YSR District Latest News
-
పెన్నాలో గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
వల్లూరు: వల్లూరు మండల పరిధిలోని పుష్పగిరి వద్ద పెన్నా నదిలో ఆదివారం గల్లంతైన ముగ్గురు యువకులకు సంబంధించి సోమవారం మూడో మృతదేహం లభించింది. ఇన్స్టాలో పరిచయమైన పలు ప్రాంతాలకు చెందిన 8 మంది షార్ట్ ఫిల్మ్లు, రీల్స్ చేసే క్రమంలో కడప నగర పరిసర ప్రాంతాల్లో షూటింగ్ పూర్తి చేసుకుని ఆదివారం భోజనం పార్సిళ్లతో పుష్పగిరి వద్దకు వచ్చి సరదాగా పెన్నా నదిలో దిగగా హరిబాబు (25), హర్ష వర్దన్ (22), కృష్ణ చైతన్య(20) లు నీటిలో మునిగి గల్లంతైన విషయం విదితమే. పోలీసులు స్థానిక జాలర్లు, ఫైర్ సిబ్బందితో కలిసి చేపట్టిన గాలింపు చర్యల్లో అదే రోజు సాయంత్రం హర్ష వర్దన్, హరిబాబు మృతదేహాలు లభ్యం కాగా చీకటి పడే వరకు గాలించినా కృష్ణ చైతన్య ఆచూకీ లభించలేదు. ఎస్ఐ శివ నాగిరెడ్డి ఆధ్వర్యంలో సోమవారం ఉదయం ఫైర్ సిబ్బంది, జాలర్ల సహాయంతో తిరిగి గాలింపు చర్యలు చేపట్టగా సంఘటన జరిగిన ప్రాంతానికి కొద్ది దూరంలో కృష్ణ చైతన్య మృతదేహం లభ్యమైంది. పోస్ట్మార్టం కోసం మృతదేహాన్ని కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ప్రారంభమైన పది మూల్యాంకనం
కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల సమాధాన పత్రాల మూల్యాంకనం సోమవారం కడపలోని మున్సిపల్ హైస్కూల్ మెయిన్లో ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ మూల్యాంకనానికి క్యాంపు ఆఫీసర్గా డీఈఓ షేక్ షంషుద్దీన్ వ్యవహరించారు. ఈ మూల్యాంకనానికి రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాల నుంచి అన్ని సబ్జెక్టులకు సంబంధించి 1,95,674 పేపర్లు వచ్చాయి. ఈ మూల్యాంకన విధుల్లో 94 మంది చీఫ్ ఎగ్జామినర్లు, 540 మంది అసిస్టెంట్ ఎగ్జామినర్లు 270 మంది స్పెషల్ అసిస్టెంట్లు పాల్గొని 7824 పేపర్లకు మూల్యాంకనాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా క్యాంపు ఆఫీసర్, డీఈఓ షేక్ షంషుద్దీన్ మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రంలో పేపర్లను దిద్దే సిబ్బంది అన్ని జాగ్రత్తలను పాటిస్తూ పేపర్లను మూ ల్యాంకనం చేయాలన్నారు. జవాబు పత్రాలను క్షుణంగా పరిశీలించి మార్కులను వేయాలన్నారు. మూల్యాంకన విధులకు హజరయ్యే సిబ్బంది కచ్చితంతా సమయపాలన పాటించాలన్నారు. మూల్యాంకన కేంద్రంలో ఎవరు కూడా సెల్పోన్లను వినయోగించరాదని... దీంతోపాటు మూల్యాంకన విధులకు వచ్చే సిబ్బంది ఖచ్చితంగా గుర్తింపు కార్డులను ధరించాలని సూచించారు. మూల్యాంకన కేంద్రాన్ని పరిశీలించిన ఆర్జేడీ... మున్సిపల్ హైస్కూల్ మొయిన్లో జరుగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శ్యాముల్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన డీఈఓ షేక్ షంషుద్దీన్తో కలిసి మూల్యాంకన కేంద్రంలో పరిశీలించి సిబ్బందికి పలు సూచనలు సలహాలను ఇచ్చారు. డిప్యూటీ క్యాంపు ఆఫీసర్ రాజగోపాల్రెడ్డి, ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీకాంత్, ఎంఈఓలు, మూల్యాంకన సిబ్బంది పాల్గొన్నారు. తొలిరోజు 7824 సమాధాన పత్రాలకు మూల్యాంకనం -
●తోటలలో మాగిపోతున్న అరటి గెలలు
వేముల : పాతాళానికి పడిపోయిన అరటి ధర... రైతన్న లాభాల కలల్ని తుంచేసింది. ఓ సారి ప్రకృతి వైపరీత్యం నిలువునా దెబ్బతీస్తే... మరోసారి ధరాఘాతం అరటి రైతుకు శాపమైంది. పంట బాగొచ్చినా ధర లేక శ్రీగెలశ్రీగిల్లాడుతున్న దుస్థితి నెలకొంది. ఈ ఏడాది అరటి సాగు లాభదాయకంగా ఉంటుందనే ఉద్దేశంతో రైతులు విస్తారంగా పంట సాగు చేశారు. జిల్లాలో వేల ఎకరాలలో అరటి గెలలు కోతకు వచ్చాయి. ఒక్కసారిగా మార్కెట్ ధరలు పతనం కావడంతో రైతులకు కోలుకోలేని దెబ్బ తగులుతోంది. అరటి సాగులో ఎకరానికి లక్ష రూపాయల మేర పెట్టుబడులు పెట్టారు. తోటలలో అరటి గెలలు మాగిపోవడంతో ఎకరాకు 10 టన్నులకు మించి దిగుబడులు లేవని రైతులు అంటున్నారు. సాగులో లక్ష రూపాయలు పెట్టుబడి పెడితే రూ.30వేల నుంచి రూ.40వేలు ఆదాయం వస్తే ఎకరాకు రూ.60వేల మేర నష్టపోతున్నామని రైతులు చెబుతున్నారు. జిల్లాలో 15వేల ఎకరాలలో అరటి తోటలు జిల్లాలో 40వేల ఎకరాలలో మొదటి, రెండవ, మూడవ అరటి పపంటలు సాగులో ఉన్నాయి. ఇందులో 30వేల ఎకరాలలో ఒక పులివెందుల నియోజకవర్గంలో సాగులో ఉంది. ఇప్పటికే రెండు, మూడు పంటలు అరటి కోతలు పూర్తయ్యాయి. ప్రస్తుతం మొదటి పంట జిల్లాలో 15వేల ఎకరాల్లో సాగులో ఉంది. మొదటి పంటలో అరటి గెలలు కోతకు వచ్చాయి. జూన్, జులై మాసాలలో సాగు చేసిన అరటి పంటలో గెలలు కోతకు వస్తున్నాయి. గెలలు కోతకు వచ్చే సమయానికి ధరలు పడిపోవడంతో రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. అరటికి ధరాఘాతం అరటికి మార్కెట్లో ధరలు పూర్తిగా పడిపోయాయి. టన్ను అరటి రూ.3వేల నుంచి రూ.4వేలకు మించి ధరలు లేకపోవడంతో రైతులు అల్లాడుతున్నారు. ఈ ఏడాది ఫిబ్రవరి చివరి వరకు టన్ను అరటి రూ.22వేలకుపైనే ధరలు ఉండేవి. ధరలు స్థిరంగా ఉంటాయని సాగులో ఆదాయం ఉంటుందని ఆశించిన రైతులకు నిరాశే మిగులుతోంది. రెండవ, మూడవ పంటలలో అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో ధరలు ఉండటంతో ఆదాయం వచ్చింది. మొదటి పంట రైతులకు ధరల్లేక తీవ్రంగా నష్టపోతున్నారు. శాసిస్తున్న దళారీ వ్యవస్థ మరోవైపు అరటి ధరలపై దళారుల ప్రభావం తీవ్రంగా ఉంది. ఒకరకంగా చెప్పాలంటే మార్కెట్లో అరటి ధరలను దళారీ వ్యవస్థ శాసిస్తోందని చెప్పవచ్చు. అరటి కొనుగోళ్లకు ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు వచ్చినా దళారులు లేనిదే కొనుగోలు చేయరు. దళారులేమో వ్యాపారులు ఇచ్చే డబ్బులకు ఆశపడి సిండికేట్గా ఏర్పడి అరటి ధరలను నిర్ణయిస్తూ రైతులను దోచుకుంటున్నారు. వ్యాపారులు తోటలను చూసి దళారీ ఎంత ధరకు చెబితే అంతే ధరలకు రైతులు అమ్ముకోవాల్సి వస్తోంది. కొనుగోళ్లకు ముందుకురానీ వ్యాపారులు అరటి ధరలు మార్కెట్లో పడిపోవడంతో అరటి కొనుగోళ్లకు వ్యాపారులు ముందుకు రావడంలేదు. మార్కెట్ ధరలు ఉంటే స్థానిక వ్యాపారులు నేరుగా తోటల వద్దకు వచ్చి రైతులతో మాట్లాడి అరటి కొనుగోలు చేసేవారు. ధరలు పతనం కావడంతో స్థానికంగా ఉన్న వ్యాపారులు తోటలవైపు చూడటంలేదు. ధరలు ఉన్నప్పుడు తోటల వద్దకు వచ్చిన వ్యాపారులు ధరలు పడిపోగానే అటువైపు కన్నెత్తి చూడలేదని రైతులు వాపోతున్నారు. అరటి పంట కాలం పూర్తయినా ధరలు లేక గెలలు కోత కోయలేదు. దీంతో తోటలలో అరటి గెలలు మాగిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. అరటి గెలలు మాగితే ఆ గెలలను వ్యాపారులు కొనుగోలు చేయరని, మాగిపోవడంవలన ఆ గెలలను వదిలివేయాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంతమంది రైతులు మాగిన అరటి గెలలను కోసి ట్రాక్టర్లతో బయటకు తరలించి పారేస్తున్నారు. -
అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో పరిష్కరించాలి
కడపసెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం ద్వారా స్వీకరించిన అర్జీలను ప్రత్యేక శ్రద్ధతో, అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అర్జీల స్వీకరణ కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి కలెక్టర్తోపాటు జేసీ నిధి మీనా, డీఆర్ఓ మల్లికార్జున వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరై ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ అర్జీదారులు సంతృప్తి చెందేలా నాణ్యమైన పరిష్కారం అందించాలన్నారు. పీజీఆర్ఎస్లో రీ ఓపెన్ అయిన అర్జీలను మరింత నాణ్యతతో పరిష్కరించాలని, జిల్లా అధికారులకు అందిన అర్జీలను పరిష్కరించేందుకు సమయం కేటాయించాలన్నారు. సాగునీటి సంఘాల బాధ్యత కీలకం జలమే సంపద, జలమే జీవనాధారం.. అన్న సత్యాన్ని గుర్తెరిగి నీటి భద్రతా బాధ్యతలో.. సాగునీటి సంఘాలు కీలక పాత్ర పోషించేలా చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం ‘జలధార.. నీటి భద్రత–సాగు నీటి సంఘాల బాధ్యత’అమలు ప్రణాళికపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు.. అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుండి.. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి హాజరయ్యారు. ఈ సందర్భంగా సంబందిత అధికారులతో జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి ఆదేశాల మేరకు జిల్లాలో నీటి భద్రత అందరి బాధ్యతగా భావించాలన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభమైన ‘జలధార’కార్యక్రమంలో భాగంగా.. ఏప్రిల్ 6 నుంచి జూలై 14వ తేదీ వరకు జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో జల ధార కార్యక్రమానికి సంబంధించి 100 రోజుల ప్రణాళికను బాధ్యతగా అమలు చేయాలన్నారు. ‘జలధార’విజయవంతంగా నిర్వహిద్దాం ప్రతి నీటిబొట్టును ఒడిసిపట్టేందుకు ప్రారంభించిన ‘జలధార’కార్యక్రమాన్ని జిల్లాలో విజయవంతంగా నిర్వహించేందుకు కార్యచరణ ప్రణాళికను సిద్ధం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి మండల స్థాయి అధికారులను ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
శివాలయంలో అవినీతి విచారణలో హైడ్రామా
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి (శివాలయం) ఆలయంలో జరిగిన అవినీతిపై సోమవారం చేపట్టిన విచారణ రసాభాసగా జరిగింది. అవినీతిపై ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు దేవదాయశాఖ రీజనల్ జాయింట్ కమిషనర్ చంద్రశేఖర్ ఆజాద్ ఆదేశాల మేరకు ఆరుగురితో విచారణ కమిటీని నియమించారు. ఈ కమిటీ సభ్యుల్లో ముగ్గురు గైర్హాజరయ్యారు. ప్రొద్దుటూరు దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ రవికిరణ్కుమార్రెడ్డి, మదనపల్లె ఇన్స్పెక్టర్ శశికుమార్, తిరుపతి ఇన్స్పెక్టర్ ఫణిరాజశయనలు విచారణకు హాజరయ్యారు. దీంతో ఆలయ కమిటీ చైర్మన్ ఈ విచారణపై అభ్యంతరం తెలిపారు. అధికారులకు ఆయన ఆధారాలు అందించారు. బంగారు హారం, వెండి ఆభరణాలు మాయమైనా సంబంధిత అధికారులపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. జనసేన పార్టీ నాయకులు మాదాసు మురళి, అల్లం చంద్రశేఖర్, బీజేపీ పట్టణాధ్యక్షుడు వంకదారి నరేంద్రరావు అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఆలయంలో జరిగే వినాయక చవితి ఉత్సవాల్లో దేవదాయశాఖ అధికారులు ఎలాంటి నిధులు ఇవ్వలేదని, ఉత్సవాల పేరుతో నిధులు స్వాహా చేశారని గణపతి మహోత్సవ కమిటీ ప్రతినిధులు మారెళ్ల మల్లికార్జునరావు, సుబ్రహ్మణ్యం, చంద్రగుప్తా, సేతురావు అధికారులకు తెలిపారు. గత ఐదేళ్లలో గణపతి మహోత్సవ కమిటీ పేరుతో రూ.2.80 లక్షలు స్వాహా చేశారన్నారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అవినీతిపై పలువురు భక్తులు తన దృష్టికి తెచ్చారన్నారు. దీనిపై విచారించగా బంగారు హారం, 290 గ్రాముల వెండి ఆభరణాలు మాయమయ్యాయని, బంగారు హారం రికవరీ జరిగిందన్నారు. అయితే వెండి వస్తువులు ఇంత వరకు రికవరీ కాలేదన్నారు. జూనియర్ అసిస్టెంట్ శివప్రసాద్ ఉన్నతాధికారులతో కలసి పలు చెక్కుల ద్వారా దాదాపు రూ.కోటి నిధులు దుర్వినియోగం, స్వాహా చేశారని పేర్కొన్నారు. అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రొద్దుటూరు దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ రవికిరణ్కుమార్రెడ్డి మాట్లాడుతూ ఆలయంలో జరిగిన అవినీతిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇవ్వనున్నట్లు తెలిపారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. మంగళవారం విచారణ చేయనున్నట్లు చెప్పారు. విచారణలో ఆలయ ఈఓ రమణ, అర్చకులు భక్తులు, టీడీపీ, బీజేపీ, జనసేన నాయకులు పాల్గొన్నారు.విచారణకు ముగ్గురు కమిటీ సభ్యులు గైర్హాజరు -
‘శ్రీరామ’ విద్యార్థినికి గోల్డ్ మెడల్
తిరుపతి సిటీ : కరకంబాడి రోడ్డులోని శ్రీరామ ఇంజినీరింగ్ కాలేజీ విద్యార్థిని ఎస్.భావన ఉత్తమ ప్రతిభను కనబరిచారు. ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్న్స్– డేటా సైన్స్లో 87.58శాతం మార్కులతో బంగారు పతకం సాధించారు. సోమవారం ఈమేరకు అనంతపురం జేఎన్టీయూలో నిర్వహించిన స్నాతకోత్సవంలో గవర్నర్అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్, ప్రశంసాపత్రం అందుకున్నారు. కళాశాల చైర్మన్ మన్నెం రామిరెడ్డి, సెక్రటరీ మన్నెం రామసుబ్బారెడ్డి, డైరెక్టర్ మన్నెం అరవింద్ కుమార్ రెడ్డి, ప్రిన్సిపల్ జయచంద్ర, వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ వాసు, విభాగాధిపతి డాక్టర్ స్వప్నసుధ అభినందనలు తెలిపారు. -
‘అగమ్య’ ప్రయాణం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ప్రైవేట్ బస్సుల ప్రమాదాలు ఆగడం లేదు. ఇటీవల కాలంలో కర్నూల్, అరకు, చిత్తూరు జిల్లా గంగసాగరం ప్రాంతాల్లో జరిగిన ఘటనలు మరువక ముందే మార్కాపురం వద్ద మరో ఘోర ప్రమాదం చోటు చేసుకుంది. రాత్రి ప్రయాణాలపై ఆందోళనలు వ్యక్తం అవుతున్నాయి. వైయస్సార్ జిల్లా కేంద్రం మీదుగా విజయవాడ, బెంగళూరు హైదరాబాద్ విశాఖపట్నం వంటి ప్రాంతాలకు దాదాపు 500 పైగా ప్రైవేట్ బస్సులు రాకపోకలు సాగిస్తుంటాయి. ఈ ప్రయాణంలో అత్యంత ప్రమాదకరమైన ప్రాంతాలపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించారు. జిల్లాలోని గువ్వల చెరువు ఘాట్రోడ్డు, దువ్వూరు, మైదుకూరు, ఖాజీపేట ప్రాంతాల్లోని రోడ్లు ప్రమాదాలకు నిలయం మారాయి. ఈ మార్గాల్లో ప్రమాదాలు జరగకుండా రవాణాశాఖ అధికారులు ఎప్పటికప్పుడు చర్యలు చేపడుతున్నారు. బస్సులను నిత్యం తనిఖీలు చేస్తున్నారు. అయినా ప్రాథమికంగా వెలుగులోకి వస్తున్న అంశాలు అందోళన కలిగిస్తున్నాయి. అధిక వేగం, డ్రైవర్ల ఆలసట, నిర్లక్ష్య డ్రైవింగ్, వాహనాల్లో లోపాల వల్ల ఎక్కడో ఒక చోట ప్రమాదాలకు దారి తీస్తున్నాయని అధికారులు చెబుతున్నారు. ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్నప్పటికీ బస్సుల వాస్తవ పరిస్థితి అనుమానాస్పదంగా ఉందనే విమర్శలు వినిపిస్తున్నాయి. రంగంలోని రవాణాశాఖ మార్కాపురం ప్రమాదాల పరంపర నేపథ్యంలో రవాణాశాఖ అప్రమత్తమైంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రత్యేక తనిఖీలకు శ్రీకారం చుట్టింది. చెక్పోస్ట్లు, హైవేలపై విస్తృతంగా తనిఖీలు నిర్వహిస్తున్నారు. డ్రైవర్ల లైసెన్స్లు, వాహన ఫిట్నెస్ సర్టిఫికెట్లు, పర్మిట్, ఇన్సూరెన్స్ పత్రాలను పరిశీలిస్తున్నారు. ఓవర్లోడింగ్, ఓవర్ స్పీడ్పై ప్రత్యేక నిఘా పెట్టారు. నిబంధనలు పాటించని ప్రైవేట్ బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటామని అధికారులు సష్టం చేస్తున్నారు. తీవ్ర లోపాలు ఉన్న వాహనానలు సీజ్ చేయడం, కేసులు నమోదు చేయడం జరుగుతుందని హెచ్చరిస్తున్నారు. అవసరమైతే అనుమతులను రద్దు చేసే చర్యలకు వెనుకాడబోమని అంటున్నారు. భద్రతే లక్ష్యం ప్రయాణికుల భద్రతే లక్ష్యమని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రాన్స్పోర్ట్ వ్యవస్థ్దలో క్రమశిక్షణ తీసుకురావడమే ఈ తనిఖీల లక్ష్యమని పేర్కొంటున్నారు. ప్రభుత్వ చర్యలతో పాటు ప్రయాణికులు కూడా అప్రమత్తంగా ఉండాలని సూచిస్తున్నారు. బస్సు పరిిస్థ్దితి గమనించడం, అధిక వేగంపై అభ్యంతరం చెప్పడం అవసరమని అధికారులు చెబుతున్నారు. ప్రైవేట్ ట్రావెల్స్ వైపు పెరుగుతున్న అనుమానాలు వరుస ప్రమాదాలతో రవాణాశాఖ అలర్ట్ జిల్లా వ్యాప్తంగా తనిఖీలు నిబంధన ఉల్లంఘిస్తే కఠిన చర్యలు -
గడువులోగా సమస్యలు పరిష్కరించాలి
కడప కోటిరెడ్డి సర్కిల్ : జిల్లా పోలీసు కార్యాలయంలో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలను స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. అలాగే బాధితులకు సత్వరమే న్యాయం అందేలా చూడాలని ఆయన అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ప్రకాష్బాబు, మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామిరెడ్డిలు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ -
సమస్యలు పరిష్కరించకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తాం
కడప ఎడ్యుకేషన్ : ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన ఆర్థిక హామీల అమలులో ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరి సహేతుకం కాదని, ఆర్థిక సమస్యలను పరిష్కరించుకుంటే ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ఫ్యాప్టో కడపజిల్లా చైర్మన్ సంగమేశ్వరరెడ్డి, సెక్రటరీ జనరల్ అబ్దుల్లాలు హెచ్చరించారు. ఫ్యాప్టో ఇచ్చిన మలిదశ పోరాట ఉద్యమంలో భాగంగా సోమవారం కడపలోని మున్సిపల్ మెయిన్ స్కూల్ పదోతరగతి మూల్యాంకన కేంద్రం వద్ద ఫ్యాప్టో కడప జిల్లా శాఖ ఆధ్వర్యంలో విధులకు హాజరవుతున్న ఉపాధ్యాయులు నల్ల బ్యాడ్జీలు ధరించి విధులకు హాజరయ్యేలా చైతన్య పరిచారు. ఎన్నికల సందర్భంలో రాష్ట్రంలోని ఉద్యోగ ఉపాధ్యాయులకు సకాలంలో 12వ పీఆర్సి అమలు చేస్తానని, 11వ పీఆర్సీలో జరిగిన నష్టాన్ని సవరిస్తామని, 12వ పీఆర్సీ కమిటీ వచ్చే లోపు జరిగే ఆలస్యానికి భర్తీగా మధ్యంతర భృతిని ప్రకటిస్తామని అన్నారన్నారు. పెండింగ్లో ఉన్న బిల్లుల బకాయిలు, పెన్షనర్ల ఆర్థిక ప్రయోజనాలు, మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లుల రోడ్డు మ్యాప్ ప్రకటించి విడుదల చేస్తామని హమీ ఇచ్చారన్నారు. అలాగే కారుణ్య నియామకాల విషయంలో ఉపాధ్యాయుల పిల్లలకు జిల్లా యూనిట్గా నియామకాలు చేపడతామని, ధరల పెరుగుదలకు అనుగుణంగా డీఏను ఎప్పటికప్పుడు ప్రకటిస్తామని హామీ ఇచ్చిన కూటమి పాలకులు ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు అయినప్పటికీ ఎలాంటి అతీగతి లేదన్నారు. రాష్ట్ర సంఘం ఇచ్చిన మలి దశ ఉద్యమంలో భాగంగా 9వ తేదీ సాయంత్రం మూల్యాంకన కేంద్రం వద్ద నిరసన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని తెలిపారు. ఈనెల 25 నుంచి 27 తేదీల మధ్యలో విజయవాడలో చేపట్టే రిలే నిరాహార దీక్షలో పెద్ద ఎత్తున కడప జిల్లా నుంచి పాల్గొంటామని నాయకులు తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయుల సంఘం నుంచి వెంకట సుబ్బారెడ్డి, చంద్రశేఖర్, ఎస్టీయు నుంచి ఇలియాస్బాషా, పాలకొండయ్య, రామ్మోహన్, ఏపీటీఎఫ్ నుంచి ఖాదర్ భాషా, శ్రీనివాస్ రెడి, యుటిఎఫ్, రూటా, బి టి ఏ,ఆఫ్టా అసోసియేషన్ సంఘాల నాయకులు పాల్గొన్నారు.ఫ్యాప్టో కడపజిల్లా చైర్మన్ సంగమేశ్వర్ రెడ్డి -
మహిళలను కించపరచడం నీచమైన చర్య
బద్వేలు అర్బన్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్పై ఏబీఎన్ ఆంధ్రజ్యోతి ఛానల్లో ప్రసారం చేసిన చర్చలో మహిళలను కించపరిచేలా ప్రసారం చేయడం నీచమైన చర్య అని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. సోమవారం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రతిపాదించిన మావిగన్పై ప్రజల్లో విస్తృతంగా చర్చ జరుగుతున్న నేపథ్యంలో ఆ చర్చను పక్కదారి పట్టించేందుకు ఏబీఎన్ ఛానల్ ఎండీ రాధాకృష్ణ ద్వారా వైఎస్సార్సీపీ నేతల కుటుంబ సభ్యులపై ముఖ్యంగా మహిళలపై విషం చిమ్ముతున్నారని మండిపడ్డారు. రాజకీయాల్లో సిద్దాంతపరమైన విభేధాలు, విమర్శలు సహజమే అయినప్పటికీ ఒక రాజకీయ ప్రతిపాదనను విమర్శించే క్రమంలో కుటుంబ సభ్యులను, ముఖ్యంగా మహిళలను కించపరిచేలా మాట్లాడటం సరికాదన్నారు. జర్నలిజం అనేది సమాజానికి దిశా నిర్ధేశం చేసే ఒక పవిత్రమైన వృత్తి అని, ఒక ఛానల్ ఎండీగా సమాజానికి ఆదర్శంగా ఉండాల్సిందిపోయి ఇతరుల వ్యక్తిగత జీవితాలను, మహిళల గౌరవాన్ని కించపరచడం ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణకు తగదని అన్నారు. తక్షణమే ఏబీఎన్ ఎండీ రాధాకృష్ణ మహిళా లోకానికి క్షమాపణ చెప్పాలని ఆమె కోరారు.ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ -
3ఎకరాలలో అరటి సాగు చేశా
నేను మూడెకరాలలో అరటి సాగు చేశా. సాగులో ఎకరాకు లక్ష రూపాయల మేర పెట్టుబడులు పెట్టా. ఫిబ్రవరి వరకు ధరలు ఉండటంతో గెలలు కోతకు వచ్చే సమయానికి ఇవే ధరలు ఉంటాయని ఆశించాం. ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో వ్యాపారులు రావడంలేదు. అరటి సాగులో తీవ్రంగా నష్టపోతున్నా. – రామిరెడ్డి, అరటి రైతు, గొందిపల్లె అరటి ధరలు మార్కెట్లో పడిపోవడంతో వ్యాపారులు కొనుగోళ్లకు ముందుకు రావడంలేదు. తోటలలో అరటి గెలలు మాగిపోతున్నా యి. మాగిన అరటి గెలలను ట్రాక్టర్తో తరలించి గొర్రెలకు మేతగా వేస్తున్నాం. ఐదెకరాలలో అరటి సాగుకు రూ. 4లక్షల మేర పెట్టుబడులు పెట్టా. పెట్టుబడులు కూడా రావడం ల్యా. – శివశంకర్రెడ్డి, అరటి రైతు, మబ్బుచింతలపల్లె ఈ ఏడాది మార్కెట్లో అరటి ధరలు ఒక్కసారిగా పడిపోయాయి. రెండవ, మూడవ పంటలకు ఉన్న ధరలు మొదటి పంటలో దిగుబడులు వచ్చేసరికి ధరలు లేకుండా పోయాయి. ఆమాంతం ధరలు లేకపోవడంతో వ్యాపారులు కూడా కొనుగోళ్లకు ఆసక్తి చూపలేదు. ధరలు లేకపోవడంతో సాగులో రైతులు నష్టాలను చవి చూడాల్సి వస్తోంది. – రాఘవేంద్రారెడ్డి, హెచ్ఓ, పులివెందుల -
రాధాకృష్ణ ఒళ్లు దగ్గరపెట్టుకొని వ్యాఖ్యలు చేయాలి
కడప కార్పొరేషన్ : ఏబీఎన్ ఛానెల్ ఎండీ రాధాకృష్ణ ఒళ్లు దగ్గర పెట్టుకొని వ్యాఖ్యలు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి హెచ్చరించారు. సోమవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ‘రేపు ... మీ భార్యలు.. మీ భార్యలు కాదని జగన్మోహన్ రెడ్డి చెబితే గుడ్డిగా నమ్మేసి... కట్టుకున్నదాన్ని చెల్లిగా భావించి పెళ్లి సంబంధాలు కూడా చూడటానికి వెరవని వెన్నుముక లేని బ్యాచ్ వైఎస్సార్సీపీలో తయారైందని రాధాకృష్ణ మాట్లాడటం చాలా అభ్యంతరకరమన్నారు. ఆ మాటలు వింటుంటే ఒంటినిండా కులగజ్జితో , ఎంగిలి మెతుకులు ఏరుకుంటూ, బతుకుతున్న నీ స్వభావం గురించి నువ్వే చెప్పుకున్నట్టు అనిపించడం లేదా... అని ప్రశ్నించారు. ఏ పార్టీ అయినా నాయకుడి అడుగుజాడల్లో నడుస్తుందని, అది పార్టీ శ్రేణుల కర్తవ్యమన్నారు. అంతమాత్రానికే తల్లికి, భార్యకు తేడా తెలియని నీలాంటి వారు పార్టీ శ్రేణుల విధేయతను కించపరుస్తూ మాట్లాడితే చూస్తూ ఊరుకోమన్నారు. జర్నలిజం ముసుగులో అక్షర వ్యభిచారం చేస్తున్న నీలాంటి వారు సూక్తులు చెబితే జనం నోటితో నవ్వడం లేదని, అడవులు సంరక్షణ గురించి వీరప్పన్, ప్రపంచ శాంతి గురించి బిన్లాడెన్ ఉపన్యాసం ఇచ్చినంత చండాలంగా ఉందన్నారు. ఏ పార్టీ అభిమానులు ఎలా ఉండాలో చెప్పడానికి నీవు ఎవరని ప్రశ్నించారు. మీరు ఎన్టీఆర్ను రాముడిగా చూపిస్తే మొక్కాలి, అదే వ్యక్తిని డ్రామారావు, కామారావుగా చూపిస్తే అసహ్యించుకోవాలా...చెప్పులు వేయించి పైకి పంపిస్తే చప్పట్లు కొట్టాలా అని సూటిగా ప్రశ్నించారు. మీరు ఏపీకి ప్రత్యేక హోదా కావాలని చెబితే... మేము తలలు ఊపాలి, హోదా వల్ల ఉపయోగం లేదు..ప్యాకేజీ ముద్దు అంటే అవునంటూ వెనక నడవాలా అని నిలదీశారు. మీరు కాంగ్రెస్తో జట్టు కట్టి మోడీని తిడితే మీకు జేజేలు పలకాలి, మీరు బీజేపీతో ఉంటూ సోనియాను తిడితే చప్పట్లు కొట్టాలా...రాష్ట్రం అప్పుల్లో ఉంది , ఆర్థిక పరిస్థితి బాగోలేదు , వచ్చిన ఆదాయం జీతాలకే సరిపోవడం లేదు అని మీరు చెబితే నమ్మాలి, మళ్లీ అదే నోటితో లక్ష ఎకరాల విస్తీర్ణంలో కొన్ని లక్షల కోట్లు తగలబెట్టి ... 50 ఏళ్ల పాటు ప్రపంచస్థాయి రాజధానిని కడతామని చెబితే ఊకొట్టాలా ఇదేం నీతి అని ప్రశ్నించారు. ప్రతిపక్ష నేతగా వైఎస్ జగన్ ఢిల్లీ వెళ్లి . ప్రధాని ని కలిస్తే .‘అమ్మ జగనా‘అంటూ హెడ్డింగ్ పెట్టి . కేసులు మాఫీ కోసం వెళ్ళాడని రాస్తారు, మీ కులపోడు ప్రతిపక్షనేతగా ఢిల్లీ వెళ్లి అక్కడ అందరి కాళ్ళు పట్టుకుంటే.. మావాడు ఢిల్లీని వణికించాడని ... అక్కడ చక్రం తిప్పాడని ... లుచ్చా రాతలు రాస్తారన్నారు. ఇప్పటికై నా అక్షర వ్యభిచారం మానుకోవాలని.. ఒళ్ళు దగ్గర పెట్టుకుని వార్తలు, వ్యాఖ్యలు చేయాలని హితవు పలికారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా వైద్య విభాగం సభ్యులు డాక్టర్ పి పెంచలయ్య పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి -
వేధింపులపై కేసు నమోదు
రాజుపాళెం : భర్తతో పాటు అతని కుటుంబీకులు అదనపు కట్నం కావాలని వేధింపులకు గురి చేస్తున్న సంఘటనలో నలుగురిపై కేసు నమోదైన సంఘటన సోమవారం రాజుపాళెం మండలంలో చోటు చేసుకుంది. రాజుపాళెం ఏఎస్ఐ సిద్దయ్య తెలిపిన వివరాల మేరకు... మండలంలోని అర్కటవేముల గ్రామానికి చెందిన నంద్యాల స్వప్నాదేవికి నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ టౌన్కు చెందిన గుల్లదుర్తి వెంకట కృష్ణారెడ్డితో గత ఏడాది 2025లో వివాహం జరిగింది. అప్పట్లో కట్నకానుకల కింద 21 తులాల బంగారు, ఒక కేజీ వెండి సామాన్లు, రెండు లక్షల నగదును ఇచ్చినట్లు తెలిపారు. వెంకట కృష్ణారెడ్డి హైదరాబాదులో ఫార్మా కంపెనీలో ఉద్యోగం కోసం ఇంటర్వ్యూ ఉందని అని చెప్పి వెళ్లిపోయి అదనపు కట్నం కోసం స్వప్నా దేవిని వేధింపులకు గురి చేస్తున్నారన్నారు. అదనపు కట్నం కింద మరో రెండు లక్షలు ఇవ్వాలని భర్తతో పాటు అతని మేనమామ, తమ్ముడు, అత్త వేధింపులకు గురిచేయడంతో నంద్యాల స్వప్నా దేవి ఇచ్చిన ఫిర్యాదు మేరకు భర్తతో పాటు మరో ముగ్గురిపై సోమవారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ వివరించారు.పల్సర్ మోటార్ బైకు దగ్ధంవేంపల్లె : పులివెందుల రోడ్డు నుండి గండికి వెళ్లే బైపాస్ రోడ్డులో ఆదివారం తెల్లవారుజామున ట్యాంకు నుంచి పెట్రోలు లీకై పల్సర్ బైకు దగ్ధమైంది. సోమవారం పోలీసులు తెలిపిన వివరాలు. వేంపల్లె మేదర వీధికి చెందిన కమల్బాషా అనే వ్యక్తి గండి బైపాస్ రోడ్డులోని ఒక ఫంక్షన్ హాలులో జరిగే వివాహానికి బైకులో వెళ్లాడు. ఆదివారం రాత్రి 2గంటల సమయంలో బైక్ యజమాని కమల్బాషా స్నేహితుడు మహమ్మద్ బైకును తీసుకుని స్పీడ్గా వెళ్లడంతో బైక్ నుంచి పెట్రోల్ లీకై మంటలు చెలరేగాయి. దీంతో మహమ్మద్ అనే వ్యక్తి భయపడి బైకును అక్కడ పడేసి వెళ్లిపోయాడు. ఈ విషయం ఎవరికీ చెప్పకపోవడంతో మంటలు ఎగసిపడి పూర్తిగా ఏపీ39సీహెచ్ 1934 నంబరు గల పల్సర్ బైకు పూర్తిగా కాలిపోయిందని సీఐ నరసింహులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరోగ్యశ్రీని అనారోగ్యశ్రీగా మారుస్తున్న చంద్రబాబు
పులివెందుల : రాష్ట్రంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అనారోగ్యశ్రీగా మారుస్తున్నాడని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి దుయ్యబట్టారు. సోమవారం పులివెందులలోని తన స్వగృహం వద్ద ఆయన మాట్లాడుతూ ఆరోగ్యశ్రీ పథకానికి సంబంధించి నెట్వర్క్ ఆసుపత్రులకు దాదాపు రూ.3వేల కోట్ల బకాయిలను కూటమి ప్రభుత్వం చెల్లించలేదన్నారు. దీంతో వారం రోజులుగా ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు సమ్మె ప్రకటించి ఆరోగ్యశ్రీ సేవలను ప్రజలకు అందించడం లేదన్నారు. దీంతో పేద ప్రజలు వైద్య చికిత్సలు అందక తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం కింద వైద్య సేవలు నిలిచిపోవడంతో పేద ప్రజలు వైద్య సేవలు పొందడానికి అప్పులు చేసే పరిస్థితి నెలకొందన్నారు. అయినా ఈ ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేదని మండిపడ్డారు. ఇప్పటికే మెడికల్ కళాశాలలను ప్రైవేట్పరం చేయాలనుకుంటున్న చంద్రబాబు ఆరోగ్య పథకాన్ని కూడా అటకెక్కించాలని చూడటం దారుణమని ధ్వజమెత్తారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీ పథకాన్ని జగనన్న రూ.5లక్షల నుంచి రూ.25లక్షలకు పెంచారని గుర్తు చేశారు. అమరావతికి పెట్టే ఖర్చులో ఒక్క శాతం నిధులను ఖర్చు చేసినా రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలు పూర్తవుతాయన్నారు. కేవలం 29గ్రామాల రియల్ ఎస్టేట్ కోసం చంద్రబాబు అమరావతి పేరుతో రూ.2లక్షల కోట్లు ఖర్చు చేస్తానని చెప్పుకోవడం హాస్యాస్పదంగా ఉందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కళ్యాణ్లు అమరావతి పేరుతో కమీషన్ల రూపంలో వేల కోట్లు దోచుకునేందుకే అమరావతి పేరుతో నాటకాలాడుతున్నారని ఎంపీ విమర్శించారు. జగనన్న ప్రతిపాదించిన ‘మావిగన్’ సమన్యాయం చేస్తుందన్నారు. కానీ తమ ఎల్లో మీడియా ద్వారా టీడీపీ నాయకులు విష ప్రచారం చేయటం సిగ్గు చేటని ధ్వజమెత్తారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ధ్వజం -
9న జిల్లా స్థాయి మహిళల హాకీ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా మహిళల జూనియర్, సీనియర్ ఎంపికలు ఈ నెల 9న నగర శివార్లలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో నిర్వహించనున్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కా ర్యదర్శి శేఖర్ సోమవారం ఒక ప్రకటనలో తెలి పారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు జూనియర్ విభాగంలో 01–01–2007 తరువాత జన్మించి ఉండాలని పేర్కొన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడా కారిణులు తమ ఆధార్, డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికెట్స్, పదో తరగతి మార్క్ లిస్ట్ తీసుకురావాలన్నారు. ఎంపికైన జూనియర్ జిల్లా జట్టు ఈనెల 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరగబోయే రాష్ట్ర స్థాయి జూనియర్ టోర్నమెంట్లో పాల్గొంటారన్నారు. అలాగే సీనియర్ మహిళల ఎంపికలు కూడా నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు 86884 46515 అనే నెంబర్ను సంప్రదించాలని సూచించారు. ‘డయల్ యువర్ ఎస్ఈ’కి స్పందన కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు నిర్వహిస్తున్న ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ ఈ’ కార్యక్రమానికి మంచి స్పందన లభించింది. సోమవారం విద్యుత్ భవన్లోని ఎస్ఈ ఛాంబర్లో ఉదయం 8.30 నుంచి 9.30 గంటల వరకూ నిర్వహించిన ఈ కార్యక్రమంలో 9 మంది వినియోగదారులు మొబైల్ కమ్యూనికేషన్స్ ద్వారా విద్యుత్ సమస్యలను వివరించారు. ఎస్ఈ ఎస్. శ్రీనివాసులు వారి సమస్యలను విని సంబంధిత అధికారులకు తక్షణ చర్యల కోసం బదిలీ చేశారు. వినియోగదారుల సమస్యలను స్వయంగా పరిశీలించి, సాధ్యమైన పరిష్కారాలు తీసుకోవడం ఏపీఎస్పీడీసీఎల్ లక్ష్యమని ఆయన తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ మధుసూదన్, డీఈఈలు మోహన్, నాగముని స్వామి, అసిస్టెంట్ ఇంజనీర్ శ్యామ్ పాల్గొన్నారు. నోటిఫికేషన్ రద్దు కడప కోటిరెడ్డి సర్కిల్ : ఫ్రంట్ ఆఫీస్ కో–ఆర్డినేటర్ పోస్టు భర్తీకి సంబంధించి గతంలో జారీ చేసిన నోటిఫికేషన్లో లోపాలు ఉన్నందున వాటిని రద్దు చేశామని జిల్లా ప్రధాన న్యాయమూర్తి సి.యామిని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ చైర్మన్ ఆంధ్రప్రదేశ్ స్టేట్ లీగల్ సర్వీసెస్ అథారటి ఆదేశాల మేరకు ఆ నోటిఫికేషన్లో జరిగిన ఎంపిక ప్రక్రియను రద్దు చేశారని, త్వరలో కొత్త నోటిఫికేషన్ జారీ చేస్తారని పేర్కొన్నారు. స్థానికులు, స్థానికేతర అభ్యర్థులు ఇద్ద రు దరఖాస్తులు చేసుకోవచ్చునన్నారు. గతంలో దరఖాస్తు చేసిన అభ్యర్థులు మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాల్సిన అవసరంలేదన్నారు. కొత్తగా దరఖాస్తు చేసే అభ్యర్థులు మాత్రమే పరీక్ష చెల్లించాలని, నోటిఫికేషన్ వివరాలను త్వరలో తెలియజేస్తామని ఆమె తెలిపారు. అధిక ఉష్ణోగ్రతలతో అప్రమత్తం! కడప సెవెన్రోడ్స్: అధిక ఉష్ణోగ్రతలు, వేడి గాలుల ప్రభావం పెరుగుతున్న నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండి తమ ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సూచించారు. సోమవారం జిల్లా సచివాలయంలోని సభా భవన్లో కలెక్టర్, జేసి నిధి మీనాతో కలసి వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో వడదెబ్బ నివారణకు సంబంధించిన అవగాహన పోస్టర్లను విడుదల చేశారు. -
క్షణికావేశం.. చిన్నాభిన్నం
అప్పుల ఊబిలో చుక్కుకుని ఛిద్రమైన కుటుంబంగాలివీడు : క్షణికావేశంతో తీసుకున్న అనాలోచిత నిర్ణయం ఒక కుటుంబాన్ని చిన్నాభిన్నం చేసింది. అప్పుల భారంతో మనస్తాపానికి గురైన దంపతులు తీసుకున్న ఆత్మహత్య నిర్ణయం రెండు ప్రాణాలను బలి తీసుకోగా, ఇద్దరు అమాయక చిన్నారులను అనాథలుగా మార్చింది. ఈ ఘటన గాలివీడు పట్టణంలో విషాదాన్ని నింపింది. శెట్టివారిపల్లెకు చెందిన మారువేణి మల్లికార్జున (35), ఆయన భార్య రాణి దంపతులకు ఐదేళ్ల జాన్వీ, మూడు నెలల చిన్నారి ఉన్నారు. మల్లికార్జున ఓ ప్రైవేట్ హౌసింగ్ కంపెనీలో మేనేజర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మొదట సాఫీగా సాగిన జీవితం, కుటుంబ అవసరాల పెరుగుదలతో ఆర్థిక ఒత్తిళ్లు అధికమయ్యాయి. అవసరాల కోసం తీసుకున్న అప్పులు క్రమంగా పెరుగుతూ, వాటి మీద వడ్డీలు భారంగా మారాయి. ఒకవైపు అప్పు తీర్చేందుకు మరొక అప్పు తీసుకోవడం, మరోవైపు అధిక వడ్డీలతో అవస్థలు ఏర్పడ్డాయి. చివరికి వడ్డీ వ్యాపారుల ఒత్తిడి తట్టుకోలేక దంపతులు తీవ్ర మనోవేదనకు గురయ్యారు.ఈ నేపథ్యంలో ఏప్రిల్ 3వ తేదీ రాత్రి విషద్రావణం తాగారు. వెంటనే వారిని కడప, కర్నూలు ఆసుపత్రులకు తరలించి చికిత్స అందించినప్పటికీ, ఇద్దరూ ప్రాణాలు కోల్పోయారు. ఆసుపత్రిలో లిద్దరూ విగతజీవులుగా పడివున్న తల్లిదండ్రులను చిన్నారులు విలపించారు. ఏమి జరిగిందో అర్థం కాని ఆ పసిపాపల పరిస్థితి ప్రతి ఒక్కరినీ కదిలించింది. వారిని ఎవరు చూసుకుంటారు? వారి విద్య, భవిష్యత్తు ఎలా ఉంటుంది? అన్న ప్రశ్నలు సమాజం ముందున్నాయి. ఈ విషాద ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు. ఇదిలా ఉండగా, అనాథలుగా మిగిలిన చిన్నారులకు ప్రభుత్వం, స్వచ్ఛంద సంస్థలు ముందుకు వచ్చి సహాయం చేయాలని గ్రామస్తులు, మానవతావాదులు కోరుతున్నారు. మనస్తాపంలో తీసుకునే ఒక్క తప్పుడు నిర్ణయం ఎన్నో జీవితాలను చీకటిలోకి నెట్టేస్తుందని ఈ ఘటన మళ్లీ గుర్తుచేసింది. భాదతప్త హృదయాలతో అంత్యక్రియలు ఆత్మహత్య చేసుకున్న మారువేణి మల్లికార్జున, ఆయన భార్య రాణి మృతదేహాలు మండల కేంద్రమైన శెట్టివారిపల్లెకు చేరుకున్న వెంటనే కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు బోరున విలపించారు. బాధాతప్త హృదయంతో భార్యభర్తల అంత్యక్రియలు ఆదివారం సాయంత్రం పూర్తి చేశారు. -
సమతావాదికి మమతల నీరాజనాలు
కడప సెవెన్రోడ్స్: దేశ స్వాతంత్య్రం కోసం పోరాడుతూనే మరోవైపు సామాజిక వివక్షతను జయించిన సామాజిక విప్లవ యోధుడు డాక్టర్ బాబు జగ్జీవన్ రామ్ అని ఆయనకు దేశం యావత్తు మమతల నీరాజనాలు అర్పిస్తోందని జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునుడు కొనియాడారు. ఆదివారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సమతావాది, మానవతావాది, సుపరిపాలనాధ్యక్షుడు డాక్టర్ బాబూ జగ్జీవన్రామ్ 119వ జయంతి వేడుకలు సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా జిల్లా రెవెన్యూ అధికారి మల్లికార్జునతోపాటు మాదిగ కార్పొరేషన్ డైరెక్టర్ మల్లేష్, జిల్లా కో–ఆపరేటివ్ అధికారి వెంకట సుబ్బయ్య, జెడ్పీ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ రాజ్యలక్ష్మి, సాంఘిక సంక్షేమ శాఖ డీడీ సరస్వతి హాజరయ్యారు. బాబు జగ్జీవన్ రామ్ గారి ఆశయ స్ఫూర్తితో.. జిల్లాలో సుస్థిర అభివద్ధి కోసం.. అధికారులు పాటుపడాలని డీఆర్ఓ సూచించారు. కార్యక్రమంలో జిల్లా కో ఆపరేటివ్ అధికారి వెంకటసుబ్బయ్య, వివిధ దళిత, ప్రజా సంఘాల నాయకులు పాల్గొన్నారు. రుణాల పంపిణీ: అనంతరం డీఆర్డీఏ, ఎస్సీ కార్పొరేషన్ ఆధ్వర్యంలో 53 మంది లబ్ధిదారులకు ఉన్నతి పథకం ద్వారా రూ. 21.20 లక్షలు, ఎస్సీ కార్పొరేషన్ ద్వారా రూ 26.50 లక్షలు, లబ్ధిదారుల వాటా రూ. 5.30 లక్షలు కలిపి మొత్తం రూ. 53 లక్షలు వివిధరకాల జీవనోపాధులకు మంజూరు చేశారు. డీఆర్వో మల్లికార్జునుడు -
నేనే సత్యము.. నేనే జీవము..
నేటి నుంచి వార్షిక పరీక్షలు కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా 1వతరగతి నుంచి 8వ తరగతి విద్యార్థులకు వార్షిక పరీక్షల షెడ్యూల్ విడుదలైంది. సంబంధిత పరీక్షలు నేటి నుంచి అన్ని పాఠశాలల్లో ప్రారంభంకానున్నాయి. ఇందులో భాగంగా 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు 6వ తేదీ నుంచి 10వ తేదీ వరకు, 6 నుంచి 8 తరగతి విద్యార్థులకు 6 నుంచి 16వ తేదీ వరకు నిర్వహిస్తారు. 1 నుంచి 5వ తరగతి విద్యార్థులకు ఉదయం 9.30 గంటల నుంచి మద్యాహ్నం 12.30 గంటల వరకు , 6 నుంచి 8వ తరగతి విద్యార్థులకు 9.15 నుంచి 12.30 గంటల వరకు నిర్వహించనున్నారు. జిల్లావ్యాప్తంగా ప్రైవేటు, ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న 2,94,958 మంది విద్యార్థులు ఈ వార్షిక పరీక్షలకు (సమ్మెటివ్ అసెస్మెంట్–2)హాజరుకానున్నారు. ఇందుకు సంబంధించిన ప్రశ్నపత్రాలను కడపలోని జిల్లా కామన్ ఎగ్జామ్ బోర్డు(డీసీఈబీ) నుంచి మండల కేంద్రాలకు చేర్చారు. ● 1 నుంచి 8 తరగతులకు ఎస్ఏ–2 పరీక్షలు ● మండల కేంద్రాలకు చేరిన ప్రశ్నపత్రాలు కడప సెవెన్రోడ్స్ : పునరుత్తానంతో తానే జీవమునని క్రీస్తు ఏసు లోకానికి చాటారని మరియాపురం సెయింట్ క్యాథడ్రల్ చర్చి బిషప్ సగినాల పాల్ ప్రకాశ్ అన్నారు. ఆదివారం క్రీస్తు పునరుత్తానం (ఈస్టర్) పండుగను పురస్కరించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తెల్లవారుజామునే పెద్ద ఎత్తున విశ్వాసులు చర్చి ఆవరణలోకి తరలివచ్చి ప్రార్థనల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా బిషప్ ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. ద్వేషం ఉన్నచోట ప్రేమను, అశాంతి ఉన్నచోట సమాధానాన్ని నెలకొల్పి సత్యాన్ని స్థాపించడమే ఈస్టర్ పండుగ అసలైన పరమార్థమని వివరించారు. జిల్లా వ్యాప్తంగా ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు భక్తిశ్రద్ధలతో నిర్వహించుకున్నారు. ఘనంగా ఈస్టర్ వేడుకలు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక ప్రార్థనలు -
పువ్వులు విరిసె..సీతాపతి మురిసె
ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రామయ్య సన్నిధిలో ఆదివారం పుష్పయాగాన్ని వేడుకగా నిర్వహించారు. బ్రహ్మోత్సవాలు ముగిసిన తరువాత పుష్పయాగం, ఏకాంతసేవ నిర్వహించడం సాంప్రదాయం. ఇందులో భాగంగా వివిధ ప్రాంతాల నుంచి తెప్పించిన నయనమనోహరమైన పుష్పాలతో కోదండరాముడిని అర్చించారు. వేలాదిగా తరలివచ్చిన భక్తులు ఈ వేడుకను తిలకించి పులకించిపోయారు. పుష్పాభిషేకం.. కోదండ రాముడి సన్నిదిలో పుష్పయాగం సందర్భంగా రంగురంగుల పుష్పాలతో జగదభిరాముడికి పుష్పాభిషేకం చేశారు. ఉదయం సుప్రభాత సేవ జరిగింది. ఆలయశుద్ధి, ఆరాధన చేపట్టారు. అనంతరం భక్తులకు సర్వదర్శనం భాగ్యం కల్పించారు. సాయంత్రం 6 గంటలకు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో పుష్పప్రదర్శన చేశారు. బెంగులూరు, నాగర్కోయిల్, శ్రీరంగం, చైన్నె, తిరుపతి, కడప నగరాల నుంచి 3 టన్నుల 12 రకాల పూలు, 6 పత్రాలు పుష్పాలను తెప్పించారు. గులాబి, చామంతి, నూరువరహాలు, సంపంగి, మల్లె, గన్నేరు, మొగలిరేకులు, కనకాంబరాలు, తామర పూలు తీసుకొచ్చారు. తులసిదళాలు, దవనం, పన్నీరు, మరవంపత్రాలతో సీతారామలక్ష్మణ మూర్తులకు పుష్ప నీరాజనం చేశారు. ఈ యాగం నిర్వహించడంతో సమస్త దోషాలు తొలగిపోతాయని వేదపండితులు రాజేష్ భట్టార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో టీటీడీ ఉద్యాన అధికారి శ్రీనివాసులు, ప్రముఖులు, విశేష సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. శ్రీ కోదండ రామాలయంలో నయనానందకరంగా పుష్పయాగం -
ట్రాక్టర్ కింద పడి డ్రైవర్ మృతి
ముద్దనూరు : మండలంలోని పెద్దదుద్యాల గ్రామ సమీపంలో ఆదివారం ట్రాక్టర్ నడుపుతూ ప్రమాదవశాత్తు అదే ట్రాక్టర్ క్రింద పడి డ్రైవరు శ్రీనివాసులు(44) దుర్మరణం చెందాడు.ఎస్ఐ మధుసూదన్రెడ్డి సమాచారం మేరకు ముద్దనూరులోని యానాది కాలనీలో నివాసం ఉంటున్న శ్రీనివాసులు తన కుటుంబంతో కలిసి సుంకేసుల, పెద్దదుద్యాల గ్రామాల్లో తాడిపత్రికి చెందిన వ్యక్తి పొలాల్లో పనిచేస్తున్నాడు.ఆదివారం సాయంత్రం సుంకేసుల నుంచి పెద్దదుద్యాలలోని పొలంలోకి ట్రాక్టర్ నడుపుకుంటూ వస్తున్నాడు.ప్రధాన రహదారి నుంచి పక్కకు వెళ్తుండగా ట్రాక్టర్ అదుపుతప్పి పడిపోయింది.ఈ ప్రమాదంలో శ్రీనివాసులు ట్రాక్టర్ క్రింద పడి అక్కడికక్కడే మృతిచెందాడు.మృతునికి భార్య ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఎస్ఐ సంఘటనాస్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కార్డన్ సెర్చ్ ఆపరేషన్ కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఆదివారం తెల్లవారుజామున కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌకు పీఎస్ పరిధిలోని వైఎస్ఆర్ కాలనీలో చిన్నచౌకు సీఐ ఓబులేసు ఆధ్వర్యంలో కడప టూ టౌన్ సీఐ జి.ప్రసాద రావు, ఎస్ఐ రామకృష్ణ, సిబ్బందితో శ్రీఆపరేషన్ వజ్రప్రహార్శ్రీలో భాగంగా కార్డన్ అండ్ సర్చ్ ఆపరేషన్ నిర్వహించారు. పాత నేరస్తులు, అనుమానితుల ఇళ్లలో, అనుమానిత ప్రాంతాల్లో అణువణువూ క్షుణ్ణంగా తనిఖీలు నిర్వహించారు. వాహనాల రికార్డులను పరిశీలించారు. సరైన రికార్డులు లేని 10 ద్విచక్ర వాహనాలు స్వాధీనం చేసుకున్నారు. రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లకు, సస్పెక్ట్ షీటర్లకు కౌన్సెలింగ్ నిర్వహించారు. చట్ట వ్యతిరేక కార్యకలాపాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గ్రామస్తులు ఎవరూ ఎలాంటి గొడవలకు పాల్పడకుండా మీరు మీ పనులు చేసుకుంటూ ఆర్థికంగా ఎదిగి పిల్లల బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలని సూచించారు. సైబర్ నేరాలపై ప్రజలకు అవగాహన కల్పించారు. అసాంఘిక కార్యకలాపాలకు సంబంధించి లేదా అనుమానితుల సమాచారాన్ని డయల్ 112 ద్వారా పోలీస్ శాఖకు సమాచారమివ్వాలని సూచించారు. ఎవరూ రికార్డులు లేని వాహనాలను కొనుగోలు చేయవద్దని కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు సూచించారు. 12న జిల్లా నూర్బాష్ సంఘ సమావేశంకడప సెవెన్రోడ్స్ : జిల్లా నూర్బాష్ అసోసియేషన్ నూతన కార్యవర్గాన్ని ఎన్నుకునే కార్యక్రమం ఈనెల 12వ తేది కడప నగరం ఎర్రముక్కపల్లెలోని సంఘ కార్యాలయంలో నిర్వహిస్తున్నట్లు ఆ సంఘం జిల్లా అధ్యక్షులు వి.ఖాదరయ్య ఒక ప్రకటనలో తెలిపారు. సంఘ కార్యవర్గ కాలపరిమితి రెండు సంవత్సరాలు పూర్తయిన నేపధ్యంలో సర్వసభ్య సమావేశం ఏర్పాటు చేసి కొత్త కార్యవర్గాన్ని ఎన్నుకోనున్నట్లు తెలిపారు. కనుక జిల్లాలోని అసోసియేషన్ ప్రతినిధులు హాజరు కావాలని కోరారు. -
ఉప్పుగుంటపల్లెలో పురాతన విగ్రహం
మైదుకూరు : వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు మండలంలోని ఉప్పుగుంటపల్లెలో ఆదివారం పురాతన అమ్మవారి విగ్రహం బయటపడింది. గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి వారసుల పొలాల వద్ద ఈ విగ్రహంతోపాటు నాగుల విగ్రహాలు వెలుగు చూశాయి. పెద్దిరెడ్డి అబ్బిరెడ్డి కుటుంబీకులు పూజలు నిర్వహిస్తూ పిల్లలకు పుట్టు వెంట్రుకలు తీసే పుట్ట శనివారం కుంగడాన్ని గమనించారు. ఈ విషయాన్ని దువ్వూరు మండలం జొన్నవరం రామాలయం పూజారికి తెలపగా, తవ్వకాలు జరపకుండా ఆ ప్రాంతాన్ని నీటితో నింపాలని సూచించినట్టు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పెద్దిరెడ్డి దశరథరామిరెడ్డి తెలిపారు. తాము ఆ విధంగా చేయడంతో మట్టి కరిగి తొలగిపోయి అమ్మవారి విగ్రహం నాగులు విగ్రహాలు బయటపడ్డాయని వివరించారు. ఈ విషయాన్ని మైదుకూరుకు చెందిన ఔత్సాహిక చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్కు తెలిపామని ఫొటోలను పంపామని తెలిపారు. ఆయన బయటపడిన విగ్రహం చాముండి విగ్రహం అని, 17వ శతాబ్దానికి చెందినదై ఉండవచ్చని తెలిపారన్నారు. అమ్మవారి విగ్రహం బయటపడిన విషయాన్ని అమెరికాలో ఉంటున్న తమ బంధువులకు తెలియజేశామని దశరథరామిరెడ్డి తెలిపారు. -
మూల్యాంకనం
నిఘా నీడలో కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్ష పత్రాల మూల్యాంకనానికి సర్వం సిద్ధమైంది. కడపలోని మున్సిపల్ హైస్కూల్ మెయిన్లో సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభంకానుంది. ఇందుకు సంబంధించిన అన్ని ఏర్పాట్లను విద్యాశాఖ అధికారులు సిద్ధం చేశారు. ఈ ప్రక్రియ ఏప్రిల్ 6 నుంచి 15వ తేదీ వరకు నిర్వహించనున్నారు. ఇప్పటికే వివిధ జిల్లాల నుంచి వచ్చిన సమాధాన పత్రాలకు కోడింగ్ ప్రక్రియ ముగిసింది. ఈ పేపర్ల మూల్యాంకనానికి జిల్లావ్యాప్తంగా 900 మంది సిబ్బందిని ఏర్పాటు చేశారు. వీరిలో జవాబు పత్రాలకు మూల్యాంకన నిర్వహించే అసిస్టెంట్ ఎగ్జామినర్లతోపాటు వాటిని పరిశీలించేందుకు చీప్ ఎగ్జామినర్, స్పెషల్ అసిస్టెంట్లను సిద్ధం చేశారు. ఈ మూల్యాంకన ప్రక్రియకు సంబంధించి జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ క్యాంపు ఆఫీసర్గా వ్యవహరించనున్నారు. మూల్యాంకన కేంద్రంలో అన్ని గదులతోపాటు ఆవరణలో కూడా సీసీ కెమోరాలను ఏర్పాటు చేశారు. దీంతో మూల్యాంకన ప్రక్రియ మొత్తం నిఘా నీడలో జరగనుంది. విడతల వారీగా.. ఈ ఏడాది వివిధ జిల్లాల నుంచి వచ్చిన 1,95,674 జవాబు పత్రాలను ఇక్కడ మూల్యాంకనం చేయ నున్నారు. ఇందుకోసం 900 మంది సబ్జెక్టు టీచర్లను విద్యాశాఖ నియమించింది. వీరికి మూల్యాంకన నిర్వహణపై శిక్షణను కూడా ఇచ్చారు. నిబంధనలు ఇలా... ● ఉపాధ్యాయులు సెల్ఫోన్, స్మార్ట్ఫోన్లు, ఎరైజర్, వైట్నర్ తదితర వస్తువులను మూల్యాంకన కేంద్రంలోకి తీసుకువెళ్లరాదు ● ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఆరు వరకు మూల్యాంకనం జరుగుతుంది. మూల్యాంకన కేంద్రంలో ఎటువంటి తప్పిదాలు జరిగినా ఉపాధ్యాయులే బాధ్యత వహించాల్సి ఉంటుంది. ● మూల్యాంకన కేంద్రంలో విధులకు హాజరయ్యే సిబ్బంది సమయానికి హాజరు కావాలి. లేకుంటే క్రమశిక్షణా చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. ● మూల్యాంకనంలో పాల్గొనే సిబ్బందికి గుర్తింపు కార్డులు జారీ చేశారు. గుర్తింపు కార్డు ఉన్న వారినే ఆ ప్రాంతంలోకి అనుమతించనున్నారు. నేటి నుంచి పది మూల్యాంకనం ఏర్పాట్లు సిద్ధం చేసిన విద్యాశాఖ జిల్లాకు 1,95,674జవాబుపత్రాలు రాక 900 మందిసిబ్బందితో మూల్యాంకనం -
ఆలయం.. సర్వాంగ సుందరం
చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధి సకల హంగులతో మహా కుంభాభిషేకానికి ముస్తాబవుతోంది.ఆలయ జీర్ణోద్ధరణ పనుల కారణంగా గత నాలుగేళ్లకు పైగా బాలాలయంలోని దారువు విగ్రహానికి పూజలు చేస్తున్న భక్తులు ఇక నుంచి మూల విరాట్ దర్శనంతో పరవశించి పోనున్నారు. ఆలయాన్ని పునరుద్ధరించి సర్వాంగ సుందరంగా తీర్చేందుకు గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ప్రభుత్వం రు.28 కోట్లు మంజూరు చేసింది.ఈనిధులతో గండి రూపు రేఖలు మారిపోయాయి.సంస్కృతి వెలిగేలా తరాలు మురిసేలా ప్రాంగణంలోకి అడుగిడగానే భక్తి భావం పెంపొందేలా ఆలయాన్ని నిర్మించారు. 2021 అక్టోబర్ 27 నుంచి మూల విరాట్ దర్శనం లేక బాలాలయంలోని దారువు విగ్రహానికి భక్తులు పూజలు చేస్తూ వచ్చారు. వైఎస్సార్ మార్క్ గండి అభివృద్ధిలో వైఎస్ మార్క్ కనిపిస్తుంది.దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి కాగానే ఆలయాన్ని టీటీడీలో విలీనం చేయించారు.దీంతో అర్చకుల క్వార్టర్స్ భక్తుల వసతి గృహ సముదాయాలు.వీఐపీ క్వార్టర్స్,కార్యాలయం గది,పంచముఖ ఆంజనేయస్వామి విగ్రహంతోపాటు రాయచోటి వేంపల్లె ప్రధాన రహదారి గండి పరిధి వరకు నాలుగు వరుసలతో సిమెంటు రోడ్లు వేయించారు.ఆయన మరణానంతరం ఆలయ అభివృద్ధి పడకేసింది.ఆలయం తిరిగి దేవదాయశాఖలోకి మారింది. జగన్ ముఖ్యమంత్రి అయ్యాక వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి,మండల ఇన్చార్జి వైఎస్ కొండారెడ్డిలు ప్రత్యేక చొరవ చూపి గండి ఆలయాన్ని అభివృద్ధి చేయాలన్న సంకల్పంతో టీటీటీలోకి మార్పించారు.మరో అరగంటలో ఆలయం టీటీడిలోకి చేరుతుందనగా హైకోర్టు స్టే అడ్డుపడింది.దీంతో జగనన్న మరో అడుగు ముందు కేసి రు.28 కోట్లు పైగా సీజీఎఫ్ నిధులు మంజూరు చేయించడంతో ఆలయ అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టారు.పనులు ప్రారంభమయ్యాక వేంపల్లె జెడ్పీటీసి రవికుమార్ రెడ్డిలు పర్యవేక్షిస్తు వచ్చారు.అనంతరం బాలాలయం నిర్మించి అందులో దారువుతో చేయించిన స్వామి విగ్రహాన్ని ప్రతిష్ఠింప చేసి 2021 అక్టోబర్ 27 నుంచి భక్తులకు స్వామి దర్శనం చేయిస్తు వస్తున్నారు. నూతన ఆలయంలో సుమారు 120కి పైగా దేవతా మూర్తుల విగ్రహాలతో తయారు చేసిన రాతి స్థంభాలతో నిర్మించారు. రాజ గోపురాలు కూడా పలు విగ్రహాలతో అందంగా నిర్మించారు.పడమర రాజగోపురంతో పాటు కొద్ది మేర ప్రహారీ గోడ పనులు మాత్రం పెండింగ్ లో ఉన్నాయి. గోపురాలకు సంబంధించి రంగులు,తలుపులు వంటివి దాతల సహకారంతో వేయించినట్లు ఆలయ అధికారి గురుప్రసాద్ తెలిపారు.మేనెల 8నుంచి 13 వరకు కుంభాభి షేకం కార్యక్రమం నిర్వహణకు తేదీని ఖరారు చేసినట్లు ఆయన తెలిపారు.ఈమేరకు త్వరలోనే కుంభాభి షేకానికి ఆహ్వాన పత్రికలను ముద్రించి ముఖ్యులకు అందించి ఆహ్వానిస్తామని ఆయన తెలిపారు. టెండర్లకు ఆహ్వానం గండి ఆలయం జీర్ణోద్ధరణ,మహాకుంబాభిషేకం నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్ల నిమిత్తం టెండర్లకు ఆహ్వానించినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి,దేవదాయశాఖ కర్నూలు డిప్యూటి కమిషనర్ గురుప్రసాద్ తెలిపారు.చలువపందిళ్లు, విద్యుద్దీపాలంకరణ, బారికేడ్ల ఏర్పాటు,రాజగోపురాలపై కలశాలు, సారవ కొయ్యలు ,పూల అలంకరణ,యాగశాల ఏర్పాటు తదితరాలకు సంబంధించి ఈనెల 13 ఉదయం 10 గంటలకు టెండర్ల నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. -
అమరావతి పేరిట దేశంలో అతిపెద్ద స్కాం
కడప కార్పొరేషన్ : అమరావతి రాజధాని పేరిట దేశంలో అతిపెద్ద స్కాం జరుగుతోందని వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర అన్నారు. ఆదివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డితో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎవరైనా ఏదైనా సాధిస్తేనో, గొప్ప ప్రాజెక్టు పూర్తి చేస్తేనో సంబరాలు చేసుకుంటారని, కానీ అవేమీ లేకుండానే టీడీపీ శ్రేణులు అమరావతి పేరుతో సంబరాలు చేసుకోవడం హాస్యాస్పదమన్నారు. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన రెండేళ్లలో అమరావతిలో ఒక్క ఇటుక కూడా పెట్టలేదన్నారు. 12 ఏళ్లుగా గ్రాఫిక్స్లోనే చూపుతున్నారని, కనీసం టీజర్ అయినా వదలాలని ఎద్దేవా చేశారు. దేవతల రాజధాని అంటూ పైకెత్తుతున్నారని, శివుని కై లాసం కడుతున్నారో, శ్రీక్రిష్ణుని ద్వారకా నగరం నిర్మిస్తున్నారో అర్థం కాలేదన్నారు. రాష్ట్రానికి రావాల్సిన ప్రత్యేక హోదా వద్దని, ప్రత్యేక ప్యాకేజీ తెచ్చుకుని ప్రజలకు అన్యాయం చేశారన్నారు. అమరావతి ప్రాంతం రాజధానికి అనుకూలం కాదని శివరామక్రిష్ణన్ కమిటీ ఆనాడే చెప్పిందని, చదరపు అడుగుకు రూ.4500లతో అన్ని చోట్లా నిర్మాణాలు జరుగుతుంటే, అమరావతిలో మాత్రం రూ.14 వేలు ఖర్చు చేస్తున్నారన్నారు. ఇది దేశంలోనే అతిపెద్ద స్కాం అని ఆరోపించారు. ఫ్లై ఓవర్నిర్మాణానికి కి.మీకి రూ.30 కోట్లు ఖర్చవుతుందని, వీరు మాత్రం రూ.175 కోట్లు వినియోగిస్తున్నారన్నారు. అమరావతి అనేది ఒట్టి భ్రమరావతి మాత్రమేనని, మావిగన్ పేరిట వైఎస్ జగన్ గొప్ప ఆచరణాత్మక ఆలోచన చేశారన్నారు. అమరావతికి తాము వ్యతిరేకం కాదని, కూటమి నేతలు చేస్తున్న రియల్ ఎస్టేట్ వ్యాపారానికే తాము వ్యతిరేకమన్నారు. వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డా.నాగార్జునరెడ్డి మాట్లాడుతూ చంద్రబాబు లక్షల కోట్ల అప్పులు చేస్తూ రాష్ట్ర ప్రజలను అడుక్కుతినేలా చేస్తున్నారన్నారు. అమరావతి 40 ఏళ్లకు కూడా పూర్తి కాదన్నారు. వైఎస్సార్సీపీ యువజన నాయకుడు చల్లా పవన్ మాట్లాడుతూ కూటమి నేతలు మంచం, మల్లెపూలు, విడాకులు అనే కాన్సెప్ట్తో పని చేస్తున్నారని ఎద్దేవా చేశారు. బీఆర్ నాయుడు, అరవ శ్రీధర్ లాంటి వారి దీన్ని ఆదర్శంగా తీసుకున్నారన్నారు. అనంతరం అమరావతి నిర్మాణం పేరుతో ప్రజలను అడుక్కుతినేలా చేస్తున్నారంటూ రూపొందించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు సాయిదత్త తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ నాయకులు -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
రాజుపాళెం : రాజుపాళెం మండల పరిధిలోని వెలవలి–తొండలదిన్నె గ్రామాల మధ్యలో మినీ స్కూల్ బస్సు – బైక్ ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు ఎల్లప్పగారి పెద్ద ఖాదరయ్య (39) ఓ ప్రైవేట్ ఉద్యోగి. శనివారం మండల కేంద్రమైన రాజుపాళెం నుంచి స్వగ్రామమైన వెలవలి గ్రామానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా మినీ స్కూల్ బస్సు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆయనకు ఎడమ చేయి విరిగి అపస్మారక స్థితిలోకి వెళ్లారు. చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఖాదరయ్య ఆదివారం మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ ప్రసాద్ తెలిపారు. మృతుని తండ్రి రాముడు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ..బ్రహ్మంగారిమఠం : మండలంలోని మైదుకూరు– పోరుమామిళ్ల జాతీయ రహదారి లింగాలదిన్నెపల్లె సమీపంలో శనివారం జరిగిన బైక్లు ఢీకొన్న ప్రమాదంలో గాయపడిన భోరెడ్డి జయనరసింహరెడ్డి(36) ఆదివారం మృతి చెందాడు. జయనరసింహరెడ్డికి . భార్య, ఇద్దరు గపిల్లలు ఉన్నారు. కడపలో ప్రవేటు ఆసుపత్రిలో కోమాలో ఉండి మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చికిత్స పొందుతూ.. కమలాపురం : పట్టణ పరిధిలోని రైల్వే గేటు సమీపంలోని మందిరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన పన్నీరు సంకిత్(29) మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఈ నెల 2వ తేదీ రాత్రి మందిరం వద్ద ఆర్ఓబీ కోసం ఏర్పాటు చేసిన చేసిన ఫైలింగ్ మిషన్ను తప్పించడంలో రెండు బైక్ లు ఢీ కొన్నాయి. ఈ ఘటనలో సంకిత్కి తీవ్ర గాయాలయ్యాయి. కమలాపురం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రుడిని 108 వాహనంలో రిమ్స్కు తరలించారు. అక్కడి వైద్యులు చికిత్సలు అందించి మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మధ్యాహ్నం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. మృతుడు కడప మృత్యుంజయ కుంటలో నివాసం ఉంటున్నాడు. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు అన్నారు. -
‘సర్’ సర్వే చాలా ప్రమాదకారి
● వైఎస్సార్సీపీ బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషకడప కార్పొరేషన్ : స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్) సర్వేతో చాలా ప్రమాదం పొంచి ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష హెచ్చరించారు. ఆదివారం సాయంత్రం నగర పార్టీ కార్యాలయంలో కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులతో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించారని, ప్రక్కనున్న తమిళనాడులో 93లక్షల ఓట్లు తొలగించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి భరించలేక ఉత్తరప్రదేశ్లో 7 మంది బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 24 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగలేదన్నారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లను ఇందులో తొలగిస్తారన్నారు. ఈనెల 15వ తేది నుంచి రాష్ట్రంలో ఈ కార్యక్రమం ప్రారంభమయ్యే అవకాశముందని, లేదా కొంత జాప్యం జరగవచ్చన్నారు. ఉద్యోగ నిమిత్తం వేరే చోట ఉన్నవారు, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా జరగాలంటే సమర్థులైన వారిని బీఎల్ఏలుగా నియమించుకోవాలన్నారు. బీఎల్ఓలతోపాటు వైఎస్సార్సీపీ నియమించిన బీఎల్ఏలు కూడా ఈ వెరిఫికేషన్లో పాల్గొంటే ఉపయోగముంటుందని తెలిపారు. దీనిపై నియోజకవర్గాల స్థాయిలో, జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. బీఎల్ఏలు నిర్లక్ష్యంగా ఉంటే మనం నష్టపోయే అవకాశముంటుందని తెలిపారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు పి. జయచంద్రారెడ్డి, బసవరాజు, బీహెచ్ ఇలియాస్, జమాల్వలీ, నాగమల్లారెడ్డి, అలీ అక్బర్, సుబ్బరాయుడు, నాగేంద్రప్రసాద్, శ్రీరంజన్రెడ్డి, అరీఫుల్లా బాష తదితరులు పాల్గొన్నారు. -
30 శాతం ఐఆర్ వెంటనే ప్రకటించాలి
కడప ఎడ్యుకేషన్ : 12వ పీఆర్సీ ఏర్పాటు చేయడంతోపాటు 30 శాతం మధ్యంతర భృతిని వెంటనే ప్రకటించాలని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మల్లు రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం కడపలోని ఎస్టీయూ భవన్లో జిల్లా అధ్యక్షుడు ఎన్.సంగమేశ్వరరెడ్డి అధ్యక్షతన ఫ్యాప్టో ప్రథమ కార్యవర్గ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా రఘునాధరెడ్డి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల మేనిఫెస్టోలో పొందుపరచి, ఇచ్చిన హామీల అమలుతో పాటు,12వ పీఆర్సీ, మధ్యంతర భృతి అమలు చేయాలనే డిమాండ్తో ఎస్టీయూ పక్షాన పలు రకాల ఉద్యమాలు చేపట్టామన్నారు. అయినా సరే అర కొర పెండింగ్ బిల్లుల చెల్లింపులు తప్ప,మిగిలిన వాటిని పట్టించుకోలేదన్నారు.ఆంధ్రప్రదేశ్ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) ఆధ్వర్యంలో నిర్వహించబోయే మలిదశ ఉద్యమానికి సిద్ధం కావాలని ఎస్టీయూ నాయకులకు, కార్యకర్తలకు పిలుపునిచ్చారు. ఉపాధ్యాయవాణి ప్రధాన సంపాదకులు కె.వి.శేఖర్, ఎస్టీయూ జిల్లా అధ్యక్ష, ప్రధానకార్యదర్శులు సంగమేశ్వరరెడ్డి, పాలకొండయ్యలు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి కామ్రేడ్ గాలి చంద్ర, ఏఐటీయూసీ రాష్ట్రనాయకులు ఎల్. నాగసుబ్బారెడ్డి, ఎస్టీయూ రాష్ట్రకార్యవర్గ సభ్యులు ఇలియాస్ బాష, క్రిష్ణారెడ్డి, దాదాపీర్,ఏఐఎఫ్ఈటీఓ జాతీయకార్యదర్శి పి.రమణారెడ్డి, ఎస్టీయూ సీనియర్ నాయకులు సురేష్ బాబు, జయరామయ్య, చింతంరెడ్డి రామచంద్రారెడ్డి,సుధాకర్ రెడ్డి,జిల్లా ఆర్థిక కార్యదర్శి యు.సుబ్రహ్మణ్యం, జిల్లాకార్యవర్గ సభ్యులు, రాష్ట్రకౌన్సిలర్లు, రీజనల్ కన్వీనర్లు,మండలశాఖల అధ్యక్ష,ప్రధానకార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
సంఘ సంస్కర్త బాబూ జగ్జీవన్ రామ్
కడప కార్పొరేషన్ : బాబూ జగ్జీవన్ రామ్ గొప్ప సంఘ సంస్కర్త అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం బాబూ జగ్జీవన్ రామ్ జయంతిని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రవీంద్రనాథ్రెడ్డితోపాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ముఖ్య అతిథులుగా హాజరై జగ్జీవన్ రామ్ చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీహార్లోని వెనుకబడిన వర్గాల నుంచి రాజకీయాల్లోకి వచ్చిన జగ్జీవన్ రామ్ పార్లమెంటులో నలభై ఏళ్లపాటు వివిధ మంత్రిపదవులు నిర్వహించారని, భారత దేశానికి ఉప ప్రధానిగా సేవలందించారని కొనియాడారు. అంటరాని వారికి సమానత్వం కోసం అంకితమైన ఆల్ ఇండియా డిప్రెస్డ్ క్లాసెస్ లీగ్ సంస్థను స్థాపించారన్నారు. కార్మిక శాఖామంత్రిగా, రక్షణ మంత్రిగా, న్యాయ శాఖామంత్రిగా ఆయన అనేక సంస్కరణలు ప్రవేశపెట్టారని గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం నగర అధ్యక్షుడు షఫీ, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, అబ్దుల్సుభాన్, సింధే రవి పాల్గొన్నారు. నివాళి బాబూ జగ్జీవన్ రామ్ జయంతి సందర్భంగా కడప నగరంలోని మహా వీర్ సర్కిల్లో ఉన్న బాబూ జగ్జీవన్రామ్ విగ్రహానికి వైఎస్సార్సీపీ సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ లు పూలమాల వేసి నివాళులు అర్పించారు. కార్యక్రమంలో మాజీ మేయర్ పాకా సురేష్, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, వైఎస్సార్సీపీ నాయకులు త్యాగరాజు, కె. బాబు, సుబ్బరాయుడు, సీహెచ్ వినోద్ కుమార్; దాసరి శివప్రసాద్, రామ్మోహన్రెడ్డి, షఫీ, సాయి, రవి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
కడప అనంతపురం జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్ విజేతగా అనంతపురం జట్టు నిలిచింది. అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్లో అన్ని జట్లు నాలుగేసి మ్యాచ్లు ఆడగా అనంతపురం జట్టు 1.037 నెట్ రన్రేట్తో 12 పాయింట్లతో విజేతగా నిలవగా కర్నూలు జట్టు 12, కడప జట్టు 8, నెల్లూరు 4, చిత్తూరు 4 పాయింట్లు సాధించాయి. శనివారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం జట్టు, కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టు విజయం సాధించాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం, నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు 50 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 363 పరుగులు చేసింది. ఆ జట్టు లోని హానీష్ వీరారెడ్డి79 బంతుల్లో 12 ఫోర్లు, 6 సిక్సర్లతో 125 పరుగులు చేశాడు. అర్జున్ టెండూల్కర్ 52 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని సూతేజ్రెడ్డి 6 వికెట్లు తీశాడు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 49.3 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 249 పరుగులు చేసింది. ఆ జట్టులోని పవన్ రిత్విక్ 79, పూర్ణ చంద్ర గణేష్ 47 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని అర్జున్ టెండూల్కర్ 3, ప్రమో ద్ కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 114 పరుగులు తేడాతో విజయం సాధించింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో చిత్తూరు–కడప జట్టు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యా టింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 330 పరుగులు చేసింది. ఆజట్టులోని తేజరెడ్ది 112 పరుగులు చేశారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 43.5 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణవ్రెడ్డి 101, విజయ్ రామ్రెడ్డి 76, సయ్యద్ మహ్మద్ 52 పరుగులు చేశారు. -
సోలార్ నిర్మాణాన్ని అడ్డుకున్న రైతులు
బ్రహ్మంగారిమఠం : మండలంలోని పలుగురాళ్లపల్లె, పాపిరెడ్డిపల్లె రెవెన్యూ పొలంలోని ప్రభుత్వ భూములు 175 ఎకరాలు, ఆన్లైన్ భూములు 168 ఎకరాలు ఎకోరెన్ సోలార్ కంపెనీకి ప్రభుత్వం ఇచ్చింది. ప్రభుత్వ భూమిలో చెంచయ్యగారిపల్లె, ఎద్దులాయపల్లె, మల్లేపల్లె ఎస్సీ కాలనీకు చెందిన రైతులు కొన్నేళ్లుగా సాగు చేసుకుంటున్నారు. అయితే ప్రభుత్వ పరంగా రైతుల వద్ద ఆధారాలు లేకపోవడంతో ఎకోరెన్ కంపెనీకి 175 ఎకరాలు ప్రభుత్వం లీజ్కు ఇచ్చింది. దీంతో నిర్మాణ పనులను శనివారం భూ నిర్వాసితులు అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న జేసీ డాక్టర్ నిధిమీనా, బద్వేల్ ఆర్డీఓ చంద్రమోహన్ ఘటనాస్థలికి చేరుకుని రైతులకు సర్ధిచెప్పారు. రైతులకు పరిహారం అందేలా చూస్తామని జేసీ హామీ ఇచ్చారు. తమపై కంపెనీ ప్రతినిధి శ్రీనివాస్ దురుసుగా ప్రవర్తించారని జేసీకి రైతులు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ కార్తీక్, మండల ఇన్చార్జి సర్వేయర్ స్వాతి, టీడీపీ మండల అధ్యక్షుడు సి.సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. అప్పులబాధతో వ్యక్తి ఆత్మహత్యపుంగనూరు : అప్పులబాధతో ఓ వ్యక్తి శుక్రవారం రాత్రి ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. శనివారం పోలీసులు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని సుల్తాన్సాబ్వీధిలో నివాసం ఉన్న మహమ్మద్రఫి (35) పలువురి వద్ద అప్పులు చేశారు. ఈ క్రమంలో అప్పు ఇచ్చినవారి వేధింపులు తాళలేక ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ అన్సర్బాషా తెలిపారు. -
నీరుపయోగం
లింగాల : లింగాల మండలం రామన్నూతనపల్లె, మురారిచింతల గ్రామ సమీపంలో ఉన్న చెరువులు నీరులేక వెలవెలబోతున్నాయి. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవతో మండలంలోని అన్ని గ్రామాలకు ఎత్తిపోతల పథకాలు ఏర్పాటు చేశారు. వీటికి పాడా నిధులను వినియోగించారు. అందులో భాగంగా సుమారు రూ.5కోట్ల పాడా నిధులతో రామన్నూతనపల్లె, గుణకణపల్లె చెరువులకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు అందించేందుకు పంప్ హౌస్లు ఏర్పాటు చేశారు. పంప్ హౌస్లకు మోటార్లు, పైపులైన్లు పూర్తయ్యాయి. అయినా అధికారులు స్పందించకపోవడంతో ఆయా చెరువులకు చుక్క నీరు అందడంలేదు. గత ఏడాది అనావృష్టి, ప్రస్తుతం మండుతున్న ఎండలతో బోరు బావుల్లో భూగర్భజలాలు అడుగంటుతున్నాయని రైతులు ఆవేదన చెందుతున్నారు. రామన్నూతనపల్లె చెరువు నీరు నింపితే రామన్నూతనపల్లె, గుణకణపల్లె, లింగాల, పెద్దకుడాల, చిన్నకుడాల తదితర గ్రామాల్లోని బోరుబావుల్లో భూగర్భజలాలు పెంపొందుతాయని అక్కడి రైతులు తెలిపారు. గుణకణపల్లెకు సంబంధించి ఎత్తిపోతల పథకం, పైపులైన్ కూడా పూర్తి చేశారు. అయితే చెరువుకు సంబంధించి భూసేకరణ పనులు పెండింగ్లో ఉన్నాయి. ప్రస్తుతం రామన్నూతనపల్లె ఎత్తిపోతల పథకానికి సంబంధించి మోటార్లు ఉన్నప్పటికీ విద్యుత్ నియంత్రికలు లేకపోవడంవల్ల నీటిని విడుదల చేయలేదు. మరోవైపు దీని పనులు నిర్వహించిన కాంట్రాక్టర్ శివప్రకాష్రెడ్డి తనకు బిల్లులు అందలేదని, వాటిని అధికారులకు అధికారికంగా అప్పగించలేదు. దీంతో రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఆయా గ్రామాల్లో విస్తారంగా అరటి, చీనీ, టమోట, మొక్కజొన్న పంటలను సాగు చేస్తున్నారు. భూగర్భజలాలు అడుగంటితే పంటలు చేతికి అందడం కష్టంగా మారుతుందని రైతులు వాపోతున్నారు. ఇప్పటికై నా నీటి పారుదల శాఖ అధికారులు చొరవ తీసుకుని ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చి రామన్నూతనపల్లె చెరువుకు నీటిని అందించాలని కోరుతున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఏఈ చైతన్యారెడ్డిని వివరణ కోరగా ఆయా ఎత్తిపోతల పథకాలకు సంబంధించి పనులు పెండింగ్లో ఉన్నాయని, కొన్ని మోటార్లు, స్టాటర్లు పనిచేయడంలేదన్నారు. దీనిపై ప్రభుత్వానికి నివేదికలు పంపించామన్నారు. పరికరాలు వచ్చిన వెంటనే ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి రామన్నూతనపల్లె చెరువుకు నీరు అందిస్తామని తెలిపారు. బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి అందని నీరు బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి నీరు అందక లోపట్నూతల, కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల గ్రామాల రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి నెల రోజుల క్రితం బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి కర్ణాటక ప్రాంతం నుంచి ట్రాన్స్ఫార్మర్ను తీసుకొచ్చి అందించారు. దీంతో కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, లోపట్నూతల గ్రామాలకు కొద్దిపాటి నీరు చేరడంతో రైతుల బోరుబావుల్లో భూగర్భజలాలు పెరిగి పంటలకు కొంత ఊరట లభించింది. అదేవిధంగా బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి సంబంధించిన ట్రాన్స్పార్మర్ కాలిపోయినా అధికార పార్టీ నాయకులు, నీటిపారుదల శాఖ అధికారులు పట్టించుకున్నా పాపానపోలేదు. ప్రస్తుతం వెలిదండ్ల సమీపంలోని లింగాల కుడికాలువ నుంచి భారీ మోటార్ల ద్వారా వరదరాజులస్వామి కోన సమీపంలో ఉన్న చెరువుకు నీరు అందించాల్సి ఉంది. అయితే వెలిదండ్ల సమీపంలోని కుడికాలువ వద్ద ఉన్న పంప్ హౌస్లో మోటార్లు పనిచేయకపోవడంతో వరదరాజులస్వామి కోన సమీపంలోని చెరువుకు నీరు అందడంలేదు. వరదరాజులస్వామి కోన నుంచి బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి నీరు తరలించాలి. వరదరాజులస్వామి కోన సమీపంలోని చెరువులో నీరు లేకపోవడంతో అక్కడ ఉన్న ఒక్క మోటారుకు సరిపడా నీరు ఉన్నాయని, మూడు మోటార్లు ఆడించే అవకాశం లేకుండాపోయింది. దీంతో బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకానికి నీరు చేరడంలేదు. అరకొరగా చేరుతున్న నీటిని ఒక్క మోటారు ద్వారా బియాండ్ తాతిరెడ్డిపల్లె ఎత్తిపోతల పథకం కింద కోమన్నూతల, ఎగువపల్లె, దిగువపల్లె, మురారిచింతల, లోపట్నూతల గ్రామాలకు సక్రమంగా నీరు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. నీటి పారుదల శాఖ అధికారులు కానీ, కూటమి నాయకులు కానీ పట్టించుకోవడంలేదని రైతులు ఆరోపిస్తున్నారు. తామే రైతులను ఆదుకుంటామని, సాగు, తాగునీరు అందిస్తున్నామ ని గొప్పలు చెప్పుకుంటున్న కూటమి నాయకులు ఎత్తిపోతల పథకాల వ్యవస్థు ఎలా పనిచేస్తున్నాయో కూడా పట్టించుకోవడంలేదని రైతులు ఆవేదన వ్య క్తం చేస్తున్నారు. ఈ విషయమై నీటిపారుదల శాఖ ఈఈకి ఫోన్ చేయగా.. ఆయన స్పందించడంలేదు. ఉన్నతాధికారులు స్పందించాలి సాగునీరు లేక తాము పడుతున్న ఇబ్బందులను దృష్టిలో పెట్టుకుని నీటిపారుదల శాఖ ఎస్ఈ, జిల్లా కలెక్టర్లు స్పందించి న్యాయం చేయాలని రైతులు కోరుతున్నారు. అధికార పార్టీ నాయకులు కేవలం రాజకీయాలు మాత్రమే చేస్తున్నారని, రైతుల అవస్థలను పట్టించుకోవడంలేదని ఆవేదన చెందుతున్నారు. నీరులేక వెలవెలబోతున్న రామన్నూతనపల్లె, మురారిచింతల చెరువులు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ట్రాన్స్ఫార్మర్ అందించినా సద్వినియోగం చేసుకోని అధికారులు భూగర్బజలాలు అడుగంటుతున్నాయని రైతుల ఆవేదనపేరుకే రైతు ప్రభుత్వం కూటమి సర్కార్ పేరుకే రైతు ప్రభుత్వమని గొప్పలు చెప్పుకుంటోంది. పంటలకు గిట్టుబాటు ధరలు అందించడంలో విఫలమైంది. సీబీఆర్లో నీరు ఉన్నా, లింగాల కుడికాలువకు నీరు ప్రవహిస్తున్నా ఎత్తిపోతల పథకాలను ప్రారంభించలేని దుస్థితిలో ప్రభుత్వం ఉంది. గత వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఎత్తిపోతల పథకాలను ప్రారంభించి వాటిని పూర్తి చేశారు. ప్రస్తుతం ప్రభుత్వం ఎత్తిపోతల పథకాన్ని ప్రారంభించి రైతులకు సాగు, తాగునీరు అందించాలి. – ఇరికిరెడ్డి జగన్మోహన్రెడ్డి, రైతు, రామన్నూతనపల్లెచెరువుకు నీరు నింపాలి రామన్నూతనపల్లె చెరువుకు ఎత్తిపోతల పథకాల ద్వారా నీరు నింపితే మండలంలోని రామన్నూతనపల్లె, లింగాల, గుణకణపల్లె, చిన్నకుడాల గ్రామాల్లోని బోరుబావుల్లో భూగర్భజలాలు పెంపొందుతాయి. వర్షాభావ పరిస్థితులు నెలకొన్నప్పటికీ రైతులు ధైర్యంగా పంటలు సాగు చేసుకునే అవకాశం ఉంటుంది. ప్రభుత్వం స్పందించి తగిన చర్యలు తీసుకుని రామన్నూతనపల్లె చెరువుకు నీరు అందించాలి. – ఈశ్వరరెడ్డి, రైతు, రామన్నూతనపల్లె -
డాక్టర్ ఎంవీఆర్ ఆశయసాధనకు కృషి
ప్రొద్దుటూరు కల్చరల్ : మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎంవీ రమణారెడ్డి కుటుంబ సభ్యులంతా ఆయన ఆశయ సాధనకు కృషి చేస్తారని రాయలసీమ వ్యాయామ విద్య కళాశాల కరస్పాండెంట్ ఉమ, ఎంవీఆర్ కుమారుడు మురళీధర్రెడ్డి పేర్కొన్నారు. శనివారం డాక్టర్ ఎంవీ రమణారెడ్డి 83వ జయంతి సందర్భంగా ఆర్సీపీఈలో ఎంవీఆర్ విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎంవీఆర్ జయంతి వేడుకల్లో భాగంగా గత రెండు రోజుల నుంచి కళాశాలలో రక్తవర్గ నిర్ధారణ పరీక్షలు నిర్వహించామన్నారు. శనివారం సురక్ష బ్లడ్ బ్యాంక్ వారి సహకారంతో రక్తదానం శిబిరం ఏర్పాటు చేశామన్నారు. 64 మంది రక్తదానం చేసినట్లు తెలిపారు. డాక్టర్ ఎంవీఆర్ ట్రస్టు ద్వారా విద్య, సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించామని చెప్పారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ రవిశంకర్, అధ్యాపకులు, ఏఓ సుబ్రహ్మణ్యం, ఎన్టీఆర్ వైద్య విశ్వవిద్యాలయం పాలకమండలి సభ్యుడు డాక్టర్ టీడీ వరుణ్కుమార్రెడ్డి, సంస్కృతి స్వచ్ఛంద సంస్థ కార్యదర్శి ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, సురక్ష బ్లడ్ బ్యాంక్నిర్వాహకుడు ఓబుళరెడ్డి, శ్రీసాయి డైగ్నోస్టిక్ సభ్యులు పాల్గొన్నారు. -
జగన్ వస్తేనే అభివృద్ధి
● అమరావతికి చట్టబద్ధత కూటమి భ్రమే ● రాజధాని డ్రామాలపై మండిపడ్డ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలోకి వస్తేనే కోస్తాతో పాటు రాయలసీమ, ఉత్తరాంధ్ర ప్రాంతాలు కూడా అభివృద్ధి చెందుతాయని మాజీ మంత్రి, ఎమ్మెల్సీ పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన వైఎస్సార్ కడప జిల్లా జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ రాజధానికి చట్టబద్ధత అంటూ కూటమి ప్రభుత్వం ప్రజలను భ్రమల్లో ముంచెత్తుతోందన్నారు. అమరావతిలో రాజధాని నిర్మించాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి 50 వేల ఎకరాలు పంట పొలాలను తీసుకొని ఇంత వరకు వారికి న్యాయం చేయలేదని విమర్శించారు. మరో 50 వేల ఎకరాల భూమిని తీసుకోనే ప్రయత్నం చేస్తోందని అన్నారు. రాజధాని నిర్మాణం కోసం 2 వేల ఎకరాలు ఉంటే సరిపోతుందని తెలిపారు. అలా కాకుండా లక్షల ఎకరాల భూములను తీసుకొని ఇష్టమైన కంపెనీలకు ఎకరా రూపాయికి ఇస్తామని చెప్పడం విడ్డూరంగా ఉందన్నారు. సీఆర్డీఏ ఏర్పాటు చేసుకొని అవినీతికి పాల్పడుతున్నారన్నారు. గతంలో హైదరాబాద్ తరహలో జరిగిన తప్పిదాన్ని మరోసారి జరగవద్దని వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచిస్తున్నారని గుర్తుచేశారు. మచిలీపట్నంలో పోర్ట్ నిర్మాణం ఉందని, అంతే కాకుండా అన్ని వసతులు, భవనాలు ఉన్నాయని అటువంటి చోట రాజధాని నిర్మాణం చేపడితే ఖర్చు తక్కువతో పూర్తి ఆవుతుందన్నారు. అలా కాకుండా అమరావతిలో నిర్మాంచాలంటే లక్ష కోట్ల బడ్జెట్ అవసరం అవుతుందని, ఎప్పడు పూర్తవుతుందో చెప్పలేమన్నారు. గతంలో శివరామకృష్ణ కమిటీ రాజధాని నిర్మాణానికి అమరావతి సరియైన ప్రదేశం కాదని, అన్ని సంస్థలు ఒకే చోట నిర్మించవద్దని సూచించిందని చెప్పారు. గతంలో విజయవాడలో దిగువ ప్రాంతంలో వరదనీరు వచ్చి చేరి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడ్డారన్నారు. వరదనీరు తొలగించడానికి సుమారు 600 కోట్టు ఖర్చు చేయడం జరిగిందన్నారు. వెనుకబడిన ప్రాంతాలైన రాయలసీమను బుందేల్ఖండ్ తరహలో రాష్ట్రానికి ప్రత్యేక హోదా కానీ ప్రత్యేక ప్యాకేజీని కానీ కూటమి నాయకులు సాధించలేదన్నారు. ఇప్పడు ఏదో సాధించినట్లు సంబరాలు చేసుకోవడం ఆశ్చర్యానికి గురి చేస్తోందని ఆయన ఎద్దేవాచేశారు. ఈ కార్యక్రమంలో జిల్లా మునిసిపల్ విభాగం అధ్యక్షుడు వల్లభాయి హృషికేశవరెడ్డి, మాజీ కౌన్సిలర్ ముల్లా జాని, మాజీ మార్కెట్యార్డ్ చైర్మన్ రమణారెడ్డి, ఎర్రగుంట్ల రాజారెడ్డి, సుబ్రమణ్యం, చంద్రశేఖర్రెడ్డి, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
‘తహలిల్’తో ముగిసిన ఉరుసు ఉత్సవాలు
తహలిల్ ఊరేగింపులో పాల్గొన్న పీఠాధిపతి, సోదరులు ఊరేగింపులో పాల్గొన్న భక్తులు కమలాపురం: పట్టణంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, హజరత్ దస్తగిరి షా ఖాద్రి, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రి ఉరుసు మహోత్సవాలు ఘనంగా ముగిశాయి. ఈ నెల 1వ తేదీ నుంచి దర్గా పీఠాధిపతి (ముతవల్లి) సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో, దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో జరుగుతున్న ఉత్సవాలు శనివారం తహలిల్ కార్యక్రమంతో ముగిశాయి. ఉదయం స్థానిక పాత బస్టాండు సమీపంలోని గంధం ఇంటి నుంచి పీఠాధిపతి ఆధ్వర్యంలో పూలచాదర్ తదితర వాటిని ప్రతేక్యంగా అలంకరించిన చాందినిలో ఊరేగింపుగా దర్గాకు తీసుకువచ్చారు. అనంతరం దర్గాలో వెలసి ఉన్న స్వాముల వారి మజార్లపై పూల చాదర్లు సమర్పించి ప్రత్యేక ఫాతెహ నిర్వహించారు. భక్తులకు ప్రసాదాలు పంచిపెట్టారు. నషాన్ రోజున దర్గా ఆవరణలో ఆవిష్కరించిన జెండాను తొలగించారు. దీంతో ఉరుసు మహోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, ఇస్మాయిల్, సర్ఫరాజ్, పెద్ద సంఖ్యలో భక్తులు, పట్టణ ప్రజలు పాల్గొన్నారు. కాగా భక్తులకు నిర్వాహకులు అన్నదానం ఏర్పాటు చేశారు. -
హోంమంత్రి అనిత నోరు అదుపులో పెట్టుకోవాలి
● వైఎస్ జగన్ను విమర్శించే స్థాయి ఆమెకు లేదు ● వైఎస్సార్సీపీ మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు వెంకట సుబ్బమ్మకడప కార్పొరేషన్ : రాష్ట్ర హోంమంత్రి అనిత నోటిని అదుపులో పెట్టుకొని సభ్యతగా మాట్లాడాలని వైఎస్సార్సీపీ జిల్లా మహిళా విభాగం అధ్యక్షురాలు టీపీ వెంకట సుబ్బమ్మ హెచ్చరించారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి 11 సీట్లు వచ్చాయని పదే పదే ఎద్దేవా చేస్తున్నారని, 40 శాతం ఓట్లు వచ్చాయని గుర్తించకపోవడం వారి మూర్ఖత్వానికి నిదర్శనమన్నారు. కేవలం 11 సీట్లు ఉన్న వైఎస్ జగన్కు మీరెందుకు భయపడుతున్నారో చెప్పాలన్నారు. రాష్ట్రాన్ని పాలించడం చేతగాక లక్షల కోట్ల అప్పులు చేస్తూ ప్రజలపై భారం వేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక మహిళలు, చిన్నారులు, దళితులపై జరుగుతున్న ఆకృత్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందన్నారు. హోంమంత్రిగా వాటిని నియంత్రించాల్సిన అనిత ఆ పని చేయకుండా వైఎస్ జగన్ను విమర్శిస్తూ కాలం వెళ్లబుచ్చుతున్నారన్నారు. రైల్వేకోడూరులో నడిరోడ్డుపై మహిళపై దాడి చేస్తే ఎలాంటి చర్యలు లేవని, సాక్షాత్తు అసెంబ్లీ స్పీకరే దళితున్ని కొట్టారని, జిల్లా ఎస్పీ కార్యాలయానికి వె ళ్లి టీడీపీ ఎమ్మెల్యే బెదిరించి, హంగామా చేస్తే వారిపై ఏం చర్యలు తీసుకోలేదన్నారు. ఇంతటి అరాచకాలు జరుగుతున్నా హోంమంత్రి స్పందించరని, వైఎస్ జగన్ను విమర్శించి చంద్రబాబు, లోకేష్ల మెప్పు పొందేందుకు ప్రయత్నిస్తున్నారని ధ్వజమెత్తారు. రెండేళ్లకే ఈ ప్రభుత్వంపై ప్రజలు విసిగిపోయారని, ఎప్పుడు ఎన్నికలు వచ్చినా తగిన బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శులు రత్నకుమారి, క్రిష్ణవేణి, మాజీ కో ఆప్షన్ సభ్యురాలు బి. మరియలు, మల్లీశ్వరి, శివమ్మ పాల్గొన్నారు. -
కన్నులపండువగా చక్రస్నానం
ఒంటిమిట్ట: ఏకశిలానగరి కోదండ రాముడి బ్రహ్మోత్సవాలలో చివరి ఘట్టమైన చక్రస్నానం కన్నులపండువగా సాగింది. తొమ్మిది రోజులు బ్రహ్మోత్సవాలు యజ్ఞంలా జరిగాయి. లక్షల మంది భక్తులు తరలివచ్చి జగదభిరాముడిని దర్శించుకున్నారు. బ్రహ్మోత్సవాల ముగింపు సందర్భంగా చక్రస్నానాన్ని శనివారం భక్తిశ్రద్ధలతో నిర్వహించా రు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం ఉదయం సుప్రభాత సేవ నిర్వహించారు. భక్తుల సర్వదర్శనానికి అనుమతిచ్చారు. సీతారామలక్ష్మణ దివ్య మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పాలతో శోభాయమానంగా అలంకరించారు. 9:30 గంటలకు సుదర్శన చక్రత్తాశ్వర్ పల్లకిలో ఆలయం ఎదురుగా నిర్మించిన నూతన పుష్కరిణికి శోభాయాత్ర ప్రారంభమైంది. 9:30 నుంచి 10:30 గంటల వరకు సీతారామలక్ష్మ ణ ఉత్సవ మూర్తులకు ఉత్సవ కంకదారు రాజేష్ ఆధ్వర్యంలో స్నపనతిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. సీతారామలక్ష్మణుల సరసన చక్రత్తాళ్వార్కు పాలు, పెరుగు, తేనె, పసుపు, చందనాలతో అభిషేకాలు చేశారు. 10:30 నుంచి 11:00 గంటల వరకు అర్చకులు వేదమంత్రోచ్ఛారణతో చక్రస్నాన కార్యక్రమాన్ని కనుల పండువగా నిర్వహించారు. టీటీడీ అధికారులు, ఉద్యోగులు సిబ్బంది, కళాకారులు, భక్తులు పుణ్యస్నానాలు చేశారు. పుష్కరిణి నుంచి ఆలయ మాడ వీధుల్లో ఊరేగింపు నేత్రపర్వంగా సాగింది. ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సివిల్ విభాగం అధికారులు డీఈ నాగరాజు, ఏఈ అమర్ నాథ్ రెడ్డి, సీఐ నరసింహారాజు, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు, సిద్దవటం ఎస్ఐ హారిక వేదపండితులు, అర్చకులు, ఇతర అధికారులు, సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం ఏకశిలానగరి కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు ముగిశాయి. తొమ్మిదో రోజు శనివారం రాత్రి రుత్వికులు శాస్త్రోక్తంగా ధ్వజావరోహణం నిర్వహించారు. ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి పూజా సామగ్రిని సమర్పించారు. ఈ సందర్భంగా కంకణదారు రాజేష్ భట్టార్ ఆధ్వర్యంలో యాగశాలలో హోమాలు నిర్వహించారు. ధ్వజావరోహణంలో ధ్వజ స్థంభం పై నుంచి గరుడ పతకాన్ని కిందికి దించారు. కలశాలను కోదండ రామయ్యకు సమర్పించారు. ఆదివారం సాయంత్రం 6 నుంచి పుష్పయాగం జరుగుతుంది. ముగిసిన బ్రహ్మోత్సవాలు -
జెడ్పీ సీఈఓ బాధ్యతల స్వీకరణ
కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్ ముఖ్య కార్యనిర్వహణాధికారిగా ఆర్.రామచంద్రారెడ్డి శనివారం బాధ్యతలు చేపట్టారు. కర్నూలు జిల్లా పత్తికొండలో డివి జనల్ డెవలప్మెంట్ అధికారిగా పనిచేస్తూ పదోన్నతిపై ఆయన ఇక్కడికి వచ్చారు. ఆయన స్వస్థలం ముద్దనూరు. ఈఓపీఆర్ అండ్ ఆర్డీగా తొండూరులో ఉద్యోగ ప్రవేశం చేసిన ఆయన 1997లో ఎంపీడీఓగా పదోన్నతి పొంది చాపాడు, ప్రొద్దుటూరు, రాజుపాలెం తదితర మండలాల్లో పనిచేశారు. డ్వామా ఏపీడీగా, రాజంపేట, జమ్మలమడుగులో విధులు నిర్వర్తించారు. అధికారుల సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని ఈ సందర్భంగా ఆయన తెలియజేశారు. వైభవం.. ముక్తిరామలింగేశ్వరుడి బ్రహ్మోత్సవంప్రొద్దుటూరు కల్చరల్: స్థానిక రామేశ్వరంలోని ముక్తిరామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివారి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిస్తున్నారు. శనివారం ముక్తిరామలింగేశ్వరస్వామికి, రాజరాజేశ్వరి అమ్మవారికి పూజా కార్యక్రమాలు నిర్వహించి ప్రత్యేకంగా అలంకరించారు. లోకకల్యాణార్థం గణపతి, నవగ్రహ, రుద్రహోమాలను నిర్వహించారు. సాయంత్రం గంగా రాజరాజేశ్వరి సమేత ముక్తిరామలింగేశ్వరస్వామి ఉత్సవ మూర్తులను రావణబ్రహ్మ వామనంపై కొలువుదీర్చి పుర వీధుల్లో శివనామస్మరణల మధ్య వైభవంగా ఊరేగించారు. గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీలక్ష్మీ నరసింహాస్వామి వారి కల్యాణోత్సవం కన్నులపండువగా నిర్వహించారు. శని వారం స్వాతి నక్షత్రంతో పాటు స్వామివారి జన్మ దినం కావడంతో టీటీడీ వారి ఆధ్వర్యంలో స్వామివారికి కల్యాణో త్సవం నిర్వహించారు. కల్యాణమండపం వద్ద చలువపందిళ్లు, పచ్చని తోరణాలతో పెళ్లివేదికను అందంగా అలంకరించారు. ముందుగా మూలవర్లకు అభిషేకాలు, అర్చనలు, ప్రత్యేక పూజలు జరిపారు. ముత్యాల తంబ్రాలతో స్వామివారి పెళ్లివేడుక నిర్వహించారు. పీఎం సూర్య ఘర్ ఉత్సవాలను జయప్రదం చేయాలి కడప కార్పొరేషన్: ప్రధానమంత్రి సూర్యఘర్ ఉత్సవాలను జయప్రదం చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్.శ్రీనివాసులు అన్నారు. శనివారం విద్యుత్ భవన్లోని తన చాంబర్లో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 5 నుంచి 14వ తేది వరకూ సూర్య ఘర్ ఉత్సవాలు నిర్వహిస్తున్నామని, ఇందులో ఎస్సీ, ఎస్టీ లబ్ధిదారులకు అమలు చేస్తున్న సౌర రూఫ్ టాప్లలో పురోగతి సాధించాలన్నారు. ఇప్పటికే కేటాయించిన లక్ష్యాలను నిర్ణీత గడువులోపు పూర్తి చేయడానికి పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు హరిసేవ్యా నాయక్, లక్ష్మీపతి, రాజశేఖర్ రెడ్డి, మధుసూదన్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (కమర్షియల్) వి.వి. మోహన్ కుమార్, మరియు రూఫ్ టాప్ సోలార్ సిస్టమ్ ఇన్స్టాలేషన్ ఏజెన్సీల ప్రతినిధులు, తదితరులు పాల్గొన్నారు. -
‘సర్’పై అప్రమత్తంగా ఉండాలి
కడప కార్పొరేషన్: స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్(సర్)పై వైఎస్సార్సీపీ నాయకులు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, జోనల్ అధ్యక్షుడు భరత్ కుమార్ హెచ్చరించారు. శనివారం సాయంత్రం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన కోర్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లను తొలగించారని, పొరుగు రాష్ట్రమైన తమిళనాడులో 93లక్షల ఓట్లు తొలగించారన్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడి భరించలేక ఉత్తరప్రదేశ్లో 7 మంది బీఎల్ఓలు ఆత్మహత్యలు చేసుకున్నారని గుర్తు చేశారు. 24 ఏళ్లుగా ఆంధ్రప్రదేశ్లో ఈ కార్యక్రమం జరగలేదన్నారు. డబుల్ ఎంట్రీలు, చనిపోయిన వారి ఓట్లను ఇందులో తొలగిస్తారన్నారు. ఈనెల 15 నుంచి రాష్ట్రంలో ఈ కార్య క్రమం ప్రారంభమయ్యే అవకాశముందన్నారు. ఉద్యోగ నిమిత్తం వేరే చోట ఉన్నవారు, విదేశాలకు వెళ్లిన వారి ఓట్లు తొలగించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. ఇలా జరగాలంటే సమర్థులైన వారిని బీఎల్ఏలుగా నియమించుకోవాలన్నారు. బీఎల్ఓలతోపాటు వైఎస్సార్సీపీ నియమించిన బీఎల్ఏలు కూడా ఈ వెరిఫికేషన్లో పాల్గొంటే ఉపయోగముంటుందని తెలిపారు. దీనిపై నియోజకవర్గాల, జిల్లా స్థాయిలో శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. అలాగే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం పనులు పూర్తి చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ కార్యాచరణ ప్రణాళిక రూపొందించిందని, దాన్ని అందరూ విజయవంతం చేయాలన్నారు. అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, బద్వేల్ ఎమ్మె ల్యే సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి నరేన్, మాజీ మేయర్ పాకా సురేష్, సీఈసీ సభ్యులు ఏ. మల్లికార్జునరెడ్డి, ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, రాష్ట్ర కార్యదర్శులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, గురుమోహన్, పోరెడ్డి నరసింహారెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, కె. నాగేంద్రారెడ్డి, రాజగోపాల్రెడ్డి పాల్గొన్నారు. ఈ సర్వే జరిగిన 12 రాష్ట్రాల్లో లక్షల ఓట్లు తొలగించారు సమర్థులైన వారిని బీఎల్ఏలుగా నియమించుకోవాలి వైఎస్సార్సీపీ కోర్ కమిటీ సమావేశంలోజిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి -
సమస్యలపై స్పందించకుంటే భూములు ఇవ్వలేం..
ఎర్రగుంట్ల : చాగలమర్రి నుంచి వేంపల్లె, రాయచోటి మధ్య నిర్మించే జాతీయ రహదారి కోసం భూముల సేకరణ విషయంపై శనివారం ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు, వై కోడూరు, పోట్లదుర్తి, ఎర్రగుంట్ల గ్రామాలకు చెందిన భూనిర్వాసితులతో డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి ఆధ్వర్యంలో తాహసీల్దార్ అమరేశ్వరి, జాతీయ రహాదారి శాఖ డీఈ చంద్రశేఖర్రెడ్డిలు సమావేశం నిర్వహించారు. వై కోడూరు గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ వాసుదేవరెడ్డి, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డిలు రైతుల పక్షాన మాట్లాడారు. అధికారులకు ఒత్తిళ్లు ఉన్నాయంటూ హడావిడిగా సమావేశం పెట్టి రైతులతో బలవంతంగా భూములు సేకరణ చేస్తుంన్నారన్నారు. ముందు రైతుల సమస్యలను పరిష్కరించాలన్నారు. రోడ్డు వేస్తే మా భూములలో నుంచి నీరు పోవడానికి డ్రైనేజీతో పాటు సర్వీస్ రోడ్లును ఏర్పాటు చేయాలన్నారు. మా తాతా ముత్తాలు సంపాదించిన భూములను మీకు అప్పనంగా ఇవ్వలేమన్నారు. దీంతో అధికారులు ఏమీ మాట్లాడకుండా సమావేశం నుంచి వెళ్లిపోయారు. అలాగే పెద్దనపాడు గ్రామంలో రైతులు ఎకరాకు రూ.1.20 కోట్లు నష్టపరిహారం ఇవ్వాలని కోరారు. అయితే ప్రభుత్వం తరుపున రూ.92 లక్షలు ఇస్తామని చెప్పడంతో నష్టపరిహారంలో తేడాలు ఉండటంతో భూములు ఇవ్వలేమని రైతులు చెప్పారు. ఎర్రగుంట్ల పోట్లదుర్తి గ్రామాలకు చెందిన రైతులతో కూడా అధికారులు సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలోనూ రైతుల వద్ద నుంచి భూ సేకరణ విషయంలో ఆనాసక్తి ఎదురైంది. -
గాలిమరల నిర్మాణానికి భూముల పరిశీలన
ముద్దనూరు: మండలంలోని పలు గ్రామాల పరిధిలో ఏర్పాటు చేయనున్న గాలిమరల విద్యుత్ ఉత్పత్తికి అవసరమైన భూములను జేసీ నిధిమీనా పరిశీలించారు. శనివారం మండలంలోని బొందలకుంట, చింతకుంట, మంగపట్నం, కొలవలి, ఉప్పలూరు, పెద్దదుద్యాల గ్రామాల పరిధిలోని ప్రభుత్వ భూములలో ఆంపస్ విండ్ మిల్స్ కంపెనీ నిర్మించే గాలిమరలకు కేటాయించాల్సిన భూములను జేసీ మీనా స్థానిక ఆర్డీవో శిరీషతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా జేసీ భూముల వివరాలు సేకరించారు. సోలార్ ప్రాజెక్టు కోసం... తొండూరు: తొండూరు మండలం మల్లేల గ్రామ సమీపంలోని మాలే గంగమ్మ ఆలయ సమీపంలో సోలార్ ప్రాజెక్టు నిర్మాణం కోసం శనివారం జేసీ నిధి మీనా స్థలాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా స్థలానికి సంబంధించిన మ్యాప్లను పరిశీలించారు. స్థల వివరాలను అడిగి తెలుసుకున్నారు. -
రెండు కార్లు ఢీ.. నలుగురికి గాయాలు
దువ్వూరు : మండలంలోని జొన్నవరం మెట్ట వద్ద కడప – కర్నూలు జాతీయ రహదారిపై రెండు కార్లు ఢీకొనడంతో ఇద్దరికి తీవ్ర గాయాలు కాగా, మరో ఇద్దరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప పట్టణానికి చెందిన దంతవైద్యురాలు గౌతమి తమ కుటుంబ సభ్యులతో మంత్రాలయంలో దైవదర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా జొన్నవరం మెట్ట వద్ద జాతీయ రహదారిపై వారు ప్రయాణిస్తున్న కారు టైర్ పగిలి డివైడర్ను దాటుకొని వెళ్లి కడప నుంచి బేతంచర్లకు వెళుతున్న కారును ఢీకొంది. ప్రమాదంలో మంత్రాలయం నుంచి కడపకు వెళుతున్న కారులో ఒక మహిళకు రెండు కాళ్లు విరిగాయి, మరొకరికి స్వల్ప గాయాలయ్యాయి. పవన్ అనే వ్యక్తి కుటుంబ సభ్యులతో కడప నుండి బేతంచర్లకు వెళుతున్న కారులో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మరోకరికి స్వల్ప గాయాలయ్యాయి. పోలీసులు క్షతగాత్రులను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. రెండు కార్లలో ఎయిర్బ్యాగ్లు ఓపెన్ కావడంతో ప్రాణాపాయం తప్పిందని ఎస్ఐ పేర్కొన్నారు. కారులో ప్రయాణించేటప్పుడు సీట్ బెల్టు, ద్విచక్రవాహనాల్లో ప్రయాణించే వారు హెల్మెట్ ధరించాలని సూచించారు. -
కాళీయమర్దనుడిగా కోదండరాముడు
ఒంటిమిట్ట: ఏకశిలానగరిలో కొలువైన కోదండరాముడి వార్షిక బ్రహ్మోత్సవాలు వైభంగా జరుగుతున్నాయి. ఎనిమిదో రోజు శుక్రవారం ఉదయం కాళీయమర్దన అలంకారంలో జగదభిరాముడిని ముస్తాబు చేశారు. పట్టు వస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో అందంగా అలంకరించారు. ఉదయం 7:30 నుంచి 9:30 గంటల వరకు స్వామివారి ఊరేగింపు జరిగింది. భజన బృందాలు భజనలు, కోలాటాలు అడుతుండగా స్వామి వారు పురవీధుల్లో విహరించారు. అనంతరం ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపన తిరుమంజనం జరిగింది. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనంతో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులకు అభిషేకం చేశారు. సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ నిర్వహించారు. ఆశ్వవాహనంపై సీతాపతి శుక్రవారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు అశ్వ వాహనంపై స్వామి వారు భక్తులకు దర్శనమిచ్చారు. ఉపనిషత్తుల ఇంద్రియాలను గుర్రాలుగా వర్ణిస్తున్నాయి. అందువల్ల అశ్వాన్ని అధిరోహించిన పరమాత్మ ఇంద్రియాలను నియమించే నియామకుడు. పరమాత్ముడు అశ్వ స్వరూపంగా కృష్ణయజుర్వేదం తెలియజేసింది. పోటెత్తిన భక్తులు ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా శుక్రవారం ఒంటిమిట్ట రామాలయానికి భక్తులు పోటెత్తారు. సాధారణ భక్తుల తాకిడి ఉన్నంత వరకు అంతా సాఫీగానే సాగింది. ఉదయం 11 గంటలకు నైవేద్యం విరామం అనంతరం భక్తులు భారీ ఎత్తున తరలివచ్చారు. క్యూలైన్లు కిక్కిరిశాయి. ఆలయ రంగమండపం చుట్టూ ఎన్ని మార్గాలు ఉన్నాయో అన్ని మార్గాల నుంచి దర్శనం కోసం భక్తులు దూసుకొచ్చారు.టీటీడీ విజిలెన్స్ సిబ్బంది కట్టడి చేయలేకపోయారు.దీంతో క్యూలైన్లలో ఉండే చిన్నపిల్లలు, వృద్ధులు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అంతేకాకుండా క్యూలైన్లు కూడా భక్తుల తాకిడికి ఒరిగి పోయాయి. అయినా విజిలెన్స్ సిబ్బంది అక్కడ ఎలాంటి ప్రమాద నివారణ చర్యలు తీసుకోకపోవడం గమనార్హం. ఆశ్వ వాహనంపై ఊరేగుతున్న ఒంటిమిట్ట విభుడు అలరించిన కోలాట ప్రదర్శన -
రాజధాని నిర్మాణం పేరుతో రూ.లక్షల కోట్ల దోపిడీ
● ప్రజలు మేల్కోకపోతే భావితరాలకు పేదరికమే శాపం ● 200 ఏళ్లు వచ్చినా రాజధాని నిర్మాణం పూర్తి కాదు ● మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు రూరల్ : రాజధాని నిర్మాణం పేరుతో కూటమి నేతలు రూ.లక్షల కోట్ల దోపిడీ చేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో రాచమల్లు విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ రాజధాని పేరుతో కూటమి నేతలు చేసే అన్యాయం, అక్రమాలు, అవినీతిని ప్రజలు గుర్తించలేకపోతే భవిష్యత్తు తరాలకు పేదరికాన్ని రాష్ట్ర ప్రభుత్వం ఇస్తుందన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అమరావతిలో దేవతల రాజధానిని నిర్మిస్తున్నానని 2014లో మొదలు పెట్టి భూ దోపిడీకి పాల్పడుతున్నారన్నారు. 50 వేల ఎకరాలు రాజధాని నిర్మాణానికి కావాలని ఏడాదికి మూడు బంగారు పంటలు పండించే భూములను రైతుల వద్ద నుండి బలవంతంగా లాక్కున్నారన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో రాజధాని నిర్మాణం అనుమానాస్పదంగా ఉందన్నారు. ఈప్రాజెక్టుపై అందరికి అనేక రకాలైన ప్రశ్నలు ఉన్నాయన్నారు. రాజధాని నిర్మాణం పూర్తి కావాలంటే 200 సంవత్సరాలు పట్టేటట్లు ఉందన్నారు. రాజధాని నిర్మాణం సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్టు అని చెప్పి రూ.47వేల కోట్లు రాజధాని నిర్మాణం కోసం అప్పు చేశారన్నారు. భవన నిర్మాణం చదరపు అడుగుకు రూ.4వేలు ఉండగా అదే చదరపు అడుగుకు రాజధాని నిర్మాణంలో రూ.14వేలు ఖర్చు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ కరోనాలాంటి ఇబ్బందికర పరిస్థితిల్లో ఇంతగా అప్పు చేయలేదన్నారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం 22 నెలల్లో రూ.3.41 లక్షల కోట్లు అప్పులు చేయడం దారుణం అన్నారు. ప్రజల పేరుతో ప్రతి మంగళవారం అప్పు చేసి ప్రతి శనివారం కూటమి నేతలైన చంద్రబాబు, లోకేష్, పవన్కళ్యాణ్ హైదరాబాద్కు డబ్బును తరలిస్తున్నారన్నారు. అమరావతిలో నిర్మించే రాజధాని భేతాళ కథలతో సమానమేనని తెలిపారు. చంద్రబాబు నాయుడు ఉన్నన్ని రోజులు రాజధాని నిర్మాణాన్ని పూర్తి చేయలేరన్నారు. ఈ రాష్ట్రంలో జరుగుతున్న అనేక అక్రమాలు, అవినీతికి, ముఖ్యమంత్రి చెబుతున్న అబద్దాలకు, చేస్తున్న పనులకు పొంతనే లేకుండా పోయిందన్నారు. ఆర్థిక విధ్వంసం, ఆర్థిక అవినీతి, అన్యాయాలు ఈ రాష్ట్రంలో జరుగుతున్నాయన్నారు. 2014 నుండి చంద్రబాబు నాయుడు రాజధాని నిర్మాణంపై ఒకటే స్లోగన్ వాడుతున్నారన్నారు. దేవతల రాజధానిని నిర్మిస్తా.. ఏ సింగపూర్.. దుబాయ్, అమెరికాను తలపించేలా అమరేంద్రుని స్వర్గసీమను తలపించేలా రాజధాని నిర్మాణాన్ని చేపడుతున్నట్లు చెబుతూనే ఉన్నాడు. వందల ఎకరాల్లో నిర్మించాల్సిన రాజధానికి 50వేలు ఎకరాలు కావాలని రైతుల వద్ద నుండి బలవంతంగా లాక్కోవడం దరుణమన్నారు. రాజధాని నిర్మాణంపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు చెప్పే మాటలు కలలో అద్భుతంగా ఉంటాయని, మెలకువ రాగానే కంపచెట్లు, నీళ్లు తోడుకోవడం ఉంటుందన్నారు. రైతులను, నిరుద్యోగులను, ఇతర వర్గాల వారిని ఉద్దరిస్తానని చెప్పి రూ.లక్షల కోట్లు అప్పు చేస్తూ అందరికి పంగనామాలు పెడుతున్నారన్నారు. రాజధాని నిర్మాణం కూటమి నేతలకు ఏటీఎం లాంటిదన్నారు. ఈ ప్రభుత్వంలో ఉద్యోగ కల్పన ఉండదు, ఉపాధి అవకాశాలు ఉండవు, వ్యవసాయం నాశనం, ఆరోగ్యశ్రీ అటకెక్కిందన్నారు. రాష్ట్రానికి రాజధాని లేకుండా జగన్ చేశారంటూ ప్రజలకు ఒక భూతంలా చూపించారన్నారు. బీఆర్ నాయుడును తొలగించాలని నేడు పూజలు టీటీడీ చైర్మన్ పదవి నుండి బీఆర్ నాయుడును తొలగించాలని కోరుతూ స్థానిక బొల్లవరంలోని వెంకటేశ్వరస్వామి దేవాలయంలో శనివారం ఉదయం 9.30 గంటలకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ప్రత్యేక పూజలు నిర్వహిస్తున్నట్లు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. పూజలు అనంతరం మీడియా సమావేశం ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామ, వార్డులలో ఉన్న పార్టీకమిటీ సభ్యులు ప్రత్యేక పూజల్లో పాల్గొనాలని ఆయన కోరారు. -
కుక్కల దాడిలో బాలుడికి గాయాలు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక నారాయణ పాఠశాల వెనుకవైపున గురువారం రాత్రి బాలుడిపై కుక్క లు దాడి చేసి తీవ్రంగా గాయపరిచాయి. భరత్ అనే బాలుడు సైకిల్పై ఇంటికి వెళుతుండగా కుక్కలు వెంబడించి దాడి చేశాయి. దాడిలో గాయపడిన భరత్ను వెంటనే తల్లిదండ్రులు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించారు. ఇప్పటికై నా మున్సిపల్ అధికారులు స్పందించి పట్టణంలో కుక్కల బెడద లేకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి..అట్లూరు : ఎదురెదురుగా వస్తూ ద్విచక్రవాహనాలు ఢీకొని ఇరువురికి తీవ్రగాయాలైన సంఘటన కడప – బద్వేలు ప్రధాన రహదారిపై బద్వేలు మండలం వెంకటశెట్టిపల్లె గ్రామ సమీపాన శుక్రవారం సాయంత్రం చోటు చేసుకుంది. స్థానిక వివరాల మేరకు అట్లూరు మండలం ఎర్రబల్లి గ్రామానికి చెందిన పిన్నపురెడ్డి చెన్నసుబ్బారెడ్డి తన ద్విచక్రవాహనంపై బద్వేలుకు వెళుతుండగా సిద్ధవటం మండలం ఖాదర్బంగ్లాకు చెందిన నందీశ్వర్ ద్విచక్రవాహనంపై బద్వేలు నుంచి సిద్ధవటంకు వస్తూ వెంకటశెట్టిపల్లె వద్ద ఇరు వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్లో క్షతగాత్రులను బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య బద్వేలు అర్బన్ : బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్ పరిధిలోని పెద్దచెరువు కట్ట సమీపంలో గల అచ్చెమ్మగుడి పక్కనే ఉన్న ముళ్లపొదల్లో ఓ గుర్తు తెలియని వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతిచెందినట్లు అర్బన్ సీఐ బి.రామకృష్ణ పేర్కొన్నారు. శుక్రవారం మృతదేహాన్ని గుర్తించినప్పటికీ నాలుగైదు రోజుల క్రితం ఆత్మహత్య చేసుకుని ఉండవచ్చని ఆయన తెలిపారు. మృతుడు సుమారు 40–45 సంవత్సరాల వయస్సులోపు ఉండి బ్లూకలర్ షర్ట్, నల్లని ఫ్యాంటు ధరించి ఉన్నాడని తెలిపారు. మృతుని వద్ద ఎలాంటి ఆధారాలు లభించకపోవడంతో ఎవరనేది తెలియడం లేదని, మృతదేహాన్ని ఎవరైనా గుర్తిస్తే అర్బన్ పోలీసులను సంప్రదించడం గాని 9121100626, 9121100627 నెంబర్లను సంప్రదించాలని కోరారు. అనంతరం మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఇరువర్గాలపై కేసు నమోదు కొండాపురం: మండల పరిధిలోని తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని బీసీ కాలనిలో దేవరింటి పవన్కుమార్ పై అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు నరసింహాకు పాత కక్షల కారణంతో గొడవ జరిగింది. ఈ ఘటన పై తాళ్లప్రొద్దుటూరు ఎస్ఐ మంజునాథ ఇరువర్గాలపై శుక్రవారం కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివరాలిలా.. తాళ్లప్రొద్దుటూరు గ్రామంలో గురువారం రాత్రి జరిగిన పాతగొడవలు కారణంతో జనసేన నాయకుడు నరసింహా మరో ఐదుగురు కలసి దేవరింటి పవన్కుమార్ను కొట్టడంతో తలకు గాయమైంది. రెండు పళ్లు ఊడిపోయాయి. ఈఘటన పై జనసేన నాయకుడుతో పాటు ఐదుగురిపై కేసు నమోదు చేశామన్నారు. అదే గ్రామానికి చెందిన లక్ష్మిదేవిని దేవరింటి పవన్ కాలితో తనడంతో అతనిపై కేసు నమోదు చేశామన్నారు. పులిచెర్ల(కల్లూరు): కల్లూరు మాజీ సర్పంచ్ ఎస్.షుకూర్ తన అనుచరులతో కలిసి శుక్రవారం మాజీ మంత్రి, పుంగనూరు శాసన సభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సమక్షంలో తిరుపతిలో ఆయన స్వగృహంలో వైఎస్సార్సీపీలో చేరారు. పార్టీ కండువాకప్పి పెద్దిరెడ్డి ఆయన్ను పార్టీలోకి సాదరంగా ఆహ్వానించారు. -
రైలు కిందపడి ఇరువురి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శుక్రవారం రైలు కిందపడి ఇద్దరు వ్యక్తులు మృతి చెందారు. కమలాపురం రైల్వే స్టేషన్ సమీపంలో సుమారు 40–45 సంవత్సరాల వయసు ఉన్న గుర్తు తెలియని వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడు. మృతుడి కుడిచేతి ముంజేయిపై ఆంజనేయ స్వామి పచ్చ ఉంది. నలుపు రంగు షర్టు తెలుపు, ఎరుపు రంగు కలిగిన గళ్ల ఫుల్ షర్ట్, ఎరుపు, నలుపు, పసుపు రంగు కలిగిన పూల డిజైన్ లుంగీ ధరించి ఉన్నాడు. అలాగే కనుమల్లోపల్లె రైల్వే స్టేషన్ల మధ్య, గిరిజన భవన్ వెనకాల ఉన్న రైల్వే ట్రాక్పై మరో యువకుడు రైలు కింద పడి మృతి చెందారు. మృతుడు కడప నగరం ప్రకాశం నగర్కు చెందిన చింతకుంట సురేష్ (24)గా గుర్తించారు. ఇతడు కేఎస్ఆర్ఎం కాలేజీలో చదువుతున్నట్లు తెలిసింది. సమాచారం అందుకున్న కడప రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని మృతదేహాన్ని స్వాధీనం చేసుకుని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను కడప రిమ్స్ హాస్పిటల్ కు తరలించారు. కమలాపురం రైల్వేస్టేషన్ సమీపంలో మృతి చెందిన వ్యక్తి ఆచూకీ తెలిసినవారు కడప రైల్వే సీఐ 9247575624, ఎస్ఐ సెల్ నెం. 8500226717లో సంప్రదించాలని పోలీసులు కోరారు. కనుమలోపల్లె వద్ద చింతకుంట సురేష్ మృతికమలాపురం సమీపంలో మృతి చెందిన వ్యక్తి -
రేపు బాబు జగ్జీవన్రామ్ జయంతి
కడప సెవెన్రోడ్స్: బాబు జగ్జీవన్రామ్ 119వ జయంతి ఈనెల 5వ తేదీ వేడుకలను నిర్వహిస్తున్నట్లు సాంఘిక సంక్షేమశాఖ ఉప సంచాలకులు కె.సరస్వతి ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. జిల్లాలోని ప్రజాప్రతినిధులు, ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ సంఘాల నాయకులు, అధికారులు హాజరు కావాలని కోరారు. బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీపోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి దేవస్థానం పరిధిలో 7 న ఉదయం 10గంటలకు టోల్ గేట్ రుసుం కోసం వేలం పాట నిర్వహించనున్నారు. ఇందుకోసం ధరావతు రూ 1లక్ష చెల్లించాలి. అలాగే 9న భక్తుల తలనీలాల కోసం వేలం పాట జరుగుతుంది. ఇందుకు వేలం పాట రుసుం రూ 25లక్షలు చెల్లించి బహిరంగ వేలంలో పాల్గొనాలని మేనేజర్ ఈశ్వరాచారి ఒక ప్రకటనలో తెలిపారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీకోదండ రామస్వామి బ్రహ్మోత్సవాలకు ప్రతి ఏటా బీఎంఆర్జీఎఫ్ పౌండేషన్ తరఫున ఒంటిమిట్ట రామయ్యకు రెడ్ల రైతులు పండించిన పదార్థాలను సమర్పిస్తారు. ఇందులో భాగంగా శుక్రవారం బీఎంఆర్జీఎఫ్ పౌండేషన్ చైర్మన్ సుమతి రెడ్డి ఆధ్వర్యంలో పట్టు వస్త్రాలు, రైతులు పండించిన తినుబాండారాలతో కూడిన సారెను ఒంటిమిట్ట రామయ్యకు సమర్పించారు. కార్యక్రమంలో సీబీఐటీ జై చంద్రారెడ్డి, కడపకు చెందిన వీరారెడ్డి, తిరుపతికి చెందిన యుగంధర్ రెడ్డి, దిలీప్ రెడ్డి, చిత్తూరుకు చెందిన శ్రీధర్ రెడ్డి పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: ఏప్రిల్ నెల 1వ తేదీ నుంచి నేతన్నలకు ఉచిత విద్యుత్ పథకం అమల్లోకి వచ్చిందని ఏపీఎస్పీడీసీఎల్ ఛైర్మెన్, సీఎండీ శివశంకర్ లోతేటి ఒక ప్రకటనలో తెలిపారు. మగ్గంపై వస్త్రాలు నేసే నేతన్నలకు నెలకు 200 యూనిట్లు, పవర్ లూమ్ మగ్గాల నేతన్నలకు నెలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్తును సరఫరా చేయడం జరుగుతుందన్నారు. అల్పాదాయంతో జీవితాలను నెట్టుకొస్తున్న నేతన్నలకు ఇది ఉపయోగపడనుందన్నారు. మగ్గాలు, పవర్ లూమ్స్ ఉన్న ప్రాంతాల్లో విద్యుత్ లోడ్ కు అనుగుణంగా ట్రాన్స్ఫార్మర్ల సామర్థ్యాన్ని పెంచడం, విద్యుత్ సర్వీసులకు కెపాసిటర్ల ఏర్పాటు వంటి అంశాలపై ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నామన్నారు. -
గుక్కెడు నీళ్లు... గుప్పెడు గింజలు
మదనపల్లె సిటీ: ఈసారి ఎండలు ఆరంభం నుంచే మండుతున్నాయి. ఉష్ణతాపం తీవ్రమవుతుండటంతో జంతుజాలం దాహంతో అల్లాడుతోంది. మనుషులైతే దప్పిక వేసినప్పుడు ఎలాగోలా గొంతు తడుపుకొంటారు. కానీ మూగజీవాలకు ఇబ్బందిగా ఉంటుంది. నీటి వనరుల్లో జలం అడుగంటడంతో సులభంగా దాహార్తి తీరదు. ఈ నేపథ్యంలోమనుషులే స్వచ్చందంగా జీవకారుణ్యం ప్రదర్శించాలి. గుక్కెడు నీళ్లు, గుప్పెడు గింజలు ఇంటి ఆవరణంలో అందుబాటులో ఉంచితే పక్షులు చెంగుచెంగున వచ్చి నీటితో గొంతు తడుపుకొంటాయి. ఇప్పటికే కొందరు ఈ మంచి పనిని ప్రారంభించారు. మరింత మంది భాగస్వాములైతే బాగుంటుంది. ఆదర్శం....హెల్పింగ్మైండ్స్ : మదనపల్లె పట్టణంకు చెందిన హెల్పింగ్మైండ్స్ సంస్థ ప్రతినిధులు ప్రతి ఏడాది వేసవి ప్రారంభంలో వాటర్ బౌల్ కార్యక్రమం అమలు చేస్తున్నారు. పలువురికి వాటర్బౌల్లను ఉచితంగా అందజేసి దాని ప్రాముఖ్యతను వివరిస్తున్నారు. మహిళలకు దీని గురించి ప్రత్యేకంగా చెబుతున్నారు. ఇంటి ఆవరణంతో పాటు ఇంటి మిద్దెలపైకి నీళ్లు ఉంచడంతో పాటు గుప్పెడు గింజలు పెట్టాలని చెబుతున్నారు. అంతే కాకుండా సభ్యులందరూ కలిసి పరిసర ప్రాంతాల్లో అటవీ ప్రాంతాలకు వెల్లి వాటర్ సాసర్లు ఏర్పాటు చేసి నీళ్లు నింపుతున్నారు. ఇది ఒకరి నుంచి మరొకరికి చేరి మూగజీవాల గొంతు తడిపేందుకు వారధిగా నిలుస్తోంది. ఎంతో మంది తమ గుమ్మాల ముందు గింజలు పోసి, తొట్టెలలో నీరు పోసి ఉంచుతున్నారు. పక్షి సందేశం...అందుకుందాం తెల్లారక ముందే లేచి గూడు వదిలి వెళ్తుంటాం. ఎండలో ఎగురుతుంటే రెక్కలు అలిసి నీరసిస్తాం. మిగతా కాలాల్లో అంతగా ఇబ్బంది ఉండదు. కానీ ఎండాకాలం మాత్రం మాకు భారంగా గడుస్తుంది. ఆహారం దొరకక, నీరు లభించక అల్లాడిపోతాం. పోయిన ఏడాది మా పక్షిజాతిలో ఎన్నో రకాలు నీటి చుక్క దొరక్క దాహార్తితో రాలిపోయాయి. అందుకే మిమ్నల్ని ముందస్తుగా అప్రమత్తం చేస్తున్నాం. మా కోసం కాసిన్ని నీళ్లిల్చిమా ప్రాణాలు కాపాడమని ప్రాధేమపడుతున్నాం. శ్రమ అనుకోకుండా మీ ఇంటి గోడ,డాబా,వీలైన ప్రదేశంలో గింజలు, మంచినీళ్లు ఏర్పాటు చేస్తే ఆకలి, దప్పిక తీర్చుకుంటాం. ఏదో సమయంలో మీ ముంగిటిల్లోకి వచ్చి మా బాషలో కృతజ్ఞతలు చెప్పుకుంటాం. ఇట్లు .. మీ నేస్తాలు: పావురాలు, పిచ్చుక, కాకి, కోయిల, చిలుక, ఇంకా మా తోటి పక్షిజాతులు (ఈ సందేశం వాటప్ గ్రూపుల్లో చక్కర్లు కొడుతోంది) దాహార్తి తీర్చుకుంటున్న కుక్కలు, కోతులు పక్షుల దాహం తీర్చేలా కారుణ్యం చూపిద్దాం -
వైభవంగా కమలాపురం ఉరుసు
విద్యుద్దీపాల అలంకరణలో దర్గా ప్రాంగణం కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలసిన శ్రీ హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, శ్రీ హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్ధీన్ షా ఖాద్రి, శ్రీ హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రి ఖుద్దస సిర్రహుం వార్ల ఉరుసు మహోత్సవం వైభవంగా జరిగింది. దర్గా పీఠాధిపతి సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో,దర్గా కన్వీనర్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో శుక్రవారం ప్రధాన ఉరుసు మహోత్సవం జరిగింది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ రాష్ట్రాల నుంచి ముస్లిం, హిందు భక్తులు పెద్ద సంఖ్యలో తరలివచ్చారు. భక్తుల కొంగు బంగారంగా విరాజిల్లుతున్న ఈ దర్గాకు కులమతాలకు అతీతంగా భక్తులు వేలాదిగా తరలి రావడంతో దర్గా భక్తులతో కిటకిట లాడింది. భక్తులు దర్గాలోని స్వామి వారి మజార్లపై పూల చాదర్లు సమర్పించి చక్కెర చదివింపులు చేశారు. అలాగే పీఠాధిపతి మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రిని భక్తులు గౌరవ పూర్వకంగా కలిసి ఆశీర్వాదం పొందారు. . అలరించిన ఖవ్వాలి పోటీ: కమలాపురం పెద్ద దర్గా ఉరుసు మహోత్సవాన్ని పురస్కరించుకొని దర్గా ఆవరణంలో ఏర్పాటు చేసిన ఖవ్వాలి పోటా పోటీగా సాగింది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెల్గాంకు చెందిన ఉస్తాద్ మురాద్ ఆతిష్, యూపీ కి చెందిన రాజా సర్ఫరాజ్ ల మధ్య వేకువ జాము వరకు ఖవ్వాలీ పోటీ సాగింది. ఖవ్వాలి ప్రేమికులు పాటలను వింటూ, మజా చేస్తూ ఖుషీ ఖుషీగా నజరానా సమర్పించారు. ప్రముఖుల ప్రార్థనలు: కమలాపురం ఉరుసు మహోత్సవాన్ని ప్రముఖులు తిలకించారు. వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, నియోజకవర్గ పరిశీలకుడు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి తదితరులు దర్గా చేరుకున్నారు. స్వామి వారి మజార్లను దర్శించుకుని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీఠాధిపతి ఫైజుల్ గఫార్ షా ఖాద్రి,దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ వారిని దర్గా మర్యాదలతో స్వాగతం పలికారు. వారిని ఘనంగా సత్కరించారు. ప్రముఖులు పీఠాధి పతి నుంచి ఆశీర్వాదం పొందారు. భక్తులతో కిటకిట లాడిన దర్గా ప్రాంగణం -
క్రీస్తు సందేశం.. క్షమా గుణం
సాక్షి, నెట్వర్క్: hÌêÏ ÐéÅç³¢…V> VýS$yŠæ{òœ•yól {´ëÆý‡¦-¯]lË$ Ô¶æ${MýSÐéÆý‡… ¿ýæMìS¢-{Ôèæ-§ýl®-ÌS™ø °Æý‡Ó-íßæ…-^éÆý‡$. ÌZMýS Æý‡„ýS-MýS$-Oyðl¯]l {MîSçÜ$¢.. çÜÆý‡Ó Ð]l*¯]l-Ð]l-´ëç³ ÑÐ]l¬MìS¢ MøçÜ… Ð]l$Æý‡×æ Õ„ýS ´÷…¨¯]l Æøk¯]l$ Ô¶æ$¿ýæ Ô¶æ${MýS-Ðé-Æý‡…V> õ³ÆöP…-r*.. {MðS•çÜ¢Ð]l ÑÔ>Ó-çÜ$-ÌS…-§ýlÆý‡* {ç³™ólÅMýS {´ëÆý‡¦-¯]lË$ ^ólÔ>Æý‡$. ¿ýæMìS¢™ø 40 Æøk-ÌS-´ër$ Eç³-ÐéçÜ ©„ýSË$ B^èl-Ç…-_¯]l ÑÔ>ÓçÜ$-Ë$.. Ô¶æ${MýS-ÐéÆý‡… Ðésìæ° ÑÆý‡Ð]l$׿ ^ólÔ>Æý‡$. A¯]l…™èlÆý‡… ^èlÇa-ÌSMýS$ ™èlÆý‡-Í-Ððl-ãÏ {ç³™ólÅMýS {´ëÆý‡¦¯]lË$ ^ólÔ>Æý‡$. ¯]lVýSÆý‡, ç³rt׿ Ò«§ýl$ÌZÏ {MðS•çÜ¢Ð]l#Ë$ ¿êÈ Æ>ÅÎ °Æý‡Ó-íßæ…-^éÆý‡$. D çÜ…§ýlÆý‡Â…V> {MîSçÜ$¢ ÕË$Ð]l Ð]l*Æý‡Y §ýl–Ô>ÅÌS¯]l$ MýSâýæÏMýS$ MýSsìæt-¯]lr$Ï {ç³§ýl-ÇØ…-^éÆý‡$. D çÜ…§ýl-Æý‡Â…V> {MðS•çÜ¢Ð]l Ð]l$™èl VýS$Æý‡$-Ð]l#Ë$ VýS$yŠæ {òœ•yól {´ëÐ]l¬-QÅ-™èl¯]l$ ÑÐ]l-Ç…-^éÆý‡$. {ç³fÌS Æý‡„ýS׿ MøçÜ… {MîSçÜ$¢ ™èl¯]l iљ鰲 ™éÅVýS… ^ólÔ>Æý‡° õ³ÆöP-¯é²Æý‡$. A…§ýl$MóS D Æøk¯]l A…§ýlÆý‡* Eç³ÐéçÜ ©„ýSË$ ^ólíÜ {MîSçÜ$¢¯]l$ ç³Nh-Ýë¢Æý‡° ÑÐ]l-Ç…-^éÆý‡$. „ýSÐ]l* VýS$׿Ðól$ HçÜ$ {MîSçÜ$¢ ç³Ç-^èlÆý‡Å A°, {ç³fÌS…-§ýlÆý‡* Ô>…† çÜÐ]l*-«§é¯]l… MýSÍW E…yéÌS° íßæ™èlÐ]l# ^ðl´ëµÆý‡$. {MîSçÜ$¢ iÑ-™èl…, »Z«§ýl-¯]lË$ A…§ýlÇMîS B§ýl-Æý‡Ø-±-Ķæ$Ð]l$-¯é²Æý‡$. శిలువ మోస్తున్న గురువులు శిలువ యాగం ర్యాలీలో పాల్గొన్న విశ్వాసులు భక్తిశ్రద్ధలతో గుడ్ఫ్రైడే -
పాలిసెట్ దరఖాస్తుకు గడువు పొడగింపు
కడప ఎడ్యుకేషన్: పాలిసెట్ దరఖాస్తు చేసుకునేందుకు ఈ నెల 9వ తేదీ వరకు గడువు పొడగించినట్లు కడప మహిళా పాలిటెక్నిక్ ప్రిన్సిపాల్, పాలిసెట్ జిల్లా కోఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 4వ తేదీ వరకు గడువు ఇచ్చిన అధికారులు విద్యార్థుల పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని 9వ తేదీ వరకు గడువు పొడిగించినట్లు ఆమె తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యార్థులందరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. నిలిపి ఉన్న పాలవ్యాన్ను ఢీకొని వ్యక్తి మృతి రాయచోటి: రోడ్డుపై నిలిపి ఉన్న పాలవ్యానును ఢీకొని బత్తల శ్రీనివాసులు (25) అక్కడికక్కడే మృతి చెందాడు. రాయచోటి పట్టణ పరిధిలోని చిత్తూరు రోడ్డులో ఉన్న ఎస్ఆర్ కళ్యాణ మండపం సమీపంలో శుక్రవారం ఉదయం ఈ ప్రమాదం చోటు చేసుకుంది. కడప పట్టణం అలంకాన్పల్లికి చెందిన బత్తల చంద్రయ్య కుమారుడు శ్రీనివాసులు రాయచోటిలోని పీటీఎంపల్లిలోని బంధువుల ఇంటికి వచ్చాడు. శుక్రవారం బంధువుల ఇంటి నుంచి బైకుపై బయలుదేరిన శ్రీనివాసులు చిత్తూరు మార్గంవైపు వెళ్తుండగా పాల విక్రయానికి నిలిపి ఉన్న వ్యాన్ను ఢీ కొట్టాడు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఆటో డ్రైవర్ మృతి ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రింగురోడ్డులోని చిన్నశెట్టిపల్లె రోడ్డు క్రాస్ వద్ద ఆటోను కారు ఢీ కొన్న ఘటనలో ఆటో డ్రైవర్ గుండ్ల సుబ్రమణ్యం (60) మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు శుక్రవారం ప్రొద్దుటూరు వైపు నుంచి టాటా నెక్సెన్ కారు జమ్మలమడుగు వైపు వెళ్తుండగా చౌటపల్లె వైఎస్సార్ సర్కిల్ నుంచి వస్తున్న ఆటో చిన్నశెట్టిపల్లె క్రాస్ రోడ్డు వద్ద యూటర్న్ తీసుకుంటుండగా కారు ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ సుబ్రమణ్యం అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కలుషిత ఆహారం తిని అస్వస్థత
రామసముద్రం: మండలంలోని కాప్పల్లి పంచాయతీ నల్లచిన్నేపల్లిలో కలుషిత ఆహారం తిని పలువురు అస్వస్థతకు గురయ్యారు. మూడు రోజుల క్రితం గ్రామంలో శ్రీరామనవమి వేడుకలు నిర్వహించి గ్రామస్తులకు అన్నదాన ప్రసాదాలు పంపిణీ చేశారు. వాటిని తిన్న ప్రజలకు ఫుడ్ పాయిజన్ (కల్తీనూనెతో) జరిగి వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యారు. పలువురుకు టైఫాయిడ్ జ్వరం రావడంతో మదనపల్లి, చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రులలో చికిత్స పొందారు. గ్రామంలో పవిత్ర, వెంకటేష్ రాజు, వాణి, రెడ్డెమ్మ, రెడ్డి ప్రసాద్ లతో పాటు మరో 15 మందికి వాంతులు, విరోచనాలు అయ్యాయి. విషయం తెలుసుకున్న చెంబకూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రం వైద్యాధికారులు డాక్టర్ జాహ్నవి, నాగరాజు ఆధ్వర్యంలో వైద్య బృందం శుక్రవారం గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు చేశారు. ప్రజలకు రక్త పరీక్షలు చేసి మందులు, మాత్రలు, ఓ ఆర్ ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేశారు.36 మందికి చికిత్స చేయగా, 5మందికి వాంతులు, విరోచనాలు, ఐదుగురికి జ్వరాలు ఉన్నట్లు గుర్తించి చికిత్స అందించారు. ఎనిమిది మందికి చెంబకూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందించారు. కాచి వడపోసిన నీటిని తాగాలని, పరిసరాలను శుభ్రంగా ఉంచుకోవాలని గ్రామస్తులకు వైద్యులు అవగహన కల్పించారు. 20 మందికి వాంతులు, విరోచనాలు, ఐదుగురికి జ్వరాలు గ్రామంలో వైద్య శిబిరం ఏర్పాటు -
కూటమి ప్రభుత్వంలో ఆరోగ్యశ్రీపై నీలినీడలు
బద్వేలు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుండి పేదలకు ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకంపై నీటినీడలు కమ్ముకుంటూనే ఉన్నాయని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీవోకాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ రాష్ట్రంలోని నెట్వర్క్ ఆసుపత్రులకు చంద్రబాబు ప్రభుత్వం రూ.3 వేల కోట్ల బకాయిలు పెట్టడంతో ఆరోగ్యశ్రీ సేవలు పూర్తిగా స్తంభించిపోయాయని, దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని అన్నారు. ఆరోగ్యశ్రీ అనగానే పేదలకు దివంగత మహానేత వైఎస్రాజశేఖర్రెడ్డి పేరు గుర్తుకు వస్తుందని, అందుకు ఆయన పేరు ప్రజల గుండెల్లో నుండి దూరం చేసేందుకే కక్షపూరితంగా బిల్లులు చెల్లించకుండా పథకాన్ని నిర్వీర్యం చేసేందుకు ప్రయత్నిస్తున్నారని అన్నారు. విదేశీ పర్యటనలు, ప్రత్యేక విమానాలు, యోగాడే వంటి వాటి కోసం వందల కోట్లు ప్రజాధనం ఖర్చు చేసిన కూటమి పెద్దలకు పేదల ఆరోగ్యానికి ఆసరాగా నిలిచిన ఆరోగ్యశ్రీ పథకానికి బిల్లులు చెల్లించకపోవడం దారుణమన్నారు. 2014–19 మధ్యకాలంలో కూడా చంద్రబాబు ప్రభుత్వం దిగిపోయే నాటికి రూ.700 కోట్ల మేర ఆరోగ్యశ్రీ బిల్లులు బకాయిలు పెట్టారని, అనంతరం అధికారంలోకి వచ్చిన జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బకాయిలను చెల్లించిందని గుర్తు చేశారు. అంతేకాకుండా ఆరోగ్యశ్రీ పథకం వైద్య ఖర్చులు రూ.25 లక్షలకు పెంచడంతో పాటు పథకాన్ని మరింత విస్తరించి 3250 వ్యాధులను ఆరోగ్యశ్రీ పరిధిలోకి తీసుకొచ్చిన ఘనత వైఎస్జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ప్రభుత్వం స్పందించకపోవడంతో నెట్వర్క్ ఆసుపత్రులు సమ్మెలోకి దిగిన కారణంగా పేద రోగులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పేదల ఆరోగ్యానికి ఆసరాగా ఉన్న ఆరోగ్యశ్రీ పథకానికి బిల్లులు చెల్లించి పథకాన్ని పూర్తిస్థాయిలో కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ -
జనసేన రౌడీ మూకలపై అట్రాసిటీ కేసు పెట్టాలి
● హర్షవీణకు న్యాయం చేయాలి ● వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి బూసిపాటి కిశోర్ కడప కార్పొరేషన్: రైల్వే కోడూరులో ఎమ్మెల్యే అరవ శ్రీధర్ బాధితురాలు హర్షవీణపై దాడి చేసిన జనసేన రౌడీ మూకలపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసు నమోదు చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. శుక్రవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే అరవ శ్రీధర్ తనను బెదిరించి, బ్లాక్ మెయిల్ చేసి లొంగదీసుకున్నారని హర్షవీణ వీడియోలతో సహా బయటపెట్టినా ప్రభుత్వం ఆమెకు న్యాయం చేయకపోవడం దారుణమన్నారు. జనసేన కార్యాలయం ఎదుట తాను ఆత్మహత్య చేసుకుంటానని బాధితురాలు చెప్పినా జనసేన అధినేత పవన్ కళ్యాణ్ స్పందించలేదన్నారు. కనీసం ఆ ఎమ్మెల్యేను పార్టీ నుంచి కూడా సస్పెండ్ చేయలేదన్నారు. నిన్న గురువారం హర్ష వీణపై జనసేన నాయకులు తాతంశెట్టి నాగేంద్ర ఆధ్వర్యంలో రౌడీ మూకలు ఆమెను కులం పేరుతో దూషిస్తూ, రాడ్లతో దాడి చేసి హత్యాప్రయత్నం చేశారన్నారు. తాతంశెట్టి నాగేంద్ర పై హత్యాయత్నం, ఎస్టీ, ఎస్టీ అట్రాసిటీ యాక్టు కింద కేసులు నమోదు చేసి వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. నడిరోడ్డుపై ఒక మహిళపై దాడి చేసినా ప్రభుత్వంలో ఏమాత్రం చలనం లేకపోవడం దారుణమన్నారు. హర్షవీణకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, ఆమెకు జరుగుతున్న అన్యాయంపై జాతీయ ఎస్సీ కమిషన్కు, మహిళా కమిషన్కు ఫిర్యాదు చేస్తామన్నారు. ఎలాంటి అండదండలు లేక ఒంటరిగా న్యాయపోరాటం చేస్తున్న ఆమెకు న్యాయం జరిగేంత వరక వైఎస్సార్సీపీ ఆమె పక్షాన పోరాడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ అధ్యక్షులు సింగమాల వెంకటేశ్వర్లు, జిల్లా వైద్య విభాగం సభ్యులు డాక్టర్ పెంచలయ్య పాల్గొన్నారు. -
ఉద్యోగం కోసం వెళుతుండగా కబలించిన మృత్యువు
● రోడ్డు ప్రమాదంలో కడప యువకుడు మృతి ● మరో యువకుడికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్: ఆ ఇద్దరు ఉన్నత చదువులు చదువుకున్న విద్యా వంతులు. డిగ్రీ పూర్తిచేసి ఉద్యోగాలు లేక ఖాళీగా ఉంటున్నారు. ఇంతలో బెంగళూరులో ఉన్న తన చిన్న నాటి స్నేహితుడు ఓ ప్రైవేట్ కంపెనీలో ఉద్యోగం చేస్తుంటే తమకు చిన్న జాబ్ ఇప్పించాలని అభ్యర్తించారు. అందుకు ఆ స్నేహితుడు బెంగళూరు వస్తే ఉద్యోగం ఇప్పిస్తానని చెప్పడంతో కడపకు చెందిన ఇద్దరు స్నేహితులు బెంగళూరుకు బైకులో శుక్రవారం ఉదయం బయలు దేరారు. మదనపల్లె– కర్ణాటక సరిహద్దున రాయల్పాడు వద్ద లారీ మృత్యువు రూపంలో వారికి ఎదురుగా వచ్చింది. ఆ లారీని తప్పించే క్రమంలో బైకు అదుపు తప్పి రోడ్డు పక్కనే ఉన్న సైడ్ వాల్ను ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరి స్నేహితుల్లో ఒకరు అక్కడి కక్కడే ప్రాణాలు కోల్పోయాడు. మరోకరు కొన ఊపిరితో ఉండడంతో స్థానికులు గుర్తించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్స అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ విషాదకర ఘటనపై రాయల్పాడు ఎస్ఐ శివకుమార్ తెలిపిన వివరాలిలా.. కడప పట్టణం, రాజారెడ్డి వీధికి చెందిన ఉమా మహేశ్వర్ (25), సబ్ జైలు వీధికి చెందిన దీవన (24)లు, బైకులో బెంగళూరులో ఉన్న స్నేహితునికి వద్దకు ఉద్యోగం వెతకడానికి బయలు దేరారు. మదనపల్లె – కర్ణాటక లోని రాయల్పాడు సమీపానికి రాగానే ఎదురుగా వచ్చిన ఓ లారీని తప్పించ బోయి రోడ్డు పక్కనే ఉన్న సేప్టి వాల్ ను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో దీవన అక్కిడి కక్కడే దుర్మరణం చెందగా అతని స్నేహతుడు ఉమ హహేశ్వర్ తీవ్రంగా గాయపడడంతో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. అతడి పరిస్థితి ఆందోళన కరంగా ఉందని చెప్పడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు బాధితున్ని కడపకు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన దీవన తీవ్రంగా గాయపడిన ఉమమహేశ్వర్ -
గండికోట నుంచి నీరు బంద్
జమ్మలమడుగు: గండికోట జలాశయం నుంచి మైలవరానికి అధికారులు నీటి సరఫరా బంద్ చేశారు. గత నెల 27వతేదిన మైలవరం జలాశయానికి ఒక గేటు ద్వారా 2500 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. ఈ తర్వాత వాటి స్థాయిని 5వేల క్యూసెక్కులకు పెంచారు. ప్రస్తుతం మైలవరం జలాశయంలో 2.7 టీఎంసీల నీరు చేరింది. గండికోట నుంచి మైలవరం జలాశయానికి రెండు టీఎంసీల నీటి విడుదల కోటా అయిపోవడంతో నీటిని నిలుపుదల చేసినట్లు అధికారులు ప్రకటించారు. కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఐదుమంది తహసీల్దార్లను బదిలీ చేస్తూ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రొసీడింగ్స్ జారీ చేశారు. గతంలో మైలవరంలో పనిచేస్తూ బదిలీ అయి పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న ఎం.లక్ష్మినారాయణను కాశినాయన మండల తహసీల్దార్గా నియమించారు. అలాగే గతంలో కలసపాడులో పనిచేస్తూ బదిలీపై పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న జీవీ మధురవాణిని తొండూరు తహసీల్దార్గా నియమించారు. అడహక్ పదోన్నతి పొంది పోస్టింగ్ కోసం ఎదురుచూస్తున్న బి.అనూరాధను సింహాద్రిపురం తహసీల్దార్గా, పోరుమామిళ్లలో పనిచేస్తున్న డి.ఉదయభాస్కర్రాజును ప్రొద్దుటూరుకు బదిలీ చేశారు. కలెక్టరేట్ పరిపాలన అధికారిగా పనిచేస్తున్న కె.విజయ్కుమార్ను పోరు మామిళ్ల తహసీల్దార్గా నియమించారు. కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా గత నెల 16వ తేదీ నుంచి ప్రారంభమైన పదోతరగతి పరీక్షలు గురువారంతో ముగిశాయి. పరీక్ష ముగిసిన అనంతరం బయటికి రాగానే విద్యార్థులు ఆనందంతో ఎగిరి గంతులేశారు. జిల్లావ్యాప్తంగా గురువారం జరిగిన ఇంగ్లిష్ పరీక్షకు 176 మంది గైర్హాజరయ్యారు. 167 పరీక్షా కేంద్రాల్లో 27,826 మంది విద్యార్థులకుగాను 27,650 మంది హాజరయ్యారు. పరీక్షల నిర్వహణ కోసం ఏర్పాటు చేసిన 7 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 44 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేయగా.. 68 పరీక్షా కేంద్రాల్లో సిట్టింగ్ స్క్వాడ్ ఏర్పాటు చేశారు. -
పనుల నాణ్యతలో రాజీపడొద్దు
కడప సెవెన్రోడ్స్: కడప ఆర్ట్స్ కాలేజ్ సమీపంలో నిర్మాణంలో ఉన్న పి–4 ‘స్టార్టప్ కడప‘ ఎంటర్ ప్రెన్యూర్షిప్ సెంటర్ నిర్మాణ పనుల పురోగతిని గురువారం సాయంత్రం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. జిల్లాకు తలమానికంగా అధునాతన సాంకేతికతతో రూపుదిద్దుకుంటున్న స్టార్టప్ కడప భవన నిర్మాణ పనులను నాణ్యతలో ఎలాంటి రాజీలేకుండా, వేగవంతంగా నిర్ణీత సమయంలోగా పూర్తిచేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో హౌసింగ్ పీడీ రాజారత్నం, కాంట్రాక్టు ఏజెన్సీలు, ఇంజినీరింగ్ అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ను అభినందించిన సీఎం చంద్రబాబు ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులకు డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా నాణ్యమైన భోజనాన్ని అందించేందుకు జిల్లాలో వినూత్నంగా ప్రారంభించిన స్మార్ట్ కిచెన్ విధానానికి జాతీయస్థాయిలో స్కోచ్ అవార్డు పొందడం అభినందనీయమని, ఇందుకు కృషిచేసిన కలెక్టర్ శ్రీధర్ను ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రత్యేకంగా అభినందించారు. సీఎం జిల్లా పర్యటనలో భాగంగా గురువారం ఒంటిమిట్ట టీటీడీ అతిధి గృహంలో జిల్లాకు స్మార్ట్ కిచెన్గాను అందిన స్కోచ్ అవార్డు జ్ఞాపికను కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ముఖ్యమంత్రికి చూపించి జిల్లాలో స్మార్ట్ కిచెన్ విధానం అమలవుతున్న తీరును వివరించారు. జిల్లాలో ప్రస్తుతం ఐదు స్మార్ట్ కిచెన్ ల ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,రుచికరమైన, సాంకేతిక పరిజ్ఞానం ద్వారా పారదర్శకంగా భోజనం అందిస్తున్నామని, మరో 33 స్మార్ట్ కిచెన్లు నిర్మాణ దశలో ఉన్నాయని,ఇందులో 7 స్మార్ట్ కిచెన్లు వారంలోపు పూర్తి చేస్తామని,మిగిలిన 26 స్మార్ట్ కిచెన్లు నిర్మాణ పనులను ఏప్రిల్ నెలాఖరు లోపు పూర్తి చేసేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నట్టు కలెక్టర్ ముఖ్యమంత్రికి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా,రాజంపేట సబ్ కలెక్టర్ భావన పాల్గొన్నారు. -
‘పద్య కవులకు ఆహ్వానం’
కడప ఎడ్యుకేషన్: విశ్వకవి వేమన, తొలి స్వాతంత్య్ర పోరాట వీరుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి, దానకర్ణుడుగా పేరుపొందిన బుడ్డా వెంగళరెడ్డి ఈ ముగ్గురు మహనీయులపై ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య ఆధ్వర్యంలో, వైయస్సార్ జిల్లా రచయితల సంఘం పర్యవేక్షణలో పద్య కావ్య రచన పోటీ నిర్వహిస్తున్నట్లు వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షులు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంఘాల సమాఖ్య ప్రధాన కార్యదర్శి లెక్కల కొండారెడ్డి తెలిపారు.ఇందుకు సంబంధించి గురువారం కడప రెడ్డి సేవా సమితి సభా భవనంలో కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రెండు తెలుగు రాష్ట్రాల్లోనే కాకుండా, ప్రపంచవ్యాప్తంగా విస్తరించి ఉన్న తెలుగు కవులు పోటీలో పాల్గొన వచ్చని తెలిపారు. వివరాలకు 7700003399 నంబర్లో సంప్రదించాలన్నారు. కార్యక్రమంలో రెడ్డి సేవా సమితి కోశాధికారి గుడ్ల ఆదినారాయణ రెడ్డి, మద్దిక సుబ్బిరెడ్డి,కొండా చెంచిరెడ్డి, శ్రీయపు రెడ్డి శివ నారాయణ రెడ్డి, కారపు రెడ్డి చంద్రారెడ్డి, కర్నాటి విశ్వనాథరెడ్డి, వెల్లాల వెంకటేశ్వరరాచారి, మాచిరాజు రమణయ్య తదితరులు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకుల దాష్టీకం
పులివెందుల : పులివెందుల పట్టణంలో స్థానిక వెంకటేశ్వరస్వామి గుడి సమీపంలో గత 18ఏళ్ల నుంచి మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ ఆ ప్రాంతంలో బస్సులు ఎక్కే ప్రయాణికుల కోసం వేసవి కాలంలో చలివేంద్రాన్ని ఏర్పాటు చేసేవారు. అక్కడే ప్రయాణికులు సేద తీరేందుకు శాశ్వతంగా షెడ్డు ఏర్పాటు చే యాలని వరప్రసాద్ సంకల్పించారు. ఈ విషయాన్ని గత మున్సిపల్ చివరి కౌన్సిల్ సమావేశంలో తీర్మానం ప్రవేశపెట్టారు. కౌన్సిల్ ఆమోదం కూడా తెలిపింది. అనంతరం వరప్రసాద్ అక్కడ షెడ్డు ఏర్పాటు చేశారు. అయితే ఇక్కడే టీడీపీ నాయకులు నీచ బుద్ధిని బయటపెట్టారు. అక్కడ శాశ్వత చలివేంద్రం ఏర్పాటు చేయడం, ప్రజలకు సౌకర్యం కల్పించడం ఏమాత్రం నచ్చని టీడీపీ నాయకులు దౌర్జన్యంగా అప్పటికప్పుడు ఆ ప్రాంతంలో టీడీపీ జెండాలు, బ్యానర్లు కట్టి నాలుగు క్యాన్లతో చలివేంద్రాన్ని ఏర్పాటు చేశారు. అయితే ఈ చలివేంద్రం ఏర్పాటులో మున్సిపల్ కమిషనర్ మునికుమార్ పాల్గొనడం కొసమెరుపు. ఈ సందర్భంగా వరప్రసాద్ మాట్లాడుతూ గత 18ఏళ్ల నుంచి ప్రయాణీకులకోసం చలువ పందిరి, చలివేంద్రం ఏర్పాటు చేయటం జరుగుతోందని, ఈ ఏడాది కూడా ఏర్పాటు చేద్దామని నా సొంత డబ్బు ఒక లక్ష రూపాయలతో బస్ షెల్టర్ ఏర్పాటు చేసినట్లు పేర్కొన్నారు. గురువారం పులివెందులలో ఆయన ఒక ప్రకటన ద్వారా తెలుపుతూ ఈ చలివేంద్రానికి వైఎస్సార్సీపీ రంగులు కూడా వేసినట్లు, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వచ్చిన తర్వాత ప్రారంభించాలనుకున్నామని, కానీ బుధవారం టీడీపీ నాయకులు 4 క్యాన్లు పెట్టి టీడీపీ బ్యానర్లు కట్టి నేను వేసిన పందిరి కింద చలివేంద్రం పెట్టారన్నారు. ఎక్కడ వైఎస్సార్సీపీకి మంచిపేరు వస్తుందోనని టీడీపీ వారు చేసిన పని సిగ్గుమాలిన చర్య అని అన్నారు. ప్రజలకు సేవ చేయాలనే ఉద్దేశమే ఉంటే సొంత నిధులతో ఎక్కడైనా చలివేంద్రాలు ఏర్పాటు చేయవచ్చని, చిత్త శుద్ధిలేని పనులు చేసి నవ్వులపాలు కావటం మీకు అలవాటే కదా అని అన్నారు. నా తండ్రి, దివంగత వల్లెపు నాగన్న పేరిట బస్ షెల్టర్ నిర్మించాలని మున్సిపల్ కౌన్సిల్లో తీర్మానం చేయడం జరిగిందన్నారు. మున్సిపల్ కమిషనర్ ఏమన్నారంటే.. : దీనిపై మున్సిపల్ కమిషనర్ మునికుమార్ను వివరణ కోరగా.. ఆ ప్రాంతంలో శాశ్వత చలివేంద్రం ఏర్పాటుకు మున్సిపల్ కౌన్సిల్ ఆమోదం తెలపడం వాస్తవమేనన్నారు. అయితే బుధవారం ఏర్పాటు చేసిన చలివేంద్రం ప్రారంభోత్సవంలో నేను పాల్గొనలేదని, మున్సిపాలిటీకి సంబంధించిన అడ్డంకులు తొలగించడానికి మాత్రమే అక్కడికి వెళ్లానని తెలిపారు. పోలీస్స్టేషన్లో ఫిర్యాదు.. : టీడీపీ నాయకులు చేసిన దౌర్జన్యంపై గురువారం మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్,మాజీ మున్సిపల్ వైస్ చైర్మన్ హఫీజ్, మాజీ కౌన్సిలర్లు కోళ్ల భాస్కర్, కిశోర్, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షుడు హాలు గంగాధరరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు స్థానిక అర్బన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. చలివేంద్రం ఏర్పాటులోనూ రాజకీయం -
వైఎస్ జగన్కు మేనమామ అయినందుకు గర్వపడుతున్నా..
కడప కార్పొరేషన్: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి మేనమామ అయినందుకు గర్వపడుతున్నానని వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. గురువారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైల్వే ఓవర్ బ్రిడ్జి నిర్మాణానికి భూమిపూజ చేయడానికి కమలాపురానికి వచ్చిన మంత్రి బీసీ జనార్దన్రెడ్డి తనపై విమర్శలు చేయడం దారుణమన్నారు. రైల్వే ఓవర్ పూర్తి చేయనందుకు సిగ్గుపడాలని తనను మాట్లాడటం సరికాదన్నారు. పులివెందులతో సమానంగా కమలాపురం నియోజకవర్గాన్ని అభివృద్ధి చేశానని, జనార్దన్రెడ్డిలా ప్రజల సొమ్ము దోచుకోలేదన్నారు. ఆయన సతీమణి ఇందిరమ్మ వసూల్ రాణిగా పేరు గడించారని ఎద్దేవా చేశారు. నేషనల్ హైవే నుంచి కమలాపురం లోకి రూ.100 కోట్లతో ఫ్లై ఓవర్ చేపట్టి 90 శాతం పూర్తి చేయడం జరిగిందని, మార్కెట్ యార్డును రూ. కోట్లతో అభివృద్ధి చేశామన్నారు. అమ్మవారి శాల నుంచి గతంలో 8 అడుగుల రోడ్డు ఉండేదని, దాన్ని విస్తరించి వెడల్పాటి రోడ్డు నిర్మించామన్నారు. ఓపెన్ డ్రైన్లు నిర్మించి ఎక్కడా వరదనీరు నిలవకుండా చర్యలు చేపట్టామన్నారు. తాగునీటికి సంబంధించి కుందూనది నుంచి రూ. 24కోట్లతో పంపింగ్ స్కీం తెచ్చి, 4 ఓవర్ హెడ్ ట్యాంకులు నిర్మించామన్నారు. ప్రతి సచివాలయ పరిధిలో రైతు భరోసా కేంద్రాలు, అర్బన్ హెల్త్ సెంటర్లు నిర్మించడమేగాక రూ.6కోట్లతో పాలిటెక్నిక్ కాలేజీ, రూ.9కోట్లతో హాస్పిటల్ నిర్మాణం చేపట్టామని, నాడు–నేడు ద్వారా అన్ని పాఠశాలలను అభివృద్ధి చేశామన్నారు. రైల్వే ఓవర్ బ్రిడ్జికి సంబంధించి రాష్ట్ర ప్రభుత్వ నిధులతో ఆరు ఆర్లు టెండర్లు పిలిస్తే ఎవరూ రాలేదని, ఆ తర్వాత సేతు బంధన్ స్కీంలో దేశ వ్యాప్తంగా 79 బ్రిడ్జిలు మంజూరు చేస్తే, మన రాష్ట్రంలో 3 మంజూరు చేశారని, అందులో కమలాపురం బ్రిడ్జి మొదటిదన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్ కృషి వల్లే అది సాధ్యమైందన్నారు. అప్పట్లో లోకల్ నాయకులు కమీషన్లు అడగటం వల్ల కాంట్రాక్టర్ చేయలేదని, ఇప్పుడు కమీషన్లు ఇచ్చే కాంట్రాక్టర్ ద్వారా పనులు చేస్తున్నారని ఎద్దేవా చేశారు. ఇది క్రెడిట్ చోరీ తప్పా ఇంకేం కాదన్నారు. కమలాపురం నియోజకవర్గ అభివృద్ధిపై ఏ రోజైనా, ఎవరితోనైనా చర్చించేందుకు సిద్ధమని సవాల్ విసిరారు. ఎమ్మెల్యే వస్తారా, ఆయన తండ్రి వస్తారా, మంత్రిగా మీరు వస్తారా చెప్పాలన్నారు. కమలాపురం నియోజకవర్గంలో తండ్రీకొడుకులు ఇసుక, కంకర, మట్టి, బ్రాందీ షాపుల ద్వారా రోజుకు రూ.40లక్షలు వసూలు చేస్తున్నారని ఆరోపించారు. ఇక కర్నూల్ జిల్లాలో మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, ఆయన సతీమణి ఇందిరమ్మ చేస్తున్న అక్రమ వసూళ్లు అందరికీ తెలుసన్నారు. క్రషర్లనీ ఆపి రూ.8కోట్లు వసూలు చేశారని, డీవియేషన్లు ఉన్నాయని ఓ ఫంక్షన్ హాలు నుంచి రూ.1.40కోట్లు, వేర్ హౌస్ నుంచి రూ.40లక్షలు వసూలు చేశారని ఆరోపించారు. సొంతంగా మైనింగ్ లేకపోయినా క్రషర్ ఏర్పాటు చేసుకుని అక్రమ మైనింగ్ చేస్తున్నారన్నారు. గ్రావెల్, మట్టి, ఇసుక ద్వారా అక్రమంగా సంపాదిస్తున్నారని, డా. మహ్మద్ హుస్సేన్ నుంచి రూ.70లక్షలు వసూలు చేశారని ఆరోపణలు ఉన్నాయన్నారు. పవర్ గ్రిడ్, సిమెంట్ ఫ్యాక్టరీల ద్వారా వసూళ్లకు పాల్పడుతున్నారని, స్టోర్ బియ్యాన్ని మచిలీపట్నం, కాకినాడ పోర్టులకు అక్రమ రవాణా చేస్తున్నారని ఆరోపించారు. గురివిందగింజ తన నలుపెరగనట్లు తనపై విమర్శలు చేయడం హాస్యాస్పదమన్నారు. త్వరలో వీరికి ప్రజలే బుద్ది చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, వైఎస్సార్సీపీ నాయకులు బంగారు నాగయ్య యాదవ్, ఎస్. వెంకటేశ్వర్లు, సీహెచ్ వినోద్ కుమార్, షపీ, ఫయాజ్, రమేష్రెడ్డి పాల్గొన్నారు. ప్రజల సొమ్ము దోచుకునే నీవు సిగ్గుపడాలి మీ భార్య ఇందిరమ్మ వసూల్రాణిగా పేరొందింది కమలాపురం నియోజకవర్గ అభివృద్దిపై ఏ రోజైనా చర్చకు సిద్ధం నీవు వస్తావా...మీ ఎమ్మెల్యేనా, వారి తండ్రా మీ ఇష్టం మంత్రి బీసీ జనార్థన్రెడ్డిపై విరుచుకుపడిన వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథరెడ్డి -
21,22తేదీల్లో వ్యవసాయ కార్మికసంఘం మహాసభలు
బద్వేలు అర్బన్ : బద్వేలు పట్టణంలో ఈ నెల 21, 22వ తేదీల్లో వ్యవసాయ కార్మిక సంఘం 7వ జిల్లా మహాసభలు నిర్వహించనున్నట్లు సీపీఎం జిల్లా కార్యదర్శి, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్ పేర్కొన్నారు.గురువారం స్థానిక సుందరయ్య భవనంలో నిర్వహించిన వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా విస్తృత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని పునరుద్ధరించే వరకు ఉద్యమించాలని అన్నారు. గాంధీ గ్రామస్వరాజ్యం పునాదులపై బీజేపీ అధికార దాహంతో కార్పొరేట్ల రాజ్యం నిర్మిస్తోందని అన్నారు. అనంతరం మహాసభలకు సంబంధించిన కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి అన్వేష్, జిల్లా నాయకులు జి.శివకుమార్, ఆయా మండలాల కార్యదర్శులు వెంకటేష్, వెంకటరమణ, వీరభద్రుడు, గురవయ్య, ఓబయ్య, ఆవాజ్ జిల్లా కార్యదర్శి చాంద్బాష, కేవీపీఎస్ జిల్లా కార్యదర్శి జకరయ్య, సీఐటీయూ మాజీ జిల్లా కార్యదర్శి శ్రీనివాసులు, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ నాగేంద్రబాబు, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు చిన్ని తదితరులు పాల్గొన్నారు. ఎస్పీ కార్యాలయం ఆవరణలో యువకుడు ఆత్మహత్యాయత్నం కడప అర్బన్: వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయం ఆవరణలో ‘పెన్నార్’కాన్ఫరెన్స్ హాల్ సమీపంలో రాచకుంట మేఘశ్యామ్ (24) గురువారం విష ద్రావణం తాగడంతోపాటు, బ్లేడుతో గొంతును కోసుకొని ఆత్మహత్యకు యత్నించాడు. సమాచారం అందుకున్న కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య తమ సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకుని యువకుడిన రిమ్స్కు తరలించారు. ఈ సంఘటనపై ప్రాథమిక సమాచారం మేరకు పెండ్లిమర్రి మండలం నందిమండలానికి చెందిన రాచకుంట జయశంకర్ కుమారుడు రాచకుంట మేఘశ్యామ్(24) అదే గ్రామానికి చెందిన ముగ్గురు పిల్లలు ఉన్న ఓ వివాహితతో వివాహేతర సంబంధం పెట్టుకున్నాడు. వివాహేతర సంబంధం మంచిది కాదని తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు పలుమార్లు మేఘశ్యాంకు నచ్చచెప్పే ప్రయత్నం చేశారు. అంతేగాక వారిని ఇబ్బందులకు గురి చేస్తున్నాడని, ఇదే అంశంపై పెండ్లిమర్రి పోలీస్ స్టేషన్ లో పలుమార్లు ఫిర్యాదులు చేసుకోవడంతో కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈ క్రమంలో వివాహితను, ఆమె పిల్లలను తన తల్లిదండ్రులు, బంధువులు దాచి పెట్టారని ఆవేదన వ్యక్తం చేస్తూ యువడుకు ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్లు సమాచారం. అపస్మారస్థితిలో, వివరాలు చెప్పలేని పరిస్థితుల్లో బాధితుడు రిమ్స్ ఆసుపత్రిలో ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఎస్పీ కార్యాలయంలో విధుల్లో వున్న కానిస్టేబుల్ ఫిర్యాదు మేరకు యువకుడు మేఘశ్యాంపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు కడప వన్టౌన్ సీఐ వి.చిన్న పెద్దయ్య తెలియజేశారు. -
అనంతపురం, కర్నూలు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్లు ఉత్సాహంగా కొనసాగుతున్నాయి. గురువారం కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో అనంతపురం చిత్తూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 39.4 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని అర్జున్ టెండూల్కర్ 69, ప్రశాంత్ 52 పరుగు లు చేశారు. చిత్తూరు జట్టులోని నవీన్ 3, సాయి చరణ్ 2, బ్రహ్మ సాయి తేజ్రెడ్డి 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం 210 విజయ లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 42.3 ఓవర్లలో 194 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని తేజరెడ్డి 86, భవాని ప్రసాద్ 25 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 3, హానీష్ వీరారెడ్డి 4, అర్జున్ టెండూల్కర్ 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 15 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ప్రారంభించింది. 47.3 ఓవర్లలో 209 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని సాయి గణేష్ 51, మనోజ్రాజ్ 43 పరుగులు చేశారు. కడప జట్టులోని ప్రణవ్ రెడ్డి 4, మహ్మద్ ఆయూబ్ 2, నాగ కుళ్లాయప్ప 2, సుదర్శన్ 2 వికెట్లు తీశారు. అనంతరం 209 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ను ప్రారంభించిన కడప జట్టు 48.2 ఓవర్లలో 199 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని ఆదిల్ హుస్సేన్ 43, మహ్మద్ ఆయూబ్ 73 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాబ్జాన్ భాష 4 విక్యాత్ 4 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 10 పరుగుల తేడాతో విజయం సాధించింది. ప్రణవ్ రెడ్డి, 4 వికెట్లు అర్జున్ టెండూల్కర్,69 పరుగులు మహ్మద్ ఆయూబ్, 73 పరుగులు -
ఉపాధికి ఊరట!
కడప సిటీ: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధిహామీ పథకం (ఎన్ఆర్ఈజీఎస్) ఏప్రిల్ 1 నుంచి వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవిక మిషన్ గ్రామీణ–2025 (వీబీజీ రామ్జీ) అమలు కావాల్సి ఉంది. అయితే విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1వ తేదీ వరకు ఈ పథకం అమలు చేసేందుకు వీలు లేకుండా పోయింది. దీంతో ఉపాధిహామీ పథకానికి భారీగా ఊరట లభించింది. పెండింగ్లో ఉన్న పనులను గడువులోపు పూర్తి చేసుకునేందుకు అవకాశం వచ్చింది. మరిన్ని పనిదినాలు పెరిగేందుకు వీలు కలిగింది. అంతేకాకుండా రాష్ట్ర ప్రభుత్వ, కేంద్ర వాటాల్లో వీబీజీ రామ్కు ప్రస్తుతం ఉన్న ఉపాధిహామీ పథకానికి చాలా తేడాలు ఉండడం వల్ల ప్రగతిలో ఉన్న పనులను మే 1వ తేదీలోగా పూర్తి చేసుకుంటే రాష్ట్ర ప్రభుత్వానికి ఆర్థికభారం తగ్గుతుంది. ఒకవేళ మిగిలిపోతే కేంద్ర ప్రభుత్వం 60, రాష్ట్ర ప్రభుత్వం 40 శాతం నిధులు ఖర్చుచేయాల్సి ఉంటుంది. ప్రస్తుతం ఉపాధిహామీ పథకంలో కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వ వాటా ఉంది. మేల్కొని హుషారు పడితేగానీ గడువులోపల పనులు పూర్తయ్యే అవకాశం కనిపించడం లేదు. ప్రస్తుతం ఉపాధిహామీ పథకంలో 18,572 పనులు ప్రగతిలో ఉన్నాయి. ఇందులో మెటీరియల్, రోడ్లు, డ్రైనేజీ, తారు, మెటల్ రోడ్లు, పశువుల పాక (క్యాటిల్షెడ్లు), కొత్త స్మశాన వాటికల అభివృద్ధి పనులు ఇందులో ఉన్నాయి. పీపీ–2 కింద మరిన్ని పనులు పల్లె పండుగ (పీపీ–2) పథకం కింద ఉపాధిహామీలో వివిధ అభివృద్ధి పనులను పూర్తి చేసేందుకు మార్గం సుగమమైంది. గతేడాది జూన్లో ప్రారంభమైన ఈ పనులు ఇంకా పూర్తి కాలేదు. ప్రస్తుతం వీబీజీ రామ్జీ వాయిదా పడడంతో పీపీ–2 కింద పనులు కొనసాగేందుకు అవకాశం ఉంది. అభివృద్ధి పనుల్లో వివిధరకాల రోడ్లు ఉన్నాయి. ఇప్పటివరకు 800 పనులకు సంబంధించి రూ. 59 కోట్లతో సీసీ రోడ్లు నిర్మించారు. బీటీ రోడ్డు 74 పనులకు రూ. 26.09 కోట్లు, 71మెటల్ రోడ్డు పనులకు రూ. 16 కోట్లు, 17 పాఠశాలల ప్రహారీ గోడల పనులకు సంబంధించి రూ. 1.57 కోట్లు, 34 గ్రామ పంచాయతీ కార్యాలయ నిర్మాణాలకు రూ. 2 కోట్లు, మైదుకూరు నియోజకవర్గంలో 720 క్యాటిల్ షెడ్లు (పశువుల పాక)కు సంబంధించి రూ. 12.50 కోట్లు, ఇందులో శ్మశానాల అభివృద్ధికి 34 పనులకు రూ. 6 కోట్లు, 63,47,000 పనిదినాలకు సంబంధించి రూ. 173.37 కోట్లు రావాల్సి ఉండగా, ప్రస్తుతం రూ. 8 కోట్లు పెండింగ్లో ఉన్నాయి. అలాగే మెటీరియల్కు రూ. 145 కోట్లు రావాల్సి ఉండగా, రూ. 140 కోట్లు పెండింగ్లో ఉండగా త్వరలో వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం ఉన్న ఉపాధిహామీ పథకానికి మే 1 నుంచి అమలు చేసే వీబీజీ రామ్జీ పథకానికి కేంద్ర, రాష్ట్ర వాటాల్లో చాలా తేడాలు ఉన్నాయి. ప్రస్తుత పథకంలో 90 శాతం కేంద్రం, కేవలం 10 శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం భరించాల్సి ఉండగా, వీబీజీ రామ్జీ పథకంలో కేంద్రం 60 శాతం, రాష్ట్ర వాటా 40 శాతం చెల్లించాల్సి ఉంటుంది. ఈశాన్య రాష్ట్రాలైన 13 రాష్ట్రాలకు వెసలుబాటు కల్పించి పాత పద్ధతిలోనే నిధులు చెల్లించే అవకాశం ఉంటుంది. ఈ జాబితాలో ఆంధ్రప్రదేశ్కు చోటు కల్పించుకోవడంలో ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు పూర్తిగా విఫలమయ్యారు. 2014లోనే ఆంధ్రప్రదేశ్ విడిపోయిందని, ఉత్త చేతులతో ఉన్నామని, ఉన్న 10 శాతం కూడా చెల్లించలేమని గగ్గోలు పెట్టిన చంద్రబాబు ఇప్పుడు మాత్రం వీబీజీ రామ్జీ పథకం వచ్చినప్పటికీ మౌనంగా ఉన్నారు. కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కొత్త పథకంపై పార్లమెంట్లో గళం విప్పగా, కూటమి ఎంపీలు మాత్రం మౌనం వహించడం గమనార్హం. చంద్రబాబునాయుడుకు అవకాశం ఉన్నా వినియోగించుకోవడం లేదన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్రప్రభుత్వంతో పొత్తు పెట్టుకున్నప్పటికీ సఫలం కాకపోవడంతో ప్రజలనుంచి తీవ్ర విమర్శలు ఎదురవుతున్నాయి. పది శాతమే కష్టమన్న చంద్రబాబు 40 శాతం వాటా చెల్లించే పరిస్థితి ఉందా? అని పలువురు ఆర్థిక నిపుణులు విశ్లేషిస్తున్నారు. ముందు రాష్ట్ర ప్రభుత్వం నిధులు ఇవ్వాల్సిన వాటా ఇస్తేనే....ఆ తర్వాతనే కేంద్రం నిధులు విడుదల చేస్తుంది. ఈ ఉపాధి పథకం ఉంటుందా.. ఊడుతుందా? అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. వెసులుబాటు కలిగింది కేంద్ర ప్రభుత్వం వీబీజీ రామ్ పథకాన్ని ఏప్రిల్ 1 నుంచి అమలు చేయాల్సి ఉంది. కానీ, విధి విధానాలు ఖరారు కాకపోవడంతో మే 1కి వాయిదా పడింది. ఈ నేపథ్యంలో ప్రగతిలో ఉన్న పనులను త్వరగా పూర్తి చేసుకునేందుకు అవకాశం ఉంది. మే 1లోపు అన్ని పనులు పూర్తి చేసేందుకు కృషి చేస్తున్నాం. – ఆదిశేషారెడ్డి, పీడీ, డ్వామా, కడప వీబీజీ రామ్జీ పథకం మే 1వ తేదీకి వాయిదా వేయడంతో ఉపాధిహామీ పథకానికి ఊరట లభించింది. 140 కోట్లు కూలీల వేతనాలకు చెల్లించే పరిస్థితి వచ్చింది. 50 లక్షల పనిదినాలు చేసుకు నేందుకు వీలు కలిగింది. మెటీరియల్ (నిర్మాణాత్మక పనులు)కు రూ. 93 కోట్లు అదనంగా వచ్చే అవకాశం ఉంది. మే 1కి వీబీజీ రామ్జీపథకం వాయిదా ప్రగతిలో 18,572 పనులు 50 లక్షల పనిదినాలుకలిసివచ్చే అవకాశం మెటీరియల్ పనులు కూడాచేసుకునేందుకు మార్గం సుగమం పాత పద్దతిలోనే పనులు పూర్తి చేయాల్సిన అవసరం -
క్రీస్తు త్యాగాలకు ప్రతీక గుడ్ఫ్రైడే
● నేడు శుభ శుక్రవారం ● చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు రాజంపేట టౌన్: క్రీస్తు అనగానే క్షమ, కరుణ గుణాలు గుర్తుకు వస్తాయి. లోకంలోని పాపులను పరిశుద్ధులు చేసేందుకు, వారికి క్షమను అందించేందుకు కరుణామయుడైన ఏసుక్రీస్తు శిలువపై తన ప్రాణాలను బలిపెట్టిన రోజే గుడ్ఫ్రైడే. దీనినే శుభ శుక్రవారం అని కూడా అంటారు. తన ఆత్మబలిదానంతో పాపులకు దేవుని పరిశుద్ధసన్నిధిలో స్థానం కల్పించిన ఈ శుక్రవారాన్ని ప్రపంచంలోని క్రైస్తవులందరూ శుభ శుక్రవారంగా భావిస్తారు. దయామయుడైన క్రీస్తు శిలువపై చిందించిన రక్తం మానవాళికి శుభాలను చేకూర్చింది. అందువల్ల క్రైస్తవులు, విశ్వాసులు గుడ్ఫ్రైడేని భక్తిశ్రద్దలతో నిర్వహించుకుంటారు. గుడ్ఫ్రైడే నాడే కల్వగిరిపై క్రీస్తును శిలువపై శిక్షించారు. ఘనంగా ఏర్పాట్లు జిల్లాలో గుడ్ఫ్రైడే వేడుకలను నిర్వహించుకునేందుకు క్రైస్తవులు, విశ్వాసులు అన్ని ఏర్పాట్లు చేశారు. అందులో భాగంగా పాస్టర్లతో పాటు క్రైస్తవులు, విశ్వాసులు చర్చిల్లో ఉపవాస ప్రార్థనలు చేయనున్నారు. ఏసు ప్రభువు చూపిన మార్గాన్ని అనుసరించి ఆరాధించే వారికి పరలోకపు ద్వారాలు తెరుచుకొని ఉంటాయని విశ్వాసుల ప్రగాఢ నమ్మకం. ఏసు మరణం సృష్టిలో ఓ అద్భుతమైన త్యాగపూరిత మరణం. దేవునితో మానవునికి శాశ్విత బంధాన్ని ఏర్పరిచిన గొప్ప మరణం అని పాస్టర్లు చెబుతున్నారు. రేపటితో ముగియనున్న లెంట్ డేస్ గుడ్ ఫ్రైడేని పురస్కరించుకొని క్రైస్తవులు, విశ్వాసులు 40 రోజుల పాటు లెంట్డేస్ (శోకదినాలు) నిర్వహిస్తారు. ఇవి శనివారంతో ముగియనున్నాయి. లెంట్డేస్ను పురస్కరించుకొని అనేక మంది క్రైస్తవులు గత నలబై రోజులుగా శుభకార్యాలకు దూరంగా ఉన్నారు. అలాగే దైవధ్యానంలోనే గడుపుతున్నారు. ఉదయం, సాయంత్రం వేళల్లో ప్రత్యేక ప్రార్దనలు చేస్తున్నారు. కాగా శుక్రవారం గుడ్ఫ్రైడేని, ఆదివారం ఈస్టర్ వేడుకలను క్రైస్తవులు, విశ్వాసులు ఘనంగా నిర్వహించుకోనున్నారు. పునరుత్తానమే ఈస్టర్ కల్వరి కొండమీద శిలువపై మరణించిన క్రీస్తును....అక్కడి కొండ గుహలో సమాధి చేస్తారు. మూడోరోజు ఏసుక్రీస్తు పునరుత్తానం పొంది తిరిగి తన శిష్యులకు దర్శనమిచ్చినట్లు పాస్టర్లు చెబుతున్నారు. ‘నేను జీవమును’ అన్న మాటకు నిదర్శనంగా నిలిచి లోకానికి తన దివ్య మహిమను చాటారు. ప్రభువు పునరుత్తానం చెందిన ఆదివారాన్ని ఈస్టర్ సండేగా పిలుచుకుంటారు. అశాంతితో తల్లడిల్లుతున్న నేటి ప్రపంచానికి క్రీస్తు ప్రబోధించిన ప్రేమ, దయ, కరుణ, క్షమ గుణాలు ఆదర్శం కావాలని పాస్టర్లు చెబుతున్నారు. కాగా జిల్లాలో పలు చర్చిల్లో క్రీస్తు ఆత్మబలిదానం, శిలువయాగం తదితర ఘట్టాలను ప్రదర్శించనున్నారు. గుడ్ఫ్రైడే సందర్భంగా చర్చిల్లో ప్రత్యేక ప్రార్దనలు చేయనున్నారు. ఈసందర్భంగా పాస్టర్లు ఏసు ప్రభువు కల్వరి కొండపై బలిదానం చేసిన ఘట్టాలను క్రైస్తవులు, విశ్వాసులకు తెలియచేయనున్నారు. -
పరిమళించిన.. ఆధ్యాత్మిక సుగంధం
కమలాపురం: కమలాపురంలో పట్టణంలో వెలసిన హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రీ, హజరత్ దస్తగిర్ షా ఖాద్రీ, హజరత్ మౌలానా మౌల్వీ ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రీ, హజరత్ జహీరుద్దీన్ షా ఖాద్రీ ఖుద్దస సిర్రహుం వార్ల గంధోత్సవం ఘనంగా జరిగింది. దర్గా పీఠాధిపతి (ముతవల్లి) సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో గంధోత్సవం వైభవంగా నిర్వహించారు. అశేష భక్తజన సందోహం తరలిరాగా.. గురువారం రాత్రి గంధోత్సవం అత్యంత భక్తి శ్రద్ధలతో జరిపారు. పీఠాధిపతి నివాసం నుంచి గంధం సామగ్రిని బస్టాండు సమీపంలోని గంధం ఇంటికి మేళతాళాలతో తీసుకొచ్చారు. అక్కడి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో గంధంను ఊరేగించారు. కర్ణాటక రాష్ట్రం నుంచి వచ్చిన డప్పు వాయిద్యాలు అలరించాయి. గంధోత్సవం ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్, సంబటూరు బస్టాండు మీదుగా దర్గా చేరుకుంది. పీఠాధిపతి దర్గాలోని స్వామి వార్ల మజార్లపై పూల చాదర్ సమర్పించి గంధం ఎక్కించారు. అనంతరం భక్తులందరికీ గంధం పంచి పెట్టారు. గంధోత్సవం ఊరేగింపులో ఫకీర్ల విన్యాసాలు గగుర్పొడిచాయి. తలలోకి పెద్ద ఇనుప కడ్డీని గుచ్చుకొని దానిపై టెంకాయలు పగులగొట్టి అబ్బుర పరిచారు. ఈ విన్యాసాలను చూసేందుకు భక్తులు ఆసక్తి చూపారు. అలరించిన ఖవ్వాలి ఫోటీ కమలాపురం గఫార్ షా ఖాద్రీ ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా మైదానంలో ఏర్పాటు చేసిన ఖవ్వాలీ పోటీ అలరించింది. బెల్గాంకు చెందిన ప్రఖ్యాత ఖవ్వాల్ ఉస్తాద్ మురాద్ ఆతిష్, యూపీకి చెందిన రాజా సర్ఫరాజ్ల మధ్య రాత్రంతా ఖవ్వాలీ పోటీ ఆద్యంతం ఉత్సాహంగా సాగింది. వేలాదిగా తరలివచ్చిన భక్తులు రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి భక్తులు వేలాదిగా ఉరుసు మహోత్సవాలకు తరలివచ్చారు. స్వామి వార్లను దర్శించుకొని ప్రత్యేక ఫాతెహా నిర్వహించారు. పీఠాధిపతిని కలిసి ఆశీర్వాదం పొందారు. కాగా ఉరుసు మహోత్సవానికి వచ్చిన భక్తులకు మోహన్ బీడీ కంపెనీ యాజమాన్యం అన్నదానం ఏర్పాటు చేశారు. భక్తిశ్రద్ధలతో దర్గా– ఏ– గఫారియా గంధమహోత్సవం నేడు ఉరుసు -
ముత్యాలతలంబ్రాల కోసం..
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల సందర్భంగా బుధవారం జరిగిన సీతారాముల కల్యాణంలో పంపిణీ చేయగా మిగిలిన ముత్యాల తలంబ్రాల ను గురువారం ఒంటి మిట్ట రామాలయంలో స్వామి దర్శనానికి విచ్చేసిన భక్తులకు టీటీడీ అధికారులు పంపిణీ చేశారు. ముత్యాలతలంబ్రాలు పంపిణీ చేస్తున్నారని తెలుసుకున్న భక్తులు ఒంటిమిట్ట రామాలయానికి పోటెత్తారు. ఈ నేపథ్యంలో భక్తుల మధ్య తోపులా కూడా జరిగింది. భక్తులకు ఇవ్వాల్సిన ముత్యాతలంబ్రాలు అధిక మొత్తంలో పోలీసులు, విజిలెన్స్ అధికారులకు, సిబ్బందికి టీటీడీ అధికారులు ఇవ్వడంపై భక్తులు ఆగ్రహించారు. ఈ నేపథ్యంలో టీటీడీ అధికారులు, భక్తుల మద్య కాసింత వాగ్వాదం జరిగినట్లు తెలుస్తోంది. -
సహోదర ప్రేమను సమాజానికి పంచాలి
ప్రతి ఒక్కరు ఏసుచూపిన మార్గాన్ని అనుసరించి, క్షమా గుణాన్ని అలవరుచుకొని సమాజానికి సహోదర ప్రేమను పంచాల్సిన అవసరం ఎంతైనావుంది. ఇతరుల కష్టాలను పంచుకోవడంలోనే శాంతి దాగివుంది అనే పరమ సత్యాన్ని చాటడానికి క్రీస్తు శిలువ ఎక్కి రక్షకుడయ్యాడు. ఏసుక్రీస్తు పరిశుద్దుడు, ఏ పాపము చేయని వాడు కనుకే తనకు తానే శిలువకు అప్పగించుకున్నాడు. మనుషుల పట్ల అవాజ్యమైన ప్రేమ, త్యాగము క్రీస్తు జీవితంలోనే చూడగలము. – కస్తూరి ఫోనిక, సిస్టర్, నిజస్వరూపుని మందిరం, రాజంపేట -
ఘనంగా ప్రారంభమైన ఉరుసు
కమలాపురం: పట్టణంలో వెలసిన దర్గా–ఏ–గఫారియా, ఖాదరియా, జహీరియా ఉరుసు మహోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. దర్గా పీఠాధిపతి సజ్జాద్–ఏ–నషీన్ మహమ్మద్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రీ ఆధ్వర్యంలో, దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ పర్యవేక్షణలో అశేష భక్తజన సందో హం నడుమ బుధవారం సాయంత్రం ఉరుసు ఉత్సవాలు ప్రారంభ మయ్యాయి. గంధం ఇంటి నుంచి ప్రత్యేకంగా అలంకరించిన చాందినిలో నషాన్ జెండాను ఊరేగింపుగా తీసుకువచ్చారు. జెండా ఊరేగింపు తాళిం, మార్కెట్, చౌక్ సెంటర్, సంబటూరు బస్టాండు మీదుగా పెద్ద దర్గాకు చేరుకుంది. ఊరేగింపులో ప్రత్యేక డప్పు కళాకారుల వాయిద్యాల నడుమ యువత వివిధ రకాల నృత్యాలు చేశారు. తమిళనాడు నుంచి ప్రత్యేకంగా తెచ్చిన బాణా సంచా పెద్ద ఎత్తున పేల్చుతూ ఊరేగింపు నిర్వహించారు. ఊరేగింపు అనంతరం ఉత్సవాల ప్రారంభానికి సూచికగా నషాన్ను దర్గా ఆవరణలో ఆవిష్కరించారు. రాష్ట్రం నలుమూలల నుంచే కాక తమిళనాడు, కర్ణాటక, మహారాష్ట్ర, కేరళ రాష్ట్రాల నుంచి తరలివచ్చిన భక్త జనుల సమక్షంలో హజరత్ అబ్దుల్ గఫార్ షా ఖాద్రి, దస్తగిరిషా ఖాద్రి, మౌలానా మౌల్వి మొహిద్ధీన్ షా ఖాద్రి, హాజీ హజరత్ జహీరుద్ధీన్ షా ఖాద్రిల మజార్లపై పూల చాదర్లు సమర్పించారు. ప్రత్యేక ఫాతెహా చేశారు. అనంతరం భక్తులకు అన్నదానం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీఠాధిపతి సోదరులు దస్తగిరి షా ఖాద్రి, మౌలానా ఖాద్రి, గౌస్ పాక్, జియా, సర్ఫరాజ్, ఇస్మాయిల్, గ్రామ ప్రజలు, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. రాత్రి టి. హుసేన్ మియా కుటుంబ సభ్యులు అన్నదానం నిర్వహించారు. నేడు గంధ మహోత్సవం: కమలాపురం పెద్ద దర్గాగా విరాజిల్లుతున్న దర్గా–ఏ–గఫారియా ఖాదరియాలో గురువారం రాత్రి గంధం మహోత్సవం వైభవంగా నిర్వహించనున్నారు. రాత్రి ప్రముఖ ఖవ్వాల్ల మధ్య గొప్ప ఖవ్వాలీ పోటీ నిర్వహించనున్నారు. నషాన్ ఊరేగింపులో పాల్గొన్న పీఠాధిపతి, సోదరులు ఉరుసు ప్రారంభానికి సూచికగా నషాన్ ఊరేగిస్తున్న భక్తులు -
ఇబ్బందులు లేకుండా చర్యలు
వైద్య సేవలు నిలుపుదల చేసిన ఆసుపత్రులకు రోగులు వస్తే ఉచిత వైద్యం కోసం మరొక ఆసుపత్రికి వెళ్లేలా సూచిస్తున్నా ం. ఉచిత వైద్య సేవలు అందించే నెట్వర్క్ ఆసుపత్రిలో ఆరోగ్య సమస్యకు చికిత్స లేకపోతే, రిమ్స్కు వెళ్లేలా చర్యలు తీసుకుంటున్నాం. –బాలాంజనేయులు, ఎన్టీఆర్ వైద్యసేవ జిల్లా కోఆర్డినేటర్సమ్మెలో ఉన్నారని చెప్పారు నేను చెవి సమస్యతో ఇబ్బంది పడుతున్నాను. ఆరోగ్యశ్రీ కింద వైద్యం పొందుదామని కడపకు వచ్చాను. ఇక్కడ ఆసుపత్రుల వారు సమ్మెలో ఉన్నా మంటున్నారు. ఫీజు చెల్లించి ఇక్కడే చూపించుకోవాలి లేదంటే వేరొక డాక్టర్ కాడికి వెళ్లాలి. –రామలక్ష్మమ్మ, జమ్మలమడుగు -
ఆరోగ్యశ్రీ వైద్య సేవలు నిలుపుదల
కడప రూరల్: తెలుగుదేశం పార్టీ వైఖరి కారణంగా జిల్లా వ్యాప్తంగా మరో మారు ఎన్టీఆర్ వైద్య సేవ ( ఆరోగ్యశ్రీ ) ఉచిత వైద్య సేవలను ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు బుధవారం నుంచి నిలుపుదల చేశాయి. కూటమి ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఆరోగ్యశ్రీ పథకం ఒడిదుడుకులను ఎదుర్కొంటోంది. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో మరోమారు ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేయడంతో వైద్యం కోసం వచ్చిన పేదలు ఇబ్బందులు పడ్డారు. తొలిరోజు చాలా వరకు ఆసుపత్రులు వైద్య సేవలను నిలుపుదల చేసి సమ్మెలో పాల్గొన్నా యి. వైద్యం కోసం ఆసుపత్రులకు వచ్చిన పేదలు వైద్య మిత్రులను సంప్రదించగా.. వైద్య సేవలను నిలుపుదల చేశారు మరొక ఆసుపత్రికి లేదా రిమ్స్కు వెళ్లాలంటూ సూచించారు. దీంతో వచ్చిన రోగులు అసౌకర్యానికి.. ఇబ్బందులకు గురయ్యారు. ఉచిత వైద్యానికి ఎప్పుడు ఆటంకాలు లేవని... ఈ ప్రభుత్వంలోనే సమస్యలు ఎందుకు వస్తున్నాయో అర్థం కావడం లేదని పలువురు వాపోయారు. ఆసుపత్రులను నిర్వహించలేక.. ఎన్టీఆర్ వైద్య సేవ పథకం కింద జిల్లా వ్యాప్తంగా మొత్తం 110 కి పైగా ఆసుపత్రులు ఉన్నాయి. అందులో 42 ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు పనిచేస్తున్నాయి. ఈ ఆసుపత్రులకు ప్రభుత్వం దాదాపుగా మొత్తం రూ 130 కోట్లకు పైగా బకాయిలను చెల్లించాలి. ఆసుపత్రులను నిర్వహించలేని పరిస్థితులలో ఉన్న యాజమాన్యాలు తమ సమస్యలను పలుమార్లు ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాయి. ప్రభుత్వం స్పందించకపోవడంతో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు సమ్మెబాట పట్టాయి. ‘ఎన్టీఆర్ వైద్య సేవ ’ (ఆరోగ్యశ్రీ ) కు గడ్డుకాలం దాపురించింది. టీడీపీ నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం ఉచిత వైద్యం పథకంపై నిర్లక్ష్య వైఖరిని ప్రదర్శిస్తోంది. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులకు బిల్లులు చెల్లించకుండా ఇబ్బందులు పెడుతోంది. దీంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులు ఉచిత వైద్య సేవలను నిలుపుదల చేశా యి ఫలితంగా పేదలకు ఉచిత వైద్యం గగనమైంది. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రులకు అందని బిల్లులు ’ఆషా’ పిలుపుమేరకు వైద్య సేవలు బంద్ ఉచిత వైద్యానికి పేదల ఇబ్బందులు -
గజ వాహనంపై కల్యాణరాముడు
ఒంటిమిట్ట: శ్రీ కోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం రాత్రి కల్యాణోత్సవం అనంతరం గజవాహనంపై కల్యాణరాముడు భక్తులకు దర్శనమిచ్చారు. కల్యాణం అనంతరం ఉత్సవమూర్తులను రామాలయానికి ఊరేగింపుగా తీసుకొచ్చారు, 9.30 గంటల నుంచి 10.30 వరకు స్వామివారు ఆలయ మాఢవీధుల్లో భక్తులకు దర్శనమిచ్చారు. రాములోరి కల్యాణోత్సవం సందర్భంగా రామాలయం భక్తులతో కిటకిటలాడింది. కోదండరాముడి రాజసం శ్రీకోదండరామస్వామి బ్రహ్మోత్సవాలలో భాగంగా బుధవారం శివధనుర్భంగాలంకారణంలో శ్రీ కోదండరాముడు రాజసం భక్తులను కనువిందు చేసింది. చెక్కభజనలు, కేరళవాయిద్యాలు, మంగళవాయిద్యాలు న డుమ స్వామివారి ఊరేగింపు కోలాహాలంగా జరిగింది. డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూ పరింటెండెంట్ హనుమంతయ్య పాల్గొన్నారు. పోలీసు ఆంక్షలతో భక్తులు ఇబ్బందులు రాములోరి కల్యాణోత్సవ సందర్భంగా పోలీసులు అమలు చేసిన అంక్షలతో భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఒంటిమిట్ట సర్పంచ్ కత్తి సుజాత, పలువురు ప్రజా ప్రతినిధులకు వీఐపీ పాసు ఉన్నా పోలీసులు ఆంక్షలు చూపి, కల్యా ణ వేదిక వద్దకు వెళ్లకుండా అడ్డుకున్నారు. ఒంటిమిట్టలో సీఎం బస ఒంటిమిట్టలో ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు బుధవారం రాత్రి బస చేశారు. ఈ సందర్భంగా సీఎంను పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు కలిసి మాట్లాడారు. -
కర్నూలు, చిత్తూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. బుధవారం కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 297 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి సూర్యతేజ రెడ్డి 70 బంతుల్లో 7 ఫోర్లు, 7 సిక్సర్లతో 110 పరుగులు చేశారు. మనోజ్రాజ్ 41 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 3, ప్రమోద్కుమార్ 2, మల్లికార్జున 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 49.2 ఓవర్లలో 286 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని అర్జున్ టెండూల్కర్ 67, విశ్వ వికాస్ 80 పరుగులు చేశారు, కర్నూలు జట్టులోని సాబ్జాన్బాషా 3, దినేష్కుమార్ 3 వికెట్లు తీశారు. దీంతో కర్నూలు జట్టు 11 పరుగులు తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి, టాస్గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. నిర్ణీత 45.2 ఓవర్లలో 212 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని షేక్ కమాల్ 48, తోషిత్ యాదవ్ 47 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని రెడ్డి ప్రకాశ్ 4, సాయి చరణ్ 2, నవీన్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 39.3 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది.జట్టులోని తేజరెడ్డి 63, గౌతమ్ కృష్ణ తేజ్ 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ మహేష్ 3 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 4 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
మాటలేనా..చేతల్లో చూపిస్తారా
● కొన్ని రోజుల క్రితం ముగిసిన టి–20 ప్రపంచకప్లో చెలరేగిన బుకీలు ● అడపా దడపా కేసులతో సరిపెట్టుకున్న పోలీసులు ● క్రికెట్ బెట్టింగ్కు అడ్డాగా మారిన ప్రొద్దుటూరు ప్రొద్దుటూరు క్రైం : ఇటీవలే టి–20 ప్రపంచకప్ క్రికెట్ మ్యాచ్లు ముగిశాయి. ఈ మ్యాచ్లకు ముందు కూడా పోలీసులు ఆయా స్టేషన్ల పరిధిలో ఉన్న క్రికెట్ బుకీలను పిలిపించి కౌన్సెలింగ్తో పాటు పందేలు నిర్వహిస్తే తాట తీస్తానంటూ హెచ్చరికలు జారీ చేశారు. అయితే ఒకటి, రెండు స్టేషన్లలో క్రికెట్ పందేలు నిర్వహిస్తున్న చిన్నా చితకా వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. ప్రధాన, బడా బుకీలెవ్వరూ పట్టుబడలేదు. పోలీసులు వీళ్లనెవ్వరినీ టచ్ చేయలేదు. ప్రధాన బుకీలను టచ్ చేయలేదా చేయలేకపోయారా అనేది తెలియడం లేదు. రోజుకు మూడు మ్యాచ్ల చొప్పున నెల రోజుల పాటు టి 20 క్రికెట్ మ్యాచ్లు జరిగాయి. పలుకుబడి, అధికార పార్ట్టీ అండ ఉన్న బుకీలు స్థానికంగా ఉంటూ క్రికెట్ పందేలు పెద్ద ఎత్తున నిర్వహించారు. కొందరు ప్రధాన బుకీలు, పేరున్న బుకీలు మాత్రం పక్క రాష్ట్రాలకు, ఇతర దేశాలకు వెళ్లిపోయారు. అయితే నెల రోజుల పాటు క్రికెట్ పందేల్లో బిజీగా ఉన్న బుకీలు తర్వాత ప్రొద్దుటూరుకు వచ్చి వారి వ్యక్తగత, ఇతర సాధారణ కార్యకలాపాలు చూసుకుంటూ ఉండిపోయారు. మ్యాచ్ల కంటే ముందు కౌన్సిలింగ్కు వెళ్లిన బుకీలు తర్వాత ‘మమ్మల్ని టచ్ చేసేదెవరు’ అన్నట్టు ప్రొద్దుటూరులో చెట్టాపట్టాలేసుకొని దర్జాగా తిరుగుతున్నారు. మళ్లీ అదే సీన్ రిపీట్ అవుతుందా.. సుమారు రెండు నెలల పాటు ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు జరగుతాయి. ఈ నేపథ్యంలో ప్రొద్దుటూరులోని అన్ని స్టేషన్ల పరిధిలో ఉన్న బుకీలు, మట్కా నిర్వాహకులను పోలీసులు పిలిపించారు. ఎస్డీపీఓ కార్యాలయంలో ఏఎస్పీ విభూకృష్ణ బుకీలందరికీ వార్నింగ్ ఇచ్చారు. ఇక నుంచైనా క్రికెట్ పందేలు మానుకొని మంచిగా జీవించాలని చెప్పారు. లేదంటే మాత్రం ఎక్కడున్నా పట్టుకొచ్చి కేసులు నమోదు చేస్తామని హెచ్చరికలు జారీ చేశారు. బయటి ప్రాంతాలకు వెళ్లి ఇక్కడి వారితో క్రికెట్ పందేలు నిర్వహిస్తామంటే చూస్తూ ఊరుకోమని టెక్నాలజీని ఉపయోగించి దేశంలో ఏ మారుమూల రాష్ట్రంలో ఉన్నా పట్టుకొస్తామని ఏఎస్పీ గట్టిగా హెచ్చరించారు. కాగా కౌ న్సెలింగ్లో ప్రధాన బుకీలెవ్వరూ కనిపించక పోవడం విశేషం. ప్రధాన బుకీలకు ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇస్తారేమోనని పలువురు చర్చించుకుంటున్నారు. పొలిటికల్ ముసుగులో బుకీలు కొందరు ప్రధాన బుకీలకు అధికార పార్టీ అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. పొలిటికల్ ముసుగులో ఉన్న కొందరు ప్రధాన బుకీలు సొంతంగా యాప్లను నడిపిస్తునట్లు తెలుస్తోంది. ఇంకొందరు అసిస్టెంట్లను నియమించుకొని బెట్టింగ్ నడిపిస్తున్నారు. ప్రొద్దుటూరు పోలీసులవి మాటలేనా.. లేక చేతల్లో చూపిస్తారా..అనేది రానున్న రోజుల్లో తెలుస్తుంది. అని క్రికెట్ పందేల నిరోధానికి పోలీసులు తీసుకునే చర్యలపై ప్రొద్దుటూరు ప్రజలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మకాం మార్చిన బుకీలు ఏఎస్పీ విభూకృష్ణ హెచ్చరికలు జారీ చేసిన నేపథ్యంలో ప్రధాన, బడా బుకీలు ఇప్పటికే సురక్షిత ప్రాంతాలకు వెళ్లినట్లు తెలుస్తోంది. కొందరు బెంగళూరు, చైన్నె, తిరుపతి, గోవా, హైదరాబాద్లకు వెళ్లగా.. మరి కొందరు దేశమే విడిచి వెళ్లినట్లు తెలుస్తోంది. అఽధికార పార్టీ అండ ఉంటుందని భావించే క్రికెట్ పందెంగాళ్లు స్థానికంగానే ఉన్నట్లు తెలుస్తోంది. కొందరు బుకీలు ఇప్పటికే ప్రొద్దుటూరులోని అపార్ట్మెంట్లలో ఇళ్లను అద్దెకు తీసుకున్నట్లు సమాచారం. ఒకేచోట ఉండకుండా వారానికి మరో చోటికి మకాం మార్చేలా ప్లాన్ రూపొందించుకున్నట్లు విశ్వసనీయ సమాచారం. కొందరు బుకీలు తమ ఇళ్లలోనే ప్రత్యేకంగా రూపొందించుకున్న విలాసవంతమైన గదిలోనే బెట్టింగ్ కార్యకలాపాలు నిర్వహించుకోనున్నట్లు తెలిసింది. సాధారణంగా క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలో గతంలో ప్రతి రోజు క్రికెట్ పందేలు నిర్వహించే వ్యక్తులను ఆయా సీఐలు, ఎస్ఐలు స్టేషన్లకు పిలిపించేవారు. మ్యాచ్ పూర్తయ్యే వరకు ఆయా స్టేషన్లలోనే ఉండేవారు. అయితే ఇప్పుడు అలాంటి పరిస్థితి కనిపించలేదు. జిల్లా అంతటా బెట్టింగ్కు రంగం సిద్ధం చేసుకున్న బుకీలు ప్రొద్దుటూరు బుకీలకు ప్రొద్దుటూరుతో పాటు జిల్లా అంతటా సంబంధాలు ఉన్నాయి. కడప జిల్లానే గాక రాయలసీమలోని జిల్లాల్లో కూడా వీరు పందేలు నిర్వహించుకునేందుకు రంగం సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. రోజుకు రూ. కోట్లలో పందేలు జరిగే అవకాశం ఉందని పోలీసులు భావిస్తున్నారు. ప్రొద్దుటూరులోని మోడంపల్లె, నడింపల్లె, దస్తగిరిపేట, జిన్నారోడ్డు, మైదుకూరు రోడ్డు, శ్రీనివాసనగర్, వైఎంఆర్కాలనీ, హౌసింగ్బోర్డు, భగత్సింగ్ కాలనీ, బొల్లవరం, గాంధీరోడ్డు, మెయిన్బజార్, తదితర ప్రాంతాల్లో భారీగా క్రికెట్ బెట్టింగ్ జరుగుతున్నట్లు తెలుస్తోంది. యువత జీవితాలను చిన్నాభిన్నం చేస్తున్న క్రికెట్ బెట్టింగ్ను అరికట్టాలని ప్రొద్దుటూరు ప్రజలు కోరుతున్నారు. -
ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి
ముద్దనూరు: ముద్దనూరు–పులివెందుల ప్రధాన రహదారిలో ఈనెల 29న బైక్పై ప్రయాణిస్తూ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన చంద్రశేఖర్(25) అనే యువకుడు చికిత్స పొందుతూ బుధవారం మృతి చెందాడు.ఏఎస్ఐ రమేష్ కథనం మేరకు మండలంలోని ఆరవేటిపల్లె గ్రామానికి చెందిన చంద్రశేఖర్ తలుపుల మండలం వేమలగండిలో ఉన్న తన భార్య దగ్గరికి ఆదివారం రాత్రి బైక్పై బయలుదేరాడు.మండలంలోని నల్లబల్లె గ్రామ సమీపంలో కుక్క అడ్డురావడంతో బైక్ను అదుపుచేసుకోలేక కిందపడిపోయాడు.ఈ ప్రమాదంలో చంద్రశేఖర్ తలకు తీవ్రగాయాలయ్యాయి.వెంటనే అతన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.అక్కడనుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూలుకు తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ఉదయం మరణించాడు.మృతుని భార్య నాగజ్యోతి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
పసికందును తల్లికి అప్పగించిన పోలీసులు
చెన్నూరు (వల్లూరు)/మైదుకూరు : చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో డబ్బు కోసం కన్న బిడ్డను అమ్ముకున్న విషయంపై పోలీసులు, ఐసీడీఎస్ ఆధ్వర్యంలో బుధవారం ముమ్మురంగా విచారణ చేపట్టారు. ఐిసీడీఎస్ ఆధ్వర్యంలో చైల్డ్ ప్రొటెక్షన్ అడ్వైజర్ సునీత సామాజిక ఆరోగ్య కేంద్రం వైద్యులతో అక్కడి సిబ్బందితో విచారించారు. ఆసుపత్రిలో కు.ని. ఆపరేషన్లు ఏ తేదీల్లో నిర్వహించారనే విషయాలపై విచారణ చేశారు. అలాగే కన్నబిడ్డ దూరం కావడంతో తల్లడిల్లిన తల్లి లక్ష్మి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో స్వీపర్గా పనిచేసే సుబ్బమ్మ అనే మహిళ వద్ద పసిబిడ్డ ఉండగా పోలీసులు ఆమెను అదుపులోకి తీసుకొని చెన్నూరు పోలీసుస్టేషన్కు తీసుకొచ్చారు. పోలీసుల అదుపులో ఉన్న సుబ్రమణ్యంను పోలీసులు విచారించగా తనకు చెన్నూరు సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే స్టాఫ్ నర్స్ కవిత ఇచ్చినట్లు పోలీసులకు తెలియజేశారు.సామాజిక ఆరోగ్య కేంద్రంలో పనిచేసే స్టాఫ్ నర్స్ కవిత, సెక్యూరిటీ గార్డ్ భైరవ, స్వీపర్ పుష్ప, బాల కుమార్, పేర్లు వెల్లడైనట్లు పోలీసులు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేశామని పోలీసులు తెలిపారు. కాగా దొరికిన పసికందును తల్లి లక్ష్మీనారాయణమ్మకు అప్పగించి తల్లీబిడ్డను వన్ స్టాప్ సెంటర్కు తరలించారు., దీనిపై పూర్తి విచారణ చేపడతామని పోలీసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఎస్ఐ శంకర్ నాయక్, హెడ్ కానిస్టేబుల్ శ్రీరాములు, శ్రీకాంత్, ఐసిడిఎస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
వైభవం.. ధ్వజావరోహణం
హంసవాహనంపై విహరిస్తున్న రామచంద్రుడుచక్రస్నానం నిర్వహిస్తున్న వేదపండితులు వాల్మీకిపురం: వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామివారి సాలకట్ల బ్రహ్మోత్సవాలు బుధవారం ధ్వజావరోహణతో ముగిశాయి. ఉదయం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కోలిపి శుద్ధి, తోమాలసేవ, కొలువు, పంచాగశ్రవణం, అర్చన, బలి, శాత్తుమొర నిర్వహించారు. ఉదయం 7గంటలకు వసంతోత్సవం అనంతరం స్వామివారిని తిరుమాడ వీధుల్లో ఊరేగించారు. సీతారామలక్ష్మణ సరసన చక్రత్తాళ్వార్లకు పాలు, పెరుగు, నెయ్యి, పండ్ల రసాలతో అభిషేకం జరిపారు. అనంతరం అర్చకుల వేదమంత్రోచ్ఛారణ నడుమ భక్తిశ్రద్ధలతో చక్రస్నానం నిర్వహించారు. రాత్రి 8గంటలకు వాహన మండపంలో సీతారామలక్ష్మణులను హంసవాహనంపై కొలువదీర్చారు. స్వామివారు హంసవాహనంపై ఊరేగుతూ స్వామివారు భక్తులను కటాక్షించారు. రాత్రి 10గంటలకు ధ్వజావరోహణం కార్యక్రమంతో శ్రీ పట్టాభిరామస్వామి శ్రీ పరాభవనామ సంవత్సర సాలకట్ల బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి పాల్గొని, ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, సిబ్బంది నాగరాజ, భక్తులు పాల్గొన్నారు.ముగిసిన పట్టాభిరాముని బ్రహ్మోత్సవాలు -
ముత్తూట్లో గోల్డ్ మాయం చేశారు
● అనుమానంతో బ్యాంకుకు పరుగులు తీసిన ఖాతాదారులు ● బ్యాంకును తెరవనీయకుండా అడ్డగింత రాయచోటి: రాయచోటిలోని ముత్తూట్ ఫైనా న్స్ బ్యాంకు మేనేజర్ ఖాతాదారుల బంగారు నగలతో వెళ్లిపోయారన్న ప్రచారం బంగారు పె ట్టిన ఖాతాదారుల గుండెల్లో రైళ్లు పరిగెత్తించా యి. ఖాతాదారులు బుధవారం ఉదయం బ్యాంకు వద్దకు పరుగులు తీశారు. మేనేజర్ వచ్చేవరకు బ్యాంకు తాళాలను తెరవడానికి వీ లులేదని భీష్మించుకు కూర్చున్నారు. విషయా న్ని తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి ఖాతాదారులకు సర్దిచెప్పి అనుమానాలు ఉంటే బ్యాంకు తెరిచిన తరువాత నివృత్తి చేసుకోవాలని, నగలు చూపించకపోతే అనంతరం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయాలని సూచించారు. దీంతో ఖాతాదారులు బ్యాంకును ఓపెన్ చేయడానికి సమ్మతించారు. ముత్తూట్ ఫైనాన్స్ ఖాతాల్లో సిబ్బంది చేతివాటం లేదా భారీ దోపిడీల వల్ల కస్టమర్ల బంగారం అపహరణకు గురైన సంఘటనలు ఖాతాదారుల్లో భయాందోళనలకు గురి చేస్తున్నాయి. ఆర్థిక సమస్యల వల్ల మధ్య తరగతి, ఆపై వర్గాల ప్రజలు కష్టపడి సంపాదించి దాచుకున్న బంగారాన్ని అత్యవసర పరిస్థితుల్లో వడ్డీ వ్యాపారుల దగ్గర తాకట్టు పెట్టడం తెలిసిందే. ఇలాంటి పరిస్థితుల్లో సంబేపల్లి మండలం, గున్నికుంట్ల గ్రామం, కత్తివాండ్లపల్లికి చెందిన ఉమా మహేశ్వర్ రెడ్డి 128 గ్రాముల బంగారాన్ని ముత్తూట్ ఫైనాన్స్లో పెట్టి రూ. 11.36 లక్షల మొత్తం రుణంగా పొందారు. రెన్యువల్ నిమిత్తం బ్యాంకు మేనేజర్కు 073170 నంబరు ఉన్న ఖాళీ చెక్కును అందజేశానన్నారు. ఈ చెక్కుతో గోల్డ్లోన్కు జమ చేయకుండా మేనేజర్ పసుపులేటి నరేష్ తన భార్య చిన్నమనేని లక్ష్మీదేవి పేరున రూ. 9,50,000లు డ్రా చేసినట్లు బ్యాంకు ఎదుట మీడియాకు వివరించారు. రెండు రోజులుగా బ్యాంకుకు రాకుండా ఖాతాదారులకు సమాధానం చెప్పకుండా తిరుగుతున్నారని పేర్కొన్నారు. ఇదే విషయంపై రాయచోటి అర్బన్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు కూడా చేశారన్నారు. బ్యాంకులో జరిగిన అవకతవకలపై బ్యాంక్ మేనేజర్ నరేష్ను ఫోన్ ద్వారా వివరణ కోరగా ఉమా మహేశ్వర్ రెడ్డి తన దగ్గర వ్యక్తిగతంగా రూ. 6 లక్షల వరకు అప్పుగా తీసుకున్నారన్నారు. ఆ అప్పుకు సంబంధించిన వడ్డీ మొత్తం కలిపి చెక్కు ద్వారా మాకు జమ చేశారని తెలిపారు. బ్యాంకులో గోల్డ్ ద్వారా రుణం పొందిన డబ్బులకు, నాకు చెల్లించిన డబ్బులకు ఎలాంటి సంబంధం లేదని పేర్కొన్నారు. రెండు రోజులుగా తాను వ్యక్తిగత కారణాలు వల్ల సెలవుల్లో ఉన్నానని తెలిపారు. ఈ సమయంలో ఉమా మహేశ్వర్ బుధవారం కొంతమందితో బ్యాంకు దగ్గరకు వచ్చి తప్పుడు ప్రచారం చేశారని తెలిపారు. ఇదే విషయం ఖాతాదారుల్లో గందరగోళాన్ని నెలకొల్పిన సంఘటనపై రాయచోటి పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ముత్తూట్, మణప్పురం ఇతర ఫైనాన్స్ బ్యాంకుల్లో బంగారు నగలు తాకట్టు పెట్టిన వారి గుండెల్లో రైలు పరిగెడుతున్నాయి. పెట్టిన నగలను తిరిగి పొందటానికి ప్రైవేట్ వ్యక్తుల నుంచి అధిక వడ్డీలతో రుణాలు తీసుకొని ప్రైవేట్ బ్యాంకుల వద్దకు పరుగులు తీస్తున్నారు. ముత్తూట్ బ్యాంకులో వచ్చిన ఆరోపణలపై భీతిల్లిన ఖాతాదారులు బుధవారం ఒక్కరోజు రూ. 40 లక్షలు చెల్లించి బంగారాన్ని పొందినట్లు సమాచారం. -
తల్లీకూతురు ఆత్మహత్య
తొండూరు : తొండూరు మండల పరిధిలో దారుణమైన ఘటన చోటుచేసుకుంది. మల్లేల గ్రామంలో మంగళవారం రాత్రి 7.45 గంటలకు షేక్ బీబీ (56), ఆమె కుమార్తె షేక్ ఇమామ్బీ (33)లు తమ ఇంటిలోని ఫ్యాన్లకు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. తండ్రి షేక్ ఇమామ్బాషా ఇంటిలో కనిపించకుండా పోయారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అయితే అప్పుల బాధతోనే తల్లీకూతురు ఆత్మహత్య చేసుకున్నట్లు పోలీసులు భావిస్తున్నారు. ఆటో బోల్తా.. డ్రైవర్కు గాయాలుసిద్దవటం : సిద్దవటం– భాకరాపేట ప్రధాన రహదారి అయ్యప్పస్వామి గుడి సమీపాన భాకరాపేట నుంచి సిద్దవటంకు ఆటో నడుపుకొంటూ వస్తుండగా ఎదురుగా వస్తున్న బస్సును తప్పించబోయి అదుపు తప్పి మంగళవారం సాయంత్రం ఆటో బోల్తా పడింది. ఆటో డ్రైవర్ భవనాసి వెంకటేష్కు స్వల్ప గాయాలయ్యాయి. ఆయనను వైద్యసేవల కోసం కడప రిమ్స్కు తరలించామని స్థానికులు తెలిపారు. ఏపీఎస్పీడీసీఎల్లో పదోన్నతులు కడప కార్పొరేషన్ : ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్)లో పలువురికి పదోన్నతులు కల్పిస్తూ ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఉత్తర్వులు జారీ చేశారు. కడప సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజినీర్గా పని చేస్తున్న ఎస్.రమణకు సీజీఎంగా పదోన్నతి కల్పించి తిరుపతి కార్పొరేట్ ఆఫీసు కొనుగోళ్ల విభాగానికి బదిలీ చేశారు. ఓఅండ్ఎం విభాగంలో చీఫ్ జనరల్ మేనేజర్గా పని చేస్తున్న ఎం.క్రిష్ణారెడ్డి మార్చి 31వ తేదికి పదవీ విరమణ చేయడంతో ప్లానింగ్ విభాగం చీఫ్ జనరల్ మేనేజర్గా పనిచేస్తున్న కె.సంపత్ కుమార్ను ఆ స్థానానికి బదిలీ చేశారు. కార్పొరేట్ ఆఫీసులో ఎనర్జీ ఆడిట్ విభాగంలో జనరల్ మేనేజర్గా విధులు నిర్వహిస్తున్న ఎస్. శ్రీనివాసులును కడప ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈగా బదిలీ చేశారు. డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా పని చేస్తున్న రవి చంద్రశేఖర్, షేక్ చాంద్బాష, ఎస్.రామక్రిష్ణలకు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్లుగా, అసిస్టెంట్ ఇంజినీర్లుగా పనిచేస్తున్న ఎం.కవిత, ఎస్.అశోక్ కుమార్, బి.రవి కుమార్లకు డీఈఈలుగా పదోన్నతి కల్పించారు. -
రైతుల సమస్యలు సీఎం దృష్టికి తీసుకెళ్లాలి
దువ్వూరు : ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి వస్తున్నారని, మొక్కజొన్న, అరటి రైతుల సమస్యను ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్లాలని కలెక్టర్ను కోరినట్లు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. మంగళవారం దువ్వూరు మండలం చల్లబసాయపల్లె గ్రామంలో నిర్మించిన రైతు సేవా కేంద్రాన్ని, విలేజ్ హెల్త్ క్లినిక్ను ఎంపీ అవినాష్రెడ్డి వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ చైర్మన్, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్యాదవ్తో కలసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎంపీ మాట్లాడుతూ కడప జిల్లాలో మొక్కజొన్న పంటను దళారులు క్వింటాలుకు కేవలం రూ.1500తో కొనుగోలు చేసి రైతులను మోసం చేస్తున్నారన్నారు. మొక్కజొన్న పంటకు కనీస మద్దతు ధర రూ.2,500 ఉందని, ప్రభుత్వం మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసి రైతులకు కనీస మద్దతు దర రూ.2,500తో కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలన్నారు. అరటి పంట గతంలో టన్ను రూ.25 వేలు ఉండేదన్నారు. యుద్ధం కారణంగా ఎగుమతులు జరగకపోవడంతో మరో పక్క ముంబైలో అరటి పంట ఎక్కువ రావడంతో కిలో రూ.5కే దళారులు కొంటున్నారన్నారు. దీంతో అరటి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం రైతులకు అరటి పంటకు రూ.10 వేలు మద్దతు ధర కల్పించి, కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి ఆదుకోవాలని తెలిపారు. మొక్కజొన్న, అరటి రైతుల సమస్యలపై కలెక్టర్తో మాట్లాడినట్లు చెప్పారు. అనంతరం భారత పార్లమెంట్ ఎస్టిమేషన్ కమిటీ సభ్యునిగా ఎన్నికై న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, రెడ్యం చంద్రశేఖర్రెడ్డిలు శాలువా కప్పి, పూలమాలతో సత్కరించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో మాజీ వ్యవసాయ శాఖ, ఉద్యానశాఖ సలహాదారులు ఇరగంరెడ్డి తిరుపాల్రెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, ఎంపీపీ కానాల జయచంద్రారెడ్డి, జెడ్పీటీసీ మేర్వ కృష్ణయ్య, మాజీ జెడ్పీటీసీ గోపిరెడ్డి బాబు, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ఇరగంరెడ్డి శంకర్రెడ్డి, చల్లబసాయపల్లె సర్పంచ్ సంఘన లక్ష్మిరెడ్డి, మాజీ సర్పంచ్ సంఘన హరినాథరెడ్డి, నాయకులు కోగటం వీరారెడ్డి, బొంతపల్లె వెంకటసుబ్బారెడ్డి, మాజీ ఎంపీపీ గోపాల్రెడ్డి, ఇరగంరెడ్డి పద్మనాభరెడ్డి, వ్యవసాయ మండలి జిల్లా మాజీ చైర్మన్ ఓకే రెడ్డి, వైఎస్సార్సీపీ మండల మాజీ కన్వీనర్ చిరాకి బాషా, ఎంపీడీఓ సుబ్బారెడ్డి, ఏఓ అమరనాథరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ హరికృష్ణ, డాక్టర్లు సురేష్బాబు, రోషిణి, మైదుకూరు నియోజకవర్గ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, మాజీ మున్సిపల్ కౌన్సిలర్లు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. -
ఫ్యాప్టో చైర్మన్గా నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి
కడప ఎడ్యుకేషన్ : కడప జిల్లా ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) చైర్మన్గా నర్రెడ్డి సంగమేశ్వరరెడ్డి ఎన్నికయ్యారు. కడప వి.వి.ఆర్ ఎస్టీయూ భవన్లో జరిగిన ఫ్యాప్టో సభ్య సంఘాల కార్యవర్గ సమావేశంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నారు. ఇప్పటి వరకు ఫ్యాప్టో చైర్మన్గా ఉన్న ఇలియాస్ బాషా ఎస్టీయూ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడిగా ఎంపిక కావడంతో ప్రస్తుత ఎస్టీయూ కడప జిల్లా అధ్యక్షుడిగా ఉన్న సంగమేశ్వరరెడ్డిని ఫ్యాప్టో చైర్మన్గా నియమించారు. ఈ సందర్భంగా సంగమేశ్వరరెడ్డి మాట్లాడుతూ ఉద్యోగ ఉపాధ్యాయులకు సంబంధించిన ఆర్థికపరమైన, ఆర్థికేతర సమస్యల పరిష్కారానికి ఉమ్మడి ఉద్యమాలే శరణ్యమని అన్నారు. గత ప్రభుత్వం, నేటి ప్రభుత్వం ఉద్యోగ ఉపాధ్యాయులకు ఎన్నికల సమయంలో బూటకపు హామీలు ఇచ్చి లబ్ధి పొంది నేడు ఇచ్చిన హామీలు మరిచి వ్యవహరిస్తున్నాయన్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండు సంవత్సరాలు కావస్తున్నా 12వ పీఆర్సిపై అతీగతీ లేదని, వేల కోట్ల రూపాయల బకాయిలు ఇప్పటికీ పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో ఫ్యాప్టో ఆధ్వర్యంలో భవిష్యత్తు ఉమ్మడి ఉద్యమాలకు అందరనీ కలుపుకొని సమన్వయంతో ముందుకెళ్తామన్నారు. -
చెయ్యేరులో.. ‘పచ్చ’ తోడేళ్లు!
రాజంపేట : చెయ్యేరు నదిని తెలుగుదేశం పార్టీ నేతలు చెరబట్టారు. నిబంధనలు ఉల్లంఘించి జోరుగా ఇసుక అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా రాజంపేట–రాయచోటి మార్గంలోని బాలరాచపల్లెలో నిబంధనలు ఉల్లంఘించి ఇసుక దోపిడీ చేస్తున్నారు. ఎంచక్కా ఇతర రాష్ట్రాలకు ఎగుమతి చేస్తూ జేబులు నింపేసుకుంటున్నారు. కాగా చెయ్యేరు నుంచి ఇసుక తరలిస్తున్న వాహనాలను రాజంపేట పోలీసులు గత శనివారం రాత్రి పట్టుకున్నారు. ఎలాంటి పత్రాలు లేని వాహనాల్లో ఇసుకను తరలిస్తున్నట్లు గుర్తించి 12 వాహనాలను స్వాధీనం చేసుకున్నారు. మన్నూరు సీఐ లింగప్ప తన సిబ్బందితో ఇసుక టిప్పర్ల తరలింపును అడ్డుకున్నారు. వాటిని సంబంధిత శాఖ అధికారులకు అప్పగించారు. ఇసుక టిప్పర్లను విడిపించేందుకు ఓ మంత్రి ప్రయత్నం ఇసుక టిప్పర్లను విడిపించేందుకు ఇన్చార్జి హోదాలో ఓ మంత్రి విశ్వప్రయత్నం చేసినట్లు సమాచారం. గతంలో ఎన్నడూ లేని విధంగా భారీగా వాహనాలను పట్టుకోవడంతో టీడీపీ వర్గాల్లో సంచలనం కలిగించింది. పోలీసు ఉన్నతాధికారిపై కూడా ఒత్తిడి తీసుకొచ్చారనే వాదనలు బయటికివచ్చాయి. జిల్లాకు చెందిన మంత్రి అనుచరులే.. బాలరాచపల్లె హైలెవల్ వంతెన సమీపంలో ఇటాచీ పెట్టి మరీ అడ్డగోలుగా ఇసుకను తరలిస్తుండడంపై కొన్ని నెలలుగా తరచూ ఫిర్యాదులు వస్తున్నాయి. అయినా అధికారులు పట్టించుకోలేదు. ఇప్పుడు పట్టుబడిన ఇసుక టిప్పర్లు జిల్లాకు చెందిన మంత్రి అనుచరులేనని తెలుస్తోంది. పరీవాహక ప్రాంత వాసులు ఆందోళన నియోజకవర్గలోని చెయ్యేరు నదిని పచ్చతోడేళ్లు చుట్టుముట్టడంతో స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి కాలంలో భూగర్భ జల సమస్య ఉత్పన్నమయ్యే పరిస్ధితులు వస్తాయని చెయ్యేరు నదీ పరీవాహక ప్రాంతవాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
రైలు కింద పడి మహిళ మృతి
పీలేరు రూరల్ : రైలు కింద పడి మహిళ మృతి చెందిన సంఘటన పీలేరు టౌన్ చిత్తూరు రోడ్డు మార్గం రైల్వేగేటు సమీపంలో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. స్థానిక చెన్నారెడ్డి కాలనీకి చెందిన గుండ్లూరు మనోహరమ్మ (65) కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతోంది. ఈ క్రమంలో మంగళవారం ఉదయం ధర్మవరం వెళ్తున్న నర్సాపురం ఎక్స్ప్రెస్ కిందపడి మృతి చెందింది. కదిరి రైల్వే పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఢీకొన్న కార్లు.. తప్పిన ప్రమాదంమదనపల్లె : మదనపల్లెలో మంగళవారం రాయలసీమ లిఫ్ట్ ప్రాజెక్టుపై జరిగిన రౌండ్ టేబుల్ సమావేశం సందర్భంగా ఓ ప్రమాదం తప్పింది. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కాన్వాయ్లో తిరుపతిరోడ్డు నుంచి పట్టణంలోకి వచ్చేందుకు సిటిఎం రోడ్డులో వస్తుండగా విద్యుత్ కేంద్రం వద్ద కాన్వాయ్లోని వాహనాలకు ప్రమాదం జరిగింది. ముందు వెళ్తున్న కారు సడన్ బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న వైఎస్సార్సీపీ యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్దన్రెడ్డి వస్తున్న కారు ఢీకొంది. ఇదే కారుకు వెనుక వస్తున్న నాయకులు శివారెడ్డి, పద్మజారెడ్డి కార్లు ఢీకొన్నాయి. అయితే వాటిలో ప్రయాణిస్తున్న నాయకులు ఎవరికీ ప్రమాదం జరగలేదు. -
పసికందును అమ్మేసిన తండ్రి
● తాగుడుకు బానిసై.. డబ్బుల కోసం విక్రయం ● బిడ్డ కోసం తల్లడిల్లుతున్న తల్లిమైదుకూరు/వల్లూరు(చెన్నూరు) : పేదరికం, వ్యసనాలు రక్తసంబంధాలను తెంచి వేస్తున్నాయి. డబ్బు కోసం కన్న బిడ్డ అనే మమకారాన్ని కూడా కాదనుకుని కసాయిగా మారి ఓ కన్న తండ్రి 5 వారాల పసికందును రూ.50 వేలకు అమ్మేశాడు. కన్న బిడ్డ దూరం కావడంతో ఆ తల్లి తల్లడిల్లుతోంది. బాలింత సమస్యలతో బాధపడుతూ ఆ తల్లి మైదుకూరులోని అత్తమామల వద్దకు రావడంతో పసికందు విక్రయం సంఘటన మంగళవారం వెలుగు చూసింది. బాధితురాలు లక్ష్మీనారాయణమ్మ తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చాపాడు మండలం సిద్ధారెడ్డిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన లక్ష్మీనారాయణమ్మకు మైదుకూరుకు చెందిన దండు బాలకుమార్తో పదేళ్ల కిందట వివాహం జరిగింది. బేల్దారి పని చేసే బాలకుమార్ పెళ్లి అయిన ఏడాది బాగానే ఉన్నాడు. తర్వాత మద్యానికి బానిస అయ్యాడు. మద్యం తాగి వచ్చినప్పుడల్లా ఇంట్లో గొడవ చేసేవాడు. నాలుగేళ్ల కిందట డబ్బు కోసం ఉన్న ఇల్లును కూడా అమ్మేశాడు. సిద్ధారెడ్డిపల్లె ఎస్సీ కాలనీలో తన తల్లిదండ్రులకు చెందిన ఇల్లు ఉండటంతో లక్ష్మీనారాయణమ్మ భర్త పిల్లలతో అక్కడికి చేరింది. బాలకుమార్ తల్లిదండ్రులు జోజమ్మ, ఆరోగ్యం కూలి పనులు చేసుకుంటూ మైదుకూరులోనే ఉండిపోయారు. సిద్ధారెడ్డిపల్లెకు వెళ్లే సమయానికి లక్ష్మీనారాయణమ్మకు ఇద్దరు మగ పిల్లలు యశ్వంత్, సతీష్ ఉన్నారు. ఇటీవల ఆమె మూడోసారి గర్భం దాల్చింది. మైదుకూరులోని సామాజిక ఆరోగ్య కేంద్రంలో గత నెల 24న అమె మళ్లీ మగ బిడ్డకు జన్మనిచ్చింది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంటానని అక్కడి వైద్యులకు చెప్పగా మైదుకూరు ఆస్పత్రిలో కు.ని. ఆపరేషన్లు చేయడం లేదని.. చెన్నూరు లేదా కడపకు వెళ్లాలని వారు చెప్పారు. రెండు వారాల కిందట లక్ష్మీనారాయణమ్మ చెన్నూరులోని ప్రభుత్వ ఆస్పత్రికి వెళ్లి కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకునే వారికి ప్రభుత్వ ప్రోత్సాహకం కింద ఇచ్చే నగదు గురించి మాట్లాడుదామంటూ సోమవారం బాలకుమార్ భార్య, తల్లి జోజమ్మను తీసుకొని చెన్నూరు ఆస్పత్రికి వెళ్లాడు. అత్తా కోడళ్లు పసికందుతో ఆస్పత్రిలో కూర్చుని ఉండగా ఆస్పత్రి సిబ్బందిలో ఓ వ్యక్తి రూ.50 వేలు తీసుకుని వచ్చి జోజమ్మ చేతిలో పెట్టి లక్ష్మీనారాయణమ్మ ఒడిలో ఉన్న పసికందును తీసుకొని వెళ్లాడు. తర్వాత బాలకుమార్ భార్య తల్లి వద్దకు వచ్చి బిడ్డ గురించి ఏడ్చినా, ఎవరికై నా చెప్పినా ఇద్దరినీ చంపేస్తానని బెదిరించాడు. ఆ వెంటనే తల్లి చేతిలో ఉన్న రూ.50 వేలను తీసుకుని మీరు ఇంటికి వెళ్లండి తాను రాత్రికి వస్తాను అంటూ అక్కడి నుంచి వెళ్లిపోయాడు. జోజమ్మ కోడలిని తీసుకుని మైదుకూరుకు వచ్చి అక్కడ ఆటోలో ఆమెను సిద్ధారెడ్డిపల్లెకు పంపి, తాను ఇంటికి వెళ్లిపోయింది. రెండు రోజులుగా బిడ్డకు పాలు ఇవ్వకపోవడం, బిడ్డ గుర్తుకు రావడంతో లక్ష్మీనారాయణమ్మ ఏడ్చుకుంటూ మైదుకూరులోని ప్రొద్దుటూరు రోడ్డులో అద్దె ఇంట్లో ఉంటున్న అత్తమామల వద్దకు వచ్చింది. అత్తమామలు, లక్ష్మీనారాయణమ్మ రోదిస్తూ బిడ్డ గురించి మాట్లాడుకుంటుండగా పసికందు విక్రయం గురించి అందరికీ తెలిసింది. ఐసీడీఎస్ అధికారులకు సమాచారం అందడంతో మైదుకూరు పట్టణం సూపర్వైజర్ ప్రశాంతి.. జోజమ్మ ఇంటి వద్దకు చేరుకుని బాధిత పసికందు తల్లి లక్ష్మీనారాయణమ్మను విచారణ చేసి వివరాలను తెలుసుకున్నారు. సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నుట్ట సూపర్వైజర్ తెలిపారు. చెన్నూరు ఆస్పత్రి వైద్యులే మధ్యవర్తులా.. మూడోసారి మగ బిడ్డకు జన్మనిచ్చిన లక్ష్మీనారాయణమ్మ కుటుంబ నియంత్రణ ఆపరేషన్ కోసం చెన్నూరు ఆస్పత్రికి వెళ్లిన సమయంలోనే ఆమె భర్త బాలకుమార్ పసికందును విక్రయించాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ఆ విషయం ఆస్పత్రి వద్ద పాలను విక్రయిస్తున్న ఓ మహిళకు చెప్పడంతో ఆమె.. అక్కడి సిబ్బంది ద్వారా వైద్యురాలికి సమాచారం ఇచ్చినట్టు తెలుస్తోంది. చెన్నూరులో విధులు నిర్వహిస్తున్న ప్రొద్దుటూరుకు చెందిన ఆ వైద్యురాలు మరో వైద్యురాలితో మాట్లాడి డీల్ కుదిర్చినట్టు సమాచారం. వారంతా కలిసి ప్రొద్దుటూరుకు చెందిన కొందరికి శిశువును అప్పగించినట్టు తెలుస్తోంది. పిల్లలు లేని జంటకు విక్రయించారా లేక పిల్లల్ని విక్రయించే రాకెట్ నడుపుతున్న వారికి విక్రయించారా అనే విషయాన్ని అధికారులు, పోలీసులే తేల్చాల్సి ఉంది. అధికారుల వివరణ ఈ విషయంపై సామాజిక ఆరోగ్య కేంద్రంలో పని చేస్తున్న డాక్టర్ శివకుమార్ను సాక్షి వివరణ కోరగా.. తాను సెలవుల్లో ఉన్నానని, తనకు ఏమీ తెలియదని సమాధానమిచ్చారు. సామాజిక ఆరోగ్య కేంద్రం గైనకాలజిస్ట్ డాక్టర్ హర్షారెడ్డిని అడగగా.. మార్చి 17వ తేదీన కుటుంబ నియంత్ర ఆపరేషన్ చేయించుకున్నారని, 24వ తేదీన తిరిగి కుట్లు విప్పుటకు రావాల్సి ఉందని, అంత వరకు తనకు తెలుసు అని, మిగతా విషయాలు తనకు ఏమీ తెలియని సమాధానం ఇచ్చారు. -
ఏడాదిలోపు పనులు పూర్తి చేస్తాం
కమలాపురం : కమలాపురం పట్టణంలో రైల్వే ట్రాక్పై నిర్మిస్తున్న ఆర్ఓబీ పనులను ఏడాదిలోపు పూర్తి చేస్తామని రోడ్లు భవనాల శాఖా మంత్రి బీసీ జనార్ధన్రెడ్డి తెలిపారు. మంగళవారం స్థానిక రైల్వే గేటు సమీపంలో రూ.39 కోట్లతో ఆర్ఓబీ నిర్మాణానికి ఎమ్మెల్యే చైతన్యరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డితో కలసి భూమిపూజ చేశారు. అలాగే శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కమలాపురం ప్రజల చిరకాల కోరిక నెరవేరనుందన్నారు. ఆర్ఓబీ పనులను త్వరితగతిన చేపట్టి ఏడాదిలోపు పూర్తి చేసి వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. అరగంటలోనే నాలుగు రైళ్లు వెళ్తున్నాయని, కమలాపురం ప్రజలు చాలా కష్టాలు అనుభవిస్తున్నారన్నారు. ఆర్థిక లోటు ఉన్నప్పటికి రాష్ట్రంలో చాలా రోడ్లు వేశామన్నారు. అలాగే ఖాజీపేట రహదారిలో ఉన్న లో లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు కూడా మంజూరు చేసి పనులు చేపడతామన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్అండ్బీ అధికారులు, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. -
కూటమికి వ్యతిరేకంగా మార్పు మొదలైంది
● హామీలు నెరవేర్చడంలో ప్రభుత్వం విఫలం ● వైఎస్సార్సీపీ సర్పంచ్లకు సత్కార సభలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిమైదుకూరు : అభివృద్ధి, సంక్షేమంలో హామీలను నెరవేర్చడంలో, పాలనలో విఫలమైన కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రజల్లో మార్పు మొదలైందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. మైదుకూరులో మంగళవారం మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో మైదుకూరు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ సర్పంచ్లకు ఆత్మీయ సత్కార కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇందులో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఎంపీ అవినాష్రెడ్డి మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.7,500 కోట్ల పంటల బీమా ఇవ్వగా కూటమి ప్రభుత్వం పైసా ఇవ్వలేదని ఆరోపించారు. ఈ రెండేళ్లలో రైతులకు రూ.3 వేల కోట్లు రావాల్సి ఉండగా ఇప్పటికీ ఇవ్వలేదన్నారు. కేంద్రం ఇచ్చేది మినహా కూటమి ప్రభుత్వం ఒక పైసా ఇవ్వలేదని తెలిపారు. మహిళలకు, విద్యార్థులకు మొండి చేయి చూపిందని ఆరోపించారు. సర్పంచ్ పదవి అనేది ఎంతో బాధ్యతతో కూడుకున్నదని, దానిని ఐదేళ్లపాటు ప్రజా సేవగా భావిస్తూ నిర్వహించిన వైఎస్సార్సీపీ సర్పంచ్లకు అభినందనలు తెలిపారు. కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న అసంతృప్తికి తోడు వైఎస్సార్సీపీ సర్పంచ్లు, కార్యకర్తలు వారిలో మరింత చైతన్యం తీసుకురావాలని సూచించారు. వచ్చే ఎన్నికల్లో సర్పంచ్ నుంచి జెడ్పీటీసీల వరకు అభ్యర్థి ఎవరైనా అన్ని వైఎస్సార్సీపీ వారే గెలవాలని అన్నారు. వచ్చే ఎన్నికల్లో కూటమికి భంగపాటు తప్పదు వచ్చే ఎన్నికల్లో కూటమికి భంగపాటు తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. మైదుకూరు నియోజకవర్గంలో 90 పంచాయతీల్లో 82 వైఎస్సార్సీపీ గెలిచిందని, రానున్న ఎన్నికల్లో మొత్తం గెలవాలని అన్నారు. మైదుకూరు నుంచి శెట్టిపల్లె రగురామిరెడ్డిని, పార్లమెంట్ స్థానం నుంచి వైఎస్ అవినాష్రెడ్డిని త్రిబుల్ మెజారిటీతో గెలిపించాలని పిలుపునిచ్చారు. ఈ సారి వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా వస్తే 40 ఏళ్లపాటు అధికారంలో ఉంటారని పేర్కొన్నారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్ మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి సర్పంచ్లకు విశేష అధికారాలు ఇచ్చారని, మళ్లీ ఆయనను సీఎంగా చేసుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో వైఎస్సార్సీపీ గెలుపు తథ్యమని అన్నారు. కార్యక్రమానికి అధ్యక్షత వహించిన శెట్టిపల్లె రఘురామిరెడ్డి మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో చంద్రబాబుకు బుద్ధి చెబుతామని ప్రజలే అంటున్నారని తెలిపారు. ఎప్పుడు ఎన్నికలు వచ్చినా కూటమి ప్రభుత్వంపై తమ అసంతృప్తిని ప్రకటిస్తారని పేర్కొన్నారు. వైఎస్సార్సీపీ కార్యకర్తలు, సర్పంచ్లు ప్రజా సమస్యలపై స్పందించి వారి మన్ననలను పొందాలని సూచించారు. మైదుకూరు నియోజకవర్గ పరిశీలకుడు, బద్వేలు మాజీ మున్సిపల్ చైర్మన్ వాకమల్ల రాజగోపాల్రెడ్డి మాట్లాడారు. సర్పంచ్లకు ఆత్మీయ సత్కారం కార్యక్రమంలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, జెడ్పీ చైర్మన్ ఎం.రామగోవిందరెడ్డి, మైదుకూరు నియోజకవర్గ పరిశీలకుడు వాకమల్ల రాజగోపాల్రెడ్డి తదితరులు నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ సర్పంచ్లను శాలువా, పూలమాల, జ్ఞాపికతో ఘనంగా సత్కరించి అభినందించారు. కార్యక్రమంలో నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, ఎంపీపీలు, జెడ్పీటీసీలు, ఎంపీటీసీలు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
జనసేన నేత జులుం
బద్వేలు అర్బన్ : కోర్టులో నడుస్తున్న ఓ ఆస్తి వివాదంలో పట్టణానికి చెందిన ఓ జనసేన నేత జోక్యం చేసుకుని హల్చల్ చేశాడు. సదరు ఇళ్లలో అద్దెకు ఉంటున్న వారిపై జులుం ప్రదర్శించాడు. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని రాధాకృష్ణనగర్ సమీపంలో గల రాధాకృష్ణ కల్యాణ మండపం, మరికొన్ని ఇళ్లకు సంబంఽధించి ఇరువర్గాల మధ్య వివాదం కోర్టులో నడుస్తోంది. అయితే ఇటీవల కాలంలో ఇరువర్గాలు సమస్య సృష్టిస్తుండటంతో పెద్ద మనుష్యులు జోక్యం చేసుకుని కల్యాణ మండపానికి ఇరువురు కలిసి తాళం వేసుకునేలా ఒప్పందం చేశారు. కోర్టులో వివాదం తెగే వరకు ఎవరూ అందులోకి ప్రవేశించకూడదని నిర్ణయించారు. అయితే ఇటీవల కాలంలో ఓ వర్గానికి చెందిన వ్యక్తులు కల్యాణ మండపం పరిసరాల్లోకి ఇళ్ల వద్దకు వెళ్లి అద్దెకు ఉంటున్న వారిని ఇళ్లు ఖాళీ చేసి వెళ్లాలని భయభ్రాంతులకు గురిచేశారు. దీంతో ఇప్పటికే నాలుగు కుటుంబాల వారు ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోయారు. ఈ క్రమంలో మంగళవారం మధ్యాహ్న సమయంలో జనసేన పార్టీకి చెందిన దద్దం నాగార్జున అనే వ్యక్తి సదరు కల్యాణ మండపం సమీపంలోని ఓ ఇంటి తాళాలు పగులకొట్టేందుకు యత్నించాడు. ఈ సమయంలో మరో వర్గానికి చెందిన వ్యక్తులు అడ్డుకోవడంతో ఇరువురి మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సమయంలో చుట్టుపక్కల వారు సర్దిచెప్పడంతో జనసేన నేత అక్కడి నుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటనపై అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు ఒక వర్గానికి చెందిన భాస్కర్ తెలిపాడు. సబ్ రిజిస్ట్రార్తోపాటు మరో ఇద్దరు సస్పెన్షన్లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లి సబ్ రిజిస్ట్రార్ సి.రామాంజులతోపాటు గతంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేసిన ఎ.సురేష్, ప్రస్తుత జూనియర్ అసిస్టెంట్ బి.ప్రశాంతిలను సస్పెండ్ చేస్తూ మంగళవారం కడప రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ డిప్యూటీ ఇన్స్పెక్టర్ రామలక్ష్మీ పట్నాయక్ ఉత్తర్వులు జారీ చేశారు. 22ఏ పరిధిలోని నిషేధిత జాబితాలో ఉన్న భూములను డబ్బులు తీసుకొని ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా రిజిస్ట్రేషన్ చేసినట్లు రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ కమిషనర్, ఐజీ ఆధ్వర్యంలో చేపట్టిన తనిఖీలో బట్టబయలు కావడంతో ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. తంబళ్లపల్లిలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్న ఉదయ్ కిరణ్రెడ్డిని లక్కిరెడ్డిపల్లి ఇన్చార్జ్ సబ్ రిజిస్ట్రార్గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు.● ఇరు వర్గాల ఆస్తి వివాదంలో జోక్యం ● ఓ ఇంటి తాళం పగులగొట్టే యత్నం -
దర్గా ఏ గఫారియా
మతసామరస్యానికి ప్రతీక ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని దర్గా ప్రాంగణంలో గంధం, ఉరుసు రెండు రోజుల పాటు గొప్ప ఖవ్వాలి పోటీ నిర్వహించ నున్నారు. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన బెల్గాంకు చెందిన ఉస్తాద్ మురాద్ ఆతిష్, యూపీకి చెందిన రాజా సర్ఫరాజ్ ల మధ్య గొప్ప ఖవ్వాలి పోటీ జరుగుతుందని, నిర్వాహకులు తెలిపారు. 3న బండ లాగుడు పోటీలు: ఉరుసు మహోత్సవాలను పురస్కరించుకొని ఏప్రిల్ 3న దర్గా ప్రాంగణంలో పాల దంతాలు కలిగిన వృషభ రాజములచే చిన్న బండ లాగుడు పోటీలు నిర్వహించ నున్నా రు. విజేత ఎడ్ల యజమానులకు నగదు బహుమ తులు అందించనున్నారు. పోటీల్లో పాల్గొనే ఎడ్ల యజమానులు 13వ తేదీ ఉదయం 7గంటల్లోపు 97011 23459, 81219 96786 నెంబర్కు సంప్రదించి పేర్లు నమోదు చేసుకోవాలని నిర్వాహకులు తెలిపారు. కమలాపురం: కమలాపురం పట్టణంలో వెలిసిన దర్గా ఏ గఫారియా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. భక్తుల కొంగుబంగారంగా విరాజిల్లుతోంది. దక్షిణ భారతదేశంలోనే ప్రసిద్ధి చెందిన ఈ దర్గాలో హజరత్ అబ్దుల్ గఫార్షాఖాద్రీ, హజరత్ దస్తగిరిషాఖాద్రీ, హజరత్ మౌలానా మౌల్వి ఖాదర్ మొహిద్దీన్ షా ఖాద్రి, హజరత్ జహీరుద్దీన్ షాఖాద్రీ ఖుద్దస సిర్రహుం వెలసి ఉన్నారు. ఏటా ఈ ఉరుసు మహోత్సవాలు అంగరంగ నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. ప్రస్తుతం 106వ ఉరుసు మహోత్సవాల నిర్వహణకు సర్వం సిద్ధం చేస్తున్నారు. ముతవల్లి సజ్జాదె–ఏ–నషీన్ హజరత్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, వారి సోదరుల ఆధ్వర్యంలో ఈ ఉరుసు ఉత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏప్రిల్ నెల 1వ తేదీ నషాన్తో ఉరుసు మహోత్సవాలు ప్రారంభమై, 2న గంధం, 3న ఉరుసు, 4న తహలిల్తో కార్యక్రమాలు ముగుస్తాయి. ఉరుసు ఉత్సవాలకు దర్గా సుందరంగా ముస్తాబైంది. రాష్ట్రం నలు మూలల నుంచే కాక తమిళనాడు, మహారాష్ట్ర, కర్ణాటక, కేరళ నుంచి సైతం భక్తులు తరలి రానున్నారు. మతసామరస్యానికి ప్రతీక ఈ దర్గాను హిందువులే నిర్మించడంతో ఈ దర్గా మతసామరస్యానికి ప్రతీకగా నిలుస్తోంది. హజరత్ దస్తగిరిషా ఖాద్రికి ముఖ్య శిష్యుడుగా ఉన్న నామా నాగయ్య శ్రేష్ఠి కుటుంబ సభ్యులు ఇప్పటికీ ధర్మకర్తగా కొనసాగుతుండడం విశేషం. హాజి జహీరుద్ధీన్ షా ఖాద్రి, స్వర్గీయ పీఠాధిపతి ఫైజుల్ గఫార్ షా ఖాద్రి, ప్రస్తుత పీఠాధిపతి 2న గంధం, 3న ఉరుసు ఏర్పాట్లు పూర్తి చేసిన దర్గా నిర్వాహకులు మన రాష్ట్రంతో పాటు ఇతర రాష్ట్రాలనుంచి తరలి రానున్న భక్త జనం -
కల్యాణోత్సవానికి అదనపు బస్సులు
కడప కోటిరెడ్డిసర్కిల్: ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి క్షేత్రంలో బుధవారం జరిగే స్వామి వారి కల్యాణోత్సవాన్ని అదనపు బస్సు సర్వీసులను నడపనున్నట్లు జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని వివిధ డిపోల నుంచి బస్సులు నడుస్తాయని ఆయన వివరించారు. కడప డిపో నుంచి 35, పులివెందుల 12, బద్వేలు 22, జమ్మలమడుగు 12, ప్రొద్దుటూరు 7, రాజంపేట, రాయచోటి డిపోల నుంచి 17 బస్సులతోపాటు ఇతర ప్రాంతాల నుంచి 40 బస్సులు కలిపి మొత్తం 145 బస్సులు స్వామి వారి కల్యాణోత్సవ సందర్బంగా నడుస్తాయని తెలిపారు. అలాగే కడప వైపు ఏర్పాటు చేసిన పార్కింగ్ స్థలం నుంచి కళ్యాణోత్సవం జరిగే ప్రదేశం వరకు 12 ఉచిత బస్సులు, రాజంపేట వైపు సాలాబాద్ క్రాస్ పార్కింగ్ స్థలం నుంచి కళ్యాణోత్సవం ప్రదేశం వరకు 8 ఉచిత బస్సులు ఏర్పాటు చేశామన్నారు. అంతేకాకుండా పొరుగు జిల్లాలైన అనంతపురం, కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, విజయవాడ, విశాఖపట్నం, హైదరాబాద్ ప్రాంతాల నుంచి కూడా భక్తులు హాజరయ్యే అవకాశం ఉన్న దృష్ట్యా ప్రత్యేక బస్సులు ఏర్పాటు చేశామని ఆయన తెలిపారు. -
ముఖ్యమంత్రి కాన్వాయ్ రిహార్సల్ నిర్వహణ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నేడు సీతారాముల కల్యాణ మహోత్సవానికి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు రానున్న నేపథ్యంలో మంగళవారం ఒంటిమిట్టలో కాన్వాయ్ రిహార్సల్ నిర్వహించారు. కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్తో కలిసి కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఈ రిహార్సల్ను పరిశీలించారు. ఈ సందర్భంగా కాన్వాయ్ వెళ్లే మార్గంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లపై పోలీసు అధికారులకు ఆయన పలు సూచనలు చేశారు. రహదారి వెంట చేపట్టాల్సిన భద్రతా చర్యలపై పోలీసు అధికారులకు, సిబ్బందికి దిశానిర్దేశం చేశారు. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం, టీటీడీ గెస్ట్ హౌస్, కల్యా ణ వేదిక తదితర ప్రాంతాల్లో బందోబస్త్పై సూచన లు చేశారు. భద్రతను కట్టుదిట్టం చేయాలని ఆదేశించారు. టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, టీటీడీ సీవీఎస్వో మురళీ కృష్ణ, జేసీ నిధి మీనా పాల్గొన్నారు.పరిశీలించిన కర్నూల్ రేంజ్ డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ -
చతుర్దశినాడు... పున్నమి వెలుగుల్లో కల్యాణం
ఏకశిలానగరి శ్రీ కోదండ రామాలయానికి ఓ ప్రత్యేకత ఉంది. సాధారణంగా సీతారాముల వివాహ మహోత్సవాలు అన్ని ఆలయాల్లోనూ నవమి నాడే అభిజిత్ లగ్నంలో నిర్వహిస్తారు. భద్రాచలం రామక్షేత్రంలో, తిరుపతి కోదండ రామాలయంలోనూ దాదాపు అన్ని చోట్ల చైత్ర శుద్ధపాడ్యమి నుంచి ఉత్సవాలు ప్రారంభం అవుతాయి. నవమి నాటి కల్యాణంతో ముగుస్తాయి. ఇలా అనేక చోట్ల పగలు రామయ్య పెళ్లి జరిగితే ఒక్క ఒంటిమిట్టలోనే రాత్రి వేళ నిర్వహిస్తారు. ఈ సంప్రదాయం ఇప్పటిది కాదు. ఆలయ దివ్య దర్శనం ప్రజలకు అందుబాటు లోకి వచ్చినప్పటి నుంచి ఇలాగే జరుగుతోంది. -
పుట్టపర్తి సత్యసాయి వైద్య సంస్థకు రూ. కోటి వైద్య పరికరాలు
కడప సెవెన్రోడ్స్ : పుట్టపర్తిలోని శ్రీ సత్యసాయి ఇన్సిట్యూట్ ఆఫ్ హైయర్ మెడికల్ సైన్సెస్ సంస్థకు కోటి రూపాయల విలువైన 6 సెర్వో–సి వెంటిలేటర్లు, 3 ఎఫ్ఎక్స్–8 సర్జికల్ యూనిట్లను అందజేశామని ఎల్ఐసీ కడప సీనియర్ డివిజనల్ మేనేజర్ జీకేఆర్వీ రవికుమార్ తెలిపారు. ఎల్ఐసీ జోనల్ మేనేజర్ పునీత్ కుమార్, సత్య సాయి సెంట్రల్ ట్రస్ట్ మేనేజింగ్ ట్రస్టీ ఆర్ రత్నాకర్లకు ఈ ఎక్విప్ మెంట్ను ఎల్ఐసీ శ్రీ సత్యసాయి సంస్థల ముఖ్యుల సమక్షంలో అందజేశారని తెలిపారు. శస్త్ర చికిత్సల సమయంలో పూర్తి స్థాయిలో ఉపయోగపడి వారికి కీలక వైద్యాన్ని అందించి రోగుల ప్రాణాల్ని ఈ ఎక్విప్మెంట్ కాపాడతాయని ఆశాభావం వ్యక్తం చేవారు. -
మహిళపై అత్యాచారయత్నం
వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక గండి రోడ్డులో సిమెంట్ బ్రిక్స్లో పనిచేసే ఒక మహిళపై అత్యాచారంయత్నానికి పాల్పడిన షేక్ ఇజయతుల్లాపై కేసు నమోదు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఒరిస్సా రాష్ట్రం బర్కత్ బట్టి జిల్లాకు చెందిన మహిళ వేంపల్లె గండి రోడ్డులో ఉన్న స్టార్ సిమెంట్ బ్రిక్స్ ఫ్యాక్టరీలో పని చేస్తూ ఉండేది. ఈ నెల 26వ తేదీన ఆ మహిళపై బ్రిక్స్ ఫ్యాక్టరీ మేనేజర్ షేక్ ఇజయతుల్లా అత్యాచారయత్నానికి పాల్పడ్డాడు. ఆమె పక్కకు వెళ్లి తప్పించుకుని వెంటనే ఆమె భర్తకు విషయం తెలపగా.. ఢిల్లీ హ్యూమన్ రైట్స్కు ఫిర్యాదు చేశాడు. వారు కడప ఎస్పీకి సమాచారమివ్వడంతో వేంపల్లె సీఐ నరసింహులు విచారించి వారిపై కేసు నమోదు చేశారు. చోరీ కేసులో నిందితుడు అరెస్టువేంపల్లె : వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడిన మలిరెడ్డి జయప్రకాష్ రెడ్డి అనే నిందితుడిని అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. సోమవారం వేంపల్లెలోని స్థానిక పోలీస్స్టేషన్లో నిందితుడిని విలేకరుల ఎదుట హాజరుపరిచారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల కాలంలో పగలు, రాత్రి పూట వేంపల్లె పంచాయతీ పరిధిలోని నాయీ బ్రాహ్మణ వీధిలోని టెంకాయ చెట్టు ఎదురుగా ఉన్న చక్రాయపేట ఎంపీపీ బాలకృష్ణ ఇంట్లో చోరీ చేసిన సంఘటనలో బంగారు, వెండి, రెడ్డినగర్లోని లక్ష్మీదేవి ఇంట్లో, పులివెందుల రోడ్డులోని తేజా శారీస్ సెంటర్లో చీరలు, లక్ష్మి హెయిర్ స్టైల్లో టీవీని పులివెందులలోని కొండారెడ్డి కాలనీకీ చెందిన మలిరెడ్డి జయ ప్రకాష్ రెడ్డి దొంగలించినట్లు తెలిపారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్ పర్యవేక్షణలో సీఐ నరసింహులు, ఎస్ఐ తిరుపాల్ నాయక్ల ఆధ్వర్యంలో సోమవారం స్థానిక ఎన్టీఆర్ సర్కిల్లో నిందితుడిని అరెస్టు చేశారు.అతని వద్ద నుంచి 8గ్రాముల బంగారు కమ్మలు, రెండు వెండి గ్లాసులు, వెండి దీపాలను, 40 చీరలు, టీవీని స్వాధీనం చేసుకున్నారు.అలాగే బైకును కూడా సీజ్ చేసినట్లు తెలిపారు చోరీ కేసును త్వరగా చేధించిన హెడ్ కానిస్టేబుల్ వేణుగోపాల్ రెడ్డి, కానిస్టేబుల్ శివ చైతన్య, ఆలీ, కిరణ్లను సీఐ నరసింహులు అభినందించారు. -
కడప న్యాయవాదుల సంఘం అధ్యక్షుడిగా జీ.వి. రాఘవరెడ్డి
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లాలో కడప బార్ అసోసియేషన్ అధ్యక్షుడిగా జీ.వి.రాఘవరెడ్డి, ఉపాధ్యక్షులుగా వి.రాజగోపాల్ రెడ్డి, ప్రధాన కార్యదర్శిగా ఎం.హరి గణేష్లు విజయం సాధించారు.సోమవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎన్నికలు ప్రశాంతంగా జరిగాయి.మొత్తం 729 ఓట్లకు గాను 617 ఓట్లు పోల్ అయ్యాయి. కడప బార్ అసోసియేషన్ అధ్యక్షులుగా పోటీ చేసిన జి.వి. రాఘవరెడ్డి 96 ఓట్ల తేడాతో విజయం సాధించారు. అధ్యక్షులుగా పోటీచేసిన అభ్యర్థులలో జీ.వి.రాఘవరెడ్డికి 322, బొగ్గుల గురప్ప్ర నాయుడుకు 226, యు.శేషయ్యకు 62 ఓట్లు వచ్చాయి. ఉపాధ్యక్షులుగా పోటీచేసిన వి.రాజగోపాల్ రెడ్డి 7 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ఉపాధ్యక్షులుగా పోటీ చేసి న అభ్యర్థులలో వి.రాజగోపాల్ రెడ్డికి 310 ఓట్లు పోలయ్యాయి.డాక్టర్ జాల ప్రభాకర్కు 303 ఓట్లు పోలయ్యాయి. కడప బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శిగా ఎం. హరి గణేష్ 124 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు. ప్రధాన కార్యదర్శిగా పోటీచేసిన హరి గణేష్ కు 278, భువన్ ఏకాదశి రెడ్డికి 161, ఎం.వి.సుబ్బారామయ్యకు 118, సుందర్ రాజుకు 55 ఓట్లు పోలయ్యాయి.సెక్రెటరీ –1 గా ఎస్. వి.కిషోర్ కుమార్,జాయింట్ సెక్రెటరీ–2 గా పి.సుధారాణి,కోశాధికారిగా ఏ. ఉమాదేవి,మహిళా ప్రతినిధిగా ఎన్.,అనురాధ,లైబ్రరీ సెక్రటరీగా పి.సురేష్ కుమార్, స్పోర్ట్స్ అండ్ కల్చరల్ సెక్రటరీగా ఐ.రాజు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. -
తప్పుడు కేసులు పెడుతున్నారు.. ఎవరినీ వదిలిపెట్టం
కొండాపురం : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ శ్రేణులపై రాజ్యాంగ నిబంధనలకు విరుద్ధంగా తప్పడు కేసులు పెట్టి ఇబ్బందులు పెడుతున్న వారిని ఎవరిని వదిలిపెట్టమని జమ్మలమడుగు నియోజకవర్గ సమన్వయ కర్త, ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు.సోమవారం కొండాపురంలోని రాఘవేంద్ర ఆశ్రమంలో స్టేట్ ఆర్గనైజేషన్,యాక్టివిటీ సెక్రటరీ వజ్ర భాస్కర్రెడ్డి, ఎస్ఈసీ మెంబర్ గిరిధర్రెడ్డిలతో కలిసి ఎమ్మెల్సీ గ్రామ కమిటీ,గ్రామ అనుబంధ విభాగ కమిటీలను నియమించే కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్బంగా ఆయన మాట్లాడుతూ అన్యాయంగా ఏ అధికారి అయినా ఇబ్బందులు పెడితే పార్టీ శ్రేణులు సమష్టిగా, ధైర్యంగా ఎదుర్కోవాలన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు పార్టీలకు అతీతంగా, ఓటు వేయకపోయినా సంక్షేమఫలాలు అందించారన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన సూపర్సిక్స్ హామీలు ఏ ఒక్కటి కూడా సక్రమంగా అమలు చేయలేదన్నారు. పార్టీ బలోపేతం కోసం ప్రతి ఒక్కరూ సైనికుల్లా పని చేసి వైఎస్ జగన్ను ముఖ్యమంత్రి చేసుకుందామని పేర్కొన్నారు. పార్టీ కోసం కష్టపడిన వారికి గుర్తింపు ఉంటుందని భరోసా ఇచ్చారు. వజ్ర భాస్కర్రెడ్డి మాట్లాడుతూ గ్రామ స్థాయిలో నియమించిన కమిటీ సభ్యులు ప్రజలకు మాజీ సీఎం వైఎస్ జగన్మెహన్రెడ్డి అందించిన సంక్షేమఫలాలు, కూటమి ప్రభుత్వం అమలు చేయలేని పథకాల గురించి వివరించాలని చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల సీనియర్నాయకులు, గ్రామ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
ఒంటిమిట్టను నియోజకవర్గకేంద్రంగా ప్రకటించాలి
● రాష్ట్ర అధికారిక రామాలయం ప్రాముఖ్యతను పరిగణనలోకి తీసుకోవాలి ● కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిరాజంపేట : డిలీమిటేషన్ ప్రక్రియలో భాగంగా ఒంటిమిట్టను నియోజకవర్గ కేంద్రంగా ప్రభుత్వం ప్రకటించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని కడప లోక్సభ సభ్యుడు వైఎస్ అవినాష్రెడ్డి అన్నారు. సోమవారం స్ధానిక శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డితో కలిసి సీతారామ,లక్ష్మణ విగ్రహమూర్తులను దర్శించుకున్నారు. అర్చకులు తీర్ధప్రసాదాలను అందజేశారు. ఆలయ విశిష్టతను ఎంపీకి వివరించారు. భక్తులకు అభివాదం చేశారు.క్యూలో భక్తులు ఎంపీని ఆప్యాయంగా పలుకరించారు. అనంతరం ఆలయం బయట ఎంపీ మీడియాతో మాట్లాడారు. డిలీమిటేషన్ అనేది కళ్లముందు కనిపిస్తోందన్నారు. ఒంటిమిట్టకు రాష్ట్ర వ్యాప్తంగా గుర్తింపు ఉందన్నారు. ఒంటిమిట్టకు ఉన్న ప్రాముఖ్యత, చరిత్రను ప్రభుత్వం గుర్తుంచుకోవాలన్నారు. ఆ దిశగా నియోజకవర్గ కేంద్రంగా ప్రకటించాల్సిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జిల్లాలో 15 నియోజకవర్గాలు ఉండబోతున్నాయన్నారు. ఒంటిమిట్ట నియోజకవర్గ కేంద్రమైతే బాగుంటుందని, ఆదిశగా తాను కూడా ఏకీభవిస్తునని ఎంపీ తమ మనోగతం తెలియచేశారు. రైళ్ల హాల్టింగ్స్పై కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు దృష్టి సారించాలి రాష్ట్ర విభజన తర్వాత అధికారిక రామాలయం ఒంటిమిట్ట శ్రీ కోదంరామాలయం గుర్తింపులోకి వచ్చిందని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు.ఈ నేపథ్యంలో స్ధానిక ఎంపీ పీవీమిథున్రెడ్డి, తాను ఢిల్లీలో ఇది వరకే పలుమార్లు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో అన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని కోరామన్నారు. రాష్ట్ర నలుమూలలే నుంచి కాకుండా, దేశంలో అన్ని ప్రాంతాల నుంచి ఒంటిమిట్ట రామాలయానికి భక్తులు వచ్చేలా రైళ్ల సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. కేవలం బ్రహ్మోత్సవాల తరుణంలోనే కాకుండా ఏడాదిపాటు అన్ని రైళ్లకు హాల్టింగ్ సౌకర్యం కల్పించాల్సిన ఆవశ్యకత ఉందని తెలిపారు. ఆ దిశగా కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలని కోరుతున్నామన్నారు. రాష్ట్ర ప్రభుత్వం రామాలయ చరిత్రను కేంద్రం దృష్టికి తీసుకెళ్లి, భక్తులకు రైలుప్రయాణ సౌకర్యం కల్పించాలని కోరుతున్నామన్నారు. శ్రీరామచంద్రుని జీవితం ఆదర్శనీయం శ్రీరామచంద్రుని జీవితం ప్రతి ఒక్కరికి ఆదర్శనీయమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. తాగ్యానికి, ధర్మానికి మారుపేరు కోదండరాముడన్నారు. ప్రజలు, రైతులు బాగుండాలని కోదండరామున్ని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నామన్నారు. ఏప్రిల్ 1న జరిగే దాశరథి కల్యాణోత్సవంలో ఎలాంటి లోపాలు తలెత్తకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని టీటీడీ, రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరుతున్నామన్నారు. ఈ కల్యాణం చూసేందుకు రాష్ట్ర వ్యాప్తంగా పెద్దఎత్తున భక్తులు తరలివస్తారన్నారు. టీటీడీ, ప్రభుత్వం సమన్వయంతో కల్యాణోత్సవంను జయప్రదంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని విన్నవిస్తున్నామన్నారు. ఎంపీతోపాటు ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే దాసరిసుధా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రమేష్యాదవ్, మాజీ మేయర్లు సురేష్బాబు, పాకా సురేష్, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, జెడ్పీమాజీ వైస్చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ మహిళా రాష్ట్ర ప్రధానకార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, జిల్లా రైతువిభాగం అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియన్ నేత ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ కన్వీనర్ టక్కోలు శివారెడ్డి, మాజీ ఉపమేయరు నిత్యానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భద్రత.. ప్రతి ఒక్కరి బాధ్యత
కమలాపురం : పరిశ్రమల్లో పని చేసే ప్రతి ఒక్కరూ భద్రతను బాధ్యతగా తీసుకుని పని చేయాలని డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్(డీసీఐఎఫ్) చిన్నారావు తెలిపారు. సోమవారం మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పొరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్)లో 55వ జాతీయ భద్రతా దినోత్సవ ముగింపు వేడుకలు నిర్వహించారు. ముందుగా ప్లాంట్ హెడ్ రామమూర్తి, సీటీఓ అతుల్ ప్రియదర్శి, చీఫ్ మేనేజర్ భార్గవ్రెడ్డి, సేఫ్టీ ప్రతినిధి అమూల్య, సేఫ్టీ ఇన్చార్జి మహేశ్వర్ రెడ్డిలతో కలసి జాతీయ భద్రతా జెండాను ఆవిష్కరించారు.అలాగే ప్లాంట్లో ఏర్పాటు చేసిన పని ప్రదేశంలో భద్రతపై అవగాహన పెంపొందించేందుకు పీపీఈ(పర్సనల్ ప్రొటెక్టివ్ ఎక్విప్మెంట్) స్టాల్ను రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. భద్రత ప్రతిజ్ఞ చేశారు. ఈ సందర్భంగా డీసీఐఎఫ్ చిన్నారావు మాట్లాడుతూ భద్రత నాతో ప్రారంభం అవుతుంది అనే భావనతో ప్రతి వ్యక్తి అన్ని స్థాయిల్లో జాగ్రత్తలు పాటించాల్సిన అవసరం ఉందన్నారు. భద్రతా థీమ్ను ఉదహరణలతో వివరించారు. ప్లాంట్ హెడ్ రామ మూర్తి మాట్లాడుతూ భద్రత ప్రతి ఒక్కరి జీవన విధానంలో భాగమై ఉండాలన్నారు. ప్లాంట్లో ప్రతి పనిని భద్రతతో చేయడం అత్యంత అవసరన్నారు. సీటీఓ అతుల్ ప్రియదర్శి మాట్లాడుతూ పని ప్రదేశంలో ఉన్న అసురక్షిత పరిస్థితులను తక్షణం గుర్తించి వాటిని సరిదిద్దాలన్నారు. అనంతరం భద్రతపై చిన్నారులు చేసిన పలు ప్రదర్శనలు ఆకట్టుకున్నాయి. భద్రతపై చైతన్యం పెంపొందించడంలో భాగంగా నిర్వహించిన పోటీల్లో గెలుపొందిన విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో పరిశ్రమ ఉద్యోగులు, కార్మికులు, పాఠశాల, పాలిటెక్నిక్ విద్యార్ధులు పాల్గొన్నారు.డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావు -
కడప, కర్నూలు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు కొనసాగాయి. సోమవారం వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో జరిగిన వన్డే మ్యాచ్లో కడప–నెల్లూరు జట్లు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది.. నిర్ణీత 37.2 ఓవర్లలో 239 పరుగులకు ఆలౌటైంది.జట్టులోని రణధీర్ రెడ్డి 51, సుదర్శన్ 45 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సయ్యద్ షాహుల్ హామీద్ 5 వికెట్లు తీశాడు. భార్గవ్ మహేష్ 2, భార్గవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 37.5 ఓవర్లల్లో 231 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని మన్విత్ కుమార్రెడ్డి 50, సూతేజ్రెడ్డి 32 పరుగులు చేశారు. కడప జట్టులోని మహ్మద్ ఆయూబ్ 5 వికెట్లు, రాజేష్ 2, ఆదిల్ హుస్సేన్ 2 వికెట్లు తీశారు. దీంతో కడప జట్టు 8 పరుగుల తేడాతో విజయం సాధించింది, ● కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కర్నూలు–చిత్తూరు జట్లు తలపడ్డాయి, టాస్గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 341 పరుగులు చేసింది. జట్టు లోని నాయిముల్లా 103, సాయి సూర్య తేజరెడ్డి 134 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ 2, గౌతమ్ కృష్ణతేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 43.2 ఓవర్లకు 265 పరుగులకు ఆలౌటైంది. ఆ జట్టులోని తేజరెడ్డి 131, చరణ్జిత్ 86 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సాబ్జాన్బాషా 5, రెహమాన్ 2, సాయి సూర్యతేజరెడ్డి 2, తీశారు. దీంతో 76 తేడాతో కర్నూలు జట్టు విజయం సాధించింది. -
సీతారాముల కల్యాణం నేపథ్యంలో ట్రాఫిక్ మళ్లింపు
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లాలో ఏప్రిల్ 1 న ఒంటిమిట్టలో జరగనున్న శ్రీ సీతారాముల కళ్యాణం నేపథ్యంలో భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా కడప నగరంలో, ఒంటిమిట్ట రహదారి, రేణిగుంట రహదారిపై ట్రాఫిక్ మళ్లింపు అమలులో ఉంటుందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. ఈ మేరకు ఎస్పీ సోమవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. మళ్లింపు ఏప్రిల్ 1 వ తేదీ ఉదయం 9 నుంచి 2 వ తేదీ ఉదయం 8 గంటల వరకు అమలులో ఉంటుందని తెలిపారు. వాహనదారులు పోలీసుశాఖకు సహకరించాలని కోరారు. వాహనాల దారి మళ్లింపు వివరాలు ● కడప నుండి తిరుపతి వైపు వెళ్లే వాహనాలు కడప నగరం అలంఖాన్ పల్లె ఇర్కాన్ జంక్షన్ నుంచి ఊటుకూరు సర్కిల్, రాయచోటి మీదుగా తిరుపతి వెళ్ళాలి. ● తిరుపతి నుంచి కడప వైపు వచ్చే భారీ వాహనాలు, రవాణా వాహనాలు రాయచోటి మీదుగా కడపకు చేరుకోవాలి. ● రాజంపేట వైపు నుంచి కడప వెళ్లే భారీ వాహనాలను రాయచోటి మీదుగా దారి మళ్లింపు. రాజంపేట వైపు నుంచి వచ్చే ద్విచక్ర వాహనాలు సాలాబాద్ నుంచి ఇబ్రహీం పేట, మాధవరం మీదుగా పంపుతారు.వాహనదారులు పోలీసు శాఖకు సహకరించాలి : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
అంజనీసుతుడిపై కౌసల్య తనయ
● భక్తులను కరుణించిన కోదండరాముడు ● తిలకించి పులకించిన భక్తజనం ఒంటిమిట్ట : కోదండ రామస్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం రాత్రి కోదండరాముడు హనుమంత వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. త్రేతా యుగంలో రామభక్తుడిగా, భగవద్భక్తులలో అగ్రగణ్యుడిగా ప్రసిద్దిగాంచిన వాడు హనుమంతుడు. దాస భక్తికి ప్రతీకగా స్వామివారు హనుమంత వాహనంపై ఊరేగారు. ఉదయం నవనీతకృష్ణాలంకారంలో రాముల వారు ముగ్దమనోహరంగా దర్శనమిచ్చారు. నవనీతకృష్ణాలంకారంలో రామయ్య బ్రహ్మోత్సవాల్లో భాగంగా నాలుగవ రోజు సోమవారం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు స్వామి వారి ఊరేగింపు వైభవంగా జరిగింది. భక్త జన బృందాలు, కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండడగా, మంగవాయిద్యాల నడుమ స్వామి వారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. భక్తులు అడుగడుగునా కర్పూర హారతులు సమర్పించి స్వామి వారిని దర్శించుకున్నారు. చిన్ని కృష్ణుడిని లీలలను గుర్తు చేస్తూ రాముల వారు వెన్నకుండతో భక్తులకు దర్శన మిచ్చారు. బ్రహ్మోత్సవాల్లో నేటి కార్యక్రమాలు కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఐదవ రోజు మంగళవారం ఉదయం 7:30 నుంచి 10 గంటల వరకు మోహినీ అలంకారంలో స్వామి వారు భక్తులకు అభయమిస్తారు. రాత్రి 7 నుంచి 9:00 గంటల వరకు గరుడసేవ నిర్వహిస్తారు. -
రోడ్డు ప్రమాదానికి కారణమైన వ్యక్తి అరెస్టు
మైదుకూరు : జాతీయ రహదారి బైపాస్ రోడ్డులో వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన వ్యక్తిని అరెస్టు చేసినట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి సోమవారం తెలిపారు. ఈనెల 25న బుధవారం పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డులో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారి బైపాస్ సర్వీస్ రోడ్డు వద్ద పాల వ్యాన్ ఢీకొని ద్విచక్రవాహనంలో వెళుతున్న దువ్వూరుకు చెందిన మొగిలిచర్ల భానుప్రకాష్ మృతి చెందిన విషయం తెలిసిందే. బైక్పై ఉన్న మరో యువకుడు గంగా ప్రసాద్ హైదరాబాద్లో చికిత్స పొందుతున్నాడు. ధర్మవరం నుంచి చాపాడు మండల పరిధిలోని ఓ పాల ఫ్యాక్టరీకి పాలను తీసుకొచ్చి తిరిగి వెళుతూ బైక్ను ఢీకొన్న పాల వ్యాన్ డ్రైవర్ షేక్ మస్తాన్ను సోమవారం శ్రీనగరం వద్ద అరెస్టు చేసి, పాల వ్యాన్ను సీజ్ చేసినట్టు పేర్కొన్నారు. జాతీయ రహదారిపై వ్యతిరేక దిశలో వాహనాన్ని నడిపి ఒకరి మృతికి కారణమైన ప్రకాశం జిల్లా దర్శికి చెందిన డ్రైవర్ మస్తాన్పై హత్య కేసుకు సమానమైన సెక్షన్ కింద కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచినట్టు సీఐ రమణారెడ్డి తెలిపారు. -
పేదరిక నిర్మూలనకే పీ4
ఇన్ఛార్జి మంత్రి సవిత కడప సెవెన్రోడ్స్ : రాష్ట్రంలో పేదరిక నిర్మూలనకే పీ4 పథకాన్ని రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తోందని జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో ఎంబీకే–10–20–స్వర్ణాంధ్ర 2047 కార్యక్రమంతోపాటు రాష్ట్ర బడ్జెట్ 2026–27 డిస్ట్రిక్ట్ ఔట్రీచ్ ప్రోగామ్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా పీ4 కార్యక్రమం ద్వారా జిల్లాలో పేదరిక నిర్మూలనకు కృషి చేస్తున్న పలువురికి మంత్రి ప్రశంసాపత్రాలు, జ్ఞాపికలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే మాధవి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధి మీనా తదితరులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిపులివెందుల రూరల్ : పులివెందుల మండలం ఎర్రిపల్లె గ్రామ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని హరిచంద్ర(46) అనే వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని అహోబిలాపురానిక చెందిన వెంకటరమణ కుమారుడు హరిచంద్ర ముత్తుకూరు గ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా.. ఎర్రిపల్లె గ్రామ సమీపంలోకి రాగానే గుర్తు తెలియని బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హరిచంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. హరిచంద్ర జేసీబీలు పెట్టుకుని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసినట్లు ట్రాఫిక్ సీఐ శాంతి లాల్ తెలిపారు. వ్యక్తి అదృశ్యంలింగాల : లింగాల మండలం దిగువ లింగాల గ్రామానికి చెందిన వెన్నపూస చెన్నకేశవరెడ్డి (48) గత శనివారం ఉదయం 9గంటల నుంచి కనిపించడంలేదని ఆయన భార్య రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. శనివారం ఉదయం లింగాల బస్టాండులో బస్సు ఎక్కి ఎక్కడికో వెళ్లిపోయాడని, ఇంతవరకు ఆచూకీ తెలియడంలేదని ఫిర్యాదులో పేర్కొన్నారు. చెన్నకేశవరెడ్డి ఎత్తు 5.5 అడుగులు, ఛామనఛాయ కలిగి ఉంటాడన్నారు. అతను పూర్తిగా నడవలేరని, కర్ర సాయంతో చిన్నగా నడుస్తూ ఉంటాడని, మతి స్థిమితంలేదని, మాటలు కూడా మాట్లాడలేని పరిస్థితి ఉన్నారన్నారు. ఆ వ్యక్తి ఎవరికై నా కనిపిస్తే లింగాల ఎస్ఐ 9121100551, రూరల్ సీఐ 9121100549, పులివెందుల డీఎస్పీ 9121100545 నంబర్లకు ఫోన్ చేసి సమాచారమివ్వాలని ఎస్ఐ జగదీశ్వరరెడ్డి తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలుమైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలోని గడ్డంవారిపల్లెకు సమీపంలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో మైదుకూరుకు చెందిన ముగ్గురు వ్యక్తులు గాయపడ్డారు. వీరిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు ఇలా ఉన్నాయి. మైదుకూరులోని కడప రోడ్డుకు చెందిన షేక్ సాదక్వలీ, కొత్తకొట్టాలుకు చెందిన ఫకృద్దీన్, బద్వేలు రోడ్డుకు చెందిన ఖాజా హుస్సేన్ అనే వారు కార్పెంటర్లు. వీరు సోమవారం బైక్పై మండలంలోని ముత్తరాయపల్లెకు చెక్కపని చేసేందుకు వెళుతున్నారు. గడ్డంవారిపల్లె సమీపంలోని బైపాస్ వద్ద వెనుకవైపు నుంచి వచ్చిన కారు బైక్ను ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. ఫకృద్దీన్ను ప్రొద్దుటూరుకు, సాదక్వలీ, ఖాజా హుస్సేన్లను కడప రిమ్స్కు చికిత్స కోసం తరలించారు. రిమ్స్లో చికిత్స పొందుతున్న ఖాజాహుస్సేన్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం కర్నూలు లేదా తిరుపతికి తీసుకు వెళ్లాల్సిందిగా డాక్టర్లు రెఫర్ చేసినట్టు కుటుంబ సభ్యులు తెలిపారు. -
జాంబవంతుని శోభ..అజరామరం
● 108 అడుగుల విగ్రహం ఏర్పాటుపై కసరత్తు ● దాశరథి కల్యాణంరోజున విగ్రహానికి శంకుస్థ్ధాపన?ఏకశిలానగరంలోని ఒంటిమిట్ట చెరువుఏకశిలానగరంలోని శ్రీ కోదండరాముని ఆలయంరాజంపేట : ఏకశిలానగరికి జాంబవంతుని శోభ సంతరించుకోనుంది. జాంబవంతుడు సీతారామ,లక్ష్మణ విగ్రహాలను ప్రతిష్టించినందుకు ఇప్పుడు జాంబవంతుని కీర్తిప్రతిష్టలు ఇనుమడించనున్నాయి. ఏపీలో రామారాధనకు ప్రముఖ కేంద్రంగా ఉన్న ఈ ఆలయ ప్రాముఖ్యతను మరింత పెంచేలక్ష్యంతో రామాయణంలో కీలక పాత్ర పోషించిన జాంబవుంతుని విగ్రహాన్ని రాములోరి బ్రహ్మోత్సవాల్లో ప్రతిష్టించాలని యోచిస్తున్నట్లు టీటీడీ వర్గాలు పేర్గొంటున్నాయి. ఏకశిలానగరం(ఒంటిమిట)లో ఇప్పుడు రామాలయం సమీపంలో ఉన్న ఒంటిమిట్ట చెరువులో 108 అడుగుల జాంబవంతుని విగ్రహం ఏర్పాటు దిశగా టీటీడీ మాస్టర్ప్లాన్ తీసుకొచ్చింది. ఆలయాన్ని అభివృద్ధి చేయడం, ఈ ప్రాంతంలో సాంస్కృతిక పర్యాటకాన్ని పెంపొదించడానికి రూపొందించిన బృహత్ ప్రణాళికలో జాంబవంతుడు విగ్రహం ఏర్పాటు ఒక భాగమని టీటీడీ వర్గాలు తెలిపాయి. అన్నమయ్య విగ్రహం తరహాలో.. తాళ్లపాక అన్నమాచార్యుల 600 జయంతి సందర్భంగా 108 అడుగుల విగ్రహాన్ని అప్పటి టీటీడీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి నేతృత్వంలో ఏర్పాటుచేశారు. ఈ విగ్రహాన్ని దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆవిష్కరించారు. ఇప్పుడు ఇది రాజంపేటకే ల్యాండ్మార్క్గా మారింది. ఇదే తరహాలోనే ఒంటిమిట్ట చెరువులో జాంబవంతుని విగ్రహాన్ని ఏర్పాటుచేసి, ఏకశిలానగిరికి ల్యాండ్ మార్క్గా నిలిచేలా రూపకల్పన జరుగుతోంది. భవిష్యత్తులో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా మారనుంది. కాగా ఇప్పటికే దాశరధి కల్యాణమండపం సమీపంలో నామమాత్రంగా జాంబవంతుడి విగ్రహం ఏర్పాటుచేసిన సంగతి తెలిసిందే. అధ్యాతిక్మ క్షేత్రంగా.. ఏకశిలానగరం(ఒంటిమిట్ట)లోని శ్రీ కోదండరామాలయం అధ్యాత్మిక క్షేత్రంగా భాసిల్లుతోంది. కడప–తిరుపతి మార్గంలో సెంటర్ ఆఫ్ అట్రాక్షన్గా నిలుస్తోంది ఒంటిమిట్ట చెరువు జాతీయరహదారి పక్కనే రామాలయం ఉంది. రహదారి మరో వైపు జిల్లాలోనే అతిపెద్ద చెరువు ఉంది. 2014లో రాష్ట్ర విభజనం అనంతరం శ్రీ కోదండరామాలయం ప్రభుత్వ అధికారిక రామాలయంగా మారింది. వచ్చెనెల 1న రాము లోరి కల్యాణం రోజున రాష్ట్ర ప్రభుత్వం తరపున ముఖ్యమంత్రి ముత్యాల తలంబ్రాలు, పట్టువస్త్రాలు తీసుకురావడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. అదే రోజున సీఎం చేతుల మీదుగా జాంబవంతుని విగ్రహానికి శంకుస్థాపన కార్యక్రమం నిర్వహించేందుకు టీటీడీ సన్నద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. అధికారికంగా టీటీడీ ఇంకా ప్రకటించలేదు. మరోవైపు విగ్రహానికి సంబంధించి డిజైన్ తుదిదశకు చేరుకున్నట్లు టీటీడీ వర్గాలు చెబుతున్నాయి. -
ప్రశ్నిస్తే బురద జల్లడం మీ పాలన అసలు స్వరూపం
పులివెందుల : పని చేయకుండా అప్పులు తీసుకుని అవినీతికి పాల్పడుతూ ప్రజల డబ్బు దోచుకుని, ప్రశ్నిస్తే దాన్ని మళ్లించేందుకు బురదజల్లడం మీ పాలన అసలు స్వరూపమని, డైవర్షన్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట, రెండోవిడత పూలింగ్ పేరిట చేసిన డ్రామాను ప్రజలు గమనిస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తెలిపారు. ఆదివారం పులివెందులలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. మేం ఇప్పటికీ చెబుతున్నది ఒక్కటే...అధికారంలో మీరు ఉన్నారు...మిమ్మల్ని అడ్డుకునే వారు ఎవరూ లేరు.. ఎలాంటి అడ్డంకులు లేవు...కానీ మీరు చెబుతున్న పనులు మాత్రం కనిపించడం లేదన్నారు. పైగా ఇప్పుడు అధికారంలో ఉన్న చంద్రబాబు 2028లోపు రాజధాని పూర్తిచేస్తామని చెబుతున్నారని, మరి అదే సమయంలో ‘‘ఎవరైనా మార్చేస్తారు’’అనే ప్రచారం ఎందుకు చేస్తున్నారని ప్రశ్నించారు. ఇది మీకు మీపై నమ్మకం లేదనే సంకేతం కాదా అని ప్రశ్నించారు. కట్టలేరని మీరే అంగీకరిస్తున్నట్టే కదా అని అన్నారు. అసెంబ్లీ తీర్మానాలు చేసి డ్రామాలు చేయడం ఎందుకు? కౌన్సిల్ను పక్కన పెట్టడం ఎందుకు? భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి దారుణంగా ఉందని తెలిపారు. ప్లాట్ల డెవలప్మెంట్ లేదు, రోడ్లు లేవు, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయని పేర్కొన్నారు. తమ ప్లాట్ ఎక్కడుందో తెలియని స్థితిలో రైతులు ఉన్నారన్నారు. కుటుంబ అవసరాలు తీర్చుకోలేక, పిల్లల పెళ్లిళ్లు చేయలేక రైతులు ఇబ్బందులు పడుతున్నారని, మిమ్మల్ని ఎవ్వరూ నమ్మే పరిస్థితిలో లేరని చెప్పారు. రెండో విడత పూలింగ్కోసం ఎత్తుగడలో భాగంగా ఈతీర్మానం డ్రామా ఆడుతున్నారని విమర్శించారు. అమరావతి కోసం అసెంబ్లీలో తీర్మానం చేయాల్సిన పరిస్థితి ఎందుకు వచ్చిందని...ఎవరు అడ్డుపడ్డారు? ఈ ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలన్నారు. మళ్లీ టెండర్లు పిలవడమేంటి..? మొదటి దశలోనే 50,000 ఎకరాలు తీసుకున్నారని, ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు అంటే రూ లక్ష కోట్లు అవసరమన్నారు. రెండో దశలో మరో 20,500 ఎకరాలకు రూ.40–50 వేల కోట్లు. మరో 25,000 ఎకరాలకు రూ.50 వేల కోట్లు ఇలా మొత్తం ఖర్చు భారీగా పెరుగుతోందన్నారు. మొత్తంగా కనీస సదుపాయాలకే రూ.2 లక్షల కోట్లు అవసరమని, ఇంకా అదనంగా మాస్టర్ ప్లాన్ పేరిట మరింత భూములు అమసరమని, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి చూస్తే ఇది సాధ్యమా అనే ప్రశ్న సహజంగా ఉత్పన్నమవుతుందని తెలిపారు. 2014–19లో రూ.5,000 కోట్లే ఖర్చు చేశారని, ఇప్పుడు కూడా పెద్దగా పనులు కనిపించడం లేదన్నారు. కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్ల పేరుతో రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. పాత టెండర్లను రద్దు చేసి మళ్లీ టెండర్లు పిలవడం అనుమానాస్పదంగా ఉందని ఎంపీ అన్నారు. ఏడేళ్లలో చంద్రబాబు చేసింది ఏమీ లేకపోగా, కొత్తగా ఒక్క పర్మినెంట్ బిల్డింగ్ కూడా కట్టలేదని పేర్కొన్నారు. టెండర్లు కొద్దిమంది కంపెనీలకే ఇవ్వడం, 4 శాతం ఎక్సెస్తో పనులు ఇవ్వడం అనేది అవినీతికి పరాకాష్ట అని అన్నారు. స్క్వేర్ ఫీట్కు రూ.11,000 ఖర్చు అంటే చివరికి ఎంత అవుతుందో ప్రజలు ఆలోచించాలన్నారు. అమరావతి సెల్ఫ్ ఫైనాన్స్ ప్రాజెక్ట్ అని చెబుతున్నారని, అయితే ఎందుకు రూ.47,000 కోట్ల అప్పులు తీసుకున్నారో? ఎందుకు ప్రభుత్వ గ్యారంటీలు? భూములు అమ్మి డబ్బు తెస్తామని చెప్పిన వారు ఇప్పటివరకు ఎంత సంపాదించారు? తెచ్చిన అప్పులను ఎవరు తీరుస్తారు? ఏడేళ్లలో ఇప్పటివరకూ ఒక్కపైసా కూడా రాబడిలేదు. మరి ఈ భారం ఎవరిమీద వేస్తారని ప్రశ్నించారు. నత్త నడకన పనులు 2024 జూన్ తర్వాత డ్రా చేసిన రూ వేల కోట్ల రుణాల్లో రూ.5,000 కోట్లు మొబిలైజేషన్ అడ్వాన్స్గా ఇచ్చారని, ఇవి కమీషన్ల రూపంలో వెళ్లాయనే ఆరోపణలు ఉన్నాయని, అందుకే పనులు నత్తనడకగా సాగుతున్నాయని ఎంపీ తెలిపారు. మీ అవినీతి వ్యవహారాలు చూసి రైతులు కూడా రెండో దశలో భూములు ఇవ్వడానికి వెనుకంజ వేస్తున్నాని అన్నారు. టెంపరరీ అసెంబ్లీ, టెంపరరీ హైకోర్టు పేరుతో సుమారు రూ.1000 కోట్లు ఖర్చు చేశారని, శాశ్వత పరిష్కారం లేకుండా ఇలా డబ్బు ఖర్చు చేయడం ఎందుకని ప్రశ్నించారు. కొత్తగా నిర్మాణాలు లేకుండా, కనెక్టివిటీ కూడా అభివృద్ధి జరగదని, ఇప్పటికీ కరకట్ట రోడ్డే ప్రధాన మార్గమని తెలిపారు. కొన్ని పనులు గత ప్రభుత్వ కాలంలోనే పూర్తయ్యాయని, వెస్ట్రన్ బైపాస్ కట్టింది జగన్మోహన్రెడ్డి కాదా అని ప్రశ్నించారు. చంద్రబాబు లక్ష్యం రాజధాని నిర్మాణం కాదని, దాని పేరుతో సంపద సృష్టించడం. తన అనుచరులు, బినామీలకు లాభం చేకూర్చడమే అసలు ఉద్దేశమన్నారు. ఆర్టీఐ ద్వారా అడిగినా సమాచారం ఇవ్వడం లేదని,అమరావతి ప్రాజెక్ట్లో పారదర్శకత లేదన్నారు. వైఎస్సార్ సీపీ అభివృద్ధి వికేంద్రీకరణలో అమరావతిని వ్యతిరేకించలేదన్నారు. అభ్యంతరం అవినీతి మీద మాత్రమేనని, వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా అమరావతిలో ఇల్లు కట్టుకున్నారని, అమరావతి ప్రాంతంపై వ్యతిరేకత లేదనేది స్పష్టమన్నారు.అమరావతి పనులపై రూ.2,000 కోట్ల అవినీతి ఆరోపణలతో ఇన్కమ్ ట్యాక్స్ నోటీసులు వచ్చాయని, పీఏ శ్రీనివాస్ పేరుతో కమీషన్లు వెళ్లాయని పేర్కొన్నారు. ఇది పెద్ద అనుమానాలకు దారితీస్తోందన్నారు. భవిష్యత్తులో నిర్మించే భవనాల నిర్వహణ ఖర్చులు కూడా భారీగా ఉంటాయని, ఆచరణాత్మక ఆలోచన లేకుండా భారీ ప్రాజెక్టులు ప్రకటించడం ప్రజల్లో భయం కలిగిస్తోందని ఎంపీ పేర్కొన్నారు. డైవర్షన్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా సీఎం చంద్రబాబుకు రాజధానిపై చిత్తశుద్ధి లేమి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
నేడు ఒంటిమిట్టకు ఎంపీ అవినాష్ రెడ్డి రాక
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలో జరుగుతున్న శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలకు సోమవారం కడప పార్లమెంట్ సభ్యుడు వైఎస్ అవినాష్ రెడ్డి రానున్నట్లు ఆదివారం వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సీతారామలక్ష్మణులను వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డితో కలిసి ఎంపీ దర్శించుకుంటారన్నారు. ఉదయం 8:30 గంటలకు ఒంటిమిట్టకు చేరుకోనున్నారు.నూతన కార్యవర్గం ఎన్నికప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక కళాభారతి కార్యాలయంలో ఆదివారం సంస్థ ఎన్నికలను నిర్వహించారు. సంస్థ అధ్యక్షులుగా కొత్తపల్లి శీను, ప్రధాన కార్యదర్శిగా సుభాష్చంద్రబోస్, ట్రెజరర్గా సోమశేఖర్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. కార్యవర్గ సభ్యులుగా ఏవీ శేఖరాచారి, జీవీ సుబ్బారెడ్డి, డి.శివప్రసాద్, గౌరీశంకర్, శశిరాజా ఆచారిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా అధ్యక్షుడు కొత్తపల్లి శీను మాట్లాడుతూ 49 ఏళ్లుగా కళాభారతి నాటక సంస్థను నడిపిస్తున్నట్లు తెలిపారు. ఇంకా మంచి నాటక ప్రదర్శనలు ఇచ్చేందుకు కృషి చేస్తామని పేర్కొన్నారు. రిమ్స్లో గుర్తు తెలియని మృతదేహాలుకడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో ఈనెల 27న గుర్తు తెలియని వ్యక్తులను వైద్యపరీక్షల కోసం వేర్వేరు సమయాల్లో తీసుకుని వచ్చారు. వారికి పరీక్షలను నిర్వహించగా చనిపోయారని వైద్యు లు నిర్ధారించారు. రెండు గుర్తు తెలియని మృతదేహాలను మార్చురీలో ఉంచారు. వారి ఆచూ కీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని అధికారులు కోరుతున్నారు. భార్యభర్తలపై దాడిచాపాడు: మండల పరిధిలోని పెద్ద గురువలూరు గ్రామంలో ఆదివారం మధ్యాహ్నం గ్రామానికి చెందిన పాలగిరి సత్య వేమారెడ్డి, అతని భార్య పద్మావతి పై ప్రొద్దుటూరులో నివాసముంటున్న రామిరెడ్డి వీరారెడ్డి అలియాస్ పోలీసు వీరారెడ్డి కొంతమంది వ్యక్తులతో కలిసి దాడి చేసినట్లు ఇన్చార్జి ఎస్ఐ ధనుంజయ తెలిపారు. శ్రీరామనవమి పండుగ అనంతరం శనివారం రాత్రి రామాలయం వద్ద జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమం వద్ద వీరారెడ్డి, సత్య వేమారెడ్డి మధ్య స్వల్ప వాగ్వాదం చోటుచేసుకుంది. ఆదివారం మధ్యాహ్నం వీరారెడ్డి మరి కొంతమంది వ్యక్తులతో కలిసి సత్యవేమారెడ్డి ఇంటిపైకి వెళ్లి దాడికి పాల్పడ్డారు. ఈ దాడిలో పద్మావతి చేతికి తీవ్ర గాయమైంది. కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఇన్చార్జి ఎస్ఐ తెలియజేశారు. ఒంటిమిట్టకు 85,000 శ్రీవారి లడ్డూలు ఒంటిమిట్ట : ఏప్రిల్ 1న జరిగే ఒంటిమిట్ట సీతారాముల కల్యాణానికి ఆదివారం తిరుమల నుంచి 85,000 శ్రీవారి లడ్డూలు పంపినట్లు ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి తెలిపారు. తిరుమల ఎస్టేట్స్ ఆఫీసర్, పరకామణి డిప్యూటీ ఈవో వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో తిరుమల శ్రీవారి లడ్డూలు ప్యాకింగ్ జరిగింది. కార్యక్రమంలో 300 మంది సేవకులు పాల్గొన్నారు. విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతిపీలేరురూరల్ : విద్యుదాఘాతంతో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం బండ్లవంకకు చెందిన ఎస్. వంశీకృష్ణ (40) ఎలక్ట్రీషియన్ పని చేస్తూ జీవనం సాగించేవాడు. ఆదివారం స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలో కల్యాణమండపం వద్ద మరమ్మతులు చేస్తూ విద్యుద్ఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ యుగంధర్ తెలిపారు. -
అనంతపురం, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు ఆదివారం ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 230 పరుగులు చేసింది. జట్టులోని ప్రణవ్రెడ్డి 46, రణధీర్రెడ్డి 41 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, మల్లికార్జున 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 35.2 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 233 పరుగులు చేసింది. జట్టులోని కెహెచ్ వీరారెడ్డి 84, ప్రశాంత్ 31 పరుగులు చేశారు. కడప జట్టులోని మహ్మద్ ఆయూబ్ 3, ప్రణవ్రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో అనంతపురం జట్టు 3 వికెట్ల తేడా విజయం సాధించింది. ● కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నెల్లూరు–కర్నూలు జట్లు తలపడ్డాయి, టాస్గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 50 ఓవర్లలో 7 వికెట్లు కోల్పోయి 405 పరుగులు చేసింది. ఆ జట్టులోని య్యద్ షాహుల్ హామీద్ 80 బంతుల్లో 18 ఫోర్లు, 5 సిక్సర్లతో 132 పరుగులు చేశాడు. మన్విత్ కుమార్ రెడ్డి 71, తోషిత్ యాదవ్ 51 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని అశోక్ కుమార్ యాదవ్ 2, సాయి సూర్యతేజ రెడ్డి 2 తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 43.2 ఓవర్లలో 271 పరుగులకు ఆలౌటైంది. జట్టులోని నయిముల్లా 50, హృదయ్ 37 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని భార్గవ్ 2, తోషిత్ యాదవ్ 2, అఖిల్ 2 అశోక్ 2 వికెట్లు తీశారు. దీంతో నెల్లూరు జట్టు 134 తేడాతో ఘన విజయం సాధించింది. -
ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దు
పీలేరురూరల్ : ఉద్యోగుల సహనాన్ని పరీక్షించొద్దని మాజీ ఎమ్మెల్సీ, ఏఐఎస్టీఎఫ్ జాతీయ కార్యనిర్వాహక అధ్యక్షుడు కత్తి నరసింహారెడ్డి అన్నారు. ఆదివారం స్థానిక వీఎస్ఆర్ కల్యాణమండపంలో ఎస్టీయూ ద్వితీయ కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశవ్యాప్తంగా లక్షలాదిమంది ఉపాధ్యాయులు టెట్ నిబంధన విషయంలో తీవ్ర గందరగోళంలో ఉంటే, పరిష్కార చర్యలు చేపట్టాల్సిన కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య ధోరణిలో ఉండడం మంచిది కాదన్నారు. సుప్రీంకోర్టు తీర్పుపై స్పందించి చట్ట సవరణ చేయాల్సిన అవసరం ఉందన్నారు. సీపీఎస్ ఉమ్మడి సర్వీసు రూల్స్ విషయంలోనూ ప్రభుత్వాలు దృష్టి సారించాలని డిమాండ్ చేశారు. పీఆర్సీ, ఐఆర్పై ప్రభుత్వ మొండి వైఖరి సరికాదన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మల్లు రఘునాథరెడ్డి, ఎల్. సాయిశ్రీనివాస్, జిల్లా అధ్యక్షులు ఎ. శివారెడ్డి, ఎస్టీయూ నాయకులు కె.వి. శేఖర్, గాజుల నాగేశ్వరరావు, పి. రమణారెడ్డి, బాలగంగిరెడ్డి, పోకల మధుసూదన, జగన్మోహన్రెడ్డి, కడియాల మురళి, మోహన్, వేణుగోపాల్రెడ్డి, గంటా మోహన్ పాల్గొన్నారు.మాజీ ఎమ్మెల్సీ కత్తి నరసింహారెడ్డి -
అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టురట్టు
గోపవరం : బద్వేలు రూరల్ స్టేషన్ పరిధిలో చంపుతామని కత్తితో బెదిరించి వృద్ధురాలి మెడలో నుంచి బంగారు గొలుసు చోరీ కేసులో కీలక నిందితుడిని అరెస్టు చేయడంతో పాటు చోరీ సొత్తు, కారు, రెండు బైక్లను స్వాధీనం చేసుకున్నట్లు బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య తెలిపారు. ఆదివారం విలేకరులకు వివరాలు వెల్లడించారు. శ్రీరామనవమి పండుగ రోజున రూరల్ పోలీసుస్టేషన్ పరిధిలోని శ్రీనివాసపురం గ్రామంలో వృద్ధురాలిని కత్తితో బెదిరించి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని పారిపోయిన ఘటనపై కేసు నమోదు చేసి రూరల్ సీఐ పర్యవేక్షణలో రూరల్ ఎస్ఐ రంగారావు, సిబ్బంది బృందాలుగా ఏర్పడి గాలింపు చర్యలు చేపట్టగా అందిన సమాచారం మేరకు ఆదివారం మండలంలోని ద్వారకానగర్ సమీపంలోని గరుడయ్యసత్రం వద్ద అనుమానాస్పదంగా తిరుగుతున్న మార్కాపురం టౌన్కు చెందిన షైక్ఈసుమీరావల్లిని అదుపులోకి తీసుకుని విచారించగా విషయాలు వెలుగులోకి వచ్చాయన్నారు. నేరచరిత్ర, ముఠా వివరాలు మీరావల్లి గతంలో మార్కాపురంలో దొంగతనం చేసి జైలుకు వెళ్లాడు. జైలులో ఇతనికి మజీద్, అంజిరెడ్డి, వెంకటేష్ అనే కరుడుకట్టిన పాతనేరస్తులతో పరిచయం ఏర్పడి ఈ నలుగురు ఒక గ్యాంగ్గా ఏర్పడి జనం ఎక్కువ ఉన్న చోట మహిళలు నగలు వేసుకుని ఉంటారని, ఆ ప్రదేశాలను దొంగతనాలకు ఎంచుకుని ఎవరైనా అడ్డుకుంటే కత్తులతో చంపడానికై నా సిద్ధపడాలని నిర్ణయించుకుని పథకం ప్రకారం కత్తులు కూడా కొనుగోలు చేసినట్లు తెలిపారు. వీరందరూ ఈ నెల 25వ తేదీన పొదిలి సమీపంలో ఒక డీలక్స్ బైక్, 26వ తేదీన నరసారావుపేటలో మరో బైక్, పామూరు సమీపంలో పల్సర్ బైక్ దొంగిలించారు. ఈ క్రమంలో శ్రీరామనవమి సందర్భంగా శ్రీనివాసపురం వద్ద ఒంటరిగా ఉన్న వృద్ధురాలిని కత్తులతో బెదిరించి ఆమె మెడలో ఉన్న రూ.2.50 లక్షలు విలువైన బంగారు గొలుసును దొంగిలించడం జరిగిందన్నారు. ఈ కేసులో నిందితుడి నుండి బంగారు గొలుసుతో పాటు కారు, ద్విచక్ర వాహనాలు, కత్తులు స్వాఽధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. రూరల్ ఎస్ఐ రంగారావు, బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డిల ఆధ్వర్యంలో రెండు బృందాలుగా ఏర్పాటు చేసి 48 గంటల్లోనే అంతర్ జిల్లా దొంగల ముఠా గుట్టు రట్టుచేసి వారి నుండి విలువైన వస్తువులను స్వాధీనం చేసుకోవడం పట్ల మైదుకూరు డీఎస్పీ రాజేందప్రసాద్ సీఐ క్రిష్ణయ్య, ఎస్ఐలను అభినందించారు. అరెస్టు చేసిన నిందితుడిని రిమాండ్కు తరలించామని, ఈ కేసులో పరారీలో ఉన్న ముగ్గురు నిందితుల కోసం గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు ఎస్ఐ రంగారావు తెలిపారు.ఒకరు అరెస్టు -
ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ జెండా
సాక్షి టాస్క్పోర్స్ : తెలుగుదేశం పార్టీ ఆవిర్బావ దినోత్సవం సందర్బంగా ఆదివారం వీరపునాయునిపల్లె మండలంలోని ఉరుటూరు గ్రామ సచివాలయం వద్ద స్థానిక తెలుగుదేశం నాయకులు పార్టీ జెండాను ఎగురవేశారు. ప్రభుత్వ కార్యాలయాల వద్ద ఆగస్టు 15, జనవరి 26న జాతీయ జెండాను ఎగురవేయడం ఆనవాయితీగా వస్తోంది. దీనికి విరుద్ధంగా టీడీపీ నాయకులు తెలుగుదేశం పార్టీ జెండాను ఎగురవేయడం విమర్శలకు దారితీస్తోంది. ఇప్పటికే టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డుఅదుపు లేకుండా పోయిందని విమర్శలు వినిపిస్తున్నాయి. ఇలాంటి విధానాలకు స్వస్తి పలకాలని, ఇలాంటి వి జరగకుండా అధికారులుచర్యలు తీసుకోవాలని స్థానిక ఎంపీటీసీ లక్ష్మిరామాంజనమ్మ అన్నారు.ఈ విషయంపై మండల అబివృద్ది అధికారి శేషా చలపతిని వివరణ కోరగా ప్రభుత్వ కార్యాలయాల వద్ద పార్టీ జెండాలను ఎగురవేయడం చట్టవిరుద్ధం, ఆదివారం కావడంతో అధికారులు లేరని ఉండి ఉంటే అలా జరిదేది కాదని, వెంటనే తీసేయిస్తానని, ఇక మీదట ఇలా జరగకుండా చర్యలు తీసుకొంటామని తెలిపారు. -
ఒంటిమిట్ట కల్యాణోత్సవానికి పటిష్ట బందోబస్తు
కడప అర్బన్: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న నిర్వహించనున్న శ్రీ సీతారాముల కళ్యాణానికి పటిష్ట బందోబస్త్ ఏర్పాటు చేయాలని ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. ఆదివారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో బందోబస్తు ఏర్పాట్లపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ ముఖ్యమంత్రితో పాటు పలువురు వీఐపీలు విచ్చేయనుండడంతో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేపట్టాలన్నారు. కల్యాణానికి అధిక సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో ట్రాఫిక్కు ఎలాంటి అంతరా యం కలగకుండా ముందస్తు చర్యలు చేపట్టాలన్నారు. కల్యాణం రోజున ట్రాఫిక్ ను మళ్లించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఆలయ పరిసరాలు, కళ్యాణ వేదిక వద్ద సీసీ టీవీలు ఏర్పాటు చేసి కమాండ్ కంట్రోల్ సెంటర్ ద్వారా ముఖ్యమైన ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాల ద్వారా భద్రత కట్టుదిట్టం చేయాలన్నారు. దర్శనం, అన్నప్రసాదాల పంపిణీ వద్ద తోపులాట లేకుండా బ్యారికేడ్లు, కళ్యాణానికి వచ్చే భక్తులకు పార్కింగ్ ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్.పీ బి.రమణయ్య, ప్రొద్దుటూరు ఏ.ఎస్.పీ విభుకృష్ణ, రాజంపేట ఏ.ఎస్.పీ హెగ్డే పాల్గొన్నారు. పోలీసు అధికారులతో సమీక్ష సమావేశంలో ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
ప్రజా సమస్యలు పరిష్కరించకపోతే ఉద్యమిస్తాం
కడప వైఎస్ఆర్ సర్కిల్: గ్రామీణ ప్రాంతాల్లో ప్రజలు ఎదుర్కొంటున్న మౌలిక సమస్యలు పరిష్కారానికి జిల్లా పరిషత్ కృషి చేయకపోతే ప్రజాక్షేత్రంలో ఉద్యమం తప్పదని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శనివారం కడపలోని జిల్లా పరిషత్ కార్యాలయం ఎదుట ప్రజా సమస్యలు పరిష్కరించాలని కోరుతూ అందోళన చేపట్టారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజల మౌలిక సదుపాయాల కల్పన కోసం 15వ ఫైనాన్స్ నిధులతోపాటు ప్రభుత్వం నుంచి వస్తున్న నిధులు, వాణిజ్య సముదాయాల నుంచి వస్తున్న ఆదాయం సమస్యల పరిష్కారానికి ఖర్చు చేయాల్సిన జిల్లా పరిషత్ లెక్కల ప్రకారం కోట్లు ఖర్చు చేస్తున్నట్లు చెబుతున్నప్పటికీ ఆచరణలో ఖర్చుకు తగ్గట్టు ప్రజల అవసరాలు తీర్చడంలో విఫలం అవుతుందన్నారు. వేసవి ఆరంభంలోనే తాగునీటి ఎద్దడితో గ్రామాలు విలవిలాడుతున్నాయని, బోర్లు, మోటార్ల రిపేర్లు, రక్షిత మంచినీటి పథకాల పేరుతో పాలకవర్గానికి, అధికారులకు ఆదాయాన్ని సమకూర్చిపెట్టే వనరులుగా మార్చుకొని ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారని ఆరోపించారు.జిల్లా పరిషత్లో జరుగుతున్న అక్రమ నియామకాలపై, ప్రమోషన్లు, బదిలీలపై విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు వి వీరశేఖర్ ఎంవీ సుబ్బారెడ్డి జి వేణుగోపాల్ కేసి బాదుల్లా పి శ్రీరాములు పి బాలు,పి మస్తాన్, జి నాగేశ్వరరావు, షావల్లి, కే మునయ్య, ఇమ్మానియేల్, పడిగే వెంకట రమణ, లింగన్న, రవికుమార్, పి నాగరాజు, సుబ్బరాయుడు, తారక్ నరసింహ తదితరులు పాల్గొన్నారు. -
కంకర తొలగించమన్నందుకు గొడ్డలితో దాడి
ప్రొద్దుటూరు క్రైం : రహదారిలో వాహన రాకపోకలకు ఇబ్బందిగా మారిన కంకరను తొలగించమని చెప్పిన వ్యక్తిపై గొడ్డలితో దాడి చేసి గాయపరిచిన ఘటన ప్రొద్దుటూరులో శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని సూపర్బజార్ రోడ్డులోని శ్రీకాళహస్తి వీధికి చెందిన దుద్యాల హరి డ్రైవర్గా పని చేస్తున్నాడు. అతను శుక్రవారం రాత్రి 11 గంటల సమయంలో బైక్లో ఇంటికి బయలుదేరాడు. ఆయన ఇంటి వద్దనే ఎలక్ట్రికల్ పని చేసే సత్యం అనే వ్యక్తి తన ఇంటి నిర్మాణం కోసం రోడ్డుపై కంకర తోలాడు. రోడ్డుకు అడ్డంగా కంకర ఉండటంతో ఆ దారిలో వెళ్లే వాహనదారులు కిందపడి ప్రమాదాల బారిన పడేవారు. ఈ క్రమంలో హరి కూడా బైక్లో అదే దారిలో వెళ్తూ తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. దీంతో అతను అక్కడే ఉన్న సత్యం వద్దకు వెళ్లి దీన్ని ప్రశ్నించాడు. రోడ్డుకు అడ్డంగా కంకర వేస్తే వాహనదారులకు ఇబ్బంది కదా.. కావున తొలగించాలని హరి సూచించాడు. ఆగ్రహించిన సత్యం నాకు చెప్పడానికి నువ్వు ఎవరు అంటూ హరిని పరుష పదజాలంతో ధూషించాడు. రోడ్డుపై వెళ్తున్న వాళ్లెవరూ నన్ను ప్రశ్నించలేదు, నువ్వు ప్రశ్నిస్తావా నిన్ను చంపితే ఎవరు కాపాడతారు అంటూ గొడ్డలి తీసుకొని హరి తలపై కొట్టడంతో తీవ్ర రక్తగాయాలయ్యాయి. సత్యం భార్య విజయ కూడా గొడ్డలి తిరగేసి హరిని కొట్టింది. హరికి తలతో పాటు శరీరంపై గాయాల య్యాయి. హరి తల్లి సావిత్రమ్మపై కూడా ఇరువురు దాడి చేయగా ఎడమ చేతికి గాయమైంది. అక్కడే ఉన్న స్థానికులు అడ్డు పడి హరిని, సావిత్రమ్మను కాపాడటంతో ప్రమాదం తప్పింది. గాయపడిన ఇరువురిని చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. తనను చంపడానికి ప్రయత్నించిన సత్యం, అతని భార్య విజయపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని హరి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు త్రీ టౌన్ పోలీసులు తెలిపారు. తీవ్రంగా గాయపడిన డ్రైవర్ దుద్యాల హరి -
ఆత్మహత్యకు యత్నించిన మహిళ మృతి
ప్రొద్దుటూరు క్రైం : మూడు రోజుల క్రితం ముగ్గురు పిల్లలతో సహా ఆత్మహత్యా యత్నం చేసిన మల్లెపూల భువనేశ్వరి (30) చికిత్స పొందుతూ శనివారం సాయంత్రం మృతి చెందింది. గురువారం సాయంత్రం ప్రొద్దుటూరులోని ఈశ్వరరెడ్డినగర్కు చెందిన భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలు సుష్మ, నిఖిత, ఘణలకు గడ్డి మందు కలిపిన కూల్ డ్రింక్ తాపించి ఆమె కూడా అదే కూల్డ్రింక్ తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురిని కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించగా.. వారి ఆరోగ్య పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో మెరుగైన చికిత్స కోసం అదే రోజు రాత్రి కడప రిమ్స్కు తీసుకెళ్లారు. భువనేశ్వరి, పెద్ద కుమార్తె సుష్మల ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. శుక్రవారం మధ్యాహ్నం వరకు తల్లీకూతుళ్లిద్దరూ అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. అయితే సాయంత్రానికి ఇద్దరూ స్పృహలోకి రావడంతో కుటుంబ సభ్యులు ఊపిరి పీల్చుకున్నారు. ఉన్నట్టుండి భువనేశ్వరి ఆరోగ్యం పూర్తిగా క్షీణించిపోవడంతో శనివారం సాయంత్రం మృతి చెందింది. ముగ్గురు పిల్లలు కోలుకుంటున్నట్లు పోలీసులు తెలిపారు. కోలుకుంటున్న ముగ్గురు పిల్లలు -
నేడు విద్యుత్ బిల్లులు చెల్లించవచ్చు
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సౌకర్యార్థం ఆదివారం సెలవు దినం అయినప్పటికీ జిల్లా వ్యాప్తంగా విద్యుత్ బిల్లుల వసూ లు కేంద్రాలు యథావిధిగా పనిచేస్తాయని ఏపీఎస్పీడీఎల్ పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని విద్యుత్ బిల్లులు సకాలంలో చెల్లించాలని కోరారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ మెన్ అండర్–23 అంతర్ జిల్లాల వన్డే మ్యాచ్లు నేటి నుంచి ఏప్రిల్ 4 వరకు నిర్వహించనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఎ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈ మ్యాచ్లు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియం, కేఓఆర్ఎం మైదానంలో జరుగుతాయని వివరించారు. కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ఏపీ ఎస్ఎస్డీసీ సౌజన్యంతో ప్రభుత్వ పురుషుల కళాశాల(స్వయంప్రతిపత్తి)లో జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) ఆధ్వర్యంలో ఈ నెల 30న సోమవారం జాబ్ డ్రైవ్ నిర్వహించనున్నట్లు కళాశాల ప్రిన్సిపల్ ఎం. రవి కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా లోని ప్రభుత్వ, ప్రైవేటు ఎయిడెడ్ కళాశాలలో ఫైనల్ ఇయర్ చదువుతున్న విద్యార్థులు, డిగ్రీ , పీజీ పూర్తి చేసిన విద్యార్థులు ఈ అవకాశాన్ని ఉపయోగించుకోవాలని తెలియజేశారు. వివరాలకు కళాశాలలోని జేకేసీ కోఆర్డినేటర్ రాము (7995802325), మెంటార్లు సారధి (9347256400), రవీంద్రారెడ్డి (93900 52901)లను సంప్రదించాలని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: జిల్లా రెవెన్యూ అధికారిగా మల్లికార్జున శనివారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో భాగంగా మల్లికార్జునను ప్రభుత్వం కడప డీఆర్వోగా నియమించింది. ఈ మేరకు కలెక్టరేట్కు చేరుకుని తన చాంబర్లోగా బాధ్యతలు స్వీకరించారు. అంతకుముందు కార్యాలయ అధికారులు, సిబ్బంది ఆయనను ఆహ్వానించారు. అనంతరం నూతన డీఆర్వో కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రెవెన్యూ అంశాలపై చర్చించారు. కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో శనివారం ఆ శాఖ జిల్లా అధికారి డాక్టర్ నాగరాజు ఆధ్వర్యంలో జిల్లా పీసీపీ పీఎన్డీటీ నోడల్ ఆఫీసర్ డాక్టర్ ప్రవీణ్ డిస్టిక్ లెవెల్ అడ్వైజరీ కమిటీ మాతృ మరణాలపైన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జిల్లాలోని స్కానింగ్ కేంద్రాలను ఎప్పటికప్పుడు తనిఖీలు నిర్వహించాలన్నారు, ఇకమీదట ఎలాంటి మాతృ మరణాలు సంభవించరాదన్నారు. కార్యక్రమంలో డీసీహెచ్ఎస్ డాక్టర్ హిమదేవి, ప్రోగ్రాం ఆఫీసర్ అరిఫుల్లా, సీ్త్ర వ్యాధి నిపుణురాలు డాక్టర్ లక్ష్మీ సుశీల, రేఖా రావు, మత్తు వ్యాధి నిపుణులు డాక్టర్ సునీల్, డాక్టర్ యాదవేందర్ రెడ్డి, డాక్టర్ అబ్దుల్ కలీఫ్, శోభారాణి పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్కు దేశంలో ప్రముఖ ఇంజినీరింగ్ ప్రొఫెషనల్ సంస్థ ది ఇన్ట్సిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ ఇండియా ప్రతిష్టాత్మకమైన ఫెలో ఆఫ్ ది ఇన్స్టిట్యూషన్ ఆఫ్ ఇంజనీర్స్ సభ్యత్వాన్ని ప్రదానం చేశారు. ఇంజినీరింగ్ రంగంలో అత్యున్నత సభ్యత్వంగా పరిగణించబడే ఈ ఫెలోషిప్, ఇంజినీరింగ్, సాంకేతికత, పరిశోధన , విద్యా రంగాలలో విశిష్ట సేవలు అందించిన ప్రముఖులకు ప్రదానం చేస్తారు. కాగా ఆచార్య రాజశేఖర్ మూడు పీహెచ్డీలతో పాటు నాలుగు పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలు సంపాదించి, మూడు దశాబ్దాలుగా ఉన్నత విద్యా రంగంలో సేవలు అందిస్తున్నారు. -
అరటి తోటలోకి దూసుకెళ్లిన కారు
సింహాద్రిపురం : సింహాద్రిపురంలోని ఇండియన్ గ్యాస్ ఏజెన్సీ సమీపంలో కారు అదుపు తప్పి అరటి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ గాయపడ్డాడు. స్థానికులు గమనించి క్షతగాత్రుడిని 108 వాహనంలో చికిత్స నిమిత్తం తాడిపత్రికి తరలించారు. ఈ సంఘటనకు సంబంధించి పోలీసులకు ఎలాంటి సమాచారం లేదు. హత్యాయత్నం కేసులో ఇద్దరు అరెస్టు రాజంపేట: మండలంలోని కొత్తబోయనపల్లెలో ఉన్న ప్రియా లేడీస్ హాస్టల్ వద్ద ఈనెల 8న ఎర్రబల్లి గ్రామానికి చెందిన కడిమెల్ల గిరిధర రాజాపై జరిగిన హత్యాయత్నం కేసులో ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే తెలిపారు. ఎస్డీపీఓ కార్యాలయంలో విలేకర్ల సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ ఘర్షణకు సంబంధించి మొత్తం 11 మంది నిందితులను గుర్తించామన్నారు. వారిలో ఇద్దరు కోర్టులో సరెండరయారని,. ప్రస్తుతం మరో ఇద్దరిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు చేసిన వారిలో చాగలమర్రిమండలానికి చెందిన ఆలమూరు వెంకటకార్తీక్ రెడ్డి, గుత్తి మండలానికి చెందిన గడ్డెం ఎర్రి స్వామిలు ఉన్నారని వివరించారు. గిరిధర్రాజుపై జరిగిన హత్యయత్నం కేసులో వీరు ప్రముఖపాత్ర పోషించారన్నారు. మిగిలిన వారిని త్వరలో పట్టుకుంటామన్నారు. పీజీ హాస్టల్ల్లో ఉంటున్న విద్యార్ధులపై యజమానులు నిఘా ఉంచాలని సూచించారు. అనంతరం పీజీ హాస్టల్స్ యజమానులకు ఆయన కౌన్సిలింగ్ ఇచ్చారు.సమావేశంలో మన్నూరు సీఐ లింగప్ప, ఎస్ఐ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక శ్లోక పాఠశాల రహదారిలో ఉన్న ఓ ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. బాధితురాలు అఖిల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి రెండు తులాలు, వెండి వస్తువులు, రూ.50వేల నగదును అపహరించినట్లు తెలిపారు. స్థానిక మదీనాపురానికి చెందిన షేక్ అఖిల కడప కొప్పర్తిలో డిక్సన్ కంపెనీకి చెందిన సీసీ కెమెరాల కంపెనీలో ఉద్యోగం చేస్తోంది. భర్త ఇటీవల మృతి చెందాడు. ఈమె శ్లోక పాఠశాల సమీపంలోని జిమ్మి చెట్టు వద్ద నివాసం ఉంటోంది. తన తల్లి ఇంటి వద్ద పిల్లలను వదిలి శుక్రవారం డ్యూటికి వెళ్లింది. శనివారం తిరిగి ఇంటికి వచ్చి చూడగా తలుపు తాళాలు పగులగొట్టి ఉన్న విషయం బయటపడటంతో తల్లిని పిలిపించి ఇంట్లోకి వెళ్లింది. బీరువాను పగుల కొట్టి బంగారు, వెండి వస్తువులతోపాటు డబ్బాలో ఉన్న రూ.50వేల నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపింది. నగదు ఉన్న డబ్బాను ఇంటి బయట వేసి వెళ్లినట్లు తెలిపారు. దాదాపు రూ.5లక్షల వరకు నష్టం కలిగినట్లు వాపోయారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇంటి పరిసరాలను పరిశీలించారు. షేక్ అఖిల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. విద్యుత్ తీగలు తగిలి యువకుడు మృతి గాలివీడు: మండలంలోని గరుగుపల్లె పంచాయతీ పరిధిలోని ఇడపన్ చేనుపల్లెలో తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పంటలను అడవి జంతువుల నుంచి కాపాడేందుకు ఏర్పాటు చేసిన విద్యుత్ తీగ ఒక యువకుడి ప్రాణాలను బలి తీసుకుంది.గ్రామానికి చెందిన పందికుంట సాయికుమార్ రెడ్డి (19) తన సొంత పొలంలోని వేరుశనగ పంట వద్ద విద్యుత్ వైరు తగిలి అక్కడికక్కడే మతి చెందాడు. గ్రామస్తులు కథనం మేరకు ప్రతిరోజూ పంట కాపలాకు తండ్రి ఇరగం రెడ్డి లేదా తల్లి ఆకులమ్మ వెళ్లేవారు.ఇదే క్రమంలో శుక్రవారం రాత్రి సంఘటన జరిగిన రోజు సాయికుమార్ రెడ్డి తన తండ్రికి భోజనం తీసుకెళ్లాడు. అయితే అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలను గమనించలేదు.ముందుకెళుతుండగా విద్యుత్ తీగలు తాకడంతో ఒక్కసారిగా కుప్పకూలిపోయాడు. గట్టిగా కేకలు వేయడంతో సమీపంలో ఉన్న తండ్రి ఇరగం రెడ్డి పరుగెత్తుకుంటూ వచ్చాడు. అప్పటికే సాయికుమార్ రెడ్డి మృతి చెందాడు. -
కార్మిక పక్షపాతి వైఎస్సార్టీయూసీ
కడప కార్పొరేషన్: వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(వైఎస్సార్టీయూసీ) కార్మికుల పక్షపాతిగా వారి సమస్యల పరిష్కారానికి పోరాడుతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా అన్నారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్టీయూసీ ఆవిర్భావ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి మాజీ డిప్యూటీ సీఎంపాటు సీఈసీ సభ్యులు కె. సురేష్ బాబు, మాజీ మేయర్ పాకా సురేష్లు ముఖ్య అతిథులుగా హాజరై వైఎస్సార్టీయూసీ జెండాను ఆవిష్కరించారు. అనంతరం కేక్ కట్చేసి ఒకరినొకరు పంచుకున్నారు. అనంతరం అంజద్బాషా మీడియాతో మాట్లాడుతూ వైఎస్సార్టీయూసీ ఏర్పడి 14 ఏళ్లు పూర్తయ్యిందని, అప్పటినుంచి కార్మికుల పక్షాన ఎన్నో పోరాటాలు చేసినట్లు చెప్పారు. గతంలో ఏ ప్రభుత్వాలు ఆటో కార్మికుల గురించి ఆలోచన చేయలేదని, వైఎస్సార్సీపీ ప్రభుత్వమే వారిని గుర్తించి ఏడాదికి రూ.10వేలు ఇచ్చినట్లు తెలిపారు. సంఘటిత, అసంఘటిత రంగంలో ఉన్న కార్మికుల సంక్షేమానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసిందని, ఆ పథకాలన్నీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో అమలు కావడం లేదన్నారు. ఇందు కోసం పోరాటం చేయాల్సిన అవసరముందని తెలిపారు. వైఎస్సార్టీయూసీ జిల్లా అధ్యక్షుడు ఎం. జాషువా మాట్లాడుతూ కార్మికుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్టీయూసీ వారి వెన్నంటి ఉంటుందని స్పష్టం చేశారు. ఈ ప్రభుత్వం వచ్చాక రిమ్స్లో 114 మంది కార్మికులను తొలగించారని, వారిని మళ్లీ విధుల్లోకి తీసుకునే వరకూ వైఎస్సార్టీయూసీ పోరాడుతుందని స్పష్టం చేశారు. నగర అధ్యక్షుడు ఏ1 నాగరాజు మాట్లాడుతూ వైఎస్సార్టీయూసీ ఏర్పడినప్పటి నుంచి సుమారు 9 ఏళ్లు ప్రతిపక్షంలోనే ఉంటూ కార్మికుల పక్షాన పోరాడిందని గుర్తు చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సింగమాల వెంకటేశ్వర్లు, డా. నాగార్జునరెడ్డి, గుంటి నాగేంద్ర, సీహెచ్ వినోద్ కుమార్, రాయల్ బాబు, రామ్మోహన్రెడ్డి, ఐస్క్రీం రవి, తోటక్రిష్ణ, త్యాగరాజు, బాలస్వామిరెడ్డి, రామక్రిష్ణారెడ్డి, షంషీర్, టీపీ వెంకట సుబ్బమ్మ, బి. మరియలు, మియ్యా, కంచుపాటి బాబు, రహీమ్, మల్లీశ్వరి, పద్మ తదితరులు పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
భర్తతో కాపురం చేయనివ్వడం లేదు
● పోలీసులు న్యాయం చేయలేదు ● అత్తింటి వద్ద బైఠాయించిన యువతి మైదుకూరు : అత్తామామలు, ఆడపడుచులు తనను భర్తతో కాపురం చేయనివ్వడం లేదని ఆరోపిస్తూ ఓ యువతి అత్తింటి వద్ద బైఠాయించిన సంఘటన శనివారం మైదుకూరు పట్టణంలో జరిగింది. ప్రొద్దుటూరుకు చెందిన తప్పెట సునీత అనే బాధిత యువతి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. సునీతకు మైదుకూరుకు చెందిన గోపవరం నవీన్ కుమార్తో రెండున్నరేళ్ల కిందట వివాహం జరిగింది. పెళ్లికి ముందే యువతి హైదరాబాద్లో, నవీన్ కుమార్ బెంగళూరులో సాఫ్ట్వేర్ ఇంజినీర్లుగా పనిచేసేవారు. వివాహం తర్వాత ఇద్దరం కలిసి కాపురం పెడదామని సునీత కోరినా కొన్నాళ్లు ఆగాలని భర్త చెప్పాడు. రెండున్నరేళ్లు గడిచినా పట్టించుకోకపోవడంతో పెద్ద మనుషులతో పంచాయితీ పెట్టించింది. కొద్ది రోజుల్లోనే ఇద్దరితో కాపురం పెట్టిస్తామని పెద్ద మనుషులు చెప్పడంతో సునీత హైదరాబాద్ వెళ్లిపోయింది. తర్వాత తనకు తన భార్య సునీతతో ప్రాణహాని ఉందని నవీన్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. తన భార్య విడాకులు తీసుకునేందుకు సమ్మతి తెలిపిందని పత్రాలు సృష్టించి విడాకులు తీసుకునేందుకు ప్రయత్నాలు చేస్తున్నాడు. ఈ విషయం తెలిసి రెండు మూడు రోజులుగా సునీత అత్తింటి వద్దకు రాగా అత్తా మామలు ఇంట్లోకి రానివ్వడం లేదు. దీంతో శనివారం సాయంత్రం అత్తింటి వద్ద బైఠాయించింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తనది పెద్దలు కుదిర్చిన వివాహమని, తల్లిదండ్రులు వివాహ సమయంలో 16 తులాలు బంగారు ఆభరణాలు పెట్టారని, రూ.7లక్షలు ఖర్చు చేసి పుట్టింటి వారే వివాహం జరిపించారని తెలిపింది. పెళ్లి తర్వాత కాపురం పెట్టాలని కోరగా తన భర్త వాయిదా వేస్తూ వచ్చాడని పేర్కొంది. తాను పండుగ రోజుల్లో హైదరాబాద్ నుంచి వస్తే అత్త, ఆడపడుచులు ఇంట్లోకి రానివ్వరని ఆరోపించింది. అదనపు కట్నంగా స్థలాలు, ఇల్లు రాయించుకుని రావాలని అత్త లక్ష్మీదేవి తనను వేధిస్తోందని తెలిపింది. వేధింపులు తాళలేక మైదుకూరు పోలీసులను ఆశ్రయించగా ప్రొద్దుటూరులో ఫిర్యాదు చేయాలని చెప్పారని, ప్రొద్దుటూరు టూటౌన్ పోలీసుల వద్దకు వెళితే మైదుకూరులో ఫిర్యాదు చేయమన్నారని వాపోయింది. దిక్కు తోచక వారం కిందట ఎస్పీ కార్యాలయంలో ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. అయినా ఇంత వరకు పోలీసుల నుంచి ఎలాంటి స్పందన కనిపించలేదని అన్నారు. తాను ఇంటి వద్దకు రాగానే అత్తా మామలు ఇంటికి తాళం వేసి వెళ్లిపోయారని చెప్పింది. తనకు న్యాయం చేయాలని బాధిత యువతి సునీత కోరుతోంది. -
సంగీతం, సాహిత్యం మూర్తీభవించిన మహాకవి పుట్టపర్తి
కడప అర్బన్: తెలుగు పదాలతో ‘శివతాండవం’ఆడించి, తెలుగు సాహితీ కారుల్లో అగ్రగణ్యుడుగా నిలిచిన మహాకవి పద్మశ్రీ పుట్టపర్తి నారాయణాచార్యులు అని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కొనియాడారు. శనివారం పుట్టపర్తి నారాయణాచార్యులు జయంతిని పురస్కరించుకుని సరస్వతి పుత్రుడి చిత్రపటానికి పూలమాలవేసి జిల్లా ఎస్పీ ఘనంగా నివాళులు అర్పించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ సంగీతం, సాహిత్యం మూర్తీ భవించిన వ్యక్తిత్వం నారాయణాచార్యులదని పేర్కొన్నారు. ‘శివతాండవ కావ్యం’చదువుతున్నంతసేపూ గుక్క తిప్పుకోనీయదని, కనురెప్ప వాల్చనీయదన్నారు. అనితర సాధ్యమైన కావ్యాన్ని రచించి సాహిత్యాకాశంలో ‘పుట్టపర్తి’ధ్రువతారగా నిలిచిపోయారన్నారు. కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏ.ఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, ఏఆర్ డీఎస్పీ పీ.నాగేశ్వర రావు, ఆర్.ఐ శివరాముడు తదితరులు పాల్గొన్నారు. -
ప్రతి ఒక్కరూ ట్రాఫిక్ నిబంధలను పాటించాలి
కడప అర్బన్: ప్రతి ఒక్క వాహనదారుడు ట్రాఫిక్ నిబంధనలను పాటించాలని జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని అన్నారు. శనివారం కడపలోని జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసదన్లో నిర్వహించిన న్యాయవిజ్ఞాన సదస్సులో వివిధ కళాశాలల విద్యార్థులకు 38 హెల్మెట్లను జిల్లా ప్రధానన్యాయమూర్తి చేతుల మీదుగా పంపిణీ చేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధానన్యాయమూర్తి మాట్లాడుతూ హెల్మెట్, సీటు బెల్ట్ తప్పకుండా పెట్టుకోవాలన్నారు. మద్యం తాగి డ్రైవ్ చేయకూడదన్నారు. డ్రైవింగ్ లైసెనన్స్ లేకుండా వాహనాలను నడుపరాదన్నారు. నాలుగో అదనపు జిల్లా జడ్జి జి.దీనబాబు,ఆరో అదనపు జిల్లా జడ్జి ఎన్.శాంతి, ఏడో అదనపు జిల్లా జడ్జి జి.రమేష్కుమార్, పోక్సో కోర్టు స్పెషల్ జడ్జి టి.కేశవ, ప్రిన్సిపల్ సీనియర్ సివిల్ జడ్జి కె.ప్రత్యూషకుమారి, అదనపు సీనియర్ సివిల్ జడ్జి జి.సి ఆషిఫాసుల్తానా, జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి షేక్ బాబా ఫకృద్దీన్ విచ్చేశారు. రోడ్డు ప్రమాదాలపై న్యాయ విజ్ఞాన సదస్సును బసవ రామ తారక లా కాలేజీ, బసిరెడ్డి లా కాలేజీ, ఎస్వీ, కెఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కాలేజీలు, వివేకానంద మహిళా డిగ్రీ కాలేజీ విద్యార్థులకు నిర్వహించారు. జిల్లా ప్రధానన్యాయమూర్తి డాక్టర్ సి.యామిని -
కలెక్టర్ తరఫున అవార్డు అందుకున్న డీఈఓ,స్టెప్ సీఈఓ
కడప సెవెన్రోడ్స్ : డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకం ద్వారా విద్యార్థులకు నాణ్యమైన,రుచికరమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు జిల్లాలో వినూత్నంగా చేపట్టిన స్మార్ట్ కిచెన్ విధానాన్ని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ప్రారంభించారు. ఈ స్మార్ట్ కిచెన్ విధానం ఒక మోడల్గా ఉంటూ.. మన్ననలు పొందుతోంది. ఈ నేపథ్యంలో జిల్లాలో వినూత్నంగా అమలు చేస్తున్న స్మార్ట్ కిచెన్ ప్రాజెక్ట్కు జాతీయ స్థాయిలో గుర్తింపు లభించింది. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి స్కోచ్ అవార్డు ఇండియాస్ హానెస్ట్ ఇండిపెండెంట్ హానర్కు ఎంపికయ్యారు. ఈ మేరకు శనివారం న్యూ ఢిల్లీ లోని ఇండియా హాబిటాట్ సెంటర్లో జరిగిన 106 వ స్కోచ్ సమ్మిట్ అవార్డు ప్రదాన కార్యక్రమంలో భాగంగా జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి తరపున స్కోచ్ అవార్డును జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్, స్టెప్ఈఓ విజయ్ కుమార్ అందుకున్నారు. వ్యక్తిపై హత్యాయత్నం చక్రాయపేట : మండలంలోని రాజీవ్నగర్ కాలనీకి చెందిన తేల్లూరు చిన్నరాముడుపై గుర్తు తెలియని వ్యక్తులు హత్యాయత్నానికి పాల్పడ్డారు. బాధితుడి కథనం మేరకు వివరాలు.. తన పొలంలోని వేరుశనగ పంటకు అడవి పందుల నుంచి కాపాడుకునేందుకు రాత్రిపూట కాపలా నిమిత్తం వెళతాడు. గురు, శుక్రవారాల్లో కూడా కాపలా వెళ్లాడు. అయితే కొందరు గుర్తు తెలియని వ్యక్తులు పొలం చుట్టూ ఉన్న ముళ్ల కంపకు నిప్పు పెట్టడమేకాక తనపై రాళ్లు కూడా వేశారని బాధితుడు తెలిపాడు. గురువారం రోజు గుర్తు తెలియని వ్యక్తి ఫోన్ చేసి చంపుతానని బెదిరించాడున్నారు. ఈ విషయంపై చక్రాయపేట పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపాడు. -
●రోడ్డు పనుల నిలిపివేతపై నిలదీత
● అరటి రైతులను ఆదుకోవాలి ● జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం కడప సెవెన్రోడ్స్: రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులు తక్షణమే చేపట్టాలని, జిల్లాలో అకాల వర్షాలతోపాటు పశ్చిమాసియా సంక్షోభం వల్ల నష్టపోయిన రైతులను ఆదుకోవాలని ప్రభుత్వానికి కోరుతూ జిల్లా పరిషత్సర్వసభ్య సమావేశం ఏకగ్రీవంగా తీర్మానించింది. శనివారం జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధ్యక్షతన సర్వసభ్య సమావేశం జరిగింది. ‘సీమ’జీవనాడి ఎత్తిపోతల తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, కేసీ కెనాల్, ఎస్ఆర్బీసీ తదితర సాగునీటి ప్రాజెక్టులకు జీవనాడి అయిన రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను తక్షణమే చేపట్టాలని ప్రభుత్వాన్ని కోరుతూ తీర్మానం చేయాలంటూ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ప్రతిపాదించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ప్రభుత్వం అక్రమంగా దిండి, పాలమూరు–రంగారెడ్డి పథకాలను చేపట్టి 100 టీఎంసీల నీటిని అక్రమంగా తరలించుకుపోతోందని తెలిపారు. మరోవైపు కర్ణాటక ప్రభుత్వం అక్రమంగా అల్మట్టి ఎత్తు పెంచుతోందన్నారు. ఈ నేపధ్యంలో పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ ఉపయోగం లేకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సీమ ఎత్తిపోతలకు అనుమతులు లేవంటున్న టీడీపీ నేతలు పట్టి సీమను ఎలా చేపట్టారని ప్రశ్నించారు. కూటమి పార్టీలకు 21 మంది ఎంపీలు ఉన్నప్పటికీ ప్రభుత్వం తరుపున వాదనలు వినిపించకపోవడం వల్ల పర్యావరణ అనుమతులు రాని పరిస్థితి ఏర్పడిందని ధ్వజమెత్తారు.సీమ ఎత్తిపోత పనులు తిరిగి చేపట్టాలని కోరుతూ తీర్మానం చేసేందుకు తొలుత ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి అభ్యంతరం చెప్పినా చివరకు అంగీకరించక తప్పలేదు. తమ పార్టీ కూడా మద్దతు ఇస్తుందని తెలిపా రు. జెడ్పీ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి మాట్లాడుతూ అకాల వర్షాల వల్ల అరటి రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారన్నారు. అలాగే పశ్చిమాసియా ఉద్రిక్తతల నేపధ్యంలో ఎగుమతులు నిలిచిపోవడం వల్ల ధరలు దారుణంగా పడిపోయాయన్నారు. ఈ పరిస్థితుల్లో అరటి రైతులను ఆదుకునేందుకు ప్రభు త్వం తక్షణ చర్యలు చేపట్టాలని కోరుతూ ఆయన ప్రతిపాదించిన తీర్మానాన్ని సమావేశం ఆమోదించింది. సోలార్ భూములకు పరిహారం ఇవ్వాలి పోరుమామిళ్ల మండలం చెర్లోపల్లె సర్వే నెంబరు 676లో బీసీ, ఎస్సీ పేదలు 51.67 ఎకరాల భూమిని చాలాకాలంగా సాగు చేసుకుంటున్నారని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ తెలిపారు. ఆ భూములను సోలార్ ప్రాజెక్టు యాజమాన్యానికి తహసీల్దార్ అప్పగించారని చెప్పారు. ఇప్పుడు సోలార్ యాజమాన్యం రైతుల భూములను స్వాధీనం చేసుకునేందుకు సిద్ధమైందన్నారు. రైతులకు న్యాయం చేయాలని ఆమె కోరారు. కలెక్టర్ బదులిస్తూ ఆ భూములు ఎస్సీ, బీసీలకు అసైన్మెంట్ ఇవ్వలేదని తెలిపారు. అందుకే సోలార్ ప్రాజెక్టుకు ఇచ్చామన్నారు. నిజంగా ఆ భూములుసాగు చేస్తున్నారా? లేదా? అని ఆర్డీఓ విచారణ నిర్వహిస్తారన్నారు. దౌర్జన్యంగా భూముల స్వాధీనం ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ పెద్దముడియం మండలం కల్వటాల గ్రామంలో సోలార్ ప్లాంటు పనులను చేపడుతున్నారని తెలిపారు. రైతులతో అగ్రిమెంటు లేకుండా, లీజు లేకుండా, డబ్బులు ఇవ్వకుండా పట్టా భూముల్లో కూడా దౌర్జన్యంగా పనులు చేపట్టారని ఆరోపించారు. ● పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ మాట్లాడుతూ తమ మండలంలో 16 ట్రాన్స్ఫార్మర్లు చోరీకి గురయ్యాయన్నారు. ఇందువల్ల రైతులకు తీవ్ర ఇబ్బందులు తలెత్తాయన్నారు. ఖాళీగా ఉన్న విద్యుత్ ఏఈ పోస్టులు భర్తీ చేయాలని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి కోరారు. కారుణ్య నియామకాలపై చర్చ: జిల్లా పరిషత్లో బోగస్ సర్టిఫికెట్లతో కారుణ్య ఉద్యోగాలు పొందారనే ఆరోపణలు పత్రికల్లో వస్తున్నాయని, దీనిపై వివరణ ఇవ్వాలని ఎమ్మెల్సీ రామగోపాల్రెడ్డి కోరారు. 10మంది అనర్హులు బోగస్ సర్టిఫికెట్లతో ఉద్యోగాలు పొందినమాట నిజమేనని జెడ్పీ సీఈఓ ఓబులమ్మ తెలిపారు. జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి మాట్లాడుతూ ఇన్నాళ్లు జీతాలు ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. బాధ్యులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. బీమా, పంట రుణాలపై వాగ్వివాదం పంటలు నష్టపోయిన రైతులకు రావాల్సిన బీమా సొమ్ములు ఇప్పించాలని వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి కోరారు. జిల్లాకు బీమా కింద మంజూరైన రూ.173 కోట్లు ఎక్కడుందో చెప్పాలంటూ నిలదీశారు. దీనిపై డీసీసీబీ చైర్మన్ సూర్యనారాయణరెడ్డి మాట్లాడుతూ ఒకే డీకేటీ భూమిపై నలుగురు రుణాలు గతంలో పొందారని తెలిపారు. బద్వేలులో ఒకరు అరెస్టు కూడా అయ్యారని పేర్కొన్నారు. దీనిపై బద్వేలు జెడ్పీటీసీ చిన్న పోలిరెడ్డి తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. 2025 ఖరీఫ్కు సంబంధించి పెండింగ్లో ఉన్న రూ. 25 కోట్లు బీమా విడుదల చేసి రైతులను ఆదుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి కోరారు. కడప వ్యవసాయ మార్కెట్ యార్డులో జంబోషెడ్, టాయిలెట్లు నిర్మించాలని కో ఆప్షన్ సభ్యుడు కరీముల్లా కోరారు. ● ఈ సమావేశంలో జెడ్పీ ఉపాధ్యక్షులు జేష్ఠాది శారద, పిట్టు బాలయ్య యాదవ్, జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఎమ్మెల్సీ రమేష్యాదవ్ వీఎన్ పల్లె ఎంపీపీ రఘునాథరెడ్డి ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి తాగునీరు లేక అనేక గ్రామాల ప్రజలు అలమటిస్తున్నారని చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్రెడ్డి ఆందోళన వ్యక్తం చేశారు. వెలిగల్లు నుంచి తమ మండలంలోని గ్రామాలకు నీరిచ్చే పథకాలను చేపట్టాలన్నారు. మెగా కంపెనీ అలసత్వం కారణంగా పులివెందుల తాగునీటి పథకం నుంచి తమకు నీరు రావడం లేదన్నారు. ఇందుకు కలెక్టర్ బదులిస్తూ 35 కిలోమీటర్ల పనులు పెండింగ్లో ఉన్నాయని, వాటిని త్వరగా పూర్తి చేయిస్తామన్నారు. వీరితో పాటు పలువురు జెడ్పీటీసీలు తాగునీటి సమస్యపై గళమెత్తారు. -
రాయంచపై రాములోరి విహారం
ప్రధాన గోపురం నుంచి గ్రామోత్సవానికి బయలుదేరిన ఒంటిమిట్ట రామయ్య హంస వాహనంపై ఊరేగుతున్న స్వామివారు... గ్రామోత్సవంలో ఆలయ డిప్యూటీ ఈవో ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతయ్య ఒంటిమిట్ట: ఏకశిలానగరిలోని శ్రీ కోదండ రామస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా రెండో రోజు శనివారం రాత్రి 7 నుంచి 9 గంటల వరకు హంసవాహన సేవ కనులపండువగా సాగింది. రాయంచపై రాములోరు కొలువై మాడ వీధుల్లో భక్తులకు దర్శనభాగ్యం కల్పించారు. అంతకుముందు సీతారామలక్ష్మణ మూర్తులను పట్టువస్త్రాలు, ఆభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా ముస్తాబు చేశారు. ఆలయ డిప్యూటీ ఈఓ ప్రశాంతి ఆధ్వర్యంలో సాగిన ఈ సేవలో వేలాది మంది భక్తులు పాలుపంచుకున్నారు. కోలాటం బృందం నృత్య ప్రదర్శనలు, తాళ భజనలు, మంగళవాయిద్యాలు ముందు సాగుతుండగా రాచఠీవితో హంస వాహనంపై నిలిచిన రాములవారు ఒంటిమిట్ట వీధుల్లో విహరించారు.హారతి కర్పూరాలతో భక్తులు తమ కోర్కెలు తీర్చాలని రాములవారికి ప్రణమిల్లారు. భక్తుల విన్నపాలను ఆలకిస్తూ..అభయమిస్తూ ..జీవన విధానానికే ఒకే సందేశమిస్తూ స్వామివారు ముందుకు కదిలారు. వేణుగానాలంకారంలో.. అంతకుముందు ఉదయం స్వామివారు వేణుగానాలంకారంలో భక్తులకు అభయమిచ్చారు. భక్తజన బృందాలు కోలాటాలతో స్వామివారిని కీర్తిస్తుండగా, మంగళవాయి ద్యాల నడుమ స్వామివారి ఊరేగింపు కోలాహలంగా జరిగింది. ఉదయం 11 నుంచి 12 గంటల వరకు స్నపనతిరుమంజనం నిర్వహించారు. తిరిగి సాయంత్రం 5 నుంచి 6 గంటల వరకు ఊంజల్ సేవ వైభవంగా జరిగింది. ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 1న జరిగే సీతారాముల కల్యాణాన్ని వైభవంగా నిర్వహిస్తామని జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ అడిషనల్ ఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం అన్నారు. శనివారం వారు ఒంటిమిట్ట కల్యాణ వేదిక వద్ద జరుగుతున్న ఏర్పాట్లను, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వచ్చేందుకు ఏర్పాటు చేసిన హెలీప్యాడ్ను, ఆలయం వద్ద ఏర్పాట్లను పరిశీలించారు. అనంతరం స్థానిక టీటీడీ పరిపాలన భవనంలో టీటీడీ, జిల్లా యంత్రాంగంతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ టీటీడీ, జిల్లా యంత్రాంగం అధికారులు సమన్వయం చేసుకుని, సమిష్టికిగా పని చేసి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. భక్తులకు ఎలాంటి సమస్యలు తలెత్తకుండా కమాండ్ కంట్రోల్ రూమ్ సమర్థవంతంగా పనిచేయాలన్నారు. భక్తులకు అన్నప్రసాదాలు, తాగునీరు, మజ్జిగ పంపిణీ చేసేందుకు పూర్తి స్థాయి ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కడప జిల్లా జేసీ నిధిమీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దె, టీటీడీ, జిల్లా యంత్రాంగం అధికారులు పాల్గొన్నారు. కనుల పండువగా హంస వాహన సేవ రామయ్య సన్నిధిలో ప్రణమిల్లిన భక్తజనం -
ఒంటిమిట్ట విశిష్టత నలుదిశలా వ్యాపింపచేయాలి
రాజంపేట: ఒంటిమిట్ట రామాలయం చరిత్రాత్మమైనదని, ఈ ఆలయ విశిష్టత నలుదిశలా వ్యాపింపచేయాలని రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి కలిసి ఒంటిమిట్ట(ఏకశిలానగరం)లోని శ్రీ కోదండరామున్ని దర్శించుకున్నారు. అనంతరం తూర్పు గాలిగోపురం వద్ద మీడియాతో ఎంపీ మాట్లాడుతూ రాష్ట్రంలోనే రాములవారి గుడి అంటే ఒంటమిట్ట రామాలయం అని భక్తులు విశ్వసిస్తున్నారన్నారు. రాజకీయాలకు అతీతంగా తాము రామాలయం అభివృద్ధిని కోరుకుంటున్నామన్నారు. ఆలయం అభివృద్ధి, భక్తులకు సౌకర్యం కల్పనకు సంబంధించి తాను ముందంజలో ఉంటానన్నారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి మాట్లాడుతూ ఒంటిమిట్ట కోదండరాముని ఆశీస్సులతో రాష్ట్ర ప్రజలు సుఖసంతోషాలతో ఉండాలన్నారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి ఎప్పుడూ ఒంటిమిట్ట కోదండరాముని ఆశీస్సులు ఉండాలని కోరుకుంటున్నామన్నారు. భక్తులకు అసౌకర్యం కలగుకుండా బ్రహ్మోత్సవాలు బ్రహ్మండంగా తిరుమల తిరుపతి దేవస్ధానం, ప్రభుత్వం నిర్వహించాలన్నారు. మంచి కార్యక్రమానికి వైఎస్సార్సీపీ మద్దత్తు ఎల్లప్పుడూ ఉంటుందన్నారు. ప్రజలందరికి శ్రీరాముని ఆశీస్సులు కలగాలని కోరుకుంటున్నామన్నారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ నేతలు చొప్పా ఎల్లారెడ్డి, జెడ్పీమాజీ వైస్చైర్మన్ ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్రెడ్డి, మండల పార్టీ కన్వీనర్ టక్కోలు శివారెడ్డి, సిద్దవరం గోపిరెడ్డి, మేకపాటి నందకిషోర్రెడ్డి, ఆకేపాటి శివారెడ్డి, మహిళరాష్ట్రనాయకురాలు ఏకులరాజేశ్వరీ రెడ్డి, రైల్వేకోడూరు వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి పాల్గొన్నారు. అంతకముందు ఆలయంలో టీటీడీ ఆధ్వర్యంలో ఎమ్మెల్యే, ఎంపీలకు శాలువాలు కప్పి సత్కరించారు. రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి -
● ఒంటిమిట్ట రామయ్యసేవలో ప్రముఖులు
ఒంటిమిట్ట:ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో కొలువైన శ్రీరామచంద్రున్ని శుక్రవారం శ్రీరామనవమి సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ఎం.బాలాజి, వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, గుంతకల్ డివిజనల్ రైల్వే మేనేజర్(డీఆర్ఎం) చంద్రశేఖర్ గుప్తా, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, దర్శించుకున్నారు.వీరికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. మూలవిరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేసి, సత్కరించారు. -
పరిహారం మరిచి.. పరిహాసమా!
కడప అగ్రికల్చర్: సీఎం చంద్రబాబు నాయకత్వంలోని కూటమి ప్రభుత్వం అన్నదాతలతో ఆటలాడుకుంటోంది. ప్రకృతి ప్రకోపానికి తీవ్రంగా నష్టపోయిన అన్నదాతకు పరిహారంతో మందు పూయాల్సింది పోయి నయాపైసా ఇవ్వకుండా పరిహాసమాడుతోంది. వ్యవసాయానికి చేయూతనివ్వకుండా వేధిస్తోంది. కష్టకాలంలో కర్షకులకు వెన్నుదన్నుగా నిలిచే పలు పథకాలకు నిలువునా తూట్లు పొడుస్తోంది. గతేడాది మోంథా తుపాన్ కారణంగా దెబ్బతిన్న పంటలకు ఇప్పటికీ నష్టపరిహారం చెల్లించలేదు. ఆ గాయం మరవకముందే తాజాగా వారం రోజుల క్రితం జిల్లాలో ఈదురు గాలులు, అకాల వర్షాలు రైతన్నలను నిలువునా దెబ్బతీశాయి. ముఖ్యంగా జిల్లాలో అరటి పంటతోపాటు మొక్కజొన్న, సజ్జపంటలు దెబ్బతిని నష్టపోయారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి రైతులు పంటల బీమా ప్రీమియం చెల్లించినా ఆ పంటలకు సంబంధించిన నష్టపరిహారం ఇప్పటికి ఇవ్వలేదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో సర్కారు చిత్తశుద్ధితో వ్యవసాయానికి వెన్నుదన్నుగా నిలిచింది. రైతులు ఆర్థికాభివృద్ధికి అడుగడుగునా చేయూతనిచ్చింది. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత రైతుల పరిస్థితి దయనీయంగా మారింది. గతంలో అన్నదాతలకు ఉచితంగా అందిన పంటల బీమా పథకాన్ని ఇప్పుడు అనుచితంగా మార్చేసింది. నిలువునా నష్టపోయిన రైతన్న... గతేడాది సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో ఏర్పడిన మోంథా తుపాన్ కారణంగా జిల్లా రైతులు భారీగా నష్టపోయారు. జిల్లాలో 3988 మంది రైతులకు సంబంధించి వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి 5193.5 ఎకరాలో వరి, మినుము, పత్తి, మొక్కజొన్న, ఉల్లి, పూల పంటలు దెబ్బతిని రూ. 540.26 లక్షల మేర నష్టం వాటిల్లింది. తాజాగా వారం రోజుల క్రితం బంగాళాఖాతంలో అల్పపీడనం కారణంగా ఈ నెల 19, 20 తేదీలలో వీచిన ఈదురుగాలులు, అకాల వర్షాలతో జిల్లాలోని 6 మండలాల్లో 21 గ్రామాలలో 107 మంది రైతులకు సంబంధించి 98.40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న, సజ్జపంటలకు నష్టం జరిగింది. అలాగే జిల్లాలోని రాజంపేట, సింహాద్రిపురం, తొండూరు, ముద్దనూరు మండలాల్లో అరటికి సంబంధించి 62 మంది రైతులకు రూ. 156 లక్షల మేర నష్టం జరిగింది. ఇలా వ్యవసాయ, ఉద్యాన పంటలకు సంబంధించి అకాల వర్షాలు, ఈదురు గాలులతో జిల్లాలో రూ. 400 లక్షలకుపైగా నష్టం వాటి ల్లినట్లు తెలిసింది. గతేడాది వచ్చిన మోంథా తుపాన్ వల్ల నేలవాలిన వరిపంట కొండాపురంలో నేలవాలిన మొక్కజొన్న పంటను చూపుతున్న రైతు 7 లక్షల దాకా నష్టం... ఇటీవల వచ్చిన అకాల వర్షాలు, ఈదురు గాలులకు 13 ఎకరాల్లో మొక్కజొన్న పంట నేలబడిపోయింది. దీంతో 7 లక్షల దాకా నష్టం వచ్చింది. ఎకరాకు 30 క్వింటాల్ చొప్పున దిగుబడి వచ్చేది. అలాంటి పూర్తిగా నేలపడిపోయి పనికిరాకుండా పోయింది. పెట్టుబడితోపాటు దిగుబడి కూడా నేలపాలైంది. – విశ్వనాథరెడ్డి, ఓబన్నపేట, కొండాపురం మండలం పది లక్షలు నష్టపోయా... 3700 ఆరటి మొక్కలను నాటాను. మొదటికాపు. ఆరటి గెలలతో పొలమంతా నిండుగా పంట ఉండింది. ఉన్నట్లుండి వచ్చిన ఈదురుగాలులు అకాల వర్షంతో గెలలతో సహా చెట్లన్నీ నేలపడిపోయాయి. దీంతో దాదాపు పది లక్షల దాకా నష్టం వచ్చింది. ఒక్క రుపాయి కూడా వచ్చే పరిస్థితి లేదు. మమ్మల్ని ప్రభుత్వమే ఆదుకోవాలి. – మధుసూదన్రెడ్డి, సింహాద్రిపురం తక్షణమే నష్ట పరిహారం చెల్లించాలి గతేడాది మోంథా తుపాన్తో నష్టపోయిన రైతులకు ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదు. మళ్లీ ఇటీవల అకాల వర్షంతోపాటు ఈదురు గాలలతో జిల్లాలో ఆరటి, మొక్కజొన్న, సజ్జపంట పూర్తిగా నెల పడిపోయి రైతులు నష్టపోయారు. ప్రభుత్వం స్పందించి తక్షణమే నష్టపోయిన రైతులను ఆదుకోవాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు పంట నష్ట పరిహారం కోసం ఏడాదిగా ఎదురుచూపు గతేడాది తుపాన్లు, వర్షాలతో తీవ్రంగా నష్టపోయిన జిల్లా రైతులు తాజాగా అకాల వర్షాలు, గాలులతోఅరటి, మొక్కజొన్న, సజ్జపంట నష్టం నాలుగు సీజన్లు ముగుస్తున్నాపైసా విదిల్చని కూటమి సర్కార్ ఆందోళనలో అన్నదాతలు గత ఏడాది ఖరీఫ్ సీజన్లో చంద్రబాబు ప్రభుత్వం వరిపంటకు సంబంధించి ఎకరాకు రూ. 630, వేరుశనగకు ఎకరాకు రూ. 450, మామిడికి ఎకరాలకు రూ. 1750 చొప్పున రైతుల నుంచి ప్రీమియం కట్టించింది. బాబు సర్కార్ అధికారంలోకి వచ్చిన 2024 జూలై 12 నుంచి 2026 మార్చి వరకు దాదాపు నాలుగు సీజన్లు పూర్తి అయాయి. బీమా ప్రీమియం చెల్లించినా రైతులకు మాత్రం పంటల నష్ట పరిహారం కింద ఇప్పటి వరకు ఒక్క పైసా కూడా చెల్లించలేదు. గతేడాది వరుస తుఫాన్లతోపాటు వర్షాలకు పంటల దెబ్బతిన్న రైతులు పరిహారం కోసం ఆశగా ఎదురు చూస్తున్నారు. -
గండిలో అంజన్న గ్రామోత్సవం
చక్రాయపేట : గండి వీరాంజనేయస్వామి సన్నిధిలో శ్రీరామ నవమి పర్వదినం సందర్భంగా స్వామి వారి గ్రామోత్సవం వైభవంగా నిర్వహించారు. పండుగ సందర్భంగా భక్తులు ఉదయం నుంచి అధిక సంఖ్యలో వచ్చి భక్తి ప్రపత్తులతో స్వామిని దర్శించుకున్నారు. సాయంత్రం ప్రత్యేకంగా అలంకరించిన ఉష్ట్ర వాహనంపై స్వామి ఉత్సవ విగ్రహం ఉంచి గండి పురవీధులతోపాటు సమీపంలోని వీరన్నగట్టుపల్లెలో స్వామి వారిని ఊరేగించారు. గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పరిధిలోని రింగురోడ్డుపై జయరాజ గార్డెన్స్ సమీపంలో గురువారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని భూమిరెడ్డి సూర్యనారాయణ(43) అనే వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. మైదుకూరు నివాసి సూర్యనారాయణ తన కుమారుడు వెంకన్నారాయణను చైతన్య పాఠశాలలో వదిలేందుకు మైదుకూరు నుంచి కడపకు వస్తుండగా జయరాజా గార్డెన్స్ సమీపంలో వారి బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడ్డ తండ్రి కుమారులను వైద్య సేవల కోసం రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. గురువారం అర్ధరాత్రి పన్నెండు గంటల సమయంలో భూమిరెడ్డి సూర్యనారాయణ మృతి చెందాడని, వెంకట నారాయణ చికిత్స పొందుతున్నట్లు కుటుంబ సభ్యులు తెలియజేశారు. అశ్రునయనాలతో వీడ్కోలు మైదుకూరు : భూమిరెడ్డి సూర్యనారాయణకు శుక్రవారం కుటుంబ సభ్యులు, బంధువులు, మిత్రులు అశ్రునయనాలతో కడపటి వీడ్కోలు పలికారు. విద్యార్థి దశ నుంచి మంచి క్రీడాకారుడిగా సూర్యనారాయణతో తమ అనుబంధాన్ని తలుచుకుని మిత్రులు కన్నీటి పర్యంతమయ్యారు. మైదుకూరులో క్రికెట్ టోర్నమెంట్ల నిర్వహణలో అతను చురుగ్గా ఉండేవాడని మైదుకూరు క్రికెట్ క్లబ్ సభ్యులు తెలిపారు. -
పెన్షనర్లు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలి
రాజంపేట : పెన్షనర్లు ఆరోగ్యంపై దృష్టి పెట్టాలని హైకోర్టు న్యాయమూర్తి ఎం.బాలాజీ సూచించారు. రాజంపేటలోని ఆయన స్వగృహంలో ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేన్ ఆధ్వర్యంలో పెన్షనర్లు మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా హైకోర్టు న్యాయమూర్తి ప్రభుత్వ ఉద్యోగం నుంచి రిటైర్డ్ అయిన వారికి సూచనలు, సలహాలు అందజేశారు. పని చేసి రిటైర్డ్ అయిన తర్వాతే ఉత్సాహంగా, ఆరోగ్యంగా మరింతగా ఉండాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండాలంటే ప్రతి రోజు వాకింగ్ చేయాలని చెప్పారు. రిటైర్డ్ అయిన తర్వాత మిగిలిన జీవిత కాలాన్ని ప్రశాంతంగా కొనసాగేలా వ్యవహరించాలన్నారు. అనంతరం హైకోర్టు న్యాయమూర్తిని ప్రభుత్వ పెన్షనర్ల అసోసియేషన్ రాజంపేట తాలుకా ప్రెసిడెంట్ పిల్లి పిచ్చయ్య, ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంక్ మాజీ మేనేజరు పిల్లి పిచ్చయ్య, డీసీసీ మాజీ జనరల్ మేనేజరు గాలిశెట్టి మనోహర్ నేతృత్వంలో శాలువా కప్పి, జ్ఞాపిక అందజేసి ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో పెన్షనర్లు భాస్కర్ పంతులు, వెంకటేశ్వరి, జయమ్మ, రామానాయుడు, డి.బాబు, కె.నరసయ్య, ఎ.సుబ్రమణ్యం, పిల్లి నరసింహులు, పాల రాజగోపాల్, ఎంవీ రమణ, రాజేశ్వరరావు, బొడ్డు శంకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
గుండెపోటుతో వ్యక్తి మృతి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాలకు సంబంధించి కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తుండగా అంజి(44) అనే వ్యక్తి గుండెపోటుతో మృతి చెందినట్లు ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. కల్యాణ వేదిక వద్ద పనులు చేస్తున్న అంజి అనే వ్యక్తికి అకస్మాత్తుగా గుండెపోటు రావడంతో 108 సహాయంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ అతను చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. మృతుడి వివరాలు తెలిసిన వారు 9121100582, 9121100581 అనే ఫోన్ నంబర్లను సంప్రదించాలని కోరారు. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని మృతదేహాలు కడప అర్బన్: కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)కు చికిత్స కోసం వేర్వేరు రోజుల్లో వచ్చిన ఇద్దరు తీవ్ర అనారోగ్యంతో వేర్వేరు సమయాలలో మృతి చెందారు. వారి మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీలో వుంచారు. వీరి ఆచూకీ తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు తెలియజేశారు. అగ్నిప్రమాదంలో భారీ నష్టం ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని గీతాశ్రమం వీధిలో శుక్రవారం జరిగిన అగ్నిప్రమాదంలో భారీ నష్టం సంభవించింది. ఒక ఇంట్లో నుంచి మరో ఇంట్లోకి మంటలు వ్యాపించడంతో భారీ నష్టం జరిగింది. బాధితులు తెలిపిన వివరాల మేరకు.. కృష్ణపాటి రాధమ్మ ఇంట్లోని వరండాలో ఉన్న కూలర్లో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్నిప్రమాదం సంభవించింది. మంటలు పెద్ద ఎత్తున చెలరేగి ఇంట్లోని బట్టలు, నిత్యావసర వస్తువులు, ఫర్నీచర్, టీవీ పూర్తిగా కాలిపోయాయి. అయితే మంటలను అదుపు చేసేలోగా పక్కన ఉన్న కామిశెట్టి రమాదేవి ఇంట్లోకి వ్యాపించాయి. ఈ ప్రమాదం ధాటికి గ్రైండర్, ఓవెన్, టీవీ, దుకాణానికి సంబంధించిన వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. అలాగే పెద్ద మొత్తంలో డబ్బు, గోధుమ పిండి, బియ్యం బస్తాలు, ఇంటి పైకప్పు, స్లాబ్ దంతెలు కాలిపోయాయి. అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలను అదుపు చేశారు. రెండు ఇళ్లలోనూ సుమారు రూ.8 లక్షల వరకు నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక అధికారులు అంచనా వేశారు. -
నేడు ఒంటిమిట్టకు ఎంపీ మిథున్రెడ్డి రాక
రాజంపేట: ఏకశిలానగిరి (ఒంటిమిట్ట)లో జరుగుతున్న శ్రీ కోదండరామయ్య బ్రహ్మోత్సవాలకు శనివారం రాజంపేట లోక్సభ సభ్యుడు పెద్దిరెడ్డి మిథున్రెడ్డి రానున్నట్లు రాజంపేట ఎమ్మెల్యే కార్యాలయం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపింది. ఆలయంలోని సీతారామలక్ష్మణలను ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథ్డ్డితో కలిసి దర్శించుకుంటారన్నారు. ఉదయం 10.30 గంటలకు ఒంటిమిట్టకు చేరుకోనున్నారు. వీరి వెంట నియోజకవర్గ వైఎస్సార్సీపీ ముఖ్యనేతలు పాల్గొంటారు. కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ స్టేట్ ఎలిజిబిలిటీ టెస్ట్ (సెట్) పరీక్షకు ఆత్మవిశ్వాసంతో వెళ్లాలని యోగి వేమన విశ్వవిద్యాలయం ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అన్నారు. ఉపకులపతి స్వయంగా యూజీసీ నెట్/ఏపీ సెట్ ఉచిత శిక్షణా తరగతులు ఉదయం 9 నుంచి 10 గంటల వరకు (రెగ్యులర్ తరగతులకు ఇబ్బంది కలుగకుండా) నిర్వహిస్తున్నారు. ఈనెల 28 , 29 తేదీలలో సెట్ పరీక్ష ఉన్న నేపథ్యంలో విద్యార్థుల సౌకర్యార్థం శ్రీరామనవమి పండుగ అయినప్పటికీ శుక్రవారం బోధన చేశారు. పరీక్షల్లో రాదగిన అంశాలు, ఎలా ఆన్సర్ చేయాలో వివరించారు. పేపర్–1 లో అధిక మార్కులు స్టోర్ చేస్తే సెట్లో అర్హత సాధించడం సులువుతుందని విద్యార్థులకు తెలిపారు. కొండాపురం: గండికోటజలాశయం నుంచి కృష్ణాజలాలను మైలవరం జలాశయానికి 2500 క్యూ సెక్కులు విడుదల చేసినట్లు జలవనరులశాఖ ఈఈ ఉమమహేశ్వర్లు శుక్రవారం తెలిపారు. గండికోట ప్రాజెక్టు నుంచి ఒక గేట్ ఎత్తి మైలవరం జలాశయం పరిధిలో తాగునీటి ఆవసరాలకోసం నీటిని పంపిస్తున్నట్లు వివరించారు. మైలవరం ప్రాజెక్టుకు 2 టీఎంసీలు పంపుతున్నట్లు చెప్పారు. ప్రస్తుతం గండికోట జలాశయంలో 24.5 టీఎంసీల నీరు నిల్వ ఉందని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: కడప నగర శివార్లలోని శిల్పారామంలో శిల్పారామం చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ వి.స్వామి నాయుడు ఆదేశాల ప్రకారం చేతి వృత్తులకు సంబంధించి ప్రత్యేక స్టాల్స్లను కేటాయించనున్నట్లు ఇన్చార్జి అధికారి వెంకట సుబ్బయ్య తెలిపారు. శుక్రవారం ఆయన మాట్లాడుతూ చేనేత వృత్తులతోపాటు కొండపల్లి బొమ్మలు,కుమ్మర్లకు స్టాల్స్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నామన్నారు.చిన్నపిల్ల లు, పెద్దవారికి సంబంధించిన వినోదాత్మకమైన గేమ్స్ నిర్వహణకు సంబంధించి ఆసక్తి కలవారికి ఈఓఐ పద్ధతి ద్వారా స్థలాన్ని కేటాయిస్తామన్నారు. సంబందిత వర్గాలు ఏప్రిల్ 6వ తేదీ లోగా దరఖాస్తు చేసుకోవాలన్నారు. వివరాలకు కడప శిల్పారామం ఆఫీస్లో సంప్రదించాలని సూచించారు. సౌమ్యనాఽథున్ని దర్శించుకున్న గుంతకల్ డీఆర్ఎం నందలూరు: నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని గుంతకల్ డివిజనల్ మేనేజర్ (డీఆర్ఎం)చంద్రశేఖర్ గుప్తా దంపతులు శుక్రవారం రాత్రి దర్శించుకున్నారు. అర్చకులు సునీల్, సాయికృష్ణ డీఆర్ఎం దంపతులకు ఆలయ మర్యాదలతో స్వాగతం పలికి ప్రత్యేక పూజలు నిర్వహింపజేశారు. ఈ సందర్భంగా ఆలయ చరిత్రను వారికి వివరించారు. అనంతరం తీర్థప్రసాదాలు అందజేసి పూలమాల, శాలువాతో సత్కరించారు. అనంతరం రైల్వేస్టేషన్కు చేరుకున్న ఆయనకు రైల్వే కన్సల్టేటివ్ మెంబర్ రాచూరి మురళి డీఆర్ఎంకు పలు సమస్యలపై వినతిపత్రం అందజేశారు. సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో సీనియర్ డీఓఎం శ్రావణ్కుమార్, సీనియర్ డీఈఎన్ సుదర్శన్రెడ్డి, డీఆర్యు సీసీ మెంబర్ తళ్లెం భరత్కుమార్రెడ్డి పాల్గొన్నారు. -
కోలుకుంటున్న తల్లి, ముగ్గురు పిల్లలు
ప్రొద్దుటూరు క్రైం: పట్టణంలోని ఈశ్వరరెడ్డినగర్లో పిల్లలతో సహా ఆత్మహత్యకు ప్రయత్నించిన భువనేశ్వరి, ముగ్గురు పిల్లలు కడప రిమ్స్లో కోలుకుంటున్నారు. వారి ఆరోగ్యం నిలకడగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. గురువారం రాత్రి భువనేశ్వరి తన ముగ్గురు పిల్లలు సుష్మ, నిఖిత, ఘణలకు పురుగుల మందు కలిపిన కూల్డ్రింక్ను తాపించి ఆపై ఆమె కూడా తాగి ఆత్మహత్యకు యత్నించిన విషయం తెలిసిందే. నలుగురి పరిస్థితి ఆందోళన కరంగా ఉండటంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి నుంచి కడప రిమ్స్కు తరలించారు. వీరిలో భువనేశ్వరి, సుష్మల ఆరోగ్యం అత్యంత విషమంగా ఉందని వైద్యులు చెప్పారు. గురువారం రాత్రి నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు ఇద్దరూ అపస్మారక స్థితిలోనే ఉండిపోయారు. అయితే మధ్యాహ్నం తర్వాత వీళ్లిద్దరి ఆరోగ్యం కాస్త మెరుగు పడినట్లు వైద్యులు తెలిపారు. ప్రస్తుతం నలుగురి ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. భువనేశ్వరిపై హత్యాయత్నం కేసు నమోదు భువనేశ్వరిపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పిల్లలకు వారి అనుమతి లేకుండా పురుగుల మందుకలిపిన కూల్డ్రింక్ తాపించి చంపడానికిప్రయత్నించిందనే కారణంతో ఆమైపె హత్యా యత్నం కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయం జియాలజి శాఖకు చెందిన ఆచార్యులు ఎన్. జయరాజుకు అంతర్జాతీయ సదస్సుకు హాజరుకావాలని యూకేలోని కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఆహ్వానం పంపింది. ఈ నెల 30 నుంచి ఏప్రిల్ 1వ తేదీ వరకు కేంబ్రిడ్జి యూనివర్సిటీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ మేథమేటికల్ సైన్స్ వారు నిర్వహించే అంతర్జాతీయ సదస్సులో ఆచార్య జయరాజు ‘కృత్రిమ మేథస్సు అను వర్తనాలు’(ఏఐ ఇన్ ఓపెన్ సైన్స్) అనే అంశంపై ప్రసంగించనున్నారు.జయరాజుకు విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్, ఇన్చార్జి రిజిస్ట్రార్ ఆచార్య పి.పద్మ అభినందనలు తెలిపారు. -
గుప్త నిధుల కోసం తవ్వకాలు
జమ్మలమడుగు రూరల్ : పర్యాటక ప్రాంతమైన గండికోటలో గుప్తనిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు జరిపినట్లు గండికోటకు చెందిన పొలం గల రైతు శుక్రవారం తెలిపారు. గురువారం అర్ధరాత్రి గండికోటలో పురాతన మసీద్ పక్కన పొలంలో తవ్వకాలు చేపట్టారు. గతంలో కూడా పలు మార్లు తవ్వకాలు జరిపినట్లు తెలిసింది. స్థానిక ప్రజల సహకారం లేనిదే ఈ వ్యవహారం జరగదని పలువురు అంటున్నారు. చామలూరు గ్రామంలో.. కొండాపురం : మండలంలోని చామలూరు గ్రామానికి చెందిన జి.రామాంజనేయులరెడ్డి పొలంలో గుప్తనిధుల కోసం దుండగులు తవ్వకాలు చేపట్టిన ఘటన గురువారం రాత్రి చోటుచేసుకొంది. శుక్రవారం ఉదయం తన పొలంలోకి రైతు వెళ్లి చూడగా పుట్ట వద్ద జేసీబీతో సుమారు పది అడుగుల లోతు తవ్వినట్లు తెలిపారు. బొలేరో క్యాంపర్ జాడలు ఉన్నట్లు పేర్కొన్నారు. పుట్ట వద్ద పసుపు కుంకుమ అచ్చింతలు ఉన్నాయని పూజలు చేసి తవ్వకాలు చేపట్టినట్లు ఆయన తెలిపారు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు సమచారం ఇచ్చినట్లు వివరించారు. కొండాపురం మండలం చామలూరు పొలంలో తవ్విన గుంత గండికోట వద్ద పొలంలో తవ్వకాలు జరిగిన ప్రదేశం -
● త్రేతాయుగాన్ని తలపించిన సంక్షిప్త రామాయణ ప్రదర్శన
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా టీటీడీ ఉద్యాన శాఖ అధికారి శ్రీనివాసులు ఆధ్వర్యంలో త్రేతాయుగాన్ని మళ్లీ గుర్తుకు చేసేలా సంక్షిప్త రామాయణ ప్రదర్శణ నిర్వహించారు. ఈ ప్రదర్శనలో రామాయణంలో ఉన్న కొన్ని ముఖ్య సన్నివేశాలను బొమ్మల రూపంలో ప్రదర్శించారు. ఇది భక్తులను కనువిందు చేసింది. ఈ ప్రదర్శనలో బాల్యంలో రామ, లక్ష్మణ, భరత, శత్రుఘ్నులు పెరిగిన తీరు, సీతా స్వయంవరంలో శివధనుస్సును విరిచిన శ్రీరాముడు, సీతారాముల కల్యాణం, వనవాసంలో బంగారు జింక కొరిన సీత, రావణుడు సీతాదేవిని అపహరించుట, చెట్టు చాటునుంచి వాలిని రాముడు వధించుట, ఆశోక వనంలో ఉన్న సీతను చేరుకున్న హనుమకు చూడామణిని ఇవ్వడం, లంకిణి నోటి నుంచి హనుమంతుడు బయటకు రావడం, వాల్మీకి చెంత లవకుశలు రామాయణ చరితం చెప్పే సన్నివేశాలు ఏర్పాటు చేశారు. త్రేతాయుగంలో జరిగిన సంఘటలను అచ్చం అలాగే బొమ్మల రూపంలో తీర్చిదిద్దారు. -
భద్రాచలం తరహాలో ఒంటిమిట్టను అభివృద్ధి చేయాలి
రాజంపేట : భద్రాచలం తరహాలో ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ను అభివృద్ధి చేయాలని డీఆర్ఎం చంద్రశేఖర్గుప్తాను కోరినట్లు గుంతకల్ డివిజనల్ రైల్వే యూజర్స్ కమిటీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం ఒంటిమిట్టకు విచ్చేసిన డీఆర్ఎంతో ఆయన రైల్వేస్టేషన్లో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఒంటిమిట్ట స్టేషన్ అభివృద్ధితోపాటు ప్రయాణికులకు సౌకర్యాలను కల్పించే దిశగా నిర్ణయాలు తీసుకోవాలన్నారు. రాష్ట్ర ప్రభుత్వ అధికారిక రామాలయంగా గుర్తింపు పొందడంతో.. రాష్ట్రంలోని నలుమూలల నుంచి వేలాదిగా భక్తులు వస్తున్నారన్నారు. వీరందరికీ కూడా రైలు ద్వారా ఒంటిమిట్ట చేరుకునే పరిస్థితులు లేవన్నారు. అటు కడప, ఇటు నందలూరులో దిగి ఒంటిమిట్టకు చేరుకుంటున్నారన్నారు. ముంబై–చైన్నె రైల్వేమార్గంలో ప్రధాన పుణ్యక్షేత్రమైన ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లలో ముందుగా కొన్ని రైళ్లకు అయినా హాల్టింగ్ ఇవ్వాలన్నారు. ముఖ్యంగా వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ, చైన్నె రైళ్లకు హాల్టింగ్ ఇవ్వాలన్నారు. అలాగే స్టేషన్లో రెండు ప్లాట్ఫాంల మధ్య ఫుట్ ఓవర్ బ్రిడ్జి నిర్మితం చేయాలని కోరారు. తాగునీటి సౌకర్యాలు, రెండు ప్లాట్పాంలలో పై కప్పులు వేయాలన్నారు. అలాగే ఒంటిమిట్టకు వచ్చే యాత్రికులకు రెస్ట్ రూంలు, వేచివుండే గదులు, మరుగుదొడ్లు నిర్మించాలని కోరారు. ఇప్పటికే ఒంటిమిట్ట రైల్వేస్టేషన్ అభివృద్ధి విషయంలో ఎంపీ పీవీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిలు రైల్వేమంత్రి (మినిస్టర్ ఆఫ్ రైల్వేస్)కు వినతులు ఇచ్చారన్నారు. రైళ్లకు స్టాపేజి ఇవ్వడం వల్ల రాష్ట్రంలోని నలుమూలల నుంచి వచ్చే యాత్రికులు, భక్తులకు రైలుసౌకర్యం కల్పించినట్లవుతుందని ఎంపీలు ఇప్పటికే రైల్వేశాఖకు తెలియచేశారని గుర్తు చేశారు. డీఆర్ఎం కూడా సానుకూలంగా స్పందించారని తెలిపారు. డీఆర్ఎంతో పాటు గుంతకల్ రైల్వే డివిజన్ అధికారులు, స్థానిక రైల్వే అధికారులు పాల్గొన్నారు. డీఆర్ఎం వెంట ఏడీఆర్ఎం సుదర్శన్రెడ్డి, అసిస్టెంట్ కమిషనరు రాజగోపాల్రెడ్డి, సీసీఐ జనార్ధన్, ఆర్పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, ఎస్ఐ వనిత, జీఆర్పీ అధికారి సునీల్రెడ్డి, గల్లా శ్రీను, శివకుమార్రెడ్డి తదితరులు ఉన్నారు. ఇప్పటికే ఎంఆర్కు ఎంపీలు వినతులు ఒంటిమిట్ట రైల్వేస్టేషన్లో డీఆర్ఎంతో భేటీ గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్రెడ్డి -
ఇదేమిటి.. రామా !
● ఆలయంలో ప్రొటోకాల్ తప్పారా..! ● టీడీపీ నేత పట్టువస్త్రాల సమర్పణపై అభ్యంతరాలు ● నోరు మెదపలేకపోతున్న ఆలయ అధికారులు రాజంపేట : ఒంటిమిట్ట కోదండ రామాలయంలో శ్రీరామనవమి సందర్భంగా పట్టువస్త్రాలు సమర్పించిన నాయకుడు.. వార్డు మెంబరు కాదు.. సర్పంచి కాదు.. ఎంపీపీ కాదు.. ఎమ్మెల్యే కాదు.. ఎంపీ కాదు.. రాజంపేట టీడీపీ ఇన్చార్జిగా ఉన్న చమర్తి జగన్మోహన్రాజుకు ఎందుకు తిరుమల తిరుపతి దేవస్థానం పట్టం కట్టిందనే విమర్శలను మూటకట్టుకుంది. టీటీడీ ప్రొటోకాల్ పాటించే విషయంలో నిబంధనలు పకడ్బందీగా అమలు చేస్తుంది. ఇప్పుడు రామయ్య సన్నిధిలో టీటీడీ ప్రొటోకాల్ తప్పిందన్న విమర్శలు వెలువడ్డాయి. ఆలయ అధికారులు జీ హుజూర్ అని టీడీపీకి దాసోహమన్నారా? అన్న విమర్శలను ఎదుర్కొంటున్నారు. ఒంటిమిట్ట కోదండరామస్వామి బ్రహ్మోత్సవాల నేపథ్యంలో శ్రీరామనవమి రోజున స్వామివారికి టీడీపీ నేత పట్టువస్త్రాలను తీసుకెళ్లడంపై అభ్యంతరాలు వ్యక్తమయ్యాయి. అయితే కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన జనసేన, బీజేపీలకు ముఖ్యనేతలు ఉన్న వారికి కూడా ఈ సంప్రదాయాన్ని వర్తింపచేయాలి కదా అని కూటమి వర్గాల నుంచి భిన్నస్వరం వినిపిస్తోంది. అధికారులూ.. ప్రొటోకాల్ విషయంలో జాగ్రత్త.. ప్రొటోకాల్ విషయంలో ఉన్నతాధికారులు, అధికారులు జాగ్రత్తగా మసులుకోకపోతే రిటైర్ అయినా పింఛన్ నిలిపివేత, సస్పెండ్, ఉద్యోగం ఊస్టింగ్ ఆర్డర్స్ కూడా వచ్చే పరిస్థితులు ఉంటాయని తెలుసుకోవాలని మేధావి వర్గాలు హితువు పలుకుతున్నారు. ఒక రాజంపేట నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయి నుంచి మండల స్థాయి అధికారగణం ప్రొటోకాల్ పాటించడం లేదన్న ఆరోపణలు ఇప్పటికే వెలువడుతున్నాయి. ఉన్నతాధికారులు, అధికారులు ప్రొటోకాల్ తప్పితే సంబంధిత ప్రజాప్రతినిధులు ఉన్నత స్థాయికి ఫిర్యాదులు చేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరు రిటైర్డ్ అయినా విధి నిర్వహణలో ప్రొటోకాల్ తప్పినందుకు ఆయనను ప్రొటోకాల్ తప్పిద శాపం వెంటాడుతున్న సంగతి విదితమే. పింఛన్ కూడా నిలిపివేశారని తెలిసింది. ప్రొటోకాల్ విషయంపై వివరణ అడగడానికి ‘సాక్షి’ విలేకరులు ఫోన్ చేయగా.. టీటీడీ అధికారులు లిఫ్ట్ చేయలేదు. -
ఇస్రో సందర్శన.. విజ్ఞాన సముపార్జన
● 9వ తరగతి విద్యార్థులకు అవకాశం ● యువికా –2026కు దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : విద్యార్థి దశ నుంచే అంతరిక్ష పరిశోధనలపై ఆసక్తి పెంపొందించేందుకు భారత అంతరిక్ష పరిశోధనా సంస్థ (ఇస్రో) కృషి చేస్తోంది. ఇందుకోసం ఈ ఏడాది యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. విద్యార్థులకు సాంకేతిక, అంతరిక్ష పరిశోధనలపై ప్రాథమిక స్థాయి నుంచి విజ్ఞానాన్ని అందించడానికి ఈ కార్యక్రమం ఎంతగానో దోహద పడుతుందని సైన్స్ ఉపాధ్యాయులు చెబుతున్నారు. ఈ ఏడాది జనవరి నాటికి 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు యువికాకు అర్హులు. ఇందుకు సంబంధించిన షెడ్యూల్ను ఇస్రో విడుదల చేసింది. తమ అధికారిక వెబ్సైట్ ద్వారా విద్యార్థులు మార్చి 31 లోపు ఆన్లైన్లో నమోదు చేసుకోవడానికి గడువును ప్రకటించింది. ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. అవి డెహ్రాడూన్(ఉత్తర్ఖండ్), తిరువనంతపురం(కేరళ), సూళ్లూరుపేట(అంధ్రప్రదేశ్), బెంగుళూరు(కర్ణాటక), అహ్మదాబాద్(గుజరాత్), హైదరాబాద్( తెలంగాణ), షిల్లాంగ్(మేఘాలయ). ● 8వ తరగతిలో విద్యార్థులకు వచ్చిన మార్కులను 50 శాతం, గ్రామీణ ప్రాంతాల్లో చదువుతున్న వారికి అదనంగా 15 శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, సైన్స్ఫెయిర్ జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో పాల్గొన్న విద్యార్థులకు 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్ విద్యార్థులకు 5 శాతం, ఒలింపియాడ్ పరీక్షలో మొదటి మూడు స్థానాలకు పాఠశాల, జిల్లా, రాష్ట్ర స్థాయి ఆపై స్థాయిలో(గత 3 సంవత్సరాలు) పాల్గొన్న వారికి 5 శాతం, ఆటలపోటీల్లో పాల్గొన్న వారికి 5 శాతం కేటాయించి ఎంపిక చేస్తారు. దరఖాస్తు ఇలా.. ఇస్రో ప్రధాన వెబ్ౖసైట్లో మార్చి 31వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఐఎస్ఆర్ఓ.జీవోవి.ఇన్/యువిక.హెచ్టిఎంఎల్ లింక్ ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎంపికై న వారి జాబితాను ఏప్రిల్ 7న విడుదల చేస్తారు. మే 18న విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు యువికా–2026 ముగింపు సందర్భంగా ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. 14 రోజుల పర్యటన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులకు చక్కటి అవకాశం. ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికైన వారికి ప్రయాణం, భోజనం, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా కల్పిస్తుంది. ఎంపికై న విద్యార్థులను 14 రోజులపాటు శ్రీహరి కోటలోని సతీష్ధావన్ అంతరిక్ష కేంద్రానికి తీసుకెళ్లి అక్కడి విశేషాలు వివరిస్తారు. ఇస్రో సంస్థల్లోని శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులతో చర్చించవచ్చు, ఆస్ట్రో ఫిజిక్స్, ఆస్ట్రో బయాలజీ, మెటీరియల్ సైన్స్, కంప్యూటర్ సైన్స్లపై అవగాహన కల్పిస్తారు. అలాగే ఇస్రో చైర్మన్తో సంభాషించే అవకాశం కలుగుతుంది. రిజిస్ట్రేషన్ గడువు : మార్చి 31 వరకు ఎంపికై న విద్యార్థులు జాబితా విడుదల : ఏప్రిల్ 7 విద్యార్థులకు ఆహ్వానం : మే 18 యువికా కార్యక్రమం : మే 19 నుంచి 30 వరకు ముగింపు : మే 31 -
కసనూరులో పోలీసుల దాడులు
సాక్షి టాస్క్ఫోర్స్ : సింహాద్రిపురం మండలం కసనూరు – అంకాలమ్మ గూడూరు రోడ్డు సమీపంలోని తోటలలో గురువారం పోలీసులు దాడులు నిర్వహించారు. జూదమాడుతున్న నలుగురిని అరెస్టు చేసి రూ.19వేలు స్వాదీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. అయితే వాస్తవం ఇందుకు విరుద్ధంగా ఉన్నట్లు సమాచారం. కసనూరు గ్రామ సమీపంలోని తోటలో గత కొన్ని నెలలుగా టీడీపీ నాయకుని ఆధ్వర్యంలో జూదం జరుగుతోంది. ఈ ఇతర జిల్లాల నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు ఇక్కడికి వస్తున్నట్లు తెలుస్తోంది. అయితే ఇన్ని నెలలుగా అటువైపు కన్నెత్తి చూడని పోలీసులు గురువారం దాడులు జరిపారు. గురువారం పులివెందుల డీఎస్పీ ఆధ్వర్యంలో పలువురు సీఐలు, ఎస్ఐలు జూదశాలపై దాడి చేశారు. జూదమాడతూ 40మంది పట్టుబడటమే కాకుండా పెద్ద ఎత్తున నగదు దొరికినట్లు సమాచారం. అయితే అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు పోలీసులు కంటి తుడుపు చర్యగా నలుగురిపై కేసు నమోదు చేసి రూ.19వేల నగదు దొరికినట్లు చూపించారు. నిందితులను పోలీసులు తప్పించినట్లు సమాచారం. పోలీసులు తూతూ మంత్రంగా దాడులు చేయడంపట్ల పలువురు పెదవి విరుస్తున్నారు. స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో ప్రతిభ కడప ఎడ్యుకేషన్: కేరళ రాష్ట్రంలో ఈ నెల 13, 14 తేదీల్లో నిర్వహించిన ఆల్ ఇండియా సౌత్ జోన్ నేషనల్ ఇంటర్ పాలిటెక్నిక్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్లో కడప మహిళా ప్రభుత్వ పాలిటెక్నిక్ విద్యార్థి సి. శిరీష ప్రతిభ చాటి ఆల్ ఇండియా స్థాయిలో బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నట్లు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి తెలిపారు. 800 మీటర్ల పరుగుపందెంలో శీరీష సత్తా చాటిందన్నారు. భవ్య శ్రీ లాంగ్జంప్లో రెండో స్థానంలో, బి. భవ్యశ్రీ 200 మీటర్ల పరుగుపందెంలో మూడోస్థానంలో నిలిచిందన్నారు. నాగేశ్వరి వాలీబాల్ టీం విన్నర్గా నిలిచిందన్నారు. ప్రతిభ కనపరిచిన విద్యార్థులకు ప్రిన్సిపాల్ సీహెచ్ జ్యోతి, అధ్యాపకులు, తల్లిదండ్రులు అభినందనలు తెలిపారు. -
ఎల్పీజీ స్థానంలో పీఎన్జీ వినియోగం తప్పనిసరి
కడప సెవెన్రోడ్స్ : పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారు కచ్చితంగా ఎల్పీజీకి బదులుగా పీఎన్జీ వినియోగానికి బదిలీ కావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి వినియోగదారులకు సూచించారు. గురువారం కలెక్టరేట్లో సివిల్ సప్లయ్ శాఖ ఆధ్వర్యంలో ఎల్పీజీ గ్యాస్కు ప్రత్యామ్నాయంగా కడప జిల్లాలో అందుబాటులో ఉన్న పీఎన్జీ వినియోగంపై అవగాహన పెంచేందుకు కో ఆర్డినేషన్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, జేసీ డాక్టర్ నిధీమీనా హాజరయ్యారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ దేశంలో వంట గ్యాస్ కొరత కొనసాగుతున్న క్రమంలో కేంద్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. ఆ మేరకు పీఎన్జీ అందుబాటులో ఉన్న ప్రాంతాల్లో ఉన్న వారు కచ్చితంగా మారిపోవాల్సి ఉంటుంది. వారందరికీ అతి త్వరలో ఎల్పీజీ గ్యాస్ సరఫరా ఆగిపోనుందనే విషయాన్ని కూడా తెలియజేశారు. ప్రస్తుతం కడప నగరంలోని అన్ని గృహ అవసరాలకు తప్పనిసరిగా పీఎస్జీని ఉపయోగించుకునే విధంగా నగరపాలక సంస్థ అన్ని వార్డు సచివాలయాల పరిధిలో వినియోగదారులకు అవగాహన కల్పించాలని సూచించారు. కార్యక్రమంలో థింక్ గ్యాస్ జిల్లా మేనేజర్ విజయ్ మోహన్ పీఎన్జీ వాడకం, ఉపయోగాలు, ప్రభుత్వం కల్పించే రాయితీలు, లాభాలు మొదలైన అంశాలను పీపీటీ ద్వారా వివరించారు. పలువురు హోటల్స్ యాజమాన్య కమిటీ వారు అడిగిన సందేహాలను నివృత్తి చేశారు. మరిన్ని వివరాలకు టోల్ ఫ్రీ: 1800 2021 999, 9010926528లో సంప్రదించాలన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
ప్రయాణికులకు మెరుగైన వసతుల కల్పనకు కృషి
రాజంపేట: రాజంపేట రైల్వేస్టేషన్లో ప్రయాణికులకు మెరుగైన వసతల కల్పనకు రైల్వే అధికారులు కృషిచేయాల్సిన ఆవశ్యకత ఉందని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. గురువారం రాజంపేట రైల్వేస్టేషన్ను ఎమ్మెల్యే పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రధానంగా ఈ రైల్వేస్టేషన్లో రెండు ఎక్సలేటర్లు, లిప్ట్ సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఉందన్నారు. గతంలో ఇక్కడ పార్శిల్ ఆఫీసు ఉండేదన్నారు. అప్పట్లో ఈ ప్రాంతం నుంచి నిమ్మకాయల ఎగుమతి జరిగేవన్నారు. అలాగే ఉద్యానవనపంటలు రైళ్ల ద్వారా ఎగుమతి చేయాలన్నారు. ఈ నేపథ్యంలోనే పార్శిలాఫీసు బలోపేతం దిశగా రైల్వే అధికారులు యోచించాలన్నారు. ఎంపీలు పీవీ మిథున్రెడ్డి, మేడా రఘునాథరెడ్డి నేతృత్వంలో రాజంపేట రైల్వేస్టేషన్లో మెరుగైన సౌకర్యాల కల్పించే దిశగా ముందుకెళతామన్నారు. అమృత్భారత్ పథకం కింద రాజంపేటను చేర్చడంలో ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషి ఉందన్నారు. రాజంపేట సబ్వేలో త్వరిగతిన మార్గం సుగమమం చేసే విధంగా రైల్వే అధికారులుతో ఇదవరకే మాట్లాడానని, ఆ దిశగా చర్యలు చేపట్టారని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు.గుంతకల్ డీఆర్యూసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి, కడప సీసీ జనార్ధన్, ఆర్పీఎఫ్ ఎస్ఐ త్రివేణి, స్టేషన్మేనేజరు గోపి వైఎస్సార్సీపీ నేతలు డీలరు సుబ్బరామిరెడ్డి, పాపినేని విశ్వనాథరెడ్డి, జీవీసుబ్బరాజు, అమర్, దండుగోపి,శివశంకర్, చికెన్ శ్రీనివాసులగౌడ్, మణి పాల్గొన్నారు. -
చీనీ చెట్ల నరికివేత
తొండూరు : మండలంలోని మల్లేల గ్రామానికి చెందిన గౌస్ అనే రైతుకు చెందిన 25 చీనీచెట్లను బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు నరికేశారు. గౌస్ వైఎస్సార్సీపీ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉండేవాడు. ఈ నేపథ్యంలో కొంతమంది గుర్తు తెలియని వ్యక్తులు బుధవారం రాత్రి చీనీ తోటలోకి వెళ్లి చీనీ చెట్లతోపాటు డ్రిప్ వైర్లు, గేట్ వాల్స్ ధ్వంసం చేశారు. ఈ సంఘటనపై తొండూరు ఎస్ఐ ఘన మద్దిలేటికి ఫిర్యాదు చేసినట్లు బాధతుడు తెలిపాడు. పోలీసుల దాడులు – నలుగురు అరెస్టు కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు డీఎస్పీ పర్యవేక్షణలో అక్రమ కార్యకలాపాల్లో నిమగ్నమై ఉన్న వ్యక్తుల కదలికలపై నిఘా ఏర్పాటు చేసి నలుగురు నిందితులను అరెస్టుచేసినట్లు సీఐ రెడ్డెప్ప తెలిపారు. గురువారం ఆయన మీడియాకు వివరాలను తెలియజేశారు. ఎస్ఐ మహమ్మద్ రఫీ, ఏఎస్ఐ వెంకటేశ్వర్లు, ఇతర సిబ్బంది భగత్సింగ్ పార్క్ సమీపంలోని సంఘం ఫంక్షన్ హాల్ వద్ద క్రికెట్ బెట్టింగ్కు పాల్పడతున్న కడపకు చెందిన సంక కల్యాణ్, ఎల్లటూరు ప్రదీప్, కొడిదెల రహమత్ వల్లి, దొంతల రాహుల్ రెడ్డిలను అరెస్టుచేసి వారినుంచి రూ.17,98,500 నగదు, 4 సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కొందరు నిందితులు పరారయ్యారని, వారిని త్వరలోనే పట్టుకుంటామని తెలిపారు. హుండీ ఆదాయం లెక్కింపు వల్లూరు: పుణ్య క్షేత్రమైన పుష్పగిరి కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలోని శాశ్వత హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. భక్తులు స్వామివారికి హుండీ ద్వారా సమర్పించిన కానుకలను దేవదాయ శాఖ అధికారుల పర్యవేక్షణలో లెక్కించారు. ఇందులో మొత్తం రూ 4,05,325 ఆదాయం వచ్చినట్లు ఈవో శ్రీనివాసులు తెలిపారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ ఇన్స్పెక్టర్ శివయ్య, ఆలయ అనువంశిక ధర్మకర్త దుగ్గిరెడ్డి వెంకట సుబ్బారెడ్డి, అర్చకులు, పోలీసు సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
ఎత్తిపోతల పథకంతోనే సీమకు న్యాయం
మైలవరం: రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేయడం వల్ల ఈ ప్రాంతంలో నీటి ఎద్దడి తలెత్తి ప్రజలు ఇబ్బందులు పడేప్రమాదం ఉంందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి అన్నారు. గురువారం మండలం కేంద్రంలోని మైలవరం జలాశయాన్ని సందర్శించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం కేసీ ఆయకట్టు కింద వేసిన పంటలు ఎండిపోతున్నాయని, అందుకు కారణం కూటమి ప్రభుత్వం కాదా అని ప్రశ్నించారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి పేరువస్తుందనే ఉద్దేశంతో ఇక్కడి కూటమి నాయకులు ఈ పథకాన్ని నిర్వీర్యం చేశారన్నారు. ప్రస్తుతం కేసీ కెనాల్కు నీరు వచ్చే పరిస్థితి లేదని, అదే రాయలసీమ ఎత్తిపోతకం ప్రారంభమై ఉంటే ఈ ప్రాంత వాసులకు తాగు, సాగునీరు వచ్చి ఉండేదన్నారు. కేసీ కెనాల్కు మైలవరం జలాశయం నుంచి నీటిని తరలించేందుకు గత రెండు రోజులుగా ప్రయత్నాలు చేస్తున్నారని, వారి తప్పును కప్పిపుచ్చుకోవటానికి ఈ నీటిని వాడుతున్నట్లు ఆయన తెలిపారు. మైలవరం టీబీసీ కాలువ ద్వార తీగలేరు వాగుకు పంపించి కేసీ కెనాల్కు నీటిని కుందూ ద్వారా అందించే ప్రయత్నం చేస్తున్నారన్నారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద మోటార్లు బిగిస్తే పథకం ప్రారంభమవుతుందని, అయితే వైఎస్ జగన్కు పేరు వస్తుందని కూటమి ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం గురించి పట్టించుకోవడం లేదన్నారు. దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలు తీసుకున్న నిర్ణయం వల్ల ప్రస్తుతం గండికోటప్రాజెక్టు, మైలవరం, రాయలసీమల్లో పలు ప్రాంతాల్లో కుంటలు చెరువులు నీటితో నింపుకోగల్గుతున్నామన్నారు. ఇప్పటికై నా రాష్ట్ర ప్రభుత్వం రాయలసీమ ఎత్తిపోతల పథకం పనులను ప్రారంభించాలని ఆయన డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, జిల్లా అదికార ప్రతినిధి మోహన్రెడ్డి,జమ్మలమడుగు పరిశీలకులు పోరెడ్డి నరసింహారెడ్డి, మండల అధ్యక్షుడు ధన్నవాడ మహేశ్వరరెడ్డి, భాస్కర్రెడ్డి, ముల్లాజానీ, మున్సిపల్విభాగ జిల్లా అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, మండల నాయకుడు ఆంజేయులు పాల్గొన్నారు. ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
ఏం జరిగింది.. ఎలా జరిగింది..
● గోడౌన్లో నిల్వలు సక్రమంగా ఉన్నాయన్న జిల్లా మేనేజర్ ● వ్యత్యాసం ఉందన్న విజిలెన్స్ అధికారులు ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరులోని పౌరసఫరాల సంస్థ గోడౌన్లో సంస్థ జిల్లా మేనేజర్ నాగ సుధ ఆధ్వర్యంలో గురువారం మధ్యాహ్నం నుంచి సాయంత్రం వరకు నిల్వలను పరిశీలించారు. పరిశీలన అనంతరం జిల్లా మేనేజర్ను మీడియా ప్రతినిధులు వివరాలను కోరగా గోడౌన్లో నిత్యావసర వస్తువుల నిల్వలన్నీ సక్రమంగా ఉన్నాయని తెలిపారు. కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందన్నారు. విజిలెన్స్ అధికారులు బుధవారం తనిఖీ చేసి గోడౌన్లో ఉన్న నిల్వల్లో భారీగా వ్యత్యాసం ఉందని ఇచ్చిన నివేదికపై వివరణ కోరగా మాకు వారు ఎలాంటి నివేదిక ఇవ్వలేదన్నారు. తమ అధికారులతో కూడా సంతకాలు తీసుకోలేదని తెలిపారు. పత్రికల్లో వచ్చిన వార్తలను చూసి జిల్లా జాయింట్ కలెక్టర్ నిధి మీనాను కలిసి విషయం తెలిపామన్నారు. జేసీ సూచనల మేరకే ఈ రోజు గోడౌన్లో తనిఖీ చేశామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా మేనేజర్ నాగసుధతోపాటు ప్రొద్దుటూరు తహసీల్దార్ వి.గంగయ్య, పౌరసరఫరాల శాఖ డిప్యూటీ తహసీల్దార్ శివప్రసాద్ పాల్గొన్నారు. విజిలెన్స్ సీఐ ఆధ్వర్యంలో తనిఖీలు విజిలెన్స్ సీఐ శ్రీనివాసులరెడ్డి ఆధ్వర్యంలో బుధవారం కొన్ని గంటలపాటు తనిఖీలు నిర్వహించారు. బస్తాలను లెక్కించారు. గోడౌన్ డిప్యూటీ తహసీల్దార్ లింగస్వామి, గోడౌన్ సిబ్బంది సమక్షంలోనే తనిఖీలు నిర్వహించారు. నిల్వలలో 50.2 క్వింటాలు బియ్యం, 43 క్వింటాలు చక్కెర, 7 క్వింటాలు జొన్నలు, తదితర నిత్యావసర వస్తువుల్లో తేడాలు ఉన్నాయని ప్రకటన విడుదల చేశారు. ప్రస్తుతం జిల్లా మేనేజర్ నాగ సుధ నిల్వలన్నీ కరెక్ట్గా ఉన్నాయని, కేవలం రెండు కిలోల చక్కెర మాత్రమే వ్యత్యాసం ఉందని అన్నారు. రెండు శాఖల అధికారులు వేర్వేరుగా ఇచ్చిన వివరాలు ఆసక్తికరంగా ఉన్నాయి. ఏమి జరిగింది.. ఎలా జరిగిందనేదానిపై అందరు చర్చించుకుంటున్నారు. ఉన్నతాధికారులు ఏ చర్యలు తీసుకుంటారో వేచి చూడాల్సి ఉంది. -
13 గ్యాస్ సిలిండర్లు స్వాధీనం
ఎర్రగుంట్ల: ఎర్రగుంట్ల, చిలంకూరు గ్రామాల్లో డాబాలు, హోటళ్లలో విజిలెన్స్ అధికారి లక్ష్మణ్ ఆధ్వర్యంలోగురువారం దాడులు నిర్వహించారు. 13 సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు.ఉన్నతాధికారులుకు నివేదిక అందిస్తామన్నారు.ఆర్ఐ ప్రమీల, అధికారులు భాస్కర్రెడ్డి, ఆనందరావు పాల్గొన్నారు. హోటళ్లపై ఎన్పోర్సుమెంట్ అధికారుల దాడులు జమ్మలమడుగు: పట్టణంలోని హోటళ్లపై ఎన్ఫోర్స్మెంట్ డీటీగోవిందు మోరె ఆధ్వర్యంలో అధికారులు గురువారం దాడులు నిర్వహించారు. పాతబస్టాండ్ తాడిపత్రి రహదారిలో ఉన్న ఓ బేకరిలో దాడులు చేశారు. అక్రమ సిలిండర్లు కలిగి ఉండటంతో ఏడింటిని సీజ్ చేసి గ్యాస్ ఏజెన్సీకి అప్పగించారు. బేకరి యాజమాన్యంపై కేసునమోదు చేసినట్లు డీటీ తెలిపారు. బి.కోడూరు : మండలపరిధిలోని వివిధ హోటళ్లలో గృహావసరాలకు వినియోగించే 5 సిలిండర్లను రెవెన్యూ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. బద్వేలు ఆర్డీఓ ఆదేశాల మేరకు గురువారం రెవెన్యూ సిబ్బంది తనిఖీలు నిర్వహించారు. వాణిజ్య సిలిండర్లకు బదులుగా గృహావసరాల సిలిండర్లను ఉపయోగిస్తుండటంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. -
ప్రాణం తీసిన ఈత సరదా
గోపవరం : ఈత సరదా ఒకరి ప్రాణాలు తీసింది. ఈ విషాద ఘటన పెద్దగోపవరం ఎస్సీకాలనీలో గురువారం చోటుచేసుకుంది.వివరాలు మండలంలోని పెద్దగోపవరం ఎస్సీకాలనీకి చెందిన కత్తిమల్లేష్ (36) తోటివారితో కలిసి ఎస్సీకాలనీకి సమీపంలో ఉన్న బావి వద్దకు ఈతకు వెళ్లాడు. మల్లేష్ బావిలోకి దూకాడు. బావి లోపల తీగలు అల్లుకుపోయి ఉండటంతో వాటిల్లో ఇరుక్కుపోయాడు. ఎంతసేపటికి బయటికి రాకపోవడంతో అక్కడ ఉన్న వారు వెంటనే పోలీసు, అగ్నిమాపక కేంద్రానికి సమాచారమిచ్చారు. వారు హుటాహుటిన బావి వద్దకు చేరుకుని దాదాపు రెండు గంటల పాటు గాలించగా మల్లేష్ మృతదేహం లభ్యమైంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. సరదా కోసం ఈతకు వెళ్లి మృత్యువాతపడటంతో కుటుంబ సభ్యులు బోరుబోరున విలపించారు. ఎస్సీకాలనీలో విషాదఛాయలు అలుముకున్నాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు బద్వేలు రూరల్ ఎస్ఐ రంగారావు కేసు నమోదు చేశారు. -
ఈవీఎం గోడౌన్ల పరిశీలన
కడప సెవెన్రోడ్స్: కలెక్టరేట్ భవన సముదాయంలోని ఈవీ ఎం గోడౌన్లను గుర్తింపు పొందిన అన్ని రాజకీయ పార్టీల ప్రతినిధుల సమక్షంలో కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీల్లో భాగంగా ఈవీఎంలను భద్రపరిచిన గోడౌన్లను తనిఖీ చేశామని కలెక్టర్ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్ఛార్జి జిల్లా రెవెన్యూ అధికారి వెంకటపతి, హెచ్ సెక్షన్ సూపరింటెండెంట్ శ్రీకాంత్ రెడ్డి, గుర్తింపు పొందిన రాజకీయ పార్టీల ప్రతినిధులు లక్ష్మణ్ రావు(బీజేపీ), ఫయాజ్ అహ్మద్ (వైఎస్సార్ సీపీ), జనార్దన్, జబీవుల్లా (టీడీపీ), గౌస్ పీర్ (కాంగ్రెస్), డా.శ్రీనివాసులు (ఆప్), విశ్వనాథ్ (జేఎస్పీ) తదితరులు పాల్గొన్నారు. గనులు, క్వారీల నిర్వహణపై దృష్టి సారించాలి: జిల్లా ఆర్థిక అభివృద్ధిలో కీలకపాత్ర పోషిస్తున్న గనులు, క్వారీల నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ శ్రీధర్ మైనింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలో మైనింగ్ క్వారీ ల నిర్వహణ, ప్రధాన ఖనిజ బ్లాకుల కార్యాచరణ తదితర అంశాలపై జేసీ డాక్టర్ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్ భావనలతో కలిసి అధికారులతో సమావేశం నిర్వహించారు. -
అంగన్వాడీ ఆయాపై అత్యాచార యత్నం
అడ్డుకున్న భర్త, మామపై కూడా దాడిసాక్షి టాస్క్ఫోర్స్: కమలాపురం మండలం ఎర్రగుడిపాడులో పని చేస్తున్న అంగన్వాడీ ఆయా పై అదే గ్రామానికి చెందిన రిపోర్టర్ చంద్ర దాడి చేసి అత్యాచారయత్నానికి ఒడి గట్టాడు. గురువారం గ్రామంలో ఉన్న ఆయాను లైంగికంగా వేధిస్తుండగా బాధిత మహిళ గట్టిగా కేకలు వేయడంతో భర్త, మామ అడ్డుకోవడానికి ప్రయత్నించారు. వారిపై కూడా విచక్షణారహితంగా దాడి చేశాడు. తీవ్ర గాయాలైన వారిని చికిత్స నిమిత్తం కమలాపురం ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సూచన మేరకు మెరుగైన చికిత్స కోసం రిమ్స్కు తీసుకెళ్లారు. గతంలో కూడా ఈమైపె పలుమార్లు లైంగిక దాడగికి ప్రయత్నించడం, సదరు మహిళ ప్రతిఘటించడం పోలీస్ స్టేషన్లో ఫిద్యాదు చేయడం జరిగాయి. ప్రస్తుతం అదే కేసు నడుస్తున్నప్పటికీ తిరిగి లైంగిక దాడికి పాల్పడడం పై గ్రామస్తులు ఆశ్చర్యాన్ని వ్యక్తం చేస్తున్నారు. పట్టపగలు ఇలాంటి కార్యక్రమాలు గ్రామంలో జరుగుతుండటంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. పలువురికి ఆదర్శంగా నిలవాల్సిన రిపోర్టర్ ఇలాంటి అఘాయిత్యాలకు ఒడి గట్టడంపై స్థానికులు విస్మయాన్ని వ్యక్తం చేస్తున్నారు. చంద్ర పై తక్షణం పోక్సో కేసు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని బాధితులు కోరుతున్నారు. -
మాస్టర్ ప్లాన్కు మంగళం.. ముడుపులే ‘మూలం’ !
ప్రొద్దుటూరు రూరల్: నిబంధనలు నెమరువేయడానికి కాదు.. బుట్టదాఖలా చేయడానికే అన్నట్లుంది ప్రొద్దుటూరు మండలం కొత్తపల్లె గ్రామ పంచాయతీ అధికారుల తీరు. అందినకాడికి ‘తడిపితే’ చాలు.. నిబంధనలను పాతరేసి, చెరువులు, కాలువలపై కూడా అపార్ట్మెంట్లు లేపేయవచ్చని అధికారులు నిరూపిస్తున్నారు. మైదుకూరు రోడ్డులో మాస్టర్ ప్లాన్ను తుంగలో తొక్కి, బఫర్ జోన్ను కబళిస్తూ సాగుతున్న ఓ అక్రమ అపార్ట్మెంట్ నిర్మాణం ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. రూ. 20 లక్షల ‘ముడుపు’ మంత్రం! ఈ అక్రమ కట్టడం వెనుక భారీ స్థాయిలో కాసుల వేట సాగినట్లు తెలుస్తోంది. తొలుత నిబంధనల ఉల్లంఘనను గుర్తించి పనులను నిలిపివేసిన అధికారులు, ఆ తర్వాత అధికార పార్టీకి చెందిన ఓ కీలక ప్రజాప్రతినిధి మధ్యవర్తిత్వంతో రూ. 20 లక్షల బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ ‘ముడుపుల’ మంత్రం పఠించిన వెంటనే, అక్రమ నిర్మాణానికి అధికారులు సాగిలపడి ‘గ్రీన్ సిగ్నల్’ ఇచ్చేశారు. డీఎల్పీఓ, డీపీఓ వంటి ఉన్నతాధికారులు నిత్యం ఈ ప్రాంతంలో సంచరిస్తున్నా, పన్నుల వసూళ్లపై ఉన్న శ్రద్ధ ఈ భారీ అక్రమ కట్టడంపై చూపకపోవడం వెనుక మతలబు ఏంటో అందరికీ అర్థమవుతూనే ఉంది. కాలువ మలుపు.. పేదల పొట్ట కొట్టే తీర్పు! అపార్ట్మెంట్ యజమాని ప్రయోజనాల కోసం రెవెన్యూ అధికారులు ఏకంగా మురికి కాలువ అలైన్మెంట్నే మార్చేయడం గమనార్హం. ప్రొద్దుటూరు మున్సిపాలిటీ నుంచి వచ్చే ప్రధాన మురికి కాలువను అపార్ట్మెంట్కు తగలకుండా వంకర తిప్పారు. ఈ క్రమంలో పక్కనే ఉన్న సామాన్యుల, పేదల స్థలాలను కాలువలోకి నెట్టేశారు. అపార్ట్మెంట్ చుట్టూ ఫైర్ ఇంజిన్ తిరగడానికి కనీసం 2.5 మీటర్ల సెట్ బ్యాక్ కూడా వదలలేదు. రేపు ఏదైనా ప్రమాదం జరిగితే ఆ అపార్ట్మెంట్ వాసుల పరిస్థితి ఏమిటన్నది ప్రశ్నార్థకంగా మారింది. పంచాయతీ కార్యదర్శి ‘అమాయకత్వం’! ఈ అక్రమ దందాపై ‘సాక్షి’ వివరణ కోరగా, కొత్తపల్లె పంచాయతీ కార్యదర్శి నరసింహులు చెప్పిన సమాధానం విస్తుగొలుపుతోంది. గ్రామ పరిధిలో ఐదు అంతస్తుల భవనం లేస్తుంటే.. ‘నాకేమీ తెలియదు.. నా దగ్గర రికార్డులే లేవు’ అంటూ బుకాయించడం ఆయన బాధ్యతారాహిత్యానికి పరాకాష్ట. అధికారుల అండ, రాజకీయ అండదండలతో సాగుతున్న ఈ అవినీతి కట్టడంపై జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి విచారణ జరిపించాలని బాధితులు కోరుతున్నారు. కొత్తపల్లెలో కాలువను కమ్మేసిన అపార్ట్మెంట్.. రూ. 20 లక్షల బేరంతో ‘గ్రీన్ సిగ్నల్’ బఫర్ జోన్లో అక్రమ నిర్మాణం.. చూసీచూడనట్లు వ్యవహరిస్తున్న ఉన్నతాధికారులు ప్రజాప్రతినిధి, అధికారుల జేబుల్లోకి భారీగా అక్రమ వసూళ్లు మురికి కాలువ అలైన్మెంట్ మార్పు.. పేదల స్థలాలకు ఎసరు ఏమీ తెలియదంటున్న పంచాయతీ కార్యదర్శి.. రికార్డులే లేవని సమాధానం! -
బాబు పాలనలో రైతులకు అష్ట కష్టాలు
కడప ఎంపీ అవినాష్రెడ్డి పులివెందుల రూరల్: చంద్రబాబు పానలో రైతులు అష్టకష్టాలు పడుతున్నారని, ప్రకటనలతోనే గత రెండేళ్లుగా ప్రభుత్వం కాలయాపన చేస్తోందని, అధికారంలోకి రావడానికి రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చిందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఆరోపించారు. పులివెందులలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో బుధవా రం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజల సమస్యలను పరిష్కరించడంలో ఘోరంగా విఫలమైంద న్నారు. రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రైతుల సమస్యలను పట్టించుకోవడంలేదన్నారు. రైతులు పండించిన పంటలకు కనీస గిట్టుబాటు ధరలు కూడా కూటమి ప్రభుత్వం కల్పించలేకపోతోందన్నారు. ఆధ్యాత్మిక ఉత్సవాలకు ఆహ్వానంఏప్రిల్ 1వ తేదీ నుంచి కమలాపురంలో ప్రారంభం కానున్న ’దర్గా ఏ గఫారియా’ ఉరుసు ఉత్సవాలకు రావాలని దర్గా కన్వీనర్ షేక్ ఇస్మాయిల్ ఎంపీని ఆహ్వానించారు. దీనికి ఆయన సానుకూలంగా స్పందించారు. -
ప్రమాదంలో గాయపడిన యువకుడు మృతి
మైదుకూరు : మైదుకూరు పట్టణ శివారులో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి, చికిత్స పొందుతూ మొగిలిచర్ల భాను ప్రకాష్ (24) అనే యువకుడు గురువారం మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. దువ్వూరుకు చెందిన భానుప్రకాష్, ఎర్రగొల్ల గంగాప్రసాద్ అనే యువకులు బుధవారం బైక్పై కడపకు వెళుతున్నారు. మైదుకూరు శివారులోని చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి బైపాస్ సర్వీస్ రోడ్డు మలుపు వద్ద వ్యతిరేక దిశలో వస్తూ పాల వ్యాన్ బైక్ను ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన ఇద్దరిని చికిత్స కోసం కర్నూలుకు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం భాను ప్రకాష్ మృతి చెందాడు. మెరుగైన చికిత్స కోసం గంగా ప్రసాద్ను హైదరాబాద్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు పేర్కొన్నారు. మెకానిక్ షెడ్లో కాపర్ వైర్ చోరీ పులివెందుల రూరల్ : స్థానిక కడప రోడ్డులో ఎమ్మార్ఎఫ్ షోరూం సమీపంలోని మెకానిక్ షెడ్లో గురువారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు విద్యుత్ కేబుల్ను అపహరించారు. మెకానిక్ షెడ్డుకు సంబంధించిన గేట్ తాళాలను పగులగొట్టి అందులో రైతుకు సంబంధించిన కాపర్ వైరును దోచుకెళ్లారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 25కేజీల కాపర్ వైరును అపహరించుకపోయారని బాధితుడు లబోదిబోమంటున్నాడు. పోలీసు అధికారులు ప్రత్యేక దృష్టి సారించి ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరుతున్నాడు శివాలయంలో చోరీ ఎర్రగుంట్ల: మండల కేంద్రమైన ఎర్రగుంట్ల పట్టణంలోని దొండపాడులో ఉన్న శివాలయంలో బుధవారం రాత్రి చోరీ జరిగింది. గురువారం ఉదయం భక్తులు గుడికి వెళ్లగా ఆలయం తలుపులు తెరిచి ఉన్నాయి. వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వడంతో వారు సంఘటన స్థలాన చేరుకుని పరిశీలించారు. భక్తులు కానుకలు వేసిన హూండీని దొంగలు తీసుకెళ్లారు. ఆలయంలో ఉన్న సీసి పుటేజీ ఆధారంగా చోరీ జరిగినట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆలయ ధర్మకర్త మలిశెట్టి చిన్నయ్య, దొండపాడు ప్రజలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ద్విచక్రవాహనం దగ్ధం సుండుపల్లె : మండల కేంద్రంలోని రెహమాన్వీధి బీఎస్ఎన్ఎల్ టవర్ వెనుక భాగంలోని మల్లినేని సుజాత ద్విచక్రవాహనాన్ని ఆమె ఇంటి ముందు భాగంలో పార్కింగ్ చేసింది. బుధవారం రాత్రి 2 గంటల సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఏపీ03 సియూ 4770 నంబర్ గల ద్విచక్రవాహనానికి పెట్రోల్ పోసి నిప్పు పెట్టారు. బైక్ పూర్తిగా కాలిపోయింది. స్థానిక పోలీస్స్టేషన్లో గురువారం సుజాత పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు తెలిపింది. -
శ్రీరామనవమి శుభాకాంక్షలు
పులివెందుల: వైఎస్సార్ జిల్లా ప్రజలకు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి శ్రీరామనవమి శుభాకాంక్షలు తెలిపారు. శ్రీరామనవమిని జిల్లా ప్రజలందరూ ఎంతో భక్తిశ్రద్ధలతో జరుపుకుంటారని ప్రకటనలో పేర్కొన్నారు. శ్రీరాముడి జీవితం అందరికీ ఆదర్శమని .. జిల్లా ప్రజలపై ఆయన కరుణ ఉండాలని ఆకాంక్షించారు. కలెక్టర్, ఎస్పీ నవమి శుభాకాంక్షలు కడప సెవెన్రోడ్స్: కుటుంబ జీవన గమనంలో కష్ట సుఖాలు సహజమే అనే సత్యానికి సీతారాముల ఆదర్శ జీవిత సారాంశమే నిదర్శనమని కలెక్టర్ శ్రీధర్, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ వేరు వేరు ప్రకటనల్లో పేర్కొన్నారు. జిల్లా ప్రజలపై శ్రీ రామరక్ష ఉండాలని కోరుకుంటూ శ్రీరామ నవమి శుభాకాంక్షలు తెలియజేశారు. ప్రజలంతా ఆయురారోగ్యాలతో, సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, అందరి భాగస్వామ్యంతో అభివృద్ధిలో జిల్లా ముందడుగు వేయాలని కలెక్టర్, ఎస్పీ ఆకాంక్షించారు. కడప సెవెన్రోడ్స్: కడప నగరంలో ఈ నెల 28న జరిగే జెడ్పీ సర్వసభ్య సమావేశానికి అన్ని శాఖల జిల్లా అధికారులు ప్రగతి నివేదికలతో పాటు అభివృద్ధి ప్రతిపాదనల సమగ్ర సమాచారంతో హాజరు కావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కడపలోని జిల్లా పరిషత్ సమావేశ మందిరంలో ఉదయం 9.30 లకు సర్వసభ్య సమావేశం జరుగుతుందని, జెడ్పీ చైర్మన్ అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లాల కలెక్టర్లు, ప్రజాప్రతినిధులు హాజరవుతారని పేర్కొన్నారు. కడప ఎడ్యుకేషన్: ప్రైవేటు అన్ ఎయిడెడ్ పాఠశాల్లో ఉచిత ప్రవేశాలకు సంబంధించి తొలి విడత లాటరీలో 711 మంది విద్యార్థులు ఎంపికై నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి గాను ప్రైవేటు పాఠశాలల్లో పేదలకు కేటాయించిన 25 శాతం సీట్లు లాటరీ ద్వారా ఎంపికై న విద్యార్థులతో భర్తీ చేస్తున్నట్లు తెలిపారు. జిల్లావ్యాప్తంగా 1206 మంది విద్యార్థులు ఆన్లైన్లో రిజిస్టర్ చేసుకున్నారని తెలిపారు. తొలివిడతలో కిలోమీటర్ పరిధిలో ఉన్న 711 మంది విద్యార్థులను ఎంపిక చేసినట్లు తెలిపారు. తొలివిడతలో 178 మంది ఎస్సీలకు, 19 మంది ఎస్టీలకు, 83 మంది మైనార్టీలకు, 305 మంది బీసీలకు, 125 మంది ఓసీలకు, ఒక్క సీడబ్ల్యూఎస్ఎన్ విద్యార్థికి ప్రవేశాలు కల్పించినట్లు వివరించారు. ఎంపికయిన విద్యార్థులు అన్ని రకాల ధ్రువ పత్రాలతో ఈ నెల 26వ తేదీ నుంచి ఏప్రిల్ 7వ తేదీ వరకు ఆయా పాఠశాలకు వెళ్లి ప్రవేశాలను నిర్ధారించుకోవాలని తెలిపారు. -
ఎన్నియ్యల్లో.. ఎన్నికల్లో.. చంద్రంమామా!
‘చందమామ రావే.. జాబిల్లి రావే అని పిల్లలకు కథలు చెప్పినట్లు.. ఎన్నికలు రావు.. నోటిఫికేషన్ రాదు అంటూ కూటమి సర్కార్ కాలక్షేపం చేస్తోంది. ఊరూరా తిరుగుతూ అసాధ్యమైన హామీలిచ్చి అధికారం చేపట్టిన చంద్రబాబు, ఇప్పుడు గ్రామాల్లోకి వెళ్లాలంటేనే భయపడుతున్నారు. అందుకే ఎన్నియల్లో ఎన్నికల్లో చంద్రంమామా.. అంటూ ప్రజలు ఆటపట్టిస్తున్నారు‘ బద్వేలు: అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి సర్కార్కు ఇప్పుడు ’స్థానిక’ సెగ తగులుతోంది. ఎన్నికల ముందు కొండంత ఆశలు చూపి, అధికారం చేపట్టాక ప్రజల గొంతు కోసిన చంద్రబాబు అండ్ కో.. ఇప్పుడు పల్లెల్లోకి వెళ్లాలంటేనే వణికిపోతున్నారు. మున్సిపాలిటీలు, కార్పొరేషన్ల ఎన్నికలను ఇప్పటికే అటకెక్కించిన సర్కార్, ఇప్పుడు పంచాయతీల్లోనూ ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేసేందుకు సిద్ధమైంది. జనం తిరగబడతారని, ఘోర పరాభవం తప్పదని ఇంటెలిజెన్స్ నివేదికలు రావడంతో.. ఎన్నికల ఊసే ఎత్తకుండా ప్రత్యేకాధికారుల పాలనను రుద్దేందుకు కుతంత్రాలు పన్నుతోంది. దోపిడీ పర్వం.. పడగ విప్పిన పచ్చదండు! అధికారం చేపట్టిన నాటి నుంచి కూటమిలోని చోటా మోటా నాయకులు ’అందినకాడికి దోచుకో.. అడ్డంగా పంచుకో’ అన్న చందంగా వ్యవహరిస్తున్నారు. జిల్లాలోని వాగులు, వంకలు ఇసుక మాఫియా పరం కాగా, కొండలు, గుట్టలను సైతం కంకర రూపంలో కరిగించేస్తున్నారు. గ్రామకంఠం భూములను పచ్చ నేతలు కబ్జా చేస్తుంటే అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారు. మద్యం పాలసీ పేరుతో ఊరూరా బెల్టు షాపులను ప్రోత్సహిస్తూ సామాన్యుల రక్తాన్ని తాగుతున్నారని మహిళా లోకం నిప్పులు చెరుగుతోంది. నిధులపై కన్నేసి.. సర్పంచ్లను ముంచేసి! పంచాయతీల పదవీకాలం ఏప్రిల్ 2తో ముగియనుంది. అయితే, ఎన్నికల నోటిఫికేషన్ ఇవ్వకుండా కాలయాపన చేయడం వెనుక పెద్ద కుట్రే ఉంది. పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను కాజేసేందుకే ఈ వాయిదా పర్వమని తెలుస్తోంది. సర్పంచ్ల పదవీకాలం ముగియగానే, తహసీల్దార్లు, ఎంపీడీఓల వంటి ప్రత్యేకాధికారులను నియమించి.. వారి ద్వారా ఆ నిధులను తమ అనుయాయులకు, పచ్చ కాంట్రాక్టర్లకు కట్టబెట్టేందుకు పక్కా స్కెచ్ వేశారు. కూటమి అడ్రస్ గల్లంతు తప్పదు ‘ఈసారి ఏ ఎన్నికలు వచ్చినా కూటమి అడ్రస్ గల్లంతు అవ్వడం ఖాయం. రెండేళ్లుగా ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు. సంక్షేమ పథకాల నిధులు ప్రజలకు చేరడం లేదు. జనం ఆగ్రహంతో ఉన్నారు, అందుకే గెలవలేమని తెలిసి సర్పంచ్ ఎన్నికలను వాయిదా వేస్తున్నారు.‘ –బాల అంకిరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకుడు, ఇ.రామాపురం, కలసపాడుప్రజల్లో వ్యతిరేకత బలంగా ఉంది ‘కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. మున్సిపల్, సర్పంచ్ ఎన్నికలు జరిగితే ఓడిపోతామనే భయంతోనే ప్రత్యేకాధికారులతో పాలన సాగించాలని చూస్తున్నారు. ఎన్నికలు ఎప్పుడు జరిగినా కూటమికి పరాభవం తప్పదు.‘ –జి. హనుమంతరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వినర్, కాశినాయన మండలం. నిధుల దోపిడీ కోసమే వాయిదా పన్నాగం ‘పంచాయతీల ఖాతాల్లో ఉన్న కేంద్ర నిధులను దోచుకోవడానికే ఎన్నికలు వాయిదా వేస్తున్నారు. ప్రత్యేకాధికారుల ద్వారా ఆ డబ్బును టిడిపి కార్యకర్తలకు పంచిపెట్టేందుకు కుతంత్రం పన్నుతున్నారు. ఓటమి భయం వల్లే వేచి చూసే ధోరణిలో ఉన్నారు.‘ –రామకృష్ణారెడ్డి, వైఎస్సార్సీపీ కన్వినర్, బి.కోడూరు మండలంవైఎస్సార్ కడప జిల్లాలో దాదాపు 95 శాతం పంచాయతీలు వైఎస్సార్సీపీ మద్దతుదారుల చేతుల్లోనే ఉన్నాయి. ఈ బలాన్ని తట్టుకోలేక, ప్రజాబలంతో గెలవడం అసాధ్యమని భావించే.. రిజర్వేషన్లు, ఓటర్ల జాబితా అంటూ కుంటి సాకులు వెతుకుతున్నారు. పీకల్లోతు ప్రజా వ్యతిరేకత నుండి తప్పించుకోవడానికే ఈ ’వాయిదా’ డ్రామా ఆడుతున్నారని జనం చర్చించుకుంటున్నారు. ఎన్నికలంటేనే ‘ఎల్లో గ్యాంగ్’కు వణుకు జనం తిరగబడతారనే’స్థానిక’ వాయిదా! 619 పంచాయతీల్లో ప్రజాస్వామ్యానికి పాతర..ప్రత్యేకాధికారుల రాజ్యానికి తెర ఏప్రిల్ 2తో ముగియనున్న సర్పంచ్ల గడువు.. ఊసేలేని నోటిఫికేషన్! నిధుల దోపిడీ కోసమే పక్కా స్కెచ్..పచ్చ నేతల కబ్జాలకు అడ్డు లేదు -
హాయ్గా.. వేగంగా!
● శరవేగంగా ‘గ్రీన్ఫీల్డ్’.. డిసెంబర్కే పూర్తి! ● రూ.14 వేల కోట్లతో 343 కి.మీ. మేర ఆరు వరుసల రహదారి ● కొడికొండ చెక్పోస్ట్ నుంచి విజయవాడ వరకు 14 ప్యాకేజీల్లో పనులు ● ఇప్పటికే 60 శాతం పూర్తి.. రికార్డు వేగంతో సాగుతున్న నిర్మాణంకడప సిటీ : రాష్ట్ర రవాణా ముఖచిత్రాన్ని మార్చేయనున్న ప్రతిష్టాత్మక ‘గ్రీన్ఫీల్డ్’ ఎక్స్ప్రెస్ హైవే పనులు శరవేగంగా సాగుతున్నాయి. నేషనల్ హైవేస్ అథారిటీ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో శ్రీ సత్యసాయి జిల్లా కొడికొండ చెక్పోస్ట్ నుంచి విజయవాడ వరకు చేపట్టిన ఈ ఆరు వరుసల రహదారి పనులు ఇప్పటికే 60 శాతం పూర్తయ్యాయి. సుమారు రూ. 14 వేల కోట్ల అంచనా వ్యయంతో 343 కిలోమీటర్ల మేర నిర్మిస్తున్న ఈ ప్రాజెక్టును ఈ ఏడాది డిసెంబరు చివరి నాటికి పూర్తి చేసి, జాతికి అంకితం చేసేందుకు అధికారులు కసరత్తు చేస్తున్నారు. అసలేమిటీ ‘గ్రీన్ఫీల్డ్’..? చాలామందికి గ్రీన్ఫీల్డ్ హైవే అంటే ఏమిటనే అవగాహన ఉండటం లేదు. సాధారణంగా ఉన్న రహదారులను వెడల్పు చేయడం కాకుండా, గ్రామాల మీదుగా వెళ్లకుండా నేరుగా పంటపొలాలు, ఖాళీ స్థలాల గుండా కొత్తగా నిర్మించే రహదారినే ‘గ్రీన్ఫీల్డ్ హైవే’ అంటారు. ఈ రోడ్డు నిర్మాణం ఎక్కడా గ్రామాల్లోకి వెళ్లదు. దీనివల్ల ప్రయాణ దూరం, సమయం భారీగా తగ్గుతాయి. ఐదు జిల్లాల మీదుగా.. 14 ప్యాకేజీలు ఈ మెగా ప్రాజెక్టు ఐదు జిల్లాల (శ్రీ సత్యసాయి, వైఎస్సార్ కడప, నెల్లూరు, ప్రకాశం, బాపట్ల) గుండా సాగుతోంది. దీనికోసం ప్రభుత్వం ఇప్పటికే 6,902 ఎకరాల భూసేకరణ పూర్తి చేసింది. 2024 మార్చిలో ప్రారంభమైన ఈ పనులను మొత్తం 14 ప్యాకేజీలుగా విభజించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేస్తున్నారు. హైటెక్ భద్రత.. స్పీడ్ లిమిట్ 100 కేఎంపీహెచ్ ఈ హైవేపై గరిష్ట వేగ పరిమితిని గంటకు 100 కిలోమీటర్లుగా నిర్ణయించారు. కేవలం ఫోర్ వీలర్లకు మాత్రమే అనుమతి ఉంటుంది. భద్రతా కారణాల దృష్ట్యా ఆటోలు, ద్విచక్ర వాహనాలను నిషేధించారు. వేగ పరిమితిని పర్యవేక్షించేందుకు అత్యాధునిక ‘ఆటో సీసీ కెమెరాల’ను ఏర్పాటు చేస్తున్నారు. నిబంధనలు అతిక్రమిస్తే ఆటోమేటిక్గా వాహనదారుల మొబైల్కు చలాన్ మెసేజ్ వెళ్తుంది.పనుల వేగానికి 4 గిన్నీస్ రికార్డులు ‘గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు ఎటువంటి ఆటంకాలు లేవు. భూసేకరణ ప్రక్రియ ఇప్పటికే పూర్తయింది. అత్యంత నాణ్యతతో, వేగంగా పనులు చేస్తున్నందుకు గాను ఈ ప్రాజెక్టుకు ఇప్పటికే నాలుగు గిన్నీస్ వరల్డ్ రికార్డులు లభించాయి. డిసెంబరు చివరి నాటికి పనులు పూర్తి చేసి రహదారిని అందుబాటులోకి తెస్తాం.‘ – బి. అశోక్కుమార్, ఎన్హెచ్ఏఐ పీడీ, కడప -
హనుమంతవాహనంపై శ్రీరాముడి తేజసం
వాల్మీకిపురం : పట్టాభిరాముడి సాలకట్ల బ్రహ్మోత్సవాలు వైభవంగా జరగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా రెండవ రోజు బుధవారం స్వామివారు తన ప్రియభక్తుడైన హనుమంతునిపై పురవీధుల్లో విహరిస్తూ భక్తులకు అభయం ఇచ్చారు. ఉదయం సుప్రభాతసేవతో స్వామిని మేల్కొలిపి శుద్ధి, తోమాలసేవ, పంచాంగ శ్రవణం, కొలువు, అర్చన అనంతరం ఉదయం 8గంటలకు స్వామివారిని ముత్యపుపందిరి వాహనంపై పురవీధుల్లో విహరించారు. ఉదయం 10గంటలకు ఉత్సవర్లకు స్నపన తిరుమంజనం జరిపారు. రాత్రి 8గంటలకు ఉత్సవర్లను పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అలంకరించి హనుమంత వాహనంపై కొలువుదీర్చారు. పురవీధుల్లో ఊరేగింపు నిర్వహించారు.


