breaking news
YSR District Latest News
-
సైన్సు మ్యూజియం సందర్శన
కడప ఎడ్యుకేషన్: కడప చెన్నూరు బస్టాండ్లో ఉన్న సైన్సు మ్యూజియం సెంటర్ను ఆదివారం ఉన్నత విద్య ఆర్జేడీ డాక్టర్ రవీంద్రనాథ్, డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్స్, సైన్సు విభాగ అద్యాపకులు సందర్శించారు. ఈ సందర్భంగా వారు సైన్సు మ్యూజయంలోని పరికరాలను పరిశీలించారు. సైన్సు మ్యూజియంలోని ఎక్యూప్మెంట్ గురించి సైన్సు క్యూరేటర్ రెహమాన్ను అడిగి తెలుసుకున్నారు. కడప ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్ ప్రిన్సిపల్ డాక్టర్ సలీంబాషా పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: కడపలోని భారత స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ప్రధాన శిక్షణ కేంద్రంలో వారం రోజుల నుంచి సాగుతున్న స్కౌట్ మాస్టర్ శిక్షణ ఆదివారంతో ముగిసింది. ఎల్.ఓ.సి డాక్టర్ కమల కన్నన్, శివ ప్రసాద్ రావు ఆధ్వర్యంలో నిర్వహించిన బేసిక్, అడ్వాన్స్ కోర్సు శిక్షణకు జిల్లా వ్యాప్తంగా వివిధ పాఠశాలలు, కళాశాలల నుంచి దాదాపు ఎనబై మంది ఉపాధ్యాయులు, అధ్యాపకులు పాల్గొన్నారు. కార్యక్రమంలో జిల్లా జాయింట్ సెక్రటరీ వెంకట సుబ్బయ్య, కోశాధికారి శివ శంకర్ రెడ్డి, సహాయ సిబ్బంది శివ ప్రసాద్, అమర్నాథ్ బాబు, అహమ్మద్, పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: ఉద్యోగ, ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే నెరవేర్చాలని బహుజన టీచర్స్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున డిమాండ్ చేశారు. కడపలోని బహుజన టీచర్స్ యూని యన్ సంఘ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన ముఖ్య నాయకుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఉద్యోగ ఉపాధ్యాయుల కు అనేక హామీలు ఇచ్చి అధికారం వచ్చిన తర్వాత విస్మరించడం చంద్రబాబు ప్రభుత్వానికి మంచిది కాదన్నారు. గత ఎన్నికలలో ఇచ్చిన హామీ మేరకు వెంటనే పీఆర్సీ కమిటీ వేసి, 30శాతం ఐఆర్ ప్రకటించాలన్నారు. ఉద్యోగులకు రావలసిన పెండింగ్ డీఏలు, ఐ.ఆర్, పీఆర్సీ కమిటీలపై ఆలస్యం చేయకుండా మంచి నిర్ణయాన్ని తీసుకోవాలని ఉద్యోగ, ఉపాధ్యాయులలో నెలకొన్న తీవ్ర నిరాశ నిస్పహలను తగ్గించాలని కోరారు. కడప జిల్లా అధ్యక్షుడు యమ్. గంగరాజు, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు కట్టా గంగాధర్, జిల్లా కార్యదర్శి కె. జయరాం తదితరులు పాల్గొన్నారు. సిద్దవటం: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయడం దుర్మార్గమైన చర్య అని వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టినరోజు సందర్భంగా సిద్దవటం మండలం భాకరాపేట మూడు రోడ్ల కూడలిలో ఉన్న దివంగత నేత వైఎస్ఆర్ విగ్రహం వద్ద ఆదివారం ఎమ్మెల్యే కేక్ను కట్ చేశారు. అనంతరం పరమాత్మ సేవా వృద్ధాశ్రమంలో వృద్ధులకు పండ్లు పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద విద్యార్థులకు వైద్య విద్య ఉచితంగా అందాలని, అలాగే పేద కుటుంబాల వారు ఉచిత వైద్యం పొందాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్ రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తెచ్చారన్నారు. ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు వాటిని ప్రైవేట్పరం చేసేందుకు చర్యలు చేపట్టారన్నారు. వైఎస్ఆర్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వర్రెడ్డి పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వరనాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు తమ అర్జీలు పరిష్కారం కాకపోయినా లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్కు కాల్ చేయవచ్చన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు వారి అర్జీలు మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో అర్జీలు నమోదు చేసుకోవచ్చన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నెంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని పేర్కొన్నారు. -
వాసు పోస్టింగ్.. ఊస్టింగ్!
సాక్షి ప్రతినిధి, కడప: రాజకీయ నేతలు అనుక్షణం సేవాభావం కలిగి ఉండాలి. సమాజ శ్రేయస్సుపై అంకితభావంతో మెలగాలి. చెప్పే మాటల్లో నిజాయితీ, ఆచరణలో చిత్తశుద్ధి కన్పించాలి. అప్పుడే ప్రజల్లో మెప్పు, ఆయా రాజకీయ పార్టీల్లో పరపతి ఉంటుంది. ఇందుకు భిన్నంగా వ్యవహరిస్తే అంతే స్పీడ్గా తిరోగమనం చవిచూడాల్సి వస్తుంది. టీడీపీ నేత శ్రీనివాసులరెడ్డే తీరే ఇందుకు ప్రత్యక్ష ఉదాహరణ. వాసు వ్యవహారశైలితో విసిగిపోయిన టీడీపీ అధిష్టానం తాజాగా జిల్లా బాధ్యతల నుంచి తప్పించింది. జిల్లా తెలుగుదేశం పార్టీలో రెడ్డెప్పగారి శ్రీనివాసులరెడ్డి కింగ్ పిన్... పార్టీ యావత్తు తన చుట్టే తిరిగేది. నియోజకవర్గాల్లో తాను సూచించిందే ఫైనల్. ఇది పదేళ్ల క్రితం మాట. క్రమేపీ తప్పించుకునే ధోరణి అలవాటు చేసుకున్నారు. ఉన్న కేడర్లో నమ్మకం సన్నగిల్లింది. కడప పార్లమెంటు పరిధిలో కీలక నేతగా ఉన్న ఆయన, కేవలం కడప అసెంబ్లీ నియోజకవర్గానికి పరిమితం కావాల్సి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. పోనీ కడప నియోజకవర్గంలో కూడా పార్టీ కేడర్కు భరోసాగా నిలిచారా?అంటే అదీ లేదు. అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనతో ఎన్నో ఏళ్లుగా టీడీపీ కోసం అంటిపెట్టుకొని వస్తున్నవారిని వ్యూహాత్మకంగా దెబ్బతీశారు. చివరికి కార్పొరేషన్ పాలకమండలిలో టీడీపీ పరువు నిలిపిన ఏకై క కార్పొరేటర్ ఉమాదేవి కుటుంబానికి రాజకీయంగా ముప్పుతిప్పలు పెట్టారు. ఎన్నికలకు ముందు సర్వస్వం టీడీపీనే అనుకున్న వారిని క్రమేపి దూరం చేసుకుంటూ వచ్చారని పరిశీలకులు పేర్కొంటున్నారు. ఒంటెత్తు పోకడలు...దౌర్జన్యకర ఘటనలు టీడీపీ అధికారంలోకి వచ్చాక పార్టీలో తాను చెప్పిందే వేదం, తన మాటే శాసనం అన్నట్లు వాసు వ్యవహరించారు. కడప గడపలో వైరిపక్షానికి చెందిన రెండు బార్లు బలవంతంగా లాక్కున్న ఘటన తెరపైకి వచ్చింది. మూడు దశాబ్దాలుగా మద్యం వ్యాపారంలో తలమునకలైనప్పటికీ ఇలాంటి పరిస్థితి ఎప్పుడు చూడలేదని సదరు మద్యం వ్యాపారి వాపోవడం గమనార్హం. టీడీపీ కేడర్పై అంతర్గతంగా పైచేయి సాధించాలనే తపనే ఇలాంటి దౌర్జన్యకర ఘటనలను ప్రోత్సహించేలా చేసిందని విశ్లేషకుల మాట. ఇలాంటి చర్యలతో విసిగిపోయిన టీడీపీ కేడర్ పొరుగు నియోజకవర్గానికి చెందిన పుత్తా నరసింహారెడ్డి వద్దకు క్యూ కట్టారు. వివిధ రూపాల్లో నిరసనలు పాటించడం, కమలాపురానికెళ్లి మరీ పుత్తాకు మొరపెట్టుకుంటూ వచ్చారు. ఈ పరిణామాలను సరిదిద్దుకోవాలనే ఆలోచన లేకపోవడంతో అధిష్టానం వద్ద మరింత చులకన కావాల్సి వచ్చిందని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు కడపలో నిర్దిష్ట అభివృద్ధి సాధించేందుకు ప్రత్యేక చర్యలు చేపట్టలేకపోయారు. ఎంతసేపు వైరిపక్షంపై కక్ష సాధింపు రాజకీయాలకు పరిమితం అయ్యారు. ఇలాంటి ఘటన లన్నీ కూడా అధ్యక్ష పదవి తొలగింపునకు ప్రధాన కారణమయ్యాయని పరిశీలకులు వివరిస్తున్నారు. టీడీపీని ఏకతాటిపై నడపడంలో విఫలం కడప టీడీపీ కేడర్లో పెరిగిన అసంతృప్తి పుత్తాను ఆశ్రయిస్తూ వచ్చిన తెలుగుతమ్ముళ్లు రాజ్యసభ సీటుపై సన్నగిల్లిన ఆశలు కడప జిల్లా టీడీపీ అధ్యక్షుడిగా జమ్మలమడుగు ఇన్ఛార్జి చదిపిరాళ్ల సుబ్బరామిరెడ్డి (భూపేష్రెడ్డి)ని ఆ పార్టీ అధిష్టానం నియమించింది. ప్రధాన కార్యదర్శిగా జబీబుల్లా (ప్రొద్దుటూరు)ను నియమించారు. కాగా భూపేష్ జమ్మలమడుగు ఎమ్మెల్యే టికెట్పై ఆశలు పెట్టుకుంటే చిన్నాన్న ఆదినారాయణరెడ్డి పొత్తులో భాగంగా బీజేపీ టికెట్ దక్కించుకున్నారు. విధిలేని పరిస్థితుల్లో ఎంపీ అభ్యర్థిగా బరిలో నిలవాల్సి వచ్చింది. గ్రూపు రాజకీయాలకు, అంతర్గత విభేదాలకు తావు లేకుండా ఉండేందుకే తాజాగా జిల్లా అధ్యక్ష పదవి అప్పగించి ఉంటుందని రాజకీయ వేత్తలమాట. పైగా అధిష్టానం రిమోట్ కంట్రోల్ ద్వారా పార్టీని చక్కదిద్దేందుకు కట్టబెట్టారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రబల్లె పంచాయతీ పరిధిలోని మల్లికార్జునపురం, నల్లపురెడ్డిపల్లె గ్రామాల్లోని పొలాల్లో శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ వైర్లు చోరీ చేశారు. మల్లికార్జునపురం గ్రామానికి చెందిన రైతులు మల్రెడ్డి, మస్తాన్, రామాంజనేయులు, నబీ రసూల్, సుధాకర్ల పొలాల్లోని మోటార్ల దగ్గర ఉన్న కేబుల్ వైర్లను అపహరించి తీసుకెళ్లారు. కడపలో చైన్ స్నాచింగ్ కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో రామరాజుపల్లెలో ఆదివారం మధ్యాహ్నం పందిళ్లపల్లి పద్మావతి అనే మహిళ మెడలో నుంచి రోల్డ్ గోల్డ్ చైన్తో పాటు రెండు కాసుల బంగారు చైన్ను గుర్తుతెలియని వ్యక్తి వచ్చి లాక్కెళ్లాడు. రామరాజుపల్లికి చెందిన పద్మావతి తమ బంధువుల ఇంటికి సీమంతం ఫంక్షన్కు వెళ్లి తిరిగి వస్తుండగా సచివాలయం ఎదురుగా గుర్తుతెలియని వ్యక్తి వచ్చి బాధితురాలి తల వెనుక భాగాన కొట్టి ఆమె మెడలోని చైన్ను లాక్కెళ్లాడు. చైన్ను లాక్కున్న వెంటనే దూరంగా పరుగు తీసి, వేరే వ్యక్తితో కలిసి మోటార్బైకులో పరారయ్యాడు. బాధితురాలి ఫిర్యాదు మేరకు ఆమె మెడలోని రోల్డ్ గోల్డ్ చైనుతోపాటు రెండు కాసుల బంగారు చైన్ను నిందితుడు లాక్కెళ్లాడని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తులసి నాగ ప్రసాద్ తెలిపారు. గుప్తనిధుల కోసం తవ్వకాలుపెద్దమండ్యం : మండలంలోని కలిచెర్ల మౌలాకా పహాడ్ వద్ద ఉన్న ఓ ఇంటి ఆవరణలో గుప్తనిధులు వెలికి తీసేందుకోసం క్షుద్రపూజలు నిర్వహించినట్లు స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు.ఈ మేరకు గుప్తనిధుల కోసం తవ్విన ఇంటి ఆవరణాన్ని, పరిసర ప్రాంతాలను ఎస్ఐ వెంకటేశ్వర్లు, సిబ్బంది పరిశీలించారు. అరుదైన వన్య ప్రాణుల స్మగ్లర్లు అరెస్టు రైల్వేకోడూరు అర్బన్ : అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం వన్య ప్రాణుల స్మగ్లింగ్కు సంబంధించి స్పెషల్ బ్రాంచ్ పోలీసులు దాడులు నిర్వహించారు. రాజ్కుమార్, భూపతిరాజు, జయరావ్, మొలకల సుబ్రమణ్యం, శ్రీరాములాయారి, శివ, రవికుమార్లను అరెస్టు చేశారు. ఫారెస్టు రిజర్వు అధికారి శ్యాంసుందర్ ఆధ్వర్యంలో వారిని కోర్టులో హాజరుపరిచారు. వారివద్ద నుంచి రెండు తలల పాము, అలుగులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
జగనన్న 2.0 పాలనలో కార్యకర్తలకు పూర్తి న్యాయం
కడప కార్పొరేషన్ : మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 2.0 పాలనలో పార్టీ కార్యకర్తలకు పూర్తిగా న్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి అన్నారు. ఆదివారం అక్కాయపల్లె 47వ డివిజన్లో నిర్వహించిన రచ్చబండ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అబద్దాలు, మోసాలతో ఈవీఎంలను మేనేజ్ చేసి కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన ఏ హామీని సక్రమంగా అమలు చేయలేదన్నారు. ప్రజలకు మేలు చేయకపోగా పేద, మధ్య తరగతి వర్గాలకు నష్టం కలిగించేలా మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తున్నారన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ పేరుతో నెల రోజులు ప్రజా ఉద్యమాన్ని నిర్వహించామని, దీనికి ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. రాబోయే రోజుల్లో పార్టీని మరింత బలోపేతం చేసేందుకు కృషి చేయాలని కోరారు. వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు అంజద్బాషా మాట్లాడుతూ సచివాలయ స్థాయి నుంచి పార్టీని బలోపేతం చేయాలన్నారు. కడప శాసన సభ్యురాలు కుర్చీ ఎమ్మెల్యేగా పేరు తెచ్చుకున్నారన్నారు. ఇసుక, మట్టి, వైన్ షాపులు, వెంచర్ల నుంచేగాక తోపుడు బండ్ల వారి నుంచి మామూళ్లు తీసుకుంటున్నారని ఆరోపించారు. ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్ జిల్లా, కడప నగరం అభివృద్ధి చెందాలంటే వైఎస్సార్సీపీతోనే సాధ్యమన్నారు. మేయర్ పాకా సురేష్ కుమార్ మాట్లాడుతూ అందరి సహకారంతో డివిజన్లో అనేక అభివృద్ధి పనులు చేశామని, రూ.27 కోట్లతో మంచినీటి పథకం తెచ్చామని, రెండు పార్కులు నిర్మించుకున్నామన్నారు. శ్మశానాలను ఆదర్శంగా తీర్చిదిద్దామన్నారు. అనంతరం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదిన సందర్భంగా మేయర్ పాకా సురేష్ ఆధ్వర్యంలో భారీ అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్ కుమార్, డాక్టర్ నాగార్జునరెడ్డి, గుంటి నాగేంద్ర, త్యాగరాజు, టీపీ వెంకట సుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలి
ప్రొద్దుటూరు : రాష్ట్రంలోని వివిధ ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఉద్యోగుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు ఇంజా సోమశేఖర్రెడ్డి కోరారు. ఆదివారం స్థానిక రాష్ట్ర ఉద్యోగుల సంఘం కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తాత్కాలిక ప్రాతిపదికన గత 15 ఏళ్ల నుంచి పనిచేస్తున్న ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఇన్సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని, ప్లానింగ్ డిపార్ట్మెంట్లో ఖాళీగా ఉన్న పోస్టులను వెంటనే భర్తీచేయాలని కోరారు. గురుకుల, కస్తూర్బా పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులు, డేటా ఎంట్రీ ఆపరేటర్లను కొనసాగిస్తూ మెరుగైన జీతభత్రాలతో ఉద్యోగ భద్రత కల్పించాలన్నారు. కాంట్రాక్టు జూనియర్ లెక్చరర్లకు జీఓ ఎంఎస్ నంబర్ 114ను అమలు చేసి వారి సర్వీసును క్రమబద్దీకరించాలన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు గరుడాచలం, జనరల్ సెక్రటరీ జీఎన్ సాయికుమార్, ఎగ్జిక్యూటివ్ కమిటీ సభ్యులు నాగేంద్రారెడ్డి, వెంకటసుబ్బయ్య, దివాకర్, ఆంజనేయులు పాల్గొన్నారు. హైందవ సంస్కృతిని పరిరక్షించాలి ప్రొద్దుటూరు కల్చరల్ : హైందవ సంస్కృతి, సంప్రదాయాలను పరిరక్షించాల్సిన అవసరం ఉందని వేదాంత గీత శివం ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానందా స్వామిజీ పేర్కొన్నారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ ఆవిర్భవించి వంద సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా స్థానిక బొల్లవరం వేంకటేశ్వరస్వామి ఆలయ ప్రాంగణంలో హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటి వరకే కులం అని గడప దాటితే అందరూ హిందువులనే భావన అందరిలో రావాలన్నారు. శివదర్శనానంద స్పిరిచ్యువల్ ట్రస్ట్ వ్యవస్థాపకురాలు శివదర్శనానంద సరస్వతీ మాతాజీ హిందువులంతా కలిసికట్టుగా జీవించాల్సిన ఆవశ్యకతను వివరించారు. ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలక మండలి సభ్యుడు, హిందూ సమ్మేళన సమితి సమన్వయకర్త డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, హిందూ ధర్మం గురించి వివరించారు. కార్యక్రమంలో సమ్మేళనం సమన్వయకర్త సుధాకర్రెడ్డి, ఆర్ఎస్ఎస్ ప్రతినిధులు, హిందువులు తదితరులు పాల్గొన్నారు. రెండు ఆటోలు ఢీకొని ఇద్దరికి గాయాలులింగాల : లింగాల మండలం కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో ఆదివారం రాత్రి రెండు ఆటోలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు ఆటో డ్రైవర్లకు తీవ్ర గాయాలయ్యాయి. పులివెందులకు చెందిన ముని పీరా అనే వ్యక్తి ఆటోలో అనంతపురం వెళ్లి వేరుశనగ కాయలను తీసుకొస్తుండగా కర్ణపాపాయపల్లె గ్రామ సమీపంలో అనంతపురం జిల్లా పుట్లూరు మండలం తంగనాయనపల్లె గ్రామానికి చెందిన రామాంజి అనే వ్యక్తి ఆటో ఢీకొన్నాయి. ఈ ఘటనలో ముని పీరా కంటికి తీవ్ర గాయాలు కాగా, రామాంజికి స్వల్ప గాయాలయ్యాయని స్థానికులు తెలిపారు. మద్యం మత్తులో ఆటోలు నడపడంవల్ల ఈ ప్రమాదం సంభవించినట్లు వారు తెలిపారు. గాయపడిన వ్యక్తిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రామాంజి అనే వ్యక్తి స్వల్ప గాయాలతో ఆటోను వదిలి పరారయ్యాడు. కల్వర్టును ఢీకొని ఇద్దరి దుర్మరణం రాయచోటి టౌన్ : రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలో నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొని ఇద్దరు దుర్మరణం చెందారు. స్థానికుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రాయచోటి – గాలివీడు రోడ్డు మార్గంలోని యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద పల్స్ర్ బైక్పై మాధవరం గ్రామం వడ్డెపల్లెకు చెందిన రేపన లక్ష్మీప్రసాద్(18) అలియాస్ ప్రతాప్, వెంకటసాయి కుమార్ (25)లు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. ఇద్దరు మాధవరం వడ్డెపల్లె నుంచి రాయచోటికి సొంత పనుల నిమిత్తం వస్తున్న సమయంలో యండపల్లె సమీపంలోని ఏకోపార్కు వద్ద నిర్మాణంలో ఉన్న కల్వర్టును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో వెంకటసాయికుమార్ అక్కడికక్కడే మృతి చెందగా లక్ష్మీప్రసాద్ను 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో మృతి చెందాడు. ట్రాఫిక్ సీఐ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. -
మానవతావాది న్యాయవాది లేబాక తులసిరెడ్డి
ప్రొద్దుటూరు క్రైం : దివంగత న్యాయవాది లేబాక తులసిరెడ్డి నిజమైన మానవతావాది అని హైకోర్టు న్యాయవాది రతంగపాణిరెడ్డి తెలిపారు. దివంగత తులసిరెడ్డి జ్ఞాపకార్థం పెన్నానది ఒడ్డున ఉన్న స్వరూప్ ఎస్టేట్లో తులసిరెడ్డి కుమారుడు లేబాక హృతిక్రెడ్డి, తమ్ముడు లేబాక గంగిరెడ్డి, మేనల్లుడు మధుసూదన్రెడ్డిల ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన ఆత్మీయ సమ్మేళనంలో ఆయన సన్నిహితులు, స్నేహితులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ సందర్భంగా పలువురు మాట్లాడుతూ.. న్యాయవా ది లేబాక తులసిరెడ్డి వల్ల ఎంతో మంది ఉన్నత ఉద్యోగాల్లో స్థిరపడ్డారన్నారు. పైసా ఆశించకుండా వందలాది మందికి ఉద్యోగాలు, పోస్టింగ్లను ఇప్పించారని తెలిపారు. అనంతపురం ఎస్కే యూని వర్సిటీలో సీట్లు ఇప్పించడంలోను, హాస్టల్ వసతి కల్పించడంలో ఎందరికో సహకారాన్ని అందించారని పేర్కొన్నారు. ఇటీవల ప్రొద్దుటూరు బార్ అసోసియేషన్లో తులసిరెడ్డి చిత్రపటం ఆవిష్కరణ కార్యక్రమానికి హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ శ్రీనివాసరెడ్డి హాజరై, తులసిరెడ్డితో తనకున్న అనుబంధాన్ని పంచుకున్నారని గుర్తు చేశారు. తెలుగు రాష్ట్రాల్లో వివిధ హోదాల్లో పని చేస్తున్న వారు, రిటైర్డ్ అయిన వారు సుమారు 400 మందికి పైగా ఆత్మీయ సమ్మేళనానికి హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో సాక్షి జనరల్ మేనేజర్ రామగంగిరెడ్డి, హైకోర్టు న్యాయవాది మహేశ్వరరెడ్డి, అనంతపురం అడ్వకేట్లు శ్యామ్, నారాయణరెడ్డి, రామ్మోహన్రెడ్డి, మధుసూదన్రెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు చవ్వా రాజశేఖర్రెడ్డి (చిత్తూరు వైఎస్సార్సీపీ ఇన్చార్జి), మాజీ ఎమ్మెల్సీలు వెంకటశివారెడ్డి, దేవగుడి నారాయణరెడ్డి, తెలంగాణ రాష్ట్రంలోని కొత్తగూడెం అడిషనల్ ఎస్పీ బీవీరెడ్డి, రిటైర్డ్ డీఎస్పీ సుదర్శన్రెడ్డి, ఎర్రగుంట్ల మున్సిపల్ చైర్మన్ హర్షవర్దన్రెడ్డి, అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి, మెట్టుపల్లె సుధాకర్రెడ్డి, ప్రొద్దుటూరు మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, వైద్యులు త్యాగరాజరెడ్డి, స్వరూప్కుమార్రెడ్డి, హెడ్మాస్టర్ రాంభూపాల్రెడ్డి, దొంతిరెడ్డి హనుమంతరెడ్డి, అశ్విన్కుమార్రెడ్డి, పురుషోత్తంరెడ్డి, డాక్టర్ స్వరూప్కుమార్రెడ్డి, డాక్టర్ సింగం భాస్కర్రెడ్డి, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి, రిటైర్డ్ ఎంపీడీఓ రమణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
తొలి తెలుగు శాసనానికి విశ్వఖ్యాతి
కడప ఎడ్యుకేషన్ : కలమల్లలోని తొలి తెలుగు శిలాశాసనానికి విశ్వఖ్యాతి తీసుకువచ్చేలా కృషి చేస్తామని, భాషా, సాహిత్య సంపదను భావితరాలకు వారసత్వ సంపదగా అందించే బాధ్యత అందరిపై ఉందని భారత మాజీ ఉప రాష్ట్రపతి వెంకయ్యనాయుడు తనయ, స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ పేర్కొన్నారు. ఆదివారం కడప సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం, కేంద్ర గ్రంథాలయంలో జానమద్ది సాహితీ పీఠం ఆధ్వర్యంలో భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ సౌజన్యంతో డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి (బ్రౌన్ శాస్త్రి) శతజయంతి (1925–2025) సందర్భంగా ఏర్పాటు చేసిన తొలి ‘తెలుగు శిలా శాసనం‘ నమూనా (రెప్లిక) స్థూపాన్ని స్వర్ణభారత్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఇమ్మణ్ణి దీపా వెంకట్ చేతుల మీదుగా ఆవిష్కరించారు. అనంతరం సమావేశ మందిరంలో ఏర్పాటు చేసిన సభా కార్యక్రమంలో ముఖ్య అతిథిగా హాజరైన ఆమె మాట్లాడుతూ తెలుగు భాషా సాహితీ సౌరభంలో మణి దీపంలా వెలుగొందుతున్న సి.పి.బ్రౌన్ భాషా పరిశోధనా కేంద్రాన్ని సందర్శించడం తనకు చాలా సంతృప్తినిచ్చిందన్నా రు. తన తండ్రి గారి జిల్లా పర్యటన అనంతరం కలమల్ల తెలుగు శాసనాన్ని ప్రపంచానికి చాటి చెప్పే అవకాశం కల్పించినందుకు గర్వంగా ఉందన్నారు. శిలాశాసన నమూనాను తమ ట్రస్టు ద్వారా సి.పి. బ్రౌన్ గ్రంథాలయంలో నెలకొల్పడం అదృష్టంగా భావిస్తున్నామన్నారు. స్వర్ణ భారతి ట్రస్ట్ ద్వారా ఇప్పటివరకు రెండున్నర లక్షల మందికి ఉచిత విద్యా సదుపాయాలు, ఆరు లక్షల మందికి పైగా ఉచిత వైద్య సదుపాయం కల్పిస్తున్నామన్నారు. మండలి వెంకట కృష్ణారావు అధికార భాషా సంఘం అధ్యక్షులు త్రివిక్రమ్ పూల మాట్లాడుతూ తెలుగు భాషా ఔన్నత్యాన్ని, తెలుగు శిలా శాసనాన్ని ప్రాచుర్యంలోకి తీసుకువచ్చే సత్కార్యంలో భాగస్వాములైన స్వర్ణభారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్ట్ దీపా వెంకట్ సేవలు అమూల్యమైనవన్నారు. కడప జిల్లాలో వెలసిన మొదటి తెలుగు శిలాశాసన నమూనాను సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేసుకోవడం గొప్ప విషయం అన్నారు. బ్రౌన్ గ్రంథాలయ సలహామండలి సభ్యులు జానమద్ది విజయభాస్కర్ మాట్లాడుతూ సామాజిక సేవకు మారుపేరైన దీపా వెంకట్ భారత 13వ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్య నాయుడు తనయ అన్న గుర్తింపు మాత్రమే కాక ఆయన మానసపుత్రిక ‘స్వర్ణభారత్ ట్రస్ట్‘ మేనేజింగ్ ట్రస్టీగా సామాజిక సేవలో ప్రపంచస్థాయిలో గుర్తింపు పొందారన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో ప్రముఖ రచయిత, చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్, కలమల్ల ఎరికల్ ముత్తురాజు ధనంజయుడు వర్మ వంశీకుడు పీవీఎల్ఎన్ రాజు, బ్రౌన్ గ్రంథాలయ సంచాలకులు డాక్టర్ జి.పార్వతి మాట్లాడారు. ఈ సందర్భంగా అతిథులు సి.పి. బ్రౌన్ పరిశోధన కేంద్రంలో ఏర్పాటు చేసిన ఛాయాత్రాలను తిలకించారు. గ్రంథాలయంలో నిక్షిప్తం చేసిన అమూల్యమైన, వెలకట్టలేని పురాతన తాళపత్ర గ్రంథ నిధిని, పరిశోధనా గ్రంథాలను, పలు రకాల గ్రంథాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో వైవీయూ రిజిస్ట్రార్ పుత్తా పద్మ, ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, పలువురు ప్రముఖులు, భాషాభిమానులు, సాహితీవేత్తలు, బ్రౌన్ గ్రంథాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.స్వర్ణ భారతి ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ దీప వెంకట్ -
ఉత్సాహంగా జిల్లాస్థాయి ఖేలో ఇండియా పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో జిల్లాస్థాయి అథ్లెటిక్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లాస్థాయి ఖేలో ఇండియా అస్మితా లీగ్ పోటీలు ఉత్సాహంగా సాగాయి. అండర్ 14, 16 బాలబాలికలకు ట్రియాథ్లాన్ హైజంప్, లాంగ్జంప్, 60 మీటర్ల, 600 మీటర్ల పరుగు పోటీలు, బ్యాక్త్రో, షాట్పుట్, జావెలిన్త్రో, డిస్కస్త్రో విభాగాలలో పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో జిల్లా నలుమూలల నుంచి 120 మంది క్రీడాకారులు ఉత్సాహంగా పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ప్రతిభ కనపరచిన క్రీడాకారులకు మెమెంటోలు, ప్రశంసాపత్రాలను అందించారు. ఈ సందర్భంగా అడిషనల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ మార్తల సుధాకర్రెడ్డి, అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు బసిరెడ్డి వీరకళ్యాణ్రెడ్డి మాట్లాడుతూ ఖేలో ఇండియా లీగ్మ్యాచ్ ప్రతిభ గల క్రీడాకారులకు మంచి అవకాశమన్నారు. అబ్జర్వర్ రాజా, అసోసియేషన్ జిల్లా కార్యదర్శి అహ్మర్బాషా, వ్యాయామ సంచాలకులు నాగూర్బాషా, రమణయ్య, షేక్బాషా, సుబ్బయ్య, లక్ష్మీ, రాఘవ, సతీష్రెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
నిండు జీవితానికి రెండు చుక్కలు
కడప రూరల్: చిన్నారుల నిండు జీవితానికి రెండు చుక్కల మందు దోహదపడుతుందని ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి అన్నారు. ఆదివారం పోలియో చుక్కల కార్యక్రమం సందర్భంగా పులివెందులలో చిన్నారులకు చుక్కల మందు వేశారు. కడపలో నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ మాట్లాడుతూ తొలిరోజు 94శాతం మంది చిన్నారులకు చుక్కల మందు వేశామని వివరించారు. వైద్య సిబ్బంది సోమ, మంగళవారం ఇంటింటికి వచ్చి తొలిరోజు వేయించని చిన్నారులకు చుక్కల మందు వేస్తారని తెలిపారు. తల్లిదండ్రులు తమ చిన్నారుల కు పోలియో చుక్కలు వేయించాలని సూచించారు.● తొలి రోజు 94శాతం నమోదు -
జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమైన చర్య
కమలాపురం : మండలంలోని పెద్దచెప్పలిలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకోవడం హేయమైన చర్య అని వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యుడు సాయినాథ శర్మ ధ్వజమెత్తారు. ఆదివారం సాయంత్రం పెద్దచెప్పలిలో జరిగే వైఎస్ జగన్ మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను టీడీపీ నాయకులు అడ్డుకున్నారు. ఫ్లెక్సీలు చించారు. ఇదేమని ప్రశ్నించిన వైఎస్సార్సీపీ కార్యకర్తలపై టీడీపీ నాయకులు దౌర్జన్యానికి దిగి దాడి చేశారు. దీనిపై స్పందించిన సాయినాథ శర్మ కమలాపురంలోని వైఎస్సార్ సీపీ కార్యాలయంలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడారు. పోలీసులను అడ్డు పెట్టుకుని పర్మిషన్ లేదని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి జన్మదిన వేడుకలను అడ్డుకోవడం హేయమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా జగనన్న జన్మదిన వేడుకలు పండుగలా జరిగాయన్నారు. పెద్దచెప్పలికి మాత్రమే పర్మిషన్ కావాలా? అని ఆయన ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో టీడీపీ నాయకులు చేసే కార్యక్రమాలను ఏనాడైనా అడ్డుకున్నామా? అన్నారు. పోలీస్ పర్మిషన్ తీసుకుని మళ్లీ వెళ్లి వేడుకలు నిర్వహిస్తామన్నారు. కొందరు రాజకీయ నాయకులు పబ్బం గడుపు కోవడం కోసమే ఇలాంటి దుశ్చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ నాయకులు కొత్త సంస్కృతికి తెరలేపుతున్నారని, ఇది మంచి పద్ధతి కాదన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో తమకు శృంగభంగం తప్పదని టీడీపీ నాయకులు ఇలాంటి ఆటలు సాగిస్తున్నారని, ప్రజలే తగిన బుద్ధి చెబుతారని ఆయన అన్నారు. పార్టీ మండల కన్వీనర్ ఉత్తమారెడ్డి, జడ్పీటీసీ సుమిత్రా రాజశేఖర్ రెడ్డి మాట్లాడుతూ పెద్దచెప్పలిలో గత 30 ఏళ్ల నుంచి ఏ పార్టీ కార్యక్రమమైనా అదే సర్కిల్లో జరగడం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఇందులో భాగంగా జగనన్న జన్మదిన వేడుకలు అదే ప్రాంతంలో నిర్వహిస్తుండగా టీడీపీ నాయకులు వచ్చి ఫ్లెక్సీలు చించడం తగదన్నారు. ఇలాంటి వికృత చేష్టలకు చరమగీతం పాడాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు చెన్నకేశవరెడ్డి, మారుజోళ్ల శ్రీనివాసరెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, జనార్దన్ రెడ్డి, దేవదానం, జెట్టి నగేష్, దాసరి సురేష్, భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ దళిత నాయకునిపై టీడీపీ నాయకుల దాడి
ఖాజీపేట : తుడుమలదిన్నె గ్రామం దళితవాడకు చెందిన చాట్ల విజయభాస్కర్ (38)పై అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు దాడికి దిగారు. అతని వద్ద ఉన్న మొబైల్ఫోను, డబ్బును లాక్కున్నారు. దీంతో బాధితుడు న్యాయం కోసం పోలీసు స్టేషన్ వద్ద నిరసనకు దిగిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.చాట్ల బాలరాజు వైఎస్సార్సీపీలో దళిత సంఘం నాయకునిగా ఉంటున్నాడు. తుడుమలమదిన్నె గ్రామంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పుట్టిన రోజు వేడుకల్లో పాల్గొన్నారు. అయితే అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చందా శ్రీనివాసులరెడ్డి ఫోన్ చేసి నువ్వు మా గ్రామంలో వైఎస్ జగన్ పుట్టిన రోజు వేడుకలు చేస్తావా నీకు ఎంత ధైర్యం అంటూ కులం పేరుతో, కుటుంబ సభ్యులను సైతం తిట్టాడు. ఫోన్ సంభాషణ రికార్డింగును ఖాజీపేట సీఐ వంశీధర్కు వినిపించి ఫిర్యాదు చేసేందుకు బాధితుడు స్టేషన్కు వెళ్లాడు. సీఐ న్యాయం చేస్తానని చెప్పడంతో వెనుదిరిగాడు. పోలీస్ స్టేషన్ నుంచి ఇంటికి వస్తున్న విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు చందా శ్రీనివాసులరెడ్డి, మదన్మోహన్రెడ్డి, సుధాకర్రెడ్డి, సంతోష్లు బైక్పై ఉన్న విజయభాస్కర్ను ఈడ్చి తీవ్రంగా దాడి చేశారు. దాడి విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ నాయకులు వీపీ రాఘవరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి తదితరులు పోలీసు స్టేషన్కు చేరుకుని బాధితునికి న్యాయం చేయాలని పోలీసులను కోరారు.బాధితుడు కడప రిమ్స్లో చికిత్స పొందుతున్నాడు. -
సంస్కరణల పేరుతో ప్రభుత్వ విద్యలో సంక్షోభం
మైదుకూరు : సంస్కరణల పేరుతో విద్యారంగాన్ని ప్రభుత్వం సంక్షోభంలోకి నెట్టి వేస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా ఆరోపించారు. ఆదివారం మైదుకూరులోని డీసీఎల్ ఫంక్షన్ హాల్లో యూటీఎఫ్ 45వ జిల్లా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అంతకుముందు కడప రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహం వద్ద నుండి డీసీఎల్ వరకు ఉపాధ్యాయులతో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్టీఎఫ్ఐ, యూటీఎఫ్ పతాకాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ప్రతినిధుల సమావేశంలో లక్ష్మీరాజా మాట్లాడుతూ నిరంతరం ఉపాధ్యాయుల బోధనా సమయాన్ని హరిస్తూ, బోధనేతర కార్యక్రమాలలో భాగస్వాములను చేస్తున్నారని విమర్శించారు. కూటమి ప్రభుత్వం విద్యారంగ పరిరక్షణే లక్ష్యమని చెబుతూనే ప్రభుత్వ విద్యకు పాతరేస్తున్నదని దుయ్యబట్టారు. యూటీఎఫ్ ప్రచురణల విభాగం రాష్ట్ర చైర్మన్ ఎం.హనుమంతరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఉద్యోగ, ఉపాధ్యాయులకు అనేక హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం, ఉద్యోగుల అండదండలతో గెద్దెనెక్కి ఇప్పుడు ఉద్యోగులను విస్మరించడం దుర్మార్గమన్నారు. సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.మనోహర్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు మాట్లాడుతూ విద్యాశాఖ అధికారులు ప్రభుత్వ విద్యారంగ బలోపేతానికి కృషి చేయకుండా ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేసే కార్యక్రమాలను నిరంతరం రూపొందించి అమలు చేసే పనిలో ఉన్నారని విమర్శించారు. సమావేశంలో సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జునరెడ్డి, సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మీరాజా -
ఓన్లీ పబ్లిసిటీ.. నో యాక్టివిటీ
పులివెందుల : చంద్రబాబు, ఆయన తనయుడు లోకేష్లు ఓన్లీ పబ్లిసిటీ, నో యాక్టివిటీ అన్న విధంగా మారారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దుయ్యబట్టారు. ఆదివారం పులివెందుల భాకరాపురంలోని వైఎస్సార్ ఆడిటోరియంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జన్మదినం సందర్భంగా ఏర్పాటు చేసిన బ్లడ్ క్యాంపు వద్ద ఆయన మీడియాతో మాట్లాడారు. వాటర్ గ్రిడ్ పనులను చంద్రబాబు నాయుడుతో ప్రారంభించాలని వీళ్లు కాన్సెప్ట్ పెట్టుకున్నారని, అసలు వాటర్ గ్రిడ్ పథకాన్ని వీళ్లే కనిపెట్టినట్లు, ఆ పథకం వీళ్లే మంజూరు చేసినట్లు, వీళ్ల బిల్డప్ తెలియని వాళ్లు చూస్తే ఆశ్చర్యపోతారన్నారు. రూ.480 కోట్లతో మంజూరు చేసిన తాగునీటి పథకానికి సంబంధించి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే దాదాపు 60 నుంచి 80 శాతం పనులు పూర్తయినా వీళ్లు ఇంకా పూర్తి చేయడం లేదన్నారు. ఎవరి హయాంలో ఏమి జరిగిందో పులివెందుల ప్రజలందరికీ తెలుసన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు ఉచిత పంటల బీమా ప్రతి రైతుకు వచ్చేదన్నారు. ఈనెల 15వ తేదీన వరి కాకుండా అన్ని పంటలకు బీమా గడువు పూర్తయిందన్నారు. వరికి ఇంకా కొంచెం గడువు ఉందని, ఏ ఒక్క రైతుకు కూడా ఈ ప్రభుత్వం ఎలాంటి అవగాహన కార్యక్రమాలు చేపట్టలేదన్నారు. దాని ఫలితంగా రైతులెవరూ బీమా, ప్రీమియం కట్టుకోలేని పరిస్థితి ఉందన్నారు. జనవరి 15వ తేదీ వరకు బీమా గడువు పెంచాలని, దీనిపై ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు, లోకేష్లు విదేశాలకు వెళతారు.. ఒక గ్రూపు మీటింగ్కు సంబంధించి ఫొటో తీస్తారు, ఆ ఫొటో ఈనాడు, ఆంధ్రజ్యోతిలో ప్రచురించి, మీడియా చానెళ్లలో ప్రసారం చేసి రాత్రింబవళ్లు చెమటోడుస్తున్నట్లు కలరింగ్ ఇస్తారన్నారు. ఇవన్నీ ప్రజలు అన్ని గమనిస్తున్నారని, బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం వైఎస్ జగన్మోహన్రెడ్డి జగనన్న జన్మదినాన్ని రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నాయకులు, జగనన్న ఇష్టపడే ప్రతి ఒక్కరూ పెద్ద ఎత్తున సేవా కార్యక్రమాలు, ఇతర రాష్ట్రాలు, దేశాల్లో కూడా ఘనంగా జరుపుకుంటున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. నాయకత్వానికి నిలువెత్తు రూపం జగన్ అని అన్నారు. రాజకీయ అరంగ్రేటం నుంచి నేటి వరకు ఆయన జర్నీ చూస్తే ఆదర్శనీయమని తెలిపారు. రాబోయే రోజుల్లో వైఎస్సార్సీపీని తిరుగులేని మెజార్టీతో గెలిపిస్తారని, కార్యకర్తలు, ప్రజల ఆశీస్సులతో, దీవెనలతో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అవుతారన్నారు.కూటమి ప్రభుత్వంపై ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఫైర్ -
వంద బస్తాల వడ్లు ఉచితంగా పంపిణీ
కడప ఎడ్యుకేషన్ : కడప నగరం రామచంద్రాపురం గ్రామంలో శనివారం లేవాకు నారపురెడ్డి చారిటబుల్ ట్రస్టు చైర్మన్ లేవాకు లక్ష్మిరెడ్డి ఆధ్వర్యంలో ఏటా మాదిరిగానే ఈ ఏడాది కూడా 50 కేజీల బరువైన వంద బస్తాల వడ్లను పేదలకు ఉచితంగా పంపిణీ చేసి తమ దాతృత్వాన్ని చాటుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమకున్న రెండు ఎకరాల్లో సొంత ఖర్చుతో వరిపంటను సాగు చేసి పండించిన వరి ధాన్యాన్ని తమ చుట్టుపక్కల గ్రామాలైన పబ్బాపురం, రామచంద్రాపురం, రామరాజుపల్లెకు చెందిన పేదలకు ఒక్కొక్కరికి 50 కిలోల చొప్పున వంద బస్తాలను ఉచితంగా పంపిణీ చేసినట్లు తెలిపారు. తమ పినతండ్రి లేవాకు నారపురెడ్డి జ్ఞాపకార్థం ఈ కార్యక్రమాన్ని 2005 నుంచి కొనసాగిస్తున్నామని తెలిపారు. ట్రస్టు వైస్ చైర్మన్ లేవాకు నితీష్రెడ్డి, ట్రస్టు సభ్యులు లేవాకు రఘునాథరెడ్డి, లక్ష్మిదేవి, మహేశ్వరరెడ్డి, శివ, వేమయ్య, శ్రీను తదితరులు పాల్గొన్నారు. బ్యూటీ సెంటర్పై విజిలెన్స్ దాడులుకడప అర్బన్ : MýSyýlç³ ¯]lVýS-Æý‡…ÌZ° gñæ.G….[ïÜtsŒæÌZ E¯]l² Æ>Ķæ$-ÌS-ïÜÐ]l$ º*Åsîæ òÜ…r-ÆŠ‡Oò³ Ôèæ°-ÐéÆý‡… ÑhÌñ毌SÞ A«¨M>-Æý‡$Ë$, íܺ¾…¨ §éyýl$Ë$ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D §éyýl$-ÌSÌZ ç³Ë$ Æý‡M>ÌS M>òÜÃ-sìæMŠS ÝëÐ]l${W ç³Ç-Ö-Í…-^éÆý‡$. GÐ]l*Ãȵ «§ýlÆý‡ ÌôæMýS$…yé AÐ]l¬Ã-™èl$¯]l², GMŠS{OòÜీ M>ÝùÃsìæMŠS AÐ]l$Ã-M>Ë$, GÐ]l*Ãȵ Æó‡rϯ]l$ Ð]l*Æó‡aíÜ AÐ]l¬Ã-™èl$¯]l² A…Ô>-ÌS¯]l$ ç³Ç-VýS׿-¯]l-ÌZMìS ¡çÜ$MýS$° ™èl°-TË$ ^ólç³-sêtÆý‡$. D ™èl°T-ÌSÌZ ÎVýSÌŒæ Ððl${sêÌSi C¯ŒS-òܵ-MýStÆŠ‡ G….Ñ Æý‡Ðól$‹Ù MýS$Ð]l*ÆŠ‡ Æð‡yìlz, ÑhÌñ毌SÞ A«¨-M>-Æý‡$Ë$ ¼.X-™éÐé×ìæ, ¼. »êº$ Ððl*òÜ‹Ü, G‹Ü. Rêgê çßæ$õÜÞ¯ŒS ´ëÌŸY¯é²Æý‡$. °º…-«§ýl-¯]lÌZ EÌSÏ…-íœ$…^ól Ķæ$fÐ]l*-¯]l$-ÌSOò³ ^èlrt-ç³-Æý‡…V> ^èlÆý‡ÅË$ ¡çÜ$-MýS$…-sê-Ð]l$-¯é²Æý‡$. òßæyŠæ M>°-õÜt-º$ÌŒæ G‹Ü.-Æý‡ïœ, M>°-õÜt-º$â¶æ$Ï G‹Ü. sìæç³š çÜ$Ìê¢-¯Œl, çÜ$«§éMýSÆŠæ, Æý‡…™èl$ »êÚë ´ëÌŸY¯é²Æý‡$. -
మళ్లీ జగనన్న పాలనే రావాలి
ఈ చిత్రంలో కనిపిస్తున్న మల్లవత్తుల చిన్నచెన్నయ్య కుటుంబ సభ్యులు బద్వేలు పట్టణంలోని భావనారాయణనగర్లో నివసిస్తున్నారు. వీరికి గత 2019–2024 మధ్య కాలంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల సంక్షేమ పథకాల ద్వారా దాదాపు రూ.5,73,750లు లబ్ధి చేకూరింది. చిన్నచెన్నయ్యకు చేనేత పెన్షన్ కింద నెలకు రూ.4 వేలు చొప్పున రూ.2.40 లక్షలు, చెన్నయ్య భార్య చెన్నమ్మకు ఆసరా పథకం కింద ఏడాదికి రూ.18,750లు చొప్పున రూ.93,750లు, చెన్నయ్య కుమారుడు చెండ్రాయుడుకు నేతన్న నేస్తం పథకం కింద ఏడాదికి రూ.24 వేలు చొప్పున రూ.1.20 లక్షలు, చెన్నయ్య కోడలు వెంకటసుబ్బమ్మకు సున్నావడ్డీ కింద ఏడాదికి రూ.10 వేలు చొప్పున రూ.50 వేలు, చెన్నయ్య మనవడు చెన్నసాయికి అమ్మఒడి పథకం కింద రూ.70 వేలు అందింది. జగనన్న హయాంలో తమ కుటుంబానికి ఎంతో లబ్ధి చేకూరిందని, మళ్లీ ఆయన పాలనే రావాలని ఈ సందర్భంగా వారు కోరారు. –బద్వేలు అర్బన్ -
డీజిల్ దొంగతనంపై విచారణ
చాపాడు : బెంగళూరు – విజయవాడ మధ్య జరుగుతున్న గ్రీన్ఫీల్డు ఎక్స్ప్రెస్ హైవే నిర్మాణ పనుల్లో బుధవారం జరిగిన డీజిల్ దొంగతనంపై శనివారం ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ సిబ్బందితో కలసి విచారణ చేపట్టారు. ఎర్రగుడిపాడు–ఆదిరెడ్డిపల్లె ప్యాకేజి రోడ్డు నిర్మాణ పనుల్లో భాగంగా మండలంలోని రామసుబ్బమ్మకొట్టాలు గ్రామ సమీపంలో పనులు జరుగుతున్నాయి. ఇక్కడ రామసుబ్బమ్మ కొట్టాలు–పెద్దగురువళూరు, కుచ్చుపాప, వెదురూరు గ్రామాలకు వెళ్లే క్రమంలో రోడ్డుపై వంతెన నిర్మిస్తున్నారు. పనులు ముగిసిన అనంతరం బుధవారం రాత్రి ఇక్కడ ఉన్న హిటాచీ వాహనం నుంచి 200 లీటర్ల మేరకూ డిజిల్ను అపహరించినట్లు రోడ్డు నిర్మాణ ప్రతినిధులు గుర్తించారు. రోడ్డు నిర్మాణ సంస్థ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు చేయగా శనివారం ఏఎస్ఐ సంఘటనా స్థలం వద్ద విచారించారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది, ఇతర వర్కర్లను విచారించారు. విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామని పోలీసులు తెలిపారు. రెండు ఆటోలు దగ్ధంపులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని నగరిగుట్టలో నివాసంటున్న శివ, కుళ్లాయి బాషాలకు చెందిన రెండు ఆటోలకు శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. వీరిద్దరూ ఆటోలను పెట్టుకుని తమ కుటుంబాలను పోషించుకుంటున్నారు. ఈ నేపథ్యంలో గుర్తు తెలియని వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టడంతో సుమారు రూ.4లక్షల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆ ప్రాంతంలో మద్యం తాగుతున్న వ్యక్తులు ఆటోలకు నిప్పు పెట్టి ఉంటారని బాధితులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామిరెడ్డి, ఎస్ఐ తిమోతిలు సంఘటనా స్థలానికి చేరుకుని ఆటోలకు నిప్పు పెట్టిన ఘటనపై ఆరా తీశారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
రిమ్స్ మార్చురీలో వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప రిమ్స్ ఆసుపత్రిలో ఈనెల 8 తేదీన అనారోగ్యంతో గుర్తు తెలియని వ్యక్తి (49) చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 19న మృతి చెందాడు. మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు తెలిపారు. యువజనోత్సవాల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభకడప ఎడ్యుకేషన్ : యువజన సర్వీసుల శాఖ, విజయవాడ వారి ఆధ్వర్యంలో గుంటూరు జిల్లా కేఎల్ యూనివర్సిటీలో ఈ నెల 18 నుంచి 20 వ తేదీ వరకు జరిగిన రాష్ట్ర స్థాయి యువజనోత్సవాల్లో జిల్లాకు చెందిన విద్యార్థినులు ప్రథమ, ద్వితీయ స్థానంలో నిలిచారని స్టెప్, ముఖ్య కార్యనిర్వహణాధికారి ఐ.జె. విజయ్ కుమార్ తెలిపారు. కవిత్వంలో ఎస్.హీన ఫిరసత్ ప్రథమ, కథా రచనలో ఎం. వెంకట సాహిత్య ద్వితీయ బహుమతి పొందారని తెలిపారు. రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి వీరికి బహుమతులు ప్రదానం చేశారు. ప్రథమ స్థానం పొందిన విద్యార్థిని ఢిల్లీలో జరిగే జాతీయ స్థాయి యువజనోత్సవాల్లో పాల్గొంటుందని తెలిపారు. కాంప్లెక్స్ సమావేశాలకు హాజరు కావాలికడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ప్రతి మూడవ శనివారం నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు ఉపాధ్యాయులు తప్పనిసరిగా హాజరు కావాలని జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమంత కుమార్ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల మెయిన్లో శనివారం ఎస్జీటీ, స్కూల్ అసిస్టెంట్ కాంప్లెక్స్ సమావేశాలను ఆయన తనిఖీ చేశారు. ముందుగా ఈయన కాంప్లెక్స్ సమావేశాలు జరుగుతున్న తరగతి గదిలో ఉపాధ్యాయుల మధ్య జరుగుతున్న బోధనాభ్యాసన చర్చా విషయాలను పరిశీలించారు. సమగ్ర శిక్ష సెక్టోరియల్ అధికారులు రమణమూర్తి, నరసింహరాజు, హెచ్ఎం ముబీన రెహనా తదితరులు పాల్గొన్నారు. మహిళల ఆర్థికాభివృద్ధికి కృషిఎర్రగుంట్ల : మహిళలు ఆర్థికంగా అభివృద్ధి చెందడానికి భారతి సిమెంట్ ఫ్యాక్టరీ యజమాన్యం నిరంతరం కృషి చేస్తుందని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ చీఫ్ మేనేజర్ ఐఆర్పీఆర్ హెచ్ఓడీ పేర్ల భార్గవరెడ్డి తెలిపారు. శనివారం తిప్పలూరులోని భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్, పెయిడ్ స్వచ్ఛంద సేవ సంస్థల ఆధ్వర్యంలో కుట్టు శిక్షణ పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి పెయిడ్ స్వచ్ఛంద సేవా సంస్థ అధ్యక్షుడు నాగేశ్వరరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా భార్గవరెడ్డి మాట్లాడుతూ కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ కింద ఫ్యాక్టరీ పరిసర ప్రాంతాలలో అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో ఫ్యాక్టరీ సీఎస్ఆర్ హెడ్ నితీశ్వర్కుమార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యవసాయ మాజీ సలహదారులు అంబటి కృష్ణారెడ్డి, సంస్థ డైరెక్టర్ చలపతిరావు, ఫ్యాక్టరీ సీఎస్ఆర్ వింగ్మధన్రెడ్డి పాల్గొన్నారు. గువ్వలచెరువు ఘాట్లో రోడ్డు ప్రమాదం చింతకొమ్మదిన్నె : గువ్వలచెరువు ఘాట్ రోడ్డులో శనివారం రాత్రి రాయచోటి నుంచి కడప వైపు వస్తున్న నక్షత్ర ట్రావెల్స్ బస్సు బ్రేక్ ఫెయిలైంది. డ్రైవర్ బస్సును అదుపు చేయలేక ముందు వెళుతున్న లారీని ఢీకొన్నాడు. బస్సులోని అయ్యప్ప భక్తులు పదిమందికి, డ్రైవర్, క్లీనర్కు గాయాలయ్యాయి. ప్రమాద సమయంలో బస్సులో 31 మంది ఉన్నారు. వీరంతా శబరిమలలో దర్శనం ముగించుకొని హైదరాబాద్కు వెళుతున్నట్లు సమాచారం. -
పల్స్ పోలియోను విజయవంతం చేయాలి
కడప రూరల్ : జిల్లా వ్యాప్తంగా ఆదివారం నిర్వహించనున్న పల్స్ పోలియో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ తెలిపారు. శనివారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయం నుంచి నిర్వహించిన పల్స్ పోలియో ర్యాలీని ప్రారంభించారు. అనంతరం డీఎంహెచ్ఓ చాంబర్లో విలేకరులతో మాట్లాడారు. ఐదేళ్ల లోపు చిన్నారులందరికీ పోలియో చుక్కలను వేయించాలన్నారు. ఇందుకు సంబంధించి పోలియో చుక్కలు ప్రభుత్వ వైద్య కేంద్రాలతోపాటు అన్ని ప్రాంతాల్లో అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది పాల్గొన్నారు. డీఎంహెచ్ఓ డాక్టర్ ఉమామహేశ్వర కుమార్ -
ఇంటర్ నూతన పరీక్షా విధానంపై అవగాహన సదస్సు
కడప ఎడ్యుకేషన్ : జాతీయ విద్యా విధానానికి (ఎన్ఈపీ –2020) అనుగుణంగా రాష్ట్రంలో విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని 2025–26 సంవత్సరం నుంచి ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో విప్లవాత్మక మార్పులు తీసుకువచ్చిందని ఇంటర్మీడియట్ ఆర్ఐఓ టీఎస్ వెంకటేశ్వర్లు తెలిపారు. కడపలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కళాశాలలో శనివారం 2025– 26 విద్యా సంవత్సరం నుంచి మారిన ఇంటర్మీడియట్ సిలబస్, పరీక్షా విధానంలో తెచ్చిన సమూల మార్పులపై కళాశాల యాజమాన్యాలు, అధ్యాపకులు, ిపిన్సిపల్స్కు అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఐపీఈ 2026 పబ్లిక్ పరీక్షలలో రెండవ సంవత్సరం విద్యార్థులకు పాత విధానంలోనే పరీక్షలు కొనసాగుతాయన్నారు. మొదటి సంవత్సరం విద్యార్థులకు మాత్రం పూర్తిగా కొత్త విధానంలో జాతీయ విద్యా విధానానికి అనుగుణంగా పరీక్షల విధానం అమలు చేస్తారన్నారు. ఇంటర్మీడియట్ విద్యా మండలి అధికారి, అసిస్టెంట్ ప్రొఫెసర్(ఈఆర్టీడబ్ల్యూ) జయసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఇంతకుముందు గణిత సబ్జెక్టుల్లో 150 మార్కులకు 1ఏ, 1బి లుగా రెండు పేపర్లు వేర్వేరు రోజుల్లో ఉండేవన్నారు. కానీ ఈ విద్యా సంవత్సరం నుంచి ప్రథమ సంవత్సరం విద్యార్థులకు గణితం ఒకే పేపర్ గా 100 మార్కులకు ఒకే రోజు ఉంటుందన్నారు. అలాగే గతంలో బాటనీ 60 మార్కులకు, జువాలజీ 60 మార్కులకు వేర్వేరు పేపర్లు, వేర్వేరు రోజుల్లో పరీక్ష నిర్వహించేవారన్నారు. ఈ సంవత్సరం నుంచి బయాలజీ పేరుతో ఒకే పరీక్ష 85 మార్కులకు ఉంటుందన్నారు. విద్యార్థులు ఒకేరోజు రెండు విడివిడి సమాధాన పత్రాలలో బాటనీ, జువాలజీకి సంబంధించిన సమాధానాలు రాయాల్సి ఉంటుందన్నారు. ఎంపీసీ విద్యార్థులు బయాలజీని అడిషనల్ సబ్జెక్టుగా, బైపీసీ విద్యార్థులు గణిత సబ్జెక్టును అడిషనల్ సబ్జెక్టుగా ఎంచుకొని ఎం బైపీసీ సర్టిఫికెట్ పొందవచ్చన్నారు. గత సంవత్సరం ఉన్న సెకండ్ లాంగ్వేజ్ స్థానంలో విద్యార్థులు తమకు నచ్చిన సబ్జెక్టులను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. -
పునఃప్రారంభం అయిన నిత్యాన్నదాన కేంద్రం పనులు
పునఃప్రారంభం అయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు టీటీడీ, విజిలెన్స్, పోలీసు అధికారులతో వాదిస్తున్న పామూరు సుబ్రమణ్యం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో ఈ నెల 11వ తేది ప్రారంభం అయ్యి 12వ తేది ఆగిపోయిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు శుక్రవారం టీటీడీ అధికారులు పునఃప్రారంభించారు. అసలు విషయానికి వస్తే...ఈ నెల 11న రామాలయం ఆవరణలోని నామల వనం పక్కనే ఉన్న పార్కులో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులను ప్రారంభించారు. అయితే టీటీడీ పనులు ప్రారంభించిన ప్రదేశం తమది అంటు పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి అక్కడ జరుగుతున్న పనులను అడ్డుకుని అతని హద్దు వరకు కంచె వేసేందుకు సిమెంట్ స్తంభాలను ఏర్పాటు చేశారు. ఆ రోజు నుంచి అక్కడ టీటీడీ చేస్తున్న తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం పనులు ఆగిపోయాయి. దీంతో స్థానికంగా ఉన్న ఆలయ టీటీడీ అధికారులు విషయాన్ని టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వారి ఆదేశాల మేరకు సమస్య పరిష్కారానికి టీటీడీ వీజీవో(విజిలెన్స్, భద్రత అధికారి) గిరిధర్ శుక్రవారం ఒంటిమిట్ట రామాలయం వద్దకు చేరుకున్నారు. సమస్యాత్మకంగా ఉన్న తాత్కాలికంగా ఏర్పాటు చేస్తున్న నిత్యాన్నదానం కేంద్రానికి సంబంధించిన ప్రదేశాన్ని సందర్శించి, అక్కడ పనులకు ఆటంకం కలిగించేందుకు పామూరు సుబ్రమణ్యం ఏర్పాటు చేసిన సిమెంట్ స్తంభాలను స్థానిక పోలీసులు, విజిలెన్స్ సిబ్బందితో కలిసి తొలగించారు. ఈ విషయం తెలుసుకున్న పామూరు సుబ్రమణ్యం ఘటన స్థలానికి చేరుకుని తమ స్థలానికి నష్టపరిహారం అందించి, అందులో ఏ పనులైనా చేసుకోవాలని వారితో వాదించారు. అయితే ఆయన వాదన విన్న వీజీవో గిరిధర్ తమది అంటున్న స్థలానికి సంబంధించిన ధ్రువీకరణ పత్రాలు ఉంటే కోర్టు ఆదేశాలతో రావాలని ఆయన తెలిపారు. అంత వరకు ఇక్కడ పనులు ఆపే అర్హత వారికి లేదని స్పష్టం చేశారు. దీంతో చేసేది ఏమీ లేక పామూరు సుబ్రమణ్యం కోర్టు ఆదేశాలతో వస్తానని చెప్పి అక్కడి నుంచి వెళ్లి పోయారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సీఐ నరసింహారాజు, టీటీడీ సివిల్ విభాగం డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, స్థానిక విజిలెన్స్ సిబ్బంది, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
కరెంట్షాక్తో యువకుడికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కరెంట్షాక్తో యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలుకు చెందిన రామకృష్ణ కుమారుడు కరుణాకర్ అలియాస్ కర్ణ(17) ఎలక్ట్రిక్ లైటింగ్ పనులు చేసేవాడు. శుక్రవారం మండలంలోని శానిటోరియం సమీపంలోని ఓ చర్చికి క్రిస్మస్ సందర్భంగా విద్యుత్ అలంకరణ చేస్తుండగా, వైరును పైకి వేసే క్రమంలో 11కేవీ.విద్యుత్ తీగలపై పడి కరెంట్ షాక్కు గురై చెట్టుపై నుంచి కిందపడ్డాడు. తీవ్రంగా గా యపడ్డాడు. గమనించిన స్థానికులు వెంటనే బా ధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి త రలించారు. చికిత్సలు అందించిన అనంతరం ప రిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతి – మరొకరికి గాయాలు అర్ధవీడు (ప్రకాశం) : వెనుక వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పిన ట్రాక్టర్ బోల్తాపడి ఒకరు మృతిచెందగా మరొకరికి గాయాలైన ఘటన మండలంలోని గన్నెపల్లి–రంగాపురం గ్రామాల మధ్య శుక్రవారం రాత్రి 9 గంటల సమయంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. బోరుబావిలో ఇరుక్కుపోయిన మోటార్లు వెలికితీసే ట్రాక్టరు గన్నెపల్లి నుంచి యాచవరం వెళ్తున్న క్రమంలో వెనుక నుంచి వస్తున్న ఆర్టీసీ బస్సుకు సైడ్ ఇవ్వబోయి అదుపు తప్పి పక్కనున్న సైడుకాలువలో పడిపోయింది. ట్రాక్టర్లో ఉన్న కడప జిల్లా మైదుకూరు మండలం రాబురాంపేటకు చెందిన ముత్యాల శ్రీను (44) తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతిచెందాడు. ట్రాక్టర్లో ఉన్న ప్రొద్దుటూరు మండలానికి చెందిన ఆకుమల్ల కుమార్కు తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రైల్వేకోడూరులో అరెస్ట్ కలకలం
● అరుదైన వన్యప్రాణుల స్మగ్లింగ్లో నలుగురు అరెస్ట్ ● స్థానిక ఎస్సార్కె లాడ్జీలో నిందితులను విచారించిన అధికారులు రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలో డైరెక్టర్ ఆఫ్ రెవిన్యూ ఇన్టెలిజెన్స్ కేంద్ర బృందాల దాడులు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. అటవీశాఖకు సంబంధించిన అరుదైన రకం జంతువుల స్మగ్లింగ్ చేస్తున్న కొందరిని స్పెషల్ బ్రాంచ్ పోలీసులు, నాలుగు బృందాలు దాడులు నిర్వహించి అరెస్ట్ చేశారు. వారిని పట్టణంలోని ఎస్సార్కె లాడ్జ్లో మధ్యాహ్నం నుంచి 9 గంటలకు పైగా విచారణ చేస్తుండడంతో జనాలు, అరెస్ట్ అయిన వారి బంధువులు లాడ్జ్ వద్ద గుమికూడడంతో కలకలం రేగింది. దీనికి తోడు స్థానిక పోలీసులు, అధికారులు, పాత్రికేయులను అనుమతించలేదు. లాడ్జ్ను మొత్తం వారి అదుపులోకి తీసుకొన్నారు. రాత్రి 9 గంటల సమయంలో అటవీశాఖ అధికారులను లోపలికి అనుమతించారు. అనంతరాజుపేటకు చెందిన ఆటోడ్రైవర్ మొలకల సుబ్రమణ్యం, పట్టణానికి చెందిన శ్రీరాములు ఆచారిలను అదుపులోకి తీసుకుని విచారణ ఆధారంగా మరో ఇద్దరిని అరెస్ట్ చేసి విచారిస్తున్నట్లు తెలిసింది. అటవీ శాఖ అరుదైన ప్రాణులైన అల్వా, పూడుపాములను విదేశాలకు స్మగ్లింగ్ చేస్తున్నారన్న సమాచారంతో దాడులను నిర్వహించినట్లు తెలిసింది. అలాగే వారివద్దనుండి కొన్ని వన్యప్రాణులను స్వాధీనం చేసుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. అదుపులోకి తీసుకొన్న వారితో అధికారులు, లాడ్జీ ముందు గుమికూడిన జనం -
సీమ అస్తిత్వ చిరునామా గజ్జెల మల్లారెడ్డి
కడప ఎడ్యుకేషన్ : రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకొని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించిన అభ్యుదయ రచయిత గజ్జెల మల్లారెడ్డి అని కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి అన్నారు. యోగి వేమన విశ్వ విద్యాలయం తెలుగు శాఖ, కేంద్ర సాహిత్య అకాడమీ సంయుక్త ఆధ్వర్యంలో గజ్జెల మల్లారెడ్డి శత జయంతి సదస్సు శుక్రవారం విశ్వవిద్యాలయంలోని మొల్ల సమావేశ మందిరంలో జరిగింది. ఈ సమావేశంలో ప్రారంభోపన్యాసం చేసిన ఆచార్య రాచపాళెం చంద్రశేఖరరెడ్డి మాట్లాడుతూ స్వాతంత్రం వచ్చిన తరువాత భారత ప్రభుత్వం భాషల పట్ల వారధిగా పనిచేయడానికి కేంద్ర సాహిత్య అకాడమీని ఏర్పాటు చేశారన్నారు. గజ్జెల మల్లారెడ్డి రాయలసీమ అస్తిత్వాన్ని చిరునామాగా చేసుకున్నాడని, తెలుగు గేయానికి గజ్జకట్టి నృత్యం చేయించాడన్నారు. అభ్యుదయ సాహిత్యానికి కడప జిల్లా కవులు ప్రధాన భూమిక పోషించారని, వారిలో రాచమల్లు రామచంద్రా రెడ్డి , కేతు విశ్వనాథ రెడ్డి, సొదుం జయరాం, గజ్జెల మల్లారెడ్డి తదితరులు ఉన్నారని అన్నారు. మల్లారెడ్డి వేమన లాగే ప్రజల్లో తిరిగాడని, అందుకే ప్రజా సమస్యలను ఎప్పటికప్పుడు కవిత్వంగా మార్చాడన్నారు. సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ మాట్లాడుతూ విశ్వవిద్యాలయంలో జరిగే కార్యక్రమాలు జాతీయ అంతర్జాతీయ స్థాయిలో చర్చకు రావాలన్నారు. గజ్జెల మల్లారెడ్డి సరళమైన భాషలో, క్లుప్తంగా,వ్యంగ్యాత్మంగా రాస్తారని అన్నారు. రాజకీయ విమర్శ చాలా సూటిగా ఉంటుందని ఉదహరించారు. సదస్సుకు అధ్యక్షత వహించిన ఆచార్య టి.శ్రీనివాస్ మాట్లాడుతూ విద్యార్థులు వృత్తి బాధ్యతతో పాటు ఒక ప్రవృత్తిని ఎంచుకొని ముందుకు సాగితే భవిష్యత్తు సంతోషంగా ఉంటుందని, ఒకవేళ మన ప్రవృత్తి సాహిత్యం అయితే జీవితం చాలా ఆహ్లాదకరంగా ఉంటుందని అన్నారు. ఆచార్య రాచపాళెం చంద్రశేఖర రెడ్డి రాసిన శ్రీగజ్జెల మల్లారెడ్డి జీవిత చరిత్ఙ్ర పుస్తకం(మోనోగ్రాఫ్)ను అతిథులు ఆవిష్కరించారు. తెలుగు శాఖాధిపతి, కేంద్ర సాహిత్య అకాడెమీ సలహా మండలి సభ్యులు, సదస్సు నిర్వాహకులు ఆచార్య ఎం. ఎం.వినోదిని స్వాగతం పలికి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆర్ ఎం. ఉమా మహేశ్వర రావు మాట్లాడుతూ గజ్జెల మల్లారెడ్డి నిరంతరం రాజకీయాలను పరిశీలిస్తూ వర్తమాన అంశాలను కవిత్వంగా, వ్యాసాలుగా రాసేవారని అన్నారు. శ్రీ వెంకటేశ్వర విశ్వ విద్యాలయం ప్రాచ్య పరిశోధనా సంస్థ సంచాలకులు ఆచార్య పిసి వెంకటేశ్వర్లు గజ్జెల మల్లారెడ్డి ఆత్మకథ అయిన ఆత్మసాక్షిపై మాట్లాడారు. మల్లారెడ్డి అనువదించిన సుహృల్లేఖనం, దమ్మపథం గ్రంథాలపై ప్రముఖ విమర్శకులు డా. పి. సంజీవమ్మ మాట్లాడారు. శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయ విశ్రాంత ఆచార్యులు మేడిపల్లి రవికుమార్ మాట్లాడారు. గజ్జెల మల్లారెడ్డి గేయాల్లోని నిర్మాణ పద్ధతులను తెలుగు శాఖ ఆచార్యులు డాక్టర్ ఎన్.ఈశ్వర రెడ్డి ఉదాహరణలతో వివరించారు. ఈ సదస్సులో కేంద్ర అకాడెమీ ప్రతినిధి టి.ఎస్. చంద్రశేఖర రాజు, సాహిత్య తెలుగు శాఖ ఆచార్యులు పి.రమాదేవి, జి. పార్వతి, ఆర్ట్స్ డీన్ ఆచార్య కె. గంగయ్య, పరిశోధకులు,పీజీ విద్యార్థులు పాల్గొన్నారు. కేంద్ర సాహిత్య అకాడెమీ పురస్కార గ్రహీత ఆచార్య రాచపాళెం -
విధుల్లో నిరంతరం అప్రమత్తంగా ఉండాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే లక్ష్యంగా ఆర్టీసీ డ్రైవర్లు విధి నిర్వహణలో నిరంతరం అప్రమత్తంగా ఉండాలని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి పిలుపునిచ్చారు. శుక్రవారం కడప నగరంలోని తన కార్యాలయంలో ప్రమాదాలకు పాల్పడిన డ్రైవర్లకు శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత ఓం శాంతి సంస్థ ప్రతినిధి ప్రదీప అక్కయ్యచే డ్రైవర్లకు యోగా, ధ్యానం ప్రాధాన్యతను తెలియజేసి మానసిక ప్రశాంతత కోసం ధ్యానం చేయించారు. గోపాల్రెడ్డి మాట్లాడుతూ డ్రైవర్లు పనితీరుతోనే ఆర్టీసీకి పేరు ప్రఖ్యాతులు లభిస్తాయన్నారు. నిర్ణీత సమయంలో బస్సును నడిపినపుడే ప్రయాణీకుల మన్ననలు పొందవచ్చన్నారు. ముఖ్యంగా సెల్ఫోన్ మాట్లాడుతూ డ్రైవింగ్ చేయరాదన్నారు. అలాగే ప్రయాణీకులతో మర్యాద పూర్వకంగా వ్యవహరించాలన్నారు. అనంతరం పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా ప్రమాదాలకు అవకాశం ఉన్న అంశాలను తెలియజేశారు. పులివెందుల డిపో మేనేజర్ ప్రేమ్ కుమార్ ప్రమాదాలపై సమీక్ష చేశారు. డ్రైవర్లకు బ్లాక్ స్పాట్పై జాగ్రత్తలను తెలియ జేశారు. ఈ కార్యక్రమంలో వివిధ డిపోలకు చెందిన 19 మంది డ్రైవర్లు, కండక్టర్లు హాజరయ్యారు. -
మట్కా బీటర్లు అరెస్ట్
కడప అర్బన్ : కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఇద్దరు మట్కా బీటర్లను శుక్రవారం అరెస్టు చేసినట్లు ఎస్సై ప్రదీప్ కుమార్ తెలిపారు. షేక్ మస్తాన్ షరీఫ్, మొహమ్మద్ గౌస్ అనే ఇరువురు మట్కా ఆడుతున్నట్లు సమాచారం రావడంతో పోలీసులు వెళ్లి దాడులు చేసి వారి నుంచి రూ.6.950 నగదు స్వాధీన పరుచుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. టీవీ పేలి వృద్ధురాలికి తీవ్ర గాయాలు రామాపురం : మండలంలోని గువ్వలచెరువు గ్రామంలో శుక్రవారం తెల్లవారు జామున ఓ ఇంట్లో అకస్మాత్తుగా పోర్టబుల్ టీవీ పేలి పోవడం తీవ్ర కలకలం రేపింది. ఈ ఘటనలో గూడురు లక్ష్ముమ్మ అనే వృద్ధ మహిళకు తీవ్ర గాయాలయ్యాయి. అంతేకాకుండా టీవీ పూర్తిగా దెబ్బతినగా, బీరువా, తలుపులు, కిటికీలు, అద్దాలు పూర్తిగా ధ్వంసం అయ్యాయి. తీవ్రంగా గాయపడిన మహిళను చికిత్స నిమిత్తం స్థానికులు కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు, ఫైర్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకొని పరిశీలించారు. అధిక వోల్టేజ్, నిరంతరం టీవీ ఆన్లో ఉండటం వలన పేలుడు జరిగి ఉండవచ్చునని లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజు నాయక్ తెలిపారు. ప్రజలు ఎలక్ట్రానిక్ పరికరాలు ఉపయోగించేటప్పుడు తగిన జాగ్రత్తలు పాటించాలని, వోల్టేజ్ స్టెబిలేజర్లు వినియోగించాలని సూచించారు. కడప వ్యాపారి హత్య రాయచూరు రూరల్ : వీధుల్లో తిరుగుతూ వ్యాపారం చేస్తున్న వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసిన సంఘటన నగరంలో చోటుచేసుకుంది. కడపకు చెందిన సయ్యద్ హుసేన్్ పాషా(25) 15 రోజుల కిందట నగరానికి వచ్చి పండ్ల వ్యాపారం చేస్తూ జీవనం గడుపుతున్నారు. గురువారం రాత్రి ఒంటి గంట సమయంలో రాయచూరు ఆకాశవాణి కార్యాలయం వద్ద పాషా తన వ్యానులో నిద్రిస్తున్నారు. ఈ సమయంలో దుండగుల చేతిలో హత్యకు గురయ్యారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలాన్ని ఎస్పీ పుట్టమాదయ్య, యస్.మంజునాథ్, బసవరాజ్ పరిశీలించారు. ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం వద్ద నిత్యాన్నదానం కేంద్ర ఏర్పాటు పనులను నిలిపి వేసిన వ్యక్తి పామూరి సుబ్రమణ్యంపై శుక్రవారం టీటీడీ అధికారులు కేసు నమెదు చేశారు. పోలీసుల వివరాల మేరకు..ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆవరణలో తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు లో భాగంగా ఈ నెల 12 వ తేదిన తాత్కాలిక నిత్యాన్నదాన కేంద్రం ఏర్పాటు పనులు నిర్వహిస్తుండంగా పామూరు సుబ్రమణ్యం అనే వ్యక్తి తమ స్థలం అంటూ ఆ రోజు ఆ పనులను నిలిపి వేయడంపై 19వ తేదీ ఆలయ టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి స్థానిక పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు పామూరు సుబ్రమణ్యంపై కేసు నమోదు చేశామని ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. -
అనారోగ్యంతో ఏఆర్ కానిస్టేబుల్ మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలోని ఏఆర్ విభాగంలో కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న బి.మహేశ్వర్ రెడ్డి (ఏఆర్ పీసీ 422) శుక్రవారం అనారోగ్యంతో మృతి చెందారు. ఏఆర్ పీసీ మహేశ్వర్ రెడ్డి మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బాధిత కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. విధి నిర్వహణలో అంకితభావంతో పనిచేసే సిబ్బంది అకాలమరణం పొందడం బా ధాకరమన్నారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎ స్పీ ఆదేశాల మేరకు ఆర్ఐ శివరాముడు.. కడప నగరం రవీంద్ర నగర్లోని బి.మహేశ్వర్ రెడ్డి స్వగృహం వద్దకు వెళ్లి మృతదేహం వద్ద పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులను పరామర్శించి పోలీస్ శా ఖ అండగా ఉంటుందని భరోసా కల్పించారు. కాగా మహేశ్వర్ రెడ్డి 1994బ్యాచ్ కు చెందిన వ్యక్తి. భార్య, కుమార్తె ఉన్నారు. శనివారం పోలీస్ లాంఛనాలతో మ హేశ్వర్ రెడ్డి అంత్యక్రియలు నిర్వహించనున్నారు. పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు. ములకలచెరువు : కన్న కూతురి పెళ్లి కళ్లారా చూడాలని... ఘనంగా చేయాలని కలలు కన్న ఒక తండ్రి సంతోషంతో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు వెళ్లి ఇంటికి తిరుగు ప్రయాణంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. ఈ విషాదకరమైన ఘటన శుక్రవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం మేరకు... పెద్దతిప్పసముద్రం మండలం మద్దయ్యగారిపల్లెకు చెందిన పి.ఖాసీంవలి కుమార్తె అఫ్రీన్కు అదే గ్రామానికి చెందిన యువకుడితో వచ్చే ఏడాది జనవరి 3వ తేదీ వివాహం నిశ్చయమైంది. ఈ క్రమంలో బంధుమిత్రులకు పెళ్లి పత్రికలు పంచేందుకు ఖాసీంవలి ఉదయం ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వెళ్లాడు. అక్కడ పెళ్లి పత్రికలు పంచి తిరిగి సాయంత్రం ఇంటికి బయల్దేరాడు. ములకలచెరువు మీదుగా మద్దయ్యగారిపల్లెకు వెళ్తుండగా నాయనచెరువుపల్లి సత్రం మలుపు వద్ద ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తున్న బి.కొత్తకోట మండలం బుచ్చిరెడ్డిగారిపల్లి నారాయణస్వామికి చెందిన ద్విచక్రవాహనం ఢీ కొట్టుకున్నాయి. ఈ ప్రమాదంలో ఖాసీంవలి తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే మృతిచెందాడు. నారాయణస్వామి సైతం తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. ప్రమాద సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహుడు సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. ప్రమాదానికి గల కారణాలు తెలుసుకొని మృతిదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మృతుడికి అఫ్రీన్, అమ్మాజాన్ ఇద్దరు కుమార్తెలు, ఆసీఫ్ కుమారుడు, భార్య సంషాద్ ఉన్నారు. సంఘటన స్థలంలో వీరి రోదనలు చూపరులను కంటతడి పెట్టించాయి. పెద్దదిక్కు లేకుండా చేశావు.... మేము నీకేమి అన్యాయం చేశాం దేవుడా అంటూ రోదించారు. మహేశ్వర్ రెడ్డి (ఫైల్), నివాళులర్పిస్తున్న ఆర్ఐ శివరాముడు -
ఎద్దుల బండిని ఢీకొన్న లారీ
వల్లూరు : వల్లూరు మండలంలో శుక్రవారం తెల్లవారు జామున పొగ మంచు కమ్ముకుంది. దీంతో వాహన దారులకు అతి సమీపంలోకి వచ్చే వరకు ఎదురుగా వున్న వాహనాలు కనిపించక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఈ క్రమంలో మండల పరిధిలోని తప్పెట్ల గ్రామ సమీపంలో కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై తెల్లవారుజామున రోడ్డు ప్రమాదం జరిగింది. మండలంలోని సీ కొత్తపల్లెకు చెందిన రైతు చంద్ర శేఖర్ అలియాస్ చెన్నయ్య బక్కిరెడ్డిపల్లె సమీపంలోని పొలంలో సేద్యం పనులకు ఎద్దుల బండిలో బయలుదేరాడు. అదే సమయంలో కడప వైపు నుండి కమలాపురం వైపు వెళ్తున్న లారీ పొగ మంచు కారణంగా కనిపించక పోవడంతో ముందుగా వెళ్తున్న ఎద్దుల బండిని వెనుక నుంచి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఎద్దుల బండి బోల్తా పడింది. బండిలో వున్న రైతు చెన్నయ్య కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. దీంతో అతన్ని చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటనా స్థలానికి చేరుకుని, తీవ్రంగా మంచు కమ్ముకున్న పరిస్థితుల్లో మరో ప్రమాదం జరగకుండా రోడ్డుపైన బోల్తా పడి ఉన్న ఎద్దుల బండిని పక్కకు తొలగించి వాహనాల రాకపోకలను నియంత్రించారు. -
గాంధీ విగ్రహం ఎదుట నిరసన
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టంను రద్దు చేస్తూ ఉపాధిని హరించే జీ–రామ్–జీ అనే నూతన బిల్లును బీజేపీ లోక్సభలో బలవంతంగా ఆమోదింపజేసిందని దీనిని వెంటనే రద్దు చేయాలని సీపీఎం కడప జిల్లా కార్యదర్శి చంద్రశేఖర్, నగర కార్యదర్శి రామమోహన్ పేర్కొన్నారు. శుక్రవారం నగరంలోని ఐటిఐ సర్కిల్ వద్ద ఉన్న మహాత్మా గాంధీ విగ్రహం ఎదుట సీపీఎం ఆధ్వర్యంలో నిరసన చేపట్టి గాంధీ విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రామీణ పేదలు, వ్యవసాయ కార్మికులు, కూలీలకు చేసిన ఘోర నమ్మకద్రోహమని, ఇది దేశ ప్రజాస్వామ్య చరిత్రలో మరో చీకటి రోజు అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నగర కార్యదర్శి రామమోహన్, జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు అన్వేష్, దస్తగిరిరెడ్డి, శ్రీనివాసులరెడ్డి, నగర కమిటీ సభ్యులు చంద్రరెడ్డి జమీల, వెంకటేశ్వర్లు, నాయకులు రామకృష్ణారెడ్డి, నరసింహ, నారాయణరెడ్డి, శంషాద్, విజయ్, తిమ్మయ్య, ప్రవీణ్ కుమార్, రఘు, తదితరులు పాల్గొన్నారు. -
హత్య కేసులో నిందితుడికి యావజ్జీవం
● మద్యం తాగొద్దని మందలించినందుకు.. ● నరసింహుడును దారుణంగా హత్య చేసిన నాగరాజు ● 2021లో జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో జరిగిన ఘటనప్రొద్దుటూరు క్రైం : జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021లో జరిగిన హత్య కేసులో ప్రొద్దుటూరులోని ఎర్రన్నకొట్టాలకు చెందిన ఇల్లూరు నాగరాజు అనే నిందితుడికి ప్రొద్దుటూరు ఏడీజే కోర్టు యావజ్జీవ కారాగార శిక్ష విధించింది. కోర్టు వర్గాలు తెలిపిన వివరాల మేరకు.. జమ్మలమడుగు మండలంలోని గొనిగెనూరులో 2021 అక్టోబర్ 24న జ్యోతుల పండుగ నిర్వహించారు. వారి ఆహ్వానం మేరకు గూడెంచెరువు గ్రామానికి చెందిన సర్వ నరసింహుడు అనే బంధువు మిద్దె లక్ష్మిదేవి ఇంటికి వచ్చాడు. వారింటి సమీపంలోనే వెంకటరాముడు నివాసం ఉంది. అతని అల్లుడైన ఇల్లూరు నాగరాజు కూడా పండుగ నిమిత్తం వెంకటరాముడు ఇంటికి వచ్చాడు. నాగరాజు మద్యం సేవించి అందరితో గొడవ పడుతుండటంతో నరసింహుడు అతన్ని వారించాడు. ఎందుకు మద్యం తాగి అందరితో గొడవ పడుతున్నావని సున్నితంగా మందలించాడు. దీన్ని నాగరాజు అవమానంగా భావించి మనసులో పెట్టుకున్నాడు. ఈ క్రమంలో మరుసటి రోజున (2021 అక్టోబర్ 25న) నాగరాజు లక్ష్మీదేవి ఇంటి వద్దకు వెళ్లాడు. ‘అలా బయటికి వెళ్దాం రా..’ అని మాయమాటలు చెప్పి నరసింహుడును తీసుకెళ్లాడు. అలా నరసింహుడుతో కలసి వెళ్లిన నాగరాజు రక్తపు మరకలు కలిగిన షర్టుతో సాయంత్రం ఒంటరిగా ఇంటికి వచ్చాడు. అనుమానం కలిగిన లక్ష్మీదేవి కుటుంబ సభ్యులు నరసింహుడు కోసం వెతికే క్రమంలో లక్ష్మీనారాయణ అనే వ్యక్తి తారస పడ్డాడు. నరసింహుడు గురించి అతన్ని అడుగగా మామిడి తోటలోకి వెళ్లి చూడమని చెప్పాడు. లక్ష్మీదేవి, ఆమె కుమారుడు రామ్మోహన్తో కలిసి తోటలోకి వెళ్లి చూడగా నరసింహుడు రక్తపు మడుగులో పడి చనిపోయి ఉన్నాడు. లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు అప్పటి జమ్మలమడుగు అర్బన్ సీఐ జి వెంకటేశ్వర్లు కేసు నమోదు చేశారు. నిందితుడు నరసింహుడును అరెస్ట్ చేసి చార్జ్షీట్ దాఖలు చేశారు. అప్పటి నుంచి ఈ కేసు విచారణ ప్రొద్దుటూరు సెకండ్ ఏడీజే కోర్టులో జరుగుతూ వచ్చింది. తుది విచారణలో నేరం రుజువు కావడంతో ఇల్లూరు నాగరాజు అలియాస్ ఉపేంద్రకు యావజ్జీవ కారాగార శిక్షతో పాటు రూ. 10 వేలు జరిమానా విధిస్తూ సెకండ్ ఏడీజే జడ్జి కె సత్యకుమారి శుక్రవారం తీర్పు చెప్పారు. ఈ కేసులో అడిషనల్ పీపీ మార్తల సుధాకర్రెడ్డి వాదనలను వినిపించి నిందితుడికి శిక్ష పడేలా చేశారు. ప్రస్తుత జమ్మలమడుగు సీఐ సురేష్, కోర్టు హెడ్కానిస్టేబుళ్లు నాగరాజు, మహబూబ్బాషా, ఇతర పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
నేడు కెరీర్ ఫెస్ట్
కడప ఎడ్యుకేషన్: స్థానిక వైఎస్సార్ అడిటోరియం పక్కన ఉన్న నూర్జహాన్ షాదిఖానా – ఉర్దూ ఘర్లో శనివారం జిల్లా కెరీర్ యాక్టివిటీ ఎక్స్పో, ఎగ్జిబిషన్ నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ పేమ్రంత్కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమ సన్నద్ధతపై శుక్రవారం సమగ్ర శిక్ష కార్యాలయంలో సెక్టోరియల్ అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని మొత్తం 36 మండలాల నుంచి పాల్గొననున్నారని చెప్పారు. ప్రతి మండలం నుంచి 5 ప్రాజెక్టులు ప్రదర్శించాన్నారు. అందులో 3 కెరీర్ పాత్ మోడల్స్, 1 పెయింటింగ్, 1 వృత్తి విద్య/వృత్తి దుస్తుల పోటీ ఉండాలని తెలిపారు. ఈ ఎగ్జిబిషన్లో మండల స్థాయి విజేతలందరూ పాల్గొనాలని సూచించారు. కాగా ఇంటర్మీయెట్ తర్వాత ఏ కోర్సులు చదివితే, ఎలాంటి ఉద్యోగ అవకాశాలు ఉంటాయి వంటి విషయాలపై ఈ ప్రదర్శన జరుగుతుంది. విద్యార్థులు ఉన్నత చదువుల ద్వారా తమ జీవితాలను ఎలా తీర్చిదిద్దుకోవాలో ఇందులో తెలియజేస్తారు. ఈ కార్యక్రమంలో జీసీడీవో ఆరోగ్య మేరీ, సెక్టోరియల్ అధికారులు, జిల్లా కెరీర్ అండ్ మెంటల్ హెల్త్ కౌన్సిలర్లు పాల్గొన్నారు. -
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు మైదుకూరు నియోజకవర్గానికి చెందిన ఎం.శ్రీనివాసులురెడ్డి వైఎస్సార్ సీపీ రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 21న సీనియర్స్ జిల్లా స్థాయి నెట్బాల్ ఎంపికలను కడప నగరంలోని జేేఎంజే జూనియర్ కళాశాలలో నిర్వహిస్తున్నట్లు జిల్లా నెట్బాల్ సంఘం కార్యదర్శి రెడ్డయ్య తెలిపారు. జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తూర్పుగోదావరి జిల్లా రావులపాలెంలో జరగనున్న రాష్ట్ర స్థాయి నెట్ బాల్ పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. పెండ్లిమర్రి: మండలంలోని వెల్లటూరు గ్రామంలో ప్రథమ చికిత్స కేంద్రాన్ని శుక్రవారం పెండ్లిమర్రి పీహెచ్సీపీ వైద్యాధికారి ప్రసాద్ సీజ్ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వెల్లటూరులో నిర్వహిస్తున్న వరదారెడ్డి ప్రథమ చికిత్స కేంద్రంలో నిబంధనలకు విరుద్ధంగా చికిత్స చేస్తున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలిసి వెళ్లి పరిశీలించామని తెలి పారు. అక్కడ ప్రభుత్వ నిబంధనల ప్రకారం చికిత్స చేయకపోడంతో చికిత్స కేంద్రాన్ని సీజ్ చేసీ డీఎంహెచ్ఓకు తెలిపామన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాల యం పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఎంఏ, ఎం.కామ్, ఎంఎస్సీ) కోర్సులలో నేరుగా ప్రవేశాల ప్రక్రియ శనివారం (20వ తేదీ)తో ముగియనుందని విశ్వవిద్యాలయ డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ డాక్టర్ టి.లక్ష్మిప్రసాద్ ఒక ప్రకటనలో వెల్లడించారు. ప్రవేశాల గడువు 12వ తేదీకి ముగిసినప్పటికీ విద్యార్థుల అభ్యర్థన మేరకు ఆంధ్రప్రదేశ్ ఉన్నత విద్యా మండలి 20వ తేదీ పీజీలో ప్రవేశాలు చేసుకునేలా కళాశాలలకు అవకాశాన్ని కల్పించిందన్నారు. అభ్యర్థులు తమ బరిజనల్ సర్టిఫికెట్లతో విశ్వవిద్యాలయంలోని డైరెక్ట్ రేట్ అఫ్ అడ్మిషన్స్ కార్యాలయంలో హాజరు కావాలని సూచించారు. ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఎంట్రన్స్ టెస్ట్ –2025 రాసి అర్హత సాధించిన వారు, రాయని వారు కూడా ఈ స్పాట్ అడ్మిషన్లకు హాజరు కావచ్చన్నారు. మదనపల్లె సిటీ: జేఎన్టీయూ సౌత్జోన్ షటిల్ బ్యాడ్మింటన్ పోటీలకు స్థానిక ఆదిత్య ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థి ప్రశాంత్ ఎంపికయ్యారు. చిత్తూరు జిల్లా కుప్పం ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన జేఎన్టీయూ సౌత్జోన్ ఇంటర్ యూనివర్శిటీ షటిల్ బ్యాడ్మింటన్ పోటీల్లో పాల్గొన్నాడు. ప్రతిభ కనబరిచి త్వరలో జరిగే సౌత్జోన్ పోటీలకు ఎంపికయ్యాడు. కాలేజీలో శుక్రవారం కాలేజీ డైరెక్టర్ రామమోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ రాయుడు, అధ్యాపకులు అభినందించారు. కురబలకోట: అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ ఎంఐటీఎస్–ఐపీఎఫ్సీ మదనపల్లె మద్దతుతో మదనపల్లె పట్టు –పట్టు చీరల కోసం భౌగోళిక సూచిక (జీఐ) ట్యాగ్ దరఖాస్తు సమర్పించినట్లు యూనివర్సిటీ వీసీ సీ.యువరాజ్ శుక్రవారం తెలిపారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ మదనపల్లె పట్టుచీరలు ఉన్నతమైన నాణ్యత, మెరుపు,తేలిక లాంటి అల్లికకు ప్రసిద్ధి చెందాయన్నారు. మిట్స్ ఛాన్సలర్ ద్వారకనాథ్ మాట్లాడుతూ రైతులు, నేత కార్మికులు తయారీదారులు జీఐ ట్యాగ్ సంభావ్య ప్రయోజనాలపై ఆశాభావంతో ఉన్నారన్నారు. -
21న రచ్చబండ
సాక్షి, అమరావతి: వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణం అత్యంత బలంగా చేపట్టేలా కార్యాచరణ కొనసాగుతోందని పార్టీ రాష్ట్ర కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి చెప్పారు. ఇప్పటికే 10 నియోజకవర్గాల్లో కమిటీల నియామకం పూర్తయిందన్నారు. కమిటీల నియామకం పూర్తయిన నియోజకవర్గాల్లో 21న రచ్చబండ కార్యక్రమం నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయన శుక్రవారం కడప, పుంగనూరు, మడకశిర, వేమూరు అసెంబ్లీ నియోజకవర్గాల నాయకులతో టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ముందుగా మడకశిర నియోజకవర్గంలో కమిటీల ఏర్పాటు పూర్తయిందని చెప్పారు. తరువాత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నియోజకవర్గం పుంగనూరులోను, అనంతరం వేమూరులోను కమిటీలు ఏర్పాటయ్యాయని తెలిపారు. పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్.. కడప పార్లమెంటులో పూర్తి చేద్దామని పిలుపునివ్వడంతో వాళ్లు కూడా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆధ్వర్యంలో 80 రోజుల్లో పూర్తి చేశారని చెప్పారు. ఈ నియోజకవర్గాల కమిటీల నియామకంలో పార్టీ జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గాల కో ఆర్డినేటర్ల ప్రోత్సాహం చెప్పుకోదగినదని పేర్కొన్నారు. పార్టీ నిర్మాణం పటిష్టం జరిగి క్షేత్రస్థాయిలో బలమైన నెట్వర్క్ ఏర్పాటైతే.. భవిష్యత్తులో మన ప్రభుత్వం వచ్చిన తర్వాత కిందిస్థాయిలో ఏది చేయాలన్నా, వాళ్ల ద్వారా చేయడం, లేదా ఇన్వాల్వ్ చేయడం కోసం పటిష్టమైన నాయకత్వం రికార్డు అయి ఉంటుందని చెప్పారు. పార్టీ అధినేత నేరుగా కనెక్ట్ అయ్యేందుకు, సెంట్రల్ ఆఫీసులో డేటా అందుబాటులో ఉండేందుకు, బీమా, ఐడీ కార్డులు అందించేందుకు, మన ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏదైనా పదవులు ఇచ్చేటప్పుడు ప్రయారిటీ తెలుస్తుందని వివరించారు. ‘రేపు (ఆదివారం) మన అధ్యక్షులు వైఎస్ జగన్ పుట్టినరోజును ఘనంగా నిర్వహిద్దాం. ప్రభుత్వ మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరించిన తీరు, చంద్రబాబు దుర్మార్గ విధానాలపై తీర్మానం, గవర్నర్కు మెమొరాండం ఇచ్చినది ఆయా కమిటీల సమావేశం సందర్భంగా తీర్మానం చేయాలి. స్థానిక సమస్యలు పెట్టాలి. ఉపాధి హామీ చట్టాన్ని మార్చిన ప్రభావం గ్రామాల్లో పడుతుంది. కాబట్టి, పేద కూలీలకు జరిగే నష్టం గురించి తీర్మానం చేయాలి. రైతుల సమస్యలు, మద్దతు ధర లేకపోవడం, ఎరువులు, విత్తనాలు లేకపోవడం వంటివాటిని చేర్చవచ్చు. సోషల్ మీడియా వేదికలు వాట్సాప్, ఎక్స్, ఇన్స్ట్రాగాం ద్వారా యాక్టివ్గా ఉండేవారిని గుర్తించి షేర్ చేసేలా చర్యలు తీసుకోవాలి. నియోజకవర్గ ఇన్చార్జీలు చొరవ తీసుకుని ఈ కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలి. మూడు, నాలుగునెలలు మీటింగులు జరగాలి. జిల్లా అధ్యక్షులు, నియోజకవర్గ ఇన్చార్జీలు ఐదారుసార్లు సమావేశాలు నిర్వహిస్తే అదే గాడిలో పడుతుంది’ అని సజ్జల పేర్కొన్నారు. సంస్థాగత కమిటీలు పూర్తయిన 10 నియోజకవర్గాల్లో నిర్వహణ వైఎస్సార్సీపీ స్టేట్ కో ఆర్డినేటర్ సజ్జల రామకృష్ణారెడ్డి నాలుగు నియోజకవర్గాల అసెంబ్లీ నాయకులతో టెలికాన్ఫరెన్స్ -
బోయనపల్లెను వీడని గంజాయి వాసన!
రాజంపేట: కడప–రేణిగుంట హైవేలో నిత్యం రద్దీగా ఉండే ప్రాంతం బోయనపల్లె.ఈ ప్రాంతాన్ని గంజాయి వాసన వీడేటట్లు కనిపించడంలేదు.బోయనపల్లెలో వివిధ ఇంజినీరింగ్ విద్యాసంస్ధలు ఉండటంతో ఇతర జిల్లాలకు చెందిన అనేక మంది యువతీ, యువకులు ఉన్నారు. గంజాయి ఎక్కడి నుంచి ఈ ప్రంతానికి వస్తుందనే విషయంపై పోలీసులు దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి గంజాయి నిర్మూలనపై ప్రత్యేక దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుచప్పుడు కాకుండా అమ్మకాలు న్యూ బోయనపల్లెలో గంజాయి అమ్మకాలు జరుగుతున్నాయనేది ఓపెన్ టాక్. రూ.350, రూ.450, రూ.550లకు విక్రయిస్తున్నట్లు పలువురు చెపుతున్నారు. యువతను అధికంగా ఆకర్షించేలా రహస్యంగా కొన్ని ప్రాంతాలను ఎంపిక చేసుకొని గంజాయి ప్యాకెట్లను విక్రయిస్తున్నట్లు తెలిసింది.గంజాయి ఎక్కడి నుంచి దిగుమతి అవుతోందన్న అంశంపై పోలీసులు దృష్టి సారించారు. . పోలీసు సబ్కంట్రోల్ ఉన్నా.. న్యూబోయనపల్లెలో ఉదయం నుంచి రాత్రి వరకు రద్దీగా ఉంటుంది. అలాగే ట్రాఫిక్ కూడా ఉంటుంది. గతంలో ఇక్కడ సబ్ కంట్రోల్ ఉంది. పోలీసు సిబ్బంది కొరత కారణంగానే నిర్వహణ భారంగా మారిందనే భావనలు శాఖాపరంగా వినిపిస్తున్నాయి. ఇప్పుడైతే మూతపడింది. గతంలో బోయనపల్లెలో అటు మద్యం, ఇటు గంజాయి మత్తులో యువత వీరంగాలు సృష్టించిన సంఘటనలు చోటుచేసుకున్నాయి.అనుమానితులపై నిఘా.. తాజాగా గంజాయి అమ్మకాలు విషయంలో మన్నూరు పోలీసులు నిఘా పెట్టారు. ఈ నేపథ్యంలో శుక్రవారం కొంతమంది అనుమానితులను అదుపులోకి తీసుకున్నారు.గతంలో కూడా కొందరిని పట్టుకున్నారు. ప్రస్తుతం రాజంపేటలో స్పెషల్పార్టీ సంచరిస్తోంది. అవాంఛనీయ సంఘటన ప్రాంతాలపై దృష్టి సారించినట్లు తెలుస్తోంది. గుట్టుగా అమ్మకాలు అనుమానితులను విచారిస్తున్న పోలీసులు -
వంద రోజుల యాక్షన్ ప్లాన్ పాటించాలి
కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని ప్రతి పాఠశాల పదో తరగతి వంద రోజుల యాక్షన్ ప్లాన్ పాటించాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్ ఆదేశించారు. కడప నగరంలోని నగరపాలక ఉన్నత పాఠశాల (మెయిన్)లోని యాక్షన్ ప్లాన్ను ఆయన శుక్రవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పదో తరగతి ఉపాధ్యాయులతో సమావేశం ఏర్పాటు చేసి, యాక్షన్ ప్లాన్ ఏ విధంగా అమలు చేస్తున్నారని అడిగి తెలుసుకున్నారు. అనంతరం విద్యార్థులతో తరగతి గదిలో మమేకమై ప్రిపరేషన్పై అడిగి తెలుసుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు ముబీన రెహనా, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా ప్రజా పరిషత్ పరిధిలో జూనియర్ అసిస్టెంట్లు/టైపిస్టులుగా పని చేస్తున్న పలువురికి సీనియర్ అసిస్టెంట్లుగా పదోన్నతి కల్పిస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ మేరకు శుక్రవారం జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ వారికి పదోన్నతుల పత్రా లను అందజేసి అభినందించారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, జెడ్పీ ఉపాధ్యక్షులు బాలయ్య, పరిపాలన అధికారి చాంద్బాషా, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
బాదుడే.. బాదుడు!
వాహనం సంవత్సరాలు గత రేటు ప్రస్తుత రేటు ● ఫిట్నెస్ పేరుతో చార్జీల మోత ● వాహనదారులపై అదనపు భారం ● ఆందోళన చెందుతున్న యజమానులు ● ఇక వాహనాలు నడపలేమంటున్న వైనం కడప వైఎస్ఆర్ సర్కిల్: వాహనదారులు ఊహించని విధంగా కేంద్ర ప్రభుత్వం ఫిట్నెస్ చార్జీలు పెంచింది. జిల్లా పరిధిలో వివిధ రకాల వాహనాలు కలిపి సుమారు లక్షకు పైగా ఉన్నాయి. ఒకవైపు బాడుగ లేక మరోవైపు డీజిల్, పెట్రోల్ ధరలు పెరిగి టైర్లు, ఇన్సూరెన్స్తోపాటు విడిభాగాల ధరలు కూడా కొండెక్కి కూర్చున్న నేపథ్యంలో.. మూలిగే నక్కపై తాటికాయ పడ్డట్టు వాహనదారుల పరిస్థితి తయారైంది. ఆటో నుంచి లారీల వరకు ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. ఇటు పెరిగిన ఫిట్నెస్ చార్జీలు అటు ఈఎంఐలు కట్టలేక వాహనదారులు ఆందోళన చెందుతున్నారు. ఇలా అయితే వాహనాలు నడపలేమని చేతులెత్తేస్తున్నారు. జిల్లాలో కడప, కమలాపురం, పులివెందుల, ప్రొద్దుటూరు నియోజకవర్గాల్లో వివిధ రకాల వాహనాలు, లారీలు, టిప్పర్లు, క్రేన్లు, జేసీబీలు ఇతర ట్రాన్స్పోర్ట్ వాహనాలు అధికంగా ఉన్నాయి. వాటి యజమానులకు.. పెంచిన చార్జీలు అదనపు భారం కానున్నాయి. 15 ఏళ్ల నుంచి 20 ఏళ్ల వరకు ఒకే రకం చార్జీలు అమలు చేస్తున్నారు. లైట్ గూడ్స్ వెహికల్స్, మిడిల్ గూడ్స్ వెహికల్స్, హెవీ గూడ్స్ వెహికల్స్గా విభజించి ఫిట్నెస్ చార్జీలను ప్రభుత్వం పెంచింది. జిల్లాలో కడప, ప్రొద్దుటూరు ప్రాంతాలలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాలు ఉన్నాయి. సమావేశంలో పాల్గొన్న డీటీసీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు హెవీ వెహికల్స్ 10 920 1416 10–13 2360 15–20 16,520 20 ఏళ్లకు పైగా 33,040 ఎంజీవీ 10 920 1416 10–13 2360 15–20 13,334 20 ఏళ్లకు పైగా 26,668 ఆటో 15 620 944 15–20 2360 20 ఏళ్లకు పైగా 10,620 ఎల్జీవీ 15 820 944 15–20 10,030 20 ఏళ్లకు పైగా 20,060 కడప వైఎస్ఆర్ సర్కిల్: రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాలకు ప్రభుత్వం కేటాయించిన లక్ష్యాలను వంద శాతం సాధించాలని రీజనల్ జాయింట్ ట్రాన్స్పోర్ట్ కమిషనర్ (ఆర్జేటీసీ) కృష్ణ వేణి పేర్కొన్నారు. శుక్రవారం నగర శివారులోని ఊటుకూరులో ఉన్న జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో రాయలసీమ జోనల్ స్థాయి అర్ధ వార్షిక సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ రెవెన్యూ లక్ష్యాలను 82 శాతం మాత్రమే సాధించామని, వంద శాతం సాధించేందుకు అన్ని విభాగాల అధికారులు సమన్వయంతో పని చేయాలని ఆదేశించారు. వాహనాల పన్ను చెల్లించని యజమానులకు నోటీసులు పంపించాలని తెలిపారు. 2026 మార్చి 31 నాటికి వాహన పన్నుల వసూలు పూర్తి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రాయలసీమ జోన్ పరిధిలోని 8 జిల్లాల డీటీసీలు, బ్రేక్ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణపై ఎరుపెక్కిన ఉద్యమం
● కలెక్టరేట్ వద్ద సీపీఐ ఆందోళన ● పోలీసులతో తోపులాట, ఉద్రిక్తత ● కార్యాలయంలోకి చొచ్చుకెళ్లిన శ్రేణులు కడప సెవెన్రోడ్స్: రాష్ట్రంలో మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ చర్యలను నిరసిస్తూ సీపీఐ ఆధ్వర్యంలో గురువారం కలెక్టరేట్ ఎదుట ఆందోళన జరిగింది. పెద్ద సంఖ్యలో వచ్చిన ఆ పార్టీ శ్రేణులు కార్యాలయంలోకి చొచ్చుకెళ్లేందుకు ప్రయత్నించగా, పోలీసులు అడ్డుకున్నారు. ఈ సందర్భంగా ఇరు వర్గాల మధ్య వాగ్వివాదాలు, తోపులాటలు చోటుచేసుకున్నాయి. చివరికి పోలీసు వలయాన్ని చేధించుకుని ఆందోళనకారులు లోనికి వెళ్లి బైఠాయించారు. సామాన్యులకు వైద్య విద్య, వైద్యాన్ని దూరం చేసేందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ కోసం ప్రభుత్వం జీఓ నెం. 590, 107, 108లను జారీ చేసిందని, వాటిని రద్దు చేసే వరకు పోరాటాన్ని కొనసాగిస్తామని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర స్పష్టం చేశారు. కొత్త వైద్య కళాశాలల్లో పీపీపీ విధానాన్ని అమలు చేయాలని బాబు సర్కార్ తీసుకున్న నిర్ణయం అత్యంత ప్రమాదకరమైందని ధ్వజమెత్తారు. ఇది సామాజిక న్యాయం, విద్యార్థుల హక్కులు, ఉపాధి భద్రత, పేద, మద్యతరగతి వర్గాల భవిష్యత్తుపై తీవ్ర ప్రతికూల ప్రభావాలు చూపుతుందన్నారు. పీపీపీ విధానంలో ప్రభుత్వ భూ ములు, భవనాలు, వసతులు, కళాశాలలు, ఆస్పత్రు లు దాదాపు 60 ఏళ్లు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్లిపోతాయన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం జీఓను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీపీఐ నాయకులు నాగసుబ్బారెడ్డి, బాదుల్లా, చంద్రశేఖర్, సుబ్రమణ్యం, మద్దిలేటి, ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు బి.శివతేజ, ఎల్.చంద్ర, ఏఐవైఎఫ్ అధ్యక్ష, కార్యదర్శులు ప్రభాకర్, శరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ ఆపాలంటూ కలెక్టరెట్ ఎదుట బైఠాయించిన సీపీఐ శ్రేణులు.. కలెక్టరేట్లో దూసుకొస్తున్న, సీపీఐ, విద్యార్థి సంఘాల నేతలు -
విదేశీ బీమా కంపెనీలు వద్దు..స్వదేశీ ఎల్ఐసీ ముద్దు
కడప సెవెన్రోడ్స్ : బీమా రంగంలో 100 శాతం విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు (ఎఫ్డీఐ) దేశ ఆర్థిక ప్రయోజనాలకు విరుద్ధమని, ప్రభుత్వ బీమా రంగ పురోగతికి ఆటంకమని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి అన్నారు. గురువారం కడప బ్రాంచ్ కార్యాలయం ఎదుట ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రతినిధి అవధానం శ్రీనివాస్ అధ్యక్షతన అఖిల పక్ష సంఘాల నిరసన ప్రదర్శనలో ఇన్సూరెన్స్, బ్యాంకింగ్, లియాఫీ, సీఐటీయూ, ఇతర ఉద్యోగ కార్మిక సంఘాల నాయకులు రఘునాథ్ రెడ్డి, మనోహర్, అజీజ్, నారాయణరెడ్డి, లలిత, జగదీశ్వర్ రెడ్డి, సుధీకర్, సుదర్శన్ రెడ్డి తదితరులు పాల్గొని మాట్లాడారు. ఇప్పటివరకు 74 శాతం ఎఫ్డీఐ పరిమితి ఉందని, కానీ ప్రైవేటు ఇన్సూరెన్స్ కంపెనీలు దాన్ని పూర్తిగా ఉపయోగించుకోలేదని అన్నారు. మొత్తం బీమా రంగంలో కేవలం 32.67 శాతం మాత్రమే ఎఫ్డీఐ వచ్చిందని అన్నారు. లైఫ్ ఇన్సూరెన్స్ రంగంలో కేవలం 4 కంపెనీలు మాత్రమే 74 శాతం పరిమితిని పూర్తిగా వాడుకున్నాయని, మరో 6 ప్రధాన కంపెనీలకు విదేశీ ఈక్విటీ ఏమీ లేదన్నారు. ఇప్పుడున్న 74 శాతం పరిమితి బీమారంగవృద్ధికి అడ్డు కాదని ఇది నిరూపిస్తున్నదని అన్నారు. 100 శాతం ఎఫ్డీఐ వస్తే దేశీయ పొదుపులపై విదేశీ కంపెనీల నియంత్రణ పెరుగుతుందని అన్నారు. ఇది దేశ ఆర్థికాభివృద్ధికి హానికరమని అన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ ఉద్యోగాల సంఘాల నాయకులు అక్బర్ బాషా, కామనూరు శ్రీనివాసరెడ్డి, వెంకటసుబ్బయ్య, లక్ష్మి దేవి, వారిజాతమ్మ, శ్రీకృష్ణ, ప్రశాంతి, శ్రీనివాసులు, కుమార్, సాదక్ వలీ, గౌస్, వెంకట్రామరాజు, నరసింహారెడ్డి, రామాంజుల్ రెడ్డి, రామకృష్ణారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడికి ఐదేళ్ల జైలు
బి.కోడూరు : బద్వేలు సీనియర్ సివిల్ కోర్టులో మైనర్ బాలిక కిడ్నాప్ కేసుకు సంబంధించి నిందితుడికి ఐదేళ్ల జైలుశిక్షతో పాటు రూ.వెయ్యి జరిమానా విధించినట్లు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని అక్కుపాలెం గ్రామానికి చెందిన 16 ఏళ్ల బాలికను అదే గ్రామానికి చెందిన కంబగండ్ల ఓబయ్య అలియాస్ నవీన్ 2019 జనవరి ఆరో తేదీన మాయమాటలు చెప్పి కిడ్నాప్ చేసి అహోబిలం తీసుకెళ్లాడు. దీనిపై బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు బి.కోడూరు పోలీసు స్టేషన్లో అప్పటి ఎస్ఐ ఘనమద్దిలేటి కేసు నమోదు చేశారు. దర్యాప్తు పూర్తి చేసి నిందితుడిపై ఆధారాలతో ఛార్జ్ షీట్ దాఖలు చేశారు. సదరు కేసును బద్వేలు సీనియర్ సివిల్ జడ్జి వై.జె.పద్మశ్రీ విచారణ జరిపి ముద్దాయిపై నేర నిరూపణ కావడంతో 5 సంవత్సరాలు జైలుశిక్ష, రూ.వెయ్యి జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ తరపున పబ్లిక్ ప్రాసిక్యూటర్ డి.వి.ఎస్.ఆర్.కృష్ణ కోర్టులో బలమైన వాదనలు వినిపించారు. సదరు కేసులో సాక్షులను సకాలంలో కోర్టులో ప్రవేశపెట్టేలా చర్యలు తీసుకున్న బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య, అప్పటి ఎస్ఐ ఘనమద్దిలేటిలతో పాటు కోర్టు కానిస్టేబుల్ రమణ, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ కిషోర్కుమార్లను జిల్లా ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాధ్ అభినందించినట్లు ఎస్ఐ తెలిపారు. -
వైద్య సేవల్లో జిల్లాకు ప్రథమ స్థానం
కడప రూరల్: నవంబర్ నెల వైద్య సేవలకు సంబంధించి జిల్లా వైద్య ఆరోగ్యశాఖకు ప్రథమ స్థానం లభించినట్లు ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. డెలివరీలు, ఇన్ పేషంట్, అవుట్ పేషెంట్, ల్యాబ్ టెస్ట్, వ్యాధి నిరోధక టీకాలతో పాటు ఇతర సేవలకు సంబంధించి నవంబర్ నెలకు రాష్ట్రంలోనే జిల్లాకు ప్రథమ స్థానం లభించినట్లు పేర్కొన్నారు. జిల్లావ్యాప్తంగా ఉన్న ప్రాథమిక, పట్టణ ఆరోగ్య కేంద్రాలు, వైద్యాధికారులు, పారామెడికల్ వైద్య సిబ్బంది ఇదే స్ఫూర్తితో ప్రజలకు వైద్య సేవలందించాలని కోరారు. అట్లూరు: స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని గురువారం జెడ్పీ సీఈఓ సి.ఓబుళమ్మ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె రికార్డులను పరిశీలించి తగు సూచనలు, సలహాలు ఇచ్చారు. అనంతరం చెత్త నుంచి సంపద తయారీ కేంద్రాలను సందర్శించి తయారు చేసిన వర్మీకంపోస్టు ఎరువును పరిశీలించారు. అట్లూరు ఎస్సీ కాలనీలో పర్యటించారు. కాలనీలో ప్రజ లకు ఇబ్బందిగా ఉన్న పాడుబడిన బావిని పూడ్చాలని అధికారులను ఆదేశించారు. ఎంపీడీఓ కార్యాలయ భవనం శిథిలావస్థకు చేరుకోవడంతో ఆ భవనాన్ని పరిశీలించి నూతన భవనానికి ప్రతిపాదనలు తయారు చేయాలని సూచించారు. ఎంపీడీఓ వెంగమునిరెడ్డి, ఏఓ భాస్కర్బాబు, డిప్యూటీ ఎంపీడీఓ గంగాధర్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. వేంపల్లె: ఖాట్మండులో ఈనెల 16 నుంచి జరుగుతున్న అంతర్జాతీయ సౌత్ ఏషియన్ గోల్ షాట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో వేంపల్లె మండలం వీరన్నగట్టుపల్లెకు చెందిన రాచవీటి తేజేంద్ర ప్రతిభ చూపాడు. ఈయన వేంపల్లెలోని వైఎస్సార్ వివేకానంద ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో గెస్ట్ ఫిజికల్ డైరెక్టర్గా పనిచేస్తున్నారు. 2009 నుంచి 2025 వరకు కబడ్డీ, హ్యాండ్ బాల్, తైక్వాండో, షూటింగ్ బాల్ క్రీడల్లోనూ రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించారు. తేజేంద్రను కళాశాల అధ్యాపకులు, విద్యార్థులు అభినందించారు. మదనపల్లె: మదనపల్లె నుంచి టమాటను రైళ్ల ద్వారా వివిధ ప్రాంతాలకు ఎగుమతులు చేసేలా రైల్వేశాఖ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు మార్కెటింగ్శాఖ అధికారులు వెల్లడించారు. గురువారం స్థానిక మార్కెట్ యార్డులో మార్కెట్ కమిటీ పాలకవర్గ సమావేశం చైర్మన్ శివరాం అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా చైర్మన్, కార్యదర్శి జగదీష్ పలు అంశాలను కమిటీ దృష్టికి తెచ్చారు. కడప ఎడ్యుకేషన్: స్కూల్ గేమ్స్ అండర్ 14 జాతీయస్థాయి వాలీబాల్ టోర్నమెంట్ పోస్టర్ను గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు ఆవిష్కరించారు. జనవరి 5 నుంచి 9వ తేదీ వరకు జమ్మలమడుగులోని బాలికల ప్రభుత్వ కళాశాలలో ఈ పోటీలు జరగనున్నాయి. ఈ మేరకు గురువారం స్కూల్ గేమ్స్ రాష్ట్ర కార్యదర్శి భానుమూర్తి రాజు క్రీడా ప్రాంగణాన్ని సందర్శించి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శులు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి అలాగే టోర్నమెంట్ కార్యదర్శి శివశంకర్ రెడ్డిలకు పలు సూచనలు అందించారు. పాఠశాల హెడ్మాస్టర్లు బి. శ్రీనివాసులు రెడ్డి.సుబ్రహ్మణ్యం. సీనియర్ వ్యాయామ ఉపాధ్యాయులు బాబు,ప్రసాద్ రెడ్డి, శివకృష్ణ, చంద్రమోహన్ రెడ్డి, రాయుడు, అంకాల్ రెడ్డి, హేమాంబ రెడ్డి,మహేష్, చరణ్, పాల్గొన్నారు. -
పాలకుల కుట్రను అంతం చేసే సంతకం!
పాలకుల కుట్రను అంతం పలకడమే లక్ష్యంగా జన‘కోటి’సంతకంతో సమరమే చేసింది. యువత భవిత కోసం సంతకంతో మద్దతు పలికింది. ప్రై‘వేటు’పై కలంతో పోటెత్తింది. పాలకుల తీరును ఎండగడుతూ వైఎస్సార్ సీపీ చేపట్టిన మహా యజ్ఞంలో స్వచ్ఛందంగా పాలుపంచుకుంది. వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ప్రతి ఒక్కరిలోనూ స్ఫూర్తి నింపింది. ప్రతి ఒక్కరూ ప్రైవేటీకరణపై గళమెత్తేలా చేసింది. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణపై రాష్ట్ర ప్రభు త్వం అనుసరిస్తున్న తీరుపై పలువురు తమ అభిప్రాయాలను పంచుకున్నారు. –కడపఎడ్యుకేషన్/జమ్మలమడుగు/కమలాపురం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ యోచన విరమించుకోవాలి
రాష్ట్రంలో విద్య, వైద్య రంగాలను ప్రైవేటీకరించే దిశగా కూటమి ప్రభు త్వం వేగంగా పావులు కదపడం దుర్మార్గం. వైద్య విద్య కళాశాలల పీపీపీ విధానం రాష్ట్రానికి నష్టం కలిగిస్తుంది. ఏళ్లపాటు ప్రభుత్వ భూమి, వనరులు ప్రైవేటు సంస్థల చేతుల్లోకి వెళ్తే వారికి ఆదాయవనరులుగా మారతాయి. వైద్య విద్య పూర్తిగా వ్యాపారమవుతుంది. మేనేజిమెంట్ కోటా ద్వారా ఇచ్చే 20 శాత సీట్లు (376) ఒక్కో సీటుకు దాదాపు రూ.50 నుంచి 60 లక్షల వరకు వసూలు చేసే అవకాశం ఉంది. ఈ అధిక ఫీజు కారణంగా సామాన్య విద్యార్థులు వైద్య విద్యకు పూర్తిగా దూరమవుతారనడంలో సందేహం లేదు. – అంకన్న, పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు -
ఉత్సాహంగా క్రాస్ కంట్రీ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : బాషా అథ్లెటిక్స్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో స్థానిక టీవీఆర్ హైస్కూల్ సమీపంలో బాల, బాలికలకు నిర్వహించిన జిల్లా స్థాయి క్రాస్ కంట్రీ (దూరపు పరుగు) పోటీల్లో ఉత్సాహంగా క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు పాల్గొని తమ ప్రతిభను కనబరిచారు. ఈ పోటీల్లో ప్రతి చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు బాలుర అండర్–16 విభాగంలో 2 కిలోమీటర్లు క్రాస్ కంట్రీ పోటీలో పి.ఇస్మాయిల్, పి.ఫరీద్ బాషా, అండర్–18 విభాగంలో 6 కిలోమీటర్లు పోటీలో ఎస్.షాహిద్, వి.పవన్, అండర్–20 విభాగంలో 8 కిలోమీటర్లు పోటీలో ఎల్.రాంభూపాల్రెడ్డి, ఎస్.దాదా దస్తగిరి, పురుషుల 10 కిలోమీటర్ల పోటీలో హర్ష, బాలికల అండర్–16 విభాగంలో 2 కిలోమీటర్లు పోటీలు ఎస్.లాల్బీ, షేక్ పాతిమా నస్రిన్, అండర్–18 విభాగంలో 4 కిలోమీటర్ల పోటీలో ఎం.రాధా, ఎస్.షాహిన్ ఎంపికయ్యారని ఫౌండేషన్ కార్యదర్శి అహ్మర్ బాషా వివరించారు. వీరు ఈనెల 24న బుధవారం కాకినాడ జిల్లా పెద్దాపురంలో జరిగే రాష్ట్రస్థాయి క్రాస్ కంట్రీ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిధ్యం వహిస్తారని చెప్పారు. వ్యాయామ సంచాలకులు లక్ష్మీ, రాఘవ, నాగేశ్వరరావు, సంజీవ్, శివ, సీనియర్ క్రీడాకారులు సికిందర్, సలీం ఈ పోటీల నిర్వహణలో సహకరించారని తెలిపారు. -
21న తొలి తెలుగు శాసనం నమూనా ఆవిష్కరణ
కడప సెవెన్రోడ్స్: ఎర్రగుంట్ల మండలం కలమల్ల గ్రామంలోని శ్రీ లక్ష్మీ చెన్నకేశవ ఆలయంలోని తొలి తెలుగు శాసనానికి తయారు చేసిన నమూనాను ఈనెల21న కడప నగరంలోని సీపీ బ్రౌన్ గ్రంథాలయంలో ఏర్పాటు చేయనున్నారు. ప్రముఖ సాహితీవేత్త డాక్టర్ జానమద్ది హనుమచ్ఛాస్త్రి శతజయంతి సంవత్సరాన్ని పురస్కరించుకుని జానమద్ది సాహితీపీఠం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పీఠం మేనేజింగ్ ట్రస్టీ విజయభాస్కర్, ప్రముఖ రచయిత, చరిత్రకారులు బొమ్మిశెట్టి రమేష్ తెలిపారు. గతేడాది కలమల్లలో నిర్వహించిన తెలుగు భాషా దినోత్సవానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ ఉప రాష్ట్రపతి ఎం.వెంకయ్యనాయు డు తొలి తెలుగు శాసనంపై స్పందించారు. శాసనం అందరికీ అందుబాటులో ఉండాలంటే నమూన తయారు చేసి ప్రతిష్ఠించాల్సిన అవసరముందని భావించారు. అందుకు సరైన వేదిక సీపీ బ్రౌన్ గ్రంథాలయంగా గుర్తించారు. ఆయన మానస పుత్రిక స్వర్ణభారత్ ట్రస్టు తరఫున నమూన తయారు చేయిస్తామని హామి ఇచ్చారు. ఆ మేరకు నమూన సిద్దమైంది. ఈనెల 21న బ్రౌన్ గ్రంథాలయంలో నమూన స్థూపాన్ని స్వర్ణభారత్ ట్రస్టు మేనేజింగ్ ట్రస్టీ ఐ.దీప వెంకట్ ఆవిష్కరించనున్నారు. అధికారభాషా సంఘం రాష్ట్ర అధ్యక్షుడు త్రివిక్రమరావు ముఖ్య అతిథిగా హాజరయ్యే ఈ కార్యక్రమంలో పలువురు ప్రజా ప్రతినిధులు పాల్గొననున్నారు. తొలి తెలుగుశాసన ప్రతిరూపం కలమల్లలోని శాసనం -
అవినీతి నిర్మూలనకు కృషి చేస్తాం
కడప అర్బన్: సమాజంలో ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులు ఎలాంటి ‘అవినీతి’కి పాల్పడినా తమ దృష్టికి నేరుగాగానీ, టోల్ ఫ్రీ నెంబర్ ‘1064’కుగానీ, డీఎస్పీ ఫోన్ నెం. 94404 46191కు సమాచారం ఇవ్వాలని, నిరంతరం అందుబాటులో ఉంటామని కడప ఏసీబీ నూతన డీఎస్పీ సీతారామారావు అన్నారు. గురువారం ఆయన కడపలోని అవి నీతి నిరోధకశాఖ కార్యాలయంలో డీఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన, ఇన్స్పెక్టర్ శ్రీనివాసుల రెడ్డితో కలిసి అవినీతి నిరోధకశాఖకు సంబంధించి సమాచారం ఇచ్చేందుకు టోల్ఫ్రీ నెంబర్: 1064తో రూపొందించిన పోస్టర్ను ఆవిష్కరించారు. కాగా 1995 బ్యాచ్కు చెందిన ఆయన వివిధ ప్రాంతాలలో ఎస్ఐగా, సీఐగా విధులను నిర్వర్తించారు. శ్రీకాకుళం జిల్లాలో స్పెషల్బ్రాంచ్ విభాగంలో డీఎస్పీగా పనిచేస్తూ కడప అవినీతి నిరోధకశాఖ డీఎస్పీగా బదిలీపై వచ్చారు. పోలీసుశాఖతో పాటు, ఏ ప్రభుత్వశాఖలోనైనా అవినీతి అధికారులున్నా ప్రజలు స్వేచ్ఛగా తమ దృష్టికి తీసుకురావచ్చన్నారు. అవినీతి నిరోధకశాఖ టోల్ ఫ్రీ నెం ‘1064’కు సమాచారం ఇవ్వండి కడప నూతన ఏసీబీ డీఎస్పీ సీతారామారావు వెల్లడి -
ప్రైవేటీకరణతో తీవ్ర నష్టం
రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల ఏపీ విద్యార్థులకు తీవ్ర నష్టం జరుగుతుంది. పక్క రాష్ట్రాల్లో తక్కువ మార్కులకు మెడికల్ సీటు దొరికే అవకాశాలు ఉంటే.. మన రాష్ట్రంలోని విద్యార్థులు వారి కంటే మెరుగైన మార్కులు తెచ్చుకున్నా సీటు దక్కకుండా పోతోంది. అందుకే మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల సేకరణలో విద్యార్థులందరం స్వచ్ఛందంగా పాల్గొన్నాం. – పాతకుంట హేమంత్రెడ్డి, విద్యార్థి, చెన్నూరు. ప్రభుత్వమే కాలేజీలు నడిపిస్తే పేదలకు మేలు మెడికల్ కాలేజీలు ప్రభుత్వ ఆధ్వర్యంలో నడిస్తేనే నిరుపేదలకు ఎంతో మేలు జరుగుతుంది. నీట్ పరీక్షలు రాసినప్పుడు ప్రభుత్వ కాలేజీలలో మంచి ర్యాంకు సాధించిన వారికి ప్రభుత్వ ఫీజులతోనే సీటు వస్తుంది. ప్రైవేట్ పరం చేయడం ద్వారా కాలేజీ యాజమాన్యం లక్షల రూపాయలు వసూలు చేసే అవకాశం ఉంటుంది. –ఆర్షద్, ఇంటర్మీడియట్, జమ్మలమడుగు -
పాత కక్షలే హత్యకు కారణం
కడప అర్బన్ : కడప నగర శివార్లలో స్వరాజ్ నగర్లో ఖాళీగా ఉన్న ఎన్జీఓ ప్లాట్లలో ఈనెల 11వ తేదీన రాత్రి వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ (27) అనే యువకుడిని దారుణంగా హత్య చేసిన కేసులో ప్రధాన నిందితుడు అరుణ్ కుమార్ అలియాస్ అరుణ్ను పోలీసులు అరెస్టు చేశారు. అలాగే అతని బంధువు అయిన బాలుడిని అదుపులోకి తీసుకున్నారు. ప్రధాన నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు తరలించారు. బాలుడిని జువైనల్ హోం( ప్రభుత్వ బాలుర గృహం)కు తరలించారు. ఈ సంఘటనపై కడప డీఎస్పీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు వివరాలను వెల్లడించారు. పాత కక్షలను మనసులో పెట్టుకుని.. ఈ కేసులో ప్రధాన నిందితుడు అరుణ్కుమార్ అలియాస్ అరుణ్ హత్యకు గురైన వల్లెపు వెంకటయ్య అలియాస్ వెంకట్ చిన్ననాటి స్నేహితులు. మృతుడికి మొదట వెంకట సుధతో వివాహమైంది. కుటుంబ కలహాల కారణంగా వారిద్దరూ విడిపోయారు. తర్వాత అతను భవిత అలియాస్ అక్కమ్మను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. ఆమెను వివాహం చేసుకున్న సమయంలో అరుణ్ తన మోటార్ సైకిల్ను కుదువకు పెట్టి మృతుడికి ఆర్థికంగా సహకరించాడు. అదే క్రమంలో మృతుడు వెంకట్ కూడా పూచీకత్తుగా ఉండి అరుణ్కు చెందిన మోటార్ సైకిల్ను కుదువ పెట్టి, తనకు తెలిసిన వారి వద్ద నుంచి డబ్బులు ఇప్పించాడు. అయితే చెప్పిన సమయానికి అరుణ్ డబ్బులు చెల్లించక పోయే సరికి వెంకట్, అరుణ్ను అతని కుటుంబ సభ్యులను ఉద్దేశించి అసభ్యకరంగా తిట్టడంతో మనస్తాపానికి గురయ్యాడు. దీంతో అతను వెంకట్పై కక్ష పెంచుకున్నాడు. అతనితో స్నేహ పూర్వకంగా ఉన్నట్లు నటిస్తూనే చంపేందుకు అవకాశం కోసం ఎదురు చూశాడు. ఈ నేపథ్యంలో ఈనెల 11వ తేదీ సాయంత్రం అరుణ్ తన చిన్నాన్న కుమారుడైన బాలుని సహకారం తీసుకున్నాడు. వారిద్దరూ కలిసి వెంకట్కు అతిగా మద్యం తాగించారు. పూర్తిగా మత్తులో ఉండగా, ఇద్దరు కలిసి వెంకట్ను సిమెంట్ ఇటుక దిమ్మెలతో తల పైన రక్తం వచ్చేలా కొట్టి దారుణంగా హత్య చేశారు. తొలుత హత్యకు కారణమైన వారి వివరాలు తెలియరాలేదు. తరువాత క్లూస్ టీం, డాగ్ స్క్వాడ్ సిబ్బంది సహకారంతో ‘సోను’ అనే జాగిలం ప్రధాన నిందితుడి ఇంటిని కనుగొనడంలో కీలక పాత్ర పోషించింది. నిందితుల నుంచి రెండు సెల్ఫోన్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిని కోర్టులో హాజరు పరచగా రిమాండ్కు ఆదేశించారు. నేరస్తులను గుర్తించడంలో నేర్పరి ‘సోను ’ జాగిలం.. మంగళగిరి పోలీస్ హెడ్ క్వార్టర్స్లో శిక్షణ పూర్తి చేసుకుని ఇటీవలే జిల్లా పోలీస్ శాఖ డాగ్ స్క్వాడ్లో చేరిన ‘సోను’ డ్యూయల్ ట్రైనింగ్ పొందింది. పేలుడు పదార్థాలను, నేరస్తులను గుర్తించడంలో నేర్పరిగా పేరు గాంచింది. జిల్లా పోలీస్ శాఖలో చేరిన కొద్ది కాలంలోనే హత్య కేసు ఛేదించి ‘శభాష్.. సోను’ అని పోలీస్ ఉన్నతాధికారుల ప్రశంసలు అందుకుంది. ఈ కేసులో నిందితులను అరెస్టు చేసేందుకు కృషి చేసిన దర్యాప్తు అధికారి రిమ్స్ పోలీసు స్టేషన్ సీఐ బి.రామక్రిష్ణా రెడ్డి, ఎస్ఐ సుభాష్ చంద్ర బోస్, క్లూస్ టీం ఎస్ఐ ఎస్.వినీల, డాగ్ స్క్వాడ్ సిబ్బంది మహబూబ్ హుసేన్, సుధీర్ రాజ, సోను జాగిలం, హెడ్ కానిస్టేబుల్ హరి ప్రసాద్, సుధాకర్, కానిస్టేబుల్ ఇస్మాయిల్, సుందర్ను అభినందించారు. హత్య కేసులో నిందితుడి అరెస్టు పోలీసుల అదుపులో మరో బాలుడు కేసు ఛేదనలో కీలక పాత్ర పోషించిన పోలీస్ జాగిలం ‘సోను’ వివరాలు వెల్లడించిన కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు -
వెంటనే రద్దు చేయాలి
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ నిర్ణయాన్ని ఏపీ ప్రభుత్వం వెనక్కి తీసుకోవాలి. ఆయా కళాశాలలను 33 ఏళ్ల లీజుకు ప్రైవేటు సంస్థలకు ఇవ్వబోతున్నాయి. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ రిజర్వేషన్ కోటాను 50 శాతం తగ్గించడం, 50 శాతం సీట్లను మార్కెట్ రేట్లతో అమ్మడం వంటి నిర్ణయాలు వల్ల ఫీజులు అమాంతం పెరుగుతాయి. దీంతో పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షగా మారుతుంది. ఈ నిర్ణయం రాష్ట్ర ఆరోగ్య సేవలపై కూడా తీవ్రమైన ప్రభావం చూపుతుంది. – డీయం.ఓబులేసు ఆర్ఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు -
కడప ఐఎంహెచ్ పీజీ వైద్య విద్యార్థుల ప్రతిభ
కడప అర్బన్ : జిల్లా రిమ్స్ ఆవరణంలో ఉన్న ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెంటల్ హెల్త్(ఐఎంహెచ్) పీజీ ఫైనల్ ఇయర్ విద్యార్థులు రాష్ట్ర స్థాయి సీఎంఈలో ప్రతిభ కనబరిచారు. ఈనెల 13, 14 తేదీలలో నంద్యాలలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో మానసిక వైద్య విభాగం సీఎంఈ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కడప రిమ్స్ ఆవరణంలోని ఐఎంహెచ్కు చెందిన పీజీ ఫైనలియర్ వైద్య విద్యార్థులు డాక్టర్ ఏ .శ్రీకాంత్ రెడ్డి, డాక్టర్ ఎం. శ్రీ చరిత క్విజ్ పోటీలలో పాల్గొని బహుమతిని గెలుచుకున్నారు. ఈ సందర్భంగా గురువారం ఐఎమ్హెచ్ వైద్యులు కడప ప్రభుత్వ వైద్య కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. జమునను కలిశారు. ఆమె వైద్య విద్యార్థులను అభినందించారు. ఈ కార్యక్రమంలో ఐఎమ్హెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రాముడు, అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ అనిల్ కుమార్, డాక్టర్ వంశీకృష్ణ, డాక్టర్ డి. సునీత, అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ సురేష్ కుమార్, డాక్టర్ షాహిద్ బాషా, డాక్టర్ సరిత, డాక్టర్ సందీప్, డాక్టర్ రవి కిరణ్, డాక్టర్ నగేష్, డాక్టర్ విశాలాక్షి పాల్గొన్నారు. -
మహిళ ఆత్మహత్య
చింతకొమ్మదిన్నె : మండలంలోని ఎర్రమాచుపల్లెకు చెందిన బుర్రి లక్ష్మీదేవి (44) బుధవారం ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపారు. కడుపునొప్పి, కాళ్ల నొప్పులు భరించలేక స్థానికంగా ఆర్ఎంపీ డాక్టర్ల వద్ద చూపించుకుంటూ వచ్చింది. నయం కాకపోవడంతో బుధవారం రాత్రి ఉరి వేసుకున్నట్లు ప్రాథమిక సమాచారం. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు చాపాడు : మండల పరిధిలోని ప్రొద్దుటూరు –మైదుకూరు జాతీయ రహదారిలో నాగులపల్లె సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని మిండ్యాల శేషాద్రి (18) అనే యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. చాపాడు మండలం పల్లవోలు గ్రామానికి చెందిన శ్రీను, వెంకటలక్ష్మి దంపతుల కుమారుడు శేషాద్రి ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు మెకానిక్ షాపులో పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో గురువారం రాత్రి 8.30 గంటల ప్రాంతంలో ప్రొద్దుటూరు నుంచి పల్లవోలుకు బైకులో వస్తుండగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన శేషాద్రిని స్థానిక వాహనదారులు ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించినట్లు అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గుండెపోటుతో ఏఆర్ ఎస్ఐ మృతి కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎం.టి. విభాగంలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహిస్తున్న పి.వసంత్ కుమార్ గురువారం తెల్లవారుజామున గుండెపోటుతో మృతి చెందారు. ఏఆర్ ఎస్ఐ మృతి పట్ల జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఏఆర్ ఎస్ఐ కుటుంబానికి ప్రగాఢ సానుభూతి తెలిపారు. కుటుంబానికి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య కడప నగరం భాకరాపేట స్వామి నగర్లోని గృహంలో ఉంచిన ఏఆర్ ఎస్ఐ భౌతికకాయంపై పుష్ప గుచ్చాలు ఉంచి ఘనంగా నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో ఆర్.ఐ సోమశేఖర్ నాయక్, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్ పాల్గొన్నారు. న్యాయ విజ్ఞాన సదస్సు చింతకొమ్మదిన్నె : కడప నగరం ఇందిరానగర్లో ‘నల్సా’ వంద రోజుల కార్యక్రమంలో భాగంగా గురువారం న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ అధ్యక్షులు, జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫక్రుద్దీన్ సూచనల మేరకు జరిగిన ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాది అక్బర్ అలీ, పారా లీగల్ వలంటీర్లు దశరథ రామిరెడ్డి, శ్రీనివాసులు, నిర్మల, రాజు, ఆశా, అంగన్వాడి వర్కర్లు పాల్గొన్నారు. -
ఆర్టీపీపీలో నాలుగు ఇళ్లలో చోరీ యత్నం
● ఒక ఇంటిలో 3 తులాల బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు వేలి ముద్రలు సేకరిస్తున్న క్లూస్టీం వస్తువులను చెల్లాచెదురుగా పడేసిన దృశ్యం ఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు–525, 535, జీ టైపు–350, 362 క్వార్టర్లలో గరువారం రాత్రి దొంగలు చోరీకి యత్నించారు. అయితే ఒక ఇంటిలో మాత్రం బంగారు, వెండి నగలు ఎత్తుకెళ్లారు. విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు, కొండాపురం సీఐ రాజ, కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డిలు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కడప నుంచి క్లూస్ టీం వచ్చి నాలుగు ఇళ్లలో పరిశీలించి వేలి ముద్రలను సేకరించారు. ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలో ఎఫ్ టైపు వరుసలో ఎఫ్–525 క్వార్టర్స్లో సుబ్రమణ్యం శ్రేష్టి నివాసం ఉంటున్నారు. ఆయన పని మీద చైన్నెకు వెళ్లారు. అలాగే ఎఫ్–535 క్వార్టర్స్లో నివాసం ఉంటున్న దుగ్గిరెడ్డి రామ్మోహన్రెడ్డి కుటుంబం హైదరాబాదుకు వెళ్లగా, ఆయన తాళాలు వేసి డ్యూటీకి వెళ్లారు. అలాగే జీ టైపు వరసలో ఉండే జీ–350 దేవచంద్ర కుటుంబంతో కలసి చిలంకూరుకు వెళ్లారు. జీ–362 క్వార్టర్స్లో ఉండే ఆదినారాయణరెడ్డి కూడా పనిమీద కుటుంబంతో బయటకు వెళ్లారు. ఈ నాలుగు క్వార్టర్స్లో ఏక కాలంలో ఇంటి తలుపులు పగలకొట్టి ఇంటిలోకి గుర్తు తెలియని దొంగలు ప్రవేశించి ఇంటిలోని బీరువాలను పగులగొట్టారు. అయితే జీ–350 క్వార్టర్స్లో ఉంటున్న దేవచంద్ర ఇంట్లో మాత్రం 3 తులాలు బంగారు, 150 గ్రాముల వెండి ఆభరణాలు చోరీ చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. మిగిలిన మూడు ఇళ్లలో చోరీకి యత్నించారు కానీ ఎలాంటి నగలు, నగదు దొంగలకు దొరకలేదు. ఒకే ఇంటిలో రెండో సారి చోరీ... ఆర్టీపీపీలోని ఎఫ్ టైపు 525లో 2020లో చోరీ జరిగింది. అప్పుడు పెద్ద మొత్తంలో నగదు, బంగారు ఆభరణాలు చోరీకి గురయ్యాయి. అయితే మరలా అదే ఇంటిలో ఇప్పుడు చోరీ జరిగింది. అలాగే 2015 సంవత్సరంలో ఆర్టీపీపీలోని ఇదే కాలనీలో ఏకంగా 7 క్వార్టర్లలో చోరీ జరిగింది. అప్పుడు చోరీలను మధ్యప్రదేశ రాష్ట్రానికి చెందిన వారు చేసినట్లుగా పోలీసులు గుర్తించారు. ఆ మేరకు దొంగలను కూడా పట్టుకుని కొంత మొత్తం రికవరీ చేశారు. భద్రతపై ఉద్యోగుల ఆదోళన.. ఆర్టీపీపీలో వరుసగా చోరీలు జరుగుతుండటంతో భద్రతపై ఉద్యోగుల్లో ఆందోళన మొదలైంది. ఆర్టీపీపీలోని వీవీరెడ్డి కాలనీలోకి వెళ్లాలాంటే గేటు వద్ద ఎస్పీఎఫ్ సిబ్బంది పహారా ఉంటారు. గేటు దాటి లోనికి పోవాలంటే వారు నిత్యం తనిఖీ చేస్తుంటారు. దొంగలు ఏ విధంగా వస్తున్నారనే సందేహాన్ని ఉద్యోగులు వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఏపీజెన్కో యజమాన్యం స్పందించి భద్రతపై ప్రత్యేక దృష్టి సారించాలని ఉద్యోగులు కోరుతున్నారు. -
నేడో రేపో ఆదేశాలు...
పదో తరగతి నూరు రోజుల ప్రణాళిక కార్యక్రమ అమలుకు సంబంధించి ప్రతి పాఠశాలకు ఒక జిల్లా అధికారి లేదా మండల గెజిటెడ్ అధికారిని నియమించాం. వారు వారానికి రెండు రోజులు వారికి నియమించిన పాఠశాలకు వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. ఇందుకు సంబంధిత జాబితాను కలెక్టర్కు పంపించాం. ఆయననుంచి ఒకటి రెండు రోజలు సంబంధిత జాబితా విడుదల అవుతుంది. జాబితా విడుదలైనప్పటి నుంచి నియమించిన అధికారులు వారికి కేటాయించిన పాఠశాలకు వెళ్లి పర్యవేక్షించాల్సి ఉంటుంది. –షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
పోస్టల్ ఇన్సూరెన్స్ భళా !
● ఆరు పథకాలతో ఆర్థిక ప్రయోజనాలు ● తపాలా శాఖ పథకాల విస్తరణ కడప వైఎస్ఆర్ సర్కిల్ : తపాలా శాఖ అందించే బీమా పథకాలు అన్ని వర్గాల ప్రజలకు ధీమానిస్తున్నాయి. పీఎల్ఐ (పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్) పేరిట ప్రవేశపెట్టిన పలు రకాల పథకాలు ఎంతో మంది గ్రాడ్యుయేట్లకు ఆర్థిక ప్రయోజనాలు చేకూరుస్తున్నాయి. వీటిని మొదట్లో తపాలా శాఖ ఉద్యోగుల సంక్షేమ పథకాలుగా ప్రవేశపెట్టారు. తర్వాత కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ఉద్యోగులు, భద్రతా సిబ్బందికి వర్తింపజేశారు. కాలక్రమేణా పీఎల్ఐ పథకాన్ని వైద్యులు, ఇంజినీర్లు, న్యాయవాదులు, సీఏ వంటి ప్రొఫెషనల్స్తో పాటు బీఎస్ఈ, ఎన్ఎస్ఈ లలో నమోదు కంపెనీల ఉద్యోగులకు వర్తింపజేశారు. ఇటీవల గ్రాడ్యుయేట్లకు పీఎల్ఐ సౌకర్యాన్ని విస్తరించారు. దీంతో ఈ పథకాల వైపు గ్రాడ్యుయేట్లు ఆసక్తి చూపుతున్నారు. యాంటిసిపేటెడ్ ఎండోమెంట్ అస్యూరెన్స్.. దీనిని మనీ బ్యాక్ పాలసీ అంటారు. 19 నుంచి 25 సంవత్సరాల మధ్య గలవారు ఈ పాలసీకి అర్హులు. బీమా రూ.20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాలపరిమితి 15 నుంచి 20 సంవత్సరాలుగా నిర్ణయించారు. 15 ఏళ్ల పాలసీపై 6, 9, 12 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం బోనస్ లభిస్తుంది. 20 ఏళ్ల పాలసీపై 8, 12, 16 సంవత్సరాలు పూర్తయితే 20 శాతం, మెచ్యూరిటీపై 40 శాతం చొప్పున బోనస్ లభిస్తుంది. ఈ స్కీమ్లో ఉన్న లబ్ధిదారులకు సంవత్సరానికి ఒకసారి 1000 రూపాయలకు రూ. 48 చొప్పున బోనస్ లభిస్తుంది. హోల్ లైఫ్ అస్యూరెన్స్... ఈ పాలసీకి 19 నుంచి 55 సంవత్సరాల మధ్య గల వా రు అర్హులు. బీమా రూ.20వేల నుంచి 50 లక్షల వరకు ఉంటుంది. ప్రీమియం చెల్లించే వయసును 55, 58, 60 సంవత్సరాలుగా ఎంచుకునే అవకాశం కల్పించా రు. నాలుగేళ్ల తర్వాత రుణం తీసుకునే వెసులుబాటు ఉంది. మూడేళ్లు దాటితే పాలసీ సరెండర్ చేసుకొనే వీలుంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే ఎలాంటి బో నసులు వర్తించవు. కోతలు విధిస్తారు. ప్రతిఏటా 1000కి రూ. 76 చొప్పున బోనస్ లభిస్తుంది. పాలసీదారుడికి 80 ఏళ్లు దాటినా లేదా మరణించినా వారసులకు బీమా సొమ్ము బోనస్ ప్రయోజనాలను చెల్లిస్తారు. కన్వర్టబుల్ హోల్ లైవ్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 19 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. రూ.20 వేల నుంచి రూ.50 లక్షల వరకు బీమా చెల్లింపులు చేయవచ్చు. మూడేళ్లు దాటితే ఎప్పుడైనా పాలసీ సరెండర్కు అవకాశం ఉంటుంది. ఐదేళ్ల లోపు సరెండర్ చేస్తే బోనస్ రాకపోగా కోతలు విధించే నిబంధనలు ఉన్నాయి. ప్రతి ఏటా రూ.1000 కి 76 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది.. ఎండోమెంట్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 18 నుంచి 50 సంవత్సరాల వారు అర్హులు. కనీస బీమా రూ.20,000, గరిష్టంగా రూ.50 లక్షలు ఉంటుంది. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం, పాలసీ సరెండర్కి అవకాశం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీల సరెండర్పై బోనసుల్లో కోతలు విధింపు తప్పవు. ప్రతి ఏటా రూ.1000 కి 52 రూపాయలు చొప్పున బోనస్ లభిస్తుంది. జాయింట్ లైఫ్ అస్యూరెన్స్.. ఈ పాలసీకి 21 నుంచి 45 ఏళ్ల వయసు గల దంపతులు అర్హులు. బీమా రూ. 20వేల నుంచి రూ.50 లక్షల వరకు ఉంటుంది. పాలసీ కాల పరిమితి ఐదు నుంచి 20 ఏళ్లు. పాలసీ తీసుకున్న మూడేళ్ల తర్వాత రుణ సదుపాయం ఉంటుంది. ఐదేళ్లు దాటిన పాలసీలు సరెండర్ పై బోనస్ల్లో కోత ఉంటుంది. పాలసీదారుడు మరణానంతరం ప్రయోజనాలు భాగస్వామి లేదా వారసులకు వర్తిస్తాయి. ప్రతి ఏటా రూ.1000కి 52 చొప్పున బోనస్ లభిస్తుంది. సింగిల్ ప్రీమియంతో దంపతులు బీమా కవరేజి పొడిగించుకోవచ్చు. చిల్డ్రన్ పాలసీ.. పాలసీదారుల పిల్లల కోసమే ఈ పథకాన్ని తీసుకొచ్చారు. గరిష్టంగా ఇద్దరు పిల్లలకు బీమా చేసుకోవచ్చు. పిల్లల వయస్సు తప్పనిసరిగా ఐదు నుంచి 20 ఏళ్ల లోపు ఉండాలి. పిల్లలకు గరిష్టంగా రూ.3 లక్షలు లేదా పాలసీదారు బీమా ప్రకారం ఇన్సూరెన్స్ తీసుకోవచ్చు. పాలసీదారు ( పిల్లల తండ్రి) వయసు 40 ఏళ్లు దాటి ఉండకూడదు. పాలసీదారు చనిపోతే పిల్లలపై తీసుకున్న బీమాకు ప్రీమియం చెల్లించనక్కర్లేదు. కాలపరిమితి తీరాక బీమా సొమ్ము బోనసులు వర్తిస్తాయి. రుణ సదుపాయం సరెండర్ సౌకర్యాలు ఈ స్కీమ్ లో ఉండవు. ప్రీమియం తల్లిదండ్రులు చెల్లించాలి. పిల్లలు ఆరోగ్యంగా ఉండాలి. వీరికి ఎలాంటి వైద్య పరీక్షలు నిర్వహించరు. ఎండోమెంట్ పాలసీ ప్రకారం బోనసులు వర్తిస్తాయి. దరఖాస్తు చేయడం ఇలా.... పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకోవాలనుకునేవారు కావాల్సిన పత్రాలను విధిగా సంబంధిత అధికారులకు సమర్పించాలి. గ్రాడ్యుయేట్, పదో తరగతి, డిగ్రీ సర్టిఫికెట్లు ఇవ్వాల్సి ఉంటుంది. పాలసీని బట్టి వివిధ వైద్య పరీక్షలు ఉంటాయి, స్మార్ట్ ఫోన్ వినియోగదారులు పోస్ట్ ఇన్ఫో యాప్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. లేదా సమీప పోస్ట్ ఆఫీస్ను సంప్రదించి స్కీంలో భాగస్వాములు కావచ్చు. ఉమ్మడి జిల్లాలో 3,79,680 పాలసీదారులు పీఎల్ఐ పథకంలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాలో 3,79,680 మంది పాలసీదారులు ఉన్నారు. ఇందులో కడప డివిజన్లో 2,08,722, ప్రొద్దుటూరు డివిజన్లో 1,70,958 పాలసీదారులు ఉన్నట్లు అధికారులు తెలుపుతున్నారు. కేంద్ర ప్రభుత్వం తీసుకు వచ్చిన పీఎల్ఐ పథకాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాలి. గ్రాడ్యుయేట్లు, విద్యావంతులు, ఈ పథకంలో చేరి వివిధ పథకాల్లోని ప్రయోజనాలను పొందవచ్చు. తక్కువ బీమాతో ఎక్కువ ప్రీమియంలు పొందవచ్చు. పోస్టల్ ఉద్యోగులు పీఎల్ఐ పథకాలపై గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పిస్తున్నారు. – రాజేష్, కడప డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్. -
ఉద్యాన సాగులో జిల్లాను అగ్రస్థానంలో నిలిపేలా చర్యలు
కడప సెవెన్రోడ్స్: వ్యవసాయ, ఉద్యాన పంటల సాగులో వైయస్సార్ కడప జిల్లా రాష్ట్రంలోనే అగ్రస్థానం లో నిలిచేలా సాగుబడి విస్తీర్ణం పెరుగుతోందని.. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకు జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వివరించారు. అమరావతిలో రెండు రోజుల పాటు జరుగుతున్న 5వ జిల్లా కలెక్టర్ల సమావేశం లో భాగంగా మొదటి రోజు బుధవారం జరిగిన సమావేశంలో వైఎస్ఆర్ కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరై జిల్లాలో వ్యవసాయ, ఉద్యాన శాఖల అభివృద్ధిపై ముఖ్య మంత్రి చంద్రబాబుకు వివరించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో జిల్లా లోని రైతులు ఉద్యాన, వాణిజ్య పంటల పైన ఎక్కువ మొగ్గు చూపుతూ.. ఉత్పత్తి కూడా గణనీయంగా పెంచుతున్నారన్నారు. వాణిజ్య పంటలైన అరటి, చీనీ, నిమ్మ, దానిమ్మ, పండ్ల తోటలతో పాటు ఉల్లి, పసుపు, పూల తోటలను విస్తారం గా సాగు చేస్తున్నారన్నారు. జిల్లాలో పండించిన చామంతి పువ్వులను అధికంగా బెంగుళూరు తదితర ప్రాంతాలకు ఎగుమతి చేయడం వల్ల ఆశించిన మేర ఆదాయాన్ని జిల్లా రైతులు పొందుతున్నారన్నారు. వాణిజ్య పంటల విషయం లో ఇక్కడ రైతులు మార్కెటింగ్ పైన కొంత ప్రత్యేక దష్టి సారించాల్సి ఉందని, ఏ సీజన్ లో.. ఏయే పంటలకు ఎలాంటి డిమాండ్ ఉంటుందన్న విషయాన్ని దృష్టి సారించాల్సిన అవసరం ఉందన్నారు. అందుకోసం స్థానిక, జాతీయ, అంతర్జాతీయ ట్రేడింగ్ పైన రైతులకు అవగాహన పెంపొందించే విధంగా చర్యలు చేపడుతున్నామన్నారు. భవిష్యత్తు లో వైయస్సార్ కడప జిల్లా ఉద్యాన పంటలకు ప్రసిద్ధిగాంచేలా, ఉద్యాన హబ్ గా జిల్లాను అభివృద్ధి చేసేందుకు ప్రత్యేక దృష్టి సారిస్తున్నామని జిల్లా కలెక్టర్ వివరించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు రెడ్డిస్వాతి
కడప ఎడ్యుకేషన్ : కడప నగర పరిధిలోని నిర్మల ఫార్మసి కళాశాలకు చెందిన ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికై ంది. పులివెందుల జేఎన్టీయూలో జరిగిన యూనివర్సిటీ హ్యాండ్బాల్ పోటీలలో కళాశాలలో నాలుగో సంవత్సరం చదువుతున్న ఫార్మ.డి విద్యార్థి రెడ్డి స్వాతి జేఎన్టీయూ యూనివర్సిటీ జట్టుకు ఎంపికై ంది. 2026 జనవరిలో కేరళలోని మహాత్మాగాంధీ యూనివర్సిటీలో జరిగే సౌత్ జోన్ హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొని కళాశాల, యూనివర్సిటీకి మంచి పేరు తీసుకురావాలని ప్రిన్సిపాల్ మోహన్కుమార్ సూచించారు. రెడ్డి స్వాతిని నిర్మల ఫార్మసి కళాశాల చైర్మన్ బి. శ్రీనివాసులు, ప్రిన్సిపాల్ మెహన్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ గంగరాజు, కళాశాల సిబ్బంది అభినందించారు. -
నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత
● కాలువలపై ఉన్న ఆక్రమణల తొలగింపునకు అధికారుల యత్నం ● నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి ప్రశ్న కడప కార్పొరేషన్ : ఆక్రమణల తొలగింపు విషయంలో సాయి కృప నర్సింగ్ కాలేజీ వద్ద ఉద్రిక్తత చోటు చేసుకుంది. కాలేజీ ఎదుట కాలువపై ఉన్న తాపలను తొలగించేందుకు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్రం ఆధ్వర్యంలో నగరపాలక అఽధికారులు కాలేజీ వద్దకు చేరుకున్నారు. తమకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారని కళాశాల ఛైర్మన్, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అధికారులను ప్రశ్నించారు. డ్రైనేజీ కాలువలో నీరు ప్రవహించడమే మీ ఉద్దేశమైతే తామే తొలగిస్తామని చెప్పారు. ఇందుకు అడిషనల్ కమిషనర్ అంగీకరించలేదు. తాపలు తొలగించాల్సిందేనని పట్టుబట్టారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీకి, అడిషనల్ కమిషనర్కు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. చివరకు మూడు రోజుల్లో తాపలు తొలగించాలని, లేనిపక్షంలో శనివారం తామే వచ్చి తొలగిస్తామని కమిషనర్ చెప్పి వెళ్లిపోయారు. రాజకీయ కక్షపాధింపునకు పరాకాష్ట వైఎస్సార్సీపీ నాయకులపై కడప ఎమ్మెల్యే కక్ష సాధింపునకు ఇది పరాకాష్ట అని పలువురు విమర్శిస్తున్నారు. నాలుగు రోజుల క్రితం ఇదే ప్రాంతంలో పర్యటించిన ఆమె నర్సింగ్ కాలేజీ వద్ద తాపలు తొలగించాలని నగరపాలక అధికారులను ఆదేశించినట్లు తెలుస్తోంది. ఎమ్మెల్యే ఆదేశాలతో అధికారులు ఉన్నఫళంగా జేసీబీ తీసుకురావడం పట్ల విస్మయం వ్యక్తమవుతోంది. సాయికృప నర్సింగ్ కాలేజీ ఎదుట చాలా ఏళ్ల క్రితమే తాపలు కట్టి ఉన్నారు. కాలువలో నీరు సక్రమంగా పోకపోయినా, కాలువల్లో పూడిక తీయాల్సి వచ్చినా గ్రిల్స్ వేసుకోవాలని చెప్పవచ్చు. లేదా తొలగిస్తామని ముందస్తు నోటీసులు ఇవ్వాలి. అలాకాకుండా రాజకీయ కోణంలో ఆక్రమణల పేరిట తొలగించే యత్నం చేయడం దుమారం రేపుతోంది. గతంలో వైఎస్సార్సీపీ నాయకులకు చెందిన వాటర్ప్లాంట్లు, కమర్షియల్ షాపులు కూలగొట్టించిన ఎమ్మెల్యే, తాజాగా వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిని లక్ష్యంగా చేసుకొని వారి కళాశాల తాపలను తొలగించడానికి అధికారులను ఉసిగొల్పడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
విద్యార్థి దశ నుంచే వ్యవసాయంపై అవగాహన అవసరం
కడప అగ్రికల్చర్ : విద్యార్థి దశ నుంచే విద్యార్థులు వ్యవసాయంపై అవగాహన పెంచుకోవాలని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రా నాయక్ సూచించారు. ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం విద్యార్థులు ఇప్పపెంట గ్రామంలో రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా వ్యవసాయ అధికారి మాట్లాడుతూ విద్యార్థి దశలోనే వ్యవసాయ అనుబంధ శాఖల గురించి తెలుసుకోవాలన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.అంకయ్య కుమార్ , ఏరువాక కేంద్రం సమన్వయకర్త డాక్టర్ కె.కృష్ణప్రియ, వ్యవసాయ పరిశోధన స్థానం శాస్త్రవేత్త డాక్టర్ సునీల్ రైతులతో ముఖాముఖి కార్యక్రమం నిర్వహించి పంటల సాగు, తెగుళ్లు, పురుగుల మందుల వాడకం గురించి తెలియజేశారు. తిరుపతి, మహానంది, ఉదయగిరి వ్యవసాయ కళాశాలల అసోసియేట్ డీన్లు రెడ్డిశేఖర్, జయలక్ష్మి, క్రిష్ణారెడ్డిలు మాట్లాడుతూ విద్యార్థులు రైతుల అనుభవాలను తెలుసుకొని మంచి దిగుబడులు ఎలా సాధించాలో నేర్చు కోవాలని సూచించారు. మండల అధ్యక్షుడు గంధం మోహన్, రైతులు, విద్యార్థులు పాల్గొన్నారు. జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ -
నిర్ణయాన్ని వెనక్కుతీసుకోవాలి
చంద్రబాబు ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలనుకోవడం పేద విద్యార్థులకు శాపంగా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పేదలకు మెరుగైన వైద్యం.డాక్టర్ చదవాలన్న పేద విద్యార్థుల కల నెరవేర్చాలన్న ఉద్దేశ్యంతో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చారు. ప్రస్తుతం ఈ కాలేజీలను చంద్రబాబు ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దారుణం. ప్రజలు కూడా ప్రైవేటీకరణను పూర్తిస్థాయిలో వ్యతిరేకిస్తున్నారు. చంద్రబాబు తక్షణమే తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలి. –పోలంరెడ్డిప్రమోద్కుమార్రెడ్డి, విద్యార్థి, రాచాయపేట, గోపవరం మండలం -
టీడీపీ సర్కార్ పునరాలోచించాలి
వైఎస్ జగన్ ప్రభుత్వంలో మంజూరు చేసిన మెడికల్ కళాశాలను ప్రైవేట్పరం చేయడం తగదు. ఎంబీబీఎస్ చదవాలంటే ప్రైవేట్ కళాశాలలకు రూ.కోట్లలో ఫీజు, డొనేషన్లు చెల్లించాల్సి ఉంటుంది. ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే సాధారణ మధ్యతరగతి, పేదలకు మేలు జరుగుతుంది. ప్రతి ప్రభుత్వ మెడికల్ కళాశాలలో పేద ప్రజలకు వైద్యం అందించేందుకు సూపర్ స్పెషాలిటీ ఆస్పత్రి ఉంటుంది. ఈ నిర్ణయాన్ని కూటమి ప్రభుత్వం ఉపసంహరించుకోవాలి. –ఎల్.దస్తగిరి సాయి, విద్యార్థి, ప్రొద్దుటూరు -
అన్నివర్గాలకు నష్టమే
ప్రభుత్వం మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం వల్ల అన్ని వర్గాల ప్రజలకు నష్టమే. ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే మంచి విద్యతోపాటు వైద్యం కూడా లభిస్తుంది. ఏ ప్రభుత్వమైన ప్రభుత్వ విద్యను ప్రోత్సహించాలి. ప్రైవేట్ మెడికల్ కళాశాలల వల్ల వైద్య విద్యకు, ఉచిత వైద్యానికి పేద విద్యార్థులు, ప్రజలు దూరమవుతారు. వైఎస్సార్పీపీ ప్రభుత్వ హయాంలో ఎంతో ఉన్నత ఆశయంతో 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేశారు. వాటిని ప్రస్తుత ప్రభుత్వం ప్రైవేట్ పరం చేయాలని చూడడం చాలా దుర్మార్గం. – కె.పవన్కళ్యాణ్, విద్యార్థి, ప్రొద్దుటూరు -
కూచ్ బెహర్ ట్రోఫీ విజేత ఆంధ్రా జట్టు
కడప వైఎస్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ మ్యాచ్లో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా–ఉత్తరాఖండ్ జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో బౌలర్ల ధాటికి ఉత్తరాఖండ్ బ్యాటర్లు తడబడటంతో రెండవ రోజే ఆంధ్రా జట్టుకు విజయం వరించింది. బుధవారం రెండవ రోజు 42 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 71.2 ఓవర్లలో 254 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని ఆనంద్ జోషయ్య 58 బంతులకు 1 సిక్సర్, 4 ఫోర్లతో 49 పరుగులు, మన్విత్ కుమార్ రెడ్డి 2 ఫోర్లు, 2 సిక్సర్లతో 39 పరుగులు చేశారు. ఉత్తరాఖండ్ జట్టులోని నిషు పటేల్ 5 వికెట్లు, లక్ష్య రాయ్చందాని 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్టు నిర్ణీత 36 ఓవర్లకు 102 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లక్ష్యరాయ్చందాని 30 పరుగులు, ఆయుష్ దేశ్వాల్ 25 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని ఏఎన్వీ లోహిత్ ఉత్తరాఖండ్ బ్యాటర్లపై చెలరేగి చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 5 వికెట్లు, రాజేష్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత 10.5 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 55 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 20 పరుగులు, హానీష్ వీరారెడ్డి 35 పరుగులు చేశారు. దీంతో ఆంధ్రా జట్టు విజయం సాధించింది. అయితే ఉత్తరాఖండ్ జట్టు ఆంధ్రా బౌలర్ల ధాటికి తక్కువ పరుగులకే ఆలౌట్ కావడం విశేషం. దీంతో ఆంధ్రా జట్టుకు 7 పాయింట్లు లభించాయి. ఏఎన్వీ లోహిత్, ఆంధ్రా (5 వికెట్లు)రాజేష్, ఆంధ్రా (4 వికెట్లు) -
ప్రైవేటుకు కట్టబెడితే పేద విద్యార్థులకు తీవ్ర నష్టం
రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడితే పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని రాష్ట్రంలో 17మెడికల్ కళాశాలల ఏర్పాటును సంకల్పించి కొన్నింటిని పూర్తి చేశారు. విద్యార్థుల భవిష్యత్తు, పేదలకు అత్యుత్తమ వైద్యాన్ని దృష్టిలో పెట్టుకుని కూటమి సర్కార్ తన ఆలోచనలను పునరాలించుకోవాలి. – యూసఫ్, విద్యార్థి, దువ్వూరు ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు ప్రభుత్వ మెడికల్ కళాశాలలను పీపీపీ విధానంలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం తగదు. ఈ విషయంగా వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల పేరుతో తీసుకున్న నిర్ణయం అభినందనీయం. ఇందుకు విద్యార్థి లోకం స్వచ్చందంగా మద్దతు ఇస్తోంది. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే కలను సాకారం చేసేలా చంద్రబాబు సర్కార్ తన నిర్ణయాన్ని పునరాలోచించి సరైన నిర్ణయం తీసుకోవాలి. – గుత్తిరెడ్డి కార్తీక్రెడ్డి, విద్యార్థి, కడప వైద్య విద్యను దూరం చేయరాదు చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంతో వైద్య విద్యను పేద విద్యార్థులకు దూరం చేయడం సరికాదు. వైద్య రంగంవైపు వెళ్లాలనుకునే ప్రతి విద్యార్థి వైద్య విద్యను అభ్యసించాలని కలలు కంటాడు. అయితే చంద్రబాబు సర్కార్ పీపీపీ విధానంతో ఆ కల కల గానే మారిపోతుంది. ముఖ్యమంత్రి పేద వర్గాలను దృష్టిలో పెట్టుకుని ముందుకు సాగాలి. – అబ్దుల్ రోషన్, విద్యార్థి, కడప -
పట్టపగలే దోపిడీ
కొండాపురం : మండల పరిధిలోని పెంజి అనంతపురం గ్రామంలోని లక్ష్మి కాంతమ్మ, నారాయణరెడ్డి ఇంటిలో పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు 6.5 తులాల బంగారం దోపిడీ చేశారు. స్థానికుల వివరాల మేరకు గ్రామంలోకి కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బియ్యం పెట్టమని అడుక్కుంటూ వచ్చారు. నారాయణరెడ్డి ఇంటివద్దకు వెళ్లగా బాత్రూమ్లో నారాయణరెడ్డి స్నానం చేస్తుండగా, లక్ష్మి కాంతమ్మ ఒక్కతే ఇంట్లో ఉండింది. ఇదే అదనుగా గుర్తుతెలియని వ్యక్తులు ఇంటిలోకి దూరి ఆమె ముఖంపై మత్తుమందు చల్లి ఆమెను తాడుతో కట్టేసి నోట్లో వస్త్రాలు పెట్టి బీరువాలోని ఒక నల్లపూసలదండ, ఒక చైన్ మొత్తం 6.5 తులాల బంగారం ఎత్తుకెళ్లారు. సీఐ రాజా, ఎస్ఐ ప్రతాప్ రెడ్డి సంఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలు వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిపై మండల పరిధిలోని కొప్పోలు బస్టాపు సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో పుత్త చిన్నాయపల్లె గ్రామానికి చెందిన సింగంరెడ్డి వర లక్ష్మి అనే మహిళ తీవ్రంగా గాయపడింది. స్థానికులు తెలిపిన సమాచారం మేరకు వరలక్ష్మి బస్టాపు వద్ద రోడ్డు దాటుతుండగా కమలాపురం వైపు నుంచి కడప వైపు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనం ఢీకొట్టింది. దీంతో ఆమె తీవ్రంగా గాయపడి రక్తస్రావమైంది. స్థానికులతో పాటు అదే సమయంలో అటు వెళుతున్న వైఎస్ఆర్సీపీ నేత సంబటూరు ప్రసాద్రెడ్డి ఆమెను పరామర్శించి 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. అనంతరం స్థానికులు ఆమెను చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ శివ నాగిరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బత్తల శ్రీనివాసరెడ్డికి స్టేషన్ బెయిల్ పులివెందుల : బద్వేలుకు చెందిన సోషల్ మీడియా యాక్టివిస్ట్ బత్తల శ్రీనివాసరెడ్డికి పులివెందులలో స్టేషన్ బెయిల్ మంజూరైంది. మంగళవారం రాత్రి కడప కోర్టులో బెయిల్ మంజూరు కాగానే కోర్టు బయట వేచి ఉన్న పులివెందుల పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకుని పులివెందుల స్టేషన్కు తరలించారు. శ్రీనివాస్ రెడ్డిపై నమోదైన కేసు సెక్షన్ల ప్రకారం స్టేషన్ బెయిల్ కావడంతో బుధవారం రాత్రి అతనికి 41ఏ నోటీసులు జారీ చేసి విడుదల చేశారు. ఆ వెంటనే అతన్ని నెల్లూరు జిల్లాకు చెందిన వసంతపేట పోలీసులు పులివెందుల డీఎస్పీ ఆఫీస్ వద్ద అదుపులోకి తీసుకుని వెళ్లిపోయారు. క్వార్టర్ ఫైనల్స్కు చేరిన క్రికెట్ పోటీలు విజయవాడరూరల్ : మండలంలోని నున్న గ్రీన్ హిల్స్ మైదానంలో 69వ ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్ ఏపీ) అండర్–17 బాలుర అంతర జిల్లా క్రికెట్ చాంపియన్షిప్ బుధవారం ప్రారంభమైంది. కృష్ణా, కడప, గుంటూరు, విశాఖ, తూర్పు గోదావరి జట్లు క్వార్టర్ ఫైనల్స్కు చేరాయి. ప్రారంభ మ్యాచ్లో కడప జిల్లా గుంటూరుపై 20 పరుగుల తేడాతో విజయం సాధించి క్వార్టర్ ఫైనల్స్కు అర్హత సాధించింది. కడప జిల్లా కర్నూలును 47 పరుగుల తేడాతో ఓడించింది. -
ఉద్యోగుల హక్కు పెన్షన్
● డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు ● ఘనంగా పెన్షనర్స్ దినోత్సవం కడప ఎడ్యుకేషన్ : పెన్షన్ అనేది ఉద్యోగుల హక్కు అని డీఆర్ఓ విశ్వేశ్వరనాయుడు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రభుత్వ పెన్షనర్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం పాత రిమ్స్లోని బీసీ భవన్లో జాతీయ పెన్షనర్స్ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు మాట్లాడుతూ పెన్షనర్స్ అందరూ వివిధ రంగాలలో నాలుగు దశాబ్దాల పాటు కష్టించి ప్రభుత్వానికి, ప్రజలకు వారధులుగా పనిచేసిన వారన్నారు. వారి న్యాయమైన కోర్కెలు నెరవేర్చడం ప్రభుత్వ బాధ్యత అన్నారు. తమ పరిధిలో ఉన్న సమస్యలను తప్పక పరిష్కరిస్తామని, పెన్షన్ పొందే హక్కు ప్రతి పెన్షనర్కు ఉందని పేర్కొన్నారు. ఉపాధ్యాయ శాసన మండలి మాజీ సభ్యులు పోచంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఉపాధ్యాయ, ఉద్యోగ పెన్షనర్లకు రావాల్సిన బకాయిలను వాయిదాలు వేస్తూ, మానసిక క్షోభకు గురిచేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మెడికల్ బిల్లులు కూడా ప్రస్తుత ప్రభుత్వాలు చెల్లించడం లేదన్నారు. జిల్లా ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు శ్రీనివాసులు, నిత్యపూజయ్య మాట్లాడుతూ పెన్షనర్స్ సమస్యలు తమ సమస్యలు గానే భావించి, వాటి సాధనకు కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సంఘం కార్యదర్శి రామమూర్తి నాయుడు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగముని రెడ్డి, అసోసియేట్ ప్రెసిడెంట్ రాధాకృష్ణ మాట్లాడుతూ పెన్షనర్స్ డే ప్రాముఖ్యతను వివరించారు. అనంతరం 75 వసంతాలు పూర్తి చేసుకున్న 51 మంది విశ్రాంత ఉద్యోగులను ముఖ్య అతిథుల చేతుల మీదుగా ఘనంగా సన్మానించారు. సన్మాన గ్రహీతలు నారాయణ, రాయుడు, సుబ్బారెడ్డి, ఉత్తన్న తదితరుల మాట్లాడుతూ తమను సత్కరించడం సంతోషాన్ని ఇచ్చిందన్నారు. కోశాధికారి నాగేష్ వందన సమర్పణతో సమావేశం ముగిసింది. ఈ సమావేశంలో సంఘం నాయకులు ఆకేపాటి సుబ్బారాయుడు, సుభాన్, చలపతి, నాగరత్నాచారి, మస్తాన్, రామ్మోహన్ రాజు, సత్యరాజు, రామకృష్ణ, సంఘం కార్యవర్గ సభ్యులు పాల్గొన్నారు. -
రబీ సాగు సగమే..
కడప అగ్రికల్చర్: ఈ ఏడాది రబీ సాగు అంత ఆశా జనకంగా లేదు. వరుస తుఫాన్ల కారణంగా ఎడ తెరిపి లేకుండా కురిసిన వర్షాలకు రబీ సాగు అను కున్నంత ముందుకు సాగలేదు. రబీసాగు ఆరంభమై రెండున్నర నెలలు దాటినా అతికష్టంపైన సాధారణసాగులో సగం అంటే 50 శాతం కాగా అంతకు మంచి 5 శాతం మాత్రమే ఎక్కువ సాగైయింది. గతేడాది ఈ సమయానికి సాధారణ సాగు 1,39, 796 హెక్టార్లకుగాను జిల్లాలో 1,00,680 హెక్టార్లలో వివిధ పంటలు సాగుకాగా ఈ ఏడాది అదే సమయానికి 77,121 హెక్టార్లు మాత్రమే సాగయింది. ● ఇక ఆరుతడి పంటలసాగు కూడా అంతంత మాత్రంగానే ఉంది. ప్రస్తుతం వేరుశనగ, నువ్వు పంటలు వేసుకునేందుకు అవకాశం ఉన్నా భూముల్లో నెమ్ము ఆరక పంటలసాగు ముందుకు సాగడం లేదు. దీంతో రైతన్నల్లో నిరాసక్తి నెలకొంది. ముందుగా సాగుచేసిన పంటలు మాత్రం వర్షాలకు దెబ్బతిన్నాయి. ముగిసిన శనగ సాగు సీజన్ ... జిల్లాలో శనగ సాగు సీజన్ ముగిసింది. ఈ ఏడాది శనగపంట సాగు ఆశించిన మేర కాలేదు. జిల్లాలో శనగ సాధారణసాగు 76,613 హెక్టార్లకుగాను 58,160 హెక్టార్లలో మాత్రమే సాగయింది. సాధారణంగా ఈ ఏడాది వందశాతానికి మించి శనగసాగు అవుతుందనుకున్న అధికారుల ఆశలు నిరాస అయింది. ● జిల్లాలో జమ్మలమడుగు, తొండూరు, లింగాల, ఎర్రగుంట్ల, ముద్దనూరు, బిమఠం, వల్లూరు, సింహాద్రిపురం, పెండ్లిమర్రి, రాజుపాలెం, వీఎన్పల్లి, పెద్దముడియం, కొండాపురం, మైలవరం మండలాల్లో అత్యధికంగా శనగపంట సాగు అవుతుంది. అలాంటిది ఈ ఏడాది అయా మండలాల్లో అనుకున్న మేర సాగు కాలేదని రైతులు తెలిపారు. కాగా.. జిల్లాలో ఎర్రగుంట్ల, జమ్మలమడుగు మండలాల్లో సాధారణ సాగుకు మించి శనగపంట సాగయింది. మిగతా మండలాల్లో సగం కూడా సాగు కాలేదు. జిల్లావ్యాప్తంగా 55 శాతం మేరపంటల సాగు వరుస తుపాన్లు ఇందుకు కారణం 1,39,796 హెక్టార్లకుగాను 77,121 హెక్టార్లలో వివిధ పంటల సాగు వేరుశనగ, పత్తి, సన్ప్లవర్ సాగు అంతంతే.. శనగ, మినుము, పెసర సాగుకుముగిసిన సీజన్ ప్రస్తుతం జిల్లాలో వరి, వేరుశనగ, నువ్వుల పంటలకు మాత్రమే అదును ఉందని వ్యవసాయ అధికారులు తెలిపారు. అయితే ఈ రబీ సీజన్కుగాను వరి సాధారణసాగు 11,645 హెక్టార్లకుగాను ప్రస్తుతం 734 హెక్టార్లలో సాగు అయ్యింది. ముందుగా సాగు చేసిన రైతులు మళ్లీ రెండవ పంట సాగుగా వరిపంటను ప్రస్తుతం సాగు చేస్తున్నారు. అలాగే వేరుశనగ సాధారణసాగు 5079 హెక్టార్లుకాగా ప్రస్తుతం 926 హెక్టార్లలో సాగయింది. అలాగే నువ్వు పంటకు సంబంధించి సాధారణసాగు 4566 హెక్టార్లుకాగా ప్రస్తుతం 1190 హెక్టార్లలో సాగయింది. అయితే ఈ మూడు పంటలసాగుకు అదను ఉంది కాబట్టి సాగు విస్తీర్ణం పెరిగే అవకాశం ఉంది. ఏదిఏమైనా ఈ ఏడాది రబీ ఆశించిన మేర సాగు కాలేదనే చెప్పాలి. -
బాబు బినామీల జేబులు నింపడానికే ప్రైవేటీకరణ
కడప కార్పొరేషన్: చంద్రబాబు బినామీల జేబులు నింపడానికే మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ వైద్య విభాగం రాష్ట్ర కార్యదర్శి డాక్టర్ కళ్యాణ్ చక్రవర్తి అన్నారు. బుధవారం కడపలోని పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలో ఉన్నప్పుడు 1999–24 కాలంలో రాష్ట్రానికి 19 కాలేజీలు మంజూరు కాగా అందులో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఒక్కటి మాత్రమే వచ్చిందన్నారు. ప్రైవేటీకరణ అంటే చంద్రబాబుకు ఎంత మక్కువో ఈ ఉదాహరణ చాలన్నారు. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలో ఉంటే పేద విద్యార్థులు రూ.70వేలతో మెడిసిన్ పూర్తి చేయవచ్చని, లేనిపక్షంలో ఏడాదికి రూ.1.14లక్షలు చెల్లించాల్సి ఉంటుందన్నారు. వైద్య ఖర్చులు కూడా భారీగా పెరిగిపోతాయన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక ఆరోగ్యశ్రీ నిర్వీర్యమైందని, నెట్వర్క్ హాస్పిటల్స్కు బిల్లులు చెల్లించపోవడంతో అవి పేదలకు వైద్యం చేయడం మానేశాయన్నారు. ప్రైవేటీకరణపై వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన లభించిందని, ఆ సంతకాల పత్రాలను ఈనెల 18వ తేదీ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి గవర్నర్కు అందించనున్నారని తెలిపారు. పేద, మధ్యతరగతి ప్రజల కోసం వైఎస్సార్సీపీ చేస్తున్న ఈ ఉద్యమానికి ప్రతి ఒక్కరూ మద్దతుగా నిలవాలని కోరారు. ప్రైవేటీకరణతో ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంతో చెప్పాలి మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ద్వారా ప్రభుత్వ ఖజానాకు వచ్చే ఆదాయం ఎంతో బహిర్గతం చేయాలని వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి డిమాండ్ చేశారు. చంద్రబాబు రాజకీయ మాయాజాలం చెబితే చాంతాడంత అవుతుందని, వినడానికి వీధినాటకం అవుతుందన్నారు. సంపద సృష్టిస్తానని చెప్పిన ఆయన మెడికల్ కాలేజీలు అమ్మేస్తున్నారని, వందల కోట్ల విలువైన ప్రభుత్వ ఆస్తులను అమ్మేస్తూ ఏడాదికి రూ.8వేల సంపదను ఖజానాకు తీసుకొస్తున్నారని ఎద్దేవా చేశారు. పీపీపీ విధానంలో మెడికల్ కాలేజీలు నిర్మించాలని 2022లో ప్రధాని నరేంద్రమోదీ చెప్పినప్పటికీ, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆ విధానంతో పేదలకు మేలు జరగదని భావించారన్నారు. అందుకే ఆ ఖర్చు ప్రభుత్వమే భరిస్తుందని ప్రభుత్వ ఆధ్వర్యంలోనే మెడికల్ కాలేజీలు నిర్మించారని గుర్తు చేశారు. చంద్రబాబు ప్రభుత్వానికి ప్రజల శ్రేయస్సు, వారి ఆరోగ్యంపై ఏమాత్రం శ్రద్ద లేదన్నారు. ఈ సమావేశంలో వైద్య విభాగం నగర అధ్యక్షుడు సతీష్రెడ్డి, డాక్టర్ పవన్ కుమార్రెడ్డి, డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు. -
డ్రోన్ కెమెరాల వితరణ
కడప అర్బన్ : శాంతిభద్రతల పరిరక్షణ, ట్రాఫిక్ నియంత్రణ, అసాంఘిక కార్యకలాపాలపై నిఘా, విపత్తు నిర్వహణ, ఇతర పోలీసింగ్ అవసరాల కోసం వేముల మండలంలోని యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా లిమిటెడ్ (యు.సి.ఐ.ఎల్) తరపున రూ. 3 లక్షల విలువైన రెండు అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన డ్రోన్ కెమెరాలను జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్కు కంపెనీ ప్రతినిధులు అందజేశారు. కార్పొరేట్ సామాజిక బాధ్యత (సి.ఎస్.ఆర్)లో భాగంగా బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా ఎస్పీకి కంపెనీ జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్ అందజేయగా వాటిని పులివెందుల సబ్ డివిజన్కు కేటాయించారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ శాంతి భద్రతలను పరిరక్షించడంలో సాంకేతికత పాత్ర కీలకమైనదన్నారు. ఈ కార్యక్రమంలో పులివెందుల డీఎస్పీ బి.మురళి, ఆర్.కె. వ్యాలీ సీఐ ఉలసయ్య, వేముల ఎస్ఐ ప్రవీణ్ కుమార్, యు.సి.ఐ.ఎల్ డీజీఎం కిషోర్ భగత్, సి.ఎస్.ఆర్ ఇన్చార్జి నవీన్ కుమార్ రెడ్డి, అసిస్టెంట్ మేనేజర్ (పర్సనల్) తారక్ పాల్గొన్నారు. -
ఖోఖో జిల్లా జట్టు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లా ఖోఖో జూనియర్, సీనియర్ జట్లను ఎంపిక చేసినట్లు జిల్లా ఖోఖో సంఘం అధ్యక్ష, కార్యదర్శులు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జె.నరేంద్ర తెలిపారు. చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఎంపిక నిర్వహించామన్నారు. జూనియర్స్ ఖోఖో జట్టు క్రీడాకారులకు కేఎన్ఆర్ ఎస్టేట్ (సుధీర్) స్పాన్సర్ చేశారు. అలాగే సీనియర్స్ జిల్లా ఖో ఖో జట్టుకు పురుషులకు యునిక్స్ బ్యూటీ సెలూన్ నిర్వాహకులు, మహిళల జట్టుకు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి (యోగి వేమన యూనివర్సిటీ) క్రీడా దుస్తులు అందించారు. ఈ ఎంపికలకు ముఖ్య అతిథులుగా హాజరైన డాక్టర్ శివ బాబు, డాక్టర్ కె.రామ సుబ్బారెడ్డి, నారాయణ పాఠశాల ఏజీఎం హరీష్ బసవరాజు మాట్లాడుతూ రాష్ట్ర స్థాయి ఖోఖో పోటీలలో తమ ప్రతిభను చాటి ఉమ్మడి కడప జిల్లా క్రీడాకారులు విజయకేతనం ఎగురవేయాలని కోరారు. జూనియర్స్ బాలుర జట్టు .. అయాన్ బాబు, అశోక్, నాగ చైతన్య, రామకష్ణ, వెంకట అనిల్ కుమార్, హేమంత్, శివ, ధనుంజయ్, మహేష్, ముఖేష్, రాఘవ, శ్రీకాంత్, ఎతీష్ , వెంకటకృష్ణ, హేమంత్ రాజు. జూనియర్స్ బాలికల జట్టు.. ధరణి, సాహితీ, ప్రసన్న, రెహనాబీ, దీక్షిత, జానకి లహరి, వెంకట ప్రణవి, గంగ లావణ్య, అనుపమ, హరిత, లోహిత, యోగ రాయల్, వైష్ణవి, అశ్విని, వెంకట నందిని. సీనియర్స్ మహిళల జట్టు .. గాయత్రి, లక్ష్మీదేవి, ప్రతి, అఖిల, లక్ష్మీ ప్రసన్న, వాసంతి, స్నేహలత, జయశ్రీ, వందన, రంగమ్మ, కమలమ్మ, సత్యవాణి, హాసిని, చైత్ర, రాధిక. సీనియర్స్ పురుషుల జట్టు .. రామ్మోహన్, సుధీర్, రాము, లక్ష్మణ్, గోవింద రెడ్డి, ఖాదర్ రెడ్డి, వీరేష్, అయ్యబాబు, చంద్రశేఖర్, హరి ప్రసాద్, షేక్ సుభాన్, ప్రేమ్ పృథ్వీరాజ్, శ్రీనాథ్, సునీల్, వెంకట నరేంద్ర ఎంపికయ్యారు. -
అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరికి జైలు శిక్ష
ఎర్రగుంట్ల : ఓ అమ్మాయి పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు ఇద్దరు యువకులకు కోర్టు జైలు శిక్ష, జరిమానా విధించింది. కలమల్ల ఎస్ఐ డి.సునీల్ కుమార్ రెడ్డి వివరాల మేరకు.. ముద్దనూరు మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన కుంచెం శ్రీధర్, కుంచెం గోపాల్ అనే యువకులు 2023 సంవత్సరంలో ఒక అమ్మాయితో అసభ్యకరంగా ప్రవరించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ సంజీవరెడ్డి కేసు నమోదు చేశారు. ఈ కేసును విచారించిన కడప పోక్సో కోర్టు జడ్జి ఎస్.ప్రవీణ్ కుమార్ కుంచెం శ్రీధర్కు 21 రోజుల జైలు శిక్ష రూ.25 వేలు జరిమానా, కుంచెం గోపాల్కు 17 రోజుల జైలు శిక్ష, రూ.10 వేలు జరిమానా విధిస్తూ తీర్పు ఇచ్చారు. నిందితులకు శిక్ష పడేందుకు సహకరించిన పబ్లిక్ ప్రాసిక్యూటర్ కొమ్మినేని వేణుగోపాల్, ఎస్ఐ సునీల్కుమార్ రెడ్డి , కోర్టు కానిస్టేబుల్ ఎం.నారాయణ, కోర్టు మానిటరింగ్ ఏఎస్ఐ నాగేంద్ర, సీఐ వినయ్కుమార్రెడ్డిలను ఉన్నతాధికారులు ప్రశంసించారు. క్విజ్ పోటీల్లో జిల్లా విద్యార్థుల ప్రతిభ కడప కార్పొరేషన్ : జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాల్లో భాగంగా ఇంధన పొదుపుపై విద్యార్థుల్లో అవగాహన పెంపొందించేందుకు ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ లోతేటీ ఆధ్వర్యంలో సంస్థ పరిధిలోని 9 జిల్లాలలో ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులకు ఇంధన పొదుపుపై క్విజ్ పోటీలు నిర్వహించారు. ఇందులో జిల్లాకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబరిచారని కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ తెలిపారు. బుధవారం డివిజన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో వారిని ఆయన ప్రత్యేకంగా అభినందించారు. క్విజ్ పోటీల్లో ఖాజీపేట ఏపీ మోడల్ స్కూల్ విద్యార్థి జీవీవీ నాగిరెడ్డి, ఈ. నాగ రిషిత, ప్రొద్దుటూరు ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి వై. ప్రణీత్రెడ్డి, వైవీఎస్ మున్సిపల్ హైస్కూల్ వి. వైష్ణవ్లు విజేతలుగా నిలిచారని తెలిపారు. -
నజీరుల్లా మఠం, మసీదు వక్ఫ్బోర్డు స్వాధీనం
ప్రొద్దుటూరు కల్చరల్ : మైదుకూరు రోడ్డులోని నజీరుల్లా షా మఠం, ఖాదర్ హుస్సేన్ మసీదులను వక్ఫ్బోర్డు స్వాధీనం చేసుకుంటున్నట్లు వక్ఫ్ బోర్డు ఇన్స్పెక్టర్ వసీం అక్రం తెలిపారు. బుధవారం ఆయన నజీరుల్లా షా మఠం వద్ద నోటీసులు అతికించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కొంత మంది నజీరుల్లా షా మఠం ఆస్తులు ఆక్రమణకు గురవుతున్నాయని హైకోర్టులో పిటీషన్ వేశారన్నారు. హైకోర్టు, వక్ఫ్ బోర్డు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు వక్ఫ్బోర్డు ఆస్తులను స్వాధీనం చేసుకుంటున్నట్లు తెలిపారు. అలాగే ఖాదర్ హుస్సేన్ మసీదును సక్రమంగా నిర్వహించడం లేదని, కమిటీని సక్రమంగా నిర్వహించాలని అనేక సార్లు చెప్పినా పరిస్థితిలో మార్పులేదన్నారు. దీంతో ఆ మసీదును వక్ఫ్బోర్డు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కాగా నజీరుల్లాషా మఠం వద్ద అంజుమన్ అహలే ఇస్లాం కమిటీ అధ్యక్షుడు వీఎస్ ముక్తియార్, నజురుల్లా షా మఠం ట్రస్టు ప్రతినిధులు, సభ్యులు వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్తో చర్చించారు. కోర్టు తీర్పు మేరకు ఆస్తులపై సర్వే నిర్వహించాలని, నజీరుల్లా షా మఠాన్ని స్వాధీనం చేసుకోవడాన్ని తాము ఒప్పుకోమని తెలిపారు. -
బజారుకు వెళ్లొచ్చేసరికి చోరీ
బద్వేలు అర్బన్ : పట్టణంలోని మార్తోమానగర్లో గల పునరావాస కాలనీ సమీపంలో మంగళవారం ఓ ఇంట్లో చోరీ జరిగింది. ఇంట్లోని వారు బజారుకు వెళ్లొచ్చేసరికి దొంగలు ఇంట్లోకి ప్రవేశించి బీరువా పగులకొట్టి 10 గ్రాముల బంగారు వస్తువులు అపహరించారు. పట్టణంలోని పునరావాస కాలనీలో నివసించే దిరసంత చెన్నయ్య గత కొద్ది రోజులుగా అయ్యప్పమాల ధరించి ఉన్నా డు. బుధవారం శబరిమలకు ప్రయాణం ఉండటంతో అందుకు సంబంధించిన సామగ్రిని కొనుగోలు చేసేందుకు భార్యతో కలిసి బజారుకు వెళ్లాడు. బజారు నుంచి తిరిగి ఇంటికి వచ్చేసరికి తలుపులు పగులకొట్టి ఉండటంతో అనుమానంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తలుపులు తెరిచి ఉన్నాయి. దీంతో చోరీ జరిగినట్లు గ్రహించి వెంటనే అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్ఐ జయరాము లు ఘటన స్థలాన్ని పరిశీలించారు. అలాగే క్లూస్ టీం బృందాన్ని పిలిపించి వేలిముద్రలు సేకరించారు. చెన్నయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు అర్బన్ ఎస్ఐ జయరాములు కేసు నమోదు చేశారు. కాగా బీరువాలోని మరొక అల్మారాలో ఉన్న మరికొన్ని బంగారు ఆభరణాలు, వెండి సామగ్రి దుండగులు వదిలేసి వెళ్లడం గమనార్హం. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు అట్లూరు : మండల పరిధిలోని కడప–బద్వేలు ప్రధాన రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో వాసం హరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల వివరాల మేరకు రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వాసం హరి తన ద్విచక్రవాహనంపై సొంత పనుల మీద కొండూరు గ్రామానికి వెళ్లి తిరిగి రెడ్డిపల్లికి బయలుదేరాడు. మార్గమధ్యంలో ఉన్నట్లుండి గేదెలు అడ్డు రావడంతో ఢీకొని కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి అతన్ని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. తంబళ్లపల్లె : రోడ్డు ప్రమాదంలో విద్యార్థి మృతి చెందిన సంఘటన మంగళవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ బాలచెరువుపల్లెకు చెందిన ఎం.సహదేవ కుమారుడు రాము (15) తంబళ్లపల్లె మండలం బోయపల్లెలోని మేనేత్త ఇంటిలో ఉంటూ తంబళ్లపల్లెలో ఐటీఐలో చదువుతున్నాడు. ఈ క్రమంలో మధ్యాహ్నం బోయపల్లె వద్ద నుంచి ద్విచక్రవాహనంలో వస్తుండగా మార్గమధ్యంలో గోళ్లపల్లికి సమీపంలో ముందు వరిగడ్డిలోడుతో వెళ్తున్న ట్రాక్టర్ను ఓవర్టేక్ చేయబోయి ప్రమాదశాత్తు కిందపడ్డాడు. అతడిపై నుంచి ట్రాక్టర్ వెళ్లడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు హుటాహుటిన తంబళ్లపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే విద్యార్థి మృతి చెందినట్లు ధ్రువీకరించారు. ప్రమాద విషయం తెలుసుకున్న ఎస్.ఐ ఉమామహేశ్వరరెడ్డి సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. విద్యార్థి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరిలించారు. -
జిల్లా స్థాయి ఖోఖో జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్/చింతకొమ్మదిన్నె : ఉమ్మడి కడప జిల్లాలో జూనియర్స్, సీనియర్స్ బాల బాలికల ఖోఖో జట్ల జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయని ఖోఖో సంఘం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ కె. రామసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి జె. నరేంద్ర తెలిపారు. మంగళవారం చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురంలోని నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో ఖోఖో జూనియర్, సీనియర్స్ బాల బాలికల జట్ల ఎంపికలు జరిగాయి. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జూనియర్స్ జిల్లా జట్టుకు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 19 నుంచి 21 తేదీలలో ప్రకాశం జిల్లా పంగులూరులో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. సీనియర్స్ జిల్లా జట్టు ఎంపికై న క్రీడాకారులు ఈనెల 24 నుంచి 26 వ తేదీ వరకు కృష్ణా జిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఈ కార్యక్రమంలో నారాయణ పాఠశాల ఏజీఎం హరి బసవ రాజు, ఖోఖో సంఘం సభ్యులు సుధీర్, లక్ష్మి, రవి, పవన్ కుమార్, కృష్ణయ్య,లక్ష్మణ్, రెడ్డయ్య పాల్గొన్నారు. -
గోడౌన్లో అగ్నిప్రమాదం
– రూ.9 లక్షల మేర నష్టం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని పాత సామాన్ల గోడౌన్లో అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. షేక్షావలీ కొన్నేళ్లుగా పాత సామాన్ల (గుజరీ) షాపు నిర్వహిస్తున్నాడు. స్థానికంగా ఉన్న వ్యాపారులతో పాటు పరిసర ప్రాంత వ్యాపారులు ప్లాస్టిక్, పాత ఇనుప వస్తువులను సేకరించి ఇక్కడ విక్రయిస్తుంటారు. వీటిని అతను మున్సిపల్ ఆఫీసు రోడ్డులోని గోడౌన్లో నిల్వ చేసేవాడు. ఈ క్రమంలో మంగళవారం షార్ట్ సర్క్యూట్ వల్ల గోడౌన్లో నుంచి పెద్ద ఎత్తున మంటలు వ్యాపించాయి. దీంతో స్థానికుల సమాచారం మేరకు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. గోడౌన్లో ప్లాస్టిక్ సామాన్లు అధికంగా ఉండి మంటల్లో కాలడంతో దట్టమైన పొగలు అలుముకున్నాయి. చుట్టుపక్కల ఉన్న నివాస గృహాల్లోకి పొగ వెళ్లడంతో వారు భయాందోళన చెందారు. జేసీబీ సాయంతో గోడౌన్ గోడను పగులకొట్టి మంటలను ఆర్పారు. ప్రొద్దుటూరుతో పాటు మైదుకూరు, జమ్మలమడుగు అగ్నిమాపక వాహనాలతో మంటలను ఆర్పేశారు. ఈ ప్రమాదంలో సుమారు రూ. 9 లక్షల మేర నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు తెలిపారు. -
కూచ్బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ఎలైట్ మ్యాచ్ మంగళవారం కడప వేదికగా వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ప్రారంభమైంది. తొలిరోజు ఆంధ్రా–ఉత్తరాఖండ్ రాష్ట్రాల జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన ఉత్తరాఖండ్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్లో బ్యాటింగ్ ప్రారంభించిన ఉత్తరాఖండ్ జట్లు నిర్ణీత 69.5 ఓవర్లకు 202 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆదిత్య నాధని 57 పరుగులు, లక్ష్యనాధని 47 పరుగులు చేశారు. ఆంధ్రా జట్టులోని సిద్దు కార్తీక్ రెడ్డి 3 వికెట్లు, ఏఎన్వి లోహిత్ 3 వికెట్లు, భార్గవ్ మహేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు 7 ఓవర్లకు వికెట్ నష్టపోకుండా 42 పరుగులు చేసింది. ఆ జట్టులోని లోహిత్ లక్ష్మీ నారాయణ 18 పరుగులు, హానీష్ వీరారెడ్డి 17 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. మ్యాచ్ మధ్యలో స్టేడియంలో వెలుతురు సరిగా లేకపోవడంతో గంట పాటు మ్యాచ్ నిలిపి వేశారు. వెలుతురు లేక గంట పాటు మ్యాచ్ నిలిపివేత -
మరోసారి విభేదాలు బహిర్గతం
సాక్షి టాస్క్ఫోర్స్: పులివెందుల నియోజకవర్గంలో టీడీపీలో మరోసారి వర్గ విభేదాలు బట్టబయలు అయ్యాయి. ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి, బీటెక్ రవి వర్గాల మధ్య కొంత కాలం నుంచి దూరం కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో మంగళవారం పులివెందులలోని ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో పులివెందుల నియోజకవర్గ అభివృద్ధిపై తెలుగుదేశం పార్టీ సమీక్ష సమావేశం నిర్వహించింది. అన్ని శాఖల నుంచి ప్రభుత్వ అధికారులు హాజరయ్యారు. అయితే ఇందులో కొసమెరుపు ఏమిటంటే స్థానికంగా ఉన్న తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డికి ఆహ్వానం అందనట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం బీటెక్ రవి కుటుంబ సభ్యుల అధ్యక్షతన జరిగినట్లుగా ఉంది. బీటెక్ రవి, ఆయన తమ్ముడు, చిన్నాన్నలు సమీక్ష చేశారు. దీనిపై అధికారులు అసంతృప్తిగా ఉన్నట్లు సమాచారం. అభివృద్ధి సమావేశమా లేక కుటుంబ సమావేశమా అని వారు మథన పడుతున్నట్లు విశ్వసనీయ సమాచారం. రాజ్యాంగబద్ధంగా ఎన్నికై న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి ఈ మీటింగ్కు హాజరు కాకపోవడంపై తెలుగుదేశం పార్టీలోనే పలువురు నాయకులు తీవ్రంగా చర్చించుకుంటున్నారు. రాష్ట్ర స్థాయి నాయకులు అనేక సార్లు ఇద్దరి మధ్య సయోధ్య కుదిర్చినా విభేదాలు కొనసాగుతూనే ఉన్నాయి. ప్రభుత్వ అధికారులు కూడా రాజ్యాంగ పరిధిలో ఉన్న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డికి సమాచారం ఇవ్వకపోవడం ఏమిటని ఆయన వర్గం ప్రశ్నిస్తోంది. ● బీటెక్ రవి అధ్యక్షతన సమావేశం ● హాజరు కాని ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి -
హ్యాకథాన్లో ఆర్కేవ్యాలీ విద్యార్థుల ప్రతిభ
వేంపల్లె : జాతీయ మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్లో ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు అత్యంత ప్రతిభ చూపినట్లు ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తా తెలిపారు. మంగళవారం ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ప్రతిభ చూపిన విద్యార్థులను ఆయన అభినందించారు. విజయవాడలోని పీఎస్సీఎంఆర్ కళాశాలలో బ్రైనోవర్శన్ సొల్యూషనన్స్ ఇండియా ప్రైవేట్ లిమిటెడ్ సహకారంతో జాతీయ స్థాయిలో మైండ్ స్పీట్ 2కె25 హ్యాకథాన్ జరిగిందన్నారు. ప్రతిష్టాత్మక జాతీయ హ్యాకథాన్న్లో ఆర్జీయూకేటీ ఆర్కే వ్యాలీ విద్యార్థులు చురుకుగా పాల్గొని విశ్వవిద్యాలయం నవీనత, పరిశోధన, పరిశ్రమ– ఆధారిత విద్యపై పెట్టే ప్రత్యేక దృష్టికి నిదర్శనంగా కళాశాల ప్రతిష్టను జాతీయ స్థాయిల్లో మరింతగా పెంచారన్నారు. ఆర్జీయూకేటీ పరిధిలోని ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులైన అబ్దుల్ సమద్, సుఫ్ఫియన్, సుహైల్, పఠాన్ ముక్రం ఖాన్లను ట్రిపుల్ ఐటీ అధికారులు అభినందించారు. -
సహకార ఉద్యోగుల ధర్నా
కడప సెవెన్రోడ్స్ : తమ సమస్యలను పరిష్కరించాల ని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ సహకార సంఘాల ఉద్యోగులు మంగళవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా ని ర్వహించారు. జిల్లా సహకార సంఘ ఉద్యోగుల యూ నియన్ అధ్యక్షుడు కొండయ్య, ప్రధాన కార్యదర్శి ర త్నం మాట్లాడుతూ తమకు హెచ్ఆర్ పాలసీ అమలు చేస్తామని ప్రభుత్వం ఇచ్చిన జీఓ నెం. 36ను తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న సమస్యలు పరిష్కరించేందుకు జీఓ లు జారీ చేసినప్పటికీ అధికారులు అమలు చేయడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. 2019 తర్వాత ఉద్యో గంలో చేరిన వారిని రెగ్యులరైజ్ చేయాలన్నారు. సహకార ఉద్యోగులకు గ్రాట్యూటీ అమలు చేయాలన్నారు. 2019–24 వేతన సవరణ ఇవ్వాలన్నారు. కెపాసిటీ టు పే నిబంధనలకు సంబంధం లేకుండా జీతభత్యాలు చెల్లించాలని కోరారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. రాజుపాళెం : తనకు ఇష్టం లేని పెళ్లి వద్దని అటు తల్లిదండ్రులకు, ఇటు బంధువులకు, స్నేహితులకు చెప్పుకోలేక షేక్ పెద్ద మీరావలీ (24) అనే యువకుడు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం రాజుపాళెం మండలంలోని వెల్లాల గ్రామ పొలాల్లో జరిగింది. రాజుపాళెం ఎస్ఐ కత్తి వెంకటరమణ తెలిపిన వివరాల మేరకు.. నంద్యాల జిల్లా చాగలమర్రి మండలంలోని గొట్లూరు గ్రామానికి చెందిన షేక్ చిన్న మీరావలీ కుమారుడు పెద్ద మీరావలీకి కొద్ది రోజుల్లో వివాహం జరగనుంది. అయితే ఈ వివాహం ఇష్టం లేకపోవడంతో ఎవరికి చెప్పుకోలేక మంగళవారం ప్రొద్దుటూరులో బ్యాంకులో పని ఉందని తల్లిదండ్రులకు చెప్పి ఇంటి నుంచి వెళ్లిపోయాడు. ఈ క్రమంలో పెద్ద మీరావలీ వెల్లాల గ్రామ పొలాల్లో మామిడి జ్యూస్లో విషపు గుళికలు కలుపుకొని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. సమాచారం అందుకున్న రాజుపాళెం ఎస్ఐ వెంకటరమణ సంఘటన స్థలానికి వెళ్లగా అప్పటికే పెద్ద మీరావలీ మృతి చెంది ఉన్నాడు. మృతుడి తండ్రి చిన్న మీరావలీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారు. చైల్డ్ కేర్ లీవ్పై ప్రభుత్వ నిర్ణయం హర్షణీయం కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించిన చైల్డ్ కేర్ లీవ్కు గరిష్ట వయస్సు పరిమితిని తొలగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం హ ర్షణీయమని ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి ఒక ప్ర కటనలో పేర్కొన్నారు. మహిళా ఉద్యోగులకు గతంలో పిల్లల సంరక్షణ సెలవుల వినియోగానికి సంబంధించి పిల్లల గరిష్ట పరిమితి ఉండేదని, అయితే ప్రస్తుతం కూ టమి ప్రభుత్వం ఈ పరిమితిని తొలగించి ఉద్యోగులు తమ మొత్తం సేవా కాలంలో, రిటైర్మెంట్కు ముందు వరకు చైల్డ్ కేర్ లీవ్ను వినియోగించుకోవచ్చని ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఉద్యోగులు ఈ సెలవులను పిల్లల సంరక్షణ, పరీక్షల సమయంలో, అనారోగ్య సందర్భాల్లో వినియోగించుకోవచ్చన్నారు. -
20న ఎస్హెచ్జీ కుటుంబాలకు జాబ్మేళా
కడప సెవెన్రోడ్స్: ఎస్హెచ్జీ కుటుంబాలలోని నిరుద్యోగ యువత కోసం పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ(మెప్మా) వారి ఆధ్వర్యంలో ఈ నెల 20న జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆయన మంగళవారం కలెక్టరేట్లోని తన చాంబర్లో జాబ్ మేళాకు సంబంధించిన పోస్టర్లను జిల్లా జాయింట్ కలెక్టర్ అదితి సింగ్తో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి నిర్దేశించిన ఒక కుటుంబం– ఒక వ్యాపారవేత్త లక్ష్యానికి అనుగుణంగా మెప్మా సంస్థ ఎస్హెచ్జీ సభ్యుల కుటుంబ సభ్యులకు వారికున్న ఆసక్తి, అనుభవం, నైపుణ్యం ఆధారంగా రుణ ఆధారిత స్వయం ఉపాధి యూనిట్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. దీనికోసం జాబ్ మేళాల నిర్వహణలో విశిష్ట అనుభవం ఉన్న ‘నిపుణ– హ్యూమన్ డెవలప్మెంట్ సొసైటీ’తో మెప్మా సంస్థ ఒప్పందం కుదుర్చుకుని జాబ్ మేళాలను నిర్వహించి ఉద్యోగ అవకాశాలను సంఘ సభ్యుల కుటుంబాలలోని నిరుద్యోగ యువతీ యువకులకు కల్పిస్తున్నట్లు తెలిపారు. ఈ జాబ్ మేళాలో ప్రముఖ కంపెనీలు పాల్గొని అభ్యర్థుల అర్హతలను బట్టి ఉద్యోగాలు కల్పిస్తాయన్నారు. ఈ నెల 20న కడప మునిసిపల్ కార్పొరేషన్ పరిధిలోని గాంధీనగర్ మునిసిపల్ హైస్కూల్లో ఉదయం 10 గంటలకు జాబ్ మేళా ప్రారంభించనున్నట్లు తెలిపారు. మెప్మా ప్రాజెక్ట్ డైరెక్టర్ కిరణ్ కుమార్ పలు అంశాలను తెలియజేశారు. 5జీ ఫోన్లతో సమర్థంగా సేవలు మహిళా శిశు సంక్షేమ శాఖలో సమర్థవంతంగా సేవలను నిర్వహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసిన 5జీ మొబైల్ ఫోన్లు ఎంతో ఉపయుక్తం అవుతాయని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్లోని తన చాంబర్లో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రభుత్వం మహిళా శిశు సంక్షేమ శాఖ అంగన్వాడీలకు సరఫరా చేసిన ‘శాంసంగ్ 5జీ‘ మొబైల్ ఫోన్లను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప జిల్లాకు సంబంధించి 2494 మందికి 5ఎ మొబైల్స్ను మంజూరు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి, అంగన్వాడీ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రొద్దుటూరులో ‘కేవీ’ ఏర్పాటు చేయాలి
కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: ప్రొద్దుటూరు పట్టణంలో కేంద్రీయ విద్యాలయం (కేవీ) ఏర్పాటు చేయాలని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి కోరారు. మంగళవారం కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు ఆయన వినతిపత్రం సమర్పించారు. ప్రొద్దుటూరులో కేంద్ర ప్రభుత్వ సంస్థలకు చెందిన ఎంతో మంది ఉద్యోగులు, విశ్రాంత ఉద్యోగులు ఉన్నారని తెలిపారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల పలు కేంద్రీయ విద్యాలయాలను ఆంధ్రప్రదేశ్లోని చిన్నచిన్న పట్టణాలకు మంజూరు చేసిందని తెలిపారు. వీటితో పోల్చుకుంటే ప్రొద్దుటూరు జనాభా పరంగా పెద్దదని, పాలనా పరమైన ప్రాధాన్యత, విద్యా పరమైన అవసరాలు ఉన్నాయన్నారు. ప్రొద్దుటూరు పట్టణానికి కేంద్రీయ విద్యాలయం మంజూరు చేస్తే అందుకు అవసరమైన భూమిని కేటాయించేందుకు జిల్లా యంత్రాంగం చర్యలు తీసుకుంటుందని తెలిపారు. ఈ కార్య క్రమంలో తిరుపతి ఎంపీ గురుమూర్తి పాల్గొన్నారు. రైళ్ల పొడిగింపు, స్టాపింగ్పై వినతి ముద్దనూరు: కడప పార్లమెంటు సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి ఢిల్లీలో కేంద్ర రైల్వేశాఖామంత్రి అశ్వనీ వైష్ణవ్ని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎంపీ మైసూరు–రేణిగుంట ఽమధ్య నడిచే వీక్లీ స్పెషల్ ట్రైన్(22135–22136)ను కడప నగరం వరకు పొడిగించాలని కోరారు. ఈ వీక్లీ రైలు రేణిగుంటలో దాదాపు 10 గంటలు పాటు నిరుపయోగంగా నిలిచివుంటుందని, ఈ సమయంలో కడప వరకు రైలు ప్రయాణాన్ని పొడిగిస్తే ప్రజలకు ఎంతో ఉపయోగకరంగా వుంటుందని కోరారు. కడప ప్రజలు ఎంతో కాలం నుంచి కడప నుంచి బెంగుళూరుకు రైలు సౌకర్యం కల్పించాలని కోరుతున్నారని, మైసూరు–రేణిగుంట మధ్య నడిచే ఈ రైలును కడప వరకు నడిపితే బెంగుళూరుకు వెళ్లడానికి ప్రయాణికులకు సౌకర్యవంతంగా వుంటుందని తెలిపారు. ముద్దనూరులో.. ముద్దనూరు–మచిలీపట్నం (ట్రైన్ నం.17215– 17216)ల మధ్య నడిచే రైలుకు ముద్దనూరులో స్టాపింగ్ సౌకర్యం కల్పంచాలని కోరారు. జమ్మలమడుగు, పులివెందుల నియోజకవర్గాలకు ముద్దనూరు ప్రధాన రైల్వేస్టేషన్ అని, ఈ రైలు స్టాపింగ్ వల్ల ఎంతో ప్రయోజనకరమని తెలిపారు. రాజంపేట: కడప–రేణిగుంట హైవే.. డేంజర్ జోన్గా మారిందనే అంశం పార్లమెంట్లో కూడా చర్చకు వచ్చింది. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట జాతీయ రహదారి దుస్థితిపై గళం విప్పారు. సరైన అలైన్మెంట్ లేదని, నైట్ జర్నీ యమడేంజర్గా ఉందని తెలియజేశారు. వాహనదారులు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణించే పరిస్థితులు ఉన్నాయని చెప్పుకురావడంతో ఈ అంశం కేంద్ర రవాణాశాఖను తాకింది. నిత్యం ఏదో ఒక ప్రాంతంలో ప్రమాదం సంభవిస్తోంది. హైవే దారంతా రక్తపు మరకలే కనిపిస్తున్నాయి. నిత్యం ప్రమాదాలు కొనసాగుతున్నాయి. ప్రాణాలు గాలిలో కలుస్తున్నాయి. రెండు దశాబ్దాల కిందట సింగిల్ రోడ్డుగా ఉన్న రహదారిని వెడల్పు చేసి స్టేట్ హైవే డబుల్ రోడ్డుగా మార్చారు. ఉభయ వైఎస్సార్ జిల్లాలో ఈ రోడ్డు కొనసాగుతోంది. ప్రయాణం.. భయానకం ప్రస్తుత హైవే వెంట ప్రయాణం భయానకంగా మారింది. ఎటువైపు నుంచి ప్రమాదం పొంచి ఉందో తెలియని పరిస్థితి. కడప శివార్లలోని జేఎంజే కళాశాల నుంచి భాకరాపేట సర్కిల్, మాధవరం, ఒంటిమిట్ట, నందలూరు, రాజంపేట, పుల్లంపేట, ఓబులవారిపల్లె, మంగంపేట, రైల్వేకోడూరు, శెట్టిగుంట, కుక్కులదొడ్డి వరకు హైవేలో రహదారి ప్రయాణం కత్తి మీద సాములా మారింది. మార్గంలో అనేక ప్రమాదకర మలుపులు ఉన్నాయి. ఒంటిమిట్ట, నందలూరు, రెడ్డిపల్లె చెరువుకట్టలపై రహదారి ఉంది. అనేక మార్లు వాహనాలు అదుపు తప్పి చెరువుల్లో పడిన సంఘటనలు కూడా ఉన్నాయి. దక్షిణ భారతదేశం నుంచి తిరుమలకు కడప–రేణిగుంట మార్గం మీదుగా వేలాది మంది యాత్రికులు వాహనాల్లో ప్రయాణం చేస్తుంటారు. తెలంగాణా, మహారాష్ట్ర, కర్ణాటకతోపాటు రాజస్తాన్, యూపీ తదితర రాష్ట్రాల నుంచి కూడా యాత్రికులు ఈ రోడు మార్గాన్నే వెళుతుంటారు. తుపాన్తోపాటు రకరకాల ఫోర్వీల్ వాహనాల్లో యాత్ర కొనసాగించడం అధికంగా ఉంటుంది. పలుమార్లు వాహనాలు ప్రమాదాలకు గురైన సంఘటనలు ఉన్నాయి. పెరుగుతున్న ట్రాఫిక్ కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబయి, హైదరాబాద్కు రాకపోకలు కొనసాగుతున్నాయి. నిత్యం 17 వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ఈ ట్రాఫిక్కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడం లేదు. ఫలితంగా ప్రమాదాలు, ట్రాఫిక్ స్తంభించడం తరుచూ జరుగుతున్నాయి. అంతే గాకుండా కడప–రేణిగుంట రోడ్డు ప్రయాణం రెండు నుంచి మూడు గంటలకు పైగా పడుతోంది. సకాలంలో గమ్యాలకు చేరలేని పరిస్థితి ఉంది. కడప–రేణిగుంట హైవేలో ప్రతి మండల పరిధిలో బ్లాక్ స్పాట్స్ను గుర్తించారు. రాజంపేట అర్బన్లో 3, నందలూరు 2, , రైల్వేకోడూరు 3, పుల్లంపేట 3 ఓబలవారిపల్లె 6, మన్నూరు 3 ఉన్నట్లు గుర్తించారు. ప్రత్యేక బృందాలు సర్వే చేసి కడప–రేణిగుంట ప్రస్తుత హైవేలో ప్రమాదాలు జరుగుతున్నాయని నిర్ధారణకు వచ్చింది. ఈ క్రమంలో పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పెద్దాసుపత్రిలో ట్రామా సెంటర్ను కూడా ఏర్పాటు చేశారు. ఇప్పుడు అందుబాటులో లేదనే సంగతి విదితమే. అధ్వానస్థితిలో కడప–రేణిగుంట హైవే ప్రమాదకర మలుపులు ప్రాణాలు పోతున్న వైనం పార్లమెంట్లో గళం విప్పినమేడా రఘునాథరెడ్డి కడప–రేణిగుంట హైవేకు సరైన అలైన్మెంటట్ లేదని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పార్లమెంట్ సాక్షిగా గళం విప్పారు. ప్రమాదాలకు నిలయంగా మారిందన్నారు. మలుపులు ఉన్నాయని, రాత్రి పూట ప్రయాణం భయంకరంగా ఉంటుందన్నారు. వాహనాల రాకపోకలకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ విషయంలో కేంద్రప్రభుత్వం చర్యలు తీసుకుని ప్రమాదరహిత రహదారిగా మార్చాలని కోరారు. కడప –రేణిగుంట నేషనల్ హైవేలోని నందలూరు చెయ్యేరు నదిపై నిర్మించి వంతెన(బ్రిడ్జి) ప్రమాదాలకు నిలయంగా నిలిచిపోయింది. వంతెనపై ప్రమాద నివారణ చర్యలేవి కనిపించడం లేదు. వంతెన మధ్యలో ఉన్న బీటి (తారు)రోడ్డు అస్తవ్యస్తంగా తయారైంది. రోడ్డు మధ్యలో గుంతలు పడ్డాయి. బ్రిడ్జిపై వేగాన్ని నిరోధించే విధంగా బోర్డులు, స్పీడ్ బ్రేకర్లు కూడా వేయలేదు. రాత్రి వేళలో వంతెనపై చీకటిగా ఉండటంతో రాకపోకలకు ఇబ్బందులు ఎదురవడమే కాకుండా ప్రమాదాలు సంభవిస్తున్నాయి. ఈ బ్రిడ్జి సగం మన్నూరు, మరో సగం నందలూరు పోలీసు స్టేషన్ల పరిధిలోకి వస్తాయి. కిలోమీటర్లకు పైగా పొడవు కలిగిన ఈ వంతెన మృత్యుకుహరంగా మారింది. -
మహిమాన్వితం.. మహాప్రసాదం
బ్రహ్మంగారిమఠం : ‘జగన్మాతా.. దీవించు తల్లీ’ అంటూ భక్తులు వేడుకున్నారు. మహాదేవి ప్రసాదం కోసం వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో తరలివచ్చారు. ‘అమ్మవారి ప్రసాదం.. మహిమాన్వితం’ అంటూ భక్తిశ్రద్ధలతో స్వీకరించారు. శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరు రోజుల పాటు కనుల పండువగా నిర్వహించిన ఆరాధన గురుపూజ మహోత్సవాలు మంగళవారం ముగిశాయి. అమ్మవారికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేసి, విశేషంగా అలంకరించారు. అనంతరం మహాప్రసాద వినియోగ కార్యక్రమం నిర్వహించారు. బ్రహ్మంగారిమఠం, శ్రీఈశ్వరీదేవి మఠం సంప్రదాయాల ప్రకారం శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో ద్వార పూజ చేశారు. బ్రహ్మంగారిమఠంలో ప్రసాదం తయారు చేసి, శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామికి నైవేద్యంగా సమర్పించారు. అనంతరం భక్తులకు పంపిణీ చేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, సంకటితిమ్మాయపల్లెకు చెందిన పోలు ఎరికలరెడ్డి, సుబ్బారెడ్డి, ముక్కమల్ల భాస్కర్రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్ తదితరులు పాల్గొన్నారు. ముగిసిన ఈశ్వరీదేవి ఆరాధన మహోత్సవాలు -
కువైట్ను తాకిన రాజంపేట జిల్లా ఉద్యమ సెగ
రాజంపేట : రాజంపేట,రైల్వేకోడూరుకు చెందిన వేలాది మంది జీవనోపాధి కోసం కువైట్లో దేశంలో ఉన్న నేపథ్యంలో వారు కూడా జిల్లా కేంద్రంగా రాజంపేట ఉండాలనే డిమాండ్ లేవనెత్తారు. మాలియాలోని పవన్ రెస్టారెంట్లో ప్రవాసాంధ్రులు రాజంపేట మున్సిపల్ వైస్చైర్మన్, కాపు నేత మర్రి రవికుమార్ పదిరోజులుగా చేస్తున్న అన్నమయ్య జాయింట్ యాక్షన్ కమిటీ రిలే నిరాహారదీక్షలకు కువైట్ వైఎస్సార్సీపీ తరపున మద్దతు పలికారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ కువైట్ కన్వీనర్ ముమ్మడి బాలిరెడ్డి మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఇప్పుడు రాజంపేటకు అర్హత ఉందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఆ దిశగా చర్యలు తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ నేతలుు గోవిందు నాగరాజు పాల్గొన్నారు.మాలియాలో రాజంపేట, రైల్వేకోడూరు వాసుల నిరసన -
సీఐపై బదిలీ వేటు.. కూటమిలో విభేదాలే కారణం?
ముద్దనూరు : స్థానిక అప్గ్రేడ్ పోలీస్ స్టేషన్ సర్కిల్ ఇన్స్పెక్టర్ దస్తగిరిని వీఆర్కు బదిలీ చేస్తూ ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేయడానికి కూటమి నేతల విభేదాలే ప్రధాన కారణంగా తెలుస్తోంది. గత కొంతకాలంగా మండలంలో స్థానిక పోలీసుశాఖ వ్యవహారశైలి వల్ల కూటమిలోని ప్రధాన నేతల మధ్య సమస్యలు ఉత్పన్నమవుతున్నట్లు సమాచారం. ప్రభుత్వ మద్యం దుకాణాల ఏర్పాటులో ఘర్షణ మొదలుకొని ఇటీవల స్మార్ట్ కిచెన్ షెడ్ నిర్మాణంలో ఘర్షణ, ఇతర చిన్నచిన్న సమస్యల్లో కూడా స్థానిక పోలీసులు కూటమిలోని ఒక వర్గం వారికే వత్తాసు పలుకుతూ తమ వర్గీయులను చిన్నచూపు చూస్తున్నారనే భావనతో మరో వర్గం నేత ఉన్నట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో పలుసార్లు నియోజకవర్గస్థాయి కూటమి నేత ఒకరు పోలీసు అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ఇటీవల కూటమి వర్గీయుల మధ్య జరిగిన ఓ ఘర్షణ కేసు అనంతరం చోటుచేసుకున్న పరిణామాలతో సీఐపై వేటు పడినట్లు తెలుస్తోంది. కూటమినేతల మధ్య సమన్వయ లోపం తమకు శాపమైందని పోలీసు అధికారులు వాపోతున్నారు. -
క్షయవ్యాధి నిర్మూలనకు సమష్టి కృషి
ఎర్రగుంట్ల : క్షయ వ్యాధికి అత్యాధునిక వైద్య చికిత్స అందుబాటులో ఉందని, ఽధైర్యంగా ముందుకు వచ్చి అవసరమైన చికిత్సను ఉచితంగా పొందవచ్చని ఎర్రగుంట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారి డాక్టర్ పి.శ్రీనాథ్రెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని సుంకేసుల గ్రామంలో భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్ సహకారంతో పెయిడ్ స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షయ వ్యాధి భయంకరమైన అంటువ్యాధి అన్నారు. ఈ వ్యాధి లక్షణాలు ఉన్న వారు వెంటనే సమీపంలోని ప్రభుత్వ ఆస్పుత్రికి వెళ్లి చికిత్స చేయించుకోవాలన్నారు. భారతి సిమెంట్ ఫ్యాక్టరీ సీఎస్ఆర్ వింగ్ డి. మదన్రెడ్డి మాట్లాడుతూ ప్రస్తుతం క్షయవ్యాధి సోకిందని ఎవరూ భయపడాల్సిన అవసరం లేదన్నారు. ఈ వ్యాధి నిర్మూలనకు సమిష్టిగా కృషి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో పెయిడ్ సంస్థ అధ్యక్షుడు కె.నాగేశ్వరరెడ్డి, హెల్త్ సూపర్వైజర్లు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
● వరదాయిని.. జగజ్జనని
ఘనంగా అమ్మవారి ఆరాధనోత్సవాలు బ్రహ్మంగారిమఠం : ‘వర ప్రదాయిని.. జగజ్జనని’ అంటూ భక్తులు శరణు వేడారు. ‘కొలిచే వారి కొంగు బంగారమై నిలిచే తల్లీ.. మమ్మల్ని చల్లంగా చూడు’ అంటూ భక్తిశ్రద్ధలతో ప్రార్థించారు. ఈశ్వరీదేవి మఠం జగన్మాత నామస్మరణతో మార్మోగింది. బ్రహ్మంగారిమఠంలోని శ్రీఈశ్వరీదేవి మఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా నిర్వహిస్తున్నారు. ఐదో రోజైన సోమవారం పూర్వపు మఠాధిపతి వీరబ్రహ్మయ్యాచార్య స్వాముల వారి ఆరాధన నిర్వహించారు. ఉదయం ప్రభాత సేవ, అభిషేషకం, బిల్వదళార్చన, గురుపూజ విధులు చేపట్టారు. మఠాధిపతి వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. మధ్యాహ్నం ద్వార పూజ, నైవేద్యం, మంత్ర పుష్పం, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం తదితర కార్యక్రమాలు చేపట్టారు. రాత్రి గ్రామోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. బ్రహ్మంగారిమఠానికి చెందిన చిన్మయామిషన్ వారి గీతాపారాయణం భక్తులను అలరించింది. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని జగన్మాత ఈశ్వరీదేవిని దర్శించుకున్నారు. వారికి అర్చకులు తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి, దాతలు తమిదల కోటిరెడ్డి, శిల్పా శ్రీకాంత్, కల్లూరు కేశవాచారి, కోడూరి సుబ్రహ్మణ్యాచారి, పోలు పోలేటమ్మగారి సుబ్బారెడ్డి, బాల హుస్సేన్రెడ్డి, యాకశిరి జయలక్షుమ్మ, నొస్సం సుబ్రహ్మణ్యాచారి, మహేశ్వరాచారి తదితరులు పాల్గొన్నారు. -
చలి చంపేస్తోంది.!
కడప అగ్రికల్చర్ : మొన్నమొన్నటి వరకు వర్షాలతో ఇబ్బంది పడిన ప్రజలు తాజాగా చలితో వణికిపో తున్నారు. రాత్రి ఉష్ణోగ్రతలు పూర్తిగా పడిపోయా యి. రాత్రి 8 గంటల నుంచి చలి మొదలై ఉదయం 9 గంటల వరకు చలి తీవ్రత అధికంగా ఉంటోంది. ఈ పరిస్థితి జిల్లాలో గత పది రోజుల నుంచి నెలకొంది. దీంతో జిల్లా ప్రజలు వణికిపోతున్నారు. మును పెన్నడూ లేని విధంగా చలి తీవ్రత పెరగడంతో వృద్ధులు, చిన్నారులతో పాటు ఉదయం పూట పనుల మీద వెళ్లే ప్రజలు చలికి గజగజలాడుతున్నారు. ఈ పరిస్థితి ఇంకెనాళ్లు కొనసాగుతుందోనని ఆందోళన చెందుతున్నారు. కమ్ముకుంటున్న పొగమంచు.. ఒక పక్క చలి చంపుతుంటే మరో పక్క పొగమంచు కమ్మేస్తోంది. క్రమంగా పొగమంచు తగ్గినా చలి మాత్రం పంజా విసురుతోంది. దీంతో పనుల మీద బయటకు వెళ్లే రైతులు, రైతు కూలీలు, వ్యాపారులు ఇబ్బందులు పడుతున్నారు. వీరితోపాటు చిన్నపిల్లలు, వృద్ధులు కూడా అవస్థలు పడుతున్నారు. గతేడాది డిసెంబర్ మొదటి వారం వరకు వాతావరణం సాధారణంగానే ఉండేది. అలాంటిది ఈ ఏడాది డిసెంబర్లో వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని చలి ప్రారంభమైంది. సంక్రాంతికి మరింత పెరిగే అవకాశం.. ఈ చలి తీవ్రత జనవరి నెలలో మరింత పెరగనుంది. సాధారణంగా సంక్రాంతి సీజన్లో చలి అధికంగా ఉంటుంది. సంక్రాంతి పండుగకు చలి సంకలెత్తకుండా చంపుతుందని సామెత కూడా ఉంది. ఈ సామెత ఈ ఏడాది నిజమయ్యేలా కనిపిస్తోంది. జిల్లాలో తగ్గిన ఉష్ణోగ్రతలు.. జిల్లా వ్యాప్తంగా నవంబర్ నెల 10వ తేదీ కనిష్ట ఉష్ణోగ్రత 25.3 డిగ్రీలు, గరిష్ట ఉష్ణోగ్రత 32.8 డిగ్రీలు ఉండేది. అలాంటిది డిసెంబర్ 15వ తేదీ నాటికి కనిష్ట ఉష్ణోగ్రత 15.4 చేరగా గరిష్ట ఉష్ణోగ్రత 28.2 డిగ్రీలకు చేరింది. ఒక్కసారిగా ఉష్ణోగత్రల్లో మార్పు రావడంతో చాలా మంది జ్వరం, జలుబు, దగ్గుతో బాధపడుతున్నారు. చలి దుస్తులకు పెరిగిన గిరాకీ.. చలి తీవ్రత పెరిగిన నేపథ్యంలో మధ్యప్రదేశ్ లోని భోపాల్ ప్రాంతానికి చెందిన కొందరు వ్యాపారులు కడప నగరంతోపాటు పలు ప్రాంతాలలోని రోడ్ల పక్క స్టాల్స్ను ఏర్పాటు చేసుకుని జోరుగా చలి దుస్తుల విక్రయాలను సాగిస్తున్నారు. ఈ స్టాల్స్లో చలికి సంబంధించిన స్వెట్టర్లు, రెయిన్కోట్లు, శాలువాలు, మంకీ క్యాపులు, గ్లౌజులు, రగ్గులు విక్రయిస్తున్నారు. పెంపుడు జంతువులకు దూరంగా.. ఈ సీజన్లో పెంపుడు జంతువులకు దూరంగా ఉండాలి. వైరస్ల వ్యాప్తికి పెంపుడు జంతువులు ప్రధాన కారణంగా నిపుణులు చెబుతున్నారు. ఈ కాలంలో వాటిని బెడ్రూమ్, వంటగదిలోకి రానివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్న వృద్ధులు, చిన్న పిల్లలు జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడే వారు పెంపుడు జంతువులను దగ్గరలో లేకుండా చూసుకోవాల్సిన అవసరం ఉంది. వేడి వస్తువులకు ప్రధాన్యం.. ఈ చలికాలంలో చల్లని వస్తువులకు దూరంగా ఉండాలి. ముఖ్యంగా కూల్డ్రింక్స్, ఐస్క్రీములకు మరింత దూరంగా ఉండాలి. గోరు వెచ్చని నీరు తాగితే కాసింత ఉపశమనం లభిస్తుంది. వీటికితోడు తాజా ఆహారం తీసుకుంటే మంచింది. ముఖ్యంగా ఈ చలికి చంటి బిడ్డలను బయటకు తీసుకెళ్లకూడదు. చలితో గజగజ వణుకుతున్న జిల్లా వాసులు గత పది రోజుల నుంచి పెరిగిన చలి తీవ్రత సాయంత్రం 6 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు ప్రభావం 15 డిగ్రీలకు చేరిన రాత్రి ఉష్ణోగ్రతలు తెల్లవారుజాము నుంచి రోడ్లను కమ్ముకుంటున్న పొగమంచు ఇబ్బందులు పడుతున్న వాహనదారులు మారిన వాతావరణంలో వివిధ అనారోగ్య సమస్యలు జాగ్రత్తలు పాటించాలంటున్న వైద్యులుదీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులు జాగ్రత్త.. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు ఊహించని స్థాయిలో పడిపోతున్నాయి. గుండె జబ్బులు, బీపీ, ఆస్తమా, మధుమేహం వ్యాధిగ్రస్తులు ఈ చలికి జాగ్రత్తగా ఉండాలి. వీరు ముఖ్యంగా చలి తీవ్రంగా ఉన్న సమయాల్లో బయటకు వెళ్లకూడదు. సాధారణ ప్రజలకు కూడా జలుబు, దగ్గు, సీజనల్ జ్వరాలు పచ్చే అవకాశం ఉటుంది. ఒక వేళ బయటకు రావాల్సిన అవసరం ఏర్పడితే మాత్రం తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ అవ్వారు అర్జున్కుమార్, రిమ్స్ వైద్యులు, కడప -
కళ్లెదుటే వైకుంఠము.. కల్యాణ వైభోగము..
● వైభవంగా శ్రీ వేంకటేశ్వరుని కల్యాణం ● పోటెత్తిన భక్తజనంకడప సెవెన్రోడ్స్ : ‘ఒళ్లంతా కళ్లు చేసుకున్నా ఆ వైభవాన్ని తనివితీరా చూడలేము. ఆ కమనీయ దృశ్యాన్ని తిలకించిన జీవితమే ధన్యము. ఇదిగిదిగో కళ్లెదుటే వైకుంఠము’ అంటూ భక్తులు పరవశించారు. విశాలమైన పందిట్లో మనోహరంగా అలంకరించిన వేదికపై అభయముద్రతో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని కల్యాణ ఘట్టాన్ని చూసేందుకు గోవిందమాల దీక్షధారులైన భక్తులు బంధుమిత్రులు, కుటుంబ సభ్యుల సమేతంగా తరలివచ్చారు. కల్యాణాన్ని తన్మయత్వంతో భక్తిపూర్వకంగా తిలకించారు. సోమవారం కడప నగరం మున్సిపల్ మైదానంలో శ్రీ గోవిందమాల భక్తబృంద సేవా సమితి ఈ కార్యక్రమాన్ని నిర్వహించింది. ఇందులో భాగంగా ఉదయం 5 గంటలకు సుప్రభాతసేవ, అనంతరం తోమాల సేవ, అర్చనలు నిర్వహించారు. 9 గంటల నుంచి కల్యాణోత్సవం ప్రారంభమైంది. కనుల పండువగా.. కల్యాణ ఘట్టంలో భాగంగా కుడివైపున నూతన వరుడిగా శ్రీవారిని, ఎడమవైపు ఉభయదేవేరులైన శ్రీదేవి, భూదేవి మాతలను వధువులుగా అలంకరించి కనుల పండువగా తీర్చిదిద్దారు. వేద పండితుల బృందం కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించింది. పుణ్యాహవాచనం, కలశ ప్రతిష్ఠ, గణపతిపూజ, ప్రవరలు, యజ్ఞోపవీత ధారణల అనంతరం సంప్రదాయంగా కన్యాదానం చేశారు. మహామంగళ సూత్రాలను భక్తులందరికీ దర్శింపజేశారు. అనంతరం మంగళ వాయిద్యాల సుస్వరాలు, వేదమంత్రోచ్ఛాటనల మధ్య స్వామి పక్షాన వేద పండితులు అమ్మవార్ల గళసీమల్లో మంగళ సూత్రాలను అలంకరించారు. ఈ సందర్భంగా వేద పండితుల బృందాలు తలంబ్రాల కార్యక్రమాన్ని ఉత్సాహ భరితంగా నిర్వహించారు. పూల చెండులాట ఆడారు. భక్తులందరికీ మంగళాక్షతలను కల్యాణ ప్రసాదంగా అందజేశారు. ప్రారంభం నుంచి కార్యక్రమం ముగిసేంతవరకు టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు అన్నమయ్య కీర్తనలు ఆలపించారు. భక్తులు అడుగడుగునా చేసిన గోవిందనామ స్మరణలు ఆ ప్రాంగణంలో ప్రతిధ్వనించాయి. హాజరైన వారందరికీ వివాహ భోజనం ఏర్పాటు చేశారు. సందడిగా గ్రామోత్సవం సాయంత్రం ఉత్సవ మూర్తులను గరుడ వాహనంపై కొలువుదీర్చి ప్రత్యేకంగా అలంకరించిన రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. గ్రామోత్సవంలో కోలాటాలు, చెక్కభజనలు, బ్యాండు మేళాలు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. -
నూతన కార్యవర్గం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్రప్రదేశ్ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా నూతన కార్యవర్గం ఎన్నికై ంది. ఇందులో జిల్లా అధ్యక్షుడిగా ఎస్. అమర్నాథ్రెడ్డి. ప్రధాన కార్యదర్శిగా వి. కిరణ్కుమార్రెడ్డి, గౌరవాధ్యక్షుడిగా కె. ప్రభాకర్రెడ్డి, కోశాధికారిగా దామోదర్రెడ్డి, మహిళా కార్యదర్శిగా షరీదాభాను, కార్య నిర్వాహక అధ్యక్షులుగా శివశంకరెడ్డి, కర్నాటి రాజశేఖర్రెడ్డి, ఖాదర్ మొహిద్దీన్, అసోసియేషన్ ప్రెసిడెంట్గా మల్లికార్జునరెడ్డి, పవన్, జయప్రకాస్రెడ్డి, కార్య నిర్వాహక కార్యదర్శిగా సతీష్, ఓబుల్రెడ్డి, విజయమ్మ, గౌరవ సలహాదారులుగా రమేష్బాబు, మైనార్టీ వింగ్ కన్వీనర్గా బాబా రజాక్, సోషల్ మీడియా కన్వీనర్గా జాన్ సుందర్రాజు, ఉపాధ్యక్షులుగా మదార్వలి, వెంకటరామిరెడ్డి, బాలశివారెడ్డి, గంగాధర్రెడ్డి, రాఘవేంద్రమ్మ, భాస్కర్రెడ్డి, సహాయ కార్యదర్శులుగా కరుణాకర్రెడ్డి, రఘనాథరెడ్డి, లక్ష్మినారాయణ, వెంకటేశ్వరరెడ్డి,జేసునాథరెడ్డి, అడిట్ కమిటీ కన్వీనర్గా రమణ, సభ్యులుగా శ్రీనాథరెడ్డి, సూరి, నాగార్జున, రాష్ట్ర కౌన్సిలర్లుగా రమణారెడ్డి, సీకే వెంకటనాథరెడ్డి, జగన్మోహన్రెడ్డి, సురేష్రెడ్డిలను ఏకగీవ్రంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాట్లాడుతూ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ బలోపేతానికి, ఉపాధ్యాయ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. కిరణ్కుమార్రెడ్డి అమర్నాథరెడ్డి -
మేం అధికారంలోకి వస్తే మెడపట్టి గెంటేస్తాం
మెడికల్ కాలేజీ టెండర్లలో పాల్గొని ఎవరైనా వాటిని సొంతం చేసుకుంటే వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అఽధికారంలోకి వచ్చిన తర్వాత వారిని మెడపట్టి గెంటేస్తాం. విద్య, వైద్యం విషయంలో పేదలు దోపిడీకి గురికాకూడదనే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలు తీసుకొచ్చారు. రూ.8500కోట్లతో వాటిని పూర్తి చేసేందుకు సంకల్పించారన్నారు. రూ.5వేల కోట్లు అయితే అన్ని కాలేజీలు పూర్తవుతాయి. చంద్రబాబు చేసే ప్రతి కార్యక్రమం కమీషన్ల కోసమే.. దౌర్జన్యంగా మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే ఒప్పకునే ప్రసక్తేలేదు. – ఎస్వీ సతీష్ కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ రాయలసీమ ఇన్చార్జి -
ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు
కడప సెవెన్రోడ్స్ : ఇంధన పొదుపుతో ఉత్తమ భవిష్యత్తు ఉంటుందని, విద్యుత్ పొదుపు అందరి బాధ్యత అని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని సభా భవన్లో ఈనెల 14వ తేదీ నుంచి 20 వ తేది వరకు జాతీయ ఇంధన పొదుపు వారోత్సవాలకు సంబంధించిన గోడ పత్రికలు,కరపత్రాలను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా జాయింట్ కలెక్టర్ అధితి సింగ్ తో కలిసి విడుదలచేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇంధనాన్ని పొదుపు చేయడంపై ప్రజల్లో అవగాహన కల్పించడం ఈ వారోత్సవాల ముఖ్య ఉద్దేశం అన్నారు. ఇంధన సామర్థ్యం,పరిరక్షణ ప్రాముఖ్యత,విద్యుత్ ఆదా గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ప్రసంగాలు,ర్యాలీలు, విద్యార్థులలో అవగాహన కల్పించుటకు వ్యాసరచన పెయింటింగ్ పోటీలు, వర్క్ షాప్, వెబినార్లు ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ ఆదేశించారు. భూతాపం, వాతావరణ మార్పులనుఎదుర్కోవడానికి సాంప్రదాయేతర ఇంధన వనరుల వినియోగాన్ని ప్రోత్సహించాలని సూచించారు.కార్యక్రమము లో విద్యుత్ శాఖ సూపరింటెండింగ్ ఇంజనీర్ ఎస్ రమణ, ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. సమగ్రంగా న్యూట్రిషనల్ కన్వర్జెన్స్ పైలెట్ ప్రాజెక్టు సర్వే సాంకేతిక మద్దతు ద్వారా పోషకాహారం–వ్యవసాయ కన్వర్జెన్స్ను ప్రారంభించడం(ఇనాక్ట్స్)్ఙ అనే పైలెట్ ప్రాజెక్టు కార్యక్రమ సర్వే జిల్లాలో సమగ్రంగా సాగుతోందని జిల్లా కలెక్టర్ శ్రీదర్ చెరుకూరి పేర్కొన్నారు. మంగళవారం కలెక్టర్ క్యాంపు కార్యక్రమంలో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో అమలవుతున్న ఇనాక్ట్స్ పైలెట్ ప్రాజెక్ట్ సర్వే కార్యక్రమంపై ఇండియన్ స్కూల్ ఆఫ్ బిజినెస్ ప్రాజెక్ట్ అసోసియేట్ స్మతితో పాటు సంబందిత జిల్లా అధికారులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో డీఆర్డీఏ పీడి రాజ్యలక్ష్మి, వ్యవసాయ శాఖ జిల్లా అధికారి చంద్రా నాయక్, డిప్యూటీ డిఎంహెచ్ఓ మహేశ్వర కుమార్, సీఎన్ఎఫ్ డిపిఎం ప్రవీణ్ కుమార్, ఐసీడీఎస్ పీడీ రమాదేవి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
మ్యూటేషన్ నిర్వహించాలి
మా గ్రామ పొలం ఎల్పీఎం నంబరు 2042లో ముప్పై ఆరున్నర సెంట్ల భూమిని 2015లో కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ కూడా చేయించుకున్నాను. 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు కూడా మంజూరు చేశారు. కానీ రీ సర్వే నిర్వహించిన తర్వాత అధికారుల తప్పిదం వల్ల సదరు ఎల్పీఎం నంబరులో ఇతరుల పేర్లు నమోదయ్యాయి. కనుక మళ్లీ మ్యూటేషన్ నిర్వహించి కొత్త 1బీ, అడంగల్, పాసు పుస్తకాలు జారీ చేయాలి. – పి.రాఘవేంద్రకుమార్రెడ్డి, మల్లేపల్లె, బి.మఠం మండలం ఖాతా నంబరు 54, సర్వే నంబరు 923/2బిలో 40 సెంట్ల భూమి మా అనుభవంలో ఉంది. అయితే సదరు భూమి ఆన్లైన్లో కనిపించడం లేదు. ఆ భూమిని ఆన్లైన్ చేయించాలని పలుమార్లు రెవెన్యూ అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అందుకే కలెక్టర్కు చెప్పుకుంటే సమస్య పరిష్కారమవుతుందనే ఆశతో వచ్చాను. – వెన్నపూస వెంకటరెడ్డి, పాత గిరిగెలపల్లె, పెండ్లిమర్రి మండలం చిన్నచౌకు గ్రామ పొలం సర్వే నంబరు 908–1ఏలో మా అబ్బ పేరిట 70 సెంట్ల భూమి ఉంది. ఆ భూమికి రెవెన్యూ అధికారులు 2015 నవంబరు 30న నా పేరిట 1బీని జారీ చేశారు. అయితే ఈ మధ్య ఆన్లైన్లో సదరు భూమికి సంబంధించిన 1బీ రిజిష్టర్ కనిపించడం లేదు. కొందరు తప్పుడు పత్రాలు తయారు చేసి విక్రయిచేందుకు ప్రయత్నిస్తున్నట్లు తెలుస్తోంది. కనుక దీనిపై విచారణ నిర్వహించి నా పేరిట 1బీ డాక్యుమెంటును ఆన్లైన్లో నమోదుకు చర్యలు తీసుకోవాలి. – సానపురెడ్డి కొండారెడ్డి, హౌసింగ్బోర్డు కాలనీ, కడప -
తప్పుడు రికార్డులతో పరిహారం కాజేశారు
మా గ్రామ పొలం సర్వే నంబరు 102లో నాకు 52 సెంట్ల భూమి యురేనియం కార్పొరేషన్ సేకరించింది. సర్వే నంబరు 742లో రెండు ఎకరాల 85 సెంట్ల భూమి నా పేరిట ఉంది. ఇందుకు సంబంధించిన అన్ని డాక్యుమెంట్లు ఉన్నాయి. అయితే రెవెన్యూ అధికారులు మాయాజాలం చేసి సదరు రెండు సర్వే నంబర్లలోని భూమిని కొప్పుల వెంకటేశ్ పేరిట చూపెట్టి రూ. 4.37 లక్షలు పరిహారం పొందారు. వెంకటేశ్కు ఎలాంటి డాక్యుమెంట్లు లేకపోయినా రెవెన్యూ అధికారులు కుమ్మకై ్క పరిహారం కాజేశారు. – ఉదయగిరి మస్తాన్, రాచగుంటపల్లె, వేముల మండలం -
ప్రజా ప్రదక్షిణ వేదిక
● వ్యయ ప్రయాసాలతో కలెక్టరేట్కు తరలివస్తున్న ప్రజలు ● సమస్యల పరిష్కారం కోసం ఎదురుచూపులు కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారవేదిక ‘ప్రదక్షిణ’వేదికగా మారిందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ప్రతి సోమవారం నిర్వహిస్తున్న గ్రీవెన్సెల్లో ప్రజలు సమస్యలు విన్నవిస్తున్నప్పటికీ క్షేత్ర స్థాయిలో అవి పరిష్కారానికి నోచుకోవడం లేదు. భూమికి సంబంధించిన సమస్యలే అత్యధికంగా వస్తున్నాయి. రీ సర్వేలో దొర్లిన తప్పిదాల కారణంగా తమ భూమి విసీ్త్రర్ణం తగ్గిందని, ఆన్లైన్లో తమ పేర్లను నమోదుచేయాలని, పట్టాదారు పాసు పుస్తకం మంజూరు చేయాలని, ఇతరులు తమ భూములను ఆక్రమించారని తదితర అనేక సమస్యలు వస్తున్నాయి. -
డబుల్ ఇంజిన్తో రాష్ట్రానికి ట్రబుల్
డబుల్ ఇంజిన్ సర్కార్తో రాష్ట్రానికి ట్రబుల్ ఏర్పడింది.రాష్ట్రానికి వెయ్యికోట్లు నిధులు తేలేని స్థితిలో కూటమి నేతలు ఉన్నారు. ప్రజల ఆరోగ్యం, విద్య పట్ల ప్రభుత్వానికి శ్రద్ధ లేదు.కార్పొరేట్ల ప్రయోజనాల కోసమే ఈ ప్రభుత్వం పనిచేస్తోంది. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయాలా వద్దా అనే విషయంపై ప్రభుత్వం ఐవీఆర్ఎస్ విధానం ద్వారా అభిప్రాయాలు తెలుసుకోవాలి. – నరేన్ రామాంజులరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరిస్తే పేదలకు నాణ్యమైన వైద్యం అందుబాటులో ఉండదు. ప్రైవేట్ వ్యక్తులు సేవాభావంతో వ్యవహరించరు. లాభార్జన కోసమే పనిచేస్తారు వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి అధిక ప్రాధాన్యత ఇచ్చారని, చంద్రబాబు సీఎం అయ్యాక ఆరోగ్యశ్రీని, ఫీజు రీయంబర్స్మెంట్ పథకాన్ని పూర్తిగా నిర్వీర్యం చేశారు. – రఘురామిరెడ్డి, వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ గొప్ప ఆశయంతో మంజూరు చేయించిన 17 మెడికల్ కాలేజీలను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. మెడికల్ కాలేజీలు ప్రభుత్వ రంగంలోనే ఉండాలి, ప్రైవేటు పరం చేయొద్దు అని నెల రోజులుగా కోటి సంతకాల సేకరణ చేసిన ప్రతి ఒక్కరికీ కృతజ్ఞతలు. – కొండూరు అజయ్రెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు -
మృత్యువులోనూ వీడని స్నేహ బంధం
దువ్వూరు : స్థానిక నల్లవంక దగ్గర జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గోపులాపురం గ్రామానికి చెందిన చిట్టిబోయిన పెద్ద ఎల్లయ్య (60), నేలటూరు గ్రామానికి చెందిన చాగలేటి వీరప్రతాప్రెడ్డి (62) ఇద్దరు స్నేహితులు. ఆదివారం వీరిద్దరు దువ్వూరుకు ఇంటి సరుకుల కోసం టీవీఎస్ ఎక్సెల్ స్కూటర్పై వచ్చి తిరిగి సొంత ఊర్లకు బయలుదేరారు. దువ్వూరు సమీపంలోని నల్లవంక దగ్గర ఉన్న సురేష్ గోడౌన్ వద్ద వాహనాన్ని ఆపి రోడ్డు దాటుతుండగా ప్రొద్దుటూరుకు వెళుతున్న బొలెరో వాహనం వేగంగా వారిని ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరు స్నేహితులు అక్కడికక్కడే మృతి చెందారు. వీరిరువురు వ్యవసాయంపై ఆధారపడి జీవించేవారు. చాలా ఏళ్ల నుంచి ఇద్దరు స్నేహితులుగా ఉన్నారు. పెద్ద ఎల్లయ్యకు భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. వీరప్రతాప్రెడ్డికి కోవిడ్ సమయంలో భార్య చనిపోయింది. కుమారుడు, కుమార్తె ఉన్నారు. రోడ్డు ప్రమాదంలో వీరు మృతి చెందిన విషయం తెలుసుకున్న బంధు మిత్రులు, ఇరుగ్రామాల ప్రజలు పెద్ద సంఖ్యలో సంఘటన స్థలానికి చేరుకుని బోరున విలపించారు. పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ శివప్రసాద్ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో ఇద్దరి దుర్మరణం -
లాభాల మునగ.!
కడప సిటీ : జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకంలో రకరకాల పండ్ల తోటల పెంపకానికి కేంద్ర ప్రభుత్వం నిధులను ఖర్చు చేస్తోంది. 300 రకాల వ్యాధులకు ఉపయోగపడే మునగ (మోరింగా) సాగుకు కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం అందిస్తోంది. 2022–23 ఆర్థిక సంవత్సరంలో మునగ సాగుకు ప్రభుత్వం అవకాశం కల్పించింది. జిల్లాలోని ఆరు మండలాల్లో మునగ సాగును చేపట్టారు. ప్రారంభంలో కేవలం 23 మంది రైతులు మాత్రమే 17.43 ఎకరాల్లో 710 మొక్కలు మాత్రమే నాటారు. పూర్తిగా రైతుకు ఎలాంటి భారం లేకుండా గుంతలు తీసే పని నుంచి మొక్కల పంపిణీ రెండు సంవత్సరాలపాటు నిర్వహణ కూడా పూర్తి ఉచితంగానే కేంద్ర ప్రభుత్వం రైతులకు అవకాశం కల్పిస్తోంది. అఽధిక పోషక విలువలతోపాటు ఔషధ గుణాలు కూడా మునగ మొక్కల్లో ఎక్కువగా ఉన్నాయి. హోస్టెడ్ ప్లాంటేషన్ ద్వారా నర్సరీల్లో పెంచిన మునగ మొక్కలను రైతులకు అందజేస్తోంది. అంతేకాకుండా ప్రభుత్వ పాఠశాలల్లో, అంగన్వాడీ కేంద్రాల్లో కూడా నాటించి విద్యార్థులకు మునగతో ఏ విధంగా ఉపయోగం ఉందో తెలియజేసే విధంగా చర్యలు తీసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా 31.61 ఎకరాల గుర్తింపు.. జిల్లా వ్యాప్తంగా ఆరు మండలాల్లో ఈ మునగసాగు చేపట్టారు. ఇందులో భాగంగా 31మంది రైతులకు 31.61 ఎకరాలు గుర్తించారు. 14,190 గుంతలు తీయగా, ఇందులో 29.7 ఎకరాల్లో సాగై 11,850 మొక్కలు నాటారు. రెండు సంవత్సరాలపాటు ఈ పంట ఉంటోంది. తర్వాత సాగు చేసిన రైతులకు రెండవ దఫా ఇచ్చేందుకు అవకాశం ఉండదు. 0.5 ఎకరా నుంచి ఎకరా వరకు నాటేందుకు అనుమతి ఉంది. రెండింతలకుపైగా ఆదాయం.. కొత్తగా రైతులు ప్రారంభంలో మొగ్గు చూపకపోయినా తర్వాత అధికారులు ఆదాయం రెండింతలు వస్తుందని చెప్పగా రైతులు ముందుకు వచ్చారు. సున్నా పెట్టుబడితో కేంద్ర ప్రభుత్వం వీటికి అయ్యే ఖర్చు ఉచితంగానే నిధులు ఇస్తోంది. రైతు చేతి నుంచి ఒక్క రూపాయి కూడా వెచ్చించాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు ఒక రైతు ఎకరాకు కేంద్ర ప్రభుత్వం మొక్కలు, మెటీరియల్కు కలిపి రూ. 80 వేలు ఉచితంగా ఇవ్వగా, ఆ రైతుకు రెండు సంవత్సరాల కాలంలో రూ.3.50 లక్షల ఆదాయం అందుతోందని గణాంకాలు చెబుతున్నాయి. మునగ ఆకుతో 300 వ్యాధులు దూరం.. మునగ ఆకు, మునక్కాయలు మనం నిత్యం తినే ఆహారమేగానీ, దాని గురించి ప్రజల్లో పూర్తిగా అవగాహన లేదు. అయితే మునక్కాయలే కాకుండా మునగ ఆకులో కూడా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని వివిధ పరిశోధనల్లో వెల్లడైంది. మునగ ఆకులో ఏ, సీ విటమిన్లు పుష్కలంగా ఉంటాయి. ఆయుర్వేదంలో అయితే 300 వ్యాఽ ధులు నయం చేసేందుకు మునగ ఆకును ఉపయోగిస్తారని ఆయుర్వేద నిపుణులు చెబుతున్నారు. క్యారెట్ తింటే వచ్చే విటమిన్లు 8–10 రెట్లు అధికంగా మునగ ఆకు ద్వారా పొందవచ్చు. కళ్ల వ్యాధులకు సంబంధించి మందుల్లో కూడా వాడతారు. మహిళలు రోజుకు ఏడు గ్రాముల మునగ ఆకు పొడిని మూడు నెలలపాటు వరుసగా తీసుకుంటే 13.5 శాతం బ్లడ్ షుగర్ లెవెల్స్ తగ్గుతాయని పరిశోధనలో కూడా తేల్చారు. థైరాయిడ్కు మంచి మందుగా పనిచేస్తుంది. మునగాకు రసాన్ని పిల్లలకు అందిస్తే ఎముకలు బలిష్టంగా ఉంటాయి. పాలిచ్చే తల్లులకు పాలు పెరిగేందుకు మునగాకు ఉపయోగపడుతుంది. ఉదాహరణకు 100 గ్రాముల మునగాకులో నీరు 75.9 శాతం, పిండి పదార్థాలు 13.4 గ్రాములు, కొవ్వు పదార్థాలు 17 గ్రాములు, మాంసకృత్తులు 6.7 గ్రాములు, క్యాల్షియం 440 మిల్లీ గ్రాములు, పాస్పరస్ 70 మి.గ్రా. ఐరన్ 7 మి.గ్రా, సి–విటమిన్ 200 మిల్లీ గ్రాములు, ఖనిజ లవణాలు 2.3 శాతం, పీచు పదార్థం 0.9 మిల్లీ గ్రాములు, ఎనర్జీ 97 క్యాలరీల పోషక పదార్థాలు కలిగి ఉంటుంది. మునగ సాగుతో ఆరోగ్యం.. ఆదాయం సాగు చేసుకునేందుకు ముందుకొస్తున్న రైతులు ఉపాధి హామీలో పూర్తిగా ఉచితంగా గుంతలు, మొక్కలు అందజేత -
ఆదీ.. నీ బతుకంతా అబద్ధాలే!
జమ్మలమడుగు : ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డీ.. నీ బతుకంతా అబద్ధాలతోనే సాగుతోంది.. అని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఘాటుగా విమర్శించారు. ఆదివారం జమ్మలమడుగులోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆది బెదిరింపులకు భయపడేవారు ఇక్కడ ఎవ్వరూ లేరన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు నిజాయితీగా జరిగాయని, రాబోయే ఎన్నికల్లో పులివెందుల మున్సిపాలిటీని ముఖ్యమంత్రికి గిఫ్టుగా ఇస్తామని ప్రగల్భాలు పలుకుతున్నాడన్నారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలు ఎంత సజావుగా జరిగాయో రాష్ట్ర ప్రజలందరూ ప్రత్యక్షంగా చూశారన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గం నుంచి వేలాది మంది అక్కడ దొంగ ఓట్లు వేసి వచ్చారన్నారు. సాక్షాత్తు కలెక్టర్ సమక్షంలోనే దొంగ ఓట్లు వేసిన చరిత్ర ప్రజలందరికీ తెలుసన్నారు. ఆది అంటే అవినీతి, అబద్ధం అని ఎద్దేవా చేశారు. రాజకీయ భిక్ష పెట్టిన వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించే స్థాయి గాని అర్హత గాని ఆదినారాయణరెడ్డికి లేవన్నారు. ఆదిలాంటి అవినీతి, దగాకోరు రాజకీయ నాయకులు ఎవరూ లేరన్నారు. అధికారం ఎక్కడ ఉంటే అటువైపు పరుగులు తీసే మనస్తత్వం కలిగిన నీచ చరిత్ర అందరికీ తెలుసన్నారు. అధికారాన్ని అడ్డుపెట్టుకుని చిత్రావతి, పెన్నానది, ఫ్యాక్టరీల వద్ద కమీషన్లు దండుకుంటూ, ఫ్లైయాష్ను దోచుకుంటూ నెలకు మూడు కోట్ల రూపాయలు ఆర్జిస్తున్నాడని ఆరోపించారు. రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కచ్చితంగా వైఎస్సార్సీపీ తరపున అభ్యర్థులను పోటీలో నిలిపి తీరుతామని, ఎలాంటి బెదిరింపులు, దౌర్జన్యాలనైనా ధీటుగా ఎదుర్కొనేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు రాబోయే ఎన్నికల్లో సూదులతో గుచ్చుతా అని ఆదినారాయణరెడ్డి అంటున్నాడని, అయితే ప్రజలు 2029 ఎన్నికల్లో నీకు సూది వేసి శాశ్వతంగా రాజకీయ సమాధి చేస్తారన్నారు. ఇప్పటికై నా ఆదినారాయణరెడ్డి తన స్థాయి తెలుసుకుని మాట్లాడితే బాగుంటుందని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ అధికారప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, పొన్నపురెడ్డి గిరిధర్రెడ్డి, జగదీశ్వరరెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, కౌన్సిలర్ ముల్లాజానీ, విష్ణువర్దన్రెడ్డి, వద్దిరాల రామాంజనేయులు యాదవ్ తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
ఉపాధ్యాయుల సమస్యలు మంత్రి లోకేష్ దృష్టికి
● ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి ● ఎస్టీయూ ఆధ్వర్యంలో మహా ర్యాలీర్యాలీలో పాల్గొన్న ఎస్టీయూ నాయకులుమాట్లాడుతున్న ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డికడప ఎడ్యుకేషన్ : పాఠశాలల్లో బోధనేతర కార్యక్రమాల వలన ఉపాధ్యాయులు బోధనకు దూరం అవుతున్నారనే విమర్శ ఎక్కువగా ఉందని ఈ విషయాన్ని మంత్రి లోకేష్ దృష్టికి తీసుకెళ్లి చర్చిస్తానని పశ్చిమ రాయలసీమ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డి అన్నారు. ఆదివారం కడప నగరంలో ఆర్ట్స్ కాలేజ్ నుంచి జిల్లా పరిషత్తు వరకు ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ ఆధ్వర్యంలో వేలాది మంది ఉపాధ్యాయులు మహా ర్యాలీ నిర్వహించారు. అనంతరం జడ్పీ సమావేశ మందిరంలో నిర్వహించిన విద్యా సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ విద్యారంగం, ఉపాధ్యాయల అభ్యున్నతికి ఎస్టీయూ చేస్తున్న కృషి ప్రశంసనీయమన్నారు. ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ అర్హత పరీక్ష పై ఆందోళన చెందవద్దని రాష్ట్ర ప్రభుత్వం శక్తి వంచన లేకుండా కృషి చేసి 2011 కంటే ముందు ఉపాధ్యాయ వృత్తిలోకి వచ్చిన వారికి టెట్ నుంచి మినహాయింపు వచ్చేలా కృషి చేస్తామని హామీ ఇచ్చారు. భవిష్యత్తులో ఉపాధ్యాయ సంఘాల అభిప్రాయాలు తీసుకుని సమస్యల పరిష్కారానికి చొరవ తీసుకుంటామని తెలిపారు. ఉపాధ్యాయ మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు విద్యా సంవత్సరం మధ్యలో తీసుకొస్తున్న సంస్కరణల వల్ల విద్యా సంవత్సరం కుంటుపడుతోందని చెప్పారు. ప్రయోగాలు సత్ఫలితాలు ఇవ్వడం లేదని అన్నారు. ఇలాంటి నిర్ణయాలు తీసుకునే ముందు ప్రభుత్వాలు ఆలోచించాలన్నారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జుల ఈశ్వరయ్య మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అవలంబిస్తున్న విధానాలు చూస్తుంటే ప్రపంచ బ్యాంకు షరతులకు తలొగ్గి ఉచిత విద్య నుంచి ప్రభుత్వం తప్పుకునేలా పావులు కదుపుతోందన్నారు. జీఓ 117కు ప్రత్యామ్నాయంగా తీసుకొచ్చిన 21 జీఓను సవరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కొర్రా సురేష్ బాబు, గాజుల నాగేశ్వరరావు, కోటేశ్వరరావు, సుబ్రహ్మణ్యం రాజు, జోసెఫ్ సుధీర్ బాబు, తిమ్మన్న, జనవిజ్ఞాన వేదిక నాయకులు విశ్వనాథం, సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర, ఏఐఎస్ఎఫ్ విద్యార్థి విభాగం నాయకుడు వలరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వరరెడ్డి, పాలకొండయ్య, రాష్ట్ర నాయకులు కంఘం బాలగంగిరెడ్డి, పిల్లి రమణారెడ్డి, రవిశంకర్రెడ్డి, కొత్తపల్లి శీను, బండి సుధాకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కేసీ కాలువలో మృతదేహం
మైదుకూరు : మైదుకూరు వద్ద కడప – కర్నూలు (కేసీ)కాలువలో ఆదివారం మృతదేహం కనిపించింది. ఉదయం అటుగా వెళ్లిన కొందరికి మృతదేహం కనిపించడంతో పోలీసులకు సమాచారం అందించారు. ఆ మేరకు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి మృతదేహం ఆచూకీపై వివరించారు. మృతుడు చాపాడు మండలం నాగాయపల్లెకు చెందిన పిచ్చపాటి వీరప్రభాకర్రెడ్డి (38)గా గుర్తించారు. ఆయన ఈనెల 11వ తేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి తిరిగి రాలేదని కుటుంబ సభ్యులు తెలిపినట్టు సీఐ పేర్కొన్నారు. ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న కేసీ కెనాల్ నీటిలో ప్రమాదవశాత్తు పడి చనిపోయినట్టు తెలిపారు. మృతుని భార్య సుభద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు చెప్పారు. నిలకడగా విద్యార్థుల ఆరోగ్యంతొండూరు : తొండూరు మండలం అగడూరు పంచాయతీ పరిధిలో గల యాదవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో శనివారం జరిగిన ఫుడ్ పాయిజన్తో విద్యార్థులు అస్వస్థతకు గురైన విషయం తెలిసిందే. ఆదివారం పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి విలేకరుల బృందంగా వెళ్లి.. అక్కడి వైద్యులు, విద్యార్థుల తల్లిదండ్రులతో వివరాలు తెలుసుకోగా, ప్రస్తుతం విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందని తెలిపారన్నారు. సోమవారం విద్యార్థులను డిశ్చార్జి చేస్తామని వైద్యులు తెలిపారు. బైక్లు ఢీ ముద్దనూరు : స్థానిక పోలీసు స్టేషన్ ముందు ఆదివారం సాయంత్రం ఎదురెదురుగా వస్తున్న మోటార్ బైక్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇరువురికి తీవ్ర గాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో ఒకరికి కాలువిరగగా, మరొకరికి తలకు గాయాలయ్యాయి. క్షతగాత్రులిద్దరూ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. సిద్దవటం మండలాన్ని కడప జిల్లాలోనే కొనసాగించాలి కడప కార్పొరేషన్ : సిద్దవటం మండలాన్ని వైఎస్సార్ కడప జిల్లాలోనే కొనసాగించాలని జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు మధుసూదన్, లక్ష్మినారాయణ, దిలీప్రెడ్డి కోరారు. ఆదివారం వారు వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డికి వినతి పత్రం సమర్పించి మద్దతు కోరారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కడపకు కూతవేటు దూరంలోనే సిద్దవటం ఉందని, దీన్ని అన్నమయ్య జిల్లాకు మారిస్తే 80.కి.మీ చుట్టూ తిరిగి జిల్లా కేంద్రమైన రాయచోటికి వెళ్లాల్సి ఉంటుందన్నారు. 2009లో కడప అసెంబ్లీ నియోజకవర్గం నుంచి రాజంపేట నియోజకవర్గంలో కలిసి చాలా కోల్పోయామని, ఎంతో చరిత్ర కలిగిన ఒక నాటి జిల్లా కేంద్రాన్ని మరింత దిగజార్చవద్దని కోరారు. ఒంటిమిట్ట వద్ద చెరువులోకి దూసుకెళ్లిన కారు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలోని సాలాబాదు క్రాస్ రోడ్డు వద్ద ఆదివారం ఉదయం ఒంటిమిట్ట చెరువులోకి కారు దూసుకెళ్లింది. పోలీసుల వివరాల మేరకు.. కర్నూలులోని నిర్మల్ నగర్కు చెందిన శ్రావణ్కుమార్ కుటుంబ సభ్యులు మరో ముగ్గురు కారులో తిరుమలకు వెళ్లి వస్తున్నారు. ఒంటిమిట్ట చెరువు కట్టపైకి రాగానే కారు అదుపు తప్పి చెరువులోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ కారుకు తుమ్మచెట్లు అడ్డుపడటంతో చెరువులో మునగలేదు. ప్రమాదం తప్పింది. అప్పుల బాధతో రైతు ఆత్మహత్య చిట్వేలి : ఆరుగాలం కష్టించి పండించిన పంటలు పండక, పెట్టిన పెట్టుబడులు రాక రైతు ఆత్మహత్య చేసుకున్న ఘటన చిట్వేలి మండలంలో జరిగింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని జట్టువారిపల్లికి చెందిన ఏదోటి సుబ్బరాయుడు (48) కౌలుకు 15 ఎకరాలలో బొప్పాయి,అరటి సాగు చేస్తున్నాడు. పండించిన పంటలు పండక, పెట్టుబడి రాక అప్పుల బాధతో శనివారం విషపు గుళికలు మింగాడు. రేణిగుంట ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. -
అంగరంగ వైభవం.. పుష్ప రథోత్సవం
● కనుల పండువగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు ● భారీగా పాల్గొన్న భక్తజనంబ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠంలో అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. నాలుగో రోజైన ఆదివారం పుష్పరథోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. లోకమాత పుష్పరథంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. జగజ్జననికి మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజేశ్వరిదేవి దంపతులు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉత్సవమూర్తిని విశేషంగా అలంకరించి, ఊరేగింపు చేపట్టారు. ఉదయం గుడి ఉత్సవం కమనీయంగా జరిగింది. ఈ కార్యక్రమానికి నెల్లూరు జిల్లా అనుమసముద్రం మండలం కొలను గ్రామానికి చెందిన లక్ష్మీప్రసన్న, భువనేశ్వర్రెడ్డి ఉభయదారులుగా వ్యవహరించారు. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం అలరించింది. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఆకట్టుకున్న కోలాటం ఇటుకలపాడుకు చెందిన శివపార్వతుల మహిళా కోలాట బృందం ప్రదర్శించిన కోలాటం ఆకట్టుకుంది. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో విజయవాడకు చెందిన గుంటముక్కల వెంకటేశ్వరరావు, వైజాగ్కు చెందిన గోపిశెట్టి సురేంద్రనాథ్, కడపకు చెందిన మునగా బద్రినాథ్ శ్రేష్టి, ప్రకాశం జిల్లా కంభంకు చెందిన తిరువీధి లక్ష్మీరంగయ్యశ్రేష్టి, బ్రహ్మంగారిమఠం ముక్కమల్ల భాస్కర్రెడ్డి, వీరపు ఉమాపతి, సుంకు సురేష్బాబు, చెరువుపల్లి ఓంకారస్వామి, నొస్సం చంద్రశేఖరాచారి తదితరులు పాల్గొన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి సన్నిధిలో.. శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలకు సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన భక్తులు శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి సజీవ సమాధిని దర్శించుకుని తరించారు. అలాగే మాత గోవిందమాంబ, శ్రీవీరబ్రహ్మేంద్రస్వామి నివాస గృహం, పోలేరమ్మ చేత నిప్పు తెప్పించిన రచ్చబండ, పోలేరమ్మ గుడి, తదితర ప్రాంతాలను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
ఉద్యోగ,ఉపాధ్యాయుల పెండింగ్ డీఏలు చెల్లించాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలను కూటమి ప్రభుత్వం వెంటనే చెల్లించాలని పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి డిమాండ్ చేశారు. కడపలోని సాయిబాబా స్కూల్లో ఆదివారం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ కడప జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు అమర్నాథ్రెడ్డి ఆధ్యర్యంలో జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ టీచర్స్ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి హాజరయ్యారు. సమావేశం ప్రారంభంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక విద్యా వ్యవస్థ నిర్వీర్యం అవుతోందన్నారు. ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఏలు చాలా ఉన్నాయన్నారు. వాటిని వెంటనే చెల్లించాలన్నారు. ప్రభుత్వం కొత్త పీఆర్సీ కమిషన్ వేసి ఉపాధ్యాయులకు, ఉద్యోగులకు పీఆర్సీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఫిట్మెంట్ ప్రకటించిందన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర నాయకులు సీకే వెంకటనాథరెడ్డి, సజ్జల వెంకట రమణారెడ్డి, జిల్లా నాయకులు రమేష్బాబు, సురేష్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, ఫరీదాబాను, మాజీ ఎంఈఓలు వీరారెడ్డి, జాపర్సాదిక్లతోపాటు పలువురు సంఘ నాయకులు పాల్గొన్నారు.వైఎస్సార్టీఎఫ్ కార్యవర్గ సమావేశంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి -
ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలి
ప్రొద్దుటూరు కల్చరల్: రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.శ్యాంసుందర్రెడ్డి డిమాండ్ చేశారు. స్థానిక ఏపీటీఎఫ్ కార్యాలయంలో ఆదివారం ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాదిన్నర పూర్తయినా ఎన్నికల్లో ఉద్యోగ, ఉపాధ్యాయులకు ఇచ్చిన హామీల అమలులో ప్రభుత్వం సాచివేత ధోరణి అవలంబిస్తోందన్నారు. 2023 జూలై నుంచి 12వ పీఆర్సీ అమలు కావాల్సి ఉన్నప్పటికీ కనీసం 12వ పీఆర్సీ కమిషన్ కూడా నియమించలేదన్నారు. వెంటనే 12వ పీఆర్సీ కమిషన్ను నియమించి 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలన్నారు. జూలై 2024 నుంచి ఇప్పటి వరకు మూడు విడతల బకాయిలను చెల్లించాల్సి ఉందన్నారు. సరెండర్ లీవుల బిల్లులను ట్రెజరీలకు సమర్పించి మూడేళ్లయినా ఇంత వరకు డబ్బు చెల్లించలేదన్నారు. 11వ ీపీఆర్సీ బకాయిలు, డీఏల బకాయిలను వెంటనే చెల్లించాలన్నారు. టీచర్ల ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యను పరిష్కరించాలన్నారు. ఈ సమావేశంలో ఏపీటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి శ్రీనివాసరెడ్డి, మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, జిల్లా కౌన్సిలర్లు సుబ్బయ్య, ప్రభాకర్రెడ్డి, దామోదర్, సీనియర్ నాయకులు కృష్ణారెడ్డి, గురివిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
సేవలకు అంతరాయం
కడప అగ్రికల్చర్: చంద్రబాబు సర్కార్ సహకార ఉద్యోగులను పట్టించుకోవడం లేదు. వారి సమస్యల పరిష్కారానికి హామీలు ఇవ్వడం తప్ప నెరవేర్చకపోవడంతో సహకార సంఘం ఉద్యోగులు ఆందోళన బాట పట్టారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అన్ని సహకార సంఘాల్లో రూ.లక్షల్లో లావాదేవీలు జరుగుతుంటాయి. ఉద్యోగుల ఆందోళన కారణంగా ఆయా రోజుల్లో లావాదేవీలు నిలిచిపోతుండంతో రైతులకు ఇబ్బందులు తప్పడం లేదు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 77 సహకార సంఘాలు ఉన్నాయి. వీటిలో 400 మంది సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ముగియడంతో పలువురు రైతులు ధాన్యం డబ్బులు చేతికి రావడంతో వాటిని చెల్లించేందుకు సహకార సంఘాలకు వస్తున్నారు. ఉద్యోగులు నిరసన కార్యక్రమాలు చేపడుతుంటంతో ఉసూరుమంటూ వెనుతిరిగి వెళ్లాల్సి వస్తోందని పలువురు రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బంగారంపై రుణాలు తీసుకునే రైతులకు అవస్థలు చాలా మంది రైతులు రబీ పంటల పెట్టుబడి కోసం బంగారు నగల తాకట్టుపై అధికంగా రుణాలు తీసుకుంటారు. రూ. 88 పైసల వడ్డికే సహకారం సంఘాల్లో రుణాలు ఇస్తారు.దీంతో రైతులు బంగారు తాకట్టుెపెట్టి రుణాలు పొందుతారు. కానీ ఉద్యోగులు అందుబాటులో లేకపోడంతో ఇబ్బందులు పడుతున్నామని అన్నదాతలు వాపోతున్నారు. జీవో నెంబర్ 36ను వెంటనే అమలు చేయాలి. 2019, 2024 పెండింగ్లో ఉన్న వేతన సవవరణలు చేయాలి. ఉద్యోగులకు చెల్లించే గ్రాట్యుటీ సీలింగ్ 2 లక్షలు మాత్రమే చెల్లిస్తున్నారు.చట్ట ప్రకారం గ్రాట్యుటీ చెల్లించాలి. ప్రభుత్వోద్యోగుల మాదిరిగా పదవీ విరమ ణ వయస్సును 62 సంవత్సరాలకు పెంచాలి. ఉద్యోగులకు రూ. 5 లక్షలకు తక్కువ కాకుండా ఆరోగ్య బీమా కల్పించాలి. ప్రతి ఉద్యోగికి రూ. 20 లక్షల టర్మ్ ఇన్యూరెన్స్ పాలసీ చేయించి కుటుంబాలకు భరోసా కల్పించాలి డీసీఈబీ ద్వారా నేరుగా రైతులకు రుణాలు ఇవ్వకుండా సహకారం సంఘాల ద్వారా ఇచ్చే విధంగా చర్యలు తీసుకోవాలి ప్రస్తుతం సహకార సంఘాల్లో పనిచేస్తున్న అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ క్లర్క్, కంప్యూటర్ ఆపరేటర్లను సీనియారిటీ ప్రాతిపదికన జిల్లాలో ఖాళీగా ఉన్న సంఘాల సీఈఓలుగా నియమించాలి. ఆందోళన కార్యక్రమాల వివరాలు.. డిసెంబర్ 16వ తేదీ రాష్ట్రంలో ఉన్న అన్ని జిల్లా సహకార కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం సమర్పించడం. డిసెంబర్ 22 రాష్ట్రంలో ఉన్న అన్ని డీసీసీబీ ప్రధాన కార్యాలయాల వద్ద ధర్నా, వినతిపత్రం అందజేయడం. 29వ తేదీ రాష్ట్రవ్యాప్తంగా సహకార సంఘాలు ఉద్యోగులతో విజయవాడ ధర్నా చౌక్ వద్ద మహాధర్నా, ఉన్నతాధికార్లకు వినతిపత్రం అందించడం. 2026 జనవరి ఽ5వ తేదీ నుంచి 26 జిల్లాలు పూర్తి అయ్యేవరకు విజయవాడలోని ధర్నా చౌక్ వద్ద రిలే నిరాహాల దీక్షలు. కొనసాగుతున్న సహకార సంఘ ఉద్యోగుల ఆందోళన నిలిచిపోతున్న లావాదేవీలు అవస్థలు పడుతున్న అన్నదాతలు -
ఉత్సాహంగా గ్రీన్ హార్ట్ ఫుల్నెస్ 2కే రన్
ప్రొద్దుటూరు కల్చరల్: ఫిట్ ఇండియాలో భాగంగా శ్రీరామచంద్రమిషన్, రోటరీ క్లబ్, రోటరీ కంటి ఆస్పత్రి, మిడ్ టౌన్ రోటరీ క్లబ్ సంయుక్త ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన గ్రీన్ హార్ట్ఫుల్నెస్ 2కే రన్ ఉత్సాహంగా సాగింది. స్థానిక మున్సిపల్ కార్యాలయం వద్ద గ్రీన్ హార్ట్ఫుల్ నెస్ 2కే రన్ను డీఎస్పీ భావన, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గ్రీన్ హార్ట్ఫుల్నెస్ కార్యక్రమం ద్వారా పర్యావరణ పరిరక్షణ కోసం మొక్కల పెంపకం, నిషేధిత ప్లాస్టిక్ వస్తువులపై అవగాహన కల్పించడం అభినందనీయమన్నారు. ప్రతి ఒక్కరూ తమ వంతుగా మొక్కలను నాటి పరిరక్షించాలని తెలిపారు. నిషేధిత ప్లాస్టిక్ వస్తువుల వాడకాన్ని తగ్గించి పర్యావరణాన్ని కాపాడాలని సూచించారు. డాక్టర్ వైవీ స్వరూప్ కుమార్ఱెడ్డి, శ్రీరామచంద్రమిషన్ జోనల్ కోఆర్డినేటర్ ఎన్.బాబు రామచంద్ర, రోటరీక్లబ్ ప్రెసిడెంట్ గజ్జల వెంకటేశ్వరరెడ్డి మాట్లాడుతూ ప్రకృతిని కాపాడి భావితరాలకు అందించడం మనందరి బాధ్యత అన్నారు. ధ్యానం ద్వారా మనిషి మానసిక వికాసం పొందుతారన్నారు. అనంతరం వికసిత్ భారత్ ప్రతిజ్ఞ చేశారు. మున్సిపల్ కార్యాలయం నుంచి ప్రారంభమైన 2కే రన్ పుట్టపర్తి సర్కిల్కు చేరుకుని అక్కడ మానవ హారంగా ఏర్పడి పర్యావరణ పరిరక్షణ నినాదాలు చేశారు. శ్రీకృష్ణాలయం ఆవరణలో అల్పాహారం, 250 జామ, నేరేడు, ఔషధ గుణాలు కలిగిన మొక్కలను ఉచితంగా పంపిణీ చేశారు. ఆప్కాబ్ మాజీ చైర్పర్సన్ ఝాన్సీరాణి,సుధాకర్రెడ్డి, రవిశంకర్, సత్య ప్రవీణ్, రాజశేఖర్, లక్ష్మీకాంతమ్మ తదితరులు విద్యార్థులు పాల్గొన్నారు. -
నియోజకవర్గం సేకరించిన సంతకాలు
సాక్షి ప్రతినిధి, కడప: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజలు నీరాజనం పలికారు. ఊరు–వాడ ప్రభుత్వ వ్యతిరేకత స్పష్టంగా కన్పించింది. జిల్లా వ్యాప్తంగా ఏడు నియోజకవర్గాలల్లో మారుమూల గ్రామాలకు సైతం ఆ పార్టీ శ్రేణులు వెళ్లి నిరసన గళాన్ని కలం ద్వారా వ్యక్త పర్చేలా వ్యవహరించారు. ప్రజావ్యతిరేక విధానాలపై వైఎస్సార్సీపీ ఉద్యమాన్ని గ్రామ స్థాయిలో రగిల్చింది. సంతకాల పత్రులను వాహనాల్లో ఎక్కించి పార్టీ శ్రేణులు జిల్లా కార్యాలయానికి చేరవేశారు. అన్ని నియోజవకర్గాలకు చెందిన 4,80,101 మంది ప్రభుత్వ వైఖరికి వ్యతిరేకంగా సంతకాలు చేసిన ప్రతులతో సోమవారం జిల్లా కేంద్రంలో భారీ ర్యాలీకి సన్నాహాలు చేశారు. మెడికల్ కళాశాలలు ప్రైవేట్పరమైతే పేదలకు వైద్య విద్య కలగానే మిగిలిపోతుందనే ఆవేదనే కోటి సంతకాల్లో భాగస్వామ్యం అయ్యేలా చేసిందని విశ్లేషకులు భావిస్తున్నారు. పేదలు వైద్య విద్యకు దూరం కాకుడదని..... మెడికల్ కళాశాలలు ప్రైవేట్ వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడం వల్ల పేద, మధ్య తరగతి విద్యార్థులకు వైద్య విద్యపై ఆశలు గల్లంతవుతాయనే ఉద్దేశంతో వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణకు పిలుపునిచ్చారు. ఆమేరకు జిల్లాలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ ఉధృతంగా సాగింది. జిల్లా వ్యాప్తంగా 4,80,101 మంది నుంచి సంతకాలు సేకరించారు. పులివెందులలో అన్ని వసతులతో రాజసం ఉట్టి పడుతున్న ప్రభుత్వ మెడికల్ కళాశాల ప్రైవేట్ పరం కానుందని ప్రజలు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అందులో భాగంగానే జిల్లాలో ప్రభుత్వ వైఖరికి నిరసనగా భారీ స్పందన లభించినట్లు పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కాగా సంతకాలు చేసిన ఆ ప్రతులతో నియోజకవర్గ కేంద్రాల్లో ర్యాలీలు చేపట్టి, జిల్లా కేంద్రంలోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి ఇదివరకే చేర్చారు. పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డికి అందజేశారు. నేడు జిల్లా కేంద్రంలోభారీ ర్యాలీకి సన్నాహాలు ఊరు–వాడల్లో ఉద్యమ వేడి రగిల్చిన వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణకు అనూహ్య స్పందన ప్రతులను జిల్లా కేంద్రానికి చేర్చిన శ్రేణులు బద్వేల్ 60,000 కడప 70,000 కమలాపురం 60,000 మైదుకూరు 50,000 ప్రొద్దుటూరు 1,00,200 జమ్మలమడుగు 49,700 పులివెందుల 90,201 మొత్తం 4,80,101 -
● ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా చేపట్టిన కోటి సంతకాల నిరసన కార్యక్రమంలో భాగంగా జిల్లా కేంద్రంలో సోమవారం భారీ ర్యాలీకి ఏర్పాట్లు పూర్తి చేశారు. జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు పెద్ద ఎత్తున తరలిరానున్నట్లు తెలుస్తోంది. ఉదయం 10గంటలకు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి ర్యాలీగా ప్రారంభమై కోటిరెడ్డి సర్కిల్ మీదుగా ఎన్టీఆర్ సర్కిల్, సెవెన్ రోడ్స్ సర్కిల్ మీదుగా హెడ్ పోస్టాఫీసు చేరుకొని అక్కడున్న దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి నివాళులు అర్పించి, జిల్లా కేంద్రం నుంచి సంతకాల ప్రతులను పార్టీ కేంద్ర కార్యాలయానికి పంపనున్నారు. ఈకార్యక్రమంలో జిల్లా వ్యాప్తంగా ఉన్న వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజాప్రతినిధులు భారీ స్థాయిలో పాల్గొననున్నారు. -
16 నుంచి కూచ్బెహర్ క్రికెట్ టోర్నీ
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప వేదికగా ఈ నెల 16 నుంచి 19 వరకు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో బీసీసీఐ అండర్–19 కూచ్బెహర్ ట్రోఫీ 2025–26 టోర్నమెంట్ జరగనుంది. ఈ విషయాన్ని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆంధ్ర–ఉత్తరఖండ్ రాష్ట్రాల జట్ల మధ్య మ్యాచ్ జరుగుతుందని ఆయన పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 15వతేదీన ఉదయం 10.30 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఆ సంస్థ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండి దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ సదవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న శ్రీ అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అమ్మవారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. బోనాలు సమర్పించి తలనీలాలు అర్పించారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు రావడంతో ఆలయ ప్రాంగణం కిటకిటలాడింది. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: చింతకొమ్మదిన్నె మండలం నారాయణ రెసిడెన్షియల్ పాఠశాలలో జిల్లా ఖోఖో సంఘం ఆధ్వర్యంలో ఈ నెల 16న జిల్లా స్థాయి జూనియర్స్, సీనియర్స్ విభాగంలో ఎంపికలు జరగనున్నాయి. ఈ విషయాన్ని సంఘం అధ్యక్ష, కార్యదర్శులు కె.రామ సుబ్బారెడ్డి, నరేంద్ర ఆదివారం ఓ ప్రకటనలో పేర్కొన్నారు. జూనియర్స్ విభాగానికి సంబంధించి 2008 జనవరి 1 తర్వాత పుట్టి 18 సంవత్సరాల లోపు వయస్సు వారు అర్హులు అన్నారు. 18 సంవత్సరాల పైబడి వయసున్న వారు సీనియర్ విభాగానికి అర్హులు అని తెలిపారు. ఈనెల 19, 20 ,21వ తేదీల్లో ప్రకాశం జిల్లా జే. పంగులూరులో జరిగే పోటీల్లో జూనియర్ జట్టు క్రీడాకారులు , ఈనెల 24 నుంచి 26 వరకు కృష్ణాజిల్లా గుడివాడలో జరిగే రాష్ట్రస్థాయి ఖోఖో పోటీల్లో సీనియర్స్ జట్టుకు ఎంపికై న వారు పాల్గొనాల్సి ఉంటుందన్నారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్ కు కాల్ చేయవచ్చని డీఆర్వో తెలిపారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను సోమవారం సభాభవన్ లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో విశ్వేశ్వర నాయుడు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్ వెబ్సైట్లో నమోదు చేసుకోవచ్చన్నారు. ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్) అర్జీల స్వీకరణ కార్యక్రమాన్ని జిల్లా కేంద్రంతో పాటు మండల, మున్సిపల్ స్థాయిలో కూడా నిర్వహిస్తామన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం సోమ వారం ఉదయం 9.30 నుంచి 10 గంటల వరకు జరుగుతుందన్నారు.ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చునన్నారు. -
ధర్నాను విజయవంతం చేయాలి
సహకార సంఘాల్లో పనిచేసే ఉద్యోగుల సమస్యలను పరిష్కరించాలని జనవరి 5వ తేదీ విజయవాడ ధర్నా చౌక్ వద్ద చేపట్టనున్న ధర్నాను విజయవంతం చేయాలి. ఉద్యోగులకిచ్చిన హామీలు అమలు చేయాల్సి ఉండగా ఆ దిశగా చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడంలేదు. – ఎన్.సుధీర్రెడ్డి, ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్బ్యాంకు జిల్లా అధ్యక్షుడుసమస్యలు పరిష్కరించాలి రాష్ట్రవ్యాప్తంగా పీఏసీఎస్లలో పనిచేస్తున్న ఉద్యోగులు సమస్యల పరిష్కారం కోసం పోరాడుతున్నారు.చంద్రబాబు ప్రభుత్వం వీరి గరించి పట్టించుకోవడంలేదు. ఇప్పటికైనా స్పందించాలి. ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి చర్యలు తీసుకోవాలి. – జి. నారాయణరెడ్డి, ఏపీ కో–ఆపరేటివ్ సెంట్రల్ బ్యాంకు ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర కార్యనిర్వాహక అధ్యక్షుడు. -
విద్యారంగంలో వికటిస్తున్న ప్రయోగాలు
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలోని పాఠశాల విద్యా రంగంలో అధికారులు తీసుకుంటున్న నిర్ణయాలు, చేస్తున్న ప్రయోగాలు వికటిస్తున్నాయని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ అభిప్రాయపడ్డారు. కడప నగరంలోని జిల్లా పరిషత్తు సమావేశ మందిరంలో శనివారం ఎస్టీయూ 79వ రాష్ట్ర కౌన్సిల్ సమావేశాలు నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం విద్యారంగంలో నూతన పోకడలకు పోకుండా పాఠశాలల్లో గుణాత్మక విద్య సాధనకు తగిన తోడ్పాటును ఉపాధ్యాయులకు అందిస్తుందని ఆశించామన్నారు. కానీ 2025 జూన్ నుంచి పాఠశాల విద్యారంగం ప్రయోగాలకు లోనవుతోందన్నారు. ఉపాధ్యాయుడికి బోధనా సమయాన్ని ఇవ్వకుండా పాఠశాల నిర్వహణకే పరిమితం చేస్తూ తీసుకుంటున్న నిర్ణయాలు సగటు ఉపాధ్యాయులను ఆందోళన కలిగిస్తున్నాయన్నారు. ఎస్ఎస్సి యాక్షన్ ప్లాన్ పేరుతో కేవలం ఒక తరగతి పైనే సగం విద్యా సంవత్సరం దృష్టి పెట్టి మిగతా తరగతులను నిర్లక్ష్యం చేయడం సరైన పద్ధతి కాదన్నారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మల్లు రఘునాథరెడ్డి మాట్లాడుతూ సిలబస్కు సంబంధం లేని పద్ధతిలో ప్రశ్నాపత్రాలను రూపొందించి ఉపాధ్యాయులు తయారు చేసిన ప్రశ్నాపత్రాలను పక్కనపెట్టి ప్రధమ్ అనే ఎన్జీఓ సంస్థ ద్వారా ప్రశ్నా పత్రాలు తయారు చేయించడంలో ఉన్న ఆంతర్యం ఏమిటో అర్థం కాలేదన్నారు. ఆ ప్రశ్నల ద్వారా మూల్యాంకనం చేపట్టడం అనేది అటు విద్యార్థులకు ఇటు ఉపాధ్యాయులకు గందరగోళంగా మారిందన్నారు. జూన్ నెలలో బదిలీలు పూర్తి చేసినప్పటికీ ఇప్పటికీ పది నుంచి పదిహేను శాతం మంది రిలీవర్లు లేక అదే స్థానాల్లో కొనసాగుతున్నారన్నారు. జిల్లా విద్యాశాఖ అధికారులు అకడమిక్ ఇన్స్ట్రక్టర్ల నియామకం కోసం ప్రతిపాదనలు పంపితే కేవలం 30 శాతం మాత్రమే అనుమతిస్తూ కమిషనర్ నిర్ణయించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో రాష్ట్ర ఆర్థిక కార్యదర్శి కోటేశ్వరరావు, ఉపాధ్యాయ చీఫ్ ఎడిటర్ గాజుల నాగేశ్వరరావు, సంయుక్త అధ్యక్షులు సురేష్బాబు, నాగిరెడ్డి, శివప్రసాద్, రాష్ట్ర నాయకులు బాల గంగిరెడ్డి, ఇలియాస్ బాషా, రమణారెడ్డి, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సంగమేశ్వర్ రెడ్డి, పాలకొండయ్య, నాయకుడు సుబ్రహ్మణ్యంతోపాటు రాష్ట్రంలోని 25 జిల్లాల నుంచి రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వివిధ జిల్లాల అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు ఈ సమావేశంలో పాల్గొన్నారు.ఎస్టీయు రాష్ట్ర అధ్యక్షుడు సాయి శ్రీనివాస్ -
లోకపావనీ.. పాహిమాం
● అంగరంగ వైభవంగా ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాలు ● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● పెద్ద ఎత్తున తరలి వచ్చిన భక్తజనంబ్రహ్మంగారిమఠం : దేవీ శరణం.. లోకమాతా పాహిమాం.. జగజ్జననీ రక్షమాం అంటూ భక్తులు వేడుకున్నారు. బ్రహ్మంగారిమఠం భక్తజన సంద్రంగా మారింది. శ్రీఈశ్వరీదేవి ఆరాధన గురుపూజ మహోత్సవాలు మూడు రోజులుగా కనుల పండువగా జరుగుతున్నాయి. అమ్మవారు సజీవ సమాధి నిష్ట వహించిన రోజైన శనివారం కార్యక్రమాలను అంగరంగ వైభవంగా నిర్వహించారు. అమ్మవారి మాలధారులు ఇరుముడి సమర్పించారు. పట్టు వస్త్రాలు సమర్పణ రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు ఆధ్వర్యంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన మహిళా భక్తులు అమ్మవారికి పట్టు వస్త్రాలు, పసుపు, కుంకుమ సమర్పించారు. శ్రీ విశ్వకర్మ విరాట్ భవన్ నుంచి వారు ఊరేగింపుగా అమ్మ సన్నిధానికి చేరుకున్నారు. ఈ సందర్భంగా నిర్వహించిన కోలాటం తదితర సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ధ్వజ స్తంభం వద్ద 108 దీపాలను వెలిగించి, 108 కొబ్బరి కాయలు కొట్టి త్వరితగతిన లోకపావని ఆలయ పునః నిర్మాణం జరగాలని ప్రార్థించారు. అలాగే శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి, మాతా గోవిందమాంబకు పట్టువస్త్రాలు సమర్పించారు. విశ్వబ్రాహ్మణ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు అంగలకుదుటి సుశీల నేతృత్వంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో గౌరవాధ్యక్షురాలు తాళబత్తుల వాసవి, ప్రధాన కార్యదర్శి లక్కోజు సుజాత, బాపట్ల జిల్లా మహిళా అధ్యక్షురాలు భారతి తదితరులు పాల్గొన్నారు. మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి, రాజరాజేశ్వరిదేవి దంపతులు పూజ కార్యక్రమాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కాణిపాకం వరసిద్ధి వినాయక ఆలయ ట్రస్టు బోర్డు మెంబర్ వడ్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం ప్రధాన కార్యదర్శి దువ్వూరి నరసింహాచారి, న్యాయ సలహా కమిటీ చైర్మన్ గురుప్రసాద్, క్రమశిక్షణ కమిటీ చైర్మన్ పెద్దబాబు, కోనసీమ జిల్లా వైస్ ప్రెసిడెంట్ వరదసత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. కమనీయంగా దీక్షా బంధన అలంకరణ మధ్యాహ్నం లోకపావని దీక్షా బంధన అలంకరణలో భక్తులకు దర్శనమిచ్చారు. ఈ సందర్భంగా అమ్మవారిని శోభాయమానంగా అలంకరించారు. అల్పాహారం, అన్నదాన కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. రాత్రి పండ్లతో తులాభారం నిర్వహించి, వాటిని భక్తులకు పంపిణీ చేశారు. సింహ వాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. సహస్ర దీపాలంకరణ వెలుగుతో దేవస్థానం కాంతులీనింది. కర్ణాటక రాష్ట్రం బళ్లారికి చెందిన ప్రగతి నృత్యాలయ కళాట్రస్ట్ బృందం ప్రదర్శించిన నృత్యం ఆకట్టుకుంది. గుంటూరుకు చెందిన కుమారి తిరువళ్లూరి దివ్యశరణి భాగవతారిణి హరికథా గానం అలరించింది. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. మఠం నిర్వాహకులు, అన్నదాన సత్రాల వారు వసతి సౌకర్యాలు కల్పించారు. ఆలయ ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో మఠం సిబ్బంది, అమ్మవారి శిష్యులు ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో దాతలు వొమ్మిన చిన్న ఈశ్వరయ్యశ్రేష్టి, మారంరెడ్డి రామనారాయణరెడ్డి, కడారు విశ్వనాథాచార్యులు, అంకిరెడ్డిపల్లె ఓబుల్రెడ్డి, కోడూరు శ్రీనివాస రావు, చెరువుపల్లి వీరయ్యస్వామి, చేవూరి రామస్వామి తదితరులు పాల్గొన్నారు.దర్శించుకున్న మాజీ ఎమ్మెల్యే శ్రీ ఈశ్వరీదేవి ఆరాధనోత్సవాల్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డి పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ప్రత్యేక పూజ కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామిని కలిసి ఆశీస్సులు తీసుకున్నారు. ఆలయ నిర్వాహకులు మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లి రఘురామిరెడ్డిని సత్కరించారు. తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు రత్నకుమార్ యాదవ్, ఎంపీటీసీ మనోహరాచారి, నాయకులు భాస్కరరెడ్డి, ఉమాపతి, సుబ్బారెడ్డి, చంద్రఓబుల్రెడ్డి, జోగయ్య పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
ముద్దనూరు : మండలంలోని యామవరం గ్రామానికి చెందిన ఓ యువతి అదృశ్యమైనట్లు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఏఎస్ఐ రమేష్ సమాచారం మేరకు యామవరానికి చెందిన యువతి ఇంటర్మీడియట్ చదువుతోంది. శుక్రవారం రాత్రి ఆమె ఇంటిలో ఉంది. శనివారం తెల్లవారుజాము నుంచి కనిపించలేదు. చుట్టుపక్కల విచారించినా ఫలితం లేకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. అదనపు కట్నం కోసం వేధింపులపై కేసుముద్దనూరు : భర్తతో పాటు బంధువులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నారని భార్య ఫిర్యాదు మేరకు శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు మండలంలోని కొర్రపాడు గ్రామానికి చెందిన గంగాకృష్ణవేణికి ఓబుళాపురం గ్రామానికి చెందిన గణేష్ అనే వ్యక్తితో సమారు 6నెలల క్రితం వివాహమైంది. వివాహ సమయంలో 13 తులాల బంగారు కట్నం కింద గణేష్కు ఇచ్చారు. అయితే గత కొంత కాలంనుంచి అదనపు కట్నం తేవాలని భర్త గణేష్, అతని బంధువులు తనను వేధిస్తున్నారని గంగాకృష్ణవేణి ఫిర్యాదు చేసింది. దీంతో గణేష్తో పాటు మరో నలుగురిపై అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. కుక్కల బారినపడి పొడదుప్పి మృతిఅట్లూరు : మండల పరిధిలోని కళావాండ్లపల్లి గ్రామం కుక్కల బారిన పడి పొడదుప్పి మృతి చెందింది. స్థానికుల వివరాల మేరకు శనివారం ఉదయం లంకమల అభయారణ్యం నుంచి కళావాండ్లపల్లి గ్రామం వైపు కొన్ని పొడదుప్పిలు గుంపుగా రావడంతో కుక్కలు వెంబడించాయి. ఓ పొడదుప్పి స్కూల్ ఆవరణలోకి ఎగిరి దూకింది. కుక్కలు దుప్పిని వెంబడించి గాయపరిచాయి. స్థానికులు గుర్తించి ఎస్ఐ నాగకీర్తనకు సమాచారం ఇవ్వడంతో ఆమె సిద్ధవటం ఫారెస్టు రేంజ్ అధికారి కళావతికి సమాచారం ఇచ్చారు. రేంజ్ అధికారి ఆదేశాల మేరకు సిబ్బంది సంఘటన స్థలానికి వచ్చి పరిశీలించగా అప్పటికే దుప్పి మృతి చెంది ఉంది. దీంతో పోస్టుమార్టం చేసి అడవిలో ఖననం చేశారు. వీఆర్ఏల సమస్యలు పరిష్కరించాలికడప వైఎస్ఆర్ సర్కిల్ : గ్రామ రెవెన్యూ సహాయకుల సమస్యలు పరిష్కారమయ్యేంతవరకు పోరాటాలు నిర్వహిస్తామని ఏపీ వీఆర్ఏ జేఏసీ రాష్ట్ర వైస్ చైర్మన్ నల్లిపోగు నాగేశం, జేఏసీ స్టేట్ సెక్రటరీ కొమ్మద్ది ఈశ్వరయ్య పేర్కొన్నారు. శనివారం నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ వీఆర్ఏల సమస్యలపై ఈనెల 16న సీసీఎల్ఏ చీఫ్ కమిషనర్ ప్రధాన కార్యాలయం ఎదుట మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి వీఆర్ఏల సమస్యల పరిష్కారంపై చిత్తశుద్ధి లేదన్నారు. తెలంగాణ రాష్ట్ర తరహాలో వీఆర్ఏలకు పే స్కేలు ఇవ్వాలని, కనీస వేతనం రూ. 26 వేలు బేసిక్ స్కేల్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో జిల్లా జేఏసీ అధ్యక్షుడు కె.పుల్లయ్య ఉపాధ్యక్షుడు షేక్ బాషా పాల్గొన్నారు. ఇంటర్ విద్యార్థిపై దాడి మదనపల్లె రూరల్ : ఇంటర్ విద్యార్థిపై కొందరు వ్యక్తులు మూకుమ్మడిగా దాడిచేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. చిత్తూరుజిల్లా పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె పంచాయతీ కృష్ణాపురానికి చెందిన రాజబాబు, కళావతి దంపతుల కుమారుడు రెడ్డిప్రసాద్(18) స్థానికంగా ఓ ప్రైవేట్ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కాలేజీ వదిలిన తర్వాత రెడ్డిప్రసాద్ గ్రామానికి చెందిన విద్యార్థినిని మదనపల్లెకు చెందిన ఓ యువకుడు టీజీంగ్ చేశాడు. ఈ విషయమై రెడ్డిప్రసాద్ అతడిని నిలదీశాడు. దీంతో యువకుడు మరి కొందరితో కలిసి గుంపుగా వచ్చి రెడ్డిప్రసాద్ కోమటివానిచెరువు కట్టపై నడిచి వస్తుండగా, విచక్షణారహితంగా దాడిచేసి కొట్టారు. చంపేస్తామంటూ బెదిరించారు. దాడిలో రెడ్డిప్రసాద్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకోగా గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కడప– బెంగళూరు రైల్వేలైన్ ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఇటీవల జరిగిన రైల్వే అధికారుల సమావేశంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ముద్దనూరు– ముదిగుబ్బ మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మాణం జరపాలని చేసిన ప్రతిపాదనపై అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర డిమాండ్ చేశారు. శనివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కడప– బెంగళూరు రైలు మార్గంపై ఇదివరకే పెండ్లిమర్రి, రాయచోటి, మదనపల్లి మీదుగా ఒక ప్రాజెక్టుకు కేంద్రం ఆమోదం తెలిపిందన్నారు. జిల్లాలో విస్తారంగా పండించే అరటి, మామిడి, చీనీ, బొప్పాయి, చామంతి పంటల ఎగుమతికి పెండ్లిమర్రి మీదుగా కడప– బెంగళూరు రైల్వే లైను నిర్మాణానికి 2008లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రణాళిక రూపొందించారన్నారు. రూ.2వేల కోట్ల అంచనా వ్యయంతో 157 కిలో మీటర్ల మేర చేపట్టాల్సిన పనులను వైఎస్సార్ మరణానంతరం అటకెక్కించారన్నారు. అనుమతులున్న పాత ప్రాజెక్టుకు రూ. 2వేల కోట్లు కేటాయిస్తే రైల్వే పనులు పూర్తి చేయడానికి అవకాశం ఉన్నదన్నారు. కానీ ఆ దిశగా ఆలోచించకుండా కొత్త ప్రాజెక్టు ప్రతిపాదన తీసుకురావడంలోని ఆంతర్యమేమిటన్నారు. పాత ప్రాజెక్టుకు కేటాయించిన వందల కోట్ల నిధులు నిరుపయోగం కావాల్సిందేనా అని ప్రశ్నించారు. ఇలాంటి సందర్భాలలో అఖిలపక్ష సమావేశం నిర్వహించి అందరి అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం ఉందని ఆయన పేర్కొన్నారు. దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా..చెన్నూరు : శబరిమలకు వెళ్లి వస్తుండగా శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు గాయాల పాలయ్యారు. చెన్నూరుకు చెందిన నలుగురు కేరళ రాష్ట్రం శబరిమలలోని అయ్యప్పస్వామిని దర్శించుకున్నారు. తిరుగు ప్రయాణంలో ఘాట్ రోడ్డులో వర్షం వల్ల ట్రాక్టర్ అదుపు తప్పి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో వారు నలుగురూ గాయపడ్డారు. వారిని అక్కడి పోలీసులు ఆస్పత్రికి తరలించారు. గాయపడిన సునీతకు వైద్యులు చికిత్స అందిస్తున్నారు. మిగిలిన ముగ్గురికి ప్రాథమిక చికిత్స అందించి, డిశ్చార్జ్ చేశారు. ఎవరికీ ప్రాణాపాయం లేదని పోలీసులు తెలిపారు. నాకౌట్ దశకు సాఫ్ట్బాల్ పోటీలు వీరవాసరం : వీరవాసరం ఎంఆర్కే జడ్పీహెచ్ఎస్ పాఠశాల క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న 69వ రాష్ట్రస్థాయి స్కూల్ గేమ్స్ అండర్ 17 సాఫ్ట్ బాల్ పోటీలు నాకౌట్ దశకు చేరుకున్నాయని పశ్చిమగోదావరి జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి పీఎస్ఎన్ మల్లేశ్వరరావు, దాసరి సునీత తెలిపారు. రెండవ రోజు బాలికల పోటీలో వైఎస్సార్ కడప జట్టు శ్రీకాకుళం జట్టుపై 08:04 తేడాతో గెలుపొందింది. బాలికల క్వార్టర్ ఫైనల్ పోటీలో కడప జట్టు గుంటూరు జట్టుపై విజయం సాధించి సెమీఫైనల్లోకి ప్రవేశించింది. బాలుర పోటీలో కడప జట్టు కృష్ణా జిల్లా జట్టుపై 01–00 తేడాతో విజయం సాధించింది. బాలుర క్వార్టర్ ఫైనల్ పోటీలో గుంటూరు జట్టు కడప జట్టుపై గెలిచి సెమీఫైనల్లోకి ప్రవేశించింది.చికిత్స పొందుతున్న మహిళచికిత్స పొందుతున్న బాలుడురోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలు -
● కల్యాణ వైభోగమే..
● కనుల పండువగా శ్రీనివాస కల్యాణం ● మార్మోగిన గోవింద నామస్మరణప్రొద్దుటూరు కల్చరల్ : తిరుమల తిరుపతి దేవస్థానం పర్యవేక్షణలో గోవిందమాల భక్త బృందం ఆధ్వర్యంలో అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో శనివారం అఖిలాండకోటి బ్రహ్మాండ నాయకుడు సప్తశైల వాసుడైన శ్రీనివాసుని కల్యాణం వైభవంగా జరిగింది. ప్రత్యేకంగా ఆలయం నమూనాతో రూపొందించి రంగురంగుల పూలతో అలంకరించిన కల్యాణ వేదికపై శ్రీదేవి, భూదేవి సమేత శ్రీనివాసుని ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన వేదపండితులు దేవతా మూర్తులకు విశేష పూజాకార్యక్రమాలను నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. రుత్వికుల మంత్రోచ్ఛారణలు, మంగళవాయిద్యాల మధ్య స్వామివారి కల్యాణోత్సవాన్ని కనుల పండువగా నిర్వహించారు. స్వామివారి కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భారీ ఎల్ఈడీ స్క్రీన్లను ఏర్పాటు చేశారు. గోవింద నామ స్మరణలతో ఆ ప్రాంతం మార్మోగింది. 23 కౌంటర్లను ఏర్పాటు చేసి దాదాపు 10 వేల మందిపైగా భక్తులకు అన్నప్రసాద వినియోగం చేశారు. టీటీడీ కళాకారులు అన్నమాచార్య సంకీర్తనలను ఆలపించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు టంగుటూరు మారుతిప్రసాద్, కొత్తపల్లె సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
సమస్యల పరిష్కారంలో కొరవడిన స్పష్టత
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో ఉద్యోగ, ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభుత్వంలో స్పష్టత కొరవడిందని యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ ఆరోపించారు. శనివారం కడపలోని యూటీఎఫ్ భవన్లో జరిగిన ఆ సంఘం జిల్లా కార్యవర్గ సమావేశంలో ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కూటమి పెద్దలు ఉద్యోగులకు ఇచ్చిన హామీ మేరకు తమకు రావాల్సిన ఆర్థిక బకాయిలను చెల్లించడంతోపాటు 12వ పీఆర్సీని అమలు చేసి తమ ఆర్థిక పరిస్థితిని మెరుగు పరుస్తారని ఆశించారన్నారు. అయితే పీఆర్సీ అమలు సంగతి అటుంచితే, పీఆర్సీ చైర్మన్ను నియమించడంలో సైతం కాలయాపన చేస్తున్నారన్నారు. పీఆర్సీ గడువు ముగిసి రెండున్నరేళ్లు కావస్తున్నా ప్రభుత్వం మీనమేషాలు లెక్కించడం తగదన్నారు. ఉద్యోగుల ఆర్థిక బకాయిలను ఆరు మాసాలలోగా రోడ్ మ్యాప్ ప్రకటించి చెల్లిస్తామన్న ప్రభుత్వం ఇప్పటివరకు కేవలం 8500 కోట్ల రూపాయల బకాయిలను మాత్రమే చెల్లించిందని, మిగతా 25 వేల కోట్ల బకాయిల చెల్లింపునకు చర్యలు చేపట్టాలన్నారు. సుప్రీంకోర్టు తీర్పును ఆసరాగా చేసుకుని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్షను నిర్వహించడం తగదన్నారు. ఈ సమావేశంలో యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి బి.లక్ష్మి రాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు, జిల్లా సహాధ్యక్షుడు వై.రవికుమార్, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు ఎస్.ఎజాస్ అహ్మద్, ఎ.శ్రీనివాసులు, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు డి.క్రిష్ణారెడ్డి, ఐక్య ఉపాధ్యాయ జిల్లా కన్వీనర్ జి.గోపీనాథ్ జిల్లా కార్యవర్గ సభ్యుడు సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు.యూటీఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.ఎస్.ఎస్.ప్రసాద్ -
రాయచోటి వద్దు.. కడప ముద్దు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట చెక్పోస్ట్ వద్ద జేఏసీ నాయకులు శనివారం రాయచోటి వద్దు.. కడప ముద్దు అంటూ వంటావార్పు కార్యక్రమం నిర్వహించారు. జేఏసీ నాయకులు మాట్లాడుతూ ప్రజాభీష్టం మేరకే ప్రభుత్వ నిర్ణయం తీసుకోవాలన్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటి కేంద్రంగా సిద్దవటం మండలాన్ని కలపడం సహేతుకంగా లేదన్నారు. సిద్దవటం మండలం కడపలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అలాగే మాధవరం–1 గ్రామంలో మహిళా నాయకురాలు ఏకుల రాజేశ్వరిరెడ్డి, కేవీ సుబ్బయ్య, నరసింహారెడ్డి, తుర్రా ప్రతాప్, రెడ్డెయ్య రిలే నిరాహారదీక్షలో పాల్గొన్నారు. ఈ సందర్బంగా విద్యార్థులు మహిళలు, జేఏసీ నాయకులు కడప–చైన్నె జాతీయ రహదారిలో భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీకి రాజంపేట జనసేన నాయకుడు అతికారి కృష్ణ సంఘీభావం తెలిపారు. కాగా ఇదే సమయంలో తిరుపతి నుంచి కడప వైపు వెళ్తున్న ఇన్చార్జి మంత్రి సవితమ్మ కారును ఆపి సిద్దవటం మండలాన్ని కడపలోనే కొనసాగించాలని జేఏసీ నాయకులు విజ్ఞప్తి చేశారు. అందుకు మంత్రి సానుకూలంగా స్పందించారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నాయకులు అనిల్కుమార్రెడ్డి, చలపాటి చంద్ర, వినోద్, నాయబ్ రసూల్, శివయ్య, వెంకట్, రవిశంకర్, డాక్టర్ లక్ష్మీనారాయణ పాల్గొన్నారు. కడప జిల్లానే ఆమోదయోగ్యం ఒంటిమిట్ట : సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలు కడప జిల్లాలోనే కొనసాగించడమే అన్ని విధాలా ఆమోదయోగ్యం అని వైఎస్సార్సీపీ రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్ రెడ్డి అన్నారు. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను అన్నమయ్య జిల్లాలో విలీనం చేయడాన్ని వ్యతిరేకిస్తూ శనివారం కోదండ రామాలయం వెనుక వైపు 8వ రోజు కొనసాగిన జేఏసీ రిలే నిరాహార దీక్షలో ఆయనతో పాటు మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. పిడుగు వెంకట శేషారెడ్డి, సుంకేసుల సుబ్బరాయుడు, కో–ఆప్షన్ మెంబర్ షేక్ మహ్మద్ రఫీ, బత్తల సుబ్బనరసయ్య, పందేటి చంద్రశేఖర్ రాజు దీక్షలో కూర్చున్నారు. ప్రజల అభిప్రాయాలను గౌరవించి ఒంటిమిట్ట, సిద్దవటం మండలాలను కడప జిల్లాలోనే కొనసాగించాలని వారు ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు. మండల జేఏసీ అధ్యక్షుడు భవనాసి రామదాసు, ఉపాధ్యక్షుడు పాటూరి గంగిరెడ్డి, జేఏసీ నాయకుడు బాలరాజు శివరాజు, చంద్రసుధాకర్ రెడ్డి, గురుమోహన్ రాజు, సిరిపిరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక కృషి
పదో తరగతి పరీక్షలో ఉత్త మ ఫలితాల సాధనకు ప్ర త్యేక కృషి చేస్తున్నాం. విద్యార్థుల స్టడీ తరువాత నిర్వహించే పరీక్షల్లో సాధించిన మార్కుల ఆధారంగా ఉపాధ్యాయు లందరూ ప్రత్యేక శ్రద్ధ వహిస్తున్నారు. సబ్జెక్టుల వారీగా ఉపాధ్యాయులు విద్యార్థులపై ప్రత్యేక శ్ర ద్ధ తీసుకుంటున్నారు. మా పాఠశాలలో వంద శాతం ఉత్తీర్ణత సాధించేందుకు కృషి చేస్తున్నాం. – వెంకట సుబ్బారెడ్డి, జెడ్పీ హైస్కూల్, బద్వేల్ జిల్లా వ్యాప్తంగా అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో వంద రోజుల ప్రణాళిక పకడ్బందీగా అమలు చేస్తున్నాం. తరచూ పాఠశాలలను సందర్శిస్తున్నాం. ఉపాధ్యాయులు విద్యార్థులు ఏ అంశాల్లో వెనుకబడి ఉన్నారో పరిశీలిస్తున్నారు. ఉపాధ్యాయులకు మేము తగిన సూచనలు, సలహాలు ఇస్తున్నాం. అందరి సమష్టి కృషితో ఉత్తమ ఫలితాలు సాధించేందుకు కృషి చేస్తున్నాం. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి -
అటల్ ఆశయం మోదీతో సాధ్యం
కడప (కోటిరెడ్డి సర్కిల్) : మాజీ ప్రధాని అటల్ బిహారి వాజ్పేయి హయాంలో వచ్చిన స్వర్ణ చతుర్భుజి హైవే ప్రాజెక్టు భారతదేశ దశను మార్చిందని కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ అన్నారు. అటల్–మోదీ సుపరిపాలన యాత్ర కడప నగరానికి చేరుకుంది. ఈ సందర్భంగా ఎర్రముక్కపల్లి కూడలిలో శనివారం కూటమి నేతలు కలిసి వాజ్పేయి విగ్రహాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన బహిరంగ సభలో శ్రీనివాసవర్మ, రాష్ట్ర మంత్రులు సత్యకుమార్, సవిత, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ మాట్లాడుతూ.. దేశంలో సుపరిపాలనకు వాజ్పేయి నాంది పలికారని, ఆయన తీసుకొచ్చిన విధానాలు దేశాభివృద్ధికి మంచి పునాది వేశాయని గుర్తు చేశారు. ఒక సాధారణ కుటుంబంలో జన్మించిన వాజ్పేయి స్వశక్తితో ఎదిగి దేశానికి నాయకత్వం వహించారన్నారు. ఆయన బాటలోనే ప్రధాని నరేంద్ర మోదీ భారతదేశాన్ని 2047 నాటికి నంబర్ 1గా చేసేందుకు పని చేస్తున్నారన్నారు. అంతకుముందు వినాయక నగర్ నుంచి ఎర్రముక్కపల్లి సర్కిల్ వరకు భారీగా ర్యాలీ నిర్వహించారు. బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో బీజేపీ నాయకులు వంగలి శశిభూషణ్రెడ్డి, బాలకృష్ణ యాదవ్, నాగోతు రమేష్ నాయుడు, ఆదూరి శాదరమ్మ, వేణువర్ధన్ రెడ్డి, దయాకర్రెడ్డి, ప్రవీణ్ నాయుడు, చలపతి, బొమ్మన విజయ్, భాను ప్రకాష్, ఆదినారాయణరెడ్డి, బీటెక్ రవి, సుంకర శ్రీనివాస్, శ్రీనివాసులరెడ్డి, హరిప్రసాద్, కూటమి నేతలు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీని బలీయమైన శక్తిగా మార్చాలి
● రాష్ట్రానికి ఆదర్శంగా కడప పార్లమెంట్ను తయారు చేయాలి ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి వెల్లడి కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీని బలీయమైన శక్తిగా తయారు చేయాలని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన జిల్లా స్థాయి కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ అధికారం కోల్పోయినా ప్రజల్లోనే ఉంటూ.. వారి సమస్యల పరిష్కారానికి పోరాడే ఏకై క పార్టీ వైఎస్సార్సీపీయేనన్నారు. ఎంతో దూరదృష్టితో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కాలేజీలు మంజూరు చేయిస్తే, చంద్రబాబు ప్రభుత్వం పీపీపీ పద్ధతిలో అమ్మేయాలని చూస్తోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ నెల రోజులుగా పోరాటం చేస్తున్నామని, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణకు ప్రజల నుంచి విశేష స్పందన లభించిందన్నారు. లక్ష్యానికి మించి సంతకాలు సేకరించామని, ఈనెల 10వ తేది 4.80 లక్షలకు పైగా సంతకాల పత్రాలు జిల్లా కేంద్రానికి చేరాయన్నారు. 18వ తేదీలోపు అన్ని గ్రామ, మండల, జిల్లా కమిటీలను పూర్తి చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక గ్రామ స్థాయిలో తీసుకున్న నిర్ణయాల మేరకు ప్రభుత్వ పాలన జరుగుతుందన్నారు. జగనన్న 2.0 ప్రభుత్వంలో కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. 7 నియోజకవర్గాల్లో 95 వేల మందితో కమిటీలు కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి మాట్లాడుతూ కడప పార్లమెంటు పరిధిలోని 7 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 902 యూనిట్లకు కమిటీలు వేస్తే 95 వేల మంది కమిటీ సభ్యులు తయారవుతారన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్ర భాస్కర్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 20 లక్షల మందితో కమిటీలు వేయనున్నట్లు తెలిపారు. ఈ నెల 21వ తేదీన అన్ని గ్రామాలు, వార్డులు, డివిజన్లలో రచ్చబండ కార్యక్రమాలు నిర్వహించాలన్నారు. ఇందులో ముఖ్యంగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతూ, మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా, స్థానిక సమస్యలపై మూడు తీర్మానాలు చేయాలన్నారు. ఆ రోజు 10 గంటలకు ఈ కార్యక్రమాలు ప్రారంభించేలా నియోజకవర్గ సమన్వయకర్తలు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మేయర్ పాకా సురేష్ కుమార్, సీఈసీ మెంబర్ ఏ.మల్లికార్జునరెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా 15న భారీ ర్యాలీ
● అదే రోజు సంతకాల పత్రాలు కేంద్ర కార్యాలయానికి తరలింపు ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి పిలుపు కడప కార్పొరేషన్ : మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా ఈనెల 15వ తేదీన జిల్లా కేంద్రమైన కడపలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ నిర్వహించనున్నట్లు ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి తెలిపారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన అధ్యక్షతన కోర్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పార్టీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు జిల్లా ప్రజల నుంచి అనూహ్య స్పందన లభించిందన్నారు. ప్రతి నియోజకవర్గంలో లక్ష్యానికి మించి 4,80, 201 సంతకాలు సేకరించారని, దీన్ని విజయవంతం చేసిన నియోజకవర్గ ఇన్చార్జులు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో అత్యధికంగా సంతకాలు సేకరించిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డికి ప్రత్యేకంగా అభినందనలు తెలిపారు. సంతకాల పత్రాలను 15వ తేదీ ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్, ఏడురోడ్ల కూడలి, పాత కలెక్టరేట్ మీదుగా తీసుకెళ్లి వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి కేంద్ర కార్యాలయానికి తరలించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున హాజరు కావాలన్నారు. పండుగ వాతావరణంలో ఈ సంతకాలను పంపించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ చైర్మన్ రఘురామిరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు పి.రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వజ్రభాస్కర్రెడ్డి, సీఈసీ మెంబర్ ఏ.మల్లికార్జునరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, యానాదయ్య, డా. సొహైల్, సంబటూరు ప్రసాద్రెడ్డి, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజలకు మెరుగైన పోలీసు సేవలు
కమాండ్ కంట్రోల్ సెంటర్ను ప్రారంభించిన డీఐజీ కోయప్రవీణ్ ప్రొద్దుటూరు క్రైం: కమాండ్ కంట్రోల్ సెంటర్తో ప్రజలు మరింత మెరుగైన పోలీసు సేవలు పొందుతారని కర్నూల్ డీఐజీ కోయప్రవీణ్ తెలిపారు. ప్రొద్దుటూరులోని టూ టౌన్ పోలీస్స్టేషన్ కాంపౌండ్లో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్ను శుక్రవారం డీఐజీ పునఃప్రారంభించారు. గతంలో ఉన్న కమాండ్ కంట్రోల్ సెంటర్లో చాలా వరకు సీసీ కెమెరాలతో పాటు ఇతర విభాగాలు పని చేయలేదు. పట్టణంలోని ప్రధాన సర్కిళ్లలో కూడా సీసీ కెమెరాలు లేవు. బ్లూ కోల్ట్స్ సిబ్బంది మాత్రమే పట్టణంలో బైక్లతో గస్తీ నిర్వహించేవారు. దీంతో డీఎస్పీ భావన, సీఐ సదాశివయ్యల ప్రత్యేక చొరవతో దాతల సహకారంతో కొత్తగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే 8 బ్లూకోల్ట్స్ కొత్త బైక్లను సమకూర్చారు. వీటిని డీఐజీ చేతుల మీదుగా ప్రారంభించారు. కమాండ్ కంట్రోల్ కోసం కృషి చేసిన టూ టౌన్ సీఐ, సిబ్బందికి డీఐజీ ప్రశంసా పత్రాలను అందచేశారు. సహకరించిన దాతలను డీఐజీ సన్మానం చేశారు. అనంతరం డీఐజీ మాట్లాడుతూ రాయలసీమలోనే ప్రొద్దుటూరు వాణిజ్య కేంద్రమని చెప్పారు. అలాంటి పట్టణంలో మెరుగైన, సురక్షితమైన పోలీసు సేవలు అందించాలనే ఉద్దేశంతో దాతల సహకారంతో కమాండ్ కంట్రోల్ సెంటర్ను మరింత అభివృద్ధి చేసి ప్రారంభించామని తెలిపారు. కొత్తగా 123 సీసీ కెమెరాలు, వీడియోవాల్, ఆటోమేటిక్ నంబర్ప్లేట్ రికగ్నేషన్ కెమెరాలు, జీపీఎస్తో అనుసంధానం చేసిన 8 బ్లూకోల్ట్ బైక్లు, ఎల్హెచ్ఎంఎస్ కెమెరాలను నూతన టెక్నాలజీతో ఏర్పాటు చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, అడిషనల్ ఎస్పీ ప్రకాష్బాబు, ప్రొద్దుటూరు డీఎస్పీ భావన, సీఐలు సదాశివయ్య, నాగభూషణం, రాజగోపాల్, వేణుగోపాల్ ఎస్ఐలు రాఘవేంద్రారెడ్డి, సంజీవరెడ్డి, భాస్కర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి (35) మృతదేహం వుంది. అతను ఈనెల 10వ తేదీన తీవ్ర అనారోగ్యంతో కడపలోని ప్రభుత్వాసుపత్రిలో వైద్య పరీక్షల కోసం చేరాడు. చికిత్స పొందుతూ ఈనెల 11న మృతి చెందడంతో మృతదేహాన్ని మార్చురీలో వుంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ప్రొద్దుటూరు క్రైం : స్థానిక జిల్లా ఆస్పత్రి సమీపంలో శుక్రవారం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. శుక్రవారం సాయంత్రం ఆస్పత్రి మెయిన్ గేట్ ఎదురుగా చనిపోయిన అతని మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. అతను ఉదయం నుంచి ఆస్పత్రి పరిసరాల్లోనే ఉన్నాడని స్థానికులు చెబుతున్నారు. అనారోగ్యంతో మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి కుటుంబ సభ్యులు, బంధువులు ఎవరైనా ఉంటే ఔట్పోస్టులో సంప్రదించాలని ఔట్పోస్టు ఇన్చార్జి షబ్బీర్బాషా తెలిపారు. కాలువలో పడి వ్యక్తి మృతి కలసపాడు : కలసపాడులోని పోరుమామిళ్ళ– గిద్దలూరు రోడ్డు కలసపాడు ఆర్సీఎం చర్చి వద్ద ఉన్న తెలుగుగంగ డిస్ట్రిబ్యూటరీ కాలువలో కలసపాడుకు చెందిన షేక్దస్తగిరి (63) మద్యం మ త్తులో పడి మృతి చెందాడు. వివరాలు ఇలా ఉ న్నాయి. కలసపాడుకు చెందిన దస్తగిరి తన భా ర్య 10 సంవత్సరాల క్రితం మృతి చెందడంతో ఒంటరిగా జీవిస్తున్నాడు. ఈయనకు ఇద్దరు కు మారులు, ఒక కుమార్తె ఉన్నారు. ఈయన కలసపాడులోని ఆంజనేయస్వామి ఆలయంలో ఉంటుండే వాడు. ఇటీవల ఆర్సీఎం చర్చి వద్ద ఓ ఇంటిని బాడుగకు తీసుకుని ఉంటున్నాడు. ఈయన గతంలో హమాలీ పని చేసేవాడు. వయసు పైబ డటంతో పని చేయలేక ఒంటరిగా ఉంటున్నాడు. శుక్రవారం కాలువలో దస్తగిరి మృతదేహాన్ని స్థా నికులు గుర్తించి పోలీసులకు తెలిపారు. ఎస్ఐ సు భాన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. మృతు డి కుమార్తె షేక్మాబున్ని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వృద్ధుడి ఆత్మహత్య కొండాపురం : మండల పరిధి కె.సుగుమంచిపల్లె పునరావాస కేంద్రంలోని సీ బ్లాక్లో బుక్కుపట్నం గ్రామానికి చెందిన ఓ వృద్ధుడు కడపు నొప్పి తాళ లేక విషం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పిల్లనాగన్న గారి సుబ్బరాయుడు(67) గురువారం రాత్రి కడపు ఆత్మహత్యకు ప్రయత్నించడంతో తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం అనంతరం కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు డి.అనిల్కుమార్ తెలిపారు. ప్రొద్దుటూరు కల్చరల్ : బెంగాల్ ఎన్నికలను పురస్కరించుకుని ప్రధాన మంత్రి నరేందర మోదీ వందేమాతరం గేయాన్ని వివాదాస్పదం చేయడం విచారకరమని సీపీఐ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య విమర్శించారు. సీపీఐ పార్టీ శత వార్షికోత్సవాల్లో భాగంగా ‘వర్తమాన రాజకీయాలు – కమ్యూనిస్టుల కర్తవ్యం’ అన్న అంశంపై ప్రొద్దుటూరులో ఓ ఫంక్షన్ హాల్లో సదస్సు నిర్వహించారు. మొదట పార్టీ శ్రేణులు మున్సిపల్ కార్యాలయం నుంచి భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం జరిగిన సదస్సులో ఈశ్వరయ్య మాట్లాడుతూ కేరళలో ఎన్నికలు జరిగితే అయ్యప్పస్వామిని, కర్ణాటకలో జరిగితే హిజాబ్ అంశాలను తెరపైకి తెచ్చి ఎన్నికల్లో లబ్ధి పొందడానికి మోదీ ప్రయత్నించారని విమర్శించారు. ఉస్మానియా యూనివర్సిటీ ప్రొఫెసర్ సి.కాసీం మాట్లాడుతూ అన్ని వర్గాల ప్రజల సమానత్వం, సమాన హక్కుల కోసం పోరాటం చేసిన చరిత్ర కమ్యూనిస్టు పార్టీదే అన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు హరినాథరెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి గాలి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు రామయ్య, పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, మద్దిలేటి, హరి, పల్లవోలు రమణ, ఇమాన్యుయేల్, బాదుల్లా, గంగా సురేష్, పీవీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచింది
● నిజాయితీగా వ్యవహరించిన అధికారులకు అభినందనలు ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డిప్రొద్దుటూరు : జిల్లాలో జరిగిన కడప కార్పొరేషన్, ముద్దనూరు ఎంపీపీ ఎన్నికల్లో ప్రజాస్వామ్యం గెలిచిందని, వైఎస్ రాజశేఖరరెడ్డి కుటుంబంపై ఉన్న ప్రేమ, అభిమానాలతో ఏ ఒక్కరూ ప్రలోభాలకు లొంగలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. ఆయన శుక్రవారం తన క్యాంప్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. జిల్లా ఎస్పీతోపాటు పోలీసు సిబ్బంది, జేసీ అదితి సింగ్తోపాటు రెవెన్యూ అధికారులు ప్రజాస్వామ్యబద్ధంగా వ్యవహరించారని తెలిపారు. ఈ కారణంగానే టీడీపీ నేతల అంచనాలు తలకిందులయ్యాయన్నారు. కడప కార్పొరేషన్ మేయర్గా ఉన్న కె.సురేష్బాబును, ముద్దనూరు ఎంపీపీగా ఉన్న ప్రదీప్కుమార్రెడ్డిలను సాంకేతిక కారణాలు చూపి తొలగించారన్నారు. కేవలం కూటమి నేతల కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే ఇలా చేశారని విమర్శించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి నాయకత్వంలో 39 మంది కార్పొరేటర్లు కలసి పాకా సురేష్ను మేయర్గా ఎన్నుకున్నారన్నారు. గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఎన్నికల్లో ఒక రోజు అధికారులు సహకరించారన్నారు. నిజాయితీగా ఎన్నికలు జరిపినందుకు అధికారులకు రాచమల్లు అభినందనలు తెలిపారు. రానున్న స్థానిక సంస్థల ఎన్నికల్లో అధికారులు ఇలాగే వ్యవహరిస్తే ప్రజాస్వామ్యం మరింత ద్విగిణీకృతం అవుతుందన్నారు. రూ.50 లక్షలు ఆఫర్ చేశారు ముద్దనూరు ఎంపీపీ ఎన్నికల్లో ఒక్కొక్క ఎంపీటీసీకి కూటమి నేతలు రూ.50 లక్షలు ఆఫర్ చేశారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. మొత్తం 9 మంది ఎంపీటీసీల్లో కూటమి పార్టీకి ఒక ఎంపీటీసీ మాత్రమే ఉండగా తర్వాత ఆ సంఖ్యను మూడుకు పెంచుకున్నారన్నారు. ఈ ఎన్నికల్లో ఇద్దరు ఎంపీటీసీలను లాగడానికి కూటమి నేతలు శతవిధాలా ప్రయత్నించి విఫలమయ్యారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, కౌన్సిలర్లు గుర్రం లావణ్య, రాగుల శాంతి, నూకా నాగేంద్రారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, కోఆపరేటివ్ స్టోర్స్ అధ్యక్షురాలు గజ్జల కళావతి, నాయకులు చౌడం రవీంద్ర, ఎద్దుల రాయపురెడ్డి, పార్వతి తదితరులు పాల్గొన్నారు. -
రాబోయే రోజుల్లో వైఎస్ఆర్సీపీ ప్రభంజనం
పులివెందుల : రాబోయే రోజుల్లో జరిగే అన్ని ఎన్నికల్లోనూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభంజనం సృష్టిస్తుందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పులివెందులలోని తన నివాసం వద్ద ఆయన మాట్లాడుతూ గురువారం జరిగిన కడప మేయర్, ముద్దనూరు మండలం ఎంపీపీ ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీ విజయం సాధించడం సంతోషంగా ఉందన్నారు. ఈ రెండు ఎన్నికలలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఎన్ని ప్రలోభాలు, భయభ్రాంతులకు గురి చేసినా వైఎస్ఆర్సీపీ నాయకులు గట్టిగా న్యాయం వైపు నిలబడడం జరిగిందన్నారు. వారు చేసిన మేలును గుర్తుపెట్టుకుని పార్టీ వారికి తగిన విధంగా అన్ని రకాలుగా మేలు చేయడం జరుగుతుందన్నారు. అలాగే రాష్ట్రంలో జరిగిన పలు ఉప ఎన్నికలలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులు గెలుపు సాధించడం జరిగిందన్నారు. అనంతరం ఆయన ప్రజాదర్బార్ నిర్వహించారు. ప్రజా సమస్యల పరష్కారానికి చర్యలు తీసుకున్నారు. యాత్రికుల మరణం బాధాకరం అల్లూరి సీతారామరాజు జిల్లాలో శుక్రవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో యాత్రికులు మరణించడం బాధాకరమని వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. యాత్రికుల మరణం తనను తీవ్ర దిగ్బ్రాంతికి గురిచేసిందన్నారు. ప్రమాదంలో మరణించిన వారి కుటుంబాలకు తన ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నానన్నారు. గాయపడిన వారికి మెరుగైన వైద్య చికిత్సలు అందించి వారి కుటుంబాలను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. జీతాలు ఇప్పించండి పులివెందుల రాణి తోపులో పని చేస్తున్న కార్మికులు ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డిని కలిశారు. తమకు కొద్ది నెలలుగా జీతాలు అందలేదని, దీంతో కుటుంబ పోషణ భారమైందని వారు ఎంపీతో వాపోయారు. దీనికి ఎంపీ వెంటనే కలెక్టర్కు ఫోన్ చేసి సమస్య పరిష్కరించాలని కోరారు. కలెక్టర్ వారి జీతాలు సీడీఎంఏ ద్వారా మున్సిపాలిటీకి బదలాయించి పది రోజుల లోపు చెల్లిస్తామని ఎంపీకి వివరించారు. ఎంపీకి సన్మానం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని ఇటీవల వైఎస్ఆర్సీపీ సోషల్ మీడియాలో సంయుక్త కార్యదర్శిగా ఎన్నికై న కొంగనపల్లి విజయ్, ఇతర నాయకులు సన్మానించారు. ఈ సందర్భంగా తనకు పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ కోసం కష్టపడి పని చేస్తానని ఎంపీకి తెలిపారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
వేతనాల పెంపుకోసం అంగన్వాడీల ధర్నా
కడప సెవెన్రోడ్స్ : తమకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని, ఇతర సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అంగన్వాడీ వర్కర్లు శుక్రవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వందలాదిగా తరలివచ్చారు. ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి నాగసుబ్బారెడ్డి, డిప్యూటీ జనరల్ సెక్రటరీ కేసీ బాదుల్లా, సీఐటీయూ జిల్లా కార్యదర్శి మనోహర్, అంగన్వాడీ వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శులు మంజుల, లక్ష్మిదేవిలు మాట్లాడుతూ లేబర్ కోడ్స్ రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పెండింగ్లో ఉన్న 1810 మినీ వర్కర్లకు క్వాలిఫికేషన్ రిలాక్సేషన్ ఇచ్చి మెయిన్ సెంటర్లుగా మార్చాలని కోరారు. హెల్పర్ల పదోన్నతులకు నిర్దిష్టమైన మార్గదర్శకాలు రూపొందించి అమలు చేయాలన్నారు. అంగన్వాడీలకు సంక్షేమ పథకాలు వర్తింపజేయాలన్నారు. అన్ని యాప్లు కలిపి ఒక యాప్గా మార్చాలని, సె ంటర్ నిర్వహణకు 5జీ ఫోన్లు ఇవ్వాలని, ఎఫ్ఆర్ఎస్ రద్దు చేయాలని కోరారు. గ్రాట్యూటీ అమలుకు మార్గదర్శకాలు రూపొందించాలని, వేతనంతోకూడిన మెడికల్ లీవ్ ఇవ్వాలన్నారు. పెండింగ్లో ఉన్న 164 సూపర్వైజర్ పోస్టులు భర్తీ చేయాలని కోరారు. ప్రీ స్కూలు బలోపేతం చేయాలని, పిల్లలకు తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, సాయంత్రం స్నాక్స్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. -
వ్యక్తిగత కక్షతోనే ఆ ఫ్లెక్సీ వేశారు
● ఏడీపీ సర్వే ద్వారా ఇష్టం వచ్చినట్లు పన్నులు పెంచారు ● అందులో భాగంగానే మా ఇంటి పన్ను కూడా పెరిగింది ● దీనిపై రివిజన్ పిటిషన్ వేసినా... ఫైనల్ డిమాండ్ నోటీసు ఇవ్వలేదు ● అందుకే పన్ను చెల్లించలేదు ● నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ వెల్లడి కడప కార్పొరేషన్ : తనపై ఉన్న వ్యక్తిగత కక్షతో, పరువు ప్రతిష్టలకు భంగం కలిగించాలనే ఉద్దేశంతోనే ఫ్లెక్సీలు వేశారని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. శుక్రవారం కార్పొరేన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తాను మేయర్గా ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు కూడా కాకమునుపే కొందరు సర్కిళ్లలో ఫ్లెక్సీలు వేయడం దారుణమన్నారు. తానంటే గిట్టనివారు వారి ఆక్రోషాన్ని ఎలా చూపాలో తెలియక ఈ విధంగా వెళ్లగక్కారన్నారు. ఇంటి పన్ను అనేది ఎప్పటికై నా కట్టాల్సిందేనని, దాన్ని ఎవరూ మాఫీ చేయలేరన్నారు. ఇప్పుడు కట్టకపోతే ఎన్ని సంవత్సరాలకై నా వడ్డీతో సహా చెల్లించక తప్పదన్నారు. తన తల్లి పేరుతో ఉన్న ఆ ఇంటికి గతంలో రూ.12229 పన్ను వస్తుండగా, ఏడీపీ సర్వేలో భాగంగా దాన్ని పదింతలు పెంచారన్నారు. ఇలా తనకు మాత్రమే జరగలేదని, కడప నగరంలోని 20 వేల మందికి ఈ సర్వే ద్వారా పన్నులు పెంచారన్నారు. జీహెచ్ఎంసీ యాక్టు ప్రకారం ఇంటి యజమానులకు నోటీసు ఇచ్చిన తర్వాతే పన్ను పెంచాలని స్పష్టంగా ఉందన్నారు. సర్వే పేరిట అసంబద్ధంగా పెంచిన పన్నులను వైఎస్సార్సీపీ కార్పొరేటర్లమంతా తీవ్రంగా వ్యతిరేకించామని గుర్తు చేశారు. పలు సర్వసభ్య సమావేశాల్లో ప్రజలందరి తరఫున తాము ఈ అంశాన్ని లేవనెత్తి పోరాటం చేస్తే, చివరకు ఏడీపీ సర్వేను నిలిపేశామని అధికారులు చెప్పారన్నారు. ప్లాన్ తీసుకొని ఇల్లు నిర్మించినప్పటికీ, లేనట్లుగా చూపి చాలా మందికి 100 శాతం ఫెనాల్టీ విధించారన్నారు. తమ ఇంటికి పెరిగిన పన్నుపై రివిజన్ పిటిషన్ సమర్పించామని, అధికారులు దానిపై విచారణ చేసి ఇప్పటికీ ఫైనల్ డిమాండ్ నోటీసు ఇవ్వనందునే పన్ను కట్టలేదని వివరించారు. కార్పొరేషన్ పరిధిలో ఇంకా 976 రివిజన్ పిటిషన్లు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. ఊరు, పేరు లేకుండా వేసే ఫ్లెక్సీలను ముద్రించవద్దని ప్రింటర్ల యజమానులకు సూచించారు. కార్పొరేషన్ అనుమతి పొందిన తర్వాతే ఫ్లెక్సీలు వేసేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచిస్తామన్నారు. సాదారణ కుటుంబం నుంచి వచ్చిన అత్యున్నతమైన మేయర్ పదవి అధిరోహించాననే అక్కసుతో ఇలా చేసినట్లు కనిపిస్తోందని, ఫ్లెక్సీలు వేసి సమయం వృథా చేసుకోవద్దని, నగరాభివృద్ధికి, ప్రజా సమస్యల పరిష్కారానికి వీలైతే సలహాలు ఇవ్వాలని కోరారు. -
లైన్ తప్పిన రైల్వే
కడప–బెంగళూరు రైల్వేలైన్ నిర్మాణం పనులు ఆగిపోయాయి. దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి తన హయాంలో ఈ రైల్వేలైన్పై ప్రత్యేక దృష్టి సారించారు. రాష్ట్ర ప్రభుత్వం నుంచి వాటాను సక్రమంగా కేటాయించారు. ఆయన మరణాంతరం పనులు మందగించాయి. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో ఈ రైల్వేలైన్కు రూ.185 కోట్లు కేటాయిందిచి. ఇప్పుడు మళ్లీ రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ అధికారంలో ఉంది. నిధుల కేటాయింపు లేకపోవడంతో పనులకు బ్రేక్ పడింది. రైలుమార్గం: కడప–బెంగళూరు దూరం: 257 కి.మీ వ్యయం: రూ.2వేల కోట్లు ప్రారంభం: 2014 రాజంపేట: కడప–బెంగళూరు రైలుమార్గం నిర్మాణానికి నిధుల గ్రహణం పట్టుకుంది. కూటమి ప్రభు త్వం అధికారంలోకి వచ్చాక రాష్ట్రం వాటా నిధులను విడుదల చేయలేదు. నిధులిస్తే నిర్మాణానికి ముందుకొస్తామన్న అభిప్రాయం రైల్వేమంత్రి అశ్విని వైష్ణవి నుంచి వెలువడినట్లు తెలిసింది. ముచ్చటగా మూడో సారి అధికారంలో కొనసాగుతున్న ఎన్డీఏ పాలనలో ప్రతి బడ్జెట్లో అరకొరనిధులు కేటాయిస్తూ వచ్చింది. దీంతో రైలుమార్గం పనులు ముందుకుసాగలేదన్న అపవాదును కేంద్రం మూటకట్టుకుంది. అందుబాటులోకి ఎప్పుడో.. గతంలో రైల్ నెట్వర్క్ విస్తరణలో భాగంగా కేంద్రరైల్వేశాఖ మంత్రి, రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా ఎంపిక చేసిన రైల్వే ప్రాజెక్ట్ జాబితాలోకి కడప–బెంగళూరు రైల్వేలైన్ను చేర్చారు. రాష్ట్రంలో ఏడురైల్వే ప్రాజెక్టుల్లో కడప–బెంగళూరు రైల్వేలైన్ ఒకటి కావడం గమనార్హం. రైలుమార్గం నిర్మాణం ప్రారంఽభమై 15 ఏళ్లు అవుతున్న పురోగతి లేదు. అయితే పెండ్లిమర్రి వరకు రైలుమార్గం పూర్తికావడంతో అక్కడి వరకు నంద్యాల–కడప డెమో రైలును కొంతకాలం నడిపించారు. నాలుగుదశల్లో... కడప–బెంగళూరు రైలుమార్గాన్ని నాలుగు దశల్లో నిర్మాణం చేపట్టేలా రైల్వేశాఖ నిర్ణయించింది. మొదటిదశలో రూ.153కోట్ల కేటాయింపులు జరిగాయి. భూసేకరణకు సంబంధించి రూ.89కోట్లలో రూ.20కోట్లు వ్యయం చేసింది. కడప నుంచి గంగనపల్లె, పెండ్లిమర్రి వరకు నిర్మాణం చేపట్టారు. 311.84 ఎకరాల భూమిని సేకరించారు. 54 చిన్నబ్రిడ్జిలు, ఆరుపెద్ద బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. 199.2కోట్లు భూసేకరణ కోసం వ్యయంచేశారు. ముందుకుసాగని పనులు: రెండో దశలో పెండ్లిమర్రి–రాయచోటి, రాయచోటి టు ఊయ్యలపాడు (చిత్తూరు), మూడో దశలో మదనపల్లెరోడ్డు టు మదగట్ట (ఆంధ్రప్రదేశ్సరిహద్దు) మదగట్ట టు ముల్భాగల్ (కర్ణాటకరాష్ట్ర సరిహద్దు) నాలుగదశలో ముల్బాగల్ టు కోలార్ వరకు నిర్మాణం చేపట్టేలా కడప–బెంగళూరు రైల్వేలైన్ రూపుదిద్దుకుంది. అయితే పనులు ముందుకు సాగడం లేదు. నిధుల కేటాయింపులో నిర్లక్ష్యం రాష్ట్రం వాటా మాట తుస్సు నిధులిస్తేనే లైన్ నిర్మాణానికికేంద్రం మొగ్గు ముందుకుసాగని పనులు త్వరితగతిన పూర్తి చేయాలి కడప–బెంగళూరు రైలుమార్గం పూర్తయితే ఉభయవైఎస్సార్జిల్లా వాసులకు కర్ణాటకతో కనెక్టివిటీ పెరుగుతుంది. అంతేగాకుండా అన్నమయ్య జిల్లాకేంద్రం రాయచోటికి రైలు వచ్చినట్లవుతుంది. బడ్జెట్లో అధికనిధులు కేటాయించి త్వరతిగతిన పూర్తి చేయాల్సిన బాధ్యత ఎన్డీఏ సర్కారుపై ఉంది. –మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడుకడప–బెంగళూరు మధ్య రైలు నిర్మాణానికి 2010 సెప్టెంబరులో అప్పటి రైల్వేశాఖ మంత్రి మునియప్ప శ్రీకారం చుట్టారు. దీనికి 2008–2009 బడ్జెట్లో ఆమోదం లభించింది. రూ.1000కోట్ల అంచనా వ్యయంతో రైలుమార్గం నిర్మాణపనులు కదిలాయి. 258కిలోమీటర్ల మేర నిర్మాణానికి 1, 531 భూసేకరణతో ఐదేళ్లలో పూర్తిచేయాలని లక్ష్యం పెట్టుకున్నారు. అయితే పనుల్లో కదలికలేదు. భూసేకరణకు రూ.199.2కోట్లు కేటాయించారు. -
దేదీప్యమానం.. దేవీ వైభవం
● వైభవంగా శ్రీ ఈశ్వరీమాత ఆరాధనోత్సవాలు ● భారీగా తరలి వస్తున్న భక్తులు ● ఘనంగా ఏర్పాట్లు బ్రహ్మంగారిమఠం : దేవీ వైభవం దేదీప్యమానంగా వెలుగొందుతోంది. బ్రహ్మంగారిమఠంలోని జగన్మాత శ్రీఈశ్వరీదేవి మఠంలో ఆరాధన గురుపూజోత్సవాలు కనుల పండువగా జరుగుతున్నాయి. ఈ సందర్భంగా మఠం సర్వాంగ సుందరంగా ముస్తాబైంది. మిరుమిట్లు గొలిపే విద్యుత్ కాంతులతో ధగధగలాడుతోంది. ఆలయానికి రంగులతో మెరుగులద్దారు. దేవాలయంతోపాటు పరిసరాలను వివిధ రకాల పుష్పాలతో అందంగా అలంకరించారు. ప్రాంగణంలో శోభాయమానంగా రంగవళ్లులు వేశారు. ఆకట్టుకునేలా ముఖద్వారాన్ని తీర్చిదిద్దారు. వెరసి ఉత్సవాలను పురస్కరించుకుని నూతన శోభ సంతరించుకుంది. కమనీయంగా అశ్వవాహనోత్సవం ఉత్సవాల్లో రెండో రెండో రోజైన శుక్రవారం ఈశ్వరీదేవికి ప్రత్యేక అలంకరణ చేసి, విశేష పూజలు చేపట్టారు. బ్రహ్మంగారిమఠం మండలం నరసన్నపల్లెకు చెందిన శ్రీ అభయ సీతారామా భజన మండలి ఆధ్వర్యంలో నిర్వహించిన చెక్క భజన భక్తులను అలరించింది. మధ్యాహ్నం కమనీయంగా అశ్వవాహనోత్సవం జరిగింది. అమ్మవారు అశ్వవాహనంపై ఆశీనులై భక్తులను ఆశీర్వదించారు. సాయంత్రం తిరుమల తిరుపతి దేవస్థానాలకు చెందిన అన్నమాచార్య ప్రాజెక్ట్ కళాకారులు సంగీత విభావరి ప్రదర్శించారు. రాత్రి హంస వాహనోత్సవం ఉత్సాహ భరితంగా జరిగింది. ఉభయ దాతలుగా బద్వేలు మండలం కుమ్మరకొట్టాలుకు చెందిన గోవిందిన్నె సుబ్బరాయుడు ఆచారి, విజయలక్ష్మి, విజయవాడకు చెందిన గుంటముక్కల ఉమామహేశ్వరరావు, నిర్మల, బ్రహ్మంగారిమఠం మండలం బొగ్గులవారిపల్లెకు చెందిన బొగ్గుల ఈశ్వరనారాయణరెడ్డి, శారదాంబ, గోవిందరెడ్డి, నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన వంక వేణుగోపాల్, సుగుణమ్మ, బ్రహ్మానందరెడ్డి, సునీత దంపతులు వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరుకు చెందిన శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి పాదరేణువులు వారు అల్పాహారం పంపిణీ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చి అమ్మవారిని దర్శించుకున్నారు. ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆశీస్సులతో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో దేవదాయ శాఖ, మఠం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ సంఘం అధ్యక్షుడు పావులూరి హనుమంతరావు, కాణిపాక వరిసిద్ధి వినాయక దేవాలయం ట్రస్టు బోర్డు డైరెక్టర్ తూర్పునాటి వడ్ల రాజ్యలక్ష్మి, రాష్ట్ర మహిళా కమిటీ గౌరవ అధ్యక్షురాలు తాళబత్తుల వాసవి, అధ్యక్షురాలు అంగల కుదుటి సుశీల, ప్రధాన కార్యదర్శి లక్కోజు సుజాత, బాపట్ల జిల్లా అధ్యక్షురాలు కొలకలూరు భారతీదేవి తదితరులు పాల్గొన్నారు. నేడు ప్రధాన వేడుక శ్రీఈశ్వరీదేవి 1789లో మార్గశిర బహుళ నవమినాడు సజీవ సమాధి నిష్ట వహించారు. అప్పటి నుంచి ఏటా అమ్మవారి ఆరాధన గురుపూజోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఈ ఏడాది శనివారం ఈ వేడుకలు నిర్వహిస్తున్నారు. ఈ సందర్భంగా ఉభయ తెలుగు రాష్ట్రాలతోపాటు కర్ణాటక, తమిళనాడు నుంచి భక్తులు భారీగా తరలి వస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారి కోసం ఆర్టీసీ ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేసింది. ఇప్పటికే అధిక సంఖ్యలో చేరుకున్నారు. మహిళా భక్తులు అమ్మవారికి పసుపు, కుంకుమ, చీర సమర్పిస్తారు. అనంతరం సామూహిక కుంకుమార్చన నిర్వహించనున్నారు. ఇందులో మఠాధిపతి దంపతులు పాల్గొంటారు. మధ్యాహ్నం జగన్మాతకు దీక్షా బంధన అలంకరణ ఉంటుంది. రాత్రి సింహవాహన గ్రామోత్సవం, తులాభారం, సహస్ర దీపాలంకరణ తదితర కార్యక్రమాలు ఉంటాయి. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని నిర్వాహకులు కోరారు. కోలాటం ఆడుతున్న కళాకారులు హంస వాహనంపై అమ్మవారి ఊరేగింపు -
నిర్ణీత సమయానికే విమానాలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈనెల మొదటి వారంలో జరిగిన ఇండిగో సంక్షోభం తర్వాత కడప విమానాశ్రయంలో ప్రస్తుతం విమానాల రాకపోకలు సాధారణంగా సాగుతున్నాయని కడప విమానాశ్రయం డైరెక్టర్ సుజిత్కుమార్ పొదార్ తెలిపారు. గురువారం కడప విమానాశ్రయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. సగటున ప్రతిరోజు 200 మంది ప్రయాణికులు కడప విమానాశ్రయానికి రాకపోకలు సాగిస్తున్నారన్నారు. ఈనెల 4వ తేదీ విమానాల రాకపోకల్లో రెండు గంటలకు పైగా ఆలస్యం జరిగిందని, అయితే డిసెంబరు 5వ తేదీ మినహా కడప విమానాశ్రయంలో ఎలాంటి విమానాల రద్దు జరగలేదన్నారు. ప్రయాణికులకు అసౌకర్యం కలగకుండా ఇండిగో సంస్థ ముందుగానే సమాచారం అందించిందని, అయితే ప్రస్తుతం కడప విమానాశ్రయంలో ప్రయాణికులకు సంబంధించి డెలివరీ చేయాల్సిన బ్యాగులు పెండింగ్లో లేవన్నారు. ప్రస్తుతం ఇండిగో హైదరాబాదుకు ప్రతిరోజు, చైన్నె, విజయవాడలకు రోజుమార్చి రోజు విమానాలను నడుపుతోందన్నారు. ప్రయాణికుల సౌకర్యం కోసం మే ఐ హెల్ప్యూ డెస్క్ కూడా త్వరలో ప్రారంభించనున్నామన్నారు. కడప విమానాశ్రయంలో 2023 నుంచి నైట్ ల్యాండింగ్ విమానాలు దిగే సౌకర్యం ఉందన్నారు. ఎయిర్బస్, ఏ320 వంటి పెద్దవిమానాలకు అనుకూలంగా ఉండేలా 2022లో రన్వేను 2515 మీటర్లకు విస్తరించారన్నారు. కొత్త టెర్మినల్ భవన నిర్మాణ పనులు జరుగుతున్నాయని, ఇవి మార్చి, ఏప్రిల్–2026 నాటికి పూర్తవుతాయన్నారు. కొత్త టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక కడప విమానాశ్రయం ఒకేసారి ఏడు ఎయిర్బస్సు, ఏ320 విమానాలను హ్యాండిల్ చేయగలదన్నారు. కారు పార్కింగ్ ప్రాంతంలో 375 కార్లు, 100 స్టాఫ్ కార్లను పార్కింగ్ చేసే సామర్థ్యం ఉంటుందన్నారు. అలాగే ఫ్లైట్ ట్రైనింగ్ స్కూలు త్వరలో ప్రారంభం కానుందని, ఇది కడప యువతకు భవిష్యత్తులో పైలెట్లుగా మారేందుకు అవకాశం కల్పిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో క్యాసో (ఎస్ఎఫ్ఎస్) కె.ఆర్ముగం, ఆపరేషన్ మేనేజర్ (ఏఏ1) దామోదర్, ప్రొటోకాల్ ఆఫీసర్ షీరిన్ తదితరులు పాల్గొన్నారు. కడప విమానాశ్రయం డైరెక్టర్ సుజిత్కుమార్ పొదార్ -
మేయర్ పీఠం ఎప్పటికీ వైఎస్సార్సీపీదే
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ పీఠం ఎప్పటికీ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ దేనని నూతన మేయర్ పాకా సురేష్ కుమార్ అన్నారు. గురువారం ఎన్నిక పూర్తయ్యాక కార్పొరేషన్ కార్యాలయంలోని తన ఛాంబర్లో ఆయన మీడియాతో మాట్లాడుతూ కడపలో సమస్యలు సృష్టించాలని అధికార పార్టీ ప్రయత్నించిందని, తప్పుడు ఫిర్యాదు చేసి అప్పుడు మేయర్గా ఉన్న సురేష్ బాబుపై అనర్హత వేటు వేశారన్నారు. ఈ ఎన్నిక రావడం చాలా బాధాకరమన్నారు. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లంతా ఏకగ్రీవంగా తనను ఎన్నిక చేసినందుకు వారందరికీ ధన్యవాదాలు తెలిపారు. ఈ ఎన్నిక ద్వారా వైఎస్సార్సీపీలో చీలిక తేవాలని అధికార పార్టీ చేసిన ప్రయత్నాలు బెడిసికొట్టాయన్నారు. టీడీపీ నాయకులు ఎన్ని విధాలుగా ఇబ్బందులు పెట్టినా, ప్రలోభాలకు గురి చేసినా తామంతా వైఎస్సార్సీపీ వెంటే ఉంటామని కార్పొరేటర్లు మరోసారి నిరూపించారన్నారు. ఇది చాలా శుభపరిణామమన్నారు. మేయర్గా తనకు తక్కువ సమయం ఉన్నా... ప్రజా సమస్యల పరిష్కారానికి, నగరాభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు. రాబోయే ఎన్నికల్లో కూడా గెలుపు మాదే: మాజీ మేయర్ సురేష్ బాబు రాబోయే మున్సిపల్ ఎన్నికల్లో కూడా గెలుపు తమ పార్టీదేనని మాజీ మేయర్ కె. సురేష్ బాబు అన్నారు. ఎన్నిక అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ మేయర్గా పాకా సురేష్ను తామంతా ఏకగ్రీవంగా ఎన్నుకున్నామని, ఈ విషయంలో తమ కార్పొరేటర్లు ప్రలోభాలకు లొంగకుండా ఓటేశారన్నారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీ తొలుత వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, మేయర్ అభ్యర్థి పాకా సురేష్ తదితరులు దివంగత వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అనంతరం పార్టీ కార్యాలయం నుంచి జిల్లా పరిషత్ కార్యాలయం మీదుగా కార్పొరేషన్ ఆఫీసుకు ర్యాలీగా వెళ్లారు. ● కార్పొరేషన్ కార్యాలయం వద్ద పోలీసులు కార్పొరేటర్ల ఐడీ కార్డులు, పాసులు తనిఖీ చేసి లోపలికి పంపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్లు ముంతాజ్ బేగం, నిత్యానందరెడ్డి, కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. నూతన మేయర్గా ఎన్నికైన పాకా సురేష్ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష ఘనంగా సన్మానించారు. ఆయనకు పూలమాలలు వేసి, శాలువాలు కప్పి ఘనంగా సన్మానించి శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, షఫీ తదితరులు పాల్గొన్నారు. నూతన మేయర్ పాకా సురేష్ -
రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలకు ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక రామేశ్వరంలోని ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ విద్యార్థి యంజర్ల ప్రణీత్రెడ్డి రాష్ట్రస్థాయి క్విజ్ పోటీలకు ఎంపికయ్యాడు. జాతీయ ఇంధన పరిరక్షణ వారోత్సవాల్లో భాగంగా ఏపీఎస్పీడీసీఎల్ ఆధ్వర్యంలో జమ్మలమడుగు, కడప, రాజంపేట డివిజన్ల పరిధిలోని పాఠశాలల విద్యార్థులకు కడప సైన్స్ సెంటర్లో గురువారం ఎనర్జీ కన్సర్వేషన్ (ఇంధన పరిరక్షణ)పై క్విజ్ పోటీ నిర్వహించారు. ప్రణీత్ రెడ్డి 60 మార్కులకు 58 మార్కులు సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యాడు. కడప ఉపవిద్యాశాఖాధికారి రాజగోపాల్రెడ్డి చేతుల మీదుగా ప్రణీత్రెడ్డి ప్రశంసా పత్రాన్ని అందుకున్నాడు. ఈనెల 16న జూమ్ మీటింగ్ ద్వారా నిర్వహించే రాష్ట్ర స్థాయి క్విజ్ పోటీలో అతను పాల్గొననున్నాడు. ఈ విద్యార్థిని ప్రధానోపాధ్యాయుడు సత్యబాబు, ఉపాధ్యాయులు అభినందించారు. -
ఎన్ని ప్రలోభాలకు గురిచేసినా వైఎస్సార్సీపీని బలపరిచారు
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి జమ్మలమడుగు/ముద్దనూరు: బీజేపీ ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, ముద్దనూరు నాయకులు తమకు బలం లేకున్నా ముద్దనూరు ఎంపీపీని కై వసం చేసుకోవాలని వైఎస్సార్సీపీ ఎంపీటీసీలను ప్రలోభాలకు గురిచేసినా అవి లెక్కచేయకుండా వైఎస్సార్సీపీ పార్టీనే బలపరచారని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. గురువారం ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక పూర్తి అయిన తర్వాత నూతన ఎంపీపీగా ఎంపికై న కొర్రపాడు ఎంపీటీసీ వెన్నపూస పుష్పలతతోపాటు ఎంపీటీసీలందరినీ ఆయన అభినందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ విజయం వైఎస్సార్సీపీకి మరింత బలం చేకూర్చుతుందని తెలిపారు. ● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ కూట మి నాయకులు మెజార్టీలేకపోయినా తమ ఎంపీటీసీలను లాగే ప్రయత్నం చేశారని.. ఎంపీటీసీల ఇండ్ల వద్దకు వెళ్లి డబ్బులు ఆశ చూపారని.. అయితే వైఎస్ కుటుంబంపై ఉన్న విశ్వాసంతో ఎవరూ పార్టీని వదలలేదన్నారు. దీంతో కూటమి నాయకుల ప్రలోభాలు ఫలించలేదన్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో వైఎస్సార్సీపీ జెండాను ఎగురవేసి వైఎస్ జగన్మోహన్రెడ్డికి బహుమతిగా ఇస్తామని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. కాగా.. ఎంపీపీ ఎన్నిక సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ముందస్తు ప్రణాళికలతో ఎంపీటీసీలను ప్రత్యేక వాహనంలో ముద్దనూరు ఎంపీడీఓ కార్యా లయానికి తీసుకునివచ్చారు. ఎంపీపీ ఎన్నిక ఏకగ్రీవంతో కార్యకర్తలలో ఉత్సాహం నెలకొంది. పుష్పలత -
లింగాపురం సొసైటీ స్థలంపై వివాదం
ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని లింగాపురం గ్రామంలో ఉన్న ఆంధ్రప్రగతి రైతు సేవా సహకార సంఘం లిమిటెడ్కు సంబంధించిన స్థలంపై వివాదం నెలకొంది. మూలవారిపల్లె గ్రామానికి చెందిన ఎస్సీ ప్రజలు సొసైటీ స్థలంలో తమకు శ్మశానానికి రస్తా కావాలని గత ఆరు నెలలుగా డిమాండ్ చేస్తూ అధికారులకు వినతి పత్రాలు ఇచ్చారు. అయితే సొసైటీ అధికారులు తమ సొసైటీకి సంబంధించిన స్థలం నుంచి రహదారి హక్కులు లేవని చెబుతుండగా గురువారం ఇటు ప్రజలు, అటు సొసైటీ అధికారుల అర్జీల మేరకు తహసీల్దార్ గంగయ్య, మండల సర్వేయర్ వెంకటలక్ష్మిలు వచ్చి సొసైటీ స్థలాన్ని పూర్తి స్థాయిలో సర్వే నిర్వహించారు. సర్వే నంబర్ 80/1ఏలో సొసైటీకి 51 సెంట్లు స్థలం ఉన్నట్లు తహసీల్దార్ నిర్ధారించారు. అక్కడి ఎస్సీ ప్రజలు సొసైటీకి అంత స్థలం లేదని, ఇందులో ఎన్నో ఏళ్లుగా తామంతా శ్మశానానికి రహదారిగా వినియోగించుకుని వెళుతున్నామని వాగ్వాదం చేశారు. సొసైటీ స్థలానికి ప్రహరీని నిర్మిస్తే తమకు రాకపోకలు ఇబ్బందని, నిర్మాణాలను అడ్డుకుంటామని ప్రజలు అధికారులతో వాదనకు దిగారు. సొసైటీ స్థలంలో ప్రహరీ కట్టుకునే హక్కు సొసైటీ అధికారులకు ఉందని, ఖాళీగా ఉన్నప్పుడు ఎవరైనా వాడుకుంటే దానికి హక్కు రాదని ప్రజలకు తహసీల్దార్ తెలిపారు. శ్మశానానికి ముందు ఉన్న రహదారిని వినియోగించుకోవచ్చని ఎవరైనా అభ్యంతరం తెలిపితే తనకు ఫిర్యాదు చేయాలని ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో సొసైటీ సీఈఓ రాజశేఖర్, చైర్మన్ సిద్ధారెడ్డిగారి నాగమునిరెడ్డి, వీఆర్ఓ రామయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఈశ్వరీదేవి మఠం.. ఉత్సవ శోభితం
కలశోత్సవం నిర్వహిస్తున్న మహిళా భక్తులు విద్యుత్ దీప కాంతులీనుతున్న ఈశ్వరీదేవి మఠం బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలోని శ్రీ ఈశ్వరీదేవిమఠం ఉత్సవ శోభను సంతరించుకుంది. విద్యుత్ దీప కాంతులతో ధగధగలాడుతోంది. భక్తజన సందడితో కళకళలాడుతోంది. అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు గురువారం ఘనంగా ప్రారంభమయ్యాయి. ఉదయం ప్రభాత సేవ, పంచామృతాభిషేకం, కుంకుమార్చన తదితర కార్యక్రమాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. జగన్మాత శ్రీ ఈశ్వరీదేవిని ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం నివేదన, నీరాజనం, తీర్థప్రసాద వినియోగం చేపట్టారు. సాయంత్రం సూక్తపారాయణం, అభిషేషకం, కుంకుమార్చన చేశారు. రాత్రి కలశోత్సవం, నైవేద్యం, కలశస్థాపన తదితర కార్యక్రమాలను కమనీయంగా నిర్వహించారు. ఉభయదాతలుగా గుంటూరుకు చెందిన కోడూరు శివరామ శాస్త్రి, కోడూరు ఫణీంద్ర వ్యవహరించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని, అమ్మవారిని దర్శించుకున్నారు. వారికి ఎలాంటి ఇబ్బంది తలెత్తకుండా మఠాధిపతి శ్రీ వీరశివకుమారస్వామి ఆధ్వర్యంలో ఈఓ బీవీ జగన్మోహన్రెడ్డి పర్యవేక్షణలో దేవదాయ శాఖ, మఠం సిబ్బంది ఏర్పాట్లు చేశారు. కార్యక్రమంలో ముత్తలూరు ఆంజనేయశర్మ, రఘువు వెంకటసుబ్రమణ్యాచార్యులు, అమ్మవారి శిష్యులు తదితరులు పాల్గొన్నారు. -
రెండో రోజు ‘టెట్’కు 82 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా రెండో రోజు గురువారం నిర్వహించిన టెట్(టీచర్స్ ఎలిజిబిలిటీ టెస్ట్)కు 82 మంది గైర్హాజరయ్యారు. ఉదయం సెషన్లో కడపలోని ఐదు, ప్రొద్దుటూరులోని పరీక్ష కేంద్రంలో నిర్వహించిన టెట్ పరీక్ష కు సంబంధించి 710 మంది విద్యార్థులకు 674 మంది హాజరుకాగా, 36 మంది గైర్హాజరయ్యారు. అలాగే మధ్యాహ్నం సెషన్లో 710 మంది అభ్యర్థులకు 664 మంది హాజరుకాగా, 46 మంది గైర్హాజరయ్యారు. కడపలోని పలు పరీక్ష కేంద్రాలను డీఈఓ షేక్ షంషుద్దీన్ పర్యవేక్షించి సిబ్బందికి పలు సూచనలు చేశారు. కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు దిగువ పేర్కొన్న వారిని రాష్ర పార్టీ కమిటీలో వివిధ హోదాలలో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆవుల విష్ణువర్థన్రెడ్డిని స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్గా నియమించారు. రాష్ట్ర కార్యదర్శులు(పార్లమెంటు)గా అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన పోలు సుబ్బారెడ్డి, ఉపేంద్రారెడ్డి, మదనపల్లెకు చెందిన డి. ఉదయ్ కుమార్, వైఎస్సార్ జిల్లా జమ్మలమడుగు నియోజకవర్గానికి చెందిన రఘునాథ్రెడ్డి, కమలాపురం నియోజకవర్గానికి చెందిన సంబటూరు ప్రసాద్రెడ్డిలను నియమించారు. పులివెందుల టౌన్: పులివెందుల పట్టణంలోని వైఎస్సార్ ఇంటిగ్రేటెడ్ స్పోర్ట్స్ అకాడమి క్రీడా మైదానంలో నిర్వహించిన రాష్ట్రస్థాయి హాకీ టోర్నమెంట్ విజేతగా కడప జట్టు నిలిచింది. గురువారం కడప, విశాఖపట్టణం జట్ల మధ్య ఫైనల్ మ్యాచ్ రసవత్తరంగా సాగింది. ఈ మ్యాచ్లో కడప జట్టు విజేతగా నిలవగా, విశాఖపట్టణం జట్టు రన్నర్గా నిలిచింది. పశ్చిమగోదావరి జిల్లా జట్టు మూడవ స్థానంలో నిలిచింది. అనంతరం విన్నర్, రన్నర్ జట్లకు ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. కార్యక్రమంలో టోర్నమెంట్ ఆర్గనైజర్స్ శ్రీకాంత్ రెడ్డి, ప్రవీణ్, కిరణ్, రాకేష్ బాబు, విక్టరీ పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అన్ని అభివృద్ధి కార్యక్రమాల ప్రగతి నివేదికలను సిద్ధం చేయా లని జేసీ అదితి సింగ్ అన్ని శాఖల జిల్లా అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి సానుకూల ప్రజా దృక్పథం, ఏజెంట్ స్పేస్ కోసం డాక్యుమెంట్ అప్లోడ్, ఎన్టీఆర్ భరో సా, దీపం గ్యాస్, రేషన్ సరఫరా, వరి ధాన్యం కొనుగోలు, ప్రజా రవాణా సేవలు, రిజిస్ట్రేషన్ సర్వీసులు తదితర అంశాలపై ప్రభుత్వ ప్రధా న కార్యదర్శి విజయానంద్ జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి జేసీ అదితి సింగ్ హాజరయ్యారు. వీసీ ముగిసిన అనంతరం అధి కారులకు జేసీ పలు సూచనలు ఇచ్చారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం దర్శనం కోసం వస్తున్న భక్తుల ఆకలి మూడు పూటల తీర్చడానికి టీటీడీ ప్రారంభించాలనుకున్న నిత్యాన్నదానం కేంద్రానికి కేంద్ర పురావస్తు శాఖ తాత్కాలిక ఏర్పాట్లకు అనుమతులు జారీ చేసింది. ఇందులో భాగంగా గురువారం రామాలయ ఆవరణలోని నామాల వనం పక్కనే ఉన్న పచ్చని వనంలో 60 అడుగుల పొడవు, 40 అడుగుల వెడల్పు వైశాల్యం గల ప్రమాద రహిత జర్మన్ షెడ్డుతో టీటీడీ సివిల్ విభాగం అధికారులు నిత్యాన్నదానం కేంద్రం తాత్కాలిక ఏర్పాట్లు ప్రారంభించారు. ఇక్కడ ఒకే సారి 200–250 మంది భక్తులు కూర్చుని భోజనం చేసేలా సౌకర్యాలు కల్పించనున్నారు. శాశ్వత నిత్యాన్నదాన కేంద్రానికి కేంద్ర పురావస్తూ శాఖ అనుమతలు ఇచ్చేంత వరకు ఈ ప్రాంతంలోనే నిత్యాన్నదానం జరుగుతుందని టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి తెలిపారు. అతి త్వరలోనే అన్ని ఏర్పాట్లు పూర్తి చేసి తాత్కాలిక నిత్యఅన్నదాన కేంద్రాన్ని ప్రారంభిస్తామని ఆయన వివరించారు. -
వామ్మో.. స్క్రబ్ టైఫస్!
● తీవ్రమైన జ్వరం, ఒళ్లునొప్పులుంటే నిర్లక్ష్యం చేయొద్దు ● అనుమానిత లక్షణాలున్న వారికి ఆస్పత్రిలోనే నిర్ధారణ పరీక్షలు ● ఆందోళన వద్దు.. అప్రమత్తంగా ఉంటే చాలు ప్రొద్దుటూరు క్రైం : స్క్రబ్ టైఫస్ అనే జ్వరం ప్రజల్లో భయాందోళనకు గురి చేస్తోంది. తెలుగు రాష్ట్రాల్లో స్క్రబ్ టైఫస్ కేసులు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి. కొన్ని చోట్ల ఈ వ్యాధి లక్షణాలతో కొంత మంది మృత్యువాత పడ్డారు. జిల్లాలో కూడా స్క్రబ్ టైఫస్ లక్షణాలతో పలువురు ఆస్పత్రి పాలయ్యారు. కడప రిమ్స్లో ముగ్గురు చికిత్స పొందుతున్నారు. క్రమేణా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. పీహెచ్సీలు, పట్టణ ఆరోగ్య కేంద్రాలతో పాటు ఏరియా ఆస్పత్రులు, జిల్లా ఆస్పత్రుల్లో ముందస్తు చర్యలు చేపట్టారు. జిల్లాలో 51 పీహెచ్సీలు, 30 పట్టణ ఆరోగ్య కేంద్రాలు, బద్వేలు, పోరుమామిళ్ల, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, పులివెందుల, చెన్నూరులలో కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు, కడపలో ప్రభుత్వ జనరల్ ఆస్పత్రి అండ్ మెడికల్ కాలేజీ (రిమ్స్) ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి ఉన్నాయి. అప్రమత్తమైన వైద్య ఆరోగ్యశాఖ స్క్రబ్ టైఫస్ జ్వరాలు పెరుగుతున్న దృష్ట్యా ప్రజల్లో భయాందోళనలు పోగొట్టడంతో పాటు వ్యాధి లక్షణాలు, తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వైద్యాధికారులు అవగాహన కల్పిస్తున్నారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత ఆధ్వర్యంలో విస్తృతంగా అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. ఓపీ విభాగంలో ఉన్న టీవీల ద్వారా స్క్రబ్ టైఫస్ జ్వరం గురించి వివరిస్తున్నారు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు, దద్దుర్లు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే ఎలీసా టెస్ట్ నిర్వహించాలని సంబంధిత వైద్యులకు ఆదేశాలు జారీ చేశారు. అత్యవసర విభాగంలో 24 గంటలు వైద్యులు అందుబాటులో ఉండేలా ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రబ్ టైఫస్ విభాగం ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో ఆరు బెడ్లతో స్క్రబ్ టైఫస్ ఐసోలేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశారు. ఈ వ్యాధితో అడ్మిట్ అయిన వారికి కావాల్సిన మందులను కూడా ఐసోలేషన్ వార్డులోనే సిద్ధంగా ఉంచారు. ఐసోలేషన్ విభాగాన్ని ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్ డాక్టర్ సుజాత, ఆర్ఎంఓ డాక్టర్ శివరాంలు పరిశీలించారు. స్క్రబ్ టైఫస్ కేసులొస్తే పూర్తి స్థాయిలో చికిత్సను అందించేలా వైద్యాధికారులు, సిబ్బందిని అప్రమత్తం చేశారు. రెండు రోజుల క్రితం జిల్లా ఆస్పత్రికి తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులతో ఒక వ్యక్తి రాగా అనుమానంతో వైద్యులు ఎలీసా టెస్ట్ చేశారు. అతనికి డెంగీ జ్వరమని నిర్ధారణ అయినట్లు వైద్యులు తెలిపారు. జిల్లా ఆస్పత్రిలో ప్రతి రోజు 800–900 వరకు ఓపీ నమోదు అవుతుంది. జ్వరం సోకి ఆస్పత్రికి వచ్చిన వృద్ధులు, చిన్న పిల్లలను వైద్యులు జాగ్రత్తగా పరీక్షలు చేస్తున్నారు. స్క్రబ్ టైఫస్ లక్షణాలు స్క్రబ్ టైఫస్ అనేది ఓరియంటియా సుట్సుగముషి అనే సూక్ష్మక్రిమి ద్వారా వస్తుంది. ఇది చిగ్గర్స్ అనే చిన్న కీటకాల లాంటి పురుగుల ద్వారా వ్యాప్తి చెందే బ్యాక్టీరియల్ ఇన్ఫెక్షన్. ఈ బ్యాక్టీరియా ఎలుకలు, కుందేళ్లు, ఉడతల శరీరంపై కనిపిస్తుంది. ఈ చిగ్గర్స్ కీటకాలు పొదలు, గడ్డి, వ్యవసాయ భూముల్లో నివసిస్తాయి. ఇవి కుట్టినప్పుడు ఇన్ఫెక్షన్ సోకుతుంది. స్క్రబ్ టైఫస్ వ్యాధి సోకిన తర్వాత 5–15 రోజుల్లోపు తీవ్రమైన జ్వరం, చలి, ఒంటినొప్పులు, తలనొప్పి, అలసట, బలహీనత, మెడ, చంకల్లో వాపు గడ్డలు, శరీరంపై దద్దుర్లు వస్తాయి. అలాగే పురుగు కుట్టిన చోట ముదురు రంగుతో కూడిన పుండు ఏర్పడుతుంది. ఇలాంటి లక్షణాలుంటే స్క్రబ్ టైఫస్గా భావించాలని వైద్యులు చెబుతున్నారు. సకాలంలో చికిత్స చేయించకపోతే శ్వాసతీసుకోవడంలో ఇబ్బందిగా మారడంతో పాటు అవయవాల వైఫల్యం కూడా జరిగే అవకాశం ఉందని హెచ్చరిస్తున్నారు. ఇది అంటువ్యాధి కాదని, సకాలంలో ఆస్పత్రికి వెళ్లి చికిత్స చేయించుకుంటే నాలుగైదు రోజుల్లోనే పూర్తిగా నయం అవుతుందని వైద్యులు తెలిపారు. స్క్రబ్ టైఫస్ నివారణ మార్గాలు ఏంటంటే.. స్క్రబ్ టైఫస్ రాకుండా ఉండాలంటే చేతులు, కాళ్లను బాగా కప్పి ఉంచాలని నిపుణులు చెబుతున్నారు. అలాగే ఇంటి పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలి. ఇంటి చుట్టూ గడ్డి, పొదలు పెరగనివ్వకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇంటి చుట్టూ నీరు పేరుకుపోకుండా చూసుకోవాలి. గోరు వెచ్చని నీరు తాగడంతో పాటు సమతుల ఆహారం తీసుకుంటే మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. జిల్లా ఆస్పత్రిలో రద్దీగా ఉన్న ఓపీ రిజిస్ట్రేషన్ విభాగం జిల్లా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన స్క్రబ్ టైఫస్ ఐసోలేషన్ విభాగం స్క్రబ్ టైఫస్ జ్వరం పట్ల ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. తీవ్రమైన జ్వరం, ఒంటి నొప్పులు తదితర లక్షణాలు కనిపిస్తే వెంటనే జిల్లా ప్రభుత్వాసుపత్రికి రావాలి. అనుమానిత లక్షణాలు ఉన్న వారికి రక్తపరీక్షలు చేస్తున్నాం. ముందు జాగ్రత్తగా ఆస్పత్రిలో ప్రత్యేక స్క్రబ్ టైఫస్ ఐసోలేషన్ విభాగాన్ని ఏర్పాటు చేశాం. చికిత్సకు కావాల్సిన మందులన్నీ ఉన్నాయి. 24 గంటల పాటు వైద్యులు అందుబాటులో ఉంటారు. ఈ వ్యాధి బారిన పడకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. – డాక్టర్ సుజాత, జిల్లా ఆస్పత్రి మెడికల్ సూపరింటెండెంట్, ప్రొద్దుటూరు. -
మృతుడి గుర్తింపు
ఎర్రగుంట్ల : ఇటీవల కాలంలో ఎర్రగుంట్ల రైల్వేస్టేషన్ పరిధిలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్న మృతుల వివరాలతో స్టేషన్ ఆవరణంలోని జీఆర్పీ స్టేషన్ వద్ద సూచిక బోర్డును ఏర్పాటు చేసినట్లు ఎర్రగుంట్ల రైల్వే ఎస్ఐ భాస్కర్రెడ్డి తెలిపారు. గురువారం బోర్డులో ఉన్న తండ్రి ఫొటో చూసి గుర్తించి మృతుడి కుటుంబ సభ్యులు రైల్వే పోలీసులను సంప్రదించారన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏప్రిల్ నెల 8వ తేదీన గుర్తు తెలియని వ్యక్తి రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడని తెలిపారు. సూచిక బోర్డును చూసి ఏప్రిల్ 8వ తేదీన మృతి చెందిన వ్యక్తి అనంతపురం జిల్లా తాడిపత్రిలో ఉంటున్న హాజీపీరా కుమారుడు షేక్ మహబూబ్ బాషాగా కుటుంబ సభ్యులు గుర్తించారన్నారు. మృతుడు మహబూబ్ బాషా ఆరోగ్య సమస్యల కారణంగా మృతి చెందాడని మృతుడి భార్య , కుమారులు వాంగ్మూలం ఇచ్చారని ఎస్ఐ తెలిపారు. కారు ఢీకొని యువకుడి మృతి చిన్నమండెం : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందగా మరో యువకుడి పరిస్థితి విషమంగా ఉంది. దీంతో రెండు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. పోలీసుల కథనం మేరకు.. చిన్నమండెంకు చెందిన పఠాన్ సాహుల్ (22), పఠాన్ రిజ్వాల్(16)లు తమ సొంత పనుల నిమిత్తం బుధవారం రాత్రి రాయచోటికి వచ్చారు. మదనపల్లి బైపాస్ వద్దకు రాగానే వారి ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో పఠాన్ సాహుల్ మృతి చెందగా తీవ్రంగా గాయపడిన పఠాన్ రిజ్వాల్ను ఆసుపత్రికి తరలించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకులకు ఇలా జరగడంపై రెండు కుటుంబాల్లో తీవ్ర విషాద ఛాయలు అలుముకున్నాయి. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. బొలెరో వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలు కలకడ : ఆగి ఉన్న ద్విచక్రవాహనాన్ని బొలెరో వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గురువారం ఉదయం కలకడ మండలం, బాలయ్యగారిపల్లె పంచాయతీ బావికానివడ్డిపల్లెకు చెందిన అంజి తన ద్విచక్రవాహనంలో సంబేపల్లె మండలం, మోటకట్ల ముదినేనిపల్లెకు చెందిన సి.రమణతో కలిసి బాకివానివడ్డిపల్లెకు వచ్చాడు. తిరుగు ప్రయాణంలో బాకివానివడ్డిపల్లె సమీపంలో ద్విచక్రవాహనంపై నిలబడి ఉండగా బాలయ్యగారిపల్లె నుంచి అతివేగంగా వచ్చిన బొలెరో పికప్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన అంజి, రమణలను రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
ప్రజాగ్రహానికి నిదర్శనం ‘కోటి సంతకాలు’
కడప కార్పొరేషన్: రాష్ట్రంలో చంద్రబాబు సర్కార్ తీసుకున్న ప్రైవేటీకరణ నిర్ణయంపై ప్రజలు ఆగ్రహంగా ఉన్నారనేందుకు కోటి సంతకాలే నిదర్శనమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పీపీపీ పేరు చెప్పి మెడికల్ కాలేజీలను అమ్మేసేందుకు చంద్రబాబు ప్రయత్నిస్తున్నారన్నారు. ఎకరా లీజు రూ.99లకు 60 ఏళ్లు అంటే అమ్మేయడం కాక మరేమిటని ప్రశ్నించారు. కరోనాలో సరైన వైద్య సదుపాయాలు లేక ప్రజలు చాలా ఇబ్బందులు పడ్డారని, అలాంటి పరిస్థితి మళ్లీ ఉత్పన్నం కాకూడదని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దూరదృష్టితో 17 మెడికల్ కాలేజీలను తీసుకొచ్చి 7 కాలేజీలను పూర్తి చేసి, అడ్మిషన్లు కూడా తీసుకున్నారన్నారు. ఆ కాలేజీల నిర్మాణాన్ని పూర్తి చేయుటకు నాబార్డు ద్వారా రూ.8500కోట్లు రుణం కూడా మంజూరు చేయించారన్నారు. పాడేరు, పులివెందుల కాలేజీలకు ఎన్ఎంసీ మెడికల్ సీట్లు ఇస్తే, ప్రభుత్వం పులివెందుల కాలేజీకి ఇచ్చిన సీట్లను వద్దని చెప్పడం దుర్మార్గమన్నారు. ఈ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ప్రజా ఉద్యమాన్ని చేపట్టిందని, ప్రజలందరినీ ఇందులో భాగస్వాములను చేసి ప్రైవేటీకరణ వల్ల కలిగే అనర్థాలను వివరించి వారి సంతకాలు సేకరించడం జరిగిందన్నారు. నెల రోజుల పాటు జరిగిన ఈ మహోద్యమంలో జిల్లాలోని 7 నియోజకవర్గాల్లో 4,80,101 సంతకాలు సేకరించామన్నారు. సంతకాల సేకరణలో కష్టపడిన నియోజకవర్గ సమన్వయకర్తలు, పార్టీ నాయకులు, కార్యకర్తలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సంతకాలను ఈనెల 15న కేంద్ర కార్యాలయానికి తరలించి, ఈనెల 18న పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి, ముఖ్య నేతల ద్వారా గవర్నర్కు అందజేస్తామన్నారు. ● కడప మేయర్, ముద్దనూరు ఎంపీపీ ఎన్నిక ద్వారా లబ్ధిపొందాలని అధికార టీడీపీ ప్రయత్నించిందని రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఈ ఎన్నికల వల్ల వైఎస్సార్సీపీలో వైషమ్యాలు వస్తాయని వారు భావించారని, కానీ వారి పాచిక పారలేదన్నారు. కడప మేయర్ పదవికి మూడు నెలలు, ముద్దనూరు ఎంపీపీ పదవికి ఐదు నెలలు మాత్ర మే గడువు ఉందన్నారు. తమ కార్పొరేటర్లు, ఎంపీటీసీలు ప్రలోభాలకు తలొగ్గకుండా వైఎస్ జగన్మోహన్రెడ్డి మీద ఉన్న అభిమానంతో వైఎస్సార్సీపీ వెంట ఉండటం గర్వంగా ఉందన్నారు. వారందరికీ ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. మేయర్గా ఎన్నికై న పాకా సురేష్కు, ముద్దనూరు ఎంపీపీ పుష్పలతకు అభినందనలు తెలిపారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పోలీసులు, రౌడీలు, గూండాలను ఉపయోగించి అధికార పార్టీ గెలుచుకుందన్నారు. ఇప్పుడు జరిగిన మేయర్, ఎంపీపీ ఎన్నికల ఫలితాలు టీడీపీకి చెంపపెట్టు అన్నారు. ఈ జిల్లా వైఎస్సార్సీపీకి కంచుకోట అని ఎవరూ దీన్ని బద్దలు కొట్టలేరన్నారు. ఈ సమావేశంలో మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్, కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఫయాజ్ పాల్గొన్నారు. పీపీపీ పేరుతో మెడికల్ కాలేజీలను అమ్మేస్తున్నారు ఈనెల 18న ఈ సంతకాలను గవర్నర్కు అందించనున్న వైఎస్ జగన్ మేయర్, ఎంపీపీ ఎన్నిక ద్వారా టీడీపీ లబ్ధి పొందాలని ప్రయత్నించింది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు
కడప సెవెన్రోడ్స్: నీటి భద్రతతోనే దేశ భవిష్యత్తు ఆధారపడి ఉందని ఇందుకు జిల్లాలో సమర్థ వంతమైన నీటి భద్రత, సంరక్షణ, నిర్వహణకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. గురువారం ఢిల్లీ లో ఐఐటి ఢిల్లీ, నీతి ఆయోగ్ వారు సంయుక్తంగా నిర్వహించిన ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్ లో జిల్లా రివర్ మేనేజ్మెంట్ ప్లాన్ ఫ్రేమ్వర్క్ కింద జిల్లా స్థాయి నీటి నిర్వహణపై ప్యానలిస్ట్గా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సదస్సులో మాట్లాడుతూ జిల్లాలో దీర్ఘకాలిక నీటి భద్రత కోసం నాలుగు పద్ధతులను వివరించారు. వర్షపు నీటిని సంరక్షించడం, నదుల ప్రవాహ నిర్వహణను మెరుగుపరచడం, భూగర్భజలాల నీటి మట్టాన్ని పెంచడం, ప్రణాళిక బద్ధంగా జలాశయాల నీటి నిర్వహణ, సమర్థవంతమైన నదీ పరీవాహక నిర్వహణ కోసం పంటలు పర్యావరణ వ్యవస్థ లకు తేమ నిలుపుదల శాతాన్ని పెంచడం వంటి అంశాలపై దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. జిల్లా స్థాయిలో నీటిపారుదల, తాగునీరు, ఆరోగ్యం మరియు పర్యావరణ నిర్వహణలోని అంతరాల నిర్మూలన, వికేంద్రీకృత మురుగునీటి శుద్ధి వ్యవస్థ, చిత్తడి నేలల పునరుద్ధరణ, చెక్–డ్యామ్లు, బిందు సేద్యం మరియు ఖచ్చితమైన వ్యవసాయ పద్ధతులు మరియు భూగర్భ జలాల పునరుద్ధరణ వంటి అంశాల అమలు, వ్యవసాయం లో సమర్థవంతమైన నీటి వినియోగం వంటి కేంద్రీకత మార్గాల ద్వారా పరిష్కరించ వచ్చునని వివరించారు. నీటిపారుదల, గ్రామీణాభివృద్ధి, వ్యవసాయం, అడవులు మరియు పట్టణ స్థానిక సంస్థలలో శాఖా పరంగా బలోపేతం చేయడం, సమర్థవంతమైన వినియోగంపై నీటి నిర్వహణ ఆధారపడి ఉంటుందని ఆయన స్పష్టం చేశారు. ఇది సాధ్యమవ్వడానికి ఒక డిస్ట్రిక్ట్ వాటర్ గవర్నెన్స్ కమిటీని మరియు డిస్ట్రిక్ట్ పిఎమ్యు(ప్రాజెక్ట్ మేనేజ్మెంట్ యూనిట్)ని ఏర్పాటు చేయాలని ఈ సదస్సులో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రతిపాదించారు. ఈ ఇంటిగ్రేటెడ్ ఫోర్ వాటర్ విధానం జిల్లాల లో సమర్థ వంతంగా అమలు ద్వారా సంపూర్ణ, సుస్థిరాభివృద్ధి ఆధారిత నీటి నిర్వహణ కు మార్గదర్శకంగా నిలుస్తుందని వివరించారు. జిల్లాలో సమర్థవంతమైన నీటి భద్రతకు ప్రణాళికలు ఢిల్లీ లో 10వ ఇండియా వాటర్ ఇంపాక్ట్ సమ్మిట్లోకలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
విద్యుత్ చట్టం సవరణ బిల్లును వ్యతిరేకిస్తున్నాం
కడప కార్పొరేషన్ : విద్యుత్ సంస్థలను పూర్తిగా ప్రైవేటీకరించేందుకు కేంద్ర ప్రభుత్వం సవరణల పేరుతో ఈ ఏడాది అక్టోబర్ 9న పార్లమెంటులో ప్రవేశపెట్టిన బిల్లును తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని ఏపీ ఎలక్ట్రిసిటీ స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) రాష్ట్ర అధ్యక్షుడు బి. రామలింగారెడ్డి అన్నారు. గురువారం విశ్వేశ్వరయ్య భవన్లో యూనియన్ జిల్లా అధ్యక్షుడు యు. లక్ష్మినారాయణ అధ్యక్షతన జరిగిన జిల్లా సర్వసభ్య సమావేశంలో ఆయన మాట్లాడుతూ 57 పేజీల ముసాయిదా బిల్లులో డిస్కంలను పూర్తిగా కార్పొరేట్లకు అప్పగించేందుకు పథక రచన చేశారన్నారు. జిల్లా నాయకుడు ఎం. బాలకాశి మాట్లాడుతూ మీటర్ రీడర్లకు ఉద్యోగ భద్రత కల్పించాలని, కాంట్రాక్ట్–ఔట్ సోర్సింగ్ కార్మికులకు డిస్కంల ద్వారానే వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఈ. శివయ్య, ఎనర్జీ అసిస్టెంట్ల యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె. మల్లికార్జున్ రెడ్డి మాట్లాడారు. ఈ సమావేశంలో డిస్కం అధ్యక్షుడు పి. సురేష్ బాబు, ఏఐటీయూసీ జిల్లా కార్యదర్శి ఎల్. నాగసుబ్బారెడ్డి, జిల్లా కార్యదర్శి కె. బ్రహ్మానందరెడ్డి, జిల్లా నాయకులు ప్రతాప్ రెడ్డి, రవీంద్రారెడ్డి, రామచంద్ర రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాలకు జన నీరాజనం
జమ్మలమడుగులో కోటి సంతకాల ప్రతులను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డికి అందజేస్తున్న నాయకులు కోటి సంతకాల సేకరణ పూర్తయిన సందర్భంగా మాట్లాడుతున్న మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా కమలాపురంలో ర్యాలీ నిర్వహిస్తున్న నరేన్ రామాంజుల రెడ్డి, పార్టీ నేతలు మైదుకూరులో ర్యాలీలో పాల్గొన్న మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, నాయకులు బద్వేలులో మాట్లాడుతున్న ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ పులివెందులలో కోటి సంతకాల ప్రతుల వాహనాన్ని ప్రారంభిస్తున్న వైఎస్ మనోహర్రెడ్డి ప్రొద్దుటూరులో వైఎస్ విగ్రహం వద్ద నివాళి అర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే రాచమల్లు , పార్టీ శ్రేణులు కడప కార్పొరేషన్: ెుడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణకు జన ం నీరాజనం పలికారు. జిల్లాలో ఏడు నియోజకవర్గాల్లో సేకరించిన సంతకాల పత్రాలను పండుగ వాతావరణంలో వాహనాలలో ఎక్కించి జిల్లా కార్యాలయానికి పంపించారు. ఈ సందర్భంగా అన్ని నియోజకవర్గాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, అభిమానులు, ప్రజలు ర్యాలీలు నిర్వహించి సంఘీభావం ప్రకటించారు. జిల్లా కేంద్రమైన కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష కార్యాలయం నుంచి ప్రత్యేక వాహనంలో సుమారు 70 వేల సంతకాలతో కూడిన పత్రాలను పార్టీ జిల్లా కార్యాలయానికి తీసుకొచ్చారు. ఈ వాహనానికి మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, అన్నమయ్య జిల్లా పరిశీలకులు కె. సురేష్ బాబు జెండా ఊపి ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో పాల్గొన్నారు. ప్రొద్దుటూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో కోటి సంతకాల పత్రాలను జిల్లా కార్యాలయానికి తరలించారు. తొలుత ఈ పత్రాల బండిళ్లను వైఎస్సార్ విగ్రహం వద్ద ఉంచి, దివంగత వైఎస్సార్కు పూలమాల వేసి ఘనంగా నివాళులర్పించారు. నియోజకవర్గ వ్యాప్తంగా లక్షా 200 సంతకాలు సేకరించారు. వాటిని ప్రత్యేక వాహనంలో కడపకు తరలించారు. కార్యక్రమంలో పార్టీ నేతలు, ప్రజాప్రతినిధులు, కార్యకర్తలు, పెద్ద ఎత్తున ప్రజలు పాల్గొన్నారు. పులివెందుల అసెంబ్లీ నియోజకవర్గానికి సంబంధించి 90,200 సంతకాలు సేకరించారు. సంతకాలు చేసిన పత్రాలను తరలించే వాహనాన్ని మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి జెండా ఊపి ప్రారంభించారు. నియోజకవర్గంలోని ఏడు మండలాలకు చెందిన పార్టీ నాయకులు, కార్యకర్తలు కార్యక్రమంలో పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఈ కార్యక్రమం ఆద్యంతం పండుగ వాతారణంలో కొనసాగింది. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో 50 వేల సంతకాలు సేకరించారు. బుధవారం ఈ సంతకాలు చేసిన పత్రాలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆధ్వర్యంలో ప్రత్యేక వాహనం ద్వారా జిల్లా కార్యాలయానికి తరలించారు. ఈ వాహనాలను రామసుబ్బారెడ్డి ప్రారంభించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. కమలాపురం నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో 60,240 సంతకాలు సేకరించారు. ఈ సంతకాలతో కూడిన బండిళ్లను బుధవారం జిల్లా కార్యాలయానికి తరలించారు. అంతకుముందు పార్టీ కార్యాలయం వద్దగల వైఎస్సార్ విగ్రహానికి నివాళులర్పించారు. సుమారు 30 బాక్సుల్లో వీటిని వాహనంలో ఎక్కించి పంపారు. అంతకుముందు పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు వైఎస్సార్సీపీ కార్యాలయం నుంచి అప్పాయపల్లె వరకు పెద్ద ఎత్తున ర్యాలీ చేపట్టారు. మైదుకూరు నియోజకవర్గంలో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో సుమారు 70 వేల సంతకాలను సేకరించారు. తొలుత పార్టీ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరులోని పార్టీ కార్యాలయం నుంచి ఖాజీపేట వరకు బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం సంతకాలు చేసిన పత్రాలను బాక్సు ల్లో భద్రపరిచి కడపలోని పార్టీ కార్యాలయానికి తరలించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గంలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డా. దాసరి సుధ ఆధ్వర్యంలో 60 వేల సంతకాలు సేకరించారు. తొలుత ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి ఆధ్వర్యంలో పార్టీనేతలు, కార్యకర్తలు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి సిద్దవటం రోడ్డులోని వైఎస్సార్ విగ్రహం వరకు ర్యాలీ నిర్వహించారు. తొలుత దివంగత వైఎస్సార్కు నివాళులర్పించారు. అనంతరం సంతకాల పత్రాలు తరలించే వాహనానికి ఎమ్మెల్యే, ఎమ్మెల్సీలు జెండా ఊపి జిల్లా కార్యాలయానికి సాగనంపారు. పండుగ వాతావరణంలో జిల్లా కార్యాలయానికి తరలింపు పలుచోట్ల ర్యాలీలు -
ఎర్రగుంట్లలో ఘోర రోడ్డు ప్రమాదం
ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణం ముద్దనూరు రోడ్డులోని జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల క్రీడామైదానం ఎదురుగా బుధవారం సాయంత్రం ఆర్టీసీ బస్సును ఎదురుగా బైక్పై వచ్చి యువకులు ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్పై వచ్చిన యువకులు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. విషయం తెలుసుకున్న వెంటనే ఎస్ఐ నాగ మురళి తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. మహారాష్ట్రలోని చంద్రాపూర్ జిల్లాకు చెందిన వినాయక్ శర్వాన్ చౌద్రి (34), కరణ్ విలాస్ తెలంగే (24) అనే యువకులు ఎర్రగుంట్ల మండలంలోని జువారి సిమెంట్ ఫ్యాక్టరీలో తుమ్మలపల్లి గ్రామానికి చెందిన కాంట్రాక్టర్ బాబయ్య వద్ద కార్మికులుగా పనిచేస్తున్నారు. వీరిద్దరు సుమారు పది రోజుల క్రితమే మహారాష్ట్ర నుంచి వచ్చి పనిలో చేరారు. అయితే గత నాలుగు రోజుల నుంచి వీరు పనికి రాకుండా బయట తిరుగుతున్నట్లు కాంట్రాక్టర్ తెలిపాడని ఎస్ఐ అన్నారు. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం ప్రొద్దుటూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు సింహాద్రిపురం నుంచి ప్రొద్దుటూరుకు వెళుతుండగా, అదే సమయంలో ఇద్దరు యువకులు ఎర్రగుంట్ల నుంచి ముద్దనూరు వైపు బైక్పై బయలు దేరారు. కానీ ఇద్దరు యువకులు రాంగ్ రూట్లో వెళ్లి ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సును ఢీకొట్టారు. ఈ ప్రమాదంలో బైక్పై వున్న యువకులు అక్కడికక్కడే రక్తగాయాలతో మృతి చెందారు. ఈ సంఘటన స్థానికుల మనుసులను కలచి వేసింది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ నాగమురళి పరిశీలించి ట్రాఫిక్ను క్రమబద్ధీకరించారు. అనంతరం మృతదేహాలను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ పరదేశీరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రాంగ్ రూట్లో వెళ్లి ఆర్టీసీ బస్సును ఢీకొట్టిన యువకులు అక్కడికక్కడే ఇద్దరు దుర్మరణం మృతులిద్దరూ మహారాష్ట్రకు చెందిన వారిగా గుర్తించిన పోలీసులు -
మున్సిపల్ పెట్రోలు బంకు డబ్బుపై విచారణ జరిపించండి
ప్రొద్దుటూరు : మున్సిపల్ పెట్రోలు బంకులో రూ.కోటి 30లక్షలు మాయమైందని టీడీపీ పట్టణాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ క్యాసినో నిర్వాహకులతో కలిసి చేసిన విమర్శల్లో ఏమాత్రం వాస్తవం లేదని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ఛాంబర్లో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ అధికార పార్టీలో ఉన్న ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి విచారణ చేయించి వాస్తవాలను నిగ్గుతేల్చాలని కోరారు. ఈ డబ్బు వసూలుకు సంబంధించి తాము కూడా మద్దతు ఇస్తామన్నారు. మున్సిపాలిటీ ఉద్యోగి ప్రవీణ్ పెట్రోలు బంకును నిర్వహిస్తున్నాడని, అనేక మంది ట్రాన్స్పోర్టర్లకు డీజిల్ అప్పు ఇచ్చాడన్నారు. ఈ ప్రకారం సుమారు రూ.80లక్షలు బకాయిలు ఉందని సమాచారం తెలిసిందన్నారు. ఇందులో తన ప్రమేయం ఉందని నిరూపించినా, తాను డీజిల్ అప్పు ఇవ్వాలని చెప్పి ఉన్నా బాధ్యత తనదేనన్నారు. అగస్త్యేశ్వరస్వామి ఆలయానికి సంబంధించిన ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం ఉందో మీ సోదరుడు రమణతో చెప్పించాలని చల్లా రాజగోపాల్ను కోరారు. సిరిపురి కాంప్లెక్స్కు సంబంధించిన షిరిడీ సాయి స్వీట్స్ కౌన్సిలర్ వరికూటి ఓబుళరెడ్డి కోడలి పేరుతో ఉందని, ప్రతినెలా ఆయన రూ.లక్షా 8వేలు, వెనక ఉన్న ఐస్క్రీం పార్లర్ బద్వేలి శ్రీనివాసులరెడ్డి అల్లుడు నిర్వహిస్తున్నారని, ఇందుకు గాను రూ.85వేలు అద్దె చెల్లిస్తున్నారన్నారు. రాయలసీమలోనే మున్సిపల్ భవనాలకు సంబంధించి అత్యధికంగా ఇక్కడే బాడుగ చెల్లిస్తున్నారన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు ఉస్మాన్, మేకల ప్రకాష్, శివప్రసాద్ యాదవ్, గుర్రం ప్రకాష్ పాల్గొన్నారు. -
మోసం చంద్రబాబు నైజం
పులివెందుల : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నైజమే మోసం చేయటమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ ఉన్నది లేనట్లుగా.. లేనిది ఉన్నట్లుగా చూపడంలో చంద్రబాబు సిద్ధహస్తుడన్నారు. ఆయనకు మోసాన్ని కప్పిపుచ్చుకునేందుకు ఎల్లో మీడియా వంతపాడుతోందన్నారు. చంద్రబాబు జీవితమంతా వ్యవస్థలను మ్యానేజ్ చేసుకుంటూ ఎల్లో మీడియాను అడ్డుపెట్టుకుని ప్రజలను మోసగించడం అలవాటుగా మారిందన్నారు. రాష్ట్రాన్ని ఏదో అభివృద్ధి పథంలోకి తీసుకెళుతున్నట్లుగా తప్పుడు అంకెల గారడీతో రాష్ట్రాన్ని మభ్యపెడుతున్నారన్నారు. ఇండిగో సంక్షోభంపై టీడీపీ కేంద్ర మంత్రి వ్యవహరించిన తీరుపై జాతీయ మీడియాతోపాటు దేశంలోని అన్ని మీడియాలు దుమ్మెత్తి పోస్తున్నాయన్నారు. రాష్ట్రంలో అన్ని విభాగాలు దారుణంగా వెనుకబడిపోయాయన్నారు. రైతులకు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేవని, అలాగే విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ అందక కళాశాలల యాజమాన్యాలు విద్యార్థులకు సర్టిఫికెట్లు ఇవ్వడంలేదన్నారు. పేద ప్రజలకు సంజీవని అయిన ఆరోగ్య శ్రీ పథకానికి ఈ ప్రభుత్వం తూట్లు పొడిచిందన్నారు. సంపద సృష్టిస్తానన్న చంద్రబాబు అప్పులను మాత్రం బాగా సృష్టిస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18నెలల కాలంలోనే రూ.2.30లక్షల కోట్లకుపైగా అప్పులు చేశారన్నారు. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ మరో శ్రీలంక కాదా అని ఆయన ప్రశ్నించారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు.. రాష్ట్రంలో జగనన్న హయాంలో ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను చంద్రబాబు ప్రైవేట్పరం చేయడాన్ని వ్యతిరేకిస్తూ తమ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాల కార్యక్రమం చేపట్టడం జరిగిందన్నారు. అందులో భాగంగా జిల్లాలో పెద్ద ఎత్తున సంతకాల కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తల ఆధ్వర్యంలో జరిగిందన్నారు. కోటి సంతకాల కార్యక్రమంలో పాలు పంచుకున్న పార్టీ నాయకులు, కార్యకర్తలే కాకుండా మేధావులు, విద్యార్థులు, ఇతర రంగాలకు చెందిన ప్రముఖులకు, ప్రజలకు పేరు పేరునా ధన్యవాదాలు తెలుపుతున్నానని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేస్తున్న ఉద్యమం ఇంతటితో ఆగదని, ప్రజల కోసం నిరంతర పోరాటం కొనసాగిస్తామని ఆయన తెలిపారు.ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
తుపాను ప్రభావిత రైతాంగాన్ని ఆదుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : వరుస తుపానుల కారణంగా కుదేలైన రైతాంగాన్ని ఆదుకోకపోతే కూటమి ప్రభుత్వ పతనం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర హెచ్చరించారు. రైతాంగ సమస్యలపై రాష్ట్ర వ్యాప్త ఆందోళనలో భాగంగా బుధవారం కడప ఆర్డీఓ కార్యాలయం వద్ద సీపీఐ, ఏపీ రైతు సంఘం ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేమ శాతం పేరుతోనూ, ధాన్యం రంగు మారిందని, తాలు, తప్పలు ఉన్నాయని ధాన్యం కొనుగోలు చేయకుండా అనేక కొర్రీలు పెడుతున్నారన్నారు. కొనుగోలు కేంద్రం, రైతు సేవా కేంద్రం, రవాణా ఇన్చార్జిలు, కస్టోడియన్ ఆఫీసర్లు రైస్ మిల్లర్లతో కుమ్మకై ్క ధాన్యం దళారులకు అమ్ముకునే విధంగా వ్యవహరిస్తున్నరన్నారు. దీంతో 75 కేజీల బస్తాను రూ.1200కు అమ్ముకొని బస్తాకు రూ.400 నుంచి 500 వరకు నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వ్యవసాయ, ఉద్యానవన పంటలతోపాటు ఆక్వా రైతుల పరిస్థితి కూడా దయనీయంగా మారిందన్నారు. అరటి రైతులకు న్యాయం చేస్తామని, ఉల్లి పంట రైతులకు హెక్టారుకు రూ.50వేలు ఇస్తామని, భూమిలేని ప్రతి కౌలురైతుకు అన్నదాత సుఖీభవ పథకం కింద రూ.20 వేలు అందజేస్తామని చెప్పిన ప్రభుత్వం ఇందులో ఏ ఒక్కటీ అమలు చేయలేదన్నారు. ఆందోళన అనంతరం ఆర్డీఓ కార్యాలయ అడ్మినిస్ట్రేషన్ అధికారి శంకర్ రావుకు వినతి పత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు ఎంవీ సుబ్బారెడ్డి, సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, సి.సుబ్రహ్మణ్యం, ఎన్ విజయలక్ష్మి, జి.వేణుగోపాల్, బి శంకర్ నాయక్, ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు వలరాజు, కౌలు రైతు సంఘం నాయకులు సుదర్శన్ రెడ్డి, మనోహర్ రెడ్డి, రైతు సంఘం నాయకుడు సావంత్ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర -
వసంతపేట మున్సిపల్ హైస్కూల్ ఘటనపై విచారణ
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక వసంతపేట మున్సిపల్ హైస్కూల్లో గత నెల మధ్యాహ్న భోజనం ఫుడ్ పాయిజనింగ్ విషయమై హైకోర్టు ఉత్తర్వుల మేరకు బుధవారం జిల్లా ప్రధాన న్యాయమూర్తి జడ్జి డాక్టర్ సి.యామిని విచారణ చేశారు. ఫుడ్ పాయిజనింగ్ ఎలా జరిగింది అనే విషయమై ప్రధానోపాధ్యాయుడు గురప్ప, అస్వస్థతతో ఆసుపత్రిలో చేరిన 11 మంది విద్యార్థులు, జిల్లా ఆస్పత్రి వైద్యుడు ఆనంద్బాబు, విద్యాశాఖాధికారి షంషుద్దీన్, ఫుడ్ ఇన్స్పెక్టర్ హరిత, మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి, తహసీల్దార్ గంగయ్య, ఎంఈఓలు సావిత్రమ్మ, శోభారాణి, చౌడేశ్వరి వంట ఏజెన్సీ నిర్వాహకులు జయలక్ష్మీ తదితరులను విచారించారు. ముందుగా పాఠశాలకు చేరుకున్న లీగల్ సెల్ అథారిటీ జిల్లా కార్యదర్శి బాబాఫకృద్దీన్ మధ్యాహ్న భోజనాన్ని పరిశీలించారు. భోజనం తింటున్న విద్యార్థులతో మాట్లాడారు. అలాగే జడ్జి యామిని మధ్యాహ్న భోజనం రుచి చూశారు. ప్రధానోపాధ్యాయుని గదిలో జడ్జి ఫుడ్ పాయిజనింగ్ ఘటనపై ప్రధానోపాధ్యాయుడు, విద్యార్థులు, మధ్యాహ్న భోజన ఏజెన్సీవారు, వైద్యశాఖ, పోలీసు, విద్యాశాఖ, తహసీల్దార్ తదితరులను ఒక్కొక్కరిగా విచారించి వారి నుంచి వివరాలు సేకరించారు. వంట ఏజెన్సీ నిర్వాహకురాలు మోతుకూరు జయలక్ష్మిపై కేసు నమోదు చేయాలని పోలీసులను ఆదేశించారు. -
వనిపెంట ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి
మైదుకూరు : వనిపెంటలోని ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ అన్నారు. జాతీయ హస్తకళా వారోత్సవాల్లో భాగంగా వనిపెంటలోని ఇత్తడి కళాకారుల మౌలిక వసతుల కేంద్రంలో ఏర్పాటు చేసిన శిక్షణ కార్యక్రమాన్ని బుధవారం హరిప్రసాద్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కేంద్రంలో హస్త కళాకారులు తయారు చేసిన ఇత్తడి, రాగి కళాకృతులను ఆయన పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ హస్త కళాకారులను కాపాడుకోవాలని, వారికి అండగా నిలవాలని తెలిపారు. కళాకారులు తయారు చేసే కళాకృతుల విలువను పెంచాలన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల్లో 36 హస్తకళల ఉత్పత్తులు ఉన్నాయని పేర్కొన్నారు. వనిపెంటలోని ఇత్తడి పరిశ్రమ అభివృద్ధికి కృషి చేస్తామని, రెండు నెలల శిక్షణలో కళాకారులు మంచి నైపుణ్యాన్ని పొందాలని సూచించారు. తర్వాత ఇక్కడి కళాకారులు తయారు చేసే కళాకృతులకు మార్కెటింగ్ కల్పించే బాధ్యత హస్త కళల అభివృద్ధి కార్పొరేషన్ తీసుకుంటుందని హామీ ఇచ్చారు. రాయితీతో ముడి సరుకును అందించేందుకు ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎంల దృష్టికి తీసుకుపోతానని తెలిపారు. కార్యక్రమంలో హస్తకళల కార్పొరేషన్ ఓఎస్డీ లక్ష్మీనాథ్, అధికారులు హుస్సేన్, శివారెడ్డి, ఢిల్లేశ్వరరావు, శ్రీకాంత్, వనిపెంట ఇత్తడి కళాకారుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు ఇస్మాయిల్ తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర హస్తకళల అభివృద్ధి సంస్థ చైర్మన్ డాక్టర్ పసుపులేటి హరిప్రసాద్ -
మదనపల్లెలో మిస్సింగ్.. మంగాపురంలో మర్డర్.?
● హత్యచేసి పూడ్చిపెట్టినట్లు అనుమానాలు ● దర్యాప్తు చేస్తున్న తాలూకా పోలీసులు ● భర్త ఆచూకీ కోసం స్టేషన్ వద్ద భార్య పడిగాపులుమదనపల్లె రూరల్ : మదనపల్లెలో అదృశ్యమైన వ్యక్తి తిరుపతి సమీపంలోని మంగాపురం వద్ద హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఇంటి నుంచి వెళ్లిన వ్యక్తిని స్నేహితులు చంపి తోటలో పూడ్చినట్లు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అదృశ్యమైన భర్త కోసం తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట పిల్లలతో కలిసి భార్య పడిగాపులు కాస్తోంది. మండలంలోని మాలేపాడు పంచాయతీ రామాపురానికి చెందిన చంద్రప్ప కుమారుడు ఆవులపల్లె నరసింహులు(35) నవంబర్ 27న ఇంటి నుంచి తన ద్విచక్రవాహనంలో వెళ్లాడు. అదేరోజు మధ్యాహ్నం భార్య విజయలక్ష్మి అతడికి ఫోన్ చేస్తే...సీటీఎం పంచాయతీ దిన్నెమీదపల్లెకు చెందిన స్నేహితుడు నాగరాజుతో కలిసి తిరుపతికి వెళ్లినట్లు చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేశాడు. తిరిగి ఆమె సాయంత్రం మరోసారి భర్తకు ఫోన్ చేయగా, స్విచ్ ఆఫ్ వచ్చింది. అప్పటి నుంచి భర్త ఆచూకీ కోసం బంధువులతో కలిసి మదనపల్లె, తిరుపతి తదితర ప్రాంతాల్లో వెతికింది. అయినా ఫలితం లేకపోవడంతో ఈనెల 3న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. భర్త నరసింహులు వ్యవసాయం చేస్తుంటాడని, అప్పుడప్పుడు ఇంటి నుంచి వెళితే మూడు నుంచి పదిరోజుల వరకు బయటి ప్రాంతాల్లో ఉండి ఇంటికి తిరిగి వచ్చేవాడని ఫిర్యాదులో పేర్కొంది. నవంబర్ 27న వెళ్లిన భర్త ఇప్పటివరకు తిరిగి రాలేదని, ఆచూకీ తెలపాల్సిందిగా పోలీసులను కోరింది. అదేరోజు తాలూకా పోలీసులు వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. ఇందులో భాగంగా నరసింహులు స్నేహితుడైన నాగరాజుతో పాటు మరో ముగ్గురిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈ క్రమంలో స్నేహితుల మధ్య మనస్పర్థల కారణంగా నరసింహులును హత్యచేసి తిరుపతి సమీపంలోని శ్రీనివాస మంగాపురం బ్రిడ్జి వద్ద ఓ తోటలో పూడ్చిపెట్టినట్లుగా నిందితులు చెప్పినట్లు తెలుస్తోంది. అయితే, హత్య ఎప్పుడు జరిగిందనేది స్పష్టత లేకపోవడంతో నిందితులతో కలిసి ఘటనాస్థలానికి వెళ్లి మృతదేహాన్ని వెలికి తీస్తేనే మృతికి గల కారణాలను చెప్పగలమని సీఐ కళావెంకటరమణ అన్నారు. కాగా, నరసింహులు వ్యవసాయంతో పాటు బ్లాక్ మ్యాజిక్, గుప్తనిధుల వేట తదితర పనులకు స్నేహితులతో కలిసి వెళ్లేవాడని స్థానికులు చెప్పారు. ఈ వ్యవహారంలో స్నేహితుల మధ్య వాటాల పంపకం లేదా ఇతర కారణాలు హత్యకు దారితీసి ఉంటాయని భావిస్తున్నారు. గురువారం తాలూకా పోలీసులు కుటుంబ సభ్యులతో కలిసి ఘటనా స్థలానికి వెళ్లి మృతదేహం వెలికితీసి నిర్ధారించనున్నారు. -
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడికి విప్ జారీ చేసే అధికారం
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ మేయర్ ఎన్నిక నేపథ్యంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుపున విప్ జారీ చేసే అఽధికారం ఆ పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డికి లభించింది. బుధవారం కేంద్ర కార్యాల యం నుంచి వచ్చిన ఉత్తర్వులను రవీంద్రనాథ్రెడ్డి ఎన్నికల రిటర్నింగ్ అఽధికారి, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్కు అందజేశారు. ఈ నెల 11వ తేదీ గురువారం వైఎస్సార్సీపీ తరుపున మేయర్గా పోటీ చేయబోయే అభ్యర్థికి ఆయన బి. ఫారం ఇవ్వనున్నారు. అలాగే వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన కార్పొరేటర్లందరికీ విప్ జారీ చేయనున్నారు. -
ఎంపీపీ ఎన్నికకు పటిష్ట చర్యలు
ముద్దనూరు : మండల ప్రజాపరిషత్ అధ్యక్ష పదవి ఎన్నికకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు ఎన్నికల రిటర్నింగ్ అధికారి, ఆర్డీఓ సాయిశ్రీ, జిల్లాపరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారి ఓబుళమ్మ, డీఎస్పీ వెంకటేశ్వర్లు తెలిపారు. బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో వారు ఎన్నికకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ గురువారం ఉదయం 11 గంటలకు ఎన్నిక ప్రక్రియ ప్రారంభమవుతుందని, ఓటు హక్కు కలిగిన ఎంపీటీసీ సభ్యులు 9మంది, ఒక కో–ఆప్షన్ సభ్యుడికి మాత్రమే సభాభవనంలోకి అనుమతి ఉంటుందన్నారు. వీరితో పాటు ఎంపీ, ఎమ్మెల్యేలను తప్ప ఇతరులు ఎవరినీ లోపలికి అనుమతించమని తెలిపారు. ఇప్పటికే అందరికీ ఎంట్రీ పాసులు అందజేసినట్లు పేర్కొన్నారు. సీసీ కెమెరాలు, వీడియోగ్రఫీతో ఎన్నికను చిత్రీకరించనున్నట్లు, ఎంపీడీఓ కార్యాలయం పరిసర ప్రాంతాల్లోకి ఎవరూ ప్రవేశించకుండా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేసినట్లు వారు తెలిపారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ అలీఖాన్, ఎంపీడీఓ రాధాకృష్ణాదేవి, సీఐ దస్తగిరి, ఎస్ఐ మైనుద్దీన్ తదితరులు పాల్గొన్నారు. ఉత్సాహంగా జిల్లా బాక్సింగ్ ఎంపికలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలు ఉత్సాహంగా నిర్వహించినట్లు జిల్లా బాక్సింగ్ అసోసియేషన్ అధ్యక్షుడు వెంకటేష్, కార్యదర్శి విజయ్ భాస్కర్ తెలిపారు. బుధవారం నగరంలోని మున్సిపల్ మైదానంలో జిల్లా స్థాయి బాక్సింగ్ ఎంపికలను నిర్వహించారు. 50–55 కేజీల విభాగంలో ఆంజనేయులు, 55–60 కేజీల విభాగంలో మహ్మద్ ఆలీ, 60–65 కేజీల విభాగంలో తలారి శ్రీనివాసులు, 70–75 కేజీల విభాగంలో చిత్తా రవికాంత్ ఎంపికయ్యారన్నారు. వీరు ఈ నెల 13, 14 తేదీల్లో విజయవాడ లయోలా కళాశాలలో జరిగే పోటీల్లో పాల్గొంటారన్నారు. పోలీస్ కానిస్టేబుల్ శిక్షణకు సన్నాహాలుకడప అర్బన్ : ఇటీవల ఎంపికై న స్టైపెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(ఎస్.సి.టి.పి.సి)కు త్వరలో శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలో నగర శివార్లలోని జిల్లా పోలీస్ శిక్షణా కేంద్రాన్ని (డి.టి.సి) బుధవారం జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సందర్శించారు. ఈ సందర్భంగా శిక్షణా కేంద్రంలోని వసతి ఏర్పాట్లను, కిచెన్ రూమ్, తరగతి గదులను, కార్యాలయ గదులను, మైదానం, అంతర్గత రహదారులను, బాటిల్ అబ్స్టాకల్స్ను పరిశీలించారు. ఏర్పాట్లను పరిశీలించి సంతప్తి వ్యక్తం చేశారు. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలపై అధికారులకు దిశానిర్దేశం చేశారు. జిల్లా ఎస్పీ వెంట డి.టి.సి. డీఎస్పీ అబ్దుల్ కరీం, డి.టి.సి. ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్ కుమార్ రెడ్డి, ఆర్.ఎస్.ఐ అప్పలనాయుడు, సిబ్బంది ఉన్నారు. -
యురేనియం ప్రభావిత గ్రామస్తులకు న్యాయం చేస్తాం
కడప సెవెన్రోడ్స్: యురేనియం ప్రభావిత గ్రామస్తులకు నష్టం జరగకుండా న్యాయం జరిగేలా చర్యలు చేపడతామని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా కలెక్టర్ ఛాంబర్లో తుమ్మలపల్లి యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా (యుసీఐఎల్) సమస్యలపై మాజీ ఎమ్మెల్సీ బీటెక్ రవి, ప్రాజెక్టు అధికారులు, పులివెందుల డివిజన్ రెవెన్యూ అధికారి, కేకే కొట్టాల గ్రామస్తులతో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జాతీయ స్థాయిలో అత్యంత ప్రాధాన్యత కలిగిన యూసీఐఎల్ ప్రాజెక్టు నిర్వహణకు సంబంధించి కేంద్ర స్థాయి పర్యవేక్షణ లో నిర్వహించడం జరుగుతోందన్నారు. యురేనియం ప్రభావిత గ్రామస్తుల సమస్యలు, వారి ప్రతిపాదనలను పరిశీలించి కేంద్రానికి నివేదిస్తామన్నారు. స్థానిక సమస్యలను పరిగణన లోకి తీసుకుని, ప్రాజెక్టు అవసరాలు, నిర్వహణ సామర్థ్యం దృష్ట్యా.. కొత్త టెయిలింగ్ పాండ్ నిర్మాణం చేపట్టడానికి ముందే ల్యాండ్ కమిటీని ఏర్పాటు చేసి కేకే కొట్టాల గ్రామాన్ని భూసేకరణ చేపట్టేందుకు చర్యలు చేపడతామన్నారు. దీనిపై పబ్లిక్ నోటిఫికేషన్ కూడా ఇవ్వనున్నామన్నారు. ఇందుకు దాదాపు 6 నెలల సమయం పడుతుందన్నారు. అంతేకాకుండా నిర్వహణలో ఉన్న పాత టెయిలింగ్ పాండ్ ఎత్తును పెంచుకునేందుకు కానీ, ఏదైనా మరమ్మతులు చేపట్టేందుకు కానీ ఉన్న అవకాశాలను పరిశీలించాల్సిన అవసరం ఉందన్నారు. కేకే కొట్టాల గ్రామస్తులకు ఎలాంటి నష్టం వాటిల్లకుండా పరిహారం, ఉపాధి అవకాశాలను న్యాయబద్ధంగా కల్పిస్తామన్నారు. గతంలో పరిహారంతో పాటు ఇంకా కొంతమందికి పెండింగ్ లో వున్న ఉద్యోగ కల్పన కూడా త్వరలో క్లియర్ చేయాలని యూసీఐఎల్ అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, యురేనియం కార్పొరేషన్ ఆఫ్ ఇండియా జనరల్ మేనేజర్ సుమన్ సర్కార్, యుసీఐఎల్ సూపరింటెండెంట్ ల్యాండ్ అక్విజేషన్ ఆఫీసర్ నవీన్ కుమార్ రెడ్డి, విజయ్ కుమార్, పీకే నాయర్, తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
జగన్మాతా.. నమోస్తుతే!
బ్రహ్మంగారిమఠంలో కొలువుదీరిన శ్రీ ఈశ్వరీదేవి.. జగన్మాతగా విరాజిల్లుతున్నారు. భక్తుల కొంగుబంగారంగా నిలిచి.. విశేష పూజలందుకుంటున్నారు. శక్తిస్వరూపిణి, సర్వమంగళకారిణిగా ప్రసిద్ధి చెందారు. ఈశ్వరీదేవిమఠంలో ఈ నెల 11 నుంచి అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించనున్నారు. బ్రహ్మంగారిమఠం : బ్రహ్మంగారిమఠంలో వెలసిన శ్రీవీరబ్రహ్మేంద్రస్వామిమఠం పక్కనే ఈశ్వరీదేవి మఠం ఉంది. పరాశక్తి స్వరూపిణి పార్వతిదేవి, లక్ష్మీదేవి అంశ నుంచి ఈశ్వరీదేవి అవతరించారని భక్తుల ప్రగాఢ విశ్వాసం. కాలజ్ఞాన ప్రబోధకర్త శ్రీ మద్విరాట్ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మనవరాలు శ్రీ ఈశ్వరీదేవి. బ్రహ్మంగారి రెండో కుమారుడైన గోవిందస్వామి, గిరియమ్మ దంపతుల పెద్ద కుమార్తె. ఆమె చిన్నప్పటి నుంచే సంస్కృతం, తెలుగు భాషలపై పాండిత్యం సంపాదించారు. 14 ఏళ్లు తపస్సు చేసి.. బ్రహ్మంగారిమఠానికి సమీపాన ఉన్న నల్లమల కొండ గుహలో 14 ఏళ్లు కఠోర తపస్సు చేసి.. అష్టాంగయోగాది, జ్ఞానవాక్సిద్ధి పొందారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి స్వప్న సాక్షాత్కార దర్శనం పొంది.. ఆయన ఆజ్ఞ ప్రకారం బ్రహ్మతత్వాన్ని బహుళ ప్రచారం చేసేందుకు సంకల్పించారు. తల్లిదండ్రులు వివాహ ప్రయత్నం చేయగా.. నిరాకరించారు. స్వీయ కల్యాణాన్ని త్యజించి లోక కల్యాణార్థం బ్రహ్మచర్య దీక్ష బూని ఆత్మతత్వ బోధనలు రచించారు. జేజినాయన వలే తత్త్వాలు, కీర్తనలు, కాలజ్ఞానం రాసి విశేష కీర్తి పొందారు. మఠాధీశులై.. తండ్రి గోవిందయ్యస్వామి యోగ సమాధి నిష్ట వహించిన దివ్య సన్నిధానానికి గర్భగుడి, అంతరాలయం, ముఖ మండపం నిర్మించి ప్రత్యేక(చిన్న) మఠం ఏర్పాటు చేశారు. ఆ మఠానికి మఠాధీశులై నిత్య పూజ కార్యక్రమాలు, ఆరాధన గురుపూజోత్సవాలు నిర్వహిస్తుండే వారు. అమ్మవారి బోధనలు విని ఆకర్షితులై.. ఎంతో మంది శిష్యులుగా మారారు. వారిలో పల్నాడు జిల్లా సత్తెనపల్లి నియోజకవర్గం రూపెనగుంట్ల గ్రామానికి చెందిన లంకెనపల్లి సుబ్బయ్యాచారి, స్థానికుడు చాటకొండ చంగయ్య శ్రేష్టి ప్రధాన శిష్యులు. ఈశ్వరిదేవి రాజయోగినిగా మారి.. శిష్యసమేతంగా దేశ పర్యటన చేసి భక్తితత్వాన్ని ప్రచారం చేశారు. ఆమె అనేక మహిమలు చూపారని భక్తులు పలు ఉదాహరణలు పేర్కొంటారు. సజీవ సమాధి.. 1789లో శ్రీ సౌమ్యనామ సంవత్సర మార్గశిర బహుళ నవమినాడు ఈశ్వరీదేవి సజీవ సమాధి నిష్ట వహించారు. నాటి నుంచి లోకకల్యాణార్థం యోగ నిద్రముద్రితురాలై భక్తజనుల నిత్య నీరాజనాలు స్వీకరిస్తున్నారు. ఆ ప్రాంతం శ్రీ ఈశ్వరీదేవిమఠంగా పేరొందింది. ఆరాధనోత్సవాలు.. ఈ నెల 11 నుంచి 16 వరకు అమ్మవారి ఆరాధన గురుపూజ మహోత్సవాలు నిర్వహించనున్నారు. 13న మార్గశిర బహుళ నవమిన సజీవ సమాధి నిష్ట వహించిన రోజు కనుక ప్రధాన వేడుకలు నిర్వహిస్తారు. ఉభయ తెలుగు రాష్ట్రాల నలుమూలల నుంచే కాకుండా కర్ణాటక, తమిళనాడు, మహారాష్ట్ర నుంచి భక్తులు తరలివస్తారు. వైభవోపేతంగా ఉత్సవాలు.. అమ్మవారి ఆశీస్సులతో ఏటా ఉత్సవాలు వైభవోపేతంగా జరుగుతున్నాయి. ఈ ఏడాది అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు శిష్యులు, భక్తులు ఏర్పాట్లు చేస్తున్నారు. వీటిని దేవదాయ శాఖ కార్యనిర్వహణాధికారి బి.వి.జగన్మోహన్రెడ్డి పర్యవేక్షిస్తున్నారు. ఏటా భక్తుల సంఖ్య పెరుగుతోంది. ఈ ఏడాది కూడా అధిక సంఖ్యలో పాల్గొని అమ్మవారి కృపకు పాత్రులు కావాలని కోరుతున్నాను. – శ్రీ వీరశివకుమారస్వామి, మఠాధిపతి, ఈశ్వరీదేవిమఠం భక్తుల కొంగు బంగారంగా ఈశ్వరీదేవి అమ్మవారు రేపటి నుంచి ఆరాధన గురుపూజ మహోత్సవాలు తరలిరానున్న ఐదు రాష్ట్రాల భక్తులు -
న్యాయమూర్తులతో ముందస్తు జాతీయ లోక్ అదాలత్ సమావేశం
కడప అర్బన్ : ఈనెల 13న జాతీయ లోక్ అదాలత్ జరగనున్న నేపథ్యంలో జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని ఆధ్వర్యంలో మంగళవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఎక్కువ సంఖ్యలో కేసులు రాజీ అయ్యే విధంగా ప్రతి ఒక్కరూ కృషి చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో రాజంపేట మూడవ అదనపు జిల్లా న్యాయమూర్తి, పోక్సో కోర్టు ఇన్చార్జి న్యాయమూర్తి ఎస్.ప్రవీణ్ కుమార్, నాల్గవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.దీన బాబు, ఏడవ అదనపు జిల్లా న్యాయమూర్తి జి.రమేష్ కుమార్, కడప ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూష కుమారి, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్, ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కె.భార్గవి, మొబైల్ కోర్టు జడ్జి ఆశ ప్రియ, మూడవ అదనపు జూనియర్ సివిల్ జడ్జి జి.విజయలక్ష్మి, కడప ఫస్ట్ అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి ఎం.రేష్మ పాల్గొన్నారు.


