breaking news
YSR District Latest News
-
వాన వెల్లువాయె!
మేఘం గర్జించింది.. చిమ్మ చీకటి వేళ.. కమ్ముకొచ్చి కుండపోతగా కురిసింది..అంతే తెల్లారేకల్లా వాగు ఉప్పొంగింది. నదీ ప్రవాహం ఉగ్రరూపం దాల్చింది.. ఇల్లంతా నీరు... ఊరంతా ఏరయింది. ఇక పంటంతా నీటిలో మునిగింది.. రైతు కంట కన్నీరొలికింది. గురువారం తెల్లారుజామున కురిసిన వర్షం.. పలు మండలాల్లో బీభత్సమే సృష్టించింది. వల్లూరు: కోట్లూరు పొలాల్లో నేలకొరిగిన వరిప్రొద్దుటూరులో రోడ్డుపై వర్షపు నీరుకడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో గురువారం తెల్లవారుజామున కుండపోత వాన కురిసింది. జిల్లాలోని వాగులు, వంకలు పొంగి పొర్లాయి. దీంతో కంది, మినుము, ఉల్లి, జొన్నలతోపాటు పలు ఆరుతడి పంటల్లో వర్షపు నీరంతా నిలి చింది. పంట పొలాల్లో నిలిచిన వర్షపునీరు వంకలను తలపించాయి. జిల్లాలో ఎర్రగంట్ల మండలంలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురవడంతో పొట్లదుర్తిలోని ఎన్టీఆర్కాలనీ, ఎర్రగుంట్లలోని సుందరయ్యకాలనీలు వర్షపు నీటితో నిండిపోయాయి. ఎర్రగుంట్ల్ల ప్రొద్దుటూరు మద్య ప్రధా న రహదారిలోని కుంది నదీ ఉధృతంగా ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు నిలిచిపోయాయి. తిప్పులూరులో మసీదు ప్రహారీ కూలిపోయింది. పాగేరు వంక ఉధృతంగా ప్రహించడంతో కమలాపురం– ఖాజీపేట మధ్య రాకపోకలు బంద్ అయ్యాయి. ఫలితంగా ఆయా గ్రామాల ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. అలాగే పెద్దముడియం మండలం పాలూరులోని నోస్సం వంక ఉధృతంగా ప్రవహించింది. కన్నెలూరులోని నివా సం ఉన్న ఓ కుటుంబం బైక్లో నొస్సం వంక దాటుతుండగా అదుపుతప్పి కొట్టుకపోతుండటంతో పాలూరుకు చెందిన కొంతమంది యువకులు కాపాడి ఒడ్డుకు చేర్చారు. అలాగే ప్రొద్దుటూరు ఆళ్లగడ్డ ప్రధాన రహదారిలో రాజుపాలెం వెంగలాయపల్లి గ్రామాల మధ్యలో మడువంకపై వర్షపు నీరు ప్రవహించడంతో కొన్ని గంటలపాటు రాకపోకలు ఆగిపోయాయి. పెద్దముడియంలో పంటపొ లాల్లో నీరు నిలిచి చెరువులను తరలించాయి. ఈ వర్షంతో విత్తిన మినుమంతా భూమిలోనే కుల్లిపోతుందని రైతులు వాపోయారు. ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కడప నగరంలోని ఫాతిమా కాలేజ్ వద్ద.. పలు కాలనీలు జలమయం పలుచోట్ల రాకపోకలు బంద్ ఉద్యానపంటలతోపాటువ్యవసాయ పంటలకు నష్టం -
ప్రతి రైతుకు యూరియా అందిస్తాం
దువ్వూరు: మండలంలోని ప్రతి రైతుకు యూరియా అందిస్తామని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ స్పష్టం చేశారు. గురువారం మండలంలోని చింతకుంట గ్రామంలోని యూరియా పంపిణీ కేంద్రాన్ని కలెక్టర్ తనిఖీ చేశారు. దువ్వూరు మండలానికి 13,560 మెట్రిక్ టన్నుల యూరియా మంజూరు కాగా, ఇంత వరకు 10వేల మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని కలెక్టర్ అడిగిన ఓ ప్రశ్నకు జేడీఏ చంద్రానాయక్ సమాధానమిచ్చారు. ఇంత స్థాయిలో యూరియా వచ్చినా రైతులకు యూరియా అందలేన్న సమస్య ఎందుకు వస్తోందని కలెక్టర్ వ్యవసాయాధికారులను ప్రశ్నించారు. అనంతరం సచివాలయంలో రైతులతో కలెక్టర్ మాట్లాడారు. కొంత మంది రైతులకే యూరియా అందుతోందని, యూరియా కోసం క్యూలో ఉన్నా అందడం లేదని పలువురు వాపోయారు. యూరియా కోసం రైతులు ఆందోళన చెందొద్దని, పూర్తి స్థాయిలో యూరియా అందిస్తామని తెలిపారు. ఉల్లి రైతులకు న్యాయం చేస్తాంఖాజీపేట: ఉల్లి పంటకు సరైన పరిహారం అందించి.. రైతులందరికీ న్యాయం చేస్తామని కలెక్టర్ శ్రీధర్ భరోసా ఇచ్చారు. ఖాజీపేట మండలం చెమ్ముళ్లపల్లె లో ఉల్లి రైతులతో కలెక్టర్ సమావేశం అయ్యారు. పొలంలోని పంటలను పరిశీలించారు. గిట్టుబాటు ధర దక్కడం లేదని పలువురు రైతులు కలెక్టర్ ఎదుట వాపోయారు. తహసీల్దార్ రమణమ్మ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ -
రాష్ట్రంలో క్షీణించిన శాంతిభద్రతలు
కడప కార్పొరేషన్: కూటమి ప్రభుత్వంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి మండిపడ్డారు. గురువారం కడప నగరంలో పర్యటించిన ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలో పాలన అస్తవ్యస్తంగా మారిందన్నారు. అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ విచ్చలవిడిగా జరుగుతున్నా జిల్లా అధికార యంత్రాంగానికిగానీ, పోలీస్ వ్యవస్థకుగానీ ఇసుమంతైనా చలనం లేదన్నారు. టీడీపీ ఎమ్మెల్యేలు, నియోజకవర్గ ఇన్చార్జులు తమను తాము పెద్ద రాజుల స్థాయిలో ఊహించుకుంటూ ఓ చేత్తో రెవెన్యూ, మరో చేత్తో పోలీసులను పెట్టుకొని ఆడిస్తున్నారని ఆరోపించారు. ఇక శాంతిభద్రతలు ఎక్కడినుంచి వస్తాయని ప్రశ్నించారు. ఇటీవలి కాలంలో ఎన్ని సమస్యలు వస్తున్నాయో చూస్తున్నాం కదా...వాటిని నియంత్రించ లేనిస్థితిలో పోలీస్ యంత్రాంగం ఉందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి దౌర్భాగ్యులకు పాలనాపగ్గాలు అప్పగించామా...అని ప్రజలు చింతిస్తున్నారన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా ఇలాంటి పద్ధతులు మార్చుకోకపోతే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. నాయకులు పి. జయచంద్రారెడ్డి, జమాల్వలీ, షఫీ, సుభాన్బాషా, త్యాగరాజు, షంషీర్, గౌస్, అక్బర్ పాల్గొన్నారు. ప్రజా దర్బార్ నిర్వహించిన ఎంపీ కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి కడప ఆలంఖాన్పల్లెలోని తన క్యాంపు కార్యాలయంలో గురువారం ప్రజా దర్బార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రజలతోపాటు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో మమేకం అయ్యారు. వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల నుంచి వచ్చిన ప్రతి సమస్యను అధికారుల దృష్టికి తీసుకుపోయి పరిష్కరించేలా చర్యలు తీసుకుంటామని ఎంపీ అన్నారు. జెడ్పీ ఛైర్మెన్ రామగోవిందు రెడ్డి, మేయర్ సురేష్ బాబు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ప్రజలు పాల్గొన్నారు. మిలాద్ ఉన్ నబీ ప్రార్థనల్లో ఎంపీ మిలాద్ ఉన్ నబీ మాసోత్సవం సందర్భంగా కడప లోని శ్రీక్రిష్ణ దేవరాయ సర్కిల్ సమీపంలో వైఎస్సార్సీపీ నేత ఎస్ఎండీ ఆజమ్ ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాతో కలిసి పాల్గొని ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించి అన్నదానాన్ని ప్రారంభించారు. అన్నదాన కార్యక్రమాన్ని ప్రారంభిస్తున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, అంజద్బాషా ప్రజా దర్బార్లో నాయకులతో మాట్లాడుతున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విచ్చలవిడిగా అక్రమ మైనింగ్, ఇసుక అక్రమ రవాణా, గ్యాంబ్లింగ్ ఇంత జరుగుతున్నా జిల్లా అధికార, పోలీస్ యంత్రాంగంలో చలనం లేదు తీవ్ర స్థాయిలో విరుచుకుపడిన కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
● ఎర్రగుంట్లలో అత్యధికంగా..
అల్పపీడనం కారణంగా కురిసిన వర్షాలలో ఎర్రగుంట్లలో అత్యధికంగా 132.2 మి.మీ వర్షం కురిసింది. అలాగే ప్రొద్దుటూరులో 120.2, సికెదిన్నెలో 110.4 , పెండ్లిమర్రిలో 89.4 , రాజుపాలెంలో 83.2 , పెద్దముడియంలో 80.8 , వల్లూరులో 76.8, చెన్నూరులో 78.6 , పులివెందుల్లో 77 , కమలాపురంలో 76.2 , వేంపల్లిలో 68.2 , ఖాజీపేట 66 , వీఎన్పల్లిలో 60.2 కడపలో 54.8 , చక్రాయపేటలో 53.2 , సిద్దవటంలో 48.2 , ముద్దనూరులో 43.2 , దువ్వూరు 34.6 , ఒంటిమిట్టలో 32.2 , జమ్మలమడుగులో 30.2 , లింగాల 25.2 , అట్లూరు 26.2 , సింహాద్రిపురం 19.6 , మైదుకూరు 16.2 , వేముల 15 , తొండూరు 12.4 , బద్వేల్ 12.2 , చాపాలు 8.6 , మైలవరం 7.4 , పోరుమామిళ్ల 6.2 , బిమఠం 5.8 , బి కోడూరు 3.8 , కాశినాయన 2 , గోపవరం 1.6 మి.మీ వర్షం కురిసింది. -
22 నుంచి దసరా ఉత్సవాలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక పాత మార్కెట్లోని లలితాదేవి, రతనాల వేంకటేశ్వరస్వామి ఆలయాల్లో ఈ నెల 22వ తేదీ నుంచి అక్టోబర్ 3వ తేదీ వరకూ దసరా ఉత్సవాలను ఘనంగా నిర్వహించనున్నట్లు ఆలయ ట్రస్టు కమిటీ ప్రతినిధులు పేర్కొన్నారు. దేవీ శరన్నవ రాత్రులకు సంబంధించిన ఆహ్వాన పత్రాలను గురువారం వారు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దసరా వేడుకలలో భాగంగా రోజూ అమ్మవారిని విశేషంగా అలంకరించి భక్తులకు దర్శనం కల్పిస్తామన్నారు. లోకకల్యాణార్థం లక్ష్మీగణపతిహోమం, సుదర్శన, పవమాన, అరుణ, సరస్వతి, రుద్ర, దుర్గా, చండీ హోమాలు, వేదపారాయణం యంత్ర ఆరాధన, జప పారాయణం నిర్వహిస్తామన్నారు. రతనాల వేంకటేశ్వరస్వామికి, స్వామివారి చెల్లెలు లలితాదేవి మూలవిరాట్లను పూలు, గాజులు, నగదు, కూరగాయలు, ముత్యాలకవచం, వత్తిపత్తితో అలంకరిస్తున్నామన్నారు. అసౌకర్యం కలుగకుండా బారీకేడ్లు, క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నామన్నారు. ఉద్యోగుల ఆగ్రహానికి గురికాక తప్పదు కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వ తీరు మారకపోతే ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆగ్రహానికి గురికాక తప్పదని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు హెచ్చరించారు. ఉద్యోగ, ఉపాధ్యాయుల ఆర్థిక, విద్యారంగ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ చేపట్టిన రణభేరి ప్రచార జాత గురువారం సాయంత్రం కడపకు చేరుకుంది. యూటీఎఫ్ నాయకులు సాదర స్వాగతం పలుకుతూ కడప ఆర్టీసీ బస్టాండ్ నుంచి మహావీర్ సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్ మీదుగా బాలాజీ నగర్ యూటీఎఫ్ భవన్ వరకూ మోటార్ సైకిల్ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ఒకలా, ఎన్నికల తర్వాత మరొకలా పాలకులు వ్యవహరిస్తున్నారని దుయ్యబట్టారు. ఉద్యోగులకు మెరుగైన వేతనాలను అమలు చేస్తామని, ఆరు నెలలలోగా ఆర్థిక బకాయిలను చెల్లిస్తామని హామీ ఇచ్చి అధికారం చేపట్టిన తర్వాత విస్మరించారన్నారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ రాష్ట్ర సహాధ్యక్షుడు కె.సురేష్కుమార్, రాష్ట్ర కార్యదర్శులు బి.లక్ష్మిరాజా, జయచంద్రారెడ్డి, నాయకులు మాదన విజయ కుమార్, పాలెం మహేష్, ఎస్.జాబీర్, సమీర్బాషా, నరసింహారావు, వై.రవికుమార్ డి.సుజాతరాణి, సివి.రమణ, ఎస్.ఎజాస్ అహమ్మద్, డి.క్రిష్ణారెడ్డి, సి.సుదర్శన్, ఎద్దు రాహుల్, వీరపోగురవి, తదితరులు పాల్గొన్నారు. 22 నుంచి డిగ్రీ విద్యాసంస్థల బంద్ కడప ఎడ్యుకేషన్ : డిగ్రీ కళాశాలలకు ఫీజు రీయంబర్స్మెంట్ నిధుల విడుదల కోరుతూ ఈ నెల 22వ తేదీ నుంచి డిగ్రీ విద్యా సంస్థల నిరవధిక బంద్ నిర్వహిస్తున్నట్లు వైవీయూ డిగ్రీ కాలేజీ ప్రైవేటు మేనేజ్మెంట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వెంకటశీను తెలిపారు. యోగివేమన యూనివర్సిటీ రిజిస్ట్రార్ పద్మనురాయన గురువారం కలిసి బంద్ నోటీసులు అందజేశారు. వెంకట శ్రీను మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా రూ. 6400 కోట్ల బకాయిలు ఉన్నాయని, అనేకమార్లు అధికారులకు వినతిపత్రం అందించినా ప్రభుత్వం స్పందించలేదన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టకుండా, ఫీజులు వసూలు చేయకుండా ఉండాలని ప్రభుత్వం నుంచి హుకుం జారీ చేశారన్నారు. ఈ పరిస్థితుల్లో విద్యాసంస్థలు నిర్వహించలేక బంద్కు పిలుపునిచ్చామని తెలిపారు. సంజీవరెడ్డి, రవిశేఖర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
జగనన్న కాలనీలో చోరీ
వేంపల్లె : స్థానిక గండి రోడ్డులోని జగనన్న కాలనీలో చోరీ జరిగింది. బాధితురాలు వాణి వివరాల మేరకు.. స్థానిక జగనన్న కాలనీలో నివాసముంటున్న వాణి లిటిల్ ప్లవర్ పాఠశాలలోనూ, ఆమె భర్త నాగేంద్ర యూసీఐఎల్లో పనిచేస్తున్నారు. గురువారం ఉదయం ఇంటికి తాళాలు వేసి ఇరువురు విధులకు వెళ్లగా.. పట్టపగలే గుర్తు తెలియని వ్యక్తులు తాళాలు పగలగొట్టి చోరీకి పాల్పడినట్లు చెప్పారు. బీరువాలో రూ.50 వేల నగదు, ఎనిమిది తులాల బంగారు అభరణాలను దొంగలించినట్లు తెలిపారు. ఎస్ఐ తిరుపాల్ నాయక్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. విద్యుత్ మోటార్ల దొంగ అరెస్టు బద్వేలు అర్బన్ : పగలు పాత సామాన్లు కొంటామని వచ్చి రాత్రి పొలాల వద్ద రైతులు ఏర్పాటు చేసుకున్న విద్యుత్తు మోటార్లను ఎత్తుకెళ్తున్న దొంగను బద్వేలు రూరల్ పోలీసులు గురువారం అరెస్టు చేశారు. స్థానిక రూరల్ పోలీసుస్టేషన్ ఆవరణలో విలేకరులకు మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వివరాలు తెలిపారు. నెల్లూరు జిల్లా ఆత్మకూరు పట్టణం ఎల్.ఆర్.పల్లిలోని ముస్లీం వీధికి చెందిన పాశంరాజేష్ వివిధ ప్రాంతాల్లో పాత సామాన్లు కొనుగోలు చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పగలు ఆయా గ్రామాల్లో తిరుగుతూ ఎవరికీ అనుమానం రాకుండా రాత్రిపూట విద్యుత్తు మోటార్లను చోరీ చేస్తున్నాడు. గత నెల 25న గోపవరం మండలం సండ్రపల్లెలో, ఈ నెల 10న బద్వేల్ మండలం వనంపులలోని పొలాల్లో విద్యుత్ మోటార్లు చోరీ చేసినట్లు రైతులు ఫిర్యాదు చేయడంతో విచారించిన పోలీసులు నిందితుడిని గోపవరం మండలం శ్రీనివాసపురం వద్ద నిందితుడిని అరెస్టు చేశారు. మూడు విద్యుత్ మోటార్లతో పాటు, ఆటోను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. రూరల్ సీఐ ఎన్.క్రిష్ణయ్య, ఎస్ఐ కె.శ్రీకాంత్, సిబ్బంది పాల్గొన్నారు. మెడికల్ క్యాంపు నిర్వహణపై విచారణ కడప అర్బన్ : కడప నగరంలోని కేంద్ర కారాగారంలో 2023 నవంబర్, 28న మెడికల్ క్యాంపు నిర్వహణపై కర్నూలు ఎస్పీ విక్రాంత్పాటిల్, కడప జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు, విజయవాడ కారాగారం సూపరింటెండెంట్ ఇర్ఫాన్, కడప ఆర్డీవో జాన్ ఇర్విన్ గురువారం విచారించారు. కమిటీ అధికారుల ఎదుట క్యాంపు నిర్వహించిన డాక్టర్లు, అప్పటి కారాగార అధికారులు హాజరయ్యారు. విచారణలో వీరి స్టేట్మెంట్లను అధికారులు రికార్డు చేశారు. పోలీసుల అదుపులో ఎర్రచందనం కూలీలు ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరు మండలంలోని పెద్దశెట్టిపల్లె వద్ద గురువారం రాత్రి తమిళనాడు రాష్ట్రానికి చెందిన పలువురు ఎర్రచందనం కూలీలను కడప ఎర్రచందనం టాస్క్ ఫోర్స్ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తమిళనాడు రాష్ట్రానికి చెందిన 15 మంది కూలీలు రెండు వాహనాల్లో వెళ్తున్నారని సమాచారం రావడంతో టాస్క్ ఫోర్స్ పోలీసులు పెద్దశెట్టిపల్లె వద్ద కాపుకాచారు. ఈ క్రమంలో వారు అక్కడికి రాగానే పోలీసులు వాహనాలను అడ్డుగా పెట్టి ఎర్రచందనం కూలీలను అదుపులోకి తీసుకున్నారు. తర్వాత వారిని కడపకు తరలించారు. ప్రధాన స్మగ్లర్ కోసం పోలీసులు వారిని విచారణ చేస్తున్నారు. కూలీల వెనుక ఉన్నది జిల్లాకు చెందిన ప్రధాన స్మగ్లర్లా లేక ఇతర ప్రాంతాలకు చెందిన వారా అనేది తెలియాల్సి ఉంది. -
కుళ్లుతున్న ఉల్లి.. కన్నీళ్లే మళ్లీ
● ప్రకటనలే పరిమితమైన ఉల్లి కొనుగోలు కేంద్రాలు ● స్వయంగా జేసీ ప్రకటన చేసినా స్పందన కరవు ● కొనుగోలు కేంద్రాలు తెరవని మార్కెటింగ్ అధికారులు ● రెండు రోజుల వర్షంతో రైతుకు కొలుకోలేని దెబ్బ జిల్లాలోని మైదుకూరు, కమలాపురం మార్కెట్ యార్డులలో ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేసి మార్కెఫెడ్ ద్వారా క్వింటాల్ రూ.1200కు కొనుగోలు చేస్తామని ఈ నెల 4న జిల్లా జాయింట్ కలెక్టర్ ప్రకటించారు. అనంతరం 15 రోజులు గడచినా అతీగతీ లేకపోవడంతోపాటు జేసీ ప్రకటన పేపర్కే పరిమితమైందా అంటూ ఉల్లి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం సాగు విస్తీర్ణం (ఎకరాల్లో) మీన్పల్లి 4089.63 మైదుకూరు 1778.60 వేముల 1004.89 పెండ్లిమర్రి 825.22 దువ్వూరు 904,78 తొండూరు 693.95 వేంపల్లి 391.52 ఎర్రగుంట్ల 311.83 ముద్దనూరు 314.88 కాశినాయన 156.97 కడప అగ్రికల్చర్/సింహాద్రిపురం: జిల్లా వ్యాప్తంగా ఈ ఏడాది ఇప్పటివరకూ 11347.67 ఎకరాల్లో రైతులు ఉల్లి పంట సాగు చేశారు. 92,300 క్వింటాళ్ల మేర దిగుబడులు వచ్చే అవకాశముందని అధికారులు ముందస్తు అంచనా వేశారు. చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లి కోత దశలో ఉంది. ఈ నేపథ్యంలో రెండు రోజులుగా ఆల్పపీడనం ఏర్పడి భారీ వర్షాలు కురిసాయి. దీంతో భూమిలోనే ఉల్లి కుళ్లిపోయే ప్రమాదం ఉండడంతో రైతులు కన్నీటి పర్యంతమవుతున్నారు. సింహాద్రిపురం మండలం అహోబిలం రైతు అంకాల్ రెడ్డి ఎకరాకు రూ.70 వేలు వెచ్చించి మూడు ఎకరాల్లో ఉల్లి సాగు చేయగా.. దిగుబడులకు గిట్టుబాటు లేకుండాపోయింది. కొనుగోలు చేస్తామన్న అధికారులు చేతులెత్తేయడం, వ్యాపారి ముందుకు రాకపోవడంతో రైతు ఉల్లి దిగుబడులను ఉచితంగా గ్రామ ప్రజలను తీసుకెళ్లమని చెప్పాల్సి వచ్చింది. ఈయనే కాదు.. మా ఘోష వినేవాళ్లే లేరా అని కన్నీళ్లు దిగమింగుతున్న రైతులు ఎందరో ఉన్నారు. గోరుచుట్టుపై రోకటిపోటు ఉల్లి పంటకు మద్ధతు ధర క్వింటా రూ.1200లకు కనుగోలు చేస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జాయింట్ కలెక్టర్ కొనుగోలుకేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పినా అనంతరం స్పందన లేకపోయింది. దీంతో ఒక పక్క మద్దతు ధర లేక.. మరోపక్క ప్రభుత్వం కొనుగోలు చేయక అల్లాడిపోతున్న ఉల్లి రైతుకు గోరుచుట్టుపై రొకటిపోటు అన్నట్లు ఆల్పపీడనంతో కురిసిన వర్షాలు మరింత కుంగదీస్తున్నాయి. కనీసం సాగు ఖర్చులు వచ్చే పరిస్థితి కనిపించడం లేదని ఆందోళన చెందుతున్నారు. క్వింటా రూ.500లు పలికితే పెట్టిన పెట్టుబడులు కూడా రావని, చేసిన అప్పులు తీరవని రైతులు వాపోయారు. ఎకరాకు లక్ష రూపాయల వరకు పెట్టుబడి పెడితే కనీసం కూలి డబ్బు రాని పరిస్థితి ఉందని చెబుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి ఉల్లి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తే రైతన్నలు మేలు జరుగుతుందని, లేకపోతే ఆత్మహత్యలే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ఉల్లి పంట సాగు చేసిన రైతులు తమ దిగుబడులను ఆయా మార్కెట్ యార్డులు, రైతు బజార్లలో విక్రయించుకోవచ్చు. వారు దిగుబడులు తీసుకువచ్చి అక్కడే ఎవరికై నా విక్రయించవచ్చు. రైతులు ఏ విధమైన గుర్తింపు కార్డులు చూపాల్సిన అవసరం లేదు. నేరుగా మార్కెట్ యార్డులు, రైతు బజార్లకు వెళ్లి కిలో రూ.12 ప్రకారం విక్రయించుకునే అవకాశం కల్పించాం. ఉల్లి రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. – డాక్టర్ శ్రీధర్ చెరుకూరి, కలెక్టర్, వైఎస్సార్ కడప జిల్లా -
మధ్దతు ధర ప్రకటించాలి...
ఎర్రగుంట్ల మండలం దండుపల్లిలో ఆరెకరాల్లో ఉల్లి పంట సాగు చేశా. త్వరలో పంట దిగుబడి వస్తుంది. ధర చూస్తే రూ.1000 ఉంది. గత నెలలో క్వింటా ఉల్లి గడ్డలు రూ.1500 నుండి రూ.1800ల వరకు పలికాయి. ప్రస్తుతం క్వింటా ఉల్లి ధర రూ.500లు పలికితే పూర్తిగా నష్టపోతారు. ఈ ధర ఏమాత్రం గిట్టుకోదు. ప్రభుత్వం ఉల్లికి రూ.3 వేల మద్ధతు ధర ప్రకటించాలి. పూర్తిగా ప్రభుత్వమే కొనుగోలు చేయాలి. దళారీల ప్రమేయం ఎక్కువగా ఉండడంతో రైతు నష్టపోవాల్సి వస్తోంది. – గంగా సురేష్, ఉల్లి రైతు, దండుపల్లి, యర్రగుంట్ల మండలం -
వ్యక్తి అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని ఆర్ట్స్ కాలేజీ రోడ్డుకు చెందిన రసూల్(50) అదృశ్యమైనట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. ఈనెల 16న ఇంట్లో భార్యాభర్తల మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. ఈనెల 17న తెల్లవారుజామున నుంచి అతను కనిపించకుండా పోవడంతో భార్య రషీద కుటుంబ సభ్యులతో కలిసి పలు చోట్ల గాలించింది. అతని ఆచూకీ లభించకపోవడంతో గురువారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యం ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం రోడ్డులో ఉన్న ఆణాబంకు వీధిలోని ఎస్బీఐ కాలనీకి చెందిన ఇంద్రకంటి విజయలక్ష్మి (53) అదృశ్యమయ్యారు. గురువారం ఇంటి నుంచి వెళ్లిపోయిన ఆమె తిరిగిరాలేదు. ఆమె పట్టణంలో పలు చోట్ల అప్పులు చేశారు. కుమారుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. బాలిక అత్యాచారం కేసులో నిందితుడికి పదేళ్ల జైలు శిక్ష వేంపల్లె : స్థానిక పుల్లయ్య తోటకు చెందిన మైనర్ బాలికపై అత్యాచారం చేసిన కేసులో తమ్మిశెట్టి రామాంజ నేయులుకు కడప కోర్టు జడ్జి డాక్టర్ సి.యామిని పదేళ్ల జైలుశిక్ష, రూ.3వేల జరిమానా విధించినట్లు వేంపల్లె సీఐ నరసింహులు తెలిపారు. వివరాలలోకి వెళితే.. వేంపల్లె గ్రామంలోని పుల్లయ్యతోట వీధికి చెందిన తమ్మిశెట్టి రామాంజనేయులు వృత్తి రీత్యా పెయిటింగ్ పనిచేస్తున్నాడు. 2019 ఆగస్టు, 26న అదే వీధికి చెందిన మైనర్ బాలికను బలవంతంగా తీసుకెళ్లి అత్యాచారం చేసినట్లు బాధితురాలి తల్లి ఫిర్యాదు చేసింది. అప్పట్లో కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. విచారించిన జడ్జి నిందితుడికి పదేళ్ల సాధారణ జైలు శిక్షతోపాటు రూ.3వేలు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పినట్లు సీఐ తెలిపారు. జూదరుల అరెస్టు ఖాజీపేట : జూదమాడుతున్న ఎనిమిది మందిని అరెస్టు చేసినట్లు ఖాజీపేట సీఐ వంశీధర్ తెలిపారు. నాగసానిపల్లె పొలాల్లో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో దాడులు చేశామని, వారి నుంచి రూ.78,470 నగదు, ఏడు సెల్ఫోన్లు, ఏడు బైక్లు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేసినట్లు తెలిపారు. కడప సెవెన్రోడ్స్ : లాటరీ ద్వారా జిల్లాలో ఏడు బార్లను గురువారం కేటాయించారు. జాయింట్ కలెక్టర్ అదితిసింగ్ సమక్షంలో పారదర్శకంగా లాటరీ ప్రక్రియ నిర్వహించారు. అర్హత సాధించిన దరఖాస్తుదారులకు బార్లను కేటాయించారు. కడపలో నాలుగు, పులివెందుల, మైదుకూరు, బద్వేల్లలో ఒకటి చొప్పున బార్లను కేటాయించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోహిబిషన్ ఎకై ్సజ్ అధికారి రవికుమార్, జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఎన్ఫోర్స్మెంట్) చంద్రశేఖర్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
తోటల వద్దే కొనుగోలు చేయాలి
తోటల వద్దే ఉల్లి దిగుబడులు కొనుగోలు చేయాలి. మార్క్ఫెడ్ అధికారులు రైతులను దిగుబడులు అక్కడికి తీసుకురమ్మంటున్నారు. తీసుకెళ్లిన తర్వాత గ్రేడింగ్ చేసి ఖచ్చితమైన ధర రావచ్చు.. రాకపోవచ్చు అంటూ చెబుతున్నారు. దీంతో మార్కెట్కు రావాలంటే భయం వేస్తోంది. కర్నూల్ మార్కెట్లో రైతుకు క్వింటా రూ.500 నుంచి రూ.350 వరకు ధర ఇవ్వడంతో ఉల్లిగడ్డలను రోడ్డుపై పారబోశారు. ప్రభుత్వమే గిట్టుబాటు ధర కల్పించి రైతుల వద్ద కొనుగోలు చేయాలి. – మల్లికార్జునరెడ్డి, ఉల్లి రైతు, అహోబిలం -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం
కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో పది మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ రాజీలేని పోరాటం చేయాలని నిర్ణయిచినట్లు వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య తెలిపారు. వైఎస్సార్ స్మారక ప్రెస్క్లబ్లో అఖిలపక్ష యువజన సంఘాలతో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆదిత్య మాట్లాడుతూ పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు రాష్ట్రానికి ఒక్క కొత్త మెడికల్ కళాశాల కూడా తీసుకురాలేకపోయారని ఎద్దేవా చేశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలను రాష్ట్రానికి మంజూరు చేయించి, అందులో 8 మెడికల్ కాలేజీలను పూర్తి చేసి తరగతులు ప్రారంభించారన్నారు. చంద్రబాబు సొంతజిల్లా అయిన చిత్తూరులోని మదనపల్లెలో 98 ఎకరాల్లో రూ.700 కోట్లు ఖర్చు చేసి మెడికల్ కాలేజీ నిర్మిస్తే దాన్ని కూడా ప్రైవేటీకరణ చేయడానికి పూనుకోవడం సిగ్గుచేటన్నారు. పాడేరు, పులివెందుల మెడికల్ కాలేజీలు ప్రారంభం కావాల్సి ఉందన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీకి ఎన్ఎంసీ 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే వద్దని లేఖ ఇచ్చిన దద్దమ్మ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. ప్రైవేటీకరణను రద్దు చేసేవరకూ పోరాటం ఆపేది లేదని, రాస్తారోకోలు, ముట్టడి కార్యక్రమాలతోపాటు, ఛలో అసెంబ్లీకి కూడా పిలుపునిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శులు రవి, చంద్ర, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి గురుప్రసాద్, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, ఏఐవైఎఫ్ నాయకులు ప్రభాకర్, ఏఐఎస్బి నాయకులు రాజేంద్ర, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జల్సాలకు అలవాటుపడి.. చోరీల బాట
– రూ.8లక్షల బంగారు ఆభరణాలు స్వాధీనం బద్వేలు అర్బన్ : జల్సాలకు అలవాటుపడి సులువుగా చోరీ చేస్తున్న ఇద్దరు యువకులను బద్వేల్ అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. వారి నుంచి సుమారు రూ.8 లక్షల విలువ చేసే బంగారు, వెండి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. స్థానిక అర్బన్ స్టేషన్ ఆవరణలో విలేకరులకు డీఎస్పీ జి.రాజేంద్ర ప్రసాద్ వివరాలు వెల్లడించారు. కడప నగరంలోని మరాఠి వీధికి చెందిన నారాయణ దిలీప్కుమార్, భాగ్యనగర్ కాలనీకి చెందిన షేక్నాయబ్రసూల్ స్నేహితులు. కడప నగరంలో ఆటో నడుపుతూ జీవనం సాగిస్తున్న వీరు జల్సాలకు అలవాటుపడి చోరీలు చేయడం అలవాటు చేసుకున్నారు. నాలుగేళ్ల కిందట సొంత అన్న ఇంట్లోనే ఇరువురు కలిసి చోరీకి పాల్పడ్డారు. ఈ నెల 10న బద్వేల్కు వచ్చిన ఇరువురు వెంకటయ్యనగర్లో శ్రీనివాసులు ఇంటికి తలుపులు పగులకొట్టి చోరీకి పాల్పడ్డారు. బాధితుల ఫిర్యాదు విచారించిన పోలీసులు బద్వేల్–మైదుకూరు రహదారిలో నిందితులను అరెస్టు చేశారు. వారి నుంచి 118.04 గ్రాముల బంగారు ఆభరణాలు, 40 గ్రాముల నాలుగు వెండి బిళ్లలు లభించాయన్నారు. అర్బన్ సీఐ లింగప్ప, ఎస్ఐలు సత్యనారాయణ, జయరామిరెడ్డి పాల్గొన్నారు. -
20న వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగ కార్యవర్గ సమావేశం
కడప కార్పొరేషన్: కడప నగరంలోని పాతరిమ్స్ ఆవరణలో ఉన్న బీసీ భవన్లో ఈనెల 20వ తేది ఉదయం 9 గంటలకు వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించనున్నట్లు ఆ పార్టీ ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు తెలిపారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. రాష్ట్ర ఎస్సీసెల్ అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, జిల్లా పార్టీ అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించాలని నిర్ణయించామన్నారు. ఈ సమావేశానికి కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్రెడ్డిలతో పాటు ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొంటారని తెలిపారు. ఎన్నికల ముందు దళితులకు ఎన్నో హామీలు ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఏ ఒక్క హామీని కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రంలో దళితులపై దాడులు జరుగుతున్నా పట్టించుకోలేదన్నారు. ఎస్సీ విభాగం రాష్ట్ర కార్యదర్శి ఎం. సుబ్బరాయుడు మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ ప్రాతినిధ్యం వహిస్తున్న పిఠాపురంలో దళితులను గ్రామ బహిష్కరణ చేస్తే సీఎం, డిప్యూటీ సీఎంలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. ఈ సమస్యలన్నింటిపై సమావేశంలో చర్చించనున్నామన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, నాయకులు బండి ప్రసాద్, రవి, అజయ్, శ్యామ్, శ్రీనివాసులు పాల్గొన్నారు. ● రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్బాబుతోపాటు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల రాక ● జయప్రదం చేయాలని జిల్లాఅధ్యఽక్షుడు ఎస్.వెంకటేశ్వర్లు పిలుపు -
ఆర్భాటం.. హంగామా.. అంతలో వెనక్కు
కడప ఎడ్యుకేషన్ : డీఎస్సీలో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికై న అభ్యర్థులందరినీ విజయవాడకు పిలిపించి ఏదో హంగామా చేయాలని భావించారు.. వారికి ఆర్భాటంగా నియామక పత్రాలను అందిస్తామని చెప్పడంతో అభ్యర్థులు ఆఘమేఘాలపై పరుగున వచ్చారు. దీరా అక్కడ పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసినందున నిలిపివేశామనడంతో వారు నిరుత్సాహానికి గురయ్యారు. కడప జిల్లా డీఎస్సీ అభ్యర్థులు, వారికి తోడుగా వచ్చే బందువులను విజయవాడకు తరలించేందుకు కడప డీఈఓ కార్యాలయం వద్ద బస్సులను(జిల్లా నుంచి 40 బస్సులు) సిద్ధం చేశారు. నలుమూలల నుంచి చాలా మంది డీఎస్సీ అభ్యర్థులు వేకువగానే కడప డీఈఓ కార్యాలయానికి చేరుకున్నారు. టిఫిన్ చేసి బయలు దేరేందుకు బస్సులు కూడా ఎక్కారు. ఇంతలోనే కార్యాక్రమం రద్దు చేశారని మేసేజ్ వచ్చింది. డీఎస్సీ అభ్యర్థులు నిరుత్సాహ పడిపోయారు. ఎక్కడి నుంచి వచ్చారో మళ్లీ వెనక్కు వెళ్లారు. డీఈఓ షేక్ షంషుద్దీన్తో మాట్లాడగా అధిక వర్షంతో విజయవాడలో కార్యక్రమం రద్దు అయిందని తమకు సమాచారం వచ్చిందన్నారు. త్వరలో మళ్లీ ఎప్పుడు ఉంటుందనే విషయాన్ని అభ్యర్థులకు తెలియచేస్తామని తెలిపారు. డీఎస్సీ అభ్యర్థులకు నిరుత్సాహం -
●కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో నిర్లక్ష్యం
ఖాళీ జాగాలు కనిపిస్తే చాలు ‘పచ్చ గద్దలు’ వాలిపోతున్నాయి.. కోట్లాది రూపాయల ప్రభుత్వ స్థలాలను పట్టపగలే మింగేస్తున్నాయి. కొండల్ని..గుట్టల్ని సైతం తవ్వేస్తూ చెరబడుతున్నాయి.. అధికార ఒత్తిడికి తోడు.. అక్రమ సొమ్ము జేబుల్లోకి చేరడంతో అధికార యంత్రాంగం దగ్గరుండి మరీ ‘తమ్ముళ్లకు’ కొమ్ముకాస్తోంది. సాక్షి ప్రతినిధి, కడప: జిల్లాలో భూ దందాలు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. అధికార పార్టీ నేతలు..కార్యకర్తల భూదాహానికి అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. కోట్లాది రూపాయాల విలువైన ప్రభుత్వ భూమి పరులపాలవుతుంటే.. అడ్డుకోవాల్సిన రెవెన్యూ యంత్రాంగం అధికార మత్తులో జోగుతోంది. ● అట్లూరు మండల పరిధిలోని నల్లాయపల్లి రెవెన్యూ పొలంలో సర్వేనెంబరు 40లో 445.81 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. సారవంతమైన ఆ భూమి వ్యవసాయానికి అనువుగా ఉంది. బద్వేల్ మండలానికి చెందిన తెలుగుతమ్ముళ్లకు ఆ భూమిపై కన్నుపడింది. అంతే.. జేసీబీ యంత్రాలు, డోజర్ ట్రాక్టర్లతో యధేచ్ఛగా చదును చేశారు. పట్టపగలు బాహాటంగా ఆక్రమణలకు పాల్పడుతున్నా రెవెన్యూ అధికారులు అటువైపు కన్నెత్తి చూడలేదు. స్థానికులు సమాచారమిచ్చినా ఉన్నతాధికారులు స్పందించలేదు. వీఆర్వోను పంపించి చేతులు దులుపుకున్నారు. పైగా ఆక్రమణదారులకు సమాచారం అందించారు. స్థానికులు అప్పగించిన జేసీబీ సైతం తర్వాత వదిలేశారు. దాదాపు 40 ఎకరాల మేరకు చదును చేసినట్లు స్థానికులు వివరిస్తున్నారు. ప్రభుత్వ భూమిగా నిర్ధారించినా.. బద్వేల్ నియోజకవర్గంలో అధికారపార్టీకి రెవెన్యూ యంత్రాంగం అండగా నిలుస్తోంది. బి.కోడూరు మండలం వేముకుంట గ్రామంలో సర్వే నంబర్ 18లో 16.50 ఎకరాలు ప్రభుత్వ గయ్యాలి భూమిని మాజీ ఎమ్మెల్యే విజయమ్మ తన అనుచరుల ద్వారా రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ప్రభుత్వ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్న నేపధ్యంలో గ్రామస్తులు రెవెన్యూ కోర్టులను ఆశ్రయించారు. రాజంపేట ఆర్డీఓ కోర్టు (ఈ3)/1916/2016లో ద్వారా 2016లో ప్రభుత్వ గయ్యాలి భూమిగా తీర్పు ఇచ్చింది. ఆపై విజయమ్మ తనయుడు ప్రస్తుత టీడీపీ ఇన్ఛార్జి రితేష్రెడ్డి కడప జాయింట్ కలెక్టర్ కోర్టును ఆశ్రయించగా జేసీ కోర్టు సైతం ఆర్డీఓ కోర్టు తీర్పును సమ్మతిస్తూ ప్రభుత్వ గయ్యాలి భూమిగా డిసెంబర్ 23, 2022 తేదిన ఉత్తర్వులు ఇచ్చింది. ఆర్డీఓ, జేసీ కోర్టుల తీర్పునసరించి బి.కోడూరు తహసీల్దార్, వేముకుంట ప్రజల సమక్షంలో పంచనామా చేపట్టారు. సర్వేనంబర్ 18లో 16.50ఎకరాలు భూమిని స్వాధీనం చేసుకొని ప్రభుత్వ భూమి బోర్టు పెట్టారు. కొండాపురం మండలం తాళ్లప్రొద్దుటూరు ఆర్అండ్ఆర్ సెంటర్ ఏర్పాటులో భాగంగా 1.38 ఎకరాలు తాళ్లప్రొద్దుటూరు పోలీసుస్టేషన్కు కేటాయించారు. ఆమేరకు తహసీల్దార్ రెఫెరెన్స్ నెం.ఏ/785/2021తో డిసెంబర్ 13, 2021న పొజిషన్ సర్టిఫికెట్ కూడా అప్పగించారు. ఇప్పుడా స్థలంపై కూటమి నేతల కన్ను పడింది. నేషనల్ హైవే–67 రోడ్డుపక్కనే ఉండడంతో సెంటు రూ.3లక్షలు పలుకుతోంది. అందులో 50 సెంట్లు భూమి కొట్టేసేందుకు సరికొత్త వ్యూహం పన్నారు. ఓ ఎమ్మెల్యే ఒత్తిడి కారణంగా స్థానికంగా పోలీసు, రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారు. ఆ మేరకు సిఫార్సులు చేస్తూ కలెక్టరేట్కు ఫైల్ పంపించారు. విషయం తెలుసుకున్న మునుపటి ఎస్పీ అశోక్కుమార్ జాయింట్ కలెక్టర్కు అభ్యంతరం చెబుతూనే, ఆ స్థలానికి కంచె వేయించారు. పోలీసుస్టేషన్కు కేటాయించిన స్థలం ప్రైవేటు వ్యక్తులకు ఎలా ఇస్తారని ప్రజలు కూడా వాదిస్తున్నా అవేవి పట్టించుకునే దిశగా రెవెన్యూ యంత్రాంగం ఆలోచనలు కన్పించడం లేదు. పెద్ద మొత్తంలో చేతులు మారడడంతో పోలీసుస్టేషన్కు కేటాయించిన స్థలాన్ని కూడా అప్పగించేందుకు సంసిద్ధమైనట్లు తెలుస్తోంది. జిల్లా వ్యాప్తంగా కోట్లాది విలువైన ప్రభుత్వ భూములు పరులుపాలు చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం కృతనిశ్చయంతో ఉండిపోయిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. యథేచ్ఛగా భూ ఆక్రమణలకు పాల్పడుతున్న అధికార పార్టీ నేతలు బద్వేలు నియోజకవర్గ పరిఽధిలోక్రమం తప్పకుండా భూదందాలు ప్రభుత్వ భూములపై కన్నేసిన ‘తమ్ముళ్లు’ కట్టడి చేయకపోగా, అక్రమార్కుల కొమ్ముకాస్తున్న అధికారులు ప్రభుత్వ భూమిగా ఆర్డీఓ, జేసీ కోర్టులు నిర్దేశించిన సదరు భూమిపై హైకోర్టు స్టేటస్–కో 2022లో ఉత్తర్వులిచ్చింది. అప్పటి నుంచి ఇప్పటి వరకూ కౌంటర్ అఫిడవిట్ దాఖలు చేయడంలో రెవెన్యూ అధికారులు నిర్లక్ష్యం ప్రదర్శిస్తున్నారు. మూడేళ్లుగా కోట్లాది రుపాయాలు విలువైన భూముల విషయంలో రెవెన్యూశాఖ చేష్టలుగి చూస్తుండి పోయింది. బహిరంగ మార్కెట్లో రూ.3కోట్లు పైబడి పలికే వేముకుంట ప్రభుత్వ గయ్యాలి భూమి రితేష్రెడ్డి ధాదాదత్తం చేసేందుకు సహకరిస్తోందనే ఆరోపణలున్నాయి. -
ప్రయాణికుల మన్ననలు పొందేలా సేవలు
కడప కోటిరెడ్డిసర్కిల్: విమాన ప్రయాణీకుల మన్ననలు పొందేలా సేవలు అందిస్తున్నామని కడప ఎయిర్పోర్టు డైరెక్టర్ సుజిత్కుమార్ పొదార్ తెలిపారు. బుధవారం ఎయిర్పోర్టు అథారిటీ ఆఫ్ ఇండియా ఆదేశాల మేరకు కడప ఎయిర్పోర్టులో యాత్రి సేవా దివస్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన వివిధ సాంస్కృతిక ప్రదర్శనలు యాత్రికులను ఆకట్టుకున్నాయి. తొలుత వివిధ ప్రాంతాల నుంచి కడపకుచేరుకున్న యాత్రికులకు డైరెక్టర్తోపాటు ఇతర అధికారులు స్వాగతం పలికారు.అలాగే రక్తదాన శిబిరంలో పలువురు స్వచ్చందంగాపాల్గొని రక్తదానం చేశారు. అనంతరం అతిథులతో కలిసి మొక్కలు నాటారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డితోపాటు ఓం శాంతి సంస్థ ప్రతినిధులు, రామకృష్ణ మిషన్ సభ్యులు, ఎయిర్పోర్టు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఆర్భాటం.. హంగామా?
డీఎస్సీ నియామక పత్రాల పంపిణీ: 19వ తేదీ ఉమ్మడి కడప జిల్లాలో ఉద్యోగాలు పొందిన అభ్యర్థులు: 628 మంది కడప ఎడ్యుకేషన్: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర లేపింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి నానా హంగామా చేశారు. తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైనవారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది .ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామా తెరమీదకు తెచ్చారు. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి కడప జిల్లాల నుంచి విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు మండిపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ● ఉమ్మడి కడప జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది.150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మెండి చేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్డెస్క్కు కాల్స్ వస్తున్నట్లు తెలిసింది. ఉద్యోగాలు రాని పలువురు జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లటం న్యాయం చేయాలని వేడుకుంటున్నారు. అభ్యర్థులకు విద్యాశాఖ అధికారులు సమాధానం చెప్పలేకపోతున్నారు. ● కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్ట్రిక్ట్ సెలెక్షన్ కమిటీ) పేరుతో తిలోదకాలిచ్చారని ఆరోపణలు ఉన్నాయి. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు జిల్లా స్థాయిలోనే జరిగేది. ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఈ కసరత్తులో అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు. ఎంపిక జాబితా పేరుతో పలు సార్లు ప్రచురించి, కాల్లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంకులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు అనర్హులుగా పేర్కొన్నారు. ● మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాల పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ఎంపికై న అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా రావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. దాదాపు 400 కిలోమీటర్లు దూరం వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. ప్రభుత్వం నిర్ణయంతో పలువురు మండిపడుతున్నారు. వైఎస్సార్జిల్లా నుంచి 1600 మంది 40 బస్సుల్లో వెళ్లనున్నారు. జిల్లాలోనే నియామకపత్రాలు అందచేయాలి డీఎస్సీకి ఎంపికై న అభ్యర్థులకు జిల్లాస్థాయిలోనే నియమాకపత్రాలు అందచేయాలి. విజయవాడకు రమ్మని చెప్పడం సరికాదు. గతంలో ఎన్నడూ లేని విధంగా ఇలా చేయడం అన్యాయం. అధికారులు పునరాలోచించాలి. – సజ్జల రమణారెడ్డి, వైఎస్సార్టీఎఫ్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ డీఎస్సీ ఆర్డర్లకు 500 కిలోమీటర్లు వెళ్లాలా! మండిపడుతున్న అభ్యర్థులు -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
పులివెందుల: రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో వైఎస్ జగనన్న పేదల కోసం దేశంలోనే ఎక్కడా లేని విధంగా రాష్ట్రంలో 17 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేయడానికి నిర్ణయం తీసుకుని అందుకు తగిన కార్యాచరణతో నిర్మాణాలు చేపట్టినట్లు చెప్పారు. అయితే దాదాపు పూర్తయిన మెడికల్ కళాశాలలను పూర్తి కాలేదంటూ ప్రస్తుత సీఎం చంద్రబాబు నాయుడు వాటిని ప్రైవేట్పరం చేయడానికి సిద్ధమయ్యాడన్నారు.ఈ ప్రభుత్వం తీసుకునే చర్యలవల్ల పేద విద్యార్థులకు మెడికల్ సీట్లు, అలాగే నిరుపేదలకు మెరుగైన వైద్య సేవలు అందకుండా పోతుందన్నారు. పులివెందులకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ సభ్యులు వచ్చి పరిశీలించి ఇక్కడ మెడికల్ కళాశాల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు ఉన్నాయని భావించి 50మెడికల్ సీట్లను మంజూరు చేయడం కూడా జరిగిందన్నారు. అయితే పులివెందులపై ఉన్న వివక్షతతో మంజూరైన మెడికల్ సీట్లను కుంటి సాకులు చెప్పి వెనక్కి వెళ్లేలా చేసిన నీచమైన చరిత్ర తెలుగుదేశం పార్టీది అని ఎంపీ అన్నారు. రాష్ట్రంలోని 17మెడికల్ కళాశాలలకు సంబంధించిన లక్ష కోట్ల ఆస్తిని ఈ ప్రభుత్వం ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడం శోచనీయమన్నారు. మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున అడ్డుకుంటామని ఆయన తెలిపారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి ప్రజల సమస్యల పరిష్కారానికి కృషి చేశారు. వైఎస్సార్సీపీలోకి 12 కుటుంబాలు మండల కేంద్రమైన వేముల ఎస్సీ కాలనీలోని టీడీపీకి చెందిన 12 కుటుంబాల వారు బుధవారం వైఎస్సార్సీపీలో చేరారు. వైఎస్సార్సీపీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డిల ఆధ్వర్యంలో చేరిన టీడీపీ నాయకులు, కార్యకర్తలకు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పార్టీ కండువాలు వేసి ఆహ్వానించారు. పార్టీలో చేరిన వారిలో చాగలేటి ప్రతాప్, అలవలపాటి గంగాధర, దారతోటి గుంటెన్న, రాచూరు రాఘవ, కొండూరు శ్రీనివాసులు, ఉలిమెల్ల గంగాధర్, గొందిపల్లె గంగాధర్, గొందిపల్లె కరుణాకర్, చాగలేటి పుల్లయ్య, గొందిపల్లె సుమంత్, కొట్టం శ్రీరాములు, గొందిపల్లె రామాంజులతోపాటు మరికొంతమంది ఉన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుండా మభ్యపెడుతూ ప్రశ్నిస్తున్న వారిపై అక్రమ కేసులు బనాయిస్తుండటంతో విసుగు చెందామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిల ఆధ్వర్యంలో సంక్షేమ పథకాలు బాగా అమలయ్యాయని, రాబోయే కాలంలో ఇంకా అభివృద్ధి చెందుతుందన్న ఉద్దేశ్యంతో పార్టీలో చేరినట్లు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు చలపతి, నాగప్ప, గంగాధర తదితరులు పాల్గొన్నారు. ప్రజల సమస్యలను తెలుసుకుంటున్న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఎంపీ సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిన వేముల మండల టీడీపీ నాయకులు కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
జిల్లాలో వర్షం
చాపాడులో 80.2 మిల్లీమీటర్ల వర్షం కడప అగ్రికల్చర్: ఆల్పపీడనం కారణంగా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా కొండాపురం, మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు. కలసపాడు, ఆట్లూరు మండలాలు మినహా మిగతా 30 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లిపంట కోతలు ప్రారంభించారు. తడికి ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం వరిపంట సాగు చేసిన రైతులకు చాలా మేలు.వరికి సోకిన చీడపీడలు తొలిగి పంట ఏపుగా పెరిగే అవకాశశం ఉంటుంది. మిగతా ఆరుతడి పంటలైన పత్తి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, సజ్జ పంటలకు, మామిడి, సపోట, చీని, నిమ్మ, డ్రాగెన్ ప్రూట్ వంటి ఉద్యాన పంటలకు కూడా ఈ వర్షం మేలేనని రైతులు తెలిపారు. చాపాడులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్లు, కాశినాయనలో అత్యల్పంగా 1 మిల్లీమీటర్ వర్షం కురిసింది. -
సమ్మెకు.. నోటీసులు
కడప కార్పొరేషన్: గాంధీజీ కలలుగన్న గ్రామ స్వరాజ్యాన్ని తీసుకురావడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022లో అక్టోబర్ 2 మహాత్మాగాంధీ జయంతి రోజు గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థకు శ్రీకారం చుట్టింది. సరిగ్గా మూడేళ్ల తర్వాత కూటమి ప్రభుత్వంలో సచివాలయ ఉద్యోగులు ఒకరోజు ముందే అక్టోబర్ 1 నుంచి సమ్మెలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారు. తమపై ప్రభుత్వం మోపుతున్న పనిభారం తగ్గించాలని, న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని వారు కోరుతున్నారు. ఉద్యోగ సంఘాల నేతలు జేఏసీగా ఏర్పడి అధికారులకు సమ్మె నోటీసులు ఇప్పటికే అందజేశారు. ఈనెల 22వ తేదీ నుంచి దశలవారీ ఆందోళనలు చేపట్టి అక్టోబర్ ఒకటి నుంచి నిరవధిక సమ్మెను చేపట్టాలని గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులు నిర్ణయించినట్లు తెలుస్తోంది. వైఎస్సార్ కడప జిల్లాలోని 36 మండలాలు, ఒక మున్సిపల్ కార్పొరేషన్, 5 మున్సిపాలిటీలు, రెండు నగర పంచాయతీలలో 889 గ్రామ, వార్డు సచివాలయాలు నడుస్తుండగా, వాటిలో సుమారు 7600 మంది ఉద్యోగులు విధులను నిర్వర్తిస్తున్నారు. వలంటీర్ల బాధ్యతలు సచివాలయ ఉద్యోగులకే... వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతి 50 ఇళ్లకు ఒక వలంటీర్ను నియమించింది. ప్రభుత్వ సంక్షేమ పథకాలను ఇంటింటికీ చేరవేయడం, పింఛన్ల పంపిణీ, ప్రభుత్వం నిర్దేశించిన సర్వేలు, కార్యక్రమాలను వలంటీర్లు అమలు చేసేవారు. తాము అధికారంలోకి వస్తే వలంటీర్లకు రూ.10వేల జీతమిస్తామని కూటమి ప్రభుత్వం ప్రకటించింది. 2024లో అధికారంలోకి వచ్చాక వలంటీర్లకు జీతాలు పెంచకపోగా వలంటీర్ల వ్యవస్థనే ఎత్తేసింది. కూటమి పాలనలో వలంటీర్లు లేకపోవడంతో ఆ పనులన్నీ చేసే బాధ్యత సచివాలయ ఉద్యోగులపైన పడింది. దీంతో సహజంగానే సచివాలయ ఉద్యోగులపై అధిక భారం, పని ఒత్తిడి పెరిగింది. ప్రజలకు సంబంధించిన సామాజిక, ఆర్థిక, విద్య, వైద్యం, ఆధార్, బయోమెట్రిక్ వివరాలు, ప్రభుత్వం సంక్షేమ పథకాలకు సంబంధించిన వివరాల సేకరణలతో భారం అధికమైంది. ఆందోళనకు కార్యాచరణ ప్రణాళిక తమ సమస్యల పరిష్కారానికి జిల్లాలోని సచివాలయ ఉద్యోగ జేఏసీ సంఘ ప్రతినిధులు కార్యాచరణ ప్రణాళిక సిద్దం చేశారు. ఇప్పటికే మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలకు సమ్మె నోటీసులు అందజేశారు. సెప్టెంబర్ 30వ తేదిలోపు తమ డిమాండ్లు పరిష్కరించకపోతే అక్టోబర్ 1వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తామన్న సంకేతాలు ఇస్తున్నారు. ● ప్రతిసారీ సర్వేల పేరుతో ఇంటింటికీ తిరిగి విధులు నిర్వహించడం వల్ల క్షేత్రస్థాయిలో తీవ్ర అవమానాలకు గురవుతూ, ఆత్మ గౌరవం కోల్పోతున్నాం. వీటి నుంచి విముక్తి కల్పించాలి. ● విద్యార్హతల ఆధారంగా రాష్ట్ర అభివృద్ధి, ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా విధులు అప్పగించాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులను మాతృశాఖలకు అప్పగించాలి. ● సమయపాలన లేని, ఒత్తిడితో కూడుకున్న విధుల నుంచి విముక్తి కల్పించాలి. ● సెలవులు, పండుగలు, ఆదివారాల్లో బలవంతపు విధులు చేయించడం ఆపాలి. ● ఆరేళ్లు ఒకే క్యాడర్లో సర్వీసు పూర్తి చేసుకున్న ఉద్యోగులకు ఏఏఎస్ ప్రకారం స్పెషల్ ఇంక్రిమెంట్లు ఇవ్వాలి. ● ప్రొబేషనరీ సమయంలో రావలసిన నోషనల్ ఇంక్రిమెంట్లకు స్పష్టమైన ప్రైమ్టైమ్ నిర్ణయించాలి. ● పట్టణ స్థానిక సంస్థల్లోని వార్డు సచివాలయాల్లోని ఖాళీలకు 50 శాతం సచివాలయ సిబ్బందితో భర్తీ చేయాలి. ● సర్వేలను ఆయాశాఖల సంబంధిత ఉద్యోగులతో నిర్వహించి, సచివాలయ సిబ్బందిపై భారం తగ్గించాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగులకు ప్రస్తుతం అమలవుతున్న రికార్డు అసిస్టెంట్ క్యాడర్ను జూనియర్ అసిస్టెంట్ క్యాడర్కు మార్పు చేయాలి. ● గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల స్టేషన్సీనియారిటీ ఆధారంగా పారదర్శక బదిలీలు జరిగేలా ప్రత్యేక విధి విధానాలను ఖరారు చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేయాలి. అత్మగౌరవం దెబ్బతింటోంది సచివాలయ ఉద్యోగులు ఏ విధులు నిర్వహించాలో వాటినే ప్రభుత్వం అప్పగించాలి. అసలు ప్రజల ఇళ్ల వద్దకు సర్వేలు చేయడం, తమకు సంబంధం లేని ఎరువుల విక్రయాల వద్ద విధులను అప్పగించడం మా ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమే. తమ విధులేమిటో ప్రభుత్వం నిర్ణయించి జాబ్చార్జ్ను ప్రకటించాలి. లేదంటే రాష్ట్ర జేఏసీ నిర్ణయం ప్రకారం ముందుకు వెళతాం. – హీరామియ్యా, జిల్లా అధ్యక్షుడు. గ్రామ, వార్డు సచివాలయం ఎంప్లాయీస్ ఫెడరేషన్వలంటీర్లు చేసే పనంతా మాపై పడింది ఇదివరకు 50 ఇళ్లకు ఒక వలంటీరు ఉండేవారు. ఒక సచివాలయంలో 25 క్లస్లర్టు ఉంటాయి. వలంటీర్లు చేసే పనంతా మాపైనే పడుతోంది. డ్యూయల్ బాసిజం మాపై ఎక్కువైంది. అన్ని రకాల పనులు మాతోనే చేయిస్తున్నారు. ఇది చాలా దారుణం. అలాగే పదోన్నతులు కల్పించడానికి తగిన విధి విధానాలు రూపొందించాలి. – పి. సిద్దేశ్వర్రెడ్డి, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్. గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల ఐక్య సంక్షేమ సంఘంచిన్నచూపు చూస్తున్నారు కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీ ర్యం చేస్తున్నారు. ఒక్క సమస్యకు పరిష్కారం లేదు. కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను చిన్నచూపు చూస్తూ ఎగతాళి చేస్తున్నారు. సంబంధం లేని విధులు అప్పగించడమే కాక సర్వేల సమయంలో ప్రభుత్వ ఉద్యోగులమైన మేము ఇంటింటికీ వెళ్లి ప్రజలు ఓటీపీలు చెప్పడం లేదు, వాటిని ఎలా పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. తక్షణమే జాబ్చార్జ్ను ప్రకటించాలి. – ఎం. మస్తాన్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు, గ్రామ, వార్డు, సచివాలయ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం ఈనెల 22 నుంచి సచివాలయ ఉద్యోగుల ఉద్యమబాట డిమాండ్లు తీర్చాలని, పని భారం తగ్గించాలని డిమాండ్ జిల్లాలో 889 సచివాలయాలు, సుమారు 7600 మంది ఉద్యోగులు -
విశ్వకర్మకు ఘన నివాళి
కడప సెవెన్రోడ్స్: శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ఉత్సవాలు బుధవారం కలెక్టరేట్లో జిల్లా బీసీ సంక్షేమశాఖ ఆధ్వర్యంలో నిర్వహించారు. తొలుత విశ్వకర్మ చిత్రపటానికి డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు పూలమాలలు సమర్పించి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్బంగా డీఆర్వో మాట్లాడుతూ కులవృత్తి గొప్పదనాన్ని, వైభవాన్ని, ప్రభావాన్ని, జీవనాధారాన్ని పెంపొందించడమే సాంకేతికతకు మూలపురుషుడైన శ్రీ విరాట్ విశ్వకర్మ జయంతి ప్రధాన ఉద్దేశ్యమన్నారు. ప్రపంచ తొలి వాస్తు శిల్పి, సృష్టికర్తగా ప్రవచనకారులు దేవశిల్పి విశ్వకర్మను ప్రస్తావించడం సమంజసమైనదన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ఆదేశాల మేరకు విశ్వకర్మ భగవానుని జన్మదినాన్ని ప్రతి ఏడాది సెప్టెంబర్ 17న ‘విశ్వకర్మ జయంతి’’ గా జరుపుకోవడం జరుగుతోందని వివరించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర విశ్వబ్రాహ్మణ కార్పొరేషన్ డైరెక్టర్ డాక్టర్ శ్రీనివాసా చారి, ఎస్డీసి వెంకటపతి, ఎస్సి కార్పోరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, బీసీ వెల్ఫేర్ అధికారి అంజల, విశ్వ బ్రాహ్మణ సంఘ ప్రతినిధులు, బీసీ సంక్షేమ శాఖఅధికారులు, పీఎం విశ్వకర్మ యోజన లబ్ధిదారులు, పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే పీఏ అండతోనే మెప్మాలో అక్రమాలు
ప్రొద్దుటూరు : అధికార పార్టీ ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి వ్యక్తిగత పీఏ స్వామి అండతో మెప్మాలో అక్రమాలు జరుగుతున్నాయని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ చాంబర్లో విలేకరులతో ఆయన బుధవారం మాట్లాడుతూ మెప్మా పరిధిలో 30వేల మంది డ్వాక్రా సభ్యులు ఉన్నారని తెలిపారు. ప్రభుత్వం ఏర్పాటు చేసిన మెప్మా మై స్టోర్ యాప్ ద్వారా టీఈ మహాలక్ష్మి అక్రమాలకు పాల్పడుతున్నారని ఆరోపించారు. మార్కెట్లో లభించే అగరబత్తీలు, ఊరగాయలు, కారంపొడి, పేలాల ముద్దలు, టవాళ్లు తీసుకువచ్చి యాప్ ద్వారా విక్రయిస్తున్నారన్నారు. ప్రొద్దుటూరులోని సంస్థతో ఒప్పందం చేసుకుని తక్కువ ధరకు కొనుగోలు చేసి ప్రజలకు ఎక్కువ ధరకు అంటగడుతున్నట్లు తెలిసిందన్నారు. 30 ్ఠ60 సైజు టవాల్ ధర రూ. 55కు తెచ్చి యాప్ ద్వారా రూ.110లకు, 250 గ్రాముల నిమ్మకాయ ఊరగాయ ప్యాకెట్ ధర రూ.60కి తెచ్చి రూ.110కి విక్రయిస్తున్నారన్నారు. మున్సిపాలిటీ పరిధిలో 90 మంది ఆర్పీలు ఉండగా ప్రతి ఆర్పీకి వాటిని అమ్మాలంటూ టార్గెట్ విధించారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డికి ఈ వ్యవహారంతో ఎలాంటి సంబంధం లేదని, ఆయన వ్యక్తిగత పీఏ స్వామి అండతోనే ఇదంతా జరుగతోందన్నారు. మూడు పేలాల ముద్దల ప్యాకెట్ రూ.60కు తెచ్చి రూ..120కి అమ్ముతున్నారన్నారు. తమ కార్యాలయంలో కంప్యూటర్లు ఏర్పాటుచేయాలని మహాలక్ష్మి ఆర్పీల వద్ద రూ.1000 చొప్పున రూ.90వేలు వసూలు చేస్తున్నారన్నారు. తన మాట వినని ఆర్పీలను టీఈ తీవ్ర ఒత్తిడికి గురిచేస్తున్నారని తెలిపారు. మెప్మా కుంభకోణంలో టీఈ రూ.20 లక్షల వరకు అక్రమంగా సంపాదించినట్లు తెలిసిందన్నారు. గృహాలకు సోలార్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలని ఆ కంపెనీతో లాలూచీపడి డ్వాక్రా మహిళలతో ఇంటింటా ప్రచారం చేయిస్తున్నారన్నారు. మెప్మాలో జరిగిన ఈ కుంభకోణంపై మెప్మా పీడీ, ఎండీలకు ఫిర్యాదు చేస్తామని తెలిపారు. ఈ సమావేశంలో గరిశపాటి లక్ష్మీదేవి, పాతకోట మునివంశీధర్రెడ్డి, నియోజకవర్గ యువజన విభాగం అధ్యక్షుడు ద్వార్శల గురునాథ్రెడ్డి పాల్గొన్నారు. మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డి -
19న చలో పులివెందుల మెడికల్ కాలేజ్
– వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కడప కార్పొరేషన్ : ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ.. .ఈ నెల 19న చేపట్టిన చలో పులివెందుల మెడికల్ కాలేజ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా పిలుపునిచ్చారు. జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ యువజన, విద్యార్థి, సోషల్ మీడియా, వాలంటరీ విభాగాల అధ్యక్షులు, సభ్యులతో బుధవారం ఆయన సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని, పది మెడికల్ కాలేజీల నిర్మాణం పూర్తిచేసి సుందరంగా తీర్చిదిద్దారన్నారు. కూటమి ప్రభుత్వం ఏర్పడిన వెంటనే వాటిని ప్రైవేటుపరం చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. గత ప్రభుత్వంపై బురద జల్లుతూ ఎలాంటి సౌకర్యాలు లేవని దుష్ప్రచారం చేయడం తగదన్నారు. విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రజలను మెడికల్ కాలేజీ వద్దకు తీసుకుపోయి అక్కడ ఉన్న వసతులు, సౌకర్యాలను, వాస్తవ పరిస్థితులను తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ సోషల్ వెల్ఫేర్ బోర్డు చైర్మన్ పులి సునీల్కుమార్, జిల్లా యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు సాయి దత్త, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షులు వివేక్, నగర యువజన విభాగం అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, నగర వాలంటీర్స్ విభాగం అధ్యక్షుడు వంశీ, సోషల్ మీడియా రాష్ట్ర కార్యదర్శి సునీత, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి సందీప్ రెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా రుతిక్ కడప.కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా కె.రుతిక్ నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఈ మేరకు ఓ ప్రకటన విడుదల చేసింది. వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ పట్టణానికి చెందిన కె.రుతిక్ వేలూరు ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(విట్) యూనివర్సిటీలో ఇంజినీరింగ్ పూర్తిచేశారు. 2019 నుంచి వైఎస్సార్సీపీలో క్రియాశీలకంగా సేవలందిస్తున్నారు. రుతిక్ పోరాట పటిమను గుర్తించిన వైఎస్.జగన్మోహన్రెడ్డి అతడిని ఐటీ విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. బుధవారం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మర్యాదపూర్వకంగా రుతిక్ కలిసి మాట్లాడారు. పది నెలలుగా విధులకు డుమ్మా చింతకొమ్మదిన్నె : మండలంలోని విశ్వనాథపురం–1 అంగన్వాడీ టీచర్ వి.అరుణ పది నెలలకు పైగా విధులకు హాజరు కావడం లేదని స్థానికులు తెలిపారు. అంగన్వాడీ టీచర్ పది నెలలపాటు విధుల్లోకి రాకపోయినప్పటికీ ఉన్నతాధికారులు ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ పీడీ రమాదేవి వివరణ కోరగా.. అంగన్వాడీ టీచర్ అరుణ ఉన్నతాధికారులకు సమాచారం ఇవ్వకుండా విధులకు గైర్హాజరవుతున్నారని తెలిపారు. ఐసీడీఎస్ సూపర్వైజర్ వెంకటలక్ష్మి, స్థానిక మహిళా పోలీసు కలిసి విచారించినా ఆమె ఫోన్లో అందుబాటులో లేరన్నారు. బాడుగకు ఉంటున్న ఇంటికి మెమోలు అంటించామని, వేతనం ఆపివేశామని ఆమె తెలిపారు. త్వరలో ఆమెను టర్మినేట్ చేయనున్నట్లు తెలిపారు. -
ప్రయాణికులకు ఇబ్బంది కలిగించవద్దు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్సార్టీసీ కడప జోన్ పరిధిలో ప్రయాణికులకు ఇబ్బందులు తలెత్తకుండా తగిన చర్యలు చేపట్టాలని ఏపీఎస్ ఆర్టీసీ కడప జోన్ జోనల్ చైర్మన్ పూల నాగరాజు సూచించారు. కడప నగరం లోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ తాగునీరు, కుర్చీలు, ఫ్యాన్లు, పరిసరాలు పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలని సూచించామన్నారు. మహిళలకు ఉచిత బస్సు పథకాన్ని ప్రభుత్వం ప్రవేశపెట్టిందని, జోన్ వ్యాప్తంగా 1.82 కోట్ల మంది ప్రయాణించారన్నారు. కేంద్ర ప్రభుత్వ నిబంధనల ప్రకారం 15 ఏళ్లు పైబడిన బస్సులను తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామన్నారు. కడప జోన్కు 500–600 బస్సులు అవసరం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో ఈడీ పైడి చంద్రశేఖర్, ఆర్ఎం పొలిమేర గోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
డ్రాగా ముగిసిన మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్ జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు బుధవారం డ్రాగా ముగిశాయి. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–చిత్తూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ వర్షం కారణంగా నిలిచిపోయింది. కర్నూలు జట్టు తొలి ఇన్నింగ్స్లో 218 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో ప్రారంభించాల్సి ఉండగా వర్షం కారణంగా రద్దు చేశారు.వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో....వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లో 109 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 46 ఓవర్లకు 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని విజయ్ రామిరెడ్డి 86, ఎస్ఎండి.ఆయూబ్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లిఖార్జున నాలుగు, షేక్ కమిల్ మూడు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 5.3 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 26 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. అనంతపురం జట్టు తొలి ఇన్నింగ్స్ అధిక్యం సాధించింది. దీంతో మల్టీ డే మ్యాచ్లో నెల్లూరుకు–19, చిత్తూరుకు 11, కర్నూలుకు ఆరు, కడపకు ఐదు, అనంతపురానికి నాలుగు పాయింట్లు లభించాయి.ఎస్జీఎఫ్ క్రీడలకు 300 మంది హాజరుకడప వైఎస్ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడలకు బుధవారం 300 మంది ఉమ్మడి జిల్లా క్రీడాకారులు హాజరైనట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి పేర్కొన్నారు. నగరంలోని డాక్టర్ వైఎస్సార్ క్రీడా పాఠశాలలో అండర్–14, 17 వయస్సు విభాగాలకు పుట్బాల్, బాక్సింగ్, రగ్బీ, మోడరన్ పెంటతలాన్ క్రీడలకు జిల్లా జట్టు ఎంపికలను చేపట్టారు. పోటీలలో ప్రతిభ కనపరిచిన వారిని జిల్లా జట్టుకు ఎంపిక చేశారు. వారి వివరాలిలా ఉన్నాయి.అండర్–14 బాలురు : శ్రావణ్కుమార్రెడ్డి, ఇర్ఫాన్, నిషాంత్రాజు, గురుతేజేశ్వర్, వెంకట ప్రణీత్, లెనిన్, గోపీనాథ్, నాగచరణ్, కెవి.ప్రణీశ్వర్, ఆదిత్, శ్రీనివాస్, అఖిల్, భరత్, నాగ చైతన్య, భద్ర, విగ్నేష్ కార్తీయన్, అభిరామ్ సాయివర్మ, మహ్మద్ హుస్సేన్, ధనుష్ సాయికుమార్.అండర్–17 బాలురు : సాయిరాకేష్, మహేష్బాబు, మస్తాన్వల్లి, జీవన్కుమార్, హామీద్, చరణ్, కార్తిక్, మహ్మద్ సుభాన్, జితేంద్ర, రెడ్డిచౌదరి, హేమంత్ కుమార్, ధీరజ్, రేవన్, వెంకట మణిరాజ్, సమీర్, చవనీశ్వర్, కెవిన్ భగవత్, మణికంఠ. బాలికలు : లక్ష్మీదేవి, జ్యోత్న, హర్షిత, అఖిల, హిమవర్షిణి, నీనగ్న, లక్ష్మీ తులసి, హిమ ప్రియ, అనుష, స్వప్న, ప్రహర్షిత, స్రవంతి, ఐశ్వర్య, జాహ్నవి, అర్చన, అమృత వర్షిణి, గౌతమి. -
ఉద్యోగులకు ఇచ్చిన హామీలు అమలుచేయాలి
ప్రొద్దుటూరు : గత ఏడాది ఎన్నికల సందర్భంగా రాష్ట్రంలోని 14లక్షల మంది ఉద్యోగులకు ఇచ్చిన ఏ హామీ కూటమి ప్రభుత్వం అమలుచేయలేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఓ వైపు సీఎం చంద్రబాబునాయుడు, మరో డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ లెక్కలేనన్ని హామీలిచ్చి ఉద్యోగులను మోసం చేశారన్నారు. గడిచిన 16 నెలల్లో 16 పైసలు కూడా ఇవ్వలేదని, వారికి మొత్తం రూ.32వేల కోట్లు బకాయిలు చెల్లించాల్సి ఉందన్నారు. డీఏ, అరియర్స్, జీఎల్ఐ, పీఎఫ్, మెడికల్ రీయింబర్స్మెంట్ సమస్యలను నేటికీ పరిష్కరించలేదని తెలిపారు. ప్రభుత్వ ఉద్యోగులతోపాటు ఔట్సోర్సింగ్, కాంట్రాక్టు, కంటింజెంట్ ఉద్యోగులకు ఎన్నో హామీలిచ్చారన్నారు. ఆరు నెలలకోమారు డీఏ చెల్లించాల్సి ఉండగా ఇప్పటి వరకూ నాలుగు డీఏ బకాయిలు ఇవ్వలేదన్నారు. వచ్చే జనవరి నాటికి ఐదో డీఏ ఇవ్వాల్సి ఉందన్నారు. తమ డిమాండ్లను పరిష్కరించాలని అడిగినందుకు 38 మంది ఉద్యోగులను కూటమి నేతలు జైలులో పెట్టించారని తెలిపారు. పీఆర్సీ, ఐఆర్ చెల్లించలేదని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేయలేదన్నారు. ఉద్యోగుల పాత బకాయిలు వెంటనే చెల్లించాలని, డిమాండ్ చేశారు. వీడియో, టెలీ కాన్ఫరెన్స్ల పేరుతో ప్రభుత్వ ఉద్యోగులు తమ విధులు నిర్వహించకుండా వారి స్వేచ్ఛను హరిస్తున్నారన్నారు. తమ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చించడానికి ప్రయత్నిస్తే కనీసం వారికి అపాయింట్మెంట్ ఇవ్వలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో 17 మెడికల్ కాలేజీలు నిర్మిస్తే కూటమి నేతలు దుష్ప్రచారం చేస్తున్నారన్నారు. మెడికల్ కాలేజీలకు పీపీపీ విధానం అమలు చేయడం సబబుగా లేదన్నారు. ఈ సమావేశంలో మార్తల ఓబుళరెడ్డి, బాణాకొండారెడ్డి, గరిశపాటి లక్ష్మీదేవి, రాగుల శాంతి, లావణ్య, బలిమిడి వెంకటలక్ష్మి, భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, సత్యం, వైఎస్సార్సీపీ నాయకులు ఎద్దుల రాయపురెడ్డి, జయంగమయ్య తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
1050 మెట్రిక్ టన్నుల యూరియా రాక
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడప జిల్లాకు మంగళవారం 1050 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రానాయక్ తెలిపారు. ఆయన కడప ఏవో సురేష్కుమార్రెడ్డితో కలిసి జిల్లాకు వచ్చిన యూరియాను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వచ్చిన మొత్తాన్ని జిల్లాలోని రైతు సేవా కేంద్రాలు, ప్రైవేటు డీలర్లకు సరఫరా చేసినట్లు తెలిపారు. ఖరీఫ్ సీజన్కు సంబంధించి 69653 మెట్రిక్ టన్నుల ఎరువులు అసవరం కాగా ఇప్పటి వరకు 36915.26 మెట్రిక్ టన్నులు సరఫరా చేసినట్లు పేర్కొన్నారు. ఇంకా 25170.97 మెట్రిక్ టన్నుల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో యూరియా 2117.80 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3268, కాంప్లెక్స్లు 15727.59, యంఓపీ 1990.80 మెట్రిక్ టన్నులతోపాటు యస్యస్పీ 2066.79 మెట్రిక్ టన్నులు ఉన్నాయని చెప్పారు. జిల్లాలో సాగు చేసిన పంటలకు యూరియా సరఫరా అవుతుందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. ● కలెక్టర్కు వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వినతి కడప సెవెన్రోడ్స్: జిల్లాలోని రైతుల అవసరాలకు తగినంత యూరియా, డీఏపీ అందించేందుకు తక్షణమే చర్యలు తీసుకోవాలని వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షులు సంబటూరు ప్రసాద్రెడ్డి కోరారు. మంగళవారం ఈ మేరకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రం పంపారు. ఈ ఏడాది ఎగువన కురిసిన వర్షాల కారణంగా కేసీ కెనాల్తోపాటు ఇతర రిజర్వాయర్లకు నీరు వచ్చిందన్నారు. దీంతో రైతులు ప్రధానంగా వరి, పత్తి, గడ్డి కయ్యలు, ఇతర పంటలు సాగు చేస్తున్నారన్నారు. పాస్పేట్, యూరియా కొంత మేర జిల్లాకు వచ్చినప్పటికీ రైతులకు అందడం కష్టంగా మారిందన్నారు. ఇప్పటికి జిల్లాలో చాలా చోట్ల రైతులు క్యూలైన్లలో రోజుల తరబడి వేచి చూడాల్సిన పరిస్థితి ఉందని తెలిపారు. యూరియా బస్తా రూ. 266తో విక్రయించాల్సి ఉండగా, బయటి మార్కెట్లో రూ 350లపైనే అమ్ముతున్నారని తెలిపారు. -
మెప్మా ఆర్పీ చేతివాటం
● నకిలీ సంతకాలతో సీసీఎల్ రుణాలు స్వాహా ● పోలీసులను ఆశ్రయించిన మహిళలు బద్వేలు అర్బన్ : మహిళల ఆర్థిక స్వావలంబన కోసం ఏర్పాటు చేసిన పట్టణ పేదరిక నిర్మూలన సంస్థ (మెప్మా)లో ఓ ఆర్పీ చేతివాటం ప్రదర్శించింది. తన పరిధిలోని స్వయం సహాయక సంఘాలకు సీసీఎల్ రుణాలు మంజూరు చేయించి అందులో వారికి తెలియకుండా కొంత మొత్తాన్ని స్వాహా చేసింది. మొత్తంగా 8 గ్రూపులకు సంబంధించి దాదాపు రూ.12 లక్షల మేర స్వాహా చేసినట్లు తెలుస్తోంది. ఆలస్యంగా తెలుసుకున్న సంబంధిత స్వయం సహాయక సంఘాల గ్రూపు మహిళలు పోలీసులను ఆశ్రయించారు. సీసీఎల్ రుణాలు స్వాహా మున్సిపాలిటీ పరిధిలోని శివానగర్ ఏరియాకు సంబంధించి మెప్మా ఆర్పీగా పనిచేస్తున్న భారతి తన పరిధిలోని పలు సంఘాలకు వివిధ బ్యాంకుల నుంచి సీసీఎల్ రుణాలు మంజూరు చేయించింది. సదరు రుణాలను మూడేళ్ల పాటు చెల్లించాల్సి ఉండగా ఏడాదిన్నర పాటు సంఘంలోని సభ్యులు క్రమం తప్పకుండా చెల్లిస్తూ వస్తున్నారు. అయితే చెల్లించిన అప్పు మొత్తం నుంచి తిరిగి రుణం పొందే అవకాశం ఉండటంతో ఆర్పీ తన చేతివాటాన్ని ప్రదర్శించింది. గ్రూపు సభ్యులకు తెలియకుండా సంతకాలను ఫోర్జరీ చేసి పలు సంఘాలకు మళ్లీ రుణం మంజూరు చేయించింది. అయితే సదరు రుణం గ్రూపు సభ్యులకు అందించకుండా స్వాహా చేసినట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇటీవల బ్యాంకులకు రుణాలకు సంబంధించిన నగదును చెల్లించేందుకు వెళ్లిన ఆయా గ్రూపుల సభ్యులకు విషయం తెలియడంతో ఆర్పీని నిలదీశారు. అప్పట్లో కొన్ని గ్రూపులకు డబ్బులు చెల్లించి విషయం బయటికి పొక్కకుండా సద్దుమణిగింపజేసినట్లు తెలిసింది. అయితే ఇటీవల గౌరీశంకర్నగర్కు చెందిన శంకర్ స్వయం సహాయక సంఘం, సరస్వతి స్వయం సహాయక సంఘంలకు చెందిన మహిళలు తమ పేరుతో తీసుకున్న రుణాన్ని చెల్లించాలని ఆర్పీని నిలదీయడంతో కొంత సమయం ఇవ్వాలని కోరింది. అప్పటి నుంచి ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని ఇంటి వద్ద లేకుండా వెళ్లిపోయినట్లు మహిళలు గుర్తించారు. దీంతో చేసేది లేక అర్బన్ పోలీసులను ఆశ్రయించారు. ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాం రుణాల పేరుతో ఆర్పీ డబ్బు స్వాహా చేసిన విషయమై ఇన్చార్జి మెప్మా మేనేజర్ కల్యాణ్బాబును వివరణ కోరగా ... రెండు నెలల క్రితమే బద్వేలు మెప్మా ఇన్చార్జి మేనేజర్గా బాధ్యతలు తీసుకున్నా శివానగర్ ఏరియాలోని పలు గ్రూపులకు చెందిన ఎస్హెచ్జీ గ్రూపు సభ్యులు రుణాల మంజూరులో ఆర్పీ చేసిన అవకతవకలపై ఫిర్యాదు చేశారు. మెప్మా పీడీకి ఫిర్యాదు చేయగా విచారణకు ఆదేశించారు. బాధ్యులపై చర్యలు తీసుకుంటాం. -
చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు
కనిష్(5 వికెట్లు) నిఖిల్గౌడ్(153 పరుగులు) వికాస్(109 పరుగులు) మహేంద్రారెడ్డి(239) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లో రెండో రోజున చిత్తూరు, అనంతపురం జట్లు భారీ స్కోర్లు చేశాయి. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 375 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 103.3 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని నిఖిత్ గౌడ్ అద్భుతంగా బ్యాంటింగ్ చేసి 22 ఫోర్లతో 153, బాలాజీ 59 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని కనిష్ చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి ఐదు, సాయి సూర్యతేజరెడ్డి రెండు, అక్షిత్రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 68 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 46, ధనుష్ నాయుడు 46 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బ్రహ్మ సాయి తేజ్రెడ్డి మూడు వికెట్లు తీశాడు. కర్నూలు జట్టు ఇంకా 236 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో...... వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 364 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 150.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 537 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని మహేంద్రారెడ్డి 30 ఫోర్లుతో అద్భుతంగా చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 239, వికాస్ 109 పరుగులు చేశాడు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ మూడు, నరసింహ రెండు, చెన్నారెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 29 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయరామిరెడ్డి 59 పరుగులు, భరత్రెడ్డి 40 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వండి
కడప ఎడ్యుకేషన్ : కేజీబీవీ విద్యార్థులకు నాణ్యతతో కూడిన ఆహారం ఇవ్వాలని జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ నిత్యానందరాజు అన్నారు. కడప ఎన్జీవో కాలనీలోని సమగ్ర శిక్ష కార్యాలయంలో కేజీబీవీల ప్రిన్సిపళ్లతో మంగళవారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఈ విద్యా సంవత్సరంలో విద్యాపథానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలన్నారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, దోమలు కుట్టకుండా తగు చర్యలు తీసుకోవాలని కోరారు. ముద్దమందారం పుస్తకాలు పిల్లలందరికీ చేరవేయాలని, వెనుకబడిన పిల్లలపై స్పెషల్ ఫోకస్ పెట్టాలన్నారు. కాలనిర్ణయ పట్టికను ఖచ్చితంగా అమలుచేయాలని, టీచింగ్, నాన్ టీచింగ్ స్టాఫ్ డూటీల పట్టిక కరెక్ట్గా మెయింటైన్ చేయాలన్నారు. మొబైల్ ఫోన్ అవసరం వరకే వినియోగించాలన్నారు. ప్రతి కేజీబీవీలో జీసీడీఓ ఫోన్ నెంబర్ పిల్లలకు అందుబాటులో ఉంచాలన్నారు. ఈ కార్యక్రమంలో రూత్ ఆరోగ్య మేరీ, వీరేంద్ర, శ్రీనివాసులురెడ్డి, అధికారులు పాల్గొన్నారు. -
కొత్త సార్లొస్తున్నారు..
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. గతంలో నిర్వహించిన పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ల ప్రామాణికం అధారంగా 680 మంది అర్హుల జాబితా ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మరో 32 పోస్టులను భర్తీ చేయలేదు. కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. ఇటీవల అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పక్రియను కడప ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు గానూ, 680 మందిని ఎంపిక చేస్తూ తుది జాబితా విడుదల చేసింది. మరో 32 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరంటూ భర్తీ చేయకుండా మిగిల్చింది. గతంలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే అన్నీ భర్తీ చేసేవారు. రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం అభ్యర్థి లేకపోతే ఆ తర్వాత అర్హత ఉన్న అభ్యర్థికి ఆ పోస్టు కేటాయించేవారు. కూటమి ప్రభుత్వం అలాకాకుండా సంబంధిత అభ్యర్థి లేకపోతే అ పోస్టును వదిలేసి తరువాత డీఎస్సీలో భర్తీ చేస్తామని చెబుతోంది. నిరుద్యోగిత పెరిగిన పరిస్థితుల్లో 32 పోస్టులు మిగిల్చడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలువుల్లో చేరే వారికి శిక్షణ... కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న 680 మంది అభ్యర్థులకు ఈ నెల 19న అపాయింటెంట్ అ ర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎంపికైన స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎస్జీటీ లకు శిక్షణ అనంతరం వారికి స్థానాలు కేటాయించి పంపనున్నారు. కొత్త ఉపాధ్యాయులంతా దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరే అవకాశం ఉంది. మోగా డీఎస్సీ అభ్యర్థుల ఎంపికకు సంబంధించి తుది ఎంపిక జాబితా rpr://apdre. apcfrr.in నందు అందుబాటులో ఉంచాం. ఈ జాబితాపై సందేహాల నివృత్తికి డీఈఓ కార్యాలయంలో హెల్ప్లైన్ ఏర్పాటు చేశాం, వివరాలకు 995973222209, 9948112966 నెంబర్లకు కాల్ చేసి సందేహాలు నివృత్తి చేసుకోవాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారి ఎంపికైన జాబితా వివరాలు... సబ్జెక్టు నోటిఫైడ్ ఎంపిక పోస్టులు చేసినవిఎస్ఏ సంస్కృతం 01 01 ఎస్ఏ తెలుగు 26 25 ఎస్ ఉర్దూ 07 06 ఎస్ఏ హింది 18 18 ఎస్ఏ ఇంగ్లీష్ 81 78 ఎస్ మ్యాథ్స్ 44 44 ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ 01 01 ఎస్ఏ పీఎస్ 29 29 ఎస్ఏ పిఎస్ ఉర్దూ 03 01 ఎస్ బయాలజీ 52 50 ఎస్ఏ బయాలజీ ఉర్దూ 02 02 ఎస్ఏ సోసియల్ స్టడీస్ 60 58 ఎస్ఏ ఎస్ఎస్ ఉర్దూ 05 05 ఎస్ఏ పిఈ 82 80 ఎస్జిటి తెలుగు మీడియం 256 254 ఎస్జిటి ఉర్దూ మీడియం 45 28 మొత్తం 712 680 ఎంపిక తుది జాబితా విడుదల డీఈఓ ఆఫీసు, కలెక్టరేట్ల వద్ద జాబితా ప్రదర్శన జిల్లాలో 712 పోస్టులకు 680 మంది ఎంపిక 19న కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెల 22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ? -
7 నుంచి భవ్య గుజరాత్ యాత్ర
కడప కోటిరెడ్డిసర్కిల్: భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భవ్య గుజరాత్ యాత్రను చేపట్టనున్నామని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. కడప రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో యాత్రకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అక్టోబర్ 7 నుంచి 10 రోజులపాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నది తీరం, యునెస్కో వారసత్వ స్థలం రాణి కి వావ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక క్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట చేరుతుందని వివరించారు. ప్రయాణికులకు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజిటేరియన్ భోజనం, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలతోపాటు ప్రతి యాత్రికుడికి ప్రయాణ బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.18,400.. 3 టైర్ ఏసీ టిక్కెట్ రూ.ఽ30,200.. 2 ఏసీ టిక్కెట్ ధర రూ.39,900 గా నిర్ణయించారని తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం బి.యేసయ్య (9281495853), కె.పవన్కుమార్ ( 8287932313)లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ ప్రతినిధులు భాస్కర్ బాబు, యేసయ్య, ఈరన్న, దుర్గాప్రసాద్, ఇన్చార్జి స్టేషన్ మేనేజర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో రైతులకు తీరని అన్యాయం
మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖాజీపేట : కూటమి ప్రభుత్వంలో రైతులకు అన్ని విధాలా తీరని నష్టం జరిగిందని మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి విమర్శించారు. తుడుమలదిన్నె సమీపంలో వంక దాటే క్రమంలో కింద పడి ప్రాణాపాయం నుంచి తప్పించుకున్న మద్దూరి ఆదిరెడ్డిని మంగళవారం ఆయన పరామర్శించారు. రైతు రెండు ఎద్దుల వంకలో పడి మృతి చెందిన విషయం తెలుసుకుని వైఎస్సార్సీపీ తరఫున రూ.72 వేల ఆర్థికసాయం అందజేశారు. ఆయన మాట్లాడుతూ యూరియా కోసం సచివాలయాల వద్ద రైతులు క్యూలో నిలబడాల్సిన దుస్థితి నెలకొందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఎప్పుడూ రైతులకు సమస్య లేదన్నారు. పంట నష్ట పరిహారం ఎప్పటికప్పుడు రైతులకు అందించేదని, ఇన్సూరెన్స్ పూర్తి ఉచితంగా ఇవ్వడమేగాక, గిట్టుబాటు ధర కల్పించి తమ ప్రభుత్వంలో రైతులను ఆదుకున్నామన్నారు. కూటమి ప్రభుత్వంలో ఆ పరిస్థితి లేదని, రైతుల పంటలకు సరైన ధర లేక తీవ్ర నష్టాలను చవిచూశారన్నారు. ఆరోగ్యశ్రీ పథకం ప్రవేటుపరం చేయాలని కూటమి ప్రభుత్వం ఆలోచిస్తోందన్నారు. పేదలకు న్యాయం జరగదని పేదలకు వై ద్యం అందే పరిస్థితి లేదన్నారు. వైద్య కళాశాలలు ప్రైవేటు పరం చేస్తే వైద్యం మరింత ఖరీదవుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో సంబటూరు ప్రసాద్రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పీవీ.రాఘవరెడ్డి, మురళీమోహన్రెడ్డి, నాగిరెడ్డి, సుబ్బారెడ్డి, పత్తూరు వెంకటయ్య, రమణ, వెంకటసుబ్బయ్య, దుంపలగట్టు రామకృష్ణారెడ్డి, పోలు ఓబుల్రెడ్డి, శెట్టిపల్లె సిద్దారెడ్డి, కొండారెడ్డి పాల్గొన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారు కమలాపురం : విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం వంద శాతం అమలుచేస్తున్నారని మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. కమలాపురం సబ్ జైలులో ఉన్న దువ్వూరు మండలం ఇడమడకకు చెందిన వైఎస్సార్సీపీ నేత శ్రీకాంత్ను రఘురామిరెడ్డి మంగళవారం పరామర్శించారు. అనంతరం జైలు బయట మీడియాతో ఆయన మాట్లాడుతూ బడిలో పంతులు విద్యార్థులకు అక్షరాలు నేర్పించినట్లు రాష్ట్రంలో మంత్రి లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగం నేర్పిస్తున్నారని మండిపడ్డారు. మైదుకూరు ఎమ్మెల్యే కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతున్నారని, డాబా పెట్టుకుని జీవనం సాగిస్తున్న శ్రీకాంత్ను మర్డర్ కేసులో ఇరికించడం ఏంటని ఆయన ప్రశ్నించారు. కానుగూడూరుకు చెందిన ఓ వ్యక్తి, శ్రీకాంత్తో చాగలమర్రి పీఎస్ పరిధిలో వాగ్వివాదం చేసాడని, దీంతో దువ్వూరు పీఎస్లో శ్రీకాంత్పై 307 సెక్షన్తో కేసు నమోదు చేయడం విడ్డూరంగా ఉందన్నారు. ఎలాంటి ఘటనలు, చిన్న ఘర్షణ కూడా జరగకపోయినా కేసులు నమోదు చేయడం అన్యాయం అన్నారు. అసలు రాష్ట్రంలో శాంతి భద్రతలు ఉన్నాయా? అని ఆయన ప్రశ్నించారు. మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ కక్ష సాధింపు చర్యలకు పాల్పడడం సరి కాదన్నారు. మీరు రెడ్ బుక్ రాసుకుంటే మేము బ్లూ బుక్లో రాసుకుంటున్నామని, వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేనన్నారు. కూటమి నేతలు ప్రజల విశ్వాసం కోల్పోయారని, చంద్రబాబు, లోకేష్ తెలుసుకోక పోతే తగిన బుద్ధి చెప్పే రోజులు దగ్గరలోనే ఉన్నాయన్నారు. సంబటూరు ప్రసాద్రెడ్డి ఆయన వెంట ఉన్నారు. -
విశ్రాంత ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి
కడప రూరల్ : రాష్ట్ర సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల్లో పనిచేసి పదవీ విరమణ పొందిన ఉద్యోగులకు బకాయిలను వెంటనే చెల్లించాలని ఏపీ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విశ్రాంత ఉద్యోగుల సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు డాక్టర్ ఎం.రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు కె.అచ్చయ్య తెలిపారు. స్థానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ గురుకులాల్లో పనిచేసిన సుమారు 550 మందికి, జిల్లాకు సంబంధించి 50 మందికి రిటైర్మెంట్ బెనిఫిట్స్ రావాల్సి ఉందన్నారు. 2018లో రిటైర్డ్మెంట్ అయిన వారి విషయంలోనూ నిర్లక్ష్యంగా వ్యవహరించడం ప్రభుత్వానికి తగదన్నారు. 50మంది బెనిఫిట్స్ అందుకోకుండానే వివిధ కారణాలతో మృతిచెందడం తీవ్ర ఆవేదనకు గురిచేస్తోందన్నారు. ఉద్యోగ జీవితంలో 30–35 సంవత్సరాలపాటు పనిచేస్తేనే ప్రభుత్వం ఉద్యోగ విరమణ సమయంలో బెనిఫిట్స్ అందిస్తోందన్నారు. విజయవాడలోని తమ శాఖ ఉన్నతాధికారులతోపాటు స్థానిక ప్రజాప్రతినిదులకు వినతిపత్రాలను సమర్పించామన్నారు. అంతేగాక మెడికల్ రీఎంబర్స్మెంట్ నిధులు అందకపోవడంతో బాధిత ఉద్యోగులు తీవ్ర ఆవేదనలో ఉన్నారన్నారు. ఉచిత పథకాలకు డబ్బులిస్తున్న ప్రభుత్వం ఉద్యోగ జీవితంలో కష్టపడి పనిచేసిన వారిని పట్టించుకోకుండా నిర్లక్ష్యంగా వ్యవహరించడం సరికాదన్నారు. ఈ సమావేశంలో ఏపీ సాంఘిక సంక్షేమశాఖ గురుకుల విశ్రాంత ఉద్యోగుల సంఘం నాయకులు పాల్గొన్నారు. -
తైక్వాండో జిల్లా జట్టుకు ఎంపిక
అండర్–14 బాలుర విభాగంలో ఎంపికై న బాలలు రాష్ట్రస్థాయికి ఎంపికై న బాలికలు ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో మంగళవారం ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 బాల బాలికల జిల్లా స్థాయి తైక్వాండో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలను ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జార్జికారొనేషన్ క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలగంగిరెడ్డి, ఈసీ మెంబర్ రామసుబ్బారెడ్డి, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటమురళీమోహన్, శివారెడ్డి, శివకృష్ణ, అల్లాబకాష్, రాఘవ తదితరులు పర్యవేక్షించారు. -
కురులు.. సిరులు
గుర్రంకొండ: అన్నమయ్య జిల్లాలో సంతాన దేవతగా ప్రసిద్ధి పొందిన శ్రీ రెడ్డెమ్మ తల్లి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలకు విదేశాల్లో భారీ డిమాండ్ ఉంది. ఇక్కడి నుంచి చైనాతోపాటు ఇతర దేశాలకు తలానీలాలు ఎగుమతి చేస్తుంటారు. నాణ్యమైన తలనీలాలు ఇక్కడ లభించడమే బయట దేశాల్లో డిమాండ్కు కారణం. ఈ నేపథ్యంలో పాటాదారులు పోటాపోటీగా వేలంలో అధిక ధర పెట్టి తలనీలాలు దక్కించుకుంటున్నారు. రెడ్డెమ్మకొండకు వచ్చే భక్తులంతా ఎక్కువగా సంతాన కోసం వచ్చేవారే. అందరూ 22 నుంచి 45 ఏళ్ల వయసులోపు మహిళలే కావడం విశేషం. ఇక్కడి ఆలయ పరిసరాల్లో పంపిణీ చేసే ఆకు పసరును సేవించి.. అమ్మవారి ఎదుట వర పడితే సంతానం కలుగుతుందని భక్తుల నమ్మకం. కోర్కెలు తీరిన మహిళలతోపాటు వారి కుటుంబ సభ్యులు అమ్మవారికి భక్తితో తలనీలాలు సమర్పిస్తుంటారు. అందరూ యుక్త వయసులో ఉన్న వారు కావడంతో.. వారి తలనీలాలు ఎంతో నాణ్యమైనవిగా ఉంటాయనేది వ్యాపారుల నమ్మకం. అందువల్ల రెడ్డెమ్మకొండలోని తలనీలాలు ఎక్కువ ధర పలుకుతుంటాయి. దీంతో ఇక్కడి ఆలయంలోని తలనీలాలకు భారీ డిమాండ్ ఉంది. అమ్మవారి ఆలయంలో లభించే తలనీలాలకు విదేశాల్లో అధిక డిమాండ్ ఉండటంతో.. వేలం పాటలు రికార్డు స్థాయిలో పలుకుతుండటం గమనార్హం. దీంతో బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వేలం పాటలో పోటీ బాగా పెరిగింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు తరలివస్తారు. గతంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు మాత్రమే వేలం పాట పాడేవారు. ఈ ఏడాది రూ.18.76 లక్షలకు వేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. భక్తుల కురులు సిరులు కురిపిస్తున్నాయి. రెడ్డెమ్మ తల్లి ఆలయ తలనీలాలు ఎక్కువ ధర పలుకుతున్నాయి. విదేశాలకు సైతం ఎగుమతి అవుతున్నాయి. వేలంపాటలో పాటాదారులు పోటాపోటీగా పాల్గొంటున్నారు. అధిక రేటు హెచ్చించి కై వసం చేసుకుంటున్నారు. దేవస్థానానికి ఏటా భారీ ఆదాయం సమకూరుతుండటం విశేషం. మంచి డిమాండ్ ఉంది అమ్మవారి ఆలయంలో భక్తులు సమర్పించే తలనీలాలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంది. ఈ సారి వేలం పాటల్లో నాలుగు రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు పాల్గొనడం ఇందుకు నిదర్శనం. దేశంలోనే కాకుండా విదేశాల్లో కూడా రెడ్డెమ్మకొండ తలనీలాలకు డిమాండ్ పెరిగింది. – మంజుల, ఈఓ, రెడ్డెమ్మకొండ రెడ్డెమ్మకొండ తలనీలాలకుభారీ డిమాండ్ చైనాకు ఎగుమతి రికార్డు స్థాయిలో వేలం -
ఊరికి దారి దొరికింది.. ఉపకారికి బిల్లు దక్కలేదు !
కడప సిటీ : ఆ గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు పైబడి అయ్యింది. రాకపోకలకు గ్రామసమీపాన ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో సమస్యలు తీవ్రతరంగా ఉండేవి. ఈ వంక పెద్ద ఎత్తున ప్రవహిస్తే మూడు రోజుల వరకు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయేవి. ఈ సమయంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను వంకలో ప్రవహించే నీటిలోనే వదిలేసే దుస్థితి. ఆ గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ వంక ప్రవాహం పెద్ద ఆటంకంగా మారి చదువులు కుంటుపడేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లె కాదు... వైఎస్సార్ కడప జిల్లాలోని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెకు అతి దగ్గరలో ఉన్న ఓబుల్రెడ్డిపల్లె. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఓబుల్రెడ్డిపల్లె గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి 2023 వరకు ఆ గ్రామ సమీపంలోని మొగమూరు వంక ప్రభావంతో వర్షాకాలంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండేవి. అప్పటి నుంచి 2022 వరకు ఆ గ్రామ సమస్యను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న గ్రామమైనప్పటికీ ఏ నాయకులు వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదు. పద్మవ్యూహంలాంటిది ఈ వంక వస్తే ఓబుల్రెడ్డిపల్లె వాసులకు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఉండేది. అటు పాలగిరికి వెళ్లి మెయిన్రోడ్డుకు వచ్చేందుకు యేరు అడ్డు పడేది. నాగూరు మీదుగా వెళ్లి వేంపల్లెకు వెళ్లాలంటే పాములూరు వంక అడ్డుగా ఉండేది. ఈ వంక ప్రవాహం వస్తే ఎటువంటి రాకపోకలకు అవకాశమే లేదు. వంక ప్రవాహం తగ్గినంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. గొర్రెల కాపరులకు తప్పిన ప్రమాదం 2022 నవంబరులో ఓబుల్రెడ్డిపల్లె సమీపాన ఉన్న వంక ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి. ఆ సమయంలో తండ్రీ కొడుకులు ఆవుల ఎర్రన్న యాదవ్, బాల మునీంద్రయాదవ్లు వంకకు పైన తమకు చెందిన గొర్రెలు ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు వంకను దాటాలని ప్రయత్నించారు. కాకపోతే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుని పోతుండగా, ఒక కంపచెట్టును ఆశ్రయించి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గమనించి అప్పటి ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి దృష్టికి ప్రమాద ఘటన గురించి తెలియజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బోట్ల సాయంతో తండ్రీకొడుకులను ప్రాణాలతో రక్షించారు. వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం ఓబుల్రెడ్డిపల్లెకు గ్రామ పరిసరాల్లో ఉన్న మొగమూరు వంక వర్షాకాలంలో అన్ని రకాల ఇబ్బందులను కలగజేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కసారి ఈ వంక భారీ స్థాయిలో వర్షాలు కురిసినపుడు మూడు, నాలుగు రోజుల వరకు ప్రవాహం తగ్గే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వంకను దాటేందుకు వీలుగాక వంకనీళ్లలోనే మృతదేహాలను వదిలి అంత్యక్రియలను పూర్తి చేయాల్సిన దుస్థితి నెలకొనేది. గ్రామంలో కేవలం 5వ తరగతి వరకే చదువుకునే వీలుంది. 6వ తరగతి నుంచి పై తరగతులకు చదువుకునేందుకు వెళ్లేందుకు వేంపల్లె, వీరపునాయునిపల్లెకు వెళ్లాల్సి ఉంటుంది. వంక ప్రవాహం వల్ల చదువులకు తప్పని తిప్పలు కొనసాగేవి. చదువులు కుంటుపడేవి. కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్ ఊరి మేలు కోసం వంతెన నిర్మాణం చేపట్టిన వీరయ్య యాదవ్ ఎన్నిమార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వం బిల్లుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ చివరకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మాటలతోనే సరిపెట్టారు. ఈ నేపధ్యంలో వీరయ్య యాదవ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే ఎక్కడ వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో బిల్లులకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్కనపెట్టి గ్రామ సమస్యను తీర్చేందుకు చేపట్టిన వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 2023 నవంబరులో ఎట్టకేలకు ఆ గ్రామస్తుల ఇబ్బందులు తొలగేందుకు వంకకు అడ్డంగా వంతెన నిర్మా ణం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ పట్టుదలతో వంతెన నిర్మాణానికి సీఎండీఎ ఫ్, జీజీఎంపీ కింద రూ. 57 లక్షలు మంజూరైంది. ఇది లా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఒక్క పైసా కూడా వీరయ్య యాదవ్కు అందలేదు. కానీ ఊరి మేలు కోసం ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణంతో ఆ గ్రామానికి 200 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం వంక నీళ్లలోనే మృతదేహాలను వదిలేసే దుస్థితి చదువులకూ తప్పని తిప్పలు వైఎస్ జగన్ హయాంలో వంతెన నిర్మాణం తొలగిన అన్ని ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బిల్లులు మంజూరు కాకపోవడంతో కోర్టు మెట్లెక్కిన వైనం -
డీఎస్సీలో మూడో ర్యాంక్ సాధించిన హేమలత
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరానికి చెందిన హేమలత 43 ఏళ్ల వయసులో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు విభాగంలో మూడో ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 2004లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశానన్నారు. వివాహం అయ్యాక తన భర్త పల్లేటి శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతో బీఈడీ పూర్తి చేసి ప్రైవేట్స్కూల్ టీచర్గా పనిచేశానన్నారు. 2012 డీఎస్సీలో సైన్స్ సబ్జెక్టు దరఖాస్తు చేసినప్పుడు డిగ్రీలో తన సబ్జెక్టులు బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కావడం, బోటని లేదా జువాలజీ ఉండాలన్న నియమంతో తన దరఖాస్తు రిజెక్ట్ అయిందన్నారు. తర్వాత ఎంఏ ఇంగ్లీషు పూర్తి చేసి 2018 డీఎస్సీలో 20వ ర్యాంకు సాధించాను. కానీ కేవలం రెండే పోస్టులు ఉండటంతో తనకు జాబ్ రాలేదన్నారు. అనంతరం ఇంటర్ కాలజీ ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తూ 2025 డీఎస్సీకి ప్రయత్నించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషులో 3వ ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించానన్నారు. ఎంఈడీ కూడా పూర్తి చేశానన్నారు. తన పెద్దకుమారుడు బీటెక్ ఫస్ట్ ఇయర్, రెండో కుమారుడు 9వ తరగతి చదువుతున్నాడన్నారు. వ్యవసాయం చేస్తూ తనకు సహాయ సహకారాలు అందించిన తన భర్త ప్రోత్సాహాన్ని, తన తల్లి సహకారాన్ని మరువలేనన్నారు. -
అన్ని ఇబ్బందులు తీరాయి
ప్రధానంగా ఈ వంక ప్రవాహం వల్ల వర్షాకాలంలో మా ఇబ్బందులు అన్నీ ఇన్నీ కావు. గ్రామం విడిచి ఎక్కడికి వెళ్లాలన్నా దిక్కుతోచని పరిస్థితి. వంక ప్రవాహం తగ్గినంత వరకు ఎక్కడికి వెళ్లేందుకు వీలుండేది కాదు. ప్రస్తుతం వంతెన నిర్మాణం పూర్తి కావడంతో అన్ని ఇబ్బందులు తొలగిపోయాయి. – నీలం శివగంగరాజు, ఓబుల్రెడ్డిపల్లె వంతెన నిర్మాణం చేపట్టకముందు ఎన్నో ఇబ్బందులు ఎదుర్కొనేవారం. రాకపోకలకు తీవ్ర సమస్యగా ఉండేది. ముఖ్యంగా విద్యార్థులకు వీఎన్ పల్లె, వేంపల్లె పాఠశాలల్లో చదువుకునే వారికి ఆటంకం కలిగేది. ఈ వంతెన నిర్మాణం వల్ల మృతదేహాలకు అంత్యక్రియలు, విద్యార్థుల చదువులకు, రాకపోకలకు ఆటంకం లేకుండా జరిగిపోతున్నాయి. – కొండెబోయిన గంగన్న, ఓబుల్రెడ్డిపల్లె వందల సంవత్సరాలుగా ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో ఎంతో ఇబ్బందులు పడేవారం. నేను ఇబ్బంది పడినప్పటికీ మా గ్రామానికి స్వేచ్ఛగా రాకపోకలు కొనసాగించేందుకు వంతెన నిర్మాణం చేపట్టడం ఎంతో ఆనందంగా ఉంది. ఈ వంతెన నిర్మాణానికి రూ. 57 లక్షలు మంజూరు కాగా, వంతెన నిర్మాణం కూడా పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బిల్లుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది. ఆ తర్వాత వచ్చిన కూటమి ప్రభుత్వం బిల్లులు చెల్లించేందుకు సవాలక్ష కారణాలు చెబుతూ కాలాయాపన చేస్తూ రావడంతో కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. – బత్తల వీరయ్య యాదవ్, మాజీ ఎంపీపీ, ఓబుల్రెడ్డిపల్లె -
శాంతిభద్రతలను పరిరక్షిస్తాం
కడప అర్బన్ : జిల్లాలో పోలీస్ శాఖ పట్ల ప్రజలలో మరింత నమ్మకం పెంపొందించేలా శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు తీసుకుంటామని జిల్లా నూతన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం ఆయన ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ముందుగా జిల్లా పోలీస్ కార్యాలయంలో జిల్లా సాయుధ బలగాల నుంచి గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం వేదపండితుల ఆశీర్వచనాలతో జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ జిల్లాలోని అధికారులు, మీడియా, ప్రజల భాగస్వామ్యంతో డ్రగ్స్, గ్యాంబ్లింగ్, క్రికెట్ బెట్టింగ్, ఇతర అసాంఘిక కార్యకలాపాలు, చట్ట వ్యతిరేక కార్యకలాపాలపై చాలా కఠినంగా వ్యవహరిస్తామని తెలిపారు.శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అదనపు ఎస్పీ(ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్లు దారెడ్డి భాస్కర్ రెడ్డి, శివ శంకర్ నాయక్ పాల్గొన్నారు. విధుల్లో అలసత్వం తగదు జిల్లాలో ప్రజా సమస్యలపై పోలీస్ అధికారులు తక్షణమే స్పందించి పరిష్కరించాలని, విధుల్లో అలసత్వం ఉండరాదని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కడప సబ్ డివిజన్ పోలీస్ అధికారులు, ఇతర ప్రత్యేక విభాగాల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్బంగా జిల్లా ఎస్.పి మాట్లాడుతూ జిల్లాలో పర్యటించి శాంతిభద్రతల పరిరక్షణకు ఎలాంటి చర్యలు తీసుకోవాలో అధ్యయనం చేస్తామన్నారు. శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటివారినైనా ఉపేక్షించేది లేదన్నారు. ● పోలీసుల అధికారుల సంఘం నాయకులు ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపారు. కార్యక్రమంలో కడప జిల్లా పోలీసు అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, వైస్ ప్రెసిడెంట్ శంకర్,స్టేట్ కో– ఆప్షన్ నెంబర్ ఎస్ఎం. డి. షఫీవుల్లా, ఆర్ ఎస్ ఐ రామస్వామి రాజు, ఎగ్జిక్యూటివ్ నెంబర్స్ ఏప్రిన్, మాధవి లత పాల్గొన్నారు. ● జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన అనంతరం ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొన్నారు. జిల్లా నలుమూలల నుండి వచ్చిన ప్రజల నుండి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. నిర్ణీత గడువులోపు ప్రజాసమస్యలను పరిష్కరించాలని అధికారులకు ఆదేశాలు జారీ చేశారు. జిల్లా ఎస్పీగా బాధ్యతలు చేపట్టిన షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి
కడప సెవెన్రోడ్స్ : ప్రజాసమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. సోమవారం సభాభవన్లో ఏర్పాటు చేసిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థలో డీఆర్వో వివిధ శాఖల జిల్లా అధికారులతో కలిసి ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫిర్యాదుదారుల విజ్ఞప్తులను సంబంధిత అధికారులు క్షేత్ర స్థాయికి స్వయంగావెళ్లి క్షుణ్ణంగా పరిశీలించి పారదర్శకంగా విచారణ చేసి, అర్జీదారుడు సంతృప్తి చెందేలా నిర్ణీత గడువులోపు తప్పనిసరిగా పరిష్కరించాలన్నారు. అర్జీలు పెండింగ్ లేకుండా రీఓపెన్ కాకుండా జాగ్రత్త వహించాలని సూచించారు. అర్జీల విచారణకు కింది స్థాయి అధికారులను పంపకుండా స్వయంగా అధికారే వెళ్లాలని, అర్జీదారుడు సంతృప్తి చెందేలా అర్జీలను పరిష్కరించాలన్నారు. అనంతరం అర్జీదారుల నుంచి వారు అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు, ఎస్డీసీ వెంకటపతి, జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, తదితరులు పాల్గొన్నారు. ఇవీ వినతులు ● లింగాల మండలం మురారి చింతల గ్రామానికి చెందిన తోట వెంకటకృష్ణ అనే వ్యక్తి మేము వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నామని, ఊర్లో ఉన్న తమకు చెందిన భూమిని ఆక్రమించుకొని ఆన్లైన్లో ఎక్కించుకున్నారని, సమస్యను పరిష్కరించాలని విన్నవించారు. ● పొద్దుటూరు మండలం నడింపల్లి కి చెందిన షేక్ షాహిన అనే మహిళ భర్తను కోల్పోయి ఇబ్బందుల్లో ఉన్నానని, నాకు ప్రభుత్వం మంజూరు చేసే వితంతు పింఛను మంజూరు చేయించాలని అర్జీని సమర్పించారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు -
యూసీఐఎల్ అధికారుల తీరుపై ఆందోళన
పులివెందుల టౌన్ : తమ సమస్యలు పరిష్కరించకుండా కాలయాపన చేస్తున్నారని పులివెందుల నియోజకవర్గ పరిధిలోని వేముల మండలం కె.కె.కొట్టాల గ్రామస్తులు యూసీఐఎల్ అధికారులపై మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓ చిన్నయ్య నేతృత్వంలో యూసీఐఎల్ అధికారులు జీఎం సుమన్ సర్కార్, డీజీఎం విజయకుమార్, భూసేకరణాధికారి నవీన్ కుమార్రెడ్డితో గ్రామస్తులు భేటీ అయ్యారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ టైలింగ్ పాండ్, ఇతర కారణాల వల్ల తమ గ్రామంలో ఆరోగ్య పరిస్థితులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. సీఎస్ఆర్ నిధుల కింద ఎలాంటి అభివృద్ధి పనులు చేయలేదని, తమ గ్రామంలో అవసరమైన తాగునీరు, విద్య, వైద్య సౌకర్యాలు కూడా కల్పించలేదని ధ్వజమెత్తారు. తాజాగా టైలింగ్ పాండ్ నిర్మాణం ఎత్తు పెంచుకుంటూ పోతున్నారని, దానివల్ల తమ గ్రామస్తులకు జరిగే అన్యాయం, కష్టం, నష్టం గుర్తించడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ గ్రామానికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించి, పునరావాసం కింద తమకు తగిన వసతులు కల్పించి, గ్రామం మొత్తాన్ని యూసీఐఎల్ పరిధిలోకి తీసుకుని తమను ఆదుకోవాలని కోరారు. ఈ సందర్భంగా యూసీఐఎల్ జీఎం సమాధానమిస్తూ గ్రామస్తుల సమస్యలను ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి త్వరగా పరిష్కారమయ్యేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవో చిన్నయ్య, డీజీఎం విజయకుమార్, భూసేకరణ అధికారి నవీన్ కుమార్ రెడ్డి, ఆలూరు రాజేష్ బాబు, సర్పంచ్ రంగనాథం, మోహన్ బాబు, రాజేష్, శివ పాల్గొన్నారు.సమస్యలు పరిష్కరించాలని కె.కె.కొట్టాల వాసుల డిమాండ్ -
ముంపు.. ముప్పు
● ముంచుకొస్తున్న సోమశిల వెనుక జలాలు ● ఆగిన వాహన రాకపోకలు ● 28 గ్రామాల ప్రజలకు అవస్థలుఅట్లూరు : వేగంగా వస్తున్న ముంపు జలాలతో.. ముప్పు పొంచి ఉంది. సోమశిల జలాశయంలో రోజురోజుకు నీరు పెరుగుతోంది. పూర్తి స్థాయి సామర్థ్యానికి చేరువలో ఉంది. దీంతో అట్లూరు మండల పరిధిలోని సగిలేరు నదికి భారీగా జలాలు వస్తున్నాయి. వేములూరు దగ్గర సగిలేరు నదిపై ఉన్న లోలెవల్ వంతెన పైకి సోమశిల వెనుక(ముంపు) జలాలు ముంచుకొస్తున్నాయి. లోలెవల్ వంతెన నీట మునగడంతో వాహనాల రాకపోకలు పూర్తిగా నిలిచిపోయాయి. దీంతో 28 గ్రామాల ప్రజలకు తిప్పలు తప్పడం లేదు. సోమశిల జలాశయం పూర్తి సామర్థ్యం 78 టీఎంసీలు కాగా 69 టీఎంసీలు దాటితే సగిలేరు నది వంతెనపైకి చేరుతాయి. ప్రస్తుతం సోమశిలలో 74.5 టీఎంసీలు ఉన్నాయి. దీంతో సోమవారం నాటికి వంతెనపైకి మూడు అడుగుల మేర నీరు చేరింది. చుట్టూ తిరిగి వెళ్లాల్సిన పరిస్థితి మండల నడిబొడ్డున సగిలేరు ఉంది. ఈ నదికి తూర్పు భాగాన కమలకూరు, మణ్యంవారిపల్లి, మాడపూరు, కామసముద్రం, వేమలూరు, ముత్తుకూరు గ్రామ పంచాయతీలు ఉండగా.. వాటిలో 28 గ్రామాలు ఉన్నాయి. అలాగే పడమర భాగాన 6 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. మండల కార్యాలయాలతోపాటు పోలీస్స్టేన్ సహా సగిలేరు నదికి పడమర ఉన్న మండల కేంద్రమైన అట్లూరులో ఉన్నా యి. సాధారణంగా ఆ గ్రామాల వారు మండల కేంద్రమైన అట్లూరుకు ఆరు కిలో మీటర్ల దూరం ప్రయాణించే వెళ్లే వారు. కానీ వంతెన నీట మునగడంతో.. బద్వేలు మీదుగా వెళ్లాల్సి రావడంతో 40 కిలోమీటర్లు దూరం ప్రయాణించాల్సి వస్తోంది. రైతులకు తప్పని తిప్పలు సగిలేరు నదికి ఇరువైపులా కొంత మంది రైతుల పొలాలు ఉన్నాయి. వంతెనపై నీరు చేరవడంతో.. పొలాలకు వెళ్లేందుకు ఇబ్బంది పడుతున్నారు. నడములలోతు వరకు నీరు వచ్చింది. ప్రమాదం అని తెలిసినా కొంత మంది అదే నీటిలో నడుచుకుంటూ వెళ్తున్నారు. అధికారులు స్పందించి ఇప్పటికై నా సగిలేరు నదిపై హైలెవల్ వంతెన నిర్మించాలని కోరుతున్నారు. -
మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం
పులివెందుల : పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే.. వద్దని వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వమిదని కూటమిపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో పూర్తయిన నిర్మాణాలు, ఆసుపత్రి భవనాలు, నర్సింగ్ కళాశాలను పరిశీలిస్తూ.. పూర్తయిన భవనాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం వారు మెడికల్ కళాశాల ఎదురుగా.. కళ్లు ఉండి చూడలేని సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, రైతు విభాగపు నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, పులి సునీల్కుమార్, వేముల సాంబశివారెడ్డి, సర్వోత్తమరెడ్డి, రసూల్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, పులివెందుల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తి కాకపోతే.. సీట్లు ఎలా కేటాయిస్తారు? పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయిస్తే.. కూటమి వద్దని వెనక్కి పంపింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థ వచ్చి చూసి 50 సీట్లు కేటాయించిందంటే.. మెడికల్ కళాశాల పూర్తయినట్లా, పూర్తి కానట్లా? మెడికల్ కళాశాల పూర్తి కాకపోతే ఈ కళాశాలకు 50 సీట్లు ఎందుకు కేటాయిస్తారు. కోట్లు వెచ్చించి నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన విద్య, వైద్యం అందిచ్చాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయడం ఏమిటి? – రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు విష ప్రచారం 2024 మార్చిలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభించారు. కాలేజీ, హాస్పిటళ్లకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వైఎస్సార్సీపీ పాలనలోనే వచ్చేసింది. రోజుకు ఓపీ 500 నుంచి 1000 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. టీడీపీ ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్సీని పంపించి పులిందుల మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని విష ప్రచారం చేయిస్తోంది. ప్రజలను మభ్యపెట్టాలని చూడటం తగదు. – ఎస్బీ అంజద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎంజగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే.. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రారంభిస్తే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలతో కలిసి అలుపెరని పోరాటాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. త్వరలో కూటమికి బుద్ధి చెబుతారు. – రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మైదుకూరు పులివెందుల మెడికల్ కళాశాల 90 శాతం పూర్తి కేవలం రూ.120 కోట్ల మేర పనులు పెండింగ్ ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైన కూటమి అలుపెరగని పోరాటాలతో అడ్డుకుంటాం వైఎస్సార్సీపీ నాయకులు -
ఆర్టీపీపీ నుంచి గుట్టుగా స్క్రాప్ తరలింపు
సాక్షి టాస్క్ఫోర్స్ : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిశ్రమ నుంచి గుట్టు చప్పుడు కాకుండా పాత ఇనుము (స్క్రాప్)ను కొందరు బయటికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు కొన్నేళ్ల కిందట పూర్తి అయ్యాయి. అందులో భాగంగా స్క్రాప్ (పాత ఇనుప ముక్కలు) నిలువ పేరుకుని పోయింది. అయితే ఇలా పక్కన పడి ఉన్న స్క్రాప్ను పరిశ్రమ యజమాన్యం టెండర్ల ద్వారా అమ్మకం వీలు ఉన్నప్పటికీ.. ఏ కారణం చేతనో చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఎన్డీఏ కూటమికి చెందిన కొందరు స్క్రాప్పై కన్నేశారు. సంబంధిత అధికారులకు రాజకీయ వత్తిళ్లు కూడా లేకపోలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్క్రాప్ బయటకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కార్మిక వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆర్టీపీపీ నుంచి బయటికి వెళ్తున్న స్క్రాప్ వాహనాన్ని పట్టుకోవడం, వదిలి పెట్టడటం కూడా జరిగిందని తెలుస్తోంది. సంబంధిత అధికారులపై రాజకీయ వత్తిళ్లు రావడంతో ఆ వాహనాన్ని వదిలేసినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. పట్టుకున్న వాహనం సచివాలయ వద్ద ఉంచి మంతనాలు చేసిన తర్వాత.. వదిలి వేసినట్లు సమాచారం. కూటమి నేతలు ఆర్టీపీపీని ఆదాయ వనరుగా మర్చుకున్న విషయం బహిరంగ రహస్యం. ఆర్టీపీపీలో పని చేస్తున్న కొందరి సహాయ సహాకారాలు ఉండటం వల్ల స్క్రాప్ సులువుగా బయటకు పోతుంది. ఆర్టీపీపీ ప్రధాన గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని, ఏ విధంగా బయటికి పోతుందో సులువుగా తెలుసుకోవచ్చు. అయినా ఏ కారణం చేతనో సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు విధినిర్వహణలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావును వివరణ కోరాగా.. ఆరా తీస్తామన్నారు. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. ఏదిఏమైనా విచారణ చేస్తామని, సంబంధిత వారిపై చర్యలు ఉంటాయన్నారు. అనంతరం కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డిని వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయినా ఆర్టీపీపీలోని అన్ని విభాగాల అధికారులతో సంప్రదించి విచారణ చేస్తామన్నారు. ఆర్టీపీపీ అధికారులు ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని తెలిపారు. -
నాపై పోలీసులు దాడి చేశారు
కడప అర్బన్ : హోటల్లో భోజనం చేస్తుండగా మైదుకూరు పోలీసులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మైదుకూరు మండలం జీవీ.సత్రానికి చెందిన కాకాని సాంబశివ ఆరోపించారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం తమ గ్రామానికి సమీపంలో భోజనం చేస్తున్నాననే గానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నా లాఠీలతో చితకబాదారని తెలిపారు. ప్రస్తుతం రిమ్స్లో గాయాలతో చికిత్స పొందుతున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు. కడపలో పోలీసుల ఆకస్మిక తనిఖీలుకడప అర్బన్ : కడప చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సర్కిల్, అప్సర సర్కిళ్లలో ఎస్ఐ రాజరాజేశ్వరరెడ్డి, స్పెషల్ పార్టీ సిబ్బంది ఆదివారం రాత్రి ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. లాడ్జిలు, ఆర్టీసీ బస్టాండ్లో సోదాలు జరిపారు. ఎస్ఐ మాట్లాడుతూ ఎవరైనా వాహనాలను నడిపేటపుడు నిబంధనలను పాటించాలన్నారు. లాడ్జీలలో గదులను అద్దెకు ఇచ్చేటపుడు గుర్తింపుకార్డును తీసుకోవాలని సూచించారు. -
వైద్యులు చేతులెత్తేస్తే..108 సిబ్బంది పురుడు పోశారు
మదనపల్లె రూరల్ : జిల్లా ఆస్పత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు.. తాము కాన్పు చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. గర్భిణిని తిరుపతికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్ వద్ద 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కనపరిస్తే.. 108 సిబ్బంది పురుడుపోశారని మహిళ కుటుంబీకులు చేతులెత్తి దండం పెట్టారు. వివరాల మేరకు.. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె పంచాయతీ కత్తిరివారిపల్లెకు చెందిన సాగర్ భార్య భాగ్యమ్మ(20) రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు మదనపల్లె మండలం బసినికొండలో ఉంటోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమెకు పురిటినొప్పులు మొదలవడంతో 108 వాహనం బసినికొండకు చేరుకుని భాగ్యమ్మను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చారు. వార్డులోకి తీసుకెళ్లేందుకు వీల్ఛైర్ లేకపోవడంతో కుటుంబసభ్యులు నొప్పులు పడుతున్న మహిళను నడిపించుకునే తీసుకెళ్లారు. ఆ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నర్సింగ్ సిబ్బంది నామమాత్రపు పరీక్షలు చేసి తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎన్టీ రెడ్డి జశ్వంత్, పైలట్ సద్దాం గర్భిణి ప్రసవవేదనను గమనించి, ఈ స్థితిలో తిరుపతికి తరలిస్తే మార్గమధ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఆస్పత్రిలోనే కాన్పు చేయండంటూ అభ్యర్థించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా చికిత్స గురించి మీరు చెప్పేదేంటి. ఆమెకు రక్తం ఆరు పాయింట్లు ఉంది. మేం రెఫర్ చేస్తే తీసుకెళ్లడం మీ బాధ్యత. తీసుకువెళ్లండంటూ గదమాయించారు. చేసేదేమీలేక 108 సిబ్బంది భాగ్యమ్మను తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో భాకరపేట ఘాట్ సమీపంలో 108 వాహనంలోనే 3.5 కిలోల బరువున్న మగపిల్లవాడికి జన్మనిచ్చింది. 108 సిబ్బంది ప్రసవానంతర చికిత్సలు అందించి, మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించారు. -
ఫేక్ సర్టిఫికెట్లతోనే రిజిస్ట్రేషన్
ప్రొద్దుటూరు : వంశపారంపర్యంగా కాపాడుకుంటూ వస్తున్న ఆస్తులను తప్పుడు సర్టిఫికెట్లు సృష్టించి అమ్ముకోవడం ప్రొద్దుటూరులో చర్చనీయాంశంగా మారింది. ఒకరి ఆస్తి మరొకరికి మారాలంటే ఎన్నో రకాల నిబంధనలున్నాయి. అయితే అన్నింటినీ సులువుగా తయారు చేసి నకిలీ ముఠా కోట్ల రూపాయల ఆస్తులకు కన్నం వేస్తోంది. తాజాగా ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన గంజికుంట సుబ్బరాయుడు ఆస్తే ఇందుకు ఉదాహరణ. ప్రభుత్వ ఉద్యోగిగా పనిచేస్తూ రిటైర్ట్ అయిన ఆయనకు 1986లో మైదుకూరు రోడ్డులోని ఎన్జీఓ ప్లాట్లలో ప్లాట్ నంబర్ 300ను కేటాయించారు. అప్పటినుంచి ఇప్పటి వరకూ ఆయన తన ఆస్తిని కాపాడుకుంటూ వస్తున్నారు. తరచూ తన ప్లాట్ వద్దకు వెళ్లి చూసుకోవడం జరుగుతోంది. చుట్టుపక్కల వారు చెప్పడంతోనే ప్రస్తుతం తన ఆస్తిని మరొకరికి దొంగగా రిజిస్ట్రార్ చేయించారని బయటపడింది. ఫేక్ సర్టిఫికెట్ల ముఠా ఉందా.. గంజికుంట సుబ్బరాయుడతోపాటు ఆయన సతీమణి లక్ష్మీదేవి మరణించినట్లు డెత్ సర్టిఫికెట్లు సృష్టించడం హైదరాబాద్కు చెందిన వ్యక్తికి సుమా రు రూ.2 కోట్ల విలువైన ఆస్తిని రిజిస్ట్రేషన్ చేయించడం జరిగింది. సజీవంగా ఉన్న సుబ్బరాయుడుతోపాటు ఆయన సతీమణి రిజిస్ట్రేషన్లో డెత్ సర్టిఫికెట్లు సమర్పించారు. అయితే ఈ డెత్ సర్టిఫికెట్లు మున్సిపాలిటీ నుంచి జారీ చేయలేదు. కేవలం సొంతంగా ఫేక్ డెత్ సర్టిఫికెట్లను తయారుచేసి అమ్మడం జరిగింది. ఈ సర్టిఫికెట్లలో సూచించిన 2015, 2017 సంవత్సరాలలో మున్సిపల్ కమిషనర్ రఘునాథరెడ్డి ఉన్నట్లు పేర్కొన్నారు. వాస్తవానికి అప్పట్లో రఘునాథరెడ్డి లేరు. 2024 సాధారణ ఎన్నికల సమయంలో రఘునాథరెడ్డి బదిలీపై వచ్చి వెళ్లారు. కాగా ప్రతి ఎన్జీఓ ప్లాట్కు సంబంధించి ప్రొద్దుటూరు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్ నుంచి లేఖను జారీ చేసిన తర్వాతే ప్లాట్ను అమ్ముతున్నారు. ఈ ప్లాట్ అమ్మకానికి సంబంధించి కూడా ఆగస్టు నెల 8న సంఘం కార్యదర్శి సాల్మన్ లేఖ ఇచ్చినట్లు పొందుపరిచారు. ప్రభుత్వం పూర్తి స్థాయిలో విచారణ జరిపితే ఫేక్ సర్టిఫికెట్ల ముఠా వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది. గతంలో కూడా పలు సందర్భాల్లో ఇలాంటి నకిలీ రిజిస్ట్రేషన్లు జరిగాయి.కోట్ల రూపాయల ఆస్తులకు కన్నం -
108 సిబ్బంది లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేది..
108 సిబ్బంది లేకుంటే, నా భార్య, బిడ్డ నాకు దక్కని పరిస్థితి. సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. పురిటినొప్పులతో భార్య తల్లడిల్లిపోతోంది. ఇక్కడే డెలివరీ చేయండని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది, రేపు సాయంత్రం వరకు కాన్పు జరిగే అవకాశం లేదు. తిరుపతికి వెళ్లండని పంపేశారు. సమయానికి 108 వాహనం అందుబాటులో ఉండి, అందులో వెళ్లాం కాబట్టి సరిపోయింది. అదే వైద్యుల మాట విని బస్సులో వెళ్లి ఉండి ఉంటే, మా పరిస్థితి ఏమయ్యేది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు ఏమాత్రం బాగోలేవు. – సాగర్, గర్భిణి భర్త -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణపై ఉద్యమం
కడప అర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. కడప నగర శివారులో 2006లో 230 ఎకరాల్లో రిమ్స్ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే 125 కోట్ల రూపాయలతో 452 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 40.81 కోట్ల వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో మానసిక వైద్యశాల, 107 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల కేన్సర్ హాస్పిటల్కు 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఈ మూడు హాస్పిటల్స్ నిర్మాణాలను పూర్తి చేసి 2023 డిసెంబర్ 23న ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో కడప రిమ్స్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, కడప నగర మేయర్ కె.సురేష్బాబుతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియా బృందంతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలలకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, అలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆ పార్టీ నేతలు సులి సునీల్కుమార్, షేక్ షఫీ, కార్పొరేటర్లు పాకా సురేష్, బాలస్వామిరెడ్డితోపాటు పలువురు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్య, వైద్యం పేదలకు దూరం చేస్తే ఊరుకోం కార్పొరేట్ వ్యక్తులకు కూటమి దోచిపెట్టే యత్నం సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకువైఎస్ఆర్ పేరు తొలగింపుపై ఆగ్రహం రిమ్స్ను పరిశీలించినవైఎస్ఆర్సీపీ నేతలు -
ప్రభుత్వ రంగాలను కూటమి అమ్మేందుకు తెరలేపింది
సీమ నడిబొడ్డున ఉన్న కడప సూపర్ స్పెషలిటీ వైద్యశాలను సైతం అమ్ముకునే, దోచుకునే కార్యక్రమానికి పాల్పడటం సిగ్గు చేటు. అప్పట్లో ఎయిమ్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాకుండా బిల్డింగ్లు నిర్మించి, వాడుకలోకి తీసురావాలని భావించారు. నిజాన్ని అబద్ధం చేయాలనుకోవడం సరికాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలో బుద్ధి చెబుతారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
వైఎస్ఆర్ పేరు తొలగింపు సరికాదు
ఉమ్మడి రాష్ట్రంలో 10 మెడికల్ కళాశాలలు కట్టించి, వైద్య సేవలు అంచిందిన ఘనత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డిదే. నాలుగు జిల్లాలకు నడిబొడ్డున రిమ్స్ను ఏర్పాటు చేశారు. అనంతరం రిమ్స్ను అప్గ్రేడ్ చేసి సూపర్ స్పెషాలిటీ వైద్యశాల నిర్మించారు. మెరుగైన వైద్యం అందించాలని సంకల్పించి జగన్ జాతికి అంకితం చేశారు. సూపర్ స్పెషాలిటీ వైద్యశాలకు వైఎస్ రాజశేఖర్రెడ్డి పేరు తీసేయడం సిగ్గు చేటు. దుర్మార్గపు ఆలోచన విరమించుకోవాలి. –కె.సురేష్బాబు, నగర మేయర్, కడప -
కడప టు బీహార్!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుడ్న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలకు డైరెక్ట్ కనెకివిటీ రైలు ఉమ్మడి కడపజిల్లా రైలుమార్గంలో నడవలేదు. బీహార్లోని రక్సౌల్ నుంచి చర్లపల్ల్లి (తెలంగాణ) వరకు ఆరేళ్లుగా రైలు నడుస్తోంది. ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ను జిల్లా రైలుమార్గంలో తిరుపతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పడు డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్ క్లియర్ కావడంతో ఉమ్మడి కడప జిల్లా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ రైలు నేరుగా బీహార్ నుంచి చర్లపల్లి మీదుగా జిల్లా రైలుమార్గం గుండా తిరుపతికి చేరనుంది. ఇప్పటి వరకు గూడూరు జంక్షన్ నుంచి ఉమ్మడి కడప జిల్లా వాసులు బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టాలు పడేవారు. రేణిగుంట–విజయవాడ మార్గంలోని గూడూరు జంక్షన్కు వెళ్లి తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ జంక్షన్ ఉమ్మడి కడప జిల్లా వాసులకు చాలా దూరం. కడప నుంచి గూడూరుకు 141 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు మూడుగంటలకు పైగా సమయం పడుతుంది. ఏ రైలుకు వెళ్లాలన్న గూడూరు జంక్షన్కు 4 గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్ల ప్రయాణం తప్పడం లేదు. ● 07052/51 నంబరుతో నడిచే రైలును రక్సౌల్(బీహార్) నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రక్సౌల్కు పొడిగించారు. గుంతకల్, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నారు. ● ఝార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగమైన బైద్యనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు వీలు కలుగుతుంది. ● బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని ధన్బాద్, రాంచీ, జాసిద్, ఒడిశా రాష్ట్రంలోని రూర్కేలా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్ పట్టణాలకు మార్గం సుగమమం కానుంది. ● ఉత్తర తెలంగాణతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానంగా ఈ రైలును నడవనుంది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట, తర్పూర్కాగజ్ నగర్లకు చేరుకోవచ్చు. డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్క్లియర్ ఉమ్మడి కడప జిల్లా లైన్లో రక్సౌల్–చర్లపల్లె వీక్లీ 20 నుంచి తిరుపతి వరకు పొడిగింపు -
వంకలోపడి ఎనిమిదేళ్ల బాలుడు మృతి
కొండాపురం : అప్పటి వరకు కళ్ల ముందు నవ్వుతూ ఆటలాడుతున్న కొడుకు క్షణాల్లో విగతజీవిగా మారడం ఆ తల్లిదండ్రులకు తీవ్ర శోకాన్ని మిగిల్చింది. మండలంలోని దత్తాపురం పునరావాస కేంద్రంలోని వంకలో పడి ఎనిమిదేళ్ల బాలుడు దుర్మరణం చెందిన ఘటన ఆదివారం చోటుచేసుకుంది. దత్తాపురం గ్రామానికి చెందిన పాపన్నగారి గుణదీపక్(8) మూడో తరగతి చదువుతున్నాడు. సాయంత్రం సమయంలో పిల్లలతో కలిసి సరదగా వినాయకుని విగ్రహం తయారు చేసుకోవడానికి బంకమట్టికోసం వంక దగ్గర తీసే సమయంలో ప్రమాదవశాత్తూ అందులో పడి పోయాడు. కుటుంబీకులు గుర్తించేలోగానే బాలుడు మృతిచెందినట్లు స్థానికులు తెలిపా రు. తల్లిదండ్రులు గంగాధర్, గీతలు గుండెలవిసేలా ఏడ్చారు. బాలుడు మృతితో గ్రా మంలో విషాదచాయలు అలుముకున్నాయి.ఉత్సాహంగా క్రీడా ఎంపికలుప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జి కారొనేషన్ క్లబ్లో ఉమ్మడి కడప జిల్లా ఎస్జీఎఫ్ఐ అండర్–19 బాలబాలికల రైఫిల్ షూటింగ్, ఫెన్సింగ్, టేబుల్ టెన్నిస్ జిల్లా స్థాయి ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. క్రీడాకారులు తమ నైపుణ్యంతో అందరిని ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభకనబరిచిన క్రీడాకారులను ఈనెల 23 నుంచి 26 వరకు కాకినాడ, రాజమండ్రిలలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొననున్నారు. ఫెన్సింగ్ పోటీలకు 28 మంది క్రీడాకారులు పాల్గొనగా 14 మంది, రైఫిల్ షూటింగ్లో 16 మంది పాల్గొనగా 9 మంది, టేబుల్ టెన్నిస్లో 17 మందికి గాను 10 మంది రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ పోటీలను జార్జికారొనేషన్ క్లబ్ సెక్రటరీ సుధాకర్రెడ్డి, ఎస్జీఎఫ్ఐ అండర్–19 జిల్లా సెక్రటరీ చంద్రమోహన్ రాజు, కోచ్ రాఘవ, అల్లాబకాష్, శివారెడ్డి తదితరులు పర్యవేక్షించారు. -
పేదలకు వైద్య విద్య దూరం
మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం అవుతుంది. కాలేజీలను అనుబంధంగా ఉన్న ఆస్పత్రులు కూడా ప్రైవేటు వ్యక్తుల చేతుల్లోకి వెళ్లడంతో.. ఉచిత వైద్య సౌకర్యం పేదలు కోల్పోతారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా మెడికల్ కళాశాలలను నిర్మింపచేసి అభివృద్ధి దిశగా తీసుకుని వెళ్లారు. కానీ చంద్రబాబు వాటిని ప్రైవేటు పరం చేయాలనుకోవడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. – డాక్టర్ నాగార్జున రెడ్డి, డాక్టర్ల విభాగం అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్
మదనపల్లె సిటీ : విద్యార్థుల్లో దాగిన ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్వో, బార్క్, డీఆర్డీవో, ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్షిప్, ఉపకారవేతనం పొందే అవకాశాన్ని కలిగిస్తోంది. ’కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్తంగా పరీక్ష నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో పరీక్ష పాల్గొనవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్సైట్లో రూ.200 రుసుం చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. వివిధ స్థాయిల్లో పరీక్ష వివిధ స్థాయిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం, సామాన్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి, సత్యేంద్రనాథ్, బోస్ జీవిత చరిత్ర, లాజికల్ థింకింగ్, రీజనింగ్ తదితర సబ్జెక్టుల్లో బహుళైచ్చిక విధానంలో ప్రశ్నలుంటాయి. వీవీఎం పరీక్ష సంబంధించి విద్యార్థులు మొదట పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ద్వారా పరీక్ష రాయవచ్చు. విద్యార్థి ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో, సెల్ఫోన్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్ట్యాప్ల ద్వారా పాల్గొనవచ్చు. ఆంగ్లం, హిందీతో పాటు 9 ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. ప్రతిభ చూపిన విద్యార్జులకు స్థాయిని బట్టి ద్రువపత్రాలు,నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ప్రధానోపాధ్యాయుల కృషి అవసరం విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – భాస్కరన్, డివిజన్ సైన్సు అధికారి, మదనపల్లెవిద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు -
చాలీ చాలని జీతాలతో చాకిరి
కడప ఎడ్యుకేషన్ : సమగ్రశిక్ష, విద్యా శాఖలో అత్యంత కీలకంగా పనిచేసే చిరుద్యోగులైన సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో చాకిరీ చేస్తూ కుటుంబాలను భారంగా మోస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరకులు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఏ ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ చాలీచాలని జీతాలతో జీవితాలను ఏ విధంగా సాగించాలని మదిలో మదనపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించకుండా, ఉద్యోగుల మధ్య వేతన అసమానతలను పెంచే విధంగా ఈ జీవో నంబర్–2ను అమలు చేస్తోంది. ఈ జీఓ కేవలం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీయడమేగాక, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విద్యాశాఖలో పనిచేసే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖలో.. జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రంలో 156 మంది సీఆర్ఎంటీలు, 19 మంది మండల లెవల్ అకౌంటెంట్స్, 34 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 35 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 ఉండేది. ఆ తర్వాత వీరికి 2020లో గత వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 23,500కు వేతనం పెంచింది. ఆ తరువాత అధికారంలోకి కూటమి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని, 2025 జనవరి, 6వతేదీన జీవో నంబర్–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగ కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని, కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీఓ ఉద్దేశమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నూతన రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని వారు తెలిపారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సరిపోవడంలేదని వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పుచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలను విరివిగా పెంచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం వికలాంగులు, ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యులకు వద్ధాప్యం పింఛన్ తొలగించారు. వాటిని తిరిగి పునరుద్ధరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పెంచింది. తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచింది. కానీ ఈ సౌకర్యం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వర్తింప యకపోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. అనేక సంవత్సరాలుగా తక్కువ జీతంతో పనిచేస్తూ, ఎలాంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా, రిటైర్ అయ్యేసరికి కుటుంబానికి భారం అవుతున్న పరిస్థితి దురదృష్టకరమని ఆందోళన చెందుతున్నారు. వీరికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లానే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు, గ్రాట్యూటీ, పెన్షన్ పథకం లేదా ఉద్యోగ భద్రతకు దారిచూపే ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కనికరించని ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం మరిచిన ప్రభుత్వం ఆరేళ్లుగా వేతనం పెంపుకోసం ఎదురుచూపు -
తప్పు మీద తప్పు!
సాక్షి ప్రతినిధి, కడప: సోమశిల బ్యాక్ వాటర్ ముంపు పరిహారం చెల్లింపులో అధికారులు తప్పు మీద తప్పు చేస్తున్నారు. అవార్డు అయిన తర్వాత కూడా పరిహారం చెల్లించడం ఒక ఎత్తయితే, అక్రమంగా పొందిన పరిహారానికి వడ్డీ చెల్లించాలని నిర్ణయించడం మరో ఎత్తు. అధికార పార్టీకి చెందిన ఓ ఎమ్మెల్యే సిఫార్సులతో తప్పులను సైతం అడ్డుకోలేక చేష్టలుడిగి జిల్లా స్థాయి అధికారులు ఉండిపోయారు. మరోవైపు అత్యున్నత స్థాయి అధికారి సిఫార్సులు తోడు అవడంతో రూ.1.75కోట్లు అక్రమంగా ప్రజాధనాన్ని కొల్లగొట్టేందుకు సన్నహాలు పూర్తి అయ్యాయి. ● సోమశిల బ్యాక్ వాటర్ 14వ రీచ్లో అట్లూరు మండలం చెర్లోపల్లె గ్రామంలో 254 ఇళ్లుకు ముంపు పరిహారం లభించింది. 6700 చదరపు మీటర్లు ఇళ్లున్నాయని గుర్తించి రూ.1.17 కోట్లు చెల్లించారు. అవార్డు అయిన తర్వాత వ్యవసాయ పొలంలో అవసరాలకు నిర్మించుకున్న నాలుగు ఇళ్లుకు పరిహారం చెల్లించాలని విన్నపం తెరపైకి వచ్చింది. అప్పట్లో మాజీ మంత్రి వీరారెడ్డి సిఫార్సులతో ఆ నాలుగు ఇళ్లుకు రూ.84లక్షల పరిహారం చెల్లించారు. అంతటితో ఆగకుండా తర్వాత మరో కొత్త కథ తెరపైకి తెచ్చారు. హైకోర్టు రిట్ ఫిటిషన్ 282/2010 ప్రకారం ఇచ్చిన తీర్పు మేరకు తమకు వడ్డి చెల్లించాలంటూ తాజాగా తెరపైకి తెచ్చారు. అందుకు అధికార పార్టీకి చెందిన నోరున్న ఎమ్మెల్యే తోడయ్యారు. రాష్ట్ర స్థాయిలో ప్రిన్సిఫల్ సెక్రెటరీ సానుకూలత లభించింది. ఎవరి వాటా వారికి అప్పగించేందుకు ముందుకు రావడంతో వడ్డీ రూపేనా రూ.1.75కోట్లు సొమ్ము చేసుకునేందుకు సన్నహాలు దాదాపు పూర్తి అయ్యాయని సమాచారం. సోమశిల బ్యాక్ వాటర్ అవార్డు అయిన తర్వాత ముంపు పరిహారం ఆపై వడ్డీ చెల్లించాలని మరో విన్నపం ప్రిన్సిపల్ సెక్రెటరీ స్థాయిలో సిఫార్సులు రూ.1.75 కోట్లు అక్రమంగా కొట్టేసేందుకు వేగంగా అడుగులు అధికారపార్టీ ఎమ్మెల్యే ఒత్తిడితో చేష్టలుడిగిన అధికారులు చెర్లోపల్లిలో అక్రమంగా ప్రజాధనం కొట్టేసేందుకు పన్నాగం ఒంటిమిట్ట మండలం బందారుపల్లెలో అవార్డు అయిన తర్వాత డబ్బులు చెల్లించలేదు. దాంతో రద్దు కావడంతో తిరిగి అవార్డు చేశారు. రెండేళ్లు కాలం గడిచిపోవడంతో ఆ గ్రామస్థులు హైకోర్టును ఆశ్రయించారు. తమకు చెల్లిస్తున్న పరిహారానికి వడ్డీ కూడా జమ కట్టాలని కోరారు. ఆమేరకు హైకోర్టులో రిట్ ఫిటిషన్ 282/2010 దాఖలయ్యింది. విచారించిన హైకోర్టు రెండేళ్లు ఆలస్యంగా డబ్బులు ఇచ్చిన కారణంగా వారికి వడ్డీ చెల్లించాలని తీర్పు ఇచ్చింది. ఆ సాకు చూపెట్టి అట్లూరు మండలం చెర్లోపల్లెలో వడ్డీ పేరుతో ప్రజాధనం కొల్లగొట్టేందుకు సన్నహాలు చేశారు. అంతే కాకుండా కొత్త రేట్లు ప్రకారం పరిహారం ఇస్తే వడ్డీ చెల్లించరాదని ఉత్తర్వులు సైతం ఉన్నాయి. కొత్త రేట్లు ప్రకారం పరిహారం పొందినప్పటికీ తిరిగి వడ్డీ చెల్లించాలంటూ సిఫార్సులు ఆరంభించి దాదాపు సక్సెస్ అయ్యారని తెలుస్తోంది. ఒకమారు అవార్డు అయిన గ్రామంలో తిరిగి ఇళ్లు నిర్మించి పరిహారం కొత్త రేట్లుతో పొందారు. రూ.84లక్షలు 2014లో పరిహారం పొందిన నేపధ్యంలో 1996 నుంచి 2013 వరకూ వడ్డీ చెల్లించాలని సిఫార్సులు చేపట్టారు. అధికారులు తప్పు మీద తప్పుకు ఆస్కారం ఇస్తున్నారు. అధికార పార్టీ నేతల ఒత్తిడికి తలొగ్గడం, రాష్ట్ర స్థాయి ఉన్నతాధికారి సిఫార్సులు చేయడంతో ప్రజాధనం దుర్వినియోగం కానుంది. అక్రమార్కులు ముంపు పరిహారం పొందడంలో అడ్డదారులతో సొమ్ము చేసుకునే పనిలో నిమగ్నమైనట్లు సమాచారం. -
జిల్లా ఎస్పీగా నచికేత్ విశ్వనాథ్
కడప అర్బన్: రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాలలో 14 జిల్లాలకు సంబంధించిన ఎస్పీలకు స్థానచలనం, నియామకం చేస్తూ శనివారం ప్రభుత్వ చీఫ్ సెక్రటరీ కె విజయానంద్ ఉత్తర్వులను జారీ చేశారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీగా షెల్కే నచికేత్ విశ్వనాథ్ను నియమించారు. ఈయన 2019 ఐపీఎస్ బ్యాచ్కు చెందిన అధికారి. ప్రస్తుతం ఇంటలిజెన్స్ విభాగంలో అధికారిగా విధులను నిర్వహిస్తున్నారు. నేడో, రేపో ఆయన జిల్లాకు విచ్చేసి ఎస్పీగా బాధ్యతలను చేపట్టనున్నారు. నియమితులైన ఏడు నెలలకే ఎస్పీ ఈ.జీ అశోక్కుమార్ బదిలీ.... వైఎస్ఆర్ జిల్లా ఎస్పీగా నియమితులైన ఈ.జీ అశోక్కుమార్ 2025 జనవరి 24న విధుల్లో చేరారు. గతంలో కడపలో డీఎస్పీగా పనిచేసిన ఈజీ అశోక్కుమార్ మరలా జిల్లా ఎస్పీగా నియమితులై విధుల్లో చేరినపుడు ఒకవైపు ప్రజలు, మరోవైపు అధికారులు ఎంతో హర్షం వ్యక్తం చేశారు. జిల్లామీద పట్టువున్న అధికారిగా విధులను నిర్వహిస్తారని భావించారు. అనుకున్నట్లుగానే శాంతిభద్రతల పరిరక్షణలో తనదైన శైలిలో విధులను నిర్వహించారు. కానీ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఇటీవల జరిగిన ఉప ఎన్నికలలో పోలింగ్ నిర్వహణ, ఇతర అంశాలు అభద్రతా భావాన్ని నెలకొల్పాయి. ఐపీఎస్ అధికారుల నియామకంలో బదిలీ అయిన అధికారుల జాబితాలో ఈయన పేరును ప్రస్తావించలేదు. కానీ ఒకటి రెండు రోజుల్లో మరికొంతమంది నియామకాల జాబితాలో ఈ.జీ అశోక్కుమార్ పేరు రావచ్చని భావిస్తున్నారు. ఏది ఏమైనా ఎస్పీ అశోక్కుమార్ బదిలీ ఏడు నెలలకే జరగడం అటు అధికారుల్లో, ఇటు ప్రజల్లో చర్చనీయాంశంగా మారింది. అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలి రాయచోటి: అన్నమయ్య జిల్లా ఎస్పీగా ధీరజ్ కనుగిలిని నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. స్థానికంగా పనిచేస్తున్న ఎస్పీ వి. విద్యాసాగర్ నాయుడు కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. నియమితులైన ఏడు నెలలకే ఎస్పీ అశోక్కుమార్ బదిలీ -
నమో నారసింహా
గుర్రంకొండ: నమో నారసింహా అంటూ భక్తులు గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో స్వామివారిని కొలిచారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో తరిగొండ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. చారిత్రాత్మాక గుర్రంకొండ కోటలోని శ్రీ నృసింహస్వామి ఆలయంలో వేకువజామేన అర్చనలు, అభిషేకాలు, ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయాలకు చేరుకొని స్వామివార్లను సేవించుకొన్నారు. అర్చకులు భక్తులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప రూరల్: ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు స్వస్థ నారి సశక్త్ పరివార్ అభియాన్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ నాగరాజు తెలిపారు. శనివారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్యశాఖ కార్యాలయంలో నిర్వహించిన సమావేశంలో ఆయన మాట్లాడారు. మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం, సాధికారత మెరుగుపడుతుందన్నారు. జిల్లా వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ వైద్య కేంద్రాలలో 474 వైద్య శిబిరాల ద్వారా స్పెషలిస్ట్ వైద్యులతో వైద్య పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని సమకూర్చడమే ధ్యేయమన్నారు. కార్యక్రమంలో డాక్టర్ ఉమామహేశ్వర్ కుమార్, డాక్టర్ రవిబాబు, రమేష్, మనోరమ, భారతి, ఖాజా తదితరులు పాల్గొన్నారు. నవోదయలో సైన్స్ గ్రూప్ ఖాళీల భర్తీకి చర్యలు రాజంపేట : మండలంలోని నారమరాజుపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్ గ్రూపులో(2025–2026) ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ కె.గంగాధరన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో సైన్స్, గణితంలో 60 శాతం మార్కులు, సరాసరి 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. విద్యార్థులు స్వయంగా వ చ్చి సెప్టెంబరు 23వ తేదిలోగా దరఖాస్తు అందచేయాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబి తా, టీసీ వెంట తీసుకురావాలన్నారు. స్పాట్ అ డ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా వాసులేగాక ఇతర జిల్లాల విద్యార్థులు చేరవచ్చునన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: కేంద్ర మంత్రి రామ్దాసు అథవాలే అక్టోబర్ 4, 5 ,6 తేదీల్లో ఆంధ్ర రాష్ట్రంలో పర్యటించ నున్నారని రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా జాతీయ కార్యదర్శి పేరం శివ నాగేశ్వరరావు గౌడ్ అన్నారు. శనివారం కడప నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. తమ పార్టీ ఎన్డీయే కూటమి భాగస్వామిగా ప్రధాని నరేంద్ర మోడీ మంత్రి వర్గంలో మూడవ సారి కొనసాగుతున్నదని తెలిపారు. కేంద్ర మంత్రి ఆంధ్రప్రదేశ్ పర్యటనలో భాగంగా ముందుగా తిరుపతి, తిరుమల దేవస్థానాన్ని సందర్శించ నున్నారని, అక్కడ ఆయనకు ఘనంగా సన్మానం జరుగుతుందని తెలిపారు. ఆ తర్వాత ఏపీ సీఎం చంద్రబాబు ఆధ్వర్యంలో మంగళగిరిలోని సికే ఫంక్షన్ హాలులో మంత్రి అథవాలే చేతుల మీదుగా వినికిడి యంత్రాలు పంపిణీ కార్యక్రమం ఉందని ఆయన వివరించారు. ఈ సమావేశంలో రిపబ్లికన్ పార్టీ ఆఫ్ ఇండియా సౌత్ ఇండియా జనరల్ సెక్రటరీ ఎన్ డి అజయ్ ప్రసన్న, జోసెఫ్ తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలలపై చంద్రబాబు అబద్ధపు ప్రచారం
పులివెందుల : రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైఎస్సార్ వేషధారణలో శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అనంతపురం సభలో చంద్రబాబు పాడేరు మెడికల్ కళాశాల మినహా, ఎక్కడ వైద్య కళాశాల నిర్మాణం జరగలేదని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలను నివృత్తి చేసేందుకే అందరికీ వైద్య కళాశాల చూపుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గతంలో ఉండేవని, వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. గతంలో రోగులను అత్యవసర పరిస్థితిలో రాష్ట్రంలో సరైన వసతులు లేక హైదరాబాద్, చైన్నె. బెంగుళూరు ప్రాంతాలకు అంబులెన్స్లలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. సరిహద్దులలో అంబులెన్స్లు ఆపి రాష్ట్రంలో వైద్యం చేయించుకోవాలని చెప్పారన్నారు. దీంతోపాటు చాలామంది మెడికల్ కళాశాల బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. దీంతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో ఐఆదు మెడికల్ కళాశాలలు గత రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, మరో నాలుగు మెడికల్ కళాశాలలు గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గత ఏడాది మెడికల్ కళాశాలల ప్రారంభాలను ఆపి ప్రస్తుతం వాటిని పీపీపీ విధానం పేరుతో ఎలా పంచుకోవాలనే దానిపై కూటమి నాయకులు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకునేలా కృషిచేస్తామన్నారు. -
సెయిల్ కంపెనీలో చోరీ
కొండాపురం : సెయిల్ కంపెనీలో వరుస చోరీలు పోలీసులకు సవాల్గా మారాయి. టి.కోడూరు సమీపంలోని సెయిల్ కంపెనీలో శుక్రవారం రాత్రి సోలార్ కాపర్ ప్లేట్ల చోరీకి పాల్పడుతున్న వారిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. తాళ్లప్రొద్దుటూరు ఏఎస్ఐ రాయపాటిబాసు వివరాల మేరకు.. సెయిల్ కంపెనీలో పనిచేసే ఇద్దరు వ్యక్తులు, మరో వ్యక్తి కలిసి సోలార్ కాపర్ ప్లేట్లను చోరీ చేశారు. టి.కోడూరు గ్రామానికి వచ్చే రోడ్డు వద్ద తీసుకువస్తుండగా పట్టుకున్నట్లు పోలీసులు తెలిపారు. వాటి విలువ సుమారు రూ. 2.80 లక్షలు ఉంటుందన్నారు. సంస్థ సెక్యూరిటీ ఇన్ఛార్జి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఏఎస్ఐ తెలిపారు. కరస్పాండెంట్పై పోక్సో కేసు మైదుకూరు : తన పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్పై మైదుకూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక ఓ పాఠశాలలో సదరు విద్యార్థిని ఒకటో తరగతి నుంచి చదువుతోంది. తల్లి కువైట్కు వెళ్లగా తండ్రితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు స్టడీ అవర్స్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండు నెలలుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ అడిగింది. దీంతో కరస్పాండెంట్ ప్రవర్తన గురించి చెప్పింది. ఆ విషయమై పోలీస్స్టేషన్కు వెళ్లి విద్యార్థినితో వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయించింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు. కాలువలో పడ్డ స్కార్పియో పులివెందుల రూరల్ : మండలంలోని రచ్చుమర్రిపల్లె వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా గ్రామానికి చెందిన కిరణ్, శ్రీనివాసనాయక్, నారాయణ స్వామి, చంద్రనాయక్, రమేష్నాయక్, మహేంద్రబాబులతోపాటు మరో ఎనిమిది మంది జమ్మలమడుగు నియోజకవర్గ సమీపం లోని తండాకు స్కార్పియోలో బయలుదేరారు. రాయలాపురం వంతెన సమీపంలోని కాల్వ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కాల్వలో పడిపోయింది. దీంతో స్కార్పియోలోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తమబంధువు పెళ్లిచూపులకు వెళ్తున్నట్లు వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్కూల్ బస్సు ఢీకొని ఒకరు మృతి మైదుకూరు : మండలంలోని మాచుగారిపల్లె స్కూల్ బస్సు ఢీకొనడంతో బైక్పై వస్తున్న లంకల చిన్నఓబులేసు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గంగాయపల్లెకు చెందిన చిన్న ఓబులేసు శుక్రవారం సాయంత్రం మాచుగారిపల్లె గ్రామానికి వస్తున్నారు. జీవీ.సత్రంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సుమాచుగారిపల్లె వద్ద బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్న ఓబులేసును కడప రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి అన్న కుమారుడు లంకల ఓబులేసు ఫిర్యాదు మేరకు అర్బన్ ఏస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న స్కూల్ బస్సుల వేగం జీవీ సత్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు మితిమీరిన వేగంతో తిరగడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుస్తున్నాయి. జీవీ సత్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని గతంలో ట్రాన్స్జెండర్ మృతి చెందగా, తాజాగా బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో మరొకరు మృతి చెందారు. విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నగదు ఇవ్వమన్నందుకు దాడి మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అబ్దుల్లా(47) అతడి తమ్ముడు ఖాదర్వలి(29) కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బావాజాన్ వద్ద రూ.1.75 లక్షలకు రెండు పాడి ఆవులు కొనుగోలు చేశారు. అయితే, చెప్పిన మేరకు ఆవులు పాలు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి ఇచ్చి తమ డబ్బు చెల్లించాలని కోరారు. కొద్ది రోజులుగా నగదు ఇవ్వకుండా బావాజాన్ ఇబ్బంది పెట్టడంతో శనివారం అన్నదమ్ములు ఇద్దరూ ముదివేడుకు చేరుకుని తమకు రావాల్సిన నగదుపై బావాజాన్ను నిలదీశారు. దీంతో అతను తన అనుచరులతో కలిసి అబ్దులా, ఖాదర్వలిలపై దాడి చేయించాడు. బాధితులు ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్సలు పొందారు. ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : మండలంలోని ఓ మహిళఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతోంది. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మూర్తి భార్య ఉలిగెమ్మ(24) భర్తతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. కుటుంబసభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
సీఎం అనుమతించినా.. ఫలితం లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీిసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్క్లబ్లో శనివారం యూనియన్ జోనల్ సమావేశం నిర్వహించారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఏపీఎస్సార్టీిసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అంగీకారం అనంతరం సీఎం గత నెల 28న ఆర్టీసి ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. సంబంధిత జీఓను టిఆర్–బి అధికారులు జీఏడీకి పంపినా, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి మొండి వాదనలు చేస్తూ ఫైల్ కదలకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 6000 మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆరోపించారు. 11వ పీఆర్సీకి సంబంధించి 24 నెలల అరియర్స్, నాలుగు డీఏలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. సీ్త్రశక్తి పథకం భవిష్యత్తులో విజయవంతంగా నడవాలంటే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవలేదని అన్నారు. వెంటనే 3000 బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో సుమారు పదివేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో నడిపించాలని కోరారు. ఈ సమావేశంలో పి.సుబ్రహ్మణ్యంరాజు, సి.నబీరసూల్, కె.మద్దిలేటి, కె.అర్జున, పి.ఏ.మజీద్, యన్.విజయకుమార్, సి.వి.మురళీధరన్, వి.వెంకటేశ్వర్లు, ఏ.మురగమ్మ, కె.బి.నాగార్జున రెడ్డి, యస్.ప్రసాద్ బాబు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యం.రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ విజయకుమార్, ట్రెజరర్ నాగేంద్రప్రసాద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు -
కాయ్ రాజా కాయ్
క్రికెట్ బెట్టింగ్ అనగానే గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ బెట్టింగ్కు ఈ పట్టణం పుట్టినిల్లు అని చెప్పొచ్చు. మ్యాచ్లు ప్రారంభమైతే చాలు పోలీసులు నిఘా పెట్టడం.. ప్రతి రోజూ బుకీల అరెస్ట్ చేయడం తరచూ జరుగుతోంది. తాజాగా కాయ్ రాజా కాయ్ అంటూ యాప్లపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో ఈసారైన అడ్డుకట్ట పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ● ప్రొద్దుటూరు క్రికెట్ బుకీలకు కళ్లెం వేసేది ఎవరు? ● ఆసియా కప్ టీ20 టోర్నీతో జోరందుకున్న బెట్టింగ్ ● నేడు ఇండియా–పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పట్టణంలో ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ అంటే టీవీ, మొబైల్ పోన్లు, రాసుకోవడానికి నోట్ బుక్కులు, లైన్బాక్స్ సెటప్ ఉండేది. వీటన్నింటినీ ఒక గదిలో ఏర్పాటుచేసుకొని లైవ్ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ బెట్టింగ్ రాసేవాళ్లు. ఇందుకోసం గుమస్తా, డబ్బు వసూలు చేయడానికి బాయ్లను పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించి నియమించుకునేవారు. ఐపీఎల్, వరల్డ్కప్ లాంటి వరుస క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలోనూ బుకీలు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే వీరు ఏ ప్రాంతంలో ఉన్నా టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకునేవారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న డబ్బునేగాక బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేసేవారు. సొంతంగా యాప్ల నిర్వహణ కొన్నేళ్ల తర్వాత టెక్నాలజీ మారిపోయింది. స్మార్ట్ మొబైల్తో టెక్నాలజీని క్రికెట్ బుకీలు ఉపయోగించారు. కొన్నేళ్ల నుంచి ఈ పద్ధతి ఆన్లైన్లో జోరుగా సాగుతోంది. వారిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఇటీవల బెట్టింగ్ యాప్లు పెరిగిన నేపథ్యంలో యువత సులభంగా డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. యాప్ల నుంచి ఆదాయం వస్తుండటంతో ప్రొద్దుటూరు బుకీల చూపు ఈ యాప్లపై మళ్లింది. లక్షల రూపాయలు వెచ్చించి కొందరు బుకీలు యాప్లను కొనుగోలు చేశారు. వాటి ఐడీలను తమ ముఖ్య అనుచరులకు ఇచ్చి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. యాప్ల ద్వారా బుకీలు రూ.కోట్లు ఆర్జించినట్లు టాక్ నడుస్తోంది. ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నాలుగైదేళ్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త చట్టంతో చెక్ పడుతుందా? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోండి.. రండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. మీ ఫోన్లో ఆడుతూ రూ.వేలు, లక్షలు జేబులో వేసుకోండి శ్రీ అంటూ సినిమా హీరోలు, ఇతర సెలబ్రెటీలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ఇలాంటి ప్రకటనలే కనిపించేవి. వీటికి ఆకర్షితులైన యువత బెట్టింగ్ మాయలో పడిపోతున్నారు. ఐపీఎల్ లాంటి వరుస మ్యాచ్లు జరిగినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరులో ఓ యువకుడు బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఐదు నెలల క్రితం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 23 మందిని అరెస్ట్చేసి వారి నుంచి రూ.3.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదు చేశారు. అనేక మంది ప్రాణాలను బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లను చెక్పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును గత నెల 20న లోక్సభ ఆమోదించింది. ఆన్లైన్ గేమ్లను నిర్వహించినా, ప్రోత్సహించినా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. గేమింగ్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా–పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజీ టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్కు ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రూ.వందల కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో బుకీలు ఆన్లైన్లో పందేలు నిర్వహిస్తారా లేక ఆఫ్లైన్లో ఆడతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రొద్దుటూరు బుకీల ఆగడాలను పోలీసులు నిలువరిస్తారో లేదో చూడాలి మరి. -
బీటెక్ విద్యార్థికి రూ.61 లక్షల పరిహారం
ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు కాళ్లను పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి వడ్ల సుమంత్కు రోడ్డు ప్రమాద పరిహార క్లెయిమ్ కింద రూ.61లక్షల చెక్ను మెగా లోక్ అదాలత్లో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి శనివారం అందజేశారు. వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్కు చెందిన సుమంత్ బీటెక్ చదువుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 5న చిన్నాన్న సుధాకర్తో కలిసి బైక్లో ఎర్రగుంట్లకు వెళ్లాడు. పని ముగించుకొని ప్రొద్దుటూరుకు బయలుదేరారు. సుధాకర్ బైక్ నడుపుతుండగా సుమంత్ వెనుక కూర్చున్నాడు. పోట్లదుర్తి వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వస్తున్న టిప్పర్ వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సుమంత్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. వెంటనే అతడిని కర్నూలుకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి హైదరాబాద్కు రెఫర్ చేశారు. వారికి సుమారు రూ.40 లక్షలకు పైగా ఖర్చయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాఽధితులు కోర్టులో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ను దాఖలు చేశారు. మెగా లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, భాధితులకు రాజీ కుదరడంతో కోర్టు సూచన మేరకు చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం కింద బీటెక్ విద్యార్థి సుమంత్కు రూ.61 లక్షల చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎస్కే రియాజుద్ధిన్, కంపెనీ న్యాయవాది రాజశేఖర్రెడ్డి, సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
టీడీపీ వారికే డైరెక్టర్ పదవులా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన నాయకులను సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికే రిమ్స్లో డైరెక్టర్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా.. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కావడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారన్నారు. అయితే ఆ సంబంధాలు దెబ్బతినేలా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కడప పరిస్థితిని సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన లేకుండా కార్యక్రమాలు చేపట్టేవారు కాదని, ప్రస్తుతం బీజేపీ, జనసేనను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటికై నా కూటమి సంబంధాలు మెరుగు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు, బీజేపీ నాయకులు శివనాయక్, రమణ చారి, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి -
ఆటో మిత్ర పథకానికి దరఖాస్తుల ఆహ్వానం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం అమలు చేయనున్న ఆటోమిత్ర పథకం కింద ఆర్థిక సాయం కోసం అర్హులు దరఖాస్తు చేసుకోవాలని జిల్లా రవాణా శాఖ అధికారి కోరారు. ఆటో రిక్షా/మోటార్ క్యాబ్ /మ్యాక్సీ క్యాబ్ డ్రైవర్ యజమానులకు 2025– 26వ సంవత్సరానికి ఏపీ ప్రభుత్వం రూ.15000 సాయం అందించేందుకు మార్గ దర్శకాలను విడుదల చేసిందని తెలిపారు. వాహన యజమాని, డ్రైవింగ్ లైసెన్స్ కలిగిన వ్యక్తి ఒకే కుటుంబానికి చెందిన వారై ఉండాలని, లైట్ మోటార్ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని తెలిపారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో రిజిస్ట్రేషన్ అయిన వాహనమై ఫిట్నెస్ సర్టిఫికెట్, మోటార్ వాహన టాక్స్ కలిగి ఉండాలన్నారు. ప్యాసింజర్ ఆటో రిక్షా దారులు మాత్రమే ఈ పథకానికి అర్హులన్నారు. ప్రతి దరఖాస్తుదారుడు ఆధార్ కార్డు, తెల్లరేషన్కార్డు కలిగి ఉండడంతోపాటు ఒక కుటుంబానికి ఒకరు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తుడి కుటుంబ సభ్యులెవరూ ప్రభుత్వ ఉద్యోగులు కారాదని, ఆదాయ పన్ను చెల్లించేవారై ఉండరాదని, 300 యూనిట్ల కరెంటు వినియోగించేవారై ఉండరాదని అన్నారు. శానిటరీ పని చేసేవారికి మినహాయింపు ఉందని తెలిపారు. గ్రామీణ ప్రాంతాల్లో తడి పొలం మూడు, డ్రైలాండ్ అయితే పదెకరాలు, మున్సిపాల్టీ ప్రాంతాల్లో 1000 స్క్వేర్ మీటర్ల స్థలం ఉండే అభ్యర్థులు ఈ పథకానికి అనర్హులన్నారు. అర్హులు ఉంటే ఈ నెల 17వ తేదీ నుంచి 19వ తేదీలోపు గ్రామ సచివాలయంలో దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈ నెల 24న జాబితా ప్రకటిస్తారని, అర్హులకు రాష్ట్ర ముఖ్యమంత్రి చేతుల మీదుగా నగదు అందిస్తారని వివరించారు. డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్ కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్ మూడో రోజున డ్రాగా ముగిసింది. అనంతపురం–కర్నూలు జట్ల మధ్య కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజున ఎనిమిది వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాంటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 148 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎంకె.దత్తారెడ్డి 57 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్రెడ్డి నాలుగు, సాబ్జాన్ మూడు, కనిష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి 74 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 22 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దీపక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 16.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహేంద్ర 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కర్నూలు జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది. వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..... వైఎస్సార్ స్టేడియంలో చిత్తూరు–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడో రోజున రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ 40, పవన్ రిత్విక్ 23 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 58 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 42, జివి,చరణ్జిత్ 67 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుజిత్రెడ్డి నాలుగు, మాధవ్ మూడు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం దక్కించుకుంది. -
అండర్–19 తైక్వాండో పోటీలకు ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రైల్వే కోడురూలో నిర్వహించిన అండర్–19 తైక్వాండో పోటీలలో కడప విద్యార్థులు ప్రతిభ కనపరిచి రాష్ట్రస్థాయికి ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ అండర్–19 జిల్లా కార్యదర్శి చంంద్రమోహన్రాజు పేర్కొన్నారు. తైక్వాండో 44 కిలోల విభాగంలో నాగమోక్షిత, 55 కిలోల విభాగంలో పీవీఎస్.రెడ్డెమ్మ, 59 కిలోల విభాగంలో కెఆర్.సరయురెడ్డి బంగారు పతకాలు సాధించి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. బాలుర 54 కిలోల విభాగంలో కెఆర్.సాత్విక్రెడ్డి, 85 కిలోల విభాగంలో మునిచైతన్య బంగారు పతకం సాధించి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేషన్ కార్యదర్శి విజయభాస్కర్ వెంకటేష్, శారద, కోచ్లు, తదితరులు పాల్గొన్నారు. వృద్ధురాలిపై వానరం దాడి రాజంపేట రూరల్ : 75 ఏళ్ల వృద్ధురాలు మన్నూరు చెంగమ్మపై వానరం దాడి చేసి గాయపరిచిన సంఘటన మండలంలోని ఎగువ మందపల్లి గ్రామంలో శనివారం చోటుచేసుకుంది. ఈ దాడిలో చెంగమ్మకు కుడి మోచేయి వద్ద నరం కట్ అయినట్లు ఆమె బంధువులు తెలియజేశారు. చెంగమ్మ రాజంపేట ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. వానరాల సంచారంపై ప్రజలు పంచాయతీ అధికారులకు పలుమార్లు ఫిర్యాదు చేసినా పట్టించుకొలేదన్నారు. ఇప్పటికై నా వానరాలను పట్టి అడవిలో వదిలేయాని కోరారు. 14005 కేసులకు పరిష్కారం – రూ.9,94,86,943 కక్షిదారులకు చెల్లింపు కడప అర్బన్ : జాతీయ లోక్ అదాలత్లో 14005 కేసులు పరిష్కరించి, కక్షిదారులకు రూ.9,94,86,943 చెల్లించినట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలిపారు. జిల్లా వ్యాప్తంగా శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించారు. కడపలో నాలుగు, ప్రొద్దుటూరు, రాజంపేట, రాయచోటిలో మూడు చొప్పున, బద్వేల్లో రెండు, సిద్ధవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు మరియు రైల్వే కోడూరులో ఒకటి చొప్పున బెంచ్లు ఏర్పాటు చేశారు. ఈ లోక్ అదాలత్లో లోక్ అదాలత్ సభ్యులు, కక్షిదారులు వారి న్యాయవాదులతో సంప్రదింపులు జరిపి కేసులను పరిష్కరించుకున్నారు. ఈ సందర్భంగా జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరి బాబా ఫకృద్దీన్లు కేసుల పరిష్కారానికి సహకరించిన వారికి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు. -
జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జూనియర్ కబడ్డీ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కబడ్డీ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి బాలికలు 150 మంది, బాలురు 200 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరి శ్రీకాంత్రెడ్డి, సెక్రటరి చంద్రావతి, జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ గురుశేఖర్, సెక్రటరి సుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాణి,ఎస్జీఎఫ్ అండర్–19 సెక్రటరి చంద్రహాజరాజు, విక్టర్ కోచ్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి కబడ్డీ పోటీలకు ఎంపికై నది వీరే.. బాలురు జట్టు : వేణుసాయి, దుర్గశంకర్, బ్రహ్మయ్య, నూర్ భాష, మల్లి ఖార్జున, కలాం, సాయి ప్రసాద్, యశ్వంత్, జయంత్ నాయక్, హుస్సేన్, మల్లిఖార్జున, నరేంద్ర, జశ్వంత్, గఫార్ బాషా. బాలికల జట్టు : జ్యోత్న, నీల మహేశ్వరి, రంగ శివజ్యోతి, సునీత, పల్లవి, సిఎం రామలక్ష్మీ, వర మేఘన, హేమ ప్రియ, షషీనా, మైధిలి, అయ్యవారమ్మ, గంగాదేవి, అనిత, కృపా జ్యోతి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న బాలుర జట్టు రాష్ట్ర పోటీలకు ఎంపికై న బాలికల జట్టు -
అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలా?
కడప కార్పొరేషన్: కూటమి అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10వ తేదీ కూటమి నేతలు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి విజయోత్సవ సభ నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. పదహారు నెలలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో.. 5లక్షల పింఛన్లు తొలగించడం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడంలో.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేయడంలో సూపర్ హిట్ సాధించారని ఎద్దేవా చేశారు. 87లక్షల మందికి ‘తల్లికి వందనం’ ఇవ్వాల్సి ఉండగా, 54లక్షల మందికే ఇచ్చి, 16 నెలల్లో ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, 5 రకాల సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి బంపర్హిట్ కొట్టారని ఎద్దేవా చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మొదటి ఏడాది పంగనామం పెట్టారని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చి 7లక్షల మందికి కోత వేశారన్నారు. యాభై ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసగించారన్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాలను స్థాపించలేదని, ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మొనగాడుగా నిలిచారన్నారు. వాటిలో 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటుకు అమ్మేయాలను కోవడం దారుణమన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలను నిర్వీర్యం చేయడంలో..రైతులకు యూరియా దొరక్కుండా చేయడంలో ఈ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. వలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని చెప్పి ఆ వ్యవస్థనే ఎత్తేశారన్నారు. ప్రభుత్వ బడులు, వైద్యశాలలను.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పతనావస్థకు తీసుకుపోయారన్నారు. కూటమి నేతలు విజయోత్సవ సభ నిర్వహించిన జిల్లాలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తీవ్రంగా అవమానిస్తే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పార్టీ నాయకులు బీహెచ్ ఇలియాస్, టీపీ వెంకటసుబ్బమ్మ, జమీల్, అజ్మతుల్లా, త్యాగరాజు, బసవరాజు, కంచుపాటి బాబు, అహ్మద్ పాల్గొన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో సూపర్హిట్ పదిహేనేళ్లు ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించారా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల మంజూరు ఘనత వైఎస్ జగన్ది మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
కొనసాగుతున్న ఎస్జీఎఫ్ క్రీడా ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో ఆసక్తికరంగా క్రీడా ఎంపికలు జరుగుతున్నాయి. శుక్రవారం నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో జిల్లా స్థాయి అండర్– 14,17 బాల బాలికలకు రాష్ట్ర స్దాయి ఎంపికలు నిర్వహించారు. టెన్నిస్, టేబుల్ టేన్నిస్, ఊషు, తంగట, ఖురేష్ వంటి క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి ఈ క్రీడలను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి ఈ ఎంపికలకు 14 సంవత్సరాల, 17 సంవత్సరాల విభాగాల నుంచి దాదాపు 350 విద్యార్థులు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ కనపరిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేశారు. కార్యక్రమంలో ఎస్జీఎఫ్ సెక్రటరీలు శ్రీకాంత్ రెడ్డి, చంద్రావతి ఉపాధ్యాయ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, పలువురు వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. రాష్ట్రస్థాయి అమరావతి క్వాంటం వ్యాలీకి ఎంపిక వేంపల్లె : రాష్ట్రస్థాయి అమరావతి క్వాంటం వ్యాలీకి ఇడుపులపాయి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. తిరుపతిలోని పద్మావతి మహిళా విశ్వవిద్యాలయంలో ఈనెల 10వ తేదీన రీజనల్, జోనల్ స్థాయి అమరావతి క్వాంటం వ్యాలీ హ్యాకథాన్లో సత్తా చాటారు. గతనెల 28వ తేదీన ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ లో జరిగిన ఇంటర్నల్ క్వాంటం వ్యాలీ హ్యాక్థాన్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన రెండు జట్లను తిరుపతిలోని మహిళా యూనివర్సిటీకి పంపగా, అక్కడ కూడా ఆ రెండు టీంలు సత్తా చాటి రూ.10వేల క్యాష్ అవార్డుతోపాటు ప్రశంసా పత్రంను అందుకున్నారు. ఈ రెండు టీంలలో సుమారు 12 మంది విద్యార్థులు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారని తెలిపారు. రాష్ట్రస్థాయిలో కూడా మరిన్ని విజయాలు సాధించాలని విద్యార్థులను ఆకాంక్షించారు. 15న సీనియర్స్ సాప్ట్ టెన్నిస్ క్రీడాకారుల ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈ నెల 15న జిల్లా స్థాయి సీనియర్స్ సాప్ట్ టెన్నిస్ పురుషులు, మహిళల జట్లు ఎంపికలను నిర్వహిస్తుననట్లు పురుషోత్తం రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు కడప నగరంలోని డీఎస్ఏ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 27, 28 తేదీలల్లో విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. మరిన్ని వివరాలకు 9966211903 అనే నెంబర్ను సంప్రదించాలన్నారు. వైద్యరంగంలో జనరల్ మెడిసిన్కు ప్రత్యేక స్థానం కడప అర్బన్ : వైద్యరంగంలో జనరల్ మెడిసిన్కు ప్రత్యేక స్థానం వుందని ఏపీఐ చైర్మన్ డాక్టర్ మనోజ్కుమార్ తెలియజేశారు. ఏపీకాన్ –2025 ఆధ్వర్యంలో శుక్రవారం కడప నగర శివార్లలోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్) ఆవరణంలో 53వ వార్షిక అసోసియేషన్ ఆఫ్ ఫిజిషియన్స్ ఇండియా వారి ఏపీ స్టేట్ ఏపికాన్ –2025 సదస్సు నిర్వహణకు ఘనంగా ప్రారంభించారు. కార్యక్రమం నిర్వహణలో భాగంగా పీజీ వైద్య విద్యార్థులు వివిధ కేటగిరిలలో తాము ప్రెజెంటేషన్ చేయాలనుకున్న అంశాలను జనరల్ మెడిసిన్ వైద్యాధికారుల ముందు తెలియజేశారు. తమకున్న సందేహాలను నివృత్తి చేసుకున్నారు. ఈ అవగాహన సదస్సు కార్యక్రమాలను జాతీయ స్థాయి 53వ కాన్ఫరెన్స్గా కడప నగర శివార్లలోని రాయచోటి రోడ్డులో వున్న మాధవి కన్వెన్షన్ హాల్లో 13, 14 తేదీలలో జాతీయ స్థాయిలో అవగాహన సదస్సును నిర్వహించనున్నారు. కార్యక్రమాలను డాక్టర్ టి. మునీశ్వర్రెడ్డి, ఆర్గనైజింగ్ చైర్మన్గా డాక్టర్ యాదవేంద్రారెడ్డి ఆర్గనైజింగ్ సెక్రటరీ డాక్టర్ అర్జున్కుమార్ వ్యవహరించనున్నారు. -
కబ్జా ఆరోపణలు నిరాధారం
కలసపాడు : తనపై వచ్చిన కబ్జా ఆరోపణలు నిరాధారమని బద్వేలు నియోజకవర్గ బూత్కన్వీనర్ల అధ్యక్షుడు కె.రమణారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పోరుమామిళ్ళలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల తనపై కొన్ని ఛానెళ్ళలో, పత్రికల్లో తాను కబ్జాలకు పాల్పడినట్లు, ఆలయ భూములు రిజిస్ట్రేషన్ చేయించుకున్నట్లు కథనాలు ప్రచురించడం చాలా బాధాకరమన్నారు. తన 20 సంవత్సరాల రాజకీయ చర్రితలో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి వెంట నడుస్తూ వైఎస్సార్ కుటుంబానికి విధేయుడుగా ఉంటూ బద్వేలు నియోజకవర్గంలో పార్టీ అభివృద్ధికి తన వంతు కృషి చేశానన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ సుధ బద్వేలు మార్కెట్యార్డు చైర్మన్గా తన భార్యను మొట్టమొదటిసారిగా చేశారన్నారు. తాను వైస్ చైర్మన్గా ఉండి రూ.10 కోట్లతో నియోజకవర్గంలో మార్కెట్ కమిటీ ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు చేపట్టామన్నారు. 20 సంవత్సరాల రాజకీయ చరిత్రలో ఒక ఎకరా డీకేటీ భూములు పొందడం గాని వాగులు, వంకలు కబ్జా చేయలేదన్నారు. ప్రభుత్వ భూములు ఆక్రమించలేదని తెలిపారు. తాను అంచెలంచెలుగా కష్టపడి తన వ్యాపారాన్ని అభివృద్ధి చేస్తుకున్నానే తప్ప అవినీతి, అక్రమాలకు పాల్పడలేదన్నారు. రంగసముద్రం పంచాయతీ సర్వే నెంబర్ 930/2 లో 35 సెంట్ల స్థలాన్ని కబ్జాకు పాల్పడినట్లు రామచంద్రారెడ్డి, బైరిశెట్టిశ్రీనివాసులు తనపై ఆరోపించారన్నారు. తాను 90 సెంట్ల స్థలాన్ని గంగాధరఆచారి, నిజాముద్దీన్, రామకృష్ణారెడ్డిల వద్ద కొనుగోలు చేశానని, ఆ భూమిని ఇతరులకు విక్రయించగా గంగాధరఆచారి వారికి రిజిస్ట్రేషన్ కూడా చేశారన్నారు. బైరిశెట్టిశ్రీనివాసులు, రాఘవేంద్రరెడ్డి అక్రమంగా రిజిస్ట్రేషన్ పొంది లేని భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారన్నారు. తనకు దేవాలయానికి సంబంధించిన స్థలానికి, నాకు ఎటువంటి సంబంధం లేదని తెలిపారు. తనపై అసత్య ఆరోపణలు చేసిన ఛానెళ్ళు, పత్రికలు వారం లోపల తనకు సంజాయిషీ ఇవ్వాలని, లేనిపక్షంలో న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తానని తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు సింగమాలవెంకటేశ్వర్లు, గుండంహనుమంతరెడ్డి, రాళ్లపల్లినరసింహులు, జగన్మోహన్రెడ్డి, చాపాటిసాయినారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. బద్వేలు నియోజకవర్గ బూత్కన్వీనర్ల అధ్యక్షుడు కె.రమణారెడ్డి -
ప్రమాదమా.. హత్యాయత్నమా..?
● జేఎన్టీయూ హాస్టల్ వార్డెన్కు తీవ్ర గాయాలు ● అందుబాటులోకి రాని 108 వాహనం పులివెందుల : పట్టణంలోని ఎర్రగుడిపల్లెకు చెందిన ఆనందరావు పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో హాస్టల్ వార్డెన్గా పనిచేస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం ఆనందరావు జేఎన్టీయూ సమీపంలో తీవ్ర గాయాలతో రోడ్డు పక్కన తన ద్విచక్ర వాహనంతో సహా గాయాలతో అపస్మారక స్థితిలో ఉన్నాడు. దీన్ని గమనించిన స్థానికులు అతడిని కాపాడే ప్రయత్నాలు చేశారు. పోలీసు సిబ్బందికి, 108 వాహనానికి సమాచారం ఇచ్చారు. దీంతో పులివెందుల ట్రైనింగ్ ఎస్ఐ అనిల్ సంఘటనా స్థలానికి చేరుకున్నారు. ప్రమాదం జరిగిన తీరును చూస్తే ఆనందరావు బైకు అదుపు తప్పి ప్రమాదం జరిగిందా లేకపోతే ఎవరైనా వ్యక్తులు దాడి చేశారా అనేది అనుమానాం కలుగుతోంది. స్థానికులు రకరకాలుగా చర్చించుకుంటున్నారు. అందుబాటులోకి రాని 108 వాహనం : జేఎన్టీయూ సమీపంలో తీవ్రంగా గాయపడిన ఆనందరావును స్థానికులు గుర్తించి 108 వాహనానికి ఫోన్ చేశారు. అయితే సంఘటన జరిగిన అర్ధ గంటసేపు అయినా కూడా 108 వాహనం చేరుకోలేదు. దీంతో స్థానికులు, పోలీసులు అటువైపు వస్తున్న వాటర్ క్యాన్ ఆటోలో క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే ఆనందరావు పూర్తిగా మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నాడు. ఆనందరావు కోలుకుంటే ప్రమాదమా.. హత్యాయత్నమా అనే విషయాలు తెలిసే అవకాశం ఉంది. ఈ విషయం తెలుసుకున్న అర్బన్ సీఐ సీతారామిరెడ్డి స్థానిక ప్రైవేట్ ఆసుపత్రికి చేరుకుని సంఘటనపై వివరాలు సేకరిస్తున్నారు. -
పత్రికా స్వేచ్ఛను హరించడం తగదు
పత్రికా స్వేచ్ఛను హరించేలా కూటమి ప్రభుత్వం నిరంకుశంగా వ్యవహరిస్తోంది. రాజ్యాంగం కల్పించిన వాక్ స్వాతంత్య్రాన్ని హరిస్తోంది. పోలీసులతో కేసులు పెట్టిస్తూ భయపెట్టాలని చూస్తోంది. ఇటీవల ఒక నాయకుడి ప్రెస్మీట్ కవర్ చేసినందుకు కేసు పెట్టడం దుర్మార్గం. పత్రికా స్వేచ్ఛకు విఘా తం కలిగేలా, ప్రజాస్వామ్య విలువలకు భంగం వాటిల్లేలా వ్యవహరించడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వెంటనే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పెట్టిన కేసును ఎత్తివేయాలి. –వైఎస్ అవినాష్రెడ్డి, ఎంపీ, కడప కక్షపూరితం..దుర్మార్గం పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)ఏ ప్రసాదించింది. ప్రజల గొంతుకై న పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. పత్రికలో వచ్చే వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వవచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. అంతేకాని భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభసభ్యుడు -
పేద విద్యార్థుల డాక్టర్ కలను దూరం చేస్తున్న కూటమి ప్రభుత్వం
బద్వేలు అర్బన్ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేసి పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను కూటమి ప్రభుత్వం దూరం చేస్తోందని బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీవో కాలనీలోని ఎమ్మెల్యే కార్యాలయంలో ఆమె మాట్లాడుతూ పేద విద్యార్థులు డాక్టర్ కావాలనే కలను నెరవేర్చడంతో పాటు ప్రజలకు సూపర్ స్పెషాలిటీ వసతులతో అత్యుత్తమ వైద్యం అందించాలన్న లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాష్ట్ర వ్యాప్తంగా 17 కొత్త మెడికల్ కాలేజీల నిర్మాణాలకు శ్రీకారం చుట్టి వాటిని పూర్తి చేసి కొన్నింటిలో తరగతులు సైతం ప్రారంభించారని అన్నారు. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాక ముందు కేవలం 11 ప్రభుత్వ వైద్యకళాశాలలే ఉండేవని, తద్వారా ప్రజలకు మెరుగైన వైద్యసేవలు అందవన్న ఉద్దేశ్యంతో కొత్త మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేస్తే వాటిని చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం ప్రైవేటుపరం చేయాలనుకోవడం దుర్మార్గమన్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం పేదల పక్షాన ఆలోచించి ప్రభుత్వ రంగంలోనే మెడికల్ కళాశాలలను కొనసాగించాలని కోరారు. ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ -
మయూరాలు పురివిప్ప నాట్యమా డుతుంటే.. చూసేందుకు రెండు కళ్లు చాలవు. కానీ ఇడుపులపాయలో నెమళ్లు విలాపం చెందుతుండటం.. పక్షుల ప్రేమికులను ఆందోళన కలిగిస్తోంది. సంరక్షణ, పర్యవేక్షణ లోపంతో కొన్ని మృత్యువాత పడుతుండటం విషాదకరం. పట్టించుకోవాల్సిన ప్రభుత్వం శీతకన్ను వేయ
కడప సిటీ: ఇడుపులపాయలోని నెమళ్ల పునరుత్పత్తి, సంరక్షణ కేంద్రం (నెమళ్ల పార్కు)లో నానాటికీ నెమళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. పర్యాటకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జాతీయ పక్షిగా నెమలికి మన దేశంలో గుర్తింపు ఉంది. అటవీశాఖ నిబంధనల మేరకు జాతీయ జంతువు పులికి ఎంతటి ప్రాముఖ్యత ఉందో, అంతే ప్రాధాన్యతను మయూరానికి ఇవ్వాల్సి ఉంది. ప్రస్తుతం అడవుల్లో నెమళ్ల సంఖ్య తగ్గిపోతుండటంతో.. ఇలాంటి కేంద్రాన్ని మరింత శ్రద్ధతో సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. 105 నుంచి 31కి తగ్గిన నెమళ్ల సంఖ్య దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 2008 డిసెంబరు 24న ఈ కేంద్రానికి శంకుస్థాపన చేశారు. రూ.50 లక్షల నిధులు కేటాయించారు. నెమళ్ల ఆరోగ్య సంరక్షణకు ఓ ఆస్పత్రి, గుడ్లను పొదిగించేందుకు ఇంక్యుబేటర్, ల్యాబ్, ఆకర్షణీయమైన షెడ్లు ఏర్పాటు చేశారు. ఆ సమయంలో 72 నెమళ్లు (10 మగ నెమళ్లు, ఆడ నెమళ్లు 29, మిగిలినవి పిల్లలు) ఉన్నాయి. ఆ తర్వాత ఇందులో నెమళ్ల సంఖ్య 105కి చేరింది. దాదాపు ఇక్కడ పెంచి పోషించిన నెమళ్లు 400 దాకా అడవుల్లోకి వదిలే సందర్భాలు ఉన్నాయి. ప్రస్తుతం 31 నెమళ్లు మాత్రమే ఈ కేంద్రంలో ఉండటం ఆందోళన కలిగించే పరిణామం. కోళ్ల కింద గుడ్లు పెట్టి పొదిగిస్తున్న వైనం ప్రస్తుతం నెమళ్ల పార్కులో గుడ్లు పొదిగించే ఇంక్యుబేటర్ మూలకు చేరింది. నాలుగేళ్లుగా పనిచేయకపోవడంతో కోళ్ల కింద గుడ్లు పొదిగిస్తూ వస్తున్నారు. ఈ నేపథ్యంలో పునరుత్పత్తి అంతంత మాత్రంగానే కొనసాగుతోంది. ఇది కూడా నెమళ్ల సంఖ్య తగ్గడానికి కారణంగా తెలుస్తోంది. రూ.2 లక్షల ఖరీదు చేసే ఈ ఇంక్యుబేటర్ను కొనకుండా నిర్లక్ష్యం వహిస్తున్నారంటే.. ఏ మేరకు నెమళ్లపార్కు మీద శ్రద్ధ కనబరుస్తున్నారో అవగతమవుతోంది. అటవీ శాఖ అధికారుల విచారణ ఈ ఏడాది జనవరిలో ఒకేసారి తొమ్మిది నెమళ్లు మృతి చెందాయి. వీటికి పోస్టుమార్టం నిర్వహించి భూమిలో పాతిపెట్టారు. ఒకేసారి ఇన్ని నెమళ్లు చనిపోవడంతో అధికారులకు అనుమానం మొదలైంది. ఎవరో విష ప్రయోగం చేశారన్న విషయం పోస్టుమార్టంలో తేలింది. ఈ నేపథ్యంలో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. సీసీ కెమెరాలు లేకపోవడంతో ఎవరు చేశారన్నది గుర్తించడంలో ఇబ్బందిగా మారింది. ఎవరైనా చెడ్డపేరు తెచ్చేందుకు చేశారా? అనే అనుమానంతో అధికారులు ఉన్నారు. కుందేళ్లు, లవ్బర్డ్స్ కూడా లేవు ఇడుపులపాయ నెమళ్ల పార్కులో నెమళ్లే కాకుండా 25 లవ్ బర్డ్స్, 20 కుందేళ్లు కూడా ఉండేవి. ప్రస్తుతం అవి కూడా మృతి చెందినట్లు తెలుస్తోంది. సంరక్షణ సరిగా లేకపోవడంతోనే ఈ పరిస్థితి ఎదురైనట్లు పర్యాటకులు చెబుతున్నారు. తెలుగు రాష్ట్రాలకు ఒకే ఒక పునరుత్పత్తి కేంద్రం రెండు తెలుగు రాష్ట్రాలకు కలిపి నెమళ్ల పునర్పత్తి కేంద్రం, సంరక్షణ కేంద్రం ఇదొక్కటే ఉంది. ఇలాంటి కేంద్రాన్ని తెచ్చుకోవాలంటే కేంద్ర ప్రభుత్వం అనుమతి లేనిదే ఏర్పాటు చేసుకోవడం చాలా కష్టమైన పని. అందువల్ల దీనిని అతి జాగ్రత్తగా సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. ఒకానొక దశలో ఎత్తివేసే యత్నం దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి నెలకొల్పిన ఈ నెమళ్ల పార్కును ప్రస్తుత ముఖ్యమంత్రి చంద్రబాబు గతంలో ఇక్కడ లేకుండా ఎత్తివేసే ప్రయత్నం చేశారు. 2016లో ట్రిపుల్ ఐటీలో కాన్వోకేషన్ కార్యక్రమానికి హాజరైనపుడు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అప్పట్లో నిధులు లేని కారణంగా మూసివేత దిశగా ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ కేంద్రాన్ని తీసివేసి అటవీశాఖ అతిథి గృహంగా మార్చాలన్న నిర్ణయానికి కూడా అప్పట్లో వచ్చినట్లు తెలిసింది. ఈ విషయాన్ని 2016 డిసెంబరు 21న సాక్షి ‘పాపం మయూరం’ శీర్షికన కథనం ప్రచురించడంతో.. ఎక్కడ చెడ్డపేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ నిర్ణయాన్ని విరమించుకున్నారు. ఇడుపులపాయ నెమళ్ల పార్కులో నానాటికీ నెమళ్ల సంఖ్య తగ్గిపోతున్న నేపథ్యంలో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. సంరక్షించే వారు లేకపోవడమా? లేక పర్యవేక్షణ లోపమా? అనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. సక్రమమైన సంరక్షణ ఉంటే నెమళ్లు ఎందుకు పునరుత్పత్తి కావడం లేదని పర్యాటకులు ప్రశ్నిస్తున్నారు. సరిగా వాటికి పోషకాహారాన్ని పెడుతూ సంరక్షించుకుంటూ వెళ్లడం లేదన్న విమర్శలు ఉన్నాయి. అయితే అధికారులు మాత్రం అన్ని సక్రమంగానే ఉన్నాయని చెబుతున్నారు. నిధులు ఆలస్యంగా ప్రభుత్వం నుంచి అందుతున్నా.. ఇబ్బందులు లేవంటున్నారు. ఇడుపులపాయ నెమళ్ల పునరుత్పత్తి కేంద్రంపై నిర్లక్ష్యం తగ్గిపోతున్న మయూరాల సంఖ్య విష ప్రయోగంతో ఒకే సారి 9 మృతి మూలనపడిన ఇంక్యుబేటర్ సంఖ్య పెంచేందుకు చర్యలు నెమళ్లపార్కులో నెమళ్ల సంఖ్య పెంచేందుకు అన్ని చర్యలు తీసుకుంటున్నాం. కొత్త ఇంక్యుబేటర్ కోసం నివేదికలు ప్రభుత్వానికి పంపించడం జరిగింది. త్వరలోనే వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం కోళ్ల కింద గుడ్లను పొదిగించి పునరుత్పత్తి చేస్తున్నాం. తొమ్మిది నెమళ్లు మృతి చెందిన విషయంపై కేసు నమోదుతోపాటు విచారణ ప్రారంభించాం. త్వరలో నిందితులను పట్టుకుంటాం. సీసీ కెమెరాలను త్వరలోనే ఏర్పాటు చేస్తున్నాం. –బాలసుబ్రమణ్యం, అటవీ అధికారి, వేంపల్లె పార్కును సంరక్షించుకోవాలి నెమళ్లపార్కుపై అధికారులు చర్యలు చేపట్టి సంరక్షించాల్సిన అవసరం ఉంది. నెమళ్ల సంఖ్య తగ్గిపోకుండా పునరుత్పత్తి చేయాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నెమళ్లపార్కు ఒక పర్యాటక కేంద్రంగా మారడంతో దీన్ని అన్ని విధాలా అభివృద్ధి చేసేందుకు అధికారులు చర్యలు చేపట్టాలి. – యు.చంద్ర ఓబుల్రెడ్డి, వేంపల్లె పర్యాటకుల్లో ఆందోళన నెమళ్ల పార్కులో నెమళ్ల సంఖ్య తగ్గిపోవడంతో పర్యాటకులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. ప్రధానంగా గండి వీరాంజనేయస్వామిని దర్శించుకునే వారంతా ఇడుపులపాయకు వస్తున్నారు. అక్కడ నెమళ్లను చూసి చిన్న పిల్లలు ఆనందంతో కేరింతలు వేస్తారు. ఇలాంటి కేంద్రాన్ని సంరక్షించుకోవాల్సిన అవసరం ఉంది. – కొండారెడ్డి, వేంపల్లె -
రాజకీయ జోక్యంతో విచారణ మమ
● కొండను తవ్వి ఎలుకను పట్టిన అధికారులు ● వచ్చారు 6ఏ కేసు పెట్టి సరిచేసి వెళ్లారు..సాక్షి టాస్క్ఫోర్స్ : దువ్వూరులో గురువారం రాత్రి యూరియా అక్రమంగా తరలిస్తుండటంపై ‘రాత్రి అక్రమంగా యూరియా తరలింపు’ అనే శీర్షికతో శుక్రవారం సాక్షి పత్రికలో కథనం ప్రచురితమైంది. ఈ కథనంపై విచారణ చేయడానికి జిల్లా వ్యవసాయాధికారి (జేడీఏ) చంద్రానాయక్, మైదుకూరు ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ అమరనాథరెడ్డి, దువ్వూరు ఎస్ఐ వినోద్కుమార్ శుక్రవారం విచారణ చేపట్టారు. ముందుగా ఏడీఏ కృష్ణమూర్తి శ్రీమహానందీశ్వర ట్రేడర్స్ వద్దకు చేరుకుని విచారణ చేపట్టారు. విచారణ ప్రారంభంలో జాయింట్ కలెక్టర్ షాపును సీజ్ చేయమని చెప్పారని, తప్పు ఎవరు చేసినా ఉపేక్షించొద్దని చెప్పారని ఏడీఏ మీడియాతో చెప్పుకొచ్చారు. అనంతరం జేడీఏ చంద్రానాయక్ షాపు వద్దకు వచ్చారు. జేడీఏతో ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ అమరనాథ్ రెడ్డిలు ఈ ట్రేడర్స్కు గురువారం సాయంత్రం 9 టన్నుల యూరియా వచ్చిందన్నారు. ప్రస్తుతం 7.8 టన్నుల యూరియా నిల్వ ఉందని, 1.2 టన్నుల యూరియాను గురువారం రాత్రి అక్రమంగా విక్రయించినట్లు తెలిపారు. జేడీఏ వ్యవసాయాధికారులతో కలిసి ప్రొద్దుటూరు రోడ్డులో ఉన్న ఆ షాపు గోడౌన్ వద్దకు చేరుకుని అక్కడ ఉన్న యూరియా బస్తాలను లెక్కించారు. మొదట 77 బస్తాల యూరియాను అక్రమంగా అమ్మినట్లు గుర్తించారు. నాటకీయ పరిణామాల మధ్య అకస్మాత్తుగా 57 బస్తాలు తక్కువ ఉన్నాయని, 30 బస్తాల యూరియా మరో గోడౌన్లో ఉన్నాయని అధికారులు కొత్త కథ చొప్పుకొచ్చారు. ఈ ట్రేడర్స్కు చెందిన మరొక గోడౌన్ను తనిఖీ చేయడానికి అధికారులు వెళ్లారు. అక్కడికి వెళ్లాక జేడీఏ, ఇతర వ్యవసాయాధికారులు 45 నిమిషాలు వేచివున్నా కూడా ట్రేడర్స్ వారు తాళాలు తీయలేదు. చివరకు వ్యవసాయాధికారులు తాళాలు తెప్పించి ఆ గోడౌన్ను తనిఖీ చేయగా రాజకీయ జోక్యంతో నాటకీయ పరిణామాల మధ్య అధికారులు మహానందీశ్వర ట్రేడర్స్పై అమితమైన ప్రేమనుకనబరిచి లేదు కేవలం 27 బస్తాలు మాత్రమే తక్కువగా ఉన్నాయని క్లీన్ చిట్ ఇవ్వడం గమనార్హం. ఆ 27 బస్తాల యూరియా అతను బ్లాక్ మార్కెట్కు తరలించలేదని, అది కూడా వారికి తెలిసిన రైతులకు డీబీటీ ప్రకారం ఇచ్చారని అధికారులు చెప్పడం అక్కడున్న వారిని ఆశ్చర్యానికి గురిచేసింది. గురువారం సాయంత్రం ఆ షాపుకు 9 టన్నుల యూరియా వస్తే అదే రోజు రాత్రి యూరియాను అక్రమంగా తరలిస్తుండగా రైతులు నిలదీశారు. కానీ వ్యవసాయాధికారులు షాపు వారు డీబీటీ ప్రకారం యూరియాను ఎత్తించారనడం కొస మెరుపు. మొత్తం మీద విచారణను మసి పూసి మారేడు కాయ చేసి తూ.తూ. మంత్రంగా ఉన్న యూరియాను సీజ్ చేసి 6ఏ కేసు నమోదు చేసి ఆ ట్రేడర్స్పై భక్తిని చాటుకుని విచారణను మమ అనిపించారు. అధికారులు అనుకుంటే ఏమైనా చేయగలరని ప్రజలు చెప్పుకుంటున్నారు. అధిక ధరలకు యూరియా అమ్ముతున్నారని పత్రికల్లో కథనాలు వస్తున్నా విచారణకు వచ్చిన వ్యవసాయాధికారులు అధిక ధరలపై ఒక్క షాపుపై కూడా ఎటువంటి చర్యలు తీసుకోవడం లేదని రైతులు చర్చించుకుంటున్నారు. -
బతికుండగానే చంపేశారు
● రూ.2కోట్లు విలువైన ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని డెత్ సర్టిఫికెట్తో అమ్మేశారు ● ఎన్జీఓ ప్లాట్ 300కు సంబంధించి వెలుగుచూసిన సంఘటన ప్రొద్దుటూరు : బతికుండగానే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినట్లు ఏకంగా డెత్ సర్టిఫికెట్ను సృష్టించి రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని మరొకరికి అమ్మారు. ప్రభుత్వ ఉద్యోగి వీఆర్ఎస్ పొంది ప్రతినెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటనను తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సంఘటన ఎవరు చేశారు.. ఎలా జరిగింది... ఎవరెవరి హస్తం ఉంది అనే వివరాల గురించి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఆరా తీయలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1980 ప్రాంతంలో ఎన్జీఓ ప్లాట్లు వేశారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ కాలనీలోనే గంజికుంట సుబ్బరాయుడు (నీటి పారుదల శాఖ రిటైర్డు ఎస్ఈ)కు 1986లో సర్వే నంబర్ 194, 196లోని ప్లాట్ నంబర్ 300లోని 7.5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆయన గత 40 ఏళ్లుగా తన స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ సృష్టించి... గంజికుంట సుబ్బరాయుడు నీటి పారుదల శాఖలో ఎస్ఈగా పనిచేసి 2003లో వీఆర్ఎస్ పొంది ప్రభుత్వం నుండి ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి పెన్షన్ పొందుతున్నారు. గంజికుంట సుబ్బరాయుడు, తన భార్య గంజికుంట వెంకటసుబ్బమ్మ ప్రొద్దుటూరు పట్టణంలోని బుడ్డాయపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న (ఆధార్ కార్డు 994947290378) వివరాలతో గంజికుంట సుబ్రహ్మణ్యం ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన వద్ది నారాయణ కుమారుడు నాగరాజు (ఆధార్ కార్డు నంబర్ 879824061289)కు రిజిస్టర్ చేయించారు. తన తండ్రి గంజికుంట సుబ్బరాయుడుతోపాటు తల్లి గంజికుంట లక్ష్మీదేవి మరణించినట్లు ఏకంగా మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని జత చేశారు. వాస్తవానికి గంజికుంట సుబ్బరాయుడుకు గంజికుంట సుబ్రహ్మణ్యంకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో వీరికి తెలియదు, ఎలాంటి సంబంధాలు లేవు. ఈ ఏడాది ఆగస్టు 13న ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్టర్ జరిగింది. స్టాంప్ రైటర్ తొండలదిన్నె శ్రీనివాసులు ఈ డాక్యుమెంట్ను తయారు చేయగా, దొరసానిపల్లెకు చెందిన వరద ఆంజనేయులు, డ్రైవర్ కొట్టాలకు చెందిన నల్లు జయశంకర్ సాక్షులుగా ఉన్నారు. తనకు జరిగిన మోసాన్ని తెలుసుకున్న గంజికుంట సుబ్బరాయుడు కొద్ది రోజుల క్రితం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ విషయంపై శుక్రవారం సాయంత్రం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జీఎన్జీ రామదాసును సాక్షి వివరణ కోరగా ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. బతికుండగానే గంజికుంట సుబ్బరాయుడు మరణ ధృవీకరణ పత్రం గంజికుంట సుబ్బరాయుడు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని అమ్మిన వారు, కొన్నవారు -
ఓంకారేశ్వర్ కుటుంబానికి ఆర్థికసాయం
కడప కోటిరెడ్డిర్కిల్ : రామాపురం మోడల్ స్కూలులో ఒకేషనల్ ఐటీ ట్రేడ్లో ట్రైనర్గా పనిచేస్తూ రోడ్డు ప్రమాదంలో మరణించిన ఓంకారేశ్వర్ కుటుంబానికి సహచరులు ఆర్థికసాయం అందజేసి తమవంతుగా తోడ్పాటు అందించారు. ఓంకారేశ్వర్ ఇటీవల జరిగిన ప్రమాదంలో మృతి చెందారు. ఈ క్రమంలో స్కిల్ ట్రీ కంపెనీ లిమిటెడ్ ఒకేషనల్ ట్రైనర్స్, ఒకేషనల్ కో ఆర్డినేటర్స్ సహకారంతో రూ. 1,15,000 సేకరించి ఆ మొత్తాన్ని శుక్రవారం మృతుడి సతీమణి అమృతకు అందజేశారు. ఈ సందర్భంగా బాధిత కుటుంబ సభ్యులు ఆర్థికసాయం అందించిన వారికి కృతజ్ఞతలు తెలియజేశారు. కార్యక్రమంలో ఒకేషనల్ ఉపాధ్యాయురాలు సురేఖ, కో ఆర్డినేటర్ వెంకట్ తదితరులు పాల్గొన్నారు. 8మంది పేకాటరాయుళ్ల అరెస్టు వేంపల్లె : స్థానిక గండి – పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలో జూదమాడుతున్న 8 మందిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తిరుపాల్ నాయక్ తెలిపారు. శుక్రవారం సీఐ నరసింహులు ఆదేశాల మేరకు గండి – పులివెందుల బైపాస్ రోడ్డు సమీపంలో పేకాట ఆడుతున్న వారిపై ఎస్ఐ తిరుపాల్ నాయక్ తన సిబ్బందితో దాడులు చేశారు. దీంతో వెంకటరమణతోపాటు మరో 7 మందిని అరెస్టు అదుపులోకి తీసుకుని రూ.82,300 నగదును స్వాధీనం చేసుకోవడంతోపాటు వారిపై కేసు నమోదు చేశామన్నారు. మునయ్యకోనలో మృతదేహం లభ్యం ముద్దనూరు : ముద్దనూరు–జమ్మలమడుగు రహదారిలోని మునయ్యకోనలో చిట్టిబోయిన గంగాధర్(53)అనే వ్యక్తి మృతదేహాన్ని శుక్రవారం పోలీసులు గుర్తించారు. సీఐ దస్తగిరి సమాచారం మేరకు.. తొండూరు మండలం గంగాదేవిపల్లెకు చెందిన గంగాధర్ రెండురోజుల క్రితం ఇంటినుంచి బయటకు వెళ్లాడు. మునయ్యకోనలో అతడి మృతదేహాన్ని గుర్తించారు. మరణానికి చెంనని కారణాలు ఇతర వివరాలపై విచారణ జరుపుతున్నట్లు సీఐ తెలిపారు. నిందితులకు జైలు పోరుమామిళ్ల : పోరుమామిళ్ల ఫారెస్టు రేంజ్లో 2019 ఎర్రచందనం కేసులో తిరుపతి కోర్టులో శుక్రవారం మల్లేపల్లె గ్రామానికి చెందిన నిందితులు కప్పలరమేష్, గురుప్రసాద్లకు 5 సంవత్సరాలు జైలు శిక్ష, రూ.6 లక్షలు జరిమానా విధిస్తూ కోర్టు తీర్పు ఇచ్చింది. రూ.11లక్షలు మోసం చేసారని కేసు ముద్దనూరు : మండలంలోని పెద్ద దుద్యాల గ్రామ సమీపంలోని జీయమ్ ఎకో కంపెనీకి చెందిన రూ.11లక్షల 54వేల సొమ్మును మోసం చేసారని కోకా ప్రదీప్, అతని భార్యపై పోలీసులు కేసు నమోదు చేశారు.ఏఎస్ఐ రమణ సమాచారం మేరకు జీయమ్ ఎకో కంపెనీలో విశాఖపట్టణంకు చెందిన ప్రతీప్ మేనేజర్గా, అతని భార్య అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. కంపెనీకి చెందిన లారీల బాడీ తయారీకి గ్యారేజీలో రూ.11లక్షల 54వేల సొమ్మును చెల్లించినట్లు ప్రదీప్ కంపెనీని మోసగించి, డబ్బు చెల్లించినట్లు నకిలీ లావాదేవీల పత్రాలు సృష్ఠించాడు. కొద్దిరోజుల అనంతరం కంపెనీ ఎండీ కనక ప్రసాద్ గ్యారేజీ ప్రతినిధులను సంప్రదించగా తమకు ఎటువంటి డబ్బు ముట్టలేదని వారు తెలిపారు. ప్రదీప్ను విచారించడానికి ప్రయత్నించగా అతని ఫోన్ స్విచ్ ఆఫ్ వుండడంతో ఎండీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. -
వాటా కోసం వేట
సాక్షి ప్రతినిధి, కడప: ‘రాజు తలుచుకుంటే కొరడా దెబ్బలకు కొదవా’ అన్నట్లుగా సంస్థలకు, కాంట్రాక్టర్లకు అధికార పరపతి ఎలా ఉంటుందో జమ్మలమడుగు కూటమి నేతలు రుచి చూపిస్తున్నారు. సంస్థ ఏదైనా సరే వారి కనుసన్నుల్లో నడుచుకుంటే సరే.. లేదంటే అల్లాడిపోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. 40 ఏళ్ల చరిత్ర ఉన్న అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమ నుంచి అదానీ ఐడల్ పవర్ ప్లాంట్ నిర్మాణం పనుల వరకూ నిర్వాహకులు ముప్పుతిప్పలకు గురయ్యారు. తాజాగా టీ.కోడూరు వద్ద నిర్మాణంలో ఉన్న సోలార్ కంపెనీ ఆ జాబితాలో చేరింది. రాత్రికి రాత్రి కోట్లాది విలువైన ఫ్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు మాయం అవుతున్నాయి. కుయ్యో మొర్రో అంటూ సంస్థ ప్రతినిధులు పోలీసులను ఆశ్రయిస్తే ఎఫ్ఐఆర్ నమోదు చేసి చేతులు దులుపుకుంటున్న వైనమిది. రూ.1700 కోట్ల అంచనా వ్యయంతో.. కొండాపురం మండలం టీ.కోడూరు గ్రామ పొలాల్లో సెయిల్ (ఎస్ఏఈఎల్) కంపెనీ సోలార్ పవర్ ప్లాంట్ నిర్మాణానికి ముందుకు వచ్చింది. రూ.1700 కోట్ల అంచనా వ్యయంతో 380 మెగావాట్ల విద్యుత్ ఉత్పత్తి సామర్థ్యంతో చేపట్టేందుకు సిద్ధమైంది. ఆమేరకు 2024లో రైతుల నుంచి 1500 ఎకరాల భూమి 30 ఏళ్లు లీజుకు తీసుకుంది. ప్రభుత్వ అనుమతులు దక్కడంతో 2025 ఫిబ్రవరి నుంచి పనులు ప్రారంభించింది. సెయిల్ కంపెనీ సోలార్ నిర్మాణ పనులు ఓ వైపు కొనసాగిస్తుండగా.. మరోవైపు కూటమి నేతలు చుక్కలు చూపిస్తున్నారు. కొండాపురం మండల బాధ్యుల సహకారంతో టీ.కోడూరు నేతలు ముప్పుతిప్పలు పెడుతున్నట్లు సమాచారం. నిర్మాణ పనులు అప్పగించిన సంస్థకు అనేక సమస్యలు సృష్టిస్తున్నట్లు తెలుస్తోంది. కంపెనీ ప్రతినిధులు పోలీసులకు ఫిర్యాదు సెయిల్ కంపెనీ నిర్మిస్తున్న సోలార్ నిర్మాణ పనుల్లో రాత్రికి రాత్రి సోలార్ ప్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు మాయం అవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు వరసగా చోరీకి గురవుతున్నాయి. ఇప్పటికీ పలుమార్లు ఇలాంటి ఘటనలు చోటుచేసుకున్నాయి. ఇదే విషయమై కంపెనీ ప్రతినిధులు తాళ్లప్రొద్దుటూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సెయిల్ కంపెనీ ప్రతినిధి ఆనంద్ దూభే ఫిర్యాదు మేరకు ఈ నెల 6న క్రైమ్ నంబర్ 154/25 ఎఫ్ఐఆర్ నమోదు చేశారు. సెక్యూరిటీ ఇన్చార్జి మహేశ్వరరెడ్డి ఫిర్యాదు మేరకు ఈనెల 8న క్రైమ్ నంబర్ 158/25 ఎఫ్ఐఆర్ నమోదు అయింది. ప్రాథమిక విచారణ చేపట్టిన పోలీసులు కూటమి నేతల ప్రమేయాన్ని గుర్తించారు. వెంటనే రంగ ప్రవేశం చేసిన మండల బాధ్యుడు ఒకరు పోలీసులతో మధ్యస్తం నెరిపారు. ‘మీ వాటా మీకు అప్పగిస్తాం, ఎలాంటి చర్యలు చేపట్టవద్దు’ అని హుకుం జారీ చేసినట్లు సమాచారం. ఆపై అధికార పార్టీ నేతల మాట జవదాటని పోలీసుశాఖ.. నిమ్మకు నీరెత్తినట్లుగా వ్యవహరిస్తున్నట్లు సమాచారం. డబుల్ స్టార్ అధికారి పెద్ద మొత్తంలో దోపిడీదారుల నుంచి సొమ్ము చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. నిర్మాణ సంస్థకు మాత్రం ఇప్పటికీ కూటమి నేతల వేధింపులు తప్పడం లేదు. జమ్మలమడుగు నియోజకవర్గంలో అదానీ హైడల్ ప్రాజెక్టు నిర్మాణ పనుల్లో అధికార పార్టీ నేతలు ప్రత్యక్ష దౌర్జన్యం చేశారు. ఏకంగా సైట్ ఇంజినీర్పై దాడి చేశారు. సివిల్ పనులు చేస్తున్న రిత్విక్ కన్స్ట్రక్షన్స్ సంస్థకు ముప్పుతిప్పలు పెట్టారు. ఆపై అల్ట్రాటెక్ పరిశ్రమపై దృష్టి పెట్టారు. అల్ట్రాటెక్లో పూర్తి ఆధిపత్యం కోసం చేయని దందాలు లేవు. అక్కడే టెంటు వేసుకొని సిమెంటు ఉత్పత్తికి ఆటంకం కల్గించారు. ఆమేరకు వ్యవస్థలను అడ్డుపెట్టుకొని దౌర్జన్యం రుచి చూపించారు. ఆర్టీపీపీలో సైతం అలాంటి వ్యవహారమే తెరపైకి వచ్చింది. తాజాగా సెయిల్ సోలార్ ప్లాంట్లో నిర్మాణ పరికరాలు చోరీకి గురవుతున్నాయి. కోట్లాది రూపాయల విలువైన పరికరాలు కోల్పోవాల్సిన పరిస్థితులు కల్పిస్తున్నారు. జమ్మలమడుగు నియోజకవర్గంలో ఇలాంటి దుస్సాహాసం వెనుక కూటమి నేతల ప్రత్యక్ష, పరోక్ష ప్రమేయం ఉన్నట్లు పరిశీలకులు ఆరోపిస్తుండటం గమనార్హం. సెయిల్ కంపెనీకి చుక్కలు చూపిస్తున్న కూటమి నేతలు ప్యానెల్స్, ఐరన్, కేబుల్స్, బ్యాటరీలు రాత్రికి రాత్రే మాయం కోట్లు విలువైన పరికరాల చోరీ వెనుక నాయకుల ప్రమేయం కేసు నమోదు చేసి చేతులుదులుపుకొన్న పోలీసుశాఖ -
భూ సమస్యలకు సత్వర పరిష్కారం
కడప కోటిరెడ్డిసర్కిల్: భూ సమస్యల ఫిర్యాదులకు సత్వర పరిష్కారం చూపాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. శుక్రవారం కలెక్టరేట్లోని సభాభవన్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో వచ్చిన ఫిర్యాదుల పెండెన్సీపై ఆమె డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చంద్రమోహన్, చిన్నయ్య, సర్వే ల్యాండ్స్ ఏడీ మురళీ కృష్ణతో కలిసి సీఎంవో కార్యాలయం నుంచి అందిన కాల్స్ మేరకు ఆయా డివిజన్ల ఆర్డీవోలు, అన్ని మండలాల తహసీల్దార్లు, ఆర్ఐలు, ఎంపీడీఓలు, సంబంధిత శాఖల జిల్లా అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం పీజీఆర్ఎస్ వ్యవస్థ నిర్వహణపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తోందన్నారు. ముఖ్యంగా ప్రభుత్వ సేవలు, రెవెన్యూ అంశాలు, పీవోటీ యాక్ట్ ప్రకారం అసైన్డ్ భూముల పరిష్కారంలో ఎక్కువగా ఫిర్యాదులు అందుతున్నాయని, వచ్చిన ఫిర్యాదులకు సరైన పరిష్కార నివేదికలు అందడం లేదన్నారు. అనంతరం ఆయా శాఖల వారీగా ఫిర్యాదుల పెండింగ్పై సమీక్షించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా స్థాయి అధికారులు, తదితరులు పాల్గొన్నారు. ఉల్లి కొనుగోలుకు ప్రణాళికా బద్ధంగా చర్యలు జిల్లాలో పండించిన ఉల్లి పంటను రైతులకు నష్టం వాటిల్లకుండా ఏపీ మార్క్ ఫెడ్ ద్వారా కొనుగోలు చేసేందుకు జిల్లా యంత్రాంగం ప్రణాళిక ప్రకారం చర్యలు చేపడుతోందని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ తెలిపారు. కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో ఏపీ మార్క్ఫెడ్ ద్వారా రైతుల నుంచి నేరుగా ప్రభుత్వం చేపడుతున్న ఉల్లి పంట కొనుగోలుకు సంబంధించి జిల్లాలోని ఉల్లి రైతులు, ట్రేడర్లతో ఆమె సమావేశం ఏర్పాటు చేసి, వారి నుంచి అభిప్రాయాలు స్వీకరించారు. ఈ సందర్బంగా ఇన్చార్జి కలెక్టరు మాట్లాడుతూ ఇప్పటికే ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఆయా ప్రాంత ఉల్లి రైతులు సద్వినియోగం చేసుకునేందుకు అన్ని రకాల సదుపాయాలను కల్పించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్ర బాబు, జిల్లా మార్క్ ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్ వలి తదితరులు పాల్గొన్నారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ అదితి సింగ్ -
న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : తమ న్యాయమైన కోర్కెలు పరిష్కరించాలని పెన్షనర్ల సంఘం జిల్లా అధ్యక్షుడు చెన్నారెడ్డి డిమాండ్ చేశారు. కడప పెన్షనర్ల భవనంలో జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పెన్షనర్లు, ఉద్యోగులపై సవతి తల్లి ప్రేమ కనబరచడం విచారించదగిన విషయమన్నారు. కార్యదర్శి రామమూర్తినాయుడు మాట్లాడుతూ పెన్షనర్లకు రావాల్సిన 11వ పీఆర్సీ బకాయిలు, డీఆర్, ఈహెచ్ఎల్ ఎన్క్యాష్మెంట్ బకాయిలు ఇవ్వాలన్నారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు పసుపులేటి శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రభుత్వాలు పెన్షనర్ల సమస్యలపై ఉదాసీనంగా ఉన్నందున అన్ని సంఘాలు కలిసి పోరాడాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అసోసియేట్ ప్రెసిడెంట్ జడపల్లి రాధాకృష్ణ, వైస్ ప్రెసిడెంట్ రంగనాయకులు, వర్కింగ్ ప్రెసిడెంట్ నాగమునిరెడ్డి, కోశాధికారి నూనె నగేష్, నాయకులు తుపాకుల నారాయణ, చలపతి గౌడ్ సుభాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు గురువారం ప్రారంభం అయ్యాయి. స్థానిక కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 57 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా చక్కగా బ్యాటింగ్ చేసి 107 పరుగులు, సాయి గణేష్ 57 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని షేక్ కమిల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేశారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్సార్ఆర్ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 75 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 407 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోషన్ పవన్ కుమార్ 213 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో అద్బుతంగా బ్యాటింగ్ చేసి 226 పరుగులు చేశాడు. సోహర్ వర్మ 53 పరుగులు, సూతేజ్ రెడ్డి 89 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ఉద్యోగులకు పాత పెన్షన్ పునరుద్ధరించాలి
కడప ఎడ్యుకేషన్ : కేంద్ర ప్రభుత్వం మోమో 57 ప్రకారం పాత పెన్షన్ పునరుద్ధరించాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ పోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్, శోభారాణి డిమాండ్ చేశారు. కడప తాలూకా కేంద్రం వద్ద నల్లబాడ్జీలు ధరించి గురువారం మహా నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. గుజ్జల తిరుపాల్, శోభారాణి మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ మెమో 57 అనుసరించి 2003 డీఎస్సీ ఉపాధ్యాయులు (7361 మంది), పోలీసులు (1821), గ్రూప్ 1, గ్రూప్2 ఉద్యోగులకు(1800) పాత పెన్షన్ అమలుచేయాలని డిమాండ్ చేశారు. 2004 సెప్టెంబర్, 01 తదుపరి నియామకం జరిగి సీపీఎస్ విధానంలో కొనసాగుతున్న సుమారు 11000 మందికి పాత పెన్షన్ పునరుద్ధరించాలన్నారు. ఎన్జీఓ జిల్లా అధ్యక్షులు బి.శ్రీనివాసులు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో పాత పెన్షన్ అమలుకు ఎలాంటి నిర్ణయం తీసుకోలేదని తెలిపారు. ఏపీ ప్రభుత్వంలోని ముగ్గురు ఐఏఎస్ అధికారులకు గత ప్రభుత్వం పాత పెన్షన్ పునరుద్ధరించిందన్నారు. ఈ కార్యక్రమంలో బి.గంగాధర్, ఎస్.బాబూరెడ్డి, పి.వెంకటసుబ్బారెడ్డి, చెన్నయ్య, రోజారాణి, చంద్రకళ, కె.చెన్నయ్య, లక్ష్మీరాజా, మోపూరి వెంకట శివారెడ్డి, సుబ్బారెడ్డి, రామాంజనేయులు, రామిరెడ్డి శ్రీనివాసులురెడ్డి, ప్రతాపుడు, లక్ష్మీకాంత్ పాల్గొన్నారు.జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల్ -
వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే ఉద్యమిస్తాం
● ప్రజల ఆస్తులను పప్పులు, బెల్లాలకు అమ్మేస్తారా...? ● పులివెందుల్లో మెడికల్ కాలేజీ ఉండరాదనే కక్ష? ● మంజూరైన సీట్లను వెనక్కి ఇవ్వడం దుర్మార్గం ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డికడప కార్పొరేషన్ : ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేటుపరం చేస్తే ప్రజా ఉద్యమం తప్పదని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి హెచ్చరించారు. వైఎస్సార్సీపీ జిల్లా పార్టీ కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్లో అవినీతి విలయతాండవం చేస్తోందన్నారు. చంద్రబాబు అవినీతి చక్రవర్తి అని తెహల్కా డాట్కామ్ ఎప్పుడో చెప్పిందని, దేశంలో ఆయనంత సంపన్నుడు ఎవరూ లేరని, ఆయనకున్న ఆస్తులు మరెవరికీ లేవని ఆరోపించారు. పెద్ద హాస్పిటల్స్ అన్నీ హైదరాబాద్, బెంగళూరు, చైన్నె నగరాల్లో ఉన్నా.. ఏపీలో కరోనాను వైఎస్.జగన్మోహన్రెడ్డి అధిగమించారన్నారు. తద్వారా రాష్ట్రంలో తక్కువ మరణాలు నమోదయ్యాయన్నారు. భవిష్యత్లో ఇలాంటి పరిస్థితి రాకుండా మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఒక విజన్తో ఒక్కో జిల్లాకు ఒక వైద్య కళాశాల చొప్పున 17 కొత్త మెడికల్ కాలేజీలను మంజూరుచేయించారన్నారు. 1923 నుంచి రాష్ట్రంలో 12 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, కొత్తగా మంజూరైన మెడికల్ కాలేజీల్లో ఐదు కాలేజీలు పూర్తయ్యాయని, మరో రెండు ప్రారంభోత్సవానికి సిద్ధగా ఉన్నాయని పేర్కొన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీలో అన్ని వసతులు, వైద్య పరికరాలు ఉన్నా.. పులివెందులకు 50 సీట్లు వద్దు అని లేఖ రాసిన దుర్మార్గ ప్రభుత్వం ఇదేనని ధ్వజమెత్తారు. ఎవరైనా మెడికల్ సీట్లు కావాలని కోరుకుంటారని, సీట్లు వద్దని చెప్పిన ఏకై క ప్రభుత్వాన్ని ఇప్పుడే చూస్తున్నామన్నారు. పులివెందుల ప్రజలు మనకు ఓట్లేయరు...అక్కడ మెడికల్ కాలేజీలు ఉండకూడదనే కక్షతోనే ఇలా చేస్తున్నారని మండిపడ్డారు. 2024–25 సంవత్సరానికి 50 సీట్లు తీసుకొని ఉంటే, 2025–26 సంవత్సరానికి మరో 150 సీట్లు వచ్చి ఉండేవన్నారు. ఆ అవకాశాన్ని ప్రభుత్వం తుంగలో తొక్కిందన్నారు. వైఎస్ జగన్ మొదటి విడత చేపట్టిన 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తూ జీవో ఇవ్వడం దుర్మార్గమన్నారు. ఒక్కో మెడికల్ కాలేజీ 50–100 ఎకరాల్లో రూ.500 కోట్లతో నిర్మించారని, అవి లక్షల కోట్ల రూపాయల విలువజేసే ప్రజా ఆస్తులని తెలిపారు. ఈ మెడికల్ కాలేజీల వల్ల 2360 మెడికల్ సీట్లు వస్తాయని, 2550 సీట్లు అదనంగా వచ్చే అవకాశముందన్నారు. ఇక్కడ మెడికల్ సీట్లు లేక రాష్ట్రంలోని విద్యార్థులు రష్యా, చైనా, జార్జియా వంటి దేశాలకు పోతుంటే వచ్చిన వాటిని వెనక్కి ఇవ్వడం దారుణమన్నారు. ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటు పరం చేయడమే చంద్రబాబు నైజమని, 2014–19లో కూడా ఆయన అనేక ప్రభుత్వ హాస్పిటళ్లను ప్రైవేటుపరం చేశారన్నారు. చిత్తూరు మెడికల్ కాలేజీని అపోలోకు అప్పగించారని గుర్తుచేశారు. ప్రభుత్వ ఆస్తులను పప్పులు, బెల్లాలకు అమ్మేయాలనుకోవడం సరికాదన్నారు. తాను, తన బినామీలను బాగుపరచాలనే ఉద్దేశ్యంతోనే ఇలా చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ప్రైవేటీకరణను రద్దు చేస్తామని, బాబు పాలనలో ప్రభుత్వ రంగంలోని ఎన్నో పరిశ్రమలు మూతపడ్డాయని గుర్తు చేశారు. విశాఖ ఉక్కు పరిశ్రమను ప్రైవేటు పరం చేస్తుంటే చూస్తూ ఊరుకున్నారని విమర్శించారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుని తీరుతామని హెచ్చరించారు. సూపర్ ప్లాఫ్ సినిమాకు విజయోత్సవాలు చేసినట్లు కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్ సూపర్హిట్ అంటూ సభలు నిర్వహిస్తోందని ఎద్దేవా చేశారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, ఎస్. వెంకటేశ్వర్లు, యానాదయ్య, షేక్ షఫీ, శ్రీరంజన్రెడ్డి, వి. నాగేంద్రారెడ్డి, కంచుపాటి బాబు, సాయి, నిరంజన్, తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై అక్రమ కేసు నమోదు
కలసపాడు : మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బత్తులచంద్రమోహన్, బత్తులఆదిలక్ష్మి, స్వర్ణ శ్రీనాథ్లపై పోలీసులు గురువారం అక్రమ కేసు నమోదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బత్తుల చంద్రమోహన్ పొలంలో టీడీపీ నాయకుడు ఇటీవల గ్రావెల్ రోడ్డు వేశాడు. 20 సంవత్సరాల నుంచి ఆ రోడ్డు ఎవరికి ఉపయోగంలో లేదు. ఇటీవల గ్రామ టీడీపీ నాయకుడు కక్ష సాధింపులో భాగంగా చంద్రమోహన్ పొలంలో అడ్డంగా రోడ్డు వేశాడు. అయినా చంద్రమోహన్ ఏమీ అనలేదు. ఐదు రోజుల క్రితం గ్రామంలోని ఓ ట్రాక్టర్తో చంద్రమోహన్ మిగిలిన భూమిని దున్నుకున్నాడు. రోడ్డును దున్నేశాడని టీడీపీ నాయకుడు బక్కిరెడ్డినారాయణరెడ్డి ఫిర్యాదు మేరకు మామిళ్లపల్లె గ్రామానికి చెందిన చంద్రమోహన్, అతని భార్య ఆదిలక్ష్మి, ట్రాక్టర్ డ్రైవర్ శ్రీనాథ్లపై అక్రమంగా కేసు నమోదు చేసి స్టేషన్కు తరలించారు. డ్రైవర్పై అనుచిత వ్యాఖ్యలు మామిళ్లపల్లె గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ స్వర్ణశ్రీనాథ్పై ఎస్ఐ తిమోతి అనుచిత వ్యాఖ్యలు చేసినట్లు సమాచారం. నీపై రెండు, మూడు కేసులు ఉన్నాయని దుర్భాషలాడినట్లు బాధితుడు శ్రీనాథ్ తెలిపారు. -
ఉత్సాహంగా సాగిన ఎస్జీఎఫ్ క్రీడలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో క్రీడలు ఉల్లాసంగా, ఉత్సాహంగా జరిగాయి. నగరంలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో జిల్లా స్థాయి అండర్– 14, 17 రాష్ట్రస్థాయి పోటీలకు బాల బాలికల ఎంపిక నిర్వహించారు. ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, స్విమ్మింగ్, జిమ్నాస్టిక్స్, సైక్లింగ్ విభాగాలలో పోటీలను ప్రత్యేకాధికారి జగన్నాథరెడ్డి ప్రారంభించారు. ఉమ్మడి కడప జిల్లా నుంచి 450 మంది విద్యార్థులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో శ్రీకాంత్రెడ్డి, చంద్రావతి, ప్రవీణ్ కిరణ్, శివశంకర్రెడ్డి పాల్గొన్నారు. -
బెదిరింపులతో డబ్బు లాక్కున్న ముగ్గురు అరెస్టు
కడప అర్బన్ : కడప రిమ్స్ పీఎస్ పరిధిలోని తిలక్ నగర్ ఆంజనేయస్వామి గుడి సమీపంలో వెళ్తున్న వారిని బెదిరిస్తూ పర్సు లాక్కుని పరారవుతున్న చాంద్బాషా, మురాఫత్ అలియాస్ లడ్డు, గౌస్ పీర్లను గురువారం అరెస్ట్ చేసినట్లు కడప రిమ్స్ పోలీసులు తెలిపారు. గత నెల 22వ తేదీ రాత్రి తిలక్ నగర్ సమీపంలో ఆంజనేయస్వామి గుడి వద్ద వాకింగ్ చేస్తున్న ఇందుమతి, ఇంకా ఇద్దరు మహిళలు, అటువైపుగా వెళ్తున్న యువకులను బెదిరించి నిందితులు డబ్బు వసూలు చేసినట్లు పోలీసులు తెలిపారు. బాధిత మహిళ ఇందుమతి పోలీసులకు ఫిర్యాదు చేయడంతో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు పోలీసులు తెలిపారు. రిమ్స్ వైద్య విద్యార్థిని ప్రతిభకడప అర్బన్ : కడప రిమ్స్ వైద్య విద్యార్థిని కల్లూరి కిరణ్మయ ప్రతిభ కనబరచి బంగారుపతకం అందుకున్నారు. వైఎఎస్సార్ జిల్లా వేంపల్లి మండలం రామిరెడ్డిపల్లెకు చెందిన కల్లూరి శివప్రసాద్రెడ్డి (లేట్), ఎద్దుల రత్నమ్మల కుమార్తె కల్లూరి కిరణ్మయి కడప రిమ్స్లో వైద్య విద్య అభ్యసిస్తోంది. అనాటమీ విభాగంలో గోల్డ్ మెడల్ సాధించి భళా అనిపించింది. చిన్నపుడే తండ్రిని కోల్పోయిన కిరణ్మయి తల్లి రత్నమ్మ, మేనమామ, అత్త ప్రోత్సాహంతో ఎంబీబీఎస్ సీటు సాధించి కడప రిమ్స్లో చేరారు. అనాటమీ విభాగంలో మొదటి సంవత్సరంలో ప్రతిభ చూపి బంగారు పతకానికి ఎంపికయ్యారు. ఈ నెల 9న విజయవాడ తుమ్మలపల్లి వారి క్షేత్రయ్య కళాక్షేత్రంలో గవర్నర్ అబ్దుల్ నజీర్ సమక్షంలో వీసీ డాక్టర్ పి.చంద్రశేఖర్, ముఖ్య అతిథి డాక్టర్ ఓ.పి.యాదవ్ చేతుల మీదుగా బంగారుపతకం అందుకున్నారు. కిరణ్మయి మాట్లాడుతూ భవిష్యత్తులో పీజీ వైద్యను డీవీఎల్ విభాగంలో అభ్యసించాలని, ప్రజలకు తమవంతుగా వైద్య సేవలదించాలని కోరుకుంటున్నానని తెలిపారు. -
ఉల్లి కొనుగోలు కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలి
కడప సెవెన్రోడ్స్ : మార్క్ ఫెడ్ ద్వారా ప్రారంభమైన మైదుకూరు, కమలాపురం ఉల్లి కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ అన్నారు. కలెక్టరేట్లోని తన ఛాంబర్లో ఉద్యాన, మార్క్ ఫెడ్ అధికారులతో గురువారం సమీక్షించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ క్వింటా ఉల్లి ధర రూ.1200 ప్రకారం ఈ–క్రాప్ నమోదు చేసుకున్న రైతుల నుంచి మార్క్ ఫెడ్ కొనుగోలు చేస్తుందన్నారు. మైదుకూరు, కమలాపురం మార్కెట్ యార్డుల ఆవరణలో ఇప్పటికే కొనుగోళ్లు ప్రారంభమయ్యాయన్నారు. ఉల్లి రైతులకు నష్టం వాటిల్లకుండా, నాణ్యత పరిగణలోకి తీసుకుని కొనుగోలు ప్రక్రియ చేపట్టినట్లు జేసీ తెలిపారు. ఈ సమావేశంలో జిల్లా ఉద్యాన శాఖ అధికారి రవిచంద్రబాబు, మార్క్ఫెడ్ అధికారి పరిమళ జ్యోతి, మార్కెటింగ్ ఏడీ ఆజాద్వలి, తదితరులు పాల్గొన్నారు. -
బాల శాస్త్రవేత్తలకు ప్రోత్సాహం
కడప ఎడ్యుకేషన్ : విద్యార్థుల సృజనాత్మక ఆలోచనలను వెలికితీసేందుకు ఇన్స్పైర్ మనక్ పేరిట ప్రతిపాదనలు పంపేందుకు ప్రభుత్వం ఈ నెల 15వ తేదీ వరకూ గడువు పొడిగించింది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వ శాఖ ఏటా నిర్వహించే ఈ పోటీలలో అన్ని ప్రభుత్వ అనుబంధ పాఠశాలల్లో ఆరు నుంచి పదో తరగతి చదివే విద్యార్థులు తమ ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా 226 ప్రాథమికోన్నత, ఉన్నత పాఠశాలల నుంచి 1000 ప్రాజెక్టులు పంపాలని ప్రభుత్వం టార్గెట్ పెట్టింది. ఇప్పటి వరకూ 632 ప్రాజెక్టులు మాత్రమే వచ్చాయి. మరో మూడు రోజులు గడువు ఉండడంతో మరిన్ని ప్రాజెక్టులు పంపేందుకు మరో అవకాశం ఉంది. దరఖాస్తు చేయడం ఎలా.. పాఠశాల స్థాయిలో తొలుత ఐడియా కాంపిటేషన్ నిర్వహించి స్థానిక సమస్యలను పరిష్కరించే దిశగా ప్రాజెక్టులు పంపేలా చూడాలి. ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి ఆ విద్యార్థి పేరు, తండ్రిపేరు తరగతి వివరాలు, విద్యార్థి బ్యాంకు ఖాతా, ఆధార్ కార్డు సంఖ్యలు నమోదుచేయాలి. అనంతరం ఠీఠీఠీ.జీ ుఽట ఞజీట్ఛ్చ్చఠ్చీటఛీట.జౌఠి.జీ ుఽ వెబ్సైట్లో విద్యార్థులు తమ ఆలోచనలకు అనుగుణంగా ప్రాజెక్టుల వివరాలను నమోదుచేయాలి. రెండు నెలల్లో జిల్లా స్థాయిలో ఉత్తమ ఆలోచనలను ఎంపిక చేస్తారు. అనంతరం రాష్ట్ర స్థాయికి ప్రాజెక్టు పంపేందుకు విద్యార్థి బ్యాంకు ఖాతాకు రూ.10 వేల నగదు జమచేస్తారు. రాష్ట్రస్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న వారికి రూ.25 వేల వరకు అదనపు నిధులు కేటాయిస్తారు. పూర్తి స్థాయిలో ఇన్స్పైర్ మనక్ పోటీల్లో ప్రతిభ చూపితే రాష్ట్రపతి భవన్ సందర్శనకు అవకాశం ఉంటుంది. అంతేగాక జాతీయ స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశం లభిస్తుంది. ప్రతిభకు పట్టం ఇన్స్పైర్ మనక్కు నామినేషన్ల స్వీకరణకు ప్రభుత్వం ఈ నెల 15వతేదీ వరకూ గడువు విధించింది. పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులను పరిశోధనల వైపు ప్రేరేపించడానికి ఇన్స్పైర్ మనక్ పథకం ఉపయోగపడుతుంది. గైడ్ టీచర్లు శిక్షణ ఇచ్చి సందేహాలను నివృత్తి చేయాలి. మంచి ప్రాజెక్టులను ఇన్స్పైర్ ప్రదర్శనకు తీసుకువచ్చి మంచిపేరు తేవాలి. – షేక్ షంషుద్దీన్, జిల్లా విద్యాశాఖ అధికారిఇన్స్పైర్ మనక్ నామినేషన్లకు గడువు పొడగింపు -
రెడ్బుక్ రాజ్యాంగంలోపత్రికా స్వేచ్ఛ కూడా లేదు
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇందులో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి కూడా స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఎడిటర్లపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గం. స్టేట్మెంట్ పబ్లిష్ చేస్తే కేసులు పెడతారా? కంటెంట్ మారినా.. ఒక నాయకుడి ప్రెస్ మీట్ కవర్ చేస్తే కేసులు పెట్టడం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు ఈ రాష్ట్రంలో లేవా? ప్రజాస్వామ్య దేశంలో మొదటి సారి ఇలాంటి విచిత్రాలు చూస్తున్నాం. ఎంతో కాలం ఇలాంటి ఆగడాలు సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. –ఎస్బీ అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం సమంజసం కాదు ఒక రాజకీయ నాయ కుడు తన అభిప్రా యాన్ని తెలియయజేసినప్పుడు విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రజల పక్షాన ఉన్న పత్రికల బాధ్యత. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికలపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం సమంజసం కాదు .అది పత్రికా స్వేచ్ఛను,వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే.కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ఆగడాలు ఎంతో కాలం సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కొరముట్ల శ్రీనివాసులు, మాజీవిప్, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు కొత్త సంస్కృతికి తెరరాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా.ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని, ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, ఎడిటర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం..ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది.ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు..ప్రజల ముందు కూడా నిలబడవు. –గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ -
మోస్తరు వర్షం
కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా జిల్లాలో బుధవారం రాత్రి నుంచి గురువారం ఉదయం వరకు మోస్తరు వర్షం కురిసింది. కాశినాయన, కలసపాడు, పోరుమామిళ్ల, బి.కోడూరు మండలాలు మినహా మిగతా 32 మండలాల్లో వాన పడింది. ఇందులో భాగంగా కడపలో అత్యధికంగా 66.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. ఈ వర్షం ఆరుతడి పంటలకు ఎంతో ఉపయుక్తం అని అన్నదాతలు తెలిపారు. పంటలకు ఉన్న చీడపీడలు తగ్గే అవకాశం ఉన్నట్లు వారు పేర్కొంటున్నారు. నాలుగు మండలాలు మినహా జిల్లా అంతటా వాన కడపలో అత్యధికంగా 66.2 మి.మీ వర్షపాతం -
పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం
ఉచిత బస్ ఎఫెక్ట్ రాజంపేట: కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన సీ్త్రలకు ఉచిత బస్సు పథకం.. రైల్వే ఆదాయానికి గండికొండుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్యాసింజర్ రైళ్లు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మహిళా ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. దీంతో మహిళా బోగీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రైళ్లలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు తొలగిస్తూ వస్తున్న క్రమంలో.. ఈ పథకం రైల్వే ఆదాయానికి మరో దెబ్బ కొట్టింది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏ దిశగా అడుగులు వేస్తోందో.. వేచి చూడాల్సిందే. ● ఉభయ జిల్లాల మీదుగా మార్గంలో 25 స్టేషన్లు ఉండగా, డైలీ 30 (అప్ అండ్ డౌన్) రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో రైల్వేలకు వస్తున్న ఆదాయం పట్టాలు తప్పుతోంది. ఇప్పటి నుంచే అధికారుల్లో ఎర్నింగ్స్(ఆదాయం)పై ఆందోళన రోజురోజుకు హెచ్చరిల్లుతోంది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని రైలుమార్గంలో నడిచే నంద్యాల–రేణిగుంట డెమో ప్యాసింజర్, అరకోణం నుంచి కడప వరకు నడిచే అరక్కోణం, తిరుపతి నుంచి హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లపై ఉచిత బస్ (సీ్త్రశక్తి పథకం) ప్రభావం పడింది. ఫలితంగా రైల్వే ఆదాయనికి ఉచిత బస్ (ఆర్టీసీ) గండికొట్టిందనే రైల్వే నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మోదీ సర్కారు రాయితీలను రానురాను తీసేసుకుంటూ వస్తోంది. జర్నలిస్టుల పాస్లతోపాటు అన్ని రకాల రాయితీలకు మంగళం పాడిన సంగతి విదితమే. రైల్వేకమర్షియల్ విభాగాన్ని.. ఇప్పుడు ఉచితబస్తో ఎర్నింగ్స్ కోల్పోతున్న అంశం వేధిస్తోంది. రైలు ప్రయాణానికి మహిళలు దూరం ఏ రైలులో అయినా గార్డుబ్రేక్ ముందు ఉండే లేడీస్కోచ్లో సీట్ల కోసం మహిళలు పోటీపడే పరిస్థితులు నిత్యం కొనసాగుతుండటం విదితమే. ప్రతి స్టేషన్లో అధికంగా మహిళలు ఈ కోచ్లో సీటు కోసం పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లేడీస్కోచ్లో కనీసం పదిమంది కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఆసక్తి చూపుతుండటమే.. ఇందుకు కారణమని రైల్వే వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పైగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితమే అన్న భావనలో రైలు ప్రయాణాలకు స్వస్తి చెపుతుండటం గమనార్హం. చాలా బోగీల్లో ఖాళీగా సీట్లు ముంబయి–చైన్నె రైలు మార్గంలోని ఉమ్మడి కడప జిల్లా మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లు బోసిపోతున్నాయి. ప్రయాణపు ధర తక్కువ అయిన క్రమంలో మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉండేవి. ఇప్పుడు ఆ దృశ్యాలు రైలు బోగీలు దూరమయ్యాయి. చాలా మటుకు సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి. ఖాళీగా మహిళా బోగీలు ప్రతి స్టేషన్లో పడిపోయిన రాబడి బోసిపోతున్న ప్యాసింజర్ రైళ్లు రైల్వే అధికారుల్లో ఆందోళన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా సమాచారం మార్గం: ముంబయి–చైన్నె రైళ్లు : 30 (అప్ అండ్ డౌన్) స్టేషన్లు: 25కిలోమీటర్లు: 180ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రైలు మార్గంలో ప్రతి రైల్వేస్టేషన్లో ఎర్నింగ్స్ పడిపోతున్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ రైళ్ల ప్రయాణంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. పేదోడి రైళ్లుగా నడు స్తున్న వీటిలో.. తక్కువ వ్యయంతో గమ్యాలకు చేరుకోవచ్చన్న భావనలో మహిళలు ప్రయాణాలు సాగించేవారు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సుతో రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపడం లేదు. కడప నుంచి ఒంటిమిట్ట, నందలూరు, తిరుపతి, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలకు నంద్యాలడెమో, ఇంటర్సిటీ, అరకోణం రైళ్లను మహిళలు ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నంద్యాల నుంచి కడప, తిరుపతి కానీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఫలితంగా ఈ మూడు రైళ్లు ఆగే స్టేషన్లలో ఎర్నింగ్ పడిపోతున్నాయి. -
రాత్రి అక్రమంగా యూరియా తరలింపు
దువ్వూరు: మండలంలో రాత్రిళ్లు అక్రమంగా యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిపోతోంది. నిజమైన రైతులకు యూరియా అందక ఎండకు క్యూలో నిలుచొని అష్టకష్టాలు పడుతుంటే.. ప్రైవేట్ వ్యాపారులు మాత్రం రూ.400 నుంచి రూ.500 వరకు వసూలు చేస్తున్నారు. ఎవరు ఎక్కువ ధర ఇస్తే వారికి ఏ సమయంలోనైనా యూరియా దొరుకుతుందని రైతులు ఆరోపిస్తున్నారు. యూరియా కృత్రిమ కొరత సృష్టిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని విజిలెన్స్ ఏఎస్పీ గత నెలలో దువ్వూరులోని ఫర్టిలైజర్స్ దుకాణాలపై దాడులు చేసి హెచ్చరించినా.. వ్యాపారుల తీరు మారలేదు. దువ్వూరుకు చెందిన మహానందీశ్వర ట్రేడర్స్ గురువారం రాత్రి 9 గంటల సమయంలో మూడు ఆటోల్లో యూరియాను అక్రమంగా తరలిస్తుండగా.. సమీపంలో ఉన్న దళితవాడ రైతులు యూరియా మాకు ఇమ్మంటే లేదన్నారు, ఈ సమయంలో ఎక్కడికి తరలిస్తున్నారని అడ్డుకున్నారు. ‘మా ఇష్టం మేము ఏ సమయంలోనైనా అమ్ముకుంటాం, మీరెవరు అడ్డుకునేది’ అంటూ షాపు సిబ్బంది దురుసుగా ప్రవర్తించారు. నిజమైన రైతులకు అందడం లేదని ఆవేదన మరో పక్క వ్యవసాయాధికారులు దువ్వూరు మండలానికి 980 టన్నుల యూరియా ఇంత వరకు వచ్చిందని చెబుతున్నారు. ఆ యూరియాలో ఎంత శాతం రైతులకు అందిందో, పక్కకు ఎంత తరలిపోయిందో అధికారులే లెక్క తేల్చాలి. ఇంత స్థాయిలో యూరియా పంపిణీ చేసినా రైతులకు అందకుండా ఇలా రాత్రిళ్లు బ్లాక్ మార్కెట్కు తరలిపోతుంటే... నిజమైన రైతులకు యూరియా ఎక్కడ అందుతుందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియాను సక్రమంగా పంపిణీ చేయని అధికారులు.. అవసరం లేకున్నా యూరియా వాడుతున్నారని, రైతులపైనే నిందలు మోపుతున్నారు. దువ్వూరు మండలంలో 13,500 ఎకరాల్లో పంటలను సాగు చేయగా, అందులో దాదాపు 60 శాతంపైన కేసీ కెనాల్ పరిధిలో రైతులు వరి సాగు చేశారు. ఒక ఎకరాకు ఎంత తక్కువ అన్నా మూడు బస్తాల యూరియా పడుతుందని, కానీ ఒక బస్తా కూడా దొరకడం కష్టంగా ఉందని రైతులు వాపోతున్నారు. వ్యవసాయ అధికారులు ఇప్పటికై నా యూరియా పక్కకు తరలిపోకుండా చర్యలు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. విచారణ చేస్తాం ఈ విషయంపై మండల వ్యవసాయాధికారి అమరనాథ్రెడ్డిని వివరణ కోరగా దువ్వూరు మండలానికి 52 టన్నుల యూరియా మంజూరైందన్నారు. ఆ యూరియాను శుక్రవారం రైతు సేవా కేంద్రాల ద్వారా, ప్రైవేట్ దుకాణాల ద్వారా పంపిణీ చేయనున్నామన్నారు. అయితే దువ్వూరులోని మహానందీశ్వర ట్రేడర్స్ వారు రాత్రి 9 గంటల సమయంలో ఆటోలో యూరియాను తరలించడం తప్పని, విచారణ చేసి చర్యలు తీసుకుంటామని తెలిపారు. అడ్డుకున్న రైతులు దురుసుగా ప్రవర్తించిన ‘ఫర్టిలైజర్స్’ సిబ్బంది -
ప్రశాంతంగా స్టాఫ్నర్స్ నియామకాల కౌన్సెలింగ్
కడప రూరల్: కడప వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం (జోన్–4)లో గురువారం నిర్వహించిన కాంట్రాక్ట్ స్టాఫ్నర్స్ నియామకాల కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. ఎంపికై న 67 మందికి కౌన్సెలింగ్ నిర్వహించారు. స్టాఫ్నర్స్లుగా పోస్టింగ్లు ఇచ్చారు. ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ నిబంధనల ప్రకారం కౌన్సెలింగ్ నిర్వహించినట్లు తెలిపారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ శేఖర్, సూపరింటెండెంట్లు శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్స్ బత్తనయ్య, వనీష తదితరులు పాల్గొన్నారు. కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలకు గురువారం 1315 మెట్రిక్ టన్నుల యూరియా వచ్చిందని జిల్లా వ్యవసాయ అధికారి చంద్రనాయక్ తెలిపారు. కడపకు వచ్చిన యూరియా ర్యాక్ను ఆయన గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కడప జిల్లాకు 900 మెట్రిక్ టన్నులు కాగా ఇందులో 395 టన్నులు మార్క్ఫెడ్కు పంపగా మిగతా 205 టన్నులు మన గ్రోమోర్ సెంటర్కు, మరో 300 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లాకు 415 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 328 మెట్రిక్ టన్నులను మార్క్ఫెడ్కు, 58 టన్నులు మనగ్రోమోర్ సెంటర్లు, మరో 29 టన్నులు ప్రైవేటు డీలర్లకు కేటాయించినట్లు చెప్పారు. -
కొండాపురంలో ఆగిన ఎక్స్ప్రెస్ రైళ్లు
కొండాపురం : కొండాపురం రైల్వేస్టేషన్లో బుధవారం ఉదయం కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు ఆగింది. మనోహర్బాబు ఆద్వర్యంలో రైలుకు పూజలు నిర్వహించారు. కన్యాకమారి– పూణే మధ్య నడిచే 16381,16382 ఎక్స్ప్రెస్ రైళ్లు ఆపాలని కడప ఎంపి వైఎస్ అవినాష్రెడ్డి రైల్వే ఉన్నతాధికారులతో మాట్లాడి స్టాపింగ్ చేయించడంతో కొండాపురం ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. అలాగే జయంతిఎక్స్ ప్రెస్ నిలుపుదలకు కృషి చేసిన కడపఎంపి వైఎస్ అవినాష్రెడ్డికి ఎల్లనూరు, కొండాపురం,సింహాద్రిపురం మండల ప్రజలు అభినందనలు తెలిపారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలి ప్రొద్దుటూరు కల్చరల్ : రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లకు 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే ప్రకటించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. మండలంలోని ఉన్నత పాఠశాలల్లో బుధవారం నిర్వహించిన ఏపీటీఎఫ్ సభ్యత్వ నమోదు కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. శ్యాంసుందర్రెడ్డి మాట్లాడుతూ 2024 నుంచి పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, సీపీఎస్ రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని అమలుచేయాలని డిమాండ్ చేశారు. 2003 డీఎస్సీ వారికి మెమో 57 ప్రకారం పాత పెన్షన్ విధానం వర్తింపచేయాలన్నారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని కోరారు. ఈ నెల 11వ తేదీ నుంచి 17వ తేదీ వరకు ఏపీటీఎఫ్ రాష్ట్ర వ్యాప్తంగా నిరసన కార్యక్రమాలను చేపడుతోందన్నారు. 11న నల్లబ్యాడ్జీలతో విధులకు హాజరు, 12న మండల కేంద్రాల్లో నిరసన, 13, 14న ప్రజాప్రతినిధులకు వినతిపత్రాల సమర్పణ, 15న పాత తాలూకా కేంద్రాల్లో నిరసన, 16న జిల్లా కేంద్రాల్లో నిరసన, 17న సీఎంకు మెయిల్స్ ద్వారా విజ్ఞాపనలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ నాయకులు శ్రీనివాసరెడ్డి, కృష్ణారెడ్డి, సుబ్బారెడ్డి, సయ్యద్ బాషా, వెంకటేశ్వర్లు, ఖాజాపీరా, వరప్రసాద్ రెడ్డి, అబ్దుల్ ఫయాజ్ తదితరులు పాల్గొన్నారు. పట్టపగలే నగల చోరీ బద్వేలు అర్బన్ : ఇంటికి తాళం వేసి బయటికి వెళ్లాలంటే పట్టణ వాసులు భయపడిపోతున్నారు. అలా తాళం పడిందో లేదో.. ఇలా దొంగలు చొరబడి ఉన్నదంతా దోచేస్తున్నారు. రాత్రి పూట కాకుండా పట్టపగలే చోరీలకు పాల్పడుతూ రెచ్చిపోతున్నారు. పట్టణంలోని వెంకటయ్యనగర్లో బుధవారం మధ్యాహ్నం తాళం వేసిన ఓ ఇంటిలో దొంగలు చొరబడి 12.50 తులాల బంగారు నగలు, 100 గ్రాముల వెండి ఆభరణాలు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. పట్టణంలోని వెంకటయ్యనగర్లో సునీత, శ్రీనివాసులు దంపతులు నివశిస్తున్నారు. శ్రీనివాసులు ఉదయమే బయటికి వెళ్లగా, మధ్యాహ్నం సమయంలో సునీత పక్కవీధిలోని తండ్రి ఇంటికి వెళ్లింది. ఇదే అదునుగా భావించిన దొంగలు ఇంటి తాళం పగులకొట్టి లోపలికి చొరబడ్డారు. బీరువా తలుపులు పగులకొట్టి లాకరులో దాచిన 12.50 తులాల బంగారు నగలు, వంద గ్రాముల వెండి ఆభరణాలు అపహరించుకువెళ్లారు. గంట తర్వాత ఇంటికి వచ్చిన సునీత చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని అర్బన్ పోలీసులకు సమాచారం అందించారు. సీఐ లింగప్ప ఘటనా స్థలాన్ని పరిశీలించి బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. వేలిముద్రలు సేకరించారు. -
పాలకవర్గం పట్టు.. కమిషనర్ బెట్టు
● రెండో రోజున కొనసాగిన కౌన్సిల్ సమావేశం ● చైర్ పర్సన్ ఫిర్యాదుతో నిర్వహించిన కమిషనర్ ప్రొద్దుటూరు : మున్సిపల్ పాలకవర్గం పట్టుబట్టి భీష్మించగా.. మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి తన బెట్టు వదలి రెండో రోజున బుధవారం ఎట్టకేలకు కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. దీంతో సమస్య పరిష్కారమైంది. అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని మంగళవారం సాయంత్రం మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి అధ్యక్షతన నిర్వహించారు. అజెండాలోని ఒక అంశం చదివిన తర్వాత గత నెలలో ఎందుకు కౌన్సిల్ సమావేశం నిర్వహించలేకపోయారో కమిషనర్ సమాధానం చెప్పాలని చైర్ పర్సన్ ప్రశ్నించారు. ఫోన్ చేసినా స్పందన లేకపోవడం, వాట్సాప్ మెసేజ్ పెట్టినా పలకకపోవడానికి కారణమేమిటని అడిగారు. ఎక్స్అఫిషియో మెంబర్ హోదాలో హాజరైన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి స్పందించి మీ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన అవసరం కమిషనర్కు లేదని, ఆయన క్షమాపణ ఎందుకు చెబుతారు.. ఏమైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోండి .. అంటూ అడ్డు చెప్పారు. కమిషనర్ కౌన్సిల్ సభ్యులందరికీ జవాబుదారీగా వ్యవహరించాలని.. గతంలో ఎమ్మెల్యే చెప్పిన విషయాన్ని మున్సిపల్ వైస్చైర్మన్ ఆయిల్మిల్ ఖాజా ఈ సందర్భంగా గుర్తుచేశారు. బీసీ మహిళా చైర్ పర్సన్ అని చులకనగా చూస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేశారు. చైర్ పర్సన్కు కమిషనర్ సారీ చెప్పాల్సిందేనని వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లు పోడియం వద్ద బైఠాయించారు. దీంతో కొంతమంది టీడీపీ సభ్యులు కమిషనర్కు మద్దతుగా బైఠాయించారు. వాగ్వాదాల మధ్య సభ జరుగుతుండగా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి అర్ధంతరంగా బయటికి వెళ్లిపోయారు. సమావేశం నుంచి వెళ్లిన కమిషనర్ కౌన్సిల్ సమావేశం జరుగుతుండగానే మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డి ఎమ్మెల్యే వరదరాజులరెడ్డితోపాటు కిందివైపున ఉన్న తన ఛాంబర్కు వెళ్లిపోయారు. సమావేశం వాయిదా వేయకుండా, చైర్ పర్సన్ అనుమతి లేకుండా ఆయన ఎలా వెళ్లిపోతారని చైర్పర్సన్, వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారుమునిరెడ్డి, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ప్రశ్నించారు. తిరిగి కమిషనర్ సమావేశం జరిపే వరకు ఇక్కడే ఉంటామని హాల్లోనే రాత్రంతా గడిపి... అక్కడే భోజనాలు చేసి నిద్రకు ఉపక్రమించారు. అరెస్టు చేసేందుకు పోలీసుల యత్నం మున్సిపల్ కౌన్సిల్ హాల్లో ఉన్న చైర్పర్సన్, వైస్ చైర్మన్లను, కౌన్సిలర్లను అరెస్టు చేసేందుకు రాత్రి పోలీసులు బెదిరింపులకు దిగారు. మంగళవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో పోలీసులు మీరు కౌన్సిల్ హాల్ నుండి వెళ్లిపోకుంటే అరెస్టు చేస్తామని మున్సిపల్ వైస్ చైర్మన్ పాతకోట బంగారు మునిరెడ్డితో అన్నారు. చైర్పర్సన్ అనుమతి లేకుండా పోలీసులు కౌన్సిల్ హాల్లోకి వచ్చేందుకే వీలులేదని, ఏ చట్ట ప్రకారం తమను అరెస్టు చేస్తారని ప్రశ్నించారు. ఏ చర్యలు తీసుకువాలన్నా చైర్ పర్సన్ అనుమతి తీసుకోవాలని అనడంతో పోలీసులు వెళ్లిపోయారు. బుధవారం ఉదయం చైర్పర్సన్ పలుమార్లు అనంతపురంలోని మున్సిపల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ నాగరాజుకు ఫిర్యాదు చేశారు. సమావేశం జరుపుతారా లేదా? అని అడిగారు. చైర్పర్సన్ ఫిర్యాదుతో ఆర్డీడీ కమిషనర్ ఆగ్రహంతో కమిషనర్, ఆర్ఓ, క్లర్క్లను సస్పెండ్ చేస్తామని హెచ్చరించినట్లు విశ్వసనీయ సమాచారం.లార్డీడీ ఆదేశాల మేరకు కమిషనర్ దిగి వచ్చి 20 గంటల తర్వాత మధ్యాహ్నం యథావిధిగా కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించారు. అజెండాలోను అంశాలకు సభ్యులు ఆమోదం తెలిపారు. ఎగ్జిబిషన్ గెజిట్ను సవరణ చేయాలని సూచించారు. సమావేశానికి కేవలం వైఎస్సార్సీపీ సభ్యులు మాత్రమే హాజరయ్యారు. ఈ సందర్భంగా వైఎస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా మాట్లాడుతూ సభా సాంప్రదాయం ప్రకారం కౌన్సిల్ సమావేశాలు నిర్వహించుకోవాలని, నిబంధనలను పాటించాలని సూచించారు. పంతాలకు, పట్టింపులకు పోతే నష్టపోయేది అధికారులేనన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ కౌన్సిలర్లు చేపట్టిన నిరసనకు 13వ వార్డు కౌన్సిలర్, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జి ఇర్ఫాన్ బాషా మద్దతు తెలిపారు. పొరపాటు చేసిన కమిషనర్ మంగళవారం కౌన్సిల్ సమావేశం జరుగుతుండగా మధ్యలోనే ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వెంట వెళ్లిన కమిషనర్ పొరపాటు చేసి ఇరుక్కుపోయారు. ఎందుకు సమావేశం నుంచి మధ్యలో వెళ్లిపోయారని చైర్పర్సన్ ఫిర్యాదు చేయగా విధి నిర్వహణ సమయం దాటిపోయిందని (ఆఫీస్ అవర్స్) వెళ్లిపోయినట్లు కమిషనర్ లిఖిత పూర్వకంగా సమాధానం ఇచ్చారు. దీంతో వైఎస్సార్సీపీ సభ్యులు బుధవారం ఆఫీస్ అవర్స్ ప్రారంభమయ్యాయని తిరిగి సమావేశం నిర్వహించాలని కోరారు. దీంతో కమిషనర్కు సందిగ్ద పరిస్థితి ఏర్పడింది. సభ్యులందరు బ్లాక్ రిబ్బన్లు ధరించి కౌన్సిల్ హాల్లో నిరసన వ్యక్తం చేయడంతోపాటు సెల్ఫీ వీడియోల ద్వారా ఆర్డీడీ, కలెక్టర్కు ఫిర్యాదు చేయడంతో మళ్లీ కౌన్సిల్ సమావేశం జరిగింది. -
ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం
● అన్నింటా ప్రబలుతున్న విష జ్వరాలు ● కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ● ప్రభుత్వాస్పత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత బద్వేలు అర్బన్/ప్రొద్దుటూరు క్రైం : బద్వేల్ పట్టణంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ వార్డులో చూసినా ఇంటికి ఒకరు, ఇద్దరు చొప్పున జ్వర పీడితులు చికిత్సకు రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యుల కొరత ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల్లో బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో 250 నుండి 400 ఓపీ నమోదవుతుండటం పరిస్థితికి అద్దంపడుతోంది. ఏ ప్రైవేటు ఆసుపత్రి చూసినా జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. ఆస్పత్రి కిటకిటలాడుతున్నా తగినంతమంది వైద్యులు లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఆరుగురే ఉన్నారు. వీరిలోనూ ఒకరు డిప్యుటేషన్పై వారంలో రెండు రోజులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షలు నిర్వహించే యంత్రం మరమ్మతులకు గురికావడంతో రోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రక్తనమూనాలు సేకరించి గాంధీనగర్ అర్బన్ హెల్త్సెంటర్లో పరీక్ష చేయిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. కిక్కిరిసిన చిన్నపిల్లల వార్డు ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రిలో రోజూ సుమారు 1100 దాకా ఓపీ నమోదవుతోంది. మరోవైపు రాజుపాళెం, కామనూరు, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఓపీ పెరిగింది. కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు వర్షాలు పడుతుండడం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో పలువురు జ్వరాల బారిన పడి ఆస్పత్రికి వస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. ఎక్కువమంది చిన్నారులు జ్వరం, జలుబు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కిటకిటలాడుతోంది. 20 మంచాలు మాత్రమే ఉండడంతో 30 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. మంచాల కొరత కారణంగా ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటుగా మరింతమంది చికిత్స పొందుతున్నారు. రక్త పరీక్షల కోసమే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఓపీ కోసం బారులు తీరిన జ్వరపీడితులు చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు -
ఆదివాసుల హక్కుల కోసం స్టాన్స్వామి పోరాటం
ప్రొద్దుటూరు కల్చరల్ : ఆదివాసుల హక్కుల కోసం ఫాదర్ స్టాన్స్వామి తన జీవితాంతం పోరాటం చేశారని జన విజ్ఞాన వేదిక జిల్లా యూత్ కన్వీనర్ హేమంత్ కుమార్ తెలిపారు. స్థానిక జేవీవీ కార్యాలయంలో మానవ హక్కుల కార్యకర్త ఫాదర్ స్టాన్ స్వామి జైలులో రాసిన ‘మౌన ప్రేక్షకుణ్ణి కాను’ పుస్తక పరిచయ సభ బుధవారం నిర్వహించారు. కవి మహమూద్ అధ్యక్షతన జరిగిన ఈ సందర్భంగా హేమంత్కుమార్ మాట్లాడుతూ ఆదివాసుల గ్రామసభ అనుమతి లేనిదే ఎవరు భూములు కొనడానికి వీలులేదని అన్నారు. అటవీ హక్కుల చట్టాన్ని గత ప్రభుత్వాలు తుంగలో తొక్కాయన్నారు. కనీస వసతులు కల్పించకుండా జైలులో ఆయన చనిపోవడానికి కారణమయ్యారన్నారు. మిత్రజ్యోతి సాహితీ సంస్థ కన్వీనర్ మహమూద్ మాట్లాడుతూ ప్రస్తుత సామాజిక స్థితికి పుస్తకం అద్దం పడుతుందని, హక్కుల కోసం గొంతెత్తితే ఎటువంటి వారైనా కఠిన పరిస్థితులను ఎదుర్కోవాల్సిందేనని చెబుతోందని అన్నారు. విరసం కార్యవర్గ సభ్యురాలు వరలక్ష్మి మాట్లాడుతూ ఈ పుస్తకం భీమా కొరేగాం అక్రమ కేసులో నిబంధించబడిన బుద్ధి జీవుల గొంతుక అని చెప్పారు. మధ్య భారతంలో కగార్ పేరుతో సహజ వనరులను తవ్వి తీయడానికి ఆదివాసులపై నరమేధం చేస్తున్నారన్నారు. ఈ కార్యక్రమంలో జేవీవీ రాష్ట్ర నాయకుడు తవ్వాసురేష్, రచయితలు దాదాహయత్, కుప్పిరెడ్డి పద్మనాభరెడ్డి, జింకా సుబ్రహ్మణ్యం, చైతన్య మహిళా సంఘం పద్మ, గోపీనాథ్రెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి సుబ్బరాయుడు, ఇన్నర్వీల్ భారతి, దేవానంద్, కొత్తపల్లి శ్రీను, పౌరహక్కుల సంఘం సురేష్, ప్రొఫెసర్ షఫీవుల్లా, హైమ, రాకేష్, బాల నరసింహులు తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు–తాడిపత్రి రహదారిపై ఓ లారీ భీబత్సం సృష్టించింది. వేగంగా వస్తూ రహదారిపై వెళ్తున్న గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. వాటిని మేపే ఇద్దరు గొర్రెల కాపరులపై వెళ్లడంతో వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 15 గొర్రెలు మృతి చెందాయి. ఎస్ఐ రామకృష్ణ వివరాల మేరకు.. నంద్యాల జిల్లా అళ్లగడ్డ తాలూకా నల్లవాగుపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు(45), ఆలమూరు గ్రామానికి చెందిన నరసింహులు(35) తమ యజమాని క్రిష్ణయ్యకు చెందిన గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి గండికోట ప్రాంతంలో గొర్రెలు మేపి స్వగ్రామానికి యజమాని క్రిష్ణయ్యతో కలిసి బయలుదేరారు. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్డులో వెనుకవైపు నుంచి అతి వేగంగా గుర్తుతెలియని లారీ దూసుకువచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందగా, నరసింహులును ప్రొద్దుటూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. యజమాని క్రిష్ణయ్య ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 15 గొర్రెలు మృతిచెందడంతో దాదాపు రూ. 2.50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, మృతుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని క్రిష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బోరున విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ తెలిపారు. ఇద్దరు వ్యక్తుల దుర్మరణం మృతిచెందిన వెంకటేశ్వర్లు, నరసింహులు -
ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీని, జాతీయ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వ విధానాలు బలహీన పరుస్తున్నాయని సీపీఎం రాజ్యసభ సభ్యుడు శివ దాసన్ తీవ్రంగా విమర్శించారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి అధ్యక్షతన బుధవారం కడప యూటీఎఫ్ భవన్లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల సెమినార్ లో సీపీఎం రాజ్యసభ్యులు శివదాసన్ మాట్లాడుతూ దేశంలో యూనివర్సిటీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరని, విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయని అన్నారు. ఆరోగ్య రంగంలో కేటాయింపులు తగ్గిపోవడం వల్ల చిన్న సమస్యలు కూడా నియంత్రించలేని స్థితి నెలకొందన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి టీడీపీ, వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు విగ్రహాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని, కానీ స్కూళ్లను, హాస్పిటల్స్ ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, ప్రజాప్రతినిధులపై ఉందని, పెన్షన్ సదుపాయం అన్నది రాజ్యాంగ హక్కు అని పాలకులు గుర్తించాలని అన్నారు. కేరళ తరహా ప్రత్యామ్నాయ విధానాల కోసం అంతా ఐక్యం కావాలని పిలుపునిచ్చారు. అవధానం శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మి రాజా, నాగమునిరెడ్డి, రాజశేఖర్ రాహుల్, రవి తేజ, ఎన్.శివశంకర్ , రామ్మూర్తి నాయుడు, అజీజ్, లలిత, రామకృష్ణా రెడ్డి, సుధాకర్, వెంకటరామరాజు పాల్గొన్నారు. -
అయ్యా.. ఇవ్వండి యూరియా
చాపాడు : అయ్యా.. ఇవ్వండి యూరియా అంటూ మండలంలోని అల్లాడుపల్లెకు వచ్చిన వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ చంద్రానాయక్ను అల్లాడుపల్లె, లక్ష్మీపేట, శ్రీరాములపేట, పెద్ద గురవలూరు గ్రామాల రైతులు నిలదీశారు. జేడీఏను చుట్టుముట్టి యూరియా కోసం తాము పడుతున్న అవస్థలు విన్నవించారు. రైతుసేవా కేంద్రాల ద్వారా యూరియా తెప్పించి సరిపడేంత అందించాలని డిమాండ్ చేశారు. ఇప్పటికే ప్రైవేట్ దుకాణాల్లో బస్తా రూ.400–500 వరకు పెట్టి తెచ్చుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని, ఒక బస్తా ఇస్తే పంటలు ఎలా సాగు చేయాలని వారు ప్రశ్నించారు. దీనికి స్పందించిన జేడీఏ మాట్లాడుతూ యూరియా వాడకాన్ని వరిపైరులో తగ్గించాలని, ఎకరాకు 75 కిలోలు మూడు విడతల్లో అందించుకోవాలని సూచించారు. మామూలు యూరియా బదులు నానో యూరియా వాడితే డబ్బు ఆదా అవుతుందని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏడీఏ కృష్ణమూర్తి, వ్యవసాయాధికారి దేవీపద్మలత, వ్యవసాయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. జేడీఏను చుట్టుముట్టి నిలదీసిన రైతులు -
నేపాల్లోని తెలుగువారి రక్షణకు చర్యలు
కడప సెవెన్రోడ్స్: నేపాల్లో జరుగుతున్న హింసాత్మక సంఘటనల నేపథ్యంలో అక్కడున్న తెలుగు వారిని సురక్షితంగా వెనక్కు తీసుకు వచ్చేందుకోసం వైఎస్సార్ కడపజిల్లా యంత్రాంగం ప్రత్యేక చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా కలెక్టరేట్లో కంట్రోల్ రూము నెంబరు 08562–246344 ఏర్పాటు చేసింది. నేపాల్లో ఉన్న భారతీయుల కోసం రాష్ట్ర ప్రభుత్వం కూడా హెల్ప్లైన్ నెంబర్లను ఏర్పాటుచేసినట్లు జిల్లా యంత్రాంగం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్కు చెందిన ప్రజల కోసం ఢిల్లీలోని ఏపీ భవన్లో హెల్ప్లైన్ నెంబర్లు 98183 95787, 85000 27678 ఏర్పాటు చేశారు. ఇవి కాకుండా ఏపీఎన్ ఆర్టీఎస్ హెల్ప్లైన్ నెంబరు 0863 2340 678 సైతం అందుబాటులో ఉంటుంది. నేపాల్లో చిక్కుకున్న వారి వివరాలు పొందుపరిచేందుకు స్కానర్ సైతం అందుబాటులోకి తీసుకువచ్చారు. కలెక్టరేట్ కంట్రోల్ రూము 08562–246344 -
ప్రతిభకు ఉపకారం
కడప ఎడ్యుకేషన్: ప్రభుత్వ బడుల్లో గ్రామీణ,పేద,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే అధికంగా చదువుతుంటారు. చాలా మంది విద్యార్థులు ఆర్థిక కారణాలతో మధ్యలో బడి మానేసి విద్యకు దూరవుతున్నారు. దీంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేలా కేంద్ర ప్రభుత్వం ఉపకారవేతనం అందిస్తూ చేయూతనిస్తోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో అర్హత సాఽధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్లు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం అందుతుంది. దరఖాస్తుకు ఈనెల 4నుంచి 30వ తేదీ తుది గడువు విధించారు. పరీక్ష డిసెంబర్ 7వతేదీ నిర్వహిస్తారు. ఎవరు అర్హులు: ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7 వ తరగతిలో ఓసీ,బీసీలైతే 55 శాతం, ఎస్సీ,ఎస్టీలైతే 50 శాతం మార్కులు లేదా దానికి సమాన మైన గ్రేడ్ పొందిన వారు అర్హులు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. ప్రభుత్వ ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠశాలల్లో రెగ్యులర్గా చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలు ,రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులు WWW.bse.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 వేలు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు ఈ పారితోషికానికి ఎంపికై తే 9 నుంచి 12వ తరగతి వరకు ఉపకారవేతనం అందుతుంది. ఏడాదికి రూ.12వేల చొప్పున మొత్తం రూ.48 వేలు ఇవ్వనున్నారు. విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తీసి వివరాలు సమర్పిస్తే నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని విభాగాల వారీగా అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఇందులో రెండు ప్రశ్నపత్రాలు ఉంటాయి. మూడు గంటల పాటు పరీక్ష సమయాన్ని కేటాయించారు. మెంటల్ ఎబిలిటీ పరీక్ష: వెర్బల్, నాన్ వెర్బల్, రీజనింగ్ నుంచి 90 ప్రశ్నలుంటాయి. దీనికి 90 మార్కులు స్కాలిసిస్ అప్టిట్యూట్ పరీక్ష: ఇందులో 7,8 తరగతుల స్థాయిలో నేర్చుకున్న గణితం, సామాన్య,సాంఘిక విషయాలపై ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 180 మార్కులు. ఎన్ఎంఎంఎస్ సమాచారం ఇలా.. ఎన్ఎంఎంస్కు దరఖాస్తులకు వేళాయే 9వ తరగతి నుంచి ఇంటర్ వరకు ప్రోత్సాహకాలు ఏడాదికి రూ. 12 వేల ఆర్థిక సాయం అన్ని ప్రభుత్వ యాజమాన్యాల్లో 8వ తరగతి విద్యార్థులు అర్హులు ప్రారంభమైన ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ సెప్టెంబర్ 30వ తేదీ వరకు గడువు డిసెంబర్ 7న రాత పరీక్ష ఆన్లైన్ దరఖాస్తుల స్వీకరణ: 04–09–25 ఆన్లైన్లో దరఖాస్తు చేయడానికిచివరితేదీ : 30.09.25 దరఖాస్తుకు వెబ్సైట్: WWW.bse.gov.in పరీక్ష ఫీజు వివరాలు ఓసీ, బీసీ విద్యార్థులకు ఫీజు: రూ.100 ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు: రూ.50(ఎస్బిఐ కలెక్ట్ లింక్ ద్వారా) ఎన్ఎంఎంఎస్ రాత పరీక్ష: 07.12.2025 ఎంపీపీ, జెడ్పీ స్కూళ్లు 7698 ప్రభుత్వ స్కూళ్లు 503 మున్సిపల్ స్కూళ్లు 1563 ఎయిడెడ్ స్కూళ్లు 423 ఓరియంటల్ స్కూళ్లు 171 ఏపీ మోడల్ స్కూళ్లు 276 -
‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్త పిలుపు మేరకు చేపట్టిన ‘అన్నదాత పోరు’ గ్రాండ్ సక్సెస్ అయ్యిందని ఆ పార్టీ జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ‘అన్నదాత పోరు’ను అడ్డుకోవాలని ప్రభుత్వం పోలీసుల ద్వారా నోటీసులు ఇప్పించి, కేసులు పెడతామని బెదిరించినా రైతులు, రైతు కార్మికులు, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు వాటికి లొంగకుండా రోడ్లపైకి వచ్చారన్నారు. వారందరికీ పేరుపేరునా కృతజ్ఞతలు తెలిపారు. శాంతియుతంగా ర్యాలీ చేస్తామని చెప్పినా .. పోలీసులు అడుగడుగునా అడ్డుకుని ప్రజాస్వామ్యాన్ని అంతం చేయాలని చూశారన్నారు. ఎన్నికల హామీలు అమలు చేయకపోతే ప్రభుత్వాన్ని దించే పరిస్థితి రావాలన్నారు. వ్యవసాయానికి సంబంధించి ముందస్తు ప్రణాళిక అనేదే లేకుండా ప్రభుత్వం వ్యవహరించిందన్నారు. రాష్ట్రా నికి 8లక్షల టన్నుల యూరియా కావాల్సి ఉంటే ముందే ప్లాన్ చేసి ఏప్రిల్, మే నెలల్లోనే కేంద్రానికి ఇండెంట్ ఇవ్వకుండా తాత్సారం చేసిందన్నారు. తీరా రైతులకు యూరియా అవసరమయ్యే సమయానికి ప్రభుత్వం వద్ద నిల్వలు లేవని, దీంతో ఆడలేక మద్దెల ఓడు అన్నట్లు యూరియా వేసిన వరి తింటే కేన్సర్ వస్తుందని చెప్పడం సరికాదన్నారు. అలాగే 100 శాతం యూరియాను ప్రైవేటు డీలర్లకే అప్పగించడం వల్ల రూ.270కి అమ్మాల్సిన క్వింటా యూరియాను రూ.700–800లకు అమ్ముతున్నారన్నారు. ఇందులో సుమారు రూ.400కోట్ల అవినీతి జరిగిందని ఆరోపించారు. రైతు భరోసా కేంద్రాలు, సచివాలయాలను ఉపయోగించుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. వారం పదిరోజుల్లోనే 15 మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారన్నారు. అడుగడుగునా ప్రభుత్వం రైతులకు అన్యాయం చేస్తూనే ఉందన్నారు. ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సభలు...? సూపర్ సిక్స్ హామీలు సూపర్ హిట్ అయ్యాయని కూటమి పార్టీల నేతలు సభ నిర్వహించడం ఆశ్చర్యంగా ఉందన్నారు. ఇంకా ఎవరిని మభ్యపెట్టడానికి ఈ సభలు నిర్వహిస్తున్నారని ప్రశ్నించారు. పింఛన్ రూ.4వేలకు పెంచి 5లక్షల పింఛన్లు తొలగించారని, 19 ఏళ్లు నిండిన మహిళలకు ఆడబిడ్డ నిధి కింద నెలకు రూ.1500 ఇవ్వలేదని, నిరుద్యోగ భృతి అసలే లేదన్నారు. సంబటూరు ప్రసాద్రెడ్డి, పార్టీ నేతలు పులి సునీల్కుమార్, బీహెచ్ ఇలియాస్ పాల్గొన్నారు. పోలీసులు నోటీసులిచ్చి బెదిరించినారైతులు వెనకడుగు వేయలేదు ప్రభుత్వం రైతులకు అడుగడుగునా మోసం చేసింది వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడుపి. రవీంద్రనాథ్రెడ్డి -
బాల్య వివాహాలను కట్టడి చేద్దాం
కడప కోటిరెడ్డిసర్కిల్: జిల్లాలో బాల్య వివాహాలు జరగకుండా తగిన చర్యలు చేపట్టాలని ఐసీడీఎస్ పీడీ రమాదేవి అన్నారు. బుధవారం కలెక్టరేట్లోని జిల్లా బాలల రీసోర్స్ సెంటర్లో సీడీపీఓలు, సూపర్వైజర్లకు మిషన్ శక్తి పథకంపై పది రోజుల కార్యక్రమంలో భాగంగా తొలిరోజు కార్యక్రమాలను ఆమె ప్రారంభించారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ బాల్య వివాహాలు అనేక అనర్థాలకు దా రి తీస్తాయని సూచించారు. మిషన్ వ్యాత్సల్య పథకం ద్వారా చిన్నారులను చట్టబద్దంగా దత్తత తీసుకోవాలని ఆమె సూచించారు. సీడీపీఓలు శ్రీలత, సునీత, శ్రీదేవి, జిల్లా మిషన్ శక్తి కోఆర్డినేటర్ శోభారాణి, డీసీపీఓ సుభాష్ యాదవ్, సఖి వన్స్టాప్ సెంటర్ అడ్మినిస్ట్రేటర్ అశ్విని, కౌన్సిలర్ పర్వీన్బాబు పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 14న జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నగరంలోని జయనగర్ కాలనీ జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో సీనియర్స్ బాల బాలి కల జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు ఒరిజినల్ ఆధార్కార్డుతో ఎంపికలకు హాజరుకావాలన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు నవంబర్ 7 నుంచి 10 వరకు జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆయన పేర్కొన్నారు. -
బీసీ మున్సిపల్ చైర్పర్సన్ అని చులకనా!
ప్రొద్దుటూరు: గత నెలలో ఎందుకు మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించలేదు..? తాను సమావేశం పెట్టాలని సమాచారం పంపినా ఎందుకు స్పందించలేదు.. అంటూ మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి మున్సిపల్ కమిషనర్ రవిచంద్రారెడ్డిని ప్రశ్నించారు. తాను బీసీ మున్సిపల్ చైర్పర్సన్ అని చులకనగా చూస్తున్నారా? అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. మంగళవారం మధ్యాహ్నం నిర్వహించిన మున్సిపల్ కౌన్సిల్ సమావేశానికి మున్సిపల్ చైర్పర్సన్ అధ్యక్షత వహించారు. గత నెలలో సాధారణ సమావేశం నిర్వహించాలని, తర్వాత అత్యావసర సమావేశం నిర్వహించాలని వాట్సాప్లో మెసేజ్ పెట్టానని, సిబ్బంది ద్వారా సమాచారం అందించానని చైర్పర్సన్ తెలిపారు. అయినా ఎందుకు స్పందించలేదని కమిషనర్ను ప్రశ్నించారు. కమిషనర్ వాట్సాప్ మెసేజ్ కూడా తీసుకున్నారని చైర్పర్సన్తోపాటు వైస్ చైర్మన్లు ఆయిల్ మిల్ ఖాజా, పాతకోట బంగారు మునిరెడ్డి తెలిపారు. దీనిపై కమిషనర్ ఎంతకూ స్పందించకపోవడంతో పోడియం వద్ద వైఎస్సార్సీపీ మహిళా కౌన్సిలర్లు బైఠాయించారు. చైర్పర్సన్కు సమాధానం ఇవ్వకపోవడం అంటే చైర్పర్సన్ను అవమానించినట్లేననే వైఎస్సార్సీపీ సభ్యులు తెలిపారు. ఎక్స్ అఫిసియో సభ్యుని హోదాలో హాజరైన ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి కమిషనర్ సారీ చెప్పాల్సిన అవసరం లేదని, జవాబు ఇవ్వాల్సిన పనిలేదన్నారు. మీరు ఏదైనా ఉంటే ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసుకోవాలే కానీ అడ్డుకోవడం తగదన్నారు. ‘కమిషనర్లు.. ప్రతి కౌన్సిలర్కు జవాబుదారీతనంగా ఉండాలని.. గతంలో మీరు చెప్పిన సూచనలు ఏమయ్యాయని వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా ఎమ్మెల్యే వరదరాజులరెడ్డిని సూటిగా ప్రశ్నించారు. సుమారు అరగంటకుపైగా సభ్యుల మధ్య వాగ్వాదం జరిగింది. చైర్పర్సన్, వైస్ చైర్మన్లు, సభ్యులకు సమాధానం ఇవ్వకుండానే కమిషనర్, ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్ది వెంట సమావేశం నుంచి వెళ్లిపోయారు. తిరిగి సమావేశం నిర్వహించే వరకు తాము ఇక్కడే కూర్చుంటామని చైర్పర్సన్తోపాటు వైస్ చైర్మన్లు, సభ్యులు సమావేశ మందిరంలోనే నిరసన తెలిపారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్పర్సన్ ఆర్డీడీకి ఫోన్లో కమిషనర్పై ఫిర్యాదు చేశారు. ఉద్దేశ పూర్వకంగానే ఎమ్మెల్యే ఆదేశాల మేరకు ఎగ్జిబిషన్ వేలం పాట నిర్వహించకూడదని, మున్సిపల్ కౌన్సిల్ సమావేశం నిర్వహించకుండా జాప్యం చేశారని వైస్ చైర్మన్లు ఆరోపించారు. కొత్తపల్లె పంచాయతీ పరిధిలో టీడీపీ వర్గీయులు కొత్తగా ఎగ్జిబిషన్ ప్రారంభిస్తున్నారని, అందుకోసమే మున్సిపాలిటీలో ఎగ్జిబిషన్ నిర్వహించకుండా వాయిదా వేస్తారా అని ప్రశ్నించారు. ప్రొద్దుటూరు మున్సిపల్ కౌన్సిల్ మీటింగ్ హాల్లో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, వైస్ చైర్మన్లు పాతకోట బంగారు మునిరెడ్డి, ఆయిల్ మిల్ ఖాజాతోపాటు వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు మంగళవారం రాత్రంతా గడిపారు. ఈ విషయమై చైర్పర్సన్ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. తాము మీటింగ్ హాల్లోనే ఉన్నామని.. అజెండా ప్రకారం సమావేశం నిర్వహించాలని కమిషనర్కు తెలిపారు. మున్సిపల్ చైర్పర్సన్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వని కమిషనర్ ఎమ్మెల్యే వరద వెంట వెళ్లడంతోబైఠాయించిన కౌన్సిలర్లు -
యూరియాపై ఆందోళన వద్దు
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో లక్ష ఎకరాలకు సరిపడ యూరియా ఉందని, రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో ఎస్పీ ఈజీ అశోక్ కుమార్, జాయింట్ కలెక్టర్ అదితి సింగ్లతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఖరీఫ్లో రైతులకు 12500 టన్నుల యూరియా అందజేశామన్నారు. మూడు రోజులుగా 1100 టన్నులు అందజేశామని, ఈ రోజు 150 టన్నులు పంపిణీ చేశామన్నారు. రానున్న రోజుల్లో 600–700 టన్నుల యూరియా జిల్లాకు రానుందని వెల్లడించారు. ఇప్పటికి 3.70లక్షల బస్తాల యూరియా తీసుకున్నారని తెలిపారు. ప్రైవేటు డీలర్లు బ్లాక్ మార్కెటింగ్కు పాల్పడితే కేసులు పెడుతున్నామన్నారు. యూరియా కేవలం నత్రజనిని మాత్రమే ఇస్తుందని.. ఎక్కువ వాడితే పంటకు నష్టం కలుగుతుందని చెప్పారు. ఉల్లి ఎంతైనా కొంటాం: జిల్లాలో పదివేల ఎకరాల్లో ఉల్లిపంట సాగుచేశారని, రెండు రోజుల నుంచే కోత ప్రారంభమైందని కలెక్టర్ తెలిపారు. ఈనెల 22, 23 తేదీల నుంచి పంట మార్కెట్కు వస్తుందన్నారు. మార్క్ఫెడ్ ద్వారా కిలో రూ.12ల చొప్పున ప్రభుత్వం కొనుగోలు చేస్తుందన్నారు. జిల్లాలో చీని రైతులు 80 శాతం మంది ఇప్పటికే పంట అమ్ముకున్నారన్నారు. మార్కెట్లో వేలం నిర్వహించే సమయంలో బాగా గ్రేడింగ్ చేసి తీసుకురావాలని సూచించారు. బ్లాక్ మార్కెట్ చేస్తే చర్యలు కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి -
గల్లంతైన యువకుడి మృతదేహం లభ్యం
ఎర్రగుంట్ల : యర్రగుంట్ల మండలం పోట్లదుర్తి పరిధిలోని పెన్నానదిలో గల్లంతు అయిన చెన్నూర్ ఫయాజ్ మృత దేహం లభించిందని యర్రగుంట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన చెన్నూర్ ఫయాజ్తో పాటు మరికొంత మంది యువకులు సోమవారం సాయంత్రం చేపలు పట్టడానికి పెన్నానది వద్దకు వెళ్లారు. అయితే చేపలు పడుతున్న సమయంలో చెన్నూరు ఫయాజ్ (25) అనే వ్యక్తి ప్రమాదశాత్తు నదిలో పడి గల్లంతు అయ్యాడు. సమాచారం అందిన వెంటనే పోలీస్, అగ్నిమాపక సిబ్బంది సంయుక్తంగా బోటు సాయంతో సోమవారం రాత్రింతా గాలించారు. మంగళవారం ఉదయం కూడా బోటు సాయంతో పెన్నానది నీటి ప్రవహం వెంబడి గాలింపు చేశారు. హనుమనుగుత్తి గ్రామ సమీయంలో దడికి ఫయాజ్ మృతదేహం ఉండటం అగ్నిమాపక, పోలీస్ సిబ్బంది గుర్తించారు. మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిమిత్తం ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామని సీఐ తెలిపారు. ఎరువు కోసం వెళ్లి వస్తుండగా.. – లారీ ఢీ కొని రైతు మృతి చాపాడు : మైదుకూరు– ప్రొద్దుటూరు ప్రధాన రహదారిలో గల మండల పరిధిలోని ఆనంద ఆశ్రమం క్రాస్ రోడ్డు వద్ద మంగళవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో సోమాపురం గ్రామానికి చెందిన లెక్కల లక్ష్మిరెడ్డి (65) అనే రైతు అక్కడికక్కడే మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. స్థానికులు తెలిపిన వివరాలు మేరకు.. లక్ష్మిరెడ్డి ఎరువుల కోసం మైదుకూరుకు వెళ్లి తిరిగి గ్రామానికి ఎక్స్ఎల్ ద్విచక్ర వాహనంపై వస్తుండగా రాత్రి 8 గంటల ప్రాంతంలో సోమాపురం క్రాస్ రోడ్డు దాటుతుండగా ఫ్లై ఓవర్ బ్రిడ్జిపై నుండి ప్రొద్దుటూరుకు వెళుతున్న వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో లక్ష్మిరెడ్డి తలకు తీవ్ర గాయం కాగా అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటనలో మోటార్ సైకిల్ నిప్పంటుకుని కాలిపోయింది. మృతునికి భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఈ ప్రమాదంపై పోలీసులు సంఘటన స్థాలానికి చేరుకుని కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇటీవల జాతీయ రహదారిని విస్తరణ చేసి ఫ్లైఓవర్ బ్రిడ్జి నిర్మించడం వలన సోమాపురం వెళ్లే గ్రామస్తులు రోడ్డు దాటుకునేందుకు ఇబ్బందులు పడుతున్నారు. ఇప్పటికై నా రోడ్డు నిర్మాణ అధికారులు చర్యలు తీసుకుని తగిన జాగ్రత్తలు ఏర్పాట్లు చేయాలని కోరుకుంటున్నారు. టిప్పర్ ఢీ కొని వ్యక్తి మృతి ఖాజీపేట : జాతీయ రహదారి లో జరిగిన రోడ్డు ప్రమాదంలో కె. సుబ్బయ్య (48) అనే వ్యక్తి మృతి చెందాడు. వివరాల్లోకి వెళితే చాపాడు మండలం నాగసానిపల్లె గ్రామం వద్ద ఉన్న గుట్ట నుంచి మట్టిని టిప్పర్ ద్వారా తరలిస్తున్నారు. అందులో భాగంగా అల్లాడు పల్లె నుంచి ఖాజీపేట మండల పరిధిలోని జాతీయ రహదారి అయ్యప్ప స్వామి గుడి దగ్గరకు రాగానే ముందు వెళుతున్న బైక్ను టిప్పర్ ఢీ కొంది. దీంతో బైక్ పై ఉన్న సుబ్బయ్య రోడ్డు నుంచి కాలువలో పడ్డాడు. కాలువలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఖాజీపేట పోలీసులు అక్కడికి చేరుకుని చనిపోయిన వ్యక్తిని కడప రిమ్స్ లోని మార్చురీకి తరలించారు. చనిపోయిన వ్యక్తిది ప్రొద్దుటూరు గా గుర్తించారు. ఆమేరకు టిప్పర్ డ్రైవర్ జహంగీర్ ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. పోక్సో కేసులో నిందితుడు అరెస్ట్ కడప అర్బన్ : ఐదేళ్ల చిన్నారిపై అత్యాచారయత్నం కు పాల్పడిన రౌడీ షీటర్ రాజ్కుమార్ పై పోక్సో యాక్ట్ కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి నిందితుడిని మంగళవారం అరెస్టు చేసినట్లు తాలూకా ఎస్ఐ తులసి నాగప్రసాద్ తెలిపారు. తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రౌడీషీటర్ రాజ్ కుమార్ ఈనెల ఏడో తేదీన ఐదేళ్ల చిన్నారిని చాక్లెట్ ఇచ్చి తన ఇంట్లో ఎత్తుకుని వెళ్లి అత్యాచారయత్నం కు పాల్పడే ప్రయత్నం చేశాడని తెలిపారు. ఈకేసుకు సంబంధించి నిందితుడిని అరెస్టు చేసి రిమాండ్ కు తరలించినట్లు తెలిపారు. తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం – టపాసులు పడి బోదకొట్టం దగ్ధం వీరబల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్లో కరిముల్లా అనే వ్యక్తి బోదకొట్టం నిర్మించుకొని టీ అమ్ముకొని జీవనం సాగించేవాడు. మంగళవారం రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం ఇన్చార్జ్ పదవి చేపట్టిన జగన్ మోహన్ రాజు మొట్టమొదటి సారిగా మండలానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్లో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో టపాసులు కాల్చడంతో అవి ఆ బోదకొట్టంపై పడి పూర్తిగా కాలిపోయింది. దీంతో కరీముల్లా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో నిరుత్సాహంగా ఉండిపోయింది. కరీముల్లా ఇటీవల వేలు ఖర్చుచేసి బోదకొట్టం ఏర్పాటు చేసుకున్నాడు. -
కేఎన్ఆర్ ట్రావెల్స్ కార్యాలయంపై దాడి
పులివెందుల : పులివెందుల పట్టణంలోని శ్రీరామ హాలు రోడ్డులో ఉన్న కేఎన్ఆర్ ట్రావెల్స్ కార్యాలయంపై మంగళవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు దాడికి పాల్పడ్డారు. ట్రావెల్స్ ఎదురుగా కారు పార్కింగ్ చేయడంతో ట్రావెల్స్లో పనిచేసే వ్యక్తి కారును పక్కకు తీయాలని బస్సు వస్తుందని తెలపడంతో మాట, మాట పెరిగి ఘర్షణ చోటు చేసుకుంది. దీంతో కోపోద్రిక్తులైన కారులో ఉన్న గుర్తు తెలియని వ్యక్తులు ట్రావెల్స్లో పనిచేసే వ్యక్తిపై దాడికి పాల్పడటంతోపాటు ట్రావెల్స్లో ఉన్న ఫర్నీచర్, బస్సు అద్దాలను ధ్వంసం చేశారు. ఈ సంఘటనతో ఉద్రిక్త వాతావరణం చోటు చేసుకుంది. ఈ విషయం తెలుసుకున్న సీఐ సీతారామి రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకుని పరిస్థితిని అదుపులోకి తెచ్చారు. బస్సు అద్దాలు, ఫర్నీచర్ ధ్వంసం -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
గాయపడిన ప్రసాద్, శ్రీను, ప్రొద్దుటూరు ఆసుప్రతిలో వైద్యులతో మాట్లాడుతున్న మాజీ ఎమ్మెల్యే సుధీర్రెడ్డి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిలంకూరు గ్రామ పరిధిలోని సిర్రాజుపల్లి రోడ్డులో జేసీబీ యంత్రం పనులు చేస్తుండగా అదే మార్గంలో పోతున్న బైక్ను ఢీకొన్న సంఘటన మంగళవారం చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో బైకుపై పోతున్న మల్లికప్రసాద్ (40), యర్రగుళ్ల శ్రీను, శివశంకర్లకు గాయాలయ్యాయి. వీరిలో మల్లికప్రసాద్కు తీవ్ర గాయాలుకాగా మరో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. విషయం తెలుసుకున్న వెంటనే జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టరు మూలె సుధీర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకున్నారు. అనంతరం యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథ్రెడ్డి సంఘటన స్థలాన్ని చేరుకుని పరిశీలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు... సిర్రాజుపల్లి గ్రామానికి చెందిన మల్లికప్రసాద్, దండుపల్లి గ్రామానికి చెందిన యర్రగుళ్ల శ్రీను, శివశంకర్లు ముగ్గురు సిర్రాజుపల్లి రోడ్డు నుంచి బైక్లో చిలంకూరుకు బయలు దేరారు. చిలంకూరు గ్రామ సమీపంలోని స్మశాన వాటిక వద్దకు రాగానే జేసీబీ రోడ్డుకు అనుకుని పనులు చేస్తోంది. జేసీబీ ఆపరేటర్ ముందు భాగాన పనులు చేస్తుండగా వెనుక భాగాన ఉన్న జేసీబీ పళ్ల తొట్టి రోడ్డుకు దగ్గరలో ఉంది. అదే సమయంలో బైక్పైన ప్రసాద్, శ్రీను, శివశంకర్లు పోతుండుగా జేసీబీ తొట్టి తగిలింది. దీంతో బైక్పై ఉన్న ప్రసాద్ ఎగిరి తొట్టికి ఉన్న ఇనుప పళ్ల మధ్య ఇరుక్కోవడంతో ఇనుప పళ్లు ప్రసాద్ ఛాతీపై దిగింది. మిగిలిన ఇద్దరు శ్రీను, శివశంకర్ స్వల్పగాయాలతో బయట పడ్డారు. విషయం తెలుసుకున్న వెంటనే మాజీ ఎమ్మెల్యే డాక్టరు ఎం సుధీర్రెడ్డి సంఘటన స్థలానికి చేరుకుని గాయపడిన ముగ్గురికి ప్రొద్దుటూరులోని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రసాద్ పరిస్థితి విషమించడంతో కర్నూల్ కు తరలించారు. అక్కడ నుంచి హైదరాబాదుకు తరలించినట్లు సమాచారం. సంఘటన స్థలాన్ని సీఐ విశ్వనాథ్రెడ్డి పరిశీలించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ‘భారతి’ విద్యార్థులు
కమలాపురం : మండల పరిధిలోని నల్లలింగాయపల్లెలో వెలసిన భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) లోని డీఏవీ భారతి విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వామ్ కిషోర్ కుమార్ తెలిపారు. మంగళవారం పరిశ్రమ ప్రతినిధులతో కలసి ఆయన విజేతల వివరాలు వెల్లడించారు. ఇటీవల విజయ నగరం జిల్లాలోని రాజాం సీఎంఆర్ డీఏవీ పబ్లిక్ స్కూల్లో జరిగిన డీఏవీ రాష్ట్ర స్థాయి అథ్లెటిక్స్ పోటీల్లో పాల్గొని అత్యుత్తమ ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. అండర్–17 బాలుర విభాగంలో ఎన్వీ కార్తిక్రెడ్డి ట్రిపుల్ జంప్లో ప్రథమ స్థానంలో నిలిచాడు. అలాగే 400 మీ. పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచాడు. జావెలిన్ త్రోలో ఎం. షారూన్ కుమార్ తృతీయ స్థానంలో, 4్ఙశ్రీ400 మీటర్ల పరుగు పందెంలో నరేష్, కార్తీక్, భార్గవ్, షారూన్ ద్వితీయ స్థానంలో నిలిచారు. అండర్–17 బాలికల విభాగంలో వైశాలి ట్రిపుల్ జంప్లో ద్వితీయ స్థానంలో నిలిచారు. జావలిన్ త్రోలో విహారిక ద్వితీయ స్థానంతో పాటు 400మీటర్ల పరుగు పందెంలో తృతీయ స్థానంలో నిలిచింది. అండర్–14బాలికల విభాగంలో ట్రిపుల్ జంప్లో అశ్లిత ప్రథమ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో కేవీ రుషి జావెలిన్ త్రోలో తృతీయ స్థానంలో నిలిచాడు. కాగా విజేతలుగా నిలిచిన వారిలో కార్తిక్ రెడ్డి (ట్రిపుల్ జంప్), వైశాలి (ట్రిపుల్ జంప్), విహారిక (జావెలిన్ త్రో), అశ్లిత(ట్రిపుల్ జంప్) లు త్వరలో జరగబోయే డీఏవీ జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. కాగా విజేతలుగా నిలిచిన వారిని పరిశ్రమ సీఎంఓ సాయి రమేష్ ,ప్రతినిధులు గోపాల్రెడ్డి, భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రిలు అభినందించారు. -
దొరికింది ఎంత.. దాచింది ఎంత?
● గ్యాంబ్లింగ్ సంఘటనలో అనుమానాలు ఎన్నో ● 22 మంది పేకాటరాయుళ్లు అదుపులోకి.. ● రూ. 11,83,940 నగదు స్వాధీనం జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు మండల పరిధిలోని గండికోట– దప్పెర్ల రహదారిలో ముళ్లపొదల్లో భారీ ఎత్తున పేకాట ఆడుతున్నట్లు జిల్లా ఎస్పీ అశోక్ కుమార్కు అజ్ఞాత వ్యక్తులు సమాచారం ఇచ్చారు. ఎస్పీ ఆదేశాల మేరకు జమ్మలమడుగు పట్టణ సీఐ నరేష్బాబు ఎస్ఐ రామకృష్ణ, సిబ్బందితో కలసి దాడులు చేసి వివిధ ప్రాంతాలకు చెందిన 22 మందిని పేకాటరాయుళ్లను అదుపులోకి తీసుకున్నారు. కాగా వారి వద్ద నుంచి విశ్వసనీయ సమాచారం మేరకు సుమారు రూ. 80 లక్షల రూపాయలు మేరకు పట్టుబడినట్లు తెలుస్తోంది. ఉన్నతాధికారులు విచారిస్తే అసలు విషయం తెలుస్తుందని స్థానిక ప్రజలు కోరుతున్నారు. సీఐ నరేష్ బాబు విలేకరులతో మాట్లాడుతూ.. సీఐ నరేష్ బాబు మంగళవారం రాత్రి 8 గంటల ప్రాంతంలో పట్టణ పోలీస్స్టేషన్లో విలేకరుల సమావేశాన్ని నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ గండికోట– దప్పెర్ల రోడ్డు మార్గంలో పేకాట ఆడుతున్నట్లు సమాచారం రావడంతో సిబ్బందితో కలసి 7వ తేదీ దాడి నిర్వహించి 22 మంది పేకాటరాయుళ్ల వద్ద నుంచి రూ. 11, 83, 940 స్వాధీనం చేసుకుని నోటీసులు ఇచ్చి పంపామన్నారు. కాగా.. మండలపరిధిలోని చిటిమిటి చింతలలో ఈ నెల 7వ తేదీ పేకాట ఆడుతూ పట్టుబడిన 22 మంది మంగళవారం కొలిమిగుండ్ల మండలం అవుకు నుండి 15 లీటర్ల నాటు సారా తెచ్చుకుని గ్రామ సమీపంలో తాగుతున్నట్లు సమాచారం రావడంతో వారిని అదుపులోకి తీసుకోని కోర్టుకు హాజరు పరిచామని.. కోర్టు రిమాండ్ విధించినట్లు ఆయన తెలిపారు. ఇదిలా ఉండగా పోలీసులు స్వాధీనం చేసుకున్న డబ్బు విషయం ఎంత అనే దానిపై చర్చలు సాగుతున్నాయి. జూదరుల అరెస్ట్ కడప అర్బన్ : కడప నగరంలోని చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉక్కాయపల్లె దిబ్బల సమీపంలో జూదమాడుతున్న ఏడుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.. వారి వద్ద నుంచి రూ. 75వేలు నగదుతో పాటు, పేకముక్కలను స్వాధీనం చేసుకున్నారు. -
సాగు భూముల్ని కార్పోరేట్లకు కట్టబెడుతున్న బీజేపీ
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సాగు భూముల్ని కార్పొరేట్ కంపెనీలకు కట్టబెట్టడంతో వ్యవసాయ రంగం సంక్షోభంలోకి నెట్టబడుతోందని వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత అధ్యక్షులు విజయ రాఘవన్ అన్నారు. మంగళవారం కడప నగరంలోని హరిత హోటల్ ఆవరణంలో జాతీయ సమావేశాలు ప్రారంభ సూచిక సందర్భంగా జెండా ఆవిష్కరించారు. అనంతరం ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ భూ పంపిణీ సాగునీరు ఉపాధి హామీకై వ్యవసాయ కార్మికులు ఉద్యమించి పోరాడాలని పిలుపునిచ్చారు. విదేశీ పెట్టుబడులపై ఆధారపడి ఊహాజనితమైన పథకాలతో భూములు సేకరించి వ్యవసాయాన్ని గ్రామీణ ఆర్థిక వ్యవస్థను దెబ్బతీస్తున్నదని, రైతుల్ని వ్యవసాయ కూలీలను అభద్రతకు భయభ్రాంతులకు పాలకులు గురి చేస్తున్నారని ధ్వజమెత్తారు. బలవంతపు భూ సేకరణ వల్ల అభివృద్ధి జరగలేదని దీనివల్ల లక్షలాది రైతులు కూలీలు వృత్తిదారుల కుటుంబాలు రోడ్డున పడుతున్నాయన్నారు. నేడు నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాలా తీస్తోందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలస బాట పడుతున్నారని, సన్న ,చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. కానీ కేంద్రంలోని మోడీ ప్రభుత్వానికి ఇవి ఏమాత్రం పట్టడం లేదన్నారు. ఈ సమావేశంలో అఖిలభారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజు కృష్ణ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కార్యదర్శి బి వెంకట్, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర అధ్యక్ష కార్యదర్శులు దడాల సుబ్బారావు, వెంకటేశ్వర్లు, జిల్లా అధ్యక్ష కార్యదర్శులు శివకుమార్, అన్వేష్, జిల్లా ఉపాధ్యక్షులు జి చంద్రశేఖర్, జిల్లా రైతు సంఘం కార్యదర్శి దస్తగిరి రెడ్డి, సిఐటియు జిల్లా కార్యదర్శి బి మనోహర్, జిల్లా అధ్యక్షులు కే శ్రీనివాసులు రెడి,్డ జిల్లా నాయకులు ఏ రామ్మోహన్ పాల్గొన్నారు. వ్యవసాయ రంగ సంక్షోభం పుస్తకం ఆవిష్కరణ అఖిల భారత రైతు సంఘం ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ ఏపీ రైతు సంఘం రాష్ట్ర కమిటీ ముద్రించిన కార్పోరేట్ల కబంధ హస్తాల్లో వ్యవసాయ రంగం పుస్తకాన్ని మంగళవారం కడప హరిత హోటల్లో ఆవిష్కరించారు. కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరి రెడ్డి, రైతు సంఘం నాయకులు పాల్గొన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం అఖిలభారత అధ్యక్షుడు విజయ రాఘవన్ -
అన్నదాత సమస్యలపై వైఎస్సార్ సీపీ పోరుబాట
● కమిషన్ల కోసమే ప్రైవేటుకు యూరియా ● వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి కడప సెవెన్రోడ్స్ : కేంద్రం నుంచి యూరియా రాష్ట్రానికి రాగానే కమీషన్ల కోసం కక్కుర్తిపడి మొత్తం ప్రైవేటుకే ఇచ్చేశారని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ప్రభుత్వంపై విమర్శించారు. దీంతో బస్తా రూ. 270లకు అమ్మా ల్సిన యూరియా బ్లాక్లో రూ. 800–1000లకు అమ్ముతున్నారని పేర్కొన్నారు. బ్లాక్ మార్కెటీర్లపై తక్షణమే చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రైతు సమస్యలపై మంగళవారం ప్రతి అసెంబ్లీ నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో నిర్వహించనున్న ర్యాలీలను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. సోమవారం సాయంత్రం ఆ పార్టీ కార్యాలయంలో జెడ్పీ చైర్మన్ ముత్యా ల రామగోవిందరెడ్డి, వైస్ చైర్మన్ బాలయ్య, రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు ప్రసాద్రెడ్డి, పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డిలతో కలిసి ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎరువుల సమస్యపై ఆందోళనలు చేపట్టాలని తమ పార్టీ పిలుపునివ్వడంతో రైతులను మభ్య పెట్టేందుకు అధికారులు టోకన్లు పంపిణీ చేస్తున్నారని రవీంద్రనాథ్రెడ్డి ఆరోపించారు. తొలుతే ప్రణాళికబద్దంగా ప్రభుత్వం వ్యవహరించి ఉంటే యూరియా కొరత తలెత్తేది కాదన్నారు. యూరియాకోసం రైతులు సొసైటీల ఎదుట క్యూలు కడుతుంటే ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెంనాయుడు హేళనగా మాట్లాడటం దారుణమన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యానికి పెద్దపీట వేశారని గుర్తు చేశారన్నారు. కరోనా సమయంలోనూ రైతులను ఆదుకున్న ఘనత వైఎస్సార్ సీపీ ప్రభుత్వానిదేనన్నారు. వైఎస్సార్ సీపీ నాయకులు కొండూరు అజయ్కుమార్రెడ్డి, వీఎన్ పల్లె, చెన్నూరు ఎంపీపీలు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో సాక్షి టీవీ కరస్పాండెంట్కు గాయాలు
కడప అర్బన్ : కడప సాక్షి టీవీ చానెల్ సీనియర్ కరస్పాండెంట్ వెన్ను శ్రీనివాసరావు (50) సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఆయన కడప నగరంలోని ఓంశాంతి నగర్లో నివాసం ఉంటున్నారు. ఉదయం తన ఇంటి నుంచి స్కూటీలో వస్తుండగా చెత్తను తరలిస్తున్న ఆటోను తప్పిస్తుండగా ప్రమాదం జరిగింది. ఈ సంఘటనలో ఆయన ఎడమకాలు ఫ్రాక్చర్ అయింది. కడప నాగరాజుపేటలోని సన్రైజ్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. ఈ క్రమంలో ఆయనను మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజాద్బాషా, కడప నగర మేయర్ కె.సురేష్బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు తదితరులు పరామర్శించారు. సంఘటన గురించి అడిగి తెలుసుకున్నారు. మెరుగైన వైద్యం అందించాలని డాక్టర్లకు సూచించారు.పెన్నాలో యువకుడి గల్లంతుఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి– ప్రొద్దుటూరు మార్గన ఉన్న పెన్నాలో చేపలు పట్టడానికి వెళ్లి చెన్నూరు ఫయాజ్ (25) అనే వ్యక్తి ప్రమాదవశాత్తు నదిలో పడి గల్లంతు అయినారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు యువకులు చేపలు పట్టడానికి పోట్లదుర్తి పెన్నానది వద్దకు సాయంత్రం చేరుకున్నారు. వీరిలో చెన్నూరు ఫయాజ్ అనే యువకుడు చేపలు పట్టడానికి పోయే సమయంలో ప్రమాదవశాత్తు కాలు జారి నదిలో పడిపోయారు. నది బయట ఉన్న ముగ్గురు యువకులు గాలింపు చర్యలు చేపట్టారు. అప్పటికే ఫయాజ్ నదిలో గల్లంతు అయినారు. వెంటనే వారు ఫయాజ్ కుటుంబ సభ్యులకు సమాచారం తెలియజేశారు. ఫయాజ్ కుటుంబ సభ్యులు యర్రగుంట్ల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో సంఘటన స్థలానికి పోలీసులు వెళ్లారు. సీఐ విఽశ్వనాథ్రెడ్డి, ఫైర్ సిబ్బంది కూడా సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాలింపులు చేపట్టారు. రాత్రి కావడంతో మంగళవారం ఉదయం గాలింపులు చేసే అవకాశం ఉంది. -
వరాలందించే ఆరోగ్యమాత
● విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ ● ఘనంగా ముగిసిన ఆరోగ్యమాత ఉత్సవాలు ముగింపు ఉత్సవాలకు హాజరైన విశ్వాసులు విశేష అలంకారంలో ఆరోగ్యమాత స్వరూపం కడప సెవెన్రోడ్స్ : విశ్వసించిన వారికి వరాలు, దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆరోగ్యమాత అందజేస్తుందని విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ అన్నారు. కడప నగరం రైల్వేస్టేషన్ సమీపంలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన పూజ ప్రార్థన దినోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నగరంలో ఆరోగ్యమాత ఉండడం రాయలసీమ ప్రాంతానికి ఆశీర్వాదకరమని, పది రోజులుగా ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్థనలు వైభవంగా జరిగాయన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ఆరోగ్యమాత పతాక అవరోహణ చేశారు. రెవరెండ్ ఫాదర్ బి.జ్వాన్నేస్, రెవరెండ్ ఫాదర్ డేవిడ్రాజు పరిశుద్ధ జపమాల, దివ్యసత్ప్రసాద ఆశీర్వాదం చేశారు. ఉత్సవాల్లో జి.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎర్రగుడిపాడుకు చెందిన ఏసన్న బృందం చెక్కభజన భక్తులను ఆకట్టుకుంది. ఈ కార్యక్రమంలో గురువులు ఎండీ ప్రసాద్రావు, ఇతర గురువులు, కన్యసీ్త్రలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
రైతు బిడ్డకు జాతీయ స్థాయి పురస్కారం
వేముల : తెలంగాణ రాష్ట్రం హైదరాబాద్లో కడప రైతు బిడ్డ గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి అరుదైన జాతీయ స్థాయి పురష్కారాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. వివరాలలోకి వెళితే.. కడప జిల్లా వేముల మండలం కుప్పగుట్టపల్లె గ్రామానికి చెందిన గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి పదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిఫార్సుతో టర్బో సర్వీసెస్ రంగంలో కేవలం రూ.1400 జీతంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. చేసే పనిలో అంకితభావరం, కఠోర శ్రమతో అంచెలంచెలుగా ఎదిగారు. ఉద్యోగిగా ఉంటూనే వ్యాపార మెళకువలను ఆకలింపు చేసుకున్నారు. 2017లో కూకట్పల్లె కెపీహెచ్బీ కాలనీ కేంద్రంగా న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ అనే సంస్థను స్థాపించాడు. కేవలం కొన్నేళ్లలోనే తన సంస్థను అగ్రగామిగా నిలిపాడు. సేవా రంగంలో ఆయన అందిస్తున్న విశిష్ట సేవలను గుర్తించిన ఓ టీవీ న్యూస్ చానెల్ తెలంగాణాలో నిర్వహించిన కార్యక్రమంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు ఈనెల 5వ తేదీన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతులమీదుగా గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన సతీమణి కళ్యాణిలు అందుకున్నారు. ఒకప్పుడు ఉద్యోగం కోసం ఎదురు చూసిన లక్ష్మీనారాయణరెడ్డి నేడు తన సంస్థలో 100మందికి పైగా నిరుద్యోగులకు ఉపాధి కల్పిస్తూ వారి కుటుంబాలకు అండగా నిలుస్తున్నారు. -
భూమి, ఉపాధి కోసం పోరుబాట
● అఖిలభారత రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు ● ఘనంగా వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : భూ పంపిణీ, సాగునీరు, ఉపాధి హామీ కోసం వ్యవసాయ కార్మికులు ఉద్యమించాలని అఖిలభారత రైతు వ్యవసాయ కార్మిక సంఘాల ప్రధాన కార్యదర్శులు విజయ రాఘవన్, విజూ కృష్ణన్ వెంకట్, శివ దాసన్ తెలిపారు. కడపలో సోమవారం వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ సమావేశాలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా నగరంలోని హరిత హోటల్ నుంచి కోటిరెడ్డి సర్కిల్, ఎన్టీఆర్ సర్కిల్ మీదుగా పాత బస్టాండ్ వరకు ర్యాలీ నిర్వహించారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వారు మాట్లాడారు. నూతన ఆర్థిక విధానాల వల్ల వ్యవసాయ రంగం మొత్తం దివాలా తీస్తోందని, వ్యవసాయ కార్మికులు పెద్ద ఎత్తున వలస బాట పడుతున్నారని తెలిపారు. సన్న, చిన్నకారు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలు చేసుకుంటున్నారని పేర్కొన్నారు. కానీ కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం పట్టడం లేదని ధ్వజమెత్తారు. వ్యవసాయ కూలీల వలసల నివారణ కోసం ఆనాడు వామపక్ష పార్టీల ఎంపీలు పెద్ద ఎత్తున పోరాడి సాధించుకున్న ఉపాధి హామీ పథకాన్ని నేడు ఎన్డీఏ ప్రభుత్వం బడ్జెట్లో నిధులు కేటాయించకుండా తూట్లు పొడుస్తోందన్నారు. పంటలకు దక్కని గిట్టుబాటు ధర మోదీ పాలనలో రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధరలు దక్కడం లేదన్నారు. స్వామినాథన్ కమిషన్ సిఫారసులు అమలు చేయాలని ఢిల్లీ రైతాంగ ఉద్యమం పెద్ద ఎత్తున జరిగినా కేంద్ర ప్రభుత్వానికి ఏమాత్రం కనువిప్పు కలగలేదన్నారు. కేరళ తరహా ప్రత్యామ్నాయ విధానాలు భారతదేశ రైతులు, వ్యవసాయ కార్మికులకు కావాలన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం కేంద్రం నిధులకు ఆశపడి రాష్ట్రానికి రావాల్సిన ఎరువులు, యూరియా కోసం బీజేపీ ప్రభుత్వాన్ని నిలదీయలేని పరిస్థితిలో ఉందని తెలిపారు. రానున్న కాలంలో ఎర్రజెండా ఆధ్వర్యంలో వ్యవసాయ కూలీలకు భూములు దక్కే వరకు పోరాటాలు కొనసాగిస్తామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో కేరళ వ్యవసాయ కార్మిక సంక్షేమ బోర్డు చైర్మన్ చంద్రన్, వ్యవసాయ కార్మిక సంఘం అఖిల భారత నాయకులు విక్రమ్ సింగ్, వ్యవసాయ కార్మిక సంఘం మహిళా కన్వీనర్ లలిత బాలన్తోపాటు ఏపీ రైతు వ్యవసాయ కార్మిక సంఘాల అధ్యక్ష,కార్యదర్శులు ప్రభాకర్ రెడ్డి, వెంకటేశ్వర్లు, దండాల సుబ్బారావు, సీపీఎం కడప జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్, నగర కార్యదర్శి ఏ.రామ్మోహన్, కడప జిల్లా రైతు వ్యవసాయ కార్మిక సంఘాల నాయకులు అన్వేష్ శివకుమార్, దస్తగిరిరెడ్డి, సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.మనోహర్ అధ్యక్షులు శ్రీనివాసులురెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
శ్రీ సత్యసాయి జిల్లా బీసీ జిల్లా కమిటీ ఇన్చార్జిగా బసవరాజు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం ప్రధాన కార్యదర్శిగా ఉన్న ఎస్. బసవరాజును శ్రీ సత్యసాయి జిల్లా బీసీ జిల్లా కమిటీ ఇన్చార్జిగా నియమిస్తూ ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా సమ్మెట బసవరాజు మాట్లాడుతూ తనకిచ్చిన బాధ్యతను సక్రమంగా నెరవేర్చి పార్టీకి మంచిపేరు తెస్తానని, శ్రీ సత్యసాయి జిల్లాలో పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని తెలిపారు. 10 నుంచి ఎస్జీఎఫ్ జిల్లా స్థాయి ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఎస్జీఎఫ్ జిల్లాస్థాయి సెలక్షన్స్ ఈ నెల 10 నుంచి 17వరకు నిర్వహించనున్నట్లు ఎస్జీఎఫ్ జిల్లా సెక్రటరీ శ్రీకాంత్ చంద్రావతి సోమవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. వివిధ రకాల క్రీడా పోటీలతో నిర్వహించే ఈ సెలక్షన్స్ జిల్లాలోని పలు ప్రాంతాల్లో నిర్వహిస్తున్నట్లు వారు వెల్లడించారు. మార్కెటింగ్ ఏడీకి ‘షోకాజ్’ కడప సెవెన్రోడ్స్ : విధుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరించిన మార్కెటింగ్ శాఖ ఏడీ ఆజాద్వల్లికి సోమవారం కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి షోకాజ్ నోటీసును జారీ చేశారు. రెండు రోజుల్లోగా సంజాయిషీ ఇవ్వాలని కలెక్టర్ నోటీసుల్లో పేర్కొన్నారు. జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక వేంపల్లె : జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికైనట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు బి.నాగ పవన్, ఎస్.అరవింద్, జి.విజయ్ కుమార్, డి.రవితేజ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని సత్తా చాటారని వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుంచి 14వ తేదీ వరకు ఛత్తీ్స్ఘడ్ బిలయోలో నిర్వహించే యోగాసన భారత్ జాతీయ స్థాయిపోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై డైరెక్టర్తోపాటు పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రమేష్ కై లాస్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్ : నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్ పరీక్ష (ఎన్ఎంఎంఎస్)కు దరఖాస్తు చేసుకునేందుకు ఆన్లైన్ అప్లికేషన్ను ఆహ్వానిస్తున్నట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఈ పరీక్షకు నమోదు చేసుకునుటకు ఈ నెల 30 వరకు గడువు ఉందని తెలిపారు. ఈ పరీక్ష రాయటకు ఏపీలోని ప్రభుత్వ, జిల్లా పరిషత్తు, మున్సిపల్, ఎయిడెడ్, మండల పరిషత్తు ప్రాథమికోన్నత పాఠశాలలు, వసతి సౌకర్యంలేని ఆంధ్రప్రదేశ్ పాఠశాలల్లో ఈ సంవత్సరం 8వ తరగతి చదువుతూ కుటుంబ సంవత్సర ఆదాయం రూ. 3,50,000 లోపు ఉన్న విద్యార్థులందరూ అర్హులు అని తెలిపారు. పరీక్ష రుసుం ఓసీ, బీసీబీ విద్యార్థులకు రూ. 100, ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు రూ. 50 ఆన్లైన్ అప్లికేషన్లో ఇవ్వబడిన ఎస్బీఐ కలెక్ట్ లింగ్ ద్వారా మాత్రమే పరీక్ష రుసుం చెల్లించాలని తెలిపారు. మరింత సమాచారం కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం వారిని కలవాలని తెలిపారు. ప్రధానోపాధ్యాయులు విద్యార్థులకు ఎన్ఎంఎంఎస్ గురించి విద్యార్థులకు అవగాహన కల్పించి ఎక్కువ మంది దరఖాస్తు చేసుకునేలా చూడా లని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. వైభవం..పల్లకీ ఉత్సవం రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి పల్లకీలో ఊరేగారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు ఆలయాన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు జరిపారు. రాత్రి స్వామి, అమ్మవారిని అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చిరు. మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. -
దేవగుడి x పోట్లదుర్తి
● గండికోటలో పనులు అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఆది వర్గం ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోట్లదుర్తి నాయకులు ● తలలు పట్టుకుంటున్న అధికారులు టాస్క్ఫోర్సు : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు రోజు రోజుకు ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో ‘పోట్లదుర్తి బ్రదర్స్’ ఎక్కడ పనులు చేపట్టిన ఆ పనులు అడ్డుకోవడం దేవగుడి బ్రదర్స్లో ఒకరయిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి పరిపాటిగా మారిపోయింది. పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం 70 కోట్లకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను లెస్ వేసి రిత్విక్ కంపెనీ పేరుతో పోట్ల దుర్తి బ్రదర్స్ దక్కించుకున్నారు. ఇటీవల గ్రామంలో రిత్విక్ కంపెనీ గండికోటలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం యంత్రాలతో వెళ్లారు. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి స్థానిక నాయకులను రెచ్చగొట్టి పనులు అడ్డుకోవాలని సూచించారు. దీంతో స్థానిక నాయకులు పనులకు అడ్డు తగులుతూ వస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు మొదలు పెట్టగా రెండు సార్లు గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. చేసేదిలేక రిత్విక్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న అధికారులకు ఈ ఇద్దరి వివాదం తలనొప్పిగా మారిపోయింది. సోమవారం గండికోటలో పోలీసు బందో బస్తు మధ్య పనులు చేస్తున్న కంపెనీని సాయంత్రం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానికులు పనులు అడ్డుకున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా.. స్థానికంగా ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ అధికారులు వాపోతున్నారు. గతంలోనూ అంతే.. గతంలో కొండాపురం మండలంలో టి.కోడురు పంచాయతీ పరిధిలో అదాని గ్రూప్ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులకు ఎంపీ రమేష్నాయుడు దక్కించుకున్నారు. ఈ పనులు ప్రారంభించడానికి వెళ్లిన అధికారులపై దాడులు చేసి భయందోళనకు గురి చేశారు. అప్పట్లో ఈ దాడి సంచలనంగా మారింది. అనకాపల్లి ఎంపీ రమేష్ నాయుడు సీరియస్గా తీసుకోవడంతో అధికారులు సైతం అలర్టు అయ్యారు. పనులు చేపట్టడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. అలాగే స్థానిక రైతులకు అదనంగా పరిహారం ఇస్తామన్న హామీని అమలు చేయనందున దానికోసం కంపెనీ ముందు ధర్నా నిర్వహించే విధంగా ఇటీవల దేవగుడి సోదరులు పావులు కదిపారు. సీఎంఓ కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు రావడంతో హుటాహుటిన డీఎస్పీ స్థానిక పోలీసులతో వెళ్లి స్థానిక నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక నాయకులు ధర్నాను విరమించుకున్నారు. అదేవిధంగా ముద్దనూరులో సీఎం సురేష్ నాయుడు వర్గం బ్రాందీషాపు చేజిక్కించుకున్నారు. బ్రాందీషాపు ప్రారంభించటానికి రూములు అద్దెకు ఇవ్వకూడదంటూ ఆదినారాయణరెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడు భయపెట్టడంతో స్థానికులు బ్రాందీషాపులకు రూములు అద్దెకు ఇవ్వలేని పరిస్థితి ఏర్పడింది. చివరకు బ్రాందీషాపుకు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే సురేష్ నాయుడు అప్పటి ఎస్పీని కలిశారు. దీంతో సీరియస్గా తీసుకున్న అధికారులు కంటైనర్లో బ్రాందీషాపును మొదట ప్రారంభింపజేశారు. స్థానికంగానే అమ్మవారి భూ వివాదం... పోట్లదుర్తి గ్రామంలో ఉన్న పెద్దమ్మ అమ్మవారుకు సంబంధించిన భూములు, అభివృద్ధి విషయంలో పోట్లదుర్తి బ్రదర్స్, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఎర్పడింది. ఎంపీ నిధులకింద అమ్మవారి ప్రాంగణం అభివృద్ధి చేయాలని సీఎంసురేష్ నాయుడు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అయితే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య రాళ్లతో దాడులు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి విషయంలో పోట్లదుర్తి, దేవగుడి వర్గీయుల మధ్య పనులు విషయంలో ఆధిపత్యం కొనసాగుతూనే ఉంది. తన నియోజకవర్గంలో పోట్లదుర్తి బ్రదర్స్ పెత్తనం ఏమిటంటూ ఆదివర్గం, అధికార పార్టీలో ఉన్న తమ పనులే అడ్డుకుంటార అంటూ పోట్లదుర్తి బ్రదర్స్ పోటా పోటీ పెత్తనం చెలాయిస్తున్నారు. వీరి మధ్య స్థానకంగా ఉన్న అధికారులు ఎవరికి సర్దుబాటు చేయలేక నలిగిపోతున్నారు. మరి ఉన్నతాధికారులు.. ఆయా పార్టీ పెద్దలు ఎలా ముందుకెళతారో వేచి చూడాలి. పోస్టర్ల ఆవిష్కరణ కడప అగ్రికల్చర్ : పశువులకు గాలికుంటు వ్యాధి నివారణ టీకాలను రైతులు విధిగా వేయించాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకంలో భాగంగా గాలికుంటు వ్యాధి నివారణ టీకాల కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్లను కలెక్టరు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ నెల 15 నుంచి నెల రోజుల వరకు ఈ టీకాల కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. జిల్లాలో 3,71,400 డోసుల టీకాలు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. పశుసంవర్ధక శాఖ జేడీ శారదమ్మ, పశుసంవర్ధక శాఖ అధికారులు తదితరులు పాల్గొన్నారు. నేడు సమావేశం కడప ఎడ్యుకేషన్ : కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు డీవీఈఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడిజిల్లా అండర్ 19 ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రమోహన్రాజు తెలిపారు. ఎస్జీఎఫ్ఐ అండర్ 19 స్కూల్ గేమ్స్ సంబంధించి జిల్లా జట్లను ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించిన పీడీ, పీఈటీ, ఇన్చార్జు పీడీలు తప్పకుండా హాజరు కావాలని ఆయన తెలిపారు. వివరాలకు 9290760996 నంబర్లో సంప్రదించాలని కోరారు. -
దేశంలో యూరియా ఎమర్జెన్సీ విధించాలి
● అఽధిక ధరకు విక్రయిస్తే చర్యలు చేపట్టాలి ● కలెక్టరేట్ ఎదుట సీపీఐ ధర్నాకడప సెవెన్రోడ్స్ : దేశంలో యూరియా ఎమెర్జెన్సీ విధించాలని, రాష్ట్రంలో యూరియా కొరత తీర్చాలని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర కోరారు. సోమవారం ఆ పార్టీ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ధర్నాలో ఆయన మాట్లాడారు. ఎరువుల కొరత సృష్టించి అఽధిక ధరలకు విక్రయిస్తున్న డీలర్లపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. ఎరువుల కేటాయింపులో రైతు సేవా కేంద్రాలు, ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాలకు ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. యూరియా అందుబాటులో లేక రైతులు అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. గతేడాది ఇలాంటి సమస్య రాలేదన్నారు. యూరియా నిల్వలు ఉన్నాయని ప్రభుత్వం చెబుతున్నా రైతులకు ఎందుకు అందడం లేదని ప్రశ్నించారు. కేంద్రం నుంచి వస్తున్న యూరియాలో 80 శాతం ప్రైవేటు షాపులకు ఇస్తూ 20 శాతం మాత్రమే ఆర్ఎస్కే, సొసైటీలకు సరఫరా చేయడం తగదన్నారు. ఇందువల్ల బ్లాక్లో బస్తా రూ.400కు పైగానే అమ్మి సొమ్ము చేసుకుంటున్నారని ఆరోపించారు. ఒక ఆధార్కార్డుకు ఒక యూరియా బస్తా మాత్రమే ఇస్తామనడం తగదన్నారు. డీలర్ల వద్ద యూరియా కొనుగోలుకు వెళితే యూరియాతోపాటు ఇతర ఎరువులు కూడా కొనాలని షరతు పెడుతున్నారని తెలిపారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సుబ్బారెడ్డి, సీపీఐ నాయకులు వెంకట్రాముడు, శంకర్నాయక్, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, చంద్రశేఖర్రెడ్డి, ఈశ్వరయ్య, బషీర్, పక్కీరప్ప, కొండయ్య, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. -
మల్టీ డే మ్యాచ్లో చిత్తూరు, నెల్లూరు విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు ఉత్సాహంగా కొనసాగాయి. సోమవారం రెండవ రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో అనంతపురం జట్టుపై చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 132 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 55.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తేజరెడ్డి 142 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతంగా ఆడి 106 పరుగులు చేశాడు. రెడ్డి ప్రకాశ్ 30 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, ప్రవీణ్కుమార్ సాయి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 46.2 ఓవర్లకు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నిస్కయ్ 47, ప్రవీణ్ కుమార్ సాయి 32 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బ్రహ్మసాయి తేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14.5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 52, జెనిక్ దాస్ 34 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని భార్గవ 2 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో రెండవ రోజే విజయం సాధించింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టుపై నెల్లూరు జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం రెండవ రోజు 140 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 86.1 ఓవర్లలో 501 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 167, సోహన్ వర్మ 68, మాధవ్ 66, శ్రీ హర్ష 58 పరుగులు చేశారు. కడప జట్టులోని ఎస్ఎండీ ఆయూబ్ 4, వరుణ్తేజ్రెడ్డి 4, చెన్నారెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 33.1 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 53, నాగ చాతుర్య 33 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, నారాయణ 2, సూతేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. -
చీనీ కాయల మార్కెట్ యార్డు వద్ద ఉద్రిక్తత
పులివెందుల చీనీ కాయల మార్కెట్లో గొడవ పడుతున్న రైతులు, వ్యాపారులుమార్కెట్లో ఆందోళన చేస్తున్న చీనీ రైతులుపులివెందుల రూరల్ : పులివెందుల పట్టణ పరిధి వ్యవసాయ మార్కెట్ యార్డు ఆవరణలోని చీనీకాయల మార్కెట్ వద్ద సోమవారం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. మార్కెట్లోని రైతులు, వ్యాపారస్తుల మధ్య గొడవ చోటు చేసుకుంది. గిట్టుబాటు ధర లేదని రైతులు ధర్నా నిర్వహించారు. వ్యాపారస్తులంతా సిండికేట్ అయి నిండా ముంచేస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాగే ఉంటే ఈ నెల 11వ తేదీన మార్కెట్ యార్డుకు తాళాలు వేసే పరిస్థితి నెలకొంటుందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు దారి తీసిన పరిస్థితులు ఇలా ఉన్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో.. గతంలో చీనీ తోటల వద్దకు వివిధ ప్రాంతాల నుంచి వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేసేవారు. అప్పట్లో 10 టన్నులకు సూట్ కింద 2 టన్నుల వరకు వ్యాపారస్తులు, దళారులు రైతుల నుంచి తీసుకునేవారు. అయితే వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు సూట్ అనే పద్ధతిని రద్దు చేసేందుకు ఒక ఐఏఎస్ ఆఫీసర్ను నియమించి మార్కెట్ యార్డులో చీనీ రైతులకు, వ్యాపారస్తుల మధ్య సయోధ్య కుదిర్చారు. సూట్ పద్ధతి లేకుండా మార్కెట్ యార్డులో చీనీ కాయల మార్కెట్ను ఏర్పాటు చేసి అక్కడికే వ్యాపారస్తులు వచ్చి కొనుగోలు చేసే విధంగా ఏర్పాటు చేశారు. పులివెందుల ప్రాంతంలోని చీనీ రైతులకు సరైన గిట్టుబాటు ధర కల్పించే విధంగా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జంబో షెడ్డులు ఏర్పాటు చేసి చీనీ కాయల మార్కెట్ను ఏర్పాటు చేశారు. సూట్ అనే విధానాన్ని కూడా లేకుండా చీనీ వ్యాపారస్తులు ప్రశాంతంగా గిట్టుబాటు ధరలతో వ్యాపారాలు చేసుకునేవారు. టన్ను రూ.30 వేల నుంచి లక్ష వరకు పలకడంతో రైతులు ఆనందంగా విక్రయాలు జరిపేవారు. కూటమి పాలనలో.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత పులివెందుల చీనీ మార్కెట్లో దళారులంతా ఏకమై ఒకట్రెండు చీనీ కాయల కుప్పలకు మాత్రమే.. అది కూడా 2 నుంచి 3 టన్నులకు మాత్రమే అధిక ధర వెచ్చిస్తూ కొనుగోలు చేస్తున్నారు. అంతకుమించి ఉన్న మిగిలిన చీనీ కాయల కుప్పలకు నామమాత్రంగా ధరలు నిర్ణయించి నిండా ముంచేస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గిట్టుబాటు కాకపోతే అనంతపురం మార్కెట్ తీసుకుపోండని వ్యాపారస్తులు ఉచిత సలహాలు ఇస్తున్నారని వారు వాపోతున్నారు. ప్రస్తుతం మార్కెట్లో దళారీ వ్యవస్థ ఉండటంతో గిట్టుబాటు ధరలు కూడా అందడం లేదని పేర్కొంటున్నారు. గత ప్రభుత్వంలో చీనీ ధరలు బాగా ఉండేవని కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత దళారీ వ్యవస్థ జోక్యం చేసుకోవడంతో తమకు ఇష్టం వచ్చిన ధరలకు వేలంపాట నిర్వహిస్తున్నారని రైతులు వాపోతున్నారు. టన్ను రూ.6 వేల నుంచి రూ.20 వేల వరకే పలుకుతుండటంతో గిట్టుబాటు కావడం లేదని అంటున్నారు. న్యాయం చేయాలి ఇతర రాష్ట్రాలలో టన్ను చీనీ కాయలు రూ.25 వేలు ఉంటే.. ఇక్కడ ఫస్ట్ క్వాలిటీ రూ.14 వేలు, రూ.12 వేలు పెట్టడం ఏమిటని దళారులపై రైతన్నలు మండిపడ్డారు. ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారస్తులు వస్తే వారిని మార్కెట్కు రానివ్వకుండా.. వారితో కుమ్మకై ్క తమను ముంచేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయం పెద్దది కావడంతో అర్బన్ సీఐ సీతారామిరెడ్డి రంగ ప్రవేశం చేసి.. దళారులు, రైతులకు నచ్చజెప్పి వేలంపాటను యథావిధిగా కొనసాగింపజేశారు. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ రైతులకు చీనీ ధర గిట్టుబాటు లేకుండా కొనుగోలు చేస్తే 11వ తేదీ నుంచి మార్కెట్ యార్డులో మండిలన్ని మూసివేసేయాలన్నారు. రైతులెవరూ కూడా మార్కెట్ యార్డులోకి చీనీ కాయలు తీసుకురావద్దన్నారు. తోటల వద్దనే వ్యాపారస్తులకు అమ్మితే బయట నుంచి వచ్చే వ్యాపారస్తులు న్యాయమైన ధరలకు కొనుగోలు చేస్తారన్నారు. మార్కెట్ యార్డులోకి తెస్తే దళారుల చేతుల్లో మోసపోవాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. 11వ తేదీ ప్రతి ఒక్కరూ పులివెందుల మార్కెట్ యార్డు చీనీ మండిల వద్దకు చీనీ రైతన్నలు చేరుకోవాలన్నారు. దళారులు చేస్తున్న మోసాలను నాయకులు, అధికారులు అరికట్టి.. తమకు న్యాయం చేస్తే యథావిధిగా కొనసాగిస్తామని, లేదంటే మండీలు మూత వేయాల్సిన పరిస్థితి నెలకొంటుందన్నారు. గిట్టుబాటు ధరలేదని రైతుల ఆందోళన దళారులు ముంచేస్తున్నారని మండిపాటు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టన్ను రూ.లక్ష వరకు.. ప్రస్తుతం రూ.14,200 మాత్రమే -
ఇమామ్, మౌజన్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
కడప సెవెన్రోడ్స్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం నాయకులు డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర విభాగం పిలుపులో భాగంగా మైనార్టీ విభాగం జిల్లాశాఖ, నగర శాఖల సంయుక్తాధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు మదీన దస్తగిరి, నగర శాఖ అధ్యక్షుడు, కార్పొరేటర్ షఫీ, రాష్ట్ర ప్రచార కార్యదర్శి ఎస్.గౌస్బాషా మాట్లాడారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇమామ్లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ జనవరి నుంచి ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. సెప్టెంబరు వరకు ఎనిమిది నెల ల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయ న్నారు. గతేడాది ఎన్నికల సమయమైన ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. ఇలా 11 నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం గతేడాది మార్చి వరకు వేతనాలు ఇచ్చిందని, కూటమి అధికారంలోకి వచ్చాక వేతనాలు పెండింగ్లో ఉంచడం వల్ల ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. మసీదు కమిటీలు కూడా ఈ చెల్లింపులను భరించలేకపోతున్నాయన్నారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉన్న పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. నూర్బాషా కార్పొరేషన్కు రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. తర్వాత జేసీ అదితిసింగ్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో మైనార్టీ విభాగం రాష్ట్ర కార్యదర్శి షఫీ, నగర ప్రధాన కార్యదర్శి అక్బర్ అలీ, హజ్ కమిటీ మాజీ చైర్మన్ గౌసులాజమ్, వేర్ హౌసింగ్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కరీముల్లా, మైనార్టీ విభాగం మాజీ ప్రభుత్వ సలహాదారు మహమ్మద్ బొగ్దాది, మున్నా తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ మైనార్టీ నేతల ఆందోళన -
ప్రజా ఫిర్యాదులకు శాశ్వత పరిష్కారం
ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో స్వీకరించే ఫిర్యాదులు పునరావృత్తం కాకుండా క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి శాశ్వత పరిష్కారం చూపాలని పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశించారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలోని పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో జిల్లా ఎస్పీ ప్రజా ఫిర్యాదుల పరిష్కార కార్యక్రమం(పీజీఆర్ఎస్) నిర్వహించారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన 121 మంది ఫిర్యాదుదారులతో జిల్లా ఎస్పీ ముఖాముఖి మాట్లాడి.. చట్ట ప్రకారం విచారణ జరిపి, సత్వరం పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఆ ఫిర్యాదులపై సంబంధిత పోలీస్ స్టేషన్ అధికారులతో మాట్లాడి త్వరితగతిన విచారణ జరిపి భాదితులకు న్యాయం అందించేలా చూడాలన్నారు. ఫిర్యాదులపై తీసుకున్న చర్యలు, పూర్తి వివరాలను నివేదిక రూపంలో జిల్లా పోలీస్ కార్యాలయానికి అందజేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మహిళా పోలీస్స్టేషన్ డీఎస్పీ ఇ.బాలస్వామిరెడ్డి, డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీం తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం
మైదుకూరు : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆదివారం చిత్తూరు – కర్నూలు జాతీయ రహదారి బైపాస్పై కలసపాడుకు చెందిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగి షేక్ ఖాదర్ హుస్సేన్ (52) దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడులోని పోలేరమ్మ వీధికి చెందిన ఖాదర్ హుస్సేన్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఆదివారం బ్యాంక్ పని మీద వెళుతున్నాను అంటూ భార్య ఫాతిమాకు చెప్పి మోటార్ బైక్పై బయల్దేరారు. మైదుకూరు శివారులో జాతీయ రహదారి బైపాస్పైన ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సంఘటనలో బైక్పై ఉన్న ఆయన తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి ఖాదర్ హుస్సేన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. మృతునికి మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు, ఆమె మృతి చెందిన తర్వాత చేసుకున్న రెండో భార్య ఫాతిమాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
నొప్పి మాయం.. సర్జరీ దూరం
● ఫిజియోథెరపీ దివ్య ఔషధం ● దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ● రిమ్స్లో ప్రత్యేక వైద్య సేవలు ● నేడు ఫిజియోథెరపీ దినోత్సవంకడప అర్బన్ : ప్రపంచ వ్యాప్తంగా ఏటా సెప్టెంబర్ 8న ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకొంటారు. ఫిజియోథెరపీ ప్రాముఖ్యత, దాని వల్ల కలిగే ప్రయోజనాల గురించి ప్రజలకు అవగాహన కల్పించడమే ఈ దినోత్సవం ప్రధాన ఉద్దేశం. మారిన జీవనశైలి, శారీరక శ్రమ లేకపోవడం, కంప్యూటర్ల ముందు ఎక్కువ సేపు కూర్చోవడం వంటి కారణాలతో అనేక మంది యువత, పెద్దలు కీళ్ల నొప్పులు, వెన్నునొప్పి, మెడనొప్పి వంటి సమస్యలతో బాధపడుతున్నారు. ఇలాంటి సమస్యలకు మందులు లేకుండా ఫిజియోథెరపీ ద్వారా చికిత్స అందించి, శారీరక ఆరోగ్యాన్ని మెరుగుపరచడంలో ఫిజియోథెరపిస్ట్లు కీలక పాత్ర పోషిస్తున్నారు. ఫిజియోథెరపీ ఎందుకు అవసరం? ఆధునిక జీవనంలో ఫిజియోథెరపీ అవసరం రోజురోజుకు పెరుగుతోంది. పుట్టుకతో వచ్చే వైకల్యాలు, ప్రమాదాల వల్ల కలిగే గాయాలు, పక్షవాతం, మానసిక ఒత్తిడి వంటి అనేక ఆరోగ్య సమస్యలకు ఫిజియోథెరపీ అద్భుతమైన చికిత్సగా నిలుస్తోంది. వ్యాయామాల ద్వారా, చేతితో చేసే చికిత్సల ద్వారా (మాన్యువల్ థెరఫీ)తోపాటు, ఇతర పద్ధతుల ద్వారా శారీరక కదలికలను మెరుగుపరచి, నొప్పిని తగ్గించి, జీవిత నాణ్యతను పెంచడంలో సహాయపడుతుంది. ముఖ్యంగా, వయసు పెరిగే కొద్దీ వచ్చే కీళ్ల నొప్పులు, బలహీనత వంటి వాటిని నియంత్రించడంలో, ఎముకల సాంద్రతను పెంచడంలో కూడా ఫిజియోథెరపీ కీలక పాత్ర పోషిస్తుంది. పీడియాట్రిక్ ఫిజియోథెరపీ.. పిల్లల భవిష్యత్తు కోసం.. పిల్లల ఆరోగ్యానికి పీడియాట్రిక్ ఫిజియోథెరపీ ఎంతో అవసరం. పుట్టినప్పటి నుంచి వచ్చే కండరాల బలహీనత, శరీర భాగాల కదలికలో సమస్యలు, మెదడు పక్షవాతం (సెలెబ్రల్ పల్సీ) వంటి సమస్యలకు ఈ చికిత్స చాలా ఉపయోగపడుతుంది. ఫిజియోథెరపిస్టులు వ్యాయామాల ద్వారా పిల్లల శారీరక సామర్థ్యాన్ని పెంచుతారు. దీనివల్ల వారు నడవడం, కూర్చోవడం, చేతులు ఉపయోగించడం వంటివి సులభంగా నేర్చుకుంటారు. పిల్లలు సాధారణ జీవితం గడపడానికి, స్కూల్కి వెళ్లడానికి, ఆత్మవిశ్వాసంతో ఉండటానికి ఈ చికిత్స దోహదపడుతుంది. ఫిజియోథెరపీలో మహిళల పాత్ర గర్భధారణ, ప్రసవం, రుతుక్రమం వంటి సందర్భాల్లో మహిళలు ఎదుర్కొనే శారీరక సమస్యలకు ఫిజియోథెరపీ ఎంతో ఉపయోగపడుతుంది. సరైన అవగాహన లేకపోవడం వల్ల చాలా మంది మహిళలు ఈ చికిత్సను ఉపయోగించుకోవడం లేదు. ఫిజియోథెరపీ ద్వారా ఈ సమస్యలను అధిగమించి, ఆరోగ్యవంతమైన జీవితాన్ని గడపవచ్చు. కడప రిమ్స్లో ఫిజియోథెరపీకి ప్రత్యేక వైద్యం కడప రిమ్స్లో ఫీజియోథెరపీ విభాగంలో ప్రతి రోజు మేల్, ఫిమేల్ ఓపీలో సుమారు 70 నుంచి 80 మంది పేషెంట్స్ ఫీజియో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ప్రజలకు సంపూర్ణ వైద్య విధానంలో ఫీజియోథెరపీ చేస్తున్నారు. ఇక్కడ ఫీజియోథెరపీ సంబంధంగా పిడియాట్రిక్స్, జినియాట్రిక్స్ ఎలక్ట్రో థెరపీ, ఎక్సర్సిస్ థెరపీ పరికరాలతో విద్యార్థులు, ట్రైనీ డాక్టర్లతో పక్షవాతం, కీళ్ల నొప్పులు, పోస్ట్ ఆప్, ఆర్థో సర్జరీస్లకు, ఎముకల, నరాల సంబంధం అగు మరి ఎన్నో వ్యాధులకు రిమ్స్లో ఫీజియో విభాగం లో చికిత్స పొందుతున్నారు. ఇక్కడ ప్రత్యేకంగా ఆర్థో, న్యూరో, కార్డియో, పిడియాట్రిక్స్ సర్జరీస్ భా గాలకు, తదితర అవసరమైన విభాగాలకు ఫీజియోథెరపీ చికిత్స చేయడం జరుగుతుంది. నూతన లేజర్, యుఆర్థెరెపీ ద్వారా పిల్లల నుంచి పెద్దల వరకు వయోవృద్ధుల వరకు కూడా చికిత్స ఇవ్వడం జరుగుతుంది. కడప, ఇతర ప్రాంతాల నుంచి చికిత్స మేరకు ఇక్కడికి రావడం జరుగుతుంది.ఫిజియోథెరపీని ప్రోత్సహించాలి వైద్యులు, ఫిజియోథెరపీ నిపుణులు ఫిజియోథెరపీని ప్రోత్సహించడానికి వివిధ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. దీనిపై అవగాహన కల్పించడానికి ర్యాలీలు, సదస్సులు నిర్వహిస్తున్నారు. ఫిజియోథెరపిస్టుల కోసం ప్రత్యేక కౌన్సిల్ ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ ఉద్యోగాలను కల్పించాలని కూడా అసోసియేషన్లు ప్రభుత్వాన్ని కోరుతున్నాయి. ప్రజలు కూడా మందులపై ఆధారపడకుండా ఫిజియోథెరపీ చికిత్సను స్వీకరించడం ద్వారా ఆరోగ్యవంతమైన జీవితాన్ని పొందవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. మా విభాగంలో ముగ్గురు ఫీజియోథెరపిస్టులు 30 మంది సిబ్బంది ద్వారా ఇక్కడ చికిత్స ఇవ్వడం జరుగుతుంది. సూపరింటెండెంట్, ఆర్ఎంఓ ప్రోత్సాహంతో నూతన పరికరాలు, ప్రక్రియలతో ఫీజియోథెరెపీ విభాగం అభివృద్ధి చెందుతోంది. – డాక్టర్ సంపత్ కుమార్, హెచ్ఓడీ, ఫిజియోథెరపీ విభాగం, ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్), కడప -
సౌత్జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. ఆదివారం వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం– చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 50.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అర్జున్ టెండ్కూలర్ 64, వికాస్ 53 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ముఖేష్ చక్కగా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బాలాజీ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్లు 33 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 73, రెడ్డి ప్రకాశ్ 20 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప– నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 43.5 ఓవర్లకు 257 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని భరత్రెడ్డి 66, ఎస్ఎండి ఆయూబ్ 51, శివ కేశవ 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, ఇకాక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టులోని సోహన్ వర్మ 53, శ్రీహర్ష 31 పరుగులు చేశారు. కడప జట్టులోని వరుణ్తేజ్ రెడ్డి 3 వికెట్లు, చెన్నారెడ్డి 1 వికెట్ తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
నాణ్యమైన వైద్యం పేదలకు దూరం
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం నాణ్యమైన వైద్యాన్ని పేద ప్రజలకు దూరం చేస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. ఆదివారం కడపలో తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశ చరిత్రలో తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడానికి కేబినెట్లో ఆమోద ముద్ర వేయడం దారుణమన్నారు. పేద విద్యార్థులకు వైద్య విద్య, పేదలకు ప్రభుత్వ వైద్యాన్ని దూరం చేసేందుకు ప్రభుత్వం యత్నించడం దారుణమన్నారు. కొత్త వైద్య కళాశాలల మంజూరు కోసం చాలా రాష్ట్రాలు కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తున్నాయని, అయితే మన రాష్ట్రలో మాత్రం ఇప్పటికే సిద్ధంగా ఉన్న మెడికల్ కాలేజీలను ప్రైవేటుకు ధారాదత్తం చేయడం దుర్మార్గమన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలో 11 మెడికల్ కాలేజీలే ఉన్నాయని, వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత జిల్లాకు ఒక మెడికల్ కళాశాల ఉండాలని 17 కొత్త మెడికల్ కాలేజీలకు అనుమతి తీసుకొచ్చారన్నారు. వీటి నిర్మాణానికి రూ.8500 కోట్లు మంజూరు చేశారన్నారు. ఈ మేరకు మొదటి ఏడాది 5 మెడికల్ కాలేజీలు పూర్తి చేశారని, రెండో ఏడాది మరో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి చేశారన్నారు. పులివెందుల మెడికల్ కాలేజీ కూడా అందులో ఉందన్నారు. ఈలోపు ఎన్నికలు రావడంతో మూడు కాలేజీలకు మాత్రమే అనుమతులు వచ్చాయన్నారు. కేంద్రం సీట్లు కేటాయించినా.. పులివెందుల మెడికల్ కాలేజీకి కేంద్రం 50 మెడికల్ సీట్లు కేటాయిస్తే, నిర్వహణ తమ వల్ల కాదంటూ కేంద్రానికి లేఖ రాసిన చరిత్ర కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వ ఆధీనంలో మెడికల్ కాలేజీలు ఉంటే పేద విద్యార్థులు వైద్య విద్యను తక్కువ ఫీజులతోనే పూర్తి చేసే అవకాశముంటుందని, గ్రామీణ ప్రాంత ప్రజలకు ఆరోగ్య సేవలు అందుబాటులో ఉంటాయన్నారు. ప్రైవేటు పరం చేయడం వల్ల మెడికల్ సీట్లు కోట్ల రూపాయలకు అమ్ముకునే అవకాశముందని, పేద విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఆరోగ్య సేవలు పేదలకు అందుబాటులో ఉండవన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలోకి వచ్చినా ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు పరం చేయడమే పరమావధిగా పెట్టుకుంటారని విమర్శించారు. విద్యారంగంలో 6 వేల ప్రభుత్వ పాఠశాలలను మూసివేశారని, నారాయణ, చైతన్య విద్యాసంస్థలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ప్రభుత్వ వైఖరి వల్ల ప్రభుత్వ విద్య, వైద్యం అందని ద్రాక్షగా మారే ప్రమాదముందని హెచ్చరించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ప్రత్యేక విమానాలు, హెలికాప్టర్లు ఉపయోగిస్తూ ప్రజాధనం దుర్వినియోగం చేస్తున్నారన్నారు. ఈ దుబారా ఖర్చు తగ్గిస్తే ప్రభుత్వమే మెడికల్ కాలేజీలు నిర్వహించవచ్చన్నారు. కమీషన్ల్ల కోసం పన్నాగం ప్రభుత్వ ఆస్తులను అప్పనంగా ప్రైవేటుకు దోచిపెట్టి కమీషన్లు కాజేయడానికి పన్నాగం పన్నుతున్నారన్నారు. అపర సంజీవని ఆరోగ్యశ్రీని భీమా పద్ధతిలో అమలు చేస్తూ దేశంలోనే అత్యుత్తమంగా అమలైన విధానానికి బాబు సర్కారు ఉరి వేస్తోందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం మళ్లీ అధికారంలోకి వస్తే ప్రైవేటీకరణ రద్దు చేస్తామన్నారు. కూటమి ప్రభుత్వ విధానాలను ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో ఈ ప్రభుత్వానికి గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, సుదర్శన్, గుంటి నాగేంద్ర, రెడ్డి ప్రసాద్, బసవరాజు, శంకరాపురం సింధు, సాయిదత్త, పత్తిరాజేశ్వరి, ఉమామహేశ్వరి పాల్గొన్నారు. వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేయడం దారుణం దేశ చరిత్రలో తొలిసారిగా 10 కొత్త మెడికల్ కాలేజీలు ప్రైవేటీకరణ వైఎస్సార్సీపీ ప్రభుత్వం వస్తే ప్రైవేటీకరణ రద్దు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
జమ్మలమడుగు రూరల్ : వైఎస్సార్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా (వైఎస్సార్, అన్నమయ్య) జిల్లా స్థాయి జూనియర్ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆదివారం జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపికలను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్రిష్ణమూర్తి, వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని మండలాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జూనియర్ జిల్లా జట్టుకు బాలురు 10 మందిని, బాలికలు 10 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12, 13, 14వ తేదిల్లో అనంతరపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెలక్షన్ కన్వీనర్ ఓబయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సెలక్షన్ కమిటీ మెంబర్లు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా బాలుర జట్టు మహమ్మద్ బాబా (రాజంపేట) కె.కౌశిక్, హైడెన్, డి.రాజేష్, వెంకటేశ్, చిన్న ఓబులేసు (దువ్వూరు) డి.షడ్రక్, రఫెల్ (చిన్న సింగనపల్లె) ఎస్.మురళి, రాజు (ఒంటిమిట్ట) ఎస్. షాజిద్(రాజంపేట) జిల్లా బాలికల జట్టు డి.కీర్తి, డి.నయోమి (చిన్న సింగనపల్లె) ఎం.స్వీటీ (ఎస్.ఉప్పలపాడు) జి.వర్షిణీ (తాళ్ల ప్రొద్దుటూరు) ఎం.గౌతమి, జి.సునంద, కె.చెర్లీన్, ఎస్.అశ్వీనీ, ఎస్.లక్ష్మీ (చియ్యపాడు) -
లాండ్రీ షాపులో అగ్నిప్రమాదం
మైదుకూరు : లాండ్రీ నిర్వహిస్తున్న ఓ ఇంటిలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు రాజారెడ్డి వీధిలో ఉంటున్న కంచర్ల ఆంజనేయులు నివాసం ఉంటున్న ఇంటిలోనే లాండ్రీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఫ్రిడ్జ్, మోటార్, టీవీ, బియ్యంతోపాటు ఇంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు, శుభ్రం చేసి ఇసీ్త్ర చేసేందుకు తీసుకొచ్చిన పలువురి పట్టుచీరలు, దుస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక అధికారి పి.బసివి రెడ్డి, సిబ్బంది వీరనన్న, రవికుమార్, భాస్కర్, కరీముల్లా సంఘటన జరిగిన ఇంటి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆంజనేయులు కోరారు. -
ఉత్సాహంగా అథ్లెటిక్స్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్ మైదానంలో ఆదివారం బాషా అథ్లెటిక్స్ షౌండేషన్ ఆధ్వర్యంలో నిర్వహించిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు క్రీడాకారుల మధ్య ఉత్సాహంగా సాగాయి. అండర్ –18, 20 సీ్త్ర,పురుషులకు నిర్వహించిన ఈ పోటీల్లో జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 120 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. 100 మీటర్లు, 200 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్లు, లాంగ్జంప్, జావెలిన్ త్రో, షాట్పుట్, హైజంప్ విభాగాలలో పోటీలు నిర్వహించారు. క్రీడాకారులు తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో 20 మంది క్రీడాకారులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు ఈ నెల 26, 27 తేదీల్లో ఏలూరులో జరగనున్న రాష్ట్రస్థాయి జూనియర్ అథ్లెటిక్స్ చాంపియన్ షిప్ పోటీలలో పాల్గొననున్నారు. ఈ పోటీలను వ్యాయామ సంచాలకులు శివారెడ్డి, రాఘవ, నాగేశ్వరరావు, ఖాదర్రెడ్డి, దిలీప్, హసీనా, బాషా అథ్లెటిక్ ఫౌండేషన్ కార్యదర్శి అహమర్బాషా పర్యవేక్షించారు. -
ఏ పంటకూ గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వం
● అన్నదాత సమస్యలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ● 9న రైతు పోరును జయప్రదం చేయండి ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్రంలో ఏ పంటకూ ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించడం లేదని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ధ్వజమెత్తారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో 9న జరిగే రైతు పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన మిర్చి, శనగ, ఉల్లి, చీనీ, అరటి, మినుముల పంటలకు సరైన గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా నష్టపోయారని పేర్కొన్నారు. పండించిన పంటను అమ్ముకోలేక, ప్రభుత్వం నుంచి సహాయం అందక తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. గిట్టుబాటు ధరలు లేకపోవడంతో రైతులు ఆత్మహత్య చేసుకుంటున్నారన్నారు. కర్నూలు జిల్లాలో రైతులు ఉల్లికి మద్దతు ధర లేకపోవడంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన చోటు చేసుకుందన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పంటలకు గిట్టుబాటు ధర కల్పించినట్లు పేర్కొన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ ప్రభుత్వం వచ్చిన ఏడాదిన్నర కాలంలోనే రైతులు రోడ్డుపైకి రావలసిన పరిస్థితి వచ్చిందన్నారు. అయినా రాష్ట్ర ప్రభుత్వం పట్టించుకోలేని పరిస్థితిలో ఉందన్నారు. రైతులపై చిన్నచూపు హార్టికల్చర్ మాజీ చైర్మన్ సంబటూరు ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకు గౌరవం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో ఎరువులు, యూరియా కొరత ఉందని చెబితే.. భోజనానికి పోతే క్యూలో నిలబడమా, రైతులు కూడా ఎరువుల కోసం క్యూలో నిలబడ్డారు అంటూ మంత్రి అచ్చెన్నాయుడు హేళన చేసి మాట్లాడటం తగదన్నారు. సాక్షాత్తు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వరిలో యూరియా వేయడం వల్ల రోగాలు వస్తాయని, రైతులు వరి పంట వేయవద్దు అంటూ సలహాలు ఇస్తున్నారన్నారు. రైతులకు కావలసిన యూరియా అందిస్తామని ఎక్కడా చెప్పడం లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న ఐదు సంవత్సరాల కాలంలో రైతులు ఏ రోజు యూరియా కావాలంటూ రోడ్డున పడ్డ దుస్థితి లేదన్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వానికి రైతులంటే అలుసైపోయిందని వారిపై అక్రమ కేసులు పెట్టడమే పనిగా పెట్టుకుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పట్టణ అధ్యక్షుడు పోరెడ్డి మహేశ్వరరెడ్డి, ధన్నవాడ మహేశ్వరరెడ్డి, ముల్లాజానీ, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, వెంకటరెడ్డి, భాస్కర్రెడ్డి, బొనం సురేష్ పాల్గొన్నారు. -
● ఉల్లి రైతులు, రైతు సంఘ నాయకుల ఆందోళన
పెండ్లిమర్రి మండలంలో ఉల్లి పంటను కోస్తున్న కూలీలుకడప అగ్రికల్చర్: ఆరుగాలం కష్టపడి పంటలు సాగు చేస్తున్న రైతులకు కష్టాలు తప్పడం లేదు. పంట చేతికొచ్చే సరికి సరైన గిట్టుబాటు ధర కరువై కంట కన్నీరు ఆగడం లేదు. ఇటు అతివృష్టి.. అటు అనావృష్టితో రైతులు ఏటా నష్టాలపాలవుతున్నారు. అన్నింటికి తట్టుకుని పంట చేతికొస్తే ప్రభుత్వం నుంచి ‘మద్దతు’ లేక బతుకు బరువుగా మారుతోంది. ముఖ్యంగా ఈ ఏడాది ఉల్లి రైతు పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. ఉల్లిపంటకు సరైన మద్దత ధర లేకపోవడంతో రైతులు ఎక్కడికక్కడ ఆందోళనకు దిగుతున్నారు. ప్రస్తుతం క్వింటాల్ ఉల్లి ధర రూ.700 నుంచి రూ. 800 పలుకుతోందని ఉల్లి రైతులు తెలిపారు. ఎకరా ఉల్లిపంట సాగుకు సేద్యాలు, విత్తనాలు, ఎరువులు, పురుగుమందులు, కూలీలు..ఇలా అన్ని కలిపి రూ.70 నుంచి 80 వేల వరకు ఖర్చు వస్తుందని రైతులు తెలిపారు. దిగుబడి కూడా ఎకరాకు 50 నుంచి 70 క్వింటాల్ వరకు వస్తుందని ధర చూస్తే మాత్రం క్వింటాల్ రూ. 700 రూ. 800 పలుకుతుందని తెలిపారు. ఈ ధరకు ఉల్లిగడ్డలు అమ్మితే కనీసం సాగు ఖర్చులు కూడా రావని ఉల్లిరైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరల స్థిరీకరణ నిధి.. ఏదీ..! రైతులు నష్టపోకుండా ఉండేందుకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుతున్నప్పటికీ ఆచరణలో అమలుకాకపోవడంతో ఉల్లి రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించి ఉల్లిపంటకు మద్దతు ధర కల్పించి రైతును ఆదుకోవాలని వేడుకుంటున్నారు. మద్దతు ధర లేక దిగాలుపడ్డ రైతులు జిల్లావ్యాప్తంగా 7532 ఎకరాల్లో ఉల్లి పంటసాగు 64 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి రావచ్చని అధికారుల అంచనా క్వింటాల్ 7 నుంచి 8 వందల ధర పలుకుతుందన్న ఉల్లి రైతులు సాగు ఖర్చులు కూడా రావనివాపోతున్న అన్నదాతలు ఉల్లి రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి ఉల్లి రైతుల పరిస్థితి కొందామంటే కొరివి, అమ్ముదామంటే అడవి అన్న చందంగా మారింది. వేలకు వేలు ఖర్చు పెట్టి ఉల్లిపంటను సాగుచేస్తే దిగుబడి వచ్చే సరికి గిట్టుబాటు ధర లేకుండా పోతోంది. మరో పది పదిహేను రోజుల్లో ఉల్లిపంటను కోయాలి. ఈ ధరలు చూస్తే ఏం చేయాలో అర్థం కావడం లేదు. – చక్రధర్రెడ్డి, ఉల్లి రైతు, సింగనపల్లె, దువ్వూరు కనీస మద్దతు ధర క్వింటాకు 3వేల రూపాయల కల్పించాలి ఉల్లి పంటలకు కనీస మద్దతు ధర క్వింటాకు రూ. 3 వేలు కల్పించాలి. ప్రభుత్వమేమో రూ. 1200లు ప్రకటించి కొనుగోలు చేస్తామని అంటోంది. ఈ ధరతో అమ్మితే రైతులకు కనీసం పెట్టుబడులు కూడా రావు. ఉల్లి ఎకరం సాగు చేయడానికి సుమారు 80 వేలు దాకా ఖర్చు వస్తుంది. ధర లేక రైతులు నష్టపోతున్నారు. – గాలి చంద్ర, ిసీపీఐ జిల్లా కార్యదర్శి. -
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
కడప సెవెన్రోడ్స్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం జిల్లాలోని ఆలయాలను మూసివేశారు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఏర్పడింది. ఈ కారణంగా దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.50 గంటలకు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.00 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే మున్సిపల్ హైస్కూలు వద్దగల శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం, గడ్డిబజారులోని శ్రీ బాలాజీ ఆలయం, బిల్టప్ వద్దగల శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంతోపాటు ఇతర ఆలయాలను కూడా మూసివేశారు. ఒంటిమిట్ట రామాలయం మూసివేత ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆదివారం మూతపడింది. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రామాలయాన్ని మధ్యాహ్నం 1:50 గంటలకు మూసివేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున సుప్రభాతసేవ, ఆలయశుద్ధి, పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం యథావిధిగా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. రాయచోటి వీరభద్రాలయం రాయచోటి టౌన్: చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు. అలాగే పాత రాయచోటిలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, చెక్పోస్ట్ వద్ద వెలసిన శ్రీ శివాలయ తలుపులు, యండపల్లె సమీపంలోని శ్రీ భైవరవుడి ఆలయాలను కూడా మూసివేశారు. -
ముగిసిన పవిత్రోత్సవాలు
కడప సెవెన్రోడ్స్: దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 4నుంచి ప్రారంభమైన పవిత్రోత్సవాలు ముగిశాయి. ఆదివారం ఉదయం 6 నుంచి మధ్యాహ్నం 1.00 గంట వరకు పవిత్ర విసర్జనాలు, మహాపూర్ణాహుతి, కుంభ ప్రోక్షణ, పవిత్ర వితరణ తదితర పూజలను అర్చకులు ఆగమోక్తంతంగా నిర్వహించారు. అనంతరం భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేశారు. అర్చకులతోపాటు ఆలయ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డి పాల్గొన్నారు. -
అమ్మకానికి ఎర్రబంగారం
రాజంపేట: రాష్ట్ర ప్రభుత్వం నిల్వ ఉన్న ఎర్రచందనం విక్రయించాలని నిర్ణయం తీసుకుంది. దీంతో అటవీశాఖ ఎర్రచందనం నిల్వలపై దృష్టి సారించింది. కేంద్రీయ డిపో(తిరుపతి)లో ఉన్న ఎర్రచందనం అమ్మేందుకు అన్ని చర్యలను తీసుకుంది. శేషాచలం అటవీ పరిధిలో ఎక్కడ ఎర్రచందనం లభ్యమైనా సెంట్రల్డిపోకు తరలిస్తున్నారు. రాజంపేట, కపిలతీర్ధంలో కూడా ఎర్రచందనం డిపోలు ఉన్నాయి. వీటి నిల్వల విషయంలో సీఆర్ఎస్ ప్రధానంగా వ్యవహారిస్తోంది. ప్రస్తుతానికి 135 టన్నులు వేలానికి సిద్ధం చేశారు. ఈ విషయాన్ని సీఆర్ఎస్ సంబంధిత అధికారి ఒకరు ధ్రువీకరించారు. ప్రపంచంలోనే అరుదైన ఎర్రచందనం రాయలసీమ ప్రాంతంలో ఉన్న కొండల్లో మాత్రమే దొరుకుతుంది. ఈ కొండలు దాదాపు 5.5లక్షల హెక్టార్లలో విస్తరించి ఉన్నాయి. చిత్తూరు, నెల్లూరు, కడప, కర్నూలు జిల్లాలో విస్తరించిన శేషాచలం, వెలుగొండ, పాలకొండ, నల్లమల అడవులు తూర్పు కనుమల్లో ఉన్నాయి. వీటిలో శేషాచలం, వెలుగొండలో మాత్రమే అధికంగా ఎర్రచందనం పెరుగుతోంది. ఈ కొండల్లో యురేనియం, ఐరన్, గ్రాపైట్, కాల్షియం లాంటివి వివిధ నిష్పత్తులో ఉన్నాయి. రాజంపేట ఎర్రబంగారానికే డిమాండ్ జీవవైవిధ్యఅటవీ ప్రాంతం(బయోస్పెయిర్)గా గుర్తింపు పొందిన శేషాచలం ఎర్రచందనం చెట్లతో ప్రత్యేక గుర్తింపు సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయమార్కెట్లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి ఎక్కువ డిమాండ్ ఉంది. వైఎస్సార్జిల్లాలో 3.2 మిలియన్లు హెక్టార్లలో, అన్నమయ్య జిల్లాలో 2.8 మిలియన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఎర్రచందనం అనే పేరు ఎలా.. ఎర్రచందనాన్ని అనేక పేర్లతో పిలుస్తారు. టెరోకార్పస్సాంటలైనస్ అనేది దీని శాసీ్త్రయనామం. టెరో అనే గ్రీకు మాటకు ఉడ్(కర్ర) అని అర్థం. కార్పస్ అంటే పండు. దాని కాయ చాలాగట్టిగా ఉంటుంది. సాధారణంగా అది మొలకెత్తదు. అది మొక్క రావాలంటే ఏడాది పడుతుంది. దీనినే ఎర్రచందనం, రక్తచందనం, శాంటాలం. ఎర్రబంగారం అని కూడా అంటారు. రాజంపేట, రైల్వేకోడూరు పరిధిలో.. రాజంపేట, రైల్వేకోడూరు రేంజ్ పరిధిలో 50 వేల హెక్టారలో శేషాచల అడవులు విస్తరించి ఉన్నాయి. ఈ అడవుల్లో అధికంగా ఎర్రచందనం ఉంది. ఈ అడువులను జీవావరణ రిజర్వుగా కేంద్రం ప్రకటించింది. ఐదువేల వృక్షజాతులు మొక్కలు కలిగిన శేషాచల అడవులకు బయోస్పియర్ రిజర్వుగా ప్రకటించారు. ఈ అడవులో 1700పైగా పుష్పించే జాతి మొక్కలు ఉన్నాయి. దుంగలన్నీ ఒకచోటికి.. స్మగ్లర్ల అక్రమరవాణా నేపథ్యంలో ఎల్లలు దాటిన ఎర్రచందనాన్ని, దేశంలోని వివిధ రాష్ట్రాల్లో స్మగ్లర్లు అక్రమంగా నిల్వ చేసిన ఎర్రదుంగలను , అటవీ, పోలీసు,కస్టమ్స్శాఖల వద్ద వివిధ ప్రాంతాల్లో ఉన్న ఎర్రచందనాన్ని ఒకేచోటికి రప్పించి భద్రపరిచే పనులకు నాలుగేళ్ల క్రితం అటవీశాఖ శ్రీకారం చుట్టింది. టెండర్ల ద్వారా విక్రయించి రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చేందుకు ఏర్పాట్లు చేసింది. తిరుపతి కేంద్రీయ ఎర్రచందనం డిపోకు జిల్లాలోని డిపోలో నిల్వ ఉంచిన వాటిని తరిలిస్తారు. అక్కడే వేలంపాట నిర్వహించనున్నట్లు అటవీ అధికారులు చెబుతున్నారు. చైనా, జపాన్లలో వంటింట్లో వాడే పాత్రలు, గిన్నెలుకూడా ఎర్రచందనంతో తయారు చేసినవి వాడుతుంటారు. సంగీతవాయిద్యాలు తయారు చేసి పెళ్లిళ్లలో బహుమతిగా ఇస్తుంటారు. రష్యా వాళ్లు కూడా ఎర్రచందనం కొనుగోలు చేస్తుంటారు. అందులో ఔషధగుణాలు ఉన్నాయి. వయగ్రా, కాస్మెటిక్, ఫేస్ క్రీమ్ లాంటి వాటిలో వీటిని వాడతారు. అల్సర్ను తగ్గించే గుణం, కిడ్నీ సమస్యలు, రక్తాన్ని శుద్ధి చేయడం వంటి లక్షణాలు ఎర్రచందనంలో ఉంటాయని నిపుణులు అంటున్నారు. విదేశాలకు తరలిపోకుండా ఎర్రచందనం అక్రమ రవాణాకు అడ్డుకట్టవేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం యాంటీ స్మగ్లర్స్ టాస్క్ఫోర్స్ను ఏర్పాటుచేసింది. శేషాచలం అడవుల్లో నిత్యం కూంబింగ్ చేస్తూ చెట్లను నరకకుండా అడ్డుకుంటోంది. 2015లో ఏర్పాటైన ఈ టాస్క్ఫోర్స్లో పోలీసు, ఫారెస్టు, ఏపీఎస్పీ, సివిల్ పోలీసు డిపార్టుమెంట్ల సిబ్బంది ఉంటారు. తిరుపతి హెడ్క్వార్టర్గా పనిచేస్తోంది. గత 15 సంవత్సరాల్లో 15 లక్షల టన్నుల ఎర్రచందనం విదేశాలకు తరలిపోయింది. సీఆర్ఎస్ డిపోలోని నిల్వ ఉన్న మూడు రకాల ఎర్రబంగారం వేలంపాటకు సిద్ధమైంది. ఈ–సేల్ ద్వారా అమ్మకాలు సాగించనున్నారు. ఈనెల 22 నుంచి వచ్చేనెల 6 వరకు ఎర్రబంగారు కొనుగోలు దారులు డిపో సందర్శించే అవకాశం కల్పించారు. చిప్స్, బటన్స్, రూట్స్ రకాలను వేలంపాటలో అమ్మకానికి సిద్ధం చేశారు. రేట్ విషయంపై నిర్ణయం తీసుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక కమిటీ వేయనుంది. ఎర్రచందనం స్మగ్లర్లు శేషాచలం అటవీ ప్రాంతం నుంచి అక్రమంగా రవాణా చేస్తూ పట్టుబడిన దుంగలను కేంద్రీయ ఎర్రచందనం డిపోలో భద్రపరుస్తారు. వాటికి వేలం పాట నిర్వహించనున్నారు. అటవీప్రాంతం: శేషాచలం(బయోస్పెయిర్) అన్నమయ్య జిల్లా: 2.8 మిలియన్ల హెక్టార్లు వైఎస్సార్ జిల్లా: 3.2 మిలియన్ల హెక్టార్లు -
కుటుంబ బంధాలకు స్ఫూర్తి మరియమాత
కడప సెవెన్రోడ్స్: మరియమాత కుటుంబ బంధాలు ఎలా ఉండాలో తన జీవితం ద్వారా తెలుపుతూ విశ్వాసులకు స్ఫూర్తినిచ్చారని కడప మేత్రాసన కోశాధికారి రెవరెండ్ ఫాదర్ ఎస్.సురేష్ అన్నారు. ఆరోగ్యమాత నవదిన ప్రార్థన ఉత్సవాల సందర్భంగా ఆదివారం మరియాపురంలోని సెయింట్ మేరీస్ క్యాథడ్రల్ చర్చిలో రెవరెండ్ ఫాదర్ మరియన్న దివ్య బలిపూజ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ మరియమాతను ఆరోగ్య వరప్రదాయిని అంటారని, విశ్వాసం, నమ్మకాలతో ఆమె సన్నిధికి వచ్చి ప్రార్థించిన వారికి ఆరోగ్యం, ఉపశమనం లభిస్తాయన్నారు. ఆమె చూపిన బాటలో విశ్వాసులంతా నడిచినపుడే శాంతి సమాధానాలు లభిస్తాయన్నారు. నగరంలో ఆరోగ్యమాత ఊరేగింపు అనంతరం ఆరోగ్యమాత తేరు ఊరేగింపు మరియాపురం నుంచి నగరంలోని పలు ప్రముఖ కూడళ్ల ద్వారా ఆరోగ్యమాత పుణ్యక్షేత్రానికి చేరుకుంది. వల్లూరు విచారణ గురువు రెవరెండ్ ఫాదర్ శరత్ ఊరేగింపును పర్యవేక్షించారు. ఈ కార్యక్రమంలో కడప మేత్రాసన మరియదళ, విన్సెంట్ దె పాల్ సభ్యులు, ఆరోగ్యమాత సభ సిస్టర్లు పాటలు, జపమాల ధ్యానం నిర్వహించారు. రాత్రి 8 గంటలకు నల్గొండ డాన్బాస్కో ప్రిన్సిపాల్ రెవరెండ్ ఫాదర్ విల్సన్ ఆధ్వర్యంలో పరిశుద్ధ దివ్య సత్ ప్రసాద ఆరాధన,స్తుతి ప్రార్థనలు, స్వస్థత ప్రార్థనలు నిర్వహించారు. అనంతరం ఆరోగ్యమాత యువత ఆధ్వర్యంలో క్రైస్తవ భక్తి గీతాలాపన, నృత్య ప్రదర్శనలు జరిగాయి. కార్యక్రమంలో గురువులు, మఠ కన్యలు, విశ్వాసులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆరోగ్యమాత స్వరూపానికి పూల అలంకరణ చేస్తున్న దృశ్యం, ఊరేగింపులో పాల్గొన్న విశ్వాసులు -
బాబు పాలనలో సంక్షోభంలో వ్యవసాయం
వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ప్రొద్దుటూరు : చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో వ్యవసాయం సంక్షోభంలో పడిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు.ఎరువుల బ్లాక్ మార్కెట్ను నిరోధించి రైతులందరికి యూరియా సరఫరా చేయాలని కోరుతూ ఈనెల 9న ఉదయం 10 గంటలకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు తెలిపారు. ప్రొద్దుటూరులోని తన స్వగృహంలో శనివారం అన్నదాత పోరు పోస్టర్లను ఆవిష్కరించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ వ్యవసాయాన్ని పండుగ చేసింది దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి అయితే వ్యవసాయాన్ని దండగగా మార్చిన ఘనత చంద్రబాబుదేనన్నారు. చంద్రబాబుకు తొలి నుంచి రైతులపై ప్రేమ లేని కారణంగా వ్యవసాయాన్ని నిర్వీర్యం చేశారన్నారు. యూరియా కోసం వెళ్లిన రైతులపై గతంలో లాఠీ చార్జి చేసిన పరిస్థితులు ఉన్నాయన్నారు. జగన్ ప్రభుత్వంలో కొరత లేదు వైఎస్ జగన్ ప్రభుత్వంలో ఐదేళ్లు రైతులకు సమస్యలు లేవని రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా ఎరువులు, విత్తనాలను అందించడంతోపాటు శాస్త్రవేత్తల ద్వారా సలహాలు కూడా ఇచ్చేవారన్నారు. ప్రస్తుతం పరిస్థితి అందుకు భిన్నంగా మారిందన్నారు. సరైన ప్రోత్సాహం లేని కారణంగా ఆర్థిక ఇబ్బందులతో రైతులు ఆత్మహత్యలు చేసుకునే పరిస్థితి ఏర్పడిందన్నారు. అన్యాయాన్ని ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి జైలులో వేయాలని చంద్రబాబు ప్రభుత్వం అసెంబ్లీలో చట్టం చేస్తోందన్నారు. ఎంత మందిని ఎంత కాలం జైళ్లలో పెడతారని రాచమల్లు ప్రశ్నించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్పర్సన్ భీమునిపల్లి లక్ష్మీదేవి, ఎంపీపీ శేఖర్ యాదవ్, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, జిల్లా ఉపాధ్యక్షుడు పోరెడ్డి నరసింహారెడ్డి, కౌన్సిలర్లు వరికూటి ఓబుళరెడ్డి, లావణ్య, జయంతి, రాగుల శాంతి, ముదిరెడ్డి వెంకటసుబ్బారెడ్డి, చింపిరి అనిల్ కుమార్, రైతు నాయకులు టంగుటూరు విశ్వనాథరెడ్డి, శంకరాపురం మల్లికార్జునరెడ్డి, కోఆప్షన్ సభ్యుడు మల్లికార్జున ప్రసాద్, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
ఉల్లి ధర పతనంపై ఆందోళన
కడప సెవెన్రోడ్స్: ఉల్లి ధరలు భారీగా పడిపోవడంపై ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహించారు. కడపలోని కలెక్టరేట్ వద్ద శనివారం ఉల్లిగడ్డలపై పెట్రోల్ పోసి తగలబెట్టి నిరసన తెలియజేశారు. ఈ సందర్భంగా సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర మాట్లాడుతూ ఉల్లిగడ్డలు మార్కెట్లో క్వింటా వెయ్యి రూపాయలకు కూడా కొనడం లేదన్నారు. ప్రభుత్వం రూ.1200 ప్రకటించి కొనుగోలు చేస్తామంటోందని, ఈ రేటుకు అమ్మితే కనీసం పెట్టుబడులు కూడా దక్కవన్నారు. ఉల్లి ఎకరం సాగు చేయడానికి రూ. 80 వేల దాకా ఖర్చు అవుతుందని తెలిపారు. రైతుల వ్యవసాయ ఉత్పత్తులు, వినియోగదారుల మధ్య ధరల వ్యత్యాసం తగ్గించేందుకు, చీకటి మార్కెట్ల నివారణకు ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేస్తామని ప్రభుత్వం చెబుత్నుప్పటికీ ఆచరణలో సాధ్యం కావడం లేదన్నారు. కనీస మద్దతు ధర మూడు వేల రూపాయలు కల్పించి ప్రభుత్వమే కొనుగోలు చేసే వరకు పోరాటం చేస్తామని పేర్కొన్నారు. అనంతరం కలెక్టరేట్ ఏవో విజయ్కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఎంవీ సుబ్బారెడ్డి, పి.భాస్కర్, సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, ఎన్.వెంకట శివ, కేసీ బాదుల్లా, సురేష్, జి.మద్దిలేటి, వెంకట్ రాముడు, శంకర్ నాయక్, భవాని శంకర్, నాగేశ్వరరావు, మల్లికార్జున, భాగ్యలక్ష్మి, మునయ్య, రామ్మోహన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. మద్దతు రేటు రూ.3 వేలుకల్పించాలని డిమాండ్ కలెక్టరేట్ వద్ద ఉల్లిగడ్డలు తగలబెట్టిరైతు సంఘం నిరసన -
అత్యాచారం కేసులో వ్యక్తి అరెస్టు
వేముల : మైనర్ బాలిక అత్యాచారం కేసులో కుంచపు వెంకటరమణ అనే వ్యక్తిని అరెస్టు చేసినట్లు సీఐ ఉలసయ్య, ఎస్ఐ ప్రవీణ్కుమార్లు తెలిపారు. వేముల పోలీస్ స్టేషన్లో శనివారం వారు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. వేముల గ్రామానికి చెందిన కుంచపు వెంకటరమణ 2021లో స్థానికంగా ఉన్న ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ఇంటర్ చదువుతుండేవాడు. మధ్యలో చదువు ఆపేసి అప్పటి నుండి బేల్దారి పనికి వెళ్లేవాడు. ఈ క్రమంలో గత నాలుగు నెలల నుండి వేముల గ్రామానికి చెందిన మైనర్ బాలికను ప్రేమిస్తున్నానంటూ వెంటపడుతుండేవాడు. ఈ నేపథ్యంలో గతనెల 30వ తేదీ బాలికను బలవంతంగా మోటార్ సైకిల్పై ఎక్కించుకుని వెళ్లి అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ సంఘటనకు సంబంధించి బాధిత బాలిక ఫిర్యాదు మేరకు కుంచపు వెంకటరమణపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. నిందితుడిని శుక్రవారం సాయంత్రం అరెస్టు చేశారు. శనివారం కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు వారు తెలిపారు. -
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం
కడప ఎడ్యుకేషన్ : బోధన, పరిశోధన, సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన యోగి వేమన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)– 2025లో యోగి వేమన విశ్వవిద్యాలయానికి 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ 500 పైన ఉండగా అందులో వైవీయూ 51 నుంచి వందలోపు ర్యాంకు దక్కించుకోవడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమన్నారు. 2006లో ఏర్పాటైన వైవీయూ పాత విశ్వవిద్యాలయాలైన అనంతపురం జేఎన్టీయూ, ఎస్కేయూ, పద్మావతి విశ్వవిద్యాలయం వంటి వాటి సరసన నిలిచిందన్నారు. వైవీయూలో రామన్ ఫెలోషిప్, డాడ్ ఫెలోషిప్ పొందిన అధ్యాపకులు పనిచేస్తున్నారని అలాగే జర్మనీ, యూకే, యూఎస్ లలో పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో సెవెన్ స్పోక్ యూనివర్సిటీలను ఎంపిక చేయగా వాటిలో ఒకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది వైవీయూ కావడం గర్వకారణం అన్నారు. తద్వారా వైవీయూలో పరిశోధనకు రూ. 10 కోట్ల నిధులు రానున్నాయన్నారు. నిర్ణీత సమయంలో భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ మంచి ర్యాంకులు యూనివర్సిటీ సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్న ఐక్యూ ఏసీ బృందాన్ని వీసీ అభినందించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రిర్ ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలు, ప్లేస్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇంటర్నల్ క్వాలిటీ అసూరెన్స్ సెల్ (ఐక్యూ ఏసీ) సంచాలకులు డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం శర్మ, పీఎం ఉషా సమన్వయకర్త డాక్టర్ టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ 2027 నాటికి 100 ప్రాజెక్టులతో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం పోటీ పడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఐక్యుఏసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ చంద్ర, సభ్యులు డాక్టర్ దాక్షాయని, డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు డాక్టర్ పి. సరిత, డాక్టర్ కె. శ్రీనివాసరావు, డాక్టర్ తుమ్మలూరు.సురేష్ బాబు పాల్గొన్నారు. వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు -
పంటల సాగులో రైతులకు తోడ్పాటునందించాలి
కడప అగ్రికల్చర్ : పంటల సాగులో రైతులకు కావాల్సిన సూచనలు, సలహాలను అధికారులు అందించి రైతుల అభివృద్ధికి కృషి చేయాలని ఊటుకూరు వ్యవసాయ పరిశోధన కేంద్రం ప్రిన్సిపల్ సైంటిస్టు డాక్టర్ ప్రభాకర్రెడ్డి పేర్కొన్నారు. కడప నగర శివార్లలోని ఊటుకూరు పరిశోధన కేంద్రంలో శనివారం సమావేశం నిర్వహించారు. జిల్లా జేడీఏ, జిల్లా ఏడీఏలు, వ్యవసాయ శాస్త్రవేత్తలు, కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ తదితరులు పాల్గొన్నారు.ఈ సందర్భంగా ఆయన ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో జిల్లాలో సాగుచేస్తున్న పంటల వృద్ధి దశలు, వాటిలో ఉత్పన్నమవుతున్న సమస్యల గురించి చర్చించారు. వ్యవసాయ పరిశోధన స్థానం ప్రిన్సిపల్ సైంటిస్టు ప్రభాకర్రెడ్డి -
హెచ్ఐవీపై యువతకు అవగాహన అవసరం
జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు కడప రూరల్ : హెచ్ఐవీ/ఎయిడ్స్ వ్యాధి పట్ల నేటి యువతకు అవగాహన కల్పించాల్సిన అవసరం ఉందని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ నాగరాజు పిలుపునిచ్చారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ, జిల్లా ఎయిడ్స్ నియంత్రణ సంస్థ ఆధ్వర్యంలో యూత్ ఫెస్ట్ 2025–26లో భాగంగా శనివారం 5కే రెడ్ రన్ మారథాన్ నిర్వహించారు. కొత్త కలెక్టరేట్ రోడ్డు నుంచి రిమ్స్ బ్రిడ్జి వరకు కొనసాగిన ఈ మారథాన్ యూ టర్న్ తీసుకుని తిరిగి మహావీర్ సర్కిల్కు చేరుకుంది. ఈ సందర్భంగా డాక్టర్ నాగరాజు మాట్లాడుతూ హెచ్ఐవీ అంటు వ్యాధి కాదని తెలుసుకోవాలన్నారు. హెచ్ఐవీ బాధితుల పట్ల వివక్షను విడనాడాలన్నారు. ఇదే క్రమంలో యువత హెచ్ఐవీ బారిన పడి బంగారు భవిష్యత్తులను చేజేతులా కోల్పోవద్దని సూచించారు. జిల్లా లెప్రసీ, ఎయిడ్స్–టీబీ ఽఅధికారి డాక్టర్ యస్.రవి బాబు మాట్లాడుతూ హెచ్ఐవీ /ఎయిడ్స్ బారిన పడిన వ్యక్తుల పట్ల వివక్ష చూపకూడదని వారి పట్ల ప్రేమ, అభిమానాలు కలిగి ఉండాలని తెలియజేశారు. క్లస్టర్ ప్రోగ్రామ్ ఆఫీసర్ భాస్కర్ వేంపల్లె మాట్లాడుతూ హెచ్ఐవీ ఎయిడ్స్ కి చికిత్స ఉందన్నారు. దీనిపై అనుమానాలు ఉంటే ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత పరీక్షలు చేయించుకోవచ్చని తెలిపారు. అలాగే హెచ్ఐవీ ఉన్న వ్యక్తులు ఎలాంటి భయం, ఆందోళన లేకుండా ప్రభుత్వ ఆసుపత్రులలో ఉచిత మందులు తీసుకోవాలని తెలిపారు . ఈ 5కే రెడ్ రన్ మారథాన్లో అబ్బాయిల విభాగంలో మొదటి బహుమతి ఎ. సింహాచలం (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప), రెండవ బహుమతి ఈ. సికిందర్ (గవర్నమెంట్ ఆర్ట్స్ కాలేజ్ ఫర్ మెన్, కడప) గెలుచుకున్నారు. అలాగే యువతుల విభాగంలో మొదటి బహుమతి శ్రీశ (గవర్నమెంట్ పాలిటెక్నిక్ విమెన్ కాలేజీ, కడప), రెండవ బహుమతి కీర్తి (గంగాభవాని కాలేజీ) గెలుపొందారు. ట్రాన్స్ జెండర్స్ విభాగంలో మొదటి బహుమతి పింకి (యస్బీఆర్టీఎం కాలేజ్, కడప), రెండవ బహుమతి ఇ. మహేష్ (ఎస్వీ డీసీ కాలేజీ, కడప) గెలుపొందారు. జిల్లా క్రీడల అధికారి జగన్నాథ్ రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ డాక్టర్ గురవయ్య, స్టెప్ మేనేజర్ సుబ్బరాయుడు, స్టాటిస్టికల్ ఆఫీసర్ రమేష్రెడ్డి, అసిస్టెంట్ మలేరియా అధికారి వెంకటరెడ్డి, కోచ్లు అమృత్రాజ్, కల్యాణ్, ఇతర అధికారులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
‘కృషి’కి దక్కిన ఫలితం
● ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రాన్ని వరించిన పురస్కారాలు ● జోనల్ స్థాయిలో మూడు ప్రథమ, ఒకటి తృతీయ స్థానం ● హర్షం వ్యక్తం చేస్తున్న కేవీకే సమన్వయకర్త, శాస్త్రవేత్తలు కడప అగ్రికల్చర్ : తమిళనాడులోని రాయవేలూరు వేదికగా ఈనెల 2వ తేదీ నుంచి 4వ తేదీ వరకు జరిగిన జోనల్ స్థాయి(ఆంధ్రప్రదేశ్, తమిళనాడు, పుదుచ్చేరి,తెలంగాణ రాష్ట్రాలు) కృషి విజ్ఞాన కేంద్రాల వార్షిక కార్యాచరణ కార్యశాలలో కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రానికి జోనల్ స్థాయిలో నాలుగు పురస్కారాలు లభించాయి. ఇందులో ● షెడ్యూల్డ్ కులాల ఉప ప్రణాళిక పథకాన్ని విజయవంతంగా జిల్లాలో అమలు పరిచినందుకు ప్రథమ స్థానం. ● అపరాలు ఆదర్శ గ్రామం పథకాన్ని విజయవంతంగా నడిపిస్తునందుకు మూడవ స్థానం. ● జిల్లాలో మినుములో పల్లాకు తెగులు తట్టుకునే రకాలను విస్తరించినందుకు ప్రథమ స్థానం. ● అత్యుత్తమ ఫొటో విఽభాగంలో ప్రథమ స్థానం. ఈ పురస్కారాలను వ్యవసాయ సాంకేతిక విజ్ఞాన అనుప్రయోగ సంస్థ(ఆలారీ)జోన్ –10 డైరెక్టర్ డాక్టర్ షేక్ ఎన్. వీరా, ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం విస్తరణ సంచాలకులు డాక్టర్, జి. శివనారాయణ సమక్షంలో అందించారు. ఈ సందర్భంగా ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం సమన్వయకర్త డాక్టర్ అంకయ్య మాట్లాడుతూ ఈ పురస్కారాలు రావడానికి కృషి చేసిన, తోడ్పాటు అందించిన ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వ విద్యాలయం ఉపకులపతి డాక్టర్ ఆర్. శారద జయలక్ష్మికి, విస్తరణ సంచాలకులు డా. జి శివనారాయణ, సహాయ వ్యవసాయ పరిశోధన సంచాలకులు డా. సుమతి, ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానం తిరుపతి వారికి ధన్యవాదాలు తెలిపారు. అలాగే ఈ పురస్కారాలు సాధించడానికి విశేష కృషి చేసిన పూర్వపు కార్యక్రమ సమన్వయకర్త డాక్టర్ వీరయ్య, కేవీకే శాస్త్రవేత్తలు, సాంకేతిక, కార్యక్రమ సిబ్బందికి సహకరించిన వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల రైతులకు, వ్యవసాయ, అనుబంధ విభాగాల అధికారులకు కృతజ్ఞతలు తెలిపారు. కేవీకే శాస్త్రవేత్తలు హర్షం వ్యక్తం చేశారు. -
‘సంపూర్ణత అభియాన్’ సారథులకు సత్కారం
కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్య సాధనకు కృషి చేసిన అధికారులను శనివారం ఘనంగా సత్కరించారు. ఆకాంక్ష జిల్లా, ఆకాంక్ష బ్లాకుల్లో ఆరు విభాగాల్లో లక్ష్యాలు సాధించిన నేపథ్యంలో సంబంధిత భాగస్వామ్య శాఖల అధికారులు, ఫ్రెంట్లైన్ అధికారులు, సిబ్బందిని అభినందిస్తూ కడప మాధవి కన్వెన్షన్ హాలులో సన్మాన కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరితోపాటు కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణ చైతన్య హాజరయ్యారు. ముందుగా ఆకాంక్ష జిల్లా, బ్లాకుల లక్ష్య సాధనకు చేపట్టిన కార్యక్రమాలకు సంబంధించి ఆయా శాఖలు ప్రదర్శించిన స్టాళ్లను పరిశీలించారు. అనంతరం ఏర్పాటైన సభలో జిల్లా కలెక్టర్, ఎమ్మెల్యేలు ఏడీపీ భాగస్వామ్య శాఖల అధికా రులు, ఫ్రెంట్లైన్ అధికారులు, సిబ్బందికి పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైఎస్ఆర్ కడప ఆకాంక్ష జిల్లాలో ఎంపికై న చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు ఆకాంక్ష బ్లాక్లలో నీతి ఆయోగ్ గుర్తించిన 6 అంశాల్లో ‘సంపూర్ణత అభియాన్‘ కార్యక్రమాన్ని సంబంధిత శాఖలైన వైద్య ఆరోగ్య, శిశు సంక్షేమం, గ్రామీణాభివృద్ధి, విద్య, నైపుణ్యాభివృద్ధి, వ్యవసాయ, పట్టణాభివృద్ధి మొదలైన శాఖల ఆధ్వర్యంలో ప్రారంభించినట్లు తెలిపారు. ప్రభు త్వం గుర్తించిన ఆరు ముఖ్యమైన సూచికల్లో (జీవన ప్రమాణాలు మెరుగు పరచుటలో) సంబంధించి సంతృప్తికర స్థాయిని పొందడమే సంపూర్ణత అభియాన్ ముఖ్య ఉద్దేశం అన్నారు. 2024 ఫిబ్రవరి నాటికి ఆకాంక్ష జిల్లా, బ్లాకుల్లో వైద్య ఆరోగ్య రంగంలో ప్రెగ్నన్ట్ ఉమెన్ సమస్యలు, ఐసీడీఎస్లో బాలింత తల్లుల పోషకాహార సమస్యలు, విద్య శాఖలో మౌలిక సదుపాయలు, వ్యవసాయంలో సాయిల్ హెల్త్ కార్డులు పంపిణీ, గ్రామీణాభివృద్ధి రంగాలు, ఏఏ గ్రూపులకు బ్యాంకు రుణాలు అందజేయడం.. వంటి ఆరు అంశాల్లో జిల్లాను అభివృద్ధి పథంలోకి తీసుకుని వచ్చి సంపూర్ణత అభియాన్ అభివృద్ధి లక్ష్యాన్ని వంద శాతం సంతృప్తికర స్థాయిలో సాధించినందుకు గాను నీతి ఆయోగ్ మన జిల్లాకు మొదటి ర్యాంకును ప్రకటించడం జరిగిందన్నారు. ఆరు ప్రామాణికాల్లో అభివృద్ధిని ఆకాంక్షిస్తూ.. 2018 నుంచి ఇప్పటి వరకు పూర్తి స్థాయి అభివృద్ధిని సాధించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ముఖ్య ప్రణాళిక అధికారి హజరతయ్య, డీఎహెచ్ఓ శ్రీ నాగరాజు, ఐసీడీఎస్ పీడీ రమాదేవి, డీఈవో షంషుద్దీన్, డీఏవో చంద్రా నాయక్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, ఎల్డిఎం జనార్దనం, అనుబంధ శాఖల జిల్లా అధికారులు, నీతి ఆయోగ్ యంగ్ ప్రొఫెషనల్స్ తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా రాష్ట్రస్థాయి సూపర్ సెవెన్ క్రికెట్ పోటీలు
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అనిబిసెంట్ మున్సిపల్ హైస్కూల్లో శనివారం ఆంధ్రప్రదేశ్ సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో రాష్ట్రస్థాయి 4వ సూపర్ సెవెన్ అండర్–23 యూత్ క్రికెట్ పోటీలు ఉత్సాహంగా ప్రారంభమయ్యాయి. రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి 11 టీంలు ఈ పోటీల్లో పాల్గొన్నాయి. పోటీలను ప్రారంభించిన సీమాంధ్ర బీసీ సంక్షేమం సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు చల్లా రాజగోపాల్ మాట్లాడుతూ క్రీడాకారులు నిత్యం క్రీడా సాధన చేసి రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీల్లో రాణించాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో యూత్ క్రికెట్ క్లబ్ అధ్యక్షుడు మార్తల సుధాకర్రెడ్డి, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయుడు నాగార్జునరెడ్డి, రాష్ట్ర సూపర్ సెవెన్ క్రికెట్ అసోసియేషన్ సెక్రటరీ దేవేంద్ర, నంద్యాల జిల్లా సెక్రటరీ కిరణ్, అన్నమయ్య జిల్లా సెక్రటరీ మురళీ, పలు జిల్లాల కార్యదర్శులు, వ్యాయామ ఉపాధ్యాయుడు ప్రశాంత్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తిశ్రద్ధలతో ఆరోగ్యమాత ఉత్సవాలు
కడప సెవెన్రోడ్స్ : కడప నగరంలోని ఆరోగ్యమాత ఉత్సవాల్లో భాగంగా శనివారం 9వ రోజున నవదిన పూజా కార్యక్రమాలు భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. నల్గొండ డాన్బాస్కో ప్రిన్సిపాల్ తాళ్ల విల్సన్ సందేశాన్ని అందజేశారు. తొలుత అలంకరించిన పల్లకీపై మరియమాత స్వరూపాన్ని ఉంచి చర్చి ప్రాంగణంలో విశ్వాసులు స్తుతి గీతాలు ఆలపిస్తూ ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా గురువులు ఆరోగ్యమాత సందేశాన్ని వినింపించారు. భక్తులు స్తుతి గీతాలు ఆలపించారు. తేరు, దివ్య బలిపీఠాలను అలంకరించారు. ఈ కార్యక్రమంలో ఫాదర్ ఎండీ ప్రసాద్రావు, ప్రెసిడెంట్ విక్టర్, కార్యదర్శి సెబాస్టియన్, ఆర్థిక కార్యదర్శి ఆనందరావు, డేవిడ్, ఆంథోని, జార్జి, రాజేంద్ర, మణి, జయరాజుతోపాటు పలువురు విశ్వాసులు పాల్గొన్నారు. -
అన్నదాత సమస్యలపై ప్రభుత్వం నిర్లక్ష్యం
కడప కార్పొరేషన్: అన్నదాత సమస్యలు పరిష్కరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. ఎన్నికల వేళ కూటమి ఎన్నో హామీలు ఇచ్చి, అధికారంలోకి వచ్చిన తర్వాత వెన్నుపోటు పొడిచిందని ధ్వజమెత్తారు. శనివారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రస్తుతం రైతులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. పంటలకు గిట్టుబాటు ధర లేదని, పంట నష్టపోతే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వడం లేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు పంటల భీమా ప్రీమియం కూడా ప్రభుత్వం చెల్లించడం లేదన్నారు. వ్యవసాయం దండగ అన్న చంద్రబాబు, నేడు దాన్ని నిరూపిస్తున్నారన్నారు. ముఖ్యమంత్రి, వ్యవసాయ శాఖామంత్రి వ్యవసాయాన్ని అవహేళన చేసేలా మాట్లాడుతున్నారని ధ్వజమెత్తారు. యూరియా కోసం రైతులు క్యూ లైన్లలో నిల్చుంటే వ్యవసాయ శాఖ మంత్రి, రైతులు బఫే భోజనం కోసం నిల్చున్నట్లు ఉన్నారని ఎద్దేవా చేయడం దుర్మార్గమన్నారు. రైతులు పండించిన పంటలకు గిట్టుబాటు ధర లేక అల్లాడుతున్నారన్నారు. యూరియా అందుబాటులో ఉందని చెబుతూనే, యూరియా వల్ల కేన్సర్ వస్తుందని ముఖ్యమంత్రి చెప్పడం దారుణమన్నారు. వరి రైతులను నిరుత్సాహపరిచేలా, వ్యవసాయాన్ని నిర్లక్ష్యం చేసేలా సీఎం వ్యాఖ్యలు ఉన్నాయన్నారు. మార్క్ఫెడ్ల ద్వారా యూరియా సరఫరా చేయాల్సిన ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. రైతు భరోసా కేంద్రాల ద్వారా నాణ్యమైన ఎరువులు, విత్తనాలు సరఫరా చేయాల్సిన ప్రభుత్వం, ఆర్బీకేలను నిర్వీర్యం చేసిందన్నారు. కడపలోని ఆలంఖాన్పల్లె సొసైటీకి 50 ఏళ్ల చరిత్ర ఉందని, అలాంటి సొసైటీకి ఒక్క యూరియా బస్తా కూడా ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. యూరియాపై కృత్రిమ కొరత సృష్టించడం వల్ల రూ.270కి అమ్మాల్సిన దాన్ని రూ.600లకు విక్రయిస్తున్న పరిస్థితి ఉందన్నారు. యూరియా సరఫరాలో రూ.300 కోట్ల స్కాం జరిగిందని ఆరోపించారు. ధరల స్థిరీకరణ నిధి ఏదీ? రాష్ట్రంలో గతం కంటే తక్కువ సాగు విస్తీర్ణం నమోదైనప్పటికీ.. సక్రమంగా విత్తనాలు, ఎరువులు సరఫరా చేయడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. గతంలో పుట్టి వడ్లు రూ.16 వేలు ఉండగా, ఇప్పుడు రూ.12 వేలు మాత్రమే ఉందన్నారు. చీనీ టన్ను గతంలో లక్ష రూపాయలు ఉండగా, ఇప్పుడు రూ.15 వేలే ఉందన్నారు. ఉల్లికి ప్రభుత్వం రూ.1200 మద్దతు ధర ఇవ్వడం దారుణమన్నారు. కనీసం క్వింటా రూ.3 వేలతో కొనాలని డిమాండ్ చేశారు. రైతుల కోసం రూ.5 వేల కోట్లతో ధరల స్థిరీకరణ నిధి ఏర్పాటు చేసి రైతులను ఆదుకుంటామని చెప్పిన ప్రభుత్వం ఆ నిధే ఏర్పాటు చేయలేదన్నారు. ఈ క్రాప్ నమోదు చేసిన రైతులకు ప్రభుత్వమే ప్రీమియం చెల్లించి భీమా కల్పించాలన్నారు. ఈ సమస్యల పరిష్కారానికి వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ‘రైతు పోరు’ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ నెల 9వ తేది ఉదయం 10 గంటలకు జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయం వరకూ ర్యాలీ నిర్వహించి, ఆర్డీఓకు వినతి పత్రం సమర్పించనున్నామన్నారు. ఈ కార్యక్రమంలో రైతులు పెద్ద ఎత్తున పాల్గొని జయప్రదం చేయాలని కోరారు. అనంతరం రైతు పోరు పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు యానాదయ్య, దాసరి శివప్రసాద్, బంగారు నాగయ్య యాదవ్, దేవిరెడ్డి ఆదిత్య, సీహెచ్ వినోద్ కుమార్, షంషీర్, చెన్నయ్య, ఆర్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. పంటలకు దక్కని గిట్టుబాటు ధర యూరియా సరఫరాలో విఫలం 9న వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో రైతు పోరు మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా