breaking news
YSR District Latest News
-
సేవా పతకాలు ప్రదానం
కడప అర్బన్: 2025 సంవత్సరానికి విశిష్ట సేవలందించిన పోలీస్ అధికారులు, సిబ్బందికి ఇటీవల రాష్ట్ర పోలీస్ శాఖ ప్రకటించిన ఉత్కృష్ట, అతి ఉత్కృష్ట సేవా పతకాలను జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రదానం చేశారు. ఈ సందర్బంగా వారిని జిల్లా ఎస్.పీ ప్రత్యేకంగా అభినందించి మున్ముందు ఇదే స్పూర్తితో విధులు నిర్వర్తించాలని ఆకాంక్షించారు. ఉత్కృష్ట సేవ పతకాలు– 2025 పొందిన వారు బాలమద్దిలేటి, సీఐ, చింతకొమ్మదిన్నె పీ.ఎస్, వి.శ్రీధర్ బాబు, పిసీ202 కడప ట్రాఫిక్ పీస్.ఎం. అబ్దుల్ సలాం, పీసీ.423, డి.సి.ఆర్.బి,కడప. పి. సుధాకర్, హెచ్సీ.534, రాజుపాలెం పీఎస్, ఎం. మహేష్, పీసీ.709, దువ్వూరు పీఎస్,డి. వెంకట భార్గవ్, సీపీ.797, సీకేదిన్నె పీఎస్, ఈ. విశ్వనాథ్, పీసీ.1137, ఐటీ కోర్ టీమ్, ఆర్.వీరాంజనేయులు, పీసీ.2072, ప్రొద్దుటూరు ఐఐఐ టౌన్ పీఎస్, .పి. మహేష్ కుమార్ రావు, పి.సి.2128, పెద్దముడియం పీఎస్, ఎస్. రామ మోహన్ రెడ్డి, ఏ.ఆర్.పి.సి.1804, డీఏఆర్., కడప, ఎస్. జాఫర్ బాషా, ఏఆర్పీసీ.1814, డీఏఆర్., కడప. అతి ఉత్కృష్ట సేవా పతకం అవార్డు గ్రహీతలు – 2025 ఎస్. అక్బర్ అలీ, ఏ.ఎస్.ఐ.549, ఐ.టి. కోర్ టీమ్, ఎస్. అహ్మద్ అలీ, హెచ్సీ 1634, ఏహెచ్టీయూ, ఎస్. సూర్యప్రకాశ్ రావు, హెచ్సీ.1545, ఎస్. వెంకట సుబ్బయ్య, హెచ్సీ 1496, బద్వేల్ యు/జిపీఎస్, ఎస్. మహబూబ్ బాషా, హెచ్సీ 1424, జమ్మలమడుగు యు/జి పీఎస్. పి. నరసయ్య, పి.సి.3277, ప్రొద్దుటూరు ఐఐ టౌన్ యు/జి పి.ఎస్, వై. శ్రీనివాసులు, హెచ్సీ.1963, కడప ఐ టౌన్ యు/జి పి.ఎస్, ఎం. శివ రామయ్య, ఏఆర్హెచ్సీ.2481, డీఏఆర్., కడప. ఎల్. రమణారెడ్డి, ఏ.ఆర్హెచ్సీ.1222, డీఏ.ఆర్, కడప. జి. నాగేశ్వరయ్య, పి.సి.1564, మన్నూరు పీ ఎస్. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్: జిల్లాలోని పలు మండలాల్లో గురువారం తెల్లవారుజామున వర్షం కురిసింది. ఇందులో భాగంగా బి.కోడూరులో 4.2 ఎంఎం, కలసపాడులో 2.8 ఎంఎం, ఖాజీపేటలో 2.4 ఎంఎం, బిమఠంలో 1.8 ఎంఎం, ఓంటిమిట్టలో 1.4 ఎంఎం, కడపలో 1.2 ఎంఎం, వల్లూరులో 1 ఎంఎం వర్షం కురిసింది. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయంలో డిజిటల్ బ్యాంకింగ్ సేవలు, వాటి వినియోగం, ప్రయోజనాలు, భద్రతా చర్యలపై ఎంబీఏ విద్యార్థులకు స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ కార్యాలయ సిబ్బంది శివరామకృష్ణ, భారతి బృందం (ఎస్బీఐ) అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా డిజిటల్ బ్యాంకింగ్ ద్వారా అందుబాటులో ఉన్న వివిధ సేవలు, ఆన్లైన్ లావాదేవీలు, మొబైల్ బ్యాంకింగ్, యూపీఐ, ఏటీఎం సేవలు, ఇంటర్నెట్ బ్యాంకింగ్ తదితర అంశాలను విద్యార్థులకు వివరించారు. డిజిటల్ లావాదేవీల సమయంలో అప్రమత్తంగా ఉండాలని, ఓటీపీ, ఏటీఎం పిన్, పాస్వర్డ్, బ్యాంకు ఖాతా వివరాలను ఇతరులతో పంచుకోరాదని సూచించారు. -
గుర్తు తెలియని మహిళ మృతి
ప్రొద్దుటూరు క్రైం : అనారోగ్యంతో చికిత్స పొందుతూ గుర్తు తెలియని మహిళ ప్రొద్దుటూరు జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో మృతి చెందింది. సుమారు 45 ఏళ్ల వయస్సున్న మహిళ అనారోగ్యంతో బుధవారం ప్రభుత్వ ఆస్పత్రిలో చేరింది. ఈ క్రమంలో చికిత్స పొందుతూ గురువారం ఉదయం మృతి చెందింది. ఆస్పత్రిలో చేరినప్పుడు ఆమె ఒంటిపై చిరిగిన దుస్తులు ఉండటంతో స్థానికులు మానవతా దృక్పథంతో పాత స్కూల్ యూనిఫాంను అందించారు. ఆమెకు సంబంధించిన ఎలాంటి వివరాలు తెలియకపోవడంతో మృతదేహాన్ని ఆస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి ఆచూకీ లేదా కుటుంబ సభ్యుల వివరాలు ఎలిసిన వారు ఆస్పత్రి ఔట్పోస్టులో సంప్రదించాలని ఇన్చార్జి షబ్బీర్ బాషా తెలిపారు. రిమ్స్లో.. కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో వైద్య పరీక్షలను చేయించేందుకు గుర్తు తెలియని వ్యక్తి (55)ని తీసుకుని వచ్చారు. క్యాజువాలిటీలో వైద్య పరీక్షల అనంతరం మరణించినట్లు తెలియజేశారు. మృతదేహాన్ని మార్చురీకీ తరలించారు. ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే వారికి మృతదేహాన్ని అప్పగిస్తామనీ రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
ఉద్యోగం రాలేదని మనస్తాపంతో యువకుడి ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : ఆ యువకుడు చిన్నతనం నుంచి చదువులో బాగా రాణిస్తుండేవాడు. బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. అయితే తోటి స్నేహితులందరికి ఉద్యోగాలు వచ్చినప్పటికీ తనకు ఇంకా రాలేదని మనస్తాపానికి గురయ్యాడు. ఉరివేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తల్లిదండ్రులకు కడుపుకోత మిగిల్చాడు. గురువారం బద్వేలు పట్టణంలో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించి పోలీసులు తెలిపిన వివరాల మేరకు పట్టణంలోని తెలుగుగంగ రోడ్డులో నివసిస్తున్న బి.వెంగయ్య, జయమ్మ దంపతులకు ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె. వారిలో చిన్నవాడైన బొడ్డుబోయినహరిక్రిష్ణ (25) బీటెక్ పూర్తి చేసి ఉద్యోగాన్వేషణలో ఉన్నాడు. తోటి స్నేహితులందరికి ఉద్యోగాలు వచ్చాయి. తనకు ఇంకా రాలేదని తరచూ బాధపడుతుండేవాడు. ఇటీవలే తన తండ్రి వద్ద కూడా ఆ విషయం ప్రస్తావన చేసి బాధపడుతుండటంతో తల్లిదండ్రులు సర్దిచెప్పారు. ఈ క్రమంలో గురువారం ఉదయం తన స్నేహితుడిని కలిసి వస్తానని ఇంటి నుండి వెళ్లిన హరిక్రిష్ణ మధ్యాహ్నం వరకు రాకపోవడంతో తల్లి జయమ్మ ఫోన్ చేసింది. ఎంతసేపటికి ఫోన్ తీయకపోవడంతో విషయాన్ని వెంగయ్యకు తెలిపింది. ఆయన ఇంటి వద్దకు వచ్చి చుట్టుపక్కల గాలించినప్పటికీ ఫలితం దక్కలేదు. చివరగా అనుమానం వచ్చి హరిక్రిష్ణ నివాసముంటున్న ఇంటి సమీపంలో ఉన్న వారి మరో ఇంటి వద్దకు వెళ్లి చూడగా రేకుల ఇంటికి పైభాగంలో ఉన్న ఇనుపపైపుకు చీరతో ఉరివేసుకుని వేలాడుతూ కనిపించాడు. వెంటనే చుట్టుపక్కల వారిని, బంధువులను పిలిపించి హరిక్రిష్ణను ఆటోలో ప్రభుత్వాసుపత్రికి తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు ధృవీకరించారు. మృతుని తండ్రి వెంగయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. -
వీరిరువురు..ఇక తప్పించుకోలేరు !
సాక్షి, మదనపల్లె: రాష్ట్రవ్యాప్తంగా పెను సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు దర్యాప్తు ఆఖరి అంకానికి చేరుకుంది. ఈ వ్యవస్థీకృత నకిలీ మద్యం దందాలో ఎకై ్సజ్ శాఖ మొత్తం 33 మందిని నిందితులుగా చేర్చగా.. వారిలో ఇప్పటికే 31 మంది అరెస్టయి కటకటాలపాలయ్యారు. ఇక ఈ కేసులో తెరవెనుక సూత్రధారులుగా ఉండి, విచారణకు సహకరించని ఆ ఇద్దరు పచ్చ నేతలు మాత్రమే ప్రస్తుతం మిగిలి ఉన్నారు. వారే.. సస్పెండ్ అయిన తంబళ్లపల్లె టీడీపీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ డి.జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్ రెడ్డి. వీరిద్దరి ముందస్తు బెయిల్ పిటిషన్లను బుధవారం దేశ అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు పూర్తిగా కొట్టివేయడంతో.. ఎకై ్సజ్ అధికారులు వీరిని ఏ క్షణమైనా అరెస్ట్ చేసే అవకాశం ఉందన్న వార్త ఉత్కంఠ రేపుతోంది. విచారణకు సహాయ నిరాకరణ.. సుప్రీంను ఆశ్రయించిన దర్యాప్తు అధికారి.. సుప్రీంకోర్టు ఇచ్చిన ముందస్తు వెసులుబాటు (తాత్కాలిక రక్షణ)తో విదేశాల నుంచి ములకలచెరువుకు తిరిగి వచ్చిన జయచంద్రారెడ్డి, గిరిధర్ రెడ్డిలు రెండు సార్లు ఎకై ్సజ్ విచారణకు హాజరయ్యారు. ఈ కేసు విచారిస్తున్న దర్యాప్తు అధికారి, అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిండెంట్ జోగేంద్ర వీరిని సుదీర్ఘంగా ప్రశ్నించినప్పటికీ.. నిందితులిద్దరూ దర్యాప్తునకు ఏమాత్రం సహకరించలేదని తెలిసింది. ఈ నేపథ్యంలోనే దర్యాప్తు అధికారి జోగేంద్ర వ్యూహాత్మకంగా సుప్రీంకోర్టును ఆశ్రయించి.. శ్రీకేసులో ముఖ్య నిందితులు ఇద్దరూ విచారణకు సహకరించడం లేదు.. నకిలీ మద్యం దందా వెనుక ఉన్న అసలు నిజాలు, మూలాలు బయటకు తీయాలంటే వీరిని కస్టడీకి తీసుకోవాల్సిన అవసరం ఉంద్ఙి అని కోర్టులో పిటిషన్ వేశారు. ఈ క్రమంలోనే తాజాగా సుప్రీంకోర్టు వీరి బెయిల్ పిటిషన్లను కొట్టివేయడంతో, కోర్టు తీర్పు ఉత్తర్వు అందడమే ఆలస్యం ఎకై ్సజ్ ప్రత్యేక బృందాలు వీరిని అదుపులోకి తీసుకునేందుకు సర్వం సిద్ధం చేసుకున్నట్టు ప్రచారం జరుగుతోంది. పాత చార్జ్షీట్లు వెనక్కి.. పూర్తిస్థాయిలో సరికొత్త వ్యూహం ములకలచెరువు సమీపంలోని ఓ గోదాములో నకిలీ మద్యం తయారీ, సరఫరా, విక్రయాలకు సంబంధించిన ఈ పెద్ద వ్యవహారం గత అక్టోబర్ మూడో తేదీన వెలుగులోకి వచ్చి రాష్ట్రంలో సంచలనం కలిగించింది. ఈ కేసుకు సంబంధించి దర్యాప్తు అధికారి ఇప్పటికే తంబళ్లపల్లె కోర్టులో రెండు చార్జ్షీట్లను (దోషారోపణ పత్రాలు) దాఖలు చేశారు. అయితే దర్యాప్తు ఇంకా ముగింపునకు రాకపోవడం, కీలక నిందితులైన జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డిల (నిందితులు 17, 18) అరెస్టు పెండింగ్లో ఉండటంతో చార్జ్షీట్ల సంఖ్య ఇంకా పెరిగే అవకాశం ఉండేది. కానీ తాజా పరిస్థితుల నేపథ్యంలో, ఎకై ్సజ్ వర్గాల సమాచారం ప్రకారం.. ఇప్పటికే కోర్టులో దాఖలు చేసిన ఆ రెండు చార్జ్షీట్లను వెనక్కి తీసుకొని, ఈ ఇద్దరు పచ్చ నేతల అరెస్టు మరియు విచారణ అనంతరం సేకరించాల్సిన మరిన్ని పక్కా ఆధారాలతో ఏకకాలంలో ‘పూర్తిస్థాయి సమగ్ర సింగిల్ చార్జ్షీట్’ను దాఖలు చేసేందుకు ఎకై ్సజ్ ఉన్నతాధికారులు చట్టపరమైన కసరత్తులు ప్రారంభించారు. సుప్రీంకోర్టులో జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డిల బెయిల్ పిటిషన్లు డిస్మిస్ తక్షణ అరెస్టుకు ఎకై ్సజ్ ఏఈఎస్ జోగేంద్ర రెడీ రెండు సార్లు విచారణకు పిలిచినా సహకరించని పచ్చ నేతలు కస్టడీ కోసం సుప్రీంను ఆశ్రయించిన దర్యాప్తు అధికారి -
దళితుల భూములపై పచ్చ గురి !
● కలెక్టరేట్ గ్రీవెన్స్లో బాధితురాలి ఫిర్యాదు ● క్షేత్రస్థాయిలో పులివెందుల డీఐఓ హేమలత తనిఖీ వేంపల్లె: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పచ్చ నేతలు రోజురోజుకు రెచ్చిపోతున్నారు. ‘మమ్మల్ని అడిగే నాథుడే లేడు’ అనే అధికార దర్పంతో దళితుల భూములను సైతం వదలకుండా కబ్జా చేసేందుకు అడ్డగోలుగా తెగబడుతున్నారు. వేంపల్లె మండలంలోని పాములూరు గుట్ట సమీపంలో ఉన్న సర్వే నంబరు–1లో, గత 30 ఏళ్లుగా దారా పద్మావతి అనే దళిత మహిళకు చెందిన 2.85 ఎకరాల పొలం ఉంది. అయితే, కూటమి అధికారంలోకి రాగానే స్థానిక టీడీపీ మండల ఉపాధ్యక్షుడు వీరభద్ర కన్ను ఆ విలువైన పొలంపై పడింది. రాత్రికి రాత్రే జేసీబీలు, ట్రాక్టర్లను పెట్టి అక్రమంగా గ్రావెల్ మట్టిని తోలి చదును చేస్తుండగా బాధితురాలు నిలదీయగా.. ‘ఇది మా పొలం.. మీరు ఎవరికి చెప్పుకుంటారో చెప్పుకోండి!’ అంటూ పచ్చ నేతలు ఆమెను తీవ్రంగా బెదిరించారు. దీంతో బాధితురాలు నేరుగా జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలోని గ్రీవెన్స్ సెల్ను ఆశ్రయించి ఫిర్యాదు చేసింది. దళిత మహిళ ఫిర్యాదుతో పులివెందుల డీఐఓ హేమలత వివాదాస్పద పాములూరు గుట్ట పొలాన్ని ప్రత్యక్షంగా పరిశీలించారు. కూటమి నేతలు సదరు పొలంలో బహిరంగంగా గ్రావెల్ మట్టి తోలి చదును చేస్తుంటే మండల రెవెన్యూ అధికారులు ఏం చేస్తున్నారంటూ వారిపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీనికి తహసీల్దార్ శివశంకర్ రెడ్డి స్పందిస్తూ.. సర్వే నంబరు–1లో ఇంకా సబ్ డివిజన్ చేయలేదని, ఈ సర్వే నంబర్లలో చాలా అవకతవకలు ఉన్నాయని, పూర్తి సర్వే నిర్వహించి బాధితులకు భూమిని అప్పగిస్తామని దాటవేసే ప్రయత్నం చేశారు. చదును చేస్తున్న భూమి ప్రభుత్వ భూమి అని తేలితే సదరు వ్యక్తిపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. -
వైవీయూలో నూతనంగా డిగ్రీ కోర్సులు
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం తమ ప్రాంగణంలో 5–ఏళ్ల ఇంటిగ్రేటెడ్ యూజీ–పీజీ (6 కోర్సులు), ఆనర్స్ డిగ్రీ (4 కోర్సులు) ప్రోగ్రామ్లను అందిస్తోందని ప్రవేశాల సంచాలకులు ఆచార్య వి.రామకృష్ణ తెలిపారు. నాణ్యమైన ఉన్నత విద్యా అవకాశాల కోసం చూస్తున్న విద్యార్థులు ఈ నెల 23 వరకు జరిగే వెబ్–ఆప్షన్ ప్రక్రియలో యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాలను ఎంపిక చేసుకోవచ్చన్నారు. ఈ సందర్భంగా కోర్సు కోడ్ల వివరాలను వెల్లడించారు. యోగి వేమన విశ్వవిద్యాలయ కళాశాల కోడ్ – 21587గా వివరించారు. బీఎస్సీ./ఎంఎస్సీ. ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అండ్ బయోఇన్ఫర్మేటిక్స్( కోర్సు కోడ్ 1879) బీఎస్సీ/ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ అప్లైడ్ జియాలజీ – 1880, బీఎస్సీ/ఎంఎస్సీ ఇంటిగ్రేటెడ్ ఫిజిక్స్ – 1881, బీఏ /ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఎకనామిక్స్ – 1884, బీఏ/ఎంఏ ఇంటిగ్రేటెడ్ ఇంగ్లీష్ – 1883, బీఏ/ఎంఏ ఇంటిగ్రేటెడ్ తెలుగు– 1882, బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్ (బీఎఫ్ఏ) – 1656, బీకాం ఆనర్స్ (కంప్యూటర్ అప్లికేషన్స్)– 1505, బీఎస్సీ ఆనర్స్ (ఫిజిక్స్) – 1524, బీఎస్సీ ఆనర్స్ (కెమిస్ట్రీ) – 1554 కోడ్లకు ఆప్షన్లు ఇవ్వాలని వివరించారు. అక్రమ మద్యం రవాణాపై నిఘా కడప వైఎస్ఆర్ సర్కిల్: వైఎస్ఆర్, అన్నమయ్య జిల్లాలో ఇతర రాష్ట్రాల మద్యం రవాణా జరగకుండా నిరంతరం నిఘా నిర్వహిస్తున్నామని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. గురువారం నగరంలోని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ కార్యాలయంలో రెండు జిల్లాల ప్రొహిబిషన్–ఎకై ్సజ్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వానికి రావాల్సిన ఎకై ్సజ్ రెవెన్యూ లక్ష్యాలను వంద శాతం సాధించేలా అధికా రులు సమన్వయంతో పనిచేయాలని ఆదేశించారు. మద్యాన్ని ఎమ్మార్పీ కంటే అధిక ధరలకు విక్రయిస్తే లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. -
డిమాండ్లు పరిష్కరించేవరకు తగ్గేదేలే
కడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో జూనియర్ వైద్యులు తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం చేపట్టిన సమ్మె గురువారం 11వ రోజుకు చేరుకుంది. తమ డిమాండ్లు పరిష్కరించే వరకు శాంతియుతంగా తమ పోరాటాన్ని కొనసాగిస్తామని జూనియర్ వైద్యులు స్పష్టం చేస్తున్నారు. ఏపీ జూడా పిలుపు మేరకు రాష్ట్రవ్యాప్తంగా జూనియర్ వైద్యులు గురువారం స్వచ్ఛంద రక్తదాన శిబిరాలను నిర్వహించి వినూత్నంగా నిరసనను తెలియజేశారు. ఇందులో భాగంగా జీఎంసీ కడప సమ్మె ప్రాంగణంలో జూనియర్ వైద్యుల ఆధ్వర్యంలో రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా కడప జీఎంసీ జూడా అధ్యక్షుడు డాక్టర్ రవితేజనాయక్, ఉపాధ్యక్షుడు డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి డాక్టర్ మేఘన, ఉపాధ్యక్షులు ఎస్.యశ్వంత్ కృష్ణ, కె.యశ్వంత్కృష్ణ మాట్లాడుతూ తమ న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం చేపడుతున్న ఆందోళనలో భాగంగా 42మంది స్వచ్చందంగా రక్తదానం చేశారన్నారు. ఏడుగురు రిలే నిరాహార దీక్షల్లో పాల్గొన్నారన్నారు. ఈ ఆందోళనలో దాదాపు 300 మంది జూడాలు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు తమ నిరసనను తెలియజేశారు. స్టైఫండ్ను 30 శాతం పెంచాలన్నారు. ప్రభుత్వ రంగంలో పని చేస్తున్న డాక్టర్ల వయోపరిమితిని 62 నుంచి 65కు పెంచాలన్న ఆలోచనను ప్రభుత్వం విరమించుకోవాలని డిమాండ్ చేశారు.11వ రోజుకు చేరిన జూడాల నిరసన -
పారదర్శకంగా ప్రత్యేక ఓటరు జాబితా
కడప సెవెన్ రోడ్స్: ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్–2026)లో భాగంగా ప్రత్యేక ఓటరు జాబితాను పారదర్శకంగా, స్వచ్ఛంగా రూపొందించాలని జిల్లా ఎలక్షన్ రోల్ అబ్జర్వర్ చేతన్ టి.ఎస్. ఈఆర్వోలు, ఏఈఆర్వోలను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్ లో ఎస్ఐఆర్–2026 లో భాగంగా జేసీ నిధీమీనా, డీఆర్వో మల్లికార్జునుడులతో కలిసి గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఓటరు జాబితా రూపకల్పనలో ఎన్నికల కమీషన్ ప్రక్రియ, నిబంధనలు అమలు చేయాలన్నారు. దేశంలో పెద్ద ఎత్తున జరిగే ఎన్నికల నిర్వహణలో చిన్న తప్పు జరగకుండా ఉండాలంటే ఎన్నికల కమీషన్ నిబంధనలు తప్పనిసరిగా పాటించాల్సిన అవసరం ఉందన్నారు. బీఎల్వోలు క్షేత్రస్థాయిలో 100 శాతం ఇంటింటి సర్వే చేపట్టాలన్నారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల నాయకులు వారి ఫిర్యాదులను ముందుగానే అందించాలని, క్షేత్రస్థాయిలో నాయకులకు తెలియజేసి అందరూ సహకరించేలా చూడాలన్నారు. ఈ సందర్భంగా జేసీ డాక్టర్ నిధీమీనా జిల్లాలో ఎస్.ఐ. ఆర్. నిర్వహణ గురించి వివరిస్తూ... జిల్లాలో మొత్తం 18,96,231 మంది ఓటర్లు ఉండగా, జూలై 24 నాటికి 64,434 మంది (3.40 శాతం) మ్యాపింగ్ కాని ఓటర్లు, 2,43,180 మంది (12.82 శాతం) మ్యాపింగ్లో వ్యత్యాసాలు ఉన్న ఓటర్లు ఉన్నట్లు తెలిపారు. కడప నియోజకవర్గంలో అత్యధికంగా 25,538 మంది మ్యాపింగ్ కాని ఓటర్లు ఉన్నారని వివరించారు. ఆగస్టు 20 నాటికి 3,07,685 నోటీసులను 100 శాతం జనరేట్ చేశామని, ఎక్కడా పెండింగ్ లేదని తెలిపారు. పోలింగ్ కేంద్రాల హేతుబద్ధీకరణలో భాగంగా 2,251 కేంద్రాలను 2,444కు పెంచేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేశామని, కొత్తగా 193 కేంద్రాల ఏర్పాటు, 20 కేంద్రాల మార్పు, 20 కేంద్రాల పేర్ల మార్పునకు ప్రతిపాదనలు పూర్తయ్యాయని జేసీ వివరించారు. గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు, ఈఆర్వోలు, ఏఈఆర్వోలు తదితరులు పాల్గొన్నారు. ఓటరు నమోదుకు ప్రత్యేక శిబిరాలు ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్)లో భాగంగా అర్హులైన వారు తమ పేర్లను ఓటర్ల జాబి తాల్లో నమోదు చేసుకోవడానికి, అభ్యంతరాలు, సవరణలు, ఓటు బదిలీ కోసం ఎన్నికల కమిషన్ సెష్పల్ క్యాంపెయిన్ నిర్వహించనుంది. ఈ నెల 22, 23, 28, 29 తేదీల్లో జిల్లాలోని 2,444 పోలింగ్ కేంద్రాల్లో సంబంధిత బీఎల్వోలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ప్రజలకు అందుబాటులో ఉంటారు. ఈ నెల 30నాటికి 18 ఏళ్లు పూర్తయ్యే యువతీ యువకులు ఓటర్ల జాబితాలో తమ పేర్ల ను నమోదు చేసుకోవడానికి అర్హులు. అలాగే ఏదైనా కారణాల వల్ల ఇప్పటి వరకు తమ పేర్లు నమోదు చేసుకోని అర్హులు కూడ నమోదు చేసుకోవచ్చు. ఇందుకు సంబంధించిన ఫారం–6లు బీఎల్వోల వద్ద అందుబాటులో ఉంటాయి. అలాగే ఓటరు పేరు, ఇతర వివరాల్లో ఏవైనా తప్పులు ఉంటే వాటిని సవరించుకోవడానికి ఫారం–8 సమర్పించాల్సి ఉంటుంది. ఇక ఎవరైనా మరణించి ఉన్న లేక శాశ్వతంగా ఇతర ప్రాంతాలకు వలసలు వెళ్లి ఉన్నా అలాంటి వారి పేర్లను ఓటరు జాబితాల్లో నుంచి తొలగించాలంటూ ఫారం–7 సమర్పించాల్సి ఉంటుంది. ఇవన్నీ ఈ నెల 30 తేదీ లోపు సమర్పించాలి, నిరంతర నమోదు ప్రక్రియ అందుబాటులో ఉన్నప్పటికి ఈ నెల 30 తేదీలోపు దర ఖాస్తు చేసుకుంటేనే అక్టోబర్ 3న విడుదల అయ్యే ఓటర్ల తుది జాబితాల్లో అవకాశం ఉంటుంది. ఓటర్లకు నోటీసుల జారీ.... ఎన్యూమరేషన్ ప్రక్రియలో వివిధ కారణాల వల్ల సరైన ఆధారాలు సమర్పించలేక పోయిన వారికి సంబంధిత ఈఆర్వోలు/ఏఈఆర్వోలు నోటీసులు జారీ చేస్తున్నారు. ఇప్పటికి జిల్లాలో 3,07,685 నోటీసులను జనరేట్ చేశారు. ఇందులో గురువారం నాటికి 2,55,637 మందికి నోటీసులు అందజేశారు. ఇంకా 52,048 మందికి నోటీసులు అందజేయాల్సి ఉంది. ఇప్పటికి నోటీసులు అందుకున్న వారిలో 34,210 మందిని విచారించారు. సెప్టెంబర్ 28 తేదీ వరకు ఈ కార్యక్రమం కొనసాగుతుంది. అనంతరం అక్టోబర్ 3న ఓటర్ల తుది జాబితా విడుదల అవుతుంది. రాష్ట్ర ఎన్నికల అధికారి సమీక్ష జిల్లాలో జరుగుతున్న సర్ ప్రక్రియపై రాష్ట్ర ముఖ్య ఎన్నికల అధికారి వివేక్ యాదవ్ గురువారం కలెక్టర్లతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. క్లయిమ్స్, అభ్యంతరాల పరిఫ్కారంలో భాగంగా క్షేత్ర స్థాయి ధృవీకరణ నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియను వేగవంతం చేసి నిర్దేశిత గడువులో పూర్తి చేయాలని ఆదేశించారు. -
తనయుడిపై కోపం.. తండ్రి హతం
రాజంపేట : తనయుడిపై ఉన్న కోపం తండ్రి ప్రాణాలకు ముప్పు తెచ్చిన సంఘటన రాజంపేట పట్టణం సుద్దగంతల్లో చోటుచేసుకుంది. సీఐ నాగార్జున వివరాల మేరకు పట్టణంలోని సుద్దగుంతల ప్రాంతంలో చిలకాల పెంచలయ్య (60) తనయుడు నరేంద్రలు కలిసి పాలవ్యాపారం చేస్తుంటారు. ఈ క్రమంలో అదే ప్రాంతానికి చెందిన బిళ్లా నరసింహులు అనే వ్యక్తి నరేంద్రపై కక్ష పెంచుకున్నాడు. అతనిపై కోపంతో అందుబాటులో ఉన్న చిలకాలపెంచలయ్యను కత్తితో పొవడవడంతో అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. బిళ్లానరసింహులు, మృతుడు ఒకే సామాజికవర్గానికి చెందిన వారు. కాగా ఈ హత్య మహిళతో అక్రమసంబంధం ఉందన్న కారణంగా జరిగినట్లు స్ధానికంగా ప్రచారం జరుగుతోంది. పోలీసులు కూడా అదే చెబుతున్నారు. కాగా వృద్ధుడు హత్యతో ఆయన కుటుంబీకులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. రంగంలోకి దిగిన క్లూస్టీం వృద్ధుడు పెంచలయ్య హత్యకు గురైన నేపథ్యంలో క్లూస్టీం రంగంలోకి దిగింది. హత్య జరిగిన ప్రదేశంలో ఆధారాల కోసం అనేషించింది. అయితే నరేంద్రను హత్య చేయకుండా, ఆయన తండ్రి పెంచలయ్యను ఎందుకు హత్య చేశాడన్నది పోలీసులు తొలిచివేసిన అంశం.హత్య కేసుగా నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టరం నిమిత్తం మృతదేహాన్ని రాజంపేట ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు.రాజంపేటలో పాలవ్యాపారి హత్య -
ఆన్లైన్ సేవలకు యాక్సిలరేటర్
కార్యాలయాలకు బ్రేక్..● కనుమరుగైన క్యూలైన్లు.. ● రవాణా శాఖ కార్యాలయాలు వెలవెలకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఒకప్పుడు వాహనదారులతో కిటకిటలాడిన రవాణా కార్యాలయాలు (ఆర్టీఏ) ఇప్పుడు వెలవెలబోతున్నాయి. రవాణా శాఖ పరిధిలోని సేవలను ప్రభుత్వం దశలవారీగా ఆన్లైన్లోకి తీసుకురావడంతో కార్యాలయాలకు వాహనదారులు రాక గణనీయంగా తగ్గిపోయింది. వైఎస్ఆర్ కడప జిల్లాలో ఉపరవాణా శాఖ కమిషనర్ కార్యాలయం ఉంది. ప్రొద్దుటూరులో ఆర్టీవో,పులివెందుల, బద్వేలు, రాజంపేట మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. గతంలో ఆర్టీఏ కార్యాలయాల్లో సుమారు 83 రకాల సేవలు అందించేవారు. 2016 తర్వాత రవాణా శాఖ సేవలను ఒక్కొక్కటిగా ఆన్లైన్ చేస్తూ వచ్చింది. అలా రాను రాను 79 సేవలను ఆన్లైన్ ద్వారానే అందుబాటులోకి తీసుకువచ్చింది. ● కొత్త వాహనం రిజిస్ట్రేషన్లను 2016 నుంచి రవాణా శాఖ కార్యాలయాల ద్వారా కాకుండా డీలర్స్ కు అప్పగించారు. డీలర్లు రిజిస్ట్రేషన్కు కావాల్సిన టాక్స్ కట్టించుకుని వాహనాల ఫోటోలు అప్లోడ్ చేస్తే, రవాణా శాఖ అధికారులు ఫొటోలు చూసి అప్రూవ్ చేసేవారు. ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొత్త వాహనాల రిజిస్ట్రేషన్ ను రవాణా అధికారుల అప్రూవల్ అవసరం లేకుండా నేరుగా ఆటో అప్రోవల్ అయ్యేలా నిర్ణయం తీసుకుంది. ● 2018కి ముందు వాహనాల పరిమిట్లను, వాహనాలకు చెందిన క్వార్టర్లీ ట్యాక్స్లను రవాణా శాఖ కార్యాలయంలో ఇచ్చేవారు. 2018 తర్వాత ఈ రెండు సేవలను ఆన్లైన్ చేశారు. అదే విధంగా రవాణా శాఖ ఇచ్చే మరొక కీలకమైన సేవ వాహనాల ఫిట్నెస్లను 2024 సెప్టెంబర్ 1 నుండి ప్రైవేటు ఏజెన్సీకి అప్పగించింది. ● ఇటీవల ముఖ్యమంత్రి రవాణా శాఖ సేవలను పరిశీలించి వాహనాల ఫైనాన్స్ క్లియరెన్స్, ఫైనాన్స్ ఎడిషన్, చిరునామా మార్పు సేవలను ఆటో అప్రూవల్ చేసేలా మార్పులు చేయాలని ఆదేశించారు. ● ప్రస్తుతం డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ఎల్ఆర్, డెత్ సేవలు మాత్రమే కార్యాలయంలో అందుతున్నాయి. గతంలో వాహన రిజిస్ట్రేషన్, డ్రైవింగ్ లైసెన్స్, పర్మిట్లు, ఇతర రవాణా సంబంధిత సేవలు కోసం కార్యాలయానికి రోజూ వందలాది మంది వాహనదారులు, ఏజెంట్లు, ఇతరులు వస్తున్నప్పుడు సందడిగా కనిపించేవి. కానీ రానురాను సేవలు ఆన్లైన్ కావడంతో ప్రస్తుతం ఆర్టీఏ కార్యాలయాలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ప్రస్తుతం కార్యాలయంలో ప్రత్యక్షంగా నిర్వహిస్తున్న సేవల్లో ప్రధానంగా వాహన యజమాని మృతి చెందిన సందర్భంలో ఆయన పేరుపై ఉన్న వాహనాన్ని వారసుడు లేదా ఇతర అర్హత కలిగిన వ్యక్తి పేరుపైకి బదిలీ చేసే ప్రక్రియ, ఎల్ ఎల్ ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ సేవలు మాత్రమే మిగిలినట్లు సమాచారం. వీటిలో కూడా ఎల్ఎల్ఆర్, డ్రైవింగ్ లైసెన్స్ మంజూరు చేసే ప్రక్రియను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించనున్నట్లు తెలిసింది. అందులో ఇప్పటికే ఒక డ్రైవింగ్ శిక్షణ కేంద్రం మంజూరు అయింది. మరో రెండు కూడా రానున్నట్లు అధికారుల ద్వారా అందిన సమాచారం. ఇక డెత్ సేవ మినహా మిగిలిన దాదాపు అన్ని సేవలు ఆన్లైన్లోనే అందుబాటులోకి రావడంతో కార్యాలయానికి వచ్చే వారి సంఖ్య బాగా తగ్గింది. ఉద్యోగుల్లో మానసిక ఆందోళన ఉప రవాణా శాఖ జిల్లా కార్యాలయం పరిధిలో ప్రొద్దుటూరు, ఆర్టీవో, పులివెందుల, బద్వేలు, రాజంపేట మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. జిల్లాలో ఒక డీటీసీ , ఒక ఆర్టీవో, పదిమంది మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, నలుగురు అసిస్టెంట్ మోటర్ వెహికల్ ఇన్స్పెక్టర్లు, నలుగురు ఏవోలు, 8 మంది సీనియర్, జూనియర్ అసిస్టెంట్లు, ఇద్దరు సబార్డినేటర్లు మొత్తం 34 మంది ఉద్యోగులు పనిచేస్తున్నారు. రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 700 నుండి 900 మంది ఉద్యోగులు పని చేస్తున్నారు. రవాణా శాఖ సేవలన్నీ క్రమంగా ఆన్లైన్లోకి వెళ్లిపోతుండటం, ఫిట్నెప్, డ్రైవింగ్ లైసెన్స్, ఎల్ ఎల్ ఆర్ సేవలను ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగిస్తుండడంతో రవాణా శాఖ కార్యాలయాల్లో పనిచేస్తున్న ఉద్యోగుల్లో మానసిక ఆందోళన మొదలైంది. ప్రస్తుతం ఉన్న పనులు కూడా భవిష్యత్తులో పూర్తిగా ఆన్లైన్ పరిధిలోకి వెళితే తమ పరిస్థితి ఏమిటన్న ప్రశ్న ఉద్యోగులను వేధిస్తోంది. రవాణా శాఖ ఉద్యోగాల్లో కొనసాగిస్తారా? ఇతర శాఖల్లోకి కలుపుతారా? లేక సిబ్బంది సంఖ్యను తగ్గిస్తారా? అన్న సందేహాలు వారిలో నెలకొన్నాయి. తమ ఉద్యోగ భద్రతపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని పలువురు ఉద్యోగులు కోరుతున్నారు. సేవలు తగ్గుతున్నప్పటికీ తమ అనుభవం, నైపుణ్యాలను ఉపయోగించుకునేలా భవిష్యత్ ప్రణాళిక రూపొందించాలని వారు అభిప్రాయపడుతున్నారు.ప్రభుత్వం రవాణా శాఖలోని సేవలను వాహనాదారులకు పారదర్శకంగా, సులభతరంగా అందించడానికి ఆన్లైన్ చేసింది. వాహనాదారులు ఆన్లైన్ సేవలపై అవగాహన పెంచుకొని సద్వినియోగం చేసుకోవాలి. –వీర్రాజు, జిల్లా ఇన్చార్జి ఉప రవాణా శాఖ కమిషనర్పారదర్శకత కోసమే ఆన్లైన్ -
ఎంపీ చొరవతో స్వగ్రామానికి రెడ్డెమ్మ మృతదేహం
చక్రాయపేట : వైఎస్సార్ కడప జిల్లా చక్రాయ పేట మండలం కల్లూరుపల్లెకు చెందిన సిద్దా రెడ్డెమ్మ గత గురువారం మస్కట్లో మృతిచెందింది. కడప పార్లమెంట్ సభ్యులు వైఎస్ అవినాష్ రెడ్డి చొరవతో రెడ్డెమ్మ మృతదేహం గురువారం(20వతేదీ) అర్ధరాత్రి కల్లూరుపల్లెకు చేరుకుంది. రెడ్డెమ్మ బంధువులు తెలిపిన మేరకు కల్లూరుపల్లెకు చెందిన సిద్దా రామచంద్ర భార్య రెడ్డెమ్మ జీవనోపాధి నిమిత్తం 11 నెలల క్రితం రాయచోటికి చెందిన రఫీ అనే ఏజెంట్ ద్వారా మస్కట్కు వెళ్లింది. అయితే ఏజెంట్ రూ.2 లక్షలు డబ్బు తీసుకొని ఆమెకు కచ్చితమైన వీసా ఇవ్వకుండా మోసం చేశాడు. దీంతో ఆమె మస్కట్ వెళ్లినా వీసా లేని కారణంగా ఎవరూ పనిలోకి తీసుకోలేదు. దీంతో తాను మోసపోయానని తెలుసుకున్న రెడ్డెమ్మ భర్త రామచంద్రకు వియాన్ని చెప్పి అక్కడ ఉన్న తెలిసిన ప్రవాసాంధ్రుల సహకారంతో దొంగగా పనులు చేసుకునేది. ఇటు ఇండియాకు రాలేక అక్కడ పనులు చిక్కక ఆవేదనతో కుమిలి పోయి అనారోగ్యానికి గురైంది. ఈవిషయాన్ని అక్కడి వారు మస్కట్లో ఉన్న వైఎస్సార్సీపీ ఒమన్ అధ్యక్షుడు గుబ్బల భాస్కర్ దృష్టికి తీసుకెళ్లారు. స్పందించిన ఆయన రెడ్డెమ్మను ఆస్పత్రిలో చేర్పించి వైద్యం చేయించాడు. అయినా ఆమె గత గురువారం మృతి చెందింది. ఈవిషయాన్ని కుటుంబ సభ్యులకు ఆయన ఫోన్ చేసి విషయం చెప్పడంతో కన్నీటి పర్యంతం అయ్యారు. మస్కట్లో రెడ్డెమ్మ అగచాట్ల గురించి చక్రాయపేట మండల వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు, రెడ్డెమ్మ సమీప బంధువు పోతపాళెం సభాపతి నాయుడు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దృష్టికి తీససుకెళ్లాడు. ఇందుకు స్పందించిన ఆయన రెడ్డెమ్మ ఆస్పత్రి ఖర్చులకు ఆర్థిక సాయం అందించారు. ఆమె చనిపోయిన విషయాన్ని తెలుసుకొని అక్కడి ఎంబసీ అధికారులతో ఫోన్ ద్వారా మాట్లాడారు. విమాన ఖర్చులకు డబ్బులు ఇచ్చి ఆమె మృతదేహాన్ని కల్లూరుపల్లెకు చేర్చేందుకు కృషి చేశారు. -
వ్యక్తి మృతిపై కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని మంగపట్నం సమీపంలోని ఓ ప్రైవేటు కంపెనీలో పనిచేస్తున్న రామాంజనేయులు(49) మృతిపై గురువారం కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ రమేష్ తెలిపారు.ఏఎస్ఐ సమాచారం మేరకు అనంతపురం జిల్లా పుట్లూరు మండలంలోని గరుగుచింతలపల్లె గ్రామానికి చెందిన రామాంజనేయులు గత కొంత కాలంనుంచి ప్రైవేట్ కంపెనీలో ఎలక్ట్రికల్ విభాగంలో పనిచేస్తున్నాడు.బుధవారం సాయంత్రం పనిముగిసిన తర్వాత సమీపంలోనే ఉన్న తన గదికి వెళ్లిడు.గురువారం ఉదయం అతను నిద్రలేయకపోవడంతో గమనించిన తోటి పనివారు బంధువులకు సమాచారం ఇచ్చి అతనిని జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అయితే అప్పటికే అతను మృతిచెందినట్లు వైద్యులు తెలిపారు.రామాంజనేయులు అనారోగ్య సమస్యతో బాధపడుతున్నాడని,మృతిని కుమారుడు ఫణీంద్ర ఫిర్యాదు మేరకు అనుమానాస్పద కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
సర్ కార్యక్రమంతో అనిశ్చితిలో లక్షల ఓట్లు!
● 2025 ఓటర్ల జాబితా ప్రకారం స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లపై ప్రభావం ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) ప్రక్రియతో రాష్ట్ర వ్యాప్తంగా లక్షల ఓట్లు అనిశ్చితి లో పడ్డాయి.. సర్ పూర్తయి తుది ఓటర్ల జాబితా ప్రకటించిన తర్వాతే స్థానిక సంస్థల ఎన్నికలు నిర్వహించాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా డిమాండ్ చేశారు. గురువారం తన కార్యాలయంలోని నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 20 ఏళ్లకు ఒకసారి సర్ ప్రోగ్రాం జరుగుతుందని, ఇందులో మరణించినవారు, శాశ్వితంగా వలస వెళ్లినవారు, డబుల్ ఎంట్రీలను తొలగిస్తారన్నారు. ఈ ఏడాది అక్టోబర్ 3న తుది ఓటర్ల జాబితా ప్రచురితమవుతుందని.. ఆ తర్వాతే స్థానిక ఎన్నికలు నిర్వహిస్తే బాగుంటుందన్నారు. సర్ ప్రోగ్రాంలో మొత్తంగా 87లక్షల ఓట్లు అనిశ్చితిలో ఉన్నాయన్నారు. కడప అసెంబ్లీ నియోజకర్గంలో 2.87లక్షల ఓట్లు ఉండగా, సర్ ప్రోగ్రాంలో 67 వేల ఓట్లు తొలగించారని, మరో 77వేల మందికి నోటీసులు ఇచ్చారన్నారు. 1.44లక్షల ఓట్లను తీసేస్తారో, ఉంచుతారో తెలియని పరిస్థితి ఉందన్నారు. తుది జాబితా ప్రకటించిన తర్వాత ఎవరి ఓట్లు ఉన్నాయో, లేదో తెలుసుకునే వీలుంటుందన్నారు. 2025 ఓటర్ల జాబితా ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తే రిజర్వేషన్లు తారుమారు అయ్యే అవకాశం ఉంటుందన్నారు. అలాగే కడపలో వార్డు ల పునర్విభజన అంశం హైకోర్టులో విచారణ జరుగుతోందన్నారు. ఒక్కో డివిజన్లో 1000–1500 ఓట్లు తొలగించిన పరిస్థితి ఉందన్నారు. ఈ విషయ మై ఎన్నికల కమిషన్కు, ప్రభుత్వానికి పార్టీ తరఫున విన్నవించామని, జిల్లాలో తాము కలెక్టర్ను కలిసి విజ్ఞప్తి చేశామని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, మాజీ కార్పొరేటర్లు షఫీ,శ్రీరంజన్రెడ్డి, బసవరాజు పాల్గొన్నారు. -
●నియోజకవర్గాల్లో పచ్చ నేతల టిక్కుల పర్వం
సాక్షి ప్రతినిధి, కడప: ఉమ్మడి వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల పరిధిలో ప్రకృతి సంపద దోపిడీ పతాక స్థాయికి చేరింది. ఇసుక, గ్రావెల్, బరైటీస్ వంటి అపురూప ఖనిజాలను అధికార పార్టీకి చెందిన ‘తెలుగు తమ్ముళ్లు’ నిలువునా కొల్లగొడుతున్నారు. ఖనిజాల తవ్వకాలకు లీజు అనుమతులు, రాయల్టీ పర్మిట్లు తప్పనిసరి అయినప్పటికీ.. ప్రస్తుతం తెలుగుదేశం పార్టీ ఇన్ఛార్జిలు, ఎమ్మెల్యేల సిఫార్సులుంటే చాలు, ఎక్కడైనా యథేచ్ఛగా తవ్వకాలు జరపవచ్చనేది ఇక్కడ అమలవుతున్న ఏకై క నిబంధన. పాతకాలంలో సామంత రాజులు కప్పం చెల్లించినట్లుగా అక్రమార్కులు తెలుగుతమ్ముళ్లకు మామూళ్లు ముట్టజెబుతుండటంతో.. అటువైపు మైనింగ్, రెవెన్యూ, పోలీస్ అధికారులు కన్నెత్తి చూసే సాహసం కూడా చేయడం లేదు. ఈ వ్యవస్థీకృత దోపిడీ వల్ల నెలకు ఏకంగా రూ.100 కోట్ల ప్రజా సంపద అక్రమార్కుల పాలవుతున్నా, నిఘా విభాగాలు సైతం కళ్లున్న కబోదిలా మిన్నకుంటున్నాయి. కళ్లముందే ‘బరైటీస్’ లూటీ.. లీజుదారుల ఆవేదన ముఖ్యంగా వేంపల్లె, వేముల, పులివెందుల ప్రాంతాలలో కళ్లముందే అపురూపమైన బరైటీస్ (ముగ్గురాయి) ఖనిజ తవ్వకాలు యథేచ్ఛగా నడుస్తున్నాయి. అసలైన లీజు హోల్డర్లతో ఏమాత్రం నిమిత్తం లేకుండా తెలుగుతమ్ముళ్లు అడ్డగోలుగా మైనింగ్ సాగిస్తున్నారు. దీనిపై లీజుదారులు ఎన్నో పర్యాయాలు మైనింగ్, పోలీస్, రెవెన్యూ అధికారులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదులు చేసినప్పటికీ అస్సలు పట్టించుకోవడం లేదు. ఈ అక్రమ తవ్వకాల వల్ల ప్రభుత్వానికి రావాల్సిన కోట్లాది రూపాయల రాయల్టీ ఆదాయం నిలువునా గంగపాలవుతోంది. అధికారులు, నిఘా సంస్థలైన విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్, ఇంటెలిజెన్స్, స్పెషల్ బ్రాంచ్ విభాగాలు సైతం అంతా చూస్తూ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడం వెనుక భారీ స్థాయిలో సొమ్ము చేతులు మారినట్లు స్పష్టమైన ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఎమ్మెల్యే ‘ఏటీఎంగా’ పాపాఘ్ని నది జిల్లాలోని ప్రముఖ జీవనది పాపాఘ్ని ఒక నియోజకవర్గ ఎమ్మెల్యేకు పక్కా ‘ఏటీఎం’గా మారిపోయింది. ఎనీటైం, ఎనీ సెంటర్లో ఇసుక తీసుకెళ్లేందుకు వీలుగా నెలకు ఏకంగా రూ.1.30 కోట్లు చెల్లించేలా ఇసుక విక్రయాలలో మునుపు అనుభవమున్న ఒక వ్యక్తితో సదరు ఎమ్మెల్యే అంతర్గత ఒప్పందం చేసుకున్నారు. ఈ ఒప్పందం ప్రకారం సదరు కాంట్రాక్టరుకు చెందిన వాహనాలు మినహా మరెవ్వరి వాహనాలు పాపాఘ్ని నదిలోకి దిగినా, వెంటనే అధికారులు రంగంలోకి దిగి ప్రత్యక్ష చర్యలు తీసుకుంటున్నారు. అయితే గడిచిన నెలలో ఆశించిన తీరులో విక్రయాలు లేనందున, ఈ కప్పం మొత్తాన్ని రూ.1.15 కోట్లకు తగ్గించుకోవాలని సదరు కాంట్రాక్టరు ఎమ్మెల్యేకు విన్నవించుకున్నట్లు సమాచారం. చెయ్యేరు, బహుదా నదుల చెర.. బెంగళూరుకు క్యూ మరోవైపు అన్నమయ్య జిల్లాలోని చెయ్యేరు, బహుదా నదులను కూడా తెలుగుతమ్ముళ్లు పూర్తిగా చెరబట్టారు. ప్రభుత్వంలో ఉన్నత స్థాయి పరపతిని అడ్డం పెట్టుకుని ఈ నదులపై గుత్తాధిపత్యం సాధించారు. ఇక్కడి నుండి రేయింబవళ్లు పదుల సంఖ్యలో భారీ లారీలు క్యూ కట్టి మరీ ఇసుకను నేరుగా బెంగళూరుకు తరలిస్తున్నా, ఎక్కడా అడ్డగించే సాహసం కూడా అధికారులు చేయలేకపోతున్నారు. ఈ మాఫియా నియమించుకున్న లారీలు తప్ప మరెవ్వరి లారీలు వచ్చి చేరినా, ట్రాన్స్పోర్టు అధికారులు వెంటనే దూకుడు ప్రదర్శిస్తూ జరిమానాలు విధిస్తున్నారు. హైలెవల్ బ్రిడ్జి ప్రక్కనే భారీ యంత్రాలతో టిప్పర్లు ద్వారా తరలిస్తున్న ఇసుక పాపాఘ్ని నది నుంచి అక్రమంగా తరలివెళ్తోన్న ఇసుక ప్రకృతి సంపదను దోచుకుంటున్న తెలుగుతమ్ముళ్లు వేంపల్లె, వేముల, పులివెందులలో ‘బరైటీస్’ లూటీ పాపాఘ్ని నది ఓ ఎమ్మెల్యేకు ‘ఏటీఎం’. నెలకు రూ.1.30 కోట్ల ఒప్పందంతోనే యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా చెయ్యేరు, బహుదా నదులను చెరబట్టిన ‘పచ్చ’ నేతలు నేరుగా బెంగళూరుకు భారీ లారీల క్యూ జమ్మలమడుగు రూరల్, కొండాపురం ప్రాంతాలలో మరో ఎమ్మెల్యే సమీప బంధువులు ఇసుక ద్వారా అడ్డగోలుగా సొమ్ము చేసుకుంటున్నారు. లింగాల, వేంపల్లె, చక్రాయపేట మండలాలలోనూ ఇదే పరిస్థితి కొనసాగుతోంది. ఇసుక రీచ్ల వద్ద తెలుగుతమ్ముళ్లు ‘టిక్’ కొట్టిన వ్యక్తి మాత్రమే ఇసుక తీసుకెళ్లాలనే అలిఖిత చట్టం నడుస్తోంది. నిజానికి ఖనిజ సంపద రక్షణకై జిల్లా కలెక్టర్, ఎస్పీ, జాయింట్ కలెక్టర్, ఆర్డీఓ, మైనింగ్ ఏడీ సమన్వయంతో అక్రమ రవాణాపై ఉక్కుపాదం మోపాలి. కానీ నేడు పాలకులు, అధికారులు చూపిస్తున్న ఘోర నిర్లక్ష్యం ఇలాగే కొనసాగితే.. భవిష్యత్ తరాలకు బరైటీస్ ఖనిజం ఇలా ఉండేదని, ఇసుక ఈ స్థాయిలో దొరికేదని, గ్రావెల్ అంటే ఇదంటూ కేవలం పుస్తకాల్లో బొమ్మలు చూపించి చెప్పుకోవాల్సిన దుస్థితి వస్తుందని పర్యావరణ పరిశీలకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. -
నిధుల కోసం రా‘జోలె’
కడప సిటీ : వైఎస్సార్ కడప, నంద్యాల జిల్లాల సరిహద్దుల్లోని కుందూనదిపై ఉన్న రాజోలి రిజర్వాయర్ నూతన ప్రాజెక్టు నిర్మాణం అటకెక్కినట్లే కనిపిస్తోంది. ఎప్పుడో బ్రిటీషు కాలంలో నిర్మించిన ఈ ఆనకట్ట మరమ్మతులకు నోచుకోక నీరంతా వృథాగా వెళ్లిపోతోంది. వైఎస్సార్ సీపీ హయాంలోనే ఈ ప్రాజెక్టు నూతన నిర్మాణానికి బీజం పడినా.. ప్రస్తుత కూటమి ప్రభుత్వం భూ సేకరణ విషయంలో మీనమేషాలు లెక్కిస్తోంది. ఎన్నికల సమయంలో రాజోలి ప్రాజెక్టుపై పెద్ద పెద్ద మాటలు వల్లె వేసిన కూటమి నేతలు అధికారంలోకి వచ్చాక చిన్నచూపు చూస్తున్నారు. చారిత్రక నేపధ్యం బ్రిటీషుకాలంలో 1860–70 మధ్య డచ్, బ్రిటీషు ఇంజనీర్లు కుందూ నదిపై రాజోలి ఆనకట్ట నిర్మించారు. అప్పటి నుంచి జిల్లా వాసులకు సాగు, తాగునీరందిస్తూ వస్తోంది. కేసీ కెనాల్ వ్యవస్థలో ఈ ఆనకట్ట కీలకపాత్ర పోషించింది. మైదుకూరు, చాపాడు, ప్రొద్దుటూరు ప్రాంతాలకు ఈ ప్రాజెక్టు ద్వారా తాగునీరు అందించేవారు. కాలక్రమేణా పాతకట్ట పూడిక, ప్రాజక్టు దెబ్బతినడంతో నీటిని సమర్థంగా నిల్వ చేసేందుకు కొత్త రాజోలి రిజర్వాయర్ నిర్మాణం తలపెట్టారు. వైఎస్సార్సీపీ హయాంలోనే.. 2.95 టీఎంసీల సామర్థ్యంతో రాజోలి కొత్త ఆనకట్ట నిర్మాణానికి 2020లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ముందుకు వచ్చింది. ఈ మేరకు సుమారు రూ.1357.10 కోట్లతో ఈ ప్రాజెక్టు నిర్మాణం చేపట్టాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించారు. టెండర్లు కూడా పూర్తయ్యాయి. కూటమి రాకతో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ‘రాజోలి ఆనకట్ట నిర్మాణంపై ఒక్క అడుగు ముందుకు పడలేదు. రైతులపై చిత్తశుద్ధి కరువై భూ సేకరణ పేరిట కాలయాపన చేస్తోంది. కొత్త నిర్మాణం ఆలస్యమైనా కనీసం ఉన్న గేట్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. గేట్ల మరమ్మత్తులకు రూ.18.85 లక్షలు మంజూరైనా పనులు జరగకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎన్నికల సమయంలో లెక్కలేనన్ని హామీలిచ్చిన కూటమి నేతలు ఏరుదాటక ‘గేటు’ కూడా పట్టించుకోకపోవడంపై అన్నదాతలు మండిపడుతున్నారు. ప్రయోజనాలు ఈ రిజర్వాయర్ ద్వారా జిల్లాలోని కేసీ కెనాల్ పరిధిలో ఉన్న దాదాపు 83,489 ఎకరాల సాగు భూమికి నీటి సరఫరా స్థిరపడుతుంది. ప్రొద్దుటూరు పట్టణంతోపాటు చుట్టుపక్కల మండలాలకు శాశ్వతంగా తాగునీటి సమస్య తీరుతుంది. కుందూనదికి తరుచూవచ్చే వరదల ఉధృతిని తగ్గించి నీటిని నిల్వ చేసేందుకు తోడ్పడుతుంది. జిల్లాలోని మైదుకూరు, బద్వేలు నియోజకవర్గాలతోపాటు కర్నూలు, నంద్యాల జిల్లాల్లోని సుమారు 91 వేల ఎకరాల సాగునీటి అవసరాలు తీర్చేందుకు ఈ ప్రాజెక్టు రూపకల్పన చేశారు. ఈ ప్రయోజనాలు చేకూర్చాలంటే కొత్త ప్రాజెక్టు నిర్మాణంతోనే సాధ్యమవుతుంది. మరమ్మత్తులకు నోచుకోని గేట్లు వైఎస్సార్ సీపీ హయాంలోనే కొత్త ప్రాజెక్టుకు టెండర్లు సాగుతూ పోతున్న భూ సేకరణ పట్టించుకోని కూటమి ప్రభుత్వం -
నీటితొట్టిలో పడి చిన్నారి మృతి
అట్లూరు : నీటితొట్టిలో పడి రెండేళ్ల చిన్నారి మృతి చెందిన సంఘటన సంఘటన అట్లూరు మండలం ఎస్.వెంకటాపురంలోని చూడూరు కాలనీలో చోటు చేసుకుంది. స్థానికులు, బంధువుల వివరాల మేరకు.. చూడూరు కాలనీకి చెందిన మాడపూరు సౌజన్య, హరిలకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. రోజువారి కూలి పనుల నిమిత్తం భార్యభర్తలు మంగళవారం చిన్న కుమార్తె వేదశ్రీ(2)ని నాయనమ్మ దగ్గర వదిలి వెళ్లారు. రాత్రి ఆడుతూ ఇంటి సమీపంలోని నీటి తొట్టిలో చిన్ను పడి ఉండటాన్ని నాయనమ్మ చూసి స్థానకులకు సమాచారం ఇచ్చింది. 108 అంబులెన్స్ సిబ్బందికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి పరీక్షించి పాప మృతి చెందిందని చెప్పారు. కూలి పనులకు వెళ్లి రాత్రి ఇంటికి వచ్చే సరికి చిన్ను చనిపోయి ఉండటంతో తల్లిదండ్రులు బోరున విలపించారు. చేపల దాణా పేరుతో రూ.64 లక్షలు మోసం ప్రొద్దుటూరు క్రైం : చేపల దాణా సరఫరా పేరుతో వ్యాపారిని నమ్మించి రూ.64 లక్షలు మోసం చేసిన నలుగురిపై బుధవారం వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మండలంలోని రిలయెన్స్ పెట్రోల్ బంకు సమీపంలో నివాసం ఉంటున్న కాంబోజి చిన్నపుల్లయ్య శ్రీ సాయి యోషిత ట్రేడర్స్ పేరుతో చేపల దాణా వ్యాపారం నిర్వహిస్తున్నాడు. 2025లో డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ జిల్లాకు చెందిన కసిరెడ్డి వీరవెంకట దుర్గాప్రసాద్ ప్రొద్దుటూరులోని చిన్నపుల్లయ్యను సంప్రదించాడు. తాను గతంలో నగరం శ్రీనివాసరావు వద్ద గుమస్తాగా పని చేశానని, చేపల చెరువుల యజమానులకు దాణా విక్రయించి పెడతానని చెప్పాడు. అందుకు గాను తనకు కమీషన్ ఇవ్వాలని కోరగా చిన్నపుల్లయ్య అంగీకరించాడు. ఈ క్రమంలో మొదట మూడు నెలల పాటు దాణా తీసుకున్నందుకు సంబంధించిన డబ్బును దుర్గా ప్రసాద్ క్రమం తప్పకుండా చెల్లించడంతో అతనిపై చిన్నపుల్లయ్యకు నమ్మకం ఏర్పడింది. అనంతరం తన స్నేహితులైన ఉలవకాయల రామస్వామి రమణ, విజయ్, ముద్రగడ రమేష్లకు చేపల చెరువులు ఉన్నాయని, వారికి దాణా అవసరమని దుర్గాప్రసాద్ పరిచయం చేశాడు. దుర్గా ప్రసాద్ చెప్పిన మేరకు వారికి చిన్నపుల్లయ్య దాణా సరఫరా చేశాడు. సుమారు రూ. 64 లక్షల విలువైన దాణాకు సంబంధించిన బిల్లులను గుర్తు తెలియని వ్యక్తుల పేర్లతో తయారు చేయించి మోసం చేసినట్లు అతను ఫిర్యాదు చేశాడు. డబ్బులు చెల్లించాలని అడుగగా నిందితులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అతను పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపారు. -
స్థానిక ఎన్నికల నిర్వహణకు సిద్ధం !
కడప సెవెన్రోడ్స్ : స్థానిక సంస్థల ఎన్నికల నిర్వహణకు సంబంధించి జిల్లాలో అవసరమైన అన్ని ముందస్తు ఏర్పాట్లను పకడ్బందీగా చేపడుతున్నామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠాకు వివరించారు. బుధవారం రాష్ట్ర ఎన్నికల కమిషనర్ అనిల్ చంద్ర పునేఠా సంబంధిత పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ, పంచాయతీరాజ్ శాఖల కమిషనర్లతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లు, జెడ్పీ సీఈవోలు, డీపీవోలు, మున్సిపల్ కమిషనర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై సమీక్ష నిర్వహించారు. ఈ వీడియో కాన్ఫరెన్స్లో కడప కలెక్టర్ క్యాంపు కార్యాలయం నుంచి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా జిల్లాలో స్థానిక సంస్థల ఎన్నికలకు సంబంధించి చేపడుతున్న ముందస్తు ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ రాష్ట్ర ఎన్నికల కమిషనర్కు వివరించారు. జిల్లాలోని 39 మండలాల పరిధిలో 619 గ్రామపంచాయతీలు, 6,004 వార్డులు ఉన్నాయని, మొత్తం 11,84,815 మంది ఓటర్లు ఉన్నారని తెలిపారు. ఎన్నికలు నిర్వహించని 8 గ్రామపంచాయతీలకు సంబంధించి న్యాయస్థానాల ఉత్తర్వులు, ఎన్నికల బహిష్కరణ తది తర అంశాలను కూడా కమిషనర్ దృష్టికి తీసుకెళ్లారు. అభివృద్ధి పనులను వేగవంతం చేయాలి దాల్మియా పరిశ్రమ ప్రభావిత గ్రామాల ప్రజలకు ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇచ్చిన ప్రతి హామీని నిబంధనల మేరకు అమలు చేసి, వారికి పూర్తి న్యాయం జరిగేలా చర్యలను వేగవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను, దాల్మియా సంస్థ ప్రతినిధులను ఆదేశించారు. బుధవారం సాయంత్రం కలెక్టరేట్లోని తన ఛాంబర్లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనాతో కలిసి దాల్మియా సంస్థ యాజమాన్య ప్రతినిధులు, రెవెన్యూ, సంబంధిత శాఖల అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. గత ఏడాది నిర్వహించిన ప్రజాభిప్రాయ సేకరణ సందర్భంగా ఇచ్చిన హామీలు, తీసుకున్న నిర్ణయాల అమలు పురోగతిని అంశాల వారీగా సమీక్షించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
● మ్యారేజ్ బ్యూరోల రికార్డులు: 90% అబ్బాయిలే!
వివిధ వివాహ వేదికల డేటా ప్రకారం.. రిజిస్ట్రేషన్ చేసుకుంటున్న వారిలో 90 శాతానికి పైగా అబ్బాయిల ప్రొఫైల్స్ ఉంటుండగా, అమ్మాయిల వివరాలు మాత్రం పది శాతం కూడా దాటడం లేదు. గతంలో అమ్మాయిల తల్లిదండ్రులు ఆఫీసుల చుట్టూ తిరిగేవారు. కానీ ఇప్పుడు అబ్బాయిల తండ్రులు రోజుకు రెండు మూడు సార్లు ఫోన్లు చేస్తూ ఆరా తీస్తున్నారు. ‘మాకు ఆస్తిపాస్తులతో పనిలేదు, అమ్మాయి నచ్చితే చాలు.. ఏదైనా కొత్త ప్రొఫైల్ వస్తే మొదట మాకే చెప్పండి, ఫీజు ఎంతైనా ఇస్తాం’ అంటూ అబ్బాయిల తల్లిదండ్రులు బ్యూరోల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. -
రూ.1500 కోట్ల భూములు ఏమయ్యాయో నిగ్గుతేల్చండి
ప్రొద్దుటూరు : తమ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు రూ.1500 కోట్ల విలువైన భూములను స్వాహా చేశామని బూచిగా చూపి అధికారంలోకి వచ్చిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితోపాటు ఆయన కుమారుడు కొండారెడ్డి ఇంత వరకు ఎందుకు బయటపెట్టలేకపోతున్నారని మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ప్రశ్నించారు. ఆయన బుధవారం వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు ఖాజాపీర్ కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ఇప్పటికై నా బురద చల్లే పనులను మానుకోవాలని కోరారు. రెండున్నర సంవత్సరాలైనా తాము భూములు కబ్జా చేసి ఉంటే విచారించి ఎందుకు కేసులు పెట్టలేకపోయారన్నారు. వాల్మీకి కార్పొరేషన్ డైరెక్టర్ నల్లబోతుల నాగరాజు రూ.100 కోట్ల స్కాం జరిగిందని, అందులో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి హస్తం ఉందని విమర్శలు చేయడం హాస్యాస్పందంగా ఉందన్నారు. శ్రీనివాసనగర్లో ప్రభుత్వ స్థలం మూడు సెంట్లు ప్రైవేట్ వ్యక్తులకు రిజిస్ట్రేషన్ చేశారన్నారు. ఇందులో తమకు రూ.2.5 కోట్లు వచ్చిందని ఆరోపణలు చేశారని తెలిపారు. ప్రతిపక్షంలో ఉన్న తమకే రూ.2.5 కోట్లు వస్తే అధికార పార్టీలో ఉన్న వరదరాజులరెడ్డికి, ఆయన సోదరుడు రాఘవరెడ్డికి, కొండారెడ్డికి ఏమాత్రం వచ్చిందన్నారు. వార్త వేసి ఖండన రాశారు ఈ ఏడాది ఏప్రిల్ 24న సాక్షి పత్రికలో శ్రీనివాసనగర్ స్థలం అక్రమ రిజిస్ట్రేషన్పై ప్రచురించిన కథనాన్ని బంగారు మునిరెడ్డి చూపించారు. న్యాయవాది సంధాని మరుసటి రోజు ఇచ్చిన ఖండనను కూడా పత్రికలో ప్రచురించారన్నారు. వాస్తవాలను తెలుసుకోకుండా రాచమల్లు చెప్పిఉంటే పత్రికలో మరుసటి రోజు రాశారని చెప్పడం దురదృష్టకరమన్నారు. బుర్ర లేకుండా నాగరాజులాంటి వారితో మాట్లాడిస్తే మీకే నష్టం జరుగుతుందని టీడీపీ నాయకులను ఉద్దేశించి అన్నారు. రూ.1500 కోట్ల భూములలో స్కాం జరిగి ఉంటే నిరూపించాలని సవాల్ విసిరారు.మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి -
ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన నిందితుల అరెస్ట్
పులివెందుల : రైల్వే, ఇన్ఫోసిస్ కంపెనీలలో ఉద్యోగాలు ఇప్పిస్తామని మోసం చేసిన ఇద్దరు నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.8లక్షల నగదును స్వాధీనం చేసుకున్నామని అర్బన్ సీఐ శ్రీరామ్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం పట్టణంలోని స్థానిక అర్బన్ పోలీస్స్టేషన్లో ఆయన ఎస్ఐలతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పులివెందుల అర్బన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉద్యోగాలు ఇప్పిస్తామని నమ్మించి ప్రజలను మోసం చేసిన రెండు వేర్వేరు కేసుల్లో ఇద్దరు నిందితులను కనంపల్లె చెక్ పోస్ట్, కదిరి చెక్ పోస్ట్ల వద్ద విశాఖపట్టణం శ్రీనివాసనగర్కు చెందిన నామాల జనప్రకాష్రావు, తిరుపతి జిల్లా వరదయ్యపాలెం మండలం బత్తలవలం గ్రామానికి చెందిన కృష్ణయ్య మహేష్లను గుర్తించి పెద్ద మనుషుల సమక్షంలో అరెస్టు చేశామన్నారు. నామాల జనప్రకాష్రావు..పులివెందుల పట్టణానికి చెందిన మల్లికార్జునరెడ్డికి ఇన్ఫోసిస్ కంపెనీలో ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి డబ్బులు తీసుకున్నాడన్నారు. అలాగే కృష్ణయ్య, మహేష్ పులివెందుల పట్టణానికి చెందిన సాయి కుమార్కు ఉద్యోగం ఇప్పిస్తానని నమ్మబలికి ప్రాసెసింగ్ ఫీజు పేరుతో రూ.2లక్షలు తీసుకుని ఉద్యోగం ఇవ్వకపోవడంతో సాయి కుమార్ 2025 మార్చి 24వ తేదీన పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల వద్ద నుంచి రూ.8,00,000/– నగదును చట్ట ప్రకారం స్వాధీనం చేసుకొని బాదితులకు సత్వర న్యాయం చేసినట్లు చెప్పారు. ప్రజలు అప్రమత్తంగా ఉండి డబ్బులు ఇస్తే ఉద్యోగం ఖాయమని చెప్పే మోసగాళ్లను నమ్మొద్దని సీఐ సూచించారు. కార్యక్రమంలో ఎస్ఐలు మధుసూదన్రెడ్డి, తిమోతి, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
జీవితం ఒక ఆల్జీబ్రా.. విలువ కనుగొంటే విజయమేరా !
● డైలీ పేపర్ బాయ్ టు డిగ్రీ లెక్చరర్ ● కష్టాలను జయించిన ‘గణిత’ విజేత! ● కృషి, పట్టుదలతో ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్గా కుంచం గణేష్ రెడ్డి ఎంపిక వేంపల్లె: కఠినమైన పేదరికం, అడుగడుగునా కష్టాలు ఎదురైనా.. గుండె నిండా ఆత్మవిశ్వాసం, అచంచలమైన పట్టుదల ఉంటే అనుకున్న లక్ష్యాన్ని సాధించవచ్చని నిరూపించాడు వైఎస్ఆర్ కడప జిల్లా వేంపల్లె మండలం తువ్వపల్లె గ్రామానికి చెందిన కుంచం గణేష్ రెడ్డి. ఇటీవల ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ విడుదల చేసిన ప్రభుత్వ డిగ్రీ కాలేజ్ లెక్చరర్ల నియామక ఫలితాలలో ఆయ న గణిత శాస్త్ర విభాగంలో లెక్చరర్గా ఎంపికై తన కలని సాకారం చేసుకున్నారు. ఒకప్పుడు తెల్లవారుజామునే లేచి ఇళ్ల చుట్టూ పేపర్లు వేసిన ఒక సామాన్య ‘పేపర్ బాయ్’.. నేడు ప్రభుత్వ డిగ్రీ ప్రొఫెసర్గా మారి పెను సంచలనం సృష్టించాడు. 12 ఏళ్లకే తండ్రి దూరం.. గణేష్ రెడ్డి జీవిత ప్రయాణం ఎందరికో కన్నీళ్లు తెప్పిస్తూనే, సరికొత్త స్ఫూర్తిని ఇస్తుంది. ఆయనకు కేవలం 12 ఏళ్ల వయసు ఉన్నప్పుడే తండ్రి కుంచం సుబ్బారెడ్డి మరణించారు. అప్పటినుంచి ఆయన తల్లి కుమారి, నాన్నమ్మ సావిత్రమ్మ తమ రెక్కల కష్టాన్నే నమ్ముకుని గణేష్ను చదివించారు. డిగ్రీ చదువుతున్న రోజుల్లో కుటుంబానికి ఆసరాగా ఉండేందుకు, తన చదువు ఖర్చుల కోసం ఆయన తెల్లవారుజామునే లేచి పేపర్ బాయ్గా పనిచేశారు. కార్పొరేట్లకు దీటుగా సర్కారు చదువు.. కార్పొరేట్ విద్యాసంస్థల్లో లక్షలు కుమ్మరిస్తేనే విజయాలు దక్కుతాయని భావించే వారికి గణేష్ రెడ్డి ఒక సజీవ నిదర్శనం. ఆయన ప్రాథమిక విద్యాభ్యాసం నుంచి పీజీ వరకు అంతా పూర్తిగా ప్రభుత్వ విద్యాసంస్థల్లోనే కొనసాగింది. వేంపల్లె జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాలలో పదో తరగతి, కడప ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాలలో బీఎస్సీ పూర్తి చేశారు. గణితంపై ఉన్న పట్టుదలతో ఎంఎస్సీ ఎంట్రన్స్ పరీక్షలో రాష్ట్రస్థాయిలో 8వ ర్యాంకు సాధించి, యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ పూర్తి చేశారు. అనంతరం ఏపీఆర్సెట్–2023 పరీక్షలో రాష్ట్ర స్థాయిలో ఫస్ట్ ర్యాంకు సాధించి ప్రస్తుతం వైవీయూలో పీహెచ్డీ చేస్తున్నారు. గురువు స్ఫూర్తితో ఓపెన్ కేటగిరీలోనే కొలువు కడప ప్రభుత్వ పురుషుల డిగ్రీ కళాశాల అధ్యాపకులు డాక్టర్ సుబ్బయ్య తనకు ఆదర్శమని, ఆయ న అందించిన ప్రోత్సాహం, మార్గదర్శకత్వం వల్లే తాను ఈ స్థాయికి చేరుకున్నానని గణేష్ రెడ్డి కృతజ్ఞతతో చెప్పారు. ఈ క్రమంలోనే ఏపీపీఎస్సీ డిగ్రీ లెక్చరర్ల పరీక్ష రాసి, మొదటి ప్రయత్నంలోనే ఏకంగా ఓపెన్ కేటగిరీలో ఉద్యోగం సాధించి రికార్డు సృష్టించారు. ఈ నోటిఫికేషన్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి మ్యాథమెటిక్స్ విభాగంలో ప్రభుత్వ లెక్చరర్గా ఎంపికై న ఏకై క వ్యక్తి గణేష్ కావడం విశేషం. తల్లికి ‘విజయమే’ బహుమతి గణేష్ ఈ పరీక్షకు సిద్ధమవుతున్న కీలకమైన సమయంలోనే ఆయన తల్లి కుమారి భయంకరమైన క్యాన్సర్ బారిన పడ్డారు. ఒకవైపు తల్లికి జరుగుతున్న కీమోథెరపీ, రేడియేషన్ చికిత్సల తాలూకు మానసిక వేదన, మరోవైపు పరీక్షల తీవ్ర ఒత్తిడి ఉన్నప్పటికీ ఆయన అధైర్యపడలేదు. ‘నా తల్లి నా కోసం చేసిన త్యాగాలకు, చూపిన ప్రేమకు ఈ ప్రభుత్వ ఉద్యోగమే నేను ఇచ్చే అతిపెద్ద బహుమతి’ అని గణేష్ రెడ్డి భావోద్వేగానికి లోనయ్యారు. ఈ సందర్భంగా తనకు ప్రతి అడుగులోనూ అండగా నిలిచిన తన కుటుంబ సభ్యులకు, స్నేహితులకు, అధ్యాపకులకు ధన్యవాదాలు తెలిపారు. కూడికలతో స్నేహం కూడు.. తీసివేతతో కష్టాలు తుడుచు గుణకారంతో సంతోషాలు పెంచు.. భాగహారంతో బాధలు పంచు సమీకరణాల చిక్కు ముడులను.. సహనంతో విప్పర తమ్ముడా ‘ఎక్స్’, ‘వై’ ల విలువల వెనుక.. దాగుందిరా సృష్టి మర్మం సూత్రాలన్నీ ఒడిసి పడితే.. సులువుగా మారును జీవిత గమ్యం అపజయాల గడప దాటితే.. విజయాల ‘గణితం’ నీదవునురా -
అన్నను చంపిన తమ్ముడు అరెస్ట్
బ్రహ్మంగారిమఠం : బి.మఠంలో ఈనెల 16న గొడ్డలితో అన్నను నరికి చంపిన వజ్రాల సురేష్ ను బుధవారం అరెస్ట్ చేసి బద్వేల్ కోర్టుకు తరలించినట్లు మైదుకూరు రూరల్ సీఐ శివశంకర్ తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ మద్యం మత్తులో ఉన్న సురేష్ ఆదివారం నిద్రిస్తున వజ్రాల వెంకటసుబ్బయ్యను చిన్నవివాదం వల్ల గొడ్డలితో నరికి చంపాడన్నారు. వెంకట సుబ్బయ్య తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నట్లు తెలిపారు, కార్యక్రమంలో ఎస్ఐ శివప్రసాద్. పోలీసులు పాల్గొన్నారు. జాతీయ స్థాయి తపాలాశాఖ లేఖా రచన పోటీలుప్రొద్దుటూరు కల్చరల్ : ‘దాయ్ ఆఖర్’పేరుతో తపాలాశాఖ ‘భూమాతకు ఒక లేఖ – ప్రకృతిని రక్షించడానికి నా వాగ్దానం’అనే అంశంపై లేఖలను ఆహ్వానిస్తున్నట్లు ప్రొద్దుటూరు పోస్టల్ సూపరింటెండెంట్ బి.లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 18 ఏళ్లలోపు వారు ఒక కేటగిరిగా, 18 ఏళ్లు పైబడిన వారిని మరొక కేటగిరిగా పరిగణిస్తూ, విజేతలకు నాలుగు కేటగిరిల్లో మొత్తం 12 బహుమతులు అందిస్తారని ఆయన పేర్కొన్నారు. 2026 జనవరి 1 నాటికి 18 సంవత్సరాల కంటే తక్కువ లేదా పైబడి ఉన్నానని ధ్రువీకరణ పత్రాన్ని జత పరచాలన్నారు. లేఖను తెలుగు, హిందీ, ఇంగ్లీషు భాషల్లో రాసి అక్టోబర్ 31వ తేదీలోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసెస్, ప్రొద్దుటూరు డివిజన్, ప్రొద్దుటూరు – 516360 చిరునామాకు పంపాలని సూచించారు.ఎన్వలప్పై పంపాలనుకునే వారు ఏ–4 సైజ్ పేపర్పై 1000 పదాలకు మించకుండా రాసి పంపాలని, ఇన్ల్యాండ్ లెటర్ కార్డుపై రాసే వారు 500 పదాలకు మించకుండా రాయల్సి ఉంటుందన్నారు. దరఖాస్తుల ఆహ్వానం తపాలా శాఖ దీన్ దయాల్ స్పర్శ్ యోజన కింద ఉపకరా వేతనాల (స్కాలర్షిప్)ను అందిస్తోందని ప్రొద్దుటూరు పోస్టల్ సూపరింటెండెంట్ బి.లక్ష్మణ్ నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. 6 నుంచి 9వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తోందని పేర్కొన్నారు. దరఖాస్తులను 2026 సెప్టెంబర్ 16వ తేదీలోపు సూపరింటెండెంట్ ఆఫ్ పోస్టాఫీసు, ప్రొద్దుటూరు డివిజన్, ప్రొద్దుటూరు అనే చిరునామాకు పంపాలని సూచించారు. విద్యార్థులపై కేంద్ర ప్రభుత్వ వేధింపులు ఆపాలి కడప సెవెన్రోడ్స్ : ఢిల్లీ ఉద్యమంలో పాల్గొన్న విద్యార్థులపై వేధింపులు ఆపాలని వివిధ సంఘాల నాయకులు డిమాండ్ చేశారు. బుధవారం రాష్ట్ర వ్యాప్త పిలుపులో భాగంగా కడప కలెక్టరేట్ వద్ద ఎస్ఎఫ్ఐ, డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో నిరసన దీక్ష చేపట్టారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉన్నత విద్య పూర్తిగా భ్రష్టు పట్టిందన్నారు. అందుకు ఉదాహరణనే నీట్ పరీక్షా విధానమేనని తెలిపారు. బీజేపీ ప్రభుత్వంలో ఇప్పటికే నీట్ పేపర్ 89 సార్లు లీకేజీ అయ్యిందని, పరీక్ష నిర్వహణలో ఎన్టీఏ పూర్తిగా విఫలమైందన్నారు. నీట్ పేపర్ లీకేజీ కారణంగా ఎంతో మంది విద్యార్థులు ఆత్మహత్యలు చేసుకున్నారని తెలిపారు. ఈ ఆత్మహత్యలు అన్ని ప్రభుత్వ హత్యలుగానే భావిస్తున్నామన్నారు. లక్షలాది మంది విద్యార్థులు భవిష్యత్ అంధకారం కాకూడదని కడుపుమండి డిల్లీ లో పోరాటం సాగించి కేంద్రం మెడలు వంచి కేంద్ర విద్యా శాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాల్సి వచ్చిందని వివరించారు. డిల్లీ పోరాటంలో పాల్గొన్న విద్యార్థులపై కేసులు నమోదు చేస్తూ భయబ్రాంతులకు గురి చేసే విధంగా వేధింపులకు పాల్పడుతున్నదని, ఈ చర్యని వ్యతిరేకిస్తూ ఖండిస్తున్నామని అన్నారు. -
31లోగా అప్లోడ్ చేయాలి
– డీఈఓ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్: జిల్లాలో నేషనల్ మీన్స్ మెరిట్ స్కాలర్ షిప్ పొందుతున్న విద్యార్థులు రెన్యువల్ దరఖాస్తులను ఎన్ఎస్ పోర్టర్లో ఈ నెల 31లోగా అప్లోడ్ చేయాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2022 నుంచి 2024 సంవత్సరాల్లో పరీక్షకు ఎంపికై ప్రస్తుతం హాస్టల్ వసతి లేని ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో చదివే పది, ఇంటర్ విద్యార్థులు ఆన్లైన్లో రెన్యువల్ చేసుకున్న తరువాత సదరు పాఠశాల, జూనియర్ కళాశాల నోడల్ అధికారితో ఆమోదించాలని తెలిపారు. దరఖాస్తుతోపాటు స్టడీ సర్టిఫికెట్, జిరాక్స్ కాపీలను డీఈఓ కార్యాలయంలో అందజేయాలని తెలిపారు. క్వాంటమ్ కంప్యూటింగ్లో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రతిభ వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీకి చెందిన విద్యార్థి సీవీఎస్ మహేంద్ర క్వాంటమ్ కంప్యూటింగ్లో ప్రతిభ చూపాడు. ఈ మేరకు ఈనెల 17న విజయవాడలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చేతుల మీదుగా సన్మానం పొందినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్, ఏఓ పెనుకొండ రవికుమార్ తెలిపారు. బుధవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో విద్యార్థి మహేంద్రను వారు అభినందించారు. జాతీయ స్థాయి సర్టిఫికేషన్ కార్యక్రమంలో సాధించిన ఈ ఘనత ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ గౌరవాన్ని, ప్రతిష్టను తీసుకొచ్చిందని పేర్కొన్నారు. డీన్ అకాడమిక్స్ డాక్టర్ రమేష్, కై లాష్, కోఆర్డినేటర్ క్వాంటమ్ టెక్నాలజీస్ ఎం. భాస్కరయ్య, అధ్యాపక బృందం పాల్గొన్నారు. కారు చీకట్లలో.. చిరుతల షికారు! రాజంపేట : రాపూర్ ఘాట్రోడ్డులో రాత్రి వేళల్లో చిరుతల సంచారం ఎక్కువైంది. ఒక్కోసారి గుంపులుగా రోడ్డుమీదకు వస్తున్నాయి. వీటి గాండ్రింపులతో వాహనదారులు భయాందోళనకు గురవుతున్నారు. అన్నమయ్య జిల్లా అటవీశాఖ పరిధిలో ఉన్న చిట్వేలి–రాపూర్ ఘాట్రోడ్డు దట్టమైన పెనుశిలా అభయారణ్యంలో ఉంది. నెల్లూరు, విజయవాడ ప్రాంతాలకు వెళ్లే వారు ఎక్కువగా ఈ ఘాట్ గుండానే ప్రయాణిస్తారు. ఇక సిద్దవటం–బద్వేలు రహదారి రాత్రి వేళ మూసి ఉండడంతో చాలా మంది ఈ దారినే ఉపయోగిస్తున్నారు. దీంతో పగలే కాకుండా రాత్రి వేళల్లోనూ రాపూర్ఘాట్ వాహనాలతో రద్దీగా ఉంటుంది. కాగా ఇటీవల ఈ ఘాట్లో చిరుతల గాండ్రింపులు ఎక్కువయ్యాయి. రాత్రి వేళలో చిరుతలు రోడ్డు దాటుతుండగా, ఘాట్లో ప్రొటక్షన్ వాల్ గోడలపై నిలబడి ఉండడాన్ని వాహనదారులు గుర్తించారు. దీనిపై అటవీ సిబ్బందిని అడగ్గా.. అటవీ ప్రాంతంలో వన్యప్రాణులకు దాహార్తి తీర్చుకోవడానికి నీటివనరులు పుష్కలంగా ఉన్నా.. అడవి దోమలపోటుకు తట్టుకోలేకే విశాల ప్రాంతానికి వస్తున్నాయని వివరించారు. వాహనాదారులు ఘాట్రోడ్డు దాటే విషయంలో జాగ్రత్తగా వ్యవహరించాలని సూచించారు. బీసీ భవన్లో రగడ కడప రూరల్: కడప నగరం పాత రిమ్స్లో గల బీసీ భవన్లో రగడ జరిగింది. బుధవారం జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణయ్య ఆధ్వర్యంలో వివిధ బీసీ సంఘాల నేతలతో బీసీ భవన్ అభివృద్ధి కమిటీ ఏర్పాటు సన్నాహక సమావేశం జరిగింది. ఈ సమావేశానికి వివిధ బీసీ సంఘాలకు చెందిన నాయకులు హాజరయ్యారు. ఈ సందర్భంగా బీసీ భవన్పై ఆధిపత్యం కోసం బీసీ సంఘాల నేతల మధ్య వాదనలు జరిగాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి సహకారంతో బీసీ భవన్ ఏర్పాటైంది. ఈ భవనం బీసీ సంఘాలకు చెందిన అందరిది. అభివృద్ధి కమిటీలో ఏకపక్షంగా కొందరినే పరిమితం చేయకుండా, అన్ని సంఘాలకు చోటు కల్పించాలని పలువురు బీసీ నేతలు వాదించారు. బీసీ సంఘాల నేతల వాదనలు విన్న అనంతరం, సమావేశం మరొకసారి ఏర్పాటు చేస్తామని జిల్లా బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణయ్య తెలిపారు. -
కొనసాగుతున్న జూనియర్ డాక్టర్ల సమ్మె
కడప అర్బన్ : రాష్ట్రవ్యాప్తంగా ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ ఆధ్వర్యంలో స్టైఫండ్ పెంపు డిమాండ్ తో బుధవారం కడప జీఎంసీ, జీజీహెచ్ ఆవరణలో ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ నాయకులు ర్యాలీ నిర్వహించేందుకు ముందుకు వచ్చి బుధవారం పదవ రోజున ఆందోళన కొనసాగించారు. ఇప్పటికే నాన్ ఎమర్జెన్సీ సేవలను బహిష్కరిస్తూ రిలే నిరాహార దీక్షలను చేపట్టిన జూనియర్ డాక్టర్లు ప్రభుత్వం నుంచి తమ డిమాండ్లపై స్పష్టమైన హామీ రాకపోవడంతో తదుపరి దశకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. అత్యవసర సేవలు కూడా నిలిచిపోతే ప్రభుత్వ ఆసుపత్రులను ఆశ్రయించే పేద, మధ్యతరగతి రోగులపై ప్రత్యక్ష ప్రభావం పడే అవకాశం ఉంది. స్టైఫండ్ లో 30% పెంపు కోసం డిమాండ్ చేస్తూ 2009లో జారీ చేసిన జీవో 287 ప్రకారం ప్రతి రెండేళ్లకు ఒకసారి 15శాతం స్టైఫండ్ పెంపు జరగాల్సి ఉందని జూనియర్ డాక్టర్లు పేర్కొంటున్నారు. ఈ పెంపు ఏడు నెలల పైగా ఆలస్యమైందని చెబుతున్నారు. జూనియర్ డాక్టర్ల సేవలపై ఆధారపడే ప్రభుత్వ బోధనా ఆస్పత్రిలో రోగుల సంఖ్య అధికంగా ఉండడంతో అదనంగా భారం పడుతోంది. ఇప్పటివరకు అత్యవసర విభాగాల్లో సేవలకు ఈనెల 16వ తేదీ వరకు జూనియర్ డాక్టర్లు హాజరవుతూ వచ్చారు. ఈనెల 17వ తేదీ నుంచి అత్యవసర సేవలను కూడా బహిష్కరించి ఆందోళన ఉధృతంగా చేపట్టారు. ఇందులో భాగంగా కడప జీఎంసీ, జీజీహెచ్ (రిమ్స్) ఆవరణలో రిలేదీక్షలను చేపట్టారు. ఈక్రమంలోనే ర్యాలీని నిర్వహించారు. తరువాత ఓపీ భవనంలో నినాదాలు చేసుకుంటూ వెళ్లి అధికారులకు తమ ఆవేదనను వివరించారు. -
స్థానిక సమరానికి సిద్ధం కావాలి
వేంపల్లె : ప్రజా సమస్యలు పరిష్కరించేందుకు తన వంతు కృషి చేస్తానని, కాబట్టి రాబోయే స్థానిక సంస్థల సమరానికి వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు సిద్ధం కావాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి పేర్కొన్నారు. బుధవారం వేంపల్లెలోని శ్రీరాంనగర్లో నివాసం ఉంటున్న వైఎస్సార్సీపీ నేత తమ్మిశెట్టి బాబు గృహ ప్రవేశానికి కడప ఎంపీ హాజరయ్యారు. ఈ సందర్భంగా స్థానిక ప్రజలు తమ ప్రాంతానికి సంబంధించిన వివిధ సమస్యలను ఎంపీ దృష్టికి తీసుకొస్తూ వినతి పత్రాలను అందజేశారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి వినతులను ఎంపీ స్వయంగా పరిశీలించి సంబంధిత అధికారులతో చర్చించి సమస్యల పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటానని హామీ ఇచ్చారు. కార్యకర్తలకు అండగా ఉంటామని, అధైర్య పడకుండా ధైర్యంగా ఉండాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ రవికుమార్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చంద్ర ఓబుల్ రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు మునీర్, బీఎస్ షేక్షావలి, ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి కమతం రాజా, సుధాకర్, ప్రసాద్ రెడ్డి, బంకా సోమేశ్వరరెడ్డి, బ్రహ్మయ్య, కిష్టయ్య, ముత్యాల ఆంజినేయులు. ఆంజి రెడ్డిలతోపాటు పలువురు వైఎస్సార్సీపీ కార్యకర్తలు పాల్గొన్నారు.ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
మైదుకూరు : మైదుకూరు – సింగరాయకొండ జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం ఢీకొని మైదుకూరు మున్సిపల్ పారిశుధ్య కార్మికుడు పసల చిన్న వెంకటయ్య (59) దుర్మరణం చెందాడు. బుధవారం తెల్లవారుజామున జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పప్పనపల్లె ఎస్సీ కాలనీకి చెందిన చిన్న వెంకటయ్య తాత్కాలికలక వేతనంపై 5 నెలల కిందట మైదుకూరు మున్సిపాలిటీలో పారిశుధ్య కార్మికుడిగా చేరాడు. రోజులాగే విధులకు హాజరయ్యేందుకు బుధవారం తెల్లవారుజామున మోపెడ్పై మైదుకూరుకు బయల్దేరాడు. 4.50 గంటల ప్రాంతంలో భూమాయపల్లె సమీపంలోకి రాగానే వెనుక వైపు నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో చిన్న వెంకటయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. ఢీకొట్టిన అనంతరం వాహనం చిన్న వెంకటయ్య మృతదేహాన్ని కొద్ది దూరం ఈడ్చుకుంటూ వెళ్లడంతో శరీరం నుజ్జునుజ్జుయింది. మృతునికి భార్య ఓబుళమ్మ, ఇద్దరు కుమారులు, ఓ కుమార్తె ఉన్నారు. సంఘటనపై అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నారు. మైదుకూరు – సింగరాయకొండ జాతీయ రహదారి పనులు నత్తనడకన సాగుతుండటం, పనులు సక్రమంగా చేయకపోవడం వల్లే ప్రమాదాలు జరుగుతున్నాయనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికే ఈ రహదారిపై జరిగిన ప్రమాదాల్లో పలువురు మృతి చెందారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని..సిద్దవటం : కడప–చైన్నె జాతీయ రహదారి ఎస్కెఆర్ నగర్ సమీపంలో బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో మాడ బాలాజీరావు (45) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన మాడ బాలాజీరావు బుధవారం తెల్లవారుజామున టీ తాగేందుకు నడుచుకుంటూ ఎస్కెఆర్ నగర్ వద్దకు వస్తుండగా గుర్తు తెలియని వాహనం అతన్ని ఢీకొంది. అతని తలకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే మృతిచెందారు. మృతుని భార్య పార్వతి జీవనోపాధి కోస మూడేళ్ల క్రితం గల్ఫ్ దేశానికి వెళ్లింది. బాలాజీ ప్రతి రోజు కూలి పనికి వెళ్లి తన కుమారుడు పార్థు, కుమార్తె మధుమితను పోషించేవాడు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న హైవే పెట్రోలింగ్ పోలీసులు, సిద్దవటం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుని కుమార్తె మధుమిత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. బ్యాంకు ఉద్యోగిని అదృశ్యంపై వీడని మిస్టరీ ఆలమూరు : స్థానిక యూనియన్ బ్యాంకులో రూరల్ డెవలప్మెంట్ ఆఫీసర్గా పనిచేస్తున్న కడప జిల్లా సింగారెడ్డిపల్లికి చెందిన గానుగపెంట సుప్రియ (28) కోసం గాలింపు చర్యలను ఆలమూరు పోలీసులు ముమ్మరం చేశారు. ఈనెల 17న చొప్పెల్ల లాకుల వద్ద స్కూటర్, తాళం, కళ్లజోడు, పాదరక్షలు వదిలి వెళ్లి తూర్పు డెల్టా ప్రధాన పంటకాలువలో దూకి ఆత్మహత్య చేసుకుందని భావించిన పోలీసులు ఆ దిశగా గాలింపు చర్యలు చేపట్టారు. ఆమె ఆచూకీ తెలియక అదృశ్యం కాస్త మిస్టరీగా మారింది. ఇప్పటికే సీసీ కెమెరాలు, డ్రోన్ల సాయంతో పరిశీలించినా సుప్రియ ఆచూకీ తెలియకపోవడంతో కాకినాడ నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్డీఆర్ఎఫ్ దళాలతో గాలిపు చర్యలను తీవ్రతరం చేశారు. అయినా ఆ యువతి ఆచూకీ కానరాక అంతటా ఆందోళన నెలకొంది. -
వేంపల్లెలో కమాండ్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు
వేంపల్లె : వేంపల్లెలోని అర్బన్ పోలీస్స్టేషన్లో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎస్పీ విలేకరులతో మాట్లాడుతూ వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఏర్పాటు చేసిన కమాండ్ కంట్రోల్ రూమ్ ద్వారా 24 గంటలు ప్రత్యేక నిఘా కొనసాగుతుందన్నారు. అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని అందుబాటులోకి తీసుకొచ్చి వేంపల్లె పట్టణంలో పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్ ఏర్పాటు చేశామన్నారు. వేంపల్లె పట్టణ వ్యాప్తంగా నిఘా నేత్రాలు ఉన్నాయని, చిన్న ఘటన జరిగిన వెంటనే తెలుసుకునేందుకు వీలు ఉంటుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న పోలీస్ స్టేషన్ల్లో అవసరమైన చోట్ల పబ్లిక్ సేఫ్టీ ఇంటిగ్రేటెడ్ ఆపరేషన్ సెంటర్లు ఏర్పాటు చేస్తామన్నారు. అంతకుముందు కమాండ్ కంట్రోల్ గదిలో విద్యార్థినులకు సీసీ కెమెరాల పని తీరు, భద్రతపై ఎస్పీ అవగాహన కల్పించారు. సీసీ కెమెరాలకు ఆర్థిక సహాయం చేసిన దాతలను ఆయన శాలువాలతో సత్కరించి కృతజ్ఞతలు తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐలు నరసింహులు, శ్రీరామ్, శాంతిలాల్, ప్రసాదరావు, ఎస్ఐలు తిరుపాల్ నాయక్, ప్రవీణ్, శ్రీప్రియ, చంద్రశేఖర్, స్వామి వివేకానంద పాఠశాల కరస్పాండెంట్ రామాంజనేయరెడ్డి, శ్రీచైతన్య పాఠశాల డైరెక్టర్ చేతన్ రెడ్డి, నారాయణ విద్యాసంస్థల చైర్మన్ నారాయణరెడ్డి, శ్రీనివాస పాఠశాల కరస్పాండెంట్ కేశవులు, అక్షర మహిళా జూనియర్ కళాశాల కరస్పాండెంట్ విజయభారతి, ఉషాకిరణ్ పాఠశాల పీఈటీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
కదం తొక్కిన కార్మికులు
కడప సెవెన్రోడ్స్ : తాము ఎదుర్కొంటున్న సమస్యలను ప్రస్తుత అసెంబ్లీ సమావేశాల్లో చర్చించాలని డిమాండ్ చేస్తూ రాష్ట్ర పిలుపులో భాగంగా మంగళవారం ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఉద్యోగ, కార్మికులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించారు. తొలుత మహావీర్ సర్కిల్ నుంచి ర్యాలీగా వచ్చారు. అప్పటికే ప్రధాన ద్వారాలను పోలీసులు మూసివేశారు. దీంతో ఆందోళనకారులు కలెక్టరేట్ ఎదుట బైఠాయించి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు.ఏఐటీయూసీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి ఎల్.నాగసుబ్బారెడ్డి, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు జి.వేణుగోపాల్, కేసీ బాదుల్లా మాట్లాడారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కార్మికుల సంక్షేమం కోసం కాకుండా అంబానీ, ఆదాని లాభాల కోసమే పనిచేస్తున్నాయంటూ విమర్శించారు. అంగన్వాడీ, ఆశా వర్కర్లకు కనీస వేతనం రూ. 26 వేలు చెల్లించాలని డిమాండ్చేశారు. కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలన్నారు. ఇటీవల 8 గంటల పనిని 10 గంటలకు పెంచుతూ అసెంబ్లీలో తీర్మానం చేయడాన్ని ఖండించారు. ఏఐటీయూసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ గంగా సురేష్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ మద్దిలేటి, కార్యనిర్వాహక కార్యదర్శి శ్రీరాములు, ఉపాధ్యక్షులు లింగన్న, చాన్బాషా, కార్యదర్శులు వెంకట రమణ, కల్పన, నగర అధ్యక్షులు కల్పన యూనియన్ నాయకులు పాల్గొన్నారు. -
కరాటే పోటీల్లో జయకేతనం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జపాన్ షోటోకాన్ కరాటే–డో అసోసియేషన్ ఆధ్వర్యంలో కర్ణాటక రాష్ట్రంలోని గౌరిబిదనూరులోని సెయింట్ ఆన్స్ స్కూల్లో నిర్వహించిన ఓపెన్ కరాటే చాంపియన్షిప్లో కడప విజయ్ మార్షల్ ఆర్ట్స్ కరాటే అకాడమీకి చెందిన 19 మంది విద్యార్థులు సత్తా చాటినట్టు ఆ అకాడమీ మాస్టర్ విజయ్ తెలిపారు. విద్యార్థులు అనూ ఏంజెల్, మేఘన, తాన్య, అబ్దుల్లా ఖాన్, వజ్ర దత్, యోగిత్ రామ్, చాడ్విక్, రజిత, హసిని, రోహన్ మొదటి స్థానంలో ట్రోఫీలు సాధించారని ఆయన పేర్కొన్నారు. హితిక, అబ్బాస్ ఖాన్, రుతిక, గణేష్, హన్విక, నైషిక్, రమ్య, మోక్షిత్ రెండవ స్థానంలో ట్రోఫీలు సాధించారని వివరించారు. -
మల్టీ డే జోనల్ మ్యాచ్ విజేత టీమ్–ఈ జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీడే జోనల్ మ్యాచ్ విజేతగా 8 పాయింట్లతో టీమ్–ఈ జట్టు నిలిచింది. మూడవ రోజు మంగళవారం కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో టీమ్–ఈ జట్టు టీమ్–బీ జట్టుపై 514 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టీమ్–ఏపై టీమ్–డీ జట్టు 277 పరుగుల తేడాతో జయకేతనం ఎగురవేసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 277 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–ఈ జట్టు 91.3 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 419 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని గౌతమ్ ఆర్య అద్భుతంగా రాణించి 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. టీమ్–బీ జట్టులోని దేవాషిస్ 4, ధీరజ్కుమార్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–బీ జట్టు 21.2 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 71 పరుగులు చేసింది. ఆ జట్టులోని వీరేంద్ర అన్వేష్ 29, కేవీ ఓంకార్ 25 పరుగులు చేశారు. టీమ్–ఈ జట్టులోని లక్ష్మీ గౌతమ్ 3 వికెట్లు తీశాడు. దీంతో టీమ్ ఈ జట్టు 514 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 205 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–డీ జట్టు 83.4 ఓవర్లకు 278 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని క్రాంతి కుమార్ 43 పరుగులు చేశాడు. టీమ్–ఏ జట్టులోని ఫణీంద్ర 3, లోహిత్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–ఏ జట్టు 40.4 ఓవర్లకు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని దేవ్ ప్రమోద్ 59 పరుగులు చేశాడు. టీమ్–డీ జట్టులోని రణదీప్ చక్కటి లైనఫ్తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. జయంత్ 4 వికెట్లు తీశాడు. దీంతో టీమ్–డీ జట్టు 277 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ జోనల్ మ్యాచ్లో టీమ్–ఈ జట్టు 8 పాయింట్లతో అగ్రస్థానంలో ఉండగా టీమ్–బీ 5 పాయింట్లు, టీమ్–డీ 3 పాయింట్లు, టీమ్–సీ జట్టు 1 పాయింటు సాధించింది. -
ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు పారదర్శకంగా చేపట్టాలి
డీఆర్వో మల్లికార్జునుడు స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామ పంచాయతీల్లో ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్ల గుర్తింపు ప్రక్రియను పకడ్బందీగా, పారదర్శకంగా నిర్వహించాలని జిల్లా రెవెన్యూ అధికారి కె.మల్లికార్జునుడు అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని డీఆర్వో చాంబర్లో కలెక్టర్ ఆదేశాల మేరకు స్థానిక సంస్థల ఎన్నికల సన్నద్ధతపై జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, డీపీవో రామచంద్ర, మున్సిపల్ కమీషనర్లు, పట్టణ ప్రణాళిక అధికారులతో సమావేశం నిర్వహించారు. జిల్లాలో గత ఎన్నికల అనుభవాలను దృష్టిలో ఉంచుకుని త్వరలో నిర్వహించనున్న స్థానిక సంస్థల ఎన్నికలను చక్కటి ప్రణాళికతో నిర్వహించేందుకు సన్నద్ధం కావాలని సూచించారు. ఎన్నికల సిబ్బంది నియామకం, ఎన్నికలకు సంబంధించిన సామగ్రి, ఎన్నికల సిబ్బందికి అవసరమైన శిక్షణ తదితర ప్రక్రియలను త్వరితగతిన చేపట్టాలని ఆదేశించారు. ఈ నెల 18 నుంచి 20వ తేదీ వరకు ఇంటింటి సర్వే ద్వారా ఎస్సీ, ఎస్టీ, బీసీ ఓటర్లను గుర్తించి, 21, 22 తేదీల్లో ఓటర్ల జాబితాల్లో గుర్తించనున్నారు. 23న ముసాయిదా జాబితా ప్రచురించి, 24 నుంచి 26 వరకు అభ్యంతరాలు స్వీకరిస్తారు. 27 నుంచి 31 వరకు అభ్యంతరాలపై విచారణ నిర్వహించి, సెప్టెంబరు 1 నుంచి 4 వరకు గ్రామసభల్లో జాబితాలను ధ్రువీకరిస్తారని, అలాగే సెప్టెంబరు 5న తుది జాబితాను ప్రచురిస్తారన్నారు. ప్రతి పంచాయతీకి ప్రత్యేక గుర్తింపు అధికారిని నియమించి, ఇతర శాఖల జాబితాలతో వివరాలను సరిపోల్చి పరిశీలించాలని డీఆర్వో సూచించారు. అర్హులైన ప్రతి ఓటరు వివరాలను సక్రమంగా నమోదు చేసి, నిర్ణీత గడువులో తుది జాబితాను సిద్ధం చేయాలని సూచించారు. -
చిన్నారులపై పందుల దాడులు
● పట్టించుకోని కార్పొరేషన్ యంత్రాంగం చింతకొమ్మదిన్నె : మండల పరిధి నుంచి కడప నగర కార్పొరేషన్లోకి విలీనమైన మేరీనగర్, ఇందిరానగర్ ప్రాంతాల్లో పందులు యథేచ్ఛగా సంచరిస్తూ.. చిన్నారులపై దాడులు చేస్తున్నా కార్పొరేషన్ యంత్రాంగం పట్టించుకోవడం లేదని రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ చింతకొమ్మదిన్నె మండల కార్యదర్శి మడగలం ప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశశారు. పందుల వల్ల ప్రజలకు ప్రమాదాలు పొంచి ఉన్నాయని, వాటిని నివాస ప్రాంతాల నుంచి తరలించాలని ఆయన కోరారు. ఇందిరానగర్లో నివాసం ఉంటున్న కార్మికుడైన సందీప్ కుమారుడిపై పందులు ఇటీవల చేయడంతో.. కాలి బొటన వేలు కోల్పోయి రిమ్స్లో చికిత్స పొంది ఇంటికి వచ్చాడన్నారు. ఆ బాలుడిని స్థానికులతో కలసి మంగళవారం పరామర్శించిన సందర్భంగా ప్రసాద్ మాట్లాడుతూ పలు నివాసిత ప్రాంతాల్లో మనుషుల కంటే పందులే అధికంగా ఉన్నాయని, గత కొంత కాలంగా తరచూ మనుషులపై, ముఖ్యంగా చిన్నపిల్లలపై దాడులు అధికమయ్యాయని పేర్కొన్నారు. గతంలో ఒక బాలుడిపై, అలాగే రిమ్స్ హాస్పిటల్లోని వన్స్టాప్ సెంటర్ మహిళా కానిస్టేబుల్పై దాడి చేసి గాయపరిచాయన్నారు. సంబంధిత అధికారులు తక్షణమే వీటిని ఊరి నుంచి తరలించాలన్నారు. -
జూనియర్ వైద్యుల సమ్మె తీవ్ర రూపం
కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) పిలుపు మేరకు కడపలోని గవర్నమెంట్ మెడికల్ కాలేజ్లో జూనియర్ వైద్యుల ఫేజ్–3 సమ్మె మరింత ఉధృతమైంది. మంగళవారం రిలే నిరాహార దీక్షల్లో 25 మంది పీజీలు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జీఎంసీ కడప జూడా అసోసియేషన్ అధ్యక్షుడు రవితేజ నాయక్ మాట్లాడుతూ ఫేజ్–3లో భాగంగా కడపకు చెందిన జూనియర్ డాక్టర్లు అత్యవసర, అత్యవసరం కాని వైద్య సేవలను పూర్తిగా ఉపసంహరించుకుని ఏపీ జూడా అసోసియేషన్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిగణనలోకి తీసుకుని, సమస్యలను పరిష్కరించేందుకు తక్షణ చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఏపీ జూడాతో ఐక్యంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం వెంటనే సానుకూలంగా స్పందించాలన్నారు. లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జీఎంసీ జూడా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి డాక్టర్ మేఘన, నాయకులు కె.యశ్వంత్కృష్ణ, ఎస్.యశ్వంత్కృష్ణతోపాటు పీజీలు, హౌస్ సర్జన్లు తదితరులు పాల్గొన్నారు. -
గంజాయి స్వాధీనం.. ఐదుగురి అరెస్ట్
బద్వేలు అర్బన్ : పట్టణంలోని పోరుమామిళ్ల బైపాస్రోడ్డులో గల ఫ్లైఓవర్ బ్రిడ్జి కింద తనిఖీలు నిర్వహించి 2.1 కిలోల గంజాయితోపాటు రూ.6 వేలు, ఒక ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం స్వాధీనం చేసుకుని ఐదుగురిని అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ తెలిపారు. మంగళవారం స్థానిక అర్బన్ స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం లక్ష్మక్కపల్లె గ్రామానికి చెందిన దొడ్డేటిపల్లి రమణయ్య వివిధ ప్రాంతాల్లో తక్కువ ధరకు గంజాయిని కొనుగోలు చేసి.. బద్వేలు ప్రాంతాన్ని అడ్డాగా చేసుకుని కిలో రూ.6 వేలు చొప్పున ఇతర నిందితులకు విక్రయిస్తుండేవాడు. ఈ క్రమంలో మంగళవారం పోరుమామిళ్ళ బైపాస్రోడ్డులోని ఫ్లైఓవర్ బ్రిడ్జి వద్ద ఎలక్ట్రానిక్ తూనిక యంత్రం ద్వారా ఒక్కొక్కరికి 250 గ్రాముల చొప్పున తూకం వేసి విక్రయిస్తుండగా దాడి చేసి నిందితులను పట్టుకున్నారు. రమణయ్యతోపాటు నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలం బ్రాహ్మణపల్లె గ్రామానికి చెందిన షేక్చిన్నమీరావలి, ప్రకాశం జిల్లా పొన్నలూరు మండలం మాలేపాడు గ్రామానికి చెందిన వలేరి మల్లిఖార్జున, బద్వేలు పట్టణం మార్తోమానగర్కు చెందిన వల్లెపు వెంకటసుబ్బయ్య, ప్రకాశం జిల్లా పెదచెర్లోపల్లె మండలం పెద్దఇర్లపాడు గ్రామానికి చెందిన నాగులూరి రాజమ్మను అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. వీరిలో చిన్నమీరావలి, రాజమ్మపై గతంలో కూడా గంజాయి కేసులు ఉన్నట్లు సీఐ తెలిపారు. సమావేశంలో ఎస్ఐలు యు.వై.జయరాములు, ఎం.రంగారావు, ఏఎస్ఐ శ్రీనివాసమూర్తి, హెడ్కానిస్టేబుల్ శివయ్య, కానిస్టేబుళ్ళు కె.సుబ్బయ్య, ఎం.సుబ్బయ్య, మహిళా కానిస్టేబుల్ కళ్యాణి పాల్గొన్నారు. -
‘నారు’పోసినవారికి.. నీరు పోయరా!
● కేసీ కాలువ కింద నీరొస్తుందనే ఆశతో ముమ్మరంగా నారుమడుల సాగు ● అధికారుల మౌనంతో 81 వేల ఎకరాల ఆయకట్టు రైతుల్లో గుబులు కడప అగ్రికల్చర్ : కేసీ కెనాల్ (కర్నూలు–కడప కాలువ) పరిధిలో సాగు నీటిపైనే ఆధారపడి దాదాపు 81,232.99 ఎకరాల భారీ ఆయకట్టు విస్తరించి ఉంది. జిల్లాలోని దువ్వూరు, మైదుకూరు, చాపాడు, ఖాజీపేట, కొండపేట, రాజుపాలెం, ప్రొద్దుటూరు, చెన్నూరు, వల్లూరు, కడప, సి.కె.దిన్నె మండలాల పరిధిలోని గ్రామాలు ఈ కాలువ పరిధిలోకి వస్తాయి. ఇటీవల కురిసిన వర్షాలను ఆసరాగా చేసుకుని, చాలా మంది రైతులు తమకున్న బోరు బావుల కింద ముందస్తుగానే ఆరుతడి పంటలైన పసుపు, పత్తి, మొక్కజొన్న, సజ్జ పంటలను సాగు చేశారు. మరికొందరు రైతులు వరి సాగు కోసం నారుమడులను కూడా సిద్ధం చేసుకున్నారు. అయితే, గత కొన్ని రోజులుగా మళ్లీ వర్షాలు ముఖం చాటేయడంతో బోర్లలో నీటిమట్టాలు పడిపోతాయేమోనని, వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు దెబ్బతింటాయేమోనని ఈ 11 మండలాల అన్నదాతలు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. కేసీ కాలువకు నీరు వస్తేనే తమ పంటలు చేతికందుతాయని ఆయకట్టు రైతులు ఎదురుచూస్తున్నారు. -
మళ్లీ కేబుల్ వైర్ల అపహరణ
లింగాల : మండలంలోని ఇప్పట్ల గ్రామంలో గుర్తు తెలియని దుండగులు వ్యవసాయ విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లను తస్కరించారు. గత ఐదారు మాసాలుగా స్తబ్దుగా ఉన్న దొంగలు మళ్లీ కేబుల్ వైర్ల చోరీకి పాల్పడ్డారు. ఇప్పట్ల గ్రామ సమీపంలోని బలపాల గుట్ట వద్ద ఉన్న 15 విద్యుత్ మోటార్ల కేబుల్ వైర్లను సోమవారం రాత్రి అపహరించుకు పోయారు. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మంగళవారం సాయంత్రం వారు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. త్వరలో దొంగలను పట్టుకుని రైతులకు న్యాయం చేస్తామని పోలీసులు తెలిపారు. -
20 నుంచి కేవీకేలో శిక్షణ
కడప ఎడ్యుకేషన్ : కడపలోని ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో నాబార్డ్ ఆర్థిక సహకారంతో ఈనెల 20 నుంచి నిర్వహించే ‘మిల్లెట్లతో స్వయం ఉపాధి’ శిక్షణ కార్యక్రమానికి ఆసక్తి గలవారి నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కేవీకే ప్రతినిధులు ఒక ప్రకటనలో తెలిపారు. మిల్లెట్లతో విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, ప్యాకేజింగ్, లేబులింగ్, వ్యాపార నిర్వహణ, మార్కెటింగ్, ఆహార భద్రత ప్రమా ణాలపై శిక్షణ ఇస్తామని పేర్కొన్నారు. ప్రతి బ్యాచ్లో 25 మంది అభ్యర్థులకు అవకాశం ఉంటుందని, మొత్తం 10 బ్యాచ్లకు శిక్షణ అందించనున్నామన్నారు. అభ్యర్థులు తమ పేర్లను నమోదు చేసుకోవాలని, శిక్షణ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు కొనసాగుతుందని, వివరాలకు 7386718426 నెంబరులో సంప్రదించాలని సూచించారు. ఎన్ఎంఎంఎస్ఫలితాల విడుదలకడప ఎడ్యుకేషన్ : జాతీయ ఉపకార వేతన పరీక్ష (ఎన్ఎంఎంఎస్) ఫలితాలు విడుదలయ్యాని జిల్లా విద్యాశాఖాధికారి ఎస్.షంషుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న విద్యార్థులకు సంబంధించిన మెరిట్ కార్డులు ఈనెల 12 నుంచి ప్రభుత్వ పరీక్షల కార్యాలయ అధికారిక వెబ్సైట్లో అందుబాటులో ఉంటాయన్నారు. ఇతర వివరాలకు సంబంధిత ప్రధానోపాధ్యాయులను సంప్రదించాలని ఆయన కోరారు. ప్రతిష్టాత్మకంగా ‘స్టార్ట్అప్ కడప’! కడప సెవెన్రోడ్స్ : యువతలోని సృజనాత్మక ఆలోచనలకు ప్రోత్సాహం అందించి, ఉద్యోగాలు వెతికే స్థాయి నుంచి ఉద్యోగాలు సృష్టించే స్థాయికి తీసుకెళ్లే లక్ష్యంతో భారతదేశంలోనే ప్రతిష్టాత్మకంగా నిర్మించిన ‘స్టార్ట్అప్ కడప’ఎంటర్ప్రెన్యూర్షిప్ సెంటర్ దేశానికే ఆదర్శంగా నిలవనుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. నగరంలోని ఆర్ట్స్ కళాశాల మైదానం వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన ‘‘స్టార్ట్అప్ కడప’’నిర్మాణ పనుల పురోగతిని కలెక్టర్ మంగళవారం సాయంత్రం సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావనతో కలిసి పరిశీలించారు. దరఖాస్తు గడువు పొడిగింపు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈ ఏడాది జిల్లాస్థాయి ఉపాధ్యాయ పురస్కారం కోసం జిల్లా స్థాయిలో అర్హత గల ఉపాధ్యాయుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షంషుద్దీన్ ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తుదారులు కనీసం 10 సంవత్సరాల బోధన అనుభవం కలిగి ఉండాలన్నారు. దరఖాస్తుల గడువును ఈనెల 28 వరకు పొడిగించినట్లు ఆయన పేర్కొన్నారు. ఆయా ఉపాధ్యాయులను సర్వేపల్లి రాధాకృష్ణ జయంతి సందర్భంగా సెప్టెంబర్ 5న సన్మానించనున్నట్లు డీఈఓ వివరించారు.అర్జీల పరిష్కారంలో జాప్యం తగదు! కడప సెవెన్రోడ్స్ : ప్రజలకు అందుతున్న రెవెన్యూ సేవలను మరింత వేగవంతంగా, పారదర్శకంగా అందించడంతో పాటు పెండింగ్ సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని మండలాల రెవెన్యూ అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో నిర్వహించిన రెవెన్యూ అధికారుల సమావేశంలో రెవెన్యూ, ప్రజా సేవలకు సంబంధించి 12 ప్రధాన ప్రమాణికాల్లో పురోగతిపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ, భూసర్వే పునఃపరిశీలన, ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ, భూముల బదలాయింపులు, 22–ఏ కేసులు, చుక్కల భూములు, భూసేకరణ, ప్రభుత్వ భూముల కేటాయింపు, ఐవీఆర్ఎస్, ఇతర సామూహిక సమస్యలు, జెడ్హెచ్డీసీ భూములు, ఆన్లైన్ రెవెన్యూ రికార్డులు, భూముల డిజిటలీకరణ తదితర అంశాలపై మండలాల వారీగా పురోగతిని సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో రీసర్వే ప్రక్రియను వేగవంతం చేసి పెండింగ్లో ఉన్న దశలను సకాలంలో పూర్తి చేయాలని కలెక్టర్ సూచించారు. 22–ఏ జాబితాలో తప్పుగా నమోదైన భూములను నిబంధనల ప్రకారం పరిశీలించి సరిదిద్దాలని ఆదేశించారు. రాజోలి జలాశయ ప్రాజెక్టుకు సంబంధించిన భూసేకరణలో పరిహారం చెల్లింపుల కోసం నిధుల అవసరంపై ప్రతిపాదన ప్రభుత్వానికి పంపిన వివరాలను కూడా సమావేశంలో పరిశీలించారు. -
రాష్ట్ర స్థాయి హాకీ పోటీలకు ఎంపిక
కడప ఎడ్యుకేషన్ : తిరుపతిలో ఆగస్టు 24 నుంచి 27 వరకు జరగనున్న రాష్ట్ర స్థాయి అమరావతి ఛాంపియన్షిప్–2026 హాకీ పోటీలకు కడప ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు చెందిన బీకాం సీఏ ఫైనల్ ఇయర్కు చెందిన విద్యార్థి ఇందిర ఎంపికై ంది. జిల్లా స్థాయి పోటీలలో అద్భుత ప్రతిభ కనబరిచిన ఇందిర.. కళాశాల క్రీడా విభాగం తరఫున రాష్ట్ర జట్టుకు ఎంపికై ంది. ఆ విద్యార్థిని ప్రిన్సిపాల్ డాక్టర్ స్మిత, క్రీడా విభాగం అధికారి, బోధన, బోధనేతర సిబ్బంది అభినందించారు. అథ్లెటిక్స్ పోటీల్లో ప్రతిభకడప ఎడ్యుకేషన్ : తిరుపతిలో ఆగస్టు 11 నుంచి 13 వరకు జరిగిన రాష్ట్రస్థాయి అథ్లెటిక్స్ పోటీలలో కడప ఆర్ట్స్ కళాశాలకు చెందిన విద్యార్థి అరవింద్ సత్తా చాటాడు. ఆర్ట్స్ కళాశాలలో బీఏ తెలుగు ఆనర్స్ చదువుతున్న అరవింద్ అండర్ 20 విభాగంలో హెప్టాథ్లాన్ ఈవెంట్లో రాష్ట్రస్థాయిలో ప్రథమ స్థానంలో నిలిచి, స్వర్ణ పథకం సాధించాడు. దాంతోపాటు త్వరలో జరగబోయే జాతీయ స్థాయి అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఆ విద్యార్థిని కళాశాల ప్రిన్సిపల్ జె.వెంకటలక్ష్మి, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ రమణారావు, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్చార్జ్ టి.హజరతయ్య , పీడీ మహేష్ అభినందించారు. యువకుడిపై కేసు నమోదుకలసపాడు : మండలంలోని ముద్దంవారిపల్లె గ్రామానికి చెందిన హర్ష అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు పోలీస్స్టేషన్ ఇన్చార్జి శివశంకర్ తెలిపారు. ఆయన వివరాల మేరకు.. గ్రామానికి చెందిన ఇద్దరు బాలికలు ఇంట్లో వసతి లేక బహిర్భూమికి బయటికి వెళ్లారు. ఆ ప్రదేశంలో గ్రామానికి చెందిన హర్ష ఉండటంతో గమనించిన బాలికలు ఇంటికి వచ్చి తల్లి భారతికి విషయం చెప్పారు. దీంతో భారతి అక్కడికి వెళ్లి చూడగా అక్కడే ఉన్న హర్షను మందలించింది. దీంతో ఆమైపె హర్ష చేయి చేసుకున్నాడు. దీంతో సోమవారం రాత్రి భారతి.. హర్షపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రమేష్ పేర్కొన్నారు. మంగళవారం నగర శివారులోని తెలుగు కాలనీలో యువజన సర్వీసుల శాఖ, ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ సంయుక్త ఆధ్వర్యంలో ఎన్సీసీ క్యాంపస్లో విద్యార్థులకు ‘మాదకద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా నిరోధంపై ప్రత్యేక అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేటి యువత, విద్యార్థులు చెడు అలవాట్లకు, మత్తుపదార్థాలకు బానిసలుగా మారి.. ఉజ్వల భవిష్యత్తును నాశనం చేసుకోవద్దని పేర్కొన్నారు. మాదకద్రవ్యాల వినియోగం వల్ల కలిగే శారీరక, మానసిక అనర్థాలను, చట్టపరమైన శిక్షలను వివరించారు. దేశ నిర్మాణంలో కీలకపాత్ర పోషించాల్సిన ఎన్సీసీ క్యాడెట్లు సమాజంలో మాదకద్రవ్యాల నిర్మూలనకు అంబాసిడర్లుగా నిలవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఎన్సీసీ కమాండింగ్ ఆఫీసర్ లోకనాథం, స్టెప్ సీఈఓ బీవీ ప్రసాద్ రావు, స్టెప్ జనరల్ మేనేజర్ సుబ్బరాయుడు, ప్రొహిబిషన్ – ఎకై ్సజ్ శాఖ ఇన్స్పెక్టర్ పద్మావతి తదితరులు పాల్గొన్నారు. జూదరుల అరెస్ట్మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని వెంకటసుబ్బయ్య కాలనీ సమీపంలో మంగళవారం పేకాట ఆడుతున్న ఆరుగురిని అరెస్టు చేసినట్టు అర్బన్ ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపారు. వారి వద్ద ఉన్న పేక ముక్కలు, రూ.6,640 నగదు స్వాధీనం చేసుకున్నట్టు పేర్కొన్నారు. వారిపై కేసు నమోదు చేసినట్టు ఎస్ఐ తెలిపారు. -
సాగర్కు జలకళ!
‘సీమ’ వెలవెల..కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం తాగునీటి ముసుగులో విద్యుత్ ఉత్పాదన ద్వారా శ్రీశైలం నీటిని నాగార్జున సాగర్కు తరలిస్తుండటం పట్ల రాయలసీమ వాసులు, రైతాంగం తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ఎల్నినో కారణంగా ఈ యేడు తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఏర్పడి, ఖరీఫ్ సాధారణ పంటల సాగు దారుణంగా పడిపోయింది. రిజర్వాయర్ల నీటిమట్టాలు వేగంగా అడుగంటుతుండగా, భూగర్భ జలాలు పాతాళానికి చేరువయ్యాయి. ఇప్పటికే సీమలోని వందలాది గ్రామాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. ఈ తరుణంలో ఎగువ రాష్ట్రాల్లో కురిసిన భారీ వర్షాల వల్ల శ్రీశైలం జలాశయానికి పెద్ద ఎత్తున వరద ప్రవాహం రావడంతో రాయలసీమ ప్రజల్లో ఆశలు చిగురించాయి. అయితే, ఖరీఫ్ పంటల సాగుకు నీరివ్వలేమని కూటమి ప్రభుత్వం ముందే చేతులెత్తేసింది. కేవలం తాగునీటి అవసరాల కోసం నాగార్జునసాగర్కు 32 టీఎంసీలు, రాయలసీమ రిజర్వాయర్లకు 20 టీఎంసీలు, చైన్నెకి 10 టీఎంసీలు ఇస్తామని జలవనరులశాఖ మంత్రి నిమ్మల రామానాయుడు ప్రకటించారు. ఆ తర్వాత అక్టోబరు, నవంబరు మాసాల్లో వచ్చే వర్షాలను బట్టి పరిస్థితులు సమీక్షించి నిర్ణయం తీసుకుంటామని ఆయన తెలిపారు. చెప్పింది ఒకటి.. చేస్తోంది మరొకటి! రాష్ట్ర జలవనరుల మంత్రి చేసిన అధికారిక ప్రకటనకు విరుద్ధంగా, ఇప్పటికే క్షేత్రస్థాయిలో భారీగా నీటి దోపిడీ జరిగిందని సాగునీటి నిపుణులు పేర్కొంటున్నారు. గత పది రోజుల పైబడి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన ద్వారా ఇప్పటికే సుమారు 40 టీఎంసీల వరకు నాగార్జున సాగర్కు తరలించినట్లు తెలుస్తోంది. సాగర్లో ఇప్పటికే తగిన నీటి నిల్వ ఉండడంతో అక్కడ తాగునీటి సమస్య ఉత్పన్నమయ్యే ప్రశ్నే లేదని నిపుణులు స్పష్టం చేస్తున్నారు. అయినప్పటికీ, దిగువ ప్రాంతాలకు ’తాగునీటి మిష’తో శ్రీశైలాన్ని ఖాళీ చేస్తున్నారు. మరోవైపు, తెలంగాణ ప్రభుత్వం జూరాల నుంచి నెట్టెంపాడు, భీమా–1, 2 పథకాలకు ఐదు వేల క్యూసెక్కుల నీటిని తరలిస్తోంది. తాగునీటి కోసం అంటూ సాగర్కు కేటాయించిన నీటిలో దీన్ని లెక్కించడం లేదు. అంటే చెప్పిన దానికన్నా ఆచరణలో అత్యధికంగా నీటిని దిగువకు తోడేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నుంచి అవుట్ఫ్లో పరిశీలిస్తే, మొత్తం 62,848 క్యూసెక్కుల నీరు విడుదలవుతోంది. ఇందులో 51,848 క్యూసెక్కులు విద్యుత్ ఉత్పాదన పేరిట నాగార్జున సాగర్కు వెళుతున్నాయి. జూరాల నుంచి వెళుతున్న ఐదు వేల క్యూసెక్కులు కలిపితే కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు ఏకంగా 56,848 క్యూసెక్కుల కృష్ణా నీరు తరలిపోతోంది. రాయలసీమకు మొండిచేయి.. వట్టిపోతున్న జలాశయాలు కోస్తా, తెలంగాణ ప్రాంతాలకు ఐదో వంతు కంటే ఎక్కువ నీరు తరలిపోతుంటే, రాయలసీమ విషయానికి వచ్చేసరికి ప్రభుత్వం ఘోరమైన వివక్ష చూపుతోంది. మల్లేల లిఫ్ట్ నుంచి హంద్రీ–నీవా ద్వారా కర్నూలు జిల్లా ఎగువ ప్రాంతాలైన పత్తికొండ, అనంతపురం జిల్లాలకు కేవలం 3 వేల క్యూసెక్కులు మాత్రమే ఇస్తున్నారు. ఇక పోతిరెడ్డిపాడు ద్వారా 8 వేల క్యూసెక్కులు ఇస్తున్నారు. వెరసి రాయలసీమ మొత్తానికి కలిపి కేవలం 11 వేల క్యూసెక్కుల నీరు మాత్రమే విడుదలవుతోంది. దీనివల్ల రాయలసీమ రిజర్వాయర్ల పరిస్థితి అత్యంత దయనీయంగా మారింది. శ్రీశైలానికి ఇన్ఫ్లో పూర్తిగా ఆగిపోయిన ప్రస్తుత స్థితిలో, కనీస నీటిమట్టాన్ని సైతం నిర్వహించకుండా ఉన్న నీటినంతా తోడేస్తే ఇక్కడి తాగు, సాగునీటి అవసరాల మాటేమిటని రాయలసీమ వాసులు ప్రశ్నిస్తున్నారు. ఇంత జరుగుతున్నా ఈ ప్రాంతానికి చెందిన కూటమి ఎమ్మెల్యేలు, ఇతర ముఖ్య నాయకులు నోరు మెదపకపోవడం పట్ల స్థానిక ప్రజలు, రైతాంగం తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఉన్న నీరంతా తోడేయకుండా రాయలసీమ తాగునీటి అవసరాలతో పాటు, రాబోయే రబీలో కనీసం ఒక ఆరుతడి పంటకై నా సాగునీరు అందించేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. తాగునీటి ముసుగులో శ్రీశైలం ఖాళీ కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న సీమ రైతాంగం శ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపాలని డిమాండ్ 875 అడుగుల కనీస నీటిమట్టం నిర్వహించాల్సిందే అడుగంటిన రాయలసీమ రిజర్వాయర్లు తాగునీటి ముసుగులో శ్రీశైలం ఖాళీ కూటమి ప్రభుత్వంపై భగ్గుమంటున్న సీమ రైతాంగం శ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపాలని డిమాండ్ 875 అడుగుల కనీస నీటిమట్టం నిర్వహించాల్సిందే అడుగంటిన రాయలసీమ రిజర్వాయర్లుశ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపాలి శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన చేపట్టి తాగునీటిని తరలిస్తున్నారంటూ చెబుతున్న కూటమి ప్రభుత్వం, ప్రకటించిన కేటాయింపులకు అదనంగా నాగార్జున సాగర్కు పంపుతోంది. తెలంగాణ ప్రభుత్వం జూరాల నుంచి ఐదు వేల క్యూసెక్కు లు నీటిని భీమా, నెట్టెంపాడులకు తరలిస్తున్నప్పటికీ మన ప్రభుత్వం పరిగణలోకి తీసుకోకపోవడం విచారకరం. శ్రీశైలంలో తక్షణమే విద్యుత్ ఉత్పాదన ఆపి 875 అడుగుల కనీస నీటి మట్టాన్ని నిర్వహించాలి. సీమకు తాగునీటితోపాటు కనీసం రబీలో ఆరుతడి పంటకు నీరిచ్చేందుకు చర్యలు చేపట్టాలి. – దేవగుడి చంద్రమౌళీశ్వర్రెడ్డి, కేసీ డిస్ట్రిబ్యూటరీ కమిటీ మాజీ చైర్మన్, కడపఅన్ని ప్రాజెక్టులకు తాగు, సాగునీరు విడుదల చేయాలి పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా తక్షణమే తాగునీటితో పాటు పంటలకు సాగునీరు విడుదల చేయాలి. ఎల్నినో వల్ల ఖరీఫ్ పంటల సాగు దాదాపు పడిపోయింది. రిజర్వాయర్లలో నీటిమట్టాలు అడుగంటిపోతుండటం రాయలసీమ భవిష్యత్తుకు ఆందోళన కలిగిస్తోంది. ఈ కరవు పరిస్థితుల్లో రాయలసీమ రైతులను ఆదుకునేందుకు తెలుగుగంగ, గాలేరు–నగరి, హంద్రీ–నీవా, ఎస్ఆర్బీసీ, కేసీ కెనాల్కు తక్షణమే నీటి విడుదల చేసి సీమను ఆదుకోవాలి. – నారుపల్లె జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర అధ్యక్షులు, అఖిల భారత రెడ్డిసంఘం, దువ్వూరు -
ఎంపీ కృషి వల్ల ‘అమృత్ భారత్’లో చేరికతో కొత్తలుక్!
ఈ చారిత్రక స్టేషన్ను ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి తన నిరంతర కృషితో ‘అమృత్ భారత్’ స్కీం కింద చేర్పించి, ఏకంగా రూ.28.51 కోట్ల భారీ నిధులు మంజూరు చేయించారు. దీంతో ప్రయాణికులను ఆకర్షించేలా అంతర్జాతీయ స్థాయి వసతులు కల్పించి స్టేషన్కు సరికొత్త లుక్ తీసుకువచ్చారు. కేంద్ర రైల్వే మంత్రిత్వ శాఖతో సంప్రదింపులు జరిపి దేశ రాజధానికి వెళ్లే ఢిల్లీ రైలు హాల్టింగ్తో పాటు పలు రైళ్ల నిలుపుదలను సాకారం చేశారు. అలాగే సబ్వే నిర్మాణం కొరకు గత బడ్జెట్లో రూ.2 కోట్లు కేటాయించేలా ఎంపీ కృషి చేశారు. -
హత్యాయత్నం కేసులో నిందితుల అరెస్ట్
లింగాల : మండలంలోని ఎగువ లింగాల గ్రామంలో ఆదివారం సాయంత్రం కత్తి రామచంద్రుడు, కత్తి చంద్రావతిలపై వెన్నపూస నాగప్రసాద్, వెన్నపూస రవితేజలు వేటకొడవళ్లతో దాడులు నిర్వహించారు. ఈ దాడిలో కత్తి రామచంద్రుడు, ఆయన భార్య కత్తి చంద్రావతిలు గాయాలపాలయ్యారు. ఈ విషయమై ఎస్ఐ జగదీశ్వరరెడ్డి సోమవారం విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కత్తి రామచంద్రుడు, వెన్నపూస నాగప్రసాద్ల మధ్య ఆస్తి విషయమై గత కొంతకాలంగా స్వల్ప ఘర్షణలు జరుగుతుండేవన్నారు. ఇందులో భాగంగా శనివారం కత్తి రామచంద్రుడు కుమార్తె గంగా రాణి సీమంతం నిర్వహించిన తర్వాత వారి బంధువులను బస్టాండుకు వదిలిపెట్టేందుకు రామచంద్రుడు కుమారుడు గంగరాజు ద్విచక్రవాహనంలో తీసుకెళుతుండగా నాగప్రసాద్ ఘర్షణకు పాల్పడ్డారన్నారు. అనంతరం ఆదివారం సాయంత్రం బైకులో వెన్నపూస నాగప్రసాద్, వెన్నపూస రవితేజలు రామచంద్రుడు ఇంటి వద్దకు వెళ్లి వేటకొడవళ్లు, కత్తితో వారిపై దాడి చేశారన్నారు. వారిని హతమార్చేందుకే దాడులు చేశారన్నారు. విషయం తెలిసిన వెంటనే తాము ఘటనా స్థలానికి వెళ్లి గాయాలపాలైన రామచంద్రుడు, చంద్రావతిలను పులివెందుల ప్రభుత్వాసుపత్రికి చికిత్స నిమిత్తం పంపించడం జరిగిందన్నారు. కత్తి చంద్రావతి ఫిర్యాదు మేరకు వెన్నపూస నాగప్రసాద్, వెన్నపూస రవితేజలపై హత్యాయత్నం కేసును నమోదు చేయడం జరిగిందన్నారు. సోమవారం ఉదయం లింగాల బస్టాండు సమీపంలోని లోపట్నూతల క్రాస్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకుని, వారి వద్ద ఉన్న మారణాయుధాలను స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు. వారిని కోర్టుకు హాజరుపరచడం జరుగుతుందన్నారు. సమావేశంలో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
తపాలా బీమా జీవితానికి భరోసా
కడప వైఎస్ఆర్ సర్కిల్ : తపాలా శాఖ అందిస్తున్న తపాలా జీవిత బీమా (పీఎల్ఐ) కుటుంబానికి ఆర్థిక భరోసాను అందించే బీమా పథకం అని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి.రాజేష్ తెలిపారు. సోమవారం నగరంలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో కడపకు చెందిన ఎం.శివశరత్కుమార్ చౌదరి ఎన్హెచ్ఏఐలో ఇంజనీర్గా పని చేస్తూ, 2023 సెప్టెంబర్లో రూ.20 లక్షల సమ్ అష్యూర్డ్తో పీఎల్ఐ పాలసీ తీసుకున్నారు. దురదృష్టవశాత్తు 2025 అక్టోబర్ 19న ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతి చెందడం జరిగిందన్నారు. పాలసీదారుడి నామినీ అయిన ఆయన తల్లి ఎం.రాజేశ్వరికి, పాలసీ క్లెయిమ్ కింద రూ.22,56,318 విలువైన చెక్కును నామినీ అయిన కుమార్తె నిహారిక చౌదరికి అందజేశారు. ఈ సందర్భంగా పోస్టల్ సూపరింటెండెంట్ మాట్లాడుతూ పీఎల్ఐ ద్వారా పాలసీదారునికి జీవిత భద్రతతో పాటు కుటుంబ సభ్యులకు ఆర్థిక రక్షణ లభిస్తుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ సూపరింటెండెంట్ అహ్మద్ హుస్సేన్, ప్రధాన తపాలా కార్యాలయ పోస్ట్మాస్టర్ జె.సుబ్బరాయుడు, పీఎల్ఐ డెవలప్మెంట్ ఆఫీసర్ మునాఫ్, బ్రాంచ్ పోస్ట్మాస్టర్ లతీఫ్, సిబ్బంది నేసా మహేష్ తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీలో అసోసియేట్ డీన్ల నియామకం వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ఇడుపులపాయ (ఆర్కేవ్యాలీ) ట్రిపు ల్ ఐటీ క్యాంపస్లో నూతనంగా అసోసియేట్ డీన్(అకాడమిక్)ల నియామకాన్ని చేపట్టినట్లు డైరెక్టర్, ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్, పరిపాలనాధికారి డాక్టర్ పెనుకొండ రవికుమార్ తెలిపారు. కెమిస్ట్రీ విభాగంలో మెంటర్గా విధులు నిర్వహిస్తున్న డాక్టర్ బి.ఈశ్వర్ నాయక్ను పీయూసీ విద్యార్థులకు, ఈఈఈ విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పని చేస్తున్న షేక్ ఖాజా హుస్సేన్ను ఇంజనీరింగ్ విద్యార్థులకు అసోసియేట్ డీన్లుగా నియమించినట్లు పేర్కొన్నా రు. సోమవారం వారికి నియామక పత్రాలను ఏఓ పెనుకొండ రవికుమార్ అందజేశారు. వారిని పలువురు అధ్యాపకులు, ఆధ్యాపకేతర బృందం అభినందించారు. -
సమస్యల పరిష్కారంలో పారదర్శకత ముఖ్యం
కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారంలో నాణ్యత, పారదర్శకతతో పాటు ప్రజల్లో నమ్మకాన్ని, సానుకూల స్పందనను పెంపొందించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జేసీ డాక్టర్ నిధి మీనా తోకలిసి ప్రజల నుంచి వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం పీజీఆర్ఎస్ ద్వారా అందిన ఫిర్యాదుల పరిష్కారంలో పెండెన్సీపై అధికారులతో కలెక్టర్ సుమీక్షించారు. ప్రజల నుంచి అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు.అర్జీల పరిష్కారంలో జాప్యానికి తావులేకుండా అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాల న్నారు. జిల్లాలోని అన్ని ప్రభు త్వ కార్యాలయాల్లో ఈ–ఆఫీస్ విధానాన్ని ఖచ్చితంగా అమలయ్యేలా సంబంధిత శాఖల జిల్లా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ప్రత్యామ్నాయ చర్యలు, ఈ ఖరీఫ్ సీజన్లో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచాలని కలెక్టర్ అధికారులకు సూ చించారు. డీఆర్వో మల్లికార్జునుడు, జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, డిప్యూటీ కలెక్టర్ రంగస్వామి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయాలికడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ప్రతిష్టాత్మకంగా చేపడుతున్న నీటిపారుదల, జాతీయ రహదారులు, రైల్వే, సౌర విద్యుత్, మురుగునీటి శుద్ధి కేంద్రాలు, ఇతర అభివృద్ధి ప్రాజెక్టులకు అవసరమైన భూసేకరణ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లాలో వివిధ అభివృద్ధి ప్రాజెక్టులకు సంబంధించిన రెవెన్యూ అంశాలు, భూసేకరణ పురోగతిపై సంబంధిత అధికారులతో వీసీ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ సోమశిల, తెలుగు గంగ, జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ లిఫ్ట్, కుందూ – పెన్నా, గండికోట, రాజో లి తదితర ప్రాజెక్టుల భూసేకరణను వేగవంతం చేయా లని కలెక్టర్ సూచించారు. జాతీయ రహదారుల ప్రాజెక్టులకు సంబంధించి 1,635.42 హెక్టార్ల భూమి సేకరణ నమోదైందని, అందుకు సంబంధించి 90శాతం పరిహారం కూడా చెల్లించినట్లు అధికారులు తెలిపారు. మరింత సమర్థవంతంగా ‘స్మార్ట్ కిచెన్’ ప్రతిరోజూ విద్యార్థులకు శుచికర, రుచికరమైన పోషక విలువలున్న మధ్యాహ్న భోజనాన్ని సకాలంలో అందిస్తూ దేశానికే స్ఫూర్తినిస్తున్న స్మార్ట్ కిచెన్ వ్యవస్థ ద్వారా త్వరలో లక్ష మందికి విస్తరిస్తున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో స్మార్ట్ కిచెన్ ల నిర్మాణ పురోగతిపై సంబంధిత కమిటీ సభ్యులతో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష నిర్వహించారు. జిల్లాలో ప్రస్తుతం 27 స్మార్ట్ కిచెన్ల ద్వారా 864 పాఠశాలల్లో దాదాపు 53 వేల మంది విద్యార్థులకు ప్రతిరోజూ శుచికరమైన రుచికర భోజనం ప్రత్యేక ఫుడ్ ట్రాన్స్ పోర్ట్ వాహనాల ద్వారా అందుతోందన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
జెండా పండుగకూ అప్పులే దిక్కు!
గత 2024–25 మరియు 2025–26 విద్యా సంవత్సరాలకు సంబంధించి కూడా కేవలం యాభై శాతం నిధులను మాత్రమే ప్రభుత్వం అరకొరగా విడుదల చేసి చేతులు దులుపుకుంది. ఈ ఏడాది విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ ప్రచార ఆర్భాటాలు చేస్తున్నారే తప్ప, క్షేత్రస్థాయిలో బడిపండుగకు, అలాగే ఇటీవల ఆగస్టు 15వ తేదీన నిర్వహించిన స్వాతంత్య్ర దినోత్సవ జెండా పండుగ వేడుకలకు కూడా పైసా నిధులు ఇవ్వలేదు. దీంతో జెండా పండుగ ఖర్చులు, స్వీట్లు, బహుమతుల కొరకు కూడా పలువురు ప్రధానోపాధ్యాయులు బయట అప్పులు తెచ్చి మరీ ఆయా జాతీయ సంబరాలను నిర్వహించాల్సి వచ్చింది. ఇప్పటికై నా పెండింగ్లో ఉన్న స్కూల్ గ్రాంట్ నిధులను తక్షణమే విడుదల చేయాలని విద్యా సంఘాలు గట్టిగా డిమాండ్ చేస్తున్నాయి. -
పీజీఆర్ఎస్ ఫిర్యాదులకు సత్వర పరిష్కారం
కడప అర్బన్ : పీజీఆర్ఎస్ ఫిర్యాదులను చట్ట పరిధిలో సత్వరం పరిష్కరిస్తున్నట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఎస్పీ పాల్గొని జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 154 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ అర్జీలను పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడారు. నిర్ణీత గడువులోపు పరిష్కరించాలంటూ ఆదేశాలు జారీ చేశారు. పోలీస్ శాఖ ద్వారా పరిష్కారం అయ్యే ప్రతి ఫిర్యాదును ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావాలని కోరుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం, పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. విద్యార్థి కిడ్నాప్, దాడి చేసి విడుదల? చింతకొమ్మదిన్నె : కడప నగరం నెహ్రూ పార్క్ వద్ద ఉన్న చైతన్య పాఠశాలలో 9వ తరగతి చదువుతున్న విద్యార్థి పుత్తా విష్ణుసాయిరెడ్డి సోమవారం సాయంత్రం పాఠశాల నుంచి వెళుతూ రాజారెడ్డి వీధిలోని పోలీస్ పెట్రోల్ బంక్ సమీపంలో కిడ్నాప్నకు గురి అయినట్లు బంధువులు తెలిపారు. వల్లూరు మండలం కొప్పోలు గ్రామానికి చెందిన పుత్తా ప్రతాప్రెడ్డి, సుభాషిణిల కుమారుడు విష్ణుసాయిరెడ్డి చదువు నిమిత్తం రాజారెడ్డి వీధిలోని మేనత్త సుహాసిని ఇంట్లో ఉంటూ పాఠశాలకు వెళ్లి వచ్చేవాడు. సాయంత్రం పాఠశాల 5.30 గంటలకు ముగియగా, రోజూ 5.40 గంటలకు ఇంటికి చేరుకునే వాడు. అయితే సోమవారం సాయంత్రం 6 గంటలు అయినా ఇంటికి రాకపోవడంతో మేనత్త పాఠశాల వద్దకు వెళ్లి విచారణ చేశారు. విష్ణు సాయిరెడ్డి పాఠశాలకు వచ్చి క్లాసులు ముగిసిన తర్వాత వెళ్లిపోయినట్లు పాఠశాల సిబ్బంది తెలిపారు. అనంతరం ఆమె అనుమానంతో సమీపంలోని పార్కులోనూ, తెలిసిన వారిని విచారణ చేయసాగింది. ఈ క్రమంలో విష్ణు సాయిరెడ్డి తన తండ్రి ప్రతాప్రెడ్డికి ఫోన్ చేసి కిడ్నాప్కు గురి అయి చింతకొమ్మదిన్నె సమీపంలో ఉన్నట్లు సమాచారం ఇచ్చాడు. విష్ణు సాయిరెడ్డి రాజారెడ్డి వీధిలోని పోలీస్ పెట్రోల్ బంకు సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళ్తుండగా.. తెల్లటి కారులో ముగ్గురు వ్యక్తులు వచ్చి కిడ్నాప్ చేసి, విద్యార్థికి ముసుగు వేసి కొట్టి, అనంతరం చింతకొమ్మదిన్నె సమీపంలోని ఒడ్డు వద్ద కారులో నుంచి తోసినట్లు తెలిపారు. అనంతరం విష్ణుసాయిరెడ్డి ఏడ్చుకుంటూ సమీపంలోని చింతకొమ్మదిన్నె గ్రామం వద్దకు వెళ్లి ఇతరుల ఫోన్ ద్వారా తండ్రికి కిడ్నాప్ విషయం చెప్పాడు. ప్రతాప్రెడ్డి ద్వారా సమాచారం అందుకున్న చింతకొమ్మదిన్నెలోని బంధువులు వెళ్లి వారి ఇంటి వద్దకు తీసుకువెళ్లి చింతకొమ్మదిన్నె పోలీసులకు సమాచారం తెలియజేశారు. చింతకొమ్మదిన్నె ఏఎస్ఐ నాగరాజు వెంటనే విష్ణుసాయిరెడ్డి ఉన్న బంధువుల ఇంటి వద్దకు చేరుకొని బంధువులను, విద్యార్థిని విచారణ చేశారు. -
వీజీఎస్సీ జిల్లా అధ్యక్షుడిగా జయరాం
కడప సిటీ : వాసవి గ్లోబల్ స్పిరిచువల్ కౌన్సిల్ (వీజీఎస్సీ) జిల్లా అధ్యక్షుడిగా వంకదారి జయరాం నియమితులయ్యారు. ఈ మేరకు వీజీఎస్సీ వ్యవస్థాపకులు, గ్లోబల్ చైర్మన్ సోమవారం నియామక పత్రాన్ని అందజేశారు. కడపకు చెందిన వంకదారి జయరాం 2026 ఆగస్టు 14 నుంచి 2028 ఆగస్టు 13 వరకు బాధ్యతల్లో కొనసాగనున్నారు. ఆధ్యాత్మిక నిబద్ధత, నాయకత్వ లక్షణాలు, సమాజ సేవ పట్ల అంకితభావాన్ని గుర్తించి జయరాంకు ఈ బాధ్యతలు అప్పగించినట్లు నియామక పత్రంలో పేర్కొన్నారు. సమాజ సంక్షేమం, ఐక్యత, సమగ్రత, సేవా విలువలను ముందుకు తీసుకెళ్లేందుకు కృషి చేయాలని సంస్థ సూచించింది. -
పులివెందుల రహదారులు.. మారనున్న రూపురేఖలు
● మాజీ సీఎం వైఎస్ జగన్, ఎంపీ అవినాష్రెడ్డి చొరవతో పనులు ● రాజ్యసభ మాజీ ఎంపీ పరిమల్ నత్వానీ నిధులతో శ్రీకారం ● రూ.1.08 కోట్ల పనులకు అనుమతి మంజూరు పులివెందుల : 2026–27 ఎంపీ ల్యాండ్స్ నిధుల కింద రూ.1,08 కోట్ల అంచనా వ్యయంతో పులివెందుల మున్సిపాలిటీలో ప్రతిపాదించిన పనులకు రాజ్యసభ మాజీ ఎంపీ పరిమల్ నత్వానీ నిధుల కింద పరిపాలనా అనుమతి మంజూరు చేసేందుకు జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఉత్తర్వులు జారీ చేశారు. వివరాలలోకి వెళితే.. మూడు నెలల క్రితం పులివెందుల పర్యటనకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి, అలాగే కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దృష్టికి పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ వరప్రసాద్ పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని పలు రోడ్ల నిర్మాణాలు చేపట్టాలని తీసుకెళ్లారు. దీంతో వెంటనే స్పందించిన వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డిలు అప్పట్లో రాజ్యసభ సభ్యుడిగా ఉన్న పరిమల్ నత్వానీ దృష్టికి తీసుకెళ్లి ఆయన నిధుల నుంచి పనుల ఆమోదానికి ప్రతిపాదనలు పంపడం జరిగింది. ఇందుకు సంబంధించి పరిమల్ నత్వానీ నిధుల నుంచి ప్రతిపాదనలు పంపిన పనులకు పరిపాలనా అనుమతులు లభించాయి. దీంతో పులివెందుల మున్సిపాలిటీ పరిధిలో రూ.1,08,50,000ల పనులకు నిధులు మంజూరయ్యాయి. ఈ నిధులతో పెద్దరంగాపురం గ్రామంలోని 5–4–136 నుంచి 5–4273 వరకు 350 మీటర్ల పొడువనా సీసీ రోడ్డు వేసేందుకు రూ.30 లక్షలు, పెద్దరంగాపురం గ్రామంలోని 5–4–39 నుంచి 5–4–110బి వరకు 250 మీటర్ల పొడవునా సీసీ రోడ్డు వేసేందుకు రూ.20 లక్షలు, పులివెందుల మున్సిపాలిటీలో రోజువారీ పారిశుద్ధ్య నిర్వహణ కోసం ట్రాలీతో కూడిన కొత్త ట్రాక్టర్ కొనుగోలుకు రూ.18.50 లక్షలు, చిన్నరంగాపురం మెయిన్ రోడ్డుకు 600 మీటర్ల పొడవునా అప్రోచ్ రోడ్డు వేసేందుకు రూ.40 లక్షల మంజూరుకు ఉత్తర్వులు జారీ చేశారు. రాజ్యసభ మాజీ ఎంపీ పరిమల్ నత్వానీ నుంచి అందించిన ప్రతిపాదనలపై పులివెందుల మున్సిపల్ కమిషనర్ ఈ ఏడాది జూలై 24వ తేదీన సాధాసాధ్యాల నివేదిక సమర్పించారు. వైఎస్ఆర్సీపీ అధికారంలో లేకున్నా.. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో పులివెందుల నియోజకవర్గ వ్యాప్తంగా అన్ని గ్రామాలలో సీసీ రోడ్లు, గ్రామ సచివాలయాలు, రైతు భరోసా కేంద్రాలు, పలు ఇరిగేషన్ పనులు చిత్రావతిలో 10 టీఎంసీల నీటి నిల్వ, పైడిపాలెం రిజర్వాయర్లో 6 టీఎంసీల నీటి నిల్వలతోపాటు పులివెందుల పట్టణంలో మెడికల్ కళాశాల నిర్మాణం, అరటికి సంబంధించి కోల్డ్ స్టోరేజ్, బోలేవార్డ్లతోపాటు వందల కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టడం జరిగింది. ప్రస్తుతం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో లేకున్నా కూడా పులివెందుల ప్రాంత ప్రజల పట్ల ఉన్న చిత్తశుద్ధితో వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డిలు రోడ్ల నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. అలాగే బ్రాహ్మణపల్లె, రోటరీపురం ప్రాంతాలలో పలు రోడ్ల నిర్మాణాలకు గత మున్సిపాలిటీ కౌన్సిల్ ఆమోదం తెలిపిన పనులకు కూడా త్వరలో జనరల్ కేటగిరీ కింద పనుల శ్రీకారానికి ఆమోదం లభించనుంది. దీంతో మున్సిపాలిటీ పరిధిలోని రోడ్ల నిర్మాణాల పట్ల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఎంపీ చొరవతో చెరువుకు నీటి విడుదలపులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని వెలమవారిపల్లె గ్రామంలో భూగర్భ జలాలలు అడుగంటిపోయి సాగునీరు లేక పంటలు ఎండిపోతున్నాయని, వెలమవారిల్లె చెరువుకు నీటిని విడుదల చేయాలని ఆదివారం గ్రామస్తులు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని భాకరాపురంలోని ఆయన నివాసంలో కలిసి విన్నవించారు. దీనికి స్పందించిన ఎంపీ వెలమవారిపల్లె చెరువుకు నీటిని విడుదల చేయాలని పీబీసీ అధికారులతో మాట్లాడారు. దీంతో పీబీసీ అధికారులు సోమవారం పులివెందుల బ్రాంచ్ కెనాల్ నుంచి వెలమవారిపల్లె చెరువుకు నీటిని విడుదల చేశారు. దీంతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి రైతులు కృతజ్ఞతలు తెలియజేశారు. -
మాదిగలపై ‘కూటమి’ ప్రభుత్వం వివక్ష
● అమలుకు నోచుకోని ఎన్నికల హామీలు ● కలెక్టరేట్ ఎదుట మాదిగల జేఏసీ ధర్నా కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలో మాదిగల అభివృద్ధి, సంక్షేమం పట్ల కూటమి ప్రభుత్వం తీవ్ర వివక్ష చూపుతోందని మాదిగల జేఏసీ జిల్లా అధ్యక్షుడు పెద్దులపల్లి ఓబులపతి ఆరోపించారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ ఒక్క హామీ అమలు చేయలేదని విమర్శించారు. కూటమి ప్రభుత్వ వివక్షను నిరసిస్తూ జేఏసీ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. నిరుపేదలైన ఒక్కో మాదిగ కుటుంబానికి రెండు ఎకరాల వ్యవసాయ భూమి పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కూటమి అధికారంలోకి వచ్చి రెండేళ్లు దాటినా అసైన్మెంట్ కమిటీ ఏర్పాటు చేయకపోవడం విచారకరమన్నారు. మాదిగల విషయానికి వచ్చేసరికి అసైన్మెంట్ కమిటీ సమావేశం జరగాలంటున్న అధికారులు.. బడా పారిశ్రామికవేత్తలకు మాత్రం వేలాది ఎకరాలు పంచి పెడుతున్నారని ఆరోపించారు. కడప నగరం చెమ్ముమియాపేట గ్రామ పొలం సర్వే నంబరు 601లో ఉన్న 5.70 ఎకరాల భూమిని మాదిగల ఇళ్ల స్థలాలకు కేటాయించాలని కోరారు. గతంలో ఇదే సర్వే నంబరులో కొంత మంది దళితులకు రెవెన్యూ అధికారులు ఇళ్ల స్థలాల పట్టాలిచ్చారని పేర్కొన్నారు. అయితే లియాఖత్ అనే వ్యక్తి ఆక్రమించి మాదిగ చర్మకారులను రానివ్వడం లేదన్నారు. ఆయనకు ఎలాంటి హక్కు లేదని, ఆ భూమిని స్వాధీనం చేసుకుని మాదిగలకు కేటాయించాలన్నారు. అలాగే బాబూ జగ్జీవన్రామ్ భవన నిర్మాణానికి స్థలాన్ని మంజూరు చేయాలన్నారు. అనంతరం కలెక్టర్ కార్యాలయంలో అధికారులకు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ నాయకులు పి.బాలసుబ్బయ్య, పి.మల్లికార్జున, కువైట్ సుబ్బరాయుడు, ఎదురూరు బాబు, పి.సునీల్కుమార్, జీసీ నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
జూనియర్ డాక్టర్ల సమ్మె ఉధృతం
కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) పిలుపు మేరకు గవర్నమెంట్ మెడికల్ కాలేజ్ కడపలో ఫేజ్–3 సమ్మె సోమవారం ప్రారంభమైంది. ఈ సందర్భంగా జీఎంసీ కడప జూడా అసోసియేషన్ అధ్యక్షుడు రవితేజ నాయక్ మాట్లాడుతూ ఫేజ్–3లో భాగంగా కడపకు చెందిన జూనియర్ డాక్టర్లు అత్యవసర, అత్యవసరం కాని వైద్య సేవలను పూర్తిగా నిలిపేస్తూ ఏపీ జూడా అసోసియేషన్ ఉద్యమానికి సంపూర్ణ మద్దతు ప్రకటించామన్నారు. జూనియర్ డాక్టర్ల న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం పరిగణనలోకి తీసుకుని, సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు చేపట్టాలని కోరారు. రాష్ట్ర ప్రభుత్వం తమ న్యాయ మైన డిమాండ్లను పరిష్కరించకపోతే సమ్మెను మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప జీఎంసీ జూడా వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి మేఘన, నాయకులు కె.యశ్వంత్కృష్ణ, ఎస్. యశ్వంత్కృష్ణలతో పాటు,పీజీలు, హౌస్ సర్జన్లు పాల్గొన్నారు. సోమవారం రిలే దీక్షల్లో పీజీలు నందన్రాజ్, జగదీష్, కౌసర్, సాయిప్రసన్న, ఉషప్రియ, అంజు వినోద్, హౌస్ సర్జన్లు హర్షవర్దన్, అజయ్, జీవన, స్మృతి పండా, నిస్సీ, వర్షిణి, మధుమతిలు పాల్గొన్నారు. -
స్కూటీ అదుపు తప్పి మహిళ మృతి
ఖాజీపేట : ఖాజీపేట మండలం కుమ్మరకొట్టాలు గ్రామం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ మహిళ మృతి చెందింది. కడప నుంచి వనిపెంటకు స్కూటీలో వెళుతూ వేగాన్ని అదుపు చేయలేక రాయిని ఎక్కించడంతో కింద పడి.. అన్నమయ్య జిల్లా రామాపురం మండలం కొత్తపల్లి గ్రామానికి చెందిన బత్తల లక్ష్మీదేవి తీవ్రంగా గాయపడింది. దీంతో ఆమెను రిమ్స్ ఆస్పత్రికి తరలించగా.. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ప్రకటించారు. మృతురాలి కుమారుడు వెంకట రమణ ఫిర్యాదు మేరకు ఖాజీపేట పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. విద్యార్థిని అదృశ్యం కడప అర్బన్ : కడపలోని కో–ఆపరేటివ్ కాలనీకి చెందిన సోమ శివరాజా, రుక్మిణీల కుమార్తె సోమ పద్మావతి(17) అనే ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం విద్యార్థిని అదృశ్యమైనట్లు సోమవారం రాత్రి తల్లిదండ్రులు కడప వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా వుంటే 9121100510, 9121100511, 9121100512 నంబర్లకు సమాచారం తెలియజేయాలని కోరారు. కరువు జిల్లాగా ప్రకటించాలి – ఏపీ రైతు సంఘం నేతల డిమాండ్ కడప సెవెన్రోడ్స్ : ఖరీఫ్ సీజన్ మొదలై మూడు నెలలు కావస్తున్నా వైఎస్సార్ కడప జిల్లాలో వర్షాలు పడక దుర్భర పరిస్థితులు నెలకొన్నందున వెంటనే కరువు జిల్లాగా ప్రకటించి కేసీ కెనాల్తోపాటు ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని రైతు సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు ఎంవి. సుబ్బారెడ్డి, పోతిరెడ్డి భాస్కర్ డిమాండ్ చేశారు. ప్రాజెక్టులకు నీటిని విడుదల చేయాలని కోరుతూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేపట్టింది. ఈ ధర్నాలో వారు మాట్లాడుతూ.. జిల్లాలోని తెలుగు గంగ, పైడిపాలెం, సర్వరాయసాగర్, వామికొండ తదితర ప్రాజెక్టుల పరిధిలో పంట కాలువలు నిర్మించాలని కోరారు. కౌలు రైతులకు గుర్తింపు కార్డులివ్వాలని, రైతులు, కౌలు రైతుల రుణాలన్నింటిని మాఫీ చేసి, తిరిగి రుణాలు ఇవ్వాలని, అన్నదాత సుఖీభవ నిధులను రూ. 50 వేలకు పెంచాలని డిమాండ్ చేశారు. రైతులకు సబ్సిడీతో విత్తనాలు, ఎరువులు, డీజిల్ అందించాలని, యంత్ర పరికరాలను పూర్తి సబ్సిడీతో ఇవ్వాలని కోరారు. లేదంటే పోరాటాలను తీవ్రతరం చేస్తామని హెచ్చరించారు. అనంతరం డిమాండ్లతో కూడిన వినతి పత్రాన్ని డీఆర్ఓ మల్లికార్జునుడికి అందజేశారు. -
సుద్దముక్కల నుండి తుడిచే చీపుర్ల దాకా.. అన్నీ అప్పులే!
ఈ నిర్వహణ గ్రాంటు నిధుల నుండే ప్రధానోపాధ్యాయులు పాఠశాలకు సంబంధించిన ప్రతీ చిన్న అవసరాన్ని తీర్చాల్సి ఉంటుంది. క్లాస్ రూముల్లో రాసే చాక్పీసులు, డస్టర్లు, ఆఫీస్ స్టేషనరీ, విద్యార్థుల మార్కుల నమోదు పత్రాలు (రిజిస్టర్లు), బడిని శుభ్రం చేసే చీపుర్లు, జాతీయ పండుగల నిర్వహణ, పాఠశాల భవనాల చిన్నపాటి మరమ్మతులు వంటి వివిధ కార్యక్రమాల అమలుతో పాటు రోజువారీ అత్యవసర ఖర్చులను కూడా ఈ నిధుల నుంచే ఖర్చు చేయాల్సి ఉంటుంది. అలాంటి నిత్య అవసరాల ఖర్చులకు కూడా ప్రభుత్వం పైసా విదల్చకపోవడంతో ప్రధానోపాధ్యాయులు తీవ్ర అవస్థలు పడాల్సి వస్తోంది. -
ఉత్సాహంగా మల్టీడే జోనల్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మల్టీడే ఇంటర్ జోనల్ మ్యాచ్లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. సోమవారం కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 73 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్–బీ జట్టు 35.2 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టులోని దేవాషిస్ 84, కేవీ ఓంకార్ 29 పరుగులు చేశారు. టీమ్–ఈ జట్టులోని తేజసాయి 3, గౌతమ్ ఆర్య 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–ఈ జట్టు 65 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 277 పరుగులు చేసింది. ఆ జట్టులోని నారాయణ 67, సాయి గణేష్ 55 పరుగులు చేశారు. టీమ్–బీ జట్టులోని ధీరజ్కుమార్రెడ్డి 2, దేవాషిస్ 2 వికెట్లు తీశారు. దీంతో టీమ్–ఈ జట్టు 443 పరుగుల ముందంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 81 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–ఏ జట్టు 55.5 ఓవర్లకు 161 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని దేవ్ ప్రమోద్ 51, శశాంక్రెడ్డి 29 పరుగులు చేశారు. టీమ్–డీ జట్టులోని రణదీప్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. జయంత్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన టీమ్–డీ జట్టు 57 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 205 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 57, భాను శ్రీ హర్ష 52 పరుగులు చేశారు. టీమ్–ఏ జట్టులోని లోహిత్రెడ్డి 2 వికెట్లు తీశాడు. దీంతో టీమ్–డీ జట్టు 346 పరుగుల ముందంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. జయంత్ (4 వికెట్లు)దేవాషిస్ (84 పరుగులు) రణదీప్ (5 వికెట్లు) నారాయణ (67 పరుగులు) -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
ఖాజీపేట : బంధువుల వివాహం కోసం వెళ్లి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. ఖాజీపేట పంచాయతీ కె.బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన కణం చైతన్య(24) కడపలోని ఒక షాపింగ్ మాల్లో పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆదివారం ఉదయం 7 గంటల సమయంలో తుడుమలదిన్నె గ్రామం అంకాలమ్మ ఆలయ సమీపంలోని కాలువలో గ్రామస్తులు మృతదేహాన్ని గుర్తించారు. ఆదివారం ఉదయం గ్రామం వైపు వెళ్తున్న వ్యక్తులు కొందరు కాలువలో మృతదేహం పడి ఉండటం గమనించి గ్రామస్తులకు సమాచారం ఇచ్చారు. అక్కడికి వెళ్లిన వారు చనిపోయిన వ్యక్తి.. కె.బుడ్డాయపల్లె గ్రామానికి చెందిన కణం చైతన్యగా గుర్తించారు. వెంటనే అతని బంధువులకు సమాచారం ఇవ్వడంతో.. వారు అక్కడికి చేరుకున్నారు. మృతుడి తండ్రి మోసే ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాత్రి తుడుమలదిన్నె గ్రామానికి చెందిన బంధువుల ఇంటికి వివాహ వేడుకలకు హాజరైనట్లు తెలిపారు. ఆదివారం తెల్లవారుజామున సుమారు 2 గంటల ప్రాంతంలో ఇంటికి తిరుగు ప్రయాణం చేసినట్లు స్థానికులు చెబుతున్నారు. ఇంటి నుంచి వచ్చే మార్గంమధ్యలో ఏదైనా వాహనం ఢీకొని మృతి చెందాడా లేక బైక్ నడపడంలో ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందాడా అనేకోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి శవ పరీక్షల నిమిత్తం మృతదేహాన్ని కడప రిమ్స్కు తరలించారు. -
స్నేహం పేరిట గ్యాంగ్వార్లు
ప్రొద్దుటూరు క్రైం : ‘రేయ్ మచ్చా..! ఒక చిన్న పని ఉంది వస్తావా.. చెప్పరా మామా.. ఏం చేయాలి.. నీ కోసం ప్రాణమైనా ఇస్తా’.. ఇది ఇటీవల కాలంలో ఎక్కడ చూసినా వినిపించే మాట. రేయ్ ఒక చిన్న పని ఉంది అంటూ ఒక ఫ్రెండ్ ఫోన్ చేశాడంటే చాలు.. ఎక్కడికి వెళ్లాలి? ఎందుకు వెళ్లాలనే ఆలోచన లేకుండానే.. కొందరు యువకులు వెళ్తున్నారు. స్నేహితుడి కోసం ఏం చేయడానికై నా సిద్ధమంటూ అత్యుత్సాహం ప్రదర్శిస్తున్నారు. చివరికి అదే స్నేహం వారిని కేసుల్లో ఇరికించి పోలీస్స్టేషన్, కోర్టు, జైళ్ల చుట్టూ తిరిగే పరిస్థితికి తీసుకెళ్తోంది. ప్రొద్దుటూరులో ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలను పరిశీలిస్తే.. యువతలో పెరుగుతున్న ఈ ధోరణి ఆందోళన కలిగిస్తోంది. చిన్న పాటి కారణాలకే యువకుల మధ్య తలెత్తుతున్న వివాదాలు తీవ్ర ఘర్షణలకు దారి తీస్తున్నాయి. చివరికి గ్యాంగ్లుగా ఏర్పడి దాడులు చేసుకునే స్థాయికి చేరుతున్నాయి. ప్రొద్దుటూరులో నిత్యం యువకుల గొడవలే.. రీల్స్ ప్రభావమో లేక స్వతహాగా వచ్చిన ఆలోచనేమో తెలియదు కానీ.. ఇటీవల విద్యార్థులు కొట్టుకునే సీన్లు, వాళ్లు ఎంట్రీ ఇచ్చే విధానం చూస్తే గ్యాంగ్స్టర్ సినిమాలకు ఏ మాత్రం తీసిపోవనిపిస్తుంది. ప్రొద్దుటూరులో ఈ తరహా గొడవలు నిత్యకృత్యమయ్యాయి. అందులో కొన్ని ఘటనలు.. ● నాలుగు రోజుల క్రితం ప్రేమ వ్యవహారంలో బీటెక్ చదువుతున్న ఇద్దరు స్టూడెంట్ల మధ్య జరిగిన చిన్నపాటి వాగ్వాదం.. గ్యాంగ్లుగా ఏర్పడి కొట్టుకునే వరకు వెళ్లింది. ఈ క్రమంలో ఓ ఇంజినీరింగ్ విద్యార్థి తన స్నేహితులతో కలసి బార్లో ఉండగా.. మరో బీటెక్ విద్యార్థి తన స్నేహితులను వెంట తీసుకొని అక్కడికి వెళ్లాడు. 10 మందికి పైగా యువకులు కేకలు వేస్తూ బార్లోకి ప్రవేశించారు. రాడ్లు, కట్టెలు, బీరు బాటిళ్లతో వెళ్లడంతో అక్కడ ఒక్కసారిగా ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. రెండు వర్గాలు పరస్పరం దాడులకు తెగపడ్డారు. పోలీసులు రంగప్రవేశం చేయడంతో పరిస్థితి అదుపులోకి వచ్చింది. ఈ ఘటనలో బీటెక్ విద్యార్థికి గాయాలయ్యాయి. పోలీసులు 11 మందిని అరెస్ట్ చేశారు. వారిలో 9 మంది ఇంజినీరింగ్ విద్యార్థులు ఉన్నారు. ● పట్టణంలోని ఎల్ఐసీ కార్యాలయం వద్ద ఉన్న ఫంక్షన్ హాల్లో జరిగే పెళ్లి కోసం తాడిపత్రి నుంచి వాహనాల్లో బంధువులు వచ్చారు. ఈ క్రమంలో రాత్రి యువకులు అక్కడ మద్యం తాగి రాళ్లు రువ్వుకోవడంతో పెళ్లికి వచ్చిన వాహనాల అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. పెళ్లి వాళ్లకు ఈ విషయం తెలిసి అక్కడికెళ్లి యువకులను ప్రశ్నించారు. దీంతో ఏడుగురు యువకులు మద్యం మత్తులో పెళ్లివాళ్లపై దాడి చేశారు. వారు భయపడి ఫంక్షన్ హాల్లోకి వెళ్లినా వదల్లేదు. రాళ్లు విసిరి భయభ్రాంతులకు గురి చేశారు. విషయం తెలిసి అక్కడికి వచ్చిన పోలీసులపై కూడా యువకులు తిరగబడ్డారు. ● కొన్ని రోజుల క్రితం గాంధీరోడ్డులో కొందరు యువకులు రాత్రి 12 గంటల సమయంలో రోడ్డుపైనే మద్యం తాగుతూ కేకలు వేయసాగారు. విధుల్లో ఉన్న హోంగార్డు వారి వద్దకు వెళ్లి ఎందుకు ఈ టైంలో అల్లరి చేస్తున్నారు.. ఇంటికి వెళ్లిపోండని సూచించాడు. దీంతో యువకులు వినిపించుకోకుండా హోంగార్డుపైనే దాడికి దిగారు. యువకుల దాడిలో హోంగార్డుకు గాయాలయ్యాయి. దారిన పోయే స్థానికులు కొందరు సర్దిచెప్పినా వినిపించుకోలేదు. ● ఇటీవల వరుసగా ఆర్ట్స్ కాలేజీ రోడ్డులోని సర్కిల్లో రాత్రి సమయాల్లో గొడవలు చోటు చేసుకుంటున్నాయి. యువకులు మద్యం మత్తులో విచక్షణా రహితంగా దాడులు చేసుకుంటున్నట్లు స్థానికులు చెబుతున్నారు. అర్ధరాత్రి 12 గంటలు దాటినా యువకులు గుంపులుగా చేరడం, కొట్టుకోవడంతో అక్కడ చుట్టుపక్కల నివాసాలున్న ప్రజలు భయాందోళనలకు గురవుతున్నారు. మద్యం కీలక పాత్ర ఇటీవల యువకుల మధ్య ఉన్న మద్యం స్నేహం విడదీయరానిదైంది. ప్రొద్దుటూరులో జరుగుతున్న ప్రతి గొడవ వెనుక మద్యం కీలకపాత్ర పోషిస్తోంది. గొడవకు వెళ్లే ముందు మద్యం తాగడం.. గొడవలు ముగిశాక సిట్టింగ్ వేయడం అనేది పరిపాటిగా మారింది. పార్టీ ఉందిరా మామా అంటే చాలు మరి కొంత మంది దోస్తుగాళ్లను తోడు చేసుకొని క్షణాల్లో ఎంత దూరంలో ఉన్నా చేరిపోయే పరిస్థితి కనిపిస్తోంది. తల్లిదండ్రుల పర్యవేక్షణ అవసరం యువతలో ఈ తరహా మార్పులకు తల్లిదండ్రుల పర్యవేక్షణ లోపించడం కూడా ఒక ప్రధాన కార ణం. పిల్లలపై నమ్మకం ఉంచడంతోపాటు వారి స్నేహాలు, అలవాట్లు, ప్రవర్తనలో వస్తున్న మార్పులను గమనించాలి. ఆలస్యంగా ఇంటికి రావడం, తరచూ పార్టీలు, కొత్త స్నేహాలు, చదువుపై ఆసక్తి తగ్గడం వంటి మార్పులను నిర్లక్ష్యం చేస్తే పరిస్థితి చేయి దాటే ప్రమాదం ఉందని నిపుణులు సూచిస్తున్నారు. మద్యం మత్తులో గొడవలు జైలు పాలవుతున్న భవిత -
ఉత్సాహంగా చెస్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగరంలోని ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో అనీస్ దర్బారీ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ ఉత్సాహంగా జరిగిందని జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీస్ దర్బారీ తెలిపారు. ఈ టోర్నమెంట్కు రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 167 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ టోర్నమెంట్లో కడపకు చెందిన రూపేష్ రెడ్డి 7 పాయింట్లు సాధించి ప్రథమ స్థానంలో, అనంతపురానికి చెందిన భరత్ భూషణ్ 6 పాయింట్లు సాధించి ద్వితీ య స్థానంలో, కడపకు చెందిన నూలాల జస్వంత్ 6 పాయింట్లు సాధించి తృతీయ స్థానంలో నిలిచారు. గెలుపొందిన క్రీడాకారులకు డీఎస్డీవో గౌస్బాషా బహుమతులను అందజేశారు. అసిస్టెంట్ డైరెక్టర్ ఆఫ్ అగ్రికల్చర్ మార్రిపాటి నాగరాజా, ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్ పీడీ జయచంద్ర రెడ్డి, టోర్నీ డైరెక్టర్ తబస్సుమ్ పాల్గొన్నారు. జాతికి స్ఫూర్తి.. సర్దార్ గౌతు లచ్చన్నకడప సెవెన్ రోడ్స్ : అట్టడుగు వర్గాల అభ్యున్నతికి పాటుపడిన మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధుడు సర్దార్ గౌతు లచ్చన్న జాతికి స్ఫూర్తిదాయకం అని డీఆర్వో కె.మల్లికార్జునుడు కొనియాడారు. ఆదివారం కలెక్టర్లోని పీజీఆర్ఎస్ హాలులో వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో సర్దార్ గౌతు లచ్చ న్న జయంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి కృష్ణ, స్టెప్ సీఈవో ప్రసాద్, బీసీ జాతీయ మహాసభ జాతీయ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున, జిల్లా గౌడ సంఘం గౌరవాధ్యక్షులు రామమూర్తి నాయుడు పాల్గొన్నారు. 19నుంచి యోగా పోటీలు వేంపల్లె : జిల్లా యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 19 నుంచి జిల్లా స్థాయి యో గా పోటీలు నిర్వహించనున్నట్లు రాయలసీమ యోగా స్పోర్ట్స్ ఇన్చార్జ్ మనోహర్ రెడ్డి, జిల్లా కార్యదర్శి తేజా, జాయింట్ సెక్రటరీ షఫీ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. వేంపల్లెలోని వైఎస్ఆర్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళా శాలలో నిర్వహించే ఈ పోటీలను సబ్ జూనియర్, జూనియర్, సీనియర్ విభాగంలో ఉంటాయని వివరించారు. వివరాలకు 9398014919, 9440470064 నెంబర్లుకు సంప్రదించాలని కోరారు. ఫలితాలు విడుదలకడప ఎడ్యుకేషన్: జిల్లాలో ఈ ఏడాది ఏప్రిల్లో నిర్వహించిన గ్రంథాలయ పరీక్ష ఫలితాలను ప్రభుత్వ పరీక్షల సంచాలకులు విడుదల చేసినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. దీనికి సంబంధించి https://www.bse.ap.gov.in అనే వెబ్సైట్లో ఫలితాలను పొందవచ్చని పేర్కొన్నారు. -
రెడ్బుక్ పాఠం.. గ్రీన్ ఇంక్ సంతకం
● టీడీపీ ఎమ్మెల్సీ చెప్పిందానికల్లా తలాడిస్తున్న డీఈఓ! ● విచక్షణ మరిచి టీచర్లపై సస్పెన్షన్ వేటుసాక్షి ప్రతినిధి, కడప : టీడీపీ ఎమ్మెల్సీ ఆడే ఆటలో డీఈఓ పావుగా మారిపోయారా? చెప్పిందానికల్లా తలాడిస్తున్నారా? తప్పొప్పులను కాదని విచక్షణ మ రిచి ప్రవర్తిస్తున్నారా? జిల్లా ఉపాధ్యాయులపై సస్పెన్షన్ వేటు ఇందులో భాగమేనా? అంటే.. ఉపాధ్యాయ సంఘాలు ‘అవున’నే అంటున్నాయి. వివరాల్లోకి వెళితే.. ఇన్ సర్వీస్ టీచర్లకు టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్ (టెట్) నుంచి మినహాయించాలని, 30ఏళ్లుగా విధి నిర్వహణలో ఉన్న టీచర్లకు మళ్లీ టెట్ నిర్వహించడం సహేతుకం కాదని ఉపాధ్యా య సంఘాలన్నీ ముక్తకంఠంతో ఆందోళన చేస్తూ వస్తున్నాయి. ఈ క్రమంలో టెట్ వల్ల ఏపీలో లక్షమంది టీచర్లు ఇబ్బందులు పడుతున్నారని జిల్లాకు చెందిన పలు వురు టీచర్స్ యూనియన్ నాయకులు ఇటీవల పులి వెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి విన్నవించారు. స్పందించిన వైఎస్ జగన్ న్యాయపోరాటంతో పాటు కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్దామని, కేంద్ర విద్యాశాఖ మంత్రి అపాయింట్మెంట్ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు కోరతారని, టీచర్స్ ప్రతినిధుల బృందం వారితో వెళ్లి విన్నవించాలని సూచించారు. ఈ మేర కు మాజీ సీఎం వైఎస్ జగన్ ఆదేశాల మేరకు వైఎస్సార్సీపీ ఎంపీలు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, ఎం.గురుమూర్తి, గొల్లబాబురావు, వైఎస్సార్సీపీ టీచర్స్ ఎమ్మెల్సీలు పద్మాలతారెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, పర్వతరెడ్డి చంద్రశేఖరరెడ్డి గత గురువారం ఢిల్లీలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్జోషితో సమావేశమై వాస్తవ విషయాలను విన్నవించారు. వీరితో పాటు జిల్లాకు చెందిన టీచ ర్స్ యూనియన్ నేతలు వెంకటనాథరెడ్డి, సింగారెడ్డి అమర్నాథరెడ్డి (వైఎస్సార్టీఏ), నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి (ఎస్టీయూ) ప్రహ్లాద్ జోషిని కలిసి టెట్ వల్ల టీచర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వివరించారు. డీఎస్సీపై ఫిర్యాదు చేశారంటూ సస్పెన్షన్ కేంద్ర విద్యాశాఖ మంత్రి ప్రహ్లాద్జోషిని కలిసి రాష్ట్రంలో డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని ఫిర్యాదు చేశారని, ఆ మేరకు వాట్సాప్ మెసేజ్ తమ వద్ద ఉందంటూ డీఈఓ షంషుద్ధీన్ సదరు ఉపాధ్యా యులు వెంకటనాథరెడ్డి, అమర్నాథరెడ్డి, సంఘమేశ్వరరెడ్డిలను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాట్సాప్ మేసేజ్ల ఆధారంగా ఏకంగా సస్పెండ్ చేయడం, పైగా తప్పుడు ఆరోపణలు చూపించడంపై పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. టీచర్ల ఇష్యూపైన పోరాటం చేస్తున్న యూనియన్ నేతల్ని సస్పెన్షన్ చేయాలని ఓ ఎమ్మెల్సీ నుంచి వచ్చిన ఒత్తిడి మేరకే ముందు వెనుకా ఆలోచించకుండా ఈ నిర్ణయం తీసుకున్నట్లు టీచర్ల్ల సంఘాలు కోడై కూస్తున్నాయి. రాష్ట్ర వ్యాప్తంగా సుమారు లక్ష మంది టీచర్ల ఇబ్బందులపై కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తే సస్పెన్షన్ చేయడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. షోకాజ్ కూడా కోరకుండా ఏకంగా సస్పెన్షన్ చేయడంపై తప్పుబడుతున్నారు. ఈవిషయమై డీఈఓను వివరణ కోరేందుకు ప్రయత్నించగా అందుబాటులోకి రాకపోవడం గమనార్హం. -
ఆర్టీసీ డ్రైవర్ను చెప్పుతో కొట్టిన ప్రయాణికుడు
వేంపల్లె : ఆర్టీసీ బస్సు ఆపకుండా పోవడంతో.. డ్రైవర్ను ఓ ప్రయాణికుడు చెప్పుతో కొట్టాడు. వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల నుంచి ఆదివారం కడపకు ఎక్స్ప్రెస్ సర్వీసు బయలుదేరింది. ఈ క్రమంలో వేంపల్లె రాజీవ్ కాలనీ వద్ద ఒక ప్రయాణికుడు బస్సును ఆపే ప్రయత్నం చేశాడు. అక్కడ బస్సు స్టేజీ లేదు, ఫుల్ లోడ్తో ఉండటంతో డ్రైవర్ మల్లికార్జునరెడ్డి ఆపకుండా వేంపల్లె బస్టాండ్కు వెళ్లాడు. అయితే ప్రయాణికుడు ఊరుకోకుండా బైక్లో బస్సును వెంబడించి కడప రోడ్డులోని హనుమాన్ జంక్షన్ వద్ద.. బస్సు ఆపి ఆర్టీసీ డ్రైవర్ను అసభ్య పదజాలంతో దూషించి పాదరక్షలతో కొట్టాడు. తోటి ప్రయాణికులు ఎంత చెప్పినా వినకుండా కొట్టి వెళ్లిపోయాడు. డ్రైవర్ కొద్ది సేపు బస్సును అక్కడే ఆపి వేశాడు. ఇలాంటి ఘటనలు మళ్లీ పునరావృతం కాకుండా ఆ ప్రయాణికుడు క్షమాపణ చెప్పే వరకు బస్సు కదలనీయబోనని డ్రైవర్ భీష్మించుకుని కూర్చున్నాడు. ప్రయాణికులు అందరిని వేరే బస్సులో ఎక్కించారు. డ్రైవర్, కండక్టర్తోపాటు ఘటన చూసిన ప్రయాణికుడు బస్సు తీసుకొని వేంపల్లి పోలీస్స్టేషన్కు వచ్చారు. విషయాన్ని వేంపల్లె సీఐ నరసింహులుకు తెలిపి ఫిర్యాదు చేశారు. కొట్టిన వ్యక్తి ఎవరని పోలీసులు ఆరా తీస్తున్నారు. -
ఎమ్మెల్యే సాక్షిగా జాతీయ జెండాకు అవమానం
ప్రొద్దుటూరు : ఎమ్మెల్యే, ప్రజాప్రతినిధులు, అధికారుల సాక్షిగా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో జాతీయ జెండాకు అవమానం జరిగిందని కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇర్షాన్ బాషా తెలిపారు. ఈ నెల 15న స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ గ్రౌండ్లో నిర్వహించిన కార్యక్రమం వేదిక వద్ద నేలపైనే త్రివర్ణ పతాకం రూపాన్ని ఏర్పాటు చేశారన్నారు. వేదికపై ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితో సహా నాయకులు, అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు ఈ విషయాన్ని గమనించాల్సిన అవసరం ఉందన్నారు. జాతీయ జెండా ఎత్తయిన స్థాయిలో గర్వంగా, హుందాతనంగా రెపరెపలాడాలని, త్రివర్ణ రంగులను నేలపై, ప్రజలు నడిచే ప్రదేశంలో ఏర్పాటు చేయడం సరికాదన్నారు. ప్రివెన్షన్ ఆఫ్ ఇన్సల్ట్ టు నేషనల్ హానర్ యాక్ట్ 1971లోని సెక్షన్ 2 ప్రకారం జాతీయ జెండాను తొక్కడం లేదా దానికి ఇతర విధాలుగా అవమానం చేయడం శిక్షార్హమని ఆయన గుర్తు చేశారు. ఈ చట్టంలో జాతీయ జెండా చిత్రం, పెయింటింగ్, డ్రాయింగ్ లేదా ఇతర కనిపించే ప్రతిరూపం కూడా ప్రస్తావించబడిందని పేర్కొన్నారు. ఈ ఘటనపై మున్సిపల్ అధికారులు, కార్యక్రమ నిర్వాహకులు స్పష్టమైన వివరణ ఇవ్వాలని, భవిష్యత్తులో జాతీయ జెండా గౌరవానికి భంగం కలిగించే విధంగా ఎటువంటి కార్యక్రమాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
మేధావుల ఫోరాన్ని పటిష్టం చేయాలి
● వైఎస్సార్సీపీ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు ఈశ్వర్ ప్రసాద్రెడ్డి కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మేధావుల ఫోరాన్ని పటిష్టం చేయాలని ఆ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం అధ్యక్షుడు పి.ఈశ్వర్ప్రసాద్రెడ్డి అన్నారు. ఆదివారం సాయంత్రం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన జిల్లా మేధావుల ఫోరం సమన్వయ సమావేశంలో ఆయన మాట్లాడారు. గ్రామాల్లో తటస్థంగా ఉన్న రిటైర్డ్ ఉద్యోగులు, టీచర్లు, ఇంజినీర్లను, పార్టీ సానుభూతి పరులను వైఎస్సార్సీపీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు. పని చేస్తామని వచ్చే వారిని గ్రామ, మండల కమిటీల్లో నియమించాలన్నారు. సీఎం చంద్రబాబు అధికారం కోసం ఎన్ని దుర్మార్గాలకై నా పాల్పడుతారని, వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా చేయరన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ఉండటం వల్ల పేద ప్రజలకు ప్రయోజనకరమని, ప్రైవేటు ఆధీనంలో ఉంటే వారికి నష్టమన్నారు. ఈ విషయం మేధావులు సులభంగా అర్థం చేసుకోగలరన్నారు. వాళ్ల వాళ్లకు సంపద సృష్టించడానికే చంద్రబాబు అధికారంలోకి వచ్చారన్నారు. వైఎస్సార్, వైఎస్ జగన్కు.. చంద్రబాబుకు మధ్య తేడాను ప్రజలకు వివరించాలన్నారు. రూ.5 వేల కోట్లతో మెడికల్ కాలేజీలను కట్టలేనని చెబుతూ, అమరావతిలో లక్షల కోట్లు ఖర్చు చేస్తున్నారని విమర్శించారు. తటస్థులుగా ఉన్న 20 శాతం మందిని వైఎస్సార్సీపీ వైపు తిప్పుకోగలిగితే మన విజయం సులభమవుతుందని తెలిపారు. అనంతరం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ మేధావుల మౌనం సమాజానికి ప్రమాదకరమన్నారు. రాష్ట్రంలో జరుగుతున్న అన్యాయాలు, అక్రమాలను, మంచి చెడులను ప్రజలకు తెలియజేయాల్సిన బాధ్యత మేధావులపై ఉందన్నారు. మేధావుల ఫోరానికి సంబంధించి అన్ని కమిటీలను పూర్తి చేయాలని, కష్టపడి పనిచేసే వారిని అందులో నియమించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిసునీల్, మేధావుల ఫోరం జిల్లా అధ్యక్షుడు పి.సంపత్ కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు పి.క్రిష్ణమూర్తి, సంజీవయ్య, మునిరెడ్డి, రాష్ట్ర కార్యదర్శులు డి.వేణుగోపాల్, జిల్లా కార్యదర్శి డాక్టర్ రామాంజులరెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు బి.విష్ణువర్ధన్రెడ్డి, నియోజకవర్గ అధ్యక్షులు పి. వెంకటరెడ్డి, ఏ.శ్రీనివాసులు, వై.కుమార్రెడ్డి, భరత్ కుమార్రెడ్డి, అబ్దుల్లా, ఇలియాస్ పాల్గొన్నారు. -
పార్టీ బలోపేతంలో యువతే కీలకం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలోపేతం చేయడంలో యువజన విభాగం కీలకపాత్ర పోషించాలని వైఎస్సార్సీపీ జిల్లా అఽధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక జిల్లా పార్టీ కార్యాలయంలో యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య ఆధ్వర్యంలో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ పార్టీ నాయకుల సలహాలు, సూచనలు తీసుకుంటూ యువత ముందుకు సాగాలన్నారు. హోదాలను బట్టి బాధ్యతాయుతంగా సమన్వయంతో పనిచేయాలన్నారు. ఎన్నికల ముందు విద్యార్థులు, యువతకు చంద్రబాబు ఎన్నో హామీలు ఇచ్చి ఏ ఒక్క హామీని కూడా అమలు చేయ కుండా వారిని మోసం చేశారన్నారు. బాబు వస్తే జాబు వస్తుందని, 20లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పారని లేనిపక్షంలో నిరుద్యోగులకు నెలకు రూ.3వేల చొప్పున నిరుద్యోగ భృతి ఇస్తామన్నారన్నారు. కానీ రెండూ ఇవ్వలేదన్నారు. ఈ విషయాలన్నీ ప్రజల్లోకి తీసుకుపోయి యువతీ, యువకులను పార్టీ వైపు ఆకర్షితులయ్యేలా చేయాలన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ దేశంలోనే ఏ ప్రభుత్వం చేయని విధంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం 1.35లక్షల సచివాలయ ఉద్యోగాలను పారదర్శకంగా భర్తీ చేసిందన్నారు. ఈ కూటమి ప్రభుత్వం కేవలం 16వేల పోస్టులకు డీఎస్సీ ఇచ్చి అనేక అక్రమాలకు పాల్పడిందని ఆరోపించారు. యువజన విభాగం నేతలు చురుగ్గా ఉండాలని, స్థానిక సంస్థల ఎన్నికల్లో కీలకపాత్ర పోషించాలన్నారు. యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య మాట్లాడుతూ పదవిని అలంకారప్రాయంగా కాకుండా బాధ్యతగా భావించి పార్టీ కోసం కష్టపడదామని పిలుపునిచ్చా రు. సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసిపాటి కిశోర్, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, యువజన విభాగ నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, రాష్ట్ర ఉపాఽధ్యక్షుడు షఫీవుల్లా, నియోజకవర్గ అధ్యక్షుడు గురునాథరెడ్డి, చంద్ర ఓబుల్రెడ్డి, ఈశ్వర్రెడ్డి, హరీష్రెడ్డి, నరసింహారెడ్డి, జిల్లా ఉపాధ్యక్షులు పఠాన్ఖాన్, పి. సందీప్ పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
గ్రామ కంఠ స్థలం కబ్జా
● వందల ఏళ్ల నుంచి గంగమ్మతల్లికి పూజలు రాజంపేట రూరల్ : రాజంపేట పట్టణం నూనివారిపల్లి నడిబొడ్డున కొన్ని వందల సంవత్సరాల నుంచి గంగమ్మతల్లిని ఏర్పరుచుకొని పూజలు నిర్వహించుకునే.. గ్రామ కంఠం భూమి సర్వే నంబర్ 918లోని 2.50 సెంట్లను కబ్జా చేసినట్లు గ్రామ ప్రజలు మద్దిపట్ల పవన్కుమార్, తలపనేని వేంకటేశ్వర్లు, మద్దిపట్ల రాజేంద్ర, పల్లేటి ప్రసాద్, భీమినేని రమేష్ ఆరోపించారు. ఆదివారం ఆ స్థలం వద్ద వారు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ రెవెన్యూ, మున్సిపల్ అధికారులు రికార్డులను క్షణ్ణంగా పరీశీలించి సంయుక్తంగా సర్వే నిర్వహించాలని డిమాండ్ చేశారు. రికార్డుల ప్రకారం సర్వే చేసి హద్దులను ఏర్పాటు చేయాలని పేర్కొన్నారు. ఆ భూమిలో సంప్రదాయ బావిని మూసివేయటం ఎంత వరకు సంజసమని ప్రశ్నించారు. ఆ స్థలంలో దర్జాగా కాంపౌడ్ వాల్ నిర్మించి భక్తులు పూజలు చేసుకోవటానికి కూడా వీలు లేకుండా చేయటం సబబేనా అని నిలదీశారు. గ్రామ ప్రజల విశ్వాసాలను, తరతరాలుగా కొనసాగుతున్న సంప్రదాయాలను గౌరవిస్తూ అధికారులు వెంటనే చర్యలు చేపట్టాలన్నారు. కబ్జా స్థలంలో ఏర్పాటు చేసిన అనధికార నిర్మాణాలను తొలగించాలన్నారు. కబ్జా స్థలంను గంగమ్మతల్లి పూజల కోసం భవిష్యత్ తరాల కోసం కేటాయించాలని డిమాండ్ చేశారు. -
ప్రారంభమైన అండర్–19 జోనల్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే ఇంటర్జోనల్ మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. మూడు రోజుల పాటు జరిగే ఈ మ్యాచ్ల్లో తొలి రోజు ఆదివారం కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో టీమ్–ఈ వర్సెస్ టీమ్–బీ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన టీమ్–ఈ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 74.2 ఓవర్లకు 339 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 96 పరుగులు చేశారు. టీమ్–బీ జట్టులోని శ్రీరామ్ వీరేంద్ర అవినాష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్–బీ జట్టు 13 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 73 పరుగులు చేసింది. టీమ్–ఈ జట్టులోని తేజసాయి 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో టీమ్–డీ వర్సెస్ టీమ్–ఏ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన టీమ్–డీ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్–డీ జట్టు 64.4 ఓవర్లకు 302 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మనుదర్శన్ 81 పరుగులు చేశారు. టీమ్–ఏ జట్టులోని తులసి నందన్ 4 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్–ఏ జట్టు 25 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 81 పరుగులు చేసింది. దీంతో తొలిరోజు ఆట ముగిసింది. -
మా దిక్కు రావయ్యా.. వాన దేవుడా!
● పదును వర్షం కోసం వరుణ యాగాలు ● జోరుగా కప్పాలమ్మ ఊరేగింపులు ● ఆచారాలు గుర్తు చేస్తున్న పల్లె జనంకడప సెవెన్రోడ్స్ : ఎల్నినో నేపధ్యంలో జిల్లాలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు ఏర్పడ్డాయి. అప్పుడప్పుడు మేఘాలు రెండు చినుకులు రాల్చి వెళ్లడంమినహా పదును వర్షం కురిసింది లేదు. ఫలితంగా సాగు చతికిలపడిపోయింది. నదులు, వంకలు, వాగు లు ఎండి ఎడారులను తలపిస్తున్నాయి. పాతాళ గంగమ్మ రోజురోజుకు అడుగంటిపోతోంది. అనేక గ్రామాలు దాహార్తితో అలమటిస్తున్నాయి. వరుణ దేవుడు కరుణిస్తే తప్ప కష్టాలు గట్టెక్కవు. అందుకే జిల్లా వాసులు ‘ఏ దిక్కునున్నావు వాన దేవుడా.. మా దిక్కు రావయ్యా వాన దేవుడా’.. అంటూ మొరపెట్టుకుంటున్నారు. వరుణుని మెప్పించేందుకు అనాదిగా వస్తున్న సంప్రదాయాలను పాటిస్తున్నారు. వరుణ యాగాలు వర్షం కోసం వరుణ యాగాలు నిర్వహించే సంప్రదాయం జిల్లాలో అనాదిగా వస్తోంది. 1810–13లో కరువు సంభవించినపుడు ఆనాటి కలెక్టర్ సీఆర్ రాస్ వరుణ యాగాలు జరిపించారు. 1822–24లో కరువు కబళించినపుడు కలెక్టర్ జె.హన్బరి 300 వరహాలు మంజూరు చేయించి పుష్పగిరిలో వరుణ యాగం జరిపించినట్లు కడపజిల్లా గెజిటీర్లో ఉంది. వర్షాలు పడక పంటలు ఎండిపోతున్న సందర్బాల్లో ప్రభుత్వాలే వరుణ యాగాలను నిర్వహిస్తోంది. రాష్ట్ర దేవాదాయ ధర్మదాయశాఖ వరుణ యాగాలు నిర్వహించాలంటూ సర్క్యులర్ జారీ చేసింది. ఈ మేరకు రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో శివునికి సహస్ర ఘటాభిషేక సహిత వరుణ యాగ మహోత్సవాన్ని ఈనెల 1 నుంచి 3వ తేది వరకు శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఇటీవల ప్రొద్దుటూరు పట్టణంలో పోతురాజుగడ్డ వద్ద మహిళలు 108 కలశాలతో జలాభిషేకం నిర్వహించి వర్షాలు కురవాలని ప్రార్థించారు. జిల్లాలో ఇప్పటికే అనేక గ్రామాల్లో మహిళలు పెద్ద సంఖ్యలో గ్రామ దేవత గంగమ్మకు బోనాలు సమర్పించి వర్షాలు కురిపించాలని పూజలు నిర్వహించారు. మదనపల్లె పట్టణం కదిరి రోడ్డులోని టిప్పుసుల్తాన్ మైదానంలో ముస్లింలు వర్షాల కోసం ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. కప్పాలమ్మ ఊరేగింపు కరువులు వచ్చిన సందర్భాల్లో వానలు కురవాలని పల్లెల్లో కప్పలను ఊరేగించడం అనాదిగా వస్తున్న సంప్రదాయం. జిల్లాలో ఇప్పటికే పలుచోట్ల కప్పలను ఊరేగించారు. కప్ప అరిస్తే వర్షం పడుతుందనేది పూర్వం నుంచి ప్రజల విశ్వాసం. పలుచోట్ల కప్పలకు పెళ్లిళ్లు నిర్వహిస్తారు. కప్పలు సంతోషంగా ఉంటే మేఘాలు కరుణిస్తాయన్నది నమ్మకం. ఈ వేడుకలో మహిళలతో పాటు పిల్లాజల్లా ఉత్సాహంగా పాల్గొంటారు. ‘‘కప్పాలమ్మ నీళ్లాడే.. కడవలు దొర్లా నీళ్లొచ్చే’’.. అంటూ పాటలు ఆలపిస్తారు. కప్పాలమ్మ అనేది ఒక నమ్మకం మాత్రమే కాదు.. అది జిల్లా రైతు బతుకు, ప్రకృతితో పెనవేసుకున్న బంధానికి గుర్తు. ఈ ప్రార్థనలు మన్నించి వరుణుడు తన కరుణా కటాక్షాలను ప్రసరింపజేస్తే కరువు కష్టాల నుంచి జిల్లా వాసులు గట్టెక్కుతారు. మరి వరుణుడు ఆలకిస్తాడో.. అలకబూనుతాడో కాలానికెరుక.గుగ్గెమ్మ తల్లికి పూజలు చౌడేపల్లె : నీళ్లులేక పంటలు ఎండిపోతున్నాయ్... బోరు బావుల్లో నీటి మట్టం తగ్గిపోతోంది. మాపై కరుణించి వర్షం కురిపించు.. అంటూ అన్నమయ్య జిల్లా దిగువపల్లె పంచాయతీ మాదంవారిపల్లె గ్రామస్తులు వేడుకొన్నారు. ఆదివారం కాగతి చెరువు కట్టపై వెలసిన గ్రామదేవత గుగ్గెమ్మ తల్లికి ఇంటిటా రైతులు తరలివచ్చి పూజలు చేసి 101 బిందె నీటితో అభిషేక పూజలు చేశారు. పూర్వికుల ఆచారం మేరకు వర్షం కోసం గుగ్గెమ్మ తల్లికి పూజలు చేసి రాగి గంజి తయారు చేశారు. అక్కడికి చేరుకొన్న ప్రజలకు రాగి గంజి పంపిణీ చేశారు. అన్నం వడ్డించి చెరువులోకి వెళ్లి ‘అమ్మా.. గుగ్గెమ్మ తల్లీ తినడానికి అన్నం ఉంది .. తాగడానికి నీళ్లు లేవమ్మా..’ అంటూ కేకలు పెట్టారు. -
పాలనలో చంద్రజాలం!
ప్రచారంలో హామీల గాలం...ఎన్నికల వేళ హామీల డప్పు కొట్టి ఆకట్టుకోవడం... అధికారంలోకి రాగానే మూటకట్టి అటకెక్కించడం చంద్రబాబు సర్కారుకు హెరిటేజ్ వెన్నతో పెట్టిన విద్య. ఎప్పట్లాగే ఈ సారికూడా ఉద్యోగ ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను సీఎం చంద్రబాబు విజయవంతంగా అటకెక్కించారు. హామీల అమలుపక్కనెట్టి తనకే సాధ్యమైన గారడీ లెక్కలతో మాయాజాలం .. కాదు కాదు చంద్రజాలం చేస్తున్నారు.కడప ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల కూటమి ప్రభుత్వం దగా చేసింది. ఎన్నికల వేళ ఆయా వర్గాలకు ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని ప్రతి సభలోనూ ఉపన్యాసాలు వల్లె వేసింది. ఈ మేరకు ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచింది. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఇంతవరకు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదని ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు మండిపడుతున్నారు. హామీల అమలుకు ఇక ఉద్యమమే శరణ్యమంటూ కార్యాచరణ ప్రణాళిక రచించే పనిలో నిమగ్నమయ్యారు. కూటమి హామీలు ఇవే.. ● రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రతి నెల 1వ తేదీన జీతాలు, పెన్షన్లు చెల్లించడం, పెండింగ్ బకాయిలను క్లియర్ చేయడం, పెన్షనర్ల కార్పొరేషన్ ఏర్పాటుకు చర్యలు తీసుకోవడం. ● ఉద్యోగులకు మెరుగైన పే రివిజన్ కమిషన్ (పీఆర్సీ) అమలు చేస్తాం. ● ఉద్యోగులకు మధ్యంతర భృతి (ఐఆర్)ప్రకటిస్తాం. ● ఉద్యోగులకు చెల్లించే అలవెన్సులు పునఃపరిశీలన. ● కాంట్రిబ్యూటరీ పెన్షన్ స్కీమ్(సీపీఎస్), ఓల్డ్ పెన్షన్ స్కీమ్ (ఓపీఎస్) విధానాన్ని సమీక్షించి, ఉద్యోగులకు ఆమోదయోగ్యమైన పరిష్కారం తీసుకొస్తాం. ● ప్రభుత్వ ఉద్యోగ, ఉపాధ్యాయుల గౌరవాన్ని పునరుద్ధరించి, అనుకూలమైన పని వాతావరణం కల్పిస్తాం. ● ఏటా జాబ్ క్యాలెండర్ విడుదల చేస్తాం, మెగా డీఎస్సీని నిర్వహిస్తాం. హామీల అమలు ఊసే లేదు.. ఉద్యోగ వర్గాలు ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న 12వ వేతన సవరణ సంఘం (పీఆర్సీ)పై ఊసే లేకపోవడాన్ని తప్పుబడుతున్నారు. 12వ పీఆర్సీ 2023 జూలై నుంచి అమలు కావాల్సి ఉండగా, 2026 జూలై పూర్తయినప్పటికీ కూటమి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంపై ఉద్యోగ, ఉపాధ్యాయులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పీఆర్సీ కమిటీని పునరుద్ధరించకపోవడం వారి అసంతృప్తికి ప్రధాన కారణంగా తెలుస్తోంది. అలాగే ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇప్పటికే నాలుగు డీఏలు పెండింగ్లో ఉన్నాయి. ఈ ఏడాది జూలై 1నుంచి ఐదవ డీఏ అమల్లోకి వచ్చింది. ఎన్నికల ముందు పెండింగ్లో ఉన్న డీఏ బకాయిలను ఆరు నెలల్లో చెల్లిస్తామని ఇచ్చిన హామీ రెండేళ్లు గడిచినా నెరవేర్చలేదు. అలాగే 2022 మే నుంచి పెండింగ్లో ఉన్న సరెండర్ లీవ్ బకాయిలను ఇంతవరకు ఇవ్వలేదని ఆయా వర్గాల వారు మండిపడుతున్నారు. ఉద్యోగుల జీవితాలతో కూటమి దగా మేనిఫెస్టో అమలులో కూటమి ప్రభుత్వం విఫలం హామీల అమలుకు కదంతొక్కనున్న ఉద్యోగ, ఉపాధ్యాయులు -
మోటారు వైర్ల చోరీలు.. రైతులు బెంబేలు
చెన్నూరు(వల్లూరు) : చెన్నూరు మండల పరిధిలోని పలు ప్రాంతాల్లో వ్యవసాయ విద్యుత్ మోటార్ల వైర్ల దొంగతనాలు ఆగడం లేదు. నెల రోజుల్లోపే వరుసగా మూడు సార్లు గుర్తు తెలియని దుండగులు చోరీ చేశారు. ఈ నెలలో ఇప్పటికే రెండు సార్లు వైర్ల దొంగతనాలు జరగగా రైతులు వాటిని తిరిగి అమర్చుకున్నారు. తాజాగా శనివారం రాత్రి చెన్నూరు గ్రామ శివారులోని పాత దళితవాడ సమీపంలోని పొలాల్లో రైతుల వ్యవసాయ మోటర్ల వైర్లు చోరీకి గురయ్యాయి. జహీరుల్లా, మస్తాన్, జవాహీద్, చింతగుంట రమణారెడ్డి అనే రైతుల వ్యవసాయ మోటార్ల వైర్లను దొంగలు కత్తిరించుకుపోయారు. ఆదివారం ఉదయం పొలాలకు నీళ్లు పెట్టడానికి వెళ్లిన రైతులు ఈ విషయాన్ని గుర్తించారు. రామనపల్లె పాతూరు పొలాల్లోని పలు వ్యవసాయ మోటార్ల వైర్లు సైతం దొంగలు కత్తిరించుకుపోయారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. కాగా రామనపల్లె గ్రామానికి చెందిన ప్రజల తాగునీటి అవసరాలు తీర్చే రెండు పంపు సెట్ల వైర్లను దొంగలు రెండవ సారి కత్తిరించుకుపోయారని రామనపల్లె గ్రామపంచాయతీ పీడీవో తెలిపారు. దీంతో ప్రజలు తాగునీటి అవసరాలకు చాలా ఇబ్బంది పడుతున్నారని పేర్కొన్నారు. దీనికి సంబంధించి ఆగస్టు 8వ తేదీన చెన్నూరు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశామని తెలిపారు. పోలీసులు నిఘా పెట్టి దొంగలను పట్టుకొని రైతులను కాపాడాలని గ్రామస్తులు వేడుకొంటున్నారు. -
బార్లో చోరీ
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో ఉన్న ఓ బార్లో చోరీ జరిగింది. సుమారు రూ.30 వేల దాకా అపహరించారని బార్ నిర్వహకులు తెలిపారు. దొంగ బార్లోని పైకప్పు రేకులు తీసి లోనికి ప్రవేశించి, చోరీ చేసినట్లు సీసీ ఫుటేజ్ ద్వారా తెలిసింది. ఈ విషయంపై ఫిర్యాదు రాలేదని, ఫిర్యాదు వస్తే విచారణ చేపడుతామని సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. లింగాల : లింగాల మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం 5 గంటల ప్రాంతంలో కత్తి రామచంద్రుడు అనే వ్యక్తి ఇంటిపై వేట కొడవళ్లతో దాడి జరిగింది. రవితేజ, నాగప్రసాద్, ప్రకాష్రెడ్డి, వెంకట చలపతితోపాటు సుమారు పది మంది వేటకొడవళ్లతో దాడి చేశారు. ఈ ఘటనలో కత్తి రామచంద్రుడు ఆయన భార్య చంద్రావతికి తీవ్ర గాయాలయ్యాయి. విషయం తెలిసిన వెంటనే ఎస్ఐ జగదీశ్వర్రెడ్డి ఘటన స్థలానికి చేరుకున్నారు. బాధితులను పులివెందుల ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. బాధితుల వద్ద స్టేట్మెంట్ రికార్డ్ చేసి కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. ఘర్షణ ఎందుకు జరిగింది అనే విషయంపై విచారణ చేస్తున్నామని ఆయన అన్నారు. కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (జీజీహెచ్)లో ఈ నెల 4వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి (50) వైద్య పరీక్షల కోసం వచ్చి ఈ నెల 11న మృతి చెందాడు. మరో వ్యక్తి (47) ఈ నెల 15వ తేదీన మధ్యాహ్నం జీజీహెచ్లో వైద్యం కోసం చేరాడు. అదే రోజున సాయంత్రం మృతి చెందాడు. ఇద్దరి మృతదేహాలను మార్చురీలో వుంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. -
పురుగుల నివారణ మందు అపహరణ
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని నానుబాలపల్లెకు చెందిన ముగ్గురు కౌలు రైతుల పొలాల వద్ద దుండగులు పురుగు నివారణ మందులు, మోటార్ వైర్లను, లైన్ వైర్లను ఎత్తుకెళ్లారు. బాధితులు తెలిపిన మేరకు శనివారం అర్ధరాత్రి జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. నానుబాలపల్లెకు చెందిన బుసగాని చంద్రశేఖర్ యాదవ్, బుసగాని చెండ్రాయుడు, మేకల నరసింహులు అనే కౌలు రైతులు ఉల్లి, మిరప, కూరగాయల పంటలను సాగు చేశారు. పొలాల వద్ద చిన్న రూములు కట్టి అందులో మోటారు వైర్లు, పురుగు మందులు నిల్వ చేసుకున్నారు. శనివారం అర్ధరాత్రి దుండగులు రైతుల రూములకున్న తాళాలను పగలగొట్టి అందులో ఉన్న పురుగు మందులు, మోటార్ వైర్లు, లైన్ వైర్లను ఎత్తుకెళ్లారు. ఉదయ పొలాల వద్దకు వెళ్లిన రైతులు రూముల తాళాలను పగలగొట్టి ఉండటం చూసి లబోదిబోమన్నారు. దుండగుల దుశ్చర్యతో ఆర్థిక నష్టంతోపాటు పొలాలకు నీరు అందని పరిస్థితి ఏర్పడిందని రైతులు వాపోతున్నారు. తన పొలం వద్ద చోరీ జరగడం ఇది రెండో సారని, నాలుగు నెలల కిందటే దొంగలు తన మోటార్ వైర్ను ఎత్తుకెళ్లారని చంద్రశేఖర్ యాదవ్ ఆవేదన వ్యక్తం చేశారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్టు బాధిత రైతులు తెలిపారు. కడప అర్బన్ : తన 8 ఏళ్ల కుమార్తైపె లైంగిక దాడికి యత్నించిన తండ్రిని అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ పోలీసులు తెలిపారు. టూ టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రెండు రోజుల క్రితం కన్న కూతురిపై తండ్రి లైంగిక దాడికి ప్రయత్నించడంతో.. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు వారు పేర్కొన్నారు. -
ఉపాధ్యాయులతో కూటమి ఆటలు
పులివెందుల రూరల్ : డీఎస్సీ అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు టీచర్లపై సస్పెన్షన్ వేటు వేశారని, ఉపాధ్యాయ మనోభావాలతో కూటమి సర్కార్ ఆటలాడుతోందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం ఆయన భాకారాపురంలోని తన నివాసంలో ప్రజాదర్బార్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు వైఖరిపై టీచర్లు చేసే పోరాటానికి వైఎస్సార్ సీపీ మద్దతుగా ఉంటుందన్నారు. తన కొడుకు లోకేష్ డీఎస్సీలో పాల్పడిన అవి నీతి అక్రమాలను కప్పి పుచ్చుకునేందుకు సీఎం చంద్రబాబు ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాలు చేస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. అంతకుముందు పులివెందుల మున్సిపాలిటీ పరిధి లో ఉన్న విన్నవారిపల్లె గ్రామ సమీపంలోని వెల్లమ్మవారిపల్లె చెరువుకు నీరందించాలని గ్రామస్తులు ఎంపీ దృష్టికి తీసుకువచ్చారు. స్పందించిన ఆయన అధికారులతో మాట్లాడి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కోరారు. అలాగే అక్కడికొచ్చిన ప్రజల నుంచి ఎంపీ వినతులు స్వీకరించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
శాంతిభద్రతల రక్షకులకు పురస్కారాల సత్కారం
కడప అర్బన్ : జిల్లాలో పోలీసు శాఖలో విశిష్ట సేవలందించిన పోలీసు అధికారులు, సిబ్బందికి రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సేవా పతకాలను మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి అందజేశారు. స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో పతకాలను అందజేశారు. పతక గ్రహీతలను జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. ఉత్తమ సేవా పతకం : పి.రమణారెడ్డి, హెచ్సీ, మైలవరం పీఎస్ సేవా పతకాలు : 1) జి.రాజు, హెచ్సీ, బి.కోడూరు పీఎస్, 2) ఎస్.గౌస్ మొహిద్దీన్, పీసీ, చెన్నూరు పీఎస్, 3) ఎ.బాదుషా, పీసీ, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పీఎస్, 4) సి.మల్లికార్జున, ఏఆర్ పీసీ, డీఏఆర్ కడప, 5) జె.గుండప్ప రావు, ఏఆర్హెచ్సీ, డీఏఆర్ కడప. -
అంజన్న దర్శనం..భక్తుల పరవశం
చక్రాయపేట: శ్రావణ మాసం తొలి శనివారోత్సవం భక్తులతో గండి క్షేత్రం నిండుకుంది. భక్తులు ప్రశాంతంగా క్యూలైన్ లో నిలుచుని స్వామివారిని దర్శించుకొని పరవశించి పోయారు.వర్షాలు లేని కారణంగా పాపాఘ్ని నదిలో నీరు లేకపోవడంతో ఆలయ వర్గాలు భక్తుల సౌకర్యార్థం కాలువ తవ్వించడంతో భ అందులో స్నానాలు చేసి దర్శనం చేసుకున్నారు.వేంపల్లె నుంచి పెద్ద ఎత్తున భక్తులు కాలి నడకన గండికి చేరుకున్నారు.ఉదయం నుంచి కూడా భక్తుల తాకిడి కనిపించింది.ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి ఎస్ఐ శ్రీప్రియ ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు.కొందరు భక్తులు అన్నదానం ఏర్పాటు చేశారు. ఉత్సవ ఏర్పాట్లను ఆలయ అదికారి విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి,పాలక మండలి సభ్యులు పర్యవేక్షించారు.జిల్లా వైద్యారోగ్యశాఖ అదికారి నాగరాజు స్వామిని దర్శించుకున్నారు.అంజన్న మూలవర్లును ఆలయ ప్రధాన ఉపప్రధాన,ముఖ్య అర్చకులు కేసరి,రాజారమేష్,రాజగోపాలాచార్యులు రఘు స్వామిలు ప్రత్యేకంగా అలంకరించారు.భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు.రాత్రి ఏర్పాటు చేసిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరింప చేశాయి. శ్రావణ మాసం తొలిశనివారం ఆలయానికి రు.15,51,669 ఆదాయం వచ్చినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. ప్రసాదాల విక్రయం,సేవాటికెట్లు,అన్నదాన విరాళాలు, తాత్కాలిక అంగళ్లు తాత్కాలిక హుండీల ద్వారా ఈ ఆదాయం వచ్చిందన్నారు. తొలి శనివారం గండి ఆదాయం రూ.15 లక్షలు -
అవార్డులు తిరస్కరించిన ఇంజినీరింగ్ సిబ్బంది
● ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం ● అలరించిన సాంస్కృతిక కార్యక్రమాలు ● జిల్లా కేంద్రంలో ఉత్సవాల్లో పాల్గొన్న మంత్రి బీసీ జనార్దన్రెడ్డివాతావరణం జిల్లాలో శనివారం 27.2 – 36.9 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. గంటకు 9.3 కిలోమీటర్ల వేగంతో గాలులు వీచాయి. – కడప అగ్రికల్చర్. మహనీయుల త్యాగం.. నేటి తరానికి ఆదర్శనీయం – 8లో ఆదివారం శ్రీ 16 శ్రీ ఆగస్టు శ్రీ 2026కడప సెవెన్ రోడ్స్ : స్వాతంత్య దినోత్సవ వేడుకలు శనివారం వైఎస్సార్ కడప జిల్లా కేంద్రంలో ఘనంగా జరిగాయి. కడప పోలీసు పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ పతాకాన్ని ఎగురవేసి గౌరవ వందనం స్వీకరించారు. దేశభక్తి గీతాలతో విద్యార్థులు చేసిన నృత్యప్రదర్శలు అలరించాయి. జిల్లా అభివృద్ధిని వివరించేలా శకటాల ప్రదర్శన నిర్వహించారు. పెట్టుబడుల గమ్యస్థానంగా కడప అనంతరం మంత్రి మాట్లాడుతూ పెట్టుబడుల గమ్యస్థానంగా కడపను తీర్చిదిద్దేందుకు చర్యలు చేపట్టామని అన్నారు. పెట్టుబడిదారులకు ప్రోత్సాహకం అందించేందుకు ‘ఇన్వెస్ట్ కడప’ అనే జిల్లా పెట్టుబడి సౌలభ్య కేంద్రాన్ని ఏర్పాటు చేశామని, త్వరలోనే ఇది నిర్వహణలోకి రానుందన్నారు. శనివారం కడప పోలీసు పెరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. జాతీయ జెండాను ఎగురవేసి పోలీసుల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. పరేడ్ను పరిశీలించారు. అనంతరం జిల్లా ప్రజలనుద్దేశించి మాట్లాడుతూ రానున్న ఐదేళ్లలో రూ.25వేల కోట్ల పెట్టుబడులను సులభతరం చేయడం ద్వారా లక్ష మందికి ఉపాధి అవకాశాలు కల్పించడం ఇన్వెస్ట్ కడప ప్రధాన లక్ష్యమని తెలిపారు. అంతర్జాతీయ స్థాయిలో ప్రముఖ పారిశ్రామిక పెట్టుబడి కేంద్రంగా కడపను నిలబెట్టడమే ప్రభుత్వ సంకల్పమన్నారు. పెట్టుబడిదారులకు ఒకేచోట అన్ని సేవలు అందేలా ఇన్వెస్ట్ కడపను అభివృద్ధి చేస్తామన్నారు. నైట్ ల్యాండింగ్ సౌకర్యం ఉన్న విమానాశ్రయం, ముంబై– కన్యాకుమారి రైలు మార్గం, జాతీయ రహదారులు రవాణా పరంగా అనుకూలతలు కల్పిస్తున్నాయన్నారు. కృష్ణపట్నం, చైన్నె ఓడరేవులు సమీపంలోనే ఉన్నాయన్నారు. ప్రతి ఇంటి నుంచి ఒక స్టార్టప్ రావాలన్న ఉద్దేశంతో దేశంలోనే ప్రథమంగా కడపలో స్టార్టప్ కడపను ఏర్పాటు చేశామన్నారు. ఈ కేంద్రం ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉందన్నారు. దీని ద్వారా ప్రతి ఏటా 50 నుంచి 100 స్టార్టప్లను అభివృద్ధి చేసి 500లకుపైగా ప్రత్యక్ష, పరోక్ష ఉపాధి అవకాశాలను కల్పించడం, రూ.500కోట్లకుపైగా పెట్టుబడులను ఆకర్షించడం లక్ష్యాలుగా నిర్దేశించుకున్నామన్నారు. కొప్పర్తి ఎలక్ట్రానిక్ మాన్యుఫ్యాక్చరింగ్ క్లస్టర్లో పరిశ్రమలు రూపుదిద్దుకుంటున్నాయన్నారు. దీంతో ప్రత్యక్షంగా, పరోక్షంగా 2.50లక్షల మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు రానున్నాయని తెలిపారు. ఈ మెగా ఇండస్ట్రియల్ హబ్లో 6,292 ఎకరాలలో రూ.2,750.76కోట్లతో అభివృద్ధి చేసేందుకు ప్రతిపాదనలు పంపామన్నారు. జమ్మలమడుగు మండలం సున్నపురాండ్లపల్లె వద్ద రూ.2వేల కోట్లతో ఏర్పాటు కానున్న జేఎస్డబ్ల్యు నియో ఎనర్జీ ప్లాంటు ద్వారా 400 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తితోపాటు 1380మందికి ఉద్యోగ అవకాశాలు రానున్నాయని వెల్లడించారు. గాలేరు నగరి ఆయకట్టు స్థిరీకరణ, కొత్త ఆయకట్టు అభివృద్ధికి చర్యలు చేపడుతున్నామన్నారు. జీఎన్ఎస్ఎస్ ప్యాకేజీ పనులను వేగవంతం చేసి 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామన్నారు. ఎన్టీఆర్ తెలుగు గంగ ప్రాజెక్టు పరిధిలో 84వేల ఎకరాలకు సాగునీరు అందించే చర్యలు చేపట్టామన్నారు. కుందూ నది నుంచి 8టీఎంసీల నీటిని ఎత్తిపోసి 1.93లక్షల ఎకరాల ఆయకట్టును స్థిరీకరించనున్నట్లు తెలిపారు. మైదుకూరు మండలంలోని ముదిరెడ్డిపల్లె, తిప్పిరెడ్డిపల్లె చెరువులలో తెలుగు గంగ కాలువ ద్వారా నింపేందుకు రూ.8.90కోట్లతో చేపట్టిన పనులకు పరిపాలనా, సాంకేతిక అనుమతులు పూర్తి చేశామన్నారు. రాయలసీమను ఉద్యానవన కేంద్రంగా అభివృద్ధి చేసేందుకు లక్ష కోట్ల విలువైన పెట్టుబడి కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళుతున్నామన్నారు. లింగాల మండలం అరటి పంట ద్వారా జిల్లాతోపాటు రాష్ట్ర స్థూల విలువ ఆధారిత ఉత్పత్తిలో కీలక పాత్ర పోషిస్తోందన్నారు. రైతులు సాగు చేస్తున్న ఈ అరటికి దేశీయ, విదేశీ మార్కెట్లలో అధిక ఆదాయం వచ్చేలా మార్కెటింగ్ సౌకర్యాలను మెరుగుపరుస్తామన్నారు. ప్రొద్దుటూరు నుంచి ఆర్టీపీపీని కలుపుతూ, పులివెందుల నుంచి అద్దాలమర్రి హైలెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు, కమలాపురం ఆర్ఓబీ పనులు పురోగతిలో ఉన్నాయని వివరించారు. కడప నగరాన్ని అభివృద్ధి చేసేందుకు రూ.906కోట్లతో పనులకు శ్రీకారం చుట్టామన్నారు. అమృత్ 2.0 పథకం కింద బ్రహ్మం సాగర్ నుంచి కడప నగరానికి శాశ్వత తాగునీటి సరఫరా కోసం రూ.592కోట్లతో చేపట్టిన పనులు కొనసాగుతున్నాయన్నారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.38కోట్లతో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. ఉత్తమ సేవలకు సర్టిఫికెట్ల ప్రదానం : వివిధ ప్రభుత్వ శాఖలకు చెందిన 413మంది అధికారులు, ఉద్యోగ సిబ్బంది, ఎన్జీవోలు, బ్యాంకర్లు, తదితరులు చూపిన ఉత్తమ ప్రతిభను గుర్తించి మంత్రి బీసీ జనార్థన్రెడ్డి మెరిట్ సర్టిఫికెట్లను ప్రదానం చేశారు. రూ.945 కోట్ల ఆస్తుల పంపిణీ అనంతరం మంత్రి జనార్థన్రెడ్డి వివిధ ప్రభుత్వ శాఖలు అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలపై ఏర్పాటు చేసిన స్టాల్స్ను పరిశీలించారు. ఈ సందర్భంగా 92,721 మంది లబ్ధిదారులకు రూ.945కోట్ల విలువ చేసే ఆస్తులను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో కలెక్టర్ డాక్టర్శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, జాయింట్ కలెక్టర్ నిధి మీనా, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి పాల్గొన్నారు. పోలీసు పరేడ్ గ్రౌండ్లో జాతీయ జెండాకు గౌరవ వందనం చేస్తున్న మంత్రి బీసీ జనార్దన్రెడ్డి. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, ఎస్పీ షెల్యే నచికేత్ విశ్వనాథ్ అగ్నిమాపక సిబ్బంది ప్రదర్శన స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా పోలీసు పరేడ్ గ్రౌండ్లో జరిగిన వేడుకల్లో అలరించిన విద్యార్థుల సాంస్కృతిక ప్రదర్శనలు పరేడ్ను పరిశీలిస్తున్న మంత్రి హాజరైన అధికారులు, ప్రజలు తొండూరుకు చెందిన మహాత్మ జ్యోతిరావు పూలే పాఠశాల బీసీ సంక్షేమ వసతి గృహం నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమం, అలాగే కడప ట్రైబ ల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాల విద్యార్థులు, సీకే దిన్నె ఏడిఫై, కడప ముద్ర డ్యాన్స్ అకాడమి, అట్టూరు కేజీబీవీ, ఖాజీపేట కేజీబీవీ విద్యార్థులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఈ వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. కడప కార్పొరేషన్: 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కడప నగరపాలక సంస్థ కార్యాలయంలో అధికారులు ఇచ్చిన అవార్డులను ఇంజినీరింగ్ విభాగం సిబ్బంది తిరస్కరించారు. వీరు అవార్డులు తిరస్కరించడానికి అడిషనల్ కమిషనరే కారణమని తెలుస్తోంది. వివరాలిలా ఉన్నాయి. కడప కార్పొరేషన్లో స్వాతంత్య్ర దినోత్సవం రోజు 44 మందికి అవార్డులు ఇచ్చారు. వీరిలో ఇంజినీరింగ్ విభాగానికి సంబంధించిన వారు 7 మంది, ఎస్టాబ్లిష్మెంట్ సెక్షన్ నలుగురు, యూపీఏ సెక్షన్ ఇద్దరు, పబ్లిక్ హెల్త్ విభాగం 9 మంది, రెవెన్యూ విభాగం ఇద్దరు, టౌన్ప్లానింగ్ విభాగం ఇద్దరు, స్వర్ణవార్డుల నుంచి 18 మంది ఉన్నారు. కాగా ఇంజినీరింగ్ విభాగంలో పనిచేసే 28 మందికి అవార్డులు ఇవ్వాలని ఆ శాఖ సూపరింటెండెంట్ ఇంజినీర్ కమిషనర్కు సిఫారసు చేశారు. ఇందులో గండి, లింగంపల్లి వాటర్ వర్క్స్లో పనిచేసే సిబ్బంది, ఫిట్టర్లు తదితరులు ఉన్నారు. సిబ్బందిని ప్రోత్సహించడానికి సాదారణంగా ఆయా విభాగాలు ఎంతమందిని ప్రతిపాదిస్తే అంతమందికీ అవార్డులు ఇస్తుంటారు. పేర్లు ఎక్కువగా ఉంటే కమిషనర్ వారిలో ఎంతమందికి ఇవ్వాలో నిర్ణయం తీసుకుని వారి పేర్లను ఆ శాఖకు సూచిస్తారు. అయితే అవార్డులు తీసుకోవడానికి రావాలని శుక్రవారం రాత్రి అందరికీ ఫోన్లు చేసి పిలిచిన తర్వాత ఉదయం జాబితాలో కేవలం ఏడుగురి పేర్లే కనిపించడంతో ఇంజినీరింగ్ శాఖ అధికారులు షాక్ అయ్యారు. కమిషనర్తో సంబంధం లేకుండానే అడిషనల్ కమిషనర్ వారి పేర్లను తొలగించినట్లు తెలిసింది. దీంతో మనస్తాపానికి గురైన సిబ్బంది ఆ అవార్డులను తిరస్కరించారు. ప్రతిదీ తాను చెప్పినట్లు చేయాలనే అడిషనల్ కమిషనర్ వ్యవహార శైలి రాను రాను వివాదంగా మారుతోందనే విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. -
మహనీయుల త్యాగం.. యువతరానికి ఆదర్శనీయం
కడప కార్పొరేషన్ : వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా కార్యాలయంలో 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాతో కలిసి జాతీయ జెండాను ఎగురవేసి గౌరవ వందనం చేశారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఎందరో మహనీయులు, స్వాతంత్య్ర సమరయోధులు, సామాన్య ప్రజల త్యాగాల ఫలితంగానే మనకు స్వాతంత్య్రం లభించిందని తెలిపారు. మహాత్మా గాంధీ, నేతాజీ సుభాష్ చంద్రబోస్, భగత్ సింగ్, డాక్టర్ బి.ఆర్.అంబేద్కర్ వంటి మహనీయుల సేవలను, త్యాగాలను ఎప్పటికీ స్మరించుకోవాలన్నారు. దేశ ఐక్యత, సమగ్రత, శాంతి, సమానత్వం, అభివృద్ధి కోసం ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యతగా కృషి చేయాలని పిలుపునిచ్చారు. భారతదేశానికి స్వాతంత్య్రం వచ్చి 80 సంవత్సరాలు పూర్తవుతున్నా.. ఆంధ్రప్రదేశ్లో మాత్రం రెడ్ బుక్ రాజ్యాంగం నడుస్తున్న పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోందని, ప్రజాస్వామ్య విలువలను కాపాడాల్సిన ప్రభుత్వం రాజకీయ కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం బాధాకరమని అన్నారు. ప్రజల పక్షాన వైఎస్ఆర్సీపీ పోరాటం మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తవుతున్నా.. ప్రజలకు ఇచ్చిన హామీల అమలులో తీవ్ర వైఫల్యం చెందిందని, సామాన్య ప్రజలకు ఆశించిన స్థాయిలో ప్రయోజనం చేకూరలేదని విమర్శించారు. ప్రజల హక్కులను కాపాడేందుకు, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించేందుకు, అణగారిన వర్గాల గొంతుకగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నిరంతరం ప్రజల పక్షాన పోరాడుతూనే ఉంటుందని స్పష్టం చేశారు. ఈ కార్యక్రమంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, ఎస్ఏ కరిముల్లా, పార్టీ నాయకులు బీహెచ్ ఇలియాస్, శ్రీరంజన్రెడ్డి, ఎస్.వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ నాయక్, పవర్ అల్తాఫ్, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య, ఏ.నాగరాజు, అక్బర్ అలీ, షఫీ, వెంకట్రావ్, కేసీఆర్, పస్తం అంజి, రహీం, మహిళా నేతలు టీపీ వెంకట సుబ్బమ్మ, రత్నకుమారి, బి. మరియలు, క్రిష్ణవేణి పాల్గొన్నారు. వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఘనంగా స్వాతంత్య్ర దినోత్సవం జెండా ఆవిష్కరించిన జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కూటమి ప్రభుత్వం ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోందని విమర్శ -
నాటి వీరోచిత పోరాటం.. నేటి స్వేచ్ఛా భాగ్యం
కడప సెవెన్ రోడ్స్ : నాటి కడప జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, కడప కోటిరెడ్డి, సుండుపల్లె ఆదినారాయణరెడ్డి లాంటి ఎంతో మంది సమరయోధుల త్యాగాల ఫలితంగానే నేడు మనం స్వేచ్ఛా స్వాతంత్య్రాలను అనుభవిస్తున్నామని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామ గోవిందరెడ్డి అన్నారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా జిల్లా పరిషత్ కార్యాలయ ఆవరణలో జాతీయ జెండాను ఎగురవేసి వందనం సమర్పించారు. ఈ సందర్భంగా జెడ్పీ చైర్మన్ మాట్లాడుతూ దేశ స్వాతంత్య్రం కోసం బ్రిటీష్ పాలకులకు వ్యతిరేకంగా ఎన్నో ఉద్యమాలను నిర్వహించి ప్రాణాలను సైతం తృణప్రాయంగా అర్పించిన త్యాగమూర్తులను స్మరించుకోవాలన్నారు. కార్యక్రమంలో జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం, ఇతర సిబ్బంది పాల్గొన్నారు. యోగివేమన విశ్వవిద్యాలయంలో.. కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం(వైవీయూ)లో జాతీయ జెండాను వీసీ బెల్లంకొండ రాజశేఖర్ ఎగురవేశారు. అనంతరం వందేమాతరం, జనగణమన గీతాలను ఆలపించి గౌరవ వందనం స్వీకరించారు. ఈ వేడుకల్లో రిజిస్ట్రార్ పి పద్మ, ప్రిన్సిపల్ టి శ్రీనివాస్, వ్యాయామ విద్య క్రీడా శాస్త్రాల విభాగాధిపతి రామ సుబ్బారెడ్డి, ప్రొద్దుటూరు లేపాక్షి డిగ్రీ కళాశాల పురుషుల, మహిళల స్కౌట్స్, గైడ్స్ బృందం శిక్షకురాలు నజ్మా, వివిధ విభాగాల డీన్లు, ప్రొఫెసర్లు, బోధన బోధనేతర సిబ్బంది, వైవీయూ సెక్యూరిటీ బృందం తదివతరులు పాల్గొన్నారు.జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి -
యువకుడి ఆత్మహత్య
రాజంపేట : పట్టణంలోని బండ్రాళ్లవీధిలో నారాయణ రాఘవ గుప్తా(21) శనివారం ఇంటిలో ఫ్యాన్కు ఊరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. సమాచారం అందుకున్న పట్టణ పోలీసులు చేరుకొని, మృతుడి సంబంధీకులను విచారణ చేశారు. అతను బెంగళూరులో బిజినెస్ మేనెజ్మెంట్ కోర్సు చేస్తున్నట్లు తెలిసింది. కోర్సులో ఫెయిల్ కావడంతో కొంతకాలంగా మనస్తాపంతో ఉన్నట్లు కుటుంబీకులు తెలిపారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రాంతీయ వైద్యశాలకు తరలించారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. మహిళ ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : మండలంలోని బడికాయలపల్లికి చెందిన రామకృష్ణ భార్య ఎన్.సుమిత్ర(32) కడుపు నొప్పి తాళలేక శనివారం ఇంట్లో ఉన్న కల్లాపి చల్లే పౌడర్ నీళ్లలో కలిపి తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. పింఛా నదిలో పడి వ్యక్తి మృతిసుండుపల్లె : మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టు దిగువ భాగాన ఉన్న పింఛా నది మడుగు నీటిలో పడి రాగి మానుబిడికికి చెందిన ఒక వ్యక్తి మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు. శనివారం సాయంత్రం పింఛా నదిలో కొందరు చేపల వేట నిర్వహిస్తుండగా.. మండల పరిధిలోని మాచిరెడ్డిగారిపల్లె పంచాయతీ రాగిమానుబిడికికి చెందిన మూడే ప్రవీణ్నాయక్(42) అక్కడికి వెళ్లి చూస్తూ ప్రమాదవశాత్తూ జారి నది నీటిలో పడి మడుగు లోపల చిక్కుకుని మృతి చెందినట్లు తెలిపారు. పక్కనే ఉన్న చేపల వేటగాళ్లు వెంటనే తేరుకుని నీటిలో గాలించగా నీటి లోపల చిక్కుకున్న ప్రవీణ్నాయక్ను వెలుపలికి తీయగా అప్పటికే అతను మృతి చెందినట్లు గుర్తించి మృతదేహాన్ని అతని స్వగ్రామానికి తరలించారు. మృతుడి భార్య కువైట్లో ఉండగా, కుమార్తె కుమారుడు ఉన్నారు. సుండుపల్లె పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. -
16న బాలికల రగ్బీ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరలోని డాక్టర వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో ఖేలో ఇండియా అండర్ –15 బాలికల రగ్బీ టోర్నమెంట్ నిర్వహిస్తు న్నట్లు అస్మిత రగ్బీ లీగ్ టోర్నీ ఆర్గనైజర్ పోలంకి గణేష్బాబు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. తాము ఇచ్చిన లింకులో రిజిస్టర్ అయినా వారందరూ పాల్గొన్నవచ్చన్నారు. స్కూల్ పిల్లలే కాక అండర్–15 బాలికల కేటగిరిలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా ఈ లింకులో రిజిస్టర్ చేసుకొని టోర్నీలో పాల్గొనవచ్చని తెలిపారు. ఇందుఓ గెలిచిన వారికి పతకాలు ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు మొబైల్ 82970 59998 నంబర్లో సంప్రదించాలన్నారు. దరఖాస్తు గడువు పొడిగింపు కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం జర్నలిజం అండ్ మాస్ కమ్యూనికేషన్ విభాగం అందించే పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీ డీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీ డీటీజే) కోర్సుల్లో ప్రవేశ దరఖాస్తు గడువును సెప్టెంబర్ 11వ తేదీ వరకు పొడిగించినట్లు విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు ఆచార్య వి రామకృష్ణ తెలిపారు. ఏడాది కాలంగా ఈ కోర్సుల్లో రెండు సెమిస్టర్లు ఉంటాయన్నారు. రెగ్యులర్ విధానంలో సాయంత్రం నిర్వహించే ఈ కోర్సుల్లో ప్రవేశానికి విద్యార్థులతో పాటు, జర్నలిజం ప్రొఫెషన్లో ఉన్నవారు, ప్రభుత్వ ప్రైవేటు ఉద్యోగులు కూడా అర్హులన్నారు. డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలన్నారు. మరిన్ని వివరాలకు విశ్వవిద్యాలయంలోని ప్రవేశాల సంచాలకుల కార్యాలయం లేదా 8008006630, 95420 67303 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు.టీటీడీ ఆలయ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో మూలవిరాట్లను సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉరుసు పోస్టర్ల ఆవిష్కరణ చౌడేపల్లె: అన్నమయ్యజిల్లాదాదేపల్లెలోని హజ్రత్ సయ్యద్ పీర్ మషాయఖ్ బహదూర్ అలీషా బాబా దర్గాలో ఈనెల16,17,18 తేదీల్లో ఉరుసు మహోత్సవం నిర్వహిస్తున్నట్లు ముస్లిం మత పెద్దలు తెలిపారు. శనివారం తిరుపతిలోని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డిరామచంద్రారెడ్డి నివాసంలో ఎమ్మెల్యేపాటు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డితో కలిసి పోస్టర్లను ఆవిష్కరించారు. అంతకుముందు ఉరుసుకు కుటుంబ సమేతంగా రావాలని పెద్దిరెడ్డికి ఆహ్వానపత్రిక అందజేశారు. -
స్వాతంత్య్ర స్ఫూర్తి.. ఉప్పొంగిన దేశభక్తి
● అలరించిన సాంస్కృతిక నృత్యాలు ● ఆకట్టుకున్న శకటాల ప్రదర్శనకడప సెవెన్ రోడ్స్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు అంబరాన్నంటాయి. మువ్వన్నెల పతాక సాక్షిగా ప్రతి గుండెలోనూ ’స్వాతంత్య్ర’ స్ఫూర్తి రగిలింది, దేశభక్తి ఉప్పొంగింది. ఈ పండుగ వేళ నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు వీక్షకులను మంత్రముగ్ధులను చేశాయి. భిన్నత్వంలో ఏకత్వాన్ని చాటుతూ విద్యార్థులు ప్రదర్శించిన నృత్య రూపకాలు భారతీయ సంస్కృతీ సంప్రదాయాల వైభవాన్ని కళ్లకు కట్టాయి. జిల్లా కేంద్రంలో శనివారం కనుల పండువగా సాగిన ఈ వేడుకలకు పోలీస్ పరేడ్ మైదానం వేదికై ంది. ఇందులో నిర్వహించిన సాంస్కృతిక ప్రదర్శనలు, నృత్యాలు, వివిధ కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. శకటాలు వ్యవసాయం, పశుసంవర్ధక, డీఆర్డీఏ, డ్వామా – జలవనరులు, పాఠశాల విద్య – సమగ్ర శిక్ష, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవెలప్మెంట్, అటవీ శాఖ, ఐసీడీఎస్, మున్సిపల్ కార్పొరేషన్, వైద్య, ఆరోగ్యం, 108, 104, ఏపీఎస్పీడీసీఎల్, పోలీసు వజ్ర, నేత్ర, విపత్తుల స్పందన, అగ్నిమాపక సేవల శాఖలు నిర్వహించిన శకటాల ప్రదర్శన ఆకట్టుకుంది. ఇందులో జెడ్పీ (స్మార్ట్ కిచెన్) శకటానికి మొదటి బహుమతి, వైద్య ఆరోగ్య శాఖకు ద్వితీయ బహుమతి, డీఆర్డీఏకు తృతీయ బహుమతి, కడప నగర పాలక సంస్థకు నాల్గవ బహుమతులు లభించాయి. పోలీసు శాఖకు సంబంధించి ఎన్సీసీ విభాగానికి ప్రథమ బహుమతి, స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగానికి ద్వితీయ బహుమతి, ఏఆర్ఫస్ట్ ప్లాటర్న్కు తృతీయ బహుమతి లభించాయి. జిల్లా పోలీస్ శాఖ స్టాల్ జిల్లా పోలీస్ శాఖ ఏర్పాటు చేసిన స్టాల్ సందర్శకులను విశేషంగా ఆకట్టుకుంది. రాష్ట్ర రోడ్లు, భవనాలు, మౌలిక సదుపాయాలు, పెట్టుబడుల శాఖ మంత్రి బి.సి.జనార్ధన్రెడ్డి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్లతో కలిసి సైబర్ నేరాలపై అవగాహన కల్పించే పోస్టర్లను ఆవిష్కరించారు. జిల్లా ఎస్పీ షెల్కె నచికేత్ విశ్వనాథ్ పోలీస్ శాఖ అందిస్తున్న వివిధ సేవలను మంత్రికి వివరించారు. శక్తి బృందాలు, సైబర్ నేరాలు, డయల్–112, గృహ భద్రత పర్యవేక్షణ వ్యవస్థలపై పోలీస్ అధికారులు సందర్శకులకు అవగాహన కల్పించారు. -
● ప్రతిభకు ప్రశంస
దేశ 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు జిల్లా కేంద్రమైన కడపలోని పోలీస్ పరేడ్ మైదానంలో అట్టహాసంగా జరిగాయి. ఈ సందర్భంగా ప్రజలకు నిరంతరం సేవలందిస్తూ, విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పలువురు ప్రభుత్వ అధికారులు, సిబ్బందిని ప్రభుత్వం ఘనంగా సత్కరించింది. జిల్లా, మండల స్థాయి అధికారులతోపాటు క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండే గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు, కార్యాలయాల సిబ్బందికి మంత్రి బీసీ జనార్థన్రెడ్డి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి చేతుల మీదుగా ప్రశంసా పత్రాలు, అవార్డులను అందజేశారు. – కడప సెవెన్ రోడ్స్ -
జంట హత్యల కేసు ఛేధన
సుండుపల్లె : సుండుపల్లె మండలం మడితాడు గ్రామ పంచాయతీ కృష్ణారెడ్డి చెరువు వద్ద గత నెల 22న జరిగిన ఇద్దరి మృతి కేసును పోలీసులు ఛేదించారు. చిన్నగొల్లపలోలికు చెందిన అబ్బన్నగారి జయరాం (44), రెడ్డిచెర్ల రవీంద్ర(45)లను వాహనంతో ఢీకొట్టి హత్య చేసి, ఘటనను రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించేందుకు నిందితులు ప్రయత్నించినట్లు దర్యాప్తులో తేలిందని సుండుపల్లె సీఐ సురేష్రెడ్డి, ఎస్ఐ మహేష్ తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. రవీంద్ర కుటుంబానికి, ప్రధాన నిందితుడు రెడ్డిచెర్ల శివశంకర్ కుటుంబానికి ఇంటి స్థలానికి సంబంధించి కొంతకాలంగా వివాదం ఉంది. ఈ నేపథ్యంలో రవీంద్రను హత్య చేయాలని శివశంకర్ తన స్నేహితులతో కలిసి పథకం రూపొందించినట్లు పోలీసులు గుర్తించారు. పథకం ప్రకారం అశోక్ లేలాండ్ బడా దోస్త్ వాహనంతో జయరాం, రవీంద్రలను ఢీకొట్టి హత్య చేసినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తులో సేకరించిన శాసీ్త్రయ, సాంకేతిక ఆధారాలతో నిందితులను గుర్తించారు. పోలీసుల దర్యాప్తు వేగవంతం కావడంతో యెరికల శివప్రసాద్ (29), వాక శరణ్రాజ్ అలియాస్ చరణ్(30) శనివారం ఉదయం వీఆర్ఓ సమక్షంలో లొంగిపోయారు. అనంతరం వారిని సుండుపల్లె పోలీసులు అరెస్టు చేశారు. ఈ కేసులో ప్రధాన సూత్రధారి రెడ్డిచెర్ల శివశంకర్తో పాటు సానిపాయికి చెందిన మరో వ్యక్తి పరారీలో ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నిందితుల నుంచి అశోక్లేలాండ్ బడా దోస్త్ వాహనం (ఏపీ39 డబ్ల్యుకె 935), సుజుకి యాక్సెస్ ద్విచక్రవాహనం (ఏపీ39 జియు2581) స్వాధీనం చేసుకున్నారు. నిందితులను న్యాయస్థానం ముందు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. కేసులో తదుపరి దర్యాప్తు కొనసాగుతోంది. -
జెండా పండుగకు వేళాయె
శనివారం శ్రీ 15 శ్రీ ఆగస్టు శ్రీ 202680వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేసింది. వేడుకలకు వేదిక అయిన పోలీస్ పేరెడ్ గ్రౌండ్స్ను అందంగా ముస్తాబు చేశారు. విద్యుత్ దీపాలతో వేదికను అలంకరించారు. స్వాతంత్య్ర సమరయోధులు, ఇతర అతిథులు కూర్చొనేందుకు వీలుగా కుర్చీలు, బారీ కేడింగ్, వాహనాల పార్కింగ్, తాగునీరు, స్టాల్స్వంటి ఏర్పాట్లు పూర్తయ్యాయి. – కడప సెవెన్ రోడ్స్ ఉదయం 8.45గంటలకు : పెరేడ్ కంటింజెంట్స్ పొజిషన్ 8.52గంటలకు : ఎస్పీ జనరల్ సెల్యూట్ స్వీకరణ 8.55 : కలెక్టర్ జనరల్ సెల్యూట్ స్వీకరణ 8.58 : మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి వేదిక వద్దకు చేరుకుంటారు. 9 : జాతీయ పతాకాన్ని ఎగురవేసి రాష్ట్రీయ సెల్యూట్ స్వీకరిస్తారు 9.05 : పరేడ్ను తిలకిస్తారు 9.15 : జిల్లా ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తారు 9.45 : పెరేడ్ మార్చింగ్ నిర్వహిస్తారు 9.50 : స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను సత్కరిస్తారు 10.30 : సాంస్కృతిక కార్యక్రమాలు, పోలీసు డాగ్ స్క్వాడ్, పోలీసు డెమో, అగ్నిమాపక దళ విన్యాసాలు ఉంటాయి 10.55 : సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న వారు, ఎన్సీసీ, స్కౌట్స్ ఫొటోషూట్ ఉంటుంది. 11.05 : మెరిట్ సర్టిఫికెట్ల ప్రదానం జరుగుతుంది 11.55 : మంత్రి స్టాల్స్ను సందర్శిస్తారు 12.55 : జాతీయ గీతంతో కార్యక్రమం ముగుస్తుంది -
రహదారుల పురోగతిపై మంత్రుల సమీక్ష
పులివెందుల రూరల్ : పులివెందులలోని ఆర్అండ్బీ అతిథి గృహంలో రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత శుక్రవారం రహదారుల పురోగతిపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉమ్మడి వైఎస్ఆర్ కడప జిల్లాలో రూ.182.74 కోట్లతో 586 కిలోమీటర్ల మేర రోడ్ల అభివృద్ధి పనులు చేపట్టడం జరిగిందన్నారు. రూ.10.55 కోట్లతో పులివెందుల నియోజకవర్గ పరిధిలో రోడ్లు అభివృద్ధి చేసినట్లు పేర్కొన్నారు. పెండింగ్ పనులు వేగవంతం చేయాలని సంబంధిత అధికారులను సూచించారు. జాతీయ రహదారులకు సంబంధించి భూసేకరణ పనులు వేగవంతం చేయాలని ఆదేశించారు. కార్యక్రమంలో ఆర్అండ్ బీ అధికారులు, తదితరులు పాల్గొన్నారు. గండి అంజన్న సేవలో.. గండి వీరాంజనేయ స్వామిని రాష్ట్ర రోడ్లు భవనాల శాఖ మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి దర్శించుకున్నారు. ఆయన వెంట టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి, పులివెందుల నియోజకవర్గ ఇన్చార్జ్ బీటెక్ రవి, జనసేన నేత డాక్టర్ రవితోపాటు వేంపల్లె, చక్రాయపేట మండలాలకు చెందిన పలువురు నాయకులు, ఆలయ పాలకమండలి సభ్యులు ఉన్నారు. -
నియామకం
వేంపల్లె : యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా మారం శ్రీకాంత్రెడ్డి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. శుక్రవారం వేంపల్లె మండలం నందిపల్లె గ్రామానికి చెందిన శ్రీ నందీశ్వరాలయ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ కోఆర్డినేటర్గా ఉన్న మారం శ్రీకాంత్ రెడ్డిని యోగా స్పోర్ట్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసినట్లు ఏపీ రాష్ట్ర యోగా స్పోర్ట్స్ కార్యదర్శి అవినాష్శెట్టి నియామక పత్రం అందజేశారు. ఒంటిమిట్ట : మండల పరిధిలోని మలకాటిపల్లి గ్రామానికి చెందిన సిరాల కృష్ణయ్య(70) రోడ్డు ప్రమాదంలో గాయపడి శుక్రవారం ఇంటి దగ్గర తీవ్ర అనారోగ్యంలో మృతి చెందినట్లు ఒంటిమిట్ట పోలీసులు తెలిపారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. గత నెల 6వ తేదీన సిరాల కృష్ణయ్య ఆటోలో కడప వైపు వెళ్తుండగా వెనుక వైపు నుంచి లారీ ఢీ కొట్టిన ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, కోలుకోలేక అనారోగ్యంతో శుక్రవారం ఇంటి దగ్గర మృతి చెందినట్లు ఒంటిమిట్ట పోలీసులు తెలిపారు. -
అదృశ్యమైన విద్యార్థి అప్పగింత
ప్రొద్దుటూరు క్రైం : టీచర్ మందలించడంతో పాఠశాల నుంచి ఎవరికీ చెప్పకుండా బయటికి వెళ్లిపోయిన ఏడో తరగతి విద్యార్థిని ప్రొద్దుటూరు రూరల్ పోలీసులు కేవలం రెండు గంటల్లోనే గుర్తించి తల్లిదండ్రులకు అప్పగించారు. చాపాడు మండలంలోని రామదాసుపురానికి చెందిన పేట ఆకాష్ టీచర్స్ కాలనీలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో ఏడో తరగతి చదువుతున్నాడు. సోమవారం ఓ సబ్జెక్ట్ విషయంలో టీచర్ మందలించడంతో మనస్తాపానికి గురై.. పాఠశాల యాజమాన్యానికి, తోటి విద్యార్థులకు చెప్పకుండా మధ్యాహ్నం సమయంలో బయటికి వెళ్లిపోయాడు. భోజన విరామం తర్వాత తరగతులు ప్రారంభమైన సమయంలో ఆకాష్ కనిపించకపోవడంతో యాజమాన్యం ఆందోళనకు గురైంది. పాఠశాల ఇన్చార్జి వెంటనే ఈ విషయాన్ని రూరల్ పోలీసులకు తెలిపారు. సమాచారం అందుకున్న రూరల్ ఎస్ఐ శ్రీకాంత్ వెంటనే స్పందించి సిబ్బందితో కలిసి విద్యార్థి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. పాఠశాల పరిసర ప్రాంతాలు, విద్యార్థి వెళ్లే అవకాశం ఉన్న ప్రాంతాల్లో ముమ్మరంగా గాలించారు. ఈ క్రమంలో కేవలం రెండు గంటల వ్యవధిలోనే ఆకాష్ను గుర్తించారు. అనంతరం బాలుడిని సురక్షితంగా కుటుంబ సభ్యులు, పాఠశాల యాజమాన్యానికి అప్పగించారు. ఈ సందర్భంగా ఎస్సై శ్రీకాంత్ మాట్లాడుతూ పిల్లలు కనిపించకుండా పోయినప్పుడు తల్లిదండ్రులు, పాఠశాల యాజమాన్యాలు ఆందోళనతో సమయం వృథా చేయకుండా వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని సూచించారు. ఏదైనా ఘటన జరిగిన వెంటనే పోలీసులకు సమాచారం అందిస్తే, వేగంగా స్పందించి గాలింపు చర్యలు చేపట్టడం ద్వారా సమస్యను త్వరగా పరిష్కరించే అవకాశం ఉంటుందని తెలిపారు. -
రిహార్స్ల్ను పరిశీలించిన అడిషనల్ ఎస్పీ
కడప కోటిరెడ్డి సర్కిల్ : స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా కట్టుదిట్టమైన భదత్రా ఏర్పాట్లు చేశామని అడిషనల్ ఎస్పీ(అడ్మిన్) కె.ప్రకాష్బాబు, ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్యలు తెలిపారు. శుక్రవారం జిల్లా పోలీసు కార్యాలయంలోని పోలీసు పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల రిహార్సల్స్ను నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలకు ప్రముఖులు హాజరవుతున్న నేపథ్యంలో ఎలాంటి సంఘటనలు చోటు చేసుకోకుండా పోలీసులు అప్రమత్తంగా ఉండాలన్నారు. పోలీసు జాగిలాలు గ్రౌండ్లో చేసి న విన్యాసాలు చూపరులను ఆకట్టుకున్నాయి. కార్యక్రమంలో పెరేడ్ కమాండర్స్, ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, ఆర్ఎస్ఐ కె.వెంకటేశ్వర్లు పెరేడ్లో మార్చింగ్ నిర్వహించారు. ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, పెద్దయ్య, టైటస్, సివిల్, ఏఆర్, పోలీసు, హోంగార్డులు, ఎన్సీసీ, స్కౌట్స్ విద్యార్థులు పాల్గొన్నారు. -
నేడు గండిలో శ్రావణ తొలి శనివారోత్సవం
చక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రమైన గండిలో శ్రావణ మాస ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. నేడు తొలి శ్రావణ మాస శనివారోత్సవం జరుగనుంది. ఇందుకోసం ఆలయ ప్రాంగణాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఆవరణలో పలు దేవతా మూర్తుల డిజిటల్ కటౌట్లు ఏర్పాటు చేశారు. రాత్రి పూట విద్యుద్దీపాలంకరణతో గండి దేదీప్యమానంగా వెలిగి పోతోంది. రాత్రి బస చేయు భక్తుల కాలక్షేప నిమిత్తం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా క్యూలైన్లు, తాగునీరు వంటి ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. వీఐపీ పాసులను పూర్తిగా రద్దు చేసినట్లు చెప్పారు. ప్రత్యేక అలంకరణ మూలవర్లుకు ప్రత్యేక పూల అలంకరణ చేస్తున్నట్లు ఆలయ ప్రధాన ఉపప్రధాన అర్చకులు కేసరి, రాజారమేష్, ముఖ్య అర్చకులు రాజగోపాలాచార్యులు తెలిపారు. శ్రావణ శనివారాల్లో ఎలాంటి అభిషేకాలు, వాహన పూజలు ఉండవని చెప్పారు. తెల్లవారుజామున 3.30 నుంచి 4 వరకు సుప్రభాతం, 4 నుంచి 4.30 వరకు అభిషేకం, 4.30 నుంచి 5 వరకు అలంకరణ, అనంతరం భక్తులకు స్వామి దర్శనం ఉంటుందని వారు తెలిపారు. మధ్యాహ్నం 12.30, సాయంత్రం 7కు మహానైవేద్యం, మహామంగళ హారతి, తీర్థ ప్రసాద వినియోగ కార్యక్రమాలు ఉంటాయని వారు వివరించారు. రాయచోటి టౌన్ : ఇద్దరు బైకు దొంగలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఏడు బైకులను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతి కలిసి డీఎస్పీ ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో వివరాలు వెల్లడించారు. గాలివీడు మండలం తూముకుంటకు చెందిన మావిళ్ల వీరారెడ్డి అలియాస్ వీరారెడ్డి నాయుడు, కోటకొండ ఆంజనేయులు అలియాస్ రామాంజులు అలియాస్ గుండు అనే ఇద్దరు అన్నమయ్య జిల్లా, వైఎస్సార్ కడప జిల్లా, అనంతపురం జిల్లాలో బైకులు దొంగలించినట్లు వేర్వేరుగా కేసులు నమోదు అయ్యాయని తెలిపారు. వీరారెడ్డిపై గతంలో ఇలాంటి బైకు దొంగతనాల కేసులు 37 నమోదు అయినట్లు తెలిపారు. ఈ నేరాలపై జైలుకు వెళ్లి ఆరు నెలల క్రితం బయటికి వచ్చిన తరువాత మళ్లీ కోటకొండ రామాంజనేయులుతో కలసి బైకు దొంగతనాలకు పాల్పడ్డారని తెలిపారు. వీరిని శుక్రవారం అరెస్టు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు చెప్పారు. -
ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించాలి
జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరికడప సెవెన్ రోడ్స్ : మనం ఒక మొక్క నాటితే.. భావితరాలకు ఒక మంచి భవిష్యత్తును అందించినట్లేనని..పచ్చదనం పెంపొందించడంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు.80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల సందర్భంగా శుక్రవారం జిల్లా అటవీశాఖ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టరేట్ ప్రాంగణంలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ స్వచ్ఛమైన గాలి, ఆరోగ్యకరమైన జీవనం, భావితరాలకు సురక్షితమైన పర్యావరణాన్ని అందించాలంటే ప్రతి ఒక్కరూ మొక్కలు నాటాలని, వాటిని సంరక్షించడాన్ని సామాజిక బాధ్యతగా స్వీకరించాలని తెలిపారు. అంతకుముందు జిల్లా కలెక్టర్ ఛాంబర్లో జిల్లా అటవీ శాఖ ఆధ్వర్యంలో అందుబాటులో ఉన్న నర్సరీల వివరాలను పొందుపరచిన కరపత్రాలను జిల్లా కలెక్టర్, జేసీ, డీఎఫ్ఓ, డీఆర్వో ఆవిష్కరించారు.కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ నిధి మీనా, జిల్లా అటవీ అధికారి రాజశేఖర్ బాబు, డీఆర్వో మల్లికార్జునుడు, కలెక్టరేట్ ఏవో నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
జమ్మలమడుగు : అక్రమ కేసులు పెడితే భయపడేదని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో ఆ పార్టీ నాయకులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అధికార పార్టీకి చెందిన కూటమి నేతలు రోడ్డును బ్లాక్ చేసి సూపర్ సిక్స్– సూపర్ సక్సెస్ పేరుతో గంటల తరబడి మీటింగ్ నిర్వహించి ప్రజలకు, వాహనదారులకు తీవ్ర ఇబ్బందులు కలిగించినా వారిపై ఎటువంటి కేసులు లేవన్నారు. ప్రజల, యువత హక్కులపై పోరాటం చేస్తూ ర్యాలీ చేస్తే పోలీసులు తమపై అక్రమ కేసులు పెట్టడం ఏమిటని ప్రశ్నించారు. రాష్ట్రంలో డీఎస్సీ ఉద్యోగాల నియామకాల్లో అక్రమాలు జరిగాయని ఆరోపించారు. ఫీజురీయింబర్స్మెంట్ ఇవ్వడకపోవడంతో విద్యార్థులు ఫీజులు కట్టలేక ఇంటికి వచ్చేస్తున్నారన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా రిలే నిరాహార దీక్షలతోపాటు నిరసన ర్యాలీలు నిర్వహించడం జరిగిందన్నారు. అందులో భాగంగా ఈ ర్యాలీలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పాల్గొన్నారని పేర్కొన్నారు. అయితే కూటమి నాయకులైన ఆదినారాయణరెడ్డి, భూపేష్రెడ్డి ప్రోద్బలంతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు తమ కుటుంబంలోని వారందరిపై, స్థానిక నాయకులతోపాటు అదనంగా మరో 400 మందిపై పోలీసులు కేసులు పెట్టి భయపెట్టే ప్రయత్నం చేస్తారా అంటూ ప్రశ్నించారు. ఇంకా రెట్టింపు ఉత్సాహంతో ప్రభుత్వంపై పోరాటం చేయడం జరుగుతుందన్నారు. తమ పార్టీ కార్యకర్తలను వచ్చే ఎన్నికల్లో భయపెట్టి ఇబ్బందులు పెట్టే ప్రయత్నం చేయాలనుకుంటే పోరాపాటే అన్నారు. ప్రతి ఎన్నికల్లో పోటీలో ఉంటామని పేర్కొన్నారు. ఈ కార్యాక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, మున్సిపల్ విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, హనుమంతరెడ్డి, పెద్దదండ్లూరు హనుమంతరెడ్డి, మైనార్టీ నాయకులు ముల్లాజానీ, ఫయాజ్బాషా, గౌరీనాథ్రావు, రాఘవేంద్రారెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి పాల్గొన్నారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తే కేసులా? పోలీసుల తీరుపై ఎమ్మెల్సీ మండిపాటు -
బీఎస్ఎన్ఎల్ ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : వినియోగదారులు బీఎస్ఎన్ఎల్ అందిస్తున్న ఆఫర్లు సద్వినియోగం చేసుకోవాలని బీఎస్ఎన్ఎల్ డిప్యూటీ జనరల్ మేనేజర్ చంద్రశేఖరన్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని బీఎస్ఎన్ఎల్ ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడారు. 80వ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా బీఎస్ఎన్ఎల్ పరిమిత కాలానికి కేవలం 1 రూపాయి ఫ్రీడం ప్లాన్ ప్రారంభించిందన్నారు. ఇందులో రోజుకు 1 జీబీ హై–స్పీడ్ డేటాతోపాటు 24 రోజుల పాటు ఉచిత అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ ఉంటుందన్నారు. పీవీ2399 వార్షిక ప్లాన్లో భాగంగా బాగా ప్రాచుర్యం పొందిన బీఎస్ఎన్ఎల్ వార్షిక ప్లాన్కు అదనంగా 47 రోజుల వ్యాలిడిటీ అందిస్తున్నట్లు పేర్కొన్నారు. దీంతో మొత్తం వ్యాలిడిటీ 412 రోజులకు పెరుగుతుందన్నారు. రోజుకు 2 జీబీ హై–స్పీడ్ డేటా, అన్లిమిటెడ్ వాయిస్ కాలింగ్ లభిస్తాయన్నారు. ఈ ప్రత్యేక ఆఫర్లు ఆగస్టు 12 నుంచి సెప్టెంబర్ 12 వరకు అందుబాటులో ఉంటాయన్నారు. అదే విధంగా బీఎస్ఎన్ఎల్ ఎఫ్టీటీహెచ్ సేవల ద్వారా అందించే హై–స్పీడ్ ఇంటర్నెట్ కనెక్టివిటీ జిల్లాలోని అన్ని మండలాల్లో విస్తరించినట్లు పేర్కొన్నారు. అందులో భాగంగా పైబర్ బేసిక్ ప్లాన్ కొత్త వినియోగదారులకు మొదటి నెల పూర్తిగా ఉచితమన్నారు. తదుపరి 3 నెలలకు నెలకు రూ.399, ఆ తరువాత నెలకు రూ.499 చొప్పున చార్జీ ఉంటుందన్నారు. ఈ ప్రత్యేక ప్రారంభ ఆఫర్ ఈ నెల 1 నుంచి 90 రోజుల పాటు చెల్లుబాటులో ఉంటుందని వివరించారు. -
జిఎఫ్సీ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి
రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఒకేషనల్ కోర్సుకు సంబంధించి జనరల్ ఫౌండేషన్ కోర్సు (జీఎఫ్సీ) సబ్జెక్టును గెస్ట్ ఫ్యాకల్టీ పద్ధతిలో బోధించేందుకు అర్హులైన అభ్యర్థులు ఈనెల 17వ తేదీలోగా కార్యాలయ పనిదినాల్లో దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ రామాంజనేయులు శుక్రవారం పేర్కొన్నారు. ఎంఏ రూరల్ డెవలప్మెంట్, ఎంఏ ఎకనామిక్స్, అగ్రికల్చర్ ఎకనామిక్స్, అప్లైడ్ ఎకనామిక్స్, ఎకనామిక్స్ సబ్జెక్టులలో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులన్నారు. దరఖాస్తు చేసుకున్న వారికి ఈనెల 18వ తేదీ ఉదయం 11 గంటలకు ఇంటర్వ్యూ ఉంటుందన్నారు.అభ్యర్థులు తమవెంట విద్యార్హతకు సంబంధించిన ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకురావాలని తెలిపారు. ఆలస్యంగా నడిచిన ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రాజంపేట: జిల్లాలో ఏపీ సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్ రైలు శుక్రవారం ఆలస్యంగా నడిచింది. నందలూరు–రేణిగుంట మార్గంలోని మామండూరు రైల్వేస్టేఃన్ సమీపంలో రైలు ఫార్మిసిన్లోని ఎస్1 బోగీలో చక్రాల వద్ద పొగ వచ్చింది. ప్రయాణికులు ఇటీవల రైల్వేలో జరుగుతున్న ఫైర్ సంఘటనలతో ఆందోళన చెందారు.బ్రేక్బైడింగ్ కావడంతో సాంకేతిక సమస్య తలెత్తిన క్రమంలో పొగ వచ్చింది. పొగ వల్ల ఎటువంటి ప్రమాదం లేకపోయినా సిబ్బంది అప్రమత్తయ్యారు. సమస్యను పరిష్కరించారు. అనంతరం రైలును కదలించారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. డిగ్రీ పరీక్ష ఫలితాలు విడుదల కడప ఎడ్యుకేషన్: కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల (స్వయంప్రతిపత్తి)కు సంబంధించిన డిగ్రీ ప్రథమ సంవత్సరం ద్వితీయ సెమిస్టర్ పరీక్ష ఫలితాలను కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్. స్మిత, పరీక్షల నియంత్రణాధికారి డా. ప్రకాశ్ నారాయణ రెడ్డి శుక్రవారం విడుదల చేశారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ ద్వితీయ సెమిస్టర్ పరీక్షలు 655 మంది రాయగా వారిలో 556 మంది అన్ని సబ్జెక్టుల్లో ఉత్తీర్ణత సాధించారని, 85 శాతం సగటు ఉత్తీర్ణత నమోదైందని తెలిపారు. విద్యార్థులు తమ వ్యక్తిగత ఫలితాలను కళాశాల పరీక్షల వెబ్సైట్ skrgcwaexams.inలో లాగిన్ అయి తెలుసుకోవచ్చని ప్రిన్సిపాల్ తెలిపారు. 17న ఈశ్వరీదేవి జయంత్యుత్సవం బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రభోదకర్త జగద్గురు శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మనుమరాలు శ్రీ ఈశ్వరీదేవి జయంత్యుత్సవం ఈ నెల 17న జరగనుంది. ఇందుకోసం ఈశ్వరీదేవి మఠం నిర్వాహకులు ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం తెల్లవారుజామున నుంచి సుప్రభాత సేవ, కలశతీర్థం, అభిషేకం, కుంకుమార్చన, హోమాలు నిర్వహించనున్నారు. అనంతరం అష్టోత్తర(108) కలశాలతో భక్తజనం ఊరేగింపుగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠం వరకు వెళ్లి, పూజలు జరుపుతారు. సాయంత్రం సహస్రదీపాలంకరణ సేవ ఉంటుంది. రాత్రి ఊయలసేవ, గ్రామోత్సవం ఉంటాయి.ఈ కార్యక్రమాలను శ్రీ మఠాధిపతులు వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో మఠం సిబ్బంది నిర్వహించనున్నారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొనాలని నిర్వాహకులు కోరారు. తపాలాశాఖ ప్రత్యేక సేవలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాఖీ పౌర్ణమి సందర్భంగా విదేశాల్లో ఉన్న సోదరులు, బంధువులు, ఆత్మీయులకు రాఖీలు, బహుమతులు పంపేందుకు భారత తపాలా శాఖ అంతర్జాతీయ పార్సిల్, ఇంటర్నేషనల్ స్పీడ్ పోస్ట్ సేవలను అందుబాటులోకి తెచ్చిందని కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ జి. రాజేష్ తెలిపారు. శుక్రవారం కడపలోని పోస్టల్ ప్రధాన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఈ నెల 28న రాఖీ పౌర్ణమి జరుపుకోనున్న నేపథ్యంలో ప్రజలు తమ ఆత్మీయులకు రాఖీలు, బహుమతులు, నిబంధనల ప్రకారం అనుమతించిన వస్తువులను విదేశాలకు పంపించుకోవచ్చన్నారు. గ్రామీణ ప్రాంత ప్రజలు తమ సమీపంలోని బ్రాంచ్ పోస్టాఫీసు ద్వారా కూడా విదేశాలకు రాఖీలు, బహుమతులు పంపించుకునే సౌకర్యం ఉందన్నారు. -
మహిళా విభాగం మరింత బలోపేతం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగాన్ని అత్యంత శక్తివంతంగా తయారు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి సూచించారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డితో కలిసి మహిళా విభాగం జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో మహిళలకు అధిక ప్రాధాన్యత కల్పించడం జరిగిందని, వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక నవరత్న పథకాలన్నీ మహిళల పేరు మీదనే ఇచ్చారని గుర్తు చేశారు. నామినేటెడ్ పదవుల్లో, పనుల్లో మహిళలకు 50 శాతం రిజర్వేషన్ కల్పించిన ఘనత ఒక్క వైఎస్ జగన్కే దక్కుతుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంత్రివర్గంలో కూడా సగం మందిని మహిళలను తీసుకున్నారని, అత్యంత కీలకమైన హోం శాఖ మహిళకే కేటాయించారన్నారు. మహిళల రక్షణ, భద్రత కోసం దిశ చట్టాన్ని తీసుకొచ్చారన్నారు. పార్టీ బలోపేతంలో మహిళల పాత్ర ఎంతో కీలకమని, మహిళా నాయకులు, కార్యకర్తలకు సముచిత ప్రాధాన్యత కల్పిస్తూ, పార్టీ కార్యక్రమాల్లో వారిని మరింత చురుకుగా భాగస్వాములను చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతామన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలకు రక్షణ లేకుండా పోయిందని, టీడీపీ నాయకులే మహిళలపై దాడులు చేస్తూ, అఘాయిత్యాలకు పాల్పడుతున్నారన్నారు. ప్రభుత్వం చేస్తున్న మహిళా వ్యతిరేక చర్యలను ప్రజల్లోకి తీసుకుపోవాలన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి మాట్లాడుతూ మహిళలు సాధికారత సాధించాలని, మహిళా విభాగం శక్తివంతమై రాష్ట్రానికి ఆదర్శప్రాయంగా నిలవాలన్నారు. గెలుపు, ఓటములు ఎలా ఉన్నా ఎన్నికల్లో మనం చేసే యుద్ధం చాలా గొప్పగా ఉండాలన్నారు. మహిళలు పదవులు పొందడంతోపాటు పురుషులపై ఆధారపడకుండా స్వేచ్ఛగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. సందర్భోచితంగా, వేగంగా నిర్ణయాలు తీసుకోగలగాలని సూచించారు. వైఎస్సార్సీపీని గెలిపించాలన్నా, ప్రజలను చైతన్యం చేయాలన్నా, ప్రభుత్వ వ్యతిరేక విధానాలు అందరికీ తెలియజేయాలన్నా అది మహిళలకే సాధ్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు బండి దీప్తి, రమీజా, మల్లీశ్వరి, శ్రీదేవి, తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
సమర శంఖారావం.. స్వాతంత్య్రానికి స్ఫూర్తి దీపం
● బ్రిటిష్ సామ్రాజ్యాన్ని గండ్రగొడ్డలిలా తాకిన ‘నేల ఉప్పు’ విప్లవం! ● కోవెలకుంట్ల కదనరంగంలో కత్తి పట్టిన వీరనరసింహుడి సాయుధ తిరుగుబాటు ● బాపూజీ పిలుపుతో ఉవ్వెత్తున ఎగసిన శాసన ఉల్లంఘన పోరాట పతాకం కడప సెవెన్ రోడ్స్: భారత స్వాతంత్య్ర సంగ్రామ చరిత్రలో ఉమ్మడి కడప జిల్లా ప్రదర్శించిన వీరత్వం, రగిలించిన విప్లవాగ్ని తెల్లదొరల గుండెల్లో శాశ్వత సింహస్వప్నమై నిలిచింది. జాతీయ స్థాయిలో మహాత్మా గాంధీజీ ఉప్పు సత్యాగ్రహానికి పిలుపునివ్వడానికి ఎన్నో దశాబ్దాల ముందే.. కడప జిల్లా చౌడు నేలల నుంచి ఉద్భవించిన ‘నేల ఉప్పు’ బ్రిటీష్ ఆర్థిక సామ్రాజ్యాన్ని నిలువునా కుదిపేసింది. తమ ఉనికిని, జీవనాధారాన్ని దెబ్బతీయాలని చూసిన ఆంగ్లేయ పాలకుల నిరంకుశ చట్టాలను ధిక్కరిస్తూ స్థానిక ఉప్పు తయారీదారులు (ఉప్పర కులస్తులు) తెల్లదొరలను ముప్పుతిప్పలు పెట్టారు.కేవలం చట్టాల ధిక్కారమే కాదు, బ్రిటీష్ అరాచకత్వానికి వ్యతిరేకంగా ఉయ్యాలవాడ గడ్డపై రేగిన రేనాడు సూర్యుడు, వీరబ్రహ్మంగారి శిష్యుడు దొరవారి నరసింహారెడ్డి చేసిన మహాత్తర సాయుధ తిరుగుబాటు.. భావి భారత స్వాతంత్య్ర పోరాటానికి నిలువెత్తు ప్రేరణగా నిలిచింది. ఈ వీరత్వానికి, విప్లవ స్ఫూర్తికి అహింసా ఆయుధాన్ని జోడించేందుకు సాక్షాత్తు జాతిపిత మహాత్మా గాంధీజీ కడప గడ్డపై మూడు పర్యాయాలు అడుగుపెట్టారు. బాపూజీ పిలుపుతో ఉమ్మడి జిల్లా అంతటా సత్యాగ్రహాలు, సహాయ నిరాకరణ, విదేశీ వస్తు బహిష్కరణ, క్విట్ ఇండియా ఉద్యమాలు దావానలంలా రగిలాయి. నేడు స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల చారిత్రక తరుణంలో, మన కడప గడ్డపై చెరగని ముద్ర వేసిన ఆ అపూర్వ సమర ఘట్టాలు మరియు మహాత్ముని అడుగుజాడలపై ‘సాక్షి’ ప్రత్యేక కథనం. ఉప్పు..కాదు నిప్ఫు ● గాంధీజీ కంటే ముందే తిరుగుబాటు: మహాత్మా గాంధీ జాతీయ స్థాయిలో చేపట్టిన ఉప్పు సత్యాగ్రహానికి శతాబ్ద కాలం ముందే కడప జిల్లా ఉప్పు తయారీదారులు (ఉప్పర కులస్తులు) తెల్లదొరలకు ముచ్చెమటలు పట్టించారు. ● బ్రిటిష్ ఖజానాకు గండి: చౌడు నేలల నుంచి తయారు చేసే ‘నేల ఉప్పు’ను స్థానిక ప్రజలు, పేదలు ఎక్కువగా వాడేవారు. దీనివల్ల బ్రిటీష్ ప్రభుత్వం ఏటా రూ. 8 లక్షల నుంచి రూ. 11 లక్షల వరకు భారీ ఆదాయాన్ని కోల్పోయింది. ● 1805 నాటి నిరంకుశ నిషేధం: ఆదాయ నష్టాన్ని తట్టుకోలేని బ్రిటీష్ ప్రభుత్వం 1805లో నేల ఉప్పు తయారీపై నిషేధ చట్టాన్ని తెచ్చి, 1806 నుంచి కఠినంగా అమలు చేస్తూ ఉప్పర కులస్తుల పొట్టగొట్టింది. ● థార్న్హిల్ పర్యటన (1873): ప్రభుత్వం ఎన్ని ఆంక్షలు పెట్టినా తయారీ ఆగకపోవడంతో, బోర్డు ఆఫ్ రెవెన్యూ సభ్యుడు థార్న్హిల్ రాయలసీమలో పర్యటించి అధిక పన్నులు విధించినా ఫలితం లేకపోయింది. ● ధరల తగ్గింపు ఎత్తుగడ: పన్నులతో లాభం లేకపోవడంతో, సముద్ర తీర ప్రాంతాల్లో పలికే తక్కువ ధరకే కడప జిల్లాలోనూ సముద్రపు ఉప్పును విక్రయించే సరికొత్త ఎత్తుగడ వేశారు. ● లైసెన్స్ ఆంక్షలు: కొత్తగా నేల ఉప్పు బట్టీలు ఏర్పాటు చేయరాదని నిబంధనలు పెట్టి, లైసెన్స్ విధానాన్ని తెచ్చారు. అయితే కొత్తగా ఎవరికీ లైసెన్స్లు మంజూరు చేయలేదు. ● అధికారిక నిషేధం (1880): మద్రాసు సాల్ట్ కమిషన్ సిఫార్సులతో 1880లో ప్రభుత్వం నేల ఉప్పును పూర్తిగా నిషేధించి, బట్టీలను ధ్వంసం చేయడానికి ప్రత్యేక సైనిక, అధికారిక బృందాలను రంగంలోకి దించింది. ● శాసన ఉల్లంఘన: ఆంక్షలు ముమ్మరమైనా కడప సమీపంలోని పాలంపల్లె, మోడమీదపల్లె, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, సిద్ధవటం, బద్వేల్, రాయచోటి, పులివెందుల తదితర ప్రాంతాలలో నేల ఉప్పు తయారీ ఆగలేదు. కడప వీరులు బ్రిటీష్ చట్టాలను ధిక్కరిస్తూ వారిని ముప్పుతిప్పలు పెట్టారు. జాతిపిత పాదస్పర్శతో పునీతం ● జాతీయోద్యమ ప్రేరణ: ఆనాటి ఉమ్మడి కడప జిల్లాకు చెందిన ఉయ్యాలవాడ నరసింహారెడ్డి సాగించిన సాయుధ తిరుగుబాటు భావి భారత జాతీయోద్యమానికి ఎంతో ప్రేరణనిచ్చింది. ● మొదటి పర్యటన (1921 సెప్టెంబరు 30): తిరుపతి సభ ముగించుకుని రేణిగుంట నుంచి రైలులో రాజంపేట మీదుగా గాంధీజీ కడపకు చేరుకున్నారు. ● కరువు నిధి విరాళాలు: రాయలసీమ కరువు సహాయం కోసం కడపలో జరిగిన సభకు 40 వేల మంది రాగా, ప్రజలు ‘స్వరాజ్య నిధి’ కింద అపారమైన విరాళాలు ఇచ్చారు. ● వస్త్ర దహనం – హరిసర్వోత్తమరావు అనువాదం: గాంధీజీ ప్రసంగాన్ని గాడిచర్ల హరిసర్వోత్తమరావు తెలుగులోకి అనువదించగా, ఉత్తేజితులైన ప్రజలు విదేశీ వస్త్రాలను కుప్పలుగా పోసి తగులబెట్టారు. ● రెండో పర్యాయం (1929 మే 17): హిందు–ముస్లింల ఐక్యత, అంటరానితనం నిర్మూలన లక్ష్యంగా గాంధీజీ తన సతీమణి కస్తూర్బాతో కలిసి జిల్లాకు వచ్చారు. ● రూట్ మార్చి ప్రసంగాలు: తాడిపత్రి నుంచి వస్తూ కొండాపురం, మంగపట్నం, ముద్దనూరు, చిలంకూరు, ఎర్రగుంట్ల గ్రామాల్లో ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. ● ప్రొద్దుటూరు సభ: రాత్రి ప్రొద్దుటూరు చేరుకున్న గాంధీ దంపతులకు ప్రజలు ఘనస్వాగతం పలికి, ఖద్దరు నిధికి రూ. 1,730ల నగదుతో పాటు బంగారు కానుకలను సమర్పించారు. ● మూడో పర్యటన (1934 జనవరి 1): అస్పృశ్యత నివారణ ధ్యేయంగా వచ్చిన గాంధీజీకి శెట్టిగుంట, రాజంపేట రైల్వేస్టేషన్లలో వేలాది మంది స్వాగతం పలికారు. ● ‘శాంతినికేతన్’లో బస: కడప ఏడు రోడ్ల కూడలి సమీపంలోని సమరయోధుడు దేవిరెడ్డి రామసుబ్బారెడ్డి ఇల్లైన ‘శాంతినికేతన్’లో జాతిపిత బస చేశారు. ● కార్మిక కాలనీల సందర్శన: కడపలో ఖద్దరు ఎంపోరియంను ప్రారంభించిన బాపూజీ, మున్సిపల్ పారిశుధ్య కార్మికుల కాలనీల్లో పర్యటించి మున్సిపల్ హైస్కూలు మైదాన సభలో అంటరానితనానికి వ్యతిరేకంగా ప్రసంగించారు. -
ఎర్రచందనం స్మగ్లర్లకు 5 ఏళ్లు జైలు
మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంట ఫారెస్ట్ రేంజి పరిధిలో ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడిన ఇద్దరికి శుక్రవారం తిరుపతిలోని ఎర్రచందనం స్మగ్లింగ్ అడిషనల్ జడ్జి సెషన్స్ కోర్టు 5 ఏళ్లు కఠిన కారాగార శిక్ష, ఒక్కొక్కరికి రూ.3 లక్షల జరిమానా విధించినట్టు వనిపెంట ఎఫ్ఆర్ఓ ఏవీ చలపతి నాయుడు తెలిపారు. జరిమానా కట్టకపోతే అదనంగా ఆరు నెలలు సాధారణ జైలు శిక్ష అనుభవించేలా న్యాయమూర్తి తీర్పు ఇచ్చినట్టు పేర్కొన్నారు. దువ్వూరు మండలం పెద్ద బాకరాపురం గ్రామానికి చెందిన ఎం.రమణారెడ్డి, కె.బాల రంగయ్య అనే వారు వనిపెంట రేంజి పరిధిలోని నీలాపురం బీట్లో 2018లో ఎర్రచందనం స్మగ్లింగ్ చేస్తుండగా పట్టుకొని, వారి నుంచి 295.60 కిలోల బరువు ఉన్న 11 దుంగలను స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేసినట్టు తెలిపారు. ఈ కేసులో శుక్రవారం తీర్పు వెలువడినట్టు ఎఫ్ఆర్ఓ పేర్కొన్నారు. ఎర్రచందనం అక్రమ రవాణాలో ఈ తీర్పు ఎంతో ముఖ్యమైనదని ఈ సందర్భంగా ఎఫ్ఆర్ఓ చలపతి నాయుడు అన్నారు. -
ప్రణాళికాబద్ధంగా ఏర్పాట్లు
కడప సెవెన్ రోడ్స్ : 80వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల నిర్వహణకు కడప పోలీసు పరేడ్ గ్రౌండ్లో చేపడుతున్న ఏర్పాట్లను జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా శుక్రవారం సాయంత్రం పరిశీలించారు. కార్యక్రమానికి హాజరయ్యే ప్రజలు, అధికారులు, ప్రజాప్రతినిధులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను సమన్వయంతో పూర్తి చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. పరేడ్ గ్రౌండ్ పరిసరాల్లో పారిశుద్ధ్య నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని, తాగునీరు, వైద్య సదుపాయాలను అందుబాటులో ఉంచాలని సూచించారు. ట్రాఫిక్ నియంత్రణ, వాహనాల పార్కింగ్కు సంబంధించి ముందస్తు ప్రణాళికతో చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులకు సూచించారు. కార్యక్రమంలో ఆర్డీఓ మురళి, మున్సిపల్ కమిషనర్ భవానీ ప్రసాద్, జిల్లా విద్యా శాఖాధికారి షంషుద్దీ్న్ తదితరులు పాల్గొన్నారు. -
లారీ కింద పడి యువకుడి మృతి
పోరుమామిళ్ల : పట్టణంలోని ఉద్దికట్టవీధికి చెందిన నీరుగంటి మస్తాన్వలి (35) శుక్రవారం ఉదయం రెవెన్యూ చావిడి వద్ద రోడ్డు దాటుతుండగా లారీ కింద పడి మృతి చెందాడు. చావిడి దగ్గర ప్రధాన రహదారిలో రోడ్డు దాటుతుండగా విజయవాడ వైపు నుంచి మైదుకూరు వైపు వెళుతున్న ఐషర్ లారీ కింద పడ్డాడని తెలిసింది. లారీ డ్రైవర్ ఆపి చూసేటప్పటికి ప్రాణాలతో ఉండటంతో వెళ్లి పోయాడని, లారీ వెళ్లిన పది నిమిషాల్లోనే అతను మృతి చెందాడని సమాచారం. మస్తాన్వలి చనిపోడంతో సమాచారం పోలీసులకు తెలపడంతో లారీని బి.మఠం పోలీసులు పట్టుకుని, పోరుమామిళ్లకు తెచ్చారని తెలిసింది. మృతుడి తల్లి నీరుగంటి ఖాశింబీ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. తన కుమారుడు కూలీ పని చేసుకుని జీవనం చేసేవాడని, భార్య చనిపోయిందని, అతనికి పిల్లలు లేరని పేర్కొంది. శుక్రవారం పనికి పోయేందుకు ఉదయమే వెళ్లాడని, లారీ ఢీ కట్టడంతో మృతి చెందాడని ఆమె ఫిర్యాదులో పేర్కొంది. ఈ మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
భార్య కాపురానికి రాలేదని భర్త ఆత్మహత్య
కమలాపురం : పట్టణ పరిధిలోని క్రాస్ రోడ్డు వద్ద అక్కదేవతల కాలనీకి చెందిన మార్పురి మురళీ మహేష్(32) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మురళి మహేష్ ఆటో నడుపుతూ జీవనం సాగించేవాడు. భార్య విన్నీతో మనస్పర్థల కారణంగా తరుచూ ఘర్షణ పడేవారు. అయితే భార్య 20 రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. రెండు రోజుల క్రితం మురళి అత్తింటికి వెళ్లి ఇంటికి రావాలని పిలిచాడు. దీనికి భార్య నిరాకరించడంతో మనస్తాపం చెంది శుక్రవారం మధ్యాహ్నం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతడిని కమలాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే మురళి మృతి చెందినట్లు అక్కడి వైద్యులు ధ్రువీకరించారు. విషయం తెలుసుకున్న పోలీసులు ఆసుపత్రికి చేరుకుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతుడికి చిన్న వయస్సు గల కుమారుడు ఉన్నాడు. మహేష్ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
రాగి తీగెల దొంగల ఆటకట్టు
చాపాడు : మండల పరిధిలోని ఆనంద ఆశ్రమం రోడ్డు వద్ద ఇద్దరు రాగి తీగెల దొంగలను శుక్రవారం పోలీసులు అరెస్టు చేశారు. ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపిన వివరాల మేరకు.. ప్రొద్దుటూరు పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన మేకల బబ్లూ, పాపగాల్ల సుధీర్ పలు చోట్ల విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగి వైర్లను దొంగలించినట్లు ఈ నెల 2న కేసు నమోదైందన్నారు. ఈ క్రమంలో ప్రొద్దుటూరులో ఒక వ్యక్తిపై దాడి చేసిన కేసుతోపాటు, 7న అల్లాడుపల్లె రోడ్డు వద్ద మూలే ఖాదర్రెడ్డి అనే వ్యక్తిని కత్తితో బెదిరించి నగదు, సెల్ఫోన్ దొంగలించిన కేసులతోపాటు గతంలో గంజాయి, దొంగతనాలు, మద్యం కేసులు వారిపై ఉన్నాయన్నారు. పట్టుబడిన వీరి వద్ద నుంచి ఒక మోటార్బైక్, కత్తిని స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వీరిని తమ సిబ్బంది చాకచక్యంగా పట్టుకున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
కార్మిక సమస్యల పరిష్కారానికి పోరాడాలి
కడప కార్పొరేషన్: కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై రాజీ లేని పోరాటం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి సూచించారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన వైఎస్సార్టీయూసీ జిల్లా విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం కార్మికులకు ఎన్నో సంక్షేమ పథకాలు అందించి చేయూతనిస్తే ఈ కూటమి ప్రభుత్వం కార్మికులకు ఉన్న పథకాలను అన్నింటిని తొలగించి, వారి పొట్ట కొడుతోందని విమర్శించారు. మళ్లీ అభివృద్ధి రావాలన్నా, కార్మిక, కర్షక సోదరులకు సంక్షేమ ఫలాలు అందాలన్నా 2029లో మనమందరం సమిష్టిగా కృషి చేసి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రిని చేసుకోవాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్టీయూసీ విభాగాన్ని మరింత బలోపేతం చేయడానికి ప్రతి మండలం, గ్రామ స్థాయిలో కమిటీలు వేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్కుమార్, వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు మల్లూరి జాషువా, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వీరా రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్ రాయల్, రాష్ట్ర కార్యదర్శి శ్రీధర్, స్టేట్ జాయింట్ సెక్రటరీ మధుసూదన్ రెడ్డి, జిల్లా నాయకులు, నియోజక వర్గ అధ్యక్షులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి -
వెయ్యడుగుల మువ్వన్నెల జెండా!
వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో ప్రజలు ముందస్తు స్వాతంత్య్ర వేడుకలను కన్నుల పండువగా నిర్వహించారు. మదనపల్లెలో రాజకీయ పార్టీల నేతలు, పట్టణ ప్రముఖులు, విద్యార్థు లు, ఉపాధ్యాయులు, అధికారులు, ప్రజలు, ప్రజా సంఘాల ప్రతినిధులు భాగస్వాములై వెయ్యి అడుగుల తిరంగా పతాకాన్ని చేతబట్టి నడిచారు. విద్యార్థులు అశ్వాలపై మువ్వన్నెల జెండాతో ముందుకు నడుస్తుంటే.. వారి వెంట జనం ప్రదర్శనగా వెళ్లారు. స్థానిక టిప్పు సుల్తాన్ మైదానం నుంచి ప్రారంభమైన తిరంగా ప్రదర్శన.. జాతి సమైక్యత నినాదాలతో పండగ వాతావరణంలో జరిగింది. అలాగే, హర్ ఘర్ తిరంగాను పురస్కరించుకుని గురువారం కడప గాంధీనగర్ ఉన్నత పాఠశాల విద్యార్థులు 1,000 అడుగుల జాతీ య జెండాతో ఎర్రముక్కపల్లి సర్కిల్ వర కు ర్యాలీ చేశారు. సమాజ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు, అడ్వకేట్ వాండ్రాసి పెంచలయ్య పాల్గొన్నారు. – సాక్షి, మదనపల్లె/కడప ఎడ్యుకేషన్ -
వైఎస్సార్సీపీ హయాంలో సంక్షేమ వైభవం
సాక్షి ప్రతినిధి, కడప: పూజ్య బాపూజీ మహాత్మగాంధీ కలలు కన్న అసలైన గ్రామ స్వరాజ్యం గత వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో రాష్ట్రవ్యాప్తంగా అద్భుతంగా ప్రస్ఫుటమైంది. పేదలకు అత్యంత చెంతకు ప్రభుత్వ సేవలన్నింటినీ తీసుకువస్తూ.. దేశ చరిత్రలోనే ఎన్నడూ లేని విధంగా ప్రతి ఇంటి వద్దకే వాలంటీర్ వచ్చి అవసరమైన సేవలు మరియు పెన్షన్లను అందించే పకడ్బందీ వ్యవస్థను నాడు జగన్ సర్కార్ విజయవంతంగా నడిపించింది. పల్లెల్లోనే ఒకే చోట గ్రామ సచివాలయాలు, వైఎస్సార్ రైతు భరోసా కేంద్రాలు, డిజిటల్ గ్రంథాలయాలు మరియు విలేజ్ హెల్త్ క్లినిక్లను ఏర్పాటు చేసి పరిపాలనా సంస్కరణల్లో సరికొత్త అధ్యాయాన్ని లిఖించింది. నాడు–నేడుతో ప్రభుత్వ బడులకు కార్పొరేట్ వైభవం! విద్యా రంగంలో విప్లవాత్మక మార్పులు తెచ్చేలా నాటి జగన్ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మన బడి నాడు–నేడు పథకంతో ప్రభుత్వ పాఠశాలల రూపురేఖలు సమూలంగా మారిపోయాయి. కార్పొరేట్ మరియు ప్రైవేటు పాఠశాలలను తలదన్నేలా సర్కారు బడులను అధిగమించి అత్యాధునిక వసతులతో అద్భుతంగా తీర్చిదిద్దారు. సరికొత్త విద్యావ్యవస్థను అందుబాటులోకి తెస్తూ గ్రామీణ, మారుమూల ప్రాంతాల పాఠశాలల్లో సైతం డిజిటల్ బోర్డులను ఏర్పాటు చేసి స్మార్ట్ క్లాస్ బోధనను తీసుకువచ్చారు. గతంలో కేవలం సంపన్న ఉన్నత వర్గాలకే పరిమితమైన అంతర్జాతీయ స్థాయి ఇంగ్లీషు మీడియం చదువులను, నాడు ప్రభుత్వ బడులలో ఉచితంగా ప్రవేశపెట్టడం వల్ల పేద విద్యార్థుల ముంగిటకే ఇంగ్లీషు చదువులు వచ్చి చేరాయి. పల్లెల్లో పరిపాలనా విప్లవం.. 649 గ్రామ సచివాలయాలు! నాడు జిల్లావ్యాప్తంగా గ్రామ సచివాలయ వ్యవస్థను అత్యంత అద్భుతంగా తీర్చిదిద్దారు. ఉమ్మడి జిల్లా పరిధిలో ఏకంగా 649 గ్రామ, వార్డు సచివాలయాలను ఏర్పాటు చేసి ప్రజలకు లంచాలు, సిఫార్సులు లేని పాలనను అందించారు. ఆయా సచివాలయాల పరిధిలో స్థానిక యువతకు ఉపాధి కల్పిస్తూ 6,490 మంది ప్రభుత్వ శాశ్వత ఉద్యోగులను ఒకేసారి నియమించారు. ఇందులో అంతర్భాగంగా దాదాపు 15,000 మంది గ్రామ వాలంటీర్లను నియమించి.. కులం, మతం, రాజకీయం చూడకుండా అర్హులైన వారందరికీ ఇంటి వద్దకే ప్రభుత్వ సేవలను ఠంచన్గా అందించారు. అలాగే పేదలకు స్థానికంగానే అత్యుత్తమ వైద్య సేవలు అందించేందుకు జిల్లావ్యాప్తంగా 438 విలేజ్ క్లినిక్లను, నగరాల్లో 32 అర్బన్ ప్రైమరీ హెల్త్ సెంటర్లను అత్యాధునిక వసతులతో నిర్మించారు. ప్రతి వర్గానికి సంక్షేమ హారతి నాడు చేనేత కార్మికుల ఇబ్బందులను గమనించి వైఎస్సార్ నేతన్న నేస్తం ద్వారా సొంత మగ్గం ఉన్న ప్రతి చేనేత కుటుంబానికి ఏటా ఇరవై నాలుగు వేల రూపాయల చొప్పున అందించి ఆర్థికంగా నిలబెట్టారు. అన్నదాతలకు పెట్టుబడి సాయంగా వైఎస్సార్ రైతు భరోసా కింద ఏడాదికి పదమూడు వేల ఐదు వందల రూపా యల చొప్పున అందజేసి తోడుగా నిలిచారు. జీవనో పాధి కోసం నిత్యం ఇక్కట్లు పడే ఆటో, ట్యాక్సీ డ్రైవర్లకు వైఎస్సార్ వాహనమిత్ర ద్వారా ఏటా పది వేల రూపాయల చొప్పున ఆర్థిక సాయం అందించారు. అలాగే కులవృత్తులపై ఆధారపడిన నాయీ బ్రాహ్మణులు, రజకులు మరియు టైలర్ల జీవన ప్రమాణాలు పెంచేందుకు ఏటా పది వేల రూపాయల చొప్పున నేరుగా వారి ఖాతాల్లో జమ చేసి జగన్ సర్కార్ అండగా నిలిచింది. అర్హతే ప్రామాణికంగా జగనన్న ప్రస్థానం! పిల్లల చదువుల కోసం పేద తల్లులు అప్పులపాలు కాకూడదనే ఉద్దేశంతో జగనన్న అమ్మ ఒడి పథకం ద్వారా ఏటా పదిహేను వేల రూపాయలు అందించి బడికి పంపే ప్రతి తల్లిని ఆదుకున్నారు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద ఆడపిల్లల పెళ్లిళ్లకు ఇబ్బంది లేకుండా వైఎస్సార్ పెళ్లి కానుకను ప్రవేశపెట్టారు. మహిళా సాధికారతకు అగ్రపీఠం వేస్తూ వైఎస్సార్ ఆసరా, జగనన్న చేయూత అందించడంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా లక్షలాది మంది అర్హులైన పేద మహిళలకు సొంత ఇంటి స్థలాలతో పాటు పక్కా గృహాలను మంజూరు చేశారు. గ్రామీణులకు అత్యున్నత విద్యా, వైద్యం, జీవనోపాధి మెరుగుపరుచుకునేందుకు కావాల్సిన ఆర్థిక చేయూత.. రాజకీయాలతో నిమిత్తం లేకుండా కేవలం అర్హతే ప్రామాణికంగా పేదల చెంతకు చేరింది. నాడు నిజమైన గ్రామ స్వరాజ్యం పరిడవిల్లిందని సామాజిక విశ్లేషకులు, మేధావులు ఈ సందర్భంగా బలంగా కొనియాడుతున్నారు. -
నేడు మంత్రి రాక
కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర రోడ్డు, భవనాలు, మౌలిక వసతులు, పెట్టుబడుల శాఖ మంత్రి బీసీ జనార్థన్రెడ్డి శుక్రవారం కడప జిల్లా పర్యటనకు రానున్నారని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. ఉదయం 10.30గంటలకు పులివెందులకు చేరుకుంటారు. సాయంత్రం వరకు స్థానిక కార్యక్రమాలలో పాల్గొంటారు. అనంతరం కడపకు చేరుకుని ఆర్అండ్బీ గెస్ట్ హౌస్లో బస చేస్తారు. శనివారం ఉదయం పంద్రాగస్టు వేడుకల్లో పాల్గొని జాతీయ జెండాను ఎగురవేసి ప్రసంగించనున్నారు. వైఎస్సార్సీపీలో నియామకాలు కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పులివెందులకు చెందిన ఎం. విశ్వనాథ్ యాదవ్ను జిల్లా యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా, కడపకు చెందిన సీ. వెంకట రమణను బీసీ విభాగం ఎగ్జిక్యూటివ్ సభ్యుడిగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కొనసాగుతున్న యాత్ర చక్రాయపేట: గ్లోబల్ వార్మింగ్ ముప్పును తగ్గించి అడవుల పెంపకంపై అవగాహన కల్పి స్తూ తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూరుకు చెందిన బయోటెక్నాలజీ విద్యార్థి ముత్తు సెల్వం చేపట్టిన సైకిల్ యాత్రం గురువారం సాయంత్రం చక్రాయపేటకు చేరుకుంది.ఈ సందర్భంగా ఎస్సై చంద్రశేఖర్ ఆయనకు స్వాగతించి కొంత మేర ఆర్థిక సహకారం అందించారు. ఈ సందర్భంగా ముత్తు సెల్వం మాట్లాడుతూ 2027 నాటికి డిల్లీకి చేరడంతో తన 44వేల కిమీ యాత్ర ముగుస్తుందని వివరించాడు. -
● కుక్క తోక వంకర.. పిల్లల తోక టింకర!
పులివెందుల ఉద్యాన కళాశాల ప్రాంగణంలో ఒక కుక్క జన్మనిచ్చిన ఎనిమిది కుక్కపిల్లలు ఒక అరుదైన శారీరక వైవిధ్యంతో అందరినీ ఆశ్చర్యపరుస్తున్నాయి. తెలుపు, గోధుమ రంగు మచ్చలతో ఎంతో ముద్దుగా ఉన్న ఈ పిల్లలలో మూడింటికి మాత్రమే సాధారణంగా తోకలు ఉన్నాయి. మిగిలిన ఐదు కుక్కపిల్లలకు తోక చాలా చిన్నగా ఉండటం లేదా అస్సలు కనిపించకపోవడం ఇక్కడ విశేషంగా నిలిచింది. ఈ శారీరక లక్షణాలు వాటి తల్లిదండ్రుల నుంచి వంశపారంపర్యంగా సంక్రమించి ఉండవచ్చని భావిస్తున్నారు. ఎంతో ఆరోగ్యంగా, చురుకుగా ఉన్న ఈ కుక్కపిల్లలను కళాశాల విద్యార్థులు, సిబ్బంది తమ విశ్రాంతి సమయంలో ఎంతో ప్రేమగా సంరక్షిస్తూ, ఆహారం అందిస్తున్నారు. మూగజీవాలలో కనిపించే ఇలాంటి వింత లక్షణాలు భవిష్యత్తులో జంతు శాస్త్రవేత్తల పరిశోధనలకు మరియు శాసీ్త్రయ అధ్యయనాలకు ఒక మంచి అవకాశాన్ని కల్పిస్తాయని నిపుణులు చెబుతున్నారు. – పులివెందుల -
● పడండి తొందర..ప్రమాదముంది ముందర!
రాజంపేటలోని రెండో ప్లాట్ఫారం వైపు అండర్ బ్రిడ్జికి సమీపంలో నిలువునా ఎండిపోయిన ఓ భారీ వేపవృక్షం ఎప్పుడు ఎవరి నెత్తిన విరిగిపడుతుందోనని స్థానికులు, విద్యార్థులు ప్రాణభయంతో అల్లాడుతున్నారు. ఈ వృక్షం కింది భాగంలో వేర్లు సైతం భూమితో పట్టు కోల్పోవడంతో, స్వల్ప గాలి వీచినా నేలకొరిగేందుకు సిద్ధంగా ఉంది. నిత్యం ప్రభుత్వ హైస్కూల్, జూనియర్, డిగ్రీ కళాశాలలకు వెళ్లే వందలాది మంది విద్యార్థులు ఈ మార్గం గుండానే రాకపోకలు సాగిస్తుంటారు. దీనికి తోడు చెట్టుకు కూతవేటు దూరంలోనే టిఫిన్ సెంటర్లు, హోటళ్లు, చికెన్ సెంటర్ వంటి చిరు దుకాణాలు ఉండటంతో నిత్యం ప్రజల రద్దీ ఎక్కువగా ఉంటుంది. ఈ ప్రమాదకర వృక్షాన్ని తొలగించాలని పలుమార్లు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా ఆర్అండ్బీ శాఖ అధికారులు కన్నెత్తి చూడలేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పోనీ, తమ సొంత డబ్బులతో చెట్టును కొట్టేద్దామన్నా.. అటవీ లేదా రెవెన్యూ అధికారులు ఎక్కడ కేసులు పెడతారోనని జనం జంకుతున్నారు. జరగరాని ప్రమాదం జరిగి ప్రాణనష్టం సంభవిస్తే అధికారులదే పూర్తి బాధ్యతని, తక్షణమే స్పందించి ఈ భారీ ఎండిన వృక్షాన్ని తొలగించాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. –రాజంపేట -
విద్యా ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఐక్య ఉద్యమం
కడప సెవెన్ రోడ్స్ : విద్యా రంగ ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ ఐక్య ఉద్యమాన్ని చేపట్టాల్సిన అవసరం ఉందని ఏఎస్వైఎఫ్ఓ రాష్ట్ర అధ్యక్షుడు ఓబయ్య అన్నారు. బుధవారం కడప నగరంలోని పద్మశ్రీ ఓకేషనల్ జూనియర్ కళాశాలలో నిర్వహించిన ఏఎస్వైఎఫ్ రాష్ట్ర మొదటి మహా సభలో ఆయన మాట్లాడుతూ ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించాలని కోరారు. అంబేద్కర్ ఆలోచనా విధానాన్ని ఆదర్శంగా తీసుకుని దేశాభివృద్ధిలో విద్యార్థులు కీలక పాత్ర పోషించాలన్నారు. పీఎస్యూ రాష్ట్ర కార్యదర్శి కె. సుబ్బారాయుడు, పీఆర్ఎస్వైఎఫ్ రాష్ట్ర కార్యదర్శి శంకర్, ఏఐబీఎస్యూ రాష్ట్ర అధ్యక్షుడు జగన్ రాథోడ్ మాట్లాడుతూ ప్రభుత్వాల నిర్లక్ష్యం వల్ల విద్య అనేది అంగడి సరుకుగా మారిందన్నారు. విద్యను వ్యాపారంగా మార్చే ప్రైవేటీకరణ విధానాలను వ్యతిరేకించాలని, ప్రతి విద్యార్థికి సమానంగా నాణ్యమైన విద్య అందేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పెండింగ్ లో వున్నా ఫీజు బకాయిలు, సంక్షేమ హాస్టల్ విద్యార్థుల మెస్ ఛార్జిలను ధరలకు అనుగుణగా పెంచాలని డిమాండ్ చేశారు. పీఎఆర్ఎస్వైఎఫ్ జిల్లా అధ్యక్షులు ఓరుగంటి నాగేంద్ర బాబు, ఏఎస్వైఎఫ్ నాయకులు ఆఫ్రిదు, అబ్దుల్, అహ్మద్, ప్రీతి, వెంకటలక్ష్మి, అనూష, గౌతమి పాల్గొన్నారు. -
తిరుపతి–తిరువణ్ణామలై రహదారిని అభివృద్ధి చేయండి
కడప కార్పొరేషన్: తిరుపతి నుంచి తమిళనాడులోని తిరువన్నామలై వరకు ఉన్న రహదారిని మరింత అభివృద్ధి చేసి, ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యాలు కల్పించాలని తిరుపతి ఎంపీ మద్దెల గురుమూర్తి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. బుధవారం ఢిల్లీలో వారు జాతీయ రోడ్డు రవాణా, రహదారుల శాఖామంత్రి నితిన్ గడ్కరీని కలిసి వినతిపత్రం అందజేశారు. తిరుపతి, కాణిపాకం, వేలూరు, తిరువణ్ణామలై వంటి ప్రముఖ ఆధ్యాత్మిక ప్రాంతాలను సందర్శించే భక్తులకు ఈ మార్గం ఎంతో ముఖ్యమైందని ఎంపీలు మంత్రికి వివరించారు. ఈ అంశంపై కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సానుకూలంగా స్పందిస్తూ ...వెంటనే డీపీఆర్ తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించినట్లు ఎంపీలు వివరించారు. జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరికీ వైఎస్సార్సీపీ ఎంపీల వినతి -
రోడ్డు ప్రమాదంలో సాక్షి ఫొటోగ్రాఫ్ర్కు తీవ్ర గాయాలు
కడప అర్బన్: కడపలోని గోకుల్ టీ వద్ద ఉన్న డివైడర్ను దాటుతున్న కడప సాక్షి ఫోటోగ్రాఫర్ మహమ్మద్ రఫీని బైక్ వేగంగా వచ్చి ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో రఫీ తీవ్రంగా గాయపడి అస్వస్థతకు గురయ్యాడు. స్థానికులు, బంధువులు అతన్ని ఖలీల్బాషా ఆసుపత్రిలో చేర్పించారు. కుడిచేయి, కాలుకు గాయాలయ్యాయి. కెమెరా పూర్తిగా దెబ్బతింది. ఈ ఘటనపై కడప వన్ టౌన్, ట్రాఫిక్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పోలీసుల అదుపులో నకిలీ బంగారం విక్రేతపులివెందుల రూరల్ : పులివెందుల బంగారు దుకాణాలలో నకిలీ బంగారం విక్రయిస్తున్నారన్న అనుమానంతో హర్యానాకు చెందిన రాజ్ కుమార్ అనే వ్యక్తిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. గతంలో కూడా ఇలా నకిలీ బంగారాన్ని దుకాణాలలో కుదవపెట్టి సుమారు లక్షల రూపాయలు తీసుకెళ్లారని వ్యాపారస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. హర్యానాకు చెందిన రాజ్ కుమార్ నకిలీ బంగారాన్ని అమ్ముతున్నాడని అనుమానంతో పోలీసులకు అప్పగించినట్లు వ్యాపారులు తెలిపారు. -
ఐచర్ వాహనం బోల్తా
సింహాద్రిపురం : ఐచర్ లారీ సింహాద్రిపురం సమీపంలో నందాలంబావి వద్ద ప్రమాదకరమైన మలుపు వద్ద బుధవారం వేకువజామున అదుపుతప్పి బోల్తా పడింది. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తెలంగాణా నుంచి అరటి కాయల లోడుతో వెలిదండ్లకు వెళుతున్న ఐచర్ వాహనం ప్రమాదకర మలుపు వద్దకు రాగానే అదుపు తప్పి బోల్తా పడింది. వాహనంలో డ్రైవర్ మాత్రమే ఉన్నాడు. అతనికి స్వల్ప గాయాలయ్యాయి. సింహాద్రిపురం నుంచి వెళ్లిదండ్లకు వెళ్లే రోడ్డు 12 కిలోమీటర్ల దూరానికి 13 ప్రమాదకరమైన మలుపులు ఉన్నాయి. తరచూ ప్రమాదాలు జరుగుతున్నా అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజలు వాపోతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఈ మలుపులను తొలగించి డబుల్ రోడ్డు వేయాలని చేసిన ప్రయత్నాలు ఫలించలేదు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేయాలని కోరతున్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లోని రెండో ప్లాట్ఫాంలో ఉన్న ఫుట్ఓవర్ బ్రిడ్జి కింద గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది ఉన్నాడని రైల్వే ఎఎస్ఐ గురుశంకర్రెడ్డి బుధవారం తెలిపారు. మృతుడికి సుమారు 45 సంవత్సరాలు ఉంటాయని, బక్కచిక్కి ఉన్నాడని తెలిపారు.ఎవరైనా గుర్తు పడితే ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ కు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. పాముకాటుతో వ్యక్తి మృతి పెండ్లిమర్రి : మండలంలోని చెన్నంరాజుపల్లె హరిజనవాడకు చెందిన దేవర చిన్న ఓబులేసు(39) పాము కాటుకు గురై చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. స్థానికులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు చిన్న ఓబులేసు వెల్లటూరులోని వేరుశనగ కాయల మిల్లులో పని చేస్తుండంగా ఈనెల 1వ తేదీన పాము కాటుకు గురయ్యాడు. చికిత్స నిమిత్తం కడపలో ప్రైవేట్ ఆసుపత్రికి అక్కడి నుంచి వేలూరు సీఎంసీకి తరలించారు. అక్కడ పరిస్థితి మొరుగు పడకపోవడంతో మళ్లి కడప రిమ్స్ అసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. బుధవారం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆస్తి వివాదం: వ్యక్తిపై దాడి కొండాపురం : మండల పరిధిలోని సిరిగేపల్లెగ్రామంలో ఆస్తి వివాదం కారణంగా బుధవారం ఓ వ్యక్తి పై దాడి జరిగింది. తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ కథనం మేరకు..బండ బాలన్న తల్లితండ్రులకు సంబంధించిన వ్యవసాయ భూమి సర్వే నంబర్ 36–1 లో 50 సెంట్లు వారసత్వంగా వచ్చింది. మిగిలిన భూమి తన సోదరులతో ఒక ఎకరం కొనుగోలు చేశాడు. రెండు గంటల సమయంలో బాలన్న ఇంటి దగ్గర భూమి వివాదంపై ఎడమ చెంపపై రాళ్లతో బి. వెంకటస్వామి, బి. రాజు, బి.వెంకటేష్ కొట్టడంతో తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. గాలేరు–నగరికాలువలో వృద్ధుడి మృతదేహంముద్దనూరు : మండలంలోని శెట్టివారిపల్లె పరిధిలో గాలేరు–నగరి ప్రధాన కాలువలో హెడ్రెగ్యులేటర్ వద్ద బుధవారం వృద్ధుని మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. చెన్నూరు బెస్తకాలనీకి చెందిన శ్రీనివాసులు(60)అనే వ్యక్తి కాలువలో పడి నీటమునిగి మృతిచెందాడు.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని బయటకు తీశారు.ఇతను ప్రమాదవశాత్తు కాలువలో పడి మృతిచెందాడా లేక ఆత్మహత్యకు పాల్పడ్డాడా అనే వివరాలు తెలియాల్సి ఉంది. -
జెడ్పీ ఉద్యోగాల కుంభకోణంలో సూత్రధారుల అరెస్ట్
● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ విశ్వనాథ్కడప అర్బన్ : ప్రభుత్వ కారుణ్య నియామక ప్రక్రియలోని లొసుగులను ఆసరాగా చేసుకుని జిల్లాలో భారీ కుంభకోణానికి పాల్పడిన ఇరువురు ప్రధాన నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. గతంలో జెడ్పీ కార్యాలయంలో పనిచేసిన ఇద్దరు సస్పెండెడ్ ఉద్యోగులే ఈ మోసానికి ప్రధాన సూత్రధారులుగా పోలీసులు గుర్తించారు. బద్వేల్ ఈఈపీఆర్ఐ లో జూనియర్ అసిస్టెంట్గా పనిచేసిన సయ్యద్ మస్తాన్ వల్లి, కమలాపురం ఎంపీపీ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేసిన చిలుమారు శ్రీనివాసులరెడ్డిలను ఈ వ్యవహారంలో అరెస్ట్ చేసినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం వెల్లడించారు. ఆయన తెలిపిన సమాచారం ప్రకారం జిల్లా పరిషత్ కార్యాలయంలో విధులు నిర్వహించిన సమయంలో నిందితులు ఇక్కడి రికార్డుల్లోని లొసుగులను గుర్తించి మోసానికి శ్రీకారం చుట్టారు. జెడ్పీ ఉన్నతాధికారుల సంతకాలు, ముద్రలను ఫోర్జరీ చేసి నకిలీ కారుణ్య నియామక ఉత్తర్వులు సృష్టించారు. 25 మంది అభ్యర్థుల నుంచి దాదాపు రూ.2 కోట్లను వసూలు చేసి వారికి ఈ నకిలీ ఉత్తర్వులు అందించారు. ఈ ఉత్తర్వుల ఆధారంగా ఉద్యోగాల్లో చేరిన వారికి కొన్నేళ్లుగా ప్రభుత్వం జీతాలు చెల్లిస్తుండడంతో ఖజానాకు సుమారు రూ.3.80 కోట్ల నష్టం వాటిల్లినట్లు పోలీసులు ప్రాథమికంగా అంచనా వేశారు. జిల్లాలో కారుణ్య నియామకాల ప్రక్రియలో తీవ్ర అవకతవకలను గుర్తించిన కడప జిల్లా పరిషత్ సీఈఓ సుబ్రమణ్యం ఈ మేరకు ఈ నెల 3వ తేదీన చేసిన ఫిర్యాదుతో ఈ మొత్తం వ్యవహారం వెలుగులోనికి వచ్చింది. నకిలీ నియామక ఉత్తర్వులతో జెడ్పీ హైస్కూళ్ల ఆఫీస్ సబార్డినేట్లుగా, వాచ్మెన్లుగా ఉద్యోగాల్లో చేరిన 25 మంది అభ్యర్థుల పాత్రపైనా పోలీసులు ప్రస్తుతం లోతుగా దర్యాప్తు చేస్తున్నారు. వీరంతా బాధితులా లేక ముందే తెలిసి నిందితులతో చేతులు కలిపారా అనే కోణంలోనూ విచారణ సాగుతోంది. ఈ వ్యవహారంతో సంబంధమున్న అందరిపై చర్యలు ఉంటాయని ఎస్పీ స్పష్టం చేశారు. -
గూడ్స్ ఇంజన్ను ఢీకొన్న ట్రాలీ
● పట్టాలపై ‘నార్త్’ మాఫియా.. ప్రమాదం జరిగినా ‘సిక్’ డ్రామాలు ● రైల్వేలో పెచ్చుమీరుతున్న ప్రాంతీయ పక్షపాతం ● డౌన్ ట్రాక్లో అదుపుతప్పిన భారీ ట్రాలీ ● ప్రాణభయంతో దూకేసిన నలుగురు కార్మికులు ● జోన్ అధికారులకు తెలియకుండా సర్దుబాటు రాజంపేట: రైల్వే శాఖలో ఉత్తర భారత అధికారుల బరితెగింపు, అడ్డగోలు నిర్లక్ష్యం పతాక స్థాయికి చేరింది. భద్రతా నిబంధనలను గాలికొదిలేసి ఘోర ప్రమాదానికి కారణమవడమే కాకుండా, ఆ విషయాన్ని ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లకుండా క్షేత్రస్థాయిలోనే ‘మేనేజ్’ చేసిన సంచలన ఉదంతం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. రైలింజన్, ట్రాలీ ఢీకొన్న సంఘటన ఇలా.. ఈ నెల 5వ తేదీన మంటపంపల్లె–నందలూరు రైల్వే స్టేషన్ల మధ్య మౌలాతట్ సమీపంలో రైలుపట్టాల మరమ్మతుల నిమిత్తం ట్రాక్పై నిబంధనల ప్రకారం ‘రెడ్ ఫ్లాగ్’ ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మంటపంపల్లె వైపు నుంచి ఓ అధికారి, నలుగురు ఉత్తరాది ప్రాంతానికి చెందిన కార్మికులు ఇంజినీరింగ్ ట్రాలీని రన్ చేసుకుంటూ వచ్చారు. అయితే, ట్రాక్ కొంతదూరం వెళ్లేసరికి అక్కడ డౌన్ (వాలు) ఉండటంతో భారీ ఇంజినీరింగ్ సామాన్లతో ఉన్న ఆ ట్రాలీ వేగం ఆకస్మాత్తుగా పెరిగింది. ట్రాలీలో ఉన్న వారంతా కొత్తవారు కావడం, వారికి ఆపరేటింగ్ విధానంపై కనీస అవగాహన లేకపోవడంతో వేగంగా వెళ్తున్న ట్రాలీని అస్సలు ఆపలేకపోయారు. ప్రాణభయంతో దూకేసిన సిబ్బంది.. లోకోపైలట్ దిగ్భ్రాంతి ట్రాలీ పూర్తిగా అదుపు తప్పిందని గ్రహించిన కార్మికులు ప్రాణభయంతో కదులుతున్న ట్రాలీలో నుంచి కిందకు దూకేశారు. తృటిలో ప్రాణాపాయం నుంచి బయటపడినప్పటికీ, అందరికీ తీవ్ర గాయాలయ్యాయి. ఈ క్రమంలో అదుపుతప్పిన ఆ ట్రాలీ పట్టాలపై అమర్చిన ‘రెడ్ బ్యానర్’ను సైతం బలంగా దాటుకుంటూ వెళ్లి.. లూప్లైన్లో కడప వైపు వెళ్లడానికి సిద్ధంగా నిలిచి ఉన్న గూడ్స్ రైలు ఇంజన్ను అత్యంత వేగంగా ఢీకొట్టింది. ఈ ప్రమాద సమయంలో భారీ శబ్దం రావడంతో ఇంజన్లోని లోకోపైలట్ తీవ్ర భయాందోళనకు గురయ్యారు. ఒకవేళ గూడ్స్ రైలు గనుక రన్నింగ్లో ఉండి ఉంటే మాత్రం రైలు పట్టాలు తప్పి ప్రాణనష్టం జరిగేది. గాయపడినా దొంగ హాజరు.. ‘సిక్’ రికార్డుల దగా ఈ ప్రమాదం జరిగిన సమయంలో అక్కడ విధి నిర్వహణలో ఉన్న స్టేషన్ మాస్టర్, రన్నింగ్స్టాప్, స్థానిక ఇంజినీరింగ్ అధికారులు అంతా ఉత్తరాది ప్రాంతానికి చెందిన వారే కావడంతో ఒక ముఠాగా ఏర్పడ్డారు. తాము చేసిన ఘోర తప్పిదాన్ని కప్పిపుచ్చుకునేందుకు, ఈ ప్రమాద సంఘటనను జోన్ ఉన్నతాధికారుల వరకు వెళ్లకుండా గుట్టుచప్పుడు కాకుండా దాచిపెట్టారు. పైగా, ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన నార్త్ కార్మికులను కాపాడేందుకు స్థానిక అధికారులు నిబంధనలను పూర్తిగా గాలికొదిలేశారు. గాయపడిన వారికి అధికారికంగా ‘సిక్’ (వైద్య సెలవు) రాసి రికార్డుల్లో చూపించాల్సి వస్తే జోన్ ఉన్నతాధికారులకు సమాధానం చెప్పుకోవాల్సి వస్తుందని భయపడి.. వారు ఆసుపత్రి పాలైనా, ‘సిక్’లో కాకుండా రెగ్యులర్ డ్యూటీలోనే ఉన్నట్లు రికార్డుల్లో అక్రమంగా హాజరు వేయించుకున్నారు. ఈ దొంగ హాజరు వ్యవహారం ఇప్పుడు రైల్వే వర్గాల్లో తీవ్రమైన హాట్ టాపిక్గా మారింది. రైల్వేలో పెరిగిపోతున్న ‘నార్త్ ఫీలింగ్’ ప్రస్తుతం రైల్వేలోని అన్ని విభాగాలలోనూ బీహార్, మధ్యప్రదేశ్, ఉత్తరప్రదేశ్ ప్రాంతాలకు చెందిన వారే తిష్ట వేశారు. ఎక్కడ చూసినా నార్త్ వారే కనిపిస్తుండటంతో తెలుగు ఉద్యోగులు మచ్చుకై నా కనిపించని దుస్థితి నెలకొంది. నార్త్ నేతలు ఎంతటి ఘోర నిబంధనల ఉల్లంఘనకు పాల్పడినా, ఎలాంటి ప్రమాదాలకు కారకులైనా మరే ఇతర చర్యలు కానీ ఉండవని రైల్వే వర్గాలు బహిరంగంగానే చర్చించుకుంటున్నాయి. చివరకు డివిజన్ స్థాయి నుంచి జోన్ స్థాయి వరకు ఉన్న ఉన్నతాధికారులు కూడా ఈ ‘నార్త్ ఫీలింగ్’ మాఫియాపై ఎలాంటి చర్యలు తీసుకోలేక, ఏమీ చేయలేని తీవ్ర నిస్సహాయ స్థితిలో ఉన్నారనే ఆరోపణలు రైల్వే కార్మిక వర్గాల్లో బలంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడు జరిగిన గూడ్స్ ఇంజన్, ట్రాలీ ప్రమాదమే ఇందుకు సజీవ నిదర్శనమని, దీనిపై రైల్వే బోర్డు ఉన్నత స్థాయి విజిలెన్స్ విచారణ జరిపించాలని కార్మిక సంఘాలు డిమాండ్ చేస్తున్నాయి. నందలూరు సీనియర్సెక్షన్ ఇంజినీర్ కార్యాలయం నిలబడి ఉన్న గూడ్స్ రైలును ఇంజినీరింగ్ ట్రాలీ ఢీ కొట్టిన దృశ్యం (ఊహాచిత్రం) -
టీచర్లకు టెట్ నుంచి మినహాయింపునకు కృషి చేయాలి
కడప కార్పొరేషన్ : ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఉపాధ్యాయ సంఘాల బృందం కోరింది. బుధవారం విజయవాడ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలతో కలిసి వారు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ ఇప్పటికే ఉద్యోగంలో కొనసాగుతున్న వేలాది మంది ఉపాధ్యాయులు పదోన్నతులు, ఇతర సర్వీస్ ప్రయోజనాల కోసం మళ్లీ టెట్ రాయాల్సి వస్తుండటం తీవ్ర ఇబ్బందికరంగా మారిందన్నారు. దీర్ఘకాలంగా ఉపాధ్యాయ వృత్తిలో కొనసాగుతున్న వారికి ఈ నిబంధన గుదిబండగా మారిందని, కేవలం ప్రస్తుతం అమలులో ఉన్న నిబంధనల్లో మార్పులు చేయడం కాకుండా ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ నుంచి పూర్తిస్థాయి మినహాయింపు కల్పించేలా అవసరమైతే చట్ట సవరణ చేయాలని కోరారు.ఉపాధ్యాయ సంఘాల విజ్ఞప్తిపై స్పందించిన వైయస్ జగన్ఈ సమస్యను కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లేందుకు చొరవ తీసుకున్నారు. ఇందులో భాగంగా కడప ఎంపీ వైయస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో ఈ నెల 13వ తేదీన కేంద్ర విద్యాశాఖ మంత్రితో ప్రత్యేక భేటీకి ఏర్పాట్లు చేశారు. ఈ భేటీలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు, రాష్ట్ర స్థాయి ఉపాధ్యాయ సంఘాల నేతలతో కూడిన ప్రతినిధి బందంతో పాటు వైఎస్సార్సీపీ పార్లమెంట్ సభ్యులు కూడా పాల్గొననున్నారు. రాష్ట్రంలోని ఇన్–సర్వీస్ ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న సమస్య తీవ్రతను కేంద్ర విద్యాశాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లి టెట్ నుంచి మినహాయింపు కల్పించేలా కేంద్రంపై ఒత్తిడి తీసుకురానున్నారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీలు ఎంవీ రామచంద్రారెడ్డి, కె. కల్పలత, పి.చంద్రశేఖర్రెడ్డి, ఏపీవైఎస్సార్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు కేశవరపు జాలిరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి షేక్ జంషీద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సీకే వెంకటనాథరెడ్డి, గౌరవాధ్యక్షుడు పి. అశోక్ కుమార్, , కడప జిల్లా అధ్యక్షుడు ఎస్. అమర్నాథ్, ఫ్యాఫ్టో జిల్లా అధ్యక్షుడు సంగమేశ్వర్ పాల్గొన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్కు కోరిన ఉపాధ్యాయ సంఘాల బృందం -
●ఆరుతడి పంటలకై నా కేసీ నీరు అందేనా?
● వరుణుడి కరుణతో జిల్లాలో ఊపందుకున్న ఆరుతడి సాగు ● శ్రీశైలం నిండుకుండలా మారినా కేసీ కాలువకు వరి నీరివ్వబోమంటూ కొర్రీలు ● తీవ్ర ఆందోళనలో అన్నదాతలు! కడప అగ్రికల్చర్: జిల్లావ్యాప్తంగా వారం రోజుల నుంచి కురుస్తున్న అనుకూల వర్షాలతో అన్నదాతల్లో ఆశ లు చిగురిస్తున్నాయి. మొన్నటివరకు ఎల్నినో ప్రభావంతో మందకొడిగా సాగిన ఖరీఫ్ సాగు పనులు, వరుణుడి కరుణతో ఇప్పుడు ఒక్కసారిగా ఊపందుకున్నాయి. ముఖ్యంగా వేరుశనగ, పత్తి, మినుము, మొక్కజొన్న వంటి ఆరుతడి పంటల సాగుపై రైతులు గట్టి ఆసక్తి చూపుతూ పొలం పనులను ముమ్మరం చేశారు. ఇటీవల కురిసిన వర్షాలు ఆరుతడి పంటలకు అమృతంలా మారడంతో సాగు విస్తీర్ణం గతేడాది కంటే ఈసారి గణనీయంగా పెరిగింది. మరింత పెరగనున్న విస్తీర్ణం ప్రస్తుతం కురుస్తున్న వర్షాల తేమతో ఈ పంటల సాగు విస్తీర్ణం రానున్న రోజుల్లో మరింత పెరగనుందని వ్యవసాయ అధికారులు అంచనా వేస్తున్నారు. 7,758 హెక్టార్లలో వరిసాగు.. కేసీ కెనాల్ పరిధిలో తగ్గే ముప్పు! జిల్లాలోని నీటి ఆధారిత బోర్లు, పెన్నా, కుందు, పాపాగ్ని నదీ పరివాహక ప్రాంతాల్లో ఈ ఏడాది వరిపంటను సాగు చేశారు. జిల్లాలో వరి సాధారణ సాగు విస్తీర్ణం 33,078 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 7,758 హెక్టార్లలో (23.4 శాతం) వరిపంట సాగైంది. నిజానికి కేసీ కెనాల్కు కనుక సకాలంలో నీరు విడుదలై ఉంటే.. ఒక్క కేసీ కెనాల్ కిందే రికార్డు స్థాయిలో దాదాపు 40 వేల హెక్టార్ల విస్తీర్ణంలో వరిపంట సాగయ్యే అవకాశం ఉండేది. కానీ ప్రస్తుతం ఖరీఫ్ వరిపంటకు నీటిని విడుదల చేయలేమని అధికారులు నిష్కర్షగా ప్రకటించడంతో రైతులు కేసీ కెనాల్ కింద వరి సాగు చేయడానికి తీవ్రంగా జంకుతున్నారు. ఈ అనాలోచిత నిర్ణయం వల్ల ఈ ఏడాది జిల్లాలో వరిపంట సాగు విస్తీర్ణం భారీగా తగ్గే ప్రమాదం స్పష్టంగా కనిపిస్తోంది. శ్రీశైలం నిండినా.. కేసీ రైతుకు నిరాశే ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు వరదనీరు పోటెత్తడంతో శ్రీశైలం ప్రాజెక్టు దాదాపు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. జలాశయం పూర్తి స్థాయి నీటిమట్టం 885 అడుగులు కాగా.. ఆగస్టు 11వ తేదీ ఉదయానికి నీటిమట్టం 878.80 అడుగులకు చేరింది. ప్రాజెక్టులోకి ఇంకా 72,849 క్యూసెక్కుల వరద నీరు వచ్చి చేరుతోంది. మరో 6.2 అడుగుల మేర నీరు చేరితే శ్రీశైలం డ్యాం పూర్తిగా నిండిపోనుంది. ప్రాజెక్టులో ఇంత భారీగా నీరు ఉన్నప్పటికీ, నీటిపారుదల శాఖ అధికారులు మాత్రం ఖరీఫ్ సీజన్కు సంబంధించి కేసీ కెనాల్ కింద వరిసాగుకు నీటిని అందించలేమని స్పష్టం చేయడంతో రైతాంగంలో తీవ్ర ఆందోళన వ్యక్తమవుతోంది. శ్రీశైలం ప్రాజెక్టులోకి వరదనీరు వస్తుండటంతో కచ్చితంగా నీరు వదులుతారనే నమ్మకంతో బోర్ల కింద వరినారుమడులను సాగుచేసుకున్న రైతులు ఇప్పుడు దిక్కుతోచని స్థితిలో పడిపోయారు. గతేడాది కంటే 4,785 హెక్టార్లు అధికం అధికారిక గణాంకాల ప్రకారం.. గతేడాది ఆగష్టు 11వ తేదీ నాటికి జిల్లాలో కేవలం 16,518 హెక్టార్లలో మాత్రమే వివిధ పంటలు సాగు కాగా.. ఈ ఏడాది ఆగష్టు 11వ తేదీ నాటికి ఏకంగా 21,303 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. అంటే గతేడాదితో పోలిస్తే ఈ ఏడాది అదనంగా 4,785 హెక్టార్లలో సాగు విస్తీర్ణం పెరిగింది. జిల్లావ్యాప్తంగా ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 76,496 హెక్టార్లు కాగా, ఇప్పటివరకు 21,303 హెక్టార్లలో (27.8 శాతం) సాగు పూర్తయింది. ఈ సాగు మరో వారం రోజుల్లో మరింత విస్తరించనుంది. ప్రస్తుతం కురిసిన వర్షాల కారణంగా జిల్లాలోని ప్రధాన ఆరుతడి పంటల సాగు విస్తీర్ణం గణనీయంగా పుంజుకుంది. వాటి వివరాలు ఇలా ఉన్నాయి. మొక్కజొన్న : సాధారణ సాగు విస్తీర్ణం 1,495 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 1,127 హెక్టార్లలో సాగై 75 శాతానికి చేరుకుంది. వేరుశనగ : సాధారణ సాగు 4,446 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 2,380 హెక్టార్లకు చేరి 53.5 శాతానికి నమోదైంది. మినుము : సాధారణ సాగు విస్తీర్ణం 3,745 హెక్టార్లు కాగా.. ఇప్పటివరకు 1,273 హెక్టార్లలో సాగై 34 శాతానికి చేరింది. పత్తి : సాధారణ సాగు విస్తీర్ణం 22,469 హెక్టార్లు కాగా.. ప్రస్తుతం 7,405 హెక్టార్లకు పెరిగి 33 శాతానికి చేరుకుంది. వరిసాగుకు నీటిని ఇవ్వలేమని ప్రకటించడంతో.. కనీసం ఆరుతడి పంటలకై నా నీటిని విడుదల చేసి కాపాడాలని పలువురు రైతులు కోరుతున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు వరదనీటితో నిండినప్పటికీ కనీసం ఆరుతడి పంటలకై నా నీరు విడుదల చేయకపోతే ఎలా అని అన్నదాతలు ప్రశ్నిస్తున్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న కొద్దిపాటి వానలతో పంటలకు ఊపిరొచ్చినప్పటికీ, మళ్లీ వరుణుడు ముఖం చాటేస్తే పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, కాబట్టి ప్రభుత్వం తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. -
24 నుంచి రాష్ట్రస్థాయి పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈనెల 24 నుంచి 27 వరకు తిరుపతిలో అమరావతి ఛాంపియన్ షిప్–2026 రాష్ట్ర స్థాయి పోటీలను నిర్వహించనున్నారని డీఎస్డీఓ గౌస్బాషా బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇప్పటికే 12 క్రీడాంశాలలో అండర్ 17, 23 బాలబాలికలకు నియోజకవర్గ, జిల్లాస్థాయి ఎంపికలను చేపట్టామన్నారు. జిల్లాస్థాయిలో ఎంపికైన క్రీడాకారులు పైన తెలిపిన తేదీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. ఈకేవైసీ చేయించుకోకుంటే గ్యాస్ కనెక్షన్ రద్దు కడప సెవెన్ రోడ్స్ : జిల్లాలోని వంట గ్యాస్ వినియోగదారులు సకాలంలో ఈకేవైసీ చేయించుకోకపోతే ధ్రువీకరణ పూర్తయ్యే వరకు ఎల్పీజీ కనెక్షన్లు తాత్కాలికంగా నిలిపివేస్తామని జిల్లా పౌర సరఫరాల అధికారి రఘురాం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. హెచ్పి పే యాప్ (హెచ్పీసీఎల్), ఇండియన్ ఆయిల్ వన్ యాప్(ఐఓసీఎల్), ఎల్లో బీ పీసీఎల్ యాప్(బీపీసీఎల్) ల ద్వారా ఈకేవైసీ చేయించుకోవచ్చునన్నారు. ఈనెల 15లోపు ఈకేవైసీ పూర్తి చేసుకోవాలని కేంద్రం నిర్ణయించిందని పేర్కొన్నారు. జిల్లాలో 5,28,051 గ్యాస్ కనెక్షన్లు ఉండగా.. అందులో 4,95,036 ఈకేవైసీ పూర్తయ్యాయని తెలిపారు. 16న చెస్ టోర్నమెంట్ కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 16న నగరంలోని ఇంటర్నేషనల్ డిల్లీ పబ్లిక్ స్కూల్లో అనీస్ దర్బారి చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఓపెన్ ప్రైజ్ మనీ చెస్ టోర్నమెంట్ నిర్వహించనున్నట్లు టోర్నమెంట్ డైరెక్టర్ శ్రీమతి తబస్సుం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్కు మొత్తం రూ.55 వేలు నగదు బహుమతులు ఉంటాయన్నారు. వివరాలకు 9030292116 సంప్రదించాలని కోరారు. విద్యార్థి హక్కుల పరిరక్షణకు పోరాటం – సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య కడప వైఎస్ఆర్ సర్కిల్: విద్యార్ది హక్కుల పరిరక్షణకు నిరంతర పోరాటాలు చేస్తామని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య పేర్కొన్నారు. బుధవారం ఏఐఎస్ఎఫ్ 91వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ వద్ద జెండాను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఐఎస్ఎఫ్ పోరాటాల వేగుచుక్కగా అభివర్ణించారు. విద్యార్థుల హాస్టళ్లలో మెరుగైన వసతులు కల్పించాలని, పెరుగుతున్న ధరలకు అనుగుణంగా మెస్ ఛార్జీలు పెంచాలని, నాణ్యమైన భోజనం అందించాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విశ్వవిద్యాలయాల్లో మౌలిక వసతులు, అధ్యాపకులు, సిబ్బంది కొరతను పరిష్కరించాలన్నారు.సీపీఐ నాయకులు చంద్ర, వెంకట శివ, నాగసుబ్బారెడ్డి, కెసీ బాదుల్లా, వుణుగోపాల్, మద్దిలేటి భాగ్యలక్ష్మీ పాల్గొన్నారు. కొనసాగుతున్న జూడాల ఆందోళన – జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రిలేనిరాహార దీక్షలు కడప అర్బన్: ఏపీ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో తమ న్యాయపరమైన డిమాండ్ల సాధనకోసం రాష్ట్ర వ్యాప్తంగా జూడాలు ఆందోళనలను చేపట్టారు. ఇందులో భాగంగా కడపలోని జీజీహెచ్ (రిమ్స్)లో బుధవారం రిలే నిరాహార దీక్షలను చేపట్టారు. ఈ దీక్షలను సాయంత్రం వరకు కొనసాగించారు. ఈ సందర్భంగా కడప జీఎంసీ (రిమ్స్) జూడా అధ్యక్షుడు డాక్టర్ ఎం. రవితేజ నాయక్, ఉపాధ్యక్షులు డాక్టర్ లక్ష్మీకాంత్, కార్యదర్శి యశ్వంత్ కృష్ణ,సంయుక్త కార్యదర్శి డాక్టర్ మారుతీనాయక్, హౌస్సర్జన్ డాక్టర్ సుబ్బారెడ్డిలతో పాటు కార్యదర్శి డాక్టర్ మేఘనలతో పాటు, పీజీలు,సీనియర్ రెసిడెంట్లు, హౌస్సర్జన్లు తమ ఆందోళన చేపట్టారు. పెరిగిన ధరలకు అనుగుణంగా స్టైఫండ్ను 30 శాతం పెంచాలనీ ప్రధానమైన డిమాండ్గా ఆందోళనను కొనసాగిస్తున్నామన్నారు. కొన్ని నెలలుగా పెండింగ్లో ఉన్న ఉపకారవేతనాలను (స్టైఫండ్స్) వెంటనే విడుదల చేయాలన్నారు. ప్రయాణికులకుమెరుగైన సేవలు అందిస్తాం కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప ఆర్టీసీ జోన్లో ప్రయాణికులకు మెరుగైన సేవలు అందించేందు కు కృషి చేస్తున్నామని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కిశోర్ తెలిపారు. బుధవారం కడప బస్టాండు సమీపంలో ఉన్న ఆర్టీసీ కార్గో పాయింట్, బస్టాండులను ఆకస్మికంగా తనిఖీ చేశారు. కార్గో పాయింట్లలో బుకింగ్ చేసుకున్న కస్టమర్లతో ఆయన మాట్లాడారు. ఏవైనా సమస్యలుంటే తమ దృష్టికి తీసుకరావాలని ఆయన కోరారు. -
కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలి
ఎర్రగుంట్ల : విద్యుత్ సంస్థలలో పనిచేస్తున్న కాంట్రాక్ట్ కార్మికులను రెగ్యులర్ చేయాలని, లేకపోతే ఉద్యమిస్తామని కాంట్రాక్ట్ కార్మిక సంఘం నాయకులు పేర్కొన్నారు. బుధవారం ఆర్టీపీపీలోని ఏపీ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ జాయింట్ యాక్షన్ కమిటీ పిలుపు మేరకు ఆర్టీపీపీ గేటు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ కమిటీ చైర్మన్ కట్టా నాగరాజు మాట్లాడుతు చాలా ఏళ్ల నుంచి కార్మికులు చాలీచాలనీ జీతాలతో పనులు చేస్తున్నారన్నారు. వారి న్యాయమైన సమస్యలను పరిష్కరించకపోతే భవిష్యత్ కార్యచరణ ప్రకటిస్తామని హెచ్చరించారు. జేఏసీ జనరల్ సెక్రటరీ నారాయణరెడ్డి మాట్లాడుతు ఏపీ జెన్కోలో పనిచేస్తున్న కార్మికుల సీనియారిటీ, విద్యార్హత నైపుణ్యాన్ని పరిగణనలోకి తీసుకుని గ్రేడ్ మార్పు చేయాలని డిమాండ్ చేశారు సీపీడీసీఎల్ వైస్ చైర్మన్ శ్రీనివాసులు మాట్లాడుతు కారుణ్య నియామకాల ద్వారా ఉద్యోగాలు పొందిన కార్మికులకు జీఓ 129 ప్రకారం వేతనాలు చెల్లించాలని, అలాగే జీఓ 167 కింద పనిచేస్తున్నత కార్మికులకు కడూఆ జీఓ 129 ప్రకారం వేతనాలు అమలు చేయాలని కోరారు. కార్మికులందరు హక్కుల సాధనకోసం ఐక్యంగా పోరాడాలని నాయకులు పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉద్యోగ సంఘాల నాయకులు శివయ్య, రామక్రిష్ణారెడ్డి, ఓబులేసు, కాంట్రాక్ట్ కార్మిక సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయకపోతే ఉద్యమిస్తాం
చాపాడు : ఎగువ ప్రాంతాల్లో భారీ వర్షాలు పడి శ్రీశైలం ప్రాజెక్టుకు 879 అడుగుల నీరు చేరినప్పటికీ జిల్లాలో అధికార పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నప్పటికీ కేసీ కెనాల్కు సాగు నీటిని విడుదల చేయకపోవడం చాలా దారుణమని వైఎస్సార్సీపీ రాష్ట్ర క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి పేర్కొన్నారు. బుధవారం ఆయన తన నివాసంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డితో కలిసి మాట్లాడుతూ గతంలో 875 అడుగులు నీళ్లు వచ్చినప్పుడు నీటిని వెంటనే వదిలేవారన్నారు. కేసీకి సాగు నీటిని విడుదల చేయలేమని మంత్రి, కలెక్టర్ చెప్పే మాటాలు రైతులను నిరుత్సాహపరుస్తున్నాయన్నారు. వర్షాలు పడి ప్రాజెక్టు నిండితే రబీకి నీటిని విడుదల చేస్తామి నేతుల, అధికారులు పేర్కొనడం విడ్డూరంగా ఉందన్నారు. శ్రీశైలంలో 854 అడుగులు తగ్గిపోతే కేసీ కెనాల్ పరిధిలోని 92,000 ఎకరాల ఆయకట్టు ఎడారిగా మిగిలిపోతుందన్నారు. కుందూనది వెంబడి ఎత్తిపోతుల పథకాలకు, పశువులకు తాగునీరు లేకుండా ఇబ్బందిగా ఉంటుందన్నారు. 130 ఏళ్ల చరిత్ర కలిగిని కేసీ కెనాల్కు గతంలో తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీటిని కేటాయింపు ఉందన్నారు. హెచ్ఎన్ఎస్ఎస్కు 10 టీఎంసీలు కేటాయించారన్నారు. ఈ నెలాఖరులోగా కేసీ కెనాల్కు, బ్రహ్మసాగర్కు నీటిని వదిలి నింపాలన్నారు. అలా కానీ పక్షంలో రైతులతో కలిసి ఇడమడక నుంచి కడప వరకు రాస్తారోకో, హైవే నిర్బంధం చేస్తామని హెచ్చరించారు.మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి -
వైఎస్సార్సీపీ నాయకులపై కేసులు
జమ్మలమడుగు : డీఎస్సీలో జరిగిన అక్రమాలకు నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీ విజయవంతం కావడంతో పోలీసులు కేసులు నమోదు పనిలో పడ్డారు. ఇప్పటికే పోలీసులు క్రైం నంబర్ 213/2026 అండర్ సెక్షన్ కింద, 189/2, 223, 126(2), 132, 190 సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. అందులో భాగంగా ఎమ్మెల్సీ తనయుడు పొన్నపురెడ్డి వెంకట శివారెడ్డి గిరిధర్రెడ్డి హృషికేశవరెడ్డి, ముల్లాజానీ, పోచిరెడ్డి రమణారెడ్డి, గజ్జల లక్షుమయ్య మరో18 మందిపై కేసులు నమోదు చేశారు. మొత్తం 400 మందిపై కేసులునమోదు చేసి మిగతా వారిని గుర్తించే పనిలో పడ్డారు. పశుగ్రాసం కొరత నివారణకు చర్యలుఎర్రగుంట్ల : ఎల్నినో ప్రభావం వల్ల ఏర్పడిన పశుగ్రాసం కొరత నివారణకు అధికారులు చర్యలు చేపట్టారు. ఎర్రగుంట్ల మండలం తిప్పలూరులో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ ఇచ్చిన 15 ఏకరాల పొలంలో గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. 30 మంది పొలం లేని పశువులు కలిగిన రైతులకు లబ్ధి చేకూరేల గడ్డి పెంపకం చేస్తున్నామని పశుసంవర్ధశాఖ జాయింట్ డైరెక్టర్ డాక్టర్ ఎన్ శ్రీనివాసులు తెలిపారు. బుధవారం పొలంలో గడ్డి విత్తనాలు వేసే కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతు తిప్పలూరు లో 350 కిలోల సీఎస్హెచ్–24 రకానికి చెందిన జొన్న విత్తనాలను రైతులకు ఉచితంగా అందించినట్లు తెలిపారు. మండలంలో సామూహిక గడ్డి క్షేత్రాలు ఏర్పాటు చేసేందుకు రైతులు ముందుకు వస్తే వారికి ఉచితంగా విత్తనాలు అందిస్తామన్నారు. -
ఆరుతడి పంటలకైనా కేసీ నీరు ఇవ్వాలి
శ్రీశైలం ప్రాజెక్టు వరదనీటితో నిండటం చాలా సంతోషం. అయితే కేసీ నీటిని కనీసం ఆరుతడి పంటలకై నా విడుదల చేయాలి. వర్షాధారంతో ఇటీవల సాగు చేసిన పంటలు వర్షాభావంతో ఎండుముఖం పట్టాయి. గత వారం రోజుల నుంచి కురిసిన కొద్దిపాటి వానలతో వాటికి కొంత ఊపిరొచ్చింది. మళ్లీ వరుణుడు ముఖం చాటేస్తే మాత్రం పంటలు ఎండిపోయే ప్రమాదం ఉంది. కేసీ కెనాల్ కింద కనీసం ఆరుతడి పంటలకై నా నీటిని విడుదల చేస్తే రైతులకు మేలు జరుగుతుంది. – నరసింహారెడ్డి, రైతు, పిచ్చిపాటిపల్లె, ఖాజీపేట మండలం. ఎల్నినో ప్రభావంతో వర్షాలు లేవు. దీనితో పాటు కేసీ కాలువకు నీరు కూడా రావాలంటున్నారు. ఈ ఏడాది తినడానికి తిండిగింజలు కూడా కరువయ్యేటట్లు ఉన్నాయి. అధికారులు ఆలోచించి ఇంకో పది రోజులకై నా కేసీ కెనాల్కు నీటిని విడుదల చేస్తే వరిపంటను సాగు చేసుకునేందుకు వీలుంటుంది. అధికారులు ఆ దిశగా తక్షణమే ఆలోచించాలి. – వేణుగోపాల్, రైతు, రేపల్లి, చాపాడు మండలం. శ్రీశైలం ప్రాజెక్టులో విద్యుత్ ఉత్పత్తిని తక్షణమే నిలిపివేసి, సీమలోని రైతుల పంటల సాగు కోసం కేసీ కెనాల్కు సాగునీరు విడుదల చేయాలి. జలాశయంలో కొద్దిపాటి నీరు చేరగానే అధికారులు విద్యుత్ ఉత్పత్తిని ప్రారంభిస్తూ నీటినంతా కిందికి వాడేస్తున్నారు. విద్యుత్ ఉత్పత్తి కంటే ముందు అన్నం పెట్టే రైతుల బాగు ముఖ్యం కావాలి. ప్రభుత్వం తక్షణమే స్పందించి కేసీ కాలువకు నీటిని విడుదల చేయాలి.– దస్తగిరి రెడ్డి, జిల్లా కార్యదర్శి, ఏపీ రైతు సంఘం. -
మామూళ్లు ఇవ్వలేదని దరఖాస్తులు పంపించలేదా!
ప్రొద్దుటూరు : ‘మా గ్రామంలో దాదాపు అందరం మగ్గంపై ఆధారపడి జీవిస్తున్నాం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో గ్రామానికి 200పైగా వైఎస్సార్ నేతన్న నేస్తం పథకం మంజూరైంది. ఈ ప్రభుత్వంలో తమ గ్రామంలో ఒక్కరికీ పథకం మంజూరు కాలేదు’ అంటూ మండలంలోని పెద్దశెట్టిపల్లె గ్రామ పంచాయతీ నరసింహాపురం గ్రామానికి చెందిన నేతన్నలు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. బుధవారం చేనేత జౌళి శాఖ ఫీల్డ్ ఆఫీసర్ శేషగిరి రావుతోపాటు సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్ హర్షవర్ధన్రెడ్డి గ్రామానికి రాగా చేనేత కార్మికులంతా తిరగబడ్డారు. మామూళ్లు ఇవ్వకపోవడం వల్లే తమ దరఖాస్తులను పైకి పంపలేదా అని ప్రశ్నించారు. జిల్లాలోనే నరసింహాపురం గ్రామం అంటే చేనేత కార్మికులని గుర్తింపు ఉందని, అలాంటి తమ గ్రామంలో ఒక్కరికి కూడా నేతన్న సేవ పథకం వర్తింపజేయకపోవడం ఏంటని తూర్పారబట్టారు. వెల్ఫేర్ అసిస్టెంట్ హర్షవర్ధన్రెడ్డి మాట్లాడుతూ తాను ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నానన్నారు. సమయం లేని కారణంగా గడువు లోగా పంపలేకపోయానన్నారు. ఈ సందర్భంగా ఫీల్డ్ ఆఫీసర్ శేషగిరి రావు మాట్లాడుతూ దరఖాస్తులు తమకు అందడంలో ఆలస్యం కారణంగానే పథకం మంజూరు కాలేదన్నారు. రెండో దశలో తప్పనిసరిగా మంజూరు చేయిస్తామని హామీ ఇచ్చారు. అధికారులపై నేతన్నల తీవ్ర ఆగ్రహం -
అవయవదానం.. అమరత్వం
ఆర్టీసీ డ్రైవర్ నేత్రదానం ప్రొద్దుటూరు : స్థానిక భవాని కాలనీకి చెందిన ఆర్టీసీ డ్రైవర్ వర్ర రఘునాథరెడ్డి (54) అనారోగ్యంతో బుధవారం మృతి చెందారు. ఆయన సతీమణి గంగాదేవి(టీచర్), కుమారులు మాధవరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, బావ మరిది అనంతపురం సీఐ శివగంగాధర్రెడ్డి నేత్రదానికి అంగీకరిస్తూ జిల్లా అంధత్వ నివారణ సంస్థ, స్నేహిత అమృత హస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. బుధవారం రఘునాథరెడ్డి మృతదేహం నుంచి టెక్నీషియన్ అరవింద్ కార్నీయాలను సేకరించి హైదరాబాద్లోని డాక్టర్ అగర్వాల్ నేత్ర నిధికి తరలించారు. సేవా సమితి అధ్యక్షుడు రాజు మాట్లాడుతూ వర్ర రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు తీసుకున్న ఈ మానవతా నిర్ణయం వల్ల ఇద్దరు అంధులకు చూపు వస్తుందన్నారు.ఆయన కళ్లు సజీవం పులివెందుల రూరల్ : పులివెందులకు చెందిన వైఎస్ ఆనంద్రెడ్డి (87) ఈ ఏడాది జులై 30న మృతి చెందారు. ఆయన తమ మధ్య భౌతికంగా లేనప్పటికీ ఆయన కళ్లు మరొకరికి చూపునివ్వాలన్నది కుటుంబ సభ్యులు కోరిక. వెంటనే నేత్రసేకరణ కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి కార్నియాలను సేకరించారు. దీనివల్ల ఇద్దరికి చూపు లభించింది.ప్రొద్దుటూరు కల్చరల్ మరణం ప్రతి జీవికి అనివార్యం. కానీ మరణానంతరం కూడా జీవించడం సాధ్యమేనా? శరీరం నశించినా మన ఉనికి కొనసాగుతుందా? ఈ ప్రశ్నలకు అవయవ దానమే స్పష్టమైన సమాధానం. ఒక మనిషి మరణించినా అతని గుండె మరో శరీరంలో కొట్టుకోవచ్చు. అతని కళ్లు మరో ప్రపంచాన్ని చూడవచ్చు. అతని కాలేయం, మూత్రపిండాలు, మరికొందరికి కొత్త జీవితాన్ని ప్రసాదించవచ్చు. మరణానంతరం కూడా మనిషిని జీవింపజేసే మహోన్నత దానం అవయవదానం. నేడు ప్రపంచ అవయవదాన దినోత్వవం సందర్భంగా కథనం. 24 ఏళ్లుగా ఆరోగ్యంగా జీవిస్తున్న అవయవ స్వీకర్త అవయవదానం వల్ల రెండో జీవితాన్ని పొందిన ప్రొద్దుటూరు పట్టణానికి చెందిన ప్రముఖ వ్యాపార వేత్త, రోటరీ క్లబ్ అధ్యక్షుడు కొవ్వూరు రమేష్రెడ్డి ఇప్పుడు వేల మందికి జీవదాన సందేశాన్ని చేరవేస్తూ అమరత్వం అంటే ఏమిటో సమాజానికి చెబుతున్నారు. రెండు కుటుంబాల మహోన్నత నిర్ణయంతో తనకు పునర్జన్మ లభించిందని చాటుతున్నారు. 24 ఏళ్ల కిందట తనకు లివర్, కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగినా ప్రస్తుతం ఆరోగ్యంగా జీవిస్తున్న కొవ్వూరు రమేష్రెడ్డి అవయవదానంపై ప్రజల్లో చైతన్యవంతులను చేసేందుకు కృషి చేస్తున్నారు. ఈయనకు 2002లో లివర్ సమస్య ఏర్పడటంతో డాక్టర్లు లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేయాలని చెప్పారు. ఆయన మిత్రులు హైదరాబాద్ గ్లోబల్ హాస్పిటల్లో లివర్ ట్రాన్స్ప్లాంటేషన్ చేస్తారని చెప్పడంతో హాస్పిటల్లోనే ప్రథమంగా లివర్ మార్పిడిని 2003 మార్చి 11న చేయించుకున్నారు. డాక్టర్లు 10 ఏళ్లు ఆరోగ్యంగా జీవించవచ్చని తెలిపారు. వరంగల్కు చెందిన ఓ యువతి ఆయనకు లివర్దానం చేశారు. 2009లో కిడ్నీ సమస్య ఏర్పడటంతో గుంటూరుకు చెందిన ఓ యువకుడు బ్రెయిన్ డెత్ అవడంతో అతడి కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ జరిగింది. మంచి ఆహారపు అలవాట్లు, వైద్యుల సూచనలను తప్పక పాటిస్తూ ఇప్పటికీ 24 ఏళ్లుగా ఆరోగ్యవంతంగా జీవిస్తున్నారు. ఇద్దరి అవయవదానంతోనే తాను ఆరోగ్యంగా ఉన్నానని తన పునర్జన్మకు కారణమైన అవయవదానంపై విస్తృత ప్రచారం చేస్తున్నానన్నారు. తనకు లభించిన జీవితాన్ని మరికొంత మందికి ఇవ్వాలనే సంకల్పంతో అవగాహన ఉద్యమాన్ని ప్రారంభించారు. తనకు కాలేయం దానం చేసిన యువతి జ్ఞాపకార్థం కొవ్వూరు రమేష్రెడ్డి చారిటబుల్ ట్రస్ట్ను ఏర్పాటు చేసి 10 వేల మంది మహిళలకు పావలా వడ్డీకి రుణాలు అందించారు. మెగా ఉచిత వైద్య శిబిరాలను ఏర్పాటు చేసి మందులను ఉచితంగా పంపిణీ చేశారు. కుట్టు శిక్షణ తరగతులను నిర్వహించి 800 కుట్టుమిషన్లను మహిళలకు పంపిణీ చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు ఉచితంగా నోటు పుస్తకాలను పంపిణీ చేశారు. విస్తృత అవగాహన అవయవదానంపై ప్రజలను చైతన్యవంతులను చేసేందుకు 2014 సెప్టెంబర్ 4న ప్రొద్దుటూరు నుంచి తిరుమలకు సుదీర్ఘ పాదయాత్ర చేశారు. 2016 ఫిబ్రవరిలో తిరుపతి గోవిందరాజ స్వామి ఆలయం నుంచి విజయవాడ కనకదుర్గమ్మ ఆలయం వరకు మరో చైతన్య యాత్ర చేపట్టి 29 రోజుల్లో పూర్తిచేశారు. కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, వ్యాపార, ఉద్యోగ, రాజకీయ ప్రతినిధులకు అవయవదానంపై అవగాహన కల్పించి దారి వెంట కరపత్రాలను పంపిణీ చేశారు. ఆయన ఆరోగ్యం, ఆహార అలవాట్లపై వైద్యులు వివరాలు తెలుసుకున్నారు. గతేడాది ఫిబ్రవరిలో అవయవ దానంపై అవగాహన కల్పిస్తూ రన్ ఫర్ లైఫ్ పేరుతో 9 వేల మందికి పరుగు పోటీలను నిర్వహించారు. తెలుగు రాష్ట్రాల స్థాయి 3కే, 5కే పరుగు పోటీలను నిర్వహించి విజేతలకు నగదు బహుమతులు అందజేశారు. ఇటీవల పట్టణంలో 130 మంది వైద్యులు, వైద్య సిబ్బందితో భారీ ర్యాలీ నిర్వహించారు. అవయవదానంపై అవగాహన కల్పించి పలువురిని ఒప్పించి అంగీకారపత్రాలు తీసుకున్నారు. జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్యకార్యకర్తల సంఘం సహకారంతో అవయవదానంపై అవగాహన కల్పించి 65 మందితో అవయవదాన పత్రంపై సంతకాలు చేయించారు. ఇప్పటి వరకు కళాశాలలు, స్వచ్ఛంద సంస్థలు, వైద్య కళాశాలు, రోటరీ, ఉద్యోగ, విద్యాసంస్థల్లో 400 వరకు సదస్సులు నిర్వహించి అవయవదానానికి ప్రజలు ముందు వచ్చేలా కృషి చేస్తున్నారు.నేడు ప్రపంచ అవయవదాన దినోత్సవం -
విద్యార్థి, వలంటీర్ల విభాగాల పాత్ర కీలకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుంబంధంగా విద్యార్థి, వలంటీర్ల విభాగాలు ఎంతో కీలకమైనవని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేసే దిశగా వరుసగా సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రతి అనుబంధ విభాగం పనితీరు, పార్టీ కార్యక్రమాలపై చర్చిస్తామని వివరించారు. పార్టీ ఉద్యమాలు, పోరాటాల్లో విద్యార్థులు, వలంటీర్లు ప్రముఖ పాత్ర వహించేలా చేయాలన్నారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, నగర అధ్యక్షుడు శివారెడ్డి, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి సందీప్రెడ్డి, వలంటీర్స్ విభాగం జోనల్ ప్రెసిడెంట్ అఖిలేష్, జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీ పోస్టుకు పచ్చగిరాకీ!
● వితంతువుకు అన్యాయం ● ఇంటర్వ్యూలు ముగిసి ఐదు నెలలైనా పూర్తికాని నియామకంఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని అంగన్వాడీ కార్యకర్త పోస్టు నియామకం అధికార పార్టీ నేతల మధ్య తీవ్ర అవినీతి, అంతర్గత కుమ్ములాటలకు వేదికగా మారింది. 2026 మార్చి నెలలో విడుదలైన నోటిఫికేషన్కు సంబంధించి, 2026 ఏప్రిల్ 23వ తేదీనే ఇంటర్వ్యూలు కూడా పూర్తయ్యాయి. జిల్లావ్యాప్తంగా మిగిలిన అన్ని ఖాళీ పోస్టులలో అభ్యర్థులను నియమించినప్పటికీ, ఒక్క ఒంటిమిట్ట పోస్టు విషయానికి వచ్చేసరికి ఐదు నెలలుగా అధికారులు ఫలితాలను ప్రకటించకుండా కాలయాపన చేస్తున్నారు. వితంతువుకు అన్యాయం.. నిబంధనలు గాలికే! ప్రభుత్వ నిబంధనల ప్రకారం అంగన్వాడీ టీచర్ పోస్టుల ఎంపికలో వితంతువులకు (భర్త లేని మహిళలకు) మొదటి ప్రాధాన్యత ఇవ్వాల్సి ఉంటుంది. ఈ పోస్టుకు దరఖాస్తు చేసుకున్న వారిలో భర్త చనిపోయి, ఇద్దరు ఆడపిల్లలతో జీవనోపాధి లేక అల్లాడుతున్న ‘సౌందర్య’ అనే వితంతువు అర్హురాలై ఉన్నప్పటికీ ఆమెను పూర్తిగా పక్కనబెట్టేశారు. నిబంధనలను తుంగలో తొక్కి, రాజకీయ పలుకుబడి ఉన్నవారికే ఈ ఉద్యోగాన్ని కట్టబెట్టేందుకు అధికారులు ప్రయత్నిస్తుండటంపై మండలవ్యాప్తంగా తీవ్ర విమర్శలు వ్యుక్తమవుతున్నాయి. తెలుగుతమ్ముళ్ల వాగ్వాదం.. రూ. 5లక్షలకు డీల్! ఇక్కడ పోస్టు కోసం మొత్తం ఏడుగురు అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా, అందులో ఇద్దరు టీడీపీ అభ్యర్థుల వైపు నుంచి రాజకీయంగా తీవ్ర ఒత్తిడి వస్తోంది. రాజంపేటకు చెందిన ఒక ప్రముఖ టీడీపీ ముఖ్య నేత ఈ నియామకంలో చక్రం తిప్పుతూ.. పోటీ పడుతున్న ఆ ఇద్దరు అభ్యర్థులకూ ఈ అంగన్వాడీ పోస్టును కేటాయించాలంటూ సిఫారసు లేఖలు ఇవ్వడం గమనార్హం. ఈ ఒక్క పోస్టుకు తెరవెనుక సుమారు రూ.5 లక్షల వరకు గిరాకీ నడుస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే ఇటీవల అంగన్వాడీ కార్యకర్త పోస్టు విషయమై స్థానిక తెలుగుతమ్ముళ్ల మధ్య బహిరంగంగానే పెద్ద ఎత్తున వాగ్వాదం చోటుచేసుకుంది. ఇంటర్వ్యూలు పూర్తయి ఐదు నెలలు కావస్తున్నా అర్హులైన వితంతువును నియమించకుండా, కేవలం రాజకీయ అండ ఉందనే కారణంతో ఇతరులకు అప్పజెప్పేందుకు చూస్తుండటంతో నిరుద్యోగులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకే పోస్టుకు ఇద్దరు అధికార పార్టీ అభ్యర్థులు సిఫారసు లేఖలతో ఒత్తిడి తెస్తుండటంతో, ఎవరికి అంటగట్టాలో తెలియక సంబంధిత ఉన్నతాధికారులు తల పట్టుకుంటున్నారు. -
అనుమానాస్పద స్థితిలో వృద్ధురాలి మృతి
జమ్మలమడుగు రూరల్ : మండల పరిధిలోని గండికోట కొట్టాల గ్రామానికి చెందిన పోలు లక్షుమ్మ (75) అనే వృద్ధురాలు అనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. పోలీసులు తెలిపిన వివరాలు ఉన్నాయి. గండికోట కొట్టాల గ్రామానికి చెందిన పోలు లక్ష్ముమ్మకు ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. 2 ఏళ్ల క్రితం ఆమె ఆస్తిని ఇద్దరు కుమారులకు పంపకం చేసింది. ఉన్న కాస్తో కూస్తో డబ్బును, కొంత భాగం భూమిని తన జీవనానికి పెట్టుకొంది. చిన్న కుమారుడైన మల్లేష్ వద్ద ఆమె ఉంది. ఇటీవల కొంత నగదు లక్ష్ముమ్మ ఖాతాలో జమ అయింది. దీంతో పెద్ద కుమారుడు భార్య ఇంటికి వచ్చి గొడవ పడింది. దీంతో ఇద్దరు కుమారులు ఎక్కడ గొడవ పడి.. కొట్లాడుకుంటారో అని భావించి ఆమె వద్ద ఉన్న కొన్ని మాత్రలు సోమవారం రాత్రి వేసుకున్నట్లు తెలుస్తోంది. మంగళవారం ఉదయం నిద్ర లేవకపోవడంతో.. అనుమానం వచ్చి చూశారు. వెంటనే ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు తెలిపారు. చిన్న కుమారుడు మల్లేష్.. తల్లి మృతిపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఆ మేరకు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ సత్యనారాయణ తెలిపారు. -
సాగునీరు విడుదల చేయాలి
● జొన్న, మినుము, మొక్కజొన్న సాగుకు శ్రీశైలం నీరే ఆధారం ● వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అఽధ్యక్షుడు ప్రసాద్రెడ్డికడప కార్పొరేషన్ : శ్రీశైలం ప్రాజెక్టు నిండినా కేసీ కెనాల్, బ్రహ్మంసాగర్, కుందూనదికి నీటిని విడుదల చేయాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి విమర్శించారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ, ఎగువన వర్షాలతో శ్రీశైలంలో ప్రస్తుతం 879 అడుగుల నీటి నిల్వ ఉందని, 60 వేల క్యూసెక్కుల ఇన్ఫ్లో వస్తోందని తెలిపారు. గతంలో 875 అడుగులు ఉన్నప్పుడే కేసీ కెనాల్, తెలుగుగంగకు నీరిచ్చిన దాఖలాలు ఉన్నాయన్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పత్తి, తెలంగాణ ఎత్తిపోతల పథకాల పేరుతో రోజుకు 60 వేల క్యూసెక్కుల నీటిని తోడేస్తున్నారని ఆరోపించారు. రబీలో వర్షాలు పడితేనే నీరిస్తామనడం సరికాదని, నీటి మట్టం 854 అడుగుల లోపలికి పడిపోతే కడప జిల్లాతో పాటు రాయలసీమ మొత్తం ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. ఆరుతడి పంటలైన జొన్న, మినుము, మొక్కజొన్నలను సాగు చేసుకునేందుకు, అలాగే కుందూ పరీవాహక ప్రాంతంలో తాగునీటి పథకాలు, పశువుల తాగునీటి అవసరాల కోసమైనా కుందూ నదికి ఎస్కేఈ ఛానెల్ (నిప్పుల వాగు) ద్వారా వెంటనే నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేశారు. 130 సంవత్సరాల చరిత్ర కలిగిన కేసీ కెనాల్కు గతంలో తుంగభద్ర నుంచి 10 టీఎంసీల నీటి కేటాయింపు ఉండేదన్నారు. ఆ తర్వాత వైఎస్ రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో తుంగభద్ర నీటిని హెచ్ఎన్ఎస్ఎస్కు మళ్లించి, శ్రీశైలం ప్రాజెక్టు నుంచి 10 టీఎంసీలను కేసీ కెనాల్కు కేటాయించారని గుర్తుచేశారు. చట్టబద్ధమైన కేటాయింపులు ఉన్నందున రైతులకు శ్రీశైలం నుంచి నీటిని విడుదల చేయాల్సిన కనీస బాధ్యత ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ ఛైర్మన్ బాలయ్య యాదవ్, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, సీకే దిన్నె కన్వీనర్ శ్రీనివాసులరెడ్డి, భాస్కర్రెడ్డి, పుల్లయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఢీకొన్న కారు, ఆటో
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలో రాజంపేట మండల శివారు ప్రాంతం వెంకటరాజంపేటలో మంగళవారం హెచ్పీ పెట్రోలు బంకుల వద్ద కారు, ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆరుగురికి తీవ్ర గాయాలయ్యాయి. చికిత్స నిమిత్తం బాధితులను స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వీరిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. వీరంతా రాజంపేట నుంచి పుల్లంపేటకు వెళుతుండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అదుపు తప్పిన బైక్ ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో చింతకుంట గ్రామ సమీపంలో బైక్ అదుపు తప్పడంతో రాజశేఖర్రెడ్డి అనే వ్యక్తికి గాయాలయ్యాయి. మంగళవారం ఉమ్మారెడ్డిపల్లెకు చెందిన రాజశేఖర్రెడ్డి తాడిపత్రి నుంచి మోటార్బైక్పై స్వగ్రామానికి వస్తుండగా గాలేరు–నగరి కాలువ వద్ద బైక్ అదుపుతప్పి కింద పడి పోయాడు. గాయపడిన ఆయనను 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వ్యక్తి ప్రాణాలు కాపాడిన పోలీసులు సుండుపల్లె : మండల పరిధిలోని చిన్నగొల్లపల్లి గ్రామ పంచాయతీ రాజయ్యగారిపల్లికి చెందిన మల్లికార్జుననాయుడు విష పదార్థం తీసుకొని ఆత్మహత్యకు పాల్పడుతున్నట్లు సుండుపల్లి ఎస్ఐ మహేష్కు ఫోన్లో సమాచారం ఇచ్చి అనంతరం ఫోన్ స్విచ్ ఆఫ్ చేశాడు. వెంటనే ఎస్ఐ స్పందించి ఆ వ్యక్తి లొకేషన్ ట్రేస్ చేసి సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కానిస్టేబుల్ వెంకటేష్ నాయక్, హోంగార్డు రవినాయక్, గ్రామస్తులు కలిసి మల్లికార్జుననాయుడును సకాలంలో రక్షించి 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. సుండుపల్లి పోలీసుల అప్రమత్తతతో ప్రాణాపాయం తప్పడంతో కుటుంబ సభ్యులు ఎస్ఐ మహేష్కు కృతజ్ఞతలు తెలిపారు. ఆరుగురికి గాయాలు -
ఇదేనా సంస్కరణ అంటే..!
బోధనేతర కార్యక్రమాలైన యాప్లలో వివరాలు నమోదు, ఆన్లైన్ కార్యక్రమాల వల్ల ఉపాధ్యాయులు, హెచ్ఎంలు తీవ్ర ఒత్తిడికి, ఆందోళనకు గురవుతున్నారు. తల్లిదండ్రుల మొబైల్ఫోన్లలో లీప్యాప్ తప్పనిసరిగా డౌన్లోడ్ చేయించాలని అధికారులు ఒత్తిడి చేయడం సరికాదు. గ్రామీణ ప్రాంతాల్లో బడుగు, బలహీన వర్గాల వారికి స్మార్ట్ఫోన్లు లేకపోయినా.. వంద శాతం డౌన్లోడ్ చేయాలని అధికారులు ఒత్తిడి తెస్తున్నారు. – శ్యాంసుందర్రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
నందలూరు రైల్వే కేంద్రానికి మహర్దశ !
రాజంపేట: రైల్వే పరంగా ఎంతో చారిత్రక ప్రాధాన్యం ఉన్న నందలూరు రైల్వే కేంద్రంలో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి కేంద్ర రైల్వేశాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ స్పష్టమైన హామీ ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. ఢిల్లీలోని పార్లమెంట్ భవనంలో రైల్వేమంత్రిని ఆయన స్వయంగా కలిసి నందలూరు అభివృద్ధిపై చర్చించారు. ప్రస్తుతం నందలూరులో ఉన్న ఆర్యూబీ అత్యంత ఇరుకుగా ఉండటం వల్ల బస్సులు, లారీలు, అత్యవసర అంబులెన్స్ వాహనాల రాకపోకలకు నిత్యం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదురవుతున్నాయని ఎంపీ మంత్రికి వివరించారు ఈ క్రమంలో ఇక్కడ ఆర్వోబీ నిర్మాణం ఎంతో అత్యవసరమని స్పష్టం చేయగా మంత్రి సానుకూలంగా స్పందించారు. అలాగే నందలూరు రైల్వే కేంద్రంలో గతంలో ఉన్న రైళ్లకు వాటరింగ్ సౌకర్యాన్ని పునరుద్ధరించడంపై ప్రత్యేక దృష్టి సారించినట్లు మేడా రఘునాథరెడ్డి వెల్లడించారు. గుత్తి–రేణిగుంట రైల్వే లైన్ మధ్య ప్రయాణించే అన్ని సుదూర ప్రాంత రైళ్లకు వాటరింగ్ సౌకర్యం కల్పించడానికి నందలూరు కేంద్రం భౌగోళికంగా ఎంతో అనుకూలమన్నారు. వైఎస్ఆర్సీపీ నేతలపై అక్రమ కేసులు – ఎంపీ, ఎమ్మెల్సీ సహా వందల మందిపై బనాయింపు కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లాలో ఈనెల 10వ తేదీన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా, డీఎస్సీ అభ్యర్థులను మోసం చేశారని..లోకేష్ రాజీనామా చేయాలంటూ ర్యాలీలను వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ ర్యాలీలో పాల్గొన్న వైఎస్ఆర్సీపీ నేతలపై జిల్లా వ్యాప్తంగా కడప, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం నియోజక వర్గాలలో పోలీసులు అక్రమ కేసులను బనాయించారు. వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప నగరంలోని వన్ టౌన్ పోలీస్ స్టేషన్ లో ర్యాలీ నిర్వహించారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాష, గుంటి నాగేంద్రతో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. జమ్మలమడుగులో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, ఇంకా 400 మందిపై కేసు నమోదు చేశారు. పులివెందులలో వైఎస్ఆర్సీపీ నగర అధ్యక్షుడు ఇంకా 50 మందిపై కేసు నమోదు చేశారు. కమలాపురం పరిధిలో నరేన్ రామాంజుల రెడ్డితో పాటు మరికొంతమందిపై కేసు నమోదు చేశారు. -
సహజత్వానికి దూరం.. సాఫల్య కేంద్రాలకు పయనం !
బద్వేలు: బంగారు సంతతీ.. బంగారు సంతతీ.. అంటూ దశాబ్దాల క్రితం ప్రతి ఇంటా మారుమోగిన పాటలు.. నేటి తరం దంపతుల జీవితాల్లో కన్నీటి ఆవేదనగా మారుతున్నాయి. కాలం, జీవనశైలి మారడంతో నేడు సంతానం కలగడం అంత సులభంగా లేదు. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లావ్యాప్తంగా సంతానలేమి సమస్యతో బాధపడే దంపతుల సంఖ్య రోజురోజుకూ వేగంగా పెరుగుతోంది. ఒకప్పుడు వంద మందిలో కేవలం ఒకరిద్దరు మాత్రమే ఈ సమస్యతో బాధపడేవారు. కానీ ఇప్పుడు ఆ సంఖ్య ఏకంగా 20 శాతం దాటినట్లు వైద్య గణాంకాలు చెబుతున్నాయి. కాగా సంతాన సాఫల్య కేంద్రాలకు ఒకప్పుడు హైదరాబాద్, చైన్నె, బెంగళూరు వంటి మహానగరాలు మాత్రమే పుట్టినిల్లుగా ఉండేవి. కానీ దూరప్రాంతాలకు వెళ్లలేని నిరుపేద, మధ్యతరగతి బాధితుల అవసరాలను ఆసరాగా చేసుకుని.. ఇప్పుడు మన జిల్లాలోనే పదుల సంఖ్యలో సంతాన సాఫల్య కేంద్రాలు వెలిశాయి. ముఖ్యంగా జిల్లా కేంద్రమైన కడపతో పాటు ప్రొద్దుటూరు పట్టణాల్లోనే 10 కి పైగా ఫెర్టిలిటీ కేంద్రాలు ఏర్పాటయ్యాయి. ఈ కేంద్రాల్లో ప్రస్తుతం ప్రతిరోజూ 30 నుంచి 40 మంది దాకా మహిళలు సంతానం కోసం ప్రత్యేక చికిత్సల నిమిత్తం వస్తున్నారు. సంతానలేమికి ప్రధాన కారణాలు ఇవే.. చాలామంది జీవితంలో స్థిరపడ్డాకే వివాహం చేసుకోవాలని 30 నుంచి 40 ఏళ్ల వయస్సు వచ్చినా పెళ్లిళ్లు వాయిదా వేసుకోవడం. సంతానలేమికి ప్రధాన కారణం. శారీరక శ్రమ లేదా వ్యాయామం అస్సలు లేకపోవడం, శృతిమించుతున్న స్థూలకాయం..మహిళల్లో అండాశయంలో నీటి బుడగలు లేదా తిత్తులు ఏర్పడటం, రాత్రివేళల్లో మొబైల్ ఫోన్లు ఎక్కువగా చూడటం వల్ల ఆలస్యంగా నిద్రపోవడం, పిజ్జాలు, బర్గర్ల లాంటి జంక్ఫుడ్ను విపరీతంగా తీసుకోవడం కూడా ఇందుకు కారణాలు. ఐవీఎఫ్ ఎప్పుడు అవసరమవుతుంది? సంతానం కలగని వారందరికీ ఐవీఎఫ్ అవసరం లేదు. ముందుగా వైద్యులు సహజ సిద్ధంగా గర్భం ధరించేలా చికిత్స అందిస్తారు. ఆ మార్గాలన్నీ విఫలమై, సహజ సిద్ధంగా గర్భధారణకు అస్సలు అవకాశం లేని దంపతులకు మాత్రమే ఐవీఎఫ్ చికిత్స అవసరమవుతుంది. ఫెలోపియన్ నాళాలు పూర్తిగా మూసుకుపోయినప్పుడు, అండాశయ ట్యూబ్స్ బ్లాక్ అయినప్పుడు, అండకణాల సంఖ్య చాలా తక్కువగా ఉన్నప్పుడు అవసరం. ప్రాథమిక సంతాన సాఫల్య చికిత్స అయిన ఐయూఐ పదే పదే విఫలమైనప్పుడు, మహిళల్లో ఎక్కువసార్లు అబార్షన్లు అయినప్పుడు, క్యాన్సర్ బారిన పడిన రోగులకు అవసరం. మగవారిలో వీర్యకణాల నాణ్యత తక్కువగా ఉన్నప్పుడు లేదా పూర్తిగా కణాలు లేనప్పుడు ఐవీఎఫ్ అనివార్యమవుతుంది. మారుతున్న జీవనశైలి, లేటు వయసు పెళ్లిళ్లు, జంక్ఫుడ్ సంస్కృతితో దంపతుల్లో తీవ్రమవుతున్న హార్మోన్ల అసమతుల్యత ఉమ్మడి జిల్లాలో ఏకంగా 20 శాతం దాటిన సంతానలేమి బాధితులు ఐవీఎఫ్ అంటే ఇన్ విట్రో ఫెర్టిలైజేషన్. ఇది ఒక అత్యాధునిక సంతానోత్పత్తి చికిత్స విధానం. శారీరక లోపాల వల్ల గర్భధారణ సాధ్యం కానప్పుడు.. ఐవీఎఫ్ పద్ధతిలో సీ్త్ర శరీరం నుంచి అండాలను, పురుషుని నుంచి శుక్ర కణాలను వెలికితీస్తారు. సేకరించిన అండం, శుక్రకణాలను అత్యాధునిక ల్యాబొరేటరీలో శాసీ్త్రయంగా కలుపుతారు. అక్కడ ఫలదీకరణం చెంది విజయవంతంగా రూపాంతరం చెందిన పిండాన్ని మరల సీ్త్ర గర్భాశయంలోకి జాగ్రత్తగా ప్రవేశపెడతారు. ఇది విజయవంతంగా గర్భధారణకు దారితీస్తుంది. -
అనుబంధ సంఘాలను బలోపేతం చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి అనుంబంధంగా ఉన్న సంఘాలను క్షేత్ర స్థాయి నుంచి బలోపేతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లా అనుబంధ విభాగాలను మరింత బలోపేతం చేసే దిశగా ఈనెల 12వ తేది నుంచి క్రమం తప్పకుండా సమావేశాలు నిర్వహించాలన్నారు. అనుబంధ విభాగాల పనితీరు, పార్టీ కార్యక్రమాలపై ఈ సమావేశాల్లో చర్చించాలని సూచించారు. ఈ సమావేశాలకు రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల అధ్యక్షులు, కమిటీ సభ్యులు హాజరు కావాలని ఆదేశించారు. నియోజకవర్గ అధ్యక్షులు, మండల అధ్యక్షులు, పార్టీ వివిధ విభాగాల బాధ్యులు సమావేశాలకు హాజరయ్యేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ అనుబంధ విభాగాలను క్షేత్రస్థాయిలో మరింత క్రియాశీలం చేయడమే ఈ సమావేశా ల ముఖ్య ఉద్దేశ్యమన్నారు. అనుబంధ విభాగాల బలోపేతంతో పార్టీ కార్యక్రమాలను ప్రజల్లోకి మరింత విస్తృతంగా తీసుకెళ్లేలా కార్యాచరణ రూపొందిస్తా మని వెల్లడించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులిసునీల్, జిల్లా అనుబంధ సంఘాల అధ్యక్షులు ఎస్. వెంకటేశ్వర్లు, వేణుగోపాల్ నాయక్, ఎన్. శివరామ్, మదీనా దస్తగిరి, లక్ష్మిరెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, డాక్టర్ నాగార్జునరెడ్డి, శ్రీకాంత్రెడ్డి, టీపీ వెంకట సుబ్బమ్మ, బండి దీప్తి, సాయిదత్త, సూర్యనారాయణ, జాషువా, మహబూబ్ బాష, పి. సంపత్కుమార్, చెన్నకేశవరెడ్డి, వరదారెడ్డి, రామక్రిష్ణారెడ్డి, హృషికేశవరెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
అంజన్నా.. నీటి కష్టాలు తీర్చన్నా..
● గండిలో ఓహెచ్ఎస్ఆర్ నిరుపయోగం ● ఫిల్టర్,పైపులైన్ కనెక్షన్లకు నిధుల కొరతచక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఈ ఏడాది శ్రావణ మాస ఉత్సవాలకు వచ్చే లక్షలాది మంది భక్తులకు తాగు నీటి ఇక్కట్లు తప్పేలా లేవు. భక్తుల సౌకర్యార్థం నీటి ఎద్దడి లేకుండా ఉండేందుకు నూతనంగా నిర్మించిన ఓహెచ్ఎస్ఆర్ ట్యాంకుకు ఫిల్టర్ వేసి పైపులైన్ల కనెక్షన్లు ఇవ్వక పోవడమే ఇక్కడ ప్రధాన సమస్యగా కనిపిస్తోంది. వివరాలు..గండిలో భక్తుల సౌకర్యార్ధం లక్ష లీటర్ల సామర్థ్యంతో ఓహెచ్ఎస్ఆర్ నిర్మించాలని ఆలయ మాజీ చైర్మన్ కావలి కృష్ణతేజ, చక్రాయపేట జెడ్పీటీసీ సభ్యుడు శివప్రసాదరెడ్డిలు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డిల దృష్టికి తీసుకెళ్లారు.ఇందుకు జెడ్పీ చైర్మన్ రు.25లక్షలు జెడ్పీ నిధుల(15వ ఆర్థిక సంఘం)నుంచి మంజూరు చేశారు. ఆ నిధులతో 40వేల లీటర్ల సామర్థ్యంతో ట్యాంకు నిర్మించేందుకు టెండర్లు నిర్వహించారు. పనులు ప్రారంభించి ట్యాంక్ నిర్మాణం పూర్తి చేశారు. ఓహెచ్ఎస్ఆర్ పనులు చేసిన కాంట్రాక్టర్ రామసుబ్బారెడ్డి స్వామిపై భక్తితో తన సొంత నిధులు కొంత వెచ్చించి 40 వేల లీటర్ల సామర్థ్యం అయితే 60 వేల లీటర్ల నీళ్లు పట్టేలా నిర్మించారు. పనులన్నీ సుమారు రెండు నెలల క్రితమే పూర్తయ్యాయి, కనెక్షన్ ఇవ్వక పోవడంతో ఓహెచ్ఎస్ఆర్కు కనెక్షన్ ఇవ్వక పోవడంతో అది నిరుపయోగంగా మారనుంది.పాపాఘ్ని నదిలో ఫిల్టర్ వేసి మోటారు బిగించి ట్యాంకుకు కనెక్షన్ ఇస్తే వెంటనే అది భక్తులకు అందుబాటులోకి వస్తుంది.ఫిల్టర్ మోటర్,పైపు లైన్లకు నిధుల లేమి కారణంగా ఏమి చేయలేక పోతున్నట్లు ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పేర్కొంటున్నారు. కూటమి నేతలు కలెక్టర్తో మాట్లాడి ఆయన ద్వారా నైనా నిధులు మంజూరు చేయిస్తే ఓహెచ్ఎస్ఆర్ అందుబాటులోకి వస్తుందని భక్తులు పేర్కొంటున్నారు. -
హరివిల్లులా శ్రావణం.. ప్రతి ఇల్లూ హరినందనం !
రాజంపేట టౌన్/కడప సిటీ: ఆకుపచ్చని ఆషాఢం ముగిసి, ముంగిట తోరణాలు కట్టే శ్రావణం వచ్చేసింది. క్యాలెండర్లో శ్రావణ మాసం అడుగుపెడుతుంటే నే చాలు.. తెలుగు ఇంటి కోడలి మనసు నోముల వైపు పరుగులు తీస్తుంది. ఈ పవిత్ర మాసం ప్రారంభం కానుండటంతో, లక్ష్మీదేవికి స్వాగతం పలికేందుకు ముంగిళ్లు ముస్తాబవుతున్నాయి. ఈ ముప్పై రోజులూ పల్లె, పట్నం అనే తేడా లేకుండా ప్రతి ఇల్లూ ఒక నందనవనాన్ని తలపించనుంది. శ్రవణ నక్షత్రం.. విష్ణు ప్రశస్తం పౌర్ణమి నాడు చంద్రుడు శ్రవణా నక్షత్రానికి సమీపంలో సంచరించడం వల్లే ఈ మాసానికి శ్రావణం అనే పేరు వచ్చింది. శ్రవణ నక్షత్రం సాక్షాత్తు ఆ శ్రీమహావిష్ణువు జన్మ నక్షత్రం కావడంతో.. ఈ నెలంతా హరినామ స్మరణతో మారుమోగిపోతుంది. శ్రావణంలో వచ్చే ప్రతి రోజూ పవిత్రమైనదే అ యినా.. మంగళ, శుక్ర, శనివారాలకు ఉన్న ప్రాధాన్యత వేరు. మంగళవారం మంగళగౌరి పూజలతో కొత్త కోడళ్లు, శుక్రవారం వరలక్ష్మీ వ్రతాలతో ముత్తై దువులు, శనివారం వేంకటేశ్వరుడి కొలువుతో ఇళ్లు ఆధ్యాత్మిక శోభను సంతరించుకోనున్నాయి. ఈసారి ఐదు శుక్రవారాల మురిపెం ఈ ఏడాది శ్రావణ మాసంలో ఒక అద్భుతమైన విశేషం ఉంది. మాసం ప్రారంభమైన మరుసటి రోజే మహాలక్ష్మికి ప్రీతిపాత్రమైన శుక్రవారం రానుంది. అంతేకాదు, ఈసారి శ్రావణంలో మొత్తం ఐదు శుక్రవారాలు రావడం మరింత విశేషం. దీంతో లక్ష్మీదేవి ఆరాధనకు, ఉపవాస దీక్షలకు మహిళలు ఇప్పటికే పట్టుచీరలు, పూజా సామగ్రిని సిద్ధం చేసుకుంటున్నారు. స్థానిక అమ్మవారి ఆలయాలన్నీ ప్రత్యేక అలంకరణలు, శ్రావణ మంగళ హారతులతో భక్తులను ఆకర్షించనున్నాయి. బంధాల పండుగలు.. పెళ్లిళ్ల సందడులు సంస్కృతి, సాంప్రదాయాల సమాహారమైన శ్రావణంలో.. వరలక్ష్మీ వ్రతంతో పాటు నాగుల చవితి, బంధాల మాధుర్యాన్ని పంచే రాఖీ పౌర్ణమి, ఉట్టి సంబరాల శ్రీకృష్ణాష్టమి వంటి పెద్ద పండుగలు వరుసకట్టనున్నాయి. ఇవన్నీ కుటుంబాల మధ్య బాంధవ్యాలను మరింత పెంచనున్నాయి. మరోవైపు, చాన్నాళ్లుగా మూతపడిన శుభముహూర్తాల గడియలు మళ్లీ తెరుచుకోవడంతో పెళ్లి బాజాలు మోగనున్నాయి. బంధువుల రాకపోకలు, పట్టువస్త్రాల హడావుడితో శ్రావణం సరికొత్త ఉత్సాహాన్ని తీసుకురానుంది. కళ్యాణ మండపాలు కళకళ.. ఉపాధి పండగ ఆషాఢ మాసం కారణంగా నిలిచిపోయిన శుభ ముహూర్తాలు శ్రావణం రాకతో మళ్లీ ఊపందుకున్నాయి. వివాహాలతో పాటు గృహప్రవేశాలు, భూమి పూజలు, సత్యనారాయణస్వామి వ్రతాలు వంటి ఎన్నో శుభకార్యాలు ఈ నెలలోనే నిర్వహించేందుకు జనం సిద్ధమయ్యారు. దీంతో జిల్లాలోని కళ్యాణ మండపాలన్నీ ఇప్పటికే పూర్తిగా బుక్ అయిపోయి కళకళలాడుతున్నాయి. ఈ శ్రావణ సీజన్ పై వస్త్ర దుకాణాలు, బంగారు వ్యాపారులు, మంగళవాయిద్యాల కళాకారులు, పూల వ్యాపారులు, క్యాటరింగ్ సిబ్బంది, డెకరేషన్ నిర్వాహకులు, ఆర్కెస్ట్రా బృందాల వంటి ఎంతోమంది ఉపాధి కార్మికులు భారీ ఆశలు పెట్టుకున్నారు. శాఖాహారంతోనే ఆరోగ్యం.. శ్రావణ మాసం కేవలం ఆధ్యాత్మిక పరంగానే కాకుండా ఆరోగ్య రీత్యా కూడా ఎంతో మేలు చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. ప్రస్తుతం మొబైల్ యాప్ లలో ఆర్డర్ పెడితే నిమిషాల్లో ఇంటికే మాంసాహారం వచ్చే వెసులుబాటు ఉండటంతో చాలామంది ఎప్పుడు పడితే అప్పుడు అతిగా తింటూ అనారోగ్యాల పాలవుతున్నారు. ఇలాంటి తరుణంలో శ్రావణ నియమాల వల్ల మెజారిటీ ప్రజలు మాంసాహారానికి దూరంగా ఉంటూ కేవలం సాత్విక, శాఖాహార భోజనానికే ప్రాధాన్యత ఇస్తారు. ఇది శరీర జీర్ణవ్యవస్థను మెరుగుపరిచి ఆరోగ్యానికి ఎంతో మేలు చేకూరుస్తుంది. దీనికి తోడు మహిళలు, పురుషులు ఉదయాన్నే స్నానాలు ఆచరించి ఆలయాలు, ఇళ్లలో నిత్యం పూజలు చేయడం వల్ల మానసిక ప్రశాంతత లభిస్తుంది. ఈ మాసమంతా ఆధ్యాత్మిక చింతనతో గడపడం వల్ల మనిషిని సన్మార్గం వైపు పయనింపజేసేందుకు దోహదపడుతుంది. శ్రావణమాసం ఎంతో శుభప్రదమైనది. ఈ మాసం మానవాళికి జ్ఞానసిద్ధిని అందించే కాలంగా పురాణాల్లో కూడా ప్రత్యేకంగా ప్రస్తావించబడింది. శ్రావణ మాసంలో వచ్చే ప్రతి రోజూ ఎంతో పవిత్రమైనది మరియు సకల దేవతారాధనకు అత్యంత అనుకూలమైనది. ముఖ్యంగా ఈ నెలలో మహిళలు శ్రద్ధతో చేసే లలితా సహస్రనామ పారాయణం వల్ల అపారమైన పుణ్య ఫలాలు సిద్ధిస్తాయి. – జనార్దన్ స్వామి, పురోహితుడు నోములు, వ్రతాల వేళ.. ముంగిట ముగ్గుల హేల పెళ్ళి బాజాల సందడి.. ఆలయాల్లో ఆధ్యాత్మిక సడి ఐదు శుక్రవారాల మురిపెం.. ఈ నెలంతా లక్ష్మీ కటాక్షం రేపటి నుంచి శ్రావణమాసం ప్రారంభం -
‘నేషనల్ గ్రాప్లింగ్’లో ప్రథమ స్థానం
కడప ఎడ్యుకేషన్ : ఉత్తరాఖండ్లోని హరిద్వార్లో ఈ నెల 1 నుంచి 7 వరకు జరిగిన నేషనల్ రెజ్లింగ్ గ్రాప్లింగ్ చాంపియన్షిప్ 2026–27 పోటీల్లో కడప ఎస్కేఆర్ – ఎస్కేఆర్ ఉమెన్స్ కళాశాల విద్యార్థిని పోలి చైత్ర అద్భుత విజయం సాధించారు. కడప జిల్లా నుంచి ప్రాతినిధ్యం వహించిన చైత్ర అండర్ 19 విభాగంలో 65 కిలోల బరువు విభాగంలో బీచ్ గ్రాప్లింగ్ స్టైల్ పోటీల్లో పాల్గొని ప్రథమ స్థానం సాధించి బంగారు పతకం కై వసం చేసుకున్నారు. ఈ పోటీలను ఏపీ బీచ్ గ్రాప్లింగ్ అసోసియేషన్, రెజ్లింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆ విద్యార్థి ని మంగళవారం కళాశాలలో ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.స్మిత, రాజనీతి శాస్త్ర విభాగాధిపతి పి.వి.సుబ్బారెడ్డి, ఎన్సీసీ సీటీఓ సుజాత, ఐక్యూఏసీ కోఆర్డినేటర్ కృష్ణవేణితోపాటు అధ్యాపక, అధ్యాపకేతర సిబ్బంది అభినందించారు. మద్యం మత్తులో యువకుడిపై దాడిమైదుకూరు : బార్లో మద్యం తాగుతుండగా నాయని వీరేష్ అనే యువకుడిపై మద్యం మత్తులో ఉన్న మరో యువకుడు రాకేష్ దాడి చేసి గాయపరిచిన సంఘటన మంగళవారం మైదుకూరులో జరిగింది. స్థానిక సీపీఐ కాలనీకి చెందిన వీరేష్ అరటి తోటల్లో కూలి పనికి వెళుతుంటాడు. మంగళవారం బద్వేలు రోడ్డులోని బార్లో మద్యం తాగుతుండగా.. అరుంధతి నగర్కు చెందిన రాజేష్ అతనిని తిట్టి దాడి చేశాడు. వెంట తెచ్చుకున్న ఇనుప రాడ్తో తలపై మోదాడు. గాయపడిన వీరేష్ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కూలిన చౌడు మిద్దె పైకప్పుమైదుకూరు : మున్సిపాలిటీ పరిధిలోని మామిళ్లపల్లె కొత్తపల్లెలో మంగళవారం తెల్లవారుజామున వర్షానికి నానిపోయి పెద్ద రోశయ్యకు చెందిన చౌడు మిద్దె పైకప్పు కూలిపోయింది. ఆ సమయంలో ఇంట్లో పెద్ద రోశయ్య, ఓబుళమ్మ దంపతులు నిద్రిస్తున్నారు. మంచం పక్కగా పైకప్పు కూలడంతో వారికి ఎలాంటి గాయాలు కాలేదు. పైకప్పు కూలిన శబ్దానికి ఇరుగుపొరుగు వారు వచ్చి గోడకు ఉన్న గూటి బండను తొలగించి లోపల ఉన్న వారిని బయటికి తెచ్చారు. కేసు నమోదుమైదుకూరు : మైదుకూరు శివారులో సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు మంగళవారం తెలిపారు. కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై వెంకటేశ్వరస్వామి గుడి వద్ద కారు, బైక్ను ఢీకొన్న సంఘటనలో చెన్నూరుకు చెందిన ముగ్గురు యువకులు గాయపడిన సంఘటన తెలిసిందే. -
అఖిల భారత పోలీస్ గేమ్స్లో సత్తా
కడప అర్బన్ : తెలంగాణలోని హైదరాబాద్ నగరం గచ్చిబౌలిలో జూలై 23 నుంచి 30 వరకు నిర్వహించిన 11వ అఖిల భారత పోలీస్ గేమ్స్–2026లో కడప జిల్లా పోలీస్ సిబ్బంది విశేష ప్రతిభ కనబరిచి సత్తా చాటారు. క్రీడల్లో అత్యుత్తమ ప్రదర్శన కనబరిచిన పోలీస్ సిబ్బంది ప్రొద్దుటూరు త్రీటౌన్ పి.ఎస్ మహిళా కానిస్టేబుల్ పి.శివకుమారి, ప్రొద్దుటూరు టూ టౌన్ ఎస్ఐ ఎస్.మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పీఎస్ కానిస్టేబుల్ ఎస్.పి.మహబూబ్ బాషాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మంగళవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో అభినందించారు. ఈ ప్రతిష్టాత్మక జాతీయ స్థాయి పోలీస్ క్రీడా పోటీలలో వ్యక్తిగత విభాగంలో ప్రొద్దుటూరు త్రీ టౌన్ పి.ఎస్ (డబ్ల్యూ పీసీ–2186) పి.శివకుమారి పెంచాక్ సిలాట్ క్రీడలో ఓపెన్ 2 ఓవర్ 100 కేజీ విభాగంలో రజత పతకం సాధించారు. ప్రొద్దుటూరు టూటౌన్ పీఎస్ ఎస్ఐ ఎస్.మహబూబ్ బాషా, ప్రొద్దుటూరు ట్రాఫిక్ పీఎస్ (పీసీ–2559) ఎస్.పి.మహబూబ్ బాషా తైక్వాండో క్రీడలో పూమ్సే విభాగంలో క్వార్టర్ ఫైనల్ వరకు చేరుకుని విశేష ప్రతిభ కనబరిచారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
● వన్డేభారత్ !
చిత్రంలో కనిపిస్తున్న నిగనిగలాడే ఆధునిక రైలే ‘వందేభారత్ ఎక్స్ప్రెస్’. జిల్లా రైలు మార్గంలో ఈ వేగవంతమైన రైలు పరుగులు తీస్తుంటే చూసి మురిసిపోవడం స్థానికుల వంతవుతోంది. అయితే, ఇది సామాన్య ప్రయాణికులకు అందుబాటులోకి వచ్చిన రైలు అనుకుంటే పొరపాటే! కేవలం టెస్టింగ్ కోసం ‘ఒక్క రోజు’ వచ్చి వెళ్లే మురిపెంగానే మిగిలిపోతోంది. రైల్వే అధికారులు కేవలం ఖాళీ కోచ్లతో, సిబ్బందితో కలిసి ఇప్పటివరకు ఐదుసార్లు ఇక్కడ టెస్టింగ్ ట్రిప్పులు నిర్వహించారు. తాజాగా గురువారం నాడు తిరుపతి–సికింద్రాబాద్ మధ్య నడిచే వందేభారత్ రైలును నిర్దేశించిన వేగంతో రేణిగుంట నుంచి నందలూరు వరకు పరుగెత్తించారు. విజయవాడ, చైన్నె రూట్లలో రైళ్ల రద్దీ ఎక్కువగా ఉండటం వల్ల ప్రయోగాత్మక పరీక్షలకు ఇబ్బందిగా మారుతోంది. అదే సమయంలో రేణిగుంట–కడప మధ్య ట్రాఫిక్ తక్కువగా ఉండటంతో, రైల్వే అధికారులు వందేభారత్ ట్రయల్ రన్స్కు ఈ మార్గాన్ని వేదికగా చేసుకున్నారు. పట్టాలపై దూసుకెళ్తున్న ఈ రైలును చూసి, త్వరలోనే తమకూ వందేభారత్ సేవలు అందుతాయనే ఆశతో స్థానిక ప్రయాణికులు ఎదురుచూస్తున్నారు. రాయలసీమలో అత్యంత కీలకమైన ‘గుత్తి–రేణిగుంట’ రైలు మార్గంలో మాత్రం రెగ్యులర్ సర్వీసును ప్రారంభించకుండా రైల్వేశాఖ ముఖం చాటేయడంపై స్థానికులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. – రాజంపేట -
డిమాండ్ల సాధన కోసం జూడాల ఆందోళన
కడప అర్బన్ : ఆంధ్రప్రదేశ్ జూనియర్ డాక్టర్స్ అసోసియేషన్ (ఏపీ జూడా) ఇచ్చిన పిలుపుతతో ప్రభుత్వ వైద్య కళాశాల, జీజీహెచ్ ఆవరణలో ఇంటర్న్షిప్స్, పోస్ట్ గ్రాడ్యుయేట్స్, సూపర్ స్పెషాలిటీ పీజీలు, సీనియర్ రెసిడెంట్స్ రాష్ట్ర వ్యాప్త సమ్మెలో భాగంగా ఫేజ్–1ను మంగళవారం ప్రారంభించారు. జూనియర్ డాక్టర్ల న్యాయబద్ధమైన, దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న డిమాండ్ల సాధన కోసం ఈ సమ్మెను ఐక్యంగా, శాంతియుతంగా నిర్వహిస్తున్నట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీ జూనియర్ డాక్టర్ల అసోసియేషన్ కడప జీఎంసీ యూనిట్ నుంచి జనరల్ సెక్రటరీ డాక్టర్ మేఘన, ఉపాధ్యక్షుడు డాక్టర్ ఏ.లక్ష్మీకాంత్, కార్యదర్శి డాక్టర్ కె.యశ్వంత్ కృష్ణ, ఉపాధ్యక్షుడు ఎస్.యశ్వంత్కృష్ణ మాట్లాడారు. జూనియర్ డాక్టర్ల స్టైఫండ్ను పెంచాలన్నారు. సవరించిన స్టైఫండ్ను ఈ ఏడాది జనవరి 1 నుంచి అమలు చేయాలన్నారు. వైద్యుల రిటైర్మెంట్ వయసును 65 ఏళ్లకు పెంచడాన్ని వ్యతిరేకిస్తున్నామన్నారు. ఎన్ఎంసీ నిబంధనలను పాటించాలన్నారు. మెడికల్ ఫ్యాకల్టీ పోస్టుల్లో ఎం ఎస్సీ/పీహెచ్డీ వంటి నాన్–మెడికల్ ఫ్యాకల్టీ నియామకాలు చేపట్టకూడదన్నారు. ప్రభుత్వ వైద్య కళాశాలలు, ఆసుపత్రుల్లో ప్రాథమిక మౌలిక సదుపాయాలు, అవసరమైన సౌకర్యాలను మెరుగుపరచాలన్నారు. అనంతరం కడప జీజీహెచ్ రిమ్స్ ఐపీ నుంచి ఓపీ, వైద్య కళాశాల వరకు నిరసన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ రెసిడెంట్లు, జూనియర్ డాక్టర్లు, హౌస్ సర్జన్లు, వైద్య విద్యార్థులు పాల్గొన్నారు. -
రైతాంగ ఉద్యమాలు తప్పవు
● ప్రత్యామ్నాయ మార్గాలున్నా నీరివ్వకపోవడం దారుణం ● శ్రీశైలంలో రోజురోజుకూ తగ్గుతున్న నీటి నిల్వలుకడప కార్పొరేషన్ : తుంగభద్ర జలాశయంలో 85 టీఎంసీల నీరు చేరిందని, అందులోంచి ఆంధ్రప్రదేశ్ వాటా నీటితో గండికోట జలాశయంలో ప్రస్తుతం 15 టీఎంసీల నీరు నిల్వ ఉందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తెలిపారు. గండికోట కింద పంట కాలువలు పూర్తి కానందున, ఆ నీటిని కేసీ కాలువకు మళ్లించి రైతులకు ఇవ్వవచ్చని చెప్పారు.ఇలాంటి ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషించకుండా, రైతుల పరిస్థితిని అర్థం చేసుకోకుండా నంద్యాల కలెక్టర్ ప్రకటన చేయడం దారుణమన్నారు. శ్రీశైలం జలాశయంలోకి వచ్చే నీటికంటే వివిధ పథకాలకు, విద్యుత్ ఉత్పత్తికి వాడుతున్న నీరే ఎక్కువగా ఉండటంతో రోజురోజుకూ నీటి మట్టం తగ్గిపోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. 2012లో కేవలం 868 అడుగుల నీరు ఉన్నప్పుడే కేసీ కాలువ ఇరుకారు పైర్లకు నీరు ఇచ్చిన దాఖలాలు ఉన్నాయని గుర్తుచేశారు. కలెక్టర్ చేసిన ఆ ప్రకటనను ప్రభుత్వం సమర్థిస్తుందో లేదో స్పష్టం చేయాలని రెడ్యం డిమాండ్ చేశారు. తక్షణమే కేసీ కాలువకు నీటిని విడుదల చేయించాలని, లేనిపక్షంలో రైతాంగంతో కలిసి పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. -
అదృశ్యమైన బాలుడి మృతి
చాపాడు : మండల పరిధిలోని మడూరు గ్రామంలో సోమవారం సాయంత్రం కనిపించకుండా పోయిన పబ్లేటి మెహనూర్ అలియాస్ ఆసిఫ్(11) మంగళవారం సాయంత్రం విగతజీవిగా కనిపించాడు. ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్కూల్ నుంచి ఇంటికి వచ్చిన బాలుడు ఆడుకోవడానికి అని బయటికి వెళ్లి కనిపించలేదన్నారు. బాలుడి తండ్రి మహమ్మద్ రఫీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. డ్రోన్ కెమెరాలతో గాలింపు చేపట్టగా గ్రామంలోని మహబూబ్ బాషా, కొండా సుబ్బారెడ్డి గృహాల మధ్య బాలుడిని గుర్తించామన్నారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారన్నారు. మృతదేహాన్ని రూరల్ సీఐ శివశంకర్ పరిశీలించారు. బాలుడి ఒంటిపై గాయాలు ఉండటంతో విద్యుత్ ప్రమాదానికి గురై మృతి చెంది ఉంటాడని పోలీసులు భావిస్తున్నారు. అన్నపై దాడి కేసులో ఏడేళ్లు జైలురాజంపేట : తిరుపతి జిల్లా పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లె దళితవాడకు చెందిన దాస్తోటి సుబ్రమణ్యం.. తన అన్న దాస్తోటి నారాయణపై కొడవలితో దాడి చేసిన కేసులో.. నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ.10 వేల జరిమానా విధిస్తూ రాజంపేట అసిస్టెంట్ సెషన్స్ జడ్జి నక్క లావణ్య మంగళవారం తీర్పు ఇచ్చారు. రైల్వేడూరు సీఐ డి.శ్రీనివాసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లె దళితవాడకు చెందిన దాస్తోటి సుబ్రమణ్యం, దాస్తోటి నారాయణ అన్నదమ్ములుగా ఉన్నారు. పెద్దల ఆస్తిగా ఉన్న మేకల పంపకంలో.. 2019లో అన్న, తమ్ముడి మధ్య గొడవ జరిగింది. ఈ క్రమంలో దాస్తోటి నారాయణపై కొడవలితో దాడి చేసి, గాయపరిచారు. అప్పట్లో ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదుతో అప్పటి ఎస్ఐ వినోద్కుమార్ కేసు నమోదు చేశారు. నిందితుడిని అరెస్టు చేసి, దర్యాప్తు చేపట్టారు. కేసు విచారణ సమయంలో రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసులు, కోడూరు రూరల్ సీఐ డి.శ్రీనివాసులు పర్యవేక్షణలో పుల్లంపేట ఎస్ఐ చిన్నరెడ్డప్ప కోర్టుకు సాక్షులను హాజరు పరిచారు. ప్రభుత్వం తరఫున అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థంగా వాదనలు వినిపించారు. పులివెందుల రూరల్ : బీటెక్ రవి అవాస్తవాలు మాట్లాడుతూ డీఎస్సీ అభ్యర్థులను మోసం చేస్తున్నారని డీఎస్సీ అభ్యర్థులు జిలాన్బాషా, భాస్కర్ ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం సాయంత్రం వారు పట్టణంలోని బాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత కొన్ని రోజులుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న నిరాహార దీక్షలో కూడా తాము పాల్గొన్నామన్నారు. తమతోపాటు వందలాది మంది డీఎస్సీ అభ్యర్థుఽలు పాల్గొన్నారన్నారు. అలాగే డీఎస్సీ అభ్యర్థులకు మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన ర్యాలీలో కూడా డీఎస్సీ అభ్యర్థులు పాల్గొన్నారన్నారు. తమకు జరిగిన అన్యాయంపై బీటెక్ రవి స్పందించకుండా తమకు సంఘీభావం తెలిపిన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీపై బురద జల్లడం సరికాదన్నారు. -
బ్యాడ్మింటన్ పోటీలకు న్యాయనిర్ణేతగా ఎంపిక
రాజుపాళెం : రాజుపాళెం మండలంలోని వెలవలి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల పీడీ సి.చంద్ర ఓబుళ రెడ్డికి ఢిల్లీలో జరిగే పోటీలకు రావాలని పిలుపు వచ్చింది. ఈ నెల 17 నుంచి 23వ తేదీ వరకు ఢిల్లీలో జరగబోవు బ్యాడ్మింటన్ ఓల్డ్ చాంపియన్ 2026 టోర్నమెంట్కు న్యాయ నిర్ణీతగా ఎంపికై నట్లు ఆయన సోమవారం తెలిపారు. ఆయనకు ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందనలు తెలిపారు. లయోలా కళాశాలకు ‘అటానమస్’ హోదాపులివెందుల టౌన్ : స్థానిక లయోలా డిగ్రీ కళాశాలకు యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్ స్వయంప్రతిపత్తి హోదాను మంజూరు చేసిందని కళాశాల ప్రిన్సిపల్ ఫాదర్ జోజిరెడ్డి తెలిపారు. సోమవారం ఆయన మాట్లాడుతూ.. ఈ హోదా 2026–27 నుంచి 2030–31 వరకు ఐదు విద్యా సంవత్సరాల పాటు అమల్లో ఉంటుందని, కళాశాల ప్రస్థానంలో ఇది ఒక చరిత్రాత్మక మైలురాయి అని చెప్పారు. 1979లో స్థాపించిన లయోలా కళాశాల నాణ్యమైన విద్యా సేవలకు దక్కిన గుర్తింపుగా దీనిని భావించవచ్చునన్నారు. ఈ సందర్భంగా కళాశాల అభివృద్ధికి పునాది వేసిన వైఎస్సార్ కుటుంబ సభ్యులు దివంగత వైఎస్ రాజారెడ్డి, వైఎస్ జయమ్మ, వైఎస్ రాజశేఖరరెడ్డి, వైఎస్ వివేకానందరెడ్డిలను ఆయన గుర్తుచేసుకున్నారు. దశాబ్దాలుగా సేవలు అందించిన సిబ్బందికి, పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు.లారీని ఢీకొన్న కారు: వ్యక్తి మృతి చెన్నూరు (వల్లూరు) : హైదరాబాద్ నుంచి పుత్తూరుకు వెళుతున్న కారు చెన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని పాత టోల్గేట్ వద్ద ఆగి ఉన్న లారీని వెనుకనుంచి ఢీకొనడంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. హ్యుందాయ్ వెన్యూ ఏపీ 07 జేయూ 2869 అనే కారులో ఐదుగురు ప్రయాణికులు ఉన్నారు. డ్రైవర్ కం ఓనర్ వెంకట శివకుమార్రాజు, ఆయన తల్లి దాసర మంగమ్మ సురక్షితంగా బయటపడ్డారు. వెనక సీటులో ప్రయాణిస్తున్న వారిలో వారి దగ్గరే పనిచేస్తున్న ముగ్గురు బీహారీ కార్మికులు ఉన్నారు. కారు ఢీ కొట్టిన కుదుపుకు వెనక సీటులో ఉన్న ముగ్గురిలో మధ్యలో కూర్చున్న పవన్ కోమన్ (48) అనే వ్యక్తి అద్దాలు తగిలి అక్కడికక్కడే మరణించాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు రిమ్స్ ఆస్పత్రికి తరలించారు. చెన్నూరు పోలీసులు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులపై ప్రభుత్వం ‘విషప్రచారం’బద్వేలు (అట్లూరు): శ్వేతపత్రం విడుదల పేరుతో ఉద్యోగ, ఉపాధ్యాయులపై కూటమి ప్రభుత్వం విషప్రచారం చేస్తోందని యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు మదన విజయకుమార్ మండిపడ్డారు. సోమవారం బద్వేలు జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వద్ద యూటీఎఫ్ 52వ ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఆయన పతాకాన్ని ఆవిష్కరించి మాట్లాడారు. ఉద్యోగుల అండతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం.. వారిని పూర్తిగా విస్మరించిందన్నారు. పీఆర్సీ గడువు ముగిసి మూడున్నరేళ్లు దాటినా 12వ పీఆర్సీని అమలు చేయకుండా మీనమేషాలు లెక్కిస్తోందని ధ్వజమెత్తారు. చెల్లించాల్సిన ఐదు డీఏలలో ఒక్కటి మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకుందని, ఆర్థిక బకాయిలు పూర్తిగా ఇవ్వలేదని విమర్శించారు. బడ్జెట్లో ఉద్యోగుల జీతాలు, పెన్షన్లకు కేవలం 28.4 శాతమే కేటాయించినప్పటికీ, 95 శాతం జీతాలకే పోతోందంటూ తప్పుడు ప్రచారం చేయడం వెనుక 12వ పీఆర్సీలో అన్యాయం చేసే కుట్ర దాగి ఉందని ఆరోపించారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా నాయకులు సుధాకర్, శివప్రసాద్, పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పారిశ్రామికవేత్తలుగా ఎదగాలి
వేంపల్లె : ట్రిపుల్ ఐటీ విద్యార్థులు సరికొత్త ఆలోచనలతో ప్రపంచ స్థాయిలో గుర్తింపు పొందేలా, పారిశ్రామికవేత్తలుగా ఎదగాలని ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ప్రొఫెసర్ డాక్టర్ విజయ్ ప్రకాష్ పిలుపునిచ్చారు. సోమవారం ఇడుపులపాయ క్యాంపస్లో ఆర్జీయూకేటీ ఆధ్వర్యంలో ‘స్టార్టప్ కడప – ఎంటర్ప్రెన్యూర్షిప్ ఎకోసిస్టమ్’ అనే అంశంపై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కడప కలెక్టరేట్ ప్రతినిధి గోవర్ధన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ.. యువత కేవలం ఉద్యోగులుగా కాకుండా, ఇతరులకు ఉపాధి కల్పించే స్థాయికి ఎదగాలన్నారు. వ్యాపార రంగంలో వచ్చే ఆర్థిక నష్టాలను ధైర్యంగా ఎదుర్కొనే నాయకత్వ లక్షణాలు అలవర్చుకోవాలని సూచించారు. కొత్త ఆలోచనలను ఆచరణలో పెట్టేందుకు లభించే ఆర్థిక సహాయ మార్గాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. సదస్సులో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి డాక్టర్ పెనుకొండ రవికుమార్, డీన్ డి.రమేష్ కై లాస్, పీఆర్ఓ డాక్టర్ జి.తిరుపతి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
........
మదనపల్లి టౌన్: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో అనూహ్యంగా సంభవించిన అనారోగ్యం కోలుకోలేని దెబ్బ తీసింది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం, వేపుమానుపేట గ్రామం, కొత్తపూల వాండ్లపల్లికి చెందిన యోగేశ్వర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు ఊహించని విధంగా, అత్యంత వేగంగా పడిపోతుండటంతో ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు.చిన్న ఉద్యోగం.. అంతలోనే ఆర్థిక సంక్షోభంయోగేశ్వర్ రెడ్డి బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతాయుతంగా, కంటికి రెప్పలా పోషించేవారు. కుటుంబానికి ఏకై క జీవనాధారమైన వ్యక్తి ఇలా ఆసుపత్రి పాలుకావడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య, బంధువులు, మిత్రులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలు నిలవాలంటే సుమారు రూ.50 లక్షలకు పైగా భారీ వ్యయంతో కూడిన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు.ఉన్న భూమిని అమ్మేసినా దక్కని ప్రాణభిక్ష..భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు తన శక్తిమేరకు సర్వస్వం ఖర్చు పెట్టింది. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూమిని సైతం కన్నీటితో విక్రయించి, ఇప్పటివరకు రూ.25 లక్షలను వైద్య ఖర్చుల కోసం వినియోగించింది. ఇప్పటికే సగం ఖర్చు భరించిన ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు రూపాయి కూడా పుట్టని దయనీయ స్థితిలో పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను ఇలాగే కొనసాగించాలన్నా, ఆయనకు పూర్తిస్థాయి ప్రాణభిక్ష దక్కాలన్నా తక్షణమే అదనంగా మరో రూ.25 లక్షల ఆర్థిక సహాయం అత్యవసరంగా అవసరమవుతోంది. కళ్లముందే కుటుంబ పెద్ద కనుమూసే దుస్థితిని చూస్తూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది. సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, మానవతావాదులు స్పందించి యోగేశ్వర్ రెడ్డి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు అందించే సాయం రూ.100 అయినా, రూ.500 అయినా రూ.1,000 అయినా మీకు సాధ్యమైనంత సహాయం చేయండి. చిన్న సహాయం కూడా, అనేక మంది కలిసి అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద బలంగా మారుతుంది. ఒక్క సహాయంం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వగలదు. మనందరి చేయూతం ఆ తండ్రిని తన కుటుంబం చెంతకు చేర్చగల అవకాశం కావచ్చు. వ సహాయం చేయాలనుకునే వారు 9494852304 నంబర్కు ఫోన్పే లేదా గూగుల్పే ద్వారా నగదు పంపవచ్చు. లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాండూరు శాఖకు చెందిన అకౌంట్ నంబర్: 30754629889, ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN0010187 ద్వారా కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ చేసి యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలను కాపాడవచ్చు. -
హజ్ యాత్రికులకు కడపలోనే ఇమిగ్రేషన్ ఏర్పాటు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : కడప విమానాశ్రయం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని వసతులు కలిగిన నేపథ్యంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి ఇమిగ్రేషన్తోపాటు కడప నుంచి నేరు గా విమానం ద్వారా జిద్దాకు చేరుకునేలా చూ డాలని ఏపీ ఉలేమా అయిమ్మ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో డీఆర్వో మల్లికార్జునుడికి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా రాయలసీమ మధ్యలో ఉన్నందున జిల్లాతోపాటు అన్నమయ్య, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన హాజీలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనివల్ల రాయలసీమ హాజీలకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అందులో పేర్కొన్నారు. అలాగే కడపలో ఉన్న హజ్ హౌస్ను వాడుక లోకి తీసుకురావాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే హాజీలను భవనంలో వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మౌల్వీలు మహమ్మద్ అలీ బద్దాదీ సాహెబ్, వలీవుల్లా హుస్సేనీ సాహెబ్, న్యామతుల్లా సాహెబ్, అబ్దుల్ రెహమాన్ సాహెబ్, షకృద్దీన్ సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, వాహిద్ అలీ సాహెబ్, అమీర్ బాబు, నజీర్ అహ్మద్, సలావుద్దీన్ పాల్గొన్నారు. కరపత్రాల ఆవిష్కరణ కడప సెవెన్రోడ్స్: ఈనెల 12, 13 తేదీల్లో కడప నగరంలో నిర్వహించనున్న అంబేద్కర్ స్టూడెంట్ యూత్ ఫెడరేషన్ (ఏఎస్వైఎఫ్) రాష్ట్ర మహాసభల కరపత్రాలను సోమవారం స్థానిక సాయిరాం కాలేజీలో విద్యార్థులతో కలిసి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఏఎస్వైఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.ఓబయ్య మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం విద్యార్థి సంఘాలను హాస్టళ్లలోకి అనుమతించబోమని సర్క్యులర్ జారీ చేయడం ద్వారా తన చేతగానితనాన్ని బయటపెట్టుకుందని విమర్శించారు. జిల్లా నాయకులు ఆఫ్రిద్, రఫీ, పవన్ పాల్గొన్నారు. ఎలుగుబంటి దాడిలోవ్యక్తికి గాయాలు ఖాజీపేట:నాగనాథీశ్వర కొండ దిగువన తెలుగుగంగ కాలువ గట్టుపై సోమవారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తున్న ఇమాముల్ (56) అనే వ్యక్తిపై ఎలుగుబంటి దాడి చేసి, చేతి నడివేలును పూర్తిగా కొరికేసింది. తీవ్ర రక్తస్రావమవుతున్నా ధైర్యం కోల్పోని ఇమాముల్.. పక్కనే ఉన్న రాయితో ఎలుగుబంటిపై తిరగబడ్డాడు. ఇంతలో వెనుక నుంచి వస్తున్న తోటి వాకర్స్ గమనించి గట్టిగా కేకలు వేస్తూ, రాళ్లు విసరడంతో ఎలుగుబంటి పంట పొలాల్లోకి పారిపోయింది. కాగా.. అడవికి ఆనుకుని ఉన్న పంట పొలాలకు వెళ్లేవారు, వాకర్స్ జాగ్రత్తగా ఉండాలని పత్తూరు బీట్ ఫారెస్ట్ అధికారి నాయక్ సూచించారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్: జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా ఆదివారం తెల్లవారుజామున జిల్లాలో పలు మండలాలల్లో వర్షం కురిసింది. ఇందులో బిమఠంలో 6.8 ఎంఎం, దువ్వూరులో 6.4 ఎంఎం, పెద్దముడియంలో 5.4 ఎంఎం, మైదుకూరు 3.4 ఎంఎం, బద్వేల్11.8 ఎంఎం వర్షం కురిసింది. మెరిట్ జాబితా విడుదల కడప ఎడ్యుకేషన్:జిల్లాలోని కేజీబీవీ ఉపాధ్యా య పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లావ్యాప్త ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ తెలిపారు. వివరాలను htt p://kadapadoe.in వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు. ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగి న ఆధారాలతో ఈ నెల 12 లోపల httpr://kfbvrecruitment. apcfrr.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 13న కడప శంకరాపురంలోని ‘స్కౌట్ హాల్’ నందు అసలు సర్టిఫికేట్లతో హాజరుకావాలని ఆమె కోరారు. -
జంట హత్యల కేసు ఛేదించిన పోలీసులు
కడప అర్బన్ : కడపలోని రామాంజనేయపురం, దండోరా కాలనీకి చెందిన హారిక (22 )ను, తన తల్లి ఓబుళమ్మను సిద్దవటం పరిధిలో కేవలం కొన్ని గంటల వ్యవధిలోనే దారుణంగా హత్య చేయడం, తన మరదలు అయ్యవారమ్మపై హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనల్లో నిందితుడైన చెవిటివాండ్ల బాబు(45)ను పోలీసులు అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి మూడు సెల్ఫోన్లను, ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. సోమవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయంలోని ‘పెన్నార్ కాన్ఫరెన్స్’హాల్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ వివరాలు వెల్లడించారు. కడపలోని దండోరా కాలనీలో నివాసం వుంటున్న బాబు,సుజాతలకు కుమార్తె హారిక(22), మణికుమార్, అవినాష్ అనే కుమారులు వున్నారు. హారిక రాజంపేట లోని అన్నమాచార్య కాలేజీ లో బీటెక్ చదివేది. ఆ అమ్మాయి ఇంటర్ నుంచి బాయ్ ఫ్రెండ్స్తో ఎక్కువగా ఫోన్లో మాట్లాడుతూ చదువును నిర్లక్ష్యం చేయడంతో ఆమె తండ్రి చెవిటివాండ్ల బాబు ఈ నెల 3వ తేదీన రోకలితో కొట్టి చంపి చేతులకు మెడకు చున్నితో చుట్టి బెడ్ రూమ్ లో పడవేసి, ఆ తర్వాత నిందితుడు తల్లి ఓబులమ్మను వనిపెంట వద్ద నుంచి తీసుకొచ్చి, అదే రోజు రాత్రి సిద్ధవటం మండలం, మాచుపల్లె గ్రామ పొలాల వద్ద చంపేశాడు. తర్వాత మరదలు అయ్యవారమ్మ ను కొత్తపల్లె లో తన ఇంటి వద్ద పిల్లలతో ఉండగా అదే రోజు రాత్రి ఇంటిలోకి పోయి, ఆమెను కూడా చంపడానికి ప్రయత్నం చేశాడు. ఆమె కేకలు వేయడంతో, చుట్టు పక్కల వారు రాగా, నిందితుడు అక్కడ నుండి పారిపోయాడు. హత్య చేయడానికి కారణాలివే.. హారిక తాను ప్రేమించిన యువకుడితో ఫోన్న్లో మాట్లాడటం, అతడిని ఇంటికి పిలిపించుకోవడం చేసేది.చదువుపై శ్రద్ధ చూపక పరీక్షల్లో ఫెయిల్ అయినట్లు తెలిపారు. దీంతో నిందితుడు బాబు హారికను కాలేజీ మాన్పించి ఇంటి వద్దే ఉంచాడు. బాబు, అతని భార్య ఇద్దరూ పనుల నిమిత్తం బయటకు వెళ్లే సమయంలో హారికను ఇంట్లో ఉంచి బయట నుంచి తాళం వేసి వెళ్లేవారని తెలిపారు. హారికను చూసుకోవడానికి నిందితుడు తన తల్లి ఓబులమ్మను వనిపెంట నుంచి కడపకు పిలిపించి ఇంటి వద్ద ఉంచాడు. ఓబులమ్మ మనవరాలు హారికపై ఉన్న ప్రేమతో తన మొబైల్ ఫోన్న్ను ఆమెకు ఇస్తూ ఉండేదని, హారిక అబ్బాయిలతో మాట్లాడేదన్నారు. ఈ విషయం గమనించిన నిందితుడు బాబు ఆమెను మందలించాడు. అయినప్పటికీ హారిక, ఓబులమ్మ ప్రవర్తనలో ఎలాంటి మార్పు రాలేదని, హారిక తల్లిదండ్రుల మాటలను లెక్కచేయకుండా అబ్బాయిలతో ఫోన్న్లో మాట్లాడుతూనే ఉండేదని పేర్కొన్నారు. హారిక ప్రవర్తన కారణంగా వీధిలో తనకు అవమానం జరుగుతోందని నిందితుడు భావించినట్లు పోలీసుల దర్యాప్తులో వెల్లడైంది. తనకు జరుగుతున్న అవమానం తొలగిపోవాలంటే కుమార్తె హారికను, హారికను సరిగా చూసుకోకుండా మొబైల్ ఫోన్ ఇస్తున్న తన తల్లి ఓబులమ్మను చంపాలని నిందితుడు నిర్ణయించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈనెల ఇంట్లో ఎవరూ లేని సమయంలో హారికను పచ్చడి దంచే రోకలితో కొట్టి హత్య చేసినట్లు నిందితుడు పోలీసుల విచారణలో వెల్లడించినట్లు తెలిపారు. పింఛన్ కోసం వనిపెంటకు వెళ్లిన తన తల్లి ఓబులమ్మను హత్య చేయాలనే ఉద్దేశంతో నిందితుడు తన ద్విచక్రవాహనంలో (ఏపీ04ఏవై 4118) వనిపెంటకు వెళ్లాడన్నారు. ఓబులమ్మను బైక్లో ఎక్కించుకుని సిద్ధవటం మండలం, మాచుపల్లె గ్రామ పొలాల వద్దకు తీసుకెళ్లాడు.. అదే రోజు రాత్రి సుమారు 10 గంటల సమయంలో ఓబులమ్మను హత్య చేసి అక్కడే పడవేసినట్లు నిందితుడు తెలిపినట్లు ఎస్పీ పేర్కొన్నారు. అనంతరం సిద్ధవటం మండలం, కొత్తపల్లెలో నివసిస్తున్న తన తమ్ముడు రఘునాథ్ భార్య అయ్యవారమ్మను హత్య చేయడానికి ఆమె ఇంటికి వెళ్లాడన్నారు. అయ్యవారమ్మ తన తమ్ముడు రఘునాథ్తో సక్రమంగా కాపురం చేయడం లేదనే కారణంతో ఆమెను హత్య చేయడానికి ప్రయత్నించినప్పటికీ, అదృష్టవశాత్తు తప్పించుకున్నట్లు ఎస్పీ తెలిపారు. ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంతోనే నిందితుడు పట్టివేత.. ఈ కేసును కొత్తగా స్మార్ట్ పోలీసింగ్ లో భాగంగా ఏర్పాటు చేసిన ఆర్టీజీఎస్, సీసీటివి –360 అప్లికేషను ద్వారా ఛేదించారు. నిందితుడు బాబు తన బైక్లో ఈనెల 5వ తేదీన శ్రీకాళహస్తి ఏపీ సీడ్స్ వద్ద, అదే రోజు సాయంత్రం శ్రీకాళహస్తిలో తిరుపతి రోడ్డు,శ్రీకాళహస్తి రైల్వేస్టేషన్, మరుసటిరోజున చిత్తూరు జిల్లా నరహరిరావుపేట, గుడిపాల వద్ద ఆర్టిజిఎస్, సీసీటివి–360 అప్లికేషనులో పోలీస్ వారికి అలర్ట్ వచ్చింది.. దాన్ని ఛేదిస్తూ రిమ్స్పీఎస్, ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ సీఐలు యం.రాజ గోపాల్, వెంకటేశ్వర్లు, ఎస్ఐలు లక్ష్మీనారాయణ, శ్రీనివాసులు, చంద్ర మోహన్, హెడ్ కానిస్టేబుల్ సుధాకర్, ప్రవీణ్, కానిస్టేబుల్ ప్రసాద్, సుబ్బరాయుడు, మహేష్ లు నిందితుడిని పట్టుకున్నారు. నిందితుడిని అరెస్ట్ చేయడంలో కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు.నిందితుడి అరెస్ట్.. మూడు సెల్ఫోన్లు, మోటార్ సైకిల్ స్వాధీనం -
● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ డిమాండ్ ● జిల్లావ్యాప్తంగా హోరెత్తిన యువత నిరసన ర్యాలీలు ● ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని గర్జన ● విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
ప్రొద్దుటూరులో వైఎస్సార్సీపీ నాయకుల ర్యాలీని అడ్డుకుంటున్న పోలీసులు సాక్షి ప్రతినిధి, కడప: దగా డీఎస్సీపై ప్రజా పోరు నింగినంటింది. పోలీసులను అడ్డు పెట్టి వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని కట్టడి చేయాలని చూసి కూటమి ప్రభుత్వ ప్రయత్నం విఫలమైంది. ఖాకీల ఆంక్షల సంకెళ్లు యువత, వైఎస్సార్సీపీ శ్రేణుల ర్యాలీల ముందు నిలవలేకపోయాయి. పట్టణ.. పురవీధులన్నీ వైఎస్సార్సీపీ శ్రేణులతో పోటెత్తాయి. డీఎస్సీలో అక్రమాలు వెలికితీయాలని చిత్తశుద్ధితో కొనసాగిస్తున్న ఉద్యమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయి. పులివెందులలో లాఠీఛార్జి చేసినా, కడప, కమలాపురం, రాజంపేట, మైదుకూరులలో కట్టడి చేయాలని ప్రయత్నించినా కార్యకర్తలు ఇసుమంత కూడా వెనక్కి తగ్గలేదు. పైగా మరింత దూకుడుగా నిరశన కొనసాగించారు. ● జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ సోమవారం చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతమైంది. డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి అయినవారికి కట్టబెట్టారనే ఆరోపణలకు భారీ ఎత్తున ప్రజా మద్దతు లభించింది. అక్రమాలకు తెరలేపిన మంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ను వైఎస్సార్సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. ● పులివెందులలో స్థానిక పాత ఎమ్మెల్యే ఆఫీస్ నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకు భారీ జనం సందోహం మధ్య నిరసన ర్యాలీ కొనసాగించారు. పోలీసులు శ్రేణులపై లాఠీఛార్జి చేసినా వెనుకంజ వేయలేదు. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం ఆంక్షలు విధించినా, ప్రజల తరఫున పోరాటాన్ని ఆపేది లేదన్నారు. డీఎస్సీ క్వశ్చన్ పేపర్ అప్లోడ్ చేసిన ఎస్సీఈఆర్టీ ఔట్సోర్సింగ్ ఉద్యోగి నవీన్ అనే వ్యక్తికే రాష్ట్రంలో మొదటి ర్యాంక్ వచ్చిందని లీకేజీ జరిగిందని ఒప్పుకున్న ప్రభుత్వం అతని ఉద్యోగాన్ని పక్కన పెట్టిందన్నారు. ఇక జీవో నంబర్ 4, 47, 76లను తెచ్చి అసలు పరీక్షే రాయకుండా ఉద్యోగాలు ఇచ్చేలా నిబంధనలు మార్చారని తూర్పారబట్టారు. డీఎస్సీ అక్రమాలపై తక్షణమే సీబీఐతో విచారణ జరిపించాలని, ఈ అవకతవకలకు బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ తక్షణమే రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. ● బద్వేల్.. స్థానిక ఎన్జీఓ కాలనీలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి పూలమాలలు వేసి అక్కడి నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ నిరసన ర్యాలీ కొనసాగించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందురెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధా నేతృత్వంలో భారీ ఎత్తున ప్రజలు పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ముఖ్యనేతలు మాట్లాడుతూ శాంతియుతంగా రిలే నిరాహార దీక్షలు, ర్యాలీ చేపడితే పోలీసుల ద్వారా అడ్డుకునే ప్రయత్నం చేయడం దుర్మార్గమని, ఇది రాజ్యాంగ విరుద్దమన్నారు. పోలీసులను అడ్డుపెట్టుకొని ఉద్యమాలు ఆణచవేయలేరన్నారు. ● కమలాపురంలో స్థానిక గ్రామ చావడి నుంచి పార్టీ కార్యాలయం వరకు ర్యాలీని ఇన్ఛార్జి నరేన్ రామాంజులరెడ్డి, అదనపు సమన్వయకర్త అబ్బిరెడ్డి మల్లికార్జునరెడ్డి నేతృత్వంలో కొనసాగించారు. ర్యాలీని పోలీసులు శతవిధాలుగా అడ్డుకునే ప్రయత్నం చేసి విఫలమైయ్యారు. వేలాది మంది యువత ప్రజలు పాల్గోని ప్రజాస్వామ్యబద్ధంగా ర్యాలీని కొనసాగించారు. ● మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం చేపట్టిన ర్యాలీ విజయవంతమైంది. స్థానిక వనిపెంట రోడ్డులోని డీసీఎల్ కల్యాణ మండపం నుంచి ఉదయం 10 గంటల సమయంలో ర్యాలీకి సిద్ధం కాగా, అర్బన్ సీఐ రమణారెడ్డి ర్యాలీని నియంత్రించాలని ప్రయత్నించారు. విద్యార్థి, యువజన విభాగం నాయకులు రోడ్డుపైనే బైఠాయించి డీఎస్సీ అక్రమాలపై నిగ్గు తేల్చాలని నినాదాలు చేశారు. ● ప్రొద్దుటూరులో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. గురువయ్య తోటలోని నాలుగు రోడ్ల కూడలి నుంచి ర్యాలీ నినాదాలతో సాగింది. ఇన్చార్జి డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో పోలీసులు మున్సిపల్ కార్యాలయం చుట్టు మూడు రోడ్ల వద్ద బారీకేడ్లను ఏర్పాటు చేసి ర్యాలీ అడ్డుకోవడంతో ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. అనంతరం వైఎస్సార్సీపీ శ్రేణులు మున్సిపల్ పార్కు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ● జమ్మలమడుగులో ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి నేతృత్వంలో వేలాది మంది ప్రజలు పార్టీ కేడర్తో వైఎస్సార్సీపీ కార్యాలయం వద్దనుంచి రామిరెడ్డిపల్లె రహదారి, పెద్దపసుపల మోటు, సంజామలమోటుల మీదుగా పాతబస్టాండ్లో ఉన్న తహసీల్దార్ కార్యాలయం వరకూ చేపట్టారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పొన్నపురెడ్డి వెంకటశివారెడ్డి, గిరిధర్రెడ్డిలతో పాటు ఆరు మండలాలకు చెందిన కేడర్ డీఎస్సీ అక్రమాలపై నినదిస్తూ నిరసన కొనసాగించారు. ● కడప వైఎస్సార్సీపీ జిల్లా కార్యలాయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగింది. మాజీ మంత్రి అంజద్ బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డిలతోపాటు అన్నీ విభాగాలకు చెందిన కేడర్తో పాటు ప్రజలు వేలాదిగా తరలివచ్చారు.ర్యాలీని కట్టడి చేసేందుకు నగరంలో ఉన్న పోలీసు అధికారులు పెద్ద ఎత్తున యత్నించారు. పోలీసుల ప్రయత్నాలను ధీటుగా ఎదుర్కొని ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ కొనసాగించారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ మునుపెన్నడూ డీఎస్సీలో ఇలాంటి ధోరణి చూడలేదన్నారు. ప్రభుత్వం అడ్డుగోలుగా నియమకాలు చేసుకొనేందు అడ్డదారుల్లో జీఓలు తెచ్చిందని మాజీ మంత్రి అంజద్ బాషా ఆరోపించారు. ● రాజంపేటలో ఆర్అండ్బీ అతిథిగృహం నుంచి ర్యాలీ ప్రారంభం కాగానే, పట్టణ సీఐ నాగార్జున ఆధ్వర్యంలో పోలీసులు అడ్డుకున్నారు. రోప్ను అడ్డంగా పెట్టడంతో తొక్కిసలాటకు దారితీసింది. ఎమ్మెల్యే ఆకేపాటితో పాటు పార్టీ శ్రేణులు, నేతలు పోలీసుల చర్యలను వ్యతిరేకించారు. పోలీసుల దౌర్జన్యంపై ఎమ్మెల్యే ఆకేపాటి నిరసనగా రోడ్డుపై బైఠాయించారు. డీఎస్సీలో అక్రమాలకు పాల్పడిన మంత్రి లోకేష్ను కాపాడుకునేందుకు సీఎం చంద్రబాబు నానా తంటాలు పడుతున్నారని ఎమ్మెల్యే ఆరోపించారు. -
జోనల్ మ్యాచ్లో టీమ్–ఇ, టీమ్–ఎ జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీడే జోనల్ మ్యాచ్లో మూడవ రోజు సోమవారం టీమ్–ఎ టీమ్–ఇ జట్లు ఘనంగా విజయం సాధించాయి. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో సోమవారం 9 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్–ఎ జట్టు 72.4 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 320 పరుగులు చేసింది. ఆ జట్లులోని దేవ్ ప్రమోద్ 79 , నిఖిల్ 64 పరుగులు చేశారు. టీమ్–సి జట్టులోని సాయి విఘ్నేష్ 3, ప్రియతమ్ రాజ్ 3, వికెట్లు తీశారు. దీంతో టీమ్–ఎ జట్టు 3 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వెఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 152 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్–ఇ జట్టు 61.3 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 271 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని ఎస్ఎంజి ప్రభాకర్ 59, సీహెచ్ సోహన్రెడ్డి 74 పరుగులు చేశారు. టీమ్–డి జట్టులోని జయంత్ 3, రణదీప్ 2, పవన్సుతశ్రీదత్త 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన టీమ్–డి జట్టు 49.4 ఓవర్లకు 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నంద కిషోర్ 68, భాను శ్రీ హర్ష 40 పరుగులు చేశారు. టీమ్–ఇ జట్టులోని లక్ష్మీ గౌతమ్ 3, శ్యామట దినేష్ 3, సాయి చరణ్ 2, గౌతమ్ ఆర్య 2 వికెట్లు తీశారు. దీంతో టీమ్–ఇ జట్టు 207 పరుగుల తేడాతో విజయం సాధించింది. -
‘ఆసరా’ కోసం పోరాటం
ఆఫీసర్లు కాగితాలు చూశారు. నిబంధనలు చదివారు. కానీ ఆ కాగితాల వెనుక ఉన్న ఒక తండ్రి కన్నీళ్లను, ఒక బిడ్డ ఆకలిని చూడలేకపోయారు. తన బిడ్డను సాకే ఒక చిన్న ’ఆసరా’ కోసం ఆ తండ్రి అలిసిపోకుండా పోరాడుతున్నాడు. ఈ చిత్రంలో రైతు లక్ష్మిరెడ్డి పులివెందుల మండలం లక్ష్మయ్యవారిపల్లెలో నివసిస్తున్నాడు. ఈయనకు ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నాడు. జగదీశ్వర్ రెడ్డి కుమారుడికి పుట్టుకతో అంగవైకల్యం. గత ప్రభుత్వంలో పింఛన్ మంజూరు అయినా.. ఈ ప్రభుత్వంలో నాలుగు మార్లు తన కుమారుడిని మోస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నాడు. అయినా ఉన్నతాధికారులు మాత్రం రేపు మాపు అంటూ తిప్పుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం ఇలాంటి వారిపై కనికరం చూపదా అంటూ ఆ తండ్రి పడుతున్న అవస్థలు చూసిన ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫొటో : సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
‘క్విట్ కార్పొరేట్’.. కార్మికులు, రైతుల ఉమ్మడి గర్జన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్రంలోని మోదీ ప్రభుత్వం కార్మికులు, రైతులు, సామాన్య ప్రజల ప్రయోజనాలను కార్పొరేట్లకు కట్టబెట్టడాన్ని నిరసిస్తూ క్విట్ ఇండియా డే సందర్భంగా కడప ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఉమ్మడి సంఘాల ఆధ్వర్యంలో భారీ నిరసన నిర్వహించారు. ‘క్విట్ కార్పొరేట్– దేశ్ కో బచావో‘ నినాదంతో జరిగిన ఈ ధర్నాలో కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల జిల్లా కార్యదర్శులు మనోహర్, బాదుల్లా, దస్తగిరి రెడ్డి, అన్వేష్, ఎం.వి.సుబ్బారెడ్డి, వేణుగోపాల్ ప్రసంగించారు. గత 12 ఏళ్లలో కార్పొరేట్ శక్తులకు చెందిన దాదాపు రూ.12 లక్షల కోట్ల రుణాలను ‘రైటాఫ్’ పేరుతో కేంద్రం మాఫీ చేసిందని నాయకులు మండిపడ్డారు. అప్పుల ఊబిలో కూరుకుపోయి రైతులు ఆత్మహత్యలు చేసుకుంటున్నా వారి రుణాలు మాఫీ చేయడానికి మాత్రం ప్రభుత్వానికి చేతులు రావడం లేదని ధ్వజమెత్తారు. ఓడరేవులు, ఎయిర్పోర్టులు, రైల్వే, బొగ్గు గనులను అదానీ వంటి కార్పొరేట్లకు ధారాదత్తం చేస్తూ, సామాన్యులపై పన్నుల భారం మోపుతున్నారని విమర్శించారు. కార్మికుల హక్కులను కాలరాస్తూ నాలుగు లేబర్ కోడ్లను తెచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. కార్పొరేట్లకు లాభాలు పెంచుతూ ప్రజల సంపదను లూటీ చేస్తున్న శక్తులను దేశం నుంచి తరిమికొట్టాలని నాయకులు పిలుపునిచ్చారు. ఉపాధి హామీ చట్టాన్ని నీరుగార్చే విధంగా ’జీ రామ్ జీ’ బిల్లును తీసుకొచ్చి వ్యవసాయ కార్మికులకు ఉపాధిని దూరం చేశారని ధ్వజమెత్తారు. రానున్న కాలంలో కేంద్ర ప్రభుత్వ ప్రజావ్యతిరేక విధానాలపై సమరశీల పోరాటాలకు కార్మిక, రైతు, వ్యవసాయ కూలీలు ఐక్యంగా సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో కార్మిక సంఘాల నాయకులు వెంకటసుబ్బయ్య, రామ్మోహన్, చంద్రారెడ్డి, వేణుగోపాల్, మద్దిలేటి, సుంకర రవి, రైతు సంఘం నాయకులు గోపాలకృష్ణయ్య, చిన్న సిద్దయ్య తదితరులు పాల్గొన్నారు. -
సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలి
కడప సెవెన్రోడ్స్ : వికసిత భారత్ లక్ష్యాలను అధిగమిస్తూ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల స్ఫూర్తితో వైఎస్సార్ కడపజిల్లాను సమస్యలు లేని జిల్లాగా తీర్చిదిద్దాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధీమీనా జిల్లా అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవన్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమంలో జేసీ డీఆర్వో మల్లికార్జునుడుతో కలిసి ప్రజల నుంచి నేరుగా వినతిపత్రాలు స్వీకరించారు. అనంతరం అధికారులతో జేసీ నిధీమీనా మాట్లాడుతూ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) ద్వారా అందిన ప్రతి అర్జీని క్షేత్రస్థాయిలో పరిశీలించి వాస్తవ పరిస్థితులను తెలుసుకున్న తర్వాతే తగిన పరిష్కారం చూపాలని సూచించారు. అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లో పీజీఆర్ఎస్ ఫీడ్బ్యాక్ క్యూఆర్ కోడ్లను తప్పనిసరిగా ప్రదర్శించాలన్నారు. స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను అన్ని శాఖల జిల్లా అధికారులు సమన్వయంతో విజయవంతం చేయాలన్నారు. ఎల్నినో ప్రభావంతో వాతావరణంలో చోటుచేసుకుంటున్న మార్పులను దృష్టిలో ఉంచుకుని ఈ ఖరీఫ్ సీజన్లో ప్రత్యామ్నాయ సాగు విధానాలపై జిల్లా ప్రజలు, రైతుల్లో అవగాహన పెంచాలని జేసీ అధికారులకు సూచించారు. ఇందుకోసం నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ప్రజల్లో చైతన్యం తీసుకురావాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం, ఎస్డీసీ వెంకటపతి, డిప్యూటీ కలెక్టర్లు శివ రామిరెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, సమగ్ర శిక్ష ఏపీసీ అనురాధ పాల్గొన్నారు. దేశ నిర్మాణంలో భాగస్వాములు కావాలి దేశ స్వాతంత్య్ర స్ఫూర్తిని ప్రజల్లో మరింతగా చాటుతూ, దేశ నిర్మాణంలో ప్రతి పౌరుడు తన వంతు బాధ్యతను నిర్వర్తించేలా దేశ నిర్మాణంలో భాగస్వాములు అనే కార్యక్రమాలను జిల్లాలో ఆగస్టు 10 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించాలని జాయింట్ కలెక్టర్ నిధిమీనా జిల్లా ప్రజలకు పిలుపునిచ్చారు. ఆగస్టు 13 నుంచి 15 వరకు ‘‘హర్ ఘర్ తిరంగా’’ కార్యక్రమంలో భాగంగా ప్రతి ఇంటి వద్ద, వాణిజ్య సంస్థలు, ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండాను ఎగురవేసి దేశభక్తిని చాటాలని కోరారు. యువత, విద్యార్థులు, ప్రముఖులు, క్రీడాకారులు, ప్రజలు పెద్ద సంఖ్యలో ‘‘అనే నేను’’ సామాజిక మాధ్యమ ప్రచారంలో పాల్గొనాలని కోరారు. జాతీయ జెండాను చేతిలో పట్టుకుని ‘‘అనే నేను... దేశ అభివృద్ధి కోసం నా వంతుగా...’’ అంటూ 30 నుంచి 60 సెకన్ల స్వీయ వీడియోలను రూపొందించి సామాజిక మాధ్యమాల్లో ప్రచారం చేయాలని సూచించారు.జేసీ డాక్టర్ నిధి మీనా -
ఐక్యతతోనే సమస్యల పరిష్కారం
– అపుస్మా సమావేశంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి జమ్మలమడుగు రూరల్ : ప్రైవేట్ పాఠశాలల సమస్యలను పరిష్కరించుకునేందుకు ఐక్యతతో కృషి చేయాల్సిన అవసరం ఉందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి. రామచంద్రారెడ్డి సూచించారు. అదివారం మండల పరిధిలోని గండికోటలో రాష్ట్రస్థాయి అపుస్మా సర్వసభ్య సమావేశాన్ని రాష్ట్ర వర్కింగ్ అధ్యక్షుడు రమణారెడ్డి, జమ్మలమడుగు అపుస్మా అధ్యక్షుడు బైరెడ్డి రవీంద్రారెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ.. అపుస్మాలో ఒక ఎమ్మెల్సీ ఉన్నారంటే గర్వకారణమన్నారు. అపుస్మాలో పదవులు రాలేదని కాకుండా అపుస్మా కోసం తాము ఎంత వరకు ఉపయోగపడుతున్నామో గ్రహించాలని సూచించారు. రాష్ట్రంలో రికగ్నజైషన్ ఫైల్స్ దాదాపు 35 పెండింగ్లో ఉన్నాయని, ఇటీవల ఈ విషయాన్ని విద్యాశాఖ మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లామన్నారు. విద్యా విధానం వేరు రాజకీయం వేరు అని చెపంపడం జరిగిందన్నారు. అపుస్మాలో అన్ని రాజకీయ పార్టీల నాయకులు ఉన్నారని గుర్తు చేశారు. కావున కలిసికట్టుగా సమస్యలను పరిష్కరించుకోవాలని తెలియజేశారు. కార్యక్రమంలో అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు తులసి విష్ణు ప్రసాద్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ రమణ, చీఫ్ అడ్త్వజర్ పుల్లయ్య, జమ్మలమడుగు అపుస్మా నాయకులు చల్లపల్లి రమేష్రెడ్డి, రామిరెడ్డి, దస్తగిరి శేషారెడ్డి తదితరులు పాల్గోన్నారు. -
మరణంలోనూ వీడని బంధం
● భర్త మరణ వార్త విని భార్య మృతి దువ్వూరు : మరణంలోనూ భార్యాభర్తల బంధం వీడలేదు. అనారోగ్యంతో భర్త మృతి చెందగా, ఆ వార్త తెలిసిన వెంటనే భార్య మృతి చెందిన విషాదకర సంఘటన దువ్వూరులో చోటు చేసుకుంది. మండల కేంద్రమైన దువ్వూరు టీచర్స్ కాలనీకి చెందిన ఇరగంరెడ్డి వెంకటరామిరెడ్డి (79) తెలుగు పండిట్గా 2005లో ఉద్యోగ విరమణ పొందారు. ఆయనకు భార్య నారాయణమ్మ (68), కుమారులు శ్రీహరిరెడ్డి, చంద్రహాస్రెడ్డి, జయదేవ్ రెడ్డి ముగ్గురు హైదరాబాద్లో స్థిరపడ్డారు. ఈ క్రమంలో కొన్ని రోజులుగా వెంకటరామిరెడ్డి అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆయన కుమారుల వద్ద హైదరాబాద్లో ఉంటున్నారు. ఆదివారం ఆయన ఆరోగ్యం క్షీణించడంతో హైదరాబాద్లోని ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేర్పించారు. అక్కడ చికిత్స పొందుతూ ఉదయం 11 గంటలకు మృతి చెందారు. భర్త మరణ వార్త విన్న నారాయణమ్మ సొమ్మసిల్లి పడిపోవడంతో కుటుంబ సభ్యులు ఆస్పత్రికి తరలించగా అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు తెలిపారని బంధువులు వివరించారు. భార్యాభర్తలు ఒకేసారి మృతి చెందడంతో వారి కుటుంబ సభ్యులతోపాటు దువ్వూరు గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాలను హైదరాబాద్ నుంచి దువ్వూరుకు తరలించి అంత్యక్రియలు చేయనున్నట్లు బంధువులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో గొర్రెల కాపరి మృతి
ప్రొద్దుటూరు : విద్యుత్శాఖ అధికారుల నిర్లక్ష్యం ఓ నిండు ప్రాణాన్ని బలి తీసుకుంది. ప్రొద్దుటూరు మండలంలోని కల్లూరు పరిసరాల్లో ఉన్న భూముల్లో విద్యుత్ వైర్లు తగిలి గొర్రెల కాపరి గుజ్జల ఓబులేసు యాదవ్ (35) అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. గుజ్జల ఓబులేసు యాదవ్ గొర్రెల కాపరిగా జీవనం సాగిస్తున్నాడు. యథావిధిగా ఆదివారం పంట పొలాల్లో గొర్రెలను మేపుతూ ఉండగా విద్యుత్ స్తంభం వద్ద కిందికి వేలాడుతున్న వైర్లు తగిలి అక్కడికక్కడే కాలిపోయాడు. తోడుగా వెళ్లిన మరో గొర్రెల కాపరి గ్రామస్తులకు సమాచారం అందించాడు. ఓబులేసు యాదవ్ శరీరం పూర్తిగా కాలిపోయే వరకు వైర్లలో విద్యుత్ సరఫరా ఉంది. విషయం తెలుసుకున్న గ్రామస్తులు విద్యుత్ సరఫరాను నిలిపివేయించి మంటలను ఆర్పారు. మాజీ సర్పంచ్ కల్లూరు నాగేంద్రారెడ్డి ఈ విషయాన్ని అధికారులకు తెలిపారు. జరిగిన సంఘటనపై దిగ్బ్రాంతిని వ్యక్తం చేస్తూ ఓబులేసు యాదవ్ కుటుంబాన్ని పరామర్శించారు. అధికారుల నిర్లక్ష్యమే కారణం విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గుజ్జల ఓబులేసు యాదవ్ మృతి చెందాడని గ్రామస్థులు ఆరోపిస్తున్నారు. గ్రామ పరిసరాల్లోని గతంలో విద్యుత్ సరఫరాను అందించేందుకు ట్రాన్స్ఫార్మర్ను ఏర్పాటు చేశారు. తర్వాత అక్కడ ఎవరూ పంటలు సాగు చేయడం లేదని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ను తొలగించారు. ట్రాన్స్పార్మర్కు సంబంధించిన విద్యుత్ సరఫరా వైర్లు మాత్రం ఇప్పటికీ అలాగే ఉన్నాయి. విద్యుత్ అధికారులు ఏమాత్రం పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వదిలేశారు. విద్యుత్ శాఖకు సంబంధించిన లైన్మెన్ సూర్యం విధులకు గైర్హాజరవుతూ తనకు ప్రత్యామ్నాయంగా గ్రామానికి చెందిన ఏసన్నను నియమించారు. అతను కూడా నిత్యం మద్యం మత్తులో ఉంటూ విధులకు హాజరు కావడం లేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. విద్యుత్ శాఖ ఈఈ చాంద్ బాషాను వివరణ కోరగా ఓబులేసు యాదవ్ మృతి చాలా బాధాకరమన్నారు. జరిగిన సంఘటనపై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకుంటామన్నారు. సంఘటన స్థలాన్ని రూరల్ పోలీసులు పరిశీలించారు. -
ఘాటు తగ్గుతున్న ఉల్లి
● జిల్లాలో గణనీయంగా తగ్గిన సాగు ● 60 శాతంపైనే తగ్గిన సాగు విస్తీర్ణం ● ధరల ప్రభావంతోనే సాగుకు ముందుకు రాని రైతులు వేముల : జిల్లాలలో ఈ ఏడాది ఉల్లి సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇప్పటివరకు 7 వేల ఎకరాల్లో మాత్రమే ఉల్లి సాగైందని ఉద్యాన శాఖ అధికారులు పేర్కొన్నారు. గతేడాది జిల్లాలో రైతులు విస్తారంగా ఉల్లి సాగు చేసుకున్నారు. పెట్టుబడులు ఎక్కువైనా ఉల్లివైపే మొగ్గు చూపారు. అయితే దిగుబడులు వచ్చే సమయానికి ధరలు పతనమయ్యాయి. దీంతో పెట్టుబడులు కూడా చేతికందక అన్నదాతలు తీవ్రంగా నష్టపోయారు. ఈ ఏడాదీ అదే పరిస్థితి ఎదరవుతుందనే భయంతో ఉల్లి సాగుకు మొగ్గు చూపలేదు. కొనుగోళ్లకు వ్యాపారులు కూడా రాకపోవడంతో ట్రాక్టర్లలో బయటకు తోలుకోవాల్సిన పరిస్థితులను చూసిన రైతులు ఈ ఏడాది సాగుకు ఆసక్తి చూపలేదు. 7 వేల ఎకరాల్లో సాగు ఈ ఏడాది జిల్లాలో ఇప్పటివరకు 7 వేల ఎకరాలలో ఉల్లి సాగైనట్లు ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. మైదుకూరు, వీరపునాయునిపల్లె, తొండూరు, వేముల, వేంపల్లె, పెండ్లిమర్రి, ముద్దనూరు మండలాల్లో అత్యధికంగా సాగవుతుంది. మిగిలిన మండలాల్లో అక్కడక్కడ సాగు చేసేవారు. అయితే ఈ మండలాల్లో సగం మంది రైతులు ఉల్లి సాగుకు ఆసక్తి చూపలేదు. ఏటా మే, జూన్లో ఉల్లి సాగు చేసేవారు. 60 శాతంపైనే తగ్గిన సాగు విస్తీర్ణం ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 60 శాతంపైనే ఉల్లి సాగు విస్తీర్ణం తగ్గిపోయింది. గతేడాది జిల్లాలో 20 వేల ఎకరాల్లో ఉల్లి సాగైతే.. ఈ ఏడాది 7 వేల ఎకరాలకు పడిపోయింది. ఆయా మండలాల్లో సాగుకు రైతులు ముందుకు రాలేదు. సాగులో పెట్టుబడులు పెట్టి నష్టపోతామనే భయం రైతులను వెంటాడింది. ఒకవైపు వర్షాభావంతో నీటి వనరులు తగ్గిపోతాయనే ఆందోళన.. మరోవైపు ధరలు లేకపోతే నష్టపోతామనే భయంతో రైతులు ఉల్లి సాగుకు సాహసించలేకపోయారు. ఎకరాకు రూ.80 వేలకుపైనే పెట్టుబడులు ఉల్లి సాగులో పెట్టుబడులు పెరిగిపోతూనే ఉన్నాయి. గతేడాది రూ.50వేల నుంచి రూ.60వేల వరకు పెట్టుబడులైతే.. ఈ ఏడాది ఎకరాకు రూ.80వేలకు పైనే పెట్టుబడులు అవుతున్నాయని రైతులు అంటున్నారు. ఉద్యాన పంటలలో పెట్టుబడులతో కూడుకున్న పంట ఉల్లి. ఈ ఏడాది రసాయనిక ఎరువుల ధరలు, కూలీల రేట్లు, ట్రాక్టర్ బాడుగలు పెరిగిపోయాయి. బస్తా రసాయనిక ఎరువుపై రూ.450 మేర ధరలు పెరిగితే పంటలు ఎలా సాగు చేసుకోవాలని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గత ఏడాది సాగులో పెట్టుబడులైనా దిగుబడులు వచ్చినా ధరలు లేక రైతులు పంటను దున్నివేశారు. కనీసం వ్యాపారులు కూడా రాకపోగా వాటిని బయటకు తోలేందుకు అదనంగా ఖర్చు చేయాల్సి రావడంతో రైతులు ఉల్లి సాగుకు భయపడుతున్నారు. ఈ ఏడాది సాగులో పెట్టుబడులవుతున్నా ధరలు లేకపోతే నష్టపోతామనే ఉద్ధేశ్యంతో రైతులు ఉల్లి సాగుకు ఆసక్తి చూపలేదు. -
రాజోలి.. ఖాళీ!
ఏ ‘నార’దిష్టి తగిలిందో ఏమోగానీ ఖరీఫ్ సీజనంతా నీటి చుక్క లేకుండానే గడిచిపోయింది. కరిమబ్బు హలధారితో దోబూచులాడింది.. ఆశగా ఎదురుచూసిన నేలతల్లికి సైతం నీటి తడి లేకుండా చేసింది.. అక్కడక్కడ చిరు జల్లులు మినహా వాన వెల్లువైంది లేదు.. ఏ ఒక్క నదిలోనూ ఝరి పారింది లేదు.. నల్లగా మబ్బు పట్టడం తప్పా చుక్క నీరు జారింది లేదు... ఇదిగో ఈ చిత్రాలే సాక్ష్యాలు.. గతేడాది జూలైలోనే రాజోలి ఆనకట్ట నిండుకుండలా మారి పరవళ్లు తొక్కింది. నీటి సవ్వడులతో...కర్షకుల కన్నీళ్లు, కష్టాలను తుడిచింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఒక్కసారీ పదును వాన పడింది లేదు. ఫలితంగా ఇదిగో ఇలా చుక్క నీరు లేక రాజోలి ఆనకట్ట వెలవెలబోతోంది. ఈ ఆనకట్ట నుంచి కేసీ ప్రధాన, కేసీ చాపాడు కాలువతో పాటు కుందూనది కింద దాదాపు 92 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. కొందరు రైతులు మాత్రమే గుండె ధైర్యం చేసుకొని నీరు వస్తుందన్న ఆశతో నారు పోసి వరి నాట్లు కూడా వేశారు. అన్నదాతల ఆశలపై వరుణుడు నీళ్లు చిలకరిస్తాడో.. కరుణించి దోసిళ్లతో కుమ్మరిస్తాడో కాలమే సమాధానం చెబుతుంది.– రాజుపాళెం -
డీఎస్సీ అక్రమాలపై పోరు
● నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో నిరసన ర్యాలీలు ● పాల్గొననున్న ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలుకడప కార్పొరేషన్ : డీఎస్సీ–2025లో జరిగిన అవకతకలు, అక్రమాలపై వైఎస్సార్సీపీ పోరు కొనసాగిస్తోంది. గతంలో విద్యార్థులు, యువత ఆధ్వర్యంలో ర్యాలీలు, ధర్నాలు చేసిన ఆ పార్టీ, ఈనెల 6,7,8 తేదీల్లో అన్ని నియోజకవర్గాల్లో రిలే నిరాహార దీక్షలు నిర్వహించింది. ఇందులో పార్టీ నేతలతోపాటు డీఎస్సీ, అభ్యర్థులు, నిరుద్యోగులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేశారు. తాజాగా ఈనెల 10వ తేది అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి, సంబంధిత అధికారులకు వినతి పత్రాలు అందజేయాలని ఆ పార్టీ నిర్ణయించింది. ఈ మేరకు వైఎస్సార్ కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, బద్వేల్, పులివెందుల, రాజంపేట, జమ్మలమడుగు, కమలాపురం అసెంబ్లీ నియోజకవర్గాల్లో సోమవారం నిరసన ర్యాలీలు నిర్వహించనున్నారు. ఎన్నికల ముందు మెగా డీఎస్సీపై తొలి సంతకం చేస్తామని ప్రకటించిన ముఖ్యమంత్రి చంద్రబాబు, అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర తర్వాత 16వేల పోస్టులకు డీఎస్సీ–2025 నిర్వహించారు. ఈ డీఎస్సీ లో అక్రమాలు చోటు చేసుకున్నాయని బాధితులు, వైఎ స్సార్సీపీ ఆరోపిస్తోంది. మెరిట్ ప్రాతిపదికన ఉద్యో గాలు ఇవ్వకుండా పరీక్షలు రాసిన వారి డేటాను ఆన్లైన్ నుంచి తొలగించడం... మొదటి ర్యాంకు వచ్చిన ఎన్సీఆర్టీ ఔట్ సోర్సింగ్ ఉద్యోగికి ఉద్యోగం ఇవ్వకపోవడం వంటివి దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. ఈ అక్రమాలపై సీబీఐతోగానీ, సిట్టింగ్ జడ్జితోగానీ విచారణ జరపాలని ప్రతిపక్ష వైఎస్సార్సీపీ డిమాండ్ చేస్తూ కొన్ని రోజులుగా ఆందోళనలు చేస్తోంది. వీటన్నింటికీ బాధ్యత వహించి రాష్ట్ర విద్యాశాఖామంత్రి లోకేష్ రాజీనామా చేయాలని కూడా ఆ పార్టీ డిమాండ్ చేస్తోంది. అలాగే బకాయి ఉన్న రూ.10వేల కోట్ల ఫీజు రీయంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగులకు భృతి ఇవ్వాలని కోరుతోంది. ఈ డిమాండ్లతోనే ఈనెల 10వ తేది అన్ని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించేందుకు సమాయత్తమవుతోంది. నిరసన ర్యాలీలను విజయవంతం చేయాలి డీఎస్సీ అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ చేపట్టిన నిరసన ర్యాలీలను విజయవంతం చేయా లని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి కోరా రు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐతో విచారణ చేయాలని, మంత్రి లోకేష్ రాజీనామా చేయాలన్నారు. సోమవా రం జిల్లాలోని 8 నియోజకవర్గాల్లోనూ భారీ ఎత్తున ర్యాలీలు కొనసాగనున్నాయని తెలిపారు. యువత ర్యాలీలలో పాల్గొని నిరసన తెలియజేయాలన్నారు. ర్యాలీలపై కూటమి కుట్ర ●పోలీసుల ద్వారా నోటీసులు అందజేత కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో సోమవారం నిర్వహించ తలపెట్టిన నియోజకవర్గ ర్యాలీలను అడ్డుకునేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నింది. ఈ మేరకు ర్యాలీలు నిర్వహించవద్దని పార్టీ నాయకులందరికీ పోలీసుల ద్వారా నోటీసులు జారీ చేయిస్తోంది. పులివెందులలో కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి, కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ కే సురేష్ బాబు, వైఎస్ఆర్సిపి జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి , మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మె ల్యే రాచమల్లు, జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామ సుబ్బారెడ్డి ,బద్వేల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి ఎమ్మెల్యే దాసరి సుధా రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి తదితరులకు నోటీసులు ఇచ్చినట్లు తెలుస్తోంది.


