breaking news
YSR District Latest News
-
భూమి కోసం అన్నదమ్ముల మధ్య ఘర్షణ
తొండూరు : మండలంలోని సంతకొవ్వూరు పంచాయతీ పరిధిలో గల ఎస్.చెర్లోపల్లె గ్రామంలో అన్నదమ్ముల మధ్య పొలం తగాదాపై ఘర్షణ జరిగినట్లు ఎస్ఐ ఘన మద్దిలేటి తెలిపారు. శనివారం చెర్లోపల్లె గ్రామానికి చెందిన నారాయణ, వీరయ్య అన్నదమ్ముల మధ్య పొలం తగాదా విషయమై ఘర్షణ జరిగింది. నారాయణ అనే వ్యక్తి వీరయ్య భార్య భవాని, లక్ష్మీ కవితలు ఇంటి వద్ద భూమి విషయమై పరస్పరం దాడి చేసుకున్నారు. ఈ సంఘటనలో భవాని, లక్ష్మీ కవితలకు బలమైన గాయాలు కావడంతో వీరిని పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి 108 వాహనంలో తరలించారు. ఈ సంఘటనపై ఎస్ఐ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెన్నాలో గుర్తుతెలియని మహిళ మృతదేహం లభ్యం ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో ఉన్న పెన్నానదిలో గుర్తు తెలియని మహిళ మృతదేహం లభ్యమైందని సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. వచ్చిన సమాచారం మేరకు శనివారం సాయంత్రం సీఐ ఆదేశాల మేరకు సంఘటన స్థలాన్ని ఎస్ఐ నాగమురళి పరిశీలించారు. మృతురాలి వయసు 25 నుంచి 30 మధ్య ఉంటుంది. రెడ్ కలర్ ఓని, బ్లాక్ కలర్ లెగ్గిన్ ధరించింది. పూర్తి వివరాలు తెలియాల్సింది. వివరాలు తెలిసిన ఎవరైనా 9121100530 నంబర్కు తెలపాలని సీఐ కోరారు. విద్యుదాఘాతంతో అడవి పంది మృతి మైదుకూరు : మండలంలోని వనిపెంట అటవీ రేంజ్లో విద్యుదాఘాతంతో అడవి పంది మృతి చెందినట్లు అటవీ రేంజ్ అధికారి చలపతి నాయుడు శనివారం తెలిపారు. రేంజ్ పరిధిలోని గంజికుంట బీట్లో పంది మృతి చెందినట్లు తెలియడంతో తాము వెళ్లి పరిశీలించగా కొంత మేరకు పంది మాంసం లభ్యమైనట్లు పేర్కొన్నారు. పంది మృతి చెందిన చోట ఉన్న పొలం యజమానిని విచారణ చేస్తున్నామని తెలిపారు. ఎవరైనా పొలాలకు విద్యుత్ కంచెను వేసి వన్యప్రాణుల మృతికి కారణమైతే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని ఎఫ్ఆర్ఓ హెచ్చరించారు. -
ఫార్మసీలో ఆధునిక పరిశోధనలు పెరగాలి
రాజంపేట : నేటి సమాజంలో ఫార్మసీ రంగానికి ప్రాధాన్యత పెరుగుతోందని, ఆధునిక పరిశోధనలు పెరగాలని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి పేర్గొన్నారు. శుక్రవారం అన్నమాచార్య ఫార్మసీ కళాశాలలో స్పార్క్రిక్సజినిటింగ్ డ్రగ్ డిస్కవరీ అండ్ డెవలప్మెంట్ త్రూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనే అంశంపై జాతీయ సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 200 పత్ర ప్రదర్శనలో ప్రదర్శించే ఆధునిక అంశాలపై అవగాహన కల్పించుకోవాలన్నారు. ఐపీఏ అధ్యక్షులు, రాజమండ్రి వికాస్ ఫార్మసీ కళాశాల డైరెక్టరు డాక్టర్ టీవీ నారాయణ మాట్లాడుతూ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఔషధ తయారీ కనుగొనాలన్నారు. రెడ్డీస్ ల్యాబొరేటరీస్ శాస్త్రవేత డాక్టర్ జనార్ధన్ మాట్లాడుతూ పరిశోధనలలో ఆధునికత జ్ఞానాన్ని పెంచుకోవాలన్నారు. సదస్సులో తమ పత్ర ప్రదర్శనల ద్వారా అనేక నూతన పరిశోధన మార్గాలు, అధ్యయనం చేసుకునేందుకు దోహద పడతాయన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి మాట్లాడుతూ ఎన్నో ఔషధ మొక్కల్లో నుంచి వెలికి తీసే ఔషధాలపై, వాటి ప్రయోగాలపై పట్టు సాధించాలన్నారు. సదస్సులో ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, అన్నమాచార్య కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ నారాయణ, శాస్త్రవేత్తలు డాక్టర్ ఒలియర్ జోయల్గోనా, డాక్టర్ గోపినాథ్, ప్రిన్సిపాల్ డాక్టర్ స్వర్ణలత పాల్గొన్నారు. సదస్సులో రాష్ట్రంలోని వివిధ కళాశాల నుంచి, వివిధ రాష్ట్రాల నుంచి 700 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకోగా, 200 మంది పత్ర ప్రదర్శనతో , వీడియోలతో పాల్గొన్నారు. కార్యక్రమంలో కళాశాలకు చెందిన డాక్టర్ ఎం.దీప, డాక్టర్ వాసవిదేవి, వై.ప్రదీప్కుమార్తోపాటు అధ్యాపక బృందం పాల్గొన్నారు. పత్ర ప్రదర్శనలో చక్కటి ప్రతిభ చూపిన వారికి బహుమతులను అందజేశారు. -
సెల్ చోరీలతో మొదలెట్టి.. ఘరానా దొంగగా మారి..
ప్రొద్దుటూరు క్రైం : అతను రాత్రి వేళ గస్తీ నిర్వహిస్తాడు. జన సంచారం లేనిచోట తాళం వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలు చేస్తుంటాడు. మొదట చిన్న చిన్న సెల్ఫోన్లను చోరీలు చేస్తున్న అతను.. ఇళ్లకు కన్నాలు వేసే స్థాయికి ఎదిగి ఘరానా దొంగగా మారాడు. ప్రొద్దుటూరుతోపాటు జిల్లాలోని పలు ప్రాంతాల్లో చోరీలు చేసిన షేక్ నౌమాన్ అలియాస్ మస్తాన్ అనే దొంగను టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వివరాలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ శనివారం సాయంత్రం మీడియాకు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని పెన్నానగర్కు చెందిన షేక్ నౌమాన్ పెయింటర్ పని చేసుకొనేవాడు. కొన్నేళ్ల నుంచి అతను చెడు వ్యసనాలకు లోనై చోరీలు చేయడం ప్రారంభించాడు. ముందుగా అతను నిద్రపోయిన వారి వద్ద నుంచి సెల్ఫోన్లు చోరీ చేసేవాడు. తర్వాత ఇళ్లలో చిన్న చిన్న దొంగతనాలు చేస్తూ వచ్చాడు. నాలుగైదు చోట్ల చోరీకి పాల్పడినా అతని నేరాలు బయటికి రాకపోవడంతో భారీ చోరీలు చేయడం అలవాటు చేసుకున్నాడు. ఇళ్లలో సొమ్ము లూటీ చేసిన తర్వాత పోలీసులు గుర్తు పట్టకుండా ఉండేందుకు తరచు నివాస ప్రాంతాలను మారుస్తూ వచ్చాడు. ఇలా ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాలకు మకాం మార్చి నేరాలు చేసేవాడు. ఇతనిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో సస్పెక్ట్ షీట్ కూడా ఉంది. ప్రొద్దుటూరు, రాయచోటి ప్రాంతాల్లో నౌమాన్పై 10 కేసుల వరకు ఉన్నాయి. ఈ క్రమంలో ప్రొద్దుటూరులోని బాలాజినగర్–2లో నివాసం ఉంటున్న జావిద్ అనే స్వర్ణకారుడు ఇంట్లో ఈ ఏడాది 22న రాత్రి చోరీ చేశాడు. పెద్ద ఎత్తున బంగారు దొంగలించాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. నిందితుడు షేక్ నౌమన్ ఎర్రగుంట్ల బైపాస్ రోడ్డులోని మోడంపల్లె క్రాస్ వద్ద ఉండగా శనివారం టూ టౌన్ ఎస్ఐ షేక్ మహబూబ్బాషా సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. అతని వద్ద సుమారు 68 గ్రాములు బంగారు, పల్సర్ బైక్ను స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని రిమాండుకు తరలించినట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ కేసును ఛేదించి పెద్ద మొత్తంలో బంగారు నగలను రికవరీ చేసిన సీఐ వంశీనాథ్, ఎస్ఐలు మహబూబ్బాషా, ఆర్ రాఘవేంద్రారెడ్డి, సిబ్బంది గురుశేఖర్, మధుసూదన్రెడ్డి, సత్యనారాయణలను ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. నిందితుడి అరెస్ట్, బంగారు ఆభరణాలు, బైక్ స్వాధీనం -
బాల్యమిత్రుల అపూర్వ కలయిక
● 80 ఏళ్లు దాటినా కొనసాగుతున్న వారి స్నేహం ● రాజంపేట వేదికగా కలుసుకున్న మిత్రులు రాజంపేట టౌన్ : వారందరికి ఎనిమిది పదుల వయసు దాటింది. దాదాపు అరవై మూడేళ్ల క్రితం అనంతపురంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ విద్య పూర్తి చేసుకున్నారు. ఆ తరువాత పలువురు వివిధ హోదాల్లో బాధ్యతలు నిర్వర్తించి పదవీ విరమణ పొందగా, ఇంకొందరు వ్యాపార రంగంలో ఉన్నత స్థాయికి చేరుకొని విశ్రాంతి తీసుకుంటున్నారు. సహజంగా ఆ వయసులో ఉన్న వారు ఒకరిద్దరు స్నేహితులను మినహా మిగతా వారి గురించి మరచిపోయి కాలాన్ని వెల్లదీస్తూ జీవనం సాగిస్తుంటారు. అయితే అనంతపురంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్ కళాశాలకు చెందిన 1958–1963 బ్యాచ్ విద్యార్థులు ఇందుకు భిన్నమనే చెప్పాలి. 2013 వరకు చిన్ననాటి మిత్రులు ఎక్కడెక్కడో ఉండేవారు. వారిలో కొంత మంది తమ స్నేహాన్ని కొనసాగించేవారు. అయితే 2013లో వారు చదువుకున్న ఇంజినీరింగ్ కళాశాల గోల్డెన్ జూబ్లీ వేడుకలు మిత్రులందరిని కలిపింది. ఇక అప్పటి నుంచి కరోనా సమయంలో మినహా ప్రతి ఏడాది ఇతర రాష్ట్రాలు, జిల్లాల్లో ఉండే ఓ స్నేహితుడి ఊరిలో కలుసుకొని రెండు రోజుల పాటు ఆనంద భరితంగా గడుపుతున్నారు. అందులో భాగంగా శనివారం బెంగళూరు కేంద్రంగా హిందుస్థాన్ ఏరోనాటికల్ సంస్థలో ఆఫీసర్గా పని చేసి పదవీ విరమణ పొందిన ములక్కాయల జనార్దన్రెడ్డి ఆధ్వర్యంలో చిన్ననాటి స్నేహితులు రాజంపేటలోని కాకతీయ కళాశాల ఆడిటోరియంలో కలుసుకున్నారు. చిన్ననాటి స్నేహితులు ఒకొక్కరు కాకతీయ కళాశాల ఆడిటోరియానికి చేరుకునే సమయంలో.. ముందుగా వచ్చిన మిత్రులు వారికి ఎదురెళ్ళి ఆప్యాయంగా అలింగనం చేసుకొని మిత్రమా.. కుశలమా అంటూ యోగక్షేమాలు తెలుసుకున్నారు. అనంతరం అందరూ ఒకచోట కూర్చోని తాము చదువుకున్న రోజుల్లో జరిగిన తీపి జ్ఞాపకాలను గుర్తు చేసుకున్నారు. అలాగే పలువురు తమ ఆరోగ్య రహస్యం గురించి తెలియచేయగా, ఇంకొందరు తమకున్న ఆరోగ్య సమస్యల గురించి తెలియచేసి వారిపై వారే ఛలోక్తులు వేసుకోవడంతో నవ్వులు పూయించింది. ఏది ఏమైనా ఎనబై సంవత్సరాలపైబడిన వారు స్నేహితులను కలుసుకోవడానికి వందల కిలోమీటర్లు ప్రయాణించడం విశేషంగా చెప్పవచ్చు. ఇదిలా వుంటే తొలుత కాలం చెందిన మిత్రుల ఆత్మశాంతి కోసం రెండు నిమిషాలు మౌనం పాటించి.. వారితో తమకు ఉన్న అనుబంధాన్ని గుర్తు చేసుకున్నారు. ఒక్క మాటలో చెప్పాలి అంటే స్నేహం వెయ్యేనుగుల బలం. స్వార్థం, కల్మషం లేని ఒక్క స్నేహితుడు ఉన్నా చాలు జీవితం చాలా ఆనందంగా సాగిపోతుంది. అయితే మా స్నేహితులందరు కూడా స్వచ్ఛమైన మనస్సుగల వారు. అందువల్లే ఎనిమిది పదుల పైబడిన వయసులోను మా స్నేహం కొనసాగుతుంది. నిజంగా ఇది మా అదృష్టమనే చెప్పాలి. – కె.రంగనాధం, మాజీ సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్, తిరుపతి -
చంద్రబాబు పాలనలో అప్పులు, అరాచకం
జమ్మలమడుగు : ‘రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ప్రజలు, రైతులకు చేసిందేమీ లేదు. 20 నెలల పాలనలో ఏకంగా మూడు లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేసింది. ఆ అప్పులు దేనికి ఖర్చు పెట్టారో తెలియని పరిస్థితి. రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలు ఏమైనా అమలు పరిచారా అంటే అదీ లేదు’ అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అరాచక పాలన సాగిస్తోందన్నారు. ప్రశ్నించే వారిపై తప్పుడు కేసులు పెట్టి, ఇబ్బందులకు గురిచేయడమే పనిగా పెట్టుకున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు పరిచే ఆలోచనలో ప్రభుత్వం కనిపించడం లేదన్నారు. రాష్ట్రంలో మూడు సార్లు కూటమి ప్రభుత్వం బడ్జెట్ను ప్రవేశ పెట్టిందన్నారు. మూడో బడ్జెట్లో కూడా రైతులు, చేనేతలు, విద్యార్థులకు ఇచ్చిన హామీలైన నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి, ఆసరా పథకాలకు నిధులు కేటాయించలేదన్నారు. సూపర్ సిక్స్ పేరుతో ఇచ్చిన హామీలను ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. కానీ సూపర్ సిక్స్ సూపర్ హిట్ అంటూ కోట్లాది రూపాయల నిధులు ప్రకటనలకు ఖర్చు చేస్తున్నారే తప్ప.. క్షేత్ర స్థాయిలో సూపర్ సిక్స్ పథకాలు సూపర్ఫ్లాప్ అయ్యాయన్నారు. వైఎస్సార్సీపీపై అసత్య ప్రచారం వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాష్ట్రం దివాలా తీసిందని, శ్రీలంకగా మారిందంటూ పది లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారంటూ కూటమి నాయకులు అసత్య ప్రచారం చేశారని విమర్శించారు. కానీ చంద్రబాబు పాలనలో గత మూడు సార్లు ప్రవేశ పెట్టిన బడ్జెట్లో రాష్ట్ర ఆదాయం లక్ష కోట్లు అని చూపారని, అందులో వచ్చింది 60 వేల కోట్ల రూపాయలు మాత్రమేనన్నారు. సంపద సృష్టిస్తామన్న చంద్రబాబు నాయుడు అప్పులు సృష్టించి పెద్దలకు పంచి పెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకుడు పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య పాల్గొన్నారు. ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి -
కొలువుదీరనున్న నందీశ్వరుడు
● రాష్ట్రానికే తలమానికంగా ఆలయం ● సీజీఎఫ్, దాతల సహకారంతో నిర్మాణం ● రూ.6 కోట్లతో నూతన దేవాలయం ● రేపటి నుంచి 27 వరకు ఆలయ ప్రాణ ప్రతిష్ట వేడుకలు వేంపల్లె : మండలంలోని నందిపల్లెలో నూతనంగా నిర్మించిన నందీశ్వరాలయంలో నందీశ్వరుడు కొలువు తీరనున్నాడు. రాష్ట్రానికే తలమానికంగా నూతన ఆలయం నిర్మించారు. గతంలో 150 ఏళ్ల పురాతన శివాలయం ఉండేది. ఆలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులు చందాలు ప్రోగు చేసుకుని రూ.30 లక్షలతో నూతన ఆలయం నిర్మించాలని గ్రామ సర్పంచ్ మారం సులోచన, కుమారుడు యూకే, యూరప్ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్ మారం శ్రీకాంత్ రెడ్డిలను కోరారు. ఈ విషయాన్ని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దృష్టికి వారు తీసుకెళ్లారు. ఆయన సహకారంతో సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించగా, దాతల సహకారంతో కలిపి దాదాపు రూ.6 కోట్ల వ్యయంతో ఈ నూతన ఆలయాన్ని నిర్మించారు. ఈనెల 23వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఆలయ ప్రారంభోత్సవంతోపాటు శివలింగం, నందీశ్వరుడు విగ్రహాలకు ప్రాణప్రతిష్ట వేడుకలు జరగనున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో సీజీఎఫ్ నిధులు మంజూరు గత వైఎస్సార్సీపీ హయాంలో నందిపల్లెలో నందీశ్వర నూతన ఆలయ నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారంతో గ్రామ సర్పంచ్ రూ.45 లక్షలను సీజీఎఫ్ ఫండ్కు జమ చేశారు. దీంతో కడప ఎంపీ కృషితో సీజీఎఫ్ కింద రూ.1.80 కోట్లు నిధులు మంజూరు చేయించారు. అలాగే దాతల నుంచి రూ.70 లక్షలు ప్రోగు చేశారు. మిగిలిన రూ.3.50 కోట్లు యూకే, యూరప్ వైఎస్సార్సీపీ కో ఆర్డినేటర్ మారం శ్రీకాంత్రెడ్డి తన నిధులను ఆలయ నిర్మాణానికి ఖర్చు చేశారు. సుమారు 5 ఎకరాల్లో సువిశాలమైన ప్రదేశంలో నందీశ్వరాలయాన్ని నిర్మించారు. ఆలయమంతా రాతి కట్టడాలు నందీశ్వరాలయమంతా రాతి కట్టడాలతో చాలా అందంగా నిర్మించారు. గుంటూరు జిల్లా చిలకలూరిపేట మండలం కోటప్పకొండ గ్రామం నుంచి ఆలయానికి సంబంధించిన రాళ్లను కొనుగోలు చేశారు. ఆళ్లగడ్డలో ప్రత్యేకంగా నంది విగ్రహాన్ని మొలిపించి తయారు చేశారు. శివుడు, పార్వతి విగ్రహాలను మధ్యప్రదేశ్లోని ఓంకారేశ్వర్ వద్ద ఉన్న నర్మదా నది గ్రామంలో తయారు చేయించారు. ఆలయం చుట్టూ ఉన్న వినాయకుడుతోపాటు వివిధ దేవతా రూపాల్లో ఉన్న 27 విగ్రహాలను రూ.3 లక్షలు వెచ్చించి తిరుమల తిరుపతి దేవస్థానం నుంచి పొందారు. ఐదు రోజులు పాటు వివిధ కార్యక్రమాలు ఆలయ ప్రారంభ మొదటి రోజు 23వ తేదిన గణపతి పూజ, యాగశాల ప్రవేశం, మృత్సంగ్రహణం, ఆంకురారోహణం, ఆగ్ని ప్రతిష్ఠ, 24న ప్రాతఃకాల పూజ, లక్ష్మీ గణపతి హోమం, మూల మంత్ర హోమాలు, 25న మహారుద్ర హోమం, గ్రామోత్సవంతోపాటు నందీశ్వరుడికి మహానీరాజనం, కోటి దీపోత్సవం, 26న కంచి పీఠాథిపతుల జగద్గురు శంకర విజయోంధ్ర సర్వస్వతి శంకర చార్య స్వామిగల్ ఊరేగింపుతోపాటు యంత్ర ప్రతిష్ఠలు, విగ్రహ ప్రతిష్ఠ, ధ్వజా శిఖర ప్రతిష్ఠ, కుంభాభిషేకం. 27న రుద్రాభిషేకం చేయడంతోపాటు శివ పార్వతుల శాంతి కళ్యాణం నిర్వహించనున్నారు. వేడుకల సందర్భంగా ఆలయ ప్రాంగణంలో కోలాటంతోపాటు సాంస్కృతిక ప్రదర్శన కార్యక్రమాలు వేడుకగా జరగనున్నాయి. 5 రోజుల పాటు ఆలయాన్ని దర్శించే భక్తులకు అన్నదానం కార్యక్రమం ఏర్పాటు చేయనున్నారు. భక్తులను అలరించేందుకు 26న గాయకురాలు మధుప్రియ బృందంచే ఆర్కెస్ట్రా కూడా నిర్వహించనున్నారు. నందీశ్వరాలయంలో శివలింగం విగ్రహ ప్రతిష్ట కార్యక్రమానికి పలువురు ప్రముఖులు, నాయకులు హాజరుకానున్నారు. నందిపల్లెలో నూతన నందీశ్వరాలయ నిర్మాణానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఎంతో కృషి చేశారు. రూ.30లక్షలతో నిర్మించుకోవాలనుకున్న ఆలయం దాదాపు రూ.6కోట్ల వ్యయమైంది. సీజీఎఫ్ నిధులు మంజూరు చేయడంలో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కీలకపాత్ర పోషించారు. ఆలయమంతా రాతి కట్టడాలతోనే నిర్మాణం జరిగింది. రాష్ట్రంలోనే తలమానికంగా ఇలాంటి పెద్ద నందీశ్వరాలయం మా గ్రామంలో నిర్మాణం కావడం చాలా సంతోషంగా ఉంది. ఆలయ నిర్మాణానికి తన వంతు సహకారం అందించాను. – మారం శ్రీకాంత్ రెడ్డి, యూకే, యూరప్ వైఎస్సార్సీపీ కోఆర్డినేటర్, నందిపల్లె నందిపల్లె గ్రామంలో పురాతన శివాలయం శిథిలావస్థకు చేరుకోవడంతో గ్రామస్తులందరం కలి పి నూతన ఆలయం నిర్మించాలని నిర్ణయం తీసు కున్నాం. అందుకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారం కోరాం. మొదటగా రూ. 30 లక్షలతో నూతన ఆలయాన్ని నిర్మించాలనుకున్నాం. తర్వాత కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారంతో రూ.1.80 కోట్ల సీజీఎఫ్ నిధులు మంజూరు కావడంతో దాతల సహకారంతో మరింత డబ్బును పోగు చేసి దాదాపు రూ.6 కోట్లతో ఆలయ నిర్మాణాన్ని పూర్తి చేశాం. – మారం సులోచన, గ్రామ సర్పంచ్, నందిపల్లె -
ఆ అనుభూతి మాటల్లో చెప్పలేనిది
చిన్ననాటి స్నేహితులను స్వయంగా కలుసుకోవడంలో ఉండే అనుభూతి మరెందులోను ఉండదనే చెప్పాలి. వాస్తవంగా చెప్పాలి అంటే ఎనబై ఏళ్లు పైబడిన వయసులో సుదూర ప్రాంతాలకు వెళ్లి చిన్ననాటి మిత్రులను ప్రతి ఏడాది ఒకచోట కలుసుకోవడం చాలా కష్టతరమైన పనే. అయినా మిత్రులను కలుసుకుంటున్నామన్న ఆనందం వల్ల శరీరం కూడా సహకరిస్తుందనిపిస్తుంది. – ములక్కాయల జనార్దన్రెడ్డి, రిటైర్డ్ ఆఫీసర్, రాజంపేట వయసు పైబడే కొద్ది ఆరోగ్య సమస్యలు ఉంటాయి. అందువ ల్ల ఇతర ప్రాంతాలకు వెళ్లి స్నేహితులను కలుసుకుందామన్న ఆలోచనలు ఉన్నా శరీరం సహకరించక స్నేహితులను కలవలేని పరిస్థితి ఉంటుంది. అయితే మాకు ఎనిమిది పదుల వయసు దాటినా ప్రతి ఏడాది స్నేహితులను కలుస్తున్నాము. ఇది మాకు భగవంతుడు ఇచ్చిన వరంగా భావిస్తున్నాం. – బాలవీరారెడ్డి, మాజీ వైస్ చాన్సలర్, బెంగుళూరు -
చైన్స్నాచర్లను పట్టుకున్న యువకులు
బి.కోడూరు : మండలంలోని పాయలకుంట్ల గ్రామంలో శనివారం ఇద్దరు చైన్స్నాచింగ్ దొంగలను అదే గ్రామానికి చెందిన యువకులు వెంబడించి పట్టుకుని పోలీసులకు అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. పాయలకుంట్ల గ్రామ సమీపాన రైస్మిల్ వద్ద రోడ్డుపై అరటిపండ్ల దుకాణాన్ని ఒక మహిళ గత కొంత కాలంగా నడుపుతోంది. శనివారం ఉదయం పోరుమామిళ్ల నుంచి ఇద్దరు యవకులు ద్విచక్ర వాహనంలో వచ్చి అరటిపండ్ల దుకాణం వద్ద ఆపి.. అరటిపండ్లు కొనుగోలు చేయబోయి ఆమెను ఏమార్చి మెడలో ఉన్న చైన్ లాక్కెళ్లబోయారు. ఆమె జాగ్రత్తగా చేతిలో ఉన్న చాకుతో గట్టిగా అరుస్తూ వారిపై తిరగబడి చైన్ను విడిపించుకుంది. దీంతో ఆ యువకులు తమ బైక్పై పరారయ్యారు. రైస్మిల్ వద్ద ఉన్న కొంత మంది యువకులు ఈ విషయాన్ని గమనించి బైక్లతో వెంబడించి గుండంరాజుపల్లె గ్రామ సమీపాన వారిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో యువకులు నందలూరు గ్రామానికి చెందిన శంకరయ్య, విజయశంకర్లుగా గుర్తించారు. వారిపై బద్వేలు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మండలంలో ఇలాంటి సంఘటనలు మూడుకు పైగా జరిగినప్పటికీ శనివారం యువకులు పట్టుకోవడం గమనార్హం. ఏయూ ప్రొఫెసర్కు జాతీయ పురసార్కం రాజంపేట : అన్నమాచార్య యూనవర్సిటీ ఈఈఈ విభాగం అసిసోయేట్ ప్రొఫెసర్ డాక్టర్ పసల గోపి జాతీయ పురస్కారం అందుకున్నారు. ఆయనను శుక్రవారం ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబారెడ్డి అభినందించారు. డాక్టర్ పసల గోపి విద్యారంగంలో చూపిన అత్యుత్తమ సేవలు, అంకితభావం, నైపుణానికి గుర్తింపుగా ప్రతిష్టాత్మక అథర్రేడియన్స్ అవార్డును ప్రదానం చేశారు. ఈ అవార్డును మీరట్లో ఆరాధయ ఎక్ ఎహ్సాస్ ఫౌండేషన్ అందించింది. అభినందన కార్యక్రమంలో ఏయూ ప్రొఫెసర్ పద్మలలిత, ఈఈఈ హెచ్వోడీ డాక్టర్ పీబీ చెన్నయ్య తదితరులు పాల్గొన్నారు. -
24న రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్/చింతకొమ్మదిన్నె: చింతకొమ్మదిన్నె మండలంలోని చిన్నపల్లి యోగి శ్రీ నరసింహ్మ స్వామి ఆరాధన సందర్భంగా ఈ నెల 24న రాష్ట్రస్థాయి ఓల్డ్ కేటగిరీ ఎడ్ల బండలాగుడు పోటీలను నిర్వహించనున్నట్లు ఆలయ ధర్మకర్త గోసుల మునిరెడ్డి తెలిపారు. ఈ పోటీల్లో మొదటి బహుమతి రూ. 70,016, రెండవ బహుమతి రూ. 50,016, మూడవ బహుమతి రూ. 30,016, నాల్గవ బహుమతి రూ. 20,016, ఐదవ బహుమతి రూ. 15,016, ఆరవ బహుమతి రూ. 10,016 బహుమతులు ఉంటాయన్నారు. ఆసక్తి గల ఎడ్ల యజమానులు వివరాలకు 98669 32301 అనే నెంబర్లో సంప్రదించాలని సూచించారు. ఒంటిమిట్ట: ఏకశిలానగరిలోని ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆవరణలో శనివారం హైదరాబాద్ కు చెందిన శ్రీ వాగ్దేవి కళా సమితి ఆధ్వర్యంలో నిర్వహించిన నాదోపాసన సాంస్కృతిక కార్యక్రమం భక్తులను అలరించింది. ఈ కార్యక్రమంలో శ్రీ సీతారాముల కల్యాణంపై కర్నాటిక్ క్లాసికల్ గాయకుడు పి.శ్రీనివాసకుమార్ సంకీర్తనలు పాడి భక్తులను మంత్రముగ్దులను చేశారు. అనంతరం హరికథను భక్తుల కళ్ళకు కట్టినట్టు వినిపించారు. ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్లు మూలవిరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షణ చేసి.. గర్భాలయంలోని మూలవిరాట్కు సమర్పించారు. నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలను తొడిగి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశామని ఇంటర్మీడియట్ ఆర్ఐఓ టీఎన్వీ వెంకటేశ్వర్లు తెలిపారు. ఇంటర్ పరీక్షల నిర్వహణపై శనివారం ఆర్ఐఓ కార్యాలయంలో ఆయన విలేకర్లతో మాట్లాడారు. ఈనెల 23 నుంచి ప్రారంభమై మార్చి 24వ తేదీ వరకు పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఈ పరీక్షల కోసం జిల్లాలో 62 పరీక్షా కేంద్రాలను సిద్ధం చేశామని తెలిపారు. సంబఽంధిత పరీక్షలు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహిస్తామని తెలిపారు. పరీక్షలు సీసీ కెమెరాల పర్యవేక్షణలో అత్యంత కట్టుదిట్టంగా జరుగుతాయని వివరించారు. 17,100 ప్రథమ సంవత్సర విద్యార్థులు, 16564 మంది ద్వితీయ సంవత్సర విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారని వెల్లడించారు. విద్యార్థులు సహాయం కొరకు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08562 244171 ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ఎవరికైనా సమస్యలుంటే ఫోన్ చేయవచ్చునని తెలిపారు. -
అభివృద్ధి పనులు ప్రారంభం
ఒంటిమిట్ట: ఏకశిలానగరి శ్రీ కోదండ రామస్వామి సన్నిధి ఆవరణలో శనివారం రూ.18 లక్షల నిధులతో పలు రకాల పనులను ప్రారంభించినున్నట్లు టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి శనివారం తెలిపారు. ఇందులో ఇప్పటికే ఆలయ లడ్డూ కౌంటర్ వద్ద నుంచి టీటీడీ పరిపాలన భవనానికి వెళ్లే మార్గాన్ని పునరుద్ధరణ చేస్తున్నామన్నారు. అలాగే అలంకార మండపం వద్ద కూడా మరమత్తుల పనులు చేయాలని, ఆలయానికి దక్షణ–పడమర వైపు కలిసే మాడ వీధులవద్ద ఉన్న గేటు దగ్గర స్వామి వారి రథం వెల్లేందుకు ఇంకా విశాలంగా ఉండేలా పనులు చేయాల్సి ఉందన్నారు. గ్రామ పురవీధుల్లో స్వామి వారి రథం తిరిగే 300 మీటర్ల బీటీ రోడ్డును కూడా అభివృద్ధి చేస్తున్నామని వివరించారు. -
సీమ లిఫ్ట్ కోసం ఉద్యమం
రాయలసీమ నీటి ప్రాజెక్టులపై రాయచోటిలో మీడియాతో మాట్లాడుతున్న వైఎస్ఆర్సీపీ నాయకులు రాయచోటి: రాయలసీమకు సాగు, తాగునీరు అందించే ప్రాజెక్టును నిలిపేసి తాను పుట్టిన ప్రాంతానికి సీఎం చంద్రబాబు తీవ్ర అన్యాయం చేస్తున్నారని అన్నమయ్య జిల్లా వైఎస్ఆర్సీపీ నేతలు మండిపడ్డారు. రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పార్టీ కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. సీమ ప్రయోజనాలను గాలికొదిలేసి పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రితో చంద్రబాబు కుమ్మక్కు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో దాదాపు పూర్తయిన రాయలసీమ లిఫ్ట్ పనుల్ని చంద్రబాబు నిలిపేయడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ఇప్పటికై నా చంద్రబాబు తన తప్పు తెలుసుకుని సీమ లిఫ్ట్ పనులు ప్రారంభించకపోతే మార్చి 1న పార్టీలకతీతంగా వైఎస్ఆర్సీపీ ప్రజా ఉద్యమాన్ని ప్రారంభిస్తుందని వారు హెచ్చరించారు. చంద్రబాబు సీమ ద్రోహి: సురేష్బాబు, కడప మాజీ మేయర్ గతంలో తానే దేవెగౌడ, గుజ్రాల్, వాజ్పేయిలను ప్రధానుల్ని చేశానని చెప్పుకున్న చంద్రబాబు 1995లో వెలుగోడు, బ్రహ్మసాగర్ వంటి ప్రాజెక్టులకు శంకుస్థాపనలు చేసి ఒక్క రూపాయి నిధులివ్వలేదన్నారు. 1996, 1998లో ఉప ఎన్నికలు జరిగితే మళ్లీ టెంకాయలు కొట్టాడు కానీ రూపాయి కేటాయించలేదని పేర్కొన్నారు. రాయలసీమలో పుట్టిన చంద్రబాబు.. ఈ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇవ్వాలన్న ఆలోచన చేసిన పాపానపోలేదని విమర్శించారు. చంద్రబాబు కుయుక్తుల్ని అడ్డుకుంటాం: పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎమ్మెల్యే చంద్రబాబు ఎన్ని ప్రాజెక్టులు ఆపేశాడో ఆయనకు తెలుసు. రాయలసీమ ప్రజలందరికీ తెలుసు. కుప్పానికి కూడా చంద్రబాబు చేసిందే మీ లేదు. ఈ మధ్య ఓ ఇల్లు కట్టుకోవడం తప్ప కుప్పానికి ఏమీ చేయలేదు. రాయలసీమకు బాబు అన్యాయమే చేశాడని మండిపడ్డారు. వైఎస్ఆర్ రాయలసీమ ప్రాంతానికి సాగునీరు, తాగునీరు అందించాలని ఆ రోజుల్లో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యం పెంచాలని చూస్తే సొంత పార్టీ కాంగ్రెస్లోనే చాలా మంది వ్యతిరేకించారని ఎమ్మెల్యే ఆకేపటి పేర్కొన్నారు. వెనుకబడిన రాయలసీమ ప్రాంతానికి తాగునీరు, సాగునీరు ఇవ్వాల్సిన బాధ్యత ఉందని ఎవర్నీ లెక్కచేయకుండా వైఎస్సార్ ముందుకెళ్లారన్నారు. చంద్రబాబు సీఎం అయ్యాక ప్రాజెక్టుల విషయంలో అడుగు కూడా ముందుకు పడలేదన్నారు. తిరిగి జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు అంతా సిద్దం చేసిన తరుణంలో బాబు సర్కారు మూలనపారేశారన్నారు. చంద్రబాబుతో తనకు ఉన్న సాన్నిహిత్యంతో రాయలసీమ లిఫ్ట్ ఆపానని రేవంత్రెడ్డి చెప్పుకున్నా ముఖ్యమంత్రి స్పందించకపోవడం దారుణమని ఎమ్మెల్యే ఆకేపాటి దుయ్యబట్టారు. మార్చి 1న కార్యాచరణ ప్రకటిస్తాం రాయలసీమ నీటి బాధలు పట్టని చంద్రబాబు జగన్ చేపట్టినసీమ లిఫ్ట్ను గాలికొదిలేశారు పొరుగు రాష్ట్ర ముఖ్యమంత్రికి రాష్ట్రం తాకట్టు మీడియా సమావేశంలోధ్వజమెత్తిన వైఎస్సార్ సీపీ నాయకులు -
కాఫీ పెట్టండి.. సారూ!
బి.కొత్తకోట: మూడున్నర దశాబ్దాల క్రితం అటవీశాఖ చేసిన ఓ మంచి కాఫీ లాంటి ప్రయోగం ఫలించగా, ఆచరణలో విఫలమైంది. సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉన్న బి.కొత్తకోట మండలంలోని వేసవి విడది కేంద్రం, ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్ ప్రకృతి ప్రయోగాలకు వేదిక. ఇందులో ఎన్నో ప్రయోగాలు విజయవంతం అయ్యాయి. అందులో మొక్కలపై ఎన్నో ప్రయోగాలు చేయగా వాటి ఆనవాళ్లు ఇప్పుడు లేవు. ఇందులో ఒకటి కాఫీ మొక్కల పెంపకం. అతిచల్లని అరకు లాంటి ప్రాంతాలకే పరిమితమైన కాఫీతోటల పెంపకం 1990లో ప్రయోగాత్మకంగా హార్సిలీహిల్స్పై చేపట్టారు. ప్రయోగం ఫలించింది మొదటి సారిగా 1990లో ఇక్కడ కాఫీతోటలు సాగు చేయాలన్న ఆలోచన అటవీశాఖకు కలిగింది. దాంతో అప్పటి అధికారులు కాఫీ మొక్కలను నాటి వాటి ఎదుగుదల, దిగుబడి, నాణ్యతను పరిశీలించారు. వాటిని నాటిన తర్వాత అవి మొక్కలై మంచి దిగుబడి ఇవ్వడంతో పాటు ఎలాంటి సమస్యలు ఎదురుకాలేదు. దాంతో సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో.. వేసవిలో సాధారణ ఉష్ణోగ్రత 32 డిగ్రీలు, శీతాకాలం ఉదయం సమయంలో ఉష్ణోగ్రత 7 డిగ్రీలకు పడిపోతుంది. ఈ స్థాయి ఉష్ణోగ్రతలున్నా కాఫీతోటల పెంపకం విజయవంతమైంది. కొండపైన అటవీప్రాంగణం, ఘాట్రోడ్డులోని రెండో మలుపు వద్ద కాఫీ తోటలను పెంచారు. ఇవి ఏటా దిగుబడిని ఇస్తున్నాయి. అయితే వీటి నిర్వహణ సక్రమంగా లేకపోయినా దిగుబడి బాగా వస్తోంది. ప్రస్తుతం కాఫీ మొక్కల నిండా గింజలు కనిపిస్తున్నాయి. ఈ మొక్కల భాగాలను కత్తిరించి వేయడంతో ఒక స్థాయి వద్ద ఎదుగుదల ఆగిపోయింది. సేకరణ వదిలేశారు: కొండపై రెండుచోట్ల ఉన్న కాఫీతోటల నుంచి మంచి దిగుబడి వస్తోంది. వీటినుంచి మొదట్లో కాఫీ గింజలను సేకరించారు. తర్వాత దీనిపై నిర్లక్ష్యం పెరగడంతో వాటి నిర్వహణ, సస్యరక్షణ చర్యలను పూర్తిగా వదిలేశారు. దీనిఫలితంగా దిగుబడి వస్తున్నా వాటిని ఆదాయంగా మార్చుకునేందుకు అటవీశాఖ ఆసక్తి చూపడం లేదు. ఈ దిగుబడిలో కొంత కోతులు తింటుండగా, మిగిలినవి వృధాగా నేలరాలిపోతున్నాయి. ఆదాయం వచ్చే ఈ కాఫీ గింజలను సేకరించేందుకు అధికారులు ఆసక్తి చూపించడం లేదు. హార్సిలీహిల్స్పై అటవీప్రాంగణంలో కాఫీతోట ఘాట్రోడ్డులో కాఫీతోట తూర్పు కనుమలతో విడిపడిన హార్సిలీహిల్స్ దట్టమైన అడవులతో కూడుకున్నది. జీవవైవిఽ ద్యం పరంగా ఎంతో ప్రాధాన్యత ఉంది. ఈ కొండ అడవి తూర్పున కురబలకోట మండలం, దక్షిణాన కర్ణాటక రాష్ట్రానికి విస్తరించి ఉంటుంది. 8,755 హెక్టార్ల విస్తీర్ణంలో దట్టమైన అటవీప్రాంతం ఉంది. ఇందులో రిజర్వ్ఫారెస్ట్ 6,231 హెక్టార్లుందని 1882లోనే 16వ సెక్షన్ కింద ప్రభుత్వం ప్రకటించింది. కాఫీ తోటల పెంపకం విజయవంతమైంది. దీన్ని దృష్టిలో పెట్టుకుని అటవీశాఖ అడవిలో, ఘాట్రోడ్డు సమీపంలోని మైదాన భూమిపై వీటిని పెంపకాన్ని చేపట్టి విస్తరిస్తే ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. ఉపాఽధి, ఉద్యోగ అవకాశాలు కలగడంతోపాటు అరకు కాఫీ లాగా హార్సిలీహిల్స్ పేరు బ్రాండ్గా మారే అవకాశం లేకపోలేదు. ఈ దిశగా అటవీశాఖ చర్యలు తీసుకుంటే మంచి ఫలితాలొస్తాయి. హార్సిలీహిల్స్పై తోటల పెంపకం పట్ల అటవీశాఖ నిర్లక్ష్యం ప్రయోగం సఫలం..ఆచరణ విఫలం మంచి దిగుబడి ఉన్నా సేకరణ లేదు సాగు విస్తీర్ణం పెంచితే మార్కెటింగ్కుపుష్కలంగా అవకాశాలు అరకు కాఫీని ఆదర్శంగాతీసుకోవాలంటున్న పరిశీలకులు విస్తరణకు పరిశీలన హార్సిలీ హిల్స్ పై కాఫీ తోటల నిర్వహణ, విస్తరణకు చర్యలు తీసుకోవాల్సి ఉంది. అటవీ ప్రాంగణంలో కొత్తగా కాఫీ తోటల పెంపకానికి భూమి లేదు. కొండలో అనువైన ప్రాంతాన్ని గుర్తించి.. దీనిపై నివేదిక ప్రభుత్వాన్ని పంపుతాం. తోటల నుంచి గింజలను సేకరించేందుకు చర్యలు తీసుకుంటాం. – జయప్రసాదరావు, మదనపల్లె రేంజర్ -
బ్రహ్మోత్సవాల ధ్వజావరోహణ
ఉత్సవ మూర్తులకు వసంతాలు పోస్తున్న వేదపండితులు హంస వాహనంపై ఊరేగుతున్న శ్రీభద్రకాళీ సమేతుడు రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలకు సంబంధించి శనివారం ధ్వజావరోహణ నిర్వహించారు. శనివారం ఉదయం ఉత్సవమూర్తులు, పూర్ణకుంభాలతో ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం వేదపండితులు ఓంకార స్వామి, రాచరాయయోగి స్వామి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు కృష్ణయ్యస్వామి, శంకరయ్య స్వామి ఆధ్వర్యంలో స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు నిర్వహించారు. స్వామి, అమ్మవార్ల దగ్గర కంకణ విసర్జన పూజలు నిర్వహించారు. అంతకు ముందగా యాగశలలో పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఆలయ ఈవో డీవీ రమణా రెడ్డిలు కుటుంబ సమేతంగా.. పాలక మండలి సభ్యులు భకిశ్రద్ధలతో హోమం నిర్వహించారు. చివరిగా మహాపూర్ణాహుతి సమర్పించారు. రాయంచపై భద్రకాళీ సమేతుడు రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేతుడు హంసవాహనంపై రాచవీడు పురవీధులలో ఊరేగారు. బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా శనివారం తొమ్మిదో రోజు ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్ కుమార్, ఆలయ ఈవో డీవీ రమణారెడ్డిల ఆధ్వర్యంలో స్వామివారిని మాఢవీధులలో ఊరేగించారు. -
కారు ఢీకొని కూలీ మృతి
జమ్మలమడుగు రూరల్ : మండలంలోని చిటిమిటిచింతల(పాటి) టోల్గేట్ సమీపాన కారు ఢీకొన్న సంఘటనలో శుక్రవారం పూజారి మైసురయ్య (48) అనే రోడ్డు కూలీ మృతి చెందాడు. స్థానికులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. నంద్యాల జిల్లా కోవెలకుంట్ల మండలంలోని భీమునిపాడు గ్రామానికి చెందిన పూజారి మైసురయ్య ముద్దనూరు రహదారిలో ఉన్న టోల్గేట్ సమీపాన రోడ్డు పనులు చేస్తుండగా.. ముద్దనూరు వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నట్లు కుటుంబసభ్యులు తెలిపారు. మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : కదులుతున్న రైలు నుంచి జారి పడి ఓ విద్యార్థి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కాచిగూడ నుంచి తిరుచానూరు వెళ్తున్న రైలు శుక్రవారం ఉదయం కడప రైల్వేస్టేషన్కు వచ్చింది. ఈ రైలు నుంచి కడప కేఎస్ఆర్ఎం కళాశాలలో బీటెక్ చదువుతున్న షేక్ సైపుల్లా అనే కడపకు చెందిన విద్యార్థి ప్రమాదవశాత్తు జారిపడి మరణించాడు. మృతుడు కుటుంబంతో సహా హైదరాబాదుకు వెళ్లి తిరుగు ప్రయాణంలో కడప రైల్వే స్టేషన్లో దిగే సమయంలో సంఘటన జరిగినట్లుగా తెలుస్తుంది. రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఫ్రెండ్స్ను కలవడానికి వెళ్తూ.. ప్రొద్దుటూరు క్రైం : 10వ తరగతి పరీక్షలు సమీపిస్తున్నాయి.. స్నేహితులను కలుసుకొని వారు ఎలా చదువుతున్నారో తెలుసుకునేందుకు పునీత్ (15) బైక్లో బయలుదేరాడు. అయితే మార్గంమధ్యలోనే లారీ ఢీ కొనడంతో దుర్మరణం చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఖాజీపేట మండలంలోని ఏటూరు గ్రామానికి చెందిన బంకా ఇమ్మానియేల్ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించేవాడు. అతనికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారిలో చిన్న కుమారుడు పునీత్ స్థానికంగా ఉన్న జిల్లా పరిషత్ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్నాడు. అతనికి ప్రొద్దుటూరులో స్నేహితులు ఉన్నారు. 10వ తరగతి పరీక్షలు సమీస్తున్నందున వారు ఎలా ప్రిపేర్ అవుతున్నారో తెలుసుకునేందుకు శుక్రవారం బైక్లో ప్రొద్దుటూరుకు బయలుదేరాడు. ఈ క్రమంలో మైదుకూరు రోడ్డులోని సినిహబ్కు వెళ్లే మలుపు వద్ద లారీని ఓవర్ టేక్ చేస్తుండగా ప్రమాదవశాత్తు లారీ కింద పడ్డాడు. లారీ ఒక్కసారిగా అతని మీదుగా వెళ్లడంతో పునీత్ ఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. రూరల్ ఎస్ఐ కేసీ రాజు ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కుమారుడి మృతదేహాన్ని చూసి తల్లిదండ్రులు బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వన్డే మ్యాచ్లో నెల్లూరు, అనంతపురం జట్ల జయభేరి కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–12 సౌత్జోన్ అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్ల్లో నెల్లూరు, అనంతపురం జట్లు విజయభేరి మోగించాయి. శుక్రవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో నెల్లూరు–కడప జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ను ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 35 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 199 పరుగులు చేసింది. ఆ జట్టులోని యోగాంజనేయులు 69, ఎంఎం గురు ఈక్షిత్రెడ్డి 42 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుచిత్రెడ్డి 1, శశిధర్రెడ్డి 1 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 31.2 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 200 పరుగులు చేసింది. ఆ జట్టులోని మౌనిష్ 56, జాన్సన్ 56 పరుగులు చేశారు. కడప జట్టులోని జశ్వంత్రెడ్డి 1, యోగాంజనేయులు 1 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్లో అనంతపురం–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 35 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 165 పరుగులు చేసింది. ఆ జట్టులోని తౌఫిక్ 44, అభినవ్ 25 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని గణేష్ 3, ఫరీద్ నవాజ్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 28.1 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మహంత్ యాదవ్ 39, కెఆర్ ప్రజ్వల్ 31 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వెంకట్నరేన్ 3, పీఎన్ రాజుల్రెడ్డి 2, గోవర్దన్ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 25 పరుగులు తేడాతో విజయం సాధించింది. మౌనిష్, నెల్లూరు (56 పరుగులు) జాన్సన్, నెల్లూరు (56 పరుగులు) యోగాంజనేయులు, కడప (69 పరుగులు) -
కమిషనర్ మనోజ్కు పదవీ గండం!
సాక్షి ప్రతినిధి, కడప: కమిషనర్ మనోజ్రెడ్డికి పదవీ గండం తప్పడం లేదు. హైకోర్టు ఉత్తర్వుల మేరకు ప్రభుత్వం నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాల్సి ఉంది. 2018 ఏపీపీఎస్సీ గ్రూప్–1 ద్వారా ఎంపికై వివిధ హోదాల్లో ఉన్న 125 మంది అధికారులకు ఆ తీర్పు వర్తించనుంది. రిక్రూట్మెంట్ మూల్యాంకనంలో అక్రమాలు, నిబంధనల ఉల్లంఘన ఆరోపణలపై ఏపీ హైకోర్టు కీలక నిర్ణయం తీసుకుంది. అప్పట్లో ఎంపికై న మనోజ్రెడ్డి సైతం కమిషనర్ నుంచి తాత్కాలికంగా తప్పుకోవాల్సిన పరిస్థితి ఉత్పన్నమైంది. ● 2018 ఏపీపీఎస్సీ గ్రూప్–1 రిక్రూట్మెంట్లో మూల్యాంకనంలో అక్రమాలకు ఆస్కారం ఇచ్చారని, నిబంధనలు ఉల్లంఘించారని అర్హులైన తాము ఉద్యోగాలు కోల్పోయామని కొందరు అభ్యర్థులు హైకోర్టును ఆశ్రయించారు. వారి అభ్యర్థనలు పరిగణలోకి తీసుకున్న హైకోర్టు గ్రూప్–1న ఎంపికలో అక్రమాలపై విచారణకు రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఆమేరకు రాష్ట్ర ప్రభుత్వం ఈనెల 14న అడిషనల్ డీజీ రవిశంకర్ అయ్యన్నార్ నేతృత్వంలో సిట్ ఏర్పాటు చేసింది. తాజాగా శుక్రవారం అప్పట్లో ఎంపికై న 125 మంది ఉద్యోగులను నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేసి విచారణ చేపట్టాల్సిందిగా హైకోర్టు ఆదేశించింది. ఆమేరకు గ్రూప్–1 మూల్యాంకన ఎంపికై న అభ్యర్థుల జవాబుపత్రాల ట్యాంపరింగ్ జరిగిందా లేదా అని ఫోరెన్సిక్ నిపుణులతో పరిశీలన చేపట్టిన తర్వాత సిట్ మార్చి 17, 2026 లోపు దర్యాప్తు నివేదిక సమర్పించాలని స్పష్టం చేసింది. కాగా గతంలో హైకోర్టు సింగిల్ బెంచ్ గ్రూప్–1 మెయిన్స్ రద్దుకు ఉత్తర్వులు ఇవ్వగా, డివిజన్ బెంచ్ స్టే విధించింది. ప్రస్తుతం తాజాగా సిట్ విచారణ నేపధ్యంలో 125 మంది గ్రూప్–1 అధికారులు ఈ వివాదంలో చిక్కుకున్నారు, వారి ఉద్యోగాల భవిష్యత్తు సిట్ నివేదికపై ఆధారపడి ఉండడం విశేషం. 2018 గ్రూప్–1 రిక్రూట్మెంట్పై విచారణకు హైకోర్టు ఆదేశం అప్పటి వరకు నాన్ ఫోకల్ పోస్టులకు బదిలీ చేయాలంటూ ఆదేశాలు -
సీమ ఎత్తిపోతల పథకం కోసం మహోద్యమం
కడప కార్పొరేషన్ : రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని పూర్తి చేయాలని కోరుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో మహోద్యమం చేపట్టనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి స్పష్టం చేశారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు నాయుడు ఎప్పుడు ముఖ్యమంత్రి అయినా రాయలసీమకు తీవ్ర అన్యాయమే జరుగుతుందన్నారు. ఆయన రాయలసీమలో పుట్టినా ఈ ప్రాంతానికి ఎలాంటి మేలు చేయలేదన్నారు. కృష్ణా నదీ పరివాహక ప్రదేశంలో లక్షల ఎకరాల సాగు ఉందని, వీటికి నీరు రావాలంటే కర్ణాటక, మహారాష్ట్ర నుంచి కృష్ణా జలాలు రావాలన్నారు. 1996లో ఆల్మట్టి డ్యామ్ చేపట్టినప్పుడు దాని సామర్థ్యం 17 టీఎంసీలుగా ఉండేదని, దేవెగౌడ ప్రధానమంత్రి అయ్యాక 129.76 టీఎంసీలకు పెంపు చేశారన్నారు. దాని కింద నారాయణపూర్ డ్యామ్ 20 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారన్నారు. ఆల్మట్టి నిర్మించే సమయంలో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండి కళ్లు అప్పగించి చూశారే తప్ప.. ఎలాంటి పోరాటం చేయలేదన్నారు. ప్రస్తుతం ఆల్మట్టి ఎత్తును 519 మీటర్ల నుంచి 524.256 మీటర్లకు పెంచుతున్నారని, తద్వారా దాని సామర్థ్యం 279.72 టీఎంసీలకు పెరగనుందన్నారు. దీనివల్ల భవిష్యత్లో రాయలసీమకు చుక్క నీరు వచ్చే అవకాశం ఉండదన్నారు. కృష్ణానదిపై తెలంగాణ కల్వకుర్తి, పాలమూరు– రంగారెడ్డి, డిండి ఎత్తిపోతల వంటి అక్రమ ప్రాజెక్టులు నిర్మించేటప్పుడు కూడా చంద్రబాబే సీఎంగా ఉన్నారని, ఓటుకు నోటు కేసులో ఇరుక్కొని అప్పుడు కూడా ఎలాంటి అభ్యంతరం చెప్పలేదన్నారు. రాయలసీమకు తాగునీరు, సాగునీరు తేవడానికి దివంగత వైఎస్సార్ పోతిరెడ్డిపాడు రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 44 వేల క్యూసెక్కులకు పెంచే సమయంలో, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దాన్ని 88 వేల క్యూసెక్కులకు పెంచాలని చర్యలు చేపట్టినప్పుడు మాత్రం కోర్టుల్లో కేసులు వేసి ఈ ప్రాంతానికి మేలు జరక్కుండా అడ్డుకున్న చరిత్ర చంద్రబాబుకు ఉందన్నారు. శ్రీశైలానికి వరద నీటి రోజులు పూర్తిగా తగ్గిపోయాయని, 45 రోజుల వరద దినాల్లో వీలైనంత మేర నీటిని తీసుకోవాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. దీనికోసం వైఎస్ జగన్ ప్రభుత్వం రూ.4 వేల కోట్లు ఖర్చు చేసి, 80 శాతం పనులు పూర్తి చేసిందన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయాల్సిన సీఎం చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ప్రజల ప్రయోజనాలను ఫణంగా పెట్టారన్నారు. ఈ అన్యాయాన్ని నిలదీసేందుకు ఇటీవల పోతిరెడ్డిపాడు హెడ్రెగ్యులేటర్ వద్ద పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించామని, మార్చి 1వ తేది రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం, గుంటూరు, కృష్ణా, చైన్నె ప్రాంత నేతలను కలుపుకొని సన్నాహక సమావేశం నిర్వహిస్తున్నామన్నారు. ఈ సమావేశంలో భవిష్యత్ ప్రణాళికపై చర్చించడం జరుగుతుందన్నారు. మార్చి 1న 9 జిల్లాల నేతలతో సన్నాహక సమావేశం అన్ని పార్టీలు, ప్రజా సంఘాలకు ఆహ్వానం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కూటమి ప్రభుత్వం రాయలసీమ గొంతు నొక్కేలా వ్యవహరిస్తోందని బద్వేల్ శాసన సభ్యురాలు డాక్టర్ దాసరి సుధ అన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉండటం రాయలసీమ ప్రజలు చేసుకున్న దురదృష్టమన్నారు. చంద్రబాబు ఈ ప్రాంతానికి ఎటూ మేలు చేయడని, ఎవరైనా చేస్తుంటే కూడా ఓర్వలేరన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ఈ సమావేశంలో మేయర్ పాకా సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి, ఎస్సీ విభాగం అధ్యక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు, శ్రీరంజన్రెడ్డి, పి.సంపత్కుమార్, కంచుపాటి బాబు, ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. – ఎమ్మెల్యే దాసరి సుధ రాయలసీమ కడుపుకొడుతున్న సీఎం చంద్రబాబును ఈ ప్రాంత ప్రజలు ఎన్నటికీ క్షమించారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి అన్నారు. రాయలసీమ కరువుపీడిత ప్రాంతమని, నీటి వనరులు పుష్కలంగా ఉంటేనే ఏ ప్రాంతమైనా అభివృద్ధి చెందుతుందన్నారు. శ్రీశైలం డ్యామ్ సామర్థ్యం 215 టీఎంసీలైతే అందులో 10 శాతం పూడిక ఉందని, 854 అడుగుల వరకు నీరు ఉంటేనే రాయలసీమకు నీళ్లు వస్తాయన్నారు. 800 అడుగుల నుంచి 854 అడుగుల వరకూ 90 టీఎంసీలు ఉంటాయని, మిగిలిన నీటిని తెలంగాణ కరెంటు ఉత్పత్తికి వాడుకుంటుందన్నారు. ఈ నేపథ్యంలో ఖరీఫ్ సీజన్లో పంటలను కాపాడుకోవాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ అవసరమన్నారు. ఎన్డీఏతో పొత్తులో కొనసాగుతూ కేంద్రంలో ప్రతిపక్షమైన కాంగ్రెస్తో మైత్రి కొనసాగించగల మేధావి చంద్రబాబు అన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మకై ్క రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని ఆపేశారన్నారు. దీనివల్ల రైతులకు చాలా నష్టం వాటిల్లుతుందని, రైతులు ఇప్పటికై నా మేల్కొని ఉద్యమానికి తరలిరావాలని అన్నారు. – రఘురామిరెడ్డి -
కాంట్రాక్టర్తో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దుతాం
పారిశుద్ధ్య కార్మికులకు అన్యాయం జరగకుండా తమ వంతుగా కాంట్రాక్టర్తో మాట్లాడి పరిస్థితులను చక్కదిద్దుతాం. వయోపరిమితి, విద్యార్హతలపై కొత్తవారికి వర్తించేలా, పాత వారిపట్ల మానవతాదృక్పథంతో వ్యవహరించాలని ఇప్పటికే సూచించాం. అపరిశుభ్ర పరిస్థితులు నెలకొనకుండా, రోగులకు, వారి సహాయకులకు ఇబ్బందులు లేకుండా చూస్తాం. పెండింగ్ వేతనాలను కూడా త్వరలోనే ఇప్పించేందుకు కృషి చేస్తాం. – రంగస్వామి, అడ్మినిస్ట్రేటర్, రిమ్స్, కడప -
కార్మికుల పక్షాన పోరాటం చేస్తాం
శానిటేషన్తో పాటు, ఇతర కాంట్రాక్ట్లు మారినప్పుడల్లా కార్మికులను వివిధ కారణాలతో తొలగిస్తే ఊరుకునేది లేదు. పద్మావతి వారు కాంట్రాక్ట్ను గత ఏడాది అక్టోబర్ 2 నుంచి అమలులోకి వచ్చినపుడే కాంట్రాక్టర్, ఆయన తరపున సూపర్వైజర్లకు పదేపదే కార్మికులను తొలగించరాదనీ, నూతన కార్మికులకు తమ ఎంఓయులోని నిబంధనలను అమలు చేసుకోవచ్చని చెప్పాం. అనవసరంగా 15 మంది శానిటేషన్ సూపర్వైజర్లను తొలగించారు. కార్మికుల పక్షాన న్యాయపోరాటానికి సిద్ధంగా ఉన్నాం. – వెంకటసుబ్బయ్య, ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల రాష్ట్ర కార్యదర్శి, రిమ్స్, కడప -
అసాంఘిక కార్యకలాపాలపై నిరంతర నిఘా
కడప అర్బన్ : అసాంఘిక కార్యకలాపాలైన గ్యాంబ్లింగ్, మట్కా, క్రికెట్ బెట్టింగ్పై నిరంతరం నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని సమావేశపు హాల్లో జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్ పోలీస్ అధికారులతో వేర్వేరుగా నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్కూళ్లు కాలేజీలలో సోషల్ మీడియా వల్ల మహిళలు, బాలికలకు కలిగే వేధింపులపై అవగాహన కల్పించాలన్నారు. మహిళా భద్రతపై గ్రామాలు, కాలనీలు, పాఠశాలలు, కళాశాలల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలని ఆదేశించారు. మహిళా సంరక్షణ కార్యదర్శులు (జి.ఎం.ఎస్.కె )ల భాగస్వామ్యంతో గ్రామాలలో మరింత విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. అలాగే, గస్తీని పెంచాలని ఆదేశించారు. రోడ్డు ప్రమాదాలు నియంత్రించేందుకు తగిన చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదపూర్వకంగా వ్యవహరించి వాస్తవాలను నిర్ధారించుకుని నిర్ణీత వ్యవధిలోగా చట్టపరిధిలో సమస్యలను పరిష్కరించాలని ఆదేశించారు. త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని పేర్కొన్నారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించి గ్రామ సభలు, పల్లె నిద్ర, గ్రామాల సందర్శన నిర్వహించాలని చెప్పారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉక్కుపాదం మోపాలన్నారు. గంజాయి, ఇతర మత్తు పదార్థాలు, బహిరంగ మద్యపానం చేసే వారిపై డ్రోన్ కెమెరాల ద్వారా దాడులు నిర్వహించి కేసులు నమోదు చేయాలని ఆదేశించారు. ఈ సమీక్షా సమావేశాల్లో అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వెంకటేశ్వర రావు, పులివెందుల డి.ఎస్.పి మురళి నాయక్, జమ్మలమడుగు, పులివెందుల సబ్ డివిజన్లోని సి.ఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. -
సీఎం తన క్లాస్మేట్ అంటూ కాంట్రాక్టర్ ప్రచారం
పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్ కాంట్రాక్టర్ భాస్కర్ నాయుడుకే రాయలసీమజోన్లోని అన్ని భోదనాసుపత్రులు, జిల్లా ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ లభించింది. ఆయన తన సహచరుల ద్వారా, అనుచరుల ద్వారా తాను కూటమి ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు తనకు బంధువు, క్లాస్మేట్, ఒకే ఊరివారమనీ విస్తృతంగా ప్రచారం చేసుకుంటున్నారు. ఆయన గత అక్టోబర్ 2నుంచి కడప రిమ్స్ ఆవరణంలో జీజీహెచ్, మెడికల్ కళాశాల, సూపర్స్పెషాలిటీ హాస్పిటల్, కేన్సర్ హాస్పిటల్, ఐఎంహెచ్, నర్సింగ్ కళాశాల, ప్రభుత్వ దంతవైద్యకళాశాలలలో శానిటేషన్ కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఆయన వచ్చినప్పటి నుంచి ఇప్పటివరకు ప్రతి విభాగంలోనూ పరిశుభ్రత అంతంతమాత్రంగానే ఉంది. రోజురోజుకు ఐపీ, ఓపీ విభాగాల్లో , ఇతర ప్రదేశాలలో రోగులు, వారి సహాయకులు తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొంటున్నారు. -
24న జిల్లా స్థాయి సైక్లింగ్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈ నెల 24న డీఎస్ఏ క్రీడా మైదానంలో అండర్–18 విభాగంలో జిల్లాస్థాయి సైక్లింగ్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీవో గౌస్భాష పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలన్నారు. క్రీడాకారులు తమ సొంత సైకిల్తో పాల్గొనాలని సూచించారు. జిల్లా స్దాయిలో ఎంపికై న వారు మార్చి 1న ఎన్టీఆర్ జిల్లా విజయవాడలో జరిగే రాష్ట్ర స్దాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని తెలిపారు. జూద స్థావరంపై దాడులు పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణం నగరిగుట్టలోని ఎస్సీ హాస్టల్ వెనుక భాగంలో కంప చెట్ల వద్ద ఖాళీ స్థలంలో నిర్వహిస్తున్న జూద స్థావరంపై పోలీసులు శుక్రవారం దాడులు నిర్వహించారు. జూదం ఆడుతున్న ఆమూరు వెంకట శివారెడ్డి, వెట్టి అశోక్, పగడాల సాయికుమార్, షేక్ సందాని, ఆమూరు రమేష్రెడ్డి, పప్పూరి సాయి మునీశ్వరరెడ్డిని అదుపులోకి తీసుకున్నట్లు ట్రాఫిక్ సీఐ హాజివలి తెలిపారు. వారి వద్ద నుంచి రూ.40,150 నగదుతోపాటు పేక ముక్కలను స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. ఈ మేరకు పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. చిల్లర బంకులో చోరీ వేంపల్లె : వేంపల్లెలోని పులివెందుల రోడ్డులో ఉన్న చిల్లర బంకులో గురువారం అర్ధరాత్రి ఆకతాయిలు చోరీకి పాల్పడ్డారు. బాధితుడు ఖలీల్ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గురువారం రాత్రి 9 గంటలకు ఖలీల్ యథావిధిగా తమ చిల్లర బంకుకు తాళాలు వేసుకుని ఇంటికి వెళ్లాడు. శుక్రవారం తెల్లవారే సరికి బంకు వెనుక వైపు రేకులను నెట్టి ఉన్నట్లు గమనించాడు. తాళాలు తెరిచి చూడగా గల్లా పెట్టె నుంచి రూ.2 వేల నగదుతోపాటు సిగరెట్టు పెట్టెలు కనిపించలేదు. దీంతో అది ఆకతాయిల పని అని బాధితుడు గమనించారు. పోలీసులు రాత్రి వేళల్లో గస్తీ నిర్వహిస్తే ఇలాంటి దొంగతనాలు జరిగే అవకాశం ఉండదని బాధితుడు తెలిపారు. తుమ్మలపల్లెలో ఘర్షణ పులివెందుల రూరల్ : పులివెందుల మండలం తుమ్మలపల్లె గ్రామంలో బావికి సంబంధించిన స్థలం విషయమై శుక్రవారం సంగటి గంగాధర్రెడ్డి, తుమ్మల గంగాధర్రెడ్డి ఘర్షణ పడ్డారు. హైవే రోడ్డు వెడల్పులో భాగంగా తుమ్మలపల్లి గ్రామంలో బావికి సంబంధించిన స్థలం విషయంపైన గొడవ పడ్డారు. రెవెన్యూ శాఖ అధికారులు గ్రామానికి వెళ్లి సర్వే చేస్తుండగా.. అధికారుల ముందే గొడవకు దిగారు. ఈ ఘటనలో ఇరువురికి గాయాలయ్యాయి. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
హామీల అమలులో మోసం
సూపర్ సిక్స్ పేరుతో హామీలు ఇచ్చి ఆ పథకాలకు రాష్ట్ర బడ్జెట్లో నిధులు కేటాయించకపోవడం దుర్మార్గం. కొత్త పింఛన్ల ఊసే లేదు. ఇచ్చిన హామీలు అమలు చేయకుండా ప్రజలను మోసం చేశారు. ఆడ బిడ్డ నిధికి రూ.32 వేల కోట్లు అవసరం కాగా పైసా కూడా నిధులు విడుదల చేయలేదు. ఇదేనా చంద్రబాబు సుదీర్ఘ అనుభవం. ప్రజలకు ఇచ్చిన హామీల అమలు గురించి పట్టించుకోకుండా దగా చేయడం సిగ్గుచేటు. – వెలిచర్ల నాగసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ సమాచార హక్కు చట్టం రాష్ట్ర కార్యదర్శి, కాశినాయన -
అంతర్ రాష్ట్ర దోపిడీ దొంగల ముఠా అరెస్ట్
● బురఖాల ముసుగులో దోపిడీ, హత్య చేసేందుకు స్కెచ్ ● కుట్రను భగ్నం చేసిన పోలీసులు ● కత్తులు, బురఖాలు, కారంపొడి స్వాధీనం కడప అర్బన్ : కడప నగరంలో భారీ దొంగతనానికి ప్రయత్నించి.. అవసరమైతే హత్యలు చే సేందుకు సిద్ధమైన అంతర్ రాష్ట్ర దోపిడీ ముఠా ను పోలీసులు అరెస్ట్ చేశారు. కడప టూటౌన్ సీఐ ప్రసాద్రావు ఆధ్వర్యంలోని పోలీసులు.. నలుగురు అంతర్ రాష్ట్ర నిందితులను పట్టుకొ ని కటకటాల్లోకి నెట్టారు. కడప డీఎస్పీ కార్యాలయంలో శుక్రవారం డీఎస్పీ వెంకటేశ్వర్లు టూ టౌన్ సీఐ ప్రసాద్ రావు, ఎస్సై రామకృష్ణతో కలిసి విలేకరుల సమావేశం ఏర్పాటు చేసి వివరాలు వెల్లడించారు. ఈ నెల 19వ తేదీ రాత్రి 8 గంటలకు కడప టూటౌన్ పోలీస్స్టేషన్ పరి ధిలోని అయేషా వీధి, బెల్లం మండీ ప్రాంతంలో నేరానికి ముఠా సిద్ధమైనట్లు తెలిపారు. ఏ మాత్రం ఆలస్యం జరిగినా కడప నగరంలో ఊహించని ఘోరం జరిగే అవకాశం ఉండేదని పేర్కొన్నారు. ఆ ఇంటిని దోపిడీ చేయడంతోపాటు ఇంట్లో ఉన్న వారందరినీ దారుణంగా హత్య చేయడానికి కూడా పథకం వేసినట్లు దర్యాప్తులో తెలిసిందన్నారు. అరెస్ట్ అయిన వారిలో ఉత్తరప్రదేశ్ రాష్ట్రం మురాదాబాద్ జిల్లా మొహల్లా గ్రామం అబ్దుల్లా బడా ప్రాంతానికి చెందిన షాకీర్ అలీ (25), మురాదాబాద్ జిల్లా ముండాపాండే, శివోరా బాజే గ్రామానికి చెందిన సుభాన్ అలీ అలియాస్ సులేమాన్ (24), మురాదాబాద్ జిల్లా ముండాపాండే, శివోరాబాజేకు చెందిన యూ సుఫ్ అలీ అలియాస్ జావీద్ (33), సంబల్ జి ల్లా సైదాపూర్ జాస్కోడికి చెందిన సులేమాన్ (34) ఉన్నారన్నారు. వారి వద్ద నుంచి 4 ప దునైన కత్తులు, 2 నల్లని బురఖాలు, 2 జతల నల్లని చేతి గ్లౌజులు, 2 లేడీస్ బ్యాగులు, 2 జతల లేడీస్ చెప్పులు, అర కిలో కారంపొడి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. యజమానుల ఇంటికే కన్నం షాకీర్ అలీ, సుభాన్ అలీ నాలుగేళ్లుగా కడప నగరంలోని అయేషా వీధిలో నివసిస్తూ, ఇంటర్నేషనల్ కల్యాణ మండపం పక్కన ఉన్న ఐకాన్ స్టైల్ హెయిర్ కటింగ్ సెలూన్లో హెయిర్ కటింగ్ మాస్టర్లుగా పని చేస్తున్నారన్నారు. వారి యజమాని సయ్యద్ జమీల్ అహ్మద్ కువైట్కు వెళ్లిన తర్వాత, అక్కడి కలెక్షన్ మొత్తాన్ని జమీల్ మేనల్లుడు పరాన్ నదీం ఖాన్కు అప్పగిస్తూ వుండేవారన్నారు. ఈ క్రమంలో జమీల్ ఇంట్లో అతని భార్య, తల్లి, మేనత్త, వదిన చిన్నపిల్లలు ఉంటారని పేర్కొన్నారు. ఇంట్లో బంగారం, డబ్బు వంటి విలువైన వస్తువులు ఉంటాయని తెలుసుకున్న వా రు, తమ అవసరాల కోసం డబ్బు, బంగారు న గలను ఆ ఇంట్లో దొంగతనం చేసి, అనంతరం స్వగ్రామాలకు వెళ్లిపోవాలని పథకం వేసుకు న్నారన్నారు. ఈ నేరానికి తమకు ధైర్యం సరి పోదని భావించి, ఉత్తరప్రదేశ్కు చెందిన యూ సుఫ్ ఆలీ అలియాస్ జావిద్, సుభాన్ ఆలీ అలియాస్ సులేమాలను పిలిపించారన్నారు. యూ సుఫ్ అలీపై ఉత్తరప్రదేశ్లో రెండు హత్య కేసు లు, సుభాన్ ఆలీ అలియాస్ సులేమాన్పై ఒక హత్యాయత్నం కేసు ఉన్నట్లు తెలిపారు. వీరి నేర అనుభవాన్ని ఉపయోగించుకుని పక్కా ప్రణాళిక రూపొందించారని వివరించారు. పోలీస్ జీపు సైరన్ విని.. కడప నగరంలోని వై.వి.స్ట్రీట్లో కొనుగోలు చేసుకున్న వస్తువులతో ఇద్దరు ముందుగా సుభాన్ అలీ ఆ ఇంటి వద్దకు వెళ్లి మహిళలతో మాట్లాడుతుండగా, మిగతా ముగ్గురు వెనుక నుంచి ఇంట్లోకి చొరబడి మహిళల కళ్లలో కారంపొడి చల్లి, అడ్డం వస్తే కత్తులతో దాడి చేసి అవసరమైతే హత్య చేసి దోపిడీ చేయాలని ప్రణాళిక రూపొందించారన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ ఆదేశాల మేరకు కడప డి.ఎస్.పి ఏ.వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో విజిబుల్ పోలీసింగ్ నిర్వహిస్తున్న సమయంలో, పోలీస్ జీపు సైరన్ విని నిందితులు పారిపోవడానికి ప్రయత్నించగా వెంటనే వారిని చుట్టుముట్టి పట్టుకున్నారు. నేర సామగ్రిని స్వాధీనం చేసుకొని కేసు నమోదు చేశారు. ఈ నేర నియంత్రణలో కడప టూ టౌన్ సీఐ జి.ప్రసాద్ రావు, ఎస్సైలు రామకృష్ణ, మహమ్మద్ రఫీ, ఏఎస్ఐలు వెంకటేశ్వర్లు, సుధాకర్, హెడ్ కానిస్టేబుళ్లు శ్రీహరి, శివయ్య, రామకృష్ణ, కానిస్టేబుళ్లు తులసి రామయ్య, చంద్రశేఖర్, మనీష్ పాల్గొన్నారు. ఇతర రాష్ట్రాల నుంచి కొత్తగా పనుల కోసం వచ్చే వారి పూర్తి వివరాలు సేకరించి, విచారణ అనంతరం మాత్రమే నియమించుకోవాలని డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. విచారణ లేకుండా పనిలో పెట్టుకుంటే ప్రాణాలకు ప్రమాదం వాటిల్లే అవకాశముందని హెచ్చరించారు. తమ వద్ద పని చేసే వారి వివరాలు తెలుసుకొని, అనుమానం ఉంటే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ అంతర్ రాష్ట్ర ముఠాను సమయానికి పట్టుకోవడంతో కడప నగరంలో ఒక భారీ దోపిడీతోపాటు పలువురి హత్యలను నివారించగలిగామని డీఎస్పీ తెలియజేశారు. కడప టూటౌన్ పోలీసుల బృందాన్ని డీఎస్పీ, ఎస్పీ అభినందించారు. -
రైతుల అభ్యున్నతికి కృషి చేయాలి
కడప అగ్రికల్చర్ : రైతుల అభ్యున్నతితోపాటు జిల్లా అభివృద్ధికి శాస్త్రవేత్తలు, అధికారులు కృషి చేయాలని గుంటూరు ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్ జి.శివ నారాయణ తెలిపారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం శాసీ్త్రయ సలహా సంఘ సమావేశంతోపాటు ఏరువాక కేంద్రానికి సంబంధించిన జిల్లా స్థాయి సమన్వయ సంఘ సమావేశం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ 2025 – 26 సంవత్సరానికి సంబంధించి కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం, సస్యరక్షణ, ఉద్యాన, పశువిజ్ఞానం, సామాజిక విజ్ఞానం విభాగాలతోపాటు ఏరువాక కేంద్రం చేపట్టిన సాంకేతిక, విస్తరణ కార్యక్రమాలపై చర్చించారు. అలాగే రాబోయే సంవత్సరానికి చేపట్టబోయే కార్యాచరణ ప్రణాళికలపై సమగ్రంగా చర్చించారు. జిల్లాకు అవసరమైన పరిశోధనలు, విస్తరణ కార్యాచరణ కార్యక్రమాల అమలుకు సూచనలు ఇవ్వాలని తెలిపారు. తిరపతి సహ పరిశోధనా సంచాలకులు డాక్టర్.వి.సుమతి, కేవీకే సమన్వయకర్త డాక్టర్ అంకయ్యకుమార్, ఏరువాక కేంద్రం సమన్వయకర్త క్రిష్ణప్రియ, కేవీకే శాస్త్రవేత్తలు, డాక్టర్లు శిల్పకళ, కె.సాయి మహేశ్వరి, మహేశ్బాబు, మానస, సురేశ్కుమార్రెడ్డి గత సంవత్సంలో చేపట్టిన పరిశోధన, విస్తరణ పురోగతి గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ పరిశోధన స్థానం అధిపతి జి.ప్రభాకర్రెడ్డి, డీటీసీ ఉపసంచాలకులు యం.నాగరాజ, ఏపీ ఎంఐపీ పీడీ వెంకటేశ్వరరెడ్డి, వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు, కేవీకే, ఏరువాక కేంద్ర శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
‘సోలార్’ సమస్యల పరిష్కారం కోసం ’1912’
కడప కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని సోలార్ విద్యుత్ వినియోగదారులు సమస్యల పరిష్కారం కోసం టోల్–ఫ్రీ నంబరు–1912ను సంప్రదించవచ్చని ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.సోలార్ విద్యుత్ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం వినియోగదారులు కాల్ సెంటర్కు కాల్ చేయడం ద్వారా ఫిర్యాదు చేయొచ్చని సూచించారు. కాల్ సెంటర్లో సోలార్ సంబంధిత ఫిర్యాదులను కూడా నమోదు చేసే సౌకర్యాన్ని నూతనంగా అందుబాటులోకి తీసుకువచ్చినట్లు తెలిపారు. వినియోగదారులు ఇంటరాక్టివ్ వాయిస్ రెస్పాన్న్స్ సిస్టమ్ (ఐవీఆర్ఎస్) ద్వారా మొబైల్ ఫోన్ స్క్రీన్ పై 5 అంకెను నొక్కి సోలార్ విద్యుత్ ఫిర్యాదులను నమోదు చేయవచ్చని తెలిపారు. ఈ ఫిర్యాదు ఆధారంగా నిర్దిష్ట సమయంలోగా సంబంధిత సోలార్ పరికరాల విక్రేత సమస్యను పరిష్కరించేందుకు అవకాశం ఉంటుందన్నారు. సమస్యను పరిష్కరించిన వెంటనే వినియోగదారునికి ఫీడ్ బ్యాక్ కాల్ చేస్తారని, వినియోగదారుడు ఇచ్చే ఫీడ్ బ్యాక్ కు అనుగుణంగా ఫిర్యాదును మూసివేయడం, తెరవడం జరుగుతుందన్నారు. సంస్థ పరిధిలోని నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. -
అపురూప ఘట్టం.. మహానైవేద్యం
● అధిక సంఖ్యలో తరలి వచ్చిన భక్తులు ● వీరభద్రస్వామికి బంగారు కిరీటం, మూడో కన్ను ధరింపచేసినవేదపండితులు రాయచోటిటౌన్: రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో అపురూప ఘట్టమైన మహానైవేద్యాన్ని వేదపండితులు శుక్రవారం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు.ఈ కార్యక్రమాన్ని తిలకించేందుకు ఉభయ తెలుగు రాష్ట్రాలు, కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర తదితర ప్రాంతాలనుంచి భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. మహానైవేద్య ప్రత్యేకత.. స్వామివారికి ప్రతి రోజు అర్చకులు ప్రసాదాన్ని నైవేద్యం సమర్పిస్తారు. సంవత్సరానికి ఒక రోజు స్వామి వారికి పెద్ద రాశిలో సమర్పించే ప్రసాదాన్ని మహానైవేద్యం అంటారు. దీనికోసం స్వామికి భత్యంలో భాగంగా రోజుకు ఒక సేరు బియ్యం చొప్పున 365 రోజులకు 365 సేర్లు బియ్యంతో భోజనం, నెలకు ఒక సేరు బియ్యం ప్రకారం 12 నెలలకు 12 సేర్లు బియ్యంతో వండిన నిప్పట్లు, వివిధ రకాల కూరగాయలతో వండిన వంటకాలతో పాటు పలు రకాల దుంపలు, గుమ్మడి కాయలు వండి రాశిగా పోస్తారు. ఈ వంటకాలను తెల్లవారు జామున మూడుగంటల నుంచే సుండుపల్లె మండలం శ్రీరామాపురానికి చెందిన వారు తడిబట్టలతో మడికట్టుతో భోజనం వండి సిద్ధం చేయడం పూర్వం నుంచి వస్తున్న ఆనవాయితీ. వేదపండితులు, అర్చకులు పూజలు నిర్వహించిన తర్వాత ఆలయం మధ్యలో అన్నాన్ని రాశిగా పోశారు. వీరశైవులు రాశిపై కత్తులు దూస్తూ హర హర మహదేవ్ అంటూ విన్యాసాలు చేస్తూ రాశిని కొల్లకొట్టారు. తర్వాత వడియరాజులు కూడా మహానైవేధ్యంలోకి దూకి అందినంత వారు తీసుకెళతారు. అనంతరం ప్రధాన అర్చకులు వేదపండితుల సహాయంతో స్వామివారికి బంగారు కిరీట ధారణ చేసి 11–45 నిమిషాలకు త్రినేత్రం(మూడోకన్ను) ధరింపచేశారు.స్వామివారి త్రినేత్రం అన్నం రాశిపై పడుతుందని, అప్పుడు ఒక్క క్షణంపాటు ప్రకంపనలు వస్తాయని భక్తుల నమ్మకం. ● మహానైవేద్యం కొల్లగొట్టాక మిగిలిన నైవేద్యాన్ని ( ప్రసాదాన్ని) కన్నడ భక్తులు తీసుకొచ్చి ఆలయం వెలుపల విస్తర్లలో ఎండపెట్టుకున్నారు. ఎండిన తర్వాత వడియాలుగా మార్చుకొని తీసుకెళతారు. శుక్రవారం తెల్లవారుజుమున అగ్నిగుండ ప్రవేశం నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి పాల్గొన్నారు. శ్రీభద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం రథోత్సవం వైభవంగా జరిగింది. ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన రథంపై కొలువుదీర్చి పుర వీధులలో ఊరేగించారు. ఈ సందర్భంగా కళాకారుల విన్యాసాలు, నృత్యప్రదర్శనలు ఆకట్టుకున్నాయి.వీధులన్నీ స్వామి వారి నామస్మరణతో మారుమోగాయి. ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో రమణారెడ్డి పాల్గొన్నారు. -
బీసీలను దగా చేసిన చంద్రబాబు
2026–27 బడ్జెట్లో చంద్రబాబు బీసీలను దగా చేశారు. ఎన్నికలకు ముందు కూటమి నాయకులు బీసీల్లోని 130 కులాలకు 50 ఏళ్లకే పింఛన్, సబ్సిడీ రుణాలు వంటి హామీలు అమలు చేస్తామని ఎన్నికల మేనిఫెస్టోలో చెప్పి బీసీలతో ఓట్లు వేయించుకుని రెండేళ్లు గడుస్తున్నా ఏ ఒక్క పథకం అమలు చేయలేదు. వరుసగా మూడో బడ్జెట్లో కూడా బీసీల పథకాలకు సంబంధించి రూపాయి కూడా కేటాయించలేదు. దీన్ని బట్టి అర్థమవుతోంది చంద్రబాబు బీసీలను ఎంత దగా చేస్తున్నారో. బీసీ విద్యార్థులకు స్కాలర్షిప్లు, విద్యాదీవెన, వసతి దీవెన సకాలంలో చెల్లించక విద్యకు దూరమవుతున్నారు. – నేట్లపల్లె శివరాం, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ బీసీ విభాగం, మైదుకూరు. -
చెయ్యేరులో మా రీచ్లు
రాజంపేట: చెయ్యేరు నదినీ ఇసుకాసురులు చెరబట్టారు. ఇష్టానుసారంగా దోపిడీ చేస్తున్నారు. తమకు కేటాయించిన రీచ్లో కాకుండా అవుట్ ఆఫ్ రీచ్లోనూ ఇసుక దోపిడీకి సిద్ధమయ్యారు. ఎక్కడో దూరంలోనూ కాదు బాలరాజుపల్లె హైలెవెల్ వంతెనకు కిలోమీటర్ దూరంలోనే ఇసుకను తవ్వితరలించేందుకు నిర్వాహకులు సన్నద్ధులయ్యారు. కాగా ఆర్. బుడుగుంటపల్లె వద్ద ఇసుక క్వారీ ఉంది. అక్కడి నుంచే కొన్ని నెలలుగా ఇసుకను ఇష్టానుసారంగా తోడేసుకున్న సంగతి తెలిసిందే. ఇసుకాసురులకు అధికారపార్టీకి చెందిన ఓ మంత్రి అండ ఉందనే ఆరోపణలు అందరికి తెలిసిందే.వందలాది టిప్పర్లతో..చెయ్యేరులోని ఇసుక క్వారీ నుంచి వందలాది లారీలలో ఇసుకను ఇతర రాష్ట్రాలకు భారీగా తరలిస్తు న్న వ్యవహారం ఇంకా కొనసాగుతోంది. చెయ్యేరు లో నిబంధనలకు విరుద్ధంగా ఇటాచీ మిషన్లు పెట్టి టిప్పర్లకు లోడ్ చేయడం బహిరంగంగానే జరుగుతున్న జిల్లా యంత్రాంగం ఎటువంటి చర్యలు తీసుకోలేని పరిస్థితులో ఉన్నాయని చెయ్యేరు నదీపరీవాహక వాసులు వాపోతున్నారు.బాలరాజుపల్లె వద్ద ఇసుక తోడితే ఒప్పుకోం..ఆర్. బుడుగంటపల్లె వద్ద కాకుండా బాలరాజుపల్లె వద్ద ఇసుకను తోడితే ఒప్పుకోమని బాలరాజు పల్లె గ్రామస్తులు అడ్డుకున్నారు. ఇసుక టిప్పర్లను రానివ్వకుండా గ్రామస్తులు అడ్డుకున్న సంఘటన మంగళవారం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. గ్రామస్తులు లేని సమయంలో టిప్పర్లను నిర్వహకులు మళ్లీ ఇసుక తోడివేతకు రంగంలోకి దింపడం గమనార్హం.రీచ్ నిర్వాహకుల మంతనాలు..రీచ్ నిర్వాహకులు కొంతమంది గ్రామస్తులతో మంతనాలు సాగించినట్లు తెలిసింది. బాలరాజపల్లె నుంచి ఇసుక తరలింపును తాము వ్యతిరేకిస్తున్నామని గ్రామస్తులు తేల్చిచెప్పారు.అసలే అన్నమయ్య డ్యాం లేదు..ముందుగానే అన్నమయ్య డ్యాం లేదు. అన్నమయ్య డ్యాం ఉండి ఉంటే బ్యాక్వాటర్ వల్ల భూగర్భజలాల సమస్య తమకు ఉండేది కాదని బాలరాజుపల్లె గ్రామస్తుడు ఒకరు‘సాక్షి’కి తెలిపారు. ఇప్పటికే ఈ ప్రాంతం నుంచి ఇతర ప్రాంతాలకు తాగునీటి సరఫరా జరుగుతోందని వివరించారు. బాలరాజుపల్లె దగ్గర ఇప్పటికే పెద్దపెద్దగుంతలు పడ్డాయన్నారు.ఇసుకాసురుల ధనదాహానికి చెయ్యేరు నది చిక్కిపోతోంది. ఒంటినిండా గుంతల గాయాల తో నిలువెల్లా రోదిస్తోంది. అధికారం అండ చూసుకుని.. అధికారులను లంచాలతో కొని.. పచ్చ తోడేళ్లై .. మారీచులై రాత్రింబవళ్లు ఇసుకను తోడేస్తుంటే.. చేసేదీలేక ఇంకుతున్న క‘న్నీళ్ల’తో మౌనంగా చూస్తోంది. సాగునీరిచ్చి పంటకు.. తాగునీటితో ప్రజలకు ఆయుష్షు పోసే నదీమతల్లి నేడు దోపిడీదారుల గుప్పిట్లో చేరి బిక్కుబిక్కుమంటోంది.బాలరాజుపల్లె వద్ద ఇసుక తోడేస్తే ఎలా? ఇసుకను ఇస్టానుసారంగా తోడేస్తే భూగర్భజలాలు అడుగంటి పోతాయని బాలరాజుపల్లె గ్రామీణులు ఆందోళన వ్యక్తం చేశారు. వచ్చే వేసవిలో తప్పనిసరిగా సాగునీరు, తాగునీరుకు ఇబ్బంది పడాల్సివస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ జోక్యం చేసుకొని తమకు భవిష్యత్తులో నీటిగండం రాకుండా బాలరాజుపల్లెలో కాకుండా కేటాయించిన రీచ్లో ఇసుకను తోడుకునేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
22న పారా బ్యాడ్మింటన్ ఎంపికలు
కడప వైఎస్సార్ సర్కిల్:ఈ నెల 22న రాష్ట్రస్థాయి పారా బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు జిల్లా అధ్యక్షుడు దామోదర్ రెడ్డి, ఉపాధ్యక్షుడు సుబ్బరాయుడు గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు మున్సిపల్ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు 9000672017, 99631 94010 నంబర్లకు ఫోన్ చేసి పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. రాయచోటి: అన్నమయ్య జిల్లా రాయచోటి నియో జ కవర్గానికి చెందిన గుండా సురేంద్రను వైఎస్ఆర్సీపీ మైదాన ప్రాంత ఎస్టీ సెల్ అధ్యక్షుడిగా వైఎస్సార్సీపీ కేంద్ర కమిటీ కార్యాలయం ప్రకటించింది. తనకు ఈ బాధ్య తను అప్పగించినందుకు పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, సహకరించిన రాష్ట్ర కో–ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి, రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డికి, అనుబంధ విభాగాల రాష్ట్ర కోఆర్డినేటర్ అలూరి సాంబశివారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. సాక్షి అన్నమయ్య: వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా అధికార ప్రతినిధిగా రాయచోటికి చెందిన గాజుల హాజిబాష, జిల్లా యువజన విభాగం కార్యదర్శిగా రాజంపేటకు చెందిన కల్లూరు రమేష్గౌడ్, జిల్లా ప్రచార విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా రాయచోటికి చెందిన వి.సురేష్కుమార్రెడ్డిలను నియమించారు. కడప ఎడ్యుకేషన్: 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్ష ఏప్రిల్ 25వ తేదీ నిర్వహించబడుతుందని జిల్లా పాలిసెట్ కో–ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. ఈ పాలిసెట్–2026 ప్రవేశ పరీక్ష కోసం వైఎస్సార్ కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలతో పాటు ఈ ఏడాది అదనంగా బద్వేల్, జమ్మలమడుగు, పులివెందుల, సింహాద్రిపురంలలో పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు ఆమె తెలిపారు. జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో పాలిసెట్–2026 పరీక్షకు ఉచిత శిక్షణ తరగతులు ఏప్రిల్ 2వ తేదీ నుంచి ప్రారంభమవుతాయన్నారు. వీటికి హాజరయ్యే విద్యార్థులకు ఉచిత స్టడీ మెటీరియల్ (తెలుగు ఇంగ్లీష్) అందజేస్తామన్నారు. తిరుపతి అన్నమయ్యసర్కిల్: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల సమీపంలోని తరిగొండ శ్రీలకీ్ష్మ్నరసింహస్వామి ఆలయంలో ఈ నెల 24 నుంచి మార్చి 5వ తేదీ వరకు నిర్వహించనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు ఈనెల 23వ తేదీన సాయంత్రం 6 గంటలకు అంకురార్పణ నిర్వహించనున్నారు. ఈమేరకు టీటీడీ గురు వారం పత్రికా ప్రకటన విడుదల చేసింది. అలాగే బ్రహ్మోత్సవాలకు టీటీడీ విస్తృత ఏర్పాట్లుచేపట్టింది. అందులో భాగంగా ఆలయ పరిసరాలలో చలువ పందిళ్లు, రంగోలీలు, క్యూలైన్లు, బారికేడ్లు, ఆలయం, మాడ వీధుల్లో శోభాయమానంగా విద్యుత్, పుష్పాలంకరణలను చేపట్టారు. బ్రహ్మోత్సవాల్లో ప్రతిరోజు ఉదయం 8 నుంచి 9.30 గంటల వరకు, రాత్రి 8 నుండి 10 గంటల వరకు వాహనసేవలు ఉంటాయి. కడప అగ్రికల్చర్ : బిందు, తుంపర సేద్యానికి అటోమేషన్ ఏర్పాటు చేయడం ద్వారా వృథా నీటికి అడ్డుకట్ట వేయొచ్చని ఏపీ సూక్ష్మ నీటి సాగు పథకం ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటేశ్వరెడ్డి అన్నారు. కడప కలెక్టరేట్లోని ఆంధ్రప్రదేశ్ సూక్ష్మ నీటి సాగు పథకం కార్యాలయంలో గురువారం క్షేత్రస్థాయి అధికారులు, కంపెనీ ప్రతినిధులకు ఆటోమేషన్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఉద్యాన, వ్యవసాయ సంబంధిత పంటలు పండించే రైతులకు వ్యవసాయం సులభతరం చేయడానికి, నీటి వినియోగం పెంచి పంటల దిగుబడి మెరుగుపరచడానికి డ్రిప్పుతో అనుసంధానించిన ఆటోమేషన్ సేవలను పోత్సహిస్తోందని తెలిపారు. ఆటోమిషన్ సబ్సిడీ వివరాలు.. రెండు హెక్టార్లలోపు భూమి కలిగి ఉన్న రైతులకు 55 శాతం సబ్సిడీతో రూ. 22,000 మించకుండా.. 2 నుంచి 4 హెక్టార్లులోపు భూమి కలిగిన అన్ని వర్గాల రైతులకు 45 శాతం సబ్సిడితో 18,000 వరకు ఇవ్వనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఏపీఓ మురళీమోహన్రెడ్డి, ఎంఐ ఇంజనీర్లు, ఎంఐడిలు పాల్గొన్నారు. -
లోకేష్ మాటలు.. నీటిమూటలు
● కాశినాయన క్షేత్రం అటవీ అనుమతులపై చేతులెత్తేసిన నారా లోకేష్ ● ఏడాది అవుతున్నాసమస్యలు యథాతథం కాశినాయన : ‘ఆవు చేలో మేస్తే దూడ గట్టున మేస్తుందా’అన్నట్లుగా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుమారుడు మంత్రి నారా లోకేష్ వ్యవహార శైలి ఉంది. మాట ఇవ్వడం.. ఆపై మరుగునపరచడం ముఖ్యమంత్రి చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య. ఈ విషయంలో నారా లోకేష్ తండ్రిని మించిన తనయుడనిపించుకున్నాడు. ఏడాది క్రితం కాశినాయన క్షేత్రంలో అటవీ శాఖ అనుమతులు లేవంటూ అటవీ అధికారులు కట్టడాలను కూల్చివేశారు. ఎక్కడ తమ ప్రభుత్వానికి చెడ్డ పేరు వస్తుందో అని హడావుడి చేసి కూలగొట్టిన కట్టడాలను తానే సొంత డబ్బులతో పూర్తి చేస్తానన్న లోకేష్ ఓ చిన్న కట్టడం కట్టి చేతులు దులుపుకొన్నారు. ఇప్పుడు ఆ క్షేత్రంలో సమస్యలు మాత్రం ‘ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’అన్న చందంగా మారాయి. కాశినాయ క్షేత్రంలో కొన్ని సత్రాలు, ఇతర నిర్మాణాలను అటవీ శాఖ కూల్చివేసింది. ఉప ముఖ్యమంత్రిగా ఉన్న పవన్కల్యాణ్ అటవీ శాఖ మంత్రిగా ఉన్నారు. ఈ కూల్చివేతలపై ఆయన ఒక్క మాట కూడా మాట్లాడకపోవడం గమనార్హం. అప్పటికే అనుమతుల కోసం ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా కేంద్ర అటవీశాఖ మంత్రికి వైఎస్ జగన్ లేఖ రాశారు. అనుమతులు మంజూరు కాలేదు. ప్రభుత్వం మారడంతో చంద్రబాబు సర్కార్ అక్కడ కూల్చివేతల పర్వం చేపట్టింది. ఈ వ్యవహారంతో పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. ప్రభుత్వానికి ఎక్కడ చెడ్డ పేరు వస్తుందోనని భయపడిన మంత్రి నారా లోకేష్ హడావుడి చేశారు. ఏకంగా తన పీఏ కేకే చౌదరిని పంపించి నిర్మాణాలను దగ్గరుండి కట్టించాలని ఆదేశించారు. ఈ మేరకు ప్రచార మాధ్యమాల్లో కూడా హడావుడి చేశారు. ఆయన పీఏ నాలుగు రోజులు ఇక్కడే మకాం వేసి రూ.5లక్షలతో పడగొట్టిన రేకుల షెడ్ను నిర్మాణం చేపట్టి వెళ్లిపోయారు. అటవీ అనుమతులపై హంగామాతో సరి కాశినాయన క్షేత్రం నల్లమల అటవీ ప్రాంతంలో ఉంది. అక్కడ భక్తులు గుడి నిర్మాణం చేపట్టారు. నిత్యాన్నదాన సత్రం కూడా ఏర్పాటు చేసి వచ్చిన భక్తులకు భోజన వసతి కల్పిస్తున్నారు. 13 ఏళ్ల క్రితం అటవీ అనుమతులు లేవంటూ ఆలయ నిర్మాణాన్ని అటవీ అధికారులు నిలిపివేశారు. జ్యోతి క్షేత్రానికి 13 హెక్టార్ల స్థలాన్ని ఇవ్వాలని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్రానికి లేఖ రాశారు. కేంద్ర ప్రభుత్వం సకాలంలో స్పందించలేదు. రాష్ట్రంలో అధికార మార్పిడి కావడంతో కాశినాయన క్షేత్రంలో కట్టడాల కూల్చివేతకు సిద్ధమయ్యారు. ఇక్కడ ప్రధాన సమస్య అటవీ అనుమతులు తీసుకురావడమే. కాగా మంత్రి నారా లోకేష్ నెలలోపల అటవీ అనుమతులు తెప్పించి పునర్నిర్మాణం చేపడుతామన్న మాటలు నీటి మూటలే అయ్యాయి. ఏడాది కావస్తున్నా అటవీ అనుమతుల విషయంలో ఒక్క మాట కూడా మాట్లాడలేదు. జ్యోతి క్షేత్రం కూల్చివేతలను చూసేందుకు బీజేపీ నేతలు కూడా పోటీ పడి పర్యటనలు చేసి అటవీ అనుమతులు తీసుకొస్తామని హామీలు ఇచ్చి వెళ్లిపోయారు. ఆ తర్వాత మరిచిపోయారని భక్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా చంద్రబాబు ప్రభుత్వం, నేతలు స్పందించి జ్యోతి క్షేత్రానికి అటవీ అనుమతులు మంజూరు చేయాలని భక్తులు కోరుతున్నారు. -
వైభవంగా ముగిసిన గంగ జాతర
లక్కిరెడ్డిపల్లి: రాయలసీమలోనే అతిపెద్ద జాతరగా ఖ్యాతిగాంచిన లక్కిరెడ్డిపల్లి మండలంలోని అనంతపురం గంగమ్మ దేవత జాతర ఘనంగా ముగిసింది. గురువారం మైలు తిరుణాలకు వచ్చే మూడుదారులు భక్తులతో కిటకిటలాడింది. గురువారం అర్థరాత్రి దాటాక తెల్లవారుజామున రెండు గంటల సమయంలో అమ్మవారు అశ్వవాహనంపై ఆశీనులై ఊరేగారు. ఆలయ ప్రాంగణం చుట్టూ ఉన్న రోడ్డుపై మంగళవాయిద్యాలు.. మిరుమిట్లుగొలిపే బాణసంచాలు.. భక్తుల కోలాహల నడుమ అంగరంగ వైభవంగా దర్శనమిస్తూ మెరవనిగా ఈడిగపల్లికి తిరుగు పయనమయ్యారు. తెల్లవారేసరికి అమ్మవారు ఆలయానికి ప్రవేశించారు. రాయలసీమ జిల్లాల నుంచే కాకుండా ఇతర రాష్ట్రాల నుండి వందల సంఖ్యలో చాందినీ బండ్లతోపాటు కుంకుమ, ఎద్దులబండ్లు జాతరకు తరలివచ్చాయి. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆధ్వర్యంలో డీఎస్పీ కృ,ష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ డి శోభలు జాతరకు పటిష్ట బందోబస్తు, ట్రాఫిక్ ఏర్పాట్లు చేశారు. జాతర చివరిరోజు చాందినీ బండ్ల ఎదుట ఏర్పాటు చేసిన కోలాటం, చెక్కభజన భక్తులను అలరించాయి. జాతరలో ఏర్పాటు చేసిన జబర్దస్త్, రేలారే రేలా, డ్యాన్స్ ప్రోగ్రాంలతో యువత కేరింతలు కొడుతూ ఉత్సాహంగా సందడి చేశారు. గంగమ్మ ఆలయ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు జాతర ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఉత్సాహంగా బండలాగుడు పోటీలు జాతరను పురస్కరించుకొని నిర్వాహకులు రాయలసీమ బండలాగుడు పోటీలను నిర్వహించారు. విజేత ఎడ్ల యజమానులకు మండిపల్లి నాగిరెడ్డి మెమోరియల్ ట్రస్టు ద్వారా మొదటి బహుమతి రూ. ఒక లక్ష, ద్వితీయ బహుమతి రూ. 80 వేలు నగదును లక్ష్మీప్రసాద్ రెడ్డి అందజేశారు. హుండీ ఆదాయం లెక్కింపు: అనంతపురం గంగమ్మ దేవత జాతర సందర్భంగా మూడురోజుల హుండీ ఆదాయాలను గురువారం లెక్కించారు. రూ. 17,96,420లు వచ్చినట్లు ఆలయ ఈఓ శ్రీనివాసులు తెలిపారు. ఈ నగదు మొత్తాన్ని ఆలయ ఖాతాకు జమ చేయనున్నట్లు వారు తెలిపారు. లెక్కింపు కార్యక్రమంలో సిబ్బంది, పూజారులు పాల్గొన్నారు. అశ్వవాహనంపై భక్తులను కరుణించిన అమ్మవారు ప్రత్యేక ఆకర్షణగా చాందినీబండ్లు తిరుగుపయనమైన చాగలగట్టుపల్లి, గొల్లపల్లి అమ్మవార్లు -
నేడు మహా నైవేద్యం
రాయచోటి టౌన్: శ్రీభద్రకాళీ సమేత శ్రీవీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలలో అపురూప ఘట్టమైన ‘మహా నైవేద్యం’ శుక్రవారం నిర్వహించనున్నారు. ఈ అపురూప ఘట్టాన్ని ప్రతక్ష్యంగా చూసేందుకు స్థానికంగానే కాకుండా ఇతర రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. ఈ మహాౖనైవేద్యం నిర్వహించే క్రమంలో పూర్తిగా అన్నాన్ని (భోజనాన్ని) రాశిగా పోసి ఈ రాశిపై వండిన అత్తిరాసాలు, కూరగాయలు, దుంపలు కప్పి ఉంచి తరువాత శ్రీవీరభద్రుడికి త్రినేత్రం ధరింపజేస్తారు. ఆ క్షణం కోసం లోపల ఉన్న వేదపండితులు, అర్చకులు, ఆలయ అధికారులు, ఆలయపాలక మండలి సభ్యులు, భక్తులు ఎంతో ఆతృతగా ఎదురు చూస్తుంటారు. త్రినేత్రం ధరింపచేసిన తరువాత వేదపండితులు వల్లించే వేదమంత్రాల మధ్య వడ్డెర్లు ఒక్కసారిగా ఈ మహానైవేద్య ప్రసాదాన్ని అందినంత తీసుకెళ్తారు. తరువాత ఈ రాశిలోని అన్నప్రసాదాన్ని అధికారుల పర్యవేక్షణలో పోలీసులు, అర్చకులు భక్తులకు అందిస్తారు. సర్వం సిద్ధం మహా నైవద్యే ఘట్టాన్ని చూసేందుకు కర్నాటక రాష్ట్రం నుంచి వేలాదిగా తరలివస్తారు. ఒక రోజు ముందుగానే రాయచోటికి చేరుకొంటారు. వీరికి కర్నాటక రాష్ట్రం ట్రస్ట్ వాళ్లు ఉచిత భోజనం ఏర్పాటు చేస్తారు. బస చేయడానికి ఏర్పాట్లు....... కర్నాటక రాష్ట్రం నుంచి తరలి వచ్చే భక్తుల కోసం ఆలయానికి ఎదురుగా ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల భవనాలు, సమీపంలోని మరో ప్రైవేట్ పాఠశాల భవనాలు, ఆలయానికి చెందిన గదులు భక్తుల కోసం ఏర్పాటు చేస్తారు. స్వామివారికి బంగారు కిరీట ధారణ రాయచోటి టౌన్: బ్రహ్మోత్సవాలలో భాగంగా స్వామి, అమ్మవార్లకు దాతల చేతుల మీదుగా బంగారు కిరీట ధారణ చేశారు. కర్నాటక రాష్ట్రానికి చెందిన గురులింగప్ప కమరడిగి కుటుంబ సభ్యులు గతంలో స్వామివారికి, అమ్మవారికి బంగారు కిరీటాలను బహుకరించారు. వీటిని బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా ప్రధాన ఉత్సవాల సమయంలో స్వామి వారికి, అమ్మవారికి అలంకరించడం.. ఆపై తిరిగి బ్యాంక్లో భద్రపరడచం ఆనవాయితీగా వస్తోంది. ఈ క్రమంలో దాతల కుటుంబ సభ్యులు గురువారం ఆలయానికి రావడంతో వారి ఎదుటనే కిరీటధారణ చేశారు. -
కడప, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–12 సౌత్జోన్ అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 141 పరుగులు చేసింది. ఆ జట్టులోని మనీష్ సాయి 27, గౌరీష్ 26 పరుగులు చేశారు. కడప జట్టులోని భాను వర్షిత్రెడ్డి 2, వివాన్స్ రెడ్డి 2, సాయి చరిత్2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన కడప జట్టు 24.2 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 144 పరుగులు చేసింది. ఆ జట్టులోని యం గురు ఈక్షిత్ 36, హరి శ్రీయాన్ 22 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని గౌరీష్ 2 వికెట్లు తీశారు. మహ్మద్ నవాజ్ (88 పరుగులు) సుచిత్రెడ్డి (5 వికెట్లు) -
స్థానిక సంస్థల ఎన్నికలకు సన్నద్ధం
కడప అర్బన్: మహిళా భద్రత కు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాలని, ఈవ్ టీజింగ్, మహిళలు, చిన్నారులపై నేరాలు జరగకుండా తగిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయం లోని కాన్ఫరెనన్స్ హాలులో ప్రొద్దుటూరు సబ్ డివిజన్ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. త్వరలో జరగనున్న స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ప్రశాంతంగా, స్వేచ్చాయుత వాతావరణంలో ఎన్నికలు జరిగేందుకు వీలుగా ఇప్పటినుండే తగిన ప్రణాళికలు రూపొందించాలని పోలీస్ అధికారులను ఆదేశించారు. గంజాయి, డ్రగ్స్ పై ప్రత్యేక కార్యాచరణ రూపొందించి ఉక్కుపాదం మోపాలన్నారు.రోడ్డు భద్రతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని సూచించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్) ఫిర్యాదులకు అత్యధిక ప్రాధాన్యత ఇచ్చి నిర్ణీత గడువులోగా, చట్ట పరిధిలో పరిష్కారం అయ్యేలా చూడాలని సూచించారు. ఈ సమావేశంలో అదనపు ఎస్పీ (అడ్మిన్)కె.ప్రకాష్ బాబు, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభుకృష్ణ , ప్రొద్దుటూరు సబ్ డివిజన్ లోని సీఐ లు, ఎస్ఐ లు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
24 గంటల్లో కథ ముగిసింది
మదనపల్లె: ఒక ఘటన రెండు చావులు..విధి విచిత్రమో, కర్మ సిద్దాంతమో కాని ఏడేళ్ల బాలికపై అత్యాచారం చేసి, ఆపై నీటి డ్రమ్ములో ముంచి చంపిన కర్కోటకుడైన మానవ మృగం కులవర్దన్ కూడా 24 గంటల్లో మరణించాడు. కులవర్ధన్ మృతదేహం చెరువులో కనిపించిందన్న వార్త బుధవారం ఉదయమే వ్యాపించడంతో మదనపల్లె ప్రజల్లో హర్షాతిరేకాలు వ్యక్తం అయ్యాయి. బాలిక నివసించిన ప్రాంతంలో యువకులు టపాసులు కాల్చి సంబరాలు చేశారు. బాలిక అమర్రహే అంటూ నినాదాలు చేశారు. మహిళలు కొవ్వొత్తులతో ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఇలాంటి సంఘటనలు జరగకుండా పోలీసులు కఠినమైన చర్యలు తీసుకోవాలని ప్రజలు తమ అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. న్యాయం జరిగింది కులవర్ధన్ మరణంతో బాలిక కుటుంబానికి న్యాయం జరిగింది. అయితే ప్రజల ఆందోళనతో న్యాయం జరగదని అనుకున్నాం. కానీ కర్మ వెంటాడింది. –ఎస్.లక్ష్మిదేవి, మదనపల్లె పండగలా ఉంది ప్రజలు, పోలీసుల భయంతోనే కులవర్దన్ను దేవుడే శిక్షించాడు. ఈ ప్రాంత మహిళల్లో భయం తొలగింది. మాకు పండగలా ఉంది. –ఎం.ప్రభావతి, మదనపల్లె ధర్మం గెలిచింది బాలిక హత్య ఘటనతో ఆవేశం కట్టలు తెంచుకుంది. న్యాయం కోసం ఎండలో ఆందోళన చేశాం. అన్నం, నీళ్లు లేకుండా ఆందోళన చేశాం. చివరకు ధర్మం గెలిచింది. –సరస్వతి, మదనపల్లె చిన్నారిపై అఘాయిత్యం, హత్య జరిగిన మరుసటిరోజే హంతకుడి మరణం మదనపల్లెలో ప్రజల సంబరాలు -
మార్చి 11న వైవీయూ స్నాతకోత్సవం
కడప ఎడ్యుకేషన్ : యోగివేమన విశ్వవిద్యాలయం స్నాతకోత్సవం మార్చి 11వ తేదీన నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. ఇందుకు సంబంధించి తేదీని ఖరారు చేస్తూ విశ్వవిద్యాలయ కులపతి రాష్ట్ర గవర్నర్ కార్యాలయం నుంచి వర్సిటీకి ఉత్తర్వులు చేరాయి. ఏకకాలంలో ఒకే వేదికపై నిర్వహించే 11వ, 12వ 13వ, 14వ స్నాతకోత్సవం ద్వారా 13,399 విద్యార్థులు పట్టాలు అందుకోనున్నారు. ప్రతిభావంతులు బంగారు పతకాలను అందుకుంటారు. విశ్వవిద్యాలయ రెగ్యులర్ ఉపకులపతిగా ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ బాధ్యతలను స్వీకరించాక గత నెల 2వ తేదీన రాష్ట్ర గవర్నర్ను కలిసి కాన్వకేషన్ నిర్వహణ అనుమతి కోరారు. తాజాగా రాష్ట్ర గవర్నర్ నుంచి అనుమతి రావడంతో బుధవారం సాయంత్రం కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొఫెసర్ కె.ఎస్.వి కృష్ణారావు , కాన్వకేషన్ కోర్ కమిటీ ప్రతినిధులు ప్రొద్దుటూరు ఇంజినీరింగ్ కాలేజ్ ప్రిన్సిపల్ ప్రొఫెసర్ జయ చంద్రారెడ్డి, విశ్వవిద్యాలయ ప్రొఫెసర్లు ఎస్ రఘునాథరెడ్డి,ఎం.జి. దాము, నజీర్ అహ్మద్, విజయలక్ష్మితో తన ఛాంబర్ లో సమావేశం అయ్యారు. కాన్వకేషన్ ప్రాధాన్యత అంశాలపై చర్చించారు. -
దళిత యువకులను దారుణంగా హత్య చేశారు
● జంట హత్యలపై సిట్ బృందంతో విచారణ చేయించాలి ● మందకృష్ణమాదిగ డిమాండ్ కడప అర్బన్ : వైఎస్సార్ జిల్లా మైదుకూరు నియోజక వర్గం పరిధిలో బ్రహ్మంగారి మఠం మండలం పరిధిలో ఈనెల 5వ తేదీన సతీష్, ఓబులేసు అనే యువలకులు దారుణంగా హత్యకు గురయ్యారని తమ విచారణలో నిజనిర్ధారణకు వచ్చామని, ఆ సంఘటనపై సిట్ బృందంతో విచారణ జరపాలనీ ఎమ్మార్పీఎస్ వ్యవస్థాపక అధ్యక్షుడు మందకృష్ణ మాదిగ డిమాండ్ చేశారు. బుధవారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయానికి వచ్చిన ఆయన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ను కలిసి దళిత యువకులైన సతీష్, ఓబులేసుల మరణాలు ప్రమాదవశాత్తు జరిగినవి కావనీ, దారుణంగా హత్యలకు గురయ్యారని తెలియజేశారు. ఈ సంఘటనపై కడపలోని ఎస్పీ కార్యాలయంలో ఎస్పీని కలిసిన తరువాత మీడియాతో మాట్లాడారు. ఈనెల 5, 6వ తేదీల్లో బి. మఠం మండలం లో జరిగిన దళిత మాదిగ యువకుల మరణాలు ప్రమాదవశాత్తు జరగలేదని, ముమ్మాటికీ హత్యలేనని వాటిపై, రాజకీయ ఒత్తిళ్లకు లొంగని అత్యంత నిజాయితీ గల ఐపీఎస్అధికారి ఆధ్వర్యంలో సమగ్ర విచారణ జరపాలని విజ్ఞప్తి చేశామన్నారు. మోకాలులోతు స్థాయిలో నీళ్లు పారే కాలువలో యువకులు పడి చనిపోయారని పోలీసులు కేసు నమోదు చేసి చేతులు దులుపుకోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు.పక్కపక్కన నడుచుకొంటూ వెళ్తున్న ఇద్దరూ ఒకే చోట జారి కాలువలో పడిపోతే ఒకరు ఒకచోట, మరొకరు మూడు కిలోమీటర్ల దూరంలో వారి మృతదేహాలు దొరకడం చాలా అనుమానాలకు తావిస్తోందన్నారు. మృతుల్లో ఓబులేసు కు, సతీష్కు వేర్వేరు గ్రామాల యువతులతో ఉన్న ప్రేమ వ్యవహారాల విషయం సాక్ష్యాలతో సహా తెలియడంతోనే వారి కుటుంబ సభ్యులు వీరిని హత మార్చి ఉంటారని మేము, కుటుంబ సభ్యులు బలంగా నమ్ముతున్నామని, ఇలాంటి అనుమానాలు ఇంకా ఎన్నో ఉన్నాయని ఎస్పీకి లోతుగా వివరించారు. ఈ వ్యవహారంపై నిజాయితీ గల ఐపీఎస్ అధికారితో విచారణ జరిపించాలని ఎస్పీని కోరగా, పరిశీలిస్తానని హామీ ఇచ్చారు.కార్యక్రమంలో బాధిత కుటుంబ సభ్యులతో పాటు ఎమ్మార్పీఎస్ జాతీయ అధ్యక్షుడు మున్నంగి నాగరాజు, ఎంఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు వై.కె.విశ్వనాథ్, ఎంఎస్పీ జాతీయ నాయకుడు సొట్ట నరేంద్ర బాబు, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు రుద్రపోగు సురేష్, జిల్లా ఇన్చార్జి గుండాల ఈశ్వరయ్య, జాతీయ నాయకుడు శివయ్య, ఎంఎస్పీ జిల్లా అధికార ప్రతినిధి మాతయ్య, మైదుకూరు నియోజకవర్గ సీనియర్ నాయకులు సంజీవ, జయచంద్ర, కై పు భాస్కర్, బి. మఠం మండల ఎమ్మార్పీస్ అధ్యక్షులు జ్ఞానేశ్వరావు తదితరులు పాల్గొన్నారు. -
‘స్మార్ట్ కిచెన్’లో విజి‘లెన్స్’
కడప అర్బన్ : కడప మున్సిపల్ హైస్కూల్ (మెయిన్) లోని స్మార్ట్ కిచెన్ లో అవకతవకలపై బుధవారం మధ్యాహ్నం విజిలెన్స్ అధికారులు ఆకస్మికంగా తనిఖీలు చేశారు. ఈ స్మార్ట్ కిచెన్ నుంచి ప్రతిరోజు 2000 నుంచి 2500 మంది విద్యార్థులకు భోజనాలను పంపిస్తారు. మెనూ ప్రకారం పిల్లలకు అందించే కోడిగుడ్ల పరిమాణం సాధారణంగా 50 గ్రాముల బరువుతో ఉండాలి. అలాకాకుండా ఇక్కడ ఒక్కో గుడ్డు 35 గ్రాముల నుంచి 40 గ్రాముల మేరకు మాత్రమే బరువు కలిగి ఉన్నాయి. కాంట్రాక్టర్ తక్కువ బరువు ఉన్న గుడ్లను సరఫరా చేయడమే ఇందుకు కారణమని చెబుతున్నారు.ఈ సందర్భంగా డీసీటీవో మాట్లాడుతూ స్మార్ట్ కిచెన్ తనిఖీలలో గుడ్ల పరిమాణం 50 గ్రాములు ఉండాల్సి ఉండగా కేవలం ఒక్కో గుడ్డు 35 నుంచి 40 గ్రాములు మాత్రమే ఉన్నాయని గుర్తించామన్నారు. ఈ వ్యత్యాసానికి సంబంధించి రిపోర్టును తయారుచేసి జిల్లా విద్యాశాఖ అధికారికి తదుపరి చర్యల కోసం పంపిస్తామన్నారు.తనిఖీలు చేసిన వారిలో డీసీటీవో గీతా వాణి, ఇన్స్పెక్టర్ శివన్న, ఏవో లక్ష్మణ్, కడప ఎంఈఓ ఇర్షాద్ తదితరులు ఉన్నారు. వైభవంగా పుష్పరథోత్సవం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారి కల్యాణమహోత్సవాల్లో భాగంగా చివరి రోజు బుధవారం పుష్పరథోత్సవం వైభవంగా జరిగింది. వీరబ్రహ్మేంద్ర స్వామి, గోవిందమాంబలను పుష్పరధోత్సవంలో కందిమల్లా య్యపల్లెలో ఊరేగించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఐదు రోజుల పాటు జరిగిన ఉత్సవాలు ముగిశాయి. మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మేనేజర్ ఈశ్వరాచారి పర్యవేక్షణలో ఉత్సవాలు నిర్వహించారు.ప్రత్యేక అధికారి శంకర్బాలాజీ ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
విద్యుదాఘాతంతో కాడెడ్లు మృతి
కాశినాయన : మండలంలోని బాలాయపల్లె గ్రామానికి చెందిన రైతు నాగెళ్ల పుల్లారెడ్డి కాడెడ్లు విద్యుదాఘాతానికి గురై బుధవారం మృతి చెందాయి. పోలీసులు తెలిపిన వివరాల మేరకు పుల్లారెడ్డి ఉదయం 6 గంటలకు వ్యవసాయ పనుల నిమిత్తం రెండు ఎద్దులను తోలుకుని పొలానికి వెళ్లాడు. వారి బంధువైన నాగెళ్ల వెంకటేశ్వరరెడ్డి తన పొలం చుట్టు తీగను అమర్చి దానికి 11కేవీ విద్యుత్ను సరఫరా చేశాడు. పక్క పొలమే కాబట్టి ప్రమాదవశాత్తు కాడెడ్లు విద్యుత్ తీగను తగులుకుని షాక్ గురై మృతి చెందాయి. సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి వెంకటేశ్వరరెడ్డిపై కేసు నమోదు చేశామని ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. మృతి చెందిన ఎడ్లకు పశువైద్యాధికారి రామారావు పోస్టుమార్టం నిర్వహించారు. సుమారు రూ.2లక్షలకుపైగా విలువైన కాడెడ్లు మృతి చెందాయని, ప్రభుత్వం ఆదుకోవాలని నాగెళ్ల పుల్లారెడ్డి కోరుతున్నారు. రాజంపేటలో చోరీ రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణం చత్రపతి శివాజీనగర్కు సమీపంలో ఉన్న ఓ ఇంటిలో దొంగలు పడి 45 గ్రాముల బంగారు ఎత్తుకెళ్లారని అర్బన్ పోలీసులు తెలిపారు. వివరాలిలా వున్నాయి. చత్రపతి శివాజీనగర్ ప్రాంతానికి సమీపంలో నివాసం ఉంటున్న ఎర్రప్పగారి నిర్మల పుల్లంపేట మండలం పుల్లారెడ్డిపల్లెలో ఉంటున్న తన తండ్రి ఇటీవల అనారోగ్యంబారిన పడి తిరుపతిలో చికిత్స పొందుతుండటంతో ఈనెల 14వ తేదీ తిరుపతికి వెళ్లింది. రెండు రోజుల క్రితం నిర్మల తండ్రి మృతి చెందడంతో పుల్లారెడ్డిపల్లెలో తండ్రి అంత్యక్రియలు పూర్తయ్యే వరకు అక్కడే ఉండింది. అనంతరం బుధవారం ఉదయం రాజంపేటలోని తన ఇంటికి రాగా తలుపులు పగలగొట్టి ఉండటంతో లోపలికి వెళ్లి చూడగా దుస్తులు, ఇతర వస్తువులు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి. దీంతో బంగారు దాచిన ప్రాంతానికి వెళ్లి చూడగా దొంగలు ఎత్తుకెళ్లినట్లు గుర్తించింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ పోలీసులు తెలిపారు. గొర్రెల కాపరి ఆత్మహత్యాయత్నం పెద్దతిప్పసముద్రం : మండలంలోని కాకిమారపల్లికి చెందిన జికా శ్రీనివాసులు (40) అనే గొర్రెల కాపరి ఆత్మహత్యకు యత్నించాడు. గొర్రెలు మేపేందుకు వెళ్లగా మందలోని కొన్ని గొర్రెలు కనిపించలేదని గుర్తించాడు. దీంతో మనోవేదనకు గురై గడ్డి మందు తాగాడు. కుటుంబీకులు మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరిస్థితి ఆందోళన కరంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. -
పదోతరగతి పరీక్షలకు పక్కాగా ఏర్పాట్లు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : మార్చి 16వ తేదీ నుంచి ఏప్రిల్ ఒకటి వరకు జరుగు పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణకు పక్కాగా ఏర్పాట్లు చేయాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు పేర్కొన్నారు. బుధవారం జిల్లా సచివాలయంలోని బోర్డ్రూమ్లో పదవ తరగతి పబ్లిక్ పరీక్షల నిర్వహణ పై సంబంధిత శాఖల అధికారులతో డీఆర్ఓ సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పదవ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధిత శాఖల సమన్వయంతో అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. మార్చి 2 నుంచి మార్చి 13 వరకు జరగనున్న ఓపెన్ స్కూల్ ఇంటర్మీడియట్ పరీక్షల విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలపై విద్యాశాఖ, పోలీసు, వైద్య ఆరోగ్యశాఖ, విద్యుత్, మున్సిపల్, పోస్టల్ శాఖ అధికారులతో మాట్లాడి తగు సూచనలు చేశారు. ఈ సమావేశంలో డీఈఓ షంషుద్దీన్ పాల్గొన్నారు. ఎకై ్పజ్ సీఐని అడ్డుకున్న గ్రామస్తులు తొండూరు : మండలంలోని సంత కోవూరు గ్రామంలో బుధవారం రాత్రి ముద్దనూరు ఎకై ్సజ్ సీఐ వినీలను గ్రామస్తులు అడ్డుకున్నారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఎకై ్సజ్ సీఐ రాత్రి సంత కొవ్వూరు గ్రామానికి వెళ్లారు. అక్కడ బెల్ట్షాప్ నిర్వహిస్తున్న వారి దగ్గరికి వెళ్లి మద్యం బాటిల్ తీసుకుని ఎమ్మార్పీ కంటే అధిక ధరకు అమ్ముతున్నారని, మీకు బెల్ట్ షాపు నిర్వహణకు ఎవరు అనుమతులు ఇచ్చారని వారిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం తెలుసుకున్న గ్రామస్తులు సీఐ వాహనాన్ని చుట్టుముట్టారు. గ్రామాలకు బెల్ట్షాపులు ఇవ్వకుంటే సరిపోతుంది కదా.. మా గ్రామంలోకి వచ్చి ఎందుకు దాడు చేస్తున్నారని ప్రశ్నించారు. ఓ బెల్ట్షాపు నిర్వాహకుడిని ఎకై ్సజ్ పోలీసులు వాహనంలో ఎక్కించేందుకు ప్రయత్నించగా గ్రామస్తులు అడ్డుకున్నారు.రాత్రిపూట వచ్చి దాడులు చేసి..సంతకాలు పెట్టించుకుంటారా అంటూ ప్రశ్నించారు. దీంతో ఎకై ్సజ్ అధికారులు గ్రామం నుంచి జారుకున్నారు. విషయంపై ముద్దనూరు ఎకై ్సజ్ సీఐ వినీలను వివరణ కోరగా బుధవారం రాత్రి సంతకోవూరుకు వెళ్లిన విషయం వాస్తవమని, బెల్ట్ షాపులు నిర్వహించకూడదని చెప్పి వచ్చినట్లు తెలిపారు. మల్లెంకొండేశ్వరస్వామికి రూ.9.53 లక్షల ఆదాయం గోపవరం : శివరాత్రి పర్వదినం సందర్భంగా నిర్వహించిన మల్లెంకొండేశ్వస్వామి బ్రహ్మోత్సవాలకు హుండీ ద్వారా రూ.9,52,982లు ఆదాయం వచ్చినట్లు బద్వేలు దేవదాయశాఖ ఈవో ఎస్.రామలింగారెడ్డి తెలిపారు. బుధవారం బద్వేలు పట్టణంలోని శ్రీదేవి, భూదేవి సమేత కల్యాణ వేంకటేశ్వరస్వామి ఆలయ ఆవరణలోని దేవదాయశాఖ కార్యాలయంలో పర్యవేక్షణాధికారి శివయ్య ఆధ్వర్యంలో మల్లెంకొండేశ్వరస్వామి హుండీ ఆదాయాన్ని లెక్కించినట్లు ఆయన తెలిపారు. మల్లెంకొండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి రూ.9,52,982, 21 గ్రాముల బంగారం, 120 గ్రాములు వెండి వచ్చినట్లు తెలిపారు. అలాగే దిగువ మల్లెంకొండేశ్వరస్వామి ఆలయానికి సంబంధించి రూ.93,285లు హుండీ ద్వారా వచ్చిందన్నారు. ఇప్పటికే తలనీలాలకు సంబంధించి రూ.5.70 లక్షలు వేలంపాట ద్వారా వచ్చిందన్నారు. కార్యక్రమంలో మల్లెంకొండేశ్వరస్వామి ఆలయ చైర్మన్ మల్లెంకొండయ్య, ఏపీఐఐసీ డైరెక్టర్ ప్రసాదరెడ్డి, బద్వేలు రూరల్ సీఐ రామకృష్ణ, దేవదాయశాఖ సిబ్బంది, పాలక మండలి సభ్యులు పాల్గొన్నారు. రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భధ్రకాళీసమేత శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా బుధవారం చండీహోమం నిర్వహించారు. అంతకు ముందు ఉదయం స్వామి, అమ్మవార్లు శేషవాహనంలో పట్టణ పురవీధుల్లో ఊరేగారు.అర్చకులు స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు జరిపారు. బంగారు ఆభరణాలు, పట్టువస్త్రాలు, రంగురంగుల పూలతో అందంగా అలంకరించారు.భక్తులు అధికసంఖ్యలో స్వామి, అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్కుమార్, ఆలయ ఈవో డివి రమణారెడ్డి పాల్గొన్నారు. -
జన జాతర
లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అనంతపురం గంగమ్మ దేవత జాతర జనసంద్రమైంది. బుధవారం ప్రారంభమైన ఉత్సవాలకు అధిక సంఖ్యలో భక్తులు తరలిరావడంతో ఆలయ ప్రాంగణం భక్తులతో కిక్కిరిసింది. వివిధ రకాల పుష్పాలతో ప్రత్యేక అలంకరణలో శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత అమ్మవారు భక్తులకు దర్శనమిచ్చారు. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతూ దర్శనమిచ్చిన అమ్మవారి ఎదుట మహిళలు ఒరపడ్డారు. కరుణించమ్మా అంటూ మొక్కుకున్నారు. బోనాలతో మొక్కులు చెల్లింపు.... కస్తూరిరాజుగారిపల్లి గ్రామం, చాగలగుట్టపల్లి అమ్మవారిని పూజాది కార్యక్రమాల అనంతరం అర్థరాత్రి సమయంలో ఆరుబయట ఉంచారు. సాంప్రదాయబద్ధంగా పళ్లు కృష్ణారెడ్డి, రఘునాథరెడ్డి కుటుంబ సభ్యులు తొలి బోనంగా అమ్మవారికి జంతుబలులను సమర్పించారు. జాగారానికి తరలిన భక్తులు అమ్మవారికి కొబ్బరికాయలు కొడుతూ బోనాలు సమర్పించి మొక్కులు చెల్లించా రు. తెల్లవారుజామున మూడు గంటలకు బయలుదేరిన అమ్మవారు అప్పలరాజుగారిపల్లి, ఎస్సీ కాలనీ, మార్లవాండ్లపల్లి, మర్రిచెట్టు, చౌటపల్లి గ్రామాల మీదుగా అత్యంత అంగరంగ వైభవంగా అమ్మవారి ఊరేగింపు సాగింది. ఈడిగపల్లి గౌడ్లు కళ్లు సాంగ్యంతో అమ్మవారిని ఆలయంలోకి తీసుకెళ్తూ సంతానం కోసం వరపడిన మహిళలు మీదుగా అమ్మవారిని ఆలయంలోకి చేర్చారు. వరపడిన మహిళలకు సిద్దులపూజ అనంతరం సిద్దుల ప్రసాదాన్ని అందజేసి భక్తులకు అమ్మవారి సర్వదర్శనాన్ని కల్పించారు. పలు మానవతా స్వచ్ఛంద సంస్థలు మజ్జిగ ప్యాకెట్లు, నీళ్లబాటిళ్లు పంపిణీ చేశాయి. జాతరలో చాందినీ, కుంకుమ బండ్లు భక్తులను ఆకర్షించాయి. జాతరలో ఏర్పాటు చేసిన చెక్కభజన, కోలాటం, ఆర్కెస్ట్రా, జబర్దస్త్, రేలారే రేలా వంటి సాంస్కృతిక కార్యక్రమాలు యువతను ఉర్రూతలూగించాయి. ఈ సంవత్సరం రూ. 300లు దర్శనాన్ని ఏర్పాటు చేయడంతో వీఐపీలకు సులభతరంగా అమ్మవారి దర్శనం కలిగినట్లు అయ్యింది. డీఎస్పీ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సిఐ కృష్ణంరాజు నాయక్, లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ శోభ ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూశారు. మొక్కులు ఉన్నవారు అమ్మవారికి బోనాలు సమర్పించడంతోపాటు తలనీలాలు అర్పించారు. ఈ కార్యక్రమంలో లక్షలాది మంది భక్తులు, మహిళలు పాల్గొన్నారు. -
శివరాత్రి ఆదాయం రూ.1.11కోట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్: మహా శివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని కడప రీజియన్లోని ఏడు డిపోల నుంచి వివిధ శైవ క్షేత్రాలకు 1317 ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసి 1,46,077కి.మీ తిప్పడం ద్వారా రూ.1,11,31,086ల ఆదాయం ఒనగూరిందని కడప జిల్లా ప్రజా రవాణా అధికారి పోలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. శివరాత్రి సందర్భంగా ఆర్టీసీ బస్సులను ఆదరించి ఆదాయం రావడానికి తోడ్పడిన భక్తులకు ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నామన్నారు. కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఫుడ్ సేఫ్టీ అధికారులు విస్తృతంగా తనిఖీలు చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని బోర్డ్ రూమ్ హాల్లో జిల్లా టాస్క్ ఫోర్స్ కమిటీలో పలు అంశాలపై సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వ ప్రైవేటు వసతి గృహాలు, హోటల్స్, స్ట్రీట్ ఫుడ్ వద్ద ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు నిర్వహించడం ద్వారా కలుషిత ఆహారంతో ఎదురయ్యే సమస్యల నుంచి ప్రజలను కాపాడవచ్చునని తెలిపారు. పరిశ్రమల్లో భద్రతా చర్యలను పటిష్టం చేయాలి పరిశ్రమల్లో ప్రమాదాలు జరగకుండా భద్రతా చర్యలను మరింత పటిష్టం చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని ిపీజీఆర్ఎస్ హాలులో జిల్లా క్రైసిస్ గ్రూప్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని అన్ని పరిశ్రమల్లో కార్మికులకు రక్షణ కల్పించేందుకు పటిష్ట భద్రతా చర్యలు తీసుకోవాలన్నారు. చాపాడు: మండల వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో నిర్వహించే మధ్యాహ్న భోజన పథకంలో భోజన నాణ్యతపై ప్రత్యేక చర్యలు తీసుకోవాలని విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ తెలిపారు. మండల కేంద్రమైన చాపాడులోని జీఏ ఎస్ హైస్కూల్, ఉర్దూ హైస్కూల్, ప్రాథమిక పాఠశాలలను బుధవారం ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మూడు పాఠశాలల్లో మధ్యాహ్న భోజనాన్ని ఆయన పరిశీలించి నిర్వహణపై ఆరా తీశారు. అనంతరం ఆర్జేడీ మాట్లాడుతూ విద్యార్థులకు చదువుతోపాటు మధ్యాహ్న భోజనం నాణ్యతగా ఉండేలా చొరవ తీసుకోవాలని ఎంఈఓలకు సూచించారు. ఎంఈఓలు రవిశంకర్, వంశీకృష్ణ, ఆయా పాఠశాలల హెచ్ఎంలు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ నశించింది
పులివెందుల: రాష్ట్రంలో లా అండ్ ఆర్డర్ పూర్తిగా నశించిందని కడప ఎంపీ వైఎస్ఆర్ రెడ్డి విమర్శించారు. బుధవారం వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పోలీసుల ఉద్యోగం పూర్తిగా కూటమి నేతల చెప్పు చేతల్లో నడుస్తోందన్నారు. చిన్నారులను చిదిమేస్తున్నా ఈ ప్రభుత్వానికి పట్టడంలేదన్నారు. హోం మంత్రి ఏమి చేయకున్నా గొప్పలు చెప్పుకోవడం విడ్డూరంగా మారిందన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో 30వేల మంది మహిళలు కనిపించలేదని అబద్ధాలు చెప్పడం జరిగిందన్నారు. అలాంటి మహిళలను ఈ ప్రభుత్వం ఎంతవరకు కాపాడిందని ఆయన ప్రశ్నించారు. ఉన్నది లేనట్లుగా, లేనిది ఉన్నట్లుగా చెప్పడం చంద్రబాబుకు, ఆయన దత్తపుత్రుడు పవన్ కళ్యాణ్లకు అలవాటుగా మారిందని తెలిపారు. మహిళలపై, చిన్నారులపై జరుగుతున్న ఈ అఘాయిత్యాలకు చంద్రబాబు, పవన్ కళ్యాణ్, హోంమంత్రి అనితలు ఏమి సమాధానం చెబుతారని ఆయన ప్రశ్నించారు. చంద్రబాబు ప్రభుత్వంలో ప్రతిరోజు మహిళలపై అఘాయిత్యాలు జరుగుతున్నాయన్నారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మహిళల కోసం చట్టాలను రూపొందించినట్లు చెప్పారు. అయితే ప్రస్తుత ప్రభుత్వంలో మహిళలు నిరాదరణకు గురవుతున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టాలను ఈ ప్రభుత్వం పూర్తిగా తుంగలో తొక్కిందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. -
మోసం చేయడం చంద్రబాబు నైజం
మోసం చేయడం, వెన్నుపోటు పొడవడం చంద్రబాబు నైజం. అది ఆయనకు వెన్నతో పెట్టిన విద్య. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీలకు 50ఏళ్లకే పింఛన్ ఇస్తానని ఎన్నికల ప్రచారంలో ఊదరగొట్టాడు. రెండేళ్లు పూర్తి కావస్తున్నా ఆ పథకం దారిదాపుల్లో లేదు. ఈసారైనా బడ్జెట్ కేటాయిస్తారని చాలా మంది లబ్ధిదారులు ఎదురు చూశారు. కానీ వారికి నిరాశే మిగిల్చింది. మరోసారి చంద్రబాబు తన నైజాన్ని చాటుకున్నారు. ఈ పథకం అమలుకు ఏటా రూ.9600కోట్లు అవసరం కాగా, మూడేళ్లలో రూ. 28,800 కోట్లు లబ్ధిదారులకు ఎగ్గొట్టారు. – పి. చంద్రశేఖర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు -
వరాల వసంతం.. రంజాన్ మాసం
కమలాపురం/కడప సెవెన్ రోడ్స్ : వరాల వసంతం రానే వచ్చింది. ప్రతి గ్రామం, ప్రతి పట్టణం, ప్రతి నగరంలో రంజాన్ సందడి వచ్చేసింది. బుధవారం రాత్రి నెల వంక కనిపించింది. గురువారం నుంచి ముస్లింలు ఉపవాస దీక్షలు పాటిస్తారు. ఈ రంజాన్ మాసం ముస్లింలకు ప్రీతి పాత్రమైంది. ఈ మాసంలో ఒక్క రుపాయి దానం చేస్తే రూ.70 చేసినంత పుణ్యం లభిస్తుందని వారి విశ్వాసం.ఏ మసీద్లో చూసినా చిన్నా, పెద్ద తేడా లేకుండా సంప్రదాయ దుస్తులు ధరించి ముస్లిం సోదరులు కనిపిస్తారు. ఈ మాసం అంతా వయస్సుతో సంబంధం లేకుండా పిల్లలు మొదలుకొని పండు ముసలి వరకు ఉపవాస దీక్షలు పాటిస్తారు. తెల్లవారు జామున నుంచి సూర్యాస్తమయం వరకు, కనీసం ఎంగిలి కూడా మింగ కుండా ఉపవాసం ఉంటారు. సందడిగా ఇఫ్తార్: రంజాన్ మాసంలో ఇఫ్తార్ కార్యక్రమం సందడిగా జరుగుతుంది. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాస దీక్ష చేపట్టిన ముస్లింలు సాయంత్రం మగ్రిబ్ నమాజ్కు మసీద్లకు చేరుకుంటారు. అక్కడ అందరూ సామూహికంగా కలసి పండ్లు, ఫలాలు తదితర వాటిని భుజించి ఉపవాస దీక్షను విడుస్తారు. ఈ కార్యక్రమంతో మసీదులు సందడిగా కనిపిస్తాయి. ముస్లింలు శుక్రవారాన్ని చాలా పవిత్ర మైన రోజుగా కొలుస్తారు. ప్రతి శుక్రవారం జుమ్మా నమాజ్ చదువుతారు. రాత్రి దర్గాలకు వెళ్లి స్వాముల వారిని కొలుస్తారు. అలాంటిది రంజాన్ మాసంలో వచ్చే శుక్రవారాలకు మరింత ప్రాధాన్యత ఇస్తారు. ప్రతి ఒక్కరూ మసీదులకు వెళ్లి ప్రత్యేక నమాజ్ ఆచరిస్తారు. తరావీహ్ నమాజ్తో అధిక పుణ్యం రంజాన్ మాసంలో తరావీహ్ నమాజ్కు ప్రత్యేకత ఉంది. ఈ మాసంలో ముస్లిం సోదరులు ఉపవాస దీక్ష విరమించిన అనంతరం రాత్రి ఇషా నమాజ్లో భాగంగా 20 రకాతుల స్పెషల్ తరావీహ్ నమాజ్ చదువుతారు. మహ్మద్ ప్రవక్త(స.అ.వ.సొ.) ఉన్నప్పటి కాలం నుంచే ఈ తరావీహ్ నమాజ్ చదువుతున్నారు. దివ్య ఖురాన్ 30 భాగాలుగా ఉంటుంది. ఒక్కో రోజు తరావీహ్ నమాజ్లో ఒక్కో ఖురాన్ భాగం చదువుతారు. ముస్లింలు ఖురాన్ చదవాలి. చదవలేని వారు కనీసం తరావీహ్ నమాజ్లో చదివే ఖురాన్ పఠనాన్ని అయిన వినాలి. ఇలా చేయడం వలన ఎక్కువ పుణ్యం లభిస్తుంది. ఖురాన్లోని ఒక్క అక్షరం చదివితే 10 పుణ్యాలు లభిస్తాయి. మరి అలాంటిది రంజాన్ మాసంలో ఖురాన్ చదివితే అనేక రెట్లు పుణ్యాలు లభిస్తాయని మత పెద్దలు తెలిపారు. అలాగే రంజాన్లో సున్నత్ సమాజ్కు కూడా ఫరజ్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుందని వారు తెలిపారు. నేటి నుంచి ఉపవాస దీక్షలురంజాన్ మాసం పుణ్యాలు సంపాదించే మాసం. ఖురాన్లోని ఒక అక్షరం చదివితే 10 పుణ్యాలు లభిస్తాయి. అదే రంజాన్ మాసంలో చదివితే అనేక రెట్లు ఎక్కువ పుణ్యాలు లభిస్తాయి. ఈ మాసంలో మనం నిష్ట నియమాలు పాటించి అల్లాహ్ ఆరాధనలో గడపాలి. తమ తప్పులను క్షమించమని ప్రార్థిస్తే అల్లాహ్ తప్పక క్షమిస్తాడు. ముస్లింలు ఈ మాసం అంతా పుణ్యాలను సంపాదించుకోవాలి. – హాఫిజ్ గయాసుద్ధీన్, కమలాపురం. ముస్లిం మహిళలు కూడా తమ ఇళ్లల్లో స్పెషల్ తరావీహ్ నమాజ్ చదవాలి. రంజాన్ మాసంలో సున్నత్ నమాజ్ ఆచరించినా, ఫర్జ్ నమాజ్ చదివినంత పుణ్యం లభిస్తుంది. కాబట్టి ముస్లింలంతా ఉపవాస దీక్షలు (రోజా) పాటించి తరావీహ్ నమాజ్ చదవాలి. – షఫీవుల్లా, పేష్ ఇమామ్, మస్జిద్–ఏ–ఖాదరియా, కమలాపురం -
ఖాకీల పచ్చపాతం
పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయకుల ఆగడాలకు అంతులేకుండా పోయింది. ఆదాయమే లక్ష్యంగా పచ్చమూకలు అడ్డదారులను ఎంచుకుంటున్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని వ్యవస్థలను ‘మేనేజ్’చేస్తున్నారు. పోలీసులేమో జీ హుజూర్ అంటూ పచ్చ నేతల సేవలో తరిస్తున్నారు.సాక్షి టాస్క్ఫోర్స్: కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పులివెందుల నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ నాయ కుల ఆగడాలు రోజురోజుకు మితిమీరుతున్నాయి. ప్రతి వ్యవస్థలో తాము చెప్పిందే జరగాలి అన్నట్లు తెలుగుదేశం పార్టీ నాయకులు హుకూం జారీ చేస్తున్నారు. ఓ వైపు తాము ప్రజల కోసం పని చేస్తున్నామని చెప్పుకుంటూనే... మరోవైపు తీవ్ర అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నారు. గత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో.. అంతకు ముందు దివంగత వైఎస్సార్ హయాంలో పులివెందుల ప్రాంతం అభివృద్ధి వైపు పరుగులు తీసింది. మహానేత వైఎస్సార్, జననేత వైఎస్జగన్ కక్షలు కార్పణ్యాలు పక్కనబెట్టి నియోజకవర్గం అభివృద్ధిపైనే దృష్టి సారించి వందల కోట్ల నిధులతో పులివెందుల ప్రాంతాన్ని అభివృద్ధి చేశారు. అలాంటి పులివెందుల ప్రాంతాన్ని ప్రస్తుతం టీడీపీ నాయకులు తమ స్వార్థం, ఆదాయం కోసం భ్రష్టు పట్టిస్తున్నారు. అధికారమే పరమావధిగా కక్ష సాధింపులు, అక్రమ కేసులు బనాయించి పులివెందుల సంప్రదాయాన్ని మంట కలుపుతున్నారు.కూటమి నేతలకు అండగా పోలీసులుపులివెందులలో తెలుగుదేశం పార్టీ నాయకులు చేస్తున్న అరాచకాలకు పోలీసుల నుంచి పూర్తి మద్దతు లభిస్తోంది. పులివెందుల ప్రాంతంలో పనిచేస్తున్న సబ్ డివిజన్ అధికారికి రాయలసీమ రేంజ్ అధికారి అండదండలు ఉండడంతో తనదైన శైలిలో రెచ్చిపోతున్నాడు. రాయలసీమ రేంజ్ అధికారి, పులివెందుల సబ్ డివిజన్ అధికారి గత జెడ్పీటీసీ ఎన్నికల్లో ఏకపక్షంగా వ్యవహరించి పులివెందుల ప్రాంత ప్రజలను భయభ్రాంతులకు గురిచేసి ఏ విధంగా జెడ్పీటీసీ ఎన్నికలు నిర్వహించారనే విషయం రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా గమనించారు.జూదంపై దాడి చేసిన ఎస్ఐ ట్రాన్స్ఫర్రెండు నెలల క్రితం పులివెందుల పట్టణంలోని టీడీపీ నాయకుడు ఉలిమెల్ల రోడ్డులో తన తోటలో జూదం నిర్వహిస్తుండగా కొత్తగా ఎస్ఐ పోస్టింగ్ వచ్చిన అధికారి ఆ జూదశాలపై దాడులు చేశారు. ఆ విషయంలో పులివెందుల ద్వితీయ శ్రేణి నాయకులు పోలీస్ స్టేషన్కు వెళ్లి సాక్షాత్తూ డీఎస్పీ సమక్షంలోనే ఆ ఎస్ఐపై తిట్టారు. సదరు అధికారి పూర్తిగా టీడీపీ నాయకులకు వత్తాసు పలుకుతూ ఎస్ఐపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. అంతే నిష్పక్షపాతంగా విధులు నిర్వహించిన ఆ ఎస్ఐని బదిలీని బహుమానంగా అందించారు.జూదం జోరుగా...పులివెందుల నియోజకవర్గంలో యథేచ్చగా టీడీపీ నాయకుల ఆధ్వర్యంలో జూదశాలలు నిర్వహిస్తున్నారు. టీడీపీ పులివెందుల నియోజకవర్గ ఇంచార్జ్ తన తమ్ముడికి చెందిన తోటలో 18 నెలల నుంచి యథేచ్చగా జూదం నిర్వహిస్తున్నారు. అలాగే పులివెందులలోని ద్వితీయ శ్రేణి నాయ కులు చెన్నారెడ్డి కాలనీ, నారాయణ కాలేజీ సమీపంలో, నగరిగుట్ట సమీపంలో, వారికి సంబంధించిన అనేక స్థావరాలలో జూదం నిర్వహిస్తున్నారు. అయినా అటువైపు పులివెందుల పోలీసులు కన్నెత్తి చూడడంలేదు.పులివెందుల క్లబ్బులపై దాడులుపులివెందులలో 50ఏళ్ల నుంచి రోటరీ క్లబ్, యంగ్ మెన్స్ క్లబ్లు నిర్వహిస్తున్నారు. ఈ క్లబ్లలో నిబంధన మేరకు కేవలం అందులో సభ్యత్వం తీసుకున్న మెంబర్స్కు మాత్రమే జూదమాడే అవకాశం ఉంటుంది. అలాగే క్లబ్ నిబంధన మేరకు ఇందులో క్యారం బోర్డు, షటిల్, టెన్నిస్ వంటి ఆటలు కూడా ఆడుతూ ఉంటారు. గత పది రోజుల నుంచి టీడీపీ నాయకుల ఆదేశాల మేరకు ఈ క్లబ్బుల పై పోలీసులు దాడులు నిర్వహించారు. వారం క్రితం ఒకసారి, బుధవారం మరోసారి దాడులు నిర్వహించారు. టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న జూదాలకు ఆదాయం తక్కువ అవుతుందనే ఉద్దేశంతోనే వారు ఈ విధంగా క్లబ్బులపై దాడులు చేయిస్తున్నారని మెంబర్స్ ఆరోపిస్తున్నా రు. సాధారణంగా ఇటువంటి క్లబ్బులలో రిటైర్డ్ ఎంప్లాయీస్ తదితరులు కాలక్షేపం కోసం నిబంధన మేరకు జూదమాడుతూ ఉంటారు. అలాంటి క్లబ్బులపై దాడులు నిర్వహిస్తే తమ జూదశాలలకు మరింత ఆదాయం ఉంటుందని టీడీపీ నాయకులే పోలీసులను అడ్డుపెట్టుకొని ఇలాంటి దాడులు చేస్తున్నారని వారు వాపోతున్నారు. -
తక్కువ ధరకే ఫార్చునర్ కారు అంటూ టోకరా
కళ్యాణదుర్గం : తక్కువ ధరకే ఫార్చునర్ కారు వస్తుందంటూ సైబర్నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా ఓ అమాయకుడికి ఆశ చూపి రూ.24 లక్షలకు టోకరా వేశారు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన భీముడు అజిత్కుమార్ శ్రీఓఎల్ఎక్స్శ్రీలో ఓ ఫార్చునర్ కారు రూ.24 లక్షలకే వస్తుందంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు చూసిన వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వేణుగోపాల్రెడ్డి కారు కోసం అజిత్ కుమార్తో బేరం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారంలో అజిత్ కుమార్ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందిన తూర్పు త్రిశాంత్ను పావుగా వాడుకున్నాడు. ఈ క్రమంలో వేణుగోపాల్రెడ్డి ద్వారా రూ.24 లక్షలను తూర్పు త్రిశాంత్ పేరిట కళ్యాణదుర్గంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు జమ చేయించాడు. అనంతరం ఓఎల్ఎక్స్లో ఫార్చునర్ కారు పెట్టినందుకు ఒరిజనల్ ఓనర్ అకౌంట్కు రూ.10 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి.. మిగిలిన డబ్బుతో ఉడాయించేశాడు. కారు కోసం వేణుగోపాల్రెడ్డి.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. తనను మోసం చేశారని గ్రహించాడు. బాధితుడు ఆ జిల్లాలో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. వచ్చిన సొమ్ముతో అజిత్, త్రిషాంత్ కర్ణాటకకు వెళ్లి ఓ జ్యువెలరీ షాపులో బంగారం కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నేరగాళ్ల కోసం విజయవాడ సైబర్ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం వచ్చి విచారణ జరిపినట్లు సమాచారం.పక్కా ప్లాన్తో మోసాలుభీముడు అజిత్ కుమార్ అమాయకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనికి ఏకంగా పలు రకాల చిరునామాలతో ఐదు ఆధార్ కార్డులు ఉన్నట్లు తేల్చారు. ఇలాంటి కేసుల్లో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు తన సోదరితో పాటు ఐదుగురు అడ్వొకేట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఏ సమస్య వచ్చినా అజిత్కుమార్ను అరెస్టు చేయకుండా అడ్వొకేట్లే కాపాడుతుంటారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే సైబర్ మోసంపై ఓ సీఐ.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా..్ఙగాలిని పట్టుకోగలవా?! నీకు దమ్ముందాశ్రీఅంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
నేటి నుంచి శనగల కొనుగోలు
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వం నిర్ణయించిన కనీస మద్దతు ధరతో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా గురువారం నుంచి శనగలను కొనుగోలు చేయనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ తెలిపారు. జేసీ నిధి మీనాతో కలిసి బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో గురువారం నుంచి పులివెందుల, తొండూరు, జమ్మలమడుగు, ముద్దనూరు, ప్రొద్దు టూరు, కమలాపురంలలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని, త్వరలో మరో 15 కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. రైతు సేవా కేంద్రాల్లో రిజిష్టర్ చేసుకుంటే ఏరోజు మార్కెట్కు శనగలు తీసుకురావాలో మెసేజ్ వస్తుందన్నారు. ఈ–క్రాప్ బుకింగ్ను అనుసరించి రైతుల అకౌంట్లలోకే డబ్బు జమ చేస్తామని తెలిపారు. సమావేశంలో వ్యవసాయ, మార్క్ఫెడ్, సహకారశాఖల అధి కారులు చంద్రానాయక్, పరిమళజ్యోతి, వెంకట సుబ్బయ్యలు పాల్గొన్నారు. మాతా శిశు మరణాల నివారణకు చర్యలు మాతా శిశు మరణాల నివారణకు గైనకాలజిస్టులు శ్రద్ధ తీసుకోవాలని కలెక్టర్ సూచించారు. కలెక్టరేట్లో వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి మెటర్నల్ డెత్ సర్వేలెన్స్ అండ్ రెస్పా న్స్ కమిటీ సమావేశం నిర్వహించి పలు సూచనలు చేశారు. -
శాంతిభద్రతల రక్షణలో ఘోర వైఫల్యం
మదనపల్లె: మదనపల్లె సహా రాష్ట్రంలో శాంతి భద్రతలను పరిరక్షించడంలో కూటమి ప్రభుత్వం దారుణంగా విఫలమైందని వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, ఎస్ఈసీ మెంబర్ జి.షమీం అస్లాం, మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ ఆరోపించారు. ఏడేళ్ల చిన్నారి హత్యాచార ఘటనపై తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ మహిళ హోంశాఖ మంత్రిగా ఉండగా ఇలాంటి దారుణాలు జరుగుతున్నాయంటే ప్రభుత్వం శాంతిభద్రతలపై ఏ స్థాయిలో పని చేస్తోందో అర్థమవుతోందన్నారు. వీధికో బెల్టుషాపుతో మద్యం ఏరులై పారుతోందన్నారు. గంజాయి విక్రయాలతో యువత గంజాయికి బానిసై పెడదారిన పడుతున్నారని అన్నారు. మత్తు పదార్థాలను అరికట్టడంలో పోలీసులు దారుణంగా విఫలమయ్యారని ఆరోపించారు. చిన్నారి మరణానికి కారణమైన నిందితుడిని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ నేతల ఆగ్రహం కఠిన చర్యలకు పార్టీలు, సంఘాల నేతల డిమాండ్ -
వైభవం.. త్రేతేశ్వరస్వామి రథోత్సవం
భారీగా తరలివచ్చిన భక్తజనంరాజంపేట రూరల్ : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు మంగళవారం శ్రీ కామాక్షి సమేత శ్రీత్రేతేశ్వరస్వామి రథోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మహాశివరాత్రి అనంతరం ప్రాధాన్యత ఇచ్చే కార్యక్రమాల్లో ప్రధానమైనది రథోత్సవం. దేవదేవేరిలను రథంలో తిలకించడానికి భక్తులు వేలాదిగా తరలి వచ్చారు. రథంలో కొలువుదీరిన శ్రీకామాక్షి సమేత శ్రీత్రేతేశ్వర స్వామిని దర్శించుకొని భక్తులు తరించారు. ప్రత్యేక పుష్పాలతో రథాన్ని శోభాయమానంగా అలంకరించడంతో రథం భక్తులను విశేషంగా ఆకట్టుకుంది. గతంలో ఎన్నడూ లేని విధంగా భక్తులు రథోత్సవ కార్యక్రమంలో పాల్గొనడంతో.. అత్తిరాల గ్రామంతోపాటు పరిసర ప్రాంతాల్లో సైతం జనసందోహం కనిపించింది. అనేక మంది భక్తులు రథాన్ని లాగేందుకు పోటీ పడ్డారు. దీంతో పోలీసులు సైతం భక్తులను అదుపు చేసేందుకు శ్రమించాల్సి వచ్చింది. స్వామి వారి రథం తేరు మాను వరకు వెళ్లి తిరిగి వచ్చే వరకు భక్తులు హరతులు పడుతూ టెంకాయలు కొట్టి మొక్కులు చెల్లించుకున్నారు. ఏది ఏమైనా ఉత్సవాల్లో ముఖ్య ఘట్టమైన రథోత్సవంలో వేలాది మంది భక్తులు పాల్గొన్నా.. పోలీసులు, నిర్వాహకులు సమన్వయంతో కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. శివరాత్రి ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ కమిటీ నిర్వాహకులు, దేవదాయ శాఖ అధికారులు, పోలీసులు, వివిధ శాఖల అధికారులు అవిశ్రాంతంగా కృషి చేశారు. ఈ వేడుకలలో ఈఓ సురేష్కుమార్రెడ్డి, దేవస్థాన కమిటీ చైర్మన్ పూల నాగమని, మాజీ చైర్మన్లు పూల నరసింహులు, కె వెంకటేశ్వర్లునాయుడు, కె.సుబ్రమణ్యంనాయుడు, మన్నూరు సీఐ లింగప్ప, ఎస్ఐ వేంకటేశ్వర్లు, రెవెన్యూ, పంచాయతీ, విధ్యుత్ శాఖల అధికారులు, భక్తులు, వివిధ స్వచ్ఛంద సంస్థల నిర్వాహకులు పాల్గొన్నారు. -
అత్తను చంపిన అల్లుడికి యావజ్జీవ శిక్ష
● కూలి డబ్బు ఇవ్వలేదని హతమార్చిన వైనం ● 2021లో ప్రొద్దుటూరులో జరిగిన ఘటన ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు శివారులోని కొర్రపాడు రోడ్డులో 2021లో జక్కం గ్రేసమ్మను హత్య చేసిన కేసులో.. ఆమె అల్లుడు కమతం సూరిబాబుకు ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు మండలంలోని కొత్తపల్లె పంచాయతీ పరిధిలో ఉన్న వివేకానందనగర్కు చెందిన గ్రేసమ్మ తన భర్తతో విభేదాల కారణంగా 8 ఏళ్ల నుంచి శంకరాపురం గ్రామంలోని తన పెద్ద కుమార్తె వద్ద ఉండేది. అక్కడే కూలి పనికి వెళ్తూ వచ్చిన డబ్బును కుమార్తెకు ఇచ్చేది. అయితే ప్రొద్దుటూరు మండలంలోని నక్కలదిన్నె గ్రామానికి చెందిన రెండవ కుమార్తె భర్త అయిన కమతం సూరిబాబు (ముద్దాయి) కూడా తనకు డబ్బులు ఇవ్వాలని తరచూ గ్రేసమ్మతో గొడవ పడుతూ ఉండేవాడు. ఈ క్రమంలో 2021 మర్చి 2న గ్రేసమ్మ నక్కలదిన్నెలో ఉంటున్న రెండవ కుమార్తె ఇంటికి వెళ్లింది. సాయంత్రం సమయంలో శంకరాపురం గ్రామానికి వెళ్లాలని చెప్పగా.. అల్లుడు సూరిబాబు తన టీవీఎస్ ఎక్సెల్లో వాహనంపై తీసుకెళ్తానని చెప్పాడు. ఈ క్రమంలో ఆమెను వాహనంలో తీసుకెళ్తుండగా మార్గంమధ్యలో డబ్బుల విషయమై గొడవ పడ్డాడు. వారి మధ్య కొంతసేపు వాగ్వాదం జరిగింది. దీంతో సూరిబాబు గ్రేసమ్మను టీవీఎస్ ఎక్సెల్పై నుంచి కిందికి తోసేశాడు. అక్కడితో ఆగక ఆమె గొంతు నులిమి హత్య చేశాడు. కొర్రపాడు రోడ్డులోని టిడ్కో ఇళ్ల సముదాయం సమీపంలోని ముళ్ల పొదల్లో మృతదేహాన్ని పడేశాడు. గ్రేసమ్మను హత్య చేసినట్లు సూరిబాబు తన భార్య మరియమ్మకు చెప్పాడు. కుటుంబ సభ్యులందరూ ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతురాలి కుమారుడు జక్కం శాంతుడు ఫిర్యాదు మేరకు అప్పటి రూరల్ సీఐ విశ్వనాథ్రెడ్డి కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. యావజ్జీవ శిక్షతోపాటు రూ.10 వేల జరిమానా నాటి నుంచి ఈ కేసు ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో విచారణ జరుగుతోంది. ఈ క్రమంలో నేరం రుజువు కావడంతో ముద్దాయి కమతం సూరిబాబుకు యావజ్జీవ కారాగార శిక్షతోపాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ మంగళవారం ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి కే సత్యకుమారి తీర్పు వెల్లడించారు. అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్తల సుధాకర్రెడ్డి బలమైన వాదనలు వినిపించి నేర నిరూపణలో కీలక పాత్ర పోషించారు. ఈ కేసులో శ్రమించి దోషికి శిక్ష పడేలా చేసిన రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐలు శ్రీకాంత్, కేసీ రాజు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది ఏ నాగరాజు, ప్రొద్దుటూరు రూరల్ కానిస్టేబుల్ వెంకటయ్యను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ అభినందించారు. -
ఉత్కంఠ భరితంగా బండలాగుడు పోటీలు
రాజంపేట రూరల్ : రాజంపేట మండలంలోని అత్తిరాలలో జిల్లా స్థాయి బండలాగుడు పోటీలు ఆద్యంతం ఉత్కంఠ భరితంగా సాగాయి. కడప జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 5 జతల ఎడ్లు పాల్గొన్నాయి. అనంతపురం జిల్లా అక్కంపల్లి గ్రామానికి చెందిన కోనపల్లే ఇంద్రారెడ్డి ఎడ్లు 20 నిమిషాలలో 710 అడుగులు బండలాగి ప్రథమ స్థానంలో నిలిచి రూ.50 వేలు దక్కించుకున్నాయి. వేముల మండలం రంగోరిపల్లి గ్రామానికి చెందిన మూలే జస్విత్రెడ్డి ఎడ్లు 676 అడుగులు లాగి రూ.40 వేలు ద్వితీయ బహుమతిని గెలుచుకున్నాయి. పులింవెందుల మండలం ఎర్రిపల్లి గ్రామానికి చెందిన కాకర్ల విజయ్కుమార్రెడ్డికి చెందిన ఎడ్లు 600 అడుగులు బండలాగి మూడవ స్థానంలో నిలిచి రూ.30 వేలు దక్కించుకున్నాయి. నంద్యాల జిల్లా డోన్ మండలం మాల్యాల గ్రామానికి చెందిన షేర్ మహిమున్నా ఎడ్లు 459 అడుగులు లాగి నాల్గవ స్థానంలో నిలవడంతో రూ.20 వేలు దక్కించుకున్నాయి. కొండాపురం మండలానికి చెందిన బెడదూరు గ్రామానికి చెందిన ప్రణయ్ ఎడ్లు 389 అడుగులు లాగి ఐదవ స్థానంలో నిలిచి రూ.10 వేలు దక్కించుకున్నాయి. పోటీలలో పాల్గొన్న పోటీదారులకు మెదటి బహుమతిని రైల్వేకోడూరు మండలం ఓబనపల్లికి చెందిన గడికోట వేంకటేశ్వర్లునాయుడు రూ.50 వేలు, రెండవ బహుమతి రాజంపేట మండలం మందరం గ్రామానికి చెందిన వల్లూరు రమేష్రెడ్డి రూ.40 వేలు, మూడవ బహుమతి ఇసుకపల్లి గ్రామానికి చెందిన అద్దెపల్లి ప్రతాప్రాజు రూ.30 వేలు, నాల్గవ బహుమతిగా నందలూరు మండలానికి చెందిన రేవూరు వేణుగోపాల్ రూ.20 వేలు, ఐదవ బహుమతిగా మందరం రాచపల్లి గ్రామానికి చెందిన ముప్పాల శంకరరాజు రూ.10 వేలు బహుమతిగా వితరణ చేశారు. ఈ పోటీలను మన్నూరు సీఐ ఎస్.లింగప్ప పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ పోటీలను తిలకించడానికి వివిధ ప్రాంతాల నుంచి భారీగా ప్ర జలు తరలివచ్చారు. కార్యక్రమంలో మన్నూరు, సుండుపల్లి ఎస్ఐలు ఎం.వేంకటేశ్వర్లు, ఎస్.హుస్సేన్సాహెబ్, ఏఎస్ఐలు సీ.ఎస్.కే. ప్రసాద్వర్మ, ఎస్. ఖాసింబ్సాబ్, హెడ్ కానిస్టేబుల్స్ ఎస్.షామీర్బాషా, వి.తిరుపతయ్య, పోలీసులు పాల్గొన్నారు. -
నిరవధిక సమ్మెలోకి సహకార ఉద్యోగులు
కడప అగ్రికల్చర్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ఉద్యోగస్తుల యూనియన్ల ఐక్య వేదిక పిలుపు మేరకు.. రాష్ట్రమంతటా రెండు నెలలుగా విడతల వారీగా నిరసన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు సహకార సంఘాల రాష్ట్ర ఉపాధ్యక్షుడు బాబు తెలిపారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం స్పందించలేదన్నారు. ఇందుకు నిరసనగా సోమవారం నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడం జరిగిందని తెలిపారు. మంగళవారం కడప డీపీడీఎం ప్రసాద్కు సహకార సంఘాల సీఈఓలు వినతి పత్రం అందజేశారు. అనంతరం బాబు మాట్లాడుతూ సంఘాలకు తాళాలు వేసి ఈఆర్పీలు కూడా లాగిన్ చేయరాదని పిలుపు ఇచ్చామన్నారు. కడప డీసీసీబీకి సంబంధించి ఉమ్మడి జిల్లాలో 75 సంఘాలకు గాను 30 సంఘాలు లాగిన్ అయినట్టు రిపోర్ట్ చూపిస్తుందన్నారు. కానీ సంఘాలతో కానీ సీఈఓలకు కానీ సంబంధం లేకుండా ఈఆర్పీ లాగిన్ అయినట్లు తెలుస్తోందన్నారు. సంఘాల సిబ్బంది సమ్మెలో ఉన్నా కూడా ఈఆర్పీలు లాగిన్ అవ్వడం మీద అనేక అనుమానాలకు తావిస్తోందన్నారు. అంతే కాకుండా ఫైనాన్సియల్కు సంబంధించిన ట్రాన్సక్షన్స్ ఉన్న అన్ని సంఘాలలో ఇలాంటి చర్య తగనిదని అన్నారు. ఎవరు లాగిన్ అయ్యారో తెలియని సాఫ్ట్వేర్లో సహకార సంఘాలు కోట్ల రూపాయల ట్రాన్సక్షన్స్ చేయడం హాస్యాస్పదంగా ఉందన్నారు. సూపర్ వైజర్, డిపార్ట్మెంట్ వారికి కూడా వారి వారి లాగిన్ ఇచ్చారన్నారు. వారు కూడా సిబ్బంది నిరసనకు సంఘీభావం తెలిపారన్నారు. కడప డీపీడీఎం ప్రసాద్ దీనిపై సానుకూలంగా స్పందించి తగు వివరాలు పై అధికారులతో చర్చించి త్వరలో అందజేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అన్నమయ్య, కడప జిల్లాల సంఘాల సీఈఓలు సాబ్జాన్, జాఫర్, లక్ష్మినారాయణ, ఆన్సర్, ఇందాద్, రవి, నరేష్, ఖాదరవలి, రెడ్డెప్పరెడ్డి, రవిశంకర్రెడ్డి, ధర్మారెడ్డి, రామచంద్ర, వీరాకుమార్, సుబ్బారెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
గండికోట హత్య కేసు ఏమైందో!
సాక్షి ప్రతినిధి, కడప: గండికోటలో సుమారు 8 నెలల క్రితం జరిగిన బాలిక హత్య కేసు ఇంకా తేలలేదు. క్లూస్ టీమ్ పరిశీలించింది. డాగ్ స్క్వాడ్ పర్యటించింది. టవర్ లోకేషన్ తీశారు. ఫోన్ కాల్స్ టెక్నికల్ విశ్లేషణ చేశారు. ఇరువురు ఐపీఎస్ స్థాయి అధికారుల పర్యవేక్షణలో క్షేత్రస్థాయిలో నలుగురు డీఎస్పీలు, నలుగురు సీఐలు, 10మంది ఎస్ఐలు ప్రత్యేక దృష్టి పెట్టారు. శరవేగంగా దర్యాప్తు చేపట్టారు. త్వరలో అసలు విషయం వెలుగు చూస్తుందని సమాజం భావించింది. పైగా ఘటన జరిగిన మరుసటి రోజు డీఐజీ కోయ ప్రవీణ్ వచ్చి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. సాయంత్రంలోగా నిందితుల్ని పట్టుకుంటామని మీడియా సాక్షిగా చెప్పారు. ● ఏమైందో..ఏమో! సాయంత్రాలెన్నో వెళ్లాయి.. రోజులు గడిచాయి.. నెలలు దాటుతున్నాయి.. ఇప్పటికీ హత్య కేసులో పురోగతి లేదు. సస్పెన్స్ కొనసాగుతూనే ఉంది. తాజాగా మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్యోదంతం నేపధ్యంలో ఒక్కమారుగా గండికోట మైనర్ బాలిక హత్య వ్యవహారం చర్చనీయాంశంగా మారింది. 8నెలలు పూర్తయినా ఇప్పటికీ హత్య చేసిందెవరు? హత్య చేయడానికి కారణాలు ఏమిటీ? ఇలాంటి ప్రశ్నలు ప్రశ్నార్థకంగానే ఉండిపోయాయి. నిర్ధారణ కాకముందే స్పందించిన డీఐజీ... బాలిక హత్య కేసులో కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ తొందరపాటు చర్య స్పష్టంగా కన్పిస్తోంది. అప్పటి ఎస్పీ ఆశోక్కుమార్తో పాటు ఘటన స్థలానికి చేరుకున్న డీఐజీ కోయ ప్రవీణ్ తొందరగా నిర్ధారణకు వచ్చారు. హత్యలో బాలిక స్నేహితుడు లోకేష్ ప్రమేయం లేదని ప్రకటించారు. అంతటితో ఆగకుండా సాయంత్రం నిందితుల్ని అదుపులోకి తీసుకొని ఎస్పీ హత్య వివరాలు తెలియజేస్తారని అప్పట్లో మీడియాకు వివరించారు. హత్య కేసులో ఎలాంటి పురోగతి లేకుండానే డీఐజీ స్థాయి అధికారి అలా ప్రకటించడం వెనుక ఆంతర్యం ఏమిటనేది ప్రశ్నార్థకంగా నిలుస్తోంది. మదనపల్లెలో చిన్నారి హత్యోదంతం నేపఽథ్యంలో... మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి హత్య మంగళవారం ఉదయం వెలుగుచూసింది. ఓ దుర్మార్గుడి వ్యవహారమే అందుకు కారణమని స్థానికులు నిర్ధారణకు వచ్చారు. తక్షణమే తమకు అప్పగించాలని బాధిత కుటుంబం పక్షాన మదనపల్లె పట్టణం ఏకతాటిపైకి వచ్చింది. నిరాటంకంగా ఆందోళన చేపట్టింది. పోలీసు అధికారులు నచ్చజెప్పినా శాంతించలేదు. ఇలాంటి సున్నిత ఘటనలు తలెత్తితే అంతే వేగంగా పోలీసుల చర్యలు లేకపోవడమే అందుకు ప్రధాన కారణంగా తెలుస్తోంది. ● పుంగనూరు టౌన్లో ఏడేళ్ల చిన్నారి ఆదృశ్యం తర్వాత సమ్మర్స్టోరేజీ ట్యాంకులో 10రోజులకు మృతదేహం లభించింది. ఈఘటన గత ఏడాది సెప్టెంబర్ 24న చోటుచేసుకుంది. అదృశ్యం వ్యవహారం వెలుగులోకి రాగానే అన్నీ కోణాల్లో దర్యాప్తు ఆశించిన వేగంగా లేకపోవడమే మైనర్ బాలిక మృతికి ఆస్కారం ఏర్పడిందనే భావన అక్కడి ప్రజానీకంలో ఉంది. బాలికలు, మహిళల అదృశ్యం వ్యవ హారాల్లో సత్వరమే చర్యలు చేపడితే పోలీసు వ్యవ స్థ మీద మరింత విశ్వాసం పెరుగుతోంది. అలా కాకుండా ఉదాసీనతతో వ్యవహరిస్తే మదనపల్లెలో ఘటనలాగా బాధితులు ఆందోళన దిగడం సహజమని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. 8నెలలు గడుస్తున్నా కేసులో లభించని పురోగతి ఘటన రోజు సాయంత్రంలోగానిందితుల్ని పట్టుకుంటామన్న డీఐజీ ఇప్పటికీ తేలని హత్య కేసు వ్యవహారం జమ్మలమడుగు రూరల్: ‘గండికోట’ బాలిక హత్య కేసులో అనుమానితులైన ఇద్దరిని జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్ బాబు ఆధ్వర్యంలో సిబ్బంది గుజరాత్ రాష్ట్రానికి నార్కో అనాలసిస్ పరీక్షకు తీసుకెళ్లినట్లు సమాచారం. 4 నెలల క్రితం కోర్ట్ అనుమతితో నాగేంద్ర, కొండయ్య, బాలిక స్నేహితుడు లోకెష్ను పాలిగ్రాఫ్ టెస్ట్ను పోలీస్ అధికారులు విజయవాడకు తీసుకెళ్లి పరీక్షలు నిర్వహించారు. ఈ పరీక్షలో ఎటువంటి ఆధారాలు లభించలేదు. దీంతో అధికారులు నార్కో అనాలిసీస్ పరీక్షకు తీసుకెళ్లినట్లు సమాచారం. -
ఇలాంటి నీచుడిని పబ్లిగ్గా ఉరితీయాలి
మదనపల్లి పట్టణం నీరుగట్టివారిపల్లిలో ఏడేళ్ల బాలికనుఅమానుషంగా హత్య చేసిన మానవ మృగం కుల వర్దన్ను పబ్లిక్గా ఉరితీయాలి. ఇది క్షమించరాని నేరం. ఇలాంటి నీచుడిని ఊరికే వదలకూడదు. ఈ సంఘటన అందర్ని కలచివేస్తోంది. అంగళ్లు దగ్గర కళ్యాణ మండపంలో గతంలో నా బిడ్డను కూడా ఇలానే ఒక మృగాడు పొట్టన పెట్టుకున్నాడు. ఇప్పుడు మరో చిన్నారి కూడా ఇదే విధంగా మరో దుష్టుడి చేష్టలకు బలైంది. బాలిక ఎంత వేదన బాధ అనుభవించి ఉంటుందో..తలచుకుంటే వళ్లు జలదరిస్తుంది. –సిద్దారెడ్డి, గుట్టపాళ్యం, బి.కొత్తకోట మండలం మత్తే కారణం మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి మరణానికి గంజాయి మత్తే కారణం. ప్రభుత్వం బాధిత కుటుంబానికి ఆర్థికంగా ఆదుకోవాలి. దుర్మార్గానికి పాల్పడిన వ్యక్తికి కఠిన శిక్ష విధించాలి. గంజాయి, బెల్టుషాపులతోనే రాష్టంలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నాయి. – కళ్యాణ్ భరత్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం శిక్షించాలి చిన్నారి మృతి కారకుడైన వ్యక్తిని కఠినంగా శిక్షించాలి. పోలీసు అధికారులు ఈ ఘటనను సీరియస్గా తీసుకుని చర్యలు చేపట్టాలి. మదనపల్లెలో జిల్లా అధికారులు ఉన్నారు. మహిళలు, చిన్నారులపై జరుగుతున్న దాడులను అరికట్టేలా కఠినంగా వ్యవహరించాలి. – శివప్రసాద్, బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు ముఖ్య నాయకుడి అనుచరుడు ఏడేళ్ల చిన్నారి మృతికి కారకుడైన వ్యక్తి స్థానిక టీడీపీకి చెందిన ముఖ్యనాయకుడి అనుచరుడే. అతను తన ఒంటిపై ఆ నాయకుడి పేరును టాటూగా కూడా వేయించుకున్నాడు. నిందితుడు గంజాయి మత్తులో ఇలాంటి ఘాతుకాలకు పాల్పడుతున్నాడు. మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. గంజాయి రవాణాను, విక్రయాలను పోలీసులు తక్షణమే అరికట్టాలి. – పునీత్కుమార్, బహుజన యవసేన అధ్యక్షుడు రూ.25 లక్షల పరిహారం చిన్నారి హత్య దారుణం. సమాజానికి ఈ హత్య ఓ మచ్చ. రాష్ట్ర వ్యాప్తంగా గంజాయి విక్రయాలతో శాంతిభద్రతలకు తీవ్ర విఘాతం కలుగుతోంది. నిందితున్ని కఠినంగా శిక్షించాలి. బాధిత కుటుంబానికి రూ.25 లక్షల పరిహారం చెల్లించాలి. –వీఎస్.రెడ్డి, వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి మెతక వైఖరి వల్లే పోలీసుల మెతక వైఖరే ఏడేళ్ల చిన్నారి ప్రాణం తీసింది. రౌడీషీటర్లు, సంఘవిద్రోహశక్తులపై కఠినవైఖరి లేనిఫలితంగానే ఇలాంటి సంఘటనలు జరుగుతున్నాయి. ఇకౖపైనెనా పోలీసు యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలి. – కృష్ణప్ప, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి ప్రభుత్వ వైఫల్యం మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారి మృతి ఘటన ప్రభుత్వ వైఫల్యమే. చిన్నారి అదృశ్యమైన వెంటనే పోలీసులు వేగంగా స్పందించి ఉంటే ఘటనను అడ్డుకోవడం సాధ్యమయ్యేది. పోలీసు వ్యవస్థలో నిర్లక్ష్యం, సమన్వయ లోపం కారణంగానే ఒక పసి ప్రాణం బలి కావాల్సి వచ్చింది. ఈ ఘటనకు పోలీసు అధికారులు, ప్రభుత్వం బాధ్యత వ్యవహరించాల్సిందే. – మర్రి సుమిత్ర, ఏపీమహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి -
గాల్లో దీపంలా ఆడబిడ్డల రక్షణ
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినరోజు నుంచి మహిళలపై అఘాయిత్యాలు, అత్యాచారాలు, హత్యలు జరుగుతున్నా అరికట్టడంలో పూర్తిగా వైఫల్యం చెందింది. మదనపల్లిలో బాలిక హత్యాచార సంఘటన దారుణం. చిత్తూరు నుంచి శ్రీకాకుంళం వరకు రోజుకో కీచకపర్వం జరుగుతోంది. హోంమినిష్టర్ అనిత కు చీమ కుట్టినట్లు కూడా లేదు. ఆడబిడ్డపై చేయి వేస్తే అదే ఆఖరి రోజు అన్న సీఎం చంద్రబాబు మహిళలపై చేయివేస్తే తాట తీస్తా అన్న డిప్యూటీ సీఎం పవన్ ఏ ఒక్క సంఘటనలోనైనా స్పందించిన దాఖలాలే లేవు. – గౌరీ, మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు -
కనీస మద్దతు ధరతో ‘శనగ’ కొనుగోలు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రకృతి అనుకూలించి ఈ యేడు జిల్లాలో శనగ పంట దిగుబడి బాగా వచ్చినప్పటికీ రైతులకు కష్టాలు తప్పడం లేదని కడప లోక్సభ సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. శనగ క్వింటాలు రూ. 5875 కనీస మద్దతు ధరగా ప్రభుత్వం నిర్ణయిందని పేర్కొన్నారు. జిల్లాలో కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసి సేకరించకపోవడం వల్ల రైతులు రూ. 4700లకే అమ్ముకునే దుస్థితి తలెత్తిందన్నారు. ఇప్పటికే 25 శాతం పంట దళారుల చేతుల్లోకి వెళ్లిపోయిందని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ఎంఎస్పీతో శనగ పంట కొనుగోలు చేయాలని ఆయన డిమాండ్ చేశారు. మంగళవారం కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్తో ఈ విషయంపై చర్చించారు. అలాగే జిల్లాలోని వివిధ ప్రజా సమస్యలను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని కోరారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. శ్రీశైలం రిజర్వాయర్లో 854 అడుగులకు నీటిమట్టం చేరితేగానీ రాయలసీమ ప్రాజెక్టులకు 7000 క్యూసెక్కులు మాత్రమే డ్రా చేసుకునే వీలుంటుందన్నారు. గాలేరు–నగరి, తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ లాంటి పథకాలకు శ్రీశైలంలో 880 అడుగుల నీటిమట్టం ఉంటేనే నీరు అందుతుందన్నారు. కానీ, తెలంగాణ విచ్చల విడిగా నీటిని తోడేస్తుంటే శ్రీశైలంలో 880 అడుగుల లెవెల్ చేరుకోదన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం కన్నా ఎక్కువ ప్రయోజనం చేకూరుస్తున్నామని చెబుతున్న రాష్ట్ర ప్రభుత్వ వాదనపై విలేకరులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానమిచ్చారు. అందుకే ముందుచూపుతో వైఎస్ జగన్మోహన్రెడ్డి 800 అడుగుల నుంచే నీటిని డ్రా చేసుకోవడానికి వీలుగా రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని చేపట్టారని పేర్కొన్నారు. రాయలసీమకు రాష్ట్ర బడ్జెట్లో తీవ్ర అన్యాయం జరిగిందని ఓ ప్రశ్నకు బదులిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ వైస్ చైర్మన్ బాలయ్య, వైఎస్సార్ సీపీ నాయకులు వల్లంబాయి హృషికేశవరెడ్డి, షేక్ షఫీవుల్లా, సీహెచ్ వినోద్కుమార్, దేవిరెడ్డి ఆదిత్య, చెన్నూరు ఎంపీపీ చీర్ల సురేష్యాదవ్, వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి, వేణుగోపాల్నాయక్ తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయాన్ని నిర్వీర్యం చేస్తున్న సర్కార్ పులివెందుల : కూటమి ప్రభుత్వం వ్యవసాయ రంగాన్ని రాష్ట్రంలో పూర్తిగా నిర్వీర్యం చేస్తోందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. మంగళవారం పులివెందులలోని తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ ఎన్నికలప్పుడు చంద్రబాబు పీఎం కిసాన్కు సంబంధం లేకుండా ఏడాదికి రూ.20వేలు రైతన్నలకు అందిస్తానని ప్రతి ఎన్నికల మీటింగ్లలో ఊదరగొట్టారని.. అధికారంలోకి వచ్చాక ఆ హామీని తుంగలో తొక్కారని ధ్వజమెత్తారు. ప్రస్తుతం ఏ పంటకూ గిట్టుబాటు ధరల్లేక రైతులు అల్లాడుతున్నారన్నారు. కనీసం రైతులకు యూరియా కూడా అందించలేని అధ్వాన పరిస్థితిలో ఈ ప్రభుత్వం ఉండటం సిగ్గుచేటన్నారు. 20నెలలుగా అన్ని విధాలుగా నష్టపోయిన రైతాంగానికి ప్రస్తుత బడ్జెట్లో ఎంతమాత్రం ప్రాధాన్యత ఇవ్వలేదన్నారు. వ్యవసాయ రంగానికి అరకొరగా కేటాయించడంపై ఈ ప్రభుత్వానికి రైతులపట్ల ఎంత చిత్తశుద్ధి ఉందో అర్థమవుతోందన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
గనుల నిర్వహణపై దృష్టి సారించాలి
కడప సెవెన్రోడ్స్ : జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గనుల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మైనింగ్ అధికారులను ఆదేశించారు. మంగళవారం రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్రంలోని వివిధ రకాల ఖనిజ వనరుల లభ్యత, గనుల నిర్వహణ సంబంధిత అంశాలపై.. ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ సంబంధిత కార్యదర్శులతో కలిసి అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా స్టేట్ లెవెల్ కో ఆర్డినేషన్ కమిటీ సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు జిల్లా అటవీ శాఖ అధికారి వినీత్ కుమార్ హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మైన్స్ డీడీ సుబ్రమణ్యం, మైన్స్ విజిలెన్స్ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, పరిశ్రమల శాఖ జీఎం చాంద్బాషా, రాయల్టీ ఇన్స్పెక్టర్లు, ఫారెస్ట్, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు. ‘స్టార్ట్ అప్ కడప’ లక్ష్యం.. యువతకు స్ఫూర్తిదాయకం ఉద్యోగం అందుకునే స్థాయి నుంచి ఉద్యోగాలు అందించే స్థాయికి యువత ఎదగాలన్న లక్ష్యంతో జిల్లాలో రూపుదిద్దుకుంటున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ యువత నైపుణ్యతకు స్ఫూర్తిగా నిలవనుందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో పి4 విధానం ద్వారా జిల్లాలో ఇన్నోవేటీవ్గా నిర్మిస్తున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్ స్థాపన ఉద్దేశం, ప్రత్యేకతలు మొదలైన అంశాలపై జిల్లాలోని పలువురు విద్యావేత్తలైన పి4 భాగస్వాములతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అధునాతన సదుపాయాలతో అన్ని రకాల మౌలిక వసతులతో రూపుదిద్దుకోనున్న ‘స్టార్ట్ అప్ కడప’ ఎంటర్ ప్రెన్యూర్ షిప్ సెంటర్.. యువ స్టార్టప్ వ్యవస్థాపకులు, ఫ్రీలాన్సర్లు, చిన్న, మధ్యతరహా వ్యాపార సంస్థల అభివద్ధికి పునాది వేస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ రాజశేఖర్, చంద్ర ఓబుల్రెడ్డి (కెఎస్ఆర్ఎం విద్యాసంస్థల చైర్మన్), అర్జీయూకేటీ డైరెక్టర్ డా.గోపాల రాజు, ఏఐటీఎస్ ఈడీ, కెఎంసి కమిషనర్ మనోజ్రెడ్డి, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఇండస్ట్రీస్ జీఎం చాంద్ బాషా, హౌసింగ్ పీడి రాజా రత్నం, స్టెప్ సీఈవో నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్, స్కిల్ డెవలప్మెంట్ డీఎస్డీఓ వినీల్ కుమార్, ఎల్డీఎం జనార్దనం, విద్యావేత్తలు, ఏడీపీ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు. -
● చిన్నారిపై హత్యాచారంతో మండిపడ్డ మదనపల్లె ● కట్టలు తెగిన ప్రజాగ్రహం ● సత్వర న్యాయం కోసం పట్టు ● పోలీసులపై అసహనంతో స్థానికుల నినాదాలు ● చైన్నె–ముంబై రహదారిపై గంటలపాటు రాకపోకలు బంద్
గంజాయికి బానిసగా మారి.. ఒళ్లంతా మత్తెక్కి.. కామంతో కళ్లు నెత్తికెక్కి.. మగాడొకడు మృగంగా మారి.. ఏడేళ్ల చిన్నారిని చిదిమేసి.. మానవత్వం ఉసురు తీసి.. మదనపల్లె చరిత్రలో మాయని మచ్చగా మారాడు. ఏడేళ్లు కూడా నిండని చిన్నారి.. అన్నెం.. పున్నెం తెలియని వయసు అభం..శుభం తెలియని మనసు... తనకేం జరుగుతోందో.. వాడేం చేస్తున్నాడో.. ఆడుకునే వయసులో ఆటబొమ్మగా మారి‘పోయింది’. నట్టింట ‘లేడి’పిల్లలా నడయాడిన తమ ఇంటి జాబిల్లిని.. తన ఒడినే ఉయ్యాలగా చేర్చి.. తన వేలినే దిక్సూచిగా మార్చి.. అల్లారుముద్దుగా పెంచుకున్న అమ్మానాన్న.. హఠాత్తుగా ముసురుకున్న అమావాస్య చీకట్లను చూసి ‘తల్లి’డిల్లిపోయింది.. తండ్రి గుండె నీరయ్యింది. నీరుగట్టుపల్లి కన్నీరుమున్నీరయ్యింది. ‘పచ్చ’ ప్రతినిధులేహత్యాచారాలు సాగిస్తున్నా.. నోరు మెదపని నాయకులున్నంత కాలం.. ఖద్దరు బాబులకు ఖాకీలు గులాంగిరీ చేస్తున్నంత కాలం.. ఆడ‘పిల్లల’కు రక్షణెక్కడ. కామాంధులకుఅంతమెక్కడ..? అంటూ ధర్మాగ్రహంతో ప్రశ్నిస్తోంది ప్రజానీకం. వ్యవస్థపై నమ్మకం సన్నగిల్లినప్పుడు.. సమాజం మారుతుందన్న ఆశ ఆవిరైనప్పుడు.. జనావేశం కట్టలు తెగుతుంది.. సత్వర న్యాయం కావాలంటుంది.. ఈ చిన్నారి ఉదంతమే ..ఇందుకు సాక్ష్యం. మదనపల్లె: మదనపల్లె పట్టణానికి చెందిన ఏడేళ్ల చిన్నారి మరణానికి కారణమైన నిందితుడిని తక్షణ మే శిక్షను అమలు చేయాల్సిందేనని మదనపల్లె ప్రజ లు ముక్తకంఠంతో నినదించారు. కేసులు, విచారణ పేరుతో కాలాతీతం అవుతుంది, మరణించిన బాలికకు సత్వర న్యాయం జరగాలంటే తక్షణమే శిక్షిస్తూ తీర్పు ఇవ్వాల్సిందేనని పట్టుబట్టారు. మంగళవారం ఉదయం ఏడేళ్ల బాలిక హత్యాచార వార్తతో మదనపల్లె పట్టణం ఒక్కసారిగా అట్టుడికింది. ప్రజల్లో ఆగ్రహం వెల్లువెత్తింది. దీంతో బాలికను హతమార్చిన కులవర్ధన్ (27) ఇంటి వద్దకు చేరుకుని ముట్టడించారు. మృతదేహం తరలింపునకు నిరాకరణ బాలిక మృతదేహాన్ని నిందితుడి ఇంటినుంచి తీసుకెళ్లేందుకు పోలీసులు చేసిన విశ్వప్రయత్నాలు విఫలమయ్యాయి. ఐసీడీఎస్ పీడీ హేమావతి అతని ఇంటి వద్దకు చేరుకుని దర్యాప్తు ప్రక్రియకు అవరోధం సృష్టించవద్దని కఠినంగా శిక్షించేలా చర్యలు తీసుకుంటామని స్థానికులకు హామీ ఇచ్చారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, తహసీల్దారు కిషొర్ కుమార్ రెడ్డి, సీఐ మహ్మద్ రఫి ప్రజలతో మాట్లాడినా వారు శాంతించలేదు. నిందితుడు కులవర్దన్ను తమకు అప్పగిస్తేనే బాలిక మృతదేహం తరలింపుకు అంగీకరిస్తామని భీష్మించుకు కూర్చున్నారు. ఎండను లెక్కచేయకుండా బాధిత కుటుంబానికి అండగా నిలిచారు. పోలీసులు నచ్చజెప్పినా వినలేదు. ఈ పరిస్థితుల్లో ఉద్రికత్త పరిస్థితి కొనసాగింది. భోజనం, నీళ్లు లేకపోయినా సాయంత్రం వరకు కదలకుండా మానవత్వం చాటారు. బాలిక తల్లి ఎండకు తట్టుకోలేక, విలపిస్తూ పలుమార్లు సొమ్మసిల్లింది. డీఐజి కోయప్రవీణ్ వచ్చాక చర్చించిన తర్వాత పోలీసుల దర్యాప్తుకు ప్రజలు సహకరించారు. కట్టలు తెగిన ఆగ్రహం చిన్నారి మరణంతో ప్రజల్లో ఆగ్రహం కట్టలు దిగింది. నీరుగట్టువారి పల్లెలో రోడ్డుపై ప్రజలు బైఠాయించారు. సంఘీభావంగా వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, ఎస్ఈసీ నెంబర్ షమీంఅస్లాం, చైర్మన్ మనూజ తదితరులు పాల్గొన్నారు. బాలిక కు టుంబానికి న్యాయం జరగాలంటూ డిమాండ్ చేశారు. ఒకటా రెండా.. సుమారు ఆరు గంటలపాటు ముంబై–చైన్నె జాతీయ రహదారిపై అన్నమయ్య సర్కిల్ వద్ద బైఠాయించడంతో రాకపోకలు స్తంభించిపోయాయి. ప్రధానంగా అనంతపురం, పుట్టపర్తి, కడప జిల్లాల నుంచి, తంబళ్లపల్లె నియోజకవర్గం మదనపల్లెకొచ్చే వాహనాలన్నీ రోడ్డుపైనే ఆగిపోయాయి. తమిళనాడు, చిత్తూరు జిల్లా నుంచి మదనపల్లె, అనంతపురం వైపు వెళ్లే బస్సులు, రవాణా లారీలు రోడ్డుపైన నిలిచిపోయాయి. ఫలితంగా ట్రాఫిక్ ఇరువైపుల పూర్తిగా స్తంభించింది. డీఐజీ కోయప్రవీణ్ మదనపల్లెకు చేరుకోవడం, అదే సమయంలో బాలిక తల్లి సొమ్మసిల్లిపోవడంతో ఆమెను ఆసుపత్రికి తరలించారు. దాంతో ఆందోళనకారులు ఆమె వెంట వెళ్లారు. తర్వాత పోలీసులు ఆందోళన చేస్తున్న వారిని నచ్చజెప్పి పంపించేశారు. సాయంత్రం 6 గంటలకు రాకపోకల పునరుద్ధరణ జరిగింది. -
పై అంతస్తులో నిద్రిస్తుండగా.. కింది ఇంటిలో చోరీ..
జమ్మలమడుగు రూరల్, మైలవరం : పై అంతస్తులో నిద్రిస్తుండగా.. కింది ఇంటిలో చోరీ జరిగింది. ఈ సంఘటన మైలవరం మండలంలోని చిన్నకొమెర్ల గ్రామంలో సోమవారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. జమ్మలమడుగు రూరల్ సీఐ భాస్కర్రెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నకొమెర్ల గ్రామానికి చెందిన జయరామకృష్ణారెడ్డి (దాల్మియా కర్మాగారంలో హెచ్ఆర్ విభాగంలో ఉద్యోగి) సోమవారం రాత్రి భార్య పిల్లలతో కలసి మిద్దె 2వ పోర్షన్లో నిద్రించాడు. తెల్లవారుజామున లేచి కిందికి వచ్చి చూడగా ఇంటి ద్వారం ప్రధాన తలుపులు తెరచి ఉన్నాయి. దీంతో ఇంటిలోకి వెళ్లి చూడగా బీరువా తాళాలు తెరచి ఉన్నాయి. అందులో ఉన్న దుస్తులు చిందర వందరగా పడి ఉన్నాయి. దీంతో బీరువాలో దాచి ఉంచిన బంగారు, వెండి, నగదు చూడగా కనపడలేదు. వెంటనే బాధితుడు తలమంచిపట్నం పోలీసులకు సమాచారం అందించాడు. 40 తులాల బంగారు, కేజీ వెండి, నగదు అపహరణ తన ఇంటిలో 40 తులాల బంగారు, ఒక కేజీ వెండి, రూ. 6 లక్షల నగదు చోరీకి గురైందని జయరామకృష్ణారెడ్డి తలమంచిపట్నం పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశాడు. దీంతో డీఎస్పీ వెంకటేశ్వరరావు, రూరల్ సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐ లక్ష్మీనారాయణ బాధితుడి ఇంటికి వెళ్లి పరిశీలించారు. జిల్లా కేంద్రం నుంచి క్లూస్ టీం అధికారులు వచ్చి డాగ్ స్క్వాడ్తో కలిసి పరిశీలించారు. కడప అర్బన్ : కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి(రిమ్స్)లో ఈ నెల 16 నుంచి పారిశుద్ధ్య కార్మికులు 17వ తేదీ మధ్యాహ్నం వరకు ఆందోళన ఉధృతంగా చేపట్టారు. ఐపీ, ఓపీ విభాగాల్లో చెత్తాచెదారం తొలగించకుండా విధులను బహిష్కరించారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్ మాట్లాడుతూ మాట్లాడుతూ పారిశుద్ధ్య కార్మికులకు మూడు నెలల నుంచి వేతనాలు ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. 15– 20 ఏళ్ల మధ్యకాలం నుంచి పని చేస్తున్న శానిటేషన్ కార్మికులందరినీ వయోపరిమితి, విద్యార్హత పేరుతో తొలగించడం అన్యాయమన్నారు. కాంట్రాక్టర్ జీజీహెచ్తో శానిటేషన్ కాంట్రాక్ట్ చేజిక్కించుకున్న కొన్ని రోజులకే విద్యార్హత, ఇతరనిబంధనల పేరుతో 15 మంది సూపర్వైజర్లను తొలగించారని పేర్కొన్నారు. 58 ఏళ్లు దాటాయని 40 మందిని, 50 ఏళ్లు దాటి, కనీస విద్యార్హత 8–10 లేదని 70 మందిని తొలగించడం భావ్యం కాదన్నారు. ‘పద్మావతి హాస్పిటాలిటీ ఫెసిలిటీస్ మేనేజ్మెంట్ సర్వీస్’ పేరుతో కాంట్రాక్ట్ పనులను చేపడుతున్న భాస్కర్ నాయుడు అనే కాంట్రాక్టర్తోపాటు, పని చేస్తున్న సూపర్వైజర్ల వేధింపులు తట్టుకోలేకపోతున్నామని కార్మికులు వాపోయారు. ఇదిలా ఉండగా.. మధ్యాహ్నం వరకు ఐపీ, ఓపీ విభాగాలలో ఆందోళన కార్యక్రమాలు జరిగాయి. ఓపీ విభాగంలో సీఐటీయూ నాయకులు, శానిటేషన్ సూపర్వైజర్లు.. అధికారులతో చర్చలు జరిపారు. నెలరోజుల పాటు గడువును ఇచ్చి కోర్టు ద్వారా గానీ, ఇతరత్రా ప్రయత్నాలతో తమకు అనుగుణంగా ఉత్తర్వులను తీసుకుని రావాలని, పరస్పర ఒప్పందం చేసుకున్నాక ఆందోళన విరమించారు. -
పేదల గృహ నిర్మాణంపై నిర్లక్ష్యం
పేదల గృహ నిర్మాణంపై బడ్జెట్లో తీవ్ర నిర్లక్ష్యం చూపారు. ఎన్నికల వేళ ప్రతి పేదవాడికి 2 సెంట్ల ఇంటి స్థలం ఇస్తామని హామీ ఇచ్చారు. రెండేళ్లు కావొస్తున్నా ఒక కుటుంబానికి కూడా ఇంటి పట్టా ఇవ్వలేదు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో చేపట్టిన ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం పూర్తి చేయలేదు. బడ్జెట్లో ఇంటి స్థలాల మంజూరుపై ప్రస్తావనే చేయలేదు. వైఎస్ జగన్ ప్రభుత్వంలో పూర్తయిన 3 లక్షల ఇళ్లను కూటమి ప్రభుత్వం తన ఖాతాలో వేసుకోవడం దారుణం. – వై.శ్రీరంజన్రెడ్డి, రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి, వైఎస్సార్సీపీ -
బడ్జెట్లో సంక్షోభం మాత్రమే కనిపిస్తోంది
ప్రొద్దుటూరు : కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో విడత బడ్జెట్లో సంక్షేమ పథకాలు లేవని, సంక్షోభం మాత్రమే కనిపిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన సోమవారం తన క్యాంప్ కార్యలయంలో మీడియాతో మాట్లాడుతూ అభివృద్ధిని అటకెక్కించారని తెలిపారు. గతేడాది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 72 లక్షల పింఛన్లలో 5 లక్షల పింఛన్లను రద్దు చేశారని, ఈ బడ్జెట్లో మరో 8 లక్షలను రద్దు చేయడానికి రంగం సిద్ధం చేశారన్నారు. అలాగే అమ్మఒడి పథకానికి సంబంధించి 82 లక్షల మందికి గాను 50 లక్షల మందికే ఇచ్చేలా నిధులు కేటాయించారన్నారు. మూడు ఉచిత సిలిండర్లకు సంబంధించి అవసరమైన డబ్బు బడ్జెట్లో ప్రవేశపెట్టలేదని తెలిపారు. రైతు భరోసా పథకానికి రాష్ట్ర ప్రభుత్వం రూ.20వేలు, కేంద్ర ప్రభుత్వం రూ.6వేలు ఇవ్వాల్సి ఉండగా మొదటి ఏడాది రాష్ట్ర ప్రభుత్వం అసలు నిధులే కేటాయించలేదన్నారు. ఇవి కోతలని తెలిపారు. నిరుద్యోగులందరికి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా శిక్షణ ఇప్పించి ఉద్యోగాలు కల్పిస్తామని, లేని పక్షంలో నిరుద్యోగ భృతి రూ.3వేలు చెల్లిస్తామని ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నించారు. బడ్జెట్లో ఈ పథకానికి నిధులు కేటాయించలేదన్నారు. 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీలకు పింఛన్లు ఇస్తామని ప్రగల్భాలు పలికిన నాయకులు రెండేళ్లవుతున్నా ఎందుకు అమలు చేయలేకపోతున్నారన్నారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ మంజూరు చేయాలని, రైతులు పండించిన పంటలకు మద్దతు ధర ఇచ్చి ప్రభుత్వం ఆదుకోవాలని కోరారు. పోలవరం ప్రాజెక్టు నిర్మాణం, అమరావతి రాజధాని నిర్మాణం తమకు రెండు కళ్లని కూటమి నేతలు చెబుతున్న మాటల్లో వాస్తవం లేదని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఈ రెండు పథకాలు వారికి జేబులుగా మారాయని విమర్శించారు. ప్రజలకు చేసిన మోసానికి వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం 175కు 175 సీట్లలో ఓటమి చవిచూడాల్సి వస్తుందన్నారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
రైతులకు మేలు చేసే బడ్జెట్కాదు
రాష్ట్ర ప్రభుత్వం శనివారం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్ రైతులకు ఏ మాత్రం మేలు చేసే విధంగా లేదు. రైతు కన్నీరు దేశానికి మంచిది కాదంటూనే...వాస్తవ రూపంలో వారి కంట కన్నీరు పెట్టిస్తున్నారు. వ్యవసాయ బడ్జెట్ రూ.53752కోట్లలో విద్యుత్ సబ్సిడీ రూ.13752 కోట్లు, సాగునీటి ప్రాజెక్టుల నిర్వహణకు పోలవరంతో కలిసి రూ.14277కోట్లు మాత్రమే కేటాయించారు. విత్తన సబ్సిడీకి రూ.240కోట్లు, యాంత్రీకరణకు రూ.139.65కోట్లు కేటాయించడం అన్యాయం. గత ప్రభుత్వంలో ఐదేళ్ల సరాసరి కంటే ఇది చాలా తక్కువన్నారు. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రగా మారుస్తున్న చంద్రబాబు
పులివెందుల : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు రాష్ట్రాన్ని అప్పుల ఆంధ్రప్రదేశ్గా మారుస్తున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఇప్పటికే రాష్ట్రాన్ని కూటమి ప్రభుత్వం ఆధ్వర్యంలో అనేక రకాలుగా ఆధోగతిపాలు చేసిన విషయం తెలిసిందేనన్నారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన 20నెలల కాలంలోనే రాష్ట్రంపై రూ.3లక్షల కోట్లకు పైగా అప్పుల భారాన్ని మోపారని తెలిపారు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా రాష్ట్ర ప్రజలకు ఒరిగిందేమిలేదన్నారు. ఎన్నికలపుడు ఇచ్చిన ఏ ఒక్క హమీని ఈ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. కమీషన్ల రూపంలో రూ. కోట్లు దండుకోవడమే టీడీపీ నాయకులు పనిగా పెట్టుకున్నారన్నారు. గత వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ ప్రభుత్వంలో వచ్చిన పారిశ్రామిక పెట్టుబడులను ప్రస్తుతం తమ హయాంలో వచ్చినట్లుగా కవరింగ్ చేస్తూ గొప్పలు చెప్పుకుంటున్నారని అన్నారు. తమ అనువయూలకు వేలకోట్ల ప్రభుత్వ భూములను ఎకరం 99పైసలకు కట్టబెడుతున్న నీచ చరిత్ర చంద్రబాబునాయుడుదే అని అన్నారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ కక్షసాధింపు చర్యలకు పాల్పడటంలో రాష్ట్రాన్ని చంద్రబాబు అగ్రగామిగా నిలుపుతున్నాడన్నారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్ర బడ్జెట్ అంకెలగారడీ : చంద్రబాబు ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ అంకెలగారదీగా ఉందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు.సంక్షేమ పథకాలకు సంబంధించి బడ్జెట్లో కేటాయింపులే లేవన్నారు. 18ఏళ్లు నిండిన ఆడవారికి నెలకు రూ.15వందలు చొప్పున ఏడాదికి రూ.18వేలు ఇస్తామన్నాని చెప్పి బడ్జెట్లో ఆపథకానికి ఒక్క రూపాయి కేటాయించలేదన్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పి దానికి కూడా ఒక్కరూపాయి కేటాయించలేదన్నారు. నిరుద్యోగభృతికి కూడా మంగళంపాడారన్నారు. ఎన్నికలప్పుడు ఇచ్చిన హామీలు అమలు చేసే విధంగా ఈబడ్జెట్ లేదని తెలిపారు.ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
ఒక్క మాత్రతో ‘నులి’మేద్దాం
కడప సెవెన్రోడ్స్ : నులిపురుగులను నులిమేస్తేనే.. సమాజానికి ఆరోగ్యకరమైన భావిభారత పౌరులను అందివ్వగలమని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం రాత్రి కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాల్లో ఈనెల 17న నిర్వహించే జాతీయ నులి పురుగుల నిర్మూలన కార్యక్రమంపై జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఎంహెచ్ఓ నాగరాజులతో కలిసి జిల్లా వైద్య ఆరోగ్యశాఖ, అనుబంధ శాఖల అధికారులతో జిల్లా సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ఈ నెల 17వ తేదీన జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం చేపడుతున్నామని వివరించారు. అందులో భాగంగా.. నులిపురుగులను నివారించేందుకు ఆల్బెండజోల్ మాత్రలను అన్ని పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో విద్యార్థులకు పంపిణీ చేయనున్నామని పేర్కొన్నారు. అనంతరం నులిపురుగుల నిర్మూలన కార్యక్రమంపై.. రాష్ట్ర వైద్య ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ వారు ప్రచురించిన వాల్పోస్టర్లను సంబందిత జిల్లా అధికారులతో కలిసి కలెక్టర్ ఆవిష్కరించారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
నెల్లూరు, కర్నూలు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–12 సౌత్జోన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. సోమవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం–నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 35 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 224 పరుగులు చేసింది. జట్టులోని ఓ. మోనిష్ 59, భరద్వాజ్ 52, జాన్సన్ 47 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని అఖిల్ గౌడ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 20.4 ఓవర్లకు 98 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని గోవర్ధన్ 30, హాన్సిక్రెడ్డి 13 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని ఆశ్విన్ రాణా 4 వికెట్లు, గురు 3 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 126 పరుగులతో విజయం సాధించింది. కెఎఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కర్నూలు–చిత్తూరు జట్లు తలపడ్డాయి, టాస్గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 35 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 220 పరుగులు చేసింది. జట్టులోని గౌతమ్రెడ్డి 68, రుత్విక్రెడ్డి 51 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని పునిత్ సాయి రెడ్డి 2 వికెట్లు, చరిత్ 2 వికెట్లు తీశారు, అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 35 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆజట్టులోని ధనుష్ 83 బంతుల్లో 19 ఫోర్లతో 100 (సెంచరీ) చేశాడు. కె.ఇ గోకుల్ సాయి 49 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని సూర్య 3 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 2 పరుగులతో విజయం సాధించింది. మంగళవారం వైఎస్ఆర్ఆర్ కిక్రెట్ స్డేడియంలో కడప–చిత్తూరు. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో అనంతపురం–కర్నూలు జట్లు తలపడనున్నాయి. లంకమల అభయారణ్యంలో వ్యక్తి మృతిసిద్దవటం : మండలంలోని పొన్నవోలు గ్రామ పంచాయతీ వెంకటాయపల్లి గ్రామానికి చెందిన ఈరిశెట్టి వెంకటసుబ్బయ్య (53) అనే వ్యక్తి మృతిచెందాడు. ఈయన ఆదివారం మహాశివరాత్రికి బద్వేల్ సమీపంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ లంక మల్లేశ్వర స్వామి దర్శనానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వచ్చేందుకు బస్సులో కూర్చొని సీటులోనే కుప్పకూలి మృతిచెందాడు. మృతదేహాన్ని బస్సులో బద్వేలుకు తరలించారు. కుటుంబీకులు సోమవారం మృతదేహాన్ని వెంకటాయపల్లి గ్రామానికి తీసుకొచ్చి అంత్యక్రియలు నిర్వహించారు. పొలతల క్షేత్రంలో గుర్తుతెలియని వ్యక్తి... పెండ్లిమర్రి : పొలతల శైవ క్షేత్రంలో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. ఇతనికి దాదాపు 60 సంవత్సరాల వయసు ఉంటుందని పోలీసులు తెలిపారు. మృతదేహం వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదు, ఒంటిపై తెల్లని మాసిపొయిన చొక్కా, గళ్ళ లుంగి ధరించి ఉన్నాడన్నారు. ఎవరైనా మృతదేహాన్ని గుర్తిస్తే పెండ్లిమర్రి పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ తులసి నాగప్రసాద్ తెలియజేశారు. 9121100527 నంబర్కు కాల్ చేయాలని తెలిపారు. -
దంతవైద్య కళాశాల పరిపాలనాధికారిగా నాగరాజు
కడప అర్బన్ : కడప ప్రభుత్వ దంతవైద్య కళాశా ల, హాస్పిటల్ పరిపాలనాధికారిగా కె.బి నాగరా జు సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఏపీ పబ్లిక్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ డైరెక్టర్ డాక్టర్ ప ద్మావతి శుక్రవారం ఉత్తర్వులు జారీ చేశారు. ఐదేళ్లుగా ఆఫీస్ సూపరింటెండెంట్గా పనిచేస్తున్న నాగరాజుకు పదోన్నతి కల్పించడంతో పాటు ఇక్కడే పరిపాలనాధికారిగా నియమించడంతో సహచర ఉద్యోగులు శుభాకాంక్షలు తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు సిద్దవటం : మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భా గంగా శ్రీ నిత్యపూజ స్వామి హుండీలో భక్తులు వేసిన కానుకలు లెక్కింపు చేపట్టగా రూ.14,96, 073 ఆదాయం వచ్చిందని ఎండోమెంట్ ఇన్చార్జ్ ఈఓ శ్రీధర్ తెలిపారు. సిద్దవటం మండలంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీనిత్యపూజస్వామి మహాశివరాత్రి బ్రహ్మోత్సవాలలో భాగంగా శుక్ర, శని, ఆదివారాల్లో మూడు రోజుల పాటు భక్తులు వేసిన కానుకలు లెక్కించామని పేర్కొన్నారు. ఆలయ ఛైర్మన్ రాజేంద్రప్రసాద్, పీఎఫ్ఓ కిరణ్కుమార్రెడ్డి, ఏఆర్ పోలీసులు, సిద్దవటం పోలీసులు పాల్గొన్నారు. ఉత్సవాల ఆదాయం రూ.7.60 లక్షలు చాపాడు : మండలంలోని అల్లాడుపల్లె వీరభధ్రస్వామికి మహాశివరాత్రి ఉత్సవాల ద్వారా 7.60 లక్షలుపైగా ఆదాయం లభించినట్లు ఆలయ చైర్మన్ వీరనారాయణ యాదవ్, ఈఓ శంకర్ బాలాజీ తెలిపారు. శివరాత్రి పండుగ సందర్భంగా ఏర్పాటు చేసిన 3 తాత్కాలిక హుండీల ద్వారా ఆదాయం రూ.2.90 లక్షలు రాగా, స్పెషల్ దర్శనం రూ.10 టికెట్ ద్వారా రూ.62,250, ప్రత్యేక దర్శనం రూ.100 టికెట్ ద్వారా రూ.87,700 ఆదాయం వచ్చిందని వారు వివరించారు. భక్తులు సమర్పించిన తలనీలాల ద్వారా రూ.20,160, ఖాళీ స్థలాలు (అంగళ్లు) ద్వారా రూ.44,410, సేవా టికెట్ల వల్ల రూ.2,60,182, లడ్డూ ప్రసాదం అమ్మకం ద్వారా రూ.1,52,000లు, అన్నదాన సత్రం వద్ద భక్తుల ద్వారా రూ.57,549లు ఆదాయం వచ్చిందన్నారు. లక్కిరెడ్డిపల్లె గంగమ్మ తల్లి దేవస్థాన ఈఓ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. ఫొటో: 16ఎంవైడి 02– హుండీలలో నగదు లెక్కింపు చేపడుతున్న సిబ్బంది -
ఆడబిడ్డ నిధి పేరుతో మహిళలకు టోకరా
ఆడబిడ్డ నిధి పథకానికి ఈ బడ్జెట్లో ఎలాంటి నిధులు కేటాయించలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. 18–50 ఏళ్లలోపు మహిళలకు ఏడాదికి రూ.32వేల కోట్లు ఇవ్వాల్సి ఉంటే ఎగ్గొట్టారు. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. మూడు సిలిండర్లు ఎప్పుడిస్తారో చెప్పలేదు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. – ఎంవీ సుజిత, స్వయం సహాయ సంఘ సభ్యురాలు. రాష్ట్రంలో 87,41,885 మంది పిల్లలు బడుల్లో చదువుతుంటే, రూ.15వేల వంతున ఏటా రూ.13,112 కోట్లు ఇవ్వాల్సి ఉండగా తొలి ఏడాది పూర్తిగా ఎగ్గొట్టారు. 2025–26లో పిల్లల సంఖ్యను దాదాపు 21లక్షలు తగ్గించి, కేవలం 66 లక్షలమందికి రూ.8,389 కోట్లు ఇచ్చామన్నట్టుగా చూపిస్తున్నారు. ఇప్పటికీ క్షేత్రస్థాయిలో చాలామందికి అందలేదు. అందులోనూ చాలామందికి రూ. 8వేలు, 9వేలు, రూ.10వేలు మాత్రమే పడ్డాయి. మూడేళ్లలో ఇవ్వాల్సింది రూ.39,336 కోట్లు ఇవ్వాల్సి ఉంటే తక్కువ చూపిస్తున్నారు. తల్లికి వందనం పథకం అమలు కూడా ఒక మోసమే. – పి. జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి. -
బీసీలను బురిడీ కొట్టించారు
కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2026–27 బడ్జెట్లో బీసీలకు బురిడీ కొట్టించారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు ఒక్కటి కూడా నెరవేర్చలేదు.యాభై ఏళ్లకే పింఛన్ ఇస్తామని, బడ్జెట్లో ఆ ప్రస్తావనే తీసుకురాలేదు. బీసీలకు రాయితీ రుణాలు, ఆదరణలాంటి పథకాలకు నిధులు కేటాయించలేదు. ఈ బడ్జెట్ వల్ల బీసీలకు ఒరిగిందేమీ లేదు. చంద్రబాబు చెప్పిన హామీలకు ప్రజలు నమ్మి ఓట్లు వేసి మోస పోయారు. జీవితంలో ఇంక ఎప్పుడు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాదు. – ఎన్.శివరామ్, బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు -
తెగుతున్న వింగ్.. పదునెక్కుతున్న వన్
రైల్వన్ యాప్ రైల్వేస్టేషన్లో బుకింగ్ కార్యాలయం రైలు రాజంపేట: ఇక రానున్న రోజుల్లో రైల్వన్యాప్తో రైలెక్కాల్సిన పరిస్థితులు ఆవిష్కృతమవుతున్నాయి. ఆ విధంగా రైల్వేశాఖ రైల్వన్యాప్కు పదనుపెడుతోంది.దీనిపై ప్రయాణికులకు అవగాహన కల్పిస్తోంది. ఫలితంగా కమర్షియల్ వింగ్ను బలహీనపరిచే దిశగా రైల్వేశాఖ పయనిస్తోంది. స్టేషన్మాస్టర్లతో టికెట్ల కొట్టించాలని, అనవసరం వ్యయం తగ్గించేందుకు రైల్వన్యాప్ను అస్త్రంగా రైల్వేశాఖ ప్రయోగిస్తోందని రైల్వే కార్మికవర్గాలు అభిప్రాయపడున్నాయి. ఇప్పటికే అన్ని స్టేషన్లలో రైల్వన్యాప్ ప్రచారహోర్డింగ్లను ఏర్పాటుచేశారు. బ్రిటీషు కాలం నుంచి కొనసాగుతూ వస్తున్న రైల్వే కమర్షియల్ విభాగం కనుమరుగు కానుంది. ప్రతి రైల్వేస్టేషన్లో రైల్వే బుకింగ్, పార్శిల్ బుకింగ్ కార్యాలయాలు ఉండేవి. వాటిని రాను..రాను తీసేస్తూ వస్తున్నారు. కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖ తీసుకొచ్చిన రైల్వేవన్యాప్ సర్వం అన్నట్లుగా స్టేషన్లోని బుకింగ్లను ఎత్తివేసేందుకు ప్రణాళికలను రూపొందిస్తున్నారు. ఫలితంగా కమర్షియల్ సిబ్బంది మనుగడకు ముప్పు వాటిల్లే పరిస్థితులు ఉన్నాయని కార్మికసంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. అవగాహన జిల్లా రైలుమార్గంలో పలు రైల్వేస్టేషన్లకు టికెట్ కోసం, రిజర్వేషన్ చేసుకోవడానికి వస్తున్న ప్రయాణికులకు కమర్షియల్ సిబ్బంది అవగాహన కల్పిస్తున్నారు.టికెట్ ఏ విధంగా బుక్ చేసుకోవాలి, రిజర్వేషన్ ఎలా చేసుకోవాలి, రైళ్ల రాకపోకలు ఏ విధంగా తెలుసుకోవాలో రైల్వన్యాప్లో తెలియచేస్తున్నారు. బుకింగ్ కౌంటర్ టికెట్ జారీ చేయకుండా ప్రయాణికుల మొౖబైల్ నుంచి టికెట్లను జారీ చేయించడం, రిజర్వేషన్ చేయిస్తున్నారు. ఈ విధంగా చేయాలని ఇప్పటికే రైల్వే ఉన్నతాధికారుల నుంచి ఆదేశాలు వెలువడ్డాయి. ● స్టేషన్లలో బుకింగ్ కార్యాలయాల్లో పనిచేస్తున్న సిబ్బందికి మంగళం పాడనున్నారు. స్టేషన్లలో బుకింగ్ కార్యాలయాలను ఎత్తివేస్తే ఆ డిపార్టుమెంట్ అంటిపెట్టుకొని పనిచేస్తున్న కమర్షియల్ సిబ్బందిని వేరే విధంగా వినియోగించుకోనున్నారు. చాలమందిని టీసీలుగా రైలు ఎక్కించనున్నారు. మరికొందరిని ఇతర డిపార్టుమెంట్లోకి పంపించనున్నారు. ఇదంతా చాపకిందనీరుగా సాగుతోందని రైల్వేవర్గాలు సమాచారం. స్టేషన్మాస్టర్లే టికెట్ జారీ చేసుకోవాలట... స్టేషన్మాస్టర్లే టికెట్ జారీ చేసుకోవాలని ఉన్నతస్థాయి నుంచి సంకేతాలను పంపిస్తున్నారు. ఓ వైపు ప్రయాణీకులు టికెట్లు ఇవ్వాలి.. మరోవైపు రైళ్ల రాకపోకల గురించి సిగ్నల్ ఇవ్వాలి.. కంట్రోలర్తో సంభాషించాలి.. ఇలాంటి అనేక సమస్యలు ఆపరేటింగ్ వ్యవస్థలో తలెత్తనున్నాయి. ఫలితంగా స్టేషన్మాస్టర్లు ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందని రైల్వే నిపుణులు చెపుతున్నారు. ఒక్కోసారి రైళ్ల ప్రమాదానికి స్టేషన్మాస్టర్లు కారణమయ్యే పరిస్థితులు నెలకొంటాయని కార్మిక సంఘాలు వాపోతున్నాయి. బ్రిటీషు కాలం నుంచి బుకింగ్ వ్యవస్థను ప్రత్యేకంగా ఏర్పాటు చేయడానికి కూడా అదే కారణమని రైల్వేశాఖలోని సీనియర్లు చెబుతున్నారు. ప్రయాణికులకు టికెట్ ఇచ్చి, మళ్లీ రైళ్ల నిర్వహణ అంటే కష్టమని, ఈవిధానాన్ని తాము వ్యతిరేకిస్తున్నామని స్టేషన్మాస్టర్లు తమ అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నారు. కడప, నందలూరు, ఎర్రగుంట్లలో బుకింగ్ కార్యాలయాలు కొనసాగించే దిశగా రైల్వే యోచన చేస్తోంది. మిగిలిన రైల్వేస్టేషన్లలో రైల్వన్యాప్, ప్రైవేట్ ఆపరేటర్ వ్యవస్థను ఏర్పాటు చేసే దిశగా రైల్వేశాఖ అడుగులు వేస్తున్నట్లు కార్మికవర్గాలు చర్చించుకుంటున్నారు. నందలూరు స్టేషన్లో స్టేషన్మాస్టర్ టికెట్ ఇచ్చుకోవాలంటే కష్టమని రైల్వే నిపుణులు చెపుతున్నారు. నిరంతరం గూడ్స్ రైళ్ల రద్దీతోనే స్టేషన్మాస్టర్కు సరిపోతుంది. రోజుకు 30కిపైగా గూడ్స్ రైళ్లు, రెగ్యులర్, స్పెషల్ ట్రైన్స్ నడుస్తుంటాయి. ఇటాంటి పరిస్థితిలో రైల్వన్యాప్ వ్యవస్థ కోసం బుకింగ్ కార్యాలయాన్ని ఎత్తివేయడం వల్ల అనేక సమస్యలు ఉత్పన్నమవుతాయి. రైల్వే భధ్రత అంశం కూడా ఇందులో ఇమిడివుంది. వందలాది మంది రైల్వే కార్మికులు, ఉద్యోగులు, రన్నింగ్స్టాప్ నందలూరు రైల్వేకేంద్రంగా రాకపోకలు సాగిస్తున్నారు. ఈ పరిస్థితుల్లో బుకింగ్ వ్యవస్థను కొనసాగించాలని రైల్వేకార్మికవర్గాలు కోరుతున్నాయి. -
కళ్లకు కట్టినట్లు అబద్ధాలు, మోసాలు
● సంపద సృష్టిస్తానని, అప్పులు సృష్టిస్తున్న బాబు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఎద్దేవాకడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం చేస్తున్న మోసాలు, చెబుతున్న అబద్ధాలు 2026–27 బడ్జెట్లో కళ్లకు కట్టినట్లు కనిపిస్తున్నాయని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి ఊసే లేదని, 50 ఏళ్లకే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పింఛన్లు ఇస్తామని దానికి ఒక్క పైసా కూడా కేటాయించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సంక్షేమానికి, అభివృద్ధికి పెద్దపీట వేసి డీబీటీ ద్వారా ప్రజల ఖాతాలకు నగదు జమ చేస్తుంటే...వైఎస్ జగన్ ఆర్థిక విధ్వంసం చేస్తున్నారని విమర్శలు చేశారన్నారు. సూపర్ సిక్స్ పథకాలకు అరకొర కేటాయింపులే చేశారని, మిగిలిన 136 హామీలను గాలికొదిలేశారన్నారు. వైఎస్ఆర్సీపీ ప్రభుత్వంలో సీ పోర్టులు, నాడు–నేడు ద్వారా స్కూళ్లు, ఆసుపత్రులు అభివృద్ధి చేసినా, రైతు భరోసాకేంద్రాలు, సచివాలయాలు, వెల్నెస్ సెంటర్లు నెలకొల్పినా రూ.3.18లక్షల కోట్లే అప్పులు అయ్యాయన్నారు. ఈ ప్రభుత్వం ఏ పథకాలు అమలు చేయకపోయినా రెండేళ్లు కాకముందే రూ.3.27లక్షల కోట్లు అప్పులు చేశారన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన పెద్దమనిషి, అప్పులు సృష్టిస్తున్నారని ఎద్దేవా చేశారు. లంచాలకు కమిషన్ల కోసమే ప్రభుత్వం పనిచేస్తున్నట్లు ఉందన్నారు. విద్యారంగంలో సమూలమైన మార్పులు తెచ్చిన ఘనత జగన్కే దక్కిందన్నారు. ధనవంతులు మాత్రమే ఉన్నత చదువులు చదువుకోవాలనే భావన చంద్రబాబుదన్నారు. అందుకే సీబీఎస్ఈ, టోఫెల్, ఐబీ సిలబస్లను రద్దు చేస్తున్నట్లు ప్రకటించారన్నారు. దుర్భిక్షప్రాంతమైన రాయలసీమకు రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఎంతో అవసరమని, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో కుమ్మకై ్క ఆ ప్రాజెక్టును నిలిపేశారన్నారు. బడ్జెట్లో ఆరోగ్యశ్రీ ఊసే లేదని, చంద్రబాబు చేస్తున్న అప్పులకు భవిష్యత్లో వడ్డీ కూడా కట్టలేని పరిస్థితి ఏర్పడుతుందని హెచ్చరించారు. ప్రజలను మోసం చేయకూడదనే వైఎస్ జగన్ ఎన్నికల్లో అబద్దాలు చెప్పలేదన్నారు. సమావేశంలో మేయర్ పాకా సురేష్ కుమార్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు బాలస్వామిరెడ్డి, షఫీ, వైఎస్సార్సీపీ నాయకులు సుబ్బరాయుడు, ఎన్. శివరామ్, ఎస్. వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్, కె. శివయాదవ్, షఫీవుల్లా, రాయల్బాబు, ఫయాజ్, నిరంజన్రెడ్డి పాల్గొన్నారు. -
టీడీపీ కూటమి ప్రభుత్వం ‘సంస్కారం’ మరిచింది. అంతిమ సంస్కారానికి పెన్షనర్ల కుటుంబీకులకు ఇవ్వాల్సిన డబ్బు జమ చేయడం లేదు. ఒకప్పుడు ప్రభుత్వ పెన్షనర్ మరణిస్తే అదే రోజు వారి కుటుంబీకులకు ప్రభుత్వ చట్టబద్ధంగా ఇవ్వాల్సిన ఫ్యునరల్ చార్జీలు (దహన–ఖననక్రియలు/మట్టిఖ
రాజంపేట : ప్రభుత్వ పెన్షనర్లు మృతి చెందితే వారి అంత్యక్రియలకు రాష్ట్ర ప్రభుత్వం ఇవ్వాల్సిన నగదు సాయం ఇప్పట్లో ఇచ్చే పరిస్థితి కనిపించడం లేదు. జిల్లాలో వందలాది మంది ఈ డబ్బుకోసం ఎదురుచూస్తున్నారు. వారి కళ్లు కాయలు కాస్తున్నా ప్రభుత్వానికి కనికరం కరువైంది. గతంలో ప్రభుత్వ పెన్షనర్ చనిపోతే అదే రోజు అంత్యక్రియలకు డబ్బు ఇచ్చే విధానం కొనసాగింది. ఇప్పుడు ఆ పరిస్ధితి లేదు. మృతునికి సంబంధించిన పత్రాలు ఇచ్చేందుకు నెలకు పైగా పడుతుంది. ఇక ప్రభుత్వం నుంచి వీరికి ధనసాయం అందేందుకు ఎన్నాళ్లు పడుతుందో అర్థం కావడం లేదు. పెన్షనర్ చనిపోతే ఆయా కుటుంబీకులు అంత్యక్రియలు వెంటనే నిర్వహిస్తున్నా... సంప్రదాయం ప్రకారం ప్రభుత్వం నుంచి రావాల్సిన కనీస సాయం అందడం లేదు. ఇప్పటివరకు అనేక మంది ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు నగదు కోసం వేచిఉన్నారు. జిల్లాలో రాజంపేట, కడప, ప్రొద్దుటూరు, బద్వేలు, మైదుకూరు, సిద్ధవటం, పులివెందుల, ముద్దనూరు తదితర ప్రాంతాలో ఖజనా కార్యాలయాలు ఉన్నాయి. వీటి పరిధిలో అనేక మందికి అంత్యక్రియల డబ్బు రాలేదు. నగదు జమలో జాప్యం... ప్రభుత్వ పెన్షనర్లు మృతి చెందిన క్రమంలో వారికి చట్టబద్ధంగా రావాల్సిన అంత్యక్రియల నగదు వారి సంబంధీకులకు అందజేయడంలో రాష్ట్ర ప్రభుత్వం జాప్యం చేస్తోంది. ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలను ప్రభుత్వం చిన్నచూపు చూస్తోందని వాపోతున్నారు. ప్రభుత్వ పెన్షనర్ మరణించిన నేపథ్యంలో అందుకు సంబంధించి డెత్, ఫ్యామిలీ మెంబరు తదితర వివరాలను స్ధానిక ట్రెజరీలో అందచేస్తుంటారు. ఈ ట్రెజరీ ద్వారా ప్రభుత్వ ట్రెజరీకి వివరాలు వెళుతుంటాయి. అంతా అన్లైన్లో జరిగిపోతుంటాయి. అయితే ఖాతాలో నగదు జమ చేయడం ప్రభుత్వం మరిచిపోయినట్లుందన్న విమర్శలు ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకుల్లో వినిపిస్తున్నాయి. బడ్జెట్ లేదని కుంటిసాకులుప్రభుత్వ పెన్షనర్లు మరణిస్తే వారికి ఇవ్వాల్సిన ఫ్యునరల్ చార్జీస్ ఇచ్చేందుకు ప్రభుత్వం వెనుకంజ వేస్తోందన్న విమర్శలు వెలువడుతున్నాయి. కూటమి ప్రభుత్వం లక్షల కోట్లు వ్యయం చేసి, అనవసర కార్యక్రమాలను చేస్తున్న క్రమంలో ప్రభుత్వ పెన్షనర్లు మరణిస్తే వారి కుటుంబీకులకు డబ్బు ఇవ్వలేని దుస్ధితిలో ఉందా అని పలువురు ప్రశ్నిస్తున్నారు. బడ్జెట్ సాకుతో జిల్లాలో అనేక మంది మరణించిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబాలకు ఫ్యునరల్ చార్జీలు చెల్లించడం లేదు. ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు కూటమి ప్రభుత్వం తీరుపై అసంతృప్తితో ఉన్నారు. ట్రెజరీల చుట్టూ మృతుల కుటుంబీకులుదివంగతులైన ప్రభుత్వ పెన్షనర్లకు రావాల్సిన ఫ్యునరల్ చార్జీల కోసం వారి కుటుంబీకులు ట్రెజరీల చుట్టూ ప్రదక్షణలు చేస్తున్నారు. ఫ్యునరల్ చార్జీలు చెల్లించేందుకు అవసరమైన పత్రాలు ఆన్లైన్లో రాష్ట్ర ఖజనాకు వె వెళ్లాయి. అయితే నెలల తరబడి ఈ చార్జీల కోసం ఎదురుచూడాల్సిన పరిస్ధితులు నెలకొన్నాయి. ట్రెజరీ అధికారులు తమ చేతిలో ఏమీ లేదని, డబ్బు రాష్ట్ర ఖజనా నుంచి రావాల్సిందేనని వాపోతున్నారు. ఫ్యునరల్ చార్జీల విషయంలో ఏమీ చేయలేమని స్థానిక ట్రెజరీ అధికారులు చేతులేత్తేస్తున్నారు. మృతుల కుటుంబీకుల ఖాతాలకు నేరుగా రాష్ట్ర ఖజానా నుంచి డబ్బు పడుతుందని చెబుతున్నారు. అయితే ఎప్పుడు వేస్తారో తెలియదంటున్నారు. దీంతో మృతిచెందిన ప్రభుత్వ పెన్షనర్ల కుటుంబీకులు మదనపడుతున్నారు. ఈ విషయంపై జిల్లా ట్రెజరీ అధికారి వివరణకు ప్రయత్నించినా ఫలితం లేకుండాపోయింది. అంత్యక్రియల నగదు జమలో ప్రభుత్వ జాప్యం దివంగత పెన్షనర్ల కుటుంబీకుల ఎదురుచూపు బడ్జెట్ లేదని కుంటి సాకులతో కాలయాపన చేతులెత్తేస్తున్న ఖజానా అధికారులు ట్రెజరీల చుట్టూ తిరుగుతున్న కుటుంబీకులు ప్రభుత్వం ‘మట్టి’కొట్టుకుపోతుందని శాపనార్థాలు -
చెన్నూరులో దొంగల ముఠా హల్చల్
వల్లూరు(చెన్నూరు): చెన్నూరులో ఆదివారం రాత్రి దొంగల ముఠా హల్ చల్ చేసింది. శివరాత్రి సందర్బంగా తాళాలు వేసి వివిధ తిరునాళ్లకు ఇంటిల్లిపాదీ వెళ్లిన గృహాలను ఎంచుకున్న దొంగలు ఇంటి తాళాలు పగుల గొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాలను పగులగొట్టి చోరీకి పాల్పడ్డారు. స్థానికులు, బాధితులు తెలిపిన సమాచారం మేరకు చెన్నూరులోని బెస్త కాలనీకి చెందిన పలు కుటుంబాలు శివరాత్రి పర్వదినాన్ని పురష్కరించుకుని దైవ దర్శనంతో బాటు జాగారం చేయడానికి ఆదివారం బైరవేశ్వర కోనకు వెళ్లారు. బుడ్డాయపల్లెకు చెందిన రాములమ్మ పొలతల పుణ్యక్షేత్రానికి వెళ్లింది. దొంగలు బెస్తకాలనీలోని టైలర్ శివ, క్యామన చలపతి, గుగ్గిర వెంకట రమణ గృహాలతో బాటు బుడ్డాయపల్లెలోని రాములమ్మ ఇంటి తాళాలను పగులగొట్టి లోనికి ప్రవేశించారు. బీరువాల తాళాలు పగుల గొట్టి అందులోని బట్టలను చిందరవందరగా వేసి చోరీకి పాల్పడ్డారు. ఇందులో దాదాపు 25 నుంచి 30 తులాల బంగారు నగలు, సుమారు 3 లక్షల రూపాయల వరకు నగదు చోరీకి గురైనట్లు సమాచారం. సమాచారం అందుకున్న పోలీసులు సీఐ కృష్ణారెడ్డి ఆధ్వర్యంలో సంఘటనా స్థలాలను పరిశీలించారు. క్లూస్ టీమ్ పరిశీలించింది. బాధితుల నుండి ఫిర్యాదులు తీసుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కృష్ణారెడ్డి తెలిపారు. సీసీ టీవీ పుటేజీల పరిశీలన దొంగతనం జరిగిన రెండు కాలనీలు కడప– కర్నూలు హైవేకు పక్కనే వున్నాయి. బెస్తకాలనీలో ఒకే వీధిలోని మూడు గృహాల్లో చోరీ జరిగింది. పోలీసులు విచారణలో భాగంగా అందుబాటులో వున్న సీసీ టీవీ పుటేజీలను పరిశీలించగా, కొంత సమాచారం లభించినట్లు తెలుస్తోంది. ఐదుగురితో కూడిన దొంగల ముఠా చోరీకి పాల్పడినట్లు తెలుస్తోంది. ఇందులో వారు ముఖాలకు ముసుగులతో బాటు చేతులకు గ్లౌసులను ధరించినట్లు తెలుస్తోంది.శివరాత్రి ఉత్సవాలకు వెళ్లిన వారికి చెందిన నాలుగు ఇళ్లలో చోరీ -
బాధితులకు న్యాయం చేయలి
జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్ : బాధితులకు సత్వర న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు.సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 100 ఫిర్యాదులు పీజీఆర్ఎస్కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ, ప్రజల నుండి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్న్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్పీ ఎన్. సుధాకర్, తదితరులు పాల్గొన్నారు. -
చేనేత కార్మికురాలు ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : చేనేత పనిలో నష్టాలు రావడంతో లక్ష్మీశాంతి (36) అనే చేనేత కార్మికురాలు యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని హనుమాన్నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు, లక్ష్మీశాంతి దంపతులు చేనేత పని చేసుకొని జీవనం సాగించారు. వారికి ఇద్దరు కుమారులు ఉన్నారు. వారికి సొంత ఇల్లు లేకపోవడంతో బాడుగ ఇంట్లో ఉంటున్నారు. భార్య భర్తలిద్దరూ చేనేత పని చేస్తేనే వారి సంసారం గడుస్తుంది. ఇటీవల లక్ష్మీశాంతి కరెంట్ మగ్గం నిర్వహణపై ట్రైనింగ్ తీసుకుంది. కరెంట్ మగ్గం కొనుగోలు చేసే ఆర్థిక స్థోమత లేకున్నా పని చేసుకోవడానికి సులభతరం అవుతుందనే ఉద్దేశంతో అప్పు చేసి ఇటీవల ఇంట్లో కరెంట్ మగ్గాన్ని ఏర్పాటు చేసుకున్నారు. కొన్ని రోజులుగా అప్పులిచ్చిన వారు బాకీ చెల్లించమని ఒత్తిడి చేయసాగారు. రుణదాతలకు చెప్పుకోలేక బాకీ చెల్లించే స్థోమత లేకపోవడంతో లక్ష్మీశాంతి ఆదివారం యాసిడ్ తాగి ఆత్మహత్యా ప్రయత్నం చేసింది. దీంతో ఆమెను కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా వైద్యులు కడపకు రెఫర్ చేశారు. రిమ్స్ వైద్యులు ఆమెను పరిశీలించి తిరుపతికి వెళ్లాల్సిందిగా సూచించారు. మీ క్రమంలో లక్ష్మీశాంతిని తిరుపతికి తీసుకెళ్లగా అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కాగా ఆమె వద్ద ఉన్న సూసైడ్ నోట్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాయలసీమకు తీరని అన్యాయం
బడ్జెట్లో రాయలసీమకు సీఎం చంద్రబాబు అన్యాయం చేశారు. రాయలసీమ ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టులకు ఎలాంటి బడ్జెట్ కేటాయించకుండా మోసం చేశారు. జూనియర్ న్యాయవాదులకు పదివేల రూపాయలు జీవన భృతి (స్టైఫండ్) ఇస్తామని ఎన్నికల సమయంలో హామి ఇచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఆ పథకం గురించి ఊసే ఎత్తలేదు. పథకాలు కేవలం మోసాలని తేలిపోయింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంత అభివృద్ధికి ఎలాంటి ప్రత్యేకమైన నిధులను కేటాయించకపోవడం దురదృష్టకరం. – జీవి రాఘవరెడ్డి, కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు -
జాతరకు వచ్చే మార్గాలు..
గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి భక్తులు చేరుకోవడానికి రోడ్డు మార్గం ద్వారా మూడు రహదారుల్లో భక్తులు రావొచ్చు. కడప నుంచి రామాపురం మీదుగా చేరుకోవచ్చు. రాయచోటి–కడప జాతీయ రహదారిలో ఉన్న చిట్లూరుకు పడమర వైపు నుంచి రావచ్చు. లక్కిరెడ్డిపల్లి–రాయచోటి మార్గంలోని మర్రిచెట్టు నుంచి తూర్పు వైపున ఉండే రోడ్డు నుంచి, లక్కిరెడ్డిపల్లిలోని ప్రభుత్వ కార్యాలయాల ప్రాంగణం ఎదురుగా ఉన్న రోడ్డు నుండి గద్దగుండ్లరాచపల్లి, ఈడిగపల్లి, కౌటపల్లి మార్గాలు ద్వారా గంగమ్మ జాతరకు భక్తులు చేరుకోవచ్చు. తిరునాల కార్యక్రమాలు.. ఈనెల 17వ తేదీ చాగలగుట్టపల్లిలో అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల అమ్మవారికి సిద్దులపూజ, సర్వదర్శనం, బోనాలు, చాందినీ బండ్లు, అమ్మవారి ఊరేగింపు,19న గురువారం మైల తిరునాల ఊరేగింపుతో, గంగ స్నానాలతో అభిషేకంతో తిరునాల ముగుస్తుంది. 18వ తేదీ రాత్రి చెక్కభజన, కోలాటం, ఆర్కెస్ట్రా, జబర్దస్త్ ప్రోగ్రామ్ వంటి కార్యక్రమాలు ఉంటాయని నిర్వాహకులు తెలిపారు. -
కనుల పండువగా వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం
స్వామి, అమ్మవారి కల్యాణం నిర్వహిస్తున్న వేదపండితులు, కల్యాణోత్సవంలో పాల్గొన్న భక్తజనం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణం కనుల పండువగా నిర్వహించారు. మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ఈ వేడుక జరిగింది. ఆదివారం ఉదయం ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. మధ్యాహ్నం స్వామి వారు దీక్షాబంధనాలంకారోత్సవంలో దర్శనమిచ్చారు. రాత్రి 9 గంటలకు గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి దంపతుల కల్యాణాన్ని మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి దంపతులు ఘనంగా నిర్వహించారు. తరువాత నరనంది ఉత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. జాగారణ, వివిధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. వివిధ ప్రాంతాల నుంచి భక్తులు తరలివచ్చారు. -
బైక్ల ఢీ : ఒకరిమృతి
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ఐసీఎల్ క్వారీ సమీపంలో రెండు స్కూటర్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో హేమంత్ కుమార్(25) మృతి చెందగా, సత్యనారాయణ తీవ్రంగా గాయపడ్డాడు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్ సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ డాక్టర్ ఎం సుధీర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని క్షతగాత్రున్ని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు.. మండల పరిధిలోని కదిరివారిపల్లె గ్రామానికి చెందిన పుల్లయ్య కుమారుడు హేమంత్ కుమార్ సమీపంలో ఓ ట్రాన్స్ఫోర్టులో పనిచేస్తున్నాడు. సాయంత్రం పని ముగించుకుని బైక్లో ఇంటికి బయలు దేరాడు. అలాగే సీకేదిన్నే మండలం పరిధిలోని ఉటూకురుకు చెందిన సత్యనారాయణ కూడా పని ముగించుకుని ముద్దనూరు వైపు నుంచి స్కూటర్లో ఇంటికి బయలుదేరారు. వీరిద్దరు ఐసీఎల్ క్వారీ సమీపంలోకి రాగానే రెండు బైక్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరు రోడ్డుపై కింద పడి పోయారు. హేమంత్కుమార్కు తల పగిలి రక్తస్రావం జరిగి అక్కడిక్కడే మృతి చెందాడు. సత్యనారాయణ తలకు బలమైన గాయమైంది. కొన ఊపిరితో ఉండటంతో 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. సత్యనారాయణ స్కూటర్లో బేల్దారి పనికి సంబంధించిన సామాన్లు ఉండటంతో బేల్దారి అయి ఉంటారని తెలుస్తోంది. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న స్కూటర్లను తొలిగించి ట్రాఫిక్ సమస్య లేకుండా చేశారు. ● కదిరివారిపల్లి గ్రామానికి చెందిన హేమంత్కుమార్కు పది రోజు కిందట ఆడ బిడ్డ పుట్టిందని, ఇంతలోనే మృతి చెందాడని అతని తల్లిదండ్రులు బోరున విలపించారు. మృతుడి తండ్రి పుల్లయ్యకు కూడా ఇటీవల కాళ్లు విరిగి ఇబ్బందులు పడ్డారు. ఇంటికి పెద్ద దిక్కుగా ఉన్న కుమారుడు హేమంత్ కుమార్ చనిపోవడంతో తల్లిదండ్రులు కన్నీమున్నిరుగా విలపించారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని నాగులకట్టవీధిలో మూడు రోజుల క్రితం జరిగిన సుబ్రమణ్యం హత్య కేసులో నిందితున్ని త్రీ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. కుటుంబ సభ్యులను ధూషించినందుకే సుబ్రమణ్యంను వినయ్ హత్య చేసినట్లు పోలీసులు తెలిపారు. అరెస్ట్ వివరాలను త్రీ టౌన్ పోలిస్స్టేషన్లో ఆదివారం సాయంత్రం సీఐ టీవీ కొండారెడ్డి మీడియాకు వెల్లడించారు. రాయచోటిలోని ఎన్జీఓ కాలనీకి చెందిన గువ్వల సుబ్రమణ్యం కార్పెంటర్గా పని చేస్తున్నాడు. అతనికి డ్రైవింగ్ రావడంతో యాక్టింగ్ డ్రైవర్గా కూడా వెళ్తుంటాడు. అతను 15 ఏళ్ల క్రితం రాజుపాళెం మండలంలోని కొర్రపాడు గ్రామంలో పెళ్లి చేసుకున్నాడు. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. కొన్ని రోజులుగా సుబ్రమణ్యం పనులు చేసుకుంటూ ప్రొద్దుటూరులోనే ఉంటున్నాడు. అతను ప్రతి రోజు మద్యం తాగేందుకు వైన్ షాపునకు వెళ్లే క్రమంలో నాగులకట్ట వీధికి చెందిన నవీన్ పరిచయమయ్యాడు. ఇటీవల ఇద్దరు మద్యం తాగే సమయంలో గొడవ పడ్డారు. అక్కడ వారి మధ్య చిన్నపాటి గొడవ కూడా జరిగినట్లు పోలీసులు తెలిపారు. దీన్ని మనసులో పెట్టుకున్న వినయ్ సుబ్రమణ్యంను ఎలాగైనా హతమార్చాలని పథకం రచించాడు. ఈ క్రమంలోనే ఈ నెల 13న మద్యం తాగేందుకు తన ఇంటికి రావాలని సుబ్రమణ్యంను వినయ్ పిలిచాడు. అతను రాత్రి 8 గంటల సమయంలో నాగులకట్ట వీధిలోని వినయ్ ఇంటికి వెళ్లాడు. ఇంట్లో మద్యం తాగేందుకు సిద్ధం అవుతుండగా సుబ్రమణ్యం గొంతు భాగంలో కత్తితో పొడిచి వినయ్ పారిపోయాడు. కొద్ది సేపటి తర్వాత అతను ఘటనా స్థలంలోనే మృతి చెందాడు. ఈ ఘటనపై మృతుని భార్య గువ్వల రమాఅనిత ఫిర్యాదు మేరకు త్రీ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. హత్య కేసులోని నిందితుడు వినయ్ జమ్మలమడుగు రోడ్డులోని బొల్లవరం బస్స్టాప్ వద్ద ఉండగా సీఐ కొండారెడ్డి, ఎస్ఐ సంజీవరెడ్డి, ఏఎస్ఐ సుబ్బన్న సిబ్బందితో కలిసి వెళ్లి అరెస్ట్ చేశారు. ఈ మేరకు నిందితుడ్ని రిమాండుకు తరలించినట్లు సీఐ కొండారెడ్డి తెలిపారు. -
గంగమ్మ జాతర.. చూసొద్దాం పద
లక్కిరెడ్డిపల్లి : భక్తులు కోరిన కోర్కెలు తీర్చుతూ కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ దేవత జాతర రాయలసీమ ప్రాంతానికే తలమానికంగా నిలుస్తోంది. ప్రతి ఏడాది మహాశివరాత్రి మరుసటి రోజున ప్రారంభమై మూడురోజులపాటు జాతర జరుగుతుంది. లక్షలాది మంది భక్తులు తరలివస్తారు. ఈనెల 17వ తేదీ రాత్రి చాగలగుట్టపల్లె అమ్మవారి జాగారం, 18న నిండు తిరునాల, 19న మైల తిరునాల జాతర జరగుతుందని ఆలయ కమిటీ చైర్మన్ సోడి వెంకటేశ్వర్లు, ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు పేర్కొన్నారు. ఆలయ ప్రాశస్త్యం.. గంగమ్మ తల్లి అనారోగ్యానికి గురైన వారికి అభయమిస్తూ, సంతానం లేని వారికి సంతానాన్ని ప్రసాదిస్తూ భక్తుల పాలిట కల్ప తరవుగా శోభిస్లుతోంది. అన్నమయ్య జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి మండలం, అనంతపురం గ్రామంలో కొలువుదీరి ఉంది. మహాశివరాత్రి ముగిసిన రెండోరోజు నుంచి జాతర ప్రారంభమవుతుంది. అమ్మవారికి పుట్టినిల్లుగా భావించే కస్తూరురాజుగారిపల్లి గ్రామంలోని చాగలగుట్టపల్లి నుంచి గంగమ్మ దేవత ఉత్సవ విగ్రహాన్ని బ్యాండు మేళాల మధ్య అప్పలరాజుగారిపల్లి, మార్లవాండ్లపల్లి, మర్రిచెట్టు, చౌటపల్లిల మీదుగా గంగమ్మ జాతర జరిగే ప్రాంతానికి ఊరేగింపుగా తీసుకొస్తారు. దారి పొడవునా అమ్మవారికి బోనాలు సమర్పిస్తారు. సిద్దులపూజతో సిద్దుల ప్రసాదాన్ని సంతానం లేక వరపడిన మహిళలకు అందజేస్తారు. ఇప్పటి నుంచి జాతర ప్రారంభమవుతుంది. పూజలతోపాటు, బండలాగుడు పోటీలు, రాత్రికి చాందినీ, కుంకుమ బండ్లు తిప్పుతారు. చెక్కభజన అమ్మవారి ఉత్సవ మూర్తిని ఊరేగింపుగా చేయడాన్ని నిండు తిరునాలగా భావిస్తారు. రెండోరోజు మైల తిరుణాల రోజున స్థానిక ప్రాంత భక్తులు అమ్మవారికి మొక్కులు తీర్చుకోవడంతోపాటు సాయంత్రం చాగలగుట్టపల్లె గంగమ్మ అమ్మవారి ఉత్సవ మూర్తిని అమ్మవారి ఇంటికి చేర్చడంతో తిరునాల పరిసమాప్తం అవుతుంది. రాయలసీమ ప్రాంతానికే తలమానికం అనంతపురం గంగమ్మ జాతర ఈనెల 17న చాగలగుట్టపల్లె అమ్మవారి జాగారం 18న నిండు తిరుణాల, 19న మైల తిరునాలభక్తులకు మెరుగైన సౌకర్యాలు ఈనెల 18, 19వ తేదీల్లో జరిగే శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ జాతర సందర్భంగా సామాన్య భక్తులకు మెరుగైన సౌకర్యాలు కల్పించేందుకు ఏర్పాట్లు చేస్తున్నాం. జాతరలో ఎక్కడికక్కడ తాత్కాలిక రోడ్లను ఏర్పాటు చేసి భక్తులకు అసౌకర్యాలు కలగకుండా ముందస్తు ప్రణాళికలు రూపొందిస్తున్నాం. ఈ ఏడాది టోల్గేట్లు వసూలు చేయకుండా జాతరకు వచ్చే దుకాణాదారులకు ఇబ్బందులు లేకుండా చేయగలిగాం. – సోడి వెంకటేశ్వర్లు, గంగమ్మ ఆలయ చైర్మన్, లక్కిరెడ్డిపల్లి మండలం, అన్నమయ్య జిల్లావీఐపీ పాసు రద్దు చేశాం ఈ ఏడాది వీఐపీ పాసులను రద్దు చేసి వాటి స్థానంలో రూ. 300లు టికెట్లను తీసుకొచ్చాం. రూ. 100 టికెట్లతోపాటు రూ. 10లు టికెట్లు, ఉచిత దర్శనానికి కూడా ఏర్పాట్లు చేశాము. భక్తుల సౌకర్యార్థం క్యూలైన్లు, చలువ పందిళ్లను ఏర్పాటు చేశాం. రెండు రోజులపాటు దాతల సహకారంతో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేసే దిశగా చూస్తున్నాము. సామాన్య భక్తులకు సులభతరంగా అమ్మవారి దర్శనాన్ని కల్పించేందుకు ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. – శ్రీనివాసులు, ఆలయ ప్రత్యేకాధికారి, అనంతపురం గంగమ్మ ఆలయ, అన్నమయ్య జిల్లా -
వెన్నుపోటు బాబు
సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యత లేదు కూటమి సర్కార్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యత పూర్తిగా లోపించింది. ఇది పూర్తిగా అబద్దాలు, మోసాల బడ్జెట్గా మారింది. కూటమి ప్రభుత్వం మూడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 4 హామీల గూర్చి పట్టించుకోలేదు. నిరుద్యోగులను, మహిళలను, రైతులను, ఉద్యోగులను ఈ బడ్జెట్ మోసగించింది. నిరుద్యోగ భృతిగానీ, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఈ రెండేళ్లల్లో 8 లక్షల ఉద్యోగుల హామీకి ఎక్కడా చోటు కల్పించలేదు. – పాకా సురేష్ కుమార్, మేయర్, కడప ఎస్సీ, ఎస్టీలకు ఒరిగింది శూన్యం రాష్ట్ర బడ్జెట్ వల్ల ఎస్సీ, ఎస్టీలకు ఒరిగింది శూన్యమని చెప్పవచ్చు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అమలుపైనా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. 2 సెంట్ల ఇళ్ల స్థలం ప్రస్తావనగానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి పట్టించుకోలేదు. సంక్షేమానికి 17.3 శాతం నుండి 16 శాతానికి తగ్గిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు నిధుల కేటాయింపులు లేవు. చిన్న తర హా పరిశ్రమల కింద ఎస్సీ,ఎస్టీలకు రావాలిసిన రాయితీలపై స్పష్టత ఇవ్వలేదు. – సీహెచ్ వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు -
కార్మికులకు, నిరుద్యోగులకు మొండిచేయి
కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ కార్మికులను కూటమి ప్రభుత్వం నిలువునా దగా చేసింది. ఈ బడ్జెట్ సమావేశాల్లో నైనా కార్మికులకు మేలు జరుగుతుందనే ఆశ కొంతైనా ఉండేది. అలాంటిదేమీ లేకుండా కార్మికులకు మొండిచేయి చూపించారు. అలాగే నిరుద్యోగ యువతకు నెలకు 3000 రూపాయలు భృతికి ఈ బడ్జెట్లో మంగళం పలికారు. ఎలక్షన్లకు ముందు మాత్రం తీర్చలేని హామీలు ఇవ్వడం, అధికారంలోకి వచ్చాక బడ్జెట్ ఖాళీ అయిందని చెప్పడం చంద్రబాబుకు పరిపాటిగా మారింది. ఇలాంటి పాలకులను మరొకసారి అధికారం ఇవ్వకూడదు. – పి వెంకటసుబ్బయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఆప్కాస్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ -
పొలతలకు తరలివచ్చిన భక్తజనం
పెండ్లిమర్రి : జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రాల్లో పొలతల క్షేత్రం ప్రముఖమైంది. క్షేత్రానికి శనివారం జిల్లా నలుమూల నుంచి కాక ఇతర రాష్ట్రాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం స్వామివారికి వేద పండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆకుపూజ, రుద్రాభిషేకం వంటి ప్రత్యేక పూజ లు నిర్వహించారు. భక్తులకు అసౌకర్యం కలుగకుండా ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు చేపట్టారు. డీఎంహెచ్ ఓ నాగరాజు, తహసీల్దార్ అనురాధ, ఎంపీడీవో జగన్మోహన్రెడ్డిలు ఉత్సవాల ఏర్పాట్లను పర్యవేక్షించారు. నిఘా నేత్రంలో పొలతల క్షేత్రం పొలతలలో మహాశివరాత్రి ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఇబ్బందులు కలగకుండా.. అంసాఘిక కార్యకలాపాలు జరగకుండా ఉండేందుకు పొలతల క్షేత్రం చూట్టు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశారు. ఉత్సవాలకు లక్షల సంఖ్యలో భక్తులు రానున్నారు. క్షేత్రంలో అత్యాధునిక డ్రోన్ కెమెరాతో నిఘా చేపట్టారు. నేడు శివపార్వతుల కల్యాణోత్సవం మహశివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో ఆదివారం ఉదయం 10 గంటలకు ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కల్యాణం నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ క్రిష్ణానాయక్లు తెలిపారు. అనంతరం రాత్రి 10గంటలకు రథోత్సవం అక్కదేవతల గుడి వరకు ఉంటుందన్నారు.ప్రారంభమైన శివరాత్రి ఉత్సవాలు -
విద్యార్థి ఆత్మహత్య
కలసపాడు : మండలంలోని పుల్లారెడ్డిపల్లె గ్రామానికి చెందిన రాచకొండుగురుతేజ (16) శుక్రవారం రాత్రి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు రాచకొండుచిన్నగురయ్య, గురమ్మల కుమారుడైన గురుతేజ కలసపాడులోని ఓ ప్రైవేట్ స్కూల్లో పదో తరగతి చదువుతున్నాడు. గురుతేజకు కొన్నేళ్ల నుంచి చర్మవ్యాధి కారణంగా ఆసుపత్రిల్లో వైద్యం అందించినా తగ్గకపోవడంతో చదువుపై శ్రద్ధ చూడపం లేదన్నారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో మంచి మార్కులు సాధించలేనని మనస్తాపానికి గురై శుక్రవారం రాత్రి భోజనం చేసిన తర్వాత చర్మవ్యాధికి సంబంధించిన ఆయింట్మెంట్ క్రీమ్ను పూసు కుని చదువుకుకోవాలని తల్లికి చెప్పి గదిలోకి వెళ్లిపోయాడు. సుమారు రాత్రి 10 గంటల సమయంలో తల్లి చూడగా గదిలోని ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. వెంటనే తల్లి చుట్టుపక్కల వారికి చెప్పడంతో వారు వచ్చి కలసపాడులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతిచెందినట్లు వారు తెలిపారు. గురుతేజ తండ్రి చిన్నగురయ్య 14 ఏళ్ల క్రితం మృతిచెందాడు. ఒక్కగానొక్క కుమారుడు మృతిచెందడంతో తల్లి గురమ్మ రోదన వర్ణనాతీతం. తల్లి గురమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తునట్లు కలసపాడు పోలీసులు తెలిపారు. లారీ ఢీకొని బేల్దారి మృతిజమ్మలమడుగు : పట్టణంలోని నేతాజినగర్ కాలనీకి చెందిన తలారి రామసుబ్బరాయుడు ఆలియాస్ బాబు(48) అనే బేల్దారిని లారీ ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. శనివారం బాబు ముద్దనూరు మండలంలో బేల్దారి పని నిమిత్తం బైక్లో వెళ్లాడు. సాయంత్రం వరకు పనులు చేసుకుని తిరిగి ఇంటికి వస్తుండగా మండల పరిధిలోని కొత్తరోడ్డు సమీపంలోకి రాగనే ఎదురుగా వస్తున్న లారీ ఢీకొనడంతో కిందపడి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. తృటిలో తప్పిన ప్రమాదంగోపవరం : శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు నుంచి భక్తులు ట్రాక్టర్లో మండలంలోని మల్లెంకొండకు వెళుతున్న సమయంలో శనివారం సూరేపల్లె వద్ద ట్రాక్టర్ అదుపుతప్పి ఒకవైపుకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో భక్తులకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని భక్తులు తెలిపారు. స్థానికుల సహాయంతో ట్రాక్టర్ను బయటికి తీసి భక్తులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా మల్లెంకొండకు పంపడం జరిగింది. -
మెడికల్ మాఫియాను అడ్డుకోవాలి
ప్రొద్దుటూరు : స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద శనివారం మెడికల్ మాఫియాను అడ్డుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యుడు బి.రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఫార్మాస్యూటికల్ కంపెనీలు రోగులకు తాత్కాలిక ఉపశమనం పేరుతో నకిలీ మందులను మార్కెట్లోకి విడుదల చేస్తున్నారని ఆరోపించారు. మెడికల్ షాపులకు ఒక షీట్పై 40 శాతం రాయితీ ఇచ్చి వీధి వ్యాపారానికి అడ్డదారులు తొక్కుతున్నానని అన్నారు. ప్రజల నుంచి మాత్రం వాటిపై ముద్రించిన ఎమ్మార్పీ రేట్లకు అమ్ముతున్నారన్నారు. ప్రజలను నిలువు దోపిడీ చేస్తున్నారని, వారి ఆరోగ్యాలతో ఆడుకుంటున్న మెడికల్ మాఫియాను అడ్డుకోవాలని డిమాండ్ చేశారు. చాలా మంది మెడికల్ షాపుల యజమానులు ఫార్మసీలో గ్రాడ్యుయేషన్ లేకపోయినా వేరొకరి సర్టిఫికెట్లతో నడుపుతూ అక్రమ సంపాదనకు పాల్పడుతున్నారన్నారు. వీటిని నివారించాల్సిన డ్రగ్ ఇన్స్పెక్టర్లు, ఆ పై అధికారులు నెలవారి మామూళ్ల మత్తులో జోగుతున్నారని ఆరోపించారు. ఫార్మా కంపెనీలు షాపుల వారికి, కొంత మంది డాక్టర్లకు గిఫ్ట్ల పేరుతో ఎరవేస్తూ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారన్నారు. వెంటనే మెడికల్ మాఫియాపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు చంద్రశేఖర్, మచ్చా శ్రీను, మద్దిలేటి, హరి, ప్రమీల, సుజాత తదితరులు పాల్గొన్నారు. -
బ్రహ్మంగారిమఠానికి ఉత్సవ శోభ
బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠం ఉత్సవ శోభ సంతరించుకుంది. స్వామి, అమ్మవారి కల్యాణ వేడుకలకు సిద్ధమైంది.మహాశివరాత్రి సందర్భంగా శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, గోవిందమాంబ కల్యాణ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. శనివారం ప్రారంభమైన ఈ వేడుకలు మంగళవారం వరకు నాలుగు రోజుల పాటు జరుగుతాయి. ఇందులో భాగంగా శనివారం ఉదయం నామ సంకీర్తన, ఉపనిషత్ పారాయణం, అభిషేకం చేపట్టారు. మధ్యాహ్నం వీరబ్రహ్మేంద్రస్వామి మఠం మఠాధిపతుల మూలపురుషుడు పెద్ద గోవిందస్వామి ప్రథమ పుత్రుడు గోవిందస్వామి ధర్మపత్ని వీరపాపమాంబ ఆరాధన నిర్వహించారు. ఈ సందర్భంగా మఠాధిపతి శ్రీ వీరధర్మజ వెంకటాద్రిస్వామి ప్రత్యేక పూజలు చేశారు. సాయంత్రం హరికథ కాలక్షేపం, రాత్రి కలశోత్సవం, శేషవాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగాయి. నేటి కార్యక్రమాలు ఉదయం సుప్రభాతం, మధ్యాహ్నం దీక్షాబంధనాలంకారోత్సవం, నామసంకీర్తన, భజనలు, సాయంత్రం కర్నూలు హరిప్రియ కళాకారుల సంగీత విభావరి, ఉత్సవం, స్థానిక ఆస్థాన పండితుల ఉపన్యాసం ఉంటాయి. రాత్రి 9 గంటలకు గోవిందమాంబ సమేత శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి దంపతుల కల్యాణం మఠాధిపతి శ్రీ వెంకటాద్రిస్వామి దంపతులు ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణానికి కందిమల్లాయ్యపల్లె పుర ప్రజలు పట్టు వస్త్రాలు, తలంబ్రాలు తీసుకురానున్నారు. ఆనవాయితీ ప్రకారం ఏటా జిల్లాలోని పెద్దపుత్తకు చెందిన తాడిగొట్ల నారాయణరెడ్డి, వీరారెడ్డి కుటుంబ సభ్యులు ఉభయదాతలుగా కల్యాణ వేడుక నిర్వహించనున్నారు. అనంతరం నరనంది ఉత్సవం, జాగారణ, వివిధ కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహిస్తారు. ఈశ్వరీదేవి మఠంలో.. స్థానిక శ్రీ ఈశ్వరీదేవి మఠంలోని శివాలయం సన్నిధిలో మహాశివరాత్రి మహోత్సవాలు శనివారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉత్సవాలు నాలుగు రోజుల పాటు నిర్వహించనున్నారు. ఉదయం కలశస్థాపన, శ్రీ పార్వతీపరమేశ్వరుల విగ్రహ మూర్తులకు ప్రభాతసేవ, అభిషేకం, కుంకుమార్చన, మధ్యాహ్నం నైవేద్యం, మంత్రపుష్పం, నీరాజన తీర్థప్రసాద వితరణ, సాయంత్రం అభిషేకం, కుంకుమార్చన, రాత్రి నైవేద్య, మంత్రపుష్ప, నీరాజన తీర్థప్రసాద వితరణ తదితర కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కార్యక్రమాలను తిలకించి తరించారు. వారి సౌకర్యార్థం ఏర్పాట్లను మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో చేస్తున్నారు.నేడు స్వామి, అమ్మవారి కల్యాణం -
శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహా శివరాత్రి సందర్భంగా జిల్లాలోని శైవ క్షేత్రాలకు భక్తుల సౌకర్యార్థం అన్ని ఏర్పాట్లు చేశామని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడుతూ పొలతలకు 165 బస్సులు, నిత్యపూజ కోనకు 40, లంకమల 23, బి.మఠం 17, మల్లెంకొండ 10, హత్యరాల 22, జ్యోతి 6, కన్యతీర్థం 8, అల్లాడుపల్లె దేవలాలు 12, తలకోన 5, మల్లెంకొండ 10, సంగమేశ్వర దేవలాలు 2, భానుకోట 3, అగస్తేశ్వరకోనకు 8 బస్సులు చొప్పున నడుపుతున్నామని తెలిపారు. భక్తుల సౌకర్యార్థం బస్టాండ్లలో మరుగుదొడ్లు, మంచినీటి సౌకర్యం, చలువపందిళ్లు ఏర్పాటు చేశామన్నారు. ఈ సందర్భంగా పలువురు అధికారులను నియమించామని, భక్తులు ఆర్టీసీ సేవలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. -
బడ్జెట్ కేవలం అంకెల గారడీ
అసెంబ్లీలో ఇవాళ కూటమి ప్రభుత్వం ప్రవేశపెట్టిన రూ.3.32 లక్షల కోట్ల బడ్జెట్ చూస్తే అంతా ఆత్మస్తుతి, పరనింద తప్ప ఏమీ లేదు. అధికార పార్టీ ప్రజాప్రతినిధులు తమను తాము పొగుడుకోవడం, గత ప్రభుత్వం పేరుతో మా మీద నిందలు వేయడం జరిగింది. రాష్ట్రాన్ని ఉద్ధరిస్తారని ప్రజలు అధికారమిచ్చిన విషయాన్ని విస్మరించారు. గతేడాది రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. పొగాకు, మిర్చి, మామిడి, జొన్న ఇలా ఏ ఒక్క పంటకూ మద్దతు ధరను అందించలేకపోయారు. అంతా అంకెల గారడీ. వాస్తవికత ఎక్కడా కనిపించలేదు. రాష్ట్ర చరిత్రలో మూడో వంతు లోటు బడ్జెట్ ఉండటం ఇదే తొలిసారి. – పి.రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షులు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజలకు ఉపయోగపడని బడ్జెట్ బడ్జెట్ మొత్తం అంకెల గారడీయే. అన్ని అబద్ధాలు, మోసాలతో బడ్జెట్ను నింపేశారు. ఆడబిడ్డ నిఽధి, నిరుద్యోగ భృతికి ఎలాంటి కేటాయింపులు లేవు. ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని చెప్పారు.. కానీ ఒక్క రూపాయి కూడా నిధులు కేటాయించలేదు. సీబీఎస్ఈ, టోఫెల్ వంటి వాటిని రద్దు చేయడం దారుణం. ధరల స్థీరీకరణ నిధికి కేవలం రూ.500 కోట్లు కేటాయించడం దుర్మార్గం. అప్పుల మీద అప్పులు చేస్తూ ప్రభుత్వం రికార్డు సృష్టిస్తోంది. మొత్తంగా ఈ బడ్జెట్ ప్రజలకు ప్రయోజనకారిగా లేదు. –ఎస్బీ అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని పెద్దచెప్పలి క్రాస్ వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. ఎస్ఐ విద్యా సాగర్ తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. వేంపల్లె మండలం ముతుకూరుకు చెందిన మాచునూరు శ్రీనివాసులు (38), అదే గ్రామానికి చెందిన శ్రీనివాసులురెడ్డిలు బైక్లో కమలాపురం మండలం విభరాపురంలో సొంత పనుల నిమిత్తం వచ్చారు. తిరిగి వెళుతుండగా పెద్దచెప్పలి క్రాస్ వద్దకు రాగానే స్పీడ్ బ్రేకర్ ఉండటంతో బైక్ నడిపే శ్రీనివాసులురెడ్డి స్లో చేశాడు. కడప నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బైక్ను వేగంగా వెళ్లి ఢీ కొట్టింది. ఈ ఘటనలో బైక్ వెనుక వైపు కూర్చున్న మాచునూరు శ్రీనివాసులు కింద పడ్డాడు. అతడిని తొక్కించుకుంటూ లారీ వెళ్లిపోయింది. ఈ ఘటనలో శ్రీనివాసులు నడుము నుంచి మోకాళ్ల వరకు ఉన్న భాగమంతా నుజ్జు నుజ్జు అయింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. బైక్ నడుపుతున్న శ్రీనివాసులురెడ్డికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ తన సిబ్బందితో ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం మృతదేహాన్ని ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా ప్రమాదానికి కారణమైన లారీని ఎర్రగుంట్ల వద్ద పోలీసులు పట్టుకున్నట్లు తెలిసింది. -
సంక్షేమ హాస్టల్ వర్కర్లను పర్మినెంట్ చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రభుత్వ సంక్షేమ బీసీ, ఎస్సీ,ఎస్టీ వసతి గృహాల్లో 10, 15 సంవత్సరాలుగా పని చేస్తున్న ఔట్ సోర్సింగ్ వర్కర్లను పర్మినెంట్ చేయాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎల్ నాగసుబ్బారెడ్డి ప్రభుత్వ సంక్షేమ హాస్టల్ వర్కర్స్ యూనియన్ గౌరవాధ్యక్షులు కేసి బాదుల్లా, కార్యదర్శి రాజేశ్ పేర్కొన్నారు. శనివారం కడపలోని హోచిమిన్ భవన్లో ఏఐటీయూసీ 12 జిల్లా మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామాల్లో రోజువారీ పనులు చేసే కార్మికులకు రోజుకు రూ. 600 చొప్పున నెలకు రూ.18 వేలు సంపాదిస్తున్నట్లు అదే విధంగా నగరాల్లో అడ్డా కూలీలు నెలకు రూ 24 వేలు వరకు సంపాదిస్తున్నారని తెలిపారు. అంతకంటే తక్కువ హాస్టల్ కార్మికులకు ఇవ్వడం ఎంతవరకు న్యాయమన్నారు. పెరిగిన ధరల ద్రవ్యోల్బణం దృష్టిలో పెట్టుకొని వెంటనే జీతాలు రూ.26 వేలకు పెంచడానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. హాస్టళ్లలో వర్కర్ల సంఖ్యను విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా పెంచాలని డిమాండ్ చేశారు. సమావేశంలో ఏఐటీయూసీ నగర కార్యదర్శి యు మద్దిలేటి హాస్టల్ వర్కర్స్ యూనియన్ నాయకులు చండ్రాయుడు భాస్కర్ ప్రసాదు చంద్రశేఖర్ జానీ భారతి విజయ్ కుమారి మంజుల తదితరులు -
రాష్ట్ర సిలబస్కు అనుగుణంగా ఏటీఎల్ అనుసంధానం
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర సిలబస్కు అనుగుణంగా అటల్ టింకరింగ్ ల్యాబ్ అనుసంధానం చేస్తూ ఏపీ ఎస్సీఈఆర్టి వారు దేశంలోనే మొదటి సారిగా హ్యాండ్ బుక్స్ తయారు చేసినట్లు డిప్యూటి ఈఓ రాజగోపాల్రెడ్డి తెలిపారు. కడప డీఈఓ కార్యాలయంలో శనివారం ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటల్ టింకరింగ్ ల్యాబ్ (ఏటీఎల్) స్కూళ్లపై రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో కేంద్ర అడిట్ టీం ఏటీఎల్ స్కూళ్లను విజిట్ చేస్తాయని తెలిపారు. అందువల్ల క్యాష్ బుక్, రిజల్యూషన్ బుక్, చెక్బుక్, బ్యాంకు స్టేట్మెంట్ అన్ని సరిచూసుకోవాలని చెప్పారు. కార్యక్రమంలో డీఈఓ కార్యాలయ ఏడీ రామక్రిష్ణ, జిల్లా సైన్సు ఆఫీసర్ వేపరాల ఎబినైజర్, ఏటీఎల్ స్కూల్స్ హెచ్ఎంలు, ప్రిన్సిపాల్స్ , ఏటిఎల్ ఇంచార్జు టీచర్స్ హాజరయ్యారు. -
● ప్రాజెక్టులపై చిన్నచూపు
చంద్రబాబు సర్కార్ 2026–27 వార్షిక బడ్జెట్లో రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులపై శీతకన్ను వేసింది. తెగిపోయిన అన్నమయ్య ప్రాజెక్టు ఊసే లేదు. గాలేరి–నగరి సుజల స్రవంతి పథకంపై చిత్తశుద్ధి కన్పించలేదు. జీఎన్ఎస్ఎస్–హెచ్ఎన్ఎస్ఎస్ అనుసంధానం చేసి కుప్పానికి సైతం నీరు ఇవ్వాలని వైఎస్సార్సీపీ సర్కార్ భావిస్తే, కూటమి సర్కార్ నిర్లక్ష్యం ప్రదర్శిస్తోంది. ఇప్పటికే జీఎన్ఎస్ఎస్ దాదాపు రూ.2వేల కోట్లు పనులు పూర్తయి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. తాజాగా రూ.665.37కోట్లు బడ్జెట్ కేటాయింపు చేశారు. జీఎన్ఎస్ఎస్ పరిధిలో పనులు ముందడుగు పడే అవకాశమే లేద ని నిపుణులు వివరిస్తున్నారు. హెచ్ఎన్ఎస్ఎస్ రూ.2,621 కోట్లు కేటాయించగా, అందులో 25శాతం మాత్రమే జీఎన్ఎస్ఎస్ కేటాయించడం వెనుక కూటమి సర్కార్ దుర్భుద్ధి తేటతెల్లమౌతోందని రాజకీయ పక్షాలు ఆరోపిస్తున్నా యి. జీఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువ పనుల పురో గతి ప్రశ్నార్థకంగా మారింది. కేసీ కెనాల్ ఆయక ట్టుకు ప్రాణప్రదమైన రాజోలి ప్రాజెక్టు ప్రస్తావనే లేదు. బడ్జెట్లో నిధుల కేటాయింపులే లేకపోవ డం సర్కారు కక్షపూరిత విధానానికి నిదర్శనం. నీటి ప్రాజెక్టుల కేటాయింపులు...రూ.కోట్లలో.. -
శివోహం!
● జిల్లా అంతటా మార్మోగుతున్న శైవనామం ● శైవ క్షేత్రాల్లో ఘనంగా ఏర్పాట్లు చేసిన నిర్వాహకులు ● ఇప్పటికే కొండ కోనలకు చేరుకున్న భక్తజనం ● నేడు మహా శివరాత్రి పర్వదినం కడప సెవెన్రోడ్స్: శివుడు....భోళాశంకరుడు...భక్తవ శంకరుడు...ఆకు, పండు, పువ్వు, నీరు ఇలా ఏమిచ్చి మనసారా మొక్కినా భక్తులను కరుణిస్తాడు...వరాలు కురిపిస్తాడు....ఆపదలో ఆదుకుంటాడు....అందుకే ఆయన భక్తవ శంకరుడు. ఆ స్వామి వారిని తలుచుకునే మహాశివరాత్రి భక్తులకు ఎంతో ముఖ్యమైనది. ఈ పండుగను ఆదివారం ఘనంగా నిర్వహించుకునేందుకు ప్రజలు ఏర్పాట్లు చేసుకున్నారు. నిర్వాహకులు శివాలయాలను అందంగా తీర్చిదిద్దారు. ● మన జిల్లాలో ప్రముఖ శివాలయాలు అందులోనూ అటవీ ప్రాంతాల్లో ఉన్న ఆలయాల సంఖ్య 15కు పైగానే ఉంది. ఒకప్పుడు ఈ జిల్లాలో శైవం బాగా విస్తరిల్లింది. జిల్లాలో వీరశైవ ఆలయాలు కూడా ఉండడంతో అటు తమిళనాడు, కర్ణాటక నుంచి కూడా శివరాత్రి సందర్భంగా భక్తులు ఈ జిల్లాకు వస్తుంటారు. మహాశివరాత్రి సందర్బంగా జిల్లా అంతటా ముఖ్యంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాల్లో శివరాత్రి పూజలు నిర్వహించడానికి జిల్లా దేవదాయ, ధర్మదాయ శాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. వైద్య ఆరోగ్య, పంచాయతీ, అగ్నిమాపకశాఖ, పోలీసు తదితర ప్రభుత్వ శాఖల సహకారంతో ఇప్పటికే పలుమార్లు జిల్లాలోని అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలను పరిశీలించారు. పోలీసు అధికారులు కూడా తమ పరిధిలోని శైవ క్షేత్రాలకు బందోబస్తు కోసం తరలివెళ్లారు. శనివారం ఉదయం నుంచే అటవీ క్షేత్రాల మొక్కులుగల భక్తులు ప్రత్యేక వాహనాలను ఉచితంగా ఏర్పాటు చేశారు. అలాగే ఆర్టీసీ సంస్థ ప్రత్యేక బస్సులను ఏర్పాటు చేసింది. అటవీ ప్రాంతాల్లోని ఆలయాలకు వెళ్లేందుకు పలువురు భక్తులు ద్విచక్ర వాహనాలను ఉపయోగించడంతో దారులన్నీ రద్దీగా మారాయి. నడక శ్రమ తెలియకుండా భక్తులు చేసే శివనామ స్మరణతో ఆయా క్షేత్రాలు మార్మోగాయి. శివ పూజలకు ఘనంగా ఏర్పాట్లు శివరాత్రి సందర్భంగా అటవీ ప్రాంతాల్లోని శైవ క్షేత్రాలలో శివయ్యకు విశేష పూజలు నిర్వహించనున్నారు. జిల్లాలో లక్షల మంది హాజరయ్యే క్షేత్రా లు కూడా ఉన్నాయి. ముఖ్యంగా పొలతల, నిత్యపూజస్వామికోన, అత్తిరాల, భైరవకోన, కపర్థీశ్వరకోన, కన్యతీర్థం, భానుకోట తదితర ప్రాంతాలకు భక్తులు భారీగా హాజరవుతారు. అటవీ ప్రాంతాలతోపాటు గ్రామాలు, పట్టణాలు, కడప నగరంలోని శివాలయాలలో కూడా వైభవంగా పూజలు నిర్వహించేందుకు నిర్వాహకులు ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేశారు. దాదాపు అన్ని ఆలయాలలో పండుగ సందర్భంగా ఆదివారం మధ్యాహ్నం భక్తులకు అన్నదానం చేయనున్నారు. రాత్రి 8 నుంచి అర్థ రాత్రి వరకు భజనలు, ప్రవచనాలు, భక్తి గీతాలాపనలు నిర్వహించనున్నారు. అర్దరాత్రి 12 గంటల నుంచి లింగోద్భవం సందర్బంగా మహాన్యాస పూ ర్వక ఏకాదశ రుద్రాభిషేకం నిర్వహించనున్నారు. విద్యుద్దీపాల వెలుగులో ఆలయంకడప సెవెన్రోడ్స్: మహా శివరాత్రిని పురస్కరించుకొని జిల్లా వ్యాప్తంగా శైవ క్షేత్రాలలో జిల్లా యంత్రాంగం అన్ని ఏర్పాట్లు చేసిందని జేసీ నిధి మీనా పేర్కొన్నారు. శనివారం రాత్రి టెలీ కాన్ఫరెన్స్ ద్వారా జిల్లాలోని ప్రముఖ శైవక్షేత్రాల్లో చేసిన ఏర్పాట్ల నిర్వహణపై దేవాదాయ శాఖ, రెవెన్యూ, సంబంధిత అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఉత్సవాల నిర్వహణతోపాటు భక్తులకు అసౌకర్యం కలిగించకుండా ఏర్పాట్లు చేయాలన్నారు. ముఖ్యంగా క్యూలైన్ల నిర్వహణ పకడ్బందీగా ఉండాలని, ప్రతి క్షేత్రంలో అన్నదానం జరుగుతుందని తెలిపారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ ఏర్పాటు భక్తులకు సమాచార, సహాయం నిమిత్తం కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని 21 మంది సిబ్బందితో 3 షిఫ్టుల్లో 24/7 విధులను కేటాయించడం జరిగిందన్నా రు. కంట్రోల్ రూమ్ సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. -
విద్యారంగానికి కేటాయింపులు తక్కువే
పాఠశాల విద్యారంగానికి తగినంత మేర నిధులు కేటాయించకపోవడం అన్యాయం. విద్యకు జీడీపీలో మూడు శాతం బడ్జెట్ పునరాలోచించాలి. మోడల్ ప్రాథమిక విద్య వ్యవస్థకు తాజా నిధుల్లో ప్రత్యేక బడ్జెట్ కేటాయించి ప్రాథమిక విద్యా వ్యవస్థను బలోపేతం చేయా లి. పాఠశాలల్లో మౌలిక వసతుల కొరతను తీర్చాలి. మన బడి, మన భవిష్యత్ కింద ఆగిపోయిన పనులను పూర్తి చేయాలి. సర్వేపల్లి రాధాకృష్ణ విద్యార్థి మిత్ర కిట్స్ నాణ్యత ఉండేలా మరింత బడ్జెట్ పెంచాలి. – సీపీ ప్రసాద్, ఏపీపీఎస్ హెచ్ఎం అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు -
కల్యాణం.. కమనీయం!
రాయచోటి టౌన్: రాయచోటి రాచరాయుడి కల్యాణ మహోత్సవం వైభవంగా నిర్వహించారు. శనివారం శ్రీ వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాల నిర్వహణలో భాగంగా రెండవ రోజు ఉదయం 9గంటలకు స్వామి వారి కల్యాణ మహోత్సవం వేదపండితులు రాచరాయ యోగీస్వామి, ప్రణవానందగిరి స్వామి వారి శిశ్యులు మఠం ఓంకార స్వామి వారి ఆచార్యత్వంలో నిర్వహించారు. ఉదయం స్వామి వారికి ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వరంలో గణపతి హోమం, ఉత్సవ మూర్తులకు ఆలయ ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి వారి ఆధ్వర్యంలో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి కల్యాణ మహోత్సవానికి మండిపల్లి లక్ష్మీప్రసాద్రెడ్డి ముత్యాలు, తలంబ్రాలు, పట్టువస్త్రాలు సమర్పించారు. అనంతరం కల్యాణ మంటపం వేదికపై స్వామి వారి కల్యాణ క్రతువు క్రమంగా నిర్వహించారు. -
ముగిసిన దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్వర్ణాంధ్ర ఇంటర్ డిస్ట్రిక్ట్ సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా శనివారం జరిగిన లీగ్, ఫైనల్ మ్యాచ్లు ముగిశాయి. శనివారం అనంతపురం, కర్నూల్ జట్ల మధ్య ఈ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచిన కర్నూలు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. ముందుగా బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 109 పరుగులు చేసింది. సాధిక్బాషా 62 బంతుల్లో 73 పరుగులు చేసి జట్టుకు ప్రధాన స్కోరు అందించారు. కర్నూల్ బౌలర్లలో ప్రభాకర్ 4 ఓవర్లలో 13 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, యానాక్ 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశారు. 110 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూల్ జట్టు 13 ఓవర్లలో 74 పరుగులకు ఆలౌటైంది. అనంతపురం బౌలర్లలో రోషిరెడ్డి 4 ఓవర్లలో 12 పరుగులు మాత్రమే ఇచ్చి 6 వికెట్లు తీసుకొని అద్భుత ప్రదర్శన చేశారు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్కు రోషిరెడ్డి ఎంపికయ్యారు. అనంతరం నెల్లూరు, అనంతపురం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ జరిగింది. టాస్ గెలిచి బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 20 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 141 పరుగులు చేసింది. హుడా 29 బంతుల్లో 39 పరుగులు, సాధిక్బాషా 20 బంతుల్లో 19 పరుగులు చేశారు. నెల్లూరు బౌలర్లలో అఖిల్ రెడ్డి 4 ఓవర్లలో 24 పరుగులు ఇచ్చి 2 వికెట్లు, కిట్టు 4 ఓవర్లలో 32 పరుగులు ఇచ్చి 2 వికెట్లు తీశారు. 142 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 14 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసి విజేతగా నిలిచి చాంపియన్గా అవతరించింది. కిట్టు 38 బంతుల్లో 83 పరుగులు చేసి జట్టును విజయతీరాలకు చేర్చారు. రాకేష్ గౌడ్ 19 బంతుల్లో 23 పరుగులు చేశారు. అనంతపురం బౌలర్లలో సాధిక్ బాషా 3 ఓవర్లలో 22 పరుగులు ఇచ్చి 1 వికెట్ తీశారు. విజేతలకు ఎల్ఐసీ డివిజనల్ మేనేజర్ రవి కుమార్, మార్కెటింగ్ ఆఫీసర్ రాకేష్, కడప ఏబీజీ బ్యాంకు మేనేజర్ ఇ. రామమోహన్, భాస్కర్ మెడికల్ డిస్ట్రిబ్యూటర్ మిసెస్ శర్మ, కడప క్రికెట్ అసోసియేషన్ ఏవో నాగేష్, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ విన్నర్స్, రన్ర్స్కు బహుమతులను అందజేశారు. -
శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా ప్రధాన అర్చకులు వీణారాఘవాచార్యులు మూల విరాట్కి పంచామృతాభిషేకం నిర్వహించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. కడప సెవెన్రోడ్స్: దళిత కుటుంబంలో జన్మించి ముఖ్యమంత్రి పదవిని అధిరోహించిన దామోదరం సంజీవయ్య యావత్ భారత దేశానికే ఆదర్శమని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. శనివారం కలెక్టరేట్లో దివంగత ముఖ్యమంత్రి దామోదరం సంజీవయ్య 105 జయంతి వేడుకలు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధులుగా జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తోపాటు ఎస్డీసి వెంకటపతి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతీ హాజరయ్యారు. కార్యక్రమంలో ముందుగా ప్రముఖులు, ప్రత్యేక అతిధులు దామోదరం సంజీవయ్య చిత్ర పటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. -
అన్ని వర్గాలను మోసగించారు
అసెంబ్లీలో ప్రవేశపెట్టిన బడ్జెట్ అన్ని వర్గాలను మోసగించేదిలా ఉంది. తన ఆప్తుడు, శిష్యుడు తెలంగాణ ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డిని పూర్తిస్థాయిలో సంతృప్తి పరిచేందుకు బడ్జెట్లో రాయలసీమ ఎత్తిపోతల పథకాలను నిధులు కేటాయింపు లేనేలేదు. 2.95 టీఎంసీలు సామర్థ్యంతో నిర్మిస్తున్న రాజోలు జలాశయానికి నిధులు కేటాయించకపోవడం దారుణం. విద్యుత్ ఉత్పాదక రంగంపై మనసు పెట్టని కూటమి సర్కార్ తీరు స్పష్టంగా కనబడుతోంది. – రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాష్ట్ర కార్యదర్శి, వైఎస్సార్ సీపీ -
ఘరానా మోసగాడు అరెస్ట్
కడప అర్బన్ : ఆన్లైన్లో ‘పోలో’,‘వాల్లా’అనే గే యాప్లలో సభ్యులను తాను పోలీసునంటూ బెదిరించి డబ్బులు, బంగారు ఆభరణాలను దోచుకుంటున్న ఘరానా మోసగాడు చదువుల ప్రసన్నకుమార్ రెడ్డి అలియాస్ ప్రసన్న అలియాస్ కొప్పును కడప చిన్నచౌక్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుడు ప్రధానంగా కడపలోని ఎం.ఎస్ కొట్టాలకు చెందిన వ్యక్తిని తాను అలిపిరి పోలీస్స్టేషన్ కానిస్టేబుల్ను అని బెదిరించి దాదాపు రూ.6,95,500 నగదును, రూ. 30 గ్రాముల బంగారు ఆభరణాలను కాజేశాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్లు కడప చిన్నచౌక్ సీఐ ఏ. ఓబులేసు వెల్లడించారు. నిందితుడి వద్ద నుంచి రూ.4.5 లక్షల విలువైన 30 గ్రాముల బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను పోలీసులు రికవరీ చేశారు. నిందితుడు ‘పోలో’, ‘వాల్లా’అనే ఆండ్రాయిడ్ ’గే యాప్’లలో మెంబర్గా ప్రవేశించి ఆ యాప్లలో నమోదైన మిగిలిన సభ్యుల మొబైల్ నంబర్లు సేకరించుకొని వారికి పోలీసును అంటూ బెదిరింపు కాల్ చేస్తాడు. సభ్యులు యాప్లో నేరపూరిత మెసేజ్లు పెట్టారు, తమ పైన పోలీస్ కేసు నమోదు చేశామని చెప్పి, తనకు డబ్బులు ఇస్తే కేసులు లేకుండా చేస్తాను అని నమ్మిస్తాడు. చాలామంది అమాయకుల నుంచి డబ్బులు, బంగారు నగలు వసూలు చేస్తాడు. అదేవిధంగా సాఫ్ట్వేర్ ఉద్యోగాలు ఇప్పిస్తాను అని చెప్పి కూడా డబ్బులు వసూలు చేస్తూ చాలామందిని మోసం చేశాడు. ఇతను బీటెక్ వరకు చదువుకున్నాడు. అతనికి ఉన్న టెక్నికల్ నాలెడ్జ్ తో తిరుపతి, అనంతపురం, బెంగళూరు పట్టణాలను కేంద్రాలుగా చేసుకుని ఇలాంటి మోసాలకు పాల్పడుతున్నాడు. ఇతనిపై చిన్నచౌక్, కడప వన్ టౌన్, అనంతపురం, నార్పల పోలీస్ స్టేషన్లలో సుమారు ఐదు కేసులు వున్నాయి. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ ఇన్స్పెక్టర్ ఎ. ఓబులేసు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి తమ సిబ్బందితో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి నిందితుడిపై ప్రత్యేకమైన నిఘా ఉంచారు. కడప చిన్నచౌక్ పిఎస్ పరిధిలో పాతబైపాస్ సర్కిల్ వద్ద నిందితుడు ప్రసన్నకుమార్ రెడ్డిని అరెస్ట్చేసి, అతని వద్ద నుంచి బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ను రికవరీచేసినట్లు సీఐ తెలియజేశారు.రూ.4.5 లక్షల విలువైన బంగారు ఆభరణాలు, సెల్ఫోన్ స్వాధీనం -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న స్కూలు బస్సు
లింగాల : లింగాల మండలం రామనూతనపల్లె గ్రామ సమీపంలోని శివాలయం వద్ద ఆర్టీసీ బస్సును పులివెందుల శ్రీచైతన్య హైస్కూలు బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న గుణకణపల్లె గ్రామానికి చెందిన డేరంగుల సిద్ధమ్మ గాయపడింది. వివరాలలోకి వెళితే.. శనివారం సాయంత్రం కోమన్నూతల నుంచి పులివెందులకు వస్తున్న ఆర్టీసీ బస్సును పులివెందుల నుంచి స్కూలు పిల్లలను గ్రామాలకు తీసుకెళుతున్న శ్రీచైతన్య హైస్కూలు బస్సు అతివేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తున్న సిద్దమ్మపై బస్సులో ఉన్న స్టెప్నీ టైరు పడి రెండు చేతులు ఫ్రాక్చరయ్యాయి. ఆర్టీసీ డ్రైవర్కు స్టీరింగ్ తగలి స్వల్ప గాయాలయ్యాయి. అయితే స్కూలు బస్సులోని పిల్లలకు ఎలాంటి ప్రమాదం సంభవించలేదు. స్కూలు బస్సు అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రయాణీకులు, స్థానికులు తెలిపారు. గాయపడ్డ మహిళను వెంటనే పులివెందుల ఆసుపత్రికి తరలించారు. -
పాన్ ఐఐటీ హ్యాక్థాన్లో ప్రతిభ
వేంపల్లె: జాతీయస్థాయి పాన్ ఐఐటీ హ్యాక్ థాన్లో ఇదుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభను కనబరిచినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆన్లైన్ క్విజ్, డెమో సమర్పణ వంటి అంశాల్లో నిర్వహించిన ఈ హాక్ థాన్లో సుమారు 8000 మంది పాల్గొనగా.. మల్టీ ఏజెంట్ సిస్టమ్స్ అంశంలో ఉత్తమ 15 జట్లను ఎంపిక చేశారు. ఈనెల 9వ తేదీ నుంచి 11వ తేదీ వరకు ఐఐటీ మద్రాస్, క్యూడ్రెంట్ సంస్థ సంయుక్తంగా ఫైనల్స్ నిర్వహించారు. ఈ హ్యాక్ థాన్లో బిట్స్ పిలానీ, ఐఐటీ విద్యార్థులు పోటీ పడగా ఆర్కే వ్యాలీ జట్టు ‘ట్వైలైట్‘ పడిగల కృష్ణ కౌశిక్, కొండ్రా స్వర్ణాంజలి విజేతలుగా నిలిచారు. విజేతలకు రేబాన్ మెటా గ్లాసిస్ షీల్డ్, ప్రశంసా పత్రాన్ని అందజేశారు. విద్యార్థులను డైరెక్టర్, పరిపాలన అధికారి రవికుమార్, విభాగాధిపతులు రత్నకుమారి, సుధాకర్ రెడ్డి, కోనప్ప అభినందించారు. -
అరటి పంట దగ్ధం.. రూ. లక్షల్లో నష్టం
పులివెందుల రూరల్ : అరటి పంట దగ్ధం కావడంతో రైతుకు రూ.లక్షల్లో నష్టం వాటిల్లింది. మండలంలోని కొత్తపల్లె గ్రామానికి చెందిన ఓబయ్య అనే రైతు 4 ఎకరాల్లో అరటి పంట సాగు చేశాడు. అరటి పిలకలు నాటినప్పటి నుంచి గెలలు వేసే వరకు చెట్లను సొంత కన్న బిడ్డల్లాగా చూసుకొని సాగు చేస్తే.. పక్కనే ఉన్న కొండకు గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టడంతో నిప్పు రవ్వలు వచ్చి అరటి పంటకు అంటుకున్నాయి. దీంతో అరటి పంట అగ్నికి ఆహుతైందని బాధిత రైతు ఆవేదన వ్యక్త చేస్తున్నాడు. మార్కెట్లో అరటి ధరలు బాగా ఉన్న సమయంలో చేతికొచ్చిన అరటి పంట ఇలా బూడిద కావడంతో కన్నీరు మున్నీరవుతున్నాడు. నాలుగు ఎకరాల్లో అరటి పంటతోపాటు డ్రిప్ పరికరాలు కాలిపోవడంతో సుమారు రూ.15 లక్షల మేర ఆస్తి నష్టం వాటిల్లినట్లు వాపోయాడు. బాధితుడిని ప్రభుత్వం ఆదుకోవాలని పలువురు రైతులు కోరారు. స్పందించని అగ్నిమాపక శాఖ అధికారులు అరటిపంటకు అగ్ని అంటుకుందని రైతు అగ్నిమాపక శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం ఇచ్చారు. అయితే వారు సకాలంలో స్పందించకపోవడంతో పంట పూర్తిగా కాలిపోయిందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. -
ట్రాక్టర్ కింద పడి విద్యార్థి దుర్మరణం
బ్రహ్మంగారిమఠం : మండలంలోని నరసన్నపల్లెకు చెందిన కొనిరెడ్డి నాగ వీరప్రతాప్రెడ్డి (20) అనే విద్యార్థి శుక్రవారం ట్రాక్టర్ కింద పడి దుర్మరణం చెందాడు. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. నరసన్నపల్లెలోని దేవరకొండ కృష్ణయ్యకు చెందిన ట్రాక్టర్కు ఆశ్రమానికి చెందిన రామోహన్రావు యాదవ్ (బాజీ) డ్రైవర్గా ఉన్నాడు. శుక్రవారం నరసన్నపల్లె నుంచి డ్రిప్ పైపులు దాదాపు 20 కట్టలతో ఆరుగురు కూలీలతో అంబవరానికి తీసుకువెళ్తున్నాడు. డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో గంగిరెడ్డిపల్లె కాలనీ దగ్గర పెద్దరాయిని ట్రాక్టర్ టైర్ ఎక్కడంతో.. అందులో ఉన్న నాగవీరప్రతాప్రెడ్డి జారి పడ్డాడు. ట్రాక్టర్ ట్రాలీ టైర్ తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. వీరప్రతాప్రెడ్డి ఇంటర్ చదువుతూ కూలీ పనులకు వెళ్తూ ఉంటాడు. డ్రైవర్కు కనీసం లైసెన్స్ లేదని, అటువంటి వ్యక్తిని డ్రైవర్గా ఎందుకు పెట్టుకున్నారని మృతుడి కుటుంబ సభ్యులు ఆవేదన వెలిబుచ్చారు. ప్రతాప్రెడ్డి తండ్రి ఫిర్యాదు మేరకు ఎస్ఐ శివప్రసాద్ కేసు నమోదు చేసి ట్రాక్టర్ను స్టేషన్కు తరలించారు. ప్రతాప్రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరుకు తీసుకువెళ్లారు. అనంతరం కుటుంబ సభ్యులు నరసన్నపల్లెలో అంత్యక్రియలు చేశారు. పోలీసులు ట్రాక్టర్ ఓనర్, డ్రైవర్పై చర్యలు తీసుకోవాలని మృతుడి తల్లిదండ్రులు కోరుతున్నారు. -
పరీక్షల నిర్వహణకు పకడ్బందీ ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లను పటిష్టంగా చేపట్టాలని జేసీ డాక్టర్ నిధి మీనా సంబంధిత శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ఇంటర్మీడియట్, టెన్త్ క్లాస్ పరీక్షల సన్నద్ధత, మహాశివరాత్రి ఉత్సవాలలో వసతులు, భద్రతా ఏర్పాట్లు, సానుకూల ప్రజా దృక్పథం, డాక్యుమెంట్ అప్ లోడ్, కోర్టు బిల్డింగుల కోసం స్థల సేకరణ, కొత్త జిల్లాల్లో నూతన కోర్టు భవనాల కోసం స్థల సమస్యలు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జూమ్ ద్వారా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరు కాగా, స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జేసీ డాక్టర్ నిధి మీనా హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో జేసీ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్య కార్యదర్శి సూచనల మేరకు జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి, ప్రత్యేక అమలు కార్యక్రమాలతోపాటు ప్రధానంగా పారదర్శకంగా పీజీఆర్ఎస్ అమలు, సజావుగా గ్యాస్ సరఫరా, నాణ్యమైన విద్యుత్ సరఫరా, ప్రజా రవాణా వ్యవస్థలో ప్రయాణికులకు సంతప్తికరమైన సేవలు అందించడం తదితర అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. మహా శివరాత్రి ఉత్సవాల సందర్భంగా జిల్లాలోని 16 ప్రధాన శైవ క్షేత్రాల్లో పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు, ఎలాంటి కొరత లేకుండా వసతులను సమకూర్చేలా రెవెన్యూ, పోలీసు, దేవదాయ శాఖల అధికారులు, ప్రత్యేక అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో సంబందిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జేసీ డాక్టర్ నిధి మీనా -
● నీకు నేను... నాకు నువ్వు..
పుంగనూరు ‘మున్సిపాలిటిలో తాత్కాలిక ఉద్యోగిగా పని చేస్తున్నోడికి ఏముందని నా బిడ్డను ఇచ్చేది... ప్రేమించినంత మాత్రాన నా బిడ్డను ఇవ్వాలని రూల్ ఉందా.. ’ అని బాలిక తండ్రి అడ్డు చెప్పినా ఆ ప్రేమజంట వివాహం చేసుకుని నేడు ఆదర్శంగా నిలిచారు. పుంగనూరు పట్టణానికి చెందిన బి.నరేంద్రరాజు మున్సిపాలిటీలో రెవెన్యూ ఇన్స్స్పెక్టర్గా పని చేస్తున్నారు. ఆయనకు 1996లో కర్ణాటకకు చెందిన ఎస్ఐ గోపాలక్రిష్ణ కుమార్తె శిల్పతో పరిచయం ఏర్పడింది. ఆమె బంధువుల ఇంటికి వచ్చేది. అలా పుంగనూరుకు వచ్చివెళ్తుండగా పరిచయం కాస్తా పెరిగి పెద్దదై ప్రేమలో పడ్డారు. కులాలు ఒకటైనా పెద్దలు స్థాయీబేధాలతో ప్రేమజంటను విడదీశారు.ఏడాది పాటు పోరాటం సాగించారు. చివరకు ప్రేమే జయించింది. 1997 జూన్ 27న అతికష్టం మీద వివాహం జరిగింది. అదే ఏడాది నరేంద్రరాజుకు ఉద్యోగం పర్మినెంట్ అయింది. దీంతో ఆ కుటుంబంలో సంతోషానికి అవధులు లేకుండా పోయింది. ఇద్దరు కుమారు లు పునీత్రాజు,మనోజ్రాజుతో ప్రస్తుతం ఆ ప్రేమజంట సంతోషంగా జీవిస్తూ, ఆదర్శంగా నిలిచారు. –నరేంద్ర, శిల్పా, పుంగనూరు -
రౌద్రాయ.. వీరభద్రాయ..
● వైభవంగా బ్రహ్మోత్సవాలు ప్రారంభం ● వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారికి విశేష పూజలు ● భక్తిశ్రద్ధలతో ధ్వజారోహణం ధ్వజారోహణం నిర్వహిస్తున్న అర్చకులు, ప్రత్యేక అలంకరణలో వీరభద్రస్వామి, భద్రకాళీ అమ్మవారు రాయచోటి టౌన్ : ‘భద్రకాళీ ప్రియాయ.. రౌద్రాయ.. వీరభద్రాయ నమః’ అంటూ భక్తులు భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. తమను చల్లగా చూడాలని వారు స్వామి, అమ్మవారిని వేడుకున్నారు. రాయచోటిలో శ్రీ భద్రకాళీ సమేత వీరభద్రస్వామి బ్రహ్మోత్సవాలు శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభం అయ్యాయి. తెల్లవారుజామున ఆలయ పాలక మండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో వేదపండితులు నర్రావెంకట భాస్కర్ సిద్ధాంతి నేతృత్వంలో ఆయన శిష్యులు (రుత్వికులు), ఆలయ ప్రధాన అర్చకులు యాగశాలలో హోమాలు నిర్వహించారు. ముందుగా మహాగణపతి పూజ నిర్వహించి తరువాత హోమం చేశారు. అక్కడి నుంచి కలశపూజతో స్వామివారికి సమర్పించారు. తరువాత స్వామి, అమ్మవారికి విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి, అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. బంగారు ఆభరణాలతోపాటు వెండి కిరీట ధారణతో అందంగా అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. వస్త్రాలు అందజేత బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(అర్చకులు, రుత్వికుల)కు ఆలయ సంప్రదాయం ప్రకారం వస్త్రాలు అందజేశారు. వేదపండితుల మంత్రోచ్చారణల మధ్య స్వామివారి ఆజ్ఞ పొందుతూ ఆ వస్త్రాలను వారికి అందజేశారు. వాటిని ధరించిన తరువాత పూజలకు సిద్ధమయ్యారు. కంకణధారణ స్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వాహకుల(ఆలయ పాలక మండలి సభ్యులు, అధ్యక్షుడు, మహానైవేద్య నిర్వాహకులు, రుత్వికులు, ప్రధాన అర్చకుల)కు కంకణధారణ చేశారు. వేదపండితుల మంత్రోచ్చారణ మధ్య ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కంకణధారణ చేసిన వారు నియమనిష్టలతో బ్రహ్మోత్సవాలు విజయవంతంగా ముగిసే వరకు ఆలయ ప్రాంగణాన్ని విడిచి వెళ్లకూడదని వేదపండితులు వెల్లడించారు. శైవాచారం ప్రకారం ధ్వజారోహణ వీరశైవాచారం ప్రకారం కంకణధారణ చేసిన బ్రహ్మోత్సవాల నిర్వాహకులు శైవ ఆగమనం ప్రకారం.. రుత్వికులు శ్రీ వీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాల నిర్వహణకు నందీశ్వరుడి ద్వారా పరమ శివుడి ఆజ్ఞ కోరుతూ విన్యాసాలు ప్రదర్శించారు. వారితోపాటు కన్నడ భక్తులు, స్థానిక భక్తులు నిర్వహించిన విన్యాసాలు భక్తులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అనంతరం నందీశ్వరుడిని వస్త్రంపై చిత్రీకరించి ధ్వజారోహణ చేశారు. దీంతో శ్రీవీరభద్రస్వామి వారి బ్రహ్మోత్సవాలు ప్రారంభం అయ్యాయి. అనంతరం భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. -
ధర లేక ...
శనగ పంటకు సరైన ధర లేదు. క్వింటా రూ. 4800 నుంచి రూ. 5100 పోతుంది. దీంతో చేసేందేమి లేక సంచుల్లో నింపుకుని ఇళ్లలో వేసుకుంటున్నాం. సంచుల్లో నింపినందుకు, తూకం వేసినందుకు ఒక్కో క్వింటాపైన వంద రూపాయల ఖర్చు వస్తుంది. మద్దతు ధర ఉంటే ఈ ఖర్చు తగ్గేది. పది రూపాయలు వచ్చేది. – బోధం కుళ్లాయిరెడ్డి, మాలేపాడు గ్రామం, ఎర్రగుంట్ల మద్దతు ధరతో కొనుగోలు చేయాలి 7 ఎకరాల్లో శనగ పంటను సాగు చేశాను, ప్రస్తుతం ఒకటిన్నర ఎకరాలో కొత కోశాను. ఎకరాకు 10 క్వింటాళ్లు చొప్పున దిగుబడి వచ్చింది. కానీ ధర మాత్రం బాగా లేదు. ప్రభుత్వం మద్దతు ధరతో రైతుల నుంచి శనగలను కోనుగోలు చేయాలి. లేకుంటే నష్టపోతారు. –శివరామిరెడ్డి,కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం ప్రభుత్వ నిర్ణయం సరికారు ప్రభుత్వం శనగ సాగు చేసిన ప్రతి రైతు నుంచి పంట కొనుగోలు చేయాలి. కానీ అలాకాకుండా ప్రతి గ్రామంలో 50 మంది చొప్పున ప్రతి రైతు నుంచి 25 క్వింటాళ్లు లేదా 5 ఎకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు సంబంధించిన దిగుబడిని మాత్రమే కొనుగోలు చేస్తామని పేర్లు నమోదు చేయించుకుంది. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. – దస్తగిరి రెడ్డి, జిల్లా రైతు సంఘ నాయకులు. -
ద్విచక్రవాహనం ఢీకొని వ్యక్తి మృతి
లింగాల : మండల పరిధి ఇప్పట్ల గ్రామ సమీపంలోని బీఆర్ అంబేడ్కర్ గురుకుల పాఠశాల వద్ద ద్విచక్ర వాహనం ఢీ కొని షేక్ ఆలీ మౌలా(58) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ జగదీశ్వరరెడ్డి కథ నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శుక్రవారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ఇప్పట్ల గ్రామ సమీపంలోని సింహాద్రిపురం మండలం అంకాలమ్మ గూడూరు గ్రామానికి చెందిన రామచంద్రారెడ్డి పొలానికి కాపలాగా ఉన్న ఆలీ మౌలా.. పొలం నుంచి పార్నపల్లె – పులివెందుల ప్రధాన రహదారిపైకి వచ్చి నడుచుకుంటూ వెళ్తున్నాడు. అదే సమయంలో కోమన్నూతల గ్రామానికి చెందిన గంట వెంకట శివ మరో ఇద్దరు ఒకే మోటారు సైకిల్పై అతి వేగంగా పులివెందులకు వెళ్తూ ఆలీ మౌలాను వెనుక వైపు నుంచి ఢీకొన్నారు. దీంతో ఆలీ రోడ్డుపై బోర్లపడి నుదిటికి బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. ఆలీ మౌలాను ప్రైవేట్ వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. ద్విచక్రవాహనం పూర్తిగా దెబ్బతినగా, వాహనం నడుపుతున్న వెంకట శివ గాయాలపాలయ్యాడు. దీనిపై మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన డీఎస్పీ శుక్రవారం సాయంత్రం పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐ ఎన్వీ రమణ, ఎస్ఐ జగదీశ్వరరెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ద్విచక్రవాహనదారులు విధిగా హెల్మెట్ ధరించాలని డీఎస్పీ సూచించారు. కార్యక్రమంలో లింగాల పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
రైతుకేదీ శనగ!
కడప అగ్రికల్చర్: శనగ రైతును ధరాఘాతం వెంటాడుతోంది. ఆరుకాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకుందామంటే ధర లేదు. ఈ తరుణంలో ఆదుకోవాల్సిన ప్రభుత్వం పట్టీపట్టనట్లు వ్యవహరిస్తోంది. దిగుబడులు అరంభమైనా ఇంత వరకు శనగ కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేయకుండా కూటమి సర్కార్ చేష్టలుడిగి చూస్తోంది. దీంతో రైతులు దళారులకు పంటను అప్పజెప్పి నష్టాలను మూటగట్టుకుంటున్నారు. శనగకు మద్దతు ధర కేంద్ర ప్రభుత్వం రూ.5875 కేటాయించగా దళారీలు మాత్రం నాణ్యతను బట్టి క్వింటా రూ.4800 నుంచి 5100 తో కోలుగోలు చేసి రైతులకు శఠగోపం పెడుతున్నా చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడంలేదని రైతులు, రైతుసంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ● జిల్లాలో ఈ ఏడాది రబీ సీజన్కు సంబంధించి సాధారణ సాగు 79613 హెక్టార్లుకాగా 75775 హెక్టార్లలో శనగపంట సాగైంది. ప్రస్తుతం కోతలు ప్రారంభమయాయి. దిగుబడులు కూడా ఆశాజనకంగానే ఉన్నాయి. కానీ రైతులకు మద్దతు ధర కరువైంది. కేంద్ర ప్రభుత్వం శనగలకు రూ. 5875 మద్దతు ధర ప్రకటించింది. పోనీ ఆఽ ధరకై నా అమ్ముకుందామంటే ఎక్కడ ఇంత వరకు చంద్రబాబు ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయలేదు. జిల్లాలో శనగపంట రబీ సీజన్లో నల్లరేగడి భూముల్లో అత్యధికంగా సాగు చేస్తారు. కేవలం మంచు ప్రభావంతో పూర్తయ్యే పంటను జిల్లాలో పెద్దముడియం, జమ్మలమడుగు, మైలవరం, వీఎన్పల్లి, రాజుపాలెం, దువ్వూరు, వేములు, వేంపల్లె మండలాల్లో ఈ ఏడాది అత్యధికంగా సాగు చేశారు. ఈ ఏడాది జిల్లాలో జేజే –11 అత్యధికంగా సాగు చేశారు. ఒకటి రెండు నీటి తడులతో ఈ ఏడాది ఎకరాకు 8 నుంచి 11 క్వింటాళ్ల వరకు దిగుబడి వస్తున్నట్లు రైతులు తెలిపారు. రాసిపోసిన శనగలు ఈ ఏడాది జిల్లాలో శనగ విస్తీర్ణంతోపాటు దిగుబడి కూడా పెరిగింది. దీంతో రైతులు సంతోషపడుతున్నారు. ధర బాగా ఉటుందని ఆశ పడ్డారు. కానీ పంట చేతి కోచ్చే సరికి చంద్రబాబు సర్కార్ కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకుండా నిమ్మకు నీరెత్తినట్లు ఉండిపోయింది. దీంతో చేసేందేమిలేక చాలా మంది పొలంలోనే దళారీలకు అమ్ముకుంటున్నారు. వాళ్లు క్వింటాకు 4800 రుపాయల నుంచి నాణ్యతను బట్టి రూ. 5100 కొనుగోలు చెల్లిస్తున్నట్లు రైతులు తెలిపారు. కేంద్ర ప్రభుత్వమేమో రైతులకు క్వింటా మద్దతు ధరను 5875 రుపాయలు ప్రకటిస్తే కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయని కారణంగా క్వింటాపై 800 నుంచి 1000 రుపాయల తగ్గించి దళారీల చేతులో పెడుతున్నారు. అంటే ఒక్కో ఎకరాపైన రూ.8000 వేల నుంచి 10 వేలకుపైగా రైతులు నష్టపోతున్నారు. మద్దతు ధర వచ్చే వరకు పంట నిల్వ ఉంచుదామంటే సరైన వసతులు లేవు. దీంతో చేసేదేమి లేక ఎంతకు పడితే అంతకు అమ్ముకుంటున్నారు. దీనికితోడు గింజ నాణ్యత, తేమశాతం పేరు చెప్పి క్వింటాకు అదనంగా రెండుమూడు కింటాలు దండుకుంటున్నారని పలువురు రైతులు వాపోతున్నారు. -
నాడు– నేడు పనులు పూర్తి చేయాలి
ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన నాడు–నేడు పథకం కింద పెండింగ్లో ఉన్న పనులను పూర్తి చేయాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. శుక్రవారం శాసనమండలిలో ఆయన మాట్లాడుతూ నాడు–నేడు కింద పాఠశాలల భవనాలు 90 శాతం పూర్తయ్యాయని, కిటికీలు, ఎలక్ట్రిక్ ఫిట్టింగులు పూర్తి చేస్తే సరిపోతుందన్నారు. ఇందుకు సంబంధించిన నిధులు కూడా హెడ్మాస్టర్ అకౌంట్లలో ఉన్నాయన్నారు. ప్రభుత్వం ఆదేశాలిస్తే వారు ఆ పనులు పూర్తి చేస్తారని తెలిపారు. అలాగే మూడేళ్లలో 70 వేల మంది విద్యార్థులు ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేటు స్కూళ్లకు పోయారని తెలిపారు. విద్యాహక్కు చట్టం ద్వారా ప్రభుత్వ స్కూళ్లలో చదువుతున్న వారిని ప్రైవేటు స్కూళ్లలో చేర్పిస్తున్నారని, వారికి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ కూడా ఇస్తోందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గుతుందని గుర్తించి తమిళనాడు, తెలంగాణ ప్రభుత్వాలు దీన్ని పక్కన పెట్టాయని గుర్తు చేశారు. విద్యాహక్కు చట్టాన్ని పునఃపరిశీలన చేయాలని కోరారు. -
హామీలు నెరవేర్చకపోతే ఆందోళనలు ఉధృతం
కడప సెవెన్రోడ్స్ : ఎన్నికల సమయంలో ఉపాధ్యాయులు, ఉద్యోగులకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఇచ్చిన హామీలు ఉల్లంఘించడాన్ని నిరసిస్తూ ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కడప కలెక్టరేట్ ఎదుట మహా ధర్నా నిర్వహించారు. ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు ఎన్. సంగమేశ్వరరెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయ వర్గాలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నాయి. ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నినాదాలు చేశారు. కూటమి ప్రభుత్వం ఎన్నికల మ్యానిఫెస్టోలో ప్రకటించిన హామీలు తక్షణమే అమలుచేయాలని డిమాండ్ చేశారు. 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలన్నారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఆందోళనలు ఉధృతం చేస్తామని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. ఈనెల 25న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు ఇలియాస్బాషా, జిల్లా ప్రధాన కార్యదర్శి కె.పాలకొండయ్య, కడప యూనిట్కు చెందిన వి.షుగుప్తా యాస్మిన్, చప్పిడి సుభాషిణి, రాష్ట్ర నాయకులు కృష్ణారెడ్డి, వేణుగోపాల్రెడ్డి, దాదాపీర్, భాస్కర్, సురేష్బాబు, జయరామయ్య, సుబ్రమణ్యం, రమణారెడ్డి, చెన్నకేశవరెడ్డి, శివారెడ్డి, రామచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడపలో ఎస్టీయూ మహా ధర్నా -
మృత్యువుతో పోరాడి.. హెడ్మాస్టర్ మృతి
● వృత్తి పరమైన ఒత్తిళ్లా? కుటుంబ సమస్యలా? ● దర్యాప్తు చేస్తున్న పోలీసులు కడప అర్బన్ : కడప నగరంలో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన హెడ్మాస్టర్ జింకా జమీమా సుందరం(49) వారం రోజులుగా మృత్యువుతో పోరాడి.. చివరికి మృతి చెందింది. వన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని గాంధీనగర్ స్కూల్ సమీపంలో నివాసం ఉంటున్న జింకా జమీమా సుందరం ఈ నెల 6న ఉదయం ఇంటిలో ఎవరూ లేరు సమయంలో ఉరేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శుక్రవారం మధ్యాహ్నం వరకు హెడ్మాస్టర్ మృత్యువుతో పోరాడి కడప రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటన జరిగిన రోజున ఆమె తండ్రి జింకా సామెల్, భర్త పుష్పరాజ్ ఫిర్యాదు మేరకు అదే రోజున కడప వన్టౌన్ సీఐ వి.చిన్న పెద్దయ్య కేసు నమోదు చేసి, విచారణ చేపట్టారు. ఈ క్రమంలో హెడ్మాస్టర్ జింకా జమీమా సుందరం ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ పరిస్థితి విషమించడంతో ఈ నెల 12వ తేదీ రాత్రి 11:50 సమయంలో కడప రిమ్స్ ఆసుపత్రికి మెరుగైన చికిత్స కోసం తరలించారు. చికిత్స పొందుతూ 13వ తేదీన మధ్యాహ్నం మృతి చెందింది. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో ఉంచారు. ప్రస్తుతం మృతురాలి భర్త, బంధువుల స్టేట్మెంట్లను రికార్డ్ చేసి, మృతదేహానికి శనివారం పోస్టుమార్టం నిర్వహించనున్నారు. తర్వాత పోలీసులు సమగ్రంగా దర్యాప్తు చేపట్టి చట్టపరంగా చర్యలు తీసుకోనున్నారు. కాగా ప్రధానోపాధ్యాయురాలు మృతి పట్ల పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆమె తమ వృత్తిలో ఇన్చార్జ్ హెడ్మాస్టర్గా బాధ్యతలను చేపట్టినప్పటి నుంచి ఎదుర్కొన్న ఒత్తిళ్లకు మానసికంగా తీవ్ర ఆవేదన చెంది ఈ చర్యకు పాల్పడిందా? లేక కుటుంబ సమస్యల వల్ల ఈ అఘాయిత్యం చేసుకుందా? లేక ఈ రెండు సమస్యలను అధిగమించలేక ఇలా చేసుకుందా? అనే అంశాలపై పోలీసు అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టాల్సి ఉంది. -
అద్దాల షాపులో చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డులో చందమామ డాబా సమీపంలో ఉన్న అద్దాల షాపులో శుక్రవారం అర్ధరాత్రి సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. జీవనోపాధి కోసం శ్రీకాకుళం జిల్లా కొవ్వాడ గ్రామానికి చెందిన పాపారావు 15 ఏళ్ల క్రితం పులివెందులకు వచ్చి అద్దాలు, టోపీలు, హెల్మెట్లు అమ్ముకుంటూ జీవనం గడుపుతున్నాడు. అద్దాలు, టోపీలు అమ్మిన వచ్చిన డబ్బులతో తమ పిల్లలను చదివించుకుంటూ ఇక్కడే స్థిరపడ్డాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం ఐదుగురు యువకులు ఆటోలో వచ్చి కడప రోడ్డులో ఉన్న అద్దాల షాపును పగులగొట్టి అందులోని టోపీలు, ఇళ్ల అద్దాలు, హెల్మెట్లు అపహరించి తీసుకెళ్లారు. వీటి విలువ సుమారు రూ.30 వేలు ఉంటుందని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. అద్దాల షాపును పగులగొడుతుండగా.. పక్కనే ఉన్న కల్యాణ మండపం సిబ్బంది కేకలు వేయడంతో ఆటోలో వచ్చిన యువకులు షాపులో ఉన్న అద్దాలు, టోపీలు, హెల్మెట్లు తీసుకుని పారిపోయారు. దీంతో బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. పులివెందులలో ఆగని చోరీలు పులివెందుల పట్టణంలో ఏదో ఒక ప్రాంతంలో చోరీలు జరుగుతూనే ఉన్నాయి. పట్టణంలోని మారుతి హాలు, ఎస్బీఐ కాలనీ, నగరిగుట్ట ప్రాంతాలలో గత మూడు రోజుల నుంచి వరుసగా ద్విచక్ర వాహనాలు చోరీకి గురవుతూనే ఉన్నాయి. శుక్రవారం కూడా కడప రోడ్డులోని ఓ అద్దాల షాపులో కొంత మంది యువకులు ఆటోల్లో వచ్చి షాపులోని అద్దాలు, హెల్మెట్లు, టోపీలు అపహరించి తీసుకెళ్లారు. ఇలా పట్టణంలో ఏదోక చోట చోరీలు జరుగుతూనే ఉన్నాయని ప్రజలు భయాందోళన చెందుతున్నారు. వరుసగా చోరీలు జరుగుతున్నా సంబంధిత పోలీసు అధికారులు.. దొంగలను పట్టుకోవడంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేకాక శ్రీరామ హాల్ రోడ్డులో రోడ్లపై ఉన్న కారు అద్దాలు కూడా పగలగొడుతూ కొంత మంది యువకులు వికృత చేష్టలు చేస్తున్నారని ప్రజల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా సంబంధిత పోలీసు అధికారులు రాత్రి సమయంలో గస్తీ నిర్వహించాలని స్థానికులు కోరుతున్నారు. రూ.30 వేల వస్తువుల అపహరణ -
పొలతలలో నేటి నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు
పెండ్లిమర్రి: జిల్లాలో ప్రసిద్ధి పొందిన శైవ క్షేత్రాలల్లో ప్రముఖమైనది పొలతల క్షేత్రం. మహాశివరాత్రి పర్వదినం సందర్భంగా పొలతల క్షేత్రంలో శనివారం నుంచి మూడు రోజుల పాటు ఉత్సవాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ చైర్మన్ రాజారెడ్డి, ఈఓ కృష్ణానాయక్లు తెలిపారు. క్షేత్రానికి వచ్చేభక్తులకు ఎలాంటి అసౌకర్యాలు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామన్నారు. భక్తుల సౌకర్యార్థం ఆర్టీసీ అధికారులు కడప,పులివెందుల, ప్రోద్దుటూరు, రాయచోటి డిపోల నుంచి బస్సు సర్వీస్లను కేటాయించారన్నారు. ఉత్సవాలకు ట్రాఫిక్, అసాంఘిక కార్యాకలాపాలు, జరగకుండా ఉండేందుకు జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షణలో రూరల్ సీఐ చల్లని దొర, ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఆధ్వర్యంలో గట్టి పోలీసు బందో బస్తు ఏర్పాటు చేశారన్నారు.ఉత్సవ ఏర్పాట్లను ఆర్డీఓ జాన్ ఇర్విన్ శుక్రవారం పర్యవేక్షించారు. శనివారం ఉదయం స్వామివారికి వేదపండితుల ఆధ్వర్యంలో గణపతి పూజ, ఆకుపూజ, కుంకుమార్చనలతో ఉత్సవాలు ప్రారంభవపుతాయన్నారు. ఆదివారం చండీ హోమం, పూర్ణాహూతి, రథ ప్రతిష్ట, కుంకుమార్చన అనంతరం ఉదయం 10గంటల నుంచి ముత్యాల తలంబ్రాలతో శివపార్వతుల కళ్యాణం, రాత్రి 10 గంటలకు రథోత్సవం నిర్వహించనున్నట్లు చెప్పారు. సోమవారం ముగింపు కార్యక్రమాలు ఉంటాయన్నారు. -
సమీక్షకే సమయం లేదా!
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాల గడువు సమీపిస్తోంది. సరిగ్గా మరో 45 రోజుల్లో ఉత్సవాలకు శ్రీకారం జరగనుంది. రెండు తెలుగు రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్త జనం తరలిరానుంది. పైగా రాష్ట్ర ప్రభుత్వ లాంఛనాలతో జరిగే బ్రహ్మోత్సవ వేడుక ఇది. ఇంతటి మహోత్సవంపై ఉన్నత స్థాయి అధికారులు ఇంతవరకు సన్నాహాక సమీక్షలు నిర్వహించక పోవడంపై భక్తులు నిట్టూర్చుతున్నారు. ఇది టీటీడీ అధికారుల నిర్లక్షాన్ని చూపుతోందని పలువురు విమర్శిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా పలు ఆలయాల ఉత్సవాల్లో ముందస్తు చర్యల్లేక భక్తులు తీవ్ర ఇబ్బందులు పడుతున్న సంఘటనలు.. మృత్యువాత పడుతున్న ఘటనలను ఉటంకిస్తున్నారు. ● ఒంటిమిట్టలో శ్రీ కోదండ రామాలయం వార్షిక బ్రహ్మోత్సవాలను మార్చి 26న అంకురార్పణ చేయనున్నారు. ఏప్రిల్ 5వ తేది వరకు నిర్వహించాలని ఇప్పటికే అధికారికంగా అనుమతిచ్చారు. సరిగ్గా 42 రోజుల సమయం ఉంది. గతంలో ఏటా మూడు నెలల ముందు నుంచి బ్రహ్మోత్సవాలు వచ్చే వరకు నెలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించే వారు. ఈ ఏడాది ఇంతవరకు ఉన్నతాధికారులతో ఒక్క సమావేశం కూడా నిర్వహించలేదు. ఈపాటికి కల్యాణ వేదిక వద్ద బ్రహ్మోత్సవాల ఏర్పాట్లు మొదలయ్యేవి. సీతారాముల కళ్యాణ వేదిక ప్రాంగణంలో కంపచెట్లు, కలుపు మొక్కలు తొలగించి, చదును చేసేందుకు గుత్తపత్రాలు ఆహ్వానించినా, ఇంకా తుది నిర్ణయం తీసుకోలేదు. ఇక్కడ ఇంకా ఎలాంటి పనులు ప్రారంభం కాలేదు. మొక్కలను తొలగించి చదును చేయాల్సి ఉంటుంది. వాహనాలను నిలిపేందుకు ప్రత్యేకంగా స్థలాన్ని ఎంపిక చేసి, అక్కడ శుభ్రం చేయాల్సి ఉన్నా కదలిక లేదు. విద్యుత్ నియంత్రికలు అమర్చాలి, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలి. భద్రతపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి, తాగునీరు, సేవకులకు భోజన వసతి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అలంకరణలు, విద్యుత్ కాంతులు, స్వాగత తోరణాలు ఏర్పాటు, ప్రసాదం పంపిణీ, పారిశుధ్యం, వైద్య సేవలు, క్యూలైన్లు వంటి అంశాలు చర్చకు రావాల్సి ఉంది. ఉత్సవాల వేల విధులు నిర్వహించే ఉద్యోగులు, సిబ్బంది, సేవకులకు బస వసతి కల్పించడంపై శ్రద్ధ వహించాల్సి ఉంది. నెలన్నర రోజుల్లో ఒంటిమిట్ట బ్రహ్మోత్సవాలు గోడ, కర, ఆహ్వాన పత్రాల ఊసే లేదు? కల్యాణ వేదిక ప్రాంగణమంతా పిచ్చిమొక్కలే ఇదీ కోదండ రాముడి ఉత్సవ ఏర్పాట్ల తీరు ఒంటిమిట్ట రామయ్య బ్రహ్మోత్సవ వేడుకల సమాచారాన్ని దశదిశలా తెలిపేలా విస్తృతంగా ప్రచారం చేయాలని టీటీడీ నిర్ణయం తీసుకుంది. ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణానికి తలంబ్రాలు అందజేసేందుకు చిరు సంచులు, రాములోరి పరిణయ ఘట్టాన్ని కనులారా వీక్షించేందుకు వచ్చే లక్షలాది మంది భక్తులకు ప్యాకెట్లలో తలంబ్రాలు నింపి అందిస్తామని అధికారులు చెబుతున్నారు. గోడపత్రాలు, ప్రముఖులకు ఆహ్వాన పుస్తకాలు(వీఐపీ, వీవీఐపీ), రంగుల కరపత్రాలు, ప్రత్యేక ఆహ్వానాలు పత్రాలు వేల సంఖ్యలో ముద్రించేందుకు టీటీడీ నిర్ణయం తీసుకుందని చెబుతున్నా... గోడ, కర, ప్రచార పత్రాలు ఇంకా ఇక్కడికి చేరలేదు. సాధారణంగా గత వేడుకల్లో జరిగిన తప్పిదాలను మరలా జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉన్నతాధికారులు సమీక్షించాల్సి ఉంది. సమీక్షలే చేయకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిలువుటద్దంగా మారింది. ఏటా ఉత్సవాలు ప్రారంభమవడానికి ముడు నెలల ముందే ఒంటిమిట్టలో చేపట్టాల్సిన అభివద్ధి పనులు, బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఉన్నతాధికారుల పర్యవేక్షణ, సమీక్ష నిర్వహిస్తూ వచ్చేవారు. లోటు పాట్లు లేకుండా ముందస్తుగా కసరత్తు చేసి, విజయవంతం చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించి, ఆ దిశగా అడుగులేసేవారు. ఈ దఫా ఎందుకనో బ్రహ్మోత్సవాల ఏర్పాట్లపై ఇక్కడికి జేఈవో, ఈవో ఉన్నత స్థాయి అధికారులెవరూ రాలేదు. -
వైఎస్సార్సీపీలో పలువురికి పదవులు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన పలువురిని వివిధ హోదాలలో నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్పార్సీపీ ఆర్గనైజేషనల్ సెక్రటరీగా ఇందిరెడ్డి రాజశేఖర్రెడ్డి(కమలాపురం), విశ్వబ్రాహ్మణ విభాగం అధ్యక్షుడిగా గొడ్లవీటి సుబ్రమణ్యం(మైదుకూరు), జిల్లా విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శిగా పి. మహేశ్వర్రెడ్డి, జిల్లా వలంటీర్స్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా కె. బయక్రిష్ణారెడ్డి, జిలాల మున్సిపల్ విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా షేక్ మహ్మద్ వారిష్, జిల్లా రైతు విభాగం ఎగ్జిక్యూటివ్ మెంబర్గా ఎల్. వెంకట సుబ్బారెడ్డి(కమలాపురం)లను నియమించారు. బద్వేల్ నియోజకవర్గ పరిశీలకుడిగా మల్లికార్జునరెడ్డి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులుగా ఉన్న అబ్బిగారి మల్లికార్జునరెడ్డిని బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గ పరిశీలకులుగా నియమించారు. ఈ మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కమలాపురం నియోజకవర్గానికి చెందిన ఈయన గతంలో ఏపీఎస్ఆర్టీసీ చైర్మన్గా పనిచేశారు. మదనపల్లె సిటీ: శాప్ ఆధ్వర్యంలో జిల్లా క్రీడా ప్రాఽధికార సంస్థ నిర్వహించే జిల్లా స్థాయి చెస్ బాల,బాలికల జట్ల ఎంపికలు ఈనెల 17న నిర్వహిస్తున్నట్లు డిఎస్డీఏ చంద్రశేఖర్ తెలిపారు. ఈ పోటీలు మదనపల్లెలోని విజయభారతి ఇంగ్లీష్ మీడియం స్కూల్లో అండర్–13,15,17,19 జట్ల ఎంపికలు జరుగుతాయన్నారు. ఎంపికై న జట్లు జిల్లాకు ప్రాతినిధ్యం వహిస్తూ రాష్ట్ర స్థాయి శాప్ లీగ్ టోర్నమెంట్ల్లో పాల్గొంటాయన్నారు. రాష్ట్రస్థాయి టోర్నమెంట్ ఫిబ్రవరి 21,22 తేదీల్లో తిరుపతిలో జరుగుతుందని తెలిపారు. మరిన్ని వివరాలకు రవీంద్రనాథ్ ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 8639957954, మస్తాన్, సీనియర్ అసిస్టెంట్ 7386901200 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
ఉద్యోగుల బకాయిలు విడుదల చేయాలి
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో ప్రభుత్వ ఉద్యోగులు, పెన్షనర్లకు సంబంధించి రూ.40వేల కోట్ల బకాయిలు ప్రభుత్వం విడుదల చేయాలని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కోరారు. గురువారం శాననమండలిలో ఆయన ఉద్యోగుల సమస్యలను లేవనెత్తారు. 12వ పీఆర్సీ నియామకం ఇంకా పూర్తి కాలేదని, దీనితోపాటు మధ్యంతర భృతి చెల్లింపుపై కూడా ఉద్యోగులు ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నారన్నారు. వారికి 4 డీఏలు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఉద్యోగ విరమణ చేసిన ఉద్యోగులకు అందాల్సిన గ్రాట్యూటీ, పెన్షన్ బకాయిలు, ఇతర బెనిఫిట్లు భారీగా పెండింగ్లో ఉన్నాయన్నారు. మెడికల్ రీయింబర్స్మెంట్, టీఏ, సరెండర్ లీవుల బకాయిలు ఇంకా పూర్తిగా పరిష్కారం కాలేదన్నారు. గ్రంథాలయ సిబ్బందికి రెండు నెలలుగా వేతనాలు, పింఛన్లు పెండింగ్లో ఉన్నాయని ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. జనవరి 2024 నుంచి సెప్టెంబర్ 2025 వరకూ ఉన్న 3.64 శాతం డీఆర్ బకాయిలను ఏప్రిల్ 2026 నుంరరి విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం ప్రకటించిందని, కానీ ఇంతవరకూ చెల్లించలేదన్నారు. ఈ బకాయిలన్నీ ప్రభుత్వం వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
ఈ సారైనా నిధులిస్తారా!
కడప సిటీ: జిల్లాలోని సాగు,తాగునీటిప్రాజెక్టులపై ‘పచ్చ’నీడ కమ్ముకుంది. ‘పైసల్లేక..’ పనులు జరగడమే గగనమైంది. ఫలితంగా జిల్లాలో పెండింగ్ ప్రాజెక్టుల పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా తయారైంది. రాయలసీమ ఎత్తిపోతల పథకానికి ఎగనామం పెట్టిన చంద్రబాబు ప్రభుత్వం జిల్లాలోని మిగతా ప్రాజెక్టుల ఉన్నతినీ గాలికొదిలేసింది. ముఖ్యమంత్రి చంద్రబాబేమో ప్రతి సమావేశంలో రాయలసీమలో ప్రతి ఎకరాకు నీరందిస్తామని డప్పు కొడతారు. వాస్తవ రూపం లో అది అమలు కావడం లేదు. ● రాజంపేట పరిధిలో ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం అతీగతీ లేకుండా పోయింది. కమిటీలతో కాలయాపన చేసి మళ్లీ కొత్త టెండరు పిలువడంగానీ లేదా అదే కాంట్రాక్టర్కు అప్పగించడంగానీ జరగడం లేదు. దీంతో ప్రాజెక్టు నిర్మాణం అగమ్యగోచరంగా మారింది. జిల్లాలోని ప్రాజెక్టులు శరవేగంగా కొనసాగాలంటే 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరమని నీటిపారుదలశాఖ అధికారులు అంచనా వేశారు. ఈ నేపధ్యంలో జిల్లా ప్రాజెక్టుల సీఈ కార్యాలయం నుంచి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపించారు. 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ కేటాయించే సమయం ఆసన్నమైంది. కనీసం అధికారులు పంపిన నివేదిక ప్రకారం నిధులను మంజూరు చేస్తారా? లేక ఎగనామం పెడతారా? అనేది వేచి చూడాల్సిందే. రాయలసీమ వాసిగా.. సీఎం చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే వట్టి మాటలు చెప్పడం ఆపి.. పెండింగ్ ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేసి నీళ్లు ఇచ్చి సీమ గొంతు తడపాలని ప్రజలు కోరుతున్నారు. అన్నమయ్య కావాలంటే రూ.100 కోట్లు కావాలి అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం కోసం 2021 నవంబరులో అప్పటి వైఎస్ఆర్ సీపీ ప్రభుత్వం రూ. 787.77 కోట్లకు అనుమతులు ఇచ్చి టెండర్లను కూడా పిలిచింది. ఈ పనులను రాఘవ కన్స్ట్రక్షన్స్ సంస్థ దక్కించుకుంది. ఈ సంవత్సరం మార్చి చివరి నాటికి పూర్తి చేయాల్సి ఉంది. ఇప్పటికీ సంబంధించిన డిజైన్పై ఆమోదం లభించకపోవడంతో ప్రాజెక్టుకు బీజం పడలేదు. కమిటీ నెపంతో నీటిపారుదల ఇంజనీరింగ్ శాఖ అధికారులు, సాంకేతిక నిపుణులు పరిశీలించి ప్రాజెక్టు పూర్తికి నిధులు అవసరమని తేల్చడం జరిగింది. 2021 నవంబరు 19న అన్నమయ్య ప్రాజెక్టు మట్టి కట్ట వరదకు గురైంది. స్పిల్వే 94 మీటర్లు దెబ్బతింది. ఇతర ప్రాజెక్టులకు.. మైలవరం జలాశయానికి రూ. 1.60 కోట్లు, ఝరికోనకు రూ. 7 కోట్లు, వెలిగల్లుకు రూ.5.20 కోట్లు, బుగ్గవంక ప్రాజెక్టుకు రూ. 0.20 కోట్లు అవసరమని అధికారులు నివేదించారు. రూ.10 కోట్లు ప్రణాళికేతర పద్దు కింద అవసరమని అధికారులు కోరారు. ఈ నిధులు వస్తేగానీ ఈ పనులు ముందుకు సాగే అవకాశం కనిపించడం లేదు. అలాగే పులివెందుల నియోజకవర్గ ప్రాజెక్టు పనులకు రూ. 430 కోట్లు, దిగువ సగిలేరుకు రూ. 30 కోట్లు అవసరమని అధికారులు ప్రతిపాదనలు పంపారు. జీఎన్ఎస్ఎస్ వరద కాలువ జిల్లాలోని పెండింగ్ ప్రాజెక్టుల పనులపై సర్కార్ నిర్లక్ష్యం ప్రాజెక్టులకు రూ. 3 వేల కోట్లకు పైగా నిధులు అవసరం! బడ్జెట్లో నిధుల కేటాయిస్తారా....ఎగనామం పెడతారా? ఒకవైపు పోతిరెడ్డిపాడు పనులు సాగుతూనే ఉన్నా...అవుకు జలాశయం నుంచి గండికొట సొరంగం వరకు వరద కాలువ, సొరంగం పనులు వైఎస్సార్ సీపీ పాలనలో జరిగాయి. కూటమి హయాంలో సర్వరాయసాగర్, వామికొండ, జీఎన్ఎస్ఎస్ ఫేస్–2 ప్యాకేజీలు ఉండగా, 3–7 వరకు పనుల్లో పురోగతి లేదు. వచ్చే ఆర్థిక సంవత్సరంలో సివిల్ పనులు, భూ సేకరణ, అధికారులు, సిబ్బంది వేతనాలు, పునరావాస కాలనీల్లో మౌలిక వసతుల కల్పనకు నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశారు. ప్రతిపాదనలు అందజేశాం జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు దాదాపు రూ. 3 వేలకోట్లకు పైగా నిధులు అవసరమని ప్రభుత్వానికి నివేదికలు అందజేశాం. నిధులు మంజూరు కాగానే జిల్లాలోని ఆయా ప్రాజెక్టుల పెండింగ్ పనులకు సంబంధించి పనులను శరవేగంతో పూర్తి చేస్తాం. అన్నమయ్య ప్రాజెక్టు కూడా ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే నిర్మాణ పనులు చేపడతాం. –వరప్రసాద్, ప్రాజెక్టుల సీఈ, కడప -
మహాశివరాత్రి ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: మహాశివరాత్రి పర్వదిన మహోత్సవాల సందర్బంగా జిల్లాలోని అన్ని ప్రధాన శైవక్షేత్రాల్లో అన్ని రకాల ఏర్పాట్లు చేశామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని 16 ప్రముఖ శైవక్షేత్రాల్లో మహా శివరాత్రి ఉత్సవాలకు లక్షలాది మంది భక్తులు హాజరవుతారని, తరలివచ్చే భక్తులకు అన్ని రకాల వసతులు, భద్రతా ఏర్పాట్లను కల్పించామని పేర్కొన్నారు. పార్వతీపరమేశ్వరుల కళ్యాణోత్సవాలు, ఊరేగింపు తదితర కార్యక్రమాలను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు దేవాదా య, రెవెన్యూ, పోలీసు శాఖల ద్వారా ఏర్పాట్లను పకడ్బందీగా చేపట్టినట్లు వివరించారు. కలెక్టరేట్లో కంట్రోల్ రూము ఏర్పాటు శైవ క్షేత్రాలకు వచ్చే భక్తులకు సమాచార, సహాయం నిమిత్తం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్ను ఏర్పాటు చేశామని, 21 మంది సిబ్బందితో 3 షిఫ్టుల్లో 24/7 విధులను కేటాయించడం జరిగిందన్నారు. ఈ నెల 15న మహాశివరాత్రి నేపథ్యంలో ఈనెల 14 నుంచి 16వ తేది వరకు 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్ సేవలు ఉంటాయని.. ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ఉత్సవాలకు గట్టి బందోబస్త్ ఏర్పాటు: ఎస్పీ పెండ్లిమర్రి: పొలతల శైవ క్షేత్రంలో మహశివ రాత్రి పర్వదినం సందర్భంగా ఈనెల14వ తేదీ నుంచి మూడు రోజుల పాటు జరిగే ఉత్సవాలకు పటిష్ఠ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అధికారులకు సూచించారు. పొలతల క్షేత్రంలో చేపడుతున్న ఉత్సవాల ఏర్పా ట్లను గురువారం సాయంత్రం పరిశీలించారు. ఈసందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ఉత్సవాలకు వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్కు అంతరాయం కలగకుండా పార్కింగ్ స్థలాన్ని పెంచి వచ్చిన వాహనాలను క్రమ పద్ధతిలో పార్కింగ్ చేయించాలన్నారు. సీసీ కెమెరాలతో నిఘా ఉంచుతూ పర్యవేక్షించాలన్నారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐలు సదాశివయ్య, చల్లని దొర, ఎస్ఐ తులసి నాగప్రసాద్ ఈఓ క్రిష్ణానాయక్ పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప కోటిరెడ్డిసర్కిల్: మహాశివరాత్రిని పురస్కరించుకుని కడప రీజియన్ పరిధిలో వివిధ శైవ క్షేత్రాలకు 347 బస్సులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి తెలిపారు. రీజియన్ పరిధిలోని పొలతలకు 165, నిత్యపూజకోన 52, లంకమల 38, బి.మఠం 17, హత్యరాల 22, జ్యోతి క్షేత్రానికి 6 బస్సులతోపాటు ఇతర శైవ క్షేత్రాలకు 47 బస్సులు నడుస్తాయన్నారు. భక్తులు ఆర్టీసీ బస్సులను సద్వినియోగం చేసుకోని శివయ్య కృపను పొందాలని సూచించారు. -
ఆల్మట్టి ఎత్తు పెంపును చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నంగా కర్ణాటక ప్రభుత్వం ఆల్మట్టి డ్యాం ఎత్తును పెంచి నీటిని నిలువ చేసి దిగువ రాష్ట్రాల నీటి వాటాను గండి కొట్టడాన్ని చంద్రబాబు ప్రభుత్వం అడ్డుకోవాలని, లేకపోతే నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని సీపీఐ జిల్లా కార్యదర్శి జి. చంద్ర పేర్కొన్నారు. బుధవారం కడపలో విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ 75 శాతం నీటి లభ్యత ఆధారంగా బచావత్ ట్రిబ్యునల్ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్కు ప్రాజెక్టుల వారీగా 811 టీఎంసీలు, కర్ణాటకకు 734 టీఎంసీలు, మహారాష్ట్రకు 585 టీఎంసీలు కేటాయించగా, మిగులు జలాలను వాడుకునే వెసులుబాటును దిగువ ఆంధ్రప్రదేశ్కు కల్పించిందన్నారు. కర్ణాటక ప్రభుత్వం మొదటినుంచి తమ కేటాయించిన నీటిని వాడుకున్న తర్వాతే దిగువ ప్రాంతానికి విడుదల చేస్తామంటూ వితండవాదానికి దిగుతోందని, అయితే ఈ వాదన బచావత్ ట్రిబ్యునల్ తీర్పుకు భిన్నమైనదని ట్రిబ్యునల్ తోసి పుచ్చిందన్నారు.ఎగువ రాష్ట్రాలు ఇష్టారాజ్యంగా కేటాయింపులకు భిన్నంగా నీటిని తరలించుకుని పోతుంటే కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి రాష్ట్ర ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబు ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తే మరో మారు హక్కులు అవకాశాలు కోల్పోయిన రాయలసీమ శాశ్వత ఎడారి కావడం తథ్యమన్నారు. కేంద్రంలో, రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పటికీ రాష్ట్రానికి ఏ విధమైన ప్రయోజనం చేకూర్చలేకపోతున్నారని పేర్కొన్నారు. సమావేశంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్ నాగ సుబ్బారెడ్డి, కేసి బాదుల్లా, యు మద్దిలేటి జి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసు నిందితులకు జీవిత ఖైదు, జరిమానా
కమలాపురం : కమలాపురం పట్టణ పరిధిలోని అప్పాయపల్లె గ్రామానికి చెందిన మార్పురి సుధీకర్ను 2017లో హత్య చేసిన నిందితలకు గౌరీగాలే ఈశ్వరమ్మ, షిండే చంద్ర అలియాస్ చందు, సయ్యద్ ముబారక్ అలియాస్ పండులకు కడప 4వ అదనపు జిల్లా సెషన్స్ జడ్జి జి.దీనబాబు జీవిత ఖైదుతో పాటు రూ. 5వేలు జరిమానా విధించారు. కేసుకు సంబంధించిన పూర్వ పరాలు పరిశీలిస్తే 2017లో వివాహేతర సంబంధం, ఇతర కుటుంబ కలహాల నేపథ్యంలో మార్పురి సుధీకర్ను నిందితులు పెద్దచెప్పలికి చెందిన గౌరీగాళ్ల ఈశ్వరమ్మ, కమలాపురానికి చెందిన షిండే చంద్ర అలియాస్ చందు, అప్పాయపల్లె కు చెందిన సయ్యద్ ముబారక్ అలియాస్ పండు కలసి పథకం ప్రకారం కత్తితో పొడిచి, కర్రలతో దాడి చేసి హత్య చేశారు. ఈ సంఘటనపై అప్పట్లో కమలాపురం పోలీసులు కేసు నమోదు చేశారు. పూర్తి ఆధారాలతో కోర్టులో చార్జ్షీట్ దాఖలు చేశారు. ప్రాసిక్యూషన్ ప్రవేశ పెట్టిన సాక్ష్యాలను, దర్యాప్తు అధికారుల నివేదికలను నిశితంగా పరిశీలించిన న్యాయమూర్తి జి.దీనబాబు నిందితులపై మోపిన హత్యా నేరం రుజువైనట్లు నిర్ధారించారు. దీంతో ముగ్గురు నిందితులకు జీవిత కాల కఠిన కారాగాన శిక్షతో పాటు రూ.5వేలు జరిమాన విధిస్తూ తీర్పు వెలువరించారు. కాగా ఈ కేసులో నిందితులకు శిక్ష పడేలా పబ్లిక్ ప్రాసిక్యూటర్ బాలాజీ సమర్థవంతంగా వాదనలు వినిపించారు. ఈ కేసులో సాక్షులను సకాలంలో హాజరుపెట్టిన కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ను వీరికి సహకరించిన కోర్టు మానిటరింగ్ పోలీస్ సిబ్బంది సుబ్బరాయుడు, వెంకటేశ్వర్ రెడ్డి, నరసింహ రాయుడులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించారు. -
పాఠశాలలో వ్యాయాయ ఉపాధ్యాయుడు కీలకం
కడప ఎడ్యుకేషన్ : పాఠశాల నిర్వహణలో వ్యాయామ ఉపాధ్యాయుడు ఎంతో కీలకమని జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో బుధవారం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయుల సర్వసభ్య సమావేశం జిల్లా వ్యాయామ ఉపాధ్యాయ సంఘం అధ్యక్షుడు శివశంకర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఈ సమావేశానికి జిల్లాలోని 40 మండలాల వ్యాయామ ఉపాధ్యాయులు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ పిల్లలు చదువుతోపాటు క్రీడల్లో రాణించే విషయంలో వ్యాయామ ఉపాధ్యాయుడి పాత్ర కీలకం అన్నారు. అలాగే ఈ సంవత్సరం రెండు రాష్ట్రస్థాయి టోర్నమెంట్లు ఒక జాతీయ స్థాయి వాలీబాల్ టోర్నమెంట్లు నిర్వహించారన్నారు. ఇందుకుగాను ఆయన వ్యాయామ ఉపాధ్యాయులకు అభినందనలు తెలిపారు. డిప్యూటి ఈఓ రాజగోపాల్ రెడ్డి మాట్లాడుతూ భారతదేశానికి దేవాలయాలు కాదు క్రీడా మైదానాలు కావాలి అని స్వామి వివేకానంద చెప్పినట్లు, ప్రస్తుతం భారతదేశ యువతకు వ్యాయామ శిక్షణ, ఫిజికల్ యాక్టివిటీస్ అవసరమని చెప్పారు. అనంతరం జిల్లాలో ప్రతిభ కనబరిచిన 30 మంది వ్యాయామ ఉపాధ్యాయులకు జిల్లా ఉత్తమ శిక్షణ సేవ అవార్డుతో సత్కరించారు. అలాగే 2025లో పదవీ విరమణ చేసిన వ్యాయామ ఉపాధ్యాయులను కూడా ఈ సందర్భంగా సత్కరించారు. కార్యక్రమంలో ఏపీ పీఈటీ అండ్ శాప్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, స్టూడెంట్ కార్యదర్శులు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, సంఘ ట్రెజరర్ శివకృష్ణ, ఆర్గనైజింగ్ కార్యదర్శి అగ్గిరప్పతోపాటు వ్యాయామ ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ లేదు
కడప కార్పొరేషన్ : చంద్రబాబు ప్రభుత్వంలో సామాన్యులకు రక్షణ కరువైందని,కడపలో అసలు ప్రజాస్వామ్యం ఉందా లేక హిట్లర్ పాలన సాగుతుందా అన్న అనుమానాలు కలుగుతున్నాయని వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు సురేష్ బాబు విమర్శించారు. కడప ఎరమ్రుక్కపల్లె సమీపంలోని కందిపాళెంలో మాజీ సైనికుడు సట్టి నరసింహులు ఇంటిని అక్రమంగా కూల్చిన ఘటనను నిరసిస్తూ అఖిలపక్ష్యం అధ్వర్యంలో చేపట్టిన రిలేదీక్ష శిబిరాన్ని అయన సందర్శించి సంఘీభావం తెలిపారు. బుధవారం వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో రిలే నిరాహార దీక్షలు చేశారు. ఈ సందర్భంగా సురేష్ బాబు మాట్లాడుతూ గణతంత్ర దినోత్సవం రోజు ఆర్ధరాత్రి ఓ మాజీ సైనికుడి ఇంటిని కూల్చడం దారుణమన్నారు. ఈ పరిస్ధితిని చూస్తుంటే మనం ప్రజాస్వామ్యంలో ఉన్నామా అనే సందేహం కలుగుతోందన్నారు. ప్రత్యేకించి కడప నగరంలో కుటిల రాజకీయాలు ఎక్కువయ్యాయని, దౌర్జన్యాలు, దోపిడీలు, దాడులు అధికమయ్యాయని విమర్శించారు. ఇంటిని కూల్చివేసిన వారిపై కేసులు పెట్టాలని అఖిలపక్ష, ప్రజా సంఘాల నాయకులు ర్యాలీ చేస్తే వారిపైనే కేసులు నమోదు చేయడం దారుణమన్నారు. కేసులు పెడితే నోరు మూసుకుంటారన్న ఉద్దేశ్యంతోనే ఇటీవల మాజీ మంత్రి అంబటి రాంబాబుపై కూడా 35 కేసులు కట్టారని, కడప నగరంలో మరీ శృతిమించిందన్నారు. దళితులతో పెట్టుకున్న వారు పతనమే – కిశోర్ బూసిపాటి దళితులపై దాడులు చేసి బాధపెట్టిన వారంతా పతనం కాకతప్పదని, ఇది చరిత్ర చెబుతున్న సత్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. ఇంటి కూల్చివేతను నిరసిస్తూ స్వయంగా దీక్షలో కూర్చొన్న కిషోర్ మాట్లాడుతూ ఓ వైపు రాజ్యాంగం అమలైన రోజని అందరూ పండుగ చేసుకుంటుంటే, టీడీపీ నాయకులు మాజీ సైనికుడి ఇంటిని కూల్చి ఆ కుటుంబానికి విషాధం మిగిల్చారన్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, పొలిట్ బ్యూరో సభ్యులు శ్రీనివాసులరెడ్డిల ప్రోద్బలంతోనే గంజాయి బ్యాచ్ ఆర్ధరాత్రి అడ వారిని, పిల్లలను బయటకు లాగేసి అరాచకం సృష్టించి ఇంటిని నేలకూల్చారన్నారు. కానీ ఇంత జరిగినా అధికారులు స్పందించకపోవడం దారుణమని, దీన్ని చూస్తే కడపలో ఆటవిక పాలన సాగుతుందనిపిస్తొందన్నారు. ఈ ఆటవిక చర్యను వైఎస్సారేసీపీ తీవ్రంగా ఖండిస్తుందని, తక్షణం అధికారులు బాధ్యులపై చర్యలు చేపట్టాలని, లేనిపక్షంలో ప్రజా ఆందోళన ఉధృతం చేస్తామని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, వైఎస్సార్సీపీ నాయకులు సీహెచ్ వినోద్, సుబ్బరాయుడు, కె. బాబు, త్యాగరాజు, కంచుపాటి బాబు, పి. సంపత్ కుమార్, డా. పెంచలయ్య, తిలక్ నగర్ సుబ్బారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి ఎన్. వెంకటశివ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు కె.సురేష్ బాబు -
బార్ బరి.. గెలుపెవరిదోమరి !
● ఏడేళ్ల తర్వాత ఏపీ బార్ కౌన్సిల్కు ఎన్నికలు ● 13న పోలింగ్కు సన్నద్ధం రాజంపేట : జిల్లాలోని న్యాయవాద వర్గాల్లో ఏపీ బార్ కౌన్సిల్ ఎన్నికల వేడి రాజుకుంటోంది. ఈనెల 13న ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్ ఎన్నికల పోలింగ్ జరగనుంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులకు సంబంధించి బార్ అసోసియేషన్లు తమ తమ అభ్యర్ధులను గెలిపించుకునేందుకు పోటీపడుతున్నారు. బార్ కౌన్సిల్ ఓటరు జాబితాను ఖరారు చేసింది. మొదటి ప్రాధాన్యత ఓటు కోసం న్యాయవాదులు మల్లగుల్లాలు పడుతున్నారు.ఏడేళ్ల తర్వాత స్టేట్ బార్ కౌన్సిల్ ఎన్నికలు జరుగుతుండటం గమనార్హం. సుప్రీంకోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణ ఈ ఏడాది జనవరి 3న గెజిట్ నోటిఫికేషన్ విడుదలైన సంగతి విధితమే. జనవరి 5 నుంచి 13 మధ్య నామినేషన్లు స్వీకరించారు. ఈ ఎన్నికలు ఉదయం 10.30 నుంచి సాయంత్రం 5గంటల వరకు జరుగుతాయి. సుప్రీం కోర్టు నియమించిన కమిటీ పర్యవేక్షణలో ఈ ఎన్నికల ప్రక్రియ జరగనుంది. బరిలో 143 మంది అభ్యర్ధులు రాష్ట్ర వ్యాప్తంగా 109 పోలింగ్ కేంద్రాలను ఏర్పాటుచేశారు. 23 స్ధానాల కోసం ఈ ఎన్నికలు జరుగుతున్నాయి. రాష్ట్రవ్యాప్తంగా 150 బార్ అసోసియేషన్లు ఉన్నాయి. 143మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నారు. 23మందిని ఎంపిక చేసుకోవాల్సి ఉంటుంది. వీరిలో నుంచి చైర్మన్ అభ్యర్ధిని ఎంపిక చేసుకుంటారు. రాష్ట్ర వ్యాప్తంగా 39409 ఓట్లు ఉన్నాయని స్టేట్బార్ కౌన్సిల్ వెల్లడించింది. జిల్లాలో ఏయే కోర్టు పరిధిలో.. జిల్లాలో కడప, బద్వేలు,జమ్మలమడుగు,నందలూరు, ప్రొద్దుటూరు,పులివెందుల,రాజంపేట, రాయచోటి , రైల్వేకోడూరు, మైదుకూరు, కమలాపురం,లక్కిరెడ్డిపల్లె కోర్టుల పరిధిలో బార్ అసోసియేషన్ కార్యవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. ఈ బార్ అసోసియేషన్ల పరిధిలో ఏపీ బార్ స్టేట్ కౌన్సిల్ పోలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం పోలింగ్ అధికారులను కూడా త్వరలో నియమించి, ఉత్తర్వులు విడుదల చేయనున్నారు. ఇప్పటికే పోలింగ్ అధికారుల ఎంపిక కొనసాగిందని న్యాయవాదులు చెబుతున్నారు. జిల్లా వారీగా ఓట్లు ఇలా.. న్యాయవాదుల సమాచారం మేరకు జిల్లా వారీగా ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి. కడప(760), రాజంపేట (154), రైల్వేకోడూరు(35), నందలూరు (24), పులివెందుల (24), కమలాపురం (20), మైదుకూరు (16), జమ్మలమడుగు(30), రాయచోటి (113), ప్రొద్దుటూరు(316), బద్వేలు (69) , ఉన్నాయి. మాడల్బైలాస్ ప్రకారమే ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయవాదుల సంఘం ఎన్నికల నిర్వహిస్తామని ప్రస్తుత కార్యవర్గం హైకోర్టుకు నివేదించింది. ఇప్పటికే ఖరారు చేసిన షెడ్యూల్ ప్రకారం ఎన్నికలు నిర్వహిస్తామని వివరించింది. ఈ వివరాలను పరిగణలోకి తీసుకున్న హైకోర్టు..ఆ షెడ్యూల్ ప్రకారం ప్రశాంత, స్వేచ్ఛాయుత వాతవరణంలో ఎన్నికలు నిర్వహిస్తారని ఆశిస్తున్నట్లు తెలిపిన సంగతి తెలిసిందే. -
అంబటి రాంబాబు కుటుంబానికి పరామర్శ
కడప కార్పొరేషన్ : మాజీ మంత్రి అంబటి రాంబాబు కుటుంబాన్ని వైఎస్సార్సీపీ నేతలు పరామర్శించారు. బుధవారం ఆ పార్టీ సీనియర్ నేతలు ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ రుహుల్లా, గుంటూరు తూర్పు నియోజకవర్గ ఇన్చార్జి నూరి ఫాతిమా లు గుంటూరులోని ఆయన నివాసానికి వెళ్లి పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నేతలపై దాడులు ఆపకపోతే ప్రజలే తగిన బుద్దిచెబుతారని హెచ్చరించారు. అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి రాష్ట్రంలో కొనసాగుతున్న అరాచక పాలనకు నిదర్శనమని మండిపడ్డారు. రాజకీయ ప్రత్యర్థులపై దాడులు చేయడం, ప్రజాస్వామ్య వ్యవస్థపై దాడి చేయడం నేరమని ఆయన స్పష్టం చేశారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా అదుపు తప్పాయని, వైయస్ఆర్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు జరుగుతున్నాయని ఆరోపించారు. అంబటి రాంబాబు వంటి ప్రజాదరణ కలిగిన నాయకుడి ఇంటిపై దాడి చేయడం వెనుక ప్రభుత్వ నిర్లక్ష్యం, పోలీస్ వ్యవస్థ వైఫల్యం స్పష్టంగా కనిపిస్తోందని అన్నారు. ఈ దాడికి పాల్పడిన వారిని వెంటనే అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించకపోతే ప్రజల్లో మరింత ఆగ్రహం వెల్లువెత్తుతుందని నాయకులు హెచ్చరించారు. రాజకీయ ప్రతీకార చర్యలను అరికట్టడంలో విఫలమైన కూటమి ప్రభుత్వం ఈ ఘటనకు పూర్తి బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. వైయస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అంబటి రాంబాబు గారికి, ఆయన కుటుంబానికి పూర్తి సంఘీభావంగా నిలుస్తుందని, ఇలాంటి దాడులకు భయపడేది లేదని, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం చివరి వరకు పోరాడుతామని స్పష్టం చేశారు. అంబటి ఇంటిపై దాడి శాంతి భద్రతల వైఫల్యానికి నిదర్శనం -
భక్తులకు సాఫీగా దర్శనమయ్యేలా ఏర్పాట్లు చేయాలి
సిద్దవటం : మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు ఎలాంటి ఇబ్బందులకు లోను కాకుండా ప్రశాంత వాతావరనంలో శ్రీ నిత్యపూజ స్వామి దర్శనం చేసుకునేలా అధికారులు అన్ని ఏర్పాట్లు చేయాలని కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. సిద్దవటం పోలీస్స్టేషన్ పరిధిలో 15వ తేదీన జరిగే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా బుధవారం బందోబస్తు ఏర్పాట్లను రాజంపేట ఏఎస్పీ రామ్నాథ్ మనోజ్హెగ్డేతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ నిత్యపూజ కోనలో స్వామి దగ్గరికి భక్తులు వెళ్లే మార్గంలో ట్రాఫిక్ అంతరాయం కలగకుండా పటిష్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. ఈ సందర్భంగా ఎస్పీ శ్రీ నిత్యపూజస్వామిని దర్శనం చేసుకోగా ఆలయ పూజారులు ఆయన్ను శాలువాతో సత్కరించి, దేవాలయ విశిష్టతను వివరించారు. తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో రాజంపేట సబ్ కలెక్టర్ భావన, కడప ఆర్డీఓ జాన్ ఇర్విన్, కడప స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ సుధాకర్, సబ్ డీఎఫ్ఓ స్వామి వివేకానంద, రేంజర్ కళావతి, కడప స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు సదాశివయ్య, ఈదుర్బాషా, తహసీల్దార్ ఆకుల తిరుమలబాబు, నిత్యపూజ స్వామి ఆలయం ఈఓ శ్రీధర్, తదితరులు పాల్గొన్నారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
కడప సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో అరుదైన శస్త్ర చికిత్స
కడప అర్బన్ : రిమ్స్ ఆవరణలో ఉన్న సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్ లో మూత్ర నాళాల సమస్యతో బాధపడుతున్న 9 సంవత్సరాల బాలిక ప్రోక్షిత కు మినిమల్ ఇన్వేసివ్ విధానంలో పునర్నిర్మాణ శస్త్ర చికిత్సను విజయవంతంగా నిర్వహించారు. ఈ శస్త్ర చికిత్సను శ్రీవేసుకో స్కోపిక్ బై లేటరల్ యురేటరిక్ రీ ఇంప్లాంటేషన్ఙ్అంటారు. ఈ శస్త్ర చికిత్సను పూర్తి చేయడానికి సుమారు నాలుగు నుంచి ఐదు గంటల సమయం పట్టింది. ఈ తరహా చికిత్స చాలా అరుదుగా కడప జిల్లాలో తొలిసారిగా నిర్వహించారు. ఈ పేషెంట్కు వీయు ఆర్ వల్ల కుడివైపు కిడ్నీ పనితీరు తగ్గింది. వీయుఆర్ కు శస్త్ర చికిత్స చేయకపోతే రెండు కిడ్నీలు పాడయ్యే అవకాశం ఉంటుంది. పేషెంట్కు కిడ్నీ మార్పిడి చేయాల్సి ఉండేది. ఈ అడ్వాన్స్డ్ శస్త్ర చికిత్స వల్ల పేషంట్ కోలుకోవడం, నొప్పి లేకపోవడం, త్వరగా హాస్పిటల్ నుంచి డిశ్చార్జ్ అవుతారు. ఈ శస్త్ర చికిత్సను డాక్టర్ ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద పూర్తిగా ఉచితంగా అందించామని సాధారణంగా ఈ ఆపరేషన్కు సుమారు 6 లక్షల రూపాయల వరకు ఖర్చయ్యేదని డాక్టర్లు తెలియజేశారు. ఈ శస్త్ర చికిత్స అనంతరం బాలిక ప్రోక్షిత ఆరోగ్యం మెరుగుపడి, డిశ్చార్జ్ సమయంలో సాధారణ స్థితిలో ఉంది. ఈ శస్త్ర చికిత్సను నిర్వహించిన పీడియాట్రిక్ సర్జరీ విభాగం ప్రొఫెసర్, హెచ్ఓడీ డాక్టర్ సి. సునీల్ కుమార్ రెడ్డి, డాక్టర్ పి.వి రమణ, డాక్టర్ పి. సుకుమార్, డాక్టర్ ప్రీతి, డాక్టర్ సులక్షణతో కూడిన వైద్య బృందం నిర్వహించారు. వైద్య సేవల పట్ల బాలిక తల్లిదండ్రులు సంతృప్తి వ్యక్తం చేశారు. అనస్తీసియా విభాగం, హాస్పిటల్ పరిపాలన విభాగం సహకారానికి శస్త్ర చికిత్స బృందం కృతజ్ఞతలు తెలిపింది. ప్రభుత్వ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్లో పురిటి, చిన్నపిల్లలకు అన్ని రకాల సాధారణ, అధునాతనమైన శస్త్ర చికిత్సలను నిర్వహిస్తున్నారని, ఈ సౌకర్యాన్ని ప్రజలు ఉపయోగించుకోవాలని డాక్టర్లు కోరుతున్నారు. -
ద్విచక్రవాహనాల దొంగ అరెస్ట్
కడప అర్బన్ : కడప తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో బుధవారం ఉదయం చౌటపల్లి రైల్వే గేట్ సమీపంలో షేక్ దర్బార్ వల్లి అనే దొంగను రెడ్డెప్ప ఆధ్వర్యంలో ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ తమ సిబ్బందితో కలిసి అరెస్ట్ చేశారు. అతని వద్ద నుంచి వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగతనానికి పాల్పడిన 10 మోటార్ సైకిళ్లను స్వాధీనం చేసుకున్నారు. ఎస్ఐ మోహన్ కుమార్ గౌడ్ వివరాలను తెలియజేశారు. విలాసవంతమైన జీవితానికి అలవాటు పడి, వరుస మోటర్ సైకిల్ దొంగతనాలకు పాల్పడుతున్న పాత నేరస్తుడిని అరెస్ట్ చేసామన్నారు. సత్యసాయి జిల్లా గౌకనపల్లి చెందిన షేక్ దర్బార్ వల్లి (42) గతంలో సెల్ఫోన్ దొంగతనాల కేసులో జైలుకు వెళ్లి వచ్చాడు. జైలు నుంచి విడుదలైన తర్వాత తన పాత పద్ధతి మార్చుకోకుండా మోటార్ సైకిళ్లను లక్ష్యంగా చేసుకొని దొంగతనాలకు పాల్పడడం మొదలుపెట్టాడు. అరెస్తయిన దర్బార్వల్లిని విచారించగా కడపలోని వివిధ పోలీస్ స్టేషన్ల పరిధిలో దొంగిలించిన పది మోటార్ సైకిళ్ల గురించి సమాచారం ఇచ్చాడని, పోలీసులు వాటిని స్వాధీనం చేసుకున్నారన్నారు. నిందితుడిని రిమాండుకు తరలించామన్నారు. దొంగను పట్టుకున్న కడప తాలూకా సీఐ టి రెడ్డెప్ప, ఎస్ఐలు మోహన్ కుమార్ గౌడ్, మహమ్మద్ రఫీలను జిల్లా ఎస్పీ అభినందించారు. లోయలోకి దూసువెళ్లిన లారీ – ఒకరి మృతి, డ్రైవర్కు గాయాలు చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో ఖార్జురచెట్ల లోడుతో సేలం నుంచి పూణేకు వెళుతున్న టీఎన్ 52కే 9747 నంబరుగల లారీ బుధవారం కడపకు వస్తుండగా ఘాట్ నాలుగో మలుపు వద్ద అదుపు తప్పి లోయలోకి దూసుకవెళ్లినట్లు సీకే దిన్నె పోలీసులు తెలిపారు. విషయంతెలుసుకున్న పోలీసులు, అగ్నిమాపక అధికారి యోగేశ్వరరెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి లారీ డ్రైవర్ గోపినీ ప్రాణాలతో కాపాడారు. గాయపడిని అతన్ని అంబులెన్సు ద్వారా రిమ్స్కు తరలించారు, లారీలోని మరో వ్యక్తి శరవణ్ కుట్టి అప్పన్ ( 37) ఖార్జుర చెట్ల కింద పడి ఊపిరాడక మృతి చెందాడు. పోలీసులు యంత్రాల సహాయంతో మృతదేహాన్ని బయటికి తీయించి పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. జిల్లా అగ్నిమాపక సహాయ అధికారి యోగేశ్వరరెడ్డి తమ సిబ్బందితో కలిసి లారీలో చిక్కుకున్న డ్రైవర్ గోపి ని ప్రాణాలతో కాపాడటం పట్ల పలువురు అభినందించారు.కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, సీఐ బాలమద్దిలేటి,ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి సంఘటన ప్రాంతంలో సహాయక చర్యలు చేపట్టారు. -
కన్నతల్లిని కడతేర్చిన కొడుకు అరెస్టు
ఎర్రగుంట్ల : అప్పు కట్టమని చెప్పిన కన్నతల్లి చాప సుందరమ్మపై పెట్రోల్ పోసి కాల్చి చంపిన కేసులో కుమారుడు జాకోబ్ను అరెస్టు చేసినట్లు ఎర్రగుట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. బుధవారం విలేకరుల సమావేశంలో కేసుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.... పోట్లదుర్తి గ్రామం క్రిస్టియన్లేన్ కాలనీలో నివాసం ఉన్న సుందరమ్మ (80), అబ్రహాం(లేట్)లకు ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు. సుందరమ్మ తన కుమారుడైన జాకోబ్ వద్ద ఉంటుంది. జాకోబ్ బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. జాకోబ్కు నలుగురు సంతానం. వీరిలో ముగ్గురు కుమారులు. కుమార్తె లత ఉన్నారు. లతను ప్రొద్దుటూరు మండల పరిధిలోని కానపల్లెకు ఇచ్చి వివాహం చేశారు. పోట్లదుర్తిలోని తన ఇంటి నిర్మాణంనకు కుమార్తె లత వద్ద రూ.18 లక్షలు అప్పుగా తీసుకున్నాడు. అప్పుగా ఇచ్చిన డబ్బును ఇవ్వాలని లత తన తండ్రి జాకోబ్ను అడిగింది. ఈ విషయంలో జాకోబ్ కుమార్తెతో గొడవ పడ్డాడు. ఈ విషయంపై జాకోబ్ తల్లి సుందరమ్మ మనవరాలు లతతో గొడవ వద్దు.. అప్పుగా తీసుకున్న డబ్బును త్వరగా ఇవ్వమని కుమారుడైన జాకోబ్కు చెప్పింది. మనవరాలికి సపోర్టు చేస్తావా అని సుందరమ్మపై ఇంటిలో ఎవరూ లేని సమయంలో పెట్రోల్ పోసి నిప్పుంటించాడు. బంధువులు గమనించి సుందరమ్మను ప్రొద్దుటూరు ఆసుపత్రికి చికిత్సకు తీసుకెళ్లారు. అక్కడ సుందరమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు జాకోబ్పై హత్యాయత్నం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కానీ మెరుగైన వైద్యం కోసం సుందరమ్మను కడప రిమ్స్కు తరిలించగా అక్కడ చిక్సిత పొందుతూ మృతి చెందినట్లు తెలిపారు. సుందరమ్మ చనిపోయిన కారణంగా జాకోబ్పై హత్య కేసు నమోదు చేసుకుని నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళితో పాటు సిబ్బంది పాల్గొన్నారు. -
నేటి నుంచి అంతర్ జిల్లాల క్రికెట్ టోర్నమెంట్
కడప వైఎస్ఆర్ సర్కిల్: స్వర్ణాంధ్ర అంతర్ జిల్లాల సౌత్ జోన్ దివ్యాంగుల క్రికెట్ టోర్నమెంట్ గురువారం నుంచి ఈ నెల 14 వరకు కడపలోని వైఎస్ రాజా రెడ్డి ఏసీఏ క్రికెట్ స్టేడియం జరగనుంది. ఈ విషయాన్ని రాష్ట్ర దివ్యాంగుల క్రికెట్ విభాగ కార్యనిర్వహణ కార్యదర్శి శ్రీ సుగాలి మధుసూదన్ నాయక్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టోర్నమెంట్ ప్రారంభోత్వానికి ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ దివ్యాంగుల విభాగ క్రికెట్ కమిటీ సభ్యుడు యడ్లపల్లి సూర్యనారాయణ హాజరవుతున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన జట్లు పాల్గొంటాయన్నారు. . దివ్యాంగ క్రీడాకారులకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఈ పోటీలు నిలుస్తాయని తెలిపారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలో డిగ్రీ కళాశాలల విద్యార్థులు పెండింగ్ సబ్జెక్టులను ఒకేసారి రాసుకునే అవకాశాన్ని కల్పించినట్లు విశ్వవిద్యాలయ పరీక్షల నియంత్రణాధికారి ప్రొఫెసర్ కె.ఎస్.వి. కృష్ణారావు తెలిపారు. 2010 నుంచి డిగ్రీ చదివి అనుత్తీర్ణులైన విద్యార్థులు పరీక్షలు రాసుకునే అవకాశం కల్పించాలని పూర్వ విద్యార్థులు, పలు సంఘాల నుంచి, కళాశాల నుంచి అభ్యర్థనలు రావడంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ స్పందించి అనుమతి ఇచ్చారని తెలిపారు. 2010 నుంచి 2019 సంవత్సరాలలో డిగ్రీ చదివి సబ్జెక్టులు పెండింగ్లో ఉంచుకున్న విద్యార్థులకు ఇదొక అద్భుత అలానే చివరి అవకాశమన్నారు. అలాగే 2015 నుండి 2019 బ్యాచ్లలో 1,2,3,4,5,6 సెమిస్టర్ విధానంలో చదివిన విద్యార్థులు ఆ పరీక్షలు రాసుకునే అవకాశం కల్పిస్తున్నామన్నారు. వెబ్సైట్లో ఆన్లైన్ దరఖాస్తులు అందుబాటులో ఉన్నాయన్నారు. ఈ నెల 12 నుంచి మార్చి 16 లోపు ఆన్లైన్లో పరీక్ష దరఖాస్తును అప్లోడ్ చేయాలని తెలిపారు. అపరాధ రుసుంతో మార్చి 25వ తేదీ వరకు గడువు ఉందన్నారు. వివరాలకు www.yvuexams.in వెబ్సైట్ను సంప్రదించాలని సూచించారు. కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లా అగ్నిమాపక శాఖ జిల్లా అధికారిగా ఉప్పాల శరత్ బాబు బుధవారం కడప కలెక్టరేట్ లోని జిల్లా అగ్నిమాపక శాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన విలేకరులతో మాట్లాడారు. జిల్లాలో అగ్ని ప్రమాదాల నివారణకు, ఇతర ప్రకతి విపత్తులు, ప్రమాదాల సమయంలో ప్రజల ప్రాణాలను, ఆస్తి నష్టం జరగకుండా కృషి చేస్తామన్నారు. పశ్చిమగోదావరి జిల్లా ఏలూరుకు చెందిన ఈయన 1993 లో కృష్ణాజిల్లా అవనిగడ్డ ఫైర్ ఆఫీసర్గా విధుల్లో చేరారు. 2014లో డీఎఫ్ఓగా పదోన్నతి పొందారు. సత్తెనపల్లెలోని ఏపీ ట్రైనింగ్ సెంటర్లో విధులు నిర్వహించారు. తర్వాత అనంతపురం జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా విధులను నిర్వహించారు. ప్రస్తుతం ఆయన ఏపీ సీఆర్డీఏ లో విధులను నిర్వహిస్తుండగా ఇటీవల వైఎస్సార్ కడప జిల్లా అగ్నిమాపక శాఖ అధికారిగా బదిలీ అయ్యారు. ఆయనను జిల్లా సహాయ అగ్నిమాపక శాఖ అధికారులు యోగీశ్వర్రెడ్డి, బసివి రెడ్డి, జిల్లాలోని ఫైర్ స్టేషన్ అధికారులు కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు. కడప సెవెన్రోడ్స్: గ్రంథాలయ మరమ్మతు పనులకు మంజూరు చేసిన నిధులు ఖర్చు చేసేందుకు ప్రతిపాదనలు రూపొందించి రాష్ట్ర సంచాలకులకు పంపాలని బుధవారం జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ దాసరి భానుప్రకాశ్ అధ్యక్షతన కడపలో జరిగిన సర్వసభ్య సమావేశంలో తీర్మానం ఆమోదించారు. జిల్లా గ్రంథాలయ పరిధిలోని ఏడు బ్రాంచి లైబ్రరీల్లో ఫ్యాన్లు, లైటింగ్, పెయిటింగ్స్,టేబుళ్లు, ఫర్నీచర్ తదితర పనుల కోసం ప్రభుత్వం రూ. 40,30,000 కేటాయించిందని భానుప్రకాశ్ ఈ సందర్బంగా తెలిపారు. 2025– 26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన వేతనాలు, పెన్షన్లు, గ్రంథాలయ నిర్వహణ ఖర్చులకు సంబంధించిన తీర్మానాన్ని ఈ సందర్భంగా ఆమోదించారు. వేముల నూతన గ్రంథాలయా న్ని జిల్లా గ్రంథాలయ సంస్థ పేరిట స్వాధీనం చేసుకోవాలని తీర్మానించారు.కార్యక్రమంలో డీఈఓ షంషుద్దీన్, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి, డీఎల్పీఓ మస్తాన్వలీ, గ్రంథాలయ సంస్థ కార్యదర్శి ఎస్.అమీరుద్దీన్, పి.రాజ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎంట్రీఫీజు వసూలుకు టెండర్ రికార్డు
రుసుము రూ.25కు పెంచడంతో రూ.31 లక్షలు పలికిన పాట బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై ఉన్న అటవీశాఖ సముదాయంలోకి ప్రవేశ రుసుం వసూలుకు బుధవారం రాజంపేట డీఎఫ్ఓ కార్యాలయంలో నిర్వహించిన టెండర్లలో రికార్డుస్థాయి ధర దాఖలైంది. వివరాలు. హార్సిలీహిల్స్పై అటవీశాఖ పర్యావరణ సముదాయంలో జంతుప్రదర్శనశాల, మొసళ్లపార్కు, ప్రకృతి అధ్యయన కేంద్రం, పురాతన నీలగిరి వృక్షం ఉన్నాయి. వీటిని తిలకించేందుకు పర్యాటకులు అధికసంఖ్యలో వస్తుంటారు. ఇక్కడికి వచ్చేవారి నుంచి రూ.20 ఎంట్రీఫీజును నిర్దేశించిన అటవీశాఖ వాటిని వసూలు చేసుకునేందుకు ఏటా టెండర్లు నిర్వహిస్తోంది. 2026–27 ఏడాదికి నిర్వహించిన టెండర్లలో ఆరుగురు పాల్గొన్నారు. టెండర్ ధర రూ.29.90 లక్షలుగా నిర్ణయించగా వీరిలో కాండ్లమడుగుకు చెందిన ఇడగొట్టు రమేష్బాబు 31 లక్షల ఐదు రూపాయలకు టెండర్ దాఖలు చేయగా ఇదే అత్యధిక టెండర్ కావడంతో అధికారులు దీన్నే ఖరారు చేశారు. అలాగే క్యాంటిన్ నిర్వహణ కోసం రూ.1.75 లక్షలతో టెండర్లకు ఆహ్వనించగా శివన్న అనే వ్యక్తి అత్యధికంగా రూ.3.25 లక్షలకు టెండర్ దాఖలు చేయడంతో ఖరారు చేశారు. కాగా కొండపై అటవీశాఖ ఎంట్రీఫీజు వసూలుకు 2018 నుంచి అమలు చేస్తోంది. 2022 వరకు ఏటా రూ.ఆరేడు లక్షల ఆదాయం దక్కేది. 2022–23లో తొలిసారిగా 13,000,786 పలికింది. తర్వాత వరుగా పెరుగుతూ వస్తున్న ఆదాయంలో 2023–24లో రూ.14 లక్షలు, 2024–25లో రూ.16.50 లక్షలు, 2025–26లో రూ.19.60 లక్షలు పలికింది. ఇప్పుడు 2026–27కు 40శాతానికిపైగా ఆదాయంతో రూ.31లక్షలు పలకడం రికార్డు. కాగా మొదట రూ.10గా ఎంట్రీ రుసుము, రూ.20కి పెంచగా ప్రస్తుతం రూ.25గా చేయడంతో ఈ స్థాయిలో రూ.31 లక్షలు పలికింది. -
7 శాతం వడ్డీ...
రైతు తన వ్యవసాయ అవసరాల కోసం లక్ష రుపాయలు రుణం తీసుకుంటే సంవత్సరానికి 7 శాతం వడ్డీ అంటే రూ. 7 వేలు రూపాయలు వడ్డీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. ఇందులో కేంద్రం 3, రాష్ట్ర ప్రభుత్వం 4 శాతం వాటా ఉంటుంది. అంటే రైతు చెల్లించాల్సిన వడ్డీ మొత్తంలో కేంద్ర భరించాల్సిన 3 శాతం వడ్డీ అంటే 3 వేలు యథావిధిగా జిల్లా కేంద్ర సహకార బ్యాంకుల ద్వారా స్థానిక సహకార సంఘాలకు చెల్లిస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం తన వాటా కింద చెల్లించాల్సిన 4 శాతం అంటే రూ.4 వేలు మాత్రం ఈ 18 నెలలగా ఇవ్వడం లేదు. ఉమ్మడి వైఎస్సార్జిల్లాలో 72 సహకారం సంఘాలతోపాటు డీసీసీబీ బ్రాంచిల ద్వారా రైతులు చాలా మంది వ్యవసాయ రుణాలు తీసుకున్నారు. వీరికి సంబంధించిన వడ్డీమాత్రం చెల్లించలేదు. వడ్డీ చెల్లించడం ఆలస్యమైతే వడ్డీకి వడ్డీ కూడా కలిసి బ్యాంకులు వసూలు చేస్తాయని అన్నదాతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అలాగే సహకార సంఘాలు కూడా నిర్వీర్యమయ్యే పరిస్థితులు ఏర్పడతాయి. -
వడ్డీ రాయితీకి ఎగనామం...
కడప అగ్రికల్చర్: వ్యవసాయానికి పెద్దపీట వేస్తాం...అన్నదాతలను ఆదుకుంటామంటూ ప్రగల్భాలు పలికిన కూటమి ప్రభుత్వం అధికారంలోని వచ్చిన తర్వాత రైతన్నలను అడుగడుగునా మోసం చేస్తూనే ఉంది. ఎన్నికలకు ముందు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లించే రైతులకు ఇస్తున్న సున్నా వడ్డీ రాష్ట్ర ప్రభుత్వమే ఎసరు పెట్టింది. అంతేకాకుండా మోసపూరిత వాగ్దా నాలు చేసి అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం మొదటి ఏడాదే అన్నదాత సుఖీభవ నిధులను(రైతు భరోసా) ఎగరగొట్టింది. అది చాలదన్నట్లు అధికారంలోకి వచ్చిన తరువాత దాదాపు 18 నెలల కాలంలో ఇప్పటి వరకు నయా పైసా కూడా వడ్డీ రాయితీ విడుదల చేయలేదు. ఫలితంగా ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో దాదాపు లక్షల మంది రైతులు నష్టపోయారు. వైఎస్ జగన్ హయాంలో నిరాటంకంగా.. వడ్డీ రాయితీ పథకంలో భాగంగా రైతులు తీసుకున్న పంట రుణాలను సకాలంలో చెల్లిస్తే 4 శాతం వడ్డీ రాయితీ ప్రభుత్వం చెల్లించాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం సకాలంలో రైతులకు వడ్డీ రాయితీ అందచేసింది. వ్యవసాయ అవసరాలకు కోసం రైతులు తీసుకున్న రుణాలకు పావలా వడ్డీని ప్రభుత్వమే భరించింది. ఐదేళ్లపాటు నిరాటంకంగా ఈ పథకాన్ని జగనన్న సర్కాలు అమలు చేసింది. 2024లో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం ఈ సున్నా వడ్డీ పథకాన్ని పూర్తిగా విస్మరించింది. ఉమ్మడి జిల్లాలో... ఉమ్మడి జిల్లాలో 72 ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్)లు ఉన్నాయి. ఈ సంఘాల్లో సుమారు 1,65,000 మంది సభ్యులున్నారు. వీరంతా కనిష్టంగా లక్ష నుంచి రూ.3 లక్షల వరకు వ్యవసాయ అవసరాల కోసం పంట రుణాలు తీసుకున్నారు. ఇందులో భాగంగా 2024–25 సంవత్సరంలో ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో వ్యవసాయ పంట రుణాల కింద రైతులు సుమారు రూ. 530 కోట్లు తీసుకున్నారు. అలాగే 2025–26 సంవత్సరంలో కూడా 550 కోట్లు పంట రుణాల తీసుకున్నట్లు డీసీసీబీ అధికారులు తెలిపారు. వీరికి ప్రభుత్వం వడ్డీ రాయితీ ఇవ్వడం వల్ల రైతులకు కొంతమేర ఉపశమనం కలుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం మాత్రం ఈ ధపా అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు వడ్డీ రాయితీకి ఎగనామం పెట్టింది. సకాలంలో రుణాలు చెల్లించినా రైతులకు ఫలితం శూన్యం 18 నెలలుగా పైసా విదిల్చని కూటమి ప్రభుత్వం ఉమ్మడి జిల్లాలో చాలా మంది రైతులకు నష్టం రైతులపై కోట్లలో భారం ... ఆందోళనలో అన్నదాతలు -
రైల్వే సమస్యలను పరిష్కరించాలి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ను బుధవారం ఢిల్లీలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కలిశారు. లేఖ ద్వారా రైల్వే సమస్యలను విన్నవించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం రైల్వే స్టేషన్లో చైన్నె – ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేయాలని, అలాగే మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో నిలుపుదల చేయాలని ఎంపీ అందులో పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లాలోని పలు రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని అవినాష్ రెడ్డి కోరారు. -
త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
రాజంపేట టౌన్: పవిత్ర పుణ్య క్షేత్రంగా విరాజిల్లుతున్న హత్యరాలలోని త్రేతేశ్వర స్వామి బ్రహ్మోత్సవాలు అంకురార్పణతో బుధవారం ప్రారంభమయ్యాయి. వేకువజాము నుంచే స్వామివారికి విశేష పూజలు నిర్వహించారు. సాయంత్రం ధ్వజారోహణ కార్యక్రమాన్ని నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఇదిలావుంటే త్రేతేశ్వర స్వామి బ్రహో త్సవాలను మండలంలోని హత్యరాలతో పాటు పోలి, మందరం, సీతారాంపురం పంచాయితీల పరిధిలోని గ్రామాల ప్రజలు సంక్రాంతి పండుగ తరహాలో జరుపుకుంటారు. కాగా శివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకొని హత్యరాల గ్రామంలో వివిధ జిల్లాలు, రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు దుకాణాలు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో గ్రామంలో కోలాహల వాతావరణం నెలకొంది. కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లాకు బుధవారం 1000 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రనాయక్ తెలిపారు. ఇందులో 400 మెట్రిక్ టన్నులను ప్రైవేట్డీలర్లకు, మరో 600 మెట్రిక్ టన్నులు మార్కెఫెడ్కు కేటాయించినట్లు తెలిపారు. జిల్లాలో యూరియాకు ఎలాంటి ఇబ్బంది లేదని ఆయన తెలిపారు. -
వైభవంగా లూర్దుమాత తిరునాల
కడప సెవెన్రోడ్స్: కరుణామయి, ప్రేమమూర్తి ఏసుక్రీస్తును ఈ లోకానికి అందించిన దయగల తల్లి లూర్దుమాత తిరునాల బుధవారం వైభవంగా నిర్వహించారు. ఉదయం మరియాపురంలోని పాత గుడివద్ద బిషప్, కడప కథోలిక పీఠాధిపతి సగినాల పాల్ ప్రకాశ్ను మరియాపురం ప్రధాన వీధుల్లో భక్తులు తేరుపై ఊరేగించారు. క్రైస్తవ భక్తిగీతాలతో బాలికలు నృత్యం చేస్తూ పీఠంపైకి సాద ర స్వాగతం పలికారు. బిషప్ సగినాల పాల్ ప్రకాశ్తోపాటు వివిధ విచారణకు చెందిన 30 మంది గురువులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ సమిష్టి దివ్యబలిపూజను సమర్పించారు. అనంతరం బిషప్ ప్రసంగిస్తూ వినయం, విధేయతే మరియమాత సుగుణాలని చెప్పారు. క్రైస్తవులు కూడా వినమ్రతతో కలిగిన ప్రత్యేక శైలిని అలవర్చుకోవాలని సూచించారు. నేటి సమాజంలో ప్రజలు అనేక సమస్యలతో సతమతమవుతున్నారని, భక్తితో ప్రార్థనలు నిర్వహిస్తే పరిష్కార మార్గం లభిస్తుందన్నారు. ఆటపాటలు, సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొన్న విజేతలకు బిషప్ బహుమతి ప్రదానం చేశారు. తిరునాల కమిటీ సభ్యులు బిషప్ను ఘనంగా సత్కరించారు. సమిష్టి దివ్య బలిపూజలో విచారణ గురువు ఈరి లూర్దు మరియన్న, సహాయ గురువు సుధాకర్, వికర్ జనరల్ ఎండీ ప్రసాద్రావు, కడప డీన్ జోసెఫ్ రాజు, ప్రొక్యూరేటర్ సంబటూరు సురేష్ తదితరులు పాల్గొన్నారు. తిరునాల సందడే సందడి లూర్దుమాత నవదిన ఉత్సవాల ముగింపు సందర్భంగా పాత చర్చి ఆవరణలో ఎద్దులతో బండలాగుడు పోటీలు నిర్వహించారు. వాలీబాల్ పోటీల్లో విజేతలైనవారికి అతిథులు బహుమతులు అందజేశారు. తిరునాల కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో నిర్వహించిన పలు సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలతో ఆ ఆవరణం సందడిగా మారింది. ఉత్సాహంగా బండలాగుడు పోటీలు ముగిసిన ఉత్సవాలు -
14 నుంచి బ్రహ్మంగారి కల్యాణ మహోత్సవాలు
● 15న గోవిందమాంబ, వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణం ● కల్యాణంను నిర్వహించనున్న నూతన మఠాధిపతి దంపతులు బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి గోవిందమాంబల కల్యాణ మహోత్సవాలు మహాశివరాత్రి సందర్భంగా ఈనెల 14 నుంచి 18 వరకు బ్రహ్మంగారిమఠంలో ఘనంగా ఉత్సవాలను నిర్వహించనున్నారు. నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి ఆధ్వర్యంలో మఠం మేనేజర్ ఈశ్వరాచారి ఈ ఉత్సవాలను నిర్వహించనున్నారు. ఉత్సవ కార్యక్రమంలో 14న ఉదయం 6 గంటలకు నామ సంకీర్తన , ఉపనిషత్ పారాయణం, 8 గంటలకు అభిషేకం, 12 గంటలకు వీరమాంబ ఆరాధన, సాయంత్రం 4 గంటలకు హరికథ, రాత్రి 8 గంటలకు కలశోత్సవం, 9 గంటలకు హరికథ, 10 గంటలకు శేషవాహనోత్సవం తదితర పూజలు నిర్వహించనున్నారు. 15వ తేదీ ఆదివారం మహాశివరాత్రి సందర్భంగా ఉదయం సుప్రభాతం, 12 గంటలకు దీక్షాబంధనాలంకారోత్సవం, 2గంటలకు నామసంకీర్తన , భజనలు, సాయంత్రం 4 గంటలకు హరిప్రియ కర్నూల్ వారిచే సంగీత విభావరి, 4 గంటలకు ఉత్సవం, 6 గంటలకు స్థానిక ఆస్థాన పండితుడిచే ఉపన్యాసం, రాత్రి 9 గంటలకు పెద్దపుత్త గ్రామ ఉభయదాతలుచే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్రస్వామి కల్యాణ మహోత్సవం ఘనంగా నిర్వహించనున్నారు. ఈ కల్యాణంను నూతన మఠాధిపతి వెంకటాద్రిస్వామి దంపతుల ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. 11 గంటలకు నరనంది ఉత్సవం, 12 గంటలనుంచి జాగారణ ఉంటుంది. 16వ తేదీ సోమవారం ఉదయం నామసంకీర్తనలు, 8 గంటలకు అభిషేకం, 10 గంటలకు మోహినీ అలంకారోత్సవం, 12 గంటలకు భజనలు, రాత్రి 7గంటలకు హరికథ, 8 గంటలకు నంది ఉత్సవం చేపట్టనున్నారు. 17వ తేదీ మంగళవారం ఉదయం పారాయణం, అభిషేకం, 10 గంటలకు నిత్యహోమం, గజోత్సవం, మధ్యాహ్నం 12 గంటలకు మహాప్రసాద వినియోగం, రాత్రి 9 గంటలకు పుష్పరథోత్సవం కనులపండువగా నిర్వహించనున్నారు. 18వ తేదీ బుధవారం ఉదయం 10 గంటలకు వసంతోత్సవం, రాత్రి 8 గంటలకు బలిహరణ వంటి కార్యక్రమాలు నిర్వహించనున్నారు. -
మహాశివరాత్రికి భారీ బందోబస్తు
కడప అర్బన్ : మహాశివరాత్రి పర్వ దిన నేపథ్యంలో ఈనెల 15న దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రత చర్యలపై జిల్లా పోలీస్ అధికారులతో మంగళవారం సమీక్షా సమావేశంను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ నిర్వహించారు. మహాశివరాత్రి పండుగను పురస్కరించుకొని జిల్లాలోని దేవాలయాల వద్ద తీసుకోవలసిన భద్రతాపరమైన చర్యలపై మంగళవారం మంగళగిరి రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయం నుండి డీజీపీ హరీష్ కుమార్ గుప్తా పోలీస్ అధికారులతో వీడియో కాన్ఫరెనన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మాట్లాడుతూ ఫిబ్రవరి 15వ తేదీన జిల్లావ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో శివరాత్రి ఉత్సవాలు ఘనంగా జరుగుతాయన్నారు. జిల్లాలో ప్రధానంగా కడప సబ్ డివిజన్ పరిధిలోని పొలతల, మైదుకూరు సబ్ డివిజన్ సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలోని నిత్యపూజ కోన, రాజంపేట పోలీస్ స్టేషన్ పరిధిలోని హత్యరాల క్షేత్రాలకు భక్తులు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందున, ఆయా ప్రాంతాల్లో పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. భక్తుల రాకపోకలకు ఇబ్బంది కలగకుండా పటిష్టమైన బారికేడింగ్ ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ సమస్యలు తలెత్తకుండా తగిన ముందస్తు చర్యలు తీసుకుంటూ వాహనాల పార్కింగ్ కోసం అనువైన ప్రదేశాలను సిద్ధం చేసుకోవాలన్నారు. ప్రతి దేవాలయంలోనూ, పరిసర ప్రాంతాల్లోనూ తప్పనిసరిగా సీసీ కెమెరాలు ఏర్పాటు చేయించాలని, వాటిని పర్యవేక్షించేందుకు కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో డ్రోన్ సర్వైలెన్న్స్ నిర్వహించాలని జిల్లా ఎస్పీ సూచించారు. ఎక్కడా ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె. ప్రకాష్ బాబు, రాజంపేట ఎ ఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, ఎస్బీ డీఎస్పీ ఎన్. సుధాకర్ , కడప డీఎస్పీ ఎ. వెంకటేశ్వర్లు, మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, ఎస్బీ ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య, సీఐ లు చల్లని దొర, బాల మద్దిలేటి, నరసింహ రాజు, మన్నూరు సి.ఐ ప్రసాద్ బాబు, ఆర్ఐలు సోమశేఖర్ నాయక్, శివరాముడు, ఎస్ఐ పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
తమలపాకు తోటల పరిశీలన
కడప అగ్రికల్చర్ : వైఎస్సార్ జిల్లా సికెదిన్నె మండలంలోని కొలుములపల్లి గ్రామంలో మంగళవారం తమలపాకు తోటలను మండల ఉద్యాన, వ్యవసాయ అధికారులతో కలిసి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డా. ఎస్. మానస పరిశీలించారు. ఎండు తెగులు ప్రధాన సమస్యగా ఉందని గుర్తించారు. నివారణకు సమగ్రంగా యాజమాన్యం చేపడితే తప్ప నియంత్రించడం కష్టమని తెలిపారు. ఈ తెగులు నియంత్రణకు ప్రతి రెండు సంవత్సరాలకు ఒకసారి జొన్న లేదా మొక్కజొన్నతో పంటమార్పిడి చేయాలని తెలిపారు. ఎకరానికి ఒక టన్ను చొప్పున జిప్సమ్ వేసి అవిశ నాటటానికి ముందే కలియదున్నాలని చెప్పారు. తెగులు ఎక్కువగా ఆశించే తోటలలో నవంబరు నుండి ఫిబ్రవరి వరకు నెలకు ఒకసారి చొప్పున 4 సార్లు 1% బోర్డో మిశ్రమాన్ని పాదుల్లో పోసుకుంటూ 15 రోజుల కొకసారి చొప్పున 8 సార్లు ఆకులపై పిచికారి చేయాలని తెలిపారు. వీటిలోపాటు మరికొన్ని సూచనలు చేశారు. ఈ కార్యక్రమంలో మండల ఉద్యాన అధికారి రెడ్డయ్య, వ్యవసాయ అధికారి ఈశ్వర్ , డీఆర్సీ పద్మజ, సెరికల్చర్ పాల్గొన్నారు. -
రెట్టింపు డబ్బులు ఇస్తామంటూ మోసం
ప్రొద్దుటూరు క్రైం : రూ.35 లక్షలు ఇస్తే ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాలో రూ. 50 లక్షలు జమ చేస్తామని మోసగాళ్లు నమ్మించారు. వారి ట్రాప్లో పడిన గంగాప్రసాద్ రూ.35 లక్షలు ఇచ్చాడు. డబ్బు చేతికి అందగానే కత్తితో బెదిరించి మోసగాళ్లు పరారయ్యారు. ఏడాది తర్వాత ప్రొద్దుటూరు పోలీసులు వారి ఆటకట్టించారు. ఈ కేసులోని ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లను ప్రొద్దుటూరు టూ టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఏఎస్పీ విభూకృష్ణ మంగళవారం రాత్రి అరెస్ట్ వివరాలను మీడియాకు వెళ్లడించారు. ప్రొద్దుటూరులోని గోకుల్నగర్కు చెందిన చెందిన ఆదిమూలం గంగాప్రసాద్ క్లర్క్గా పని చేస్తున్నాడు. గతేడాది జనవరి 7న కొందరు వ్యక్తులు అతని వద్దకు వచ్చి ఎంత డబ్బు నగదు రూపంలో ఇస్తే అంతకు రెట్టింపు డబ్బును ఆన్లైన్ ద్వారా బ్యాంక్ ఖాతాకు ట్రాన్స్ఫర్ చేస్తామని నమ్మించారు. దీంతో ఆశపడిన గంగాప్రసాద్ అందుకు అంగీకరించి రూ. 33 లక్షల నగదును వారికి ఇచ్చాడు. అతను ఇచ్చిన డబ్బును బ్యాగ్లో నింపి ప్రసాద్ ఎదురుగానే వారు ఒక షూట్కేసులో పెట్టుకున్నారు. కొద్ది సేపటి తర్వాత ఆన్లైన్లో డబ్బు పంపడం ఆలస్యం అవుతోందని నీ డబ్బు వాపసు తీసుకో అని చెప్పి మరో బ్యాగ్ను ప్రసాద్కు ఇచ్చారు. అతను ఇంటికి వెళ్లి బ్యాగ్ తెరచి చూసుకోగా అందులో తెల్లకాగితాల బండిళ్లు ఉన్నాయి. దీంతో మోసపోయానని గ్రహించిన ప్రసాద్ టూ టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఐదుగురు అంతర్రాష్ట్ర మోసగాళ్లు అరెస్ట్ ఈ క్రమంలో నిందితులను మంగళవారం ప్రొద్దుటూరులోని దానంబట్టి క్రాస్రోడ్డు సమీపంలో టూ టౌన్ సీఐ వంశీనాథ్, ఎస్ఐ రాఘవేంద్రారెడ్డిలు సిబ్బందితో కలసి అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో పులివెందుల మండలంలోని పెద్దరంగాపురం గ్రామానికి చెందిన కొమ్మడ్డి గంగులయ్య, బెంగళూరుకు చెందిన పఠాన్సత్తార్, శ్రీకాకుళం జిల్లా రాజాం గ్రామానికి చెందిన అంకం నాగేశ్, హైదరాబాద్లో ఉంటున్న మల్రెడ్డి గోపాల్రెడ్డి, నెల్లూరు జిల్లా ఆల్లూరు మండలానికి చెందిన తిరుపతి పెంచలయ్యలు ఉన్నారు. వారి వద్ద నుంచి రూ. 8.50 లక్షల నగదుతో పాటు కత్తి, షూట్ కేసును స్వాధీనం చేసుకున్నారు. వీరిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించనున్నట్లు ఏఎస్పీ తెలిపారు. ఈ ముఠా సభ్యులు రైస్పుల్లింగ్, పవర్కాయిన్స్ లాంటి మోసపూరిత విధానాల ద్వారా అమాయకు ప్రజలను మోసగిస్తునట్లు ఏఎస్పీ పేర్కొన్నారు. ఇలాంటి వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆశకు పోయి మోసపోవద్దన్నారు. ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ, ఎస్ఐ, సిబ్బందిని ఏఎస్పీ అభినందించారు. రూ. 33 లక్షలతో ఉడాయించిన మోసగాళ్లు ఏడాది తర్వాత పోలీసులకు దొరికిన నిందితులు ఐదుగురు అరెస్ట్, రూ.8.50 లక్షలు స్వాధీనం అరెస్ట్ వివరాలను వెల్లడించిన ప్రొద్దుటూరు ఏఎస్పీ విభూకృష్ణ -
రోడ్డు ప్రమాదంలో కలెక్టర్కు తప్పిన ప్రమాదం
చాపాడు : మైదుకూరు – ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో మంగళవారం రాత్రి వైఎస్సార్ జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ కారు రోడ్డు ప్రమాదానికి గురైంది. ప్రొద్దుటూరులోని మున్సిపల్ కార్యాలయంలో జరిగిన నియోజకవర్గ స్థాయి సమీక్ష సమావేశానికి హాజరైన కలెక్టర్ తిరుగుపయనమయ్యారు. ఈ క్రమంలో రాత్రి 8 గంటల ప్రాంతంలో చాపాడు మీదుగా కడపకు వెళుతుండగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రం సమీపంలో కలెక్టర్ కారు ముందు వెళుతున్న స్కూటీ, లారీ వాహనాలు ఒక్కసారిగా వేగం తగ్గించాయి. దీంతో కలెక్టర్ కారు సైతం వేగం తగ్గించింది. దీని వెనకాలే వస్తున్న అశోక్ లేలాండ్ వాహనం(ట్రక్కు) కలెక్టర్ కారును వెనుకవైపు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు వెనుకవైపు దెబ్బతింది. కారులో ఉన్న కలెక్టర్కు ఎలాంటి ప్రమాదం జరగలేదు. ఈ విషయం తెలుసుకున్న చాపాడు పోలీసులు సంఘటన స్థలం చేరుకొని అశోక్ లేలాండ్ వాహనాన్ని పోలీస్స్టేషన్కు తరలించారు. ఈయనతోపాటు పలువురు జిల్లా స్థాయి అధికారులు ఉన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ నాగేంద్రప్రసాద్ తెలిపారు. -
ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న కారు
– ఇద్దరికి గాయాలు పెండ్లిమర్రి : కడప–పులివెందుల ప్రధాన రహదారిలోని పాతసంగటిపల్లె రోడ్డు వద్ద మంగళవారం రాత్రి ఇన్నోవా కారు ద్విచక్ర వాహనాన్ని ఢీకొన్న సంఘటనలో పాతసంగటిపల్లె హరిజనవాడకు చెందిన మురళి, నాగయ్యలకు తీవ్ర గాయాలు అయ్యాయి. మురళి, నాగయ్యలు పాతసంగటిపల్లె హరిజనవాడ నుంచి పని నిమిత్తం ద్విచక్ర వాహనంలో వెల్లటూరుకు వస్తుండగా పులివెందుల నుంచి కడపకు వెళుతున్న ఇన్నోవా కారు పాతసంగటిపల్లె రోడ్డు వద్ద రోడ్డు దాటుతున్న ద్విచక్ర వాహనాన్ని అదుపు తప్పి ఢీకొంది. దీంతో ద్విచక్ర వాహనంలో వెళుతున్న ఇద్దరికి తీవ్ర గాయాలు అయ్యాయి. చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కడప అర్బన్ : కడప నగరం జిల్లా కోర్టు సమీపంలో సోమవారం అర్ధరాత్రి సమయంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపాళెం మండలం గోపాయపల్లికి చెందిన బీరం నాగేశ్వర్ రెడ్డి (53) అనే వ్యక్తి దుర్మరణం చెందారు. ఈసంఘటన వివరాలను కడప ట్రాఫిక్ సిఐ సురేష్ రెడ్డి తెలిపారు. మృతుడు తమ స్వగ్రామం నుంచి కడపలో తన మనువడి పుట్టినరోజుకు వచ్చారు. కడప కోటిరెడ్డిసర్కిల్ నుంచి ఆర్టీసి బస్టాండ్ వద్దకు మోటార్సైకిల్లో వెళుతుండగా అదుపుతప్పి డివైడర్ను ఢీకొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. జెఎస్డబ్ల్యూ పరిశ్రమ భూముల పరిశీలన జమ్మలమడుగు : మండల పరిధిలోని కన్యతీర్థం సమీపంలో జిందాల్ పరిశ్రమకు కేటాయించిన భూముల రికార్డులను జాయింట్ కలెక్టర్ నిధిమీనన్ మంగళవారం పరిశీలించారు. సున్నపురాళ్లపల్లె సమీపంలో ఉన్న స్టీల్ప్లాంట్ కోసం కేటాయించిన భూములకు సంబంధించిన రికార్డులను ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్ శ్రీనివాసులరెడ్డితో కలసి పరిశీలించారు. ఇంత వరకు కేటాయించిన భూముల్లో ఎటువంటి పనులు జరిగాయని అడిగి తెలుసుకున్నారు. ఏపీ ఇండస్ట్రీయల్ పేరుమీద ఉన్న భూములను జిందాల్కు బదాలింపు జరిగిన ప్రాంతాలను ఆమె పరిశీలించారు. కార్యక్రమంలో సర్వేయర్ గురుశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
అయ్యో పాపం..
● గుండెపోటుతో తండ్రి మృతి ● గతంలో కరోనాతో తల్లి మృతి ● అనాథలైన ముగ్గురు పిల్లలు పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని కడప రోడ్డు సమీపంలోని హెచ్పీ గ్యాస్ గో డౌన్ వద్ద మోపూరి రాజా అనే వ్యక్తి డ్రైవర్గా పనిచేస్తూ కు టుంబాన్ని పోషించుకుంటున్నాడు. మంగళవారం ఉదయం రాజా ఛాతి నొప్పితో బాధపడుతూ గుండె పోటుతో మృతి చెందారని బంధువులు తెలిపారు. మృతుడు రాజా భార్య ఆరేళ్ల క్రితం కరోనాతో మృతి చెందింది. రాజాకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉండగా, ప్రస్తుతం వారు అనాథలయ్యారు. దీంతో పిల్లలు అనాథలు కావడంతో అయ్యో పాపమంటూ స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మత్స్యశాఖ అభివృద్ధికి కృషి
కడప అగ్రికల్చర్ : మత్స్యశాఖను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అందరి డైరెక్టర్స్తో కలిసి కృషి చేస్తామని ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ పేర్కొన్నారు. కడపలోని మత్స్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా డైరెక్టర్లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కడప జిల్లా మత్స్య శాఖ అధికారి రవి కుమార్, ఎప్డిఓలు, వీఎఫ్ఏలతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సొసైటీల ఆడిట్, న్యూ సొసైటీల ఏర్పాటు, పథకాల అమలు, డీఎఫ్సీఎస్ ఆదాయం పెంచుట తదితర అంశాలపై చర్చించారు. అలాగే ఫిష్ మార్కెట్, మత్స్యకారుల సమస్యలు, తదితర అంశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు. -
బద్వేలులో దొంగల హల్చల్
– ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీ బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలో దొంగలు మంగళవారం పట్టపగలే ఒకే రోజు మూడు ఇళ్లలో చోరీలకు పాల్పడి పోలీసులకు సవాల్ విసిరారు. పట్టణంలోని చెన్నంపల్లె మిట్టకు చెందిన చిన్నవీరయ్య అనే వ్యక్తి వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తుంటాడు. పని నిమిత్తం ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లగా దుండగులు లోనికి ప్రవేశించి బీరువా పగులకొట్టి 9 తులాల బంగారు ఆభరణాలు, రూ.44 వేలు నగదు, కొన్ని వెండి వస్తువులు అపహరించుకుని పోయారు. అలాగే సురేంద్రనగర్లోని గొడుగునూరు గోపి ఓ ప్రైవేటు పాఠశాలలో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నాడు. తన భార్యకు పరీక్ష ఉండటంతో ఇంటికి తాళం వేసి కడపకు వెళ్లి వచ్చేసరికి ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో పాటు బీరువా పగులకొట్టి ఉంది. చోరీ జరిగినట్లు గుర్తించి పోలీసులకు సమాచారం ఇవ్వగా వారు వచ్చి ఘటన స్థలాన్ని పరిశీలించారు. గోపి ఇంట్లో 6 తులాలు బంగారు ఆభరణాలు, రూ.20 వేలు నగదు, కొంత వెండి సామాగ్రి ఎత్తుకెళ్లారు. అలాగే చెన్నంపల్లె సమీపంలోని తిరుపతమ్మ అనే మహిళ ఇంట్లో కూడా దుండగులు చోరీకి పాల్పడ్డారు. 5 తులాల వెండి ఆభరణాలతో పాటు రూ.3 వేలు నగదు దోచుకెళ్లారు. బాధితుల ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. కాగా సురేంద్రనగర్లోని ప్రైవేటు ఉపాధ్యాయుడు గోపి ఇంట్లో గల సీసీ కెమెరాలో ఇంట్లోకి ఒక వ్యక్తి ప్రవేశిస్తున్నట్లు నమోదు కావడంతో పోలీసులు విచారణ చేస్తున్నారు. -
గువ్వలచెరువు సొరంగం నిర్మాణానికి గ్రీన్సిగ్నల్
కడప కార్పొరేషన్: కడప– రాయచోటి రహదారిలో గువ్వల చెరువు ఘాట్ వద్ద సొరంగం నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం నుంచి గ్రీన్ సిగ్నల్ లభించింది. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి 2025 డిసెంబర్ 17న రాసిన లేఖకు కేంద్ర రోడ్డు, రవాణా, హైవేస్ మంత్రి నితిన్ గడ్కరీ ఈ మేరకు సమాధానం ఇచ్చారు. కడప– రాయచోటి మార్గంలో 4లేన్ల రహదారి, దాని అనుబంధ మార్గాల నిర్మాణానికి సంబంధించి పీఎంసీ సేవలు, డీపీఆర్ తయారీ, నిర్మాణానికి ముందు పనులు, నిర్మాణం, నిర్వహణ పర్యవేక్షణ కోసం రూ.10.95కోట్లు మంజూరు చేశామని మంత్రి పేర్కొన్నారు. సొరంగం నిర్మాణ పనులు 2025– 26, 2026–27 వార్షిక ప్రణాళికలో చేర్చా మని వివరించారు. అంతర్జాతీయ విమాన సర్వీసులు నడపాలి రాజంపేట: తిరుపతి విమానాశ్రయం నుంచి అంతర్జాతీయ విమానసర్వీసులు నడపాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కోరారు. ఈ అంశంపై పార్లమెంటులో మంగళవారం డిమాండ్ చేశారు. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి లేఖకి కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ సమాధానం -
ముగిసిన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఫిబ్రవరి 1 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు 10వ తేదీతో ముగిశాయి. చివరిరోజు మంగళవారం 36 పరీక్షా కేంద్రాల్లో జరిగిన పరీక్షలకు 796 మంది విద్యార్థులు హాజయ్యారు ఆర్ఐవో వెంకటేశ్వర్లతోపాటు స్క్వాడ్్ బృందాలు, డీఈసీ సభ్యులు జిల్లాలోని పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేసి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చినట్లు తెలిపారు. కడప అగ్రికల్చర్: ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో దక్షిణ మండల స్థాయి ( కడప, అన్నమయ్య, తిరుపతి, చిత్తూరు, నెల్లూరు జిల్లాల స్థాయిలో) భారీ ‘‘ కిసాన్ మేళా ’ ఫిబ్రవరి 12న తిరుపతిలోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధనా స్థానం లో ఉదయం 9 గంటల నుంచి సాయంత్ర 5 గంటల వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు వి. సుమతి కేవీకే సమన్వయకర్త అంకయ్యకుమార్లు తెలిపారు. ‘సమగ్ర వ్యవసాయం – లాభదాయకం‘ అనే నినాదంతో జరిగే ఈ మేళాను రైతులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఇప్పటివరకు యూటీఎస్ మొబైల్ యాప్ ద్వారా ప్లాట్ఫాం, జనరల్ టిక్కెట్టు కొనేవారని, మార్చి 1 నుంచి వాటిని నిలిపి వేస్తున్నామని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. మంగళవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. యూటీఎస్ స్థానంలో రైల్ వన్ యాప్ను అందుబాటులోకి తీసుకువచ్చారన్నారు. మార్చి 1వ తేది నుంచి ఈ యాప్ ద్వారా ప్లాట్ఫాం, జనరల్టిక్కెట్లను కొనుగోలు చేయాల్సి ఉంటుందన్నారు. ఈ విషయాన్ని ప్రయాణికులు గుర్తిస్తూ ఆయా టిక్కెట్లను యాప్ ద్వారా తీసుకోవాల్సి ఉంటుందని వివరించారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో ఎక్కడా ఎరువుల కొరత లేదని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ తెలిపారు. మంగళవారం జిల్లాకు 1710 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని ఆయన తెలిపారు. ఇందులో 1150 మెట్రిక్ టన్నుల యూరియాను మార్క్ఫెడ్కు కేటాయించగా మరో 560 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. కడప అర్బన్: మిస్ గ్రాండ్ – ఏపీ–2026 మొదటి రన్నరప్గా బోడగల మహిమాన్విత విజయం సాధించారు. తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్ రామదాస్పల్లెలో ఈనెల 7న జరిగిన ఫైనల్స్లో మొదటి రన్నర్ గా కిరీటం గెలుపొందారు. కడప జిల్లా కొత్త మాధవరం గ్రామానికి చెందిన డాక్టర్ శ్రీనివాసులు,రమ్యశ్రీల కుమార్తె అయిన మహిమాన్విత ప్రస్తుతం నెల్లూరులో బీడీఎస్ అభ్యసిస్తున్నారు. మహిమాన్వితను తల్లిదండ్రులు, అన్న డాక్టర్ హరికష్ణ కౌశిక్, సహచర విద్యార్థులు అభినందించారు. చాపాడు: మండలంలోని అల్లాడుపల్లె శ్రీవీరభద్రస్వామి దేవస్థానంలో మంగళవారం శాశ్వత హుండీ ఆదాయాలను లెక్కించారు. అన్నమయ్యజిల్లా దేవాదాయశాఖ అసిస్టెట్ కమిషనర్ విశ్వనాథ్ పర్యవేక్షణలో హుండీల ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్, ఏఓ శంకర్ బాలాజీ మాట్లాడుతూ 3 నెలల 28 రోజులకు సంబంధించిన హుండీలను లెక్కించగా రూ.8,59,761 నగదు, 1.500 గ్రాముల బంగారు, 416.500 గ్రాముల వెండి, అన్నదాన సత్రంలో ఉన్న హుండీని లెక్కించగా రూ.62,390 వచ్చిందన్నారు. మొత్తం నగదు రూ.9,22,151 వచ్చిందని వారు తెలిపారు. కమిటీ సభ్యులు, రెవెన్యూ, బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది, అర్చకులు పాల్గొన్నారు. -
మహా శివరాత్రికి ఆర్టీసీ ప్రత్యేక సర్వీసులు
కడప కోటిరెడ్డిసర్కిల్: మహా శివరాత్రిని పురస్కరించుకుని ఈనెల 14, 15 తేదీల్లో కడప జోన్లోని ఎనిమిది జిల్లాల నుంచి 1454 ప్రత్యేక బస్సులను నడపనున్నామని కడప జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్టీపీ రాఘవకుమార్ తెలిపారు. మంగళవారం సాయంత్రం తన కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జోన్ వ్యాప్తంగా ఎనిమిది జిల్లాల్లో 51 డిపోలు, 4249 బస్సులు ఉన్నాయన్నారు. వీటిలో మహా శివరాత్రిని పురస్కరించుకుని 1454 ప్రత్యేక సర్వీసులను నడపుతున్నామన్నారు. వీటిలో అత్యధికంగా శ్రీశైలంకు 460 బస్సులు, వైఎస్సార్ జిల్లాలోని పొలతలకు 130, నిత్యపూజకోన 40, లంకమల 34 బస్సులను నడుపుతున్నామన్నారు. వీటిలో వైఎస్సార్ జిల్లా నుంచి 318బస్సులు, కర్నూలు 276, నంద్యాల 275, చిత్తూరు 71, సత్యసాయి 30, తిరుపతి 182, అన్నమయ్య 245, అనంతపురం నుంచి 57 బస్సులు చొప్పున శివరాత్రికి నడుపుతున్నామన్నారు. భక్తులు సురక్షితంగా ప్రయాణించేందుకు ఆర్టీసీ బస్సులను వినియోగించుకోవాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీటీఎం ప్రశాంతి తదితరులు పాల్గొన్నారు. ● శ్రీశైలానికి 460 బస్సులు ● జిల్లాలోని పొలతలకు 130 సర్వీసులు ● కడపజోన్ ఈడీ ఎస్టీపీ రాఘవకుమార్ -
●మాస్టర్ ప్లాన్పై పున ఃపరిశీలన చేయాలి: మేయర్
కోవిడ్–19 సమయంలో ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను పునఃపరిశీలన చేయాలని మేయర్ పాకా సురేష్కుమార్ అన్నారు. వైజాగ్లో ఏకంగా రద్దు చేశారని, మనం కూడా ఆ విధంగా చేయవచ్చేమో పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టతరమవుతుందని, కార్పొరేషన్ స్థలాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. గతంలో పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని సాయి మౌర్యకు లీజుకు ఇచ్చామని, ఆర్బిట్రేటర్ను నియమించుకొని ఆ సమస్య పరిష్కరించుకోవాలని న్యాయస్థానం చెప్పినా, ఇంతవరకూ అధికారులు దానిపై దృష్టి పెట్టలేదన్నారు. కార్పొరేషన్కు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.


