breaking news
YSR District Latest News
-
బాలిక అదృశ్యం కేసులో నిందితుడి అరెస్టు
వేంపల్లె : బాలిక అదృశ్యం కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. శనివారం వేంపల్లె పోలీస్ స్టేషన్లో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఈ నెల 7వ తేదీన వేంపల్లి పంచాయతీ పక్కీరుపల్లెకు చెందిన బాలిక గొర్రెలను మేపుకునేందుకు అడవిలోకి వెళ్లి అదృశ్యమైన ఘటనపై వేంపల్లె పోలీస్ స్టేషన్లో తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారన్నారు. సీఐ నరసింహులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారని తెలిపారు. చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడకా బాబు చైన్నెలోని ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తుండేవాడని, పక్కనే ఉన్న పక్కీరుపల్లెకు చెందిన బాలికతో ఇన్స్ట్రాగామ్లో పరిచయమయ్యాడన్నారు. బాలికకు మాయమాటలు చెప్పి తరచూ వీడియో కాల్స్ మాట్లాడేవాడన్నారు. ఈనెల 5వ తేదీన చైన్నె నుంచి మడకా బాబు సొంత గ్రామానికి వచ్చాడన్నారు. 7వ తేదీ ఉదయం బాలిక చింతలమడుగుపల్లె గ్రామ సమీపంలో ఉన్న అటవీ ప్రాంతంలో వజ్రాలకోట వద్దకు గొర్రెలను మేపుకునేందుకు వెళ్లిందన్నారు. విషయం తెలుసుకుని అక్కడికి వెళ్లిన బాబు బాలికతో మాట్లాడుతున్న సమయంలో గొర్రె పిల్లలు పక్కనే ఉన్న రాఘవరెడ్డి అనే వ్యక్తి పొలంలోకి వెళ్లాయన్నారు. అక్కడ గొర్రె పిల్లలు మాత్రమే ఉండటంతో బాలిక తండ్రికి రాఘవరెడ్డి భార్య ఫోన్ చేసిందన్నారు. అతను అక్కడికి వెళ్లేసరికి కూతురు కనిపించకపోవడంతో మడకా బాబుపై అనుమానం ఉందని పోలీసులకు ఫిర్యాదు చేశారన్నారు. దీంతో మడకా బాబుతోపాటు అతని స్నేహితులను పోలీస్ స్టేషన్కు పిలిపించి విచారించే సమయంలో పోలీస్ స్టేషన్పై బాలిక బంధువులు, గ్రామస్తులు దాడి చేశారని తెలిపారు. అదే రోజు రాత్రి 10 గంటల సమయంలో బాలిక ఆచూకీ తెలిసిందన్నారు. అపస్మారక స్థితిలో ఉన్న బాలికను కడప రిమ్స్కు తరలించామన్నారు. బాలికను విచారించి మైనర్ కావడంతో మడకా బాబుపై పోక్సో చట్టం కింద అత్యాచారం కేసు నమోదు చేసి అరెస్టు చేశామన్నారు. నిందితుడిని జమ్మలమడుగు కోర్టులో హాజరుపరిచి రిమాండ్కు పంపనున్నట్లు తెలిపారు. సమావేశంలో సీఐ నరసింహులు, ఎస్ఐ రంగారావు, పోలీసులు పాల్గొన్నారు.పోక్సో కేసు నమోదు -
వక్ఫ్బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం
ప్రొద్దుటూరు : మండల పరిధిలోని టీచర్స్ కాలనీ వెనుక ఉన్న వక్ఫ్బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. వక్ఫ్బోర్డుకు సంబంధించి మూడు ఎకరాల స్థలం ఉండగా అధికార పార్టీకి చెందిన కొంత మంది స్థలాన్ని లీజుకు తీసుకుని ప్లాస్టిక్ రీసైక్లింగ్ పరిశ్రమను నిర్వహిస్తున్నారు. కొంత స్థలాన్ని లీజుకు తీసుకోగా మరికొంత స్థలాన్ని అనధికారికంగా వినియోగిస్తున్నారు. మధ్యాహ్న సమయంలో ప్రమాదవశాత్తు నిప్పు అంటుకుని భారీ ఎత్తున మంటలు వ్యాపించాయి. ఆ స్థలంలో ఉన్న టైర్లతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు ఉవ్వెత్తున లేచాయి. అగ్నిమాపక సిబ్బంది నాలుగు వాహనాలను తీసుకొచ్చి సాయంత్రం వరకు మంటలను అదుపు చేశారు. వక్ఫ్బోర్డు అధికారుల పర్యవేక్షణ లేని కారణంగానే ఈ సంఘటన జరిగినట్లు తెలుస్తోంది. -
ప్రమాదవశాత్తు మంటలు..
మోటార్ బైకు, ఇతర సామగ్రి దగ్ధం వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక రాయచోటి బైపాస్ రోడ్డులో ఉన్న ఇంటిలో ప్రమాదవశాత్తు అగ్ని ప్రమాదం సంభవించడంతో మోటార్ బైకు, వాకిళ్లు, మోటార్తోపాటు ఇతర సామగ్రి దగ్ధమయ్యాయి. శనివారం మధ్యాహ్నం వేంపల్లెలోని రాయచోటి బైపాస్ రోడ్డులో ఉన్న ఇంటిలో నుండి పొగ వ్యాపిస్తుండటంతో అ ప్రాంతంలో ఉన్న ప్రజలు ఫైర్ స్టేషన్కు సమాచారమందించారు. దీంతో ఫైర్ సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఫైర్ సిబ్బంది వచ్చేసరికి ఇంటి ఆవరణంలో ఉన్న మోటార్ బైకు, మరుగుదొడ్లకు చెందిన వాకిళ్లు, కిటికీలు, తాగునీటికి చెందిన మోటార్ పూర్తిగా కాలిపోయాయి. ఈ సందర్భంగా బాధితుడు గోవర్దన్ మాట్లాడుతూ ఈ అగ్ని ప్రమాదంలో లక్ష రూపాయల వరకు నష్టం వాటిల్లిందన్నారు. ఫైర్ సిబ్బంది సమయానికి రావడంతో ఇంటి లోపల ఉన్న వడ్ల బస్తాలు అగ్ని ప్రమాదంలో కాలిపోలేదన్నారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో జరిగిందా లేక ఇంటి సమీపంలో ఉన్న టైర్లకు ఎవరైనా అగ్గి పెట్టడంవల్ల ఈ ప్రమాదం జరిగిందా అని బాధితుడు అనుమానం వ్యక్తం చేస్తున్నాడు. -
బంగారు భవితకు బాటలు వేసుకోవాలి
కడప అర్బన్ : విద్యార్థి దశలో లక్ష్యాన్ని నిర్దేశించుకుని, దాన్ని సాధించేందుకు కార్యాచరణ రూపొందించుకుని కష్టపడితే విజయం మీ సొంతమవుతుందని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పేర్కొన్నారు. శనివారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో పోలీసు సంక్షేమంలో భాగంగా టెన్త్, ఇంటర్లో ప్రతిభ కనబరిచిన 63 మంది పోలీసు, హోమ్గార్డులు, డీపీఓ సిబ్బంది కుటుంబాల పిల్లలకు నగదు ప్రోత్సాహక మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలను జిల్లా ఎస్పీ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బాగా చదివి బంగారం లాంటి భవిష్యత్తుకు బాటలు వేసుకుని అత్యున్నత స్థాయికి ఎదిగేందుకు కృషి చేయాలని సూచించారు. పోలీసుల పిల్లలు చక్కగా చదివి మంచి మార్కులు సాధించి మెరిట్ స్కాలర్ షిప్ అందుకోవడం ప్రశంసనీయమన్నారు. ఈ స్ఫూర్తితో మున్ముందు రెట్టింపు కృషితో, చదువులో ఉత్తమ ప్రతిభ కనబరచాలని ఆకాంక్షించారు. విద్యార్థులు వారు ఎంచుకున్న రంగంలో, వృత్తిలో రాణించేందుకు, ఉన్నత లక్ష్యాలను అధిరోహించేందుకు తల్లిదండ్రుల ప్రోత్సాహం తప్పని సరిగా ఉండాలన్నారు. అప్పుడే వారు లక్ష్యాలను సునాయాసంగా చేరుకోగలరన్నారు. సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ ఆరోగ్యం కాపాడుకోవాలన్నారు. పోలీస్ సంక్షేమంలో భాగంగా సిబ్బందికి వైద్య పరీక్షలు, అత్యవసర పరిస్థితుల్లో వైద్య సేవలు అందించడంలో పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ చేస్తున్న కృషిని ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ అభినందించారు. ఈ కార్యక్రమంలో ఏ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, ఆర్.ఐ. శ్రీశైల రెడ్డి, ఆర్.ఎస్.ఐ. వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, కార్యవర్గ సభ్యుడు ఏఫ్రిన్, పోలీస్, హోమ్ గార్డు, డీపీఓ సిబ్బంది కుటుంబ సభ్యులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు కుటుంబాల పిల్లలకు మెరిట్ స్కాలర్షిప్లు, ప్రశంసా పత్రాలు అందజేత -
బైకును ఢీకొన్న టిప్పర్
దువ్వూరు : కడప–కర్నూలు జాతీయ రహదారిపై పుల్లారెడ్డిపేట హైవే డాబా వద్ద బైకును టిప్పర్ ఢీ కొన్న సంఘటనలో ఒకరు మృతి చెందగా, మరొకరికి తీవ్ర గాయాలయ్యాయి. రాజుపాళెం మండలం వెలవలి గ్రామానికి చెందిన నల్లమ్మగారి బాలనాగయ్య, ఆయన వియ్యంకుడు మద్దూరు హుస్సేనయ్య కలిసి తన మేకపోతును మైదుకూరు సంతలో విక్రయించడానికి బైకుపై వెళుతున్నారు. వారు మండలంలోని పుల్లారెడ్డిపేట హైవే డాబా వద్దకు రాగానే గ్రావెల్ కోసం రాంగ్ రూట్లో వెళుతున్న టిప్పర్ బైకును ఢీ కొంది. ఈ ప్రమాదంలో బాలనాగయ్య, హుస్సేనయ్యలు తీవ్రంగా గాయపడ్డారు. వారిని 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతుతున్న బాలనాగయ్య(43) మృతి చెందాడు. మృతుడికి భార్య, కూతురు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు దువ్వూరు ఎస్ఐ వినోద్ కుమార్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన హెడ్ కానిస్టేబుల్ మృతి
బద్వేలు అర్బన్ : రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలై బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో నెల రోజులుగా చికిత్స పొందుతున్న హెడ్కానిస్టేబుల్ ఎం.లక్ష్మినారాయణ శనివారం మృతి చెందారు. 1990 బ్యాచ్కు చెందిన లక్ష్మినారాయణ (హెచ్సి 1180) బద్వేలు రూరల్ పోలీసుస్టేషన్లో పనిచేస్తూ బదిలీల్లో భాగంగా బద్వేలు అర్బన్ స్టేషన్కు నియమితులయ్యారు. గత నెల 11వ తేదీన విధుల్లో చేరేందుకు తాను నివాసమున్న కమలాపురం నుండి ఖాజీపేట మీదుగా బద్వేలుకు ద్విచక్ర వాహనంలో వస్తుండగా ఖాజీపేట సమీపంలోని ఆంజనేయకొట్టాలు వద్ద చెట్టుకొమ్మ విరిగి లక్ష్మినారాయణపై పడటంతో తీవ్ర గాయాలపాలయ్యాడు. కొద్దిరోజుల పాటు కడప నగరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మెరుగైన వైద్యం కోసం ఇటీవలే బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తరలించారు. అక్కడ కూడా కోలుకోలేక శనివారం మృతి చెందారు. మోపెడ్పై నుంచి పడి భర్త మృతిబ్రహ్మంగారిమఠం : మండలంలోని మల్లేపల్లి పంచాయతీ శ్రీరామ్ నగర్ వద్ద శనివారం సాయంత్రం టీవీఎస్ మోపెడ్పై వెళుతున్న భార్యాభర్తలు ప్రమాదవశాత్తు కింద పడడంతో భర్త సుబ్బరాయుడు (65) మృతి చెందాడు. భార్యకు స్వల్ప గాయాలయ్యాయి. కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బ్రహ్మంగారిమఠంలో సుబ్బారాయుడు కుమారుడు నాగార్జునాచారి వెల్డింగ్ షాప్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన పుట్టినరోజు సందర్భంగా శుక్రవారం రాత్రి కాశినాయన మండలం ఇటుకలపాడు గ్రామానికి చెందిన సుబ్బరాయుడు, ఆయన భార్య వచ్చారు. శనివారం సాయంత్రం తిరిగి టీవీఎస్ మోపెడ్పై వారి గ్రామానికి వెళ్తుండగా టీవీఎస్ మోపెడ్కు సుబ్బరాయుడు భార్య చీర చుట్టుకోవడంతో ఒక్కసారిగా ఇద్దరు కింద పడ్డారు. అప్పటికే సుబ్బరాయుడు తలకు పెద్ద గాయం కావడంతో రక్తనాళాలు చిట్లాయి. 108 వాహనంలో ప్రొద్దుటూరుకు తీసుకెళ్తుండగా మృత్యువాతపడ్డాడు. బి.మఠం పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నంద్యాల పోలీసుల అదుపులో టీడీపీ నాయకుడు మైదుకూరు : మైదుకూరు మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడిని శనివారం నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. మండలంలోని జీవీ సత్రంలో నివాసం ఉంటున్న ఈ టీడీపీ నాయకుడికి, నంద్యాలకు చెందిన ఓ పోలీసు అధికారి కుమారునికి మధ్య ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు సమాచారం. ఇద్దరూ కలిసి కాంట్రాక్టు పనులు చేయగా డబ్బు విషయమై గతంలో పంచాయితీ కూడా జరిగినట్టు తెలుస్తోంది. ఆ విషయంలోనే టీడీపీ నాయకుడిని నంద్యాల పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు తెలుస్తోంది. జీవీ సత్రానికి సమీపంలోని టీ స్టాల్ వద్ద అదుపులోకి తీసుకున్న పోలీసులు తమ వాహనంలోకి ఎక్కించుకుని అతను ప్రయాణిస్తున్న వాహనాన్ని కూడా వెంట తీసుకెళ్లినట్టు తెలుస్తోంది. తొలుత కుటుంబ సభ్యులు కిడ్నాప్గా భావించి స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో మైదుకూరు ప్రాంతంలో కలకలం రేగింది. పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలుసిద్దవటం : ఎగువపేటలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ముగ్గురికి కాటు వేసింది. ఎగువపేట మఠంవీధిలో శనివారం సాయంత్రం తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి కరిచింది. అలాగే పోలీసు లైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడిని, మెయిన్ బజారులో తేజా అనే యువకుడిని కూడా కరిచింది. భార్యకు స్వల్ప గాయాలు -
భర్తను హత్య చేసి.. ఆత్మహత్యగా చిత్రీకరించి..
ఖాజీపేట : భార్యాభర్తల మధ్య జరిగిన గొడవ భర్త హత్యకు దారితీసింది.. అయితే తన భర్త ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడంటూ అతని రెండవ భార్య అందరిని నమ్మించింది. భర్త మృతి విషయం తెలుసుకున్న మొదటి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి విచారించారు. ఇది ఆత్మహత్య కాదు, రెండవ భార్య చేసిన హత్య అని పోలీసులు నిర్ధారించి రెండో భార్యను అరెస్టు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా.. ఖాజీపేట మండలం అప్పనపల్లె గ్రామానికి చెందిన నక్కా శ్రీనివాసులు యాదవ్ (50)కు 30 ఏళ్ల క్రితం ప్రొద్దుటూరుకు చెందిన నక్కా లక్ష్మిదేవితో వివాహమైంది. భార్యతో గొడవల కారణంగా ఆమెకు తెలియకుండా చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన నక్కా సునీత (35)ను 13 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. వివాహ సమయంలో మొదటి భార్యతో విడాకులు తీసుకున్నానని తప్పుడు ధ్రువ పత్రాలను చూపించాడు. విషయం తెలుసుకున్న మొదటి భార్య లక్ష్మిదేవి తనకు ఎలాంటి నష్టపరిహారం ఇవ్వకుండా, తనకు తెలియకుండా రెండో వివాహం చేసుకున్న శ్రీనివాసులు యాదవ్పై కేసు పెట్టింది. కోర్టులో ఈ కేసు నడుస్తోంది. మొదటి భార్య ఫిర్యాదుతో వాస్తవాలు వెలుగులోకి.. శ్రీనివాసులు యాదవ్ జూన్ 11వ తేదీన మృతి చెందాడు. తన భర్త మృతిపై తనకు అనేక అనుమానాలు ఉన్నాయంటూ మొదటి భార్య లక్ష్మిదేవి జులై 1వ తేదీన ఖాజీపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఈ ఫిర్యాదు మేరకు ఖాజీపేట సీఐ మోహన్ కేసు నమోదు చేశారు. జులై 2న శ్రీనివాసులు యాదవ్ మృతదేహాన్ని రిమ్స్ డాక్టర్లు, తహసీల్దార్ సమక్షంలో వెలికి తీసి పోస్టుమార్టం నిర్వహించారు. చనిపోయిన వ్యక్తి తల వెనుక భాగంలో బలమైన గాయం ఉందని ఈ గాయం కారణంగా చనిపోయి ఉండవచ్చని అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు నివేదిక ఇచ్చారు. దీంతో పోలీసులు అప్పనపల్లె గ్రామంలో లోతైన విచారణ జరిపారు. భర్త అసభ్యకరమైన ప్రవర్తన కారణంగానే హత్య.. మృతుడు శ్రీనివాసులు యాదవ్ మద్యం మత్తులో పిల్లల ఎదుటే భార్య పట్ల అసభ్యకరంగా ప్రవర్తించేవాడని పోలీసులు గుర్తించారు. దీంతో రెండవ భార్య విసుగు చెందేది. జూన్ 11న ఇద్దరు పిల్లలు బయట ఉండగానే ఇంట్లోకి తాగి వచ్చి భార్య పట్ల అభ్యంతరకరంగా ప్రవర్తించాడు. దీంతో ఇరువురి మధ్య తోపులాట జరిగింది. భార్య తోసేయడంతో మంచం కోడికి తల తగిలి కింద పడ్డాడు. మద్యం మత్తులో ఉన్న శ్రీనివాసులు తిరిగి పైకి లేచేందుకు ప్రయత్నించాడు. అతను పైకి లేస్తే తనను చంపుతాడని భావించిన భార్య సునీత మంచం కోడికి తల పట్టుకుని కొట్టింది. దీంతో అక్కడికక్కడే స్పహ తప్పి పడిపోయాడు. హత్యను ఆత్మహత్యగా.. తన భర్త చనిపోయాడని నిర్ధారించుకున్న భార్య సునీత తీవ్ర ఆందోళన చెందింది. దీంతో ఇంట్లో పిల్లలను ఊయల ఉపే తాడుతో మృతదేహానికి ఉరి వేసింది. ఆ తర్వాత ఆమె గట్టిగా కేకలు వేయడంతో బయట ఉన్న వారు వచ్చి చూసే సరికి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు అందరిని నమ్మించింది. శరీరంపై ఎలాంటి రక్తగాయాలు గానీ దెబ్బలు గానీ పెద్దగా లేకపోవడంతో అందరూ ఆత్మహత్య చేసుకున్నట్లుగా భావించారు. జూన్ 12న అంత్యక్రియలు పూర్తి చేశారు. నిందితురాలి అరెస్టు మొదటి భార్య ఫిర్యాదు మేరకు జులై 2న పోస్టుమార్టం నిర్వహించినప్పటి నుంచి రెండో భార్య సునీత పరారీలో ఉంది. పోలీసులు గాలిస్తున్నట్లు తెలుసుకుని అప్పనపల్లె పంచాయతీ సెక్రటరీ ద్వారా జులై 12న పోలీసుల ఎదుట లొంగిపోయింది. పంచాయతీ సెక్రటరీ ఇచ్చిన వాంగ్మూలం ఆధారంగా రెండవ భార్య సునీతను ఖాజీపేట సీఐ మోహన్ శనివారం అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచారు. మొదటి భార్య ఫిర్యాదుతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు తలకు బలమైన గాయం కారణంగానే మృతి చెందినట్లు పోస్టుమార్టంలో వెల్లడి రెండో భార్య అరెస్టుతో ఆత్మహత్య డ్రామా గుట్టురట్టు -
రమణీయం..రథోత్సవం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామిని రథంపై కొలువుదీర్చి ముందుకు కదిలించారు.భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. గోవింద నామస్మరణలతో మాడవీధులు మార్మోగాయి. శనివారం రాత్రి అశ్వవాహనంపై సౌమ్యనాథ స్వామి పురవీధుల్లో విహరించారు. భక్తులు కాయ, కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు రీజెన్సీ నలంద విద్యాసంస్థల అధినేత జీఎన్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సౌమ్యనాథ సేవ ట్రస్టు అధ్యక్షుడు ఎద్దుల సుబ్బరాయుడు, కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, ఎద్దుల విజయసాగర్, ఆలయ సూపరిండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, రీజెన్సీ నలంద స్కూల్ వైస్ ప్రిన్సిపల్ దశరథరామయ్య, ప్రిన్సిపల్ సుబ్బరాయుడు పాల్గొన్నారు. నేడు చక్రస్నానం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. వైభవంగా సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు -
నేడు మాజీ సైనిక సంక్షేమ సంఘం సమావేశం
కడప అర్బన్ : కడప నగరంలోని సీఎస్ఐ హైస్కూల్లో ఆదివారం ఉదయం 9:30 గంటల నుంచి కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల మాజీ సైనిక సంక్షేమ ఉద్యోగుల సంఘం సర్వ సభ్య సమావేశం నిర్వహించనున్నట్లు అధ్యక్షుడు దాసరి రమణయ్య, ప్రధాన కార్యదర్శి కెప్టెన్ ఎస్.ఎస్ రాముడు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. కడప, అన్నమయ్య ఉమ్మడి జిల్లాల సైనిక సంక్షేమ సంఘం నేతలు, మాజీ సైనిక ఉద్యోగులు తమ సంక్షేమం, ఇళ్ల స్థలాల కోసం పత్రాలు తీసుకుని రావాలని వారు పేర్కొన్నారు. భూ, స్థలాల సమస్యలపై చర్చించడం జరుగుతుందని వివరించారు. వైఎస్సార్సీపీ బీసీ సెల్లో నియామకాలు కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శులుగా వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలకు చెందిన వారిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. పులివెందులకు చెందిన వడ్డెరపు గంగాధర్ యాదవ్, రాయచోటికి చెందిన రమేష్ అంపాబత్తినలను నియమించారు. అలాగే అన్నమయ్య జిల్లా పీలేరు మండల పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడిగా అంబవరం మల్లికార్జునరెడ్డిని నియమించారు. నేటి నుంచి ఏసీఏ మల్టీ డే మ్యాచ్లు కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలో ఆదివారం నుంచి ఈ నెల 31 వరకు ఏసీఏ సౌత్జోన్ అండర్–16 మెన్ మల్టీ డే మ్యాచ్లు జరగనున్నాయి. ఈ మ్యాచ్లో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు జట్లు పాల్గొంటున్నాయి. కేఎఆర్ఎం, కేవోఆర్ఎం క్రికెట్ మైదానంలో ఈ మ్యాచ్లు జరుగుతాయి. మూఢ నమ్మకాల తొలగింపే ధ్యేయం కడప ఎడ్యుకేషన్ : సమాజంలో మూఢ నమ్మకాలను తొలగించడమే జన విజ్ఞాన వేదిక లక్ష్యమని జేవీవీ వ్యవస్థాపకుడు బ్రహ్మారెడ్డి పేర్కొన్నారు. శనివారం కడప నగరంలోని యస్.వి.ఇంజినీరింగ్ కాలేజీలో జెవీవీ రాష్ట్ర అధ్యక్షుడు సురేష్కుమార్ అధ్యక్షతన రాష్ట్ర మహాసభలను నిర్వహించారు. ముందుగా జాతీయ పతాకం, జన విజ్ఞాన వేదిక పతాకాల ఆవిష్కరణతోపాటు గీతాలాపనతో ప్రారంభించారు. అనంతరం బ్రహ్మారెడ్డి మాట్లాడుతూ జేవీవీ ప్రజల ఆరోగ్యం, విద్యకు సంబంధించి ప్రధానంగా కృషి చేస్తుందన్నారు. మాజీ ఎమ్మెల్సీ గేయానంద్ మాట్లాడుతూ ప్రజలను చైతన్యవంతులను చేయడం, అన్ని రంగాల్లో సంతులిత అభివృద్ధిని సాధించే విధంగా ఉత్సాహపరచడంలో జేవీవీ తన వంతు పాత్ర పోషిస్తుందన్నారు. కార్యక్రమంలో జమ్మలమడుగు నియోజకవర్గం తెలుగుదేశం ఇన్చార్జి భూపేశ్ రెడ్డియోగి వేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పుత్తా పద్మజ కడప మున్సిపల్ కార్పొరేషన్ అదనపు కమిషనర్ కె.రాకేష్ చంద్ర, జేవీవీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోపాల్ నాయక్, జాతీయ నాయకులు బి.విశ్వనాథ, కృష్ణాజీ, శ్రీనివాసులు, సనావుల్లా, మహమ్మద్ మియా, యస్.స్వరాజ్యలక్ష్మి, వెంకటరామిరెడ్డి మాట్లాడారు. ఈ రాష్ట్ర మహాసభలకు ఆంధ్రప్రదేశ్లోని అన్ని జిల్లాలు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాల నుంచి జేవీవీ ప్రతినిధులు హాజరయ్యారు. -
దిగజారి ప్రవర్తిస్తున్నారు..
కృష్ణా జిల్లా జెడ్పీ చైర్పర్సన్ హారికపై జరిగిన దాడిని ఖండిస్తున్నా. రాష్ట్రంలో శాంతి భద్రతల పరిస్థితికి ఈ ఘటన అద్దం పడుతుంది. కూటమి అధికారంలోకి వచ్చాక మహిళలకు రక్షణ కరువైంది. టీడీపీ, జనసేన పార్టలు దిగజారి ప్రవర్తిస్తున్నాయి. జిల్లా ప్రథమ మహిళకే ఈ పరిస్థితి వస్తే, సామాన్య మహిళలకు రక్షణ ఎక్కడి నుంచి లభిస్తుంది. పోలీసుల సమక్షంలో జెడ్పీ చైర్పర్సన్పై టీడీపీ గూండాలు దాడికి పాల్పడ్డారు. చేతగాని మనుషుల్లా పోలీసులు ఎందుకు నిలబడ్డారో అర్థం కావడం లేదు. మానవ ప్రపంచం సిగ్గుతో తల వంచుకోవాల్సిన పరిస్థితి. – పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీ, జిల్లా అధ్యక్షులు -
అన్నదాతలు వానకాలం వరి సాగుకు సిద్ధమవుతున్నారు. ఎగువ రాష్ట్రంలో కురిసిన వర్షాలకు కృష్ణానది పరవళ్లు తొక్కుతుండడంతో.. కేసీ కెనాల్ ఆయకట్టు రైతుల్లో ఆశలు చిగురించాయి. జూరాల, ఆల్మట్టి నుంచి వరద నీరు వస్తుండటంతో శ్రీశైలం ప్రాజెక్టు పూర్తి స్థాయిలో నిండింది. ఈ ఏ
● నిండిన శ్రీశైలం ప్రాజెక్టు ● త్వరలో కేసీ కాలువకు నీటి విడుదల ● జిల్లాలో 92,937 ఎకరాల కేసీ ఆయకట్టు ● ఊపందుకోనున్న సాగు ● అన్నదాతల్లో ఆనందం కడప అగ్రికల్చర్ : ఎగువ ప్రాంతాల్లో కురిసిన భారీ వర్షాలకు శ్రీశైలం ప్రాజెక్టు నిండుకుండలా పరవళ్లు తొక్కుతోంది. కేసీ అధికారులు త్వరలో కేసీ కెనాల్కు నీటిని విడుదల చేయనున్నారు. జిల్లా వ్యాప్తంగా కేసీ కెనాల్ కింద 92,937.01 ఎకరాల ఆయకట్టు ఉంది. రైతులకు కావాల్సిన పచ్చిరొట్ట విత్తనాలను అధికారులు పంపిణీ చేస్తున్నారు. శ్రీశైలం ప్రాజెక్టు నిండటంతో కేసీ కెనాల్కు నీరు విడుదల కానున్న నేపథ్యంలో.. నారుమడుల సాగు జోరందుకోనుంది. రైతన్నలు ఇప్పటికే మండల కేంద్రాలకు వెళ్లి విత్తనవడ్లు తెచ్చుకునే పనిలో నిమగ్నమయ్యారు. నది పరీవాహక ప్రాంతాల్లోని రైతులు తెచ్చకున్న విత్తనపు వడ్లను నానబెట్టి మండెకట్టి నారుమడులు సాగు చేసే పనిలో బిజీబిజీగా ఉన్నారు. నారుమడుల సాగుకు సంబంధించి చిన్ని చిన్న కయ్యలను ఏర్పాటు చేసుకుని, అందులో దమ్ము చేసుకుంటూ హడావిడిగా ఉన్నారు. నీటి ఆధారం ఉన్న కొందరు రైతులు ఇప్పటికే నారుమడులను సాగు చేసుకున్నారు. నీటి ఆధారం లేని వారు కేసీకి నీరు విడుదల కాగానే నారుమడులను సిద్ధం చేసుకుంటారు. ముందుగా నారుమడులు సిద్ధం చేసుకున్న రైతన్నలు కేసీ కాలువకు నీరు రాగానే వరినాట్లు ప్రారంభించనున్నారు. జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 1,93,722 ఎకరాల్లో సాధారణ పంటల సాగు లక్ష్యం కాగా.. ఇందులో 80 వేల ఎకరాల్లో వరి పంట సాగు కానుంది. సత్తువ పంటలుగా జనుము, జీలుగల సాగు నీటి ఆధారం ఉన్న రైతాంగం వరి సాగుకు ముందుగా.. భూమికి సత్తువ కోసం జీలుగలు, జనుములను చల్లుకుని దమ్ముకు సిద్ధం చేసుకుంటున్నారు. నారుమడి సిద్ధమై వరినాట్లు వేసుకునేందుకు నెల రోజులకు పైగా గడువు ఉండటంతో.. ఆలోపు జీలుగలు, జనుము బాగా పెరిగి భూమికి సత్తువగా పనికొస్తుంది. నీటి ఆధారం లేని రైతులు ఇటీవల కురిసిన వర్షాలకు సాగు చేసుకున్నారు. మరి కొంత మందికేసీకి నీరు రాగానే జీలుగలు, జనుములు సాగు చేస్తారు. వీరు నారుమడులు సాగు చేసి.. అది సాగుకు సిద్ధమయ్యే సమయానికి ఈ జీలుగ, జనుము పంట కూడా దమ్ముకు సిద్ధమవుతుంది. దీంతో ఈ జీలుగ, జనుము పంట భూమికి సత్తువగా పనికొస్తుంది. జిల్లాలో వరినాట్లు ప్రారంభం నది పరీవాహక, నీటి ఆధారం ఉన్న రైతులు ముందుగా నారుమడులు ఏర్పాటు చేసుకుని వరిసాగు పనులు ఆరంభించారు. ఇప్పటికే జిల్లాలో నది పరీవాహక ప్రాంతాలైన చెన్నూరు, కడప, కమలాపురం, సిద్దవటం, వల్లూరు, చెన్నూరు, చక్రాయపేట, జమ్మలమడుగు తదితర మండలాల పరిధిలో వెయ్యి ఎకరాల వరకు వరి పంట సాగైనట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. ప్రతి రైతు పాటించాలి నారుమడులు సాగు చేసుకునే రైతులు పైన తెలిపిన అన్ని జాగ్రత్తలు తప్పనిసరిగా పాటించాలి. ఇందులో నిర్లక్ష్యం చేస్తే సాగు తరువాత వరి పంటలకు చీడపీడలను ఆశించి రైతులు నష్టపోయే ప్రమాదం ఉంటుంది. ముందుగా కొన్ని జాగ్రత్తలు పాటిస్తే వరిపంట సాగు తరువాత ఎలాంటి ఇబ్బందులు ఉండవు. – డాక్టర్ వీరయ్య, కో ఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త, కృషి విజ్ఞాన కేంద్రం, వైఎస్సార్ జిల్లా. -
కేసీ కెనాల్ కింద సాగులో ఉన్న ఆయకట్టు వివరాలు
మండలం ఆయకట్టు (ఎకరాల్లో) దువ్వూరు 10,419.28 చాపాడు 20,894.48 మైదుకూరు 3,553.23 ఖాజీపేట 20,804.82 రాజుపాళెం 6,894.24 ప్రొద్దుటూరు 5,427.50 కడప 5,371.83 చెన్నూరు 8,200.34 వల్లూరు 406.88 చింతకొమ్మదిన్నె 121.12 పెద్దముడియం 9,063.0 చాగలమర్రి 643.29 మొత్తం కేసీ ఆయకట్టు 92,937.01 -
పక్కీర్పల్లె.. ఖాళీ
● పోలీసుల కేసుకు భయపడి ఊరు వదిలి వెళ్లిన గ్రామస్తులు ● ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలే ● నిర్మానుష్యంగా మారిన గ్రామం వేంపల్లె : వేంపల్లె మండలం చింతలమడుగుపల్లె గ్రామ సమీపంలో ఉన్న పక్కీర్పల్లె ఖాళీ అయింది. పోలీస్స్టేషన్ ముట్టడి సంఘటనలో పోలీసులు పెట్టే కేసులకు భయపడి.. గ్రామస్తులు ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. గ్రామంలో జనాలు లేకపోవడంతో నిర్మానుష్యంగా మారింది. ఎక్కడ చూసినా ఇళ్లకు తాళాలు వేసిన దృశ్యాలే కనిపిస్తున్నాయి. ఊర్లో ఉన్న మగ, ఆడ, పిల్లలు ఇలా అందరూ వెళ్లిపోయారు. కొందరు ఆడవాళ్లు, చిన్నపిల్లలు, వృద్ధులు వీధుల్లో అక్కడక్కడ కనిపిస్తున్నారే తప్ప, జనాలు ఎక్కువ మంది లేరు. వివరాలలోకి వెళితే.. పక్కీర్పల్లెలో ఈ నెల 7వ తేదీన గొర్రెలు మేపేందుకు సమీపంలోని కొండల్లోకి 17 ఏళ్ల అమ్మాయి వెళ్లింది. ఆమె అదృశ్యం కావడంతో బంధువులు గ్రామస్తులను పిలుచుకుని వేంపల్లె పోలీసుస్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడకబాబు అనే యువకుని సెల్ఫోన్లో అమ్మాయి బట్టలు చిరిగిపోయి, దండం పెట్టే వీడియో ఉండటంతో వారి ఆగ్రహం మరింత కట్టలు తెంచుకుంది. అమ్మాయిని రేప్ చేసి చంపేశారేమోనన్న అనుమానంతో పోలీస్స్టేషన్ వద్ద రచ్చ చేశారు. దీంతో అమ్మాయి బంధువులు, గ్రామస్తులపై పోలీసులు హత్యాయత్న కేసు నమోదు చేశారు. పోలీస్స్టేషన్పై దాడికి దిగారని కేసు నమోదు అయితే అదే రోజు రాత్రి దాదాపు 10 గంటల ప్రాంతంలో అమ్మాయి.. పోలీస్ స్టేషన్లో ఉన్న తండ్రికి ఫోన్ చేసి తాను గొర్రెల దొడ్డి వద్ద ఉన్నానని చెప్పింది. దీంతో పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ నేతృత్వంలో పోలీస్ బృందాలు హుటాహుటిన అమ్మాయి ఉన్న ప్రాంతానికి చేరుకున్నారు. అపస్మారక స్థితిలో పడి ఉన్న అమ్మాయిని సురక్షితంగా కడప రిమ్స్కు తరలించారు. అమ్మాయి దొరికింది అనే విషయం చెప్పినా కూడా కొంత మంది ఆందోళనకారులు వారి ఆందోళన విరమించలేదు. అప్పటికే పోలీస్ స్టేషన్లో ఉన్న కిటికీ అద్దాలు కుర్చీలు, వాకిళ్లను పగులగొట్టారు. ఆ సమయంలో పోలీస్ స్టేషన్ సెంట్రీ డ్యూటీలో ఉన్న రామాంజనేయులరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేశారని కేసు నమోదు చేశారు. కొంత మందిని ఇప్పటికే అరెస్టు చేయగా, మరికొందరి కోసం పోలీసులు గాలిస్తున్నారు. పక్కీర్ పల్లెకు చెందిన బాలికకు, చింతలమడుగుపల్లెకు చెందిన మడక బాబుకు చనువైన పరిచయం ఉన్నట్లు తెలిసింది. వారిద్దరూ మధ్యాహ్న సమయంలో వజ్రాలకోన దగ్గర ఉన్నట్లు అక్కడున్న స్థానిక ప్రజలు చెప్పడంతో.. అమ్మాయి తల్లిదండ్రులు మరి కొంత మందితో కలిసి గుట్టలో వెతకగా మడక బాబు కనిపించాడు. అమ్మాయి బంధువులు మడక బాబుపై చర్యలు తీసుకోవాలని ఈ నెల 7వ తేదీ సాయంత్రం పోలీస్స్టేషన్ వద్దకు పిలుచుకుని వచ్చినట్లు కానిస్టేబుల్ ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. 60 మందిని అదుపులోకి.. అదే రోజు రాత్రి 8 గంటల సమయంలో పెద్ద సంఖ్యలో కొంతమంది మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ ఆవరణలోకి వచ్చి మడక బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. మడక బాబును విచారణ చేస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా.. వినకుండా పోలీసులు డౌన్ డౌన్ అంటూ నినాదాలు చేస్తూ దాడి చేశారు. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారిని వీడియోల ఆధారంగా గుర్తించి అరెస్టులు చేస్తున్నారు. దీంతో కేసుకు సంబంధించి ఇప్పటికి 60 మంది ఆందోళనకారులను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన ఆందోళనకారులను అరెస్టు చేయాలని పోలీసులు వీధి, వీధి గాలింపు చర్యలు చేపట్టడంతో.. పక్కీర్ పల్లెలోని అందరినీ అరెస్టు చేస్తారన్న భయంతో గ్రామస్తులు గ్రామం వదిలి వెళ్లిపోయారు. మాకేం తెలియదని మహిళల ఆందోళన గ్రామంలోని మహిళలు మాత్రం తమకు గానీ, తమ గ్రామానికి చెందిన ప్రజలకు ఏమీ తెలియదని, బాలికను రేప్ చేసి చంపేశారని గ్రామంలో ఉన్న ఇంటింటికి తిరిగి అమ్మాయి తల్లిదండ్రులు చెప్పడంతోనే వేంపల్లె పోలీస్స్టేషన్కు వెళ్లామని చెప్పుకొచ్చారు. తామంతా కూలీ పనులు చేసుకుని జీవనం సాగించే వారిమని, ఇప్పుడు ఈ కేసు వల్ల తమకు తీవ్ర కష్టాలు ఎదురవుతున్నాయని మహిళలు వాపోతున్నారు. -
గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు
కడప అర్బన్ : జిల్లాలో గంజాయి విక్రేతలపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ ఆదేశించారు. స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాల్లో శుక్రవారం నెలవారీ నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ గంజాయి రవాణా, విక్రయాలపై దాడులు ముమ్మరం చేయాలని, శివారు ప్రాంతాలు, ఇతర ప్రదేశాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా పెంచాలని ఆదేశించారు. మిస్సింగ్ కేసులకు అత్యధిక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. స్టేషన్ కు వచ్చే మహిళలు, ఫిర్యాదుదారులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. వైన్ షాపుల వద్ద నిబంధలకు విరుద్ధంగా మద్యం తాగితే చర్యలు తీసుకోవాలన్నారు. పట్టణాల్లో ట్రాఫిక్ క్రమబద్ధీకరణపై దష్టి పెట్టాలని, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కృషి చేయాలని సూచించారు. ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాలపై నక్షుంచి, కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ విస్తృతంగా నిర్వహించాలని కోరారు. క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, మట్కా జరగకుండా కఠినంగా వ్యవహరించాలని ఆదేశించారు.సైబర్ నేరాలు, విజిబుల్ పోలీసింగ్పై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. దాబాలు, హోటళ్లు, లాడ్జిలు, బస్టాండ్లు, రైల్వేస్టేషన్లలో తనిఖీలు నిర్వహించాలన్నారు. రాత్రి గస్తీ పెంచాలని ఆదేశించారు. అనంతరం ఇటీవల కోర్టులో జీవిత ఖైదు శిక్ష పడేలా కృషిచేసిన సిబ్బందికి నగదు రివార్డులు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సమావేశంలో డీఎస్పీలు ఎన్.సుధాకర్, ఇ.బాలస్వామిరెడ్డి, అబ్దుల్కరీం, ఎ.వెంకటేశ్వర్లు, పి.భావన, రాజేంద్ర ప్రసాద్, వెంకటేశ్వరరావు, మురళినాయక్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ద్విచక్ర వాహనాలు కడప అర్బన్ : ట్రాఫిక్ నియంత్రణ కోసం అత్యాధునిక టెక్నాలజీతో రూపొందించిన బుల్లెట్, 15 ద్విచక్ర వాహనాలను జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ శుక్రవాం ప్రారంభించారు. మంగళగిరి నుండి వచ్చిన ఈ వాహనంలో సైరన్, బ్లింకర్స్, పబ్లిక్ అడ్రెసింగ్ సిస్టం, క్రౌడ్ కంట్రోల్ టెక్నాలజీ ఉన్నాయన్నారు. కడపకు ఏడు, ప్రొద్దుటూరుకు నాలుగు, పులివెందులకు రెండు, జమ్మలమడుగు, బద్వేల్, మైదుకూరుకు ఒక వాహనం కేటాయించారు. ఫోర్ వీలర్ వెళ్ళలేని ప్రాంతాలలో టూ వీలర్స్ ఉపయోగిస్తారని, ట్రాఫిక్ను క్రమబద్ధీకరించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తారని ఎస్పీ తెలిపారు. న్నానేర సమీక్షా సమావేశంలో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ -
ఇంటి తాళాలు పగలగొట్టి నగదు, వెండి చోరీ
ఖాజీపేట : ఖాజీపేట పోలీస్ స్టేషన్ సమీపంలోనే శుక్రవారం చోరీ జరిగింది. బాధితుల వివరాల మేరకు.. ఖాజీపేట మహిళా మార్టు ప్రక్కన నివాసముంటున్న వీఎన్.అమితాబ్ గురువారం రాత్రి తన ఇంటికి తాళం వేసి కుటుంబ సమేతంగా బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం అమితాబ్ ఇంటి ముందు తన ఫొటో స్టూడియో తెరిచేందుకు వచ్చిన సిద్ధిక్ వెనుకభాగం వాకిలి పగిలి ఉడడం గమనించాడు. లోపలికి వెళ్లి పరిశీలించి చోరీ జరిగిన విషయం యజమాని అమితాబ్కు సమాచారం ఇచ్చారు. నాలుగు బీరువాలు పగుల కొట్టి దుస్తులు చెల్లా చెదురుగా పడేసినట్లు గమనించిన అమితాబ్ ఖాజీపేట పోలీసులకు ఫిర్యాదు చేశాడు. రూ.20 వేల నగదు, వెండి వస్తువులు దోచుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. బంగారు ఆభరణాలు తమ వెంట తీసుకుని పోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. పోలీసులు ఎదురుగా మహిళా మార్టు సీసీ కెమేరాలు పరిశీలిస్తున్నారు. -
కమనీయం..సౌమ్యనాథుడి కల్యాణం
నందలూరు : సౌమ్యనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కల్యా వేదికను అలంకరించారు. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామిలు శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్పవమూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల మధ్య కల్యాణ వేదికపై కొలువుదీర్చారు.అనంతరం కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు క్రతువులను నిర్వహించారు. భక్తుల హరి నామస్మరణలతో ఆలయం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. కల్యాణోత్సవం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామిని ఆలయం చుట్టూ పల్లకీలో ఊరేగించారు. బ్రహ్మోత్సవాల్లో భా గంగా శుక్రవారం రాత్రి గజవాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయ కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నదానం : కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకుడు సోమలరాజు చంద్రశేఖర్రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కల్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర సంస్థ అధ్యక్షుడు వేపగుంట శ్యామ్రాజ్ ఆధ్వర్యంలో స్కౌట్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. మారుమోగిన హరినామస్మరణ -
ఉత్సాహంగా బ్యాడ్మింటన్ పోటీలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఆంధ్ర ప్రదేశ్, తెలంగాణ బి–జోన్ స్థాయి సీఐఎస్సీఈ జోనల్ బ్యాడ్మింటన్ పోటీలను శుక్రవారం స్థానిక హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ మైదానంలో జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి జగన్నాథ్రెడ్డి ప్రారంభించారు. ఈ పోటీల్లో అండర్–14, అండర్–17, అండర్–19 వయోపరిమితి గల బాల, బాలికలు పాల్గొని తమ ప్రతిభ ప్రదర్శించారు. అండర్–17 బాలుర డబుల్స్లో చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్, కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్లు ప్రథమ, ద్వితీయ, తృతీయ స్థానాల్లో నిలిచాయి. అండర్–17లో బాలుర సింగిల్స్లో చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్, గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్, చిత్తూరు పీపల్ గ్రోవ్ స్కూల్లు వరుస మూడు స్థానాల్లో నిలిచాయి. అండర్–17 బాలికల డబుల్స్లో కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్, అండర్–14 బాలుర విభాగంలో గుంటూరు లిటిల్ ఫ్లవర్ స్కూల్ విజేతలుగా నిలిచాయి. అండర్–14 బాలికల విభాగంలో కడప హైదరాబాద్ పబ్లిక్ స్కూల్ విజేతగా నిలిచింది. ఈ కార్యక్రమంలో బ్యాడ్మింటన్ అసోసియేషన్ కార్యదర్శి జిలానీబాషా, శ్రీనివాసమూర్తి, రహమతుల్లా, తదితరులు పాల్గొన్నారు. -
వెనుకబడిన ప్రాంతాలపై నిర్లక్ష్యం వద్దు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు అమరావతి రాజధాని పేరుతో అభివృద్ధి అంటూ... వెనుక బడిన ప్రాంతాలను నిర్లక్ష్యం చేయడం తగదని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ అన్నారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర కమిటీ సమావేశం కడప ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో శుక్రవారం జరిగింది. ఈ సమావేశంలో నారాయణ మాట్లాడుతూ అధికారంలోకి వచ్చాక చంద్రబాబు రాయలసీమ అభివృద్ధిపై చిత్తశుద్ధి చూపడం లేదన్నారు. మహానాడు వేదికగా ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయడంలో విఫలమయ్యారన్నారు. నెల రోజుల్లో కడప ఉక్కు పరిశ్రమ పనులు జరుగుతాయని చెప్పిన ముఖ్యమంత్రి పట్టించుకోలేదని ఆరోపించారు. రాష్ట్ర సంపాదనంతా రాజధాని పేరుతో ఖర్చుపెడితే మిగతా ప్రాంతాల అభివృద్ధి ఎలా అంటూ ఆయన ప్రశ్నించారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశం జిల్లాల్లో సాగునీటి ప్రాజెక్టులు పూర్తిగాక రైతులు కష్టాలు పడుతున్నారన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ శ్యాంప్రసాద్ మాట్లాడుతూ రాయలసీమ ప్రాంతాల్లో సదస్సులు నిర్వహించి ప్రజలను చైతన్యవంతం చేస్తామని తెలిపారు. వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి కోరుతూ ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో నారాయణరెడ్డి, ఎన్వీ.రమణ, మాలకొండయ్య, శివయ్య, సీఆర్వీ ప్రసాద్, గుర్రప్ప, అంజి, రవిశంకర్రెడ్డి, జయవర్ధన్, ప్రభాకర్రెడ్డి, రాజేంద్ర, తదితరులు పాల్గొన్నారు.వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు నారాయణ -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
అట్లూరు : మండలంలోని కడప–బద్వేల్ రహదారిపై రెడ్డిపల్లె సమీపాన ద్విచక్ర వాహనం అదుపుతప్పి శుక్రవారం ఒకరికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల వివరాల మేరకు.. బద్వేల్ మండలం గుంతపల్లెకు చెందిన పడిగె క్రిస్టఫర్ తన ద్విచక్ర వాహనంపై సిద్దవటం మండలం మాచుపల్లెకు వెళ్లి తిరిగి వస్తున్నారు. అట్లూరు మండలం రెడ్డిపల్లె సమీపాన కడప–బద్వేల్ రహదారిపై వేప చెట్టును ఢీకొని కింద పడ్డారు. తీవ్ర గాయాలైన క్రిస్టఫర్ను 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు.రస్తా స్థలం ఆక్రమణయత్నంచింతకొమ్మదిన్నె : కడప నగరంలోకి విలీనమైన చిన్నముసలిరెడ్డిపల్లె దారిలో కొందరు రస్తా స్థలాన్ని ఆక్రమించేందుకు యత్నించగా కార్పొరేషన్ సిబ్బంది అడ్డుకున్నారు. కోట్లాది రూపాయలు విలువ చేసే ఈ స్థలంలో ఉన్న చెట్ల వద్ద స్థానిక ప్రజలు పదుల సంఖ్యలో నిత్యం సేద తీరుతుంటారు. విలువైన స్థలంగా మారడంతో చింతకొమ్మదిన్నె మండలానికి చెందిన అధికారపార్టీ నాయకుడి కన్ను పడింది. తన అనుచరులను రంగంలోకి దింపి రెవెన్యూ, కార్పొరేషన్ అధికారులపై ఒత్తిడి చేస్తున్నారనే విమర్శలున్నాయి. ఆక్రమిత స్థలంలో కట్టడాల నిర్మాణం కొరకు అనుమతి ఇవ్వాలంటూ కోరుతున్నట్లు తెలిసింది. విసుగు చెందిన స్థానికులు పదే పదే ఫిర్యాదు చేయడంతో కార్పొరేషన్ సిబ్బంది స్పందించి శుక్రవారం ఆక్రమిత స్థలంలో నిర్మిస్తున్న కట్టడాలను తొలగించారు. నేడు తెలుగు భాషా పరిరక్షణ సదస్సుగోపవరం : కర్నూలులో ఈ నెల 12, 13వ తేదీల్లో తెలుగు భాషా పరిరక్షణ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఏపీ తెలుగు భాషా వికాస ఉద్యమ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు విద్వాన్ డాక్టర్ గానుగపెంట హనుమంతరావు పిలుపునిచ్చారు. మొల్ల సాహితీ పీఠం కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ కర్నూలు సీ.క్యాంపు టీజీవీ కళా క్షేత్రంలో రెండు రోజుల పాటు నిర్వహించే రాష్ట్ర స్థాయి తెలుగుభాషా పరిరక్షణ సదస్సుకు తెలుగువారంతా హాజరు కావాలని కోరారు. సదస్సులో తెలుగుభాషపై చర్చాగోష్టి జరిపి పలు తీర్మానాలు చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని హనుమంతరావు తెలిపారు. -
18న చలో ఢిల్లీ
బద్వేలు అర్బన్ : కడపలో ఉక్కు పరిశ్రమ హామీ అమలు కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.చిన్ని పేర్కొన్నారు. స్థానిక డీవైఎఫ్ఐ కార్యాలయ ఆవరణలో కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను శుక్రవారం ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో వేలాది మందికి ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే కడప ఉక్కు పరిశ్రమ ఏర్పాటు విషయంలో కేంద్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. పది రోజుల్లో ఉక్కు పరిశ్రమ పనులు ప్రారంభిస్తామని మహానాడులో చంద్రబాబు చెప్పినా, నేటికీ పనులు ప్రారంభం కాలేదనిన్నారు. ఈ కార్యక్రమంలో మస్తాన్షరీఫ్, ఆదిల్, ఓబుల్రెడ్డి, సుధాకర్, నరసింహ, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. కర్నాటక మద్యం స్వాధీనంమదనపల్లె రూరల్ : ఎకై ్సజ్ బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 12.96 లీటర్ల ఎన్డీపీఎల్ కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి టూవీలర్ సీజ్ చేసినట్లు సీఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... కర్నాటక సరిహద్దు చీకలబైలు చెక్పోస్ట్కు సమీపంలో బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, కురబలకోట మండలం తుంగావారిపల్లెకు చెందిన మూలి రమేష్(27), కర్నాటకకు చెందిన బెంగళూరు మాల్ట్ విస్కీ(90ఎం.ఎల్) 96 టెట్రా ప్యాకెట్లు, సుజుకీ ఆక్సెస్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడి నుంచి రూ.3,840 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని, టూవీలర్ను సీజ్ చేశామన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన పెద్దిగాని సోమశేఖర్(28), కర్నాటకకు చెందిన హైవార్డ్స్ ఛీర్స్ విస్కీ(90ఎం.ఎల్) 48 టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రెండు కేసుల్లోనూ ఇద్దరిని అరెస్ట్చేసి ఎకై ్సజ్ ఎస్హెచ్ఓకు అప్పగించామన్నారు. పోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్షమదనపల్లె రూరల్ : పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎం.శంకరరావు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు వన్టౌన్ సీఐ ఎరిషావలి తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డుకు చెందిన టి.చంద్రశేఖర్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికల హైస్కూల్ వద్ద 2017 మార్చి, 3న స్కూల్కు వెళ్లే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పటి హెచ్ఎం పద్మజ ఫిర్యాదు మేరకు, ఎస్ఐ మనోహర్ పోక్సో కేసు నమోదు చేశారన్నారు. కోర్టు విచారణ అనంతరం శుక్రవారం చిత్తూరు పోక్సో కోర్టులో నిందితుడు చంద్రశేఖర్కు మూడేళ్ల జైలు శిక్ష, రూ..5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి తీర్పునిచ్చారన్నారు. -
వాటా కోసం.. తమ్ముళ్ల కుమ్ములాట
ఓబులవారిపల్లె : టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న సంస్థకు ఖనిజం సరఫరా చేసే విషయంలో వాటా కోసం తమ్ముళ్ల మధ్య కుమ్ములాట మొదలైంది. 25 శాతం వాటా తమకే ఇవ్వాలంటూ స్థానిక టీడీపీ నాయకులు భీష్మించడంతో వాదోపవాదాలు జరిగాయి. బేరసారాలు బెడిసికొట్టడంతో టెండర్ దక్కించుకున్న కంపెనీ చివరికి సరఫరా నిలిపివేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ఏపీ ఎండీసీ నుంచి ఖనిజాన్ని కొనేందుకు బల్క్ టెండర్ ద్వారా ఎంప్రదా కంపెనీ దక్కించుకుంది. ఎపీఎండీసీ కంపెనీ ఖనిజాన్ని తరలించాల్సి ఉంది. దీనిపై కూటమి నాయకుల కన్ను పడింది. పెద్ద ఎత్తున తామే ఖనిజం తీయిస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నారు. రోజూ దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడు 25 శాతం ఖనిజం తీసేందుకు తమ యంత్రాలకు అవకాశం ఇవ్వాలని పటుబట్టారు. అంతకుముందు తరలిస్తున్న కూటమి నాయకులు దీనికి ఒప్పుకోకపోగా.. వాగ్వాదాం జరగడంతో వివాదం ముదిరింది. దీంతో దీనిపై శుక్రవారం ఉదయం నుంచి కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. బేరసారాలు కుదరక పోవడంతో చివరకు ఏపీఎండీసీ నుంచి ఎమ్ప్రదా కంపెనీకి బైరెటీస్ ఖనిజం సరఫరా నిలిపివేశారు. ఏపీఎండీసీ గనుల నుంచి స్థానిక నిర్వాసిత కుటుంబీకులు, ఇల్లు కోల్పోయిన వారంతా లక్షల రూపాయలు అప్పుచేసి యంత్రాలు కొనుగోలు చేశారు. 51 ఇటాచీలు పెట్టి ఖనిజం తీస్తూ జీవనం సాగిస్తున్నారు. కూటమి నాయకులు తమకే వాటా కావాలనడంతో వీరి మధ్య వివాదం వారి జీవన స్థితిగతులకు అంటకంగా మారింది. కంపెనీకి ఖనిజం రవాణా చేసేలా చూడాలని యంత్రాల యజమానులు కోరుతున్నారు. సీఎండీ గ్రేడ్ ఖనిజం సరఫరాలో బెడిసిన ఒప్పందం తమకే 25 శాతం ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతల పట్టు -
చదువు మానేసిన వారికి ఓపెన్ స్కూల్
కడప ఎడ్యుకేషన్ : వివిధ కారణాలతో చదువు అర్ధంతరంగా మానేసిన వారికి ఓపెన్ స్కూల్ మళ్లీ చదువుకొనే చక్కటి అవకాశం కల్పిస్తోందని డీఈఓ షేక్ షంషుద్దీన్, ఓపెన్ స్కూల్ జిల్లా కోర్డినేటర్ సాంబశివారెడ్డి అన్నారు. 2025–26 విద్యా సంవత్సరంలో అడ్మిషన్స్కు సంబంధించిన కరపత్రాలను కడప డీఈఓ కార్యాలయంలో డీసీ సాంబశివారెడ్డి, ఏపీసీ నిత్యానందరాజు, ప్రభుత్వ పరీక్షల అిసిస్టెంట్ కమిషనర్ వెంకటేష్తో కలిసి శుక్రవారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఓపెన్ స్కూల్ అడ్మిషన్స్ ప్రక్రియలో ఎటువంటి సందేహాలున్నా అభ్యాసకులు సంబంధిత మండల విద్యాశాఖాధికారి కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. ఈ ఏడాది కూడా జిల్లాలోని అధ్యయన కేంద్రాల సమన్వయకర్తలు పూర్తి బాధ్యతతో నిర్ణీత గడువులోపు అడ్మిషన్లు పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీసీ నిత్యానందరాజు, శివ, తదితరులు పాల్గొన్నారు. -
పీజీ పరీక్షలు ప్రారంభం
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల అనుబంధ పీజీ కళాశాలల రెండో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు శుక్రవారం జిల్లావ్యాప్తంగా ప్రారంభమయ్యాయి. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావుతో కలసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వైవీయూపీజీ కళాశాల కేంద్రాన్ని వారు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 653 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కాగా 21 మంది గైర్హాజరైనట్లు వారు తెలిపారు. కడప ఎస్వీ పీజీ కళాశాలలో, ప్రొద్దుటూరులోని ఎస్సీఎన్ఆర్ పీజీ కళాశాలలో పరీక్షలు జరుగుతున్నాయని వివరించారు. -
కమనీయం.. కల్యాణోత్సవం
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో శుక్రవారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి కళ్యాణోత్సవాలను వేర్వేరుగా వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య ధాన్య మందిరం ఆవరణలోని కళ్యాణ వేదికపై ముందుగా సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి కొలువుదీర్చారు. ఒకే వేదికపై శివ, కేశవుల కళ్యాణం జరుగుతుండడంతో రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణోత్సవానికి హాజరైన వారికి టీటీడీ అన్నప్రసాదం పంపిణీ చేసింది. సర్పంచి గౌరీ శంకర్, ఉద్దండం సుబ్రహ్మణ్యం, అదృష్టదీపుడు, టీటీడీ అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు రథోత్సవం : బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. రోడ్డు ప్రమాదంలో జింక మృతిరాయచోటి : రామాపురం మండలం పాలనగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జింక మృతిచెందింది. శుక్రవారం ఉదయం రాయచోటి నుంచి ద్విచక్ర వాహనంలో కొంద రు కడపకు వెళ్తున్నారు. పాలన్నగారిపల్లి సమీపంలో చెట్లపొందల నుంచి జింక రోడ్డుమీదకు రావడంతో ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు గాయాలపాల య్యారు. గాయపడిన జింక కూడా మృతి చెందినట్లు అటవీబీట్ అధికారి భరణీధర్ తెలిపారు. -
రైలు గడువు పొడిగింపు
కడప కోటిరెడ్డిసర్కిల్ : తిరుపతి–చర్లపల్లి–తిరుపతి మధ్య నడుస్తున్న రైలును ఆగస్టు 30వ తేదీ వరకు పొడిగించినట్లు రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. (07011) చర్లపల్లి–తిరుపతి మధ్య ప్రతి శుక్ర, ఆదివారాల్లో.. (07018) తిరుపతి–చర్లపల్లి మధ్య ప్రతి సోమ, శనివారాల్లో నడుస్తుందన్నారు. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇంటర్ ఎస్సీ విద్యార్థులకు తల్లికి వందనం కడప రూరల్ : ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం చదువుతున్న ఎస్సీ వర్గాలకు చెందిన విద్యార్థుల ఖాతాలకు తల్లికి వందనం నిధులు మంజూరవుతాయని జిల్లా ఎస్సీ సంక్షేమ, సాధికారత అధికారి కె.సరస్వతి తెలిపారు. జిల్లాలో 1,896 మంది ఇంటర్మీడియేట్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం ఎస్సీ విద్యార్థుల బ్యాంకు ఖాతాలు పెండింగ్లో ఉన్నాయని పేర్కొన్నారు. ఎస్సీ విద్యార్థులు వెంటనే సమీపంలోని పోస్టాఫీసులో ఖాతానుతెరిచి మీ ఆధార్ నెంబరుకు, ఎన్పీసీఐ పోర్టల్కు లింక్ చేసుకోవాలన్నారు. ఒకవేళ విద్యార్థికి ఇదివరకే బ్యాంకు అకౌంటు ఉన్నట్లయితే ఆ అకౌంటుకు ఎన్పీసీఐ లింక్ చేయించాలని తెలిపారు. మీ ఖాతాకు ఎన్పీసీఐ లింకు అవడం వల్ల తల్లికి వందనం పథకం డబ్బులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా జమ అవుతాయని తెలిపారు. ఫ్రైడే డ్రైడేతో ఆరోగ్యకర వాతావరణం కడప రూరల్ : ఫ్రైడే డ్రైడే కార్యక్రమం తప్పనిసరిగా నిర్వహించడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొంటుందని జిల్లా మలేరియా అధికారి మనోరమ తెలిపారు. శుక్రవారం స్థానిక బుడ్డాయల్లెలో నిర్వహించిన ఫ్రైడే డ్రైడే కార్యక్రమంలో ఆమె పాల్గొని ప్రజలకు అవగాహన కల్పించారు. మలేరియా, డెంగీ జ్వరాలు రాకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలను గురించి వివరించారు. వారానికి ఒకసారి ఇళ్లల్లోని తొట్లు, కుండలు, బానలు, కూలర్లు శుభ్రం చేసుకోవాలని చెప్పారు. డెంగీ, మలేరియా జ్వరాలకు సంబంధించిన రక్త పరీక్షలు రిమ్స్, మీ సమీపంలోని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఉచితంగా నిర్వహిస్తారని పేర్కొన్నారు. ప్రైడే డ్రైడే కార్యక్రమం ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాటించడం వల్ల ఆరోగ్యకరమైన వాతావరణం నెలకొనడంతో మెరుగైన ఆరోగ్యం సమకూరుతుందని తెలిపారు. కార్యక్రమంలో అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, సబ్ యూనిట్ అధికారి నాగలక్ష్మిరెడ్డి, ఆరోగ్య విస్తరణ అధికారి శంకర్రెడ్డి, సుబ్రహ్మణ్యం, ఏఎన్ఎంలు, ఆశాలు పాల్గొన్నారు. జాతీయస్ధాయి క్రీడలకు ఎంపిక రాజంపేట : జాతీయస్ధాయి క్రీడలకు కేంద్రీయ విద్యాలయం విద్యార్ధులు ఎంపికయ్యారని కేంద్రీయ విద్యాలయం ప్రిన్సిపాల్ మురగేశన్ శుక్రవారం తెలిపారు. కోచ్ రాహుల్ కుమార్, సహాయకోచ్ కుమారజరపాలా వీరికి శిక్షణ ఇచ్చారన్నారు.ఎంపికై న వారిలో మోక్షిత్(చెస్), హర్ష(టేక్వాండో), కార్తీక్, మహేశ్ (కబడ్డీ), ఉదయశంకర్ (డిస్కస్త్రో) ఉన్నారని చెప్పారు. జిల్లాస్థాయి క్రీడలకు అండర్–14 విభాగంలో నాగలక్షీప్రియ, హరిత, అండర్–17లో హర్షిత, రిషి, గాయత్రి, అండర్ –19లో మోహనావైష్ణవి, యశస్విని ఎంపికయ్యారన్నారు. విద్యార్ధులను ప్రిన్సిపాల్ మురగేశన్ అభినందించారు. రైళ్లలో ఆకస్మిక తనిఖీలు రాజంపేట : జిల్లాలో నడిచే పలు రైళ్లలో శుక్రవారం పోలీసులు, రైల్వేపోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. చైన్నె–ముంబై మధ్య నడిచే సూపర్ఫాస్ట్ రైళ్ల బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమరవాణా అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్పై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు, 112కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లి గ్రామం, రాజంపేట మండలం నరమరాజుపల్లి గ్రామాల్లో ఉన్న శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈవిషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన 2025–26 విద్యా సంవత్సరం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. -
రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం గిన్నిస్ బుక్ రికార్డుల కోసమే ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహిస్తోందని, వాటివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యమని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ గురుపౌర్ణమి నాడు సత్యసాయి జిల్లా, పుట్టపర్తి నియోజకవర్గంలోని కొత్తచెరువు జిల్లా పరిషత్ పాఠశాలలో సీఎం చంద్రబాబు పేరెంట్స్, టీచర్స్ మీటింగ్ నిర్వహించి పచ్చి అబద్ధాలు చెప్పారన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నాడు–నేడు ద్వారా అభివృద్ధి చేసిన పాఠశాలలో ఈ సమావేశం నిర్వహించే నైతిక అర్హత వారికి లేదన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 60వేల పాఠశాలల్లో 2.20కోట్లమంది విద్యార్థులు, తల్లిదండ్రులు ఈ సమావేశాల్లో పాల్గొన్నారని ఘనంగా చెప్పుకుంటున్నారన్నారు.ఇటీవల వైజాగ్లో నిర్వహించిన యోగాంధ్ర కార్యక్రమం కూడా గిన్నిస్ బుక్ రికార్డుల్లోకి ఎక్కిందన్నారు. ఈ ప్రభుత్వం ఏం చేసినా రికార్డుల కోసమే తప్ప ప్రజల కోసం కాదన్నారు. జూన్ 12న ‘తల్లికి వందనం’ కార్యక్రమాన్ని ప్రారంభిస్తూ అమ్మ ఒడి మార్గదర్శకాల ప్రకారమే ఈ పథకాన్ని అమలు చేస్తున్నామని చెప్పిన సీఎం చంద్రబాబు, కొద్ది రోజులకే మాటమార్చి నిన్న సత్యసాయి జిల్లా కొత్త చెరువు పాఠశాలలో జరిగిన కార్యక్రమంలో లోకేష్ అలోచనల నుంచి ‘తల్లికి వందనం’ పథకం ఆవిర్భవించిందని చెప్పడం హాస్యాస్పదమన్నారు. దివంగత ఎన్టీఆర్ పేరు చెబితే రూ.2 కిలో బియ్యం, మద్యపాన నిషేధం వంటి పథకాలు గుర్తుకు వస్తాయని, వైఎస్సార్ పేరు చెబితే ఉచిత విద్యుత్, ఆరోగ్యశ్రీ, 108,104, జలయజ్ఞం, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలు,వైఎస్ జగన్ పేరు చెబితే అమ్మ ఒడి, నాడు–నేడు వంటివి గుర్తుకు వస్తాయన్నారు. అయితే చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే పథకం ఒక్కటి కూడా లేదన్నారు. కూటమి ప్రభుత్వంలో ప్రభుత్వ పాఠశాలల్లో 4.50లక్షల అడ్మిషన్లు తగ్గాయన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో యూనిఫారం, స్కూల్ బ్యాగ్, పుస్తకాలు, షూ, టై, బెల్ట్ వంటివి కిట్గా అందించారని, కూటమి ప్ర భుత్వంలో మంత్రి లోకేష్ అసెంబ్లీలో ప్రదర్శించిన స్కూల్ బ్యాగ్లు నెల తిరక్కుండానే చిరిగిపోతున్నా యని వీడియోలు చూపించారు.రేషనలైజేషన్ పే రుతో వేల సంఖ్యలో ప్రభుత్వ పాఠశాలలను మూ యించిన ఘనత బాబుదేనన్నారు.కూటమి ప్రభు త్వం ఇచ్చిన హామీలు అమలు చేసేంత వర కువైఎస్సార్సీపీ పోరాటం చేస్తూనే ఉంటుందన్నారు. వైఎస్ జగన్ను అంతం చేసే కుట్ర: రెడ్యం కూటమి ప్రభుత్వంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని అంతం చేసే కుట్ర జరుగుతోందని ఆర్టీసీ మాజీ జోనల్ చైర్మన్ రెడ్యం వెంకట సుబ్బారెడ్డి ఆరోపించారు. చిత్తూరు జిల్లా బంగారు పాళ్యంలో జరిగిన ఘటనే ఇందుకు నిదర్శనమన్నారు. జెడ్ప్లస్ కేటగిరి భద్రత ఉన్న ఆయనకు భద్రత కల్పించకుండా ప్రజలను అడ్డుకునేందుకు వేలమంది పోలీసులను ఉపయోగించారన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు, కరువు కవల పిల్లలని...జిల్లాలో మహానాడు నిర్వహించినప్పటి నుంచి వర్షాలు లేక రైతులు విలవిల్లాడుతున్నారని విమర్శించారు. వైఎస్సార్సీపీ నాయకులు బీహెచ్ ఇలియాస్, దాసరి శివప్రసాద్, షఫీ, డిష్ జిలాన్, అక్బర్, అజ్మతుల్లా, అహ్మద్ పాల్గొన్నారు. వాటివల్ల ప్రజలకు ఒనగూరే ప్రయోజనం శూన్యం మాజీ ఉప ముఖ్యమంత్రి ఎస్బీ అంజద్బాషా -
రిమ్స్లో అరుదైన శస్త్ర చికిత్సలు
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గైనకాలజీ విభాగంలో అరుదైన శస్త్రచికిత్సలు నిర్వహించారు. సూపరింటెండెంట్ డాక్టర్ కెఎస్ఎస్ వెంకటేశ్వరరావు గురువారం మీడియాకు వివరాలు వెల్లడించారు. ● 13 ఏళ్ల బాలిక ముట్టు సమస్యతో గైనకాలజీ విభాగంలో చేరారు. పరీక్షించగా తనకు అరుదైన జన్యువ్యాధి ఉన్నట్లు గుర్తించారు. ఆపరేషన్ చేసి ఎడమవైపు హెర్నియాలో ఉన్న అండాశయాన్ని, ఎడమ వైపు ఉన్న గర్భసంచి సగభాగాన్ని తొలగించారు. ప్రపంచంలో ఇటువంటి కేసులు ఇప్పటి వరకు ఐదు మాత్రమే నమోదు అయ్యాయని సూపరింటెండెంట్ తెలిపారు. ● 46 ఏళ్ల మహిళ కడుపు ఉబ్బరంతో బాధ పడుతూ అడ్మిట్ అయ్యారు. పరీక్షలు చేశాక అండాశయంలో పెద్ద కణితిని గుర్తించారు. శస్త్ర చికిత్స చేసి 8 కేజీల కణితిని తొలగించారు. ● 55 ఏళ్ల మహిళ కడుపు నొప్పితో బాధపడుతూ అడ్మిట్ అయ్యారు. పరీక్షలు జరిపాక అండాశయ క్యాన్సర్ తో బాధపడుతున్నట్లు గుర్తించారు. శస్త్రచికిత్స చేసి 6 కేజీల క్యాన్సర్ గడ్డతోపాటు స్టేజింగ్ లాపారోటమీ అనే చికిత్స చేసి క్యాన్సర్ భాగాలను తొలగించారు. ● శస్త్ర చికిత్స చేశాక ముగ్గురు పేషెంట్స్ బాగా కోలుకున్నారని, అందరినీ డిశ్చార్జ్ త్వరలో చేస్తామని సూపరింటెండెంట్ తెలిపారు. అన్నీ శస్త్ర చికిత్సలు గైనకాలజీ హెచ్ఓడి డాక్టర్ లక్ష్మీసుశీల ఆధ్వర్యంలో డాక్టర్ అమానుల్లా, క్యాన్సర్ శస్త్ర చికిత్స నిపుణుల నేతృత్వంలో చేసినట్లు పేర్కొన్నారు. గైనకాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ డాక్టర్ నీలిమ, డాక్టర్ పద్మావతి, డాక్టర్ రబ్బాని బేగం, డాక్టర్ రేఖారావు, అసిస్టెంట్ ప్రొఫెసర్స్, పీజీ వైద్యులు, స్టాఫ్ నర్స్లు పాల్గొన్నట్లు తెలిపారు. అనస్థీసియా విభాగాధిపతి డాక్టర్ సునీల్ చిరువెళ్ల, అసోసియేట్ ప్రొఫెసర్స్ డాక్టర్ రాఘవేంద్ర, డాక్టర్ మంజు శృతి, అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పాల్గొన్నారు. -
డ్రాగా ముగిసిన కడప–అనంతపురం మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లో మూడవ రోజు గురువారం కడప–అనంతపురం జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రాగా ముగిసింది. వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్లో 74 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కడప జట్టు 107 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 455 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ వర్మ 204 బంతుల్లో 133 పరుగులు, ఆర్దిత్ రెడ్డి 156 బంతుల్లో 111 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వరుణ్ సాయి నాయుడు 4 వికెట్లు తీశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో కడప జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం సాధించింది. కేఓఆర్ఎం మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్లో కర్నూలు జట్టుపై చిత్తూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. మూడవ రోజు గురువారం 143 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 71.2 ఓవర్లలో 272 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని హృదయ్ 85 పరుగులు, విఖ్యాత్ 85 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ఘని చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 42.2 ఓవర్లలలో 3 వికెట్లు కోల్పోయి 304 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 113 బంతుల్లో 138 పరుగులు చేశాడు. -
‘దేశం కోసం మధ్యవర్తిత్వం’ ప్రచారం ప్రారంభం
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశానుసారంగా మొదటి అదనపు జిల్లా న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాఽధికారసంస్థ ఇన్చార్జి చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎల్.వెంకటేశ్వరరావు సూచనల మేరకు, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఇన్చార్జి సెక్రటరీ కె. ప్రత్యూషకుమారి ఆధ్వర్యంలో.. ‘దేశం కోసం మధ్యవర్తిత్వంపై గురువారం నుంచి ఈనెల 16వ తేదీ వరకు ఒక వారం అవగాహన ప్రచారం‘ సందర్భంగా కడప కోర్టు ప్రాంగణంలో స్టాల్ ఏర్పాటు చేశారు. ఈ స్టాల్లో మధ్యవర్తిత్వం సంబంధించి కరపత్రాలు, బ్యానర్లను ఏర్పాటు చేశారు. ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వాలంటరీలు మధ్యవర్తిత్వంపై ప్రజలకు అవగాహన కలిగించారు. ప్రజలకు మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలు పంపిణీ చేశారు. కడప నగరంలోని ఏపీఎస్ఆర్టీసీ బస్టాండ్, కలెక్టరేట్, రైల్వే స్టేషన్, మున్సిపల్ కార్పొరేషన్ ఆఫీస్, డీఎస్పీ ఆఫీస్, సంధ్యా సర్కిల్, ట్రాఫిక్ పోలీస్ స్టేషన్, పాత బస్టాండ్ సర్కిల్, సెవెన్రోడ్ సర్కిల్, దిశా పోలీస్ స్టేషన్ మొదలగు ప్రాంతాలలో ఫ్లెక్సీలు, బ్యానర్లను ప్రదర్శించారు. మధ్యవర్తిత్వానికి సంబంధించిన కరపత్రాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ప్యానల్ న్యాయవాదులు సుబ్రహ్మణ్యం, హసీనా, పారా లీగల్ వాలంటరీలు దశరథ రామిరెడ్డి, ఈశ్వరయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
భర్త మూడో పెళ్లికి యత్నం.. మొదటి భార్య ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : ఆ వ్యక్తికి అప్పటికే రెండు పెళ్లిళ్లు అయ్యాయి. ఆరుగురు సంతానం కూడా ఉన్నారు. అయినా ఆయన మూడవ పెళ్లికి సిద్ధమయ్యాడు. దీంతో మనస్తాపానికి గురైన మొదటి భార్య కత్తితో పొడుచుకుని ఆత్మహత్య చేసుకుంది. బుధవారం అర్ధరాత్రి బద్వేలులో చోటు చేసుకున్న ఈ ఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని సుమిత్రానగర్ (ఎరుకలవీధి)కు చెందిన జగన్నాధం రవి సుమారు 25 సంవత్సరాల క్రితం కడప నగరంలోని తిలక్నగర్ ఎస్టీ కాలనీకి చెందిన రామలక్షుమ్మ (42)ను వివాహం చేసుకున్నాడు. మరికొన్నేళ్లకు రామలక్షుమ్మ సమీప బంధువును కూడా వివాహం చేసుకున్నాడు. ఈ క్రమంలో ఇటీవల రవి రాయచోటికి చెందిన తన సమీప బంధువుల అమ్మాయిని మూడవ వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యాడు. ఈ విషయమై తరచూ రామలక్షుమ్మ, రవిల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఇటీవల రవి కొద్ది రోజులు ఇంటి పట్టున లేకుండా రాయచోటికి వెళ్లి వచ్చాడు. ఇంటికి వచ్చిన తర్వాత భార్య రవిని ప్రశ్నించింది. ఇదే విషయమై బుధవారం రాత్రి కూడా ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో తాను తప్పనిసరిగా నా బంధువుల అమ్మాయిని వివాహం చేసుకుంటానని రవి తేల్చి చెప్పాడు. ‘నీవు మరో వివాహం చేసుకుంటే నేను చనిపోతాను’ అని రామలక్షుమ్మ తెలిపింది. ‘నీవు ఏమైనా నాకు ఫర్వాలేదు. నేను పెళ్లి చేసుకునే తీరుతాన’ని రవి తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన రామలక్షుమ్మ ఇంటిలోని మరో గదిలోకి వెళ్లి గడియ పెట్టుకుని కత్తితో కడుపులో, ఎడమ చేతిపైన పొడుచుకుంది. చుట్టుపక్కల వారు గమనించి రామలక్షుమ్మను హుటాహుటిన ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ గురువారం తెల్లవారుజామున మృతి చెందింది. తమ అక్క మృతికి కారణమైన రవిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి సోదరుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు. రైలు కింద పడి..జమ్మలమడుగు : ఎర్రగుంట్ల పట్టణంలోని ఆవుల క్రిష్ణయ్య(64) అనే వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. గురువారం ఉదయం రైల్వే ట్రాక్పై గూడ్స్ రైలు వస్తుండటంతో దాని కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని పోలీసులు తెలుపుతున్నారు. క్రిష్ణయ్య ముద్దనూరు రోడ్డులో టీఎంఆర్ మాల్ వెనుక వీధిలో నివాసం ఉంటున్నాడు. ఇతను హమాలీ పని చేసుకుంటూ జీవనం సాగించే వాడు. అయితే గత కొద్దికాలం నుంచి అనారోగ్యంతో మానసిక స్థితి సక్రమంగా లేకపోవడంతోనే ఆత్మహత్య చేసుకున్నట్లు తెలుస్తోంది. మృతుడికి భార్య, ఒక కుమారుడు, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. గుర్తు తెలియని వ్యక్తి మృతి కడప అర్బన్ : కడప నగరంలోని ఒన్టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో రైల్వేస్టేషన్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి (45) అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. గత రెండు రోజులుగా మద్యం సేవించి అక్కడే పడి వున్నాడు. గురువారం తెల్లవారుజామున చనిపోయాడు. అతని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. ఆచూకీ తెలిసిన వారు ఎవరైనా సీఐ: 9121100510కు గానీ, ఎస్ఐ సెల్ నెంబర్: 9121100511లకు సమాచారం ఇవ్వాలని పోలీసులు తెలియజేశారు. -
ఊర్లో ఉండాల్సిన బడిని మూసేస్తే పిల్లల చదువులెలా? పిల్లల సంరక్షణ బాధ్యత ప్రభుత్వానికి పట్టదా? కనీస సౌకర్యాలపై దృష్టి పెట్టాల్సిన అవసరం లేదా? తల్లిదండ్రుల నుంచి బాణాల్లా దూసుకొచ్చిన ప్రశ్నలకు.. విద్యాశాఖ అధికారుల వద్ద జవాబు లేకుండా పోయింది. జిల్లా వ్యాప్తంగ
కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్ సమావేశాల్లో అధికారులు.. ప్రజాప్రతినిధులకు చుక్కెదురైంది. బడుల్లో సౌకర్యా ల లేమిపై.. పాఠశాలల తరలింపుపై తల్లిదండ్రుల నుంచి ప్రశ్నల వర్షం కురిసింది. కాగా చాలా చోట్ల సమావేశాలకు తల్లిదండ్రులు గైర్హాజరయ్యారు. ● అట్లూరు మండలం చెన్నుపల్లెలో తల్లిదండ్రులు ప్ల కార్డులతో తమ నిరసన వ్యక్తం చేశారు. తమ పిల్లలకు ఊర్లోనే బడి పెట్టాలని.. కిలోమీటర్ల దూరంగా ఉన్న బడికి పంపేది లేదని స్పష్టం చేశారు ● కడప మున్సిపల్ హైస్కూల్ మెయిన్లో పిల్లల పర్యవేక్షణపై ఉపాధ్యాయులు పట్టించుకోవడం లేదని జేసీ అదితిసింగ్కు తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. గతంలో పనిచేసిన హెచ్ఎంతోపాటు పీఈటీలను మళ్లీ ఇదే పాఠశాలకు వేయాలని డిమాండ్ చేశారు. ‘తల్లికి వందనం’ డబ్బులు పడలేదని కొంతమంది జేసీకి ఫిర్యాదు చేశారు. ● జిల్లాలోని మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్, ప్రొద్దుటూరు ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సమా వేశాలకు గైర్హాజరయ్యారు. కొన్ని పాఠశాలల్లో సమస్యలున్నా అధికార పార్టీ ఎమ్మెల్యేలకు ఫిర్యాదు చేసేందుకు భయపడి ముందుకురానట్లు చర్చ సాగింది. మెగా పేరెంట్ మీటింగులో ప్రశ్నలు లేవనెత్తిన తల్లిదండ్రులు పాఠశాలల్లో వసతుల లేమిపై నిలదీత జిల్లావ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లో పేరెంట్ సమావేశాలు పలుచోట్ల ఎమ్మెల్యేలు డుమ్మా -
అరుణాచలం.. రైలులోనూ వెళ్దాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : పంచభూతాత్మక లింగాల్లో అగ్ని లింగం తేజోలింగంగా పేరొందిన అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి అధికంగా ఉంటోంది. గిరి ప్రదక్షిణకు వేలాది మంది భక్తులు తరలి వెళుతున్నారు. కడప మీదుగా రైలు సదుపాయం ఉన్నా అవగాహన లేక భక్తులు బస్సులు, ప్రైవేటు వాహనాలను ఆశ్రయిస్తున్నారు. ఈ నేపథ్యంలో రైల్వే సౌకర్యంపై సాక్షి అందిస్తున్న ప్రత్యేక కథనం. కడప నుంచి అరుణాచలానికి రోడ్డు మార్గాన వెళ్లేందుకు దాదాపు 300 కి.మీ. దూరం ఉంటోంది. ఆర్టీసీ బస్సుల్లో సూపర్ లగ్జరీల్లో అయితే దూరాన్ని బట్టి రానుపోను రూ.1050 నుంచి 1300 వరకు చార్జీగా ఉంది. ఒకవేళ కారులో వెళితే దాదాపు రూ. 8–10 వేల వరకు ఖర్చు చేయాల్సి వస్తోంది. వీటన్నింటితో పోలిస్తే రైలులో ప్రయాణిస్తే చార్జి తక్కువగా ఉన్నా.. రిజర్వేషన్ అందుబాటులో లేకపోవడంతో అనేక మంది ఇతర వాహనాలను ఆశ్రయించాల్సి వస్తోంది. అందుబాటులో రైల్వేస్టేషన్లు వైఎస్సార్ జిల్లా నుంచి పలు రైళ్లు అరుణాచలం సమీపానికి వెళుతున్నాయి. కడప నుంచి విల్లుపురం 360 కి.మీ. దూరంలో ఉంది. అయితే విల్లుపురం నుంచి అరుణాచలం 60 కి.మీ. దూరంలో ఉంది. ఎవరైనా అరుణాచలం వెళ్లాలంటే విల్లుపురం వరకు రైలులో వెళ్లి అక్కడి నుంచి రైలులో గానీ, బస్సులో గానీ, ఇతర వాహనాల్లో కూడా వెళ్లవచ్చు. కడప మీదుగా వెళుతున్న రైళ్ల వివరాలు అహ్మదాబాద్ నుంచి తిరుచానపల్లికి వెళ్లే వారాంతపు రైలు (09419) ప్రతి శుక్రవారం ఉదయం 10 గంటలకు కడపకు చేరుకుని అదే రోజు సాయంత్రం 7.15 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి ఇదే రైలు (09420)మధ్యాహ్నం 12.10 గంటలకు విల్లుపురంలో బయలుదేరి కడపకు రాత్రి 8.25 గంటలకు చేరుతుంది. ఈ రైలు కడప స్టేషన్లో మాత్రమే ఆగుతుంది. ● లోకమాన్య తిలక్–మధురై (22101) రైలు ప్రతి గురువారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరుకుని.. అదే రోజు మధ్యాహ్నం 12.30 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరుగు ప్రయాణంలో (22102) రైలు విల్లుపురంలో శుక్రవారం రాత్రి 8.40 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులో రానుపోను రూ.550 చార్జిగా నిర్ణయించారు. ● ముంబయి–కరైకాల్ ఎక్స్ప్రెస్ (11017) వారాంతపు రైలు ప్రతి ఆదివారం తెల్లవారుజామున 5.40 గంటలకు కడపకు చేరుకుని మధ్యాహ్నం 1.55 గంటలకు విల్లుపురం చేరుతుంది. తిరిగి ఇదే రైలు (11018) విల్లుపురంలో సాయంత్రం 7.25 గంటలకు బయలుదేరి.. మరుసటిరోజు తెల్లవారుజామున 3.10 గంటలకు కడపకు చేరుతుంది. ● ముంబయి–నాగర్కోయిల్ (16351) ఎక్స్ప్రెస్ రైలు వారానికి రెండు సార్లు నడుస్తుంది. ఈ రైలు ప్రతి మంగళ, శనివారాల్లో మధ్యాహ్నం 1.20 గంటలకు కడపకు చేరుకుని, అదే రోజు రాత్రి 9.30 గంటలకు విల్లుపురం చేరుతుంది. ● కడప నుంచి అరుణాచలానికి ఓకా–మధురై (09520) ఎక్స్ప్రెస్ రైలు అందుబాటులో ఉంది. ఈ ఎక్స్ప్రెస్ రైలు బుధవారం సాయంత్రం 6.05 గంటలకు కడపకు చేరుకుని మరుసటి రోజు తెల్లవారుజామున 3.40 గంటలకు అరుణాచలానికి చేరుతుంది. తిరుగు ప్రయాణంలో ఇదే రైలు (09519) అరుణాచలంలో శుక్రవారం ఉదయం 7.30 గంటలకు బయలుదేరి.. అదే రోజు మధ్యాహ్నం 1.55 గంటలకు కడపకు చేరుతుంది. ఈ రైలులో జనరల్ క్లాస్లో రూ.140, స్లీపర్లో రానుపోను రూ. 790, ఏసీ త్రీ టైర్లో రూ.2370లుగా చార్జీ నిర్ణయించారు. ● కాచిగూడ–పాండిచ్చేరి వెళ్లే రైలు (17653) ప్రతి సోమ, గురు, శనివారాల్లో కాచిగూడలో సాయంత్రం 5 గంటలకు బయలుదేరి అర్ధరాత్రి 1.30 గంటలకు కడపకు చేరుకుని ఉదయం 9.00 గంటలకు విల్లుపురం చేరుకుంటుంది. తిరిగి సాయంత్రం 3 గంటలకు విల్లుపురంలో బయలుదేరి రాత్రి 10 గంటలకు కడపకు చేరుకుంటుంది. ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి వైఎస్సార్ జిల్లా నుంచి అరుణాచలానికి వెళ్లే భక్తుల సంఖ్య బాగా పెరుగుతోంది. నేరుగా వెళ్లేందుకు ఓకా–మధురై ఎక్స్ప్రెస్, కడప నుంచి అరుణాచలంకు సమీపంలోగల విల్లుపురం వెళ్లే రైళ్లు అందుబాటులో ఉన్నాయి. కడప నుంచి కాట్పాడికి వెళ్లి అక్కడి నుంచి నేరుగా అరుణాచలానికి వెళ్లవచ్చు. రైల్వేశాఖ అందిస్తున్న సేవలను ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలి. – జనార్దన్, కమర్షియల్ ఇన్స్పెక్టర్, కడప అతి తక్కువ చార్జీతో ప్రయాణం అన్ని వర్గాలకు అనుకూలం -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ట్రాక్టర్
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి ఆలయానికి సమీపంలో గల కొండపైనున్న రోడ్డులో గురువారం పెద్ద ప్రమాదం తప్పింది. వేంపల్లె వైపు నుంచి చక్రాయపేట వైపు పశువుల మేత కోసం వేరుశనగ గడ్డి వేసుకొని వస్తున్న ట్రాక్టర్.. రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. దీంతో స్తంభం విరిగి పోయింది. విద్యుత్ వైర్ల సాయంతో అది కింద పడకుండా అలాగే ఉండి పోయింది. ఈ సమయంలో విద్యుత్ ఉన్నప్పటికీ.. అదృష్టవశాత్తు, దేవుడి దయ వల్ల మంటలు చెలరేగలేదని ప్రత్యక్ష సాక్షులు తెలిపారు. గండిలో విధులు నిర్వహిస్తున్న ఆర్కేవ్యాలీ పోలీసు స్టేషన్ కానిస్టేబుల్ విషయం తెలుసుకొని.. హుటాహుటిన అక్కడికి చేరుకొని విద్యుత్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చి సరఫరాను నిలిపి వేయించారు. అనంతరం ట్రాక్టర్ను పక్కకు తొలగించారు. చెత్త ట్రాక్టర్ అడ్డుగా నిలబడి పోవడంతో రాయచోటి వేంపల్లె మార్గంలో కొద్ది సేపు రాకపోకలకు అంతరాయం కలిగింది. మైదుకూరులో విషాదంమైదుకూరు : కర్నూలు జిల్లా ఓర్వకల్లు వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంతో మైదుకూరులో విషాదం నెలకొంది. స్థానిక నంద్యాల రోడ్డులోని మహబూబ్ నగర్ ప్రాంతానికి చెందిన కమాల్ బాషా కుటుంబ సభ్యులు హైదరాబాద్కు విహార యాత్రకు వెళ్లి తిరిగి వస్తూ ప్రమాదానికి గురయ్యారు. సంఘటనలో కమాల్ బాషాతోపాటు ఆయన మరదలు మున్ని, మనుమరాలు నదియా మృతి చెందడం.. వాహనంలో ఉన్న మిగిలిన వారు గాయపడటంతో కమాల్ బాషా బంధువులు కన్నీరు అవుతున్నారు. ఇదిలా ఉండగా హైదరాబాద్కు వెళ్లడానికి ముందు కమాల్ బాషా కుటుంబం నెల్లూరులో జరుగుతున్న రొట్టెల పండుగకు వెళ్లినట్టు తెలుస్తోంది. శనివారం నెల్లూరుకు వెళ్లిన వారు మంగళవారం ఇంటికి చేరుకొని అదే రోజు మధ్యాహ్నం నుంచి హైదరాబాద్కు వెళ్లినట్టు కమాల్ బాషా ఇరుగుపొరుగు వారు చెప్పారు. విహార యాత్రలో సంతోషంగా గడిపి తిరిగి వస్తున్న సమయంలో అతని కుటుంబం ప్రమాదానికి గురికావడం పట్ల వారు ఎంతో ఆవేదన చెందుతున్నారు.కర్నూలు జిల్లాలో రోడ్డు ప్రమాదంతప్పిన పెను ప్రమాదం -
విద్యార్థుల భవిష్యత్తుకు పునాదులు తల్లిదండ్రులే : జేసీ
విద్యార్థుల భవిష్యత్తుకు తల్లిదండ్రులే పునాదులని.. తమ పిల్లల చదువులపై ఉపాధ్యాయులను ప్రశ్నించే తత్వాన్ని అలవరుచుకోవాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, కడప నగరపాలక కమిషనర్ మనోజ్రెడ్డి సూచించారు. మెగా పేరెంట్ మీటింగ్ సమావేశాల్లో భాగంగా కడప నగరపాలక మొయిన్ స్కూల్లో నిర్వహించిన సమావేశానికి వారు హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ విద్యార్థుల చదువులు, భద్రతపై పాఠశాల ఉపాధ్యాయులతోపాటు తల్లిదండ్రుల బాధ్యత కూడా ఉండాలన్నారు. విద్యార్థులకు విలువలతో కూడిన విద్యను అందించడంలో ఉపాధ్యాయులు శ్రద్ద తీసుకోవాలన్నారు. మున్సిపల్ హైస్కూల్లో గతంలోనే అధునాతన వసతులను కల్పించామన్నారు. అనంతరం పాఠశాలల్లో చదివి ఉన్నత స్థాయి లో ఉన్న పలువురు పూర్వ విద్యార్థుల అనుభవాలను పిల్లలతో పంచుకున్నారు. ముందుగా పాఠశాలకు వచ్చిన జేసీ తరగతి గదులు, మెడల్ సెంట్రల్ కిచెన్ను పరిశీలించారు. పాఠశాలలోని సమస్యలపై విద్యార్థులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులు వారి తల్లుల పేరుతో మొక్కలు నాటా రు. ఆర్డీవో జాన్ ఇర్వీన్, కార్పొరేటర్ సూర్యనారాయణ, ఎంఈఓలు గంగిరెడ్డి, ఇర్షాద్, కార్పొరేషన్ స్కూల్స్ సూపర్వైజర్ ఫరూక్, హెచ్ఎం ముబీనా రెహ్మాన్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు
వేంపల్లె : వేంపల్లె ఘటనలో 150 మందికి పైగా కేసులు నమోదు చేసినట్లు పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. కానిస్టేబుల్ బి.రామాంజనేయులు ఫిర్యాదు మేరకు.. ఎస్పీ అశోక్ కుమార్ ఆదేశాలతో కేసు నమోదు చేసినట్లు చెప్పారు. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం డీఎస్పీ మీడియాతో మాట్లాడారు. వివరాలు ఆయన మాటల్లోనే.. ‘వేంపల్లెలోని పక్కీర్పల్లెకు చెందిన మైనర్ బాలిక అదృశ్యంపై పోలీస్స్టేషన్పై దాడి చేసిన ఘటనలో 150 మందికి పైగా కేసులు నమోదు అయ్యాయి. ఈ నెల 7వ తేదీన సాయంత్రం 7 గంటల సమయంలో పోలీస్ స్టేషన్లో సెంట్రీగా రామాంజనేయులరెడ్డి విధులు నిర్వర్తిస్తున్నారు. ఈ క్రమంలో వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కిర్పల్లెకు చెందిన సయ్యద్ సుమియా, చింతలమడుగుపల్లెకు చెందిన మడకబాబులు ప్రేమించుకున్నారని, వారిని మధ్యాహ్న సమయంలో ముచ్చుకోన దగ్గర ఉన్న వజ్రాల గుట్టలో ఉండగా.. సుమియా తల్లిదండ్రులు చూసి మడక బాబుపై చర్యలు తీసుకుని, న్యాయం చేయాలని పోలీసు స్టేషన్ వద్దకు వచ్చారు. ఈ నేపథ్యంలో మడక బాబుతోపాటు వల్లెపు గంగాధర్, విజయ్ కుమార్లను అదుపులోకి తీసుకొని విచారణ చేస్తుండగా ముస్లిం వర్గానికి చెందిన పక్కీర్ పల్లెకు చెందిన సయ్యద్ మహమ్మద్ మూసా, రాజీవ్ నగర్ కాలనీకి చెందిన మస్తాన్, వేంపల్లెకు చెందిన మాజీ జెడ్పీటీసీ షబ్బీర్, బిడ్డాలమిట్టకు చెందిన అబ్దుల్, ఇబ్రహీం, హైదర్ వలి (లాడెన్), మదీనాపురానికి చెందిన గుజిరి దర్బార్, అక్బర్, ఇబ్రహీం, సమీర్, ఈసుబ్, కోహీనూర్ నజీర్లతోపాటు దాదాపు 150 మందికి పైగా మూకుమ్మడిగా పోలీస్ స్టేషన్ అవరణలోకి వచ్చి మడక బాబుపై వెంటనే చర్యలు తీసుకోవాలని గొడవకు దిగారు. నిందితులను విచారణ చేస్తున్నామని పోలీసులు ఎంత చెప్పినా వినకుండా పోలీసులు డౌన్ డౌన్ అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ.. పోలీసులనే హత మార్చాలనే ఉద్దేశంతో రాళ్లు విసరగా హెడ్ కానిస్టేబుల్ సాయిబాబా, కానిస్టేబుల్ కిరణ్ కుమార్, మహమ్మద్ ఆలీ, నజీర్ అహమ్మద్ తప్పించుకున్నారు. పోలీస్స్టేషన్ ముట్టడిదారులు అంతటితో ఆగకుండా రాళ్లు తీసుకుని పోలీస్ స్టేషన్ కిటికీ అద్దాలు, వరండాలోని ఇనుప కుర్చీ, వెనుక వైపు ఉన్న డోరును ధ్వంసం చేసి ప్రభుత్వ ఆస్తి నష్ట పరిచారు. అంతే కాకుండా పోలీసు యూనిఫాంలో ఉన్న వారికి విధులకు ఆటంకం పరిచినట్లు ఫిర్యాదులో తెలిపారు. ఎస్పీ ఆదేశాల మేరకు నాన్ బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు’ డీఎస్పీ వివరించారు. పోలీసుల అదుపులో 40 మంది? వేంపల్లె : వేంపల్లె పోలీస్స్టేషన్ ముట్టడి కేసులో 200 నుంచి 300 మందిని అరెస్టు చేసే అవకాశం ఉందని సమాచారం. ఇప్పటికే పోలీస్ స్టేషన్ను ముట్టడి చేసిన కేసులో 40 మందిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిసింది. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారిని అదుపులోకి తీసుకోవాలనే ఉద్దేశంతో నాలుగు బృందాలుగా పోలీసులు ఏర్పడి వేంపల్లెలో జల్లెడ పట్టడం జరుగుతోంది. గురువారం వేంపల్లెలో ఉన్న 40 మందిని పోలీసులు అదుపులోకి తీసుకుని ఇతర ప్రాంతాల పోలీస్స్టేషన్లకు తరలించినట్లు సమాచారం. వేంపల్లెలోని ఆయా ప్రాంతాల్లో పోలీసులు గాలింపు చర్యలు తీసుకోవడంతో.. పోలీస్ స్టేషన్ వద్దకు వచ్చిన చాలా మంది వేంపల్లెను విడిచి పెట్టి ఇతర ప్రాంతాలకు వెళ్లిపోవడం జరిగింది. పోలీస్ స్టేషన్పై దాడి చేసిన వారితోపాటు సంఘటనను చూసేందుకు వచ్చిన వారు కూడా తమను ఎక్కడ అరెస్టు చేస్తారోనని భయంతో ఇతర ప్రాంతాలకు వెళ్లిపోయారు. డీఎస్పీ వేంపల్లెలో మకాం వేసి ముట్టడిదారుల అరెస్టుపై ఆరా తీస్తున్నారు. బాలిక తండ్రి మాబువలి ఫిర్యాదు మేరకు మడక బాబుపై అత్యాచార కేసు నమోదు చేసినట్లు డీఎస్పీ తెలిపారు. పోలీస్స్టేషన్పై దాడి చేశారని కానిస్టేబుల్ ఫిర్యాదు ఎస్పీ ఆదేశాల మేరకు నమోదు -
వైభవం..సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో గురుపౌర్ణమిని పురస్కరించుకొని సీతారాముల కల్యాణోత్సవం బుధవారం వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుతీర్చారు. బంగారు ఆభరణాలు, పుష్పాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వక్సేన పూజ, కలశ ప్రతిష్ట, యజ్ఞోపవీతధారణ, మాంగల్యపూజ, కర్పూర హారతి తదితర కార్యక్రమాలను నిర్వహించారు.అనంతరం సతీసమేతుడైన కోదండరామస్వామికి అర్చకులు పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి సీతారాముల కల్యాణోత్సవాన్ని వీక్షించి తరించారు. ఆలయ టీటీడీ సూపరిటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ పాల్గొన్నారు. ఉక్కు కర్మాగార నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి జమ్మలమడుగు రూరల్ : ఉక్కు కర్మాగారం నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించిందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం జమ్మలమడుగు మండలపరిధిలోని సున్నపురాళ్ల పల్లె వద్ద జేఎస్డబ్ల్యూ గ్రూప్స్ ఆధ్వర్యంలో శిలాఫలకం వేసిన ప్రాంతాన్ని ఎమ్యెల్యే సి.ఆదినారాయణరెడ్డి, టీడీపీ ఇంచార్జ్ భూపెష్రెడ్డి, కంపెనీ ప్రతినిధులతో కలసి కలెక్టర్ పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జిల్లాలో నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించే విధంగా చర్యలు తీసుకుంటున్నారని ఆయన తెలిపారు. ఇందులో భాగంగా కర్మాగారానికి కావలసిన స్థలం, మౌళిక సదుపాయాల కల్పన మొదలైన అంశాలపై కంపెనీ ప్రతినిధులతో చర్చించారని పేర్కొన్నారు. ఎమ్యెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ జమ్మమడుగు ప్రాంతంలో కర్మాగారం నిర్మాణం చేపట్టడానికి కూటమి ప్రభుత్వం అడుగులు వేస్తోందన్నారు. జెఎస్డబ్ల్యూ స్టీల్స్ ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ యోగేష్ బేఢీ, జీఎం వికాస్ కన్వర్, సీనియర్ వైస్ ప్రెసిడెంట్ రాజేష్ పూరి, ప్రాజెక్ట్ హెడ్ నూరుల్, ఆర్డీఓ సాయిశ్రీ పాల్గొన్నారు. 15 నుంచి క్రీడా పోటీలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల ప్రకారం ఈ నెల 15 నుంచి 17 వరకు ఖేలో ఇండియా స్కీమ్ ద్వారా మహిళలకు పలు క్రీడలను నిర్వహించనున్నట్లు డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాల ప్రత్యేక అధికారి కె, జగన్నాథరెడ్డి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. వీటిలో డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలకు అఽథ్లెటిక్స్, అర్చరీ, వెయిట్ లిఫ్టింగ్ పోటీలను నిర్వహించాలని ప్రభుత్వం నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. 22 ఏళ్లలోపు ఉన్న మహిళా క్రీడాకారిణులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఎరువుల వాడకంపై అవగాహన అవసరం కడప ఎడ్యుకేషన్: నేటి ఆధునిక వ్యవసాయసాగులో పంటలకు ఎరువుల వాడకంపై రైతులకు అవగాహన అవసరమని ఊటకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో ప్రాధమిక వ్యవసాయ సహకార సంఘాలకు సమగ్ర పోషక యాజమాన్యం శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏయే పంటలకు ఎంత శాతం ఎరువులు అవసరమో ఈ శిక్షణ ద్వారా అందరు తెలుసుకోవాలని వివరించారు. ఏరువాక కేంద్రం అధిపతి బి. పద్మోదయ మాట్లాడారు. కే వి కే శాస్త్రవేత్తలు సాయిమహేశ్వరి, సురేష్ కుమార్రెడ్డి, మానస, గిరీష్ కుమార్ పాల్గొన్నారు జిల్లా పోలీసుశాఖలో బదిలీలు కడప అర్బన్: జిల్లా పోలీసుశాఖలో గురువారం భారీ స్థాయిలో బదిలీలు జరిగాయి. వివిధ పోలీస్స్టేషన్ల పరిధిల్లో విధులను నిర్వహిస్తున్న 24 మంది ఏఎస్ఐలు, 32 మంది హెడ్ కానిస్టేబుళ్లు, 109 మంది కానిస్టేబుళ్లను నలుగురు మహిళా కానిస్టేబుళ్లు మొత్తం 169 మందిని బదిలీ చేస్తూ ఎస్పీ అశోక్కుమార్ ఉత్తర్వులను జారీ చేశారు. -
కడపకు వచ్చారో..!
సాక్షి ప్రతినిధి, కడప : ‘రిమ్స్లో ఏం చేసినా మేమే చేయాలి.. మా మనుషుల ద్వారానే చేపట్టాలి. తిరుపతి నుంచి వచ్చి మీరు ఇక్కడ కొనసాగిస్తామంటే చూస్తూ ఊరుకోవాలా. ఇక్కడ మేం లేమా? టెండర్ వేసేటప్పుడు కనీసం సంప్రదించేది లేదా? ఇష్టానుసారం టెండర్లు వేస్తే మీకు స్వాగతం చెప్పాలా? గౌరవంగా చెబుతున్నాం, మీరు కడపకు రావొద్దు..’ జిల్లా టీడీపీ ముఖ్యనేత చేసిన హెచ్చరికలు ఇవి. అధికారం అండతో ఈగల్ హంట్ ప్రతినిఽధిపై రెచ్చిపోయిన వైనమిది. కడప రిమ్స్లో ఇప్పటివరకూ ఎక్స్ఫర్ట్ ఏజెన్సీ ద్వారా సెక్యూరిటీ సర్వీసు అందుతోంది. కాలపరిమితి పూర్తి కావడంతో టెండర్లు ప్రక్రియ చేపట్టారు. ఈ మేరకు రిమ్స్లో సెక్యూరిటీ సర్వీసు అందించేందుకు న్యూడిల్లీకి చెందిన ఈగల్ హంట్ ఏజెన్సీ కొత్తగా టెండర్లు దక్కించుకుంది. ఈ నేపథ్యంలో ఈగల్ హంట్ ఏజెన్సీ ప్రతినిధి తిరుపతికి చెందిన వ్యక్తికి టీడీపీ ముఖ్యనేత నుంచి బెదిరింపు ఫోన్ కాల్స్ వెళ్లాయి. తమకు తెలియకుండా సెక్యూరిటీ సర్వీసు నిర్వహణకు వచ్చావో..నీకుంటుందంటూ హెచ్చరికలు జారీ చేశారు. బెదిరింపుల పర్వం నడుస్తుండగానే టెండర్లు పూర్తి అయ్యాయి. ఆ సెక్యూరిటీ సర్వీసులు తమ వర్గీయుడు ద్వారానే కొనసాగించాలంటూ ప్రజాప్రతినిధి కూడ ఫోన్ చేసి బెదిరింపులకు దిగినట్లు సమాచారం. ‘మీరు టీటీడీ ఉద్యోగి, మాతో పెట్టుకొవద్దు అనవసర కాంప్లీగేషన్స్ లేకుండా సెక్యూరిటీ సర్వీసు అప్పగించా..’ లంటూ ఫోన్లలో టీడీపీ ముఖ్యనేత, ప్రజాప్రతినిధి ముప్పు తిప్పలు పెడుతున్నట్లు సమాచారం. ఇప్పటికీ కొలిక్కి రాకపోవడంతో వాడెలా నిర్వహిస్తాడో చూద్దామంటూ భీష్మించుకున్నట్లు సమాచారం. శానిటేషన్ ప్రక్రియపై కూడా... రిమ్స్లో ఇదివరకూ ఏ–1 ఏజెన్సీ శానిటేషన్ ప్రక్రియ కొనసాగిస్తోంది. ఈమారు టెండర్లలో ఎవరు పాల్గొనకుండా జిల్లా టీడీపీ ముఖ్యనేత మంతనాలతోపాటు, వర్గీయుల బెదిరింపులు తెరపైకి వచ్చాయి. ఇక ఎవరూ టెండర్లల్లో పాల్గొనరనే క్రమంలో తిరుపతికి చెందిన పద్మావతి ఫెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ పాల్గొని టెండర్ దక్కించుకంది. టెండర్ బిడ్ ఓపెన్లో ఎల్–1గా నిలిచింది. ఫైనాన్స్ బిడ్ అనుమతి దక్కాల్సి ఉంది. ఈదశలో ‘కడపకు వచ్చి మీరు ఎలా కొనసాగిస్తా’రంటూ జిల్లా టీడీపీ ముఖ్యనేత నుంచి ఫోన్లు వెళ్లినట్లు సమాచారం. రాష్ట్ర ప్రభుత్వం టెండర్లు పెట్టింది, అధికారికంగా పాల్గొన్నాం, టెండర్ దక్కుతోంది. కచ్చితంగా కొనసాగించి తీరుతామంటూ సదరు ప్రతినిధి నుంచి జవాబు రావడంతో సదరు టీడీపీ నేత అవాక్కయినట్లు తెలుస్తోంది. సత్తా లేని వాడైతే అలా మాట్లాడరు, ఆ కాంట్రాక్టర్ ఎవరు, వారికి తెరవెనుక ఎవరున్నారో తెలుసుకోవాలంటూ అనుచరులను పురమాయించినట్లు సమాచారం. ఇంత పెద్ద ఎత్తున బెదిరింపులకు పాల్పడడం వెనుక అటు సెక్యూరిటీ, ఇటు శానిటేషన్ టెండర్లు ద్వారా ప్రతి నెలా రూ.59లక్షలు బిల్లింగ్ ఉండడమే ప్రధాన కారణంగా తెలుస్తోంది. కాంట్రాక్టర్ నుంచి అప్పనంగా నెలనెలా కప్పం లభిస్తుండడంతో టీడీపీ ముఖ్యనేత రంకెలు వేస్తున్నట్లు సమాచారం. కాగా పద్మావతి ఫెస్ట్ కంట్రోల్ ఏజెన్సీ ఈ వ్యవహారాన్ని సీఎంఓ దృష్టికి తీసుకెళ్తున్నట్లు సమాచారం. ఫైనాన్స్ బిడ్ అప్రూవల్ రాగానే, సీఎంఓ ద్వారా రిమ్స్ అధికారులకు సిఫార్సులు చేయించుకొని కడపకు రానున్నట్లు తెలుస్తోంది. ఈగల్ హంట్ ప్రతినిధులకు టీడీపీ ముఖ్యనేత బెదిరింపులు రిమ్స్లో మేము చెప్పినట్లే నడుచుకోవాలి మావాడితోనే సెక్యూరిటీ టెండర్ కొనసాగించాలి అధికారం అండతో బెదిరింపులకు పాల్పడుతున్న వైనం -
ఫుడ్ కార్పొరేషన్ అఽధికారుల పర్యటన
కడప కోటిరెడ్డిసర్కిల్ : న్యూఢిల్లీకి చెందిన ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా అధికారులు గురువారం జమ్మలమడుగు నియోజకవర్గంలో పర్యటించారు. గొరిగెనూరు గ్రామంలో రైతు భరోసా కేంద్రం, రైతు సేవ కేంద్రాన్ని పరిశీలించారు. అలాగే జమ్మలమడుగు వ్యవసాయ మార్కెట్యార్డును సందర్శించి రైతులకు అందిస్తున్న సేవల గురించి ఆరా తీశారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరులోని ఓ రేషన్ దుకాణాన్ని తనిఖీ చేశారు. ఒకే దేశం ఒకే కార్డు పథకం కింద దేశంలోని ఏ రేషన్ షాపు నుంచి అయినా కార్డుదారులు బియ్యం పొందవచ్చని తెలియజేశారు. అనంతరం కడపలోని బఫర్ గోడౌన్కు చేరుకుని బియ్యం నాణ్యత, పోర్టిఫైడ్ బియ్యం పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. సీకే దిన్నె మండలం బోడెద్దులపల్లి చౌక దుకాణం పరిధిలోని కార్డుదారులతో మాట్లాడారు. వారు తెలిపిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పౌరసరఫరాల అధికారి శిరీష, జిల్లా పౌరసరఫరాలశాఖ మేనేజర్, ఫుడ్ కార్పొరేషన్ అధికారులు పాల్గొన్నారు. -
బ్రిటీష్ పాలన కంటే ఘోరం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో బ్రిటీషు పాలన కంటే దారుణమైన పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ధ్వజమెత్తారు. గురువారం వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కూటమి అధికారంలోకి వచ్చి 14 నెలలు పూర్తయినా మేనిఫెస్టోలో చెప్పిన ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. రూ.1.75 లక్షల కోట్లు అప్పులు చేసినా ప్రజా సంక్షేమానికి చేసిందేమీ లేదన్నారు. చంద్రబాబు, కరువు కవల పిల్లలని, ప్రస్తుతం రాష్ట్రం కరువుతో అల్లాడుతోందన్నారు. పంటలు అంతంత మాత్రంగానే పండుతున్నాయని, ఆ పండిన పంటలకు కూడా గిట్టుబాటు ధర లేదన్నారు. పంటలు కొని రైతులకు భరోసా ఇవ్వాల్సిన ప్రభుత్వం ఒక్క కేజీ కూడా కొనలేదన్నారు. కేంద్రంతో సంబంధం లేకుండా అన్నదాత సుఖీభవ పథకం ద్వారా రూ.20 వేలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం, మొదటి ఏడాది ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదన్నారు. రైతులు తెచ్చిన అప్పులకు సున్నావడ్డీ అసలే ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి దశలోనూ రైతులకు సాయమందించారని, రూ.3 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రూ.7450 కోట్లు వారి కోసమే వినియోగించారన్నారు. కూటమి ప్రభుత్వం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని చెప్పి, దాని ఊసే ఎత్తడం లేదన్నారు. మొన్న ప్రకాశం జిల్లాలో పొగాకు రైతులను పరామర్శించడానికి వైఎస్ జగన్ వెళితే రైతులు లక్షలాది మంది తరలి వచ్చారని, నిన్న చిత్తూరులో 25 చెక్పోస్టులు పెట్టి అడ్డుకున్నా మామిడి రైతులు వేలాది మంది హాజరయ్యారన్నారు. చిత్తూరు జిల్లాలో 90 వేల మంది రైతులు రెండున్నర లక్షల ఎకరాల్లో మామిడి సాగు చేశారని, 7 లక్షల టన్నుల మామిడి పంట వచ్చిందన్నారు. మామిడిని రూ.2లకు కొనేవారు లేరని, అందుకే మామిడి రైతులు తమ బాధలు చెప్పుకొనేందుకు వైఎస్ జగన్ వద్దకు వచ్చారన్నారు. హెలీప్యాడ్ వద్ద 30 మంది కంటే ఎక్కువ ఉండకూడదు, మార్కెట్ యార్డులో 500 మంది కంటే ఎక్కువ ఉండకూడదని వేలాది మంది పోలీసులను మోహరించి అన్ని విధాలుగా నియంత్రించారన్నారు. మాజీ మంత్రులకు సైతం నోటీసులిచ్చి రౌడీ షీట్లు తెరుస్తామని బెదిరించారన్నారు. ఇది ప్రజాస్వామ్యమో, నియంతృత్వమో అర్థం కావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు బాధల్లో ఉన్నారని వారిని పరామర్శించేందుకు ఎవరు వచ్చినా స్పందన ఇలాగే ఉంటుందన్నారు. చంద్రబాబు రైతులను పరామర్శించరని, ఎవరైనా పరామర్శిస్తే ఓర్వలేరని ఎద్దేవా చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం తీరు మార్చుకొని ప్రజల సమస్యల పట్ల చిత్తశుద్ధి కనబరచాలని, లేనిపక్షంలో తగిన రీతిలో బుద్ధి చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్, రాష్ట్ర మున్సిపల్ విభాగం సంయుక్త కార్యదర్శి శ్రీరంజన్రెడ్డి, జిలా ఆర్టీఐ విభాగం జిల్లా అధ్యక్షుడు రామక్రిష్ణారెడ్డి, రాష్ట్ర యువజన విభాగం ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, వి.నాగేంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్ జగన్ పర్యటనలకు ప్రజలు బ్రహ్మరథం 25 చెక్పోస్టులు పెట్టి రైతులను అడ్డుకున్నా.. తరలివచ్చారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
అద్దె బడి మాకొద్దు
పీటీఎం ఆత్మీయ సమావేశంలో తల్లిదండ్రుల ఆందోళన బద్వేలు అర్బన్ : శిథిలావస్థకు చేరి కూలేందుకు సిద్ధంగా ఉన్న ఈ అద్దె బడి తమకొద్దని, తమ పిల్లలకు తక్షణమే సొంత పాఠశాల భవనం నిర్మించాలని చెన్నంపల్లె ప్రాథమిక పాఠశాల విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. పాఠశాలలో గురువారం నిర్వహించిన తల్లిదండ్రుల, ఉపాధ్యాయుల ఆత్మీయ సమావేశంలో ఈ ఘటన చోటు చేసుకుంది. మున్సిపాలిటీ పరిధిలోని చెన్నంపల్లె గ్రామంలో 1958లో ప్రభుత్వ పాఠశాలను ఏర్పాటు చేశారు. 30 ఏళ్ల క్రితం బద్వేలు – మైదుకూరు రహదారిలోని చెన్నంపల్లె వద్ద పాఠశాల భవనం నిర్మించారు. ఈ పాఠశాలలో 65 మంది విద్యార్థులు ఉండగా ఐదు మంది ఉపాధ్యాయులు బోధన అందిస్తున్నారు. బద్వేలు పట్టణంలో జరుగుతున్న ఎన్హెచ్–67 రోడ్డు విస్తరణ పనులు, బైపాస్ రోడ్డు పనులు చెన్నంపల్లె ప్రాథమిక పాఠశాలకు శాపంగా మారాయి. నాలుగు వరుసల రహదారి నిర్మాణంలో భాగంగా పాఠశాల గదులను కూల్చివేయాల్సి వచ్చింది. దీంతో గ్రామంలోని ఓ అద్దె భవనంలో పాఠశాల కొనసాగిస్తున్నారు. పాఠశాలను తొలగించినందుకు గాను నష్టపరిహారం కింద రూ.25 లక్షలు ఎంపీడీఓ అకౌంట్కు జమ చేశారు. శిథిలావస్థకు చేరి అద్దె ఇంట్లో కొనసాగుతున్న పాఠశాలకు తమ పిల్లలను భయంభయంగా పంపలేమని, కరెంటు పోయినా, వర్షం వచ్చినా గదుల కొరతతో తమ పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని, తక్షణమే నూతన భవనం నిర్మించాలని తల్లిదండ్రులు పట్టుబట్టారు. దీంతో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు షామీర్బాష సమావేశంలో తీర్మానం చేసి ఉన్నతాధికారులకు పంపుతామని హామీ ఇచ్చారు. -
● పేరెంట్స్ మీటింగు నిర్వహించేదే లే!
అట్లూరు : ‘మా ఊరు పాఠశాల మా ఊరులోనే ఉంచే వరకూ మా పాఠశాలలో మెగాపేరెంట్ టీచర్ మీట్(పీటీఎం)ను నిర్వహించవద్దని’మండల పరిధిలోని చెన్నేపల్లి ప్రాథమిక పాఠశాలలోని విద్యార్థుల పేరంట్స్ స్పష్టం చేశారు. మీటింగును పూర్తిగా అడ్డుకున్నారు. ఎస్.వెంకటాపురం పాఠశాలను మోడల్ పాఠశాలగా మార్చి చెన్నేపల్లిలోని ప్రాథమిక పాఠశాలలో చదివే 3,4,5 తరగతుల విద్యార్థులను తరలించాలని ఉపాధ్యాయులు పేర్కొన్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో తమ పిల్లలు ఇక్కడే చదవాలి.. అక్కడకు పంపించం అంటూ చెన్నేపల్లి కాలనీ విద్యార్థుల తల్లిదండ్రులు తెగేసి చెప్పారు. అధికారుల ఆలోచన విరమించే వరకూ మీటింగు నిర్వహించవద్దు అంటూ ప్లెక్సీలు చేతపట్టుకుని పాఠశాల ముందు ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న మండల విద్యాశాఖ అధికారి విలియంరాజు అక్కడకు చేరుకుని సమావేశం నిర్వహణకు తల్లిదండ్రులతో మాట్లాడినా ఫలితం లేకుండా పోయింది. దీంతో ఉన్నత అధికారుల దృష్టికి తీసుకెళతానని ఆయన వెనుదిరిగారు. -
బాబు మోసాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
పులివెందుల : చంద్రబాబు ఏడాది పాలనలో చేసిన మోసాలను ప్రతి నాయకుడు, కార్యకర్త ప్రజల్లోకి తీసుకెళ్లాలని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పిలుపునిచ్చారు. గురువారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ పార్టీలోని స్టూడెంట్ వింగ్, మహిళా వింగ్, వలంటీర్ వింగ్, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వింగ్ వీటితోపాటు మన నాయకులు, కార్యకర్తలకు ఈ కాన్సెప్ట్ తెలియజేయడమే ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశ్యమన్నారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు ఇచ్చిన హామీలు ఏంటి, ఈ ఏడాది పాలనలో ఆయన ఏమి అమలు చేశారు, ఏమి అమలు చేయలేదనేదే ప్రధాన అంశమన్నారు. చంద్రబాబు నాయుడు మ్యానిఫెస్టోను గుర్తు చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా కోట్లాది మంది ప్రజలను తెలుగుదేశం పార్టీ ఏవిధంగా మభ్యపెట్టిందో మనకు స్పష్టంగా తెలుస్తోందన్నారు. జగనన్న ప్రొజెక్టర్లోని స్పీచ్ను చూసిన తర్వాత దాన్ని మన పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. అంతేకాక ప్రొజెక్టర్ ద్వారా మనం చూసిన అంశాన్ని కరపత్రంగా ముద్రించామని.. ఈ కరపత్రాన్ని ప్రతి ఇంటికి తీసుకపోవాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ప్రొజెక్టర్ ద్వారా మాజీ సీఎం వైఎస్ జగన్ ప్రసంగం ఈ సందర్భంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగాన్ని ప్రొజెక్టర్ ద్వారా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ నాయకులు వీక్షించారు. వైఎస్ జగన్ ప్రసంగంలో నిరుద్యోగ భృతి, తల్లికి వందనం, ఆడబిడ్డ నిధి, అన్నదాత సుఖీభవ, దీపం పథకం, ఉచిత బస్సు, 50ఏళ్లకే పింఛన్ వంటి చంద్రబాబు హామీల ద్వారా ప్రజలు ఏ మేరకు నష్టపోయారో వైఎస్ జగన్ వివరించారు. బాబు ష్యూరిటీ – మోసం గ్యారంటీ కరపత్రం ద్వారా రాష్ట్రంలోని నాయకులందరూ చంద్రబాబు మోసాలను ఎండగట్టాలని ఆయన సూచించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రసంగం తర్వాత ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి మాట్లాడుతూ ఎన్నికల సమయంలో బాబు షూరిటీ – భవిష్యత్ గ్యారంటీ పేరుతో చంద్రబాబు, పవన్ కళ్యాణ్ సంతకాలతో కూడిన బాండు పత్రాలను కూడా అందజేశారని పేర్కొన్నారు. ఈ ఏడాది కాలంలో చంద్రబాబు తన ఏడాది పాలనలో ప్రజలను మోసం చేశారని ధ్వజమెత్తారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు బలరామిరెడ్డి, మండల కన్వీనర్ భాస్కర్రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ చిన్నప్ప, మాజీ మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ సర్వోత్తమరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్, నూర్బాషా, దూదేకుల సంఘం నాయకులు రసూల్, కౌన్సిలర్లు పాల్గొన్నారు. ఏడాది పాలనలో అన్ని వర్గాలనూ మోసం చేసిన కూటమి ప్రభుత్వం చంద్రబాబు ఎన్నికల మ్యానిఫెస్టోలోని మోసాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లాలి వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృతస్థాయి సమావేశంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
చంద్రప్రభ వాహనంపై సౌమ్యనాథస్వామి
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా 7వ రోజు గు రువారం రాత్రి కృష్ణుడి అలంకారంలో చంద్రప్రభ వాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయకర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. అంతకుముందు ఉదయం సౌమ్యనాథస్వామి కూర్మాలంకారంలో సూర్యప్రభ వాహనంపై మాడవీధుల్లో విహరించారు.భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం శ్రీ సౌమ్యనాథసేవా ట్రస్ట్ అన్నదాన సత్రంలో భక్తులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామి కల్యాణోత్సవాన్ని నిర్వహిస్తున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ తెలిపారు. నేడు ట్రాఫిక్ డైవర్షన్ శ్రీ సౌమ్యనాథస్వామి కల్యాణోత్సవం సందర్భంగా శుక్రవారం నందలూరు టౌన్లో ట్రాఫిక్ డైవర్షన్ చేయనున్నట్లు ఎస్ఐ మల్లిఖార్జునరెడ్డి పేర్కొన్నారు.గురువారం ఆయన మాట్లాడుతూ పొత్తపి, చెన్నయ్యగారిపల్లి, లేబాక గ్రామాల వైపు నుంచి నందలూరు టౌన్కు వచ్చే ప్రజలు ఆలయం వైపు దారిలో రాకుండా ఈదరపల్లి, దుర్గాపురం మీదుగా వెళ్లాలని తెలిపారు. స్వామివారం కల్యాణానికి వచ్చే భక్తులు మాత్రం నందలూరు హరిజనవాడ దగ్గర ఉన్న పార్కింగ్ ప్రదేశంలో వాహనాలు నిలిపి గుడి వద్దకు కాలినడకన రావాలన్నారు.మండల ప్రజలు, నాయకులు, పోలీసు వారికి సహకరించాలని కోరారు. -
పిల్లల భవిష్యత్తుకు బంగారు బాట
వల్లూరు : పిల్లల భవిష్యత్తుకు బంగారు బాటలు వేయాల్సిన బాధ్యత ఉపాధ్యాయులతో పాటు తల్లిదండ్రులకు ఉందని అదే లక్ష్యంతో పేరెంట్, టీచర్ల సమావేశాలను ప్రభుత్వం ప్రాధాన్యతతో నిర్వహిస్తోందని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. వల్లూరు మండల పరిధిలోని గంగాయపల్లెలోని ఏపీ మోడల్ స్కూల్లో గురువారం నిర్వహించిన మెగా పేరెంట్స్, టీచర్స్ సమావేశానికి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య రెడ్డి ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. కడప ఆర్డీవో జాన్ ఇర్విన్, డీఈఓ షంషుద్దీన్, ఎంపీడీఓ రఘురాం, తహసీల్దార్ శ్రీవాణి, ప్రిన్సిపల్ సురేష్ బాబు పాల్గొన్నారు. -
క్రీడా పాఠశాల ప్రవేశాలకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో 2025–26 సంవత్సరంలో నాలుగో తరగతి ప్రవేశాలకు బుధవారం ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి ఆధ్వర్యంలో సామర్థ్య పరీక్షలు నిర్వహించారు. విద్యార్థులకు ఎత్తు, జరువు, మెడికల్ టెస్ట్ , స్టాడింగ్ బ్రాడ్ జంప్, షాట్పుట్, 30 మీటర్ల ప్లైయింగ్ స్టార్ట్, రన్నింగ్ పరీక్షలు నిర్వహించారు. మొత్తం 27 మంది హాజరుకాగా, మెడికల్ టెస్ట్ పరీక్షలో నలుగురిని తిరస్కరించారు. క్రీడా మైదానంలో అధికారులు తగు ఏర్పాట్లు చేశారు. వివిధ కారణాలతో హాజరుకాని తొమ్మిది మంది బాల, బాలికలు ఈ నెల 11న నిర్వహించే ఎంపికలకు హాజరుకావాలని సూచించారు. 11న ఐదో తరగతి ప్రవేశాలకు ఎంపిక జరుగుతుందని, ఆన్లైన్లో అర్హులైన విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో హాజరుకావాలన్నారు. -
మా ఇంటి తాళాలు తెరిపించండి సారూ..
కమలాపురం : గత నెల 29న మా ఇంటికి కొందరు తాళాలు వేశారు.. వాటిని తెరిపించాలని కోగటం గ్రామానికి చెందిన రామిశెట్టి సతీష్ భార్య రాజేశ్వరి కోరారు. స్థానిక ప్రభుత్వ కార్యాలయాల సముదాయం వద్ద విలేకరులతో ఆమె మాట్లాడుతూ తన భర్త సతీష్ శనగల వ్యాపారం చేసి కొంతమందికి కోటి రూపాయల వరకు డబ్బు ఇవ్వాల్సి ఉందని, తమకు గ్రామంలో రూ.40 లక్షలు రావాల్సి ఉందన్నారు. నగదు అందగానే కడతామని చెప్పినా రైతులు వినకపోవడంతో ఒత్తిడి భరించలేక తన భర్త ఇంటినుంచి వెళ్లిపోయాడన్నారు. దీంతో రైతులు గత నెల 29న తమ ఇంటికి తాళం వేశారని, అప్పటి నుంచి తాను, తన పిల్లలు బంధువుల ఇంట్లో తలదాచుకున్నామని తెలిపారు. ఎస్పీకి ఫిర్యాదు చేసి.. కమలాపురం ఎస్ఐ వద్దకు వచ్చామని, ఇంటికి తాళం వేసిన వారి వివరాలతో ఫిర్యాదు చేస్తే సమస్య పరిష్కరిస్తామని ఎస్ఐ తెలిపారన్నారు. ఇదిలా ఉంటే ఆరేళ్ల క్రితం రైతుల వద్ద శనగలు కొనుగోలు చేసి డబ్బు ఇవ్వకుండా తిప్పుతున్నాడని బాధితులు బషీర్, సుబ్బారెడ్డి, సాంబ శివారెడ్డి తదితరులు గతంలో కమలాపురం పోలీస్ స్టేషన్, తహసీల్దారు కార్యాలయాల్లో ఫిర్యాదు చేశారు. తమకు న్యాయం జరగలేదని బాధిత రైతులు సతీష్ ఇంటికి తాళం వేసినట్లు తెలిసింది. -
రిమ్స్లో ‘దళారుల దందా’..!
సాక్షి, టాస్క్ఫోర్స్ : దివ్యాంగుల సర్టిఫికెట్ల రీ వెరిఫికేషన్, నూతన సర్టిఫికెట్లను ఇప్పించే విషయంలో కడప రిమ్స్, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, బద్వేల్, కమలాపురం, పులివెందుల ఆసుపత్రుల ఆవరణలో దళారుల దందా యథేచ్చగా జరుగుతోంది. కడప సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో తమకు తాము దళారాలు సర్టిఫికెట్కు ఓ రేటు ఫిక్స్ చేశారు. దివ్యాంగుల నుంచి రూ.30,000 వసూలు చేసి.. ఆస్పత్రిలో పనిచేస్తున్న మీడియేటర్ ఉద్యోగికి రూ.18 వేల నుంచి 22 వేల వరకు ఇస్టున్నట్లు ఆరోపణలున్నాయి. నూతన సర్టిఫికెట్కు ఇదే స్థాయిలో వసూలు చేస్తున్నట్లు సమాచారం. కూటమి ప్రభుత్వం దొంగ, మోసపూరితమైన సర్టిఫికెట్ల ఏరివేతను కొనసాగిస్తూ జూలై, ఆగష్టు, సెప్టెంబర్ వరకు రీ వెరిఫికేషన్ ప్రక్రియ జరుపుతోంది. దివ్యాంగుల సర్టిఫికెట్ ఇచ్చిన డాక్టర్ కాకుండా మరో డాక్టర్ పరిశీలన చేసి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ క్రమంలోనే దళారులు క్యాష్ చేసుకుంటున్నారు. అధికారులు నిఘా వుంచి దివ్యాంగులకు న్యాయం జరిగేలా చూడాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. పొలతలలో తలనీలాలకు వేలంపాటపెండ్లిమర్రి : మండలంలోని పొలతల మల్లేశ్వరస్వామి దేవస్థానంలో భక్తులు సమర్పించిన తలనీలాల వేలం ఈఓ క్రిష్ణానాయక్ బుధవారం నిర్వహించారు. 59.250 కిలోల తలనీలాలను ఒంగోలుకు చెందిన యాదగిరి రూ.5,05,500కు వేలం పాడి దక్కించుకున్నారు. దీంతోపాటు గంగనపల్లె, తిప్పిరెడ్డిపల్లె, కొత్తగిరియంపల్లెలో మల్లేశ్వరస్వామి దేవస్థానానికి సంబంధించిన 15.48 ఎకరాల భూమిని మూడేళ్ల కౌలుకు వేలం వేయగా రూ.18,400 ఆదాయం వచ్చిందని అధికారులు తెలిపారు. దేవాదాయశాఖ అధికారులు పాల్గొన్నారు. ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకురావాలి మదనపల్లె రూరల్ : ఖైదీల్లో సత్ప్రవర్తన తీసుకువచ్చేందుకు జైలు సిబ్బంది కృషి చేయాలని జైళ్ల శాఖ డైరెక్టరేట్ ఆఫ్ జనరల్ అంజనీకుమార్ అన్నారు. మదనపల్లె సబ్ జైలు, డీఎస్పీ మహేంద్రతో కలిసి బుధవారం సాయంత్రం ఆయన తనిఖీ చేశారు. ఖైదీలతో ప్రత్యేకంగా మాట్లాడి జైలులో అందుతున్న సౌకర్యాలపై ఆరా తీశారు. జైలు గదులు, మరుగుదొడ్లు పరిశీలించి, మూడు నెలలకు పైగా జైలులో ఉన్న ఖైదీల వివరాలు, బెయిల్ మంజూరైనా, బయటకు వెళ్లని ఖైదీల సమాచారం, ఉచిత న్యాయసేవలపై జైలర్ లక్ష్మణరావును అడిగి తెలుసుకున్నారు. సీఐ ఎరీషావలీ, ఎస్ఐ చంద్రమోహన్ పాల్గొన్నారు.ఒక్కో సర్టిఫికెట్కు రూ. 30,000 వసూలు -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీడే మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు హోరాహోరీగా కొనసాగుతున్నాయి. రెండో రోజు బుధవారం వైఎస్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్లో 461 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ను ప్రారంభించిన కడప జట్టు 93.2 ఓవర్లలో 495 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆర్దిత్ రెడ్డి 76 బంతుల్లో సెంచురీ చేశాడు. అనంతపురం జట్టులోని కెహెచ్.వీరారెడ్డి 4 వికెట్లు, నవదీప్ 3 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 67 ఓవర్లకు 250 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని కెహెచ్.వీరారెడ్డి 177 బంతుల్లో 133 పరుగులు, సాత్విక్ 41 పరుగులు చేశాడు. కడప జట్టులోని ధీరజ్ కుమార్ రెడ్డి 4 వికెట్లు, ఆర్దిత్రెడ్డి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 15 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 74 పరుగులు చేసింది. కడప జట్టు 319 పరుగుల అధిక్యంలో కొనసాగుతున్నది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మరో మ్యాచ్లో 11 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో రోజు మ్యాచ్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 63.4 ఓవర్లలో 251 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి చరణ్ 63 పరుగులు, బాలాజీ 55 పరుగులు చేశారు. కర్నూలు జట్టులో మహిత్ 4 వికెట్లు, మల్లి ఖార్జున 2 వికెట్లు, విఖ్యాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 28 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 143 పరుగులు చేసింది. ఆ జట్టులోని మురళీ హృదయ్ 60 పరుగులు, కెవి ఓంకార్ 43 పరుగులు చేశారు. కర్నూలు జట్టు 174 పరుగుల అధిక్యంలో కొనసాగుతోంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
కార్మిక వ్యతిరేక విధానాలను ప్రతిఘటిస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్రంలో ప్రధాన మోదీ అమలు చేస్తున్న కార్మిక, ప్రజా వ్యతిరేక విధానాలను ప్రటిఘటిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర, సీపీఎం జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్ అన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా ఐక్య కార్మిక సంఘాల ఆధ్వర్యంలో నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. స్థానిక సీఎస్ఐ చర్చి నుంచి ర్యాలీ ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్, గోకుల్ సర్కిల్, ఒకటవ గాంధీ సర్కిల్, వన్ టౌన్ పోలీస్ స్టేషన్, మీదుగా సెవెన్ రోడ్స్ దగ్గరకు చేరింది. అక్కడ నిర్వహించిన సభలో వారు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారం చేపట్టిన తర్వాత కార్మిక చట్టాలన్నింటినీ రద్దు చేసి నాలుగు లేబర్ కోడ్లు తీసుకొస్తోందన్నారు. లేబర్ కోడ్లు అమలుచేస్తే కనీసం కార్మికులు తమ సమస్యలపై నిరసన తెలియజేసే అవకాశం కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. బ్రిటీష్ కాలంలో కార్మికులు పోరాడి సాధించుకున్న పని గంటలను సైతం పెంచుతున్నారని, కార్మిక సంఘాల హక్కులను ప్రభుత్వం కాలరాస్తోందని విమర్శించారు. 73 షెడ్యూల్లోని మునిసిపల్, అంగన్వాడీ, ఆశా, తదితర రంగాల్లో పనిచేస్తున్న కార్మికులకు కనీస వేతనాలు అందక, ఉద్యోగభద్రత లేక ఇబ్బందులకు గురవుతున్నారన్నారు. వారి సమస్యలపై ఇకపై నిరసన తెలుపుకొనే అవకాశం కోల్పోతారని, ఇది నిర్బంధ నిరంకుశ విధానాలకు తార్కాణమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. అసంఘటిత రంగంలో పనిచేస్తున్న ఆటో, హమాలీ, వీధి విక్రయ కార్మికులకు సంక్షేమ బోర్డులు ఏర్పాటుచేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వ రంగ సంస్థలను కార్పొరేట్ కంపెనీలకు అప్పచెబుతూ ఆదానీ, అంబానీలకు పన్నులు తగ్గిస్తూ కార్మికుల సంక్షేమాన్ని గాలికి వదిలేసిందన్నారు. ఈ కార్యక్రమంలో ఏఐటీయూసీ, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శులు నాగసుబ్బారెడ్డి, బి.మనోహర్, కే.శ్రీనివాసులురెడ్డి, బండి రామలింగారెడ్డి. ఉద్దె మద్దిలేటి, సుబ్బరాయుడు, జయవర్ధన్, ఓబయ్య, ఐఎఫ్టీయూ నాయకులు రాము, రమణయ్య, యూటీఎఫ్ నాయకులు లక్ష్మిరాజా ఎన్.వెంకటశివ, రామ్మోహన్, తదితరులు పాల్గొన్నారు.దేశవ్యాప్త సమ్మె సభలో వామపక్ష నాయకులు -
ఢిల్లీ వర్క్షాప్లో కలెక్టర్
కడప సెవెన్రోడ్స్ : న్యూఢిల్లీలో జరిగిన నేషనల్ డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ వర్క్ షాప్కు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డిని ఆయన కలిశారు. డిస్ట్రిక్ట్ మినరల్ ఫౌండేషన్ ట్రస్టు కార్యకలాపాలు, జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనుల గురించి మంత్రికి కలెక్టర్ వివరించారు. గండికోటలో జరుగుతున్న పర్యాటక మౌలిక సదుపాయాల గురించి తెలియజేశారు. 11 చీనీ మొక్కల నరికివేతకొండాపురం : మండలంలోని తాళ్లప్రొద్దుటూరు పోలీస్ స్టేషన్ పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామానికి చెందిన గోవర్ధన్రెడ్డికి చెందిన 3.5 ఎకరాల చీనీ తోటలో 11 చీనీ చెట్లను గుర్తుతెలియని వ్యక్తులు నరికినట్లు తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ హృషికేశ్వర్రెడ్డి బుధవారం తెలిపారు. గోవర్శన్రెడ్డి పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. మండలానికి ఒక కిసాన్ డ్రోన్సిద్దవటం : ప్రతి మండలానికి 80 శాతం రాయితీపై ఒక కిసాన్ డ్రోన్ ఇస్తామని రైతు బృందాలు అధికారులను సంప్రదించాలని జిల్లా సంయుక్త వ్యవసాయ సంచాలకులు చంద్రనాయక్ తెలిపారు. సిద్దవటం మండలం శాఖరాజుపల్లెలో పొలం పిలుస్తోంది కార్యక్రమాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. మల్చింగ్ షీట్ పద్ధతిలో సాగు చేసిన దోస పంట పరిశీలించి రైతులకు సూచనలు చేశారు. ఆయన మాట్లాడుతూ రైతులకు ప్రభుత్వ పథకాలు, ప్రయోజనాలు వివరించారు. అన్నదాత సుఖీభవ పథకం కింద రైతులు ఈకేవైసీ ఫింగ్ ద్వారా చేయించుకోవాలన్నారు. రైతులకు అవసరమైన ఎరువు అందుబాటులో ఉంచాలని సిబ్బందికి సూచించారు. అనంతరం సిద్దవటం వ్యవసాయ కార్యాలయంలో ఎరువుల పంపిణీని తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏవో రమేష్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, శివకుమార్, మురళి, రైతులు పాల్గొన్నారు. -
కళ్లు తెరిచిన కూటమి పెద్దలు
సాక్షి ప్రతినిధి, కడప : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయంపై కూటమి సర్కార్ నిర్లక్ష్యం వీడింది. వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున జరిగిన విద్యార్థుల ఉద్యమానికి తోడు ..వైఎస్ఆర్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ చేసిన ట్వీట్కు ప్రభుత్వంలో చలనం వచ్చింది. వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో ఏర్పాటైన రాష్ట్ర స్థాయి విశ్వవిద్యాలయంపై సవతి తల్లి ప్రేమ కారణంగా 2025– 26 ఏడాదికి అడ్మిషన్లు నోచుకోలేదు. మరోవైపు కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్ అనుమతులు దక్కలేదు. ఈ నేపధ్యంలో వారం రోజులుగా విద్యార్థులు నిరవధిక నిరాహారదీక్ష చేపట్టారు. అదే విషయాన్ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. రాష్ట్ర ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై ఆయన ట్వీట్ చేస్తే ప్రభుత్వ పెద్దలు కళ్లు తెరిచారు. బుధవారం అడ్మిషన్లు చేపట్టేందుకు ఉన్నతాధికారులు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా కేంద్రమైన కడప నగరంలో 2020లో అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం విభజన చట్టంలో పేర్కొన్న విధంగా హైదరాబాదులోని జవహర్ లాల్ నెహ్రూ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ (జేఎన్యూ)కి సమాంతరంగా 14 రకాల స్పెషలైజ్డ్ కోర్సులతో విశ్వవిద్యాలయాన్ని కడప నగరంలో ఏర్పాటు చేసింది. యోగి వేమన విశ్వవిద్యాలయం సమీపంలో శాశ్వత భవనాల కోసం అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ 110 ఎకరాల భూమి సైతం కేటాయించింది. రూ.350 కోట్లతో విశ్వవిద్యాలయ శాశ్వత భవనాల కోసం ఆకృతులు సైతం సిద్ధం చేశారు. తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం కారణంగా శాశ్వత భవనాలకు సంబంధించి ఒక్క అడుగు కూడా పురోగతి లేదు. ఏఎఫ్యూ వ్యవహారాన్ని పూర్తిగా పట్టించుకోలేదు. సీఓఏ (కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్)అధికారులు అనుకూలంగా ఉన్నా ప్రభు త్వం పట్టించుకోలేదు. వెరసి గుర్తింపునకు నోచు కోలేదు. రెగ్యులర్ నియామకాలు లేకపోవడం మరో కారణంగా నిలిచింది. ఈఏడాది కోర్సు పూర్తి చేసుకోనున్న 63 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. మరోవైపు ఏడీసెట్ నిర్వహణ చేపట్టి నూతన అడ్మిషన్లకు శ్రీకారం చుట్టాల్సి ఉండగా రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం ప్రదర్శించింది. ఈ పరిస్థితుల్లో విద్యార్థులు నిరవధిక ఆందోళనకు దిగారు. మంగళవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిసి వాస్తవ పరిస్థితులను వివరించారు. ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్యపు ధోరణి నేపధ్యంలో అన్యాయానికి గురయ్యామని వాపోయారు. ఈ అంశాలపై మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్ చేశారు. ఫలితంగా మొద్దు నిద్రలో ఉన్న ప్రభుత్వ పెద్దలు మేల్కొన్నారు. 2025–26 విద్యా సంవత్సరానికి ఏడీసెట్తో నిమిత్తం లేకుండా మెరిట్ ప్రాతిపదికన అడ్మిషన్లు చేపట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ చైర్మన్ ప్రొఫెసర్ మధుమూర్తి బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. అదేవిధంగా సీఓఏ అనుమతులు కోసం కూడా రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక చొరవ చూపాలని విద్యార్థులు, వారి తల్లిదండ్రులు కోరుతున్నారు. డాక్టర్ వైఎస్సార్ ఏఎఫ్యూ అడ్మిషన్లు చేపట్టేందుకు ఉత్తర్వులు మెరిట్ ప్రాతిపదిక అడ్మిషన్లు చేపట్టాలని హయ్యర్ ఎడ్యుకేషన్ ఆదేశాలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ట్వీట్కు స్పందన సీఓఏ అనుమతులకు కృషి చేయాల్సిందిగా విద్యార్థుల విన్నపం -
వైభవం.. సౌమ్యనాథుని గరుడోత్సవం
నందలూరు : సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆరోరోజు బుధవారం రాత్రి స్వామివారు శ్రీ మహావిష్ణువు అలంకారంలో గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. గరుడవాహనసేవ దిగువవీధి, పేటగడ్డ, బస్టాండ్ మీదుగా అరవపల్లి వరకు సాగింది.గరుడసేవ తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు విచ్చేశారు.అరవపల్లిలో శ్రీ ముత్తు మారెమ్మ గుడి వద్ద ఏర్పాటు చేసిన విడిదిలో ఉభయదారులు కుర్ర మణియాదవ్, ప్రభావతి దంపతులను మంగళవాయిద్యాలతో ఆహ్వానించి పూజలు జరిపించారు. బుధవారం ఉదయం పుష్పాలంకరణ ప్రియుడైన సౌమ్యనాథస్వామి మోహిని అలంకారంలో శేషవాహనంపై మాఢవీధుల్లో విహరించారు.ఊరేగింపు సందర్భంగా కడపకు చెందిన గణేష్ కోలాటం బృందం కోలాట ప్రదర్శన ఆకట్టుకుంది. బ్రహ్మోత్సవాలలో నేడు : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడవ రోజు గురువారం ఉదయం శ్రీ సౌమ్యనాధ స్వామి ఉదయం సూర్యప్రభ, రాత్రికి చంద్రప్రభ వాహనంపై భక్తులకు దర్శనం ఇవ్వనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. -
ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం
– డీఈఓ షేక్ షంషుద్దీన్ కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఉపాధ్యాయులు జాతీయ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ దరఖాస్తులను జులై 13వ తేదీ వరకు ఆన్లై న్ పోర్టల్ htt pr://nationalawardstotea chers.education.gov.in ద్వారా దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ తెలిపారు. అర్హతలు, ఇత ర సమాచారం కోసం పై వెబ్సెట్నే సంప్రదించాలని డీఈఓ పేర్కొన్నారు. ఢిల్లీ వర్క్షాప్లో కలెక్టర్ కడప సెవెన్రోడ్స్ : కేంద్ర ప్రభుత్వ బొగ్గు, ఖనిజ మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో జిల్లా ఖనిజ క్షేత్ర నిధి సంస్థల నిర్వహణపై బుధవారం న్యూ ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి వర్క్ షాప్లో జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. కేంద్ర మంత్రి కిషన్రెడ్డి, భారత ప్రభుత్వ ఖనిజ మంత్రిత్వ శాఖ కార్యదర్శి డీఎల్ కాంతారావు, వివిధ రాష్ట్రాల జిల్లా కలెక్టర్లు, గనులు, భూగర్భ శాఖ అధికారులు కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇందులో జిల్లా ఖనిజ క్షేత్ర నిధి సంస్థల నిర్వహణ ప్రణాళిక, అమలు అనే అంశంపై నియమించిన కమిటిలో జిల్లా కలెక్టర్ ప్రజెంటేషన్ ఇచ్చారు. ఈ సందర్భంగా భారత బొగ్గు , గనుల మంత్రిత్వశాఖ తరుపున కలెక్టర్కు జ్ఞాపిక అందించి సత్కరించారు. 11న జాబ్మేళా కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఉపాధి కార్యాలయం ఆధ్వర్యంలో ఈనెల 11న కడప నగర శివార్లలోని కొప్పర్తి మెగా ఇండస్ట్రియల్ పార్కులోని టిరోవిజన్ కంపోజిట్ టెక్నాలజీస్ ప్రైవేటు లిమిటెడ్లో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్, ఇంటర్మీడియేట్, ఐటీఐ, డిప్లొమా, బీటెక్, ఎంటెక్, డిగ్రీ చదివి 18 నుంచి 40 ఏళ్లలోపు వారు అర్హులని పేర్కొన్నారు. ఎంపికై న వారికి అర్హతనుబట్టి రూ. 10–50 వేల వరకు వేతనం ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. నేడు జిల్లా వ్యాప్తంగా తల్లిదండ్రుల సమావేశం కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ప్రభుత్వ పాఠశాలల్లో నేడు తల్లిదండ్రుల సమావేశాలను నిర్వహించనున్నారు. ఇందుకోసం విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. ఇందులో భాగంగా 4 నుంచి 10వ తరగతి విద్యార్థుల చేత మొక్కలు నాటించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టనున్నారు. దీని కోసం ప్రభుత్వం ఒక్కో మొక్కకు రూ. 7.85 కేటాయించి నిధులను విడుదల చేసింది. ఒక్కో విద్యార్థి తమ తల్లి పేరుతో మొక్కనాటేలా రిజిస్ట్రేషన్ చేయించారు. అలాగే విద్యార్థి ప్రొగ్రెస్, హాలిస్టిక్ రిపోర్టు పేరుతో విద్యార్థి అభ్యసన, ఆరోగ్య తదితర వివరాలు అందులో పొందుపరిచి చర్చించడంతోపాటు ప్రభుత్వ పథకాలు, కార్యక్రమలను తెలియచేయనున్నారు. ఈ కార్యక్రమాన్ని జిల్లాలో 2818 ప్రభుత్వ, ప్రైవేటు బడులతోపాటు 155 ప్రభుత్వ, ఎయిడెడ్, కేజీబీవీ, హైస్కూల్ ప్లస్, సాంఘిక సంక్షేమ జూనియర్ కళాశాలల్లో కూడా నిర్వహించనున్నారు. వెబ్ ఆప్షన్స్ నమోదుకు 12 వరకు అవకాశం రాయచోటి జగదాంబసెంటర్ : రెండు సంవత్సరాల డిప్లమో ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ (డీఈఎల్ఈడీ) కోర్సుకు జరిగిన ప్రవేశ పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థులు డైట్లో సీటు పొందడానికి ఆన్లైన్ వెబ్ ఆధారంగా ఆప్షన్స్ ఇచ్చుకునేందుకు ఈ నెల 9 నుంచి 12 వరకు అవకాశం కల్పించినట్లు ప్రిన్సిపాల్ ఎంఆర్ఎస్ అజయ్కుమార్బాబు తెలిపారు. బుధవారం రాయచోటిలోని డైట్ విద్యా కేంద్రంలో ఆయన మాట్లాడుతూ వెబ్ ఆప్షన్స్ ఇచ్చుకున్న వారికి సీట్లు కేటాయించి ఈ నెల 17 నుంచి 22వ తేదీ వరకు సర్టిఫికెట్ల వెరిఫికేషన్ చేయనున్నట్లు చెప్పారు. ఈ నెల 25 నుంచి డైట్లో మొదటి సంవత్సరం తరగతులు ప్రారంభమవుతాయన్నారు. రాయచోటి డైట్ తెలుగు మీడియంలో 50, ఆంగ్ల మాధ్యమంలో 50, ఉర్దూ మాధ్యమంలో 50 సీట్లు ఉన్నాయన్నారు. డీఈఈసెట్లో సాధించిన మార్కులు, రిజర్వేషన్ల ఆధారంగా రెండేళ్ల డీఈఎల్ఈడీ కోర్సులో ప్రవేశాలు కల్పిస్తామని చెప్పారు. ఇతర వివరాలకు డైట్ సీనియర్ లెక్చరర్ మడితాడి నరసింహారెడ్డిని (9440246825 నంబర్లో) సంప్రదించాలన్నారు. ఈ కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి, డైట్ లెక్చరర్స్ వైసీ రెడ్డప్పరెడ్డి, తిరుపతి శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
పోలీసుల విచారణకు వస్తూ.. అస్వస్థతకు గురై
బద్వేలు అర్బన్ : బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైన నకిలీ పట్టాల కేసులో విచారణకు హాజరు అయ్యేందుకు పోలీస్ స్టేషన్కు వచ్చిన ఓ వ్యక్తి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. బుధవారం జరిగిన సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి. బద్వేల్ అర్బన్ పోలీస్ స్టేషన్లో నమోదైన నకిలీ ఇంటి పట్టాల కేసులో గత వారం రోజులుగా పోలీసులు పలువురినీ విచారిస్తున్నారు. ఈ క్రమంలో పట్టణంలోని సుమిత్రా నగర్కు చెందిన డి.రవికుమార్ను రోజూ స్టేషన్కు పిలిచి రాత్రికి ఇంటికి పంపిస్తున్నారు. ఈ క్రమంలో బుధవారం కూడా విచారణ నిమిత్తం స్టేషన్ వద్దకు వచ్చిన రవికుమార్ తీవ్ర అస్వస్థతకు గురై కిందపడిపోయారు. పోలీసులు ఆయన కుటుంబ సభ్యులకు సమాచారమివ్వడంతో వారు వచ్చి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. పోలీసులు తమను ఏమీ ఇబ్బంది పెట్టలేదని, వారం రోజులుగా స్టేషన్కు పిలిపిస్తుండటంతో భయాందోళనకు గురై నిద్ర మాత్రలు మింగారని రవికుమార్ కుటుంబీకులు తెలిపారు. -
ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్
కడప అర్బన్ : జిల్లా వ్యాప్తంగా పాఠశాలలు, కళాశాలలు,కు వంద మీటర్ల విద్యా సంస్ధలకు వంద మీటర్ల దూరంలో బుధవారం ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ ఇజి.అశోక్కుమార్ ఆదేశాలతో పోలీస్ అధికారులు తమ పరిధిలోని పాఠశాలలు, కళాశాల, విద్యా సంస్ధలను సందర్శించి వంద మీటర్ల లోపు టీ షాపులు, పాన్ షాపులు, కిరాణం షాపులలో సిగరెట్లు, కై నీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తుల తనిఖీలు చేసి వాటి అమ్మకాలు నిషేధమని దుకాణదారులకు తెలిపారు. విద్యా సంస్ధల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించే దుకాణ యజమానులకు కోప్టా యాక్టు ప్రకారం జరిమానా విధించారు. -
చెప్పులేసుకొని రొట్టెలు వదిలిన ఎమ్మెల్యే
– ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని విమర్శలు కడప కార్పొరేషన్ : మొహర్రం పండుగను పురస్కరించుకొని నాదర్ షా వలీ దర్గా ఉరుసుకు ప్రభుత్వ విప్, కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి హాజరై ప్రత్యేక ప్రార్థనలు చేశారు. దర్గా ప్రతినిధులు ఆమెకు స్వాగతం పలికారు. అనంతరం కేసీ కెనాల్లో రొట్టెలు వదిలే సందర్భంగా ఎమ్మెల్యే చెప్పులు వేసుకోవడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎంతో పవిత్రంగా రొట్టెలు వదిలే కార్యక్రంలో ఎమ్మెల్యే చెప్పులు వేసుకొని ముస్లింల మనోభావాలు దెబ్బతీశారని పలువురు విమర్శిస్తున్నారు. -
ఎల్లలు దాటిన అభిమానం
కడప కార్పొరేషన్ : కువైట్ దేశంలో దివంగత ముఖ్యమంత్రి డా.వైఎస్.రాజశేఖర్రెడ్డి జయంతి ఘనంగా నిర్వహించారు. మంగళవారం రాత్రి ఖైతాన్ ప్రాంతంలో ఉన్న రాజధాని రెస్టారెంట్లో వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ కట్ చేసి ఒకరినొకరు పంచుకున్నారు. కువైట్ కన్వీనర్ బాలిరెడ్డి, గల్ఫ్ కోకన్వీనర్ గోవిందు నాగరాజు మాట్లాడుతూ డా. వైఎస్సార్ తన పరిపాలనలో పేద బడుగు బాలహీన వర్గాల కోసం ఎన్నో సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి అమలు చేశారని, పేదలకు ఆరోగ్యశ్రీ, రైతులకు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకం, తదితర పథకాలు ప్రవేశపెట్టి పేదలకు అండగా నిలిచారన్నారు. తెలుగు ప్రజల గుండెల్లో రాజన్న శాశ్వతంగా ఉంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో గల్ఫ్ కోర్ కమిటీ సభ్యులు ఎన్.చంద్రశేఖర్రెడ్డి, ఎం.చంద్రశేఖర్రెడ్డి, కె.రమణయాదవ్, మర్రి కళ్యాణ్ మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం మాదిరి తాము రెడ్బుక్ తరహాలో రాయగలమని, అది తమ సంస్కృతి కాదన్నారు. ఇప్పటికై నా మంత్రి లోకేష్ రెడ్బుక్ పాలన ప్రక్కన పెట్టి డాక్టర్ అంబేడ్కర్ రాజ్యాంగాన్ని గౌరవించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లక్ష్మీప్రసాద్, షేక్ రహంతుల్లా, షేక్ గఫార్, షాహుస్సేన్, ఎ.బాలక్రిష్ణారెడ్డి, గోవిందురాజు, అప్సర్అలీ, అన్నాజీ, వెంకటక్రిష్ణ, ఉపాసన, వెంకటరమణారెడ్డి, షేక్ గఫార్, నరసారెడ్డి, పి.సురేష్రెడ్డి, అబూతురాబ్ పాల్గొన్నారు. ఖతార్లో వైఎస్సార్ జయంతి ఖతార్ దేశంలోని దోహా పట్టణంలో దివంగత మహానేత వైఎస్.రాజశేఖరరెడ్డి జయంతి వేడుక ఘనంగా జరిగింది. స్థానిక తాజ్ మహారాజ హోటల్లో వైఎస్సార్సీపీ ఖతార్ కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం రాత్రి ఖతార్ వైఎస్సార్సీపీ కన్వీనర్ దొండపాటి శశికిరణ్ ఆధ్వర్యంలో రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి, కేక్ కట్ చేసి నివాళులర్పించారు. శశికిరణ్ మాట్లాడుతూ రాజన్న భౌతికంగా తమ మధ్య లేకపోయినా, తమ గుండెల్లో చిరస్థాయిగా నిలిచిపోయారన్నారు. వైఎస్సార్ వారసుడిగా రాజకీయాల్లోకి వచ్చిన వైఎస్.జగన్మోహన్రెడ్డి నవరత్నాలు అమలు చేసి అద్భుతపాలన సాగించారన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ ప్రతినిధి వర్జిల్బాబు, వైఎస్సార్సీపీ ఖతార్ కమిటీ కో కన్వీనర్లు జాఫర్ హుస్సేన్, ఆరోన్ మనీష్, ఎన్.నాగేశ్వరరావు, జయరాజు, ఎన్.లియోపోల్డ్కింగ్, టి.అరుణ్కుమార్, హేమంత్, గణేష్, శివనారాయణ, తదితరులు పాల్గొన్నారు.కువైట్లో ఘనంగా మహానేత జయంతి -
పథకాలు ప్రజలకు పూర్తి స్థాయిలో అందాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలన్నీ అర్హులైన ప్రజలకు పూర్తి స్థాయిలో అందేలా చర్యలు తీసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమీక్షాకమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అధికారులతోపాటు ప్రజాప్రతినిధులంతా జిల్లా అభివృద్దిలో భాగస్వాములు కావాలన్నారు. కలెక్టర్ డాక్టర్శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ గత సమావేశంలో తీసుకున్న నిర్ణయాలన్నీ అమలు చేశామని పేర్కొన్నారు. ఏప్రిల్, మే, జూన్ మాసాల్లో అన్ని రకాల ఇరిగేషన్ కాల్వల పనులను, గ్రామీణ రోడ్లు, కాంపౌండ్ వాల్స్, స్మశానాలకు ప్రహారీలు వంటి నిర్మాణాలను ఉపాధి నిధులతో పూర్తి చేశామన్నారు. అన్ని మండలాల్లో మినీ గోకులం షెడ్లతోపాటు రైతుల డిమాండ్లను బట్టి చిన్నచిన్న జీవాల షెడ్లను కూడా చేపడుతున్నామన్నారు. నేషనల్ లైవ్ స్టాక్ మిషన్ ద్వారా అధిక శాతం సబ్సిడీతో అన్ లిమిటెడ్ రుణ సాయం ఇస్తున్నామనే విషయాన్ని గ్రామాల్లో విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నామన్నారు. ఈనెల 10వ తేది అన్ని మండలాల్లోని పాఠశాలు, జూనియర్ కళాశాలల్లో నిర్వహించనున్న పేరెంట్స్, టీచర్స్ మీట్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలనిపిలుపునిచ్చారు. ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి మాట్లాడుతూ గోకులం భవనాలు, ఎన్టీఆర్ గృహ నిర్మాణాలకు సూర్యఘర్ పథకాన్ని అనుసంధించాలని కోరారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి మాట్లాడుతూ కడప కార్పొరేషన్ పరిఽధిలోని రైతులకు మినీ గురుకులాలు మంజూరు చేయాలన్నారు. ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ సీజన్ల వారీగా తెగుళ్ల నివారణ, ఎరువులవాడకంపై వ్యవసాయాధికారులు అవగాహన కల్పించాలన్నారు. ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి మాట్లాడుతూ సదరమ్ ఎంట్రీలు ఆన్లైన్లో మూడుసార్లు చేస్తే తర్వాత ఎంట్రీలు చేయడానికి సైట్లో అవకాశం ఉండదని, ఈ సాంకేతిక సమస్యను పరిష్కరించాలని కోరారు. సబ్సిడీ గ్యాస్, రేషన్, రేషన్కార్డులలో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని మంత్రి దృష్టికి తీసుకు వచ్చారు. డీఆర్సీ సమావేశంలో మంత్రి సవిత -
కదులుతున్న రైలు నుంచి దూకి తల్లీకూతుళ్లకు గాయాలు
జమ్మలమడుగు : ఎక్కాల్సిన రైలుకు బదులు పొరబాటున మరో రైలు ఎక్కిన తల్లీకూతుళ్లు తీరా రైలు కదులుతున్న సమయంలో కిందకు దూకేయడంతో ఇద్దరూ గాయపడ్డారు. ఈ సంఘటన ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్లో జరిగింది. తల్లీకూతుళ్లయిన మహాలక్ష్మీ, శ్రీదేవి మంగళవారం మచిలీపట్నం నుంచి ధర్మవరం వెళ్లే రైలు కోసం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో కూర్చున్నారు. అయితే ఇంతలో మరో రైలు రావడంతో అదే ధర్మవరం రైలు అనుకుని అందులో ఎక్కారు. తీరా కదులుతున్న సమయంలో ఇది ధర్మవరం రైలు కాదని మీరు వెళ్లాల్సిన రైలు మరొకటి అని తోటి ప్రయాణికులు చెప్పారు. అప్పటికే రైలు కదిలింది. దీంతో మహాలక్ష్మీ, శ్రీదేవి వేగం పుంజుకుంటున్న రైలులో నుంచి ఒక్కసారిగా దూకేశారు. తల్లి మహాలక్ష్మీకి స్వల్ప గాయాలు కాగా కుమార్తె శ్రీదేవి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. వెంటనే అక్కడ ఉన్న రైల్వే పోలీసులు ఏఏస్ఐ సలాం, సుబ్బరాయుడు పరుగున వచ్చి బాధితులకు ప్రాథమిక చికిత్స చేయించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. -
ప్రగతిచక్రం.. స్వర్ణోత్సవం
ఉభయ వైఎస్సార్ జిల్లాలో కడప తర్వాత ఏర్పాటైంది రాజంపేట ఆర్టీసీ డిపో. ఇది ఏర్పాటై 50ఏళ్లు పూర్తి కానుంది. కేవలం ఏడు బస్సులను రోడ్డుపైకి తీసుకొచ్చారు.గోల్డెన్ జూబ్లీ చేసుకోనున్న నేపథ్యంలో ప్రత్యేక కథనం. రాజంపేట: ఉభయ వైఎస్సార్ జిల్లాలో పార్లమెంటరీ కేంద్రమైన రాజంపేటలో ఆర్టీసీ ఆవిర్భావం ఐదు దశాబ్దాలకు చేరుకుంది. 1975 ఆగస్టు 15న డిపో ఏర్పాటుచేయాలని అప్పట్లో సంస్థ నిర్ణయించింది. కడప తర్వాత ఏర్పాటైన తొలి డిపో. ఈ క్రమంలో రాజంపేట–రాయచోటి రోడ్డులోని ఇప్పుడున్న ఎల్ఐసీ కార్యాలయానికి ఎదురుగా ఉన్న ప్రాంతంలో తాత్కాలికంగా కంచె ఏర్పాటుచేసి, అక్కడి నుంచి ఆర్టీసీ సేవలను తాత్కాలికంగా ప్రారంభించారు. కడపకు అప్పటికే ఏర్పాటైన డిపో నుంచి కండక్టర్లు, డ్రైవర్లు, గ్యారేజీ కార్మికులను రప్పించారు. ఏడుబస్సులను తొలిసారిగా రొడ్కెక్కించారు.చరిత్ర ఘనంగా ఉన్నా అభివృద్ధి తిరోగమన దిశలో ఉంది. 50 ఏళ్లు పూర్తవుతున్న నేపథ్యంలో స్వర్ణోత్సవాలు నిర్వహిస్తారా అని కార్మికులు ఎదురు చూస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ హయాంలో.. మాజీ శాసనసభ్యురాలు కొండూరు ప్రభావతమ్మ ఆధ్వర్యంలో రాజంపేటలో ఆర్టీసీ ఏర్పాటుకు ప్రస్తుతం ఎర్రబల్లి ప్రాంతంలోని ఆరున్నర ఎకరాలకు పైగా ఉన్న స్ధలాన్ని ఎంపిక చేశారు. ఆ స్ధలంలో బస్స్టేషన్, ఆర్టీసీ కార్మికుల క్వార్టర్స్, డిపో గ్యారేజీల నిర్మాణం చేపట్టారు.ఇప్పుడు ఆర్టీసీ బస్టాండు ఇదే.ప్రస్తుతం ఈ స్థలాలకు కోట్లాది రూపాయల విలువ ఉంది. ఆర్టీసీ బస్టాండు,డిపో పట్టణానికే కేంద్రంగా మారింది. ● డిపో ఏర్పాటు తర్వాత అంచెలంచెలుగా అభివృద్ధి చెందింది. కడప జిల్లాలోని కడప, ప్రొద్దుటూరుతో సమానంగా బస్సు సర్వీసులను ఇక్కడి నుంచి నడిపారు. 2011–2012 వరకు 125 బస్సులు ఉండేవి. ఆర్టీసీ కార్మికులతో కళకళలాడింది. సబ్డివిజన్ పరిధిలో రైల్వేకోడూరు, రాజంపేట పరిసర ప్రాంతాల్లోని మారుమూల గ్రామాలకు బస్సులను ఏర్పాటు చేశారు. పల్లెపల్లెకు బస్సులు నడిచేవి. ప్రజలకు మెరుగైన సేవలందిస్తూ వచ్చింది. ● మాజీ ముఖ్యమంత్రి జలగంవెంగళరావు, మాజీ ఎమ్మెల్యే ప్రభావతమ్మ హయాంలో చరిత్ర సృష్టించిన డిపో..ఇప్పుడైతే తిరోగమనదిశలో పయనిస్తుందనే విమర్శలున్నాయి. బస్సు సర్వీసులు తగ్గిపోయాయి. సగానికిపైగా పల్లెలకు బస్సులు తిరగడంలేదు. ప్రైవేట్ వాహనాల కారణమని ఆర్టీసీ వారు చెబుతున్నారు. ఆర్టీసీకి 40 బస్సులు ఉండగా, అద్దె బస్సులు 30 ఉన్నాయి. ఆర్టీసీ ఆదాయం కూడా ఘననీయంగా పడిపోతూవచ్చింది. పూర్వవైభవం వచ్చేనా... రాజంపేట ఆర్టీసీ డిపో రోజురోజుకు తిరోగమన దిశలో ఉంది. కొత్తకొత్త సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలని పలువురు కోరుతున్నారు. హైదరాబాద్, బెంగళూరు, విజయవాడ, విశాఖపట్నంతోపాటు పలు పుణ్యక్షేత్రాలకు డిపోనుంచి డైరెక్ట్ కనెక్టివిటీ సర్వీసులను ఫ్రీక్వెన్సీగా పెంచాలని ఆర్టీసీ వర్గాలవారు అంటున్నారు. నందలూరు ఆర్ఎస్ టు రాజంపేట ఆర్ఎస్ బసు సర్వీసుతోపాటు పల్లె సర్వీసులను పున రుద్ధరించాల్సిన అవసరం ఉంది. బ్యాటరీ బస్సులను ప్రవేశపెడితే రాజంపేట ఆర్టీసీ డిపోకు పూర్వవైభవం వస్తుందని కార్మికులు చెబుతున్నారు. వందలాది రూట్లలో బస్సు సర్వీసులు ఉండగా, ఇప్పుడు 37 సర్వీసులకు వచ్చింది. ప్రస్తుతం 343 మంది కార్మికులు ఉన్నారు. రాజంపేట ఆర్టీసీ డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తి కావస్తోంది. 50 ఏళ్ల కిందట వేసి శిలాఫలకం కాలగర్భంలో కలిసిపోయింది. సిల్వర్జూబ్లీ చేసుకుంటున్న క్రమంలో ఆర్టీసీ అభివృద్ధిలో నూతన మార్పులు వస్తాయా? ఆ దిశగా ఆర్టీసీ యాజమాన్యం ఆలోచిస్తుందా అని కార్మికులు ఎదురుచూస్తున్నారు. ఏడు బస్సులతో డిపో ప్రారంభమైంది కేవలం ఏడుబస్సులతో రాజంపేట ఆర్టీసీ డిపో ప్రారంభమైంది. సాతుపల్లెకు ఎదురుగా ఖాళీస్థలంలో తాత్కలికంగా బస్టాండు ఏర్పాటు చేసి, అక్కడి నుంచి బస్సులను నడిపించారు. 1975లో డిపో ఏర్పాటులో పనిచేసే అవకాశం తనకు కలగడం అదృష్టంగా భావిస్తున్నాను. –ఎం.బ్రహ్మయ్య, మాజీ కండక్టరు. రాజంపేట పూర్వవైభవం తీసుకురావాలి కడప తర్వాత రాజంపేటలోనే ఆర్టీసీ సేవలు అందుబాటులోకి వచ్చాయి.డిపో ఏర్పాటై 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా గోల్డెన్ జూబ్లీ వేడుకలను నిర్వహించాలి. ఆ బాధ్యత ఆర్టీసీ యాజమాన్యం, ప్రభుత్వం తీసుకోవాలి. బస్సుస్టేషన్ ఆధునికీకరణతోపాటు కొత్త బస్సులు, అదనపు సర్వీసులను అందుబాటులోకి తీసుకురావాలి. రాజంపేట డిపోకు పూర్వవైభవం కల్పించాలి. –జీవీ నరసయ్య, రాష్ట్ర ప్రధానకార్యదర్శి, ఎంప్లాయీస్ యూనియన్ -
పోలీస్ స్టేషన్ ముట్టడిపై కేసు నమోదుకు సన్నాహాలు
వేంపల్లె : వేంపల్లె పోలీస్ స్టేషన్ను ముట్టడి చేసిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కీరుపల్లెకు చెందిన సుమియా అనే బాలిక అదృశ్యం కావడంతో సోమవారం రాత్రి పక్కీరుపల్లె, బిడ్డాల మిట్ట, కాలేజీ రోడ్డులో ఉన్న పలువురు పోలీస్ స్టేషన్ను ముట్టడి చేశారు. దీంతో పోలీస్ స్టేషన్లోని కిటికీలకు ఉన్న అద్దాలను పగులగొట్టడంతోపాటు పోలీస్ స్టేషన్పై రాళ్లు, వాటర్ ప్యాకెట్లు రువ్వారు. అలాగే పోలీసు విధులకు ఆటంకం కలిగించడంతోపాటు పోలీస్ స్టేషన్ ముందు రోడ్డుకు అడ్డంగా వాహనాలు పెట్టి ధర్నా, నిరసన కార్యక్రమాలు చేపట్టారు. బాలిక సుమియా ఆచూకీ తెలిసిందని ఇక వెళ్లాలని నిరసనకారులకు పోలీసులు తెలిపిన వినకుండా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు తమ సీసీ కెమెరాల్లో బంధించిన వీడియోలను చూసి నిరసనకారులపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టేందుకు చర్యలు చేపట్టారు. నిరసన సమయంలో రాత్రి రోడ్లపై తిరిగే మోటార్ బైకులను పోలీసులు పట్టుకుని పోలీస్ స్టేషన్లో ఉంచారు. మంగళవారం మోటార్ బైకుల కోసం వచ్చిన వారితో ఆధార్ కార్డు జిరాక్స్ తీసుకుని, మోటార్ బైకు వద్ద ఫొటోలు తీసుకొని పంపించి వేశారు. సీసీ కెమెరాల్లో, పోలీసులు తీసిన వీడియోలో మోటార్బైకుదారులుంటే వారిపై కూడా కేసులు నమోదు చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిసింది. దీంతో వందల మందిపై కేసు నమోదవుతుందనే పుకార్లు వినిపిస్తున్నాయి. కేసు నమోదుపై పోలీసులు బిజీ బిజీగా ఉన్నారు. ఇప్పటికే పోలీసులు ఎవరెవరి మీద కేసులు నమోదు చేయాలనేది గుర్తించినట్లు తెలుస్తోంది. బాలిక సుమియాకు కడప రిమ్స్లో చికిత్స.. సోమవారం రాత్రి పక్కీరుపల్లెకు చెందిన సుమియా ఆచూకీ తెలిసిన వెంటనే పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ వెళ్లి అపస్మారక స్థితిలో ఉన్న బాలికకు మంచినీరు తాపించి కడప రిమ్స్కు పంపించారు. ఈ నేపథ్యంలో కడప రిమ్స్కు ప్రొద్దుటూరు డీఎస్పీ భావన వెళ్లి చికిత్స పొందుతున్న బాలిక సుమియాను విచారించారు. మంగళవారం ఆ బాలిక కోలుకుని ఆరోగ్యంగా ఉందని సీఐ నరసింహులు తెలిపారు. వివరాలను బాలిక చెబితే తప్ప నిందితులను శిక్షించలేమని చెప్పారు. ఇప్పటికే చింతలమడుగుపల్లె గ్రామానికి చెందిన మడక బాబు, వల్లెపు గంగాధర్, విజయ్ కుమార్ అనే అనుమానిత యువకులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. -
బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకుందాం
కడప అర్బన్ : యువత మత్తుకు అలవాటు పడి భవిష్యత్తును విచ్ఛిన్నం చేసుకోవద్దని, ప్రతి ఒక్కరూ తమ భవిష్యత్తుకు బంగారు బాటలు వేసుకోవాలని పలువురు వక్తలు పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ ఆదేశాల మేరకు నషా ముక్త్ భారత్ అభియాన్లో భాగంగా ’ఈగల్’ టీం ఆధ్వర్యంలో కడప నగరంలోని రిమ్స్ ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా దివ్యాంగుల శాఖ ఏడీ కృష్ణ కిషోర్, రిమ్స్ వైస్ ప్రిన్సిపాల్ డాక్టర్ విజయ్ భాస్కర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ వంశీకృష్ణ మాట్లాడారు. సమాజంలో యువత మత్తుకు అలవాటు పడి బంగారు భవిష్యత్తును నాశనం చేసుకుంటున్నారని చెప్పారు. అంతేగాక చిన్నచిన్న పరిశ్రమలలో పనిచేసే కార్మికులు, కూలీల కుటుంబాలు చిన్నాభిన్నం అయ్యే పరిస్థితులు దాపురిస్తున్నాయన్నారు. పిల్లల పెంపకం విషయంలో తల్లిదండ్రులు ఎంతో బాధ్యతగా ఉండాలన్నారు. అప్పుడే వారు ఉన్నతమైన స్థాయిలో ఉంటారన్నారు. మత్తు పదార్థాల సేవనం వల్ల మానసిక, శారీరక అనారోగ్యంతో పాటు ప్రాణాంతక వ్యాధుల బారిన పడుతూ సమాజం నుండి దూరమవుతున్నారన్నారు. పలువురు మత్తు పదార్థాలకు అలవాటు పడి, డబ్బుల కోసం నేరాలకు, హత్యలకు సైతం పాల్పడుతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. దేశం అభివృద్ధి చెందాలంటే ప్రధానంగా యువత కీలకమని, ఎవరూ మత్తు పదార్థాల జోలికి వెళ్లకూడదని సూచించారు. మనమందరం సమష్టిగా మాదకద్రవ్య రహిత రాష్ట్రంగా తీర్చిదిద్దే విధంగా ముందుకెళ్లాలన్నారు. కళాశాల సమీపంలో, చుట్టుపక్కల ప్రాంతాలలో ఎవరైనా గంజాయి విక్రయిస్తున్నారన్న సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలన్నారు. ఈ కార్యక్రమంలో రిమ్స్ వైద్య అధ్యాపకులు, వైద్య విద్యార్థులు, ఈగల్ సిబ్బంది పాల్గొన్నారు. ఆపరేషన్ క్యాంపస్ సేఫ్ జోన్ స్పెషల్ డ్రైవ్ జిల్లా వ్యాప్తంగా ఉన్న పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్ధల వద్ద 100 మీటర్ల దూరంలో సిగరెట్, పొగాకు సంబంధిత ఉత్పత్తుల విక్రయాన్ని నిషేధించారు. ఇందులో భాగంగా ’ఆపరేషన్ క్యాంపస్ సేఫ్జోన్’ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమం నిర్వహించాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఈ సందర్భంగా మంగళవారం పోలీసు అధికారులు తమ పరిధిలోని ఆయా పాఠశాలలు, కళాశాలలు, విద్యా సంస్థలను సందర్శించి 100 మీటర్ల లోపు టీ షాపులు, పాన్ షాపులు, కిరాణా షాపులలో సిగరెట్లు, కై నీ, గుట్కా వంటి పొగాకు ఉత్పత్తులు అమ్మడం నిషేధమని షాప్ నిర్వాహకులకు తెలిపారు. విద్యా సంస్థల వద్ద పొగాకు ఉత్పత్తులను విక్రయించే షాపుల యజమానులకు జరిమానాలు విధించారు. మత్తు పదార్థాల వల్ల జీవితం అంధకారం యువతపై తల్లిదండ్రులు ప్రత్యేక దృష్టి పెట్టాలి యాంటీ డ్రగ్స్ అవగాహన సదస్సులో వక్తల పిలుపు -
సిగరెట్ తాగొద్దు అన్నందుకు యువకుడి ఆత్మహత్య
కురబలకోట : సిగరెట్ తాగొద్దు.. యుక్త వయస్సులో ఇదేమిపని అని తల్లి మందలించడంతో మనస్తాపం చెందిన యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడిన విషాదకర సంఘటన మండలంలోని అంగళ్లులో చోటుచేసుకుంది. మృతుడి కుటుంబీకులు, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ వెల్లడించిన వివరాల మేరకు..అంగళ్లు టమాటా మండీల సమీపంలో గుడిసెలు వేసుకుని కొన్ని కుటుంబాలు జీవిస్తున్నాయి. వీరిలో గోపాలమ్మకు కుమారుడు రెడ్డెప్ప (20) ఒక్కడే కుమారుడు. నాలుగు రోజుల క్రితం గుడిసెల వద్ద ఇతను సిగరెట్ తాగాడు. గమనించిన తల్లి గోపాలమ్మ మందలించింది. మనస్తాపం చెందిన అతను పురుగుల మందు తాగాడు. హుటాహుటిన 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి ఆసుపత్రికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. ఒకే మాట..ఒక్క జీవితం.! ఉన్న ఒక్క కుమారుడు అకాల మరణం చెందడంతో పుత్ర శోకంతో తల్లి గోపాలమ్మ తల్లడిల్లిపోతోంది. రేయ్ రెడ్డెప్ప నన్ను క్షమించరా..సిగరెట్ తాగొద్దనడం నా తప్పయ్యింది.. నీ మేలుకోసమే చెప్పా. నువ్వు ఇంతపని చేస్తావనుకోలేదురా..సిగరెట్ తాగొద్దు అనే ఒక్క మాట నీ జీవితాన్నే తీసుకుపోతుందని ఊహించలేకపోయారా..అంటూ ఆ తల్లి బాధతో రోదించడం కలచివేసింది. -
చెత్తలో కాలిన మందులపై విచారణ
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె పంచాయతీ కార్యాలయ ఆవరణలో సోమవారం చెత్తలో కాలిన మందుల వ్యవహారంపై డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ గీత విచారణ చేపట్టారు. జిల్లా అధికారుల ఆదేశాల మరకు కల్లూరు పీహెచ్సీ వైద్యాధికారి డాక్టర్ సుమన్తో కలసి ఆమె మంగళవారం కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయ సమీపంలోని సంఘటన స్థలాన్ని పరిశీలించారు. సంఘటనకు దారితీసిన కారణాలు, పరిస్థితులపై ఆరా తీశారు. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా హెచ్చరికలు చేశారు. ఈ సంఘటనపై విలేజ్ హెల్త్ క్లినిక్లో పనిచేస్తున్న ఏఎన్ఎం, ఐదుగురు ఆశా వర్కర్లకు మెమోలు జారీ చేశారు. కాలం చెల్లిన మందుల నిర్వీర్యం కోసం బయోవేస్టేజి నిర్వహణ పద్ధతులు ఉన్నాయని, వాటిని పాటించాలని సూచించారు. కార్యక్రమంలో కామనూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్య సిబ్బందితోపాటు కొత్తపల్లె విలేజ్ హెల్త్ క్లినిక్ వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
చెట్టుపై నుంచి జారిపడిన వ్యక్తి మృతి
ముద్దనూరు : మండలంలోని ఓబుళాపురం గ్రామంలో ప్రమాదవశాత్తు చెట్టుపైనుంచి జారిపడిన బాలిరెడ్డి(54) అనే వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందాడు. హెడ్కానిస్టేబుల్ రమేష్ సమాచారం మేరకు ఈనెల 6వతేదీన బాలిరెడ్డి గ్రామంలో పీర్లపండుగ గుండం కాల్చడానికి మొద్దుల కోసం చెట్టు ఎక్కి కట్టెలు కొడుతున్నాడు. ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి జారిపడడంతో అతనిపై చెట్టుకొమ్మ విరిగిపడింది. వెంటనే ప్రొద్దుటూరుకు తరలించారు. మెరుగైన వైద్యం కోసం కర్నూలు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ సోమవారం రాత్రి బాలిరెడ్డి మరణించాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. గొర్రెలను ఎత్తుకెళ్లిన దుండగులువేముల : వేములకు చెందిన చెల్లుబోయిన రమణయ్య గొర్రెలను సోమవారం రాత్రి దుండగులు ఎత్తుకెళ్లినట్లు బాధితుడు తెలిపారు. రమణయ్య గొర్రెల పెంపకమే జీవనాధారం చేసుకుని జీవిస్తున్నాడు. సోమవారం గొర్రెలను మేతకు తీసుకెళ్లిన అనంతరం మండల కార్యాలయం వెనుక వైపు ఉన్న దొడ్డిలో తోలుకున్నాడు. గొర్రెల దొడ్డి వద్ద రమణయ్య తల్లి కాపలా ఉంటూ నిద్రపోయింది. ఇదే అదనుగా అర్థరాత్రి సమయంలో దొంగలు దొడ్డిలోని 20 గొర్రెలను ఎత్తుకెళ్లారు. తెల్లవారుజామున చూసేసరికి గొర్రెలు లేకపోవడంతో బాధితుడు పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కడప అర్బన్ : జిల్లా న్యాయసేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని ఆదేశానుసారం జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబాఫకృద్దీన్ ఆధ్వర్యంలో మంగళవారం న్యాయ సేవాసదన్లో పారా లీగల్ వలంటీర్లకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జడ్జి మాట్లాడుతూ పారా లీగల్ వలంటీర్ల పాత్ర, డ్రెస్ కోడ్, ప్రవర్తన, నీతి ప్రమాణాలు, లీగల్ సర్వీసెస్ అథారిటీ యాక్ట్ 1987, రాజ్యాంగం ప్రవేశిక ప్రాథమిక హక్కులు, ప్రాథమిక విధులు తదితర అంశాలను వివరించారు. అలాగే ప్యానల్ న్యాయవాదుల నైపుణ్యాలను పెంపొందించేందుకు కృషి జరిగిందని జడ్జి తెలిపారు. ప్యానల్ న్యాయవాదులు విధివిధానాలు, సివిల్ కేసులు, విధులు, సుప్రీంకోర్టు, హైకోర్టు తీర్పుల పట్ల అవగాహన కలిగి ఉండాలన్నారు. 36 జీఓ అమలు కోసం అర్ధనగ్న ప్రదర్శన రాయచోటి టౌన్ : జీఓ నంబర్ 36ను అమలు చేయాలని కోరుతూ రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట మంగళవారం ఇంజినీరింగ్ కార్మికులు అర్ధనగ్న ప్రదర్శన చేశారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధ్యక్షుడు అక్బర్ మాట్లాడుతూ పని గంటలు పెంచి రూ.15 వేలు వేతనం ఇస్తున్నారని, పారిశుధ్య కార్మికులకు ఇచ్చినట్లుగా రూ.21 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి అప్కాస్ కొనసాగించాలని లేదా పర్మినెంట్ చేయాలని కోరారు. ప్రభుత్వ సంక్షేమ పథకాలు తమకు కూడా అమలు చేయాలని కోరారు. కార్యక్రమంలో కార్యదర్శి శంకరయ్య, సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రామాంజులు, మున్సిపల్ యూనియన్, ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు బీవీ రమణ, నరసింహులు, ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మి, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు. -
సెంచరీలతో కదం తొక్కిన కడప బ్యాట్స్మన్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో తొలి రోజు మంగళవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో కడప బ్యాటర్లు సెంచరీలతో కదం తొక్కారు. కడప, అనంతపురం జట్లు తలపడగా ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 88.4 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 461 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణీల్ రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 138 బంతుల్లో 20 ఫోర్లతో 108 పరుగులు చేశాడు. టి.సుదర్శన్ చక్కటి లైనప్తో బ్యాటింగ్ ఆడి 109 బంతుల్లో 15 ఫోర్లు, 4 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు. రోహిత్ వర్మ 85 పరుగులు, ఆర్దిత్ రెడ్డి 70 పరుగులు చేయడంతో కడప జట్టు తొలి రోజు భారీ స్కోరు చేసింది. అనంతపురం జట్టులోని నవదీప్ 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో కర్నూలు –చిత్తూరు జట్లు తలపడ్డాయి, ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 77.4 ఓవర్లలో 282 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయి గణేష్ 98 పరుగులు, భార్గవ్ 54 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 4 వికెట్లు, ఘణి 2 వికెట్లు, సిరాజ్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 11 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.తొలి రోజు 461 పరుగులు చేసిన కడప జట్టు -
కూలిన బీవీఎస్ కాంప్లెక్స్ గోడ
ప్రొద్దుటూరు : స్థానిక బీవీఎస్ థియేటర్ ముందున్న కాంప్లెక్స్గోడ కూలి శ్రీచక్ర ఫర్నీచర్ షాప్పై పడటంతో తీవ్ర నష్టం జరిగింది. గత పది రోజులుగా కాంప్లెక్స్ను బుల్డోజర్ సహాయంతో తొలగిస్తున్నారు. సోమవారం రాత్రి సమయంలో పనులు చేపడుతుండగా ఉన్నట్లుండి 50 అడుగుల పొడవు ఉన్న గోడ కూలి పక్కనే ఉన్న ఫర్నీచర్ షాప్పై పడింది. దీంతో ఫర్నీచర్ షాప్లోని బీరువాలు, ఫర్నీచర్ సామగ్రి దెబ్బతింది. పొరపాటున పగటి వేలలో ఈ ప్రమాదం జరిగి ఉంటే మెయిన్రోడ్డుపై ఉన్న మనుషులపై పడి తీవ్ర నష్టం కలిగేది. ముందుగా హెచ్చరించినా ఫలితం లేదు.. గత పది రోజులుగా బీవీఎస్ కాంప్లెక్స్ను తొలగిస్తున్నారని శ్రీచక్ర ఫర్నీచర్ షాప్ యజమాని గాండ్ల నారాయణ స్వామి తెలిపారు. సరైన నిబంధనలను పాటించకపోవడంతో అప్పుడప్పుడు కాంప్లెక్స్కు సంబంధించిన రాళ్లు తమ దుకాణంపై పడేవన్నారు. గతంలో పోలీసులకు ఫిర్యాదు చేశానని, సోమవారం ఉదయం నేరుగా టూటౌన్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లిఖిత పూర్వకంగా రాసి ఇచ్చానన్నారు. పోలీసులు స్వయంగా వచ్చి జాగ్రత్తలు పాటించాలని సూచించారన్నారు. చెప్పా పెట్టకుండా రాత్రివేళ పనులు ప్రారంభించారని, బీవీఎస్ కాంప్లెక్స్కు సంబంధించిన మొత్తం నిర్మాణమంతా తమ షాపువైపు పడటంతో తమకు తీవ్ర నష్టం జరిగిందన్నారు. షాపులో సుమారు రూ.2కోట్ల మేర ఫర్నీచర్ ఉందని, దాదాపు రూ.30లక్షల ఆస్తి నష్టం జరిగినట్లు ఆయన వివరించారు. తమకు బీవీఎస్ యాజమాన్యం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. సంఘటన స్థలాన్ని మున్సిపల్ వైస్ చైర్మన్లు ఆయిల్మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి పరిశీలించారు. షాప్ యాజమాని నారాయణస్వామితో మాట్లాడారు.ఫర్నీచర్ షాప్పై పడి రూ.30 లక్షల ఆస్తినష్టం -
ఫిర్యాదులకు నాణ్యమైన పరిష్కారం అందించాలి
కడప సెవెన్రోడ్స్ : పీజీఆర్ఎస్ కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం అందించాలని జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ ఫిర్యాదులకు అధికారులు క్షేత్ర స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేయాలన్నారు. అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలని సూచిస్తూ అనంతరం అర్జీదారుల నుండి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఎస్డీసీ వెంకటపతి, మెప్మా పీడీ కిరణ్ కుమార్,వివిధ శాఖల అధికారులు,తదితరులు పాల్గొన్నారు. జేసీ అదితిసింగ్ -
ఆరోగ్యశ్రీ పునర్జన్మనిచ్చింది
నాపేరు షేక్ ఆశాబీ. మాది రాజంపేట పట్టణంలోని బాలాజీనగర్. దివంగత సీఎం వైఎస్.రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం వల్ల పునర్జన్మ పొందాను. ఆపరేషన్కు ఒక్కరూపాయి కూడా ఖర్చు కాలేదు. గుండెకు పెద్ద ఆపరేషన్ చేయాలంటే లక్షల రూపాయలు ఖర్చు అవుతుందంట. ఆరోగ్యశ్రీ పథకమే లేకుంటే నేను గుండెకు పెద్ద ఆపరేషన్ చేయించుకోలేక ఈ పాటికి ఈలోకానికి దూరం అయ్యేదానిని. వైఎస్సార్ ఇప్పుడు లేకపోయినా ఆయన పెట్టిన ఆరోగ్యశ్రీ పథకం మాలాంటి పేదోళ్లకు పునర్జన్మ ఇస్తుంది. ఆయన చనిపోయి ఏళ్లు గడుస్తున్నా పేద ప్రజల గుండెల్లో ఉన్నాడు. -
బాలిక అదృశ్యం
వేంపల్లె : వేంపల్లె పంచాయతీ పరిధిలోని పక్కీర్పల్లెకు చెందిన సయ్యద్ సుమియా(18) అనే బాలిక అదృశ్యమైంది. ఈ ఘటన సోమవారం పకీరుపల్లె గ్రామంలో కలకలం రేపుతోంది. తల్లిదండ్రులు మాబువలీ, రమీజా గొర్రె పిల్లలను మేపుకొని జీవనం సాగించుకునేవారు. ఈ క్రమంలో తల్లిదండ్రులకు సొంత పని ఉండడంతో కుమార్తె సుమియా చింతలమడుగుపల్లె సమీపంలోని బట్లలకోనకు గొర్రెల పిల్లలను మేపుకునేందుకు తీసుకెళ్లింది. సాయంత్రం 5 గంటలైనా తిరిగి ఇంటికి రాకపోవడంతో తల్లిదండ్రులు గుట్టల ప్రాంతాల్లో వెతికినా కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారమిచ్చారు. సీఐ నరసింహులు, పోలీసు సిబ్బందితోపాటు బాలిక తల్లిదండ్రులు, బంధువులు చుట్టు పక్కల కొండల్లో పరిశీలించినా గొర్రెల పిల్లలు ఉన్నాయి కానీ, బాలిక కనిపించకపోవడంతో అనుమానాలు వ్యక్తం చేశారు. మద్యం తాగుతూ అదే ప్రాంతంలో చింతలమడుగుపల్లెకు చెందిన ముగ్గురు యువకులు కనిపించడంతో వారిని అదుపులోకి తీసుకుని విచారించగా వారి వాట్సాప్ స్టేటస్లో బాలికకు సంబంధించిన వీడియో కనిపించింది. ముగ్గురిని అదుపులోకి తీసుకుని పోలీసులు విచారణ చేపడుతున్నారు. బాలిక తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. బాలిక కనపడకపోవడంతో పోలీసు స్టేషన్ వద్దకు పక్కీర్పల్లె వద్దకు భారీ సంఖ్యలో వెళ్లారు. బాలిక ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపడుతున్నట్లు సీఐ నరసింహులు తెలిపారు.పోలీసుల అదుపులో అనుమానిత యువకులు -
ఏడీసెట్ విడుదల చేయపోవడం వెనుక రాజకీయ కుట్ర
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం ఆర్కిటెక్చర్ అండ్ డిజైనల్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్(ఏడీసెట్) విడుదల చేయకపోవడం వెనుక రాజకీయ కుట్ర దాగి ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అనుమానం వ్యక్తం చేశారు. సోమవారం డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ ఎదుట ఆరు రోజులుగా విద్యార్థులు చేస్తున్న నిరాహార దీక్షలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యతో కలిసి మద్దతు తెలిపారు. ఈ సందర్భంగా అంజద్బాషా మాట్లాడుతూ ఈ యూనివర్సిటీకి సీఓఏ పర్మిషన్ వెంటనే ఇవ్వాలన్నారు. ఏడీసెట్ నోటిఫికేషన్ విడుదల చేసి ఈ ఏడాది విద్యార్థులకు అడ్మిషన్లు ఇవ్వాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి ఆర్కిటెక్చర్ విద్యార్థుల సమస్యలను తీసుకెళతామని హామీ ఇచ్చారు. ఈ సందర్భంగా ఉన్నత విద్యాశాఖ కార్యదర్శి కోన శశిధర్కు ఆయన ఫోన్ చేయగా ఆయన అందుబాటులోకి రాలేదు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్ మహమ్మద్ షఫీ, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్, రాష్ట్ర యువజన విభాగం సంయుక్త కార్యదర్శి గురు ప్రసాద్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు గురు సాయి దత్త, నాయకులు ఇబ్రహీం మియా, సాయిఫ్, తదితరులు ఉన్నారు.మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
గంజాయి కేసులో భార్యాభర్తల అరెస్టు
కడప అర్బన్ : కడప నగరం డీటీసీ సర్కిల్ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద గంజాయి విక్రయిస్తున్న భార్యాభర్తలను అరెస్టు చేసినట్లు రిమ్స్ పోలీసు స్టేషన్ సీఐ సీతారామిరెడ్డి తెలిపారు. రిమ్స్ పోలీస్ స్టేషన్లో సోమవారం విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వల్లూరు మండలం తోళ్లగంగన్నపల్లి గ్రామానికి చెందిన చెన్నుబోయిన రాము గతంలో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తుండేవాడు. ఆ సమయంలో కాకినాడ టౌన్ తుమ్మలపేటకు చెందిన వాసుపిల్లి భారతి అనే యువతిని ప్రేమించి పెళ్లి చేసుకొన్నాడు. ప్రస్తుతం వారిద్దరు కడప శాస్త్రి నగర్లో నివాసం ఉంటున్నారు. ఎలాంటి పనులకు వెళ్లకుండా గంజాయి వ్యాపారం చేసి తక్కువ సమయంలో డబ్బులు బాగా సంపాదించాలని రాము ఆలోచించాడు. తనకు పరిచయమున్న మహేష్ అనే వ్యక్తి నుండి గంజాయి తెచ్చుకొని విక్రయిస్తున్నట్లు తెలిపారు. సోమవారం డీటీసీ సమీపంలోని రైల్వే బ్రిడ్జి వద్ద తనిఖీలు చేస్తున్న సమయంలో దంపతులు బైక్పై గంజాయి పెట్టుకొని వస్తుండగా వారిని అరెస్టు చేసినట్లు తెలిపారు. భార్యాభర్తల నుండి 2.8 కేజీల గంజాయిని మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. రాము అనే నిందితుడిపై గతంలో చైన్ స్నాచింగ్ కేసులు కూడా నమోదయ్యాయి.2.8 కేజీల గంజాయితో పాటు మోటార్ సైకిల్ స్వాధీనం -
నకిలీ కరెన్సీ నోట్ల ముఠా గుట్టురట్టు
సాక్షి రాయచోటి : నకిలీ కరెన్సీ చలామణి చేస్తున్న ఒక పెద్ద ముఠా గుట్టు రట్టు చేసినట్లు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు తెలిపారు. సోమవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని డీపీఓలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ల సమక్షంలో ఎస్పీ విద్యాసాగర్నాయుడు మీడియాకు వివరాలు వెల్లడించారు. నకిలీ కరెన్సీ కేసుకు సంబంధించి 10 మంది నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. వాయల్పాడులోని లక్కీ బ్రాందీ షాపు మేనేజర్ నవీన్ కుమార్ దగ్గరకు ఈనెల 26వ తేదీన 500 రూపాయల నోటుతో మద్యం కొనేందుకు కాలేషా అనే వ్యక్తి వచ్చాడన్నారు. ఇంతకు ముందు కూడా రెండుసార్లు దొంగ నోట్లు ఇచ్చావని, తిరిగి ఇప్పుడు దొంగ నోటు తెచ్చావని అనగానే కాలేషా పారిపోయాడన్నారు. లక్కీ వైన్ షాప్ మేనేజర్ నవీన్ కుమార్ వెంటనే వాయల్పాడు పోలీస్ స్టేషన్లో సీఐ జె.ప్రసాద్ బాబుకు ఫిర్యాదు చేశారన్నారు. ఈ నకిలీ కరెన్సీ నోట్ల ముఠా చీకటి పడగానే 500 రూపాయల నకిలీ కరెన్సీని మార్చే పనిలో ఉందన్న విషయం పసిగట్టిన పోలీసులు నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారన్నారు. నకిలీ కరెన్సీ చలామణిపై నిఘా పెట్టిన పోలీసులు పక్కా సమాచారం ఆధారంగా ఈ ముఠా మదనపల్లి– బెంగళూరు ప్రధాన రహదారిలో వాయల్పాడు క్రాస్ వద్ద గల నయారా పెట్రోల్ బంక్ దగ్గరలో ఉన్నారని వాయల్పాడు సీఐ తమ సిబ్బందితో వెళ్లగా పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. 10 మంది నిందితుల అరెస్టు.. సామగ్రి స్వాధీనం నకిలీ కరెన్సీ నోట్ల చలామణి నిందితులను చుట్టుముట్టి పట్టుకుని పెద్దమనుషుల సమక్షంలో విచారించగా షేక్ కాలేషా వలీ ద్వారా తీగ లాగితే డొంక కదిలినట్లు తెలిపారు. ఈ ఘటనలో షేక్ కాలేషా వలీ అలియాస్ కలేసా, వీయం ముస్తాక్ అహమద్ అలియాస్ ముత్తు, ఎస్ఎండీ హఫీజ్, భీమసింగ్ పండిట్ రాథోడ్ అలియాస్ భీమసింగ్ రాథోడ్, టి.కుమారస్వామి అలియాస్ కుమార్, షేక్ షఫీక్ అహ్మద్ అలియాస్ షఫీ, నందిమంగళం యెజాజ్ పాషా అలియాస్ యెజాజ్, వీఎం .ఫుర్ఖాన్, షేక్ ఆసిఫ్, షేక్ సుహెల్లు ఉన్నారన్నారు. వీరితో సంబంధమున్న కర్ణాటకకు చెందిన రాథోడ్, కుమార్, బాబు పరారీలో ఉన్నారన్నారు. నిందితుల నుంచి 735 నకిలీ 500 రూపాయల నోట్లు, ఒక ఎప్సాన్ ఎకో ట్యాంక్ ఎల్3210 ప్రింటర్, టీఎన్పీఎల్ ఏ4 800 జీఎస్ఎం పేపర్ల మూడు పెట్టెలు, ఒక లెనివో ల్యాప్టాప్, 12 సెల్ఫోన్లు, ఆర్బీఐ అక్షరాలతో ముద్రించబడిన ఆకుపచ్చ రిబ్బన్ స్వాధీనం చేసుకున్నామన్నారు, దొంగనోట్ల చలామణి గురించి ఒప్పుకున్నారని, వీరు ముగ్గురిపై ఇదివరకే కర్ణాటకలో పాత కేసులు ఉన్నాయన్నారు. 10 మంది నిందితులను అరెస్టు చేసిన పోలీసులు నిందితులు కర్ణాటకతోపాటు అన్నమయ్య జిల్లా వారిగా గుర్తింపు వివరాలు వెల్లడించిన అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
ఫిర్యాదుదారులకు చట్టపరిధిలో న్యాయం
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదుదారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ఈ.జి. అశోక్ కుమార్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో సోమవారం ‘ ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక‘ ( పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం ) కార్యక్రమాన్ని ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలు మూలల నుంచి విచ్చేసిన ప్రజలతో ఎస్పీ ముఖాముఖి మాట్లాడారు. వారి సమస్యలపై అక్కడికక్కడే సంబంధిత పోలీసు అధికారులకు ఫోన్ చేసి సదరు ఫిర్యాదులపై చట్టపరంగా చర్యలు తీసుకునేలా ఆదేశాలు జారీ చేశారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన ఫిర్యాదుదారులకు పోలీసు సిబ్బంది ప్రశాంతంగా తమ సమస్యను వివరించడానికి సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో డి.టి.సి. డీఎస్పీ అబ్దుల్ కరీం, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ఈ.జి .అశోక్ కుమార్ -
స్వర్ణ కడప సాధనకు శ్రమిద్దాం
కడప సెవెన్రోడ్స్ : స్వర్ణ కడప సాధన కోసం అందరూ సమష్టిగా శ్రమించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పిలుపునిచ్చారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర–పీ4 ఫౌండేషన్ అమలుపై జిల్లా స్థాయి సమీక్షా కమిటీ సమావేశంలో ఆమె మాట్లాడారు. అర్హులందరికీ సంక్షేమ పథకాలు అందాలన్నారు. పీ4 ఫౌండేషన్ ద్వారా బంగారు కుటుంబం–మార్గదర్శి విధానాన్ని అమలు చేస్తున్నామన్నారు. పేదలను అన్ని విధాలా ఉన్నత స్థాయికి తీసుకు వచ్చేందుకు ధనికుల సాయం తీసుకునేలా ప్రణాళికలు రూపొందించాలని ఆదేశించారు. జిల్లాలో 70 వేల బంగారు కుటుంబాలను గుర్తించామని వెల్లడించారు. ఆ కుటుంబాలను ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి చేసే బాధ్యత ఉద్యోగులు, ప్రజాప్రతినిధులపై ఉందన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మాట్లాడుతూ స్వర్ణాంధ్ర 2047లో భాగంగా జిల్లా లక్ష్యాన్ని చేరుకోవడానికి రానున్న ఐదేళ్లలో చేపట్టాల్సిన అభివృద్ధిపై పక్కా ప్రణాళికతో ముందుకు సాగాల్సిన అవసరం ఉందన్నారు. ప్రతి ఏటా 15 శాతం అభివృద్ధి రేటును పెంచుకుంటూ పోవాలన్నది లక్ష్యమన్నారు. ఈ సమావేశంలో ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, పుత్తా కృష్ణచైతన్యరెడ్డితోపాటు జేసీ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, సీపీఓ హజరతయ్య, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. లింగాలలో పర్యటించిన ఇన్చార్జి మంత్రి లింగాల : పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి బీటెక్ రవి ఆధ్వర్యంలో సోమవారం మండల కేంద్రమైన లింగాలలో జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పర్యటించారు. తమకు తల్లికి వందనం అందలేదని, ఎన్టీఆర్ భరోసా పింఛన్ల మంజూరు కోసం వికలాంగ సర్టిఫికెట్లు అందించలేదంటూ పలువురు మంత్రికి మొరపెట్టుకున్నారు. ఈ సందర్భంగా మంత్రి సవిత మాట్లాడుతూ చంద్రబాబు నాయకత్వంలో ఇచ్చిన హామీలనేకాక మరెన్నో హామీలను నెరవేరుస్తామని చెప్పారు.ఇన్చార్జిమంత్రి సవిత -
పోలీస్ స్టేషన్ వద్ద ఉద్రిక్తత
అదృశ్యమైన బాలిక ఆచూకీ తెలపాలంటూ గ్రామస్తులు పోలీస్ స్టేషన్ను చుట్టుముట్టి అద్దాలను, కుర్చీలను విరగ్గొట్టారు. గొర్రె పిల్లలను మేపుకొనేందుకు వెళ్లిన బాలిక సుమీయ అక్కడ స్పృహ తప్పిపోయి రాత్రి 10:30 గంటలకు గొర్ల మంద వద్దకు చేరుకుంది. స్థానికులు గమనించి పోలీసులకు సమాచారం అందించారు. అదృశ్యమైన బాలిక కనిపించడంతో తల్లిదండ్రులు, పోలీసులు ఊపిరిపీల్చుకున్నారు. డీఎస్పీ మురళి నాయక్ బాలిక దగ్గరకు వెళ్లి మాట్లాడి తల్లిదండ్రులతో సహా కడప రిమ్స్కు తరలించారు. కాగా గ్రామస్తులు మాత్రం బాలికను చూపించాలని పోలీసు స్టేషన్ వద్ద నినాదాలు చేయడంతో ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
ఇంటికి రూ.9,150 విద్యుత్ బిల్లు
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని సుబ్బిరెడ్డి కొట్టాలులో 7/135 నంబర్ గల ఇంటికి జూలై నెలకు సంబంధించి ఒకే మారు రూ.9,150 బిల్లు రావడంతో ఇంటి యజమాని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జూన్ నెలకు సంబంధించి 60 యూనిట్లకు రూ.502 బిల్లు వచ్చింది. జూలై నెలకు సంబంధించి ప్రీవియస్ విద్యుత్ రీడింగ్ 536 యూనిట్లుగా, ప్రజంట్ రీడింగ్ 1582 యూనిట్లుగా నమోదు చేశారు. ఈ ప్రకారం రూ.9,150 బిల్లు చెల్లించాలని సిబ్బంది చెప్పడంతో ఇంటి యజమాని లబోదిబోమంటున్నాడు. ఇదేమిటి బిల్లు ఇలా వచ్చిందని ఇంటి యజమాని ప్రశ్నించగా, అవన్నీ మాకు తెలియదు.. వచ్చిన బిల్లు ప్రకారం మీరు డబ్బు చెల్లించాల్సిందేనని సిబ్బంది సమాధానం ఇచ్చారు. ఈ విషయం చర్చనీయాంశంగా మారింది. -
వనిపెంట గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలి ఆత్మహత్యాయత్నం
మైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ బాలికల గురుకుల పాఠశాల నిత్యం ఏదో ఒక సమస్యతో వార్తలకెక్కుతోంది. కొద్ది రోజుల క్రితం సరిగా చదవకపోవడం, శుభ్రంగా ఉండటం లేదనే కారణంతో ఓ విద్యార్థినికి ప్రిన్సిపాల్ టీసీ ఇచ్చి పంపిన సంఘటన వివాదాస్పదమైంది. తాజాగా సోమవారం పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న డి.జ్యోతి ఆత్మహత్యాయత్నం చేశారు. ఈ సంఘటనకు సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. వనిపెంటకు చెందిన డి. జ్యోతి 8 ఏళ్లుగా కాంట్రాక్టు పద్ధతిపై గురుకుల పాఠశాలలో బయాలజీ ఉపాధ్యాయినిగా పనిచేస్తున్నారు. సోమవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో ఉపాధ్యాయిని జ్యోతి ప్రిన్సిపాల్ నిర్మల ఛాంబర్లోకి వెళ్లి టీచింగ్ డైరీ (వర్క్ డన్ స్టేట్మెంట్) అందజేశారు. కొద్ది సేపటికి పాఠశాలలోని ఓ గదిలో ఒక్క సారిగా తూలి కింద పడిపోయిన ఆమె అక్కడున్న స్టాఫ్ నర్స్తో తాను నిద్ర మాత్రలు మింగానని చెప్పారు. దాంతో అక్కడి సిబ్బంది, కొందరు ఉపాధ్యాయులు ఆమెకు ఉప్పు కలిపిన నీటిని తాగించారు. అంతలోనే పాఠశాల వద్దకు చేరుకున్న ఉపాధ్యాయురాలు భర్త సుధీర్ ఆటోలో ఆమెను తీసుకుని వనిపెంటలోని ఓ ఆస్పత్రిలో ప్రాథమిక చికిత్స చేయించి.. అక్కడి నుంచి మెరుగైన చికిత్స కోసం కడప రిమ్స్కు తరలించారు. తన చావుకు ప్రిన్సిపాల్ నిర్మల వేధింపులే కారణమంటూ ఉపాధ్యాయిని జ్యోతి రాసినట్టుగా సోమవారం సాయంత్రం 4 పేజీల సూసైడ్ నోట్ వెలుగు చూసింది. పాఠశాలలో 8 ఏళ్లుగా తాను ఎలాంటి ఫిర్యాదులు లేకుండా పనిచేస్తున్నట్టు ఉపాధ్యాయిని జ్యోతి సూసైడ్ నోట్లో పేర్కొన్నారు. ఈ విద్యా సంవత్సరం పాఠశాల తెరిచినప్పటి నుండి ప్రిన్సిపాల్ తనను వేధిస్తున్నారని ఆరోపించారు. తనకు మూడు నెలల పాప ఉన్నా రోజూ అన్ని క్లాసులకు హాజరై పాఠాలు చెబుతున్నానని పేర్కొన్నారు. స్కూల్ విషయాలను బయటికి చేరవేస్తున్నట్టు తనపై అనుమానంతో ప్రిన్సిపాల్ వేధిస్తున్నారని రాశారు. మిగతా ఉపాధ్యాయినులను తనతో మాట్లాడకుండా కట్టడి చేశారని ఆరోపించారు. తనకు మెమో ఇవ్వాల్సిందిగా తన స్నేహితులతోనే ప్రిన్సిపాల్ చెప్పారని, ఆ అవమానంతోనే తాను ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకున్నట్టు పేర్కొన్నారు. పాఠశాలపై ఆరోపణలు వచ్చిన ప్రతి సారి అధికారులు ప్రిన్సిపాల్ చెప్పే మాటలు నమ్మి నిజాలు తేల్చకుండానే వెళ్తున్నారని సూసైడ్ నోట్లో ఉపాధ్యాయిని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉపాధ్యాయిని జ్యోతి రిమ్స్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కాగా మైదుకూరు అర్బన్ ఎస్ఐ చిరంజీవి, ఎంఈఓ పద్మలత, మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ అర్జున్ వేర్వేరుగా పాఠశాల వద్దకు చేరుకుని జరిగిన సంఘటనపై విచారించారు.మాట్లాడుతున్న పాఠశాల ప్రిన్సిపాల్ నిర్మలఉపాధ్యాయిని జ్యోతి ఆత్మహత్యాయత్నంపై గురుకుల పాఠశాల ప్రిన్సిపాల్ వి.నిర్మల మాట్లాడుతూ తాను ఉపాధ్యాయిని జ్యోతిని వేధించలేదన్నారు. అందరితోపాటు ఆమె జూన్ నెల టీచింగ్ డైరీ సబ్మిట్ చేయలేదని తెలిపారు. సోమవారం తనకి తానే తన ఛాంబర్లోకి వచ్చి టీచింగ్ డైరీ ఇచ్చారని చెప్పారు. అందులో ఆమె సెలవులో ఉన్న రోజుల్లోనూ, ఆదివారం కూడా పాఠాలు బోధించినట్టు పొందుపరిచారని వివరించారు. దాంతో అలా తప్పుగా ఎందుకు రాశారని అడిగానని దీనిపై వివరణ ఇవ్వాల్సిందిగా కోరానన్నారు. ఉపాధ్యాయినులు ఎవరు ఆ విధంగా చేసినా వివరణ కోరడం మామూలుగా జరుగుతుందని పేర్కొన్నారు. తన ఛాంబర్ నుంచి ఉపాధ్యాయిని జ్యోతి వెళ్లిన కొద్ది సేపటికి సిబ్బంది వచ్చి తాను నిద్ర మాత్రలు మింగానని జ్యోతి మేడమ్ చెబుతున్నారని తనతో అనగా, వెంటనే చికిత్స కోసం తీసుకెళ్లాలని చెప్పానన్నారు. అదే సమయంలో ఆమె భర్త మరికొందరు బయట వ్యక్తులు పాఠశాల వద్దకు వచ్చి ఆమెను ఆటోలో తీసుకెళ్లారని వివరించారు. కాగా ఉపాధ్యాయిని జ్యోతి తన ఛాంబర్ నుంచి వెళ్లిన కొద్దిసేపటికే కింద పడిపోవడం, అదే సమయంలో ఆమె భర్త పాఠశాల వద్దకు చేరుకోవడం అతని వెనకే ఎలాంటి అనుమతి లేకుండా బయటి వ్యక్తులు మోటార్ బైక్లపై పాఠశాలలోకి రావడం ఇదంతా ముందుగా వేసుకున్న పథకంగా అనిపిస్తుందన్నారు. పాఠశాలలో జరిగే సంఘటనల వెనుక బయటి వ్యక్తులు ఉన్నారని ప్రిన్సిపాల్ ఆరోపించారు. గతంలో బయటి వ్యక్తులు పాఠశాలలో ఇష్టారాజ్యాంగా ఉండేవారని, తాను ప్రిన్సిపాల్గా బాధ్యతలు చేపట్టాక అవన్నీ కట్టడి చేశానన్నారు. ఏదో ఒక విధంగా తనను ఇక్కడి నుంచి పంపించాలని సమస్యలను సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. -
రాజన్నను మరవలేను
నా పేరు ఆదెమ్మ, మాది నీరుగట్టువారిపల్లె. చేనేత కార్మికురాలు. నాకు నలుగురు బిడ్డలు. చీరలు నేస్తేనే ఇళ్లు గడుస్తుంది. పిల్లలను ఉన్నత స్థాయికి తీసుకురావాలన్నదే తపన. మహానేత రాజన్న పుణ్య మాని నా పెద్ద కుమార్తె ఇడుపులపాయలో ట్రిపుల్ ఐటి సీటు వచ్చింది. బీటెక్ పూర్తి చేసి బెంగుళూరులో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తుంది. రెండవ కుమారుడు హేమంత్కుమార్ బీటెక్ పూర్తి చేసి చైన్నెలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఉద్యోగం చేస్తున్నాడు. మూడవ కుమార్తె మంజుల బీటెక్ పూర్తి చేసి సాప్ట్వేర్ ఇంజనీర్గా పని చేస్తోంది. నాల్గోవాడు బెంగుళూరులో ఉద్యోగం చేస్తున్నాడు. వైఎస్సార్ పథకాల వల్లే మా పిల్లలు ఉన్నత స్థితిలో ఉన్నారు. ఆయన రుణం మరవలేను. -
ఫీజు రీయింబర్స్మెంట్తో పేదరికం తగ్గుముఖం
నాపేరు తంబెల దీప్తి. మాది రాజంపేట. మధ్యతరగతి కుటుంబం. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశపెట్టిన ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల నేను బీటెక్ పూర్తిచేసి క్యాంపస్ సెలక్షన్స్లోనే ఉద్యోగం సాధించాను. ప్రస్తుతం దేశంలో టాప్ సాఫ్ట్వేర్ కంపెనీల్లో ఒకటైన యాక్సెన్చర్ కంపెనీలో మంచి ప్యాకెజీతో ఉద్యోగం చేస్తున్నాను. అదే ఫీజురీయింబర్స్మెంట్ పథకం లేకుంటే పేద, మధ్య తరగతికి చెందిన కొన్ని లక్షల మంది ఉన్నత చదువులకు దూరం అయ్యేవారు. ఫీజు రీయింబర్స్మెంట్ పథకం వల్ల తెలుగు రాష్ట్రాల్లో కొన్ని లక్షల కుటుంబాలు పేదరికం నుంచి బయటపడ్డాయి. -
బైక్ అదుపు తప్పి వ్యక్తికి గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపు తప్పి వ్యక్తి గాయపడిన సంఘటన ఆదివారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. మాలేపాడు పంచాయతీ దొనబైలుకు చెందిన ఆనంద (45) వ్యక్తిగత పనులపై ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని సందిరెడ్డిపల్లె వద్ద కుక్క అడ్డురావడంతో బైక్ అదపుతప్పి కిందపడ్డాడు. ప్రమాదంలో గాయపడిన ఆనంద స్థానికుల సహాయంతో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. చెవి కొరికేశాడురైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట పంచాయతీ గుండాలేరు వద్ద ఆదివారం తెల్లవారుజామున 2 గంటల సమయంలో ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. దీంతో అహ్మద్ అనే వ్యక్తి మల్లు శ్రీసాయి అనే వ్యక్తి చెవి కొరికేశాడు. అతని చెవి కొంత భాగం తొలగి పోయింది. శనివారం రాత్రి పీర్ల పండుగను పురస్కరించుకొని అందరూ ఒక చోట చేరడంతో పాత కక్షలు మనసులో పెట్టుకొని వాదులాటకు దిగినట్లు తెలిసింది. ఈ మేరకు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
జాతీయ లోక్ అదాలత్లో జిల్లాకు 1వ ర్యాంకు
కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్లో జిల్లా వ్యాప్తంగా 23, 284 కేసులకు పరిష్కారం చూపి, కక్షిదారులకు రూ.34,53,61,148 చెల్లించామని, తద్వారా రాష్ట్ర స్థాయిలో వైఎస్ఆర్ ఉమ్మడి కడప జిల్లా మొదటి ర్యాంకును సాధించిందని జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయసేవాధికారసంస్థ చైర్మన్ డాక్టర్.సి.యామిని తెలిపారు. పరిష్కారమైన కేసుల్లో క్రిమినల్ 22, 700 కేసులు, 213 సివిల్ కేసులు, 371 ఫ్రీ లిటిగేషన్ కేసులు ఉన్నాయన్నారు. కడపలో 4482 కేసులు, ప్రొద్దుటూరులో 2556 కేసులు, రాజంపేటలో 223 కేసులు, రాయచోటిలో 906 కేసులు, బద్వేల్లో 3652 కేసులు, మైదుకూరు కోర్టులో 1329 కేసులు, జమ్మలమడుగులో 3696 కేసులు, సిద్ధవటంలో 461 కేసులు, రైల్వేకోడూరులో 482 కేసులు, పులివెందులలో 1656 కేసులు, నందలూరులో 909 కేసులు, లక్కిరెడ్డిపల్లిలో 2100 కేసులు, కమలాపురంలో 832 కేసులు జాతీయ లోక్ అదాలత్లో పరిష్కరించారని తెలిపారు. జాతీయ లోక్ అదాలత్లో కేసుల పరిష్కారానికి సహకరించిన ప్రతి ఒక్కరికీ జిల్లా ప్రధాన న్యాయమూర్తితో పాటు జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్. బాబా ఫకృద్దీన్ కృతజ్ఞతలు తెలిపారు.జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని వెల్లడి -
మహిళ హత్య కేసులో నిందితుడి అరెస్టు
పులివెందుల రూరల్ : మహిళ హత్య కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మురళి నాయక్ తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక అర్బన్ పోలీస్ స్టేషన్లో ఆయన మీడియా సమావేశంలో మాట్లాడారు. గత నెల 30వ తేదీన బోనాల హసీనా అనే మహిళను హత్య చేశారన్నారు. రెండు రోజుల తర్వాత దుర్వాసన రావడంతో స్థానికులు పోలీసులకు సమాచారమిచ్చారన్నారు. సంఘటన స్థలానికి వెళ్లి అక్కడ ఉన్న సీసీ కెమెరాల ఆధారంగా దేవిరెడ్డి లిఖిత్ కుమార్ రెడ్డిని విచారించామన్నారు. విచారణలో హసీనా వడ్డీ వ్యాపారం చేస్తూ ఉండేదని, ఈ నేపథ్యంలో కరుణ కుమారికి డబ్బులు ఇచ్చిందన్నారు. రెండేళ్లవుతున్నా డబ్బులు ఇవ్వకపోవడంతో డబ్బులు ఇవ్వాలని కఠినంగా అడగడంతో కరుణకుమారి కుమారుడు లిఖిత్ కుమార్ రెడ్డి గొంతు, చేతుల మీద కత్తితో పొడిచి చంపాడన్నారు. ఈ హత్యకు ప్రోత్సహించిన కరుణ కుమారిపై కూడా కేసు నమోదు చేశామని, ఆమె పరారీలో ఉందని త్వరలో అరెస్టు చేస్తామన్నారు. ఆదివారం మధ్యాహ్నం ఉల్లిమెల్ల రింగ్ రోడ్డులో ట్రాఫిక్ సీఐ హాజీవలీ, ఎస్ఐ నారాయణలు పోలీస్ సిబ్బందితో కలిసి లిఖిత్ కుమార్రెడ్డిని అరెస్ట్ చేశారన్నారు. -
అసాంఘిక కార్యకలాపాలపై పోలీసుల దాడులు
కడప అర్బన్ : అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్.పి ఈ.జి. అశోక్ కుమార్ హెచ్చరించారు. జిల్లాలో గత 15 రోజుల్లో చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై జిల్లా పోలీస్ శాఖ జరిపిన దాడుల వివరాలను ఆయన వెల్లడించారు. ● జిల్లాలో గత 15 రోజుల్లో జూదమాడుతున్న మొత్తం 159 మందిని అరెస్టు చేసి రూ. 2,85,645 నగదు స్వాధీనం చేసుకుని 22 కేసులు నమోదు చేశామన్నారు. 9 మట్కా కేసులు నమోదు చేసి మొత్తం 16 మందిని అరెస్టు చేసి రూ. 50,570 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. ● జిల్లాలో గంజాయి విక్రయిస్తున్న నలుగురిని అరెస్టు చేసి 1.4 కిలోల గంజాయి స్వాధీనం చేసుకుని రెండు కేసులు నమోదు చేశామన్నారు. ● జిల్లాలో బహిరంగ ప్రదేశాల్లో మద్యపానంపై పోలీస్ సిబ్బంది గస్తీ తిరుగుతూ ముమ్మర దాడులు నిర్వహించి 986 మందిపై కేసులు నమోదు చేశారన్నారు. మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న 57 మందిపై కేసులు నమోదు చేశామన్నారు. ● జిల్లాలో కోడి పందేల కేసు నమోదు చేసి ఆరుగురిని అరెస్టు చేసి రూ. 5,050 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. ● అక్రమంగా మద్యం విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్టు చేసి మొత్తం 3 కేసులు నమోదు చేసి 13.24 లీటర్ల మద్యం స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ● అసాంఘిక కార్యక్రమాల నిర్మూలనకు పోలీస్ శాఖకు ప్రజలు సహకరించాలని, మట్కా, క్రికెట్ బెట్టింగ్, గ్యాంబ్లింగ్, ఇతర నేరాలకు సంబంధించిన సమాచారాన్ని డయల్ 112 కు తెలియజేయాలని సూచించారు. -
ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికుల ఆందోళన
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ సర్వీసు మొరాయించడంతో ప్రయాణికులు ఆందోళన చేసిన ఘటన ఆదివారం మధ్యాహ్నం కడప బస్టాండులో జరిగింది. ప్రతిరోజు మధ్యాహ్నం 3 గంటలకు కడప నుంచి బెంగళూరుకు వెళ్లాల్సిన అమరావతి ఏసీ బస్సు మొరాయించింది. ఈ క్రమంలో బస్టాండుకు చేరుకున్న ప్రయాణికులు ఎంతసేపటికీ బస్సు రాకపోవడంతో తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. బస్టాండులోని కంట్రోలర్తో వాగ్వాదానికి దిగారు. మరోవైపు బస్సుకు మరమ్మతుల కోసం చేసిన ప్రయత్నాలు విఫలం కావడంతో ఆర్టీసీ అధికారులు చేసేది లేక సాయంత్రం 6 గంటలకు ఇంద్ర సర్వీసును బెంగళూరుకు పంపించారు. ఈ సందర్భంగా పలువురు ప్రయాణికులు మాట్లాడుతూ ఆర్టీసీ బస్సులను సకాలంలో పంపాల్సిన బాధ్యత అధికారులపై ఉందన్నారు. బస్సు సకాలంలో రాకపోవడంతో వివిధ సమస్యలు ఎదుర్కొన్నామని, భవిష్యత్తులో ఇలాంటి ఘటనలు జరగకుండా చూడాలని వారు కోరారు.మూడు గంటలు ఆలస్యంగా బెంగళూరు సర్వీసు -
వైభవంగా తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో శివ,కేశవుల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా ఆదివారం ప్రారంభమయ్యాయి. తొలిరోజున అన్నమాచార్యుడు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయాల్లో ఘనంగా ధ్వజారోహణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, తాళ్లపాక ఆలయాల ఇన్స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది పాల్గొన్నారు. శివ, కేశవుల వాహనసేవలివే : బ్రహ్మోత్సవాల తొలిరోజున శ్రీ సిద్దేశ్వరస్వామి హంసవాహనంపై, శ్రీ చెన్నకేశవస్వామి శేషవాహనంపై విహరించారు. తిరుమల తిరుపతి దేవస్థానం డిప్యూటీ ఈఓ ప్రశాంతి పర్యవేక్షణలో తాళ్లపాక, నందలూరులో బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. భరత నాట్యంలో కలికిరి వాసికి బంగారు పతకం కలికిరి : తమిళనాడు రాష్ట్రం సేలంలో ఎస్ఏఎస్ ఈవెంట్స్, కై లాస మానస సరోవర స్కూల్ ఆధ్వర్యంలో నటరాజ నర్తనం ప్రపంచ భరతనాట్య పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలకు వివిధ దేశాలతో పాటు, జాతీయ స్థాయిలో పలు రాష్ట్రాల నుంచి 3వేల మంది ప్రదర్శకులు హాజరై 30 నిమిషాల పాటు ఒకే సారి ఏకధాటిగా నృత్య ప్రదర్శన చేసి, నటరాజ స్వామికి నాట్య నీరాజనాన్ని సమర్పించారు. దీంతో ఈవెంట్ ప్రపంచ రికార్డులకెక్కింది. కార్యక్రమానికి జిల్లా నుంచి కలికిరి పట్టణానికి చెందిన షేక్ రియాజుల్లా(పండు) హాజరయ్యారు. ముఖ్య అతిథిగా హాజరైన తమిళ నటి ప్రియదర్శిని ఈయనకు బంగారు పతకాన్ని అందజేసి అభినందించారు. -
వ్యక్తి అదృశ్యం
కడప అర్బన్ : కడప నగరం చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో జయనగర్ కాలనీలో నివాసం ఉంటున్న వనిపెంట అంజాద్ఖాన్ గత నెల 28వ తేదీన ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాలేదని అతని భార్య సల్మా ఈనెల 5వ తేదీన పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడప నగర శివార్లలోని తెలుగుగంగ ప్రాజెక్ట్ కార్యాలయంలో ఇరిగేషన్ విభాగంలో పనిచేస్తున్న అంజాద్ఖాన్ ఇటీవలే బదిలీపై బద్వేల్కు వెళ్లారు. అంజాద్ఖాన్ తన కుటుంబ అవసరాల కోసం, అనారోగ్య విషయమై అప్పులు ఎక్కువగా చేశారని అతని భార్య ఫిర్యాదులో పేర్కొన్నారు. గత నెల 28న ఇంటి నుంచి కార్యాలయానికి వెళ్లి వస్తానని చెప్పి వెళ్లి తిరిగి రాలేదని ఆమె తెలిపారు. అతని ఆచూకీ తెలిసిన వారు కడప చిన్నచౌక్ సీఐ సెల్: 9121100520, ఎస్ఐలు 9121100521, 9121100522కుగానీ సమాచారం ఇవ్వాలని పోలీసులు కోరారు. బహుజన టీచర్స్ యూనియన్ ఆవిర్భావంకడప రూరల్ : బహుజన టీచర్స్ యూనియన్ ఆఫ్ ఆంధ్ర ప్రదేశ్ నూతన సంఘం ఆవిర్భావ సమావేశం ఆదివారం స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్ క్లబ్లో నిర్వహించారు. ఈ సందర్భంగా నూతన కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర అధ్యక్షునిగా మేకల శివార్జున, ప్రధాన కార్యదర్శిగా సి.సుదర్శన్ బాబు, కోశాధికారిగా ఏ.రాజబాబు ఎన్నికయ్యారు. రాష్ట్ర కార్యదర్శిగా ఎం.గంగరాజు, కె.గంగాధర్, ఎం.శ్రీదేవి, ప్రేమ సాగర్ నిత్య ప్రభాకర్, జిల్లా అధ్యక్షుడిగా గంగరాజు, కార్యదర్శిగా బేరి మోహన్, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా కట్టా గంగాధర్ తదితరులను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. యాంటీ రేబీస్ టీకాలు వేయించాలి కడప అగ్రికల్చర్ : జంతు ప్రేమికులు తమ పెంపుడు శునకాలకు తప్పనిసరిగా యాంటీ రేబీస్ టీకాలు వేయించి జంతు సంక్రమిత వ్యాధులను నివారించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ప్రపంచ జూనోసిస్ దినోత్సవం సందర్భంగా ఆదివారం కడప పశుసంవర్థక శాఖ పాలీ క్లినిక్ కార్యాలయంలో ఉచిత రాబిస్ వ్యాధి నివారణ టీకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా కలెక్టర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జంతువుల నుంచి మనుషులకు, మనుషుల నుంచి జంతువులకు జూనొసిస్ (జంతు సంక్రమిత) వ్యాధులు సంక్రమిస్తాయన్నారు. జిల్లా పశుసంవర్థక శాఖ అధికారి డాక్టర్ శారదమ్మ మాట్లాడుతూ జిల్లాలో దాదాపు 17వేల డోసులు అందుబాటులో ఉన్నాయని పెంపుడు జంతువుల ప్రేమికులందరూ వ్యాక్సినేషన్ వేయించాలని సూచించారు. అనంతరం ఈ నెల 7 నుంచి 14 వరకు నిర్వహించే పశుగ్రాస వారోత్సవాల పోస్టర్లను పశుసంవర్థక శాఖ అధికారులతో కలిసి జిల్లా కలెక్టర్ ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పశుసంవర్థక శాఖ డీడీ రంగస్వామి, ఇన్చార్జి డీడీ శ్రీనివాసరెడ్డి, ఏడీ డాక్టర్ సుబ్బరాయుడు, ఏడీ డాక్టర్ నేతాజీ, ఏడీ డాక్టర్ మాధవి, డాక్టర్ సంధ్యారాణి, డాక్టర్ చాంద్ బాషా, పశుసంవర్థక శాఖ సిబ్బంది, తదితరులు పాల్గొన్నారు. -
గండి టెండర్లలో నిబంధనలకు పాతర
చక్రాయపేట : గండి క్షేత్రంలో శ్రావణ మాస ఉత్సవాల సందర్భంగా నిర్వహించే టెండర్లలో నిబంధనలకు పాతర వేసినట్లు కనిపిస్తోంది. ప్రత్యేక పూల అలంకరణకు పూలు సరఫరా, చలువ పందిళ్లు, బారికేడ్లు, విద్యుద్దీపాల అలంకరణ అని ఆలయ అధికారులు కరపత్రాలు ముద్రించి పంపిణీ చేస్తున్నారు. ప్రతికల్లో ప్రకటనలు కూడా అలాగే ఇస్తున్నారు. అయితే ప్రత్యేక పూల అలంకరణ అంటే ఆలయానికా లేక మూలవర్లకా అనే వివరాలు పొందు పరచలేదు. దీనికి తోడు మూలవర్లకు ప్రత్యేక అలంకరణ అంటే తోమాలలు ఎన్ని అవసరం, అవి ఎన్ని కిలోల బరువు ఉండాలి, అలంకరణ బిట్లు ఎన్ని కావాలి, వాటి బరువెంత, అలాగే పలు రకాల అల్లిన పూలు ఎన్ని కావాలి.. ఏయే రకాలు కావాలి అని కాని ఆలయంలో అలంకరణకు బంతి పూలు ఎన్ని మూరలు అనో లేక ఎన్ని కిలోలు అని వివరాలు ఉండటం లేదు. అలాగే చలువ పందిళ్లు అంటే అవి ఎన్ని అడుగులు ఎక్కడెక్కడ ఎన్ని వేయాలి అనే విషయాలు ఉండటం లేదు. బారికేడ్లు, విద్యుద్దీపాలు సీరియల్ సెట్లు, ఫోకస్ లైట్లు, డిజిటల్ బోర్డులు కూడా ఎక్కడ వేయాలి ఎన్ని వేయాలి అనే వివరాలు పొందుపరచలేదు. ముందుగానే వివరాలు ఉండక పోవడంతో టెండర్ దక్కించుకున్న కాంట్రాక్టర్ తక్కువ మోతాదులో తెచ్చి వేయడం, చాలక పోతే మరో వారానికి తెప్పించి వేయడం జరుగుతుంది. దీని వల్ల కాంట్రాక్టర్కు మేలు జరుగుతుంది కాని ఆలయ ఆదాయానికి గండి పడుతుందని పలువురు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఏటా వేయిస్తూనే ఉన్నప్పటికీ.. శ్రావణమాస ఉత్సవాల సందర్భంగా ఏటా అధికారులు టెండర్లు వేయిస్తున్నారు. ఏవేవి ఎన్ని అవసరమో ఆ వివరాలు అన్ని కూడా ఆలయ కార్యాలయంలోనే అందుబాటులో ఉంటాయి. ఎందుకంటే గతంలో కాంట్రాక్టర్లకు చెల్లించిన బిల్లులు పరిశీలిస్తే ఈ దఫా ఏవేవి ఎన్ని అవసరం అనే విషయాలు కచ్చి తంగా తెలుస్తాయి. గతంలో ఏవి ఎక్కడ వేశారో ఇ ప్పుడు అక్కడే వేయాల్సి ఉంటుంది. ఎందుకంటే ఆ లయ పరిధిలో విస్తీర్ణం తక్కువగానే ఉంది. ఈ విష యం ఆలోచించకనే దేవదాయశాఖ అధికారులు టెండర్లు పిలవడం నిబంధనలను పక్కన పెట్టినట్లేనని పలువురు భక్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పూల విక్రయ హక్కు టెండర్లలో చెప్పేది ఒకటి జరిగేది మరొకటి.. ఏడాది కాలం పాటు పూలు విక్రయించుకునే హక్కు విషయంలో అధికారులు చెప్పేది ఒకటయితే అనంతరం టెండరు దక్కించుకున్న వ్యక్తి చేసేది మరోలా ఉంటోంది. పూల విక్రయం అంటే పూలు, పూల దండలు మాత్రమే విక్రయించాలి. కాని ఇక్కడ వాటిని అసలు విక్రయించరు. తమలపాకులు తెచ్చి వాటిని దండలా కూర్చి దేవస్థానం నిర్ణయించిన ధరల కంటే ఎక్కువ ధరలకు విక్రయిస్తున్నారు. ఈ దండలకు చివరన పూలతో కుచ్చును కూడా ఏర్పాటు చేయరు. ఈ విషయాన్ని పలువురు భక్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లినా స్పందించలేదనే ఆరోపణలు ఉన్నాయి. టెండర్ల సమయంలో తమలపాకుల దండల ఊసే లేకున్నా కాంట్రాక్టర్లు వాటినే విక్రయించడంపై విమర్శలు బలంగా వినిపిస్తున్నాయి. ఖాళీ స్థలం టోల్గేట్ల కాంట్రాక్టర్కు వరం ఆలయ పరిధిలోనే గల నూతన కల్యాణ మండపం ఎదురుగా ఉన్న స్థలం టోల్గేట్ల కాంట్రాక్టర్కు వరంలా మారుతోంది. గత శ్రావణ మాసంలో ఈ ఖాళీ స్థలం టోల్గేట్ కాంట్రాక్టరుకు అప్పగించారు. టోల్ గేట్ టెండర్ల సమయంలో ఈ ఖాళీ స్థలం ప్రస్తావనే లేదు. శ్రావణ మాస ఉత్సవాలు వచ్చే సరికి ఈ స్థలాన్ని సదరు కాంట్రాక్టరుకు అప్పగించారు. దీంతో ఆ కాంట్రాక్టరు ఆ స్థలంలో దుకాణాలు ఏర్పాటు చేయించి వారి వద్ద నుంచి లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. నెలకు ఒక్కో దుకాణం వద్ద నుంచి 40 నుంచి 50 వేల వరకు బేరం కుదుర్చుకొని అందులోనే 30 నుంచి 40 వరకు దుకాణాలు, హోటళ్లను ఏర్పాటు చేయించారు. ఈ సంవత్సరం కూడా అదే పరిస్థితి ఉందని విశ్వసనీయ వర్గాల సమాచారం. అధికారులు, పాలకమండలి స్పందించి టెండర్ల వివరాలు పూలు ఎన్ని కిలోలు, ఏయే రకాలు, బారికేడ్లు ఎన్ని అడుగుల దూరం, చలువ పందిళ్లు ఎన్ని, వాటి విస్తీర్ణం ఎన్ని అడుగులు, బార్ లైట్లు ఎన్ని, ఫోకస్ లైట్లు ఎన్ని అనే వివరాలు పూర్తిగా వివరించి ఆ మేరకు టెండర్లు నిర్వహించాలని భక్తులు కోరుతున్నారు. లేకుంటే ఆలయ ఆదాయానికి గండి పడుతుందని పేర్కొంటున్నారు. రేపు గండిలో టెండర్లు గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో మంగళవారం శ్రావణ మాస ఉత్సవాలను పురస్కరించుకుని టెండర్లను నిర్వహిస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. నెల రోజులకు సంబంధించి పూల అలంకరణ కోసం పూలు సరఫరా, విద్యుత్ దీపాల అలంకరణ, చలువ పందిళ్లు, బారికేడ్ల ఏర్పాటుకు టెండర్లు నిర్వహిస్తామన్నారు. అలాగే దేవస్థానంలో ఏడాది కాలం పాటు పూలు విక్రయించే హక్కు, టోల్ గేట్ల వసూలు, రెండు సంవత్సరాల కాలానికి షాపింగ్ కాంప్లెక్స్లో గదులకు సంబంధిం టెండర్లు వేస్తున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు తమ కార్యాలయంలో సంప్రదించాలని సూచించారు. సరైన మార్గదర్శకాలు లేవంటున్న భక్తులు ఆలయ ఆదాయానికి గండికొడుతున్నారని ఆందోళన -
బాబు జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయం
కడప కార్పొరేషన్ : మాజీ ఉప ప్రధాని బాబూ జగ్జీవన్ రామ్ సేవలు చిరస్మరణీయమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కొనియాడారు. ఆదివారం జగ్జీవన్రామ్ 39వ వర్ధంతి సందర్భంగా జిల్లా పార్టీ కార్యాలయంలో మేయర్ కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలతో కలిసి ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్వాతంత్య్ర సమరయోధునిగా, దేశానికి తొలి ఉప ప్రధానమంత్రిగా బాబూ జగ్జీవన్ రామ్ దేశానికి ఎనలేని సేవలు అందించారని తెలిపారు. కార్మిక శాఖామంత్రిగా, వ్యవసాయ శాఖ మంత్రిగా అనేక సంస్కరణలు తీసుకొచ్చారన్నారు. సుదీర్ఘకాలం పార్లమెంటేరియన్గా కొనసాగిన ఘనత ఆయనకే దక్కిందన్నారు. జగ్జీవన్ రామ్ అడుగుజాడలలో ప్రతి ఒక్కరూ నడవాలని సూచించారు. జగ్జీవన్ రామ్ విగ్రహానికి ఘన నివాళి అంతకుముందు మహావీర్ సర్కిల్లోని బాబూ జగ్జీవన్ రామ్ విగ్రహానికి మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాలు పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పేద, బడుగు, బలహీన వర్గాల ఆశాజ్యోతి జగ్జీవన్ రామ్ అని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానంద రెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు పులి సునీల్ కుమార్, సంబటూరు ప్రసాద్రెడ్డి, దేవిరెడ్డి ఆదిత్య, షేక్ షఫీవుల్లా, రామక్రిష్ణారెడ్డి, సీహెచ్ వినోద్, చెన్నయ్య పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
ఉరి వేసుకుని మహిళా రైతు ఆత్మహత్య
చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామానికి చెందిన మహిళా రైతు కటారు రామాంజనమ్మ(47) శనివారం సాయంత్రం ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎస్ఐ చిన్నపెద్దయ్య, మృతురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. రామాంజనమ్మ గత కొన్నేళ్లుగా భర్తతో కలసి వ్యవసాయం చేసుకుంటూ, పాడి పశువులతో జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో వ్యవసాయంలో నష్టాలు రావడం, అప్పులు పెరగడంతో ఆర్థిక ఇబ్బందులు తలెత్తాయి. దీంతో మనస్థాపం చెందటంతో పాటు మతిస్థిమితం సరిగా లేని తన కూతురు విషయం గురించి కూడా ఆమె బాధపడేది. ఈ నేపథ్యంలో శనివారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యానుకు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలికి భర్త, ఇద్దరు కూతుళ్లు ఉన్నారు. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లో అనంతపురం జట్టు ఘన విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లో ఆదివారం మూడవ రోజు కర్నూలు జట్టుపై అనంతపురం జట్టు 59 పరుగులతో ఘన విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెండవ ఇన్నింగ్స్లో 115 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 51.1 ఓవర్లలో 214 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 87 పరుగులు, మహిత్ 37 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని వరుణ్ సాయి నాయుడు అద్భుతంగా బౌలింగ్లో రాణించి 5 వికెట్లు తీశాడు. టీవీ సాయి ప్రతాప్ నాయుడు 3 వికెట్లు తీశారు. కాగా అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్లో 486 పరుగులు చేయగా కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 213 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 214 పరుగులు చేసిన విషయం తెలిసిందే. దీంతో అనంతపురం జట్టు 59 పరుగులతో ఘన విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఆదివారం 63 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 87 ఓవర్లలో 384 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మన్విత్ రెడ్డి 97 పరుగులు, ఎస్ఎస్ హమీద్ 67, కారుణ్య ప్రసాద్ 52 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 3 వికెట్లు, తేజేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 10 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 48 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది.డ్రాగా ముగిసిన నెల్లూరు–చిత్తూరు మ్యాచ్ -
ఘనంగా గంధోత్సవం
కడప సెవెన్రోడ్స్: కడప పెద్దదర్గా ప్రధాన గురువు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ గంధోత్సవం ఆదివారం రాత్రి ఘనంగా నిర్వహించారు. గురువు మజార్ వద్ద విశేష ప్రార్థనలు జరిగాయి. ప్రక్క రాష్ట్రాల నుంచి సైతం పెద్ద సంఖ్యలో భక్తులు ఈ కార్యక్రమానికి తరలివచ్చారు. దర్గా నిర్వాహకులకు ఆ భక్తులకు ఇబ్బందులు తలెత్తకుండా ఏర్పాట్లు చేశారు. గంధోత్సవం సందర్భంగా దర్గా విద్యుత్ దీప కాంతులతో మెరిసింది. హజరత్ పీరుల్లామాలిక్ సాహెబ్ సజీవ సమాధి అయిన సందర్భంగా ప్రతి ఏటా మొహర్రం నెల పదోరోజు గంధోత్సవాన్ని నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంధం సమర్పించి ప్రత్యేక ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. లంగర్లో భోజన ప్రసాదం కూడా ఏర్పాటు చేశారు. భక్తులు పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ను దర్శించుకుని ఆశీస్సులు పొందారు. -
నకిలీ.. మకిలీ!
వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో చేపడుతున్న కాంట్రాక్టు స్టాఫ్ నర్స్ నియామకాల్లో బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహారం కలకలం రేపుతోంది. కొంతమంది అడ్డదారుల్లో అక్రమంగా సంపాదించుకోవడానికి ఒక ముఠాగా ఏర్పడి, బోగస్ సర్టిఫికెట్లను తయారు చేస్తున్నట్లుగా సమాచారం. వచ్చిన అన్ని దరఖాస్తులను పరిశీలిస్తే ఇంకెన్ని నకి‘లీలలు’బయట పడుతాయో... వైద్య ఆరోగ్యశాఖకు అంటుకున్న ఈ మకిలీ ఎప్పుడు తొలగిపోతుందో అంతుచిక్కని ప్రశ్నగా మారింది. కడప రూరల్: కడపలోని వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో ఈ ఏడాది జనవరిలో కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామకాలకు చర్యలు చేపట్టారు. 150 పోస్టులకు గాను దాదాపు 11 వేలకు పైగా అభ్యర్థులు దరఖాస్తు చేసుకున్నారు. ఆ కార్యాలయ సిబ్బంది వచ్చిన దరఖాస్తులను పరిశీలించి జాబితాను సిద్ధం చేశారు. ఎందుకై నా మంచిదని... దరఖాస్తుల ఆధారంగా నిబంధనల ప్రకారం 200 మందితో అభ్యర్థుల తుది ఎంపిక జాబితాను సిద్ధం చేశారు. ఎందుకై నా మంచిదని ఆ శాఖ అధికారులు ఎంపికై న సదరు అభ్యర్థుల సర్టిఫికెట్లను పరిశీలన కోసం అమరావతిలోని పారా మెడికల్ బోర్డు, డాక్టర్ ఎన్టీఆర్ హెల్త్ యూనివర్శిటీకి పంపారు. ఆ మేరకు బీఎస్సీ నర్సింగ్ కు సంబంధించి 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ను ఎన్టీఆర్ హెల్త్ యూనివర్సిటీకి, జి ఎన్ ఎం నర్సింగ్ కోర్సు చేసిన 100 మంది అభ్యర్థుల సర్టిఫికెట్స్ ను పారా మెడికల్ బోర్డుకు పంపారు. అందులో 27 మంది అభ్యర్థులు సమర్పించిన దరఖాస్తుల్లో బోగస్ సర్టిఫికెట్స్ ఉన్నట్లుగా ధ్రువీకరించారు. ● ఆ 27 మందికి ఆ శాఖ కార్యాలయం నోటీసులు ఇచ్చి, ఒక వారంలోపు వివరణ ఇవ్వాలని ఆదేశించింది. అందులో కొంతమంది అసలు తాము దరఖాస్తే చేయలేదని సమాధానం ఇవ్వడం గమనార్హం. మరి కొందరి ఇంటి చిరునామా తప్పుగా తేలింది. ఇంకొందరు అసలు సమాధానమే ఇవ్వ లేదు. దీంతో అనుమానాలు మరింతగా బలపడుతున్నాయి, కాగా నిబంధనల ప్రకారం మార్కులు, ప్రతిభ ఆధారంగా అభ్యర్ధులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. మూడేళ్ల చొప్పున జీఎన్ఎం కోర్స్కు 1800, బీఎస్సీ నర్సింగ్కు 2,700 మార్కులు ఉంటాయి. ఉద్యోగ నియామకాల్లో ఈ మార్కులతో పాటు సర్వీస్, అకడమిక్ వెయిటేజ్ మార్కులు ఉంటాయి. ఈ మార్కుల మెరిట్తో పాటు ఇతర నిబంధనలను పరిగణలోకి తీసుకొని ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.దీంతో అభ్యర్ధులు దొంగ మార్కుల జాబితాను సమర్పించినట్లు సమాచారం. ● గతంలో కూడా బోగస్ సర్టిఫికెట్స్ వ్యవహరం పెద్ద దుమారమే లేపింది. ఈ వ్యవహరానికి సంబంధించి కొందరిపై ఆరోపణలు ఉన్నాయి. ఇప్పుడు వెలుగు చూస్తున్న బోగస్ సర్టిఫికెట్స్ కూడా వారిపనే అనే సందేహలు వ్యక్తం అవుతున్నాయి. వారి పేర్లు తొలగించాం బోగస్ సర్టిఫికెట్స్గా నిర్ధారణ అయిన అభ్యర్ధుల పేర్లను ఎంపిక జాబితా నుంచి తొలగించాం. ఈ అంశాలను ఉన్నతాధికారులకు విన్నవించాం. నిబంధనల ప్రకారం అభ్యర్థు ల ఎంపిక జాబితాను సిద్ధం చేస్తాం.త్వరలోనే కౌన్సెలింగ్ చేపడతాం. – రామగిడ్డయ్య, ఆర్డీ, వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం -
నేడు వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నేటి నుంచి రెండు రోజులు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా సోమవారం సాయంత్రం 5గంటలకు ఆయన హెలీకాప్టర్ ద్వారా పులివెందులలోని భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పులివెందులలోనే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా పులివెందుల నుంచి ఇడుపులపాయకు చేరుకుంటారు. అక్కడ ఉదయం 7.30గంటల నుంచి 8.15గంటల వరకు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అనంతరం పులివెందులకు చేరుకుంటారు. ఉదయం 9.30గంటల నుంచి మధ్యాహ్నం 3.30గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో మమేకం అవుతారు. మంగళవారం సాయంత్రం పులివెందుల భాకరాపురం హెలీప్యాడ్ నుంచి బెంగుళూరుకు బయలుదేరి వెళతారని పార్టీ వర్గాలు తెలిపాయి. నియామకం కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం పరిధిలోని బీఈడీ, లా కళాశాలల పరిశీలన, పర్యవేక్షణకు కమిటీని నియమిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ తెలిపారు. కళాశాలల యాజమాన్యాలు తరగతులు నిర్వహించకున్నా పరీక్షలు నిర్వహిస్తోందని విద్యార్థి, ప్రజాసంఘాల నుంచి వినతులు రావడంతో విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచా ర్య అల్లం శ్రీనివాస రావు మార్గదర్శకం మేరకు సీనియర్ ప్రొఫెసర్లతో కమిటీ ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. కమిటీ కళాశాలలను సందర్శించి వాస్తవ స్థితిగతులు తెలియజేస్తుందన్నారు. ఆ మేరకు నివేదిక ఆధారంగా కళాశాలలపై తదు పరి చర్యలు ఉంటాయని ఆమె వివరించారు. సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకోనున్న మాజీ సీఎం -
కాల్ సెంటర్ సేవలు వినియోగించుకోవాలి
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చని పేర్కొన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు. ప్రజలు 08562– 244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని తెలిపారు. ప్రజలు ఈ విషయాన్ని గుర్తించి ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని డీఆర్వో సూచించారు. నేటి నుంచి మంత్రి పర్యటన కడప సెవెన్రోడ్స్: జిల్లా ఇన్ఛార్జి మంత్రి ఎస్.సవిత రెండు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. మంత్రి సవిత సోమవారం ఉదయం పులివెందులలో స్థానిక ప్రజాప్రతినిధులతో నిర్వహించే ముఖాముఖి కార్యక్రమంలో పాల్గొంటారన్నారు. అనంతరం లింగాలలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. మధ్యాహ్నం కలెక్టరేట్లో జరిగే విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ సమావేశంలో పాల్గొంటారు. సాయంత్రం కడప నగరంలో జరిగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. రాత్రి కడప ఆర్ అండ్ బీ గెస్ట్ హౌస్ బస చేయనున్నారు. 8వ తేది ఉదయం కమలాపురం నియోజకవర్గం చెన్నూరు మండలంలో సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో పాల్గొంటారు. అనంతరం కలెక్టరేట్లో జరిగే జిల్లా సమీక్షా సమావేశంలో పాల్గొన్నారు. సాయంత్రం మంత్రి రోడ్డు మార్గాన గుంటూరుకు బయలుదేరుతారని పేర్కొన్నారు. హంసవాహనంపై సౌమ్యనాథుడు నందలూరు: ఉమ్మడి కడప జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఇందులో భాగంగా మూడోరోజు ఆదివారం ఉదయం పల్లకీసేవ జరిగింది. సౌమ్యనాథుడు మాఢవీధుల్లో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. ఈ కార్యక్రమాన్ని అర్చకులు సునీల్కుమార్, పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సాయిస్వామి ఆధ్వర్యంలో నిర్వహించారు. రాత్రి హంసవాహనంపై సరస్వతీదేవి అలంకారంలో స్వామివారు దేవేరులతో కలిసి మాడవీధుల్లో విహరించారు. భక్తులు స్వామివారికి కాయ కర్పూరం సమర్పించారు. -
బాబు మోసాలను ఎండగడదాం
కడప సెవెన్రోడ్స్: ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి కులమతాలు, రాజకీయాలు, వర్గాలకు అతీతంగా పాలన అందించారని, 2.0లో మాత్రం చంద్రబాబునాయుడుకు సినిమా చూపిస్తామని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా అధ్యక్షతన ఆదివారం నగరంలో నిర్వహించిన ఆ పార్టీ కడప నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. చంద్రబాబు ఒక బుక్ చూపిస్తుంటే వైఎస్సార్ సీపీ ప్రతి కార్యకర్త ఒక్కో బుక్ చూపిస్తారంటూ హెచ్చరించారు. 2027 ఫిబ్రవరి లేదా మార్చిలో జమిలి ఎన్నికలు వచ్చే అవకాశం ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వంపై వ్యతిరేకతతో గెలువడం మనకు వద్దని, పార్టీ సంస్థాగతంగా మరింత బలం పుంజుకుని గెలవాల్సిన అవసరం ఉందన్నా రు. కేసులకు ఎవరూ భయపడవద్దని, కార్యకర్తలకు పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అన్ని స్థానాలు గెలుచుకోవడానికి కార్యకర్తలు కష్టించి పనిచేయాలని కోరారు. హామీలు అమలు చేయకుండా ముఖ్యమంత్రి చేస్తున్న మోసాలపై తొలుత కార్యకర్తలు అవగాహన పెంచుకుని ప్రజలకు వివరించాలన్నారు. బాబు మెడలు వంచైనా సూపర్ సిక్స్ అమలు చేయించాలన్నారు. కార్యకర్తల నిరుత్సాహం వల్లే ఓటమి వైఎస్సార్ సీపీ కార్యకర్తల్లో నిరుత్సాహం వల్లే సార్వత్రిక ఎన్నికల్లో ఓటమి చెందాల్సి వచ్చిందని నగర మేయర్ కె.సురేష్బాబు విశ్లేషించారు. బూత్ లెవెల్ కమిటీలు బాగా పనిచేసి ఉంటే అంజద్బాషా గెలుపొందేవారని తెలిపారు. కార్యకర్తలకు అండగా నిలుస్తామని, రానున్న మున్సిపల్ ఎన్నికల్లో ఒక్క డివిజన్ కూడా టీడీపీ గెలుచుకోలేదని ధీమా వ్యక్తం చేశారు. పీ4 పేరుతో ప్రజలను మభ్య పెట్టేందుకు బాబు యత్నిస్తున్నారని, పీ4 ఆయనతోనే ప్రారంభించాలన్నారు. వైఎస్సార్ సీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై కేసులు నమోదు చేస్తున్నారని పేర్కొన్నారు. పటాకులు పేల్చిన సంఘటనలో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రమేష్రెడ్డిలపై నక్సలైట్లు, తీవ్ర వాదులపై నమోదు చేసే ఆయుధాల కేసు బనాయించడం అక్రమమని దుయ్యబట్టారు. ప్రశ్నించే గొంతులను నొక్కడం అప్రజాస్వామికమన్నారు. ● కడప పార్లమెంటు నియోజకవర్గ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వం సంక్షేమ పథకాల ద్వారా ఇప్పటివరకు ప్రజలకు ఎంతమొత్తం అందజేసింది? ఇంకా ఎంత రావాల్సి ఉందనే విషయాలను కార్యకర్తలు ఇంటింటికి వెళ్లి వివరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ, నగర అధ్యక్షురాలు సీహెచ్ దీప్తిరెడ్డి, ఎస్సీ సెల్ నగర అధ్యక్షులు కంచుపాటి బాబు, మైనార్టీ సెల్ నగర అధ్యక్షుడు షఫీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు నాగేంద్ర, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త, డాక్టర్ల విభాగం జిల్లా అధ్యక్షుడు నాగార్జునరెడ్డి, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పాకా సురేష్, జోనల్ అధ్యక్షుడు ఇలియాస్, జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ ప్రసంగించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పులి సునీల్ కుమార్, బంగారు నాగయ్య యాదవ్, జమాల్వలీ, పి. రామ్మోహన్రెడ్డి, డా. సొహైల్, శ్రీరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. అన్ని డివిజన్లలో గెలుపు మనదే: అంజద్బాషా రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో కడప నగర పాలక సంస్థ పరిధిలోని 50 డివిజన్లలోనూ వైఎస్సార్సీపీదే గెలుపని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా ధీమా వ్యక్తం చేశారు. అన్ని డివిజన్లు టీడీపీకి ఏకగ్రీవం అవుతాయంటూ ఎమ్మెల్యే మాధవిరెడ్డి అంటున్నారని,కనీసం ఒక్క డివిజన్లో అయినా ఏకగ్రీవం చేసుకోవాలంటూ సవాల్ విసిరారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసులు నమోదు చేయడం తప్ప ఏడాది కాలంలో సీఎం చంద్రబాబు ఏ ఒక్క హామీ నెరవేర్చలేదన్నారు. ఎలాంటి షరతులు లేకుండా తల్లికి వందనం కింద ఒక కుటుంబంలో ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి సాయం అందిస్తామని చెప్పి ఇప్పుడు షరతులు విధించారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో 66 లక్షల మందికి పెన్షన్లు ఇస్తుండగా, బాబు వచ్చాక అందులో ఐదు లక్షలు తొలగించారన్నారు. ఏటా మూడు గ్యాస్ సిలిండర్లు ఇస్తామని చెప్పి ఒక్క దానితో సరిపెట్టడం మోసం కాదా? అని ప్రశ్నించారు.క్యూఆర్ కోడ్ విడుదల చేస్తున్న వైఎస్సార్ సీపీ నాయకులు సమావేశంలో పాల్గొన్న పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ జగన్ 2.0లో బాబుకు సినిమా కేసులకు భయపడవద్దు...అండగా ఉంటాం వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడుపి.రవీంద్రనాథ్రెడ్డి -
సహజీవనానికి అడ్డొస్తున్నాడని హత్య
జమ్మలమడుగు : తన సహ జీవనానికి అడ్డు వస్తున్నాడని షేక్షావలీ అనే యువకుడిని జాఫర్వలీ అనే వ్యక్తి హత్య చేసినట్లు జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు తెలిపారు. ఎర్రగుంట్ల పోలీసు స్టేషన్లో శనివారం ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. ఈ నెల 1వ తేదీన ఎర్రగుంట్ల మార్కెట్ యార్డు ఆవరణంలో జరిగిన షేక్షావలీ అనే యువకుడి హత్య కేసుకు సంబంధించిన వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన హసీనా భర్త 15 ఏళ్ల క్రితం మరణించాడు. ఆ తర్వాత ప్రొద్దుటూరుకు చెందిన జాఫర్వలీ అనే వ్యక్తి హసీనాతో గత కొంత కాలంగా సహజీవనం చేస్తున్నాడు. గత నెల 26వ తేదీన హసీనా కడపలో ఉన్న తన తల్లి ఇంటికి వెళ్లింది. జాఫర్వలీ ఆమె కోసం కడపకు వెళ్లాడు. అక్కడ ఉన్న హసీనా అన్న షేక్షావలీ నీవు ఇక్కడికి రావద్దు.. మా చెల్లెలిని వదలిపెట్టు అంటూ జాఫర్వలీని మందలించాడు. దీంతో షేక్షావలీపై జాఫర్వలీ కక్ష పెంచుకున్నాడు. తన సహ జీవనానికి అడ్డుగా ఉన్న అతన్ని అంతమొందించాలని పథకం పన్నాడు. అందులో భాగంగా ఈ నెల 1వ తేదీన జాఫర్వలి కడపలో షేక్షావలీ నివాసం ఉంటున్న వీధిలోకి వెళ్లాడు. అక్కడ ఎదురుపడిన షేక్షావలీతో జాఫర్ వలీ మాట్లాడి ఇద్దరం కలిసి మద్యం తాగుదాం రమ్మంటూ కడప రైల్వే స్టేషన్కు తీసుకెళ్లాడు. అక్కడ మద్యం సేవించిన తర్వాత ఎర్రగుంట్లలో కుక్కలను పట్టుకుంటే ఒక్కో కుక్కకు రూ. 300 ఇస్తారని నమ్మించి షేక్షావలీని ఎర్రగుంట్లకు పిలుచుకుని వచ్చాడు. కడప రోడ్డులో ఉన్న బ్రాందీ షాపులో తిరిగి మద్యం తాగారు. తర్వాత ఎర్రగుంట్ల పట్టణంలోని మార్కెట్ యార్డులో పాత గోడౌన్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశానికి వచ్చారు. పథకం ప్రకారం తక్కువ మోతాదులో మద్యం తాగిన జాఫర్వలీ మద్యం మత్తులో పడిపోయిన షేక్షావలీ తలపై అక్కడ ఉన్న ఇటుక, బండరాళ్లతో కొట్టి హత్య చేశాడు. స్థానికులు ఇచ్చిన సమాచారం మేరకు ఎర్రగుట్ల సీఐ నరేష్బాబు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన పోలీసులు నిందితుడు జాఫర్వలీని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచినట్లు తెలిపారు. ఈ కేసును అతి తక్కువ సమయంలో ఛేదించిన సీఐ నరేష్బాబుతో పాటు మరి కొందరు కానిస్టేబుళ్లను అభినందిస్తూ రివార్డులను అందజేయనున్నట్లు డీఎస్పీ తెలిపారు. యువకుడి హత్య కేసును ఛేదించిన పోలీసులు -
వైఎస్సార్సీపీ నాయకులకు స్విమ్స్లో వైద్య పరీక్షలు
సాక్షి టాస్క్ఫోర్స్ : కడపలో మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు పులివెందులలోని రింగ్రోడ్డు చుట్టూ ఉన్న వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ తోరణాలు, జెండాలు కట్టిన విషయం విదితమే. దీనిపై అప్పట్లో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, ఇతర వైఎస్సార్సీపీ నాయకులు పులివెందుల డీఎస్పీని, మున్సిపల్ కమిషనర్ను కలిసి టీడీపీ తోరణాలు తొలగించాలని వినతిపత్రాలు సమర్పించారు. అధికారులు స్పందించకపోవడంతో మున్సిపల్ చైర్మన్తోపాటు ఇతర వైఎస్సార్సీపీ నాయకులు వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న తోరణాలను తొలగించారు. వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసు అప్పట్లో జిల్లాలో ఉన్న హోం శాఖ మంత్రి అనిత, పులివెందుల టీడీపీ నాయకుల ఆదే శాల మేరకు పోలీసులు దాదాపు 18 మంది వైఎస్సార్సీపీ నాయకులపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. వీరిలో 13 మందిని అరెస్టు చేసి వారిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. అనంతరం వారిని పులివెందుల మెజిస్ట్రేట్ ఎదుట హాజరు పరచగా అక్కడ వైఎస్సార్ సీపీ నాయకులు పార్నపల్లె కిశోర్, సాతుపాటి రాజేష్, తావేటి మల్లికార్జున, షేక్ మస్తాన్, పార్నపల్లి వెంకట చలపతి, సాతుపాటి వెంకటపతిలు తమను పోలీసులు అకారణంగా కొట్టారని మెజిస్ట్రేట్ ఎదుట వాపోయారు. దీంతో పులివెందుల మెజిస్ట్రేట్ వారికి పులివెందుల గవర్నమెంట్ జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించారు. రిపోర్టుల్లో అవకతవకలు అప్పట్లో పులివెందుల మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు ఆరుగురికి పులివెందుల జనరల్ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించారు. ఈ వైద్య పరీక్షలనివేదికల్లో అనేక అవకతవకలు జరిగాయని సమాచారం. వైద్య పరీక్షలు నిర్వహించే సమయంలో వైద్యులు, సూపరింటెండెంట్పై పులివెందుల పోలీసులు అధికార పార్టీ నాయకులచే ఒత్తిడి తెచ్చి తమకు అనుకూలంగా నివేదికలు తయారు చేసుకున్నారు. దీంతో ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు వైద్య పరీక్షల నివేదికను సవాల్ చేస్తూ హైకోర్టులో పిటీషన్ వేశారు. ఈ నేపథ్యంలో కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించాలని హైకోర్టు ఆదేశించింది. ఆరుగురికి మరలా కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి కేంద్రంగా వైద్య పరీక్షలు నిర్వహించారు. అక్కడ పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, సీఐలు చాంద్బాషా, వెంకట రమణ పెద్ద ఎత్తున పైరవీలు చేశారు. వీరు కర్నూలు ప్రభుత్వ ఆస్పత్రి సూపరింటెండెంట్తో మంతనాలు జరపడం మీడియా సాక్షిగా బయట పడింది. అంతేకాకుండా కర్నూలు డీఎస్పీ కూడా తమకేమాత్రం సంబంధం లేకున్నా ఆస్పత్రికి వెళ్లి నివేదికలను మేనేజ్ చేసినట్లు సమాచారం. ఈ పరిస్థితిలో మరలా ఆరుగురు వైఎస్సార్సీపీ నాయకులు తమకు జరిగిన అన్యాయంపై సాక్ష్యాధారాలతో హైకోర్టుకు నివేదించి ప్రైవేటు కంప్లైంటు వేశారు. దీంతో హైకోర్టు మరలా వీరికి తిరుపతి స్విమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని పులివెందుల అర్బన్ సీఐ చాంద్బాషాను ఆదేశించింది. స్విమ్స్లోనైనా న్యాయం జరిగేనా..!హైకోర్టు ఆదేశాలతో వైఎస్సార్సీపీ నాయకులను శనివారం ఉదయం 7 గంటలకు పులివెందుల నుంచి అర్బన్ సీఐ చాంద్బాషా ఆధ్వర్యంలో తిరుపతి స్విమ్స్కు తీసుకెళ్లారు. అయితే అప్పటికే అక్కడికి చేరుకున్న పులివెందుల డీఎస్పీ మురళీనాయక్, రూరల్ సీఐ వెంకట రమణలు నివేదికలు తమకు అనుకూలంగా ఉండాలని మేనేజ్ చేసినట్లు సమాచారం. నిష్పక్షపాతంగా వైద్య పరీక్షలు నిర్వహిస్తే తమ బండారం ఎక్కడ బయటపడుతుందోనని అధికార పార్టీ నాయకులతో స్విమ్స్ ఆస్పత్రి పెద్దలపై ఒత్తిడి తెస్తున్నట్లు తెలిసింది. వైఎస్సార్ సీపీ నాయకులకు ప్రస్తుతం రక్త పరీక్షలు నిర్వహించి మిగిలిన పరీక్షలు తర్వాత నిర్వహిస్తామని ఆస్పత్రిలో అడ్మిట్ చేసుకున్నారు. ఇక్కడైనా తమకు న్యాయం జరగాలని బాధితులు కోరుతున్నారు. టీడీపీ తోరణాల తొలగింపు ఘటనలో అక్రమ కేసు పోలీసుల థర్డ్డిగ్రీపై హైకోర్టును ఆశ్రయించిన వైఎస్సార్సీపీ నాయకులు తిరుపతి స్విమ్స్లో వైద్య పరీక్షలు నిర్వహించాలని ఆదేశించిన హైకోర్టు -
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ సమస్యలు పరిష్కరించాలి
కడప కార్పొరేషన్ : డాక్టర్ వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. శనివారం యూనివర్సిటీ వద్ద విద్యార్థులు చేస్తున్న నాలుగో రోజు నిరవధిక నిరాహార దీక్షలకు ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వెనుకబడిన రాయలసీమలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆర్కిటెక్చర్ యూనివర్సిటీని నెలకొల్పారన్నారు. గత ప్రభుత్వంలోనే జీఓ నంబర్–42 ద్వారా యూనివర్సిటీలో లెక్చరర్లు, ప్రొఫెసర్ల పోస్టులను భర్తీ చేసేందుకు నోటిఫికేషన్ ఇచ్చారన్నారు. ఆ పోస్టులను ఈ ప్రభుత్వం భర్తీ చేసి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్చర్(సీఓఏ) పర్మిషన్ తీసుకోవాలన్నారు. ప్రభుత్వం చొరవ చూపి సీఓఏ అనుమతి వచ్చేలా చర్యలు తీసుకొని యూనివర్సిటీకి కేటాయించిన స్థలం శాశ్వత భవనాలు నిర్మించాలని కోరారు. మంత్రి లోకేష్ స్పందించపోతే పెద్ద ఎత్తున ఉద్యమం విద్యార్థుల దీక్షలకు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు పి. సాయిదత్త, ఏఐఎస్ఫ్ రాష్ట్ర అధ్యక్షుడు జి. వలరాజు, ఎస్ఎఫ్ఐ జిల్లా కార్యదర్శి వి. రవి తదితరులు మద్దతు ప్రకటించి దీక్షల్లో కూర్చున్నారు. ఈ సమస్యపై మంత్రి నారా లోకేష్ వెంటనే స్పందించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం నాయకులు శివారెడ్డి, సాయి కుమార్రెడ్డి, ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షుడు రాజ శేఖర్ రెడ్డి, ఏఐఎస్ఎఫ్ జిల్లా సహాయ కార్యదర్శి అరుణ్, నగర కార్యదర్శి తేజ పాల్గొన్నారు. సాయిరెడ్డి, రామ్, మేఘసాయి, పవిత్ర, సుష్మ, సుధీర్, సుధాకర్, ఆదిత్య, వసంత్, సింధు, మోహన్, మనోజ్ దీక్షల్లో కూర్చున్నారు. ఎమ్మెల్యేకు వినతిపత్రం కడప ఎడ్యుకేషన్ : ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ విశ్వవిద్యాలయం సమస్యను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల విద్యార్థి యువజన సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. ఈ మేరకు శనివారం కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్యరెడ్డిని కలిసి వినతిప్రత్రం సమర్పించారు. ఎమ్మెల్యేను కలిసిన వారిలో ఐక్యవేదిక నాయకులు ఎం.అంకన్న, సుబ్బారాయుడు, జయవర్ధన్, నాగరాజు, నాగేశ్వరరావు, మహేష్ ఉన్నారు. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ నాలుగో రోజుకు చేరిన విద్యార్థుల రిలే నిరాహార దీక్షలు -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీడే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు రెండో రోజు శనివారం ఉత్సాహంగా సాగాయి. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో అనంతపురం జట్టు భారీ స్కోరు చేసింది. శనివారం రెండవ రోజు 139 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 82.2 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 486 పరుగులు చేసి డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి అద్భుతంగా బ్యాటింగ్ చేసి 267 బంతుల్లో 30 ఫోర్లు, 12 సిక్సర్లతో 251 పరుగులు చేశాడు. జయంత్ కృష్ణ 79 పరుగులు, సందీప్ రెడ్డి 55 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మహిత్ తన చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. భార్గవ్ 2 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 26 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 115 పరుగులు చేసింది. ఆ జట్టులోని టీవీ సాయి ప్రతాప్రెడ్డి 2 వికెట్లు తీశాడు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండవ రోజు 14 పరుగుల ఓవర్ నైట్ స్కోరు తొలి ఇన్నింగ్స్తో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 69.1 ఓవర్లలో 318 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సిద్దు 74 పరుగులు, వరుణ్ 64 పరుగులు, సాయి చరణ్ 60 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 14 ఓవర్లలో ఒక వికెట్ కోల్పోయి 63 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. 251 పరుగులు చేసిన అనంతపురం బ్యాట్స్మన్ కేహెచ్ వీరారెడ్డి 486 పరుగుల భారీ స్కోరు చేసిన అనంతపురం జట్టు -
10న మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్
– కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : జిల్లాలోని ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలలు, జూనియర్ కళాశాలల్లో ఈనెల 10వ తేదీ మెగా పేరెంట్స్, టీచర్స్ మీట్ 2.ఓ నిర్వహిస్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పాఠశాలలు, కళాశాలల అభివృద్ధి, విద్యార్థుల ఆరోగ్యం, ప్రతిభ వంటి అంశాలను తల్లిదండ్రులకు ఈ సందర్భంగా తెలియజేస్తామన్నారు. ఆ రోజు ఉదయం 10.00 గంటలకు జిల్లా వ్యాప్తంగా కార్యక్రమాన్ని ప్రారంభిస్తామన్నారు. స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులను ఆహ్వానిస్తున్నామన్నారు. విద్యార్థులు, టీచర్లతో కమిటీలు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ముఖ్యంగా తమ పిల్లల విద్యా పురోగతిని తెలుసుకునేందుకు వీలుగా తల్లిదండ్రులకు సమగ్ర పురోగతి కార్డులను అందజేస్తామన్నారు. విద్యార్థులకు రోజూ అందించే మధ్యాహ్న భోజనాన్ని ఆరోజు తల్లిదండ్రులకు కూడా వడ్డిస్తామని తెలిపారు. తమ తల్లికి నమస్కరిస్తూ ప్రతి విద్యార్థి ఒక మొక్క నాటే కార్యక్రమాన్ని చేపడుతున్నామన్నారు. స్కూలు అబివృద్ధి కమిటీలు, పూర్వ విద్యార్థులు కూడా కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. గతంలో ఎన్నడూ లేని విధంగా రాష్ట్ర ప్రభుత్వం విద్యపై అధిక బడ్జెట్ కేటాయిస్తోందని పేర్కొన్నారు. పాఠశాలలు ప్రారంభించిన తొలిరోజే విద్యార్థులకు యూనిఫామ్స్, బ్యాగులు, పుస్తకాలు వంటివి అందిస్తున్నామన్నారు. తల్లికి వందనం డేటా బేస్లో కేంద్రీయ విద్యాలయ పిల్లల పేర్లు లేకపోవడం వల్ల వారికి తల్లికి వందనం అందలేదని తెలిపారు. సాంకేతిక కారణాలను సరిదిద్ది మెగా పేరెంట్స్, టీచర్స్మీట్కు ముందే వీరందరికీ తల్లికి వందనం కింద సాయం అందిస్తామని ఒక ప్రశ్నకు సమాధానంగా అన్నారు. ఈ సమావేశంలో జాయింట్ కలెక్టర్ అదితిసింగ్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు పాల్గొన్నారు. -
భర్తపై వేధింపుల కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని పెనికలపాడు గ్రామానికి చెందిన నాగవేణి అనే మహిళ తన భర్త వేధిస్తున్నాడని ఫిర్యాదు చేయడంతో శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు నాగవేణికి కడపకు చెందిన వెంకటసుబ్బయ్యతో 13 ఏళ్ల క్రితం వివాహమైంది. మద్యానికి బానిసైన అతను గత 2 సంవత్సరాల నుంచి భార్యను శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. వేధింపులు భరించలేని నాగవేణి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో సెక్యూరిటీ గార్డు మృతి కమలాపురం : కడప–తాడిపత్రి ప్రధాన రహదారిలో మండలంలోని టి. చదిపిరాళ్ల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో కమలాపురం పట్టణం రాం నగర్కు చెందిన ముద్దల బాలాజీ (29) అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. మృతుడు మండలంలోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీలో సెక్యూరిటీ గార్డుగా విధులు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం బాలాజీ తన విధులు ముగించుకుని ఇంటికి వస్తున్న క్రమంలోమార్గ మధ్యంలో టి.చదిపిరాళ్ల వద్దకు రాగానే కమలాపురం నుంచి ఎర్రగుంట్ల వైపు వెళ్తున్న లారీ బలంగా ఢీ కొంది. ఈ ఘటనలో తలకు బలమైన గాయం కావడంతో బాలాజీ అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ విద్యా సాగర్ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును అడిగి తెలుసుకున్నారు. శవ పంచనామా నిర్వహించి పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్కు తరలించారు. మృతుని కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. కాగా మృతునికి భార్య, ఇద్దరు చిన్న వయస్సు గల కుమార్తెలు ఉన్నారు. కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. బాలాజీ మృతితో కాలనీలో విషాద ఛాయలు అలుముకున్నాయి. -
ఈ యాప్పై ఓ లుక్ వేయాల్సిందే !
ఖాజీపేట : ప్రతి మనిషికి ఆశ ఉంటుంది.. తక్కువ పెట్టుబడి డబ్బుతో ఎక్కువ లాభం వస్తుందంటే మనిషి కనీస వివేకం కోల్పోతాడు. మనుషుల్లోని ఈ బలహీనతను ఆధారంగా చేసుకుని లుక్ యాప్ ద్వారా భారీ దోపిడీ చేసిన సంఘటన కొత్తగా వెలుగులోకి వచ్చింది. సైబర్ నేరాల పట్ల కేంద్ర ప్రభుత్వం ఎంతగా అవగాహన కల్పిస్తున్నా కొత్త కొత్త పద్ధతుల్లో మోసాలు చేస్తూ అత్యాశపరులను సైబర్ నేరగాళ్లు బురిడీ కొట్టిస్తూనే ఉన్నారు. వివరాల్లోకి వెళితే.. లుక్ యాప్ ద్వారా ఒక సారి డిపాజిట్ చేస్తే ప్రతిరోజు ఆదాయం పొందవచ్చన్న కొత్త రకమైన ఆలోచన ద్వారా సైబర్ నేరగాళ్లు కొత్త రకమైన యాప్ను తయారు చేశారు. ఈ యాప్ గురించి వాట్సాప్ ద్వారా అలాగే వివిధ రకాల సోషల్ మీడియా మాధ్యమాల ద్వారా విస్తృత ప్రచారం కల్పించారు. రోజు వారి ఆదాయం వారంలో డబ్బు విత్డ్రా చేసుకోవచ్చని అందరిని బురిడీ కొట్టించారు. ఇదికాక ఒకరు డిపాజిట్ చేసిన తరువాత మరో 10 మందిని డిపాజిట్ చేయిస్తే వారి కి ప్రమోషన్ ద్వారా అదనపు ఆదాయం వస్తుందని మోసానికి పాల్పడ్డారు. అలాగే డిపాజిట్ చేసిన వ్యక్తి అమైంట్ను బట్టి వారికి రోజు ఆదాయం వస్తుందని ఆశ చూపించారు. ఇందులో రూ.2వేల నుంచి రూ.70లక్షల వరకూ డిపాజిట్ చేసే ఏర్పాట్లు చేశారు. డిపాజిట్ మొత్తాన్ని బట్టి రోజు వారి ఆదాయం గురించి వివరించారు. రూ.2వేలు డిపాజిట్ చేస్తే ప్రతి రోజు రూ.150, రూ.70వేలకు రోజుకు రూ.2500 ఇలా వివిధ కేటగిరీలను బట్టి రెండేళ్లపాటు ఆదాయం వస్తుందని నమ్మించారు. అలాగే వారంలో ఒకసారి వచ్చిన మొత్తాన్ని విత్డ్రా చేసుకునే అవకాశం కల్పించారు. మొదట్లో రెండు వారాలు అందరికి డబ్బులు బాగానే వేశారు. దీంతో నమ్మకం కలిగి చాలా మందిని ఈ లుక్ యాప్లోకి చేర్పించారు. సభ్యుల సంఖ్య వందల నుంచి వేలకు చేరింది. 25 నుంచి పని చేయని యాప్.. వందల సంఖ్య నుంచి వేల సంఖ్యలోకి చేరిన బాధితులు ఇలా లక్షల్లో యాప్లో డబ్బులు వేశారు. ఒక్క ఖాజీపేట మండలంలోనే 200 మంది బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. ఒక్కొక్కరు రూ.2వేల నుంచి సుమారు మూడు లక్షల రూపాయల వరకూ డిపాజిట్ చేసినట్లు సమాచారం. ఒక్క ఖాజీపేటలోనే రూ.20లక్షల నుంచి రూ.30 లక్షల డబ్బు డిపాజిట్ చేసి మోసపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా 2వేల మందికి పైగానే బాధితులు ఉన్నట్లు తెలుస్తోంది. జిల్లా మొత్తం చూస్తే సుమారు రూ.30 కోట్ల మేరకు డబ్బు డిపాజిట్ చేసి మోసపోయినట్లు అంచనా. పూర్తి స్థాయిలో విచారణ జరిగితే ఈ మొత్తం ఇంకా భారీగా పెరిగే అవకాశం ఉంది. కడపలోని ఒక్క వాట్సాప్ గ్రూప్ యాప్లోనే రూ.3కోట్లు పోయినట్లు సమాచారం. ఇలాంటి గ్రూపులు జిల్లాలో చాలా ఉన్నాయని తెలుస్తోంది. అయితే గత నెల 25 నుంచి సాంకేతిక కారణాలతో యాప్ను పూర్తిగా రద్దు చేసినట్లు బాధితులు వాపోతున్నారు. డిపాజిట్ సొమ్ముకు రోజువారి డబ్బు విత్డ్రా లేకపోవడం, యాప్ పనిచేయక పోవడంతో మోసపోయినట్లు బాధితులు గుర్తించారు. తెర వెనుక ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగులు.. ఖాజీపేట మండలంలో ఈ యాప్ ద్వారా రోజువారి ఆదాయం వస్తుందని ఒక ప్రభుత్వ ఉద్యోగి ప్రచారం చేసినట్లు తెలుస్తోంది. అతని ద్వారా చాలా మంది అతని మాటలు నమ్మి ఈ యాప్లో డబ్బులు డిపాజిట్ చేసి మోసపోయినట్లు తెలిసింది. జిల్లా వ్యాప్తంగా ముగ్గురు ప్రభుత్వ ఉద్యోగుల ద్వారా ఈ యాప్లోని డిపాజిట్ల బాగోతాన్ని ప్రచారం చేసి అందులో సభ్యులుగా అందరిని చేర్పించినట్లు బాధితులు చెబుతున్నారు. యాప్లో సభ్యులుగా చేర్చిన వారిని డబ్బుల విషయం గురించి అడిగితే తమకేం సంబంధం లేదన్నట్లు చెబుతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఫిర్యాదులకు సిద్ధం.. లుక్ యాప్ బాధితులకు ప్రత్యేక వాట్సాప్ గ్రూపు ఉన్నట్లు తెలుస్తోంది. అందులో బాధితులంతా యాప్ ద్వారా మోసపోయిన తీరుపై చర్చించుకుంటున్నారు. అయితే ఈ యాప్లో అధికంగా 80 శాతం మహిళలు బాధితులుగా ఉన్నట్లు తెలుస్తోంది. వీరిలో ఉద్యోగుల సంఖ్య కూడా ఎక్కువగానే ఉంది. అయితే చాలా మంది ఈ యాప్ వల్ల బాధితులం అని తెలిస్తే ఎక్కడ పరువు పోతుందో అని కేసు పెట్టేందుకు ముందుకు రావడం లేదు. మరికొందరు మా ఖర్మ కొద్ది డబ్బులు పోగొట్టుకున్నాం ఎవ్వరికై నా తెలిస్తే పరువు పోతుంది ఎందుకులే అని వదిలేస్తున్నారు. ఇంకొందరు ఇప్పటికే సైబర్ పోలీసులకు నేరుగా, మరికొందరు ఆన్లైన్లో ఫిర్యాదు చేసినట్లు తెలుస్తోంది. లుక్ యాప్ మోసగాళ్లకు శిక్షపడేలా అధికారులు చర్యలు తీసుకోవాలని బాధితులు కోరుతున్నారు. లుక్ యాప్ పేరుతో భారీ దోపిడీ ఒకసారి డిపాజిట్ చేస్తే రోజూ డబ్బులు ఇస్తామని మోసం వెలుగులోకి వచ్చిన కొత్తరకం మోసం జిల్లా వ్యాప్తంగా 2వేల మంది బాధితులు రూ.30 కోట్లు దోపిడీ చేసినట్లు సమాచారం -
రేపు మాజీ సీఎం వైఎస్ జగన్ రాక
పులివెందుల: మాజీ సీఎం,వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండు రోజుల జిల్లా పర్యటనకు రాను న్నారు. సోమవారం సాయంత్రం పులివెందులకు చేరుకొని.. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు. మంగళవారం ఉదయం మహానేత వైఎస్సార్ జయంతి సందర్భంగా ఇడుపులపాయకు చేరుకుని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించనున్నారు. అక్కడ నుంచి పులివెందులకు చేరుకుని తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. అదే రోజు సాయంత్రం బెంగుళూరుకు బయలుదేరుతారని పార్టీ వర్గాలు తెలిపాయి. రెండు రోజుల పర్యటన వివరాలు వైఎస్ జగన్ ఈనెల 7న సాయంత్రం పులివెందులలో ని భాకరాపురం హెలీప్యాడ్కు 5గంటలకు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి పులివెందులలో బస చేయనున్నారు. ఈనెల 8న ఉదయం 6.45గంటలకు పులివెందులలోని తన స్వగృహం నుంచి వాహనంలో రోడ్డు మార్గాన బయలుదేరి 7.30గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. 8.15గంటల వరకు ఘాట్ వద్ద నివాళులర్పిస్తారు. అనంతరం రోడ్డు మార్గాన బయలుదేరి 8.45గంటలకు పులివెందుల క్యాంప్ ఆఫీస్కు చేరుకుంటారు. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 3.30 వరకు పులివెందుల క్యాంప్ ఆఫీస్లో ప్రజలతో మమేకం కానున్నారు. అనంతరం బెంగళూరుకు బయలుదేరుతారు. -
పెద్దదర్గాకు ఉత్సవ శోభ
కడపలోని పెద్దదర్గా కడప సెవెన్రోడ్స్: దేశంలోనే ప్రసిద్ధిగాంచిన మహిమాన్విత సూఫీ క్షేత్రం కడప పెద్దదర్గా ఉత్సవ శోభ సంతరించుకుంది. దర్గాలో ప్రధాన గురువులైన హజరత్ ఖ్వాజా సయ్యద్షా పీరుల్లా మాలిక్ సాహెబ్ గంధోత్సవాన్ని ఆదివారం ఘనంగా నిర్వహించనున్నా రు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లు దర్గా నిర్వాహ కులు పూర్తి చేశారు. గంధోత్సవాన్ని దర్శించి తరించేందుకు శనివారం నాటికే వివిధ ప్రాంతాల నుంచి భక్తులు దర్గా ఆవరణకు చేరుకున్నారు. తొలి గురువు నేపధ్యం మహమ్మద్ ప్రవక్త వంశీయులుగా చెప్పబడే దర్గా తొలి గురువు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ 16వ శతాబ్దంలో కర్ణాటకలోని బీదర్ నుంచి కడపకు వచ్చారు. ప్రజలకు ఆధ్యాత్మిక విషయాలను బోధి స్తుండేవారు. భగవంతుని దృష్టిలో మనుషులంద రూ ఒక్కటేనని, కలిసిమెలిసి జీవించాలంటూ ఆయ న ప్రబోధిస్తూ వచ్చారు. అనతి కాలంలోనే ఆయన మహిమలు, గొప్పతనం చుట్టుపక్కల ప్రాంతాలకు వ్యాపించాయి. ఆయన గొప్పతనాన్ని వినడమే కాకుండా ప్రత్యక్షంగా చూసిన సిద్దవటం నవాబు శిష్యునిగా మారారు. హజరత్ పీరుల్లామాలిక్ సాహె బ్ ఇక్కడే జీవ సమాధి పొందారు. సుప్రసిద్ధ హిందూ ధార్మికవేత్త, ఆర్ట్ ఆఫ్ లివింగ్ వ్యవస్థాపకులు పద్మవిభూషణ్ పండిట్ రవిశంకర్ ఓమారు పెద్దదర్గాను దర్శించారు. దర్గా సందర్శన వల్ల తనకు ఎనలేని ఆత్మసంతృప్తి, ప్రశాంతత లభించాయని తెలిపారు. ప్రధాన గురువు మజార్ వద్ద ఏదో తెలియని ఆకర్శణ శక్తి ఉందన్నారు. దర్గా నిర్వాహకుల అనుమతితో ఆయన కాసేపు మజా ర్ వద్ద కూర్చొని ధ్యానంలో గడపడం విశేషం. నేటి కార్యక్రమాలు .. హజరత్ ఖాజా సయ్యద్ షా పీరుల్లా మహమ్మద్ మహమ్మదుల్ హుస్సేని చిస్టివుల్ ఖాద్రి సాహెబ్ గంధం ఉత్సవంలో భాగంగా ఆదివారం ఉదయం 7 నుంచి రాత్రి 10 గంటల వరకు గంధ మహోత్సవం జరగనుందని దర్గా ప్రతినిధులు తెలిపారు. మొహర్రం నెల 10వ రోజు గురువులు జీవ సమాధి పొందిన రోజును పురస్కరించుకుని ఈ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. నేడు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ గంధోత్సవం ఏర్పాట్లు పూర్తి చేసిన దర్గా నిర్వాహకులు -
శల్యసారధ్యం వహిస్తున్న సర్కార్
వైఎస్సార్ ఏఎఫ్యూపై రాష్ట్ర ప్రభుత్వం శల్యసారధ్యం వహిస్తుంది. వెరసి సీఓఏ గుర్తింపు ఇచ్చేందుకు నిరాకరించింది. అప్పటి వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్కార్ 2023 అక్టోబరులో విశ్వవిద్యాలయాల్లో రెగ్యులర్ అధ్యాపక నియామకాలకు నోటిఫికేషన్ జారీ చేసింది. కాగా, అప్పట్లో టీడీపీ అండ్ కో విశ్వవిద్యాలయ నియామకాలపై కోర్టుకెళ్లి నియామక ప్రక్రియను నిలిపివేసింది. రెగ్యులర్ అధ్యాపకులు లేకపోవడంతో సీఏఓ గుర్తింపు నిచ్చేందుకు నిరాకరించింది. ఈ కారణంగా ఈఏడాది కోర్సు పూర్తి చేసుకోనున్న 63 మంది విద్యార్థుల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ● యూనివర్శిటీకీ గుర్తింపు రాకుంటే వచ్చే ఏడాది 2027లో కోర్సు పూర్తి చేసుకునే విద్యార్థులకు సైతం ఇక్కట్లు తప్పవని పలువురు వివరిస్తున్నారు. కాగా, పాలకులు, అధికారులు స్పందించాల్సిందిపోయి విద్యార్థులకు ఉన్న వసతి గృహాలను సైతం ఖాళీ చేయించడం, మూసి వేయించడం, 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు సైతం నిర్వహించకపోవడం అను మానాలకు దారి తీస్తోంది. ఈ ఏడాది ఏడీ సెట్ నోటిఫికేషన్ విడుదల చేయలేదు. విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు నిలిపివేయడం, విశ్వ విద్యాలయ ప్రాధాన్యత తగ్గించడం, తద్వారా ఇక్కడి నుంచి తరలించడమో, లేదా మూసి వేయడమో చేయాలన్న కుట్ర కోణం దాగి ఉన్నట్లు పలువురు భావిస్తున్నారు. -
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. బద్వేల్కు చెందిన బీసీ సూరారెడ్డి, జమ్మలమడుగుకు చెందిన ఎంబీ శ్రీనివాసులరెడ్డి, కమలాపురానికి చెందిన షేక్ ఇస్మాయిల్ గఫారి, కిశోర్ బూసిపాటిలను రాష్ట్ర సంయుక్త కార్యదర్శులుగా నియమించారు. బ్రహ్మంగారి సన్నిధిలో ఆమని బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర సన్నిధిలో శనివారం సాయంత్రం సినీ యాక్టర్ ఆమని స్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. పూర్వపు మఠాధిపతి చిన్నకుమారుడు దత్తయ్యస్వామి దగ్గర ఉండి ప్రత్యేక పూజలు చేయించారు. ఈసందర్భంగా ఆమని మాట్లాడుతూ భవిష్య త్ కాలజ్ఞాన ప్రబోధకర్త సజీవ సమాధిని దర్శించుకోవాలన్న కోరిక నెరవేరిందని హర్షం వ్యక్తం చేశారు. అనంతరం ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారికి పూజలు నిర్వహించారు. స్థాని క మఠాధిపతి వీరకుమార స్వామితో మాట్లాడి అమ్మవారి గురించి తెలుసుకున్నారు. తిరుపతి–హిస్సార్ మధ్య ప్రత్యేక రైలు ● ప్రఖ్యాత సూఫీ క్షేత్రం అజ్మీర్ మీదుగా.. కడప కోటిరెడ్డిసర్కిల్: కడప మీదుగా తిరుపతి–హిస్సార్ మధ్య ఈనెల 9 నుంచి సెప్టెంబరు 24వ తేది వరకు ప్రత్యేక రైలును నడపనున్నా రని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. 07717/07718 నెంబరుగల రైలు ప్రతి బుధవారం తిరుపతిలో రాత్రి 11.45 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప (రాత్రి 2.30), ఎర్రగుంట్ల, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, డోన్, కర్నూలు, మహబూబ్నగర్, కాచిగూడ (మధ్యాహ్నం 3.50), నిజామాబాద్, నాందేడ్, పూర్ణ, సూర త్, వడోదర, చిత్రదుర్గ్, అజ్మీర్ (శనివారం ఉదయం 5.00), సికార్ జంక్షన్ మీదుగా హిస్సార్కు శనివారం మధ్యాహ్నం 2.05 గంటలకు చేరుతుందన్నారు. ఇదే రైలు ఈనెల 13 నుంచి సెప్టెంబరు 28 వరకు ప్రతి ఆదివారం హిస్సార్లో రాత్రి 11.15 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో బుధవారం ఉదయం 11.30 గంటలకు తిరుపతి చేరుతుందన్నారు. 96 గంటల వ్యవధిలో.. 4000 కి.మీ దూరం ప్రయా ణిస్తుందని.. ఈ అవకాశాన్ని ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. -
ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కక్షసాధింపు తగదు
గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆర్కిటెక్చర్ యూనివర్సిటీకి 110 ఎకరాల భూమిని కేటాయించి రిజిస్టర్ చేసింది. అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి యూనివర్సిటీ అభివృద్ధికి రూ.350కోట్లు మంజూరు చేశారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రూ.250కోట్లు మంజూరు చేయాలని పలుమార్లు కేంద్రానికి విన్నవించారు. కూటమి ప్రభుత్వం వచ్చాక గత ప్రభుత్వం నియమించిన 47 డైలీ వేజ్ కార్మికులను, 135 మంది సిబ్బందిని తొలగించింది. దీన్నిబట్టే ఆర్కిటెక్చర్ యూనివర్సిటీపై కక్షసాధిస్తున్నట్లు అర్థమవుతోంది. – దేవిరెడ్డి ఆదిత్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం -
పర్యావరణానికి చాలా ఉపయోగం
ప్రధాన మంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కింద ఇంటి పైకప్పు పైన సోలార్ ఫలకలు అమర్చుకుంటే పర్యావరణ కాలుష్యం తగ్గడంతోపాటు సహజ వనరులైన నీరు, బొగ్గు కొరత రాకుండా ఉంటుంది. వినియోగదారుడు ఎన్ని కిలోవాట్లయినా సౌర ఫలకలు అమర్చుకోవచ్చు. వారికి గరిష్టంగా రూ.78వేలు మాత్రమే సబ్సిడీ వస్తుంది. వినియోగదారులు ప్రతినెలా చెల్లించే విద్యుత్ బిల్లును బ్యాంకు ఈఎంఐ కడితే ఆ తర్వాత విద్యుత్ బిల్లు చెల్లించకుండా ఉచిత కరెంటు పొందవచ్చు. – హరిసేవ్యా నాయక్, ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు. కడప డివిజన్ -
తొలి అడుగులో టీడీపీ నేతల నిలదీత
ప్రొద్దుటూరు: మండలంలోని గోపవరం గ్రామ పంచాయతీ ఆచార్ల కాలనీలో శుక్రవారం టీడీపీ నేతలు ‘సుపరిపాలనలో తొలి అడుగు’ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా స్థానికులు టీడీపీ నేతలను నిలదీశారు. చాలా రోజులుగా సిమెంటు రోడ్డుపై వర్షపు నీళ్లు నిలుస్తున్నాయని, డ్రైనేజీ కాలువలు సక్రమంగా లేక ఇబ్బందులు పడుతున్నామని ప్రజలు తెలిపారు. పలుమార్లు ఈ సమస్యను పరిష్కరించాలని కోరినా స్పందించలేదని టీడీపీ నేతలపై ప్రజలు అసహనం వ్యక్తం చేశారు. స్థానికులు నిలదీయడంతో దిక్కుతోచని నేతలు.. త్వరలో సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. రోడ్డుపై నిలిచిన మురికి నీరు డ్రైనేజీ సమస్య పరిష్కరించాలని కోరిన ప్రజలు -
శాస్త్రోక్తంగా సౌమ్యనాథుడి బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ
నందలూరు: నందలూరులోని సౌమ్యనాథ స్వామి ఆలయంలో వార్షిక బ్రహ్మోత్సవాలకు శుక్రవారం సాయంత్రం అంకురార్పణ చేపట్టారు. ముందుగా సాయంత్రం 6 గంటల నుంచి పుణ్యాహవచనం, మృత్సంగ్రహణం, సేనాధిపతి ఉత్సవం అనంతరం శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాలకు అంకురార్పణ నిర్వహించారు. అర్చకులు నవధాన్యాలు, కలశస్థాపనలు, పూర్ణకుంభ ప్రతిష్ట, పుణ్యాహవచనా బియ్యం, నెయ్యి, బెల్లం, టెంకాయలు, తమలపాకులు సమకూర్చారు. పాంచరాత్ర ఆగమ పండితుల బృందంతో కలశస్థాపన చేసి హోమం నిర్వహించారు. ఆగ్నేయమూలలో వెలసి ఉన్న పుట్ట వద్ద పూజలు జరిపారు. పుట్టమన్ను సేకరించి అంకురార్పణ మంటపంలో ఏర్పాటు చేసిన 12 పాలికలలో ఉంచారు. అందులో నవధాన్యాలు చల్లి అంకురింప చేసే కార్యక్రమాలను శాస్త్రోక్తంగా నిర్వహించారు. ఉదయం మూలవర్లు, ఉత్సవర్లకు తిరుమంజనం కార్యక్రమం జరిపారు. బ్రహ్మోత్సవాల్లో నేడు : శనివారం ఉదయం ధ్వజారోహణం, రాత్రికి యాళి వాహనంపై స్వామివారి గ్రామోత్సవం నిర్వహించనున్నారు. -
షేమ్.. షేమ్!
● అధికార దర్పానికి జీ హుజూర్ అంటున్న అధికారులు ● కమలాపురం ఎమ్మెల్యే ఇంటి ప్రాంగణంలో సమీక్షకు హాజరైన అధికారులు ● ప్రభుత్వ కార్యాలయాల్లో కాకపోయినా పరుగెత్తికెళ్లిన వైనం ● నియోజకవర్గ అభివృద్ధిపైఅధికారులతో సమాలోచనలు ● పుత్తా డైరెక్షన్లోకొనసాగిన సమావేశం సాక్షి, టాస్క్ఫోర్స్: అధికార దర్పానికి సెల్యూట్ చేస్తున్న వారు కొందరైతే.. ‘నీ బాంఛన్ దొర’ అనే వారు మరికొందరయ్యారు. పోస్టింగ్స్ కోసం స్థాయిని దిగజార్చుకొని ప్రవర్తిస్తున్నారు. ప్రభుత్వ కార్యాలయంతో నిమిత్తం లేదు, ఎక్కడ సమీక్ష పెట్టినా మీరు ఆదేశిస్తే వచ్చి తీరుతామంటూ తలూపుతున్నారు. అధికార పార్టీ నేతలు ఆదేశించిందే శాసనం, చెప్పిందే వేదమని చెప్పకనే చెబుతున్నారు. ఈక్రమంలో మాచిరెడ్డిపల్లె చెట్ల కింద సమీక్ష సమావేశం ఏర్పాటు చేస్తే.. పరుగుపరుగునా అధికారులు వాలిపోయారు. ఈ దుస్థితికి వ్యవస్థలను దిగజార్చిన అధికారులు ‘షేమ్..షేమ్’ అని ప్రజాస్వామ్యవాదులు హేళన చేస్తున్నారు. ● కమలాపురం నియోజకవర్గ అభివృద్ధిపై సమీక్ష నిర్వహించేందుకు ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి సిద్ధమయ్యారు. ఆమేరకు శుక్రవారం మాచిరెడ్డిపల్లెకు రావాల్సిందిగా అధికారులకు కబురు పంపారు. జిల్లా కేంద్రంలో ఉన్నతాధికారుల సమక్షంలో సమీక్ష చేపట్టే అవకాశం ఉంది. అలా కాదు, కూడదంటే.. నియోజకవర్గ కేంద్రమైన కమలాపురంలో కూడా చేపట్టవచ్చు. ప్రభుత్వ కార్యాలయాలతో నిమిత్తం లేకుండా ఎమ్మెల్యే పుత్తా ఇంటి ప్రాంగణంలో సమీక్ష నిర్వహించడాన్ని పలువురు తప్పుపడుతున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థను గౌరవించే వారు, ఇలాంటి చర్యలకు ఉపక్రమించరని పలువురు దెప్పి పొడుస్తున్నారు. మాచిరెడ్డిపల్లెలో చెట్ల కింద సమీక్ష నిర్వహించడం ఏమిటని అభ్యంతరం చెబుతున్నారు. ప్రగతి పేరిట పెత్తనం కమలాపురం ఎమ్మెల్యేగా పుత్తా కృష్ణచైతన్యరెడ్డి అభివృద్ధిపై సమీక్ష చేపట్టడం సముచితమే. కాకపోతే ఇంటి ప్రాంగణంలో సమీక్ష నిర్వహించడమే తీవ్ర అభ్యంతరకరమని పలువురు వివరిస్తున్నారు. అదే సమీక్ష ప్రభుత్వ కార్యాలయాల్లో నిర్వహించి.. ఇతర ప్రజా ప్రతినిధులను కూడా ఆహ్వానించించి వారి సలహాలు, సూచనలు తీసుకొని ఉంటే హుందాతనం లభించేది. అలా కాకుండా ప్రజాస్వామ్య వ్యవస్థపై గౌరవం లేకపోగా తాను చెప్పిందే వేదమన్నట్లుగా.. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పుత్తా నరసింహారెడ్డితో సమీక్ష చేయించడాన్ని పలువురు తీవ్రంగా తప్పుపడుతున్నారు. ఎలాంటి అధికారిక హోదా లేకపోయినా.. పుత్తా నరసింహారెడ్డి ఆర్డీఓ జాన్ఎర్వీన్తో సమానంగా కూర్చొని అధికారులను ప్రశ్నించారని విపక్ష పార్టీ నేతలు నిలదీస్తున్నారు. ప్రజాస్వామ్య వ్యవస్థకు అనుగుణంగా అధికారులు వ్యవహరించకపోవడం, మాచిరెడ్డిపల్లెలో సమీక్షకు వెళ్లడంపై సర్వోన్నతాధికారి అభ్యంతరం చెప్పకపోవడంపై విశ్లేషకులు హేళన చేస్తుండటం గమనార్హం. -
● హాయిగా.. సురక్షితంగా..
పవిత్రమైన, సుందరమైన శేషాచలం అటవీ కొండలు, పాలకొండల సముదాయంలో గువ్వలచెరువు ఘాట్ ఉంది. ఈ ప్రాంతం అందమైన అటవీ ప్రాంతం, వర్షాకాలంలో ఎటు చూసి నా పచ్చదనం.. జలపాతాల సోయ గాలు కనువిందు చేస్తుంటాయి. అలాంటి ప్రకృతి మధ్య సొరంగ మార్గం ఏర్పాటు కావడంతో.. ఆ ఏరియా అంతా పర్యాటక ప్రాంతంగా మారే అవకాశం ఉంది. ఈ మార్గం గుండా ఇప్పటికే హైదరాబాద్, కర్నూలు, అనంతపురం, వైఎస్సార్ కడప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వాపార, వ్యవసాయ రంగానికి సంబంధించి ఉత్పత్తులు రవాణా అవుతున్నాయి. ఉదాహరణకు మన జిల్లా నుంచి సిమెంట్, మైనింగ్, అరటి, బత్తాయి తదితర వస్తువులు గువ్వలచెరువు ఘాట్ మీదుగా పీలేరు, చిత్తూరు, చైన్నె, మదనపల్లె, బెంగళూరు తదితర ప్రాంతాలకు రవాణా అవుతున్నాయి. చైన్నె, బెంగళూరు తదితర ప్రాంతాల నుంచి ఇక్కడికి ఫ్యాక్టరీలకు మిషనరీ, ఇతర పరిశ్రమలకు సంబంధించిన విడి భాగాలు, కెమికల్స్తోపాటు టమోటా తదితర కూరగాయలు, కొబ్బరి బొండాలు.. ఇలా పలు రకాల వస్తువులు భారీ వాహనాల్లో వస్తుంటాయి. వీటిలో కొన్ని వివిధ కారణాల చేత ఘాట్ మలుపుల్లో చిక్కుకొని ప్రమాదాలకు గురి అవుతున్నాయి. సొరంగ మార్గం ఏర్పాటైతే దాదాపు ఒక గంట ప్రయాణం కలిసి రావడంతోపాటు సుఖంగా.. సురక్షితంగా ప్రయాణం సాగించడానికి వీలుకలుగుతుంది. -
6 నుంచి డీఈఈ సెట్ కౌన్సెలింగ్
కడప ఎడ్యుకేషన్: డీఈఈ సెట్ ప్రవేశాలకు సంబంధించి విద్యార్థులకు ఈ నెల 6 నుంచి కౌన్సెలింగ్ ప్రారంభమవుతుందని డీఈఓ షేక్ షంషుద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. 6,7 తేదీల్లో మొదటి దశ కౌన్సెలింగ్ ఉంటుందని ఆయన పేర్కొన్నారు. 8 నుంచి 12 వరకు విద్యార్థులు ఆన్లైన్లో వెబ్ ఆప్షన్స్ ఎంచుకోవచ్చన్నారు. 13 నుంచి 16 వరకు సీట్ల కేటాయింపు, ప్రొవిజినల్ అడ్మిషన్ లెటర్ ఇవ్వడం జరుగుతుందన్నారు. 17 నుంచి 22 వరకు డైట్స్లో సర్టిఫికెట్ల పరిశీలన, చివరి అడ్మిషన్ లెటర్ ఇవ్వనున్నట్లు వివరించారు. పైన తెలిపిన షెడ్యూల్ ప్రకారం విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరు కావాలని సూచించారు. నేడు లోక్ అదాలత్ కడప అర్బన్: ‘జాతీయ లోక్ అదాలత్’ను వినియోగించుకుని సత్వర న్యాయం పొందాలని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టులలో శనివారం ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5 గంటల వరకు లోక్ అదాలత్ నిర్వహించనున్నట్లు వారు పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 24 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కడపలో 6, ప్రొద్దుటూరులో 3, రాజంపేటలో 3, రాయచోటిలో 3, బద్వేల్లో 3, లక్కిరెడ్డిపల్లి, రైల్వేకోడూరు, మైదుకూరు, జమ్మలమడుగు, పులివెందుల, కమలాపురం కోర్టులలో ఒక్కొక్క బెంచిని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మరింత సమాచారం కోసం ఫోన్ నంబర్స్: 08562 258622, 244622ను సంప్రదించాలని వివరించారు. 29న ఈశ్వరీదేవి జయంత్యుత్సవం బ్రహ్మంగారిమఠం: బ్రహ్మంగారిమఠంలో మాతా శ్రీ ఈశ్వరీదేవి 322వ జయంత్యుత్సవాలను ఈ నెల 29న నిర్వహిస్తున్నట్లు ఈశ్వరీదేవిమఠం ఈఓ జగన్మోహన్రెడ్డి తెలిపారు. ఈ ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు అమ్మవారి భక్తులు ముందుకు రావాలని ఆయన కోరారు. మఠాధిపతి శ్రీ వీరకుమారస్వామి ప్రత్యేక పూజలతో ఉత్సవాలు ప్రారంభం అవుతాయన్నారు. అమ్మవారికి ప్రత్యేక ఉత్సవాల కోసం భక్తులు సెల్ నంబర్: 9490486064కు ఫోన్ చేసి సమాచారం తెలుసుకోవాలని వివరించారు. భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ సెక్రటరీ తొలగింపు కడప ఎడ్యుకేషన్: భారత్ స్కౌట్ అండ్ గైడ్స్ సెక్రటరీగా పని చేస్తున్న ప్రమీలను ఆ పదవి నుంచి తొలగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఆమె స్థానంలో తాను జిల్లా కార్యదర్శిగా అదనపు బాధ్యతలు చేపట్టానన్నారు. గతంలో నిర్వహించిన సమావేశంలో కార్యదర్శిగా పని చేస్తున్న ప్రమీలపై సభ్యులంతా ఫిర్యాదు చేశారన్నారు. శుక్రవారం డీఈఓ కార్యాలయంలో నిర్వహించిన సమావేశానికి ఆమె హాజరు కాకపోవడంతో సభ్యుల ఆమోదం మేరకు పదవి నుంచి తొలగించినట్లు తెలిపారు. పంటల బీమా.. రైతుకు ధీమా కడప సెవెన్రోడ్స్: బీమా పంటలకు రక్షణ కవచం లాంటిదని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ తుఫాన్లు, కరువులు, అకాల వర్షాలు వంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల పంట నష్టపోయిన రైతులకు బీమా పరిహారం వస్తుందన్నారు. ఎంపిక చేసిన పంటలను సాగు చేస్తూ నిర్ణీత సమయంలో ప్రీమియం చెల్లించి నమోదు చేసుకున్న కౌలు రైతులకు సైతం బీమా అందుతుందన్నారు. ప్రధానమంత్రి ఫసల్ బీమా యోజనను రైతులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో వ్యవసాయ, ఉద్యానశాఖ అధికారులు చంద్రానాయక్, రవిచంద్రబాబు, ఎల్డీఎం జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. -
మోసం గ్యారెంటీపై ఇంటింటా ప్రచారం
ప్రొద్దుటూరు : గ్రామం.. వార్డులలో బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీపై ఇంటింటికీ వెళ్లి తెలపాలని.. చంద్రబాబు మేనిఫెస్టోను గుర్తుచేస్తూ.. కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. స్థానిక శేగిరెడ్డి కాటిరెడ్డి కల్యాణ మండపంలో శుక్రవారం సాయంత్రం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షతన నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ చంద్రబాబుది చెత్త పరిపాలన అని, అబద్ధాలతో అధికారంలోకి వచ్చారని అన్నారు. ఇచ్చిన హామీలు అమలుచేయని కారణంగా ఏడాదిలోనే వైఎస్సార్సీపీ మూడు పెద్ద కార్యక్రమాలను నిర్వహించిందన్నారు. కరెంట్ చార్జీలు, రైతులకు మద్దతు ధర, వెన్నుపోటు కార్యక్రమాన్ని పెద్దస్థాయిలో నిర్వహించామన్నారు. కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోను అమలు చేయలేదనే విషయాన్ని ప్రతిపక్ష పార్టీగా గుర్తుచేస్తూ పోరాటం చేస్తున్నామన్నారు. సీఎం చంద్రబాబు అమలు చేయని పథకాలను.. తాను చేసినట్లు చూపిస్తున్నారన్నారు. గ్రామస్థాయి కార్యకర్తల నుంచి మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి వరకు అందరిపై దొంగ కేసులు పెట్టి అరెస్టు చేయిస్తున్నారని తెలిపారు. మాజీ ఎమ్మెల్యే వల్లభనేని వంశీని 143 రోజులు అక్రమంగా జైలులో ఉంచారన్నారు. ఈ ప్రభుత్వం ఎంతోకాలం ఉండదని, టీడీపీ నేతలను గుర్తించి బ్లూబుక్లో నమోదు చేయాలని కోరారు. 2.0 జగన్ పరిపాలనను మనమందరం చూస్తామని, అపుడు కార్యకర్తలకు పెద్ద పీట వేస్తామన్నారు. చంద్రబాబు తప్పులను గుర్తుచేస్తూ పార్టీని రక్షించుకునేందుకు నిత్యం పోరాటం చేయాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో పార్టీ కార్యకర్తలకు అన్యాయం జరిగిన మాట వాస్తవమేనని రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. పార్టీకి కార్యకర్తలే పట్టుగొమ్మలని, భవిష్యత్తు అంతా కార్యకర్తలదేనన్నారు. ఏనాడు చంద్రబాబు చరిత్రలో పోరాటం చేసిన పరిస్థితి లేదన్నారు. వైఎస్తో రాజకీయ ప్రస్థానం.. వైఎస్ రాజశేఖరరెడ్డితో చంద్రబాబు రాజకీయ ప్రస్థానం మొదలైందని, ఆయన కుమారుడు అయిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్తో ఆయన పరిపాలనకు శుభం కార్డు పడుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. 75 ఏళ్ల వయసులో చంద్రబాబు తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహించారన్నారు. జగన్ పట్ల తాను అత్యంత విశ్వసనీయత కలిగి ఉన్నానని, ఆయన కోరితే దేనికై నా సిద్ధంగా ఉన్నామన్నారు. 2028లో జమిలి ఎన్నికలు జరిగితే కూటమి ప్రభుత్వానికి ఓటమి తప్పదన్నారు. 2026లో జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో వార్డు మెంబర్ నుంచి అన్ని ఎన్నికల్లో పార్టీ అభ్యర్థులను గెలిపించుకునే దిశగా కృషి చేద్దామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఈ మూడు పార్టీలు విడిపోతే ఓడిపోతామనే భయం వారికి కల్పించింది మాత్రం జగనే అన్నారు. ప్రతి కార్యకర్త, నాయకుడు ప్రతీకారంతో జగన్ను మళ్లీ ముఖ్యమంత్రిగా చేసుకునేందుకు పనిచేయాలని కోరారు. వైఎస్సార్సీపీ కడప పార్లమెంట్ పరిశీలకుడు కొండూరు అజయ్ రెడ్డి మాట్లాడుతూ పార్టీ కార్యకర్తలు క్యూఆర్ కోడ్ను స్కాన్ చేస్తే చంద్రబాబు ఇచ్చిన హామీలను తెలుసుకోవచ్చన్నారు. జగన్ను మళ్లీ సీఎం చేసుకునేందుకు సంఘటితంగా పోరాటం చేయాలని తెలిపారు. ఈ సందర్భంగా బాబు మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ పోస్టర్లను ముఖ్య నేతలు ఆవిష్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ముఖ్య నేతలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ పోరాటంతోనే తల్లికి వందనం అమలు భవిష్యత్తులో పార్టీ కార్యకర్తలకు పెద్దపీట వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
ఆలోచనకు పదును.. సృజనకు అదును
కడప ఎడ్యుకేషన్ : ఇన్స్పైర్ మనక్– 2005 అవార్డులకు వేళయింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను ప్రయోగాల వైపు నడిపించి.. వారి చిట్టి బుర్రలకు పదునుపెట్టి... కొత్త ఆవిష్కరణలకు శ్రీకారం చుట్టి.. వారిని భావి భారత శాస్త్ర వేత్తలుగా తయారుచేయాలనే లక్ష్యంతోభాగంగా భారత ప్రభుత్వ సైన్స్ అండ్ టెక్నాలజీ విభాగం(డిఎస్టి) ఏటా విద్యార్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తోంది. జిల్లా స్థాయిలో ప్రతిభ చూసిన విద్యార్థులు రాష్ట్ర, జాతీయ స్థాయిలో రాణించే అవకాశం ఉంటుంది. జాతీయ స్థాయికి ఎంపికై న విద్యార్థులకు బాల శాస్త్రవేత్తలుగా నామకరణం చేసి రాష్ట్రపతి అవార్డు అందజేస్తారు. ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు త్వరపడాల్సి ఉంది. అర్హతలు... ఎంపికలు ఇలా వైఎస్సార్ జిల్లాలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, ఎయిడెడ్, ప్రైవేటు ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులందరూ ఇన్స్పైర్ మనక్కు దరఖాస్తు చేసేందుకు అర్హు లు. వారంతా తమ సైన్సు టీచర్ను గైడ్గా ఏర్పాటుచేసుకుని ఈ పరిశోధనలో పాల్గొనాల్సి ఉంటుంది. ప్రతి పాఠశాల నుంచి ఐదు ప్రాజెక్టులు ఎంపిక చేస్తారు. స్థానిక సమస్యలను తీర్చే విధంగా ఆలోచనలుండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచన ఎంపిక చేసి అందుకు అవసరమైన ప్రాజెక్టు రూపొందించాలి. విద్యార్థి, తండ్రి పేర్లు, తరగతి నమోదు చేసి విద్యార్థికి సంబంధించిన బ్యాంకు ఖాతా, ఆధార్కార్డు నెంబర్ ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు రాత పూర్వకంగా సంబంధిత వెబ్ సైట్లో నమోదు చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతకు సంబంధించిన అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయి ప్రతిభా వంతులను ప్రకటిస్తారు. తర్వాత రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఎంపికై న ప్రాజెక్టుకు ప్రయోగం నిమిత్తం బ్యాంకు ఖాతాల్లో రూ.10 వేలు జమ చేస్తారు. ఈ దరఖాస్తుకు గడువు సెప్టెంబర్ 15వ తేదీ వరకు ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం ఇలా... ఇన్స్పైర్ అవార్డు మనాక్లో పాల్గొనేందుకు విద్యా ర్థులు ముందుగా www.inrpireawardrdrt.gov. in వెబ్సైట్ ఓపెన్ చేయాలి. స్కూల్ ఆఽథారిటీ ఆప్షన్ను ఎంపిక చేయాలి. అందులో న్యూ రిజిస్ట్రేషన్ అప్షన్ను ఎంపిక చేయాలి. పాఠశాల వివరాలను పొందుపరిచి సేవ్ చేయాలి. సంబంధిత దరఖాస్తు జిల్లా అథారిటీకి చేరుతుంది. ఆమోదించిన తరువాత మనం ఇచ్చిన మొయిల్ ఐడీకి యూజర్ ఐడితో కూడిన లింక్ వస్తుంది. ఆ ఐడీతో పాస్వర్డు క్రియేట్ చేయాలి. అనంతరం విద్యార్థుల ప్రాజెక్టు వివరాలను అందులో నమోదుచేయాలి. జాగ్రత్తలు పాటించాలి... విద్యార్థులు తయారు చేసే ప్రాజెక్టులలో స్థానిక సమస్యలను ప్రతిబింబించి.. వాటికి పరిష్కార మార్గాలు చూపేలా ఉండాలి. పాతవైనా తాజా పరిస్థితులకు అన్వయించి పరిష్కారం చూపాలి. నమూనాల పొడవు, వెడల్పు ఒక మీటరు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టు రిపోర్టులో నమూనా పరిచయం, పనిచేసే తీరు, ఉపయోగించే పరికరాలు, తయారీ విధానం, పనిచేసే తీరు. ఫలితాల అనువర్తనాలు తప్పని సరిగా ఉండాలి. ప్రాజెక్టుల పరిశీలనకు వచ్చే న్యాయ నిర్ణేతలకు నమూనా చూపించి ప్రాజెక్టు గురించి తడబాటు లేకుండా వివరించాలి. ఎంపిక పక్రియ... విద్యార్థులు తయారుచేసిన ప్రాజెక్టులు, నమూనాలను జిల్లా స్థాయి ప్రదర్శనలో ఉంచుతారు. జిల్లా స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టులను రాష్ట్రస్థాయికి పంపుతారు. అక్కడ విజయం సాధిస్తే జాతీయ స్థాయిలో పదర్శించే అవకాశం కల్పిస్తారు. జాతీయ స్థాయిలో ఎంపికై న వాటిని ఐఐటి, నీట్ వంటి ప్రతిష్టాత్మక సంస్థలకు అప్పగిస్తారు. వాటిని వారు గొప్ప నమూనాలుగా రూపొందిస్తారు. ఉత్తమ ప్రదర్శనల నుంచి జాతీయ స్థాయిలో పదర్శనలకు అవకాశం ఉంటుంది. వీటిలో పలు ప్రాజెక్టులను ఫైనల్గా ఎంపిక చేసి రాష్ట్రపతి భవన్లో జరిగే వారోత్సవాల్లో ప్రదర్శిస్తారు. ఈ ప్రాజెక్టులకు ప్ర భుత్వం పెటెంట్ హక్కులు మంజూరు చేస్తుంది. ఇన్స్పైర్మనక్ –2025కు దరఖాస్తుల ఆహ్వానం బాల మేధావులకు గొప్ప అవకాశం సెప్టెంబర్ 15వ తేదీ వరకు నమోదుకు గడువు విద్యార్థులను ప్రోత్సహించండి ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల్లో పనిచేసే సైన్సు ఉపాధ్యాయులందరూ విద్యార్థులను ప్రోత్సహించాలి. ప్రాజెక్టుల రూపకల్పనలో వారి ఆలోచనలను పరిగణనలోకి తీసుకోని నూతనత్వాన్ని ప్రతిబింబించేలా ప్రాజెక్టు సిద్ధం చేసుకోవాలి. ఇందుకు అన్ని పాఠశాలల సైన్సు ఉపాధ్యాయులు కృషిచేయాలి. అనుమానాలుంటే జిల్లా సైన్సు అధికారిని సంప్రదించాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖాధికారి ప్రతి పాఠశాల నుంచి... ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల నమోదుకు సెప్టెంబర్ 15వ తేదీ వరకు గడువు ఉంది. ప్రతి పాఠశాల నుంచి ప్రాజెక్టులు వచ్చేలా చూడాలి. ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాల నుంచి విద్యార్థులు భాగస్వాములు కావాలి. ఇందులో ప్రాథమికోన్నత పాఠశాల నుంచి మూడు, ఉన్నత పాఠశాల నుంచి 5 ప్రాజెక్టులను తప్పనిసరిగా ఆన్లైన్లో నమోదు చేయాలి. ఇందుకు ప్రతి ౖసైన్సు ఉపాధ్యాయుడు కృషి చేయాలి. – ఎబినైజర్, జిల్లా సైన్సు అధికారి -
అట్టహాసంగా ప్రమాణ స్వీకారం
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వాసవీ కన్యకాపరమేశ్వరిదేవి ఆలయంలో ఆర్యవైశ్య సభ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం శుక్రవారం అట్టహాసంగా జరిగింది. వరుసగా ఎనిమిదో సారి అధ్యక్షుడిగా బాధ్యతలు స్వీకరించిన బుశెట్టిరాంమోహన్రావు మాట్లాడుతూ ఆర్యవైశ్య సభ ఖ్యాతిని నలుదిశాల ఇనుమడింపచేస్తామని, దసరా ఉత్సవాలను మరింత వైభవంగా నిర్వహిస్తామన్నారు. ఆర్యవైశ్య సభ అధ్యక్షుడిగా బుశెట్టి రాంమోహన్రావు, ఉపాధ్యక్షుడిగా జొన్నలగడ్డ రవీంద్ర బాబు, కార్యదర్శిగా మురికి నాగేశ్వరరావు, సహాయ కార్యదర్శిగా మల్లెంకొండు ప్రతాప్, గౌరవ సభ్యులుగా వంకధార వీరభద్రయ్య, జొన్నలగడ్డ రామచంద్ర ప్రకాష్, పోలేపల్లి రాజబాబు, రేగంటి సురేష్బాబు, మురికి మల్లిఖార్జునలతో పాటు 24 మంది సభ్యులతో సభ లీగల్ అడ్వయిజర్ కొప్పర్తి మధుసూదన్ ప్రమాణ స్వీకారం చేయించారు. రాంమోహన్ రావును వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి శాలువ కప్పి సత్కరించారు. జిల్లా ఉపాధ్యక్షులు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్పిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, పిట్టా బాలాజీ, భూమిరెడ్డి వంశీధర్రెడ్డిలు పాల్గొన్నారు. అలాగే మాజీ ఎమ్మెల్యే మల్లెల లింగారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, మాజీ ఎంపీపీ నంద్యాల రాఘవరెడ్డి, జీవీ ప్రవీణ్ కుమార్రెడ్డిలతోపాటు పలువురినీ సత్కరించారు. -
నిరవధిక నిరాహార దీక్షలకు సంఘీభావం
కడప కార్పొరేషన్ : డా.వైఎస్సార్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీకి కౌన్సిల్ ఆఫ్ ఆర్కిటెక్ట్(సీఓఏ) అనుమతి వెంటనే ఇవ్వాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య డిమాండ్ చేశారు. ఆర్కిటెక్చర్ యూనివర్సిటీలో ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో విద్యార్థులు మూడు రోజులుగా చేస్తున్న నిరవధిక నిరాహార దీక్షలకు శుక్రవారం ఆయన సంఘీభావం ప్రకటించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ.350 కోట్లతో ఆర్కిటెక్చర్ అండ్ ఫైనార్ట్స్ యూనివర్శిటీని మంజూరు చేసిందన్నారు. రెగ్యులర్ ఫ్యాకల్టీ, సొంత భవనాలు, హాస్టల్ భవనాలు లేక విద్యార్థులు ఇబ్బంది పడుతున్నారన్నారు. యూనివర్సిటీకి డా. వైఎస్సార్ పేరుందనే ఈ ప్రభుత్వం కక్షసాధిస్తున్నట్లు అర్థమవుతోందన్నారు. ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, శివతేజ, అరుణ్కుమార్, ఎన్.రాజేష్, నజీర్, సుధీర్, చంద్ర, శివశంకర్, శ్రీనివాసులు, వెంకటేష్, ప్రశాంత్, మనోజ్ తదితరులు పాల్గొన్నారు. రాష్ట్రంలో ఏడీసెట్ నిర్వహించాలంటే ముందుగా కన్వీనర్, సభ్యులను ప్రభుత్వం నియమించాల్సి ఉందని ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్శిటీ ఇన్చార్జి వీసీ విశ్వనాథ్ అన్నారు. వీలైనంత త్వరగా అన్నీ సమకూరుతాయని ఆశాభావం వ్యక్తం చేశారు. -
యువతి హత్య కేసులో ముగ్గురు నిందితులకు జైలు
కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా పోరుమామిళ్ల పీపీఎస్ పరిధిలో జరిగిన మతిస్థిమితం లేని యువతి హత్య కేసులో పోరుమామిళ్ల టౌన్ బెస్త వీధికి చెందిన షేక్ జిలానీ బాషా(26), కలసపాడు మండలం కట్టకిందపల్లికి చెందిన కారు నాగేంద్ర ప్రసాద్(25), పోరుమామిళ్లలోని తురకకోట వీధికి చెందిన షేక్ మహబూబ్ బాషా(26 ) లకు పదేళ్ల జైలు శిక్ష, రూ.1000 జరిమానా విధిస్తూ కడప నాలుగో ఏడీజే కోర్టు జడ్జి జి.దీనాబాబు తీర్పు ఇచ్చారు. పోరుమామిళ్ల పీఎస్ పరిధిలోని రామాయపల్లి శ్వశానం వద్ద 2019 జూలై, 11న హత్య జరిగింది. ముగ్గురు నిందితులు మతి స్థిమితం లేని యువతిని గొంతు నులిమి హత్య చేశారు. అప్పటి వీఆర్ఓ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సీఐ మోహన్రెడ్డి కేసు నమోదు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. విచారణలో యువతి గొంతు నులిమి హత్యచేసినట్లు రుజువు కావడంతో శుక్రవారం ముగ్గురికీ పది సంవత్సరాల జైలు శిక్ష, రూ. వెయ్యి చొప్పున జరిమానా విధిస్తూ జడ్జి తీర్పు ఇచ్చారు. సీఐ మోహన్ రెడ్డి, సీఐడీ శ్రీనివాసులు, కొండారెడ్డి, వెంకట సుబ్బయ్యలను ఎస్పీ అభినందించారు. రైలు కింద పడి వ్యక్తి మృతి కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప భాకరాపేట రైల్వే స్టేషన్ మధ్య శుక్రవారం తెల్లవారుజామున రైలు కింద పడి ఒక వ్యక్తి మృతిచెందాడు. కడప రైల్వే ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి కథనం మేరకు ప్రకాశం జిల్లా త్రిపురాంతకం మండలానికి చెందిన వెంకటనారాయణ పనినిమిత్తం గుంతకల్కు రైలులో వెళుతుండగా భాకరాపేట సమీపంలో ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. తలకు బలమైన గాయమైంది. విషయం తెలుసుకున్న కడప రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లారు. గాయపడిన వ్యక్తిని కడప రిమ్స్కు తరలించారు. చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు అప్పుల బాధతో ఆత్మహత్య కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ల మధ్య కొత్త మాధవరం సమీపంలో మల్లికార్జున(38) అనే వ్యక్తి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు కింద పడి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కడప రైల్వే పోలీసులు వివరాల మేరకు మల్లికార్జున ఎలక్ట్రికల్ కాంట్రాక్టర్ వద్ద మేనేజర్ గా పని చేస్తుండే వాడు. రెండేళ్ల కిందట ఇళ్లు కట్టుకున్నాడు. ఇంటి నిర్మాణం కోసం అప్పు చేశాడు.అప్పు ఇచ్చిన వారి నుంచి ఒత్తిడి ఎక్కువ కావడంతో భరించలేక గురువారం రాత్రి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బాలల హక్కుల పరిరక్షణకు కృషి చేద్దాం కడప కోటిరెడ్డిసర్కిల్ : బాలల హక్కులను పరిరక్షించేందుకు ప్రతి ఒక్కరూ అంకిత భావంతో కృషి చేయాలని రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ సభ్యురాలు బి.పద్మావతి సూచించారు. కలెక్టరేట్లోని సమావేశ మందిరంలో బాలల హక్కుల పరిరక్షణ, చట్టాల అమలు తీరుపై సంబంధిత శాఖల అధికారులతో శుక్రవారం ఆమె సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల కమిషన్ విధులు, ఆవశ్యకతను వివరిస్తూ బాలల హక్కులపై అవగాహన ఉండాలని సూచించారు. హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పిల్లల పట్ల సున్నితత్వంతో మెలగాలని, మౌలిక వసతులు మెరుగుపర్చాలని కోరారు. కంప్లైంట్ బాక్స్ నిర్వహించాలని, నిఅన్ని కమిటీల వివరాలు ఉండాలన్నారు. హక్కులను పర్యవేక్షించేందుకు జాతీయ, రాష్ట్ర స్థాయి కమిషన్లు పనిచేస్తున్నాయని తెలిపారు. ఏవైనా లోపాలుంటే సవరించుకుంటూ ముందుకుసాగాలన్నారు. సమర్థంగా కర్తవ్యాన్ని నిర్వర్తించినప్పుడే బాలల భవితవ్యానికి బంగారు బాటలు వేసినట్లవుతుందన్నారు. చిన్నారుల సమస్యలను పరిష్కరించేందుకు 1098 టోల్ ప్రీ నంబర్కు ఫోన్ చేయాలన్నారు. ఈ కార్య్రమంలో సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి, బీసీ వెల్ఫేర్ డీడీ అంజల, మైనారిటీ వెల్ఫేర్ ఆఫీసర్ హిదయతుల్లా, ఉమెన్ పోలీస్ స్టేషన్ డీఎస్పీ బాలస్వామి, జిల్లా బాలల సంరక్షణ అధికారి సుభాష్, హాస్టల్ వెల్ఫేర్ అధికారులు పాల్గొన్నారు. హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా తాహిర్ కడప కోటిరెడ్డిసర్కిల్ : షా సోషల్ జస్టిస్ ఫర్ ఇంటర్నేషనల్ సివిల్ అండ్ హ్యూమన్ రైట్స్ కౌన్సిల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా కడపకు చెందిన తాహిర్ నియమితులయ్యారు. కడప నగరంలోని రాష్ట్ర కార్యాలయంలో ఆ కౌన్సిల్ రాష్ట్ర అధ్యక్షుడు షేక్ అలిషేర్ ఆధ్వర్యంలో రాష్ట్ర, జిల్లా కమిటీలను శుక్రవారం ఎన్నుకున్నారు. గత 16 ఏళ్లుగా సామాజిక సేవలందిస్తూ విశేష గుర్తింపు పొందిన తాహిర్ ఉపాధ్యక్షుడిగా నియమితులయ్యారు. ఈ సందర్భంగా తాహీర్ మాట్లాడుతూ కౌన్సిల్లో తనకు అప్పగించిన పదవికి తగిన న్యాయం చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో కౌన్సిల్ కడప జిల్లా అధ్యక్షుడు షాబుద్దీన్, కౌన్సిల్ రాష్ట్ర సలహాదారులు బషీర్బుఖారి, కౌన్సిల్ జిల్లా లీగల్ అడ్వైజర్ అలీమ్ అసద్, కౌన్సిల్ ప్రతినిధులు రియాజ్, జమీర్, రెడ్డి, అనూష, లక్ష్మిదేవి, సరస్వతి, గౌస్, సమీర్అహ్మద్, తదితరులు పాల్గొన్నారు. -
పదోన్నతి జాబితాలో సీఐలు
కడప అర్బన్: రాయలసీమ జోనల్ వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో విధులను నిర్వహిస్తూనే డీఎస్పీలుగా పదోన్నతుల కోసం వేచివున్న దాదాపు 48 మంది సీఐల జాబితా రాష్ట్ర డీజీపీ కార్యాలయానికి వెళ్లింది. వీరిలో 1995 నుంచి 1996 బ్యాచ్కు చెందిన వారే అధికంగా వున్నారు. 7,8 తేదీల్లో జిల్లాలో షర్మిల పర్యటన కడప వైఎస్ఆర్ సర్కిల్: పీసీసీ అధ్యక్షురాలు షర్మిల ఈ నెల 7,8 తేదీల్లో జిల్లాలో పర్యటించనున్నట్లు గురువారం డీసీసీ అధ్యక్షురాలు విజయజ్యోతి ఒక ప్రకటనలో తెలిపారు. 7న కడప కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో జరిగే కార్యక్రమాల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. 8న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి 76వ జయంతి సందర్భంగా ఇడుపులపాయలో ఆయనకు నివాళి అర్పిస్తారని వివరించారు. అనంతరం జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఆందుబాటులో ఉంటారని తెలిపారు. ప్రొటెక్షన్ వాచర్పై ఎలుగుబంటి దాడి ఒంటిమిట్ట: మండల పరిధిలోని చింతరాజుపల్లి అటవీ ప్రాంతంలో గురువారం అటవీశాఖ ప్రొటెక్షన్ వాచర్ బొడ్డే వెంకటయ్య (48)పై ఎలుగుబంటి దాడి చేసింది. చింతరాజుపల్లి అటవీశాఖ డిప్యూటీ రేంజ్ ఆపీసర్ నాగు నాయక్ కథనం మేరకు దాసర్లదొడ్డి వద్ద బేస్ క్యాంపు నిర్వహిస్తున్న ఐదుగురు ప్రొటెక్షన్ వాచర్లలో ఒకరైన వెంకటయ్యపై ఎలుగుబండి దాడి చేసింది. వెంకటయ్య కుడి మోకాలుకు తీవ్రగాయాలయ్యా యి. ఆయనను 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ప్రస్తుతం వెంకటయ్య ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని నాగు నాయక్ తెలిపారు. రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు స్వయం ప్రతిపత్తి హోదా చింతకొమ్మదిన్నె: ఊటుకూరు సమీపంలోని ప్రకృతినగర్లోగల రామిరెడ్డి ఫార్మసీ కళాశాలకు యూజీసీ ఈ సంవత్సరం నుంచి ఐదేళ్ల వరకు స్వయంప్రతిపత్తి హోదా కల్పించిందని కళాశాల ప్రిన్సిపాల్ నెల్సన్ తెలిపారు. నాక్ గ్రేడ్ సాధించినందుకు, మౌళిక వసతులు కల్పించడం, నిష్ణాతులైన ఆచార్య బృందం కలిగి ఉండడం వలన యూజీసీ వారు రామిరెడ్డి ఫార్మసీ కళాశాల కు స్వయంప్రతిపత్తి కల్పించారు.ఈ సందర్భంగా చైర్మన్ ఈశ్వర్ రెడ్డి, కరస్పాండెంట్ గౌతంరెడ్డి, సెక్రటరీ జయసుబ్బారెడ్డి, ప్రిన్సిపాల్ నెల్సన్ కుమార్, కోఆర్డినేటర్ మనోహర్ లను ప్రత్యేకంగా అభినందించారు. కరెస్పాండంట్ గౌతంరెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయులు, సిబ్బంది, విద్యార్థులకు, తల్లితండ్రులకు పూర్వ విద్యార్థులకు కృతజ్ఞతలు తెలిపారు. నరసింహ,రాజారాం,సుచరిత,కల్పన,సలోమి,సుమలత, వందలాది మంది విద్యార్థులు పాల్గొన్నారు. -
తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం
బద్వేలు అర్బన్: వైఎస్సార్ కడప జిల్లాలోని బద్వేలు కేంద్రంగా రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. తాజాగా ఓ మహిళ తన పేరిట ఉన్న ఇంటిపట్టాను ముగ్గురు వ్యక్తులకు అమ్మడం ద్వారా కేసు నమోదు చేసుకున్న పోలీసులు విచారణలో భాగంగా పలువురు అనుమానితులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. అదుపులోకి తీసుకున్న వారిలో బద్వేలు నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్ఓ ఉన్నట్లు తెలిసింది. అనుమానితుల్లో కొందరి వద్ద నుండి నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం చేసుకున్నట్లు సమాచారం. మళ్ళీ తెరపైకి నకిలీ పట్టాల వ్యవహారం సుమారు మూడేళ్ళ క్రితం రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన బద్వేలు నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చింది. బద్వేలు కేంద్రంగా ప్రభుత్వ స్థలాలకు, డీకేటీ పట్టాలకు కొంత మంది వ్యక్తులు అప్పటి రెవెన్యూ అధికారుల సహకారంతో భారీగా నకిలీ పట్టాలు సృష్టించి క్రయవిక్రయాలకు పాల్పడ్డారు. దీంతో బద్వేలులో ప్రతినిత్యం రెవెన్యూ, పోలీసు కార్యాలయాలకు స్థలాల సమస్యను బాధితులు తీసుకెళుతుండేవారు. ఈ క్రమంలో అప్పటి రెవెన్యూ డివిజనల్ అధికారి ఆకులవెంకటరమణ నకిలీ పట్టాలపై ప్రత్యేక దృష్టి సారించి కొందరు అనుమానితులను గుర్తించి వారిపై అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసి నకిలీ పట్టాల వ్యవహారాన్ని బహిర్గతం చేశారు. 2022 మేలో అర్బన్ పోలీసుస్టేషన్లో ఎఫ్ఐఆర్ నెం. 112/22 కేసులో 19 మందిపైన, 118/22 కేసులో 7 మందిపైన కేసులు నమోదు చేసి కొంత మందిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించారు. తాజాగా పట్టణంలోని మార్తోమానగర్కు సమీపంలో 812 సర్వే నెంబర్లో తన పేరిట పట్టా ఉన్న ఓ మహిళ మొదట ఆ పట్టాను ఓ వ్యక్తి వద్ద కుదువకు ఉంచింది. తర్వాత అదే ప్లాట్ను నకిలీ పట్టాతో మరో వ్యక్తికి విక్రయించింది. అంతటితో ఆగక మరో నకిలీ పట్టాను పొంది మూడవ వ్యక్తికి సైతం స్థలాన్ని విక్రయించింది. విషయం తెలుసుకున్న బాధితులు అర్బన్ పోలీసులను ఆశ్రయించగా విచారించి సదరు మహిళతో పాటు అందుకు సహకరించిన వారిపై మూడు రోజుల క్రితం అర్బన్ పోలీసుస్టేషన్లో కేసు నమోదు చేశారు. పోలీసుల అదుపులో అనుమానితులు నకిలీ పట్టాలు సృష్టించి ముగ్గురికి విక్రయించిన ఘటనపై కేసు నమోదు చేసుకున్న పోలీసులు సదరు మహిళకు నకిలీ పట్టాలు ఎవరు తయారు చేసి ఇచ్చారో తెలుసుకునేందుకు విచారణ వేగవంతం చేశారు. ఈ క్రమంలో గతంలో నకిలీ పట్టాల వ్యవహారంలో రిమాండ్లో ఉండి వచ్చిన పలువురు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. ఈ క్రమంలో గోపవరం మండలంలోని ఓ ప్రాంతానికి చెందిన ఒక వ్యక్తి వద్ద, నియోజకవర్గంలోని ఓ తహసీల్దారు కార్యాలయంలో పనిచేసే వీఆర్ఓ వద్ద కొన్ని నకిలీ సీళ్ళు, నకిలీ పాసుపుస్తకాలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిసింది. అలాగే నకిలీ పట్టాల తయారీలో వీరి ప్రమేయం ఏమైనా ఉందా అన్న కోణంలో విచారిస్తున్నారు. అందులో భాగంగా గతంలో నమోదైన రెండు కేసుల్లో ఉన్న ఐదు మందిని, బద్వేలు రూరల్ పరిధిలోని నందిపల్లె సమీపంలో గల ఓ గ్రామానికి చెందిన మరో వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నారు. విచారణలో భాగంగా బుధవారం మైదుకూరు డీఎస్పీ రాజేంద్రప్రసాద్ సైతం అనుమానితులను విచారించినట్లు తెలిసింది. అక్రమార్కుల గుండెల్లో గుబులు పోలీసుల అదుపులో పలువురు అనుమానితులు? అనుమానితుల్లో ఓ వీఆర్ఓ నకిలీ పాసుపుస్తకాలు, సీళ్ళు స్వాధీనం అక్రమార్కుల గుండెల్లో గుబులు 2022 మే నెలలో నకిలీ పట్టాల వ్యవహారం వెలుగు చూసిన తర్వాత బద్వేలు పరిసర ప్రాంతాల్లో నకిలీ పట్టాల తయారీ సద్దుమణిగింది. అయితే రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత బద్వేలులో మళ్ళీ నకిలీ పట్టాల వ్యవహారం తెరపైకి వచ్చింది. విలువైన స్థలాలు ఉన్న ఎన్జీవో కాలనీ, నెల్లూరు రోడ్డు, మహమ్మద్కాలనీ, చెన్నంపల్లె తదితర ప్రాంతాలతో పాటు ఆయా ప్రాంతాల్లో ఉన్న పబ్లిక్పర్పస్, రస్తా పోరంబోకు స్థలాలకు కొందరు అధికార పార్టీ నాయకులు నకిలీ పట్టాలు తయారు చేయించుకుని నిర్మాణాలు చేపట్టారు. అధికారం అండదండలతో ప్రశ్నించేవారు లేకపోవడంతో యదేచ్ఛగా తమ కార్యకలాపాలు కొనసాగించారు. అయితే ప్రస్తుతం నకిలీ పట్టాల వ్యవహారం మళ్ళీ తెరపైకి వచ్చి కొందరు అనుమానితులను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారిస్తుండటంతో ఎక్కడ తమ పేర్లు బయటపడతాయోనని ఆందోళన చెందుతున్నట్లు తెలిసింది. -
నిర్దేశిత లక్ష్యాల సాధనకు కృషి
కడప సెవెన్రోడ్స్: జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు కృషి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని సమావేశ హాలులో స్వర్ణాంధ్ర విజన్– 2047లో భాగంగా నియోజకవర్గాల విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి సమీక్ష సమావేశం నిర్వహించారు.ఈ సమావేశంలో నియోజకవర్గ ప్రత్యేక అధికారులు,మండల అభివృద్ధి అధికారులు, మున్సిపల్ కమిషనర్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ స్వర్ణాంధ్ర–2047 విజన్ సాకారానికి ప్రజా ప్రతినిధుల సహకారంతో అధికారులు ప్రో యాక్టివ్ గా పని చేయాలన్నారు. ప్రభుత్వం నిర్ధేశించిన లక్ష్యాల అంశాలను సాధించడానికి నియోజకవర్గ ప్రత్యేక అధికారులు శ్రద్ధ చూపాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 78వేల బంగారు కుటుంబాలను గుర్తించామని నియోజకవర్గంలోని మండల వారీగా బంగారు కుటుంబాల మ్యాపింగ్ లక్ష్యాన్ని నిర్దేశించడం జరిగిందన్నారు. జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శులు దత్తత తీసుకుని వాళ్ల ఉన్నతికి చర్యలు తీసుకోవాలన్నారు. రియల్ ఎస్టేట్ రంగం జిల్లాలో మరో ప్రధాన కీ రోల్ ప్లే చేస్తోందని మున్సిపల్ కమిషనర్లు అందరూ అనుమతులను సులభతరం చేసి రియల్ ఎస్టేట్ రంగానికి ఊతం ఇవ్వాలన్నారు. మున్సిపల్ కమిషనర్లు వారంలో రెండు రోజులు రియల్టర్లతో ఓపెన్ ఫోరం సమావేశం నిర్వహించాలన్నారు. లేఔట్స్ బిల్డింగ్ నిర్మాణాల వంటి అనుమతుల్లో జాప్యం తగ్గించి త్వరితగతిన మంజూరు చేస్తే మున్సిపాలిటీలకు అధిక రాబడి వస్తుందని ఆ విధంగా మున్సిపాలిటీలు అభివద్ధి చెందుతాయన్నారు. జిల్లా ప్రధాన కేంద్రమైన కడప నియోజకవర్గంలో ఇండస్ట్రియల్, కన్స్ట్రక్షన్, మ్యానుఫ్యాక్చరింగ్ వంటి కీలక రంగాలపై ప్రత్యేక దృష్టి సారించి వృద్ధి సాధించాలన్నారు. రాయలసీమలోని కడప నగరం వేగంగా అభివృద్ధి చెందుతోందని అందుకు అనుగుణంగా ఎమర్జింగ్ ఏరియాలను గుర్తించి ఓపెన్ లేఔట్లు ట్రేడింగ్ లలో అనుమతులను సరళతరం చేయాలన్నారు. ముందుగా వ్యవసాయం, హార్టికల్చర్, మైక్రో ఇరిగేషన్, పశుసంవర్ధక, ఫిషరీస్ వంటి శాఖల్లో జిల్లా అధికారులు యాక్షన్ ప్లాన్ కనుగుణంగా లక్ష్యాల సాధనకు ఏ విధంగా కృషి చేస్తున్నారన్న అంశాలపై జిల్లా కలెక్టర్ రివ్యూ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీవో హాజరతయ్యా, కడప ఆర్డిఓ జాన్ ఇర్విన్, బద్వేలు ఆర్టీవో చంద్రమోహన్, జమ్మలమడుగు ఆర్డిఓ సాయి,కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి పాల్గొన్నారు. సంతృప్త స్థాయిలో ప్రజాస్పందనలు ప్రభుత్వ సేవలపై ప్రజాభిప్రాయ సేకరణలో ప్రజల నుంచి స్పందన సానుకూలంగా, సంతృప్త స్థాయి పెరిగేలా ప్రత్యేక చొరవ చూపాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల జిల్లా అధికారులకు సూచించారు. గురువారం అమరావతి నుంచి అన్ని జిల్లాల కలెక్టర్లు, సంబంధిత శాఖల అధికారులతో పలు అంశాలపై రాష్ట్ర ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి విజయానంద్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి, జేసీ అదితిసింగ్ హాజరయ్యారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పెనగలూరు: పెనగలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఇంగ్లీషు పోస్టు కసం దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ శ్రీనివాస్ రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంగ్లీషు పోస్టు (గెస్ట్ ఫ్యాకల్టీ) అర్హులైన వారి నుంచి ఈనెల 7వ తేదీ వరకు దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపారు. అభ్యర్థులు ఎంఏ ఇంగ్లీషు కనీసం 50 శాతం మార్కులు కలిగి ఉండాలన్నారు. ఈనెల 8వ తేదీ డెమో క్లాసులు కళాశాలలో ఉదయం పది గంటలకు నిర్వహించనున్నట్లు చెప్పారు. డెమో క్లాసుల అనంతరం ఎంపిక ప్రక్రియ జరుగుతుందన్నారు. కావున అర్హులైన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంచుకోవాలి కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని మహిళా సర్పంచులు నాయకత్వ లక్షణాలు పెంపొందించుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి సూచించారు. గురువారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో మహిళా సర్పంచులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని గురువారం ఆమె ప్రారంభించారు. తొలుత మహత్మాగాంధీ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ చిత్రపటానికి పూలమాలలు సమర్పించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా డీపీఓ మాట్లాడుతూ మహిళా సర్పంచులు పంచాయతీరాజ్ చట్టాలపై అవగాహన పెంచుకోవాలన్నారు. మహిళలు చైతన్యవంతులు అయితేనే గ్రామాలు అభివృద్ది చెందుతాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ నాగభూషణం, డీఎల్డీఓ, మహిళా సర్పంచులు పాల్గొన్నారు. -
పట్టాలెక్కిన రైల్వేవన్ యాప్ !
రాజంపేట : భారతీయ రైల్వే ప్రయాణికులకు అన్ని రకాల సేవలందించేందుకు రైల్వేవన్యాప్ను రైల్వేశాఖ పట్టాలెక్కించింది. రైల్వేల ద్వారా మరిన్ని మెరుగైన సేవలను అందించేందుకు ఒకే యాప్ను డిజైన్ చేసింది. ఈ నెల 1 నుంచి అమలులోకి వచ్చింది. సెంటర్ ఫర్ రైల్వే ఇన్ఫర్మేషన్ సిస్టమ్ (సీఆర్ఐఎస్) పేరిట తీసుకొని.. ఈ యాప్ ద్వారా అన్ని సేవలను అత్యంత వేగంతో యాక్సిస్ చేసే వీలుంటుంది. ప్రయాణికులకు అందే సేవలు ● టికెట్ బుకింగ్, రిజర్వేషన్, అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్ బుకింగ్ ● ప్లాన్మై జర్నీ టూల్ ద్వారా వివిధ తరగతులలో కోటాలో టికెట్ల బుకింగ్ ● అన్ రిజర్వుడ్, ప్లాట్ఫాం టికెట్లపై 3 శాతం డిస్కౌంట్ రైలు స్థితి తెలుసుకోవడం ఎలా.. ● రైలు స్థితి, ప్లాట్ఫాం నంబరు, ఆలస్యం తదితర వివరాలు ● కోచ్పొజిషన్ పీఎన్ఆర్ స్టేటస్, రీఫండ్ ● ముందస్తు రిజర్వేషన్ టికెట్ ప్రస్తుత స్ధితి గతులు, టికెట్ పీఎన్ఆర్ నంబరు ద్వారా సీటు కన్ఫర్మేషన్ స్టేటస్, రైళ్ల రద్దు, రిజర్వేషన్ రద్దు తదితర సేవలు ఫుడ్ ఆర్టరింగ్.. ● ఇండియన్ రైల్వే క్యాటరింగ్ అండ్ టూరజిం కార్పొరేషన్ లిమిటెట్ (ఐఆర్టీసీ) యాప్ ద్వారా వివిధ రైల్వేస్టేషన్లకు చేరుకునేందుకు ముందుగా.. నచ్చిన ఫుడ్ ఆర్డర్ చేసుకోవడం, రైల్వేస్టేషన్కు రైలు చేరుకున్నాక సీటు వద్దకే ఫుడ్ చేర్చడం యాప్ ఎలా డౌన్లోడ్... ● ఆండ్రాయిడ్ ఫోన్లలోనే గూగుల్ ప్లే స్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకునే వీలుంది. httpr://pay.goofe.com/sotre/a ppr/detair?orf.crir.akam ఐవోఎస్ యాప్ నుంచి... httpr://appr.appe.com/in/a pp.raione/id 6473384334 ఉపయోగించే విధానం.. ● యాప్ను డౌన్లోడ్ చేశాక. రైల్కనెక్ట్ లేదా యూటీఎస్ యాప్ లాగిన్ వివరాలతో లాగిన్ కావాలి. ● కొత్త వినియోగదారులు మొబైల్ నంబరు, ఓటీపీ ద్వారా రిజిస్టర్ చేసుకోవాలి. ● mPIN లేదా బయోమెట్రిక్ ద్వారా సులభంగా లాగిన్ కావచ్చు. ● ప్లాన్ మై జర్నీ లేదా మై బుకింగ్ వంటి ఆప్షన్లను ఉపయోగించి సేవలను యాక్సెస్ చేయవచ్చు. ఇవీ ప్రయోజనాలు.. ● ఒకే యాప్లో ఐఆర్టీఎస్ రైల్ కనెక్ట్, యూటీఎస్, రైల్మదద్, ఎన్టీఈఎస్, ఫుడ్ ఆన్ ట్రాక్ వంటి సేవలు ● బహుళ యాప్ల అవసరం తగ్గించి, డివైస్ స్టోరేజి ఆదా చేసుకోవచ్చు. ● సరళమైన ఇంటర్సేఫ్, సింగల్ సైన్–ఆన్ ద్వారా ఉపయోగం సులభతరం ● 2025 డిసెంబర్ నాటికి కొత్త పీఆర్ఎస్ సిస్టమ్ ద్వారా నిమిషానికి 1.5 లక్షల టికెట్స్ బుకింగ్, 40 లక్షల ఎంకై ్వరీలు నిర్వహించగల సామర్థ్యం. స్పీడ్గా అన్ని రకాల సేవలు అందుబాటులోకి వచ్చిన యాప్ ఐఆర్టీఎస్తో ఫుడ్ ఆర్డరింగ్ నిమిషానికి 1.5 లక్షల టికెట్ల బుకింగ్ లక్ష్యం -
విద్యార్థులపై మందుబాబు దాడి
చిన్నమండెం : విద్యార్థులపై తాగుబోతు దాడి చేసిన సంఘటన గురువారం మండలంలో చోటు చేసుకుంది. మండల పరిధిలోని బోనమల ప్రభుత్వ పాఠశాలలో పలువురు విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. ఈ క్రమంలో అదే గ్రామానికి చెందిన బాబు(పుష్ప) మద్యం తాగి.. ఆ విద్యార్థులపై మధ్యాహ్నం ఉపాధ్యాయులు లేని సమయం చూసుకొని దాడి చేశాడు. దీంతో గాయపడ్డ పలువురు విద్యార్థులను వెంటనే 108 వాహనంలో రాయచోటి ఆస్పత్రికి తరలించారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు లేనిది చూసి తమను తాగుబోతు చేతులు మడమ తిప్పాడని పలువురు పిల్లలు ఆవేదన వ్యక్తం చేశారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
– మరొకరికి తీవ్ర గాయాలు వేంపల్లె : వేంపల్లె మండల పరిధిలోని తాళ్ళపల్లె – ముసల్రెడ్డిపల్లె మధ్యలో జరిగిన రోడ్డు ప్రమాదంలో బాసం గంగరాజు (45) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని ముసల్రెడ్డిపల్లెకు చెందిన గంగరాజు బైకుపై వేంపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని మోటార్ బైకులో గురువారం రాత్రి వేంపల్లె నుంచి గంగరాజు, దుగ్గన్నగారిపల్లెకు చెందిన బుసిరెడ్డి శివానందరెడ్డిలు ముసల్రెడ్డిపల్లెకు వెళ్తూ గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. అక్కడ వీరి మోటార్ బైకు, ట్రాక్టర్ ఢీకొన్నాయి. దీంతో అక్కడికక్కడే బాసం గంగరాజు మృతి చెందాడు. బుసిరెడ్డి శివానందరెడ్డికి తలకు తీవ్ర గాయం కావడంతో 108 వాహనం ద్వారా వేంపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అనంతరం కడప రిమ్స్కు తరలించారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ నరసింహులు సంఘటనా స్థలానికి చేరుకుని రోడ్డు ప్రమాదంపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఇసుక ట్రాక్టర్ల పట్టివేత
కమలాపురం : కమలాపురం మండలంలోని కంచన్నగారిపల్లె గ్రామ సమీపంలో పెన్నా నది వద్ద అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకున్నట్లు ఎస్ఐ విద్యా సాగర్ తెలిపారు. గురువారం ఇసుక అక్రమంగా తరలిస్తున్నారనే సమాచారం రావడంతో ఎస్ఐ పోలీస్, రెవెన్యూ సిబ్బందితో కలసి పెన్నా నది వద్దకు చేరుకున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను పట్టుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. వారిపై కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. కాగా అనుమతులు లేకుండా ఇసుక, మట్టి, గ్రావెల్ తరలిస్తే క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని ఎస్ఐ హెచ్చరించారు. మోటారు సైకిల్ను ఢీకొన్న ఆర్టీసీ బస్సు పులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె – ఓదులపల్లి తండా గ్రామాల మధ్యలో గురువారం మోటార్ సైకిల్ను ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో నలుగురికి గాయాలయ్యాయి. శ్రీసత్యసాయి జిల్లా తలుపుల మండలం ఉడుములకుర్తి నుంచి ద్విచక్ర వాహనంలో గంగరాజు తన కుమారులు ఈశ్వర్, దేవేంద్రతోపాటు భార్యతో కలిసి పులివెందులలోని సర్వజన ఆసుపత్రికి వస్తుండగా.. కనంపల్లె గ్రామ సమీపంలోని ఓదులపల్లె తండా వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఈశ్వర్, దేవేంద్రతోపాటు గంగరాజు, అతని భార్యకు గాయాలయ్యాయి. వీరిని చికిత్స నిమిత్తం 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. -
21 నుంచి సీపీఐ జిల్లా మహాసభలు
వేంపల్లి : బద్వేలులో ఈ నెల 21 నుంచి 23 వరకు జరగనున్న సీపీఐ 25వ జిల్లా మహాసభల జయప్రదానికి అన్ని వర్గాల ప్రజలు సహకరించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గారి చంద్ర కోరారు. గురువారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) 1925 డిసెంబర్ 26న కాన్పూర్లో ఆవిర్భవించి 2025 డిసెంబర్ 26 నాటికి వందేళ్లు పూర్తి చేసుకుని శత జయంతి ఉత్సవాలు నిర్వహించుకోబోతోందన్నారు. పాలక ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై, జిల్లా సమగ్ర అభివృద్ధి సాధనే లక్ష్యంగా సీపీఐ పోరాడుతోందన్నారు. కేంద్రంలో మూడోసారి అధికారంలోకి వచ్చిన ఎన్డీఏ 2014 ఎన్నికల్లో నల్లధనం వెలికితీత, పన్నుల భారం తగ్గింపు, ధరల నియంత్రణ, ప్రతి అకౌంట్లో లక్షల డబ్బు జమ, ఏడాదికి 2 కోట్ల ఉద్యోగాల కల్పన వంటి వాగ్దానాలు ఇచ్చిందన్నారు. వాటి అమలులో వైఫల్యాన్ని సీపీఐ ఎండగడుతోందన్నారు. సంపద సృష్టిలో భాగస్వాములైన కార్మికులు, కర్షకులను దోపిడీ చేసే చట్టాలకు వ్యతిరేకంగా ఉద్యమిస్తోందన్నారు. విభజన హామీలైన రాష్ట్రానికి ప్రత్యేక హోదా, వెనకబడిన రాయలసీమకు ప్రత్యేక ప్యాకేజీ, జాతీయ హోదా కలిగిన పోలవరం పూర్తికి నిధులు, కడపలో ఉక్కు ఫ్యాక్టరీ ఏర్పాటు, ఆర్థిక లోటు భర్తీ, విద్యా, వైద్య సంస్థల సాధనకై దశల వారీ పోరాటాలను సాగిస్తోందన్నారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సుబ్రహ్మణ్యం, సీపీఐ పులివెందుల ఏరియా కార్యదర్శి వెంకట రాములు, ఏరియా సహాయ కార్యదర్శి బ్రహ్మం, వేంపల్లి మండల కార్యదర్శి అంజనప్ప, తదితరులు పాల్గొన్నారు. -
మైదుకూరులో పట్టపగలే చోరీ
15తులాల బంగారు, రూ.10 వేలు అపహరణ మైదుకూరు : మైదుకూరు పట్టణంలోని సర్వాయపల్లె రోడ్డులో గురువారం పట్టపగలే ఓ ఇంటిలో చోరీ జరిగింది. వేద వ్యాస హైస్కూల్ పక్కనే ఉన్న ములపాకు జంగంరెడ్డి చిన్న సుబ్బారెడ్డి అనే వ్యక్తి ఇంటిలో దుండగులు చొరబడి బీరువాలో ఉన్న 15 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లెకు చెందిన చిన్న సుబ్బారెడ్డి ఆరేళ్ల కిందట మైదుకూరులో ఇల్లు కట్టుకుని నివాసం ఉంటున్నారు. ఆయన కుమార్తెకు వివాహం కాగా, ఇద్దరు కుమారులు ఉద్యోగ రీత్యా ఇతర చోట్ల ఉన్నారు. గురువారం చిన్న సుబ్బారెడ్డి భార్య మునెమ్మ వరి నాట్లకు వెళ్లగా, ఆయన గ్రామం వద్ద సాగు చేసిన పసుపు పంటకు నీరు పెట్టేందుకు వెళ్లాడు. ఇంటికి తాళం వేసి ఉండటం గమనించిన దుండగులు.. ఇంటి ప్రధాన ద్వారం తాళాన్ని గడెలతో సహా పెకలించి లోపలికి ప్రవేశించారు. ఇంటిలో కుడి వైపున బెడ్ రూమ్లో ఉన్న బీరువా తలుపులను పగులగొట్టి అందులో ఉంచిన 22 తులాల బంగారు ఆభరణాలు, రూ.10 వేల నగదు అపహరించారు. పనులు ముగించుకుని ఇంటికి చేరుకున్న భార్యభర్తలు తలుపులు పగలగొట్టి ఉండటం చూసి.. ఆందోళనతో లోపలికి వెళ్లి చూడగా బీరువాలోని బంగారు వస్తువులు, నగదు కనిపించలేదు. చోరీ జరిగిందని భావించి లబోదిబోమంటూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అర్బన్ సీఐ రమణారెడ్డి సిబ్బందితో కలిసి బాధితుల ఇంటికి చేరుకుని పరిశీలించారు. కడప నుంచి వేలి ముద్రల నిపుణులను పిలిపించారు. వారు ఇంటిలోని బీరువా, ఇతర వస్తువులపై పడిన వేలి ముద్రలను సేకరించారు. సంఘటనపై కేసు నమోదు చేసుకుని పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
భవన నిర్మాణ కార్మికుడి హత్య
మదనపల్లె రూరల్ : భవన నిర్మాణ కార్మికుడు అనుమానాస్పద స్థితిలో ఇంట్లో పడి ఉండగా స్థానికులు గుర్తించారు. మృతుడి కుటుంబ సభ్యులు రెండో భార్య హత్య చేసిందంటూ అనుమానం వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశారు. గురువారం రాత్రి మదనపల్లి మండలంలో వెలుగు చూసిన ఘటనకు సంబంధించి, కుటుంబ సభ్యులు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి మండలం కొత్తవారిపల్లె పంచాయతీరెడ్డి గాని పల్లెకు చెందిన వీరభద్ర కుమారుడు వి.చంద్రశేఖర(42) భవన నిర్మాణ కార్మికుడిగా పని చేసేవాడు. పలమనేరుకు చెందిన మహిళతో వివాహం కాగా, కొంత కాలం క్రితం ఆమె చంద్రశేఖర్ను వదిలి వెళ్లిపోయింది. అనంతరం రమాదేవిని రెండవ వివాహం చేసుకున్నాడు. వీరికి దీక్షిత(9) చైతన్యకుమార్(5) సంతానం ఉన్నారు. ఈ క్రమంలో చంద్రశేఖర మద్యానికి బానిసై, పనులకు వెళ్లడం పూర్తిగా మానేశాడు. దీంతో కుటుంబంలో తరచు గొడవలు జరిగేవి. ఈ నేపథ్యంలో బుధవారం రాత్రి భార్యాభర్తల మధ్య మరోసారి వివాదం ఏర్పడి తీవ్ర గొడవ జరిగింది. గొడవ సందర్భంగా ఇద్దరి మధ్య జరిగిన విషయం బయటకు తెలియలేదు. అయితే గురువారం రాత్రి చంద్రశేఖర ఇంట్లోనే మృతి చెంది ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. భార్య రమాదేవిని విచారణ చేస్తే సరైన సమాధానం ఇవ్వకపోగా, ఎప్పుడు చనిపోయాడు తనకు తెలియదంటూ సమాధానం దాటవేసింది. అంతేకాకుండా మృతుడి శరీరం, తలపై రక్త గాయాలు ఉండడంతో, అనుమానం వ్యక్తం చేస్తూ స్థానికులు వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. దీంతో తాలుకా సీఐ కళా వెంకటరమణ సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి వెళ్లారు. మృతికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చంద్రశేఖర మృతిపై భార్య రమాదేవిని పోలీసులు ప్రశ్నిస్తే.. పొంతన లేని సమాధానాలు చెప్పడంతో, ఆమెను అదుపులోకి తీసుకున్నారు. మృతుడు చంద్రశేఖర తమ్ముడు మహేష్ కుమార్ మాట్లాడుతూ... తన సోదరుడు మృతికి రమాదేవి కారణమని, మృతిపై అనుమానాలు వ్యక్తం చేస్తూ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా వివాహేతర సంబంధం నేపథ్యంలోనే చంద్రశేఖర్ మృతి చెంది ఉంటాడని స్థానికులు చెబుతున్నారు. అయితే మృతికి గల కారణాలు దర్యాప్తులో తేలాల్సి ఉంది. రెండో భార్యపై అనుమానం వ్యక్తం చేస్తున్న కుటుంబ సభ్యులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ వెల్లడి -
హోటళ్లలో ఫుడ్ ఇన్స్పెక్టర్ తనిఖీ
ప్రొద్దుటూరు రూరల్ : ప్రొద్దుటూరు మున్సిపాలిటీ, రూరల్ పరిధిలోని హోటళ్లు, బిర్యాని సెంటర్లు, చికెన్ పకొడ సెంటర్లను జిల్లా ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత గురువారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ శుచి, శుభ్రత, లైసెన్స్ లేకుండా హోటళ్లు నిర్వహిస్తే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. ప్రొద్దుటూరులోని చిన్న, పెద్ద హోటళ్లపై పలువురు ఫిర్యాదు చేయడంతో ఈ తనిఖీలు చేపట్టామన్నారు. ఖాదరబాద్లోని మహ్మద్ బిర్యాని సెంటర్, డీ మార్ట్ ఎదురుగా ఉన్న లక్ష్మీనరసింహా బిర్యాని సెంటర్, సాగర్ రెస్టారెంట్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్, సుందరాచార్యుల వీధిలోని చికెన్ పకోడ సెంటర్లను తనిఖీ చేసినట్లు చెప్పారు. చికెన్ పకోడ తయారు చేస్తున్న వారు వినియోగించే ఆయిల్ బాగలేదని గమనించామన్నారు. కొందరికి నోటీసులు జారీ చేశామని, తీరు మార్చుకోకపోతే కేసులు నమోదు చేస్తామన్నారు. టీపీసీ మీటర్తో ఆయిల్ను చెక్ చేశామన్నారు. మహ్మద్ బిర్యాని సెంటర్ నుంచి మటన్ బిర్యాని, చికెన్ కర్రీ ఐటమ్స్, బీజీఆర్ బార్ అండ్ రెస్టారెంట్లోని కొన్ని పదార్థాలను ల్యాబ్కు పంపిస్తున్నట్లు తెలిపారు. ఈ శాంపిల్స్లో ఏమైనా రిమార్క్ వస్తే చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం గోపవరం గ్రామ పంచాయతీ పరిధిలోని వాటర్ ప్లాంట్ నిర్వాహకులతో పంచాయతీ కార్యాలయంలో సమావేశం ఏర్పాటు చేసి వారికి పలు సూచనలు చేశారు. నిబంధనలకు విరుద్ధంగా వాటర్ ప్లాంట్ నడపకూడదన్నారు. తప్పనిసరిగా అనుమతులు తీసుకుని స్వచ్ఛమైన నీటిని ప్రజలకు అందించాలన్నారు. ఆమె వెంట కొత్తపల్లె, గోపవరం గ్రామ పంచాయతీల కార్యదర్శులు రామమోహన్రెడ్డి, రామకృష్ణ తదితరులు ఉన్నారు. -
తొలి అడుగు కాదు.. చివరి అడుగు
ప్రొద్దుటూరు : ఇది ముఖ్యమంత్రి చంద్రబాబు పరిపాలనకు తొలి అడుగు కాదని, చివరి అడుగేనని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. 1978లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డితో ప్రారంభమైన చంద్రబాబు రాజకీయ జీవితం 2028కి జగన్తో సమాప్తం కానుందని అన్నారు. ప్రొద్దుటూరులో రాచమల్లు శివప్రసాదరెడ్డి గురువారం తన స్వగృహంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. అబద్ధపు హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ప్రస్తుతం ఇంటింటా తిరుగుతూ గొప్పలు చెప్పుకొంటూ తొలి అడుగు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయలేదని మేనిఫెస్టోను గుర్తుకు తెస్తూ ఓ కార్యక్రమాన్ని నిర్వహించాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిర్ణయించిందన్నారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు శుక్రవారం మధ్యాహ్నం 3 గంటలకు దొరసానిపల్లెలోని శేగిరెడ్డి కాటిరెడ్డి కల్యాణ మండపంలో విస్తృత స్థాయి కార్యకర్తల సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. సమావేశానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డితోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి హాజరవుతారన్నారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని కార్యకర్తలు, నాయకులు, ప్రజా ప్రతినిధులు, వైఎస్ అభిమానులందరూ సమావేశానికి తప్పక హాజరు కావాలని ఆయన కోరారు. మూడు పార్టీలు కలిసి కూటమి ప్రభుత్వంగా ఏర్పడి ఎన్నికల సందర్భంగా అలివిగాని హామీలు ఇచ్చారని రాచమల్లు వ్యాఖ్యానించారు. సుమారు 143 హామీలు ఇచ్చినా కేవలం నాలుగైదు మాత్రమే అరకొరగా అమలు చేశారని తెలిపారు. ఎన్నికల ప్రచారం సందర్భంగా కూటమి నేతలు బాండ్లు మంజూరు చేశారని పేర్కొన్నారు. ఈ బాండ్లు ప్రామిసరి నోట్తో సమానమని, వీటిపై న్యాయస్థానాన్ని ఆశ్రయించవచ్చునన్నారు. ఎమ్మెల్యే వరద సంపూర్ణ ఆరోగ్యంగా ఉండాలి గుండెకు బైపాస్ సర్జరీ చేయించుకుని ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి సంపూర్ణ ఆరోగ్యవంతుడిగా తిరిగి వచ్చి ప్రజలకు సేవ చేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. అస్వస్థతకు గురైన ఆయనకు బైపాస్ సర్జరీ చేసినట్లు ఆయన కుమారుడు కొండారెడ్డి తెలిపారన్నారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు రాగుల శాంతి, చింపిరి అనిల్ కుమార్, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, సత్యం, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, గోపవరం ఉపసర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాజుపాళెం మండల కన్వీనర్ బాణా కొండారెడ్డి, వెంకటేష్, రామమోహన్రెడ్డి పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
దేవదాయ ఆస్తులను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : దేవదాయ, ధర్మాదాయ శాఖ పరిధిలోని ఆలయాలకు చెందిన ఆస్తులను కాపాడుకొనేందుకు మార్గదర్శకాలు అమలు చేస్తున్నట్లు తిరుపతి మల్టీజోన్ ప్రాంతీయ సంయుక్త కమిషనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ ఆజాద్ చెప్పారు. గురువారం అన్నమయ్య జిల్లా కేంద్రంలోని జిల్లా దేవదాయ శాఖ కార్యాలయంలో దేవదాయ శాఖ ఉప కమిషనర్ పట్టెం గురుప్రసాద్లతోపాటు అన్నమయ్య, కడప, శ్రీసత్యసాయి జిల్లాల దేవదాయ శాఖ, తనిఖీ, కార్యనిర్వహణ అధికారులతో విస్తృత సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా పలు అంశాలపై చర్చించి మార్గదర్శకాలు సూచించారు. వాటిలో ముఖ్యమైనవి కింది విధంగా ఉన్నాయి. ● కార్యనిర్వహణ అధికారుల ఆధీనంలో ఉన్న దేవదాయల ప్రాపర్టీ రిజిస్టర్లపై పరిశీలన ● రెవెన్యూ వివరాలు నమోదు కాని వివరాల పరిశీలన ● ఆర్ఓఆర్ చట్టం ప్రకారం సంబంధిత రెవెన్యూ డివిజనల్ అధికారులకు అప్పీలు చేయవల్సిన వివరాల పైన.. ● 1బి. పట్టాదార్ పాస్ పుస్తకాలలో దేవాలయాల పేర్లు చేర్చడం, దాని కోసం మీ సేవ ద్వారా తహసీల్దార్లకు అర్జీలు ఇవ్వడం ● సంస్థల సర్వీస్ ఇనామ్ వివరాలు (ఐఎఫ్ఆర్/ఇనామ్–బి రిజిస్టర్/ఆర్ఎస్ఆర్ ప్రకారం ● సంస్థల భూముల లీజు/ షాప్స్, ఇతరత్రా లైసెన్స్ ఆమోదం ఉత్తర్వులు ● దేవదాయ చట్టం సెక్షన్ 83 కింద ఇప్పటి వరకు ఆక్రమణదారులకు జారీ చేసిన (ఎవికే షన్ నోటీస్) తొలగింపు నోటీసులు ● 11/33 ఏళ్ల లీజు ప్రతిపాదనలు ● జీవో 60 ప్రకారం జిల్లా కలెక్టర్ నిర్వహించిన భూ రక్షణ కమిటీ సమావేశంలో జారీ చేసిన ఆదేశాలు ● సామూహిక ఆక్రమణల (మాస్ ఎంక్రోచ్మెంట్) స్థితి వంటి విషయలపై చర్చించి అధికారులందరికీ మార్గదర్శకాలు జారీ చేశారు. వీటన్నింటినీ అమలు చేయాలని ఆదేశించారు. -
అస్థిర పాలనలో తప్పటడుగు.!
కడప రూరల్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది దాటింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేపట్టిన ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమం బుధవారం జిల్లా వ్యాప్తంగా ప్రారంభమైంది. ఈ కార్యక్రమం మొదటి రోజే ఇంటింటికీ సుపరిపాలనలో తొలి అడుగుకు బదులుగా ‘అస్ధిర పాలనలో తొలి తప్పటడుగు’ అనేలా సాగిందనే ఆరోపణలు వినిపించాయి. పరువు నిలబెట్టుకొనేందుకు తంటాలు... కూటమి ప్రభుత్వం తల్లికి వందనం, ఎన్టీఆర్ భరోసా పెన్షన్లు, దీపం పథకం, యుతకు ఉద్యోగాలు, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం, రైతు సంక్షేమం తదితర పథకాలు, సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు వివరించేందుకు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం ప్రారంభించారు. ఈ సందర్భంగా టీడీపీ నేతల నివాసాలను సందర్శించి పథకాలకు సంబంధించిన కరపత్రాలను అందజేశారు. అదే సందర్భంలో పథకాలు అందుతున్నాయో లేదో తెలుసుకోవాలి. పథకాలు అందలేదని ప్రజలు ప్రశ్నించే అవకాశం ఉందని గ్రహించి, ఆ తలనొప్పి ఎందుకని పార్టీ నేతలు చాలా నియోజక వర్గాల్లో తమకు అనుకూలమైన, ఎంపిక చేసిన నివాసాలను మాత్రమే సందర్శించారు. కొన్ని చోట్ల పింఛన్లు రాలేదు..తల్లికి వందనం డబ్బులు పడలేదు అంటే, ఇళ్లుందా, కారుందా అని అడిగి చూస్తాం..చేస్తాం అంటూ నేతలు చేతులు దులుపుకున్నారు. ప్రొద్దుటూరులో 1వ వార్డులో పార్టీ కార్యకర్తలు ఇంటింటికీ సుపరిపాలన కార్యక్రమం నిర్వహించారు. ప్రభుత్వం చేపట్టే పథకాలను చెప్పుకుంటూ వెళ్లారు. మైదుకూరులో రాజీవ్ కాలనీలో ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ తూతూ మంత్రంగా కార్యక్రమం నిర్వహించారు. బద్వేలు 31వ వార్డు రఘునాథపురంలో మాజీ ఎమ్మెల్యే విజయమ్మ, పార్టీ సమన్వయకర్త రితీష్రెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ ప్రజల నుంచి పథకాల అమలు తీరు గురించి తెలసుకోవడం కంటే పథకాల ప్రచారానికే ప్రాధాన్యత ఇచ్చారు. కడప నగరం 10వ డివిజన్లో నిర్వహించిన కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవిరెడ్డి పాల్గొన్నారు. ఇక్కడ డ్రైనేజీ, తాగునీటి సమస్య ఉందని స్థానికులు ఏకరువు పెట్టారు. జమ్మలమడుగులో పార్టీ ఇన్చార్జి భూపేష్రెడ్డి వెంకటేశ్వర కాలనీలో జరిగిన కార్యక్రమంలో పాల్గొన్నారు. ఎంపిక చేసిన నివాసాలను సందర్శించినట్లుగా తెలిసింది. ఈ కార్యక్రమం పార్టీ శ్రేణులకు అగ్ని పరీక్షగా మారింది. ఇటు ప్రజల్లో..అటు అధిష్టానం వద్ద పరువును నిలబెట్టుకోవడానికి తంటాలు పడుతున్నారని ఆ పార్టీలో చర్చసాగుతోంది. ఎంపిక చేసిన నివాసాల సందర్శన ‘చూస్తాం..చేస్తాం’ ఇదీ నేతల తీరు ప్రజల్లోకి వెళ్లాలంటే తమ్ముళ్ల ఇబ్బందులు టీడీపీ ‘ఇంటింటికీ సుపరిపాలన’లో మొదటి రోజే నైరాశ్యం -
రాయచోటిలో అలజడి
రాయచోటి : ఉగ్రవాదుల అరెస్టుతో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలో అలజడి నెలకొంది. కొన్ని దశాబ్దాలుగా ఉగ్రవాదులకు రాయచోటి పట్టణం షెల్టర్ జోన్గా ఉండటంపై ఇటు పోలీసులు, అటు ప్రజలలో టెన్షన్ వాతావరణం నెలకొంది. చైన్నె, కర్ణాటక, కేరళ, హైదరాబాద్ రాష్ట్రాలలోని పలు ప్రాంతాలలో చేపట్టిన బాంబు బ్లాస్టింగ్ సంఘటనలలో రాయచోటిలో పట్టుబడిన ఇరువురి పాత్ర ఉందన్న సమాచారంతో జిల్లా పోలీస్ యంత్రాంగం అప్రమత్తమైంది. కొన్ని నెలలుగా రాయచోటిలోనే మకాం వేసిన ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) అధికారులు ఉగ్రవాదుల జాడ కనిపెట్టడంలో సఫలీకృతులయ్యారు. కాశ్మీర్లో పాక్ ఉగ్రవాదులు జరిపిన ఘోర దుర్ఘటన సమయంలో వీరిద్దరి కదలికలు అధికం కావడంపై ఐబీ అధికారులు అలర్ట్ అయినట్లు సమాచారం. ఐబీ అధికారులు ఇచ్చిన సమాచారం మేరకు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ప్రత్యేక సిబ్బంది ద్వారా వారిద్దరినీ అదుపులోకి తీసుకొన్నారు. కేరళ ప్రాంతానికి చెందిన వీరిద్దరూ రాయచోటిలో స్థిర నివాసం ఏర్పరచుకొని ఇక్కడి నుంచి ఇతర ఉగ్రవాదులతో సంబంధాలను కొనసాగించినట్లు పోలీసులు గుర్తించారు. ఎవరికీ అనుమానం రానివ్వకుండా 30 ఏళ్లుగా రాయచోటిలో జీవనం సాగించడంపై పట్టణంలో మరి ఎంతమంది ఉగ్రవాదులు ఉన్నారో అన్న భయం పట్టణవాసుల్లో నెలకొంది. పట్టుబడిన ఇద్దరినీ ఐబీ అధికారులు చైన్నెకి తరలించిన అనంతరం జిల్లా ఎస్పీ ప్రత్యేక బృందాలతో రెవెన్యూ అధికారులను కలుపుకొని ఉగ్రవాదుల గృహాలలో సోదాలు చేశారు. విస్తుపోయే ఆధారాలు లభించినట్లు తెలిసింది. పట్టణ పరిధిలోని కొత్తపల్లి జడ్పీ ఉన్నత పాఠశాల సమీపంలో నివాసం ఉన్న షేక్ అమానుల్లా(55) అలియాస్ అబూబకర్ సిద్దిక్, మహబూబ్బాషావీధిలో నివాసం ఉన్న షేక్ మన్సూర్ (47) అలియాస్ మహమ్మద్అలీలు సొంతంగా ఇల్లు నిర్మించుకొని నివాసం ఉంటున్నారు. వీరి గృహాలలో బ్లాస్టింగ్ పరికరాలు, కేబుల్స్, నెట్వర్క్ సమాచారం చేరవేసే యంత్రాలు, మ్యాపులు, భూముల కొనుగోలుకు సంబంధించిన రికార్డులు తదితర వాటిని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. 1995లో కోయంబత్తూర్లో జరిగిన బాంబు పేలుళ్ల కేసులో ప్రధాన నిందితులుగా ఉన్నారు. అలాగే బీజేపీ దివంగత అగ్రనేత ఎల్కె అద్వానీ రథయాత్ర సందర్భంగా విధ్వంస చర్యలకు కుట్రలు చేసినట్లు వారి మీద ఆరోపణలు ఉన్నాయి. అలాగే దేశంలో జరిగిన వివిధ ఉగ్రవాద కార్యకలాపాలలో వీరి ప్రమేయం ఉన్నట్లుగా గుర్తించినట్లు విశ్వసనీయ సమాచారం. ఆధారాలు లభ్యం ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇరువురి అరెస్టు అనంతరం వారి గృహాల్లో పోలీసులు మంగళవారం నుంచి బుధవారం సాయంత్రం వరకు అణవణువునూ శోధించారు. కీలక సమాచారాన్ని స్వాధీనం చేసుకున్న పోలీసులు ఆ రెండు గృహాలను సీజ్ చేశారు. వివాహాలపై.. ఒకవైపు ఉగ్రవాద కార్యకలాపాలకు ప్రణాళికలు రచిస్తూనే మరోవైపు ఎవరికి అనుమానం రానివ్వకుండా ఇద్దరు ఉగ్రవాదులు సంసార సాగరంలో కొనసాగారు. అబూబకర్ గాలివీడు మండల పరిధిలో వివాహం చేసుకున్నారు. వీరికి ఒక కుమార్తె జన్మించి అనారోగ్యంతో మృతిచెందింది. మహమ్మద్అలీ పట్టణంలోని బిరాంసాహెబ్వీధికి చెందిన మహిళతో వివాహమైంది. వీరికి నలుగురు పిల్లలు ఉన్నారు. వీరి వివాహానికి, ఇతర కార్యకలాపాలకు సహకరించిన వారి వివరాలను సేకరించే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. ఇప్పటికే తీవ్రవాదుల భార్యలను, వారి బంధువులను అదుపులోకి తీసుకుని రహస్యంగా విచారణ సాగిస్తున్నట్లు తెలిసింది. వీరితో పాటు వీరికి అన్ని రంగాలలో సహకరిస్తున్న మరో నలుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. నిఘా నీడలో రాయచోటి.. దేశంలోనే వివిధ ప్రాంతాలలో ఉగ్రవాద కార్యకలాపాలకు పాల్పడుతున్న ఇద్దరిని అరెస్టు చేయడంతో జిల్లా ఎస్పీ రాయచోటిలో నిఘా వ్యవస్థను పటిష్టం చేశారు. పట్టణంలోకి ప్రవేశిస్తున్న వాహనాలతో పాటు, వివిధ అంశాలపై నిఘాను కట్టుదిట్టం చేశారు. పోలీస్, రెవెన్యూ అధికారుల ఆధ్వర్యంలో ఉగ్రవాదుల ఇళ్లలో సోదాలు భారీగా పేలుడు పదార్థాల సామగ్రి, సాంకేతిక పరికరాలు, ఉగ్రవాదుల సమాచారం లభ్యం ఉగ్రవాదుల గృహాలను సీజ్ చేసిన పోలీసులు ఎస్పీ అదుపులో ఉగ్రవాదుల కుటుంబసభ్యులు సహకారం అందిస్తున్న వారితో రహస్య విచారణ రాయచోటి పట్టణంలో పటిష్టంగా నిఘా -
ఒకే గదిలో ఐదు తరగతులు
పులివెందుల రూరల్ : మండల పరిధిలోని తుమ్మలపల్లె గ్రామంలో 1 నుంచి 5వ తరగతి వరకు ప్రభుత్వ పాఠశాల ఉంది. అయితే ఈ ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలలో ఒకే గది ఉండటంతో 1 నుంచి 5వ తరగతి వరకు విద్యార్థులకు అదే గదిలో ఒకే ఉపాధ్యాయుడు బోధిస్తున్నాడు. పాఠశాలలో అన్ని తరగతులకు కలిపి 25మంది విద్యార్థులు ఉన్నారు. ఏకై క ఉపాధ్యాయుడు ఉండటంతో విద్యార్థులకు చదువులు చెప్పేందుకు ఇబ్బందికరంగా ఉంది. అలాగే పాఠశాల భవనాలు కూడా వర్షం వచ్చినప్పుడు వర్షపునీరు గదుల్లోకి వస్తోంది. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి మరో ఉపాధ్యాయుడిని నియమించాలని గ్రామస్తులు కోరుతున్నారు. గండి టెండర్లు .. కొన్నింటికే ఆమోదం చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో శ్రావణమాస ఉత్సవాల ఏర్పాట్లకు సంబంధించి బుధవారం నిర్వహించిన టెండర్లలో అదికారులు కొన్నింటిని మాత్రం ఆమోదించి మరి కొన్నింటిని తిరస్కరించారు. ఉత్సవాలకు సంబంధించి ఫోటో, వీడియో కవరేజి, ప్రత్యేక భజంత్రీలు, స్వాగత ఆర్చీలకు సంబంధించిన టెండర్లకు ఆమోదం తెలిపినట్లు ఆలయ సహాయ కమిషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. ప్రత్యేక పూల అలంకరణ, విద్యుద్దీపాలంకరణకు సంబంధించి ఎవరూ టెండర్లలో పాల్గొన లేదని ఆయన తెలిపారు. పందిళ్లు, బారికేడ్లకు సంబంధించి ఇద్దరు మాత్రమే వచ్చి ఒకే ధరను కోట్ చేయడంతో వాటిని తిరస్కరించామన్నారు. టెండర్ల కార్యక్రమంలో ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ, కడప దేవదాయ శాఖ సూపరింటెండెంట్ రమణమ్మ, ఆలయ ప్రధాన ఉప ప్రధాన అర్చకులు కేసరి, రాజా రమేష్, మాజీ చైర్మన్లు కావలి వీరభాస్కరుడు, కల్లూరు వెంకట స్వామి, ఆలయ సూపరింటెండెంట్ సుభాష్, ఆర్కే వ్యాలీ పోలీసులు పాల్గొన్నారు. 8 తులాల బంగారం, రూ.30 వేలు చోరీ సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామంలో రోడ్డు నంబర్ 10వ వీధిలో గుర్తు తెలియని దుండగులు సోమవారం రాత్రి ఓ ఇంటిలో 8 తులాల బంగారు, రూ. 30 వేల నగదును చోరీ చేశారు. బాధితుడు మోదుగుల నరసింహులు వివరాల మేరకు.. మాధవరం–1 గ్రామంలో ఉన్న తన తండ్రి నరసింహులు(68) ఆదివారం ఉదయం మృతి చెందాడన్నారు. తన తండ్రి మృతదేహాన్ని తన భార్య లక్ష్మిప్రసన్న పొత్తప్పి గ్రామానికి తీసుకెళ్లిందన్నారు. తండ్రి మరణ వార్త తెలుసుకుని తాను కువైట్ నుంచి సోమవారం పొత్తపికి వచ్చానన్నారు. అంత్యక్రియల అనంతరం బుధవారం మాధవరం–1 గ్రామానికి వచ్చామన్నారు. తమ ఇంటి తాళాలు పగులగొట్టి, లోపల ఉన్న బీరువాను తెరిచి దుస్తులను చిందర వందరగా పడేసి ఉండటాన్ని గమనించామన్నారు. ఇంట్లో ఉన్న 8 తులాల బంగారు, రూ. 30వేల నగదు, ఒక మొబైల్ ఫోన్ను అపహరించుకొని వెళ్లినట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. ఎస్ఐ మహమ్మద్రఫీ, ఏఎస్ఐ సుబ్బరామచంద్ర సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్టీంను రప్పించి దర్యాప్తు చేస్తున్నారు. -
బాలల రక్షణకు సమన్వయంతో పనిచేయాలి
– ఐసీడీఎస్ పీడీ శ్రీలక్ష్మి కడప కోటిరెడ్డిసర్కిల్ : మహిళా అభివృద్ధి, శిశు సంక్షేమశాఖ ఆధ్వర్యంలో మిషన్ వాత్సల్య పథకంలో భాగంగా బాలల సంరక్షణ లోకీలకంగా వ్యవహరించే తహసీల్దార్లు, మండల అభివృద్ధి అధికారులు, బాలల సంక్షేమ పోలీసు అధికారులు, ఎంఈఓలు సమన్వయంతో పనిచేయాలని ఐసీడీఎస్ పీడీ దేవిరెడ్డి శ్రీలక్ష్మి తెలిపారు. బుధవారం కలెక్టరేట్లోని సభా భవనంలో బాలల రక్షణలో భాగస్వాముల పాత్రపై వర్క్షాప్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పిల్లలకు మానవీయ దృక్పథంతో సేవలు అందించాలన్నారు. బాల్య వివాహాల నిరోధంలో తహసీల్దార్లు సహకరించాలన్నారు. సంక్షేమ పథకాల అమలులో ఎంపీడీఓల పాత్ర ప్రధానమన్నారు. అనంతరం వర్క్షాప్లో పాల్గొన్న వారికి మహిళా శిశు సంక్షేమశాఖ తరుపున శ్రీలక్ష్మి సర్టిఫికెట్లు అందజేశారు. కార్యక్రమంలో స్టెప్ సీఈఓ సాయిగ్రేస్తోపాటు పలువురు పోలీసు అధికారులు, ఐసీడీఎస్ అధికారులు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు, సిబ్బంది పాల్గొన్నారు. -
డ్రాగా ముగిసిన కడప– నెల్లూరు మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఏసీఏ సౌత్ జోన్ అండర్ –19 మల్టీ డే క్రికెట్ టోర్నమెంట్లో భాగంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. ఈ మ్యాచ్లో మొదటి ఇన్నింగ్స్లో నెల్లూరు జట్టు 232 పరుగులు చేసింది. కడప జట్టు మొదటి ఇన్నింగ్స్లో 303 పరుగులు చేసింది. ఒక వికెట్ నష్టానికి 144 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో చివరి రోజు బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు రెండవ ఇన్నింగ్స్లో 114.0 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 419 పరుగుల వద్ద డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ అద్భుతంగా బ్యాటింగ్లో రాణించి 103 పరుగులు (సెంచరీ) చేశాడు. సయ్యద్ షాహుల్ హుస్సేన్ 80 పరుగులు, రోహిత్ 73 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆర్దిత్ రెడ్డి 4, చరణ్ 3 వికెట్లు తీసుకున్నారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు చివరి రోజు ఆట ముగిసే సమయానికి 13.0 ఓవర్లలో రెండు వికెట్ల నష్టానికి 59 పరుగులు చేసింది. మ్యాచ్ డ్రాగా ముగిసింది. మొదటి ఇన్నింగ్స్లో కడప జట్టు ఆధిక్యత సాధించింది. -
రుత్విక్ కన్స్ట్రక్షన్ కంపెనీ నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
బి.కోడూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని సర్వాయపల్లె వద్ద గత ఆదివారం కంపెనీ యజమానుల నిర్లక్ష్యం కారణంగా బైక్ను రుత్విక్ కంపెనీ టిప్పర్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో గుంత జయరామిరెడ్డి, కొండా జయరామిరెడ్డిలు తీవ్రంగా గాయపడ్డారు. వారి పరిస్థితి విషమించడంతో కర్నూలు ఆసుపత్రికి తరలించగా మంగళవారం గుంత జయరామిరెడ్డి మృతి చెందాడు. కొండా జయరామిరెడ్డి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో మృతి చెందిన జయరామిరెడ్డి కుటుంబ సభ్యులు, బంధువులు ప్రజాప్రతినిధులతో కలిసి బి.మఠం మండలంలోని డి.అగ్రహారం వద్ద గల రుత్విక్ కంపెనీ క్యాంపు కార్యాలయం సమీపంలోని నేషనల్ హైవేపై ఽబుధవారం సాయంత్రం మృతదేహంతో ధర్నాకు దిగారు. అంతేకాకుండా రుత్విక్ కన్స్ట్రక్షన్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా ఇప్పటి వరకు సుమారు బద్వేలు, మైదుకూరు ప్రాంతాలకు చెందిన పది మందికిపైగా మృత్యువాతపడ్డారని వారు ఆందోళన నిర్వహించారు. రాత్రి 8 గంటల వరకు ధర్నా నిర్వహించినప్పటికీ కంపెనీ వారు స్పందించలేదు. దీంతో ఐదు కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. బద్వేలు అర్బన్ సీఐ, మైదుకూరు సీఐ, బి.మఠం ఎస్ఐలు రంగంలోకి దిగి మృతుని బంధువులకు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ ఫలితం లేకపోవడంతో కంపెనీ యాజమాన్యంతో ఫోన్లో చర్చించారు. మృతుడు జయరామిరెడ్డి, తీవ్రంగా గాయపడిన జయరామిరెడ్డిలకు కలిపి కేవలం రూ.12 లక్షలు నష్టపరిహారం ఇస్తామని తెలిపినప్పటికీ మృతుని బంధువులు ఒప్పుకోలేదు. మృతునికి భార్య రమాదేవి, ఒక కుమార్తె, ఒక కుమారుడు ఉన్నారు. కుటుంబ యజమాని మృతి చెందడంతో ఆ కుటుంబం రోడ్డున పడింది. ఆ కుటుంబాన్ని పోషించే నాథుడు కరువవడంతో కంపెనీ వారు ముందుకు వచ్చి వారిని ఆదుకుని కుటుంబానికి తగిన న్యాయం చేయాలని స్థానిక నాయకులు, ప్రజాప్రతినిధులు, ప్రజా సంఘాల నాయకులు కోరారు. -
నేడు ప్రైవేటు విద్యాసంస్థల బంద్
ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి కడప కోటిరెడ్డిసర్కిల్: రాష్ట్రంలోని ప్రైవేటు విద్యా సంస్థల యాజమాన్యాలు ఎదుర్కొంటున్న సమస్యలను ప్రభుత్వం సత్వరమే పరిష్కరించాలని ఎమ్మెల్సీ, సాయిబాబా విద్యా సంస్థల చైర్మన్ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. బుధవారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ప్రైవేట్ పాఠశాలల యాజమాన్యాలపై అధికారుల వేధింపులు అధికమయ్యాయన్నారు. తమ న్యాయమైన సమస్యలను పరిష్కరించాలని ప్రభుత్వానికి తెలిపేందుకు గురువారం విద్యా సంస్థల బంద్ నిర్వహిస్తున్నామన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ విద్యాసంస్థల్లో లక్షలాది మంది ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 55 శాతం విద్యార్థులకు ప్రైవేటు విద్యా సంస్థలు విద్యాబుద్ధులు నేర్పుతున్నాయన్నారు. ఇందుకు సంబంధించి 4 లక్షలకు పైగా ఉపాధ్యాయులు పనిచేస్తున్నారన్నారు. పేద వర్గాలకు సంబంధించి 25 శాతం పిల్లలకు ఉచితంగా చదువు చెప్పాలని కేంద్ర ప్రభుత్వ యాక్టు ఉన్నా అందులోని నిబంధనలు పూర్తి స్థాయిలో అధికారులు పాటించడం లేదన్నారు. ఆయా విద్యార్థులకు సంబంధించి ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ అందించాల్సి ఉందన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి 90 వేల రూపాయల వరకు ఖర్చు చేస్తున్న ప్రభుత్వం, అందులో సగం ఇవ్వాలని తాము కోరుతున్నామన్నారు. అయితే ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. ఈ యాక్టు అనేకచోట్ల దుర్వినియోగమవుతోందన్నారు. ఇలా అనేక సమస్యలతో నిర్వహిస్తున్న బంద్కు విద్యార్థులు, తల్లిదండ్రులు సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో విద్యాసంస్థల యాజమాన్యాలు గంగయ్య యాదవ్, శివశంకర్ రెడ్డి, వెంకట్ రెడ్డి, ఇలియాస్ రెడ్డి, మైథిలి తదితరులు పాల్గొన్నారు. -
ఏ.ఆర్ కానిస్టేబుల్ సస్పెన్షన్
కడప అర్బన్: కడప పోలీసు కళాజాగృతి బృందం సభ్యులలో మహిళా డ్యాన్సర్పై అసభ్యంగా ప్రవర్తించిన ఏ.ఆర్ కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ను సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఉత్తర్వులు జారీ చేశారు. తనపై అసభ్యంగా ప్రవర్తించాడని బాధితురాలు ఎస్పీకి ఫిర్యాదు చేయడంతో ఎస్పీ ప్రాథమిక విచారణ చేయించారు. విచారణలో కానిస్టేబుల్ ఉత్తమ్ కుమార్ తప్పు చేశాడనీ రుజువు కావడంతో అతనిపై వేటు వేశారు. నియామక పత్రాలు అందజేత కడప కోటిరెడ్డిసర్కిల్: రైల్వే ఇన్స్టిట్యూట్ భవన్ ఎన్నికలు వారం రోజుల కిందట ఏకగ్రీవంగా ముగిశాయి. ఇందుకు సంబంధించిన నియామక పత్రాలను బుధవారం రైల్వే పోలింగ్ ఆఫీసర్ రాధాకృష్ణయ్య, వెల్ఫేర్ ఇన్స్పెక్టర్ గంగాదేవి ఎన్నికై న వారికి అందజేశారు. ఈ సందర్భంగా రైల్వే ఇన్స్టిట్యూట్ సెక్రటరీగా రవికుమార్, సంయుక్త కార్యదర్శిగా నరేష్కుమార్, కోశాధికారిగా వెంకటేశ్వరరెడ్డి, ఆపరేటింగ్ కమిటీ సభ్యులుగా లక్ష్మినారాయణ, చినబాబు, ఎలక్ట్రికల్ కమర్షియల్ ఇంజనీరింగ్ ఎస్అండ్టీ కమిటీ సభ్యులుగా రాజేష్కుమార్, గీత, అనిల్కుమార్, మస్తాన్లకు నియామక పత్రాలను అందజేశారు. సహకార సంఘాలు అభివృద్ధికి సహకరించాలి కడప అగ్రికల్చర్: జిల్లాలో సహకార సంఘాల భవిష్యత్తు ప్రణాళికలను రచించి ఆదాయ మార్గాలను పెంచుకోవడానికి సిబ్బంది సహకరించాలని జిల్లా సహకార శాఖాధికారి యం. వెంకటసుబ్బయ్య పేర్కొన్నారు. అంతర్జాతీయ సహకార సంవత్సరం సందర్భంగా బుధవారం కడప డివిజనల్ కో–ఆపరేటివ్ ఆఫీస్లో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సహకార సంఘాలు సక్రమంగా పనిచేయడానికి కృషి చేయాలన్నారు. ప్రొద్దుటూరు సీటీసీ ప్రిన్సిపాల్ జి. శ్రీనివాస రావు మాట్లాడారు. అనంతరం సహకార శిక్షణా కేంద్రం ప్రొద్దుటూరులో 10వ బ్యాచ్ డీసీఎం, సీఏ విద్యార్థుల సర్టిఫికెట్లు తనిఖీ చేసి వారిని కోర్సులో నమోదు చేసుకున్నారు.. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ రిజిస్ట్రార్స్ పుష్పలత, కృష్ణరెడ్డి, నాగరత్నం, సత్యనందం, వెంకట రమణ, శ్రీధర్ శ్రీనివాస్ పాల్గొన్నారు. విజన్ ప్లాన్ అమలుపై దృష్టి కడప సెవెన్రోడ్స్: జిల్లాలో అభివృద్ధి విజన్ ప్లాన్ అమలుపై అధికారులు దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. బుధవారం కలెక్టరేట్లోని బోర్డు రూమ్లో స్వర్ణ ఆంధ్ర విజన్– 2047 లో భాగంగా జిల్లా విజన్ యాక్షన్ ప్లాన్, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ పై జాయింట్ కలెక్టర్ అదితి సింగ్ తో కలసి కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి నియోజకవర్గ స్పెషల్ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఎంపీడీఓ లు, మున్సిపల్ కమిషనర్లతో కలెక్టర్ వర్చువల్ విధానంలో సమీక్షించారు. జిల్లా, నియోజకవర్గ, మండలాల అభివృద్ధి విజన్ ప్లాన్పై ప్రతి ఒక్క నియోజకవర్గ స్పెషల్ అధికారులు,మండల అధికారులు పూర్తి అవగాహన కలిగి ఉండాలన్నారు. సమాజంలో విజయవంతమైన వారు ఇతరులకు సహకారాన్ని అందించడం,నాలెడ్జ్ షేరింగ్ లాంటి అంశాలు పీ4 పాలసీలో ఇమిడి ఉన్నాయన్నారు. అలాగే ప్రతి గ్రామం, మండలాలలో మార్గదర్శులను గుర్తించే చర్యలను వేగవంతం చేయాలన్నారు. ఇప్పటికే జిల్లాలో దాదాపు 76 వేలకు పైగా బంగారు కుటుంబాలను గుర్తించామని తెలిపారు. అన్ని మండలాలలో విజన్ యాక్షన్ ప్లాన్ యూనిట్ కార్యాలయాన్ని ప్రారంభించాలని ఆదేశించారు. బీఈడీ పరీక్షలు ప్రారంభం కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ బీఈడీ కళాశాలల రెండో సెమిస్టర్ పరీక్షలు బుధవారం జిల్లావ్యాప్తంగా 16 కేంద్రాలలో ప్రారంభమయ్యాయి. ఈ పరీక్షలను విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె. ఎస్ వి కృష్ణారావుతో కలిసి తనిఖీ చేశారు. కడపలోని శ్రీహరి డిగ్రీ కళాశాల, నాగార్జున మహిళా డిగ్రీ కళాశాల కేంద్రాలను తనిఖీ చేశారు. విద్యార్థుల హాల్ టికెట్లను, వసతులను పరిశీలించారు. 4,551 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరైనట్లు వారు తెలిపారు. విశ్వవిద్యాలయం నుంచి ప్రతి కేంద్రానికి అబ్జర్వర్లను పంపామని, ప్రత్యేకంగా హై పవర్ కమిటీ పరీక్షలను పర్యవేక్షిస్తుందని తెలిపారు. -
పేద విద్యార్థులకు వరం.. గురుకులం
బ్రహ్మంగారిమఠం: నాణ్యమైన విద్య, అధునాతన వసతులతో రూపుదిద్దుకున్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ (బాలుర) మహా గురుకులం విద్యాలయం పేద విద్యార్థుల పాలిట వరం అని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. బుధవారం బి.మఠం మండలంలో నూతనంగా ఏర్పాటైన మహా గురుకులం (బాలుర) విద్యాలయంలో అకడమిక్ భవనాల్లో తరగతులు, వసతి గృహ భవనాలను కలెక్టర్, మైదుకురు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ లతో కలిసి ఘనంగా ప్రారంభోత్సవం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బి.మఠం మండల కేంద్రానికి సమీపంలో అత్యాధునిక మౌలిక సదుపాయాలు, వసతులతో సువిశాల ప్రాంగణంలో గురు కులం రూపుదిద్దుకుందన్నారు. దాదాపు వెయ్యి మంది విద్యార్థులకు విద్యా వసతులు కల్పించగల సామ ర్థ్యం ఉన్న ఈ బాలుర మహా గురుకులంలో.. ఈ విద్యా సంవత్సరానికి గాను 640 మంది విద్యార్థులతో అడ్మిషన్లను ప్రారంభించడం జరిగిందన్నారు. భవిష్యత్తులో ఈ మహా గురుకులం కీర్తి రాష్ట్ర స్థాయిలో రెపరెపలాడించే స్థాయికి ఎదగాలని కలెక్టర్ ఆకాంక్షించారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడుతూ 21 కోట్ల వ్యయంతో మహా గురుకులం నిర్మాణం పనులు చేపట్టడం జరిగిందన్నారు. మైదుకురు నియోజకవర్గ అభివృధ్ధి కోసం కలెక్టర్ ఎంతో సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. ఎస్పీ అశోక్ కుమార్ మాట్లాడుతూ సమాజంలో అన్నింటికీ మూలం ఒక్క విద్యనే అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తెరగాలన్నారు. గురుకుల విద్యాలయాల జిల్లా కో ఆర్డినేటర్ ఉషశ్రీ మాట్లాడారు. అనంతరం అధికారులు తరగతి , హాస్టల్ గదులు.. వసతులను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో బద్వేలు ఆర్డీవో చంద్రమోహన్, డీఈవో షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏసీపీ నిత్యానందరాజు,సోషల్ వెల్ఫర్ డీడీ సరస్వతి, డ్వామా పీడీ ఆది శేషారెడ్డి, ఎంపీపీ వీర నారాయణరెడ్డి పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మహా గురుకుల విద్యాలయంలో తరగతుల ప్రారంభోత్సవం -
సీమకు నీళ్లివ్వండి బాబూ!
‘కరెంట్’ టాపిక్.. ● శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన...రైతుల్లో గుబులు ● సీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు! ● కూటమి ఎమ్మెల్యేలపై సర్వత్రా విమర్శలు కూటమి నేతల నిర్లక్ష్యం రాయలసీమ సాగునీటి ప్రాజెక్టులకు పోతిరెడ్డిపాడు శ్రీశైలం జలాలను విడుదల చేసే విషయంలో సీమకు చెందిన కూటమి నేతలు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఇప్పుడు విద్యుత ఉత్పాదన చేపట్టారు. వరద ప్రభావం కూడా బాగా తగ్గుముఖం పట్టింది. ఇందువల్ల శ్రీశైలంలో నీటి మట్టం క్రమేపీ తగ్గిపోతే కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ, జీఎన్ఎస్ఎస్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారుతుంది. –సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు, కడప కనీస నీటిమట్టం నిర్వహించాలి శ్రీశైలం జలాశయంలో కనీస నీటిమట్టం 854 అడుగులను నిర్వహించాలి. ఆపై వచ్చే వరద ప్రవాహాన్ని అనుసరించి రాయలసీమ ప్రాజెక్టులైన తెలుగుగంగ, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీలకు సాగునీరు విడుదల చేసేందుకు చర్యలు చేపట్టాలి. ఇప్పుడు ఇరు రాష్ట్రాలు శ్రీశైలంలో విద్యుత్ ఉత్పాదన చేపట్టడం ఆందోళన కలిగిస్తోంది. రాయలసీమ నీటి విడుదలపై ప్రభుత్వం వెంటనే స్పష్టత ఇవ్వాలి. – దస్తగిరిరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ రైతుసంఘం,కడప కడప సెవెన్రోడ్స్: శ్రీశైలం జలాశయం నుంచి రాయలసీమ ప్రాజెక్టులకు నీటి విడుదలపై నీలి నీడలు కమ్ముకున్నాయి. ఇప్పటికే పలు రిజర్వాయర్లు బోసిపోయినట్లు అగుపిస్తున్నాయి. వరద ప్రవాహం బాగా ఉన్నప్పుడు నీరు విడుదల చేయడంలో కూటమి ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం వహించిందంటూ రైతులు మండిపడుతున్నారు. ప్రాజెక్టుల పరిధిలోని ఎమ్మెల్యేలంతా అధికార టీడీపీకి చెందిన వారైనప్పటికీ పట్టించుకోలేదన్న విమర్శలు సర్వత్రా వినిపిస్తున్నాయి. తాజాగా శ్రీశైలం జలాశయం కుడి, ఎడమ గట్టు వద్ద విద్యుత్ ఉత్పాదన ప్రారంభించారు. ఆ మేరకు నీరు దిగువనున్న నాగార్జున సాగర్ జలాశయానికి వెళుతోంది. దీంతో శ్రీశైలానికి ఎగువ నుంచి వస్తున్న వరద ప్రభావం ఒక్కసారిగా గణనీయంగా తగ్గుముఖం పట్టింది. సీమకు నీటి విడుదలపై ప్రభు త్వం నుంచి ఇప్పటివరకు ప్రకటన వెలువడని నేపథ్యంలో బుధవారం రాయలసీమ సాగునీటి సాధన సమితి నాయకులు కర్నూలులోని చీఫ్ ఇంజనీరు కార్యాలయం వద్ద ఆందోళన నిర్వహించారు. ● ఇన్నాళ్లూ ఎగువన కురిసిన వర్షాల వల్ల శ్రీశైలానికి వరద ప్రభావం భారీగా వచ్చి చేరడం, విద్యుత్ ఉత్పాదన చేపట్టకపోవడం వంటి కారణాలతో శ్రీశైలం జలాశయంలో నీటి మట్టం 874 అడుగులకు చేరడంతో రాయలసీమ రైతుల్లో ఆశలు మొలకెత్తాయి. ఖరీఫ్ సీజన్ ప్రారంభం కావడంతో ఈ ఏడు ప్రాజెక్టుల ద్వారా నీరందితే సకాలంలో పంటలు సాగు చేసుకోవడానికి వీలవుతుందని భావించారు. శ్రీశైలం జలాశయంలో మంగళవారం విద్యుత్ ఉత్పాదన ప్రారంభం కావడంతో రైతుల ఆశలు ఆవిరవుతున్నాయి. బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి ఉన్న సమాచారం మేరకు.. రాష్ట్ర ప్రభుత్వం కుడిగట్టు కాలు వ వద్ద విద్యుత్ ఉత్పాదన ద్వారా 27,708 క్యూసెక్కుల నీరు దిగువనున్న కృష్ణానదిలోకి వదులుతోంది. ఎడమగట్టు కాలువ వద్ద తెలంగాణ ప్రభుత్వం విద్యుత్ ఉత్పాదన ద్వారా 35,315 క్యూసెక్కులు దిగువనున్న నాగార్జున సాగర్ జలాశయంలోకి విడుదల చేస్తోంది. ఇలా శ్రీశైలం జలాశయం రెండు వైపుల నుంచి 63,023 క్యూసెక్కుల నీరు దిగువకు వెళుతోంది. బుధవారం జలాశయంలోకి వస్తున్న వరద ప్రవాహం 64097 క్యూసెక్కులుగా నమోదైంది. విద్యుత్ ఉత్పాదన వల్ల కొంత నీరు పోయినా ఇన్ఫ్లో ద్వారా 1074 క్యూసెక్కుల నీరు మిగులు ఉన్నట్లే కదా అని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. అయితే వరద ప్రవాహం స్థిరంగా ఉండదనే విషయాన్ని విస్మరిస్తున్నారు. అధికార గణాంకాల ప్రకారమే సోమవారం సుమారు లక్షా 50 వేల క్యూసెక్కులు ఉన్న శ్రీశైలం ఇన్ఫ్లో బుధవారం మధ్యాహ్నం 3 గంటల సమయానికి 64,097 క్యూసెక్కులకు పడిపోయింది. మధ్యాహ్నం 3.00 గంటల సమయానికి శ్రీశైలం నీటిమట్టం 875.40 అడుగులుగా ఉంది. ప్రస్తుతం డ్యాంలో 165 టీఎంసీలు ఉన్నాయి. ● తెలుగుగంగ ప్రాజెక్టులో అంతర్భాగమైన వెలిగోడు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 16.95 టీఎంసీలకుగాను ప్రస్తుతం 1.83 టీఎంసీ మాత్రమే ఉన్నాయి. ఈ జలాశయం పూర్తి స్థాయి నీటి మట్టానికి చేరుకోవాలంటే ఇంకా 15.12 టీఎంసీల నీరు రావాల్సి ఉంది. కానీ, ఇన్ఫ్లో జీరోగా ఉంది. ఔట్ఫ్లో 80 క్యూసెక్కులు ఉంది. బ్రహ్మంసాగర్ రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 17.74 టీంఎసీలు కాగా, ప్రస్తుతం 6.24 టీఎంసీ(35.17 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో జీరో..అవుట్ ఫ్లో 132 క్యూసెక్కులు ఉన్నాయి. ● గోరకల్లు రిజర్వాయర్ పూర్తి సామర్థ్యం 12.44 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.13 టీఎంసీ (25.16 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో జీరో, అవుట్ ఫ్లో 70 క్యూసెక్కులు ఉన్నాయి. అవుకు కాంప్లెక్స్ రిజర్వాయర్ సామర్థ్యం 4.15 టీఎంసీకిగాను ప్రస్తుతం 1.68 టీఎంసీ (40.53 శాతం) ఉన్నాయి. గండికోట సామర్థ్యం 26.85 టీంఎసీకిగాను ప్రస్తుతం 14.77 టీఎంసీ (54.99 శాతం) ఉన్నాయి. ఇన్ఫ్లో 0, అవుట్ఫ్లో 470 క్యూసెక్కులు. మైలవరం సామర్థ్యం 9.98 టీఎంసీకిగాను 2.57 టీఎంసీ గా ఉండగా, ఇన్ఫ్లో 0, అవుట్ ఫ్లో 131 క్యూసెక్కులు. పైడిపాలెం సామర్థ్యం 6 టీఎంసీలకుగాను ప్రస్తుతం 4.46 టీఎంసీ ఉన్నా యి. ఇన్ఫ్లో 0, అవుట్ఫ్లో 10 క్యూసెక్కులుగా ఉంది. సర్వరాయ సాగర్ సామర్థ్యం 3.06 టీఎంసీకిగాను ప్రస్తుతం 0.89 టీఎంసీలు ఉండగా, ఇన్ఫ్లో 70, అవుట్ ఫ్లో 48 క్యూసెక్కులు ఉన్నాయి. నోరు మెదపని ప్రజాప్రతినిధులు తెలుగుగంగ, ఎస్ఆర్బీసీ, గాలేరు–నగరి, కేసీ కెనాల్ ఆయకట్టు పరిధిలోని శ్రీశైలం, నందికొట్కూరు, నంద్యాల, పాణ్యం, బనగానపల్లె, ఆళ్లగడ్డ, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, మైదుకూ రు, కడప అసెంబ్లీ నియోజకవర్గాలకు ప్రాతి నిద్యం వహిస్తున్న శాసనసభ్యులందరూ అధికార కూటమికి చెందిన వారే. వీరిలో ఒకరు బీజేపీకి చెందిన వారు కాగా, మిగతా వారంతా తెలుగుదేశం పార్టీకి చెందిన వారు. ఇటీవలి కాలంలో ఎన్నడూ లేని విధంగా తెలుగుదేశం పార్టీకి రాయలసీమ జిల్లాల్లో ప్రజలు మెజార్టీని కట్టబెట్టారు. అయితే, ఈ ప్రాంత సాగునీటి విషయంపై వారు తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారనే విమర్శలు ఆయకట్టు రైతుల్లో వినిపిస్తున్నాయి. వరద ప్రభావం బాగా వస్తున్న రోజుల్లోనే పోతిరెడ్డిపాడు ద్వారా జలాశయాలను నింపేందుకు చర్యలు తీసుకుని ఉండాల్సిందని రైతులు అంటున్నారు. ప్రస్తుతం విద్యుత్ ఉత్పాదన ద్వారా నీటిని సాగర్కు విడుదల చేస్తూపోతే తమ భవితవ్యం ప్రశ్నార్థకంగా మారుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరి ఇప్పటికైనా కూటమి ఎమ్మెల్యేలు స్పందిస్తారో లేదో చూడాలి. -
రాష్ట్రంలో విధ్వంసకర పాలన
బద్వేలు అర్బన్ : కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో విధ్వంసకర పాలన సాగుతోందని, అందులో భాగంగానే వైఎస్సార్సీపీ సేవాదళ్ జిల్లా అధ్యక్షుడు శ్రీకాంత్రెడ్డి ఇంటిని ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా కూల్చివేశారని కడప ఎంపీ వైఎస్అవినాష్రెడ్డి పేర్కొన్నారు. మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ బయనపల్లె గ్రామంలో ఇటీవల కూటమి నేతల ఒత్తిడితో ఇరిగేషన్, రెవెన్యూ అధికారులు కూల్చివేసిన శ్రీకాంత్రెడ్డి ఇంటిని మంగళవారం ఎమ్మెల్యే డాక్టర్ సుధతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కేవలం కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఎటువంటి ముందస్తు నోటీసులు లేకుండా శ్రీకాంత్రెడ్డి ఇంటిని కూల్చివేశారని విమర్శించారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందనేదానికి ఈ సంఘటనే నిదర్శనమని అన్నారు. అన్యాయంగా ఇంటిని కూల్చి వేసి తమ తప్పును కప్పిపుచ్చుకునేందుకు అసాంఘిక కార్యకలాపాలు జరుగుతున్నాయని చెప్పడం దుర్మార్గమని మండిపడ్డారు. గుడికి, బడికి 50 మీటర్ల దూరంలోనే మద్యంషాపు ఉండడం అసాంఘికమని..అటువంటి వాటిపై దృష్టి సారించాలని సూచించారు. సుమారు 8 ఏళ్ల క్రితం అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో ఇంటిని నిర్మించుకుంటే అప్పుడు చెరువు స్థలమని కనిపించలేదా అని ప్రశ్నించారు. అలాగే కూల్చివేసిన ఇంటి పక్కనే అప్పటి టీడీపీ ప్రభుత్వ హయాంలో సీసీ రోడ్డు కూడా ఏర్పాటు చేశారని.. అప్పుడు చెరువు స్థలమని ఈ ప్రభుత్వానికి తెలియదా అని అన్నారు. శ్రీకాంత్రెడ్డి కుటుంబానికి పార్టీ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసానిఆదిత్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, మాజీ కుడా చైర్మన్ గురుమోహన్, జెడ్పీటీసీ పోలిరెడ్డి, వైఎస్సార్సీపీ మున్సిపాలిటీ, ఆయా మండలాల అధ్యక్షులు సుందర్రామిరెడ్డి, మల్లేశ్వర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, రామకృష్ణారెడ్డి, మున్సిపల్ వైస్చైర్మన్ గోపాలస్వామి, డీఎల్డీఏ చైర్మన్ మాధవరెడ్డి, సగర విభాగం రాష్ట్ర అధ్యక్షుడు బంగారుశీనయ్య, యద్దారెడ్డి పాల్గొన్నారు. రైతు కుటుంబానికి ఎంపీ పరామర్శ ఖాజీపేట : కూటమి పాలనలో రైతులు అన్ని విధాలుగా నష్టపోతున్నారని ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి అన్నారు. బి. కొత్తపల్లె పంచాయతీ బక్కాయపల్లె గ్రామానికి చెందిన యువ రైతు పత్తి రామచంద్రారెడ్డి (42) మార్చి 19 న తన పొలంలోనే పురుగుల మందు తాగి ఆత్మహత్య హత్య చేసుకున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఎంపీ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మంగళవారం రోజున బక్కాయపల్లె గ్రామానికి వచ్చి రైతు కుటుంబాన్ని పరామర్శించారు. ఆయన చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. అనంతరం కుటుంబ సభ్యులతో మాట్లాడారు. సరైన దిగుబడి రాక పోవడం, దిగుబడి వచ్చిన సందర్భంలో గిట్టు బాటు ధర లేక నష్టాలు రావడంతో ఆత్మహత్యకు పాల్పడ్డాడని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. ఈసందర్భంగా ఎంపీ మాట్లాడుతూ పత్తి రామచంద్రారెడ్డి కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. పిల్లలను బాగా చదివించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ప్రభుత్వ వ్యవసాయ శాఖ మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, జిల్లా వైఎస్సార్ సీపీ జనరల్ సెక్రటరీ పీవీ రాఘవరెడ్డి, ఎపీఎస్ ఆర్టీసీ కడప మాజీ జోన్ అధ్యక్షుడు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, మండల కన్వీనర్ మురళీమోహన్రెడ్డి, కేసీకెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ అధ్యక్షుడు డీఎల్ శ్రీనివాసులరెడ్డి, కేసీకెనాల్ ప్రాజెక్టు కమిటీ మాజీ ఉపాధ్యక్షుడు రెడ్యం చంద్రశేఖర్రెడ్డి, మైదుకూరు నియోజకవర్గ రైతు విబాగం అధ్యక్షుడు నాగిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. కడప ఎంపీ వైఎస్అవినాష్రెడ్డి -
ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు
కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి కడప జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికలు ఈనెల 12, 13 తేదీలలో నిర్వహించనున్నట్లు బ్యాడ్మింటన్ అసోసియేషన్ ప్రెసిడెంట్ డాక్టర్ సింగం భాస్కర్ రెడ్డి, సెక్రటరీ పి. శ్రీనివాసులరెడ్డి తెలిపారు. జూలై 12వ తేదీ రెండవ శనివారం కడప డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో అండర్ 15, అండర్ 17 విభాగాలకు చెందిన బాల బాలికల ఎంపికలు జరుగుతాయన్నారు. అలాగే 13వ తేదీ ఆదివారం ప్రొద్దుటూరు జార్జ్ క్లబ్లో అండర్ 11, అండర్ 13 బాలబాలికలకు ఎంపికలు ఉంటాయన్నారు. ఈనెల 10వ తేదీ సాయంత్రం లోపు 9440107080 లేదా 9440223908 నంబర్కు ఎంట్రీలను పంపాలని అసోసియేషన్ చైర్మన్ బాషా కోరారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి మైదుకూరు/బి.కోడూరు : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ బి.కోడూరు మండలం గుంతపల్లెకు చెందిన గుంత జయరామిరెడ్డి (42) అనే వ్యక్తి మంగళవారం మృతి చెందాడు. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుంతపల్లెకు చెందిన జయరామిరెడ్డి జూన్ 29న ఖాజీపేట మండలం శ్రీనివాసపురం గ్రామంలోని బంధువుల ఇంటికి వచ్చాడు. అదే రోజు ఆయన శ్రీనివాసపురం గ్రామానికి చెందిన తన బంధువు కొండా వెంకట రమణారెడ్డితో కలిసి మైదుకూరుకు వస్తున్నారు. జాతీయ రహదారి సర్వాయపల్లె అండర్ పాస్ వద్ద సిమెంట్ మిక్చర్ వాహనం వారిని ఢీ కొంది. సంఘటనలో జయరామిరెడ్డి, వెంకటరమణారెడ్డి తీవ్రంగా గాయపడ్డారు. ప్రాథమిక చికిత్స అనంతరం వారిని మెరుగైన చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. కర్నూలులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో కొండా వెంకటరమణారెడ్డి చికిత్స పొందుతున్నాడు. కర్నూలు ప్రభుత్వాస్పత్రిలో చికిత్స పొందుతూ జయరామిరెడ్డి మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. బైకుల దొంగ అరెస్టుయశవంతపుర : అతని కన్ను పడితే ఎలాంటి బైక్ అయినా మాయం అవుతుంది. ఘరానా ద్విచక్ర వాహనాల దొంగను బెంగళూరు హెచ్ఏఎల్ పోలీసులు అరెస్ట్ చేసి రూ. 40 లక్షల విలువగల 32 బైక్లను సీజ్ చేశారు. అన్నమయ్య జిల్లా మదనపల్లెకి చెందిన హేమంత్ (23) నిందితుడు. ఇటీవల విభూతిపురలో జరిగిన బైకు చోరీ కేసులో విచారించి మదనపల్లి మొయిన్రోడ్డులో నివాసం ఉంటున్న హేమంత్ను అరెస్ట్ చేశారు. హొసకోట, విజయపురలోనూ బైకులను చోరీ చేశాడు. 20 బైకులను మదనపల్లెలోని తన స్నేహితులకు అమ్మినట్లు పోలీసులు తెలిపారు. మిగిలిన బైకులను మదనపల్లె మెయిన్ రోడ్డులోని ఖాళీ జాగాలో దాచి ఉంచాడు. వాటిని స్వాధీనం చేసుకుని తరలించారు. రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్ర గాయాలు కలికిరి : తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిలో వాల్మీకిపురం మండల పరిధిలోని గండబోయనపల్లి సమీపంలో గల టోల్గేట్ వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలు.. కలికిరి గ్రామ పంచాయతీ సర్పంచ్ ఎల్లయ్య కుమారుడు వినేష్ సొంత పనుల నిమిత్తం మదనపల్లికి వెళ్లి తిరిగి వస్తున్నాడు. గండబోయనపల్లి సమీపంలోని టోల్గేటు వద్ద కర్ణాటకకు చెందిన కెఎ36ఎం 9619 తూఫాన్ వాహనం వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదంలో వినేష్కు తీవ్ర గాయాలు కాగా, తూఫాన్ వాహనం రోడ్డుపైన ఫల్టీ కొట్టింది. -
‘గురుకులం’ పనులు పూర్తి చేయండి
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో వెనుకబడిన తరగతుల పేద విద్యార్థులకు అధునాతన వసతులతో నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో ఏర్పాటవుతున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయం త్వరలో నిర్వహణలోకి రానుందని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో.. తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో నూతనంగా ఏర్పాటైన మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో పెండింగ్ పనులు, వసతులు సంబంధిత అంశాలపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాన్ని త్వరలో నూతన భవనంలో మారుస్తామని వెల్లడించారు. రెండు నెలల్లో గురుకులంలో ఎలాంటి మౌళిక సదుపాయాల కొరత లేకుండా రోడ్లు, విద్యుత్, నీటి పైప్ లైన్, గ్రీనరీ, డ్రిప్ ఇరిగేషన్ తదితర అన్ని రకాల సౌకర్యాలను సమకూర్చాలన్నారు. ఆర్ అండ్ బీ ఈఈ మాధవి, డీఈ జగదీశ్వర్ రెడ్డి, డీఈఓ షంషుద్దీన్, ఎస్ఎస్ఏ ఏపీసీ ఎ.నిత్యానందరాజులు, కాంట్రాక్టు ఏజెన్సీ సంబంధిత ఇంజనీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
నేటి నుంచి టోల్ ఫీజు
ముద్దనూరు : నూతనంగా నిర్మాణం పూర్తయిన ముద్దనూరు–తాడిపత్రి 4లేన్ల జాతీయ రహదారిలో బుధవారం నుంచి టోల్ప్లాజా ప్రారంభించి టోల్ ఫీజు వసూలు చేయనున్నారు. మండలంలోని మంగపట్నం గ్రామ సమీపంలో ఈ టోల్ప్లాజా నెలకొల్పారు. ముద్దనూరు నుంచి తాడిపత్రి వరకు సుమారు 55 కి.మీ. రహదారిని 4లేన్ల రహదారిగా నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలోనే ఈ రహదారి పనులకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతులు,నిధులు మంజూరయ్యాయి. అనంతరం పనులు కూడా ప్రారంభమయ్యాయి. ఇటీవలే రహదారి నిర్మాణం పూర్తవడంతో నేటినుంచి వాహనాలకు టోల్ఫీజు కూడా వసూలు చేయనున్నారు. తాడిపత్రి,అనంతపురం,గుత్తి,బళ్లారి తదితర ముఖ్య ప్రాంతాలకు ప్రయాణించే వాహనాలతో ఈ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది. జలాశయాల్లో చేపల వేట నిషేధం కొండాపురం : జిల్లాలోని గండికోట జలాశయం, బ్రహ్మసాగర్, సోమశిల వెనుక జలాలలో చేపల వేట నిషేధించినట్లు ఉప మత్య్ససంచాలకులు నాగయ్య మంగళవారం తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సహజంగా చేపల సంతానోత్పత్తి జూలై 1 నుంచి ఆగస్టు31 వ తేది వరకు ఉంటుందని.. ఈ 62 రోజులపాటు మత్య్సకారులు ఎవరు చేపలు పట్టకూడదని ఆయన హెచ్చరించారు. చేపల వేటకు పోతే ప్రభుత్వ నియమ నిబంధనలను అతిక్రమిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. జలాశయాలల్లో వేటకు వెళ్లితే మత్స్యకారుల లైసెన్సులు రద్దు చేస్తామని హెచ్చరించారు. జిల్లాలో మత్య్స సంపద అభివృద్ధికి కృషి – మత్య్సశాఖ నూతన డీడీ నాగయ్య కడప అగ్రికల్చర్ : జిల్లాలో మత్య్స సంపద అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని మత్స్య శాఖ డిప్యూటి డైరెక్టర్(ఎఫ్ఏసీ) నాగయ్య పేర్కొన్నారు.జిల్లా మత్యశాఖ డీడీ గా నాగ య్య మంగళవారం కడప మత్స్యశాఖ కార్యాలయంలో బాధ్యతలను చేపట్టారు. నాగయ్యకు కార్యాలయ సిబ్బంది అభినందించారు.5న మెగా జాబ్మేళా బద్వేలు అర్బన్ : స్థానిక రాచపూడినాగభూషణం డిగ్రీ, పీజీ కళాశాల ఆధ్వర్యంలో ఈ నెల 5న సియట్ కంపెనీ ద్వారా జాబ్మేళా నిర్వహించనున్నట్లు కళాశాల ఏఓ సాయిక్రిష్ణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ, బీసీఏలలో 2022, 2023, 2024, 2025 విద్యా సంవత్సరాల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు అర్హులని తెలిపారు. వివరాలకు 8297160304, 9703244614 నెంబర్లను సంప్రదించాలని కోరారు. నియామకం కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ జిల్లా విద్యార్థి విభాగ కమిటీని నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లా ఉపాధ్యక్షుడిగా సి. సాయి నారాయణరెడ్డి(బద్వేల్), బి. శ్రీకాంత్రెడ్డి(జమ్మలమడుగు), జిల్లా ప్రధాన కార్యదర్శులుగా కేసీ పాములేటి(జమ్మలమడుగు, ఆర్. మహేష్(కమలాపురం), శ్యామ్ మంచాల (కడప), నరేంద్రారెడ్డి (ప్రొద్దుటూరు), రాయు డు (మైదుకూరు), జిల్లా కార్యదర్శులుగా టి.మధుసూదన్రెడ్డి(మైదుకూరు), చైతన్య (ప్రొద్దుటూరు), పవన్కుమార్రెడ్డి(పులివెందుల), అబ్దుల్ ఖాదర్ (జమ్మలమడుగు), ఎన్. జయరామిరెడ్డి(కమలాపురం),రాకేష్ (బద్వేల్), మహ్మద్ సొహైల్ (కడప)ను నియమించారు. అలాగే ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా పి. ధీరజ్ గణేష్, ఎస్. లెన్నీ, వి. కార్తిక్ (కడప), విజయ్భాస్కర్రెడ్డి, కె. శ్రీనివాసులురెడ్డి(కమలాపురం), కె. శివప్రసన్న కుమార్, జి. నారారయణరెడ్డి, కె. రవీంద్రారెడ్డి(బద్వేల్), వి. ఆదిత్యనాథ్రెడ్డి, ఎస్. అఖిల్(ప్రొద్దుటూరు), షేక్ మహ్మద్, ప్రకాష్ వేముల(పులివెందుల), భరత్కుమార్రెడ్డి, షేక్ ఖలీల్బాషా (జమ్మలమడుగు), నరసింహారెడ్డి, వై. చైతన్యరెడ్డి(మైదుకూరు)లను నియమించారు. -
ముందుంది శ్రావణం.. ఏదీ స్వామి దర్శనం.!
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి ఆలయం అంటే రాయలసీమ జిల్లాల్లో తెలియని వారంటూ ఉండరు. మరీ ముఖ్యంగా శ్రావణ మాసం అంటే గుర్తుకు వచ్చేది కూడా గండిక్షేత్రమే. లక్షలాది మంది భక్తులు స్వామిని దర్శించుకోవడానికి తరలి వస్తారు. అయితే గండి వీరాంజనేయుడి మూలవిరాట్ దర్శనం కోసం గత నాలుగేళ్ల నుంచి ఎదురు చూసిన భక్త జనానికి ఈ ఏడాది కూడా నిరాశేశే ఎదురవుతోంది. ఇందుకు కారణాలు చూస్తే కోకొల్లలుగా కనిపిస్తున్నాయి. ముఖ్యంగా ఆలయం పట్ల కొందరి నిర్లక్ష్యం. మరి కొందరి పంతాలు పట్టింపులు. ఇంకొందరి అసమర్థత ఇందులో బలంగా కనిపిస్తున్నాయి. గండి వీరాంజనేయ స్వామి దేవస్థానాన్ని 2004లో వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక టీటీడీలో విలీనం చేసి కొంత వరకు అభివృద్ధి చేశారు. ఆ తర్వాత ఆయన తనయుడు జగన్ మోహన్రెడ్డి సీఎం అయ్యాక ఏకంగా రు.28 కోట్లు నిధులు మంజూరు చేసి చరిత్రను తిరగరాశారు. ముఖ్యమంత్రి హోదాలో తొలి శిలాఫలకం వేశారు. వెంటనే పనులు ప్రారంభించి త్వరిత గతిన పూర్తి చేయాలని ఆదేశించారు. అయితే తొలుత పనులు వేగవంతంగా జరిగినా క్రమేపీ మంద కొడిగా సాగాయి. నేతలు, అధికారులు, కాంట్రాక్టర్ నిర్లక్ష్యం కారణంగా పుణ్య కాలం కాస్తా పూర్తయింది. ఆలయం పనులు పూర్తవలేదు. ఇంతలో ఎన్నికలు వచ్చాయి.తిరిగి ప్రభుత్వం అదికారం లోకి రాలేదు. ఆలయం పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉండి పోయాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఆలయం పనులు జోరందుకుంటాయని భక్తులు భావించారు. కాని ఇందుకు విరుద్ధంగా గత ప్రభుత్వంలోని పాలక మండలిని రద్దు చేయించి, తాము సీట్లో కూర్చోవాలి తర్వాతనే గుడి పునః ప్రతిష్ట పనులు అనే ధోరణితో కూటమి నేతలు ఉన్నట్లు తెలుసుకొని భక్తులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. మహా కుంభాభిషేకం జరగాలంటే సుమారు రూ. 5 కోట్ల నుంచి రూ.10 కోట్ల వరకు ఖర్చు వస్తుంది. పెండింగ్ పనులు పూర్తి కావాలంటే మరో ఏడాది కాలం పడుతుంది. అంతవరకు కుంభాభిషేకం చేయకూడదని కొందరు చెబుతున్నారు. ఆ నిధులు ప్రభు త్వం నుంచి మంజూరు చేయించాలనే ఆలోచన ఏ ఒక్క కూటమి నేత చేయకపోవడం విచారకరం. పునః ప్రతిష్ట చేస్తే సరిపోతుంది కదా.. ఆలయం పనులు పూర్తయ్యాకే మహా కుంభాభిషేకం అంటున్నారు. ఇందుకు పనులు పూర్తి కాలేదు అంటున్నారు. అయితే నిత్యం ధూప దీప నైవేద్యాలు మూల విరాట్కు అర్చకులు క్రమం తప్పక నిర్వహిస్తున్నారు. ఇన్ని చేసేవారు భక్తులకు స్వామి దర్శనం కూడా చేయించవచ్చు కదా అని చర్చించుకుంటున్నారు. పునః ప్రతిష్ట చేసేందుకు చిన్న చిన్న పనులు మాత్రమే మిగిలి ఉన్నాయి. ఇవి మహా అంటే వారం పది రోజుల్లో పూర్తవుతాయి. పైగా నిధుల ఖర్చు కూడా తగ్గుతుంది. భక్తులకు మూల విరాట్ దర్శనం చేయించిన వారు అవుతారు. దీనివల్ల ఆలయ ఆదాయం కూడా గణనీయంగా పెరుగుతుంది. ఈ కోణంలో అధికారులు ఎందుకు ఆలోచించడం లేదనే ప్రశ్న భక్తుల నుంచి వినిపిస్తోంది. పంతాలు పట్టింపులతో సరి.. ఆలయంలో 95 శాతం పైగా పనులు పూర్తయ్యా యని జూన్ నెలాఖరులోపు గుడి పునఃప్రతిష్ట కార్యక్రమం పూర్తి చేసేదుకు ముహూర్తపు తేదీని ఖరారు చేయాలని నాలుగు నెలల క్రితం దేవదాయశాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్ కర్నూలు డీసీ పట్టెం గురుప్రసాద్లు ఆలయ ప్రధాన, ఉప ప్రధాన అర్చకులకు ఆదేశించారు. అయితే అర్చకుల మధ్య విభేదాలు తారా స్థాయిలో ఉన్నాయి. దీంతో ముహూర్తం నిర్ణయించేందుకు వీరు పట్టించుకున్న పాపాన పోలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గండి ఆలయ పునః ప్రతిష్టపై వీడని ఉత్కంఠ నాలుగేళ్లుగా నిరాశలో లక్షలాది మంది భక్తులు ఈ ఏడాదీ అదే పరిస్థితి -
కల.. నిజమైన వేళ !
వారంతా శ్రమజీవుల బిడ్డలు. తల్లిదండ్రుల కష్టాలు కళ్లారా చూశారు. బాగా చదివి ఉన్నత స్థాయికి చేరాలని.. కన్న వారి కలలను నిజం చేయాలని కలగన్నారు. కష్టపడి చదివారు.. వారి కష్టానికి ఫలితం దక్కింది. మహానేత వైఎస్సార్ స్థాపించిన ట్రిపుల్ ఐటీలో సీటు దక్కింది. స్వప్నం సాకారమైన వేళ.. వారి కళ్ల నిండా సంతోషం కనిపించింది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో అడ్మిషన్ల ప్రక్రియ ప్రశాంతంగా సాగింది. వేంపల్లె : రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాయలం పరిధిలోని ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమ, మంగళవారాల్లో విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ఈ ప్రక్రియలో పాల్గొన్నారు. ● రెండు రోజులపాటు నిర్వహించిన కౌన్సెలింగ్ ప్రక్రియలో భాగంగా 1010 సీట్లకు సంబంధించి అభ్యర్థులకు కాల్ లెటర్లు పంపగా.. 878 మంది విద్యార్థులు హాజరై ప్రవేశాలు పొందారు. త్వరలో రెండో జాబితా విడుదల చేయనున్నట్లు డైరెక్టర్ తెలిపారు. జూలై 15 నుంచి తరగతులు ప్రారంభమవుతాయని డైరెక్టర్ తెలిపారు. వైఎస్సార్ను స్మరించుకున్న విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు. భావిభారత ఇంజినీర్లుగా దేశానికి సేవ చేయాలన్నదే లక్ష్యంగా ముందుకు సాగుతామని అడ్మిషన్లు పాందిన విద్యార్థులు తెలిపారు. ట్రిపుల్ ఐటీలో ముగిసిన అడ్మిషన్ల ప్రక్రియ మొత్తం 878 మంది అడ్మిషన్లు పొందిన విద్యార్థులు -
ప్రభుత్వ స్థలంపై కన్నేశారు !
వల్లూరు (చెన్నూరు) : ఖాళీ జాగా కనిపిస్తే చాలు పచ్చ నేతలు వాలిపోతున్నారు. వేలు..లక్షలు కాదు కోట్ల రూపాయల ప్రభుత్వ స్థలాలను దర్జాగా కబ్జా చేస్తున్నారు. అధికారం అండ చూసుకుంటూ.. అధికారుల తీరును ఆసరాగా మార్చుకుంటూ కబ్జా పర్వం సాగిస్తున్నారు. ఇదిగో ఈ చిత్రంలో కనిపిస్తున్న స్థలం చెన్నూరు మండలం చిన్నమాచుపల్లె గ్రామ పొలంలో శాటిలైట్ సిటీ సమీపంలో ఉంది. సర్వే నెంబర్ 405/2 –68 సెంట్లు, 406/1– 47 సెంట్లు,406/2– 2.07 రెండు ఎకరాల ఏడు సెంట్లు, 406/3 –11 సెంట్లు వెరసి మొత్తం 3.33 ఎకరాలను ఆక్రమించేందుకు భూబకాసురులు పథక రచన చేశారు. సర్వే నెంబర్ 405 లో 70 సెంట్ల స్థలం కబ్జా విషయమై గత జూన్ 15న ‘సాక్షి’పత్రికలో పతాక శీర్షికన కథనం రావడంతో వెనక్కి తగ్గిన కబ్జాకోరులు ప్రస్తుతం 1 బి అడంగల్ లో 3.33 ప్రభుత్వ భూమిగా కనబడుతున్న దానిని ఆక్రమించేందుకు మళ్లీ పనులు మొదలు పెట్టారని స్థానికులు ఆరోపిస్తున్నారు. చిన్నమాచుపల్లి గ్రామ పొలం ప్రాంతంలో భారీగా వెంచర్లు వెలిసి ఉండడంతో, అక్కడి భూములకు ఒక్కసారిగా గిరాకీ పెరిగింది. ఈ విషయాన్ని కూటమి నేతలు తమకు అనుగుణంగా మార్చుకొని ప్రభుత్వ భూములను సైతం ఆక్రమించే ప్రయత్నాలు కొనసాగిస్తున్నారు. ఇంత జరుగుతున్నా రెవె న్యూ అధికారులు చోద్యం చూస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రభుత్వ భూ మి ఆక్రమణదారుల పాలు కాకుండా చర్యలు చేపట్టాలని మండల వాసులు కోరుతున్నారు. రూ. 10 కోట్ల విలువైన స్థలం ఆక్రమణకు యత్నం చోద్యం చూస్తున్న రెవెన్యూ అధికారులు