఒక చేయి విరగ్గొట్టి అక్కడే ప్రారంభించిన శిలాఫలాకాన్ని గుర్తు తెలియని దుండగులు ధ్వంసం చేశారు. ఈ విషయాన్ని వైఎస్సార్సీపీ శ్రేణులు పోలీసులకు ఫిర్యాదు చేయగా.. ఇన్చార్జి సీఐ శ్రీరామ్ సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించి వెళ్లారు. దుండగులు విరగొట్టిన వైఎస్సార్ విగ్రహం చేయి జీకేఎల్ఐ గెస్ట్ హౌస్ వద్ద శిలాఫలకాన్ని ధ్వంసం చేసిన గుర్తు తెలియని వ్యక్తులు -
రిమ్స్లో రెండు గుర్తు తెలియని మృతదేహాలు
కడప అర్బన్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో వైద్య సేవల కోసం ఇద్దరు వ్యక్తులు వచ్చారు. వీరు వైద్యసేవలు పొందుతూ వేర్వేరు రోజుల్లో మృతి చెందారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాలను అప్పగిస్తామని అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. మిస్భా తండ్రి ఆత్మహత్య పలమనేరు: గతంలో చిత్తూరు జిల్లా పలమనేరులో కాపురముంటూ పుంగనూరుకు వెళ్ళిన మిస్భా తండ్రి వజీర్ అహ్మద్(50) రెండ్రోజుల క్రితం అక్కడి కొత్తపేటలోని తన ఇంట్లో ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్టు తెలిసింది. 2022లో పలమనేరులో మిస్భా అనే బాలిక ఇంట్లో ఉరివేసుకుని అనుమానాస్పద మృతి అప్పట్లో రాష్ట్రవ్యాప్తంగా సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ ఘటన జరిగాక మిస్భా కుటుంబం పుంగనూరుకు వెళ్ళిపోయింది. ఏం జరిగిందోగాని మిస్భా తండ్రి సైతం ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడడం పలమనేరులో చర్చనీయాంశమైంది. బాలికలపై అసభ్యప్రవర్తన – నిందితుడికి జైలుశిక్ష పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కొత్తపల్లె గ్రామంలో పీర్ల చావిడి సమీపంలో ముగ్గురు మైనర్ బాలికలపట్ల అసభ్యకరంగా ప్రవర్తించిన కేసులో సైదర వల్లి అనే వ్యక్తికి కోర్టు జైలుశిక్ష విధించింది. 2023 జూన్ 20న సైదర వల్లి ముగ్గురు బాలికలతో అసభ్యకరంగా మాట్లాడి బెదిరించినట్లు వారి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. అప్పట్లో పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కోర్టులో చార్జి షీట్ దాఖలు చేసి కోర్టుకు హాజరుపరచడంతో నిందితుడికి మూడేళ్ల జైలు శిక్షతోపాటు రూ.3000 జరిమానా విధిస్తూ కోర్టు తీర్పునిచ్చింది. నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన అర్బన్ సీఐ శ్రీరామ్, పోలీసు సిబ్బందిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు మైదుకూరు : ఎరువులను అక్రమంగా నిల్వ చేస్తే చర్యలు తప్పవని వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు. మైదుకూరులో శుక్రవారం జిల్లా స్థాయి తనిఖీ బృందం ఎరువుల దుకాణాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎరువుల దుకాణాల్లో ఈ ఏడాది, గత సంవత్సరం యూరియా, డీఏపీ ఎరువుల విక్రయాల వివరాలు, గత మూడు సంవత్సరాల సగటు విక్రయాలతో పోలిక, అసాధారణ విక్రయాల పెరుగుదలను పరిశీలించారు. యూరియా అంతర్ జిల్లా రవాణా, ఐఎఫ్ఎంఎస్, ఏపీఏఐఎంస్ 2.0 యాప్లో నమోదైన విక్రయాల వివరాలను పరిశీలించి ధ్రువీకరించారు. -
32 టన్నుల రేషన్ బియ్యం పట్టివేత
రొంపిచెర్ల: అక్రమంగా ఇతర రాష్ట్రానికి తరలిపోతున్న చౌక దుకాణాల బియ్యాన్ని రొంపిచెర్ల పోలీసులు పట్టుకున్నారు. ఇన్చార్జి ఎస్ఐ వేంకటేశ్వర్లు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి జిల్లా శ్రీకాళాహస్తి, నగిరి ప్రాంతాలకు చెందిన రేషన్ బియ్యం అక్రమంగా కర్ణాటక రాష్ట్రానికి తరలి పోతున్నాయని చిత్తూరు జిల్లా ఎస్పీ శ్రీ తుఫార్ దూది , డీఎస్పీ వెంకట నారాయణ ఇచ్చిన రహస్య సమాచారం మేరకు అనంతపురం– చైన్నె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్లో శుక్రవారం వాహనాల తనిఖీ చేస్తుండగా శ్రీకాళాహస్తి నుంచి వచ్చిన ఒక లారీ, ఈచర్ వాహనంలో అక్రమంగా రేషన్ బియ్యం తరలిస్తున్నట్లు బయట పడిందన్నారు. ఈ రెండు వాహనాల వెనుక పైలెట్ వాహనం.. కారును స్వాధీనం చేసుకుని అందులోని ఐదుగరు నిందితులను అదుపులోకి తీసుకుని విచారించామని అన్నారు. తమ విచారణలో 32 టన్నుల రేషన్ బియ్యాన్ని అక్కడ తక్కువగా కొనుగోలు చేసి కర్ణాటకలోని బంగారుపేటలో రేషన్ బియ్యానికి పాలిష్ పట్టి అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు తేలిందన్నారు. ఈ ముఠా వెనుక నగిరికి చెందిన అమృతరాజు ఉన్నట్లు గుర్తించామని తెలిపారు. అతని కోసం గాలిస్తున్నామని తెలిపారు. మెరువ బాలాజీ, నందిపట్ల శ్రీనివాసులు, ఎం. సతీష్, ఎస్.కే. మహమ్మద్, దశరధ రామయ్యపై కేసు నమోదు చేసి అరెస్టు చేశామని తెలిపారు. బియ్యం విలువ సుమారు రూ.6.30 లక్షలు ఉంటుందన్నారు. అలాగే మూడు వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. సీజ్ చేసిన రేషన్ బియ్యాన్ని రొంపిచెర్ల సివిల్ సప్లెయ్స్ అధికారులకు అప్పగించినట్లు ఎస్ఐ తెలిపారు. దాడిలో కల్లూరు ఏఎస్ఐ సత్య నారాయణ, రొంపిచెర్ల హెడ్ కానిస్టేబుల్ చంద్రశేఖర్, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యాన్ని పట్టుకున్న రొంపిచెర్ల, కల్లూరు పోలీసులను ఎస్పీ అభినందించారు. -
ఎస్ఐఆర్ను వేగవంతం చేస్తున్నాం
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) ప్రక్రియను వేగవంతం చేసి, నిర్దేశిత గడువులోగా పూర్తి చేసేలా ప్రత్యేక దృష్టి సారించామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. గురువారం విజయవాడ నుంచి ఎస్ఐఆర్ నిర్వహణ, సన్నాహక చర్యలపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్.. అన్ని జిల్లాల కలెక్టర్లతో జూమ్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్కు ప్రొద్దుటూరు తహశీల్దార్ కార్యాలయం నుంచి కలెక్టర్ హాజరవ్వగా.. కడప కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి డీఆర్వో మల్లికార్జునుడు, ఎస్డీసి వెంకటపతి హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎస్ఐఆర్ ప్రక్రియ అమలుపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి అన్ని జిల్లాల కలెక్టర్లతో సమగ్రంగా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 18,96,231 మంది ఓటర్లలో 14,45,697 మంది (76.24 శాతం) మ్యాపింగ్ పూర్తయిందని, ఇంకా 4,50,534 మంది ఓటర్ల మ్యాపింగ్ మిగిలి ఉందని తెలిపారు. మొత్తం 4,62,016 మంది ఓటర్ల వివరాల్లో వ్యత్యాసాలు గుర్తించినట్లు వెల్లడించారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా జిల్లాలో ప్రస్తుతం ఉన్న 2,251 పోలింగ్ కేంద్రాలను 2,444కు పెంచే ప్రతిపాదనలు సిద్ధం చేసినట్లు తెలిపారు. ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఉపయోగం పెండ్లిమర్రి: ఉపాధి హామీ పథకంలో కేంద్రం ప్రభుత్వం నూతనంగా తీసుకొచ్చిన మార్పులు ప్రతి పేద కుటుంబానికి ఎంతో ఉపయోగకరంగా ఉంటాయని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మహాత్మాగాంధీ జాతీయ ఉపాధిహామి పథకానికి ప్రత్యామ్నాయంగా కేంద్రం ప్రభుత్వం ప్రవేశ పెట్టిన వీబీ జీ రామ్ పథకాన్ని గురువారం పెండ్లిమర్రి మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామంలో ఎమ్మెల్యే పుత్తా క్రిష్ణ చైతన్యరెడ్డితో కలిసి ప్రారంభించారు. కార్యక్రమంలో డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, ఉధ్యానశాఖ అధికారి రవిచంద్ర, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
● మూడేళ్ల తర్వాత నీ పరిస్థితి ఏంటో గుర్తుంచుకో
– రాచమల్లు ప్రసాద్రెడ్డి మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ.. ఆదినారాయణరెడ్డి ఉత్తరకుమారుడిలా ప్రగల్బాలు పలుకుతున్నాడన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలో ఉండేది ఇక మూడేళ్లేనని, ఆ తర్వాత నీ గతి ఏంటో చూసుకోవాలని హెచ్చరించారు. చావైనా బతుకై నా తాము వైఎస్ కుటుంబం వెంటే నడుస్తామన్నారు. స్టీల్ప్లాంట్ను పరిశీలించడానికి వచ్చిన సీనియర్ నాయకుడు రఘురామిరెడ్డిని పట్టుకుని నోటికొచ్చినట్లు మాట్లాడతావా.. సీనియర్లంటే కనీసం గౌరవం కూడా లేదా అని ఆదిని నిలదీశారు. బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధా, మాజీ డెప్యూటీ సీఎం అంజాద్బాషా, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు. -
ప్రజల భద్రత కోసమే పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్
పులివెందుల రూరల్ : పులివెందులలో శాంతి భద్రతల దృష్ట్యా ప్రజల భద్రత కోసం పోలీస్ స్టేషన్లో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ కమాండ్ కంట్రోల్ సెంటర్ను రాయలసీమ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రారంభించారు. పులివెందులలో సుమారు 8సర్కిల్ ప్రధాన కూడళ్లలో ఆధునిక పరికరాలతో 120 సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా వారు అర్బన్ పోలీస్ స్టేషన్ లో ఏర్పాటు చేసిన శిలాఫలకాన్ని ప్రారంభించారు. పోలీస్ స్టేషన్లో ఉన్న పోలీస్ కమాండ్ కంట్రోల్ రూంను పరిశీలించారు. అనంతరం సీసీ కెమెరాల ఏర్పాటుకు సహకరించిన దాతలను సన్మానించారు. డీఎస్పీ మురళి నాయక్, సీఐలు శ్రీరామ్, ప్రసాదరావు, శాంతిలాల్, నరసింహులు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
కేబుల్..ట్రబుల్
విద్యుత్ స్తంభాలు విద్యుత్ సరఫరా కోసం ఏర్పాటు చేసినవే. కానీ నేడు వాటిపై కేబుల్, ఇంటర్నెట్, టెలిఫోన్ వైర్లు గుట్టలు..గుట్టలుగా కనిపిస్తున్నాయి. ఈ అదనపు వైర్ల వల్ల ప్రమాదాలు, నిర్వహణలో ఇబ్బందులు, ప్రజల భద్రతకు ముప్పు వంటి సమస్యలు తలెత్తుతున్నాయి. పులివెందుల పరిధి కడప రోడ్డులోని ఎన్న్జీఓ కార్యాలయం, శ్రీరామహాలు రోడ్డులో నాగుల కట్ట వద్ద విద్యుత్ స్తంభానికి దర్శనమిస్తున్న ప్రైవేట్ కేబుల్ వైర్లే దీనికి నిదర్శనం.పెను ప్రమాదం జరగక ముందే అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. – పులివెందుల రూరల్ -
● నీ తాటాకు బెదిరింపులకు భయపడం
– ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో గండికోట ముంపువాసుల కు పరిహారణ, రాజోళి రైతులకు రూ. 24 లక్షలు ఇప్పిస్తామని ఇచ్చిన హామీలపై నిలదీస్తే.. చెప్పుదెబ్బలు తప్పవని బెదిరించడం ఆది అజ్ఞానానికి నిదర్శనమన్నారు. ‘ఫ్యాక్షన్ వద్దు.. ఫ్యాషన్ ముద్దు’ అంటూనే ఆది నియోజకవర్గంలో ఫ్యాక్షన్ రాజకీయాలు చేస్తున్నాడన్నారు. వైఎస్ కుటుంబంపై విమర్శలు చేస్తే చంద్రబాబు మంత్రి పదవి ఇస్తాడనే ఆశతోనే ఆది తూగుతున్నాడన్నారు. చేతనైతే ముందు నిర్వాసితులకు న్యాయం చేయాలని, అప్పుడు తామే స్వయంగా శాలువాతో సన్మానిస్తామన్నారు. ఆదిలాంటి అవినీతి అనకొండలను పెంచి పోషిస్తే టీడీపీ నామరూపాలు లేకుండా పోవడం ఖాయమని చంద్రబాబును హెచ్చరించారు. -
● వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
జమ్మలమడుగు: జమ్మలమడుగు నియోజకవర్గంలోని దేవగుడి గ్రామ ప్రారంభంలో ఉన్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహాన్ని గురువారం తెల్లవారుజామున కూటమి నేతలు ధ్వంసం చేయ డం తీవ్ర ఉద్రిక్తతకు దారితీసింది. ఈ ఘటనతో ఆగ్రహించిన పార్టీ కార్యకర్తలు, వైఎస్సార్ అభిమానులు వివిధ మండలాల నుంచి భారీ సంఖ్యలో ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి కార్యాలయానికి తరలివచ్చారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ వాలంటీర్ విభాగ రాష్ట్ర కార్యదర్శి భాస్కర్రెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, ముల్లాజానీ,మోహన్రెడ్డి, రమణారెడ్డి పాల్గొన్నారు. -
సచివాలయ కిటికీ అద్దాలు ధ్వంసం
కలసపాడు : మండలంలోని తెల్లపాడు గ్రామ సచివాలయ కిటికీ అద్దాలు, ఫర్నిచర్ను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తికి నష్టం కలిగించారు ప్రజలకు సేవలందించే ప్రభుత్వ కార్యాలయాలపై ఇటువంటి దాడులు జరగడం బాధాకరమని, ఘటనపై సంబంధిత అధికారులు, పోలీసుశాఖ వెంటనే స్పందించి ధ్వంసానికి పాల్పడిన వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా కార్యాలయాలకు రక్షణ కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయంపై ఎంపీడీఓ మహబూబ్బీని వివరణ కోరగా తెల్లపాడు సచివాలయంలో కిటికీ అద్దాలు, ఫర్నిచర్ ధ్వంసం చేసిన సంఘటన తన దృష్టికి వచ్చిందని, గ్రామస్తులతో పోలీసులకు ఫిర్యాదు చేయిస్తామని ఆమె తెలిపారు. సుంకు సత్రంపై దేవదాయ శాఖ డీసీ విచారణప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక శివాలయం వీధిలోని సుంకు సత్రానికి చెందిన గదుల్లో నిబంధనలకు వ్యతిరేకంగా అన్యమతస్తులు వ్యాపారాలు నిర్వహిస్తున్నారన్న ఫిర్యాదుపై దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ రామాంజనేయులు విచారణ జరిపారు. మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పర్యటనకు వచ్చిన డీసీ గురువారం సాయంత్రం సుంకు సత్రం చేరుకుని రికార్డులు తనిఖీ చేశారు. అలాగే ఆ ప్రాంతంలోని గదులను పరిశీలించారు. శివాలయంలో ఫిర్యాదు దారుడు తెల్లాకుల మనోహర్ను విచారించి వివరాలు సేరికంచారు. అనంతరం ఆయన ఫిర్యాదుపై విచారణ చేసి తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. కార్యక్రమంలో సుంకు సత్రం ఈఓ శ్రీధర్, డీసీకార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
● బాబు మెప్పు కోసమే వైఎస్సార్ విగ్రహం ధ్వంసం
– ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి రాజంపేట: ముఖ్యమంత్రి చంద్రబాబు నాయు డు మొప్పు పొందడం కోసమే జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి దేవగుడిలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ధ్వంసం చేయించారని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి ధ్వజమెత్తారు. రాజంపేటలోని తన స్వగృహంలో గురువారం ఆయన విలేకరులతో మాట్లాడారు. దేవగుడి గ్రామంలో ఆదినారాయణరెడ్డి అనుచరులు, కూటమి నేతలు చేసిన ఈ దుశ్చర్య చూసి రాష్ట్ర ప్రజలంతా నివ్వెరపోయారన్నారు. దేవగుడి సోదరులకు కనీస కృతజ్ఞత, విశ్వాసం లేవని ఆకేపాటి మండిపడ్డారు. వైఎస్సార్సీపీ నేతలు పాపినేని విశ్వనాథరెడ్డి, జావిద్అలీ, గోవర్ధన్రెడ్డి, భరత్రెడ్డి పాల్గొన్నారు. -
● వైఎస్సార్ విగ్రహాల ధ్వంసం.. డిజిటల్ బుక్లో పేర్లు రికార్డు!
– అంజద్ బాషా కడప కార్పొరేషన్: దేవగుడి గ్రామంలో, అలాగే ఇటీవల నంద్యాలలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలను ధ్వంసం చేయడం దుర్మార్గమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా అన్నారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మట్లాడారు. ఇటువంటి ఉన్మాద చర్యలకు పాల్పడుతున్న వారి పేర్లన్నీ ‘డిజిటల్ బుక్’లో నమోదు చేస్తున్నామని, తాము అధికారంలోకి వచ్చాక వీళ్ల పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవాలని హెచ్చరించారు. మైనార్టీ నాయకులు షఫీ, కరీముల్లా, ఇలియాస్, గౌసులాజం, జఫ్రుల్లా, జమీల్ పాల్గొన్నారు. -
కార్మిక హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల హక్కులను కాలరాస్తున్నాయని, కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా విధానాలు ఉన్నాయని సీఐటీయూ రాష్ట్ర అధ్యక్షుడు సీహెచ్. నర్సింగరావు పేర్కొన్నారు. గురువారం పాత రిమ్స్ లోని బీసీ భవన్ లో సీఐటీయూ జిల్లా విసృతస్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం స్పీడ్ ఆఫ్ డూయింగ్ పేరుతో కార్పొరేట్లకు ప్రజా సంపదను స్పీడుగా దోచిపెడుతుందని విమర్శించారు. గృహ వినియోగదారులకు విద్యుత్తు యూనిట్ రూ.7 తీసుకుంటూ ఉంటే కార్పొరేట్ కంపెనీలకు మాత్రం యూనిట్ ఒక్క రూపాయికి ఇస్తున్నారని అన్నారు. కార్మిక వర్గం తమ హక్కుల కోసం పోరాడే ఆలోచన రాకుండా యాప్ల పేరుతో పని భారం పెంచేశారని విమర్శించారు. పదవీ విరమణ చేసిన ఉద్యోగులకు బకాయిలు చెల్లించడం లేదని చెప్పారు. పీఆర్సీ కమిటీ వేస్తామని టీడీపీ ఎన్నికల ప్రణాళికలో పెట్టిందని. ఇంతవరకు ఆ ప్రక్రియ ప్రారంభించలేదన్నారు. పవన్ కల్యాణ్ బీజేపీ కంటే ఎక్కువగా హిందుత్వం గురించి మాట్లాడుతూ ఉన్నారని చెప్పారు. స్టీల్ ప్లాంట్ లో తగినంత మంది సిబ్బంది లేకపోవడం వల్లే ప్రమాదం సంభవించిందని, కార్మికులు సజీవ దహనమయ్యారన్నారు.. వీరి కుటుంబాలకు కోటి రూపాయలు నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మిక వ్యతిరేక విధానాలను అవలంబిస్తున్నాయని అన్నారు. ఈనెల 30, 31న కార్మికులకు హక్కులు, జీతాల పెంపు కోసం కలెక్టరేట్ల ఎదుట ఆందోళనలు ఉంటాయన్నారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు, జిల్లా బాధ్యుడు కందారపు మురళి మాట్లాడుతూ ఏ పార్టీ అధికారంలో ఉన్నా జీతాల పెంపు గురించి పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. 23 లక్షల ఉద్యోగాలు ఇస్తామన్న ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఎన్ని ఉద్యోగాలు ఇప్పటివరకు ఇచ్చారో చెప్పాలని ప్రశ్నించారు. సమావేశంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు జి.చంద్రశేఖర్, మనోహర్, లక్ష్మీదేవి, కామనూరు శ్రీనివాసులు రెడ్డి, ఎ.రామమోహన్, అంజనీ దేవి, కార్యదర్శి సత్యం, గోపి, చంద్రారెడ్డి, పాల్గొన్నారు. -
● పిరికి చర్య
జమ్మలమడుగు: జమ్మలమడుగు మండలం దేవగుడి గ్రామంలో మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాన్ని ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, భూపేష్ రెడ్డి అనుచరులు ధ్వంసం చేయడం అత్యంత పిరికిపంద చర్య అని, ఇది వైఎస్సార్ అభిమానుల మనోభావాలను తీవ్రంగా గాయపరిచిందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రసాద్రెడ్డి మండిపడ్డారు. ఈ ఘాతుకానికి నిరసనగా గురువారం వైఎస్సార్సీపీ శ్రేణులు నల్లబ్యాడ్జీలు ధరించి భారీ ప్రదర్శన చేపట్టాయి. అనంతరం నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ సీఐ నరేష్బాబుకు వినతిపత్రం సమర్పించారు. -
బ్రహ్మంగారిమఠం నూతన మేనేజర్గా పీపీఎన్ ప్రసాద్
బ్రహ్మంగారిమఠం: భవిషత్ కాలజ్ఞాన ప్రభోదకర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠం కు నూతన మేనేజర్గా మఠాధిపతి మేనమామ కుమారుడు పీపీఎన్ ప్రసాద్ ఈ నెల 1న బాధ్యతలు స్వీకరించారు. పాత మేనేజర్ ఈశ్వరాచారి నూతన మేనేజర్కు ఎలాంటి రికార్డులు అప్పచెప్పనట్లు తెలుస్తోంది. మఠాధిపతి నూతన మేనేజర్ నియామకం కోసం ఎండోమెంట్ అధికారులకు పీపీఎన్ ప్రసాద్ పేరును ప్రతిపాదించి పంపారు. అక్కడి నుంచి ఎలాంటి ఉత్తర్వులు రాకముందే.. మఠాధిపతి ఆదేశాల ప్రకారం మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నానని ప్రసాద్ చెప్పుకొంటున్నాడని స్థానికులు చర్చించుకుంటున్నారు. ప్రసాద్ నియామకంలో పూర్వపు మఠాధిపతి రెండో భార్య మారుతీ మహాలక్షుమ్మ అడ్డుతగులుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ వ్యవహారంలో స్థానిక తెలుగుదేశం పార్టీ నాయకులు కొన్నాళ్లు ఈశ్వరాచారిని కొనసాగించేలా చూడాలని ఎమ్మెల్యే పుట్టాకు తెలిపారు. ఆయన పీపీఎన్ ప్రసాద్ కు ఇప్పుడే అవకాశం ఇవ్వొద్దు అని మఠాధిపతికి తెలిపినట్లు తెలుస్తోంది. అడ్డుతగులుతారేమో అని పీపీఎన్ ప్రసాద్ భావించి.. ఈనెల 1 ఉదయం 5 గంటలకే మఠాధిపతి ఆదేశాల మేరకు దేవస్థానంలోని కార్యాలయానికి వెళ్లి రికార్డులో మేనేజర్గా సంతకం చేశారు. దోపిడీ కేసులో ముగ్గురికి జైలు శిక్షతొండూరు : 2016లో జరిగిన దోపిడీ కేసులో ముగ్గురు నిందితులకు కడప అదనపు సివిల్ జడ్జి కోర్టు రెండున్నరేళ్ల జైలు శిక్ష, రూ.3000 జరిమానా విధించింది. ఈ కేసుల్లో ముగ్గురు నిందితులు వాయిదాలకు హాజరు కాకుండా.. కోర్టు వారెంట్ ఇచ్చినప్పుడు ఎస్ఐ ఘన మద్దిలేటి, కానిస్టేబుల్ సిద్దారెడ్డి, హోంగార్డు గోవర్ధన్ వారం రోజులు గస్తీ చేపట్టి వారిని కోర్టుకు హాజరుపరిచారు. 2016 ఫిబ్రవరి 6వ తేదీ రాత్రి 8.30 గంటలకు టాటా ఏస్ వాహనంలో ప్లాస్టిక్ కుర్చీలు అమ్ముకుంటూ ముద్దనూరు నుంచి పులివెందుల వెళ్తున్న వ్యక్తిని మల్లేల ఘాట్ సమీపంలో అడ్డగించిన దుండగులు కత్తితో బెదిరించి వాహనం, రూ.62,000 నగదు దోచుకెళ్లారు. బాధితుడు అదేరోజు రాత్రి తొండూరు పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ శ్రీనివాసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అప్పటి సీఐ రవిబాబు నిందితులను అరెస్ట్ చేశారు. నిందితులు ఎ–1 సాతులూరి సుధాకర్, ఎ–3 మేసూరుగారి సురేష్, ఎ–4 మేసూరుగారి గోవిందులను అరెస్ట్ చేసి కోర్టులో ప్రవేశపెట్టారు. విచారణ అనంతరం వీరికి శిక్ష ఖరారు చేస్తూ అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.సి. హాసిషా సుల్తానా తీర్పు ఇచ్చారు. ఎస్ఐ ఘన మద్దిలేటి, పులివెందుల రూరల్ సీఐ శాంతి లాల్, డీఎస్పీ మురళీ నాయక్లు కేసు దర్యాప్తును పర్యవేక్షించారు. ఏఎస్ఐ కె.శ్రీనివాసులు, కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఏపీపీ బొర్రెం శ్రీనివాసులు నిందితులకు శిక్ష పడేలా కృషి చేశారు. -
ధోరణి మారాలి..ధరణి మురవాలి
రాజంపేట : జిల్లాలో రైతులు ఇష్టారీతిన యూరియా (నత్రజని) వినియోగిస్తున్నారు. వ్యవసాయశాస్త్రవేత్తల సిఫార్సు చేస్తున్న దాని కంటే రెండురెట్లు ఎక్కువగా చల్లేస్తుండటంతో నేల నిస్సారమవుతోంది. మేలు చేసే సూక్ష్మజీవులు నశించిపోతున్నాయి. వానపాములకు నష్టం వాటిల్లుతోంది. నీటి నిల్వ సామర్ధ్యం పడిపోతుంది. భూగర్భజలాలు కలుషితమవుతున్నాయి. రైతులు వీటిని దృష్టిలో పెట్టుకుని ఖరీఫ్లో ముందుకు సాగాల్సిన అవసరం ఉంది. ఈ ఏడాది సాగు.. జిల్లాలో ఈ ఏడాది ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 77,993 హెక్టార్లు. ఆమేరకు మూడు విడతల్లో మెట్రిక్ టన్నుల యూరియా అందించేందుకు వ్యవసాయశాఖ అధికారులు ప్రణాళికలు సిద్ధం చేశారు. క్షేత్రస్ధాయిలో అంతకు రెండితలు ఎక్కువ వాడతుండటంతో కొరత ఏర్పడుతోంది. కొందరు ప్రైవేట్ డీలర్లు ఇతర ప్రాంతాల నుంచి అధిక ధరలు చెల్లించి మరీ తెచ్చుకుంటున్నారు. శాస్త్రవేత్తల సిఫార్సులు.. ] ఎకరా పొలానికి గరిష్టంగా 36 కిలోల నత్రజని అవసరం ] అది కూడా కొంచెం కొంచెంగా మూడువిడతలుగా నాట్లు వేసే ముందు, దుబ్బు కట్టే సమయంలో వెన్ను అంకురదశలో వేయాలి ఈ లెక్క ప్రకారం 75 కిలోల యూరియా పంటకాలానికి సరిపోతుంది. ] దమ్ము సయమంలో ఎకరాకు 50కిలోల డీఏపీ విని యోగిస్తారు. అందులో 9 కిలోల నత్రజని ఉంటుంది. ] పచ్చిరొట్ట ఎరువు వినియోగించే పొలంలో 30కిలోల యూరియా వేస్తే సరిపోతుంది. ఆర్థిక ప్రయోజనాలు.. యూరియా వాడకం తగ్గిస్తే ఆర్ధికంగా ప్రయోజనాలు పొందవచ్చు. ఒక బస్తా (45కిలోలు)పై కేంద్ర ప్రభుత్వం రూ.2వేలకుపైగా రాయితీ ఇస్తుంది. బస్తా తయారీ ఖర్చు రూ. 2,300 వరకు ఉంటే కేవలం రూ.267 మాత్రమే అమ్ముతోంది. దీన్ని విదేశాల నుంచి దిగుమతి చేసుకోవడంతో విదేశీ మారక్ర దవ్యం పరంగాను సమస్యలు తలెత్తుతున్నాయి. దీన్ని దృష్టిలో పెట్టుకొని సేంద్రియ ఎరువులపై మళ్లితే ప్రభుత్వానికి మేలు జరగడమే కాకుండా రైతులకు పెట్టుబడి ఖర్చు తగ్గుతుంది. ప్రత్యామ్నాయం పచ్చిరొట్ట.. టన్ను పచ్చిరొట్ట ఎరువులో 6 కిలోల నత్రజని, 37 కిలోల భాస్వరం, 15 కిలోలపొటాష్ లభ్యమవుతుంది. ఎకరా భూమిలో వేసిన పచ్చిరొట్ట మూడు టన్నుల వరకు అందుతుంది.35 నుంచి 40 రోజుల్లో కలియదున్నితే 60 శాతం వరకు యూరియా వాడకం తగ్గించుకోవచ్చు. నేలలో నీటి నిలుపుదలకు శక్తి పెరుగుతుంది. విచ్చలవిడిగా యూరియా వాడకంతో నష్టాలు చైతన్యపరుస్తున్నా పట్టించుకోని రైతులుఅవగాహన కల్పిస్తున్నాం యూరియా వినియోగంతో అన్ని విధాలా నష్టం జరుగుతుంది. సేంద్రియ ఎరువుల వైపు అన్నదాతను మళ్లించేలా అవగాహన కల్పిస్తున్నాం. సాధారణంగా ఎకరాకు 75 కిలోల యూరియా వాడాలి. పచ్చిరొట్ట సాగు చేసేవారు అందులో సగం వినియోగిస్తే సరిపోతుంది. – సుబ్రమణేశ్వరరావు. జిల్లా వ్యవసాయాధికారి, కడప -
తప్పేమి చేయలేదు..ఆ ముగ్గురు సార్లు కొట్టారు..!
● పిల్లలను కొట్టడంపై జెడ్పీ హైస్కూల్లో తల్లిదండ్రుల వాగ్వాదం చాపాడు : టాయిలెట్లో నాసిరకంగా ఉన్న దెబ్బతిన్న డోర్ పగిలిపోగా.. దాన్ని వారిద్దరే కాళ్లతో తన్ని పగులగొట్టారని ఆరోపిస్తూ ముగ్గురు ఉపాధ్యాయులు కలిసి ఇద్దరు పదో తరగతి విద్యార్థులను చితకబాదిన సంఘటన గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో చోటు చేసుకుంది. బాధిత వివ్యార్థులు, వారి తల్లిదండ్రులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదువుతున్న చాపాడుకు చెందిన జయసూర్య, పల్లవోలుకు చెందిన చైతన్యలు రోజు మాదిరే పాఠశాలకు వెళ్లారు. పాఠశాలలో ఉండే మరుగుదొడ్డి వద్ద డోర్ పగిలిపోయి ఉంది. ఈ డోర్ను జయసూర్య, చైతన్యలు పగులగొట్టారని ఆరోపిస్తూ పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు ప్రభాకర్రెడ్డి, భాస్కర్, మహేశ్వర్రెడ్డి విద్యార్థులను ముగ్గురు కలిసి చితకబాదారు. ఈ విషయం తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు సాయంత్రం 4.30 గంటల ప్రాంతంలో విద్యా కమిటీ వైస్ చైర్మన్తో కలిసి పాఠశాలకు వెళ్లారు. అప్పటికే ఉపాధ్యాయులందరూ ఇంటికి వెళ్లిపోవడంతో అక్కడ ఉన్న ఫిజికల్ డైరెక్టర్ ఓబయ్యతో తమ పిల్లలను ఎందుకు కొట్టారని వాగ్వాదానికి దిగారు. బాత్రూం డోర్ అప్పటికే పగిలిపోయి ఉందని, దీనిని తమ పిల్లలే పగులకొట్టారని ఎలా చెబుతారని, ఈ విషయం తమ దృష్టికి తీసుకురాకుండా విద్యార్థులను ఎలా పడితే అలా కొట్టడం ఏమిటని ప్రశ్నించారు. ఇదే క్రమంలో వాగ్వాదానికి కారణమైన మరుగుదొడ్డిని పరిశీలించగా అధ్వానంగా ఉందని, అక్కడ కనీసం నీరు కూడా లేదని, అలాంటి చోటికి విద్యార్థులు ఎలా వెళతారని, విద్యార్థులను ఎందుకు కొడతారని ప్రశ్నించారు. దీనిపై రాద్దాంతం చేయొద్దని సమస్యను సర్దుబాటు చేసేందుకు ఫిజికల్ డైరెక్టర్ ఓబయ్య ప్రయత్నించగా విద్యార్థుల తల్లిదండ్రులు ఒప్పుకోలేదు. విద్యార్థులను కొట్టడంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామని, ఉపాధ్యాయులపై తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని తల్లిదండ్రులు డిమాండ్ చేశారు. బాఽధిత విద్యార్థులతో పాటు మరికొందరు విద్యార్థులు ఉపాధ్యాయులు కొట్టిన విషయంపై స్పందించి నిజంగానే ఆ ఇద్దరిని కొట్టారని చెప్పడం గమనార్హం. ఈ సంఘటనపై హైస్కూల్ హెచెం వెంకటలక్ష్మిని వివరణ కోరేందుకు ఫోన్ ద్వారా సంప్రదించగా స్పందించలేదు. అధ్వానంగా మరుగుదొడ్లు స్థానిక జెడ్పీ హైస్కూల్లో మరుగుదొడ్లు నిర్వహణ సరిగా లేక అధ్వానంగా మారాయి. పాఠశాల తెరిచి కనీసం నెల రోజులు కూడా కాకముందే మరుగుదొడ్లు వాడుకునేందుకు పనికిరాని విధంగా దుర్గంధంతో ఇబ్బందికరంగా ఉన్నాయి. వందల మంది విద్యార్థులు ఉన్న ఈ పాఠశాలలో మరుగుదొడ్ల నిర్వహణపై ప్రత్యేక దృష్టి పెట్టకపోవడం అక్కడి ఉపాధ్యాయుల నిర్లక్ష్యం కనిపిస్తోంది. -
ఆలయాలను అభివృద్ధి చేస్తాం
● మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి రాజుపాళెం : రాష్ట్రంలో ఆలయాలను అభివృద్ధి చేస్తామని రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి అన్నారు. మండలంలోని వెల్లాల పుణ్యక్షేత్రంలో గురువారం శ్రీ సంజీవరాయ స్వామి మహా కుంభాభిషేకం పూజా కార్యక్రమంలో పాల్గొన్న మంత్రి, ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి రూ.3.55 కోట్లతో నిర్మించిన ఆలయ పున నిర్మాణం, శిలాఫలకం, శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ పున నిర్మాణం, చుట్టూ ప్రాకారానికి వారు భూమి పూజ, శిలాఫలకం ఆవిష్కరణ చేశారు. అనంతరం చెన్నకేశవ, సంజీవరాయ స్వాములకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం భక్తులనుద్దేశించి మంత్రి మాట్లాడుతూ ఎమ్మెల్యే తెలిపిన మేరకు మరో రూ. 8 కోట్లు నిధులు మంజూరు చేస్తానని చెప్పారు. ఎమ్మెల్యే వరదరాజుల రెడ్డి మాట్లాడుతూ వెల్లాల పుణ్యక్షేత్రం విశిష్టత రెండు తెలుగు రాష్ట్రాల్లో భక్తులకు తెలుసని అన్నారు. మంత్రికి మాజీ జెడ్పీటీసీ సభ్యులు మహేశ్వర రెడ్డి, ఆలయ చైర్మన్ లక్ష్మినారాయణ రెడ్డి, వేద పండితులు స్వాగతం పలికారు. కార్యక్రమంలో వెంకటరామి రెడ్డి, ఏసీ శంకర్ బాలాజీ, ఈఓలు వెంకటరమణ, జగన్మోహన్ రెడ్డి, డివిజన్ ఇన్సెక్టర్కిరణ్కుమార్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. తప్పిన ప్రమాదంపులివెందుల రూరల్ : పులివెందులలోని పాత బస్టాండ్ సమీపంలో ఆర్టీసీ బస్సు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాలపై దూసుకెళ్లింది. ముందు వెళ్తున్న కడప ఆర్టీసీ బస్సును తప్పించబోయి పక్కనే ఉన్న బైక్లపై దూసుకు రావడంతో వాహనాలు బస్సు కింద పడ్డాయి. దీంతో స్థానికులు అప్రమత్తమై బస్సు కింద పడిన ద్విచక్ర వాహనాలు తొలగించారు. ఈ ఘటనలో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. బ్రేకులు ఫెయిల్ కావడంతో ఇలా జరిగిందని బస్సు డ్రైవర్ తెలిపారు.ట్రాన్స్ఫార్మర్ పగలగొట్టి రాగివైర్ల్లు చోరీసుండుపల్లె : మండల పరిధిలోని పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ మాన్యంవారిపల్లెలో గుర్తు తెలియని వ్యక్తులు గురువారం ట్రాన్స్ఫార్మర్ను పగలగొట్టి రాగివైర్లను చోరీ చేశారు.బాధితుడు చిన్నపరెడ్డి ఈమేరకు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిందితులను గుర్తించి కఠినచర్యలు తీసుకోవాలని పోలీసులను కోరాడు. -
అమరావతి అసాధ్యం.. ‘మావిగన్’ వైపే ప్రజలు!
● వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు: రాష్ట్రం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో ఉండి ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు కూడా సక్రమంగా ఇవ్వలేని పరిస్థితిలో కూటమి ప్రభుత్వం ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో గురువారం నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటువంటి పరిస్థితుల్లో రూ.2 లక్షల కోట్లు అప్పులు తెచ్చి అమరావతిని నిర్మించడాన్ని ప్రజలు వ్యతిరేకిస్తున్నారన్నారు. అక్కడ బంగారం లాంటి మూడు పంటలు పండే రైతుల భూములను బలవంతంగా లాక్కుంటూ భారీ భూ కుంభకోణానికి పాల్పడుతున్నారని ఆరోపించారు. గతంలో తీసుకున్న 50 వేల ఎకరాలకే దిక్కులేదని, ఇప్పుడు మళ్లీ మరో 50 వేల ఎకరాలు సేకరించి లక్ష ఎకరాల్లో రాజధాని కడతామనడం ముమ్మాటికీ అసాధ్యమని, ఇది కేవలం టీడీపీ నేతల దోపిడీ కోసమేనని మండిపడ్డారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మచిలిపట్నం, విజయవాడ, గుంటూరు నగరాల అనుసంధాన ‘మావిగన్’ రాజధాని నిర్మాణమే ప్రజలందరి అసలు అభిప్రాయమని స్పష్టం చేశారు. రైల్వే, జాతీయ రహదారి, పోర్టు సౌకర్యాలు ఉన్నందున చాలా తక్కువ బడ్జెట్తోనే దీనిని నిర్మించవచ్చని సూచించారు. ఈ విషయంలో జగన్ ఎంతో ధైర్యంగా, నిజాయితీగా ‘మొగోని మాట’ మాట్లాడారని, రాయలసీమ వాసిగా తాను దీనిని స్వాగతిస్తున్నానన్నారు. రానున్న ఎన్నికల్లో ప్రధానంగా ఈ అంశంపైనే తాము ఓట్లు అడుగుతామన్నారు. మావిగన్కు మద్దతు ఇచ్చేవారంతా వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని, అమరావతి భూ కుంభకోణానికి మద్దతు ఇచ్చేవారంతా టీడీపీకి ఓట్లు వేసుకోవచ్చని సవాల్ విసిరారు. రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం పక్కనపడి ‘రెడ్ బుక్ రాజ్యాంగం’ అమలవుతోందని, కూటమి ప్రభుత్వంలో మహిళలపై అఘాయిత్యాలు విపరీతంగా పెరిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. కూటమి ప్రభుత్వం విద్య, వైద్యం, వ్యవసాయ రంగాలతో పాటు గత ఎన్నికల హామీలను నెరవేర్చడంలో విఫలమైతే ప్రజలంతా వారిని తిరస్కరించాలని కోరారు. శాంతిభద్రతల పరిరక్షణ కోసం వైఎస్సార్సీపీకి ఓట్లు వేయాలని, ‘జగన్ మాటే మా బాట’ అని రాచమల్లు పునరుద్ఘాటించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పోరెడ్డి నరసింహారెడ్డి పాల్గొన్నారు. -
తల్లిదండ్రుల మృతితో అనాథగా కుమార్తె
వేంపల్లె : వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె గ్రామం వద్ద బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో తల్లిదండ్రులను కోల్పోవడంతో రేణుక అనాథగా మారింది. కత్తులూరు పంచాయతీ తాటిమాకులపల్లె గ్రామంలోని ఎస్సీ కాలనీలో వెంకట లక్షుమ్మ, వెంకట శేషు మురళీకృష్ణ అనే దంపతులు నివాసముంటున్నారు. వీరికి కుమార్తె రేణుక ఉంది. ప్రస్తుతం ఇంటర్ పూర్తి చేసింది, కుమార్తె రేణుకనుబాగా చదివించేందు కోసం తాళ్లపల్లెలోని ప్రధాన రహదారి వద్ద చిన్న బంకు పెట్టుకుని ఉదయం పూట దోసెలు, సాయంత్రం పూట బొరుగుల మిక్చర్, అప్పలాలు పెట్టుకొని విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. ఈ నేపథ్యంలో లారీ రూపంలో మ్యత్యువు వెంటాడింది. భార్యభర్తలిద్దరూ ఒకేసారి మ్యత్యువాత పడేందుకు తాళ్లపల్లె సమీపంలో ఉన్న స్పీడ్ బ్రేకర్ కూడా ఒక కారణమని చెప్పవచ్చు. సిమెంట్ లోడు లారీ ఒక్కసారిగా దుకాణంలోకి దూసుకెళ్లడంతో రేణుక తల్లిదండ్రులిద్దరూ లారీ కింద పడి నుజ్జునుజ్జు అయ్యారు. ప్రమాదం జరిగిన వెంటనే రేణుక అక్కడికి చేరుకోగా తల్లిదండ్రులు ఇద్దరు రక్తపు మడుగులో పడి ఉండటం చూసి తల్లడిల్లిపోయింది. జీవనోపాధి కోసం ఇంటి నుండి వెళ్లిన తల్లిదండ్రులు తిరిగి రాని లోకానికి వెళ్లిపోయిన విషయం తెలిసి కన్నీటి పర్యంతమైంది. భార్యభర్తల మృతితో ఎస్సీ కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఒంటరిగా మిగిలిన రేణుకను సేవా సంఘాలు, స్వచ్ఛంద సంస్థలు ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
అద్దాలమర్రిలో టీడీపీ నేత దౌర్జన్యం
సాక్షి టాస్క్ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం అద్దాలమర్రిలో టీడీపీ నేత శ్రీరామిరెడ్డి దౌర్జన్యానికి దిగారని, అధికార అండతో పెట్రేగిపోతున్నాడని బాధిత రైతు రామకృష్ణారెడ్డి వాపోయాడు. వివరాల్లోకి వెళితే తన పొలానికి పక్కనే శ్రీరామిరెడ్డికి చెందిన పొలం ఉందన్నాడు. గురువారం ఉదయాన్నే తన పొలంలో వరి నారు పోసుకునేందుకు వెళ్లానని చెప్పారు. ఆ సమయానికే శ్రీరామిరెడ్డి నా పొలంలోకి అక్రమంగా చొచ్చుకు వచ్చి పాత గట్టు ఉండగానే.. కొత్త గట్టు వేశాడన్నారు. ఇదేమని అడిగితే నీకు దిక్కున్న చోట చెప్పుకో అంటూ దాడికి ప్రయత్నించినట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. దీంతో తాను చక్రాయపేట పోలీసులు, తహసీల్దార్కు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. -
అధికార పార్టీతో అంటకాగుతున్న ఏఎస్ఐ
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వ ఉద్యోగిగా నిబంధనల మేరకు వ్యవహరించాల్సిన ఓ ఏఎస్ఐ అధికార తెలుగుదేశం పార్టీకి అంటకాగుతున్నట్లు విమర్శలు వ్యక్తమవుతున్నాయి. జిల్లా ఎస్పీ కార్యాలయంలో ఏఎస్ఐగా పనిచేస్తున్న గోపవరం శ్రీనివాసులు దేవునికడప శ్రీ సోమేశ్వరస్వామి దేవస్థానం ఆలయ కమిటీలో తన భార్య గోపవరం పార్వతికి స్థానం లభించేలా చక్రం తిప్పినట్లు తెలుస్తోంది. అనుకున్నట్లే ఆమెకు ఆలయ కమిటీలో చోటు దక్కడంతో ఆయన ఆనందానికి అవధులు లేకుండా పోయాయి. పదవి రావడానికి సహకరించిన కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, టీడీపీ జోనల్ కో ఆర్డినేటర్ ఆర్. శ్రీనివాసులరెడ్డిని ఘనంగా సన్మానించి కృతజ్ఞత చూపారు. ఈ క్రమంలో తాను ప్రభుత్వ ఉద్యోగినన్న సంగతి మర్చిపోయినట్లు తెలుస్తోంది. దేవునికడపలో జరిగే తెలుగుదేశం పార్టీ కార్యక్రమాల్లో ఆయన చురుగ్గా పాల్గొంటున్నట్లు సమాచారం. ఒక ఏఎస్ఐగా అందరినీ సమదృష్టితో చూడాల్సిన ఆయన ఒక పార్టీకి కొమ్ము కాయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఉన్నతాధికారులు ఆయనపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. దేవునికడప ఆలయ కమిటీలో తన భార్యకు స్థానం దక్కేలా చక్రం తిప్పిన వైనం -
దళితురాలి ఇంటిని కూల్చేందుకు యత్నం
● జేసీబీ, ట్రాక్టర్లు తీసుకొచ్చి దౌర్జన్యం ● దౌర్జన్యకారులకు అధికార పార్టీ అండదండలు ● న్యాయం చేయాలని బాధిత మహిళ వేడుకోలు మీడియాతో మాట్లాడుతున్న బాధితురాలు పుష్పవతి, మానసిక వికలాంగుడైన కుమారుడు వైఎస్సార్సీపీ నేతలు, స్థానికులు రావడంతో వెనక్కి పోతున్న జేసీబీ, ట్రాక్టర్లు ఇంటిని కూల్చేందుకు తీసుకొచ్చిన జేసీబీ, ట్రాక్టర్లు కడప కార్పొరేషన్: ఆర్థిక అంశాలపై ముడిపడిన విషయంలో కడప ఎర్రముక్కపల్లెలో అర్ధరాత్రి దళితుల ఇంటిని నేలమట్టం చేసిన ఘటన మరువక ముందే ప్రకాష్నగర్లో అలాంటి ఘటనే మరొకటి చోటు చేసుకుంది. అయితే అగ్రవర్ణాలకు చెందిన వారు పట్టపగలే జేసీబీ, ట్రాక్టర్లు, కూలీలను తీసుకొచ్చి ఇంటిని కూల్చేందుకు చేసిన ప్రయత్నం విఫలమైంది. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి...ప్రకాష్నగర్కు చెందిన నాగభూషణం ఎల్ఐసీలో పనిచేసేవాడు. ఈయనకు భార్య పుష్పవతి, ఒక కుమార్తె, మానసిక వికలాంగులైన ఇద్దరు కుమారులు ఉన్నారు. కాగా వేణుగోపాల్రెడ్డి అనే వ్యక్తి వద్ద తన ఇంటిని ఆయకం పెట్టి నాగభూషణం రూ.5లక్షలు అప్పుగా తీసుకున్నట్లు తెలుస్తోంది. ఆయన బతికి ఉన్నంత వరకు కుటుంబ సభ్యులెవరికీ ఈ విషయం తెలీదు. రెండేళ్లక్రితం నాగభూషణం మరణించడంతో వేణుగోపాల్రెడ్డి మరొక వ్యక్తి రామ్మోహన్రెడ్డికి దాన్ని విక్రయించినట్లు సమాచారం. సదరు రామ్మోహన్రెడ్డి దీనిపై కోర్టును ఆశ్రయించినట్లు తెలుస్తోంది. కింది కోర్టులో తీర్పు ఆయనకు అనుకూలంగా వచ్చినప్పటికీ ...ఇంట్లో ఉన్నవారిని ఖాళీ చేయించేందుకు అవసరమైన ఉత్తర్వులు తెచ్చుకోకుండా పట్టపగలే ఇంటిని కూల్చేందుకు మందీమార్భలంతో రావడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వీరికి అధికార పార్టీ నేతలు అండదండలు ఇస్తున్నట్లు తెలిసింది. కింది కోర్టు ఇచ్చిన తీర్పుపై బాధితురాలు పై కోర్టులో అప్పీలు చేసినట్లు తెలుస్తోంది. రెండు రోజులుగా ఆ ఇంట్లోకి ఆక్రమణదారులు గంజాయి బ్యాచ్ను దింపి, అక్కడే తిని, తాగడం చేస్తున్నారని బాధితురాలు చిన్నచౌకు పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇది కోర్టులో ఉన్నది కాబట్టి తాము జోక్యం చేసుకోలేమని పోలీసులు తేల్చిచెప్పినట్లు తెలుస్తోంది. ఈనెల 3వ తేది ముఖ్యమంత్రి పర్యటన ఉన్న నేపథ్యంలో పోలీసులు అంతా బందోబస్తు కోసం వె ళ్లినట్లు చెబుతున్నారు. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ దళిత నేతలు, స్థానికులు బాధితురాలికి అండగా నిలవడంతో ఆక్రమణదారులు వెనక్కి తగ్గినట్లు సమాచారం. ఆ తర్వాత పోలీసులు వచ్చి అక్కడ గుమి కూడి ఉన్నవారందరినీ పంపించి వేశారు. మాకు న్యాయం చేయాలి తన భర్త మృతి చెందిన తర్వాత తమ ఇంటిని వేణుగోపాల్రెడ్డి తన అత్త సరోజమ్మ పేరు మీద రిజిస్టర్ రిజిస్టర్ చేయించి, రామ్మోహన్రెడ్డికి విక్రయించినట్లు పేపర్లు సృష్టించారన్నారు. ప్రకాష్ నగర్లో సెంటు స్థలం విలువ రూ.30లక్షల వరకు ఉందన్నారు. మూడు సెంట్ల స్థలం రూ.90లక్షలు చేస్తుందన్నారు. కేవలం రూ.5లక్షలు ఇచ్చి తమ విలువైన ఆస్థిని కొట్టేయాలని చూస్తున్నారన్నారు. దీనిపై ఎస్పీకి ఫిర్యాదు చేసినా స్పందన లేదన్నారు. తనకు ఇద్దరు మానసిక వికాలాంగులైన ఇద్దరు పిల్లలు, పెళ్లి కావాల్సిన కుమార్తె ఉందని, ఈ ఆిస్తి పోతే తాను వారిని ఎలా పోషించాలని ఆవేదన వ్యక్తం చేశారు. ఉన్నతాఽకారులు చర్యలు తీసుకొని తమకు న్యాయం చేయాలని కోరారు. -
రేపు జిల్లాకు సీఎం చంద్రబాబు
పటిష్ట భద్రత – జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జమ్మలమడుగు రూరల్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈ నెల 3వ తేదీ జిల్లా పర్యటనలో భాగంగా పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం జిల్లా కలెక్టర్ స్థానిక ఎమ్యేల్యె ఆదినారాయణరెడ్డి, డీఐజి కోయా ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్, జేసీ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావనలతో కలసి ఉక్కు కర్మాగార పనులను, సభా ప్రాంగణాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి సందర్శించనున్న ఆలయ ప్రాంగణాన్ని, సభా స్థలి ప్రాంతంలో భద్రతా ఏర్పాట్లు, ప్రొటోకాల్ నిబంధనల మేరకు పాటించాల్సిన నియమాలపై అధికారులకు సూచించారు. కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈనెల 3వ తేదీ (శుక్రవారం) ఒకరోజు పర్యటన నిమిత్తం వైఎస్సార్ కడప జిల్లాకు వస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జమ్మలమడుగు పరిధిలోని జేఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ పనులు, సోలార్ ప్లాంట్ శంకుస్థాపన కార్యక్రమాల్లో ఆయన పాల్గొంటారు. సీఎం చంద్రబాబు ఒకరోజు పర్యటన సమయ పట్టిక కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరిసమయం పర్యటన వివరాలు ఉదయం 10:30 గంటలకు జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లి వద్ద ఉన్న జెఎస్డబ్ల్యూఆర్ఎస్ఎల్ ప్లాంట్ హెలిప్యాడ్కు చేరుకుంటారు. ఉదయం 10:40 గంటలకు హెలిప్యాడ్ నుండి రోడ్డు మార్గాన బయలుదేరుతారు. ఉదయం 10:45 గంటలకు కన్య తీర్థం బాలా త్రిపుర సుందరి సమేత శ్రీ సుందరేశ్వర స్వామి దేవస్థానం దర్శనం. ఉదయం 10:55 గంటలకు జెఎస్డబ్ల్యూ స్టీల్ ప్లాంట్ సైట్కు చేరుకుంటారు. ఉదయం 11:05 గంటలకు జేఎస్డబ్ల్యు ఆర్ఎస్ఎల్ హెవీ సెక్షన్ మిల్ కాంక్రీటు ఫ్లోరింగ్ కార్యక్రమంలో పాల్గొంటారు. ఉదయం 11:10 నుండి జెఎస్డబ్ల్యూ ప్లాంట్ సైట్ మరియు ఎక్స్పీరియన్స్ జోన్ సందర్శన. మధ్యాహ్నం 1:35 వరకు జేఎస్డబ్ల్యూ రాయలసీమ లిమిటెడ్ ప్రాజెక్టు నిర్మాణ పనుల శిలాఫలకం ఆవిష్కరణ. 400 మెగావాట్ల సోలార్ ప్లాంట్, ఇండస్ట్రియల్ పార్క్ శంకుస్థాపనల శిలాఫలకాల ఆవిష్కరణ. మధ్యాహ్నం 2:10 గంటలకు ప్లాంట్ సైట్ హెలిప్యాడ్ నుండి ప్రత్యేక హెలికాప్టర్ ద్వారా కుప్పంకు ప్రయాణమవుతారు. -
ఎర్రచందనం స్మగ్లర్ షఫీపై పీడీయాక్ట్
కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా చాపాడు మండలం ఖాదర్పల్లి గ్రామానికి చెందిన షేక్ షఫీ (25) అనే యువకుడిపై జూన్ 30న పీడీయాక్ట్ ప్రయోగించారు. ఇతనిపై 4 ఎర్రచందనం అక్రమ రవాణా కేసులు, ఒక పోక్సోకేసు నమోదయ్యాయి. ఈ కేసుల కారణంగా ఇతన్ని జ్యుడిషియల్ కస్టడీలో ఉంచారు. జైలు నుంచి విడుదలైన అతను తన అలవాటును మార్చుకోలేదు, మళ్లీ రెండు కేసుల్లో ఇతనిపై కేసులు నమోదయ్యాయి. ఇతనికి ఆంధ్రప్రదేశ్, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు చెందిన అనేక మంది అంతర్జాతీయ ఎరచ్రందనం స్మగ్లర్లతో సంబంధాలున్నాయి. ఇతనిపై పీడీ చట్టం ప్రకారం చట్టపరమైన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు పర్యవేక్షణలో ఇన్స్పెక్టర్లు సి.శంకర్ రెడ్డి, జె.శివ శంకర్ల సూచనల మేరకు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పీడీ చట్టం కింద నిర్బంధ ఉత్తర్వులను జారీ చేయమని ప్రతిపాదనలు సమర్పించారు. దానిని సంబంధిత నిందిడుడిపై అమలు నిమిత్తం సెంట్రల్ జైలు అధికారులకు అందజేశారు. -
మృత్యువై దూసుకొచ్చిన లారీ
● భార్యభర్తలు మృతి ● మరో ఇద్దరికి తీవ్ర గాయాలు వేంపల్లె: వేంపల్లె మండలంలోని తాళ్లపల్లె గ్రామం వద్ద ప్రధాన రహదారిలో మిక్చర్ బండిపై లారీ దూసుకొచ్చింది. ఈ ఘటనలో భార్యాభర్తలు ఇద్దరు అక్కడ్కడికే మృతి చెందారు. స్థానికుల వివరాలు మేరకు.. తాళ్లపల్లె గ్రామానికి చెందిన వెంకట లక్ష్ముమ్మ (40), వెంకట శేషు మురళి (45) భార్యభర్తలు. వీరు తోపుడు బండిపై మిక్చర్ విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. భార్యభర్తలు మిక్చర్ అమ్ముకొంటుండగా బుధవారం సాయంత్రం వేంపల్లె నుంచి బెంగళూరుకు వెళ్తుతున్న లారీ తాళ్లపల్లి గ్రామ సమీపంలోకి రాగానే ప్రధాన రహదారి పక్కన ఉన్న తొపుడు బండిపైకి దూసుకెళ్లింది. దీంతో భార్యాభర్తలు కల్యాణి, వెంకట శేఘ మురళి అక్కడికక్కడే మృతి చెందారు. అలాగే కూల్ డ్రింక్ షాపు నిర్వాహకుడితో పాటు మరొక వ్యక్తి త్రీవంగా గాయపడ్డాడు. ఘటన తెలిసిన వెంటనే సిఐ నర్సింహులు తాళ్లపల్లికు వెళ్లి ప్రమాదంపై ఆరా తీశారు. మృతదేహలను వేంపల్లె ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వెంకట శేషు మురళి, వెంకట లక్ష్ముమ్మ(ఫైల్) ప్రమాదానికి కారణమైన లారీ లారీ ఢీకొని కూలిపోయిన పాఠశాల ప్రహరీ -
●ఎండార్స్మెంట్ల మాయాజాలం.. అధికారుల ‘కాకిలెక్కలు’!
కడప సెవెన్రోడ్స్: ‘జీరో పెండెన్సీతో రెవెన్యూ గ్రీవెన్స్ ఫ్రీ విలేజెస్ ఏర్పాటు కావాలి.. అర్జీల పరిష్కారంలో ప్రత్యేక బ్రాండ్ తెచ్చుకోవాలి..’ ఇవి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నిత్యం సమీక్షల్లో అధికారులకు ఇచ్చే పదునైన ఆదేశాలు. కానీ, వైఎస్సార్ కడప జిల్లా క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అందుకు పూర్తిగా భిన్నంగా తయారైంది. ప్రభుత్వ నిబంధనలన్నీ ప్రకటనలకే పరిమితమవుతుండటంతో, సామాన్యుడి అర్జీల పరిష్కారం అంతంత మాత్రంగానే సాగుతోంది. స్థానికంగా న్యాయం జరగకపోవడంతో విసిగిపోయిన బాధితులు ప్రతి సోమవారం తమ అర్జీలను చేతబట్టుకుని మైళ్ల దూరం నుండి కడప కలెక్టరేట్కు పరుగులు తీస్తున్నారు. ఒక్కసారి, రెండుసార్లు కాదు... పదుల సంఖ్యలో కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్న వారు లేకపోలేదు. ఫిర్యాదుల్లో అగ్రస్థానంలో ఉన్న టాప్–10 ప్రభుత్వ శాఖలు: జిల్లాలోని మొత్తం 101 ప్రభుత్వ శాఖలకు అందుతున్న పీజీఆర్ఎస్ అర్జీలను పరిశీలిస్తే అందులో రెవెన్యూ విభాగమే అపకీర్తితో మొదటి స్థానంలో నిలిచింది. ఆ తర్వాతి స్థానాల్లో వరుసగా సర్వే సెటిల్మెంట్స్, పోలీసు, పంచాయతీరాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, నీటిపారుదల, సాంఘిక సంక్షేమ గురుకులాలు, సెర్ప్, పాఠశాల విద్యాశాఖ, విద్యుత్ శాఖ ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా ఇప్పటివరకు 90,036 అర్జీలు రాగా, అందులో 74,556 పరిష్కారమైనట్లు అధికారులు చెబుతున్నారు. అయితే, ఇందులో సర్వీస్ లెవెల్ అగ్రిమెంట్ (SLA) గడువు దాటిపోయిన (Beyond SLA) అర్జీలు ఏకంగా 6,996 ఉండటం అధికారుల నిర్లక్ష్యానికి నిలువెత్తు నిదర్శనం.70 శాతానికి పైగా భూ రంపాయణాలే!రెవెన్యూ శాఖకు వస్తున్న అర్జీల్లో 70 శాతం పైబడి భూ సంబంధమైనవే ఉన్నాయి. ముఖ్యంగా రికార్డు ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్), మ్యూటేషన్లు, వెబ్ల్యాండ్ తప్పులు, సరిహద్దు తగాదాలు, సాదా బైనామ క్లెయిమ్స్, నోషనల్ ఖాతాల మార్పు, ప్రభుత్వ భూముల ఆక్రమణలు, చుక్కల భూములు, మరియు రీ సర్వే సమస్యలపై అధికంగా అర్జీలు వస్తున్నాయి. క్షేత్రస్థాయిలో పరిశీలన చేయకపోవడం వల్లే ఒకసారి వచ్చిన వారే మళ్లీమళ్లీ వస్తూ అర్జీలు సమర్పిస్తున్నారు. మొత్తం 40,008 రెవెన్యూ అర్జీలు రాగా, 3,881 పెండింగ్లో ఉన్నాయి. పరిష్కరించిన వాటిలో కూడా 1,312 అర్జీలు గడువు దాటిన జాబితాలోనే ఉన్నాయి. ఇక సర్వే సెటిల్మెంట్స్కు సంబంధించి వచ్చిన 13,506 అర్జీల్లో 514 పెండింగ్లో ఉండగా, పరిష్కరించిన వాటిలో 1,003 అర్జీలు బియాండ్ ఎస్ఎల్ఏ పరిధిలో ఉండటం గమనార్హం. ‘రెవెన్యూ క్లినిక్’.. రోగాన్ని నయం చేయని ఫార్స్! పీజీఆర్ఎస్, వాట్సాప్ గవర్నెన్స్ వంటివి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో ప్రజలను మభ్యపెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం ‘రెవెన్యూ క్లినిక్’ పేరుతో సరికొత్త ప్రహసనాన్ని చేపట్టింది. ఈ ఏడాది జనవరి 5 నుంచి జూన్ 27వ తేదీ వరకు రెవెన్యూ క్లినిక్లలో మొత్తం 4,344 అర్జీలు వచ్చాయి. అందులో ఆక్రమణలపై 818, మ్యూటేషన్లపై 785, రీ–సర్వేపై 784, ఆర్ఓఆర్ సవరణలపై 705, 22– అ నిషేధిత జాబితాపై 251, వెబ్ల్యాండ్ సమస్యలపై 159 అర్జీలు వచ్చాయి. వీటిలో 2,697 పరిష్కరించామని చెబుతుండగా, ఇంకా 1,647 అర్జీలు (అఖీఖీ ఇష్యూడ్ 1,452తో కలిపి) పెండింగ్లోనే మూలుగుతున్నాయి. దీనిని కప్పిపుచ్చుకోవడానికి తాజాగా ప్రారంభించిన ‘వన్ మంత్–వన్ విలేజ్–ఫోర్ విజిట్స్’ కార్యక్రమం కూడా క్షేత్రస్థాయిలో మరో ప్రహసనంగానే సాగుతోంది. ‘రెవెన్యూ క్లినిక్’ల పేరిట సరికొత్త ప్రహసనం వేల అర్జీలు పెండింగ్, కాగితాలకే పరిమితమైన పరిష్కారాలు! కోటలు దాటిన సీఎం మాటలు క్షేత్రస్థాయిలో సమస్యల మూటలు ఫిర్యాదుల్లో ‘రెవెన్యూ’దే టాప్ గేర్ 70 శాతానికి పైగా భూ రంపాయణాలే కాగితాలకే పరిమితమైన జీరో పెండెన్సీ ‘రెవెన్యూ క్లినిక్లు’, ‘విజిట్లు’ ఓ ప్రహసనం మేము ఇన్ని సమస్యలు తేల్చేశామంటూ జిల్లా రెవెన్యూ అధికారులు ఘనంగా ‘కాకిలెక్కలు’ చెబుతున్నప్పటికీ, ఒక నామమాత్రపు ‘ఎండార్స్మెంట్’ బాధితుడి చేతిలో పెట్టి కంప్యూటర్ సిస్టమ్లో సమస్య పరిష్కారమైపోయినట్లు రికార్డులు మార్చేస్తున్నారనే తీవ్ర విమర్శలు ఉన్నాయి. అధికారుల ఈ కాగితపు మాయాజాలం వల్లే జిల్లా వ్యాప్తంగా ఏకంగా 9,607 అర్జీలు ‘రీ–ఓపెన్’ కావడం గమనార్హం. ఇప్పటికై నా రెవెన్యూ యంత్రాంగం క్షేత్ర స్థాయిలో సమస్యల పరిష్కారానికి గట్టి చర్యలు చేపడితేనే రీ–ఓపెనింగ్ రేటు తగ్గుతుంది. అధికారులు ఆ దిశగా చిత్తశుద్ధితో పనిచేస్తే.. ప్రజలు ప్రతి సోమవారం అర్జీలు చేతబట్టుకుని మైళ్ల దూరం నుండి కలెక్టరేట్కు పరుగులు తీయాల్సిన అవసరం ఉండదని స్పష్టమవుతోంది. -
నిత్వికది దురహంకార హత్యే.. నిందితులను ఉరితీయాలి!
లింగాల : నాలుగేళ్ల చిన్నారి నిత్వికది ముమ్మాటికీ దారుణమైన దురహంకార హత్యేనని, ఆ అపరాధానికి ఒడిగట్టిన నరరూప రాక్షసులను తక్షణమే ఉరితీయాలని విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మాజీ అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు డిమాండ్ చేశారు. లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో ఇటీవల హత్యకు గురైన చిన్నారి నిత్విక తల్లిదండ్రులు రామాచారి, సృజన దంపతులను మంగళవారం పలు జిల్లాల నుంచి వచ్చిన విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు పరామర్శించారు. చిన్నారి చిత్రపటానికి నివాళులర్పించి, కుటుంబానికి సంఘం తరఫున తక్షణ సాయంగా రూ. 50 వేల నగదును అందజేశారు. కుమారుడు లక్కీ చదువుకు పూర్తి బాధ్యత తీసుకుంటామని భరోసా ఇచ్చారు.అనంతరం పావులూరి హనుమంతరావు మాట్లాడుతూ.. పెద్దల మధ్య ఉండే కక్షలు పసిపిల్లలపై చూపడం దారుణమన్నారు. బాధితులపై పక్కింటి వెంకట్రామిరెడ్డి కుటుంబీకులు గతంలో దాడులు చేసినా పోలీసులు పట్టించుకోలేదని, పైగా రామాచారిపైనే ఎదురు కేసులు బనాయించారని మండిపడ్డారు. పోలీసుల ఈ అలసత్వాన్ని ఆసరాగా చేసుకునే వెంకట్రామిరెడ్డి భార్య స్వాతి.. చిన్నారిని నీటి డ్రమ్ములో ముంచి చంపిందని ఆరోపించారు. ప్రభుత్వం మానవతా దృక్పథంతో బాధితులకు రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని, వారిపై ఉన్న అక్రమ బైండోవర్ కేసులు ఎత్తివేసి పోలీస్ రక్షణ కల్పించాలన్నారు. నిందితుల కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేయాలన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే విశ్వబ్రాహ్మణ సామాజికవర్గం తరఫున రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు.కార్పొరేషన్ డైరెక్టర్ శ్రీనివాసాచారి, దువ్వూరి నరసింహాచారి, నెమ్మికంటి వీరబ్రహ్మం, వడ్లమాని జగదీష్, డాక్టర్ ఎస్ఏ సెల్వం తదితరులు పాల్గొన్నారు.బాధిత కుటుంబానికి విశ్వబ్రాహ్మణ సంఘం పరామర్శ.. రూ. 50 వేల ఆర్థిక సాయం -
సీఎం పర్యటనను విజయవంతం చేయాలి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని జమ్మలమడుగు మండలం సున్నపురాళ్లపల్లె ఈనెల 3న స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి విచ్చేయనున్న సీఎం చంద్రబాబు జిల్లా పర్యటనను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశించారు. మంగళవారం సాయంత్రం జిల్లా సచివాలయంలోని పీజీఆర్ఎస్ హాలులో ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, వివిధ శాఖల అధికారులకు విధుల కేటాయింపు సంబంధిత అంశాలకు సంబంధించి ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జేసి డాక్టర్ నిధి మీనా, నగర కమిషనర్ భావన, డీఆర్ఓ మల్లికార్జునుడుతో కలసి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్టీల్ ప్లాంట్ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీఎంతో పాటు కేంద్ర ఉక్కు సహాయ మంత్రి, పలువురు కేంద్ర మంత్రులు రానున్నారని వెల్లడించారు. పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి తొలుత కన్యతీర్థం దేవాలయాన్ని సందర్శించిన అనంతరం స్టీల్ ప్లాంట్ పనులకు ప్రారంభోత్సవం చేస్తారన్నారు. అనంతరం బహిరంగ సభలో పాల్గొంటారని వివరించారు. ఈ పర్యటన ను విజయ వంతం చేయడంలో స్టీల్ ప్లాంట్ యాజమాన్యం జిల్లా అధికారులతో సమన్వయం చేసుకొని పనిచేయాలని ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ భద్రతా పరంగా అన్ని ఏర్పాట్లు పకడ్బందీగా చేయనున్నట్లు వివరించారు. ఈ సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
గండి క్షేత్రానికి విరాళం
చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో జరిగే శాశ్వత నిత్యాన్నదాన పథకానికి మంగళవారం రూ.75,232లు విరాళంగా వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ సి.విశ్వనాథ్ తెలిపారు. హైదరాబాదుకు చెందిన కె.మధుసూదనరెడ్డి బిడ్డలు వంశీధర్రెడ్డి,వర్షిని రూ.50,116లు, ప్రొద్దుటూరుకు చెందిన వేంపల్లె శివారెడ్డి కుమారుడు డాక్టర్ రామచంద్రారెడ్డి కోడలు దీప్తి రూ.25,116లు విరాళం అందజేశారని చెప్పారు. అలాగే ఆలయ షాపింగ్ కాంప్లెక్స్లో 15 గదులకు గాను రెండు గదులు అద్దెకు ఇచ్చామని... వాటి ద్వారా నెలకు రూ.12,500 చొప్పున ఆలయానికి ఆదాయం వస్తుందని వెల్లడించారు. ఆలయ చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. నేటి నుంచి చేపల వేట నిషేధం – మత్య్సశాఖ డీడీ నాగయ్య కడప అగ్రికల్చర్: జిల్లాలోని గండికోట, బ్రహ్మసాగర్ జలాశయాలు, సోమశిల వెనక జలాలలో జులై 1వ తేదీ నుంచి ఆగష్టు 31వ తేదీ వరకు(62 రోజులు) చేపల వేట పూర్తిగా నిషేధించినట్లు మత్య్సశాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగయ్య తెలిపారు.చేపల సహజ సంతానోత్పిత్తి కాలాన్ని దృష్టిలో ఉంచుకుని ఈ నిషేధం విధించామని.. ఎవరైనా సంబంధిత జలాశయాలలో చేపట వేట నిర్వహించినా, ప్రభుత్వ నిబంధనలను ఉల్లంఘించినా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఏపీ ఎంఐపీ ఇన్చార్జు పీడీగా మురళీమెహన్రెడ్డి కడప అగ్రికల్చర్: ఏపీ ఎంఐపీ ఇన్చార్జు పీడీగా మురళీమోహన్రెడ్డికి బాధ్యతలు అప్పగించారు. ఏపీ ఎంఐపీ పీడీగా పనిచేస్తున్న మన్నె వెంకటేశ్వరెడ్డి మంగళవారం ఉద్యోగ విరమణ చెందడంతో ఆయన స్థానంలో ఆదే కార్యాలయంలో అసిస్టెంట్ ప్రాజెక్టు డైరెక్టర్గా పనిచేస్తున్న మురళీ మోహన్రెడ్డికి ఇన్చార్జు పీడీగా బాధ్యతలను అప్పగించారు. ఈమేరకు ఆయన బాధ్యతలను స్వీకరించనున్నారు. వ్యవసాయశాఖ డీడీగా తంగెళ్ల వెంకటేష్ కడప అగ్రికల్చర్: వ్యవసాయశాఖ డిప్యూటీ డైరెక్టర్గా తంగేళ్ల వెంకటేష్ మంగళవారం కలెక్టరేట్లోని జిల్లా వ్యవసాయ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈయన మన్యం జిల్లా పార్వతిపురం అగ్రికల్చర్ ఏడీఏగా పనిచేస్తూ పదోన్నతిపై వైఎస్సార్జిల్లా వ్యవసాయశాఖ డిప్యూటి డైరెక్టర్గా వచ్చారు. అనంతరం జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావును మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ ఏడాది రుణ లక్ష్యం రూ. 30,610 కోట్లు – వార్షిక రుణ ప్రణాళిక విడుదల చేసిన కలెక్టర్ కడప అగ్రికల్చర్: వైఎస్ఆర్ కడప జిల్లా 2026–27 సంవత్సరానికి రూ.30,610 కోట్ల రుణ లక్ష్యాన్ని నిర్దేశించినట్లు కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మంగళవారం జిల్లా సచివాలయంలో డీఆర్ ఓ మల్లికార్జునుడు,ఎల్డీఎం జనార్దనం,నాబార్డు డీడీఎం విజయ విహారి,కడప ఆర్డీఓ మురళీతో కలసి 2026–27 జిల్లా వార్షిక రుణ ప్రణాళికను విడుదల చేశారు. ఈ వార్షిక రుణ ప్రణాళిక ద్వారా వ్యవసాయం, గ్రామీణాభివృద్ధి, ఉపాధి కల్పనతోపాటు సమగ్ర ఆర్థికాభివృద్ధికి అవసరమైన పరపతి అందించేందుకు బ్యాంకులు చర్యలు చేపడతాయనివివరించారు. ‘ఎస్ఐఆర్’ను సమర్థంగా పూర్తి చేయాలి కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(ఎస్ఐఆర్) ప్రక్రియను పారదర్శకంగా పూర్తి చేయాలని భారత ఎన్నికల సంఘం డిప్యూటీ ఎన్నికల కమిషనర్ పవన్ కుమార్శర్మ ఆదేశించారు. మంగళవారం ఢిల్లీ నుంచి భారత ఎన్నికల సంఘం రాష్ట్రంలోని అన్ని జిల్లాల కలెక్టర్లతో వర్చువల్ విధానంలో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటర్ల మ్యాపింగ్ లో ఎక్కడా తప్పులు లేకుండా సాంకేతిక సమస్యలు తలెత్తకుండా చూడాలనిపలు సూచనలు చేశారు. దీనికి కలెక్టర్ బదులిస్తూ జిల్లాలో 2252 బీఎల్ఓ లు ఉన్నారని,జిల్లా లో మొత్తం 18,96,231 ఓటర్లు ఉన్నారని, 97.67శాతం ఫారం పంపిణీ ప్రక్రియ జరిగిందని, 21.53శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు వివరించారు. వీసీలో టిఎస్ చేతన్,డీఆర్ఓ మల్లికార్జునుడు తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్ ప్లాంటు ఏర్పాటుపై చంద్రబాబుకు చిత్తశుద్ధి ఏదీ?
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయిన నేపథ్యంలో.. ఈ నెల 3న మళ్లీ స్టీల్ప్లాంటుకు శంకుస్థాపన చేసేందుకు చంద్రబాబు రావడం అత్యంత హాస్యాస్పదమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష మండిపడ్డారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో వారు విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు రాయలసీమలో పుట్టినప్పటికీ ఈ ప్రాంతమంటే ఆయనకు అస్సలు పడదని, గతంలో మూడుసార్లు సీఎంగా పనిచేసినా కేవలం శిలాఫలకాలు వేయడం తప్ప దేన్నీ పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. 2018లో ఎన్నికల ముందు కంబాలదిన్నెలో చంద్రబాబు శంకుస్థాపన చేసి ఆ తర్వాత అక్కడ ఒక్క ఇటుక కూడా పెట్టకుండా వంచించారన్నారు. నాడు దివంగత నేత వైఎస్సార్ ప్రారంభించిన ‘బ్రాహ్మణి’ స్టీల్స్ పనులను ‘నెమళ్లు నాట్యమాడుతున్నాయి, సెలయేళ్లు పారుతున్నాయి’ అంటూ తప్పుడు కథనాలు రాయించి, కోర్టుల్లో కేసులు వేసి అడ్డుకున్న ద్రోహ చరిత్ర చంద్రబాబుదేనని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక ఏపీ హైగ్రేడ్ స్టీల్స్ ద్వారా అనుమతులు సాధించి, దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థను ఒప్పించి 2023 ఫిబ్రవరి, 15న భూమి పూజ చేశారని గుర్తుచేశారు. నాడు రూ.725 కోట్ల భారీ నిధులు వెచ్చించి వసతులు కల్పిస్తే.. కూటమి ప్రభుత్వం వచ్చాక వారిపై అక్రమ కేసులు పెట్టి వేధించారని, ఇప్పుడు మళ్లీ వారితోనే కొత్తగా శంకుస్థాపనకు వస్తున్నారన్నారు. ఇన్ని సార్లు డ్రామా శంకుస్థాపనలు చేసేకన్నా ప్లాంటును చిత్తశుద్దితో పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు చేస్తున్న మోసాలను ఎండగడుతూ, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులను ప్రజలకు చూపేందుకు నేడు (బుధవారం) వైఎస్సార్సీపీ జిల్లా నాయకత్వమంతా సున్నపురాళ్లపల్లె ప్రాంతాన్ని సందర్శించనున్నట్లు నేతలు స్పష్టం చేశారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్, నిత్యానందరెడ్డి, ప్రసాద్రెడ్డి, పులి సునీల్ తదితరులు పాల్గొన్నారు. -
స్టీల్ప్లాంట్ సందర్శనను అడ్డుకునే యత్నం
జమ్మలమడుగు: ముఖ్యమంత్రి చంద్రబాబు కడప ఉక్కుపై మళ్లీ చేయబోయే నకిలీ శంకుస్థాపనల రంగులు బయటపడకుండా చూసేందుకు కూటమి ప్రభుత్వం పోలీసులను అడ్డం పెట్టుకుని అప్రజాస్వామిక పర్వానికి తెరలేపింది. జమ్మలమడుగు మండల పరిధిలోని సున్నపురాళ్లపల్లె, కన్యతీర్థం వద్ద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన మౌలిక వసతులు, జిందాల్ సంస్థ చేపట్టిన పనుల తీరుతెన్నులను క్షేత్రస్థాయిలో పరిశీలించేందుకు బుధవారం వస్తున్న వైఎస్సార్సీపీ నిజనిర్ధారణ బృందాన్ని అడ్డుకునేందుకు పోలీసులు ముమ్మర ప్రయత్నాలు చేస్తున్నారు. అందులో భాగంగానే మంగళవారం సాయంత్రం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఉన్న వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డికి అర్బన్ సీఐ నరేష్బాబు ముందస్తు నోటీసులు జారీ చేశారు. స్టీల్ప్లాంట్ సందర్శన కార్యక్రమంలో పాల్గొనకూడదంటూ ఆంక్షలు విధించారు. ఒక్క జమ్మలమడుగులోనే కాకుండా ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాల నుంచి వచ్చే వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ముఖ్య నాయకులను ఎక్కడికక్కడే హౌస్ అరెస్టులు చేసేందుకు, భారీగా పోలీసు బందోబస్తును మోహరించి అడ్డుకట్ట వేసేందుకు వ్యూహాలు పన్నుతున్నారు. ప్రజాస్వామ్యబద్ధంగా తాము చేపట్టబోయే స్టీల్ప్లాంట్ సందర్శనను పోలీసులు అడ్డుకోవాలని చూడటం దుర్మార్గమని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి మండిపడ్డారు. బుధవారం ఉదయం ఉమ్మడి వైఎస్సార్ జిల్లావ్యాప్తంగా ఉన్న మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు అందరం కలిసి కచ్చితంగా స్టీల్ప్లాంట్ స్థలాన్ని సందర్శించి తీరుతామని, క్షేత్రస్థాయి వాస్తవాలను ప్రజల ముందు ఉంచుతామని స్పష్టం చేశారు. సాక్షి ప్రతినిధి, కడప : ‘ఉన్నది లేనట్లు, లేనిది ఉన్నట్లు, చేయనిది చేసినట్లు’ చెప్పుకోవడంలో సీఎం చంద్రబాబు తర్వాతే మరెవ్వరైనా అని రాజకీయ విశ్లేషకులు ఎద్దేవా చేస్తున్నారు. కడప ఉక్కు–రాయలసీమ హక్కు అంటూ గతంలో సాగిన దీక్షలన్నీ బూటకమేనని, శంకుస్థాపనలన్నీ నాటకాలేనని తేలిపోయింది. నాడు విభజన చట్టంలోని అంశాన్ని అమలు చేయాల్సిందిగా కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తేలేకపోయిన చంద్రబాబు, ఆపై క్షేత్రస్థాయి దీక్షల పేరుతో సరికొత్త నాటకాలకు తెరతీశారు. ఇలా 19 ఏళ్లుగా తెలుగుదేశం పార్టీ ఉక్కు పరిశ్రమపై అనేక రాజకీయ ఫీట్లు వేస్తూనే ఉంది. 2024లో అధికారంలోకి వచ్చిన తర్వాత ఈమారు తప్పకుండా స్టీల్ ప్లాంట్ నిర్మిస్తామని సీఎం చంద్రబాబు చెబుతూ వచ్చారు. గత ఏడాది మే 27న కడపలో నిర్వహించిన టీడీపీ మహానాడు వేదికపై నుంచి జూన్ 12లోపు ఉక్కు పరిశ్రమ పనులు పునఃప్రారంభిస్తామని ఆర్భాటంగా ప్రకటించారు. తీరా ఆ గడువు ముగిసి ఏడాది దాటిపోయినప్పటికీ క్షేత్రస్థాయిలో ఒక్క అడుగు కూడా ముందుకు పడలేదు సరికదా.. ఇప్పుడు మళ్లీ పాత కథనే తిరగేస్తూ ఈ నెల 3వ తేదీన ఉక్కు పరిశ్రమకు శంకుస్థాపన మళ్లీ చేసేందుకు సన్నద్ధమవ్వడంపై జిల్లా ప్రజల్లో తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ ‘శ్రీకారం’.. ఆపై రాజకీయ గ్రహణం రాయలసీమ మెట్ట ప్రాంతంలో ఉక్కు పరిశ్రమ స్థాపన ద్వారా ప్రత్యక్షంగా 20 వేల మందికి, పరోక్షంగా లక్ష మందికి జీవనోపాధి కల్పించాలని నాడే దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి మహా సంకల్పం చేశారు. 10 మిలియన్ టన్నుల సామర్థ్యంతో, రూ.20 వేల కోట్ల అంచనా వ్యయంతో బ్రహ్మణి స్టీల్స్కు 2007 జూన్, 10న ఆయన పునాది రాయి వేశారు. స్టీల్ ప్లాంట్ పనులు సైతం శరవేగంగా ప్రారంభమై, అప్పట్లోనే సుమారు రూ.1,500 కోట్లతో వివిధ నిర్మాణ పనులు పూర్తయ్యాయి. అంతలోనే వైఎస్సార్ అకాల మరణంతో బ్రహ్మణి స్టీల్స్కు రాజ కీయ గ్రహణం ఆవరించింది. తదనంతర కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు కుట్రపూరితంగా వ్యవహరించి, ఏకంగా పరిశ్రమకు ఇచ్చిన నీరు, భూకేటాయింపులను సైతం రద్దు చేస్తూ జీవోలు జారీ చేసి రాయలసీమకు ద్రోహం చేశాయి. ఆ తర్వాత రాష్ట్ర విభజన చట్టంలో కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు అంశాన్ని చేర్చినప్పటికీ, ఆ చట్టాన్ని అమలు చేయించడంలో నాటి కేంద్ర, రాష్ట్ర అధికార భాగస్వామ్య పార్టీగా ఉన్న టీడీపీ పూర్తిగా నోరెత్తలేకపోయింది. చిత్తశుద్ధి చాటుకున్న వైఎస్ జగన్ సర్కార్ జమ్మలమడుగులో ఉక్కు పరిశ్రమ ఏర్పాటు చేయా లనే విషయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ చిత్తశుద్ధి చాటుకుంది. తొలుత 2019లో డిసెంబర్ 23న సున్నపురాళ్లపల్లె వద్ద శంకుస్థాపన చేశారు. వెంటనే కరోనా వైరస్ కారణంగా ఎలాంటి పనులు చేపట్టలేదు. తర్వాత దేశంలోనే ప్రతిష్టాత్మకమైన జేఎస్డబ్ల్యూ జిందాల్ సంస్థతో ఒప్పందం కుదుర్చుకుని 2023 ఫిబ్రవరి, 15న వైఎస్ జగన్ ఘనంగా భూమి పూజ చేశారు. కేవలం మాటలకే పరిమితం కాకుండా, ఆ రోజు నాటికే రాష్ట్ర ప్రభుత్వం తరఫున రూ.725 కోట్ల భారీ నిధులను వెచ్చించి పరిశ్రమకు అవసరమైన నీరు, విద్యుత్, రైల్వే, రోడ్డు కనెక్టివిటీ వంటి మౌలిక వసతులను శరవేగంగా కల్పించారు. రెండు దశల్లో మొత్తం రూ.8,800 కోట్ల పెట్టుబడితో, 3 మిలియన్ టన్నుల ఉత్పత్తి సామర్థ్యం గల స్టీల్ ప్లాంట్ ఏర్పాటుకు సర్వం సిద్ధం చేశారు. వైఎస్ జగన్ ఇచ్చి న భరోసాతో జిందాల్ సంస్థ కూడా దాదాపు రూ.1,300 కోట్లు వెచ్చించి క్షేత్రస్థాయిలో వివిధ నిర్మా ణ పనులను వేగవంతం చేసింది. నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో సాగిన అదే వేగంతో పనులు కొనసాగి టీడీపీ కొనసాగించి ఉంటే.. ఈపాటికి కడప స్టీల్ ప్లాంట్ నుంచి వాణిజ్యపరంగా ఉత్పత్తి ప్రారంభమై, రాయలసీమ నిరుద్యోగ యువతకు వేలాది సంఖ్యలో ఉద్యోగాలు లభించేవి. కానీ కూటమి ప్రభుత్వం రాజకీయ కక్షలతో ఆ ప్రాజెక్టును పక్కనబెట్టి, ఇప్పుడు సరికొత్త డ్రామాలకు తెరలేపింది. నేడు వైఎస్సార్సీపీ నేతల సందర్శన చంద్రబాబు చేయబోయే ఈ నకిలీ శంకుస్థాపనల రంగులు బయటపెట్టేందుకు వైఎస్సార్సీపీ సిద్ధమైంది. సున్నపురాళ్లపల్లె వద్ద జిందాల్ సంస్థ చేపట్టిన పనులు, అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కల్పించిన మౌలిక సదుపాయాలను బుధవారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి నాయకత్వంలో ఆ పార్టీ బృందం సందర్శించనుంది. ఉక్కు పరిశ్రమ తీరుతెన్నులను, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధిని స్వయంగా పరిశీలించేందుకు వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, ముఖ్య నాయకులు భారీ సంఖ్యలో హాజరు కానున్నట్లు ఆ పార్టీ అధికారికంగా ప్రకటించింది. ఉక్కు పరిశ్రమపై లేని చిత్తశుద్ధి నాడు దీక్ష బూటకం.. శంకుస్థాపన నాటకం ‘మహానాడు’ గడువు ముగిసి ఏడాది దాటినా ముందడుగు లేదు ఎల్లుండి మళ్లీ శంకుస్థాపనకు చంద్రబాబు సర్కార్ సిద్ధం నేడు సున్నపురాళ్లపల్లె స్టీల్ ప్లాంట్ స్థలాన్ని సందర్శించనున్న వైఎస్సార్సీపీ నేతలు ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి నోటీసులు! ముందస్తు అరెస్టులకు పోలీసుల స్కెచ్ ప్రభుత్వ తీరుపై విమర్శల వెల్లువ ఎన్నికలు దగ్గరపడేసరికి అప్పటి టీడీపీ ప్రభుత్వం చిత్తశుద్ధి లేని ఆమరణ దీక్షల నాటకాలకు తెరలేపింది. అప్పటి టీడీపీ రాజ్యసభ సభ్యుడు సీఎం రమేష్ ఏకంగా 11 రోజులు ఆమరణ దీక్ష చేసినట్లు డ్రామాలు ఆడి, కనీసం ఒక కిలో బరువు కూడా తగ్గకుండా దీక్ష విరమించిన గంటలోపే ఆసుపత్రి నుంచి డిశ్చార్జి కావడం సీమ ప్రజలను వంచించడమేనని విశ్లేషకులు గుర్తుచేస్తున్నారు. అదే బూటకపు ఊపుతో కేవలం రూ.1.5 కోట్లు మంజూరు చేసి 2018 డిసెంబర్, 27న మైలవరం మండలం కంబాలదిన్నె వద్ద ‘ఏపీ హైగ్రేడ్ స్టీల్ కార్పొరేషన్’ పేరుతో చంద్రబాబు శంకుస్థాపన చేసి ఆపై దాన్ని గాలికి వదిలేశారు. తాజాగా ఈ నెల 3న చంద్రబాబు చేయబోయే ఈ శంకుస్థాపన కూడా రాయలసీమ ప్రజల కంటితుడుపు కోసమేనని స్పష్టమవుతోంది. -
చోరీ కేసులో నిందితుడి అరెస్టు
వేముల : మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో ఈనెల 24న జరిగిన శ్రీలక్ష్మీనరసింహస్వామి నూతన విగ్రహ ప్రతిష్ట మహోత్సవంలో ఓ మహిళ మెడలో బంగారు గొలుసును దొంగలించిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ ప్రవీణ్కుమార్ తెలిపారు. నెల్లూరు జిల్లా బోగోలు మండలానికి చెందిన కప్పరాళ్ల తిప్ప గ్రామంలోని సముద్రాల రాంబాబును అదుపులోకి తీసుకుని విచారించగా.. మరో నలుగురితో కలిసి భూమయ్యగారిపల్లె గ్రామంలో చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు అంగీకరించాడు. అతని వద్ద నుండి సుమారు 34గ్రాముల బంగారు గొలుసును స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు సహచరులతో కలిసి దేవాలయాలు, రాజకీయ సభలు, బస్టాండు వంటి ప్రాంతాలను లక్ష్యంగా చేసుకుని చైన్ స్నాచింగ్, పిక్ ప్యాకెటింగ్ తదితర నేరాలకు పాల్పడినట్లు వెల్లడి కావడంతో అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
హెల్త్ సూపర్వైజర్–స్టాఫ్ నర్సుల రగడ
కమలాపురం : కమలాపురం క్రాస్ రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్లో హెల్త్ సూపర్వైజర్ కొండారెడ్డి, స్టాఫ్ నర్సుల మధ్య సాగుతున్న విభేదాలు ఒక్కసారిగా రచ్చకెక్కాయి. కాంట్రాక్ట్ బేసిస్పై పనిచేస్తున్న నర్సు రమాదేవి మెడికల్ ఆఫీసర్ అనుమతితో సోమవారం లీవ్ తీసుకున్నారు. దీనిపై ఆగ్రహించిన కొండారెడ్డి.. ‘లీవ్ ఇవ్వడానికి మెడికల్ ఆఫీసర్ ఎవరు? నన్ను అడిగే సెలవు తీసుకోవాలి‘ అంటూ నర్సుపై తీవ్రంగా రుసరుసలాడాడు. మంగళవారం దీనిపై వైద్య సిబ్బంది కొండారెడ్డిని నిలదీయగా.. ఆయన ఆగ్రహంతో ఊగిపోతూ సిబ్బందితో పాటు మెడికల్ ఆఫీసర్ను కూడా బెదిరించినట్లు సమాచారం. తనకు రాజకీయ పలుకుబడి ఉందని, మహిళలని కూడా చూడకుండా కనీస మర్యాద ఇవ్వకుండా రెస్ట్ రూమ్లోకి రావద్దంటూ కొండారెడ్డి బెదిరిస్తున్నాడని నర్సులు కన్నీటిపర్యంతమయ్యారు. ఎప్పుడూ తమ సెంటర్లోనే తిష్ట వేస్తూ మానసికంగా వేధిస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల క్షేత్రస్థాయి విచారణ ఆరోగ్య కేంద్రంలో గొడవ జరిగిన విషయం తెలుసుకున్న డీఎంహెచ్ఓ ఆదేశాల మేరకు ఆర్బీఎస్కే ప్రోగ్రాం ఆఫీసర్ ఆరిఫుల్లా, డీపీఎంఓ మహమ్మద్ తహ బుధవారం ఆసుపత్రిని సందర్శించి క్షేత్రస్థాయి విచారణ జరిపారు. సిబ్బందిని వేరువేరుగా విచారించిన అనంతరం వారు మీడియాతో మాట్లాడారు. పేద ప్రజలకు వైద్య సేవలు అందించాల్సిన ఆరోగ్య కేంద్రంలో సిబ్బంది ఇలా గొడవకు దిగడం సరికాదన్నారు. అడ్మినిస్ట్రేషన్ లోపం, లీవ్స్ లాంటి చిన్న చిన్న విషయాల వల్లే ఈ రగడ జరిగిందని ప్రాథమికంగా గుర్తించామన్నారు. ఇలాంటి ఘటనలు భవిష్యత్తులో పునరావృతం కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తగిన చర్యలు తీసుకుంటామని విచారణ అధికారులు స్పష్టం చేశారు.నాయకుల అండతో నర్సులకు బెదిరింపులు -
మంత్రి గారూ..మీ ఊరి పెద్దాసుపత్రి వైపు చూడండి
ప్రొద్దుటూరు క్రైం : రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ నేడు (బుధవారం) ప్రొద్దు టూరు పట్టణంలో పర్యటించనున్నారు. స్థానికంగా జరిగే పలు కార్యక్రమాలతో పాటు ’డాక్టర్స్ డే’ సందర్భంగా వైద్యులు ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో కూడా ఆయన పాల్గొంటారు. ఈ నేపథ్యంలో కడప రిమ్స్ తర్వాత ఉమ్మడి జిల్లాలోనే అతిపెద్ద వైద్య కేంద్రంగా ఉన్న ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి దుస్థితిపై సర్వత్రా చర్చ నడుస్తోంది. ఈ ఆసుపత్రికి రోజుకు సుమారు 900 నుంచి 1000 మంది వరకు రోగులు ఓపీ కోసం వస్తుంటారు. రూ.20 కోట్లున్నా.. అస్తవ్యస్తమే! ఈ భారీ ఆసుపత్రిలో గత కొంతకాలంగా డ్రైనేజీ వ్యవస్థ పూర్తిగా అస్తవ్యస్తంగా మారింది. మరుగుదొడ్లకు సంబంధించిన పైప్లైన్లు పూర్తిగా బ్లాక్ అయిపోయి నరకం తలపిస్తున్నాయి. ఇలాంటి అనేక తీవ్రమైన సమస్యలను పరిష్కరించి, ఆసుపత్రిని ఆధునికీకరించేందుకు ప్రభుత్వం రూ.20 కోట్ల నిధులను మంజూరు చేసింది. ఈ పనులకు సంబంధించి గతేడాది నవంబర్ 17న భూమి పూజ చేశారు. అయితే, పనులు మొదలుపెట్టి 8 నెలలు కావస్తున్నా క్షేత్రస్థాయిలో ఒక్క పని కూడా పూర్తి కాలేదు. మొత్తం బడ్జెట్లో ఇప్పటివరకు రూ. 1.50 కోట్ల విలువైన పనులు మాత్రమే జరగడం అధికారుల, కాంట్రాక్టర్ల అలసత్వానికి అద్దం పడుతోంది. ప్రస్తుతం ఆసుపత్రి గ్రౌండ్ ఫ్లోర్లో ఉన్న బ్లడ్ బ్యాంక్ను సెంట్రల్ ల్యాబరేటరీలోకి మార్చారు. ఇందులో కేవలం ఫ్లోరింగ్, ఎలక్ట్రికల్ పనులతో పాటు మరుగుదొడ్ల మరమ్మతులు చేయాల్సి ఉంది. ఈ తరహా పనులను కేవలం 20 రోజుల్లోనే పూర్తి చేసే అవకాశం ఉన్నప్పటికీ, కాంట్రాక్టర్ తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ దుస్థితిపై ఆసుపత్రి అధికారులు పలుమార్లు జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఎలాంటి ఫలితం లేకుండా పోయింది. ఈ విషయంపై స్థానికంగా ఉన్న కూటమి ప్రభుత్వ నాయకులను ప్రశ్నిస్తే ‘ఆ కాంట్రాక్టర్ మా మాట వినడం లేదు.. మా ఫోన్లే ఎత్తడం లేదు.. మేమేం చేయాలి?‘ అంటూ చేతులెత్తేస్తున్నారు. ప్రొద్దుటూరు వాసి, రాష్ట్ర ఆరోగ్యశాఖ మంత్రి అయిన సత్యకుమార్ యాదవ్ ఇప్పటికై నా పెద్దాసుపత్రి అభివృద్ధి పనులపై ప్రత్యేక దృష్టి సారించాలని ప్రజలు కోరుతున్నారు.ఎక్కడికక్కడ నిలిచిపోయిన అభివృద్ధి పనులు -
ప్రజలను మోసగించేందుకే బాబు శతావతారాలు!
ప్రొద్దుటూరు (సాక్షి ప్రతినిధి) : మహా విష్ణువు లోక కల్యాణం కోసం దశావతారాలు ఎత్తితే.. సీఎం చంద్రబాబు మాత్రం ప్రజలను మోసగించేందుకు శతావతారాలు ఎత్తాడని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఎద్దేవా చేశారు. ప్రొద్దుటూరులో మంగళవారం ఆయన తన క్యాంప్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. దళితులు, నాయీబ్రాహ్మణులు, రజకులను గతంలో అవమానించిన చంద్రబాబే.. ఇప్పుడు ఓట్ల కోసం చెప్పులు కుట్టడం, బార్బర్ షాపుల్లో కటింగ్ చేయడం, దోబీఘాట్ల వద్ద ఫొటోలు దిగడం లాంటి మోసపూరిత నాటకాలు ఆడుతున్నాడని విమర్శించారు. ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని చిన్నశెట్టిపల్లెలో అర్హులు పింఛన్లకు దూరమైన సంఘటనే ఇందుకు నిదర్శనమన్నారు.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 25 నెలలు దాటుతున్నా రాష్ట్రంలో ఏ ఒక్కరికీ కొత్తగా పింఛన్లు ఇవ్వలేదన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి ఆరు నెలలకొకసారి కొత్త పింఛన్లు మంజూరు చేసేవారని గుర్తుచేశారు. చంద్రబాబు 25 నెలలుగా పింఛన్లు ఇవ్వకుండా కాలయాపన చేయడం వల్ల అర్హులైన ప్రతి ఒక్కరికీ ప్రభుత్వం దాదాపు రూ.లక్ష వరకు బకాయి పడిందని, ఆ మొత్తాన్ని తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. ఏ ఒక్క దివ్యాంగునికి, వితంతువుకు కొత్తగా పింఛన్ రాలేదని.. వీరికి సీఎం క్షమాపణ చెప్పాలన్నారు. పాత పింఛన్ల పంపిణీ పేరిట ప్రతి నెలా చంద్రబాబు విమానాల్లో తిరుగుతూ ప్రజా ధనాన్ని విచ్చలవిడిగా దుబారా చేస్తున్నారని ధ్వజమెత్తారు. గతంలో టీడీపీ ప్రభుత్వమే మంజూరు చేసిన 7 లక్షల పింఛన్లను ఇప్పుడు ఎందుకు తొలగించారని నిలదీశారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల కోసం బకాయిలు ఇవ్వకుండా కొత్త పింఛన్లు ఇస్తే ప్రజలు తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మాజీ మున్సిపల్ చైర్పర్సన్ బి.లక్ష్మీదేవి, జెడ్పీ వైస్ చైర్పర్సన్ జేష్టాది శారద, మెట్టుపల్లె ప్రభాకర్రెడ్డి పాల్గొన్నారు. మహా విష్ణువువి దశావతారాలే.. చంద్రబాబువి కపట నాటకాలు 25 నెలల కొత్త పింఛన్ల బకాయిలు తక్షణమే పంపిణీ చేయాలి వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజం -
ఐషర్ వాహనం–ట్యాంకర్ ఢీ: ఒకరి మృతి
జమ్మలమడుగు/మైలవరం : మైలవరం మండలంలోని వద్దిరాల– ధన్నవాడ గ్రామాల మధ్య ఐషర్ వాహనం, ట్యాంకర్ ఎదురెదురుగా ఢీకొనడంతో ఐషర్ వాహనం డ్రైవర్ ఉదయగిరి శ్రావణ్కుమార్(32) అక్కడికక్కడే మృతిచెందాడు .ఈ సంఘటన సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. దాల్మియానుంచి సిమెంట్ లోడుతో వెళుతున్న లారీ వద్దిరాల దాటిన తర్వాత కొలిమిగుండ్ల నుంచి వచ్చిన ఐషర్ వాహనం ఎదురురెదురుగా ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఉదయగిరి శ్రావణకుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు.ఐషర్ వాహనం టాపుపై ఉన్న మరో వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. ఇతను మాట్లాడలేకపోవడంతో ఇతను ఎవరన్న విషయాన్ని గుర్తించలేకపోతున్నారు. ట్యాంకర్ డ్రైవర్ మెల్ల రాజశేఖర్ కూడా గాయపడ్డాడు. వీరిద్దరిని అంబులెన్సులో జమ్మలమడుగు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమిచికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. ఐషర్ లారీలో ఇరుక్కున్న ఉదయగిరి శ్రావణ్కుమార్ మృతదేహాన్ని రూరల్సీఐ కులాయప్ప , ఎస్ఐలు హైమావతి, శ్యాంసుందర్రెడ్డి జేసీబీతో బయటికి తీయించారు. ఐషర్ లారీ పోరుమామిళ్ల మండలం వాసుదేవపురానికి చెందినదిగా పోలీసులు గుర్తించారు. జాతీయస్థాయి పోటీలకు ఎంపికకడప వైఎస్ఆర్ సర్కిల్ : తిరుపతిలో ఈ నెల 28న జరిగిన 6వ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కరాటే చాంపియన్షిప్ కమ్ నేషనల్ సెలెక్షన్స్–2026లో కడపకు చెందిన విజయ్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీ విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు కరాటే అసోసియేషన్ ఆఫ్ రాష్ట్ర అధ్యక్షుడు కోలా ప్రతాప్, ప్రధాన కార్యదర్శి ఎం. విజయ్ పేర్కొన్నారు. ఈ పోటీల్లో అకాడమీకి చెందిన 30 మంది విద్యార్థులు పాల్గొని 10 బంగారు, 12 వెండి, 8 కాంస్య పతకాలు సాధించారు. ఆగస్టు 7, 8 తేదీలలో కోల్కతాలో జరిగే కరాటే అసోసియేషన్ ఆఫ్ ఇండియా జాతీయ కరాటే ఛాంపియన్షిప్ కోసం అకాడమీకి చెందిన 9 మంది విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు : ఎం. అను, ఏంజెల్, ఎం. మేఘన, టి. హాసిని,ఎం. అబ్దుల్లా ఖాన్,ఎన్. వజ్ర దత్, ఎ. తన్వితాక్షి, ఎం. రోహన్, కె. ఆరోన్. -
తహసీల్దార్ కార్యాలయానికి తాళం
దువ్వూరు : రైతుల సమస్యల పరిష్కారమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని పాలకులు చెబుతున్నారు. కానీ క్షేత్ర స్థాయిలో రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యానికి ఓ రైతు తహసీల్దార్ కార్యాలయానికి తాళం వేసి నిరసన తెలిపాడు. స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమానికి మండలంలోని సంజీవరెడ్డిపల్లెకు చెందిన జొన్నవరం నాగకృష్ణారెడ్డి అనే రైతు తన సమస్యను తెలపడానికి కార్యాలయానికి వచ్చాడు. నాగకృష్ణారెడ్డి మాట్లాడుతూ దువ్వూరు రెవెన్యూ గ్రామంలో సర్వే నంబర్ 620/2ఏలో 16 సెంట్ల తన పట్టాభూమిని అధికారులు మిగులు భూమి కింద మార్చారు. సర్వే నంబర్ 633/6లో 15 సెంట్ల పట్టా భూమి సబ్ డివిజన్ అయినా ఆన్లైన్లో నమోదు చేయలేదన్నారు. సర్వే నంబర్ 652లో రస్తాకు సంబంధించిన సమస్య ఉందన్నారు. ఈ సమస్యలపై గతంలో 10 సార్లు తహసీల్దార్కు, ఆర్డీఓలకు కలెక్టరేట్లో అర్జీలు ఇచ్చినా పరిష్కారం కాలేదన్నారు. రెండేళ్ల నుంచి కార్యాలయాల చుట్టు తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన రెవెన్యూ క్లినిక్లో ఈ అంశంపై ఆర్డీఓకు అర్జీ ఇచ్చానన్నారు. తన సమస్యకు త్వరగా పరిష్కారం చూపాలని సోమవారం తహసీల్దార్ను అడగ్గా తహసీల్దార్ నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చి తనను బెదిరించే ధోరణిలో మాట్లాడారన్నారు. తన సమస్యపై స్పందించనందుకు సీసీఎల్ఏ టోల్ ఫ్రీ నంబర్ 1100కు ఫోన్ చేసి అధికారులు తన సమస్యను పరిష్కరించడం లేదని తాళాలు వేస్తున్నానని చెప్పి కార్యాలయం లోపలి నుంచి తాళాలు వేసి నిరసన తెలిపానన్నారు. పీజీఆర్ఎస్లో ఈ సమస్యపై ఎన్ని సార్లు అర్జీలు ఇచ్చినా తనను సంప్రదించకుండానే అధికారులు అర్జీలను క్లోజ్ చేస్తున్నారన్నారు. అధికారులు తనను విచారణకు పిలవకుండానే ఏకపక్షంగా అవతలి వారిని పిలిచి విచారణ చేసి వారికి మద్దతు తెలుపుతున్నారన్నారు.పోలీసులు వచ్చి రైతుకు నచ్చజెప్పి కార్యాలయం తాళాలు తీయించారు. రైతు నాగకృష్ణారెడ్డి తమ విధులకు ఆటంకం కలిగించాడని తహసీల్దార్ ఫిర్యాదు చేశారని, దీనిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తహసీల్దార్ ఏమన్నారంటే ఈ విషయంపై తహసీల్దార్ సంజీవరెడ్డిని వివరణ కోరగా ఇది వారి అన్నదమ్ముల సమస్య, ఇరుపక్షాలను పిలిచి విచారించాం. వారు రస్తా ఇస్తామని చెప్పారు, నాగకృష్ణారెడ్డి రస్తాను రిజిస్టర్ చేయించి ఇవ్వాలని అడుగుతున్నాడని తెలిపారు. ఈ సమస్య అన్నదమ్ముల మధ్య కాబట్టి సామరస్యంగా పరిష్కరించుకోవాలని, లేదంటే కోర్టుకు వెళ్లాలని చెప్పానని పేర్కొన్నారు.సమస్య పరిష్కరించనందుకు నిరసన తెలిపిన రైతు -
రామయ్య సన్నిధిలో వెలుగుల పండుగ !
భవిష్యత్తు వాతావరణంలో అంతరిక్ష, భూగోళ మార్పుల వల్ల అనేక వింతలు జరుగుతాయని శాస్త్రవేత్తలు చెబుతుంటారు. అవి చాలాసార్లు నిజమయ్యాయి కూడా. అలాంటి ఒక అరుదైన, విచిత్రమైన ప్రకృతి దృశ్యమే ‘ఆంధ్ర భద్రాద్రి’గా పేరుగాంచిన ఒంటిమిట్టలో సోమవారం సాయంత్రం చోటుచేసుకుంది. సాధారణంగా సాయంత్రం 6:30 గంటలలోపే సూర్యాస్తమయం జరిగి చీకట్లు పరుచుకోవడం ప్రకృతి నియమం. కానీ సోమవారం ఒంటిమిట్ట ఆకాశంలో ఒక విచిత్రమైన వాతావరణం నెలకొంది. రాత్రి గడియారంలో సమయం 7:00 గంటలు దాటుతున్నా సూర్యాస్తమయం కాకపోగా.. ఆ సమయంలో ప్రసరించిన సూర్య కిరణాల వల్ల తీక్షణమైన వెలుగులు ఒంటిమిట్ట అంతటా పరుచుకున్నాయి. –ఒంటిమిట్ట -
స్టీల్ప్లాంట్కు అనుమతులు తెచ్చింది వైఎస్సార్సీపీనే
జమ్మలమడుగు : నియోజకవర్గంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయాలనే అలోచన వైఎస్ కుటుంబం నుంచే పుట్టిందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నియోజకవర్గంలో 20వేల కోట్ల పెట్టుబడితో స్టీల్ప్లాంట్ నిర్మాణానికి 2007లోనే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి పారిశ్రామికవేత్త అయిన గాలి జనార్థన్రెడ్డి చేత శంకుస్థాపన చేయడం జరిగింది. వైఎస్సార్ మరణంతో పనులు పూర్తిగా నిలిచిపోయాయి. అప్పటి నుంచి జమ్మలమడుగు నియోజకవర్గంలో స్టీల్ప్లాంట్ ఏర్పాటు చేయాలన్న అలోచన ఎవ్వరికి రాలేదన్నారు. అయితే వైఎస్ కుమారుడైన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో ఏపీ ఐఐఐసీ ఆధ్వర్యంలో కడప స్టీల్ప్లాంట్ ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు.అందులో భాగంగా మూడువేల ఎకరాలకు పైగా భూకేటాయింపు, ఇన్ఫ్రాస్ట్రక్చర్ కోసం 75 కోట్లు ఖర్చు చేశారు. పర్యావరణ అనుమతులను పూర్తి చేశారు. 2022 ఫిబ్రవరిలో జెఎస్డబ్ల్యూ సజ్జన్ జిందాల్ను ఒప్పించి వారికి రాయితీలు కల్పించి ప్లాంట్ను మరోసారి ప్రారంభింపజేశారు. అయితే తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం జెఎస్డబ్ల్యూ ఎండీపైనే కేసునమోదు చేసి వారిని అరెస్టు చేసే ప్రయత్నం చేశారు.అందులో భాగంగా కొందరు అధికారులను సైతం అరెస్టుచేసిన సంగతి తెలిసిందే. అయితే ఇప్పుడు జగన్మోహన్రెడ్డి తీసుకొచ్చిన జిందాల్ కంపెనీతోనే కూటమి నాయకులు తిరిగి జెఎస్డబ్ల్యూ ఫ్యాక్టరీ నిర్మాణానికి ముందుకు వచ్చారు. నాడు జగన్మోహన్రెడ్డి అలోచన వల్లే నేడు స్టీల్ఫ్లాంట్ వచ్చిందన్న విషయం తెలుసుకోవాలన్నారు. కానీ నేడు స్టీల్ప్లాంట్ తామే తెచ్చామని గొప్పలు చెప్పుకుంటున్నారు. ఈ క్రెడిట్ను తమ ఖాతాలో వేసుకునే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు 2018 డిసెంబర్లో ఎం కంబాలదిన్నె వద్ద స్టీల్ఫ్లాంట్కు శంకుస్థాపన చేశారు. దాని పరిస్థితి ఏమైందో రాష్ట్ర ప్రజలకందరికీ తెలుసు అని ఎమ్మెల్సీ అన్నారు.ఇప్పుడు మళ్లీ స్టీల్ప్లాంట్కు శంకుస్థాపన కోసం వస్తున్నారు. దీనినైన రెండేళ్లలో పూర్తి చేస్తారా అన్న విషయం ప్రజలకు తెలియజేయాలన్నారు. కార్యక్రమంలో అధికారప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, రాష్ట్ర మైనార్టీ కార్యదర్శి ముల్లాజానీ . ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
అమరావతిలో భూదోపిడీ
పులివెందుల : ‘రాజధాని అమరావతిలో ల్యాండ్ పూలింగ్ చట్టం గడువు ముగిసినప్పటికీ, చట్టవిరుద్ధంగా రైతుల భూములను లాక్కోవడమే కూటమి ప్రభుత్వ ఏకై క లక్ష్యంగా మారింది. ఈ భూదోపిడీ వాస్తవాలు నగ్నంగా బయటపడతాయనే భయంతోనే వైఎస్సార్సీపీ రైతు పరిరక్షణ కమిటీ ప్రతినిధులపై కూటమి శ్రేణులు దాడులకు తెగబడ్డాయి‘ అని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. సోమవారం పులివెందుల బాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. వైఎస్సార్సీపీ రైతు కమిటీ సభ్యులపై దాడులు చేసింది కాక ‘మీరు అక్కడికి ఎందుకు వెళ్లారు?‘ అని స్వయంగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రశ్నించడం చూస్తే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా? రాక్షస రాజ్యంలో ఉన్నామా? అర్థం కావడం లేదన్నారు. ‘రాజధాని అమరావతికి వెళ్లేందుకు మనకు ఏమైనా పాస్పోర్ట్, వీసా కావాలా?‘ అంటూ ఆయన నిలదీశారు. అమరావతి బాధితుల పిలుపు మేరకు ఉండవల్లి సెంటర్కు వెళ్లిన వైఎస్సార్సీపీ కమిటీ సభ్యులను టీడీపీ గూండాలు అడ్డుకుని పోలీసుల ముందే దాడులు చేయడం దారుణమన్నారు. ఆ అరాచకాలను అడ్డుకోవడంలో విఫలమైన పోలీసులు, తిరిగి బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపైనే చట్టవిరుద్ధంగా ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, నాన్బెయిలబుల్ కేసులు పెట్టడం ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేయడమేనని మండిపడ్డారు. ‘రాష్ట్రంలో అంబేద్కర్ రాజ్యాంగం నడుస్తోందా? లేక నారా లోకేష్ ‘రెడ్ బుక్’ రాజ్యాంగం నడుస్తోందా?‘ అంటూ విరుచుకపడ్డారు. గతంలో ‘తెలంగాణ మీ అబ్బ జాగీరా?’ అంటూ గర్జించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, మరి ఇప్పుడు అమరావతిలో సాగుతున్న భూదోపిడీపై ఎందుకు మౌనంగా ఉన్నారని, ప్రస్తుతం ఇక్కడున్న అమరావతి ఎవరబ్బ జాగీరో సమాధానం చెప్పాలని సవాల్ విసిరారు. భూములు ఇవ్వని రైతులు తమ పొలాలకు వెళ్లే దారులు మూసివేయడం, 40 అడుగుల లోతు గుంతలు తవ్వి పంటలను నిలువునా ముంచేయడం లాంటి అరాచకాలను స్వయంగా కూటమి ప్రభుత్వమే ప్రోత్సహిస్తోందని విమర్శించారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ అరాచకాలను ఆపకపోతే రాబోయే రోజుల్లో భారీ మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. దొంగతనంపై కేసు నమోదుపోరుమామిళ్ల : కాంట్రాక్టు పనిలో ఇనుపకడ్డీలు, సెంట్రింగ్ ప్లేట్లు దొంగలించి, పోరుమామిళ్ల పట్టణం చెరుకూరి గ్రాండ్ సమీపంలోని ఖాళీ స్థలంలో దాచిన ఘటనపై సోమవారం కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హనుమంతు తెలిపారు.వివరాలిలా వున్నాయి. పులివెందుల మండలంలో మౌంట్ విస్తా ప్రైవేట్ కంపెనీ చేపట్టిన కల్వర్ట్ నిర్మాణ పనులు పూర్తయ్యాక అక్కడ మిగిలిన 220 కేజీల 10 ఎంఎం కడ్డీలు, 240 కేజీల 12 ఎంఎవ కడ్డీలు, 1200 కేజీల 10 సెంట్రింగ్ ప్లేట్లను కంపెనీలో కాంట్రాక్టర్ వెంకటేష్ వద్ద సూపర్వైజర్గా పని చేస్తున్న అట్లా శ్రీనివాసరెడ్డి దొంగలించి పోరుమామిళ్లలో దాచాడని, దీనిపై విస్టా కంపెనీ అకౌంటెంట్ నారాయణస్వామి ఇచ్చిన ఫిర్యాదుపై కేసు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. నిందితుడికి జైలు శిక్షసింహాద్రిపురం : సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన ఏనుగుల రామ లక్షుమ్మ ఇంటిలో 2025 జూన్ 8వ తేదీన దొంగతనం జరిగింది. దుండగులు ఇంట్లోకి వెళ్లి బీరువా లాకర్ పగలగొట్టి అందులో వున్న 4 తులాల బంగారు చైను, సుమారు 2 తులాల మూడు జతల బంగారు కమ్మలు ఎత్తుకెళ్లారు. ఈ మేరకు సింహాద్రిపురం పీఎస్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పులివెందుల మండలం ఇ.కొత్తపల్లె గ్రామానికి చెందిన వల్లెపు దివాకర్ను అరెస్ట్ చేసి, అతని వద్ద నుంచి రూ.3లక్షల నగదును స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించారు. నిందితుడు రిమాండ్లో ఉండగానే అతనిపై ఎస్ఐ డాక్టర్ నాయక్ చార్జ్షీట్ దాఖలు చేయగా, విచారణలో నేరం రుజువుకావడంతో సోమవారం న్యాయమూర్తి ఎం. చంద్రశేఖర్ రెడ్డి నిందితుడికి ఏడాది జైలు శిక్షతోపాటు రూ.1,000ల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించారు. ఈ కేసులో ప్రాసిక్యూషన్ తరఫున వాదనలు వినిపించిన అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ జి.మధుసూదన ఆచారి, రూరల్ సీఐ శాంతిలాల్, సింహాద్రిపురం ఎస్ఐ డాక్టర్ నాయక్, సాక్షులను కోర్టులో సకాలంలో హాజరుపరిచి నిందితుడికి శిక్ష పడేందుకు కృషి చేసిన కోర్టు కానిస్టేబుల్ ఓ. కిశోర్ బాబులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు.వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి -
రాజకీయకక్షతోనే దుష్ప్రచారం
రాజంపేట: రాజకీయ కక్షతోనే తనపై దుష్ప్రచారం కొనసాగిస్తూ పైశాచిక ఆనందం పొందుతున్నారని, అలాంటి వాటికి భయపడేవాడిని కాదని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. పట్టణంలోని తన స్వగృహంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. వైఎస్సార్సీపీని టార్గెట్ చేసుకొని తనపై ఎల్లో మీడియా అసత్య కథనాలు వండివారుస్తోందని మండిపడ్డారు. తనేంటో రాజంపేట ప్రజలకు తెలుసుకున్నారన్నారు. గత ఎన్నికల్లో కూటమి హవా కనిపించినా.. తాను ఇక్కడ వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేగా గెలిచానంటే అది రాజంపేట నియోజకవర్గ ప్రజల ఆశీస్సులన్నారు. సేవాదృక్ఫథంతో రాజకీయాల్లో ముందుకెళుతున్నందునే అది సాధ్యమైందన్నారు. తనకు స్వగ్రామమంటే ఇష్టమని.. అందుకే తెలంగాణాలోని కోట్లు విలువచేసే శంషాబాద్ ఎయిర్ పోర్టు వద్ద స్థలాన్ని అమ్ముకొని స్వగ్రామంలో స్థలాలు కొనుగోలు చేసి నిలిచిపోయానన్నారు. అలాగే దేవాలయాలు నిర్మించి, పేద జంటలకు ఉచితంగా పెళ్లిల్లు, కంటిచూపు శిబిరాలు, సీమంతాలు, నిత్యం ఆకలి అన్నవారికి ఎస్టేట్లో భోజనాలు పెడుతూ తన రాజకీయ జీవితంను గడుపుతున్నాన్నారు. అది చూసి ఓర్వలేక భూముల ఆక్రమణలని, పేదరైతుల భూములు కబ్జాలని అసత్య ఆరోపణలతో కథనాలు వండివారుస్తున్నారని మండిపడ్డారు. ఆ భూములు ఎక్కడికి పోవని బాధిత రైతులు ఆందోళన చెందనవసరం లేదని, వైఎస్సార్సీపీ అధికారంలోకి రాగానే బాధిత రైతులకు న్యాయం జరుగుతుందని ఆయన భరోసా కల్పించారు. ఆదివారం రోజున ముందస్తు నోటీసులు ఇవ్వకుండా పేద రైతులు భూములపై దౌర్జన్యంగా జేసీబీలతో ధ్వంసం చేయించారన్నా రు. దీనిపై న్యాయం కోసం పోరాడుతామన్నారు. గత వైఎస్సార్సీపీ పాలనలో రాజంపేటలో ఇలాంటి సంఘటనలు జరగలేదని గుర్తుచేశారు. ప్రస్తుత అధికారపార్టీ వల్ల నష్టపోయిన బాధిత రైతులు రాఘవరెడ్డి, చంద్రారెడ్డి, శివారెడ్డి, శ్యామలు కూడా తమకు ఎటువంటి సమాచారం, నోటీసులు ఇవ్వకుండా సెలవ రోజున తమ భూముల్లో దౌర్జన్యకరరీతిలో పోలీసులు అడ్డుకపెట్టుకొని, రెవిన్యూ అధికారులు కంచెలు పీకేశారని వాపోయారు. చక్రాలమడుగు కోట్లాది విలువ చేసిన కబ్జాలు కనపడవా.. రాజంపేట పట్టణ నడిబొడ్డున వున్న చక్రాలమడుగుకు సంబంధించి కోట్లాది రూపాయిలు విలువ చేసే భూ ఆక్రమణ జరుగుతుంటే అధికారగణం చోద్యం చూస్తోందని ఎమ్మెల్యే ఆరోపించారు.మట్టి, ఇసుక దర్జాగా దోచుకుంటే అధికారులకు కనపడటంలేదా అని ప్రశ్నించారు. చుండువారిపల్లెలోకోట్ల విలువ చేసే భములు, అన్నమయ్య పంటకాల్వలను టీడీపీకి చెందిన వారు ఆక్రమణలు చేశారన్నా రు. సమావేశంలో రాజంపేట వైఎస్సార్సీపీ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డి, రాజంపేట రూరల్ కన్వీనరు దొడ్డిపల్లె భాస్కరరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధికారప్రతినిధి పాపినేని విశ్వనాథరెడ్డి, నాయకులు దండుగోపి, సుబ్బరాజు, గొంటుమణి తదితరులు పాల్గొన్నారు. నేనేంటో రాజంపేట వాసులకు తెలుసు సేవాదృక్పథంతో రాజకీయంలో ముందుకెళుతున్నాం మీడియా సమావేశంలో రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్ రెడ్డి -
మేఘమా..కురవవే!
రెండు రోజుల నుంచి రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లో విస్తారంగా వర్షాలు కురుస్తున్నా.. వైఎస్సార్ కడప జిల్లాలో మాత్రం వరుణ దేవుడు కరుణించడం లేదు. జిల్లావ్యాప్తంగా ఆకాశంలో మేఘాలు దాగుడుమూతలు ఆడుతున్నాయే తప్ప గట్టిగా ఒక మోస్తరు వాన కూడా పడటం లేదు. సోమవారం కడప నగర వీధులపై నిండా నీలి మేఘాలు కమ్మేయడంతో, పగటిపూటే సంధ్యాసమయం తరహాలో మబ్బులు పరుచుకున్న దృశ్యాలు కనువిందు చేశాయి. ఆకాశంలో దట్టమైన మేఘాలను చూసి ఎప్పుడెప్పుడు వర్షం కురుస్తుందా అని ప్రజలతో పాటు జిల్లాలోని రైతాంగం కూడా వెయ్యి కళ్లతో ఆశగా ఎదురుచూస్తోంది.చినుకు పడితేనే సాగు పనులు వేగవంతం అవుతాయని, మేఘాల దాగుడుమూతలు వీడి త్వరలోనే భారీ వర్షాలు కురవాలని వరుణుడిని వేడుకుంటున్నారు. – సాక్షి ఫోటో గ్రాఫర్, కడప. -
నిర్ణీత గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని, జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడారు. మొత్తం 125 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. చట్ట పరిధిలో న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అర్జీలు పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోనన్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్ , డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్లపై సమీక్ష
జమ్మలమడుగు రూరల్: ఉక్కు పరిశ్రమ నిర్మాణ పనుల ప్రారంభోత్సవానికి సీఎం చంద్రబాబు హాజరుకానున్న నేపత్యంలో కలెక్టరు డాక్టర్ చెరుకూరి శ్రీధర్ స్థానిక ఎమ్మెల్యే ప్రభుత్వ విప్ అదినారాయణరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి, ఎస్పీ నచికెత్ విశ్వనాథ్, స్టీల్ ప్లాంట్ ప్రతినిధులతో కలసి సోమవారం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ జులై 3వ తేది ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు జమ్మలమడుగు మండలంలోని సున్నపురాళ్లపల్లె పంచాయతీలో ఏర్పాటు చేసే ఉక్కు పరిశ్రమ ప్రారంభోత్సవానికి రానున్నట్లు ఆయన తెలిపారు. ముఖ్యమంత్రి పర్యటనకు సంబంధించిన ఏర్పాట్లపై నేతలతో, అధికారులతో ఆయన సమీక్షించారు. జేసీ డాక్టర్ నిధి మీనా, సబ్ కలెక్టర్ భావన అర్డీఓ శీరిషా, జేఎస్డబ్ల్యూ యాజమాన్యం సిబ్బంది పాల్గొన్నారు. జిల్లాలో ఐదు మండలాల్లో వర్షం కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా సోమవారం తె ల్లవారుజామున ఐదు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా పోరుమామిళ్లలో అత్యధి కంగా 48.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే కలసపాడులో 5.4, బి.కోడూరులో 3.6, వల్లూరులో 2.6, దువ్వూరులో 1.6 మి.మీ వర్షం కురిసింది. కడప కోటిరెడ్డిసర్కిల్ : గుజరాత్లోని వల్సాడ్ నుంచి కడప మీదుగా తమిళనాడులోని వేలాంగిణికి జులై 3న ప్రత్యేక రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. 3వ తేది ఈ రైలు (09030) సాయంత్రం 6.25 గంటలకు బయలుదేరి లోనావాల, పుణె, దౌండ్, కలబురిగి, వాడి, గుంతకల్లు, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల, కడపకు మరుసటిరోజు రాత్రి 9.35 గంటలకు చేరుతుందని పేర్కొన్నారు. అలాగే రాజంపేట, రేణిగుంట, కాట్పాడి, వేలూరు, తిరుమన్నామలై, విల్లుపురం జంక్షన్, చిదంబరం, కరైకాల్, నాగూరు, నాగపట్నం మీదుగా వేలాంగిణికి 5వ తేది రాత్రి 10 గంటలకు చేరుతుందన్నారు. ఇదేరైలు అదేరోజు రాత్రి 12.30 గంటలకు బయలుదేరి 7వ తేది ఉదయం 10.30 గంటలకు వల్సాడ్కు చేరుతుందన్నారు.రిజర్వేషన్ సౌకర్యం కల్పించారని పేర్కొన్నారు. -
అడ్డాలు మారుస్తూ.. అందరినీ ఏమారుస్తూ
● రెచ్చిపోతున్న గ్యాబ్లింగ్ ముఠాలు ● రాజకీయనాయకుల అండతోనే.. ● పట్టించుకోని పోలీసులు ● పేకాటకు అడ్డుకట్ట ఎప్పుడుజూదం ఒక వ్యసనం. ఒక్కసారి అలవాటైతే చాలు.. జనాల జేబులు గుల్లచేసే వరకు వదలదు. ఎంతోమంది దీనికి బానిసై ఆస్తులు, పరపతిని పోగొట్టుకున్నారు. సులభమైన పద్ధతిలో డబ్బులు సంపాదించుకోవచ్చనే కారణంతో సరదాగా మొదలు పెట్టిన ఆట దివాళా తీయిస్తున్నా కొందరు మానుకోవడంలేదు. ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో పేకాట జూదం మళ్లీ జోరందుకుంటోంది. పట్టణ నడిబొడ్డునే జూద స్థావరాలు నడస్తున్నాయి. పోలీసులు దాడులు చేస్తున్నా కొందరు నిర్వాహకులు స్థావరాలు మారుస్తూ గ్యాంబ్లింగ్ కార్యకలాపాలను యథేచ్ఛగా కొనసాగిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గతంలో ప్రొద్దుటూరు వ్యాప్తంగా మొబైల్ గ్యాంబ్లింగ్ బ్యాచ్లు ఉండేవి. వీరు ప్రత్యేక వాహనంలో సుదూర ప్రాంతాలకు వెళ్లి పేకాట ఆడేవారు. ఇలా రోజుకో స్థావరం మారుస్తూ కార్యకలాపాలు కొనసాగిస్తూ వచ్చేవారు. అయితే ఇటీవల స్థానికంగానే సురక్షిత స్థావరాలను ఏర్పాటు చేసుకొని పేకాట జూదాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నెల 17న పట్టణ శివారులోని ఈశ్వర్రెడ్డినగర్ బైపాస్ రోడ్డు వద్ద, ముక్తియార్ ఆయిల్మిల్లు సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్టౌన్ పోలీసులు దాడులు చేసి ముగ్గురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 60 వేలు నగదును స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన ముగ్గురిపై గతంలోనే 10 చొప్పున పేకాట కేసులున్నట్లు పోలీసు అధికారులు వెల్లడించారు. ఈశ్వర్రెడ్డినగర్కు చెందిన కరుమూరు మహేష్ అలియాస్ మట్టి మహేష్ అనే వ్యక్తి పేకాట నిర్వహణకు తగు వసతులు కల్పించి జూదగాళ్ల నుంచి మేజ్ రూపంలో డబ్బు తీసుకునేవాడు. దీంతో పోలీసులు వ్యవస్థీకృత నేరం కింద వీరిపై కేసు నమోదు చేశారు. రెండు రోజుల క్రితం త్రీ టౌన్ పోలీసులు పెద్ద ఎత్తున నిర్వహిస్తున్న పేకాట జూదంపై దాడులు నిర్వహించారు. 9 మంది పేకాట రాయుళ్లను అరెస్ట్ చేసి రూ. 2.53 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ప్రొద్దుటూరు పరిసర ప్రాంతాలతో పాటు రాజుపాళెం మండలంలోని అరకటవేముల గ్రామానికి చెందిన నలుగురు గ్యాంబ్లర్లు పోలీసులకు పట్టుబడిన వారిలో ఉన్నారు. ఇవి గాక రెండు రోజులకు ఒక సారి నియోజకవర్గంలోని ఏదో ఒక ప్రాంతంలో జూదరులు పోలీసులకు పట్టుబడుతున్నారు. అయితే వరుసగా దాడులు, అరెస్టులు జరుగుతున్నా పేకాట స్థావరాలు తగ్గకపోవడం చర్చనీయాంశంగా మారింది. పట్టణంలోని కొన్ని ప్రాంతాల్లో బహిరంగంగానే జూదం నిర్వహిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కొన్ని గ్యాంబ్లింగ్ ముఠాలు స్థావరాలు మారుస్తూ పేకాట ఆడుతున్నారని తెలుస్తోంది. పోలీసులు దాడి చేసిన తర్వాత కూడా కొత్త ప్రాంతాల్లో స్థావరాలను ఎలా ఏర్పాటు చేస్తున్నారు..? నిర్వాహకులకు సమాచారం అందిస్తున్న వారు ఎవరనే అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పేకాట రాయుళ్లపైనే కాకుండా నిర్వాహకులపై దృష్టి సారించాల్సిన అవసరం ఎంతైనా ఉందని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. రాజకీయ అండతో పేకాట స్థావరాలు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని కొన్ని ప్రాంతాల్లో కొందరు రాజకీయ పలుకుబడిని ఉపయోగించుకొని పేకాట దందాను నడుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ప్రొద్దుటూరు మండలంలో పేకాట డాన్గా పేరొందిన ఓ వ్యక్తి, అతని బంధువు కొన్ని రోజులుగా పట్టణ శివారులో పేకాట స్థావరాన్ని నిర్వహిస్తున్నట్లు ప్రచారం జరుగుతోంది. ప్రొద్దుటూరు, రాజుపాళెం, పెద్దముడియం సరిహద్దు ప్రాంతంలోని పంట పొలాల్లో జూదాన్ని నిర్వహిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం. ఇక్కడికి ప్రొద్దుటూరు, జమ్మలమడుగు పరిసర ప్రాంతాలకు చెందిన జూదరులు వస్తున్నట్లు తెలుస్తోంది. ఇక్కడి జూద స్థావరం నిర్వాహకులకు అధికార పార్టీ నేతతో సాన్నిహిత్యం ఉండటంతో యథేచ్ఛగా గ్యాంబ్లింగ్ కార్యకలాపాలు నిర్వహిస్తున్నట్లు తెలిసింది. దీంతో వీరు నిర్వహిస్తున్న పేకాట స్థావరం వైపు పోలీసులు కన్నెత్తి కూడా చూడటం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గ్యాంబ్లింగ్ ముఠాలపై కేసులు నమోదు చేయడంతో పాటు, మూలాలను గుర్తించి నిర్వాహకులపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
అర్జీలపై బాధ్యతగా వ్యవహరించాలి
డీఆర్వో మల్లికార్జునుడుకడప సెవెన్రోడ్స్ : ప్రజలు సమర్పించే అర్జీలపై అధికారులు బాధ్యతగా వ్యవహరించాలని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ఆయన అర్జీలు స్వీకరించారు. వీఆర్వో స్మశానం ఆక్రమించారు మా గ్రామ సర్వే నెంబరు 362/1లో 0.84 సెంట్ల మెట్ట, 363/3లో 2.44 ఎకరాల పుంజి నాకు అనువంశికంగా సంక్రమించింది. సర్వే నెంబరు 360లో పూర్వం నుంచి మా పూర్వీకుల సమాధులు ఉన్నాయి. మా పొలాల్లోకి వెళ్లేందుకు ఆ స్థశాన స్థలం నుంచే ఎన్నో ఏళ్లుగా రహదారి ఉండేది. కాగా, విలేజ్ రెవెన్యూ అధికారిగా పనిచేస్తున్న తంబు వెంకటేశ్వర్లు దౌర్జన్యంగా స్మశానాన్ని ఆక్రమించి పంట సాగు చేస్తూ మాకు రహదారి లేకుండా చేశారు. తహసీల్దార్ కార్యాలయ అధికారులు కూడా ఆయనకే మద్దతు ఇస్తున్నారు. మేం అనేకమార్లు అర్జీలు సమర్పించి అలసిపోయాను. పొలం అమ్ముకుని అప్పులు తీర్చుకోవాలంటే రహదారి లేని పొలాన్ని ఎవరూ కొనరు. వీఆర్వో పంట సాగు చేయకుండా ఆపి నాకు రహదారి సౌకర్యం కల్పించాలి. – కలువాయి రత్నమ్మ, బి.కోడూరు మండలం నా కుమారుడి మృతిపై విచారణ జరపాలి బి.మఠం మండలం తోట్లపల్లెలోని వీరాజనంద ఆశ్రమంలో చదువుకుంటున్న నా కుమారుడు సారెడ్డి సాత్విక్ ఏప్రిల్ 6వ తేది రాత్రి 9 గంటల సమయంలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన సంఘటనపై సమగ్ర విచారణ నిర్వహించాలి. రాత్రి 9.00 గంటల సమయంలో సంఘటన జరగ్గా, విద్యుత్ షాక్ వల్ల మరణించినట్లు ఆశ్రమ నిర్వాహకులు మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు మాకు సమాచారం ఇచ్చారు. నా కుమారుని మెడ, తలపై గాయాలున్నాయి. చెవినుంచి రక్తం కారినట్లు, తల వెంట్రుకలు కాలినట్లు ఉండటం గమనించాం. నా కుమారుడు ఎలా మరణించాడని ఆశ్రమ నిర్వాహకులు వీరాజనంద స్వామిని అడిగితే సరైన సమాధానం చెప్పకపోవడమే కాకుండా బెదిరింపులకు పాల్పడుతున్నారు. ఆశ్రమ నిర్వాహకులతోపాటు యుగంధర్, మాతాజీ, బుచ్చిబాబు పాత్రపై సమగ్ర దర్యాప్తు జరిపి వాస్తవాలు వెలికితీసి బాధ్యులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి. – సారెడ్డి వీరమ్మ, బొట్లపాలెం,దర్శి మండలం, ఒంగోలు జిల్లా -
సర్ ఎన్యుమరేషన్ గడువు పొడిగించండి
కడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ–2026లో భాగంగా చేపట్టిన ఎన్యుమరేషన్ ప్రక్రియ గడువు పొడిగించాలని, బీఎల్ఓలకు నాణ్యమైన శిక్షణ ఇవ్వడంతోపాటు పోలింగ్ కేంద్రాలకు అదనంగా నియమించాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాష, సీఈసీ సభ్యుడు కె.సురేష్బాబు కోరారు. సోమవారం డీఆర్వో మల్లికార్జునుడుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2002 నాటి జాబితాలో చాపాడు మండలం నక్కలదిన్నె గ్రామంలో ‘శెట్టిపల్లెశ్రీ’ఇంటి పేరున్న అందరి ఓట్లు గల్లంతయ్యాయన్నారు. చాపాడుమండలంలోనే సుమారు 36 వేల ఓట్లు కనిపించడం లేదన్నారు. సంబంధం లేని 1141 ఓట్లు నక్కలదిన్నె గ్రామంలో చేరాయన్నారు. ఇక కడప నగరంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఇంటితోపాటు మరో నాలుగైదు ఇళ్ల నెంబర్లు కనిపించడం లేదన్నారు. ఓటర్ల జాబితాలు అస్తవ్యస్తంగా ఉన్నాయన్నారు. దీంతో మ్యాపింగ్కు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయన్నారు. ఎన్యుమరేషన్ గడువు జులై 14వ తేదీతో ముగియనుందని, ఇదే పరిస్థితి కొనసాగితే అనేక మంది ఓట్లు కోల్పొయే ప్రమాదముందని ఆందోళన వ్యక్తం చేశారు. ఆగస్టు 14వ తేది వరకు ఎన్యుమరేషన్ గడువు పొడిగించాలని కోరారు. ఎన్యుమరేషన్ ప్రక్రియపై బీఎల్ఓలతోపాటు ఏఈఆర్ఓలకు సైతం సరైన అవగాహన లేదన్నారు. వీరికి మళ్లీ శిక్షణ ఇప్పించి ఒక్కో పోలింగ్ కేంద్రానికి ముగ్గురు చొప్పున బీఎల్ఓలను ఏర్పాటు చేయాలన్నారు. చాలాచోట్ల అధికార టీడీపీ నేతలు బీఎల్ఓలను తమ ఇళ్ల వద్దకే పిలిపించుకుని ఎన్యుమరేషన్ చేయిస్తున్నారన్నారు.దొంగ ఓట్లు ఎక్కించే ప్రయత్నాలు అధికార పార్టీ చేస్తోందని ఆరోపించారు. ఓట్లు, డోర్ నెంబర్ల గల్లంతుపై అవసరమైతే న్యాయ పోరాటానికి వెనుకాడబోమని స్పష్టం చేశారు. వైఎస్సార్ సీపీ నాయకులు పులి సునీల్కుమార్, ప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. డీఆర్వోకు వైఎస్సార్ సీపీ నేతల వినతి -
బతుకుదెరువు కోసం వెళ్లి అనంత లోకాలకు
బద్వేలు అర్బన్ : ఆ యువకుడు ఆ ఇంటికి పెద్ద కుమారుడు. తండ్రి అకాల మరణంతో చిన్న వయస్సులో తండ్రి బాధ్యతలను భుజాన వేసుకుని తనకు ఇష్టమైన కిక్బాక్సింగ్ క్రీడను వదులుకుని కుటుంబ పోషణ కోసం కువైట్కు వెళ్లాడు. తల్లికి, తమ్ముడికి అండగా ఉంటూ కుటుంబ పోషణ కోసం దేశం కాని దేశంలో రేయింబవళ్లు కష్టపడేవాడు. అయితే సోమవారం కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆ యువకుడు మృతిచెందాడు. వివరాల్లోకి వెళితే పట్టణంలోని వెంకటయ్యనగర్కు చెందిన శివప్రసాద్, సుబ్బరత్నమ్మలకు ఇద్దరు కుమారులు. వారిలో పెద్దవాడైన తుమ్మిశెట్టిసురేష్ (28) తండ్రి ప్రోత్సాహంతో కిక్బాక్సింగ్లో రాణిస్తుండేవాడు. నాలుగేళ్ల క్రితం తండ్రి అనారోగ్యంతో మృతిచెందడంతో కుటుంబ బాధ్యతలు భుజానకెత్తుకున్నాడు. ఈ నేపథ్యంలో మూడేళ్ల కిందట కువైట్కు వెళ్ళి అక్కడ వివిధ రకాల పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటుండేవాడు. ఈ క్రమంలో సోమవారం ఉదయం పనికి వెళుతుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో సురేష్ అక్కడికక్కడే మృతిచెందాడు. అక్కడి సన్నిహితుల ద్వారా బద్వేలులోని తల్లికి, తమ్ముడికి విషయం తెలిపారు. దీంతో వెంకటయ్యనగర్లో విషాదఛాయలు అలుముకున్నాయి. చిన్నతనంలోనే కుటుంబ పెద్దగా బాధ్యతలు తీసుకుని ఏ కష్టం రాకుండా మమ్మల్ని పోషిస్తుండే నా కొడుకు మృతిచెందాడు. ఇప్పుడు మాకు దిక్కెవరు అంటూ ఆ తల్లి రోదించిన తీరు స్థానికులను కలచివేసింది.కువైట్లో రోడ్డు ప్రమాదంలో బద్వేలు యువకుడు మృతి -
బతి కుండగానే రికార్డుల్లో చంపేశారు
అట్లూరు : అధికారుల నిర్లక్షమో.. కూటమి ప్రభుత్వ వైఫల్యమో గానీ ఓ రైతు బతికుండగానే చనిపోయినట్లు రికార్డుల్లో సృష్టించి అతనికి ప్రభుత్వ పథకాలు అందకుండా చేసిన సంఘటన వైఎస్సార్ కడప జిల్లా అట్లూరు మండలం కుంభగిరి గ్రామంలో చోటు చేసుకుంది. కుంభగిరి గ్రామానికి చెందిన దున్నూతల రామసుబ్బారెడ్డి వ్యవసాయం చేసుకుని జీవనం సాగించేవాడు. ఈయనకు వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రైతుభరోసా, పీఎం కిసాన్, పంటనష్టం తదితర పథకాలు అందేవి. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అన్నదాత సుఖీభవ, పీఎం కిసాన్ పథకాలు అందక పోవడంతో ఆ రైతు కార్యాలయాల చుట్టూ తిరిగాడు. అయితే అన్నీ సక్రమంగా ఉన్నాయి.. ప్రభుత్వ పథకాలకు సంబంధించిన నిధులు వస్తాయని కుంభగిరి సచివాలయ సిబ్బంది కాలయాపన చేస్తూ వచ్చారు. కలెక్టర్కు ఫిర్యాదు చేస్తానని రైతు చెప్పడంతో అసలు విషయాన్ని అధికారులు వెల్లడించారు. మీరు చనిపోయినట్లు మీ రైతు సేవాకేంద్రం వీఏఏ కంప్యూటర్లో నమోదు చేసిశారని, అందువల్ల మీకు సుఖీభవ, పీఎం కిసాన్ నిధులు జమకాలేదని తెలపడంతో రైతు లబోదిబో మంటున్నాడు. -
మాయమైన స్టీల్పై ప్రశ్నల వర్షం !
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యం పోలీసు కస్టడీ విచారణ ముగిసింది. స్టీల్ మాయమైన కేసులో త్రీ టౌన్ పోలీసులు ఆయనను శనివారం కస్టడీకి తీసుకున్న విషయం తెలిసిందే. స్టీల్ను ఎక్కడికి తరలించారనే దానిపై మూడు రోజుల పాటు పోలీసులు ఏఈని విచారించారు. తొలి రోజు ఆయన ఏమాత్రం పోలీసులకు సహకరించలేదు. ఆదివారం, సోమవారం విచారణలో కొంతమేర నోరు విప్పినట్లు తెలుస్తోంది. గోడౌన్లో నిల్వ ఉంచిన రూ.1.70 కోట్ల విలువైన స్టీల్ కనిపించకుండా పోగా అందులో 40–50 శాతం స్టీల్ను విక్రయించినట్లు ఏఈ పోలీసులకు చెప్పినట్లు సమాచారం. మిగతా స్టీల్ ఏమైందనే దానిపై ఆయన నోరు మెదపలేదని పోలీ సులు చెబుతున్నారు. ఈ విషయమై మూడు రోజుల నుంచి తీవ్రంగా ప్రయత్నించినా పొంతన లేని సమాధానాలు చెబుతూ దాటవేస్తున్నట్లు తెలిసింది. సోమవారం సాయంత్రం వరకు ఏఈని విచారించిన పోలీసులు మంగళవారం ఆయనను కోర్టులో ప్రవేశపెట్టి తద్వారా సెంట్రల్ జైలుకు తీసుకెళ్లనున్నారు. మిగతా స్టీల్ ఏమైనట్లు ? మూడు రోజులుగా సాగిన పోలీసు కస్టడీ విచారణలో 40–50 శాతం మేర స్టీల్ను విక్రయించినట్లు ఏఈ సుబ్రమణ్యం చెప్పినట్లు తెలుస్తోంది. మాయమైన స్టీల్ వ్యవహారంతో తనకు సంబంధం లేదని మొదటి రోజు చెప్పిన ఏఈ, రెండో రోజు విచారణలో కూలీలను పోలీసులు ఆయన ముందు నిలబెట్టడంతో స్టీల్ విక్రయించినట్లు అంగీకరించక తప్పలేదు. అయితే మిగతా స్టీల్ ఏమైందనే విషయంలో ఏఈ నోరు మెదపలేదు. దీంతో ఏఈ సుబ్రమణ్యంను పోలీసులు మరోసారి కస్టడీ కోరే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. ఆ డబ్బు ఏం చేశావ్..? స్టీల్ విక్రయించిన డబ్బును ఏం చేశావని పోలీసు అధికారులు ఏఈపై ప్రశ్నల వర్షం కురిపించినట్లు తెలుస్తోంది. రూ.1.70 కోట్ల విలువైన స్టీల్లో సగం మాత్రమే విక్రయించినట్లు ఆయన అంగీకరించిన నేపథ్యంలో పోలీసులు డబ్బు గురించి ప్రశ్నిస్తున్నారు. డబ్బు ఏమైందనే దానిపై ఏఈ నుంచి స్పష్టమైన సమాధానాలు రాలేదని పోలీసులు అంటున్నారు. కాగా సస్పెన్షన్ ఆర్డర్ అందుకున్న రెండు రోజుల తర్వాత ఏఈ సుబ్రమణ్యం హౌసింగ్ కార్యాలయానికి వెళ్లి పలు కీలకమైన ఫైళ్లు తీసుకెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. ఆ శాఖ సిబ్బంది ద్వారా ఈ విషయం తెలుసుకున్న పోలీసులు ఏఈ సుబ్రమణ్యంను వెంటపెట్టుకొని కార్యాలయానికి వెళ్లారు. ఆయన తీసుకెళ్లిన ఫైళ్లను తిరిగి తెప్పించుకున్నట్లు సమాచారం. స్టీల్ కొనుగోలు చేసిన దుకాణదారుల్లో వణుకు రూరల్ హౌసింగ్ ఇళ్ల నిర్మాణాలకు సంబంధించిన స్టీల్ను తక్కువ ధరకు కొనుగోలు చేసిన దుకాణ దారుల్లో ఇపుడు వణుకు మొదలైంది. గోడౌన్ నుంచి మాయమైన స్టీల్లో ఎక్కువ భాగం ప్రొద్దుటూరులోని దుకాణాల్లోనే విక్రయించారు. కొందరు దుకాణదారు లు నేరుగా కొనుగోలు చేయగా, మరి కొందరు కాంట్రాక్టర్లు, మేసీ్త్రల ద్వారా స్టీల్ను కొన్నారు. ఇప్పటికే కొనుగోలు చేసిన దుకాణ దారుల జాబితాను సిద్ధం చేసిన పోలీసులు వారిని పిలిపించి విచారణ చేశారు. త్వరలో వారి నుంచి స్టీల్ను రికవరీ చేసే అవకాశం ఉంది. రివకరీతోనే సరిపెడతారా లేక దొంగ సొత్తు కొనుగోలు చేసినందుకు గాను కేసులు నమోదు చేస్తా రా అనేది పోలీసులు క్లారిటీ ఇవ్వలేదు. దీంతో వ్యాపారుల్లో ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. మూడు రోజుల పాటు హౌసింగ్ ఏఈని విచారించిన పోలీసులు 40–50 శాతం మేర విక్రయించినట్లు ఏఈ వెల్లడి ! ముగిసిన విచారణ.. మరోసారి కస్టడీలోకి తీసుకునే అవకాశం ? -
వైభవంగా పౌర్ణమి కల్యాణం
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో సోమవారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని రాతి కల్యాణ మండపంలో అర్చకులు సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేసి, నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సీతాసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు వీణా రాఘవాచార్యులు, వీణా మనోజ్ కుమార్ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. – ఒంటిమిట్ట -
రోడ్డుప్రమాదంలో యువకుడి మృతి
మైదుకూరు : మండలంలోని జాండ్లవరం వద్ద మైదుకూరు – బద్వేలు రహదారిలో సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో బత్తల చందు (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. బద్వేలులోని సుందరయ్య కాలనీకి చెందిన చందు ప్రొద్దుటూరులో ఉంటూ బేల్దారి పనులు చేస్తుంటాడు. సోమవారం ఉదయం ప్రొద్దుటూరు నుంచి బద్వేలుకు వెళుతుండగా జాండ్లవరం వీఆర్ఓ కాలనీ వద్ద బైక్ నుంచి కిందపడి డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. తండ్రి వెంకటేష్ మృతి చెందగా తల్లి వెంకటసుబ్బమ్మ ఉపాధి కోసం గల్ఫ్ దేశంలో ఉంటోంది. ఇతనికి ఒక అక్క, అన్న ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐపై వరకట్న వేధింపుల కేసుప్రొద్దుటూరు క్రైం : నంద్యాల జిల్లాలో ఫింగర్ ప్రింట్ ఎస్ఐగా పని చేస్తున్న ఇండ్ల భరత్కుమార్పై ప్రొద్దుటూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో వరకట్న వేధింపుల కేసు నమోదైంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని మున్సిపల్ కాలనీలో నివాసం ఉంటున్న సిరివెళ్ల ఇషాక్, సుజాతల కుమార్తె ప్రియాంకకు నంద్యాల జిల్లా, చాగలమర్రి మండలంలోని గొడిగెనూరు గ్రామానికి చెందిన ఇండ్ల భరత్కుమార్తో 2025లో వివాహమైంది. భరత్కుమార్ ప్రస్తుతం నంద్యాల జిల్లాలో ఫింగర్ ప్రింట్ సబ్ ఇన్స్పెక్టర్గా పని చేస్తున్నాడు, వివాహమైనప్పటి నుంచి భార్య ప్రియాంకను అతను మానసికంగా, శారీరకంగా హింసించడంతో పాటు అదనపు కట్నం కోసం వేధించేవాడు. పలుమార్లు పెద్ద మనషుల ద్వారా పంచాయతీ చేసినా భార్యను కాపురానికి తీసుకెళ్లలేదు. దీంతో ప్రియాంకతో పాటు తల్లిదండ్రులు ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణను ఆశ్రయించారు. భర్త భరత్కుమార్, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం ప్రియాంకను వేధిస్తున్నట్లు వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. -
పెన్నాలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
సిద్దవటం : మండలంలోని లింగంపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెన్నానదిలో ఆదివారం సాయంత్రం గల్లంతైన జగదీష్(26) మృతదేహం సోమవారం లభ్యమైందని ఎస్ఐ హారిక తెలిపారు. కడప నుంచి ఆదివారం గంగాధర్, మహేంద్ర, సోమశేఖర్, వెంకటేష్, నాగేంద్రబాబు, మహేష్బాబు, వెంకటసుబ్బయ్య, జగదీష్ అనే యువకులు పెన్నానదిలో సరదాగా ఈత కొడుతుండగా జగదీష్ కొట్టుకునిపోయాడు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సోమవారం ఈతగాళ్లతో గాలింపు చేపట్టారు. జగదీష్ మృతదేహం లభ్యమైంది. మృతుడు గుంటూరు జిల్లా చెరువుపల్లె గ్రామానికి చెందిన యువకుడిగా గుర్తించారు. ఇతను గత ఏడాది నుంచి కడప భాగ్యనగర్ కాలనీలోని ఓ ఎలక్ట్రికల్ బైక్ షోరూంలో మెకానిక్గా పనిచేస్తూ జీవనం కొనసాగించేవాడు. తండ్రి గోపి ఆదివారం మధ్యాహ్నం కుమారుడు జగదీష్కు ఫోన్ చేస్తే లిఫ్ట్ చేయలేదని, మరోసారి ఫోన్ చేస్తే వేరే అబ్బాయిలు ఫోన్ ఎత్తి మీ కుమారుడు పెన్నానదిలో కొట్టుకొని పోయాడని సమాచారం ఇచ్చారని కన్నీరుమున్నీరయ్యారు. పోలీసులు సమగ్ర విచారణ చేసి న్యాయం చేయాలని కోరారు. జగదీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు అంబులెన్స్లో కడప రిమ్స్కు తరలించారు. మృతుని తండ్రి గోపి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ హారిక తెలిపారు. -
చూసేయ్ జాగా..వేసేయ్ పాగా
జమ్మలమడుగు : అధికార పార్టీ నాయకులు ఇష్టానుసారం స్థలాలు ఆక్రమించుకుని ఇళ్ల నిర్మాణం చేపడుతున్నా అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారు. ఇదేమిటని ఎవరైనా ప్రశ్నిస్తే.. వారు ఇంటి కోసం దరఖాస్తు చేసుకున్నారు... ప్రతిపాదనను ఉన్నతాధికారులకు పంపిచామని అధికారులు సమాధానమిస్తున్నారు. జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన గండికోటలో అధికార పార్టీకి చెందిన మాజీ గ్రామ ప్రజాప్రతినిధి రూ.లక్షల విలువైన ప్రభుత్వ భూమిని అక్రమించుకుని ఇంటి నిర్మాణం చేపడుతున్నారు. ఇదేమిటని ప్రశ్నించే అధికారులు కనిపించడం లేదు. అనుమతులు లేకుండానే ఇంటి నిర్మాణం వేగంగా సాగుతోంది. గతంలో సామాన్యులు గండికోటలో రోడ్డు పక్కన టిఫిన్ సెంటర్, చిన్నచిన్న దుకాణాలు ఏర్పాటు చేసుకుని వ్యాపారాలు చేస్తుంటే అధికారులు పోలీసులతో వాటిని తొలగింపజేశారు. ఇప్పుడు మాత్రం ఉదాశీనవైఖరి అవలంభిస్తున్నారు. అధికార పార్టీ నాయకులకు ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయమా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వ స్థలాన్ని ఆక్రమించి ఇంటి నిర్మాణం అధికార పార్టీ నాయకుడి ఇష్టారాజ్యం -
డ్వాక్రా రుణం తీసుకున్నందుకు భర్త మందలించాడని..
● కుమార్తెతో సహా ఇంటి నుంచి వెళ్లి పోయిన భార్య ప్రొద్దుటూరు క్రైం : తనకు తెలియకుండా డ్వాక్రా రుణం ఎందుకు తీసుకున్నావని భర్త అడిగినందుకు బిడ్డతో సహా తల్లి ఇంటి నుంచి వెళ్లిపోయిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. ఈ ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హౌసింగ్బోర్డు కాలనీకి చెందిన రామకృష్ణకు భార్య మాధవి, గాయత్రి అనే ఏడేళ్ల కుమార్తె ఉంది. మాధవి ఇటీవల భర్తకు తెలియకుండా డ్వాక్రాలో రుణం తీసుకుంది. ఈ విషయం భర్తకు తెలియడంతో ఎందుకు డ్వాక్రాలో డబ్బు తీసుకున్నావని అడిగాడు. దీంతో సీకెదిన్నె మండలంలోని జమాల్పల్లి గ్రామంలో ఉంటున్న తన అక్కను అడిగి డబ్బు తీసుకొస్తానని ఈ నెల 17న కుమార్తెతో సహా ఆమె ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో భర్త పలుమార్లు ఫోన్ చేయగా తన అక్క వద్ద ఉన్నానని, డబ్బు తీసుకొని వస్తానని చెబుతూ వచ్చింది. ఈ క్రమంలో ఈ నెల 25న ఫోన్ చేయగా ఆమె మొబైల్ స్విచ్ఛాఫ్ రావడంతో భర్త రామకృష్ణ జమాల్పల్లికి వెళ్లాడు. అయితే అక్కడికి వెళ్లి భార్య, కుమార్తె గురించి వాకబు చేయగా ఇక్కడికి రాలేదని చెప్పారు. దీంతో రామకృష్ణ ఆదివారం ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి తెలిపారు. అత్తారింటి వద్ద ఉన్నారనుకున్న భార్య, కుమార్తె కనిపించకపోవడంతో రామకృష్ణ ఆందోళన చెందసాగాడు. -
కీలక మలుపు
రూ. 1.70 కోట్ల స్టీల్ మాయం కేసులో ప్రొద్దుటూరు క్రైం: రాష్ట్రవ్యాప్తంగా తీవ్ర సంచలనం సృష్టించిన ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్లోని రూ.1.70 కోట్ల విలువైన 268.71 టన్నుల ప్రభుత్వ స్టీల్ (ఇనుప కడ్డీలు) మాయం కేసులో పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఇప్పటివరకు కేవలం ఆరోపణలకే పరిమితమై ఎలాంటి పక్కా ఆధారాలు దొరక్క తలలు పట్టుకున్న పోలీసులకు.. స్టీల్ను లారీలకు లోడ్ చేసిన కూలీలను గుర్తించడంతో ఈ కేసు అత్యంత కీలకమైన మలుపు తిరిగింది. ఈ కేసులో ప్రధాన బాధ్యుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న రూరల్ హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యంను త్రీ టౌన్ పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసి కడప సెంట్రల్ జైలుకు తరలించగా, మరింత సమాచారం రాబట్టేందుకు కోర్టు అనుమతితో మూడు రోజుల పోలీస్ కస్టడీకి తీసుకున్నారు. శనివారం నుంచి కస్టడీలో ఉన్న ఏఈపై దర్యాప్తు బృందాలు ప్రశ్నల వర్షం కురిపిస్తుండగా.. రెండో రోజు విచారణలో ఏఈ కొంత మేర నోరు విప్పి, కేసుకు సంబంధించి కొన్ని కీలకమైన సమాచారాన్ని వెల్లడించినట్లు తెలుస్తోంది. 14 దుకాణాలకు సరఫరా – బద్వేల్తో లింక్ కూలీలను అదుపులోకి తీసుకుని పోలీసులు జరిపిన విచారణలో దిగ్భ్రాంతి కలిగించే విషయాలు బయటపడ్డాయి. గోడౌన్ నుంచి మాయమైన ప్రభుత్వ స్టీల్ను స్థానికంగా ఉన్న 14 పెద్ద దుకాణాలకు తరలించినట్లు కూలీలు స్పష్టం చేశారు. నిందితులు ఈ ప్రభుత్వ స్టీల్ను మార్కెట్ ధర కంటే దాదాపు 20 నుండి 25 శాతం తక్కువ ధరకే ప్రైవేట్ వ్యక్తులు, దుకాణదారులకు అక్రమంగా విక్రయించి సొమ్ము చేసుకున్నట్లు పోలీసుల ప్రాథమిక విచారణలో తేలింది. అంతేకాకుండా, ఈ స్టీల్ను కేవలం ప్రొద్దుటూరు దుకాణాలకే కాకుండా, జిల్లాలోని బద్వేల్తో పాటు ఇతర ప్రాంతాల్లో జరుగుతున్న ప్రైవేట్ కాంట్రాక్ట్ పనుల వద్దకు కూడా లారీల్లో తరలించినట్లు విచారణలో తేలింది. ముసురుతున్న అనుమానాలు – మరిన్ని అరెస్టులు అయితే, 268 టన్నులకు పైగా భారీ మొత్తంలో ఉన్న స్టీల్ను పక్కదారి పట్టించడం కేవలం ఒక్క ఏఈ సుబ్రమణ్యం వల్లే సాధ్యమా..? అనే అనుమానాలు అటు హౌసింగ్ ఉన్నతాధికారులకు, ఇటు పోలీసులకు బలంగా వ్యక్తమవుతున్నాయి. ఇంత భారీ మొత్తంలో ఇనుము తరలించాలంటే పెద్ద లారీలు, పదుల సంఖ్యలో కార్మికుల సహకారం అవసరమవుతుంది. ఈ నేపథ్యంలో నిందితులు ఏవైనా నకిలీ పత్రాలు (ఫోర్జరీ డాక్యుమెంట్లు) సృష్టించారా? లేక స్టాక్ బుక్కులు, ఇష్యూ రిజిస్టర్లలో తప్పుడు ఎంట్రీలు రాశారా? అనే కోణంలో పోలీసులు రికార్డులను జల్లెడ పడుతున్నారు. ఈ కుంభకోణం వెనుక పలువురు స్థానిక కాంట్రాక్టర్లు, మేసీ్త్రల పెద్ద నెట్వర్క్ ఉన్నట్లు పోలీసులు బలంగా నమ్ముతున్నారు.ఇందులో భాగంగా బద్వేల్కు చెందిన ఒక కీలక వ్యక్తిని, ప్రొద్దుటూరు మండలం నంగనూరుపల్లె గ్రామానికి చెందిన ఒక మేసీ్త్రని పోలీసులు అదుపులోకి తీసుకుని ముమ్మరంగా విచారిస్తున్నారు. స్టీల్ ఎక్కడికెక్కడకి తరలిపోయిందనే అంశంపై పూర్తి క్లారిటీ రావడంతో ఇన్నాళ్లూ ఉత్కంఠగా ఉన్న పోలీసు అధికారులు ఎట్టకేలకు ఊపిరి పీల్చుకున్నారు. కూలీలు, మేసీ్త్రల నుంచి సేకరించిన పక్కా ఆధారాలను ముందుంచడంతో ఏఈ కూడా ఒప్పుకోక తప్పలేదు. ఈ దోపిడీకి సహకరించిన అసలు సూత్రధారులను, చోరీ సొత్తు కొనుగోలు చేసిన వ్యాపారులను త్వరలోనే అరెస్ట్ చేసేందుకు పోలీసులు రంగం సిద్ధం చేశారు. కూలీల గుర్తింపుతో దొరికిన పక్కా ఆధారాలు 14 దుకాణాలకు ప్రభుత్వ స్టీల్ తరలింపు ప్రొద్దుటూరుతో పాటు బద్వేల్లోని కాంట్రాక్ట్ పనుల వద్దకు రవాణా మార్కెట్ ధర కంటే 25 శాతం తక్కువకే విక్రయం నంగనూరుపల్లె మేసీ్త్ర, బద్వేల్ వ్యక్తిపై విచారణ రెండో రోజు నోరు విప్పిన ఏఈ సుబ్రమణ్యం -
సాగు భూమి కంచె తొలగింపు
● 47 ఎకరాలలో ప్రభుత్వ భూమి బోర్డుల ఏర్పాటు ● వైఎస్సార్సీపీ సానుభూతి పరులపై కక్ష సాధింపు రాజంపేట రూరల్: గత 40 సంవత్సరాల నుంచి వైఎస్సార్సీపీ సానుభూతి పరులు సాగు చేసుకుంటున్న 47 ఎకరాల భూమి చుట్టూ ఉన్న కంచెను తహసీల్దార్ దస్తగిరయ్య తన సిబ్బందితో పాటు పదుల సంఖ్యలో పోలీసు బలగంతో వెళ్లి జేసీబీలతో ఆదివారం తొలగించారు. ఈ ఘటన మండల పరిధిలోని శ్రీరంగరాజపురం గ్రామంలో చోటు చేసుకుంది. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి గ్రామం అంటేనే మింగుడు పడని విధంగా ఇటీవల రెవెన్యూ అధికారులు తీసుకుంటున్న చర్యలు, చేపడుతున్న పనులు వివాదస్పదంగా మారుతున్నాయి. పట్టణ నడిబొడ్డున ఉన్న చక్రాల మడుగు వద్ద సెంటు రూ.20లక్షలు విలువైన స్థలాన్ని టీడీపీ నాయకులు యథేచ్చగా కబ్జా చేసి నిర్మాణాలు చేపట్టినా స్పందించని రెవెన్యూ శాఖ ఇప్పుడు కళ్లు తెరుచుకుందా అనే అనుమానం రాజంపేట వాసుల్లో కలుగుతోంది. నూతనంగా నిర్మిస్తున్న హైవేకు కిలోమీటరు దూరంలోని చుండువారిపల్లెలో ఎకరా కోటి రూపాయల విలువైన భూమి కబ్జా చేసినట్లు ఫిర్యాదులు చేసినా పట్టించుకోని రెవెన్యూ అధికారులు రైతులు సాగు చేసుకొనే భూమిలో సూచికలు ఏర్పాటు చేయటం విడ్డూరంగా ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. సూచికలు ఏర్పాటు చేసిన సర్వే నంబర్లు... 150–1లో 4.39, 150–3లో 4.00, 151–1లో 5.00, 151–2లో 4.67, 152–1లో 5.39, 37లో 9.50, 142లో 1.01, 143లో 3.74, 149–3లో 2.00, 1302–3లో 0.44, 1302–5లో 0.08, 1301–1లో 2.27. 1299–1లో 1.90, 1300–1లో 2.83 ఉన్నాయి. తహఽసీల్దార్ దస్తగిరయ్యను ఈ సర్వే నంబర్లు ఎవరి పేరుతో ఉన్నాయి, రైతులు ఎంత మంది అని అడగ్గా తెలియదు అని సమాధానం ఇచ్చారు. కూటమి నాయకుల అక్కసు.. వైఎస్సార్ కుటుంబానికి వీరవిధేయునిగా ఉంటూ నిత్యం అన్నదానాలు చేస్తూ ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉండే వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డిపై కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్కసు వెళ్లగక్కుతోందనేది బహిరంగ రహస్యం. వైఎస్సార్సీపీ సానుభూతి పరులు, ఆకేపాటి సానుభూతి పరులు అంటే కూటమి నాయకులు విషం కక్కటం నియోజకవర్గంలో సంచలనంగా మారుతుంది. -
బద్వేలులో విజిలెన్స్ దాడులు
● అక్రమంగా నిల్వ ఉంచిన 610 బస్తాల రేషన్ బియ్యం స్వాధీనం బద్వేలు అర్బన్ : బద్వేలులో ఆదివారం తెల్లవారుజామున విజిలెన్స్ దాడులు జరిగాయి. ఈ దాడుల్లో మున్సిపాలిటీ పరిధిలోని రూపరాంపేట సమీపంలోని ఓ గోడౌన్లో అక్రమంగా నిల్వ ఉంచిన 610 బస్తాల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. విజిలెన్స్ అధికారులు తెలిపిన వివరాల మేరకు శబరికుమార్ అనే వ్యక్తి రేషన్ బియ్యాన్ని అక్రమంగా నిల్వ ఉంచినట్లు రాబడిన సమాచారం మేరకు విజిలెన్స్, రెవెన్యూ అధికారులు దాడులు నిర్వహించారు. ఈ క్రమంలో ఓ గోడౌన్లో అక్రమంగా రవాణాకు సిద్దంగా ఉంచిన రేషన్ బియ్యాన్ని గుర్తించి బియ్యంతో పాటు లారీని స్వాధీనం చేసుకుని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించారు. ఈ ఘటనపై శబరికుమార్ను విచారించగా కొనుగోలు చేసిన రేషన్ బియ్యాన్ని సునీల్, శివశంశకర్లకు విక్రయిస్తున్నట్లు తెలిపారన్నారు. ఈ మేరకు ముగ్గురిపై అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. ఈ దాడుల్లో విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి, ఎన్ఫోర్స్మెంట్ డీటీ శివశంకర్, ఫుడ్ ఇన్స్పెక్టర్ గీతాప్రసాద్రెడ్డి, విజిలెన్స్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు. -
బైక్ను ఢీకొన్న కారు
● ఇద్దరికి తీవ్రగాయాలు ఒంటిమిట్ట: మండల పరిధిలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై ఆదివారం ద్విచక్రవాహనాన్ని కారు ఢీ కొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు.పోలీసుల వివరాల మేరకు..కడప నుంచి తిరుపతి వెళుతున్న కారు, కడప వైపు ద్విచక్రవాహనంలో వెళుతున్న కడప బుడ్డాయపల్లికి చెందిన భార్యాభర్తలు రాధా(25), మణి(30)లను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మణి కాళు నుజ్జు అయ్యాయి.రాధ తలకు బలమైన గాయమైంది. స్థానికులు గాయపడిన వారిని 108 సహాయంలో కడప రిమ్స్ కు తరలించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు.కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
నెత్తురోడిన రహదారులు
జిల్లా వ్యాప్తంగా రహదారులు రక్తసిక్తం అయ్యాయి. ఆదివారం వేర్వేరు చోట్ల రోడ్డు ప్రమాదాలు జరిగాయి. ముగ్గురు దుర్మరణం చెందారు. అయిన వారికి విషాదం మిగిల్చారు. మొహర్రం వేడుకలకు వెళుతూ.. ముద్దనూరు: ముద్దనూరు–తాడిపత్రి జాతీయరహదారిలో మండల పరిధిలోని ఓబుళాపురం గ్రామ సమీపంలో ఆదివారం మధ్యాహ్నం ట్రిప్పర్ ఢీకొని శివకృష్ణారెడ్డి(29)అనే యువకుడు దుర్మరణం చెందాడు. సీఐ నగేష్బాబు సమాచారం మేరకు మండలంలోని పెనికలపాడు గ్రామానికి చెందిన శివకృష్ణారెడ్డి మొహర్రం వేడుకలకు పెనికలపాడునుంచి ఓబుళాపురంలోని అత్తగారింటికి బైక్పై వెళుతున్నాడు. ఓబుళాపురం సమీపంలోకి రాగానే అదేమార్గంలో ప్రయాణిస్తున్న ట్రిప్పర్ ఢీకొంది.ఈ ప్రమాదంలో శివకృష్ణారెడ్డి తలకు తీవ్రగాయమైంది.దీంతో అతను అక్కడికక్కడే మృతిచెందాడు. సంఘటనా స్థలాన్ని సీఐ పరిశీలించారు.మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తుచేస్తున్నట్లు సీఐ తెలిపారు. ఆటోను కారు ఢీకొని.. రాజంపేట: మండల పరిధిలోని హోలీ ద్వారకా నగర్ సమీపాన ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మామిడి పండ్ల ఆటోను ఢీ కొట్టిన కారు. ఈ ప్రమాదంలో మృతి చెందిన ఆటో డ్రైవర్ షేక్ సలీం. మన్నూరు పోలీసుల వివరాల మేరకు..రాజంపేట మండలం, పోలీ గ్రామంలోని అంగడి కాలనీకి చెందిన షేక్ ఉస్మాన్ తన (ఏపీ 02 పి 4969 నంబర్) టాటా ఇండిగో కారులో పోలీ హరిజన వాడ వైపు వెలుతుండగా పోలీ ద్వారకా నగర్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న మామిడి పండ్ల ఆటోను వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో మామిడి పండ్ల ఆటో డ్రైవర్ షేక్ సలీం కు తీవ్రగాయాలతో అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడు బద్వేల్ కు చెందిన వాడని, రాజంపేటలోని మాలిక్ ఫ్రూట్స్ యజమాని దగ్గర డ్రైవర్ గా కూలికి పనిచేస్తున్నాడని పోలీసులు నిర్థారించారు. షేక్ సలీం మృతదేహాన్ని పోస్తుమార్టం నిమిత్తం 108లో రాజంపేట ప్రభుత్వకి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి, దర్యాప్తి చేస్తున్నట్లు మన్నూరు పోలీసులు తెలిపారు. టిప్పర్ ఢీకొని.. జమ్మలమడుగు: మండల పరిధిలోని ఉప్పలపాడు– పెద్దముడియం మండలం గుల్లకుంట మధ్యలో రోడ్డు ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో బొడితిప్పనిపాడు గ్రామానికి చెందిన బి.మౌలాలి(40) అక్కడిక్కడే మృతి చెందాడు. బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం బీటీ పాడు గ్రామానికి చెందిన బి. మౌలాలి పనినిమిత్తం బైక్లో జమ్మలమడుగుకు బయలుదేరాడు. గుల్లకుంట–ఉప్పలపాడు మార్గ మధ్యలో టిప్పర్ బైక్ను ఢీకొనడంతో కిందపడి మృతి చెందినట్లు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు పెద్దముడియం ఎస్ఐ సుబ్బారావు తెలిపారు. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం -
అన్నదాతలపై దాడి అప్రజాస్వామికం
ప్రొద్దుటూరు: రాష్ట్ర రాజధాని నడిబొడ్డున అన్నదాతలపై టీడీపీ అల్లరి మూకలు దౌర్జన్యంగా దాడి చేయడం అత్యంత అప్రజాస్వామికమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తీవ్రంగా ఖండించారు. ఇంత దుర్మార్గంగా, నిరంకుశంగా వ్యవహరిస్తున్న ఈ కూటమి ప్రభుత్వం ఐదేళ్ల పాటు బతికి బట్టకడుతుందా అనేది అనుమానంగా ఉందంటూ ఆయన మండిపడ్డారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటుతున్నా పేదలకు ఒక్క కొత్త పింఛన్ కూడా ఇవ్వలేని దుస్థితిలో ఉందని, అలాంటిది రెండు లక్షల కోట్ల రూపాయలతో లక్ష ఎకరాల్లో రాజధాని నిర్మాణం చేపడుతుందంటే ప్రజలు నమ్మే స్థితిలో లేరని ఎద్దేవా చేశారు. సీఎం ఉసిగొల్పి దాడులు చేయించారు రాజధాని కోసం తాము భూములు ఇవ్వలేమని రైతులు గతంలోనే స్పష్టం చేశారని, ఈ విషయాన్ని అప్పట్లోనే మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి వివరించారని రాచమల్లు గుర్తుచేశారు. ఈ క్రమంలో సీఆర్డీఏ పరిధిలోని రైతుల పరిరక్షణ కమిటీ ఆధ్వర్యంలో వైఎస్సార్సీపీ నాయకులు అన్నదాతలకు అండగా నిలిచేందుకు, వారి పంట పొలాలను పరిశీలించేందుకు వెళ్లగా.. సీఎం చంద్రబాబు, మంత్రి నారా లోకేష్ తమ క్యాడర్ను ఉసిగొల్పి దాడులు చేయించారని ఆరోపించారు. రైతుల అంగీకారం లేకుండా పంట పొలాల్లో బలవంతంగా రోడ్లు నిర్మించడం, మట్టిని అక్రమంగా తరలిస్తూ, దురుద్దేశంతో పంటలపైకి నీటిని వదులుతూ రైతులను సర్వనాశనం చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ప్రైవేట్ సైన్యంలా పోలీసులు.. యెల్లో మీడియా వంత రాజధాని నగరంలో పట్టపగలే వైఎస్సార్సీపీ నేతలపై రాళ్లు, కోడిగుడ్లతో దాడులు చేస్తూ, కారు అద్దాలను పగలగొడుతున్నా పోలీసులు కనీస చర్యలు తీసుకోకుండా మిన్నకుండిపోయారని, చివరకు ఈ గొడవల్లో ఒక కానిస్టేబుల్ గాయపడినా పోలీసు స్పందించకపోవడం చూస్తుంటే.. ప్రస్తుత పోలీసు వ్యవస్థ చంద్రబాబు ప్రైవేట్ సైన్యంలా పనిచేస్తోందని అర్థమవుతోందని విమర్శించారు. దాడులు చేసిన వారిని వదిలేసి, బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపైనే తిరిగి తప్పుడు కేసులు పెట్టేందుకు పోలీసులు సిద్ధమవడం అన్యాయమన్నారు. మరోవైపు రాష్ట్రంలో జరుగుతున్న వాస్తవ పరిస్థితులకు భిన్నంగా ఏబీఎన్, ఆంధ్రజ్యోతి, ఈనాడు, ఈటీవీలు తప్పుడు వార్తలు ప్రచురిస్తున్నాయని రాచమల్లు మండిపడ్డారు. దాడులు వైఎస్సార్సీపీ నేతలపై జరిగితే.. అవి టీడీపీ నేతలపై జరిగినట్లుగా చిత్రికరిస్తూ అవాస్తవాలతో ప్రజలను తప్పుదోవ పట్టిస్తున్నారన్నారు. పచ్చ పత్రికల్లో అబద్ధాలు రాయడం.. ఆ తర్వాత దానిని పట్టుకుని టీడీపీ నేతలు టీవీ డిబేట్లలో కూర్చోవడం ఒక అలవాటుగా మారిందని ఎద్దేవా చేశారు. ఎన్ని తప్పుడు కేసులు పెట్టినా, ఎంతగా బెదిరింపులకు గురిచేసినా భయపడే ప్రసక్తే లేదని, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ నష్టపోతున్న అన్నదాతల పక్షాన నిలబడి పోరాటం కొనసాగిస్తుందని రాచమల్లు తేల్చిచెప్పారు. కార్పొరేట్ రియల్ ఎస్టేట్ కోసమే బలవంతపు భూసేకరణ, దౌర్జన్యాలు ఈనాడు, ఆంధ్రజ్యోతిల్లో తప్పుడు ప్రచారం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు -
అనారోగ్యంతో జీవితఖైదీ మృతి
కడప అర్బన్: కడప కేంద్ర కారాగారంలో జీవితఖైదు అనుభవిస్తున్న రఘుపతి (45) అనారోగ్యంతో మృతి చెందినట్లు కడప రిమ్స్ పీఎస్ పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు అన్నమయ్య జిల్లా తంతివారి పల్లి గ్రామానికి చెందిన రఘుపతి (45) హత్య కేసులో జీవిత ఖైదు శిక్ష పడి 2008లో కడప సెంట్రల్ జైలుకు వచ్చాడు. గత కొంత కాలంగా తీవ్ర అనాఆరోగ్యంతో బాధపడుతుండేవాడని, చికిత్స నిమిత్తం కర్నూల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు తెలిపారు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని వారి బంధువులకు అప్పగించినట్లు తెలిపారు. చక్రాయపేట: మండలంలోని అద్దాలమర్రి (ఆంజనేయపురం) క్రాస్ సమీపంలో నామాల గుండు వద్ద పాపాఘ్ని నదిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు ఆర్కే వ్యాలీ ఎస్ఐ శ్రీప్రియ తెలిపారు.మృతుడి వయసు ఉమారు 40 సంవత్సరాలు ఉంటందని చెప్పారు.మూడు రోజుల క్రితం చనిపోయి ఉండొచ్చని, శరీరంపై ఎలాంటి గాయాలు లేవన్నారు. మృతదేహం కదపడానికి కూడా వీలు లేక పోవడంతో పంచనామా నిర్వహించి సంఘటన స్థలం వద్దనే వేంపల్లె ప్రభుత్వ వైదులతో పోస్టుమార్టం చేయించి నట్లు చెప్పారు. పోస్టుమార్టం నివేదిక ఆదారంగా కేసుకమోదు చేస్తామని ఆమె వివరించారు.ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి,చక్రాయపేట ఎస్సై చంద్రశేఖర్లు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. రైలు కింద పడి.. ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడు. శనివారం రాత్రి ధర్మవరం ఎక్స్ప్రెస్ రైలు ఢీ కొనడంతో ఈ ఘటన జరిగినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. సమాచారం అందుకున్న ఎర్రగుంట్ల రైల్వే ఎస్ఐ భాస్కర్రెడ్డి ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 30 ఏళ్లు ఉంటాయని తెలిపారు. మృతుడికి సంబంఽధించిన వివరాలు తెలియలేదన్నారు. మృతుడికి సంబంధించిన బంధువులు ఎర్రగుంట్ల రైల్వేపోలీస్ స్టేషన్లో సంప్రదించాలని ఎస్ఐ తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. గోపవరం : బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని చెర్లోబోయినపల్లె, చెర్లోరామాపురం గ్రామాల మధ్య జరిగిన ఘర్షణలో 15 మంది గాయపడ్డారు. వివరాల్లోకి వెళితే పీర్లపండుగ సందర్భంగా శనివారం రాత్రి చెర్లోబోయినపల్లెలో నిర్వహించిన కోలాటం వద్ద జరిగిన వివాదంలో చెర్లోరామాపురానికి చెందిన యువకుడిని చెర్లోబోయినపల్లె గ్రామానికి చెందిన వారు కొట్టడంతో మొదలైన వివాదం చిన్నపాటి గొడవకు దారితీసింది. ఆదివారం చెర్లోబోయినపల్లెకు చెందిన వారు చెర్లోరామాపురం నుంచి వెళుతుండగా శనివారం రాత్రి జరిగిన గొడవను దృష్టిలో పెట్టుకుని వారిపై కర్రలు, రాళ్లతో దాడికి దిగారు. చెర్లోబోయినపల్లెకు చెందిన 9 మంది, చెర్లోరామాపురానికి చెందిన ఆరుగురు గాయపడ్డారు. వీరిలో ఇద్దరు మహిళలు కూడా ఉన్నారు. గాయపడినవారిని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఘర్షణకు దిగిన రెండు గ్రామాలకు చెందిన వారు పోలీసులకు ఎలాంటి ఫిర్యాదు చేయలేదు. రాజీకి పడేందుకు చర్చలు జరుగుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావును వివరణ కోరగా ఘర్షణకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదు రాలేదని తెలిపారు. -
93.27 శాతం పల్స్ పోలియో
కడప రూరల్ : జిల్లాలో ఆదివారం పల్స్ పోలియో కార్యక్రమం జరిగింది. ఐదేళ్లలోపు చిన్నారులు 2,37,527 మంది లక్ష్యం కాగా.. సాయంత్రం 7 గంటల సమయానికి 2,21,552 మందికి వైద్య సిబ్బంది చుక్కల మందును వేశారు. ఆ మేరకు లక్ష్య సాధనలో 93.27 శాతం నమోదైంది. కాగా నేడు, రేపు ఇంటింటికీ పల్స్ పోలియో కార్యక్రమం జరుగనుంది. జిల్లాలో ఈ కార్యక్రమాన్ని రాష్ట్ర పరిశీలకుడు డాక్టర్ సునీల్ కుమార్ నాయక్ పర్యవేక్షించారు. ఈయన కడప నగరం ఫక్కీరుపల్లె పట్టణ ప్రాధమిక ఆరోగ్య కేంద్రంలో పల్స్ పోలియో కార్యక్రమం ప్రారంభించారు. ఆ సందర్భంగా మాట్లాడుతూ చిన్నారుల ఆరోగ్య భవిత కోసం పెద్దలు తమ ఐదేళ్లలోపు పిల్లలకు తప్పని సరిగా చుక్కల మందును వేయాలన్నారు. లక్ష్య సాధనలో 100 శాతం కార్యక్రమంను విజయవంతం చేయాలని వైద్యాధికారులు, సిబ్బందికి సూచించారు. కార్యక్రమంలో మున్సిపల్ అదనపు కమీషనర్ రాకేష్చంద్ర, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ రవిబాబు, జిల్లా టీకాల అధికారి డాక్టర్ ప్రవీణ్తో పాటు వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
ఈ–పర్మిట్ వజ్రాయుధం!
సెస్సు వసూళ్లకు..● 1 నుంచి మార్కెట్ కమిటీలు, చెక్పోస్టులలో కొత్త విధానం ● సిబ్బంది చేతివాటానికి బ్రేక్.. పర్మిట్ లేని వ్యవసాయ ఉత్పత్తుల రవాణాపై నిషేధం కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా ఉన్న వ్యవసాయ మార్కెట్ కమిటీల పరిధిలో ఇకపై పాత మేన్యువల్ (చేతిరాత) పద్ధతులకు పూర్తిగా కాలం చెల్లనుంది. మార్కెట్ సెస్సు వసూళ్లు, తనిఖీ కేంద్రాల వద్ద పర్మిట్ల జారీలో పారదర్శకతను పెంచేందుకు ప్రభుత్వం సరికొత్త డిజిటల్ సంస్కరణలకు తెరలేపింది. రాబోయే జూలై 1వ తేదీ నుంచి జిల్లావ్యాప్తంగా పూర్తిస్థాయిలో ఆన్లైన్ ‘ఈ–ట్రాన్స్పోర్ట్ పర్మిట్’ విధానాన్ని ప్రయోగాత్మకంగా అమలు చేయబోతున్నారు. జిల్లాలో మార్కెట్ కమిటీల పరిస్థితి – రూ.15.33 కోట్ల లక్ష్యం జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల, రాజంపేట, మైదుకూరు, కమలాపురం, సిద్ధవటం, ఎర్రగుంట్ల, సింహాద్రిపురంలో మొత్తం 11 మార్కెట్ కమిటీలు ఉన్నాయి. వీటి పరిధిలో 21 సరిహద్దు చెక్పోస్టులు విస్తరించి ఉన్నా యి. ప్రధానంగా కడప యార్డులో పసుపు, వేరుశనగ క్రయవిక్రయాలు భారీగా సాగుతుండగా, మిగిలిన చోట్ల అరటి, బొప్పాయి, మామిడికాయల విక్రయాల ద్వారా ఆదాయం సమకూరుతుంది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2026–27) ఈ 11 మార్కెట్ కమిటీలకు సంబంధించి మొత్తం రూ.15.33 కోట్ల మార్కెట్ సెస్సు వసూలు చేయాలని అధికారులు లక్ష్యంగా నిర్దేశించుకోగా, మే చివరి నాటికి రూ.315.57 లక్షలు (రూ.3.15 కోట్లు) వసూలయ్యింది. చేతివాటానికి చెక్.. క్యూఆర్ కోడ్తో పక్కా నిఘా ఇప్పటివరకు అమల్లో ఉన్న పాత మ్యాన్యువల్ విధానం వల్లే కొన్ని చెక్పోస్టుల వద్ద సిబ్బంది చేతివాటం ప్రదర్శిస్తున్నారనే తీవ్ర ఆరోపణలున్నాయి. దీనిని అరికట్టేందుకే ఆన్లైన్ చెల్లింపులను ప్రోత్సహిస్తూ ఈ–పర్మిట్ విధానాన్ని తెచ్చారు. కొత్త విధానం ప్రకారం.. వ్యాపారులు ఆన్లైన్లో డబ్బులు చెల్లించాక ఒక ప్రత్యేక క్యూఆర్ కోడ్తో కూడిన డిజిటల్ పర్మిట్ వస్తుంది. రవాణా వాహనాలు చెక్పోస్టుల వద్దకు రాగానే, అక్కడి సిబ్బంది ఆ కోడ్ను స్కాన్ చేయాల్సి ఉంటుంది. అలా చేయగానే వాహనంలో ఉన్న లోడ్, చెల్లించిన రుసుము వంటి సమగ్ర వివరాలన్నీ కంప్యూటర్ స్క్రీన్పై ప్రత్యక్షమవుతాయి. దీనివల్ల రికార్డులను తారుమారు చేసే అవకాశం సిబ్బందికి ఉండదు. 301 మంది వ్యాపారులకు రిజిస్ట్రేషన్ తప్పనిసరి జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం 11 మార్కెట్ కమిటీల పరిధిలో మొత్తం 301 మంది లైసెన్స్ కలిగిన వ్యాపారులు ఉన్నారు. వీరందరూ తప్పనిసరిగా ఆన్లైన్లో తమ పేర్లను నమోదు చేసుకుని ఈ ట్రాన్స్పోర్ట్ పర్మిట్ను పొందాల్సి ఉంటుంది. ఒకవేళ ఈ ఆన్లైన్ పర్మిట్ లేకుండా వ్యవసాయ ఉత్పత్తులను రవాణా చేస్తే, వాటిని చట్టవిరుద్ధంగా పరిగణించి రవాణాను పూర్తిగా నిషేధించనున్నారు. ఈ డిజిటల్ విధానం వల్ల అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంతో పాటు వ్యాపారులకు, రైతులకు చెక్పోస్టుల వద్ద వేచి ఉండే సమయం గణనీయంగా తగ్గుతుందని అధికారులు పేర్కొంటున్నారు. లైసెన్స్ లేకుంటే జరిమానా వడ్డింపు జూలై 1 నుంచి అమల్లోకి రానున్న ఆన్లైన్ ‘ఈ–పర్మిట్’ విధానంలో వ్యాపారులకు ట్రేడ్ లైసెన్స్ ఉండటం తప్పనిసరి అని అధికారులు స్పష్టం చేశారు. ప్రతి వ్యాపారి ఈ–ట్రాన్స్పోర్ట్ పోర్టల్లో దరఖాస్తు చేసుకుని వ్యక్తిగత లాగిన్, పాస్వర్డ్లను పొందాల్సి ఉంటుంది. వీటి ద్వారానే ఆన్లైన్లో రవాణా పర్మిట్ జారీ చేస్తారు. బ్యాంకుల ద్వారా సెస్ (రుసుము) చెల్లించడానికి 15 రోజుల గడువు ఉంటుంది. ఈ లోపు డబ్బులు చెల్లించకపోతే ఆన్లైన్ ప్రక్రియ నిలిచిపోతుంది. చెక్పోస్టుల వద్ద ట్రేడ్ లైసెన్స్ లేకుండా పంట దిగుబడులను తరలించే వారిని ‘నాన్–ట్రేడర్స్’ కింద పరిగణించి సెస్ వసూలు చేస్తారు. అయితే, లైసెన్స్ లేకుండా రవాణా చేయడానికి కేవలం మూడుసార్లు మాత్రమే అవకాశం ఉంటుంది. ఈ లోగా సదరు వ్యాపారి చేత లైసెన్స్ కోసం దరఖాస్తు చేయిస్తారు. మూడుసార్లు దాటిన తర్వాత కూడా లైసెన్స్ లేకుండా సరుకు రవాణా చేస్తూ పట్టుబడితే.. సరుకు మొత్తం విలువను బట్టి అధికారులు భారీగా జరిమానా వసూలు చేస్తారు. -
ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప జిల్లా ఏఐఎస్ఎఫ్ నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు గుజ్జుల వలరాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా జనరల్ బాడీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నూతన జిల్లా అధ్యక్షుడిగా అశోక్, జిల్లా ప్రధాన కార్యదర్శిగా బత్తల అరుణ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు కావస్తున్నా పీజీ విద్యార్థులకు శాపంగా మారిన జీవో నెంబర్ 77ను రద్దు చేయకపోవడం దుర్మార్గమన్నారు. విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ విద్యార్థులకు ఇచ్చిన హామీలను నెరవేర్చకుండా ఉత్సవాలు చేసుకోవడం సరికాదన్నారు. రాష్ట్రంలో ఫీజు నియంత్రణ చట్టాన్ని కార్పొరేట్ సంస్థలు ఉల్లంఘిస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని మండిపడ్డారు. ప్రభుత్వ విద్యా వ్యతిరేక విధానాలపై జూలై 1 నుంచి 4 వరకు జరిగే రాష్ట్ర శిక్షణ తరగతుల్లో చర్చించి, భవిష్యత్ పోరాట కార్యాచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నగర సహాయ కార్యదర్శులు మల్లికార్జున రెడ్డి, అభిరామ్, చేతన్ తదితరులు పాల్గొన్నారు. -
శ్రీకీర్తన.. లాభార్జన
కడప అగ్రికల్చర్: 2023ను ఐక్యరాజ్యసమితి ‘ఇంటర్నేషనల్ ఇయర్ ఆఫ్ మిల్లెట్స్’గా ప్రకటించిన తర్వాత చిరుధాన్యాలకు ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు వచ్చింది. ఆ వేవ్ను కడప జిల్లా రైతులు, మహిళలు స్వయం ఉపాధిగా మార్చుకునేందుకు ఉటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం అద్భుత అవకాశం కల్పిస్తోంది. ఈ నెల 29వ తేదీ నుంచి నాబార్డ్ ఆర్థిక సహకారంతో ‘మిల్లెట్లతో స్వయం ఉపాధి – వ్యవసాయ ఆధారిత సూక్ష్మ పరిశ్రమల స్థాపన’ శిక్షణ ప్రారంభం కానుంది. రాయలసీమలో విస్తారంగా పండే సజ్జ, కొర్రలు, అరికెలు, ఊదలు, సామలు వంటి మిల్లెట్లను ముడిసరుకుగా వాడుకుని విలువ ఆధారిత ఉత్పత్తులుగా మార్చే పూర్తి స్కిల్ను రెండు వారాల్లో నేర్పిస్తారు. తొలి 250 మందికే ఉచితం 10 బ్యాచ్లు నాబార్డ్ ప్రాయోజిత ఈ శిక్షణలో తొలి 250 మందికి పూర్తిగా ఉచితం. మొత్తం 10 బ్యాచ్లుగా నిర్వహిస్తారు. ఒక్కో బ్యాచ్లో 25 మందికి మాత్రమే సీటు. చదవడం, రాయడం తెలిసిన గ్రామీణ యువత, రైతు మహిళలు, సెల్ఫ్ హెల్ప గ్రూపు సభ్యులు, నిరుద్యోగులు ఎవరైనా అర్హులే. శిక్షణ తర్వాత సొంతంగా యూనిట్ పెట్టుకునే వారికి కేవీకే టెక్నికల్ గైడెన్స్, నాబార్డ్ సబ్సిడీ లోన్లకు లింకేజ్ కల్పిస్తారు. ప్రాసెసింగ్ నుంచి బ్రాండింగ్ దాకా – సిలబస్ ఇదే ● ప్రొడక్షన్ – ప్రాసెసింగ్: మిల్లెట్ శుద్ధి, గ్రేడింగ్, పిండి తయారీ, ఎక్స్ట్రూడర్ టెక్నాలజీ ● విలువ ఆధారిత ఉత్పత్తులు: లడ్డూలు, బిస్కెట్లు, నూడుల్స్, పాస్తా, రాగి మాల్ట్, రెడీ–టు–ఈట్ మిక్సులు ● ప్యాకేజింగ్ – బ్రాండింగ్: లేబుల్ డిజైన్, ఎఫ్ఎస్ఎస్ఏఐ రిజిస్ట్రేషన్, బార్కోడ్, షెల్ఫ్ లైఫ్ పెంపు ● మార్కెటింగ్: అమెజాన్, ఫ్లిప్కార్ట్ లిస్టింగ్, స్థానిక హోల్సేల్, సిటీ సూపర్ మార్కెట్లలో ప్లేస్మెంట్ ● ఫైనాన్స్: ముద్ర లోన్, స్టాండప్ ఇండియా స్కీం, నాబార్డ్ సబ్సిడీ – 35% వరకు గ్రాంట్ లక్షల ఆదాయం ఎలా? MóSÒMóS ÌñæMýSPÌS {ç³M>-Æý‡…... OÆð‡™èl$ §ýlVýSYÆý‡ çÜfj MìSÓ…sê ₹2800&₹3200 ç³Ë$MýS$™ø…¨. A§ól çÜfj™ø ÌSyýl*zË$ ™èlĶæ*Æý‡$ ^ólíÜ 250{V> ´ëÅMðSsŒæ ₹60&₹70MìS AÑ$Ùól, MìSÓ…sêMýS$ ₹9000&₹10000 ÑË$Ð]l Ð]lçÜ$¢…¨. A…sôæ 3 Æð‡rÏ Ìê¿ýæ…. Oòßæ§ýl-Æ>»ê§Šæ, »ñæ…VýS-â¶æ*Æý‡$, ^ðlO¯ðl² Ð]l*Æð‡P-rÏÌZ "Ñ$ÌñæÏsŒæ' A¯ól {»ê…yŠæ™ø 40% {ï³Ñ$Ķæ$… «§ýlÆý‡ ÌSÀÝù¢…-¨. ఎందుకు ఇప్పుడు రిజిస్టర్ చేసుకోవాలి? డయాబెటిస్, ఊబకాయం పెరుగుతున్న నేపథ్యంలో గ్లూటెన్–ఫ్రీ, ఫైబర్ రిచ్ మిల్లెట్ ఫుడ్కు డిమాండ్ రోజురోజుకీ పెరుగుతోంది. కేంద్రం కూడా ప్రతి పాఠశాల మధ్యాహ్న భోజనంలో మిల్లెట్లను తప్పనిసరి చేసింది. మార్కెట్ రెడీగా ఉంది, స్కిల్ నేర్చుకునే వారు మాత్రం తక్కువగా ఉన్నారు. రిజిస్ట్రేషన్ వివరాలు: ఆసక్తి ఉన్నవారు 8247237649 నంబర్కు పేరు, ఊరు, ఫోన్ నంబర్ వాట్సాప్ చేయాలి. ఆధార్ జెరాక్స్, రెండు ఫోటోలతో శిక్షణ రోజున హాజరు కావాలి. సీట్లు త్వరగా ఫుల్ అయ్యే అవకాశం ఉంది.భర్త అకాల మరణంతో కష్టాల కడలిలో పడినా, అధైర్యపడకుండా ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి స్వయం సమృద్ధి సాధించారు గాలివీడు మండలానికి చెందిన గంగాదేవి. వడ్రంగి పని చేసే భర్త కృష్ణమాచారి చనిపోవడంతో కుటుంబం తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో పడింది. ఈ తరుణంలో 2019లో ఆమె కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆశ్రయించారు. ఆమెలోని పట్టుదలను చూసి కేవీకే అధికారులు ‘ఐసీఏఆర్’ పథకం కింద చిరుధాన్యాల ఆధారిత ఉత్పత్తుల తయారీలో ప్రత్యేక శిక్షణ ఇచ్చారు. అంతేకాకుండా, గృహ పరిశ్రమ స్థాపనకు వీలుగా ఆగ్రో ప్రాసెసింగ్ పరికరాలు, ముడి సరుకులను ఉచితంగా అందించారు. ప్రభుత్వ అండతో వ్యాపారంలో అడుగుపెట్టిన గంగాదేవి.. ప్రస్తుతం రాఖీ లడ్డు, బర్ఫీ, ఎస్ఎం లడ్డు, వేరుశనగ లడ్డు వంటి పోషక విలువలు గల మిఠాయిలను సొంతంగా తయారు చేస్తున్నారు. స్థానిక మార్కెట్ అనుసంధానంతో ప్రస్తుతం ఆమె నెలకు సగటున రూ.11,200 ఆదాయాన్ని అర్జిస్తున్నారు. కష్టాలకు ఎదురొడ్డి, ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని ప్రశాంతంగా నడుపుకుంటూ తోటి మహిళలకు గంగాదేవి ఆదర్శంగా నిలిచారు. సమాజంలో చిరుదాన్యాల వాడాకాన్ని పెండచం, వ్యాపార నైపుణ్యాలను పెంపొందించడం లక్ష్యంగా కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం పనిచేస్తోంది. ప్రత్యేక శిక్షణా కార్యక్రమాలను 2010లో ప్రారంచినప్పటి నుంచి 5 వేల మందికి పైగా శిక్షణ ఇచ్చాం. – డాక్టర్ శీలం ప్రశాంతి, కమ్యూనిటి సైన్స్ శాస్త్రవేత్త, కృషి విజ్ఞానకేంద్రం. రాయలసీమ వాతావరణం మిల్లెట్లకు వరం. కానీ రైతు ముడిసరుకు అమ్మి లాభం కోల్పోతున్నాడు. ఈ శిక్షణతో రైతునే తయారీదారుగా, బ్రాండ్ ఓనర్గా తయారు చేయడమే మా లక్ష్యం. శిక్షణ తర్వాత 6 నెలల పాటు హ్యాండ్హోల్డింగ్ సపోర్ట్ ఇస్తాం. – డాక్టర్ శిల్పకళ, సమన్వయకర్త, కృషి విజ్ఞానకేంద్రం. డిగ్రీ వరకు చదువుకున్న వల్లూరు గ్రామానికి చెందిన గంగేశ్వరి తన వృత్తి జీవితాన్ని మొదట ఒక ఫార్మర్ ప్రొడ్యూసర్ కంపెనీలో అకౌంటెంట్గా ప్రారంభించారు. ఆమెలోని అద్భుతమైన పనితీరు, నాయకత్వ నైపుణ్యాల కారణంగా చాలా తక్కువ సమయంలోనే అదే కంపెనీకి సీఈఓగా పదోన్నతి పొందారు. అయితే సొంతంగా ఒక బ్రాండ్ను నిర్మించాలనే లక్ష్యంతో కృషి విజ్ఞాన కేంద్రాన్ని సంప్రదించారు. అక్కడ చిరుధాన్యాల విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీలో నైపుణ్యాభివృద్ధి శిక్షణ తీసుకున్నారు. అనంతరం సొంతంగా గృహ పరిశ్రమను స్థాపించి రాగిలడ్డు, జొన్న లడ్డు, మిల్లెట్ మురుకులు తయారు చేస్తూ వ్యాపారాన్ని విస్తరించారు. ప్రస్తుతం నెలకు రూ.10,000 నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. వ్యాపారంలో మరింత ముందడుగు వేస్తూ, స్థానిక మార్కెట్ అనుసంధానాన్ని పెంచుకోవడానికి వల్లూరులోని గ్రామీణ రైతు బజార్ దుకాణంలో భాగస్వామిగా పెట్టుబడి పెట్టారు. స్వశక్తితో ఎదిగి, పదిమంది రైతులకు మార్కెట్ కల్పిస్తూ ఆర్థిక స్వావలంబన సాధించిన గంగేశ్వరి నేటి యువతకు నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. సొంతంగా ఎదగాలనే సంకల్పం ఉంటే చిన్న వయసు, తక్కువ చదువు ఏమాత్రం అడ్డంకి కావని నిరూపించారు కడపకు చెందిన కోడూరు శ్రీకీర్తన. పదో తరగతి వరకే చదువుకున్నా, వంటలపై ఉన్న మక్కువతో సొంతంగా వ్యాపార సామ్రాజ్యాన్ని స్థాపించాలనే బలమైన కోరికను ఆమె పెంచుకున్నారు. ఈ క్రమంలోనే 2022లో ఆమె కృషి విజ్ఞాన కేంద్రాన్ని ఆశ్రయించి, విభిన్న ఆహార ఉత్పత్తుల తయారీపై ప్రత్యేక శిక్షణ తీసుకున్నారు. శిక్షణ అనంతరం చిరుధాన్యాల ప్రాధాన్యతను గుర్తించిన కీర్తన.. పోషక విలువలతో కూడిన సరికొత్త ఆహార పదార్థాల తయారీకి శ్రీకారం చుట్టారు. ప్రస్తుతం ఆమె సొంతంగా మిల్లెట్ మిక్చర్, మురుకులు, రాగి లడ్డు, జొన్న లడ్డు, కజ్జికాయలు, కార్న్ఫ్లేక్స్ వంటి వివిధ రకాల విలువ ఆధారిత చిరుధాన్యాల ఉత్పత్తులను అత్యంత నాణ్యతతో తయారు చేస్తున్నారు.ఈ వినూత్న వ్యాపారం ద్వారా ఆమె ప్రస్తుతం నెలకు సగటున రూ.12,500 నికర ఆదాయాన్ని ఆర్జిస్తున్నారు. తక్కువ చదువుతోనే స్వశక్తితో వ్యాపార రంగంలో రాణిస్తూ, ఆర్థిక స్వాలంబన సాధించిన శ్రీకీర్తన నేటి యువతకు, తోటి మహిళలకు నిలువెత్తు ఆదర్శంగా నిలిచారు. -
చిన్నారి హత్యపై వెల్లువెత్తిన ఆగ్రహం
లింగాల : చిన్నారి హత్యపై ఆగ్రహం వెల్లువెత్తింది. మృతురాలి కుటుంబ సభ్యులు, గ్రామస్తులు ఆందోళన తీవ్రం చేశారు. బాధిత కుటుంబానికి మద్దతుగా వివిధ ప్రాంతాల నుంచి విశ్వబ్రాహ్మణ సంఘం నాయకులు, సంఘీయులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వారితో పోలీస్ అధికారులు చర్చించి, న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గురువారం సాయంత్రం నిత్విక అనే నాలుగేళ్ల చిన్నారిని హత్య చేసి 200 లీటర్ల నీటి డ్రమ్ములో పడేసిన విషయం తెలిసిందే. శుక్రవారం పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో నిత్విక మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. అంత్యక్రియలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేస్తున్న సందర్భంగా.. వైఎస్సార్సీపీ తొండూరు మండల ఇన్చార్జి వైఎస్ మధురెడ్డి గ్రామానికి వెళ్లి నిత్విక మృతదేహానికి నివాళులర్పించారు. ఈ సందర్భంగా బాలిక తల్లిదండ్రులు రామాచారి, సృజనతో ఆయన మాట్లాడారు. అనంతరం గ్రామ ప్రజల సమక్షంలో మాట్లాడుతూ రామాచారి కుటుంబానికి న్యాయం జరిగే విధంగా చేస్తామని హామీ ఇచ్చారు. త్వరలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రామాచారి కుటుంబానికి తగిన భరోసా కల్పిస్తారన్నారు. అదే విధంగా ఆయన సీఐ శాంతిలాల్తో చర్చలు జరిపి, రామాచారి కుటుంబానికి న్యాయం చేయాలని కోరారు. అనంతరం కుటుంబ సభ్యులు గ్రామ మహిళలతో కలిసి రామాచారి ఇంటి బయట బైటాయించి ఆందోళన నిర్వహించారు. తమకు న్యాయం చేసే వరకు అంత్యక్రియలు నిర్వహించబోమని రామాచారి కుటుంబ సభ్యులు ఆందోళన చేశారు. ఎస్ఐ జగదీశ్వరరెడ్డిని సస్పెండ్ చేయాలి ఎస్ఐ జగదీశ్వరరెడ్డిని వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. ఎస్ఐ డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేశారు. ఎస్ఐ లోపట్నూతల గ్రామానికి వచ్చే వరకు ఆందోళన చేస్తామని పేర్కొన్నారు. అనంతరం విశ్వబ్రాహ్మణ సంఘాల నాయకులు అక్కడికి చేరుకుని రామాచారి కుటుంబం గ్రామంలో ఒంటరిగా ఉందని, ఆ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంక్షేమ అభివృద్ధి కార్పొరేషన్ చైర్పర్సన్ కమ్మరి పార్వతమ్మ మీడియాతో మాట్లాడుతూ బాలికను హత్య చేసిన స్వాతి, ఆమె భర్తకు ఉరి శిక్ష పడే విధంగా పోలీసులు చర్యలు తీసుకోవాలన్నారు. అదే విధంగా గతంలో బైండోవర్ కేసులు ఉల్లంఘించినందున వారికి రూ.25 లక్షల దాకా జరిమానా విధించాలన్నారు. అలాగే వెంకట్రామిరెడ్డి కుటుంబాన్ని గ్రామ బహిష్కరణ చేయాలన్నారు. వెంకట్రామిరెడ్డి కుటుంబానికి వత్తాసు పలికిన ఎస్ఐపై తగిన చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా సీఐ శాంతిలాల్ మీడియాతో మాట్లాడుతూ రామాచారి కుటుంబానికి తగిన న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. తమతోపాటు న్యాయ స్థానంలో సాక్షులు కూడా బలంగా నిలబడితే స్వాతి, వెంకట్రామిరెడ్డిలకు కఠిన శిక్షలు పడే అవకాశాలు ఉన్నాయన్నారు. పోలీసులు విశ్వబ్రాహ్మణ సంఘ నాయకులకు, గ్రామస్తులకు, రామాచారి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పి నిత్విక మృతదేహానికి ఖననం చేసేందుకు అంగీకరింపజేశారు. శనివారం మధ్యాహ్నం 2 గంటలకు నిత్విక మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బాబురెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగపు నియోజకవర్గ కన్వీనర్ సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, పులివెందుల మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, గ్రామ నాయకులు వెంగల్రెడ్డి, నాగభూషణంరెడ్డి, వివిధ గ్రామాల వైఎస్సార్సీపీ నాయకులు, సీఐలు ప్రసాదరావు, శ్రీరామ్, భాస్కర్రెడ్డి, లింగాల పోలీసులు సిబ్బంది, ప్రత్యేక పోలీసు సిబ్బంది పాల్నొన్నారు. రోడ్డుపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు బైఠాయింపు నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ విశ్వ బ్రాహ్మణ సంఘం నాయకులతో చర్చించిన పోలీసులు నిత్విక మృతదేహానికి నివాళులర్పించిన వైఎస్ మధురెడ్డినిత్విక హత్య కేసులో నిందితురాలి అరెస్ట్పులివెందుల రూరల్ : చిన్నారి నిత్విక హత్య కేసులో నిందితురాలు స్వాతిని పోలీసులు శనివారం అరెస్టు చేశారు. స్థానిక డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళి విలేకరులకు వివరాలు వెల్లడించారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రత్యేక చొరవ తీసుకుని సీసీ కెమెరాల్లో రికార్డయిన ఆధారాలను బట్టి చిన్నారి హత్య కేసును 24 గంటల్లోపే ఛేదించి నిందితురాలిని అరెస్టు చేశామన్నారు. శనివారం 11 గంటల ప్రాంతంలో నిందితురాలు స్వాతి పులివెందుల రూరల్ సర్కిల్ కార్యాలయ సమీపంలో సంచరిస్తుండగా.. రూరల్ సీఐ శాంతి లాల్, లింగాల ఎస్ఐ జగదీశ్వర్రెడ్డిలు అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ చెప్పారు. సుమారు 8 నెలల క్రితం సృజన పిల్లలు.. స్వాతి పిల్లలు చిన్న విషయం మీద గొడవపడ్డారని, ఇరు వర్గాల వారు తిట్టుకునేవారన్నారు. పాత కక్షలు దృష్టిలో పెట్టుకొని స్వాతి అనే మహిళ నిత్వికను హత్య చేసినట్లు డీఎస్పీ తెలిపారు. స్వాతిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపామన్నారు. కార్యక్రమంలో సీఐలు శ్రీరామ్, నరసింహులు, శంకర్రెడ్డి, ప్రసాద్ రావు, ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
చింతకొమ్మదిన్నె : మండలంలోని పెద్దకాంపల్లి గ్రామానికి చెందిన షేక్ నూర్జహాన్ అనే వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. శుక్రవారం రాత్రి ఇంట్లో విషద్రావణం తాగింది. వెంటనే ఆమెను రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం ఉదయం మృతి చెందినట్లు చింతకొమ్మదిన్నె ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు.ఆయన కథనం మేరకు.. నూర్జహాన్కు ఆరేళ్ల క్రితం పెద్దకాంపల్లె కు చెందిన షేక్ కమాల్బాషాతో వివాహమైంది. వారికి ముగ్గురు సంతానం. భర్త జీవనోపాధి కోసం సౌదీ అరేబియాలో ఉన్నాడు. కుటుంబ కలహాల కారణంగా ఆత్మహత్య చేసుకుంది. భర్త, అత్త, మామ పైన వేధింపుల ఆరోపణలు వస్తున్నాయి. మృతురాలిది పాతకడప సమీపంలోని మోడమీదిపల్లి. మృతురాలి తల్లి షేక్ రజియా ఇచ్చిన ఫిర్యాదు మేరకు చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్ ఇన్స్పెక్టర్ బాల మద్దిలేటి కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.చింతకొమ్మదిన్నె మండల తహసీల్దార్ నాగేశ్వరరెడ్డి పంచనామా నిర్వహించినట్లు తెలిపారు. జీవితంపై విరక్తితో.. మైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతిపేటకు చెందిన చెన్నం లక్షుమ్మ (54) అనే మహిళ జీవితంపై విరక్తి చెంది పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. సరస్వతి పేటకు చెందిన మహిళలు 7 నెలల కిందట పొలం పనులకు వెళ్లి ఆటోలో తిరిగి వస్తుండగా గ్రామానికి సమీపంలో ఆటోను జీపు ఢీకొట్టింది. ఈ సంఘటనలో ఒక మహిళ మృతి చెందగా లక్షుమ్మతోపాటు మరో ఏడుగురు మహిళా కూలీలు గాయపడ్డారు. లక్షుమ్మ కుడి కాలి పాదం పైభాగం నుజ్జునుజ్జు అయింది. పలు ఆస్పత్రుల్లో చికిత్సలు చేయించకున్నా బాగుపడక ఇబ్బంది పడేది. తన రోజువారి పనులు చేసుకునేందుకు కూడా కష్టంగా ఉండటంతో జీవితంపై విరక్తి చెంది పంటల కోసం ఆమె భర్త ఇంటిలో తెచ్చి ఉంచిన పురుగుల మందును గురువారం తాగింది. మైదుకూరులో చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం కుటుంబ సభ్యులు ఆమెను కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ఆమెకు ఇద్దరు కమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. అందరికీ వివాహాలు అయ్యాయి. మృతురాలి భర్త దస్తగిరి రెడ్డి ఫిర్యాదు మేరకు మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైతు సంఘం రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలి కడప వైఎస్ఆర్ సర్కిల్ : రైతు రక్షణ వ్యవసాయ రంగ పరిరక్షణ కోసం జులై 3,4,5 తేదీల్లో ఏలూరులో జరిగే ఏపీ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఏపీ రైతు సంఘం కడప జిల్లా కార్యదర్శి బి దస్తగిరి రెడ్డి తెలిపారు. శనివారం కడపలో రాష్ట్ర మహాసభలకు సంబధించిన పోస్టర్లను అవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులకు వ్యతిరేకంగా పార్లమెంట్లో చేసిన చట్టాలపై పోరాటానికి రైతాంగం సమాయత్తం కావాలని పిలుపునిచ్చారు. ప్రమాదకర కేంద్ర చట్టాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా,భారత్ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందం వల్ల ఏటా 5 లక్షల కోట్ల రూపాయలు సంపద అమెరికాకు తరలిపోతుందని చెప్పారు. ఈ సభలకు అఖిల భారత కిసాన్ సభ జాతీయ అధ్యక్షులు అశోక్ ధావలే, జాతీయ ప్రధాన కార్యదర్శి విజూ కృష్ణన్ వంటి జాతీయ రైతు నేతలు హాజరవుతారన్నారు. కార్యక్రమంలో రైతు సంఘం జిల్లా అధ్యక్షులు గోపాలకృష్ణయ్య, రైతు సంఘం నాయకులు కుమారస్వామి రెడ్డి, చిన్న సిద్దయ్య ,హరి, సుబ్బారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాల ఎంపికలకు 110 మంది హాజరు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాల ప్రవేశాల కోసం రెండు రోజులపాటు నిర్వహించిన జిల్లా స్థాయి ఎంపికలు ముగిశాయి. ఎంపికలకు మొత్తం 110 మంది విద్యార్థులు హాజరైనట్లు డీఎస్డీఓ గౌస్బాషా తెలిపారు. మొదటిరోజు 104 మంది హాజరు కాగా రెండో రోజు శనివారం 6 మంది మాత్రమే హాజరయ్యారు. వీరికి రిమ్స్ వైద్యులు నిరంజన్ వైద్య పరీక్షలు, డీఎస్డీఏ కోచ్లు సామర్థ్య పరీక్షలను నిర్వహించారు. ఈ ఎంపికలకు 4వ తరగతిలో బాలురు 33, బాలికలు 11, 5వ తరగతిలో బాలురు 24, బాలికలు 17, 6వ తరగతిలో బాలురు 19, బాలికలు 06 హాజరయ్యారు. ఈ పోటీల్లో ప్రతిభ కనబరిచిన వారి పేర్లను జిల్లా కలెక్టర్ అనుమతితో శాప్కు పంపుతామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికై న విద్యార్థులు విజయవాడలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే ఎంపికల్లో పాల్గొనాలన్నారు. అక్కడ ప్రతిభ కనబరిచిన వారిని క్రీడా పాఠశాలలో చోటు కల్పిస్తారు. ఈ కార్యక్రమంలో డీఎస్ఏ కోచ్లు, సిబ్బంది పాల్గొన్నారు. ఒంటిమిట్ట రామయ్యకు స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు.అర్చకులు సీతారామలక్ష్మణ మూర్తులను టీటీడీ ఆలయ అధికారులు తీసుకొచ్చిన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, తులసి గజమాలతో అందంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. -
ఎయిడ్స్ నియంత్రణ లక్ష్యాలు సాధించాలి
మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల లక్ష్యాలను ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా చేరుకోవాలని, నిర్దేశిత టార్గెట్ సాధించని వారిపై చర్యలు తప్పవని ఉమ్మడి కడప, అన్నమయ్య జిల్లాల క్లస్టర్ ప్రోగ్రామ్ అధికారి భాస్కర్ హెచ్చరించారు. శనివారం స్థానిక జిల్లా ఆస్పత్రిలోని ఏఆర్టీ కేంద్రంలో కౌన్సెలర్లు, ఎన్జీవోలతో నిర్వహించిన కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ‘మొబలైజేషన్ ఆఫ్ ఎయిడ్స్ సురక్ష’ కార్యక్రమాన్ని జిల్లాలో సమర్థవంతంగా అమలు చేయాలన్నారు. హెచ్ఐవీ స్క్రీనింగ్ లక్ష్యాన్ని 95 శాతం చేరుకోవడంతో పాటు, బాధితుల్లో 95 శాతం మందికి కచ్చితంగా చికిత్స అందించాలని ఆదేశించారు. వైరల్ లోడ్ నియంత్రణలో 99 శాతం ప్రగతి సాధించేందుకు అందరూ సమన్వయంతో కృషి చేయాలని సూచించారు. కార్యక్రమంలో మెడికల్ ఆఫీసర్ డాక్టర్ హుమయూన్, కౌన్సెలర్లు పురుషోత్తం, జయకుమార్ పాల్గొన్నారు. -
పాలప్యాకెట్ తెస్తూ.. పైలోకాలకు!
● మోటార్సైకిల్ను ఢీకొట్టిన ఎయిల్ కంపెనీ బస్సు ● కేఎస్ఆర్ఎం కాలేజీ సివిల్ మేసీ్త్ర శివ దుర్మరణంకడప అర్బన్ : ఇంటికి పాలప్యాకెట్ తెచ్చేందుకు వెళ్లిన ఆ కుటుంబ యజమాని.. తిరిగిరాని లోకాలకు వెళ్లిపోయాడు. రోడ్డు ప్రమాదం రూపంలో వచ్చిన మృత్యువు ఒక నిండు ప్రాణాన్ని బలితీసుకుంది. చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసరామయ్యగారిపల్లెకు చెందిన పేర్ల శివ (55) శనివారం ఉదయం మోటార్సైకిల్పై పాలప్యాకెట్ తీసుకుని ఇంటికి వస్తున్నాడు. ఈ క్రమంలో నరసరామయ్యగారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద ‘ఎయిల్డిక్సన్ సీసీకెమెరాల సంస్థ’కు చెందిన ఉద్యోగుల బస్సు వేగంగా వచ్చి ఆయన బైక్ను ఢీకొట్టింది. ఈ ఘోర ప్రమాదంలో బస్సు కింద పడిపోవడంతో శివ తలకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి ఆయన్ను కడప రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ అత్యవసర చికిత్స అందిస్తున్నప్పటికీ కాసేపటికే ఆయన కన్నుమూశారు. మృతుడు పేర్ల శివ గత 30 ఏళ్లుగా స్థానిక కేఎస్ఆర్ఎం ఇంజనీరింగ్ కళాశాలలో సివిల్ పనుల మేసీ్త్రగా నమ్మకంగా పనిచేస్తూ అందరి మన్ననలు పొందారు. ఆయనకు భార్య, కుమారుడు రాజశేఖర్, కుమార్తె సింధూరి ఉన్నారు. కుమారుడు రాజశేఖర్ కేఎస్ఆర్ఎం కాలేజీలోనే లెక్చరర్గా పనిచేస్తున్నారు. ప్రమాద వార్త తెలిసిన వెంటనే కేఎస్ఆర్ఎం విద్యాసంస్థల కరస్పాండెంట్ ‘నాని’ స్వయంగా ఆస్పత్రికి వచ్చి మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించి, ధైర్యం చెప్పారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అధికారుల అండతోనే టీచర్ల ప్రైవేట్ దందాకడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉపాధ్యాయులుగా ఉంటూ అక్రమ సంపాదన కోసం ప్రైవేట్ విద్యాసంస్థలు నడుపుతున్న వారిని వెంటనే విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం కడప డీఈఓ కార్యాలయం ఎదుట విద్యార్థి సంఘాలు భారీ ఆందోళన నిర్వహించాయి. ఏఐఎస్బీ, పీఎస్యూ, ఏఐవైఎల్ ఆధ్వర్యంలో జరిగిన ఈ ధర్నా అనంతరం అధికారులకు వినతిపత్రం సమర్పించారు.ఈ సందర్భంగా ఏఐఎస్బీ రాష్ట్ర అధ్యక్షుడు సగిలి రాజేంద్ర ప్రసాద్, పీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, ఏఐవైఎల్ జిల్లా కన్వీనర్ చిరంజీవి మాట్లాడుతూ.. ప్రభుత్వ విద్యపై నమ్మకం కల్పించాల్సిన ఉపాధ్యాయులే దానికి విరుద్ధంగా వ్యవహరించడం దారుణమన్నారు. పోరుమామిళ్లలో ఎలాంటి అనుమతులు లేకుండా కొందరు ప్రభుత్వ టీచర్లు సొంతంగా కోచింగ్ సెంటర్లు, స్కూళ్లు నడుపుతున్నా విద్యాశాఖ అధికారులు స్పందించకపోవడం వెనుక అధికారుల అండదండలు ఉన్నాయని ఆరోపించారు. నిబంధనలు ఉల్లంఘిస్తున్న వారిపై విచారణ జరిపి తక్షణమే చర్యలు తీసుకోకుంటే ఆందోళనలు ఉధృతం చేస్తామని వారు హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో విద్యార్థి సంఘాల ప్రతినిధులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
● స్టేడియాన్ని తక్షణమే వినియోగంలోకి తేవాలి
కోట్ల రూపాయల ప్రజాధనంతో 80 శాతం పూర్తి చేసిన క్రికెట్ స్టేడియాన్ని కూటమి ప్రభుత్వం తక్షణమే వినియోగంలోకి తీసుకురావాలి. జిల్లాలో ఎంతోమంది ప్రతిభావంతులైన క్రీడాకారులు ఈ మైదానం ఎప్పుడు అందుబాటులోకి వస్తుందా అని రెండేళ్లుగా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్నారు. స్టేడియం పూర్తిస్థాయిలో అందుబాటులోకి వస్తే గ్రామీణ ప్రాంతాల్లోని క్రీడలను, క్రీడాకారులను మరింతగా ప్రోత్సహించవచ్చు. కేవలం 20 శాతం పెండింగ్ పనులను పూర్తి చేసి, గేట్లు తెరిస్తే ఈ ప్రాంత యువతకు ఎంతో మేలు జరుగుతుంది. – నాగేంద్ర, క్రికెట్ క్రీడాకారుడు, పులివెందుల. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించే పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ ఇన్ఛార్జి అధికారి డాక్టర్ రవిబాబు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడారు. జిల్లాలో పుట్టినప్పటి నుంచి ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ, పల్స్ పోలియో చుక్కలు వేయించాలన్నారు. ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో, రైల్వే స్టేషన్, బస్ స్టాండ్, హైరిస్క్ ఏరియాల్లో పోలియో చుక్కల కేంద్రాలు ఏర్పాటు చేశామని తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి ఈ కార్యక్రమం ప్రారంభమవుతుందన్నారు. జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ప్రవీణ్ మాట్లాడుతూ ప్రతి బిడ్డకు పోలియో చుక్కలు వేయించాలన్నారు. కార్యక్రమం లో డీపీఎమ్ఓ మహమ్మద్ తహర్, డాక్టర్ ఆరిపుల్లా, డెమో భారతి, రమేష్ రెడ్డి ముని రెడ్డి, వైద్య సిబ్బంది పాల్గొన్నారు.కడప తాలూకా సీఐ బదిలీ కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్లో రెండున్నర నెలలుగా విధులు నిర్వహిస్తున్న సీఐ నరసింహారాజును అనంతపురం వీఆర్ (వేకెన్సీ రిజర్వ్) కు బదిలీ చేస్తూ కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఉత్తర్వులు శనివారం జారీ చేశారు. గతంలో ఒంటిమిట్ట సీఐగా చేసిన ఆయన, ఇటీవల అల్మాస్పేట ఘటనలో దుండగుల రాళ్ల దాడిలో తీవ్రంగా గాయపడ్డారు. ఆ సమయంలో డీఐజీ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ స్వయంగా ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. కోలుకుని విధుల్లో చేరిన సీఐ నరసింహారాజును అకస్మాత్తుగా బదిలీ చేయడంపై సహచర సిబ్బంది, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పేకాట స్థావరంపై దాడులు 9 మంది అరెస్ట్, రూ. 2.53 లక్షలు స్వాధీనంప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారులో నడుస్తున్న పేకాట స్థావరంపై త్రీ టౌన్ పోలీసులు దాడులు నిర్వహించారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. బొల్లవరం పరిసర ప్రాంతంలో పెద్ద ఎత్తున పేకాట నిర్వహిస్తున్నారని సమాచారం రావడంతో త్రీ టౌన్ సీఐ రామాంజనేయుడు, ఎస్ఐ సంజీవరెడ్డిలు సిబ్బందితో కలసి శనివారం సాయంత్రం దాడులు నిర్వహించారు. దాడిలో 9 మంది పేకాటరాయుళ్లను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 2.53 లక్షలు నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసులకు పట్టుబడిన వారిలో ప్రొద్దుటూరు, రాజుపాళెం మండలంలోని అరకటవేముల గ్రామానికి చెందిన వారున్నారు. వీరిపై కేసు నమెదు చేసినట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
సర్దుబాటు సాగేనా!
సాక్షి, కడప ఎడ్యుకేషన్ : విద్యాశాఖలో ఏటా ఉపాధ్యాయుల బదిలీల ప్రక్రియ జరగడం సర్వసాధారణమే అయినా, ఈసారి జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల స్థానచలనాలకు తీవ్ర అడ్డంకులు ఏర్పడుతున్నాయి. తరగతి గదిలో విద్యార్థుల సంఖ్యను ప్రామాణికంగా తీసుకుని ఉపాధ్యాయులను సర్దుబాటు చేసేందుకు ప్రభుత్వం అధికారిక షెడ్యూల్ను విడుదల చేసింది. ఇందులో భాగంగా జూన్ 27వ తేదీ శనివారం మండలస్థాయిలో ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ప్రారంభించాల్సి ఉండగా.. క్షేత్రస్థాయిలో ఈ ప్రక్రియ అసలు ప్రారంభానికే నోచుకోలేదు. పైనుంచి మార్పులు.. డేటా అస్తవ్యస్తం! జిల్లాలోని మండలాలలో ఎంతమంది విద్యార్థులు ఉన్నారు? ఎంతమంది ఉపాధ్యాయులు అవసరమవుతారు? అనే అంశాలపై విద్యాశాఖ అధికారులు ముందే ప్రాథమిక డేటాను సిద్ధం చేశారు. అయితే, ఉన్నతాధికారుల నుంచి వచ్చిన తాజా ఆదేశాల మేరకు ఈ నివేదికల్లో కొన్ని కీలక మార్పులు చేయాల్సి రావడంతో పాటు, లబ్ధిదారుల డేటాను మళ్లీ సరి చేయాల్సి వచ్చింది. దీంతో జూన్ 27న మండల కేంద్రాల్లో జరగాల్సిన సర్దుబాటు పక్రియ పూర్తిగా వాయిదా పడింది. అంతటా బ్రేకులు.. ఆలస్యం ఖాయం! ప్రాథమిక దశ అయిన మండలస్థాయి సర్దుబాటు ప్రక్రియే సకాలంలో జరగకపోవడంతో, ఆ తర్వాత వరుసగా జరగాల్సిన డివిజన్స్థాయి, జిల్లాస్థాయి కౌన్సెలింగ్లు కూడా ఆటోమేటిక్గా వాయిదా పడినట్లేనని విద్యాశాఖ వర్గాలు స్పష్టం చేస్తున్నాయి. అధికారుల సమన్వయ లోపం, సాంకేతిక లోపాల కారణంగా నివేదికల రూపకల్పన ఆలస్యమవడంతో.. ప్రభుత్వం నిర్దేశించిన ప్రకారం ఈ నెల 30వ తేదీ నాటికి పూర్తి కావాల్సిన ఉపాధ్యాయ సర్దుబాటు కౌన్సెలింగ్ ప్రక్రియ మరింత ఆలస్యం కావడం ఖాయంగా కనిపిస్తోంది. కడప జిల్లాలో వాయిదా పడ్డ ఉపాధ్యాయుల కౌన్సెలింగ్ ప్రక్రియ డేటా సవరణల సాకుతో నిన్న నిలిచిన మండల స్థాయి కౌన్సిలింగ్ జిల్లాల పునర్విభజన నేపథ్యంలో ఉపాధ్యాయుల్లో తీవ్ర అయోమయం జూన్ 30 నాటికి టీచర్ల కౌన్సెలింగ్ పూర్తయ్యేనా?ప్రాసెస్ను మొదలు పెట్టాం.. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉపాధ్యాయుల సర్థుబాటు పక్రియ మొదలు పెట్టాము. సాధారణంగా 27వ తేదీ మండలాల వారి సర్థుబాటు పక్రియ నిర్వహించాల్సి ఉంది. అయితే పైస్థాయి నుంచి కొంత ఆలస్యం కావడంతో ఈ పక్రియకు అవాంతరమేర్పడింది. ఈ పక్రియ నిర్ణీత గడువులోపు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
కన్నీటి సంద్రంలో కారుణ్య దీపాలు
● నలుగురిని బలిగొన్న ప్రమాదాలు ● ఆరుగురికి చూపునిచ్చిన అమరత్వం కడప అర్బన్: ఆ కుటుంబాల్లో గుండెకోత మిగిలింది.. కన్నబిడ్డలు అనంతలోకాలకు వెళ్తుంటే ఆ తల్లిదండ్రుల కళ్లు కన్నీటి సముద్రాలయ్యాయి. కానీ, ఆ మహా దుఃఖంలోనూ వారు చూపిన మానవత్వం.. ఆరుగురు అంధుల జీవితాల్లో సరికొత్త కాంతులు నింపింది. 24 గంటల వ్యవధిలో కడప నగరంలో జరిగిన రెండు ఘోర రోడ్డు ప్రమాదాలు నాలుగు కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చాయి. వరుస ప్రమాదాలు చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్ పరిధిలోని నరసరామయ్యగారిపల్లి క్రాస్ రోడ్ వద్ద శనివారం ఉదయం విషాదం చోటుచేసుకుంది. ఓ ప్రైవేట్ సంస్థ (ఎయిల్ డిక్సన్ సీసీ కెమెరాల కంపెనీ) ఉద్యోగులను తీసుకెళ్తున్న బస్సు వేగంగా వచ్చి మోటార్ సైకిల్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో పేర్ల శివ (56) అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. తర్వాత రాత్రి కడప నగర శివార్లలోని పాలంపల్లె క్రాస్ వద్ద జరిగిన మరో ఘోర ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. చెట్టంత యువకులు కళ్లముందే శవాలుగా మారడంతో ఆయా కుటుంబాల్లో రోదనలు మిన్నంటాయి. గుండె కోతలోనూ గొప్ప మనసు పాలంపల్లె ప్రమాదంలో మరణించిన యువకులలో బండి జయకిషోర్, హర్షవర్ధన్ అనే ఇద్దరి తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కడుపుకోతను దిగమింగుకుని ఒక అద్భుతమైన నిర్ణయం తీసుకున్నారు. తమ బిడ్డలు ఇక లేకపోయినా.. వారి కళ్లు ఈ లోకాన్ని చూడాలనే సంకల్పంతో నేత్రదానానికి ముందుకు వచ్చారు. మృతుల కుటుంబీకులు చూపిన ఈ అసాధారణ మానవత్వానికి ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ సిబ్బంది తక్షణమే స్పందించి నేత్రాలను సేకరించారు. ఈ నేత్రాల ద్వారా ఆరుగురు అంధులకు చూపు రానుంది. కన్నబిడ్డల మరణ శోకంలోనూ సమాజం పట్ల బాధ్యతను చాటుకున్న ఆ తల్లిదండ్రుల నిర్ణయాన్ని కడప నగర ప్రజలు కన్నీళ్లతో అభినందిస్తున్నారు. ఈ పవిత్ర కార్యంలో పాల్గొన్న ఎల్.వి.ప్రసాద్ ఐ ఇన్స్టిట్యూట్ మేనేజర్ రెడ్డి బాబు, సిబ్బంది బాధిత కుటుంబాలకు ఇన్స్టిట్యూట్ తరఫున చేతులు జోడించి కృతజ్ఞతలు తెలియజేశారు. -
● ఆశలు నీరుగారిపోయాయి
పులివెందులలో అంతర్జాతీయ ప్రమాణాలతో క్రికెట్ స్టేడియం ఏర్పాటైతే మా లాంటి ఎంతోమంది గ్రామీణ ఆటగాళ్లకు అద్భుతమైన భవిష్యత్తు ఉంటుందని ఎంతో ఆశపడ్డాం. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల మా ఆశలన్నీ నీరుగారిపోయాయి. క్రికెట్ క్రీడల పట్ల, యువత ప్రోత్సాహం పట్ల అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తీసుకున్న నిర్ణయం చాలా గొప్పది. ఈ ప్రాంత క్రికెటర్ల కోసం స్టేడియం అందుబాటులోకి తేవాలని ఆయన శ్రమించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే రాజకీయ కక్షతో ఎక్కడి పనులు అక్కడే నిలిపివేసింది. ఇప్పటికై నా ప్రభుత్వం మొండివైఖరి వీడి చొరవ తీసుకొని, మిగిలిన అరకొర పనులను పూర్తి చేస్తే క్రీడాకారులకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – శ్రావణ్రెడ్డి, క్రికెట్ క్రీడాకారుడు, పులివెందుల. -
●రాజకీయాలు పక్కనబెట్టి.. అందుబాటులోకి తేవాలి
పులివెందుల టౌన్: పులివెందుల ప్రాంత యువతను అంతర్జాతీయ స్థాయి క్రీడాకారులుగా తీర్చిదిద్దాలనే వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశయాలకు కూటమి ప్రభుత్వం అడ్డగోలుగా గండికొడుతోంది. స్థానిక రింగ్రోడ్డు హెలీప్యాడ్ సమీపంలోని 14 ఎకరాల విశాల విస్తీర్ణంలో, సుమారు రూ.23 కోట్ల భారీ వ్యయంతో అడ్వాన్స్డ్ క్రికెట్ స్టేడియం నిర్మాణాన్ని గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టింది. భారత క్రికెట్ నియంత్రణ మండలి సహకారంతో, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 2022 ఫిబ్రవరిలో ప్రారంభమైన ఈ పనులు గత ప్రభుత్వ హయాంలోనే శరవేగంగా సాగి ఏకంగా 80 శాతం వరకు పూర్తయ్యాయి. కళ్లెదుటే ప్రగతి.. కానీ కూటమి పాలకుల నిర్లక్ష్యం గత ప్రభుత్వ హయాంలో స్టేడియం చుట్టూ భద్రత కోసం నిర్మించిన భారీ కాంపౌండ్ వాల్, అంతర్గత సీసీ రోడ్లు, అత్యాధునిక వసతులతో కూడిన రెండు భారీ బిల్డింగ్లు, సిటౌట్లు, ప్రధాన గ్యాలరీతో పాటు రెండు అత్యాధునిక క్రీడా మైదానాల పనులు 80 శాతం పూర్తయ్యాయి. స్థానిక క్రీడాకారులు మెట్రో నగరాలకు వెళ్లే పనిలేకుండా ఇక్కడే ప్రపంచస్థాయి శిక్షణ పొందేలా సర్వాంగ సుందరంగా ఈ మైదానాన్ని తీర్చిదిద్దారు. అయితే, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి పులివెందుల అభివృద్ధిపై కక్షసాధింపు చర్యలకు తెరలేపింది. పగ ప్రతీకార రాజకీయాలతో పనులను అర్ధంతరంగా నిలిపివేయడంతో, ఈ అంతర్జాతీయ స్టేడియానికి ‘చంద్ర’గ్రహణం పట్టినట్లయింది. కూటమి నాయకులెవరూ ఈ స్టేడియం వైపు కన్నెత్తి చూసిన పాపాన పోలేదని స్థానిక యువత వాపోతోంది. తరలిపోయిన సామగ్రి.. అసాంఘిక కార్యకలాపాలకు అడ్డా ! ఎక్కడి పనులు అక్కడే ఆగిపోవడంతో క్రికెట్ స్టేడియం తీవ్రంగా భ్రష్టుపట్టిపోతోంది. పాలకుల ఒత్తిడితో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ అధికారులు సైతం ఇక్కడున్న విలువైన క్రీడా సామగ్రిని రహస్యంగా వేరే ప్రాంతాలకు తరలించడంపై తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ప్రస్తుతం ప్రభుత్వ పర్యవేక్షణ, రక్షణ కరువవడంతో కోట్ల రూపాయల ప్రజాధనంతో పెంచిన మైదానంలోని గడ్డి ఇప్పుడు పశువులకు మేతగా మారుతోంది. రాత్రి వేళల్లో సెక్యూరిటీ లేకపోవడంతో మందుబాబులకు, అసాంఘిక కార్యకలాపాలకు ఇది నిలయంగా మారుతోందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అరకొరగా మిగిలిపోయిన కేవలం 20 శాతం పనులను పూర్తి చేసి అందుబాటులోకి తీసుకువస్తే క్రికెట్ స్టేడియం పరిసరాలు దెబ్బతినకుండా ఉంటాయని క్రీడాకారులు కోరుతున్నారు. వెంటనే అధికారులు స్పందించి చుట్టూ ఉన్న కాంపౌండ్ వాల్కు గేటు ఏర్పాటు చేసి, పక్కాగా సెక్యూరిటీ గార్డులను నియమించాలని డిమాండ్ చేస్తున్నారు. కూటమి నాయకులు రాజకీయాలను పక్కనబెట్టి, యువత భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని మిగిలిన పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి స్టేడియాన్ని ప్రారంభించాలని క్రీడాకారులు, స్థానిక ప్రజలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నారు. -
పారదర్శకంగా ఓటరు జాబితా సవరణ : డీఆర్వో
కడప సెవెన్రోడ్స్: ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమాన్ని ఎన్నికల సంఘం మార్గదర్శకాల ప్రకారం క్షేత్రస్థాయిలో సమర్థవంతంగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి (డీఆర్వో) మల్లికార్జునుడు ఏఈఆర్ఓలకు సూచించారు. కడప కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఇటీవల ఎంపికచేసిన ఏఈఆర్ఓలకు శనివారం నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. ఇంటింటికీ వెళ్లి ఎన్మరేషన్ ఫారాల పంపిణీ, స్వీకరణ, డిజిటలీకరణ ప్రక్రియను కచ్చితంగా నిర్వహించాలని.. అర్హులైన ప్రతి పౌరుడి పేరు ఓటరు జాబితాలో ఉండేలా, అనర్హుల పేర్లు చేరకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని ఆదేశించారు. ముసాయిదా ప్రచురణ అనంతరం వచ్చే అభ్యంతరాలు, దరఖాస్తులను పరిశీలించి తుది జాబితాను సిద్ధం చేయాలన్నారు. ఆధార్ను కేవలం గుర్తింపు పత్రంగానే పరిగణించాలని, జనన తేదీ లేదా నివాస ధ్రువీకరణకు అది ఆధారం కాదని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ కలెక్టర్లు హరిప్రసాద్, రంగస్వామి మరియు ఏఈఆర్ఓలు పాల్గొన్నారు. ప్రవక్తను కించపరిచిన వ్యక్తిపై ఎస్పీకి ఫిర్యాదు కడప వైఎస్ఆర్ సర్కిల్: మహమ్మద్ ప్రవక్త, ఆయన సతీమణిపై సోషల్ మీడియాలో అనుచిత వ్యాఖ్యలు చేసిన పశ్చిమ బెంగాల్కు చెందిన నాజియా ఇలాహి ఖాన్పై క్రిమినల్ కేసు నమోదు చేయాలని కడప జిల్లా ఎస్పీ విశ్వనాథ్కు శనివారం కాంగ్రెస్ నేతలు ఫిర్యాదు చేశారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పఠాన్ మహమ్మద్ అలీ ఖాన్, మయాన రహమతుల్లాఖాన్ తదితరులు ఎస్పీని కలిసి వినతిపత్రం సమర్పించారు. నాజియా ఇలాహి ఖాన్ ఇస్లాం సంప్రదాయాలు, ప్రవక్త దాంపత్య జీవితంపై తరచూ విద్వేషపూరిత వ్యాఖ్యలు చేస్తూ ముస్లింల మనోభావాలను గాయపరుస్తోందని వారు ఆరోపించారు. సైబర్ చట్టాల కింద ఆమైపె కేసు నమోదు చేసి, ఈ విద్వేషాల వెనుక ఉన్న కుట్రదారులను విచారించాలని కోరారు. దీనిపై స్పందించిన ఎస్పీ షెల్కే నచ్చికేత్ విశ్వనాథ్.. న్యాయ సలహా తీసుకుని తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఎస్పీని కలిసిన వారిలో కాంగ్రెస్ నేతలు కమల్ బాషా, ఎస్. హమీద్, రఫీ ఖాన్ ఉన్నారు. -
తల్లులకు కడుపుకోత మిగిల్చిన ప్రమాదం
కడప అర్బన్/వల్లూరు (చెన్నూరు) : కడప నగర శివారులో చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో పాలంపల్లె క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురు యువకులు దుర్మరణం చెందారు. ఈ సంఘటన మూడు కుటుంబాలలో తీవ్ర విషాదాన్ని నింపింది. ముగ్గురు తల్లులకు కడపుకోత మిగిల్చింది. ఈసంఘటనపై పోలీసుల, మృతుల కుటుంబీకుల సమాచారం మేరకు వివరాలిలా వున్నాయి. తిరుపతి జిల్లా తిరుపతి నగరం అరుణోదయనగర్కు చెందిన కోటకొండ హర్షవర్ధన్ (22) బీటెక్ వరకు చదువుకున్నాడు. ఉద్యోగం కోసం ఎదురుచూస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన బండి జయకిషోర్ (18) అనే యువకుడి తండ్రి అంజి కూలీపని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. ఇటీవలే మృతి చెందాడు. జయకిశోర్ ఇంటర్ పూర్తి చేశాడు. తిరుపతిజిల్లా అనంతరాజుపేట గ్రామం తూర్పుపల్లెకు చెందిన డి. రవీంద్రారెడ్డి కుమారుడు దేసు సాయి శ్రీధర్రెడ్డి (28) గత ఏడాది అమెరికాలో ఎంఎస్ పూర్తి చేసి ఇండియాకు వచ్చాడు. తన తండ్రికి కొన్ని నెలల కిందట బైపాస్ సర్జరీ జరిగింది. ఇక ఇక్కడే వుండి వ్యవసాయం చూసుకోవాలనీ అనుకున్నాడు. వీరు ముగ్గురు తమ స్విప్ట్ కారులో రెండు రోజుల కిందట హైదరాబాద్లో తమ స్నేహితుడి నిశ్చితార్థం ఉంటే వెళ్లారు. తిరిగి శుక్రవారం హైదరాబాద్ నుంచి బయలుదేరారు. కడప నగర శివార్లలోకి వచ్చేసరికే ఈ ప్రమాదం చోటచేసుకుంది. కడప రిమ్స్ మార్చురీలో మూడు మృతదేహాలకు పోస్టుమార్టం నిర్వహించారు. హర్షవర్ధన్ తండ్రి చలపతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు చెన్నూరు సీఐ చాంద్బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు యువకుల్లారా.. వేగంగా వెళ్లకండి రోడ్డు ప్రమాదం కేవలం అతివేగం నిర్లక్ష్యం వల్లనే చోటుచేసుకుందని ప్రాథమికంగా తెలుస్తోంది. తిరుపతి నుంచి హైదరాబాద్ వెళ్లి తిరిగి వస్తున్న స్విప్ట్కారు పాలెంపల్లె క్రాస్ వద్దకు రాగానే ఎదురుగా వెళుతున్న లారీని వేగంగా వెళ్లి ఓవర్టేక్ చేశారు. ఎదురుగా తిరుపతి వైపు నుంచి వస్తున్న ఎర్టిగా కారును స్విఫ్ట్కారు వారు ఢీకొన్నారు. దీంతో స్విఫ్ట్కారు ఎగిరిపడి లారీని వెనక్కి ఢీకొని నుజ్జునుజ్జయింది. ముగ్గురు మృత్యువాత పడ్డారు. ఎర్టిగా కారుకు సంబంధించిన బెలూన్లు ఓపెన్ కావడంతో అందులో ప్రయాణిస్తున్న ముగ్గురు కార్తీక్(24) మున్నా (23) నాగరాజు (38) గాయాలతో బయటపడ్డారు. వీరిని మొదట కడప రిమ్స్కు, తర్వాత కర్నూలుకు తరలించారు. ఎర్టిగా కారు వారు తిరుపతికి చెందిన వారు. ఎంబ్రాయిడరీ పనులకు సంబంధించిన సంస్థ కార్తీక్ది కావడంతో మిగిలిన ఇద్దరితో కలిసి మెటిరియల్ను సరఫరా చేసేందుకు కర్నూలు, హైదరాబాద్కు బయలుదేరారు. మార్గమధ్యంలో ఈ సంఘటన చోటుచేసుకుంది. ఈ సందర్భంలో ముగ్గురు యువకుల తల్లులు రోదనతో తమ ఆవేదనను తెలియజేశారు. ఎవరైనా సరే ప్రధానంగా 20 నుంచి 25 సంవత్సరాల వయసున్న యువకులు బైక్ల్లోగానీ, కార్లలోగానీ మితిమీరిన వేగంతో, వెళ్లరాదన్నారు. మా ముగ్గురి కుటుంబాలలో విధించిన కడుపుకోత మరే కుటుంబాలలో ఉండకూడదని పేర్కొన్నారు.కోటకొండ హర్షవర్ధన్ (ఫైల్) దేసు సాయి శ్రీధర్ రెడ్డి (ఫైల్) బండి జయకిషోర్ (ఫైల్)రెండు కార్లు ఢీకొని ముగ్గురు దుర్మరణం -
జీడీఏఏపీ కార్యవర్గంలో కడప డాక్టర్లకు చోటు
కడప అర్బన్ : గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (జీడీఏఏపీ) రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు నిర్వహించారు. ఈ ఎన్నికల్లో వైఎస్ఆర్ జిల్లా కడపకు చెందిన నలుగురు ప్రభుత్వ వైద్యులు రాష్ట్ర కార్యవర్గానికి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కడప రిమ్స్ సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి సూపరింటెండెంట్గా సేవలందిస్తున్న డాక్టర్ సునీల్ కుమార్రెడ్డి రాష్ట్ర ఉపాధ్యక్షులుగా, ప్రభుత్వ వైద్య కళాశాల(రిమ్స్)లో కమ్యూనిటీ మెడిసిన్ అసోసియేట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న డాక్టర్ సి.వి.ఎస్.రాయుడు రాష్ట్ర కార్యదర్శిగా ఎన్నికయ్యారు. ప్రభుత్వ దంత వైద్య కళాశాల అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ ఓసురెడ్డి శ్రీదేవి డెంటల్ కార్యదర్శిగా, కడప ప్రభుత్వ ఆసుపత్రిలో సివిల్ అసిస్టెంట్ సర్జన్గా బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ స్వామి దాస్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడప జిల్లా నుంచి నలుగురు వైద్యులు ఏకగ్రీవంగా ఎన్నికవడం స్థానిక ప్రభుత్వ వైద్య కళాశాలల్లో పని చేస్తున్న వైద్యులందరికీ దక్కిన గౌరవంగా భావిస్తున్నామన్నారు. వైద్యుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించడానికి కృషి చేస్తామని తెలిపారు. -
రైలు ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలు
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంటపంపల్లి రైల్వేస్టేషన్ సమీపంలో శుక్రవారం రైలు పట్టాలు దాటుతుండగా రైలు ఢీకొట్టడంతో ఓ వ్యక్తి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికుల వివరాల మేరకు.. మంటపంపల్లికి చెందిన వేంపల్లి అబ్దుల్ రహీం(32) కర్నూలు నుంచి వచ్చి ఇంటికి వెళ్లేందుకు రైలు పట్టాలు దాటుతుండగా ఈ ప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో అబ్దుల్ రహీం తలకు తీవ్ర గాయాలు అయ్యాయి. సమాచారం అందుకున్న రైల్వే పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని బాధితుడిని కడప రిమ్స్కు తరలించారు. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ‘మాకు హాని కలిగితే వారిదే బాధ్యత’ ● పోలీస్స్టేషన్ను ఆశ్రయించిన జంట బ్రహ్మంగారిమఠం : మండలంలోని దిరసవంచ పంచాయతీ కమ్మవారిపల్లెకు చెందిన వెంకటసుబ్బయ్య, మంజుల ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరు శుక్రవారం బి.మఠం పోలీసులను ఆశ్రయించారు. ఈ సందర్భంగా మంజుల విలేకరులతో మాట్లాడుతూ ‘మేము ఇద్దరం ఒకే కులానికి చెందిన వారం. మాకు 2023లో వివాహం అయ్యింది. మాకు ఇద్దరు పిల్లలు ఉన్నారు. నా భర్తకు యాక్సిడెంట్ కావడంతో రెండు కాళ్లు పని చేయడం లేదు. అయినా ప్రైవేట్ ఉద్యోగం చేసి నన్ను బాగానే చూసుకుంటున్నాడు. మాకు వివాహం అయినప్పటి నుంచి మా కుటుంబ సభ్యులు గ్రామంలోకి రావద్దు అని వస్తే చంపుతామని బెదిరించడంతో భయంతో.. ఇన్నాళ్లు కర్ణాటకలో ఉన్నాం, మా భర్తకు చెందిన వ్యవసాయ భూములను చూసుకొనేందుకు గ్రామానికి వారం రోజుల క్రితం వచ్చాం. గ్రామంలోకి రాగానే మా భర్త కుటుంబ సభ్యులపై.. మా బంధులవులైన ముద్దుకృష్ణంనాయుడు, భగీదనాయుడు, చంద్రబాబు నాయుడు, శేషాద్రినాయుడు చంపుతామని హెచ్చరిస్తున్నారు. వారు చంపుతారో ఏమోనని ఎస్పీని ఆశ్రయించాం, స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయమనడంతో వచ్చాం. నాకు గానీ నా భర్తకు ఎలాంటి హాని కల్గినా వారి ద్వారానే జరుగుతుందని పోలీసులకు ఫిర్యాదు చేశాం. మాకు పోలీసులు సహకరిస్తారని కోరుకుంటున్నాం’ అని ఆమె వివరించారు. -
గుర్తుతెలియని వృద్ధుడి మృతి
కడప అర్బన్ : కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గర మురళి హాలుకు వెళ్లే దారిలో గుర్తుతెలియని వృద్ధుడు(60) ఈనెల 22వ తేదీన మృతి చెందాడు. అతని ఆచూకీ తెలియకపోవడంతో కడప రిమ్స్ మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని కడప వన్టౌన్ పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పొరపాటున తీసుకున్న బ్యాగ్ అప్పగింత పోరుమామిళ్ల : బస్సులో పొరపాటున మరొకరి బ్యాగు దించుకున్నారు. కిందకు దిగాక బస్సు వెళ్లి పోయాక ఆ బ్యాగు తమది కాదని గుర్తించిన వారు తప్పు దిద్దుకోవడంతో సొంతదారుడికి చేరింది. దీనికి మాజీ కంట్రోలర్ నాగరాజు సహకరించారు. వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం సాయంత్రం గిద్దలూరు నుంచి మైదుకూరు వస్తున్న బస్సులో దువ్వూరుకు చెందిన రమణారెడ్డి భార్యాబిడ్డలతో ఎక్కాడు. అదే బస్సులో కాశినాయన జ్యోతి క్షేత్రానికి 12 మంది బృందం ఎక్కడం జరిగింది. వారంతా ఓబుళాపురం వద్ద జ్యోతికి వెళ్లేందుకు బస్సు దిగారు. బస్సు దిగడంలో తమ బ్యాగులతోపాటు మరో బ్యాగు దింపుకొన్నారు. ఓబుళాపురం నుంచి బస్సు లేదా ఆటోలో వెళ్లాల్సి వుంది. అయితే వారు దింపుకొన్న బ్యాగులో ఒకటి తమది కాదని గుర్తించారు. వెంటనే అక్కడున్న వారితో విషయం చెప్పారు. వారు పోరుమామిళ్లలో ఉన్న మాజీ కంట్రోలర్ నాగరాజుకు సమాచారం చెప్పారు. వెంటనే నాగరాజు స్పందించి గాంధీబొమ్మ సెంటర్లో బస్సును ఆపి, బ్యాగు గురించి చెప్పగా, రమణారెడ్డి తమ బ్యాగు ఒకటి లేదని చెప్పాడు. అంత వరకు రమణారెడ్డికి తమ బ్యాగు పోయిన విషయమే తెలియదు. నాగరాజు వెంటనే రమణారెడ్డిని తన బైకుపై తీసుకొని ఓబుళాపురం వెళ్లి బ్యాగును స్వాధీనం చేసుకుని, రమణారెడ్డికి అప్పగించాడు. బ్యాగు లభించడంతో రమణారెడ్డి ఊపిరి పీల్చుకున్నాడు. నాగరాజు సమయానికి వచ్చి సమాచారం చెప్పడంతోపాటు ఓబుళాపురం తెచ్చి, బ్యాగును అప్పగించడంతో ఆనందంతో కృతజ్ఞతలు చెప్పాడు. -
ఆధ్యాత్మిక కేంద్రంగా తాళ్లపాక అభివృద్ధి
రాజంపేట : ఆధ్యాత్మిక కేంద్రంగా తాళ్లపాక అభివృద్ధికి అన్ని చర్యలను తిరుమల తిరుపతి దేవస్థానం చేపట్టనున్నదని తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈవో ప్రశాంతి అన్నారు. శుక్రవారం పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకను ఆమె సందర్శించి, అక్కడ చేపట్టవలసిన అభివృద్ధి అంశాలకు సంబంధించి పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తాళ్లపాక అభివృద్ధిపై శ్రీశైలం పాలకమండలి బోర్డు చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు టీటీడీ ఈవోకు సమర్పించిన అభివృద్ధి పనులకు సంబంధించి అంశాలను పరిశీలించడం జరుగుతుందన్నారు. తాళ్లపాక ముఖద్వారం నుంచి అన్నమయ్య ధాన్యమందిర వరకు కవుల విగ్రహాల ఏర్పాటు, తాళ్లపాక చెరువులో అన్నమయ్య కీర్తనలు రాస్తున్నట్లుగా, శివలింగం ఏర్పాటుతోపాటు ఆధ్యాత్మిక కేంద్రంగా తీర్చిదిద్దాలని శ్రీశైలం చైర్మన్ కోరారన్నారు. వీటికి బోర్డు ఆమోదం తెలిపాల్సి ఉందన్నారు. ఆ తర్వాత పనులకు టెండర్లను పిలుస్తారన్నారు. అలాగే సిద్దేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణ, ఏర్పాట్లకు సంబంధించి ఆమె దృష్టి సారించారు. 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద టీటీడీ శ్రీవారి ఆలయ నిర్వహణ విషయంలో చెడ్డపేరు తీసురావద్దని టీటీడీ సిబ్బందికి డిప్యూటీ ఈవో హెచ్చరించారు. అంతకు ముందుగా శ్రీవారిని ఆమె దర్శించుకున్నారు. ఈమె వెంట ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, తాళ్లపాక గ్రామస్తులు అదృష్ణదీపుడు, మోహనరావు, టీటీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో హజరత్ పీరుల్లా మాలిక్ గంధోత్సవం
● పలు రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు ● దర్గా అంతటా పూల కళ విద్యుద్దీప వెలుగులో పెద్దదర్గా ప్రవేశ ద్వారం దర్గా ఆవరణలో భక్తుల సందడి కడప సెవెన్రోడ్స్ : దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా పేరు గాంచిన కడప పీరుల్లామాలిక్ దర్గా మరోమారు తన విశిష్ఠతను చాటుకుంది. దర్గా గురువులు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ సజీవ సమాధి అయిన సందర్భంగా ఏటా ఈ ఉరుసును వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ మారు కూడా ఉరుసును రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా దర్గా అంతటా విద్యుద్దీపాలు అలంకరించారు. ముఖ్యంగా దర్గాలోని గురువుల మజార్ ప్రాంతాన్ని పూర్తిగా రంగురంగుల పూలతో అలంకరించారు. దర్గా ప్రాంగణమంతా పూల పరిమళం నిండి భక్తులను మైమరిపించింది. ఈ సందర్భంగా ఉద యం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంధం సమర్పించి ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ప్రధాన గురువుల మజార్ వద్ద మరోమారు గంధం సమర్పణ చేసి ప్రార్థనలు చేశారు. – మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన పీర్లను శుక్రవారం ఊరేగింపుగా తీసుకెళ్లి నీళ్లతో శుభ్రపరిచి పెట్టెల్లో భద్రపరిచారు. అంతకుముందు దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఫాతెహా నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. -
కడప చాప్టర్ అడిషనల్ కో కన్వీనర్ గా ఓవీ రెడ్డి
కడప ఎడ్యుకేషన్: భారత జాతీయ కళలు, సాంస్కృతిక వారసత్వ సంస్థ కడప చాప్టర్ అడి షనల్ కో కన్వీనర్ గా ఓ. వెంకటేశ్వరెడ్డి నియమించారు. ఈ పదవిలో ఈ యన మూడేళ్ల పాటు కొనసాగుతారు. 1 నుంచి శిక్షణ తరగతులు కడప వైఎస్ఆర్ సర్కిల్: కర్నూలు నగరంలో జులై 1 నుంచి 4 వరకు నిర్వహించే ఏఐఎస్ఎఫ్ రాష్ట్రస్థాయి శిక్షణ తరగతులను జయప్రదం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని హోచిమన్ భవన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా మోసం చేసిందన్నారు. రెండేళ్ల పండగ పేరిట రాష్ట్రమంతా ఏదో పెద్ద చేశామన్న ఆనందంలో సంబరాలు చేసుకోవడం సరికాదని.. విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలని విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ని డిమాండ్ చేశారు. ఏఐఎస్ఎఫ్ శిక్షణ తరగతులలో రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్నటువంటి విద్యా వ్యతిరేక విధానాల పైన చర్చించి రాష్ట్రవ్యాప్తంగా సమరశీల పోరాటాలకు శ్రీకారం చుడతామన్నారు. అలాగే ఈ నెల 28 వతేదీ కడప నగరంలో జరిగే ఏఐఎస్ఎఫ్ జిల్లా స్థాయి విద్యా వైజ్ఞానిక రాజకీయ శిక్షణ తరగతులు జయప్రదం చేయాలని ఆయ న కోరారు. ఏఐఎస్ఎప్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, నగర కార్యదర్శి రాజేష్, నగర సహాయ కార్యదర్శులు మల్లికార్జున రెడ్డి, అభిరామ్, చేతన్, తదితరులు పాల్గొన్నారు. – డీఈవో షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్: ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) పై భయాందోళనలు వీడాలని డీఈవో షేక్ శంషుద్దీన్ పేర్కొ న్నారు. శుక్రవారం కడపలోని యూటీఎఫ్ భవ న్లో ఆ సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన టెట్ ఉచిత కోచింగ్ సెంటర్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. సుప్రీం కోర్టు తీర్పు మేరకు ఎన్సీటీఈ మార్గదర్శకాలకు అనుగుణంగా 2028 ఆగస్టు 31 లోపు ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులంతా టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించాల్సి ఉందని అన్నారు. టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడంలో ఉపాధ్యాయులకు ఆందోళన అవసరమేలేదని, బోధనలో అపార అనుభవం ఉన్న ఉపాధ్యాయులు టెట్ పరీక్ష ఉత్తీర్ణత సాధించడం పెద్ద సమస్యేమి కాదన్నారు. యూటీఎఫ్ ఉపా ధ్యాయులకు ఉచిత కోచింగ్ను ఏర్పాటు చేయ డం అభినందనీయమని పేర్కొన్నారు. యూ టీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడారు. టెట్ బోధకులు కోవెల ప్రసాద్ రెడ్డి, బి.మస్తాన్ వలి, యూటీఎఫ్ జిల్లా గౌరవ అధ్యక్షుడు ఎన్.నాగార్జున రెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహా రావు జిల్లా కార్యదర్శులు సి.వి.రమణ, ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.డి.దేవదత్తం, ఎన్.కంబగిరి, సి.సుదర్శన్, జె.వి.సుబ్బారెడ్డి, ఎ.వీరనారాయణ, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు డి.క్రిష్ణారెడ్డి, చెరుకూరి శ్రీనివాసులు పాల్గొన్నారు. -
డ్రగ్స్ రహిత సమాజమే లక్ష్యం
కడప అర్బన్ : డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే లక్ష్యంగా కడప నగరంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ‘నషా ముక్త్ భారత్ అభియాన్’కార్యక్రమాన్ని జూన్ 26న (శుక్రవారం) సాయంత్రం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ముఖ్య అతిథిగా హాజరై, యువత డ్రగ్స్కు దూరంగా ఉండాలని, డ్రగ్స్ రహిత సమాజ స్థాపనే ప్రతి ఒక్కరి లక్ష్యం కావాలని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ‘నషా ముక్త్ భారత్ అభియాన్’కార్యక్రమాలను చేపడుతూ, గంజాయి, డ్రగ్స్ వంటి నిషేధిత మత్తు పదార్థాల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాలను ప్రజలకు, యువతకు వివరిస్తూ, అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఇందులో భాగంగా నేడు నగరంలో సిగ్నేచర్ క్యాంపైన్తోపాటు వాకథాన్ అవేర్ నెస్ ర్యాలీని చేపట్టామన్నారు. విభిన్న ప్రతిభావంతుల, ట్రాన్స్జెండర్ల, సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసిస్టెంట్ డైరెక్టర్ ఆర్.వి కృష్ణ కిషోర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లా నషా ముక్త్ భారత్ అభియాన్ పై అవగాహన కార్యక్రమాల నిర్వహణలో రాష్ట్రంలో ప్రథమ స్థానం సాధించిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్.పి(ఏ.ఆర్) బి.రమణయ్య, డ్రగ్ కంట్రోల్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ ఆశా, కడప ఇంచార్జ్ డి.ఎస్.పీ ఇ.బాలస్వామి రెడ్డి, ఏ.ఆర్ డి.ఎస్.పీ పి.నాగేశ్వర రావు, ఎకై ్సజ్ శాఖ అసిస్టెంట్ కమిషనర్ వి.చంద్రశేఖర్రెడ్డి, నార్కోటిక్స్ సి.ఐ గోవిందరెడ్డి, కడప నగరంలోని సి.ఐలు, ఎస్.ఐలు, మెప్మా, ఐ.సి.డి.ఎస్, డి.ఎం.హెచ్.ఓ అధికారులు, స్వచ్ఛంద సంస్థలు, డీ అడిక్షన్ కేంద్రాల నిర్వాహకులు పాల్గొన్నారు. -
కడప కేంద్రకారాగారం వద్ద పోలీసుల హైడ్రామా !
● బెయిల్పై వచ్చిన రియాజ్, అతహవుల్లా .. ● ఆ వెంటనే అదుపులోకి తీసుకున్న కడప టూటౌన్ పోలీసులు ● ఇద్దరిని అల్మాస్పేట ఘటనలో అరెస్ట్.... రిమాండ్కు తరలింపు నిందితులను తమ వాహనంలో తరలిస్తున్న కడప టూటౌన్ పోలీసులు కడప కేంద్ర కారాగారం నుంచి బయటకు వస్తున్న రియాజ్, అతహవుల్లా కడప అర్బన్: కడప నగర శివార్లలోని కేంద్ర కారాగారం వద్ద శుక్రవారం హైడ్రామా చోటు చేసుకుంది. కడప నగరం నకాష్కు చెందిన షేక్ రియాజ్ అలియాస్ షూటర్, పఠాన్ అతహవుల్లా అలియాస్ అతుల్ సెంట్రల్ జైలు నుంచి బెయిల్పై విడుదలవుతున్నారన్న సమాచారంతో అటు పోలీసులు.. ఇటు వారి బంధువులు అక్కడ మోహరించడంతో కాసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. రియాజ్, అతహవుల్లాలను గత నెల 15న పోలీసులు గంజాయి కేసులో అరెస్టు చేసి రిమాండ్కు తరలించిన విషయం తెలిసిందే. సదరు గంజాయి కేసులో ఈ నెల 15 వీరికి కోర్టు బెయిల్ మంజూరు చేసింది. కాగా అల్మాస్పేట ఘటనలోనూ వీరిని నిందితులుగా చేర్చిన పోలీసులు బయటికొస్తే అరెస్ట్ చేయాలని సెంట్రల్ జైలు వద్దే పడిగాపులు కాస్తూ వచ్చారు. అల్మాస్పేట సంఘటన జరిగిన సమయంలో తాము అక్కడ లేమని.. తమను ఈ కేసులో అన్యాయంగా ఇరికిస్తున్నారని రియాజ్, అతహవుల్లాలు తగిన సాక్ష్యాధారాలతో హైకోర్టులో హెబియస్కార్పస్ పిటీషన్ వేశారు. ఓ వైపు రాజకీయ ఒత్తిళ్లు.. మరోవైపు తమ అక్రమాలనే ప్రశ్నిస్తున్నారన్న అక్కసుతో సదరు నిందితులిద్దరినీ ఎలాగైనా అరెస్టు చేయాలనే ఉద్దేశంతో శుక్రవారం ఖాకీలు భారీగా మోహరించారు. ఈ నేపథ్యంలో నిందితుల తరఫున న్యాయవాదులు బెయిల్ ఉత్తర్వులు కేంద్ర కారాగార అధికారులకు అందజేయగా... షేక్ రియాజ్, పఠాన్ అతహవుల్లా కడప కేంద్రకారాగారం ప్రధాన ద్వారం నుంచి బయటకు వచ్చారు. ఆ మరుక్షణమే కడప టూటౌన్ సీఐ శ్రీహరి, తమ సిబ్బందితో కలిసి అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తీసు కెళ్లారు. సాయంత్రానికి వీరిని అరెస్ట్ చేసి మెజిస్ట్రేట్ ముందు హాజరుపరచగా.. ఆయన ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించారు. అల్మాస్పేట ఘటనకు తమ పిల్లలకు ఎలాంటి సంబంధం లేదని.. అన్యాయంగా కేసులో ఇరికించి అరెస్ట్ చేస్తున్నారనీ నిందితులకుటుంబసభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. రాజకీయ ఒత్తిళ్లతోనే తమ పిల్లలపై పోలీసులు అక్ర మ కేసులను పెట్టి వేధిస్తున్నారని ఆరోపిస్తున్నారు. -
కూటమి తీరుపై దస్తావేజు లేఖరుల నిరసన
కడప వైఎస్ఆర్ సర్కిల్: రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ప్రైవేటీకరణ చేయాల ని, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పా టు చేయాలని రాష్ట్ర మంత్రివర్గం తీసుకున్న నిర్ణయాన్ని తక్షణం ఉపసంహరించుకోవాలని ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. స్థానిక పాత రిమ్స్ లో దస్తావేజు లేఖరుల సమావేశంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ప్రైవేటీకరణతో ఆస్తులకు భద్రత లేకుండా పోతుందన్నారు. ప్రైవేటు వ్యక్తులకు రిజిస్ట్రేషన్ శాఖ అప్పజెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. రిజిస్ట్రేషన్ చేసుకునే ప్రతి డాక్యుమెంట్కు రిజిస్ట్రేషన్ చార్జీలతో పాటు అదనంగా ప్రైవేటు వ్యక్తులకు ప్రతి డాక్యుమెంట్కు 2వేల రూపాయలు చెల్లించాలని ప్రభుత్వం నిర్ణయించడం పెట్టుబడిదారులకు దోచిపెట్టడమేనని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ పీపీపీ విధానం వల్ల రిజిస్ట్రేషన్ శాఖలో అనేక గందరగోళాలు నెలకొంటాయని దాని మూలంగా ప్రజల ఆస్తులకు, ప్రాణాలకు ముప్పు వాటిల్లుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. తక్షణం రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ, రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు నిర్ణయాన్ని ఉపసంహరించుకోవాలని లేకుంటే రాష్ట్ర వ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో ఆంధ్రప్రదేశ్ దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం నాయకులు యు. సంజీవరాయుడు, కే ఓబులేసు, టి. లోకనాథం, వై.సుబ్బరాయుడు, గంగయ్య, మహేష్, శంకర్, రియాజ్, ఇక్బాల్, గణపతి, యాకోబు, రామకష్ణ, ఫైరోజ్, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
రెండు కార్లు ఢీ.. ముగ్గురు దుర్మరణం
కడప అర్బన్: వైఎస్సార్ జిల్లా కడప నగర శివారులోని పాలెంపల్లె క్రాస్ వద్ద శుక్రవారం రాత్రి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొనడంతో ప్రమాదం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు దుర్మరణం చెందారు. మొదట స్విఫ్ట్కారు (ఏపి03 బివి 3166)లో గాయపడిన ముగ్గురిని 108 వాహనంలో రిమ్స్కు తరలించారు. ప్రాథమికంగా అందిన సమాచారం మేరకు హైదరాబాద్ నుంచి తిరుపతికి వెళుతున్న స్విఫ్ట్ కారును తిరుపతి నుంచి హైదరాబాద్కు వెళుతున్న ఎర్టిగా కారు (టిఎస్33సి 0943) ఢీకొనడంతో ఈ దుర్ఘటన జరిగింది. ఈ ప్రమాదంలో స్విఫ్ట్ కారులోని ముగ్గురు మృతి చెందారు. ప్రమాదం జరిగిన వెంటనే ఎర్టిగా కార్లో బెలూన్స్ ఓపెన్ కావడంతో ఆ వాహనంలోని ముగ్గురు గాయాలతో బయటపడ్డారు. మరణించిన వారిలో తిరుపతి జీవకోనకు చెందిన హర్షవర్ధన్, కిషోర్తో తోపాటు మరో వ్యక్తి ఉన్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. సంఘటనా స్థలానికి కడప ట్రాఫిక్, చెన్నూరు పోలీసులు చేరుకున్నారు. మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. ఎర్టిగా కారులో బెలూన్స్ తెరుచుకోవడంతో ముగ్గురికి స్వల్పగాయాలు రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ముగ్గురు యువకులు -
మాకు న్యాయం చేయాలి
● చిన్నారి తల్లితోపాటు బంధువుల బైటాయింపు పులివెందుల రూరల్ : పులివెందుల నియోజకవర్గం లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గురువారం నాలుగేళ్ల చిన్నారి నిత్విక దారుణ హత్యకు గురైన విషయం తెలిసిందే. శుక్రవారం చిన్నారి తల్లి సృజన, బంధువులు, గ్రామస్తులు.. హత్య చేసిన వారిని కఠినంగా శిక్షించి తమకు న్యాయం చేయాలంటూ పట్టణంలోని పూలంగళ్ల సర్కిల్లో బైటాయించారు. దీంతో అక్కడికి డీఎస్పీ మురళీ నాయక్, ఎస్ఐలు చేరుకుని మీకు న్యాయం జరిగే విధంగా చూస్తామని హామీ ఇవ్వడంతో బైటాయింపును విరమించారు. అనంతరం పులివెందులలోని డీఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ మురళీ నాయక్ మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతురాలి తండ్రి రామాచారి కుటుంబానికి, అదే గ్రామానికి చెందిన వెంకట్రామిరెడ్డి కుటుంబానికి గత ఏడాది ఆగస్టు నెలలో చిన్న, చిన్న గొడవలు జరిగాయని, వీటి వల్ల మోటార్ బైక్ కాల్చిన సంఘటనలు కూడా జరిగాయన్నారు. దీనిపై అప్పట్లో పోలీసులు ఇరు వర్గాలకు చెందిన ఐదుగురిపై కేసు నమోదు చేశారన్నారు. ఇరు వర్గాలు ఎలాంటి గొడవలు పడకుండా వారి ఇళ్ల వద్ద సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. లింగాల ఎస్ఐ జగదీశ్వర్రెడ్డి, రూరల్ సీఐ శాంతి లాల్ ఆధ్వర్యంలో క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్తో.. హత్యా సంఘటనలో స్వాతి అనే మహిళనే కాకుండా ఇంకా ఎవరైనా ఉన్నారా అనే కోణంలో విచారణ చేస్తున్నట్లు తెలిపారు. నిందితులను కఠినంగా శిక్షిస్తామన్నారు. చిన్నారి తల్లి సృజన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. మీ వల్లే మాకు న్యాయం జరగలేదు : ఏడాది క్రితం జరిగిన గొడవల వల్లే ఇప్పుడు మా పాప ప్రాణాలు పోగొట్టుకోవాల్సి వచ్చిందని, అప్పుడే మీరు న్యాయంగా మాట్లాడి ఉంటే ఇప్పుడు ఇలా జరిగేది కాదని తుంగభద్ర ప్రాజెక్టు హైలెవెల్ కెనాల్ చైర్మన్ జోగిరెడ్డిని మృతురాలి తల్లి సృజన, బంధువులతోపాటు గ్రామస్తులు నిలదీశారు. మీరు సాక్ష్యాలను తారుమారు చేయడానికి ఇక్కడికి వచ్చారా, ఏడాది క్రితం జరిగిన గొడవలో వెంకట్రామిరెడ్డి, స్వాతిలకు టీడీపీ నాయకులు సపోర్ట్ చేయడం వల్ల చంపుకొనే వరకు దారి తీసిందని, ఆయనతో వాగ్వాదానికి దిగారు. పోలీసులు కూడా అధికార పార్టీకి ఒత్తాసు పలుకుతూ మా బంధువులను కూడా కొట్టేందుకు వచ్చారని వారు వాపోయారు. మీరేం మాకు న్యాయం చేయొద్దంటూ ఆయనపై వారు విరుచుకు పడ్డారు. -
ప్రారంభమైన క్రీడా పాఠశాల ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల ప్రవేశాల కోసం జిల్లా స్థాయి ఎంపికలు నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన 4,5,6 తరగతుల జిల్లా స్థాయి ఎంపికలకు దాదాపు 100 మంది విద్యార్థులు హాజరైనట్టు డీఎస్డీవో గౌస్బాషా తెలిపారు. వారికి సర్టిఫికెట్ల వెరిఫికేషన్, ఎత్తు, బరువు వంటివి నిర్వహించారు. అనంతరం విద్యార్థులకు డీఎస్ఎ క్రీడా మైదానంలో మెడిసన్ బాల్, స్టాడింగ్ బ్రాడ్ జంప్, వర్టికల్ జంప్, ఫ్లెక్సిబిలిటీ, షటిల్ రన్, 30 మీటర్స్, 800 మీటర్స్ రన్ వంటి వివిధ క్రీడాంశాల్లో పోటీలు నిర్వహించారు. శనివారం 6,7,8,9 తరగతి విద్యార్థులకు ఎంపికలు నిర్వహించనున్నారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి విద్యార్థులు వారి తల్లిదండ్రులు అధిక సంఖ్యలో ఇచ్చారు. వారికి కుర్చీలు, మంచి నీటి ఔకర్యం, షామియానాలు వంటివి ఏర్పాటు చేయకపోవడంతో ఇబ్బంది పడ్డారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీలోని శ్రీనగరం వద్ద కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై శుక్రవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రామిశెట్టి రామలక్షుమ్మ (53) అనే మహిళ మృతి చెందింది. శ్రీనగరంలో హైవే పక్కనే నివాసం ఉంటున్న రామలక్షుమ్మ తమ మేకలను కొద్ది దూరంలో ఉన్న భర్త శ్రీరాములు వద్దకు చేర్చి తిరిగి ఇంటికి వస్తుండగా.. వెనుకవైపు నుంచి వేగంగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొంది. సంఘటనలో తీవ్ర గాయాలతో ఉన్న ఆమెను 108 అంబులెన్స్లో స్థానిక ప్రభుత్వాసుపత్రికి చేర్చారు. మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించగా అక్కడ మృతి చెందింది. రామలక్షుమ్మకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు కాగా వారందరికీ వివాహాలు అయ్యాయి. కరెంటు షాక్తో.. జమ్మలమడుగు : పట్టణంలోని యూనియన్ బ్యాంక్ ఏటీఎం వద్ద విద్యుత్ షాక్తో స్థానిక దిగువపట్నం కాలనీకి చెందిన పాలాజీ సురేష్ (48) శుక్రవారం మృతి చెందాడు. ప్రొద్దుటూరు రహదారిలో ఉన్న యూనియన్ బ్యాంక్తోపాటు దుకాణాల సముదాయాల కింద యూనియన్ బ్యాంక్ ఏటీఎం ఏర్పాటు చేశారు. ఏటీఎం బ్యాంక్ వద్ద పాలాజీ సురేష్ మోటార్ ఆన్ చేయడానికి స్పిచ్ నొక్కాడు. వెంటనే విద్యుత్ షాక్ తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రిలో పని చేస్తున్నాడని బంధువులు తెలిపారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. చెట్టును ఢీకొన్న లారీ● డ్రైవర్ సజీవ దహనం లింగాల : బళ్లారి నుంచి నెల్లూరు గ్రానైట్ లోడుతో వెళుతున్న లారీ అనంతపురం జిల్లా ఉరవకొండ మండలం బూదగని వద్ద శుక్రవారం తెల్లవారుజామున అదుపు తప్పి చెట్టును ఢీకొట్టి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లారీకి మంటలు అంటుకున్నాయి. లింగాల మండలం కర్ణపాపాయపల్లెకు చెందిన అలవలపాటి ఓబుళరెడ్డి (45) అనే డ్రైవర్ లారీ క్యాబిన్లో ఇరుక్కుని కాలి బూడిదయ్యాడు. క్లీనర్ పుల్లయ్య ప్రాణాలతో బయటపడ్డాడు. సమాచారం తెలుసుకున్న కుటుంబ సభ్యులు, బంధువులు వెంటనే ఘటనా స్థలానికి వెళ్లారు. మృతదేహాన్ని తీసుకరావడానికి వీల్లేకుండా బూడిద కావడంతో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరయ్యారు. ఓబుళరెడ్డికి భార్య రామలక్షుమ్మతోపాటు తేజశ్విని, మహేంద్ర అనే పిల్లలు ఉన్నారు. మహిళ అదృశ్యంవీరపునాయునిపల్లె : మండలంలోని నేలతిమ్మాయపల్లె గ్రామానికి చెందిన పఠాన్ మస్తాన్బీ(18) అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్టేషన్లో శుక్రవారం కేసు నమోదైంది. ఆమెకు రెండు నెలల క్రితం వివాహమైంది. రెండు రోజుల క్రితం పీర్ల పండుగ కోసం నేలతిమ్మాయపల్లెకు వచ్చింది. గురువారం రాత్రి 10 గంటల సమయంలో ఇంటి నుంచి బయటికి వెళ్లి, తిరిగి రాలేదు. సమీప ప్రాంతాల్లో కుటుంబ సభ్యులు గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. ఈ క్రమంలో ఆమె తల్లి షాకీరా శుక్రవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేపట్టినట్లు ఎస్సై కృష్ణయ్య తెలిపారు. -
అయ్యో బిడ్డా.. అప్పుడే నూరేళ్లు నిండాయా..
● లింగాల కుడికాలువలో పడి బాలుడి మృతి లింగాల : అయ్యో బిడ్డా.. అప్పుడే నీకు నూరేళ్లు నిండిపోయాయా.. అని తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తున్న తీరు చూపరుల్ని కలచివేసింది. లింగాల మండలం చిన్నకుడాల గ్రామంలో శుక్రవారం మధ్యాహ్నం ఎస్సీ కాలనీకి చెందిన అభిరామ్(5) అనే బాలుడు ప్రమాదవశాత్తు లింగాల కుడికాలువలో పడి మృతి చెందాడు. కాలనీకి చెందిన అరుణ్కుమార్, నాగమ్మల ఏకై క కుమారుడు అభిరామ్ మృతి చెందడంతో వారి రోదన ఆరణ్య రోదనగా మారింది. మధ్యాహ్న సమయంలో ఇంటి నుంచి తల్లిదండ్రులతో డబ్బులు ఇప్పించుకుని తన స్నేహితునితో కలిసి రోడ్డు సమీపంలో ఉన్న అంగడికి వెళ్లి తిండి పదార్థాలను తీసుకొని తిరిగి వస్తుండగా.. అక్కడ కాలువ సమీపంలోకి వెళ్లి కాలు జారి పడి పోయాడు. వెంటనే స్నేహితుడు పరుగున వెళ్లి బాలుడి తల్లిదండ్రులకు విషయాన్ని తెలిపారు. దీంతో అభిరామ్ తల్లిదండ్రులతోపాటు కాలనీ వాసులు అక్కడికి చేరుకుని కాలువలో పెరిగిపోయిన జమ్ములో ఇరుక్కుని ఉన్న అభిరామ్ను వెలికి తీశారు. వెంటనే పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీంతో చేసేదేమి లేక కుటుంబ సభ్యులు, బంధువులు బాలుడిని గ్రామానికి తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. -
పోలీసుల నిర్లక్ష్యంతోనే బాలిక మృతి
లింగాల : లింగాల మండలం లోపట్నూతల గ్రామంలో గురువారం రాత్రి నిత్విక (4) అనే చిన్నారి హత్యకు పోలీసుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. గత ఏడాది నుంచి రెండు కుటుంబాల మధ్య ఘర్షణలు చెలరేగుతుంటే.. కేవలం రామాచారి కుటుంబంపైనే పోలీసులు టార్గెట్ చేస్తూ వ్యవహరించడంతో.. వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులకు పోలీసులన్నా, రామాచారి కుటుంబమన్నా చులకన భావం ఏర్పడింది. పోలీసులు కూడా తమను ఏమి చేయలేరని, హత్యకు కారణమైన స్వాతి బంధువులు పోలీసు శాఖలో ఉన్నారన్న ధైర్యంతో ఈ అఘాయిత్యానికి పాల్పడిందని గ్రామ ప్రజలు విమర్శిస్తున్నారు. తరుచూ గొడవలు జరుగుతున్న సమయంలో.. పోలీసులు ఇరువురిపైన కఠిన చర్యలు తీసుకుని తగిన కౌన్సెలింగ్ ఇచ్చి ఉంటే ఈ హత్యా ఉదంతం జరిగి ఉండేది కాదని గ్రామస్తులు వాపోతున్నారు. సీసీ కెమెరాలు రెండు ఇళ్లకు అమర్చినా వాటి ఫుటేజీని చూడటంలో కూడా పోలీసులు అశ్రద్ధ వహించారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. తరుచూ రామాచారి ఇంటిపై వెంకట్రామిరెడ్డి కుటుంబ సభ్యులు దాడులు చేయడం, కలహాలకు దిగడం, కట్టెలు కాల్చివేయడం, బైకులను దహనం చేయడం, ఇంటి వెనుక పెంచుకున్న చెట్లను కాల్చి వేయడం వంటి చర్యలకు పాల్పడుతున్నా పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోకపోగా.. రామాచారిపైనే కేసులు బనాయించి కోర్టుల చుట్టూ తిప్పడం వల్ల రామాచారి కుటుంబ సభ్యులు తీవ్ర ఆవేదనకు గురయ్యారు. దీన్ని ఆసరాగా చేసుకుని వెంకట్రామిరెడ్డి భార్య స్వాతి.. చిన్నారి నిత్విక హత్య చేయడానికి తెగించిందనే ఆరోపణలు వ్యక్తమవుతున్నాయి. నిత్వికను కాలనీలో ఎవరూ లేని సమయం చూసి వెంట తీసుకెళ్లి పక్క బజార్లోని కృష్ణయ్య ఇంటి బయట ఉన్న బాత్రూంలోని నీటి డ్రమ్ములో ముంచి హత్య చేసినట్లు తెలుస్తోంది. దీనికి పోలీసుల నిర్లక్ష్యమే కారణమని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. -
● స్వర్ణాంధ్ర సారథులు!
పాలకుల రంగుల ప్రకటనల వెనుక కన్నీటి నిజాలు కడప వీధుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి పేదలను ధనికులను చేస్తామని గొప్పలు చెబుతున్నా.. కృష్ణా హాల్ వక్ఫ్ కాంప్లెక్స్ వద్ద బడికి వెళ్లాల్సిన వయసులో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చిన్నారులు చీకటి, మురికి కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటున్నారు. ఆ మురికిలో ప్లాస్టిక్ ముక్కలు వెతికి స్క్రాప్ దుకాణంలో వేస్తేనే వారి పూట గడుస్తుంది. రేపటి పౌరుల భవిష్యత్తు ఇలా వీధులపాలవుతుంటే.. పాలకుల ప్రచారాల సంబరాలు ఎవరి కోసం అని, స్వర్ణాంధ్ర సారథులు వీరేనా అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప. -
●పెట్టుబడికి వెనకాడకుండా ఖర్చు.. కానీ సమస్యలే శాపం!
చాపాడు: కడప జిల్లా మైదుకూరు, చాపాడు నియోజకవర్గాల పరిధిలోని అన్నదాతలకు ‘పసుపు పంట’ అంటే ఎనలేని ప్రీతి. మహిళలు బంగారాన్ని ఎంత ప్రియంగా చూసుకుంటారో.. ఇక్కడి రైతులు కూడా పసుపు పంటను విత్తు నాటినప్పటి నుంచి నూర్పిడి పూర్తయ్యే వరకూ ఆరుగాలం అలానే కంటికి రెప్పలా చూసుకుంటారు. అంతర్జాతీయ మార్కెట్లో కడప పసుపునకు విపరీతమైన గిరాకీ ఉండటంతో, రికార్డు ధరల నేపథ్యంలో అన్నదాతల్లో కొత్త జోష్ నెలకొంది. ఈ ఏడాది ప్రారంభంలో క్వింటాల్ ఒట్టి పసుపు ధర రూ.10,500 లు ఉండగా, ప్రస్తుతం అది రూ.12,000 నుండి రూ.12,800 ల గరిష్ట స్థాయికి చేరింది. గతేడాది పసుపు సాగు చేసిన ప్రతి రైతుకు ఊహించని లాభాలు దక్కడంతో, ఈసారి జూలై, ఆగస్టు మాసాల్లో వేయాల్సిన విత్తనాన్ని నెల రోజుల ముందే.. అంటే జూన్ నుంచే జిల్లావ్యాప్తంగా ముమ్మరంగా సాగు చేస్తున్నారు. ప్రపంచంలో భారత్.. దేశంలో ఏపీ టాప్! ప్రపంచ దేశాల్లోకెల్లా భారతదేశంలోనే పసుపు అత్యధికంగా సాగవుతోంది. ప్రపంచవ్యాప్తంగా జరిగే పసుపు ఉత్పత్తిలో ఏకంగా 80 శాతం వాటా మన దేశం నుంచే వివిధ దేశాలకు ఎగుమతి అవుతుండటం విశేషం. ఇక దేశీయ పసుపు ఉత్పత్తిలో 40 శాతం వాటాతో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం దేశంలోనే నంబర్ వన్ స్థానంలో నిలిచింది. రాష్ట్రంలో పసుపు సాగును పరిశీలిస్తే వైఎస్సార్ కడప జిల్లా ప్రథమ స్థానంలో నిలవగా, గుంటూరు జిల్లా రెండో స్థానంలో కొనసాగుతోంది. సాగులో మైదుకూరు ఏకఛత్రాధిపత్యం జిల్లాలోని మొత్తం 24 మండలాల్లో పసుపు పంట సాగవుతుండగా, అందులో సగానికి పైగా విస్తీర్ణంతో మైదుకూరు నియోజకవర్గమే అగ్రస్థానంలో నిలిచింది. నియోజకవర్గ వ్యాప్తంగా రికార్డు స్థాయిలో 3,443.11 ఎకరాల్లో పసిడి పంట విస్తరించింది. ఇందులోనూ కేవలం ఒక్క మైదుకూరు మండలంలోనే జిల్లాలోనే అత్యధికంగా 1,428.50 ఎకరాల్లో రైతులు పసుపు పంటను విత్తడం విశేషం. ఎకరా సాగులో సాధారణ దిగుబడిగా 30 క్వింటాళ్లు రాగా, పంట బాగా పండితే 40 క్వింటాళ్ల వరకు కూడా బంపర్ దిగుబడి వస్తుందని క్షేత్రస్థాయి రైతులు ధీమాగా చెప్తున్నారు. పసుపు పంటను పండించేందుకు జిల్లా రైతులు పెట్టుబడి పెట్టడానికి ఎన్నడూ వెనకాడరు. సేద్యం మొదలుకొని పసుపు తయారీ (నూర్పిడి) వరకు ఎకరాకు సగటున రూ.1.50 లక్షల నుంచి రూ.2.20 లక్షల వరకు భారీగా ఖర్చు అవుతోంది. పంటను కంటికి రెప్పలా కాపాడుకుంటూ ప్రకృతి సహకరిస్తేనే 30 నుండి 40 క్వింటాళ్ల దిగుబడి సాధ్యమవుతుంది. అయితే రోజురోజుకు పెరుగుతున్న ఈ పెట్టుబడి ఖర్చులు రైతాంగాన్ని కుంగదీస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఉద్యానశాఖ (హార్టికల్చర్) అధికారులు విత్తన దశకు ముందే.. అంటే మే, జూన్ మాసాల్లోనే గ్రామాల్లో ముందస్తు అవగాహన సదస్సులు నిర్వహించి సాగు ఖర్చులు తగ్గించేలా రైతులకు సాంకేతిక పరిజ్ఞానాన్ని వివరించాలని డిమాండ్ చేస్తున్నారు. దీనితో పాటు, పంట చేతికి వచ్చే నాటికి మార్కెట్లో దళారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించేస్తున్నారని, రైతులు అమ్ముకున్న తర్వాతే వ్యాపారులు ధరలు పెంచుతున్నారని అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ దోపిడీకి అడ్డుకట్ట వేయాలంటే, పసుపు పంటను సురక్షితంగా నిల్వ ఉంచుకునేలా ప్రభుత్వం మైదుకూరు, సీతారామపురం ప్రాంతాల్లో తక్షణమే శీతలీకరణ గోదాములను నిర్మించాలని రైతాంగం గట్టిగా డిమాండ్ చేస్తోంది. -
కౌలు రైతుల పట్ల నిర్లక్ష్యం తగదు
కౌలు రైతుల పట్ల కూటమి ప్రభుత్వానికి కనీస బాధ్యత లేకపోవడం, నిర్లక్ష్యంగా వ్యవహరించడం తగదు. తక్షణమే కౌలుదారుల ఖాతాలకు కూడా ‘అన్నదాత సుఖీభవ’ నిధులను వేసి వారిని ఆదుకోవాలి. పెట్టుబడి సాయం సకాలంలో అందించి వారు ప్రైవేట్ అప్పుల ఊబిలోకి వెళ్లకుండా రక్షించాలి. ఈ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన రెండేళ్ల నుంచి కౌలు రైతులకు ఎలాంటి సహాయం అందలేదు. ఇప్పటికై నా కూటమి సర్కార్ స్పందించి కౌలు రైతులను ఆదుకోవాలి. – గోపాల కృష్ణయ్య, ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు. -
ఎకై ్సజ్ నేరాలను నియంత్రించాలి
– ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్శర్మ కడప సెవెన్రోడ్స్ : నాటుసారా, పొరుగు రాష్ట్రాల నుంచి మద్యం సరఫరా, నార్కోటిక్ డ్రగ్స్ తదితర ఎకై ్సజ్ నేరాల నియంత్రణపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ వహించాలని ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ శాఖ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్శర్మ ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కడప, అన్నమయ్య జిల్లాల ఎక్సైజ్ అధికారులతో ఆయన సమీక్షా సమావేశం నిర్వహించారు. నార్కోటిక్ డ్రగ్స్ వల్ల జరిగే దుష్ప్రరిణామాలపై ప్రజల్లో అవగాహన కల్పించాలన్నారు. నాటుసారా తయారీ, అమ్మకాలపై ఎప్పటికప్పుడు నిఘా ఉంచి అరికట్టాలన్నారు. అనంతరం స్టేషన్ల వారీగా క్రైం రివ్యూను అడిగి తెలుసుకున్నారు. జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు, ఆసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ చంద్రశేఖర్ రెడ్డి, సూపరింటెండెంట్లు రమేష్, సీఐలు పాల్గొన్నారు. బాధ్యతల స్వీకరణ కడప వైఎ,స్ఆర్ సర్కిల్: జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండ్గా జె. రమేష్ గురువారం నగరంలోని తన కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఆయన నెల్లూరు జిల్లాలో ఆసిస్టెంట్ ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండ్గా పని చేస్తూ పదోన్నతిపై జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా పరిధిలోని అక్రమ మద్యం, నాటు సారా వంటి వాటిపై దృష్టి పెడతామన్నారు. -
ఎన్యుమరేషన్ పత్రం కోసం వచ్చా!
నేను గతంలో రవీంద్రనగర్లో నివాసం ఉన్నాను. ఆ తర్వాత కాగితాలపెంటలో చేరాను. 2002 నాటి జాబితాలో నా పేరుతోపాటు నా భార్య జూటూరు రసూల్బీ పేరు కూడా ఉంది. కాగితాలపెంట బీఎల్ఓ రవీంద్రనగర్ సచివాలయం వెళ్లి ఎన్యుమరేషన్ పత్రం తెచ్చుకోవాలని సూచించారు. ఇక్కడికి రాగా, నా భార్య పత్రం ఇచ్చారు. నా పత్రం అడిగితే లేదని చెబుతున్నారు. – జూటూరు మహమ్మద్ హుసేన్ సాహెబ్, కాగితాలపెంట, కడప నేను రవీంద్రనగర్లో ఉంటూ ఇల్లు మారాను. ఎన్యుమరేషన్ ఫారం తీసుకోవడానికి రవీంద్రనగర్ సచివాలయానికి వచ్చాను. అయితే నాకు సంబంధించిన ఎన్యుమరేషన్ పత్రం ఇచ్చారు. నా భార్య మైమూన్ పత్రం లేదని చెబుతున్నారు. ఒకవేళ కనిపిస్తే ఇస్తామని బీఎల్ఓ అంటున్నారు. ఏం చేయాలో పాలుపోవడం లేదు. – కాలేషా, రవీంద్రనగర్, కడప -
హామీ మేరకు పెట్టుబడి సాయం ఇవ్వాలి
అధికారంలోకి వస్తే కౌలు రైతులకు ఏటా రూ.20 వేలు పెట్టుబడి సాయం ఇస్తామని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం నిస్సిగ్గుగా చెప్పింది. దాని ప్రకారం ఇచ్చిన హామీని నిలబెట్టుకుని కౌలు రైతులకు తక్షణమే పెట్టుబడి సాయం అందించాలి. క్షేత్రస్థాయిలో కేవలం గుర్తింపు కార్డులు మాత్రమే ఇస్తున్నారు తప్ప, ప్రభుత్వం నుంచి ఎటువంటి ఆర్థిక సహాయమూ అందడం లేదు. ఇప్పటికై నా మోసపూరిత విధానాలు వీడి కౌలు రైతులకు పెట్టుబడి సాయం అందించాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతుసంఘం జిల్లా అధ్యక్షుడు


