breaking news
YSR District Latest News
-
ప్రపంచంలో భారతదేశాన్ని
మాట్లాడుతున్న మాజీ ఉప రాష్ట్రపతి వెంకటయ్యనాయుడు కడప ఎడ్యుకేషన్: విద్యార్థులు తెలివితేటలకు సాన పెట్టి కొత్త సవాళ్లను అధిగమిస్తూ ప్రపంచంలో భారతదేశాన్ని మేటిగా నిలిపేలా.. క్రమశిక్షణ కలిగిన పౌరులుగా తయారు కావాలని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు ఉద్భోదించారు. ప్రపంచంలో నాలుగో ఆర్థిక శక్తిగా ఎదిగేందుకు యువత తమ మేధాశక్తికి సానపెట్టి కొత్త సవాళ్లను స్వీకరించాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్ కడప జిల్లాలోని యోగివేమన విశ్వవిద్యాలయం నూతన పరిపాలనా భవనంలోని అన్నమయ్య సెనేట్ హాలులో వైవీయూ వీసీ బెల్లకొండ రాజశేఖర్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ 150వ జయంతి వేడుక సందర్భంగా విద్యార్థులతో జరిగిన సమావేశానికి ఆయన హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆమెరికా స్నేహం అవసరం అనుకున్నా దేశ సార్వభౌమత్వాన్ని ఫణంగా పెట్టడానికి ప్రధాని మోదీ సిద్ధంగా లేరన్నారు. అమెరికా వైట్హౌస్ అధ్యక్షుడు మోదీని డిన్నర్కు ఆహ్వానించినా హాజరుకాలేదన్నారు. అయనే అంత క్రమశిక్షణతో ఉన్నప్పుడు నేటి యువత మరింత క్రమశిక్షణ అలవర్చుకోవాలని సూచించారు. చిన్న పిల్లలకు డైపర్లు మార్చినంత ఈజీగా రాజకీయ నాయకులు రోజుకోపార్టీ మారుతున్నారని అన్నారు. అసెంబ్లీ, పార్లమెంట్లను మైకులు విరగగొట్టడం, కుటుంబ సభ్యుల గురించి మాట్లాడడానికి వేదికగా మార్చారన్నారు.ప్రస్తుతం బూతులు మాట్లాడటం జరుగుతోందని, అయితే ప్రజలు వారికి పొలింగ్ బూతులోనే సమాధానం చెప్పాలని పేర్కొన్నారు. జీవిత సత్యాలను బోధించిన మహనీయుడు యోగి వేమన జీవిత సత్యాలను బోధించిన మహనీయుడు యోగివేమన అని, ఆయన శతకం చదివితే జీవితాన్ని చదివినట్లే అని మాజీ ఉప రాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు పేర్కొన్నారు. వైవీయూలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ జానమద్ది హనుమచ్ఛాస్త్రి కార్యక్రమం కోసం కడపకు వచ్చానన్నారు. ఇందులో భాగంగా యోగివేమన విశ్వ విద్యాలయాన్ని సందర్శించానన్నారు.ఇన్నేళ్ల తన అనుభవంలో తెలుసుకున్న విషయాలను విద్యార్థులు, యువతతో పంచుకోవాలనే ఉద్దేశంతో దేశంలోని విశ్వ విద్యాలయాలు, ఐఐఎంలు, ఐఐటీలు సందర్శిస్తున్నట్లు చెప్పారు. కడపజిల్లాలో యోగివేమన విశ్వ విద్యాలయం ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. చరిత్రాత్మకంగా, సాంస్కతికంగా, ఆధ్యాత్మికంగా కడపజిల్లా తెలుగువారికి అత్యంత ఇష్టమెన ప్రదేశం అన్నారు. మత సామర్యానికి ప్రతీకగా నిలుస్తోందన్నారు. తాళ్లపాక అన్నమాచార్యులు, ఆయన శ్రీమతి తిమ్మక్కలు ఈ ప్రాంతాన్ని పునీతం చేశారన్నారు. తెలుగు కవయిత్రి మొల్ల గోపవరం అడపడుచు అన్నారు.శ్రీకృష్ణదేవరాయల ఆస్థానంలోని అష్టదిగ్గజాల్లో అల్లసాని పెద్దన, రామభద్రుడు కూడా కడపజిల్లాకు చెందిన వారే అని అన్నారు.సీపీబ్రౌన్ కడపజిల్లా జేిసీగా పనిచేస్తూ తెలుగుభాషపై మక్కువ పెంచుకుని, భాషాభివృద్ధికి కృషి చేశారన్నారు. కడపజిల్లా సాంస్కృతిక, కళా సాహిత్య, ఆధ్యాత్మి కతలకు నెలవని కొనియాడారు. భారత ఔన్నత్యం, ఆంధ్రప్రదేశ్ గొప్పదనం, తెలుగుభాష తీయదనం విద్యార్థులకు అర్థమయ్యేలా తెలిపారు. ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రజాస్వామ్య దేశం భారతదేశం అని అన్నారు. ప్రపంచంలోని 12 మల్టీ నేషనల్ కంపెనీల్లో భారతీయులు సీఈవోలుగా ఉన్నారని వివరిస్తూ దేశం బలోపేతం కావాలంటే, యువత తమలో ఉన్న శక్తి సామర్థ్యాలను వినియోగించాలన్నారు. వైవీయూ ఫైన్ ఆర్ట్స్ విద్యార్థులు ప్రదర్శించిన చిత్రకళ, సర్దార్ వల్లభాయ్ పటేల్ చిత్రం ఆకట్టుకునేలా ఉన్నాయని మెచ్చుకున్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ పెద్దల మాటలను ప్రతిఒక్కరూ పాటించి సన్మార్గంలో నడవాలని సూచించారు. వైవీయూ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విద్యార్థుల అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ప్రొఫెసర్ టి శ్రీనివాస్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ తదితరులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: కడప నగరంలోని అమీన్ పీర్ దర్గాలో ఈనెల 5వ తేదీ నుంచి జరిగే ఉరుసు ఉత్సవాలకు రావాలని మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడును ఆహ్వానించారు. శనివారం కడపకు వచ్చిన మాజీ ఉప రాష్ట్రపతిని దర్గా భక్తులు కలిశారు. ఈ సందర్బంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ దర్గా చరిత్రను తెలుసుకున్నానని తెలిపారు. మత సామరస్యానికి పెద్ద దర్గా ప్రతీకగా నిలుస్తోందన్నారు. అటు ఆధ్యాత్మిక, ఇటు సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహించడంపై దర్గా భక్తులను ఆయన అభినందించారు. మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు -
ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–14 మల్టీ డే మ్యాచ్లు శనివారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కర్నూలు–కడప జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 69.5 ఓవర్లలో 125 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రిషిత్ 44 పరుగులు చేశాడు. కడప జట్టులోని మునిజ్ఞానేశ్వర్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 24 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 68 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆష్ఖాన్ (31) నాటౌట్గా నిలిచాడు. కర్నూలు జట్టులోని హేమంత్ ఒక వికెట్ తీశాడు. దీంతో కడప జట్టు కర్నూలు స్కోరు కంటే 57 పరుగులు వెనుకంజలో ఉంది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో తొలి రోజు అనంతపురం –నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 58.5 ఓవర్లలో 186 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కిన్ను కిషల్ 48 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని రోహిత్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 37 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 86 పరుగులు చేసింది. నెల్లూరు జట్టులోని శ్రీచరణ్ 2 వికెట్లు, తీశాడు. రిషిత్, కర్నూలు (44 పరుగులు)రోహిత్ రెడ్డి, అనంతపురం (6 వికెట్లు)జ్ఞానేశ్వర్, కడప (4 వికెట్లు) -
రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలం
వల్లూరు(చెన్నూరు) : మోంథా తుపాను కారణంగా పంటలు దెబ్బతిని తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని వైఎస్సార్సీపీ కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పోచిమరెడ్డి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. చెన్నూరు మండల పరిధిలోని గుర్రంపాడు పంచాయతీ ఓబులంపల్లెలో ఇటీవల కురిసిన వర్షాలకు నేల కొరిగి దెబ్బతిన్న వరి పంట పొలాలను శనివారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి వారి బాధలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసి మట్టి నమూనా సేకరణ నుంచి నాణ్యమైన విత్తనాలను, ఎరువులను అందించడమేకాక పంట చేతికొచ్చి పంటను సరైన ధరకు అమ్ముకునే వరకు రైతుకు అండగా నిలిచారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతులకు కనీసం ఎరువులను కూడా అందించలేక పోయిందన్నారు. ఉల్లిని కొనుగోలు చేస్తామని చెప్పి కొనుగోలు చేయలేదని, హెక్టారుకు రూ.50 వేలు పరిహారం అందిస్తామని ఇవ్వలేదని, సున్నా వడ్డీ, ఇన్సూరెన్స్ ప్రీమియం చెల్లింపులను ఎగనామం పెట్టిందని దుయ్యబట్టారు. వ్యవసాయం దండగ అనే సీఎం చంద్రబాబు ఆ మాటను నిజం చేయడానికి శాయ శక్తులా కృషి చేస్తున్నారని ఎద్దేవా చేశారు. సాధారణంగా రైతులకు ప్రకృతి వైపరీత్యాలు, చీడ ,పీడలు శత్రువులని, కానీ చంద్రబాబు నాయుడు వాటికంటే ప్రధాన శత్రువన్నారు. కమలాపురం నియోజకవర్గంలో కుందూ, పెన్నా నదీ పరివాహక ప్రాంతాల్లో వరి, పూల తోటలు, ఉల్లి, మినుము వంటి పంటలు వర్షాలకు దెబ్బతినగా ఇంత వరకు అధికారులు కనీసం వాటిని పరిశీలించక పోవడం దారుణమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, ఎంపీపీ చీర్ల సురేష్ యాదవ్, కమలాపురం నియోజకవర్గ వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం అధ్యక్షుడు గుమ్మళ్ల సాయి కుమార్ రెడ్డి, పార్టీ నాయకులు చల్లా వెంకటసుబ్బారెడ్డి, చల్లా శివారెడ్డి, వారిస్, హస్రత్, కార్యకర్తలు, రైతులు పాల్గొన్నారు. కమలాపురం వైఎస్సార్సీపీ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి -
ప్రొద్దుటూరులో నర్సింగ్ హోం సీజ్
● లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు ఆరోపణలు ● రిజిస్ట్రేషన్ లేకుండానే నాలుగేళ్లుగా నర్సింగ్ హోం నిర్వహణ ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని గాంఽధీరోడ్డులో ఉన్న సీఎన్ఆర్ నర్సింగ్హోంను వైద్య ఆరోగ్యశాఖాధికారులు సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యుడు ప్రతాపరెడ్డి లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు ఆరోపణలు రావడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీతా, జిల్లా వైద్యాధికారుల బృందంతో కలిసి ఆస్పత్రిని సీజ్ చేశారు. ఆస్పత్రి వైద్యుడు లింగనిర్ధారణ పరీక్షలు చేస్తున్నాడని ఫిర్యాదులు రావడంతో గత నెల 28న డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత ఆస్పత్రిని తనిఖీ చేశారు. తనిఖీల్లో భాగంగా ఆస్పత్రిలో ఉన్న మొబైల్ స్కానింగ్ మిషన్ను మరో చోటికి తరలించినట్లు గుర్తించారు. దీంతో స్కానింగ్మిషన్ను సీజ్ చేసి కడప డీఎంహెచ్ఓ కార్యాలయానికి తరలించారు. తదుపరి చర్యల నిమిత్తమై డాక్టర్ ప్రతాపరెడ్డితో మాట్లాడాలని వైద్యాధికారులు ప్రయత్నించగా ఆయన అందుబాటులో లేరు. దీంతో డిప్యూటీ డీఎంహెచ్ఓతో పాటు కడప నుంచి వైద్యాధికారుల బృందం శనివారం సీఎన్ఆర్ నర్సింగ్ హోంకు వచ్చారు. ఆస్పత్రిలోని ల్యాబ్ గది, డాక్టర్ ఓపీ గదులను సీజ్ చేశారు. ఆస్పత్రిలో గైనకాలజిస్టు గది ఉండగా.. ఈ వ్యవహారంలో ఆమె ప్రమేయం లేని కారణంగా సీజ్ చేయలేదని వైద్యాధికారులు చెబుతున్నారు. నాలుగేళ్లుగా రిజిస్ట్రేషన్ రెన్యువల్ కాలేదు లింగనిర్ధారణ పరీక్షలు నిర్వహించారనే ఆరోపణలపై ఆస్పత్రిని సీజ్ చేయడానికి జిల్లా వైద్యాధికారులు వచ్చిన నేపథ్యంలోఆస్పత్రికి సంబంఽధించిన ఆసక్తికరమైన విషయం వెలుగు చూసింది. సీఎన్ఆర్ నర్సింగ్హోం రిజిస్ట్రేషన్ గడువు ముగిసి నాలుగేళ్లయింది. అప్పటి నుంచి ఆస్పత్రి నిర్వాహకులు రిజిస్ట్రేషన్ను రెన్యువల్ చేసుకోలేదు. కేవలం ఫిర్యాదులు వస్తే తప్ప సంబంధిత జిల్లా వైద్యఆరోగ్యశాఖాధికారులు ఆస్పత్రుల వైపు కన్నెత్తి చూడటం లేదు. గత 28న తనిఖీ చేయడానికి డిప్యూటీ డీఎంహెచ్ఓ వచ్చి వెళ్లిన రెండు రోజుల తర్వాత రిజిస్ట్రేషన్ రెన్యువల్ కోసం ఆస్పత్రి నిర్వాహకులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకున్నారు. స్కానింగ్ మిషన్ను మరో చోటికి తరలించరాదు రిజిస్ట్రేషన్లో పొందు పరిచిన విధంగా కాకుండా ఒక గది నుంచి మరో గదికి స్కానింగ్ మిషన్ను మార్చినా నేరం అవుతుందని డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత అన్నారు. ఆస్పత్రిలోని గదులను సీజ్ చేసిన అనంతరం డాక్టర్ గీత మీడియాతో మాట్లాడారు. తమకు వచ్చిన ఫిర్యాదుల మేరకు గత నెల 28న సీఎన్ఆర్ నర్సింగ్హోను తనిఖీ చేశామన్నారు. ఆస్పత్రిలో ఉన్న స్కానింగ్ మిషన్ను ఒక ఆర్ఎంపీ క్లినిక్కు తరలించినట్లు తమ విచారణలో వెల్లడైందని చెప్పారు. దీంతో స్కానింగ్ మిషన్ను సీజ్ చేసి డీఎంహెచ్ఓ కార్యాలయానికి పంపించామన్నారు. లింగనిర్ధారణ పరీక్షలు చేసినట్లు రుజువు కాలేదని, తమకు ఆధారాలు ఏమీ దొరకలేదన్నారు. కేవలం స్కానింగ్ మిషన్ను మరో చోటికి తీసికెళ్లినట్లు మాత్రమే నిర్ధారణ జరిగిందన్నారు. ఆస్పత్రి రిజిస్ట్రేషన్ గడువు ముగిసి నాలుగేళ్లు అయిందన్నారు. రిజిస్ట్రేషన్ చేసుకోవాలని మూడు నోటీసులు జారీ చేసినట్లు డిప్యూటీ డీఎంహెచ్ఓ తెలిపారు. అయినా వారు ఖాతరు చేయలేదన్నారు. రెన్యువల్ కోసం రెండు రోజుల క్రితం దరఖాస్తు చేసుకున్నారని చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం పూర్తి స్థాయి నివేదికను ఉన్నతాధికారులకు పంపించనున్నట్లు చెప్పారు. తనిఖీల్లో జిల్లా ప్రోగ్రాం అధికారి డాక్టర్ ప్రవీణ్కుమార్, డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత, డెమో భారతి, హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని ఇరువురికి గాయాలు
మైదుకూరు : మైదుకూరు – ప్రొద్దుటూరు రహదారిలో పట్టణ శివారులో ఉన్న బైపాస్ సమీపంలో శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని ద్విచక్రవాహనంపై వెళుతున్న ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ప్రొద్దుటూరు మండలం కల్లూరు గ్రామానికి చెందిన అజీజ్ బాషా, బాబు అనే వ్యక్తులు ఇంటి నిర్మాణంలో టైల్స్ వేసే పని చేస్తుంటారు. శనివారం మైదుకూరులో ఓ ఇంటిలో టైల్స్ పని చేసి తిరిగి గ్రామానికి బైక్పై వెళుతుండగా బైపాస్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో అజీజ్బాషా, బాబుకు తలకు తీవ్ర గాయాలయ్యాయి. మైదుకూరు ప్రభుత్వాస్పత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అదుపు తప్పిన స్కూల్ బస్సు కాశినాయన : మండలంలోని కొట్టాలపల్లె చెరువు కట్టమీద శనివారం ప్రైవేట్ స్కూల్ టైర్ పంచర్ కావడంతో వరి మళ్లలోకి వెళ్లింది. డ్రైవర్ చాకచక్యంతో బస్సును పొలాల్లోకి దింపాడు. ఆ సమ యంలో బస్సులో ఐదుగురు విద్యార్థులు ఉండగా వారికి ఎలాంటి ప్రమాదం జరగలేదు. వెంటనే స్థానికులు పిల్లలను బయటికి తీసుకొచ్చారు. కుక్కల దాడిలో 18 గొర్రెలు మృతి ఖాజీపేట : గొర్రెల మందపై కుక్కల గుంపు దాడి చేయడంతో సుమారు 18 గొర్రెలు మృతి చెందాయి. ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన బత్తల ఓబులేసు యాదవ్కు గొర్రెలు ఉన్నాయి. శనివారం కమలాపురం మండలం కొత్తపల్లె గ్రామంలోని పొలాల్లో మేపు కోసం గొర్రెలను వదిలి వెళ్లి విశ్రాంతి తీసుకుంటుండగా ఒక్కసారిగా కుక్కల గుంపు వచ్చి దాడి చేసింది. ఈ దాడిలో సుమారు 18 గొర్రెలు మృతి చెందగా మరో 10 తీవ్రంగా గాయపడి మృత్యువుతో పోరాడుతున్నాయి. ప్రభుత్వం పరిహారం ఇచ్చి ఆదుకోవాలని బాధితుడు కోరుతున్నాడు. -
హోంగార్డ్స్ సంక్షేమానికి ప్రాధాన్యత
కడప అర్బన్ : హోంగార్డుల సంక్షేమానికి పోలీసు శాఖ ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తోందని హోంగార్డ్స్ కమాండెంట్ ఎం.మహేష్ కుమార్ పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ షె ల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఆయన హోంగార్డ్ యూనిట్ల పరిశీలన నిమిత్తం జిల్లాకు వచ్చారు. ఈ సందర్భంగా ఉమేష్ చంద్ర కల్యాణ మండపంలో హోంగార్డులకు దర్బార్ పెరేడ్ నిర్వహించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ దురలవాట్లకు దూ రంగా వుండి క్రమశిక్షణతో విధులు నిర్వహిస్తూ పోలీ స్ శాఖకు మంచి పేరు తీసుకురావాలన్నారు. అలాగే పీఎంజేజేబీవై, పీఎంఎస్బీవై పాలసీలు రెన్యూవల్ చేసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ శ్రీశైలరెడ్డి, హోంగార్డ్స్ పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలో పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో ఎంఎస్ఎంఈల ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసి రాయితీ రాని ఎస్సీ ఎస్టీలు ఈనెల 3తేదీ సోమవారం కడప కలెక్టరేట్ వద్దకు రావాలని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర కోరారు. శనివారం నగరంలోని సీపీఐ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంఎస్ఎంఈ ద్వారా పరిశ్రమలు ఏర్పాటు చేసిన ఎస్సీ ఎస్టీలు 2021 ఆగస్టు నుంచి సబ్సిడీ రాక రుణాలు ఇచ్చిన బ్యాంకుల ఒత్తిళ్లతో అధిక వడ్డీలకు అప్పుచేసి ఈఎంఐ చెల్లిస్తూ అప్పుల ఊబిలో కూరుకుపోయారన్నారు. కూటమి ప్రభుత్వ వైఖరికి నిరసనగా సబ్సిడీ రాని ఎస్సీ ఎస్టీ పారిశ్రామికవేత్తలు ఈనెల 3 తేదీ సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో కలెక్టర్ను కలిసి వినతి పత్రం అందజేయనున్నట్లు తెలిపారు. -
నకిలీమరక.. ప్రజల్లోకి వెళ్లేదెలా?
మదనపల్లె: ములకలచెరువులో అక్టోబర్ 3న నకిలీమద్యం తయారీ ప్లాంట్ వెలుగుచూడటంతో యావత్ రాష్ట్రం ఉలికిపాటుకు గురైంది. ఆరోజు కడప ఎకై ్సజ్, ఎన్ఫోర్స్మెంట్, ఎకై ్సజ్ పోలీసులు జరిపిన దాడులతో తంబళ్లపల్లె నియోజకవర్గ ప్రజలు ఆందోళళనకు గురయ్యారు. ఈ వ్యవహరంలో టీడీపీ నేతల ప్రమేయం వెలుగులోకి రావడం, నియోజకవర్గ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పార్టీనుంచి సస్పెండ్ కావడం రాష్ట్రంలో చర్చనీయాంశమైంది. ఈ పరిస్థితులతో తంబళ్లపల్లెలో టీడీపీ పరిస్థితి పెనం నుంచి పొయ్యిలోకి పడ్డట్టయ్యింది. మొన్నటిదాక టీడీపీ ఇన్చార్జిగా జయచంద్రారెడ్డి వద్దంటూ ఆ పార్టీ నేతలు, శ్రేణులు తీవ్రంగా వ్యతిరేకించగా ఇప్పుడు నకిలీమద్యం మరకతో ప్రజల్లోకి వెళ్లడం ఎలా అన్న అంతర్మథనం నెలకొంది. క్షేత్రస్థాయిలో ప్రతిష్ట పోయింది నకిలీమద్యం తయారీ కేసులో జయచంద్రారెడ్డి పేరు నిందితుల జాబితాలో చేర్చడంతో నియోజకవర్గంలో టీడీపీ ప్రతిష్ట మసకబారింది. పీటీఎం టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు అరెస్ట్, తదితర అంశాలు ఆ పార్టీని ఆంతర్మథనంలో పడే శాయి. ఈ వ్యవహారం వెవెలుగులోకి రాకముందు వరకు టీడీపీ శ్రేణులు జయచంద్రారెడ్డిని వ్యతిరేకించినప్పటికీ అధికారంలో ఉన్నామన్న ఉత్సాహంతో కనిపించారు. సొంతగానే కార్యక్రమాలను నిర్వహించుకొంటూ వచ్చారు. అయితే ఈ కేసు తర్వాత ఆ పార్టీ శ్రేణులు ఒకరకంగా చతికిలపడిపోయారు. నకిలీమరకతో ప్రజల్లోకి ఎలా వెళ్లాలి అని పార్టీనేతలు చర్చించుకుంటున్నారు.జయచంద్రారెడ్డి వర్గీయులు ప్రస్తుతం నిశ్శబ్దంగా ఉన్నారు. ● టీడీపీ ఇన్చార్జిగా ఉంటూ సస్పెండ్ అయిన జయచంద్రారెడ్డితోపాటు ఆయన బావమరిది గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్, ఇంటి పనిమనిిషి అన్బురాసు నకిలీమద్యం కేసులో నిందితులుగా ఉన్నారు. వీరిప్పటికీ అరెస్ట్ కాలేదు. నకిలీమద్యం కేసులో టీడీపీ నేతల ప్రమేయం స్పష్టంకావడంతో వారు ఏమిచెప్పినా నమ్మే పరిస్థితులు లేనంత లోతుగా ప్రజల్లోకి వెళ్లిపోయింది. ఇన్నాళ్ళు తామంతా నకిలీమద్యం తాగామన్న భయం వారిలో నెలకొంది. దీనివల్ల ఆరోగ్యంపై ప్రభావం చూపిందా అన్న భయం కూడా ఉంది. ఈ పరిస్థితుల్లో నియోజకవర్గ టీడీపీ నేతలు దీనిపై నిశ్శబ్దంగా ఉండిపోతున్నారు. ములకలచెరువు నకిలీమద్యం తయారీ కేసుతో మసకబారిన టీడీపీ ప్రతిష్ట జయచంద్రారెడ్డిని పార్టీనుంచి సస్పెండ్ చేసినా ఆస్థానంలో కొత్త వారు ఎవరో పార్టీతేల్చలేదు. ఎవరి నియమిస్తారో కనీసం ఊహకై నా చెప్పడంలేదు. పరిస్థితి చూస్తుంటే ఇన్చార్జి నియామకం ఇప్పట్లో లేనట్టే అని స్పష్టంగా అర్థమవుతోంది. ఈ నేపథ్యంలో ఇటీవల పార్టీ కేంద్రకార్యాలయంలో నియోజకవర్గ నేతలతో రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు సమావేశం నిర్వహించగా ఎవరికివారు ఇన్చార్జి పేరును ప్రతిపాదించినా అది నా పరిధిలో లేదంటూ ఆయన తప్పించుకున్నారు. ఇంతలో ఓ నేత ఇన్చార్జి పదవి ఆశిస్తున్నట్టు చెప్పడంతో ఆ నేతపై విరుచుకుపడ్డంతో వివాదం అవుతుందని సమావేశం ముగించేశారు. తంబళ్లపల్లె విషయంలో ఆదినుంచి నెలకొన్న వివాదాలతో పార్టీ అధిష్టానానికి చిరాకు తెప్పిస్తుండగా ఇప్పుడు నకిలీమద్యం తయారీ కేసు వ్యవహారం ఉక్కరిబిక్కిరి చేస్తోంది. ఈ పరిస్థితుల్లో టీడీపీ ఇన్చార్జి విషయం తేల్చే అవకాశం లేదు. -
పంటలకు నష్ట పరిహారం ఇవ్వాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో పంటలు పెద్ద ఎత్తున దెబ్బతిన్నాయని అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి పంట నష్టాన్ని అంచనా వేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ కోరారు. శనివారం ఆ పార్టీ జిల్లా కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలో కురిసిన అధిక వర్షాలతో పత్తి, వరి, మొక్కజొన్న, శనగ, మిర్చి వంటి పంటలు దెబ్బతిన్నాయని తెలిపారు. వరిపంట నేలకొరగడంతో యంత్రాలతో కోయడం సాధ్యపడక దాంతో ఖర్చుపెరిగే అవకాశం ఉందన్నారు. దిగుబడి సగానికి సగం తగ్గే అవకాశం ఉంది. దెబ్బతిన్న అన్ని పంటలకు తక్షణమే నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పరిశీలన బృందంలో అధికారులు, సిబ్బందితోపాటు రైతు సంఘం, కౌలు రైతు సంఘాల ప్రతినిధులను భాగస్వాములను చేయాలని కోరారు. ఈ సమావేశంలో సీపీఎం జిల్లా కార్యదర్శివర్గ సభ్యులు రామ్మోహన్, మనోహర్, అన్వేష్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి దస్తగిరి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఉచితంగా కంటి పరీక్షలు వేముల : యురేనియం పరిధిలోని గ్రామాల్లో ఉచితంగా కంటి పరీక్షలతోపాటు శస్త్ర చికిత్సలు చేసేలా పుష్పగిరి కంటి ఆసుపత్రితో ఒప్పందం కుదుర్చుకున్నట్లు యూసీఐఎల్ జీఎం సుమన్ సర్కార్ పేర్కొన్నారు. అందుకు సంబంధించి సీఎస్ఆర్ గ్రాంట్ కింద రూ.24.20 లక్షల చెక్కును పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రధాన వైద్యుడు సూర్యప్రకాష్కు శనివారం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సీఎస్ఆర్ నిధులను వైద్య పరికరాల కొనుగోలుకు కేటాయించామన్నారు. తుమ్మలపల్లె ప్రాజెక్టు పరిసర గ్రామాల్లోని పేద రోగులకు పుష్పగిరి కంటి ఆసుపత్రి ప్రతి ఏటా 5వేల కంటే ఎక్కువ కంటి శస్త్ర చికిత్సలను ఉచితంగా నిర్వహిస్తుందన్నారు. మూడేళ్లపాటు ఈ కార్యక్రమం కొనసాగుతుందని తెలిపారు. కార్యక్రమంలో డీజీఎం ఎస్.కె.బర్మాన్, సీఎస్ఆర్ ఇన్చార్జి నవీన్కుమార్రెడ్డి, యురేనియం అధికారులు పాల్గొన్నారు. -
నేడు బ్రహ్మంగారి జయంతి
బ్రహ్మంగారిమఠం: కాలజ్ఞాన ప్రబోధ కర్త శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి 417 సప్త దశోత్తర చతుశ్యత జయంతి మహోత్సవాలు ఆదివారం నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలను తిలకించేందుకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొంటారని మేనేజర్ ఈశ్వరా చారి తెలిపారు. సమీపంలోని పార్క్ లో ఉన్న స్వామి విగ్రహానికి క్షీరాభిషేకం, రాత్రికి కల్యాణం నిర్వహించనున్నట్లు చెప్పారు. కడప రూరల్: అల్ సోల్స్ డే సందర్భంగా ఆదివారం ప్రపంచ ఆత్మల స్మరణ దినోత్సవం నిర్వహిస్తున్నట్లు రెవరెండ్ డాక్టర్ బిషప్ కె సామ్యూల్ బాబు ఒక ప్రకటనలో తెలిపారు. విశ్వవ్యాప్తంగా క్రై స్తవులు మృతి చెందిన తమ కుటుంబ సభ్యుల సమాధులను పూలతో అలంకరించి, కొవ్వొత్తుల వెలిగించి ప్రార్థనల ద్వారా స్మరించుకుంటారని పేర్కొన్నారు. క్రైస్తవ కుటుంబాలు బిషప్, పాస్టర్ల ద్వారా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారన్నారు. ఆ మేరకు ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 2 గంటల వరకు కొత్త రిమ్స్ వద్దు గల క్రై స్తవుల సమాధుల తోటలో మరియు 3 గంటల నుంచి రాత్రి 9 గంటల వరకు మాసాపేట లోని దొరల గోరీల వద్ద సంఘ కాపరులు ప్రత్యేక ప్రార్థనలు నిర్వహిస్తారని తెలిపారు. వివరాలకు సెల్ నంబరు 9573037770 ను సంప్రదించాలని పేర్కొన్నారు. కడప సెవెన్రోడ్స్: అన్నమయ్య జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ గాలేరు – నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టు స్పెషల్ కలెక్టర్ గా అదనపు బాధ్యతలను స్వీకరించారు. ఇప్పటి వరకు జీఎన్ఎస్ఎస్ (ఎల్ఏ) స్పెషల్ కలెక్టర్ (ఎఫ్ఏసీ)గా విధులు నిర్వహించిన ఎస్.నీలమయ్య రిలీవ్ అవ్వడంతో ఆ స్థానాన్ని అన్నమయ్య జిల్లా జేసీ ఆదర్శ్ రాజేంద్రన్కు అదనంగా రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు కేటాయించడం జరిగింది. ఆ మేరకు అన్నమయ్య జిల్లా జేసీ ఛాంబర్లో జీఎన్ఎస్ఎస్ (ఎల్ఏ), కడప స్పెషల్ కలెక్టర్గా ఆదర్శ్ రాజేంద్రన్ బాధ్యతలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టు పథకంలో భాగంగా అన్ని రకాల భూసేకరణ, పరిహారం, విస్తరణ సంబందిత అన్నిరకాల పరిపాలన వ్యవహారాలను సమర్థవంతంగా పెండింగ్ లేకుండా చర్యలు చేపడతామన్నారు. రాజంపేట: తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలిలోని 108 అడుగుల అన్నమయ్య విగ్రహ ఆవరణలో నూతనంగా నిర్మించిన శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం విగ్రహ ప్రతిష్టమహోత్సవాల్లో భాగంగా శనివారం టీటీడీ పండితులు, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ఉదయం భగవతుపణ్యాహం, శాంతిహోమం, మహాకుంభారాధనం, విష్ణుగాయత్రీ పంచసూక్తపూర్వకమూర్తి హోమం, శాత్తుమర, తీర్థగోష్టి చేపట్టారు. సాయంత్రం మూర్తిహోమం, విష్ణుసహస్రనామ పారాయణం, జలాధివాసనము, పూర్ణాహుతి నిర్వహించారు. . కడప సెవెన్రోడ్స్: ఆంధ్రప్రదేశ్ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప శనివారం దేవునికడపలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్నారు. ఆలయానికి వచ్చిన న్యాయమూర్తికి అధికారులు స్వాగతం పలికారు. స్వామి, అమ్మవార్లను దర్శింపజేశారు. అనంతరం ఆమె స్థానిక శివాలయంలో శివుడిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఇన్చార్జి జిల్లా ప్రధాన న్యాయమూర్తి రమేష్ కుమార్, న్యాయమూర్తులు ప్రవీణ్ కుమార్, ప్రత్యూష, ఈశ్వర్ దేవాంగలు పాల్గొన్నారు. హైకోర్టు న్యాయమూర్తిని కలిసిన ఎస్పీ కడప అర్బన్: కడప నగరంలోని స్టేట్ గెస్ట్ హౌస్లో రాష్ట్ర హైకోర్టు జడ్డి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాపను శనివారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ మర్యాదపూర్వకంగా కలిశారు. పుష్ప గుచ్ఛం అందజేశారు. -
పులివెందులకు రైలుకూత!
రాజంపేట: పులివెందుల అంటే రాష్ట్రంలో ప్రత్యేక గుర్తింపు ఉంది. దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రాతినిధ్యం వహించిన సంగతి విధితమే. ముద్దనూరు–ముదిగుబ్బ రైలుమార్గం నిర్మాణంతో దశాబ్ధాలుగా పులివెందుల వాసులు ఎదురు చూస్తున్న రైలుకూతకు మార్గం సుగమం అయింది. ఈ మార్గం కడప–బెంగళూరుకు మరో రైలుమార్గంగా నిలవనుంది. వైఎస్సార్ కడప జిల్లాలో ముద్దనూరు, శ్రీ సత్యసాయి జిల్లాలోని ముదిగుబ్బ స్టేషన్లకు కనెక్టివిటీ రైల్వేలైన్గా మారబోతుంది. ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య రైల్వేలైన్ నిర్మితం చేయనున్నారు. ● పులివెందుల మీదుగా ఈ మార్గం ప్రణాళిక చేయడం ద్వారా కడప జిల్లా, శ్రీ సత్యసాయి జిల్లాలు పర్యాటకం, పరిశ్రమలు, వాణిజ్య రంగాల్లో వేగంగా ఎదగనున్నాయి. ఈ ప్రాంతంలో పెరుగుతున్న ఉద్యానవనపంటలు, ఖనిజసంపద,బొగ్గు వంటి వనరుల రవాణా సులభతరం అవుతుంది. ఎలక్ట్రానిక్, సిమెంట్, స్టీల్ పరిశ్రమలు రాయలసీమలో స్ధిరపడటానికి ఈ లైన్ మౌలిక సదుపాయంగా నిలుస్తుంది. ● ఈ రైలుమార్గం నిర్మితం కానున్న నేపథ్యంలో నాలుగో జంక్షన్గా ముద్దనూరు రైల్వేస్టేషన్ నిలవనుంది. ఇప్పటికే ఉమ్మడి కడప జిల్లా రైలుమార్గంలో ఓబులవారిపల్లె, కడప, ఎర్రగుంట్ల జంక్షన్లు ఉన్నాయి. సీమలో రవాణా సౌకర్యాలు... ముద్దనూరు–పులివెందుల–ముదిగుబ్బ–శ్రీ సత్యసాయి మధ్య 110 కిలోమీటర్ల పొడవైన కొత్త రైల్వేలైన్ నిర్మాణం జరగనుంది.ఈ లైన్ నిర్మాణం పూర్తయిన తర్వాత రాయలసీమ ప్రాంతానికి రవాణా సౌకర్యాలు విస్తృతమవుతాయి. ముద్దనూరు–ముదిగుబ్బ ప్రాంతాల మధ్య 65 కిలోమీటర్ల దూరం ఉంది. ఈ బడ్జెట్లో రైలుమార్గం ఆర్ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు.ముదిగుబ్బ రైల్వేస్టేషన్ గుంతకల్–బెంగళూరు రైలుమార్గంలో ఉంది. జిల్లాలోని ముద్దనూరు నుంచి ముదిగుబ్బకు లైన్ కలిపితే బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. అదే ఆలోచనతో సంబంధిత రైల్వే విభాగం అఽధికారులు డీపీఆర్ (డిటైయిల్ ప్రాజెక్టు రిపోర్టు) సిద్ధం చేశారు.రైల్వేబోర్డుకు డీపీఆర్ వెళ్లింది. 2020లో అప్పటి రైల్వేబడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైన్ను రైల్వేమంత్రిత్వ శాఖ తెరపైకి తీసుకొచ్చింది. అప్పటి నుంచి ప్రతి బడ్జెట్లో సర్వే కోసం అరకొరగా నిధులు కేటాయిస్తూ వచ్చారు. 2025 బడ్జెట్లో కొత్తలైన్కు ఆర్ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు. ముద్దనూరు–ముదిగుబ్బ రైలుమార్గానికి రైల్వేబోర్డుకు ఆమోదం తెలిపింది. రైలుమార్గం నిర్మితం కోసంప్రాజెక్టు మొత్తం వ్యయం సుమారు రూ,2,505,89 కోట్లుగా అంచనా వేశారు. ఈ మార్గం ద్వారా నాలుగు నుంచి ఐదుగంటలు పట్టే ప్రయా ణం గణనీయంగా తగ్గే అవకాశం ఉంది. నాలుగో జంక్షన్గా ముద్దనూరు ముద్దనూరు–ముదిగుబ్బ మధ్య లైన్ అంచనా వ్యయం రూ.2,505.89 కోట్లు -
కాశీబుగ్గ ఘటన విషాదకరం
పులివెందుల : శ్రీకాకుళం జిల్లా కాశీబుగ్గలోని శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటలో 9 మంది ప్రాణాలు కోల్పోవడం విషాదకరమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. చిన్న తిరుపతిగా ప్రసిద్ధి చెందిన ఆలయంలో భక్తులు వేల సంఖ్యలో రావడంతో తొక్కిసలాట జరిగిందన్నారు. ఏకాదశి రోజున ఇలాంటి సంఘటన జరగడం దురదృష్టకరమన్నారు. గతంలో కూడా తిరుపతిలో ఇలాంటి సంఘటన చోటు చేసుకుందన్నారు. తరుచూ ఇలాంటి సంఘటనలు జరుగుతున్నా ప్రభుత్వ యంత్రాంగం అందుకు సంబంధించి పటిష్టమైన చర్యలు తీసుకోకపోవడం విచారకరమన్నారు. కాశీ బుగ్గలో వేలాది మంది భక్తులు తరలి వస్తారని తెలిసినప్పుడు ముందు జాగ్రత్త చర్యలు చేపట్టి ఉండాల్సిందన్నారు. ఘటనలో గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్స అందించాలన్నారు. అలాగే మృతి చెందిన వారి కుటుంబ సభ్యులకు తన ప్రగాఢ సానుభూతిని తెలియజేస్తూ వారి కుటుంబాలకు ప్రభుత్వం మెరుగైన ఎక్స్గ్రేషియా చెల్లించి ఆదుకోవాలని ఆయన కోరారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
సారస్వతమూర్తి డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి
● నేడు శత జయంతి వేడుకలు ● ముఖ్య అతిథిగా మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు కడప సెవెన్రోడ్స్ : తెలుగు సాహిత్య రంగంలో మరువలేని పేరు డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి. మరీ ముఖ్యంగా వైఎస్సార్ కడప జిల్లా సాహిత్య లోకంలో ఆయనకు ప్రత్యేకమైన గుర్తింపు ఉంది. అటు గ్రంథాలయాల అభివృద్ధి, ఇటు బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటుతో సాహిత్యాభివృద్ధికి ఎంతో కృషి చేసిన డాక్టర్ జానమద్ది శత జయంతి వేడుకలు ఆదివారం కడపలో నిర్వహిస్తున్నారు. ఈ వేడుకల్లో భారత మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఆ సారస్వతమూర్తి గురించి.... బ్రౌన్ గ్రంథాలయం ఏర్పాటులో.. తెలుగుభాష పరిరక్షకులుగా ఆంగ్లేయుడు సీపీ బ్రౌన్ అనంత కీర్తిని పొందారు. ఆయన సాహితీ కృషిని తెలుగు వారికి అందజేసిన ఘనత డాక్టర్ జానమద్దికే దక్కుతుంది. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం తెలుగు అధ్యయనశాఖలో బ్రౌన్ పరిశోధన విభాగం 1974లో ఏర్పాటైంది. ఆచార్య జీఎన్ రెడ్డి పర్యవేక్షకులుగా, బంగోరే (బండి గోపాల్రెడ్డి) పరిశోధకులుగా పరిశోధన ప్రారంభించారు. బ్రౌన్ రచించిన రీడర్లు, సాహిత్య ఆత్మకథ ఆధారంగా వీరివురు కడపలో బ్రౌన్ నివసించిన బంగళా శిథిలాలను గుర్తించారు. అప్పుడు ఆ స్థలం ఆడిటర్ సీఆర్ కృష్ణస్వామి ఆధీనంలో ఉంది. 1976లో జానమద్ది జిల్లా రచయిత సంఘం మహాసభలను కడపలో నిర్వహించారు. ప్రముఖ తెలుగు సినీ గేయ రచయిత ఆరుద్ర, జీఎన్ రెడ్డి, బంగోరే ఆ సభల్లో పాల్గొన్నారు. ఆ సందర్భంగా వారు కలెక్టర్ పీఎల్ సంజీవరెడ్డిని కలిసి బ్రౌన్ నివసించిన ప్రదేశంలో స్మారక గ్రంథాలయాన్ని నిర్మించాలని కోరారు. కలెక్టర్ వెంటనే స్పందించి జానమద్ది హనుమచ్ఛాస్త్రితో కలిసి స్థల యజమాని కృష్ణస్వామితో చర్చించారు. గ్రంథాలయ నిర్మాణానికి 20 సెంట్ల స్థలం ఉచితంగా ఇచ్చేందుకు కృష్ణస్వామిని అంగీకరింపజేయడంలో జానమద్ది కృషి ఎంతో ఉంది. అలా 1987 జనవరి 22న గ్రంథాలయ నిర్మాణానికి శంకుస్థాపన జరిగింది. బ్రౌన్ నివసించిన బంగళా మొండి గోడల నుంచి నేడు మహాసౌధంగా రూపుదిద్దుకుందంటే అందుకు జానమద్ది నిరంతర, అలుపెరగని కృషే కారణం. ఆయన లేకుంటే గ్రంథాలయమే లేదు. అందుకే డాక్టర్ సి.నారాయణరెడ్డి ఆయనకు బ్రౌన్ శాస్త్రి అని కితాబిచ్చారు. కైఫియత్తులు తీసుకురావడంలో.. ప్రకాశం పంతులు శతజయంతి సభల్లో పాల్గొనేందుకు జానమద్ది మద్రాసు వెళ్లినప్పుడు కై ఫియత్తుల గురించి విన్నారు. రైల్వే టీటీఈగా పనిచేస్తున్న కడపకు చెందిన గాజులపల్లె వీరయ్య సాయంతో తమిళనాడు ప్రభుత్వంలో ప్రిన్సిపల్ సెక్రటరీగా పనిచేస్తున్న జేటీ ఆచార్యులను కలిశారు. కడప కై ఫియత్తులు ఇప్పించాలంటూ నాలుగైదుసార్లు చైన్నెకి వెళ్లి ఆచార్యులను కలిశారు. ఎట్టకేలకు జేటీ ఆచార్యుల ప్రత్యేక శ్రద్ధ వల్ల 44 సంపుటాల కై ఫియత్తుల జిరాక్స్ ప్రతులు 1994 డిసెంబరులో బ్రౌన్ గ్రంథాలానికి చేరాయి. వీటిని జానమద్ది మానసపుత్రుడైన విద్వాన్ కట్టా నరసింహులు పరిష్కరించారు. తెలుగుభాష.. సంస్కృతులపై పట్టు.. జాతీయ స్థాయిలో తెలుగు కవులు, రచయితలతో ఆత్మీయ అనుబంధం గల ఆయన తెలుగు, ఆంగ్ల, కన్నడల్లో పలు రచనలను అనువదించారు. స్వయంగా ఎన్నో పుస్తకాలు రచించారు. అటు ప్రాచీన సాహిత్యం, ఇటు అభ్యుదయ సాహిత్యాన్ని ఒకేలా ఆదరించారు. మాసీమ కవులు, బళ్లారి రాఘవ జీవిత చరిత్ర, సీపీ బ్రౌన్ చరిత్ర, కస్తూరి కన్నడ సాహిత్య సౌరభం, కడప సంస్కృతి–దర్శనీయ స్థలాలు, రసవద్ఘట్టాలు తదితర ఆయన రచించిన 16 గ్రంథాలు ఎంతో ప్రాచుర్యం పొందాయి. అలాగే వివిధ దినపత్రికల్లో 2500కు పైగా వ్యాసాలు రాశారు. జిల్లా రచయితల సంఘం కార్యదర్శిగా గొప్ప కవులను జిల్లాకు ఆహ్వానించి సభలు ఏర్పాటు చేశారు. బ్రౌన్ గ్రంథాలయాన్ని జిల్లాలో సాహితీ సభలకు ముఖ్య కేంద్రంగా మార్చారు. సాహిత్యం పట్ల అభిమానం, అభిరుచి ఉన్న వారిని ఎంతో ఆదరించి ఆ రంగం వైపు ప్రోత్సహించారు. తెలుగుభాష సంస్కృతుల పట్ల అధికారులు, ప్రజాప్రతినిధులు, ప్రముఖులకు ఏ సమాచారం కావాలన్నా ఆయననే సంప్రదించేవారు. ‘సీమ’వాసి కావడమే శాపం మిణుకుమిణుకు మంటున్న తెలుగు భాషా సాహిత్యాల సముద్ధరణకు జీవితాంతం అవిరళ కృషి చేసిన సీపీ బ్రౌన్ను తెలుగు వారు దాదాపు మరిచిపోయిన సమయంలో జానమద్ది ఆయనను వెలుగులోకి తీసుకొచ్చారు. బ్రౌన్ గ్రంథాలయ ఏర్పాటుతో సహా తెలుగు సాహిత్యానికి ఆయన చేసిన కృషి అమోఘం. ప్రభుత్వం ఆయన సేవలను గుర్తించి కనీసం పద్మశ్రీ పురస్కారాన్ని కూడా అందించలేదు. రాయలసీమ వాసి కావడమే ఆయన చేసుకున్న పాపమని పలువురు పేర్కొంటున్నారు. ఆయన భాషా సాహిత్యాలకు చేసిన విశేష సేవలను వివిధ సంస్థలు గుర్తించి పురస్కారాలతో గౌరవించాయి. 1998లో పొట్టిశ్రీరాములు తెలుగు విశ్వవిద్యాలయం ఆయనకు గౌరవ డాక్టరేట్ అందజేసింది. గ్రంథాలయానికి ఆయన అందించిన సేవలకు గుర్తుగా 2014 అక్టోబరు 20న గ్రంథాలయ ఆవరణలో డాక్టర్ జానమద్ది శిలా విగ్రహాన్ని నాటి జస్టిస్ జాస్తి చలమేశ్వర్ ద్వారా ఆవిష్కరింపజేశారు. జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో ఆదివారం ఉదయం బ్రౌన్ గ్రంథాలయంలో శతజయంతి సభ నిర్వహిస్తున్నారు. జానమద్ది స్మారక సాహిత్య, గ్రంథాలయ సేవా పురస్కారాలను ప్రదానం చేయనున్నారు. కేంద్ర సాహిత్య అకాడమి అవార్డు గ్రహీత ఆచార్య రాచపాలెం చంద్రశేఖర్రెడ్డి అధ్యక్షతన జరగనున్న ఈ కార్యక్రమంలో మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు ముఖ్య అతిథిగా పాల్గొంటున్నారు. అలాగే రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వెంకట జ్యోతిర్మయి ప్రతాప విశిష్ట అతిథిగా, కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్, ఏపీఎస్ పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటి, యోగి వేమన విశ్వవిద్యాలయం ఉప కులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, స్టేట్ బ్యాంకు డిప్యూటీ జనరల్ మేనేజర్ వి.హేమ ఆత్మీయ అతిథులుగా హాజరు కానున్నారు. అనంతరం రాష్ట్ర నాటక అకాడమి చైర్మన్ డాక్టర్ గుమ్మడి గోపాలకృష్ణ, పంచ సహస్రావధాని డాక్టర్ మేడసాని మోహన్, ప్రసారభారతి విశ్రాంత అదనపు డైరెక్టర్ జనరల్ డాక్టర్ రేవూరు అనంత పద్మనాభరావు, కర్ణాటకలో 20 లక్షల పుస్తకాల గ్రంథాలయాన్ని నిర్వహిస్తున్న మరె అంకేగౌడలకు ఈ సందర్భంగా పురస్కారాలను అందిస్తున్నారు. నేడు శతజయంతి సభ -
ఇంటిపోరు ఇంతింత కాదయా...!
సాక్షి ప్రతినిధి, కడప : బోద కొట్టంలోకి ఎలుక దూరిందని వెనుకటిరోజుల్లో ఒకామె ఏకంగా ఇంటికి నిప్పు పెట్టిందనే సామెతను గుర్తు చేస్తున్నారు ఓ ఎమ్మెల్యే. అచ్చం అలాగే తన వ్యతిరేకుల్ని చేరదీస్తున్నారన్న ఆక్రోషంతో కార్పొరేషన్ పరిధిని కుదించాలని పట్టుబట్టారు. పొరుగు నియోజకవర్గ పరిధిలోని డివిజన్లను అక్కడికే మార్చాలంటూ ప్రభుత్వానికి లేఖ రాశారు. కార్పొరేషన్ డివిజన్లు పునర్విభజన చేపట్టాలంటూ అభ్యర్థించారు. కలెక్టర్ నివేదిక ఆచరణ సాధ్యం కాదని జవాబు వెళ్లడంతో కమిషనర్పై అగ్గిమీదగుగ్గిలమవుతున్నట్లు సమాచారం. అనువైన నివేదిక ఇవ్వకుండా కలెక్టర్ను తప్పుదారి పట్టించారని మండిపడుతన్నట్లు తెలుస్తోంది. ‘మొగుడు కొట్టినందుకు కాదు, చూసిన తోడుకోడలు నవ్వినందుకే అసలైన బాధ’అన్నట్లుగా జిల్లాలో ఓ ప్రజాప్రతినిధి పరిస్థితి తయారైంది. తెలుగుతమ్ముళ్ల మధ్య అసంతృప్తి, అసమ్మతి అన్ని చోట్ల ఉంది. కాకపోతే, పొరుగు నియోజకవర్గానికి వెళ్లి అక్కడ అసమ్మతి గళమిప్పడమే అసలు సమస్యగా మారింది. అసమ్మతి నేతలు సైతం వ్యూహాత్మకంగా వ్యవహరిస్తున్నారు. ఒక్కో సామాజికవర్గం ఓ మారు గళమిప్పుతూ ప్రజాదృష్టిని ఆకర్షిస్తున్నారు. ఇలా ఇప్పటికి రెండు వేర్వేరు మతాలకు చెందిన ఆధ్యాత్మిక కేంద్రాల నుంచి తరలివెళ్లారు. ఇలా వెళ్లడం తీవ్రమైన అవమానంగా సదరు ప్రజాప్రతినిధి భావిస్తున్నట్లు సమాచారం. దీంతో పొరుగు నియోజకవర్గ నేత పెత్తనాన్ని కట్టడి చేసేందుకు అడుగులు వేసినట్లు సమాచారం. డివిజన్లు డీలిమేటేషన్ చేయాంటూ అభ్యర్థన... కడప కార్పొరేషన్ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. అందులో 6 డివిజన్లు కమలాపురం నియోజకవర్గ పరిధిలోకి రానున్నాయి. కడప మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేసినప్పుడు చింతకొమ్మదిన్నె, చెన్నూరు మండలాల్లోని కొన్ని పంచాయతీలు కార్పొరేషన్లో విలీనం చేశారు. ఆ కారణంగా కార్పొరేషన్లో కమలాపురం ప్రాంతం ప్రమేయం ఏర్పడింది. ఇటీవల కడపలో చోటుచేసుకుంటున్న పరిణామాల నేపథ్యంలో డివిజన్ల డీలిమిటేషన్ చేయాలంటూ ఓ ప్రజాప్రతినిధి రాష్ట్ర ప్రభుత్వాన్ని అభ్యర్థించారు. ఆమేరకు ప్రభుత్వం కలెక్టర్ నివేదిక కోరింది. సాధ్యాసాధ్యాలపై కలెక్టర్ కార్పొరేషన్ యంత్రాంగంతో చర్చించినట్లు సమాచారం. తదనంతరం డివిజన్ల పునర్విభజన సాధ్యం కాదని తెలియజేసినట్లు సమాచారం. ఆమేరకు నివేదిక అందించినట్లు తెలుస్తోంది. కమిషనర్పై గరంగరం.. కార్పొరేషన్ నుంచి 6 డివిజన్లు తప్పిస్తే కమలాపురం నేతల బెడద లేకుండా పోతుందని భావిస్తుంటే, కమిషనర్ అందుకు సహకరించలేదని ఓ ఎమ్మెల్యే ఆక్రోషం వ్యక్తం చేస్తున్నట్లు సమాచారం. ఉద్యోగ ధర్మాన్ని సైతం విస్మరించి అనేక ఘటనల్లో అండగా నిలిచిన అధికారి సైతం తాజాగా తీవ్ర వ్యతిరేకతను చవిచూడాల్సి వస్తున్నట్లు తెలుస్తోంది. ఆస్థానంలో మరో అధికారిని తీసుకురావాలనే యోచనలో ఉన్న ట్లు సమాచారం. సందట్లో సడేమియాలాగా, పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లు కొందరు మెప్మాలో పని చేస్తున్న ఓ అధికారితో అంతర్గత మంతనాలు చేసుకొని ఆయన అయితే సమర్థుడని పేరు సిఫార్సు చేసినట్లు తెలుస్తోంది. ఇప్పుడా తతంగమంతా హాట్ టా ఫిక్గా నగరంలో చుక్కర్లు కొట్టుతుండడం విశేషం. అధికార పార్టీ ఎమ్మెల్యేల మధ్య అంతర్గత పోరాటం కార్పొరేషన్ డివిజన్ల పునర్విభజన చేయాలంటూ ఓ ఎమ్మెల్యే అభ్యర్థన కడప నియోజకవర్గ పరిధిని మాత్రమే కార్పొరేషన్గా కొనసాగించాలని ఒత్తిడి కలెక్టర్ వివరణ కోరినా ప్రభుత్వం.. సాధ్యం కాదంటున్న అధికారులు -
జాతీయస్థాయి పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ : జాతీయస్థాయి అండర్–16 బాలికల ఫుట్బాల్ పోటీలకు మదనపల్లెకు చెందిన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం విద్యార్థిని తన్మయ ఎంపికయ్యారు. ఇటీవల నెల్లూరు జిల్లా నాయుడుపేటలో జరిగే రాష్ట్ర స్థాయి పుట్బాల్ పోటీల్లో ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయి జట్టుకు ఎంపికై ంది. నవంబర్ 18వతేదీ నుంచి ఏపీ ఫుట్బాల్ అసోసియేషన్ అనంతపురం ఆర్డీటీలో నిర్వహించే జాతీయ స్థాయి బాలికల చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటుందని ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్ తెలిపారు. తన్మయికి పుట్బాల్ అసోసియేషన ఉపాధ్యక్షులు జాన్ కమలేష్, సాగర్, సంయుక్త కార్యదర్శులు మహేంద్రనాయక్, క్రీడాభారతి కార్యదర్శి నరేష్ అభినందనలు తెలిపారు. -
పొలతల, నిత్యపూజకోనకు ప్రత్యేక బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్ : పవిత్ర కార్తీకమాసం సందర్భంగా ప్రతి సోమవారంజిల్లాలోని పొలతల, నిత్యపూజకోనలకు ప్రత్యేక బస్సు సర్వీసులను నడపనున్నట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప డిపో మేనేజర్ ఒక ప్రకటనలో తెలిపారు. పొలతలకు ఉదయం 6.30, 9.00, 11.30, మధ్యాహ్నం 02.15, 4.45 గంటలకు, నిత్యపూజకోనకు ఉదయం 6.30, 9.30, మద్యాహ్నం 12.30, 3.30 గంటలకు బస్సులు పాత బస్టాండు నుంచి బయలుదేరుతాయన్నారు. భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. నేడు మాజీ ఉప రాష్ట్రపతి రాకకడప సెవెన్రోడ్స్ : బ్రౌన్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో పాల్గొనేందుకు మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయుడు శనివారం కడప నగరానికి వస్తున్నారు. ఉదయం 11.30 గంటలకు హైదరాబాద్ విమానాశ్రయం నుంచి బయలుదేరి 12.40 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 12.40 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి మధ్యాహ్నం 1.00 గంటకు కడప స్టేట్ గెస్ట్హౌస్కు చేరుకుంటారు. రాత్రికి స్టేట్ గెస్ట్హౌస్లోనే బస చేస్తారు. ఆదివారం ఉదయం 9.15 గంటలకు స్టేట్ గెస్ట్హౌస్ నుంచి బయలుదేరి 9.20 గంటలకు సీపీ బ్రౌన్ గ్రంథాలయానికి చేరుకుంటారు. 9.30 నుంచి 11.30 గంటల వరకు బ్రౌన్ శాస్త్రి శతజయంతి వేడుకల్లో వెంకయ్యనాయుడు పాల్గొంటారు. 11.45 గంటలకు బ్రౌన్ లైబ్రరీ నుంచి బయలుదేరి 12.15 గంటలకు కడప ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. 1.00 గంటలకు కడప ఎయిర్పోర్టునుంచి విమానంలో బయలుదేరి 1.55 గంటలకు చైన్నె ఎయిర్పోర్టుకు చేరుకుంటారు. బందోబస్తు ఏర్పాట్ల పరిశీలనకడప అర్బన్ : దేశ మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కడప నగర పర్యటన నేపథ్యంలో భద్రతా ఏర్పాట్లపై పోలీస్ అధికారులకు జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పలు సూచనలు చేశారు. నవంబర్ 1, 2 తేదీల్లో మాజీ ఉపరాష్ట్రపతి ఎం.వెంకయ్య నాయుడు కడప నగర పర్యటన నేపథ్యంలో ఎరమ్రుక్కపల్లి లోని సీపీ బ్రౌన్ భాష పరిశోధన కేంద్రం వద్ద శుక్రవారం సాయంత్రం ఎస్పీ పర్యటించారు. కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు చేయాలని అధికారులను ఆదేశించారు.ఈ అదనపు ఎస్.పి (పరిపాలన) శ్రీ కె.ప్రకాష్ బాబు గారు, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. నియామకంకడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లాకు చెందిన కింద తెలియజేస్తున్న వారిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర యువజన విభాగం ప్రధాన కార్యదర్శిగా ఎం.నరసింహారెడ్డి (మైదుకూరు), రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా ప్రణీత్రెడ్డి (బద్వేలు), జిల్లా రైతు విభాగం ఉపాధ్యక్షుడిగా కె.లక్ష్మినారాయణరెడ్డి (కమలాపురం)లను నియమించారు. సిజేరియన్ ఆపరేషన్ జరగకుండా చూడాలికడప రూరల్ : సిజేరియన్ ఆపరేషన్ జరగకుండా గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారులు తెలిపారు. శుక్రవారం కడపలో డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు అధ్యక్షతన మాతృ మరణాలపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్ మాట్లాడుతూ ప్రతి హైరిస్క్ గర్భిణులను సకాలంలో గుర్తించాలన్నారు. వారిని తరచూ సీ్త్ర వ్యాధి నిపుణులకు చూపించాలని తెలిపారు. ఏదైనా అనారోగ్య సమస్య ఉంటే దగ్గరలోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. . ప్రతి గర్భిణిని సాధారణ కాన్పు కోసం సాధారణ సిద్ధం చేయాలన్నారు. సీ్త్ర వ్యాధి నిపుణులు డాక్టర్ లక్ష్మీ సుశీల మాట్లాడుతూ గర్భిణులకు ప్రతి నెల పీఎంఎస్ఎంఏ ప్రోగ్రాం లో రక్త పరీక్షలు, స్కానింగ్ చేయించాలని సూచించారు. కార్యక్రమంలో డాక్టర్ హిమాదేవి, డాక్టర్ బాలసుబ్రమణ్యం, డాక్టర్ శాంతి కుమారి, డాక్టర్ శాంతిలత పాల్గొన్నారు. కడపకు దంపతుల హత్య కేసు నిందితులుకడప అర్బన్ : చిత్తూరు మేయర్ కఠారి అనురాధ, మోహన్ దంపతులను దారుణంగా హత్య చేసిన నిందితులను శుక్రవారం కడప కేంద్రకారాగారానికి పోలీసులు తరలించారు. నిందితులకు చిత్తూరు కోర్టు ఉరిశిక్ష ఖరారు చేయడంతో భద్రత నడుమ కడప కేంద్రకారాగారానికి తరలించారు. ఐదుగురు నిందితులకు ఉరిశిక్ష ఖరారు చేస్తూ చిత్తూరులోని ఆరవ అదనపు సెషన్ కోర్టు తీర్పు ఇచ్చిన విషయం తెలిసిందే. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించండి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలను ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ (డీఐఈపీసీ)సమీక్ష సమావేశం జిల్లా కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి మరింత విస్తృత పరిచేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో జిల్లా ఆర్థిక ప్రగతికి ఆయువు పట్టు అయిన పారిశ్రామిక రంగాన్ని మరింత అభివృద్ధి పథంలోకి తీసుకురావాలని సూచించారు. పరిశ్రమల ప్రమోషన్కు సంబందించి ఇంకా ఏవైనా అప్లికేషన్లు పెండింగ్లో ఉంటే వెంటనే పూర్తి చేయాలన్నారు. జిల్లా స్థాయి నుంచి పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో యువతకు పారిశ్రామిక పెట్టుబడులు, యూనిట్ల స్థాపనపై అవగాహన పెంపొందించాలన్నారు. పరిశ్రమలకు వివిధ రాయితీల కింద రూ.67.62 లక్షల మేర రాయితీల మంజూరు ఆమోదం తెలిపారు. ప్రభుత్వం అనేక ప్రోత్సాహక కార్యక్రమాల ద్వారా ప్రజల్లో వ్యాపార, పెట్టుబడి ధోరణిలో.. పారిశ్రామిక రంగం వైపు అవగాహన నిమిత్తం ఉద్యం‘ పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవడం జరుగుతోందన్నారు. వ్యాపారాన్ని ప్రారంభించే ప్రతి ఒక్కరూ ఉద్యం పోర్టల్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకుని ప్రభుత్వం నుంచి అందే అన్ని రకాల రాయితీలను పొందేలా ప్రజల్లో అవగాహన పెంచాలన్నారు. సమావేశంలో పరిశ్రమల శాఖ జీఎం చాంద్ బాషా, ఏపీఐఐసీ జెడ్ఏం శ్రీనివాసమూర్తి, లీడ్ బ్యాంకు మేనేజర్ జనార్ధన, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫాక్టరీస్ చిన్నా రావు, సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, డీఆర్డీఏ వీడి రాజ్యలక్ష్మి పాల్గొన్నారు. సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు ప్రక్రియ వేగవంతం చేయాలి జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా అమలవుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ల ఏర్పాటుకు సంబంధించిన ప్రక్రియను వేగవంతం చేసి డిసెంబర్ మొదటి వారం నాటికి అన్ని మండలాలలో అందుబాటులోకి వచ్చేలా అధికారులు పని చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ భవన నిర్మాణాల పురోగతి పై జిల్లా కలెక్టర్ జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలిసి సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పైలెట్ ప్రాజెక్టుగా స్మార్ట్ కిచెన్ల ఏర్పాటు చేపట్టామని, ఇప్పటికే జిల్లాలో కడప నగరంలో స్మార్ట్ కిచెన్, సీకే దిన్నె స్మార్ట్ కిచెన్ ద్వారా విద్యార్థులకు నాణ్యమైన మధ్యాహ్న భోజనాన్ని అందిస్తున్నారన్నారు.కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
విచారణ లేకుండా డిప్యూటేషన్ ఎలా వేస్తారు
కడప ఎడ్యుకేషన్ : తిరుపతి ఇంటర్ డీవీఈఓ కార్యాలయంలో సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న నన్ను ఎలాంటి విచారణ లేకుండా వేరేచోటుకు డిప్యూటేషన్పై (వర్క్ అడ్జెస్ట్మెంట్) ఎలా వేస్తారని తిరుపతి ఇంటర్ డీడీఈవో కార్యాలయం సీనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మునిచంద్ర అధికారులను ప్రశ్నించారు. దీంతోపాటు ఎయిడెడ్ నుంచి వచ్చిన మరో వ్యక్తికి ఏ జీవో ప్రకారం పదోన్నతి ఇస్తున్నారో తెలపాలని డిమాండ్ చేశారు.ఇందుకు నిరసనగా శుక్రవారం ఇంటర్మీడియట్ ఆర్జేడీ కార్యాలయం ఎదుట సీనియర్ అసిస్టెంట్ మునిచంద్ర ప్లకార్డులతో నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా తన రెగ్యులర్ స్థానమైన తిరుపతి డీవీఈఓ కార్యాలయ సీనియర్ అసిస్టెంట్ పోస్టును ఆరోపణలు ఎదర్కొంటున్న మరొకరికి ఇచ్చేందుకు అధికారులు చూస్తున్నారని ఆరోపించారు. అందుకోసమే తనపై విచారణ చేయకుండా ముందుగానే మరో చోటికి డిప్యూటేషన్పై పంపించారన్నారు. దీంతోపాటు మరో ఉద్యోగి ఎయిడెడ్ యాజమాన్యం నుంచి వచ్చినా నిబంధనలకు విరుద్ధంగా అతనికి తన రెగ్యురల్ స్థానాన్ని ఇచ్చేందుకు సిద్దమవుతున్నారని తెలిపారు. పలు ఆధారాలతో ఫిర్యాదు చేసిన అతనిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆరోపించారు. ఈ విషయంలో తనకు న్యాయం జరిగే వరకు పోరాటం చేస్తానని హెచ్చరించారు. దీనిపై ఆర్జేడీ సురేష్బాబుతో మాట్లాడగా మునిచంద్రపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి కమిషనర్కు పంపించామన్నారు. కమిషనర్ ఆదేశాల మేరకే ఆతనిని పంపించినట్లు చెప్పారు. మిగతా వారిపై కూడా విచారణ చేసి కమిషనర్ కు నివేదించామని, ఆయన నిర్ణయం మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. -
అనుమతులు లేనిచోట ఇసుక అక్రమ రవాణా
సాక్షి ప్రతినిధి, కడప : అధికారికంగా ఇసుక అనుమతులు లేకపోయినా టీడీపీ నేతలు బరి తెగిస్తున్నారు.అధికారం అండతో ప్రకృతి వనరులను ధ్వంసం చేస్తున్నారు. ఉచిత ఇసుక మాటున అక్రమార్జనే ధ్యేయంగా వెంకయ్యకాలువ గ్రామ సమీపంలోని చిత్రావతినదిలో అనుమతులు లేకున్నా.. నిబంధనలు నదిలో తొక్కి మరీ ఇసుక దోపిడీకి పాల్పడుతున్నారు.జమ్మలమడుగు నియోజకవర్గంలోని కొండాపురం మండలం ఏటూరు ఇసుక రీచ్కు అనుమతి ఒకచోట పెట్టుకొని వెంకయ్యకాలువ గ్రామ సమీపంలోని చిత్రావతి నదిలో అనుమతులు లేనిచోట పగలు రాత్రి తేడాలేకుండా పొక్లెయిన్లు ఏర్పాటు చేసి టిప్పర్,లారీల ద్వారా ఇసుకను అక్రమంగా తరలిస్తూ లక్షలాది రూపాయాలు ఆర్జిస్తున్నారు. ఇసుక దోపిడీని అరికట్టాల్సిన మైనింగ్ ,పోలీస్, రెవెన్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. -
పటేల్ స్ఫూర్తితో ముందుకు సాగాలి
కడప అర్బన్ : దేశ సమగ్రతను కాపాడిన ఉక్కు మనిషి సర్ధార్ వల్లభాయ్ పటేల్ అని, ఆయన సంకల్పాన్ని యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. శుక్రవారం ఉదయం కడప పోలీస్ పెరేడ్ గ్రౌండ్ లో సర్దార్ వల్లభ్ భాయ్ పటేల్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం ఎస్పీ ’రన్ ఫర్ యూనిటీ’ పరుగును జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ భారతదేశాన్ని ఏకీకరణ చేసిన సర్దార్ వల్లభాయ్ పటేల్ జయంతిని పురస్కరించుకుని రాష్ట్రీ య ఏక్తా దివస్ కార్యక్రమాన్ని దేశ వ్యాప్తంగా పండుగ వాతావరణంలో నిర్వహించుకుంటున్నామన్నారు. భరత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటిచెప్పాలి కడప సెవెన్రోడ్స్ : భిన్నత్వంలో ఏకత్వం, సమైక్యత, సౌభ్రాతృత్వాలకు ప్రతీకగా వెలుగొందుతున్న భరత జాతి ఔన్నత్యాన్ని ప్రపంచానికి చాటి చెప్పాలని పిలుపునిస్తున్నామని, అదే ‘ఏక్తా దివస్‘ ముఖ్య ఉద్దేశ్యమని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు పేర్కొన్నారు. సర్ధార్ వల్లభాయి పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని శుక్రవారం కలెక్టరేట్లో రాష్ట్రీయ ‘ఏక్తా దివస్‘ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కలెక్టరేట్ అధికారులతో కలిసి సర్ధార్ వల్లభాయి పటేల్ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. కార్యక్రమంలో ముందుగా ‘దేశ ఐకమత్యం, సమగ్రత, భద్రతను కాపాడటానికి స్వయంగా అంకితమవుతానని, అంతేగాక ఈ సందేశాన్ని తోటివారందరిలో విస్తరింపచేయడానికి గట్టిగా కృషిచేస్తానని‘సభకు హాజరైన వారందరి చేత డిఆర్ఓ ప్రతిజ్ఞ చేయించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, స్టెప్ సీఈఓ విజయ్ కుమార్, మెప్మా ిపీడీ కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చిన్నరంగాపురంలో కొండచిలువ ప్రత్యక్షం
పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామంలో రైతు మల్లికార్జునరెడ్డి తోటలో శుక్రవారం కొండ చిలువ పాము ప్రత్యక్ష్యమైంది. రైతు తన పొలంలో గడ్డి కోస్తుండగా కొండ చిలువ కనిపించింది. భయంతో గ్రామస్తులు, స్థానికులు తోట వద్దకు వెళ్లి కొండ చిలువ పామును చంపేవారు. రేపు టెన్నికాయిట్ ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : పులివెందులలోని ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ కాంప్లెక్స్లో ఆదివారం టెన్నికాయిట్ ఎంపికలు నిర్వహిస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు పి.రామసుబ్బారెడ్డి , జి.వి.రమణారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎంపికై న వారు ఈ నెల 7 నుంచి 9 వరకు మూడు రోజుల పాటు బాపట్ల జిల్లా చీరాలలో జరిగే రాష్ట్ర స్థాయి జూనియర్ టెన్నికాయిట్ పోటీలలో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. 18 సంవత్సరాల లోపు వయస్సు ఉన్న వారు ఈ ఎంపికల లో పాల్గొనవచ్చని తెలిపారు. రవాణా చార్జీలను అసోసియేషన్ భరిస్తుందని తెలిపారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్ కార్డ్ తీసుకోని రావాలని కోరారు. ఇతర వివరాలకు 91826 61748 నెంబర్ను సంప్రదించాలని కోరారు ప్రకృతి వ్యవసాయ అరటి పంట పరిశీలన మైదుకూరు : మైదుకూరు మండలంలోని టి.కొత్తపల్లెకు చెందిన పుత్తా వెంకటసుబ్బారెడ్డి, ఆదిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన వెంకటరామయ్య పొలాల్లో ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో సాగు చేస్తున్న అరటి పంటను శుక్రవారం యూకేలోని రీడింగ్ యూనివర్సిటీకి చెందిన నేల, పర్యావరణ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ క్రిస్ కాలిన్స్ బృందం పరిశీలించారు. ప్రధాన పంటకు ముందు 30 రకాల విత్తనాలతో సాగు చేసిన పీఎండీసీ విధానాన్ని ప్రొఫెసర్ కాలిన్స్ రైతు శ్వేతను అడిగి తెలుసుకున్నారు. అలాగే పంట కాండం, ఆకులు నాణ్యతను పరిశీలించారు. మట్టి నమూనాలను సేకరించారు. కార్యక్రమంలో ఆదర్శ రైతు రామనందారెడ్డి పాల్గొన్నారు. -
ఎన్జీసీ జిల్లా కోఆర్డినేటర్గా విజయ ప్రసాద్
కడప ఎడ్యుకేషన్ : నేషనల్ గ్రీన్ కార్ప్స్ కడప జిల్లా కో ఆర్డినేటర్ ఏబీ విజయప్రసాద్ నియమితులయ్యారు. ఈ మేరకు డీఈఓ షేక్ షంషుద్దీన్ శుక్రవారం నియామక పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ పాఠశాలలో నేషనల్ గ్రీన్ కార్ప్స్(ఎన్జీసీ) కార్యక్రమాలను విస్తృత పరిచడం ద్వారా విద్యార్థులకు పర్యావరణ పరిరక్షణ మీద అవగాహన పెంపొందించాలని సూచించారు. ఎన్జీసీ కో ఆర్డినేటర్ విజయ ప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థులకు పర్యావరణ అంశాల మీద పట్టు సాధించడం కోసం, పర్యావరణ పరిరక్షణ కోసం వివిధ పోటీలు, ఎబ్జిబిషన్లు, ప్రాజెక్టులు, నేజర్ క్యాంపులు వంటివి నిర్వంచనున్నట్లు తెలిపారు. -
బ్రహ్మంగారి నివాసానికి పూర్వ వైభవం
బ్రహ్మంగారిమఠం : కాలజ్ఞాన ప్రబోధ కర్త పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన గృహానికి పూర్వ వైభవం కల్పించేలా చర్యలు చేపట్టనున్నట్లు ఇంటాక్ గవర్నింగ్ కౌన్సిల్ మెంబర్, కడప చాప్టర్ కన్వీనర్ కె. చిన్నపరెడ్డి పేర్కొన్నారు. ఇటీవల కురిసిన వర్షాలకు బ్రహ్మంగారు నివాసమున్న గృహం పాక్షికంగా కూలిపోయిన నేపథ్యంలో కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ ఆదేశాల మేరకు ఇంటాక్ ప్రతినిధులతోపాటు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ మల్లికార్జున ప్రసాద్, బ్రహ్మంగారిమఠం మేనేజర్ ఈశ్వరాచారి తదితరులు శుక్రవారం కూలిపోయిన బ్రహ్మంగారి నివాసాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా దివంగత పీఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి కుమారులు, దివంగత పీఠాధిపతి సతీమణి మహాలక్షుమ్మ, స్థానిక భక్తులతో వీరు చర్చించారు. కూలిపోయిన బ్రహ్మంగారి నివాసం పాత స్వరూపం చెడిపోకుండా మరమ్మతు చేయిస్తే ఈ నివాసాన్ని దర్శించుకునే భక్తులకు బ్రహ్మంగారి కాలంనాటి వైభవాన్ని గుర్తుకు తెచ్చినట్లు అవుతుందనే అభిప్రాయాన్ని వారు వ్యక్తం చేశారు. కార్యక్రమంలో ఇంటాక్ ప్రతినిధులు ఓ.వెంకటేశ్వర రెడ్డి, టీఎస్ గౌరీ శంకర్, స్థానిక భక్తులు ఈశ్వర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్పై నిరంతర నిఘా కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఇటీవల కాలంలో కర్నూలు జిల్లాలో జరిగిన ఘోర బస్సు ప్రమాదం నేపథ్యంలో వై ఎస్ఆర్ కడప జిల్లాలో రవాణా శాఖ ప్రైవేట్ ట్రావెల్ బస్సులను విస్తారంగా తనిఖీ చేసి నిరంతరం నిఘా ఉంచుతున్నట్లు జిల్లా ఇన్చార్జ్ ఉప రవాణా శాఖ కమినర్ వీర్రాజు శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులోని సీట్ ఆల్టర్నేషన్స్, ఫైర్ డిటెక్షన్ అలారమ్స్, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు, ఎమర్జెన్సీ ఎగ్జిట్ పనితీరును నిశితంగా పరిశీలించడం జరిగిందన్నారు. గత 7 రోజులలో జిల్లాలో 102 ప్రైవేట్ ట్రావెల్ బస్సులను పరిశీలించి అందులో 59 బస్సులపై కేసులు రాశామన్నారు. రోడ్డు భద్రత నియమాలకు విరుద్ధంగా ఉన్న 3 బస్సులను సీజ్ చేశామన్నారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని స్కూలు బస్సులు మరియు కాలేజీ బస్సులను తనిఖీ చేయమని రాష్ట్ర ప్రభుత్వం నుంచి వచ్చిన ఆదేశాల మేరకు వచ్చే పది రోజులలో అన్ని స్కూల్ బస్సులలో ఎమర్జెన్సీ ఎగ్జిట్, స్పీడ్ గవర్నర్, అగ్ని ప్రమాద నియంత్రణ పరికరాలు, హ్యాండ్ బ్రేక్, సర్వీస్ బ్రేక్ మొదలైన అన్ని రోడ్డు భద్రతా పరికరాలను సిద్ధంగా చేసుకోవాలని స్కూల్ యాజమాన్యాలకు నోటీసుల ద్వారా తెలియజేయడమైనదన్నారు. నిబంధనలకు విరుద్ధంగా ఉన్న బస్సులను సీజ్ చేస్తామని తెలిపారు. -
తుపానుతో నష్టపోయిన రైతులను ఆదుకోవాలి
బద్వేలు అర్బన్ : మోంథా తుపాను ప్రభావంతో పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు. శుక్రవారం బద్వేలు రెవెన్యూ డివిజన్ పరిధిలోని గుండంరాజుపల్లెలో తుపాను కారణంగా దెబ్బతిన్న వరిపంటను సీపీఎం బృందం పరిశీలించి రైతులతో మాట్లాడారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరో నాలుగు రోజుల్లో కోత కోసేందుకు సిద్ధమైన వరిపంట తుఫాను ప్రభావంతో పూర్తిగా దెబ్బతిందని, దీంతో రైతులు తీవ్ర ఆవేదన చెందుతున్నారని అన్నారు. నీటమునిగిన పంటలను అధికారులు పరిశీలించి రైతులకు ఎకరాకు రూ.35 వేలు చొప్పున నష్టపరిహారం అందించాలని కోరారు. ఉచిత పంటల బీమా ఎత్తివేతల వలన దాదాపు 6 లక్షల మంది రైతులు నష్టపోయారన్నారు. ప్రభుత్వం రైతులను ఆదుకోవాలని, లేనిపక్షంలో సీపీఎం పార్టీ ఆధ్వర్యంలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. -
డ్రోన్తో..పిచికారీ చేసుకోవాలి
అధిక వర్షాలకు భూమిలో తేమ ఎక్కువగా ఉండడంతో భూమి ఆరడం లేదు. ప్రస్తుతం అన్ని పంటలలో పైన సూచించిన మందులను ఎకరాకు 10 లీటర్ల నీటితో కలిసి పిచికారీ చేసుకోవాలి. రైతులు పైరు దశను దృష్టిలో పెట్టుకుని జాగ్రతగా పంటలను కాపాడుకోవాలి. – సునీల్కుమార్, ప్రధాన శాస్త్రవేత్త, వ్యవసాయ పరిశోధన స్థానం అధిక వర్షాలకు నీరు నిలిచి ఏ పంటైనా దెబ్బతినే అవకాశం ఉంటుంది. కాబట్టి పరిస్థితిని బట్టి పంట పొలాల్లో నిలిచి నీటిని బయటకు పంపాలి. పైన సూచించిన నియమాలను పాటించి పంటను రక్షించుకోవాలి. లేకుంటే అధిక వర్షాలకు పంటలు దెబ్బతింటాయి. అప్రమత్తంగా ఉండాలి. – క్రిష్ణప్రియ, డాట్ సెంటర్ సమన్వయకర్త, ఊటకూరు, కడప -
నాపై వచ్చిన ఆరోపణలు అవాస్తవం
భార్గవ్ రెడ్డికమలాపురం: చింతకొమ్మదిన్నె మండలంలో లేని భూమిని సృష్టించి తాను అడ్వాన్స్ తీసుకున్నానని నాపై ఓ పత్రికలో వచ్చిన ఆరోపణలు పూర్తిగా అవాస్తవం అని బీసీపీపీఎల్ హెచ్ఆర్ మేనేజర్ భార్గవ్రెడ్డి వివరించారు. శుక్రవారం కమలాపురంలో నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. చింతకొమ్మదిన్నె మండలంలోని ల్యాండ్ గురించి తనకు ఏ మాత్రం తెలియదని, ఇందులో తాను అడ్వాన్స్ తీసుకున్నానని వచ్చిన కథనంలో ఎలాంటి వాస్తవం లేదన్నారు. కొన్నాళ్ల క్రితం తనకు బాగా తెలిసిన ఓ వ్యక్తి వచ్చి తన భూమి ఆన్లైన్ కావడం లేదని రెవెన్యూ అధికారులకు చెప్పాలని నన్ను కోరాడు. తెలిసిన వ్యక్తి కావడం, అందులోనూ పదే పదే అడుగుతుండటంతో తనకు తెలిసిన ఓ అధికారికి ఫోన్ చేసి ఆ వ్యక్తికి సంబంధించిన ల్యాండ్ ఆన్లైన్ చేయాలని కోరానన్నారు. అయితే ఆ అధికారి ఆ భూమి ఆన్లైన్ కాదని, కుటుంబ సభ్యుల సమస్య ఉందని, దానిని ఏమీ చేయలేమని చెప్పడంతో తాను అదే మాట ఆ వ్యక్తికి చెప్పానని, అంతకు మించి తనకు ఏమీ తెలియదన్నారు. నేను భారతి సిమెంట్ లో పని చేస్తుండటంతో రెవెన్యూలో తిరుగుతుంటానని, దాని వలన అతడు నన్ను ఈ విషయం అడిగాడన్నారు. దానిని బేస్ చేసుకుని వారు అడ్వాన్స్ ఇప్పించుకున్నారేమోనన్నారు. ఆ భూమి గురించి గాని, ఆ సర్వే నెంబర్ల గురించి గాని, అడ్వాన్స్గురించి గాని నాకు తెలియదన్నారు. మూడు రోజుల క్రితం మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి మీ ఫిర్యాదు చేశాడని సీఐ ఫోన్ చేసి రావాలని చెప్పడంతో నేను స్టేషన్కు వెళ్లి ఇదే విషయం చెప్పానన్నారు. మహబూబ్ ఖాన్ అనే వ్యక్తి ఎవరో కూడా నాకు తెలియదన్నారు. సీఐకు కూడా ఇదే స్టేట్మెంట్ ఇచ్చానన్నారు. -
పరిశోధనలపై ఆసక్తి పెంచుకోవాలి
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచి పరిశోధనల పట్ల ఆసక్తిని పెంచుకోవాలని హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ ప్రొఫెసర్ బిందు మాధవ రెడ్డి అన్నారు. ఆయన యోగి వేమన విశ్వవిద్యాలయంలో శుక్రవారం స్కాలర్లకు, విద్యార్థులకు ‘డయాబెటిస్, కేన్సర్లో శక్తి సమతుల్యత (ఎనర్జీ హోమియోస్టాసిస్ ఇన్ డయాబెటిస్ అండ్ క్యాన్సర్)’ అనే అంశంపై అతిథి ఉపన్యాసం ఇచ్చారు. కేన్సర్ డయాబెటిస్పై ప్రస్తుతం జరుగుతున్న పరిశోధనలు గురించి అవగాహన కల్పించారు. ఈ రెండు రంగాలలో జరుగుతున్న పరిశోధనలు, యువ పరిశోధకుల భాగస్వామ్యం గురించి ప్రస్తావించారు. మరో ప్రొఫెసర్ రాజమోహన్ రాయ్ యువత పారిశ్రామికవేత్తలుగా ఎదగాలంటే ఎలాంటి ఆలోచన విధానాలు ఉండాలి, లక్షణాలను అలవర్చుకోవాలో అవగాహన కల్పించారు. వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ ఆచార్య బిందు మాధవరెడ్డిని, ప్రొ రాజమోహన్ రాయ్లను విశ్వవిద్యాలయం తరపున సత్కరించారు. -
మోంథా ప్రభావం... తెగుళ్లతో జరభద్రం
● మోంథా నుంచి కోలుకుంటున్న రైతులు ● మెలకువలను పాటించాలంటున్న శాస్త్రవేత్తలుకడప అగ్రికల్చర్ : మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురవడం.. నెమ్ము చేరడంతో పంటలు వాడుముఖం పట్టడం తెగుళ్ల బారిన పడడం జరుగుతోంది. వరితోపాటు, మినుము, వేరుశనగ, పత్తి, శనగ రైతులకు ఈ నష్టం తప్పనిసరి. ఇప్పటికే చాలా పంటలు నీటమునిగాయి. రైతులకు ఉపశమనం కలిగించేందుకు కొన్ని మెలకువలు పాటించాలని శాస్త్రవేత్తలు సూచిస్తున్నారు. ఆ వివరాలు ఇలా ఉన్నాయి. వరి పంట... కోత దశలో పడిపోయిన, నిలిచిన పైరు, కంకిలో మొలకలు కనపడితే పొలం నుంచి నీరు తీసేసి 50 గ్రాముల కల్లు ఉప్పు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. నూర్పిడి చేసిన ధాన్యం రెండు, మూడు రోజుల పాటు ఎండబెట్టడానికి వీలుకాకపోతే కుప్పలలో గింజలు మొలకెత్తకుండా క్వింటా ధాన్యానికి కిలో కల్లు ఉప్పు, 20 కిలోల వరిపొట్టు కలపాలి. పైరు నిలబడి ఉన్నా, పడిపోయిన చేలలో గింజలు రంగు మారకముందే పొట్టకుళ్లు, పాముపొడ, మానిపండు తెగుళ్లు రాకుండా ఎకరాకు 200 మి.మీటర్ల ప్రొపిపకోనోజోల్ మందు పిచికారీ చేయాలి. పిలకల దశ నుంచి పాలు పోసుకునే దశలో ఉన్న వరి పైరులో ఆకుముడత, కాండం తొలుచు పురుగు, సుడిదోమ ఆశించే అవకాశం ఉంది. వాటి నివారణకు ఎకరాకు ప్లూబెండమైడ్ 50మి.మీ, గ్రాము పైమెట్రిజిన్తో కలిపి పిచికారీ చేసుకోవాలి మినుము పొలంలో నిలిచిన నీటిని పిల్ల కాల్వల ద్వారా తీసివేయాలి. వేరుకుళ్లు, చిత్తపురుగులు, లద్దెపురుగు నివారణకు 400 మి.మీ అసిఫేట్, హెక్సాకోనజోల్, వేయి గ్రాముల 19:19:19 మందు కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. వేరుశనగ పైరు తొలిదశలో ఉన్నప్పుడు మొదలుకుళ్లు, ఆకుమచ్చ తెలుగు ఆశించాయి. నివారణకు కార్బండిజమ్, మాంకోజెబ్ 500 గ్రాములు కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. పొగాకు లద్దెపురుగు ఆశించినప్పుడు ఇమామెక్టిన్ జెంబేమేట్ 80 గ్రాములు ఎకరాకు పిచికారీ చేయాలి. కోత దశలో ఉన్న పైరులో వర్షం తగ్గిన తరువాత నీటిని తీసివేయాలి. పత్తి పైరులో నిలిచిన నీటిని తీసేసి ఎకరాకు 40 కిలోల యూరియా, 20 కిలోల మ్యూరెట్ ఆఫ్ పొటాష్ వేయాలి. గులాబీరంగు పురుగు, కాయకుళ్లు నివారణకు క్లోరాన్ట్రానిక్ప్కొల్ 60మి.మీ, హెక్సాకోనజోల్ 400మి.మీ, 13:0:45 వేయి గ్రాములు కలిపి ఎకరా పంటకు పిచికారీ చేయాలి. శనగ తొలిదశలో ఉన్న శనగ పంట వేరుకుళ్లుతో చనిపోతోంది. నివాణరకు హెక్సాకొనాజోల్ 400 మి.మీ ఎకరాకు కలిపి పిచికారీ చేయాలి. కంది ప్రస్తుతం కంది పంట శాఖీయ దశ నుండి పూత దశలో ఉంది. పొలం నుండి వర్షపు నీటిని ఎప్పటికప్పుడు తీసివేయాలి. వర్షాలు ఆగాయి కాబట్టి పొటాషియం నైట్రేట్, 19:19:19 ఎరువు 1.0% (10 గ్రా. లీటర్ నీటికి) పిచికారీ చేయాలి. పొడలు, వేరు కుళ్లు తెగుళ్ల నివారణకు, కాపర్ ఆక్సీ క్లోరైడ్ మూడు గ్రామాలు లీటరు నీటికి కలిపి మొదళ్లు తడిచేలా నేలపై పిచికారీ(డ్రెంచింగ్) చేయాలి. వర్షాలు ఆగిన తరువాత, మరూక, శెనగపచ్చ పురుగు నివారణకు క్లోరిపైరిఫాస్ 2.5 మి.లీ, నోవాల్యూరోన్ 1.0 మి.లీ, స్పైనోసాడ్ 0.3 మి.లీ కలిపి ఎకరాకు పిచికారీ చేయాలి. -
ప్రశాంతంగా ఇంటర్ నాన్ టీచింగ్ ఉద్యోగుల పదోన్నతి కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ పరిధిలోని కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల పరిధిలో ఇంటర్మీడియట్ నాన్ టీచింగ్కు సంబంధించిన పదోన్నతి కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. కడప ఇంటర్ ఆర్జేడీ కార్యాలయంలో శుక్రవారం ఇంటర్ ఆర్జేడీ సురేష్కుమార్ ఆధ్వర్యంలో కౌన్సెలింగ్ను నిర్వహించారు. నాలుగు జిల్లాలకు సంబంధించిన 18 మంది జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతికి కల్పించారు. ఇందులో ఉమ్మడి కడప జిల్లాకు సంబంధించి ముగ్గురికి, ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి ఐదుగురికి, ఉమ్మడి అనంతపురం జల్లాకు సంబంధించి నలుగురికి, ఉమ్మడి కర్నూల్ జిల్లాకు సంబంధించి ఆరుగురు జూనియర్ అసిస్టెంట్లకు సీనియర్ అసిస్టెంట్లగా పదోన్నతి కల్పించి నిర్వహించి వారికి స్థానాలకు కేటాయించారు. కౌన్సెలింగ్లో తిరుపతి జిల్లా ఆర్ఐవో రాజశేఖర్రెడ్డి, సత్యసాయి జిల్లా డీవీఈఓ చెన్నకేవశ ప్రసాద్, కడప డీవీఈఓ వెంకటేశ్వర్లు, ఆర్జేడీ కార్యాలయ ఏవో రూపానాయక్ తదితరులు పాల్గొన్నారు. రాయలసీమ పరిధిలో 18 మందికి పదోన్నతులు -
ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి
అట్లూరు : బతుకుదెరువు కోసం ట్రాక్టర్ తీసుకుని వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తూ అదే ట్రాక్టర్ కింద పడి వ్యక్తి మృతి చెందిన హృదయ విదారకరమైన ఘటన అట్లూరు మండలం కుమ్మరవారిపల్లె గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంటూరు జిల్లా త్రిపురాంతకంకు చెందిన దగ్గుల అంజిరెడ్డి (55) 20 ఏళ్ల క్రితం అట్లూరు మండలం కుమ్మరవారిపల్లె గ్రామానికి వచ్చి అదే గ్రామంలో సరస్వతి అనే మహిళను పెళ్లి చేసుకొన్నాడు. ఓ ట్రాక్టర్ను కొనుగోలు చేసి ఆ ట్రాక్టర్ ద్వారా వ్యవసాయ పనులు చేసుకుంటూ ఆయన జీవనం సాగించేవాడు. వారికి కుమార్తె వెంకట నారాయనమ్మ ఉంది. ఆమె 7వ తరగతి చదువుతోంది. శుక్రవారం ఉదయం పక్క ఊరు చిన్నరాజుపల్లికి దగ్గర మాగానిలో ట్రాక్టర్ రోటవేటర్తో అంజిరెడ్డి సేద్యం చేస్తున్నాడు. అయితే ఉన్న ఫలంగా ట్రాక్టర్ బురదలో ఇరుక్కపోవడంతో వెలికితీసే క్రమంలో ప్రమాదవ శాత్తు ట్రాక్టర్ ఇంజిన్ పల్టీ కొట్టింది. ఆ ఇంజిన్ కింద అంజిరెడ్డి పడిపోయి బుదర కూరకపోయి ఊపిరి ఆడక మృతి చెందాడు. విషయం తెలుసుకున్న స్థానికులు, బంధువులు సంఘటన స్థలానికి చేరుకుని పోలీసులకు సమాచారం అందివ్వడంతో స్థానిక ఎస్ఐ రామకృష్ణయ్య తన సిబ్బందితో సంఘటన స్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీసి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. భార్య, కుమార్తె బోరున విలపించారు. వీధిన పడ్డ ఆ కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్థానికులు కోరుతున్నారు. -
వైఎస్సార్ సంల్పంతోనే రాయలసీమకు నీళ్ళు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : దివంతగ ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి సంకల్పంతోనే రాయలసీమలో నీళ్లు చూస్తున్నామని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ గురువారం టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యులు ఆర్ శ్రీనివాసులురెడ్డి విలేకరుల సమావేశంలో ఒక విలేకరి మాట్లాడుతూ ఈనెల 26న ఆలోచనపరుల వేదిక నాయకులు రిటైర్డ్ ఐపీఎస్ అధికారి ఏబి వెంకటేశ్వరరావు ఆధ్వర్యంలో ప్రెస్ క్లబ్లో జరిగిన రౌండ్ టేబుల్ సమావేశంలో ప్రాధాన్యత క్రమంలో ప్రాజెక్టులు పూర్తిగా కాకుండానే పోలవరం బనకచర్ల ఎత్తిపోతల పథకం పేరుతో రెండు లక్షల కోట్ల అదనపు భారాన్ని రాయలసీమ రైతాంగంపై మోపుతున్నారు అన్న అభియోగాన్ని ప్రస్తావన చేశారు. అందుకు శ్రీనివాసులు రెడ్డి స్పందిస్తూ పంట కాలువల కంటే ప్రధాన కాలువ ముఖ్యం అంటూ కాలం చెల్లిన విధానాలను పట్టుకు వేలాడే కమ్యూనిస్టులు అంటూ, నీటి కోసం ఏడు దశాబ్దాలుగా యుద్ధం చేస్తున్న ఎవరూ పట్టించుకోవడంలేదని చెప్పడం ఆయన అవగాహన రాహిత్యానికి నిదర్శనమన్నారు. 2004లో అధికారంలోకి వచ్చిన దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైయస్ రాజశేఖర్ రెడ్డి నీటిపారుదల ప్రాజెక్టులకు ప్రాధాన్యత కల్పించి నిర్మాణానికి నిధులు కేటాయించి రాయలసీమలో అక్కడక్కడ నీళ్లు చూడగలుగుతున్నామంటే వైఎస్సార్ సంకల్పమే అన్నారు. కమ్యూనిస్టుల పోరాటాలకు గుర్తింపుగా గండికోట ఎద్దుల ఈశ్వర్ రెడ్డి, వెలుగొండకు పూల సుబ్బయ్య పేర్లను పెట్టి ఉద్యమకారులను గౌరవించిన చరిత్రను శ్రీనివాసులు రెడ్డి తెలుసుకోవాలన్నారు. చారిత్రాత్మకమైన విజయాలు సాధించిన కమ్యూనిస్టు పార్టీ ఎక్కడ.. ఏ సిద్ధాంతం లేకుండా అవకాశవాద రాజకీయాలకు అడ్డాగా మారిన తెలుగుదేశం పార్టీ ఎక్కడ.. అన్నారు. కార్యక్రమంలో సీపీఐ నగర కారదర్శి వెంకట శివ పాల్గొన్నారు. -
కూటమి కళ్లకు గంతలు!
రోడ్డంతా గుంతలు.. అడుగుకో గుంతతో ప్రమాదం పొంచి ఉంది. ఏ రోడ్డు చూసినా గోతులతోనే దర్శనమిస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక గుంతలు కనిపించవన్నారు.. కొన్నాళ్ల కిందటే రోడ్ల కోసం కోట్లు ఖర్చు చేశామని గొప్పలు చెప్పారు. కోట్లు ఖర్చు చేశారో.. ‘కోట్ల’ వెనక దాచారో గుంతలు పడ్డ ఈ రోడ్లను చూసే తెలుస్తుంది. పచ్చ కళ్లకు కట్టిన గంతలు తీసేస్తే గోతులు పడ్డ రోడ్డు కానొస్తుంది.అరకొరగా పనులు చేసి చేతులు దులుపుకోవడం తప్ప పూర్తి స్థాయిలో పనులు చేపట్టలేదని కడప నగర శివార్లలోని ప్రధాన రహదారిని చూస్తే అర్థమవుతుంది. ఈ రహదారుల్లో వెళ్లే ప్రయాణికులు తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. మాటలు తప్పా చేసేదేమీ ఉండదని కూటమి నేతల తీరుపై తూర్పారబడుతున్నారు. – ఫొటోలు: సాక్షి, ఫొటోగ్రాఫర్, కడప పాలెంపల్లె వద్ద అధ్వాన స్థితిలో రోడ్డుదేవునికడప రోడ్డు వద్ద ఫాతిమా కళాశాల వద్ద రింగ్రోడ్డులో బచ్చుంపల్లె వద్ద భారీ గుంత -
పంటికింద రాయితీ!
చిన్నపరిశ్రమలకు కడప సెవెన్రోడ్స్: నవంబర్ 2 తేదీ సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో జరిగే బ్రౌన్ శాస్త్రి శతజయంతోత్సవ వేడుకలకు మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్య నాయుడు రానున్న నేపథ్యంలో ప్రొటోకాల్ ప్రకారం అన్ని ఏర్పాట్లు పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లో అధికారిక ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో జేసీ అదితి సింగ్, ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో సీపీ బ్రౌన్ ప్రాంగణంలో నిర్వహించనున్న గ్రంథాలయ సాహిత్య సేవా పురస్కార ప్రదానోత్సవ కార్యక్రమంలో మాజీ ఉపరాష్ట్రపతి వెంకయ్యనాయుడు పాల్గొంటారని తెలిపారు. ఆయన బస చేయనున్న ఆర్అండ్బీ గెస్ట్ హౌస్ వద్ద మెడికల్ టీం ఏర్పాటు చేయాలని వైద్యాధికారులకు సూచించారు. అధికారులందరూ జానమద్ది సాహితీ పీఠం వారితో సమన్వయం చేసుకుంటూ, ప్రొటోకాల్ ప్రకారం అవసరమైన అన్ని ఏర్పాట్లను ఖచ్చితంగా పాటించాలని పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: ఓ సినిమాలో అడుక్కుంటున్న అలీకి బ్రహ్మానందం అర్థరూపాయి వేసి... తీసుకో.. పండుగ చేస్కో...అంటాడు. దీనికి ఏం పండుగ చేసుకోవాలి.. తొక్కలో అర్థరూపాయి వేసి ఏదో మా ఫ్యామిలీని పోషిస్తున్నట్లు ఫోజు ఇస్తున్నావేంటి.. అంటూ అలీ వెటకారంగా జవాబిస్తాడు. కూటమి ప్రభుత్వంలో పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదల విషయంలో అచ్చం ఇదే సీన్ రిపీట్ అవుతోంది. ప్రపంచమంతా ఏపీ వైపు చూస్తోంది...పారిశ్రామిక పెట్టుబడులకు ఏపీ స్వర్గధామం...ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్లో ముందున్నాం. సింగిల్ డెస్క్ ద్వారా అన్ని రకాల వెనువెంటనే అనుమతులిస్తున్నామని గొప్పలు పోతూ విశాఖపట్నంలో సమ్మిట్ నిర్వహిస్తున్నారు. ఈ సమ్మిట్కు ముందు పారిశ్రామిక వేత్తలకు ఏదో చేశామని చెప్పుకునేందుకు దీపావళి కానుక పేరుతో రూ.1500 కోట్లు పారిశ్రామిక రాయితీలు ఇస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు ఆర్భాటంగా ప్రకటించారు. తీరా చూస్తే అందులో రూ.1031 కోట్లు మాత్రమే ఇచ్చి చేతులు దులుపుకున్నారు. మిగిలిన రూ.470 కోట్లను దారి మళ్లించారు. ● వైఎస్సార్ కడప జిల్లాలో 2004 ఎంఎస్ఎంఈ యూనిట్లు ఉంటే 156.51 కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. ప్రభుత్వం అందులో సగం రాయితీలనైనా ఇస్తుందని పారిశ్రామిక వేత్తలు ఆశించారు. కానీ తీరా ప్రోత్సాహకాలు విడుదలయ్యాక వారు అవాక్కయ్యారు. కేవలం నామమాత్రంగా నిధులు మాత్రమే విడుదలయ్యాయని తెలుసుకొని నవ్వాలో, ఏడవాలో తెలియక అయోమయంలో ఉన్నారు. మొత్తం 156.51 కోట్ల బకాయిల్లో కేవలం అతి తక్కువ శాతం రాయితీలు మాత్రమే ఇచ్చి ప్రభుత్వం పండుగ చేసుకోమంటోందని పారిశ్రామివేత్తలు వాపోతున్నారు. ఈ రాయితీలు కూడా ఏయే యూనిట్లకు ఎంతెంత ఇచ్చారనే వివరాలు మాత్రం ఎవరికీ తెలియదు. ప్రభుత్వం వైఖరి చూసి పారిశ్రామిక వర్గాలు విస్తుపోతున్నాయి. ప్రోత్సాహకాలు ఎంతిచ్చారనేది తెలీదు ప్రభుత్వం ఎంఎస్ఎంఈలకు ఎంత మేర ప్రోత్సాహకాలు విడుదల చేసిందనేది మాకు తెలీదు. మేమైతే జాబితా సిద్ధం చేసి ప్రభుత్వానికి పంపించాం. కొందరు వచ్చాయంటున్నారు, కొందరు రాలేదంటున్నారు. సాధా రణంగా ఎంతమందికి ప్రోత్సాహకాలు ఇచ్చా రో జాబితా రావాలి. ఇంకా రాలేదు. – చాంద్బాషా, జనరల్ మేనేజర్, జిల్లా పరిశ్రమల కేంద్రం ప్రొటోకాల్ మేరకు ఏర్పాట్లు చేయాలి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశం జిల్లాలో 2004 ఎంఎస్ఎంఈలకు రూ.156.51కోట్ల బకాయిలు జిల్లాకు నామమాత్రంగారాయితీలు విడుదల విస్తుపోతున్న పారిశ్రామిక వర్గాలు -
కోర్టు స్టే
వల్లూరు: డాక్టర్ వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ తరలింపుపై హైకోర్టు స్టే విధించింది. ఈ యూనివర్సిటీ ఏర్పాటైనప్పటి నుంచి కడప నగర సమీపంలోని శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ వారి భవన సముదాయంలో నడుస్తోంది. ప్రస్తుత ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ వీసీ జయరామిరెడ్డి బాధ్యతలు స్వీకరించిన అతి కొద్ది రోజుల్లోనే ఈ యూనివర్సిటీని వైవీయూ ప్రాంగణంలోని 21 వ శతాబ్దం గురుకులంలోకి తరలించాలని నిర్ణయం తీసుకున్నారు. లీజు అగ్రిమెంట్ నిబంధనలను పక్కనపెట్టి హడావుడిగా యూనివర్సిటీ తరలింపు చర్యలు చేపట్టడం విమర్శలకు తావిచ్చింది. కొనసాగిస్తామని చెప్పి.. నిజానికి శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ భవన సముదాయంలో ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిర్వహణకు సంబంధించి 2024 డిసెంబర్లో అగ్రిమెంట్ ముగిసింది. ఈ క్రమంలో తమ భవనాలను ఖాళీ చేయాలని యాజమాన్యం జనవరిలో యూనివర్శిటీ అధికా రులకు నోటీసులు అందచేసింది. వైవీయూలో ఈ యూనివర్సిటీ నిర్వహణకు కేవలం 4 భవనాలు మాత్రమే అందుబాటులో ఉన్న కారణంగా అక్కడ పూర్తి స్థాయిలో తరగతులు, కార్యకలాపాలు నిర్వహించడం వీలు కాదని భావించిన యూనివర్శిటీ వారు ఇక్కడే కొనసాగించడానికి సిద్ధమయ్యారు. ఈ క్రమంలో ఈ నెల 22న తమ అగ్రిమెంట్ను రెన్యువల్ చేయాలని యాజమాన్యం యూనివర్సిటీని కోరింది. ఈ క్రమంలో తాము ఈ నెల 31లోపు యూనివర్శిటీని తరలిస్తున్నట్లు 24 వ తేదీ రాత్రి మెయిల్ ద్వారా యూజమాన్యానికి తెలియచేసింది. 27న నోటీసును అందచేసింది. దీంతో తమకు ఇప్పటి వరకు ఇవ్వాల్సిన అద్దె, ఇతర బకాయిలను, విద్యుత్ చార్జీలను చెల్లించాలని, అగ్రిమెంట్ నిబంధనల మేరకు మూడు నెలల ముందు నోటీస్ ఇచ్చిన తరువాత ఖాళీ చేయాలని యాజమాన్యం తెలిపింది. సామగ్రి తరలింపుపై అభ్యంతరం శుక్రవారం ఉదయం యూనివర్సిటీకి సంబంధించిన సామగ్రి, ఫర్నీచర్ను తరలించడానికి ట్రాక్టర్లను సిద్ధం చేయగా యాజమాన్యం అభ్యంతరం తెలిపింది. దీంతో వీసీ పోలీసులకు సమాచారం అందించగా చెన్నూరు సీఐ కృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి అక్కడికి చేరుకుని యాజమాన్యంతో చర్చించారు. లీజు అగ్రిమెంట్ నిబంధనలతో బాటు, తమ దగ్గర ఉన్న డాక్యుమెంట్లను వారు ఆయనకు అందచేశారు. ఈ క్రమంలో లీజ్ అగ్రిమెంట్ విషయమై సీఐ వీసీతో చర్చలు జరిపారు. నిబంధనలకు తిలోదకాలు ఒక యూనివర్సిటీని మొత్తం ఒక చోట నుంచి మరో చోటికి తరలించాలంటే అందులోని సామగ్రిని, రికార్డులను తరలించడానికి టెండరు నిర్వహించాల్సి ఉంటుంది. అందులో తక్కువ మొత్తానికి కోట్ చేసిన వారికి తరలింపు కాంట్రాక్టును ఇవ్వాల్సి ఉంటుంది. కానీ ఎలాంటి టెండర్లు నిర్వహించకుండా ట్రాక్టర్లను ఏర్పాటు చేసి తరలించాలని చూడడం నిబంధనలకు విరుద్ధమనే అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కాగా లీజు అగ్రిమెంట్కు సంబంధించి మూడు నెలల ముందు నోటీసు ద్వారా తెలపకపోవడంతో బాటు, తమకు చెల్లించాల్సిన సుమారు రూ 3.5 కోట్ల బకాయిలు చెల్లించకుండా యూనివర్సిటీని తరలించాలని నిర్ణయించడంపై శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేట్ లిమిటెడ్ యాజమాన్యం హైకోర్టును ఆశ్రయించింది. దీంతో సదరు కోర్టు వారం రోజుల పాటు యథాతథ స్థితిని కొనసాగించాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో యూనివర్శిటీ తరలింపునకు తాత్కాలికంగా బ్రేక్ పడింది. -
నేడు జాబ్మేళా
కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీఎస్ఎస్డీసీ, జిల్లా ఉపాధి కల్పనాధికారి కార్యాలయంలో ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు కడపలోని ప్రభుత్వ ఐటీఐలో 13 కంపెనీలతో జాబ్మేళా నిర్వహించనున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 18–45 ఏళ్లలోపు కలిగిన అభ్యర్థులు 7, 10 తరగతులు, ఇంటర్, డిగ్రీ, ఐటీఐ, డిప్లామా, బీటెక్ చదివిన వారు అర్హులన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలకు సంబంధించిన ధ్రువపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూలకు హాజరు కావాలని సూచించారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో నవంబర్ 7వ తేదీన అంతర కళాశాలల క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు ఆ విశ్వవిద్యాలయ వ్యాయామ విద్య, క్రీడా శాస్త్రాల బోర్డు కార్యదర్శి డాక్టర్ రామసుబ్బారెడ్డి తెలిపారు. రోలర్ స్కెటింగ్, రైఫిల్ షూ టింగ్, యోగ, టేబుల్ టెన్నిస్ విభాగాల్లో పోటీ లు ఉంటాయన్నారు. క్రీడాకారుల వయసు 17 నుంచి 25 ఏళ్లలోపు ఉండాలని సూచించారు. ఈ పోటీల్లో పాల్గొనదలచిన క్రీడాకారు లు ఒరిజినల్ స్టడీ సర్టిఫికేట్, టెన్త్, ఇంటర్, డిగ్రీ సర్టిఫికెట్లు, వీటిలో పాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలపై ప్రిన్సిపల్తో అటెస్టేషన్ చేయించుకుని రావాలని పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వ విద్యాలయ పరిధిలో జరగుతున్న బీఈడీ 3వ సెమిస్టర్ పరీక్షలను గురువారం యూనివర్సిటీ హైపర్ కమిటి సభ్యులు ఈశ్వరరెడ్డి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన పరీక్షా కేంద్రంలో వసతులతోపాటు విద్యార్థులను పరిశీలించారు. పరీక్ష తీరును పరిశీలించి సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అబ్జర్వ ర్ దాసరిమోసే పాల్గొన్నారు. అలాగే విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు పలు సెంటర్లను తనిఖీ చేశారు. కడప వైఎస్సార్ సర్కిల్: ఈనెల 22,23న ఏలూరులో నిర్వహించిన ఎస్జీఎఫ్ అథ్లెటిక్స్ పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటి జాతీయస్థాయికి ఎంపికై నట్లు డీఎస్డీఓ గౌస్ బాషా పేర్కొన్నారు. జిల్లా క్రీడాకారుడైన బి.సాయి 800 మీటర్లలో సిల్వర్ పథకం 400 మీటర్ల సిల్వర్ పథకం, రిలే బంగారు పతకం సాధించారన్నారు. ఏ.సాయి ప్రశాంత్ 1500 మీట ర్లలో కాంస్య పథకం, 400 మీటర్లలో రిలే బంగారు పతకం సాధించారన్నారు. వీరు నవంబర్ 27 నుంచి హర్యానాలో జరిగే జాతీయ స్థా యి పోటీలకు ఎంపికై నట్లు తెలిపా రు. అథ్లెటిక్స్ లో రాణించిన క్రీడాకారులను కోచ్ లు శివగంగా అభినందించారు. మైదుకూరు: మోంథా తుపాను కారణంగా ఉద్యాన పంటలు దెబ్బతిని ఎంత మేరకు నష్టం వాటిల్లిందనే దానిపై అంచనా వేయనున్నట్లు జిల్లా ఉద్యాన శాఖ అధికారి సతీష్ పేర్కొన్నారు. గురువారం మండలంలోని వనిపెంట కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్తలు డాక్టర్ బాలకృష్ణ, డాక్టర్ కాంతిశ్రీ, ఉద్యాన అధికారులు బి.శ్రీనివాస్ రెడ్డి, వి.రామకృష్ణ, ఉద్యాన సహాయకులతో కలిసి పలు మండలాల్లో దెబ్బతిన్న పంటలను పరిశీలించారు. మైదుకూరు, పోరుమామిళ్ల, కాశినాయన, బ్రహ్మంగారిమఠం మండలాల్లోని లింగందిన్నెపల్లె, చెంచయ్యగారిపల్లె, రామచంద్రాపురం, సావిశెట్టిపల్లె, కోడిగుడ్లపాడు గ్రామాల్లో మోంథా తుపాన్ వల్ల కురిసిన భారీ వర్షాలతో దెబ్బతిన్న అరటి, ఉల్లి, జామ, మిరప, వంగ, చామంతి పంటలను పరిశీలించి ఎంత మేరకు దెబ్బతిన్నాయి.. నష్టం ఏ స్థాయిలో ఉందనే విషయంపై అంచనా వేశారు. పంట నష్ట తీవ్రత ఎక్కువగా ఉన్నందున నష్టాన్ని అంచనా వేసి సంబంధిత శాఖలకు నివేదిక అందజేస్తామని తెలిపారు. పంట నష్ట వివరాలను నమోదు చేయండి కాశినాయన: మోంథా తుపాన్ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటల నష్ట వివరాలను నమోదు చేయాలని జిల్లా ఉద్యాన అధికారి సతీష్ తెలిపారు. మండలంలోని పలు గ్రామాల్లో తు పాన్ వల్ల దెబ్బతిన్న ఉద్యాన పంటలను స్థానిక ఉద్యాన అధికారి శ్రీనివాసులరెడ్డితో కలసి ఆయన పరిశీలించారు. -
అన్నమయ్యా...ఇదేందయ్యా..!
● టెండరు రద్దు చేయకుండానే కమిటీ ఏర్పాటు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కొత్త ప్రాజెక్టు నిర్మాణానికి రూ.787.77 కోట్లు ● రాఘవ కన్స్ట్రక్షన్స్కు టెండరు ఖరారు ● ఐదు గేట్లు ఉన్న అన్నమయ్య ప్రాజెక్టు 14గేట్ల నిర్మాణానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం చర్యలు ● కూటమి ప్రభుత్వం వచ్చాక నిర్మాణానికి అడుగులు పడని వైనం కడప సిటీ : అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణాన్ని కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. కమిటీ పేరుతో కాలయాపన చేస్తూ కాలం గడుపుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ. 787.77 కోట్లతో నిర్మాణం చేపట్టేందుకు ముందుకువచ్చింది. ఈ పనులకు సంబంధించి రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దక్కించుకుంది. ఇన్వెస్టిగేషన్కే రూ.కోటి ఖర్చు చేసింది. అంతలోపే ఎన్నికలు రావడం, అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం పనులు కొనసాగించకుండా కాలం వృథా చేస్తోంది. టెండరు రద్దు చేయకుండా కమిటీ ఏర్పాటుచేసి నిర్మాణానికి ఆలస్యం చేస్తూ మళ్లీ ఇన్వెస్టిగేషన్, కొత్త డిజైన్తో పనులు చేపడతామంటూ సాకులు చెబుతోంది. వైఎస్సార్సీపీ హయాంలో ప్రాజెక్టు గురించి ఎన్నో ఆరోపణలు చేసిన టీడీపీ అధికారంలోకి వచ్చాక నిర్మాణాలు చేపట్టడం లేదు. కమిటీతో కాలయాపన 2.20 టీఎంసీల సామర్థ్యంతో చెయ్యేరు నదిపై 2001 నాటికి ఐదు గేట్లతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించారు. అయితే 2021 నవంబరు, 19న అకస్మిక వరదలతో ప్రాజెక్టు తెగిపోయింది. దీంతో అప్పుడు అధికారంలో ఉన్న వైఎస్సార్సీపీ ప్రభుత్వం రూ.787.77 కోట్లతో ప్రాజెక్టు నిర్మించి ఐదు గేట్ల నిర్మాణాన్ని 14 గేట్లకు పెంచేందుకు టెండర్ ఖరారుచేసింది. రాఘవ కన్స్ట్రక్షన్స్ కంపెనీ టెండర్ దక్కించుకుని ఇన్వెస్టిగేషన్ పనులు చేపట్టింది. అంతలోపే ఎన్నికల కోడ్ రావడంతో పనులు నిలిచి పోయాయి. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిక కూటమి ప్రభుత్వం 25శాతంలోపు జరిగిన పనులను రద్దుచేయాలని ఆదేశాలు జారీ చేసింది. చేసిన రూ.కోటి పనులకు బిల్లు చెల్లించకుండా ఎగనామం పెట్టింది. ఇదే కంపెనీతో డిజైన్ వర్క్ చేయమని చెప్పినా కాంట్రాక్టర్ అందుకు అంగీకరించలేదు. ఈ ప్రాజెక్టు నిర్మాణానికి కూటమి ప్రభుత్వం వచ్చాక ప్రత్యేక నిపుణులు, నీటిపారుదలశాఖ అధికారులతో కమిటీ ఏర్పాటుచేసింది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కాలం దాటినా కమిటీ నివేదిక ఇంత వరకూ రాలేదు. కేవలం కమిటీ నెపంతో కాలయాపన చేస్తున్నారే గానీ, నిర్మించే యోచనలో కూటమి ప్రభుత్వం లేదని అక్కడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గేట్ల సంఖ్య పెంపు చెయ్యేరుకు వందేళ్లలో ఒకసారి గరిష్ఠంగా 2.40 లక్షల క్యూసెక్కులు, 200 ఏళ్లకు ఒకసారి గరిష్టంగా 2.80 లక్షల క్యూసెక్కుల వరద వస్తోందని అఽధికారులు అంచనా వేశారు. 140 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా అన్నమయ్య ప్రాజెక్టుకు 3.20 లక్షల క్యూసెక్కుల వరద నీరు చేరి 2021 నవంబరు, 19న తెగిపోయింది. ఈ నేపథ్యంలో నాలుగు లక్షల క్యూసెక్కుల కంటే ఎక్కువ వరద వచ్చినా సులభంగా దిగువకు విడుదల చేసేలా స్పిల్వే నిర్మించాలని అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జల వనరులశాఖ అఽధికారులు అన్నమయ్య ప్రాజెక్టు రీడిజైన్ చేశారు. ఐదే గేట్లుగా ఉన్న అన్నమయ్య ప్రాజెక్టును 14 గేట్లుగా నిర్మించాలని సంకల్పించారు. టీడీపీ నిర్లక్ష్యం 2012లో జలవనరులశాఖ 3డీ అధ్యయనంలో అన్నమయ్య ప్రాజెక్టు స్పిల్వే నుంచి గరిష్ఠంగా 2.17 లక్షల క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేయవచ్చని నివేదికలు ఇచ్చారు. 2017లో ప్రాజెక్టును తనిఖీ చేసిన డ్యాం సేఫ్టీ కమిటీ 1.30 లక్షల క్యూసెక్కుల వరదను దిగువకు విడుదల చేసేలా అదనంగా మరో స్పిల్ వే నిర్మించాలని ఇచ్చిన నివేదికను అప్పటి టీడీపీ సర్కార్ పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో 2021 నవంబరు, 16, 17, 18, 19 తేదీల్లో శేషాచలం–నల్లమల అడవులు, చెయ్యేరు, బాహుదా, మాండవ్య పరిసర ప్రాంతాల్లో కుంభవృష్టి కురిసింది. ఈ నేపథ్యంలో నవంబరు 17న అన్నమయ్య ప్రాజెక్టులో సగటున 1.77 టీఎంసీలు నిల్వచేస్తూ వచ్చిన వరదను వచ్చినట్లుగా దిగువకు వదిలారు. 18వ తేదీ రాత్రి 8 గంటలకు 77.125 క్యూసెక్కులకు చేరడంతో దిగువకు 1,09,124 క్యూసెక్కుల నీటిని వదలారు. అదే రోజున రాత్రి 10 గంటలకు ప్రాజెక్టు గేట్లను పూర్తిగా ఎత్తివేసి 1,46,056 క్యూసెక్కుల నీటిని దిగువకు పంపారు. 19వ తేదీ అర్ధరాత్రి ఊహించని పరిణామాలు ఎదురై 3.20 లక్షల క్యూసెక్కుల నీరు రావడంతో నీటిమట్టం గరిష్ఠ స్థాయికి చేరింది. సామర్థ్యం చాలక మట్టి కట్టపై నుంచి దిగువకు వరద నీరు చేరింది. దీంతో 19వ తేదీ ఉదయం 6.30 గంటలకు అన్నమయ్య ప్రాజెక్టు మట్టికట్ట తెగిపోయింది. అదే అప్పటి టీడీపీ ప్రభుత్వం అదనంగా స్పిల్వే నిర్మించి ఉంటే ప్రాజెక్టు తెగిపోకుండా ఉండేది. ఆ నిర్లక్ష్యం వల్లే ప్రాజెక్టు తెగిపోవడం జరిగిందని నిపుణులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం అన్నమయ్య ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు కమిటీ ఏర్పాటుచేసింది. ఇన్వెస్టిగేషన్, డిజైన్ వర్క్ చేపట్టాల్సి ఉంది. కమిటీ అంచనాల మేరకు ప్రాజెక్టు రూపకల్పన జరుగుతుంది. ప్రస్తుతమున్న విధానాన్ని కొనసాగించే అవకాశం కనిపించడంలేదు. కమిటీ నిర్ణయించిన తర్వాత ప్రాజెక్టు నిర్మాణం చేపట్టేందుకు చర్యలు తీసుకుంటాం. – అబ్దుల్షమీ, ఎస్ఈ, నీటిపారుదలశాఖ, కడప -
ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న ప్రతిభావంతులైన విద్యార్థులను ప్రోత్సహించడమే ఎన్ఎంఎంఎస్ పరీక్ష ఉద్దేశ్యమని పాఠశాల విద్య ఆర్జేడీ శామ్యూల్, డీఈఓ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. కడప ఆర్జేడీ కార్యాలయంలో జన విజ్ఞాన వేదిక రాష్ట్ర కమిటీ అధ్యక్షుడు కేఎస్.లక్ష్మణరావు రూపొందించిన ఎన్ఎంఎంఎస్ పరీక్ష స్టడీ మెటీరియల్ను వారు గురువారం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆర్జేడీ మాట్లాడుతూ స్టడీ మెటీరియల్ విద్యార్థులకు మరింత మార్గదర్శకంగా ఉంటుందని, ఇలాంటి సేవాకార్యక్రమాలు నిర్వహించడం ప్రశంసనీయమని అన్నారు. డీఈఓ మాట్లాడుతూ ఎన్ఎంఎంఎస్ పరీక్షలో మెరుగైన ఫలితాలను సాధించేందుకు మెటీరియల్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందన్నారు. విద్యా ప్రేరణాత్మక కార్యక్రమాల్లో భాగంగా విద్యార్థులకు పుస్తకాలను పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజా, జేవీవీ నాయకులు రాహుల్, సమీర్ బాషా, శివరాం, సరస్వతి, జీసీడీవో దార్ల రుతుఆరోగ్యమేరీ, నర్సింహారెడ్డి, వెంకటేశ్వర్లు, తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలు
ఎంపికై న అండర్–14, 17 బాలుర జట్టు ఎంపికై న అండర్–14, 17 జిల్లా స్థాయి బాలికల జట్లు కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో గురువారం ఎస్జీఎఫ్ బ్యాడ్మింటన్ పోటీలు గురువారం ముగిశాయి. ఎస్జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, బ్యాడ్మింటన్ అంతర్జాతీయ అంపైర్ జిలానీబాషా విలేకరులతో మాట్లాడుతూ అండర్–14, అండర్–17 విభాగంలో జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ జట్టుకు ఎంపికలు నిర్వహించామని, సుమారు 250కి పైగా క్రీడాకారులు హాజరయ్యారన్నారు. మండల, నియోజకవర్గ స్థాయిలో ఎంపికలు జరిపిన అనంతరం జిల్లాస్థాయి పోటీలకు పంపించడం జరిగిందన్నారు. అన్ని నియోజకవర్గాల నుండి విచ్చేసిన బాలబాలికలకు విడివిడిగా పోటీలు నిర్వహించి ప్రతి కేటగిరీకి ఐదుగురు చొప్పున ఎంపికచేశామన్నారు. జిల్లా స్థాయికి ఎంపికై న వారిని నవంబర్ 5, 6వ తేదీలలో తిరుపతిలో జరిగే అండర్–17, నవంబరు 25, 26వ తేదీలలో గన్నవరంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు పంపుతున్నామని తెలిపారు. ఎంపికై న క్రీడాకారులకు కడప, ప్రొద్దుటూరు సెంటర్లలో శిక్షణ ఇప్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. జిల్లా స్థాయి బ్యాడ్మింటన్కు ఎంపికై న క్రీడాకారుల వివరాలు ఇలా ఉన్నాయి. అండర్–17 బాలుర జట్టు : జి.వేదవ్యాసశర్మ, ఎస్.అమానుల్లాఖాన్, ఎల్.సుప్రీత్రెడ్డి, సి.త్రివిక్రమ్, డి.విశ్వనాథ్ అండర్–17 బాలికల జట్టు : ఎం.రమ్యశ్రీ, బి.హరిణి, లలితాబాయ్, కె.ప్రణవి, కె.శ్రీశరణ్య, బి.భార్గవి అండర్– 14 బాలుర జట్టు : డి.ఈశ్వర్ప్రసాద్రెడ్డి, ఏఎస్.ఆదినారాయణరెడ్డి, ఎం.ఆదిత్య, జె.శ్రీకర్రెడ్డి, పిబిజి.వర్షిత్ అండర్–14 బాలికల జట్టు : ఎల్.పూర్వజ, వి.శ్రీకావ్య, జి.ఆరాధ్య, ఎస్.శృతిక, కె.హ్రితిక -
నాలుగు రోజులుగా రాకపోకలు బంద్
బి.కోడూరు : మండలంలోని మేకవారిపల్లె చిన్నచెరువు అలుగు ఉద్ధృతంగా ప్రవహిస్తుండటంతో నాలుగు రోజులుగా రాకపోకలు నిలిచిపోయాయి. వివిధ పనుల నిమిత్తం బి.కోడూరు మండల కేంద్రం, సిద్ధయ్యగారి మఠం, బ్రహ్మంగారిమఠానికి జనం రాకపోకలు సాగించలేకపోయారు. కొందరు బి.కోడూరుకు చేరుకుని 15 కిలోమీటర్ల మేర తిరిగి సిద్దయ్యగారిమఠం, బ్రహ్మంగారిమఠానికి వెళ్తున్నారు. మేకవారిపల్లె చిన్న చెరువు అలుగు వద్ద పైపులు వేసి కల్వర్టు నిర్మించి ఉంటే ఇబ్బందులు ఎదురయ్యేవికాదని మండల వాసులు తెలిపారు. సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని మండల వాసులు కోరుతున్నారు. -
వివాహిత ఆత్మహత్య
పీలేరు రూరల్ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణం మోడల్ కాలనీలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. మోడల్ కాలనీకి చెందిన త్రివేణి (25)కి ఏడేళ్ల క్రితం కేవీపల్లె మండలం గోరంట్లపల్లెకు చెందిన సుబ్రహ్మణ్యంతో వివాహమైంది. గత కొంత కాలంగా తన ఇద్దరి పిల్లలతో త్రివేణి స్థానిక మోడల్ కాలనీలో తల్లిదండ్రుల వద్ద ఉంటోంది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం త్రివేణి పురుగుల మందు తాగి ఇంటిలో పడుకుంది. ఆమె నోట్లో నుంచి నురుగు రావడం గమనించి కుటుంబ సభ్యులు చికిత్సనిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఏడుగురిపై కేసు నమోదు
చింతకొమ్మదిన్నె : భూమి అమ్మేస్తామంటూ రూ.60 లక్షలు తీసుకుని మోసం చేశారని బాధితులు కోర్టును ఆశ్రయించడంతో కేసు నమోదు చేసినట్లు చింతకొమ్మదిన్నె ఎస్ఐ శ్రీనివాసులరెడ్డి తెలిపారు. మండలంలోని మామిళ్లపల్లె రెవెన్యూ పొలంలో తమకు సరైన పత్రాలు, హక్కులు లేకున్నా విలువైన భూమి ఉందని కడప నగరానికి చెందిన కొందరు వ్యక్తులు చెప్పారు. దీంతో కడపకు చెందిన పఠాన్ మహబూబ్ఖాన్ ఆ భూమిని కొనేందుకు రూ.60 లక్షలు ఇచ్చారు. అనంతరం వారు భూమిని అమ్మకపోవడంతో మోసపోయానని గ్రహించి కోర్టును ఆశ్రయించారు. కోర్టు ఆదేశాలతో ఏడుగురు వ్యక్తులపై క్రిమినల్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. 20 తులాల బంగారు నగల అపహరణ కమలాపురం : పట్టపగలే దొంగలు ఇంట్లోకి చొరబడి బంగారు నగలను అపహరించారు. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని రెడ్డికాలనీకి చెందిన నీలం పెద్దరెడ్డయ్య తన కుమారుడు చిదంబరంతో కలిసి ప్రొద్దుటూరుకు వెళ్లారు. రెడ్డెయ్య భార్య కింది ఇంటికి వెళ్లింది. ఆమె కళ్లు కప్పి ఇంట్లో వెళ్లిన దుండగులు అల్మారాలో ఉన్న బీగాలు తీసుకుని బీరువా తెరిచారు. అందులో 20 తులాల బంగారు నగలు దోచుకెళ్లారు. అక్కడే ఉన్న రూ.4 వేల నగదు ముట్టుకోలేదు. రాత్రి పెద్దరెడ్డెయ్య వచ్చి చూసుకుని .. బంగారం చోరీ అయినందని తెలుసుకుని పోలీసులకు సమాచారం అందించారు. ప్రతి రూపాయి దాచి పోగుచేసిన డబ్బుతో కొన్న బంగారం దోచుకెళ్లారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. -
జంతువుల కొవ్వు నుంచి ఆయిల్ తయారీ
చింతకొమ్మదిన్నె : మండలంలోని చెర్లోపల్లె జగనన్న కాలనీలో జన నివాసాల వద్ద ఎలాంటి అనుమతులు, లైసెన్సులు లేకుండా జంతువుల కొవ్వు, వ్యర్థాల నుంచి ఆయిల్ తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు సీకే.దిన్నె సీఐ బాలమద్దిలేటి, ఎస్ఐ శ్రీనివాసులురెడ్డి తెలిపారు. ఓ ఇంటిలో షేక్నూర్మహమ్మద్ అనే వ్యక్తి జంతువుల వ్యర్థాలు, కళేబరాలు, కొవ్వు సేకరించి వాటి నుంచి ఆయిల్ తయారు చేస్తున్నట్లు సమాచారం అందింది. ఈ మేరకు చింతకొమ్మదిన్నె పోలీసులు తనిఖీలు చేసి తయారుచేస్తున్న నూనెను స్వాధీనం చేసుకున్నారు. సంబంధిత ఆయిల్, వివిధ రకాల వాడకం కొరకు ఇతర రాష్ట్రాలలో విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. కేసును మరింత లోతుగా, కఠినంగా విచారిస్తే సంచలన విషయాలు బయటపడతాయని సమాచారం. యువకుడి అదృశ్యంపై కేసు నమోదు మైదుకూరు : మైదుకూరు మండలం గుడ్డివీరయ్య సత్రం గ్రామానికి చెందిన శ్రీరాముల వెంకటయ్య అనే యువకుడు కనిపించడం లేదని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లుఅర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. భార్యాభర్తల మధ్య మనస్పర్థల కారణంగా వెంకటయ్య ఇంటి నుంచి వెళ్లిపోయినట్లు సీఐ పేర్కొన్నా రు. యువకుని చెల్లెలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
‘ప్రైవేటీకరణ’రద్దు కోసం పోరాడుతాం
పులివెందుల: రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయాలని చూస్తున్న కూటమి ప్రభుత్వ కుట్రను అడ్డుకునేందుకు ఎంతవరకైనా పోరాటం చేస్తామని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రభు త్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అనేక రకాలుగా నిరసన కార్యక్రమాలు చేశామన్నారు. అందులో భాగంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణకు రాష్ట్ర వ్యాప్తంగా ప్రజల నుంచి విశేషమైన ఆదరణ లభిస్తోందన్నారు. రాష్ట్రంలో దాదాపు జిల్లాకు ఒకటి చొప్పున ఉన్న మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయడాన్ని ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారన్నారు. పేద ప్రజలకు ఉచిత వైద్య, విద్యను దూరం చేయాలనుకోవడం చంద్రబాబు దుర్మార్గపు చర్యకు పరాకాష్టగా చెప్పుకోవచ్చని ధ్వజమెత్తారు. అమరావతి రాజధానికి లక్షల కోట్లు ఖర్చు పెడుతున్న ఈ ప్రభుత్వం కేవలం రూ.5వేల కోట్లు వెచ్చిస్తే మెడికల్ కళాశాలలు పూర్తిస్థాయిలో నిర్మాణాలు పూర్తవుతాయన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు లబ్ధి చేకూర్చేందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని దుయ్యబట్టారు. తుపాన్వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలి రెండు రోజుల క్రితం రాష్ట్రంలో కురిసిన మోంథా తుపాన్వల్ల పంట నష్టం జరిగిన ప్రతి రైతన్నలను ప్రభుత్వం ఆదుకోవాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి డిమాండ్ చేశారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో పంట నష్టం జరిగిన నెలలోపే రైతులకు ప్రభుత్వ సాయం అందేదన్నారు. ఈ ప్రభుత్వంలో ఇప్పటివరకు పంట నష్టపోయిన ఏ రైతులను ప్రభుత్వం ఆదుకోలేదన్నారు. అనంతరం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
‘మోంథా’తో లక్షల ఎకరాల పంట నష్టం
ప్రొద్దుటూరు: రాష్ట్రంలో మోంథా తుపాన్ ప్రభావం కారణంగా 20 లక్షల ఎకరాల్లో పంట నష్టం జరిగి రైతులు తీవ్రంగా నష్టపోయారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన గురువారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడారు. లక్షల సంఖ్యలో రైతులు పంట నష్టాన్ని చవిచూశారన్నారు. ప్రకృతి రైతులపై కన్నెర చేస్తే కూటమి ప్రభుత్వం మాత్రం కళ్లు మూసుకుందని ధ్వజమెత్తారు. వర్షం నీరు రైతుల కన్నీళ్లలో కలిసిపోయాయని, ఇది విచారించదగ్గ విషయమని తెలిపారు. ప్రకృతి వైపరీత్యాలు రావడం ఏ ప్రభుత్వంలో అయినా సహజమని, రైతులను ఆదుకునే ఉదార స్వభావం ప్రభుత్వాలకు ఉండాల్సిన అవసరం ఉందన్నారు. లేకుంటే నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తుందని తెలిపారు. వ్యవసాయం దండగ అని గతంలో అన్న ముఖ్యమంత్రి చంద్రబాబు రైతు ద్రోహిగా రైతుల మనసులో మిగిలిపోయాడ న్నారు. ఈఏడు ఖరీఫ్లో, రబీలో ప్రకృతి వైపరీ త్యాల ప్రభావం కారణంగా పంటలు నష్టపోయినా ప్రభుత్వం ఇసుమంతైనా సాయం చేయలేదని మండిపడ్డారు. ప్రభుత్వానికి ప్రచార యావ తప్ప రైతులను ఆదుకునే మనసు లేదని ధ్వజమెత్తారు. రాష్ట్రంలో సాగు చేసిన వరి, మొక్క జొన్న, పత్తి, మిరప, ఉల్లి, పసుపు లాంటి అన్ని రకాల పంటలు దెబ్బ తిన్నాయని రాచమల్లు పేర్కొన్నారు. సబ్సిడీ శనగలు కూడా ఇవ్వలేదు వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వంలో రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ప్రభుత్వం అన్ని విధాలా సా యం చేసిందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. పంటలకు ఉచిత పంటల బీమా నమో దు చేయడం, ఎరువులు, విత్తనాలు అందించడం, 40 శాతం సబ్సిడీతో శనగలను అందించడం జరిగిందన్నా రు. కూటమి ప్రభుత్వం ఇంతవరకు శనగ విత్తనా లను రైతుల చేతికి అందించలేదన్నారు. 25 శాతం సబ్సిడీతో ఇచ్చేందుకు ఇంకా ప్రణాళికలను తయారు చేసే పరిస్థితుల్లోనే ప్రభుత్వం ఉందన్నారు. సాధారణంగా ప్రతి ఏడాది సెప్టెంబర్ 25 నుంచి అక్టోబర్ 5లోపు సబ్సీడీ విత్తనాలను పంపిణీ చేయాల్సి ఉందన్నారు. జగన్ ప్రభుత్వంలో పంటలు దెబ్బతింటే నెల రోజుల్లోపే రైతులకు పరిహారం అందించే పరిస్థితి ఉండేదన్నారు.మోంథా తుపాన్తో తీవ్రంగా నష్టపోయిన రైతులను ఆదుకునేందుకు ప్రభుత్వం దీనిని జాతీయ విపత్తుగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. కేంద్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలోని ఎంపీల బలంపైనే ఆధారపడి ఉందని, ఎంపీలు రైతులను ఆదుకునేందుకు కేంద్రాన్ని డిమాండ్ చేయాలని కోరారు. ఇప్పటివరకు జరిగిన నష్టాలకుప్రభుత్వం రూపాయి చెల్లించలేదు నష్టాలతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి వస్తోంది మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
అమరవీరుల త్యాగాలు మరువలేనివి
కడప అర్బన్ : శాంతి భద్రతల పరిరక్షణలో ప్రాణాలర్పించిన పోలీసు అమరవీరుల త్యాగాలు వెలకట్టలేనివని జిల్లా ఏఎస్పీ(పరిపాలన) కె.ప్రకాష్ బాబు పేర్కొన్నారు. కడప మహిళా పోలీస్ స్టేషన్ వద్ద అమరవీరుల త్యాగాలను స్మరిస్తూ గురువారం సంగీత కార్యక్రమం నిర్వహించారు. ఏఎస్పీ మాట్లాడుతూ పండగల సమయాల్లో అందరు ఇళ్లలో ఉంటే .... పోలీసులు రోడ్లపై బందోబస్తు విధుల్లో ఉంటారన్నారు. నిరంతరం ప్రజల పరిరక్షణలో ఉంటున్న పోలీసులకు ప్రజలు సహాయ, సహకారాలు అందించాలని కోరారు. ఏఆర్ ఏఎస్పీ బి.రమణయ్య మాట్లాడుతూ పోలీసు శాఖలో విధులు సంక్లిష్టంగా ఉంటాయని, సైనికులు దేశ సరిహద్దుల్లో, పోలీసులు దేశంలోని అంతర్గత శాంతి భద్రతల సంరక్షణ విధులు నిర్వహిస్తూ ప్రజలు ప్రశాంతంగా జీవించేలా కృషి చేస్తున్నారన్నారు. అనంతరం అమరవీరుల త్యాగాలు, వారి సేవలు ప్రజలకు తెలియజేసే విధంగా పోలీసులు బ్యాండ్ షో రూపంలో దేశభక్తి గీతాలు ఆలపించారు. అమరవీరులకు నివాళులర్పిస్తూ రెండు నిముషాలపాటు మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు, మహిళా పోలీస్ స్టేషన్ డీఎస్పీ పి.బాలస్వామిరెడ్డి, పోలీసులు, ప్రజలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో దంపతులకు గాయాలు
మైదుకూరు : మండలంలోపి తిప్పిరెడ్డిపల్లె కొత్తపల్లె సమీపంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో రాజుపాళెం మండల కేంద్రానికి చెందిన భార్యా భర్తలు గాయపడ్డారు. రాజుపాళెం గ్రామానికి చెందిన దాసరి జయరాములు, నాగమునెమ్మ దంపతులు బ్రహ్మంగారిమఠం వెళ్లి స్వామి దర్శనానంతరం తిరిగి మోటార్ బైక్పై గ్రామానికి బయల్దేరారు. టి.కొత్తపల్లె సమీపంలో మైదుకూరు – తాడిచర్ల రహదారిపై బైక్ బోల్తా పడడంతో భార్యాభర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. మైదుకూరు – తాడిచెర్ల రోడ్డు నిర్మాణంలో ఉండడంతో ప్రమాదం జరిగిన చోట రహదారి సక్రమంగా లేకపోవడంతోనే బాధితులు వస్తున్న బైక్ బోల్తా పడినట్లు తెలుస్తోంది. స్థానికులు జయరాములు, నాగమునెమ్మను చికిత్స కోసం 108 అంబులెన్స్లో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్తంభాన్ని ఢీకొని వ్యక్తి మృతి కమలాపురం : మండలంలోని అప్పారావుపల్లె గ్రామానికి చెందిన మూలవిశ్వనాథ్రెడ్డి(45) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. గ్రామస్తుల సమాచారం మేరకు.. అన్నదమ్ములైన మూలచెన్నారెడ్డి, విశ్వనాథరెడ్డి ఘర్షణపడ్డారు. ఒకరిపై మరొకరు దాడి చేసుకున్నారు. ఈ నేపథ్యంలో మద్యంతాగి ఉన్న విశ్వనాథరెడ్డి బైక్లో వెళ్తూ విద్యుత్ స్తంభానికి ఢీ కొన్నాడు. తలకు తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతిచెందినట్లు తెలిపారు. మృతుడికి భార్య భారతి, డిప్లమో చదువుతున్న కుమారుడు యశ్వంత్, టెన్త్ క్లాస్ చదువుతున్న కుమార్తె జాహ్నవి ఉన్నారు. ఎస్ఐ విద్యా సాగర్ను వివరణ కోరగా విద్యుత్ స్థంబానికి బైక్ఢీ కొని మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారని వివరించారు. విచారించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. రైలు కింద పడి వ్యక్తి మృతి కొండాపురం : మండలంలోని పాత కొండాపురానికి వెళ్లే రైల్వే వంతెన సమీపంలో రైలు కింద పడి కె.రామక్రిష్ణయాదవ్(50) మృతి చెందినట్లు యర్రగుంట్ల రైల్వే ఎస్ఐ భాస్కర్రెడ్డి గురువారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. కొండాపురం మండలంలోని డొంకపల్లె గ్రామానికి చెందిన కేసగాని రామక్రిష్ణ యాదవ్ లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బ్యాక్ పెయిన్తోపాటు, సంతానం లేదనే బాధతో మనస్తాపం చెంది రైలు కిండ పడి ఆత్మహత్య చేసుకున్నాడన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. కుక్కల దాడిలో గొర్రెలు మృతి కమలాపురం : మండలంలోని ఎర్రబల్లె కొత్తపల్లె గ్రామం సమీపంలో కుక్కలు దాడి చేయడంతో 15 గొర్రెలు మృతిచెందాయని యజమానులు మల్ల య్య, నాగార్జున ఆవేదన వ్యక్తం చేశారు. ఖాజీపేట మండలం తిప్పాయపల్లె నుంచి జీవనోపాధి నిమి త్తం గొర్రెలు మేపుకోవడానికి కొందరు ఎర్రబల్లె కొత్తపల్లె వద్దకు వచ్చారు. గురువారం తెల్లవారు జామున కుక్కలు దాడి చేసి 15 గొర్రెలను చంపాయి. దీంతో రూ. 1.50 లక్షల నష్టం వాటిల్లిందని, ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. -
అసాంఘిక కార్యకలాపాలపై దృష్టి పెట్టండి
జమ్మలమడుగు : జమ్మలమడుగు సబ్ డివిజన్ పరిధిలో మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్ తరతర అసాంఘిక కార్యకలాపాలు జరుగకుండా చర్యలు చేపట్టాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సూచించారు. జమ్మలమడుగు స్టేషన్ను బుధవారం ఆయన తనిఖీ చేశారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లు, సబ్ డివిజన్లోని సీఐలు, ఎస్ఐలతో ప్రత్యేక సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సబ్ డివిజన్ పరిధిలోని హైవేలపై రాత్రిపూట పెట్రోలింగ్ నిర్వహించాలని, రౌడీషీటర్ల కదలికలపై దృష్టి సారించాలని సూచించారు. కేసులను త్వరగా పరిష్కరించేందుకు సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని సూచించారు. గండికోట వైష్టవి హత్య కేసు గురించి ఆరాతీశారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం ప్రొద్దుటూరు క్రైం: నెల్లూరు జిల్లాలో బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రొద్దుటూరుకు చెందిన బాషా సయ్యద్పాల్ (51), సయ్యద్ ఆసిఫ్ (19) దుర్మరణం చెందారు. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సుమారు 200 కుటుంబాలు ప్రొద్దుటూరులో జీవిస్తున్నాయి. వీరంతా పీఓపీ, గ్లాస్ వర్క్, తదితర పనులు చేకుంటూ సుమారు 20 ఏళ్లుగా ఇక్కడే ఉంటున్నారు. వీరిలో సయ్యద్పాల్ కుమారుడి వివాహం గురువారం పెంచలకోనలో జరుగనుంది. దీంతో బంధువులతో పాటు సయ్యద్పాల్ బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు నుంచి కార్లలో బయలుదేరారు. అనంతసాగరం మండలంఉప్పలపాడు సమీపంలో జాతీయ రహదారిపై ఆగి ఉన్న లారీని ఢీ కొంది. ఈ ఘటనలో సయ్యద్పాల్, సయ్యద్ రఫిలు అక్కడిక్కడే మృతి చెందగా జబిఉల్లా, ఆదిల్పాల్లు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని ఆత్మకూరు జిల్లా ఆస్పత్రికి తరలించారు. కారు బోల్తా పడిన వెంటనే దారిన వెళ్తున్న వ్యక్తులు క్షతగాత్రుల ఫోన్ తీసుకొని బంధువులకు సమాచారం అందించారు. ప్రొద్దుటూరులోని సయ్యద్పాల్ బంధువులు కొందరు గురువారం ఉదయం పెంచలకోనకు వెళ్లాలని భావించారు. ప్రమాద వార్త తెలియడంతో ప్రొద్దుటూరులో ఉంటున్న ఉత్తరప్రదేశ్ వాసులు రోధించసాగారు. పలువురు వారి బంధువులు బుధవారం రాత్రి బయలుదేరి వెళ్లారు. -
రెడ్డి సంఘం జిల్లా మహిళా అధ్యక్షురాలిగా వాసంతి రెడ్డి
ప్రొద్దుటూరు : పట్టణానికి చెందిన కుందుల వాసంతిరెడ్డిని అఖిల భారత రెడ్డి సంఘం మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలిగా సంఘం అధ్యక్షుడు నారుపల్లె జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ సందర్భంగా కందుల వాసంతరెడ్డి మాట్లాడుతూ అఖిల భారత రెడ్డి సంఘం బలోపేతం చేసేందుకు, రెడ్డి మహిళల అభ్యున్నతికి కృషి చేస్తానని పేర్కొన్నారు. యువకుడి ఆత్మహత్యపెద్దతిప్పసముద్రం : మండలంలోని బూర్లపల్లికి చెందిన పీ.సతీష్ కుమార్ (22) ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఇంటి పైకప్పుకు ఉన్న కొక్కీకి ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. మృతుడి తండ్రి వెంకట్రమణ ఫిర్యాదు మేరకు ఎస్ఐ హరిహరప్రసాద్ కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. యువకుడి మృతికి అనారోగ్య సమస్యలా, వేరే ఇతర కారణాలా పోలీసుల విచారణలో వెల్లడి కావాల్సి ఉంది. గంజాయి నిందితుల పట్టివేతపెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులో ఎస్ఐ హరిహరప్రసాద్, సిబ్బంది బుధవారం నాకా బందీ నిర్వహించారు. ఈ నేపథ్యంలో ము గ్గురు యువకులు ద్విచక్ర వాహనంలో వస్తూ పో లీసులను చూసి అనుమానాస్పదంగా తచ్చాడా రు. పోలీసులు సదరు వాహనాన్ని క్షుణంగా తని ఖీ చేయగా సుమారు అరకిలో గంజాయి పట్టుబడినట్లు సమాచారం. కురబలకోట మండలం ముదివేడు సమీపంలోని మట్లివారిపల్లికి చెందిన రాజోళ్ల హరీష్ (29), మదనపల్లిలోని రామారావ్ కాలనీకి చెందిన ఫరూక్(19)లతోపాటు మరో మైనర్ యువకుడు గంజాయి తరలిస్తూ పోలీసులకు పట్టు బడినట్లు తెలుస్తోంది. తహసీల్దారు శ్రీరాములు నాయక్, వీఆర్వో నరేంద్రల సమక్షంలో పోలీసులు పట్టుబడిన గంజాయిని సీజ్ చేసి నిందితులపై కేసు నమోదు చేశారు. బొలెరో వాహనం బోల్తాచిన్నమండెం : మండల కేంద్రంలోని దేవపట్ల క్రాస్రోడ్డు వద్ద బుధవారం తెల్లవారుజామున బొలెరో వాహనం వెనుక టైరు పగలడంతో అదుపు తప్పి బోల్తా పడిందని స్థానికులు తెలిపారు. ఆ సమయంలో అటుగా ఏ వాహనం రాకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. మదనపల్లి వైపు నుంచి కడపకు నారు వేసుకొని వస్తున్న బొలెరో వాహనం దేవపట్ల క్రాస్ రోడ్డు వద్దకు వచ్చేసరికి వెనుకవైపు టైర్ పగిలి అదుపు తప్పింది. ఎవరికీ చిన్నగాయాలు కూడా కాలేదు. వర్షానికి కూలిన ఇల్లు జమ్మలమడుగు: మోంథా తుపాను ప్రభావంతో పెద్దముడియం మండలం పాలూరు గ్రామంలో కాచన రమణారెడ్డి, పుల్లమ్మ నివాసం ఉన్న ఇల్లు కూలిపోయింది. చౌడుమిద్దె కావడంతో మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి తడిసింది. ఒక్కసారిగా ఆర్థరాత్రి సమయంలో ఇల్లు కూలింది. అయితే రమణారెడ్డి, పుల్లమ్మ ఇంట్లో కాకుండా సోఫాలు నిద్రించడంతో ప్రాణాలతో బయటపడ్డారు. కూలిన శబ్దం కావడంతో స్థానికులు వచ్చి భార్య, భర్తలను క్షేమంగా బయటికి తీసి సురక్షిత ప్రాంతానికి తరలించారు. -
ఆస్తి ఇవ్వలేదనే తండ్రి, పిన్ని హత్య
● ఆన్లైన్ గేమ్లతో చేసిన అప్పు తేర్చలేక తనయుడి ఘాతుకం ● విలేకరులతో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్జమ్మలమడుగు : ఈనెల 26వ తేదీన మండలంలోని మోరగుడిలో జరిగిన నాగప్ప, పెద్దక్కల హత్య కేసును పోలీసులు చేధించారు. ఆన్లైన్ గేమ్లకు అలవాటు పడి చేసిన అప్పులు తీర్చేందుకు ఆస్తి ఇవ్వలేదనే కోపంతో కుమారుడు కుడేటి వెంకటేస్ తన తండ్రి, పిన్నిలను హతం చేసినట్లు విచారణలో తేల్చారు. స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హత్య వివరాలు వెల్లడించారు. నాగప్ప కుమారుడు కుడేటి వెంకటేష్ స్థానిక ఆసుపత్రిలో కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తున్నాడు. ఆన్లైన్లో క్యాషినో గేమ్స్ ఆడి విపరీతంగా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చుకునేందుకు ఆస్తులు పంచాలంటూ తండ్రి నాగప్పను కోరాడు. ఆన్లైన్ గేమ్లు ఆడితే నేను అప్పులు తీర్చాలా.. ఇచ్చేది లేదంటూ ససేమిరా అన్నారు. పిన్ని పెద్దక్క కూడా తాము కష్టపడి సంపాదించుకున్నది.. నీకు ఇచ్చే ప్రసక్తే లేదని తేల్చి చెప్పారు. ఇది మనసులో పెట్టుకున్న వెంకటేష్ కోపంతో ఊగిపోయాడు. ఇద్దరినీ హతమార్చాలని ముందస్తు ప్రణాళిక చేసుకున్నాడు. శనివారం రాత్రి నాగప్ప, పెద్దక్క ఒకేచోట నిద్రిస్తున్నారు. ఈ సమయంలో పట్టుడు కట్టెతో ఇద్దరినీ దారుణంగా కొట్టి హతమార్చాడు. కేసును నీరు కార్చేందుకు మిరపపొడి చల్లి.. ఇంటి తలుపులు, బీరువా తాళాలు పగులగొట్టాడు. బాధితుల ఫిర్యాదుతో పోలీసులు కేసును ఛాలెంజ్గా తీసుకుని తక్కువ రోజుల్లోనే చేధించారు. విచారణలో తండ్రి, పిన్నిలను హతమార్చానని కుమారుడు వెంకటేష్ తెలిపినట్లు ఎస్పీ వెల్లడించారు. కేసు చేధించినందుకు సీఐ నరేష్బాబు, ఎస్ఐలు రామకృష్ణ, హైమావతిలతోపాటు, కానిస్టేబుల్ నాగేంద్ర, కృష్ణారెడ్డి, మహేష్, గంగాధర్, సుధాకర్ సురేష్ ,ప్రవీణ్లకు ఎస్పీ రివార్డు ప్రకటించారు. నిందితుడు వెంకటేష్కు రిమాండ్కు తరలిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ వెంకటేశ్వర్లు పాల్గొన్నారు. -
యూనిట్ లీడర్కు ఉత్తమ పురస్కారం
కడప ఎడ్యుకేషన్ : రోబోటిక్స్, ఏఐ, స్టెమ్, యుఈపీపై భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జాతీయ కార్యాలయం ఏర్పాటుచేసిన వర్క్ షాప్లో కడప జిల్లాకు చెందిన యూనిట్ లీడర్ అహమ్మద్ సగినాల ప్రతిభ చూపారు. కర్ణాటక రాష్ట్రం దక్షిణ కన్నడ జిల్లాలోని ఆళ్వాస్ విద్యా సంస్థలో జరిగిన ఈ కార్యక్రమంలో దేశ వ్యాప్తంగా పలువురితో పోటీపడి అహమ్మద్ ప్రతిభ చూపించి విజయం సాధించారు. జాతీయ కార్యాలయ గౌరవ అతిథులు మధుసూదన్ ఆవల, షిండీయ, అనలేంద్ర శర్మ, కృష్ణస్వామి, ప్రతిమాకుమార్, ఛటర్జీ, భారత్రాజ్ ఎంపీ కెప్టెన్ బ్రిజేష్చౌటా, ఆళ్వాస్ సంస్థల అధినేత మోహన్ఆళ్వా, వివేక్ ఆళ్వా, ప్రభాకర్ భట్టు చేతుల మీదుగా అహమ్మద్ ఉత్తమ పురస్కారం అందుకున్నారు. వీలునామా ప్రకారమే మఠాధిపతిని నియమించాలి కడప రూరల్ : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి వీలునామా ప్రకారమే మఠాధిపతిని నియమించాలని వీర బ్రహ్మేంద్రస్వామి ప్రచార పరిషత్ వ్యవస్థాపక అధ్యక్షుడు ఆలెపు శ్రీనివాసులు అన్నారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి 420 ఏల్ల సుదీర్ఘ చరిత్ర ఉందన్నారు. విశ్వ గురువుగా, కాలజ్ఞాన రచయితగా భగవంతుని స్వరూపంగా స్వామి కొలువబడుతున్నారని పేర్కొన్నారు. అలాంటి పవిత్ర మఠంలో మఠాధిపతి నియామకంలో అలజడులు జరగడం తగదన్నారు. దివంగత వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి వీలునామా ప్రకారం గోవిందస్వామి మఠాధిపతిగా అర్హుడని అభిప్రాయపడ్డారు. ఈయనకు మఠం సంప్రదాయాలు, పద్ధతులు తెలుసనన్నారు. గోవిందస్వామి మాట్లాడుతూ వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి తనకు వేదాలు నేర్పేవారని, కాలజ్ఞానం గురించి బోధించేవారని తెలిపారు. తాను వీరభోగ వెంకటేశ్వరస్వామి ఆశీస్సులతో ధర్మపరిరక్షణకు కట్టుబడి ఉన్నట్లు తెలిపారు. చీటింగ్ కేసు నమోదు కడప అర్బన్: కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉంటున్న దంపతులు తనకు స్థలం ఇప్పిస్తామని రూ.54 లక్షలను తీసుకుని మోసం చేశారని భాగ్యనగర్ కాలనీకి చెందిన శివరామిరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు.. రామచంద్రారెడ్డి, శ్యామల దంపతులు బాధిత ఉద్యోగి శివరామిరెడ్డికి స్థలం ఇప్పిస్తామంటూ 54 లక్షల తీసుకున్నారు. ఇప్పటివరకూ బదులీయకపోవడంతో.. మోసం చేశాడని గ్రహించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తున్నారు. -
నియమ, నిష్టలకే.. అయ్యప్ప అనుగ్రహం
కడప సిటీ : నియమ, నిష్టలతో అయ్యప్ప మాల ధరించి శబరిమల యాత్ర చేస్తే అయ్యప్ప అనుగ్రహం కలుగుతుందని భక్తుల నమ్మకం. ఏటా కార్తిక మాసం ఆరంభం నుంచే అయ్యప్ప స్వాములు మాలధారణ ప్రారంభించి 41 రోజులు మండల దీక్ష.. ఆపై ఇరుముడితో శబరిమల అయ్యప్పస్వామిని దర్శించుకోవడం ఆనవాయితీగా వస్తోంది. గురుస్వామి మార్గదర్శనం ఇందులో ప్రత్యేకం. భక్తులు మాలధారణ చేసిన తరువాత మనసు, మాట, శరీరం పవిత్రతను కాపాడాలి. రోజూ స్వామియే శరణం అయ్యప్పా శరణు ఘోష చెప్పాలి. ఉపవాసం, అహింస, మద్యపానం, మాంసాహారం, పొగత్రాగడం పూర్తిగా నిషేధించడమేగాక, సాత్విక ఆహారం మాత్రమే తీసుకోవాలి (ఉదా: పాలు, పండ్లు, ఆకు కూరలు మొదలైనవి.). మాలధారణ కాలంలో బ్రహ్మచర్యం పాటించి.. నిత్యం ఉదయం, సాయంత్రం స్నానం చేయాలి. దీపం వెలిగించి, అయ్యప్ప స్తోత్రాలు నిష్ఠతో పఠించాలి. గుడిలో జరిగే పడిపూజ, అంబులం పూజ, మండల పూజ, గ్రామోత్సవం వంటి కార్యమాలలో విరివిగా పాల్గొనాలి. గురుస్వామి పాత్ర అయ్యప్ప మాలధారణలో గురుస్వామికి ప్రత్యేకత ఉంటుంది. భక్తులను సరైన మార్గంలో నడిపించే ఆధ్యాత్మిక మార్గదర్శకుడు ఆయన. భక్తులకు అయ్యప్ప మాలధారణ, నియమాలు, ఆచారాలు ఎలా పాటించాలో బోధిస్తాడు. మాలధారణలో సహాయం చేసి మాలను భక్తుడిచే ధరింపజేస్తాడు. స్వామియే శరణం అయ్యప్పా అని జపం చేయిస్తాడు. 41 రోజుల నియమాలు ఎలా పాటించాలో, ఏవి చేయకూడదో వివరిస్తాడు. తన శిష్యుల ఆచరణ, ఆలోచన, నడవడిని పరిశీలించి పవిత్రత కాపాడేలా చేస్తాడు. శబరిమల యాత్రలో గురుస్వామి బృందానికి నాయకుడై మార్గం చూపుతూ అన్ని పూజలు, ఆచారాలు నిర్వహిస్తాడు. అనుభవజ్ఞుడైన ఆయన భక్తులకు ఆధ్యాత్మిక ధైర్యం, శాంతి, సహనం నేర్పిస్తాడు. యాత్ర పూర్తయ్యాక మాలను తీసేయడానికి గురుస్వామి సహకారం అవసరం ఉంటుంది. అయ్యప్ప స్వామి అనుగ్రహం మాలధారణ చేసిన తర్వాత 41 రోజుల మండల దీక్ష నిష్టగా, భక్తిగా పూర్తి చేసిన భక్తుడు ఆధ్యాత్మికంగా పవిత్రుడవుతాడు, మనసు, శరీరం, ఆత్మ శుద్ధి చెందుతుంది, అయ్యప్ప స్వామి అనుగ్రహం పొందుతాడని, దీక్షను సచ్చ్ఛిదానందంగా పాటించిన వారికి అంతరంగ శాంతి లభిస్తుందని, పూర్వ జన్మ పాపాలు, చెడు అలవాట్లు తొలగి కొత్త జీవితం మొదలవుతుందని భక్తులు నమ్ముతారు. సాత్విక జీవన విధానం వల్ల శారీరకంగా ఆరోగ్యవంతులవుతారు. అయ్యప్ప స్వామి దృష్టి కరుణ పడితే, జీవితంలో శుభం, సౌఖ్యం, విజయాలు లభిస్తాయని, బ్రహ్మచర్యం, ఉపవాసం, సత్యం పాటించడం వల్ల మనసు స్థిరమవుతుంతని, మండల దీక్షను పూర్తిగా పాటించడంతో ఆత్మవిశ్వాసం, ధైర్యం పెరుగుతాయని చెబుతారు. అయ్యప్ప స్వామిని స్మరించుకుంటూ జీవించినవారికి మోక్ష మార్గం కలుగుతుంది. పెద్దపాదం విశిష్టత నిజమైన భక్తి, నియమం, వినయం కలిగిన వారికి నా కృప తప్పక లభిస్తుంది. పెద్దపాదం అనేది శబరిమల అయ్యప్ప స్వామి యాత్రలో అత్యంత పవిత్రమైన మరియు చారిత్రాత్మక ప్రదేశం. ఇది అయ్యప్ప స్వామి యాత్రికులు దివ్య దర్శనానికి వెళ్ళే మార్గంలో ఉండే ఒక ఆధ్యాత్మిక స్థలం. పెద్దపాదం అంటే అయ్యప్ప స్వామి అడుగుల ముద్రలు ఉన్నాయని భక్తుల నమ్మకం. ఈ ప్రదేశాన్ని చేరి భూమిని నమస్కరిస్తారు. ఈ ప్రదేశం చేరుకునే వరకు భక్తులు కష్టమైన అరణ్య మార్గాలు, పర్వత మార్గాలు దాటి వెళ్తారు. అది వారి భక్తి, ధైర్యం, సహనానికి పరీక్షగా భావిస్తారు. పెద్దపాదం వద్ద స్వామిని ధ్యానిస్తూ భక్తులు మోక్షం కోసం ప్రార్థిస్తారు. అక్కడి వాతావరణం ప్రశాంతంగా, ఆధ్యాత్మికంగా ఉంటుంది. శబరిమల యాత్ర ఇలా.. పెద్దపాదం మీదు అయ్యప్ప దర్శనానికి వెళ్లే వారంతా ముందుగా అయ్యప్ప యాత్ర ప్రారంభ స్థానం ఎరుమేలి చరుతారు. ఇక్కడ పెట్టా తుల్లల్ పూజ, నృత్యం చేస్తారు. తరువాత పాదయాత్ర మొదలవుతుంది. అరణ్యమార్గం పెరియ మీదుగా భక్తులు స్వామి పేరు జపిస్తూ నడుస్తారు. కఠినమైన పర్వతం కరిమల ఎక్కడం భక్తులకు నిజమైన పరీక్ష. అనంతరం పంపా చేరుకుని నదీ స్నానం చేస్తారు. అక్కడి నుంచి సన్నిధానం వైపు ఎక్కే దారిలో పెద్దపాదం వస్తుంది. ఇక్కడ భక్తులు దీపం వెలిగించి దేవుడిని ప్రార్థిస్తారు. మోకాళ్లపై కూర్చుని పూజచేస్తారు. అనంతరం అయ్యప్ప ఆలయానికి చేరి స్వామియే శరణం అయ్యప్పాఅంటూ దర్శనం పొందుతారు.కార్తీక మాసం ఆరంభం నుంచి మాలధారణపవిత్రతతో ఉన్నప్పుడే ఫలితం 35 సంవత్సరాల నుంచి అయ్యప్ప మాల ధారణ చేస్తున్నా. నియమ, నిష్టలతో దీక్ష పూర్తి చేసినపుడు అయ్యప్ప స్వామి అనుగ్రహం, ఫలితం లభిస్తుంది. నేను ప్రస్తుతం కడప హోసింగ్ బోర్డు కోదండరామాలయం ధర్మకర్తగా కొనసాగుతున్నా. 2010 సంవత్సరం నుంచి క్రమం తప్పకుండా మండలం కాలంపాటు కడప నగరం హొసింగ్ బోర్డు కాలనీలోని కోదండరామాలయంలో అన్నదానం నిర్వహిస్తున్నాం. రోజు మధ్యాహ్నం అన్నదానం(బిక్ష) ఉంటుంది. – దేసు వేంకటరెడ్డి, గురుస్వామి, హౌసింగ్బోర్డు కాలనీ, కడప -
జిల్లా మార్చురీ వద్ద ఉద్రిక్తత
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిలోని మార్చురీ వద్ద బుధవారం ఉద్రిక్తత నెలకొంది. పిల్లల పేరుతో ఆస్తి రాయించాలంటూ మృతదేహాన్ని తీసుకెళ్లకుండా మృతురాలి బంధువులు అడ్డుకున్నారు. ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామానికి చెందిన వివాహిత సునీత మంగళవారం సాయంత్రం విద్యుత్ షాక్తో మృతిచెందింది. ఆమెకు ఇద్దరు పిల్లలు కావ్య, హరినాథ్ ఉన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రిలోని మార్చురీకి తరలించారు. సునీత అమ్మగారి ఊరు మైదుకూరు మండలంలోని తిప్పిరెడ్డిపల్లె. సునీత మృతదేహాన్ని చూసేందుకు గ్రామస్తులందరూ జిల్లా ఆస్పత్రి వద్దకు వచ్చారు. సునీత భర్త శ్రీకాంత్కు కొంతమేర పొలం ఉంది. పొలాన్ని పిల్లల పేరుతో రాయించాలని సునీత తరపు బంధువులు అడిగారు. ఈ క్రమంలోనే వారి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. పోస్టుమార్టం తర్వాత మృతదేహాన్ని తీసుకెళ్లకుండా తిప్పిరెడ్డిపల్లె వాసులు అడ్డుకున్నారు. పోలీసులు నచ్చ చెప్పినా మహిళలందరూ వాహనానికి అడ్డుగా నిల్చున్నారు. రూరల్ ఎస్ఐ రాజు, టూ టౌన్ ఎస్ఐ రాఘవేంద్రారెడ్డితోపాటు పోలీసులు ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. చివరకు పిల్లల పేరుతో పొలం రాయిస్తున్నట్లు తండ్రి శ్రీకాంత్ అగ్రిమెంట్ రాయడంతో సునీత బంధువులు శాంతించారు. అనంతరం సునీత మృతదేహాన్ని చౌడూరుకు తీసుకెళ్లి అంత్యక్రియలు నిర్వహించారు.మృతదేహాన్ని తీసుకెళ్లకుండా అడ్డుకున్న బంధువులు -
వ్యక్తి ఆత్మహత్య
చక్రాయపేట: మండలంలోని పోలిశెట్టిపల్లెకు చెందిన మాచనబోయిన సిద్ధయ్య(50) బుధవారం ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామస్థులు, బంధువుల కథనం మేరకు సిద్ధయ్య గత కొంత కాలంగా ఆర్థిక సమస్యలతో ఇబ్బంది పడుతున్నారు. దీనికి తోడు ఆస్తి తగాదాలు, కుటుంబ కలహాలు ఉండడంతో శరీరంపై పెట్రోల్ పోసుకొని నిప్పంటించుకున్నాడు. ఈ విషయాన్ని గుర్తించిన గ్రామస్థులు వెంటనే సిద్ధయ్యను నాగలగుట్టపల్లెకు తీసుకొచ్చి ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం కడప రిమ్స్కు తరలించగా చికిత్స పొందుతూ అక్కడ మృతి చెందినట్లు వారు తెలిపారు. సిద్ధయ్య భార్య కూడా ఏడాది క్రితం ఆత్మహత్య చేసుకుంది. విద్యుత్ షాక్తో ఒకరు మృతి లింగాల : మండలంలోని దొండ్లవాగు గ్రామంలో విద్యుత్ షాక్కు గురై గొడ్డలి వెంకట్రాములు (60) బుధవారం మృతిచెందాడు. ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం ఉదయం వెంకట్రాములు తన ఇంటిలో విద్యుత్ స్విచ్ బోర్డు మరమ్మతులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందారు. అతడకి భార్య, కుమారుడు ఉన్నారని తెలిపారు. వెంకట్రాములు మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి భౌతికకాయాన్ని కుటుంబ సభ్యులకు అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
భక్తుల మనోభావాలకు ఇబ్బంది కల్గించవద్దు
బ్రహ్మంగారిమఠం : పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి నివసించిన నివాసం భారీ వర్షాలకు కూలిపోయింది. భక్తుల మనోభావాలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా మరో ఐదు నెలల్లో పూర్తిస్థాయి నిర్మాణాలు చేపడతామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. బుధవారం రాత్రి ఎనిమిది గంటల ప్రాంతంలో ఆయన బ్రహ్మంగారి నివాసాన్ని బద్వేల్ ఆర్డీవో చంద్ర మోహన్తో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కొంత మఠం నిర్వాహకుల నిర్లక్ష్యం ఉన్నట్లు తెలుస్తోందని తెలిపారు. బ్రహ్మంగారు నివాసం ఉన్న చోట ఒకవైపు మాత్రమే మిద్దె కూలిపోయిందని.. మరోవైపు బాగానే ఉందన్నారు అయితే భక్తుల సౌకర్యం కోసం పూర్తిస్థాయిలో నిర్మాణాలు చేపట్టి భక్తులకు అందుబాటులో తేవాలని ఆదేశిస్తున్నట్లు తెలిపారు ఈ కార్యక్రమంలో తహసీల్దారు కార్తీక్, ఎంపీడీవో రామచంద్రారెడ్డి, ఎండోమెంట్ ఏసీ మల్లికార్జునప్రసాద్, మఠం మేనేజర్ ఈశ్వరాచారి, దేవాదాయ శాఖ ఇంజినీర్లు పాల్గొన్నారు.కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వైవీయూలో జార్ఖండ్ టస్సర్ సిల్క్ పట్టు పురుగు
కడప ఎడ్యుకేషన్ : జార్ఖండ్ రాష్ట్రంలో కనిపించే టస్సర్ సిల్క్ పట్టు పురుగులు వైవీయూలో బుధవారం కనిపించాయి. వైవీయూ పరిశోధకులు నల్లమల, లంకమల అడవులలో పెరిగే వృక్ష జాతులను సేకరించి క్యాంపస్లో పెంచుతున్న విషయం అందరికీ తెలిసిందే. వీటిలో టెర్మినాలియా ఎలిపికా, టెర్మినాలియా అర్జునా వంటి వృక్ష జాతులు ఉన్నాయి. టెర్మినాలియా జాటి చెట్లపై టస్సర్ సిల్క్ పట్టు పురుగులు(ఆంథిరా మిల్లిగా)జీవిస్తున్నాయి. ఇవి ఎక్కువగా జార్ఖండ్ అడవులలో కనిపిస్తాయి. ఈ టస్సర్ సిల్క్ పట్టు పురుగును పర్యావరణశాఖ విద్యార్థులు సేకరించారు. ఈ పురుగులు 300–500 గ్రుడ్లును పెట్టి అంతరించిపోతాయని, ఆ తరువాత గ్రుడ్ల నుంచి లార్వా, ప్యూప, కక్కూన్ దశలు ఉంటాయని విద్యార్థులు తెలిపారు. -
జిల్లా వ్యాప్తంగా వర్షాలు
కడప అగ్రికల్చర్ : మోంఽథా తుపాన్ కారణంగా మంగళవారం ఉదయం నుంచి బుధవారం వరకు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిశాయి. ● నీట మునిగిన రైతన్నల ఆశలు ● జిల్లావ్యాప్తంగా 1233 హెక్టార్లలో ఉద్యాన పంటలకు నష్టం ● 4378.23 హెక్టార్లలో వ్యవసాయ పంటలకు నష్టం కడప అగ్రికల్చర్ : మోంఽథా తుపాన్ జిల్లా రైతులను ముంచేసింది. రైతన్నల ఆశలపై నీళ్లు చల్లింది. పంట సాగుకోసం శ్రమటోడ్చిన అన్నదాతలకు చివరికి కన్నీరే మిగిల్చింది. ఎడతెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రైతుల పంటలన్నీ నీటిలో తేలియాడుతున్నాయి. చేతికొచ్చిన పంట వర్షపు నీటిలో నానుతుండడం చూసి రైతన్నలు కన్నీటి పర్యంతమయ్యా రు. జిల్లాలో వరితోపాటు ప్రధాన పంటలన్నీ పూర్తి గా కోల్పోయి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మోంథా తుపాన్కంటే ముందు కురిసిన తుఫాన్ వర్షాలకు కూడా జిల్లావ్యాప్తంగా దాదాపు 8 వేల ఎకరాల్లో పత్తి, మినుము, వేరుశనగ, మొక్కజొన్న, వరి పంటలు దెబ్బతిన్నాయి. ఆ నష్టం మరువకముందే మళ్లీ మోంథా తుఫాన్ జిల్లాలోని వ్యవసాయ పంటలతోపాటు ఉద్యాన పంటలకు సంబంధించి 5611. 33 హెక్టార్లలో నీట ముంచి రైతన్నలకు భారీ నష్టం మిగిల్చింది. వరుస వానలతో జిల్లాలో కొన్ని ప్రాంతాలు ప్రజలు నీలవ నీడ కూడా కోల్పోయారు. ఉద్యాన పంటలకు సంబంధించి... మోంథా తుపాన్ వల్ల జిల్లాలో 73 రైతు సేవా కేంద్రాల పరిధిలోని 2088 మంది రైతులకు సంబంధించి 1233.1 హెక్టార్లలో ఉల్లి, కూరగాయలు, పూల తోటలు దెబ్బతిన్నాయి. ఇందులో బి.మఠం మండలంలో 110 మంది రైతులు 70.2 హెక్టార్లలో, కలసపాడు మండలంలో 66 మంది రైతులకు సంబంధించిన 36.5 హెక్టార్లలో, పోరుమామిళ్ల మండలంలో 38 మంది రైతులకు సంబంధించి 20.4 హెక్టార్లలో, కాశినాయనలో 218 మంది రైతులకు సంబంధించి 140 హెక్టార్లలో, బి. కోడూరులో 24 మంది రైతులకు సంబంధించి 8 హెక్టార్లలో, సిద్దవటంలో 74 మంది రైతులకు సంబంధించి 74 హెక్టార్లలో, మైదుకూరు లో 871 మంది రైతులకు సంబంధించి 506 హెక్టార్లలో, దువ్వూరులో 639 మంది రైతులకు సంబంధించి 380 హెక్టార్లలో, ఖాజీపేటలో 41 మంది రైతులకు సంబంధించి 20 హెక్టార్లలో, వల్లూరులో 7 మంది రైతులకు సంబంధించి 4 హెక్టార్లలో ఉల్లి, కూరగాయల పంటలు, పూలతోటలు దెబ్బతిన్నట్లు ఉద్యాన అధి కారులు నష్టాన్ని అంచనాన్ని తయారు వేశారు. వ్యవసాయ పంటలకు సంబంధించి.. జిల్లాలో 4378.23 హెక్టార్లలో వ్యవసాయ పంటలు దెబ్బతిన్నాయి. ఇందులో 1071 హెక్టార్లలో వరి, 68 హెక్టార్లలో కంది, 2559.24 హెక్టార్లలో మినుము, 119.5 హెక్టార్లలో పెసర, 145 హెక్టార్లలో మొక్కజొన్న, నాలుగు హెక్టార్లలో జొన్న, 71.64 హెక్టార్లలో వేరుశనగ, 284.5 హెక్టార్లలో పత్తి, 55.35 హెక్టార్లలో నువ్వలు పంటలు దెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు నష్టాన్ని ప్రాథమికంగా అంచనా వేశారు. కూలిన నివాస గృహాలు... వరుస వానలకు జిల్లాలో పలు మిద్దెలు కూలిపోయాయి. బి.మఠంలో వీరబ్రహేంద్రస్వామి వారి ఇళ్లు కూలిపోయింది. అలాగే ఖాజీపేట మండలం ముత్తలూరుపాడు, అప్పనపల్లె, శాంతినగర్ పలు ఇళ్లు నేలకూలాయి. కలసపాడు మండలం చెన్నుపల్లెకు చెందిన అన్నమ్మకు చెందిన కొట్టం కూలిపోయింది. -
ఆకాంక్షిత లక్ష్యాలలో పురోగతి సాధించాలి
● భూగర్భ జలాల పెంపునకు చర్యలు ● నీతి అయోగ్ జాయింట్ సెక్రటరీ సిద్దార్థ జైన్ కడప సెవెన్రోడ్స్ : ఆకాంక్షిత జిల్లాల ప్రగతిలో వైఎస్సార్ కడప జిల్లా మరింత పురోగతి సాధించేందుకు సమిష్టి కృషితో ముందుకు వెళ్లాలని నీతి ఆయోగ్ సెక్రెటరీ జాయింట్ సెక్రటరీ సిద్ధార్థ జైన్ పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరితో కలిసి వైఎస్సార్ కడప ఆకాంక్షిత జిల్లా, ఆకాంక్షిత బ్లాక్ ప్రోగ్రాం ప్రగతిపై సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా జాయింట్ సెక్రెటరీ మాట్లాడుతూ 2025 మార్చి నాటికి 73.6 స్కోరు సాధించి టాప్–5 జిల్లాలలో వైఎస్సార్ కడప జిల్లా నిలిచిందని తెలిపారు. పాఠశాలలు,అంగన్వాడీ కేంద్రాలలో శుద్ధమైన తాగునీరు అందించాలన్నారు. భూగర్భ జలాల పెంపునకు జిల్లా నీటి యాజమాన్య సంస్థ కు లక్ష్యాన్ని నిర్దేశించి లక్ష్యసాధనకు చర్యలు చేపట్టాలన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ హెల్త్ అండ్ న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ –నైపుణ్యాభివృద్ధి, గృహ నిర్మాణం, వ్యవసాయం, పశుపోషణ, మౌలిక సదుపాయాలు మొదలైన శాఖల్లో నిర్దేశిత లక్ష్యా లను సాధించడంలో మరింత పురోగతి సాధనకు కృషి చేస్తున్నామన్నారు. సీపీఓ హజరతయ్య, డీఈవో షంషుద్దీన్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి ,హౌసింగ్ పీడీ రాజారత్నం పాల్గొన్నారు. స్మార్ట్ కిచెన్ విధానం ఆదర్శనీయం చింతకొమ్మదిన్నె : సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ నిర్వహణ అద్భుతంగా ఉందని, రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం మరింత బాగుందని నీతిఆయోగ్ జాయింట్ సెక్రెటరీ, వైఎస్సార్ కడపజిల్లా ఆకాంక్షిత జిల్లా ప్రాబరీ అధికారి సిద్దార్థ్ జైన్ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లా పర్యటనలో భాగంగా బుధవారం జిల్లా కలెక్టర్తో కలిసి సీకే దిన్నె జెడ్పీ హైస్కూలులోని సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ ను ఆయన పరిశీలించారు. ఏడీపీ నోడల్ అధికారి జోయల్ విజయ్ కుమార్ పాల్గొన్నారు. పీఏసీఎస్ల అభివృద్ధికి కృషి చేయాలి కడప అగ్రికల్చర్ : ఉమ్మడి జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలు అభివృద్ధికి ప్రతి ఒక్కరూ కృషి చేయాలని సిద్దార్థజైన్ పేర్కొన్నారు. బుధవారం డీసీసీ బ్యాంకులో సమావేశాన్ని నిర్వహించి పలు సూచనలు చేశా రు. డీసీసీబీ చైర్మెన్ తదితరులు పాల్గొన్నారు. -
బద్వేలులో పర్యటించిన కలెక్టర్
బద్వేలు అర్బన్/పోరుమామిళ్ల : మోంథా తుపాను ప్రభావంతో విస్తారంగా వర్షాలు కురిసిన నేపథ్యంలో బుధవారం కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ బద్వేలులో పర్యటించారు. స్థానిక మైదుకూరు రోడ్డులో వర్షపునీరు నిలుస్తున్న ప్రాంతాన్ని, డ్రైనేజీని పరిశీలించడంతో పాటు బద్వేలు పెద్ద చెరువును పరిశీలించారు. ప్రధాన రహదారుల్లో నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజీ కాలువలు విస్తరణ చేయడానికి అంచనాలు, డిజైన్ తయారు చేయాలని ఆర్డీఓ చంద్రమోహన్, మున్సిపల్ కమిషనర్ వి.వి.నరసింహారెడ్డిలను ఆదేశించారు. అనంతరం బద్వేలు పెద్ద చెరువును సందర్శించి చెరువు సామర్థ్యం, చెరువు కింద ఉన్న ఆయకట్టు వివరాలను ఇరిగేషన్ డీఈ వేణుగోపాల్రెడ్డిని అడిగి తెలుసుకున్నారు. పోరుమామిళ్ల చెరువు పరిశీలన పోరుమామిళ్ల మండలంలో వాగులు వంకలు ఉప్పొంగాయి. పంటలు దెబ్బతిన్నాయి. రాజాసాహేబ్పేట, టే కూరు, టేకూరుపేట, సూరిశిద్దుపల్లె, తిమ్మారెడ్డిపల్లె, తోకలపల్లె, యరసాల గ్రామ పొలాలు నీటితో నిండాయి. కోత కోసి ఆరబెట్టుకున్న ధాన్యం తడిసి ముద్దయింది. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్బాబు బుధవారం సాయంత్రం పోరుమామిళ్ల చెరువును సందర్శించారు. దమ్మన్నపల్లె వద్ద రైతులు రోడ్డుపై పోసుకున్న ధాన్యాన్ని కలెక్టర్ పరిశీలించారు. నీరు పారడం వల్ల దెబ్బతిన్న పొలాల గురించి, పంట దెబ్బతిన్న పొలాల గురించి కలెక్టర్ అధికారులను విచారించారు. నష్టం గురించి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. -
చిత్రావతికి నీటి విడుదల
లింగాల : లింగాల మండలం పార్నపల్లె గ్రామ సమీపంలోని చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి బుధవారం నీటిని విడుదల చేశారు. ప్రస్తుతం కురుస్తున్న వర్షాలవల్ల సీబీఆర్ ఎగువ భాగంలోని యోగివేమన రిజర్వాయర్ పూర్తిగా నిండి దిగువకు విడుదల చేశారు. దీంతో సీబీఆర్కు రోజుకు 3వేల క్యూసెక్కుల నీరు వచ్చి చేరుతోంది. దీంతో సీబీఆర్కు పూర్తిస్థాయి నీటి నిల్వలు ఉండటంతో ఎలాంటి ప్రమాదాలు సంభవించకుండా ముందస్తుగా ఒక గేటును ఎత్తి 200క్యూసెక్కుల నీటిని చిత్రావతి నదికి విడుదల చేశారు. చిత్రావతి నది డ్యాం దిగువ ఉన్న గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని ఆర్డీఓ చిన్నయ్య సూచించారు. బీసీ ఈఈ వెంకటేశ్వరరావు, డీటీ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
హడావిడిగా ఆర్కిటెక్చర్ వర్సిటీ తరలింపు
● పెండింగ్లో 15 నెలల అద్దె బకాయిలు ● ఒప్పందాన్ని తుంగలో తొక్కిన వర్సిటీ అధికారులు ● కనీస వసతులు లేకున్నా గురుకులం భవనాల్లోకి ● వీసీ నిర్ణయం వెనుక రాజకీయ ఒత్తిళ్లు !సాక్షి ప్రతినిధి కడప : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ అధికారులు నిబంధనను.. ఒప్పందాన్ని తుంగలో తొక్కారు. జిల్లా కేంద్రమైన కడప సమీపంలో ఉన్న సదరు యూనివర్శిటీని హడావిడిగా యోగివేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 21వ సెంచరీ గురుకులం భవనాల్లోకి తరలిస్తూ వీసీ ఆచార్య బి.జయరామిరెడ్డి నిర్ణయం తీసుకున్నారు. లీజు నిబంధనలు పాటించకుండా వీసీ తీసుకున్న ఈ నిర్ణయంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. దీని వెనుక అధికార పార్టీకి చెందిన నాయకుల ఒత్తిళ్లు ఉన్నట్లు తెలుస్తోంది. ప్రస్తుతం ఆర్కిటెక్చర్ యూనివర్శిటీ శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ ప్రైవేటు లిమిటెడ్ వారి భవన సముదాయంలో నడుస్తోంది. ఒకవేళ యూనివర్శిటీ తమ సొంత భవనాల్లోకి వెళ్లదలుచుకుంటే లీజు ఒప్పందం ప్రకారం మూడు నెలల ముందే శ్రీనివాస ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూషన్స్ యాజమాన్యానికి నోటీసు ద్వారా తెలియజేయాలి. అలాగే భవనాల అద్దెలు, ఇతర బకాయిలను పూర్తిగా చెల్లించాలి. ఈ మేరకు ఒప్పందంలో రాసి ఉంది. అగ్రిమెంటు ప్రకారం మూడు నెలల ముందుగానే ఆ విషయాన్ని తమకు తెలియజేయాల్సి ఉన్నప్పటికీ వైస్ చాన్సలర్ ఆ విషయాన్ని పట్టించుకోకపోవడంపై భవన యాజమాన్యం అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. అలాగే 15 నెలలకు సంబంధించి విద్యుత్ బిల్లులతో కలిపి దాదాపు రూ. 3.50 కోట్ల అద్దె బకాయి లు, ఇతర చెల్లింపులు పెండింగ్లో ఉన్నట్లు సదరు యాజమాన్యం చెబుతోంది. పైగా మార్చిలో ఖాళీ చేయాల్సిందిగా జనవరిలో లేఖ రాస్తే.. స్పందించిన అధికారులు విద్యా సంవత్సరం కొనసాగిస్తామని రాతపూర్వక జవాబు ఇచ్చారని చెబుతోంది. కాగా ఈనెల 14వ తేది వీసీగా బాధ్యతలు చేపట్టిన ఆచార్య బి.జయరామిరెడ్డి అనతికాలంలోనే ఇలాంటి నిర్ణయం తీసుకోవడం వెనుక అధికార పార్టీకి చెందిన బలమైన నాయకుల ఒత్తిళ్లే కారణమని తెలుస్తోంది. విద్యార్థుల అగచాట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని 21వ సెంచురీ గురుకులం భవనాల్లో కనీస వసతులు సైతం లేవని తెలుస్తోంది. హాస్టల్ గదులు, తాగునీరు, టాయిలెట్లు వంటి మౌలిక సదుపాయాలు లేకపోతే తమ చదువులు ఎలా ముందుకు వెళతాయని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. అన్ని వసతులు సమకూర్చిన తర్వాత కొత్త భవనాల్లోకి యూనివర్శిటీని తరలించి ఉంటే ఎవరికీ అభ్యంతరం ఉండేది కాదని వారు అంటున్నట్లు సమాచారం. ఇప్పటికై నా హడావడి నిర్ణయాలను ఉపసంహరించుకుని, సొంత భవనాలు సమకూరిన తర్వాత వర్శిటీని తరలిస్తే బాగుంటుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. -
పింఛా ప్రాజెక్టు పరిశీలన
సుండుపల్లె: మండల పరిధిలోని పింఛా ప్రాజెక్టును జల వనరుల శాఖ డీఈ చెంగల్రాయుడు మంగళవారం పరిశీలించారు. పింఛా ప్రాజెక్టు నుంచి మంగళవారం 3632 క్యూసెక్కుల నీటిని దిగువ ప్రాంతానికి విడుదల చేసినట్లు ఏఈఈ నాగేంద్ర తెలిపారు. కడప కార్పొరేషన్: జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా రూ.6.59కోట్ల రాయితీలు విడుదలయ్యాయని జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ చాంద్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 27వ తేది ‘ఎంఎస్ఎంఈలపై చిన్నచూపు’ శీర్షికన ప్రచురితమైన కథనంపై ఆయన స్పందించారు. ఇండస్ట్రియల్ పాలసీలలో రాయితీలను విడతల వారీగా చెల్లిస్తామని ప్రభుత్వం చెప్పిందని, రాయితీలన్నీ ఒకేసారి చెల్లించాలని చెప్పడం సరికాదని పేర్కొన్నారు. భారీ పరిశ్రమలకు ఏడేళ్లుగా ఎలాంటి రాయితీలు విడుదల చేయలేదని, జిల్లాలో ఎంఎస్ఎంఈలకు రూ.156కోట్ల బకాయిలు ఉండగా రూ.6.59 కోట్లు విడుదలయ్యాయని వెల్లడించారు. -
స్కానింగ్ సెంటర్ సీజ్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని సీఎన్ఆర్ నర్సింగ్ హోంలో ఉన్న నేహా స్కానింగ్ సెంటర్ను వైద్యాధికారులు సీజ్ చేశారు. లింగ నిర్ధారణ చేస్తున్నారని ఫిర్యాదులు అందడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత మంగళవారం స్కానింగ్ సెంటర్లో తనిఖీలు నిర్వహించారు. లింగ నిర్ధారణ పరీక్షలు చేస్తున్నట్లు తెలియడంతో స్కానింగ్ సెంటర్ను సీజ్ చేసి సంబంధిత మిషన్ను జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి కార్యాలయానికి తీసుకెళ్లినట్లు డాక్టర్ గీత తెలిపారు. నిబంధనల ప్రకారం రిజిష్టర్ చేయించుకున్న సెంటర్లోనే స్కానింగ్ మిషన్ ఉంచాలని, మరోచోటికి తరలించరాదని తెలిపారు. లింగనిర్ధారణ చేసిన వారిని కఠినంగా శిక్షిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు వెంకటేశ్వర్లు, విజయకుమారి, కన్సల్టెంట్ పాలేశ్వరరావు పాల్గొన్నారు. గ్రామాల్లో విచారణ చింతకుంట గ్రామంలోని ఓ క్లినిక్లో లింగ నిర్ధారణపరీక్షలు చేస్తున్నట్లు అధికారుల దృష్టికి రావడంతో ఆ గ్రామానికి వెళ్లి పరిశీలించారు. కొన్ని రోజుల క్రితమే ఆర్ఎంపీ క్లినిక్ను ఖాళీ చేసినట్లు గుర్తించారు. అయినా ఓ ఇంట్లో స్కానింగ్ మిషన్ పెట్టుకొని లింగనిర్ధారణ చేస్తున్నట్లు తెలిసింది. జిల్లా అధికారులు ఈ ఘటనను సీరియస్గా పరిగణిస్తున్నారు. అనుమానిత గ్రామాల్లో విచారణ చేయాలని వైద్యాధికారులకు ఆదేశాలు వచ్చినట్లు తెలిసింది. ఇంతేగాక ప్రొద్దుటూరు నుంచి ఓ డాక్టర్ కూడా మొబైల్ స్కానింగ్ మిషన్ తీసుకెళ్లినట్లు గుర్తించారు. ఇందుక అసలు సూత్రధారులను గుర్తించే పనిలో వారు నిమగ్నమయ్యారు. -
సొరంగ మార్గ ప్రయాణం ఎప్పుడో?
ఓబులవారిపల్లె : ఓబులవారిపల్లి – కృష్ణపట్నం రైలు మార్గం అత్యంత పొడవైనది. ఈ మార్గంలో చిట్వేలి మండలం చెర్లోపల్లి సమీపంలోని కొండవద్ద ఆస్ట్రేలియన్ టెక్నాలజీతో దాదాపు 6.6 కిలో మీటర్ల మేర అతి పెద్ద సొరంగ మార్గం ఏర్పాటుచేశారు. దీంతోపాటు మరో 5 కిలోమీటర్ల మేర రెండో సొరంగ మార్గం ఉంది. దేశంలోనే అతిపెద్ద రైల్వే సొరంగ మార్గం 11.21 కిలోమీటర్ల మేర జుమ్మూ కశ్మీర్లోని పీర్ పంచాలో ఉంది. సొరంగం ఉన్న ఈ మార్గాల్లో ప్రయాణించాలని ప్రజలు కోరుకుంటారు. రాయలసీమ ప్రజలు చాలా ఏళ్లుగా ఎదురు చూస్తున్నా.. వారి ఆకాంక్ష కలగానే మిగిలిపోయింది.రూ.2 వేల కోట్లతో రైలు మార్గంఓబులవారిపల్లి నుంచి కృష్ణపట్నం వరకు 1.33 కిలో మీటర్ల రైలు మార్గాన్ని రెండు వేల కోట్ల రూపాయలతో నిర్మించారు. 2005–2006లో ఈ మార్గం మంజూరుకాగా, 2019 జూన్ 10న తొలి రైలును నడిపించారు. అప్పటినుంచి ఈ మార్గంలో సరకు రవాణా చేసే 25కు పైగా గూడ్స్ రైళ్లు నిత్యం ఈ మార్గంలో నడుస్తున్నాయి. మార్గ మధ్యంలో రైల్వే స్టేషన్లో సిగ్నలింగ్ వ్యవస్థ తప్ప ప్యాసింజర్లు ప్రయాణించే వీలుగా నిర్మించలేదు. ఈ మార్గంలో కడప నుంచి ఓబులవారిపల్లి మీదుగా రైల్వే అధికారులు ప్యాసింజర్ డెమో రైళ్లు నడిపించాలని ప్రజలు ప్రతిసారీ కోరుతున్నారు. ఈ రైలు నడిపతే కడప–నెల్లూరు మధ్య వాణిజ్యపరంగా, విద్యా పరంగా వ్యాపారం అన్ని విధాలా ఎంతో ప్రయోజనం కలుగుతుంది. అంతేగాక దక్షిణ భారతదేశ అతి పెద్ద సొరంగ మార్గంలో ప్రయాణించాలనే సీమ వాసుల కల నెరవేరుతుంది. రైల్వే అధికారులు స్పందించి ఈ మార్గంలో రైలు నడిపించాలని ప్రజలు కోరుతున్నారు. -
బి.మఠం మఠాధిపతి నియామకంపై వీడని ఉత్కంఠ
వినతి పత్రాలు స్వీకరిస్తున్న అధికారులు అభిప్రాయం విన్నవించేందుకు బారులు తీరిన భక్తులు బ్రహ్మంగారిమఠం : పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో 12వ మఠాధిపతి నియామకంపై ఉత్కంఠ వీడడం లేదు. పలువురు పోటీ పడుతూ కోర్టును ఆశ్రయించడంతో ధార్మిక పరిషత్ చివరికి ప్రజాభిప్రాయ సేకరణ చేయాల్సి వచ్చింది. మఠంలో గతంలో ఎన్నడూ లేని విధంగా కుటుంబసభ్యుల మధ్య ఆధిపత్య వివాదం తలెత్తడంతో కోర్టును ఆశ్రయించారు. ఆరు వారాల లోపు మఠాధిపతి నియామకం జరపాలని హైకోర్టు ఆదేశించడంతో ప్రజాభిప్రాయ సేకరణ జరపాలని ధార్మిక పరిషత్ నిర్ణయించింది. ప్రత్యేక అధికారిగా ఆర్జేసీ స్థాయి అధికారి చంద్రశేఖర్ ఆజాద్ను నియమించింది. దీంతో మంగళవారం ప్రజాభిప్రాయ సేకరణ జరిగింది. పూర్వ మఠాధిపతి వీరభోగ వసంత వెంకటేశ్వరస్వామి పెద్దభార్య పెద్దకుమారుడు వెంకటాద్రిస్వామి, వీలునామా ప్రకారం తనకే దక్కాలని రెండో కుమారుడు భద్రయ్యస్వామి మరోవైపు, రెండో భార్య మారుతీ మహాలక్ష్మమ్మ పెద్దకుమారుడు గోవిందస్వామి ఇంకోవైపు తమకే మఠాధిపతి కావాలని పట్టుపడ్డారు. పోటీ పెరగడంతో ప్రజా ప్రతినిధులు గతంలో సర్దిచెప్పారు. అయినా వినకపోవడంతో కోర్టు ఆదేశాలు అమలు చేసేందుకు ప్రజాభిప్రాయ సేకరణచేవారు. తుఫాన్ను లెక్కచేయకుండా దూరప్రాంతాల నుంచి భక్తులు, వివిధ మఠాల నిర్వకులు, సాధువులు, ప్రజా ప్రతినిధులు, వివిధ పార్టీల నాయకులు, ప్రజా సంఘాల నాయకులు, కందిమల్లాయపల్లె పుర ప్రజలు 1600మంది వినతిపత్రాల ద్వారా తమ అభిప్రాయం తెలియజేసారు. ఈ కార్యక్రమంలో కర్నూల్ డీసీ పట్టెం గురుప్రసాద్ , వైఎస్సార్ జిల్లా ఎండోమెంట్ కమిషనర్ మల్లికార్జునప్రసాద్ , ఈఓలు శంకర్బాలాజీ, జగన్మోహన్రెడ్డి ఎండోమెంట్ అధికారులు, మైదుకూరు డీఎస్పీరాజేంద్ర ప్రసాద్, సీఐ శివశంకర్, రమణారెడ్డి, ఎస్ఐ శివప్రసాద్ పాల్గొన్నారు. -
జీజీహెచ్ కార్మికులను తొలగిస్తే ఉద్యమిస్తాం
కడప అర్బన్ : కడప జిజిహెచ్(రిమ్స్)లో పనిచేస్తున్న శానిటేషన్, సూపర్వైజర్లను తొలగిస్తే ఉద్యమిస్తామని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి మనోహర్ అన్నారు. ఆప్కాస్ రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బయ్య, ఆప్కాస్ జిల్లా అధ్యక్షుడు పవన్, రిమ్స్ నాయకులు ఏసన్న ,రాజమ్మ, పెంచలమ్మ, విజయలతో కలిసి రిమ్స్ సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్ఎస్.వెంకటేశ్వరరావును మంగళవారం ఆయన కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా మనోహర్ మాట్లాడుతూ కడప ఆస్పత్రిలో ఈ నెల ఒకటో తారీఖు నుంచి పద్మావతి శానిటేషన్ వర్కర్స్ కాంట్రాక్ట్ వారు పనులు చేసేందుకు అగ్రిమెంట్ చేసుకున్నారని తెలిపారు. ఈ క్రమంలో గత 16 ఏళ్లుగా పనిచేస్తున్న శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లను తొలగిస్తామని యాజమాన్యం తరఫున సురేష్ చెప్పడం సరికాదన్నారు. కొత్తగా వచ్చిన కాంట్రాక్టర్ మ్యాన్ పవర్ ఎక్కువ కావాలనుకుంటే కొత్తవారిని తీసుకోవాలేగానీ, గతంలో పని చేసే వారిని తొలగిస్తే ఉద్యమిస్తామన్నారు. ఎంఓయూ ప్రకారం కార్మికులకు వేతనాలు మంజూరు చేయాలని, పీఎఫ్ ,ఈఎస్ఐ ప్రతి నెలా సక్రమంగా చెల్లించాలన్నారు. కార్మికులకు వీక్లీ ఆఫ్లు, సెలవులు తప్పనిసరిగా మంజూరుచేయాలని కోరారు. లేబర్ ఆక్ట్కు భిన్నంగా వేతనాలు ఇస్తే ప్రజాస్వామ్య పద్ధతిలో ఆందోళన చేయాల్సి వస్తుందని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సుబ్బారావు, బాలాజీ రావు, సీపీ.రమణ, శానిటేషన్ కార్మికులు, సూపర్వైజర్లు పాల్గొన్నారు. అనంతరం సూపరింటెడెంట్ డాక్టర్ శ్రీనివాసులుకు విన్నవించగా ఆయన స్పందిస్తూ జాయింట్ మీటింగ్ ఏర్పాటు చేస్తామని, ప్రస్తుతం ఎవరిని తొలగించవద్దని మౌఖికంగా తెలియజేశామని పేర్కొన్నారు. -
వ్యాపారుల సిండికేట్... ప్రభుత్వ ఆదాయానికి గండి
చక్రాయపేట : వీరాంజనేయుడి ఆదాయానికి గండి పడింది. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి మంకుపట్టు వీడకపోవడంతో అధికారులు వచ్చిన కాడికి అంటూ గత ఏడాది కంటే తక్కువ మొత్తానికి కట్టబెట్టేశారు. గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో గత ఏడాది కొబ్బరికాయల విక్రయానికి వేలం నిర్వహించగా రూ.80 లక్షల ఆదాయం వచ్చింది. అయితే ఈ ఏడాది టెండరు వేంపల్లెకు చెందిన నాగరాజు రూ.73,35,000కు దక్కించుకున్నారు. టెండరు దారులు సిండికేట్గా ఏర్పడి రూ.50 లక్షలకు మించి తమకు వద్దని భీష్మించుకు కూర్చోవడంతో కాసేపు చర్చ సాగింది. అయితే అనధికారికంగా రూ.60కి అమ్ముకోవచ్చునంటూ అధికారులు హామీ ఇవ్వడంతోనే ఆయనకు కట్టబెట్టారనే ఆరోపణలు వెల్లువెత్తాయి. గత ఏడాది కొబ్బరికాయల విక్రయం టెండర్ రూ.80 లక్షలకు దక్కించుకోగా.. జీఎస్టీతో కలిపి రూ.94 లక్షలు చెల్లించాలి. అయితే టెండరు దారుడు తనకు నష్టం వస్తోందని జీఎస్టీ చెల్లించలేదు. పైగా రూ.35 టెంకాయలు తెచ్చి రూ.60కి విక్రయించారు. దీనిపై భక్తులు పలుమార్లు అధికారులను విన్నవించినా ప్రయోజనం లేకపోయింది. ఈ ఏడాది కూడా 30 నుంచి 35 సెంటీమీటర్లు గల టెంకాయ రూ.35కు అమ్మాలని అధికారులు నిబంధన పెట్టారు. అయితే జీఎస్టీ ఊసే ఎత్తలేదు. దీంతో టెండరు దారులు మార్కెట్లోనే రూ.40నుంచి రూ.45 ఉంటే రూ.35కే ఎలా అమ్మాలంటూ ఎదురుప్రశ్నలు వేశారు. పోటీకి ఎవరూ రాకపోవడంతో మూడు పర్యాయాలు వాయిదా వేశారు. చివరికి ఆలయ వర్గాలు మెట్టు దిగి పూజా సామగ్రితో కలిపి రు.42కు అమ్ముకోవచ్చని అధికారికంగా ప్రకటించారు. అయినా ఎవరూ ముందుకురాలేదు. చివరకు రూ.60కు అమ్మవచ్చునని అనధికారిక హామీ రావడంతో అందరూ సిండికేట్గా మారి నామ మాత్రంగా పాడుతూ రూ.75,35,000లకు ముగించేశారు. నాగరాజుకు హక్కు కల్పించినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. దీంతో గత ఏడాది కంటే తక్కువగా టెండరు పాడడం.. ప్రభుత్వ ఆదాయానికి గండి పడడం జరిగిపోయింది. ఈ కార్యక్రమంలో ఆలయ ఛైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ కార్యాలయ అధికారి భారతి, మాజీ ఛైర్మన్లు వీరభాస్కరుడు, వెంకటస్వామి, సుభాష్, తదితరులు పాల్గొన్నారు. గత ఏడాది కంటే తక్కువగా రూ.75 లక్షలకే అప్పగించేశారు -
ఒంటిమిట్టలో రూ.40 కోట్ల అభివృద్ధి పనులకు ఆమోదం
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి నూతన అభివృద్ధి పనులకు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ఆమోదం తెలిపారు. మంగళవారం తిరుమల అన్నమయ్య భవనంలో ఈఓ అనిల్ కుమార్ సింఘాల్తో కలిసి జరిగిన బోర్డు సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి సంబంధించి భక్తుల సౌకర్యం కోసం రూ. 37 కోట్లతో 100 గదులు ఉన్న నూతన ఆధునిక వసతి భవనాన్ని నిర్మించేందుకు, అలాగే రామాలయం వద్ద మరింత ఆహ్లాదకర, ఆధ్యాత్మిక వాతావరణాన్ని అందించేందుకు రూ. 2.96 కోట్లతో 1.35 ఎకరాల్లో పవిత్ర వనం ఏర్పాటు చేసేందుకు ఆమోదం తెలిపినట్లు పేర్కొన్నారు. ఈ సమావేశంలో టీటీడీ అదనపు ఈఓ వెంకయ్య చౌదరి, జేఈఓ వీరబ్రహ్మం, బోర్డు సభ్యులు పాల్గొన్నారు. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు -
రక్తదానం.. ప్రాణదానంతో సమానం
ఏ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య కడప అర్బన్: రక్తదానం ప్రాణదానంతో సమానమని ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మంగళవారం నగరంలోని ఉమేష్ చంద్ర స్మారక కల్యాణ మండపంలో జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన రక్తదాన శిబిరాన్ని ఏ.ఆర్ అదనపు ఎస్పీ ప్రారంభించి మాట్లాడారు. సమాజంలో ఎందరో అభాగ్యులు ఆపద సమయాల్లో రక్తం లభించక ప్రాణాలు కోల్పోవడం బాధాకరమన్నారు. ఆరోగ్యంగా ఉన్న వారు స్వచ్ఛందంగా రక్తదానం చేసేందుకు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్ డీఎస్పీ పి.నాగేశ్వర రావు, ఆర్.ఐ లు శివరాముడు, టైటస్, శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ వెంకటేశ్వర్లు, రెడ్ క్రాస్ టెక్నీషియన్ స్వరూప రాణి, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
● పంట మునిగింది..
కడప అగ్రికల్చర్/సిద్దవటం: మోంథా తుఫాన్ ధాటికి వైఎస్సార్ జిల్లాలో నాలుగు మండలాల పరిధిలోని 25 గ్రామాల్లో 470 మంది రైతులకు సంబంధించి 270 హెక్టార్ల పంటనష్టం వాటిల్లినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ సూచించారు. సిద్దవటం మండలంలో 60 హెక్టార్లలో వరిపంట, గోపవరం మండలంలో 20 హెక్టార్లలో వరి, 5 హెక్టార్లలో మొక్కజొన్న, పోరు మామిళ్లలో 150 హెక్టార్లలో వరిపంట, బి.మఠంలో 35హెక్టార్లలో వరిపంట తెబ్బతిన్నట్లు వ్యవసాయ అధికారులు ప్రాథమింగా నష్టాన్ని అంచనా వేశారు. సిద్దవటం మండలంలోని లింగంపల్లి, మంగలవారిపల్లె, కడపాయపల్లె గ్రామాల్లో పంట నష్టం ఎక్కువగా ఉంది. -
దౌర్జన్యంగా భూమిని కబ్జా చేస్తున్నారు
సుండుపల్లె : భూమి కనిపిస్తే చాలు.. కబ్జా చేసెయ్ అన్న రీతిలో అధికార పార్టీ నాయకుల ఆగడాలు మితిమీరిపోతున్నాయి. తన భూమిని కబ్జా చేసేందుకు టీడీపీ నాయకులు ప్రయత్నిస్తున్నారని బాధితుడు డేరంగుల సతీష్ కన్నీరుమున్నీరవుతున్నారు. మండలంలోని భైరవగుట్ట సమీపంలో సుండుపల్లె గ్రామ సర్వే నెంబర్–426లో తన తాత డేరంగుల కృష్ణయ్య పేరుమీద 3.59 సెంట్ల డీపట్టా భూమి ఉందని తెలిపారు. తమ ఐదుగురు అన్నదమ్ములకు నేటికీ దానిపై సమాన వాటా ఉందన్నారు. అయితే ఇటీవల సుండుపల్లెకు చెందిన ఇద్దరు టీడీపీ ముఖ్య నాయకులు ఆ స్థలం ఆక్రమించాలని ప్రయత్నిస్తున్నారని తెలిపారు. తమకు హక్కుగా ఉన్న భూమిలో ఫెన్సింగ్ వేసి రాతి కూసాలు వేశారని, భూమిలోకి రావద్దంటూ బెదరిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా తమ పలుకుబడి వినియోగించి భయపెడుతున్నారని ఆరోపించారు. పిత్రార్జితంగా సంక్రమించిన భూమికి రక్షణ కల్పించాలని, ఆక్రమణదారుల నుండి తనను కాపాడాలని వేడుకున్నారు. ఈ విషయమై సంబంధిత గ్రామ రెవెన్యూ అధికారి సంతోష్ నాయక్ను చరవాణి ద్వారా వివరణ కోరగా కోర్టు విషయమై వేరే ప్రదేశంలో ఉన్నానని కార్యాలయానికి వచ్చిన తర్వాత సదరు సర్వే నెంబర్ పరిశీలించి వివరాలు తెలుపుతానన్నారు. రక్షణ కల్పించాలని పట్టాదారుడి వేడుకోలు -
రోడ్ల మరమ్మతులకు రూ. 74.20 కోట్లు
రాయచోటి : అన్నమయ్య జిల్లాలో రోడ్లు, భవనాలశాఖ పరిధిలో దెబ్బతిన్న రోడ్ల మరమ్మతులకు ప్రభుత్వం నిధులను మంజూరు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఆర్అండ్బీ అధికారి వై.సహదేవరెడ్డి తెలిపారు. జిల్లా పరిధిలోని 218 కిలోమీటర్ల మేర రోడ్లను బాగు చేసేందుకు రూ. 74.20 కోట్లు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయన్నారు. నాబార్డు, ప్లాన్ వర్క్, నిమ్మనపల్లి–వాల్మీకిపురం – గుర్రంకొండ, కలకడ–గుర్రంకొండ, పొంతల చెరువు–తిమ్మాపురం, చిత్తూరురోడ్డు–మదనపల్లి రోడ్డు వయా కేశపురం బోనమల రహదారితోపాటు ఇతర గ్రామాల రహదారులల్లో మరమ్మతు పనులు చేయనున్నట్లు ఆయన తెలిపారు. చోరీ కేసులో నిందితుల అరెస్టు జమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని వాటర్ ట్యాంకు వీధిలోని టవర్ వద్ద ఈ నెల 21న జరిగిన బ్యాటరీ చోరీ కేసులో ముగ్గురు వ్యక్తులను పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ నరేష్బాబు తెలిపారు. కోవెలకుంట్ల రహదారిలో అనుమానాస్పదంగా ఉన్న పత్తూరిప్రశాంత్, పత్తూరు జగన్, అక్కలి పవన్సాయిలను అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాటరీలు చోరీ చేసినట్లు ఒప్పుకున్నారని తెలిపారు. వారి నుంచి బ్యాటరీలు స్వాధీనం చేసుకున్నామని, వాటి విలువ రూ.90 వేలు ఉంటుందని తెలిపారు. సీఐ మాట్లాడుతూ మద్యం, చెడు అలవాట్లకు వ్యసనపరులై బ్యాటరీలు చోరీ చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో వివాహిత మృతి ప్రొద్దుటూరు క్రైం : మండలంలోని చౌడూరులో విద్యుత్ షాక్కు గురై వివాహిత సునీత (32) మృతిచెందారు. రూరల్ పోలీసుల వివరాల మేరకు.. గ్రామంలోని సునీత ఇంటి పక్కనే పశువుల కోసం రేకుల షెడ్డు నిర్మించారు. షెడ్డులో ఇనుపరాడ్డుకు ఫ్యాన్ను అమర్చారు. ఈ క్రమంలో సర్వీసు వైర్కు చుట్టిన టేప్ సరిగా లేకపోవడంతో విద్యుత్ సరఫరా అయింది. ఈ క్రమంలో మంగళవారం సాయంత్రం పశువుల పాకలోకి వెళ్లిన సునీత విద్యుత్ షాక్కు గురై దుర్మరణం చెందారు. ఎస్ఐ అరుణ్రెడ్డి ఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
40 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వేంపల్లె : మండలంలోని బోలగొందిచెరువు బీట్ పరిధిలో ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని 40 ఎర్ర చందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని జిల్లా అటవీశాఖ అధికారి వినీత్కుమార్ తెలిపారు. వేంపల్లె అటవీ శాఖ కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఎరచ్రందనం రవాణాపై నిఘా పెట్టామని, వేంపల్లె ఎఫ్ఆర్ఓ పర్యవేక్షణలో సిబ్బంది బోలగొందిచెరువు బీట్ ప్రాంతంలో కూబింగ్ నిర్వహించారని తెలిపారు. సత్యసాయి జిల్లా తలుపుల మండలానికి చెందిన వ్యక్తులు ఎర్రచదనం చెట్లను నరికి రవాణా చేసేందుకు సిద్దం చేస్తుండగా దాడులు చేశామన్నారు. వేములగొందికి చెందిన పోతలపల్లె మల్లికొండ, కాయలపల్లెకు చెందిన వీరాంజనేయులు, చినన్న వారిపల్లెకు చెందిన చెన్నకేశవులను అరెస్టు చేశామని, కాయలపల్లెకు చెందిన కలువపల్లె మనోహర్నాయుడు పరారీలో ఉన్నారన్నారు. ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరుపరుస్తున్నామన్నారు. వారి నుంచి రూ.2,13,692 విలువగల 40 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ఎరచ్రందనం స్మగ్లింగ్ చేస్తే సమస్యల్లో పడతారన్నారు. జిల్లా వ్యాప్తంగా ఆరు కేసులు నమోదు చేసి.. అక్రమ రవాణాపై ఎక్కువగా నిఘా పెట్టామని తెలిపారు. టాస్క్ఫోర్స్, పోలీస్, అటవీ శాఖ సిబ్బందతో కలిసి దాడులు చేసి డంప్లను సీజ్ చేస్తున్నట్లు తెలిపారు. వన్యప్రాణులు, అడవి జంతువులను వేటాడితే కేసులు నమోదు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో వేంపల్లె ఫారెస్ట్ రేంజ్ అధికారి బాలసుబ్రహ్మణ్యం, డీఆర్ఓలు సుబ్బయ్య, శేషయ్య, బీవీ.సుబ్బయ్య, ఏబీఓ.శ్రీనాథ్రెడ్డి పాల్గొన్నారు. డీఎఫ్ఓ వినీత్ కుమార్ -
ప్రజా సమస్యలపై కేంద్ర స్థాయిలో పోరాటం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రజా సమస్యలపై కేంద్ర, రాష్ట్రాల స్థాయిలో పోరాటం చేపడతానని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య పేర్కొన్నారు. రాష్ట్ర కార్యదర్శిగా బాధ్యతలు స్వీకరించిన తొలిసారి కడప జిల్లాకు వచ్చిన ఆయనకు నగరంలోని హరిత హోటల్లో సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర ఆధ్వర్యంలో అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ జిల్లాలో సీపీఐ నాయకులు, కార్యకర్తలు చెప్పిన సూచనలను పాటిస్తూ ప్రజా ఉద్యమాలను కొనసాగిస్తానన్నారు. చిన్నతనం నుంచి పోరాటం అనే పదం అట్టిపెట్టుకున్నానని, గిరిజన, దళిత, పేద, బడుగు వర్గాలకు విద్యార్థులకు, కార్మిక కర్షక రైతు సమస్యలపై అలుపెరుగని పోరాటం చేశానని తెలిపారు. చట్ట సభల్లో ప్రశ్నించే హక్కు గతంలో లెఫ్ట్ పార్టీలకు ఉండేదని, అలాంటి రోజులు రావాలనే తపనతో ముందుకు వెళతానన్నారు. కూటమి ప్రభుత్వంతోపాటు కేంద్రంలోని మోదీ, అమిత్షా కొనసాగిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలపై చైతన్యం చేస్తామన్నారు. ఎన్డీఏ ప్రభుత్వం ఇచ్చిన హామీలను నిలబెట్టుకోకపోగా కార్పొరేట్ సంస్థలకు సంపద దోచిపెడుతోందని వివరించారు. అమరావతిలో 64 వేల ఎకరాలు సేకరించినా.. మరో 44 వేల ఎకరాలు అవసరమంటూ పంట భూములను అన్యాక్రాంతం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడాన్ని సీపీఐ తీవ్రంగా వ్యతిరేకిస్తోందని, ఉద్యోగులకు టీఏ, డీఏలను ఇవ్వకపోవడం అన్యాయమన్నారు. రైలులో జనరల్ కంపార్ట్మెంట్లు, స్లీపర్ కంపార్టుమెంట్లు పెంచాలని అడిగితే ఎయిర్పోర్టులు కడతాం.. విమానాలలో తిరగండి అనడం ఎన్డీఏ పాలకులకే చెల్లిందన్నారు. నక్సలైట్ల ఏరివేత ముసుగులో దమనకాండ కొనసాగిస్తున్న కేంద్ర ప్రభుత్వానికి చరమగీతం పాడే రోజులు దగ్గరలో ఉన్నాయన్నారు. ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ చిన్నతనం నుంచే పట్టుదల, అంకుఠిత దీక్షతో అంచెలంచెలుగా ఎదిగిన ఈశ్వరయ్య రాష్ట్ర స్థాయి బాధ్యతలు చేపట్టడం అభినందనీయమన్నారు. కృషి పట్టుదల, సామాజిక స్పృహ, సమస్యలపైన పోరాటం చేసే దమ్ము ధైర్యం ఉన్న వ్యక్తి అని కొనియాడారు. కాంగ్రెస్ నాయకుడు డాక్టర్ నర్రెడ్డి తులసిరెడ్డి మాట్లాడుతూ కృషి ఉంటే మనుషులు ఋషులవుతారన్న దానికి నిదర్శనం గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ పార్టీల నాయకులు, తదితరులు పాల్గొన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య -
15 మంది జూదరుల అరెస్టు
పులివెందుల రూరల్ : పులివెందుల–కడప రోడ్డులోని పెట్రోలు బంకు సమీపంలో జూదమాడుతున్న హోంగార్డు గిరినాయక్, మరో ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి రూ.8 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ సుభాన్ తెలిపారు. మున్సిపాలిటీ పరిధిలోని ఉలిమెల్ల గ్రామ సమీపంలో జూదమాడుతున్న 11మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. పట్టుబడిన వారిని కోర్టుకు హాజరుపరచనున్నట్లు పోలీసులు తెలిపారు. వైవీయూ అభివృద్ధికి సహకరించండి కడప ఎడ్యుకేషన్ : వైవీయూ అభివృద్ధికి సహకరించాలని యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ బెల్లంకొండ రాజశేఖర్ కోరారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యా మండలి(ఎపిఎస్సిహెచ్) ఛైర్మన్ ఆచార్య కె.మధుమూర్తిని మంగళవారం ఆయన ఛాంబర్లో వీసి కలిసి విన్నవించారు. విద్య, పరిశోధనాపరమైన అనుభవాలతో విద్యా సంస్థను తీర్చిదిద్దాలని, ఎపీఎస్సీహెచ్ పూర్తిగా వెన్నంటి ఉంటుందని ఛైర్మన్ భరోసా ఇచ్చారు. అనంతరం ఉన్నత విద్యామండలి వైస్ చైర్మన్లు ప్రొఫెసర్ ఎస్.విజయభాస్కరరావు, కె.రత్న శైలామణి, సెక్రటరి బి.తిరుపతిరావులనులాయన కలిశారు. ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కొరడా కడప వైఎస్ఆర్ సర్కిల్ : కర్నూల్ బస్సు దుర్ఘటన నేపథ్యంలో ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై రవాణా శాఖ కొరడా ఝళిపిస్తోంది. జిల్లాలోని ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను రవాణా శాఖ అధికారులు నిత్యం తనిఖీ చేస్తున్నారు. సరైన పత్రాలు లేకపోతే కేసులు నమోదు చేస్తున్నారు. ఇన్ఛార్జి డీటీసీ వీర్రాజు ఆధ్వర్యంలో ఇప్ప టి వరకూ గత నాలుగు రోజుల్లో 61 కేసులు నమోదు చేశారు. సరైన పత్రాలు లేకుండా తిరుగుతున్న ఐదు బస్సులను సీజ్ చేశారు. అనుమతులు లేకపోవడం, పన్ను చెల్లించకపోవడం, డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవడం, మద్యం తాగి నడపడం, అగ్ని నిరోధక పరికరాలు ఏర్పాటు చేసుకోకపోవడం, సుత్తి లేకపోవడం, అత్యవసర ద్వారం లేకపోవడం, సరిగా తెరుచుకోకపోవడం వంటి వాటిని క్షుణ్ణంగా తనిఖీ చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. -
క్యాష్ కొట్టు.. సబ్సిడీ పట్టు
● పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో భారీగా అవకతవకలు ! ● ఒక ప్రామాణికం అనేది లేకుండా ఇష్టారాజ్యంగా జమ ● ఆగ్రహం వ్యక్తం చేస్తున్న పారిశ్రామిక వేత్తలు సాక్షి టాస్క్ఫోర్స్ : ఆషాఢం సేల్...దీపావళి ధమాకా...దసరా బంపర్ ఆఫర్ అంటూ వ్యాపారులు తమ వస్తువులను అమ్ముకోవడానికి వినియోగదారులకు బహుమతులు (గిఫ్ట్)లను ఎరగా వేస్తుంటారు. ఒకటి కొంటే మరొకటి ఉచితమంటూ ప్రకటిస్తుంటారు. పారిశ్రామిక ప్రోత్సాహకాలు మంజూరు చేయడంలో పరిశ్రమల శాఖలో ఇదే తరహా సేల్ రివర్స్లో జరుగుతోందన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఎవరైతే క్యాష్ కొడతారో వారికే రాయితీలు బహుమతులుగా వచ్చాయన్న అభిప్రాయాన్ని పారిశ్రామిక వేత్తలు వ్యక్తం చేస్తున్నారు. విశాఖ సమ్మిట్లో పారిశ్రామిక వేత్తలకు తాము గొప్పగా చేస్తున్నామని చెప్పుకోవడానికి ముఖ్యమంత్రి చంద్రబాబు బ్యాంకుల నుంచి రూ.2వేల కోట్లు రుణంగా పొంది, అందులో రూ.1500 కోట్లు పారిశ్రామిక ప్రోత్సాహకాలు అందిస్తున్నట్లు దీపావళి రోజు ప్రకటించారు. ఆ ప్రకటనతో సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమల పారిశ్రామిక వేత్తలు సంబరపడి పోయారు. వారి సంతోషం ఎంతోసేపు నిలవలేదు...ప్రోత్సాహకాల విడుదలలో ప్రభుత్వం చేసిన అసలు మోసం బట్టబయలైందని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ ప్రభుత్వాన్ని నమ్మి నిలువునా మోసపోయామని, ఈ దెబ్బతో చాలా చిన్న యూనిట్లు ఖాయిలా పడక తప్పదని హెచ్చరిస్తున్నారు. ఒక ప్రామాణికం, విధానం అంటూ లేకుండా... పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో పరిశ్రమల శాఖ అధికారులు ఒక ప్రామాణికం, పద్ధతి, ఒక విధానం అంటూ లేకుండా ఇష్టారాజ్యంగా వ్యవహరించినట్లు తెలుస్తోంది. ఫస్ట్ కమ్...ఫస్ట్ సర్వ్ పద్ధతిలో అయితే సీనియారిటీ మేరకు ఎవరు ముందు దరఖాస్తు చేసుకుంటే వారికి మొదట రాయితీలు ఇవ్వాలి. అలాకాకుండా ఈ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ఎవరైతే దరఖాస్తు చేసుకున్నవారికే ఇచ్చారని అనుకుంటే అంతకుముందు దరఖాస్తు చేసుకున్నవారిని పక్కనబెట్టాలి. కానీ అటూ ఇటూ కాకుండా 2023లో రాయితీలకు దరఖాస్తు చేసుకున్నవారికి కొందరికి, 2024లో దరఖాస్తు చేసుకున్న వారికి మరికొందరికి, 2022లో చేసుకున్న కొందరికి మంజూరు చేయడంతో పారిశ్రామిక వేత్తలు అయోమయంలో పడిపోయారు. ఎవరైతే కాసులిచ్చి విజయవాడలోని పరిశ్రమల శాఖ అధికారులను ప్రసన్నం చేసు కున్నారో వారికి మాత్రమే ప్రోత్సాహకాలు విడుదల చేశారనే వాదనలు వినిపిస్తున్నాయి. గత ప్రభుత్వంలో జగనన్న బడుగు వికాసం పాలసీలో దరఖాస్తు చేసుకున్న ఎస్సీ, ఎస్టీలకు ఎక్కువగా అన్యాయం జరిగినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. శాతాల్లో కూడా భారీ తేడా ఎవరికి ఎంత శాతం రాయితీలు పడ్డాయన్నది కూడా మిస్టరీగా మారింది. ఒక యూనిట్కు రావాల్సిన మొత్తం రాయితీలో 20 శాతం, 40 శాతం మేర ప్రోత్సాహకాలు విడుదల చేసినట్లు సమాచారం. బస్సులు, ఇతర వాహనాలు ఏర్పాటు చేసుకున్నవారికి 20 శాతం, మ్యాన్యుపాక్చరింగ్ సెక్టార్ వారికి 40 శాతం రాయితీలు ఇచ్చారని తెలిసింది. కానీ కొంతమందికి 10 శాతమే రాయితీలు పడ్డాయని చెబుతున్నారు. ఏ నిబంధనల ప్రకారం ఏ సంవత్సరాల్లో దరఖాస్తు చేసుకున్న వారికి ఎంతెంత రాయితీలు ఇచ్చారో ప్రకటించాల్సిన పరిశ్రమల శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై పారిశ్రామిక వేత్తలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీనిపై వారు భవిష్యత్ కార్యాచరణకు సిద్ధమవుతున్నట్లు విశ్వసనీయంగా తెలిసింది. -
శంభో శివ శంభో !
నిండు మనసుతో చెంబుడు నీళ్లు గుమ్మరిస్తే చాలు.. అడిగిన వరాలిస్తాడు... భక్తితో ఒక మారేడు దళం సమర్పిస్తే ముక్తిని ప్రసాదిస్తాడు.. మా శివయ్య భోళా శంకరుడు... అంటూ భక్తులు కార్తీక మాసం తొలి సోమవారం సందర్భంగా విశేష పూజలు నిర్వహించారు. శివాలయాలన్నీ కార్తిక దీప కాంతులతో శోభిల్లాయి. తొలి దర్శనం చేసుకున్నా...తొలిదీపం పెట్టినా అధిక పుణ్య లభిస్తుందన్న విశ్వాసంతో భక్తులు తెల్లవారుజాము 3.30 గంటల నుంచే ఆలయాలకు క్యూ కట్టి భక్తిశ్రద్ధలతో దీపాలు వెలిగించారు. ● కార్తీక దీప కాంతులతో శోభిల్లిన శైవ క్షేత్రాలు ● భక్తిశ్రద్ధలతో కార్తిక తొలి సోమవారం బి.కోడూరులోని అఖిలాండేశ్వరి బ్రహ్మానంద ఆశ్రమంలో 108 శివలింగాలు .. కడప అక్కాయపల్లెలో కోటి దీపోత్సవం.. పుష్పగిరిలో స్వామివారికి ప్రత్యేక అలంకరణ -
బీఎడ్ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల య పరిధిలోని వైఎస్సార్ కడప, అన్న మయ్య జిల్లాలోని 17 కేంద్రాల్లో బీఎడ్ పరీక్షలు సోమ వారం ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను అన్ని కేంద్రాల్లో కలుపుకొని 21,665 మంది విద్యార్థులు రాస్తున్నారు. తొలిరోజు కడపలోని నాగార్జున డిగ్రీ కళాశాల పరీక్షా కేంద్రాన్ని వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ తనిఖీ చేశారు. పరీక్షలు కట్టుదిట్టంగా నిబంధనలను అనుసరించి జరపాలని నిర్వాహకులకు సూచించారు. ఈ సందర్భంగా యోగి వేమన విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రొ.కె.ఎస్.వి.కృష్ణారావు వివరిస్తూ రెండు జిల్లాల్లోని అన్ని కేంద్రాలకు విశ్వవిద్యాలయం తరఫున అబ్జర్వర్లను నియమించామని తెలిపా రు. అలాగే స్క్వాడ్ బృందాల సభ్యులు కేంద్రాలను పర్యవేక్షిస్తున్నారని వి.సికి వివరించారు. యూనివర్సిటీ సెంటర్ అబ్జర్వర్ తుమ్మలూరు సురేష్బాబు, చీఫ్ సూపరింటెండెంట్ రెడ్డప్ప పాల్గొన్నారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి సోమవారం పల్లకీ సేవ నిర్వహించారు.ముందుగా మూల విరాట్లు, ఉత్సవ మూర్తులకు అభిషేకాలు, పూజలు జరిపారు. రంగు రంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించారు. అనంతరం ఉత్సవ మూర్తులను పల్లకీలో కొలువుదీర్చి ఆలయ మాఢవీధుల్లో ఊరేగించారు. కార్యక్రమంలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. గుంటిమడుగు పెద్ద చెరువుకు గండి రాయచోటి : రాయచోటి రూరల్ మండలం గుంటిమడుగు సమీపంలోని పెద్ద గోలాన్ చెరువుకు భారీ గండి పడింది. రెండు రోజులుగా కురుస్తున్న వర్షాలకు గోలాన్ చెరువులోకి వర్షపునీరు చేరింది. సోమవారం మధ్యాహ్నం గండిపడిన ప్రాంతాన్ని గుర్తించి అధికారులకు సమాచారం అందజేశారు. అధికారులు స్పందించి గండి పడిన ప్రాంతంలో మరమ్మతులు చేపట్టారు. కడప కోటి రెడ్డి సర్కిల్ : మోంథా తుపాను నేపథ్యంలో కడప నుంచి విశాఖపట్నం వెళ్లేతిరుమల ఎక్స్ప్రెస్ రైలును మంగళవారం రద్దు చేసినట్లు కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. ప్రయాణికులు ఈ విషయాన్ని గమనించాలని ఆయన కోరారు -
పెన్నాకు నీరు విడుదల
జమ్మలమడుగు రూరల్: మైలవరం జలాశయం నుంచి పెన్నాకు నీటిని విడుదుల చేసినట్లు మైలవరం జలాశయం ఈఈ రమేష్ తెలిపారు. సోమవారం రాత్రి 7.30 గంటల ప్రాంతంలో జలాశయం నుంచి సుమారు 4300 క్యూసెక్కుల నీటిని అధికారులతో కలసి ఆయన విడుదల చేశారు. గండికోట జలాశయం నుంచి 5 టీఎంసీల నుంచి మైలవరం జలాశయానికి ఇన్ఫ్లో ఉండడంతో.. వచ్చిన నీటిని అలాగే పెన్నాకు వదులుతున్నట్లు ఆయన తెలిపారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 6.01 టీఎంసీల నీరు ఉన్నట్లు ఆయన తెలిపారు.జలాశయం సహయం ఈఈ మూర్తి, ఏఈ సుబ్బారావు, రూరల్ సీఐ భాస్కర్రెడ్డి, ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మోంథాపై ఆందోళన వద్దు
● ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ● జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ కడప సెవెన్రోడ్స్ : మోంథా తుఫాన్ ప్రభావం ప్రారంభమైన నేపథ్యంలో ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ఎలాంటి విపత్తులు ఎదురైనా ఎదుర్కొనేందుకు అధికార యంత్రంగా అప్రమత్తంగా ఉందని ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా అధికారులకు సూచించారు. మోంథా తుపాను పరిస్థితులను ఎదుర్కొనే చర్యలు, సంసిద్ధతపై జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ జిల్లా స్థాయి అధికారులతో సోమవారం సాయంత్రం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ నష్టం, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై తగు సూచనలు చేశారు. రిజర్వాయర్లు, నదులు, వాగులు, వంకలు, చెరువులు.. ఉప్పొంగే అవకాశాలు ఉన్నందున.. పరివాహక ప్రాంతాల్లో ప్రజలను అప్రమత్తం చేస్తూ అవసరమైన సహాయక చర్యలను అందించేందుకు సంబంధిత సిబ్బందితో 24 గంటలు సిద్ధంగా ఉండాలన్నారు. అన్ని రెవెన్యూ డివి జన్ల పరిధిలో పోలీసు, అగ్నిమాపక సిబ్బందితోపాటు రెస్క్యూ టీమ్ ను కూడా అందుబాటులో ఉంచుకోవాలని సూచించారు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయాలన్నారు. జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్సీలలో సకాలంలో అత్యవసర వైద్య సేవలు అందించేందుకు వైద్యు లు అందుబాటులో ఉండాలని, అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని ఆదేశించారు. ఈ సందర్భంగా ఆయా శాఖల అధికారులు చేపడుతున్న ముందస్తు సంసిద్ధత ఏర్పాట్లపై ఇన్చార్జి కలెక్టర్ సమీక్షించారు. జిల్లాలో వర్షం కడప అగ్రికల్చర్ : తుపాన్ కారణంగా జిల్లాలో వర్షం కురుస్తోంది. ఆదివారం ఉదయం నుంచి సోమవారం ఉదయం వరకు జిల్లాలోని పలు మండలాల్లో వర్షం కురిసింది. ఇందులో భాగంగా ప్రొద్దుటూరులో అత్యధికంగా 11.6 మి.మీ వర్షం కురిసింది. అలాగే చక్రాయపేట, ఎర్రగుంట్లలలో 10, వీఎన్పల్లిలో 7.2, వేంపల్లిలో 6.2, సిద్దవటంలో 3.4, మైదుకూరులో 1.8, కడపలో 1, దువ్వూరులో 0.3 మి.మీ వర్షం కురిసింది. -
వెలిగల్లు నుంచి ..
ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు వస్తున్న నేపధ్యంలో ముందుజాగ్రత్తగా ఇరిగేషన్శాఖ అధికారులు వైఎస్సార్ వెలిగల్లు ప్రాజెక్టు నుంచి దిగువకు నీటిని విడుదల చేశారు. ప్రాజెక్టుకు వరద నీటి ప్రవాహం వస్తున్న నేపథ్యంలో దిగువనున్న పాపా ఘ్ని నదికి 750 క్యూసెక్కులు చొప్పున ఒక గేటు ద్వారా విడుదల చేస్తున్నారు. ప్రాజెక్టు సామర్థ్యం 4.63 టీఎంసీలు కాగా, ప్రస్తుతం ప్రాజెక్టులో 3.77 టీఎంసీలు నీరు నిల్వ ఉన్నట్లు అఽధికారుల ద్వారా తెలుస్తోంది. అలాగే సుండుపల్లె మండలంలోని పింఛాతోపాటు శ్రీనివాసపురం రిజర్వాయర్, జిల్లాలో ని వివిధ చెరువులకు నీరు వచ్చి చేరుతోంది. -
రాష్ట్ర స్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ‘భారతి’ విద్యార్థి ఎంపిక
కమలాపురం : కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలో ఉన్న డీఏవీ భారతి స్కూల్కు చెందిన పదవ తరగతి విద్యార్థిని పి.వైశాలి రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ నెల 25వ తేదీ గండిలోని డాక్టర్ బీఆర్. అంబేడ్కర్ గురుకుల పాఠశాలలో జరిగిన జిల్లా స్థాయి అండర్–17 హ్యాండ్ బాల్ పోటీల్లో పాల్గొన్న వైశాలి అత్యుత్తమ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. బంగారు పతకం సాధించిన వైశాలి త్వరలో విజయవాడలో నిర్వహించే రాష్ట్ర స్థాయి హ్యాండ్ బాల్ పోటీలకు హాజరవుతుందని ఆయన వివరించారు. కాగా భారతి సిమెంట్స్ ప్లాంట్ హెడ్ ఎం. రామమూర్తి, హెచ్ఆర్ గోపాల్ రెడ్డి, ఐఆర్ అండ్ పీఆర్ చీఫ్ భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి తదితరులు వైశాలితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. సిల్వర్ జోన్ ఫౌండేషన్ లిటిల్ స్టార్స్లో డీఏవీ విద్యార్థుల ప్రతిభ.. సిల్వర్ జోన్ ఫౌండేషన్ ఇంటర్నేషనల్ లిటిల్ స్టార్లో ఇంగ్లీష్, గణితం, సైన్స్ ఒలంపియాడ్ (ఐఓఈఎల్) డీఏవీ విద్యార్థులు ప్రతిభ కనబరిచారని ప్రిన్సిపల్ కిషోర్ కుమార్ తెలిపారు. తమ డీఏవీ భారతి స్కూల్కు చెందిన 147 మంది విద్యార్థులకు బంగారు పతకాలు అందాయన్నారు. అలాగే ఐదుగురికి వెండి, ఏడుగురు రజత పతకాలు అందుకున్నారని తెలిపారు. పతకాలు అందుకున్న విద్యార్థులను ప్లాంట్ ప్రతినిధులు అభినందించారు. -
రైల్వేసమస్యల పరిష్కారానికి కృషి
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా ఉన్న సమస్యల పరిష్కారానికి కృషిచేస్తానని రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యుడు, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సోమవారం రైల్వే స్టాండింగ్ కమిటీ సభ్యునిగా నియమితులై తొలిసారిగా విచ్చేసిన ఎంపీ మేడా రఘునాథరెడ్డిని మేడా భవన్(రాజంపేట బైపాస్ క్రాస్)లో పలువురు నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేస్టాండింగ్ కమిటీలో సభ్యునిగా చోటు కల్పించినందువల్ల రైల్వేపరంగా ఈ ప్రాంతానికి అవసరమైన అంశాలపై దృష్టి సారించగలిగే అవకాశం కలిగిందన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి దృష్టికి ఉమ్మడి కడప జిల్లాలోని రైలుమార్గంలో నెలకొన్న సమస్యలను తీసుకెళ్లనున్నట్లు గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి తెలిపారు. మేడాభవన్లో ఎంపీ మేడాను కలిసి బొకేను అందచేశారు.కార్యక్రమంలో రాష్ట్ర పంచాయతీరాజ్ సెక్రటరీ గాలివీటి వీరనాగిరెడ్డి,మార్కెట్మాజీ చైర్మన్ పీసీ యోగీశ్వరరెడ్డి, పట్టణ వైఎస్సార్సీపీ కన్వీనరు కృష్ణారావు, నందలూరు సింగల్ విండో మాజీ అధ్యక్షుడు పాలగిరి సుధాకర్రెడి సౌమ్యనాధాలయ మాజీ చైర్మన్ అరిగెల సౌమిత్రి, కౌన్సిలర్ సనిశెట్టి నవీన్,్డతోపాటు పలువురు కౌన్సిలర్లు తదితరులు పాల్గొన్నారు. రైల్వేస్టాండింగ్ కమిటీ సభ్యుడు ఎంపీ మేడా -
వాన జల్లు.. ఉద్యాన పంటలకు తెగుళ్లు!
కడప అగ్రికల్చర్ : మొంథా తుపాను ప్రభావం వల్ల జిల్లా వ్యాప్తంగా భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో ఉద్యాన పంటలను కాపాడుకునేందుకు తగు జాగ్రత్తలు, సస్యరక్షణ చర్యలు తప్పక పాటించాలని జిల్లా ఉద్యాన శాఖ అధికారి జి.సతీష్ ఉద్యాన రైతులకు సూచించారు. కూరగాయల పంటలు.. ● వర్షం ధాటికి పడిపోయిన మొక్కలను జాగ్రత్తగా నిలబెట్టి మొదలు దగ్గరగా మట్టిని ఎగదోయాలి. ● మొక్కలకు సరిపోయినంత ఆకులు, కొమ్మలతో ఉన్నట్లయితే 0.3 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె) లేదా 2 శాతం యూరియా ద్రావణాన్ని 2–3 సార్లు మొక్క తడిచేటట్లుగా వారం రోజుల వ్యవధిలో పిచికారీ చేయాలి. ● కూరగాయ పంటలు కొత్తగా విత్తిన లేదా నాటినట్లయితే వాటిని తీసివేసి మరలా నాటుకోవాలి. ● పంటకు ఆకుపచ్చ, కాయకుళ్లు, బూజు తెగుళ్ల ఉధృతి అధికంగా ఉంటుంది. కనుక ముందు జాగ్రత్త చర్యగా లీటరు నీటికి 2.5 గ్రాముల సాఫ్ మందును కలిపి రెండుసార్లు పిచికారీ చేయాలి. ● వేరుకుళ్లు ఆశించిన చేలల్లో కాపర్ ఆక్సీ క్లోరైడ్ 30 గ్రాములు లేదా కర్బండిజమ్ 10 గ్రాముల చొప్పున 10 లీటర్ల నీటిలో కలిపిన ద్రావణాన్ని మొక్కల మొదళ్లలో పోయాలి. పసుపు పంట.. ● వర్షాలు ఆగిన వెంటనే పంటపై లీటరు నీటికి 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ కలిపిన ద్రావణాన్ని వారం రోజుల వ్యవధిలో 2–3 సార్లు పిచికారీ చేయాలి. ● పంటలో ఇనుప ధాతులోపం ఏర్పడి లేత ఆకులు పాలిపోయినట్లు కనబడితే, 10 లీటర్ల నీటిలో 50 గ్రాములు అన్నభేది ఒక నిమ్మచెక్క రసం, జిగురు మందుతో కలిపి 15 రోజుల వ్యవధిలో 2 సార్లు పిచికారీ చేయాలి. ● నేల అదునుకు వచ్చిన వెంటనే అంతర కృషి చేసినట్లయితే త్వరగా ఆరుతుంది. పైపాటుగా ఎకరానికి 50 కిలోల యూరియా, 40 కిలోల పొటాష్తో పాటు 200 కిలోల వేపపిండి వేయాలి. ● ఆకుమచ్చ తెగులు వ్యాపించకుండా ముందు జాగ్రత్తగా ప్రాప్తికోన జోల్ 1 మి.లీ. కలిపిన ద్రావణాన్ని పిచికారీ చేయాలి. ● దుంపకుళ్లు ఆశించినట్లయితే పాదుల్లో మొక్కలు చుట్టూ నేలను కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటరు నీటికి కలిపిన ద్రావణంలో తడపాలి. తెగులు ఉధృతి అధికంగా ఉన్నట్లయితే లీటరు నీటికి 2.5 గ్రాములు రిడోమిల్ మందును కలిపిన ద్రావణంతో తడపాలి. పూల తోటలు.. ● మొక్కలపై 2 శాతం యూరియా లేదా 1 శాతం 13–0–45 (నీటిలో కరిగే ఎరువు మల్టి–కె)ను 2–3 సార్లు పిచికారీ చేయాలి. ● ఆకుమచ్చ తెగులు నివారణకు ప్రొపికొనజోల్ 1 మి.లీ. ఒక లీటరు నీటికి కలిపి వారం రోజుల వ్యవధిలో 1–2 సార్లు పిచికారీ చేయాలి. ● కోతకు సిద్ధంగా ఉన్న పువ్వులను వీలైనంత త్వరగా కోసుకోవాలి. ● పువ్వులను కోసిన తరువాత, మార్కెట్కు పంపేలోపు వాటిని తాత్కాలికంగా బాగా గాలి, వెలుతురు వచ్చే ప్రదేశంలో నిల్వ చేయాలి. ● వీలైనంత త్వరగా పువ్వులను మార్కెట్టుకు పంపాలి. ఉల్లి పంట.. ● మురుగు నీటిని బయటకు పంపాలి. ● ఆకుమచ్చ తెగులు నివారణకు మాన్కోజెబ్ 2.5 గ్రాములు లేదా క్లోరోథలోనిల్ 2 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఉల్లి కోత దశలో.. ● తుపాను హెచ్చరిక ఆధారంగా తుపాను రాక ముందే వీలైనంత తొందరగా గడ్డలను కోసుకోవాలి. ● వర్షం ఆగిన వెంటనే గడ్డలను కోయరాదు / పీకరాదు. కోత అనంతరం.. ● గడ్డలను పీకిన తరువాత 1 గ్రాము థయోఫాసేట్ మిథైల్ లేదా 1 గ్రాము కార్బండిజమ్ లేదా 1 మి.లీ. ప్రొఫికోనజోల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసి నిల్వలో గడ్డ కుళ్లును నివారించవచ్చు. ● కోసిన గడ్డలను వర్షంలో తడవకుండా టార్పాలిన్ పట్టలు కప్పాలి. ● సోలారు డ్రైయర్స్ను ఉపయోగించి గడ్డలను తొందరగా ఆరబెట్టుకోవాలి. లేదా గడ్డలను 7 నుంచి 10 రోజులు ఆరబెట్టి నిల్వ చేసుకోవాలి. ● వీలైనంత తొందరగా గడ్డలను గ్రేడింగ్ ప్యాకింగ్ చేసి నిల్వ ఉంచకుండా మార్కెటింగ్ చేసుకోవాలి.రైతులు జాగ్రత్తలు పాటించాలంటున్న ఉద్యానశాఖ అధికారులుసస్యరక్షణ చర్యలు తప్పనిసరి.. వర్షాల నేపథ్యంలో రైతులు తప్పని సరిగా ఉద్యాన పంటలకు సస్యరక్షణ చర్యలు చేపట్టాలి. అలా చేపట్టినప్పుడే ఉద్యాన పంటలను రక్షించుకోగలరు. ఆయా పంటలు సాగుచేసిన రైతులు తప్పని సరిగా ఆయా చర్యలు చేపట్టి పంటలను కాపాడుకోవాలి. – జి. సతీష్, జిల్లా ఉద్యానశాఖ అధికారి -
కొప్పర్తి చెరువు కట్ట కాలువకు గండి
చింతకొమ్మదిన్నె : మండలంలోని కొప్పర్తి చెరువు నుంచి తాడిగొట్ల చెరువుకు నీరు వెళ్లే కట్ట కాలువకు సోమవారం గండ్లు పడడంతో నీరు వృథాగా పోయింది. సాయంత్రానికి స్పందించిన రెవెన్యూ అధికారులు, స్థానిక రైతులు జేసీబీ సహాయంతో కాలువకు పడిన గండ్లను మట్టితో పూడ్చివేశారు. కీచక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేయాలి కడప ఎడ్యుకేషన్: విద్యార్థినుల పట్ల లైంగిక వేధింపులకు పాల్పడిన బ్రహ్మంగారిమఠం మండలం కందిమల్లాయపల్లి మండల పరిషత్ ప్రాథమిక పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రాధాకృష్ణమూర్తిని వెంటనే సస్పెండ్ చేయాలని ప్రోగ్రెసివ్ స్టూడెంట్ యూనియన్ రాష్ట్ర కార్యదర్శి సుబ్బరాయుడు, అఖిల భారత విద్యార్థి బ్లాక్ జిల్లా కార్యదర్శి సగిలి రాజేంద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. సోమవారం డీఈఓ షేక్ షంషుద్దీన్ను కలిసి ఫిర్యాదు చేశారు. రాధాకృష్ణమూర్తి అదే పాఠశాలలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందన్నారు. అతనిపై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నంకమలాపురం : కమలాపురం విద్యుత్ సబ్స్టేషన్కు చెందిన ప్రభుత్వ స్థలాన్ని కబ్జా చేసేందుకు ఓ వ్యక్తి యత్నించాడు. కడప–ముద్దనూరు ఫోర్లేన్ రోడ్డు మంజూరు కావడంతో కబ్జాకోరులు పావులు కదుపుతున్నారు. ఇందులో భాగంగా స్థానిక క్రాస్ రోడ్డు సమీపంలోని విద్యుత్ సబ్ స్టేషన్కు సంబంధించిన స్థలాన్ని ఆక్రమించేందుకు ఓ వ్యక్తి ఈ స్థలం నాదని, పిల్లర్ల కోసం 9 గుంతలు సైతం కొట్టించాడు. దీనిని చూసి సబ్ స్టేషన్ సిబ్బంది ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. సోమవారం విద్యుత్ అధికారులు ఆ స్థలాన్ని పరిశీలించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇది సబ్ స్టేషన్ స్థలమని తమ స్థలంలో గుంతలు కొట్టించాడని ఆ గుంతలను అధికారులు పూడ్పించారు. కార్మికుల సమస్యలపై పోరాటంఓబులవారిపల్లె : కార్మికుల సమస్యలపై అలుపెరుగని పోరాటం చేస్తామని ఏఐటీయూసీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు మాదరాజు గంగాధర్ పేర్కొన్నారు. సోమవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయం పరిసరాల్లో ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్, త్రివేణి కార్మిక సంఘం ఆధ్వర్యంలో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ఏఐటీయూసీ ఎంప్లాయిస్ యూనియన్ ప్రధాన కార్యదర్శి పోగురి మురళీ, ఏపీఎండీసీ ఎంప్లాయిస్ యూనియన్ నాయకులు దినేష్, హరి, త్రివేణి, కార్మీక సంఘం అధ్యక్షులు, కార్యదర్శులు నాగరాజు, వెంకటరమణ, వరప్రసాద్ పాల్గొన్నారు. -
గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
అట్లూరు : ప్రమాదవశాత్తు ఆదివారం సగిలేరు నదిలో గల్లంతైన ప్రభాకర్ మృతదేహం లభ్యమైంది. మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) ఓ మహిళ అంత్యక్రియలకు వెళ్లి ప్రమాదవశాత్తు సగిలేరు నదిలో గల్లంతైన విషయం విదితమే. విషయం తెలుసుకున్న వెంటనే తహసీల్దార్ సుబ్బలక్షుమ్మ, ఎస్ఐ రామకృష్ణయ్య, సీఐ కృష్ణయ్య సంఘటన స్థలానికి చేరుకుని బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి చీకటి పడే వరకు గాలించినా మృతదేహం లభించలేదు. తిరిగి సోమవారం ఉదయం పోలీసు, రెవెన్యూ, అగ్నిపక సిబ్బంది, గజ ఈతగాళ్ల సహాయంతో మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ పర్యవేక్షణలో గాలింపు చర్యలు చేపట్టారు. సాయంత్రం ఎట్టకేలకు ప్రభాకర్ మృతదేహాన్ని వెలికి తీశారు. మృతదేహానికి పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముడమాల ప్రభాకర్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి పొన్నవోలు బ్రహ్మానందరెడ్డి మృతుని కుటుంబాన్ని ఓదార్చి మేమున్నామని భరోసా ఇచ్చారు. ప్రభుత్వం ఆ కుటుంబాన్ని అన్ని విధాలా ఆదుకోవాలని కోరారు. -
విపత్తును ఎదుర్కొనేందుకు సిద్ధం
వీరపునాయునిపల్లె : మోంథా తుపాన్ను ఎదుర్కొనేందుకు సర్వం సిద్ధంగా ఉన్నామని విద్యుత్ సూపరింటెండెంట్ ఇంజనీర్ రమణ అన్నారు. సోమవారం మండలంలోని అయ్యవారిపల్లె విద్యుత్ సబ్స్టేషన్లో సిబ్బందితో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరణలో భద్రతా ప్రమాణాలు, అత్యవసర పరిస్థితుల్లో తీసుకోవాల్చిన చర్యలపై సిబ్బందికి సలు సూచనలందించారు. తుపాను ప్రభావం పూర్తిగా తగ్గిపోయేంతవరకు అధికారుల, సిబ్బందికి సెలవులు రద్దుచేశామని.. ప్రతి ఒక్కరూ 24గంటలు అందుబాటులో ఉండాలని సూచించా రు. సమావేశాననంతరం విలేకరులతో మాట్లాడు తూ తుపాను సహాయక చర్యల్లో పాల్గొనేందుకు కడప నుంచి కాకినాడకు 20బృందాలను పంపించామని వెల్లడించారు. సర్కిల్ కార్యాలయం కడప, కడప డివిజన్, పులివెందుల ప్రొద్దుటూరు, మైదుకూరులలో 5కంట్రోల్ రూమ్లు పని చేస్తున్నాయని వివరించారు. కంట్రోల్ రూమ్ నంబర్లు యల్యమ్సి సర్కిల్ కార్యాలయం కడప 9440817440, కడప డివిజన్ కార్యాలయం 9901761782, పులివెందుల 7893063007, ప్రొద్దుటూరు 7893261958,మైదుకూరు 9849057659 అత్యవసర పరిస్థితుల్లో ఈ నంబర్లకు సమాచారం అందించవచ్చని ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో యర్రగుంట్ల డీఈ కిరణ్, ఏఈ హరిప్రసాద్రెడ్డి పాల్గొన్నారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
● రూ. 10.2 లక్షల విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం ● 14 మంది నిందితుల అరెస్టు ● వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లిరాయచోటి : మాదక ద్రవ్యాల అక్రమ రవాణా ముఠా గుట్టును అన్నమయ్య జిల్లా పోలీసులు రట్టు చేశారు. జిల్లాలో గుట్టుగా సాగుతున్న గంజాయి వ్యాపారంపై జిల్లా పోలీసులు ప్రత్యేక దృష్టి సారించి సూత్రధారులు, విక్రయదారులను అరెస్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం మీడియాకు వివరించారు. కలకడ పోలీసుల ఆధ్వర్యంలో సాగిన ఈ ఆపరేషన్ ద్వారా రూ. 10.2 లక్షలు విలువైన 34 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్ బాషాతో కలిపి 14 మంది ముఠా సభ్యులను అరెస్టు చేసినట్లు వెల్లడించారు. రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి. లక్ష్మన్న పర్యవేక్షణలో కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పక్కా సమాచారం మేరకు ఈ దాడులు నిర్వహించారన్నారు. సోమవారం ఉదయం కలకడ మండలం, బంగారువాండ్లపల్లి, నడిమిచెర్ల, కొత్తపల్లి రోడ్డులోని రాతి దిబ్బ సమీపంలో పోలీసులు దాడి చేశారన్నారు. ఇదే సమయంలో గంజాయితో సిద్ధంగా ఉన్న నిందితులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని పోలీసులు చుట్టుముట్టి పట్టుకున్నట్లు పేర్కొన్నారు. ఈ ఆపరేషన్లో పట్టుబడిన 13 మంది పురుషులు, ఒక మహిళ నిందితురాలితోపాటు 14 మందిని మీడియా ముందు ప్రవేశపెట్టారు. సొత్తు కేసు వివరాలు.. నిందితుల వద్ద నుంచి సుమారు రూ.10.2 లక్షలు విలువచేసే 34 కిలోల గంజాయిని రవాణాకు ఉపయోగించిన ఒక ఆటో, మూడు మోటార్ సైకిళ్లు, 12 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ప్రధాన నిందితుడు షేక్బాషా ఒడిశా నుంచి గంజాయిని కొనుగోలు చేసి స్థానికంగా ఉన్న చిన్నచిన్న విక్రయదారుల ద్వారా జిల్లాలో విక్రయిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. అరెస్టు అయిన 14 మందిపైన వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేసి రిమాండ్ నిమిత్తం వాయల్పాడు కోర్టుకు పంపుతున్నట్లు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో మరో నలుగురు నిందితులు పరారీలో ఉన్నారని, వారిని త్వరలో అరెస్టు చేస్తామని వివరించారు. కఠిన చర్యలు తప్పవు.. జిల్లాలో గంజాయి విక్రయాలను, వినియోగాన్ని సహించేది లేదని ఎస్పీ గట్టిగా హెచ్చరించారు. గంజాయి సేవించే యువత వెంటనే వ్యసనాన్ని వదిలిపెట్టి చదువుపై దృష్టి పెట్టాలని విజ్ఞప్తి చేశారు. జిల్లాలో మాదక ద్రవ్యాల విక్రయాలు ఎక్కడైనా జరుగుతున్నట్లు తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలన్నారు. గంజాయి ముఠా అరెస్టు ఆపరేషన్ విజయవంతం చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ బి.రామాంజనేయులు, పీఎస్ఐ కుమారి హారిక, పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మదనపల్లె రూరల్ : మదనపల్లె కేంద్రంగా గంజాయి విక్రయిస్తున్న ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్లో నిర్వహించిన మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. మదనపల్లె మండలం, వలసపల్లె మొలకలదిన్నెకి చెందిన గుర్రాల వాసు అలియాస్ ఎరుకుల శ్రీనివాసులు (35), కురబలకోట మండలం, తెట్టు ఆరోగ్యపురానికి చెందిన రత్నవేలు కుమారుడు గెంటిమ్ ఆనంద్ కుమార్(27) లు గంజాయి రవాణాదారులైన మదనపల్లె పట్టణానికి చెందిన సయ్యద్ ఖాసీంసాబ్ కుమారుడు జాఫర్ అలీ, గంగిశెట్టి చలపతి కుమారుడు శివకుమార్ల దగ్గర నుంచి గంజాయి కొనుగోలు చేసి, చిన్నచిన్న ప్యాకెట్లుగా తయారు చేసి, మదనపల్లె, అంగళ్లు తదితర ప్రాంతాల్లో రహస్యంగా యువతకు, విద్యార్థులకు విక్రయించేవారన్నారు. ఈ క్రమంలో 26వ తేదీ ఆదివారం తట్టివారిపల్లె వద్ద పోలీసులు వాహనాలు తనిఖీ చేస్తుండగా శ్రీనివాసులు, ఆనంద్ కుమార్ అనుమానాస్పదంగా పట్టుబడ్డారన్నారు. వారిని విచారించి నిందితుల వద్ద నుంచి, రూ. 20వేల విలువ చేసే రెండు కిలోల గంజాయి, రవాణాకు ఉపయోగిస్తున్న ద్విచక్ర వాహనం, సెల్ ఫోన్ స్వాధీనం చేసుకున్నామన్నారు. ఏ 1 నిందితుడు శ్రీనివాసులుపై ఇదివరకే మదనపల్లె తాలూకా, టూ టౌన్, స్టేషన్లతో పాటు శ్రీ సత్యసాయి జిల్లా ముదిగుబ్బ పోలీస్ స్టేషన్లో గంజాయి కేసులు నమోదై ఉన్నాయన్నారు. నిందితులను రిమాండ్ నిమిత్తం కోర్టుకు హాజరు పరిచామన్నారు. ఇదే కేసులో గంజాయి అక్రమ రవాణాకు పాల్పడుతున్న జాఫర్ అలీ, గంగిశెట్టి శివకుమార్ పరారీలో ఉన్నారని త్వరలోనే అరెస్టు చేస్తామన్నారు. ఇందులో మరికొందరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించామని, నిందితులందరిని అరెస్టు చేస్తామన్నారు. కేసు దర్యాప్తులో ప్రతిభ చూపిన టు టౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా, సిబ్బందిని అభినందించారు. -
ఉత్సాహంగా ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో సబ్ జూనియర్ ఆర్చరీ జిల్లా స్థాయి ఎంపికలు సోమవారం ఉత్సాహంగా సాగా యి. ఆర్చరీ అసోసియేషన్ ఆఫ్ డాక్టర్ వైఎస్సార్ కడప, జిల్లా స్పోర్ట్స్ అథారిటీ ఆధ్వర్యంలో ఎంపిక లు నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా ప్రధాన కా ర్యదర్శి జనార్ధన రెడ్డి ఎంపికలను పర్యవేక్షించారు. సబ్ జూనియర్స్ ఇండియన్ రౌండ్–బాలుర జట్టు: కె. అరవింద్, ఎస్. శశి వర్ధన్, జి. సిద్ధార్ధ, టి.గణేష్, సి దినేష్ కుమార్ బాలికల జట్టు: టి.శివ దుర్గ, కె.నవ్య శ్రీ, వి.మధులిక సబ్ జూనియర్స్ రికర్వ్ రౌండ్ బాలుర జట్టు: వై.నవనీష్, ఎ.యశ్వంత్ రెడ్డి, ఎల్. కౌశల్ దేవ రాయల్, పి.విఘ్నేష్ చరణ్, బి.ఖ్యాతేష్, షణ్ముక బాలికల జట్టు: టి. సుశ్రుత సభ జూనియర్స్ కాంపౌండ్ బాలుర జట్టు: సి. అభినయ్, పివి. పాయి శ్రీనివాస్, కె. వెంకట కార్తీక్ -
మెడికల్ కాలేజీల పైవేటీకరణను వ్యతిరేకిస్తూ.. కువైట్లో కోటి సంతకాల సేకరణ
కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్లో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కువైట్ దేశంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో ప్రవాసాంఽధ్రులు కోటి సంతకాల సేకరణ కార్యక్రమం ప్రారంభించారు. కువైట్లోని మాలియా ప్రాంతంలో మాక్స్ హోటల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి కోడూరు మండల కన్వీనర్ రామిరెడ్డి, ధ్వజారెడ్డి, బద్వేల్ నియోజకవర్గ బూత్ కన్వీనర్ కల్లూరు రమణారెడ్డి, కువైట్ పిస్తా హౌస్ అధినేత ఎస్బి అహ్మద్బాషా ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి పేద, మధ్య తరగతి ప్రజలకు నాణ్యమైన వైద్య విద్య, వైద్యాన్ని అందించడానికి జిల్లాలో ఒక మెడికల్ కాలేజీ ఏర్పాటు చేశారన్నారు. కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు పరం చేయాలని చూడటం దుర్మార్గమన్నారు. అనంతరం వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమం పోస్టర్లను ఆవిష్కరించి, కోటి సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ గల్ఫ్ కో కన్వీనర్ గోవిందు నాగరాజు, గల్ఫ్ సలహాదారులు ఎన్. మహేశ్వర్ రెడ్డి, గల్ఫ్ ప్రతినిధి ఎన్. చంద్రశేఖర్ రెడ్డి, కువైట్ కో కన్వీనర్లు ఎం. చంద్రశేఖర్ రెడ్డి, మర్రి కళ్యాణ్, గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు, షేక్ రహమతుల్లా, అఫ్సర్ అలీ, యు.వెంకట రమణారెడ్డి పాల్గొన్నారు. -
జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని జగతి మాంటిస్సోరి స్కూల్లో అండర్–14, 17 జిల్లా స్థాయి వాలీబాల్ పోటీలు ఆదివారం ఉత్సాహంగా సాగాయి. ఆరు డివిజన్ల నుంచి 300 మంది క్రీడా కారులు పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ కార్యదర్శులు చంద్రావతి, శ్రీకాంత్రెడ్డి తెలిపారు. వారిలో ప్రతిభ చూపిన వారిని జిల్లా స్థాయికి ఎంపిక చేశారు. అండర్–17 బాలికల జట్టు: నమిత, ఆఫ్రిన్, నాగ తనూజ, భువనేశ్వరి, భార్గవి, భావన, శ్రావణి, శివ మంజుల, యశస్విని, భవ్యశ్రీ, నేహ, సరిత, హర్షిత, యాస్మిన్, దీపిక అండర్–17 బాలుర జట్టు: ఓంకార్, సురేష్, రామశేఖర్ రాజు, కృష్ణార్జున్, జశ్వంత్, రఘువరన్, కార్తీక్, నాగ చైతన్య రెడ్డి, టోని, చరిత్ సాయి రెడ్డి, శివరామ్, ఆకాష్, విశ్వనాథ్, ఏడు కొండలు అండర్–14 బాలికల జట్టు: భాగ్యలక్ష్మీ, ఏసుప్రియ, హారిక, సుష్మిత, నాగ సుజాత, నక్షత్ర, వైష్ణవి, గంగా భానుశ్రీ, హార్షిక, మల్లిక, ఇందు, చంద్రిక, సంధ్య, జానకి, కార్తీక, అండర్–14 బాలుర జట్టు: జాఫర్, నిఖిల్, సాయినాథ్, అభినయ్, తరుణ్తేజ్, అశోక్, తరుణ్తేజ్ రెడ్డి, యుఎల్ నారాయణ, లోహిత్ కుమార్రెడ్డి, వెంకట మణి, అనిరుధ్, హర్షవర్దన్, లక్ష్మీ ప్రసాద్, వినోద్ -
నాగమునెమ్మ మృతదేహం లభ్యం
రాజుపాళెం : రాజుపాళెం మండలం వెల్లాల గ్రామ సమీపంలోని కుందూనదిలో శనివారం గల్లంతైన నాగమునెమ్మ (76) మృతదేహం ఆదివారం లభ్యమైంది. ఉదయం నుంచి ప్రొద్దుటూరు ఫైర్ సిబ్బంది బోట్ సహాయంతో నదిలో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో వెల్లాల పాతవంతెనకు సమీపంలో ఆ వృద్ధురాలి మృతదేహం నీటిపై తేలియాడుతూ కనిపించడంతో వెంటనే బోటులో ఒడ్డుకు చేర్చారు. పెద్దముడియం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గొంగటి రామసుబ్బారెడ్డి, గొంగటి నాగమునెమ్మ అనే వృద్ధ దంపతులు జీవితంపై విరక్తి చెందడంతో పాటు అనారోగ్య కారణాలతో శనివారం వెల్లాల కుందూనది పాత వంతెనపై నుంచి నదిలోకి దూకిన విషయం విదితమే. నది ఉధృతిలో కొట్టుకుపోతున్న రామసుబ్బారెడ్డిని స్థానికుడైన గుర్రప్ప ఒడ్డుకు చేర్చగా నాగమునెమ్మ నీటి ప్రవాహానికి కొట్టుకొని పోయింది. ఆదివారం లభ్యమైన మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
సచివాలయ ఉద్యోగిని ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : పట్టణంలోని కోటిరెడ్డినగర్లో నివసిస్తూ బి.కోడూరు మండలం తంగేడుపల్లె సచివాలయంలో వెల్ఫేర్ అసిస్టెంట్గా విధులు నిర్వర్తిస్తుండే మన్నెం మల్లేశ్వరి (28) శనివారం రాత్రి ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. బి.మఠం మండలం మలుగుడుపాడుకు చెందిన సుబ్బరామిరెడ్డి, ఇంద్రావతిల రెండవ కుమార్తె అయిన మల్లేశ్వరిని మూడేళ్ల క్రితం పోరుమామిళ్ల మండలం చల్లగిరిగెలకు చెందిన రామనరసారెడ్డికి ఇచ్చి వివాహం చేశారు. ఈయన అన్నమయ్య జిల్లా రాయచోటి సమీపంలోని రామాపురంలో ప్రభుత్వ ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్నారు. అయితే శనివారం రాత్రి ఇంట్లో ఎవరూ లేని సమయంలో మల్లేశ్వరి ఫ్యాన్కు ఉరి వేసుకుంది. భర్త ఇంటికి వచ్చేసరికి తలుపులు వేసి ఉండటంతో తలుపును పగులకొట్టి లోపలికి వెళ్లి చూడగా మల్లేశ్వరి ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. మృతురాలి తండ్రి సుబ్బరామిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు అనుమానాస్పద మృతి కింద కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పరామర్శించిన మైదుకూరు మాజీ ఎమ్మెల్యే .. మృతురాలు మన్నెం మల్లేశ్వరి స్వగ్రామం బి.మఠం మండలం మలుగుడుపాడు కావడంతో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ రాష్ట్ర చైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆదివారం స్థానిక ప్రభుత్వాసుపత్రిలో మల్లేశ్వరి మృతదేహాన్ని సందర్శించి కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఆత్మహత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, బి.మఠం మాజీ సింగిల్విండో అధ్యక్షుడు సుబ్బారెడ్డి, మండల నాయకులు వెంకటరామిరెడ్డి, వివేకానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కర్నూలు బస్సు ప్రమాదంలో చంద్రబాబే మొదటి ముద్దాయి
– వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ప్రొద్దుటూరు క్రైం : బెంగళూరు–హైదరాబాద్ జాతీయ రహదారిపై కర్నూలులో జరిగిన బస్సు దగ్ధం ఘటన ప్రమాదం కాదని, ముమ్మాటికీ ప్రభుత్వ హత్యలేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ధ్వజమెత్తారు. ప్రొద్దుటూరులోని తన క్యాంపు కార్యాలయంలో ఆదివారం మీడియాతో మాట్లాడారు. ప్రభుత్వం, అధికారుల నిర్లక్ష్యం వల్లే నిండు ప్రాణాలు మంటల్లో కలిసిపోయాయని, కూటమి ప్రభుత్వం 20 మంది ప్రయాణికులను అన్యాయంగా పొట్టనపెట్టుకుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ దుర్ఘటనలో సీఎం చంద్రబాబే ప్రఽథమ ముద్దాయని ఆయన దుయ్యబట్టారు. రాష్ట్రంలో ఏరులై పారుతున్న మద్యమే ఈ ప్రమాదానికి కారణమని మండిపడ్డారు. జాతీయ రహదారి సమీపంలోని బెల్ట్షాపులో మద్యం తెల్లవారుజామునే అమ్మడంపై ప్రభుత్వం, అధికారులే బాధ్యత వహించాలన్నారు. ఆదాయమే లక్ష్యంగా రాష్ట్రంలో ఏటీఎం (ఎనీ టైం మందు) తరహాలో మద్యం అమ్మకాలు చేస్తూ ప్రభుత్వమే ప్రజల ప్రాణాలను హరిస్తోందన్నారు. ఫిట్నెస్ సహా ఏ అనుమతులూ లేకుండా జాతీయ రహదారిపై బస్సు తిరగడం అధికారుల ఉదాసీనతకు నిదర్శనమని పేర్కొన్నారు. శ్రీరాష్ట్రంలో మద్యం పాలసీ సక్రమంగా లేదని మేం ఎన్నిసార్లు చెప్పినా ఈ ప్రభుత్వానికి దున్నపోతు మీద వర్షం కురిసినట్లుగా ఉంది. నకిలీ మద్యం, విపరీతంగా బెల్టు షాపులతో ప్రజల ప్రాణాలను హరిస్తున్నారుశ్రీ అని దుయ్యబట్టారు. ఈ ఘటనతో పాటు మద్యం వల్ల ఇకపై ఏ ప్రమాదం జరిగినా అది ప్రభుత్వ నిర్లక్ష్యంగానే భావించి డిజిటల్ బుక్లో నమోదు చేస్తానన్నారు. వీటిని హత్యలుగా భావించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం రాగానే కేసులు నమోదు చేసి, చట్టప్రకారం కఠిన శిక్షలు విధిస్తామని స్పష్టం చేశారు. -
శైవ క్షేత్ర సమాహారం పుష్పగిరి
వల్లూరు : త్రిమూర్తుల్లో ఒకరుగా , భక్తులు కోరిన కోర్కెలను తీర్చే భోలా శంకరునిగా ప్రఖ్యాతి గాంచిన పరమ శివుడు ఒక్కో క్షేత్రంలో ఒక్కో పేరుతో పిలువ బడుతూ భక్తులకు దర్శనమిస్తుండడం పరిపాటి. దాదాపు ప్రతి చోట లింగాకారంలోనే ఆయన దర్శనమిస్తూ భక్తులను అనుగ్రహిస్తుంటాడు. అరుదుగా ఒకటి రెండు చోట్ల మాత్రమే ఉమా శంకరుడుగా, ఉమా మహేశ్వరుడుగా విగ్రహ రూపంలో కనిపిస్తాడు. అయితే పుష్పగిరిలో మాత్రం పరమ శివునికి విశిష్ట స్థానం వుంది. శివ కేశవ అభేద క్షేత్రమైన పుష్పగిరిలో ప్రసిద్ధి గాంచిన అనేక శివాలయాలు మనకు దర్శనమిస్తాయి. అందులో శంకరుడు ఒక్కో ఆలయంలో ఒక్కో పేరున పిలువ బడుతూ భక్తులచే పూజలందుకుంటుండడం విశిష్టత సంతరించుకుందని చెప్పవచ్చు. 108 శివలింగాలు.. పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి 108 శివలింగాల ప్రతిష్టితంగా పేరుగాంచింది. ఎన్నో ఆలయాలకు నెలవై ఆలయ నగరిగా పేరుగాంచిన ఈ క్షేత్రంలో ప్రాచీన కాలంలో ఒక చోళరాజు 108 శివలింగాలను ప్రతిష్టించి పూజలు నిర్వహించాడని ప్రతీతి. ఇక్కడ ఇప్పటికీ కనిపిస్తున్న ఎన్నో శిథిలమైన ఆలయాలు, లింగాలు, వృషభ విగ్రహాలు, శిల్పాలు, పాను పట్టాలు దీనికి బలాన్ని చేకూరుస్తున్నాయి. పుష్పగిరి గ్రామంలో వైద్యనాథేశ్వరుని ఆలయ ప్రాంగణంలో త్రికుటేశ్వర స్వామి, భీమలింగేశ్వర స్వామి, ఉమామహేశ్వర స్వామి, భీమేశ్వర స్వామి మొదలైన శివాలయాలు ప్రశస్తి గాంచాయి. కొండపైన శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయ ప్రాంగణంలో సాక్షి మల్లేశ్వర , సంతాన మల్లేశ్వర ఆలయాలతో బాటు రుద్రపాద ఆలయాలు భక్తుల కొంగుబంగారంగా నిలుస్తున్నాయి. శ్రీరామ చంద్రునిచే పూజలందుకున్న వైద్య నాథేశ్వరుడు..పురాణ పురుషుడైన శ్రీ రామ చంద్రుడు సాక్షాత్తూ తన చేతుల మీదుగా పూజలు చేసిన శివలింగంగా పుష్పగిరిలోని వైద్యనాథేశ్వరుడు ప్రశస్తిగాంచాడు. వనవాసంలో సీతను అపహరించిన రావణుని సంహరించేందుకు లంకకు వెళుతూ శ్రీరాముడు ఈ ప్రాంతంలో కొంత కాలం వున్నాడు. ఆయన ప్రతి రోజూ ఇక్కడి వైద్యనాథున్ని పుష్పాలతో పూజించేవాడు. ఈ సందర్భంలో ముందు రోజు పూజకు ఉపయోగించిన పూలను తీసి ఇక్కడి పెన్నా నదిలో వేసేవారు. ఆ పూల రాశి క్రమంగా కొండంత పెరిగి నీటిలో తేలియాడింది. దీంతో పుష్పగిరి అనే పేరు వచ్చిందని ఒక కథ ప్రచారంలో వుంది. త్రికుటేశ్వర స్వామి ఆలయం..వైద్యనాథ ఆలయ సముదాయంలో వాయువ్యాన మూడు శివుని ఆలయాల సమూహమైన త్రికుటేశ్వర స్వామి ఆలయం వుంది. ఇక్కడ తూర్పు ముఖంగా వున్న గుడిలో దేవతా మూర్తిని త్రికుటేశ్వరుడని, దక్షిణ ముఖంగా ఉన్న గుడిలోని దేవతా మూర్తిని భీమేశ్వరుడని, ఉత్తర ముఖంగా వున్న గుడిలోని దేవతా మూర్తిని ఉమా మహేశ్వరుడని ిపిలుస్తారు. త్రికుటేశ్వర స్వామి ఆలయానికి తూర్పు వైపున భీమ లింగేశ్వర ఆలయం వుంది. వైద్యనాథ ఆలయం ప్రాంగణంలోనే నైరుతి మూలన తూర్పు ముఖంగా రాఘవేశ్వరాలయం వుంది. ప్రస్తుతం ఈ ఆలయంలో శివ లింగం ఏమైందో తెలియడం లేదు. పుష్పగిరి కొండపైన ఆలయాలుపుష్పగిరి కొండపైన గల శ్రీ చెన్నకేశవ స్వామి ఆలయ సముదాయంలో చెన్నకేశవ, సంతాన మల్లేశ్వర, ఉమా మల్లేశ్వర ఆలయాలు మూడూ ఒకే ముఖ మండపాన్ని కలిగి వుండడం విశేషం. ఇక్కడి సంతాన మల్లేశ్వర ఆలయంలో శివుడు లింగ రూపంలో దర్శనమిస్తున్నాడు. ఉమా మహేశ్వర ఆలయంలో పరమేశ్వరుడు వృషభారూఢుడై పార్వతీ దేవి (ఉమ) తో కూడి ఉమా మహేశ్వరుడుగా విగ్రహ రూపంలో వుంటాడు. చెన్న కేశవ ఆలయ ప్రాంగణంలో ఈశాన్యంలో సాక్షి మల్లేశ్వర ఆలయం వుంది. రుద్రపాద ఆలయంకొండపై చెన్నకేశవ ఆలయ ప్రధాన గోపుర ద్వారానికి దక్షిణం వైపున రుద్ర పాద ఆలయం వుంది. నీటిపై తేలుతున్న కొండను త్రిమూర్తులైన విష్ణు , ఈశ్వర, బ్రహ్మలు ముగ్గురూ తలో చోట తొక్కి పట్టి అణిచారని ఒక కథ ప్రచారంలో వుంది. ఆ సందర్భంగా ఏర్పడిన శివుని పాదమే ఈ రుద్రపాదమని భక్తుల విశ్వాసం. చెన్న కేశవ ఆలయ ప్రాంగణానికి కుడి వైపున కమలా శాంభవేశ్వర ఆలయ సముదాయం వుంది. శిథిలమైన ఈ ఆలయ సముదాయాన్ని ఇటీవలే పునరుద్ధరించారు. ఇందులోని ఒక ఆలయంలో పంచలింగాలతో కూడిన విగ్రహం వుంది. మరో ఆలయంలో శివ లింగం వుంది. చెన్న కేశవ ఆలయ ప్రాంగణ మెట్లకు కుడి వైపున కొండకు మలచబడ్డ ఆలయంలో పాపవినాశేశ్వరుడు వున్నాడు. కొండపై దుర్గమ్మ ఆలయం సమీపంలో ఉమామహేశ్వర ఆలయం వుంది. ఇంద్రనాథేశ్వర ఆలయం..పెన్నా నదికి ఉత్తరం వైపున కొండ భాగంలో పశ్చిమంలో చింతలపత్తూరు వద్ద ఇంద్ర నాథేశ్వర ఆలయం వుంది. పుష్పాలేశ్వర ఆలయం..పుష్పగిరి కొండపై శిఖరాగ్రాన పుష్పాచలేశ్వర స్వామి ఆలయం వుంది. కాల క్రమంలో శిథిలావస్థకు చేరిన ఈ ఆలయ పునరుద్ధరణకు కొందరు భక్తులు తమ శాయ శక్తులా కృషి చేస్తున్నారు. దక్షిణ కాశిగా ఖ్యాతి..పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలో గ్రామానికి కొండకు మధ్య ప్రవహిస్తున్న పవిత్ర పెన్నా నది కాశీలోని గంగా నది వలె దక్షిణ దిశగా ప్రవహిస్తూ తూర్పు దిశగా అర్థ చంద్రాకారంలో సాగిపోతుంది. దీంతో ఇది దక్షిణ కాశిగా ఖ్యాతి గడించింది. పరమ శివునికి ప్రీతిపాత్రమైన కార్తీక మాసం..కార్తీక మాసం పరమ శివునికి ఎంతో ప్రీతి పాత్రమైన మాసం. ఈ మాసంలోని సోమవారాలలో, పౌర్ణమి దినాన స్వామిని దర్శించుకుని, అభిషేకాలను నిర్వహించి పూజలు చేస్తే ఎంతో పుణ్యం లభిస్తుందని నమ్మకం. అందుకే భక్తులు ఈ సోమవారాలలో ఆలయాలను దర్శించి శివునికి పూజలు చేస్తారు. నేడు మొదటి కార్తీక సోమవారం కొండపైన వున్న శివ లింగం వైద్యనాథేశ్వర ఆలయ ప్రాంగణంలో నంది విగ్రహం సంతాన మల్లేశ్వర స్వామి మూల విరాట్ పుష్పగిరిలో ఒక్కరోజు ఉపవాసంతో వుండి ఆయా దేవతా మూర్తులను దర్శిస్తే విశేష ఫలం లభిస్తుందని, సూర్య గ్రహణ సమయంలో కానీ, అక్షయ తృతీయ రోజున కానీ సంకల్ప పూర్వకంగా ఇక్కడి పినాకినీ నదిలో స్నానమాచరించి శివకేశవులను దర్శిస్తే వంద అశ్వమేథ యాగాలు చేసిన ఫలం లభిస్తుందని నానుడి. వైశాఖ, కార్తీక, మాఘ మాసాలలో కానీ, మిగిలిన మాసాలలో ఏకాదశి, పౌర్ణమి రోజులలో పినాకినీలో స్నానమాచరిస్తే అనాయాసంగా కై వల్యం లభిస్తుందని పినాకినీ మహత్యం చెబుతోంది. -
నిర్లక్ష్యంగా బైక్ నడిపిన యువకుడిపై కేసు నమోదు
వేంపల్లె : నిర్లక్ష్యంగా మోటార్ బైక్ నడిపిన దర్బార్ అనే యువకుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శనివారం సాయంత్రం వేంపల్లెలోని పులివెందుల – గండి బైపాస్ రోడ్డులోని మదీనాపురం సమీపంలో దర్బార్ అనే యువకుడితో పాటు మరో ఐదుగురు యువకులు 3 మోటార్ బైకుల్లో అతివేగంగా, అజాగ్రత్తగా నడుపుతూ పెద్దగా శబ్దం చేయడంతో పాటు మోటార్ బైకు ముందు చక్రాలను లేపి వెనుక చక్రాలపై మోటార్ బైకు నడిపి ప్రజలను భయభ్రాంతులకు గురి చేశారన్నారు. ఈ నేపథ్యంలో మోటార్ బైకులను నడిపిన యువకులను, వారి తల్లిదండ్రులను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చినట్లు చెప్పారు. అలాగే వారిపై కేసు నమోదు చేసి మోటార్ బైకులపై చర్యలు తీసుకోవాలని పులివెందుల మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కు లేఖ రాసినట్లు పేర్కొన్నారు. విద్యుత్ షాక్తో మహిళ మృతి మైలవరం : మండల పరిధిలోని కర్మలవారిపల్లె గ్రామానికి చెందిన లక్ష్మీదేవి (56) కరెంటు షాక్తో మృతి చెందింది. ఆదివారం లక్ష్మీదేవి తాను ఉతికిన దుస్తులను ఇంట్లోనే ఆరబెట్టుకుంటుండగా కడ్డీలకు విద్యుత్ కనెక్షన్ తగలడంతో షాక్కు గురైంది. భర్త మాధవరెడ్డి భార్యకు కరెంటు షాక్ తగిలిందని భావించి కాపాడే ప్రయత్నం చేశాడు. అతను కూడా విద్యుత్ షాక్కు గురయ్యాడు. విద్యుత్ షాక్కు గురైన లక్ష్మీదేవిని వెంటనే ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యులు పరీక్షించి మరణించినట్లు ధృవీకరించారు. మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నట్లు తెలిపారు. ఆటోను ఢీకొన్న కారు కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి–కడప జాతీయ రహదారిపై ముద్దనూరు వైపు వెళ్లే ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలైనట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు సిద్దవటం మండలం ఎగువపేట గ్రామానికి చెందిన చంద్ర ఓబులేసు తన కుమారుడు శశి విఖ్యాత్కు మూర్ఛ వస్తుండటంతో కొండాపురం మండలంలోని దత్తాపురం గ్రామంలో వాయి బిళ్ల వేయించుకొనేందుకు వచ్చాడు. తిరిగి వెళ్లే క్రమంలో మార్గమధ్యంలో పెంజి అనంతపురం గ్రామ సమీపంలో తాడిపత్రి వైపు నుంచి వచ్చే కారు వెనుక నుంచి ఆటోను ఢీ కొంది. ఈ ఘటనలో నలుగురికి స్వల్ప గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తాడిపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
డ్రగ్స్ రహిత సమాజం కోసం నడుం బిగిద్దాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మత్తు పదార్థాలైన డ్రగ్స్, గంజాయి రహిత సమాజం కోసం అందరం కలిసికట్టుగా నడుం బిగిద్దామని జిల్లా ఎస్పీ నచికేత విశ్వనాథ్ తెలిపారు. ఆదివారం నగరంలోని జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీవైఎఫ్ఐ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో ముద్రించిన పోస్టర్లను జిల్లా ఎస్పీ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం సమాజంలో తెలిసీ తెలియని వయస్సులో యువత మత్తు పదార్థాలకు బానిసలు అవుతున్నారన్నారు. డ్రగ్స్, గంజాయి వాడినా, అమ్మినా నేరమని, దానికి కఠిన శిక్షలు ఉన్నాయన్నారు. యువత సన్మార్గంలో నడిచి జిల్లాకు మంచి పేరు ప్రఖ్యాతులు తీసుకురావాలని ఆకాంక్షించారు. డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ముడియం.చిన్ని, వీరణాల.శివకుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నగర కార్యదర్శి విజయ్, నగర ఉపాధ్యక్షుడు పెద్దన్న పాల్గొన్నారు వృద్ధురాలి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలాజీ నగర్కు ఈనెల 26వతేదీన తన కుమార్తె ఇంటికి రాజుపాలెం మండలం అర్కటవేములకు చెందిన గంటల నాగమ్మ(82)అనే వృద్ధురాలు వచ్చింది. ఆ తరువాత ఆమె కనిపించకుండా పోయిందని అల్లుడు వేణుగోపాల్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఆచూకీ తెలిసినవారు పోలీసులకుగానీ, వేణుగోపాల్ సెల్ నెంబర్: 80740 22422కు తెలియజేయాలని పోలీసులు కోరారు. చెరువులో వ్యక్తి గల్లంతు అట్లూరు : చెరువులో ప్రమాదవశాత్తు పడి వ్యక్తి గల్లంతైన ఉదంతం మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీలో జరిగింది. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు మండల పరిధిలోని బోడిశెట్టిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన కొండూరు ప్రభాకర్ (54) డప్పు కళాకారుడుగా జీవనం సాగిస్తున్నాడు. బోడిశెట్టిపల్లి గ్రామానికి చెందిన ఓ మహిళ మృతి చెందడంతో ఆదివారం ఆమె అంత్యక్రియలకు డప్పు వాయించేందుకు ప్రభాకర్ వెళ్లాడు. ఆ మహిళ అంత్యక్రియల అనంతరం ప్రభాకర్ ఇంటికి వస్తూ కాళ్లు, చేతులు కడుక్కొనేందుకు సమీపంలోని వేమలూరు చెరువులోకి దిగాడు. ప్రమాదవశాత్తు కాలు జారి చెరువులో పడిపోయి గల్లంతయ్యాడు. దీంతో అక్కడున్న వారు బంధువులకు సమాచారం ఇచారు. బంధువులు, స్థానికులు అక్కడికి చేరుకుని పోలీసులకు, తహసీల్దార్కు సమాచారం అందించారు. స్థానిక ఎస్ఐ రామకృష్ణ, ఆర్ఐ రమణ, వీఆర్ఓ సుబ్బన్న బద్వేలు అగ్నిమాపక సిబ్బందిని, గజ ఈతగాళ్లను పిలిపించి ఆదివారం చీకటి పడే వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడటంతో గజ ఈతగాళ్లు మళ్లీ ఉదయం గాలిస్తామని తెలిపారు. మృతునికి భార్యతోపాటు ఐదుగురు ఆడపిల్లలు కాగా, వారిలో ముగ్గురికి పెళ్లిళ్లు అయ్యాయి. జాతీయ స్థాయి అబాకస్లో సత్తా చాటిన నాగార్జున విద్యార్థులు కడప ఎడ్యుకేషన్ : జాతీయస్థాయి అబాకస్ పోటీలలో కడప నాగార్జున ఇంగ్లీష్ మీడియం స్కూల్ విద్యార్థులు తమ ప్రతిభను చాటారు. బెంగళూరులో ఆదివారం నిర్వహించిన జాతీయస్థాయి క్యూబాటిక్ అబాకస్ పరీక్షల్లో 5వ తరగతికి చెందిన తబితాశ్రేష్ఠ, 4వ తరగతికి చెందిన మోక్షజ్ఞలు ద్వితీయ బహుమతులను సాధించగా 5వ తరగతికి చెందిన భారతి తృతీయ బహుమతిని సాధించారు. అలాగే 6వ తరగతికి చెందిన రేయాన్ఖాన్, 5వ తరగతికి చెందిన మోక్షితారెడ్డి, 3వ తరగతికి చెందిన సోహిత్, లక్ష్మి కాస్వీరెడ్డిలు నాలుగో స్థానంలో నిలిచారు. మరో నాలుగు మెరిట్ బహుమతులను పొందారు. జాతీయస్థాయి అబాకస్ పోటీలో ప్రతిభ చాటిన విద్యార్థులను నాగార్జున స్కూల్ కరస్పాండెంట్ శివ తులశమ్మ, డైరెక్టర్ శివప్రసాద్రెడ్డి, హెచ్ఎం క్రిష్ణారెడ్డి, హెడ్మిసెస్ సుశీలదేవి అభినందించారు. కుటుంబ సభ్యులకు మహిళ అప్పగింత మైలవరం : మండల పరిధిలోని బుచ్చంపల్లి గ్రామానికి చెందిన మూడే తేజేశ్వరిని ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఆయన మాట్లాడుతూ తేజేశ్వరి జూన్ 19వ తేదీన భర్త కేశాలు నాయక్తో గొడవ పడి ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆ సమయంలో పక్కింటి వారితో ఉపాధి పనికి వెళుతున్నానని చెప్పి వెళ్లింది. అయితే ఇంటికి భార్య తిరిగి రాకపోవడంతో భర్త కేశాలు నాయక్ ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసిన ఎస్ఐ ప్రత్యేక బృందాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. శనివారం ఆచూకీ లభ్యం కావడంతో ఆదివారం కుటుంబ పెద్దలను పిలిపించి అప్పగించారు. -
పోలీసుల విధులపై అవగాహన కార్యక్రమం
కడప అర్బన్ : జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు పోలీసు అమర వీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం జిల్లా పోలీసు కార్యాలయంలో శ్రీఓపెన్ హౌస్శ్రీ ఎగ్జిబిషన్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏఆర్ డీఎస్పీ నాగేశ్వరరావు మాట్లాడుతూ పోలీసులు విధి నిర్వహణలో భాగంగా వినియోగించే ఆయుధాలు, దుస్తులు, పనిముట్ల, నేర దర్యాప్తు విధానం తదితర విషయాలను విద్యార్థులకు తెలిపేందుకే ఈ కార్యక్రమం చేపట్టామన్నారు. బాంబు డిస్పోజబుల్ టీం, ఫింగర్ ప్రింట్, పోలీసు కంట్రోల్ రూమ్, కమ్యూనికేషన్, నేర పరిశోధనలో ఉపయోగించే డాగ్ స్క్వాడ్ బృందాలు, ఆయుధాల విడి భాగాల సమాచారం గురించి ( ఏకే 47 , విల్ పిస్టల్, గ్లో 17, కార్బన్ , ఇన్సాస్ రైఫిల్, గ్యాస్ గన్, గ్రేనేడ్, సి.సి.టి.ఎన్.ఎస్, ఫోరెన్సిక్, ఆర్ఎఫ్ఎస్ఎల్ తదితర విషయాల గురించి విద్యార్థులకు వివరించారు. బాడీ వర్న్ కెమెరాలు, డ్రోన్ కెమెరా, వి. హెచ్. ఎఫ్ సెట్, రోబో డ్రెస్ను ప్రదర్శనలో ఉంచారు. వీటిని విద్యార్థులు ఆసక్తిగా తిలకించారు. నగరంలోని వివిధ స్కూళ్లకు చెందిన 400 మందికి పైగా విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆర్.ఐ శివరాముడు, ఆర్.ఎస్.ఐ లు స్వామినాయక్, అప్పలనాయుడు, రామస్వామిరాజు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
ముంచుకొస్తున్న మోంథా!
కడప అగ్రికల్చర్: జిల్లాకు మోంథా రూపంలో తుపాను గండం పొంచి ఉంది. ఇప్పటికే బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా జిల్లాలో నాలుగు రోజుల పాటు వర్షాలు ముంచెత్తాయి. చాలా వరకు పంటలు ఇంకా నీటిలోనే ఉన్నా యి. వరుస వానలతో జిల్లావ్యాప్తంగా 8682 ఎకరాల్లో వరి, పత్తి, వేరుశనగ, మొక్కజొన్న, మినుము పంటలు దెబ్బతిని రైతుల పెట్టుబడులు వర్షార్పణం అయ్యాయి. దీంతో రైతుల కష్టం నీళ్లపాలై లక్షల మేర నష్టం వాటిల్లింది. శని, ఆదివారాలు వర్షాలకు కాసింత తెరపి రావడంతో ఉపశనమం కలిగిందని సంతోషించే లోపే మళ్లీ సోమవారం నుంచి మోంథా తుపాన్ ఉందని అధికారులు ప్రకటించడంతో అన్నదాతల్లో గుబులు మొదలైంది. ఇప్పటికే జిల్లా అధికారులు పజల అప్రమత్తంగా ఉండాలని హెచ్చరించారు. జిల్లావ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలకు రెండు రోజుల పాటు సెలవులను కూడా ప్రకటించారు. అలాగే అత్యవసర సహాయ చర్యల కోసం కంట్రోల్ రూంలను ఏర్పాటు చేసి ఫోన్ నెంబర్లను కూడా ప్రకటించారు. వాతావరణ శాఖ ఈ నెల 27,28 తేదీలలో జిల్లాకు రెడ్ అలెర్ట్ను జారీ చేసింది. శని, ఆదివారాల్లో కేవీకేకు చెందిన శాస్త్రవేత్తలు గ్రామాల్లో పర్యటించి రైతులకు తగిన సూచ నలు చేశారు. వర్షం నుంచి పంటలను ఏవిధంగా కాపాడుకోవాలో సలహాలు అందించారు. ఇప్పటికే జిల్లాను ముంచెత్తిన వర్షాలు తాజాగా మోంథా రూపంలోతుపాను గండం వేలాది ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు అప్రమత్తంగా ఉండాలంటున్న జిల్లా అధికార యంత్రాంగం ఆందోళనలో జిల్లా రైతులు, ప్రజలు -
ప్రత్యేక బలగాలు సిద్ధం
● అత్యవసర పరిస్థితుల్లో డయల్ 112కు ఫోన్ చేస్తే తక్షణం సహాయక చర్యలు ● ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్: జిల్లాలో ’మోంథా’ తుఫాను నేపథ్యంలో జిల్లా పోలీసు శాఖ ఎలాంటి పరిస్థితినైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉందని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. జిల్లా పోలీసు హెడ్ క్వార్టర్స్ లో 3 ప్రత్యేక బృందాలతో పాటు ప్రతి పోలీసు సబ్ డివిజన్ లో ఒక రెస్క్యూ టీమ్ సిద్ధం చేశారు. సహాయక చర్యల్లో పాల్గొనే బృందాలకు అవసరమైన లైటింగ్ సామాగ్రి, లైఫ్ జాకెట్లు, టార్చ్ లైట్లు, సహాయచర్యలు నిమిత్తం తాళ్లు, బాటన్ లతో సంసిద్ధంగా ఉంచారు. నదులు, వాగులు, వంకల పరివాహక ప్రాంతాల్లో ముఖ్యంగా లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని ఎస్.పి పోలీసు అధికారులను ఆదేశించారు. అవసరమైన ప్రాంతాల్లో సహాయక శిబిరాలు, పునరావాస కేంద్రాలు గుర్తించి చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉధృతంగా ప్రవహించే నదీ పరీవాహక ప్రాంతాలలో ముమ్మరంగా గస్తీ నిర్వహించాలని ఆదేశించారు. ప్రయాణించేందుకు అనువుకాని మార్గాల్లో, నీట మునిగిన రహదారుల వద్ద బందోబస్తు ఏర్పాటు చేయాలని సూచించారు. నదుల్లో ఈత కొట్టేందుకు ఎవ్వరూ వెళ్లొద్దని ప్రజలను సూచించారు. -
మత్స్యకారులు చేపల వేటకు వెళ్లరాదు
కడప అగ్రికల్చర్: జిల్లాలోని మత్య్సకారులు నదులు, జలశయాలలోకి చేపల వేటకు వెళ్లరాదని జిల్లా మత్స్యశాఖ ఉప సంచాలకులు నాగయ్య తెలిపారు. అంతేకాకుండా మత్స్యకారులు తమకు సంబంధించిన వలలు, పుట్టీలు, ఇతర సామగ్రి సురక్షిత ప్రాంతాలలో ఉంచుకోవాలని సూచించారు. పరిసర ప్రాంతాల్లో వరద ఆపద సమయంలో ఉన్నప్పుడు రెవెన్యూ, పోలీసు శాఖ ఇతర ఏశాఖవారు పిలిచినా వారికి అందుబాటులో ఉండాలని సూచించారు. కడప అగ్రికల్చర్: జిల్లాలో రబీ సీజన్కు సంబంధించి సబ్సిడీ బుడ్డ శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ కార్యక్రమం ప్రారంభమైంది. తొలి రోజు ఆదివారం జిల్లావ్యాప్తంగా 14 మండలాల పరిధిలోని 95 రైతు సేవా కేంద్రాలలో 5801 మంది రైతులు శనగ విత్తనాల కోసం రిజిస్ట్రేషన్ చేసుకున్నారు. ఈ నెల28వ తేదీతో రిజిస్ట్రేషన్ ప్రక్రియ నిలిపేస్తారు. అనంతరం రైతులకు విత్తన పంపిణీ చేస్తారు. రైతులు ఈ అవకాశం వినియోగించుకోవాలని అధికారులు సూచించారు. కొండాపురం: గండికోట ప్రాజెక్టు నుంచి రెండు క్రస్ట్ గేట్లు ద్వారా 5 వేల క్యూసెక్కులనీటిని మైలవరం జలాశయానికి విడుదల చేశామని జీఎన్ఎస్ఎస్ఈఈ ఉమా మహేశ్వర్లు ఆదివారం తెలిపారు. ఎగువ ప్రాంతాల నుంచి వరదనీరు రావడంతో ఆవుకు రిజర్వాయర్ నుంచి 3 వేల క్యూసెక్కుల నీరు గండికోట ప్రాజెక్టుకు ఇన్ఫ్లో ఉందన్నారు. అనంతపురం జిల్లా పెద్దపప్పూరు మండలం లోని చాగల్ల రిజర్వాయర్ నుంచి వేయ్యి క్యూసెక్కులనీటిని పెన్నానదికి వదలడంతో గండికోట జలాశయంలోకి రాత్రి వచ్చి చేరుతాయన్నారు. ప్రస్తు తం గండికోట జలాశయం పూర్తినీటిసామర్థ్యం 26.85 టీఎంసీలు ఉండగా ప్రస్తుతం 26.3 టీఎంసీలు నీరు నిల్వ ఉంది. ఈ నేపథ్యంలో 5 వేల క్యూసెక్కులనీటిని ఆదివారం సాయంత్రం దిగువకు వదిలినట్లు వెల్లడించారు. -
మోంథాను ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలి
కడ సెవెన్రోడ్స్: మోంథా‘తుఫాన్ నేపథ్యంలో జిల్లాలో ఈ నెల 27,28వ తేదీలలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, దీనిని ఎదుర్కొనేందుకు అధికారులు పూర్తి సన్నద్ధంగా ఉండాలని ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ అధికారులను ఆదేశించారు. తుపాన్ను ఎదుర్కొనేందుకు తీసుకుంటున్న చర్యలపై ఆదివారం అదితిసింగ్ జిల్లా అధికారులు, ఆర్డీవోలు, మండల అధికారులతో టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తుఫాన్ నేపద్యంలో అధికారులందరూ అప్రమత్తంగా ఉంటూ విధులను బాధ్యతాయుతంగా నిర్వర్తించాలన్నారు. తుపాన్ ప్రభావం వల్ల జిల్లాలో ఎక్కడా కూడా ప్రాణ నష్టం, పశు నష్టం, ఆస్తి నష్టం జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. మండలాల ప్రత్యేక అధికారులు మండల స్థాయి లోని అధికారులను సమన్వయం చేసుకొని లోతట్టు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాల్లో పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. పునరావాస కేంద్రాలలో అవసరమైన అన్ని చర్యలు చేపట్టే విషయంలో ఆర్డీఓ పూర్తి స్థాయిలో పర్యవేక్షించాలన్నారు. గుర్తించిన పునవాస కేంద్రాలలో మౌలిక వసతులు, త్రాగు నీరు,ఆహార సరఫరా, విద్యుత్,వైద్య సేవలు అందించాలన్నారు. ప్రమాదకర స్థాయిలో వాగులు,వంకలు పొంగే ప్రాంతాల వైపు ప్రజలు వెళ్ల కుండా సిబ్బంది ముందస్తు చర్యలు తీసుకోవాలనన్నారు. వైద్య ఆరోగ్య శాఖాధికారులు, సిబ్బంది 24 గంటలు వైద్య సేవలు అందించేందుకు పూర్తి స్థాయిలో సన్నద్ధంగా ఉండాలనన్నారు. భారీ వర్షాల వల్ల అన్ని గ్రామాల్లో మంచినీరు, పారిశుధ్యంపై జిల్లా పంచాయతీ అధికారి, మున్సిపాలిటీల్లో మున్సిపల్ కమీషనర్లు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పంటలను కాపాడుకునే చర్యలతో పాటు.. చేతికందిన పంట దాన్యాన్ని గోడౌన్లలో భద్రపరుచుకోవాలన్నారు. అత్యవసర సహాయ చర్యలను అందించేందుకు. జిల్లా కలెక్టరేట్ కార్యాలయంతో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో కంట్రోల్ రూమ్ లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. 27,28వ తేదీల్లో భారీ వర్షాలకు అవకాశం! పునరావాస కేంద్రాలకు లోతట్టు ప్రజలు ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్ కడప సెవెన్రోడ్స్: మోంథా తుఫాను నేపథ్యంలో జిల్లా యంత్రాంగం కట్టుదిట్టమైన సహాయక చర్యలు అందించేందుకు అప్రమత్తంగా ఉందని.. భయభ్రాంతులను చేసే పుకార్లను నమ్మకుండా.. ప్రశాంతంగా ఉండాలని ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ ప్రజలకు సూచించారు. ప్రభుత్వం నిర్వహణలో 24/7 పనిచేసే టోల్ ఫ్రీ నెంబర్లు : 112, 1070, 1800 425 0101 లకు కాల్ చేయవచ్చని ఇంచార్జి కలెక్టర్ తెలిపారు. -
●రూ.970 కోట్లను ఎగ్గొట్టి..
కడప కార్పొరేషన్: ఎంఎస్ఎంఈలపై కూటమి ప్రభుత్వం చిన్నచూపు చూస్తోంది. మాటల్ని వల్లె వేస్తూ చిన్న పారిశ్రామికవేత్తల నోట్లో మట్టి కొడుతోంది. పరిశ్రమల ప్రోత్సాహకాలు అందిస్తున్నామని గొప్పగా చెబుతూనే నిధుల విడుదలలో మెలికలు పెడుతోంది. దీపావళి కానుకగా రూ.1500 కోట్లు తొలి విడతగా ప్రోత్సాహకాలు అందిస్తున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆర్భాటంగా ప్రకటించారు. ఈ ప్రోత్సాహకాలు అందరికీ కాదు...కొందరికే పడ్డాయని పారిశ్రామిక వేత్తలు వాపోతున్నారు. తమకు ప్రోత్సహకాలు పడతాయా....పడవా...పడకపోతే తమ పరిస్థితి ఏంటని చాలా మంది అధికారులను ఆరా తీస్తున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం ఏ ప్రాతిపదికన ఎవరికి ప్రోత్సాహకాలు ఇస్తుందో పరిశ్రమల శాఖ అధికారులకు కూడా తెలియని అయోమయ పరిస్థితి నెలకొంది. ‘ఎంఎస్ఎంఈలను ఆదుకుంటాం...రూ.5వేల కోట్లు బకాయిలన్నీ పూర్తిగా చెల్లించేందుకు చర్యలు తీసుకుంటామని, ఎంఎస్ఎంఈలకు అధిక ప్రాధాన్యత ఇస్తా’మని మంత్రులు, అధికారులు ఇన్నాళ్లు చెబుతూ వచ్చారు. తీరా ప్రోత్సాహకాల విడుదలకు దగ్గరికి వచ్చేసరికి ఎంఎస్ఎంఈలకు ఎంగిలి మెతుకులు విదిల్చి భారీ పరిశ్రమలపై మమకారం కనబరిచారని విమర్శలు వినిపిస్తున్నాయి. ● రాష్ట్ర వ్యాప్తంగా 15,822 యూనిట్లకు రూ.1916. 74కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. చిన్న పరిశ్రమలకు ప్రోత్సాహకాల రూపంలో సకాలంలో సాయమందిస్తే అవి నిలదొక్కుకునే అవకాశం కలుగుతుంది. ఎక్కువమందికి ప్రయోజనం చేకూరుతుంది కూడా. అభివృద్ధిని కాంక్షించే ఏ ప్రభుత్వమైనా ఎంఎస్ఎంఈలకే ఎక్కువ నిధులు కేటాయిస్తుంది, కానీ కూటమి ప్రభుత్వం అందుకు విరుద్ధంగా కేవలం 2538 యూనిట్లే అర్హత సాధించినట్లు పేర్కొంటూ అతితక్కువగా రూ. 275.47కోట్లు మాత్రమే విడుదల చేసింది. అలాగే భారీ, మెగా పరిశ్రమల్లో 182 యూనిట్లకు రూ. 694.44కోట్లు అత్యధికంగా విడుదల చేయడం గమనార్హం. దీనిద్వారా ఎంఎస్ఎంఈల కంటే తమ ప్రభుత్వానికి బడా పారిశ్రామిక వేత్తలు, కార్పొరేట్ శక్తుల ప్రయోజనాలే ముఖ్యమని చెప్పకనే చెప్పినట్లయ్యిందని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఎస్టీ, ఎస్టీల రాయితీల్లో భారీగా కోత ఎస్సీ, ఎస్టీలను పారిశ్రామికవేత్తలుగా తీర్చిదిద్దుతామంటూ ప్రగల్భాలు పలికే ప్రభుత్వాలు ఆచరణలో వారికి చేసేది శూన్యమని మరోసారి నిరూపితమయ్యింది. భారీ పరిశ్రమలకు ఎక్కువగా ప్రోత్సాహకాలు అందించిన ప్రభుత్వం, సూక్ష్మ, చిన్న, మధ్య తరహా పరిశ్రమలు, ముఖ్యంగా ఎస్సీ,ఎస్టీ పారిశ్రామిక వేత్తలకు రాయితీల్లో భారీగా కోత కోసినట్లు సమాచారం. ఇతర సామాజిక వర్గాలతో పోల్చితే ఎస్సీ, ఎస్టీలకు ఆర్థిక స్తోమత అంతంత మాత్రంగానే ఉంటుంది. ప్రభుత్వం ప్రోత్సాహకాలు అందిస్తుందన్న నమ్మకంతో జీవితాంతం కూడబెట్టుకున్న సంపాదనను, అప్పులు సప్పులు చేసిన తెచ్చిన మొత్తాన్నంతా పరిశ్రమల్లో పెట్టి అవి సక్రమంగా నడవక ఎంతోమంది ఇబ్బందులు పడుతున్నారు. బ్యాంకులకు ఈఎంఐలు సకాలంలో చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. కొంతమందైతే యూనిట్లు ప్రారంభించిన కొద్ది నెలలకే మూతేసుకున్న పరిస్థితి ఉంది. ప్రభుత్వం మానవత్వం వ్యవహరించి దరఖాస్తు చేసుకున్న అందరికీ 100 శాతం ప్రోత్సాహకాలు అందించాలని పలుసార్లు ప్రభుత్వానికి విన్నవించారు. ఇటీవల విజయవాడలో ఆందోళన కూడా నిర్వహించారు. తమకు వ్యతిరేకంగా గళమెత్తారన్న అక్కసుతోనే ప్రోత్సాహకాల విడుదలలో ఎస్సీ, ఎస్టీలకు భారీగా కోత విధించినట్లు పారిశ్రామిక వేత్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో అతి కొద్దిమందికి మాత్రమే ప్రోత్సాహకాలు 20 శాతం మాత్రమే జమ అయ్యాయని తెలుస్తోంది. పారిశ్రామిక ప్రోత్సాహకాల విడుదలలో కూటమి ప్రభుత్వం నమ్మించి మోసం చేసిందని పారిశ్రామిక వేత్తలు మండిపడుతున్నారు. ఏ ఏడాది ప్రోత్సాహకాలు అదే ఏడాది ఇచ్చేస్తాం...ఇందుకోసం ప్రత్యేకంగా ఎస్క్రో అకౌంట్ తెరిచి మరీ బకాయిలు లేకుండా చేస్తామని హామీ ఇచ్చిన ప్రభుత్వం... ఇచ్చిన మాట నిలబెట్టుకోలేదని వారు అంటున్నారు. పారిశ్రామిక ప్రోత్సాహకాల కోసం ప్రభుత్వం బ్యాంకుల నుంచి రూ.2000కోట్లు రుణం తీసుకుంది. ఇందులో కేవలం రూ.1500 కోట్లు ప్రోత్సాహకాల కోసం విడుదల చేస్తున్నట్లు ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రకటించారు. మిగతా రూ.500కోట్లు కోత కోశారు. ఇస్తామని ప్రకటించిన రూ.1500 కోట్లలో కూడా విడుదల చేసింది కేవలం రూ.1030 కోట్లేనని... ఇందులో కూడా రూ.470 కోట్లు కోత విధించారని చెబుతున్నారు. మొత్తంగా రూ.970 కోట్లు ప్రోత్సాహకాలు ఇవ్వకుండా ఎగ్గొట్టారని తెలుస్తోంది. బస్సులకు సంబంధించి 306 యూనిట్లకు రూ.56కోట్లు మాత్రమే విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లాకు సంబంధించి 1935 యూనిట్లకు 150.71 కోట్లు ప్రోత్సాహకాలు రావాల్సి ఉంది. ఇందులో బస్సులు, ఇతర వాహనాలు అన్నీ ఉన్నాయి. అయితే కొందరికి 40 శాతం, మరికొందరికి 20 శాతం ప్రోత్సాహకాలు ఖాతాల్లో జమ అయినట్లు తెలుస్తోంది. చాలామందికి అసలే పడలేదని సమాచారం. -
● భారీ వర్షాల సమయంలో తీసుకోవలసిన జాగ్రత్తలు
మోంథా తుపాన్ వల్ల ఈ నెల 27, 28, 29 తేదీల్లో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు. ● అత్యవసరమైతే తప్పా బయటకు వెళ్లకండి. ● నీటితో నిండిన రహదారులు, వంతెనలు దాటేందుకు ప్రయత్నించవద్దు. ● విద్యుత్ తీగలు, పోల్లు తాకరాదు, వాటికి దగ్గరగా కూడా వెళ్లవద్దు. ● ఇళ్ల చుట్టుపక్కల నీరు నిల్వ ఉండకుండా డ్రైనేజ్ సదుపాయాలను శుభ్రం చేసుకోండి. ● చిన్న పిల్లలు, వృద్ధులు బయటకు వెళ్లకుండా జాగ్రత్తపడండి. ● నదులు, వాగులు పొంగిపొర్లే అవకాశం ఉన్నందున తీర ప్రాంతాల వద్దకు వెళ్లకండి. ● వరద నీరు ఇళ్లలోకి చేరే అవకాశం ఉంటే, ముందుగానే సురక్షిత ప్రదేశాలకు తరలించండి. ● పశువులను ఎత్తైన ప్రదేశాలకు తరలించండి. ● పిడుగు సమయంలో చెట్ల కింద లేదా ఓపెన్ ప్రదేశాల్లో నిలబడి ఉండవద్దు. ● మొబైల్ ఫోన్, ల్యాప్టాప్, టీవీ వంటి ఎలక్ట్రానిక్ పరికరాల వినియోగాన్ని ఆపండి. ● పిడుగు సమయంలో నీటిలో ఉండవద్దు చేపలు పట్టడం లేదా స్నానం చేయడం మానుకోండి. ● ప్రజలు కూడా అప్రమత్తంగా ఉండి పోలీసు, రెవెన్యూ, అగ్నిమాపక శాఖ అధికారుల సూచనలను తప్పనిసరిగా పాటించవలసిందిగా కోరడమైనది. ● భారీవర్షాలకు సంబంధించి ఏదైనా అవాంఛనీయ సంఘటనలు ఎదురైతే ఈ క్రింద తెలిపిన కంట్రోల్ రూమ్ నంబర్లకు లేదా డయల్ 112 కు గాని ఫోన్ ద్వారా తెలియ జేయాలని జిల్లా ఇంచార్జి కలెక్టర్ సూచించారు. ● జిల్లా కలెక్టరేట్ కార్యాలయం, కడప కంట్రోల్ రూమ్ :08562 – 246344 ● ఆర్డీవో కార్యాలయం,కడప: 08562– 295990 ● ఆర్డీవో కార్యాలయం, జమ్మలమడుగు : 95028 36762 ● ఆర్డీవో కార్యాలయం, బద్వేలు : 6301432849 ● ఆర్డీవో కార్యాలయం, పులివెందుల : 8919134718 -
ఆర్టీసీ బస్సుకు తప్పిన పెను ప్రమాదం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని రైల్వే స్టేషన్కు వెళ్లె క్రాస్ వద్ద ఆర్టీసీ బస్సుకు శనివారం పెను ప్రమాదం తప్పింది. ఆర్టీసీ బస్సు క్రాస్ రోడ్డు వద్ద మలుపు తిరుగుతుండగా వెనుక విద్యుత్ స్తంభానికి ఆనుకుని వచ్చింది. కొద్దిగా ఆదమరిచి ఉంటే విద్యుత్ స్తంభం తగిలి పెద్ద ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు భయపడ్డారు. ఈ క్రాస్ వద్ద రోడ్డును ఆనుకొని దుకాణాలు, తోపుడు బండ్లు అడ్డంగా ఉంటాయి. వాహనాల రాకపోకల్లో ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ఇప్పటికై నా అధికారులు స్పందించి క్రాస్ రోడ్డులోని అడ్డంకులను, ఆక్రమణలను తొలగించి ప్రమాదాలను నివారించాలని స్థానికులు కోరుతున్నారు. వర్షానికి కూలిన మట్టి మిద్దె వేంపల్లె : వేంపల్లె పట్టణం 12వ వార్డు జెండామాను వీధిలో ఉన్న మాబు ఖాతున్కు చెందిన మట్టి మిద్దె గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు కూలింది. ప్రమాదం తప్పడంతో బాధితులు ఊపిరి పీల్చుకున్నారు. బాధితురాలు మాట్లాడుతూ శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో మిద్దె కూలిందన్నారు. వస్తువులు ధ్వంసం కావడంతో దాదాపు రూ.50 వేలు నష్టం జరిగిందన్నారు. -
నేనూ జింకా రవి బాధితుడినే
ప్రొద్దుటూరు : గుర్రప్పస్వామి ఆటో ఫైనాన్స్ నిర్వాహకుడు జింకా రవి బాధితుల వరుసలో తాను కూడా ఉన్నానని జమ్మలమడుగు మున్సిపాలిటీలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్న జె.ప్రసాద్ తెలిపారు. 2016లో తాను రూ.50వేలు తీసుకుని చెల్లించానన్నారు. తాను తీసుకున్న సమయంలో రూ.50వేలుకు బాండు రాయించుకోవడంతోపాటు సమయానికి వడ్డీ చెల్లించలేనని మూడు ఖాళీ చెక్కులు తీసుకున్నాడన్నారు. సమయం ప్రకారం తాను అసలు, వడ్డీ చెల్లించానని, బదిలీలో భాగంగా మైదుకూరుకు వెళ్లానన్నారు. 2017లో జింకా రవి రూ.5 లక్షలకు ఒక చెక్కు, రూ.8 లక్షలకు ఒక చెక్కు కోర్టులో ఫైల్ చేశాడన్నారు. మరో రూ.5లక్షల చెక్కును జింకా రవి బంధువు జింకా వెంకటసుబ్బయ్య కోర్టులో కేసు వేశాడన్నారు. గడువు ముగిసిన తర్వాత బాండు వెనుక అతనే జమ రాసుకుని కోర్టులో వేయడంతో సివిల్ కేసు ఫైల్ అయిందన్నారు. రూ.5లక్షలు, రూ.8లక్షలకు సంబంధించిన కేసులు కోర్టులో కొట్టివేశారని, మరో రూ.5లక్షలతోపాటు బాండ్ కేసు కోర్టులో నడుస్తోందన్నారు. పోలీసు ఉన్నతాధికారులు విచారణ జరిపి తమలాంటి బాధితులకు న్యాయం చేయాలని ఆయన కోరారు. ఐపీ దాఖలు చేయలేదు : తన ఇంటికి సంబంధించి తాను ఐపీ దాఖలు చేయలేదని దొరసానిపల్లెకు చెందిన జింకా రవి అనే వడ్డీ వ్యాపారి ఒక ప్రకటనలో తెలిపారు. సాక్షిలో ఇటీవల ప్రచురితమైన ‘ఖాళీ చెక్కులతో కాసుల బేరం’, ‘న్యాయం చేయండి’ వార్తలపై ఆయన స్పందించారు. అడ్వకేట్ ఫోర్జరీ సంతకాలతో ఐపీ దాఖలు చేసినట్లు తెలిసిందన్నారు. దీంతో తాను సీనియర్ సివిల్ జడ్జి కోర్టుకు విన్నవించగా కోర్టు వారు కేసును డిస్మిస్ చేశారని తెలిపారు. ఈ విషయంపై అడ్వకేట్పై క్రిమినల్ కేసు నమోదు చేయడంతోపాటు బార్ కౌన్సిల్లో ఫిర్యాదు చేశానని పేర్కొన్నారు. తన ఇంటిని ఎవరూ కొనలేదని, ఇప్పటికీ ఆ ఇంటిలో నివసిస్తున్నానని తెలిపారు. తాను ఉద్యోగులకు డబ్బులు ఇచ్చిన మాట వాస్తవమేనని, డబ్బు తీసుకున్న ఉద్యోగులు సమయానికి చెల్లించకపోవడంతోనే తాను లీగల్ నోటీసు జారీ చేసి కేసు వేశానని తెలిపారు. తనపై తప్పుడు ప్రకటనలు చేసిన వ్యక్తులపై చట్టప్రకారం చర్యలు తీసుకుంటానని తెలిపారు. -
నేడు విద్యుత్ బిల్లులు చెల్లింపునకు అవకాశం
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఈనెల 26వ తేది ఆదివారం సెలవుదినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూలు కేంద్రాలు యఽథాతథంగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈనెల 27న ఆర్చరీ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా ఆర్చరీ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ వీవీ జనార్దన్ రెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఎంపికలు డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. సబ్ జూనియర్స్ బాల బాలికలకు నిర్వహించే ఈ ఎంపిక ల్లో ఇండియన్, కాంపౌండ్, రికర్వ్ విభాగాలు ఉంటాయని వివరించారు. కడప అగ్రికల్చర్: జిల్లాకు శనివారం 2600 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చింది. సంబంధిత యూరియా రేక్ పాయింట్ను కడప మండల వ్యవసాయ అధికారి సురేష్కుమార్రెడ్డితో కలిసి జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ పరిశీలించారు. ఇందులో 2200 మెట్రిక్ టన్నులను వైఎస్సార్జిల్లాకు కేటాయించగా మరో 400 మెట్రిక్ టన్నులను అన్నమయ్య జిల్లాకు కేటాయించారు. ఈ సందర్భంగా జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేదన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి కార్యాలయ వ్యవసాయ విస్తరణ అధికారి సుధీర్, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: కలెక్టర్ ఆదేశాల మేరకు ఈ నెల 27వ తేదీ సోమవారం జిల్లా వ్యాప్తంగా అధిక వర్షపాతం కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో కలెక్టరేట్లో నిర్వహించవలసిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర్ నాయుడు శనివారం ఒక ప్రకటనలో తెలిపా రు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలు మీ కోసం డాట్ ఏపీ డాట్ జీఓవీ డాట్ ఇన్ వైబ్సెట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోనూ.. కడప అర్బన్: జిల్లా పోలీస్ కార్యాలయంలో ఈనెల 27న నిర్వహించవలసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని రద్దు చేస్తున్నట్లు జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ విషయాన్ని జిల్లా ప్రజలు గుర్తించాలని సూచించారు. కడప సెవెన్రోడ్స్: తనను సక్రమంగా విధులు నిర్వహించనీయకుండా కొందరు వ్యక్తులు ఇబ్బందులు సృష్టిస్తున్నారని స్టేట్ వేర్ హౌసింగ్ కార్పొరేషన్ కడప హెచ్అండ్టీ కాంట్రాక్టర్ ఆర్ఎన్ సంజీవరాయుడు శనివారం ఇన్చార్జి కలెక్టర్ అదితిసింగ్కు ఫిర్యాదు చేశారు. తమకు కాంట్రాక్టు దక్కలేదన్న కక్షతో కొందరు తనను పలు రకాలుగా ఇబ్బందులు పెడుతున్నారని ఆరోపించారు. ప్రతిరోజు ఏదో ఒక సమస్య సృష్టించి తన కాంట్రాక్టును తానే రద్దు చేసుకునేలా ఒత్తిడి చేస్తున్నారన్నారు. హమాలీలు పనిచేయకుండా ఆటంకం కల్పిస్తున్నారని చెప్పా రు. రోజూ తన విధులకు ఆటంకం కలిగిస్తున్నారని చెప్పారు. ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే తాము విధులను సక్రమంగా నిర్వర్తించలేమని పేర్కొన్నారు. ఏదైనా తమపైన ఆరోపణలు వస్తే తక్షణమే సంబంధిత అధికారులతో పరిశీలన చేయించాలని కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: కర్నూలులో జరిగిన బస్సు దుర్ఘటన నేపథ్యంలో జిల్లాలో రవాణా శాఖ అధికారులు శుక్ర, శనివారాల్లో ప్రైవేట్ ట్రావెల్ బస్సుల పై దాడులు చేశారు. 34 కేసులు నమోదు చేసినట్లు జిల్లా ఇన్చార్జ్ ఉప రవాణాశాఖ కమిషనర్ వీర్రాజు శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడపలో 10 బస్సు లపై, ప్రొద్దుటూరులో 9 బస్సులపై, బద్వేల్ లో 9 బస్సులపై, పులివెందులలో 6 బస్సులపై మొత్తం 34 కేసులు నమోదు చేశామని పేర్కొన్నారు. ఈ 34 కేసులలో అగ్ని ప్రమాద నివారణ పనిముట్లు లేని కారణంగా 19 బస్సులపై కేసు నమోదు చేశామన్నారు. నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న బస్సులపై నిఘా ఉంచి నత్యం తనిఖీలు చేపడతామని వివరించారు. ప్రైవేట్ బస్సులు అన్ని రకాల పత్రాలను సక్రమంగా ఉంచుకొని బస్సులను నడపాలని ఆదేశించారు. -
ఉత్సాహంగా బాస్కెట్ బాల్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో శనివారం నిర్వహించిన అండర్ 14,17 బాస్కెట్ బాల్ ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. ఈ ఎంపికలకు దాదాపు 150 క్రీడాకారులు పాల్గొన్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ చంద్రావతి పేర్కొన్నారు. దాదాపు 12 మంది వ్యాయామ ఉపాధ్యాయులు ఎంపికలను నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు ఇజ్రాయిల్, సుబ్బయ్య, గణేష్, విశ్వనాథ్, సుబ్బ మ్మ, ఉమా, సుభద్ర పాల్గొన్నారు. నేడు వాలీబాల్ ఎంపికలు నేడు నగరంలోని మాంటిస్సోరి పాఠశాలలో వాలీబాల్ ఎంపికలను నిర్వహిస్తున్నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరి చంద్రావతి పేర్కొన్నారు. క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు ఉదయం 9 గంటల లోపల హాజరు కావాలన్నారు. -
● శభాష్.. ఎస్ఐ!
కడప అర్బన్ : కడప టూ టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలో ఓ యువకుడు ఇంట్లో వారితో గొడవపడి ఆత్మహత్యా యత్నం చేశాడు. విషయం తెలుసుకున్న వెంటనే ట్రాఫిక్ ఎస్ఐ సకాలంలో అంబులెన్సు రప్పించి బాధితుడని ఆసుపత్రికి తరలించడంతో ప్రాణాలు దక్కాయి. వివరాలలోకి వెళితే..శుక్రవారం అర్ధరాత్రి 2 గంటల సమయంలో పెట్రోలింగ్ విధుల్లో ఉన్న కడప ట్రాఫిక్ ఎస్.ఐ జయరాముడు టూ టౌన్ పరిధిలో వెళుతున్న దారిలో జియారా ఫంక్షన్ హాల్ సమీపంలోని ఓ ఇంట్లో పీరుల్లా (29) అనే యువకుడు మద్యం మత్తులో ఇంట్లో వారితో గొడవపడి విష ద్రావణం తాగాడు. ఆపై ఇంట్లోని అద్దాన్ని చేతులతో పగులగొట్టడంతో చేతికి తీవ్ర గాయాలయ్యాయి. ఇంట్లో వారు చికిత్స కోసం రోడ్డుపై ఉండడాన్ని గమనించిన ఎస్.ఐ జయరాముడు వెంటనే 108 కు ఫోన్ చేసి అంబులెన్సును రప్పించి అతన్ని రిమ్స్కు తరలించారు. సకాలంలో వైద్య చికిత్స అందించేందుకు సహకరించిన ఎస్.ఐ జయరాముడుకు బాధితుడి కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.యువకుడికి సకాలంలో వైద్య సేవలు -
ట్రాక్టర్ కింద పడి బాలుడి మృతి
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక ఈశ్వరరెడ్డినగర్లోని ముక్తియార్ ఆయిల్మిల్ సమీపంలో నివాసం ఉంటున్న షేక్ మహీర్ (14) ప్రమాదవశాత్తు ట్రాక్టర్ కింద పడి మృతి చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మహీర్ శనివారం సాయంత్రం తన స్నేహితులతో కలిసి ఈశ్వరరెడ్డినగర్లోని బైపాస్రోడ్డులో ఆడుకుంటున్నాడు. అదే వీధిలో ఉంటున్న తెలిసిన వారి ట్రాక్టర్ వెళ్తుండగా తాను కూడా వస్తానని మహీర్ ట్రాక్టర్ ఇంజిన్ వద్ద ఎక్కి కూర్చున్నాడు. ఈ క్రమంలో రామేశ్వరం బైపాస్రోడ్డులోని రెండు కుళాయిల దారి వద్దకు వెళ్లగానే ప్రమాదవశాత్తు మహీర్ ట్రాక్టర్ చక్రాల కింద పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన అతన్ని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మహీర్ తండ్రి గైబూసా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ సీఐ రాజగోపాల్ తెలిపారు. సూది మందు వికటించి మహిళ మృతి బ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లె పంచాయతీ చెంచయ్యగారిపల్లెకు చెందిన బాలగాని రమాదేవి (45) అనే వివాహిత ఆర్ఎంపీ వేసిన ఇంజక్షన్ వికటించి మృతి చెందింది. స్థానికులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. గత వారం రోజులుగా రమాదేవికి ఆరోగ్యం సరిగా లేకపోవడంతో లింగాలదిన్నెపల్లె కాలనీలోని ఆర్ఎంపీ చిట్టిబాబు దగ్గరకు శనివారం సాయంత్రం వెళ్లింది. ఆయన ఆమెకు అలర్జీ ఉందని ఇంజక్షన్ వేశారు. కొద్ది సేపటికి నోట నురుగు రావడంతో భయపడి రమాదేవిని అక్కడే ఉంచి వైద్యశాలకు తాళం వేసి వెళ్లిపోయాడు. ఆమె కుటుంబ సభ్యులు ఇంకా రాలేదని ఆర్ఎంపీ వద్దకు వెళ్లారు. అక్కడ తలుపు వేసి ఉండడంతో కిటికీలో నుంచి చూడగా బల్లపై పడిపోయి రమాదేవి కనిపించింది. ఇంటికి వేసిన తాళాన్ని పగలకొట్టి లోపలికి వెళ్లి చూడగా అప్పటికే రమాదేవి మృతి చెంది ఉంది. ఇంజక్షన్ వల్లే మృతి చెందినట్లు బంధువులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బి.మఠం ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు మృతదేహాన్ని పరిశీలించారు. బి.మఠం పోలీసులు ఆర్ఎంపీ చిట్టిబాబును అదుపులోకి తీసుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంపీపీ సి.వీరనారాయణరెడ్డి, పంచాయతీ ఉపసర్పంచ్ కొండారెడ్డిలు మృత దేహాన్ని సందర్శించారు. -
అన్నమయ్య చెంతకు.. గోవిందుడు!
రాజంపేట: అదివో..అల్లదివో..శ్రీహరివాసం..బ్రహ్మకడిగిన పాదం..అంటూ సులువైన పదాలతో కీర్తనలు అలపించిన వాగ్గేయకారుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలిలో తాజాగా శ్రీ వెంకటేశ్వరస్వామి ఆలయం అందుబాటులోకి రానుంది. పర్యాటకులు,యాత్రికులు శ్రీవారి దర్శించుకునే అవకాశాన్ని తిరుమల తిరుపతి దేవస్ధానం(టీటీడీ) కల్పించింది. వైఎస్సార్సీపీ పాలనలో అన్నమయ్య జన్మస్థలం అభివృద్ధి దిశగా అడుగులు పడ్డాయి. ఫలితంగా శ్రీవారి ఆలయం నిర్మితమైంది. ఈ నెల 31 నుంచి నవంబర్ 3 వరకు శ్రీవారి విగ్రహప్రతిష్ట మహోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ సిద్ధమైంది. సాక్షి వరుస కథనాలు శ్రీవారి ఆలయం భక్తులకు అందుబాటులో లేకుండా పోయిందనే ఆవేదనపై సాక్షి వరుస కథనాలను ప్రచురించింది. ఈ మార్గంలో నిత్యం టీటీడీ ఉన్నతాధికారులు రాకపోకలు సాగిస్తున్న చూస్తూ పోతున్నారని, భక్తులకు శ్రీవారి ఆలయాన్ని అందుబాటులోకి తీసుకురావడంలో జాప్యం చేస్తున్నారనే కోణంలో కథనాలు ప్రచురించింది. అవి టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లాయి. ఎట్టకేలకు శ్రీవారి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవాలను తలపెట్టింది. 600 జయంత్యుత్సవాల నుంచి.. అన్నమాచార్యుని 600 జయంత్యుత్సవాలు అప్పటి పాలకమండలి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో జరిగాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహావిష్కరణకు విచ్చేసిన దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి ఈ ప్రాంతం అభివృద్ధికి సంబంధించి హామీలను ప్రకటించిన సంగతి తెలిసిందే. మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి మరణం తర్వాత అన్నమయ్య థీంపార్కు అభివృద్ధిని కాంగ్రెస్, టీడీపీ ప్రభుత్వాలు అటకెక్కించాయి. అప్పటి టీటీడీ పాలకమండలి తాళ్లపాక, అన్నమయ్య థీంపార్కు అభివృద్ధికి సంబంధించి నిధుల కేటాయింపులు చేయకపోవడం గమనార్హం. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో టీటీడీ చైర్మన్ వైవీసుబ్బారెడ్డి ఈ ప్రాంత అభివృద్ధిపై దృష్టి సారించారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కృషి ఫలితంగా చైర్మన్ థీంపార్కును సందర్శించారు. ఎన్నికల ముందు అప్పటి చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి హయాంలో మళ్లీ అన్న మయ్య జన్మస్థలి అభివృద్ధిపై దృష్టి సారించారు. అన్నమయ్య ఉద్యానవనంలో దశాబ్బంన్నర తర్వాత వైఎస్సార్సీపీ పాలనలో మళ్లీ శ్రీవారి ఆలయ నిర్మాణానికి బీజం పడింది. అప్పట్లో ఎంపిక చేసిన స్థలంలో ఆలయం నిర్మించారు. టీటీడీ రూ.కోటికిపైగా వ్య యం చేస్తోంది. ఈ మార్గంలో తిరుమలకు వెళ్లే దక్షిణభారత యాత్రికులు ముందుగానే అన్నమయ్య జన్మస్థలిలో శ్రీవారిని దర్శించుకోవడం మహాదానందగా భావిస్తున్నారు. ఆలయం నిర్మాణం పూర్తికావడంతో త్వరలో ప్రారంభానికి టీటీడీ సన్నద్ధం కావడం శుభపరిణామంగా భక్తులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఆలయం పూర్తి ఎట్టకేలకు శ్రీవారి ఆలయం ప్రారంభం ఈనెల 31 నుంచివిగ్రహప్రతిష్టమహోత్సవాలు ఆనందదాయకం అన్నమయ్య థీంపార్కులో శ్రీవారి ఆలయం నిర్మించి, విగ్రహప్రతిష్ట మహోత్సవాలు చేయడం శుభపరిణామం. ఈ మార్గంలో వెళ్లే యాత్రికులు, భక్తులు స్వామివారిని దర్శించుకునే విధంగా టీటీడీ వీలు కల్పించడం హర్షణీయం. శ్రీవారి ఆలయం అందుబాటులోకి తీసుకురావాలని టీటీడీ అధికారులను ఇదివరకే కోరాం. –చొప్పా గంగిరెడ్డి, ఏయూ అధినేత, రాజంపేట -
రూ.8 లక్షల విలువైన నగల బ్యాగు అప్పగింత
● ఆటోలో పోగొట్టుకున్న వృద్ధ దంపతులు ● సకాలంలో స్పందించిన పోలీసులుకడప అర్బన్ : రూ.8 లక్షల విలువైన బంగారు, వెండి నగలున్న బ్యాగును ఆటోలో మరచిపోయి వదిలేసి వెళ్లిన వృద్ధ దంపతులకు తిరిగి గంటలోపే వాటిని అప్పగించి కడప చిన్నచౌక్ పోలీసులు శభాష్ అనిపించుకున్నారు. వివరాల్లోకెళితే... శనివారం మధ్యాహ్నం 1 గంట సమయంలో కడప నగరం, శ్రీనగర్ కాలనీలో నివాసం ఉన్న దాసరి సంటెన్న(65), దాసరి గంగులమ్మ (60) దంపతులు వారి మనుమడితో కలిసి నంద్యాలలో ఉన్న తమ కుమారుడు డాక్టర్ రమేష్ ఇంటికి వెళ్లేందుకు ఇంటి వద్ద నుంచి ఆటోలో ఆర్టీసీ బస్టాండుకు బయలుదేరారు. ఆర్టీసీ బస్టాండ్లోకి వచ్చేసరికి అప్పటికే బస్టాండ్లో నంద్యాల వైపు వెళ్లే బస్సు సిద్ధంగా ఉండడంతో ఆ గాబరాలో బంగారాన్ని ఉంచిన తమ బ్యాగును ఆటో వెనుక భాగంలో వదిలి గబగబా ఆటో దిగి బస్సు ఎక్కారు. కొంతసేపటికి తమ బ్యాగును ఆటోలో మరిచిపోయిన విషయం వారు గ్రహించారు. వెంటనే ఆర్టీసీ బస్టాండ్ అవుట్ పోస్టులో విధులలో ఉన్న కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డిని ఆశ్రయించారు. కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డి ఈ విషయాన్ని చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎ.ఓబులేసు దృష్టికి తీసుకెళ్లగా ఆయన సిబ్బందిని అప్రమత్తం చేశారు. అధికారుల సూచనల మేరకు వెంటనే రంగంలోకి దిగిన కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డి, బ్లూకోల్ట్ సిబ్బంది ఆర్టీసీ బస్టాండ్ , పరిసర ప్రాంతాలలో ఉన్న సీసీ ఫుటేజ్లను పరిశీలించారు. సీసీ ఫుటేజ్ ద్వారా వచ్చిన ఆనవాళ్లను బట్టి ఆటోను పాతబైపాస్ రోడ్డులో గుర్తించి, ఆటో వెనుక భాగంలో బంగారంతో ఉన్న బ్యాగులోని మొత్తం 8 తులాల బంగారు, 15 తులాల వెండి ఆభరణాలను పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. వాటిని చిన్నచౌక్ సీఐ ఎ. ఓబులేసు బాధితులైన దాసరి సంటెన్న, దాసరి గంగులమ్మ దంపతులకు అప్పగించారు. తక్షణమే స్పందించిన కానిస్టేబుల్ రవిప్రకాష్ రెడ్డిని, బ్లూకోల్ట్ కానిస్టేబుల్ ప్రసాద్ రెడ్డి, హోమ్ గార్డ్ గురివిరెడ్డిని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, డీఎస్పీ వెంకటేశ్వర్లు అభినందించారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
కడప సెవెన్రోడ్స్: తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం ప్రాజెక్టుల జలాశయాలు, నదీ పరివాహక ప్రాంతాలు, చెరువులు, కాలువలపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై జిల్లా, క్షేత్ర స్థాయి అధికారులతో శనివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి నష్టం, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా అదితిసింగ్ మాట్లాడుతూ కాలువలు, కుంటలు, చెరువుల్లో యువకులు, పిల్లలు ఈతకు వెళ్లకుండా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా అధికారు లు మొదలు నియోజకవర్గ,మండల, సచివాలయ, గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించారు. గత వారం రోజులుగా కురుస్తున్న వర్షాల ధాటికి జిల్లాలోని కుందూ, పెన్నా పరివాహక ప్రాంతాలతో పాటు మరి కొన్ని ప్రాంతాల్లో పంటలు దెబ్బతిన్నాయన్నారు. అందుకు సంబంధించి అధికారులు పంట నష్టాన్ని ప్రాథమిక అంచనా వేస్తున్నారన్నారు. కొన్ని చోట్ల గ్రామీణ రోడ్లు, కొన్ని నిర్మాణాలు పాక్షికంగా దెబ్బతిన్నాయన్నారు. పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై రైతులను అప్రమత్తం చేయా లని వ్యవసాయ, ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ అంతరాయం అయితే వెంటనే పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. ముందస్తు జాగ్రత్తగా తాత్కాలిక షెల్టర్లను సిద్ధం చేసుకోవాలని మండల తహశీల్దార్లను ఆదేశించారు. సకాలంలో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని వైద్య ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారు. అత్యవసర సహాయ సమాచార నిమిత్తం కలెక్టరేట్లోని కంట్రోల్ రూంతో పాటు కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవో కార్యాలయాల్లో 24 గంటలు పని చేసేలా కంట్రోల్ రూమ్లు ఏర్పాటు చేశామని వెల్లడించారు. అధికారులను ఆదేశించినజిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ -
శుభపరిణామం
అన్నమాచార్యుల జన్మస్థలిలో శ్రీవారి ఆలయాన్ని భక్తు లకు అందుబాటులోకి తీసుకురావడం శుభపరిణామం. దివంగత సీఎం వైఎస్సార్ పాలనలో అన్నమయ్య 108 అడుగుల విగ్రహం ఏర్పాటు తరుణంలో శ్రీవారి ఆలయం నిర్మాణానికి బీజంపడింది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి చైర్మన్ వైవీ సుబ్బారెడ్డి అన్నమయ్య థీంపార్కును సందర్శించి, ఆలయ నిర్మాణం పూర్తిచేయాలని కోరారు. అలాగే పూర్తయింది. ఇప్పుడు భక్తులకు శ్రీవారి దర్శనభాగ్యం కలగనుంది. – అమర్నాథరెడ్డి, ఎమ్మెల్యే, రాజంపేట -
కుందూ నదిలో దూకిన వృద్ధ దంపతులు
● వృద్ధుడిని కాపాడిన స్థానికుడు ● వృద్ధురాలి కోసం గాలింపురాజుపాళెం : కలకాలం తోడుంటానని పెళ్లిలో మాట ఇచ్చిన ప్రకారం ఇప్పటివరకు ఏ కష్టమొచ్చినా వారు కలిసి ఉన్నారు. చివరకు కలిసే చనిపోవాలని నిర్ణయించుకొని ఇద్దరూ కుందూనదిలో దూకారు. ఈ సంఘటన శనివారం రాజుపాళెం మండలం వెల్లాల సమీపంలో జరిగింది. వివరాల్లోకి వెళితే... పెద్దముడియం మండలం ఉప్పులూరు గ్రామానికి చెందిన గొంగటి రామ సుబ్బారెడ్డి (81), గొంగటి మునెమ్మ (76) దంపతులు శనివారం ఉదయం రాజుపాళెం మండలం వెల్లాలలోని ఆలయాన్ని దర్శించుకున్నారు. అనంతరం నది వద్ద ఉన్న గంగమ్మకు పూజలు చేసి ఆ వృద్ధ దంపతులు నదిలోకి దూకారు. అయితే ఈ సంఘటనను చూసి అక్కడే ఉన్న స్థానికులు కేకలు వేయడంతో వెల్లాలకు చెందిన గుర్రప్ప అలియాస్ (శేషు) ప్రాణాలకు తెగించి వారిని కాపాడేందుకు కుందూ నదిలోకి దూకాడు. ఈ క్రమంలో రామసుబ్బారెడ్డిని ఎలాగోలా కాపాడి ఒడ్డుకు చేర్చగా నాగమునెమ్మ గల్లంతైంది. ఆమె ఆచూకీ కోసం ప్రొద్దుటూరు అగ్నిమాపక సిబ్బంది రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. గత రెండు రోజులుగా కురిసిన వర్షాలకు కుందూనదిలో భారీగా నీటి ప్రవాహం ఉండటంతో గాలింపు చర్యలకు ఇబ్బందిగా మారింది. ఫైర్ సిబ్బంది నది వద్దకు బోటును తీసుకొచ్చి గాలింపు చర్యలు చేపట్టాలని చూశారు. ఈ నీటి ఉధృతికి సాధ్యం కాలేదు. తహసీల్దార్ మనోహర రెడ్డి, ఎంపీడీఓ రామనాథరెడ్డి, ఆర్ఐ హుసేన్ రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని అందుకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ సంఘటనపై గొంగటి రామసుబ్బారెడ్డి ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రైనీ ఎస్ఐ నాగకీర్తి తెలిపారు. ఆ దంపతులకు ఇద్దరు కుమారులు కాగా ఒకరు టెలికాంలో ఉద్యోగం చేస్తుండగా మరొకరు వ్యాపారం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో ఇబ్బందులు పడుతున్నామని ఈ నేపథ్యంలో జీవితంపై విరక్తి చెంది ఆత్మహత్యకు యత్నించామని రామసుబ్బారెడ్డి పోలీసులకు తెలిపాడు. ప్రాణాలకు తెగించి.. కుందూనదిలో ఉధృతంగా ప్రవహిస్తున్న నీటిలోకి దూకి వృద్ధ దంపతులను కాపాడిన మొద్దుల గుర్రప్పను అందరూ అభినందించారు. క్షణాల్లోనే సమాచారం తెలుసుకున్న గుర్రప్ప ఈత కాయలు కట్టుకొని కొట్టుకుపోతున్న దంపతులను కాపాడేందుకు ప్రయత్నించారు. దీంతో గుర్రప్పను అధికారులు, గ్రామస్తులు అందరూ శభాష్.. గుర్పప్ప అంటూ అభినందనలతో ముంచెత్తారు. -
పొలతల క్షేత్ర అభివృద్ధికి కృషి
పెండ్లిమర్రి: పొలతల పుణ్యక్షేత్రం అభివృద్ధికి అన్ని విధాలుగా కృషి చేస్తానని దేవదాయశాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పేర్కొన్నారు. శనివారం పెండ్లిమర్రి మండలం పొలతల క్షేత్రంలో దేవస్థానం నూతన పాలక మండలి ప్రమాణాస్వీకారం కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ క్షేత్రంలో చేపట్టాల్సిన పనులకు మాస్టర్ ప్లాన్ రూపొందించాలని దేవదాయశాఖ అధికారులకు సూచించారు. కమలాపురం నియోజకవర్గంలోని 90 ఆలయాలకు ధూప–దీప నైవేద్యం కింద నిధులు మంజూరు చేశామన్నారు. అనంతరం క్షేత్రంలో నాలుగు జిల్లాల దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషన్ర్లు, ఈఓలతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పొలతల దేవస్థానం చైర్మన్గా సి.రాజారెడ్డిని పాలకమండలి సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే పుత్తా చైతన్యరెడ్డి, టీడీపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డి, మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, బద్వేలు టీడీపీ ఇన్చార్జి రితేష్రెడ్డి, దేవదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. పుష్పగిరిని సందర్శించిన మంత్రి వల్లూరు: ప్రముఖ పుణ్య క్షేత్రమైన పుష్పగిరి కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయాన్ని దేవదాయ శాఖ మంత్రి ఆనం రామ నారాయణరెడ్డి శనివారం సందర్శించారు. ఈ సందర్బంగా ఆయనకు ఆలయ అర్చకులు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికారు. అనంతరం ఆయన శ్రీ చెన్న కేశవ స్వామి, శ్రీ సంతాన మల్లేశ్వర స్వాములను దర్శించుకుని పూజలు చేశారు. ఆయన మాట్లాడుతూ పుష్పగిరి అభివృద్ధికి అవసరమైన చర్యలు చేపడతామన్నారు. -
యువతి ఆత్మహత్య
● ఒంటరితనం భరించలేక..● చిన్నతనంలోనే తల్లిదండ్రులు మృతి ● తోడుగా ఉన్న అక్కకు ఇటీవల వివాహం ● మనస్థాపంతో తనువు చాలించిన వైనంప్రొద్దుటూరు క్రైం : తల్లిదండ్రులిద్దరూ చిన్న తనంలోనే చనిపోయారు. ఊహ తెలిసిన నాటి నుంచి తోడుగా ఉంటున్న అక్క పెళ్లి చేసుకొని వెళ్లిపోయింది. ఒంటరి తనంతో మానసికంగా కుంగిపోయిన ఆ యువతి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటన ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్లో చోటుచేసుకుంది. పల్లా మహేశ్వరి (26) అనే యువతి శుక్రవారం రాత్రి ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ఈశ్వరరెడ్డినగర్కు చెందిన పల్లా కవిత, మహేశ్వరిలు అక్కా చెళ్లెల్లు. వీరి చిన్న తనంలోనే తల్లిదండ్రులు చనిపోయారు. తండ్రి సుబ్రమణ్యం అనారోగ్యంతో మృతి చెందగా భర్త మరణాన్ని జీర్ణించుకోలేక తల్లి లక్ష్మీదేవి కూడా కొన్ని రోజుల తర్వాత ఆత్మహత్య చేసుకుంది. అప్పటి నుంచి అక్కాచెల్లెళ్లను వారి తాత అయిన బడిగించల రామయ్య పెంచి పెద్ద చేశారు. మహేశ్వరి ఎంఎస్సీ వరకు చదువుకొని ఓ ఇంజినీరింగ్ కాలేజీలో లెక్చరర్గా పని చేస్తోంది. ఈ క్రమంలో కవితకు మూడు నెలల క్రితం వివాహం అయింది. ఆమె పెళ్లి చేసుకొని వెళ్లినప్పటి నుంచి మహేశ్వరి, ఆమె తాత రామయ్యలు ఉంటున్నారు. రామయ్య వృద్ధాప్యం కారణంగా ఇంటి వద్దనే ఉండేవాడు. అతని బాగోగులన్నీ చిన్న మనవరాలే చూసు కునేది. చిన్నతనం నుంచి తోడుగా ఉన్న అక్క పెళ్లి చేసుకొని అత్తారింటికి వెళ్లడంతో ఒంటరిని అయ్యాననే భావన మహేశ్వరిని తరచూ వేధిస్తుండేది. దీపావళికి చెల్లెలు వద్దకు వచ్చిన అక్క.. చెల్లెలితో కలిసి దీపావళి పండుగ చేసుకోవడానికి కొత్త దంపతులిద్దరూ వారం రోజుల క్రితం ప్రొద్దుటూరులోని మహేశ్వరి ఇంటికి వచ్చారు. అక్క కవితతో కలిసి చెల్లెలు దీపావళి పండుగను సంతోషంగా జరుపుకుంది. ఈ క్రమంలో శుక్రవారం రాత్రి కవిత తన భర్తతో కలిసి పట్టణలోని గుడికి వెళ్లింది. ఆమె కొద్ది సేపటి తర్వాత ఇంటికి రాగా చెల్లెలు ఇంట్లో లేదు. ఫోన్ చేస్తే రింగ్ అవుతోంది కానీ ఆమె లిఫ్ట్ చేయలేదు. చుట్టు పక్కల చూసినా ఆమె కనిపించలేదు. దీంతో మేడపైన ఉన్న రేకుల ఇంట్లోకి వెళ్లి చూడగా మహేశ్వరి తాడుతో ఉరేసుకొని వేలాడుతూ కనిపించింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను కిందికి దింపి చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిశీలించిన వైద్యుడు అప్పటికే ఆమె మృతి చెందినట్లు తెలిపారు. ఒక్కగానొక్క తోడబుట్టిన చెల్లెలు దూరం కావడంతో ఆమె మృతదేహంపై పడి అక్క బోరున విలపించసాగింది. మృతురాలి అక్క కవిత ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
నేరాలలో శిక్షల శాతం పెంచడమే లక్ష్యం
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ● పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో సమీక్షా సమావేశంకడప అర్బన్ : జిల్లాలో నమోదయ్యే ముఖ్యమైన కేసులలో ముద్దాయిలను రిమాండ్కు తరలించే విషయంలోను, రిమాండ్ ఖైదీలను వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా కోర్టులో హాజరు పరిచే విషయమై, అదే విధంగా కేసు విచారణ సందర్భంగా ఎదురయ్యే న్యాయ పరమైన సమస్యల గురించి, జిల్లా వ్యాప్తంగా ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదై కోర్టుల్లో వివిధ దశల్లో ఉన్న కేసులకు సంబంధించిన పలు విషయాలపై పబ్లిక్ ప్రాసిక్యూటర్లతో శనివారం జిల్లా ఎస్పీ సమీక్ష సమావేశం నిర్వహించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలో జరిగిన ఈ సమావేశంలో ఎస్పీ జిల్లాలో నమోదైన ముఖ్యమైన కేసులలో దర్యాప్తు మొదలుకొని కోర్టులలో ఆ కేసులు పూర్తయి నిందితులకు శిక్ష పడేందుకు తీసుకోవాల్సిన చర్యలు, కేసులు ఫైలింగ్ చేసే విధానం తదితర విషయాలను చర్చించారు. సాక్ష్యాల సేకరణ, ప్రాపర్టీ సీజ్, అటాచ్మెంట్, కోర్టులలో ట్రయల్ జరిగే సమయంలో తలెత్తే సందేహాలను పబ్లిక్ ప్రాసిక్యూటర్లు నివృత్తి చేశారు. ఎప్పుడైతే నేరం చేసిన వారికి శిక్ష పడుతుందో అప్పుడే బాధితులకు సరైన న్యాయం జరుగుతుందని తద్వారా ప్రజలకు పోలీసులపై, న్యాయస్థానంపై నమ్మకం కలుగుతుందని జిల్లా ఎస్పీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ డైరెక్టర్ ఆఫ్ ప్రాసిక్యూషన్ ఖదీరున్బీ, కోర్టు మానిటరింగ్ సెల్ ఇన్చార్జి ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్ రెడ్డి, జిల్లాకు సంబంధించిన అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, కోర్టు మానిటరింగ్ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృతపరచాలి
కడప అగ్రికల్చర్ : క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని విస్తృత పరిచి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ సూచించారు. కడపలోని ప్రకృతి వ్యవసాయ కార్యాలయంలో శనివారం జిల్లా స్థాయిలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫార్మర్ మాస్టర్ ట్రైనర్స్ రైతులకు సీజన్ బట్టి పంటలు ఎంపిక చేసుకుని ఆ పంటలకు సంబంధించిన ఇన్పుట్స్ ముందుగా తయారు చేయించి మంచి దిగుబడి వచ్చేలా కృషి చేయాలన్నారు. ప్రకృతి వ్యవసాయం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అడిషనల్ డీపీఎం, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. చోరీ కేసులో నిందితుల అరెస్టుతొండూరు : మండలంలోని మల్లేల ఇమాంబీ దర్గాలో దొంగతనం చేసిన కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ తెలిపారు. శనివారం తొండూరు పోలీస్ స్టేషన్లో ఎస్ఐ ఘన మద్దిలేటితో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. నంద్యాల జిల్లా దొర్నిపాడు మండలం గోవిందిన్నె బీసీ కాలనీకి చెందిన షేక్ హిదయతుల్లా, జమ్మలమడుగు పట్టణానికి చెందిన షేక్ గైబుసావలీ ఈనెల 21వ తేదీన మల్లేల ఇమాంబీ దర్గాలోని హుండీని పగులగొట్టి రూ.30వేల నగదును అపహరించారన్నారు. వారిని శనివారం తొండూరు పోలీస్ స్టేషన్ సమీపంలోని భద్రంపల్లె క్రాస్ రోడ్డు వద్ద అరెస్టు చేసి వారి వద్ద నుంచి రూ.30వేల నగదుతోపాటు హీరో హోండా ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై పలు పోలీస్ స్టేషన్లలో పలు దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయన్నారు.జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ -
వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా పులి సునీల్
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాకు చెందిన పులి సునీల్ కుమార్ను ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. గతంలో ఈయన వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడిగా, పార్టీ నగర అధ్యక్షుడిగా, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్గా పనిచేశారు. ప్రస్తుతం ఎస్సీ విభాగం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్గా నియమించి జోన్–5లోని వైఎస్సార్, కర్నూల్, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల బాధ్యతలు అప్పగించారు. ఈ సందర్భంగా పులి సునీల్ కుమార్ తన నియామకానికి సహకరించిన జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎస్సీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ మేయర్ కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలకు ధన్యవాదాలు తెలిపారు. వైఎస్సార్సీపీ మైనార్టీ సెల్ సంయుక్త కార్యదర్శిగా మహబూబ్ బాషావైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన షేక్ మహబూబ్బాషా పార్టీ రాష్ట్ర మైనార్టీ విభాగం సంయుక్త కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. -
విద్యుత్ సమస్యలపై తక్షణం స్పందించాలి
బద్వేలు అర్బన్/అట్లూరు: విద్యుత్ సమస్యలపై తక్ష ణం స్పందించాలని అధికారులకు జిల్లా విద్యుత్ శాఖ సూపరింటెండెంట్ ఇంజనీర్ ఎస్.రమణ తెలిపారు. గురువారం బద్వేలు, అట్లూరు విద్యుత్ కార్యాయాల్లో ఆయన అధికారులతో సమీక్షా సమావేశాలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లా డుతూ విద్యుత్ సంబంధిత సమస్యలను తక్షణమే స్పందించి పరిష్కరించాలని తెలిపారు. విద్యుత్ సరఫరా అంతరాయం, లో ఓల్టేజ్ వంటి సమస్యలపై ప్రజల ఫిర్యాదులను వెంటనే పరిష్కరించాలన్నారు. అంతరాయం లేని విద్యుత్ సరఫరా చేయాలని, ఫీడ ర్లు, ట్రాన్స్ఫార్మర్లను పర్యవేక్షిస్తూ నిరంతర విద్యుత్ సరఫరా కొనసాగించాలని పేర్కొన్నారు. అవసరమైన ప్రాంతాల్లో కొత్త ట్రాన్స్ఫార్మర్లు ఏర్పాటు చేసి, నెట్ వర్క్ బలోపేతం ద్వారా లో ఓల్టేజ్ సమస్యలను పరిష్కరించాలని సూచించారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ లక్ష్మీపతి, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కుల్లాయప్ప, ఏఈలు షర్మిల, శివ, విజయ్ కుమార్ పాల్గొన్నారు. విద్యుత్ అంతరాయం లేకుండా చూడాలి ఒంటిమిట్ట: గత రెండు రోజులుగా ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల్లో ఎడతెరిపిలేని వర్షాలు కురుస్తున్నాయి. మరో 48 గంటలు వానలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. ఈ నేపథ్యంలో ప్రజలకు విద్యుత్ సరఫరా అందించడంలో అంతరాయం ఏర్పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలని కడప జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఇ ఎస్.రమణ సిబ్బందికి సూచించారు. గురువారం మండల పరిధిలోని రైల్వే స్టేషన్ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్ స్టేషన్ వద్ద ఆయన మాట్లాడుతూ..ప్రజల భద్రత, సేవల పునరుద్ధరణ కోసం ఏపీఎస్పీడీసీఎల్ సిబ్బంది యుద్ధప్రాతిపదికన చర్యలు చేపట్టాలన్నారు. ట్రాన్స్ ఫార్మర్లు, విద్యుత్ లైన్లు, సబ్ స్టేషన్లను పరిశీలించి అవసరమైన మరమ్మతులు చేయాలన్నారు. విద్యుత్ ప్రమాద నివారణకు తగిన చర్యలు తీసుకోవాలన్నారు. వాట్సప్,హెల్ప్లైన్ ద్వారా వచ్చిన ఫిర్యాదులను వేగంగా పరిష్కరించాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ ఏఈ ఉదయ్ కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా విద్యుత్ శాఖ ఎస్ఈ ఎస్.రమణ -
జలపాత సోయగం!
ఉరకలై గోదావరి ఉరికెనా మదిలోనికి.. అని సినీకవి అన్నట్లు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాల నేపథ్యంలో కడప సమీపంలోని పాలకొండల్లో జలపాతం ఉరకలెత్తి ప్రవహిస్తోంది. తెల్లటి నురగలు కక్కుతూ హొయలొలుకుతూ శరవేగంగా ప్రవహిస్తున్న జలపాతం అందాలను చూసేందుకు యువతీ, యువకులు ఉత్సాహంగా వస్తున్నారు. గురువారం పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించడంతో జలపాతాన్ని చూసేందుకు విద్యార్థులు, పిల్లలు, పెద్దల సంఖ్య పెరిగింది. ఈ సమయంలోనే వర్షం దంచికొట్టడంతో జలపాతం ఉధృతి కూడా పెరిగింది. జలపాతాన్ని చూసేందుకు వస్తున్న యువత ప్రమాదాల బారిన పడకుండా పోలీసులు తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సి ఉంది. ఫొటోలు: సాక్షి ఫోటోగ్రాఫర్.కడప -
కార్తీక మాసంలో భక్తుల కోసం విశేష ఏర్పాట్లు
కడప కోటిరెడ్డిసర్కిల్: పవిత్ర కార్తీక మాసాన్ని పురస్కరించుకుని రాయలసీమ ప్రాంతాల్లోని వివిధ శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ప్రత్యేక బస్సు సర్వీసులను ఏర్పాటుచేసినట్లు ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా నుంచి 60 బస్సు సర్వీసులు, అన్నమయ్య 56, తిరుపతి 10, చిత్తూరు 20, కర్నూలు 110, నంద్యాల 127, అనంతపురం 66, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 102 బస్సులు నడపనున్నామన్నారు. భక్తులకు శైవ క్షేత్రాలకు వెళ్లేందుకు ఏర్పాటు చేసిన ఆర్టీసీ సర్వీ సులను సద్వినియోగం చేసుకోవాలని, సురక్షితంగా ప్రయాణించాలని ఆయన సూచించారు. అలాగే దూర ప్రాంతాల వారికి ఆయా బస్సుల్లో రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉందన్నారు. కడపజోన్ నుంచి 551 సర్వీసులు ఆర్టీసీ కడపజోన్ ఈడీ పైడి చంద్రశేఖర్ -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమం
కడప కార్పొరేషన్: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ప్రజా ఉద్యమం నిర్వహిస్తున్నామని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ర్యాలీలకు సంబంధించిన పోస్టర్లను అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధలతో కలిసి ఆవిష్కరించారు. అనంతరం రవీంద్రనాథ్రెడ్డి మీడియాతో మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దానిని ప్రైవేటుకు అప్పగించేస్తున్నారని ఆరోపించారు. టూరిజంలో 42 హోటళ్లను ప్రైవేటుకు అప్పగించారని, విశాఖ స్టీల్ ఫ్యాక్టరీని కేంద్రం ప్రైవేటుకు అప్పగిస్తుంటే కమీషన్లకు కక్కుర్తి పడి వంతపాడుతున్నారని ధ్వజమెత్తారు. చంద్రబాబు హయంలో ఎన్నో ప్రతిష్టాత్మక ఫ్యాక్టరీలను ప్రైవేటుకు అప్పగించారని విమర్శించారు. ఆర్టీసీని కూడా ప్రైవేటు పరం చేసేందుకు సిద్దం చేశారని, 2019లో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడంతో సాధ్యపడలేదన్నారు. కడపలో పాతరిమ్స్ను కూడా అమ్మకానికి పెట్టారని గుర్తు చేశారు. తాజాగా ప్రభుత్వ రంగంలో ఉండాల్సిన మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు కట్టబెట్టేందుకు టెండర్లు పిలిచారన్నారు. అలాగే ఒక ఎకరా ఏడాదికి 99పైసలకు 66 ఏళ్లకు లీజుకు ఇవ్వడం దారుణమన్నారు. కోవిడ్ కష్ట కాలంలో ప్రైవేటు హాస్పిటల్స్ అన్నీ చేతులెత్తేస్తే ప్రభుత్వ హాస్పిటల్స్ ద్వారా ఎలా వైద్యం అందించారో అందరూ చూశారన్నారు. అలాంటి విపత్కర పరిస్థితి మళ్లీ తలెత్త కూడదని అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 13 జిల్లాలను 26 జిల్లాలుగా పెంచి ఒక్కో జిల్లాకు ఒక్కో బోధనాసుపత్రి ఉండాలన్న సంకల్పంతో రాష్ట్రానికి కొత్తగా 17 మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారన్నారు. వీటిలో ఏడు కాలేజీలు పూర్తయి అడ్మిషన్లు జరిగాయని, మరో మూడు కాలేజీల్లో 90 శాతం పనులు పూర్తయి ప్రారంభోత్సవానికి సిద్ధంగా ఉన్నాయన్నారు. ఏడాదికి రూ.1000కోట్లు ఖర్చు చేస్తే ఈ కాలేజీలు పూర్తవుతాయన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆస్తులని, వీటిని ప్రైవేటు వారికి అప్పనంగా అప్పగిస్తామంటే చూస్తు ఊరుకునేది లేదని హెచ్చరించారు. కలిసివచ్చే పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఉద్యమిస్తామన్నారు. ఇందులో భాగంగా ఈనెల 28వ తేది జిల్లాలోని అన్ని నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు నిర్వహించనున్నామని, వీటిని ప్రజలు, వైఎస్సార్సీపీ కార్యకర్తలు జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, డా. సొహైల్, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, ఏపీ సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ ఛైర్మెన్ పులి సునీల్ కుమార్, జిల్లా ఉపాధ్యక్షులు దాసరి శివప్రసాద్, కార్పొరేటర్ షఫీ, ఫయాజ్ పాల్గొన్నారు. ఈనెల 28న అన్నినియోజకవర్గాల్లో ర్యాలీలు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
● జిల్లా ఇంచార్జి కలెక్టర్ అదితి సింగ్ ● జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్08562 – 246344 ఏర్పాటు కడప సెవెన్రోడ్స్: రాష్ట్ర వ్యాప్తంగా తుపాన్ నేపథ్యంలో జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అన్ని శాఖల అధికారులను జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితి సింగ్ ఆదేశించారు. భారీ వర్షాల నేపథ్యంలో జిల్లాలో పరిస్థితులపై జిల్లా స్థాయి, క్షేత్ర స్థాయి అధికారులతో గురువారం టెలి కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా జిల్లాలో ఎటువంటి ప్రాణ, ఆస్తి, పంట నష్టం జరగకుండా ఉండేందుకు తీసుకోవాల్సిన ముందస్తు చర్యలపై అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా జిల్లా ఇంచార్జి కలెక్టర్ మాట్లాడుతూ.. మండలాల వారీగా చెరువు కట్టలు, కాలువ గట్టుల పరిరక్షణపై దృష్టి పెట్టాలని, వాగులు, వంకలు, కుంటల వద్ద అప్రమత్తంగా ఉండాలని ఇరిగేషన్, రెవెన్యూ అధికారులను ఆదేశించారు. జిల్లా అధికారులు మొదలు నియోజకవర్గ, మండల, సచివాలయ, గ్రామ స్థాయి వరకు ప్రతి అధికారి సిబ్బంది వారి వారి ప్రధాన కార్య స్థానాలలో అందుబాటులో ఉండాలని ఆదేశించా రు. వ్యవసాయ, ఉద్యానవన పంటల సాగు చేసే రైతులను అప్రమత్తం చేయాలని పంట నష్టం జరగకుండా తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి సారించాలని.. ఈ మేరకు రైతులను అప్రమత్తం చేయాలని వ్యవసాయ ఉద్యానవన శాఖ అధికారులను ఆదేశించారు. విద్యుత్ శాఖ అధికారులు వర్షాల కారణంగా విద్యుత్ అంతరాయం అయితే.. వెంటనే దానిని పునరుద్ధరించేలా అధికారులు అప్రమత్తంగా ఉండాలని విద్యుత్ శాఖ అధికారులను ఆదేశించారు. విపత్తు సమయంలో ప్రతి ఒక్క అధికారి, సిబ్బంది మరింత బాధ్యతతో వారి విధులను నిర్వర్తించాలన్నారు. వైద్య ఆరోగ్యశాఖకు సంబంధించి జిల్లాలోని అన్ని ఏరియా ఆసుపత్రులు, పీహెచ్ సిలలో సకాలంలో డాక్టర్లు అత్యవసర వైద్య సేవలు అందించేందుకు అందుబాటులో ఉండాలని అవసరమైన మందులను అందుబాటులో ఉండాలని.. జిల్లా వైద్య ఆరోగ్య శాఖా అధికారులను ఆదేశించారు. జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్లో అత్యవసర సహాయ సమాచార నిమిత్తం 08562 – 246344 కంట్రోల్ రూమ్ను కూడా ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. -
పూల తోటంతా దెబ్బతినేలా ఉంది
వరుస వర్షాలతోపాటు నిన్నామొన్నా కురిసిన భారీ వర్షంతో పొలంలో నీరంతా నిలిచింది. కార్తీక మాసం కావడంతో ఇప్పుడిప్పుడే పూలధర కాసింత పెరిగింది. నాలుగు రూపాయలు వస్తుందని ఆశపడేలోపు ఈ వర్షం నట్టేట ముంచింది. – కొమ్మద్ది. వెంకటసుబ్బయ్య, లింగారెడ్డిపల్లె, సీకేదిన్నె మండలం పెట్టుబడికూడా రాలే.. నేను ఎకరాలో చామంతి పూల తోట వేశా. ఇప్పటికీ పెట్టుబడి కూడా రాలేదు. ఇప్పుడు కార్తీక మాసం కావడంతో ధరలు బాగా ఉన్నాయి. పది రూపాయలు వస్తుందిలే అనుకుని ఆశపడ్డా. ఈ వర్షం ముంచేసింది. పెట్టుబడి కూడా రాలే. నష్టపోవాల్సిందే. – లక్కిరెడ్డి సుబ్బారెడ్డి, లిక్కిరెడ్డిపల్లె, సికెదిన్నె -
కళా ఉత్సవ్ పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు
రాయచోటి జగదాంబసెంటర్: విజయవాడలోని మురళి రిసార్ట్స్లో గురువారం నుంచి రెండు రోజుల పాటు నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి కళా ఉత్సవ్ –2025 పోటీలలో ఉమ్మడి కడప జిల్లా విద్యార్థులు పాల్గొన్నారు. ఈ విషయాన్ని కళా ఉత్సవ్ జిల్లా నోడల్ ఆఫీసర్ ఎం.నర్సింహారెడ్డి తెలిపారు. ఈ పోటీలకు ఎస్సీఈఆర్టీ డైరెక్టర్ వెంకటకృష్ణారెడ్డి అధ్యక్షత వహించగా పాఠశాల విద్యాశాఖ కమిషనర్ విజయరామరాజు ముఖ్య అతిథిగా పాల్గొని ప్రసంగించారన్నారు. విద్యార్థులలో సృజనాత్మకత, కళాత్మక నైపుణ్యాలను పెంపొందించడం, కళల ద్వారా తమ ప్రతిభను ప్రదర్శించడానికి విద్యార్థులకు వేదికను అందించడం, ప్రాంతీయ స్థాయిలో కళలను ప్రోత్సహించడం వంటి లక్ష్యాలతో కళా ఉత్సవ్ –2025 రాష్ట్ర స్థాయి పోటీలు నిర్వహిస్తున్నట్లు ఈ సందర్భంగా ఆయన తెలిపారు. గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్యకళలు, కథాకథనం పోటీల్లో ఉమ్మడి కడప జిల్లా నుంచి 23 మంది పాల్గొని తమ ప్రతిభను కనబరిచారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్కార్ట్ ఉపాధ్యాయులు భ్రమరాంబ, ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాణస్వీకారం
సిద్దవటం: సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో గురువారం శ్రీ నిత్యపూజస్వామి పాలకమండలి సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. ఆలయ చైర్మన్గా జంగిటి రాజేంద్రప్రసాద్, పాలకమండలి సభ్యులుగా పి.మల్లేశ్వరి, పి.వసంత, బి.వెంకటసుబ్బయ్య, వి.కృష్ణయ్య, ఆర్.పార్వతమ్మ, కె.మల్లీశ్వరి, సి.వెంకటసుబ్బయ్య, జె.శివారెడ్డి, కె.రూప, ఎక్స్ ఆఫీషియో సభ్యులు, అర్చకులు రంగసముద్రం సుబ్రమణ్యంశర్మల చేత ఈఓ శ్రీధర్ ప్రమాణస్వీకారం చేయించారు. కార్యక్రమంలో రాజంపేట నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు తదితరులు పాల్గొన్నారు. రాజంపేట: వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యునిగా చొప్పా ఎల్లారెడ్డి నియమితులయ్యారు. ఈమేరకు గురువారం వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మే రకు నియామకపు ఉత్తర్వులు జారీ అయ్యాయి. చొప్పా ఎల్లారెడ్డి గతంలో రాజంపేట మార్కెట్ కమిటీ చైర్మన్గా పనిచేశారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ వై.ఎస్.ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలో ప్రవేశాలకు నవంబర్ 5వ తేదీ వరకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు వైస్ చాన్సులర్ జయరామిరెడ్డి తెలిపారు. ఇంటర్మీడియట్లో ఎంపీసీ, బైపీసీ, హెచ్ఈసీ, సీఈసీ, ఎంఈసీతోపాటు డిప్లిమాలో ఓ బ్రాంచ్ పాసైన వారైన అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. విద్యార్థులు తమ భవిష్యత్తు కలలను సాకారం చేసే సృజనాత్మక విశ్వవిద్యాలయం ఏఎఫ్యూ అని తెలిపారు. ఇక్కడ Creativity. Technology, Arts , Design సమన్వయంతో రూపొందిన కోర్సులు విద్యార్థులకు విస్తృతమైన ఉద్యోగ , ఉపాధి అవకాశాలను కల్పిస్తాయన్నారు. పూర్తి వివరాల కోసం 99855 88105, 90524 60323 నెంబర్లను సంప్రదించాలని ఆయన సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా పరిధిలో వాహన యజమానులు వివిధ రకాల సేవల కోసం వాహన్ పోర్టల్ ద్వారా చేసుకున్న దరఖాస్తుల్లో 867 దరఖాస్తులు క్లియర్ చేశామని.. ఇంకా 387 పెండింగ్లో ఉన్నాయని జిల్లా ఇన్చార్జ్ ఉపరవాణా శాఖ కమిసనర్ వీర్రాజు పేర్కొన్నారు. గురువారం నగర శివార్లలోని ఊటుకూరులోని జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఫైనాన్షియర్ వెరిఫై చేస్తే తప్ప, ఈ దరఖాస్తులు రవాణా శాఖ కార్యాలయాలలో అప్రూవ్ చేయడానికి అవకాశం ఉండదన్నారు. ఈ దరఖాస్తుల వివరాలు జిల్లాలో గల రవాణా శాఖ కార్యాలయాలలో డిస్ప్లే చేశామని తెలిపారు. గత 50 రోజులలో ఫైనాన్సియర్ల నుంచి వెరిఫై అయిన 867 దరఖాస్తులు క్లియర్ చేశామని వెల్లడించారు. దరఖాస్తులు పెండింగ్లో ఉన్న వారు ఒక లేఖ, ఫామ్ 35 జిరాక్స్, వాహన యజమాని ఆధార్ జిరాక్స్, వాహనానికి సంబంధించిన రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ జిరాక్స్ కలిపి తమ కార్యాలయానికి ఈనెల 31లోపు సబ్మిట్ చేయాలన్నారు. ఈ నెల 31 లోపు సబ్మిట్ చెయ్యని దరఖాస్తులను పూర్తిగా రద్దు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరు కల్చరల్: మహాకవి డాక్టర్ గడియారం వేంకటశాస్త్రి 44వ సాహిత్య పురస్కార ప్రదానోత్సవ సభను ఈనెల 26న అరవిందాశ్రమంలోని అరబిందో ఇంటిగ్రల్ హైస్కూల్లో సాయంత్రం 5.30 గంటలకు నిర్వహించనున్నట్లు రచన సాహిత్యవేదిక ఉపాధ్యక్షుడు గడియారం వేంకట శేషశర్మ తెలిపారు. గురువారం పురస్కార ప్రదాన సభ ఆహ్వాన పత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గడియారం బహుముఖ ప్రజ్ఞాశాలి, కవి, అవధాని, విమర్శకులు అని.. ఆయన ఎన్నో కావ్యాలు రచించారన్నారు. ఆ మహానీయుని పేరుతో రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల ఆధ్వర్యంలో సాహిత్య రంగంలో విశేష కృషి చేసిన వారికి 44 ఏళ్లుగా పురస్కారాలను అందిస్తున్నామన్నారు. ఈ ఏడాది హైదరాబాద్కు చెందిన యువకవి, సాఫ్ట్వేర్ ఇంజనీర్ పరిమి శ్రీరామనాథ్ రచించిన జీవాతువుకు పురస్కారం ప్రదానం చేస్తున్నామన్నారు. సాహితీ ప్రియులు, అభిమానులు పురస్కార ప్రధానోత్సవ సభలో పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. -
జాతీయ స్థాయి అథ్లెటిక్ పోటీలకు గంగనపల్లి విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : పెండ్లిమర్రి మండలం గంగనపల్లి జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు అండర్ 19 స్కూల్ గేమ్స్లో భాగంగా పోల్ వాల్ట్ ఈవెంట్ రాష్ట్ర స్థాయి పోటీలలో ప్రతిభ చాటి జాతీయస్థాయి పోటీలకు ఎంపికై నట్లు వ్యాయామ ఉపాధ్యాయుడు శివశంకరరెడ్డి తెలిపారు. ఈ నెల 22, 23 తేదీలలో తూర్పుగోదావరి జిల్లా పెదవేగి మండలం బాలయోగి గురుకుల పాఠశాలలో నిర్వహించిన అండర్ 19 స్కూల్ గేమ్స్ పోల్ వాల్ట్ ఈవెంట్ పోటీలలో విద్యార్థులు వి.సుహానా ఫాజియా 2.30 మీటర్ల ఎత్తు దూకి బంగారు పతకాన్ని సాధించింది. అలాగే వి. మోసిన 1.65 మీటర్ల ఎత్తు దూకి వెండి పతకాన్ని సాధించి రాష్ట్ర స్థాయిలో ప్రతిభను చాటారు. వీరు నవంబర్ 26వ తేదీ నుంచి 30వ తేదీ వరకు హర్యానా రాష్ట్రంలోని భవానిలో జరిగే 69వ జాతీయస్థాయి స్కూల్ గేమ్స్ పోటీలకు ఎంపికయ్యారు. వీరి ఎంపికపై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఇక్బాల్, వ్యాయామ ఉపాధ్యాయుడు రవిశంకర్రెడ్డి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
డబ్బులు చెల్లించాలంటూ మహిళల ఆందోళన
కడప అర్బన్ : స్థలం కొనిస్తామంటూ చెప్పి తమ కుమారుని వద్ద నుంచి రూ. 70 లక్షలకు పైగానే డబ్బులు తీసుకుని తిరిగి ఇవ్వకపోగా, తన భర్తను బెదిరిస్తున్నారంటూ శ్వేత అనే మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. ఇందుకు కారణమైన కడప ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని పెట్రోల్ బంకు నిర్వాహకుడిపై చర్యలు తీసుకోవాలంటూ ఆమె తమ బంధువులతో కలిసి గురువారం ఆందోళనకు దిగారు. సదరు పెట్రోల్ బంక్ నిర్వాహకుడి ఇంటి ముందు బైఠాయించారు. విషయం తెలుసుకున్న చిన్నచౌక్ పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా బాధితురాలు శ్వేత మాట్లాడుతూ పెట్రోలు బంకు నిర్వాహకుడు తమకు స్థలం ఇప్పిస్తానంటూ రూ. 70 లక్షలకు పైగానే తీసుకున్నాడన్నారు. స్థలం ఇవ్వాలని అడిగితే స్థలం లేదని దానికి బదులుగా పెట్రోల్ బంకు లీజుకు ఇస్తానని చెప్పాడన్నారు. ఆ తర్వాత తమకు డబ్బులు ఇవ్వకపోవడంతో పాటు బెదిరింపులకు దిగుతున్నాడని తమకు న్యాయం చేయాలని కోరారు. పోలీసులు ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెప్పి అక్కడి నుంచి పంపించారు. సంఘటనపై పోలీసులు విచారణ చేపడుతున్నారు. -
జాతీయ స్థాయి పోటీలో ఏయూ విద్యార్థుల ప్రతిభ
రాజంపేట : కడప కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో నిర్వహించిన ఎక్స్లియర్–2025 జాతీయ స్థాయి మేనేజ్మెంట్ విద్యార్థుల మీట్లో అన్నమాచార్య యూనివర్సిటీ పీజీ కాలేజి ఆఫ్ కంప్యూటర్ స్టడీస్ విద్యార్థులు ప్రతిభ చాటారు. ఈ మేరకు వారిని గురువారం ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఏయూ వైస్ చాన్సలర్ డాక్టర్ సాయిబాబారెడ్డి అభినందించారు. మార్కెటింగ్ గేమ్, హెచ్ఆర్ గేమ్, ఫైనాన్స్ గేమ్ పోటీలలో వివిధ ప్రాంతాలకు చెందిన ఇంజినీరింగ్ విద్యార్ధులు పాల్గొన్నారు. ఫైనాన్స్ గేమ్లో భారత్కుమార్, కార్తీక్, కిషోర్ల బృందం రెండవ బహుమతిని దక్కించుకుంది. మార్కెటింగ్ గేమ్లో వరలక్ష్మీ, వర్ష, కావ్య బృందం మూడవ బహుమతిని సాధించారు. కార్యక్రమంలో పీజీ కాలేజి ప్రిన్సిపాల్ డాక్టర్ జె.సమతనాయుడు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి మాట్లాడుతూ ఏయూ విద్యార్థులు ప్రతి చోట ప్రతిభను సాధించడం తనకెంతో గర్వంగా ఉందన్నారు. -
రాష్ట్రంలో మహిళలకు కరువైన రక్షణ
బద్వేలు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి మహిళలకు, విద్యార్థినులకు, బాలికలకు రక్షణ కరువైందని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. గురువారం ఎన్జీఓ కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ కాకినాడ జిల్లా తునిలో గురుకుల పాఠశాలలో చదువుతున్న 13 ఏళ్ల బాలికపై టీడీపీ నాయకుడు లైంగిక దాడికి పాల్పడటం దారుణమన్నారు. అలాగే ఈ ఘటనతో పాటు తూర్పుగోదావరి జిల్లా రాజమహేంద్రవరంలోని సంక్షేమ వసతి గృహంలో ఉంటూ పదవ తరగతి చదువుతున్న బాలికపై ఓ యువకుడు లైంగిక దాడికి పాల్పడ్డాడన్నారు. ఈ రెండు ఘటనలతో రాష్ట్రంలో శాంతి భద్రతలు ఎంత దారుణంగా ఉన్నాయో స్పష్టమవుతుందని చెప్పారు. పేద, బడుగు, బలహీన వర్గాల విద్యార్థులు చదువుకుంటున్న సంక్షేమ వసతి గృహాలు, గురుకుల పాఠశాలలపై ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుండటంతోనే ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని అభిప్రాయపడ్డారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు, ఊరూరా బెల్టుషాపులు ఉండటంతో ఇలాంటి ఘటనలు చోటు చేసుకుంటున్నాయని అన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి మహిళలు, విద్యార్థినులు, బాలికలపై హత్యలు, అత్యాచారాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ఆమె కోరారు.ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ -
భూములకు రక్షణ కల్పించండి
రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కలికిరి మండలం పేత్తగడ గ్రామ పంచాయతీ మజరా పాలెంకు చెందిన గుండ్లూరు రాజగోపాల్ తనకు ప్రాణహాని ఉందని, భూములను రక్షించాలని బుధవారం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్కు ఫిర్యాదు చేశారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. తమ గ్రామంలో రెండు చింతచెట్లతో సహా సర్వే నెంబర్ 294లో 0.02 సెంట్ల భూమిని 1991లో కొనుగోలు చేశానన్నారు. అయితే ఇదే భూమిపై తమ గ్రామానికి చెందిన బందం గుర్రప్ప, అతని కుమారుడు బందం రాజు అలియాస్ పురుషోత్తంల కన్ను పడిందన్నారు. ఈ విషయమై తనను అనేకమార్లు అడిగినా తాను ఇవ్వనని చెప్పానన్నారు. అయితే ఈ నెల 21వ తేదీన తాను పొలం పనులకు వెళ్లగా బందం గుర్రప్ప, బందం రాజు, బందం రమణ, బందం రమేష్, బందం చెన్నకేశవులు మరికొందరు వ్యక్తులు తన భూమిని ఆక్రమించుకునేందుకు ప్రయత్నించారన్నారు. అంతేకాకుండా తనను బంధించి దాదాపు 40 సంవత్సరాల వయస్సు గల రెండు చింతచెట్లను దౌర్జన్యంగా, అక్రమంగా నరికివేశారన్నారు. దీంతో తమకు దాదాపు లక్ష రూపాయలకు పైగా ఆస్తి నష్టం జరిగిందన్నారు. తనపై దాడి చేసే సమయంలో ప్రాణభయంతో గట్టిగా అరుపులు వేయడంతో పక్కనే ఉన్న మదన, గంగరాజులు వచ్చి వారి బారి నుంచి తనను కాపాడారన్నారు. -
చౌడు మిద్దె కూలి మూడు పాడి గేదెలు మృతి
చాపాడు : మండల పరిధిలోని సీతారామపురం గ్రామంలో గురువారం రాత్రి 9.30 గంటల ప్రాంతంలో మార్తల ఓబులరెడ్డి అనే రైతుకు చెందిన చౌడు మిద్దె కూలి మూడు పాడి గేదెలు మృతి చెందాయి. గత నాలుగు రోజులుగా కురుస్తున్న ఎడతెరిపిలేని భారీ వర్షాలకు గురువారం రాత్రి ఉన్నట్టుండి ఓబుల్ రెడ్డికి చెందిన చౌడు మిద్దె కూలిపోయింది. ఈ ఇంట్లో ఉన్న మూడు పాడి గేదెలు అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక్క గేద విలువ లక్ష పైగా ఉంటుందని మూడు గేదెలు మూడు లక్షలకు పైగా విలువ చేస్తాయని బాధిత రైతు వాపోతున్నాడు. ప్రభుత్వం తమ కుటుంబాన్ని ఆదుకోవాలని కోరుతున్నాడు. -
బద్వేలు టీడీపీలో ఐవీఆర్ కాల్కలం!
● సర్వే పేరుతో అభిప్రాయ సేకరణ ● రెండు వర్గాలుగా విడిపోయిన పార్టీ శ్రేణులు ● పరస్పరం అధిష్టానానికి ఫిర్యాదులుఅట్లూరు : ముఖ్యమంత్రి కార్యాలయం నుంచి నిర్వహిస్తున్న ఐవీఆర్ సర్వే బద్వేలు నియోజకవర్గం తెలుగుదేశం పార్టీలో దివంగత మాజీమంత్రి బిజివేముల వీరారెడ్డి మనుమడు రితీష్రెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి వర్గాల మధ్య చిచ్చు రేపింది. బద్వేలు నియోజకవర్గం నుంచి ఆరు పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి మంత్రిగా ఇటు జిల్లా, అటు రాష్ట్ర రాజకీయాల్లో తిరుగులేని నేతగా రాణించారు దివంగత మంత్రి బిజివేముల వీరారెడ్డి. ఆయన మరణానంతరం 2001లో జరిగిన ఉప ఎన్నికల్లో ఆమె కుమార్తె విజయమ్మ టీడీపీ తరపున ఎమ్మెల్యేగా పోటీ చేసి విజయం సాధించారు. అనంతరం 2004లో డీసీ గోవిందరెడ్డి చేతిలో ఓటమి చవిచూశారు. 2009లో బద్వేలు నియోజకవర్గం ఎస్సీ రిజర్వుడు కావడంతో అక్కడ ఎస్సీ అభ్యర్థులను గెలిపించుకునే బాధ్యతను ప్రధాన పార్టీల నాయకులు తీసుకున్నారు. అయితే ఎస్సీ రిజర్వుడు స్థానాన్ని వరుసగా డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే కై వసం చేసుకుంటూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఇన్చార్జిగా ఉన్న విజయమ్మ ఆమె తనయుడు రితీష్రెడ్డి పార్టీ ఉనికిని కాపాడుకునే పనిలో పడ్డారు. ఈ పరిస్థితిలో తల్లీ తనయులకు తోడుగా నేనున్నానంటూ అట్లూరు మండలం వేమలూరు గ్రామానికి చెందిన రైల్వే కాంట్రాక్టర్ మంచూరు సూర్యనారాయణరెడ్డి టీడీపీలో చురుకై న పాత్ర పోసిస్తూ వచ్చారు. దీంతో ఆయనకు టీడీపీ అధిష్టానం డీసీసీ చైర్మన్ పదవి కట్టబెట్టింది. కట్టబెట్టింది. ఇదిలా ఉండగా ఇటీవల పోరుమామిళ్ల, బద్వేలు ప్రాంతాలకు చెందిన టీడీపీ నాయకులు కొందరు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, మంత్రి లోకేష్లను కలిసి పార్టీ కోసం కష్టపడిన తమను పక్కన పెట్టడంతో పాటు బద్వేలులో పార్టీ ఓటమికి విజయమ్మ, ఆమె తనయుడు రితీష్రెడ్డి కారకులని ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. ఐవీఆర్ కాల్తో కలకలం.. బద్వేలులో అసలే అంతంత మాత్రంగా ఉన్న టీడీపీలో ఇటీవల జరిపిన ఐవీఆర్ ఫోన్ కాల్ సర్వే మరింత సంక్షోభాన్ని సృష్టించిందనే చెప్పవచ్చు. బద్వేలు టీడీపీ ఇన్చార్జిగా ఎవరైతే బాగుంటుందో మీ అభిప్రాయం తెలియజేయండి అంటూ రితీష్రెడ్డి అయితే 1 నొక్కండి.. డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి అయితే 2 నొక్కండి అంటూ ఐవీఆర్ సర్వే కాల్ నియోజకవర్గ ప్రజలకు వస్తుండటం కలకలం రేపింది. వీరారెడ్డి వారసులకు కాకుండా ఇతరులకు ఇన్చార్జి పదవి ఎలా ఇస్తారంటూ విజయమ్మ, రితీష్రెడ్డి వర్గం వాదిస్తుంటే.. పార్టీ కోసం కష్టపడుతూ ఖర్చు పెడుతున్న సూర్యనారాయణరెడ్డికి ఇన్చార్జి బాధ్యతలు ఇవ్వాల్సిందే నంటూ మరో వర్గం తమ అభిప్రాయాలను సోషల్ మీడియా ద్వారా వ్యక్తం చేస్తున్నారు. కాగా మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, రితీష్రెడ్డి వర్గం ఇప్పటికే జిల్లా ఇన్చార్జి మంత్రిని కలిసి దశాబ్దాల రాజకీయ చరిత్ర కలిగిన కుటుంబానికి చెందిన రితీష్రెడ్డినే ఇన్చార్జిగా కొనసాగించాలని కోరినట్లు తెలిసింది. ఏదిఏమైనా ఐవీఆర్ సర్వే పుణ్యమా అని బద్వేలు టీడీపీ బీటలు వారిందనే చెప్పవచ్చు. -
హత్యాయత్నం కేసులో నలుగురు నిందితుల అరెస్టు
చింతకొమ్మదిన్నె : స్థానిక చింతకొమ్మదిన్నె పోలీస్ స్టేషన్లో నమోదైన హత్యాయత్నం కేసులో నిందితులైన ఇందిరానగర్కు చెందిన రౌడీషీటర్ చిలకల చాంద్బాషా, అతని అనుచరులైన మరో ముగ్గురు ఎర్రవల్లి అబ్దుల్, షేక్ జాకీర్ హుస్సేన్, వలీ అలియాస్ ఖాదర్ హుస్సేన్లను గురువారం అరెస్టు చేసినట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. నిందితులను ఇందిరానగర్ వీధుల్లో నడిపించుకుంటూ తీసుకువచ్చి, ఎవరైనా చట్టవ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన శిక్ష తప్పదని హెచ్చరించారు. నిందితులను కోర్టులో హాజరు పరిచి రిమాండు నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించినట్లు తెలిపారు. -
భర్తపై భార్య ఫిర్యాదు
కడప అర్బన్ : కడప నగరంలోని టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో వక్కలపేటలో నివాసం ఉంటున్న రేవతికి, బాలాజీ నగర్కు చెందిన లోకేష్కు మూడేళ్ల క్రితం వివాహమైంది. వివాహమైనప్పటి నుంచి వీరి మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. తన భర్తతో పాటు, అత్తమామలు, అక్కా బావ వేధిస్తున్నారని ఆవేదన చెందుతూ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. కడప టూ టౌన్ ఎస్ఐ ఎస్కేఎం హుస్సేన్ ఐదుగురిపై వరకట్నం వేధింపు కేసు నమోదు చేశారు. జార్జి క్లబ్లో పోలీసుల తనిఖీలుప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని జార్జికారోనేషన్ క్లబ్లో గురువారం సాయంత్రం త్రీ టౌన్ సీఐ వేణుగోపాల్ సిబ్బందితో కలిసి తనిఖీలు నిర్వహించారు. క్లబ్లో పేకాట నిర్వహిస్తున్నారని ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ తనిఖీలు చేపట్టారు. క్లబ్లో పేకాట నిర్వహించరాదని సీఐ క్లబ్ నిర్వాహకులకు తెలిపారు. నిబంధనలకు విరుద్ధంగా కార్యకలాపాలు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. యువకుడి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గుర్రం చెన్నయ్య వీధికి చెందిన షేక్ ఖాజా మొహిద్దీన్(26) ప్రైవేట్ ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగించేవాడు. గత నెల 16వ తేదీ ఇంటి నుంచి బయటకు వెళ్లి అదృశ్యమైనట్లు తెలిపారు. తండ్రి మున్నా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఏఎస్ఐ సుధాకర్ తెలిపారు. ఐదుగురు జూదరుల అరెస్టుప్రొద్దుటూరు క్రైం : స్థానిక టూ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని మోడంపల్లె దళితవాడలో పేకాట ఆడుతున్న ఐదుగురిని గురువారం పోలీసులు అరెస్ట్ చేశారు. పేకాట ఆడుతున్నారని సమాచారం రావడంతో టౌ టౌన్ ఎస్ఐ రాఘవేంద్రారెడ్డి సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. దాడిలో ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 6390 నగదును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామన్నారు. రూ. 33 లక్షలకు ఐపీ దాఖలుపీలేరు రూరల్ : పీలేరు సీనియర్ సివిల్ జడ్జి కోర్టులో కలికిరికి చెందిన దంపతులు రూ. 33 లక్షలకు ఐపీ దాఖలు చేశారు. వివరాలిలా ఉన్నాయి. కలికిరి పట్టణం, రామ్నగర్ కాలనీకి చెందిన షేక్ ఖాదర్బాషా కలికిరిలో కూల్డ్రింక్స్, టీ దుకాణం నిర్వహిస్తూ కుటుంబం పోషించేవాడు. అలాగే కలికిరి, పరిసర ప్రాంతాల్లో భూములు లీజుకు తీసుకుని టమాట పంటసాగు చేసేవాడు, ఆయన భార్య షేక్ ముంతాజ్ ఇంటిలో చీరల వ్యాపారం నిర్వహించేది. ఖాదర్ బాషా 23 మంది వద్ద రూ. 17,76,500, ముంతాజ్ ఆరుగురి వద్ద రూ. 15,50,000 అప్పు చేసింది. వ్యాపారంలో నష్టం రావడంతో ఇద్దరూ ఐపీ దాఖలు చేశారు. -
మద్యం మత్తులో రైలులో వీరంగం..
కడప కోటిరెడ్డిర్కిల్ : తిరుపతి నుంచి చర్లపల్లికి వెళుతున్న రైలులో మద్యం తాగి తోటి ప్రయాణికులకు ఇబ్బందులు సృష్టించిన యువకుడికి శిక్షగా రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం (కమ్యూనిటీ సర్వీసు) చేయించారు. రైల్వే పోలీసుల కథనం మేరకు.. ఈనెల 18వ తేదీ కర్నూలు జిల్లా దొనకొండకు చెందిన వి.రవి అనే యువకుడు తిరుపతి–చర్లపల్లి రైలులో వెళుతూ మద్యం మత్తులో ఇతర ప్రయాణికులకు ఇబ్బందులు కలిగించాడు. ఈ క్రమంలో సమాచారం అందుకున్న జీఆర్పీ, ఆర్పీఎఫ్ సిబ్బంది రైలు కడప రైల్వేస్టేషన్ మూడవ ప్లాట్ఫారానికి చేరుకున్న వెంటనే యువకుడిని అదుపులోకి తీసుకున్నారు. బీఎన్ఎస్ యాక్టు 355 ప్రకారం కేసు నమోదు చేశారు. రవి చేసిన తప్పునకు శిక్షగా కడప రైల్వేస్టేషన్ను మూడు గంటల పాటు అతనితో శుభ్రం చేయించాలని గురువారం అసిస్టెంట్ సెకండ్ క్లాస్ జూనియర్ మెజిస్ట్రేట్ ఆదేశించారు. ఈ మేరకు పోలీసులు యువకుడి చేత రైల్వే స్టేషన్ పరిసరాలను శుభ్రం చేయించారు.రైల్వేస్టేషన్ పరిసరాలు శుభ్రం చేయాలని శిక్ష విధించిన న్యాయమూర్తి -
జేఎల్ఎంకు విద్యుత్ షాక్
వేంపల్లె : వేంపల్లె మండల పరిధిలోని చింతలమడుగుపల్లె సబ్ స్టేషన్లో పనిచేస్తున్న గ్రేడ్–2 జేఎల్ఎం హరి నారాయణకు నేలవరం తండా వద్ద విద్యుత్ స్థంభం వద్ద మరమ్మతులు చేస్తుండగా విద్యుత్ షాక్ తగిలింది. విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యం కారణంగానే విద్యుత్ షాక్ తగిలిందని బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గురువారం మధ్యాహ్నం జేఎల్ఎం హరినారాయణ లైన్ మెన్ నుంచి ఎల్సీ తీసుకొని విద్యుత్ స్థంభాన్ని ఎక్కి మరమ్మతులు చేస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ స్థంభంపై నుంచి కిందపడటంతో హరినారాయణ తలకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా హరినారాయణ వెనుక భాగమంతా విద్యుత్ షాక్ తగిలి చర్మం కాలిపోయింది. స్థానికుల సహాయంతో 108 వాహనంలో హరి నారాయణను వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యుల సూచన మేరకు ప్రాథమిక చికిత్స అనంతరం కడపకు తీసుకెళ్లారు. లైన్ క్లియరెన్స్ ఇవ్వకుండానే విద్యుత్తు స్థంభాన్ని ఎక్కించడంతోనే ఈ ప్రమాదం జరిగిందని బంధువులు వాపోతున్నారు. డిప్యుటేషన్ టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకోండిరాయచోటి టౌన్ : రాయచోటి డైట్ కళాశాలలో డిప్యుటేషన్ టీచింగ్ పోస్టుల కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా విద్యాధికారి డాక్టర్ సుబ్రహ్మణం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. 2025–2026 సంవత్సరానికి సంబంధించి మాత్రమే దరఖాస్తులు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 29వ తేదీ వరకు గడువు ఉందన్నారు. స్క్రూట్నీ 30–31వ తేదీలలో జరుగుతుందన్నారు. రాత పరీక్ష నవంబర్ 5–8వ తేదీ వరకు ఆన్లైన్ ద్వారా నిర్వహిస్తామన్నారు. -
సీటీఎం రైల్వే స్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
మదనపల్లె రూరల్ : మండలంలోని సీటీఎం రైల్వేస్టేషన్లో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. గురువారం స్టేషన్లోని రెండో ఫ్లాట్ఫాంపై సుమారు 55 సంవత్సరాల వయస్సు కలిగిన వ్యక్తి అపస్మారక స్థితిలో ఉండటాన్ని గుర్తించిన రైల్వే అధికారులు పరిశీలించారు. మృతి చెందినట్లు నిర్ధారించుకుని కదిరి రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ మహబూబ్బాషా, ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని రైల్వే డాక్టర్లతో కలిసి పరిశీలించారు. కాగా, గుర్తుతెలియని వ్యక్తిది సహజ మరణమేనని, అనారోగ్య కారణాలతో చనిపోయి ఉండవచ్చని ప్రాథమికంగా భావిస్తున్నట్లు తెలిపారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే రైల్వే హెడ్కానిస్టేబుల్ మహబూబ్బాషా ఫోన్ నెంబర్.9133109537ను సంప్రదించాలన్నారు. -
కొండల్ని పిండి చేస్తున్నారు!
● అనధికారిక తవ్వకాలు ● చోద్యం చూస్తున్న అధికారులు ● పంచాయతీలకు భారీ నష్టమంటున్న స్థానికులుఖాజీపేట : గ్రామీణ రోడ్ల కోసం లేదా ఇంటి బేస్మట్టం కోసం మట్టిని తీసుకెళితే వెంటపడి వేధించి కేసులు నమోదు చేసే అధికారులు ఎలాంటి అనుమతులు లేకున్నా లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలిస్తుంటే మౌనం వహిస్తున్నారు. అది కూడా ఫారెస్ట్ భూముల నుంచి తరలించుకుపోతున్నా పట్టించుకోవడం లేదు. దీంతో ప్రతి జాతీయ రహదారి నిర్మాణం కోసం అనధికారికంగా లక్షల క్యూబిక్ మీటర్లను తవ్వేస్తున్నారు. ఇందు కోసం అడవుల్లోని కొండలు సైతం పిండి అవుతున్నాయి. ఈ తవ్వకాలపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేసి అడ్డుకుంటున్న సంఘటనలు ఖాజీపేట మండలంలో నిత్యం జరుగుతున్నాయి. మైదుకూరు నియోజకవర్గం మీదుగా ఎక్స్ప్రెస్ హైవే వెళుతోంది. ఆ రహదారి నిర్మాణం కోసం ఒక ప్రముఖ కంపెనీ రోడ్డు నిర్మాణ పనులు మొదలు పెట్టింది. ఆ రహదారి నిర్మాణం కోసం ఖాజీపేట మండలం నాగసానిపల్లె సమీపంలోని కొండలను తవ్వి మట్టిని నిత్యం వందలాది టిప్పర్ల సహాయంతో తరలిస్తున్నారు. వారికి తొలుత కేవలం 300 క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించేందుకు మాత్రమే అనుమతులు లభించాయి. అయితే ఆ మట్టితో పాటు చుట్టు పక్కల కొండలను సైతం పెద్ద పెద్ద జేసీబీల సహాయంతో పిండి చేసి మట్టిని తరలిస్తున్నారు. లక్షల క్యూబిక్ మీటర్ల మట్టి తరలింపు.. వాస్తవానికి కంపెనీ మట్టి తరలింపు విషయంలో కొందరు వ్యక్తులకు సబ్ కాంట్రాక్టు ఇచ్చినట్లు సమాచారం. వారు అనుమతులు ఇచ్చిన ప్రదేశంలో తవ్వడంతో పాటు అనధికారికంగా అనుమతులు లేని చోట భారీగా మట్టిని తరలిస్తున్నారు. తెలుగు గంగ ప్రధాన కాలువ పైభాగాన అటవీ కొండలు ఉన్నాయి. ఆ కొండల్లో సైతం అనధికారికంగా భారీగా మట్టిని తవ్వేస్తున్నారు. 300 క్యూబిక్ మీటర్లు తవ్వాల్సింది పోయి ఇప్పటికే సుమారు 3 లక్షల క్యూబిక్ మీటర్ల మట్టిని తరలించినట్లు అధికారులు చెబుతున్నారు. పంచాయతీలకు అందని రాయల్టీ.. రోడ్డు నిర్మాణం కోసం మట్టిని తరలించే క్రమంలో కంపెనీ వారు అధికారుల నుంచి అనుమతులు తీసుకుంటారు. క్యూబిక్ మీటరుకు సుమారు రూ.140 నుంచి రూ.150 చొప్పున రాయల్టీ కడతారు. అలా కట్టిన రాయల్టీలో కొంతభాగం పంచాయతీకి వస్తుంది. అయితే రాయల్టీ కట్టకుండా తరలించడంపై అప్పనపల్లె పంచాయతీ ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. జాతీయ రహదారి నిర్మాణంలో మట్టి వాడకంపై నేషనల్ అథారిటీ వారు క్యూబిక్ మీటరుకు డబ్బును నిర్ధారించి కంపెనీ వారితో కట్టించుకుంటారు. అయితే వారు వేరే ప్రాంతంలో మట్టిని తరలించినట్లు చూపుతారు. దీంతో మట్టిని తరలించుకు పోయేది ఒక చోట.. పంచాయతీకి జమ అయ్యేది వేరొక చోట. ఈ కారణంగా మట్టిని తరలించుకు పోయిన పంచాయతీకి ఎలాంటి నిధులు రావు. అటవీ కొండల్లో సైతం.. చిలక కనం దగ్గర ఉన్న కొండలు పూర్తిగా అటవీశాఖ పరిధిలోకి వస్తాయి. అలాంటి కొండలు తవ్వాలంటే అటవీ శాఖ అనుమతులు తప్పనిసరి. కానీ అక్కడ ఎలాంటి అనుమతులు లేకుండానే తవ్వకాలు చేపట్టారు. ఇప్పటికే చాలా దూరం తవ్వినట్లు తెలుస్తోంది. అడ్డుకున్న టీడీపీ నాయకులు.. రోడ్డు నిర్మాణం కోసం ఎలాంటి అమనుతులు లేకుండా మట్టిని తరలించడంపై టీడీపీ నాయకులు కొందరు అడ్డుకున్నారు. ఖాజీపేట మండలానికి చెందిన ఒక నాయకుడు, తెలుగుగంగ మాజీ ఏఈ కలసి మట్టిని తరలించే విషయంలో కంపెనీ నుంచి సబ్ కాంట్రాక్టు తీసుకున్నట్లు తెలుస్తోంది. వారే మట్టిని తరలిస్తున్నారు. అయితే అనుమతులు లేకుండా మట్టిని తరలించడంపై ఇటు అప్పనపల్లెలోని టీడీపీ నాయకులు, ఖాజీపేటకు చెందిన టీడీపీ నాయకులు తీవ్రంగా మండిపడ్డారు. మట్టిని తరలించే చోట రహదారికి అడ్డుగా మట్టి కట్టలను వేశారు. మరో చోట వాహనాలను అడ్డు పెట్టి మట్టిని తరలించకుండా పనులను తాత్కాలికంగా నిలిపేశారు. చాలా రోజులుగా మట్టిని తరలిస్తున్నా అడ్డు చెప్పని నాయకులు ఇప్పడు అడ్డుకోవడంలో ఆంతర్యం ఏమిటని స్థానికులు చర్చించుకోవడం విశేషం.మట్టి తరలింపును నిలిపి వేయమని చెప్పాం.. అనుమతుల మేరకు మట్టిని తరలించాలి. అనుమతులు మించి మట్టిని తరలించరాదు. కంపెనీ వారు కొంత మేరకు రాయల్టీ చెల్లించారు. జాతీయ రహదారి నిర్మాణ సంస్థ వారికి మేం లేఖలు రాశాము. మట్టి తరలింపును తాత్కాలికంగా ఆపేయమని చెప్పాం. పూర్తి అనుమతులు వచ్చిన తరువాతనే మట్టి తవ్వకాలు చేపట్టాలని సూచించాం. – వెంకటరామయ్య, డీఈ, గనుల శాఖఎలాంటి అనుమతులు ఇవ్వలేదు.. రోడ్డు నిర్మాణ పనుల కోసం మేము ఎవ్వరికి అనుమతులు ఇవ్వలేదు. ఎవ్వరికి సిఫార్సు చేయలేదు. అలా ఎవరైనా మట్టిని తరలిస్తే అది అనధికారిక తరలింపే అవుతుంది. వాటిని మేం అడ్డుకుంటాం. – వెంకట రమణమ్మ, తహసీల్దార్, ఖాజీపేట -
కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయండి
కమలాపురం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలను ప్రైవేటీకరణ చేస్తుండటాన్ని నిరసిస్తూ వెఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు చేపట్టిన కోటి సంతకాల సేకరణను విజయవంతం చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్ రెడ్డి పిలుపునిచ్చారు. బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో నల్లింగాయపల్లె గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ అభిమానులతో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సంధర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడిన 17 నెలలుగా రాష్ట్రంలో దుర్మార్గపు పాలన నడుస్తోందంటూ ధ్వజమెత్తారు. వైఎస్ జగన్ జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని 17 మెడికల్ కళాశాలలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం ఈ 17 నెలల పాలనలో వాటిని నిర్వీర్యం చేస్తోందని మండి పడ్డారు. మెడికల్ సీట్లు వద్దన్న ఏకై క ప్రభుత్వం కూటమి ప్రభుత్వమేనన్నారు. మెడికల్ కాలేజీలను ప్రైవేట్ పరం చేయాలనుకోవడం అత్యంత దుర్మార్గం అన్నారు. లక్షల కోట్లు విలువ చేసే మెడికల్ కాలేజీలను అతి తక్కువ ధరలకు సింగిల్ టెండర్లోనే అమ్మకాలు చేస్తున్నారన్నారు. ఎకరా భూమి 99 పైసలకే కూటమి ప్రభుత్వం అమ్ముతోందని, ఏడాదికి రూ.4వేలు అద్దె ప్రకారం ధారా దత్తం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందిరమ్మ ఇంటి అద్దె కూడా ఇంత దారుణంగా ఉండదన్నారు. 50 ఎకరాల ప్రభుత్వ ఆసుపత్రిని ఏడాదికి రూ.4వేలకు ఇవ్వడం దారుణం అన్నారు. విద్య వైద్యంపై చిత్తశుద్ధి లేదు: నరేన్ ప్రజలకు విద్య, వైద్యం అందించాలనే అంశాలపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి విమర్శించారు. మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆరోగ్య శ్రీ పథకాన్ని తీసుకువస్తే ప్రజా నేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆరోగ్యశ్రీని మరింత విస్తరించారన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో ఆరోగ్య శ్రీ ఉద్యోగులు సమ్మెలో ఉన్నారన్నారు. 10 మెడికల్ కళాశాలలతో పాటు హాస్పిటల్స్ను ప్రైవేట్ పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోందని, ఇదే జరిగితే పేద ప్రజలకు వైద్య సదుపాయాలు లభించవన్నారు. ప్రతి ఒక్కరూ ముందుకు వచ్చి కోటి సంతకాల సేకరణ చేపట్టి తమ నిరసన వ్యక్తం చేసి ప్రైవేటీకరణను అడ్డుకోవాలని పిలుపునిచ్చారు. వైద్య విద్య భారం: రాజోలి వీరారెడ్డి పేద విద్యార్థులకు వైద్య విద్య భారం అవుతుందని రాష్ట్ర పరిశ్రమల శాఖ మాజీ సలహాదారుడు రాజోలి వీరారెడ్డి తెలిపారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ జరిగితే రూ. 1 లక్ష నుంచి రూ.1.5 లక్షల ఫీజు చెల్లించే వైద్య విద్యార్థులు కోటి రూపాయలు చెల్లించాల్సి వస్తుందన్నారు. కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం చేస్తోందని మండి పడ్డారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సుమిత్రా రాజశేఖర్ రెడ్డి, మల్లికార్జున రెడ్డి, చంద్రశేఖర్ రెడ్డి, సత్యంరెడ్డి, రామ లక్ష్మీరెడ్డి, మోహన్ రెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, మహ్మద్ సాదిక్, చెన్నకేశవరెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులోని చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ షాక్తో మూడు పందులు మృతి చెందిన సంఘటన బుధవారం జరిగింది. వివరాలిలా.. మంగళవారం రాత్రి కురిసిన వర్షానికి వల్లూరులోని ప్రభుత్వ ఆసుపత్రి, గ్రామ సచివాలయాలకు వెళ్లే దారిలో ఉన్న గ్రామ పంచాయతీకి చెందిన చెత్త నుండి సంపద తయారీ కేంద్రం వద్ద విద్యుత్ తీగలు కిందకు జారిపోయి కేంద్రం ఇనుప గేటుకు తగులుకున్నాయి. దీంతో గేటుకు విద్యుత్ ప్రసరించింది. బుధవారం ఉదయం కేంద్రం వద్ద సంచరిస్తున్న మూడు పందులు గేటుకు తగిలి విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాయి. ఒక వైపు వర్షం కురుస్తుండడంతో పాటు ఆ సమయానికి మనుషులు అటువైపు రాక పోవడంతో పెను ప్రమాదం తప్పినట్లైంది. పందులు మృతి చెంది ఉండటాన్ని గమనించిన స్థానికులు వెంటనే ప్రజలను అప్రమత్తం చేయడంతో పాటు విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం అందించడంతో పెను ప్రమాదం తప్పింది. -
బీసీల పట్ల చిత్తశుద్ధి లేని ప్రభుత్వం
కడప కార్పొరేషన్ : వెనుకబడిన వర్గాలు(బీసీ)ల పట్ల కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ విమర్శించారు. బుధవారం ఆ పార్టీ నాయకులతో కలిసి పాత రిమ్స్ ప్రాంగణంలోని బీసీ భవన్ను సందర్శించారు. ఈ సందర్భంగా బీసీ భవన్లోని స్టడీ సెంటర్, లైబ్రరీ, మూడో అంతస్తులో ఉన్న విడిది రూములను పరిశీలించారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక భవనం ఉండాలనేది చిరకాల వాంఛ అని, అన్ని ప్రభుత్వాలకు అనేక మార్లు విన్నవించినా ఏ ప్రభుత్వం స్పందించలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి చొరవ వల్ల బీసీ భవన్ సాకారమైందన్నారు. కడప శివార్లలో రెండు ఎకరాలు స్థలం కేటాయిస్తామని అధికారులు చెబితే తాము కడప నగరంలోనే కావాలని పట్టుబట్టి పాతరిమ్స్ ప్రాంగణంలో సెంటు రూ.20 లక్షలు పలికేచోట 0.20 సెంట్ల స్థలాన్ని కేటాయింపజేశామన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ప్రత్యేక చొరవ చూపి ఎంపీ నిధుల నుంచి రూ.6కోట్లు భవన నిర్మాణానికి మంజూరు చేయగా, అత్యంత సుందరంగా బీసీ భవన్ను నిర్మించారన్నారు. ఆ తర్వాత ఎన్నికలు రావడంతో బీసీ భవన్ పనులు ముందుకు సాగలేదని, కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 17 నెలలు కావొస్తున్నా చిన్న చిన్న పనులు కూడా చేయకుండా పెండింగ్లో ఉంచడం దారుణమన్నారు. విద్యార్థులు పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యేందుకు సరైన పుస్తకాలు, కుర్చీలు, టేబుళ్లు, కంప్యూటర్లు వంటివి ఏవీ లేవన్నారు. స్టడీ హాల్లో విద్యార్థులు కూర్చోవడానికి కుర్చీలు కూడా లేవన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు బంగారు నాగయ్య యాదవ్ మాట్లాడుతూ బీసీ భవన్లో విశ్రాంతి గదుల్లో ఏసీలు, మంచాలు, పరుపులు, స్టడీ హాల్లో కుర్చీలు, టేబుళ్లు వంటివి ఏవీ లేవన్నారు. రూ.50లక్షలు ఖర్చు చేస్తే అన్ని సౌకర్యాలు సమకూరుతాయన్నారు. బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శివ యాదవ్ మాట్లాడుతూ బీసీల ఓట్లతో గద్దెనెక్కిన ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చెబితే, తాము జోలె పట్టుకొని బీసీ భవన్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బసవరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి సింధే రవి, గంగరాజు, మహిళా నాయకురాలు నారాయణమ్మ పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ బీసీ విభాగం నాయకులు -
లారీని ఢీకొన్న కారు
చింతకొమ్మదిన్నె : మండల పరిధిలోని కడప–చిత్తూరు జాతీయ రహదారి కొలుములపల్లి సమీపంలోని కొత్త రోడ్డు వద్ద బుధవారం ఉదయం చెత్తను తరలించే లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ శ్రీనాథ్, చెత్తను తరలించే లారీ డ్రైవర్ ఏసుదాసు ప్రసాద్కు గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప వైపు నుంచి మద్దిమడుగు వద్ద ఉన్న కార్పొరేషన్ డంపింగ్ యార్డ్కు చెత్తను తరలిస్తున్న ఏపీ 04 టీఎక్స్ 8410 నెంబర్ గల లారీని రాయచోటి వైపు నుంచి కడప వైపు వస్తున్న కేఏ 04 ఎంక్యూ 8105 నెంబర్ గల మారుతీ సియాజ్ కారు ముందు వెళ్తున్న మరో వాహనాన్ని ఓవర్ టేక్ చేసే క్రమంలో వేగంగా వస్తూ ఎదురుగా వస్తున్న లారీని ఢీకొంది. ఈ ఘటనలో కారు రోడ్డుపై పల్టీలు కొడుతూ మరోసారి బలంగా అదే లారీని ఢీకొనడంతో కారు ముందుభాగం దెబ్బతింది. కారుకు ఎయిర్ బెలూన్లు తెరుచుకోవడంతో డ్రైవర్ ప్రమాదం నుంచి తప్పించుకున్నాడు. గాయపడిన రెండు వాహనాల డ్రైవర్లను హైవే పెట్రోలింగ్ పోలీసులు 108 వాహనంలో రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతి కల్పించాలికడప రూరల్ : హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతులు కల్పించాలని నర్సింగ్ అసోసియేషన్ నాయకులు ప్రిస్కిల్లా, మనో థెరిస్కోవా తెలిపారు. ఆ మేరకు బుధవారం స్థానిక వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్యకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం వారు చాలా మంది పదవీ విరమణ పొందే దశలో ఉన్నారని తెలిపారు. కనుక హెడ్ నర్సు నుంచి గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతులు కల్పించి న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో రాధమ్మ, అమరావతి, పద్మావతి తదితరులు పాల్గొన్నారు. -
స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నం
● ఫిర్యాదు చేసిన సర్పంచ్, ప్రజలు ● విచారించిన తహసీల్దారుబద్వేలు అర్బన్ : మండల పరిధిలోని పుట్టాయపల్లె పంచాయతీలోని 186 బూత్లో గ్రామానికి చెందిన కొందరు స్థానికేతరుల ఓట్ల నమోదుకు యత్నించారు. విషయం తెలుసుకున్న సర్పంచ్ వంకెల జయరామిరెడ్డి, స్థానిక ప్రజలు డివిజన్ ఎన్నికల అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో దరఖాస్తు చేసిన వ్యక్తులు సైతం తమ వారి ఓట్లు నమోదు చేయడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదు చేశారు. ఆర్డీఓ సూచనల మేరకు బుధవారం పుట్టాయపల్లె సచివాలయంలో తహసీల్దారు ఉదయభాస్కర్రాజు గ్రామసభ నిర్వహించి గ్రామస్తులను విచారించారు. గ్రామంలో నివాసం లేని చెన్నంపల్లె, అట్లూరు మండలం గుజ్జులవారిపల్లె, మణ్యంవారిపల్లె, బద్వేలు టౌన్ ఎన్జీఓ కాలనీలకు చెందిన పలువురిని పుట్టాయపల్లె గ్రామ బూత్ నెంబర్ 186లో ఓటర్లుగా నమోదు చేయించేందుకు గ్రామానికి చెందిన బీరం జయరామిరెడ్డి, బీరం విజయనరసింహారెడ్డి తదితరులు ప్రయత్నిస్తున్నారని పుట్టాయపల్లె సర్పంచ్ జయరామిరెడ్డి మండల ఉప ఎన్నికల అధికారికి ఫిర్యాదు చేశారు. ఇదే సమయంలో తమ వారి ఓట్లు బీఎల్ఓ నమోదు చేయడం లేదని ఆర్డీఓకు ఫిర్యాదులు అందాయి. ఇరువురి వాదనల మేరకు ఆర్డీఓ ఆదేశాలతో గ్రామంలో విచారణ చేపట్టామని, తుది నివేదికను ఆర్డీఓకు అందజేస్తామని తహసీల్దారు తెలిపారు. -
రాష్ట్రస్థాయి విజేతలుగా మైదుకూరు విద్యార్థులు
మైదుకూరు : నెల్లూరు జిల్లా కావలిలో జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్బాల్ పోటీల్లో మైదుకూరు మండలానికి చెందిన విద్యార్థులు విజేతలుగా నిలిచారు. కావలిలోని డీబీఎస్ ఇంజినీరింగ్ కళాశాలలో వివిధ జిల్లాల మధ్య జరిగిన రాష్ట్రస్థాయి హ్యాండ్ బాల్ పోటీల్లో వైఎస్సార్ కడప జిల్లా జట్టు విజేతగా నిలిచిందని మండలంలోని వనిపెంట జ్యోతిరావు పూలే గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మల తెలిపారు. వైఎస్సార్ కడప జిల్లా జట్టులో తమ పాఠశాలకు చెందిన 9వ తరగతి విద్యార్థినులు హిమబిందు, దివ్య, స్నేహ, అమీరూన్, 10వ తగరతి విద్యార్థినులు కుసుమ, అపూర్వలు ప్రతిభ కనపరిచి వైఎస్సార్ కడప జిల్లా జట్టు మొదటి స్థానంలో నిలిచేందుకు కృషి చేశారని ప్రిన్సిపాల్ వివరించారు. విజేత జట్టుకు ప్రాతినిధ్యం వహించిన ఈ విద్యార్థినులను ప్రిన్సిపాల్ నిర్మల, పీఈటీ శైలజ, ఉపాధ్యాయులు అభినందించారు. -
అప్పుల భయంతో యువకుని ఆత్మహత్య
పోరుమామిళ్ల : అప్పుల భయంతో పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన రంగసముద్రం పంచాయతీ కమ్మవారిపల్లెలో జరిగింది. ఎస్ఐ కొండారెడ్డి కథనం మేరకు కమ్మవారిపల్లెకు చెందిన యువరైతు కలవకూరి నాయుడుబాబు(37) చేసిన వ్యాపారాల్లో నష్టం రావడంతో పాటు సుమారు రూ. 15 లక్షల దాకా అప్పులు చేశాడు. చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక భయంతో ఈనెల 18న పురుగుల మందు తాగాడు. అతన్ని బంధువులు నెల్లూరు కిమ్స్ ఆసుపత్రికి తీసికెళ్లారు. పరిస్థితి విషమించడంతో ఆసుపత్రి వర్గాలు ఇంటికి తీసికెళ్లమని చెప్పడంతో మంగళవారం ఇంటికి తెచ్చారు. బుధవారం ఉదయం నాయుడుబాబు మృతి చెందాడు. మృతునికి భార్య ఇద్దరు మైనర్ కూతుళ్లు ఉన్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిరుపేద పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్ పరిశీలనకడప అర్బన్ : కడప నగరం మోచంపేటలోని ఆధార్ సెంటర్ను సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ బుధవారం పరిశీలించారు. సాథి క్యాంపెయిన్లో ఆధార్ రిజిస్ట్రేషన్ చేయించుకున్న నిరుపేద పిల్లల వివరాలను ఆయన తెలుసుకున్నారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ ఆధార్ రిజిస్ట్రేషన్, ఆధార్ కార్డుకు పట్టే సమయం, ఆధార్లో ఏమైనా సమస్యలు వస్తే తిరిగి ఎలా చేయించుకోవాలి తదితర అంశాలను విచారించారు. నిరుపేద పిల్లల ఆధార్ రిజిస్ట్రేషన్లను త్వరితగతిన పరిష్కరించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆధార్ సెంటర్ నిర్వాహకులు, ప్రజలు పాల్గొన్నారు. -
వర్షపాతం వివరాలు
● జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలు ● వరుస వానలతో పట్టణ, గ్రామాల్లో లోపిస్తున్న పారిశుధ్యం ● దెబ్బతిన్న వరి, మొక్కజొన్న, పత్తి, మినుము పంటలు మొలకొచ్చిన మొక్కజొన్న గింజలు అధిక వర్షాలతో ఎర్రగుంట్ల మండలం చిన్నదన్నూరు, ఇట్లూరు గ్రామాల్లో నేలకొరిగిన వరిపంట కడప అగ్రికల్చర్ : వరుస వానలు అన్నదాతల్లో ఆందోళన కలిగిస్తున్నాయి. చేతికందిన పంటలు నీళ్లపాలవుతుండడంతో కర్షకుడి కళ్లల్లో నీళ్లు సుడులు తిరుగుతున్నాయి. మొన్నటి వరకు ఉపరితల ఆవర్తనం, తాజాగా బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం జిల్లా ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. అల్పపీడనం బలపడటంతో 24 గంటల నుంచి వాన జడి పట్టింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం రోజంతా ఎడతెరిపి లేకుండా వర్షం పడింది. ఇక వరుస వానలకు గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లో పారిశుధ్యం పూర్తిగా లోపించింది. దీంతో దోమల బెడద అధికమై జనాలు జ్వరాల బారిన పడుతున్నారు. ఆరుతడి పంటలు సాగు చేసిన రైతుల్లో గుబులు నిత్యం కురుస్తున్న వర్షాలకు భూమి తడారక ఆరుతడి పంటలు ఎర్రగా మారి దెబ్బతింటున్నాయని రైతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కనీసం కలుపు మొక్కలను తొలగించుకోలేని పరిస్థితి ఉందని వాపోతున్నారు. పైగా కలుపును తొలగించాలంటే ఖర్చులు భారీగా వస్తాయని.. ప్రధాన పంటలకు తెగుళ్లు కూడా సోకుతున్నాయని పలువురు అన్నదాతలు ఆవేదన వ్యక్తం చేశారు. పెన్నా, కుందూ నదీ పరివాహక ప్రాంతాలతోపాటు నీటి వసతి ఉన్న రైతులు బోర్ల కింద చాలా మంది ముందస్తుగా వరిపంట సాగు చేశారు. చిరుపొట్ట దశలో ఉన్న వరికంకి తాలుపోతోంది. అలాగే ఎన్ను దశలో ఉండే వరికి కంకిపైన ఉండే సుంకు రాలి ఎన్ను దెబ్బతింటోంది. దీంతో చాలామంది రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక ఇప్పటికే కోత కోసిన రైతుల పరిస్థితి మరింత దయనీయంగా మారింది. ప్రధాన రహదారుల వెంబడి, కళ్లాల్లో ఆరబెట్టుకుంటున్నారు. ఉన్నట్లుండి వచ్చిన వర్షంతో చాలా చోట్ల ధాన్యం తడిసి ముద్దయింది. మినుము, శనగ రైతులకు నష్టం.. జిల్లాలో ఇటీవల కురిసిన వర్షాలకు కొన్ని మండలాల్లో మినుము, శనగ పంటలను విత్తుకున్నారు. విత్తుకున్న వెంటనే వరుస వానలు కురుస్తుండడంతో నేలంతా బాగా తడెక్కింది. దీంతో భూమిలో విత్తిన మినుము, శనగ విత్తనాలు కుళ్లిపోయే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వరుస వానలకు పత్తికాయలోకి నీరు చేరి పత్తి(దూది) దెబ్బతింటోందని పత్తి సాగు చేసిన రైతుల్లో కలవరం మొదలైంది. పాత ఇళ్లు, మట్టి మిద్దెలతో అప్రమత్తం వారం నుంచి కురుస్తున్న వర్షాలతో జిల్లాలోని కొన్ని ప్రాంతాల్లో పాత చవుడు మిద్దెలు కూలుతున్నాయి. ఎర్రగుంట్ల పట్టణ పరిధిలోని ప్రకాష్నగర్కు చెందిన లక్ష్మిదేవికి సంబంధించిన మట్టిమిద్దె కూలింది. ఇలా చవుడు మిద్దెలతో ప్రమాదాలు జరిగే అవకాశం ఉంది. మట్టి , పాత దంత మిద్దెలు ఉన్న వారు వర్షాలతో అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లావ్యాప్తంగా అన్ని మండలాల్లో వర్షం... అల్పపీడనం కారణంగా జిల్లా వ్యాప్తంగా వర్షం కురిసింది. మంగళవారం రాత్రి నుంచి బుధవారం పగలంతా వర్షం కురిసింది. ఒంటిమిట్టలో అత్యదికంగా 66.4 మి.మీ వర్షం కురిసింది. జిల్లా కేంద్రమైన కడపలో రహదారులు నీటితో నిండిపోయాయి.మొక్కజొన్న గింజలపై పట్టలు కప్పిన రైతులు ఎర్రగుంట్ల పట్టణంలోని ప్రకాష్నగర్కాలనీలో కూలిన మట్టిమిద్దె నేను నాలుగు ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశాను. దిగుబడి బాగా వచ్చింది. కల్లంలో మొక్కజొన్న గింజలను ఆరబెట్టుకుని ఉండగా ఉన్నట్లుండి వచ్చిన ఎడతెరిపి లేని వర్షాలతో గింజలు తడిచిపోయాయి. అక్కడక్కడ గింజలు మొలకలు వస్తున్నాయి. ఇక వ్యాపారులు ధర తగ్గించి అడుగుతారు. ఎకరాలకు రూ. 40 వేలదాకా వస్తుందని ఆశపడ్డాము. మరి ఎంత వస్తుందో చూడాల. – పంజగల ఓం ప్రసాద్. దూలంవారిపల్లె , కలసపాడు మండలం నేను ఆరు ఎకరాల్లో మొక్కజొన్న పంటలను సాగు చేశాను. దిగుబడి పర్లేదు. మొక్కజొన్న గింజలను ఆరబెట్టుకుంటే వర్షానికి తడిచి పోయాయి. దీనికితోడు ఎర తెరిపిలేకుండా వర్షాలు కురుస్తుండడంతో పట్టలు కూడా తీసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో పట్టకింద ఉక్కకు గింజలు మొలకలు వచ్చాయి. ఏం చేయాలో ఆర్థం కావడం లేదు. దాదాపు లక్షన్నర వస్తుందని ఆశపడ్డాను. ఇప్పుడు పరిస్థితేందో అర్థం కావడం లేదు. గ్రామానికి చెందిన చాలామంది రైతులకు సంబంధించిన దాదాపు 600 క్వింటాళ్ల విత్తనాలు తడిచాయి. – నామాల వెంకటరమణ, దూలంవారిపల్లె. కలసపాడు మండలం. -
2296 హెక్టార్లలో పంట నష్టం
కడప అగ్రికల్చర్ : జిల్లావ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలకు జిల్లాలో 15 మండలాల పరిధిలోని 2296 హెక్టార్లలో వివిధ పంటలకు నష్టం వాటిల్లినట్లు వ్యవసాయశాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేశారు. ఇందులో వరిపంట 1489 హెక్టార్లు, కంది 258 హెక్టార్లు, మినుము 329 హెక్టార్లు, వేరుశనగ 134 హెక్టార్లు, పత్తిపంట 81 హెక్టార్లు, మొక్కజొన్న 05 హెక్టార్లలో పంట నష్టం జరిగిందని అంచనా వేశారు. సంబంధిత ప్రాథమిక నివేదకలను ఉన్నతాధికారులకు నివేదించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ వెల్లడించారు. రైతులు జాగ్రత్తలు తీసుకోవాలి.... వర్షాలకు లోతట్టు పాంతాల్లో ఉన్న పంటలు మునకకు గురి అయ్యే అవకాశం ఉందని జిల్లా వ్యవసాయ అధికారి తెలిపారు.కోత దశలో ఉన్న వరి, మినుము పంటలకు గింజలు మొలకలు వచ్చి పంట నష్టం జరిగే అవకాశం ఉన్నందున సూచనలు పాటించి పంట నష్ట నివారణ చేసుకోవాలని సూచించారు. జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ -
శివాలయాలకు కార్తీక దీపశోభ
కార్తీక దీపాలతో శైవక్షేత్రాలు కళకళలాడాయి. శివనామస్మరణతో ఆలయ పరిసరాలు ప్రతిధ్వనించాయి. శివ భక్తులకు ప్రియమైన కార్తీకమాసం బుధవారం ప్రారంభమైంది. ప్రత్యేక పూజలు, కార్తీక దీపాలతో జిల్లాలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. పవిత్ర కార్తీక మాసం ప్రారంభమైందని చాటుతూ ఆలయాల ధ్వజ స్తంభాలపై కార్తీక దీపాన్ని వెలిగించారు. కాగా జోరు వర్షాన్ని సైతం లెక్కచేయకుండా భక్తులు ఆలయాలకు వెళ్లి స్వామి వారిని దర్శించుకుని కార్తీక దీపాలను వెలిగించారు. కడప నగరంలోని శైవ క్షేత్రాల్లో నిర్వాహకులు భక్తుల సౌకర్యార్థం విశేష ఏర్పాట్లు చేశారు. – ఫొటోగ్రాఫర్, సాక్షి,కడప -
పడకేసిన పల్లె వైద్యం
● మూడు వారాలకు పైగా సమ్మెలో గ్రామీణ పీహెచ్సీ వైద్యులు ● ఇన్ఛార్జి వైద్యులతో అంతంతమాత్రంగా వైద్య సేవలు గ్రామీణ వైద్యం అటకెక్కింది. వైద్యులు తమ సమస్యల పరిష్కారం కోసం సమ్మె బాట పట్టడంతో పల్లెవాసులకు వైద్య సేవ అందని దుస్థితి నెలకొంది. వైద్యులు సమ్మెలోకి వెళ్లినా..వైద్యం పడకేసినా పాలకులకు పట్టకపోవడంపై గ్రామీణుల్లో ఆగ్రహం పెల్లుబుకుతోంది. కడప రూరల్ : గ్రామీణ ప్రాంతాల్లో ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల ద్వారా లభించే ప్రాథమిక వైద్యం పూర్తిగా గాడి తప్పింది. వైద్యులు తమ సమస్యల పరిష్కారానికి సెప్టెంబరు 28 నుంచి విధులను బహిష్కరించి సమ్మెలోకి వెళ్లారు. దీంతో కొద్దిరోజులపాటు పూర్తిగా వైద్య సేవలకు ఆటంకం కలిగింది. ఆ సమయంలో స్థానికంగా ఉన్న నర్సులే వైద్యుల పాత్ర పోషించారు. అనంతరం జిల్లా యంత్రాంగం కడప ప్రభుత్వ సర్వజన ఆస్పత్రిలోని వైద్యులను ఇన్చార్జిలుగా పీహెచ్సీలకు పంపించారు. పీహెచ్సీ ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు పనిచేస్తుంది. అయితే ఇన్ఛార్జి వైద్యులు చాలా ప్రాంతాల్లో ఆస్పత్రికి వచ్చిన వైద్యులను చూసి గంట, రెండు గంటల తర్వాత వెళుతున్నట్లుగా తెలిసింది. దీంతో వైద్య సేవలకు ఆటంకం ఏర్పడినట్లయింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధుల కాలం నడుస్తోంది. వైరల్ ఫీవర్స్ విజృంభిస్తున్నాయి. దీంతో పల్లెవాసులు పీహెచ్సీలకు వెళ్లినా అక్కడ సక్రమంగా వైద్య సేవలు లభించకపోవడంతో చేసేదీలేక సమీపంలోని పట్టణాలకు వెళుతున్నారు.


