YSR District Latest News
-
ఉద్యానశాఖ అధికారి బదిలీ
కడప అగ్రికల్చర్: జిల్లా ఉద్యానశాఖ అధికారిగా పనిచేస్తున్న సతీష్ చిత్తూరు జిల్లాకు బదిలీ అయ్యారు. ఈయనను అడ్మినిస్టేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ చేశారు. ఆయన స్థానంలో ఎవరినీ నియమించలేదు. కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ కడప జిల్లా బద్వేల్ అసెంబ్లీ నియోజకవర్గానికి చెందినవారిని రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా జి.రమణారెడ్డి, రాష్ట్ర పంచాయితీరాజ్ విభాగం కార్య దర్శిగా కె.దశరథరామిరెడ్డిలను నియమించారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లిమెంటరీ పరీక్షల్లో భాగంగా శుక్రవారం జిల్లావ్యాప్తంగా నిర్వహించిన పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. ఇందులో భాగంగా ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఉదయం సెషన్లో 46 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు 222 మంది, ఒకేషనల్కు సంబంధించి 51 మంది గైర్హాజరయారు. అలాగే సెకండియర్కు సంబంధించి మధ్యాహ్న సెషన్లో నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షకు సంబంధించి 162 మంది, ఒకేషనల్కు సంబంధించి 11 మంది గైర్హాజరయారు. మదనపల్లె సిటీ: డెడికేటెడ్ కమిషన్ చైర్మన్ రాజీవ్ రంజన్ మిశ్రా ఈనెల 25వ తేదీన వైఎస్సార్ కడప జిల్లా, అన్నమయ్య జిల్లాల అధికారులతో కడప కలెక్టర్ కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహిస్తున్నట్లు జిల్లా వెనుబడిన తరగతుల సంక్షేమశాఖ అధికారిణి తెలిపారు. వెనుబడిన కుల సంఘాలు, పౌర సమాజ సంస్థలు, ప్రజాప్రతినిధులు, సాధా రణ ప్రజల నుంచి వినతులు స్వీకరించడం జరుగుతుందన్నారు. కడప కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10 గంటల నుంచి మధ్యా హ్నం 1 గంట వరకు అందజేయాలన్నారు. మదనపల్లె సిటీ: ప్రవేశ పరీక్ష రాసి సీటు రాని విద్యార్థులకు ఈనెల 26 నుంచి కౌన్సెలింగ్ నిర్వహించనున్నట్లు ఏపీఎస్డబ్యూఆర్ఈఐ సొసైటీ జిల్లా సమన్వయ అధికారిణి ఏ.ఉదయశ్రీ తెలిపారు. కడప చిన్నచౌక్లోని అంబేద్కర్ గురుకులంలో ఉదయం 10 గంటలకు ఈ ప్రక్రియ ప్రారంభమవుతుంది ఐదో తరగతి బాలికలకు ఈనెల 26న, బాలురకు 27న.. ఇంటర్ మొదటి ఏడాది బాలికలకు ఈనెల 29న, బాలురకు 30న కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు తమ ర్యాంకు ఆధారంగా ఖాళీగా ఉన్న సీట్లను ఎంపిక చేసుకోవచ్చని ఆమె పేర్కొన్నారు. కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయం పరిధిలోని పాత వాహనాలను నిబంధనల ప్రకారం ఈ నెల 30న వేలం నిర్వహించనున్నట్లు ఆ శాఖ జిల్లా అధికారి నాగరాజు తెలిపారు. శుక్రవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి అధ్యక్షతన జిల్లా కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో నిరుపయోగంగా ఉన్న ఏడు పాత ఎస్హెచ్టీఓ వాహనాలకు ఈ నెల 30న వేలం వేయుటకు కమిటీ తీర్మానం చేసింది. గుర్తింపు పొందిన వేలం పాటదారులు ఏపీ. జిఓవి. ఇన్ వెబ్సైట్లో కనీస రుసుం చెల్లించి వేలంపాటలో పాల్గొనవచ్చని ఆ కమిటీ చైర్ పర్సన్, డీఎంహెచ్ఓ తెలిపారు. కార్యక్రమంలో ఏఓ విజయ భాస్కర్, మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఇస్మాయిల్ ఖాన్, అసిస్టెంట్ ట్రాన్స్ పోర్ట్ ఆఫీసర్ జీవీ రఘునాధవర్మ పాల్గొన్నారు. కడప రూరల్: రాయలసీమ రీజినల్ ఎడ్యుకేషన్ ఫెయిర్–2026ను ఈ నెల 24న కడప నగరంలోని విష్ణుప్రియ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్లు ఆర్ఆర్ కెరీర్ సొల్యూషన్స్ ఎండీ రామిరెడ్డి తెలిపారు. శుక్రవారం స్థానిక వైఎస్ఆర్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. 24న ఉదయం 9 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు ఈ ఫెయిర్ ను నిర్వహిస్తామన్నారు. ఇంటర్, డిప్లమా, డిగ్రీ పూర్తి చేసుకున్న తర్వాత విద్యార్థులకు ఎటువంటి ఉన్నత విద్య, ఉద్యోగ అవకాశాలు లభిస్తాయో విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొని తెలుసుకోవచ్చన్నారు. ఈ ఫెయిర్లో దేశంలోని 100కు పైగా యూనివర్సిటీలు పాల్గొంటున్నాయని తెలిపారు. ఉచితంగా ఎడ్యుకేషన్ ఫెయిర్లో పాల్గొనవచ్చని వివరించారు. -
ఎమ్మెల్యే వరదకు అవమానం
సాక్షి ప్రతినిధి, కడప: పసుపు జెండాను నమ్ముకున్న సీనియర్లకు విలువ లేదు.. ప్రజాక్షేత్రంలో గెలిచిన ఎమ్మెల్యేలకు కనీస మర్యాద లేదు! అంతా తానై, తన కోటరీ చెబితేనే అపాయింట్మెంట్లు అనే చందంగా సాగింది వైఎస్సార్ కడప జిల్లాలో మంత్రి నారా లోకేష్ పర్యటన. అటు కడప, ఇటు కొండాపురంలో జరిగిన సమావేశాల సరళి చూస్తే, కేవలం తన చుట్టూ భజన చేసే ‘అనుకూల’ వర్గానికే లోకేష్ పెద్దపీట వేశారని, జెండా మోసిన కార్యకర్తలను రోడ్డుపై నిలబెట్టారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కార్వాన్ వద్దే వరదరాజులరెడ్డికి అవమానం రాష్ట్రంలోనే అత్యంత సీనియర్ నాయకుడు, వయసులోనూ, అనుభవంలోనూ పెద్దవారైన ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డికి మంత్రి లోకేష్ పర్యటనలో తీవ్ర అవమానం ఎదురైంది. శుక్రవారం ఉదయం లోకేష్ను కలిసేందుకు మైనార్టీ నేత ముక్తియార్తో కలిసి వరదరాజులరెడ్డి ఆయన కార్వాన్ వద్దకు వచ్చారు. అయితే ఒక నియోజకవర్గ ఎమ్మె ల్యే, సీనియర్ నేత అని కూడా చూడకుండా.. ‘ముందస్తు అనుమతి లేదు, అపాయింట్మెంట్ కష్టమే‘ అంటూ లోకేష్ పర్సనల్ సెక్రెటరీ ముఖం మీదే చెప్పేయడం గమనార్హం. దాదాపు గంటసేపు పడిగాపులు కాసినా లోకేష్ నుంచి పిలుపు రాకపోవడంతో, వరదరాజులరెడ్డి తీవ్ర అవమానంతో వెనుతిరగాల్సి వచ్చింది. ప్రజాప్రతినిధికే ఈ పరిస్థితి ఉంటే ఇక తమ గతేంటని ‘తెలుగు తమ్ముళ్లు’ చెవులు కొరుక్కుంటున్నారు. జాతీయ ఉపాధ్యక్షుడికే స్టేజీ కింద స్థానం దీనికి ముందు గురువారం సాయంత్రం జరిగిన కడప నియోజకవర్గ కార్యకర్తల సమావేశంలోనూ అవమానాల పర్వం కొనసాగింది. పార్టీ జెండానే సర్వస్వంగా భావించే ఎంతోమంది కిందిస్థాయి నాయకులకు ఈ సమావేశంలో అసలు అనుమతే దక్కలేదు. ఒకవేళ లోపలికి వెళ్లగలిగినా, సీనియర్లకు దక్కిన మర్యాద శూన్యం. పార్టీ జాతీయ ఉపాధ్యక్షుడి హోదాలో ఉన్న హరిప్రసాద్, రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి గోవర్ధన్రెడ్డి లాంటి కీలక నేతలను సైతం స్టేజీపైకి రానివ్వలేదు. వీరంతా స్టేజీ కిందనే కూర్చోవాల్సి రావడంపై పార్టీ శ్రేణులు విస్మయం వ్యక్తం చేస్తున్నాయి. కోటరీతోనే ఏకాంత చర్చలు ప్రజాప్రతినిధి అయిన వరదరాజులరెడ్డిని గంట ల తరబడి బయట నిలబెట్టిన లోకేష్.. అదే సమయంలో ప్రొద్దుటూరు మాజీ ఇన్ఛార్జీ గండ్లూరు ప్రవీణ్కుమార్రెడ్డిని కార్వాన్ లోపలికి పిలిపించుకుని ఏకాంత చర్చలు జరపడం హాట్ టాపిక్గా మారింది. కేవలం తనకు అనుకూలంగా ఉండే వారికే లోకేష్ ప్రాధాన్యత ఇస్తున్నారని, పార్టీని నమ్ముకున్న కష్టజీవులకు మొండిచేయి ఎదురవుతోందని పలువురు వాపోతున్నారు. లోకేష్ రెండు రోజుల పర్యటన జిల్లా టీడీపీలో తీవ్ర నైరాశ్యాన్ని, అసంతృప్తిని మిగిల్చింది. సీనియర్లకు నో ఎంట్రీ..కోటరీకే పెద్దపీట గంటసేపు పడిగాపులు కాసినాఎమ్మెల్యేకు దక్కని అపాయింట్మెంట్ జాతీయ ఉపాధ్యక్షుడు హరిప్రసాద్,రాష్ట్ర కార్యదర్శి గోవర్ధన్రెడ్డిలకుస్టేజీ కిందనే సీట్లు -
ఎయిడ్స్ రహిత సమాజం కోసం ఉమ్మడి కృషి
ప్రొద్దుటూరు క్రైం: అందరి సహకారంతో ఎయిడ్స్ రహిత సమాజం కోసం కృషి చేద్దామని ఉమ్మడి జిల్లాల ఎయిడ్స్ నియంత్రణ క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వేంపల్లి భాస్కర్ పిలుపునిచ్చారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో శుక్రవారం ఏఆర్టీ, ఎన్జీఓల కోఆర్డినేషన్ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ’న్యాకో’ ప్రతిష్టాత్మకంగా తెచ్చిన ఎయిడ్స్ సురక్ష కార్యక్రమాన్ని విజయవంతం చేయాలన్నారు. హైరిస్క్ గ్రూపులతో పాటు అనుమానం ఉన్న వారందరికీ హెచ్ఐవీ పరీక్షలు చేయాలని, వ్యాధిగ్రస్తులకు అవసరమైన మందులను ఎల్లప్పుడూ అందుబాటులో ఉంచాలన్నారు. ఈ సమావేశంలో ఏఆర్టీ మెడికల్ ఆఫీసర్ సూర్యనాగలక్ష్మి, ఆసిఫ్, టీబీ విభాగం సిబ్బంది, ఎన్జీఓ ప్రతినిధులు పాల్గొన్నారు. -
గండికోట ముంపువాసులకు నిరాశ
జమ్మలమడుగు/కొండాపురం:కొండాపురం మండలంలో సోలార్ కంపెనీ ప్రారంభోత్సవానికి వచ్చిన మంత్రి నారా లోకేష్.. గండికోట ముంపు నిర్వాసితుల పరిహారంపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో బాధితులకు తీవ్ర నిరాశ ఎదురైంది. స్థానిక నేతలు ముంపు పరిహారం సమస్యను వివరించగా.. లోకేష్ తన ప్రసంగంలో పరిహారం ఇవ్వాలని మాత్రమే చెప్పారు కానీ, ఎప్పుడు ఇస్తారనేది స్పష్టం చేయకుండా ముఖ్యమంత్రి దృష్టికి తీసుకెళ్తామని దాటవేశారు. మరోవైపు ముంపువాసులను కాకుండా కేవలం అనుకూల వర్గాలకే పాసులు ఇచ్చి ప్రత్యేక సమావేశం నిర్వహించడంపై టీడీపీ క్షేత్రస్థాయి క్యాడర్ మండిపడింది. ‘ఎన్నికల్లో జెండాలు మోయడానికే మేం కావాలా?‘ అంటూ సొంత పార్టీ నాయకులే నిలదీయడం చర్చనీయాంశంగా మారింది.మరోవైపు గండికోట ముంపువాసులు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డిపై మండిపడుతున్నారు. ఎన్నికల్లో చెప్పి న హామీ ప్రకారం అదనపు పరిహారం ప్రస్తావనే లేకపోవడంతో ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ పర్యటన వేళ పోలీసుల జులూం మంత్రి లోకేష్ పర్యటన వేళ పోలీసులు ప్రతిపక్షం లేకుండా చేసేందుకు అరాచకానికి తెరలేపారు. మండలంలో సోలార్ ప్రాజెక్టు శంకుస్థాపన సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ఎవరూ ఇక్కడ ఉండకూడదంటూ తెల్లవారకముందే ఇళ్లపైకి వాలారు. ఊళ్లో ఉంటే పీఎస్లో కూర్చోవాలని, లేదంటే మండలం దాటాలని హుకుం జారీ చేశారు. లోకేష్ కు గండికోట ముంపు సమస్యలపై వినతులు ఇవ్వకూడదని, ఆ ప్రస్తావనే తేవద్దంటూ వైఎస్సార్సీపీ నేతలు హరినారాయణరెడ్డి, విజయభాస్కర్రెడ్డి, ప్రతాప్రెడ్డి, ప్రవీణ్లకు ముందస్తు నోటీసులు ఇచ్చారు. ప్రశ్నిస్తారనే భయంతోనే తమ గొంతు నొక్కుతున్నారని హరినారాయణరెడ్డి మండిపడ్డారు. మరోవైపు కొండాపురంలో నిలదీస్తున్న సీపీఐ నాయకుడు మనోహర్బాబుతో పాటు నలుగురిని పోలీసులు అక్రమంగా అరెస్ట్ చేశారు. పరిహారంపై తేల్చని లోకేష్ -
కడప మీదుగా మరొక వారాంతపు రైలు
కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–చర్లపల్లి–తిరుపతి (17441/42) లైన్లో మరో వారాంతపు రెగ్యులర్ రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. తిరుపతిలో ప్రతి మంగళవారం సాయంత్రం 4.30 గంటలకు బయలుదేరి రేణిగుంట, రాజంపేట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, నంద్యాల, దిగువమిట్ట, గిద్దలూరు, కంభం, మార్కా పురం రోడ్డు, మిర్యాలగూడ, నల్గొండ, పగిడిపల్లి మీదుగా చర్లపల్లికి మరుసటి రోజు ఉదయం 8.00 గంటలకు చేరుతుందన్నారు. అలాగే ప్రతి బుధవారం చర్లపల్లిలో రాత్రి 9.30 గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో మరుసటిరోజు మధ్యాహ్నం 12.30 గంటలకు తిరుపతికి చేరుతుందని వివరించారు. ఈనెల 26 నుంచి ఈ వారాంతపు రైలు ప్రారంభమవుతుందని తెలియజేశారు. -
గుర్తుతెలియని వాహనం ఢీ
– యువకుడు దుర్మరణం మదనపల్లె టౌన్: హైవేపై నడుచుకుంటూ వెళ్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టడంతో అక్కడి కక్కడే దుర్మరణం చెందిన విషాదకర సంఘటన శుక్రవారం వేకువజామున మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. మండలంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, అబ్బగొంది గ్రామానికి చెందిన ఎరప్ప్ర నాయుడు కుమారుడు ఏ. శ్రీరాములు నాయుడు (35) శుక్రవారం తెల్లవారుజామున పాలెంకొండలో కూలీల కోసం వైపు హైవేపై నడుచుకుంటూ వెళ్తున్నాడు. సీటీఎం చెరువు సమీపానికి చేరుకోగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం శ్రీరాములు నాయుడును బలంగా ఢీకొట్టింది. తీవ్ర గాయాలతో సంఘటనా స్థలంలోనే ప్రాణాలు కోల్పోయాడు. స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ప్రమాదానికి కారణమైన వాహనం ఆచూకీ కోసం పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ తెలిపారు. హోరాహోరీగా సీపీఎల్ –2 వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో సీపీఎల్ –2 క్రికెట్ మ్యాచ్లు హోరాహోరీగా జరుగుతున్నాయి. శుక్రవారం హైపెరియన్, ఎన్కే స్పోర్ట్స్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది. తొలుత బ్యాటింగ్ చేసిన ఎన్కే స్పోర్ట్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లుకు 186 పరుగులు చేసింది. హైపెరియన్ ప్లేయర్ సల్మాన్ 4 ఓవర్లలో 30 పరుగులు ఇచ్చి 3 వికెట్లు తీశాడు. తర్వాత బ్యాటింగ్ దిగిన హై పెరియన్ జట్టు 18.3 ఓవర్లకు 4 వికెట్ల తేడాతో 191 పరుగులు చేసి విజయం సాధించింది. సోహన్ రెడ్డి 45 బంతుల్లో 83, జయంత్ రెడ్డి 23 బంతుల్లో 53 పరుగులు చేశారు. సోహన్రెడ్డికి మ్యాన్ ఆఫ్ది మ్యాచ్ అవార్డు, ట్రోఫీని స్థానిక ఎంపీడీవో మనోహర రాజు, పంచాయతీ ఈవో రవీంద్రనాథ్ అందించారు. మధ్యాహ్నం స్పార్టన్ వారియర్స్, ఆదిత్య బీఆర్ జట్ల మధ్య జరిగి మ్యాచ్ను స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి టాస్ వేసి ప్రారంభించారు. ఆదిత్య బిఆర్ జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకొంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 214 పరుగులు చేసింది. జట్టులో రెడ్డిరుషీల్ 59 బంతుల్లో 95 పరుగులు చేసి నాటవుట్గా నిలిచాడు. 215 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ ప్రారంభించిన స్పార్టన్ వారియర్స్ 18.5 ఓవర్లలో 104 పరుగులకే ఆలౌటయింది.ఈ కార్యక్రమంలో సునీల్, శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ స్థలం కబ్జాకు యత్నం
● అడ్డుకున్న టీడీపీకి చెందిన మరో వర్గం ● ఇరువర్గాల మధ్య ఘర్షణ సునీల్ కుమార్ రెడ్డి వర్గాన్ని నివారిస్తున్న బద్వేలు సీఐ రామకృష్ణ, రెడ్డయ్య వర్గాన్ని నివారిస్తున్న ఎస్ఐ నాగకీర్తన అట్లూరు : మండల కేంద్రమైన అట్లూరు రెవెన్యూ పొలంలోని కడప – బద్వేలు ప్రధాన రహదారి పక్కనే సర్వే నంబర్ 1007/3లో 32 సెంట్లు ప్రభుత్వ భూమి ఉంది. ఆ స్థలాన్ని 2018లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు గుర్తించి పంపిణీకి రంగం సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. అప్పటి తహసీల్దార్ అట్లూరు మండల పరిధిలోని ఉన్న జర్నలిస్టులకు ఒక్కొక్కరికి 3 సెంట్ల చొప్పున లే అవుట్ వేసి జిల్లా కలెక్టర్కు ప్రతిపాదనలు పంపారు. అనంతరం టీడీపీకి చెందిన పోతిరెడ్డి రెడ్డయ్య ఆ స్థాలాన్ని కబ్జాకు యత్నించడంతో అప్పటి రెవెన్యూ అధికారులు ఇది ప్రభుత్వం స్థలం ఎవరైనా ఆక్రమణకు దిగితే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. అయితే శుక్రవారం ఉదయం ఆ స్థలానికి పక్కనే బోవిళ్ల సునీల్కుమార్రెడ్డి, విశ్రాంత ప్రధానోపాధ్యాయుడికి సంబంధించిన స్థలం ఉండటంతో ఈ స్థలంలో నుంచి రస్తా కావాలని జేసీబీతో సుమారు 50 మందితో అక్కడికి చేరుకుని పనులు చేపట్టారు. పోతిరెడ్డి రెడ్డయ్యతోపాటు ఆయన అనుచర వర్గం ఇక్కడికి చేరుకుని ఈ స్థలం తనదని అడ్డుకున్నారు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగింది. స్థానిక ఎస్ఐ నాగకీర్తన, బద్వేలు సీఐ రామకృష్ణ, ఎస్ఐ రంగారావు సంఘటన స్థలానికి చేరుకుని ఇరువర్గాలను చెదరగొట్టారు. వారిని స్టేషన్కు తరలించారు. జేసీబీని సీజ్ చేశారు. ఈ విషయమై స్థానిక తహసీల్దార్ సుబ్బలక్షుమ్మను వివరణ కోరగా ఈ స్థలానికి సంబంధించి పూర్తి వివరాలు బద్వేలు ఆర్డీఓ పరిశీలిస్తున్నారని, ఆయన ఆదేశాల మేరకు తదుపరి చర్యలు తీసుకుంటామన్నారు. -
జీరో లాగిన్ ఫీజుతో గృహ రుణాలు
కడప కార్పొరేషన్: ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ సంస్థ ఆధ్వర్యంలో జీరో లాగిన్ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నట్లు ఆ సంస్థ ఎండీ పంకజ్ గాడ్గిల్ అన్నారు. కడపలోని ఎన్జీవో కాలనీలో యాక్సిస్ బ్యాంకుపైన ఆదిత్య బిర్లా హౌసింగ్ ఫైనాన్స్ నూతన శాఖను ప్రారంభించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ నూతన బ్రాంచి ప్రారంభోత్సవం సందర్బంగా జీరో లాగిన్ ఫీజుతో రూ.50లక్షల వరకూ గృహ రుణాలు అందిస్తున్నామని తెలిపారు. వినియోగదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఆదిత్య బిర్లా దేశ వ్యాప్తంగా తన నెట్వర్క్ను విస్తరించిందని, కడప శాఖ ద్వారా మొత్తం బ్రాంచీల సంఖ్య 13కు చేరిందన్నారు. . జోరుగా నిషేధిత లాటరీ వ్యాపారం పుంగనూరు: పట్టణంలో బహిరంగంగా నిషేధిత లాటరీ టికెట్ల వ్యాపారం జోరుగా సాగుతుండటంతో పట్టణ ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని తూర్పుమొగసాల, సెంటర్లాడ్జి, కొత్తపేట, కొత్తయిండ్లు, ఎన్ఎస్.పేట ప్రాంతాలలో లాటరీ విక్రయాలతో పేద కుటుంబాలు వీధిన పడుతున్నాయి. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. చిన్నారి నోటికి చేపల గాలం కలకడ : చేపలను పట్టేందుకు వేసే గాలం చిన్నారి బేబీ(2)కి ఆడుకునే బొమ్మలా అనిపించడంతో నోటిలో పెట్టుకుంది, దీంతో అదికాస్త నోటిలో చిక్కుకున్న సంఘటన కలకడలో గురువారం రాత్రి చోటు చేసుకుంది. చిన్నారి కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రాజంపేటకు చెందిన రవి దంపతులు కలకడ మండలం గుడిబండ సమీపంలో తాత్కాలిక షెడ్లు వేసుకుని నెల రోజుల నుంచి నివాసం ఉంటున్నారు. మండలంలోని చెరువులు, కుంటల్లోని ముళ్లపొదలు, కంపచెట్లు కొట్టి బొగ్గులు తయారు చేసి విక్రయిస్తూ జీవనం సాగిస్తున్నారు. గురువారం రాత్రి చిన్నారి షెడ్లో ఆడుకుంటూ చేపల గాలాన్ని నోట్లో పెట్టుకొని లాగడంతో ఇరుక్కుపోయింది. కుటుంబసభ్యులు ఎంత ప్రయత్నించినా గాలం రాకపోవడంతో చికిత్స కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పరీక్షించిన వైద్యులు గాలం తీయడం కష్టతరమని భావించి తిరుపతికి రెఫర్ చేశారు. ప్రస్తుతం చిన్నారి ఆరోగ్య స్థితికి సంబంధించిన సమాచారం తెలియాల్సి ఉంది. -
జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు !
● ఒకరిపై దాడి చేశారని ఫిర్యాదు : నలుగురిపై కేసు ● యువకులపై కానిస్టేబుల్ దాష్టీకం కడప అర్బన్: కడప వన్ టౌన్ పోలీస్ స్టేషన్లో ఐడీ పార్టీ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న చంద్ర నారాయణరెడ్డి ఓ కేసులో నిందితులుగా ఉన్న యువకులను పిలిపించి వారిని కొట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు. ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ఇద్దరు జనసేన నాయకుల మధ్య రేగిన చిచ్చు మరింత రాజుకుంది. ఈ సంఘటనపై విశ్వసనీయ వర్గాల సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. జనసేన నాయకులైన హరిరాయల్, తాతంశెట్టి నాగేంద్రలు పరస్పరం సోషల్ మీడియా వేదికగా ఒకరినొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. తాతం శెట్టి నాగేంద్ర తనకు దగ్గరగా ఉన్న ప్రొద్దుటూరుకు చెందిన నలుగురు యువకులను మరో నాయకుడైన హరి రాయల్పై దాడికి పంపించాడు. దీనిపై హత్యాయత్నం కేసును నమోదు చేయాలని హరిరాయల్ పోలీసులను పట్టుబట్టారు. దీంతో ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప వన్ టౌన్ సీఐ వి. చిన్న పెద్దయ్య సంఘటన పై విచారణ చేసి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.నిందితులుగా ఉన్న నలుగురు యువకులను పోలీస్ స్టేషన్కు పిలిపించారు. సదరు కేసులో నిందితులకు 41–ఏ నోటీసులు ఇచ్చి పంపిస్తామని చెప్పి సీఐ ఇతర విధులకు వెళ్లాడు. ఆ సమయంలో ఐడీ పార్టీ కానిస్టేబుల్ చంద్ర నారాయణరెడ్డి అత్యుత్సాహం చూపారు. ఈకేసులో ఫిర్యాదుదారుడు, జనసేన నాయకుడైన హరి రాయల్ ను పోలీస్స్టేషన్కు పిలిపించారు. అతని ముందే కానిస్టేబుల్ యువకులను కొట్టి దాష్టీకానికి పాల్పడ్డాడు. యువకులు గాయపడ్డారు. తర్వాత విధులనుంచి వచ్చిన సీఐ ఎదుట హాజరు పరిచి వారికి 41– ఏ నోటీసులను ఇచ్చి పంపించేశారు. కాగా ఈ సంఘటన శుక్రవారం సోషల్ మీడియాలో యువకుల శరీరాలపై గాయాలతో కూడిన ఫొటోలతో జోరుగా ప్రచారం సాగింది. ఈ సంఘటనపై కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య ను వివరణ కోరగా, జనసేన నాయకుడు హరి రాయల్ పై దాడి చేసిన నలుగురు యువకులను పోలీస్ స్టేషన్ కు పిలిపించి విచారించామని, వారికి 41– ఏ నోటీసులు ఇచ్చి పంపించామని తెలియజేశారు. కానిస్టేబుల్ వారిపై దాడి చేశారన్న విషయం తమ దష్టికి రాలేదని, దీనిపై సమగ్రంగా విచారిస్తామన్నారు. కాగా ఈ సంఘటనలో నలుగురు యువకులను హరి రాయల్ పై దాడి చేసేందుకు పంపించిన మరో జనసేన నాయకుడు తాతంశెట్టి నాగేంద్ర తనను తాను కాపాడుకునేందుకు, పోలీసుల నుంచి తనపట్ల ఎలాంటి చట్టపరమైన చర్యలను తీసుకునేందుకు ఆస్కారం లేకుండా సోషల్ మీడియాలో విస్తృతంగా ప్రచారం చేస్తున్నారని ఆరోపణలు వినిపిస్తున్నాయి. -
మహిళలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలి
ఏఎస్పీ విభూ కృష్ణప్రొద్దుటూరు కల్చరల్ : మహిళలు తైక్వాండో వంటి ఆత్మరక్షణ విద్యలను నేర్చుకుని అందులో రాణించాలని ఏఎస్పీ విభూ కృష్ణ పేర్కొన్నారు. స్థానిక ఇంటర్నేషనల్ ఫంక్షన్ హాల్లో శుక్రవారం జాతీయ స్థాయి తైక్వాండో ఓపెన్ ఛాంపియన్ షిప్ పోటీలను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పట్టణంలో ప్రథమంగా జాతీయ స్థాయి తైక్వాండో పోటీలను నిర్వహించడం అభినందనీయమన్నారు. క్రీడలు శారీరక దృఢత్వానికి, మానసిక ఉల్లాసానికి, దోహదపడుతాయని తెలిపారు. కామెన్ వెల్త్ తైక్వాండో గోల్డ్ మెడలిస్ట్ టూటౌన్ ఎస్ఐ మహబూబ్ బాషా మాట్లాడుతూ తాను కూడా తైక్వాండో క్రీడాకారుడినని, క్రీడలు నేర్చుకోవడం వల్ల కలిగే ఉపయోగాలను వివరించారు. టూటౌన్ సీఐ వంశీనాథ్, రాష్ట్ర వక్ఫ్బోర్డు డైరెక్టర్ బేపారి జాకీర్ అహ్మద్ మాట్లాడారు. పోటీలను నిర్వహిస్తున్న ఆర్గనైజర్ సలీంను అభినందించారు. ఈ పోటీల్లో 14 రాష్ట్రాలకు చెందిన 900 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలు ఆదివారం వరకు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా తైక్వాండో క్రీడాకారులు ప్రదర్శించిన విన్యాసాలు, నటరాజ కళాక్షేత్రం విద్యార్థుల నృత్య ప్రదర్శన అందరిని ఆకట్టుకుంది. కార్యక్రమంలో యూత్ తైక్వాండో అసిసోయేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రదీప్ కుమార్, ఎస్ఏఐ కోచ్ సోమేశ్వరరావు, యూత్ తైక్వాండో అసోసియేషన్ ఏపీ చైర్మన్ మోహన్ కృష్ణ, తెలంగాణ చైర్మన్ రమేష్, మెంబర్ రాంబాబు, సీనియర్ కోచ్ మాస్టర్ ఉదయ్, మై స్పేస్ తైక్వాండో అకాడమీ చీఫ్ కోచ్ మహబూబ్ బాషా, కోచ్ హరి, ఏపీ యూత్ తైక్వాండో అసోసియేషన్ వైస్ చైర్మన్ రామకృష్ణ, రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు చెందిన కోచ్లు, క్రీడాకారులు పాల్గొన్నారు. -
ప్రజల గుండెల్లో పెద్దాయన
● వైఎస్ఆర్ రాజకీయ అభివృద్ధికి తోడ్పాటు ● పులివెందుల పెద్దాయనగా ప్రజల మన్ననలు ● నేడు దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి పులివెందుల : పులివెందుల చరిత్రలో పెద్దాయనది ఒక ప్రత్యేకత. తమ కుటుంబాన్ని నమ్ముకున్నవారికి అండగా నిలుస్తూ..కరువు లాంటి విపత్కర పరిస్థితుల్లోనూ ఆదుకున్న నాయకుడు దివంగత వైఎస్ రాజారెడ్డి. అప్పట్లో రాష్ట్ర రాజకీయాల్లో దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి బిజీగా ఉన్నా పులివెందులలో అంతా తానై నడిపించేవారు. వైఎస్ రాజారెడ్డి 1925లో వెంకటరెడ్డి, మంగమ్మ దంపతులకు జన్మించారు. ప్రజల కష్ట సుఖాల్లో పాలు పంచుకుంటూ అందరిని ఏకతాటిపై నడిపించిన దివంగత వైఎస్ రాజారెడ్డికి పులివెందుల పెద్దాయనగా పేరు వచ్చింది. అంతేకాకుండా పులివెందుల అభివృద్ధికి సంబంధించి గ్రామ సర్పంచ్గా ఎనలేని సేవలు అందించారు. క్రమశిక్షణ గల కార్యకర్తలను తీర్చిదిద్దడంలోనూ కుమారులు, కుమార్తెలు ఉన్నతస్థానంలో నిలపడంలోనూ కుటుంబ పెద్దగా పెద్దాయన పాత్ర ఎనలేనిది. పులివెందుల గ్రామ సర్పంచ్గా.. రాజకీయాల్లోకి రాకముందు నుంచి పులివెందుల్లో వై.ఎస్.రాజారెడ్డికి ప్రత్యేక గుర్తింపు ఉంది. ఎలాంటి సమస్య అయినా ఆయన దగ్గరికి వెళితే పరిష్కారమవుతుందని ప్రజల నమ్మకం.ఈ నాటికి ఆయన వెంట ఉన్న అభిమానులు రాజారెడ్డిని దేవునిగా కొలుస్తున్నారంటే ఎంత ఆరాధిస్తున్నారో అర్థమవుతోంది. ప్రజల మనిషిగా గుర్తింపు పొందిన రాజారెడ్డి పులివెందుల గ్రామ సర్పంచ్గా ఎన్నికై ప్రజాప్రస్థానం ప్రారంభించారు. ఆయన పులివెందుల సర్పంచ్గా 1988 నుంచి 1995 వరకు పనిచేశారు. ఆయన సర్పంచ్గా ఉన్న సమయంలోనే పులివెందులలో వీధిలైట్లు, రోడ్లు, విద్యా సంస్థలను ఏర్పాటు చేయడంతోపాటు మంచినీటి చెరువులను తవ్వించారు. అభివృద్ధి పనులు చేపడుతూనే ఈ ప్రాంత ప్రజల కష్టసుఖాలు తెలుసుకునేవారు. మంచినీటి సమస్య తీవ్రరూపం దాల్చినప్పుడు అన్నింటా తానే ఎన్నో వ్యయప్రయాసాలకు ఓర్చి నీటిసమస్య తీర్చడమే కాదు.. రాష్ట్రంలోనే ఇలాంటి సమస్య ఎప్పుడూ రాకూడదని పుత్రులకు హితబోధ చేసిన మహా మనిషి ఆయన. తన ఆశయాల సాధనకు రాష్ట్ర సర్వతోముఖాభివృద్ధికి తన సుపుత్రులలో ఇద్దరిని ప్రజల కోసం అంకితం చేశారు. రైతులను అన్నివిదాలా ఆదుకున్న దివంగత వై.ఎస్.రాజశేఖర్రెడ్డి కృషికి తోడుగా అక్కడక్కడ పెద్దాయన పేరుతో కూడా సేవా కార్యక్రమాలు, ప్రజా సంక్షేమ కార్యక్రమాలు అప్పట్లో రూపుదిద్దుకున్నాయి. పులివెందుల ప్రాంతంలో ప్రత్యేకంగా ఆయన పేరుతో కాలనీలు కూడా వెలిశాయి. పులివెందుల ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం దివంగత వైఎస్ రాజారెడ్డి, దివంగత జయమ్మ దంపతులు పులివెందుల ప్రాంత ప్రజల మనస్సులో ప్రత్యేక స్థానం ఏర్పరుచుకున్నారు. వైఎస్ రాజారెడ్డి బతికున్న కాలంలో ఈ ప్రాంత ప్రజలకు ఏ కష్టం వచ్చినా అండగా ఉండేవాడు. ప్రజలు కూడా తమకు ఏ కష్టం వచ్చినా పులివెందుల పెద్దాయనగా పిలువబడే వైఎస్ రాజారెడ్డి ఇంటి వద్దకు వెళ్లి మొరపెట్టుకునేవారు. ప్రజల కోసం వైఎస్ రాజారెడ్డి ఇంటి వాకిళ్లు ఎప్పుడు తెరిచి ఉండేవి. అంతేకాకుండా దివంగత మహా నాయకుడు ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి రాజకీయ అభివృద్ధికి వైఎస్ రాజారెడ్డి ఎంతో తోడ్పాటునందించారు. వైఎస్ రాజశేఖరరెడ్డి రాష్ట్ర రాజకీయాల్లో తలమునకలై ఉండగా.. వైఎస్ రాజారెడ్డి పులివెందుల ప్రాంతంలో ప్రజల సమస్యలపట్ల, రాజకీయాలపట్ల అన్నీ తానై చూసుకొనేవాడు. దీంతో వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రశాంతంగా రాష్ట్ర రాజకీయాల్లో చురుకై న పాత్ర పోషించేవాడు. వైఎస్ రాజారెడ్డి తనయుడు వైఎస్ఆర్ను ముఖ్యమంత్రిగా చూడాలని తపించేవాడు. విద్యా ప్రదాతగా.. : దివంగత వైఎస్ రాజారెడ్డి పులివెందుల పేదల ప్రజల అభ్యున్నతికి కృషి చేస్తూనే పులివెందులలో పేద విద్యార్థుల కోసం డిగ్రీ కళాశాల, పాల్టెక్నికల్ కళాశాలలు నెలకొల్పాడు. వైఎస్ రాజారెడ్డి, వైఎస్సార్లు చూపిన బాటలోనే వైఎస్ జగన్మోహన్రెడ్డి, వైఎస్ అవినాష్రెడ్డి, ఇతర కుటుంబ సభ్యులు నడుస్తున్నారని చెప్పవచ్చు. ఏదీ ఏమైనా పులివెందుల ప్రాంత ప్రజలు ఈనాటికి పెద్దాయనను మర్చిపోలేకపోతున్నారు. నివాళులర్పించనున్న వైఎస్ కుటుంబ సభ్యులు దివంగత వైఎస్ రాజారెడ్డి 28వ వర్ధంతి సందర్భంగా శనివారం పులివెందులలోని డిగ్రీ కళాశాల రోడ్డులో గల వైఎస్సార్ సమాధుల తోటలో గల వైఎస్ జయమ్మ, రాజారెడ్డి సమాధుల వద్ద మాజీ సీఎం వైఎస్ జగన్ తల్లి, మాజీ ఎమ్మెల్యే వైఎస్ విజయమ్మ, వైఎస్సార్ సోదరుడు వైఎస్ సుధీకర్రెడ్డి, ఇతర కుటుంబీకులు నివాళులర్పించనున్నారు. అనంతరం వైఎస్ రాజారెడ్డి పార్కులోని వైఎస్ రాజారెడ్డి విగ్రహం వద్ద నివాళులర్పించనున్నారు. -
రూ.2 కోట్ల అవినీతి
వేంపల్లె : స్థానిక చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీలో దాదాపు రూ.2కోట్ల అవినీతి జరిగిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. దీంతో పులివెందుల కో–అపరేటవ్ బ్యాంకు సబ్ డివిజనల్ అధికారి కమలమ్మను విచారణకు ఆదేశించారు. ఈ మేరకు శుక్రవారం చింతలమడుగుపల్లె సొసైటీలో విచారణ చేపట్టేందుకు విచ్చేశారు. ఈ విషయం తెలుసుకున్న కత్తులూరు, అలిరెడ్డిపల్లె, వేంపల్లె, చింతలమడుగుపల్లెతోపాటు ఆయా గ్రామాల్లో ఉన్న రైతులు మూకుమ్మడిగా చింతలమడుగుపల్లె వ్యవసాయ సహకార సొసైటీ కార్యాలయం వద్దకు చేరుకుని విచారణ అధికారి కమలమ్మను తమకు అన్యాయం జరిగిందని చుట్టుముట్టారు. అలాగే సొసైటీ కార్యాలయానికి రైతులు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేశారు. గతంలో చింతలమడుగుపల్లె సహకార సొసైటీలో సీఈఓగా పనిచేసిన రామిరెడ్డి అవినీతికి పాల్పడినట్లు బయారెడ్డి, ప్రసాద్ రెడ్డి, ప్రతాప్ రెడ్డి, పుల్లయ్య, సుదర్శన్ రెడ్డి, సుబ్బారెడ్డి, రామానందరెడ్డిలతోపాటు పలువురు రైతులు అరోపించారు. సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. చింతలమడుగుపల్లె సొసైటీలో వివిధ రకాల రుణాలను 1400మంది రైతులు తీసుకున్నట్లు తెలిపారు. పంట రుణాల్లో సీఈఓ రామిరెడ్డి 9 శాతం వడ్డీని వసూలు చేయాల్సి ఉండగా.. 12 శాతం వరకు వసూలు చేసినట్లు అరోపించారు. 12ఏళ్ల నుంచి సీఈఓ రైతుల నుంచి అధిక వడ్డీని వసూలు చేసి తన జేబులో వేసుకొంటున్నట్లు పేర్కొన్నారు. ఎస్టీ, ఇతర రుణాల్లో కూడా అవినీతికి పాల్పడ్డారన్నారు. ఒక్కో రైతుకు సంబంధించిన రుణాల్లో రూ.15వేల నుంచి రూ.20 వేల వరకు స్వాహా చేసినట్లు అరోపించారు. రూ.కోట్లల్లో అవినీతి చేసిన సీఈఓ రామిరెడ్డిపై ఉన్నతాధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని మండిపడ్డారు. సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి విచారణ పేరుతో కాలయాపన చేయడం తప్ప.. సీఈఓపై చర్యలు తీసుకోకపోవడం దారుణమని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికి 5 సార్లు విచారణ చేశారని, సీఈఓ చేసిన అవినీతి బయటపడినా కూడా అధికారులు అతనిపై ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. రుణాల వడ్డీ రెన్యువల్ చేయకుండా కోట్ల రూపాయలను వ్యవసాయ సహకార సంఘం సీఈవో రామిరెడ్డి మింగేశాడని వాపోతున్నారు. అనంతరం సీఈఓపై క్రిమినల్ కేసు నమోదు చేయాలని, ఉద్యోగం నుంచి తొలగించాలని విచారణ అధికారిణి కమలమ్మకు రైతులు రాతపూర్వకగా వినతి పత్రం అందజేశారు. సీఈఓ రామిరెడ్డిపై వచ్చిన అరోపణలపై విచారణ అధికారి కమలమ్మను వివరణ కోరగా.. ప్రజా సమస్యల వేదికలో కత్తులూరుకు చెందిన బయారెడ్డి, ప్రతాప్ రెడ్డిలు చింతలమడుగుపల్లె సహకార సొసైటీ సీఈఓ రామిరెడ్డిపై పిర్యాదు చేశారని, జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు కడప కోఅపరేటవ్ బ్యాంకు ఉన్నతాధికారులు తనను విచారణ అధికారిగా వేయడంతో వేంపల్లె సొసైటీ కార్యాలయానికి వచ్చానన్నారు. రాత పూర్వకంగా రైతులు వినతి పత్రం అందజేశారన్నారు. విచారణలో సీఈఓ రామిరెడ్డి అవినీతికి పాల్పడినట్లు కనిపిస్తోందన్నారు. రైతులకు న్యాయం చేసేందుకు జిల్లా ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తానని తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ దుర్మరణం
కడప అర్బన్: కడపలోని బైపాస్ రోడ్డు సమీపంలో గురువారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆటోడ్రైవర్ అక్కడికక్కడే మృతి చెందాడు. కడప ట్రాఫిక్ సీఐ తులసీరామ్ వివరాల మేరకు వైఎస్సార్ కాలనీకి చెందిన షేక్ చాన్ (33) ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గురువారం బాడుగకు రాజంపేటకు వెళ్లి తిరిగి అదే రోజున ఇంటికి రాత్రి 9.30కు బయలుదేరాడు. వైఎస్సార్ కాలనీకి వెళ్లేందుకు ఆటో యూటర్న్ తీసుకుంటుండగా వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. దీంతో ఆటో డ్రైవర్ తలకు బలమైన గాయం తగిలి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుని భార్య బీబీజాన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. ప్రొద్దుటూరు క్రైం : మండల పరిఽధిలోని చౌడూరు గ్రామంలో గుర్తు తెలియని బైక్ ఢీ కొని నాగిరెడ్డి (77) అనే వృద్ధుడు మృతి చెందాడు. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చౌడూరు గ్రామానికి చెందిన నాగిరెడ్డి గురువారం రాత్రి రోడ్డు దాటుతుండగా వేగంగా వచ్చిన గుర్తు తెలియని బైక్ అతన్ని ఢీ కొంది. ఈ ఘటనలో తీవ్ర రక్తస్రావం కావడంతో అతను అక్కడిక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రాజు తెలిపారు. విద్యుదాఘాతంతో వ్యక్తి.. వల్లూరు : మండల పరిధిలోని గోటూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం విద్యుదాఘాతానికి గురై అట్లూరి భాస్కర్ (45) దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు...భాస్కర్ తన ఇంటి వద్ద ఉన్న విద్యుత్ తీగలు తగలడంతో షాక్ కు గురై గాయపడ్డాడు. బంధువులు చికిత్స కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించగా అతడు అప్పటికే మతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. పోస్టుమార్టం నిమిత్తం మతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతుని భార్య నాగ రత్నమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ శివ నాగిరెడ్డి తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. మహిళ అదృశ్యంపై కేసు ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని శ్రీనివాసనగర్కు చెందిన గజ్జపనేని సంజీవమ్మ అనే వివాహిత రెండు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి తిరిగి రాకపోవడంతో టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు సంజీవమ్మ ఈ నెల 20న టాట్లెట్లు తీసుకొని వస్తానని కుటుంబ సభ్యులకు చెప్పి ఉదయం 10 గంటల సమయంలో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఇంత వరకు తిరిగి రాలేదు. తెలిసిన వాళ్ల ఇళ్లలోనూ. బంధువుల ఊళ్లలో విచారించినా ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు శుక్రవారం టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ ఎస్ఐ షేక్ మహబూబ్బాషా తెలిపారు. -
పరిహారం ఇవ్వక అష్టకష్టాలు పడుతున్నాం
గండికోట ప్రాజెక్టు కింద ఫేస్–3లో మా గ్రామం ముంపులోకి పోయింది. మా గ్రామానికి మొత్తానికి 600 పైగా ఉండగా 23 మందికి మాత్రమే పరిహారం చెల్లించారు. మిగిలిన వారికి పరిహారం రాక అష్టకష్టాలు పడుతున్నాం. పరిహారం ఇచ్చి మా గ్రామ నిర్వాసితులను ఆదుకోవాలని కోరుతున్నాం. –జి.నారాయణరెడ్డి, నిర్వాసితుడు, పి.అనంతపురం గ్రామం ప్రాథమిక పాఠశాలలు రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు గండికోట ప్రాజెక్టు కింద ముంపునకు గురైన తాళ్ల ప్రొద్దుటూరు గ్రామంలో ప్రాథమిక పాఠశాలలో భవనాలు లేక రేకుల షెడ్డులో నిర్వహిస్తున్నారు. పాలకులు చొరవ చూపి భవనాలు నిర్మించాలి. గ్రామంలో తాగునీళ్లు లేక ఇక్కట్లు పడుతున్నాం. డ్రైనేజీ సిమెంట్ రోడ్లు నిర్మించి మౌలిక వసతులు కల్పించాలి. –భూమిరెడ్డి ప్రతాపరెడ్డి, తాళ్ల ప్రొద్దుటూరు భూములు అమ్ముకోలేం.. ప్రభుత్వం పరిహారం ఇవ్వదు కూటమి ప్రభుత్వం అధికారంలోనికి వస్తే పరిహారం 24 లక్షలు ఇస్తామంటూ యువగళంలో నారాలోకేష్ రాజోళి ముంపురైతులతో సమావేశం పెట్టి మరీ చెప్పారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లయింది. ఇప్పటివరకు భూములకు పరిహారం గాని రాజోళి నిర్మాణం గురించి ప్రస్తావనే లేదు. మా భూములకు ప్రభు త్వం అవార్డులు పాస్ చేసింది. మా అవసరాలకు భూములు అమ్ముకుందామంటే రిజిష్ట్రేషన్లు కావడంలేదు. ప్రభుత్వమేమో పరిహారం ఇవ్వడంలేదు. ఇలాగైతా మేమెలా బతకాలి. –విశ్వనాథరెడ్డి, చదిపిరాళ్లదిన్నె, రాజోళి ముంపు బాధితులు -
అంగట్లో ఆర్డీఓ పోస్టు!
జమ్మలమడుగు: రెవెన్యూ శాఖలో బదిలీలు, పోస్టింగుల వ్యవహారం జమ్మలమడుగు నియోజకవర్గంలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. జమ్మలమడుగు ఆర్డీఓగా బాధ్యతలు దక్కించుకోవాలంటే ప్రభుత్వ పెద్దలకు అక్షరాలా 40 లక్షల రూపాయలు సమర్పించుకోవాల్సిందేనన్న ప్రచారం జోరుగా సాగుతోంది. అంత భారీ మొత్తం చెల్లించి ఇక్కడికి వచ్చినా, పెట్టిన పెట్టుబడి వెనక్కి వస్తుందా? లేదా? అనే ఆలోచనతో అధికారులు ఈ పోస్టింగ్కు వెనకడుగు వేస్తున్నారు. అంతా పాతవారు దోచుకున్నారు.. !గతంలో ఇక్కడ పనిచేసిన అధికారులు స్థానిక కంపెనీలు, పరిశ్రమల నుంచి భారీగా వసూళ్లు చేసుకుని వెళ్లిపోయారని, ఇప్పుడు వచ్చే కొత్త అధికారులకు అక్కడ దక్కేదేమీ ఉండదనే గుసగుసలు రెవెన్యూ శాఖలోనే బలంగా వినిపిస్తున్నాయి. దీనికి తోడు గతంలో జమ్మలమడుగు డివిజన్ పరిధిలో 16 మండలాలు ఉండగా, ప్రస్తుతం పులివెందుల విడిగా డివిజన్ కావడంతో జమ్మలమడుగు కేవలం 10 మండలాలకే పరిమితమైపోయింది. ల్యాండ్ కన్వర్షన్ (భూ మార్పిడి) రాబడి కూడా పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోకి మారడంతో ఆర్డీఓ కార్యాలయానికి వచ్చే సొంత ఆదాయం పూర్తి గా నిలిచిపోయింది. స్టీల్ప్లాంట్, సోలార్ కంపెనీల నిర్వాహకులు సైతం ఏ చిన్న పని ఉన్నా డైరెక్ట్గా ప్రభుత్వ పెద్దల వద్దకే వెళ్తుండటంతో తమకెలాంటి ఎలాంటి ప్రతిఫలం ఉండదని అధికారవర్గాల్లో చర్చ సాగుతోంది. పోస్టింగ్ల పైరవీలు.. 15 ÆøkÌS MìS…§ýlr Ð]l¬§ýlª-¯]l*Æý‡$ G‹Ü-yîlïÜ M>Æ>Å-ÌS-Ķæ$…ÌZ ç³°-^ólíܯ]l K A«¨M>Ç fÐ]l$Ã-ÌS-Ð]l$yýl$VýS$ BÆŠ‡yîl-KV> Ð]lÝë¢Æý‡° ÑçÜ–¢™èl {ç³^éÆý‡… fÇ-W…-¨. M>± _Ð]lÇ °Ñ$çÙ…ÌZ BĶæ$-¯]l¯]l$ ¯ðlË*ÏÆý‡$ {´ë…™é-°MìS º¨Î ^ólÔ>Æý‡$. {ç³çÜ$¢™èl… CMýSPyól VýS™èl…ÌZ ™èlçßæ-ïÜ-Ìêª-ÆŠ‡V> Ñ«§ýl$Ë$ °Æý‡Óíßæ…_, C糚yýl$ MýSÆý‡*²Ë$ hÌêÏÌZ ç³°-^ólçÜ$¢¯]l² JMýS A«¨M>Ç fÐ]l$ÃÌS-Ð]l$-yýl$-VýS$MýS$ Æ>Ð]l-yé-°MìS ¡{Ð]l {ç³Ä¶æ$-™é²Ë$ ^ólçÜ$¢-¯é²Æý‡$. AƇ$$™ól, {糿¶æ$™èlÓ ò³§ýlªË$ Ayýl$-VýS$-™èl$¯]l² ₹40 ÌS„ýSÌS ¿êÈ Ððl¬™é¢°² C^èl$a-Mø-Ð]l-yé-°MìS BĶæ$¯]l Cº¾…¨ ç³yýl$-™èl$-¯]l²r$Ï çÜÐ]l*-^é-Æý‡…. C¨Ìê E…yýlV>, fÐ]l$Ã-ÌS-Ð]l$yýl$-VýS$ÌZ çÜÇ-Mö™èl¢ ÝëÐ]l*-hMýS çÜÒ$-MýS-Æý‡-×êÌS {ç³^éÆý‡… ™ðlÆý‡-Oò³MìS Ð]l_a…¨. Ý린MýS GÐðl$ÃÌôæÅ Æð‡yìlz ÝëÐ]l*hMýS Ð]lÆ>Y-°MìS ^ðl…¨¯]l ÐéÆý‡$ M>Ð]lyýl…™ø, CMýSPyýl BÆŠ‡yîlK ´ùçÜ$tÌZ Æð‡yìlz ÝëÐ]l*-hMýS Ð]lÆ>Y-°MìS ^ðl…¨¯]l Ðéǰ °Ä¶æ$Ñ$…-^èlÐ]l-§ýlª-°, Ð]l$Æö-MýS-ǰ ¡çÜ$-MýS$Æ>-ÐéÌS° {糿¶æ$™èlÓ ò³§ýlªË$ ¿êÑçÜ$¢-¯]l²r$Ï ´÷Ísìæ-MýSÌŒæ çÜÇP-ÌŒæÞÌZ sêMŠS ¯]lyýl$-Ýù¢…¨. ప్రస్తుతం ఇన్చార్జిగా ఉన్న వ్యక్తికే జమ్మలమడుగు ఆర్డీఓగా అదనపు బాధ్యతలు అప్పగించారు. ఆయన ప్రతిరోజూ కడప నుంచి ఇక్కడికి వస్తూ పోతుండటంతో పూర్తిస్థాయిలో సమయం కేటాయించలేకపోతున్నా రు. ఫలితంగా డివిజన్ పరిధిలోని భూవివాదాలు, పెండింగ్ అర్జీల పరిష్కారం నత్తనడకన సాగుతోంది. ప్రభుత్వ పెద్దలు కక్షసాధింపులు, బేరసారాలు పక్కనబెట్టి సాధ్యమైనంత త్వరగా రెగ్యులర్ ఆర్డీఓను నియమిస్తేనే తమ భూసమస్యలు పరిష్కారమవుతాయని, లేదంటే ఇబ్బందులు పడాల్సి వస్తుందని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జమ్మలమడుగు ఆర్డీవో పోస్టింగ్ కావాలా..రూ.40 లక్షలు ఇచ్చుకోండి! సామాజిక సమీకరణాల మెలిక మూడు నెలలుగా ఇన్చార్జిలపాలనలోనే పరిపాలన నలిగిపోతున్న సామాన్యుడు -
వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా బండి మునిరెడ్డి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా కడప నగరం రూకవారిపల్లెకు చెందిన బండి మునిరెడ్డి నియ మితులయ్యారు. ప్రముఖ పారిశ్రామిక వేత్త అయిన ఈయన నగర ప్రజలకు సుపరిచితుడు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా బండి మునిరెడ్డి మాట్లాడుతూ తనను రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా నియమించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పార్టీని మరింత బలోపేతం చేయడానికి కృషి చేస్తానని తెలిపారు. కడప ఎడ్యుకేషన్: వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలో ని డాక్టర్. బీఆర్ అంబేడ్కర్ గురుకులాల్లో ప్రవేశా లకు ప్రవేశ పరీక్ష రాసి ఇప్పటివరకు సీటు కేటాయింపు పొందని విద్యార్థులకు ఈ నెల 26వ తేదీ కౌన్సెలింగ్ను నిర్వహించనున్నట్లు డా. బీఆర్ అంబేద్కర్ గురుకులాల జిల్లా సమన్వయకర్త ఉదయశ్రీ తెలిపారు. ఇందులో 5వ తరగతి ప్రవేశాలకు బాలికలకు 26వ తేదీ ఉదయం 10 గంటలకు, బాలురకు 27వ తేదీ ఉదయం 10 గంటలకు కడప చిన్నచౌక్లోని డా. బిఆర్ అంబేద్కర్ గురకులంలో కౌన్సెలింగ్ను నిర్వహిస్తామని తెలిపారు. అలాగే ఇంటర్మీడియట్ ప్రథమ సంవత్సరం ప్రవేశాలకు బాలికలకు 29వ తేదీ ఉదయం 10 గంటలకు, బాలురకు 30వ తేదీ ఉదయం 10 గంటలకు కడప చిన్నచౌక్లోని డా. బీఆర్ అంబేద్కర్ గురుకులంలో కౌన్సిలింగ్ ఉంటుందన్నారు. అర్హత కలిగిన విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరుకావాలని సూచించారు. వాల్మీకిపురం: వాల్మీకిపురంలోని శ్రీ పట్టాభిరామాలయంలో గురువారం శ్రీరాముడి జన్మ నక్షత్రమైన పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని సీతారాముల కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఉద యం స్వామివారిని సుప్రభాతసేవతో మేల్కొలిపి అర్చన, అభిషేకం జరిపారు. తదితర అనంతరం ఉత్సవ మూర్తులను అందంగా అలంకరించి మంగళవాయిద్యాల నడుమ ఆలయ ప్రాంగణంలోని ఆస్థాన మండపంలో సాంప్రదాయ బద్ధంగా తీసుకెళ్లి ఆశీనులను చేశారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య సీతారాముల కల్యాణం నిర్వహించారు. సాయంత్రం తిరుచ్చి ఉత్సవం నిర్వహించారు. -
తొలిరోజు సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతం
కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్ సప్లి మెంటరీ పరీక్షలు గురువారం జిల్లావ్యాప్తంగా ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ప్రథమ సంవత్సరానికి సంబంధించి ఉదయం సెషన్లో 46 పరీక్షా కేంద్రాలలో నిర్వహించిన పరీక్షలకు జనరల్ విభాగంలో 2976 మందికి 2813 మంది హాజరయ్యారు. సెకండియర్కు సంబంధించి మధ్యాహ్న సెషన్లో నిర్వహించిన పరీక్షలకు జనరల్ విభాగంలో 1682 మందికిగాను 1565 మంది హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆర్ఐవో వెంకటేశ్వర్లు మాట్లాడుతూ జిల్లాలో ఎక్కడా మా ల్ ప్రాక్టీస్ కేసును నమోదు కాలేదని తెలిపారు. కడప కోటిరెడ్డిసర్కిల్: తిరుపతి–చర్లపల్లి–తిరు పతి (17443/44) మధ్య వారాంతపు రెగ్యులర్ రైలును నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28 నుంచి ప్రతి గురువారం సాయంత్రం 4.30 గంటలకు తిరుపతిలో బయలుదేరి రేణిగుంట, కడప, ఎర్రగుంట్ల, ప్రొద్దుటూరు, నంద్యాల, మార్కాపురంరోడ్డు, పిడుగురాళ్ల, నడికుడి, మిర్యాలగూడ, నల్లగొండ మీదుగా చర్లపల్లికి మరుసటిరోజు ఉదయం 8.25 గంటలకు చేరుతుందన్నారు. ప్రతి శుక్రవారం సాయంత్రం 4.20 గంటలకు చర్లపల్లిలో బయలుదేరి ఇదే మార్గంలో మరుసటిరోజు ఉదయం 7.30 గంటలకు తిరుపతికి చేరుతుందని వివరించారు. కడప అర్బన్: కడపలోని రిమ్స్ పీఎస్ పరిధిలో ఏప్రిల్ 6న దారుణంగా హత్యకు గురైన కలమల్ల పెద్ద దస్తగిరి (53) కేసులో నేరారోపణలను ఎదుర్కొంటున్న మాజీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని రెండు రోజుల క్రితం కస్టడికి తీసుకున్నారు. గురువారం కస్టడీ గడువు ముగియడంతో ఆయనకు పోలీసులు రిమ్స్లో వైద్య పరీక్షలు చేయించారు. తర్వాత కడపలోని జిల్లా కోర్టులో మొబైల్ కోర్టు మెజిస్ట్రేట్ ముందు హాజరు పరిచారు. మెజిస్ట్రేట్ ఆదేశాల మేరకు బండి నిత్యానందరెడ్డిని తిరిగి కడప కేంద్ర కారాగారానికి రిమాండ్కు తరలించారు. కడప సెవెన్రోడ్స్: భరణం చెల్లించకపోవడంతో రిటైర్డ్ కానిస్టేబుల్ బోడా సుబ్బయ్యకు నెల రో జుల జైలు శిక్ష విధిస్తూ కడప ఫ్యామిలీ కోర్టు న్యాయమూర్తి శ్రీనివాసనాయక్ గురువారం తీర్పు వెలువరించారు. కడప నగరానికి చెందిన బోడా సుబ్బయ్య గంగాదేవి అనే మహిళను వివా హం చేసుకున్నాడు. మనస్పర్థలు రావడంతో ఆయన గంగాదేవిని వదిలేశాడు. దీంతో గంగా దేవి కడప ఫ్యామిలీ కోర్టులో ఎంసీ నంబరు 58/ 2022 కింద కేసు నమోదు చేశారు. దీంతో ఆమె జీవనం కోసం నెలకు రూ. 15 వేలు చెల్లించాలంటూ గత ఏడాది మార్చి 5వ తేదీ కోర్టు తీర్పునిచ్చింది. అయితే, బోడా సుబ్బయ్య భరణం చెల్లించకపోవడంతో తనకు రావాల్సిన రూ. 4 లక్షల 35 వేలు అరియర్స్ ఇప్పించాలంటూ గంగాదేవి ఫ్యామిలీ కోర్టులో పిటీషన్ దాఖలు చేసింది. న్యాయమూర్తి దీనిపై విచారణ నిర్వహించి బోడా సుబ్బయ్యను నెల రోజులు జైలుకు పంపారు. వేంపల్లె: జిల్లా వ్యాప్తంగా అటవీ శాఖ అభివృద్ధికి ప్రభుత్వం రూ.6కోట్ల నిధులు మంజూరు చేసిందని డీఎఫ్ఓ వినీత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం వేంపల్లెలోని అటవీ క్షేత్ర కార్యాలయంలో రూ.23లక్షల ఫారెస్ట్ నిధులతో నిర్మించిన అటవీ క్షేత్రాధికారి కార్యాలయాన్ని ఆయన ప్రారంభించారు. అనంతరం కార్యాలయ ఆవరణలో మొక్కలను నా టారు. ఈ సందర్భంగా ఆయన మీడి యాతో మాట్లాడుతూ ఎర్రచందన రవాణాపై ప్రత్యేక నిఘా పెట్టినట్లు చెప్పారు. ఫారెస్ట్లో అక్రమాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామ ని హెచ్చరించారు. నెమళ్ల పునరుత్పత్తి కేంద్రంలో నెమళ్ల సంరక్షణ కోసం ఈ ఏడాది రూ.15 లక్షలు ఖర్చు చేసి కంచె, సీసీ కెమెరాల ఏర్పాటుతోపా టు ఇతర పనులు చేపట్టామన్నారు. వేంపల్లె ఫారె స్ట్ రేంజ్ అధికారి బాల సుబ్రమణ్యం, డీఆర్ఓ వెంకట సుబ్బయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
మాస్కులు ధరించి..రాడ్లతో దాడి చేసి..
వేముల: తుమ్మలపల్లె యూసీఐఎల్ కర్మాగారంలో పనిచేస్తున్న ఉద్యోగిపై గురువారం ఉదయం గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేశారు. మాస్కులు ధరించిన కొంతమంది దారిలో కాపుకాచి ఇనుప రాడ్లతో ఉద్యోగి సుగునాథరెడ్డిని చితకబాదారు. ఈ సంఘటనకు సంబంధించి బాధితుని ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్నరంగాపురం గ్రామానికి చెందిన బొగ్గుల సుగునాథరెడ్డి తుమ్మలపల్లె యూసీఐఎల్ కర్మాగారంలో విధులు నిర్వహిస్తున్నాడు. అలాగే యురేనియం ఎంప్లాయీస్ యూనియన్లో జనరల్ సెక్రటరీగా కొనసాగుతున్నాడు. ప్రతిరోజు గ్రామం నుంచి బైకుపై విధులకు వెళ్లేవాడు. గురువారం ఉదయం విధులకు బయలుదేరాడు. చిన్నరంగాపురం రింగ్ రోడ్డులోకి రాగానే ఇద్దరు వ్యక్తులు బజాజ్ ఎన్ఎస్ వైట్ కలర్ బైకులో వచ్చారు. ముఖానికి మాస్కులు వేసుకున్నారు. రోజు మాదిరిగానే బెస్తవారిపల్లె క్రాస్ నుంచి యురేనియం క్వార్టర్స్ దాటగానే ఎల్.దివేంద్రారెడ్డి తోట దగ్గర దాక్కొని ఉన్న ఇద్దరు వ్యక్తులు రాడ్లు తీసుకుని ఉన్నారు. అక్కడికి రాగానే వచ్చినాడు రా అంటూ కుడివైపు ఉన్న వ్యక్తి సుమారు 5 అడుగుల ఇనుప రాడ్డుతో ఛాతిపై బలంగా కొట్టాడు. భయపడిన సుగునాథరెడ్డి అలాగే యూసీఐఎల్ దారిలోకి వెళుతుండగా మరొక చోట పురుషోత్తమరెడ్డి తోట దగ్గర కాపు కాచుకుని ఉన్న వ్యక్తులు ఎడమ చేతిపై కొట్టారు. అప్పుడు బైకు అదుపు తప్పి కింద పడిపోయాడు. ఇంతలో రింగ్ రోడ్డులో కనిపించిన ఇద్దరు వ్యక్తులు, అలాగే మొదట దాడి చేసిన వారు వచ్చి శ్రీనాథరెడ్డి, భరత్కుమార్రెడ్డిల మీద తిరగబడే మొనగాడివా రా అంటూ చంపడానికి మూడు నెలల నుంచి కాపు కాస్తున్నామని, ఈ రోజు దొరికినావు అంటూ మోకాలిపైన, కాలిపైన బలంగా కొడుతుండగా.. మబ్బుచింతలపల్లె వైపు నుంచి విజయశేఖరరెడ్డి, జనార్థన్రెడ్డిలు రావడం చూసి పారిపోయారు. గాయపడిన సుగునాథరెడ్డి జనార్థన్రెడ్డి ద్వారా గంగాధరకు ఫోన్ చేయించి అంబులెన్స్లో పులివెందుల ప్రైవేట్ ఆసుపత్రికి తీసుకొచ్చారు. అక్కడ డాక్టర్ చికిత్స చేసిన అనంతరం పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. విషయం తెలియడంతో పోలీసులు పులివెందుల ఆసుపత్రికి చేరుకుని దాడి సంఘటనపై విచారించారు. మబ్బుచింతలపల్లెకు చెందిన సి.శ్రీనాథరెడ్డి, టి.భరత్కుమార్రెడ్డిలతో పాత గొడవలు ఉండేవని, వారు నాపై కక్ష పెంచుకుని మాస్కులు వేసుకుని రాడ్లతో తీవ్రంగా కొట్టి చంపడానికి ప్రయత్నించిన వారిమీద చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు సుగునాథరెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. గాయపడిన సుగునాథరెడ్డిని చికిత్స నిమిత్తం పులివెందులలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. విష యం తెలుసుకున్న పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి, వేముల మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, వేముల జెడ్పీటీసీ కె.వెంకట బయపురెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆసుపత్రికి చేరుకుని బాధితుడిని పరామర్శించారు. ● ఈ సంఘటనకు సంబంధించి బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ప్రవీణ్ కుమార్ తెలిపారు గాయపడిన యూసీఐఎల్ ఉద్యోగి సుగునాథరెడ్డి -
రాజుపాళెంలో గాలీవాన భీభత్సం
రాజుపాళెం: రాజుపాళెం మండలంలో బుధవారం రాత్రి ఉరుములు, మెరుపులతో కూడిన గాలివాన భీభత్సం సృష్టించింది. ఈదురు గాలుల ధాటికి మండలంలోని కూలూరు, గాదెగూడూరు, టంగుటూరు, గోపాయపల్లె గ్రామాల్లో 14 విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. దీంతో విద్యుత్ శాఖకు సుమారు 70 వేల రూపాయల నష్టం వాటిల్లింది. కరెంట్ లైన్లు తెగిపోవడంతో బుధవారం రాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు మండలంలోని పలు గ్రామాలు చిమ్మచీకట్లోనే ఉండిపోయాయి. మండలంలో 9.4 మి.మీ వర్షపాతం నమోదైనట్లు రెవెన్యూ అధికారులు తెలిపారు. కొట్టాలలో నష్టం.. కొట్టాల గ్రామంలో ఈదురు గాలుల తీవ్రతకు ఓ ఇంటిపై ఉన్న రేకులు చెల్లాచెదురుగా ఎగిరిపోగా, నిలిపి ఉంచిన ఒక బొలెరో వాహనంపై భారీ చెట్టు విరిగిపడింది. -
అమరావతి పేరుతో అప్పుల కుప్పగా చేస్తున్నారు
పులివెందుల: అమరావతి పేరుతో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మారుస్తున్నారని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి తీవ్రంగా విమర్శించారు. బుధవారం పులివెందులలోని వైఎస్ జగన్ క్యాంప్ కార్యాలయంలో మాట్లాడిన ఆయన.. రాజధాని పేరుతో కూటమి ప్రభుత్వం ఇప్పటికే దాదాపు రూ.47వేల కోట్లు అప్పులు చేసిందని, మొత్తంగా ఈ రెండేళ్ల కాలంలోనే రూ.4 లక్షల కోట్ల అప్పులు కూడబెట్టిందని మండిపడ్డారు. ఇంత పెద్ద ఎత్తున అప్పులు చేస్తున్నా ప్రజలకు సంక్షేమ పథకాలు ఎందుకు అందించడం లేదని ఎంపీ ప్రశ్నించారు. వైఎస్ జగన్ హయాంలో ప్రభుత్వంలో విలీనమైన ఆర్టీసీని, ఇప్పుడు చంద్రబాబు పూర్తిగా ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించి మహిళల ఉచిత బస్సు పథకాన్ని అటకెక్కించే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. గత ప్రభుత్వం నిర్మించ తలపెట్టిన 17 మెడికల్ కాలేజీలను కూడా ప్రైవేట్పరం చేసే కుట్ర జరుగుతోందని, అమరావతికి పెట్టే ఖర్చులో కేవలం రూ.5వేల కోట్లు కేటాయిస్తే ఈ కాలేజీలన్నీ పూర్తవుతాయన్నారు. ఎన్నికల ముందు అబద్ధాలు చెప్పి అధికారంలోకి వచ్చిన కూటమి.. ఇప్పుడు ఎల్లో మీడియా సాయంతో భ్రమలు కల్పిస్తూ పాలన సాగిస్తోందన్నారు. ప్రస్తుత ప్రభుత్వ పాలన కేవలం వైఎస్సార్సీపీ శ్రేణులపై అక్రమ కేసులు బనాయించి రాక్షసానందం పొందడానికే పరిమితమైందని, ప్రజలు వీరికి త్వరలోనే బుద్ధి చెబుతారని హెచ్చరించారు. అనంతరం ఆయన ప్రజా దర్బార్ నిర్వహించి బాధితుల నుంచి అర్జీలు స్వీకరించారు. చంద్రబాబుపై కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శ -
నిన్న సీజ్... నేడు గలీజ్
● లీజు ముగిసినా, అద్దె కట్టకుండా అధికార బలంతో బెదిరింపులు ● సీజ్ చేసిన మున్సిపల్ షాపుల తాళాలు పగులగొట్టిన టీడీపీ నేత! రాజంపేట : రాజంపేట పురపాలక సంఘం కూరగాయల మార్కెట్లో అధికారులు సీజ్ చేసిన షాపులు అధికార తెలుగుదేశం పార్టీ నేతవి కావడంతో మున్సిపల్ గలీజు దందా పట్టణంలో తీవ్ర సంచలనంగా మారింది. మార్కెట్లో వ్యాపారం చేసుకుంటున్న సదరు నేత.. ఏళ్ల తరబడి షాపులకు అద్దె చెల్లించకుండా, గడువు ముగిసినా లీజు రిన్యూవల్ చేసుకోకుండా నిబంధనలను ఉల్లంఘించారు. అధికారులు పలుమార్లు హెచ్చరించినప్పటికీ, తాను అధికార పార్టీ నాయకుడినంటూ అధికారులపై తీవ్ర రాజకీయ ఒత్తిడి తీసుకొచ్చారు. అయినప్పటికీ మున్సిపల్ అధికారులు వెనక్కి తగ్గకుండా మంగళవారం పోలీసు బందోబస్తుతో ఆ నాలుగు షాపులను సీజ్ చేశారు. ఏపీ మున్సిపాలిటీ చట్టం ప్రకారం తీవ్ర నేరం! B…{«§ýl{ç³-§ólÔŒæ Ð]l¬°Þ-´ë-Ísîæ ^èlrt… 1965 ( APM Ac-t-, 1965) {ç³M>Æý‡….. Ð]l¬°Þ-´ëÍ-sîæMìS çÜ…º…-«¨…-_¯]l BçÜ$¢-ÌS¯]l$, Úëç³#-ÌS¯]l$ A«¨-M>-Æý‡$Ë$ ïÜgŒæ ^ólíܯ]l ™èlÆ>Ó™èl ÐéÇ Ð]l¬…§ýlçÜ$¢ परवानगी A¯]l$Ð]l$† ÌôæMýS$…yé B ïÜâýæÏ¯]l$, ™éâê-ÌS¯]l$ ç³VýS$-ÌSVö-rtyýl… Ìôæ§é A{MýS-Ð]l$…V> ÌZç³ÍMìS {ç³Ðól-Õ…^èlyýl… A¯ól¨ A™èlÅ…™èl ¡{Ð]l-OÐðl$¯]l ^èlrt-ç³Æý‡-OÐðl$¯]l ¯ólÆý‡…. {糿¶æ$™èlÓ Ð]l¬{§ýl-ÌS¯]l$ «§ýlÓ…çÜ… ^ólíÜ-¯]l…-§ýl$MýS$ çܧýlÆý‡$ Ð]lÅMýS$¢-ÌSOò³ {MìSÑ$-¯]lÌŒæ MóSçÜ$Ë$ ¯]lÐðl*§ýl$ ^ólíÜ MýSv-¯]l-OÐðl$¯]l ^èlÆý‡ÅË$ ¡çÜ$MýS$¯ól ÒË$…-¨. అధికార పార్టీ ఒత్తిడితో తూతూమంత్రంగా ఫిర్యాదు! అయితే, అధికారుల చర్యను సవాల్ చేస్తూ సదరు టీడీపీ నేత మున్సిపాలిటీ వేసిన అధికారిక సీళ్లను, తాళాలను పగులగొట్టి బుధవారం యథేచ్ఛగా షాపులను తెరుచుకోవడం కలకలం రేపింది. ప్రభుత్వ ముద్రలను బేఖాతరు చేస్తూ అక్రమంగా సీళ్లు తొలగించిన ఈ చట్టవిరుద్ధ వ్యవహారంపై మున్సిపల్ అధికారులు పోలీసులను ఆశ్రయించారు. అయితే, ఆ తాళాలు పగులగొట్టింది సదరు అధికార పార్టీ నేత అని అధికారులకు స్పష్టంగా తెలిసినప్పటికీ.. నేరుగా ఆయన పేరు మీద ఫిర్యాదు చేయకుండా, ‘వ్యక్తులను గుర్తించి చర్యలు తీసుకోవాలంటూ’ తూతూమంత్రంగా ఫిర్యాదు చేయడం వెనుక అధికార పార్టీ నాయకుల తీవ్ర ఒత్తిడి ఉందని మార్కెట్ వర్గాలు బహిరంగంగానే ఆరోపిస్తున్నాయి. మార్కెట్లో షాపును సీజ్ చేస్తున్న మున్సిపాలిటి అధికారులు మున్సిపాలిటీ సీజ్ ను తొలిగించి షాపులు తెరుచుకున్న దృశ్యం -
ముగిసిన ఏపీ ఈఏపీసెట్
కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగాతొమ్మిది రోజుల నుంచి నిర్వహిస్తున్న ఏపీ ఈఏసీ సెట్ బుధవారంతో ముగిశాయి. ఈ నెల 12వ తేదీ నుంచి 18వ తేదీ వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(బైపీసీ)కోర్సుల ప్రవేశ పరీక్షలను నిర్వహించారు. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలను జరిపారు. ఇందులో భాగంగా చివరి రోజు బుధవారం నిర్వహించిన ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించి రెండు సెషన్స్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 87.92 శాతం మంది విద్యార్థుల హాజరయ్యారు. కడప అర్బన్: వైఎస్సార్ కడప జిల్లాలో 19 మంది పోలీస్ సిబ్బందిని బదిలీ చేస్తూ జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ బుధవారం ఉత్తర్వులు జారీ చేశారు. బదిలీ అయిన వారిలో ఒక ఏఎస్ఐ, ఐదుగురు హెడ్ కానిస్టేబుళ్లు, 13 మంది కానిస్టేబుళ్లు ఉన్నారు. వీరందరూ తక్షణమే తమకు కేటాయించిన కొత్త ప్రాంతాల్లో విధుల్లో చేరాలని ఎస్పీ ఆదేశించారు. కడప అగ్రికల్చర్: జిల్లా కేంద్రమైన కడపలో ఈనెల 22 నుంచి 24వ తేదీ వరకు జరగాల్సిన రైతు పండుగను తాత్కాలికంగా వాయిదా వేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. వాతావరణ శాఖ హెచ్చరికల ప్రకారం ఎండ తీవ్రత ఎక్కువగా ఉండటం, అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉన్నందున ఈ కార్యక్రమాన్ని వాయిదా వేశామని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: రాజమహేంద్రవరంలో జూన్ 6,7 తేదీల్లో నిర్వహించనున్న 7వ ప్రపంచ తెలుగు సాహిత్య మహాసభలకు కడప నగరానికి చెందిన సాహిత్యకారుడు కడియంపాటి అరుణ్ప్రసాద్కు ఆహ్వానం అందింది. చైతన్య సారస్వత పరిషత్ సౌజన్యంతో అంతర్జాతీయ సాహిత్య సంస్థ శ్రీశ్రీ కళావేదిక ఆధ్వర్యంలో ఈ మహాసభలు జరుగుతున్నట్లు కళావేదిక జాతీయ అధ్యక్షులు జి.ఈశ్వరీ భూషణం, ప్రణాళిక అధికారి డాక్టర్ టి.పార్థసారథి తెలిపారు. చక్రాయపేట: జిల్లాలోని ప్రముఖ గండి శ్రీ వీరాంజనేయ స్వామి సన్నిధిలో బుధవారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. దేవదాయ శాఖ డిప్యూటీ కమిషనర్ ఆలయ కార్యనిర్వహణాధికారి పట్టెం గురుప్రసాద్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆలయంలోని ఏడు శాశ్వత హుండీల ద్వారా రూ.23,71,689లు, అన్న ప్రసాద వితరణ హుండీ ద్వారా రూ.21,584లు కలిపి మొత్తం ఆలయానికి రూ.23,93,273ల ఆదా యం వచ్చిందని వెల్లడించారు. అలాగే 000.005.900 గ్రాముల మిక్స్డ్ బంగారు, 000.420.500 గ్రాముల మిక్స్డ్ వెండి వస్తువు లు వచ్చినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో కడప దేవదాయశాఖ కార్యాలయ పర్యవేక్షకుడు శివయ్య, ఆలయ చైర్మన్ వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు నేటి నుంచి జిల్లావ్యాప్తంగా ప్రారంభం కానున్నాయి. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను ఇంటర్మీడియట్ అధికారులు పూర్తి చేశారు. ఈ నెల 21 నుంచి జూన్ 2వ తేదీ వరకు ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్స్లో పరీక్షలను నిర్వహించనున్నారు. ఇందుకోసం జిల్లావ్యాప్తంగా 46 పరీక్షా కేంద్రాల ను సిద్ధం చేశారు. ఇందులో మొదటి సంవత్సరానికి సంబంధించి 12,235 మంది విద్యార్థులు కాగా ద్వితీయ సంవత్సరానికి 8,084 మంది విద్యార్థులు పరీక్షలను రాయనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు సాగనున్నాయి. ఇందుకు సంబంధించి కడప ఆర్ఐఓ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేసి ఆన్లైన్ స్ట్రీమ్ ద్వా రా పరీక్షల తీరును పర్యవేక్షించనున్నారు. పరీక్షల నిర్వహణ కు సంబంధించి ఏవైనా సమస్యలుంటే 08562– 244171కు పోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఆర్ఐవో తెలిపారు. -
సర్వులూ ఖుషీ!
స్వయంకృషి..పీలేరు: ఆయన చదివింది ఐటీఐ డీజిల్ మెకానిక్ కోర్సు.. నడిపేది సాధారణ మెకానిక్ షెడ్డు. కానీ ఆయన మదిలో మెదిలిన ఆలోచనలు మాత్రం అసాధారణ ఆవిష్కరణలకు దారితీశాయి. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం కాకులారంపల్లెకు చెందిన మహ్మద్వలి, షర్మిల కుమారుడు రెడ్డిబాషా తన స్వయంకృషితో సరికొత్త ప్రయోగాలు చేస్తూ అందరితో ‘శభాష్’ అనిపించుకుంటున్నాడు. పీలేరులోని చిత్తూరు రోడ్డులో మెకానిక్ షెడ్డు నడుపుకునే రెడ్డిబాషా, కేవలం రిపేర్లకే పరిమితం కాకుండా సమాజానికి ఉపయోగపడే వాహనాల తయారీపై దృష్టి పెట్టాడు. రైతులు, దివ్యాంగులకు అండగా.. దివ్యాంగులు సులభంగా నడుపుకొనేలా ప్రత్యేకంగా మూడు చక్రాల వాహనాన్ని రూపొందించాడు. అలాగే రైతులు పొలం నుంచి పశుగ్రాసం, వ్యవసాయ పనిముట్లు తెచ్చుకునేందుకు వీలుగా బైక్ స్పేర్ పార్ట్స్తో తక్కువ ఖర్చుతో ఓ సరికొత్త వాహనాన్ని తయారు చేసి విజయం సాధించాడు. బయోగ్యాస్తో నడిచేలా సైకిల్కు ఇంజిన్ అమర్చి భేష్ అనిపించుకున్నాడు. రూ.5 లక్షలతో హెలికాప్టర్ కల! రెడ్డిబాషా మరో అడుగు ముందుకేసి సొంతంగా రూ. 5 లక్షల వ్యయంతో హెలికాప్టర్ తయారీకి శ్రీకారం చుట్టాడు. ఏడాదిన్నర కాలంగా శ్రమిస్తూ ఒక్కో స్పేర్ పార్ట్ను అమర్చుకుంటూ వస్తున్నాడు. ప్రస్తుతం క్యాబిన్ వర్క్ మినహా మిగిలిన పనంతా పూర్తయింది. మరో ఆరు నెలల్లో ఈ హెలికాప్టర్ పూర్తిగా సిద్ధమవుతుందని రెడ్డిబాషా ధీమా వ్యక్తం చేస్తున్నాడు. ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందితే సమాజానికి ఉపయోగపడే మరిన్ని సరికొత్త యంత్రాలను ఆవిష్కరిస్తానని ఈ యువ మెకానిక్ ఆశాభావం వ్యక్తం చేస్తున్నాడు. దివ్యాంగుల కోసం తయారు చేసిన మూడు చక్రాల వాహనం, రైతులకోసం తయారు చేసిన వాహనం పీలేరు యువకుడి అద్భుత ఆవిష్కరణలు షెడ్డులో ప్రయోగాలు.. సమాజానికి ఉపయోగాలు! రైతులు, దివ్యాంగుల కోసం తక్కువ ఖర్చుతో వాహనాల రూపకల్పన. బయోగ్యాస్ సైకిల్ నుంచి హెలికాప్టర్ దాకా అసాధారణ ప్రయోగాలు. ప్రభుత్వం ప్రోత్సహిస్తే మరిన్ని అద్భుతాలు సృష్టిస్తానంటున్న యువకుడు -
క్రికెట్ బుకీ వదిలివేతపై ఏఎస్పీ విచారణ పూర్తి
ప్రొద్దుటూరు క్రైం: వేంపల్లె క్రికెట్ బుకీ వదిలివేత వ్యవహారంపై ఏఎస్పీ విభూకృష్ణ జరిపిన అంతర్గత విచారణలో కీలక వాస్తవాలు వెలుగుచూశాయి. ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు ఏఎస్పీ స్వయంగా స్టేషన్కు వెళ్లి, ఆరోపణలు ఎదుర్కొంటున్న సీఐ, ఎస్ఐలను సుదీర్ఘంగా ప్రశ్నించారు. విచారణలో తేలిన ముఖ్యాంశాలు: ఏఎస్పీకి సమాచారం లేకుండానే ఎస్ఐ, ఒక కానిస్టేబుల్ వేంపల్లెకు వెళ్లి క్రికెట్ బుకీని ప్రొద్దుటూరుకు తరలించినట్లు నిర్ధారణ అయింది. స్టేషన్కు వచ్చిన ఒక మధ్యవర్తి.. పోలీసు అధికారులతో మాట్లాడి, ఎలాంటి కేసు లేకుండా బుకీని విడిపించుకు వెళ్లిన విషయం వాస్తవమేనని తేలింది. ఈ వ్యవహారంలో బుకీ ఎంత మొత్తం ముట్టజెప్పాడు, మధ్యవర్తితో ఎవరెవరు మాట్లాడారు అనే కోణంలో ఏఎస్పీ లోతుగా ఆరా తీశారు. సీఐ ఆదేశాలతోనే ఎస్ఐ వేంపల్లె వెళ్లాడా, లేక సొంత నిర్ణయంతో వెళ్లాడా అనే దానిపై వివరాలు సేకరించారు. నివేదికను ఎస్పీకి సమర్పించినట్లు సమాచారం. -
మాట ఎప్పుడు నిలబెట్టుకున్నావు..ఆదీ?
● ముంపు బాధితులకు కూటమి నిలువు ద్రోహం! ● ‘యువగళం’లో లోకేష్ ఇచ్చిన 24 లక్షల పరిహారం హామీ ఏమైంది? ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి సవాల్జమ్మలమడుగు: గండికోట, రాజోలి ప్రాజెక్టు ముంపు గ్రామాల బాధితులకు ఇచ్చిన ఏ ఒక్క మాటను కూడా జమ్మలమడుగు ఎమ్మెల్యే సి.ఆదినారాయణరెడ్డి (ఆది), కూటమి ప్రభుత్వం నిలబెట్టుకోలేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. బుధవారం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో నిర్వాసితులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం ఏర్పాటు చేశారు. మండలి సాక్షిగా మోసం.. మంత్రుల అడ్డగోలు మాటలు VýS…yìl-Mør »ê«¨-™èl$ÌSMýS$ OÐðlG-ÝëÞ-ÆŠ‡-ïÜï³ {糿¶æ$™èlÓ… C_a¯]l ₹10 ÌS„ýS-ÌS™ø ´ër$ A§ýl-¯]l…V> Ð]l$Æø ₹2 ÌS„ýSË$, Ððl¬§ýlsìæ Ñyýl™èl ºM>Ƈ$$Ë$ ₹3.25 ÌS„ýSË$ MýS*rÑ$ Ð]l_a¯]l Ð]l…§ýl Æøk-ÌZϯól CÝë¢Ð]l$° MýSÆý‡-ç³-{™éË$ ÐólíÜ Ð]l$È B¨-¯é-Æ>-Ķæ$-׿Æð‡yìlz àÒ$ C^éaÆý‡° Æ>Ð]l$-çÜ$-»ê¾-Æð‡yìlz VýS$Æý‡$¢^ól-Ô>Æý‡$. ¡Æ> Æð‡…yýl$ çÜ…Ð]l-™èlÞÆ>Ë$ §ésìæ¯é B FõÜ Ìôæ§ýl-¯é²Æý‡$. ©°Oò³ ™é¯]l$ Ô>çܯ]l-Ð]l$…-yýl-ÍÌZ {ç³Õ-²õÜ¢.. CÇ-VóS-çÙ-¯Œl Ð]l$…{† °Ð]l$ÃÌS Æ>Ð]l*-¯é-Ķæ¬yýl$, Ð]l$…{† ÌZMóS‹Ù çÜÐ]l$-„ýS…-ÌZ¯ól “Ò$ {糿¶æ$™èlÓ… C_a¯]l iÐø-ÌSMýS$ ç³ÇàÆý‡… Ðól$Ð]l¬ G…§ýl$MýS$ CÝ뢅’ A° »ê«§ýlÅ-™é-Æ>íßæ-™èlÅ…V> Ð]l*sêÏ-yýlr… §éÆý‡$-׿Ð]l$-¯é²Æý‡$. ఏరు దాటాక తెప్ప తగలేసిన లోకేష్! Æ>gZÍ B¯]l-MýSrt MøçÜ… A«¨M>-Æý‡$Ë$ ¿¶æ*Ð]l¬Ë$ õÜMýS-Ç…-_, AÐéÆý‡$z ^ólíÜ-¯é.. Ð]l$…yýl-ÍÌZ Ð]l*{™èl… AÌê…sìæ-§ólÒ$ Ìôæ§ýl…r* Ð]l$…{† Aº-§é®Ë$ ^ðl´ëµÆý‡° Æ>Ð]l$-çÜ$-»ê¾Æð‡yìlz Ð]l$…yìl-ç³-yézÆý‡$. Ķæ¬Ð]lVýSâýæ… ´ë§ýlĶæ*-{™èlÌZ ò³§ýlª-Ð]l¬-yìlĶæ$… Ð]l$…yýlÌê-°MìS Ð]l_a¯]l ¯éÆ> ÌZMóS‹-Ù.. OÐðlGÝëÞ-ÆŠ‡-ïÜï³ {糿¶æ$™èlÓ… {ç³MýS-sìæ…-_¯]l ₹12.5 ÌS„ýSÌS MýS…sôæ GMýS$P-Ð]lV> GMýS-Æ>MýS$ ₹24 ÌS„ýSË$ CÝë¢Ð]l$° OÆð‡™èl$-ÌSMýS$ ¯]lÐ]l$Ã-º-Í-M>Æý‡-°, C糚yýl$ ¡Æ> A«¨-M>Æý‡…ÌZMìS Ð]l^éaMýS HÆý‡$ §ésêMýS ™ðlç³µ ™èlVýS-Ìôæ-õÜÌê Ð]lÅÐ]l-çßæ-ÇçÜ*¢ Ð]l¬…ç³# »ê«¨-™èl$ÌSMýS$ òœ*Æý‡ A¯éÅĶæ$… ^ólçÜ$¢-¯é²Æý‡° «§ýlÓf-Ððl$-™é¢Æý‡$. స్వార్థ రాజకీయాలు.. రాజీనామాకు సవాల్! తన పనులు జరగడం లేదంటూ ఇక్కడ ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని నాటకాలాడే ఆదినారాయణరెడ్డికి అసలు రాజీనామా చేసే దమ్ము, ధైర్యం ఉన్నాయా అని రామసుబ్బారెడ్డి సవాల్ విసిరారు. నిన్ను నమ్మి గెలిపించిన ప్రజలను వదిలేసి, కేవలం స్వలాభం, ఆదాయం కోసమే పాకులాడుతున్నావని విమర్శించారు. ఇప్పటికై నా రైతుల నమ్మకాన్ని వమ్ము చేయకుండా, వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల నాటికల్లా గండికోట, రాజోలి ముంపు బాధితులకు పూర్తిస్థాయిలో న్యాయం చేయాలని, లేనిపక్షంలో పదవికి రాజీనామా చేసి నిజాయితీ నిరూపించుకోవాలని సవాల్ విసిరారు. మంత్రి నారా లోకేష్ తక్షణమే స్పందించి నిర్వాసితులకు పరిహారం అందేలా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
క్రీడా పాఠశాల ప్రవేశాలకు వేళాయె
కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లా కేంద్రమైన కడప నగరంలోని క్రీడా పాఠశాలలో 2026–27 ప్రవేశాలకు అధికారులు దరఖాస్తులు ఆహ్వానించారు. జిల్లా బిడ్డలు చదువుతో పాటు క్రీడల్లోనూ రాణించాలన్న సదాశయంతో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డి జిల్లా కేంద్రమైన కడప నగర శివార్లలోని స్పోర్ట్స్ స్కూల్ నిర్మించిన విషయం తెలిసిందే. అప్పటి నుంచి ఇప్పటి వరకు స్పోర్ట్స్ స్కూల్లో చదివిన విద్యార్థులు వివిధ క్రీడల్లో జిల్లా, రాష్ట్ర, అంతర్జాతీయ స్థాయిలో తమ సత్తా చాటుతున్నారు. ఇక్కడ శిక్షణ తీసుకున్న క్రీడాకారులు ఎంతో మంది క్రీడల్లో ప్రతిభ చాటి ఉన్నతస్థాయికి వెళ్లారు. కాగా 2026–27 విద్యా సంవత్సరానికి 4,5,6 తరగతుల్లో ప్రవేశాలకు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులకు ప్రభుత్వం నోటిఫికేషన్ విడుదల చేసింది. జూన్ 2 తేదీ వరకు గడువు ఆన్లైన్ ద్వారా దరఖాస్తులను మే 19 నుంచి జూన్ 2 లోపల దరఖాస్తు చేసుకోవాలి. మొత్తం 75 సీట్లకు గాను 4వ తరగతిలో 40 సీట్లు ఉన్నాయి. బాలురు–20, బాలికలు–20, 5వ తరగతిలో మొత్తం 23 సీట్లకు గాను బాలురు–06, బాలికలు –17 మంది, 6 తరగతిలో12 సీట్లకు గాను బాలురు 4, బాలికలు 8 క్రీడా పాఠశాలకు తీసుకుంటారు. 4వ తరగతి ప్రవేశానికి మూడవ తరగతి పూర్తి చేసి 8 నుంచి 10 ఏళ్లలోపు ఉండాలి. 5వ తరగతి అభ్యర్దులు 4వ తరగతి పూర్తి చేసి 9 నుంచి 11 ఏళ్లలోపు ఉండాలి. ఇక 6 తరగతిలో ప్రవేశానికి 5 తరగతి పూర్తి చేసి 10 నుంచి 12 మధ్య ఉండాలి. ఎంపికలు జరిగే తేదీ జిల్లాస్థాయి ఎంపికలు జూన్ 7, 8 తేదీల్లో కడప డీఎస్ఎ స్టేడియంలో చేపట్టనున్నారు. జూన్9న జిల్లా స్థాయిలో ఎంపికై న జాబితాను విడుదల చేస్తారు. జూన్ 11న ఎంపికై న విద్యార్థులకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలకు సమాచారం అందిస్తారు. జూన్ 14,15 తేదీల్లో కడపలోని డాక్టర్ వైఎస్ఆర్ క్రీడా పాఠశాలలో రాష్ట్ర స్థాయి ఎంపికలు ఉంటాయి. క్రీడా పాఠశాల ఎంపికలకు 9 రకాల టెస్ట్లను నిర్వహించనున్నారు. ఇందులో ఎత్తు, బరువు, 30 మీటర్ల ఫ్లయింగ్ స్టార్ట్ , స్టాండింగ్ బ్రాండ్ జంప్, వర్టికల్ జంప్, మెడిసిన్ త్రోబాల్, 800 మీటర్ల పరుగు పందెంతో పాటు వివిధ టెస్ట్లు నిర్వహిస్తారు. జూన్ 2 వరకు ఆన్లైన్ దరఖాస్తులకు గడువు జూన్ 7, 8 తేదీల్లో జిల్లా స్థాయి ఎంపికలు -
రౌడీయిజం, గంజాయిపై ఉక్కుపాదం
కడప అర్బన్: కడప జిల్లాలో రౌడీయిజం, గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు లేని సమాజ స్థాపనే లక్ష్యంగా పోలీస్ యంత్రాంగం కఠినంగా వ్యవహరించాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశించారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మైదుకూరు సబ్–డివిజన్ నేర సమీక్షా సమావేశాన్ని ఆయన నిర్వహించారు. ఎస్పీ జారీ చేసిన కఠిన ఆదేశాలు: రౌడీయిజంపై ఉక్కుపాదం: శాంతిభద్రతలకు విఘాతం కలిగించే రౌడీషీటర్లు, ట్రబుల్ మాంగర్లపై జిల్లా బహిష్కరణ, పీడీ చట్టం ప్రయోగించి కఠిన చర్యలు తీసుకోవాలి. వారు నేరం చేయకముందే ముందస్తు నిఘాతో అడ్డుకోవాలి. డ్రగ్స్, గంజాయిపై దాడులు: రాత్రిపూట ముమ్మరంగా గస్తీ (పెట్రోలింగ్) నిర్వహించాలి. అనుమానిత వ్యక్తులను డ్రగ్ డిటెక్షన్ కిట్లతో తనిఖీ చేయాలి. గంజాయి రవాణా, బహిరంగ మద్యపానాన్ని అరికట్టేందుకు డ్రోన్ కెమెరాల ద్వారా నిఘా ఉంచి దాడులు చేయాలి. క్రైమ్ మ్యాపింగ్: దొంగతనాలు జరిగే ప్రాంతాలను, నేరాల సరళిని మ్యాపింగ్ చేసి, ఆయా ప్రాంతాల్లో గస్తీని ముమ్మరం చేయాలి. పాత నేరస్థుల కదలికలపై నిఘా ఉంచాలి. ఐపీఎల్ బెట్టింగ్, మట్కా అడ్డుకట్ట: ఐపీఎల్ క్రికెట్ టోర్నమెంట్ నేపథ్యంలో గతంలో బెట్టింగ్ కేసుల్లో ఉన్న వారికి కౌన్సిలింగ్ ఇవ్వాలి. మట్కా, గ్యాంబ్లింగ్, బెల్ట్ షాపులపై విస్తృతంగా దాడులు చేసి కేసులు నమోదు చేయాలి. సీసీ కెమెరాలు తప్పనిసరి: ఏపీ పబ్లిక్ సేఫ్టీ యాక్ట్ ప్రకారం లాడ్జీలు, హోటళ్లు, అపార్ట్మెంట్లు, వాణిజ్య సముదాయాల్లో నిర్వాహకులు తప్పనిసరిగా సీసీ కెమెరాలు అమర్చుకునేలా అవగాహన కల్పించాలి. మహిళా భద్రతకు ప్రాధాన్యత: స్కూళ్లు, కాలేజీల వద్ద ‘శక్తి’ టీమ్ల బీట్లను ముమ్మరం చేయాలి. సోషల్ మీడియా వేధింపులపై బాలికలకు అవగాహన కల్పించాలి. ప్రతి పోలీస్ స్టేషన్లో మహిళా రిసెప్షనిస్ట్ల ద్వారా ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలి. రోడ్డు భద్రత – స్మార్ట్ పోలీసింగ్: స్మార్ట్ పోలీస్ ఇండికేటర్లను మెరుగుపరచాలి. పెండింగ్ కేసులు, నాన్–బెయిలబుల్ వారెంట్లను త్వరగా అమలు చేయాలి. రోడ్డు ప్రమాదాల నివారణకు ప్రత్యేక దృష్టి సారించి, వాహనదారులు హెల్మెట్ ధరించేలా చూడాలి. ఈ సమీక్షా సమావేశంలో మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్తో పాటు సబ్–డివిజన్ పరిధిలోని సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కఠిన ఆదేశాలు -
● ఖరీఫ్.. సాగయ్యేనా!
కడప అగ్రికల్చర్: జిల్లా రైతాంగానికి ఖరీఫ్ సాగు అచ్చి రావడం లేదు. పంటలు పెట్టి నష్టపోవడం, పెట్టుబడి దక్కకపోవడం, మరోవైపు వర్షాభావం, కరువు పరిస్థితులు..అన్నదాతలను కష్టాల్లోకి నెడుతున్నాయి. గడచిన నాలుగేళ్లలో రెండేళ్లు కరువు పరిస్థితులు రైతుల నెత్తిన కష్టాలు మిగిల్చాయి. ఆదుకోవాల్సిన ప్రభుత్వం పైసా ఇవ్వకుండా ముఖం చాటేసింది. ఈ పరిస్థితులు ఇలా ఉంటే ప్రస్తుత ఖరీఫ్ను ఎల్నినో తరుముకొస్తోంది. దారుణమైన వర్షభావ పరిస్థితులు నెలకొనబోతున్నాయి. గతంలో ఖరీఫ్ సమయంలో కొంతమేర పంటలైనా సాగయ్యేవి. ఈ ఎల్నినో పంటలసాగుపై ప్రభావం చూపనుంది. ప్రస్తుత ఖరీఫ్లో ఎల్ నినో కారణంగా వర్షాలు కురవకుండా దుర్భిక్షమైన పరిస్థితి నెలకొనబోతోందని ఇప్పటికే వాతావరణ శాఖ హెచ్చరించింది. అదునులో వర్షం ఉండదు ఖరీఫ్ పంటలు సాగు చేయాలంటే జూన్–జూలై మధ్య మంచి వర్షాలు కురవాలి. వాణిజ్య పంట వేరుశనగ సాగుకు జూలై 15 ఆఖరు. మిగతా పంటలు ఆగస్టు దాకా విత్తడం జరుగుతుంది. ఆ తర్వాత అదును దాటితే పంటలు పెట్టడానికి ఆస్కారం ఉండదు. అయితే ప్రస్తుత ఖరీఫ్కు సంబంధించి ముఖ్యమైన జూన్, జూలై నెలల్లో వర్షాలు ఉండవని వాతావరణ శాఖ నుంచి జిల్లా వ్యవసాయ శాఖ అధికారులకు సమాచారం అందింది. ఈ రెండు నెలల్లో 20 నుంచి 40 శాతం మేర వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ ప్రభావం అధికంగా ఉంటుందని అధికారులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ లెక్కన 60 శాతానికి పైగా వర్షపాతం లోటు ఉంటుంది. వర్షపాత లోటుతో పంటలు పెట్టడం అసాధ్యం. ఇలాంటి పరిస్థితుల్లో ఖరీఫ్ సాగు కావడం కష్టమే. ఆగస్టులో సాధారణ వర్షాలు కురుస్తాయని చెబుతున్నప్పటికీ అప్పుడు ఎలాంటి పరిస్థితులు ఉంటాయో అన్నది అంచనా వేయలేకపోతున్నారు. ఆగష్టులో వర్షాలు కురిస్తే వేరుశనగ కాకుండా ఇతర పంటలు సాగు చేసేందుకు రైతుల ముందుకు రావచ్చు. సాధారణ వర్షం కూడా కురువకపోతే పంటలు పెట్టడం అసాధ్యమే. సన్నగిల్లుతున్న ఆశలు జిల్లాను కరువులు, ఎల్నినో వెంటాడుతున్నాయి. 2024లో, 2025లో పదుల సంఖ్యలో మండలాలు కరువుబారిన పడ్డాయి. ప్రస్తుత ఖరీఫ్లో ఎల్నినో వల్ల జిల్లా మొత్తం ప్రభావితమయ్యే పరిస్థితి కనిపిస్తోంది. ఒకవేళ ఆగస్టులో సాధారణ వర్షం కురిసినప్పటికీ రైతులు సాగుకు ఆసక్తి చూపకపోవచ్చు. వ్యవసాయశాఖ సన్నద్దం ఎల్నినో ప్రభావం జిల్లాపై ఉంటుందని వాతారణశాఖ నుంచి వ్యవసాయశాఖకు వివరాలు అందినప్పటికి అధికారులు ఖరీఫ్ సాగు ప్రణాళిక అమలుకు చర్యలు చేపట్టారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్లో వేరుశనగతో పాటు వివిధ పంటల సాగుకు సంబంధించిన విత్తనాల పంపీణీ, ఎరువుల నిల్వలపై చర్యలు చేపట్టింది. మొదలుకాని పనులు సాధారణంగా ఏప్రిల్ మూడోవారం నుంచి రైతులు ఖరీఫ్ సేద్యం పనులు ప్రారంభిస్తారు. పొలాల్లో కలుపులు తీసి, దుక్కులు దున్నుతారు. వర్షాలు కురిశాక మరోసారి దుక్కులు దున్ని తర్వాత విత్తనం విత్తుతారు. అయితే వర్షాలు లేకపోవడం వల్ల మే నెల మూడో వారం దాటుతున్నా ఇంతవరకు పొలం పనులు చేపట్టలేదు. ఈ ఏడాది వర్షాధార పంటల సాగు లేనట్టే జూలై ఆఖరి వరకు వర్షాలు లేవు పంటలు కూడా విత్తే పరిస్థితి లేదు ఐదేళ్లుగా రైతులకు అచ్చిరాని ఖరీఫ్ సాగు ఈ ఏడాది ఖరీఫ్సాగుపై ఎల్నినో పడగ విప్పుతోంది. పైగా కూటమి సర్కారు కొలువుదీరినప్పటి నుంచి రైతులకు సాగు భారంగా మారింది. పంటల బీమా కట్టినా ప్రభుత్వం నుంచి పరిహారం అందడం లేదు. గతేడాది మోంథా తుపాన్ల వల్ల జిల్లాలలో వేలాది పంటలు దెబ్బతిన్నాయి. దీంతో సాగు చేయాలంటేనే రైతులు భయపడుతున్నారు. -
రాజకీయ కుట్రే!
సాక్షి ప్రతినిధి, కడప: పెద్ద దస్తగిరి హత్య కేసులో తనను ఇరికించడం వెనుక రాజకీయ కుట్ర ఉందని కడప మాజీ మేయర్ బండి నిత్యానందరెడ్డి స్పష్టం చేశారు. రాజకీయ ప్రేరేపితంతోనే పోలీసులు హత్య కేసుకు వక్రభాష్యం పలికినట్లు వివరించారు. తాజాగా నిత్యానందరెడ్డి పీటీ వారెంట్లో అదే విషయం తేటతెల్లమైంది. హతుడు దస్తగిరితో స్నేహితం తప్పా, శతృత్వం లేదని, రియల్ ఎస్టేట్ లావాదేవిలు అసలే లేవని తేల్చి చెప్పినట్లు సమాచారం. విశ్వసనీయ వర్గాల కథనం మేరకు... దస్తగిరి హత్య కేసులో నిందితుడు నరేంద్ర మాజీ మేయర్ బండి నిత్యానందరెడ్డికి సన్నిహితుడు, పైగా డ్రైవర్గా కూడా ఉన్నారు. గత నాలుగు నెలలుగా ఇరువురి మధ్య అనేక పర్యాయాలు ఫోన్కాల్స్ ఉన్నాయి. వాటి ఆధారంగా నిత్యానందరెడ్డి ప్రమేయంపై పోలీసులు అనుమానించారు. ఆ మేరకు కేసు నమోదు చేయడంతో దిక్కుతోచని నిత్యానందరెడ్డి పరారయ్యా రు. పరారీలో ఉంటూనే కోర్టులో ముందస్తు బెయిల్ పొందేందుకు ప్రయత్నించారు. బెయిల్ దక్కకపోవడంతో ఎస్పీ ఎదుట సరెండర్ అయ్యారు. అదే విషయాన్ని రెండురోజులుగా విచారించిన చిన్నచౌక్ సీఐ రామకృష్ణారెడ్డి, డీఎస్పీ బాలస్వామిరెడ్డిలకు తేల్చి చెప్పినట్లు సమాచారం. పోలీసు అధికారులు అడిగిన ప్రశ్నలన్నింటికీ జవాబు ఇచ్చినట్లు తెలుస్తోంది. పెద్ద దస్తగిరితో సన్నిహితం తప్పా, శతృత్వం లేదని, తామంతా వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులమని వివరించినట్లు సమాచారం. పైగా రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దస్తగిరి ద్వారా ఎలాంటి లావాదేవీలు లేవని వివరించినట్లు తెలుస్తోంది. పోలీసులు అడిగిన ప్రశ్నలన్నింటికీ నిక్కచ్చిగా నిజాయితీగా సమాధానాలు ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆలంఖాన్పల్లె దస్తగిరి రియల్ ఎస్టేట్ వ్యాపారంలో దళారిగా వ్యవహరించేవారు. తన చాతు ర్యం కారణంగా అమ్మకం దారులు, కొనుగోలు దారులను ఒప్పించి, తనకు కొంత వాటా పెట్టుకునేవారు. ఇలా అనేక మందితో వ్యాపార కార్యకలాపాలున్నాయి. ఎక్కడా ఒక్కరితో కూడా వ్యాపార పరంగా విభేదాలు తలెత్తిన సంద ర్భా లు లేవని కుటుంబ సభ్యులు కూడా స్పష్టం చేశారు. రియల్ వాప్యారంలో ఒప్పించి, మెప్పించేవారని దస్తగిరితో పరిచయం ఉన్న వారంతా చెబుతున్నారు. మారెమ్మ జాతర వివాదం, చెడు వ్యసనాలు కల్గిన వారి దుశ్చర్యలు కారణంగా తలెత్తిన ఘర్షణ, పరుషపదజాలం ప్రయోగం, ఎవరికి వారు క్షణికావేశంతో రెచ్చిపోవడంతో హత్య చోటుచేసుకుందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈ మొత్తం వ్యవహారంలో పోలీసుల వైఫల్యమే ప్రధాన కారణంగా కూడా పలువురు ఆరోపిస్తుండడం విశేషం. పెద్ద దస్తగిరి హత్యపై పోలీసులకు స్పష్టం చేసిన నిత్యానందరెడ్డి ! రియల్ ఎస్టేట్లో తనకు ఎలాంటిలావాదేవీలు లేవని తేల్చిచెప్పిన వైనం దస్తగిరితో స్నేహితం తప్ప, శతృత్వం లేదని స్పష్టీకరణ -
లోకేష్ పర్యటన ఏర్పాట్ల పరిశీలన
కొండాపురం/ముద్దనూరు: జిల్లాలోని జమ్మలమడుగు నియోజకవర్గం కొండాపురం మండల పరిధిలోని టి. కోడూరు గ్రామం వద్ద సెయిల్ సోలార్ ప్రాజెక్టుకు ప్రారంభోత్సవానికి ఈ నెల 22న రాష్ట్ర విద్య, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పర్యటన నేపథ్యంలో చేపట్టాల్సిన భద్రతా ఏర్పాట్లను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పి షెల్కేనచికేత్ విశ్వనాఽథ్ పరిశీలించారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో సెల్ సోలార్సంస్థ వద్ద జరుగుతున్న పనులను పూర్తి చేసి ప్పారంభోత్సవానికి సిద్దం చేయాలని అధికారులను ఆదేశించారు. ప్రకృతి సేద్య సాగుపై.. ప్రకృతిసేద్యంతో సాగుచేస్తున్న వ్యవసాయభూమిని కలెక్టర్ శ్రీధర్ ,జేసీ నిధిమీనా, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బుధవారం పరిశీలించారు.ముద్దనూరు మండలంలోని పెనికలపాడు గ్రామ సచివాలయ పరిధిలో రమణారెడ్డి అనే రైతు ప్రకృతి సేద్యంతో మామిడి,చీనీ తదితర పంటలను సాగుచేస్తున్నారు. రైతులతో ముఖాముఖిలో భాగంగా మంత్రి లోకేష్ ఈ సాగును పరిశీలించనున్నట్లు అధికారులు తెలిపారు. -
ద్విచక్ర వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక గాంధీ సర్కిల్ సమీపంలో బుధవారం రాత్రి ద్విచక్రవాహనం అదుపు తప్పి వ్యక్తి మృతి చెందాడు. తొండూరు మండలానికి చెందిన రవిప్రసాద్ అనే వ్యక్తి పులివెందుల పట్టణానికి పనుల నిమిత్తం వచ్చి పనులు ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా గాంధీ సర్కిల్ సమీపంలో ద్విచక్ర వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో రవి ప్రసాద్ అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పోస్టుమార్టం నిమి త్తం మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వ సర్వజ న ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసు లు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు.. కొండాపురం: మండల పరిధిలోని గండ్లూరు పునరావాస కాలనీ సమీపంలోని జాతీయ రహదారిలో పోలు కులాయిరెడ్డి(76) అనే వృద్ధుడు వెళుతుండగా కారు ఢీ కొన్న ఘటన చోటుచేసుకొంది. ఈ రోడ్డు ప్రమాదంలో గాయపడిన వృద్ధుడిని తాడిపత్రి ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళుతుండగా మృతి చెందినట్లు ఎస్ఐ జయరాములు తెలిపారు. చౌటిపల్లె గ్రామానికి చెందిన పోలు కులాయి రెడ్డి తోట వద్దకు వెళుతుండగా కారు ఢీ కొంది. ఈ ఘటన పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. టెన్త్ ఫెయిలయ్యాడని విద్యార్థి ఆత్మహత్య ప్రొద్దుటూరు క్రైం: టెన్త్ ఫలితాల్లో ఫెయిల్ కావడంతో మనస్థాపం చెందిన ఉప్పలూరు కుమార్ (16) అనే విద్యార్థి ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. వన్టౌన్ ఎస్ఐ మధుసూదన్రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. జోక్పాళెం వీధికి చెందిన కుమార్ ఇటీవల వెలువడిన టెన్త్ ఫలితాల్లో తెలుగు సబ్జెక్టులో తప్పాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురై మంగళవారం రాత్రి ఇంట్లోని మేడపై చీరతో ఉరేసుకున్నాడు. కుటుంబ సభ్యులు చూసేలోపే మృతి చెందాడు. మృతుడి తండ్రి సలీంబాష ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉత్సాహంగా జిల్లా స్థాయి వెయిట్ లిప్టింగ్ ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని డీఎస్ఏ క్రీడా మైదానంలో శాప్ లీగ్ ఆధ్వర్యంలో నిర్వహించిన వెయిట్లిప్టింగ్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయి. డీఎస్డీవో గౌస్ బాష ఆధ్వర్యంలో నిర్వహించిన యూత్ విభాగంలో బాల బాలికలకు ఎంపికలను నిర్వహించారు. జిల్లా స్థాయి జట్టుకు ఎంపికై ంది వీరే.... బాలికలు: శ్రీ చందన 44 కేజీలు బాలురు: ఆదిత్య కృష్ణ– 56 కేజీలు, అనంత్ కృష్ణ–56 కేజీలు, అబ్దుల్ రెహమాన్ –65 కేజీలు, నాగమోహిత్ –71 కేజీలు, వరుణ్ –79 కేజీలు, నవదీప్ –79 కేజీలు, ఐవి కిరణ్కుమార్రెడ్డి –88 కేజీలు, తేజరామ్ –88 కేజీలు, యశ్వంత్ –56 కేజీలు (స్టాండ్బై) జూనియర్ విభాగంలో... మాబు ఆర్షద్ –65 కేజీలు, భాను తేజ –79 కేజీలు, సుదర్శన్ 88 కేజీలు -
కొడుకు మరణవార్త విని తల్లి ఆత్మహత్యా యత్నం
జమ్మలమడుగు: ఉగాండాలో ఉన్న పెద్ద కొడుకు గుండెపోటుతో మరణించాడనే వార్త విని తట్టుకోలేక ఓ తల్లి పురుగుల మందు (శనగ గుళికలు) తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడింది. పెద్దముడియం మండలం మేడిదిన్నె గ్రామానికి చెందిన సూర్యనారాయణరెడ్డి, లలిత దంపతుల పెద్ద కుమారుడు ఉద్యోగ నిమిత్తం ఉగాండా వెళ్లాడు. బుధవారం ఉదయం అతను గుండెపోటుతో మృతి చెందినట్లు బంధువులు సమాచారం అందించారు. సాయంత్రం ఈ విషయం తెలిసిన తల్లి లలిత.. తీవ్ర మనస్తాపంతో ఇంట్లో ఉన్న శనగ గుళికలు మింగేసింది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను వెంటనే పట్టణంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం లలిత పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు తెలిపారు. తాగి డ్రైవింగ్: ఒకరికి జైలు, మరొకరికి జరిమానా గోపవరం: మద్యం మత్తులో వాహనాలు నడిపి పట్టుబడిన ఇద్దరు వ్యక్తులకు బద్వేలు ద్వితీయశ్రేణి మేజిస్ట్రేట్ కోర్టు బుధవారం ఒకరికి జైలు శిక్ష, మరొకరికి జరిమానా విధిస్తూ తీర్పునిచ్చింది. బద్వేలు రూరల్ సీఐ క్రిష్ణయ్య, ఎస్ఐ రంగారావు తెలిపిన వివరాల ప్రకారం.. మైదుకూరు టౌన్కు చెందిన లారీ డ్రైవర్ ఉప్పులూరు నరసింహులు గత నెల 30న మద్యం మత్తులో మితిమీరిన వేగంతో లారీ నడుపుతూ పట్టుబడ్డాడు. కోర్టులో నేరం రుజువు కావడంతో అతనికి 30 రోజుల జైలు శిక్ష పడింది. అలాగే, ఈ నెల 17న పి.పి.కుంట చెక్పోస్టు వద్ద మద్యం సేవించి బైక్ నడుపుతూ పట్టుబడిన నెల్లూరు జిల్లా కరటంపాడుకు చెందిన వీరదాసరి చక్రవర్తి అనే యువకుడికి రూ. 10,000 జరిమానా విధించారు. మద్యం తాగి వాహనాలు నడిపితే క్రిమినల్ కేసులు పెడతామని పోలీసులు హెచ్చరించారు. మదనపల్లె టౌన్: వీధి కుక్కను కొడుతున్న వారిని అడ్డుకున్నందుకు మహిళపై మూకుమ్మడిగా దాడి చేసి గాయపరిచిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకుల కథనం ప్రకారం, మదనపల్లె మండలం ఆరోగ్యవరం గ్రామానికి చెందిన ముస్తఫా కుటుంబం నివాసం ఉంటున్న వీధిలోకి ఓ కుక్క వచ్చింది. ఆ కుక్కను ఎదురింటికి చెందిన కొందరు వ్యక్తులు కరల్రతో కొడుతుండటాన్ని ముస్తఫా భార్య హసీనా (40) గమనించింది. వెంటనే అక్కడికి వెళ్లిన హసీనా.. కుక్కను కొట్టవద్దని అడ్డుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన ఎదురింటి వారు మూకుమ్మడిగా హసీనాపై దాడికి తెగబడ్డారు. కర్రలు, చేతులతో విచక్షణారహితంగా కొట్టడంతో ఆమె తల, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన హసీనాను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి భర్త ముస్తఫా మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషనన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. నరసింహులు చక్రవర్తి -
కోర్టు ఉద్యోగాల నోటిఫికేషన్లు ఇవ్వలేదు
– జిల్లా ప్రధాన న్యాయమూర్తి కడప అర్బన్: వైఎస్సార్ కడప ఉమ్మడి జిల్లా కోర్టులలో రెగ్యులర్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్ట్ ఉద్యోగాలకు ఎలాంటి నోటిఫికేషన్లు ఇవ్వలేదని జిల్లా ప్రధాన న్యాయమూర్తి బుధవారం ప్రకటనలో స్పష్టం చేశారు. నిరుద్యోగులు అపోహలు నమ్మి మోసపోవద్దని, ఎలాంటి అధికారిక నోటిఫికేషన్ అయినా పత్రికాముఖంగానే విడుదల చేస్తామని ఆమె పేర్కొన్నారు. ఉపాధి కార్మికురాలికి పాము కాటు చెన్నూరు (వల్లూరు) : చెన్నూరు మండలంలోని రామనపల్లె గ్రామంలో, పంట నీటి కాలువలో ఉపాధి పనుల ద్వారా పూడిక తీత పనులు చేస్తుండగా దస్తగిరమ్మ అనే కార్మికురాలు పాముకాటుకు గురైంది. వెంటనే అక్కడ ఉన్న తోటి కార్మికులు ఆమెను చెన్నూరు సామాజిక ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారని ఏపీవో శైలజ తెలిపారు. అనంతరం ప్రాణాపాయం లేదని, మెరుగైన చికిత్స కోసం వైద్యుల సూచనల మేరకు 108 వాహనంలో కడప రిమ్స్ ఆస్పత్రికి పంపించారు. గాలివానకు నేలకొరిగిన బొప్పాయి కలకడ : మండలంలో మంగళవారం రాత్రి కురిసిన వర్షం, గాలివానకు బొప్పాయి పంట సాగుచేసిన రైతులు నష్టపోయారు. రాత్రి సమయంలో వీచిన ఈదురు గాలులకు పంటపక్వానికి వచ్చిన చెట్లు, పంట నేలకు ఒరిగిపోవడంతో తెల్లవారి పంటవద్దకు వెళ్ళిన రైతులు లబోదిబో మంటూ కన్నీరు పెట్టుకున్నారు. మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయతీ కోనప్పగారిపల్లెకు చెందిన వేణుగోపాల్తో పాటు పలువురు రైతులు బొప్పాయి పంటను నష్టపోయామని.. ప్రభుత్వమే ఆదుకోవాలని కోరుతున్నారు. కడప ఎడ్యుకేషన్: మత్తు పదార్థాలు శారీరక, మానసిక ఆరోగ్యాలను పూర్తిగా నాశనం చేస్తాయని 30 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణ మూర్తి అన్నారు. కడప తెలుగు గంగ కాలనీలో జరుగుతున్న ఎన్సీసీ క్యాంప్లో శ్రీమత్తు పదార్థాల వినియోగం – దుష్పరిణామాలుశ్రీ అనే అంశంపై అవగాహన సదస్సు కొనసాగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, మత్తు అలవాటు మెదడు పనితీరును దెబ్బతీసి ప్రాణాంతక వ్యసనంగా మారుతుందన్నారు. కడప నార్కోటిక్ ఇన్చార్జ్, ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ గోవిందరెడ్డి మాట్లాడుతూ, టీనేజ్, యువత ఈ వ్యసనాల బారినపడే ప్రమాదం ఎక్కువ ఉన్నందున క్యాడెట్లు అప్రమత్తంగా ఉండాలన్నారు. -
ఆగని గంజాయి విక్రయాలు
● ముగ్గురు యువకుల అరెస్ట్ ● 1.600 కిలోల గంజాయి స్వాధీనం కడప అర్బన్: గంజాయి విక్రయిస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి ఒక కేజీ 600 గ్రాముల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి తెలిపారు. కడప డీఎస్పీ కార్యాలయంలో బుధవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ప్రత్యేక దాడులు నిర్వహించినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో చింతకొమ్మదిన్నె మండలం అంగడి వీధికి చెందిన కమలాపురం మాధవ, కడప నగరంలోని ప్రకాష్నగర్లో నివసిస్తున్న సాకే శంకర్ అలియాస్ శివ, ప్రకాష్ నగర్కు చెందిన ఉలవలపల్లి మనోజ్కుమార్ ఉన్నారని తెలిపారు. చిన్నచౌక్ సీఐ రామకృష్ణారెడ్డి, ఎస్ఐలు యు. ప్రతాప్ రెడ్డి, టి. హరిప్రసాద్ సిబ్బందితో కలిసి కడప పట్టణ పరిధిలోని తాడిపత్రి–తిరుపతి బైపాస్ రోడ్డులో నానాపల్లి క్రాస్ రోడ్డు సమీపంలో నిఘా నిర్వహించి గంజాయి విక్రయిస్తున్న ఈ ముగ్గురిని అదుపులోకి తీసుకుని గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. ప్రాథమిక విచారణలో నిందితులు కడప సిటీ యరమ్రుక్కపల్లికి చెందిన రాఘవ అనే వ్యక్తి వద్ద నుంచి గంజాయిని తీసుకుని విక్రయిస్తున్నట్లు ఒప్పుకున్నారని తెలిపారు. ఈ గంజాయి అక్రమ రవాణాలో లోతుగా విచారణ కొనసాగుతోందన్నారు. విలేకరులతో మాట్లాడుతున్న కడప ఇన్ఛార్జ్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి, స్వాధీనం చేసుకున్న గంజాయి -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం
బి.కోడూరు : మండలంలోని సగిలేరు డ్యాం సమీపంలో మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తువ్వపల్లె గ్రామానికి చెందిన సాకం ఈశ్వర్రెడ్డి (46) దుర్మరణం చెందాడు. వివరాల్లోకి వెళితే.. ఈశ్వర్రెడ్డి తన ద్విచక్ర వాహనంలో ఓ పని నిమిత్తం పోరుమామిళ్లకు వెళుతుండగా.. సగిలేరు డ్యాం వద్ద పోరుమామిళ్ల నుంచి మైదుకూరుకు కూలీలతో బొలెరో వాహనం వస్తోంది. ఎదురెదురుగా వస్తున్న ఈ వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఈశ్వర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. వడదెబ్బతో ఉపాధి కూలీ మృతిచింతకొమ్మదిన్నె : మండలంలోని కొప్పర్తి గ్రామపంచాయతీ ఎర్రమాసుపల్లె గ్రామానికి చెందిన చిన్న రామయ్య (60) అనే ఉపాధి కూలీ మంగళవారం కొప్పర్తి చెరువు ఫీడర్ కాలువలో ఉపాధి పని చేస్తూ వడదెబ్బకు గురై మృతి చెందాడు. చిన్నరామయ్య ఉపాధి పని చేస్తూ ఉన్నట్లుండి కుప్పకూలడంతో తోటి కూలీలు మాట్లాడించే ప్రయత్నం చేయగా.. ఉలుకు పలుకు లేకపోవడంతో వెనువెంటనే 108 అంబులెన్స్కు ఫోన్ ద్వారా సమాచారం తెలిపి సాయం కోరి, సమీపంలోని ఆటోను పిలిపించారు. ఆటో ముందుగా రావడంతో కడప నగరంలోని ఓ ప్రైవేటు వైద్యాశాలకు చిన్నరామయ్యను తరలించగా పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. ఈ సంఘటన సమాచారం తెలుసుకొని ప్రైవేటు వైద్యశాల వద్దకు ఎంపీడీఓ కుల్లాయిబాబు, ఏపీఓ రామాంజులరెడ్డి చేరుకొని మృతుడిని పరిశీలించి, తోటి కూలీలు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతుడి వారసులకు ఉపాధి హామీ చట్టం ప్రకారం రెండు లక్షల రూపాయలు చెల్లించడం జరుగుతుందని ఎంపీడీఓ కుళ్లాయిబాబు తెలిపారు. పోలీసు కస్టడీకి నిత్యానందరెడ్డికడప అర్బన్ : పెద్ద దస్తగిరి హత్య కేసులో నేరారోపణలను ఎదుర్కొంటున్న మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని దర్యాప్తు అధికారి, ప్రస్తుత చిన్నచౌక్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో కలిసి మంగళవారం పోలీసు కస్టడీకి తీసుకున్నారు. మొదట ఆయనను కడప కేంద్రకారాగారం నుంచి కడప రిమ్స్కు తీసుకుని వచ్చి వైద్యపరీక్షలను చేయించారు. తరువాత కడప చిన్నచౌక్ పోలీస్స్టేషన్కు తీసుకుని వెళ్లి విచారణ చేస్తున్నారు. -
రైళ్లలో దొంగతనాలు చేసే ముఠా అరెస్ట్
ఎర్రగుంట్ల : రైలులో ప్రయాణిస్తున్న ప్రయాణికులను మోసగించి వారి వద్ద నుంచి మొబైల్ ఫోన్లు దొంగలించి, వాటి ద్వారా యూపీఐ అప్లికేషన్లు ఉపయోగించి బ్యాంక్ ఖాతాల నుంచి అక్రమంగా డబ్బులు బదిలీ చేసుకుంటున్న అంతరాష్ట్ర దొంగల ముఠాలో ఇద్దరు దొంగలను అరెస్టు చేసినట్లు రైల్వే సీఐ సుధాకర్రెడ్డి తెలిపారు. మంగళవారం యర్రగుంట్లలో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. పశ్చిమబెంగాల్కు చెందిన హరిబర్మన్, బీహార్ రాష్ట్రానికి చెందిన సంతోషకుమార్షా పలు కేసులలో నిందితులుగా ఉన్నారు. వీరు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, తమిళనాడు కర్ణాటక తదితర రాష్ట్రాల మధ్య నడిచే ఎక్స్ప్రెస్ రైళ్లలో ఏసీ కోచ్లలో ప్రయాణించే ప్రయాణికులు నిద్రలో ఉన్న సమయంలో చార్జింగ్ పెట్టిన సెల్ఫోన్లును దొంగలించే వారు. ఆ సెల్ ఫోన్లలో ఉన్న సిమ్కార్డులు, ఓటీపీ, బ్యాకింగ్ యాప్స్, యూపీఐ అప్లికేషన్లు ఉపయోగించుకుని బాధితుల బ్యాంక్ ఖాతాలలో నుంచి అక్రమంగా డబ్బులను వివిధ బ్యాంక్ ఖాతాలు, యూపీఐ ఐడీలు, ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్ యాప్లకు మళ్లించినట్లు విచారణలో తేలింది. ఈ కేసులో నిందితులు సంతోషకుమార్షా చండిఘడ్ రాష్ట్రానికి చెందిన వికాష్షా, మొహాలీకి చెందిన రాహిల్భగత్ల ద్వారా తృతీయ పక్ష బ్యాంక్ ఖాతాల వివరాలను సేకరించి హరిబర్మన్కు అందించే వాడు. ఇలా మొత్తం హరిబర్మన్కు పంపి మోసపూరిత నగదు ఆ ఖాతాల్లో జమ అయ్యేది. ఆ మొత్తంలో సంతోష్కుమార్షా ఖాతాల ఏర్పాటు కోసం సుమారు 20 శాతం కమీషన్ చెల్లించే వారు. మిగిలిన మొత్తాన్ని హరిబర్మన్ సూచించిన ఇతర ఖాతాలకు, ఆన్లైన్ గ్యాంబ్లింగ్ ఖాతాలకు తిరిగి పంపించే వారని విచారణలో వెల్లడైంది. హరిబర్మన్ గతంలో రేణిగుంట రైల్వే పోలీసులచే, సంతోషకుమార్షా విజయవాడ పోలీసులచే అరెస్టు చేయబడి జైలుకు వెళ్లి అనంతరం బెయిల్పై బయటకు వచ్చినట్లు తెలిసింది. ఈ కేసులో 9 సెల్ఫోన్లు, రూ.1.50 లక్షలు నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. ఈ దర్యాప్తు రైల్వే డీఐజీ సత్యేసుబాబు ఆధ్వర్యంలో, రైల్వే డీఎస్పీ ప్రమోద్ పర్యవేక్షణలో జరిగింది. ఈ నిందితులకు గుత్తి, నెల్లూరు, యర్రగుంట్ల రైల్వే పోలీస్స్టేషన్లలో నమోదైన పలు కేసులలో ప్రయేయం ఉన్నట్లు గుర్తించారు. ఈ కేసులో మరో ఇద్దరిని అరెస్టు చేయాల్సి ఉందని సీఐ తెలిపారు. ఈ సమావేశంలో రైల్వే ఎస్ఐ భాస్కర్రెడ్డి, ఆర్పీఎఫ్ ఐపీఎఫ్ శ్రీనివాసులు, ఎస్ఐ గోవిందప్ప, ఏఎస్ఐ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
కూటమి వంచనపై ‘బీసీ గళం’
కడప కార్పొరేషన్ : కూటమి ప్రభుత్వం బీసీలను వంచనకు గురి చేస్తున్న వైనాన్ని వివరిస్తూ త్వరలో బీసీ గళం సభను నిర్వహించబోతున్నామని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్.శివరామ్ అన్నారు. మంగళవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికలకు ముందు బీసీలకు ఇచ్చిన హామీల్లో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. మంగళగిరిలో నిర్వహించిన జయహో బీసీ వేదికగా అప్పటి ప్రతిపక్ష నేత చంద్రబాబు నాయుడు బీసీ డిక్లరేషన్ ప్రకటించి.. బీసీలకు 50 ఏళ్లకే పెన్షన్, బీసీల రక్షణ కోసం ప్రత్యేక చట్టం, సామాజిక న్యాయ పరిశీలన కమిటీ ఏర్పాటు, బీసీ సబ్ ప్లాన్తో 5 ఏళ్లలో రూ.1.5 లక్షల కోట్లు కేటాయింపు, స్థానిక సంస్థల్లో 34 శాతం రిజర్వేషన్, చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్, అన్నీ సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో 34 శాతం రిజర్వేషన్ ద్వారా బీసీ వర్గాలకు కో ఆప్షన్ సభ్యులుగా ఛాన్స్ ఇస్తామని హామీలిచ్చారన్నారు. బీల్లో కులానికో హామీ ఇచ్చారని, అధికారంలోకి వచ్చి రెండేళ్లు అవుతున్నా ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. పల్లెకు పల్లెకు వైఎస్సార్సీపీ బీసీ వాదం తీసుకెళ్లి ప్రభుత్వం మీద పోరాటానికి సమాయత్తం చేస్తామని అయన అన్నారు.వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు ఎన్.శివరామ్ -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
సుండుపల్లె : మండల పరిధిలోని తానా మిట్ట ప్రదేశంలో అక్రమంగా తరలిస్తున్న 6 ఎర్రచందనం దుంగలను, కారును మంగళవారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ రేంజ్ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. పుదిచ్చేరి ప్రాంతానికి చెందిన జ్యోతి రామన్ అనే వ్యక్తి కేఎ 01 ఎఫ్ 9555 నంబర్ గల హోండా కారులో 92 కేజీల బరువు ఉన్న 6 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా.. సానిపాయి అటవీ శాఖ సిబ్బంది పట్టుకుని జ్యోతిరామన్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. వాటి విలువ దాదాపు రూ.3 లక్షలు ఉంటుందని రేంజ్ అధికారి తెలిపారు. -
‘పచ్చ’స్వామ్యం!
సాక్షి ప్రతినిధి, కడప : ప్రజాస్వామ్యం పచ్చస్వామ్యమైంది. అధికార పార్టీ నేతల చలువ లేకుంటే దేవుళ్లు బ్రహ్మోత్సవాలకు సైతం ఆటంకాలు తప్పడం లేదు. వైరిపక్షమంటే పోలీసు అధికారుల ద్వారా నియంత్రిస్తున్నారు. సాంస్కృతిక కార్యక్రమాలకు సైతం ఆటంకాలు తప్పడం లేదు. మునుపెన్నడూ లేని దుస్థితి ఈమారు వైఎస్సార్ కడప జిల్లాలో తెరపైకి వచ్చింది. బి.మఠం మండలం బోడపాడు గ్రామంలో శ్రీఆంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు పోలీసు పహారాలో చేపట్టారు. మూడు దశాబ్దాలుగా ఎప్పుడూ లేని రీతిలో నియంత్రించారు. తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యేలు ఆదేశాలు జారీ చేస్తే జీ.. హుజూర్ అనడం మినహా, పోలీసు అధికారులు సర్దిజెప్పే యత్నం చేపట్టడం లేదు. అదేమంటే లా అండ్ ఆర్డర్ ప్రాబ్లమ్ వచ్చే అవకాశం ఉందంటూ.. కట్టడి చేసే చర్యలకు దిగుతున్నారు. బ్రహ్మంగారిమఠం మండలం బోడపాడు గ్రామంలో శ్రీ సీతారామ అభయ వీరాంజనేయస్వామి బ్రహ్మోత్సవాలు గడిచిన 36 ఏళ్లుగా చేశారు. 37వ సారి ఈ ఏడాది కూడా ఈ నెల 12 నుంచి 19 వరకూ కొనసాగాయి. రోజుకొక సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించేందుకు గ్రామస్తులు ఏర్పాట్లు చేసుకున్నారు. ఈ ఏర్పాట్లకు అడ్డుతగిలే చర్యలకు తెలుగుదేశం పార్టీ నేతలు సిద్ధమయ్యారు. ఈక్రమంలో 12న క్రికెట్ పోటీలకు అడ్డుకునే యత్నం చేశారు. ప్రపంచ వ్యాప్తంగా ఆదరణ ఉన్న క్రికెట్ పోటీలను అడ్డుకోవడంపై గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేయడంతో తలోగ్గారు. ఆపై కోలాటం, భజన కార్యక్రమాలకు కూడా ఆటంకం కల్గించే యత్నం చేశారు. చివరి రోజున మంగళవారం వృషభరాజములచే బలప్రదర్శన పోటీలు నిర్వహించేందుకు నిర్వాహకులు నిర్ణయించుకున్నారు. ఆ ఒక్కటైనా అడ్డుకోవాలని తెలుగుతమ్ముళ్లు పంతం పట్టి పోలీసుల అధికారుల ద్వారా బలప్రదర్శన పోటీలు అడ్డుకోవడం గమనార్హం. పోలీసు అధికారులతో పహారా.. వృషభరాజముల బలప్రదర్శన అడ్డుకొని తీరాలంటూ అధికార పార్టీ ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ ఒత్తిడితో పోలీసు అధికారులు మంగళవారం బోడపాడు గ్రామంలో పహారా కాశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఉదయం నుంచే ముగ్గురు ఎస్ఐలు, సుమారు 50 మంది పోలీసులు గ్రామంలో తిష్టవేసి పోటీలు నిర్వహించకుండా అడ్డుకున్నారు. పోటీలో పాల్గొనేందుకు బోడపాడు గ్రామంలోకి ఎద్దులను రాకుండా పొలిమేరల్లోనే అడ్డుకోసాగారు. అదేమంటే పర్మిషన్ లేదు, ఎలా బండలాడుగు పోటీలు ఏర్పాటు చేస్తారు, కేసులు నమోదు చేస్తామంటూ బెదిరింపులకు దిగినట్లు గ్రామస్తులు వాపోతున్నారు. కాగా, ఆదే ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ ఈనెల 13న హనుమాన్ జయంతి కార్యక్రమంలో భాగంగా చాపాడు మండలం విశ్వనాథపురంలో బండలాడుగుడు పోటీలు ప్రారంభించారు. చట్టం అధికార పార్టీకి చుట్టం కాకపోతే బండలాడుగు పోటీలు ప్రారంభించిన ఎమ్మెల్యే సుధాకర్యాదవ్పై కేసు నమోదు చేయాలి కదా? అని బోడపాడు గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. బోడపాడు గ్రామంలోనే కావాలనే ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ బండలాగుడు పోటీలు పోలీసుల ద్వారా అడ్డగించడంపై గ్రామస్తులు మండిపడుతున్నారు. 36 ఏళ్లుగా ఎప్పుడు లేని ఆటంకం ఈమారు కల్గించారని, దేవుని కార్యక్రమంలో కూడా రాజకీయాలేమిటని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుళ్ల ఉత్సవాల్లో వింత రాజకీయం బోడపాడు గ్రామంలో పోలీసుల ఆంక్షలు ఎద్దుల బలప్రదర్శనకు ఆటంకాలు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్పై మండిపడుతున్న గ్రామస్తులు -
ఒంటిమిట్ట చెరువులో మృతదేహం వెలికితీత
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట చెరువులో సోమవారం సాయంత్రం బయటపడ్డ గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని మంగళవారం ఉదయం పోలీసులు వెలికి తీయించారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం సాయంత్రం ఒంటిమిట్ట చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాన్ని స్థానికులు గుర్తించినా చీకటి పడటంతో ఆ రోజు మృతదేహాన్ని వెలికి తీయలేకపోయారు. మంగళవారం ఉదయం గజ ఈత గాళ్ల సాయంతో చెరువులోని మృతదేహాన్ని సాదక్ వలీ దర్గా వైపు ఉన్న ఒడ్డుకు చేర్చారు. మృతుడు ఒక బిచ్చగాడిగా గుర్తించారు. నాలుగు రోజుల కిందట 1 మాధవరంలోని రోడ్డు నెంబర్ 23లో మతిస్థిమితం లేక ఒంటిపై దుస్తులు లేకుండా తిరగడం చూసిన స్థానిక ఓ వ్యక్తి తన దగ్గర ఉన్న పాత టీ షర్టు, లోయర్ ఇచ్చాడు. కేసు నమోదు చేసి, యాచకుడు చెరువులో ఎలా పడ్డాడో విచారణ చేస్తున్నామని పోలీసులు తెలిపారు. -
విద్యుత్ షాక్తో..
సుండుపల్లె : విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన సంఘటన మంగళవారం మండలంలో చోటు చేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. మండల పరిధిలోని పెద్దినేనికాలువ గ్రామ పంచాయతీ బట్రాజుగారిపల్లెలో సోమవారం రాత్రి సమయంలో మాతమ్మ తల్లి తిరునాల జరిగింది. అమ్మవారి ఆలయం చుట్టూ ప్రదక్షిణలు చేయించారు. ఊరేగింపు అయిపోయిన తర్వాత ఉదయం సమయంలో చాందినీబండి సెట్టింగ్ విప్పేందుకు కెవి పల్లి మండలం గన్నమిట్ట గ్రామానికి చెందిన పఠాన్ రెహమాన్ఖాన్(16).. బండి పైకి ఎక్కి విప్పుతుండగా ప్రమాదవశాత్తూ చాందినీబండి పైన ఉన్న 11 కెవి విద్యుత్ వైర్లు తగలడంతో షాక్కు గురై అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముగ్గురు పిల్లలతో సహా తల్లి అదృశ్యం కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలోని రవీంద్ర నగర్లో నివాసముంటున్న షేక్ రకీబు (21) అనే మహిళ, తన ముగ్గురు పిల్లలు అబ్దుల్ అజీజ్(5), మైను(3), సైజు(1)లతో కలిసి ఇంటి నుంచి గత నెల 10వ తేదీ వెళ్లిపోయినట్లు ఆమె భర్త హుస్సేన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. రవీంద్ర నగర్లో ఓ చికెన్ షాప్లో పని చేస్తున్న హుస్సేన్కు, అదే ప్రాంతానికి చెందిన రకీబుతో ఆరేళ్ల కిందట వివాహమైంది. వీరికి ముగ్గురు పిల్లలు. భర్త వేధింపులను తట్టుకోలేక బాధితురాలు తన ముగ్గురు పిల్లలతో ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె ఆచూకీ కోసం భర్త, బంధువులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎక్కడా జాడ కనిపించకపోవడంతో భర్త హుస్సేన్ పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. ఈ మేరకు తాలూకా సీఐ నరసింహారాజు ఆధ్వర్యంలో ఏఎస్ఐ వెంకటేశ్వర్లు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు తెలియజేశారు. -
రాజంపేటలో డీఆర్ఎం పర్యటన
రాజంపేట : రాజంపేట రైల్వేస్టేషన్లో గుంతకల్ రైల్వే డివిజనల్ మేనేజరు చంద్రశేఖర్గుప్తా మంగళవారం కలియతిరిగారు. 103 గేటు వద్ద నూతనంగా ఏర్పాటు చేసిన సబ్వేను ఆయన పరిశీలించారు. అమృత్భారత్లో రెండవ దశలో జరుగుతున్న పనులను పరిశీలించారు. ప్రయాణికుల సౌకర్యాలపై దృష్టి సారించారు. అనంతరం అధికారుల వసతి గృహాన్ని డీఆర్ఎం ప్రారంభించారు. ఆయన వెంట సీనియర్ డీసీఎం మనోహర్, డీవోఎం పూర్ణచంద్రరావు, కడప సీసీ జనార్ధన్, రాజంపేట ఎస్ఎంఆర్ పసుపులేటి గోపినాథ్ తదితరులు పాల్గొన్నారు. డీఆర్ఎం దృష్టికి రైల్వే సమస్యలు డీఆర్ఎం చంద్రశేఖర్ గుప్తా దృష్టికి రాజంపేట, రైల్వేకోడూరు రైల్వే పరిధిలో ప్రజలు ఎదర్కొంటున్న సమస్యలను గుంతకల్ రైల్వే డివిజనల్ యూజర్స్ కమిటీ సభ్యుడు, వైఎస్సార్సీపీ రాయలసీమ జోన్ బూత్ కమిటీ కన్వీనరు తల్లెం భరత్కుమార్రెడ్డి తీసుకెళ్లారు. వాటిని డీఆర్ఎం సానుకూలంగా స్పందించినట్లు ఆయన తెలిపారు. కార్యక్రమంలో తిరుపతి జిల్లా పుల్లంపేట మండల కన్వీనరు ముస్తాక్, నేతలు అహ్మద్, అమీర్, రజాక్, శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
పట్టుకున్నారు.. వదిలేశారు!
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరుకు ఒక యంగ్ అండ్ డైనమిక్ ఐపీఎస్ ఆఫీసర్ వచ్చారు.. క్రికెట్ బెట్టింగ్, మట్కా తదితర అసాంఘిక కార్యకలాపాల నుంచి యువతకు విముక్తి లభిస్తుందని.. ఇక అసాంఘిక శక్తులకు బడితె పూజ తప్పదని పట్టణ వాసులు భావించారు. ఇందుకు తగ్గట్టుగానే ఏఎస్పీ విభూకృష్ణ ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కాక ముందు నుంచే క్రికెట్ బుకీలు, మట్కా రాసే వారికి కౌన్సెలింగ్ నిర్వహించి తనదైన స్టైల్లో హెచ్చరికలు జారీ చేశారు. ఈ క్రమంలోనే సబ్డివిజన్లోని సీఐలు, ఎస్ఐలతో తరచూ సమావేశాలు నిర్వహిస్తూ క్రికెట్ పందేలు, బుకీల కదలికలు, వారిని ఎలా పట్టుకోవాలనే దానిపై దిశానిర్దేశం చేస్తున్నారు. ఎక్కడైనా క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారని సమాచారం వచ్చిన వెంటనే ఆయా స్టేషన్ సీఐలు, ఎస్ఐలతో కలిసి ఏఎస్పీ నేరుగా రంగంలోకి దిగుతున్నారు. ప్రొద్దుటూరు సబ్డివిజన్లో ఎంతో కాలంగా యువతను పట్టిపీడిస్తున్న అసాంఘిక కార్యకలాపాలకు ముగింపు పలకాలని కృతనిశ్చయంతో ఉన్న ఏఎస్పీ ఆదేశాలను కొందరు పోలీసు అధికారులు ఖాతరు చేయడం లేదు. సమష్టి కృషితో బెట్టింగ్ డాన్ల ఆగడాలకు చెక్ పెడదామని ‘కొండ’ంత ఆశ పెట్టుకున్న ఏఎస్పీకి తమ ‘మధు’రమైన మాటలతో కొందరు సీఐలు, ఎస్ఐలు బురిడీ కొట్టిస్తున్నారు. దాడుల పేరుతో బుకీలను పట్టుకొచ్చి గుట్టుచప్పుడు కాకుండా సెటిల్మెంట్ల వ్యవహారం సాగిస్తున్నారు. ఏం చేసినా తన వద్ద డబ్బులు లేవని చెప్పిన బుకీ ఇటీవల వేంపల్లెకు చెందిన ఒక క్రికెట్ బుకీతో ఓ స్టేషన్కు చెందిన ఒక అధికారి పెద్ద మొత్తంలో సెటిల్మెంట్ కుదుర్చుకున్న విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. స్థానికంగా ఉన్న జిన్నారోడ్డుకు చెందిన క్రికెట్ బుకీలతో సంబంధాలు ఉన్నాయనే కారణంతో కొన్ని రోజుల క్రితం ఒక ఎస్ఐ వేంపల్లెకు వెళ్లాడు. అక్కడి పేరు మోసిన క్రికెట్ బుకీని అదుపులోకి తీసుకున్నాడు. ప్రొద్దుటూరు నుంచి వేంపల్లెకు వచ్చే వరకు దారి వెంట సదరు బుకీని బెదిరిస్తూ, బుజ్జగిస్తూ బేరం కుదుర్చుకునే ప్రయత్నం చేశాడు. ఈ క్రమంలో గండిలోని ఆంజనేయస్వామి ఆలయం వద్ద వాహనాన్ని నిలుపుకొని రూ. 20 లక్షలు ఇస్తే ఇట్టే వదిలేస్తానని బంపర్ ఆఫర్ ఇచ్చాడు. అయితే ఎస్ఐ, పోలీసు సిబ్బంది ఎంత బెదిరించినా తన వద్ద డబ్బులు లేవని, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేనని భీష్మించుకొని కూర్చున్నాడు క్రికెట్ ఆ బుకీ. అక్కడి నుంచి బయలుదేరి ప్రొద్దుటూరు శివారులో వాహనాన్ని ఆపుకొని చివరగా రూ.10 లక్షలు అయినా ఇవ్వాలని అడిగినా అతను లేదని చెప్పడంతో ఇక చేసేదేమి లేక స్టేషన్కు తీసుకెళ్లారు. చివరకు జమ్మలమడుగు నియోజకవర్గంలోని ఒక వ్యక్తి ద్వారా సెటిల్మెంట్ వ్యవహారం నడిపించి క్రికెట్ బుకీ పెద్ద మొత్తంలో పోలీసు అధికారులకు సమర్పించుకొని వెళ్లిపోయినట్లు పోలీసు శాఖలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతోంది. అంతేగాక బుకీతో సంబంధాలున్న జిన్నా రోడ్డుకు చెందిన ముగ్గురు క్రికెట్ బుకీలను స్టేషన్ అధికారులు పిలిపించి బేరం కుదుర్చుకున్నట్లు సమాచారం. ఈ వ్యవహారమంతా పోలీసు ఉన్నతాధికారులకు తెలిసి జరుగుతోందా లేక వాళ్లకు తెలియకుండా స్టేషన్ పరిధిలోనే సెటిల్మెంట్ల దందా కొనసాగిస్తున్నారా అనేది తెలియాల్సి ఉంది. మొత్తానికి ఈ ఐపీఎల్ సీజన్ కొందరు పోలీసు అధికారులకు కాసుల పంట కురిపిస్తోంది. వన్టౌన్లో ఐడీ పార్టీ ఔట్ ప్రొద్దుటూరులోని వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఐడీ పార్టీని రద్దు చేశారు. వరుస వివాదాల నేపథ్యంలో పోలీసు అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. స్టేషన్కు సంబంధించిన కొందరు పోలీసు అధికారులపై ఇటీవల పత్రికల్లో వరుస కథనాలు వస్తున్న నేపథ్యంలో ఐడీపార్టీని రద్దు చేసినట్లు సమాచారం. స్టేషన్లోని విషయాలు బయటికి ఎలా వెళ్తున్నాయని పోలీసు అధికారులు సిబ్బందిపై అసహనం వ్యక్తం చేసినట్లు తెలుస్తోంది. క్రికెట్ బుకీని అదుపులోకి తీసుకున్న పోలీసులు దారి వెంట బెదిరింపులు, బుజ్జగింపులు రూ.20 లక్షలు ఇచ్చి వెళ్లిపోవచ్చన్న ఎస్ఐ చివరికి ఉన్నతాధికారికి తెలియకుండా సెటిల్మెంట్ -
భూ రీసర్వేను పారదర్శకంగా పూర్తి చేయాలి
కడప సెవెన్రోడ్స్: ప్రతి భూమికి స్పష్టమైన హక్కులు కల్పించేలా భూ రీసర్వే కార్యక్రమాన్ని అత్యంత పారదర్శకంగా, ఖచ్చితత్వంతో, వివాదరహితంగా పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం సాయంత్రం కలెక్టరేట్ సభాభవన్లో జిల్లాలోని తహశీల్దార్లు, సర్వేయర్లు, మండల సర్వేయర్లు, డిప్యూటీ తహశీల్దార్లు, వీఆర్వోలు, సంబంధిత రెవెన్యూ అధికారులతో ‘రీసర్వే రివైజ్డ్ ఎస్ఓపీ– రీసర్వే ఆన్లైన్ మాడ్యూల్స్’పై ప్రత్యేక వర్క్షాప్ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జేసీ నిధి మీనా, రాజంపేట సబ్ కలెక్టర్, కడప మున్సిపల్ కమిషనర్ హెచ్.ఎస్. భావన పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ భూముల రీసర్వే కార్యక్రమంలో భూ రికార్డుల శుద్ధి, గ్రామ సరిహద్దుల నిర్ధారణ, ప్రభుత్వ భూముల రక్షణ, గ్రౌండ్ ట్రూతింగ్, ల్యాండ్ పార్సెల్ మ్యాపింగ్, వివాదాల పరిష్కారం వంటి ప్రతి దశలో అధికారులు ఎస్ఓపీ ప్రకారం ఖచ్చితంగా పనిచేయాలని సూచించారు. రీసర్వే ప్రారంభానికి ముందు గ్రామ సభలు నిర్వహించి రైతులకు పూర్తి అవగాహన కల్పించాలని, షెడ్యూల్, విధానాలు, ప్రయోజనాలు స్పష్టంగా తెలియజేయాలని ఆదేశించారు. అలాగే ప్రభుత్వ భూముల రక్షణ విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం ఉండకూడదని, ఆక్రమణలకు అవకాశం లేకుండా స్పష్టమైన సరిహద్దులు ఏర్పాటు చేయాలని తెలిపారు. భూవివాదాలు తలెత్తిన సందర్భాల్లో చట్టపరమైన విధానాల ప్రకారం విచారణలు నిర్వహించి త్వరితగతిన పరిష్కరించాలని ఆదేశించారు. జేసీ డాక్టర్ నిధి మీనా మాట్లాడారు. ఈ కార్యక్రమంలో డీఆర్వో మల్లికార్జునుడు, కడప, జమ్మలమడుగు, బద్వేలు, పులివెందుల ఆర్డీవోలు మురళి, శిరీష, చంద్ర మోహన్, చిన్నయ్య తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
చమురు ధరల్లో ఏపీనే అగ్రస్థానం
ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పులివెందుల: పెట్రోలు, డీజిల్ రేట్లలో దేశంలోనే ఆంధ్రప్రదేశ్ అగ్రస్థానంలో ఉందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి విమర్శించారు. మంగళవారం పట్టణంలోని స్థానిక భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో ఆయన మాట్లాడారు. ఎన్నికలప్పుడు చంద్రబాబు, లోకేష్, పవన్లు తాము అధికారంలోకి వస్తే పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రతి మీటింగ్లలో ఊదరగొట్టారన్నారు. పెట్రోలు, డీజిల్ రేట్లు తగ్గిస్తామని వారి ఎన్నికల మేనిఫెస్టోలోనూ పొందుపరిచారని పేర్కొన్నారు. ప్రస్తుతం రాష్ట్రాన్ని పెట్రోలు, డీజిల్ రేట్లలో దేశంలోనే అగ్రస్థానంలో నిలబెట్టారని ధ్వజమెత్తారు. కొద్ది రోజుల క్రితం రాష్ట్రంలో తీవ్ర డీజిల్ కొరత ఏర్పడటానికి కూడా కూటమి ప్రభుత్వమే కారణమైందని మండిపడ్డారు. ఈ విషయాన్ని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లామన్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఏపీ సర్కారును తూర్పారబట్టిందని పేర్కొన్నారు. పెరిగిన పెట్రోలు, డీజిల్ వల్ల రవాణా, రైతాంగం, మధ్య తరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సి ఉంటుందన్నారు. అమరావతి పేరుతో కూటమి ప్రభుత్వం చేస్తున్న అనైతిక కార్యకలాపాలకు అడ్డూ అదుపు లేకుండా పోయిందని ధ్వజమెత్తారు. అనంతరం ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు. కష్టపడే వారికి గుర్తింపు: ఇటీవల పార్టీ పదవులు పొందిన పలువురు నాయకులు మంగళవారం ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిశారు. తమపై నమ్మకంతో బాధ్యతలు ఇచ్చినందుకు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. పార్టీలో కష్టపడే ప్రతి నాయకుడు, కార్యకర్తకు గుర్తింపు ఉంటుందని, పార్టీ పటిష్టతకు కృషి చేయాలని ఎంపీ వారికి సూచించారు. ఎంపీకి సన్మానం: ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని మడూరుకు చెందిన రైతులు కలిసి సన్మానించారు. ఇటీవల ఎంపీ సొంత నిధులతో మడూరు – బొజ్జాయిపల్లెకు చెందిన వంకలో పైపులైన్ ఏర్పాటు చేసి రాకపోకలకు రైతులకు ఇబ్బంది లేకుండా చేశారు. దీనికి రైతులు హర్షం వ్యక్తం చేశారు. -
కదలని జొన్నలు.. ఆగని కన్నీళ్లు!
కడప సెవెన్రోడ్స్: కనీస మద్దతు ధరకు రైతుల నుంచి సేకరించిన జొన్న తరలించడంలో పౌరసరఫరాల సంస్థ తీవ్ర అలసత్వం వహిస్తోంది. రవాణాకు లారీలు లేవంటూ నిర్లక్ష్యపు సమాధానాన్ని చెబుతోంది. కాటా వేసి బస్తాలకెక్కిన జొన్నలు ఇళ్లల్లో, కళ్లాల్లో మగ్గిపోతున్నాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సివిల్ సప్లయ్స్ జిల్లా మేనేజర్ నాగ సుధ తమ గోడు వినే పరిస్థితిలో లేదని వాపోతున్నారు. లారీల యజమానుల నుంచి కమీషన్లు తేలకపోవడం వల్లే రవాణా విషయంలో జాప్యం చేస్తున్నారనే ఆరోపణలు వినబడుతున్నాయి. దీంతో చెన్నూ రు మండలానికి చెందిన కొందరు రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద ఆందోళన చేపట్టాల్సి వచ్చింది. సివిల్ సప్లయ్స్ డీఎం తన తీరు మార్చుకుని జొన్నలు తరలించేందుకు తక్షణమే వాహనాలు ఏర్పాటు చేయకపోతే ఆమె కార్యాలయాన్ని దిగ్బంధిస్తామని ఏపీ రైతు సంఘం జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు గోపాలకృష్ణయ్య, దస్తగిరిరెడ్డి హెచ్చరించారు. ● 2025–26 రబీలో జిల్లాలోని వివిధ ప్రాంతాల్లో రైతులు తెల్లజొన్న సాగు చేశారు. వరిలో నష్టపోతున్నామని భావించిన కేసీ కెనాల్ రైతులు సైతం కొన్ని ప్రాంతాల్లో జొన్నసాగువైపు మళ్లారు. ఈ యేడు రబీలో అధిక వర్షాల కారణంగా పంట దెబ్బతినడంతో అరకొర దిగుబడి వచ్చిందని చెబుతున్నారు. ఆ అరకొర పంటను కొనడానికీ ఫ్రభుత్వం తీవ్ర ఇబ్బందులు పెడుతోంది. ఎంఎస్పీతో కొనుగోలు కేంద్రాలు ఆలస్యంగానైనా ప్రభుత్వం క్వింటాలుకు రూ.3699ల కనీస మద్దతు ధర ప్రకటించింది. ఈ మేరకు జిల్లాలోని పలు మండలాల్లోని రైతు సేవా కేంద్రాల్లో 20 జొన్న కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేశారు. రైతులకు పౌరసరఫరాలసంస్థ అధికారులే సంచులు సరఫరా చేయడంతో పాటు రైతుల వద్దే కాటా వేయించి బస్తాలను అక్కడే వదిలి వెళ్లారు. సేకరించిన జొన్న 20 రోజుల పైబడి రైతుల ఇళ్లల్లో, కళ్లాల్లో అలాగే ఉన్నాయి. పౌరసరఫరాల అధికారులు సేకరించిన జొన్నలకు రైతులకు రశీదులు ఇవ్వాల్సి ఉంది. అప్పుడే ప్రభుత్వం కొనుగోలు చేసినట్లు లెక్క. పౌరసరఫరా అధికారులు రశీదులు ఇవ్వక.. జొన్నలు తరలించక రైతులతో ఆటలాడుతున్నారు. రవాణాకు లారీలు కరువు పౌరసరఫరాల డీఎం పలకడం బరువు ఆదుకోండంటూ రైతుల ఏకరువు -
పాస్వర్డ్లు, ఓటీపీలు పంచుకోవద్దు
కడప ఎడ్యుకేషన్: వ్యక్తిగత వివరాలు, పాస్వర్డులు, ఓటీపీలు ఎట్టి పరిస్థితుల్లో ఇతరులతో పంచుకోవద్దని సైబర్ క్రైమ్ విభాగం సర్కిల్ ఇన్స్పెక్టర్ మధు మల్లేశ్వర రెడ్డి పేర్కొన్నారు. కడప తెలుగు గంగ కాలనీలో 30 ఆంధ్రా బెటాలియన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరంలో మంగళవారం ‘సైబర్ నేరాలపై అవగాహన‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలియని నంబర్ల నుంచి వచ్చే వాట్సాప్ లింకులు, మెయిల్స్ తెరవకూడదన్నారు. సోషల్ మీడియాలో నకిలీ ఖాతాలు సృష్టించి డబ్బులు అడగడం, వాట్సాప్ ద్వారా మోసపూరిత సందేశాలు పంపడం వంటి సైబర్ మోసాలపై క్యాడెట్లు అవగాహన కలిగి ఉండాలని సూచించారు. 30 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ సూర్యనారాయణ మూర్తి మాట్లాడుతూ సంబంధిత విషయాలను ప్రతి ఒక్కరు అవగాహన చేసుకుని అప్రమత్తంగా ఉండాలని సూచించారు. డిప్యూటీ క్యాంప్ కమాండెంట్ లెఫ్టినెంట్ కల్నల్ లలిత్ బాబు, నీలయ్య తదితరులు పాల్గొన్నారు. -
మెడికల్ కళాశాలపై తెరుచుకోని నోళ్లు.. వెన్నుముక లేని ప్రజాప్రతినిధులు!
జిల్ల్లా ప్రయోజనాలను కాపాడటంలో అధికార కూటమి ప్రజాప్రతినిధుల వైఖరి ఎంత దారుణంగా ఉందో చెప్పడానికి పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాల ఉదంతమే నిదర్శనం. వైఎస్సార్ జిల్లాలో కూటమి తరఫున ఐదుగురు ఎమ్మెల్యేలు, ఒక ఎమ్మెల్సీ ప్రాతినిధ్యం వహిస్తున్నా జిల్లాకు దక్కాల్సిన ప్రతిష్టాత్మక విద్యాసంస్థను కాపాడుకోలేక చేతులెత్తేశారు. పులివెందులలో ప్రభుత్వ మెడికల్ కళాశాల నిర్మాణం పూర్తయి, 2025 విద్యాసంవత్సరానికి గానూ 50 ఎంబీబీఎస్ (MBBS) సీట్లు కూడా మంజూరయ్యాయి. అయితే, గత ప్రభుత్వానికి ఎక్కడ మంచి పేరు వస్తుందోననే కుళ్లు రాజకీయంతో.. ‘ఆ మెడికల్ కళాశాల మాకు అవసరం లేదు’ అంటూ రాష్ట్ర ప్రభుత్వం ఏకంగా నేషనల్ మెడికల్ కౌన్సిల్ (NMC) కు లేఖ రాయడం తీవ్ర దుమారం రేపింది. అన్ని వసతులతో సిద్ధంగా ఉన్న ప్రభుత్వ కళాశాలను ఇలా తిరస్కరించడంపై జిల్లా ప్రజలు మండిపడుతున్నారు. సొంత జిల్లాకు జరుగుతున్న ఈ అన్యాయంపై ఒక్కరంటే ఒక్క కూటమి ఎమ్మెల్యే కూడా ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వద్ద నోరు మెదపలేకపోయారు. జిల్లా ప్రయోజనాలను తాకట్టు పెడుతూ వీరంతా ‘వెన్నుముక లేని ప్రజాప్రతినిధులు’గా వ్యవహరిస్తున్నారని రాజకీయ పరిశీలకులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. -
ఏపీ ఈఏపీసెట్కు 136 మంది గైర్హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించి మంగళవారం రెండు సెషన్స్లో నిర్వహించిన అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 87.56 శాతం మంది విద్యార్థుల హాజరయ్యారు. కడప, ప్రొద్దుటూ రు, రాజంపేటతో కలిసి 9 కేంద్రాల్లో ఉదయం, సాయంత్రం జరిగిన పరీక్షలకు 1093 మంది అభ్యర్థులకుగాను 136 మంది గైర్హాజరయ్యారు. కడప రూరల్ : మంత్రి నారా లోకేష్ జిల్లా పర్యటనను విజయవంతం చేయాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్ రెడ్డి తెలిపారు. మంగళవారం కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి స్వగృహంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మంత్రి లోకేష్ ఈనెల 21న కడపలో పార్టీ కార్యకర్తల సమన్వయ సమావేశంలో పాల్గొంటారని పేర్కొన్నారు. 22న జమ్మలమడుగు నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన కార్యక్రమా ల్లో పాల్గొంటారన్నారు. ఎమ్మెల్యే మాధవి, ఆ పార్టీ కో–ఆర్డినేటర్ శ్రీనివాసులు రెడ్డి పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం అనుబంధ డిగ్రీ కళాశాలలో జరుగుతున్న పరీక్షల్లో మంగళవారం జిల్లా వ్యాప్తంగా 19 మంది విద్యార్థులు డిబార్ అయినట్లు వైవీయూ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు తెలిపారు. వైఎస్సార్ ఉమ్మడి జిల్లాలో విశ్వవిద్యాలయ స్క్వాడ్ సభ్యులు పరీక్ష కేంద్రాలను విస్తృతంగా తనిఖీ చేశారని చెప్పారు పరీక్షల్లో ఏ చిన్న పొరపాటుకు తావివ్వకుండా కట్టుదిట్టంగా నిర్వహిస్తున్నామని వివరించారు. చౌడేపల్లె: అకాల వర్షం రైతులను నష్టాల్లో ముంచెత్తింది. కొన్ని ప్రాంతాల్లో వరికుప్పలు తడిచిపోగా మరికొన్న ప్రాంతాల్లో వరి గడ్డి పై వర్షపునీటి నిల్వ కారణంగా గడ్డి దెబ్బతింది. ఇక టమాటా పంటలో నిలిచిన వర్షపునీటిని బయటకు పంపడానికి రైతులు తీవ్రంగా ఇబ్బందులు పడ్డారు. కాగా రెండురోజులుగా కురిసిన వర్షాలకు ఎండ వేడిమినుంచి ప్రజలకు కాస్త ఉమశమనం లభించింది. -
నేడు బంగారు దుకాణాల బంద్
ప్రొద్దుటూరు : ఏడాది పాటు బంగారం కొనుగోలు చేయవద్దని కేంద్ర ప్రభుత్వం ప్రకటించినందుకు నిరసనగా రాష్ట్ర స్వర్ణకార సంఘం అధ్యక్షుడు కర్రి వేణుమాధవ్ పిలుపు మేరకు ప్రొద్దుటూరులో మంగళవారం బంగారు దుకాణాలు బంద్ చేయనున్నారు. తాలూకా స్వర్ణకార సంఘం ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు సంఘం అధ్యక్ష, కార్యదర్శులు బాష, యు.ఇలియాస్ ఒక ప్రకటనలో తెలిపారు. కార్యక్రమంలో భాగంగా ఎమ్మెల్యేను కలిసి వినతి పత్రం సమర్పించి, స్వర్ణకార సంఘం భవనంలో చర్చించి తదుపరి నిర్ణయం తీసుకుంటామన్నారు. 21న మహిళల క్రికెట్ ఎంపికలు కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 21న సీనియర్స్, అండర్ –23, అండర్ –19, –అండర్ –15 మహిళల క్రికెట్ ఎంపికలు నిర్వహించనున్నట్లు క్రికెట్ అసోసియేషన్ ఆఫ్ వైఎస్సార్ డిస్టిక్ కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఎంపికలకు హాజరయ్యేవారు ఆధార్ కార్డు కాపీ, బర్త్ సర్టిఫికెట్, టెన్త్ మార్క్ లిస్ట్, పాస్పోర్ట్ సైజ్ ఫొటో తీసుకురావాలన్నారు. ఉదయం 8 గంటలకు వైఎస్ఆర్ఆన్ ఏసీఏ స్టేడియంలో ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. మహిళా భవన్కు తాళం! తొండూరు : విధి నిర్వహణలో అధికారులు నిర్లక్ష్యం వహిస్తున్నారు. సమయపాలన లేకుండా ఇష్టానుసారంగా డ్యూటీలకు హాజరవుతున్నారు. ఇదిగో తాళం వేసి ఉన్న మహిళా భవన్ చిత్రమే ఇందుకు సాక్ష్యం. అప్పుల కోసం, పొదుపు ఖాతా ల వివరాల కోసం, పథకాల సమాచారం కోసం ఉదయం 9:30 నుంచి కార్యాలయం వద్ద వేచి ఉన్న డ్వాక్రా మహిళలు ఉదయం 11 దాటినా అధికారులు రాకపోయేసరికి నిరాశగా వెనుదిరిగారు. ‘రోజు కూలీ వదులుకొని వస్తే తాళం వేసి ఉంది. మా సమస్యలు ఎవరికి చెప్పుకోవాలని’ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ భవనాలు వారానికి 6రోజులు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు తెరిచి ఉండాలి. కానీ సిబ్బంది నిర్లక్ష్యం, సమయపాలన లోపంతో మహిళలు గంటల తరబడి వేచి ఉండి వెళ్లిపోతున్న ఘటనలు జరుగుతున్నాయి. పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలి – డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి కడప అగ్రికల్చర్: ప్రభుత్వ పాఠశాలలో విద్యనభ్యసించే పిల్లలకు నాణ్యమైన భోజనం అందించాలనే లక్ష్యంతో మధ్యాహ్న భోజన పథక వంట సిబ్బందికి శిక్షణ ఇస్తున్నామని డీఆర్డీఏ ప్రాజెక్టు డైరెక్టర్ రాజ్యలక్ష్మి అన్నారు. కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రంలో సోమ వారం డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకానికి సబంధించిన వంటవారికి, నిర్వాహకులకు శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన అమె మాట్లాడుతూ ఈ శిక్షణ ద్వారా ప్రతి ఒక్కరికీ మంచి అనుభవం వస్తుందన్నారు. కేవీకే సీనియర్ శాస్త్రవేత, అధిపతి వి శిల్పకళ పలు సూచనలు చేశారు. కేవికే గృహ విజ్ఞాన శాస్త్రవేత్త ప్రశాంతి పాల్గొన్నారు. సప్లిమెంటరీ పరీక్షలు పకడ్బందీగా నిర్వహించాలి – ఆర్.ఐ.ఓ, టి.ఎన్ వెంకటేశ్వర్లు కడప ఎడ్యుకేషన్: జిల్లావ్యాప్తంగా ఈ నెల 21 నుంచి ప్రారంభమయ్యే ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలను పకడ్బందీగా నిర్వహించాలని ఇంటర్మీడియట్ ఆర్ఐఓ టీఎస్ వెంకటేశ్వర్లు సూచించారు. సోమవారం కడప మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజ్ సెమినార్ హాల్లో చీఫ్ సూపరింటెండెంట్లు, డిపార్టుమెంట్ ఆఫీసర్లకు పరీక్షల నిర్వహణపై సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఎగ్జామినర్లు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి వివరించారు. జిల్లాలో 46 కేంద్రలలో పరీక్షలు జరుగుతాయని తెలిపారు. ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం రెండన్నర గంటల నుంచి ఐదున్నర గంటల వరకు రెండు సెషన్స్లలో జరుగుతాయని తెలిపారు. డి.ఇ.సి.మెంబర్లు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో సామగ్రి దగ్ధం
రాజంపేట రూరల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు ఎగసి పడటంతో 6 దుకాణాలలోని సరుకు కాలి బూడిద అయ్యింది. నిర్వాహకులకు రూ.80 లక్షల నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణ పరిధిలోని మన్నూరులో మసీదు కాంప్లెక్స్ను 2021లో 6 రూములతో ఏర్పాటు చేశారు. అన్ని రూములకు కలిపి విద్యుత్ మీటర్లను ఒకే చోట ఏర్పరిచారు. ఇందులో 3 రూములను అద్దెకు తీసుకొన్న షేక్ ఖాదర్బాషా అల్ అమర్ ట్రేడర్స్ పేరుతో ఒక రూములో పెయింట్, ఒక రూములో ఎలక్ట్రికల్, ఒక రూములో శానిటరీ పైప్స్ ఏర్పాటు చేసుకున్నారు. అదే విధంగా ఒక రూములో పాళెం ఇస్మాయిల్ గురు రాఘవేంద్ర స్పేర్ పార్ట్స్ ఏర్పాటు చేసుకున్నారు. వేరొక రూములో షేక్ ఇంతియాజ్ ఇంతియాజ్ సొల్యూషన్ను ఏర్పరిచారు. మరొక రూములో చేజర్ల శంకరరాజు కూల్ డ్రింక్స్, ప్రొవిజన్స్ను ఏర్పాటు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో సోమవారం మధ్యాహ్నం అల్ అమర్ ట్రేడర్స్ వద్ద ఏర్పరిచిన విద్యుత్ మీటర్లో నుంచి రవ్వలు వెలువడ్డాయి. ఈ రవ్వలు పెయింట్ షాపులో ఉన్న కర్పంటాయిల్ మీద పడటంతో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ఈ మంటలు అధికం కావడంతో పక్కన ఉన్న దుకాణాలలోని సరుకు కూడా కాలిపోయింది. ఇదే సమయంలో ఫైర్ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. షేక్ ఖాదర్బాషాకు రూ.70 లక్షలు, చేజర్ల శంకరరాజుకు రూ.5 లక్షలు, పాళెం ఇస్మాయిల్కు రూ.3.50 లక్షలు, షేక్ ఇంతియాజ్కు రూ.1.50 లక్షల నష్టం వాటిల్లినట్లు నిర్వాహకులు తెలియజేశారు. పరామర్శ షార్ట్ సర్క్యూట్తో నష్ట పోయిన బాధితులను ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి ఫోన్ ద్వారా పరామర్శించారు. నష్టాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. అదే విధంగా వైఎస్సార్సీపీ నియోజకవర్గ అధ్యక్షులు ఆకేపాటి అనీల్కుమార్రెడ్డి సంఘటనా స్థలానికి చేరుకొని నిర్వాహకులను ఓదార్చారు. వారికి అండగా ఉంటామని హామీ ఇచ్చారు. అనీల్కుమార్రెడ్డి వెంట వైఎస్సార్సీపీ వివిధ విభాగాల కన్వీనర్లు, మైనారిటీ నాయకులు ఉన్నారు.రూ.80 లక్షల నష్టం -
మైదుకూరులో విజిలెన్స్ దాడులు
మైదుకూరు : మైదుకూరులో సోమవారం విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు విత్తన దుకాణాలపై దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రూ.3.87 లక్షల విలువైన జీలుగలు, పిల్లి పెసర విత్తనాలను సీజ్ చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ పి.శ్రీనివాసులరెడ్డి, విజిలెన్స్ ఏఓ లక్ష్మణ్ కుమార్, విజిలెన్స్ డీసీటీఓ ఖాజా హుస్సేన్, మైదుకూరు ఏఓ బాలగంగాధర్ రెడ్డి, విజిలెన్స్ హెడ్ కానిస్టేబుల్ మహమ్మద్ రఫీ పట్టణంలోని విత్తనాలను విక్రయించే దుకాణాలపై దాడులు చేశారు. స్థానిక బద్వేలు రోడ్డులోని శ్రీపవిత్ర సీడ్స్ గోడౌన్లో సరైన అనుమతులు లేకుండా ఉన్న జీలుగ, పిల్లి పెసర విత్తనాల నిల్వలను గుర్తించారు. గోదాములోని రూ.3.57 లక్షల విలువైన 5,100 కిలోల జీలుగలు, రూ.30 వేల విలువైన 50 కిలోల పిల్లి పెసర విత్తనాలను సీజ్ చేశారు. దుకాణం యజమానిపై 6(ఏ) కేసు నమోదు చేశారు. ఈ సందర్భంగా విజిలెన్స్ ఎన్ఫోర్స్మెంట్ అధికారులు మాట్లాడుతూ సరైన అనుమతులు లేకుండా ఎవరైనా విత్తనాలను విక్రయిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు.రూ.3.87 లక్షల విలువైన విత్తనాలు సీజ్ -
సాగులో విత్తన ఎంపిక కీలకం
కడప అగ్రికల్చర్: పంటల సాగులో విత్తన ఎంపిక చాలా ముఖ్యమని మహానంది వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్ ఎ.వీరయ్య పేర్కొన్నారు. కేవీకే ఆధ్వర్యంలో కడప సమీపంలోని తాడిగొట్ల గ్రామంలో సోమవారం మహానంది వ్యవసాయ కళాశాల విద్యార్థులు రైతు సదస్సు, వ్యవసాయ ప్రదర్శన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ వ్యవసాయ విద్యార్థులు తరగతి గదిలో నేర్చుకున్న అంశాలను క్షేత్రస్థాయిలో అమలు చేసినప్పుడు తగిన ప్రతిపలం లభిస్తుందన్నారు. సమయానికి చీడ పీడలను గుర్తించి సకాలంలో సస్యరక్షణ చర్యల ద్వారా పంట ఖర్చును తగ్గించుకోవడమే కాక అధిక దిగుబడులను కూడా సాధించవచ్చన్నారు. కృషి విజ్ఞాన కేంద్రం అధిపతి, సీనియర్ శాస్త్రవేత్త డా. వి. శిల్పకళ , ఏరువాక కేంద్ర సమన్వయకర్త డాక్టర్ కృష్ణప్రియ, ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్, జిల్లా వనరుల కేంద్రం వ్యవసాయ అధికారి డా. పి. పద్మజ, మృత్తికా విభాగం సహాయాచార్యులు డా. పి.వి. గీత తదితరులు పలు సూచనలు చేశారు. అనంతరం విద్యార్థులు సమీకృత వ్యవసాయ పద్దతులు, నేల, నీటి సంరక్షణ పద్ధతులు, సోలార్ న్సింగ్ వంటి అంశాలపై ప్రతిమలను, విత్తనాలను, చార్ట్ లను, మోడల్స్ను ప్రదర్శనగా ఉంచారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ సిబ్బంది, వ్యవసాయ విద్యార్థులు, రైతులు పాల్గొన్నారు. మహానంది వ్యవసాయ కళాశాల డీన్ డాక్టర్, ఎ వీరయ్య -
అస్తవ్యస్తం..అయోమయం !
వార్డుల పునర్విభజన ప్రతిపాదనలు విడుదల కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో చేపట్టిన వార్డుల పునర్విభజన (డీలిమిటేషన్) ప్రక్రియ తీవ్ర వివాదాస్పదంగా మారింది. ఎటువంటి శాసీ్త్రయత లేకుండా, అధికార పార్టీ నేతల కనుసన్నల్లోనే ఈ విభజన జరిగిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఈ నూతన పునర్విభజన ప్రకారం ఇదివరకు 50 గా ఉన్న వార్డుల సంఖ్య ఇప్పుడు 66కు పెరిగింది. నిబంధనలు పక్కనబెట్టి జనాభా విభజన! ప్రతి వార్డులోనూ 4 వేల నుంచి 5 వేల లోపు జనాభా ఉండేలా సమతుల్యత పాటించాలనేది ప్రాథమిక నిబంధన. అలాగే నిబంధనల ప్రకారం డివిజన్ జనాభా సగటు కంటే పది శాతానికి మించి ఎక్కువ లేదా తక్కువగా ఉండకూడదు. కానీ కడప కార్పొరేషన్లో ఈ రూల్స్ పూర్తిగా గాలికొదిలేశారు. అతి చిన్న వార్డు: 21Ð]l yìlÑ-f¯ŒS ¿o-Vøã-MýS…V> ò³§ýlªV> MýS°-í³-çÜ$¢-¯]l²ç³µ-sìæMîS, MóSÐ]lÌS… 2,467 f¯é-¿ê™ø A™èlÅ…™èl _¯]l² yìlÑ-f-¯ŒSV> AÐ]l-™èlÇ…-_…-¨. B ™èlÆ>Ó™èl Ý릯]l…ÌZ 3,176 f¯é-¿ê™ø 66Ð]l yìlÑ-f-¯Œl E…¨. ಭೌ-Vø-ã-^èl*õÜ¢ 55, 54, 43 yìlÑf¯]l$Ï ^éÌê _¯]l²-ÑV> MýS°-í³-çÜ$¢¯é²Æ‡$$. అతి పెద్ద వార్డులు: మంది జనాభాతో 20, 48, 50 వార్డులు అత్యంత పెద్ద డివిజన్లుగా ఏర్పడ్డాయి. ఆ తర్వాత స్థానంలో 5,692 జనాభాతో 61వ వార్డు ఉంది. నగర శివార్లలోని 2వ డివిజన్ విస్తీర్ణంలో (ఏరియా పరంగా) అతిపెద్ద డివిజన్గా ఏర్పాటైంది. రాజకీయ విభేదాలతో ఓటర్ల విభజన? పునర్విభజనలో కడప, కమలాపురం నియోజకవర్గాలకు చెందిన ఓటర్లు పూర్తిగా వేరుపడిపోయారు. కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, కమలాపురం నియోజకవర్గ ఇన్చార్జి పుత్తా నరసింహారెడ్డిల మధ్య ఉన్న విభేదాల కారణంగానే కమలాపురం ఓటర్లు కడపలో కలవకుండా చర్యలు తీసుకున్నట్లు ప్రచారం జరుగుతోంది. దీనివల్ల కమలాపురానికే ఆరు వార్డులు ప్రత్యేకంగా ఏర్పడ్డాయి. నిజానికి 2005లోనే కమలాపురం నియోజకవర్గానికి చెందిన పంచాయితీలను కార్పొరేషన్లో విలీనం చేశారు. ఇప్పుడు ఆ ఓటర్లను పక్కనబెట్టి పునర్విభజన చేయడం ప్రాథమిక సూత్రాలకే విరుద్ధమనే వాదనలు వినిపిస్తున్నాయి. నిబంధనలు పక్కనబెట్టి ‘జిగ్జాగ్’ విభజన! రోడ్లు, డ్రైనేజీ కాలువలు, రైల్వే ట్రాక్లు, జంక్షన్లు వంటి వాటిని సరిహద్దులుగా చూపుతూ, నార్త్ (ఉత్తరం) నుండి మొదలుపెట్టి క్లాక్వైజ్ (గడియారపు ముల్లు తిరిగే దిశ) డైరెక్షన్లో వార్డుల పునర్విభజన చేయాల్సి ఉంటుంది. కానీ కడప కార్పొరేషన్లో అనేక వార్డులు జిగ్జాగ్గా మారాయని తెలుస్తోంది. ముఖ్యంగా, చివరి డివిజన్లో రావాల్సిన పాలెంపల్లెను దేవునికడపలో కలపడం ఇప్పుడు నగరంలో తీవ్ర చర్చనీయాంశమవుతోంది. రాత్రికి రాత్రే రహస్య నోటిఫికేషన్! ఆదివారం రాత్రి కార్పొరేషన్ కమిషనర్ హెచ్.ఎస్. భావన ఆదేశాల మేరకు అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర డీలిమిటేషన్ నోటిఫికేషన్ను విడుదల చేశారు. అయితే, రాజకీయ పార్టీల నాయకులకు రాత్రి పొద్దుపోయాక ఈ సమాచారం ఇవ్వడంపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. టౌన్ ప్లానింగ్ అధికారులు మొదటి నుండి ఈ ప్రక్రియను అత్యంత రహస్యంగా ఉంచారని, మీడియాకు కూడా కనీస సమాచారం ఇవ్వలేదని ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి. ఎమ్మెల్యే మాధవి, టీడీపీ రీజనల్ ఇన్చార్జి ఆర్. శ్రీనివాసులరెడ్డిలతో అధికారులు పలుమార్లు రహస్యంగా భేటీ అయి, వారు చెప్పినట్లే డివిజన్లను ఇష్టానుసారంగా ముక్కలు చేశారని విమర్శలు వస్తున్నాయి. వివాదాస్పదంగా కడప కార్పొరేషన్ వార్డుల పునర్విభజన 50 నుంచి 66కు పెరిగిన వార్డుల సంఖ్య. పూర్తిగా వేరుపడిన కడప, కమలాపురం నియోజకవర్గ ఓటర్లు. నిబంధనలకు విరుద్ధంగా జనాభా విభజన: అతి చిన్న వార్డుగా 21, పెద్ద వార్డులుగా 20, 48, 50. రహస్యంగా నోటిఫికేషన్ విడుదల చేయడంపై రాజకీయ పార్టీల ఆగ్రహంకడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థ పరిధిలో ప్రస్తుతం ఉన్న 50 డివిజన్లను 66 డివిజన్లుగా డీ–లిమిటేషన్ (పునర్విభజన) చేయుటకు సంబంధించిన ప్రతిపాదనలు, పూర్తి వివరాలు మరియు మ్యాపులను నగరపాలక సంస్థ కమిషనర్ హెచ్.ఎస్. భావన సోమవారం సాయంత్రం విడుదల చేశారు. ఈ డీ–లిమిటేషన్ ప్రక్రియలో భాగంగా ప్రతి డివిజన్ పరిధి, జనాభా, భౌగోళిక పరిస్థితులు మరియు పరిపాలనా సౌలభ్యాలను పరిగణనలోకి తీసుకొని ప్రతిపాదనలు రూపొందించబడినట్లు తెలిపారు. ప్రజలు విడుదల చేసిన మ్యాపులు మరియు వివరాలను పరిశీలించి, ఏవైనా అభ్యంతరాలు లేదా సూచనలు ఉన్నట్లయితే 18–05–2026 నుండి 24–05–2026 వరకు నగరపాలక సంస్థ కార్యాలయంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక సెల్లో లిఖితపూర్వకంగా సమర్పించవచ్చని తెలిపారు. ప్రజల నుండి అందిన అభ్యంతరాలు మరియు సూచనలను పరిశీలించిన అనంతరం తుది ప్రతిపాదనలు సిద్ధం చేయబడతాయని పేర్కొన్నారు. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకొని తమ అభిప్రాయాలను తెలియజేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ కమిషనర్ రాకేష్చంద్ర, సీపీ శైలజ, ఏసీపీలు మునిరత్నం, మునిలక్ష్మి, టీపీవో రత్నరాజు పాల్గొన్నారు. -
పెట్రో మంటపైనిరసనల జ్వాల
పెట్రో ధరల పెంపుపై నిరసనలు భగ్గుమన్నాయి.. అధికారంలోకి వస్తే ధరలు తగ్గిస్తామన్న బాబు మాటలు ఇప్పుడేమయ్యాయని వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రశ్నించాయి. నాడు కోతలు కోసి.. నేడు నిలువునా వాతలు పెడుతున్న కూటమి తీరుపై దునుమాడాయి. వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో సోమవారం జిల్లా వ్యాప్తంగా చేపట్టిన నిరసనలకు జనం స్వచ్ఛందంగా మద్దతు పలికారు. ప్లకార్డులు చేతబట్టి నిరసనల్లో పాల్గొన్నారు. చంద్రబాబు, పవన్ డౌన్ డౌన్ అంటూ నినాదాలతో హోరెత్తించారు. కడప కార్పొరేషన్: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై ప్రజల్లో ఆగ్రహం పెల్లుబుకింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో మహిళలు, యువత, రైతులు రోడ్ల మీదకు వచ్చి ప్రభుత్వ నడ్డివిరిచే చర్యలను తీవ్రంగా ఖండించారు. పెంచిన ధరలను వెంటనే తగ్గించకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ ఆందోళనల్లో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు పాల్గొని నిరసన వ్యక్తం చేశారు. అనంతరం ఆర్డీఓలకు వినతిపత్రాలు అందజేశారు. ● జిల్లా కేంద్రమైన కడపలో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆధ్వర్యంలో ఆర్డీఓ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. పార్టీ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యులు కె. సురేష్ బాబు, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ పాల్గొన్నారు. ప్లకార్డులు పట్టుకొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేస్తూ పెంచిన ధరలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేశారు. అనంతరం ఆర్డీఓ కార్యాలయ ఏఓ శంకరయ్యకు వినతిపత్రమిచ్చారు. ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, పి. జయచంద్రారెడ్డి పాల్గొన్నారు. ప్రభుత్వాలపై ప్రజాగ్రహం ఇంధన ధరల పెంపుపై వైఎస్సార్సీపీ పోరు! జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన పార్టీ శ్రేణులు. కలెక్టరేట్, తహసీల్దార్కార్యాలయాల ముట్టడి. జిల్లా వ్యాప్తంగా దద్దరిల్లిన ధర్నాలు, నిరసన ర్యాలీలు -
వేర్వేరు ప్రాంతాల్లో గుర్తుతెలియని వ్యక్తుల మృతి
ఒంటిమిట్ట : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు గుర్తుతెలియని వ్యక్తులు మృతి చెందారు. వివరాలు ఇలా ఉన్నాయి. మండల కేంద్రంలోని ఒంటిమిట్ట చెరువులో సోమవారం గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలింది. సీఐ వెంకటేశ్వర్లు తెలిపిన మేరకు..రామతీర్థం సమీపాన ఉన్న ఒంటిమిట్ట చెరువు కట్ట పక్కనే ఉన్న చెరువులో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలి ఉండటం గమనించిన అటుగా వెళ్తున్న వాహనదారులు పోలీసులకు సమాచారం అందించారు. వారు వచ్చి మృతదేహాన్ని పరిశీలించారు. చీకటి పడటంతో చెరువులో ఉన్న మృతదేహాన్ని మంగళవారం ఉదయం బయటికి తీయనున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. మృతదేహం బయటకు వచ్చేంత వరకు మృతుడి వివరాలు కానీ, ఆనవాళ్లు కానీ తెలుపలేమని సీఐ స్పష్టం చేశారు. ఆలంఖాన్పల్లెలో.. చెన్నూరు (వల్లూరు) : చెన్నూరు పోలీస్స్టేషన్ పరిధిలోని ఆలంఖాన్పల్లె ఇర్కాన్ సర్కిల్ సమీపంలో సోమవారం గుర్తు తెలియని మగ వ్యక్తి మృతదేహం లభ్యమయినట్లు పోలీసులు తెలిపారు. మృతుడి వయసు సుమారు 25 నుంచి 35 సంవత్సరాలు వుంటుందని తెలిపారు. నీలం రంగు టీ షర్ట్, జీన్స్ ప్యాంట్ ధరించి కుడి చేతి మీద కరీం సాహెబ్, మెహరునీస్సా అని, కుడి మణికట్టు మీద టాబు అని, ఎడమ చేతి మీద అబ్దుల్ ఖాదర్ అని ఆంగ్ల భాషలో పచ్చ బొట్టు రాసి ఉన్నట్లు వివరించారు. ఇతని మరణానికి గల కారణాలు తెలియాల్సి వున్నదని తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
భార్యపై భర్త గొడ్డలితో దాడి
జమ్మలమడుగు రూరల్ : కట్టుకున్న భార్యపై భర్త గొడ్డలితో దాడి చేసిన సంఘటన జమ్మలమడుగు పట్టణంలో చోటు చేసుకొంది. ఎస్ఐ రామకృష్ణ ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నాగలకట్ట వీధిలో ఉంటున్న లక్ష్మీదేవి, వెంకటేశ్వరరెడ్డి దంపతులు పిల్లలతో కలసి ఉంటున్నారు. వెంకటేశ్వరరెడ్డి వృత్తి రీత్యా బేల్దారి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. తరచూ భార్యభర్తల మధ్య గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో సోమవారం గొడవ జరిగి లక్ష్మీదేవి మెడపై వెంకటేశ్వరరెడ్డి గొడ్డలితో దాడి చేశాడు. ఈ సంఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి ప్రాథమిక చికిత్స అందించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు. పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేస్తున్నారు. ఆగి ఉన్న లారీని ఢీకొన్న ఐచర్ వాహనం పుంగనూరు : పట్టణంలోని బైపాస్ రోడ్డులో మరమ్మతుకు వచ్చి రోడ్డు పక్కన ఆపి ఉన్న లారీని ఐచర్ వాహనం ఢీకొన్న సంఘటన సోమవారం వేకువజామున జరిగింది. కడప నుంచి వి.కోటకు సిమెంటు లోడ్డుతో వెళ్తున్న లారీ రోడ్డు పక్కన ఆగి ఉండగా, మదనపల్లె నుంచి పలమనేరు వైపుగా వెళ్తున్న ఐచర్ వాహనం ఢీకొంది. అయితే ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి
● ప్రమాదం అంటున్న పోలీసులు ● మృతుడు ప్రభుత్వ ఉపాధ్యాయుడుచక్రాయపేట : మండలంలోని గాలివీడు క్రాస్లో గల కల్వర్టు కింద అనుమానాస్పద స్థితిలో భార్యాభర్తలు మృతి చెందిన సంఘటన సంచలనం రేపింది. ఆదివారం అర్ధరాత్రి సమయంలో జరిగిన ఈ ఘటన సోమవారం దావానంలా వ్యాపించింది. మృతులు పులివెందుల టౌన్ నగరి గుట్టకు చెందిన బుకే మహేష్ నాయక్(25), కాళ్ల దీపిక(21) గా పోలీసులు గుర్తించారు. సంఘటన ప్రమాదవశాత్తు జరిగిందని ఎస్ఐ చంద్రశేఖర్ పేర్కొంటుంటే.. అక్కడ చూసిన వారు మాత్రం హత్యలే అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మహేష్నాయక్ తల్లి సుజాత లింగాల మండలంలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తోంది. తండ్రి మంగే నాయక్ రైతు. వీరికి ఏకై క సంతానమైన మహేష్ నాయక్ ఓ ఎయిడెడ్ పాఠశాలలో ఉపాధ్యాయుడిగా పని చేసే వాడు. గత విద్యాసంవత్సరం ప్రారంభ సమయంలో ఆ పాఠశాలలో విద్యార్థులు లేరని మూసివేశారు. దీంతో విద్యాశాఖ అధికారులు ఆయనను వేంపల్లె టౌన్ శ్రీరామనగర్ ప్రభుత్వ పాఠశాలకు డిప్యూటేషన్పై పంపడంతో అక్కడ పని చేస్తున్నారు. అలాగే కాళ్ల దీపిక విజయనగరం జిల్లా నెలిమర్ల మండలం జర్జాపుపేటలోని శివాలయం వీధికి చెందిన గంగాధర్ (ఎక్స్ఆర్మీ) కుమార్తె. ఈమె పులివెందులలో ఇంటిగ్రేటెడ్ బీఈడీ చదువుతుండేది. దీంతో వీరిద్దరి మధ్యన ఏర్పడిన పరిచయం ప్రేమగా మారడంతో.. పెళ్లి చేసుకున్నట్లు తెలిసింది. అయితే దీపిక బంధువులు మాత్రం తమ అమ్మాయికి వివాహం కాలేదని చెబుతున్నారు. మహేష్నాయక్ పాఠశాలకు వచ్చే సమయంలో ఆయనతో కలిసి వేంపల్లెకు వస్తుండేదని అతని సన్నిహితులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో వారు ఎక్కడికి వెళ్తున్నారో.. సంఘటన అర్ధరాత్రి దాటాక ఒంటిగంట సమయంలో జరిగి ఉంటుందని పోలీసులు పేర్కొంటున్నారు. ఆ సమయంలో వారు ఎక్కడి నుంచి ఎక్కడికి పోతుండగా.. ఈ ఘటన జరిగిందనే విషయం తెలియరాలేదు. రాత్రి 8–45 గంటలకు తిరుపతిలోని రిలయన్స్ మాల్లో షాపింగ్ చేసినట్లు కొన్ని ఆధారాలు ఉన్నాయని ఎస్సై చెబుతున్నారు. పులివెందుల నుంచి వారిద్దరూ ద్విచక్ర వాహనంలో తిరుపతికి వెళ్లి తిరిగి వస్తుండగా ఈ సంఘటన జరిగిందని పోలీసుల వాదన. ఆ సమయంలో వారు వస్తూ నిద్ర మత్తులో రోడ్డు పక్కన కల్వర్టు వద్ద కాలువలో పడి చనిపోయారని పోలీసులు చెబుతుంటే.. సంఘటన చూసిన వారు మాత్రం బైక్ పెద్దగా దెబ్బతినలేదని, ఆమె తల నుజ్జునుజ్జుగా అయిందని చర్చించుకుంటున్నారు. పైగా మహేష్ మృతదేహం కల్వర్టు కింద దూరంగా ఎందుకు పడుతుందనే అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇంకా ఎన్నెన్నో అనుమానాలు సంఘటన ప్రాంతాన్ని పరిశీలించిన వారు పేర్కొంటున్నారు. ప్రమాదవశాత్తా లేక హత్యా అనే విషయాన్ని పోలీసులు నిగ్గు తేల్చాల్సి ఉంది. కాగా వారిద్దరూ బాగా డ్యాన్స్ చేస్తారని, పిల్లలకు డ్యాన్స్ కూడా నేర్పిస్తుంటారని పలువురు పేర్కొన్నారు. పులివెందులకు మృతదేహాలు గాలివీడు క్రాస్ వద్ద చనిపోయిన మహేష్ నాయక్, దీపికల మృతదేహాలను పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం పులివెందుల ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. అయితే దీపిక తల్లిదండ్రులు విజయనగరం జిల్లా నుంచి బయలుదేరడంతో వారి కోసం పోస్టుమార్టాన్ని మంగళవారానికి వాయిదా వేసినట్లు ఎస్సై తెలిపారు. మృతుల తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తామని ఆయన తెలిపారు. -
ఫిర్యాదులను గడువులోపు పరిష్కరించాలి
డీఆర్వో మల్లికార్జునుడుకడప సెవెన్ రోడ్స్: ఆర్జీదారుల సమస్యలను గడువులోపు పరిష్కరించాలని డీర్వో మల్లికార్జునుడు అధికారులను అదేశించారు. సోమవారం కలెక్టరేట్ సభాభవనంలో నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో డీఆర్ఓ ఇతర అధికారులు ఆర్జీలు స్వీకరించారు. ● సుండుపల్లి మండలంలో 70 శాతం రైతులు మామిడి తోటల వల్ల జీవనం సాగిస్తున్నారని ఆ మండలానికి చెందిన రామ శ్రీనివాస్ తెలిపారు. మామిడి కోతకు వచ్చిన ప్రస్తుత దశలో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలు తగ్గించి వేయడం వల్ల రైతులు నష్టపోతున్నారని తెలిపారు. మామిడి రైతులకు గిట్టుబాటు ధర అందించి అదుకోవాలని కోరారు. ● బుగ్గవంక డ్యాం కట్టపై అడవిని తలపించేలా కంప చెట్లు పెరిగాయని ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రవిశంకర్రెడ్డి తెలిపారు. ఇందువల్ల రానున్న రోజుల్లో కట్ట తెగిపోయేందుకు ఎక్కువ అవకాశం ఉందని తక్షణమే కంప చెట్లు తొలగించాలని కోరారు. ● చెన్నూరు మండలంలోని సిరి మెగా టౌన్షిప్లో తాగునీటి వసతి కల్పించాలని టి. ప్రభాకర్రెడ్డి కోరారు. ● తన ఆధార్కార్డులోని తప్పులు సరిచేసి ఇళ్లు మంజూరు చేయాలని వేంపల్లికి చెందిన టి. లక్ష్మీదేవి కోరారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ సీఈవో సుబ్రమణ్యం, డీఆర్డీఎ పిడి రాజ్యలక్ష్మీ, డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి, వివిధ శాఖ అధికారులు పాల్గొన్నారు. -
ప్రకృతి వ్యవసాయ విస్తరణకు కృషి
కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయ సాగు విస్తరణకు సిబ్బంది కృషి చేయాలని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ సూచించారు. శనివారం కడపలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు కార్యాలయంలో రాజంపేట డివిజన్లోని రాజంపేట, సుండుపల్లి, నందలూరు, వీరబల్లి మండలాలకు సంబంధించిన క్యాడర్స్తో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుత ఎల్నినో ప్రభావంతో రైతులతో ఎటువంటి మోడల్స్ ఏర్పాటు చేసుకోవాలనే అంశంపై శిక్షణ ఇచ్చారు. ప్రస్తుత పరిస్థితుల్లో 365 రోజులు భూమిని కప్పి ఉండేలా పంటలను సాగు చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
లాసెట్లో రాష్ట్ర స్థాయి 7వ ర్యాంకు
మదనపల్లె సిటీ : ఏపీ లాసెట్–2026 నిర్వహించిన ప్రవేశపరీక్షలో మదనపల్లెకు చెందిన షేక్ అల్మాస్ రాష్ట్ర స్థాయిలో 7వ ర్యాంకు సాధించారు. 5 సంవత్సరాల బీఎల్/ఎల్ఎల్బీ కోర్సులో చేరేందుకు మే 4వ తేదీ ప్రవేశ పరీక్ష నిర్వహించారు. ఇందులో షేక్ అల్మాస్ వందకు 96 మార్కులు సాధించారు. ఆమె తల్లిదండ్రులు షేక్ సికిందర్, షేక్ గౌసియా. తండ్రి స్థానిక ఏవీ నాయుడు కాలనీ వద్ద వెల్డింగ్ షాపు నిర్వహిస్తున్నారు. షేక్ అల్మాస్ స్థానిక కదిరిరోడ్డులోని మదనపల్లె జూనియర్ కాలేజీలో ఇంటర్మీడియట్ ఎంపీసీ కోర్సు చదివింది. ఇంటర్లో 903 మార్కులు వచ్చాయి. చిన్నప్పటి నుంచి చదువులో బాగా రాణిస్తోంది. అన్న ఇర్షాద్ అలీఖాన్ న్యాయవాది కావడంతో.. తాను లాసెట్ రాసినట్లు తెలిపింది. ఎల్ఎల్బీ పూర్తి చేసి సివిల్స్కు ప్రిపేర్ కావడమే తన ధ్యేయమని పేర్కొంది. అల్మాస్ను పలువురు అభినందించారు. -
కేకును కట్ చేసినట్లు చేశారు.. న్యాయపోరాటం చేస్తా
‘పునర్విభజన పేరుతో వార్డులను కేక్ కట్ చేసినట్లు ఇష్టం వచ్చినట్లు కట్ చేశారు. 2011 జనాభా లెక్కల ప్రకారం పునర్విభజన చేయడమే ప్రాథమికంగా తప్పు. ఈ జనాభా లెక్కల ప్రకారం 2019లోనే ఇదివరకే ఒకసారి విభజన చేశారు. మళ్లీ చేయాలంటే కొత్త జనాభా లెక్కల ప్రకారమే చేయాలి. అయినా ప్రభుత్వం దీనిని పట్టించుకోలేదు. కేవలం టీడీపీ నాయకులకు రాజకీయ పునరావాసం కల్పించడానికి, రాబోయే ఎన్నికల్లో రిజర్వేషన్ ప్రక్రియను వారికి అనుకూలంగా మార్చుకోవడానికే ఈ కుట్రకు తెరలేపారు. ఈ ప్రక్రియలో అధికారులు ఎలాంటి నిబంధనలు పాటించలేదు. దీనిపై తాము ఎక్కడికక్కడ అభ్యంతరాలు లేవనెత్తుతాం.. అవసరమైతే కోర్టుకు వెళ్లి న్యాయపోరాటం చేస్తాం. – పాకా సురేష్ కుమార్, మాజీ మేయర్. -
ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదులపై ప్రత్యేక దృష్టి సారించాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. వైఎస్ఆర్ కడప జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’ కార్యక్రమంలో ఆయన పాల్గొని, ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదుదారులతో ముఖాముఖి మాట్లాడి, వారి సమస్యలు తెలుసుకున్నారు. పీజీఆర్ఎస్కు మొత్తం 136 ఫిర్యాదులు వచ్చాయి. కార్యక్రమానికి విచ్చేసిన వృద్ధులు, దివ్యాంగుల వద్దకే ఎస్పీ వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. అప్పటికప్పుడే సంబంధిత పోలీస్ అధికారులతో ఫోన్లో మాట్లాడి, వాటిని నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశాలు జారీ చేశారు. ఈ కార్యక్రమంలో డీటీసీ డీఎస్పీ అబ్దుల్ కరీంతోపాటు పలువురు పోలీస్ అధికారులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి తైక్వాండో పోటీల్లో సత్తా
కడప వైఎస్ఆర్ సర్కిల్ : తెలంగాణ రాష్ట్రంలోని గద్వాలలో జరిగిన 16వ జాతీయ స్థాయి ఓపెన్ తైక్వాండో పోటీల్లో జిల్లా క్రీడాకారులు సత్తా చాటినట్లు జిల్లా తైక్వాండో కార్యదర్శి నాయబ్ రసూల్ తెలిపారు. ఈ పోటీలకు అన్ని రాష్ట్రాల నుంచి దాదాపు 1200 మంది క్రీడాకారులు పాల్గొన్నారని, జిల్లా నుంచి 16 మంది క్రీడాకారులు పాల్గొని 11 పతకాలు సాధించడం జరిగిందన్నారు. బంగారు పతకాలను ధనుంజయ్, తారక్, నాగూర్, రజిత పతకాలను ఖాసిం, కాంస్య పతకాలను సై ఫన్నీసా, నందిని, ప్రణత, జఫరుల్లా, ఇమ్రాన్, మహేష్, రంగనాథ్ సాధించారని పేర్కొన్నారు. వారిని జిల్లా తైక్వాండో ప్రెసిడెంట్ ఈ శివశంకర్రెడ్డి అభినందించారు. -
కత్తితో దాడి.. హత్యాయత్నం కేసు నమోదు
ముద్దనూరు : మండలంలోని ఉప్పలూరు గ్రామంలో పాలగిరి బాలవీరయ్య అనే వ్యక్తిపై అదే గ్రామానికి చెందిన వీరబోయిన లక్ష్మీనరసయ్య ఆదివారం మచ్చుకత్తితో దాడి చేశాడు. దీంతో లక్ష్మీనరసయ్యపై పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. సీఐ నగేష్బాబు సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బాలవీరయ్య, లక్ష్మీనరసయ్య మధ్య కొంత కాలం నుంచి మనస్పర్థలు ఉన్నాయి. ఈ క్రమంలో ఆదివారం గ్రామంలో ఓ వ్యక్తి ఇచ్చిన విందుకు ఇరువురు హాజరయ్యారు. భోజన సమయంలో వీరి మధ్య స్వల్ప వాగ్వాదం జరిగింది. దీంతో వీరయ్యను నరసయ్య బెదిరించాడు. అనంతరం వీరయ్య ఇంటి వద్దకు వెళ్లి అతనిని బయటికి పిలిచి మచ్చుకత్తితో దాడి చేశాడు. దీంతో వీరయ్య ముఖం మీద, రెండు చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ సమయంలో తండ్రిని కాపాడడానికి వచ్చిన వీరయ్య కుమారుడు వినోద్ను కూడా నరసయ్య కత్తితో నరికినట్లు అతని ఎడమ చేతి వేలికి గాయమైనట్లు, వినోద్ ఫిర్యాదు మేరకు నరసయ్యపై హత్యాయత్నం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. సంఘటనా స్థలాన్ని డీఎస్పీ వెంకటేశ్వర్లు పరిశీలించారు. తీవ్ర గాయాల పాలైన వీరయ్యను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం కడపకు తీసుకెళ్లారు. -
కుటుంబ కలహాలతో వివాహిత ఆత్మహత్య
రామసముద్రం : మండలంలోని పెద్దకురప్పల్లి పంచాయతీ బసవన్నకట్టలో ఓ వివాహిత కుటుంబ కలహాలతో ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ హృషికేశవరెడ్డి తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. బసవన్నకట్టకు చెందిన విజయ్ కుమారుడు తేజకు 2021లో శివయ్య కుమార్తె రమ్యను(22) ఇచ్చి వివాహం చేశారు. కొంత కాలంగా సంసార జీవితంలో కుటుంబ కలహాలు రావడంతో.. మనస్తాపానికి గురైన రమ్య శనివారం ఇంట్లో ఎలుకల నివారణ మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే రమ్యను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి తండ్రి శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పిడుగుపాటుకు వృద్ధుడు మృతి సదుం : పిడుగు పాటుకు వృద్ధుడు మృతి చెందిన సంఘటన సదుం మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. గొంగివారిపల్లె పంచాయతీ పొట్టెంవారిపల్లెకు చెందిన మల్లయ్య (90), సుశీలమ్మ దంపతులు గ్రామ సమీపంలోని పొలం వద్దకు వెళ్లారు. ఐదు గంటల ప్రాతంలో వర్షం పడటంతో చింతచెట్టు కిందికి చేరారు. పిడుగుపాటుకు గురై మల్లయ్య అక్కడే మృతి చెందాడు. సుశీలమ్మ స్వల్పంగా గాయపడగా, తాళిబొట్టు ముక్కలు కావడంతోపాటు, ఫోన్ పగిలిపోయింది. వారికి కుమారుడు, కుమార్తె ఉన్నారు.కర్ణాటక యువకుడిపై దాడిమదనపల్లె టౌన్ : కర్ణాటక యువకుడిపై మదనపల్లెలో దాడి జరిగిన సంఘటన ఆదివారం స్థానిక జిల్లా ఆస్పత్రిలో చోటు చేసుకుంది. బాధితుడి కథనం మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు చీకటివారిపల్లికి చెందిన రాజేంద్ర(33) పిన తల్లి జ్యోతి కురబలకోట మండలంలోని అంగళ్ళులో ఉంటోంది. ఆమె కుటుంబీకులతో గొడవ పడి పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడడంతో.. పినతల్లిని చూడటానికి రాజేంద్ర కర్ణాటక నుంచి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి వచ్చాడు. జిల్లా ఆసుపత్రిలో చికిత్సలు పొందుతున్న జ్యోతిని పలకరించి కారణాలు అడగి తెలుసుకున్నాడు. అనంతరం జ్యోతి భర్త నరేష్ను రాజేంద్ర నిలదీయడంతో ఆగ్రహించి నరేష్ బండరాయితో రాజేంద్ర తలపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచాడు. బాధితుడు జిల్లా ఆసుపత్రిలో చేరి చికిత్సలు పొందుతున్నాడు. స్థానిక రెండవ పట్టణ పోలీసులు విచారణ చేపట్టారు. -
కలలు.. కల్లలు
● బిల్లులు రాక...పనులు సాగక... ● బుగ్గవంక అప్రోచ్రోడ్ల పరిస్థితి అగమ్య గోచరం ● పట్టించుకోని కూటమి ప్రభుత్వం నిలిచిపోయిన బుగ్గవంక అప్రోచ్రోడ్డు పనులు కడప సిటీ: కడపలోని బుగ్గవంక అభివృద్ధికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అడుగులు వేసింది. బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపులా తారురోడ్డు వేయాలని సంకల్పించడమే గాక పనులకు శ్రీకారం చుట్టారు. అందులో భాగంగానే బుగ్గవంకు ఇరువైపుల తారురోడ్డు వేసి ట్రాఫిక్ సమస్యను తగ్గించేందుకు నిధులు మంజూరు చేశారు. పనులు 50 శాతానికి పైగా జరిగాయి.కల సాకారమవుతుందన్న వేళ ఎన్నికలు రావడం, కూటమి సర్కార్ అధికారంలోకి రావడంతో ప్రజల కలలు కల్లలుగా మారాయి. కూటమి ప్రభుత్వం ఈ రోడ్ల గురించి పట్టించుకోకపోవడం, సంబంధిత కాంట్రాక్టర్కు బిల్లులు చెల్లించకపోవడంతో అర్ధంతరంగా పనులు ఆగిపోయాయి. ట్రాఫిక్ సమస్య తీరుతుందని.. ప్రధానంగా బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపుల రోడ్డు నిర్మా ణం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే ప్రారంభించారు. అంతేకాకుండా బుగ్గవంక ఆధునీకరణలో భాగంగా మిగిలిన పనులు పూర్తి చేసేందుకు కూడా శ్రీకారం చుట్టారు. 1.2 కిలోమీటర్ల మేర పెండింగ్లో ఉన్న ప్రొటెక్షన్ వాల్ నిర్మాణాన్ని చేపట్టారు. బుగ్గవంకకు ఇరువైపులా కడపలోని రైల్వే వంతెన నుంచి అల్మాస్పేట వరకు ఎనిమిది కిలోమీటర్ల దూరం తారు రోడ్డు నిర్మాణానికి పనులు జరిగాయి. వైఎస్ జగన్ ప్రభుత్వంలో ప్రొటెక్షన్ వాల్కు ఇరువైపులా 40 అడుగుల మేర వెడల్పుతో 6.4 కిలోమీటర్ల వరకు పనులు పూర్తయ్యా యి. వాహనదారులు నేరుగా రైల్వే వంతెన వద్దకు, అల్మాస్పేటకు వెళ్లాలన్నా ఈ రోడ్డు ఉపయోగపడుతుందని భావించి పనులు చేపట్టారు. అంతేకాకుండా ఈ రోడ్ల వెంబడి వాహనాలు పోవడం వల్ల నగరంలో రద్దీ తగ్గుతుందని భావించా రు. కానీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడిచినా పెండింగ్ పనులను పూర్తి చేయకపోవడంపై కూట మి నేతలకు కడప అభివృద్ధిపై చిత్తశుద్ది లేదన్నట్లు తెలుస్తోంది. కడప నడిబొడ్డున ఉన్న బుగ్గవంక అభివృద్ధి పనులు దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలోనే జరిగాయి. కడపలో బుగ్గవంక కష్టాలు ప్రజలకు తీరని వ్యథగా ఉండేది. ప్రతిపక్ష నేతగా ఉన్న వైఎస్ రాజశేఖరరెడ్డి 2004లో తాను ముఖ్యమంత్రి అయితే బుగ్గవంక సుందరీకరణ పనులు చేపడతామని మాట ఇచ్చారు. ఆ మాట ప్రకారమే పనులు చేశారు. టీడీపీ ప్రభుత్వ హయాంలో బుగ్గవంక వరద ఉధృతితో రవీంద్రనగర్, కాగితాలపెంటతోపాటు పరిసర ప్రాంతాలు జలమయం అయ్యాయి. ప్రాణనష్టం జరిగింది. కానీ అప్పటి టీడీపీ ప్రభుత్వం ఇవేమి పట్టించుకోకుండా గాలికి వదిలేసింది. తర్వాత 2004లో అధికారంలోకి వచ్చిన వైఎస్ రాజశేఖరరెడ్డి రూ. 49 కోట్ల నిధులు మంజూరు చేసి పనులు ప్రారంభించారు. తర్వాత అధికారంలోకి వచ్చిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 2020లో పెండింగ్ పనులకు శ్రీకారం చుట్టారు.కూటమి ప్రభుత్వ ఈ రెండేళ్ల పాలనలో బుగ్గవంక ఇరువైపులా ఉన్న రోడ్ల నిర్మాణం పూర్తిగా తారుమారైంది. నోటీసులు ఇచ్చాం బుగ్గవంక రక్షణ గోడకు ఇరువైపులా రోడ్ల నిర్మాణ పనులు కొంతమేర చేయాల్సి ఉంది. కానీ సంబంధిత కాంట్రాక్టర్కు బిల్లులు మంజూరు కాకపోవడంతో పనులు నిలిపివేశారు. కాంట్రాక్టర్కు పనులు ప్రారంభించాలని నోటీసులు ఇచ్చాం. త్వరలో పనులు ప్రారంభించి నిర్మాణ పనులు పూర్తి చేస్తాం. –చెంగల్రాయుడు, ఈఈ, నీటిపారుదలశాఖ, కడప -
వైఎస్సార్సీపీ హయాంలో ప్రొద్దుటూరు అభివృద్ధి
ప్రొద్దుటూరు : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రొద్దుటూరు నియోజకవర్గంలో భారీగా అభివృద్ధి జరిగిందని మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ తెలిపారు. ప్రొద్దుటూరుకు వచ్చిన సందర్భంగా ఆయన ఆదివారం విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తాగునీరు, రోడ్లు, ఆర్టీసీ బస్టాండ్ నిర్మాణం, మార్కెట్ నిర్మాణ పనులను అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్న రాచమల్లు శివప్రసాదరెడ్డి అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి సహకారంతో మంజూరు చేయించారన్నారు. పెండింగ్లో ఉన్న పనులను కూటమి ప్రభుత్వం పూర్తి చేస్తే సరిపోతుందన్నారు. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా బస్టాండ్ను నిర్మించారని, కూటమి ప్రభుత్వం వచ్చి రెండేళ్లు అయినా దానిని ప్రారంభించలేకపోతోందన్నారు. రోడ్లు విస్తరణ చేపట్టి డివైడర్లను ఏర్పాటు చేశారని తెలిపారు. ప్రజల అవసరాలకు అనుగుణంగా రూ.50 కోట్లతో మార్కెట్ నిర్మాణం చేపట్టారని పేర్కొన్నారు. ప్రస్తుత ప్రభుత్వంలో కనీసం పవర్ కట్ లేకుండా నియంత్రించే పరిస్థితి లేదన్నారు. జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాచమల్లు శివప్రసాదరెడ్డి మళ్లీ అధికారంలోకి వస్తారన్నారు. ఒక్క మారు ప్రభుత్వం అధికారంలో ఉండటంతోనే నియోజకవర్గాన్ని ఈ స్థాయిలో అభివృద్ధి చేశారన్నారు. చంద్రబాబు మాటల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి ముఖ్యమంత్రి చంద్రబాబు మాటల పట్ల రాష్ట్రంలోని తల్లిదండ్రులందరూ అప్రమత్తంగా ఉండాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. శ్రీకాకుళంలో జరిగిన కార్యక్రమంలో సీఎం చంద్రబాబు రాష్ట్రంలోని తల్లిదండ్రులను ఉద్దేశించి మాట్లాడుతూ మూడో సంతానం కంటే రూ.30 వేలు, నాలుగో సంతానం కంటే రూ.40 వేలు, ఐదో సంతానం కంటే రూ.50 వేలు ఇస్తానని ప్రకటించారన్నారు. చంద్రబాబు చెప్పిన ప్రకారం ఇచ్చినా రూ.30 వేలు కేవలం కాన్పునకు మాత్రమే సరిపోతుందని తెలిపారు. సంతానం పుట్టిన తర్వాత వారి పోషణ బాధ్యతను ఎవరు తీసుకుంటారని, భవిష్యత్తులో వారికి విద్య, ఉద్యోగ అవకాశాలు గ్యారెంటీ ఉందా అని అన్నారు. ఎంతో మంది పేద, మధ్యతరగతి ప్రజలు ఆర్థిక భారంతో సరైన ఆహారం లేక ఇబ్బందులు పడుతున్నారని, ఇప్పుడు అదనపు సంతానం కలిగితే వారి పరిస్థితి ఏమిటని అన్నారు. సరైన భవిష్యత్తును కల్పించకపోతే పుట్టే సంతానం అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే అవకాశం ఉందన్నారు. సమావేశంలో టీటీడీ పాకలమండలి మాజీ సభ్యులు చిప్పగిరి ప్రసాద్, టంగుటూరు మారుతిప్రసాద్, వైఎస్సార్సీపీ ఆర్యవైశ్య విభాగం రాష్ట్ర నాయకుడు కరుణాకర్ పాల్గొన్నారు.మాజీ మంత్రి వెలంపల్లి శ్రీనివాస్ -
బస్సులో ప్రయాణిస్తూ యువకుడి మృతి
జమ్మలమడుగు రూరల్ : పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్(32) అనే యువకుడు ఆదివారం తిరుపతి– జమ్మలమడుగు ఆర్టీసీ బస్సులో ప్రయాణిస్తుండగా మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం పెద్దపసుపల గ్రామానికి చెందిన భాస్కర్ స్వగ్రామం వదలి కొన్నేళ్లుగా తాడిపత్రిలోని కొండెపల్లి గ్రామంలో ఉన్నాడు. కాగా ఆర్థిక సమస్యలతో 8 నెలల క్రితం స్వగ్రామమైన పెద్దపసుపలకు చేరుకున్నాడు. వ్యక్తిగత పనుల నిమిత్తం శనివారం కదిరికి వెళ్లాడు. ఆదివారం తిరిగి తిరుపతి నుంచి జమ్మలమడుగు వస్తున్న ఆర్టీసీ బస్సులో బయలుదేరాడు. బస్సు జమ్మలమడుగు పాతబస్టాండ్కు వచ్చినా.. సీటులో నుంచి లేవకపోవడంతో సిబ్బంది భాస్కర్ను లేపారు. కానీ లేవకపోవడంతో వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మృతి చెందినట్లు తెలిపారు. ఆ మేరకు తండ్రి స్వామిదాసు పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. మృతి చెందడానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. హార్సిలీహిల్స్లో పర్యాటకుల ఆటో బోల్తా మదనపల్లె టౌన్ : ప్రముఖ పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పర్యటన ముగించుకుని తిరిగి వెళ్తున్న పర్యాటకుల ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా, నలుగురు స్వల్పంగా గాయపడ్డారు. ఆదివారం సాయంత్రం హార్సిలీ హిల్స్ మూడవ మలుపు వద్ద ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుల కథనం ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన పి.కార్తీక్(19)తో పాటు మరో ఆరుగురు స్నేహితులు హార్సిలీహిల్స్కు పర్యటనకు వచ్చారు. పర్యటన ముగించుకుని సాయంత్రం ఆటోలో తిరుగు ప్రయాణ మయ్యారు. మార్గంమధ్యలోని హర్సీలీ హిల్స్ 3వ మలుపు వద్దకు రాగానే ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న ఏడుగురిలో ముగ్గురికి తీవ్ర గాయాలు అయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను బయటికి తీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆళ్లగడ్డ ప్రమాదంలో సదుం వాసి మృతి సదుం : నంద్యాల జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో సదుం మండల వాసి ఆదివారం మృతి చెందారు. గ్రామస్తుల కథనం మేరకు.. కంభంవారిపల్లె పంచాయతీ కురవపల్లెకు చెందిన సుబ్రమణ్యం(59 వ్యక్తిగత పనుల నిమిత్తం ఓ ప్రైవేట్ ట్రావెల్ బస్సులో హైదరాబాదుకు బయలుదేరారు. నంద్యాల జిల్లా ఆళ్లగడ్డ సమీపంలో బస్సు లారీని ఢీకొన్న ప్రమాదంలో ఆయన మృతి చెందారు. మృతునికి భార్య, కుమార్తె ఉన్నారు. -
డ్రైవరూ.. జాగ్రత్త టైరు
● వాహనాల టైర్లు పేలి వరుస ప్రమాదాలు ● వేసవిలో అప్రమత్తత అవసరంకడప వైఎస్ఆర్ సర్కిల్ : వాహనాలు కండిషన్లోనే ఉన్నాయి. క్రమం తప్పకుండా సర్వీసింగ్ చేస్తున్నాం. అని ధీమాలో ఉంటే సరిపోదు. టైర్లలో గాలి తరచూ సరిచూసుకోవాలని నిపుణులు చెబుతున్నారు. వాహనం బయలుదేరడానికి ముందే ఒకటికి రెండు సార్లు టైర్లు ఎలా ఉన్నాయి. వాటిలో సరిపడినంత గాలి ఉందా అని పరిశీలించుకోవాల్సిన అవసరం ఉంది. ఇటీవల కాలంలో టైర్లు పేలిపోయి ప్రమాదాలు సంభవిస్తున్నాయి. జిల్లాలో ఈ తరహా చిన్న చిన్న ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి.రబ్బర్ గట్టి పడటంతో అందులో పరిమితికి మించి గాలి పట్టినప్పుడు.. గుంతల్లో పడినప్పుడు టైర్లు పేలిపోయే ప్రమాదం ఉంది. ప్రస్తుతం ఉష్ణోగ్రతలు 45 డిగ్రీలు తాకుతున్నాయి. ఈ నేపథ్యంలో అరిగిపోయిన టైర్లతో వాహనాల్లో ప్రయాణం చేయడం ప్రమాదం అని నిపుణులు చెబుతున్నారు. ఆ అక్షరమే.. భద్రత కీలకం టైర్లు కొనుగోలు చేసే సమయంలో దాని తయారీ సంవత్సరం చూసుకోవాలి. రీ బటన్ వేసిన వాటిని కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా వ్యవహరించాలి. మరోవైపు బైకులు, కార్లు, బస్సులు, లారీల టైర్లు నాణ్యత, స్వీట్ రేటింగ్ సరిగ్గా లేకపోతే ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంది. టైర్ స్వీట్ రేటింగ్ అక్షరాల్లో ఉంటుంది. ప్రతి టైర్పై దాని సామర్థ్యం తెలియజేసే ప్రత్యేకమైన కోడ్ ఉంటుంది. అందులో చివరి ఆల్ఫాబెటికల్ అక్షరం చాలా కీలకమైంది. దాని టైర్ స్పీడ్ రేటింగ్ అంటారు. వాహన కంపెనీలు ఆ మోడల్కు తగిన స్పీడ్ రేటింగ్ నిర్ణయిస్తాయి. డ్రైవర్ డోర్ వద్ద ఉండే స్టిక్కర్ లేదా వాహన మాన్యువల్లో ఇది స్పష్టంగా ఉంటుంది. హైవేలపై డ్రైవ్ చేసే వారు హెచ్వీ రేటింగ్ టైర్లు వినియోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు. సాధారణంగా టైర్లు మన్నిక కాలం ఐదారు ఏళ్లు ఉంటుంది. కొత్త టైర్ తీసుకునే సమయంలో అది ఎప్పుడు తయారైంది అనేది తప్పనిసరిగా పరిశీలించాలి. ఉదాహరణకు 1226 అని ఉంటే 2026వ సంవత్సరం 12వ వారంలో తయారైనట్లు అర్థం. -
బైక్ అదుపు తప్పి.. కాలువలో పడి..
ఎర్రగుంట్ల : మండల పరిధిలోని చిన్నదండ్లూరు గ్రామం పరిధిలో గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్ద బైక్ అదుపు తప్పి ఎన్.నరేంద్రకుమార్రెడ్డి(37) అనే వ్యక్తి కాలువలో పడి మృతి చెందిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. కలమల్ల ఎస్ఐ సునీల్ కుమార్రెడ్డి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం జిల్లా తాడిపత్రి మండలంలోని గార్లదిన్నె గ్రామానికి చెందిన నరేంద్రకుమార్రెడ్డి తాడిపత్రిలో మెడికల్ స్టోర్ పెట్టుకుని జీవనం సాగిస్తున్నాడు. ఆయన వైఎస్ఆర్ కడప జిల్లాలోని చాపాడు మండల పరిధిలో ఉన్న తమ చిన్నమ్మ వద్దకు వచ్చి తిరిగి స్వగ్రామానికి పయనమయ్యాడు. చాపాడు నుంచి ప్రొద్దుటూరు ఆర్టీపీపీ మీదుగా తాడిపత్రికి పోవడానికి స్కూటర్లో బయలు దేరాడు. అయితే ఆర్టీపీపీ రోడ్డున గోపులాపురం గ్రామ క్రాస్ రోడ్డు వద్దకు రాగానే స్కూటర్ అదుపు తప్పి కాలువలో పడ్డాడు. ఎవరూ గమనించకపోవడంతో కాలువలోనే నీటిలోనే ఉండిపోయాడు. కొంత సేపటి తర్వాత అటుపోతున్న స్థానికులు గమనించి సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. మృతదేహాన్ని ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుడి బంధువులకు సమాచారం ఇచ్చామని వారు వచ్చిన తర్వాత వారి ఇచ్చే ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తామని ఎస్ఐ తెలిపారు. -
నిత్యపూజకోనలో శాశ్వత హుండీలు మాయం
సిద్దవటం: నిత్యపూజకోనలోని శాశ్వత హుండీలు మాయమైనట్లు భక్తులు తెలిపారు.ఆదివారం వారు మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ దేవదాయ శాఖ నిబంధనలకు విరుద్ధంగా వారంలో ఒక్కరోజు మాత్రమే శాశ్వత హుండీలు దర్శనమిస్తున్నాయన్నారు. వీటిని తాత్కాలిక హుండీలుగా ఎండోమెంట్ అధికారులు మార్చేశారని వారు ఆరోపించారు. సిద్దవటం మండలం లేదా వంతాటిపల్లి గ్రామంలో ఉండాల్సిన నిత్యపూజకోన ఈఓ కార్యాలయం కడపలో ఎందుకు ఉందని ప్రశ్నిస్తున్నారు. దేవదాయ శాఖ నిబంధనల ప్రకారం శాశ్వత హుండీలు 24/7 ఆలయ ప్రాంగణంలో మాత్రమే ఉండాలన్నారు. ఇక్కడ నాలుగు శాశ్వత హుండీలు ఉండాలని,అవి ఎక్కడికి వెళ్లాయో అని వాపోతున్నారు. ఆదివారం భక్తులు హుండీలో డబ్బులు వేయాలని వెళ్లారు. అయితే హుండీలు లేవు. ఎక్కడ ఉన్నాయని అడగ్గా లేవని అక్కడ ఉన్న ఓ వ్యక్తి తెలిపారన్నారు. రూ.45 లక్షలు వార్షిక ఆదాయం ఉన్న ఆలయంలో మహిళలు వస్త్రాలు మార్చుకోవడానికి తాత్కాలిక డ్రెస్సింగ్ కేంద్రాలు కూడా లేవన్నారు. ఆలయ పరిసరాలు అపరిశుభ్రంగా ఉన్నా ఎండోమెంట్ అధికారులు పట్టించుకోవడం లేదని భక్తులు పేర్కొన్నారు. ఈ విషయమై ఆలయ ఈఓ కొండారెడ్డిని వివరణ కోరగా ఆలయ ఆవరణలో నాలుగు శాశ్వత హుండీలు ఉన్నాయన్నారు. కొందరు కావాలని దుష్ప్రచారం చేస్తున్నారని ఆయన తెలిపారు. -
టీడీపీలో ఇరు వర్గాల ఘర్షణ
● కుందూ మట్టి తరలింపుపై వివాదం ● దారి కోసం వాగ్వాదం ● ఒకరిపై ఇద్దరు దాడి ● బాధితుడికి తీవ్ర గాయాలుప్రొద్దుటూరు : కుందూనది నుంచి మట్టిని తొలుకునే క్రమంలో దారి కోసం టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. ఈ ఘర్షణ కారణంగా జరిగిన సంఘటనకు సంబంధించి టీడీపీకి చెందిన కల్లుట్ల మౌళాలిపై మరోవర్గం వారు దాడి చేశారు. వివరాలిలా వున్నాయి. రాజుపాళెం మండలంలోని వెలవలి గ్రామ సమీపంలోని కుందూనదిలో మట్టిని తరలిస్తున్నారు. అక్కడ నదిలో దారి కోసం టీడీపీలోని ఇరు వర్గాల వారు ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో ఆ పార్టీకి చెందిన వారు అదే పార్టీకి చెందిన వ్యక్తిపై కట్టెతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. వెలవలి–తొండలదిన్నె గ్రామాల మధ్యలో ఉన్న వంతెన సమీపంలో నదిలో నుంచి మట్టిని ట్రాక్టర్ల ద్వారా తరలిస్తున్నారు. ఒక్కో ట్రాక్టరుకు మట్టిని నింపేందుకు రూ.200 వసూలు చేస్తున్నారు. అక్కడ ఇద్దరు వ్యక్తులు హిటాచీ సాయంతో మట్టిని ట్రాక్టర్లలో నింపుతున్నారు. టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణ హిటాచీ వద్ద నుంచి దాటే సమయంలో నదిలో దారి కోసం టీడీపీలోని ఇరువర్గాలు ఆదివారం తగాదా పడ్డారు. ఈ సంఘటనను దృష్టిలో ఉంచుకొని వెలవలి గ్రామంలో టీడీపీ నాయకులు మౌళాలిపై కట్టెతో దాడి చేయడంతో తలకు, కంటి వద్ద తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే అతన్ని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరులోని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ దాడి నేపథ్యంలో రాజుపాళెం పోలీసులు విచారణ చేపట్టారు. మండలంలోని తొండలదిన్నె గ్రామానికి చెందిన ఓ వ్యక్తి వెలవలి గ్రామ సమీపంలో కుందూనదిలో హిటాచీ సహాయంతో నదిలోని మట్టిని గత కొన్ని రోజులుగా ట్రాక్టర్ల ద్వారా తరలించడం జరుగుతుంది. అయితే వెలవలి గ్రామానికి చెందిన కల్లుట్ల మౌళాలి మరో హిటాచీ సహాయంతో నదిలోని మట్టిని తరలించేందుకు సిద్ధమయ్యాడు. ఈ క్రమంలో నదిలో మందుగా ఉన్న దారి కోసం ఈ ఘర్షణ చోటు చేసుకుంది. ఎమ్మెల్యే సార్ కాపాడు... సీఎం సార్ కాపాడు కుందూనది వద్ద తీవ్ర గాయాలపాలైన మౌళాలిని చికిత్స కోసం జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆయన తనపై దాడి చేసిన వారిని కఠినంగా శిక్షించాలని, తనను ఎమ్మెల్యే బతికించు, సీఎం బతికించు అంటూ వేడుకోవడం జరిగింది. ఈ సంఘటన జిల్లా స్థాయిలో చర్చినీయాంశంగా మారింది. మౌళాలిని ఆసుపత్రికి తీసుకెళ్లడంతో ఆయన కుటుంబసభ్యులతోపాటు బంధువులు, టీడీపీ కార్యకర్తలు తరలివచ్చారు. వెలవలి గ్రామంలో ఉద్రిక్తత కుందూలో మట్టిని తరలించే క్రమంలో నదిలో దారికోసం జరిగిన సంఘటన నేపథ్యంలో వెలవలి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. అక్రమంగా కుందూనదిలో మట్టిని తరలిస్తున్నారని టీడీపీలో ఒక వర్గం ఆరోపిస్తోంది. ఈ మట్టి కుమ్ములాటలో కొట్టుకునేంత వరకు పరిణామాలు దారితీశాయి. పోలీసులు రంగప్రవేశం చేయడంతో మట్టిని తవ్వుతున్న హిటాచీలను నిర్వాహకులు మరో చోటికి తరలించారు. మళ్లీ ఎటువంటి గొడవలు జరగకుండా గ్రామంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. దాడికి పాల్పడిన వారు పరారీ కావడంతో వారి కోసం పోలీసులు గాలిస్తున్నట్లు సమాచారం. పోలీసులు జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న మౌళాలిని సంఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇద్దరిపై కేసు నమోదు రాజుపాళెం : దారి కోసం టీడీపీలో ఇరు వర్గాలు ఘర్షణ పడిన కేసులో టీడీపీలో ఓ వర్గానికి చెందిన ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు పోలీసులు ఆదివారం రాత్రి తెలిపారు. అందులో వెలవలి గ్రామానికి చెందిన మౌలాలిపై దాడి చేసినట్లు.. అదే గ్రామానికి చెందిన కమ్ముసాబ్ గారి రసూల్, ఖాజావల్లిపై కేసు నమోదు చేశారు. వారు పరారీలో ఉండటంతో వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. -
ప్రశ్నిస్తే దాడులు చేయడం ఏమిటి?
● అధికారులు చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో కష్టాలు తప్పవు ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : గ్రామంలో వాటర్ ప్లాంట్ నిర్వహణ, గ్రామ పంచాయతీలో నిధులు ఏ విధంగా ఉపయోగించుకుంటున్నారో.. వాటిపై సమాచార హక్కు చట్టం కింద సమాచారం అందించాలని కోరితే ఆ వ్యక్తిపై భౌతిక దాడులకు దిగడం ఏమిటని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ప్రశ్నించారు. ఫిర్యాదు చేసినా పోలీసు అధికారులు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడం సరైంది కాదని అన్నారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎర్రగుంట్ల మండలం చిలంకూరు గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ కార్యకర్త పవన్కుమార్ నాయుడు గ్రామంలో ఉన్న వాటర్ ప్లాంట్ నిర్వహణకు సంబంధించిన వివరాలను అడితే దానికి అధికారులు సమాచారం ఇవ్వకుండా.. అధికార పార్టీ నాయకులకు కొమ్ముకాస్తూ విషయం తెలిపి.. వారు దౌర్జన్యం చేసే విధంగా చేయడం దారుణం అన్నారు. అధికారం శాశ్వతం కాదని, రేపు వచ్చేది వైఎస్సార్సీపీ ప్రభుత్వం అని గుర్తు పెట్టుకోవాలన్నారు. సుబ్బరామిరెడ్డి, శంకర్రెడ్డి ట్రస్టుల పేరుతో ప్రజలకు మంచి చేస్తున్నామంటూ ప్రచారం చేస్తున్నారన్నారు. గ్రామ పంచాయతీ నుంచి నీరు సరఫరా అవుతుంటే వాటికే కనెక్షన్లు తీసుకుని కరెంటు బిల్లులు పంచాయతీ చేత కట్టించుకుంటున్నారని ఆరోపించారు. దానికి సంబంధించిన ఆదాయం మాత్రం కూటమికి సంబంధించిన కార్యకర్తలు తీసుకుంటున్నారన్నారు. ఈ దుర్మార్గానికి అధికారులు కూడా సహకరించడం సరైంది కాదన్నారు. నియోజకవర్గంలో కూటమి నాయకుల దౌర్జన్యాలు పెరిగిపోతున్నాయన్నారు. పోలీసు అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరించడంతోపాటు వారికి వత్తాసు పలికితే చూస్తూ ఊరుకునేది లేదన్నారు. కూటమి నాయకులు అవినీతికి పాల్పడుతూ, సహజ వనరులను దోచుకుని కోట్లాది రూపాయలు సంపాదించుకుంటున్నారని ఆరోపించారు. కొండాపురంలోని పెన్నానది, చిత్రావతి, పట్టణంలోని పెన్నానదిలోని ఇసుక అక్రమంగా ఇతర ప్రాంతాలకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారన్నారు. ఇప్పటికై నా అధికారులు అధికార పార్టీకి కొమ్ముకాయడం మాని నిజాయితీగా పని చేస్తే.. భవిష్యత్తులో ఇబ్బందులు పడకుండా ఉంటారని సూచించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జిల్లా ప్రధాన కార్యదర్శి రమణారెడ్డి, బీసీ నాయకుడు గురుమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు సౌకర్యం
అరుణచాలం వెళ్లేందుకు ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుంటూరు–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు సౌకర్యంగా ఉంటుంది. అరుణాచలానికి డైరెక్ట్ కనెక్టివిటీ రైలు కోసం రైల్వేమంత్రిని రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కోరారు. ఈ మేరకు రైల్వేమంత్రి అశ్వినివైష్ణవ్ సానుకూలంగా స్పందించారు. ఎంపీ చేసిన ప్రయత్నం ఫలించింది. – తల్లెంభరత్కుమార్రెడ్డి, డీఆర్యుసీసీ, తిరుపతి జిల్లా పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు తమిళనాడులోని పుణ్యక్షేత్రాలను దర్శించుకునేందుకు గుంటూరు–తిరుపతి ఎక్స్ప్రెస్ రైలు దోహదపడుతుంది. రైళ్లు మారకుండా నేరుగా కాణిపాకం, వేలూరు, అరుణచాలం, శ్రీరంగం వెళ్లేందుకు వీలవుతుంది. అయితే మరోవైపు రాష్ట్ర రాజధానికి వెళ్లేందుకు రైలు దోహదపడదనే భావన ఉంది. రైల్వేశాఖ విజయవాడకు కడప మీదుగా వెళ్లేలా రైలు తీసుకురావాలి. –దాసరి నరసింహులు, సీనియర్న్యాయవాది, నందలూరు -
భక్తులకు శుభవార్త
రాజంపేట: ఉమ్మడి జిల్లా కేంద్రం కడప మీదుగా తమిళనాడులోని కావేరీ నది తీరాన వెలసిన భూలోక వైకుంఠంగా ప్రసిద్ధి చెందిన శ్రీరంగనాథస్వామి ఆలయానికి భక్తులు వెళ్లే అవకాశం కలిగింది. అరుణాచలం, వేలూరు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు త్వరలో రైలు అందుబాటులోకి రానుంది. అదే గుంటూరు(1726/ 17262)–తిరుపతి మధ్య నడిచే రైలు. ఈ రైలును తిరుచిరాపల్లె వరకు పొడిగించడం వల్ల భఽక్తులకు పుణ్యక్షేత్రాలకు వెళ్లేందుకు మార్గం సుగమమైంది. తమిళనాడులోని పుణ్యక్షేత్రాలు.. భక్తులు గుంటూరు–తిరుపతి రైలులో వెళ్లి తమిళనాడులోని ప్రసిద్ధి పుణ్యక్షేత్రాలను దర్శించుకోవచ్చు. వేలూరులో గోల్డెన్ టెంపుల్(శ్రీపురం మహాలక్ష్మీ ఆలయం), తిరువణ్ణామలైలోని అరుణాచలేశ్వరుడిని దర్శించుకోవచ్చు. కాణిపాకంకు వెళ్లేందుకు ఈ రైలు దోహదపడుతుంది. హాల్టింగ్స్ ఇవే.. నరసరావుపేట, వినుకొండ, దొనకొండ, మార్కాపురం రోడ్ఐ, కంభం, గిద్దలూరు, నంద్యాల, బనగానపల్లె, కోవెలకుంట్ల, ఎర్రగుంట్ల, కమలాపురం, నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట, తిరుపతి.. అక్కడి నుంచి పాకాల, చిత్తూరు, కాట్పాడి, వేలూరు, అరణిరోడ్డు, పోలూరు, తిరవణ్ణామలై(అరుణచాలం), తిరుక్కోవైలూరు, విల్లుపురం, అరియాలూరు, శ్రీరంగం మీదుగా తిరుచ్చి(తిరుచిరాపల్లె)కు చేరుకుంటుంది. మూడేళ్లుగా... మూడేళ్లుగా వైఎస్సార్ కడప,నంద్యాల, తిరుపతి జిల్లా పరిధిలోని భక్తులకు నేరుగా అరుణాచలం వెళ్లేందుకు రైలు లేక ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ వాహనాలు, ఆర్టీసీ బస్సుల ద్వారా చేరుకుంటున్నారు. ఇప్పుడు గుంటూరు–తిరుపతి ౖరైలును తిరుచిరాపల్లెకు వరకు పొడిగించేందుకు రైల్వేబోర్డు ఆమోదం లభించిందని రైల్వేవర్గాలు స్పష్టీకరించాయి. ఎంపీ మిథున్రెడ్డి కృషి ఫలితం... ఉభయ జిల్లాల వారు అరుణాచలం, శ్రీరంగం, వేలూరు వెళ్లేందుకు రైలు నడపాలని రైల్వేమంత్రిని ఎంపీ మిథున్రెడ్డి కోరారు. భక్తులు తిరుపతి, రేణిగుంటకు వెళ్లి రైలు ఎక్కాల్సి వస్తోందని దీంతో ఇబ్బందులు పడుతున్నారని విన్నవించారు. ఎంపీ వినతి మేరకు రైల్వేమంత్రిత్త్వశాఖ కూడా సానుకూలంగా స్పందించింది. దీంతో తిరుపతి–గుంటూరు మధ్య నడుస్తున్న గుంటూరు ఎక్స్ప్రెస్ రైలును తిరుచిరాపల్లె వరకు పొడిగించారు. అయితే ఈ రైలు వెళ్లే సమయం కడప, రాజంపేట,నందలూరు, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు , రైల్వేకోడూరు వాసులకు ఉపయోగకరంగా లేదు. ఉదాహరణకు రాజంపేటకు రాత్రి 8.50గంటలకు వచ్చే గుంటూరు–తిరుపతి రైలు ఇప్పుడు తెల్లవారుజామున 2 గంటలకు వస్తుంది. ఉదయం 11.20 నిమిషాలకు గుంటూరుకు చేరుకుంటుంది. దీనివల్ల అమరావతికి నేరుగా వెళ్లే సౌకర్యం ప్రయాణికులు కోల్పోయారు. ఈ విషయంలో ప్రజాప్రతినిధులు స్పందించి, సమయాల్లో మార్పులకు ప్రయత్నించాలని జిల్లా వాసులు కోరుతున్నారు. గుంటూరు–తిరుపతి మధ్య నడిచే రైలు కడప మీదుగా.. శ్రీరంగం, అరుణాచలం, వేలూరుకు రైలు! గుంటూరు–తిరుపతి రైలు పొడిగింపు గుంటూరు(17261)లో..సాయంత్రం 4గంటలకు బయలుదేరుతుంది.మరుసటి రోజు మధ్యాహ్నాం 2గంటలకు చేరుకుంటుంది. తిరుచిరాపల్లె(17262)లో సాయంత్రం 4గంటలకు బయలుదేరుతుంది. తిరుపతికి రాత్రి 11.40 గంటలకు, కడపకు 2.45కు, గుంటూరుకు మరుసటి రోజు 11.20గంటలకు చేరుకుంటుంది. -
కడప కార్పొరేషన్లో వార్డుల పునర్విభజన పూర్తి
కడప కార్పొరేషన్: కడప మున్సిపల్ కార్పొరేషన్ వార్డుల పునర్విభజన ప్రక్రియ పూర్తయ్యిందని కమిషనర్ హెచ్ఎస్ భావన ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఇదివరకు 50 వార్డులు ఉండగా, ప్రస్తుతం వాటిని 66కు పెంచినట్లు తెలిపారు. వార్డుల సరిహద్దులు, ఇతర వివరాలను ప్రకటించినట్ల చెప్పారు. దీనిపై అభ్యంతరాలుంటే రాతమూలకంగా తెలియజేయవచ్చని పేర్కొన్నారు. కడప సెవెన్రోడ్స్: చేతి వృత్తులపై ఆధారపడి జీవిస్తున్న ప్రజల సంక్షేమం కోసం తమ పార్టీ కృషి చేస్తుందని జాతీయ చేతివృత్తుల ఐక్యవేదిక పార్టీ అధ్యక్షులు అవ్వారు మల్లికార్జున అన్నారు. ఆదివారం కడపలోని తమ పార్టీ కార్యాలయంలో భవన నిర్మాణ కార్మికుల విభాగాన్ని ఏర్పాటు చేశారు. భవన నిర్మాణ విభాగం జిల్లా అధ్యక్షుడిగా మల్లెల నారాయణను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రానున్న రోజుల్లో అన్ని కార్మిక విభాగాలను ఏర్పాటు చేస్తామని ఈ సందర్బంగా అవ్వారు మల్లికార్జున అన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ కడప నగర అధ్యక్షుడు జయరాములు, 14వ డివిజన్ అధ్యక్షుడు గంగులు, వివిధ సంఘాల నాయకులు నరసింహులు, వెంకట రమణ, మహబూబున్నీసా, ఓబులేశు, షేక్ ఇస్మాయిల్, చౌడూరు ఖాసిం, నాగరాజు తదితరులు పాల్గొన్నారు. కడప అర్బన్: ద్విచక్రవాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని, ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘిస్తే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హెచ్చరించారు. ఆదివారం జిల్లా వ్యాప్తంగా నిర్వహించిన వాహన తనిఖీల్లో ట్రాఫిక్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై 198 కేసులు నమోదు చేసి, రూ. 57,445 జరిమానా విధించినట్లు తెలిపారు. ద్విచక్రవాహనదారులు హెల్మెట్, కార్లలో వెళ్లే వారు సీట్ బెల్ట్ ధరించాలని ఆయన సూచించారు. రాంగ్ రూట్ డ్రైవింగ్ చేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా ప్రఖ్యాతిపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల వచ్చారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకొన్నారు. కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయ అభివృద్ధికి పలువురు దాతలు విరాళాలను అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టకు చెందిన సోమశెట్టి వెంకటేశ్వర్లు రూ.25 వేలు, ఇదే గ్రామానికి చెందిన సోమశెట్టి రెడ్డెయ్య, రెడ్డిమణిచందన, వరుణ్కుమార్లు రూ. 25 వేలు అందజేశారు. ఆదివారం ఆలయానికి చేరుకొన్న దాతలకు, వారి కుటుంబసభ్యులకు అధికారులు స్వాగతం పలికి అమ్మవారికి పూజలు చేయించి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. దాతలు రూ. 50వేలను ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ రాజన్న నాయుడు, ఈవో మంజులకు అందజేశారు. ఈమొత్తాన్ని వాల్మీకీపురం ఆంధ్రప్రదేశ్ గ్రామీణబ్యాంకు నందు జమ చేయనున్నట్లు ఈవో పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది బాల కృష్ణ, మహేష్, వెంకటరమణ పాల్గొన్నారు. -
ఆటోలాగి.. చమురు వదిల్చారు!
కడప వైఎస్ఆర్ సర్కిల్: కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం పెట్రోలు డీజిల్ పై మూడు రూపాయలు పెంచి సామాన్య మధ్యతరగతి ప్రజలపై భారం వెయ్యడాన్ని తక్షణమే ఉపసంహరించుకోవాలని సిపిఎం నగర కార్యదర్శి రామమోహన్ డిమాండ్ చేశారు. నపెంచిన డీజిల్ పెట్రోల్ ధరలు ఉపసంహరించుకోవాలని కోరుతూ సిపిఎం ఆధ్వర్యంలో మహాత్మా జ్యోతిరావు పూలే సర్కిల్ వద్ద ఆటోను తాడుతో లాగుతూ 7 రోడ్ల కూడలి వరకు నిరసన కార్యక్రమాన్ని శనివారం చేపట్టారు. ఈ కార్యక్రమంలో సిపిఎం పార్టీ నాయకులు అన్వేష్, దస్తగిరిరెడ్డి, చంద్రారెడ్డి, రామకృష్ణారెడ్డి, శివకుమార్, నారాయణరెడ్డి, తిమ్మయ్య, అన్వర్, విజయ్, రఘు, విశ్వనాధ్, పెద్దన్న, నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
ఎద్దులబండ్లు వాడాల్సిందేనా
ప్రొద్దుటూరు : పెట్రోలు, డీజిల్ ధరలను తగ్గించాలని స్థానిక పాత బస్టాండ్ వద్ద శనివారం ఇండియన్ ఆయిల్ పెట్రోలు బంకు వద్ద సీపీఎం ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీఎం పట్టణ కార్యదర్శి సత్యనారాయణ మాట్లాడుతూ కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం పెట్రోలు, డీజిల్ ధరలు పెంచి సామాన్యులపై పెనుభారం మోపిందని విమర్శించారు. ప్రధాని మోదీ పెట్రోలు, డీజిల్ కొరత ఉందని, సైకిల్, ఎద్దుల బండ్లపై, నడుచుకుంటూ పాత రోజులు గుర్తు చేసుకుని ప్రయాణం చేయండి అని ఉచిత సలహా ఇవ్వడం ఎంత వరకు సమంజమన్నారు. సీపీఎం పట్టణ కమిటీ సభ్యులు పక్కీరయ్య, సర్వేశ్వరి, బాలసుబ్బయ్య, బాబు తదితరులు పాల్గొన్నారు. -
చమురు బాదుడుపై ధర్నా..
కడప వైఎస్ఆర్ సర్కిల్: పెంచిన పెట్రోల్ డీజిల్ ధరలను తక్షణము తగ్గించాలని వెంటనే తగ్గించాలని సిపిఐ (ఎంఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి బందెల ఓబయ్య పేర్కొన్నారు. శనివారం పెంచిన పెట్రోల్, డీజిల్ ధరలను తగ్గించాలని కోరుతూ కడప రెవిన్యూ డివిజినల్ కార్యాలయం ఎదుట ధర్నా చేపట్టారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ కేంద్రం, రాష్ట్రంలో అధికారంలో ఉన్న బిజెపి, కూటమి ప్రభుత్వం ఒక పథకం ప్రకారం పెట్రోల్, డీజిల్, రేటును పెంచారని తెలిపారు. పార్లమెంటులో తగినంత బలం లేకపోయినా అనేక బిల్లులను దొడ్డిదారిన చెయ్యగలిగిన చరిత్ర వున్న బిజెపి ఆర్థిక మాంద్యం పేరుతో ప్రజల పైన భారాలు మోపడం సరైనది కాదు అని అన్నారు. -
ఓట్లు మనవి.. పోట్లు పాలకులవి
పోరుమామిళ్ల: కేంద్రప్రభుత్వం పెట్రోలు, డీజల్, వంటగ్యాస్ ధరలను పెంచడాన్ని నిరసిస్తూ శనివారం పోరుమామిళ్లలో సీపీఐ నాయకులు అర్ధనగ్నంగా మోకాళ్లపై కూర్చొని, గ్యాస్ సిలెండర్లు నెత్తిన పెట్టుకుని ఆంధోళన చేశారు. ఈ సందర్భంగా సీపీఐ ఏరియా కార్యదర్శి పిడుగు మస్తాన్, మండల కార్యదర్శి రవికుమార్ మాట్లాడుతూ 5 రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన వెంటనే మోడీ ప్రభుత్వం పెట్రో ధరల భారం కానుకగా ఇచ్చిందన్నారు. తక్షణమే పెంచిన ధరలు ఉపసంహరించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు కేశవ, జాకోబ్, ప్రసాద్, సఫా, పీరయ్య, నరసింహులు, చంద్ర తదితరులు పాల్గొన్నారు. -
రైలు కింద పడి భార్యాభర్తలు ఆత్మహత్య
కడప కోటిరెడ్డి సర్కిల్ : భార్యాభర్తల మధ్య మనస్పర్థలు ఏర్పడి తమ నిండు ప్రాణాలను బలితీసుకున్నారు. చెన్నూరు మండలం ముండ్లపల్లెకు చెందిన సుధీర్బాబు(35), పెంచలమ్మ(35) కొన్ని సంవత్సరాల కిందట వివాహం చేసుకున్నారు. వీరికి కుమారుడు, కుమార్తె వున్నారు. సుధీర్బాబు కూలీ పనులకు వెళుతూ వుండేవాడు. అతని భార్య పెంచలమ్మ కొప్పర్తి ప్రాంతంలో ఓ సంస్థలో విధులు నిర్వహిస్తుండేది. గత నాలుగు రోజులుగా ఇద్దరికి వివాహేతర సంబంధాలపై ఒకరినొకరు గొడవపడ్డారు. శనివారం ఉదయం 11:30 గంటల ప్రాంతంలో కడప– రాయచోటి రైల్వే ఓవర్ బ్రిడ్జి సమీపంలో సుధీర్బాబు రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటనకు తట్టుకోలేక అతని భార్య పెంచలమ్మ కడప– కనుమలోపల్లె మధ్యలో రైలు కింద పడి ఆత్మహత్య చేసుకుంది. దీంతో వారి కుటుంబాలు తీవ్ర విషాదంలోకి వెళ్లాయి. కడప రైల్వే పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్ఐ దూషించి.. తీవ్రంగా కొట్టి..
జమ్మలమడుగు : ఓ మహిళకు అప్పు ఉన్నానంటూ పోలీస్స్టేషన్కు పిలిపించి డబ్బు కట్టాలంటూ తనపై వత్తిడి తీసుకురావడంతోపాటు బెల్టుతో ఇష్టారాజ్యంగా ఎస్ఐ కొట్టారని బాధితుడు, వైఎస్సార్సీపీ కార్యకర్త తానిషా వలి వాపోయాడు. శనివారం ఆయన స్థానిక ప్రభుత్వాసుపత్రికి వైద్యం కోసం వెళ్లాడు. ఈ సందర్భంగా విలేకరులతో మాట్లాడుతూ తాను మహిళ వద్ద 80 వేల రూపాయలు అప్పు తీసుకోవడం జరిగిందని తెలిపారు. దానికి వడ్డీ కింద 64 వేల రూపాయలు చెల్లించానని పేర్కొన్నారు. అయితే తన పరిస్థితి బాగలేకపోవడంతో అప్పు చెల్లించడంలో జాప్యం జరిగిందన్నారు. గతంలో ఆ మహిళ అనేక చోట్ల పంచాయితీలు పెట్టించిందని, తాను రూ.50 వేలు ఇస్తానని చెప్పానని తెలిపారు. అయితే శుక్రవారం ఆమె స్టేషన్కు వెళ్లి డబ్బులపై పంచాయితీ పెట్టిందన్నారు. ఈ సందర్భంగా పోలీసులు పిలవడంతో తాను స్టేషన్కు వెళ్లడం జరిగిందన్నారు. ఎస్ఐ జోక్యం చేసుకుని డబ్బులు చెల్లించాలని వత్తిడి తీసుకు వచ్చారని పేర్కొన్నారు. తాను 50 వేల రూపాయలు ఇస్తానని పెద్దల సమక్షంలో ఒప్పుకొన్నానని తెలిపారు. అయినా ఎస్ఐ వినకుండా.. చెప్పడానికి కూడా వీలులేని తిట్లను తిడుతూ కాళ్లను తిప్పి బెల్టుతో తీవ్రంగా కొట్టడం జరిగిందన్నారు. తనకు షుగర్ వ్యాధి ఉందని, ఆరోగ్యం సక్రమంగా లేదని చెబుతున్నా ఇష్టారాజ్యంగా కొట్టడంతోపాటు సెల్ ఫోన్ లాక్కున్నారన్నారు. శుక్రవారం రాత్రి అంతా విపరీతమైన నొప్పులు ఉండటంతో ప్రభుత్వాసుపత్రిలో వచ్చి చేరడం జరిగిందన్నారు. పోలీసులు సివిల్ పంచాయితీలు చేయకూడదని ఉన్నాతాధికారులు చెబుతున్నా.. ఇక్కడ మాత్రం సివిల్ పంచాయితీలు చేస్తూ తీవ్రంగా కొట్టడం జరిగిందన్నారు. తనకు న్యాయం జరిగే విధంగా ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు.ఆసుపత్రిలో చేరిన బాధితుడు -
ప్రకృతి వ్యవసాయ అభివృద్ధిలో బీఆర్సీలు కీలకం
కడప అగ్రికల్చర్ : ప్రకృతి వ్యవసాయ అభివృద్ధిలో బీఆర్సీల పాత్ర కీలకం అని జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణ్యేశ్వరావు అన్నారు. వైఎస్సార్ కడప జిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం కడపలోని ప్రకృతి వ్యవసాయ జిల్లా కార్యాలయంలో మండల స్థాయి నోడల్ బయో రిసోర్స్ సెంటర్ల యజమానులకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కషాయాలు, జీవ ద్రావణాల తయారీ విధానాలు ప్రత్యక్షంగా చేసి చూపించారు. వాటి తయారీ, వినియోగం, పంటలపై కలిగే ప్రయోజనాల గురించి తెలియజేశారు. బీఆర్సీ యజమానులు క్షేత్ర స్థాయిలో శాసీ్త్రయ దృక్పథంతో పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ ప్రవీణ్ కుమార్, అదనపు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వసంత కుమారి, యంగ్ ప్రొఫెషనల్ భరత్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
శ్మశానం ఆక్రమిస్తున్నారని దళితుల ఆగ్రహం
చాపాడు : శ్మశాన వాటిక స్థలం ఆక్రమిస్తున్నారని దళితులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వారు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చియ్యపాడు గ్రామ సమీపంలోని గేటురాళ్ల వంక దగ్గర పడమర వైపు ఎకరా పైగా స్థలంలో చియ్యపాడు గ్రామం పుట్టినప్పటి నుంచి దళితులు (మాల) శ్మశాన వాటిక స్థలం ఏర్పాటు చేసుకున్నారు. అనాది నుంచి నేటి తరం వరకు చనిపోయిన వారిని అక్కడే పూడ్చుకుంటున్నారు. అయితే సర్వే నంబర్లు 909, 910, 911లో 9.03 ఎకరాల పొలం ప్రొద్దుటూరుకు చెందిన పద్మనాభరెడ్డికి చెందినదని, దీనిని తాను కొన్నానని చియ్యపాడుకు చెందిన వీరేంద్రనాథ్రెడ్డి నాలుగు రోజుల క్రితం నుంచి పొలాలను చదును చేస్తున్నాడని, ఇదే క్రమంలో తమ శ్మశాన వాటిక కూడా తనదేనని అంటున్నాడని దళితులు చెబుతున్నారు. ఊరు పుట్టినప్పటి నుంచి ఉన్న శ్మశానం తమకు లేకుండా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని, తమ శ్మశానం ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలని దళితులు కోరుతున్నారు. ఈ క్రమంలో శనివారం దళితులు గ్రామ పెద్దలు బాల నరసింహారెడ్డి, శివారెడ్డిలతో కలసి తహసీల్దార్ రమాకుమారికి వినతి పత్రం అందజేశారు. శ్మశానం అన్యాక్రాంతం కాకుండా దళితులకే కేటాయించేలా చర్యలు తీసుకుంటామని తహసీల్దార్ తెలిపినట్లు వారు పేర్కొన్నారు. తెలిపారు. -
పరిసరాల పరిశుభ్రత.. ఆరోగ్య భద్రత
కడప అర్బన్ : పరిసరాలు పరిశుభ్రంగా ఉన్నపుడే ఆరోగ్యంగా జీవించవచ్చని ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి నెల మూడవ శనివారం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ‘స్వర్ణాంధ్ర– స్వచ్చాంధ్ర’ కార్యక్రమాన్ని శనివారం జిల్లా పోలీస్ హెడ్ క్వార్టర్స్ ఆవరణలో నిర్వహించారు. ఈ సందర్భంగా మొక్కలు నాటి నీరు పోశారు. పోలీస్ సిబ్బంది ‘స్వచ్ఛ ఆంధ్ర – స్వర్ణ ఆంధ్ర’పై ప్రతిజ్ఞ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు, ఆర్ఎస్ఐలు, ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమ్మెల్యే కుమారుడి ఇసుక దోపిడీ అరికట్టాలి
● రూ.150 కోట్ల ప్రభుత్వ భూమిని కబ్జా నుంచి కాపాడాలి ● మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డికడప సెవెన్రోడ్స్ : ప్రొద్దుటూరు మండలం చౌడూరు గ్రామం వద్ద ఉన్న పెన్నా నదిలో ఇసుక దోపిడీకి పాల్పడుతున్న స్థానిక ఎమ్మెల్యే కుమారుడు నంద్యాల కొండారెడ్డి అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి డిమాండ్ చేశారు. శనివారం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, జెడ్పీ ఉపాధ్యక్షులు జేష్టాది శారదతో కలిసి కలెక్టర్కు ఆయన వినతిపత్రం సమర్పించారు. అనంతరం రాచమల్లు విలేకరులతో మాట్లాడుతూ 50 ఏళ్లుగా కొంతమంది పేద రైతులు పెన్నానది పరీవాహక ప్రాంతంలో భూమిని చదును చేసుకుని వ్యవసాయం సాగిస్తున్నారని తెలిపారు. అయితే, ఇటీవల కూటమి ప్రభుత్వం వీరికి కనీసం నోటీసులు కూడా ఇవ్వకుండా సహజ న్యాయ సూత్రాలకు భిన్నంగా భూములను స్వాధీనం చేసుకుందని తెలిపారు. ఆ భూములు చదును చేసి రోడ్లు, కాలువలు నిర్మించి ప్రభుత్వానికి అప్పగించే కాంట్రాక్టు పనిని నంద్యాల కొండారెడ్డి ఏపీఐఐసీ ద్వారా పొందారని పేర్కొన్నారు. ఆ భూముల్లో వెంచర్లు వేసి పారిశ్రామికవేత్తలకు విక్రయించడం ద్వారా ప్రభుత్వం రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పాల్పడుతోందని విమర్శించారు. పగలు కాంట్రాక్టు పనులు చేసే ఎమ్మెల్యే కుమారుడు రాత్రి ఇసుకను అక్రమంగా చాగలమర్రి, మదనపల్లె ప్రాంతాలకు తరలిస్తున్నారని ఆరోపించారు. ఇందువల్ల భవిష్యత్తులో రంగసాయిపురం, శంకరాపురం, కాకిరేనిపల్లె, చౌడూరు గ్రామాల్లో తీవ్ర నీటి ఎద్దడి నెలకొనే ప్రమాదముందని తెలిపారు. అలాగే శంకరాపురం, చౌడూరు గ్రామాలు ముంపునకు గురవుతాయన్నారు. ఇంత జరుగుతున్నా తహసీల్దార్, మైనింగ్ అధికారులు, పోలీసులు, ఏపీఐఐసీ అధికారులు ఏం చేస్తున్నారంటూ ప్రశ్నించారు. కాంట్రాక్టర్గా ఉన్న వ్యక్తి నిబంధనల ప్రకారం చదును చేసే సమయంలో తొలగించిన ఇసుకను ఒకచోట డంప్ చేయాలే తప్ప తరలించరాదన్నారు. స్టేటస్ కో అమలు చేయాలి తాను హైకోర్టుకు వెళ్లగా, స్టేటస్ కో ఇచ్చారని పేర్కొన్నారు. అయితే అందుకు కూడా మెలిక పెట్టారన్నారు. తాము సర్వే నెంబరు 699/1, /3లో పనులు చేస్తున్నామంటూ నమ్మబలుకుతున్నారన్నారు. కానీ, 657 పూరా సర్వే నంబరులో 354 ఎకరాలు ఉన్నాయని, సబ్ డివిజన్ చేశాక 699/1, 699/3 ఏర్పడ్డాయని వివరించారు. ప్రభుత్వం వేస్తున్న వెంచర్ల వల్ల నష్టపోయిన రైతులకు పరిహారం ఇవ్వడంతోపాటు ప్రత్యామ్నాయ భూములు ఇవ్వాలని, స్టేటస్ కో అమలు చేయాలని డిమాండ్ చేశారు. ప్రొద్దుటూరు పట్టణం 1వ వార్డుకు చెందిన బొల్లవరంలో రూ.150 కోట్ల విలువజేసే భూమిని కాజేసి రియల్ ఎస్టేట్ ద్వారా రూ.200 కోట్లు దోచుకోవాలని పథకం పన్నారన్నారు. ఆ భూమిని కాపాడాలని కోరారు. -
విషద్రావణం తాగి మహిళ ఆత్మహత్య
అట్లూరు : భార్యాభర్తల మధ్య మనస్పర్థలతో భార్య విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్న ఘటన అట్లూరు ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి చోటు చేసుకుంది. స్థానిక ఎస్ఐ నాగకీర్త శనివారం తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అట్లూరు ఎస్సీ కాలనీకి చెందిన గోపాలయ్య, గోపాలమ్మల కుమార్తె దేవిని 8 ఏళ్ల క్రితం బద్వేలు మండలం కోనసముద్రానికి చెందిన కమలకూరు భాస్కర్కు ఇచ్చి వివాహం చేశారు. భాస్కర్ అట్లూరుకు వచ్చి అత్తగారింటిలో ఉంటూ జీవనం సాగించేవాడు. ఈనెల 14న రాత్రి భార్యాభర్తలు సెల్ఫోన్ విషయమై గొడవపడి కమలకూరు దేవి విషద్రావణం తాగగా హుటాహుటీన బద్వేలు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ దేవి మృతి చెందింది. మృతురాలికి ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మృతురాలి తల్లి గోపాలమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
లింకు దొరికింది.. డొంక కదిలింది
ప్రొద్దుటూరు క్రైం : ఐపీఎల్ క్రికెట్ మ్యాచ్లు ముగింపు దశకు చేరుకున్నాయి. మ్యాచ్ ప్రారంభంలో ప్రొద్దుటూరు పోలీసులు ఇక్కడి బుకీలకు పలుమార్లు కౌన్సెలింగ్ నిర్వహించారు. పోలీసుల ఆదేశాలు హెచ్చరికలు, ఆదేశాలను ఖాతరు చేయని బుకీలు క్రికెట్ మ్యాచ్లు ప్రారంభం కాగానే మెల్లగా ఒక్కొక్కరు జారుకున్నారు. ప్రొద్దుటూరులో ఉంటే కదా పోలీసులు మమ్మల్ని పట్టుకునేది అని భావించిన బడా బుకీలు, చోటామోటా పందెం రాయుళ్లందరూ ఇతర రాష్ట్రాలు, బయటి దేశాలకు వెళ్లిపోయారు. అక్కడి నుంచి యాప్ల ద్వారా నిరభ్యంతరంగా బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. ఐపీఎల్ ప్రారంభమై రెండు నెలలు గడిచినా చిన్నా, చితక పందెం రాయుళ్లు తప్ప ప్రధాన బుకీలు ఎవ్వరూ పోలీసులకు దొరకలేదు. ఏం చేయాలో పాలుపోక పోలీసు అధికారులు తల బాదుకోసాగారు. ఇలాంటి సమయంలో ఓ లింకు పోలీసు అధికారులకు ఊపిరి పీల్చుకునేలా చేసింది. ఇటీవల లేపాక్షిలో అక్కడి పోలీసులు దాడి చేసి పలువురు బుకీలను అదుపులోకి తీసుకున్నారు. వారితో ప్రొద్దుటూరు బుకీలతో సంబంధాలు ఉండటంతో ప్రొద్దుటూరు పోలీసులు దాడులు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా గాంధీరోడ్డులోని ప్రధాన బుకీ ఇంట్లో దాడులు నిర్వహించగా.. అతను తప్పించుకున్నాడు. ప్రొద్దుటూరులో కోవెలకుంట్ల బుకీ పాగా కోవెలకుంట్ల ప్రాంతంలో పేరు మోసిన ఒక క్రికెట్ బుకీ ప్రొద్దుటూరులో పాగా వేసినట్లు కనిపిస్తోంది. కర్నూలు, నంద్యాల జిల్లాలో బెట్టింగ్ డాన్గా పేరు పొందిన ఆ బుకీకి ప్రొద్దుటూరులోని ప్రధాన బుకీలతో పరిచయం ఏర్పడింది. దీంతో అతను ఇక్కడ కూడా కార్యకలాపాలు ముమ్మరం చేశాడు. సమయం దొరికినప్పుడల్లా అతను ఇక్కడికి వచ్చి బంగారు బిస్కెట్లను కొనుగోలు చేసి తీసుకెళ్తుంటాడు. ప్రొద్దుటూరు బుకీలకు కోవెలకుంట్ల బెట్టింగ్ డానే యాప్లకు సంబంధించిన ఐడీలు ఇస్తున్నట్లు తెలుస్తోంది. అతను ఇచ్చిన యాప్ల ద్వారానే ఇక్కడి బుకీలు అనేక మంది క్రికెట్ పందేలు నిర్వహిస్తున్నారు. ఇటీవల ప్రొద్దుటూరులోని కాల్వకట్టకు చెందిన ఒక క్రికెట్ బుకీ పట్టుపడగా.. అతని మొబైల్లోని యాప్లను పరిశీలిస్తే కోవెలకుంట్ల బుకీ పెద్ద ఎత్తున లావాదేవీలు జరిపినట్లు నిర్ధారణ అయింది. దీంతో పోలీసులు అతని కోసం విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. అతనికి సహకరిస్తున్న ప్రొద్దుటూరు బుకీల లిస్టు ఒకటి పోలీసులు ఇప్పటికే సిద్ధం చేసుకున్నట్లు తెలుస్తోంది. కోవెలకుంట్ల వాసి అయిన ఆ బుకీ ప్రస్తుతం బెంగళూరుకు మకాం మార్చాడు. కొందరు బుకీలు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు దాడులకు సమాయత్తం అవుతున్నారు. కోవెలకుంట్ల బుకీతోపాటు అతనితో సంబంధాలున్న ప్రొద్దుటూరు బుకీలు ముంబైలో ఉన్నట్లు తెలుస్తోంది. పట్టుకున్నారు.. వదిలేశారు కాగా మూడు రోజుల క్రితం ప్రొద్దుటూరు పోలీసులు క్రికెట్ బుకీ కారులో నుంచి రూ.20 లక్షలుపైగా నగదును స్వాధీనం చేసుకున్నారు. ముగ్గురు అనుమానితులను కూడా అదుపులోకి తీసుకున్నారు. విచారణ అనంతరం ముగ్గురిని ఇంటికి పంపించారు. స్వాధీనం చేసుకున్న డబ్బును కూడా వాళ్లకు ఇచ్చినట్లు తెలుస్తోంది. అధికార పార్టీ నాయకులు ఈ వ్యవహారంలో జోక్యం చేసుకున్నట్లు తెలుస్తోంది. వాళ్ల ఒత్తిడి మేరకే స్వాఽధీనం చేసుకున్న డబ్బును ఇచ్చిపంపినట్లు విశ్వసనీయ సమాచారం. దీనిపై అనేక విమర్శలు వస్తున్నాయి. పోలీసు అధికారులు మాత్రం ఈ కేసును విచారణ చేస్తున్నామని చెబుతున్నారు. బ్యాంక్ అకౌంట్లను పరిశీలిస్తున్న పోలీసులు పోలీసుల నుంచి తప్పించుకున్న ప్రధాన బుకీ అకౌంట్లను పోలీసు అధికారులు లోతుగా పరిశీలిస్తున్నట్లు తెలుస్తోంది. వారికి సంబంధించిన సెకండ్ హ్యాండ్ కార్ల షెడ్లో రూ.కోట్లలో పెట్టుబడులు పెట్టినట్లు తెలుస్తోంది. ఇంత పెద్ద మొత్తంలో వాళ్లకు డబ్బు ఎక్కడి నుంచి వచ్చింది.. క్రికెట్ బెట్టింగ్ డబ్బులతో సెకండ్హ్యాండ్ కార్ల బిజినెస్ సాగిస్తున్నారా అనే కోణంలో దర్యాపు చేస్తున్నారు. ఈ క్రమంలోనే వారి బ్యాంకు ఖాతాలను పరిశీలిస్తున్నట్లు సమాచారం. ఇన్ని రోజులు బెట్టింగ్ కేసులు లేక ఖాళీగా ఉన్న ప్రొద్దుటూరు పోలీసులకు ఇప్పుడు చేతి నిండా పని దొరికింది. ఒక్క లింకుతో బుకీల డొంక కదిలినట్లు అయింది. పోలీసులు ఎలాంటి ఒత్తిళ్లకు తలొగ్గకుండా పని చేస్తే దొరికిన లింకుల ఆధారంగా ప్రొద్దుటూరులో ఉన్న ప్రధాన బుకీలందరి ఆట కట్టించవచ్చు. చూడాలి మరి పోలీసు అధికారులు ఎంత వరకు వెళ్తారో.. ఎందరిని అరెస్ట్ చేస్తారో. కోవెలకుంట్ల క్రికెట్ బుకీకి ప్రొద్దుటూరు బుకీలతో సంబంధాలు రెండు రోజుల క్రితం జరిగిన పోలీసుల దాడుల్లో బహిర్గతం ప్రొద్దుటూరు ప్రధాన బుకీల కోసం పోలీసుల వేట -
బస్సు కింద పడి బాలుడికి గాయాలు
సిద్దవటం : మండలంలోని భాకరాపేట వద్ద శనివారం బద్వేల్ డిపోకు చెందిన ఆర్టీసీ అద్దెబస్సు కింద పడి ఓ బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. బెంగళూరులోని శ్రీరామ్నగర్కు చెందిన కామాక్షి తన బంధుమిత్రులతో కలిసి తిరుపతి సమీపాన ఉన్న నారాయణవనం నుంచి రైలులో ప్రయాణిస్తూ భాకరాపేటకు చేరుకున్నారు. అక్కడి నుంచి బ్రహ్మంగారిమఠానికి వెళ్లేందుకు బద్వేల్ వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దెబస్సును వినీత్(10) తన తల్లి కామాక్షితో కలిసి ఎక్కుతుండగా.. కండక్టర్ గమనించకుండా ఉండటంతో డ్రైవర్ మోహన్ కృష్ణ బస్సు కదిలించాడు. ఆ బాలుడు కిందపడి బస్సు వెనక టైరు అతని కాలిమీద వెళ్లడంతో ఎడమకాలు పూర్తిగా దెబ్బతినింది. ఆ రక్తగాయాలు చూసిన తల్లి స్పృహ తప్పి పడిపోయింది. గాయపడిన బాలుడిని చికిత్స కోసం స్థానికులు 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. జరిగిన సంఘటనపై మండల ఎస్ఐ హారిక విచారణ చేస్తున్నారు. ఆగని కేబుల్ వైరు చోరీలురామసముద్రం : మండలంలో కేబుల్ వైర్ల చోరీలు వరుసగా జరుగుతున్నాయి. రెండు రోజుల క్రితం ఊలపాడులో రైతుల బోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ కాగా.. శుక్రవారం రాత్రి ఆర్.నడింపల్లి పంచాయతీ బొంపల్లి గ్రామంలో పంచాయతీ తాగునీటి బోరు కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. రాత్రి వేళ గుర్తుతెలియని వ్యక్తులు వైర్లు అపహరించడంతో గ్రామంలో తాగునీటి సరఫరా నిలిచిపోయింది. జేసీబీని ఢీకొన్న బైక్ పుంగనూరు : మండలంలోని సింగిరిగుంట గ్రామానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు సంతోష్(18) అనే యువకుడు శనివారం ద్విచక్రవాహనంలో వెళ్తూ ఎదురుగా వస్తున్న జేసీబీ వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో సంతోష్కు తీవ్ర గాయాలై, ఎడమకాలు విరిగింది. అటుగా వెళ్తున్న హెల్పింగ్ లయన్స్ సభ్యుడు బషీర్ అలీ గమనించి బాధితున్ని తన ఆటోలో ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. -
తల్లికి చిన్నారి అప్పగింత
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప నగరం నాగరాజుపేటలో శుక్రవారం తప్పిపోయిన చిన్నారిని అధికారులు తల్లికి అప్పగించారు. గాయత్రి అనే మూడేళ్ల చిన్నారి తప్పిపోవడంతో అధికారులు బాలల సంక్షేమ సమితిలో అప్పగించారు. ఈ విషయం తెలుసుకున్న తల్లి బాలల సంక్షేమ సమితి వారిని కలిసి చిన్నారిని అక్కున చేర్చుకుంది. ఈ సందర్భంగా బాలిక తల్లి మాట్లాడుతూ తమది అన్నమయ్య జిల్లా ములకలచెరువు కాగా, భర్త కూలీ పనుల కోసం కడపకు రావడం జరిగిందన్నారు. ఈ క్రమంలో భోజనం తీసుకు వచ్చేందుకు హోటల్కు వెళ్లగా చిన్నారి తప్పిపోయిందన్నారు. తన చిన్నారిని అప్పగించినందుకు అధికారులకు ఆమె కృతజ్ఞతలు తెలియజేసింది. కవల పిల్లల అదృశ్యంమదనపల్లె టౌన్ : పట్టణంలోని అనపగుట్టకు చెందిన మోహన్, రాణి దంపతుల కవల పిల్లలు సందీప్ (14), సుశాంత్ (14) అదృశ్యమయ్యారు. గత నెల 17న ఇంటి నుంచి బయటకు వెళ్లిన వీరు తిరిగి రాలేదు. బంధువులు, పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో శనివారం రాత్రి తల్లి రాణి పోలీసులను ఆశ్రయించారు. -
మతపరంగా రెచ్చగొట్టే వార్తలు వ్యాప్తి చేస్తే చర్యలు
కడప అర్బన్: మత పరంగా రెచ్చగొట్టే వార్తలు వ్యాప్తి చేస్తే చర్యలు తప్పవని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ శుక్రవారం ఒక పత్రికా ప్రకటనలో హెచ్చరించారు. శాంతి భద్రతల పరిరక్షణకు కృషి చేస్తున్నామన్నారు. కొంతమంది దుండగులు, బాధ్యతారహిత వ్యక్తులు సోషల్ మీడియా వేదికగా పుకార్లు, తప్పుడు వార్తలు, మార్ఫింగ్ చేసిన వీడియోలు మతపరమైన భావోద్వేగాలను రెచ్చగొట్టే విధంగా పోస్టులను ప్రచారం చేస్తున్నట్లు తమ దృష్టికి వచ్చిందని ఎస్పీ తెలిపారు. మత విద్వేషాలను రెచ్చగొట్టే కంటెంట్ను సృష్టించడం, పోస్టు చేయడం, ఫార్వర్డ్ చేయడం లేదా షేర్ చేయడం చేసిన వారిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. రెచ్చగొట్టే పోస్టులు ఉంటే కడప పోలీస్ కంట్రోల్ రూమ్కు, 112 నంబర్కు లేదా సమీప పోలీస్ స్టేషన్న్కు సమాచారం ఇవ్వాలన్నారు. సోదరభావం, శాంతియుత జీవనానికి ప్రతీకగా కడపకు గొప్ప చరిత్ర ఉందన్నారు. అన్ని వర్గాలవారు బాధ్యతగా వ్యవహరించాలన్నారు. -
ఎమ్మెల్యే వరద ఫొటో మార్ఫింగ్ కేసులో ఒకరి అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి ఫొటోను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్టు చేసిన కేసులో టీడీపీ ప్రొద్దుటూరు మాజీ ఇన్చార్జి ప్రవీణ్కుమార్రెడ్డి అనుచరుడు పైడాల మహేష్ను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. ఎమ్మెల్యే ఫొటోలు, వీడియోలను మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో వైరల్ చేశారని మాజీ కౌన్సిలర్ తలారి పుల్లయ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రవీణ్ వర్గీయులైన పైడాల మహేష్, అజయ్కుమార్లపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ కేసులో శుక్రవారం మహేష్ను అరెస్ట్ చేసినట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. క్రికెట్ బెట్టింగ్ జూదరులు అరెస్టు మైదుకూరు : క్రికెట్ బెట్టింగ్ ఆడుతున్న ఇద్దరు జూదరులను శుక్రవారం మైదుకూరు పోలీసులు అరెస్టు చేశారు. మైదుకూరుకు చెందిన సింగనమల నాగరాజు, ఇందిరమ్మ కాలనీకి చెందిన రాయలగొల్ల రాజు అనే వారు ఐపీఎల్ క్రికెట్ బెట్టింగ్ ఆడుతుండగా స్థానిక వనిపెంట రోడ్డులోని జగన్ డాబా సమీపంలో అర్బన్ ఎస్ఐలు చిరంజీవి, వెంకరటమణ ఆధ్వర్యంలో దాడి చేశారు. నాగరాజు వద్ద రూ.3,500, రాజు వద్ద రూ.4,500 నగదును స్వాధీనం చేసుకుని వారిని అరెస్టు చేశారు. రాజుపాళెం : మండలంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన వెల్లాల శ్రీచెన్నకేశవ, సంజీవరాయ, భీమలింగేశ్వర స్వాముల ఆలయాలకు సంబంధించి ట్రస్ట్ బోర్డు ఏర్పాటు చేసేందుకు రాష్ట్ర దేవాదాయ ఖాఖ కమిషనర్ రామచంద్ర మోహన్ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసినట్లు తెలిసింది. ఈ ఆలయాలకు సంబంధించి ధర్మకర్త మండలి సభ్యులుగా లక్ష్మినారాయణ రెడ్డి, లక్ష్మి నరసింహా రెడ్డి, మధుసూదర్రెడ్డి, దాసరి రామారావు, శంకుసాయి రామారావు, విజయలక్ష్మి, సావిత్రి, అచ్చమ్మ, ఇమాంబి, వెంకటసుబ్బమ్మ, కృష్ణవేణి, ఎక్స్ అఫిషియో మెంబర్గా వీణా శేషాచార్యులను నియమించారు. మొత్తం 12 మంది ధర్మకర్తలి మండలి సభ్యులతో ప్రమాణ స్వీకార కార్యక్రమం రోజున ట్రస్ట్ బోర్డు చైర్మన్ను ఎన్నుకోనున్నారు. ప్రొద్దుటూరు కల్చరల్ : కర్నూలులోని పోస్ట్మాస్టర్ జనరల్ కార్యాలయంలో ఈ నెల 25న డాక్ అదాలత్ నిర్వహించనున్నట్లు తపాలా సూపరింటెండెంట్ కిరణ్ ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజలకు పోస్టల్ శాఖకు సంబంధించిన ఏదైనా సమస్యలు ఉంటే దీనిలో పాల్గొని ఉన్నతాధికారులదృష్టికి తీసుకెళ్లి పరిష్కరించుకోవాలని తెలిపారు. మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని పాతపాలెం గ్రామంలో అమ్మమ్మగారింటికి వచ్చిన దండుబోయిన వర్ధన్కుమార్ అనే 15 ఏళ్ల బాలుడు అదృశ్యమైనట్టు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి తెలిపారు. ఖాజీపేట మండలం త్రిపురవరం గ్రామానికి చెందిన ఈ బాలుడు వేసవి సెలవుల్లో అమ్మమ్మగారింటికి వచ్చాడని, గురువారం ఉదయం 11 గంటలకు ఆడుకునేందుకు ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి రాలేదని పేర్కొన్నారు. తల్లి రమాదేవి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి గాలిస్తున్నట్టు సీఐ వివరించారు. బాలుడి ఆచూకీ తెలిసిన వారు అర్బన్ సీఐ 9121100618, ఎస్ఐ 9121100619 నంబర్లకు తెలియజేయాలని కోరారు. కడప కోటిరెడ్డి సర్కిల్ : కడప నగరంలోని స్థానిక నాగరాజు పేటలో అమ్మాయి తప్పిపోయిందని ఐసీడీఎస్ పీడీ పి.రమాదేవి తెలిపారు. శుక్రవారం ఆమె తెలుపుతూ కడప వన్ టౌన్ పోలీసులు ఆ పాపను జిల్లా బాలల సంక్షేమ సమితిలో హాజరు పరచగా, ఆ పాపను ప్రత్యేక దత్తత సంస్థలో ఆశ్రయం కల్పించామన్నారు. ఆ పాప తల్లిదండ్రులు గానీ, బంధువులు కానీ తగిన ఆధారాలతో బాలల సంక్షేమ సమితి కార్యాలయానికి చేరుకుని సంప్రదించాలన్నారు. మరిన్ని వివరాలకు 8919171503 అనే నెంబర్కు సంప్రదించాలన్నారు. ప్రొద్దుటూరు కల్చరల్ : హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా రాయలసీమ వర్కింగ్ కమిటీ చైర్మన్గా డాక్టర్ అరికొండ ప్రతాప్కుమార్ను సంస్థ జాతీయ చైర్మన్ తాల్లూరి ప్రసన్న కుమార్ నియమించారు. ఈ సందర్భంగా ప్రతాప్కుమార్ మాట్లాడుతూ ప్రొద్దుటూరు నియోజకవర్గ చైర్మన్గా విధులు నిర్వహిస్తున్న తనకు రాయలసీమ వర్కింగ్ కమిటీ చైర్మన్గా పదోన్నతి కల్పించడం ఆనందంగా ఉందన్నారు. ఎల్నినో పరిస్థితులను ఎదుర్కోవాలి కడప అగ్రికల్చర్: జిల్లాలో ప్రస్తుత ఎన్నినో పరిస్థితులను సమర్థవంతంగా ఎదుర్కొనే విధంగా రైతులకు అవగాహన కల్పించాలని ప్రకృతి వ్యవసాయ సేద్యం జిల్లా ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ సూచించారు. వైఎస్సార్ కడపజిల్లా రైతు సాధికార సంస్థ ఆధ్వర్యంలో కడపలోని జిల్లా డీపీఎం కార్యాలయంలో జిల్లా స్థాయిలో బయో రిసోర్సు సెంటర్ యజమానులకు మూడు రోజుల శిక్షణా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా మొదటి రోజు శుక్రవారం నిర్వహించిన సమావేశంలో ఆయన ఎల్నినో ప్రభావం దాని వల్ల వ్యవసాయంపై కలిగే మార్పులు వాటిని తట్టుకునే పద్ధతులపై వివరించారు. అదనపు ప్రాజెక్టు మేనేజర్ వసంతకుమారి, బయో రిసోర్సు సెంటర్ యజమానులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. -
ట్రాక్టర్ బోల్తా – యువకుడి మృతి
బి.కోడూరు : మండలంలోని మాధవరాయునిపల్లె గ్రామానికి చెందిన బి.నాగభూషణం (35) ట్రాక్టర్ బోల్తాపడిన ఘటనలో అక్కడికక్కడే మృతిచెందాడు. స్థానికుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లాకు చెందిన నాగభూషణం మండలంలోని మాధవరాయునిపల్లె గ్రామానికి చెందిన వెంకటలక్షుమ్మని వివాహం చేసుకుని అత్తగారింట్లో ఉంటూ కుటుంబ పోషణ కోసం ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శుక్రవారం రామసముద్రం చెరువు నుండి పొలాలకు మట్టి తోలే క్రమంలో అధిక లోడుతో వెళుతూ బ్రేకులు ఫెయిల్ కావడంతో అదుపుతప్పి బోల్తాపడింది. ఈ ప్రమాదంలో డ్రైవర్ నాగభూషణం అక్కడికక్కడే మృతిచెందాడు. మృతునికి భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బి.కోడూరు ఎస్ఐ సూర్యనారాయణరెడ్డి కేసు నమోదు చేసుకుని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బ్యాంక్ రుణాలను వినియోగించుకోవాలి చాపాడు : రైతులు, డ్వాక్రా మహిళలు బ్యాంకులు అందించే వ్యవసాయ, ఇతర రుణాలను సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ లక్ష్మీ తులసి తెలిపారు. మండల కేంద్రమైన చాపాడులో శుక్రవారం మెగా అగ్రి అవుట్ రీచ్ ప్రోగ్రాంలో భాగంగా రైతులకు, డ్వాక్రా సంఘాల మహిళలకు రూ.11కోట్ల రుణాల చెక్కులను అందజేశారు. తిరుపతి జోనల్ ఏజీఎం సనల్ కుమార్ , మైదుకూరు డివిజన్ అగ్రికల్చర్ ఏడీఏ కృష్ణమూర్తి, ఏఓ దేవీపద్మలత, ఎల్డీఎం జనార్ధ న్, డీపీఎం ధనుంజయ, చాపాడు బ్రాంచ్ మేనేజర్ కేవీ రమణ పాల్గొన్నారు. ఆటో బోల్తా – డ్రైవర్ మృతి చక్రాయపేట: మండలంలోని సురభి గ్రామం మహబూబ్నగర్ వద్ద శుక్రవారం రాత్రి పాల ఆటో బోల్తాపడి డ్రైవర్ మహబూబ్ షరీఫ్(28) అక్కడి కక్కడే మృతి చెందాడు.చక్రాయపేట వైపు నుంచి లక్కిరెడ్డిపల్లె వైపు పాలు తీసు కెళుతుండగా ప్రమాదం జరిగినట్లు స్థానికులు తెలిపారు. మృతుడు మహబూబ్ షరీఫ్ చక్రాయపేట గ్రామం ఉప్పలవాండ్లపల్లె వాసి. మృతుడికి భార్యతో పాటు కొడుకు, కుమార్తె ఉన్నారు. చక్రాయపేట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బండి సంజయ్ కుమారుడిని అరెస్టు చేయాలి ప్రొద్దుటూరు క్రైం : మంత్రి బండి సంజయ్ని వెంటనే మంత్రి వర్గం నుండి బర్తరఫ్ చేయడంతోపాటు ఆయన కమారుడు బండి భగీరథ్ను అరెస్టు చేయాలని ప్రజా సంఘాల ఐక్యవేదిక నాయకులు డిమాండ్ చేశారు. శుక్రవారం సాయంత్రం స్థానిక శివాలయం సెంటర్లో బండి భగీరథ్ను అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ పోక్సో చట్టం కింద బండి భగీరథ్ను అరెస్టు చేయకుండా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నేరస్తున్ని కాపాడుతున్నాయని ఆరోపించారు. కార్యక్రమంలో రా యలసీమ మహిళా శక్తి కన్వీనర్ లక్ష్మీదేవి, ప్రగతిశీల కార్మిక సమాఖ్య నాయ కుడు శ్రీనివాసులు, విరసం నాయకురాలు వరలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదు
కలెక్టర్ డాక్టర్ చెరుకూరి శ్రీధర్ మైదుకూరు: జిల్లాలో అభివృద్ధి పనులకు నిధుల కొరత లేదని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ అన్నారు. మండలంలోని ముదిరెడ్డిపల్లె, మున్సిపాలిటీ పరిధిలోని శెట్టివారిపల్లె చెరువులకు ‘జలధార – సాగునీటి సంరక్షణ’ కింద నీరందించే పనులను శుక్రవారం ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్తో కలిసి కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ చెరువుల పునరుద్ధరణ, నీటి సంరక్షణ, భూగర్భ జలాల పెంపు లక్ష్యంగా ఈ కార్యక్రమాన్ని చేపట్టినట్టు తెలిపారు. ఎమ్మెల్యే సుధాకర్ యాదవ్ మాట్లాడారు. బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్, ఇతర అధికారులు పాల్గొన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లోనూ విద్యారత్నాలు పదో తరగతి ఫలితాల్లో శెట్టివారిపల్లె హైస్కూల్ విద్యార్థిని వీర ఉదయశ్రీ జిల్లాలో రెండో స్థానంలో నిలవడం గర్వకారణమని కలెక్టర్ తెలిపారు. సభలో వీర ఉదయశ్రీని అభినందించారు. సత్కారం: కడపలోని మాధవి కన్వెన్షన్ హాల్లో కాగా శుక్రవారం రాత్రి ‘విద్యా రత్నాలు’ అవార్డుల కార్య క్రమం జరిగింది. పదో తరగతి ఫలితాల్లో రాణించిన ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులను సత్కరించారు. -
అప్పుల బాధతో కౌలు రైతు ఆత్మహత్య
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని బి.చెర్లోపల్లె గ్రామంలో అప్పుల బాధ తాళలేక కౌలు రైతు విషపు గుళికలు తిని ఆత్మహత్య చేసుకున్నాడు. గ్రామానికి చెందిన అంకె రామచంద్రుడు (55) అనే కౌలు రైతు కూలీ పనులకు వెళ్తూ గ్రామ సమీపంలోని బిదినంచర్ల గ్రామానికి చెందిన ఓ రైతుకు చెందిన 7ఎకరాల పొలాన్ని కౌలుకు తీసుకుని గత ఏడాది అప్పులు తెచ్చి అరటి సాగు చేశాడు. అయితే అరటిలో దిగుబడులు బాగా రాగా.. గాలి రూపంలో కౌలు రైతు ఆశలు అడియాశలయ్యాయి. ధైర్యం కోల్పోకుండా ఈ ఏడాది కూడా మళ్లీ అప్పులు చేసి అరటిని సాగు చేశాడు. అయితే ఈ ఏడాది కూడా దిగుబడి ఉన్న అరటి ధర పతనం కావడంతో విధి లేని పరిస్థితుల్లో టన్ను అరటిని రూ.2వేల నుంచి రూ.3వేలకు విక్రయించాడు. అరటి సాగుకు పెట్టిన పెట్టుబడులు కూడా రాకపోవడంతోపాటు అప్పులు పెరిగిపోయి దాదాపు రూ.20లక్షల దాకా అప్పు ఉండటంతో రైతు చేసేదేమి లేక దిక్కుతోచని స్థితిలో గురువారం రాత్రి విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న అతని కుమారులు తండ్రిని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అయితే అతడు అప్పటికే మృతి చెందాడని డాక్టర్లు ధ్రువీకరించారు. మృతుడి కుమారుడు జలంధర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నేడు శాప్ డైరెక్టర్ రాక
కడప వైఎస్ఆర్ సర్కిల్: శాప్ డైరెక్టర్ రజిని శనివారం కడపకు రానున్నట్లు డీఎస్డీఓ గౌస్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో జరిగే వేసవి క్రీడా శిక్షణ శిబిరాలను పరిశీలించేందుకు వస్తున్నట్లు తెలిపారు. జిల్లా కేంద్రమైన కడపతో పాటు పలు ప్రాంతాల్లో జరిగే క్రీడా శిక్షణ శిబిరాలను పరిశీలిస్తారని పేర్కొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: శాప్ లీగ్ ఆధ్వర్యంలో ఈ నెల 20,21న వెయిట్ లిఫ్టింగ్, అథ్లెటిక్స్ క్రీడాంశాలలో జిల్లాస్థాయి ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ గౌస్బాషా తెలిపారు. ఈ నెల 20న డీఎస్ఏ క్రీడా మైదానంలో యూత్–17, జూనియర్ విభాగంలో అండర్–20 బాలబాలికలకు వెయిట్ లిఫ్టింగ్ ఎంపికలు ఉంటాయని పేర్కొన్నారు. 21న అఽథ్లెటిక్స్ ఎంపికలు జూనియర్ విభాగంలో అండర్–16, అండర్–20 విభాగాల్లో ఉంటాయని తెలిపారు. క్రీడాకారులు తమ పేర్లను శాప్ వెబ్సైట్లో నమోదు చేసుకోవాలని సూచించారు. పుంగనూరు: టమాటా పండించిన రైతులకు ధరలు ఊరటనిస్తున్నాయి. 10 కిలోల టమోట రూ.300లు కాగా, మూడో రకం రూ.260లు పలికింది. మార్కెట్ కమిటీకి 84 మెట్రిక్ టన్నుల టమాటాను రైతులు తరలించారు. టమాటాను చైన్నె, విజయవాడ, హైదరాబాద్కు వ్యాపారులు తరలించారు. రైతులు గిట్టుబాటు ధర లభించడంతో సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఈ ధరలు ఇలాగే కొనసాగితే అప్పుల ఊబిలో నుంచి బయట పడుతా మని ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. కడప కోటిరెడ్డి సర్కిల్: చర్లపల్లె – తిరుచానూరు మధ్య వారాంతపు రెగ్యులర్ రైలును ఈనెల 17వ తేదీ నుంచి నడపనున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్దన్ తెలిపారు. ప్రతి ఆదివారం చర్లపల్లెలో (17059) రాత్రి 9.30గంటలకు బయలుదేరి మల్కాజ్గిరి, కాచిగూడ, షాద్ నగర్, మహబూబ్ నగర్, కర్నూలు, తాడిపత్రి, కడప, రేణిగుంట మీదుగా తిరుచానూరుకు మరుసటి రోజు మధ్యాహ్నం 12.30గంటలకు చేరుకుంటుందని వివరించారు. ప్రతి సోమవారం (17060) తిరుచానూరులో సాయంత్రం 4గంటలకు బయలుదేరి మరుసటి రోజు ఉదయం 8గంటలకు ఇదే మార్గంలో చర్లపల్లెకు చేరుకుంటుందన్నారు. ఈ రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కల్పించామని, ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
అయ్యా... ఇదెక్కడి న్యాయం..?
● తూ తూ మంత్రంగా ఎన్హెచ్ అధికారుల విచారణ ● అర్హులైన రైతులను పిలవకుండానే విచారణ ● స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చినా కూడా రైతులకు అన్యాయం ● విందు భోజనాలతో సరిపెట్టుకున్న విచారణ సాక్షి టాస్క్ఫోర్స్ : కడప – ముద్దనూరు, బి.కొత్తపల్లె నేషనల్ హైవే ఎన్హెచ్ 716 రహదారి పరిహారం విచారణను ఎన్హెచ్ అధికారులు తూ తూ మంత్రంగా చేపట్టారు. శుక్రవారం సాక్షిలో ‘కోల్పోయింది కొంత.. కొట్టేసింది కొండంత’ అనే శీర్షికన వార్త ప్రచురితం కావడంతో జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతిని జిల్లా ఉన్నతాధికారులు విచారణాధికారిగా నియమించారు. దీంతో శుక్రవారం ఆయన తొండూరు మండలంలోని మల్లేల, తొండూరు, ఇనగలూరు, సైదాపురం, క్రిష్ణంగారిపల్లె తదితర గ్రామాలకు సంబంధించిన రైతులకు ఎవరైతే పైపులైన్లు కానీ, పండ్ల తోటలు కానీ, బోరు బావులు నష్టపోయారో అలాంటి రైతులకు ఎలాంటి సమాచారం లేకుండా కొంతమంది అనుకూలమైన రైతులను మాత్రమే పిలిపించుకుని విచారణ జరిపినట్లు పలువురు రైతులు వాపోతున్నారు. అర్హులైన రైతుల ఆవేదన .. మల్లేల గ్రామంలోని గుజ్జుల మల్లికార్జున, బూ చుపాటి దాసి, బూచుపాటి సుధాకర్, శ్రీరామరత్నం, ఓబులేసు, శ్రీరాములు, నాగయ్య, గోపాల్రెడ్డి, వెంకటరమణ, నాగేశ్వరరెడ్డిలతోపాటు మరికొంతమంది రైతులు 2014–15 సంవత్సరంలో చీనీ పంటలకు నీటి తడులు అందించేందుకు బోరుబావులలో నీరు లేకపోవడంతో సమీపంలో ఉన్న మల్లేల చెరువు నుంచి దాదాపు కిలోమీటర్ల మేర లక్షలాది రూపాయలు వెచ్చించి పైపులైన్లు వేసుకున్నారు. అప్పటినుంచి తమ చీనీ పంటలకు నీటి తడులు అందిస్తున్నారు. అలాంటి తరుణంలో ఎన్హెచ్ హైవేలో భాగంగా తమ పైపులైన్లు పూర్తిగా ధ్వంసమైనప్పటికి అధికారులు తమకు పరిహారం అందించడంలో నిర్లక్ష్యం చేస్తున్నారని రైతులు ఆందోళన చెందుతున్నారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వచ్చినా రైతులకు అన్యాయం.. ఎన్హెచ్ 716 హైవే రహదారికి తొండూరు మండలంలోని మల్లేల, తొండూరు, ఇనగలూరు, క్రిష్ణంగారిపల్లె తదితర గ్రామాలకు సంబంధించిన రైతులు పైపులైన్లు, బోరుబావులు నష్టపోయినా అధికారులు వారికి అన్యాయం చేశారు. శుక్రవారం జిల్లా స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ వెంకటపతి వచ్చి అర్హులై నష్టపోయిన రైతులను విచారణ జరపకుండా కొంతమంది రైతులను మొక్కుబడిగా పిలిపించుకుని విచారణ చేపట్టి మమ అనిపించుకున్నారు. అధికారులు వచ్చారని రైతులు అక్కడికి వెళ్లి మాకు న్యాయం చేయాలని అడిగినా కూడా మేం హైవే రోడ్డు పనులు చూడటానికి వచ్చామని రైతులతో అన్నట్లు పలువురు వాపోతున్నారు. విచారణ అనంతరం తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో విచారణకు వచ్చిన అధికారులు విందు భోజనాలు ఏర్పాటు చేసుకుని విచారణ ముగించుకుని వెళ్లినట్లు తెలిసింది. ఈ విషయమై ఎన్హెచ్ ఏఈ విశ్వనాథరెడ్డిని సాక్షి వివరణ కోరగా.. విచారణ పూర్తి చేశామని, అర్హులైన రైతులెవరైనా ఉంటే తొండూరు తహసీల్దార్ కార్యాలయంలో అర్జీల ద్వారా తెలియజేయాలన్నారు. తొండూరులో తూ తూ మంత్రంగా విచారణ జరుపుతున్న ఎన్హెచ్ అధికారులు, మల్లేలలో విచారణ జరుపుతున్న ఎన్హెచ్ అధికారులు -
రెగ్యులర్ కోసం ఎదురుచూపు
కడప రూరల్: జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో ఎంపీహెచ్ఏ ( మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ )గా విధులు చేపట్టాలంటే ఇంటర్మీడియట్ విద్యార్హతతో శానిటరీ ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందాలి. మొదట్లో ఈ శిక్షణలను కేవలం ప్రభుత్వ పరిధిలోని ట్రైనింగ్ కేంద్రాల్లో మాత్రమే 18 నెలలపాటు శిక్షణ ఇచ్చేవారు. తర్వాత కాలంలో పలు ప్రైవేటు సంస్థలు కూడా శిక్షణ ఇచ్చాయి. కాగా 2002–2003వ సంవత్సరంలో డీఎస్సీ ద్వారా కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ ఉద్యోగాలకు అభ్యర్థులను ఎంపిక చేశారు. ఈ నేపథ్యంలోనే ప్రైవేట్ శిక్షణ సంస్థల్లో ట్రైనింగ్ పొందిన వారు కూడా కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఉద్యోగాలు పొందారు. 2024లో ఎన్నికల కోడ్ కారణంగా.. 2024వ సంవత్సరంలో అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేశారు. ఆ ప్రకారం జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో 89 మంది కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ ఉద్యోగులు రెగ్యులర్ అయ్యారు. మరో 32 మందికి రెగ్యులర్ కావాల్సి ఉండగా అంతలోపే ఎన్నికల కోడ్ అమలులోకి రావడంతో ఆ ప్రక్రియ నిలిచిపోయింది. ప్రస్తుతం వారి పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. తమను కూడా రెగ్యులర్ చేసి ఆదుకోవాలని కోరుతున్నారు. అలాగే న్యాయస్థానాన్ని ఆశ్రయించడానికి సిద్ధమవుతున్నారు. ఆదుకోవాలి ఈ ఉద్యోగాన్నే నమ్ము కుని జీవిస్తున్నాం. 2003వ సంవత్సరం నుంచి విధులు చేపడుతున్నాం. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలి. – డి శివరాం, పీహెచ్సీ ఆకేపాడు న్యాయం చేయండి నేను 2003 నుంచి విధుల్లో ఉన్నా. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేయాలి. వాస్తవాలను పరిగణలోకి తీసుకొని మాకు న్యాయం చేయాలి. –ఎం చాంద్ బాషా, పీహెచ్సీ, వనిపెంట అర్హులకు న్యాయం చేయండి ఈ శాఖను నమ్ముకుని ఏళ్ల తరబడి విధులు చేపడుతున్నాం. మా సహచర ఉద్యోగులకు చాలామందికి రెగ్యులర్ అయింది. మేము అన్ని విధాల అర్హులం. మా ఉద్యోగాలను రెగ్యులర్ చేసి ఆదుకోవాలి. – జి నరసయ్య, కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏ, పీహెచ్సీ, చెన్నూరు ఇతని పేరు వీఎన్ ముని రెడ్డి. చెన్నూరు ప్రాథమి క ఆరోగ్య కేంద్రంలో కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏగా పని చేస్తున్నారు. నిబంధనల ప్రకారం తిరుపతి ఎస్వీ మెడికల్ కాలేజీ ప్రభుత్వ శిక్షణా కేంద్రంలో శానిటరీ ఇన్స్పెక్టర్గా శిక్షణ పొందారు. 2006 నుంచి కాంట్రాక్ట్ ఎంపీహెచ్ఏగా విధులు చేపడుతున్నారు. కాంట్రాక్టు ఉద్యోగిగా 2027 ఏప్రిల్ 30వ తేదీన రిటైర్మెంట్ అవుతారు. అదే రెగ్యులర్ అయితే 2029 ఏప్రిల్ 30న ఉద్యోగ విరమణ చెందుతారు. తనలాంటి వారికి చాలా మందికి ఉద్యోగాలు రెగ్యులర్ అయ్యాయి. అన్ని అర్హతలు ఉండి తామెందుకు రెగ్యులర్ కాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఇలా జిల్లా వ్యాప్తంగా రెగ్యులర్ కోసం పలువురు ఉద్యోగులు ఎదురుచూస్తున్నారు. కాంట్రాక్ట్ ఉద్యోగులుగా విధులు నిర్వహిస్తున్న ఎంపీహెచ్ఏలు రెగ్యులర్ చేసిఆదుకోవాలని వేడుకోలు -
అధికారులు అన్యాయం చేశారు..
ఎన్హెచ్ 716 రహదారి నిర్మాణంవల్ల అధికారులు అర్హులైన రైతులకు అన్యాయం చేశారు. మల్లేల చెరువు నుంచి మా భూమి వద్దకు దాదాపు 3కి.మీ మేర పైపులైన్లు వేసి రూ.6లక్షల మేర ఖర్చు చేసి చీనీ చెట్లకు నీటి తడులు అందించేవారం. రోడ్డు నిర్మాణంలో భాగంగా పైపులైన్ పూర్తిగా దెబ్బతిని నష్టం జరిగింది. నష్టపరిహారం అందించాలని అధికారులను కోరినా మా గ్రామానికి విచారణకు వచ్చిన అధికారులు మాతో మాట్లాడకుండా మమ్ములను విచారించకుండా వెళ్లిపోయారు. – ఇసుకపల్లె రంగారెడ్డి, చీనీ రైతు, మల్లేల -
నష్టపరిహారం అందించండి..
మల్లేల చెరువు నుంచి నా పొలం వద్దకు దాదాపు 4కి.మీ మేర చీనీ చెట్లకు నీటితడులు అందించేందుకు పైపులైన్ వేశాను. దాదాపు 600లకుపైగా పైపులు అమర్చాను. దీంతో నాకు రూ.8లక్షల మేర నష్టం జరిగింది. నాకు నష్టపరిహారం అందించాలని అధికారుల చుట్టూ తిరిగినా పట్టించుకోలేదు. నష్టపోయిన మాకు పరిహారం అందించకుండా ఏ నష్టం జరగని రైతులకు లక్షలు అధికారులు మంజూరు చేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు పరిశీలించి మాకు న్యాయం చేయాలని కోరుతున్నా. – గట్టు నాగయ్య, చీనీ రైతు, మల్లేల -
● చిన్న కారణాలకే జీవితాలు బుగ్గిపాలు
ప్రొద్దుటూరు: పిల్లల ఎదుగుదలలో, వారి బంగారు భవిష్యత్తును తీర్చిదిద్దడంలో తల్లిదండ్రుల పాత్ర, ప్రోత్సాహం ఎంతో ముఖ్యం. కన్నబిడ్డల కోసం కంటికి రెప్పలా కాపాడుకుంటూ, తమ రెక్కలు ముక్కలు చేసుకొని శ్రమించేవారే అమ్మానాన్నలు. అయితే, ఇటీవల కాలంలో కొందరు తల్లిదండ్రులు తమ పసిబిడ్డల భవిష్యత్తు గురించి ఇసుమంతైనా ఆలోచించకుండా క్షణికావేశంలో తీసుకుంటున్న ఆకస్మిక నిర్ణయాలతో హఠాత్తుగా జీవితాలను ముగించేస్తున్నారు. ఈ బలవన్మరణాల కారణంగా ఎన్నో కుటుంబాలు నిలువునా ఛిన్నాభిన్నం అవుతుండగా, కన్నవారి నీడను కోల్పోయి ఎందరో చిన్నారులు అనాథలుగా మారుతున్నారు. సెల్ఫీ వీడియోతో డ్రైవర్ ఆత్మహత్య ప్రొద్దుటూరులో ఇటీవల ఓ డ్రైవర్ భార్యాభర్తల మధ్య ఉన్న గొడవల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. క్షణికావేశంలో తన ఆవేదననంతా సెల్ఫీ వీడియోగా రికార్డ్ చేసి, ఉరివేసుకొని బలవన్మరణానికి పాల్పడ్డాడు. తండ్రి తీసుకున్న ఈ ఆకస్మిక నిర్ణయం వల్ల ఆయనకున్న ఒకే ఒక్క కుమార్తె భవిష్యత్తు ఇప్పుడు పూర్తిగా ప్రశ్నార్థకంగా మారిందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చేనేత కార్మికురాలి యాసిడ్ మరణం అప్పుల బాధ తాళలేక ప్రొద్దుటూరులో మరో చేనేత కార్మికురాలు దారుణ స్థితిలో తనువు చాలించింది. అప్పు ఇచ్చిన వారు తీర్చాలంటూ నిరంతరం మానసిక ఒత్తిడికి గురిచేయడంతో, తట్టుకోలేక ఆమె యాసిడ్ తాగి ఆత్మహత్య చేసుకుంది. ఈ ఘటనతో ఆమెకున్న ఇద్దరు పిల్లలు తల్లి లేని అనాథలుగా మారి రోడ్డున పడ్డారు. సోషల్ మీడియా మాయ.. ఆర్థిక క్రమశిక్షణ లోపం: ప్రస్తుత సమాజంలో ఆత్మహత్యలు పెరగడానికి సోషల్ మీడియా ప్రభావం ఒక ప్రధాన కారణంగా మారుతోందని విశ్లేషణలు చెప్తున్నాయి. స్మార్ట్ఫోన్లలో నిరంతరం రీల్స్, యూట్యూబ్ వీడియోలు చూడటం వల్ల తెలియని కొత్త వ్యక్తులతో పరిచయాలు ఏర్పడుతున్నాయి. ఇవి కొందరి ఆలోచనా విధానాలను తప్పుదోవ పట్టిస్తున్నాయి. పక్కవారితో అనవసరమైన ఆర్థిక పోటీలు పెట్టుకోవడం, కుటుంబాలలో ఆర్థిక క్రమశిక్షణ లేకపోవడం, భార్యాభర్తలు ఒకరిపై ఒకరు అనుమానాలు పెంచుకోవడం వంటివి సంసారాలలో చిచ్చులు పెడుతున్నాయి. ఫలితంగా భర్తలపై ఉన్న కోపంతో, ఇంట్లో పసిపిల్లలు ఉన్నారనే కనీస బాధ్యతను కూడా మరచి కొందరు మహిళలు అఘాయిత్యాలకు ఒడిగడుతున్నారు. చిన్న చిన్న కారణాలకే తల్లిదండ్రుల బలవన్మరణాలు ఛిన్నాభిన్నమవుతున్న కుటుంబాలు పసివాళ్ల భవిష్యత్తును గాలికి వదిలేస్తున్న వైనం.. జిల్లాలోపెరుగుతున్న ఆత్మహత్యల ఘటనలు అమ్మానాన్నలు దూరమై అనాథలుగా మారుతున్న చిన్నారులు ఖాళీగా ఉండకండి.. ఏదో ఒక పనిపై దృష్టి పెట్టండి! ‘ప్రస్తుత రోజుల్లో మనుషులలో సహనం నశిస్తోంది. ముఖ్యంగా మహిళలు ఇళ్లలో కరెంట్ డిజిటల్ పరికరాల ప్రభావంతో ఖాళీగా ఉండటం వల్ల అనవసరమైన ఆలోచనలు, మానసిక ఒత్తిళ్లు తలెత్తుతున్నాయి. మహిళలు ఇంట్లో ఒంటరిగా, ఖాళీగా ఉండకుండా తమకు నచ్చిన ఏదో ఒక పని లేదా ఉపాధి మార్గంపై దృష్టి సారించాలి.జీవితంలో సమస్యలు సహజం, అంత మాత్రానికే ఆత్మహత్యలు శరణ్యం కాదు. పసిపిల్లల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకొని కౌన్సిలింగ్ కేంద్రాలను ఆశ్రయించాలి. –డాక్టర్ కవితా ప్రసన్న, మానసిక వైద్యనిపుణురాలు, జిల్లా ఆస్పత్రిఇటీవల కాలంలో రాష్ట్రవ్యాప్తంగానే కాకుండా జిల్లాలోనూ చిన్న చిన్న కారణాలకే, తాత్కాలిక సమస్యలకే బలవన్మరణాలకు పాల్పడుతున్న ఘటనలు ఆందోళన కలిగిస్తున్నాయి. ప్రతి రోజు ఎక్కడో ఒక చోట ప్రసార మాధ్యమాల్లోనూ, పత్రికల్లోనూ గుండెలు పగిలే ఆత్మహత్యల వార్తలు వినాల్సి వస్తోంది. ఇటీవల కడప జిల్లాతో పాటు ప్రొద్దుటూరు పట్టణ పరిధిలో చోటు చేసుకున్న ఆత్మహత్య ఘటనలు ఇందుకు సజీవ సాక్ష్యాలుగా నిలుస్తున్నాయి. కుటుంబ కలహాలు, ఆర్థిక ఇబ్బందులు, మానసిక ఒత్తిళ్లు వంటి సమస్యలకు ఆత్మహత్యే పరిష్కారం అనుకుంటూ చనిపోతున్న వారు.. తమ వెనుక ఉన్న పసిపిల్లల ఆక్రందనలను విస్మరిస్తున్నారు. -
నిత్యానందరెడ్డిని అన్యాయంగా హత్య కేసులో ఇరికించారు
కడప అర్బన్: కడప నగరంలోని మాజీ డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిని పెద్ద దస్తగిరి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారనీ, ఆయన రాజకీయ ఎదుగుదల చూడలేకనే కూటమి ప్రభుత్వం పెద్దలు కుట్ర పన్నారని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ ధ్వజమెత్తారు. ఈనెల 12 వ తేదీన పోలీసులు బండి నిత్యానందరెడ్డిని కడప కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా 14 రోజులపాటు రిమాండ్కు తరలించారు. కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో వున్న నిత్యానందరెడ్డిని శుక్రవారం రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, కడప నగర మాజీ మేయర్ పాకా సురేష్ ములాఖత్ అయ్యారు. అనంతరం వారు కడప కేంద్ర కారాగారం బయట విలేకరులతో మాట్లాడారు. వైఎస్ఆర్సీపీ నాయకులను టార్గెట్ చేసి కూటమి ప్రభుత్వం వేధింపులకు గురిచేస్తున్న క్రమంలోనే నిత్యానందరెడ్డిని పెద్దదస్తగిరి హత్య కేసులో అన్యాయంగా ఇరికించారని ఆరోపించారు. ఆయన న్యాయపోరాటం చేసేందుకు పార్టీ నేతలు అండగా ఉంటామన్నారు. నిజానిజాలను తెలుసుకోకుండా ఈ విధంగా వేధింపులకు పాల్పడటం ఎంతవరకు సమంజసమని ప్రశ్నించారు. కాగా నిత్యానందరెడ్డి సతీమణి దీప్తిరెడ్డి తన భర్తతో ములాఖత్ అయి వెళ్లారు. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, మాజీ మేయర్ పాకాసురేష్ -
మిషన్లో పడి తెగిపోయిన కాలు
జమ్మలమడుగు: పొలంలో మొక్కజొన్న కోసే యంత్రంలో కాలు పడి అరవ భాస్కర అనే రైతు కాలు సగం వరకు తెగిపోయింది. శుక్రవారం ఉదయం పెద్దముడియం మండల కేంద్రంలో రైతు, వైఎస్సార్సీపీ కార్యకర్త అయిన అరవ భాస్కర్ తన పొలంలో మొక్కజొన్న పంట మిషన్తో కోయిస్తున్నాడు. అయితే ప్రమాదవశాత్తు మిషన్లో పడి సగానికి కాలు తెగి పోయింది. వెంటనే స్థానికులు అరవ భాస్కర్ను నంద్యాల జిల్లాలోని ప్రముఖ వైద్యశాలకు తరలించారు. విషయం తెలుసుకున్న ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ,ఎస్ఈసీ సభ్యుడు గిరిధర్రెడ్డిలు వెంటనే నంద్యాల జిల్లాలోని ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్లి బాధితుడిని పరామర్శించారు. అనంతరం అరవ భాస్కర్కు ధైర్యం చెప్పి అక్కడి వైద్యులకు మెరుగైన వైద్యం అందించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితుడిని పరామర్శించిన ఎమ్మెల్సీ -
‘బక్రీద్’కు పటిష్ట భద్రతా చర్యలు
● ఎస్.పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కడప అర్బన్: జిల్లా వ్యాప్తంగా ఈనెల 27న బక్రీద్ పండుగ నేపథ్యంలో పటిష్ట భద్రతా చర్యలు చేపట్టాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయం నుంచి శుక్రవారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పోలీస్ అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. పండుగ సందర్బంగా ఎలాంటి అవాంఛనీ య ఘటనలు చోటుచేసుకోకుండా కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. గోవుల అక్రమ రవాణాను అరికట్టేందుకు ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటు చేయాలన్నారు. సోషల్ మీడియాలో మత విద్వేషాలను రెచ్చగొట్టే పోస్టులు, తప్పుడు ప్రచారాలపై చర్యలు తీసుకోవాలని స్పష్టం చేశారు. ప్రజలు సోషల్ మీడియాలో అస త్య, చట్టవ్యతిరేక సమాచారాన్ని వ్యాప్తి చేయకుండా బాధ్యతాయుతంగా వ్యవహరించాలని సూచించారు. బక్రీద్ పండుగను శాంతియుత వాతావరణంలో,మత సామరస్యంతో జరుపుకోవాలని ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో అడిషనల్ ఎస్.పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, రాజంపేట ఏ.ఎస్.పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, స్పెషల్ బ్రాంచ్ డీ.ఎస్.పీ ఎన్ . సుధాకర్, డీఎస్పీలు పాల్గొన్నారు. -
సర్ షెడ్యూల్ విడుదల
కడప సెవెన్రోడ్స్: ఫొటో ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (ఎస్ఐఆర్/సర్)–2026 కార్యక్రమానికి సంబంధించిన షెడ్యూల్ను భారత ఎన్నికల సంఘం విడుదల చేసింది. 2026 జులై 1 అర్హత తేదీగా నిర్ణయించారు. ఆ తేది నాటికి వయస్సు 18 సంవత్సరాలు నిండే వారంతా ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు చేసుకోవడానికి అర్హులు. సెన్సెస్ మొదటి దశలో ఇళ్ల జాబితా, ఇళ్ల గణన కార్యక్రమం ఈనెల 20వ తేది నాటికి పూర్తి కానుంది. జిల్లాలో ఎన్యుమరేటర్లుగా పనిచేస్తున్న 3529 మందిని ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణకు సైతం వినియోగించనున్నారు. అధికారులు, సిబ్బందికి జూన్ 5 నుంచి 14వ తేది వరకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహిస్తారు. బూత్ లెవెల్ అధికారులు జూన్ 15 నుంచి జులై 14వ తేది వరకు ఇంటింటి పరిశీలన నిర్వహిస్తారు. అందుబాటులో లేని వారు, ఇతర ప్రాంతాలకు షిఫ్ట్ అయిన వారు, మరణించిన వారు, డూప్లికేట్ ఓటర్లను గుర్తిస్తా రు. చుట్టుపక్కల ఉన్న ఓటర్ల ద్వారా బీఎల్ఓలు ఈ సమాచారాన్ని సేకరిస్తారు. ముసాయిదా జాబితాలో చేర్చబడని వీరి పేర్లను ప్రజలు తెలుసుకోవడానికి వీలుగా గ్రామ పంచాయతీ, మున్సిపాలిటీ కార్యాలయాల వద్ద నోటీసు బోర్డులో ప్రదర్శిస్తారు. ఎన్యూమరేషన్ సమయంలో ఓటర్ల నుంచి ఎలాంటి పత్రాలను సేకరించరు. ఎవరైనా తన పేరును లేదా తమ బంధువుల పేర్లను గత ఇంటెన్సివ్ రివిజన్లో ఉన్న ప్రకారం ఓటర్ల జాబితాలో నమోదు చేసుకోవచ్చు. గత ఓటర్ల జాబితాలో పేర్లు నమోదై ఉండి ప్రస్తుత ఎన్యుమరేషన్ సమయంలో కనిపించని వ్యక్తులకు ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ అధికారి ముసాయిదా జాబితా విడుదల తర్వాత నోటీసులు జారీ చేస్తారు. అలా ఎవరికై తే నోటీసులు జారీ చేయబడతాయో వారి జాబితాలు ఈఆర్ఓ రికార్డు నిర్వహిస్తారు. ఇంటింటి సర్వే సమయంలో ప్రతి బీఎల్ఓ వద్ద కనీసం 30 ఫారం–6లు అందుబాటులో ఉంటాయి. ఓటర్లుగా నమోదు కావాలనుకునే వారికి బీఎల్ఓలు ఫారం–6ను అందజేస్తారు. హెల్ప్లైన్ నెంబరు 1950 ఏర్పాటు అర్హులైన వారు ప్రత్యేకించి దివ్యాంగులు, వలస వచ్చిన వారు, వృద్దులు, ఓటర్లు తమ పేర్లను జాబితాల్లో నమోదు చేసుకోవడానికి వీలుగా జిల్లా స్థాయి లో 1950 హెల్ప్లైన్ నెంబరును అందుబాటులోకి తీసుకు రానున్నారు. జిల్లాలో ప్రస్తుతం 2251 పోలింగ్ కేంద్రాలు ఉన్నాయి. జులై 14నాటికి పోలింగ్ కేంద్రాల రేషనలైజేషన్ ప్రక్రియ పూర్తి చేస్తారు. జులై 21న ఓటర్ల ముసాయిదా జాబితా విడుదల చేస్తారు. అదే రోజు నుంచి ప్రారంభించి ఆగస్టు 20వ తేది వరకు క్లెయిమ్లు, అభ్యంతరాలు స్వీకరిస్తారు. క్లెయిమ్లు, అభ్యంతరాలను సెప్టెంబరు 18 నాటికి పరిష్కరించి అదేనెల 22వ తేది ఓటర్ల తుది జాబితా ప్రకటిస్తారు. జూన్ 5 నుంచి 14 వరకుసిబ్బందికి శిక్షణ జూన్ 15 నుంచి జులై 14 వరకు బీఎల్ఓల ఇంటింటి సర్వే -
ఇకపై ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లు
కడప కార్పొరేషన్: ఆంధ్రప్రదేశ్ సదరన్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్(ఏపీఎస్పీడీసీఎల్) పరిధిలో ఉన్న ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు ప్రీ పెయిడ్ స్మార్ట్ మీటర్లు అమర్చాలని ఆ సంస్థ నిర్ణయించింది. జూన్ 1వ తేది నుంచి వీటిని అమల్లోకి తేవాలని చూస్తోంది. అంటే మొబైల్కు రీచార్జి ఎలా చేసుకుంటామో గడువు తీరిన తర్వాత విద్యుత్కు కూడా అలాగే రీచార్జి చేసుకోవాల్సి ఉంటుంది. గృహాలకు ఏర్పాటు చేసే ముందు ప్రభుత్వ సర్వీసులకు అమర్చి ఫలితాలు చూడాలని ఏపీఎస్పీడీసీఎల్ యోచిస్తున్నట్లు తెలుస్తోంది.మెరుగైన నిరంతరాయ విద్యుత్ను అందించడంలో భాగంగా మొదట ప్రభుత్వ కార్యాలయాలు, వాటర్ వర్క్స్, వీధి దీపా లు తదితర సర్వీసులకు ఇప్పటికే స్మార్టు మీటర్లు అమర్చారు. కేంద్ర ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల విద్యుత్ వినియోగం,బిల్లింగ్లో పారదర్శకతను పెంపొందించేందుకు వీలుగా స్మార్ట్ మీటర్లను కాస్తా ప్రీ–పెయిడ్ స్మార్ట్ మీటర్లుగా మార్చాలని సంస్థ నిర్ణయం తీసుకుంది. దీనివల్ల ప్రభుత్వ విద్యుత్ సర్వీసుల బకాయిల ఉపశమనంతోపాటు విద్యుత్ పంపిణీ సంస్థలు విద్యుత్ కొనుగోలు సామర్థ్యంపై ఒత్తిడిని అధిగమించేందుకు ఉపయోగపడుతుంది. సంస్థ పరిధిలో ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, కార్పొరేషన్లు/మున్సిపాలిటీలు, వాటర్ వర్క్స్, వీధి దీపాలు తదితర సర్వీసులకు సంబంధించి వైఎస్సార్ కడప జిల్లాలో 16,261 కనెక్షన్లు ఉన్నాయి. ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని అన్ని జిల్లాలలో 1.17 లక్షల సర్వీసుల్లో సింగిల్ ఫేజ్ సర్వీసులు 91,306, త్రీఫేజ్ సర్వీసులు 26,507 వున్నాయి. ఈ సర్వీసులన్నింటినీ కొన్ని గ్రూపులుగా ఏర్పాటు చేసి, ఈ–వాలెట్ ద్వారా రీచార్జ్ చేసుకునే సౌకర్యాన్ని కల్పించడం జరుగుతోంది. తొలుత ప్రభుత్వ విద్యుత్ సర్వీసులకు! జూన్ 1 నుంచి అమలులోకి జిల్లాలో 16,261ల ప్రీ–పెయిడ్ మీటర్లు జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకే.... వినియోగదారుల్లో జవాబుదారీతనాన్ని పెంపొందించేందుకే ప్రీ పెయిడ్/ స్మార్ట్ మీటర్లను ఏర్పాటు చేస్తున్నాం. సంస్థ పరిధిలోని 9 జిల్లాల్లోని ప్రభుత్వ కార్యాలయాలు, ప్రభుత్వ సంస్థలు, మున్సిపాలిటీలు/కార్పొరేషన్లు, వాటర్ వర్క్స్ విద్యుత్ సర్వీసుల నుంచి రూ.9,507 కోట్ల బకాయిలు రావాల్సి ఉంది. ఈ బకాయిల చెల్లింపు, భవిష్యత్తులో విద్యుత్తు వినియోగంలో పారదర్శకతను పెంపొందించడం, విద్యుత్ బిల్లును ఆదా చేయడంతోపాటు విద్యు త్ వినియోగాన్ని నియంత్రించుకునేందుకు ప్రీ–పెయిడ్ మీటర్లు ఉపయోగపడుతాయి. – శివశంకర్ లోతేటి, సీఎండీ, ఏపీఎస్పీడీసీఎల్ -
● అర్హులైన రైతులకు అన్యాయం
సాక్షి ప్రతినిధి, కడప: ముద్దనూరు–బి.కొత్తపల్లె నేషనల్ హైవే (ఎన్హెచ్–716) రహదారి పరిహారం కొల్లగొట్టేందుకు తెలుగుతమ్ముళ్లు మాస్టర్ ప్లాన్ రచించారు. స్వల్పంగా భూమి కోల్పోతే సర్వం పోయినట్లు రికార్డుల్ని తారుమారు చేశారు. పైపులైన్ కోల్పోయినట్లు, బోరుబావులు గల్లంతవుతున్నట్లు రికార్డులు రూపొందారు. అంతేకాదు భవనాలు, పండ్లు, కూరగాయాల తోటలు కోల్పోయినట్లు పక్కాగా కథలల్లి ప్రజాధనం కాజేసే కుట్ర పన్నారు. ఒక్కమాటలో చెప్పాలంటే లేనిది ఉన్నట్లు రికార్డులు పుట్టించారు. ఆపై లక్షలాది రూపాయాలు కొల్లగొట్టే వ్యూహాన్ని ఎంచుకున్నారు. ● ముద్దనూరు–బి.కొత్తపల్లె రహదారిలో భూసేకరణలో అనేక వైఫల్యాలు వెలుగుచూశాయి. అక్రమాల నేపధ్యంలో ఇదివరకే తొండూరు విలేజ్ రెవెన్యూ అధికారి నరహరి సస్పెండ్ ఉదంతం వెలుగు చూసింది. నరహరి అవినీతి తీగలాగితే అధికార పార్టీ నేతల అక్రమాల డొంకంతా కదిలింది. తొండూరు, మల్లేల గ్రామాల్లో పెద్ద ఎత్తున అవినీతి అక్రమాలకు పాల్పడినట్లు తెలుస్తోంది. దాదాపు రూ.కోటి పరిహారం తెలుగుతమ్ముళ్లకు భోజ్యంగా మారింది. రికార్డులు తారుమారు చేసి .. మల్లేల గ్రామంలో ఓ రైతుకు చెందిన కొంత భూమి ఎన్హెచ్ హైవే రోడ్డుకు కోల్పోయారు. ఆ కొద్ది భూమిలోనే వ్యవసాయబోర్లు, పైపులైన్లు, పండ్ల తోటలు ఉన్నట్లు రికార్డులు సృష్టించి దాదాపు రూ.10లక్షలకుపైగా పరిహారం అధికారులు మంజూరు చేసినట్లు సమాచారం. అలాగే తొండూరు గ్రామానికి చెందిన పచ్చనేతలు కోల్పోతున్న భూముల్లో బోర్లు, బావులు, పండ్లతోటలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో లేవు. అయినప్పటికీ హైవే రోడ్డు ఏర్పాటు కారణంగా విద్యుత్ కనెక్షన్లు, పైపులైన్లు, బోర్లు, పండ్ల మొక్కలు కోల్పోతున్నట్లు రికార్డులు సృష్టించారు. జిల్లా స్థాయి రెవెన్యూ యంత్రాంగం రైతులతో నేరుగా మాట్లాడే ప్రయత్నం చేయగా వీఆర్ఓ నరహరి మాత్రమే సమాధానాలు ఇవ్వసాగారు. రైతులు లేకుండా వారి అభ్యర్థన తెలుసుకోకుండా మొత్తం వ్యవహారం నరహరి నడిపారనే అంచనాకు వచ్చిన అధికారులు ఈనెల 9న సస్పెండ్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు.. నరహరి సస్పెండ్తో మొత్తం బాగోతం బహిర్గతమైంది. ఎన్హెచ్ పరిహారంలో అధికార పార్టీకి వారికే లక్షలకు లక్షలు పరిహారం మంజూరైనట్లు తెలిసింది. ఆమేరకు ఆయా రైతుల అకౌంట్లకు డబ్బులు జమ చేసేందుకు యంత్రాంగం సిద్ధంగా ఉంది. ఎన్హెచ్–716 రహదారి భూసేకరణలో అక్రమాలు అధికార పార్టీ నేతల అక్రమాలకు అండగా నిలుస్తోన్న యంత్రాంగం తొండూరు మండలంలో రెవెన్యూ అధికారుల చేతివాటం వీఆర్ఓ నరహరి సస్పెండ్తో బయటపడ్డ భాగోతం ప్రభుత్వ పరిహారాన్ని బొక్కేస్తున్న తెలుగుతమ్ముళ్లు అర్హులకు మొండిచేయి చూపడంతోనే అసలు సమస్య ఉత్పన్నమైంది. తొండూరు మండలం మల్లేల గ్రామానికి చెందిన రైతులు భూములు కోల్పోతున్నారు. కిలోమీటర్ల మేర పైపులైన్లు వేసి పండ్ల తోటలు పండించుకుంటున్నారు. అలాంటి రైతులకు నష్టపరిహారం మంజూరు చేయడంలో వివక్ష ప్రదర్శించారు. లేనిది ఉన్నట్లు రికార్డులు పొందుపర్చిన రెవెన్యూ యంత్రాంగం ఉన్నది ఉన్నట్లుగా రికార్డులు రాసేందుకు మనసొప్ప లేదు. అర్హులైన సామాన్య రైతులకు అన్యాయం చేసేందుకే సిద్ధమయ్యారు. అధికార పార్టీకి అనుకూలంగా ఉన్న రైతులకు ఒక న్యాయం, సామాన్య రైతులకు మరొక న్యాయం చేసేందుకు రెవెన్యూ యంత్రాంగం చర్యలుండిపోయాయి. ఇప్పటికై నా జిల్లా రెవెన్యూ అధికారులు ఎన్హెచ్ హైవే రోడ్డు పరిహారం అవకతవకలపై పునః పరిశీలించి అర్హులకు న్యాయం చేస్తూనే, అనర్హులను కట్టడి చేసి ప్రజాధనాన్ని కాపాడాలని పలువురు కోరుతున్నారు. -
ఏపీ ఈఏపీ సెట్కు 92.99 శాతం హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించి గురువారం రెండు సెషన్స్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 92.99 శాతం మంది విద్యార్థులు హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలలో కలిసి 9 పరీక్షా కేంద్రాలకుగాను ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్కు సంబంధించి 1569 మంది అభ్యర్థులకుగాను 1459 మంది హాజరుకాగా 110 మంది గైర్హాజరయ్యారు. ఒంటిమిట్ట (సిద్దవటం): మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి హుండీ ఆదాయాన్ని గురువారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఈ సందర్భంగా నెల రోజులకుగాను భక్తులు వేసిన కానుకలను లెక్కించగా రూ.7,72,930ల ఆదాయం వచ్చిందని టీటీడీ అధికారులు తెలిపారు. బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరి వీరబ్రహ్మేంద్రస్వామి మఠంలో భక్తులు సమర్పించుకున్న హుండీల సొమ్మును గురువారం లెక్కించారు. ఇందులో బ్రహ్మంగారిమఠంలో హుండీల ద్వారా రూ. 37,55,769 , పోలేరమ్మ గుడి దగ్గర గల హుండీ ద్వారా రూ. 2,74,699 లక్షలు. నాలుగు గ్రాముల బంగారం, 100 గ్రాముల వెండి వచ్చినట్లు మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఎండోమెంట్ అధికారి శంకర్ బాలాజీ, మఠాధిపతి వీర ధర్మజ వెంకటాద్రి స్వామి, మఠం సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. కడప రూరల్: ఫార్మసీ రంగంలో నియంత్రణ లేని కార్యకలాపాలకు నిరసనగా ఆల్ ఇండియా కెమిస్ట్ అండ్ డ్రగ్గిస్ట్ ఆధ్వర్యంలో ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపులను బంద్ చేస్తున్నట్లు అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు నరసింహమూర్తి తెలిపారు. గురువారం స్థానికంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయ న మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకుపైగా కెమిస్టులు, నియంత్రణ లేని ఆన్లైన్ కార్యకలాపాలతో పాటు, అన్యాయంగా డిస్కౌంట్ విధానాల కారణంగా కమ్యూనిటీ ఫార్మసీ వ్యవస్థ ప్రమాదంలో పడిందని అన్నారు. ఈ విధానాలకు వ్యతిరేకంగా 20న చేపట్టే దేశవ్యాప్త బంద్ కు సహకరించి, మద్దతు తెలపాలన్నారు. జిల్లా గౌరవ అధ్యక్షుడు చంద్రశేఖర్, సెక్రెటరీ వెంకటేశ్వర్లు, ట్రెజరీ సుబ్బారావు, ఆర్గనైజింగ్ సెక్రటరీ కేశవరెడ్డి, ప్రొద్దుటూరు జోన్ సెక్రటరీ సుబ్బారావు, పులివెందుల జోన్ సెక్రెటరీ దినేష్ కుమార్, కడప జోన్ సెక్రెటరీ సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగర శివార్లలోని వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో అండర్ –16, 14 క్రికెట్ ఎంపికలు ఉత్సాహంగా జరిగాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ.రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఈ ఎంపికలకు అండర్ 16 బాలుర విభాగంలో సుమారు 290 మంది, అండర్ 14 విభాగంలో 300 మంది క్రీడాకారు లు పాల్గొన్నట్లు తెలిపారు. ఇందులో ఎంపిక చేసిన వారితో సెలక్షన్ మ్యాచులు నిర్వహిస్తా మని పేర్కొన్నారు. అనంతరం జిల్లా జట్టును ఎంపిక చేస్తామని వివరించారు. ఈ ఎంపికలను జిల్లా క్రికెట్ సంఘ అధ్యక్షుడు ఎల్.మణికుమార్రెడ్డి పర్యవేక్షించారు. సభ్యులు బి.ఈశ్వర్ రెడ్డి,ఎం మహేంద్ర రెడ్డి, కే విష్ణు మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు. -
వలపు వల విసిరి.. పోలీసులకు చిక్కి !
బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని గూడెం గ్రామానికి చెందిన ఓ సాఫ్ట్వేర్ ఇంజనీర్కు వలపు వల విసిరి లక్షలు కొల్లగొట్టిన ఓ యువకుడు, యువతిని అర్బన్ పోలీసులు అరెస్టు చేశారు. గురువారం అర్బన్ పోలీసుస్టేషన్ ఆవరణలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో అర్బన్ సీఐ బి.రామకృష్ణ ఇందుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మున్సిపాలిటీ పరిధిలోని గూడెం గ్రామానికి చెందిన ఊరిబిండిఅశోక్ చైన్నెలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా జీవనం సాగిస్తున్నాడు. సుమారు రెండేళ్ళ క్రితం అశోక్ ఇన్స్ట్రా ఐడీకి పూజితరెడ్డి0707 అనే ఇన్స్ట్రా ఐడీ నుండి హాయ్ అని మెసేజ్ వచ్చింది. ఆ తర్వాత అదే గ్రామానికి చెందిన అతని సమీప బంధువు ఆదూరిరామలింగారెడ్డి అశోక్తో చర్చించి ముందస్తు పథకం ప్రకారం అతనితో పరిచయమున్న మానక అలియాస్ పూజితరెడ్డితో పరిచయం పెంచుకోమని అశోక్కు సూచించాడు. ఆ తర్వాత కొద్ది రోజులకు పూజిత తన ఆర్థిక ఇబ్బందులను చెప్పి బాధపడుతూ మెల్లగా అశోక్ వద్ద డబ్బులు గుంజడం మొదలుపెట్టింది. ఇలా అనేక దఫాలుగా వివిధ అకౌంట్లకు సుమారు రూ.81.67 లక్షలు స్వాహా చేశారు. పూజితరెడ్డి వ్యవహారశైలిలో అనుమానం వచ్చిన అశోక్ పూర్తిస్థాయిలో విచారించుకుని తనను ఉద్దేశ్యపూర్వకంగా రామలింగారెడ్డి, మానసలు మోసం చేశారని గుర్తించి గత నెల 29న అర్బన్ పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించి గురువారం చెన్నంపల్లె ప్లైఓవర్ వద్ద రామలింగారెడ్డి, మానసలను అదుపులోకి తీసుకున్నారు. నిందితులు ప్లే99ఎక్ఛేంజ్, స్కైఎక్ఛేంజ్, పేట్రస్ట్ యాప్లను వాడినట్లు విచారణలో తేలింది. అలాగే నిందితులు మోసం చేసి తీసుకున్న డబ్బులు మొత్తం క్రికెట్ బెట్టింగ్లలో వాడినట్లు దర్యాప్తులో తేలిందని తెలిపారు. సమావేశంలో అర్బన్ ఎస్ఐ ఆర్.వి.కొండారెడ్డి, కానిస్టేబుళ్ళు వెంకటేష్, వీణ తదితరులు పాల్గొన్నారు. హనీట్రాప్కు పాల్పడిన యువతి, యువకుడు అరెస్టు -
ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చేందుకే నిందలు
● కులమతాల మధ్య చిచ్చు పెట్టాల్సిన అగత్యం వైఎస్సార్సీపీకి పట్టలేదు ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష కడప కార్పొరేషన్: ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకే తమపై నిందలు వేస్తున్నారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష విమర్శించారు. కడపలోని తన కార్యాలయంలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కడప నగరం మతసామరస్యానికి ప్రతీక అని, కొన్ని దశాబ్దాలుగా ఇక్కడ ఏ చిన్న సంఘటన కూడా చోటు చేసుకోలేదన్నారు. తిరుమల తొలిగడప దేవునికడప, పెద్దదర్గా, మరియపురం చర్చిలు ఇక్కడ చాలా ప్రసిద్ధిగాంచాయని, సుదూర ప్రాంతాల నుంచి కులమతాలకు అతీతంగా భక్తులు వీటిని సందర్శిస్తుంటారన్నారు. ఇలాంటి శాంతియుత నగరంలో అల్లర్లు జరగడం పట్ల తాము చాలా చింతిస్తున్నామన్నారు. ప్రజలంతా కులమతాలకు అతీతంగా ఘర్షణ ఘటనను తీవ్రంగా ఖండించారని గుర్తు చేశారు. మతసామరస్యాన్ని కాపాడాల్సిన బాధ్యత పత్రికలు, మీడియా, రాజకీయ పార్టీలపై ఉందన్నారు. ఆ విషయాన్ని మర్చిపోయి కొన్ని పచ్చ పత్రికల్లో అల్మాస్పేటలో జరిగిన ఘటనకు వైఎస్సార్సీపీ నాయకులే కారణమని కథనాలు రావడం దురదృష్టకరమన్నారు. జర్నలిజం విలువలు ఇవేనా అని ఆయన ప్రశ్నించారు. సున్నితమైన అంశంపై ఎలా రాయాలో జర్నలిజం నేర్పలేదా అని నిలదీశారు. రెచ్చగొట్టే కథనాలు రాసి రాజకీయ రంగు పులిమే ప్రయత్నం చేయడం దుర్మార్గమైన చర్య అన్నారు. అల్మాస్ పేట ఘటనను కొన్ని దుష్ట శక్తులు ప్రేరేపించాయని.. టీడీపీ నగర అధ్యక్షుడు, మార్కెట్ యార్డు వైస్ చైర్మన్ ఇరువర్గాలకు ప్రాతినిధ్యం వహించారన్నారు. చంద్రబాబు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో రాష్ట్రంలో ఎక్కడ ఏం జరిగినా వైఎస్సార్సీపీకి అంటగట్టే కార్యక్రమం జరుగుతోందని ఆరోపించారు. ఈ రెండేళ్ల కాలంలో ప్రభుత్వ వైఫల్యాలను కప్పిపుచ్చుకునేందుకు ప్రతిదాన్నీ రాజకీయం చేస్తున్నారని, పక్కా ప్రణాళిక ప్రకారం వైఎస్సార్సీపీకి అంటగడుతున్నారన్నారు. పెద్ద దస్తగిరి హత్య విషయంలో కూడా ఇలాగే జరిగిందని గుర్తు చేశారు. రెండు గంజాయి బ్యాచ్లకు మధ్య జరిగిన ఘర్షణను వైఎస్సార్సీపీ నాయకులకు అంటగట్టారని గుర్తు చేశారు. శవరాజకీయాలు, కలమతాల మధ్య చిచ్చురేపడంలో చంద్రబాబును మించిన వారు దేశంలోనే లేరన్నారు. ప్రభుత్వాన్ని కాపాడుతూ వస్తున్న పచ్చ పత్రికల ద్వారా కథనాలు రాయించి, టీడీపీ నాయకులతో ప్రెస్మీట్లు పెట్టించి అవే నిజం అనేలా ప్రజలను మభ్యపెడతారన్నారు. ఇందులో భాగంగానే ప్రభుత్వ సలహాదారు షరీఫ్ వ్యాఖ్యలు చేశారని, చంద్రబాబు నుంచి వచ్చిన స్క్రిప్టును ఆయన బాగా చదివి వినిపించారని ఎద్దేవా చేశారు. స్తానిక సంస్థల ఎన్నికలు రాబోతున్న నేపథ్యంలో లబ్ధి పొందేందుకు ఈ కుట్రలు చేయించారని షరీఫ్ చెప్పడం హాస్యాస్పదమన్నారు. కడపలో వైఎస్సార్సీపీకి ఇంకా ఆ దుస్థితి పట్టలేదన్నారు. ఇలాంటి నీచ రాజకీయాలు చేసి లబ్ధి పొందాల్సిన అవసరం అంతకన్నా లేదని, ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగినా అన్ని స్థానాలు కై వసం చేసుకునే సత్తా తమ పార్టీకి ఉందన్నారు. కులమతాల మధ్య చిచ్చుపెట్టి రాజకీయ లబ్ధి పొందడం టీడీపీకి మొదటి నుంచి అలవాటని, వారి చరిత్ర అదేనన్నారు. ఎందుకంటే టీడీపీకి చాలా డివిజన్లలో సరైన అభ్యర్థులే కరువయ్యారని ఎద్దేవా చేశారు. ఎవరైనా బాత్రూమ్లో కాలు జారిపడినా, ఆవు ఈనిందన్నా వైఎస్సార్సీపీ వల్లే జరిగిందని చెప్పే స్థితికి టీడీపీ నాయకులు దిగజారారన్నారు. కడప నగర అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం ఇవ్వలేదన్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఏమేం అభివృద్ధి చేశామో కళ్లకు కట్టినట్లు చూపుతామన్నారు. అవకాశం వచ్చినప్పుడు ప్రజలు వారి విశ్వరూపం చూపుతారని అంజద్బాషా హెచ్చరించారు. ఈ సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి పి.జయచంద్రారెడ్డి, బంగారు నాగయ్య, తోటక్రిష్ణ, బీహెచ్ ఇలియాస్, దాసరి శివప్రసాద్, బసవరాజు, రాయల్బాబు, అక్బర్ అలీ, త్యాగరాజు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులు వేగవంతం చేయాలి
కడప సెవెన్రోడ్స్: కడప అల్ట్రా మెగా సోలార్ పార్కు (1000 మెగా వాట్లు) పరిధిలో ఎల్ఏడీ నిధులతో చేపడుతున్న అభివృద్ధి పనులు వేగవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. గురువారం తన క్యాంపు కార్యాలయంలో నాల్గవ స్థానిక ప్రాంత అభివృద్ధి నిధి కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. సోలార్ పార్క్ పరిధిలో ప్రభావిత గ్రామాలు, ప్రభావితం కాని గ్రామాల అభివృద్ధికి చర్యలు చేపట్టాలని సూచించారు. ఇప్పటివరకు విడుదల చేసిన నిధులకు సంబంధించి పనుల పురోగతి, నాణ్యతపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మంజూరైన నిధులతో గ్రామ సచివాలయ సముదాయాల అభివృద్ధి, సీసీ రోడ్లు, గ్రావెల్ రోడ్లు, కాంపౌండ్ వాల్, పార్కింగ్ టైల్స్, ప్లేగ్రౌండ్ లెవలింగ్, వెటర్నరీ భవనాల అభివద్ధి వంటి పనులను చేపట్టేందుకు కమిటీ ఆమోదం తెలిపిందన్నారు. సోలార్ పార్క్ పరిధిలోని గ్రామాల సమగ్రాభివృద్ధే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందని, ప్రజల అవసరాలకు అనుగుణంగా పారదర్శకంగా నిధులను వినియోగిస్తామని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. సోలార్ పవర్ కార్పోరేషన్ లిమిటెడ్ ఎస్ఈ ఎం. శివశంకర్ నాయుడు, సీనియర్ ఇంజనీర్/సివిల్ అశోక్ కుమార్, సీపీవో హజరతయ్య పాల్గొన్నారు. జూన్ 12 నాటికి గురుకుల విద్యాలయాన్ని సిద్ధం చేయాలి జిల్లాలో అధునాతన వసతులతో నాణ్యమైన విద్యనందించే లక్ష్యంతో రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయాన్ని జూన్ 12 నాటికి సిద్ధం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. కలెక్టరేట్ లోని తన ఛాంబర్లో తొండూరు మండలంలోని మల్లెల గ్రామంలో నూతనంగా రూపుదిద్దుకున్న మహాత్మాగాంధీ జ్యోతిరావు పూలే గురుకుల విద్యాలయంలో పెండింగ్ పనులపై సంబంధిత అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం అద్దె భవనాల్లో నడుస్తున్న విద్యాలయాన్ని ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నాటికి నూతన భవనంలో సదుపాయాలు సిద్ధం చేయాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
● జగనన్న పాలనలో గండి ‘మహా వైభవం’
2019ÌZ OÐðlG‹Ü fVýS-¯Œl Ððl*çßæ-¯Œl Æð‡yìlz Ð]l¬QÅ-Ð]l$…{† AĶæ*ÅMýS VýS…yìl „óS{™é-°MìS çÜ$Ð]lÆý‡~ अध-्य-ाय… Ððl¬§ýl-OÌñæ…¨. MýSyýlç³ G…ï³ OÐðlG‹Ü AÑ-¯é‹-ÙÆð‡yìlz, Ð]l$…yýlÌS C¯ŒS^éÆŠ‡j OÐðlG‹Ü Mö…yé-Æð‡-yìlzË$ {ç³™ólÅMýS ^öÆý‡Ð]l ^èl*í³ BÌSĶæ*°² A…™èl-Æ>j¡Ä¶æ$ Ýë¦Æ‡$$ÌZ AÀ-Ð]l–¨® ^ólõÜ…-§ýl$MýS$ MýS…MýS׿… MýSr$t-MýS$-¯é²Æý‡$. M>Ð]l$-¯Œl VýS$yŠæ 眅yŠæ (CGF) నిధులతో ఆలయ రూపురేఖలను పూర్తిగా మార్చేశారు. ఇందులో భాగంగా రూ.20 కోట్లతో ప్రధాన ఆలయ పునర్నిర్మాణ పనులు, రూ.6.10 కోట్లతో పడమర రాజగోపురం, ఆలయ ప్రాకారం, సుందరమైన బండ చప్పట పనులు చేయించారు. రూ.1.95 కోట్లతో ఆలయ సొంత నిధుల నుంచి అద్భుతమైన దక్షిణ రాజగోపురం నిర్మించారు. అద్దాల మర్రి క్రాస్ వద్ద ఆలయానికి సంబంధించి 4 ఎకరాల భూమిని గోశాలకు మంజూరు చేయించి, రూ.40 లక్షలతో దానికి ప్రహారీ గోడ నిర్మించారు. భక్తుల తాగునీటి అవసరాల కోసం రూ.9 లక్షలతో మినరల్ వాటర్ ప్లాంట్, రూ.6 లక్షలతో ఫిల్టర్ పాయింట్లు, ప్రధాన కాలువ పూడికతీత పనులు మరియు పోలీస్ అవుట్పోస్ట్ భవనాన్ని నిర్మించారు. -
పేదల స్థలాలపై టీడీపీ నేత కన్ను
● పదేళ్ల నాటి ఇంటి పునాదుల కూల్చివేత ● ఆర్డీఓకు కార్యాలయానికి వెళ్లిన బాధితులు, వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యం పులివెందుల : పులివెందులలో టీడీపీ నాయకుల ఆగడాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వం పదేళ్ల క్రితం కేటాయించిన ఇంటి స్థలాల్లో పేదలు నిర్మించుకున్న పునాదులను టీడీపీ నాయకులు కూల్చివేస్తున్నారు. బాధితుల కథనం మేరకు.. 2014లో పులివెందుల పట్టణంలోని చిన్నరంగాపురం రోడ్డు రాజీవ్ కాలనీ పక్కన ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద ఉన్న డీకేటీ స్థలంలో 50 కుటుంబాలకు అప్పటి ప్రభుత్వం ఇళ్లులేని నిరుపేదలకు ఇంటి స్థలాలను మంజూరు చేసింది. అప్పట్లో వారు పునాదులు నిర్మించుకున్నారు. ప్రస్తుతం టీడీపీ మైనార్టీ నాయకుడి కన్ను పేదల స్థలాలపై పడింది. ఆ స్థలం తనదంటూ రెండు రోజుల క్రితం పేదలు నిర్మించుకున్న ఇళ్ల పునాదులను కూల్చివేశాడు. గురువారం ఈ విషయాన్ని బాధితులు ఆర్డీఓ దృష్టికి తీసుకెళ్లాలని కార్యాలయానికి చేరుకున్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ నాయకులు బాసటగా నిలిచారు. ఈ విషయం తెలుసుకున్న టీడీపీ నాయకులు ఆర్డీఓ కార్యాలయానికి చేరుకుని అక్కడే ఉన్న బాధితుల చేతుల్లో ఉన్న పట్టా కాగితాలను, జిరాక్స్ కాఫీలను లాక్కొని దౌర్జన్యం చేశారు. అంతేకాకుండా ఆర్డీఓ కార్యాలయంలో ఆర్డీఓతో మాట్లాడుతున్న వైఎస్సార్సీపీ నాయకులపై దౌర్జన్యం చేశారు. దీనికి వైఎస్సార్సీపీ నాయకులు కూడా దీటుగా సమాధానం ఇచ్చారు. ఇంతలో ఇరు పార్టీలకు సంబంధించిన నాయకులు పెద్ద సంఖ్యలో ఆర్డీఓ కార్యాలయానికి చేరుకున్నారు. పోలీసులు రంగ ప్రవేశం చేసి ఇరువర్గాలను శాంతింపజేసి ఆర్డీఓతో పోలీసుల మాట్లాడారు. దీనికి ఆర్డీఓ ఆ స్థలాలపై సర్వే చేపడతామని, సర్వే చేసిన తర్వాత విషయం తెలియజేస్తామని చెప్పడంతో ఇరు వర్గాల వారు అక్కడి నుంచి వెళ్లారు. -
కాలేజీ అభివృద్ధి కోసమే భూమిని విక్రయించాం
కడప కార్పొరేషన్: కళాశాల అభివృద్ధి కోసమే కాలేజీకి ఉన్న భూమిని విక్రయించామని తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీ ఛైర్మెన్ ఎస్.ఖాదర్బాష అన్నారు. కడప బిల్టప్ సమీపంలోని తయ్యుబ్ కళాశాలలో గురువారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీకి సంబంధించిన సొసైటీ 1989లో మొదలైందని, 2003 నుంచి తాను కాలేజీకి చైర్మన్గా ఉన్నానన్నారు. కాలేజీకి సంబంధించి రెండు సొసైటీలు ఉన్నాయని పత్రికల్లో వచ్చిందని, అది వాస్తవం కాదన్నారు. ఆ సొసైటీ తమదని వాదిస్తున్న షేక్ నసీర్ హుస్సేన్కు, కాలేజీకి ఎలాంటి సంబంధం లేదని.. అతను కనీసం సభ్యుడు కూడా కాదన్నారు. సొసైటీకి సంబంధించిన పూర్తి ఆధారాలు తమ వద్ద ఉన్నాయని, 1999 నుంచి రికార్డులు పక్కాగా ఉన్నాయన్నారు. 1994లో కాలేజీలో అడ్మిషన్లకు అనుమతి వచ్చిందని, కాలేజీ కూడా బాగా నడిచేదన్నారు. ఎక్కువ మంది ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీకి వెళ్లడం వల్ల నష్టాలు వచ్చాయన్నారు. ఈ క్రమంలో చింతకొమ్మదిన్నె మండలం పబ్బాపురంలో కాలేజీకి సంబంధించిన 25 ఎకరాల భూమిని విక్రయించాలని సొసైటీ సభ్యులందరం నిర్ణయించామన్నారు. ఈ మేరకు 2018లో ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రెటరీ నుండి ఆర్డర్ కాపీ వచ్చిన తర్వాత కాలేజ్ డెవెలప్మెంట్ కోసం భూమిని న్యాయపద్ధతిలో అమ్మామని చెప్పారు. భూమి విక్రయించే అంశాన్ని జనరల్ బాడీ సమావేశంలో పెట్టి 19 మంది సభ్యులు ఆమోదించి, తీర్మానించిన తర్వాతే విక్రయించామన్నారు. మొదట టింబర్ డిపో సుధీర్కు విక్రయించామని, ఆయన అంత డబ్బు ఇవ్వలేనని చెప్పడంతో తిరిగి దానిని అమ్మకానికి పెట్టామన్నారు. ఆ తర్వాత శ్రీ లక్ష్మి పద్మావతి కన్స్ట్రక్షన్స్ వారు దానిని కొనుగోలు చేశారని, మాజీ ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి అందులో వాటాదారు మాత్రమేనన్నారు. తమకు పార్టీలతో సంబంధం లేదని, ఎవరు డబ్బు ఇస్తే వారికి విక్రయించామన్నారు. అమ్మిన తర్వాత వచ్చిన డబ్బుతో కాలేజీని అభివృద్ధి చేశామని, తరగతి గదులు, ప్రహరీ గోడ, స్పోర్ట్స్ రూమ్ వంటివి నిర్మించామన్నారు. పేద ముస్లిం విద్యార్థులను ఉన్నత చదువులు చదివించాలని నర్సింగ్ కాలేజీ, బీఈడీ కాలేజీల అనుమతుల కోసం ప్రయత్నం చేస్తున్నామన్నారు. ప్రతి ఏడాది సొసైటీకి ఎన్నికలు జరుగుతున్నాయని, అందుకు సంబంధించిన రికార్డులు కూడా ఉన్నాయన్నారు. ప్రతి ఒక్కరూ ఈ వాస్తవాలను గ్రహించాలని, అనవసరమైన ఆరోపణలు చేయవద్దని తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీ ఛైర్మెన్ ఎస్.ఖాదర్బాష కోరారు. ఈ సమావేశంలో ఎస్ఎండీ ఆజమ్ తదితరులు పాల్గొన్నారు. 2003 నుంచి తయ్యుబ్ ముస్లిం పాలిటెక్నిక్ కాలేజీకి చైర్మన్గా ఉన్నా షేక్ నసీర్ హుస్సేన్కు, కాలేజీకి ఎలాంటి సంబఽంధం లేదు ఎస్. ఖాదర్బాష -
హౌసింగ్ ఇన్చార్జి డీఈఈ సస్పెన్షన్
ప్రొద్దుటూరు : హౌసింగ్ డిపార్ట్మెంట్లో ప్రొద్దుటూరు రూరల్ ఏఈతోపాటు ఇన్చార్జి డీఈఈగా విధులు నిర్వహిస్తున్న సుబ్రహ్మణ్యంను సస్పెండ్ చేశారు. హౌసింగ్ నిర్మాణానికి సంబంధించిన గోడౌన్లోని ఐరన్ మాయం కావడంతో జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ రాజారత్నం ఈయనను గురువారం సస్పెండ్ చేశారు. రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ మాయమైన విషయం తెలిసిందే. తదుపరి విచారణ పూర్తయ్యే వరకు డీఈఈ ప్రొద్దుటూరు విడిచి వెళ్లకూడదని పీడీ ఆదేశించారు. ఆగి ఉన్న ట్రాక్టర్ను ఢీకొన్న మరో ట్రాక్టర్ జమ్మలమడుగు: పట్టణంలోని మద్దనూరు రహదారిలో టైరుకు పంచర్ వేయించుకోవటానికి రోడ్డు ప క్కన నిలిపి ఉంచిన ట్రాక్టర్ను వెనుకవైపు నుంచి మ రో ట్రాక్టర్ ఢీకొంది. ఈ ట్రాక్టర్ బైక్ను ఢీకొని కాలువ పైకి ఎక్కి నిలబడిపోయింది.ఈ సంఘటన గురువా ర ం ముద్దనూరు రహదారిలో జరిగింది.ఎవరికీ గాయా లు కాక పోవడంతో అందరూ ఊపిరిపీల్చుకున్నారు. -
పోలీసుల అదుపులో క్రికెట్ బుకీలు
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో క్రికెట్ బుకీల ఇళ్లపై పోలీసులు దాడులు నిర్వహించారు. దాడిలో ముగ్గురు బుకీలను అదుపులోకి తీసుకోగా గాంధీరోడ్డులోని ప్రధాన క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు పోలీసులు చెబుతున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు.. హిందూపురంలో క్రికెట్ నిర్వహిస్తూ అక్కడి బుకీలు కొందరు రెండు రోజుల క్రితం పోలీసులకు పట్టుబడ్డారు. పట్టుబడిన క్రికెట్ బుకీలకు ప్రొద్దుటూరులోని ఇద్దరు బుకీలకు సంబంధం ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఆ ఇద్దరి ద్వారా గాంధీరోడ్డులోని ఒక ప్రధాన బుకీకి లింక్ ఉన్నట్లు పోలీసుల విచారణలో బహిర్గతమైంది. దీంతో రూరల్ పోలీసులు బుధవారం అర్దరాత్రి సమయంలో ఏక కాలంలో బుకీల ఇళ్లపై దాడులు నిర్వహించి ముగ్గురిని అదుపులోకి తీసుకొని విచారణ చేస్తున్నట్లు తెలిసింది. పోలీసుల రాకను పసిగట్టిన గాంధీరోడ్డులోని క్రికెట్ బుకీ తప్పించుకున్నట్లు సమాచారం. పెద్ద మొత్తంలో డబ్బు కూడా దొరికినట్లు తెలుస్తోంది. పట్టుబడిన బుకీలను పోలీసులు విచారణ చేస్తున్నారు. వారు ఇచ్చిన సమాచారం ఆధారంగా పోలీసులు కూపీ లాగుతున్నారు. బుకీల మధ్య ఉన్న లింకులను గుర్తిస్తూ పోలీసులు లోతుగా విచారణ చేస్తున్నట్లు తెలుస్తోంది. 5 మేకలు చోరీ బద్వేలు అర్బన్ : మండల పరిధిలోని చింతలచెరువు పంచాయతీ అబ్బుసాహెబ్పేట గ్రామంలో 5 మేకలు చోరీకి గురైనట్లు రూరల్ పోలీసులు కేసు నమోదు చేశారు. వివరాలు..పట్టణంలోని విద్యానగర్లో బోవిళ్ళఎరికలరెడ్డి, సుజాత దంపతులు నివసిస్తుంటారు. ఎరికలరెడ్డి అబ్బుసాహెబ్పేట గ్రామంలో కొంత పొలాన్ని కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. పొలం వద్దనే గేదెలను, మేకలను కూడా పోషించుకుంటుండేవాడు. ఈ క్రమంలో బుధవారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 5 మేకలు చోరీ చేసినట్లు సుజాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రంగారావు తెలిపారు. పీజీ ఈసెట్లో ఒంటిమిట్ట విద్యార్థి ప్రతిభ ఒంటిమిట్ట (సిద్దవటం): ఇటీవల జరిగిన పీజీ ఈసెట్ పరీక్షల్లో ఒంటిమిట్ట లోని నాగేటి తిప్పపై నివాసం ఉంటు న్న కె.నరసింహులు, కె.లక్ష్మీదేవి దంపతుల కుమారుడు కె.శంకరయ్య ప్రతిభ కనబరిచాడ. స్టేట్ ఫస్ట్ ర్యాంక్ వచ్చినట్లు కుటుంబసభ్యులు గురువారం తెలిపారు. విద్యార్థి కె.శంకరయ్య రాజంపేట ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలో పాలిటెక్నిక్, తిరుపతి ఎస్వీ యూనివర్శిటీలో బీటెక్ను కూడా పూర్తి చేశాడు. ఇటీవల జరిగిన పీజీ ఈసెట్ పరీక్ష ఫలితాల్లో కె.శంకరయ్య 120 మార్కులకు 90 మార్కులు సాధించి స్టేట్ ఫస్ట్ ర్యాంకర్గా నిలిచాడు.కుటుంబసభ్యులు, గ్రామస్తులు శంకరయ్యను అభినందించారు. బాధ్యతలు అప్పగింత కడప ఎడ్యుకేషన్: నూతన డీఎస్ఓగా నియమితులైన లేబాక బాలాజీకి మాజీ డీఎస్ఓ వేపరాల ఎబినేజర్ గురువారం బాధ్యతలు అప్పగించారు. బాధ్యతలు చేపట్టిన బాలాజీని సర్ సీవీ రామన్ సైన్స్ క్లబ్ గౌరవాధ్యక్షులు డా. గునిశెట్టి శ్రీనివాసులు ఆధ్వర్యంలో క్లబ్ సభ్యులు కలిశారు. పూలమాలతో సన్మానించారు.కార్యక్రమంలో డీసీఈబీ సెక్రటరీ చంద్రశేఖర్ రావు, సైన్స్ మ్యూజియం కురేటర్ రెహమా న్, మాజీ డీఎస్ఓలు ఎబినేజర్, నిత్యానంద రెడ్డి, క్లబ్ సభ్యులు గంగాధర్, మఽ దుసూదన్, క్రిష్ణ కిషోర్, బాలకష్ణ, ఎన్జీసీ కన్వీనర్ విజయ ప్రసాద్ పాల్గొన్నారు. గంజాయి కేసులో ఐదుగురు నిందితుల అరెస్టు కడప అర్బన్: కడప పాత బస్టాండు సమీపంలో గురువారం గంజాయి విక్రయిస్తున్న ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ చిన్న పెద్దయ్య తెలిపారు. సీఐ వివరాల మేరకు కడప వక్కల పేట గూడూరు హరిజనవాడకు చెందిన ఖాజా ఆరిఫ్ అహ్మద్ అల్యూమినియం పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. కడప అల్మాస్పేటకు చెందిన షేక్ గౌస్ పీర్ అలియాస్ కచ్చా ఐడిల్ కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కడప నకాష్ చెందిన షేక్ రియాజ్ పండ్ల వ్యాపారం నిర్వహిస్తున్నాడు. కడప అగాడివీధికి చెందిన పఠాన్ మహమ్మద్ గౌస్ డ్రైవర్ గా పనిచేస్తున్నాడు. కడప చిలకల బావి లో ఉన్న సవైపుర స్ట్రీట్ కి చెందిన పఠాన్ అబ్దుల్లా అలియాస్ ఆతుల్లా ఖాన్లు బ్యాచ్ గా తయారై, ఇతర ప్రాంతాల నుంచి గంజాయి కొనుగోలు చేసి ఇక్కడి వారికి పొట్లాలు చేసి విక్రయిస్తున్నట్లు సమాచారం వచ్చిందన్నారు. కడప ఇన్చార్జి డీఎస్పీ బాలస్వామి రెడ్డి ఆదేశాల మేరకు ఐదుగురిని అరెస్టు చేసి వారి వద్ద నుంచి 1200 గ్రాముల గంజాయి, రెండు సెల్ ఫోన్లు, రూ.1500 నగదును స్వాధీనం చేసుకున్నారు. వారిని కోర్టులో మెజిస్ట్రేట్ ముందు హాజరుపర్చగా రిమాండ్కు తరలించారు. మహిళపై దుర్భాషలాడిన ఆర్టీసీ కండక్టర్ కడప అర్బన్: కూటమి ప్రభుత్వం అమలు చేసిన సీ్త్ర శక్తి పథకానికి తూట్లు పొడిచేలా ఆర్టీసీ సిబ్బంది అసహనానికి గురవుతూ మహిళలపై దుర్భాషలాడుతున్నారు. తాజాగా కడప నగరంలో ఆర్టీసీ పల్లె వెలుగు బస్సు ఎక్కేందుకు ప్రయత్నించిన మహిళను కండక్టర్ దుర్భాషలడటం, కొట్టడానికి ప్రయత్నించడం లాంటి సంఘటన ఇందుకు నిదర్శనం. బాధితురాలు తిరుపపులి వాణి పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఈ విధంగా పేర్కొంది. కడపలోని రామాంజనేయ పురం జర్నలిస్ట్ కాలనీకి చెందిన వాణి తన కుమార్తెకు సంబంధించిన అప్లికేషన్ తీసుకొచ్చేందుకు గురువారం మధ్యాహ్నం కడపకు వచ్చింది. నారాజుపేటలోని సన్రైజ్ హాస్పిటల్ ఎదురుగా పాత బస్టాండ్కు వెళ్లేందుకు ఆ మార్గంలో వెళుతున్న ఆర్టీసీ బస్సును నిలిపి ఎక్కడానికి ప్రయత్నించింది. బస్సు ఎక్కగానే కండక్టర్ దుర్భాషలాడుతూ.. మహిళా అని చూడకుండా కొట్టడానికి ప్రయత్నించాడు. బస్సులో నుంచి బయటకు తోసేసి వెళ్లిపొమ్మన్నాడు. దీంతో పాత బస్టాండ్ లో ఉన్న డ్యూటీలో ఉన్న పోలీసులకు తెలియజేసింది. పోలీసుల సమక్షంలోనే కండక్టర్, తనపైనే ఫిర్యాదు చేస్తావా? అంటూ మహిళను కొట్ట బోయాడు. పోలీసులు అడ్డుకున్నారు. తనపై దాడికి ప్రయత్నించిన కండక్టర్ పై మహిళ పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ సంఘటనపై కడప వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
హాకీ మైదానం పరిశీలన
కడప వైఎస్ఆర్ సర్కిల్: కడప మున్సిపల్ మైదానంలోని హాకీ గ్రౌండ్ (టర్ఫ్ పిచ్)ను నగరపాలక సంస్థ అడిషనల్ కమిషనర్ రాకేష్ చంద్ర గురువారం పరిశీలించారు. మున్సిపల్ మైదానంలో క్రీడాకారులకు అందుతున్న సౌకర్యాలను తనిఖీ చేశారు. మైదాన శుభ్రత, తాగునీరు వంటి అంశాలను సమీక్షించి అధికారులకు పలు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ నూతన హాకీ గ్రౌండ్ను త్వరలో ప్రారంభించే విధంగా చర్య లు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. కాగా హాకీ మైదానం అందుబాటులోకి రాక క్రీడాకారులు ఇబ్బందులు పడుతున్నారనే విషయంపై సాక్షి లో కథనం ప్రచురితమైన విషయం విదితమే. డీఎస్డీఓ గౌస్ బాషా పాల్గొన్నారు. -
కొత్త సీసాలో పాత సారా
పీజీఆర్ఎస్, వాట్సాప్ గవర్నెన్స్, రెవెన్యూ క్లినిక్ ఇలా పలు పేర్లతో కార్యక్రమాలు చేపట్టారు. ఎన్ని పేర్లు పెట్టినా సమస్యలు యథాతథంగా ఉన్నాయి. దీంతో అనేక వ్యయ ప్రయా సలు కోర్చి ప్రజలు పీజీఆర్ఎస్కు వస్తున్నారు. క్షేత్ర స్థాయిలోనే సమస్యలు పరిష్కారం అయ్యే విధంగా పటిష్టవంతమైన చర్యలు తీసుకోవాలి. అర్జీలను గడువులోపు పరిష్కరించడంపై ప్రత్యేక దృష్టి సారించకుండా వన్మంత్...వన్ విలేజ్...అనే కొత్త పేరుతో రావడం వల్ల ఉపయోగం లేదు. – ఎ.రామ్మోహన్రెడ్డి, సీపీఎం నగర కార్యదర్శి, కడప -
అడ్మిషన్.. టెన్షన్
సాక్షి అన్నమయ్య: ప్రైవేటు టీచర్లకు అడ్మిషన్ల అగ చాట్లు తప్పడం లేదు. అసలే మండే ఎండలకు తోడు ఉక్కపోతతో అల్లాడుతుంటే.. అడ్మిషన్ల టార్గెట్లు వారిలో మరింత వేడి పుట్టిస్తోంది. కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు టార్గెట్లు పెట్టి వీధుల్లో పరుగెత్తిస్తుంటే... మరికొన్ని పాఠశాలల యాజమాన్యాలు బస్సుల్లో టీచర్లకు పల్లెలకు తీసుకెళ్లి కరపత్రాల ద్వారా ప్రచారం చేయడంతోపాటు అడ్మిషన్లు చేయించేలా ఒత్తిళ్లు పెడుతున్నారు. లేకపోతే ఈ ఏడాది జూన్లో ప్రారంభమయ్యే కొత్త విద్యా సంవత్సరానికి సంబంధించి ఉపాధ్యాయ పోస్టుకు రెన్యూవల్ ఉండదని భయపెట్టిస్తున్నారు. సాధారణంగా వేసవి సెలవుల్లో విహార యాత్రలకు కుటుంబ సభ్యులతో వెళ్లి ఎంజాయ్ చేయాల్సిన సమయంలో... పల్లెలు, పట్టణాల్లో తిరగాల్సి వస్తోందని ప్రైవేటు టీచర్లు వాపోతున్నారు. అన్నమయ్య జిల్లాతోపాటు వైఎస్సార్ జిల్లాలో దాదాపు వెయ్యికి పైగా ప్రైవేటు పాఠశాలలు ఉన్నాయి. ఇందులో కొన్ని ప్రైవేటు యాజమాన్యాలు ఉపాధ్యాయులపై టార్గెట్లు విధిస్తున్నారు. ఒక్కో ఉపాధ్యాయుడికి 10–15 అడ్మిషన్లు చేయించాలని తీవ్రమైన ఒత్తిడి చేస్తున్నారు. ఇది తగునా! సమాజంలో ఉపాధ్యాయులకు ప్రత్యేక స్థానం ఉంది. తల్లిదండ్రుల తర్వాత స్థానం గురువుదే. అలాంటి ఉపాధ్యాయులను వీధుల్లోకి పంపి అడ్మిషన్లకోసం ఇబ్బందులు పెట్టడంపై సర్వత్రా విస్మయం వ్యక్తమవుతోంది. ప్రైవేటు పాఠశాలల మధ్య పోటీతత్వం పెరగడంతో విద్యార్థుల సంఖ్యను పెంచుకునేందుకు ఎవరివారు తాపత్రయ పడుతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో మధ్యలో ప్రైవేటు ఉపాధ్యాయులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అడ్మిషన్లు చేయకపోతే ఉద్యోగం రెన్యూవల్ ఉండదన్న ఆందోళన ఉపాధ్యాయుల్లో వెంటాడుతోంది. ప్రైవేటు పాఠశాలల టీచర్లకు టార్గెట్ల తిప్పలు ఒక్కొక్కరికి 10–15 అడ్మిషన్లు అంటూ ఒత్తిడి రెన్యూవల్ ఉండదేమోనన్న భయంతో టీచర్ల పరుగులు -
ఇద్దరు బాలురు అదృశ్యం
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులో ఇద్దరు బాలురు అదృశ్యం అయ్యారు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని ప్రకాశం వీధికి చెందిన నల్లమియ్య అర్హాన్, మౌలానా ఆజాద్ వీధికి చెందిన షేక్ రిహాన్లు స్నేహితులు. వీళ్లిద్దరూ సోమవారం ఆడుకోవడానికి బయటికి వెళ్లారు. అయితే ఆ రోజు ఇంటి నుంచి వెళ్లిన పిల్లలు తిరిగి రాలేదు. పట్టణంలోని పలు ప్రాంతాల్లోనూ. బంధువుల ఊళ్లలో గాలించినా బాలు ర ఆచూకీ తెలియలేదు. దీంతో పిల్లల తల్లిదండ్రులు బుధవారం రాత్రి వన్టౌన్ పోలీసులను ఆశ్రయించారు. పిల్లలు కనిపించకపోవడంతో తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు పట్టణ పరిధిలో బుధవారం గుర్తు తెలియని వాహనం బైక్ను ఢీకొనడంతో డానియేలు (65) అనే వ్యక్తి మృతి చెందాడు. ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దముడియం మండలం గరిశలూరు గ్రామానికి చెందిన డానియేలు బ్యాంక్ పని నిమిత్తం జమ్మలమడుగు పట్టణానికి ద్విచక్రవాహనంలో వచ్చాడు. పని ముగించుకొని తిరిగి స్వగ్రామానికి వెలుతుండగా రామిరెడ్డిపల్లె శివార్లలో వెనుక వైపు నుంచి గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ఈ సంఘటనలో డానియేలు అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహన్ని పోస్ట్మార్టం నిమిత్తం జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. భార్య వసంతమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
ముగిసిన మహాకుంభాభిషేక మహోత్సవం
చక్రాయపేట: పవిత్ర పుణ్య క్షేత్రమైన గండి వీరాంజనేయ స్వామి నూతన ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు బుధవారంతో అత్యంత వైభవంగా ముగిశాయి. సుమారు ఆరు రోజులపాటు నిర్విఘ్నంగా పలు హోమాలు నిర్వహించి వేడుకలను ముగించారు. చివరి రోజు శ్రీమద్రామాయణ పట్టాభిషేకం,మహపూర్ణాహుతి,దక్షిన రాజగోపుర విమా ణ కలిశాలు, దీపస్తంభ కలశం తదితర కార్యక్ర మాలను నిర్వహించారు. అనంతరం భక్తులకు మూలవిరాట్ దర్శనం కల్పించారు, అహోబిల పీఠం నుంచి ప్రధాన అర్చకుడు రమేష్ చేతుల మీదుగా శ్రీకార్యం, పుష్పగిరి పీఠాధిపతి విద్యాశంకర భారతి స్వామిలచే విమాన కలశ స్థాపన, భూమానందాశ్రమ పీఠాధిపతి మాతాజి ప్రతిభానందగిరి ఉత్తరాధికారి ప్రణవానంద స్వామి చేతుల మీదుగా ఈకార్యక్రమం జరిగింది. ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్, చైర్మన్ వెంకటస్వామి ఆధ్వర్యంలో టీటీడీ ఆగమ శాస్త్ర సలహాదారులు రాజేష్ స్వామి, విజయ్ స్వామిల శిష్య బృందం ఆలయ అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు, రామమోహన్శర్మ పర్యవేక్షణలో ఈకార్యక్రమాలు జరిగాయి. చాలా రోజుల తర్వాత.. వీరాంజనేయ స్వామి మూల విరాట్ దర్శనం భక్తులకు సరిగ్గా నాలుగేండ్ల,ఆరు మాసాల ,పదిహేడు రోజులకు లభించింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ పునర్నిర్మాణానికి రూ.28.5 కోట్లు మంజూరు కావడంతో 2021లో పలు యజ్ఙ యాగాదులు నిర్వహించి బాలాలయంలో దారువుతో చేసిన స్వామి వారి ఽప్రతిమకు జీవం పోసి అక్కడ భక్తులకు దర్శన వసతిని కల్పించి ప్రధాన ఆలయాన్ని మూసి పగులగొట్టారు. అప్పటి నుంచి భక్తులకు మూల విరాట్ దర్శనం కరువైంది. తిరిగి బుధవారంతో భక్తులకు స్వామి మూలవిరాట్ దర్శనం లభించింది. హాజరైన కలెక్టర్,కమిషనర్ మహాకుంభాభి వేడుకలకు కలెక్టర్ చెరుకూరు శ్రీధర్, దేవదాయ ధర్మదాయ శాఖ కమిషనర్ రామచంద్రమోహన్ హాజరయ్యారు. ఈసందర్భగా ఆలయ అర్చకులు వారికి పూర్ణఫలంతో స్వాగతించి తీర్థప్రసాదాలను అందజేశారు. కార్యక్రమంలో డీఆర్డీఏ,డ్వామా పీడీలు రాజ్యలక్ష్మి,ఆదిశేషారెడ్డి,ఆర్డబ్ల్యూస్ ఎస్ఈ ఏడుకొండలు.ఈఈ శ్రీనివాసులు,ఏఈ రమేష్రెడ్డి,దేవదాయశాఖ ఎస్ఈ సతీష్ జిల్లా సహాయ కమీషనర్ శంకర్ పాల్గొన్నారు. నాలుగేండ్ల ఆరు మాసాలపదిహేడు రోజుల తర్వాత భక్తులకు మూల విరాట్ దర్శనం తన్మయత్వంతో పరవశించిన భక్తులు హాజరైన పీఠాధిపతులు. కలెక్టర్ తదితరులు -
రెండు కార్లను ఢీకొన్న కారు
మైదుకూరు : మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని భూమాయపల్లె – కేశ లింగాయపల్లె గ్రామాల మధ్యలో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారిపై బుధవారం సాయంత్రం ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఓ కారు ఢీకొన్న సంఘటనలో 8 మందికి గాయాలయ్యాయి. వారిలో తీవ్రంగా గాయపడిన భార్యాభర్తలను మెరుగైన చికిత్స కోసం కడపకు తరలించారు. బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఆళ్లగడ్డకు చెదిన పోతులూరు ఆచారి తన కుమారుడు వేత విఖ్యాత్ పుట్టు వెంట్రుకలు తీయించేందుకు బ్రహ్మంగారిమఠానికి బంధుమిత్రులతో కలిసి ఓ కారు, లారీలో వెళ్లారు. కార్యక్రమం ముగియాగానే పోతులూరు ఆచారి, బంధువులైన ఈశ్వరమ్మ, వెంకటేశ్వర్లు, గోవిందయ్య, కుమారుడు వేద విఖ్యాత్ కారులో బయల్దేరారు. బంధువులు ఉన్న లారీ వెనుక అనుసరించింది. గిద్దలూరుకు చెందిన పల్లెపాల్ ప్రతాప్ అనే వ్యక్తి కడపలో ఉన్న తన కుమార్తె బ్యూలా గర్భిణిగా ఉండటంతో రెస్ట్ తీసుకునేందుకు తన బంధువు సుధీర్ బాబుతో కలిసి కడప నుంచి కారులో పిలుచుకొస్తున్నాడు. మైదుకూరు మండలం గంజికుంటకు చెందిన సునీల్, సునీత అనే భార్యాభర్తలు మల్లేపల్లెలో ఉన్న తన కుమార్తె వద్దకు కడప నుంచి కారులో బయలుదేరారు. ఈ మూడు కార్లు మైదుకూరు మున్సిపాలిటీలోని భూమాయపల్లె – కేశలింగాయపల్లె గ్రామాల మధ్యకు రాగానే ఆళ్లగడ్డకు చెందిన కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారి తన ముందున్న ఓ వాహనాన్ని ఓవర్టేక్ చేసి ఎదురుగా వస్తున్న రెండు కార్లను ఒకదాని తర్వాత ఒక దానిని ఢీకొట్టాడు. సంఘటనలో గంజికుంటకు చెందిన సునీల్, సునీత, గిద్దలూరుకు చెందిన పాల్ ప్రతాప్, ఆళ్లగడ్డ కారును డ్రైవింగ్ చేస్తున్న పోతులూరు ఆచారికి తీవ్ర గాయాలయ్యాయి. పాల్ ప్రతాప్ కారు డ్రైవర్.. ఓనర్ అయిన సుదర్శన్, వెంకటేశ్వర్లు, ఈశ్వరమ్మ, గోవిందయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. సమాచారం అందగానే మైదుకూరు ఖాజీపేట 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులను మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. తాను గర్భిణిగా ఉండటంతో తాము ప్రయాణిస్తున్న కారును నెమ్మదిగా పోనిస్తున్నామని, బ్రహ్మంగారిమఠం నుంచి వస్తున్న కారు ఓ వాహనాన్ని ఓవర్ టేక్ చేసి తమ కారును, మరో కారును ఢీకొట్టినట్టు గిద్దలూరుకు చెందిన బ్యూలా తెలిపారు. మైదుకూరు పోలీసులు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని సంఘటన వివరాలను నమోదు చేసుకున్నారు.8 మందికి గాయాలు -
సప్లిమెంటరీ పరీక్షలు సజావుగా నిర్వహించాలి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షలను సజావుగా, ప్రశాంతంగా పకడ్బందీగా నిర్వహించాలని డీఆర్వో మల్లికార్జునుడు సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లోని డీఆర్ఓ చాంబర్లో ఇంటర్మీడియట్ సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణ ఏర్పాట్లపై సంబంధిత శాఖల అధికారులతో జిల్లా పరీక్షల నిర్వహణ సమన్వయ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఆర్వో మాట్లాడుతూ రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డు నిర్ణయించిన షెడ్యూలు ప్రకారం ఇంటర్మీడియట్ మొదటి, ద్వితీయ సంవత్సరం కోర్సులకు సంబంధించి మే 21వ తేదీ నుంచి జూన్ 4 వరకు సప్లిమెంటరీ పరీక్షలు నిర్వహించనున్నట్లు తెలిపారు. ఆయా తేదీల్లో మొదటి సంవత్సర విద్యార్థులకు ఉదయం 9 నుంచి 12 వరకు, రెండవ సంవత్సర విద్యార్థులకు మధ్యాహ్నం 2.30 నుండి 5.30 వరకు పరీక్షలను నిర్వహించడం జరుగుతుందన్నారు. జిల్లాలో మొత్తం 46 కేంద్రాల్లో పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేయడం జరిగిందన్నారు. ఆయా కేంద్రాల వద్ద గట్టి బందోబస్త్ ఏర్పాటు చేయాలనీ పోలీస్, రెవిన్యూ అధికారులకు సూచించారు. విద్యార్థులు సహాయం కొరకు కంట్రోల్ రూమ్ ఫోన్ నెంబర్ 08562 244171 కు ఫోన్ చేయవచ్చన్నారు. డీఆర్వో మల్లికార్జునుడు -
పేద ప్రజల ఆకలి తీర్చే సేవా కార్యక్రమాలపై విషపు రాతలు
కడప కార్పొరేషన్ : పేద ప్రజల ఆకలి తీర్చే సేవా కార్యక్రమాలపై ఈనాడు పత్రిక విషపు రాతలు రాయడం తీవ్ర అభ్యంతరకరమని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిశోర్ బూసిపాటి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎస్సీ విభాగం జిల్లా అధ్యక్షుడు సింగమాల వెంకటేశ్వర్లు, వైద్య విభాగం సభ్యులు పెంచలయ్యలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ పేదలకు మెరుగైన వైద్యం అందించాలనే సత్సంకల్పంతో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ రిమ్స్ ఆసుపత్రిని నెలకొల్పారన్నారు. జిల్లా వ్యాప్తంగా మెరుగైన వైద్యం కోసం రిమ్స్ ఆసుపత్రికి వచ్చే పేద ప్రజల ఆకలి తీర్చాలనే సదుద్దేశంతో 2007వ సంవత్సరం నుంచి పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్ట్ ద్వారా కమలాపురం మాజీ ఎమ్మెల్యే పోచంరెడ్డి రవీంద్రనాథ్ రెడ్డి కోట్ల రూపాయలు వెచ్చించి రోగులు, వారి సహాయకుల ఆకలి తీరుస్తున్నారన్నారు. రోజుకు 700 నుంచి 800 పేద ప్రజలకు మెరుగైన భోజన వసతులు కల్పించి, 19 ఏళ్లుగా ప్రతినెలా రూ.7లక్షల చొప్పున ఇప్పటి వరకూ రూ.1.33 కోట్లు సొంత నిధులు వెచ్చించడం జరిగిందన్నారు. 2007లో అప్పటి కలెక్టర్ రిమ్స్ బయట ట్రస్ట్కు ప్రత్యేకంగా స్థలం కేటాయిస్తామని తెలిపినా సున్నితంగా తిరస్కరించి, సొంత నిధులతో బిల్డింగ్ నిర్మించి సేవా కార్యక్రమాలు కొనసాగించారన్నారు. ఈ మధ్య అక్కడున్న మేనేజర్, వంటవారు పొరపాట్లు చేస్తూ రోగులకు నాణ్యమైన ఆహారం అందించకపోవడం వల్ల తాత్కాలికంగా నిలుపుదల చేశారన్నారు. దీన్ని ఆసరాగా తీసుకొని పచ్చ మీడియా రోత రాతలతో అసత్యమైన ఆరోపణలతో ఎటువంటి వివరణ తీసుకోకుండా వార్తలు రాయడం దుర్మార్గమన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కిశోర్ బూసిపాటి -
ఉరివేసుకుని యువకుడు ఆత్మహత్య
వల్లూరు : మండల కేంద్రమైన వల్లూరులో గంజికుంట ప్రశాంత్(27) బుధవారం ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు వల్లూరుకు చెందిన ప్రశాంత్ ఆటో నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మూడేళ్ల క్రితం కడపలోని రాజారెడ్డి వీధికి చెందిన సునీతతో ఇతనికి వివాహం జరిగింది. మంగళవారం సాయంత్రం తన భార్యను ఆటోలో కడపలోని ఆమె పుట్టింట్లో వదిలి రేపు వచ్చి తీసుకుని వెళ్తానని చెప్పి వచ్చాడు. కుటుంబ సమస్యల నేపథ్యంలో బుదవారం వల్లూరులోని తన ఇంటిలో ఫ్యాన్కు చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఇతనికి భార్య, ఒక కుమారుడు, కుమార్తె ఉన్నారు. -
ఏపీఈఏపీ సెట్కు 93.59 శాతం హాజరు
కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్కు సంబంధించి మంగళవారం రెండు సెషన్స్లో నిర్వహించిన ఇంజనీరింగ్ అండ్ అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలకు సంబంధించి జిల్లావ్యాప్తంగా 93.59 శాతం మంది విద్యార్థుల హాజరయ్యారు. జిల్లావ్యాప్తంగా కడప, ప్రొద్దుటూరు, రాజంపేటలలో కలిసి 9 పరీక్షా కేంద్రాలకుగాను రెండు సెషన్స్కు సంబంధించి 1668 మంది అభ్యర్థులకుగాను 1561 మంది హాజరయ్యారు.కడప ఎడ్యుకేషన్: జిల్లాలోని గవర్నమెంట్, జిల్లా పరిషత్తు, మున్సిపల్ కార్పొరేషన్, కడప, ప్రొద్దుటూరు మునిసిపాలిటి పరిధిలో పనిచేస్తున్న సెకండరీ గ్రేడ్ ఉపాధ్యాయులు, తత్సమాన కేటగిరిల పాఠశాలల సహాయకులు తుది సీనియారిటి జాబితా( టీచర్ ఇన్ఫర్మెషన్ సిస్టమ్ ఆధారంగా) సబ్జెక్టుల వారిగా డీఈఓ వెబ్సైట్లో పొందు పరిచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. తుది సీనియారిటి జాబితాలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలలోపు రాత పూర్వకంగా సరైన ఆధారాలతో సంప్రదించాలని పేర్కొన్నారు. పులివెందుల రూరల్: పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె గ్రామంలో ఉన్న జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు మంచి మార్కులు సాధించడంతో దాతల సాయంతో విమానం ఎక్కారు. పదవ తరగతిలో ఉత్తమ మార్కులు సాధిస్తే విమానం ఎక్కిస్తామని, గతంలో ఇచ్చిన హామీని నల్లపురెడ్డిపల్లెకు చెందిన దాతలు నిలబెట్టుకున్నారు. పాఠశాలకు చెందిన 12మంది విద్యార్థులను అమరావతికి తీసుకెళ్లినట్లు పాఠశాల హెచ్ఎం రవీంద్రారెడ్డి తెలిపారు. విమాన ప్రయాణం చేయడం తమ జీవితంలో మరుపురాని అనుభూతిని ఇచ్చిందని విద్యార్థులు ఆనందం వ్యక్తం చేశారు. కడప ఎడ్యుకేషన్: జిల్లాలో సైన్సు కార్యకలాపాలను విస్తృతం చేయాలని జిల్లా విద్యాశాఖ అధి కారి షేక్ షంషుద్దీన్ సూచించారు. పెండ్లిమర్రి మండలం వెల్లటూరు జిల్లా పరిషత్తు ఉన్నత పాఠశాలలో ఫిజికల్ సైన్సు ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్న లేబాక బాలాజీని జిల్లా సైన్సు అధికారిగా జిల్లా విద్యాశాఖ అధికారి షేక్ షంషుద్దీన్ నియమించారు. ఈ మేరకు బుధవారం డీఈఓ కార్యాలయంలో బాలాజీకి నియామక ఉత్తర్వులను అందచేశారు. తనపై నమ్మకం ఉంచి జిల్లా సైన్సు అధికారిగా నియమించినందుకు లేబాక బాలాజీ డీఈఓకు కృతజ్ఞతలు తెలియ చేశారు. మాజీ జిల్లా సైన్సు అధికారి నిత్యానందరెడ్డి, సైన్సు ఉపాధ్యాయుడు గంగాధర్తోపాటు పలువురు సైన్సు ఉపాధ్యాయులు పాల్గొన్నారు. వేంపల్లె/చక్రాయపేట/పెండ్లిమర్రి: పాఠశాలలో పునః ప్రారంభమయ్యే నాటికే స్మార్ట్ కిచెన్ షెడ్లను పూర్తి చేయాలని కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం ఆయన వేంపల్లె, చక్రాయపేట జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో నిర్మాణంలోని స్మార్ట్ కిచెన్ షెడ్ పనులను ఆయన అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 25 తేదీలోగా ఈ పనులను పూర్తి చేయాలని కాంట్రాక్టర్లకు ఆదేశించారు. సెంట్రలైజ్డ్ మోడల్ కిచెన్ నిర్మాణంలో అవసరమైన మార్పులు, చేర్పులపై ఇంజనీరింగ్ అధికారులకు దిశా నిర్దేశం చేశారు. చక్రాయపేట జెడ్పీటీసీ శివప్రసాద్ రెడ్డి మండలంలో నెలకొన్న తాగునీటి సమస్య, ఉద్యాన పంటల సాగు చేసిన రైతుల కష్టాలు, తదితర వాటిని జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. -
ఆరోగ్యానికి కుండంత అండ!
పులివెందుల రూరల్: బయట ఎండకు తిరిగి అలసిపోయి వచ్చినప్పుడు కుండలోని గ్లాసు నీరు తాగితే దప్పిక తీరడమే కాదు.. ప్రాణమూ కుదుటపడుతుంది.. అవును.. ప్రిడ్జ్లోని ఐస్ నీరు కంటే మట్టి కుండలోని నీరు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్నారు వైద్య నిపుణులు. ఫ్రిడ్జ్ నీళ్లు తాగితే గొంతు సమస్యలు వస్తాయని వైద్యులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో పేద, మధ్య తరగతి ప్రజలే కాదు.. డబుల్ డోర్ ఫ్రిడ్జ్లు ఉన్న వారు సైతం మట్టి కుండలను కొనడానికి ఆసక్తి చూపిస్తున్నారు. ప్రస్తుత ఎండ తీవ్రత నేపథ్యంలో జిల్లా వ్యాప్తంగా మట్టి కుండల విక్రయాలు జోరుగా సాగుతున్నాయి. జిల్లాలోని ఆయా పట్టణాల్లో మట్టి కుండల విక్రయాలు రోజుకు వందల సంఖ్యలో అమ్ముడవుతున్నాయి. ఒక్కో కుండ సైజును బట్టి రూ.150ల నుంచి రూ.200ల వరకు విక్రయిస్తున్నారు. కుళాయి అమర్చిన కుండలపై వినియోగదారులు ఆసక్తి చూపుతున్నారు. గుజరాత్ రాష్ట్రం నుంచి కుండల దిగుమతి గుజరాత్ రాష్ట్రం నుంచి జామ్ అనే కొత్త కుండలను దిగుమతి చేసుకుని ఇక్కడ విక్రయిస్తున్నారు. వేసవి కాలంలో ఈ కుండలకు మంచి డిమాండ్ ఉంది. గుజరాత్కు చెందిన జాబ్ కుండలు ఒక్కొక్కటి రూ.200ల నుంచి రూ.300ల వరకు విక్రయిస్తున్నట్లు వ్యాపారస్తులు తెలిపారు. అలాగే కర్నూలు, కడప, కమలాపురం, మదనపల్లె తదితర ప్రాంతాల నుంచి కొనుగోలు చేసుకుని స్థానికంగా విక్రయిస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. కుండనీళ్లు ఆరోగ్యానికి శ్రేష్టమంటున్న వైద్య నిపుణులు వేసవికాలంలోనే కుండలకు గిరాకీ -
కడప దెబ్బ.. ఢిల్లీ అబ్బా అనేలా చేసిన జగన్
కడప కార్పొరేషన్ : పదిహేనేళ్ల క్రితం జరిగిన ఉప ఎన్నికల్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కడప దెబ్బ అంటే ఢిల్లీ అబ్బ అనేలా చేశారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకట సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణాన్ని తట్టుకోలేక మరణించిన వారందరినీ పరామర్శించేందుకు వై.ఎస్ జగన్ ఓదార్పు యాత్ర చేపడితే, కాంగ్రెస్ చీఫ్ సోనియా గాంధీ దానిని అడ్డుకుని, సీబీఐ కేసులు పెట్టి వైఎస్ కుటుంబాన్ని బలహీన పర్చాలని కుట్ర చేసిందన్నారు. ఈ నేపథ్యంలో వైఎస్ జగన్ లోక్ సభ (పార్లమెంట్) సభ్యత్వానికి రాజీనామా చేసి... రికార్డు మెజారిటీతో తాను గెలవడమే కాకుండా, తన తల్లి వై.ఎస్ విజయమ్మను రికార్డు మెజారిటీతో గెలిపించి కడప జిల్లా చరిత్రను దేశానికి చాటిన దమ్మున్నోడు వైఎస్ జగన్ అని కొనియాడారు. సోనియా గాంధీని, ఢిల్లీ సింహాసనాన్ని గడగడలాడించి లోక్ సభ సభ్యుడిగా వై.ఎస్ జగన్ 5,45,672 ఓట్లు రికార్డు మెజారిటీతో గెలిచారన్నారు. కాంగ్రెస్ పార్టీ కుట్రపూరితంగా వైఎస్ విజయమ్మపై తన బాబాయ్ వివేకానంద రెడ్డిని పోటీ చేయించినా కాంగ్రెస్, టీడీపీలను ఓడించి పులివెందుల ఎమ్మెల్యేగా 81,373 ఓట్లతో తన తల్లి వై.ఎస్ విజయమ్మ ను గెలిపించుకుని కడప పౌరుషాన్ని చూపించారన్నారు.ఆ చారిత్రాత్మక ఘట్టానికి 13 మే 2026 నాటికి అంటే బుధవారానికి 15 ఏళ్లు పూర్తి కావడం సంతోషదాయకమన్నారు. వై.ఎస్ కుటుంబానికి చేసిన నమ్మకద్రోహానికి, నాడు వై.ఎస్ జగన్ను 16 నెలలు అన్యాయంగా, అక్రమ కేసులు పెట్టిన పాపానికి నేటికీ కాంగ్రెస్ కోలుకోలేని స్థితికి చేరి భారీ మూల్యం చెల్లించుకుందన్నారు. ఇది వై.ఎస్ జగన్ చరిస్మాకు,ధైర్య సాహసాలకు, నీతి, నిజాయితీ, నిబద్ధతకు నిలువెత్తు నిదర్శనమన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్, మంత్రి నారా లోకేష్ మొదలు కూటమి నేతలంతా వై.ఎస్ జగన్ పేరు, నామస్మరణ లేకుండా ప్రసంగాలు చేయలేక ఉన్నారని, ఈనాడు, ఆంధ్రజ్యోతి పత్రికల్లో జగన్ పేరు లేకుండా కథనాలు ఉండటం లేదన్నారు. ఇది వై.ఎస్ జగన్ అంటే వారందరికీ ఉన్న భయానికి ఇది ప్రత్యక్ష నిదర్శనమన్నారు. సమావేశంలో వైయస్సార్సీపీ నాయకుడు ఆర్. శ్రీకాంత్ రెడ్డి పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి ఆర్.వెంకట సుబ్బారెడ్డి -
అంతర్రాష్ట్ర దొంగల అరెస్ట్
పోలీసులు స్వాధీనం చేసుకున్న ద్విచక్ర వాహనాలుఅరెస్టు చూపుతున్న డీఎస్పీ మురళీ నాయక్, పోలీసులు పులివెందుల రూరల్ : చైన్ స్నాచింగ్, బంగారు షాపుల్లో దొంగతనాలు ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడిన 13 మంది దొంగలను అరెస్టు చేసినట్లు వైఎస్సార్ కడప జిల్లా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ తెలిపారు. బుధవారం సీఐ, ఎస్ఐలతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడుతూ అంతర్రాష్ట్ర దొంగలను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి 19 ద్విచక్రవాహనాలు, రూ.2.79 లక్షల నగదు, కేజీ వెండి, 194గ్రాముల బంగారు వస్తువులు, రెండు మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నామన్నారు. పట్టణంలోని కదిరి రోడ్డులో మున్సిపాలిటీ డంపింగ్ యార్డు వద్ద, కడప రింగురోడ్డు వద్ద ద్విచక్రవాహనాల దొంగలను, పార్నపల్లె బస్టాఫ్ వద్ద గోల్డ్ షాపులో బంగారు దొంగతనం చేసిన దొంగలను, ఉలిమెల్ల రింగ్ రోడ్డు వద్ద చైన్ స్నాచింగ్ పాల్పడే దొంగలు 13 మందిని 22 కేసుల్లో అరెస్టు చేసినట్లు చెప్పారు.ద్విచక్రవాహనాల దొంగల నుంచి రూ.2.79లక్షల నగదు, రూ.80వేలు విలువ చేసే కేజీ వెండి వస్తువులు, రూ.18.15లక్షల విలువ గల 19 బైక్లు, రూ.50వేలు విలువ చేసే రెండు సెల్ ఫోన్లు, చైన్స్నాచింగ్ దొంగల నుంచి రూ.13.52లక్షలు విలువ చేసే 91 గ్రాముల బంగారు వస్తువులు, బంగారు షాపుల్లో చోరీకి పాల్పడే దొంగల నుంచి రూ.15లక్షలు విలువ చేసే 103 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నామన్నారు. మొత్తం రూ.53.00,700ల విలువ గల బంగారు, వెండి, నగదు, ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకోవడంతోపాటు నిందితులను అరెస్టు చేసినట్లు చెప్పారు. అరెస్టు చేసిన వారిలో నాగబాష. బూస్పాటి కుమార్, గంగయ్య, హుస్సేన్, మలికి విజయ్లను, అలాగే బీహార్ రాష్ట్రం భగల్పూర్ జిల్లాకు చెందిన చోటు కుమార్, నారాయణమ్మ, ఉమాదేవిలను అరెస్ట్ చేశామన్నారు. మిగిలిన ఐదుగురు పరారీలో ఉన్నారని, వారిలో త్వరలో ఆరెస్టు చేస్తామని డీఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో సీఐ శ్రీరామ్, ఎస్ఐలు తిమోతి, మధుసూదన్రెడ్డి, పోలీసులు, తదితరులు పాల్గొన్నారు.బంగారం, ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యం: ఎస్పీ
కడప కోటిరెడ్డిసర్కిల్: మనుషులంతా ఒక్కటేనని, హిందూ ముస్లిం భాయ్ భాయ్ అని చాటిచెప్పి శాంతితోనే జిల్లా అభివృద్ధి సాధ్యమని నిరూపించడం అభినందనీయమని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్లు తెలిపారు. హనుమాన్ జయంతి సందర్భంగా మంగళవారం సాయంత్రం కడప నగరంలో జరిగిన శోభా యాత్రలో ముస్లిం సోదరులు హిందు సోదరులను ఆలింగనం చేసుకుని స్వాగతం పలికారు. యాత్రలో పాల్గొన్న హిందూ సోదరులకు ఒకరికొకరు ఆప్యాయంగా మజ్జిగ, నీరు, పానీయాలు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ తదితరులు మాట్లాడుతూ ఇది హిందూ– ముస్లిం ఐక్యతను ప్రతిబింబిస్తుందన్నారు. హిందూ ముస్లిం అంతా ఒక్కటేనని అందరు కలిసి ముందుకు పోవాలన్నా రు. కడప నగరంలో హిందూ, ముస్లిం, క్రిస్టియన్ లు అందరు కలిసి మెలిసి ఉన్నారన్నారు. నగరంలో అందరూ కలిసి, మెలిసి ఉండాలనే భావనలో ఉన్నారని, కడపలో ఇటీవల జరిగిన ఘటనకు సంబంధించి తప్పు చేసిన వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని, హిందూ ముస్లిం సోదరులలోని అమాయకులను జిల్లా పోలీస్ శాఖ పరిగణనలోకి తీసుకుని న్యాయం చేస్తుందని ఎస్పీ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యేలు ఆదినారాయణ రెడ్డి, మాధవిరెడ్డి, నేతలు అమీర్బాబు, అఫ్జల్ఖాన్, శ్రీనివాసులరెడ్డి, టీటీడీ బోర్డు మెంబర్ భానుప్రకాష్ రెడ్డి, హిందూ, ముస్లిం సోదరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎస్పీ షెల్కే సచికేత్ విశ్వనాథ్, చిత్రంలో హిందూ, ముస్లిం నేతలు శోభాయాత్రలో స్వామి వారు -
అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి
చాపాడు : చాపాడులోని పాత అల్లాడుపల్లె రైతు సేవా సహకార సంఘం బ్యాంక్ ఆవరణలో మంగళవారం మద్యం అధికంగా తాగి వ్యక్తి మృతి చెందిన సంఘటన చోటు చేసుకున్నది. పోలీసులు తెలిపిన వేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని కుచ్చుపాప గ్రామానికి చెందిన సంబటూరు నాగసుబ్బయ్య(40) ఇంటి నుంచి ఉదయాన్నే చాపాడుకు వచ్చి సొసైటీ బ్యాంక్ వద్ద అధికంగా మద్యం తాగి అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. మద్యం మత్తులో కిందపడి ఎంతసేపటికీ లేవకపోవడంతో సమీపంలోని హోటల్లో ఉన్న మహిళలు గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వద్ద ఆధారాలను వెతికి చూడగా జేబులో ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా కుచ్చుపాప గ్రామానికి చెందిన వ్యక్తిగా గుర్తించి కుటుంబీకులకు సమాచారం అందించారు. నాగసుబ్బయ్య మద్యానికి బానిస అయినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. ఆయనకు భార్య అనసూయ, కుమారుడు, కుమార్తె ఉన్నారు. మృతదేహాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఘనంగా మహాకుంభాభిషేక మహోత్సవాలు
చక్రాయపేట : గండి ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఈ వేడుకల్లో మంగళవారం రాష్ట్ర దేవదాయ శాఖ మంత్రి ఆనం రామనారాయణరెడ్డి పాల్గొన్నారు. ఆయనకు దేవదాయ శాఖ ఆర్జేసీ చంద్రశేఖర్ ఆజాద్, ఆలయ కార్యనిర్వహణాధికారి గురుప్రసాద్ ఆధ్వర్యంలో అర్చకులు పూర్ణ కుంభంతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున ఆయన తెచ్చిన పట్టు వస్త్రాలను స్వామి వారికి సమర్పించారు. అనంతరం పలు పూజల్లో పాల్గొని గత ప్రభుత్వంలో గండి అభివృద్ధికి మంజూరు చేసిన రూ.28.5 కోట్ల పనులకు సంబంధించిన శిలా ఫలకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ఎమ్మెల్యేలు మాధవీరెడ్డి, ఆదినారాయణరెడ్డి, కృష్ణచైతన్యరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి, మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి, బీటెక్ రవి, రితేష్రెడ్డిలతో కలిసి విలేకరుల సమావేశంలో మాట్లాడారు. చంద్రబాబు ప్రభుత్వంలో ఆలయాలకు పెద్ద పీట వేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలకమండలి సభ్యులు టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు పాల్గొన్నారు. సహజత్వం లేకుండా గోపురాలపై ఈ రంగులేంటి? సంస్కృతి సంప్రదాయాలతోపాటు సహజత్వం ఉట్టిపడేలా రాతితో నిర్మించిన ఆలయంలో గోపురాలకు ఈ రంగులేంటని రాష్ట్ర దేవదాయ ధర్మదాయశాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ ఆలయ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆలయ మహాకుంభాభిషేక మహోత్సవాలను పురస్కరించుకొని ఆయన మంగళవారం గండికి విచ్చేశారు. ఈ సందర్భంగా కుంభాభిషేక ఏర్పాట్లపై పరిశీలించారు. స్వామి వాహనమైన ఒంటె, బలిపీఠాలకు వేసిన రంగులపై కూడా ఆయన పెదవి విరిచారు. వెంటనే వాటికి రంగులను తొలగించి సహజత్వం కనిపించేలా చేయాలన్నారు. పారిశుధ్య చర్యలు కూడా అధ్వానంగా ఉన్నాయని ఆగ్రహించారు. ఈ సందర్భంగా పలువురు గండిలో జరుగుతున్న అక్రమాలను ఆయన దృష్టికి తీసుకెళ్లారు. ఏమైనా ఉంటే తనకు వాట్సాప్లో మెసేజ్ పెట్టండి అని సూచించారు. ఆయన వెంట రాష్ట్ర స్థపతి పరమేశ్వరప్ప, కడప దేవదాయ శాఖ సహాయ కమిషనర్ శంకర్ బాలాజీ తదితరులు ఉన్నారు. -
ఆశావహులకు నిరాశే..
నీట్ ప్రవేశ పరీక్ష బాగా రాశామనే ధీమాతో ఎదురుచూస్తున్న ఆశావహులకు ఇది నిరాశజనక వార్తే. పరీక్ష రద్దుకు కారణమైనటువంటి వారిని కఠినంగా శిక్షించాలి. ఆ శిక్ష ఎలా ఉండాలంటే లక్షల మంది మానసికక్షోభకు గురిచేసిన వారికి ఇంక మళ్లీ ఎప్పుడు కూడా ఇలాంటి పొరపాటు చేయాలంటే భయం కలిగేలాగా శిక్ష ఉండాలి. అలాగే మళ్లీ పరీక్ష రాయనున్న విద్యార్థులు ఎలాంటి నిరాశ నిస్పృహలకు గురి కాకుండా రెట్టించిన ఉత్సాహంతో మరింత మెరుగైన ర్యాంకు సాధించేందుకు ఇప్పటి నుంచే కృషి చేయాలి. – డాక్టర్ ఓ వెంకటేశ్వర రెడ్డి, సైకాలజిస్ట్ -
జిల్లాలో ‘రైతు పండుగ‘ను విజయవంతం చేయాలి
కలెక్టర్ శ్రీధర్ కడప సెవెన్రోడ్స్: రైతులకు ఆధునిక వ్యవసాయ సాంకేతికతలు, ఉద్యానవన పంటలలో నూతన ఆవిష్కరణలు, మార్కెట్ అవకాశాలను ఒకే వేదికపై పరిచయం చేసే ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ను విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్లో ఈనెల 22–24వ తేదీ వరకు కడపలో నిర్వహించనున్న ‘రైతు పండుగ – అగ్రి ఇన్నోవేషన్ అండ్ హార్టికల్చర్ ఎక్స్పో 2026’ నిర్వహణ ఏర్పాట్లపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మే 22 నుంచి 24 వరకు మూడు రోజులపాటు కడపలోని మేడా కన్వెన్షన్ సెంటర్లో ఈ మహోత్సవం నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, శాస్త్రవేత్తలు, వ్యవసాయ నిపుణులు, స్టార్టప్ సంస్థలు, వ్యాపార వేత్తలు పాల్గొనే ఈ కార్యక్రమం రాష్ట్రంలోనే అతిపెద్ద అగ్రి – హార్టికల్చర్ ఎక్స్పోగా నిలుస్తుందని పేర్కొన్నారు. రైతులకు వ్యవసాయ రంగంలో ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం చేరువ చేయడమే లక్ష్యంగా ఈ ఎక్స్పో నిర్వహిస్తున్నామని కలెక్టర్ తెలిపారు. స్మార్ట్ కిచెన్ షెడ్ల నిర్మాణ పనుల్లో వేగం పెంచాలి: జిల్లాలోని అన్ని మండలాల్లో ఏర్పాటవుతున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ షెడ్స్ నిర్మాణ పనులను జూన్ 1వ తేదీలోపు పూర్తి చేసి పాఠశాలల పునఃప్రారంభంలోపు నిర్వహణలోకి తీసుకురావాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లో కలెక్టర్, జేసీ డాక్టర్ నిధి మీనా, కేఎంసీ కమిషనర్ హెచ్ఎస్ భావనతో కలిసి సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో డొక్కా సీతమ్మ మధ్యాహ్న భోజన పథకాన్ని మరింత శుచిగా, రుచికరంగా అందించేందుకు వినూత్నంగా అమలు చేస్తున్న సెంట్రలైజ్డ్ స్మార్ట్ కిచెన్ వ్యవస్థ జాతీయ స్థాయిలో అత్యుత్తమ పురస్కారంతో పాటు, ఇతర రాష్ట్రాలకు కూడా స్ఫూర్తినిస్తోందన్నారు. ఈ నెల 28 లోపు అన్ని రకాల నిర్మాణ పనులను పూర్తి చేసి.. రెండు రోజులు ట్రయల్ రన్ కూడా నిర్వహించాలన్నారు. ఈ సమావేశంలోసీపీఓ హజరతయ్య, స్మార్ట్ కిచెన్ల పర్యవేక్షకులు జోయల్ విజయకుమార్, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి, పీఆర్ ఎస్ఈ మద్దన్న, డిఎవో శంశుద్దీన్, నేచురల్ ఫార్మింగ్ జిల్లా మేనేజర్ ప్రవీణ్ కుమార్, హౌసింగ్ పీడి రాజరత్నం, ఏపీఎస్పీడిసిఎల్ ఎస్ఈ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. నూతన ఆవిష్కరణలతో కడప స్ఫూర్తి పరిశ్రమలు, మౌలిక వసతులు, రోడ్లు, ఐటీ, టూరిజం, ఎడ్యుకేషన్, పెట్టుబడులు వంటి అంశాలతో పాటు వినూత్న ఆవిష్కరణలతో వైఎస్ఆర్ కడప జిల్లా రాష్ట్రానికి స్ఫూర్తినిస్తోందని రాష్ట్ర పరిశ్రమలు – వాణిజ్యం (గనులు) కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా పేర్కొన్నారు. స్వర్ణ ఆంధ్ర– 2047 విజన్కు అనుగుణంగా వైఎస్సార్ కడప జిల్లాను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి రాష్ట్ర ప్రత్యేక ముఖ్య కార్యదర్శికి వివరించారు. మంగళవారం మధ్యాహ్నం కలెక్టరేట్ లోని బోర్డు మీటింగ్ హాలులో జిల్లాలోని ప్రధాన ప్రాజెక్టులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. అంతకుముందు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లాలో జరుగుతున్న ప్రత్యేక ప్రాజెక్టులు, పెట్టుబడులు, పారిశ్రామిక వృద్ధి, మౌలిక వసతుల అభివద్ధి, వ్యవసాయ పురోగతి తదితర అంశాలపై సమగ్ర పవర్ పాయింట్ ప్రజెంటేషన్ను రాష్ట్ర కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనాకు సమర్పించారు. -
విద్యార్థి దశ నుంచే క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ: విద్యార్థి దశ నుంచే క్రీడలపట్ల ఆసక్తి పెంచుకోవాలని డీఎస్డీఓ చంద్రశేఖర్ అన్నారు. మంగళవారం స్థానిక బెంగుళూరు రోడ్డులోని గురు హాకీ క్లబ్ వేసవి శిబిరాన్ని సందర్శించారు. వేసవి శిబిరంలో శిక్షణలో మెళుకువలు నేర్చుకోవాలన్నారు. హాకీ క్రీడకు మదనపల్లెలో మంచి గుర్తింపు ఉందన్నారు. ఎంతో మంది జాతీయ,రాష్ట్ర స్థాయిలో రాణించారన్నారు. హాకీ పితామహుడు ధ్యాన్చంద్ మదనపల్లెలో హాకీ క్రీడను క్రీడాకారులను నేర్పించారన్నారు. కార్యక్రమంలో సీనియర్ కోచ్ గురుభాస్కర్,పి.ప్రసాదరెడ్డి, కోచ్లు నౌషాద్,గౌస్, విష్ణు, సుల్తాన్ తదితరులు పాల్గొన్నారు. -
ఘనంగా ఫోరెన్సిక్ మెడిసిన్ దినోత్సవం
కడప అర్బన్ : కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో మంగళవారం ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగం ఆధ్వర్యంలో జాతీయ ఫోరెన్సిక్ మెడిసిన్ దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కళాశాల ప్రిన్సిపాల్, అదనపు డైరెక్టర్ ఆఫ్ మెడికల్ ఎడ్యుకేషన్ డాక్టర్ టి.జమున ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. ఫోరెన్సిక్ మెడిసిన్ వైద్య రంగంలో అత్యంత బాధ్యతాయుతమైన విభాగమన్నారు. ఈ వృత్తిలో నైతిక విలువలు, వృత్తిధర్మాలు, నిజాయితీ, సేవాభావం అత్యంత ముఖ్యమని పేర్కొన్నారు. ఫోరెన్సిక్ మెడిసిన్ విభాగాధిపతి డాక్టర్ ఎం.బాబు ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అసోసియేట్ ప్రొఫెసర్లు డాక్టర్ ఎం.శాంతి, డాక్టర్ అబ్దుల్ ఖాలిద్, డాక్టర్ జి.దినేష్, డాక్టర్ కె.అనుదీప్, డాక్టర్ జి.మౌనిక, డాక్టర్ ఎన్.నవీన్వర్ధన్, డాక్టర్ బి.జోనాథన్, డాక్టర్ వై.అరవింద్, పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులు, సిబ్బంది పాల్గొన్నారు. -
వైద్యరంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయం
కడప అర్బన్ : వైద్యరంగంలో నర్సుల సేవలు ప్రశంసనీయమని సూపరింటెండెంట్ డాక్టర్ వెంకట రాముడు తెలిపారు. కడప నగర శివారులోని రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల(ఐఎంహెచ్)లో మంగళవారం నర్సుల దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఫ్లోరెన్స్ నైటింగేల్ సేవలను స్మరించుకుంటూ ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం సూపరింటెండెంట్ మాట్లాడుతూ రిమ్స్ ఆవరణలో ప్రభుత్వ మానసిక వైద్యశాల స్థాపించి రెండేళ్లు అయిందని, అప్పటి నుంచి ఈ వైద్యశాలలో డాక్టర్లు, నర్సులు ఇతర సిబ్బంది బాగా పని చేసి వైద్యశాలకు రాష్ట్రంలోనే మొదటి స్థానాన్ని నిలబెట్టారని తెలిపారు. ఇదే విధంగా వైద్య సేవలు స్ఫూర్తిదాయకంగా కొనసాగించాలని తెలియజేశారు. ఈ కార్యక్రమంలో హెడ్ నర్సులు, ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ప్రొఫెసర్లు ఏవో, డైటీషియన్ పాల్గొన్నారు. -
విద్యార్థుల జీవితాలతో ఆటలా
ప్రస్తుతం రాసిన నీట్ పరీక్షలో మంచి మార్కులు వస్తాయని భావిస్తున్నాను. నీట్ రద్దు కావడం చాలా బాధగా ఉంది. ప్రతిసారి ఇలా ఏదో ఒకటి జరుగుతూనే ఉంది. ప్రభుత్వాలు విద్యార్థుల జీవితాలతో ఆడుకుంటున్నాయి. ఈసారైనా పేపర్ లీక్ కాకుండా ప్రభుత్వం గట్టిగా చర్యలు చేపట్టాలి. – జె.కీర్తన, కమలాపురం గుణపాఠాలు నేర్వకపోవడం శోచనీయం మా పాప ఫిర్దోస్కు ఇంటర్లో 922 మార్కులు వచ్చాయి. నీట్ పై చాలా ఆశలు పెట్టుకున్నాం. దేశవ్యాప్తంగా జరిగే ప్రవేశ పరీక్షను ఇంత అధ్వానంగా నిర్వహించడం దారుణం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గతంలో జరిగిన సంఘటనల నుంచి కూడా గుణపాఠాలు నేర్చుకోకపోవడం శోచనీయం. ఇప్పటికై నా ప్రభుత్వాలు కట్టుదిట్టమైన భద్రత ఏర్పాట్ల మధ్య నీట్ పరీక్షను నిర్వహించాలి. – షేక్ బాషు, విద్యార్థిని తండ్రి, కమలాపురం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే వైద్య వృత్తిపై ఎన్నో ఆఽశలు పెట్టుకుని నీట్ పరీక్ష రాస్తే ఎక్కడో పేపర్ లీక్ అయిందని దేశ వ్యాప్తంగా పరీక్షను రద్దు చేయడం బాధాకరం. నా కుమారుడు గురు ప్రవీణ్రెడ్డి పరీక్ష బాగా రాశాడు. ఫలితం కోసం ఎదురు చూస్తున్న తరుణంలో పరీక్ష రద్దు అయిందని తెలియగానే తేగా ఆందోళన చెందుతున్నాడు. పకడ్బందీగా పరీక్షను నిర్వహించకపోవడం ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమే. –కంకర అపర్ణ, విద్యార్థి తల్లి, చిన్నవెంతుర్లగ్రామం, మైలవరం మండలం -
‘పచ్చ’పైత్యంతో పిచ్చి రాతలు
సాక్షి ప్రతినిధి కడప: పచ్చ కామెర్లకు వారికి లోకమంతా పచ్చగా కనిపించినట్లుగా ఎల్లో మీడియా తన పైత్యాన్ని అనునిత్యం ప్రదర్శిస్తుస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం ఆయన ‘సాక్షి’తో మాట్లాడుతూ రిమ్స్ ఆస్పత్రి కడప నగరానికి నాలుగు కిలోమీటర్ల దూరంలో ఏర్పాటు చేయడంతో రోగుల సహాయకులు ఎలాంటి ఇబ్బంది పడకూడదనే పోచంరెడ్డి చారిటబుల్ ట్రస్టు ద్వారా రూ.1.2 కోట్లు సొంత నిధులు వెచ్చించి భవనం, వసతి, డైనింగ్ ఏర్పాటు చేశామన్నారు. 2019 నుంచి ఆరేళ్లుగా నిరాటంకంగా రోగుల సహా యకులకు భోజన వసతి కల్పించామన్నారు. ప్రతిరోజు ఉదయం 350–450 మంది వరకు, సాయంత్రం 220–250 మంది వరకు భోజనం చేసేవారన్నారు. తమ సిబ్బంది ఒక్క రూపాయి కూడా ఏ ఒక్కరితో వసూలు చేయకుండా, ముందస్తు టోకన్లు జారీ చేసి ఉచిత భోజనం కొనసాగించామని వివరించారు. ఆరేళ్లుగా నిరాంటకంగా ప్రతిరోజు భోజన వసతి దాదాపు 700 మందికి కల్పిస్తుంటే, ఒక్కరోజుగా గుర్తించని ఈనాడు పత్రిక ఎల్లో పైత్యాన్ని ఎక్కించుకుని అడ్డగోలు రాతలు రాసిందని మండిపడ్డా రు. అక్కడ నియమించిన మేనేజర్ భోజన, వసతిలో తప్పిదాలు చేయడం వల్ల తొలగించామన్నా రు. సిబ్బంది సమస్య కారణంగా తాత్కాలికంగా నిలిపి వేశామన్నారు. దానిని పట్టుకుని ఈనాడు తన పైత్యాన్ని ప్రదర్శించిందని ధ్వజమెత్తారు. ఛారిటబుల్ ట్రస్టుపై ఈనాడు పిచ్చి రాతలు ఆరేళ్లుగా నిరాటంకంగా రెండు పూటల భోజనం డైలీ 700 మందికి భోజన ఏర్పాట్లు ఈనాడు రాతలపై మండిపడ్డ పోచంరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి -
ప్రశాంతంగా ఏపీ ఈఏపీసెట్ ప్రారంభం
కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజనీరింగ్, అగ్రికల్చర్, పార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)–2026 మంగళవారం ప్రశాంతంగా ప్రారంభమైంది. ఈ నెల 12 నుంచి 18 వరకు ఇంజనీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు, 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, పార్మసీ(భైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. కడప, ప్రొద్దుటూరు, రాజంపేట పరీక్షా కేంద్రాలలో ఆన్లైన్ విధానంలో 9 పరీక్షా కేంద్రాలలో ఏపీ ఈఏపీ పరీక్షను నిర్వహించారు. ఇందులో ఉదయం, సాయంత్ర రెండు సెషన్స్కు సంబంధించి 1668 మందికిగాను 1567 మంది హాజరుకాగా 101 మంది గైర్హాజరయ్యారు. -
తడ‘బడి’తే తప్పదు మూల్యం
కడప ఎడ్యుకేషన్ : విద్యా సంవత్సరం మరో నెల రోజుల్లో ప్రారంభం కానుంది. జిల్లాలో పుట్టగొడుగుల్లా ప్రైవేటు విద్యా సంస్థలు పుట్టుకొస్తున్నాయి. ప్రస్తుతం జిల్లాలో కొనసాగుతున్న ప్రైవేటు, కార్పొరేట్ పాఠశాలల పేర్లతో నూతన బ్రాంచ్లు ఎక్కువయ్యాయి. ఇందుకు హంగులూ, ఆర్భాటాలతో ప్రజలను ఆకర్షించేందుకు ప్రచారాలు చేస్తూ ప్రవేశాల ప్రక్రియ చేపడుతున్నారు. తల్లిదండ్రులు తమ పిల్లలను పాఠశాలల్లో చేర్పించేందుకు సిద్ధమవుతున్నారు. అయితే విద్యార్థుల చేరికలో ఆయా పాఠశాలలకు అనుమతి ఉన్నదో లేనిదో తెలియని పరిస్థితి నెలకొంది. ఈ విషయంలో తల్లిదండ్రులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తుతున్నాయి. విద్యాశాఖ నియంత్రణ కొరవడటంతో ప్రభుత్వం నుంచి ఎలాంటి అనుమతులు తీసుకోకుండానే.. ఆమోదం ఉన్నట్లు ప్రచారం చేసుకుంటున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ నిబంధనల ప్రకారం కొత్త ప్రైవే టు పాఠశాల ప్రారంభించాలంటే విద్యాశాఖ అను మతి తీసుకోవాలి. మొదట ఓపెనింగ్ అనుమతి తీసుకున్న తర్వాతే విద్యా సంస్థలను తెరచి విద్యార్థులను చేర్చుకోవాలి. తర్వాత పూర్తి స్థాయి అనుమతి పొందాలి. ప్రాథమిక స్థాయికి జిల్లా విద్యాశాఖ అధికారి నుంచి, ఉన్నత తరగతులు ప్రారంభించాలంటే విద్యాశాఖ రీజనల్ డైరెక్టర్ (ఆర్జేడీ) ద్వారా పాఠశాల విద్యా కమిషనర్ అనుమతి తీసుకోవాలి. సీబీఎస్ఈ సిలబస్ బోధించేందుకు కేంద్ర విద్యామండలి సమ్మతించాలి. ఇలా అన్ని అనుమతులింటేనే పాఠశాలలను నిర్వహించాలి. వీటిపై ఆరా తీయండి.. ప్రతి విద్యా సంస్థ ప్రభుత్వం నుంచి రికగ్నైజేషన్ పొంది ఉండాలి. ఇది నిబంధన. అయితే చాలా విద్యాసంస్థల బోర్డులు, ప్రకటనలు నిశితంగా పరిశీలిస్తే రిజిస్టర్ అని ఉంటుంది. రిజిస్ట్రేషన్ ఎవరైనా చేసుకోవచ్చు. కానీ విద్యాశాఖ నుంచి రికగ్నైజేషన్ తీసుకోవడం తప్పనిసరి. రికగ్నైజేషన్ పొందిన విద్యా సంస్థలలోనే తల్లిదండ్రులు తమ పిల్లలను చేర్పించాలి. ఎలాంటి అనుమతులు తీసుకోకుండా కొన్ని పాఠశాలలు ఇతర విద్యా సంస్థల తరఫున పరీక్షలు రాయిస్తుంటారు. అలా పరీక్ష రాసిన విద్యార్థులను ప్రభుత్వం ప్రైవేటు విద్యార్థిగానే పరిగణిస్తుంది. మరికొన్ని ప్రైవేటు విద్యా సంస్థలు బ్రాంచ్ల పేరుతో పాఠశాలలు, కళాశాలలు నడుపుతూ ఎక్క డో ఉన్న మెయిన్ బ్రాంచి ద్వారా పరీక్షలు రాయిస్తుంటారు. ఇలాంటి విషయాలలో తల్లిదండ్రులు విచారణ చేసి విద్యా సంస్థ అనుమతి పత్రాలను అడిగి తెలుసుకున్న తరువాతే పిల్లలను చేర్పించాలి. తీసుకోవాల్సిన జాగ్రత్తలివే.. ● తొలుత పాఠశాలకు ప్రభుత్వ గుర్తింపు ఉందా లేదా అనేది చూసుకోవాలి. ● ప్రభుత్వ ఇంజనీరింగ్ విభాగం జారీ చేసిన పాఠశాల భవనం నాణ్యత ధ్రువీకరణ పత్రాన్ని పరిశీలించాలి. ● మౌలిక వసతులతోపాటు బాత్రూములు, మరుగుదొడ్లు, నీటి సదుపాయాలు తప్పనిసరి. విద్యార్థుల మానసిక, శారీకోల్లాసానికి ఉపకరించే క్రీడా ప్రాంగణం, అనుగుణంగా క్రీడా ఉపాధ్యాయులు ఉన్నారా లేదా ఆరా తీయాలి. ● అర్హత గల ఉపాధ్యాయులు బోధనలు చేస్తున్నారా లేదా పరిశీలించాలి. ● ప్రాఽథమిక, ప్రాథమికోన్నత స్థాయిలో 20 నుంచి 40 మందికి ఒక ఉపాధ్యాయుడు ఉండాలి. ఉన్నత పాఠశాలలు అయితే సబ్జెక్టుల వారీగా ఒకరు చొప్పున ఉపాధ్యాయుడు ఉండాలి. ● సురక్షిత రవాణా సదుపాయానికి బస్సులకు రవాణాశాఖ జారీ చేసిన సామర్థ్య పరీక్ష పత్రాన్ని పరిశీలించాలి. సుశిక్షితుడైన డ్రైవరు తప్పనిసరి. ● జీ–1 భవనాలు ఉంటే అగ్నిమాపక పరికరాలు, ఆ స్థాయి దాటితే మంటలు అర్పే పూర్థి స్థాయి వ్యవస్థ ఉండాలి. సంబంధిత విభాగం నుంచి అనుమతి ఉండాలి. ● ప్రభుత్వ అనుమతి లేని పాఠశాలల్లో విద్యార్థులను చేర్చితే భవిష్యత్తులో ఇబ్బందులు తలెత్తుతాయి. చైల్డ్ ఇన్ఫో ఆధారంగానే విద్యార్థుల ప్రగతి పత్రాలు, బదిలీ ధ్రువపత్రాలు జారీ చేయాల్సి ఉంటుంది. ప్రభుత్వ అనుమతి లేని వాటిలో ఈ నమోదు ఉండదు. ఆయా విద్యార్థులను బడిబయట ఉన్న వారిగా పేర్కొంటున్నారు. ఫలితంగా సమస్యలు ఏర్పడుతాయి. తల్లిదండ్రులు తస్మాత్ జాగ్రత్త ముందస్తు అడ్మిషన్లతో అప్రమత్తత అవసరం ఆకట్టుకునే ప్రచారాలు నమ్మి మోస పోకండి పాఠశాలల గురించి తెలుసుకున్నాకే చేర్పించాలినిబంధనలు అతిక్రమిస్తే చర్యలు ప్రతి ప్రైవేటు విద్యా సంస్థ ప్రభుత్వ నిబంధనలు పాటించాలి. అదే విధంగా విద్యా సంస్థ పక్కాగా రిజిస్ట్రేషన్తోపాటు ప్రభుత్వ రికగ్నైజేషన్ పొంది ఉండాలి. తల్లిదండ్రులు ప్రైవేటు సంస్థలను ఆకట్టుకునే ప్రకటనలను నమ్మి మోసపోవద్దు. అన్ని జాగ్రత్తలు పాటించి పిల్లలను చేర్పించాలి. – షేక్ షంషుద్దీన్, డీఈఓ, వైఎస్సార్కడపజిల్లా -
ఆ తల్లికి ఎంత కష్టం వచ్చింది!
జమ్మలమడుగు(ఎర్రగుంట్ల) : ఎర్రగుంట్ల పట్టణానికి చెందిన సుగుణమ్మ అనే వృద్ధురాలు తన కుమారులు తనకు అన్నం పెట్టకుండా ఇబ్బందులకు గురి చేస్తున్నారంటూ పోలీసులను ఆశ్రయించింది. ఈ విషయంపై ఆమె మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సందర్భంగా సీఐ విశ్వనాథ్రెడ్డి సుగుణమ్మ బాధ అడిగి తెలుసుకున్నారు. అనంతరం సీఐ సుగుణమ్మ కుమారులను స్టేషన్కు పిలిపించి కౌన్సెలింగ్ ఇచ్చారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలను పెంచి పెద్ద చేసి ప్రయోజకులను చేసిన తర్వాత వారిని పట్టించుకోకపోవడం సరైంది కాదన్నారు. తల్లిదండ్రులను పొషించే బాధ్యత పిల్లలపైనే ఉందన్న విషయాన్ని గుర్తించుకోవాలన్నారు. అనంతరం సుగుణమ్మ కోరిక మేరకు తిప్పలూరులో ఉన్న ఎద్దుల పెద్ద శేషయ్య అనాథాశ్రమానికి చెందిన నిర్వాహకుడు నాగేంద్రకు స్టేషన్కు పిలపించుకుని.. ఆమెను బాగా చూసుకోవాలంటూ సూచించారు. ఆమెను ప్రత్యేక ఆటోలో తిప్పలూరు అనాథశ్రమానికి తరలించి సీఐ మానవత్వాన్ని చాటుకున్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ నాగమురళి, సిబ్బంది పాల్గొన్నారు. అందరూ ఉండి అనాథగా మిగిలిన అమ్మ కుమారులు అన్నం పెట్టడం లేదంటూ ఆవేదన పోలీసులను ఆశ్రయించిన వైనం‘అడ్డాల నాడు బిడ్డలు కానీ.. గడ్డాల నాడు బిడ్డలు కాదు’ అనేది సామెత. అది అక్షర సత్యమవుతున్న సంఘటనలు అక్కడక్కడా చోటుచేసుకుంటున్నాయి. తాజాగా ఎర్రగుంట్ల పట్టణంలో జరిగింది. నవమాసాలు మోసి.. కనిపెంచిన తల్లికి కనీసం అన్నం పెట్టలేదు కన్న కొడుకులు. వృద్ధురాలైన అమ్మను, కడుపులో పెట్టుకుని చూసుకోవాల్సింది పోయి.. పట్టించుకోవడం మానేశారు. చివరికి ఆమె పోలీసులను ఆశ్రయించి.. అనాథాశ్రమానికి వెళ్లాల్సిన పరిస్థితి దాపురించింది. -
ఇప్పటికే 11 లక్షలు ఖర్చయింది
మా పాప నందినిని విజయవాడలోని గోశాల శ్రీ చైతన్య కళాశాలలో ఇంటర్తోపాటు రెండు సార్లు లాంగ్టర్మ్ నీట్ కోసం రూ. 11 లక్షలు ఖర్చు పెట్టాను. ఈసారి నీట్ పరీక్ష బాగా రాసింది. ఫలితాలకు సంబంధించి విడుదలైన ప్రాథమిక కీలో 720 మార్కులకు 590 మార్కులు వచ్చాయి. కోచింగ్ సెంటర్ వాళ్లు కూడా మంచి కళాశాలలో సీటు వస్తుందని చెప్పారు. ఎన్నో ఆశలు పెట్టుకున్నాం. మా ఆశలపైన నీళ్లు చల్లారు. మళ్లీ కోచింగ్కు పంపాలంటే ఆర్థికభారమే. – పోలిరెడ్డి, చిన్నాయపల్లె, బి. మఠం మండలం మళ్లీ కోచింగ్కు పంపాలి నీట్ రద్దు కావడంతో మళ్లీ మా పాప వర్షిణిని కోచింగ్కు పంపాలి. ఇది ఆర్థికబారం కానుంది. ఈ సారి మా పాప నీట్ పరీక్ష బాగా రాసింది. ప్రాథమిక కీ లో కూడా 589 మార్కులు వచ్చాయి. సీటు ఖచ్చితంగా వస్తుందని నిపుణులు కూడా తెలిపారు. ఇంతలో నీట్ రద్దని ప్రకటించారు. ఈ ప్రభావం పిల్లలపైన ఎలా చూపుతుందో తెలియని పరిస్థితి. 2024లో కూడా నీట్ నిర్వహణలో ఎన్నో ఆరోపణలు వచ్చాయి. అప్పట్లో రద్దు చేయలే. కానీ ఇప్పుడు రద్దు చేశారు. – ఆనందరెడ్డి, కడప. నీట్ పరీక్ష రద్దు వల్ల విద్యార్థుల్లో ఆందోళన విద్యార్థులు రాత్రింబవళ్లు శ్రమించి నీట్ పరీక్ష రాసి ఫలితాల కోసం ఎదురుచూస్తున్న తరుణంలో పేపర్ లీక్ కారణంగా పరీక్షను రద్దు చేయడంతో విద్యార్థుల్లో ఆందోళన నెలకొంది. లీకేజీకి కారణమైన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలి. –షేక్ అమీర్బాషా, విద్యార్థిని తండ్రి, దువ్వూరు -
అట్లూరు మండల వాసి ఎన్వీహెచ్ కంపెనీలో మృతి
అట్లూరు : అట్లూరు మండలం ముత్తుకూరు పంచాయతీ జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన సొద్దల రామాంజనేయులు(24) అనంతపురంలోని ఎన్వీహెచ్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందాడు. అతను శుక్రవారం మిషనరీలో పడి మృత్యువాత పడ్డాడు. అయితే అతను కియా కంపెనీలో విధులు నిర్వర్తిస్తూ మృతి చెందినట్లు సోమవారం వార్త వచ్చింది. అది కియా కంపెనీ కాదు.. కియాకు సప్లైర్ కంపెనీ అయిన ఎన్వీహెచ్ కంపెనీగా గమనించగలరు. ఉరి వేసుకొని మహిళ ఆత్మహత్య చింతకొమ్మదిన్నె : మండల పరిధి సీఎంఆర్ పల్లె సమీపంలోని అంగడి వీధిలో నివసించే రిటైర్డ్ రైల్వే ఉద్యోగి గోపాలక్రిష్ణ భార్య రేణుకాదేవి(54) సోమవారం రాత్రి ఇంట్లో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. ఆమె గత నెలలో కూడా రైలు కింద పడి ఆత్మహత్యకు ప్రయత్నించగా కుడి చేతికి గాయాలు కాగా చికిత్స పొందినట్లు వారు పేర్కొన్నారు. మృతురాలి భర్త గోపాలక్రిష్ణ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ఆత్మహత్యకు గల కారణాలు తెలియాల్సి వుంది. నియామకం కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా ప్రధాన న్యాయమూర్తి న్యాయస్థానానికి గవర్నమెంట్ ప్లీడర్గా సీనియర్ న్యాయవాది ఎం.సురేష్ కుమార్ను నియమిస్తూ రాష్ట్ర ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈయన ప్రభుత్వం తరఫున సివిల్ కేసులను జిల్లా కోర్టులో వాదించనున్నారు. ఇప్పటి వరకు ఇన్చార్జ్ జీపీగా ఆదినారాయణరావు వ్యవహరించారు. అల్మాస్పేట ఘటనలో ముగ్గురి అరెస్ట్కడప అర్బన్ : కడప నగరం టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలోని అల్మాస్పేట ఘటనలో ఒకవైపున నిందితులుగా వున్న వారిలో బాబుభాయ్, షబ్బీర్ హుసేన్, జాకీర్లను పోలీసు అధికారులు, సిబ్బంది మంగళవారం అరెస్ట్ చేశారు. వారిని కడపలోని కోర్టులో హాజరుపరిచారు. ఈతకు వెళ్లి ఇద్దరు చిన్నారుల మృతి పుంగనూరు : వేసవి తీవ్రంగా ఉండటంతో చెరువులో ఈత కొట్టేందుకు వెళ్లి ఇద్దరు చిన్నారులు మృతి చెందిన సంఘటన మంగళవారం జరిగింది. అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలోని పట్రపల్లె తండాకు చెందిన గణేష్నాయక్ కుమారుడు వరుణ్నాయక్(14), మణి నాయక్ కుమారుడు నిలేష్నాయక్(8) కలసి బడిగిరెడ్డిపల్లె గ్రామ సమీపంలోని చెరువులో ఈత కొట్టేందుకు మధ్యాహ్నం వెళ్లారు. ప్రమాదవశాత్తు లోతైన ప్రాంతంలోకి వెళ్లి ఇద్దరూ మునిగిపోయారు. సమీపంలో బాతులు మేపుతున్న యువకులు గమనించి గ్రామస్తులకు తెలిపారు. అందరూ కలసి హుటాహుటిన వెళ్లి వారిని కాపాడే ప్రయత్నం చేశారు. కానీ ఫలితం లేకపోయింది. అప్పటికే ఇద్దరూ మృతి చెందారు. వారి మృతదేహాలకు కుటుంబీకులు అంత్యక్రియలు నిర్వహించారు. -
బాగా రాశాను, మరోమారు పరీక్షించుకోవాలి..
చైన్నె వేలామ్మల్ విద్యాలయంలో చదివాను. నీట్–యాజీ పరీక్ష కోసం బాగా కష్టపడ్డాను. అంతే ధీమాగా పరీక్ష రాశాను. కీ పరిశీలిస్తే దాదాపు 661 మార్కులు రానున్నాయని అంచనా దక్కింది. పరీక్ష అయిపోయింది. కుటుంబంతో కలిసి బంధువుల ఇంటికి వచ్చాం. దాదాపు 10రోజులుగా పుస్తకాలు పట్టలేదు. తిరిగి పరీక్షించుకోవాల్సి రావడం దురదృష్టకరం. పేపర్ లీక్పై కేంద్ర ప్రభుత్వం సీరియస్గా తీసుకోవాల్సి ఉంది. భవిష్యత్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా పటిష్టచర్యలు చేపట్టాలి. – మనీష్, విద్యార్థి, చైన్నె. -
యథేచ్ఛగా కలప అక్రమ రవాణా
పులివెందుల రూరల్ : మండల పరిధిలో కొంత మంది యథేచ్ఛగా కలప అక్రమంగా రవాణా చేస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా తరలిస్తున్నా.. సంబంధిత అధికారులు చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్నారే తప్ప పట్టించుకోవడం లేదు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పర్యావరణ పరిరక్షణకు కృషి చేస్తున్నా.. క్షేత్ర స్థాయిలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి ఇలా ట్రాక్టర్లలో కలపను తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చర్యలు చేపట్టాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
లారీ దగ్ధం.. తప్పిన పెను ప్రమాదం
కురబలకోట : మండలంలోని కంటేవారిపల్లి హైవేలో సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో వెళ్తున్న లారీ నుంచి ఒక్కసారిగా మంటలు వ్యాపించడంతో కలకలం రేగింది. నడి రోడ్డుపై వెళుతున్న లారీ మంటల్లో చిక్కుకోవడంతో అక్కడి స్థానికులు, ప్రయాణికులు, వాహనదారులు ఆందోళనకు గురయ్యారు. మంగళవారం రాత్రి పది గంటల ప్రాంతంలో జరిగిన ఈ సంఘటనపై ఫైరింజన్కు సమాచారం ఇచ్చినా సకాలంలో రాకపోవడంతో లారీ మంటల్లో తగలబడిపోయింది. డ్రైవర్ సురేష్ గమనించి లారీ నుంచి వెంటనే దిగేయడంతో సురక్షితంగా బయటపడ్డాడు. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. చైన్నె నుంచి బెల్గాంకు సిమెంట్ ఖాళీ బస్తాల లోడుతో ఆ లారీ వెళ్తుండేది. లారీ కంటేవారిపల్లి వద్దకు రాగానే ఒక్కసారిగా వెనుక టైరు పగిలిన శబ్దం వచ్చింది. అనుమానం వచ్చి డ్రైవర్ సురేష్ బండి దిగి చూడగా అప్పటికే లారీ నుంచి మంటలు చెలరేగాయి. వెనుక టైరు పగిలి పక్కనే ఉన్న డీజిల్ ట్యాంకు దెబ్బతినడంతో మంటలు చెలరేగాయి. నిమిషాల వ్యవధిలోనే మంటలు లారీని కమ్ముకున్నాయి. చూస్తుండగానే మంటలు లారీ మొత్తం వ్యాపించాయి. మంటలు నిలువునా ఎగసి పడుతుండడంతో ఆర్పడానికి ఎవరూ సాహసించలేకపోయారు. వెంటనే ఫైర్ స్టేషన్కు సమాచారం ఇచ్చారు. ఫైరింజన్ రావడానికి ఆలస్యం అయ్యింది. అందరూ చూస్తుండగానే లారీ కాలిపోయింది. లారీతోపాటు సిమెంటు బస్తాలు పూర్తిగా కాలిపోవడంతో రూ. 50 లక్షలకు పైగా నష్టం సంభవించి ఉంటుందని ప్రాథమిక అంచనా. తర్వాత ఫైరింజన్ రావడంతో మంటలను అదుపులోకి తెచ్చారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. -
విద్యుదాఘాతంతో యువకుడి మృతి
మైదుకూరు : బతుకు దెరువు కోసం డ్రిల్లింగ్ పని చేస్తూ విద్యాదాఘాతానికి గురై ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరులో మంగళవారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక నంద్యాల రోడ్డులోని ఎంపీపీ మెయిన్ స్కూల్ సమీపంలో మంగళవారం ఉదయం దెబ్బతిన్న ఓ ఇంటి మెట్లను తొలగించేందుకు డ్రిల్లింగ్ చేస్తూ కై పు రాజేష్ అలియాస్ ఘని (37) అనే యువకుడు విద్యుదాఘాతానికి గురై మృతి చెందాడు. డ్రిల్లర్కు ఉన్న వైర్లు షార్టేజ్ కావడంతో రాజేష్ విద్యుదాఘాతానికి గురైనట్టు తెలుస్తోంది. ఇంటి యజమాని, మరికొందరు అతన్ని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా మృతి చెందినట్టు వైద్యులు నిర్ధారించారు. పట్టణంలో గాంధీనగర్కు చెందిన రాజేష్కు జోసెఫ్ పేటకు చెందిన కవితతో 15 ఏళ్ల కిందట వివాహం అయింది. వీరికి ముగ్గురు ఆడ పిల్లలు ఉన్నారు. రాజేష్ మృతి గురించి తెలియగానే అతని భార్య కవిత, తల్లిదండ్రులు మైఖేల్, సంతోషమ్మ ఆస్పత్రి వద్దకు చేరుకొని బోరున విలపించారు. మైదుకూరు పోలీసులు సంఘటనపై కేసు నమోదు చేసుకుని రాజేష్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు.


