breaking news
YSR District Latest News
-
కక్ష సాధింపు
కూటమి ప్రభుత్వం అన్ని విషయాల్లో కక్ష సాధింపు ధోరణి అవలంబిస్తోంది. అందులో భాగంగానే కాలేటి వాగు నిర్మాణ పనులను ఆపివేసింది. వైఎస్సార్ సీపీకి చెందిన వ్యక్తులు కావడం వల్లే ఈ నిర్ణయం తీసుకుంది. దీంతో పనులు ఆగిపోయి రైతాంగానికి నిరాశే మిగిలింది. – బెల్లం ప్రవీణ్కుమార్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్, చక్రాయపేట రైతులపై కపట ప్రేమ చంద్రబాబు ప్రభుత్వం రైతులపై కపట ప్రేమ చూపిస్తోంది. రైతులకు ఏదో ఒరగబెడతామని ప్రగల్భాలు పలుకుతుందే తప్ప చేసేది మాత్రం శూన్యం. ఉచిత పంటలబీమా రద్దు చేయడం, ఉన్న ప్రాజెక్టు పనులను కొనసాగించకుండా అనేక సాకులు చూపి నిర్మాణాలు ఆపడం ఈ ప్రభుత్వానికి అలవాటుగా మారిపోయింది. – ఎల్ఎన్ కృష్ణారెడ్డి, జిల్లా రైతు విభాగ కార్యదర్శి, వైఎస్సార్ సీపీ రైతుల్లో వ్యతిరేకత కూటమి ప్రభుత్వంపై అనతికాలంలోనే రైతుల్లో వ్యతిరేకత వచ్చింది. రైతుల విషయానికి వచ్చేకొద్ది మాటలు తప్ప చేతల్లో చూపించడం లేదు. బీమా విషయంలో నిర్లక్ష్యం? అన్నదాత సుఖీభవ పథకంలో కోతలు, ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో అలసత్వం.. ఇలా అన్నింట్లోనూ కక్షగట్టింది. దీంతో రైతులు కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత చూపుతున్నారు. – తాడిగొట్ల శివప్రసాద్రెడ్డి, జెడ్పీటీసీ సభ్యుడు, చక్రాయపేట ప్రభుత్వ నిర్ణయం మేరకే పనులు కాలేటి వాగు నిర్మాణ పనులపై ప్రభుత్వ ఆదేశాలతోనే పనులు నిర్వహిస్తాం. ప్రస్తుతం జరిగిన పనులపై విజిలెన్స్ తనిఖీలు చేపట్టాం.ప్రస్తుత టెండరును రద్దు చేసింది. రీ టెండర్ల ను పిలిచే అవకాశం ఉంది.–మధుసూదన్రెడ్డి, ఈఈ, నీటిపారుదలశాఖ డివిజన్–1, కడప -
హోరాహోరీగా వాలీబాల్ పోటీలు
జమ్మలమడుగు : 69వ జాతీయ వాలీబాల్ పోటీలు వివిధ రాష్ట్రాల క్రీడాకారుల మధ్య రసవత్తరంగా సాగుతున్నాయి. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ పోటీలను జిల్లా స్థాయి అధికారులతోపాటు వాలీబాల్గేమ్ అసోసియేషన్లు ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. మంగళవారం సాయంత్రం అన్ని రాష్ట్రాల క్రీడాకారులతో భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం బాలికల జూనియర్ కాలేజీలో పోటీలలో పాల్గొన్న క్రీడాకారులకు టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి కిట్లను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో ఆర్డీఓ సాయిశ్రీ, అధికారులు పాల్గొన్నారు. అదే జోరులో పశ్చిమబెంగాల్ జాతీయ స్థాయిలో వచ్చిన 30 టీంలలో పశ్చిమ బెంగాల్ క్రీడాకారుల జట్టు బలమైన జట్టుగా కనిపిస్తోంది. గతంలో వాలీబాల్ జాతీయ స్థాయిలో పోటీలలో విన్నర్గా నిలిచారు. ప్రస్తుతం అదే జోరు కొనసాగిస్తున్నారు. మంగళవారం జరిగిన పోటీలలో రాజస్థాన్ జట్టు తమ ప్రత్యర్థి అయిన జమ్మూకశ్మీర్పై గెలుపొందగా, ఛత్తీస్గఢ్పై పంజాబ్, గోవాపై ఒడిశా, ఢిల్లీపై విద్యాభారతీ, ఎన్వీఎస్పై కర్ణాటక, బీహార్పై తమిళనాడు, మధ్యప్రదేశ్పై హర్యానా, కేవీఎస్పై పశ్చిమ బెంగాల్, జమ్మూకశ్మీరుపై గుజరాత్, ఛత్తీస్గఢ్పై ఢిల్లీ జట్లు గెలుపొందాయి. గురువారం గెలుపొందిన జట్లు మధ్య క్వార్టర్స్ ఫైనల్, సెమీఫైనల్ మ్యాచ్లు నిర్వహించి శుక్రవారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని ఆర్గనైజింగ్ సెక్రటరీ ప్రసాద్రెడ్డి, శివశంకర్రెడ్డి తెలిపారు. -
నేడు డీఆర్సీ సమావేశం
కడప సెవెన్రోడ్స్: డిస్టిక్ రివ్యూ కమిటీ (డీఆర్సీ) సమావేశం బుధవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్లో నిర్వహించనున్నట్లు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ఇన్ఛార్జి మంత్రి సవిత అధ్యక్షతన జరిగే ఈ సమావేశానికి వివిధ శాఖల జిల్లా అధికారులు నివేదికలతో హాజరు కావాలని కలెక్టర్ ఆదేశించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: అండర్–14 బాలుర స్పాటింగ్ క్రికెట్ ఎంపికలు ఉత్సాహంగా ప్రారంభం అయ్యాయి. మంగళవారం నగర శివార్లలోని వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఈ ఎంపికలకు జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి దాదాపు 120 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఇందులో తొలి రోజు సుమారు 32 మందిని ఎంపిక చేసి జాబితా విడుదల చేశారు. రెండవ రోజు బుధవారం ఎంపికలు నిర్వహించి ఇంకా కొంత మందిని ఎంపిక చేస్తామన్నారు. ఈ ఎంపికలను ఏసీఏ సెలక్షన్ స్పాట్టింగ్ మెంబర్స్ హుస్సేన్, శరత్ హాజరై పర్యవేక్షించారు. వీరపునాయునిపల్లె: మండల పరిషత్,తహసిల్దార్ కార్యాలయ నిర్మాణ పనులపై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అసంతృప్తి వ్యక్తం చేశారు. మంగళవారం తహసీల్దార్ లక్ష్మిదేవితో కలసి నిర్మాణ పనులను తనిఖీ చేశారు. ప్రస్తుతం ప్రభుత్వ కార్యాలయాలు ప్రజలకు దూరంగా ఉండటంతో అందుబాటులోకి తీసుకువచ్చేందుకు కోట్ల రూపాయలు వెచ్చించి నిర్మాణాలు చేపడితే వాటిని నాసిరకంగా నిర్మిస్తే ఎలాగని అసహనం వ్యక్తం చేశారు. నాణ్యత ఉండేలా చూడాలని అధికారులను ఆదేశించారు. మిగిలి ఉన్న పెండింగ్ పనులను త్వరితగతిన పూర్తి చేయించి ప్రజలకు అందుబాటులోకి వచ్చేలా చర్యలు తీసుకోవాలని అధికారులకు సూచించారు. కాంట్రాక్టర్ రాజేష్ నాయుడు పాల్గొన్నారు. సిద్దవటం: మండలంలోని భాకరాపేట జెడ్పీ హైస్కూల్ను విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే 6–10వ తరగతుల వరకు జరుగుతున్న ఎఫ్ఏ–3 పరీక్ష గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకేశమ్మకు సూచించారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. ఆర్బీఐ నిబంధనలను పక్కాగా అమలు చేయాలి కడప అగ్రికల్చర్: సహకార రంగంలో రిజర్వ్ బ్యాంక్ అంఫ్ ఇండియా నిబంధనలను పక్కాగా అమలు చేయాలని నాబార్డు డీజీఎం రాజ్కుమార్శర్మ సూచించారు. మంగళవారం కడపలో నాబార్డు ఆధ్వర్యంలో కేవైసీ, ఏఎంఎల్ నిబంధనలు, ఐఆర్ఏసీ మార్గదర్శకాలపై కడప, కర్నూల్, చిత్తూరు, అనంతపురం, నెల్లూరు, ప్రకాశం జిల్లాల డీసీసీ బ్యాంకు సీనియర్ అధికారులకు అవగాహన సదస్సుతోపాటు వర్కుషాపు నిర్వహించారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్బీఐ నిబంధనల ప్రకారం ప్రస్తుత బ్యాంకింగ్ మోసాల నివారణ చర్యలపై నిపుణుల చేత విస్తృతస్థాయిలో చర్చించి అవగాహన కల్పిస్తున్నామన్నారు. కడపజిల్లా నాబార్డు సీని యర్ అధికారి విజయ విహారి, జిల్లా సహకార కేంద్ర బ్యాంకు సీఈఓ రాజమణి పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: మహిళల అక్రమ రవాణా నిరోధకం, రక్షణలో మహిళా పోలీసులు పోషిస్తున్న పాత్ర ప్రశంసనీయమని ఐసీడీఎస్ పీడీ రమాదేవి తెలిపారు. మంగళవారం కలెక్టరేట్లోని ఐసీడీఎస్ సమావేశ మందిరంలో మహిళా పోలీసులకు బాలలకు ఉన్న చట్టాలు, మిషన్ వాత్సల్య అందిస్తున్న సేవల గురించి ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన పీడీ రమాదేవి సచివాలయ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న మహిళా పోలీసులు మహిళలు, పిల్లలతో అనునిత్యం మమేకమై వారి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నారన్నారు. జిల్లా బాలల పరిరక్షణ అధికారి సుభాష్ యాదవ్ మాట్లాడుతూ జిల్లా బాలల పరిరక్షణ విభాగం, శిశు గృహ అందిస్తున్న సేవలు గురించి వివరించారు. జిల్లా బాలల పరిరక్షణ విభాగం, మిషన్ శక్తి వన్ స్టాప్ సెంటర్,శిశుగృహ సిబ్బంది పాల్గొన్నారు. -
హెల్మెట్ ధారణ.. ప్రాణాలకు రక్షణ
కడప అర్బన్ : హెల్మెట్ ధరింపుతో ప్రాణాలు సురక్షితమని, ప్రతి ఒక్కరూ హెల్మెట్ ధరించి ప్రయాణం చేయాలని కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు తెలిపారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు 37వ జాతీయ రోడ్డు భద్రతా మాసోత్సవాల సందర్భంగా కడప నగరంలో మంగళవారం ట్రాఫిక్ పోలీసులు రోడ్డు భద్రతా నిబంధనల ప్రాధాన్యత వివరిస్తూ కోటిరెడ్డి సర్కిల్ నుంచి సంధ్య సర్కిల్ వరకూ అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతూ ఎక్కువ మంది తలకు గాయం కావడం వల్లే చనిపోతుండటం చూస్తున్నామన్నారు. ఈ విచార ఘటనల వల్ల ఎన్నో కుటుంబాలు రోడ్డున పడుతున్నాయని, హెల్మెట్ ధారణతో ప్రమాదాల నుంచి రక్షణ పొందవచ్చని సూచించారు. ఈ కార్యక్రమంలో కడప ట్రాఫిక్ సీఐ సురేష్ రెడ్డి, ఎస్ఐ సిద్దయ్య, విద్యార్థులు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీలో మంగళవారం భారతీయ విజ్ఞాన్ వ్యవస్థ క్లబ్ను ఏకశిలానగరం శ్రీ పోతన సాహిత్యపీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ విజ్ఞాన సంపద, సంస్కృతి, సంప్రదాయలను నేటి విద్యార్ధి లోకం తెలుసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. అన్నమాచార్య యూనవర్సిటీ ప్రొ చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి మాట్లాడుతూ భారతీయవిజ్ఙాన వ్యవస్థ క్లబ్ను ఏర్పాటు చేయడం శుభపరిణామమన్నారు. కార్యక్రమంలో వీసీ డా.సాయిబాబారెడ్డి, ప్రిన్సిపాల్ డా.నారాయణ, పీజీ కాలేజి ప్రిన్సిపాల్ సమతానాయుడు, సివిల్ డిపార్టుమెంట్ గౌతమి, ఫార్మసీ కళాశాల ప్రిన్సిపాల్ స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
అభివృద్ధి పనులకు అడ్డంకులు
కడప కార్పొరేషన్: కడప నగరపాలక సంస్థలో అభివృద్ధి పనులకు అడుగడుగునా అడ్డంకులు ఎదురవుతున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం నగరాభివృద్ధికి నిధులు విడుదల చేయకపోయినా నగరపాలకవర్గ సభ్యులు 15వ ఆర్థిక సంఘం నిధులు, సాధారణ నిధులతో గతంలో మంజూరైన పనులను పూర్తి చేస్తున్నారు. వాటి ప్రారంభోత్సవానికి తమను పిలవాలి, తమకు చెప్పి పనులు చేయాలంటూ ఆయా డివిజన్లలోని టీడీపీ ఇన్చార్జులు కాంట్రాక్టర్లను బెదిరిస్తున్నట్లు తెలుస్తోంది. తాజాగా 14వ డివిజన్ ప్రకాష్ నగర్లో రూ.10లక్షలతో చేస్తున్న పనులను స్థానిక టీడీపీ నేతలు అడ్డుకున్నట్లు తెలిసింది. తమను పిలవకుండా ఈ పనులు ఎలా మొదలు పెడతారని వారు కాంట్రాక్టర్ను బెదిరించినట్లు సమాచారం. ఆ వర్క్కు అనుమతులు రెండేళ్లక్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనే వచ్చాయని తెలిసింది. ఇన్నాళ్ల తర్వాత కాంట్రాక్టర్ పనులు చేస్తుంటే టీడీపీ నేతలు అడ్డుపడటంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. నగరంలో రోడ్లు, కాలువలు నిర్మించాలంటే వీరి అనుమతి అవసరమా...మధ్యలో వీరి దౌర్జన్యం ఏమిటని పలువురు ప్రశ్నిస్తున్నారు. ప్రభుత్వం నుంచి ప్రత్యేకంగా నిధులు తెచ్చి అభివృద్ధి పనులు చేయించాల్సిన టీడీపీ నాయకులు, పాత పనులు పూర్తి చేస్తుంటే సైంధవుల్లా మారి అడ్డుతగలడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ప్రజలు అంతా గమనిస్తున్నారని, ఇలాంటి దౌర్జన్యాలు ఆపకపోతే ప్రజలే తగిన బుద్ధి చెబుతారని వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు హెచ్చరిస్తున్నారు. అడ్డుపడుతున్న టీడీపీ నాయకులు నోరెళ్లబెడుతున్న ప్రజానీకం -
పేదలకు అందని స్కానింగ్ సేవలు!
ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ప్రభుత్వాసుపత్రిలో స్కానింగ్ సేవలు సక్రమంగా అందడం లేదు. దీంతో పేదలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. జిల్లా ఆస్పత్రిలో రోజుకు 950–11000 వరకు ఓపీ ఉంటుంది. ఐపీ వార్డుల్లో సుమారు 350–400 మంది వరకు చికిత్స పొందుతుంటారు. ఎక్స్రే, ల్యాబ్ టెస్టులు కూడా వందల్లోనే జరుగుతుంటాయి. వేగంగా వ్యాఽధి నిర్ధారణ జరిగి, రోగులకు నాణ్యమైన వైద్యం అందాలనే ఉద్దేశంతో.. జిల్లా ఆస్పత్రిలో పబ్లిక్ ప్రైవేట్ పార్ట్నర్షిప్ పద్ధతిలో సీటీ, ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్లు ఏర్పాటు చేశారు. ిసీటీ స్కాన్ సెంటర్ కొన్నేళ్ల ముందు నెలకొల్పినా ఎంఆర్ఐ మాత్రం 2019లో ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో నిరంతరాయంగా పేద ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఉచిత ిసీటీ, ఎంఆర్ఐ స్కాన్ సేవలు జరిగేవి. ప్రజాప్రతినిధుల సిఫార్సు లేకుండానే ప్రొద్దుటూరుతోపాటు పరిసర నియోజకవర్గాల ప్రజలకు స్కానింగ్ సేవలు అందేవి. ప్రభుత్వ వైద్యులు సూచించిన వారికి ఉచితంగా స్కాన్ చేసి రిపోర్టు ఇచ్చి పంపించేవారు. ఒక వేళ పేషెంట్కు ఎంఆర్ఐ ఫిల్మ్ కావాలంటే మాత్రం అన్ని హాస్పిటల్స్ మాదిరే ఒక్కో ఫిల్మ్కు రూ. 250 చొప్పున తీసుకొని ఇచ్చేవారు. అయితే ఏడాదిన్నర నుంచి ఆస్పత్రికి వచ్చే రోగులు భిన్నమైన పరిస్థితులను ఎదుర్కొంటున్నారు. ిసీటీ, ఎమ్మార్ఐ స్కానింగ్ల విషయంలో ఆస్పత్రి అధికారులు పూర్తిగా ఆంక్షలు విధించారు. అభద్రతా భావంలో జిల్లా ఆస్పత్రి వైద్యులు విపరీతమైన తలనొప్పి, వెన్ను నొప్పి తదితర అత్యవసర పరిస్థితుల్లో హాస్పిటల్కు వచ్చిన వారికి కూడా వైద్యులు, స్పెషాలిటీ వైద్యులు స్కానింగ్లు రాయడం లేదనే విమర్శలు ప్రజల నుంచి వస్తున్నాయి. రక్త పరీక్షల పేరుతో కొందరు వైద్యులు కాలయాపన చేస్తున్నారని రోగులు వాపోతున్నారు. రోజుల తరబడి హాస్పిటల్కు వస్తున్నా సమస్య తీరకపోవడంతో.. విసుగు చెంది అనేక మంది ప్రైవేట్ హాస్పిటల్స్, స్కానింగ్ సెంటర్లను ఆశ్రయిస్తున్నారు. ఎంఆర్ఐ, ిసీటీ స్కాన్లు రాయాలని కోరితే.. అవసరం లేదుపో అని పంపిస్తున్నారని అనేక మంది రోగులు అంటున్నారు. ఏడాది క్రితం ఎంఆర్ఐ విషయంలో ఉన్నతాధికారుల నుంచి కొందరు వైద్యులకు మెమోలు వచ్చాయి. అప్పటి నుంచి వైద్యుల్లో అభద్రతా భావం నెలకొన్నట్లు తెలుస్తోంది. సీటీ, ఎంఆర్ఐ రాయాలంటేనే భయపడే పరిస్థితి కనిపిస్తోంది. రాష్ట్ర వ్యాప్తంగా పీపీపీ విధానంలో ఏర్పాటు చేసిన స్కానింగ్ సెంటర్లలో ఫిల్మ్ అవసరమైన పేషెంట్లకు ఒక్కో ఫిల్మ్కు రూ.250 చొప్పున తీసుకొని ఇస్తున్నారు. అయితే జిల్లా ఆస్పత్రిలోని ఎంఆర్ఐ సెంటర్లో నెల రోజుల పాటు ఫిల్మ్ ఇవ్వలేదు. డబ్బు ఇస్తామని పేషెంట్లు ప్రాధేయపడ్డా ఉన్నతాధికారుల ఆదేశాలంటూ ఫిల్మ్ ఇవ్వకుండా నిలిపేశారు. ఈ కారణంతో జిల్లా ఆస్పత్రిలో 80 శాతం మేర స్కానింగ్ సేవలు క్షీణించాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రోజుకు 20–25 ఎంఆర్ఐ స్కాన్లు జరుగుతుండగా ప్రస్తుతం రోజుకు 6–7 మాత్రమే చేస్తున్నారు. అలాగే ిసీటీ స్కానింగ్లు కూడా ప్రతి రోజు 50–60 వరకు జరుగగా.. ఇప్పుడు రోజుకు 15–20 మాత్రమే జరుగుతున్నాయి. స్కానింగ్ సేవల్లో రాష్ట్రంలోనే ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రి అట్టడుగున ఉంది. జిల్లాలో కడప రిమ్స్ తర్వాత ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలో సిటీ, ఎంఆర్ఐ సెంటర్లు ఉండటంతో ఎక్కువ మంది పేదలు ఉచితంగా స్కానింగ్ తీయించుకునేందుకు ఇక్కడికి వస్తుంటారు. ఆంక్షల పేరుతో స్కానింగ్ చేయకపోవడంతో ఆస్పత్రికి వచ్చి అనేక మంది నిరాశతో వెనుతిరిగి వెళ్తున్నారు. రూ. వేలు చెల్లించి ప్రైవేట్ స్కాన్ సెంటర్లలో స్కానింగ్ తీయించుకుంటున్నారు. ఎమ్మెల్యేల సిఫార్సు లెటర్లు ఉంటేనే.. స్కానింగ్లు బాగా తగ్గిపోవడంతో ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిలోని ఎంఆర్ఐ స్కానింగ్ సెంటర్ను నిర్వాహకులు ఎత్తేసే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. అగ్రిమెంట్ కాలపరిమితి పూర్తి కాగానే ఇక్కడి నుంచి తీసేయాలని కంపెనీ యోచిస్తున్నట్లు సమాచారం. ఇదే కనుక జరిగితే పేదలపై తీవ్ర భారం పడే అవకాశం ఉంది. దీనిపై పూర్తి స్థాయి స్పష్టత లేకున్నా ప్రచారమైతే ఎక్కువగా జరుగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ప్రొద్దుటూరు ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి జిల్లా ఆస్పత్రిలో అందుతున్న వైద్య సేవలపై తరచూ అధికారులతో మాట్లాడేవారు. నెలలో ఒక మారైనా ఆయన ఆస్పత్రికి వెళ్లి పరిశీలించేవారు. ముఖ్యంగా వివిధ వ్యాధులతో వస్తున్న పేదలకు జాప్యం జరగకుండా ఉచితంగా స్కానింగ్ సేవలు అందించాలని వైద్యాధికారులకు సూచించేవారు. దీంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో పేద ప్రజలకు సులభంగా ఉచిత స్కానింగ్ సేవలు అందేవి. అయితే ప్రొద్దుటూరు కూటమి నాయకులు వారి కార్యకర్తలకు, తెలిసిన వారికి ఎమ్మెల్యే సిఫార్సు లెటర్లు ఇచ్చి పంపిస్తున్నారు కానీ.. పేద ప్రజలందరికీ స్కానింగ్ సేవలు అందేలా చర్యలు తీసుకోలేదనే విమర్శలు ప్రజల నుంచి వినిపిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రిలో క్షీణించిన ఎంఆర్ఐ, సీటీ స్కాన్ సేవలు స్కానింగ్ రాయడానికి జంకుతున్న వైద్యులు ఎంఆర్ఐ సెంటర్ ఎత్తేసే యోచనలో నిర్వాహకులు లాభపడుతున్న ప్రైవేట్ స్కాన్ సెంటర్లు -
నేటి నుంచి అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవాలు
రాజంపేట : అన్నమాచార్య యూనివర్సిటీ విద్యాసంస్థల వార్షికోత్సవాలను పండుగలా నిర్వహించేందుకు సన్నాహాలు చేస్తున్నామని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రొ–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి తెలిపారు. మంగళవారం ఏయూ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి చాంబరులో ఆయన మాట్లాడారు. ఈ నెల 7, 8, 9వ తేదీలలో అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవాలను నిర్వహించదలుచుకున్నామన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ పరిధిలోని అన్ని కళాశాలలకు సంబంధించి ఒకేసారి వార్షికోత్సవం చేపట్టడం ఇదే తొలిసారి అన్నారు. యూనివర్సిటీ పరిధిలో ఇంజినీరింగ్, వ్యవసాయ, ఫార్మసీ, న్యాయ, బీఈడీ, పారామెడికల్ కోర్సుల కళాశాలలు ఉన్నాయన్నారు. వేలాది మంది విద్యార్థులకు నాణ్యమైన బోధన అందించేందుకు ఏయూ యాజమాన్యం తన వంతుగా కృషి చేస్తోందన్నారు. ఏయూ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి ఆధ్వర్యంలో అన్నమాచార్య యూనివర్సిటీ రాయలసీమకే తలమానికంగా ఉండేలా రూపుదిద్దుకుంటోందన్నారు. వార్షికోత్సవాల తొలిరోజున అంటే 8న ప్రముఖ సింగర్ మంగ్లి, సినీ నటుడు మౌలి తనుజ్ ప్రశాంత్ పాల్గొంటారన్నారు. సంగీత విభావరి కార్యక్రమం ఉంటుందన్నారు. రెండవ రోజున కోర్టు మూవీ హిరోయిన్ శ్రీదేవి, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, మున్సిపాలిటీ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి పాల్గొంటారన్నారు. స్పోర్ట్స్, కల్చరల్ దినోత్సవాలు జరుగుతాయన్నారు. ముగింపు రోజున హ్యాపీడేస్ హీరో నిఖిల్ సిద్దార్థ, అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కనుగిల్లి, అన్నమాచార్య యూనివర్సిటీ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి పాల్గొంటారన్నారు. ఏయూ విద్యాసంస్థల వార్షికోత్సవాలు ఉంటాయన్నారు. మూడు రోజుల పాటు జరిగే ఈ ఉత్సవాలలో విభిన్న రీతిలో కార్యక్రమాలను నిర్వహించడం జరుగుతుందన్నారు. వేలాది మంది విద్యార్థిని, విద్యార్థులు ఈ ఉత్సవాలలో పాల్గొంటారన్నారు. ఈ ఉత్సవాలకు ఏయూ యాజమాన్యం సర్వం సిద్ధం చేసిందన్నారు. ప్రతి రోజు సాయంత్రం 5 గంటలకు ఉత్సవాలు నిర్దేశించిన సమయానికి ప్రారంభమవుతాయన్నారు. కార్యక్రమంలో ఏఐటీఎస్ వైస్ చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, ఈయూ డాక్టర్ సాయిబాబరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● రైతులపై చిత్తశుద్ధిలేని కూటమి ప్రభుత్వం
కడప సిటీ/చక్రాయపేట: కరువు నేలపై జలకళ తెచ్చేందుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భగీరథ ప్రయత్నం చేశారు. కాలేటి వాగుతోపాటు మరో రెండు చిన్న రిజర్వాయర్లకు శ్రీకారం చుట్టారు. ముఖ్యంగా చక్రాయపేట మండలంలోని ఆయా ప్రాంతాలు నిత్యం కరువు కోరల్లో చిక్కి తండ్లాడుతుంటాయి.. వేసిన పంట చేతికొచ్చే వరకు నమ్మకం లేని పరిస్థితులే ఉంటాయి. ఈ నేపథ్యంలో అక్కడి రైతులను ఆదుకునేందుకు అప్పటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వం రూ.500 కోట్లతో కాలేటి వాగు నిర్మించడంతోపాటు లిఫ్ట్ ఇరిగేషన్ ద్వారా తరలించేందుకు చర్యలు చేపట్టింది. సుమారు 90 శాతం పనులు కూడా చేసింది. ఆపై కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పనులు ఆగిపోయాయి. పనులు కొనసాగించి ఉంటే 2025 డిసెంబరు చివరి నాటికే పనులు పూర్తయి 133 చెరువులు నింపేందుకు అవకాశం ఉండేది. కానీ చంద్రబాబు సర్కారు అన్ని విషయాల్లోనూ కక్షసాధింపు ధోరణి అవలంబిస్తోంది. పనులు ప్రారంభించి అన్నదాతలను ఆదుకోవాల్సిందిపోయి అనేక సాకులు పెట్టి జరిగిన పనులపై విజిలెన్స్ అంటూ కొత్త రాగం అందుకుంది. అంతేనా మొత్తం పనిమీద 25 శాతం పూర్తి కాలేదన్న నెపంతో కాంట్రాక్టును రద్దు చేసి మళ్లీ రీ టెండరు పిలించేందుకు ప్రయత్నాలు ప్రారంభించింది. కేవలం వైఎస్సార్ సీపీ సానుభూతి పరులు నిర్మాణ పనులు చేపట్టడం వల్ల ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. అంతేకాకుండా వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ఈ దుష్ట పన్నాగం పన్నినట్లు స్పష్టమవుతోంది. రూ. 4300 కోట్లతో పనులకు శ్రీకారం వైఎస్సార్ సీపీ ప్రభుత్వం చక్రాయపేట మండలం తక్కళ్లపల్లె సమీపంలో 1.2 టీఎంసీల సామర్థ్యంతో కాలేటి వాగు ప్రాజెక్టు నిర్మాణం చేపట్టింది. వేంపల్లె మండలం పామలూరు గ్రామ సమీపంలో జీఎన్ఎస్ఎస్ కాలువపై 56 కి.మీ వద్ద నుంచి దాదాపు 125 కిలోమీటర్ల మేర పైపులైను ద్వారా కాలేటి వాగును నింపేందుకు ప్రణాళికలు చేపట్టింది. ఇక్కడి నుంచి నీటిని గ్రావిటీ ద్వారా వెలిగల్లు ప్రాజెక్టుకు పంపింగ్ చేయాల్సి ఉంటుంది. అక్కడి నుంచి రెండు విభాగాలుగా పుంగనూరు బ్రాంచ్ కెనాల్ వద్ద అన్నమయ్య జిల్లా తంబళ్లపల్లెలోని జంగమదేవరపల్లె వద్దకు 800 క్యూసెక్కుల నీటిని తరలిస్తారు. ఈ పథకం వల్ల దాదాపు 3 లక్షల ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. అంతేకాకుండా చక్రాయపేట, రామాపురం, లక్కిరెడ్డిపల్లె మండలాల్లోని 133 చెరువులకు నీళ్లు అందించి భూగర్భ జలాలు పెంచడం కూడా లక్ష్యంగా అనుకున్నారు. ఈ మేరకు రూ. 4300 కోట్లను వైఎస్సార్ సీపీ ప్రభుత్వం కేటాయించింది. 90 శాతం ప్రాజెక్టు పనులు పూర్తి కాలేటి వాగు నిర్మాణ పనులను ఒకసారి పరిశీలిస్తే రిజర్వాయర్ స్పిల్వే, గేట్లు, ఎర్త్బండ్ పనులు ఈ ప్రభుత్వం రాకముందే ఓ కొలిక్కి వచ్చాయి. పనులు యథావిధిగా జరిగి ఉంటే ఈ పాటికి ఎప్పుడో కాలేటి వాగుకు నీరు అంది రైతాంగానికి ఎంతో ప్రయోజనం చేకూరేది. కరువు నేలపై జల సిరులు పారించాలని.. కాడి పట్టిన రైతింట సిరులపంటలొలకాలని.. జననేత వైఎస్ జగన్ పరితపించారు.. సీఎం హోదాలో కాలేటి వాగుకు శ్రీకారం చుట్టారు... భూమాత ఒడిలో గలగలల సవ్వళ్లు వింటూ ఆనందించాలని కరవు రైతులు కలలుగన్నారు.. అధికారం మారాక.. సీఎంగా చంద్రబాబు కొలువుదీరాక రైతు కల కల్లలైంది. పనులు పూర్తి చేయడం బాబు మనసుకు భారమైంది.. సీమ భూముల్లో నీళ్లు పారడం ఆయనకు నచ్చనట్లుంది.. అంతే కాలేటి వాగు కదలనంది. ‘కాలేటి వాగు చూస్తే..కడుపు మండుతోందా బాబూ..’ అంటూ రైతు లోకం ఎలుగెత్తి ప్రశ్నిస్తోంది. కూటమి ప్రభుత్వం కొలువుదీరాక పనులు నిలిపివేత 133 చెరువులకు నీరు అందని వైనం ప్రాజెక్టు పనులు 90 శాతంవైఎస్సార్ సీపీ హయాంలో పూర్తి విజిలెన్స్ తనిఖీపేరుతో కాలయాపన చేస్తున్న బాబు సర్కారు ప్రస్తుతం 25 శాతం పనులు జరగలేదని రీ టెండరుకు యత్నం ముఖ్యమంత్రికి చంద్రబాబుకు ఆది నుంచి వ్యవసాయమంటే పట్టదు.. రైతులంటేనే గిట్టదు. ఇక వైఎస్సార్ జిల్లా ప్రజలన్నా.. రైతులన్నా ఆయనకు చిన్నచూపే. కాలేటి వాగు నిర్మాణ పనులు ఆపడమే ఇందుకు తాజా ఉదాహరణ. వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో చేపట్టిన ఈ సాగునీటి ప్రాజెక్టు పనులను ముందుకు సాగించకుండా నిర్ణయాలు తీసుకోవడం ఎంతవరకు సమంజసమని రైతులు ప్రశ్నిస్తున్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఈ ప్రాజెక్టు నిర్మాణంపై ప్రత్యేక శ్రద్ద కనబరిచి నిధులు కేటాయిస్తే ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం టెండరునే రద్దు చేసి కాలయాపన చేస్తూ ముందుకు సాగుతోందని మండిపడుతున్నారు. -
అట్టహాసంగా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్
కడప అర్బన్ : వైఎస్ఆర్ జిల్లా పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్– 2025 ముగింపు వేడుకలు అట్టహాసంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో కలిసి ముఖ్య అతిథిగా విచ్చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల రోడ్ సేఫ్టీ సమావేశంలో జిల్లా ఎస్పీ ఒక ప్రతిపాదన చేయడం జరిగిందని, జిల్లాలో సంవత్సరానికి సగటున దాదాపు 700 నుంచి 800 మంది యువకులు తలకు గాయంతో ప్రాణాలు కోల్పోతున్నారన్నారు. ప్రమాదాలను నివారించేందుకు పోలీస్ సిబ్బందికి హెల్మెట్స్ ఇవ్వనున్నట్లు తెలిపిన జిల్లా ఎస్పీ వాటిని అందచేసే మంచి అవకాశం ఇవ్వడం పట్ల సంతోషంగా ఉందన్నారు. క్రీడల్లో ఓవరాల్, వ్యక్తిగత, టీమ్ ఛాంపియన్ షిప్ విభాగంలో విజేతలకు జిల్లా కలెక్టర్ అభినందనలు తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గత నాలుగు రోజులుగా క్రీడల నిర్వహణకు చక్కగా ఏర్పాట్లు చేశారని నిర్వాహకులైన ఏఆర్ పోలీస్ అధికారులు, గ్రౌండ్ స్టాఫ్నకు అభినందనలు తెలిపారు. స్పోర్ట్స్ మీట్లో ఓవరాల్ చాంపియన్గా డి.ఏ.ఆర్ జట్టు నిలవగా, వ్యక్తిగత విభాగంలో చాంపియన్గా కానిస్టేబుల్ ఎల్.సతీష్(పి.సి 3322) కడప సబ్–డివిజన్ టీం చాంపియన్ షిప్ సాధించారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్.పి(అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ (ఏ.ఆర్) బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డి.ఎస్.పి ఎన్.సుధాకర్, కడప డి.ఎస్.పి ఏ.వెంకటేశ్వర్లు, జమ్మలమడుగు డి.ఎస్.పి కె.వేంకటేశ్వరరావు, ప్రొద్దుటూరు డి.ఎస్.పి పి.భావన, పులివెందుల డి.ఎస్.పి మురళి, మైదుకూరు డి.ఎస్.పి జి.రాజేంద్ర ప్రసాద్, డి.టి.సి డి.ఎస్.పి అబ్దుల్ కరీమ్, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
ప్రొద్దుటూరు : సీఎం చంద్రబాబు నాయుడు రాయలసీమ, నెల్లూరు జిల్లాల ప్రజల గొంతుకోశాడని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి విమర్శించారు. సాధారణంగా కోడిని కోసేటప్పుడు గొంతులో నీరు పోస్తారని, చంద్రబాబు నీరు పోయకుండానే ప్రజల గొంతు కోశాడని అన్నారు. ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. జగన్ ప్రభుత్వంలో రాయలసీమ ఎత్తిపోతల పథకానికి రూ.3,850 కోట్లు మంజూరు చేసి పనులు ప్రారంభించారన్నారు. సాగునీటితోపాటు వ్యవసాయాన్ని అభివృద్ధి చేసేందుకు ఈ పథకాన్ని మంజూరు చేసి వేగవంతంగా పనులు చేపట్టారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ పథకాన్ని నిలిపేశారన్నారు. స్వయాన తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి అసెంబ్లీలో మాట్లాడుతూ తన అభ్యర్థన మేరకు ఈ పథకాన్ని చంద్రబాబు ఆపేసినట్లు తెలిపారని చెప్పారన్నారు. రాయలసీమతోపాటు నెల్లూరు జిల్లాల ద్రోహి చంద్రబాబు అని విమర్శించారు. రాయలసీమకు చంద్రబాబు ప్రభుత్వంలోనే ద్రోహం జరుగుతూ వస్తుందనడానికి ఉదాహరణలు ఉన్నాయని తెలిపారు. కరువు ఛాయలను నివారించేందుకే రాజోలి, జొలదరాశి రిజర్వాయర్ నిర్మాణ పనులను జగన్ ప్రభుత్వం చేపట్టిందన్నారు. ఇది ఇలా ఉండగా సీమ లిఫ్ట్ ఆపేసింది జగనే అని చంద్రబాబును సంరక్షించేందుకు ఆంధ్రజ్యోతి రోత రాతలు రాయడం తగదన్నారు. తాను ఈ వార్తలను పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. అనంతరం ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను కాల్చారు. అక్షరాలకు సమాజాన్ని మార్చే శక్తి ఉందని, ఇలాంటి తప్పుడు రాతల వల్ల నష్టం జరిగే అవకాశం ఉందన్నారు. చంద్రబాబును కాపాడేందుకు జర్నలిజాన్ని ఇలా వాడుకుంటారా అని ప్రశ్నించారు. ఇప్పటికై నా టీడీపీ కరపత్రిక ఆంధ్రజ్యోతికి బుద్ధి రావాలని కోరుకుంటున్నానని, ఆ పత్రికను ఎరూ చదవ వద్దని కోరారు. 18 నెలల్లో భోగాపురం ఎయిర్పోర్టును పూర్తి చేస్తారా జగన్ ప్రభుత్వంలో రూ.960 కోట్లతో భోగాపురం విమానాశ్రయ పనులను ప్రారంభించారని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. 2026 నాటికి ఈ పనులు పూర్తవుతాయని, అప్పటికి జగనే మళ్లీ సీఎంగా ఉండాలని తాను కోరుకుంటున్నానని జీఎంఆర్ సంస్థ ప్రతినిధి తెలిపారన్నారు. అయితే ప్రస్తుతం విమానాశ్రయ పనుల ప్రారంభోత్సవానికి వచ్చిన కేంద్ర మంత్రి గడ్కరి 18 నెలల్లోనే విమానాశ్రయాన్ని పూర్తి చేశారని చంద్రబాబుకు కితాబు ఇవ్వడం తగదన్నారు. జగన్ ప్రభుత్వ హయాంలో భూ సేకరణ జరిగిందని, పనులు ప్రారంభమయ్యాయని అన్నారు. వాస్తవ సత్యాలు తెలుసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు ఇలా మాట్లాడటం తగదన్నారు. సమావేశంలో పార్టీ నాయకులు పాల్గొన్నారు.ఆంధ్రజ్యోతి పత్రిక ప్రతులను కాల్చిన మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
రైలు కిందపడి వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కృష్ణాపురం రైల్వేస్టేషన్ల మధ్య (రాయచోటి బ్రిడ్జి వద్ద)మంగళవారం ఉదయం ఓ వ్యక్తి రైలు కింద పడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. 55 ఏళ్ల వయస్సు గల ఈ వ్యక్తి షిరిడిసాయి వీక్లీ ఎక్స్ప్రెస్ రైలు కిందపడడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. అతను తెల్లటి బనియన్, బెల్ట్ ప్యాంటు, బెల్ట్ ధరించి ఉన్నాడు. కుడిచేయిపై తేలు గుర్తుగల పచ్చబొట్టు ఉంది. మృతుడి ఆచూకీ తెలిసిన వారు తమకు తెలియజేయాలని కడప రైల్వేపోలీసులు కోరారు. 3 ప్రథమ చికిత్స కేంద్రాలు సీజ్తొండూరు : తొండూరులో ప్రజల ప్రాణాలతో చెలగాటమాడుతూ వైద్య నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న ప్రథమ చికిత్స కేంద్రాలపై మండల ప్రజలు జిల్లా కలెక్టర్కు స్పందన కార్యక్రమంలో చేసిన ఫిర్యాదుల నేపథ్యంలో.. వైద్య, ఆరోగ్య శాఖ అధికారులు కఠిన చర్యలకు దిగారు. జిల్లా కలెక్టర్, జిల్లా వైద్య, ఆరోగ్య శాఖాధికారుల ఆదేశాల మేరకు.. ఉప జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి ఖాజా మొహిద్దీన్ తొండూరు గ్రామంలో ఉన్న మూడు ప్రథమ చికిత్స కేంద్రాలపై మంగళవారం ఆకస్మికంగా తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా డిప్యూటీ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ ప్రజల ఆరోగ్యాన్ని రక్షించాల్సిన కేంద్రాలే ప్రజల ప్రాణాలకు ముప్పుగా మారుతున్నాయన్నారు. అనంతరం నిబంధనలకు విరుద్ధంగా పని చేస్తున్న కేంద్రాలపై పోలీసు శాఖ, మండల మెజిస్ట్రేట్ అయిన తహసీల్దార్లకు ఫిర్యాదు చేయగా వారి సహకారంతో మూడు ప్రథమ చికిత్స కేంద్రాలను సీజ్ చేశారు. సంబంధిత నిర్వాహకులకు నోటీసులు జారీ చేసి, పూర్తి వివరాలతో నివేదికను ఉన్నతాధికారులకు సమర్పించారు. కార్యక్రమంలో డాక్టర్ సుభాషిణి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ అధికారి మల్లయ్య, ఉప జిల్లా వైద్య ఆరోగ్య కార్యాలయ సిబ్బంది నరేష్, శేఖర్, పోలీస్, రెవెన్యూ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రజలను డైవర్షన్ చేయడానికి బీటెక్ రవి తంటాలు
● కృష్ణా నీటిని పులివెందులకు తెచ్చిన ఘనత వైఎస్ కుటుంబానిదే ● మీడియాతో మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైఎస్సార్సీపీ నాయకులుపులివెందుల : వైఎస్ అవినాష్రెడ్డి ప్రెస్ మీట్కు కౌంటర్ ఇవ్వడానికి బీటెక్ రవి ఏ నగరంలో ఉన్న స్థావరానికి వెళ్లి సలహాలు తీసుకొని వచ్చాడో, ఇందుకు దాదాపు వారం పైన సమయం పట్టిందా అని మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, వైస్ చైర్మన్ హఫీజ్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, వైఎస్సార్సీపీ పట్టణ ఉపాధ్యక్షుడు పార్నపల్లె కిశోర్ ఎద్దేవా చేశారు. లేక జూద స్థావరాల నుంచి వచ్చే వాటాల విషయమై మీ అనుచరుల మధ్య వచ్చిన మనస్పర్థల కారణంగా, మీ వారే పోలీసులకు ఫిర్యాదు చేసుకుని అరెస్ట్ అయితే, పోలీస్ వారిపైనే దాడి చేసిన ఘటన నుంచి ప్రజలను డైవర్షన్ చేయడానికి ఇప్పుడు కౌంటర్ గుర్తుకు వచ్చిందా అని ప్రశ్నించారు. మంగళవారం సాయంత్రం పట్టణంలోని భాకరాపురంలో ఉన్న వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో వారు మీడియాతో మాట్లాడారు. హంద్రీ నీవా కాలువ నుంచి గతంలో కూడా ఎర్రబల్లె చెరువుకు నీళ్లు ఇవ్వడం జరిగిందని, టైలింగ్ ఫాండ్ వరకు నీరు తీసుకెళ్లాలంటే పెద్ద పైపులైన్ ద్వారా మనకు హక్కుగా ఉన్న చిత్రావతి జలాశయం నుంచి ఎక్కువ మంది రైతులకు మేలు, శాశ్వత పరిష్కారం లభిస్తుందన్న ఉద్దేశంతోనే ఎగువ ప్రాంతంలో ఉన్న చెరువుల్లో నీరు సమృద్ధిగా నిండితే.. కింది ప్రాంతంలో ఉన్న చెరువుకు నీళ్లు రావడం సర్వసాధారణమని, కానీ దీన్ని కూడా గ్రావిటేషన్ ద్వారా నీరు ఇచ్చామని చెప్పుకునే నీ లాంటి అవకాశవాది (బీటెక్ రవి) ఎవ్వరు ఉండరన్నారు. మేం అడిగే ప్రశ్నలకు ధైర్యం ఉంటే సమాధానం చెప్పు ఎక్కడో శ్రీశైలం దగ్గర ఉన్న కృష్ణా నీటిని పులివెందులకు తెచ్చిన ఘనత , అలాగే మన ప్రాంతంలో దాదాపు ప్రతి గ్రామానికి, ప్రతి చెరువుకు నీరు తెప్పించింది వైఎస్ కుటుంబమన్నారు. కేవలం కల్లబొల్లి మాటలు, అక్రమాలు, దౌర్జన్యాలు తప్ప ఒక్క రూపాయి అభివృద్ధి లేదని, మన ప్రాంత ప్రజలకు నీవు మంచి చేసింది లేదన్నారు. వేములలో రాత్రికి రాత్రి జరిగిన మైనింగ్ దోపిడీలో నీకు, నీ పార్టీ నేతలకు వాటాలు అందడం వాస్తవమా, కాదా అన్నారు. పులివెందుల ప్రాంతంలో నీ అనుచరులు లోపట్నూతల కోవర్టు వెంగళ్రెడ్డి, పులివెందుల క్రికెట్ బుకీ జీవుల రమణ ఇంకా నీ ప్రధాన అనుచరుల కనుసన్నల్లో దాదాపు మూడు జిల్లాల నుంచి జూదరులను తీసుకొచ్చి వారి గృహాలు, తోటల్లో ఆడించి, అలాగే సింహాద్రిపురం, కసనూరులో జరిగే జూద స్థావరాల నుంచి నీకు ముడుపులు అందలేదా అన్నారు. యథేచ్ఛగా సాగుతున్న ఇసుక, మైనింగ్ అక్రమ రవాణాలో నీకు, నీ కుటుంబ సభ్యులకు వాటాలు ఉన్నాయా లేవా అని ప్రశ్నించారు. పార్నపల్లి దగ్గర పట్టుకున్న అక్రమ రేషన్ బియ్యం రవాణాలో నీ హస్తం ఉందా, లేదా నిలదీశారు. వీటన్నింటిపై ఏ దేవుడి సన్నిధిలోకి వచ్చి ప్రమాణ పూర్తిగా నీకు గానీ, నీ కుటుంబ సభ్యులకు గానీ సంబంధం లేదని ప్రమాణం చేయగలవా ప్రశ్నించారు. నియోజకవర్గంలో ప్రతి ఇంటికి నీటిని అందించే వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పూర్తి చేసి జాతికి అంకితం చేయాలని కాకుండా పులివెందుల మున్సిపాలిటీలో తాగునీటి కష్టాలు తీర్చాలని అడిగినట్లు నిరూపించు, లేకపోతే రాజకీయ సన్యాసం చేస్తానని ప్రమాణం చేయాలన్నారు. నువ్వు మాట్లాడిన మైనింగ్ గురించి ప్రభుత్వం చేత అన్ని రకాల అప్రూవల్ పొందిన మైన్ ఓనర్ దగ్గర నుంచి లేబర్ కాంట్రాక్టు కింద అగ్రిమెంట్ చేసుకుని లీగల్గా మా నాయకులు మైనింగ్ వ్యాపారం చేశారన్నారు. వైఎస్ కుటుంబమంతా ఒక్కటే ఆ కుటుంబంలో ఎటువంటి మనస్పర్థలు లేవని, నీ లాంటి బోగస్, అర్హత లేని నీచ రాజకీయాలు చేసే వారి వ్యాఖ్యల వల్ల ఎటువంటి ఉపయోగం లేదన్నారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వం గురించి మాట్లాడే అర్హత నీకు లేదుఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వం గురించి, మంచితనం, మేథస్సు గురించి నీ లాంటి బ్లఫ్ మాస్టర్ చెప్పాల్సిన అవసరం లేదన్నారు. ఆయన వ్యక్తిత్వంపై ఎంత బురద చల్లినా జిల్లా ప్రజలకు ఆయన పై ఉన్న ఆదరాభిమానాలకు అంతులేదని, గుండెల్లో పెట్టుకొని మూడు సార్లు ఎంపీగా గెలిపించారని అన్నారు. అలాంటి వ్యక్తి గురించి మాట్లాడే, పేరు ఉచ్చరించే అర్హత కూడా నీకు లేదని అన్నారు. ఇకనైనా పులివెందుల ప్రాంతానికి ఏదైనా మంచి చేయాలనే ఆలోచన బోగస్ రవికి ఇవ్వాలని దేవున్ని కోరుతున్నామన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు రసూల్, సర్వోత్తమరెడ్డి, కనక తదితరులు పాల్గొన్నారు. -
అటకెక్కిన అర్బన్ మండలం
● 18 ఏళ్లుగా అమలుకు నోచని జీఓ ● ఆదాయం పోతుందని తొక్కిపెట్టిన వైనం ● పనులు జరగక ఇబ్బంది పడుతున్న ప్రజలు కడప సెవెన్రోడ్స్: కడప అర్బన్ మండలం ఏర్పాటుపై రాష్ట్ర ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులు 18 సంవత్సరాలుగా అమలుకు నోచుకోని విషయం దిగ్బ్రాంతి కలిగిస్తోంది. నగరాన్ని అర్బన్, రూరల్ మండలాలుగా విభజించి తహసీల్దార్ కార్యాలయాలు ఏర్పాటు చేస్తే తమ ఆదాయానికి గండిపడుతుందని భావించిన కొందరు అధికారులు ఫైలు కదలకుండా తొక్కి పెట్టించారనే ఆరోపణలున్నాయి. దీంతో అర్బన్ మండలం ఆవిర్భవించకపోవడంతో పనులు జరగక నగర వాసులు పలు ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తోంది. వై.ఎస్.రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో కడప మున్సిపాలిటీని కార్పొరేషన్గా అప్గ్రేడ్ చేశారు. పెద్ద ఎత్తున భూమి సమస్యలు తలెత్తాయి. అప్పట్లో నగర జనాభా 2.68 లక్షలు ఉండేది. ఒక్క తహసీల్దారే ఉంటే రోజువారి పాలన, ప్రోటోకాల్ విధులతో పాటు ప్రభుత్వ భూములను పరిరక్షించడం కష్టమవుతుందని ఆనాటి ప్రభుత్వం భావించింది. దీంతో కడప మండలాన్ని అర్బన్, రూరల్ కింద విభజించాలని నిర్ణయించింది. కడప నగరంతో పాటు నాగరాజుపల్లె, చెమ్ముమియాపేట, చిన్నచౌకు, పాతకడప, గూడూరు, రామరాజుపల్లె తదితర రెవెన్యూ గ్రామాల్లో ఆరింటిని అర్బన్ కింద, ఐదు గ్రామాలను రూరల్ కింద విభజించాలని ఆనాటి ప్రభుత్వం కలెక్టర్కు ఆదేశాలు ఇచ్చింది. కొత్త తహసీల్దార్ పోస్టు కూడా మంజూరు చేసింది. ఆ మేరకు 2007 సెప్టెంబరు, 1వ తేదీ జీఓ ఎంఎస్ నెం.224 జారీ చేశారు. అలాగే ఒక డిప్యూటీ తహసీల్దార్, ఒక సీనియర్ అసిస్టెంట్, ఒక మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్, ఒక మండల సర్వేయర్ పోస్టులను కూడా నాటి ప్రభుత్వం మంజూరు చేసింది. అర్బన్ మండలం ఏర్పాటులో జాప్యం తగదు అర్బన్ మండలం కోసం అప్పటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇవ్వడమే కాకుండా తహసీల్దార్, డీటీ, సీనియర్ అసిస్టెంట్, ఆర్ఐ, సర్వేయర్ వంటి పోస్టులను కూడా మంజూరు చేసింది. అయితే అధికారులు ప్రజల అవసరాలు గుర్తించి అర్బన్ మండలం ఏర్పాటు చేయకుండా సిబ్బందిని మాత్రం ఇతర విధులకు వినియోగించుకుంటున్నారు. ఇప్పటికై నా కలెక్టర్ స్పందించి అర్బన్ మండలం ఏర్పాటుకు చర్యలు తీసుకోవాలి. – ఎన్.వెంకట శివ, నగర కార్యదర్శి, సీపీఐ ఇది నిర్లక్ష్యానికి పరాకాష్ట కడప నగర జనాభా రోజురోజుకూ పెరుగుతోంది. ఇందువల్ల ప్రజల అవసరాలు కూడా బాగా పెరిగాయి. వివిధ పనుల కోసం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయాల్సి వస్తోంది. చిన్నచిన్న పనులు కూడా సకాలంలో జరగకపోవడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. 18 ఏళ్ల క్రితమే నగర ప్రజల అవసరాలను గుర్తించి అర్బన్ మండలాన్ని ఏర్పాటు చేయాలని నాటి ప్రభుత్వం ఉత్తర్వులు ఇచ్చింది. కానీ ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదంటే ఇది ఉన్నతాధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట. ఇప్పటికై నా ప్రజల అవసరాలు గుర్తించి అర్బన్ మండలం ఏర్పాటు చేయాలి. – ఎ.రామ్మోహన్రెడ్డి, నగర కార్యదర్శి, సీపీఎం అదే సమయంలో ప్రభుత్వం నంద్యాల, ఆదోని, చిత్తూరు పట్టణాల్లో కూడా అర్బన్ మండలాలు ఏర్పాటు చేయాలని ఉత్తర్వులు ఇచ్చింది. ఆ పట్టణాల్లో అర్బన్ మండలాలు ఏర్పాటయ్యాయి. కానీ, కడపలోనే ప్రభుత్వ ఉత్తర్వులు అమలుకు నోచుకోకుండా 18 సంవత్సరాలుగా మూలనపడ్డాయి. అర్బన్ మండలానికి మంజూరు చేసిన తహసీల్దార్ను ప్రస్తుతం కలెక్టరేట్ డి–సెక్షన్ సూపరింటెండెంట్గా నియమించి పనులు చేయించుకుంటున్నారు. డిప్యూటీ తహసీల్దార్, సీనియర్ అసిస్టెంట్ కడప ఆర్డీఓ కార్యాలయంలో, రెవెన్యూ ఇన్స్పెక్టర్ కలెక్టరేట్లో, మండల సర్వేయర్ తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్నారు. అర్బన్ మండలం ఏర్పాటు చేయకుండా మంజూరు చేసిన ఉద్యోగులను ఇతర కార్యాలయాల్లో నియమించారు. నగర విస్తీర్ణం రోజురోజుకు పెరుగుతోంది. ఇప్పటికే నాలుగు లక్షలకుపైగా జనాభా ఉంది. ప్రజలు వివిధ పనుల నిమిత్తం తహసీల్దార్ కార్యాలయం చుట్టూ తిరుగుతున్నారు. అయితే పనిభారం అధికంగా ఉండటం వల్ల ప్రజల పనులు సకాలంలో పూర్తి చేయని పరిస్థితి ఏర్పడింది. ఈ పరిస్థితుల్లో అర్బన్ మండలం ఏర్పాటుకు కలెక్టర్ శ్రీధర్ చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
రైతులకు అండగా ఉంటాం
మంత్రి సవిత వీరపునాయునిపల్లె: రాష్ట్రంలోని ప్రతి రైతును ఆదుకోని వారికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసీ సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉల్లి రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక పోగా అధిక వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పంటనష్ట పరిహారం మంజూరు చేశామన్నారు. కలెక్టర్ శ్రీధర్ మాట్లాడుతూ రైతులు మార్కెట్కు అనుకూలంగా పంటలు సాగు చేయాలని అలా కాకుండా పంటలు సాగు చేస్తే నష్టాల బారిన పడాల్సి వస్తుందన్నారు. అనంతరం రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఉల్లి పంటకు సంబందించిన మెగా చెక్కును మంత్రి సవిత రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే పుత్తా చైతన్యకుమార్రెడ్డి, టీడీపీ రాష్ట ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి, జిల్లా స్థాయి అధికారులు పాల్గొన్నారు. రైతులకు పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ నందలూరు: నల్లతిమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఎల్లమ్మరాజుపల్లె గ్రామంలో మంగళవారం మీ భూమి మీ హక్కు కార్యక్రమాన్ని నిర్వహించారు.మంత్రి సవిత హాజరై రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీ చేశారు. -
శాంతియుతంగా శోభాయాత్ర నిర్వహణ
కడప సెవెన్రోడ్స్: విశ్వహిందూ పరిషత్, కడప అయోధ్య ఐక్యవేదిక ఆధ్వర్యంలో కడప నగరంలో నిర్వహించనున్న శ్రీ సీతారామ కళ్యాణం, శ్రీరామ మహా శోభాయాత్ర కార్యక్రమాలను శాంతియుతంగా నిర్వహించి విజయవంతం చేయాలని కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరి అన్ని శాఖల అధికారులను ఆదేశించారు. శోభాయాత్ర నిర్వహణ, శాంతి భద్రతలపై కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డితో కలిసి సంబంధిత అధికారులతో ఉత్సవ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ శ్రీరామ మహా శోభాయాత్ర కార్యక్రమాన్ని కుల మతాలకు అతీతంగా మత సామరస్యానికి ప్రతీకగా శాంతియుత వాతావరణంలోనిర్వహించేందుకు అన్ని రకాల భద్రతా ఏర్పాట్లను, కనీస సదుపాయాలను కల్పించనున్నట్లు వివరించారు. ఆయా శాఖల అధికారులు సంబంధిత ఏర్పాట్లను నిర్ణీత సమయం నాటికి పూర్తి చేయాలని ఆదేశించారు. మహా శోభాయాత్ర నిర్వహించే అన్ని ప్రాంతాల్లో, సెన్సిటివ్ ఏరియాల్లో గట్టి పోలీసు బందోబస్తు ఏర్పాటు చేయనున్నట్లు వివరించారు. నగరవాసులు కులమతాలకు అతీతంగా శాంతియుతంగా, భక్తి భావంతో కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కమిటీ సభ్యులను కలెక్టర్ కోరారు. ప్రభుత్వ విప్, కడప ఎమ్మెల్యే మాధవి రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో కడప మున్సిపల్ కమిషనర్ మనోజ్ రెడ్డి, ఆర్డీవో జాన్ ఇర్విన్, డీఎస్పీ వెంకటేశ్వర్లు, స్థానిక నాయకులు శ్రీనివాసులు రెడ్డి, వీహెచ్పీ జిల్లా అధ్యక్షుడు నందారపు చెన్నకష్ణారెడ్డి, జిల్లా ఫైర్ అధికారి ధర్మారావు, డీఎంహెచ్ఓ డా.నాగరాజు, ఏపీఎస్పీడీసీఎల్, డీపీఓ, పంచాయతీ రాజ్ సంబంధిత శాఖల అధికారులు, విహెచ్ పి ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
పులివెందుల మున్సిపల్ కమిషనర్పై సస్పెన్షన్ వేటు
పులివెందుల : పులివెందుల మున్సిపల్ కమిషనర్ రాముడుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు. సీడీఎమ్ఏ కార్యాలయంలో రిపోర్ట్ చేసుకోవాలని సోమవారం ఆదేశాలు రావడంతో ఆయన బయలుదేరి వెళ్లారు. పులివెందుల ఇన్చార్జి కమిషనర్గా డీఈసీ సురేశ్బాబును నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇటీవల మున్సిపల్ కమిషనర్ రాముడుపై వేధింపుల ఆరోపణలు రావడంతో ఈ చర్యలు తీసుకున్నారు. ● పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో పారిశుధ్య విభాగంలో పనిచేసే పలువురు చిరుద్యోగులను మున్సిపల్ కమిషనర్ రాముడు వేధింపులకు గురి చేస్తున్నట్లు ఆరోపణలు వచ్చాయి. మున్సిపల్ కార్యాలయంతోపాటు ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని హుకుం జారీ చేసేవారని,ఇంటికి పోతే అసభ్యకరంగా ప్రవర్తించేవాడని మహిళా ఉద్యోగులు ఆరోపించారు. ఆయన మాట వినకపోతే సమావేశం నెపంతో అనేకమార్లు తన కార్యాలయానికి రప్పించుకొని మహిళా సచివాలయ సిబ్బందిపై సైతం వేదింపులకు పాల్పడ్డారని సమాచారం. కనీసం కూర్చోమనేవాడు కాదని, మీటింగ్ మొత్తం నిలబెట్టేవారని వారు ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు జోక్యం చేసుకొని విచారణ చేపట్టి అధికారిపై చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో సోమవారం ‘సాక్షి’లో వార్త ప్రచురితం కావడంతో అధికారులు స్పందించారు. రాముడుపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.మహిళా చిరుద్యోగులపై అధికారి లైంగిక వేధింపులే కారణం -
రాయలసీమకు చంద్రబాబు మరణశాసనం
● చీకటి ఒప్పందంతో సీమకు ద్రోహం ● ఓటుకు నోటు కేసుకు భయపడి రేవంత్రెడ్డికి దాసోహం ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషాకడప కార్పొరేషన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని సీఎం చంద్రబాబు రాయలసీమకు మరణశాసనం రాశారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఘాటుగా విమర్శించారు. కడపలోని తన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టుపెట్టడం దారుణమన్నారు. తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా సీఎం రేవంత్రెడ్డి చేసిన వ్యాఖ్యలే ఇందుకు నిదర్శనమన్నారు. రాయలసీమ నీటి అవసరాలు తీర్చడానికి మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి తలపెట్టిన లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను ఆపేయడం దుర్మార్గమన్నారు. చంద్రబాబు ఎప్పుడు అధికారంలో ఉన్నా రాష్ట్రానికి మేలు జరగదన్నారు. ఆయన సీఎంగా ఉన్న కాలంలో రాయలసీమకు ఒక్క ప్రాజెక్టు కూడా తెచ్చి పూర్తి చేయలేదన్నారు. ఇలాంటి ముఖ్యమంత్రి ఉండటం ఈ ప్రాంత వాసుల దురదృష్టమన్నారు. శ్రీశైలంలో 880 అడుగుల నీటి మట్టం ఉంటేనే రాయలసీమకు నీటిని తీసుకురావడానికి ఆస్కారం ఉంటుందన్నారు. అందుకే దివంగత వైఎస్సార్ పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని 11వేల క్యూసెక్కుల నుంచి 44వేల క్యూసెక్కులకు పెంచారని మాజీ డిప్యూటీ సీఎం గుర్తు చేశారు. ఆనాడు తెలంగాణ కాంగ్రెస్ నేతలు అడ్డుపడినా ఈ ప్రాంత ప్రయోజనాలను కాపాడారన్నారు. 854 అడుగుల వద్ద 7వేల క్యూసెక్కులు, 841 అడుగుల వద్ద 2వేల క్యూసెక్కుల చొప్పున డ్రా చేసుకునేందుకు వీలుంటుందన్నారు. శ్రీశైలంలో ఏపీకి 101 టీఎంసీల నికర జలాలు కేటాయించారని, విద్యుత్ ఉత్పత్తి పేరుతో తెలంగాణ 795 అడుగులకు వచ్చేసరికి నీటిని వాడుకోవడం వల్ల ఆ స్థాయిలో నీటిని వాడుకోలేని పరిస్థితి ఉందన్నారు. దీంతో ప్రాజెక్టు ఖాళీ అవుతోందన్నారు. 2004 నుంచి ఇప్పటి వరకూ 2018–19, 2019–20 సంవత్సరాల్లో మాత్రమే వరుసగా 115.40, 179.36 టీఎంసీలు వాడుకోవడం జరిగిందన్నారు. మిగిలిన సంవత్సరాల్లో 50లేదా 60 టీఎంసీలు వాడుకోలేని పరిస్థితి ఉండేదన్నారు. చైన్నె నగరానికి తాగునీటికి 15 టీఎంసీలు, ఎస్ఆర్బీసీకి 19 టీఎంసీలు, తెలుగు గంగకు 29 టీఎంసీలు, గాలేరు నగరికి 38 టీఎంసీలు రావాలంటే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు ఆవశ్యకత ఎంతైనా ఉందన్నారు. కేసీఆర్ ముఖ్యమంత్రి అయ్యాక కల్వకుర్తి, పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకం, డిండి ఎత్తిపోతల పథకం అక్రమంగా నిర్మించారన్నారు. 2014 నుంచి తెలంగాణ అక్రమ ప్రాజెక్టులు నిర్మిస్తుంటే చంద్రబాబు వాటిని అడ్డుకోలేకపోయారన్నారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సంకల్పించి, 800 అడుగుల్లోనే ప్రతిరోజూ 3 టీఎంసీల నీటిని వాడుకునేలా రాయలసీమ ఎత్తిపోతల పథకం రూపొందించారన్నారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేస్తే రాయలసీమకు చాలా నష్టం జరుగుతుందని, గుక్కెడు మంచినీళ్లకు కూడా ఇబ్బంది పడాల్సి వస్తుందని హెచ్చరించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకంపై తెలంగాణ టీడీపీ నాయకులు గ్రీన్ ట్రిబ్యునల్ను ఆశ్రయించి కేసు వేశారని, చంద్రబాబే ఇది చేయించారని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఆరోపించారు. చంద్రబాబు ప్రభుత్వం గ్రీన్ ట్రిబ్యునల్ ముందు సరైన వాదనలు కూడా వినిపించలేకపోయిందన్నారు. నాలుగు గోడల మధ్య తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని రాయలసీమ ఎత్తిపోతల పథకం ఆపేడయం దారుణమన్నారు. రాయలసీమ ప్రయోజనాలు దెబ్బతీసే హక్కు చంద్రబాబుకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. గురుశిష్యులు కలిసి ఏపీకి, ముఖ్యంగా రాయలసీమకు తీరని అన్యాయం చేస్తున్నారని.. దీన్ని వైఎస్సార్సీపీ తీవ్రంగా ఖండిస్తోందన్నారు. రాయలసీమ టీడీపీ రాయలసీమ నాయకులకు సిగ్గూ, శరం ఉంటే తమ పదవులకు రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. రాయలసీమ ప్రయోజనాలు కాపాడటానికి వైఎస్సార్సీపీ ఎంతటి పోరాటమైనా చేయడానికి సిద్దంగా ఉందని తెలిపారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు యానాదయ్య, జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, షఫీ, శ్రీరంజన్రెడ్డి,తోటక్రిష్ణ, బి. మరియలు పాల్గొన్నారు. -
విద్యతో పాటు క్రీడల్లోనూ రాణించాలి
జమ్మలమడుగు రూరల్: నేటీ పోటీ ప్రపంచంలో విద్యార్థులు చదువుతో పాటు జాతీయ, అంతర్జాతీయ క్రీడల్లోను రాణించాలని జమ్మలమడుగు ఆర్డీఓ అదిమూలం సాయిశ్రీ పేర్కొన్నారు. సోమవారం జమ్మలమడుగు ముద్దనూరు రహదారిలో ఉన్న ప్రభుత్వ బాలికల జూనియరు కళాశాలలో 69వ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలను జిల్లా టీడీపీ అధ్యక్షుడు భూపేష్రెడ్డితో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆర్డీఓ మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో విద్యార్థులు తమ సత్తా చాటడం వల్ల వారికి విద్య, ఉద్యోగ రంగాల్లో మంచి భవిష్య త్తు ఉంటుందన్నారు. కాగా ఇక్కడికి వచ్చిన క్రీడాకారులతో గౌరవంగా మెలగాలని ఆమె సూచించారు. టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి మాట్లాడుతూ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలు జమ్మలమడుగు ప్రాంతంలో జరగడం గర్వ కారణం అన్నారు. అనంతరం విద్యార్థీనులు సంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించారు. డీఈఓ శంషుద్దీన్, ఏపీసీ ప్రేమంత కుమార్, రాష్ట్ర పాఠశాల గేమ్స్ సెక్రటరి భానుమూర్తి రాజు, జాతీయ స్థాయి అబర్జ్వర్ జయప్రకాష్, మార్కెట్ యార్డ్ చైర్మన్ నాగేశ్వరరెడ్డి, మున్సిపల్ కమిషనర్ వెంకటరామిరెడ్డి, ఎంపీడిఓ సయ్యదున్నీసా, పీఇటీలు మురళీ, హెమంబర్రెడ్డి, శివారెడ్డి అర్గనైజింగ్ సెక్రటరీలు ప్రసాద్రెడ్డి, శివ శంకర్రెడ్డి పాల్గొన్నారు. ఏపీ జట్టు ఓటమిజమ్మలమడుగు: అండర్–14 స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరుగుతున్న జాతీయ వాలీబాల్ పోటీలలో ఆంధ్రప్రదేశ్ బాలికల జ ట్టు ఓటమిపాలైంది. సోమవారం ఉదయం యూపీతో జరిగిన మ్యాచ్లో ఓటమి చవిచూసింది. అలాగే పశ్చిమబెంగాల్ –హిమాచల్ప్రదేశ్ జట్ల్ల మధ్య జరిగిన మ్యాచ్లో పశ్చిమ బెంగాల్, హర్యానా– సెంట్రల్ స్కూల్స్ టీం మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా జట్లు గెలుపొందాయి. జార్ఖండ్పై తమిళనాడు, ఛత్తీస్గడ్పై కేరళ, సైనిక స్కూల్పై ఉత్తరాఖండ్, గుజరాత్పై సీబీఎస్సీ, తెలంగాణపై కర్నాటక, ఎన్వీఎస్పై మహారాష్ట్ర విజయం సాధించాయి. తొలి రోజు పోటీలు రసవత్తరంగా సాగాయి. – ఆర్డీఓ ఆదిమూలం సాయిశ్రీ -
భూ సమస్యల పరిష్కారానికే రెవెన్యూ క్లినిక్స్
కడప సెవెన్రోడ్స్: జిల్లా ప్రజలు ఎదుర్కొంటున్న భూ సంబంధమైన సమస్యలను వేగంగా, పారదర్శకంగా పరిష్కరించేందుకే రెవెన్యూ క్లినిక్స్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో ఆయన ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. సభా భవనం వద్ద రెవెన్యూ క్లినిక్కు సంబంధించి ఏర్పాటు చేసిన అర్జీల నమోదు, రిసెప్షన్, కౌంటర్ల వద్దకు జనం క్యూ కట్టారు. అడంగల్లో మార్పులు, చేర్పులు, మ్యూటేషన్స్, పట్టాదారు పేరు మార్పులు, అసైన్మెంట్ పట్టా, ఎఫ్ లైన్, జాయింట్ ఎల్పీఎం సబ్ డివిజన్, 22ఏ నిషేద జాబితా నుంచి భూముల తొలగింపు, రస్తా, స్మశాన వాటికలు, ఆన్లైన్ రికార్డుల సవరణ, వారసత్వ నమోదు, పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు తదితర సమస్యలపై ప్రజలు అర్జీలు సమర్పించారు. ఇందులో కొన్ని..... ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ శ్రీధర్ అర్జీలు నమోదు చేసుకుంటున్న ప్రజలు సాగు భూమికి పట్టా ఇవ్వాలి గ్రామ పొలం సర్వే నెంబరు 41లో ఐదు ఎకరాల ప్రభుత్వ భూమిని నేను 15 ఏళ్లుగా సాగు చేసుకుంటున్నాను. ఉలవ, పెసర, కంది వంటి పంటలు వేస్తుంటాను. మన్యం రవిరెడ్డి అనే వ్యక్తి నా భూమిని ఆక్రమించి ఏడాది క్రితం జామాయిల్ చెట్లు నాటాడు. కలెక్టరేట్ పీజీఆర్ఎస్లో ఇప్పటికి నాలుగు సార్లు అర్జీలు సమర్పించాను. ఇప్పటికై నా నేను సాగు చేసిన ప్రభుత్వ భూమికి నా పేరిట పట్టా ఇవ్వాలి. – పి.ఇరగయ్య, నల్లాయిపల్లె, అట్లూరు మండలం భూమి ఆక్రమిస్తున్నారు మా అవ్వ నారాయణమ్మకు సర్వే నెంబరు 389/1లో 32 సెంట్ల స్థలముంది. అది సబ్ డివిజన్ కూడా జరిగింది. ఆ స్థలంలో ఉన్న కంపచెట్లను తొలగించేందుకు వెళ్లగా, మాదు కనకారెడ్డి, ఎరికల్రెడ్డి, జయలక్షుమ్మ అడ్డుకుంటున్నారు. గతంలో తహసీల్దార్కు పలుమార్లు ఫిర్యాదు చేసినా పరిశీలిస్తామన్నారు తప్ప ఇంతవరకు పరిష్కరించలేదు. మా పట్టా భూమి ఆక్రమణకు గురి కాకుండా చర్యలు తీసుకోవాలి. – టి.వెంకట సుబ్బారెడ్డి, శాఖరాజుపల్లె, సిద్దవటం మండలం కలెక్టర్ శ్రీధర్ -
అయ్యోవారలు
కడప ఎడ్యుకేషన్: చాలా ఏళ్లు దూరంగా పనిచేశాం.. రోజు రానూపోనూ వందల కిలోమీటర్లు ప్రయాణం చేసి అలిసిపోయాం.. ఇప్పుడు బదిలీ అవుతున్నాం. ఇక కష్టాలు తీరతాయనుకున్న అయ్యవార్లు కలలు కల్లలుగానే మిగిలిపోయాయి. బదిలీలు ముగిసి సుమారు ఏడు నెలలైనా వారి కష్టాలు అలాగే కొనసాగుతూనే ఉన్నాయి. ● దేవుడు వరమిచ్చినా పూజారి కనికరించలేదన్నట్లు ఉపాధ్యాయులు బదిలీ అయినా రిలీవర్ రాక కొంతమంది అయ్యవార్లు పాత స్టేషన్ల(బడుల్లో)లో కొనసా గుతున్న పరిస్థితి నెలకొంది. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా బదిలీ అయిన 175 మంది అయ్యవార్లకు ఇది తీరని రోదనగా మారింది. గతేడాది పాఠశాలలు పునః ప్రారంభం నాటికి ఉపాధ్యాయుల బదిలీలను పూర్తి చేయాలనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయులకు బదిలీ కౌన్సెలింగ్ నిర్వహించింది. ఈ బదిలీల్లోనూ ఉన్న ఖాళీలలో ముందుగా మెగా డీఎస్సీ 2025లో ఉపాధ్యాయ పోస్టులకు ఎంపికైన వారికి ప్రాధాన్యతల వారీగా భర్తీ చేస్తూ కౌన్సెలింగ్ను నిర్వహించింది. ఆపై మిగిలిన అయ్యవార్లకు బదిలీలు నిర్వహించింది. ఎన్నో ఆశలతో బదిలీలు అయిన కొంతమంది ఉపాధ్యాయులకు చివరకు నిరాశే మిగిలింది. నిబంధనల ప్రకారం ఎనిమిదేళ్లు పూర్తి చేసుకున్న పలువురు వేరే వేరే ప్రాంతాలకు బదిలీ అయ్యారు. కొందరేమో పాఠశాల నుంచి వెళ్లేందుకు వీలు లేక అక్కడే మగ్గాల్సి వస్తోంది. కారణం అక్కడికి మరో ఉపాధ్యాయుడు వస్తేనే అక్కడ నుంచి బదిలీ అయిన ఉపాధ్యాయుడు కదలాల్సి ఉంటుంది. అయితే ఆ ఊసే లేకపోవడంతో దాదాపు ఏడు నెలల నుంచి పాత స్థానాల్లోనే విధులను నిర్వహించాల్సి వస్తోందని పలువురు టీచర్లు ఆవేదన వ్యక్తం చేశారు. పేరుకే బదిలీ... పని మాత్రం పాత స్థానాల్లోనే అయోమయంలో అయ్యవార్లు మరో నాలుగు నెలల్లో ముగియనున్న విద్యా సంవత్సరం బదిలీ అయిన ఉపాధ్యాయులకు రికార్డుల్లో పేరు ఒక చోట ఉంటే పని మరో చోట చేయాల్సిన పరిస్థితి నెలకొంది. బదిలీ కౌన్సెలింగ్లో వారికి ఉన్న సీనియారిటీని బట్టి వారు అనుకున్న చోటుకు బదిలీలయ్యారు. దీంతో సంతోషంగా పాతబడుల్లో నుంచి రిలీవై కొత్త బడుల్లో చేరారు. బడులు పునః ప్రారంభమైన తరువాత మళ్లీ సంబంధిత ఉపాధ్యాయులను రిలీవర్ వచ్చే దాక పాతబడుల్లోనే పనిచేయాలని పంపించారు. దీంతో చేసేదేం లేక రిలీవర్ వచ్చేదాక అక్కడే పనిచేసి తర్వాత వద్దామని వెళ్లారు. తరువాత వచ్చేందుకు మిగులు ఉపాధ్యా యులు లేక దీంతో వారు అక్కడే పని చేయాల్సి వచ్చింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా గతంలో పనిచేసిన బడుల్లోనే పని చేస్తున్నారు. జీతం మాత్రం కొత్తగా చేరిన బడుల్లో ఉన్నట్లే తీసుకుంటున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి తమ సమస్యకు పరిష్కార మార్గం చూపాలని ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
చెస్లో జిల్లా క్రీడాకారుల ప్రతిభ
కడప వైఎస్ఆర్ సర్కిల్: వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన 11 మంది క్రీడాకారులు చెస్ పోటీల్లో రాణించారు. ఈ నెల 4న బెంగళూరులోని మంజునాథ్ కళ్యాణ మండపం లో నిర్వహించిన 22వ బీఆర్డీసీఏ ర్యాపిడ్ ఇంటర్నేషనల్ రేటింగ్ చెస్ టోర్నమెంట్లో మొత్తం 466 మంది క్రీడాకారులు పాల్గొనగా జిల్లా క్రీడాకారులు ప్రతిభ కనపరిచినట్లు జిల్లా చెస్ అసోసియేషన్ కార్యదర్శి అనీష్ దర్బారీ తెలిపారు. ప్రొద్దుటూరుకు చెందిన ధనిత సింధురాజు అండర్–10 బాలికల విభాగంలో 4వ స్థానం, కడప కు చెందిన అనీస్ దర్బారి 50 ఏళ్లు పైబడిన విభాగంలో 1వ స్థానం సాధించి నగదు బహుమతి గెలుచుకున్నారు. దేవునికడప కు చెందిన వినమ్రత్ కు టోర్నమెంట్లో అతి చిన్న వయసు క్రీడాకారుడిగా ట్రోఫీ లభించింది. అర్హాన్ నలుగురు రేటెడ్ క్రీడాకారులపై విజయాలు సాధించాడు.ప్రణవ్ స్వరూప్ రేటెడ్ క్రీడాకారులపై 2.5 పాయింట్లు సాధించగా నిఖిలేశ్వర ఒక రేటెడ్ క్రీడాకారుడిపై విజయం సాధించాడు. రీహాన్ 6 పాయింట్లు, లక్ష్మీ 3 పాయింట్లు, భద్ర 2.5 పాయింట్లు, షయాన్ 2 పాయింట్లు సాధించారు. -
పండుగ వాతావరణంలో గండికోట ఉత్సవాలు
కడప సెవెన్రోడ్స్: రాయలసీమ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ‘గండికోట ఉత్సవాల‘ ను అత్యంత వైభవంగా నిర్వహించేందుకు అన్ని శాఖల అధికారులు సమన్వయంతో తమ వంతు బాధ్యతగా తీసుకుని విజయవంతం చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. సోమవారం సాయంత్రం కలెక్టరేట్ లోని పీజీఆర్ఎస్ హాలులో గండికోట ఉత్సవాల ఏర్పాట్ల ప్రణాళిక పై కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి, ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఆర్వో విశ్వేశ్వర నాయుడులతో కలిసి అన్ని శాఖల అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గండికోట భౌగోళిక స్వరూపాన్ని మరింత ప్రాచు ర్యంలోకి తీసుకురావడం జిల్లా వాసులుగా మన అందరి బాధ్యత అన్నారు. వాస్తవికంగా చూస్తే కడప అనేది స్వచ్ఛమైన ప్రేమకు, ఆప్యాయత, అనురాగానికి ప్రతీక అన్నారు. గొప్ప సంస్కృతికి పుట్టినిల్లయిన కడప జిల్లా స్వభావాన్ని ప్రపంచానికి చాటి చెప్పేందుకు ఈ గండికోట ఉత్సవాలు చక్కటి వేదిక కావాలని కోరారు. గండికోట పర్యాటక ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించిన మ్యాపులను ఈవెంట్ మేనేజర్లు ప్రదర్శించగా..కలెక్టర్ వాటిపై పలు సూచనలు, సలహాలను అందించారు. జనవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న గండికోట పర్యాటక ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో కళాత్మకంగా నిర్వహించేందుకు ప్రణాళికలు రూపొందించామన్నారు. ఉత్సవాలు జరిగే మూడు రోజుల పాటు.. ఉదయం నుంచి రాత్రి వరకు వివిధ అంశాలపై ప్రదర్శనలు ఉంటాయన్నారు. ప్రత్యేకించి టూరిస్టులను ఆకర్షించేలా గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలని కలెక్టర్ ఆదేశించారు. ఈ కార్యక్రమంలో పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈనెల 11, 12, 13 తేదీల్లో నిర్వహణ కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
నేడు మహిళా పోలీసులకు శిక్షణ
కడప కోటిరెడ్డిసర్కిల్ : జాతీయ ‘బాల్య వివాహ రహిత భారతదేశం‘ ప్రచారంలో భాగంగా గ్రామ, వార్డు సచివాయాలకు చెందిన మహిళా పోలీసులకు ఐసీడీఎస్ ఆధ్వర్యంలో మంగళవారం కలెక్టరేట్లో ఒకరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించనున్నట్లు ఐసీడీఎస్ పీడీ రమాదేవి ఒక ప్రకటనలో తెలిపారు. బాల్య వివాహాల నిషేధ చట్టాన్ని కఠినంగా అమలు చేయడం ద్వారా బాల్య వివాహాలను నిర్మూలించడానికి జిల్లా స్థాయి శిక్షణా కార్యక్రమాన్ని చేపట్టినట్లు చెప్పారు. ఈ క్రమంలో కడప కార్పోరేషన్, సీకే దిన్నె ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని మహిళా పోలీసులకు శిక్షణ ఏర్పాటు చేశామని ఆమె వివరించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య పులివెందుల రూరల్ : పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని చిన్న రంగాపురం గ్రామానికి చెందిన రఘు (43) అనే వ్యక్తి సోమవారం ఉదయం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బంధువుల కథనం మేరకు వివరాలు..రఘు గత కొన్నేళ్లుగా బేల్దారి పనులు చేసుకుంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇతనికి భార్య దేవి, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. ఆర్థికంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో సుమారు రూ. 10 లక్షలు అప్పు చేశాడు. అయితే అప్పులవాళ్ల బాధ తాళలేక ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇంటి పెద్ద మృతిచెందడంతో భార్యాపిల్లలు బోరున విలపించారు. చోరీ కేసులో నిందితుల అరెస్ట్ మైలవరం : మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లో జరిగిన చోరీ ఘటనకు సంబంధించి ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి విలేకరులకు వివరాలు వెల్లడించారు. జమ్మలమడుగు మండలంలోని గూడెంచెరువు గ్రామానికి చెందిన ఒగ్గు అనిల్, చిన్నెం శ్రీనివాసులు, జక్కా నారాయణలు గత నెల 31వ తేదీ దొమ్మరనంద్యాల, వేపరాల గ్రామాల్లో తాళాలు వేసిన ఇళ్లలో చోరీకి పాల్పడ్డారు. సుమారు లక్షా 45 వేల రూపాయలు నగదు ఎత్తుకెళ్లాకెళ్లారు. అందిన సమాచారం మేరకు వేపరాల గ్రామంలో ముగ్గురిని పట్టుకుని విచారించారు. అనంతరం వారి వద్ద ఉన్న రూ. 56,100 స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు. కేసు నమోదు చేసి కోర్టుకు హాజరు పరచగా రిమాండ్ విధించినట్లు ఎస్ఐ తెలిపారు. -
బాధితులకు న్యాయం చేయాలి
కడప అర్బన్ : బాధితుల సమస్యలపై సత్వరమే స్పందించి, న్యాయం చేయాలని జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ‘‘ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక’’కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ప్రలు వివిధ సమస్యలపై అర్జీలు సమర్పించారు. ఈ సందర్భంగా ఎస్పీ ఫిర్యాదుదారులతో మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. బాధితులకు న్యాయం అందేలా చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. మొత్తం 81 ఫిర్యాదులు(పిజిఆర్ఎస్)కు వచ్చాయి. కార్యక్రమంలో అదనపు ఎస్పీ(పరిపాలన) కె. ప్రకాష్ బాబు మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు. అగ్నిప్రమాదం : రూ.12 లక్షల ఆస్తి నష్టం కడప అర్బన్ : కడప నగరంలోని సప్తగిరి ఎలక్ట్రానిక్స్ గోడౌన్ లో ఉన్నట్టుండి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ వల్ల అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకున్నారు. మంటలు ఆర్పేందుకు కృషి చేశారు. ఈ ప్రమాదంలో దాదాపు 12 లక్షల రూపాయల విలువైన ఎలక్ట్రానిక్ వస్తువులు నష్టపోయినట్లు సమాచారం. ఎలక్ట్రానిక్స్ గోడౌన్ యజమాని మురళీమోహన్ మాట్లాడుతూ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ప్రమాదం చోటు చేసుకుందని, దాదాపు రూ. 12 లక్షల మేరకు ఆస్తి నష్టం జరిగిందని తెలియజేశారు. -
ఆటోను ఢీకొన్న కళాశాల వ్యాన్: ముగ్గురికి గాయాలు
రోడ్డు మధ్యలో నిలిచిన పోయిన వ్యాన్నాలుగురోడ్ల కూడలిలో గుమికూడిన జనాలుఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని నాలుగు రోడ్ల కూడలిలో సోమవారం ప్రైవేట్ జూనియర్ కళాశాలకు చెందిన వ్యాన్ ఆటోను ఢీకొంది. ఈ ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ప్రొద్దుటూరుకు చెందిన విజ్ఞాన్ బాలికల జూనియర్ కళాశాలకు చెందిన వ్యాన్ సోమవారం రాత్రి ఎర్రగుంట్లలోని నాలుగు రోడ్ల కూడలి వద్దకు రాగానే బ్రేక్ ఫైయిలైంది. ముందు పోతున్న ఆటోను ఢీకొంది. ఆటో కూడా ముందు వెళుతున్న బైక్ను ఢీకొంది. దీంతో బైక్లో వెళుతున్న ఇద్దరు, రోడ్డుపై నడుచుకుంటూ వెళుతున్న మరొకరు గాయపడ్డారు. వీరిలో రోడ్డుపై వెళుతున్న దస్తగిరి అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఇతన్ని స్థానికులు ఆసుపత్రికి తరలించారు. వ్యాన్లో ఉన్న విద్యార్థినులకు ఏమీ కాలేదు. వ్యాన్ ముందు భాగం నుజ్జునుజ్జు కాగా, ఆటో వెనుక భాగం దెబ్బతింది. వ్యాన్ రోడ్డు మధ్యలో ఉండి పోవడంతో నాలుగు రోడ్ల కూడలిలో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకోని క్రేన్ సాయంతో వ్యాన్ను పక్కకు తప్పించారు. ఈ సంఘటనపై విచారణ చేస్తున్నట్లు సీఐ విశ్వనాథ్రెడ్డి తెలిపారు. -
● కల నెరవేర్చిన మిథున్రెడ్డి
రాజంపేట పార్లమెంటు పరిధిలో ఉమ్మడి చిత్తూరులోని తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు, వాయల్పాడు, ఉమ్మడికడపలోని రాజంపేట, రాయచోటి, కోడూరు అసెంబ్లీ నియోజకవర్గాలతో కలిసి ఉండేది. 2009లో వాయల్పాడు నియోజకవర్గం కనుమరుగు కావడంతో దానిస్థానంలో పుంగనూరు నియోజకవర్గం కలిసింది. 1967 నుంచి 2014 వరకు అన్ని పార్టీలు కడపజిల్లాకు చెందిన వారినే అభ్యర్థులుగా ఎంపికచేసేవి. నాలుగు అసెంబ్లీ నియోజకవర్గాలు ఉన్న ఉమ్మడి చిత్తూరుకు అభ్యర్థిత్వం దక్కేదికాదు. ఎంపీలంతా కడపవైపు వాళ్లే ఉండేవారు.2014లో మిథున్రెడ్డి రాజంపేట ఎంపీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ నుంచి బరిలో నిలిచి ఘన విజయం సాధించడంతో చిత్తూరు ప్రజల కోరిక నెరవేరింది. హ్యాట్రిక్లో మిథున్రెడ్డి రికార్డు 2014 ఎన్నికల్లో తొలిసారి బరిలోకి దిగిన మిఽథున్ రెడ్డి పురందేశ్వరీపై 1,74,762 ఓట్ల మెజార్టీతో విజయం సాధించారు. 2019 ఎన్నికలో 2,68,284 ఓట్ల మెజార్టీ సాధించారు. రాజంపేట పార్లమెంటు ఎన్నికల చరిత్రలో ఇదే అత్యధిక మెజార్టీ. 2024లోనూ గెలిచి హ్యాట్రిక్ సాధించారు. -
యూత్ పాలసీపై సూచనలు ఇవ్వండి
కడప ఎడ్యుకేషన్: డ్రాప్ట్ నేషనల్ యూత్ పాలసీ –2025లోని అంశాలపై విద్యాసంస్థల ప్రతినిధులు, యువజన, విద్యా సంఘాలు, మేధావులు, స్వచ్ఛంద సేవా సంస్థల వారు తమ అభిప్రాయాలు, సూచనలు అందించాలని స్టెప్ సీఈఓ విజయ్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. డ్రాప్ట్ నేషనల్యూత్ పాలసీకు సంబంధించి వెబ్ పోర్టల్లో పరిశీలించి ఆయా అంశాలపై అభిప్రాయాలు, సూచనలను ceostepkdp@gmail.comకు ఈ నెల 10లోపు పంపాలని ఆయన తెలిపారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 8న కాకినాడ జిల్లా స్పోర్ట్స్ అథారిటీలో ఖేలో ఇండియా ట్రైబల్ గేమ్స్ ఓపెన్ కేటగిరీలో ఎంపికలు నిర్వహించనున్నట్లు డీఎస్డీవో గౌస్బాషా తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు విలువిద్య, అథ్లెటిక్స్, ఫుట్బాల్, హాకీ, ఈత, వెయిట్ లిఫ్టింగ్, రెజ్లింగ్ ఎంపికల్లో పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తి గల క్రీడాకారులు తమ ఆధార్ జిరాక్స్ తో పాటు 2 ఫొటోలు, జనన ధ్రువీకరణ పత్రాలతో ఈ నెల 8న డిస్ట్రిక్ట్ స్పోర్ట్స్ అథారిటీ కాకినాడలో రిపోర్ట్ చేసుకోవాలన్నారు. పూర్తి వివరాలకు 94402 97692 మొబైల్ నెంబర్ను సంప్రదించాలని సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మంగళ,బుధవారాల్లో అండర్ –14 పురుషుల టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు జరగనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ ఎంపికలకు హాజరుకావాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు ఆధార్ కార్డు కాఫీ, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5) సర్టిఫికెట్ , బర్త్ ప్లేస్ సర్టిఫికెట్ తో పాటు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో , తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ ఎంపికలకు అండర్– 14 కట్ ఆఫ్ డేట్ 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తెల్లటి దుస్తులతో హాజరుకావాలని సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 10న స్వామి వివేకానంద జయంతి నేషనల్ యూత్ డే పురస్కరించుకొని జిల్లాలోని యువతకు జిల్లాస్థాయి వాలీబాల్ పోటీలు నిర్వహించనున్నట్లు భారత ప్రభుత్వం, యువజన వ్యవహారాలు, క్రీడా మంత్రితవ్య శాఖ, మై భారత్ కేంద్ర (నెహ్రూ యువ కేంద్ర) జిల్లా యువ అధికారి ప్రదీప్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. కడప మున్సిపల్ స్టేడియంలో జరిగే ఈ పోటీల్లో విజేతలకు నగదు బహుమతి, ప్రశంస పత్రం,మొమెంటో అందజేస్తామన్నారు. జిల్లాలోని 15 నుంచి 29 ఏళ్లలోపు ఉన్న యువ క్రీడాకారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని తమ ప్రతిభను మెరుగు చేసుకోవాలని తెలిపారు. ఇతర వివరాలకు 93983 91912 అనే నంబర్లో సంప్రదించాలని కోరారు. కడప ఎడ్యుకేషన్: గుంటూరులో నిర్వహించిన 48 ఆంధ్రప్రదేశ్ హిస్టరీ కాంగ్రెస్ సదస్సులో శ్రీ లంకపల్లి బుల్లయ్య ఉత్తమ పరిశోధన పత్రం అవార్డును యోగి వేమన యూనివర్సిటీ లలితకళా విభాగం అధిపతి డాక్టర్ కోట మృత్యుంజయరావు అందుకున్నారు. ఈ నెల 3, 4 తేదీల్లో గుంటూరులో జరిగిన ఈ సదస్సులో ‘రాజా రాణి ఎర్ర చందనం కొయ్య బొమ్మలపై’ఆయన సమర్పించిన పరిశోధనా పత్రాన్ని ఉత్తమమైందని ఎంపిక చేశారు. ఈ అవార్డు కింద మృత్యుంజయరావుకు నగదు, పరిశోధనా పత్రం బహుకరించారు. యూనివర్సిటీ వీసీ బెల్లంకొండ రాజ శేఖర్, ప్రిన్సిపల్ టి.శ్రీనివాస్, రిజిస్ట్రార్ పుత్తా పద్మ తదితరులు ఆయన్ను అభినందించారు. కడప అగ్రికల్చర్: రబీ 2025–26 కు సంబంధించి 90,437 మెట్రిక్ టన్నులు ఎరువులు అవసరం కాగా ఇప్పటివరకు 30,305.29 మెట్రిక్ టన్నులు జిల్లాకి సరఫరా చేయడం జరిగిందని జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రానాయక్ తెలిపారు. ప్రస్తుతం జిల్లాలో 16,651.53 మెట్రిక్ టన్నుల అన్ని రకాల ఎరువులు అందుబాటులో ఉన్నాయని తెలిపారు. ఇందులో యూరియా 3,168.63 మెట్రిక్ టన్ను లు, డీఏపీ 2,976.5 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్లు 8,598.04 మెట్రిక్ టన్నులు, యం.ఓ.పి. 489.8 మెట్రిక్ టన్నులు, యస్.యస్.పి 1418.56 మెట్రిక్ టన్నులు ఉన్నాయన్నారు. జిల్లాలోని రైతులు సాగు చేసిన పంటలకు అవసరమైన అన్ని రకములైన ఎరువులు అందుబాటులో ఉన్నాయన్నారు. రైతులెవరూ ఎరువుల కోసం ఆందోళన చెందాల్సిన అవసరం లేదని ఆయన తెలిపారు. -
కుక్కల దాడిలో 25 గొర్రెలు మృతి
తొండూరు : తొండూరు మండలం కోరవానిపల్లి గ్రామంలో కుక్కలు బీభత్సం సృష్టించాయి. కొప్పల రామాంజనేయులుకు చెందిన గొర్రెల మందపై దాడి చేశాయి. ఈ ఘటనలో 25 గొర్రెలు మృతి చెందగా మరో 10 గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ఆదివారం రాత్రి ఈ ఘటన చోటు చేసుకుంది. సోమవారం ఉదయం మృతి చెందిన గొర్రెలను చూసి రైతు తీవ్రంగా కుంగిపోయారు. ఈ దాడి వల్ల తమకు భారీ ఆర్థిక నష్టం వాటిల్లిందని, అధికారులు స్పందించి నష్టపరిహారం అందించాలని బాధితుడు కోరారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికకమలాపురం : కమలాపురం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలకు చెందిన కబడ్డీ జట్టు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ సత్య నారాయణ రెడ్డి తెలిపారు. ఈ నెల 4వ తేదీన జమ్మల మడుగులో జరిగిన పాలిటెక్నిక్ కళాశాలల జిల్లా స్థాయి కబడ్డీ పోటీల్లో కమలాపురం జట్టు పాల్గొని ప్రథమ స్థానంలో నిలిచిందన్నారు. అలాగే అథ్లెటిక్స్ విభాగంలో 400మీటర్ల రిలే పోటీల్లో ద్వితీయ స్థానం, 800 మీటర్ల పరుగు పోటీల్లో తృతీయ స్థానంలో తమ కళాశాల విద్యార్థులు నిలిచారని ప్రిన్సిపల్ తెలిపారు. క్రీడాకారులు, ఫిజికల్ డైరెక్టర్ వీరాంజనేయులును ప్రిన్సిపల్ అభినందించారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో ప్రతిభ కనబరచాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కళాశాల అధ్యాపక సిబ్బంది పాల్గొన్నారు. బైక్పై నుంచి కిందపడి బేల్దారి మృతి ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామం సమీపంలోని శివాలయంనకు వెళ్లే క్రాస్ వద్ద స్కూటర్పై వెళ్తున్న కొమ్మెర మునిశేఖర్ (58) బేల్దారి మృతి చెందాడు. ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథ్రెడ్డి కథనం మేరకు వీఎన్పల్లి మండలం యు. వెంకటాపురం గ్రామానికి చెందిన కొమ్మెర మునిశేఖర్ బెల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. సోమవారం ఎర్రగుంట్ల నుంచి స్వగ్రామానికి బైక్లో వెళుతుండగా పెద్దనపాడు గ్రామానికి సమీపంలోని శివాలయం క్రాస్ వద్దకు రాగానే అదుపు తప్పి రోడ్డు పక్కన ఉండే గుంతలో పడి అక్కడికక్కడే మృతి చెందాడు,. మృతుడి కుమారుడు మునీంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. వేధింపులపై కేసు నమోదు కాశినాయన : మండలంలోని బాలాయపల్లె గ్రామానికి చెందిన ఓ మహిళను అదే గ్రామానికి చెందిన పాలకొలను వెంకటరామిరెడ్డి వారం రోజులుగా వేధిస్తున్నాడు. సోమవారం మహిళ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ యోగేంద్ర తెలిపారు. -
ఈ–గవర్నెన్స్ ద్వారా ప్రజలకు సేవలు
కడప సెవెన్రోడ్స్: ఈ–గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలను ప్రజలకు సమర్థవంతంగా అందించాలని జిల్లా పరిషత్ డిప్యూటీ సీఈఓ సుబ్రమణ్యం అన్నారు. సోమవారం జెడ్పీ ఆవరణలోని డీపీఆర్సీ భవనంలో ఏఓలు, జూనియర్ అసిస్టెంట్లకు నిర్వహించిన శిక్షణ తరగతుల్లో ఆయన పాల్గొన్నారు. మనమిత్ర ద్వారా సర్టిఫికెట్లు, బిల్లు చెల్లింపులు సహా 160కి పైగా ప్రభుత్వ సేవలను యాక్సెస్ చేయడానికి వాట్సాప్ ఆధారిత ప్లాట్ఫాం పాలనను అందుబాటులోకి తెస్తుందన్నారు. డిజిటల్ మౌలిక సదుపాయాలు, డేటా అనలిటిక్స్, డిజిటలైజేషన్, సిటిజన్ సెంట్రిక్ డెలివరీ తదితర అంశాల గురించి వివరించారు. కడప సెవెన్రోడ్స్: జిల్లాలో రెండు రోజుల పర్యటన నిమిత్తం జిల్లా ఇన్చార్జిమంత్రి సవిత రానున్నట్లు కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. తొలి రోజు పర్యటనలో భాగంగా కమలాపురం నియోజకవర్గం వీఎన్ పల్లి మండల కేంద్రంలో రైతులకు నష్ట పరిహారాన్ని అందజేయనున్నారు. అనంతరం నందలూరు మండలం యల్లంరాజు పల్లి గ్రామంలో రాజముద్రతో కూడిన పట్టాదారు పాస్ బుక్లు పంపిణీ చేయనున్నారు. -
నేషనల్ టెక్ జైట్– 25లో విద్యార్థుల ప్రతిభ
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు క్యాంపస్లో ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన టెక్ జైట్ – 25 (2.0)లో ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఘన విజయం సాధించారని డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. గతనెల 27 నుంచి 31వ తేదీ వరకు నూజివీడు క్యాంపస్లో టెక్ ఫెస్ట్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ పోటీల్లో దేశంలోని వివిధ విద్యాసంస్థల నుంచి విద్యార్థులు పాల్గొని క్వాంటం కంప్యూటింగ్, క్వాంటం టెక్నాలజీ వాటి అనువర్తనాలపై సాంకేతిక ప్రతిభను ప్రదర్శించారు. ప్రధాన జ్యూరీ సభ్యులుగా ఐబీఎం హెడ్ డాక్టర్ ఎల్.వెంకట సుబ్రహ్మణ్యం, క్వాంటం ఆంధ్ర మిషన్ డైరెక్టర్ శ్రీధర్, డాక్టర్ యల్లా వంటి ప్రముఖులు హాజరై పోటీలను సమగ్రంగా మూల్యాంకనం చేశారు. జాతీయస్థాయి క్వాంటం మెగా ఎక్స్ పోలో ఆర్కే వ్యాలీ విద్యార్థులు ప్రథమ స్థానం సాధించారు. జాతీయస్థాయి క్వాంటం హ్యాక్థాన్లో ద్వితీయ, తృతీయ స్థానాలను కై వసం చేసుకున్నారు. విద్యార్థులు జాతీయస్థాయిలో ఉత్తమ ప్రతిభను కనబడచడంపట్ల డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రీసర్చ్ డీన్ కొండారెడ్డి, క్వాంటం ఇన్నోవేషన్ సెంటర్ కోఆర్డినేటర్ సుధాకర్ రెడ్డి, క్వాంటం టెక్నాలజీ కోఆర్డినేటర్ భాస్కరయ్య, అధ్యాపకులు మధుమోహన్, తదితరులు పాల్గొన్నారు. -
హిందువులంతా సంఘటితం కావాలి
ప్రొద్దుటూరు కల్చరల్ : హిందువులంతా సంఘటితం కావాలని వేదాంత గీత ఫౌండేషన్ అధ్యక్షుడు ఆచార్య అభినవ శంకరానంద స్వామిజీ పేర్కొన్నారు. స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలో ఆదివారం ఘనంగా హిందూ సమ్మేళనం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హిందువులు సంఘటితం అయితేనే సమాజానికి మేలు అన్నారు. భారత దేశంలో సంస్కృతి సంప్రదాయాల పట్ల విదేశీయులు కూడా మక్కువ చూపుతున్నారన్నారు. హిందూ ధర్మాన్ని, సనాతన సంస్కృతి సంప్రదాయాలను భావితరాలకు అందించాల్సిన అవసరం ఉందన్నారు. కులం గడప వరకే ఉండాలని, గడప దాటితే హిందువులమని తెలిపారు. కార్యక్రమంలో సంగిరెడ్డి శ్రీనివాసులరెడ్డి, కన్నా భాస్కర్, డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య, విశ్వహిందూ పరిషత్ జిల్లా అధ్యక్షుడు చీతిరాల నాగార్జున, హిందూ సమ్మేళన సమన్వయకర్త డాక్టర్ వరుణ్కుమార్రెడ్డి, సుధాకర్రెడ్డి, మారెళ్ల మల్లికార్జునరావు, నాగమునిరెడ్డి, మురళి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
11 నుంచి పౌర హక్కుల సంఘం మహా సభలు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఈ నెల 10, 11న తిరుపతి నగరం బైరాగి పట్టెడలోని సీపీఐ కార్యాలయంలో నిర్వహించే పౌరహక్కుల సంఘం 20వ రాష్ట్ర మహాసభలను జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్బాబు కోరారు. ఆదివారం కడప నగరంలోని వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో మహాసభలకు సంబంధించిన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో వివిధ వర్గాలు, సమూహాలు తమ హక్కుల సాధన కోసం జరిగే ఉద్యమాలకు మద్దతు ఇస్తున్నామని చెప్పారు. నేడు ప్రజాస్వామ్య ఉనికికే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. సహజ సంపదను కాపాడుతున్న ఆదివాసీలు, గిరిజనులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఎన్కౌంటర్ పేరుతో హత్య చేస్తున్నాయన్నారు. ఈ సభల్లో మాజీ హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, ప్రముఖ గాంధేయవాది హిమాంశు కుమార్, సామాజిక కార్యకర్త బేలబాటియా, ప్రొఫెసర్ హరగోపాల్ పాల్గొంటారని తెలిపారు. పౌర హక్కుల సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు పి. రెడ్డెయ్య, న్యాయవాది సంపత్ కుమార్, పరిశ్రమల శాఖ మాజీ జాయింట్ డైరెక్టర్ జి.గోపాల్, పౌర హక్కుల సంఘం సభ్యులు రవిశంకర్, జగదీష్, జేవీవీ నాయకులు వెంకటేష్, అరుణ, మల్లెల భాస్కర్ పాల్గొన్నారు. -
మున్సిపల్ అధికారి లైంగిక వేధింపులు?
● పారిశుధ్య మహిళా కార్మికులపట్ల అసభ్య ప్రవర్తన ● మున్సిపల్ చైర్మన్కు ఫిర్యాదు చేసిన మహిళా కార్మికులుపులివెందుల : పులివెందుల మున్సిపల్ కార్యాలయంలో ఓ అధికారి మహిళా పారిశుధ్య కార్మికులపట్ల లైంగిక వేధింపులకు పాల్పడుతున్నట్లు తెలిసింది. అలాగే పారిశుధ్య విభాగంలో పనిచేసే పలు చిరు ఉద్యోగులపై ఆయన వేధింపులు కొనసాగుతున్నాయి. మున్సిపల్ కార్యాలయంతోపాటు ఇంట్లో కూడా క్లీనింగ్ పనులు చేయాలని ఆ అధికారి ఆదేశాలు జారీ చేశారు. ఇంట్లో పనులు చేసేందుకు వెళితే అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నారని మహిళా ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. ఆ అధికారి మాట వినకపోతే సమావేశం నెపంతో అనేకమార్లు తన కార్యాలయానికి రప్పించుకొని దాదాపు పలువురు మహిళా పారిశుధ్య కార్మికులతోపాటు మహిళా సచివాలయ సిబ్బందిని కూడా వేధింపులకు గురి చేస్తున్నట్లు సమాచారం. కనీసం వారిని కూర్చోబెట్టకుండా మీటింగ్ మొత్తం నిలబెట్టేవారని ఆరోపిస్తున్నారు. ఎవరికై నా చెప్పుకుంటే ఉద్యోగాలకు భద్రత, అవమానం, భయంతో ఎవ్వరికీ చెప్పుకోలేని పరిస్థితి. చివరకు మునిసిపల్ చైర్మన్ వరప్రసాద్కు ఆ ఉద్యోగులు మొర పెట్టుకున్నారు. ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విచారణ చేపట్టి ఆ అధికారిపై చర్యలు తీసుకోవాలని మహిళా ఉద్యోగులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయంపై మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్ మాట్లాడుతూ మహిళా చిరు ఉద్యోగులు ఈ విషయాన్ని తన దృష్టికి తీసుకొచ్చిన విషయం వాస్తవమేనని తెలిపారు. ఈ విషయానికి సంబంధించి మహిళా కౌన్సిలర్లతో నిజనిర్ధారణ కమిటీని ఏర్పాటు చేసి వాస్తవాలను తెలుసుకుని ఉన్నతాధికారులకు నివేదిస్తామని ఆయన తెలిపారు. -
రాయలసీమ ద్రోహి చంద్రబాబు
జమ్మలమడుగు : రాయలసీమ ప్రాంత వాసులు కరువు కాటకాలతో అల్లాడిపోతున్నారు. ఈ ప్రాంత వాసులకు శ్రీశైలం నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీరు పంపింగ్ చేసుకునే ప్రాజెక్టు పనులకు తెలంగాణ ముఖ్యమంత్రి చెబితే నిలిపివేయడం ద్వారా చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా నిలిచిపోయారని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి విమర్శించారు. ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. రాయలసీమ ప్రాంత వాసిగా దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి శ్రీశైలం నుంచి నాడు 11 వేల క్యూసెక్కుల నీటిని తరలించే విధంగా పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ కెపాసిటీని 44 వేలకు పెంచి రాయలసీమ ప్రాంతానికి కృష్ణా జలాలు తీసుకువచ్చారన్నారు. ఏడాదికి వంద టీఎంసీలకు సంబంధించి వరద నీరు రాయలసీమ ప్రాంత వాసులకు కాకుండా మద్రాసు వాసులకు తాగునీటికి కూడా ఉపయోగపడ్డాయన్నారు. ప్రస్తుతం శ్రీశైలంలో 885 అడుగుల మేర నీరు వస్తేనే రాయలసీమకు నీటిని తరలించాలన్నారు. కానీ తెలంగాణ ప్రాంత వాసులకు 800 అడుగుల ఎత్తు నుంచి విద్యుత్ ఉత్పత్తి కోసం నీటిని వాడుతున్నారన్నారు. రాయలసీమ ప్రాంత వాసులకు తాగునీరు అందించడం కోసం 800 అడుగల ఎత్తు నుంచి రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా రోజుకు మూడు టీఎంసీల నీటిని తరలించే విధంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పనులకు శ్రీకారం చుట్టారని తెలిపారు. ప్రస్తుతం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాత్రం రాయలసీమ ప్రాంత వాసుల మనోభావాలను తాకట్టు పెట్టి తెలంగాణకు నీటిని విడుదల చేసి రాయలసీమ ప్రాంత వాసులకు తీరని అన్యాయం చేశారన్నారు. కూటమి నేతలు ఇప్పటికై నా కళ్లు తెరిచి రాయలసీమ ఎత్తిపోతల పనులు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో విచ్చల విడిగా మాదక ద్రవ్యాలు.. రాష్ట్రంలో విచ్చల విడిగా మాదకద్రవ్యాలైన గంజాయి, డ్రగ్స్ కూటమి ప్రభుత్వంలో రాజ్యమేలుతున్నాయని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. గతంలో జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం బెల్టుషాపులను నియంత్రణ చేసిందన్నారు. ఎక్కడా గంజాయి లేకుండా నిఘా పెంచినా చంద్రబాబునాయుడు, లోకేష్ నాడు రాష్ట్రంలో విచ్చల విడిగా గంజాయి సాగుచేస్తున్నారంటూ అసత్య ప్రచారం చేశారన్నారు. ఇప్పుడు ఒక ఎమ్మెల్యే కుమారుడే డ్రగ్స్ తీసుకుని పట్టుబడ్డాడని చెప్పారు. రాష్ట్రంలో పాలన పూర్తిగా గాడి తప్పడంతోపాటు మద్యం, బెల్టుషాపుల ద్వారా యువత మద్యానికి, గంజాయి, డ్రగ్స్కు బానిసలైపోతున్నారని విమర్శించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు గిరిధర్రెడ్డి, జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ సింగరయ్య, విష్ణువర్దన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు.ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి -
ప్రభుత్వ భూమి కబ్జాకు యత్నం
గోపవరం : నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారి పక్కనే గోపవరం రెవెన్యూ పొలం సర్వే నంబర్ 68/1లో ఉన్న లక్షల రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూమిని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారు. ఇందుకు రెవెన్యూ అధికారులు సహకరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదే సర్వే నంబరు పక్కనే 169 సర్వే నంబరులో 4.28 ఎకరాలు చల్లా గిరిజమ్మకు పట్టాభూమి ఉంది. స్థానికేతరులైన గిరిజమ్మ భర్త రిటైర్డ్ ఉద్యోగి అయినప్పటికీ కోట్ల రూపాయలు విలువ చేసే 4.28 ఎకరాలు పట్టాభూమి ఉన్నా అప్పటి రెవెన్యూ అధికారులు 68/2 లో ఉన్న 45 సెంట్ల ప్రభుత్వ భూమికి డీకేటీ పట్టా ఇచ్చారు. ఒక ఉద్యోగికి డీకేటీ పట్టా ఇవ్వడంపై అప్పట్లోనే స్థానికులు తీవ్రస్థాయిలో వ్యతిరేకించారు. అయినప్పటికీ సంబంధిత అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోలేదు. తమ పట్టా భూమితో పాటు సర్వేనెంబర్ 68/1 లో ఉన్న 49 సెంట్లు ఖాళీగా ఉన్న ప్రభుత్వ భూమిని కూడా కలుపుకుని అప్పట్లో సిమెంటు దిమ్మెలతో ప్రహరీ నిర్మించారు. అయితే ఈ విషయంపై పత్రికల్లో వరుస కథనాలు రావడంతో గతంలో పనిచేసిన రెవెన్యూ అధికారులు 68/1 సర్వేనెంబరులో ఉన్న గోడను కూల్చివేశారు. ప్రస్తుతం తిరిగి ఆ భూమిలో ఉన్న కంపచెట్లను తొలగించి గోడ కట్టేందుకు ప్రయత్నిస్తున్నారు. లక్షల రూపాయలు విలువ చేసే 68/1 సర్వేనెంబరులో ఉన్న 49 సెంట్ల ప్రభుత్వ భూమిని వదిలేసి గోడను ఏర్పాటు చేసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. 68/1 సర్వేనెంబరులో ఉన్న 49 సెంట్లలో అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ప్రభుత్వ భూమిని కాపాడాల్సి ఉంది.సహకరిస్తున్న రెవెన్యూ అధికారులు -
గండికోట ఉత్సవాలను విజయవంతం చేద్దాం
కడప సెవెన్రోడ్స్: రాయలసీమ చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని చాటిచెప్పే ‘గండికోట ఉత్సవాల‘ను వైభవంగా నిర్వహించేలా ప్రత్యేక కార్య చరణ ప్రణాళికలు రూపొందించి విజయవంతం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. ఆదివారం సాయంత్రం గండికోట ఉత్సవాల నిర్వహణ ఏర్పాట్లపై జిల్లా అధికారులతో, ఈవెంట్ నిర్వహక ప్రతినిధులు, జిల్లా పర్యాటక శాఖ, ఏపీటీడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టే అన్ని రకాల కార్యక్రమాలకు సంబంధించిన మ్యాపులను ఈవెంట్ మేనేజర్లు ప్రదర్శించగా.. జిల్లా కలెక్టర్ వాటిపై పలు సూచనలు, సలహాలను అందించారు. పనుల నాణ్యతతో ఎలాంటి రాజీ లేకుండా.. రాయలసీమ వైభావాన్ని, గండికోట చారిత్రక ప్రాశస్త్యాన్ని వివరించే అన్ని రకాల కార్యక్రమాలను ప్రణాళిక ప్రకారం పక్కాగా నిర్వహించాలని ఆదేశించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ జనవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న గండికోట పర్యాటక ఉత్సవాలను విజయవంతం చేసేందుకు సంబంధిత శాఖల అధికారులందరూ సమన్వయంతో పని చేయాలన్నారు. ఉత్సవాల్లో భాగంగా పలు రకాల పోటీలు ఉంటా యని వెల్లడించారు. పర్యాటకులకు సంతృప్తి కరమైన అనుభూతిని అందించేలా కార్యక్రమాలను తీర్చిదిద్దాలని సంబందిత అధికారులను కలెక్టర్ ఆదేశించారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ,డ్వామా,డిఆర్డీఏ, మెప్మా పిడీలు ఆది శేషా రెడ్డి, రాజ్యలక్ష్మీ, కిరణ్ కుమార్, డీపీపీ రాజ్యలక్ష్మి, రిమ్స్ సూపరింటెండెంట్ డా. వెంకటేశ్వర్లు, డీఎంహెచ్ఓ డాక్టర్ నాగరాజు, ఏపీ టిడిసి ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం,డీఈ పెంచలయ్య, ఎపిఎస్పీడీసీఎల్ ఎస్ఈ రమణ, జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్, ఆర్ అండ్ బి ఎస్ఈ చంద్రశేఖర్, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈ ఏడుకొండలు, జిల్లా ఫైర్ ఆఫీసర్ ధర్మారావు, ఇంటాక్ ప్రతినిధి చిన్నపరెడ్డి, విజ్ క్రాఫ్ట్ ఈవెంట్ మేనేజ్మెంట్ డీజీఎం నంద కుమార్ పాల్గొన్నారు. ● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
తెలంగాణ సీఎం ప్రకటనపై చంద్రబాబు స్పందించాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాయలసీమ ఎత్తిపోతల పథకం నిలుపుదలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రకటన నిజమైతే చంద్రబాబు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సీపీఐ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. గతంలో వైఎస్ జగన్మోహన్రెడి్డ్ ప్రభుత్వం రాయలసీమ జిల్లాల శాశ్వత కరువు నివారణ చర్యల్లో భాగంగా రూ. 6829.15 కోట్ల అంచనా వ్యయంతో రాయలసీమ ఎత్తిపోతల పథకం, శ్రీశైలం కుడి ప్రధాన కాలువ వెడల్పు సామర్థ్యం పెంపు పనులకు పరిపాలన అనుమతులు మంజూరు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసిందన్నారు. శ్రీశైలం జలాశయం వెనుక భాగంలో సంగమేశ్వర నుంచి రోజుకు మూడు టీఎంసీలు చొప్పున ఎత్తిపోతల పథకం ద్వారా పోతిరెడ్డిపాడు దిగువన నాలుగు కిలోమీటర్ల వద్ద శ్రీశైలం కుడి ప్రధాన కాలువలో కలిపేందుకు చేపట్టిన పనికి రూ.3825 కోట్లు కేటాయించారన్నారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ వద్ద నుండి బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వరకు కాలువ సామర్థ్యాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచుతూ రూ. 570.45 కోట్లు ఖర్చు చేశారన్నారు. శ్రీశైలం కుడి కాలువ (ఎస్.ఆర్.బి.సి), గాలేరు నగరి సుజల స్రవంతి ట్రైనింగ్: బనకచర్ల క్రాస్ రెగ్యులేటర్ వద్దనుండి గోరకల్లు రిజర్వాయర్ వరకూ ఎస్.ఆర్.బి.సి, జిఎన్ఎస్ఎస్ లైనింగ్ పనులు మరియు జిఎన్ఎస్ఎస్ కాలువ సామర్థ్యం 30వేల క్యూసెక్కులకు పెంచుతూ రూ.929.65 కోట్లు కేటాయించారన్నారు. గోరకల్లు అదనపు ఇన్ఫాల్ (రియర్వాయర్లో పలికి నీళ్ళు వచ్చే గేట్లు) రెగ్యులేటర్ నిర్మాణంకోసం రూ.36.95 కోట్లు గాలేరు–నగరి, ఎస్.ఆర్.బి.సి కాలువల ఆధునీకరణకు గోరకల్లు రిజర్వాయర్ నుండి ఔకు రిజర్వాయర్ వరకు రూ.1415 కోట్లు కేటాయించారన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేపట్టిన ఎత్తిపోతల పథకం, సామర్థ్యం పెంపు పథకాలపై విడుదల చేసిన జి.ఓ నెం. 203 పై తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం అనుమానాలు, అపోహలతో అభ్యంతరాలను తెలుపుతూ కృష్ణానది యాజమా న్య బోర్డు చైర్మెన్ చంద్రశేఖర్ అయ్యర్కు తెలంగాణ నీటిపారుదల శాఖ ముఖ్య కార్యదర్శి రంజిత్ కుమార్, ఇంజనీర్ ఇన్ చీఫ్ మురళీధర్ ఫిర్యాదు చేశారన్నారు. తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు ప్రభుత్వం పై వత్తిడి తెచ్చి రాయలసీమ ఎత్తిపోతల పథకాన్ని నిలుపుదల చేయించినట్లు అసెంబ్లీ సాక్షిగా రేవంత్ రెడ్డి చేసిన ప్రకటన రాయలసీమ ప్రజానీకానికి ఆందోళన కలిగించే అంశం అన్నారు. నిజంగా అలాంటి లోపాయికారి ఒప్పందం జరిగి ఉంటే చంద్రబాబు నాయుడు రాయలసీమ ద్రోహిగా మిగిలిపోతారని పేర్కొన్నారు. రేవంత్ రెడ్డి ప్రకటనపై చంద్రబాబు తక్షణ స్పందించాలని, రాయలసీమ ఎత్తిపోతల పథకంపై స్పష్టమైన ప్రకటన విడుదల చేయాల డిమాండ్ చేశారు.సీపీఐ జిల్లా కార్యదర్శి జి.చంద్ర -
చరిత్రహీనులుగా మిగిలిపోతారు
బద్వేలు అర్బన్ : తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డితో చేతులు కలిపి రాయలసీమకు నీరు రాకుండా చేసిన చంద్రబాబు చరిత్రహీనులుగా మిగిలిపోతారని ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ పేర్కొన్నారు. ఆదివారం స్థానిక ఎన్జీఓ కాలనీలోని ఆమె నివాసంలో ఎమ్మెల్యే మాట్లాడుతూ చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న ప్రతిసారి రాయలసీమకు అన్యాయమే చేశారని అన్నారు. రాయలసీమలో పుట్టి ఈ ప్రాంతంలోని ప్రజలకు అవసరమైన ఎత్తిపోతల పథకాన్ని తన స్వార్థ ప్రయోజనాల కోసం నిలిపివేయడం దుర్మార్గమన్నారు. అత్యంత వెనుకబడిన రాయలసీమ ప్రాంతాన్ని రాయలసీమ ఎత్తిపోతల పథకం ద్వారా సస్యశ్యామలం చేయడానికి గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి కృషి చేస్తే అందుకు విరుద్ధంగా చంద్రబాబు చర్యలు చేపట్టడం ఇక్కడి ప్రజల దురదృష్టమన్నారు. ఇప్పటికై నా చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి వ్యాఖ్యలను ఖండించాలని, లేనిపక్షంలో చంద్రబాబును రాయలసీమ ప్రజలు ఎట్టిపరిస్థితుల్లో క్షమించరని అన్నారు. అలాగే రాయలసీమ ప్రాంతానికి చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, మంత్రులు తక్షణమే రాజీనామా చేసి ప్రజల ప్రయోజనాలను కాపాడాలని కోరారు.ఎమ్మెల్యే డాక్టర్ సుధ -
● బీమా వర్తింపు ఇలా...
కడప అగ్రికల్చర్: రైతుల సంక్షేమాన్ని చంద్రబాబు ప్రభుత్వం విస్మరిస్తోంది. ఉచిత పంటల బీమా పథకాన్ని అటకెక్కించి రైతులపై మోయలేని భారం మోపింది. ప్రీమియం సొమ్ము చెల్లిస్తేనే పంటల బీమా వర్తించేలా మార్గదర్శకాలను జారీ చేసింది. కూటమి ప్రభుత్వ అనాలోచిత నిర్ణయాలతో అన్నదాతలపై కోట్లాది రూపాయల ప్రీమియం భారం పడింది. మరోవైపు సకాలంలో బీమాను చెల్లించే అవకాశమూ ఇవ్వకుండా అన్నదాతలతో ఆడుకుంటోంది. ● ప్రస్తుత రబీ సీజన్కు సంబంధించి పంటల బీమా చెల్లించడానికి ఇంతవరకు ప్రభుత్వం అనుమతి ఇవ్వలేదు. నెల క్రితం పంటకు ఎంతెంత బీమా చెల్లించాలనే ప్రకటన విడుదల చేసి చేతులు దులిపేసుకున్న ప్రభుత్వం.. ప్రీమియాన్ని ఎప్పుడు చెల్లించాలో చెప్పలేదు. మరో 25 రోజుల్లో రబీ సీజీన్ కూడా ముగుస్తుంది. జిల్లావ్యాప్తంగా వేలమంది రైతులు బీమా చెల్లింపునకు ఎదురుచూస్తున్నారు. అసలు ఏ కంపెనీ పేరు మీద డబ్బులు చెల్లించాలో కూడా తెలియక దిగాలు పడుతున్నారు. ఈ పరిస్థితుల్లో ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలకు ఏదైనా జరిగితే బాధ్యులెవరని రైతులు ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు. కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యం రైతన్నలకు శాపంగా మారింది. సాధారణంగా బీమాను నవంబర్ మొదటి వారంలోనే చెల్లించాల్సి ఉంటుంది. అటువంటిది డిసెంబర్ ముగిసినా ఇంతవరకు బీమా చెల్లింపుకు ప్రకటన రాకపోవడం చూస్తే కూటమి ప్రభుత్వానికి రైతులంటే ఎంత బాధ్యత ఉందో అర్థమవుతోందని పలువురు రైతులు, రైతు సంఘ నాయకులు విమర్శిస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 88,753 హెక్టార్లలో వివిధ పంటలసాగు... జిల్లావ్యాప్తంగా రబీ సీజన్కు సంబంధించి ఇప్పటి వరకు 88,753 హెక్టార్లలో వివిధపంటలు సాగయ్యాయి. ఇందులో శనగ 63,427 హెక్టార్లలో, మినుము 11,199 హెక్టార్లలో, మొక్కజొన్న 4667 హెక్టార్లలో, జొన్న 1726, సజ్జ 645, వరి 2149, పెసర 762 , వేరుశనగ 1046, నువ్వులు 1543, పత్తి 222, ప్రొద్దుతిరుగుడు 301 హెక్టార్లలో సాగయ్యాయి. మైలవరం ప్రాంతంలో సాగులో ఉన్న శనగపంట గడువు ముగుస్తున్నా పత్తాలేని రబీపంటల బీమా చెల్లింపు ప్రకటన నైరాశ్యంలో వేలాది మంది రైతన్నలు జగన్ హయాంలో రైతుల పక్షానప్రభుత్వమే చెల్లించిన వైనం ఇప్పుడు రైతు సొంతంగా కట్టాలన్నా సహకరించని కూటమి ప్రభుత్వం అనుమతి రాగానే తెలియజేస్తాం... రబీ పంటలబీమా చెల్లింపునకు సంబంధించి ప్రభుత్వం నుంచి ఇంకా అనుమతి రాలేదు. ఈ విషయమై ప్రభుత్వం వద్ద చర్చలు జరుగుతున్నాయి. అనుమతి రాగానే రైతులకు తెలియజేస్తాం. రైతులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – బుక్కే చంద్రానాయక్, జిల్లా వ్యవసాయ అధికారి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటైన మొదటి సంవత్సరం అంటే 2019–20లో కేవలం ఒక్క రుపాయి ప్రీమియంతో నోటిఫై చేసిన పంటలకు బీమా సదుపాయం కల్పించింది. 2020–21 నుంచి వైఎస్సార్ ఉచిత పంటల బీమా పథకాన్ని అమలు చేసింది. నోటిఫై చేసిన పంటలు ఈ క్రాపులో నమోదైతే చాలు పంటల బీమా సదుపాయం కల్పించే ఏర్పాటు చేయడంపై అన్నదాతలు హర్షం వ్యక్తం చేశారు. 2019– 20 నుంచి 2022–23 వరకు ఉచిత పంటల బీమా కింద 3,80,475 మంది రైతన్నలకు చెల్లించిన పరిహారం రూ. 1063.21 కోట్లు నేరుగా రైతులు బ్యాంకు ఖాతాలకు జమ చేసింది. ఏటా ఖరీప్ సీజన్ ఆరంభంలోనే బీమా పరిహారం విడుదల చేయడం వల్ల రైతలకు పంటలసాగుకు ఊరట లభించేది. -
రెవెన్యూ క్లినిక్స్ ఫలితాలు ఇచ్చేనా?
కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో వస్తున్న అర్జీలే పరిష్కారం కాక కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయి. గతంలో నిర్వహించిన రెవెన్యూ సదస్సుల్లో కూడా భూ సంబంధ సమస్యల అర్జీలూ ఇంకా మూలుగుతూనే ఉన్నాయి.. ఇప్పుడేమో కొత్తగా ‘రెవెన్యూ క్లినిక్స్’ పేరిట కొత్త రాగం అందుకున్నారు. పేర్లు పెట్టడంపై ఉన్న శ్రద్ధ.. అర్జీల పరిష్కారంపై లేదని అర్జీదారులు మండిపడుతున్నారు. ఇక సోమవారం నుంచి పీజీఆర్ఎస్లో కొత్తగా నిర్వహిస్తున్న రెవెన్యూ క్లినిక్స్ ఏ మేరకు ఫలితాలు ఇస్తాయన్న విషయమై పలు సందేహాలు వ్యక్తమవుతున్నాయి. ● భూ సమస్యల్లో ప్రధానంగా కొత్త డి.పట్టా మంజూరు, డి.పట్టా భూమికి ఆన్లైన్, 1బీ మంజూరు, వెబ్ల్యాండ్లో ఉన్న సున్నా విస్తీర్ణాన్ని సవరించడం, డి.పట్టా భూమి ఆక్రమణ, తప్పుడు మ్యూటేషన్లపై ఫిర్యాదులు, ప్రభుత్వ, జిరాయితీ భూముల ఆక్రమణ, 22ఏ నిషేధిత జాబితా నుంచి భూముల తొలగింపు, ఎల్టీఆర్ 1 ఆఫ్ 70, కొత్తగా అటవీ పట్టా మంజూరు, రీ సర్వే నిర్వహించాక విస్తీర్ణంలో తగ్గుదల, ఆన్లైన్ సబ్ డివిజన్ ద్వారా జాయింట్ ఎల్పీఎంలను విడదీయడం, ఆన్లైన్ సబ్ డివిజన్ ద్వారా సింగిల్ ఎల్పీఎంలను విడదీయడం, పట్టాదారు పాసుపుస్తకాల మంజూరు తదితర సమస్యలు పీజీఆర్ఎస్కు వస్తున్నారు. వీటిని నిర్దిష్ట కాల వ్యవధిలో పరిష్కరించాల్సి ఉన్నప్పటికీ క్షేత్ర స్థాయి అధికారుల నిర్లక్ష్యం వల్ల ఎక్కడి అర్జీలు అక్కడే ఉన్నాయి. బియాండ్ ఎస్ఎల్ఏ, రీ ఓపెన్ అర్జీలు అధికంగానే ఉంటున్నట్లు అదికారుల గణాంకాలు చెబుతున్నాయి. పలుమార్లు జిల్లా, రాష్ట్ర స్థాయిల్లో ఉన్నతాధికారులు సమీక్షలు నిర్వహించినా ఆశించిన ఫలితాలు రాలేదు. పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన కడప మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలోని సరోజిని నగర్ వార్డు శానిటేషన్ అండ్ ఎన్విరాన్మెంట్ సెక్రటరీ, సింహాద్రిపురం తహసీల్దార్ కార్యాలయ జూనియర్ అిసిస్టెంట్లను ఇటీవల కలెక్టర్ సస్పెండ్ కూడా చేశారు. సింహాద్రిపురం డిప్యూటీ తహసీల్దార్, ఏడీ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయ పరిధిలోని విలేజ్ సర్వేయర్లకు మెమోలు జారీ చేశారు. ఖాజీపేట ఎస్హెచ్ఓపై చర్యలు తీసుకోవాలంటూ ఎస్పీకి ఆదేశాలు జారీ చేశారు. అయినా కిందిస్థాయి సిబ్బందిలో మార్పు రావడం లేదు. భూమి సమస్యల పరిష్కారం కోసమంటున్న ప్రభుత్వం పీజీఆర్ఎస్లో పేరుకుపోయిన అర్జీలు గతంలో ఫలితాలివ్వని రెవెన్యూ సదస్సులు -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా...
ఉడతా ఉడతా ఊచ్.. రొట్టెముక్క దొరికిందోచ్... చిరు పొట్టలో ఆకలేసిందో ఏమో చిటారుకొమ్మలన్నీ తిరిగింది.. చిటపటమంటూనే అటూ..ఇటూ చూసింది... ఈ చెట్టు నుంచి.. ఆ చెట్టుకు తోకాడిస్తూ జంపులు చేసింది.. చివరగా ఓ చోట రొట్టె ముక్క దొరికింది.. ఇంకేముంది.. ఇదిగో ఇలా పటపట మంటూ కొరుకుతూ సంతోషంతో ఆరగించింది.. కడప నగరంలోని మరియాపురం ప్రాంతంలో ఓ బాదం చెట్టు పై ఉడత విన్యాసమిది. బందూక్ చేతబట్టి.. బందోబస్తు విధుల్లో తిరిగే పోలీసులకు కాసింత ఆటవిడుపు లభించింది...స్టేషన్లో రికార్డులు రాస్తూనో.. కాదంటే కేసులు కడుతూనో రోజంతా బిజీగా గడిపే పోలీసు అధికారులకు కాస్త రిలాక్సేషన్ దొరికింది.. ఉరుకులు పరుగుల జీవితానికి విరామమిచ్చి.. మైదానంలో దిగి ఉత్సాహంగా ఆటలాడారు.. ఖాకీ యూనిఫాం పక్కనబెట్టి ఉల్లాసంగా గడిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో ప్రారంభమైన పోలీస్ క్రీడలు ఆదివారం రెండో రోజు ఉత్సాహభరితంగా కొనసాగాయి. కబడ్డీ, వాలీబాల్, ఫుట్ బాల్, బాస్కెట్ బాల్ పోటీలు రసవత్తరంగా సాగాయి. అథ్లెటిక్స్ విభాగంలో పరుగుపందెం, హైజంప్, లాంగ్ జంప్, షాట్ ఫుట్, డిస్కస్ త్రో పోటీల్లో ఆద్యంతం ఆకట్టుకున్నాయి. పోలీసులు ఉత్సాహంగా పాల్గొన్నారు. –కడప అర్బన్– ఫొటోలు.. మహమ్మద్ రఫీ, ఫొటోగ్రాఫర్, కడప -
విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు
ప్రొద్దుటూరు కల్చరల్ : విద్యార్థులకు విద్యతోనే ఉజ్వల భవిష్యత్తు లభిస్తుందని శ్రీ పుష్పాండజ మహర్షి ఆశ్రమ పీఠాధిపతి, దివ్యజ్ఞానానంద గిరిస్వామి పేర్కొన్నారు. స్థానిక తొగటవీర క్షత్రియ కళ్యాణ మండపంలో ఆదివారం శ్రీమత్ పెద్ద అహోబిళక్షేత్ర తోగటవీర క్షత్రియ సేవా సంఘం వారి అన్నసత్రం ఆధ్వర్యంలో కడప, అనంతపురం, కర్నూలు ఉమ్మడి జిల్లాల్లో ప్రతిభ గల పేద తొగటవీర క్షత్రియ విద్యార్థులకు ఉపకార వేతనాల పంపిణీ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి విశిష్ట అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకుంటూ బాగా చదువుకుని ఉన్నత స్థానాల్లో నిలవాలన్నారు. చదువుతో పాటు విజ్ఞానం, నైతిక విలువలు, సేవా గుణం అలవరచు కోవాలన్నారు. ప్రతిభ గల పేద విద్యార్థులకు పెద్ద మొత్తంలో ఉపకార వేతనాలు అందిస్తున్న పెద్ద అహోబిళక్షేత్ర తోగటవీర క్షత్రియ సేవా సంఘం వారి అన్నసత్రం కమిటీ వారిని అభినందించారు. అన్నసత్రం కమిటీ అధ్యక్షుడు పల్లా శేషయ్య మాట్లాడుతూ ప్రతిభ గల పేద తొగట కుల విద్యార్థులను ప్రోత్సహించాలనే ఉద్దేశంతో 5 ఏళ్లుగా దాతల సహకారంతో ఉపకార వేతనాలను అందిస్తున్నామన్నారు. దేవదాయశాఖ డిప్యూటీ కమిషనర్ పట్టెం గురుప్రసాద్, అసిస్టెంట్ డిస్ట్రిక్ట్ ఫైర్ఆఫీసర్ అన్నం రఘునాథ్ మాట్లాడారు. అనంతరం 124 మంది ఇంజినీరింగ్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.15వేలు, ముగ్గురు ఎంబీబీఎస్ విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.50వేలు చొప్పున మొత్తం రూ.20.10 లక్షల రూపాయల చెక్కులను అందించారు. కార్యక్రమంలో శ్రీమత్ పెద్ద అహోబిళక్షేత్ర తోగటవీర క్షత్రియ సేవా సంఘం అన్నసత్రం ఉపాధ్యక్షుడు కంభం చిన్న పుల్లయ్య, నరసింహులు, కార్యదర్శి పల్లా శంకర్ నారాయణ, కోశాధికారి పల్లా నాగమయ్య, సలహాదారుడు చిమ్మని చౌడయ్య, కళ్యాణ మండపం అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, వృత్తినిపుణుల అధ్యక్షుడు కుండా నాగరాజు, తొగట కుల పెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. వెనిజులా నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లాలికడప వైఎస్ఆర్ సర్కిల్ : వెనిజులా నుంచి అమెరికా సైన్యాలు వెనక్కి వెళ్లాలని సీపీఐ, సీపీఎం జిల్లా కార్యదర్శులు జి.చంద్ర, చంద్ర శేఖర్ సీపీఐ (ఎం.ఎల్) లిబరేషన్ జిల్లా కార్యదర్శి ఓబయ్య, ఆర్.ఎస్.పి జిల్లా కార్యదర్శి సుబ్బరాయుడు పేర్కొన్నారు. ఆదివారం నగరంలోని సీపీఎం కార్యాలయంలో విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. ఐక్యరాజ్యసమితి నియమాలను, అంతర్జాతీయ న్యాయ సూత్రాలను ఉల్లంఘించి, వెనిజులా దేశంలోని చమురు సంపదను, నిక్షేపాలను కొల్లగొట్టేందుకు అమెరికా ఈ దాడులకు పాల్పడటం తగదన్నారు. ఈ సమావేశంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎల్.నాగ సుబ్బారెడ్డి, వెంకట శివ, సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు ఏ.రామ్మోహన్, వి.అన్వేష్ తదితరులు పాల్గొన్నారు.● దివ్యజ్ఞానానంద గిరిస్వామి ● 127 మంది విద్యార్థులకు రూ.20.10 లక్షలు ఉపకార వేతనాలు పంపిణీ -
19 నుంచి కడప రాయుడి బ్రహ్మోత్సవాలు
కడప సెవెన్రోడ్స్: తిరుమల తొలిగడప దేవునికడప శ్రీ లక్ష్మీవేంకటేశ్వరస్వామి ఆలయంలో ఈనెల 19 నుంచి 27వ తేదీ వరకు వార్షిక బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహించనున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. ఈ మేరకు వివరాలు వెల్లడించారు. ఈనెల 18వ తేదీ సాయంత్రం 6 నుంచి రాత్రి 8 గంటల మధ్య అంకురార్పణతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమవుతాయని పేర్కొన్నారు. ఉత్సవాల్లో భాగంగా ఈనెల 24వ తేది ఉదయం 10.30 గంటలకు స్వామి వారి కల్యాణోత్సవం ఉంటుందని వివరించారు. గృహస్తులు రూ.300 చెల్లించి కల్యాణోత్సవంలో పాల్గొనవచ్చన్నారు. జనవరి 28న సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం జరుగుతుందని వివరించారు. వాహన సేవలలో భాగంగా శ్రీలక్ష్మీ వేంకటేశ్వర స్వామి వారు ఉదయం 9.00 నుంచి 10.00 గంటల వరకు, రాత్రి 8.00 నుంచి9.00 గంటల వరకు మాడవీధుల్లో విహరించి భక్తులను అనుగ్రహిస్తారన్నారు. ఈ సందర్భంగా టీటీడీ హిందూ ధర్మప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో ప్రతిరోజు హరికథలు, భక్తి సంగీత ఆధ్యాత్మిక కార్యక్రమాలు ఉంటాయని తెలిపారు. 24న దేవదేవుని కల్యాణోత్సవం 25న రథోత్సవం -
భగీరథుని విగ్రహ ఏర్పాటుకు కృషి
ప్రొద్దుటూరు కల్చరల్ : భగీరథుని విగ్రహ ఏర్పాటుకు కృషి చేస్తానని సగర కార్పొరేషన్ రాష్ట్ర డైరెక్టర్ పేట చంద్రశేఖర్ పేర్కొన్నారు. స్థానిక మండి మర్చంట్స్ వీధిలోని మిల్లులో ఆదివారం సగర సంఘ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సగర సంఘం పెద్దలు మండలంలో లేదా పట్టణంలో స్థలం గుర్తిస్తే భగీరథుని విగ్రహ ఏర్పాటుకు తనవంతు పూర్తి సహాయ సహకారాలు అందిస్తానన్నారు. సగరులను బీసీ–డీ నుంచి బీసీ–ఏకు మార్చాలని ప్రభుత్వానికి విన్నవించడం జరిగిందన్నారు. సగర సంఘం జిల్లా అధ్యక్షుడు మజ్జారి వీరమోహన్ మాట్లాడుతూ సగరులు ఆర్థికంగా, విద్యాపరంగా, రాజకీయంగా వెనుకబడి ఉన్నారని, వారి అభివృద్ధికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. సగర కమ్యూనిటీ హాల్ ఏర్పాటు చేయాలని కోరారు. సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు బయన్న మాట్లాడుతూ ఐకమత్యంతోనే సగరుల అభివృద్ధి సాధ్యమని తెలిపారు. సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2026 క్యాలెండర్ను ముఖ్య అతిథులు ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి యానిక సుబ్బారావు, మాజీ డైరెక్టర్ మురళీ, కోశాధికారి జోడు ప్రసాద్, ఉపాధ్యక్షుడు వరికూటి సుబ్బరాయడు, కార్యదర్శి వన్నెంపల్లి వెంకటేషు, సూర్యుడు, సురేష్, వెంకట రమణ, జగతి వెంకట సుబ్బయ్య, నాగేశ్వరరావు, మజ్జారి లక్ష్మీనారాయణ, మజ్జారి వెంకటరమణ, కులపెద్దలు, ప్రముఖులు పాల్గొన్నారు. -
నేడు ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ’
కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 9.30 నుంచి 10.30 గంటల వరకూ ‘డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు పర్యవేక్షక ఇంజినీరు ఎస్. రమణ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా వినియోగదారులు నేరుగా 08562–242457 నంబర్కు ఫోన్ చేసి తమ విద్యుత్ సమస్యలను తెలియజేయవచ్చన్నారు. విద్యుత్ వినియోగదారులు ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కడప సెవెన్రోడ్స్: స్వచ్ఛ సంక్రాంతి, స్వచ్ఛ గ్రామ పంచాయతీలు–2026 కార్యక్రమంలో భాగంగా సోమవారం జిల్లాలోని అన్ని పంచాయతీల్లో ఒకేసారి ప్రత్యేక గ్రామ సభలు నిర్వహించనున్నట్లు జిల్లా పంచాయతీ అధికారి రాజ్యలక్ష్మి ఒక ప్రకటనలో తెలిపారు. చెత్త రహిత గ్రామ పంచాయతీ అనే అంశం ప్రధాన ఎజెండాతో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. స్థానిక ప్రజాప్రతినిదులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో స్వచ్ఛతను నిరంతరం కొనసాగించేందుకు తీర్మానాలు ఆమోదిస్తామన్నారు. ఉత్తమ పనితీరు కనబరిచిన మూడు పంచాయతీలను గుర్తించి గణతంత్ర దినోత్సవంలో గ్రామ పెద్దలను సత్కరిస్తామని వివరించారు. కడప సిటీ: కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వం ఆదేశాల మేరకు ఈనెల 5 నుంచి వికసిత్ భారత్ గ్యారంజీ ఫర్ రోజ్గార్ అండ్ అజీవికా మిషన్ (గ్రామీణ్) వీబీ–జీ రామ్జీ–2025 పథకానికి సంబంధించి గ్రామసభలను నిర్వహించనున్నట్లు డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంపై గ్రామసభల్లో విస్తృతంగా అవగాహన కల్పించడం, పథకంపై చర్చిస్తామని ఆయన తెలిపారు. జిల్లాలోని 629 గ్రామ పంచాయతీల్లో ఈ గ్రామసభలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామ ప్రజలు అందరూ గ్రామ సభల్లో పాల్గొని కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. కడప సెవెన్రోడ్స్: ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించుకోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పిలుపునిచ్చారు. అర్జీదారులు దాఖలు చేసిన తమ అర్జీలు ఇప్పటికీ పరిష్కారం కాకపోయినా, లేదా తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నెంబర్ కు కాల్ చేయవచ్చునన్నారు. సభాభవన్లో పీజీఆర్ఎస్ నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ ఈ సోమవారం సభాభవన్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. బి.కోడూరు: ముదిరాజ్ సంఘం జిల్లా అధ్యక్షుడిగా వై.వెంకటసుబ్బయ్యను నియమించినట్లు ముదిరాజ్ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కోర్ల నారాయణ ముదిరాజ్ తెలిపారు. ఆదివారం విజయవాడలో జరిగిన ముదిరాజ్ మహాసభ కార్యక్రమంలో ఆయనను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వెంకటసుబ్బయ్య మాట్లాడుతూ తనపై ఉన్న నమ్మకంతో తనను జిల్లా అధ్యక్షుడిగా ఎంపిక చేసినందుకు రాష్ట్ర గౌరవ అధ్యక్షుడు కొర్లనారాయణ ముదిరాజ్, రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్ముదిరాజ్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బొమ్మన సుబ్బరాయుడు ముదిరాజ్లకు కృతజ్ఞతలు తెలియజేశారు. ప్రొద్దుటూరు క్రైం: ఏపీ మెడికల్ సేల్స్ రెప్రజెంటేటివ్స్ నూతన కార్యవర్గాన్ని ఆదివారం ఎన్నుకున్నారు. యూనియన్ కార్యవర్గ వార్షిక సమావేశం స్థానిక టీఎస్సార్ కల్యాణమండపంలో నిర్వహించారు. ప్రెసిడెంట్గా పి.నరసింహారెడ్డి, వైస్ ప్రెసిడెంట్లుగా ఎంఎల్ నరసింహులు, బి.రవిప్రకాష్, సెక్రటరీగా సి.రామలింగారెడ్డి, జాయింట్ సెక్రటరీలుగా ఎస్. రెడ్డయ్య, వి.సూర్యపెద్దరాజు, ట్రెజరర్గా జె.కృష్ణ సుమంత్లను ఎన్నుకున్నారు. వీరితో పాటు మల్లికార్జున, గురుకృష్ణ, మాధవ, రామాంజనేయులు, చంద్ర, ఆనంద్, శ్రీకాంత్లు కార్యవర్గ సభ్యులుగా ఎన్నికయ్యారు. -
వాలీబాల్ పోటీలకు వేళాయె..
జమ్మలమడుగు: స్కూల్గేమ్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో జరగనున్న జాతీయస్థాయి అండర్–14 బాలికల వాలీబాల్ పోటీలకు సర్వం సిద్ధం చేశారు. జమ్మలమడుగులో సోమవారం నుంచి జరిగే ఈ పోటీలకు జిల్లా వాలీబాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. వివిధ రాష్ట్రాలనుంచి క్రీడాకారిణిలు జమ్మలమడుగుకు చేరుకున్నారు. మొత్తం 30 టీంలు పాల్గొననుండగా ఇప్పటికే 27 టీంలు చేరుకున్నాయని ఆర్గనైజింగ్ కమిటీ సభ్యులుపేర్కొన్నారు. తమిళనాడు మహారాష్ట్ర, పశ్చిమబెంగాల్, ఒడిశా ఉత్తరాఖండ్,రాజస్థాన్, తెలంగాణ, గోవా కర్నాటక, ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన టీంలు ఇప్పటికే జమ్మలమడుగుకు చేరుకున్నాయి. వీరికి పట్టణంలోని ప్రముఖ కల్యాణ మండపాలతోపాటు, గండికోటలోని అడ్వెంచర్స్ అకాడమిలో విడిది ఏర్పాట్లు చేశారు. ● సోమవారం నుంచి ప్రారంభమయ్యే ఈ పోటీలలో మొదట జమ్మూకశ్మీరు– రాజస్థాన్ జట్ల మధ్య ఉదయం 9 గంలకు మ్యాచ్ ప్రారంభమవుతుంది. గోవా టీంకు స్వాగతం పలుకుతున్న స్కూల్ గేమ్స్ ఫెడరేషన్, జమ్మలమడుగుకు చేరుకున్న ఆంధ్రప్రదేశ్ టీం -
క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం
● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ● జిల్లా వార్షిక పోలీస్ స్పోర్ట్స్ – గేమ్స్ మీట్ – 2025 ప్రారంభం ● ఉత్సాహంగా పాల్గొన్న పోలీస్ అధికారులు, సిబ్బందికడప అర్బన్ : క్రీడలతో మానసిక, శారీరక దృఢత్వం పెంపొందుతుందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పేర్కొన్నారు. శనివారం నగరంలోని పోలీస్ పరేడ్ మైదానంలో జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో వార్షిక పోలీస్ స్పోర్ట్స్– గేమ్స్ మీట్ – 2025 ను జిల్లా ఎస్పీ ప్రారంభించారు. ప్రారంభ సూచకంగా బెలూన్లు, కపోతాలను ఎగురవేశారు. జిల్లాకు చెందిన జాతీయ స్థాయి హాకీ క్రీడాకారులు, ఎ.ఆర్ హెడ్ కానిస్టేబుళ్లు ఎం.ఎస్ విజయభాస్కర్, విజయ్ కుమార్, ఫుట్ బాల్ క్రీడాకారుడు జి.రాజశేఖర్ జిల్లా ఎస్పీకి క్రీడా జ్యోతిని అందించారు. ఎస్పీ క్రీడాజ్యోతిని వెలిగించి స్పోర్ట్స్ – గేమ్స్ మీట్ను ప్రారంభించారు. ముందుగా పోటీల్లో పాల్గొనే సబ్ డివిజన్లకు చెందిన పోలీసు క్రీడాకారుల మార్చ్ ఫాస్ట్ ను జిల్లా ఎస్పీ తిలకించి గౌరవ వందనాన్ని స్వీకరించారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ సిబ్బందిలో క్రీడా ప్రతిభను వెలికితీయడానికి ‘పోలీస్ స్పోర్ట్స్ మీట్’ ఎంతో దోహదపడుతుందన్నారు. క్రీడా స్ఫూర్తితో ఆటల్లో పాల్గొనాలని, గెలుపోటములు ముఖ్యం కాదని తెలిపారు. నిరంతరం విధి నిర్వహణలో ఉండే పోలీస్ సిబ్బందికి ఈ క్రీడలు మానసిక ఉల్లాసంతో పాటు వారిలో ఉన్న క్రీడాప్రతిభకు గుర్తింపు వస్తుందన్నారు. క్రమశిక్షణ, పోలీస్ సిబ్బంది మధ్య మరింత సమన్వయం పెంపొందేందుకు ఈ క్రీడలు దోహదపడతాయన్నారు. ఈ నెల 3, 4, 5 తేదీలలో వరుసగా మూడు రోజుల పాటు సాగే ఈ స్పోర్ట్స్ మీట్ లో 6 పోలీస్ సబ్ డివిజన్లకు సంబంధించిన టీమ్లు (కడప, మైదుకూరు, పులివెందుల, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, డి.ఎ.ఆర్) కబడ్డీ, వాలీబాల్, ఫుట్బాల్, అథ్లెటిక్స్, 100 మీటర్లు, 400 మీటర్లు, 800 మీటర్ల పరుగుపందెం, హైజంప్, లాంగ్ జంప్, క్రికెట్, షటిల్ మొదలగు క్రీడలలో పాల్గొంటారని పేర్కొన్నారు. లీగ్ మ్యాచ్లలో విజేతలుగా నిలిచిన వారు ఫైనల్స్ లో తలపడనున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్). కె.ప్రకాష్ బాబు, ఎ.ఆర్ అదనపు ఎస్.పి బి.రమణయ్య, డీఎస్పీలు ఎన్.సుధాకర్, ఎ.వెంకటేశ్వర్లు, పి. భావన, కె.వెంకటేశ్వర రావు, జి. రాజేంద్ర ప్రసాద్, బి.మురళి, ఆర్.ఐ లు శివరాముడు, శ్రీశైల రెడ్డి, టైటస్, సోమశేఖర్ నాయక్, నగరంలోని సీఐలు, ఎస్.ఐ లు, ఆర్ఎస్ఐ లు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీసు సిబ్బంది, పిఈటీ మాస్టర్లు పాల్గొన్నారు. పోలీస్ స్పోర్ట్స్ మీట్లో పాల్గొన్న క్రీడాకారులు పోలీస్ స్పోర్ట్స్ మీట్ –2025లో మాట్లాడుతున్న జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
గండికోట ఉత్సవాలకు సన్నద్ధం కావాలి
జమ్మలమడుగు: ప్రముఖ పర్యాటక, చారిత్రాత్మక గండికోట ఉత్సవాల నిర్వహణకు అధికారులందరూ సన్నద్ధం కావాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. ఈనెల 11 నుంచి ఉత్సవాలు ప్రారంభం కానున్న నేపథ్యంలో శనివారం గండికోటను సందర్శించారు. ఈసందర్భంగా ఉత్సవాల కార్యక్రమాలు, ఉత్సవ వేదికప్రాంగణం, పార్కింగ్ తదితర అంశాలపై జిల్లా అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గండికోట ఉత్సవాలు దేశం నలుమూలల చాటేవిధంగా వైభవోపేతంగా నిర్వహించాలన్నారు. జిల్లా చరిత్రను ప్రపంచానికి తెలియజేసేవిధంగా ఉత్సవాలు ఉండబోతున్నాయని వివరించారు. ఉత్సవాల కోసం జరుగుతున్న పనులను మరింత వేగవంతం చేయాలన్నారు. గండికోట ప్రాంతంలో సాస్కి పథకం కింద 79 కోట్లతో అభివృద్ధి చేసి అద్భుతమైన పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేవిధంగా ప్రభుత్వం ప్రణాళికలు రూపొందించిందని పేర్కొన్నారు. పర్యాటకులకు సంతృప్తి కరమైన అనుభూతిని అందించేందుకు పదివేల చదరపు అడుగుల విస్తీర్ణంలో టూరిస్టులకు ఎక్స్పీరియన్స్ సెంటర్, 4వేల చదరపు అడుగుల విస్తీర్ణంలో రెండు అమినీటిస్, సమాచార కేంద్రాలు ఏర్పాటు చేస్తామన్నారు. గండికోట రహదారికి ఇరువైపుల పర్యాటకులకు ఆహ్లాదకరమైన వాతావరణం చేపట్టేవిధంగా పనులు చేస్తున్నామని సూచించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ జల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి, టూరిజం జిల్లా అధికారి సురేష్కుమార్, ఆర్డీఓ సాయిశ్రీ, తహసీల్దార్శ్రీనివాసుల రెడ్డి డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ● కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
కొనసాగుతున్న కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీల నిరసన
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలో 2018 నుంచి ఇప్పటివరకు పనిచేస్తున్న కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీకి నయా పైసా వేతనం పెంచకుండా ఉన్నతాధికారులు వెట్టి చాకిరి చేయించుకుంటున్నారని కాంట్రాక్ట్ గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకుల అసోసియేషన్ ప్రెసిడెంట్ నజీర్ హుస్సేన్ మండిపడ్డారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ అకాడమిక్ బ్లాక్–1 ఎదుట శనివారం మూడవ రోజు చెవిలో పూలు పెట్టుకుని నిరసన తెలిపారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఆర్జీయూకేటీ ఉన్నతాధికారులతో చర్చించి సమాన పనికి సమానవేతనం కల్పించాలని కోరారు. కార్యక్రమంలో నారాయణ, బిట్టు విజయ్, వేంపల్లె శ్రావణి తదితర గెస్ట్ ఫ్యాకల్టీ అధ్యాపకులు పాల్గొన్నారు. -
రిమ్స్ మార్చురీలో వృద్ధుడి మృతదేహం
కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో చికిత్స పొందేందుకు గుర్తు తెలియని వృద్ధుడు చేరాడు. చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. వృద్ధుని మృతదేహాన్ని రిమ్స్ మార్చురీలో వుంచారు. అతని వివరాలు తెలిసిన వారు తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని రిమ్స్ అధికారులు శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు పెద్దతిప్పసముద్రం : మండలంలోని పోతుపేట సమీపంలో ఉన్న యం.పార్లపల్లి మిట్ట వద్ద శనివారం ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ప్రమాదవశాత్తు ఢీకొన్నాయి. ఈ ఘటనలో తుమ్మరకుంట పంచాయతీ బొమ్మకపల్లికి చెందిన వెంకటేష్ (46), అభిషేక్ (22) గాయపడ్డారు. క్షతగాత్రులను చికిత్స నిమిత్తం బి.కొత్తకోట సీహెచ్సీలో ప్రథమ చికిత్స చేయించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లికి తరలించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఖైదీల ఆరోగ్యం, సంక్షేమంపై దృష్టి కడప అర్బన్ : ఖైదీల ఆరోగ్యం, సంక్షేమంపై ప్రత్యేక దృష్టి సారించాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్.బాబా ఫకృద్దీన్ పేర్కొన్నారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సూచనల మేరకు ఆయన తమ సిబ్బందితో కలిసి శనివారం కడప పురుషుల కేంద్ర కారాగారం, ప్రత్యేక మహిళా కారాగారాలను, సందర్శించారు. ఈ సందర్భంగా ఖైదీ లతో మాట్లాడి వారి కేసు వివరాలను, ఆరోగ్య విషయాలను అడిగి తెలుసుకున్నారు. ఉచిత న్యాయ సహాయాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు, అనంతరం జైలు పరిసరాలను పరిశీ లించి తగు సూచనలను ఇచ్చారు. మానసిక వ్యా ధులతో బాధపడే ఖైదీల ఆరోగ్య విషయాల పట్ల తగు జాగ్రత్తలు తీసుకోవాలని సకాలంలో మందులను వాడాలని చెప్పారు. ఈ కార్యక్రమంలో పురుషుల, ప్రత్యేక మహిళ కారాగారముల సూపరింటెండెంట్లు, ప్యానల్ న్యాయవాదులు, పారా లీగల్ వలంటీర్లు, ఖైదీలు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ రాంగోపాల్ రెడ్డి పోలీసులకు క్షమాపణ చెప్పాలి
– వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రారెడ్డి పులివెందుల : అనంతపురం జెడ్పీ సర్వసభ్య సమావేశం జరుగుతున్న సమయంలో జెడ్పీలో ప్రజా ప్రతినిధులు ఉన్నారని వారికి రక్షణగా ఉన్న పోలీసుల మీద దౌర్జన్యంగా వ్యవహరించిన టీడీపీ నాయకుల మీద కేసులు నమోదు చేయాలని, రాష్ట్రంలో పోలీసులకే గౌరవం, రక్షణ లేని వ్యవస్థ నడుస్తోందని వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు వెన్నపూస రవీంద్రా రెడ్డి ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పట్టభద్రుల ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి ఎదుట ఆయన వర్గీయులు పోలీసులను దుర్భాషలాడితే ఆయన వారికి వత్తాసు పలుకుతూ పోలీసుల మీద రౌడీయిజంగా మాట్లాడడం దేనికి సంకేతమన్నారు. పోలీసుల పట్ల దౌర్జన్యంగా వ్యవహరించి దుర్భాషలాడిన వారిని పార్టీ నుంచి సస్పెండ్ చేయాలని, అలాగే పోలీసులకు ఎమ్మెల్సీ రాంగోపాల్రెడ్డి బహిరంగ క్షమాపణ చెప్పాలని ఆయన డిమాండ్ చేశారు. నగల బ్యాగు మహిళకు అప్పగింత కడప అర్బన్ : ఓ మహిళ ఆటోలో మరిచిపోయిన బంగారు, వెండి నగల బ్యాగును కొద్ది గంటల వ్యవధిలోనే బాధితురాలికి పోలీసులు అప్పగించారు. వివరాలు ఇలా.. కడప నగరం ప్రకాష్ నగర్కు చెందిన కొమ్మునూరి మానస అనే మహిళ బద్వేలుకు వెళ్లింది. అక్కడి నుంచి ఈనెల 2 వ తేదీ రాత్రి సుమారు 07.30 గంటలకు కడపకు వచ్చింది. కడప బస్టాండ్ వద్ద ఆటో తీసుకొని తన లగేజ్ బ్యాగులు, ఇద్దరు పిల్లలతో పాటు ఇంటికి వెళ్లింది. తర్వాత తన హ్యాండ్ బ్యాగ్ చూసుకోగా కనపడలేదని, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. వెంటనే చిన్నచౌక్ పోలీసులు స్పందించి సీసీ కెమెరాలు చెక్ చేసి ఆటోను గుర్తించి ఆటో డ్రైవర్ బీకేఎం స్ట్రీట్కు చెందిన షేక్ ఖాజామొహిద్దిన్ను స్టేషన్కు పిలిపించారు. అప్పటికీ ఆటోలో వెనుక వైపు చూడకుండా అలాగే ఉండిన హ్యాండ్ బ్యాగ్ ను స్వాధీనం చేసుకున్నారు. అందులో ఉన్న సుమారు 50 గ్రాముల బరువు గల బంగారు వస్తువులు, సుమారు 100 గ్రాముల బరువు గల వెండి వస్తువులను గుర్తించారు. వాటి విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుంది, చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ సీఐ ఎ. ఓబులేసు, ఎస్ఐలు రాజరాజేశ్వర రెడ్డి, రవికుమార్లు బాధితురాలికి బ్యాగు, నగలు అప్పగించారు. ఆటోడ్రైవర్ ఖాజా మొహిద్దీన్ను ప్రశంసించారు. అతని నిజాయితీని గుర్తించి రూ.500 ప్రోత్సాహకం అందజేశారు. -
వివక్ష కాక మరేంటి...
ఖరీప్లో జిల్లావ్యాప్తంగా 20,715.57 ఎకరాల్లో ఉల్లిపంట సాగు చేస్తే ప్రభుత్వం మాత్రం 14,202.05 ఎకరాలకు మాత్రమే ప్రోత్సాహక నిధులను మంజూరు చేసింది. ఇది వివక్ష కాక మరేంటి. మిగతా 6,513 ఎకరాల్లో ఉల్లిపంటను సాగు చేసిన రైతులు రైతులు కాదా. వారికి కూడా ప్రోత్సాహక నిధులను మంజూరు చేయాలి కదా. ఇప్పటికై నా వివక్షను వదిలి అందరి రైతులకు ప్రోత్సాహక నిధులను మంజూరు చేయాలి. – సంబటూరు ప్రసాద్రెడ్డి, వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు -
● 6513.07 ఎకరాలకు...
జిల్లా వ్యాప్తంగా 6513.07 ఎకరాలకు సంబంధించి రూ. 13.02 కోట్లు సాయాన్ని మంజూరు చేయకుండా చంద్రబాబు ప్రభుత్వం శఠగోపం పెట్టింది. పేరుకేమో ఉల్లి రైతులందరికీ ప్రోత్సాహక సాయం అందించామని గొప్పలు చెబుతోంది. చాలా మంది రైతులు అటు పంట పెట్టుబడులు రాక.. ఇటు ప్రభుత్వం నుంచి ప్రోత్సాహం అందక దిగాలు పడుతున్నారు. తాము రైతులం కాదా తాము ఉల్లిపంటను సాగు చేయ లేదా ప్రశ్నించడంతోపాటు కూటమి సర్కార్కు ఎందుకింత వివక్ష అని మండిపడుతున్నారు. ఈ విషయమై రైతు సంఘ నాయకులు పంట ప్రొత్సాహకం రాని రైతులతో కలిసి కలెక్టరేట్ను ముట్టడించేందుకు సయామత్తం అవుతున్నట్లు తెలిసింది. -
రాజంపేట.. తగ్గిన అటవీ వాటా
రాజంపేట: అంతర్జాతీయంగా ఖ్యాతిని ఆర్జించిన రాయలసీమలోనే ఎర్రచందనం సంపద నిలయమమైన రాజంపేట ఫారెస్టు కోటకు బీటలు వారాయి. ఆరు దశాబ్దాల రాజంపేట అటవీ డివిజన్ మనుగడ ప్రశ్నార్థకంగా మారనున్నది. రాయలసీమలో ఎర్రచందనం డివిజన్గా ప్రసిద్ధి చెందిన డివిజన్కు ఇప్పుడు తిరుపతి, అన్నమయ్య జిల్లాల ప్రభావం పడింది. ఫలితంగా డివిజన్ వ్యాప్తంగా విస్తరించిన శేషాచలం అటవీ విస్తీర్ణంలో రాజంపేట తన వాటా పూర్తిగా తగ్గిపోయిందని అటవీ వర్గాలే ధ్రువీకరిస్తున్నాయి. రాజంపేట అటవీ డివిజన్ విస్తీర్ణం పంచుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. తిరుపతి, అన్నమయ్యకు పోగా మిగిలిన అటవీ విస్తీర్ణం కలిగిన రాజంపేట డివిజన్ వైఎస్సార్ కడపలోకి విలీనం కానున్నది. చరిత్ర కలిగిన రాజంపేట అటవీ డివిజన్ నిర్వహణ, హద్దుల వ్యవహారంపై అటవీశాఖ ఉన్నతాధికారులు తర్జనభర్జన పడుతున్నారు. కడప డివిజన్లోకి విలీనమేనా? రాజంపేట కేంద్రంగా అన్నమయ్య అటవీ పాలన కొనసాగిన సంగతి విదితమే. ఇప్పుడు డివిజన్పై కొత్తగా ఏర్పడిన మదనపల్లె జిల్లా ప్రభావం పడింది. ఇటు తిరుపతి జిల్లా ప్రభావాన్ని ఎదుర్కొంది. ఫలితంగా అటవీ విస్తీర్ణంతోపాటు జిల్లా అటవీ శాఖ కార్యాలయం కూడా మదనపల్లెకు తరలింపునకు అటవీ శాఖ సమాయత్తం కావాల్సి వస్తోంది. ఇప్పుడు రాజంపేట వైఎస్సార్ కడప జిల్లాలోకి విలీనం అయిన క్రమంలో కడప జిల్లా అటవీ శాఖ పరిధిలోకి వెళుతుంది. ఇక్కడ ఉన్న అన్నమయ్య జిల్లా అటవీ కేంద్ర కార్యాలయం బదిలీ కాక తప్పదు. సబ్ డీఎఫ్ఓ పాలనలోకి రాజంపేట ఐఎఫ్ఎస్ పాలన జరిగిన రాజంపేట ఇప్పుడు సబ్డీఎఫ్ఓ కంట్రోల్కి చేరనున్నది. ఒకప్పుడు రైల్వేకోడూరుకు సబ్డీఎఫ్ఓ హోదా అధికారి ఉండేవారు. రాజంపేటకు ఐఎఫ్ఎస్ అధికారి పాలన కొనసాగేది. ప్రస్తుతం ఆ పరిస్థితి తారుమారైంది. ఇప్పుడు కడప అటవీశాఖ ఆధీనంలోకి మిగిలిన రాజంపేట అటవీ విస్తీర్ణం చేరనున్నది. రాజంపేట ఎర్రబంగారంకే డిమాండ్ అరుదైన జంతుజాలంకు నెలవు.. కేంద్ర ప్రభుత్వంచే జీవవైవిధ్య అటవీ ప్రాంతంగా గుర్తింపు పొందిన శేషాచలం.. ఎర్రచందనం చెట్లతో విశిష్ట ప్రాధాన్యం సంతరించుకుంది. ప్రధానంగా శేషాచలం కొండల్లో పెరిగే ఎర్రచందనం ఎక్కువ చేవ ఉండటంతో దానికి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ ఉంది. ఇందులో రాజంపేట ఎర్రచందనానికి మరి డిమాండ్. అందువల్లనే ఎర్రచందనం డిపో కేంద్రాన్ని గతంలో ఏర్పాటు చేశారు. ఎన్టీఆర్ బర్తరఫ్ సమయంలో జరిగిన ఆందోళనలో భాగంగా ఈ డిపో అగ్నిప్రమాదానికి గురైన సంగతి విదితమే. అన్నమయ్య జిల్లాలో 2.8 మిలయన్ల హెక్టార్లలో ఎర్రచందనం చెట్లు ఉన్నాయి. ఆరు దశాబ్దాల డివిజన్ ప్రశ్నార్థకం శేషాచలంలో తగ్గిన విస్తీర్ణం మదనపల్లె దిశగా అన్నమయ్య డీఎఫ్ఓ -
నోటీసులు ఇవ్వకుండా దౌర్జన్యం చేస్తారా!
ప్రొద్దుటూరు క్రైం: నోటీసులు ఇవ్వకుండా.. చట్టపరమైన విధానాలు లేకుండా రైతుల పొలాలు ఎలా తీసుకుంటారని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు ప్రశ్నించారు. మండల పరిధిలోని చౌడూరు గ్రామంలో రైతుల పొలాల చదును కార్యక్రమాన్ని అడ్డుకున్న అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. చౌడూరు గ్రామంలోని 30 మంది రైతులు 50 ఏళ్ల నుంచి పొలాలను సాగు చేసుకుంటున్నారన్నారు. అటవీప్రాంతాన్ని తలపించేలా ఎడారి కొండల్లా ఉన్న ఈ భూములను రైతులు రూ. లక్షలు వెచ్చించి బోర్లు వేసుకొని మోటర్లను ఏర్పాటు చేసుకున్నారని పేర్కొన్నారు. రైతుల అభిప్రాయాలను పరిగణలోకి తీసుకోకుండా కూటమి నాయకులు ఈ భూముల్ని ఏపీఐఐసీకి అప్పగించారన్నారు. పెన్నానది ఒడ్డున మునకకు అవకాశం ఉన్న ఈ ప్రాంతంలో చిన్న తరహా పరిశ్రమలను ఏర్పాటు చేసేందుకు కూటమి నాయకులు అన్యాయంగా రైతులను గెంటేస్తున్నారని మండిపడ్డారు. ఇక్కడి రైతులు నీటి తీరువా పన్ను, భూమిశిస్తు పన్ను కట్టారని చెప్పా రు. విద్యుత్ బిల్లులు కూడా చెల్లిస్తున్నారని, ప్రభుత్వం వారికి ఉచిత విద్యుత్ కూడా అందిస్తున్నట్లు తెలిపారు. అభివృద్ధికి తాను ఎప్పుడూ వ్యతిరేకం కాదని రాచమల్లు స్పష్టం చేశారు. రైతుల నుంచి పొలాలను తీసుకునే పద్ధతి సరిగా లేదన్నారు. నోటీసులు ఇస్తే రైతులు కోర్టుకు వెళ్తారనే భయం టీడీపీనేతల్లో ఉందన్నారు. సమీప గ్రామాలతో పాటు ప్రొద్దుటూరు మునకకు గురయ్యే ప్రమాదం రైతులు సాగు చేసుకుంటున్న ఈ భూములు పెన్నా నదికి చౌడూరు గ్రామానికి మధ్యలో ఎత్తైన ప్రాంతంలో ఉన్నాయని రాచమల్లు అన్నారు. ఈ ఎత్తైన ప్రాంతం వరద నీరు గ్రామంలోకి వెళ్లకుండా రక్షణగా ఉందని చెప్పారు. ఇక్కడ రోడ్ల నిర్మాణం చేపట్టి పొలాలను చదును చేస్తే భవిష్యత్ కాలంలో చౌడూరు, రంగసాయపల్లె, శంకరాపురం గ్రామాలు మునకకు గురయ్యే ప్రమాదం ఉందని తెలిపారు. శంకరాపురం గ్రామం సమీపంలో ఉన్న మడూరు కాలువలో వరద నీరు కలిసే అవకాశం ఉందని, తద్వారా ఆ నీరంతా ప్రొద్దుటూరు పట్టణంలోకి వెళ్లి జలమయం అయ్యే అవకాశం ఉందని చెప్పారు. పలు గ్రామాలకు తాగు నీటి, సమీప భూములకు సాగునీటి సమస్య ఏర్పడుతుందన్నారు. ● వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ మార్తల ఓబులరెడ్డి, నాయకులు పల్లా లక్ష్మినారాయణరెడ్డి, సాంబశివారెడ్డి, మోపూరి సిద్ధయ్య, బోరెడ్డి సుబ్బారెడ్డి, మాజీ ఎంపీటీసీ ప్రసాద్యాదవ్, రైతులు పాల్గొన్నారు. పేరుకే ఈ ప్రాంతంలో కూటమి నాయకులు అభివృద్ధి పనులు చేస్తున్నారని, దాని వెనుక అసలు రహస్యం దాగి ఉందని రాచమల్లు శివప్రసాద్రెడ్డి తెలిపారు. ఇండస్ట్రియల్ పార్కు కోసం ప్రభుత్వం రూ. 14 కోట్లు మంజూరు చేసిందని, నాసిరకం పనులు చేసి అందులో రూ.4–5 కోట్లు కొట్టేయాలని ఎమ్మెల్యే కుమారుడు కొండారెడ్డి, కాంట్రాక్టర్ మహేశ్వరరెడ్డిలు పన్నాగం పన్నారని ఆరోపించారు. అంతేగాక నిర్మాణాల పేరుతో ఇక్కడున్న ఇసుకను, నల్ల మట్టిని విక్రయించుకొని రూ. కోట్లాది రూపాయలు లబ్ధి పొందాలనేది వారి దురాలోచన అని రాచమల్లు ఆరోపించారు. రైతులకు న్యాయం చేసేంత వరకు వారికి అండగా ఉంటానని చెప్పారు. -
చికెన్వేస్ట్ టెండర్ కోసం టీడీపీలో కుమ్ములాట !
● వాయిదాపడిన టెండర్ల ఓపెనింగ్ ● పురపాలికలో టీడీపీ వర్గనేతల హడావుడి రాజంపేట : రాజంపేట పురపాలక సంఘంలో చికెన్వేస్ట్ టెండర్ను దక్కించుకునేందుకు అధికారపార్టీ టీడీపీలో కుమ్ములాట మొదలైంది. శనివారం టెండర్ల బాక్స్ కనపడలేదని టీడీపీలో మరో వర్గం వారు హడావుడి చేశారు. చికెన్వేస్ట్ టెండర్ను ఏకగ్రీవంగా దక్కించుకునేందుకు అధికారపార్టీలో మరో వర్గం ప్రయత్నిస్తుందనే అనుమానం ఆ పార్టీకి చెందిన మరోవర్గం నేతలకు కలిగింది. ఈ టెండర్ బాక్స్ను శనివారం మధ్యాహ్నం 3.30 గంటల తర్వాత తెరవాల్సి ఉంది, దానికోసం టీడీపీ కౌన్సిలర్లు పట్టుబట్టారు. అయితే కమిషనర్ లక్ష్మీనారాయణ అందుబాటులో లేకపోవడంతో వీరిలో అనుమానాలు బలపడ్డాయి. అయితే కమిషనర్ పురపాలిక కార్యకలాపాలకు సంబంధించి జిల్లా కలెక్టరేట్కు వెళ్లినట్లుగా సిబ్బంది వివరించారు. దీంతో టెండర్ బాక్స్ ఓపెన్ చేయకుండా సోమవారానికి వాయిదా వేశారు. ఇప్పటికే ఒకసారి ఈ టెండర్ వాయిదా పడింది. ఇందుకు కారణం అధికారపార్టీకి చెందిన ఒకరికే చికెన్వేస్ట్ టెండర్ను ఇప్పించేందుకు ఆ పార్టీ నియోజకవర్గనేత పావులు కదుపుతున్నారు. నామినేట్ కింద తన వర్గానికి చెందిన ఒకరికే చికెన్ వేస్ట్ టెండర్ను ఇప్పించాలని చేసిన ప్రయత్నాలు విఫలమవుతున్నాయి. కమిషనర్పై అధికారపార్టీ నుంచి ఈ టెండర్ విషయంలో ఒత్తిడి వున్నట్లు టీడీపీ వర్గాలే పేర్కొంటున్నాయి. కాగా చికెన్వేస్ట్కు నెల్లూరులో పెద్దగా డిమాండ్ ఉంది. ఇప్పుడు ఆ వ్యాపారానికి సంబంధించి టెండర్ దక్కించుకుంటే లక్షల్లో లాభమొస్తుందని భావించి, పోటీపడుతున్నారు. పట్టణంలో చికెన్ దుకాణాల వద్ద పారేసిన వేస్ట్ను సేకరించి, ట్రాక్టర్ ద్వారా నెల్లూరు తదితర ప్రాంతాలకు తీసుకెళ్లి అమ్ముకుంటున్నారు. గతంలో కూడా చాలా తక్కువ చికెన్వేస్ట్ తీసుకొని వ్యాపారం చేసి లాభాలు ఆర్జించిన క్రమంలో ఇప్పుడు టీడీపీ నాయకులు దృష్టి సారించారు. దీంతో ఈ టెండర్ను దక్కించుకునేందుకు టీడీపీలోనే రెండు వర్గాలు పోటీపడుతున్నాయి. అయితే వైఎస్సార్సీపీకి చెందిన వారు కూడా చికెన్ వేస్ట్ టెండర్లకు దరఖాస్తులు దాఖాలు చేశారు. ఏది ఏమైనప్పటికి చికెన్ వేస్ట్ కోసం టీడీపీలో రెండు వర్గాల కుమ్మలాటలు చూసి జనం విస్తుపోతున్నారు. -
దరఖాస్తుల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్, జిల్లా ప్రధాన కార్యాలయంలో ఈ నెల చివరి వారంలో రాజ్య పురస్కార్ , తృతీయ సోపాన్ (స్కౌట్స్ అండ్ గైడ్స్) క్యాంపులు నిర్వహించనున్నట్లు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా చీఫ్ కమిషనర్ డాక్టర్ షేక్ షంషుద్దీన్ పేర్కొన్నారు. వీటికి సంబంధించిన దరఖాస్తులను ఈ నెల8వ తేదీ వరకు కడప నగరం శంకరాపురంలోని భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా ప్రధాన కార్యాలయంలో స్వీకరించనున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు డీ.ఓ.సి రమణయ్య, రోహిణి, సహాయ కార్యదర్శి ఖాదర్ బాషా, సంయుక్త కార్యదర్శి వెంకట సుబ్బయ్యలను సంప్రదించాలని పేర్కొన్నారు. కమలాపురం: కమలాపురం మండలం నల్లలింగాయపల్లెలోని భారతి సిమెంట్స్ కాలనీకి చెందిన చౌడం సునంద జాతీయ స్థాయి యోగాసన పోటీల్లో విశేష ప్రతిభ చూపారు. డిసెంబర్ 30 నుంచి జనవరి 2వ తేదీ వరకు మహారాష్ట్రలో జరిగిన 6వ సీనియర్ జాతీయ స్థాయి యోగాసన స్పోర్ట్స్ ఛాంపియన్షిప్ 2025–26 పోటీల్లో పాల్గొన్న సునంద 35–40 ఏజ్ గ్రూప్లోని సుపైన్ ఆసనాల పోటీల్లో ద్వితీయ స్థానంలో నిలిచి వెండి పతకం అందుకున్నారు. పలువురు భారతి పరిశ్రమ ప్రతినిధులు, ఉద్యోగులు సునందను అభినందించారు. కడప ఎడ్యుకేషన్: మహిళా ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా గురు చైతన్య ఉపాధ్యాయ సంఘం జిల్లాకు చెందిన మహిళా ఉపాధ్యాయురాలు వరలక్ష్మిని సౌత్ ఇండియా బెస్ట్ ఉమెన్ టీచర్ అవార్డుకు ఎంపిక చేసింది. ఏపీ, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు సంబంధించి బోధనలో ఉత్తమ ప్రతిభ, సృజనాత్మకత, వృత్తి పట్ల అంకిత భావం చూపిన 5 మంది ఉపాధ్యాయినిలను ఈ అవార్డుకు ఎంపిక చేయగా ఇందులో కడప జిల్లా పులివెందుల గవర్నమెంట్ మోడల్ ప్రైమరీ స్కూల్(రమణప్ప సత్రం)లో ప్రధానోపాధ్యాయురాలుగా పనిచేస్తున్న పీఎస్హెచ్ఎం, ఫోరమ్ రాష్ట్ర కార్యవర్గ సభ్యురాలు వద్ది. వరలక్ష్మి అవార్డును అందుకున్నారు. ఇందుకు ఏపీపీఎస్ హెచ్ఎం ఫోరం తరపున ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ అభినందనలు తెలిపారు. ఒకవైపు పాఠశాల అడ్మినిస్ట్రేషన్ చూసుకుంటూ విద్యార్థులకు విన్నూత్నంగా, వివిధ యాక్టివిటీ బేస్డ్ కార్యక్రమాల ద్వారా పిల్లలకు చక్కగా, ఆహ్లాదకర వాతావరణం ఏర్పరుస్తూ పిల్లల అభిరుచులకు తగినట్లు బోధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంపై ఈమె శ్రద్ధ అభినందనీయమన్నారు. -
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో శనివారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 9:30 గంటల నుంచి సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కల్యాణం వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయంలోని కల్యాణ వేదిక వద్ద అర్చకులు సీతారాముల ఉత్సవ విగ్రహాలను ఆశీనులు చేసి, నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, పుష్పమాలలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం సతీసమేతుడైన శ్రీ కోదండ రామస్వామికి ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్లు అంగరంగ వైభవంగా పౌర్ణమి కల్యాణం నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం శాస్త్రోక్తంగా మూలవిరాట్లకు స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం నిర్వహించి, టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, పూలు, పండ్లతో ఆలయ ప్రదక్షిణ చేసి, గర్భాలయంలోని మూల విరాట్కు సమర్పించారు. నూతన పట్టువస్త్రాలను తొడిగి, బంగారు ఆభరణాలు వేసి, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. అనంతరం సీతారామలక్ష్మణ మూర్తులకు ప్రత్యేక పూజలతో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు వచ్చారు. రాజంపేటలో చైన్స్నాచింగ్ రాజంపేట : పట్టణంలోని నూనివారిపల్లెలో బీవీఎన్ పాఠశాల సమీపంలోని రాములవారి ఆలయం వద్ద శనివారం నీలపూజి జ్యోతి అనే మహిళ మెడలో నుంచి దుండగుడు సరుడు లాక్కొ వెళ్లాడు. ఈ మేరకు బాధితురాలు పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. సరుడు రోల్డ్గోల్డ్ అయినప్పటికి అందులో రూ.1.50 లక్షల విలువ చేసే బంగారు పుస్తెలు ఉన్నాయని బాధితురాలు తెలిపారు. పల్సర్బైక్పై వచ్చిన దుండగుడు చైన్ను గట్టిగా లాగడంతో మహిళ మెడకు గాయమైంది. థైరాయిడ్ కారణంగా ఇటీవలే ఆమె గొంతుకు శస్త్రచికిత్స చేయించుకున్నారు. దొంగతనం జరిగిన ప్రదేశంలో సీసీ కెమెరాలు లేకపోవడం గమనార్హం. పట్టణ పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
మళ్లీ మొదలైన కేబుల్వైర్ల చోరీ
లింగాల : లింగాల మండలంలో విద్యుత్ మోటార్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ మళ్లీ మొదలైంది. శుక్రవారం రాత్రి గుర్తు తెలియని దొంగలు రామట్లపల్లె, చిన్నకుడాల గ్రామాలకు చెందిన రైతుల పొలాల్లోని విద్యుత్ మోటార్ల వద్ద ఉన్న విద్యుత్ కేబుల్ వైర్లను కత్తిరించుకుని వెళ్లారు. ఆయా గ్రామాలకు చెందిన సుమారు 20మోటార్లకు ఉన్న కేబుల్ వైర్లను అపహరించుకెళ్లారని రైతులు ఆందోళన చెందుతున్నారు. శనివారం ఉదయాన్నే రైతులు పొలాలకు వెళ్లి మోటార్లు ఆన్ చేయాలని చూస్తే కేబుల్ వైర్లు లేకపోవడం చూసి అవాక్కయ్యారు. రామట్లపల్లె గ్రామానికి చెందిన ఈశ్వరరెడ్డి, విశ్వనాథరెడ్డి, శంకర్రెడ్డి, సుబ్బరాయుడు, జయరామిరెడ్డి అనే రైతుల కేబుల్ వైర్లు చోరీ అయినట్లు తెలిపారు. ఒక్కో మోటార్ వద్ద 20 మీటర్ల నుంచి 30 మీటర్ల కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయని రైతులు వాపోయారు. ఈ మోటార్లకు సంబంధించిన కేబుల్ వైర్లను కొనుగోలు చేసి అమర్చుకోవాలంటే సుమారు రూ.10వేలు ఖర్చు చేయాల్సి వస్తుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గత అక్టోబర్, నవంబర్ మాసాలలో కోమన్నూతల, అంబకపల్లె, మురారిచింతల తదితర గ్రామాల్లోని కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. నవంబర్ 8వ తేదీన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి రైతుల పక్షాన లింగాల పోలీస్ స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. అప్పటి నుంచి స్తబ్దుగా ఉన్న దొంగలు తిరిగి చెలరేగిపోతున్నారు. ఇప్పటికై నా పోలీసులు రాత్రి పూట గస్తీని పెంచి ప్రత్యేక నిఘా ఏర్పాటు చేయాలని రైతులు కోరుతున్నారు. -
క్రీడల్లో రాణించినపుడే వ్యక్తిత్వం వికసిస్తుంది
కమలాపురం : విద్యార్థులు విద్యతో పాటు క్రీడల్లో రాణించినపుడే వ్యక్తిత్వం వికసిస్తుందని భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్ (బీసీసీపీఎల్) చీఫ్ టెక్నికల్ ఆఫీసర్ అతుల్ ప్రియదర్శి తెలిపారు. శుక్రవారం మండలంలోని నల్లలింగాయపల్లెలో వెలసిన డీఏవీ భారతి విద్యా మందిర్లో ప్లాంట్ హెడ్ రామ మూర్తి ఆధ్వర్యంలో ఇంటర్ హౌస్ స్పోర్ట్స్ ఫెస్ట్ అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా అతుల్ ప్రియదర్శి మాట్లాడుతూ క్రీడలు శారీరక దృఢత్వంతో పాటు మానసిక ఉల్లాసాన్ని పెంపొందిస్తా యన్నారు. అలాగే ఓటమిని తట్టుకునే ధైర్యం, జట్టుగా పని చేసే నాయకత్వ లక్షణాలను అలవర్చుతాయని పేర్కొన్నారు. హెడ్ ప్లాంట్ రామ మూర్తి మాట్లాడుతూ విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధికి డీఏవీ భారతి విద్యా మందిర్ ఎల్లప్పుడూ ప్రాధాన్యత నిస్తుందన్నారు. అందులో భాగంగానే ప్రతి ఏడాది ఇలాంటి క్రీడా సంబరాలను నిర్వహిస్తున్నామని తెలిపారు. ఈ క్రీడోత్సవంలో క్రికెట్, వాలీబాల్, త్రోబాల్, రిలే రేస్, షాట్పుట్ వంటి వివిధ క్రీడా పోటీలు నిర్వహించగా విద్యార్థులు ప్రతిభను చాటారు. అనంతరం విద్యార్థులు చేసిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. గెలుపొందిన విజేతలకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఏడీవీ రీజనల్ ఆఫీసర్ వీఎన్ శేషాద్రి, హెచ్ఆర్ హెడ్ గోపాల్రెడ్డి, చీఫ్ మేనేజర భార్గవ్ రెడ్డి, పాఠశాల ప్రిన్సిపల్ శివ్వం కిషోర్ కుమార్, ఉపాధ్యాయులు, విద్యార్థులు, తల్లిదండ్రులు పాల్గొన్నారు. -
దుంపలగట్టు పోస్ట్ ఆఫీసులో మొదలైన విచారణ
● రూ.18 లక్షలకు పైగానే స్వాహా ● వారంలోగా పూర్తి నివేదిక ఖాజీపేట : దుంపలగట్టు పోస్ట్ ఆఫీసులో జరిగిన అక్రమాలపై ఒక్కో విషయం బయటకు వస్తోంది. హెడ్పోస్ట్ ఆఫీస్ అధికారులు విచారణ మొదలు పెట్టడంతో సిబ్బంది బాగోతం బయట పడుతోంది. ఈ విచారణలో ఇప్పటికే సుమారు రూ. 18 లక్షలకు పైగానే సిబ్బంది చేతివాటం చూపినట్లు అధికారులు అంచనా వేస్తున్నారు. మరో వారం రోజుల్లో విచారణ పూర్తి అనంతరం పూర్తి నివేదిక బయటకు రానుంది. వివరాల్లోకి వెళితే... ఖాజీపేట మండలం దుంపలగట్టు పోస్ట్ ఆఫీసు లో శ్రీనివాసులు అనే వ్యక్తి సుమారు 26 సంవత్సరాలుగా పనిచేస్తున్నారు. అయితే ఆయన అనధికారింగా తన కుమారుడు విజయ్ కుమార్ ను తన స్థానంలో నియమించుకున్నారు. సుమారు 10 సంవత్సరాలకు పైగానే అనధికారికంగా దుంలపగట్టు పోస్ట్ ఆఫీసులో విజయ్కుమార్ పనిచేస్తున్నాడు. ఇలా అందరి తో నమ్మకంగా ఉంటూనే తన చేతివాటం ప్రదర్శించారు. పోస్ట్ ఆఫీసు అధికారులతో సంబంధం లేకుండానే ప్రజల వద్ద నుంచి పొదుపు పేరుతో వసూళ్లు చేశారు. ఇదే విషయం పై స్థానిక ప్రజలు గుర్తించి పోలీసులకు, పోస్ట్ఆఫీసు అధికారులకు ఫిర్యాదు చేయడం తో తీగలాగితే డొంక కదిలిందన్న చందంగా మొత్తం వ్యవహారం బయటకు వస్తోంది. అక్రమ వసూళ్లు రూ. 18 లక్షలకు పైనే ? విజయ్కుమార్ అక్రమాల పై హెడ్ పోస్ట్ ఆఫీసు నుంచి అధికారులు ప్రత్యేక విచారణ అధికారులను నియమించారు. వారు రెండు రోజులుగా గ్రామంలో విచారణ చేపట్టారు. ఇందులో పోస్ట్ ఆఫీస్తో సంబంధం లేకుండానే సుమారు రూ. 5 లక్షలు వసూలు చేసినట్లు గుర్తించారు. కనీసం పాసుపుస్తకాలు గానీ అకౌంట్ కూడా లేకుండానే ఈ మొత్తం వసూలు చేసినట్లు గుర్తించారు. అలాగే పాసుపుస్తకాలను సైతం అధికారులు అందరి వద్ద నుంచి తీసుకుని పరిశీలన చేపట్టారు. ఈ పుస్తకాల్లో సైతం వసూలు చేసిన మొత్తం డబ్బు పోస్ట్ ఆఫీసులో చెల్లించకుండా స్వాహా చేసినట్లు అధికారులు గుర్తించారు. ముఖ్యంగా పాసుపుస్తకం లో సంతకాలు, సీల్ వేయడం కూడా పోస్ట్ ఆఫీసు అధికారి తో సంబంధం లేకుండానే జరిగినట్లు అధికారులు గుర్తించారు. ఆర్డీ డబ్బులు కూడా గోల్ మాల్ జరిగినట్లు తెలుస్తోంది. దీని పై పోస్ట్ఆఫీసు పరిధిలో ఎన్ని ఖాతాలు ఉన్నాయి. అందులో ఎంత డబ్బు కట్టారు. ఎంత కట్టకుండా స్వాహా చేశారు. ఎంత డబ్బు స్వాహా అయ్యింది.. అన్న విషయాలను పూర్తిగా విచారణ చేస్తున్నారు. మరో వారం రోజుల్లో విచారణ పూర్తి చేయనున్నట్లు తెలుస్తోంది. తదుపరి నివేదికను ఉన్నతాధికారులకు, పోలీసులకు అందించే అవకాశం ఉందని అధికారులు అంటున్నారు. అయితే అక్రమ వసూళ్లు రూ. 18 లక్షలకు పైగానే ఉండవచ్చని సమాచారం. పై అధికారులు ఏం చేస్తున్నారు..? దుంపలగట్టు పోస్ట్ ఆఫీసులో గడచిన 10సంవత్సరాలు గా తన తండ్రి శ్రీనివాసుల స్థానంలో విజయ్ కుమార్ పనిచేస్తుంటే ఉన్నతాధికారులు దీనికి వత్తాసు పలకడం విశేషం. పోస్ట్ ఆఫీసు లావాదేవీలు అన్ని మొత్తం తన కుమారుడు చేత చేయిస్తుంటే అధికారులకు తెలిసీ ఎలాంటి చర్యలు తీసుకోక పోవడం ఏమిటని స్థానిక ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పుస్తకాల్లో సంతకాలు, లావాదేవీలు అన్నీ అంత ధైర్యంగా ఎలా చేశారని అందరూ ఆశ్చర్యపోతున్నారు. హెడ్పోస్ట్ఆఫీసులోని అధికారులకు తెలిసే జరిగిందా.. లేక దౌలతాపురం పోస్ట్ ఆఫీసులో అందరికీ తెలిసి జరిగిందా అన్నది విచారణలో తేలాల్సి ఉంది. అయితే స్థానికంగా చాలా మంది తన తండ్రి స్థానంలో అతనే అధికారిగా వచ్చారని భావించి డబ్బులు కడుతున్నట్లు స్థానికులు భావించారు. అయితే చివరకు శ్రీనివాసులు మాత్రమే అధికారి అని అతని కుమారుడు విజయ్కుమార్ అసలు ఉద్యోగి కాదని తెలియడంతో అంతా ఆశ్చర్య పోయారు. డబ్బులు కడతాం వదిలేయండి.. అక్రమాలకు పాల్పడిన డబ్బును పూర్తిగా కడతాం.. కేసులు లేకుండా వదిలేయాలని పోస్ట్ఆఫీసు అధికారులకు శ్రీనివాసులు కుటుంబ సభ్యులు విన్నవించుకున్నట్లు సమాచారం. విచారణకు వచ్చిన అధికారులతో, అలాగే స్థానిక పొదుపు సభ్యలను సైతం ఉద్యోగిగా ఉన్న శ్రీనివాసులు విజ్ఞప్తి చేస్తున్నట్లు తెలుస్తోంది. అయితే అధికారులు ఎలా స్పందిస్తారో విచారణ పూర్తి అయితే గానీ అసలు విషయం బయట పడే అవకాశం లేదని స్థానికులు, అధికారులు అంటున్నారు. -
టమాట.. రైతుకు ఊరట
ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 6 వేల ఎకరాలలో టమాట సాగైందని ఉద్యాన శాఖ అధికారులు చెబుతున్నారు. ఎక్కువగా ఛాంపియన్ సాగు వంటి రకాలను సాగు చేస్తున్నారు. జిల్లాలో పులివెందుల, కమలాపురం, జమ్మలమడుగు, మైదుకూరు నియోజకవర్గాలలో అత్యధికంగా సాగైంది. అక్టోబరులో సాగు ప్రారంభించారు. ప్రస్తుతం కాయల కోతలు ప్రారంభమయ్యాయి. గతేడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది సాగు తగ్గిందని ఉద్యాన శాఖ అధికారులు అంటున్నారు. ఏడాది కాలంగా స్థిరమైన ధరలు లేకపోవడం, సాగులో నష్టాలు రావడంతో.. పంట విస్తీర్ణం తగ్గిందని అధికారులు అంచనా వేస్తున్నారు. వేముల: ఈ ఏడాది రబీలో టమాట సాగు.. రైతులకు కలిసొచ్చింది. ఖరీఫ్లో ధరల్లేక నష్టాలు చవి చూశారు. అప్పుడు నష్టపోయిన రైతులు రబీలో అయినా లాభాలు గడిద్దామని సాగు చేశారు. దిగుబడులు వచ్చే సమయానికి ధరలు పెరగడంతో రైతులకు ఊరట కలుగుతోంది. పది రోజులుగా మార్కెట్లో ధరలు నిలకడగా ఉంటున్నాయి. ప్రస్తుతం తోటలలో కాయలు కోతకు వస్తున్నాయి. దిగుబడులు పూర్తయ్యే వరకు ఈ ధరలు ఉంటే ఆదాయం ఉంటుందని రైతులు అంటున్నారు. ఎకరాకు రూ.50 వేలకు పైనే పెట్టుబడి: ఉద్యాన పంటలలో అధిక పెట్టుబడులతో కూడుకున్నది టమాట. పంట కాల పరిమితి నాలుగు నెలలు. ముద్దనూరు, ముదిగుబ్బ, కదిరి తదితర ప్రాంతాల్లోని నర్సరీల నుంచి మొక్కలు తెచ్చు కుని సాగు చేస్తున్నారు. డిమాండ్ను బట్టి ఒక్కో మొక్కకు 40 నుంచి 90 పైసల వరకు చెల్లించాలి. ఎకరాకు 12 నుంచి 14 వేల మొక్కల వరకు నాటుతున్నారు. నాటినప్పటి నుంచి దిగుబడులు పూర్తయ్యేవరకు సంరక్షించుకోవాలి. చీడ పీడల నుంచి రక్షించుకునేందుకు వారానికొకసారి మందులు స్ప్రే చేస్తూ కాపాడుకుంటున్నారు. దీంతోనే టమాట సాగులో పెట్టుబడులు ఎక్కువగా అవుతున్నాయి. సకాలంలో మందులు స్ప్రే చేసి.. ఈ ఏడాది టమాట సాగులో దిగుబడులు తగ్గుతున్నాయి. మొక్కలు నాటిన మొదలు నెల రోజులపాటు తుపాను ప్రభావంతో వర్షాలు కురిశాయి. వర్షాలతో తెగుళ్లు సోకాయి. సకాలంలో మందులు పిచికారి చేసి, పంటను కాపాడుకున్నారు. తర్వాత పూత దశలో ఉండగా వర్షాలతో దెబ్బతింది. వర్షాలకు పూత రాలిపోయింది. మందులు స్ప్రే చేశాక చిగుర్లు వేసి పూత రావడంతో తోటలలో దిగుబడులు అందుతున్నాయి. వర్షాలతో టమాటకు తెగుళ్లు సోకి పూర్తిగా దెబ్బతిన్నప్పటికీ.. సకాలంలో మందులు స్ప్రే చేయడం వల్ల దిగుబడులు వస్తున్నాయని రైతులు అంటున్నారు. 10 రోజులుగా స్థిరంగా.. మార్కెట్లో టమాట ధరలు పెరిగాయి. 10 రోజులుగా స్థిరంగా కొనసాగుతున్నాయి. బయటి మార్కెట్కు 20 కిలోల బాక్సు రూ.900లతో కొనుగోలు చేస్తున్నారు. ధరలు ఉండటంతో వ్యాపారులు తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. ఈ ప్రాంతం నుంచి ఎక్కువగా మదనపల్లె, చైన్నె, కావలి తదితర ప్రాంతాలకు తరలిస్తున్నారు. తోటలలో ఇప్పుడిప్పుడే కోతలు ప్రారంభమయ్యాయి. రైతులు కూడా మార్కెట్ సమాచారం తెలుసుకుంటూ అందుకు అనుగుణంగా తోటలలో కోతలు కోస్తున్నారు. వ్యాపారులు వస్తే బాక్సుల ధర నిర్ణయించుకుని వారికి అమ్మి వేస్తున్నారు. తోటల వద్దకు వ్యాపారులు రావడంతో రైతులకు రవాణా భారం తగ్గింది. పెరిగిన ధరలు వర్షాలతో తగ్గుతున్న దిగుబడి రేటు నిలకడగా ఉంటే ఆదాయమే 5 ఎకరాలలో సాగు చేశా నాకున్న 5 ఎకరాలలో టమాట సాగు చేశా. ఎకరాకు రూ.50 వేలకు పైనే పెట్టుబడులు పెట్టా. దిగుబడులు వస్తున్నాయి. మార్కెట్లో ధరలు ఉండటంతో వ్యాపారులు తోట వద్దకు వచ్చి కొనుగోలు చేస్తున్నారు. దిగుబడులు పూర్తయ్యేవరకు ఇదే ధరలు ఉంటే ఆదాయం బాగుంటుంది. – రామసుబ్బారెడ్డి, రైతు, వేముల టమాట ధరలు మార్కెట్లో నిలకడగా ఉంటే ఆదాయం ఉంటుందని రైతులు అంటున్నారు. టమాట సాగు పెట్టు బడులతో కూడకున్నప్పటికీ దిగుబడులు ఉండి ధరలు ఉన్నట్లయితే ఆదాయం ఉంటుంది. దీంతోనే రైతులు ఈ పంట సాగు వైపు మొగ్గు చూపుతున్నారు. ప్రస్తుతం ఉన్న ధరలు దిగుబడులు పూర్తయ్యే వరకు ఉంటే.. ఎకరాకు రూ.2 లక్షల మేర ఆదాయం ఉంటుందని రైతులు చెబుతున్నారు. ఈ ఏడాది ఎకరాకు 400 బాక్సులకు మించి దిగుబడులు ఉండే పరిస్థితి లేదని, ధరలు ఉండటంతోనే ఆదా యం వస్తుందనే ఆశతో ఉన్నామని వారు అంటున్నారు. సాగు విస్తీర్ణం తగ్గడంతోనే ధరలు ఈ ఏడాది టమాట సాగు విస్తీర్ణం తగ్గింది. తుపాను వర్షాలు పడటంతో తోటలు దెబ్బతిన్నాయి. మార్కెట్కు సరఫరా లేకపోవడంతోనే ధరలు పెరిగాయి. మార్కెట్లో ఇదే ధరలు ఉంటాయనే సమాచారం ఉంది. – రాఘవేంద్రారెడ్డి, ఉద్యాన శాఖాధికారి, పులివెందుల -
నర్సింగ్ సూపరింటెండెంట్గా పదోన్నతులు
కడప రూరల్: వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 కార్యాలయంలో శుక్రవారం హెడ్ నర్స్ నుంచి నర్సింగ్ సూపరింటెండెంట్ గ్రేడ్ –2గా పదోన్నతులు కల్పించారు. రాయలసీమ జిల్లా వ్యాప్తంగా మొత్తం 9 మంది పదోన్నతులు పొందారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామగిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగుల అర్హతల ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, ఆఫీసు సూపరిండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు. జీజీహెచ్ గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా గౌరి కడప అర్బన్: కడప నగర శివారులోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్గా గౌరిని నియమించారు. ఈమె 1986లో చిత్తూరు జిల్లా బంగారుపాళెం పిహెచ్సీలో స్టాఫ్ నర్సుగా విధుల్లో చేరారు. అప్పటి నుంచి పచ్చికాపాలెం పీహెచ్సీలో విధులు నిర్వహించారు. శుక్రవారం జరిగిన గ్రేడ్–2 నర్సింగ్ సూపరింటెండెంట్ పదోన్నతుల నియామకంలో భాగంగా కడప జీజీహెచ్లో హెడ్నర్సులుగా పని చేస్తున్న గౌరి, మనోథెరిస్కోవా, ప్రిస్కిల్లాలకు గ్రేడ్–2గా పదోన్నతులను కల్పించారు. వీరీలో గౌరిని జీజీహెచ్ గ్రేడ్–2గాను, మనోథెరిస్కోవాను కడప కేన్సర్ కేర్ హాస్పిటల్, ప్రిస్కిల్లాను నంద్యాలలో నియమించారు. -
ప్రపంచ తెలుగు మహాసభలకు జిల్లా కవులకు ఆహ్వానం
పులివెందుల టౌన్ : జిల్లా కవులు పులివెందులకు చెందిన అల్లం రంగనాయకులు, బద్వేల్ నియోజకవర్గం పోరుమామిళ్లకు చెందిన బొల్లు రామ్మోహన్లకు గుంటూరులో ఈనెల 3, 4, 5వ తేదీలలో నిర్వహిస్తున్న ప్రపంచ తెలుగు మహాసభలలో ప్రతినిధులుగా పాల్గొనేందుకు ఆహ్వానం లభించింది. ఆంధ్ర సారస్వత పరిషత్తు ఆధ్వర్యంలో డాక్టర్ గజల్ శ్రీనివాస్ నిర్వహణలో 3వ ప్రపంచ తెలుగు మహాసభలకు కడప జిల్లాకు చెందిన రాయల భువన విజయం వేదిక అధ్యక్షులు బొల్లు రామ్మోహన్, శ్రీకృష్ణదేవరాయ ఫౌండేషన్ చైర్మన్ అల్లం రంగనాయకులు రాయల్ లకు ఆహ్వానం లభించింది. రిమ్స్ మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం కడప అర్బన్ : కడప నగర శివార్లలోని ప్రభుత్వ ఆసుపత్రి(రిమ్స్)లో చికిత్స పొందేందుకు వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి (40) మృతి చెందడంలో మార్చురీలో వుంచారు. అతనికి సంబంధించిన బంధువులు ఎవరైనా వుంటే తగిన ఆధారాలతో తమను సంప్రదించాలని రిమ్స్ అధికారులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. ఆలయ నిధుల దుర్వినియోగంపై చర్యలు ఎప్పుడు..? ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక అగస్త్యేశ్వరస్వామి ఆలయంలో నిధుల స్వాహా చేసిన వారిపై చర్యలు ఎప్పుడు తీసుకుంటారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. స్వామివారి ఆభరణాల గోల్మాల్పై ఇటీవల దేవాదాయశాఖ రీజనల్ జ్యువెలరీ ఇన్స్పెక్టర్ పాండురంగారెడ్డి ఆధ్వర్యంలో స్వామివారి ఆభరణాలను తనిఖీ చేశారు. 16.400 గ్రాముల బంగారు హారం, 253.900 గ్రాముల వెండి గొలుసు కనిపించం లేదని తనిఖీలో నిర్ధారించారు. ఆలయ అధికారులు అడ్జస్ట్మెంట్ పేరుతో చెక్కులు జారీ చేసి దాదాపు రూ.కోటి వరకు నిధులు స్వాహా చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఈ నిధుల స్వాహాపై దేవాదాయశాఖ అధికారులు ఎప్పుడు విచారణ జరుపుతారు, ఎప్పుడు చర్యలు తీసుకుంటారని భక్తులు ప్రశ్నిస్తున్నారు. నిధుల దుర్వినియోగంపై త్వరలో కోర్టులో కేసు వేయనున్నట్లు ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి తెలిపారు. కాగా స్వామివారి ఆభరణాల మాయంపై గత కొన్ని సంవత్సరాల నుంచి ఇప్పటి వరకు ఈఓలుగా పనిచేసిన వారిని కర్నూలులో శుక్రవారం దేవాదాయశాఖ డిప్యూటీ కమిషనర్ గురుప్రసాద్ విచారణ చేశారు. ఉపాధ్యాయులపై ఒత్తిడి తగ్గించాలి కడప ఎడ్యుకేషన్ : పదవ తరగతికి సంబంధించి వందరోజుల ప్రణాళిక పేరుతో, ప్రాథమిక ఉపాధ్యాయులకు ఎఫ్ఎల్ఎన్ పేరుతో తీవ్ర ఒత్తిడి గురిచేస్తున్నారని, విద్యాశాఖ మంత్రి వెంటనే ఉపాధ్యాయుల కు ఉపశమనం కలిగించాలని లేనిపక్షంలో విద్యాశాఖ కార్యాలయాలను ముట్టడించేందుకు వెనుకాడమని ఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షులు మల్లు రఘునాథరెడ్డి ప్రభుత్వాన్ని హెచ్చరించారు. శుక్రవారం వైఎస్సార్జిల్లా పోట్లదుర్తి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో విద్యార్థులకు మెటీరియల్ను అందించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ రాష్ట్ర ఉపాధ్యాయ సంఘం జిల్లా శాఖ చా లా ఉన్నత పాఠశాలలల్లో 10వ తరగతి మెటీరియల్ను ఉచితంగా అందిస్తోందన్నారు. అల్లం రంగనాయకులు బొల్లు రామ్మోహన్ -
ఐటీఐ ఉత్తీర్ణలైన విద్యార్థులకు పాలిటెక్నిక్ ప్రవేశం
కడప ఎడ్యుకేషన్: ఐటీఐలలో 2 ఏళ్ల కాల వ్యవధిలో గల కోర్సులలో 60 శాతం మార్కులతో పాసైన అభ్యర్థులకు పాలిటెక్నిక్లో 2 సంవత్సరాల కోర్సుల్లో ప్రవేశం పొందుటకు బ్రిడ్జి కోర్సులో అడ్మిషన్ పొందాలని ప్రభుత్వ మైనార్టీల ఐటీఐ కన్వీనర్, ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. బ్రిడ్జి కోర్సు పూర్తి చేసిన అభ్యర్థులు స్టేట్ టెక్నికల్ బోర్డు వారు నిర్వహించు ప్రవేశ పరీక్షలు రాయుటకు అర్హలని ఆయన పేర్కొన్నారు. కావున ఆసక్తి కలిగిన అభ్యర్థులు తమకు దగ్గరలోని ఏ ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐల వద్దకు వెళ్లి సంప్రదించి వారి వివరాలను నమోదు చేసుకుని జనవరి 5వ తేదీ నుంచి ప్రారంభమై ఫిబ్రవరి 4వ తేదీ వరకు జరిగే తరగతులకు హాజరు కావచ్చని తెలిపారు. మరిన్ని వివరాలకు దగ్గరలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐ వద్దకు వెళ్లి సంప్రదించాలని వివరించారు. కడప ఎడ్యుకేషన్: జిల్లా వ్యాప్తంగా కేజీబీవీలలో బాగా పని చేసిన ఉపాధ్యాయులకు 3వ తేదీ సావిత్రిబాయి ఫూలే జయంతిని పురస్కరించుకుని అవార్డులు ప్రదానం చేయనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్ తెలిపారు. శుక్రవారం కడప ఏపీసీ కార్యాలయంలో కేజీబీవీ ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప నగరంలోని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ భవనంలో 3వ తేదీ కేజీబీవీల ప్రిన్సిపాల్స్తో సమావేశం నిర్వహించడం జరుగుతుందని తెలిపారు. కేజీబీవీల అభివృద్ధి కోసం క్రమశిక్షణగా పని చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ దార్ల రూత్ ఆరోగ్య మేరీ తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: వైఎస్ఆర్ కడప జిల్లాలో సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నిర్వహిస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సిబ్బంది పోస్టులను ఔట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయుటకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. మహిళా అభ్యర్థులు మాత్రమే దరఖాస్తు చేసుకోవాలని పేర్కొన్నారు. దరఖాస్తులను ఈ నెల 3 నుంచి 11 వరకు చేసుకోవచ్చని వివరించారు. పోస్టుల వివరాలు ఇలా.. టైపు–3 కేజీబీవీల్లో ఒకేషనల్ ఇన్స్ట్రక్టర్లు –3, కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్లు –7, ఏఎన్ఎమ్ –7, అకౌంటెంట్–2, అటెండర్–4, అసిస్టెంట్ కుక్– 5, డే వాచ్ ఉమెన్–1, నైట్ వాచ్ ఉమెన్–2, స్కావెంజర్–1 అలాగే టైపు–4 కేజీబీవీల్లో వార్డెన్–1, పార్ట్ టైం టీచర్స్–2 పోస్టులు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. పూర్తి చేసిన దరఖాస్తులను అర్హతకు సంబంధించిన ఆధారాలతో కడపలోని సమగ్రశిక్ష ఏపీసీ కార్యాలయంలో పని దినాలలో సమర్పించవలెనని పేర్కొన్నారు. మరిన్ని వివరాల కోసం https://www. ssa kadapa.com/2, http: //kadapa deo.in/2 సంప్రదించాలని వివరించారు. -
టీడీపీ నాయకుల దౌర్జన్యం
పులివెందుల ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న ఈశ్వరరెడ్డి హిరోజ్పురం రైతులకు పట్టాదారు పాసు పుస్తకాలను పంపిణీ చేస్తున్న టీడీపీ నాయకులు లింగాల: వైఎస్సార్ కడప జిల్లా లింగాల మండలం ఇప్పట్ల గ్రామ పంచాయతీలోని హిరోజ్పురం గ్రామంలో శుక్రవారం పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో ఘర్షణ చోటు చేసుకుంది. టీడీపీ వర్గీయులు చేసిన ఈ దాడిలో వైఎస్సార్సీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి గాయపడ్డాడు. వివరాలిలా ఉన్నాయి. గతంలో రీసర్వే నిర్వహించిన భూములకు సంబంధించిన పట్టాదారు పాసుపుస్తకాలను రెవెన్యూ అధికారులు పంపిణీ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో ఇప్పట్ల గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ఓబుళరెడ్డి, మనోహర్రెడ్డిలు పాల్గొన్నారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకుడు ఈశ్వరరెడ్డి హిరోజ్పురం గ్రామానికి, ఇప్పట్ల గ్రామానికి ఏమి సంబంధం, మీరు హిరోజ్పురం గ్రామానికి ఎందుకు వచ్చారని ప్రశ్నించాడు. గతంలో తన భార్య పేరుపైన రెండు ఎకరాల పట్టా భూమి ఉందని, అయితే రీసర్వేలో 1.50ఎకరాల తొలగించారని, తమ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లి అడిగేందుకు కూడా వీలు లేకుండా చేస్తున్నారని టీడీపీ నాయకులను ప్రశ్నించడంతో వారు ఈశ్వర్రెడ్డిపై దాడి చేసి గాయపరిచారు. కాళ్లతో తన్నారు. గాయపడిన ఈశ్వరరెడ్డిని వెంటనే పులివెందుల ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న రూరల్ సీఐ ఎన్వీ రమణ, లింగాల పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని విచారణ నిర్వహించారు. దీనిపై విచారణ నిర్వహిస్తున్నామని పోలీసులు తెలిపారు. పట్టాదారు పాసు పుస్తకాలపంపిణీలో ఘర్షణ వైఎస్సార్సీపీ నాయకుడికి గాయాలు ఆసుపత్రికి తరలింపు -
జాయింట్ ఎల్పీఎం సమస్యలను పరిష్కరించుకోండి
ప్రొద్దుటూరు రూరల్ : జాయింట్ ఎల్పీఎం సమస్యలను రైతులు పరిష్కరించుకోవాలని జిల్లా రెవెన్యూ అధికారి విశ్వేశ్వర నాయుడు తెలిపారు. మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీ కార్యాలయంలో శుక్రవారం తొలి విడత రీ సర్వే పూర్తయిన సర్విరెడ్డిపల్లె రెవెన్యూ గ్రామ రైతులకు కొత్త పట్టాదారుపాస్ పుస్తకాలను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో తొలివిడతలో జరిగిన భూ రీ సర్వేలో ఒకే సర్వే నంబర్లో హక్కు కలిగిన రైతులు చిన్న చిన్న సమస్యలు, హద్దుల నిర్ధారణ, సర్వే నంబర్ సబ్ డివిజన్ వంటి కారణాలతో కొన్ని చోట్ల రీ సర్వే పూర్తికాక ఆ భూములు జాయింట్ ఎల్పీఎంలో ఉన్నాయన్నారు. అలాంటి రైతులు ఒకరికొకరు మాట్లాడుకుని రెవెన్యూ అధికారులకు సహకరించి తమ భూములకు సంబంధించి జాయింట్ ఎల్పీఎం సమస్యలను పరిష్కరించుకోవాలని సూచించారు. ప్రొద్దుటూరు మండలంలోని సర్విరెడ్డిపల్లె, దొరసానిపల్లె, ఎర్రగుంట్లపల్లె గ్రామాల్లో తొలి విడత కింద రీ సర్వే పూర్తవ్వడంతో కొత్త పట్టాదారు పాస్పుస్తకాలు మంజూరయ్యాయన్నారు. పాత పట్టాదారుపాస్పుస్తకాలను వెనక్కి తీసుకుని కొత్త పట్టదారుపాస్ పుస్తకాలను అందిస్తామన్నారు. రైతులతో సంబంధిత వీఆర్ఓలు బయోమెట్రిక్ వేయించుకుని కొత్త పట్టదారుపాస్ పుస్తకాలను ఇవ్వాలన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ గంగయ్య, సర్పంచ్ కొనిరెడ్డి శివచంద్రారెడ్డి, రైతులు పాల్గొన్నారు. -
రాష్ట్రస్థాయి పోటీలలో డీసీసీ బ్యాంక్ ఉద్యోగుల సత్తా
కడప అగ్రికల్చర్ : రాష్ట్రస్థాయిలో గత నెల 27,28 తేదీలలో సహకార ఉత్సవ్–3లో భాగంగా గుంటూరు నాగార్జున యూనివర్సిటీలో ఆప్కాబ్, సహకార శాఖలు నిర్వహించిన క్రీడా పోటీలలో కడప డీసీసీ బ్యాంకు ఉద్యోగులు సత్తా చాటారని ఆ బ్యాంక్ ఓఎస్డీ గుర్రప్ప తెలిపారు. ఈ సహకార క్రీడా పోటీలలో కడప డీసీసీ బ్యాంకు సిబ్బంది పలు పతకాలు సాధించారని ఆయన తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కడప డీసీసీ బ్యాంకు ఏజీఎం చంద్రశేఖర్ 100 మీటర్ల పరుగు పందెంలో ప్రథమస్థానంలో, 400 మీటర్ల పరుగు పందెంలో స్టాప్ అసిస్టెంట్ ప్రేమకుమార్ ప్రథమస్థానంలో, 4్ఙశ్రీ100 రిలే పరుగు పందెంలో రెండవస్థానం, 4్ఙశ్రీ400 రిలే పరుగుపందెంలో ద్వితీయస్థానం, వాలీబాల్లో ద్వితీయస్థానం, చెస్లో ద్వితీయస్థానం, షటిల్ బాడ్మింటన్ వెటరన్ విభాగంలో తాను (ఓఎస్డి గుర్రప్ప) ప్రథమస్థానం సాధించానని తెలిపారు. మొత్తంపైన రాష్ట్రస్థాయిలో 4 ప్రథమస్థానం, 4 ద్వితీయస్థానాలను కై వసం చేసుకున్నామని తెలిపారు. విజేతలను శుక్రవారం కడప డీసీసీ బ్యాంకులో బ్యాంకు చైర్మెన్ మంచూరి సూర్యనారాయణరెడ్డి, సీఈఓ రాజామణి, ఓఎస్డి గుర్రప్ప, జీఎం ప్రతాప్రెడ్డి, డీజీఎంలు అభినందించారు. -
6న అండర్ –14 బాలుర టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈ నెల 6,7 తేదీల్లో అండర్ –14 పురుషుల టాలెంట్ స్పాటింగ్ ఎంపికలు జరగనున్నట్లు జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి ఏ. రెడ్డి ప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల క్రీడాకారులు ఈ ఎంపికలకు హాజరుకాెవాలన్నారు. ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు తమతోపాటు ఆధార్ కార్డు కాపీ, బర్త్ సర్టిఫికెట్(ఫారం 5) సర్టిఫికెట్ మరియు బర్త్ ప్లేస్ సర్టిఫికెట్ తో పాటు ఒక పాస్ పోర్ట్ సైజ్ ఫోటో ఒరిజినల్ తో పాటు ఒక ెసెట్ జిరాక్స్ తో పాటు తమ కిట్ బ్యాగులు కూడా తీసుకురావాల్సిందిగా కోరారు. ఈ ఎంపికలు ఉదయం 8 గంటలకు కడప మున్సిపల్ స్టేడియంలో నిర్వహించనున్నామన్నారు. ఇందులో సెలెక్ట్ అయిన క్రీడాకారులను ప్రత్యేక శిక్షణ ఇవ్వనున్నామన్నారు. ఇదివరకు ఎప్పుడూ జిల్లా స్థాయిలో ఆడకుండా ఉండేవాళ్లు ఎంపికలకు రావాల్సిందిగా కోరారు. ఈ ఎంపికలకు అండర్– 14 కట్ ఆఫ్ డేట్ 2011 సెప్టెంబర్ 1 తర్వాత జన్మించిన వారు అర్హులన్నారు. ఎంపికలకు వచ్చే క్రీడాకారులు తెల్లటి దుస్తులతో హాజరుకావాలన్నారు. ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరుకు వచ్చిన మున్సిపల్ రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ (అనంతపురం) జి.నాగరాజు శుక్రవా రం మున్సిపల్ పెట్రోలు బంకు బకాయిలపై జూనియర్ అసిస్టెంట్ ప్రవీణ్ కుమార్ను విచారించారు. మున్సిపాలి టీ ఆధ్వర్యంలో నడుస్తున్న ఈ పెట్రోలు బంకుకు సంబంధించి సదరు ఉద్యోగి వివిధ రకాల ట్రావెల్స్ యజమానులకు డీజల్ను అప్పుగా ఇచ్చాడు. ఉన్నతాధికారుల అనుమతి లేకుండానే ఉద్యోగి సొంత నిర్ణయంతో రూ.1.23 కోట్లు మేర అప్పు ఇచ్చినట్లు తెలుస్తోంది. 2022 నుంచి ఈ బకాయిలు ఉండగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక బకాయిలు మరింత రెట్టింపు అయ్యాయి. ఈ నేపథ్యంలో మున్సిపల్ ఉన్నతాధికారులకు ఫిర్యాదులు వెళ్లడం పత్రికల్లో వార్తలు రావడం జరిగింది. ఈ విషయంపై మున్సిపల్ ఆర్డీ నాగరాజు పూర్తి స్థాయిలో విచారణ చేపట్టారు. ఈ సందర్భంగా ఆర్డీ విలేకరులతో మాట్లాడుతూ పెట్రోలు బంకుకు సంబంధించి అనధికారికంగా ఇప్పటి వరకు రూ.17లక్షలు వసూలైనట్లు తెలిసిందన్నారు. కమిషనర్ ప్రస్తుతం అందుబాటులో లేరని అన్నారు. విచారణ అనంతరం ప్రవీణ్కుమార్కు సంబంధించిన బ్యాంక్ లావాదేవీలను పరిశీలించి ఏమేరకు అవినీతి జరిగిందన్నదానిపై సీడీఎంఏకు లిఖిత పూర్వకంగా నివేదిక ఇస్తామన్నారు. మూతపడిన లక్ష్మీ ట్రావెల్స్కు రూ.31లక్షలు డీజిల్ అప్పు ఇచ్చిన వ్యవహారంపై ఆరా తీస్తున్నామన్నారు. కాగా మున్సిపల్ పెట్రోలు బంకులో జరిగిన అవకతవకలపై న్యాయవాది గోసంగి వెంకటసుబ్బారెడ్డి శుక్రవారం మున్సిపల్ ఆర్డీ నాగరాజును కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం మున్సిపల్ ఆర్డీ నాగరాజు పట్టణ శివారులో ఉన్న సేంద్రీయ ఎరువుల తయారీ కేంద్రాన్ని పరిశీలించారు. రహదారి మాసోత్సవాలను జయప్రదం చేయాలి కడబప వైఎస్ఆర్ సర్కిల్ : ఈ నెల 1 నుంచి 31 వరకు నిర్వహిస్తున్న జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలు జయప్రదం చేయాలని రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం మంత్రి క్యాంప్ కార్యాలయంలో 37 వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాలకు సంబంధించిన పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ ఉప రవాణా కమిషనర్ వీర్రాజు పాల్గొన్నారు. జాతీయ పోటీలకు సిద్ధం జమ్మలమడుగు/ జమ్మలమడుగు రూరల్ : ఈనెల 5వ తేదీ నుంచి ప్రారంభమయ్యే జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు సర్వం సిద్ధం చేసినట్లు వాలీబాల్ ఆర్గనైజింగ్ కమిటీ సెక్రెటరీలు ప్రసాద్రెడ్డి, శివశంకర్రెడ్డిలు పేర్కొన్నారు. శుక్రవారం పట్టణంలోని ముద్దనూరు రోడ్డులో ఉన్న బాలికల జూనియర్ కాలేజిలో జాతీయ స్థాయి వాలీబాల్ పోటీల నిర్వహణకు పూర్తి స్థాయిలో సిద్ధం చేశామని శనివారం ఉదయం జిల్లా స్థాయి అధికారులతో ఆర్గనైజింగ్ కోఆర్డినేషన్ సమావేశాన్ని నిర్వహించనున్నామన్నారు. ఈనెల 5వ తేదీ నుంచి జాతీయ స్థాయి స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యే వాలీబాల్ పోటీలకు దేశ వ్యాప్తంగా 30 టీంలు వస్తున్నాయని వారు తెలిపారు. -
నాకు న్యాయం చేయండి
● నా భర్తను హత్య చేసి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు చిత్రీకరించారు ● డీఎస్పీ కార్యాలయం వద్ద మృతుని భార్య ఆరోపణ కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా చింతకొమ్మదిన్నె మండలం గుర్రం గుంపు తండాకు చెందిన మహేంద్ర నాయక్ (29) అనే వ్యక్తి గత ఏడాది డిసెంబర్ 31వ తేదీన రాత్రి రైలు కిందపడి ఆత్మహత్య చేసుకున్నట్లు కడప రైల్వే పోలీసులు ఓ మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించారు. మొదట గుర్తుతెలియని మృతదేహంగా రైల్వే పోలీసులు తెలియజేశారు. మృతదేహంపై ఉన్న ఆనవాళ్లను బట్టి బంధువులు మృతి చెందిన వ్యక్తి మహేంద్ర నాయక్ గా గుర్తించారు. పోస్టుమార్టం నిర్వహణ అనంతరం మృతదేహాన్ని బంధువులకు అప్పగించారు. ఈ క్రమంలో గుర్రం గుంపు తాండ లో నివాసముంటున్న మహేంద్ర నాయక్ కు అదే ప్రాంతానికి చెందిన సుధాకర్ నాయక్ అనే సాఫ్ట్వేర్ ఇంజనీర్ మూడు నెలల క్రితం లక్ష రూపాయలు అప్పుగా ఇచ్చాడని, కొన్ని రోజులుగా తన డబ్బులు ఇవ్వాలని సుధాకర్ నాయక్ తన భర్తను వేధింపులకు గురి చేసేవాడని మృతుని భార్య సౌజన్య ఆరోపించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సుధాకర్ నాయక్ చివరకు తన బంధువైన ఓ కానిస్టేబుల్ ద్వారా ప్రతిరోజు ఫోన్ చేయించి సతాయించేవాడన్నారు. తమకు న్యాయం చేయాలంటూ తమ బంధువులతో కలిసి బాధితురాలు సౌజన్య శుక్రవారం కడప నగరంలోని డీఎస్పీ కార్యాలయం వద్దకు వచ్చి ఆందోళన చేశారు. తన భర్త చావుకు సుధాకర్ నాయక్ కారణమని అతని డబ్బులు ఇవ్వలేదని మనసులో పెట్టుకొని కొంతమంది వ్యక్తులతో కలిసి తన భర్తను చంపేసి రైల్వే ట్రాక్ పై పడుకోబెట్టినట్లుగా తెలుస్తోందని ఆరోపించారు. మహేంద్రనాయక్ ఆటోను బాడుగకు తీసుకుని నడుపుకుంటూ తన భార్య సౌజన్య, కుమారులు భవేంద్రనాయక్ , కేదార్నాథ్ నాయక్ లతో జీవనం సాగించేవాడు. తన భర్త డిసెంబర్ 31వతేదీన తెల్లవారుజామున ఇంటినుంచి వెళ్లాడన్నారు. ఉదయం 9:30 గంటలకు, మధ్యాహ్నం 3:47కు ఫోన్ చేశాడన్నారు. తరువాత తాను రాత్రి పదేపదే ఫోన్ చేసినా లిఫ్ట్ చేయలేదన్నారు. మరుసటి రోజున కడప రైల్వే పోలీసులు సమాచారం తెలియజేసేంతవరకు తన భర్త మరణించాడనీ తెలియలేదన్నారు. పోలీసులు సమగ్రంగా విచారించి తమకు న్యాయం చేయాలనీ మృతుని భార్య విజ్ఞప్తి చేశారు. సంఘటనపై సమగ్రంగా విచారిస్తున్నామని, సీసీటీవీ ఫుటేజీ, ఇతర సాంకేతిక పరిజ్ఞానంతో పూర్తి వివరాలు తెలుసుకుంటామని రైల్వే పోలీసులు తెలిపారు. మరోవైపు సంఘటన జరగక మునుపు మృతుడు మహేంద్ర నాయక్, తన భార్య, బంధువులతో గొడవ పడుతూ ఉన్న సమయంలో ఓ వ్యక్తి తీసిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో హల్చల్ చేస్తోంది.మృతుడు మహేంద్ర నాయక్ (ఫైల్), డీఎస్పీ కార్యాలయం వద్ద మాట్లాడుతున్న సౌజన్య -
కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ ప్రారంభం
కడప సెవెన్రోడ్స్: రైతులకు కొత్త పట్టాదారు పాసుపుస్తకాల పంపిణీ కార్యక్రమం జిల్లాలో శుక్రవారం ప్రారంభమైంది. ఈనెల 9వ తేదీ వరకు ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తారు. జిల్లాలోని ఐదు రెవెన్యూ డివిజన్లలో మొదటి విడత రీ సర్వే పూర్తయిన 260 గ్రామాల్లోని రైతులకు 72,288 పట్టాదారు పాసుపుస్తకాలు మంజూరయ్యాయి. గ్రామ సభలు నిర్వహించి వీటిని పంపిణీ చేస్తున్నారు. పట్టాదారు పేరు, తండ్రి పేరు, చిరునామా వంటి వ్యక్తిగత వివరాలు పాసు పుస్తకాల్లో పొందుపరిచారు. అలాగే సర్వే నంబరు, భూమి విస్తీర్ణం భూమి రకం వంటి వివరాలు ఉన్నాయి. ముఖ్యంగా పట్టాదారు పాసుపుస్తకంపై రాజముద్ర, క్యూఆర్ కోడ్, తహసీల్దార్ డిజిటల్ సంతకం, భూమి యాజమాన్యంపై స్పష్టత, ఫొటోగ్రాఫ్, వేలిముద్ర ధృవీకరణ సౌకర్యం, ఆధార్–మొబైల్ అనుసంధానం, ఈ–కేవైసీ వంటివి ఉంటాయి. పాసు పుస్తకాలు పంపిణీ చేసే ముందు వెబ్ల్యాండ్ వివరాలతో సరిపోల్చుతారు. ఏవైనా చిన్నచిన్న తప్పిదాలు దొర్లి ఉంటే అక్కడికక్కడ సవరణ చేసి పాసుపుస్తకాలు పంపిణీ చేస్తారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. -
ఎల్లమ్మ గుడి భూమిపై వివాదం
మైదుకూరు : మైదుకూరు మండలం గంజికుంట వద్ద వెలసిన గ్రామ దేవత ఎల్లమ్మ గుడికి సంబంధించిన భూమిపై వివాదం తలెత్తడంతో శుక్రవారం పలు హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు పెద్ద ఎత్తున గుడి వద్దకు చేరుకుని ఆందోళన చేశారు. వారు తెలిపిన మేరుకు వివరాలు ఇలా ఉన్నాయి. గంజికుంట వద్ద 200 సంవత్సరాలకు పూర్వం ఎల్లమ్మ గుడిని కట్టారు. ఎంతో మంది ఎల్లమ్మ దేవతను ఇలవేల్పుగా కొలుస్తూ పూజలు నిర్వహించేవారు. గుడి నిర్మించిన సర్వే నంబర్ 802లో 2.04 ఎకరాల భూమిని ఆలయ నిర్వాహకులు ఉత్సవాల సమయంలో వినియోగించడం చేసేవారు. అయితే కాలక్రమేనా గుడి నిర్వాహకులు ఉపాధి నిమిత్తం ఎక్కడెక్కడికో వెళ్లడంతో గుడికి ఆలనాపాలన కరువైంది. తిరిగి కొన్నాళ్లుగా ఎల్లమ్మ దేవతకు పూజలు నిర్వహించడం, జిల్లా నుంచే కాక, ఇతర జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడం జరుగుతోంది. అయితే కొన్నేళ్లుగా స్థానికులు కొందరు గుడి ఉన్న 2.04 ఎకరాల భూమిని ఆక్రమించి సాగు చేసుకుంటున్నారు. ఇటీవల గుడికి వస్తున్న భక్తులను ఆక్రమణదారులు అడ్డుకుంటూ ఇబ్బందులు పెడుతున్నారు. దానిపై కొందరు అధికారులకు ఫిర్యాదు చేయడంతో రెవెన్యూ వారు ప్రభుత్వ తోపుగా రికార్డుల్లో ఉన్న ఆ భూమిని ఎవరూ ఆక్రమించరాదని హెచ్చరిస్తూ బోర్డు పాతారు. కొద్ది రోజుల కిందట ఆక్రమణదారులు ఆ భూమిని సాగు చేసేందుకు ప్రయత్నిస్తున్నట్టు తెలిసి శుక్రవారం హిందూ సంఘాలు, బీజేపీ నాయకులు గుడి వద్ద ఆందోళన చేశారు. సర్వే నంబర్ 802లోని 2.04 ఎకరాల భూమిని ఎల్లమ్మ గుడికి కేటాయించాలని డిమాండ్ చేశారు. సోమవారం గ్రీవెన్స్ సెల్ కార్యక్రమంలో అధికారులకు ఈ విషయమై నివేదిస్తామని బీజేపీ జిల్లా ఉపాధ్యక్షుడు మాచనూరు సుబ్బరాయుడు అన్నారు. గుడి వద్ద హిందూ సంఘాల ఆందోళన -
పెండింగ్ ఆర్ఓబీ పనులపై దృష్టి సారించాలి
కడప సెవెన్రోడ్స్: జిల్లాలో పెండింగ్లో ఉన్న ఆర్ఓబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి) పనులపై దృష్టి సారించి, త్వరితగతిన పూర్తి చేసేందుకు చర్యలు చేపట్టాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం సాయంత్రం రాష్ట్ర సచివాలయం నుంచి ప్రధానంగా రైల్వే ఓవర్ బ్రిడ్జిల నిర్మాణ పనులతోపాటు ఆరోగ్యం (ప్రభుత్వ ఆసుపత్రుల సేవలు), ఎండోమెంట్స్ (దేవాలయాల వద్ద సౌకర్యాలు), రెవెన్యూ (ఆర్ఓఆర్ సర్వే), రెవెన్యూ (ఎఫ్.లైన్ సర్వే), వ్యవసాయం (యూరియా లభ్యత), వరి సేకరణ, వాహన పోర్టల్ సేవలు, రవాణా శాఖ (ట్యాక్స్), సారథి పోర్టల్ సేవలు, ఫైర్ ఎన్ఓసీ తదితర అంశాలపై సంబంధిత కార్యదర్శులతో కలిసి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా చేశారు. ఈ కార్యక్రమానికి స్థానిక కలెక్టరేట్ బోర్డు మీటింగ్ హాలు నుంచి జిల్లా కలెక్టర్ డా. శ్రీధర్ చెరుకూరితోపాటు రాజంపేట సబ్ కలెక్టర్ భావన, డీఆర్వో విశ్వేశ్వర నాయుడు హాజరయ్యారు. సీఎస్ వీసీ ముగిసిన అనంతరం సంబంధిత అధికారులతో కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో ప్రభుత్వం చేపడుతున్న అభివృద్ధి కార్యక్రమాలను పూర్తి చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్డీవోలు చంద్ర మోహన్, సాయి శ్రీ,జాన్ ఐర్విన్, చెన్నయ్య, సీపీవో హజరతయ్య, సంబంధిత శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. మెరుగైన ఫలితాలు సాధించాలి కడప ఎడ్యుకేషన్: పదో తరగతి పరీక్షల్లో మెరుగైన ఫలితాలు సాధించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అన్నారు. శుక్రవారం సాయంత్రం కలెక్టరేట్ సభా భవన్లో 100 రోజుల యాక్షన్ ప్లాన్పై ప్రత్యేక అధికారులు, హెడ్ మాస్టర్లతో రాజంపేట సబ్ కలెక్టర్ భావనతో కలిసి కలెక్టర్ సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో డీఈవో షేక్ .షంషుద్దీన్, ప్రత్యేక అధికారులు, ప్రధానోపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
సచివాలయ ఉద్యోగులపై ఎమ్మెల్యే వరద చిర్రుబుర్రు
ప్రొద్దుటూరు రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 18 నెలలైనా ఇప్పటి వరకు నూతనంగా ఒక్క సామాజిక పింఛన్ మంజూరు చేయలేదు కదా కనీసం దరఖాస్తు చేసుకునేందుకు కూడా అవకాశం లేదు. దీంతో ప్రజల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి శుక్రవారం మండలంలోని సోములవారిపల్లె పంచాయతీ పెన్నానగర్లో పల్లె పండుగ కార్యక్రమంలో భాగంగా రూ.5లక్షలతో నూతనంగా సీసీ రోడ్డు నిర్మాణానికి భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యేను ప్రజలు తమకు కొత్త పింఛన్లు రాలేదని చుట్టుముట్టారు. రేషన్ కార్డులు రాలేదని ఫిర్యాదు చేశారు. ప్రభుత్వం నుంచి పింఛన్లు రాని సంగతి అటుంచితే సచివాలయ ఉద్యోగులు అందుబాటులో లేరని, ఎవరెవరికి పింఛన్లు, రేషన్ కార్డులు లేవో త్వరలో తనకు నివేదిక ఇవ్వాలని ఎమ్మెల్యే ఈ సందర్భంగా సచివాలయ ఉద్యోగులపై చిర్రుబుర్రులాడారు. నెల తర్వాత మళ్లీ వస్తానని ఇదేవిధంగా ఉద్యోగులు వ్యవహరిస్తే తప్పకుండా చర్యలు తీసుకుంటాననడం గమనార్హం. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ సూర్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ రాఘవరెడ్డి, టీడీపీ నాయకుడు ఈవీ సుధాకర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● ఆదాయం కోసం అడ్డదారులు
సాక్షి ప్రతినిధి, కడప: ఆదాయ మార్గాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి పెట్టింది. అందులో తప్పేమీ లేదు. వక్రమార్గాల ద్వారా అధిక ఆదాయం గడించాలన్నది ఆక్షేపణనీయం. ఆ దిశగా సీఎం చంద్రబాబు సర్కార్ చర్యలు చేపట్టింది. ఇందుకు వాణిజ్య పన్నులశాఖ రంగంలోకి దింపింది. పెద్దల మెప్పు కోసం అధికారుల ఒంటెత్తు పోకడలతో అనేక మంది ఆవేదన చెందుతున్న పరిస్థితులు తెరపైకి వస్తున్నాయి. తాజాగా కడప నగరంలో హోటళ్లపై లక్షలాది రూపాయాలు జరిమానాలు విధిస్తున్న ఘటనలు తెరపైకి వస్తున్నాయి. దీంతో యాజమానులు బెంబేలెత్తుతున్నారు. ● కడప నగరంలో వారం రోజులుగా జీఎస్టీ చెల్లింపులల్లో తేడాలున్నాయని అధికారులు హోటళ్లపై దాడులు చేస్తున్నారు. అయితే అధికారుల దర్యాప్తు, ఆపై జరిమానా విఽధింపు వ్యవహారంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి ఆయా హోటళ్ల నుంచి జీఎస్టీ చెల్లింపులున్నాయి. కాగా, ఇటీవల హోటళ్లను అధికారులు ఆకస్మికంగా తనిఖీ చేస్తున్నారు. మధ్యాహ్న సమయంలో దాడులు చేసి అప్పటికి రికార్డు అయిన విక్రయాలను పరిశీలిస్తున్నారు. వాటి ఆధారంగా సాయంత్రం కూడా అదే స్థాయిలో విక్రయాలు జమ అవుతాయని అంచనాకు వస్తూ చెల్లించిన జీఎస్టీ మొత్తం చాలా తక్కువగా ఉందని, జరిమానా ఇంత మొత్తం చెల్లించాలంటూ హుకుం జారీ చేస్తున్నారు. రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ హోటల్కు ఏకంగా రూ.20లక్షలు జరిమానా విధించారు. అలాగే బైపాస్లో ఉన్న మరో హోటల్కు రూ.8లక్షలు, కృష్ణా సర్కిల్లో ఉన్న ఇంకో హోటల్కు రూ.14లక్షలు, బస్టాండ్– రైల్వేస్టేషన్ మార్గంలో ఉన్న మరో హోటల్కు రూ.8లక్షలు జరిమానా విధించినట్లు సమాచారం. ఇవి చెప్పుకునేందుకు కొన్ని మాత్రమే. జిల్లా వ్యాప్తంగా ఇలాంటి దుస్థితి నెలకొందని పలువురు వాపోతున్నారు. కాగా, జీఎస్టీ చెల్లిస్తున్నా జరిమానా విధించడంపై హోటళ్ల యాజమానులు తీవ్ర ఆవేదన చెందుతున్నారు. హోటల్ వ్యాపారం సాధారణంగా మధ్యాహ్నం పూట ఆశించిన స్థాయిలో ఉంటుంది. ఆ సమయంలో నమోదైన వ్యాపారాన్ని అంచనా వేసి లెక్క కట్టడం, జీఎస్టీ చెల్లింపులపై నిర్ధారణకు రావడంపై పలువురు అభ్యంతరం చెబుతున్నారు. ముందే అత్తెసరు వ్యాపారాలతో ఇబ్బంది పడుతుంటే, ఆపై ఇష్టారాజ్యంగా జరిమానాలు విధిస్తున్నారని పలువురు వాపోతున్నారు. పైగా ఆదివారం, శుక్రవారం రోజుల్లో తనిఖీలు చేస్తూ ఆయా రోజుల ఆధారంగా అంచనాలు సిద్ధం చేస్తూ జరిమానాలు విధించడంపై తీవ్ర ఆక్షేపణలు వెల్లువెత్తున్నాయి. అంతేకాకుండా 2021 నుంచి 2025 వరకూ లెక్కలు కట్టడం మరోవింతగా హోటల్ యాజమాన్యాలు వాపోతున్నాయి. జీఎస్టీ పేరుతో భారీగా జరిమానాలు ఐదేళ్లు జీఎస్టీ చెల్లించాలంటూ ఒత్తిడి హేతుబద్ధంగా లేని అంచనాలు బెంబేలెత్తుతున్న యాజమానులు -
జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు క్రీడాకారులు ఎంపిక
పులివెందుల రూరల్ : గతనెలలో అన్నమయ్య జిల్లా కలికిరిలో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ అండడర్–14 బాలుర, బాలికల హ్యాండ్బాల్ పోటీలలో పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె జిల్లా పరిషత్ ప్రభుత్వ ఉన్నత పాఠశాలకు చెందిన నలుగురు విద్యార్థులు ప్రతిభచాటి జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలకు ఎంపికయ్యారు. బాలుర విభాగంలో పాఠశాలకు చెందిన అన్వర్, వెంకట వివేకానంద, బాలికల విభాగంలో ఖైరూన్, మౌనిక ఎంపికయ్యారు. ఎంపికై న వీరు ఈనెల 5 నుండి 10తేదీ వరకు రాజస్థాన్ రాష్ట్రంలో చిత్తూర్గడ్లో జరిగే జాతీయస్థాయి హ్యాండ్బాల్ పోటీలలో పాల్గొంటారు. ఈ విద్యార్థులను హెడ్మాస్టర్ రవిచంద్రారెడ్డి, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు అభినందించారు. ఎస్.అన్వర్, వెంకట వివేకానంద, మౌనిక, ఖైరూన్ -
రూ.7.23 కోట్ల మద్యం తాగేశారు
కడప వైఎస్ఆర్ సర్కిల్: నూతన సంవత్సరాన్ని పురస్కరించుకొని మద్యం వ్యాపారం జోరుగా సాగింది. జిల్లాలో డిసెంబర్ 31న ఒక్కరోజే మందుబాబు రూ.7.23 కోట్లమద్యాన్ని తాగేశారు. వీటిలో లిక్కర్ 9725 కేసులు, బీర్లు 4వేలు కేసులు అమ్మకాలు జరిగాయని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ రవి కుమార్ తెలిపారు. కమలాపురం: కమలాపురంలోని పెద్ద దర్గాలో పూర్వ, స్వర్గీయ పీఠాధిపతి జహీరుద్దీన్ షా ఖాద్రి జయంతి వేడుకలు గురువారం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పీఠాధిపతి శ్రీ హజరత్ సజ్జాద్–ఏ–నషీన్ ఫైజుల్ గఫార్ షా ఖాద్రి ఆధ్వర్యంలో 150 కేజీల కేక్ కట్ చేసి భక్తులకు పంచి పెట్టారు. స్వామి వారి మజార్లపై పూలచాదర్లు సమర్పించారు. నూతన సంవత్సరంలో ప్రజలందరూ సుఖ సుంతోషాలతో వర్ధిల్లాలని ప్రార్థించారు. మదనపల్లె రూరల్: ప్రైవేట్ మెడికల్ షాపులో ప్రభుత్వ ఆస్పత్రిలో వినియోగించే మందులు లభ్యం కావడంపై మదనపల్లె డ్రగ్ ఇన్స్పెక్టర్ దాదాఖలందర్ గురువారం విచారణ చేపట్టారు. జిల్లా ఆస్పత్రిలోని డ్రగ్స్టోర్ను పరిశీలించారు. స్టాక్ వివరాలు, వినియోగిస్తున్న మందులపై అడిగి తెలుసుకున్నారు. అనంతరం ప్రైవేట్ మెడికల్ స్టోర్కు వెళ్లి విచారణ చేశారు. ప్రభుత్వ మందులు వారికి ఎలా వచ్చాయనే విషయమై ఆరా తీశారు. ఈ సందర్భంగా డ్రగ్ ఇన్స్పెక్టర్ మాట్లాడుతూ ప్రభుత్వ మందులు ప్రైవేట్ మెడికల్ షాపులో లభ్యం కావడంపై ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు విచారణ చేసి నివేదిక అందజేయనున్నట్లు తెలిపారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాల యం పరిధిలోని లా కళాశాలల ఎల్ఎల్బీ పరీక్ష ఫలితాలను విశ్వవిద్యాలయ ఉపకులపతి ప్రొఫెసర్ బెల్లంకొండ రాజశేఖర్ తన చాంబర్లో గురువారం విడుదల చేశారు. ఎల్ఎల్బీ మూడేళ్ల కోర్సుకు సంబంధించి 2,4,6 సెమిస్టర్లు, ఐదేళ్ల కోర్స్కు సంబంధించి 2,4, 6,8 సెమిస్టర్ల ఫలితాలను వెల్లడించారు. విద్యార్థులు ఫలితాల కోసం వైవీయు వైబ్సెట్ https: //www.yvuexams.in/results.aspx సంప్రదించాలని సూచించారు కార్యక్రమంలో రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పుత్తా పద్మ, విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కె.ఎస్.వి కృష్ణారావు పాల్గొన్నారు. -
మదనపల్లెలో కొలువుదీరిన జిల్లా కార్యాలయాలు
మదనపల్లె: రాయచోటిలో ఏర్పాటైన జిల్లా కార్యాలయాలు కొత్త జిల్లా కేంద్రం మదనపల్లెలో కొలువు దీరుతున్నాయి. చేర్పులు, మార్పులతో ఏర్పడిన నూతన అన్నమయ్యజిల్లాకు మదనపల్లెను కేంద్రంగా చేస్తూ ప్రభుత్వం నిర్ణయించింది. దీంతో రాయచోటిలోని సుమారు వందకు పైగా ప్రభుత్వ కార్యాలయాలు అక్కడి నుంచి మదనపల్లెకు తరలిరావాల్సి ఉంది. ప్రభుత్వ శాఖల జిల్లా అధికారులు ఇక్కడ కార్యాలయాలను ఏర్పాటు చేసుకుని పాలన సాగించేందుకు చర్యలు చేపట్టారు. తొలిరోజు 27 ప్రభుత్వ శాఖల కార్యాలయాలు కొలువుదీరాయి. ప్రధానంగా జిల్లా ఎస్పీ కార్యాలయం రేస్ కళాశాలలో సిద్ధమవుతోంది. దీన్ని ఎస్పీ ధీరణ్, పోలీసు ఉన్నతాధికారులు పరిశీలించారు. ఇప్పటి కలెక్టరేట్లో నడిచిన సబ్కలెక్టర్ కార్యాలయాన్ని పుంగనూరు రోడ్డులోని డీడీఓ భవనంలోకి మార్చారు. గురువారం ఈ కార్యాలయంలో సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి పూజలు నిర్వహించి పాలన ప్రారంభించారు. మదనపల్లెకు వచ్చిన ఎస్పీ ధీరజ్ కుటుంబ సమేతంగా స్థానిక ప్రసన్న వెంకటరమణస్వామి ఆలయానికి వెళ్లి స్వామి వారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. తొలిరోజు గురువారం మదనపల్లెలో ఏర్పాటైన జిల్లా కార్యాలయాలు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక బీటీ కళాశాలలో జిల్లా నీటి యాజమాన్య సంస్థ, జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ, జిల్లా పంచాయతీ అధికారి, ముఖ్య ప్రణాళిక అధికారి, ఖాజానా శాఖ, జెడ్పీ హైస్కూల్లో జిల్లా విద్యాశాఖ, సమగ్ర శిక్ష ఏపీసీ కార్యాలయం, ఇంటిగ్రేటెడ్ క్యాంపస్లో జిల్లా ఆడిట్, మెప్మా, పౌరసరఫరాలు, భూగర్భ జలవనరులు, సమాచార, పౌర సంబంధాలశాఖ, జీడబ్ల్యూఎస్, సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్, ఖాదీ–విలేజ్ డెవలప్మెంట్, దేవదాయ–ధర్మాదాయ, జిల్లా రిజిస్ట్రార్, లీడ్ డిస్ట్రిక్ట్ మేనేజర్, బెంగళూరు రోడ్డులోని పట్టుపరిశ్రమ భవనాల ప్రాంగణంలో ఏర్పాటు చేశారు. రేస్లో ఎస్పీ, డీడీఓలో సబ్కలెక్టర్ మొదటిరోజు 27 శాఖల కార్యకలాపాలు -
బాలింత మృతిపై జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన
మదనపల్లె రూరల్ : బాలింత మృతిపై కుటుంబ సభ్యులు మాలమహానాడు నాయకులతో కలిసి గురువారం రాత్రి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి ఎదుట ఆందోళన చేశారు. ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంపై నినాదాలు చేస్తూ నిరసన తెలిపారు. చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలం కరసనపల్లె పంచాయతీ మిట్టపల్లెకు చెందిన భాస్కర్ భార్య గగనశ్రీ(23) మొదటి కాన్పు కోసం ఈనెల 24న మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చేరింది. కాన్పు కష్టం కావడంతో 25న స్థానిక గైనకాలజీ వైద్యులు శస్త్రచికిత్స చేసి మగబిడ్డను బయటకు తీశారు. ప్రసవానంతర చికిత్స కోసం ఆస్పత్రి మెటర్నటీ వార్డులో ఉంచి చికిత్స అందించారు. వారంరోజులపాటు చికిత్స పొందిన అనంతరం గురువారం గగనశ్రీని డిశ్చార్జి చేస్తామని కుటుంబ సభ్యులకు చెప్పారు. అందులో భాగంగా ఆమెకు కుట్లు తొలగించి డిశ్చార్జి సమ్మరీ తయారుచేసేలోపు గగనశ్రీ పరిస్థితి విషమించి అపస్మారక స్థితికి వెళ్లింది. దీంతో వైద్యులు ఆమెను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లాలని కుటుంబ సభ్యులకు సూచించారు. మధ్యాహ్నం 1 గంట సమయంలో బాధితురాలిని ప్రైవేట్ అంబులెన్స్లో కుటుంబ సభ్యులు తిరుపతికి తీసుకువెళ్లారు. మార్గమధ్యంలో భాకరాపేట వద్ద గగనశ్రీ ఆరోగ్య పరిస్థితి పూర్తిగా క్షీణించి అంబులెన్స్లోనే మృతి చెందింది. కుటుంబ సభ్యులు మృతదేహాన్ని తిరిగి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అయితే, ఆస్పత్రి అత్యవసర విభాగ సిబ్బంది మృతదేహాన్ని ఇక్కడకు ఎందుకు తీసుకువచ్చారని ప్రశ్నించారు. దీంతో వారు వారంరోజుల పాటు ఆరోగ్యంగా ఉన్న గగనశ్రీ కుట్లుతీసిన వెంటనే ఎందుకు అనారోగ్యానికి గురైందన్నారు. డాక్టర్ల నిర్లక్ష్యమే గగనశ్రీ మృతికి కారణమని ఆరోపించారు. విషయం తెలుసుకున్న మాలమహానాడు జాతీయ నాయకులు యమలా సుదర్శనం, జిల్లా ఉపాధ్యక్షుడు గుండా మనోహర్ తదితరులు జిల్లా ఆస్పత్రికి చేరుకున్నారు. బాధితులకు మద్దతుగా ఆస్పత్రి వద్ద ఆందోళన చేసి నిరసన తెలిపారు. వైద్యులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. గగనశ్రీ మృతికి కారణమైన వైద్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మృతదేహాన్ని ఆస్పత్రి సిబ్బంది మార్చురీ గదికి తరలించారు. టూటౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. అయితే ఈ విషయమై జిల్లా ఆస్పత్రి వైద్యులు స్పందిస్తూ గగనశ్రీకి కుట్లువిప్పే సమయంలో అకస్మాత్తుగా ఫిట్స్ రావడంతో పరిస్థితి విషమించిందన్నారు. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి రెఫర్ చేశామన్నారు. -
సినీ ఫక్కీలో దోపిడీ
మహిళలను నిర్బంధించి ఎనిమిది తులాల బంగారు, నగదు ఎత్తుకెళ్లిన దుండగులు ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని బాలుర వసతి గృహానికి వెళ్లే ప్రధాన రహదారి పక్కనే ఉన్న ఇంట్లో మహిళలను నిర్బంధించి బంగారు, నగదును గురువారం తెల్లవారుజామున దొంగలు దోచుకెళ్లారు. బాధితుల కథనం మేరకు.. సానుగారి ఇంద్రమ్మ, వనజమ్మ అనే ఇద్దరు మహిళలు తమ ఇంట్లో గేటుకు తాళం వేసి నిద్ర పోయారు. దాదాపు రెండు గంటల ప్రాంతంలో ముగ్గురు వ్యక్తులు గోడదూకి తాళం తీసి ఒక్కసారిగా ఇంట్లోకి ప్రవేశించారు. మహిళల గుండైపె కూర్చొని తాడుతో కట్టేశారు. వారి మెడలోని బంగారు గొలుసు లాక్కున్నారు. బీరువా పగులకొట్టి రూ. 35 వేలు నగదు, దాదాపు ఎనిమిది తులాలకుపైగానే బంగారు దోచుకెళ్లారు. భయాందోళనకు గురైన మహిళలు తేరుకొని కట్లు విప్పుకొని బంధువులకు ఫోన్ చేశారు. దీంతో బంధువులు పోలీసులకు సమాచారం అందించారు. సాయంత్రం రైల్వేకోడూరు రూరల్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ పి.మహేష్ దొంగతనం జరిగిన ఇంటిని సిబ్బందితో పరిశీలించారు. క్లూస్ టీమ్ను రప్పించారు. వీలైనంత త్వరలో దొంగలను పట్టుకుంటామని సీఐ తెలిపారు. -
● పకడ్బందీ ఏర్పాట్లు.. కనిపించని ఫీట్లు
కడప కోటిరెడ్డి సర్కిల్ వద్ద పోలీసు అధికారులతో జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, నిర్మానుష్యంగా కడప నగర ప్రధాన రహదారులు కడప నగరంలో 2026 నూతన సంవత్సర వేడుకలను బుధవారం అర్ధరాత్రి నుంచి గురువారం సాయంత్రం వరకు ఘనంగా, ఉత్సాహంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావులేకుండా జరుపుకున్నారు. ఇందుకోసం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో కడప డీఎస్పీ ఏ. వెంకటేశ్వర్లు, ఎస్బి ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య తమ సిబ్బందితో కలిసి భారీగా బందోబస్తు నిర్వహించారు. వీరితో పాటు కడప నగరంలోని అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిల్లో పోలీసు అధికారులు, సిబ్బంది పటిష్ట చర్యలు చేపట్టారు. దీంతో యువత అతివేగంగా బైకులపై వెళుతూ జనాన్ని భయభ్రాంతులను చేయడం, రోడ్లపై బైకు రేసులు, విన్యాసాలు లాంటి వికృత చేష్టలు కనిపించలేదు. పోలీసులు తీసుకున్న పకడ్బందీ చర్యలతో నూతన సంవత్సర వేడుకలు ప్రశాంతంగా జరగడంపై ప్రజలు పోలీసు యంత్రాంగాన్ని అభినందిస్తూ హర్షం వ్యక్తం చేస్తున్నారు. – కడప అర్బన్ -
విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి
పుల్లంపేట : విద్యుదాఘాతంతో వ్యక్తి మృతి చెందిన ఘటన మండల పరిధిలోని ఏ.పుత్తనవారిపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన పుత్తన వెంకటరెడ్డి(42) విద్యుత్ శాఖలో ప్రైవేటుగా పనిచేస్తూ లైన్మెన్కు సహకరించేవాడు. ఈ క్రమంలో బుధవారం సాయంత్రం ట్రాన్స్ఫార్మర్లో మరమ్మతుల నిమిత్తం విద్యుత్ స్తంభం ఎక్కేందుకు సబ్స్టేషన్ సిబ్బందిని ఎల్సీ కోరాడు. ఇప్పటికే ఎల్సీ ఇచ్చి ఉన్నామని సబ్స్టేషన్ సిబ్బంది తెలపడంతో మరమ్మతుల కోసం స్తంభం ఎక్కాడు. ముందుగా ఎల్సీ తీసుకున్న వ్యక్తి ఎల్సీ తొలగించమని చెప్పడంతో సబ్స్టేషన్లో విద్యుత్ సరఫరా పునరుద్ధరించారు. దీంతో విద్యుత్ స్తంభంపై వున్న వెంకటరెడ్డి షాక్కు గురై కిందపడ్డాడు. గమనించిన స్థానికులు ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కాగా చికిత్స పొందుతూ గురువారం ఉదయం మరణించినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వెంకటరెడ్డి కుమార్తెకు వివాహం కాగా కుమారుడు బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డప్ప తెలిపారు. -
వాటర్ గ్రిడ్ పనులను పూర్తి చేయాలి
కడప సెవెన్రోడ్స్: చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల నియోజకవర్గ గ్రామాలకు తాగునీరందించే వాటర్ గ్రిడ్ పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సంబంధిత నీటిపారుదల ఇంజినీరింగ్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో పులివెందుల వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై రెవెన్యూ, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు, సంబంధిత ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ ప్రాజెక్టు మేనేజర్లతో కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ద్వారా సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పులివెందుల నియోజకవర్గ పరిధిలోని అన్ని ప్రాంతాలకు ఎలాంటి కొరత లేకుండా చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్ నుంచి పులివెందుల వాటర్ గ్రిడ్ పథకం ద్వారా తాగునీటి సదుపాయం కల్పించనున్నామన్నారు. అలాగే గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో ప్రజలకు నీటి కొరత లేకుండా ప్రణాళికలు రూపొందించి ప్రాజెక్టు పనులను కూడా పూర్తి చేసి నిర్వహణలోకి తీసుకురావడం జరిగిందన్నారు. కేంద్ర జల్ జీవన్ మిషన్ పథకంలో భాగంగా.. రూ.480 కోట్ల వ్యయంతో చేపట్టిన వాటర్ గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా.. పులివెందుల నియోజకవర్గంలో 109 గ్రామ పంచాయతీలలోని 299 గ్రామాలలోని 5.36 లక్షల జనాభాతోపాటు 7 రకాలైన ప్రభుత్వ విద్యా సంస్థలకు అవసరమైన 135 ఎల్పీసీడీల నుంచి నీటిని నిరంతరాయంగా నీరు అందించే ఉద్దేశ్యంతో పులివెందుల వాటర్ గ్రిడ్ ప్రాజెక్ట్ పనులకు శ్రీకారం చుట్టామన్నారు. కాగా ఈ పనులను డిసెంబర్ మాసం చివరి నాటికి పూర్తి కావాల్సి ఉంది. ఇంకా కొద్దిమేర పెండింగ్లో ఉన్న ఫినిషింగ్ పనుల అసంపూర్తిపై కలెక్టర్ ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. ఈ నెల మొదటి వారంలో అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేయాలని సంబంధిత ఇంజనీరింగ్ అధికారులను ఆదేశించారు. పులివెందుల ఆర్డీఓ చిన్నయ్య, ఆర్ డబ్ల్యుఎస్ ఎస్ఈ ఏడుకొండలు, ఈఈ శ్రీనివాసులు, డీఈఈలు కిరణ్ కుమార్ రెడ్డి, అంజలీ దేవి, ఎంఈఐఎల్ ప్రాజెక్టు మేనేజర్ రవికుమార్, ఏఈఈలు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి -
వైఎస్ఆర్ కడప జిల్లాకు కొత్తరూపు
కడప సెవెన్రోడ్స్: జిల్లాల పునర్ వ్వవస్థీకరణలో భాగంగా రాజంపేట రెవెన్యూ డివిజన్లోని నాలుగు మండలాలు వైఎస్సార్ కడపజిల్లాలో చేరాయి. ఇందులో కడప రెవెన్యూ డివిజన్లో కడప, కమలాపురం, వల్లూరు, చెన్నూరు, సీకే దిన్నె, పెండ్లిమర్రి, ఒంటిమిట్ట, సిద్దవటం, ఖాజీపేట ఉన్నాయి. బద్వేలు డివిజన్లో... బద్వేలు, గోపవరం, బి.కోడూరు, పోరుమామిళ్ల, కలసపాడు, కాశినాయన, అట్లూరు, బి.మఠం, మైదుకూరు.... జమ్మలమడుగు డివిజన్లో.. జమ్మలమడుగు, పెద్దముడియం, మైలవరం, ముద్దనూరు, కొండాపురం, ప్రొద్దుటూరు, రాజుపాలెం, ఎర్రగుంట్ల, దువ్వూరు, చాపాడు మండలాలు ఉన్నాయి. పులివెందుల డివిజన్లో... పులివెందుల, సింహాద్రిపురం, లింగాల, తొండూరు, వేముల, వేంపల్లె, చక్రాయపేట, వీఎన్ పల్లె ... రాజంపేట డివిజన్ పరిధిలోకి రాజంపేట, నందలూరు, వీరబల్లి, సుండు పల్లె మండలాలు వస్తాయి. ● రాజంపేట డివిజన్లోని నాలుగు మండలాలు కలవడంతో వైఎస్సార్ కడపజిల్లా కొత్త రూపు సంతరించుకుంది. జిల్లా భౌగోళిక విస్తీర్ణంతో 12,507 చదరపు కి.మీ.తో రాష్ట్రంలో మొదటిస్థానంలో ఉన్నట్లు అధికారులు తెలియజేస్తున్నా రు. ఇక రెవెన్యూ డివిజన్లు 5, మండలాలు 40, మున్సిపల్ కార్పొరేషన్ 1, మున్సిపాలిటీలు 8, గ్రామ పంచాయతీలు 619, గ్రామ/వార్డు సచివాలయాలు 715 ఉన్నాయి,. ఇందులో గ్రామ సచివాలయాలు 484 కాగా, అర్బన్లో 231 ఉన్నాయి. జన సాంద్రత ఒక చదరపు కిలోమీటరుకు 185 మంది ఉన్నారు. అసెంబ్లీ నియోజకవర్గాలు ఎనిమిది ఉండగా, రెండు పార్లమెంటు స్థానాలు ఉన్నాయి. కుటుంబాల సంఖ్య 5.63 లక్షలు ఉంది. సెక్స్ రేషియో ప్రతి వెయ్యి మంది పురుషులకు 997 మంది ఉన్నారు. అక్షరాస్యత శాతం 61.69గా ఉంది. జనాభా లెక్కలు కరెక్టేనా... జిల్లాల పునర్ వ్వవస్థీకరణ అనంతరం వైఎస్సార్ కడప జిల్లా రాష్ట్రంలోనే రెండో స్థానంలో ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించిన విషయం తెలిసిందే. ఇంతకుముందు 20,60,054 మంది జిల్లా జనాభా ఉండగా, రాజంపేట నియోజకవర్గంలోని నాలుగు మండలాలు చేరడంతో జనాభా 22,96,497కు చేరుకుని రాష్ట్రంలో రెండవ స్థానంలో ఉన్నట్లు చూపెట్టారు. కానీ, జిల్లాలో పునర్ వ్యవస్థీకరణ తర్వాత తిరుపతి జిల్లా 29,47,547 మంది జనాభాతో తొలిస్థానం, నెల్లూరుజిల్లా 22,99,699 మందితో ద్వితీయ స్థానంలో ఉండగా, వైఎస్సార్ కడపజిల్లా మూడవ స్థానంలో ఉంది. ఈ విషయం జిల్లాల పునర్విభజనతో రెవెన్యూశాఖ విడుదల చేసిన ప్రొవిజనల్ నోటిఫికేషన్లో ఉంది. మరి ఎవరి గణాంకాలు నిజమైనవో అధికారులకే తెలియాలి. -
ప్రజలకు మెరుగైన సేవలు అందించాలి
● పోలీస్ పెరేడ్ మైదానంలో ఘనంగా నూతన సంవత్సర వేడుకలు ● కేక్ కట్ చేసి శుభాకాంక్షలు తెలిపిన ఎస్పీ కడప అర్బన్ : వై.ఎస్.ఆర్. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆధ్వర్యంలో నూతన సంవత్సరం 2026 వేడుకలు గురువారం ఘనంగా జరిగాయి. ముందుగా దేవదాయ శాఖకు చెందిన వేదపండితులు జిల్లా ఎస్పీకి వేద ఆశీర్వచనం అందించారు. అనంతరం ఎస్పీ నూతన సంవత్సరం సందర్భంగా కేక్ కట్ చేసి, అందరికి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలి పి, కేక్ అందజేశారు. జిల్లా పోలీస్ ఉన్నతాధికారులు, స్పెషల్ బ్రాంచి, డీసీఆర్బీ, ఏ.ఆర్, జిల్లా పోలీసు కార్యాలయంలో పని చేసే అధికారులు, సిబ్బంది, జిల్లాలోని సీఐలు, ఎస్ఐలు సబ్ డివిజన్ వారీగా జిల్లా ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చాలను, పూలమొక్కలను అందజేసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ ఈ నూతన సంవత్సరంలో అందరికీ శుభాలు జరగాలని, పోలీసుశాఖ నిర్దేశించుకున్న లక్ష్యాలను చేరుకొనే విధంగా సమర్థవంతంగా ప్రతి ఒక్కరూ పనిచేయాలని ఆకాంక్షించారు. ప్రజలందరికీ మంచి సేవలందిస్తూ పోలీసుశాఖ ప్రతిష్టను మరింత పెంచేలా విధులు నిర్వర్తించాలన్నారు. మరింత సమర్థవంతమైన పోలీసింగ్తో 2026లో జిల్లా ప్రజలకు మెరుగైన సేవలను అందించాలన్నారు. ద్విచక్ర వాహనాలలో వెళ్లేటప్పుడు పోలీస్ అధికారులు, సిబ్బంది అందరూ హెల్మెట్ ధరించి సురక్షితంగా గమ్యస్థానాల కు చేరుకోవాలని సూచించారు. జిల్లా ప్రజలంతా శాంతియుత వాతావరణంలో ఎలాంటి శాంతి భద్రతల సమస్యలు లేకుండా జీవించాలని, పోలీసులు చేపట్టే చర్యలకు ప్రజలు కూడా తమ వంతు సహకారాన్ని అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, అడిషనల్ ఎస్పీ(ఏ.ఆర్) బి.రమణయ్య, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రా మనాథ్ హెగ్డే, స్పెషల్ డీఎస్పీలు ఎన్.సుధాకర్, ఎ. వెంకటేశ్వర్లు, భావన, జి.రాజేంద్ర ప్రసాద్, వెంకటే శ్వర రావు, అబ్దుల్ కరీం, బాలస్వామి రెడ్డి, జిల్లాలోని సీఐ లు, ఎస్ఐలు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
అటు అసంపూర్తి భవనం.. ఇటు సమస్యల వలయం
● అధ్వానంగా కడప వ్యవసాయ మార్కెట్ యార్డు ● అవస్థల్లో అన్నదాతలు పసుపు, వేరుశనక్కాయల క్రయ విక్రయాలు జరిపే పాత భవనం అసంపూర్తిగా ఉన్న జంబోషెడ్డు కడప వ్యవసాయం : కడపలోని వ్యవసాయ మార్కెట్ యార్డులో సమస్యలు విలయతాండవం చేస్తున్నాయి. యార్డుకు వచ్చే రైతులకు సరైన మౌలిక వసతులు లేక ఇబ్బందులకు గురవుతున్నారు. కనీసం తాగేందుకు మంచినీటి సౌకర్యం కూడా లేదు. వీటితోపాటు మరుగుదొడ్లు కూడా లేవు. దీంతోపాటు మార్కెట్యార్డులో రైతులు సేద తీరేందుకు సరైన వసతి లేక బస్తాలపైన, కింద పడుకోవాల్సి వస్తోంది. రైతులు తమ పంట ఉత్పత్తులను మార్కెట్కు తెచ్చి విక్రయాలు జరుపుకునే పసుపు, వేరుశనక్కాయలకు సంబంధించిన యార్డు భవనం కూడా దెబ్బతింది. యార్డుభవనం పైకప్పు దెబ్బతిని పెచ్చులూడుతోంది. దీంతో భయం భయంగా ఉత్పత్తులు ఆమ్ముకునే పరిస్థితి నెలకొంది. దీనికితోడు నూతనంగా నిర్మిస్తున్న జంబోభవనం నిర్మాణం కూడా ఏళ్ల తరబడి అసంపూర్తిగానే ఉంది. ఇప్పటికై నా మార్కెట్యార్డు అధికారులు స్పందించి అసంపూర్తిగా ఉన్న జంబోషెడ్డు నిర్మాణ పనులను పూర్తిచేయడంతోపాటు పాత భవనానికి కూడా మరమ్మతులు చేయాలని రైతులు కోరుతున్నారు. -
పెళ్లయితే ఇంటి పేరు మార్చుకోవాలా?
● వివాహ రిజిస్ట్రేషన్పై అవగాహన అవసరం ● పేరు మార్పుతో అనేక చిక్కులకు చెక్ కడప సిటీ : భారతీయ సీ్త్ర పెళ్లై అత్తారింట్లో అడుగు పెట్టిన తర్వాత ఆమె జీవితంలో ఎన్నోమార్పులు చోటు చేసుకుంటాయి. కొత్త వ్యక్తులతో కలిసి నూతన జీవితం ప్రారంభించే మహిళ పేరులోనూ మార్పులు వచ్చి చేరుతాయి. నిజానికి పెళ్లైన తర్వాత తన ఇంటి పేరును మార్చి భర్త ఇంటి పేరును చేర్చుకోవాలా? చట్టాలు ఏం చెబుతున్నాయి? ఆడపిల్లగా... అమ్మాయి పెళ్లాయ్యాక అత్తారింటికి వెళ్లి అక్కడ ఉండే పిల్లగా మారిపోతుంది. అందువల్ల మనం ‘ఆడ’ పిల్ల అనడం సహజం. పెళ్లైయిన తర్వాత భర్తతో కలిసి ముందుకు సాగుతుంది. వారి కుటుంబంలో ఒకరిగా భాగమై పోతుంది. అందుకే భర్త ఇంటి పేరును తన ఇంటి పేరుగా మార్చుకుంటుంది. ఈ సమాజంలో సంప్రదాయంగా ఇది అనాదిగా వస్తున్నదే. కానీ చట్టప్రకారం పెళ్లైన తర్వాత మహిళ తన ఇంటి పేరును మార్చుకోవాల్సిన అవసరం లేదు. కానీ రాజ్యాంగం ప్రకారం ఇది పూర్తిగా వారి ప్రాథమిక హక్కులోకి వస్తుంది. ఏ పేరుతో కొనసాగడమన్నది వారి ఇష్టం. అయితే పేరు మార్చుకునే విషయంలో మూడు ఆప్షన్లు ఉన్నాయి. వివాహిత తనకు పెళ్లికాకముందు ఉన్న ఇంటి పేరునే (మెయిడెన్ నేమ్) కొనసాగించవచ్చు. పెళ్లైన తర్వాత తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం రెండవది. మన దేశంలో అఽధికశాతం మంది అనుసరించే విధానం ఇదే. పెళ్లి కాకముందే ఉన్న ఇంటి పేరు మార్చుకోకుండానే పేరు చివరలో భర్త పేరును చేర్చుకోవడం మరో విధానం. ప్రయోజనాలు ఏమైనా ఉన్నాయా? పేరు మార్చుకోవడం వల్ల అన్నింటి కంటే ముఖ్య ప్రయోజనం చట్టపరంగా గుర్తింపు సమస్యలు ఎదురు కావు. అత్తారింటిని గౌరవించినట్లవుతుంది. ఆ కుటుంబం తనదిగా భావించినట్లు భర్త తరుపు వారిలో సానుకూలత పెరుగుతుంది. కాకపోతే పేరు మార్పునకు కొంత శ్రమించాల్సి వస్తుంది. తన తల్లిదండ్రులతో ఉన్న అనుబంధం ఆ కుటుంబంలో భాగమైన తన పేరు మారిపోతుందనే మానసిక సంఘర్షణ ఎదురవుతుంది. వీటిని మరిచిపోగలిగితే పేరు మార్చుకోవడం ద్వారా వచ్చే ప్రయోజనాలతో ఆనందంగా ఉండడం సాధ్యమే. పెళ్లి కాకముందు.. పెళ్లికాకముందున్న పేరుతో పెళ్లయిన సీ్త్ర కొనసాగితే భవిష్యత్తులో న్యాయపరమైన చిక్కులు తప్పక ఎదుర్కోవాల్సి రావచ్చు. కుటుంబ పరమైన వివాదాలు తలెత్తితే ఇలాంటి సమస్యలు వస్తాయి. అప్పుడు ఆ మహిళ గుర్తింపునకు సంబంధించిన సవాలక్ష ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది. ఏ విధంగా ఊహించని ఆస్తి, ఇతరత్రా వివాదాలు తలెత్తినా సమస్యల బారిన పడకుండా ఉండేందుకు పెళ్లయిన మహిళ తన ఇంటి పేరు స్థానంలో భర్త ఇంటి పేరును చేర్చుకోవడం మంచిదని పలువురు సూచిస్తున్నారు. ఒకవేళ పేరు మార్చుకున్నట్లయితే ఆ తర్వాత ఇతర డాక్యుమెంట్లలోనూ ఈ మేరకు మార్పులు చేసుకోవాలి. రెండు, మూడు ఆప్షన్లలో ఆ మేరకు కీలక డాక్యుమెంట్లతో పేర్లను మార్చుకోవాలి. ఈ విధానం ద్వారా ఆర్థిక, ఆస్తి లావాదేవీ విషయంలో భవిష్యత్తులో ఎలాంటి సమస్యలు తలెత్తే అవకాశం ఉండదు. ఎక్కడెక్కడ మార్చుకోవాలి..ముందుగా వివాహాన్ని రిజిష్టర్ చేయించుకోవాలి. చట్టప్రకారం మన దేశంలో ప్రతి వివాహాన్ని తప్పకుండా రిజిష్టర్ చేయించుకోవాలి. కంపల్సరీ రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారెజెస్ యాక్టు–2005 ఇలా నిర్దేశిస్తోంది. కానీ ఈ చట్టం పటిష్టంగా అమలు కావడం లేదు. వివాహాన్ని రిజిష్టర్ చేసుకున్న తర్వాత రిజిష్టర్ కార్యాలయం ఓ ధృవీకరణ సర్టిఫికెట్ను జారీ చేస్తుంది. ఇది చాలా కీలకమైంది. పెళ్లయిన తర్వాత ఏ పేరుతో కొనసాగుతారో అదే పేరును కూడా రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్లో ఉండేలా చూసుకోవాలి. ఇదే సర్టిఫికెట్ అన్నింటికి ఆధారంగా పనికి వస్తుంది. ఒకవేళ గుర్తింపు, వారసత్వ హక్కుల విషయంలో సమస్యలు తలెత్తితే ఈ సర్టిఫికెట్ కీలకంగా మారుతుంది. పైగా ఇతర అన్నిచోట్ల పేర్ల మార్పునకు కీలక ఆధారంగా పనిచేస్తుంది. వివాహ రిజిస్ట్రేషన్ సర్టిఫికెట్ పొందిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ గెజిట్ కార్యాలయంలో పేరు మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. స్థానిక పత్రికలో గెజిట్ కార్యాలయం ప్రకటన ఇచ్చిన తర్వాత పేరు మారుతుంది. లేదంటే భర్తతో కలిసి సంయుక్తంగా అఫిడవిట్ తీసుకుంటే సరిపోతుంది. వీటిల్లోనూ మార్చుకోవాలి భర్త ఇంటి పేరును స్వీకరిస్తే ఆధార్కార్డు, ఓటరు కార్డు, పాన్ కార్డు, పాస్పోర్టు వంటి వాటిల్లో కూడా ఈ మేరకు పేరు మార్చుకోవాల్సి ఉంటుంది. అలాగే బ్యాంకు ఖాతాల్లోనూ పేరు మార్పు చేసుకోవాలి. ఎందుకంటే అన్ని లావాదేవీలకు కీలకంగా బ్యాంకు ఖాతా ఉంటుంది. ఇక మ్యూచువల్ ఫండ్స్, డీమ్యాట్ ఖాతాల్లోనూ మార్పులు చేసుకోవాలి. వీటిలో పేర్లు మార్పు కోసం అఫిడవిట్ జిరాక్స్ కాపీ లేదా వివాహ నమోదు పత్రం కాపీలను ఇవ్వాలి ఉంటుంది. అప్పటికీ పాత పేరుతోనే బీమా పాలసీ కలిగి ఉంటే బీమా కంపెనీలకు పేరుమార్పు గురించి తెలియజేయాలి. అలాగే డ్రైవింగ్లైసెన్స్ ఉంటే ఆర్టీఓ కార్యాలయానికి వెళ్లి మార్పు కోసం దరఖాస్తు చేసుకోవాలి. ఇంకా ఇతరత్రా ఎక్కడెక్కడ పేరు మార్చుకోవాలన్నది మీకున్న వ్యవహారాలనుబట్టి తెలిసిపోతుంది. ఉద్యోగం చేస్తుంటే కార్యాలయ రికార్డుల్లోనూ మార్పులు తప్పనిసరి. మహిళను ఇంటి పేరుతో పిలువడం సర్వసాధారణం. అంతేకాదు...ఎక్కడైనా పేరు రాయాల్సి వచ్చినప్పుడు పూర్తి పేరు అడగకుండానే సర్ నేమ్గా భర్త తరుపు పేరును చేరుస్తారు. -
దేవాలయాల్లో హుండీలే టార్గెట్
గాలివీడు : మండలంలోని దేవాలయాల్లో హుండీల ను లక్ష్యంగా చేసుకుని గుర్తు తెలియని వ్యక్తులు వరుసగా చోరీలకు పాల్పడుతుండటంతో గ్రామస్తులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకటి మరువకముందే మరో ఘ టన చోటుచేసుకోవడం తీవ్ర ఆందోళనకు గురిచేస్తోంది. మండలంలోని పేరంపల్లి గ్రామ పరిధి పెడకంటి కొత్తపల్లిలో ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో బుధవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పా ల్పడ్డారు. ఆలయంలోని హుండీని బద్దలు కొట్టి అందులో ఉన్న నగదు మొత్తాన్ని అపహరించి పరార య్యారు. అనంతరం బద్దలైన హుండీని ఆలయానికి సమీపంలో ఉన్న పంట పొలంలో పడేసి వెళ్లినట్లు గ్రా మస్తులు గుర్తించారు. భక్తులు కానుకల రూపంలో వేసి న నగదు మొత్తం రూ.10 వేలకుపైగా ఉంటుందని ఆ లయ నిర్వాహకులు తెలిపారు. ఇదిలా ఉండగా, మంగళవారం రాత్రి నూలివీడు పంచాయతీ పరిధిలోని బొడిసానివారిపల్లెలో ఉన్న రామాలయంలోనూ ఇదే తరహా చోరీ జరిగింది. రామాలయంలోని హుండీని బద్దలు కొట్టి నగదును దోచుకెళ్లిన ఘటన మరువకముందే, మరుసటి రోజే మరో ఆలయంలో చోరీ జరగడం గ్రామ ప్రజల్లో భయాందోళనలను పెంచుతోంది. మంగళవారం వైకుంఠ ఏకాదశి పర్వదినం సందర్భంగా దేవాలయాల్లో హుండీలు భక్తుల కానుకలతో నిండిపోయి ఉంటాయన్న అంచనాలతోనే ఈ చోరీలు జరిగి ఉండవచ్చని గ్రామస్తులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. వరుసగా జరుగుతున్న ఈ ఘటనలతో పోలీసులకు కంటిమీద కునుకు లేకుండా పోతోంది. దేవాలయాల్లో భద్రతా చర్యలు కట్టుదిట్టం చేయాలని, నిందితులను త్వరగా గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు పోలీసులను కోరుతున్నారు.వరుస చోరీలతో హడలెత్తిస్తున్న దొంగలు -
లారీ.. బైకు ఢీ
– వ్యక్తికి తీవ్ర గాయాలు సిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామ సమీపంలోని మలినేనిపట్నం కాలనీ వద్ద బుధవారం రాత్రి లారీ, బైకు ఢీకొన్న ప్రమాదంలో గంగాధరంపల్లి రెడ్డిపవన్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఏపీఎస్పీ 11వ బెటాలియన్లో కుక్గా పనిచేస్తున్న గంగాధరంపల్లె హరి కుమారుడు రెడ్డిపవన్ తన బైకులో బుధవారం రాత్రి కడప నుంచి నివాసమున్న సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామానికి బయలుదేరాడు. సిద్దవటం మండలం భాకరాపేట గ్రామ సమీపంలోని మలినేనిపట్నం కాలనీ వద్దకు రాగానే ముందు వెళ్తున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేసి తిరుపతి వైపు నుంచి ఎదురుగా వస్తున్న లారీని ఢీకొనడంతో బైకు లారీ కిందికిపోయి నుజ్జు అయింది. రెడ్డిపవన్ తలకు, కుడికాలుకు తీవ్ర గాయాలయ్యాయి. వైద్యం కోసం 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ ఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించి విచారిస్తున్నారు. ట్రాక్టర్ బోల్తాపడి ఇద్దరు కూలీలకు తీవ్ర గాయాలు మదనపల్లె రూరల్ : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, ఇనుపసామగ్రిని తరలిస్తున్న ట్రాక్టర్ బోల్తా పడి జార్ఖండ్కు చెందిన ఇద్దరు కూలీలు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. ట్రాన్స్కో కార్యాలయంలో విద్యుత్ పనుల కాంట్రాక్ట్ చేస్తున్న వ్యక్తి వద్ద జార్ఖండ్కు చెందిన అర్జున్ ముండ్రే(23), సూలే(24) కూలీలుగా పనిచేస్తున్నారు. ఈ క్రమంలో విద్యుత్ సామగ్రి, పోల్స్, ట్రాన్స్ఫార్మర్లు మండలంలోని బొమ్మనచెరువు గ్రామం టేకులపాలెంలో ఏర్పాటు చేయాల్సి ఉండగా ట్రాక్టర్లో వేసుకుని వెళుతున్నారు. మార్గమధ్యంలో టేకులపాలెం రోడ్డులో ట్రాక్టర్ అదుపుతప్పి బోల్తా పడింది. ప్రమాదంలో కూలీలుగా పనిచేస్తున్న జార్ఖండ్ యువకులు ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వారి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ప్రైవేట్ మెడికల్ స్టోర్లో ప్రభుత్వ ఆసుపత్రి మందులు మదనపల్లె రూరల్ : ప్రభుత్వ జిల్లా ఆసుపత్రిలోని మందులు ప్రైవేట్ మెడికల్ స్టోర్లో ప్రత్యక్షమయ్యాయి. బుధవారం రాత్రి జిల్లా ఆసుపత్రి అత్యవసర విభాగంలో పనిచేస్తున్న డాక్టర్ సయ్యద్ హదీద్ ఈ విషయాన్ని గుర్తించి, రెడ్ హ్యాండెడ్గా మీడియాను తీసుకెళ్లి చూపించారు. ప్రభుత్వ ఆసుపత్రిలో అతిసార వ్యాధిగ్రస్తులకు అందించే మెట్రోజెల్ ఐవి ఫ్యూజన్ సైలెన్ మందు ఆసుపత్రికి ఎదురుగా ఉన్న ఓ ప్రైవేట్ మెడికల్ స్టోర్లో ఉన్నట్లు రోగి ద్వారా తెలుసుకున్నారు. వెంటనే అందుబాటులో ఉన్న విలేకరులను వెంట తీసుకొని ప్రైవేట్ మెడికల్ స్టోర్కు వెళ్లారు. ప్రైవేటు ఆసుపత్రిలో విక్రయిస్తున్న పారాసెటమాల్ ఐవి ఫ్యూజన్ సైలెన్ మందు డబ్బాలో, జిల్లా ఆస్పత్రిలో వినియోగిస్తున్న మెట్రోజల్ ఐవి సైలెన్ మందు బాటిల్ను ప్రత్యక్షంగా చూపించారు. ఈ విషయంపై ప్రైవేట్ మెడికల్ స్టోర్ సిబ్బందిని విలేకరులు ప్రశ్నించగా, ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చిన రోగులు మందు వెనక్కి తీసుకొచ్చి ఇస్తే తాము చూసుకోకుండా ఉంచుకున్నామని తెలిపారు. ప్రభుత్వ ఆసుపత్రిలోని మందులు ఈ విధంగా ప్రైవేట్ మైకల్ స్టోర్లో ఎలా ప్రత్యక్షమవుతున్నాయో అధికారులే సమాధానం చెప్పాల్సి ఉంది. -
మత్తు పదార్థాలను విడనాడండి
కడప ఎడ్యుకేషన్ : మద్యం, మత్తు పదార్థాలు విద్యార్థుల భవిష్యత్తును నాశనం చేస్తాయని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అన్నారు. జన విజ్ఞాన వేదిక ఆధ్వర్యంలో మద్యం, మత్తు పదార్థాల వల్ల సమాజానికి, విద్యార్థుల భవిష్యత్తుకు కలుగుతున్న ప్రమాదాలపై అవగాహన కల్పించాలనే ఉద్దేశంతో రూపొందించిన ‘ఉసురు తీస్తున్న మత్తు పదార్థాలు’ పోస్టర్లను బుధవారం జిల్లా ఎస్పీ విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మత్తు పదార్థాలకు ‘నో’ చెప్పే చైతన్యవంతమైన తరాన్ని నిర్మించాల్సిన అవసరం ఉందన్నారు. జేవీవీ రాష్ట్ర కమిటీ సభ్యురాలు సరస్వతి మాట్లాడుతూ ప్రజల్లో శాసీ్త్రయ అవగాహన పెంచడమే తమ లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర కమిటీ సభ్యుడు రాజశేఖర్ రాహుల్, జేవీవీ సీనియర్ నాయకుడు వెంకటేశ్వర్లు, నగర కమిటీ సభ్యులు భాస్కర్, మధుసూదన్, సి. పి.రమణ, విజయ్, రఘు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్రంలో అధిక మండలాల జిల్లాగా కడప
కడప సెవెన్రోడ్స్: జిల్లాల పునర్విభజనలో భాగంగా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం చేరడంతో రాష్ట్రంలో అత్యధికంగా 40 మండలాలు ఉన్న జిల్లాగా వైఎస్సార్ కడప ఆవిర్భవించిందని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఎనిమిది నియోజకవర్గాలు, ఐదు రెవె న్యూ డివిజన్లు, 40 మండలాలు, ఒక కార్పొరేషన్, తొమ్మిది మున్సిపాలిటీలతో జిల్లా ఆవిర్భవించిందన్నారు. జిల్లాలో ఇప్పటివరకు 20,60,054 గా ఉన్న జనాభా ఇప్పుడు 22,96,497 కు చేరిందన్నారు. మిగతా జిల్లాలతో పోలిస్తే జనాభాలో రెండవస్థానంలో నిలిచిందన్నారు. జనవరి 11 నుంచి గండికోట ఉత్సవాలను నిర్వహించనున్నట్లు తెలిపారు. ఎస్పీ విశ్వనాథ్, రాజంపే ట సబ్ కలెక్టర్ భావన పాల్గొన్నారు. రోడ్డు భద్రతా ఆంక్షలు కఠినతరం రోడ్డు భద్రత చర్యల ఆంక్షలను మరింత కఠినతరం చేయాలని కలెక్టర్ శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో జి ల్లా రహదారుల భద్రతా సమన్వయ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ఎస్పీ విశ్వనాథ్ హాజరయ్యారు. ఈ సందర్భంగా వారు పలు సూచనలు చేశారు. నాలుగు మండలాల్లో .. రాజంపేట: రాజంపేట డివిజన్ లోని నాలుగు మండలాల్లో వైఎస్సార్ కడప నుంచి రెవెన్యూ పాలన జరగనున్నది. ఈ మేరకు బుధవారం కడప కలెక్టర్ శ్రీధర్ రాజంపేట సబ్కలెక్టరేట్లో డివిజన్లోని నాలుగు మండలాల తహసీల్దార్లు, ఎంపీడీఓలతో రెవిన్యూ, అభివృద్ధి అంశాలపై సమావేశమయ్యారు. ఈ సందర్భంగా అధికారులకు పలు సూచనలు చేశారు. కలెక్టర్ శ్రీధర్ -
ఒంటిమిట్ట రామయ్యను దర్శించుకున్న ప్రముఖులు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయాన్ని బుధవారం పలువురు ప్రముఖులు వేర్వేరు సమయాల్లో దర్శించుకున్నారు. అందులో తమిళనాడు జాతీయ హరిత ట్రిబ్యునల్ న్యాయ సభ్యురాలు జస్టిస్ పుష్ప సత్యనారాయణ దంపతులు, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఓఎస్డీ కె. వెంకటకృష్ణ సతీసమేతంగా, రాజంపేట కోర్టు న్యాయమూర్తి పూజిత ఉన్నారు. వీరికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ఆలయ ప్రదక్షిణ కావించి, గర్భాలయంలోని మూల విరాట్కు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన వారిని ఆలయ అర్చకులు సత్కరించి, స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. వీరితో పాటు జెడ్పీ సీఈఓ ఓబులమ్మ, డీపీఓ ఏఓ ఖాదర్ బాషా, ఎంపీడీఓ సుజాత, రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి, మండల టీడీపీ, జనసేన నాయకులు ఉన్నారు. -
బుడ్డా వెంగళరెడ్డి చిరస్మరణీయుడు
రాజంపేట రూరల్ : రైతు, సమాజ సేవకుడు, సేవా తత్పరుడు బుడ్డా వెంగళరెడ్డి చిరస్మరణీయుడని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కొనియాడారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్లో గల ఆకేపాటి అమరనాథరెడ్డి ఇంగ్లీష్ మీడి యం స్కూల్లో బుధవారం బుడ్డా వెంగళరెడ్డి 125వ వర్థంతి వేడుకలను ఎమ్మెల్యే ఆకేపాటి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముందుగా వెంగళరెడ్డి చిత్ర పటానికి పూల మాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ 1866లో సంభవించిన క్షామ సమయంలో బళ్లారి, చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి వేల మంది ప్రజలు వెంగళరెడ్డిని ఆశ్రయించారన్నారు. వారికి కొన్ని రోజుల పాటు ప్రతి రోజు ఆహారం అందించారన్నారు. ఇందుకు మెచ్చి అప్పటి బ్రిటీష్ రాణి విక్టోరియా బంగారు పతకాన్ని బహూకరించారని తెలిపారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నయా జోష్!
కడప సెవెన్రోడ్స్: కొత్త సంవత్సర వేళ ఉత్సాహం ఉరకలెత్తింది.. ఆనందం వెల్లువెత్తింది.. కొత్త సంవత్సరం ముందురోజు అర్ధరాత్రి నుంచి కొత్త జోష్ నెలకొంది. యువతలో ఉత్సాహం ఉప్పొంగింది. ఆకట్టుకున్న కేకులు: నూతన సంవత్సర సందర్భంగా నగరంలో పలుచోట్ల కేకులు విక్రయించే దుకా ణాలు వెలిశాయి. కార్పొరేట్ స్టైల్లో కేకుల దుకాణాలకు మంచి డిమాండ్ ఉండగా, చిన్న దుకాణాలు సైత వాటితో పోటీ పడ్డాయి. స్వీట్లు–చాక్లెట్లు: యువత మోజు స్వీట్లపైనా కనిపిస్తోంది. నూతన సంవత్సరం కోసం సాధారణ స్వీట్లతోపాటు వ్యాపారులు ప్రత్యేకమైన, ఆకర్శణీయమైన ప్యాకింగ్ టిన్లతో చాక్లెట్లను అందుబాటులో ఉంచారు. కొత్త సంవత్సరాన్ని కొత్తదనంతో కొత్త ఆనందాలతో నిర్వహించుకుంటున్నారు. పటిష్ఠ బందోబస్తు: కొత్త సంవత్సరాన్ని పురస్కరించుకుని పలువురు తాగిన మత్తులో ఇష్టమొచ్చిన రీతిలో వాహనాలు నడుపుతూ ప్రమాదాలకు గురైన సంఘటనలో గతంలో జరిగాయి. ఈ నేపద్యంలో పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. మద్రాసురోడ్డులో ప్రజల రద్దీ హ్యాపీ న్యూ ఇయర్ కేక్ జిల్లా వ్యాప్తంగాకొత్త సంవత్సర సంబరాలు విందులు, వినోదాలతో యువత సందడి 2025కు వీడ్కోలు..2026కు స్వాగతం -
కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ సమస్యలు పరిష్కరించాలి
వేంపల్లె : ఆర్జీయూకేటీ పరిధిలోని ట్రిపుల్ ఐటీల్లో పని చేస్తున్న కాంట్రాక్టు టీచింగ్ గెస్ట్ ఫ్యాకల్టీల సమస్యల పరిష్కారం కోసం జనవరి 1వ తేదీన నిరసన చేపట్టనున్నట్లు కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీ అసోసియేషన్ అధ్యక్షుడు నజీర్ హుసేన్ తెలిపారు. బుధవారం ఇడుపులపాయ ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ కుమార స్వామి గుప్తాను కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తమ సమస్యలు పరిష్కరించాలని ఎన్నో సార్లు వినతి పత్రాలు ఇచ్చినా ప్రయోజనం లేకుండా పోయిందన్నారు. అందువల్ల నూతన సంవత్సరం రోజున నిరసన చేస్తున్నట్లు చెప్పారు. కాంట్రాక్టు గెస్ట్ ఫ్యాకల్టీలు మణి కిరణ్, దేవిక, శ్రావణి, అశ్వని, భవదీయులు తదితరులు పాల్గొన్నారు. -
బాకీ చెల్లించమన్నందుకు దాడి
పులివెందుల రూరల్ : అప్పుగా ఇచ్చిన డబ్బును తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరు వ్యక్తులపై మరో ఇద్దరు వ్యక్తులు రాళ్లతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన బుధవారం పులివెందుల పట్టణం అంబకపల్లె రోడ్డులో గల హెచ్డీఎఫ్సీ బ్యాంకు సమీపంలో జరిగింది. ఇందుకు సంబంధించి పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు వివరాలు ఇలాఉన్నాయి. పులివెందుల పట్టణం పార్నపల్లె రోడ్డులో మెకానిక్ షాపు నడుపుకుంటున్న రాజా వద్ద నుంచి భాస్కర్ అనే వ్యక్తి ఏడాది క్రితం రు.5లక్షలు అప్పు తీసుకున్నాడు. అలాగే పులివెందులకు చెందిన మహేశ్వరరెడ్డి నుంచి ఏడాది క్రితమే నాగరాజు రు.30 లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు తీసుకున్న తర్వాత వారు తప్పించుకు తిరుగుతుండటంతో దిక్కుతోచక బాధితులు పెద్ద మనుషుల సహకారంతో పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో హెచ్డీఎఫ్సీ బ్యాంకు వద్ద భాస్కర్, నాగరాజు ఉన్నారని సమాచారం రావడంతో రాజా, మహేశ్వరరెడ్డిలు అక్కడికి వెళ్లి డబ్బు అడిగారు. దీంతో మమ్మల్నే డబ్బు అడుగుతారా అంటూ వారు రాజా, మహేశ్వరరెడ్డిలపై రాళ్లతో దాడి చేశారు. తీవ్రంగా గాయపడిన బాధితులు పులివెందుల అర్బన్ పోలీసు స్టేషన్లో సీఐ సీతారామరెడ్డికి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. గాయపడిన మెకానిక్ రాజ, మహేశ్వరరెడ్డి -
నీట్ పీజీలో ప్రతిభ చాటిన కరిష్మా
వేంపల్లె : చక్రాయపేట మండలం ఉప్పలవాండ్లపల్లె గ్రామానికి చెందిన షఫీ, పర్వీన్ల ప్రథమ కుమార్తె కరిష్మా నీట్ పీజీలో ప్రతిభ చాటింది. ఆమె ప్రాథమిక, ఉన్నత విద్యను వేంపల్లెలోని ఉర్దూ గురుకులంలో చదివి, తిరుపతి ఎస్వీ మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ పూర్తి చేసింది. 2025 పీజీ నీట్ పోటీ పరీక్షలో ఆల్ ఇండియాలో 13 వేలు, రాష్ట్రంలో 732 ర్యాంక్ సాధించి విజయవాడలోని సిద్ధార్థ వైద్య కళాశాలలో ఓబీజీ(గైనకాలజిస్ట్) సీటు సాధించింది. తనకు లభించిన ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకుని పేదలకు వైద్య సేవలను అందిస్తానని పేర్కొంది. చౌక దుకాణాల ద్వారా గోధుమపిండి కడప సెవెన్రోడ్స్ : జనవరి నుంచి కడప నగరంలోని 133 ప్రభుత్వ చౌక ధరల దుకాణాల ద్వారా కార్డుదారులకు కిలో రూ.20 చొప్పున గోధుమపిండి పంపిణీ చేస్తామని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.విశ్వేశ్వరనాయుడు ఒక ప్రకటనలో తెలిపారు. చక్కి గోధుమ పిండిలో పోషక విలువలు అధికంగా ఉన్నందున కార్డుదారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఉచితంగా బియ్యం లేదా బియ్యానికి బదులు మూడు కిలోల వరకు రాగులుగానీ, జొన్నలుగానీ ఉచితంగా పొందవచ్చని సూచించారు. తెల్లబియ్యం కార్డుకు రూ. 17తో అరకిలో చక్కెర, అంత్యోదయ అన్నయోజన కార్డుకు రూ. 13.50తో కిలో చక్కెర, పొందవచ్చన్నారు. అనుమానాస్పద స్థితిలో వ్యక్తి మృతి కాశినాయన : మండలంలోని నరసన్నపల్లె గ్రామానికి చెందిన కనగాని రమణ (35) అనే వ్యక్తి అనుమానాస్పద స్థితిలో బుధవారం మృతి చెందాడు. ఎస్ఐ యోగేంద్ర తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మృతుడు రమణ మద్యానికి బానిస అయ్యాడని, గత నాలుగు రోజులుగా ఇంటికి కూడా వెళ్లలేదని ఎస్ఐ పేర్కొన్నారు. గ్రామ సమీపంలోని తెలుగుగంగ కాలువ దగ్గర మృతదేహం ఉన్నట్లు బుధవారం స్థానికులు గుర్తించారని తెలిపారు. మృతదేహం సమీపంలో విషద్రావణం డబ్బా గుర్తించామని, అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య రామసుధతోపాటు ముగ్గురు పిల్లలు ఉన్నారు. వివాహిత ఆత్మహత్య గుర్రంకొండ : పురుగుల మందు తాగి వివాహిత ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని సంగసముద్రంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు గ్రామానికి చెందిన ఎస్. చాంద్బాషా, ఎస్.ముబీనా దంపతులకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నాడు. వ్యవసాయం చేసుకుంటూ వీరు జీవనం సాగిస్తున్నారు. ఇటీవల కొద్ది రోజుల క్రితం కుమారుడు రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. కుమారుడి మృతితో మనస్తాపం చెందిన ముబీనా(40) మూడు రోజుల క్రితం పురుగుల మందు తాగింది. కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో వైద్యుల సూచన మేరకు తిరుపతి రుయా ఆస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ బుధవారం ముబీనా మృతి చెందింది. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్రబాబు తెలిపారు. -
ఒంటిమిట్టలో రూ. 5 కోట్ల ఉపాధి పనులు
సామాజిక తనిఖీలో వెల్లడించిన డ్వామా పీడీ ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలో 2024–25 ఆర్థిక సంవత్సరానికి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం ద్వారా రూ. 5 కోట్ల లక్ష 70వేల 583 వ్యయంతో ఉపాధి పనులు జరిగాయని డ్వామా పీడీ ఆదిశేషారెడ్డి తెలిపారు. బుధవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం కార్యాలయం ఆవరణంలో డ్వామా పీడీ ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ ప్రజా వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా పంచాయతీల వారిగా జరిగిన పనులు, వాటికి ఖర్చు చేసిన వ్యయం, ఆ పనుల్లోని లోపాల గురించి చర్చించారు. ఈ చర్చలో పలు పంచాయతీలలో జరిగిన ఉపాధి పనులలో కొలతలు తప్పుగా నమోదు చేశారని, 5 కి.మీ దూరం లేకున్నా ఉందని చెప్పి రవాణా భత్యం అందించారని, కొన్ని మస్టర్లలో ఉపాధి కూలీలకు సంబంధించి కొంత మంది సంతకాలు చేయలేదని, మరి కొంత మందికై తే అదనంగా పని నగదును చెల్లించి, మళ్లీ రికవరీ చేశారని, 100 రోజుల పనిదినాలను పూర్తి స్థాయిలో చేయించలేదనే లోపాలను వెలుగులోకి తీసుకొచ్చారు. అనంతరం డ్వామా పీడీ మాట్లాడుతూ..మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకంలో మండల వ్యాప్తంగా ఉన్న 13 పంచాయతీలలో 685 పనులు జరిగాయన్నారు. అందులో ఎంజీఎన్ఆర్ఈజీఎస్లో 657, ఎస్ఎస్ఏలో 1, పంచాయతీరాజ్లో 25, అటవీ శాఖలో 2 పనులు చేశారన్నారు. ఈ తనిఖీల్లో బయట పడ్డ లోపాలను త్వరిత గతిన సరిదిద్దుకోవాలని, అదనంగా చెల్లించిన వ్యయాన్ని రికవరీ చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డ్వామా ఏపీడీ ఆజాద్, క్వాలిటీ కంట్రోల్ అధికారి జుబేదా, ఎంపీడీఓ సుజాత, ఏపీఓ శివశంకర్రెడ్డి, సామాజిక తనిఖీ బృందం, ఫీల్డ్ అసిస్టెంట్లు, టెక్నికల్ అసిస్టెంట్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు
ఒంటిమిట్ట : ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో ధనుర్మాస పూజల్లో భాగంగా అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా జరుగుతున్నాయి. బుధవారం ఆలయ రంగమండపంలో సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను ఆశీనులు చేసి, పట్టు వస్త్రాలు తొడిగి, బంగారు ఆభరణాలు, పుష్పమాలికలతో సుందరంగా అలంకరించారు. వేద పండితులు స్వామి వారి చెంత ధనుర్మాస పారాయణం చేశారు. అనంతరం ఆలయ అర్చకులు ఉత్సవ మూర్తులకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. స్వామి వారిని భక్తులు అధిక సంఖ్యలో దర్శించుకున్నారు. -
ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు ప్రోత్సాహం
కడప సెవెన్రోడ్స్ : పారిశ్రామికంగా విస్తృతమైన వనరులు, ఉపాధి అవకాశాలున్న కడప జిల్లాలో ఔత్సాహిక పారిశ్రామికవేత్తలకు అవకాశం కల్పించి ప్రోత్సహించాలని కలెక్టర్ శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం రాత్రి కలెక్టరేట్లో జిల్లా పారిశ్రామిక ఎగుమతులు, ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో పారిశ్రామిక రంగాన్ని పటిష్టం చేసి పరిశ్రమల ద్వారా విస్తృత ఉపాధి అవకాశాలను కల్పించేందుకు అన్ని అనుబంధ శాఖలు సమన్వయంతో కృషి చేయాలన్నారు. కొత్తగా పారిశ్రామిక రంగంలోకి అడుగిడాలనుకున్న వారికి ఆర్థిక ప్రోత్సాహాన్ని అందించేలా బ్యాంకర్లు కూడా సహకరించాలన్నారు. పరిశ్రమల శాఖ జనరల్ మేనేజర్ జిఎం చాంద్ బాషా, పలు శాఖల అధికారులు పాల్గొన్నారు. దళితులకు ఎక్కడా అన్యాయం జరగరాదు దళితులకు ఎక్కడా అన్యాయం జరగకుండా చూడడమే కాకుండా జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ లక్ష్యం అని జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. బుధవారం కలెక్టరేట్లోని బోర్డు మీటింగ్ హాలులో సాంఘీక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా విజిలెన్స్, మానిటరింగ్ కమిటీ సమావేశం జరిగింది. ఈ సమావేశానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ శ్రీధర్తోపాటు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, రాజంపేట సబ్ కలెక్టర్ భావన హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతో పాటు త్వరితగతిన పరిహారం అందించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ గ్రామ స్థాయి నుండి జిల్లా స్థాయి వరకు.. బాల్య వివాహాలను అరికట్టే చర్యల్లో విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు ప్రత్యేక దష్టి సారించాలన్నారు. సోషల్ వెల్ఫేర్ డీడీ సరస్వతి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ హెగ్డే, కడప, జమ్మలమడుగు, పులివెందుల, బద్వేలు డివిజన్ల ఆర్డీఓలు జాన్ ఇర్విన్, సాయిశ్రీ, చిన్నయ్య, చంద్రమోహన్, డీఎస్పీలు, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ, డీఆర్డీఏ పీడీ రాజ్యలక్ష్మి,, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు, విజిలెన్స్ మానిటరింగ్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. లేబర్ సెస్సు వసూలు చేయాలి 2025 జనవరి నుంచి నవంబరు 25 వరకు పెండింగ్లో ఉన్న లేబర్ సెస్సు వసూలు చేసి భవన నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డుకు జమ చేయాని కలెక్టర్ శ్రీధర్ ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్లో నిర్వహించిన జిల్లా సమన్వయ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ఆలస్యం లేకుండా ప్రభుత్వ శాఖలు, మున్సిపాలిటీలు, పంచాయతీలు విధిగా సెస్సు వసూలు చేయాలన్నారు. కార్మికశాఖ ఉప కమిషనర్ రంగరాజు తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి -
కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి
పెండ్లిమర్రి : పెండ్లిమర్రి మండలం పగడాలపల్లె గ్రామంలో మంగళవారం కుక్కల దాడిలో 25 గొర్రె పిల్లలు మృతి చెందాయి. పగడాలపల్లె గ్రామానికి చెందిన కొంచాని శివయ్య అనే గొర్రెల కాపరికి సంబంధించిన గొర్రె పిల్లలపై కుక్కలు దాడి చేసి త్రీవంగా గాయపరిచాయి. దాడిలో 25 పిల్లలు చనిపోయాయి. దాదాపు రూ.2 లక్షలు నష్టం జరిగినట్లు బాధితుడు వాపోయాడు. ప్రభుత్వం ఆదుకోవాలని ఆయన కోరాడు. మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం ప్రొద్దుటూరు క్రైం : జిల్లా ఆస్పత్రిలోని మార్చురీలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని భద్రపరిచారు. 55 ఏళ్లు పైబడిన వ్యక్తి ఈ నెల 22న అనారోగ్యంతో జిల్లా ఆస్పత్రిలో చేరాడు. అతన్ని జీఈ వార్డులో ఉంచి వైద్య సిబ్బంది చికిత్స అందిస్తూ వచ్చారు. ఆరోగ్యం క్షీణించడంతో అతను మంగళవారం మృతి చెందాడు. మృతదేహాన్ని హాస్పిటల్ సిబ్బంది మార్చురీలో ఉంచారు. మృతుడికి సంబంధించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రి అధికారులను సంప్రదించాలని మార్చురీ ఇన్చార్జి వరాలు తెలిపారు. మహిళ అదృశ్యం కలసపాడు : మండలంలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మైల బాలకాశమ్మ అనే మహిళ గత మూడు రోజుల నుంచి కనిపించడం లేదు. ప్రకాశం జిల్లా అర్ధవీడు మండలానికి చెందిన బాల కాశమ్మకు మండలంలోని రెడ్డిపల్లె గ్రామానికి చెందిన మైల సురేష్తో నాలుగు సంవత్సరాల క్రితం వివాహమైంది. మూడు రోజుల నుంచి ఆమె కనిపించకపోవడంతో మంగళవారం భర్త పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు స్టేషన్ ఇన్చార్జి శంకర్ తెలిపారు. మహిళ ఆత్మహత్య కడప అర్బన్ : కడప రిమ్స్ పోలీసు స్టేషన్ పరిధిలో చలమారెడ్డిపల్లె బైపాస్ రోడ్డు సమీపంలో ఓ ఇంటిలో మహిళ ఆత్మహత్య చేసుకుంది. మైదుకూరు మండలం లెక్కలవారిపల్లెకు చెందిన మంజుల, పెండ్లిమర్రి మండలం పాతసంగటిపల్లెకు చెందిన కిరణ్కుమార్ పరస్పరం ప్రేమించుకున్నారు. ఆరేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలున్నారు. వీరిద్దరి మధ్య కొంతకాలంగా మనస్పర్థలు ఏర్పడ్డాయి. దీంతో ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఫ్యాన్కు ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. మృతురాలి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. బీజేపీ కిసాన్ మోర్ఛా జిల్లా అధ్యక్షుడిగా అశోక్ రెడ్డి కడప కోటిరెడ్డిసర్కిల్ : భారతీయ జనతా పార్టీ కిసాన్ మోర్ఛా జిల్లా అధ్యక్షుడిగా అన్నపురెడ్డి అశోక్కుమార్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు ఆయనకు బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి నియామక పత్రాన్ని అందజేశారు. తనపై నమ్మకం ఉంచి పదవి లభించేందుకు కృషి చేసిన నాయకులకు ఆయన కృతజ్ఞతలు తెలిపారు. -
పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్ ఇవ్వాలి
కడప సెవెన్రోడ్స్: ప్రభుత్వ ఫ్యామిలీ పెన్షనర్లు జనవరి 1 నుంచి ఫిబ్రవరి 28వ తేది వరకు తమ లైఫ్ సర్టిఫికెట్ను డిజిటల్ విధానంలో ‘జీవన్ ప్రమాణ్’ పోర్టల్ ద్వారా సమర్పించాలని జిల్లా ఖజాన అధికారి ఎం.వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. లైఫ్ సర్టిఫికెట్ సమర్పించేందుకు ఆధార్, మొబైల్ ఫోన్, పీపీఓ నెంబరు, బ్యాంకు పాసు పుస్తకం అవసరమని పేర్కొన్నారు. ఈ వివరాలతో సంబంధిత సబ్ ట్రెజరీ కార్యాలయంలోగానీ లేదా మీ సేవా కేంద్రంలోగానీ, పెన్షనర్ల సంఘం వద్దగానీ వివరాలు అందించి లైఫ్ సర్టిఫికెట్ నమోదు చేయించుకోవాలని సూచించారు. కడప రూరల్: వైద్య ఆరోగ్య శాఖ ప్రాంతీయ కార్యాలయం జోన్–4 పరిధిలో మంగళవారం స్థానిక జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో నిర్వహించిన కాంట్రాక్ట్ స్టాఫ్ నర్స్ నియామక కౌన్సెలింగ్ ప్రశాంతంగా ముగిసింది. మొత్తం 41 మందికి గాను 36 మంది నియామక పత్రాలు పొందారు. ఈ కార్యక్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్లు శ్రీనివాసులు, వెంకటసుబ్బమ్మ, సీనియర్ అసిస్టెంట్ వనీష తదితరులు పాల్గొన్నారు. కడప రూరల్: గర్భిణుల ఆరోగ్య పరిరక్షణకు వైద్య సిబ్బంది చర్యలు తీసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి ఉమామహేశ్వర కుమార్ తెలిపారు. మంగళవారం స్థానిక ఆ శాఖ జిల్లా కార్యాలయంలోని చాంబర్లో మాతృమరణాలపై నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రతి హైరిస్క్ గర్భవతుల ను సకాలంలో గుర్తించి, వారిని తరచూ సీ్త్ర వ్యాధి నిపుణులకు చూపించాలన్నారు. సమస్య ఉంటే దగ్గర్లోని ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్పించాలన్నారు. -
● అండదండగా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి...
సాక్షి ప్రతినిధి, కడప: ప్రజా ప్రతినిధిగా సక్రమంగా సేవ చేయాల్సింది పోయి.. అధికారంలో ఉండగానే అక్రమంగా నాలుగు రాళ్లు వెనకేసుకోవాలనే తాపత్రయమే కూటమి నేతల్లో కనిపించింది. ఈ ఏడాదిలో జరిగిన పరిస్థితులు చూస్తే ఇదే స్పష్టమవుతుంది. అక్రమార్జనే ధ్యేయంగా ఈ ఏడాదిలో కూటమి నేతలు విచ్చలవిడిగా చెలరేగిపోయారు. ● కమలాపురం నియోజకవర్గంలో ఇసుక, గ్రావెల్ దోపిడీ యథేచ్ఛగా సాగింది. అధికారులు ఏడాది పొడవునా అటువైపు కన్నెత్తి చూసే సాహసం చేయలేదు. బి.కోడూరు మండలం పాయలకుంట్ల పంచాయతీ పరిధిలోని వేమకుంట రెవెన్యూ పొలంలో సర్వే నెంబరు 18లో 16.75 ఎకరాల ప్రభుత్వ భూమిపై టీడీపీ నేత కన్ను పడింది. కోట్లాది రూపాయాలు విలువైన భూమి కంచె వేశారు. మైదుకూరు మండలం నంద్యాలంపేటలో సర్వేనంబర్ 859లో 16 ఎకరాలు, సర్వేనంబర్ 840లో 70 ఎకరాలు ప్రభుత్వ భూమికి కంచె వెలిసింది. తిప్పిరెడ్డిపల్లె గోడేరు చెరువులో 50ఎకరాలు అన్యాక్రాంతమయ్యాయి. ● టిఫెన్ బరైటీస్కు చెందిన కోట్ల విలువైన బరైటీస్ రాత్రికి రాత్రి లూటీ అయ్యింది. సిమెంటు పరిశ్రమకు ముప్పు తిప్పలు... యర్రగుంట్ల సమీపంలో ఉన్న అల్ట్రాటెక్ సిమెంటు పరిశ్రమకు కూటమి నేతలు ముప్పు తిప్పలు పెట్టారు. ముడి ఖనిజం సరఫరా చేసే ట్రాన్సుపోర్టర్లును కట్టడి చేశారు. 40 ఏళ్లు చరిత్రలో ఎన్నడూ లేని విధంగా పోలీసులు సదరు వాహనాలను సీజ్ చేశారు. ఈ ప్రభావం పారిశ్రామికవేత్తలపై పడింది. టీడీపీ కార్యాలయానికి ఆర్అండ్బీ స్థలం కడప నగరం అక్కాయపల్లె పార్కు సమీపంలో నేషనల్ హైవే ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ ఆఫీసు వెనుక వైపు న్యాక్ కార్యాలయానికి చెందిన 2 ఎకరాలు భూమి తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి కట్టబెట్టారు. ఎకరం రూ.40 కోట్లు విలువైన ఆ భూమిని రాష్ట్ర ప్రభుత్వం 99 ఏళ్లకు లీజుకు ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. కాశినాయన జ్యోతి క్షేత్రంపై వివక్షత జ్యోతి క్షేత్రంలో టీడీపీ పొలిటికల్ డ్రామా నడిపింది. కొన్ని దశాబ్ధాలుగా ఈక్షేత్రం అటవీ ప్రాంతంలోనే ఉంది. అక్కడి నుంచి అహోబిలం లక్ష్మీనరసింహస్వామి దేవాలయానికి కాలిబాట ఉంది. ఇన్నాళ్లుగా అటవీ ప్రాంతంలో ఉన్న ఈ క్షేత్రంపై కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ప్రధాన దేవాలయం, కాశినాయన సమాధి మినహా అన్నింటినీ కూల్చివేయగా.. నిరశనలు మిన్నంటడంతో వెనక్కి తగ్గింది. టీడీపీ నుంచి నిష్క్రమించిన సుగవాసి బాలసుబ్రమణ్యం తెలుగుదేశం పార్టీ బలిజ సామాజిక వర్గ నేతలను యూజ్ అండ్ త్రో పాలసీ పెట్టుకోవడంతో రాజంపేట టీడీపీ అభ్యర్థి బాలసుబ్రమణ్యం టీడీపీ నుంచి నిష్క్రమించారు. 40 ఏళ్ల పార్టీ అనుబంధాన్ని తెంచుకున్నారు. ఆపై వైఎస్సార్సీపీలో చేరారు. ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రాములపై హత్యాయత్నం వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేముల మండల నాయకుడు వేల్పుల రామలింగారెడ్డిలపై టీడీపీ మూకలు నల్లగొండువారిపల్లెలో హత్యాయత్నం చేశా రు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల సందర్భంగా పచ్చ నేతలు వీరంగం సృష్టించారు. పోలీసులకు మాయనిమచ్చ... పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలను జిల్లా పోలీసు యంత్రాంగం సక్రమంగా నిర్వహించకపోవడం చరిత్రలో మాయనిమచ్చగా నిలవనుంది. కుర్చీ కోసం ఎమ్మెల్యే చిందులు! 79వ స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల్లో కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి అధికారులపై చిందులేశారు. ప్రభుత్వ విప్, ఎమ్మెల్యే అయినప్పటికీ తనకు వేదికపై కుర్చీ వేయలేదంటూ ఆగ్రహం వ్యక్తం చేయడం అప్పట్లో హాట్టాపికై ంది. ఈ ఘటనతో ఎమ్మెల్యేపై తీవ్ర విమర్శలు వచ్చాయి. జెడ్పీ చైర్మెన్గా ముత్యాల రామగోవిందురెడ్డి జిల్లా జెడ్పీ చైర్మన్ పీఠాన్ని వైఎస్సార్ సీపీ నిలబెట్టుకుంది. బ్రహ్మంగారిమఠం జెడ్పీటీసీ సభ్యులు ముత్యాల రామగోవిందరెడ్డి జెడ్పీ చైర్మెన్గా ఎన్నికయ్యారు. మేయర్గా పాకా సురేష్... కడప మేయర్ సురేష్బాబుపై కడప ఎమ్మె ల్యే మాధవీరెడ్డి కుట్ర రాజకీయాలు చేశారు. కుటుంబ సభ్యుల పేరుతో ఉన్న వర్థిని కనస్ట్రక్షన్స్ సంస్థ రూ.36 లక్షలు కాంట్రాక్టు పనులు చేశారని బూచిగా చూపెట్టి అనర్హత వేటు వేశారు. మేయర్కు సమానంగా స్టేజ్పైన కుర్చీ వేయలేదనే కోపంతో కుట్రపన్నా రు. తిరిగి ఆస్థానాన్ని వైఎస్సార్సీపీయే దక్కించుకుంది. మేయర్ స్థానం వైఎస్సార్ సీపీదే. కాకపోతే కొత్తమద్ది సురేష్బాబు స్థానంలో పాకా సురేష్ కొలువుదీరారు. సీపీఐ రాష్ట్ర కార్యదర్శిగా ఈశ్వరయ్య... కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా (సీపీఐ) రాష్ట్ర కార్యదర్శిగా జిల్లాకు చెందిన గుజ్జల ఈశ్వరయ్య ఎన్నికయ్యారు. కమ్యూనిస్టు యోధులు ఎద్దుల ఈశ్వరరెడ్డి, నర్రెడ్డి శివరామిరెడ్డి (ఎన్ఎస్), జె వెంకట్రామిరెడ్డి (జెవి) ప్రాతినిథ్యం వహించిన జిల్లా నుంచి రాష్ట్ర కార్యదర్శిగా ఎంపిక కావడంపై రాజకీయ పార్టీలకతీతంగా హర్షం వెలిబుచ్చారు. ప్రకృతి సంపద దోపిడీలో‘పచ్చ’నేతల పోటీ సీఎం చంద్రబాబు జిల్లాలో పర్యటించినా ఫలితం సున్నా! ఎమ్మెల్యే సుధాకర్యాదవ్కు సైబర్ నేరగాళ్లు బురిడీ అధికారంలో ఉన్నా, విపక్షంలో ఉన్నప్పటికీ ప్రజాపక్షమే తమ ఎజెండా అంటూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చిత్తశుద్ధి చూపించారు. పెనుగాలుల కారణంగా నష్టపోయిన అరటి రైతులకు హెక్టారుకు రూ.20వేలు చొప్పున రూ.14కోట్లు సొంత నిధులు రైతులకు అందజేశారు. ధరలు లేక నీరసించిపోయిన ఉద్యాన రైతుల కష్టాలపై ప్రభుత్వ వైఖరి ఎండగట్టారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ఆర్ జయంతి, వర్థంతి కార్యక్రమాల్లోనూ, క్రిస్మస్ వేడుకలల్లో పాల్గొన్నారు. జిల్లా పర్యటనకొచ్చిన ప్రతి సందర్భంలోనూ ప్రజల నుంచి అపూర్వ స్పందన లభించింది. -
వర్శిటీలు పరిశోధనలు జరపాలి
రాయలసీమకు సంబంధించిన ఇలాంటి వ్యక్తుల జీవితాలు, ఆనాటి సామాజిక పరిస్థితులు వెలుగులోకి రానివ్వకుండా తొక్కి పెట్టారు. బుడ్డా వెంగళరెడ్డి లాంటి స్ఫూర్తిదాయకమైన వ్యక్తుల చరిత్ర, జీవితం అందరికీ తెలియజేయాలి. ఇలాంటి వ్యక్తులపై పరిశోధనలు జరగాలి. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప ‘బుడ్డా’జీవితాన్ని పాఠ్యాంశాల్లో చేర్చాలి బుడ్డా వెంగళరెడ్డి ప్రదర్శించిన దాతృత్వం, మానవత్వం నేటి తరానికి స్పూర్తిని ఇచ్చేందుకు వీలుగా ఆయన జీవితం గురించి పాఠ్యాంశాల్లో పొందుపరచాలి. మధ్యాహ్న భోజన పథకానికి డొక్కా సీతమ్మ పేరు పెట్టడంపై మాకు అభ్యంతరం లేదు. బుడ్డా వెంగళరెడ్డి చరిత్ర పాఠ్యాంశాల్లో లేకపోవడం బాధాకరం. – దండా ప్రసాద్, కడప -
వైకుంఠవాసా.. శ్రీ వేంకటేశా!
వైకుంఠవాసా.. శ్రీ వెంకటేశా! కడప సెవెన్రోడ్స్: వైకుంఠ ఏకాదశి సందర్భంగా జిల్లాలోని అన్ని వైష్ణవాలయాలు భక్తులతో కళకళలాడాయి. తెల్లారుజాము నుంచే భక్తులను దర్శనానికి అనుమతించారు. ప్రతి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని విశేషంగా అలంకరించి స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చారు. వైకుంఠ (ఉత్తర) ద్వారం లేని ఆలయాలలో ప్రత్యేకంగా అలాంటి ద్వారం ఏర్పాటు చేసి అందులో నుంచి భక్తులకు స్వామి దర్శనభాగ్యం కల్పించారు. జిల్లాలోని ప్రముఖ వైష్ణవాలయం దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయంలో వైకుంఠ ద్వారాన్ని అందంగా అలంకరించారు. అర్దరాత్రి 1.30 గంటల నుంచి దర్శనానికి అనుమతించినా అప్పటికే భక్తులు వైకుంఠ ద్వారం వద్ద దర్శనం కోసం వేచి ఉన్నారు. వైకుంఠ ద్వారంలో స్వామికి హారతులిచ్చి తొలి దర్శనం వేళకు భక్తులు పెద్ద సంఖ్యలో క్యూలో ఉన్నారు. చలి తీవ్రతకు లెక్కచేయకుండా భక్తులు అర్దరాత్రి 1 గంటకే వచ్చి క్యూలైన్లలో వేచి ఉండడం విశేషం. ఉదయం 11.30 గంటల వరకు స్వామి వారి దర్శనం కొనసాగింది. పలువురు ప్రముఖులు స్వామి దర్శనం చేసుకున్నారు. ముక్కోటి ఏకాదశి వేళ..మురిసిన భక్తజనకోటి వైష్ణవాలయాలకు పోటెత్తిన భక్తులు వైకుంఠ ద్వార దర్శనం ద్వారా స్వామి దర్శనం -
ప్రాణం తీసిన గుంతల రోడ్డు
– దైవదర్శనానికి వెళుతూ ముక్కోటి లోకాలకు.. – రోడ్డు ప్రమాదంలో అంగన్వాడీ టీచర్ మృతి రైల్వేకోడూరు అర్బన్ : కోడూరు– తిరుపతి ప్రధాన రహదారిపై మండలంలోని శెట్టిగుంట గ్రామం వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అంగన్వాడి టీచర్ ఆవుల లక్ష్మి (35) మృతి చెందారు. వివరాలిలా.. ఓబులవారిపల్లి మండలం కొత్తమంగంపేటలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తున్న లక్ష్మీ ముక్కోటి ఏకాదశి పురస్కరించుకొని తన భర్త పోతులయ్యతో కలిసి తిరుపతి ఆలయాలను దర్శించుకునేందుకు తెల్లవారుజామున స్కూటీలో బయలు దేరారు. శెట్టిగుంటవద్దకు రాగానే స్కూటీ గుంతలో పడడంతో ఒక్కసారిగా వెనుక కూర్చున్న లక్ష్మీ కింద పడింది. దీంతో వెనుక వస్తున్న లారీ ఆమె తలపై ఎక్కడంతో అక్కడికక్కడే మృతి చెందింది. భర్త పోతులయ్యకు గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రేనాటి ముద్దుబిడ్డ బుడ్డా
కడప సెవెన్రోడ్స్: ఒకరా ఇద్దరా.. ఊళ్లకు ఊళ్లు కరువు బారిన పడి ప్రజలంతా మృత్యుముఖంలోకి జారుతున్న విషాద సమయంలో ఆయన అక్కున చేర్చుకున్నారు. తన ఆస్తులన్నీ ధాన్యంగా మార్చి సాటి మనుషుల ప్రాణాలు నిలిపి చరిత్రలో మహనీయుడిగా నిలిచిపోయారు. అన్నార్థుల పాలిట ఆత్మబంధువుగా ఖ్యాతిగడించారు. ఆయనే రేనాటి ముద్దుబిడ్డ.. బుడ్డా వెంగళరెడ్డి. బుధవారం బుడ్డా వెంగళరెడ్డి 125వ వర్ధంతి. ఆయన సేవలను స్మరించుకుంటూ రేనాటి సూర్యచంద్రుల విగ్రహ కమిటీ ఆధ్వర్యంలో జిల్లా పరిషత్ కార్యాలయాన్ని ఆనుకుని ఉన్న ప్రేమాలయ నిరాశ్రయుల వసతి గృహంలో అన్నప్రసాద పంపిణీ కార్యక్రమాన్ని చేపడుతున్నారు. అలాగే వర్ధంతి సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. మున్సిపల్ మాజీ చైర్మన్ ఎస్.హరీంద్రనాథ్, ఏపీ వర్కింగ్ జర్నలిస్టుల సంఘం జిల్లా అధ్యక్షుడు మోపూరి బాలకృష్ణారెడ్డి, నిర్వాహకులు దండా ప్రసాద్, ఇంటాక్, రెడ్డి సేవాసమితి, రాయలసీమ కమ్యూనిస్టు పార్టీ, రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య తదితర సంఘాల ప్రతినిధులు హాజరు కానున్నారు. ‘బుడ్డా’గురించి... ఒకప్పటి కడప జిల్లా కోయిలకుంట్ల తాలూకా ఉయ్యాలవాడ గ్రామంలో భూస్వామ్య కుటుంబంలో బుడ్డా వెంగళరెడ్డి జన్మించారు. దానధర్మాలు, ధార్మిక చింతన వంటివి చిన్నతనం నుంచే అలవడ్డాయి. 1866 నాటి భయానక కరువులో ఇతర జిల్లాల నుంచి శరణార్థులైవచ్చిన వేలాది మందికి అంబలిపోసి ఆకలి తీర్చడం ద్వారా ప్రాణాలు నిలిపారు. ఈ విషయం తెలుసుకుని వెంగళరెడ్డిని మద్రాసుకు ఆహ్వానించి విక్టోరియా మహారాణి బంగారు పతకం అందజేసి గౌరవించారు. నేడు 125వ వర్ధంతి -
కాపుకాచి.. ప్రయాణికులను ఏమార్చి..
కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లాలో బస్సులు, బస్టాండ్లు, ఆటోలలో ప్రయాణికులను లక్ష్యంగా చేసుకొని బ్యాగుల్లోని నగలు, నగదు చోరీకి పాల్పడుతున్న అంతర్ రాష్ట్ర దొంగల ముఠాను ఎర్రగుంట్ల పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ కేసులో భారీగా దొంగ సొత్తును స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. మంగళవారం స్థానిక పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్ హాలులో మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. అరెస్టయిన నిందితుల నుంచి సుమారు రూ. 75 లక్షల విలువైన 507 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కిలో వెండి ఆభరణాలు, రూ.61వేలు నగదు, సుమారు రూ. 4లక్షల విలువైన కారు, నేరాలకు ఉపయోగించిన మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్టయిన వారిలో తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, టి.నగర్కు చెందిన తొండా పోసమ్మ, ఆమె భర్త పోతురాజు, డ్రైవర్లకాలనీలో నివసిస్తున్న రావుల లక్ష్మి, పులివెందులకు చెందిన కవీటి అరుణ, పిఠాపురం మండలం, రాజుగారికుంటకు చెందిన పాల శ్రీకాంత్, అతని భార్య పాల సుమతి, వీరి కుమారుడు పాల వంశీ, తూర్పుగోదావరి జిల్లా ఏలేశ్వరం మండలం నందివీధికి చెందిన నాగళ్ల శివకుమార్, మరో యువకుడు పాల ప్రేమ్కుమార్ ఉన్నారని వివరించారు. చోరీలు చేశారిలా.. ఈ ముఠా సభ్యులు బస్సులు, ఆటోల్లో ప్రయాణికుల్లా ఇతరులతో కలిసిపోతారు. ఒకరు టికెట్ తీసుకున్నట్టు నటించడం, మరొకరు మాటలతో దృష్టి మళ్లించి ప్రయాణికులను ఏమరుపాటుకు గురిచేస్తారు. ఆపై బ్యాగుల్లో ఉన్న బంగారు ఆభరణాలు, నగదు, పర్సులు, బాక్సులు దొంగిలిస్తారు. అనంతరం, మధ్యలో దిగిపోయి, వెనుక వస్తున్న తమ కారులో ఎక్కి, అనుమానం రాకుండా గుడుల వద్దకు వెళ్లి విశ్రాంతి తీసుకునే పద్ధతిని అనుసరిస్తారని పోలీసులు వెల్లడించారు. ఈ గ్యాంగ్ నేరాలు చేసిన ప్రదేశాలు.. ఎరగ్రుంట్ల, ముద్దనూరు, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, మైదుకూరు, బద్వేలు, పోరుమామిళ్ల, కలసపాడు, పులివెందుల, తాడిపత్రి, మద్దిమడుగు, విజయవాడ తదితర ప్రాంతాల్లో ఈ ముఠా బ్యాగ్ లిఫ్టింగ్లకు పాల్పడింది. వీరు దొంగిలించిన బంగారంలో కొంత భాగాన్ని తమ ప్రాంతాల్లో పరిచయాల ద్వారా అమ్మడం, తాకట్టు పెట్టడం చేస్తుంటారు. మిగిలిన బంగారాన్ని తమ వద్దే దాచుకుంటారు. ఈ క్రమంలో నేరస్థులు దొంగిలించిన బంగారంలో కొంత భాగం రాజమండ్రిలోని జెట్టి జ్యువెలర్స్ షాపులో తాకట్టు పెట్టినట్లు తెలిసింది. ప్రస్తుతం ఈ ముఠాపై జిల్లాలో మొత్తం 23 కేసులు ఛేదించామని ఎస్పీ తెలిపారు. గత పదేళ్లలో గుంటూరు, శ్రీకాకుళం, నెల్లూరు, నంద్యాల, తూర్పుగోదావరి, కాకినాడ, బి.ఆర్. అంబేద్కర్ కోనసీమ, ప్రకాశం, రాజమహేంద్రవరం, అనంతపురం తదితర జిల్లాల్లో అనేక కేసులు నమోదయ్యాయి. పదేపదే నేరాలకు పాల్పడితే పీడీ యాక్ట్లను నమోదు చేయిస్తాం: ఎస్పీ జిల్లాలో ఎవరైనా పదేపదే నేరాలకు పాల్పడితే వారిపై పీడీ యాక్ట్లను నమోదు చేయించి చట్టపరంగా చర్య లు తీసుకుంటామని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ హె చ్చరించారు. ఈ ముఠాలో అత్యధికంగా పోసమ్మపై 15 కేసులు, ఆమె భర్త పోతురాజుపై 42 కేసులు, రావుల లక్ష్మిపై 10 కేసులు నమోదై వున్నాయి. వీరిపై పీడీ యాక్ట్లను నమోదు చేస్తామన్నారు. జిల్లాలో జరుగుతున్న బ్యాగ్ లిఫ్టింగ్ ఘటనలపై ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసిన జమ్మలమడుగు పోలీసులు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు పర్యవేక్షణలో ముద్దనూరు– కడప మెయిన్రోడ్డులో కాపు కాసి వలసపల్లె క్రాస్ వద్ద అరెస్ట్ చేశామన్నారు. ఈ కేసు దర్యాప్తులో కృషిచేసిన సీఐ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నాగమురళితో పాటు ఏఎస్ఐ కె.రాజారెడ్డి, హెడ్కానిస్టేబుల్ ఆల్ఫ్రె డ్, కానిస్టేబుళ్లు లక్ష్మినారాయణ, ఏ. శివ ప్రసాద్, వీర పోతులూరయ్య, ఎ. మునీంద్ర, రామచంద్ర, ఆర్. చంద్ర, మహిళా కానిస్టేబుల్ జయంతి, హోంగార్డు ఎస్.వలీ, మహిళా హోంగార్డులను జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్బాబు, జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు సిబ్బంది పాల్గొన్నారు. అంతర్ రాష్ట్ర బ్యాగ్ లిఫ్టింగ్ ముఠా అరెస్టు రూ.75 లక్షల బంగారు, వెండి నగలు స్వాధీనం స్వాధీనం చేసుకున్న వాటిలో 507 గ్రాముల బంగారు ఆభరణాలు, ఒకటిన్నర కిలో వెండి, రూ. 4 లక్షల విలువైన కారు, రూ. 61,000 నగదు, మొబైల్ ఫోన్లు మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించిన ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
బి.మఠంలో వైకుంఠ ఏకాదశి వేడుకలు
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్ర స్వామి మఠంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా దేవస్థానం నిర్వాహకులు పలు కార్యక్రమాలు నిర్వహించారు. తెల్లవారు జామునే గోవిందమాంబ సమేత వీరబ్రహ్మేంద్ర స్వామి గ్రామోత్సవం, భజనలు, ప్రత్యేక పూజలు, అన్నదానాలు చేపట్టారు. ఈ కార్యక్రమంలో పూర్వపు మఠాధిపతి కుమారులు ప్రత్యేక పూజలు చేశారు. జిల్లా నలుమూలల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా సైన్స్ఫేర్లో ప్రతిభ చాటాలి కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రస్థాయి ఇన్స్పైర్లో ప్రతిభను చాటిన కడప అంగడివీధి జిల్లా పరిషత్తు హైస్కూల్కు చెందిన 9వ తరగతి విద్యార్థి గిరీష్ సౌత్ ఇండియా సైన్స్ఫేర్లో కూడా రాణించాలని డీఈఓ షేక్ షంషుద్దీన్, డిప్యూటీ డీఈఓ రాజగోపాల్రెడ్డి ఆక్షాంక్షించారు. దక్షిణ భారత సైన్స్ఫేర్కి ఎన్నికై న 9వ తరగతి విద్యార్థి గిరీష్, గైడ్ టీచర్ మాధవి, నారాయణలను మంగళవారం డీఈఓ కార్యాలయంలో అధికారులు అభినందించారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి వేపరాల ఎబినేజర్ తదితరులు పాల్గొన్నారు. -
సమర్థవంతమైన పనితీరు.. మెరుగైన పోలీసింగ్
కడప అర్బన్ : జిల్లాలో పోలీస్ శాఖ సమర్థవంతంగా పనిచేయడం వల్లే 2025లో నేరాలు గణనీయంగా తగ్గాయని, పోలీసులు సమష్టిగా పనిచేయడం వల్లనే సాధ్యమైందని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్థ్ పేర్కొన్నారు. మంగళవారం ఎస్పీ ఆధ్వర్యంలో 2025 నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ద్విగుణీకృత ఉత్సాహంతో 2026లో మరింత మెరుగైన పోలీసింగ్తో ప్రజలకు ఉత్తమమైన సేవలు అందిస్తామన్నారు. గత సంవత్సరంతో పోల్చుకుంటే 2025లో అన్ని రకాలైన నేరాల నియంత్రణలో గణనీయమైన మార్పు కనిపించిందన్నారు. జిల్లాలోని ఫ్యాక్షన్ ప్రభావిత గ్రామాల్లో పోలీసుల నిరంతర నిఘా, కఠిన చర్యలతో ఫ్యాక్షన్ దాదాపు కనుమరుగైందన్నారు. మహిళా భద్రతపై స్పెషల్ డ్రైవ్లో భాగంగా జిల్లాలోని అన్ని గ్రామాలు, పట్టణాల్లోని మహిళల రక్షణకు పోలీస్ శాఖ చేపట్టిన చర్యలు, మహిళల భద్రతకు ఉన్న చట్టాలపై విస్తృతంగా అవగాహన కార్యక్రమాలు 3079 చేపట్టామన్నారు. మాదకద్రవ్యాల వల్ల కలిగే నష్టాలపై పాఠశాలలు, కళాశాలల్లో 1290 అవగాహన సదస్సులు ఏర్పాటు చేసి ‘డ్రగ్స్ వద్దు బ్రో’ అనే నినాదంతో పోలీస్ కళాజాగృతి బృందం ద్వారా నాటక ప్రదర్శనలు ఇప్పించామన్నారు. అదేవిధంగా శక్తియాప్ పై అవగాహన కల్పించి 27,805 మంది చేత శక్తియాప్ రిజిస్ట్రేషన్ చేయించామన్నారు. గణనీయంగా నేరాలు తగ్గుదల.. విజిబుల్ పోలీసింగ్, అసాంఘిక శక్తులపైనా నిఘా, అవగాహన కార్యక్రమాలను చేపట్టడం, పి.డి. యాక్ట్ ప్రయోగం, నాటుసారా, అక్రమ మద్యంపై ఉక్కుపాదం మోపడం, కన్విక్షన్ బేస్డ్ పోలీసింగ్ పై ప్రత్యేక దృష్టి సారించడం, గంజాయి పైన కట్టడి వల్ల నేరాలు తగ్గుముఖం పట్టాయని జిల్లా ఎస్పీ వివరించారు. ప్రాపర్టీ నేరాల కేసుల్లో.. ● 2025లో మొత్తం 575 ప్రాపర్టీ నేరాల కేసులు నమోదు కాగా, 330 కేసులు (57.39 శాతం) ఛేదించి పోగొట్టుకున్న సొత్తు రూ. 8,59,60,862 మొత్తంలో రూ. 4.15 కోట్ల (48.31 శాతం) విలువైన చోరి సొత్తు రికవరీ చేశామని తెలిపారు. ● జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కు పాదం మోపి దాడులు నిర్వహించి 767 కేసులు నమోదు చేసి 3473 మందిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుండి రూ.1,65,57,268 స్వాధీనం చేసుకున్నామని చెప్పారు. ● జిల్లాలో ఎర్ర చందనం అక్రమ రవాణా నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టి 2025 సంవత్సరంలో 9 కే సులు నమోదు చేసి 55 మందిని అరెస్టు చేశామ న్నారు. 1979 కిలోల బరువున్న 139 దుంగలను, 5 వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ● గంజాయి విక్రయాలపై ముమ్మరంగా దాడులు నిర్వహించి 22 కేసులు నమోదు చేసి 67 మందిని అరెస్టు చేశామన్నారు. 46.27 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు. రోడ్డు ప్రమాద మరణాలలో స్వల్ప పెరుగుదల.. జిల్లాలో రోడ్డు భద్రతా నిబంధనలపై వాహనదారులకు అవగాహన కల్పించడం, డ్రంకెన్ డ్రైవ్పై ప్రత్యేక దృష్టి పెట్టడం చేసినప్పటికీ రోడ్డు ప్రమాద మరణాల్లో గత ఏడాదితో పోల్చితే స్వల్ప శాతం పెరుగుదల నమోదైందన్నారు. ట్రాఫిక్ అవగాహన కార్యక్రమాలు.. విద్యార్థులు, డ్రైవర్లు తదితరులకు 3,100 అవగాహన కార్యక్రమాలు నిర్వహించి రోడ్డు భద్రతపై అవగాహన కల్పించామన్నారు. రోడ్డు ప్రమాదాలు తగ్గించేందుకు 760 స్టాప్ – వాష్ – గో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. ● నమోదైన 57 సైబర్ నేర కేసులలో 33 కేసులు ఛేదించి, 62 మంది నిందితులను అరెస్ట్ చేశామన్నారు. బాధితులు కోల్పోయిన మొత్తం రూ. 16.47 కోట్లలో రూ. 21.52 లక్షలు బాధితులకు తిరిగి చెల్లించామన్నారు. ● ప్రజల ఫిర్యాదులను సకాలంలో పరిష్కరించేందుకు ప్రాధాన్యత ఇచ్చామన్నారు. ఈ ఏడాది మొత్తం 9,704 ఫిర్యాదులలో 9,300 ఫిర్యాదులు నిర్ణీత గడువులోనే పరిష్కారమయ్యాయన్నారు. గండికోటలో బాలిక వైష్ణవి హత్య కేసు పురోగతిపై ప్రశ్నించగా... బాలిక వైష్ణవి కేసులో దర్యాప్తు పురోగతిలో భాగంగా ఫోరెన్సిక్కు సంబంధించిన మెటీరియల్ను పరీక్షల కోసం ముంబైలోని సెంట్రల్ ల్యాబ్కు పంపించామని బదులిచ్చారు. ప్రొద్దుటూరులో కిడ్నాప్ కేసు దర్యాప్తులో ఓ వ్యక్తి గురించి అడుగగా దర్యాప్తు చేస్తున్నామని చెప్పారు. ఈ సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్బాబు, ఎస్బీ డీఎస్పీ ఎన్.సుధాకర్ పాల్గొన్నారు. 2025 నేర సమీక్షలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
గండికోట వైభవాన్ని విశ్వవ్యాప్తం చేయాలి
కడప సెవెన్రోడ్స్: గండికోట చారిత్రక, పర్యాటక సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా ‘గండికోట ఉత్సవాల‘ను ఘనంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. మంగళవారం రాత్రి కలెక్టర్ క్యాంపు కార్యాలయంలో గండి కోట ఉత్సవాల ఏర్పాట్లు, పనులపై కలెక్టర్ జిల్లా పర్యాటక శాఖ, ఏపీ టీడీసీ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా గండికోట పర్యాటక ఉత్సవాల ఏర్పాట్లలో భాగంగా చేపట్టే అన్ని రకాల పనులకు సంబంధించిన నిర్వహణ పనులను, మ్యాపులను, డిజైన్లను పరిశీలించి పలు సూచనలు, సలహాలను అందించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గండికోట పర్యాటక కేంద్రంలో సుసంపన్నమైన కోట, గార్జ్ అనుభవాన్ని పర్యాటకుల సొంతం చేసే దిశగా.. జిల్లా యంత్రాంగం పర్యాటక శాఖ ద్వారా అభివృద్ధి పనులను చేపట్టిందన్నారు. 2026 జనవరి 11, 12, 13 తేదీల్లో జరగనున్న గండికోట పర్యాటక ఉత్సవాలను జిల్లా పర్యాటక, చారిత్ర, సాంస్కృతిక వైభవాన్ని విశ్వవ్యాప్తం చేసేలా దేశం నలు దిక్కులా చాటేలా కొన్ని ప్రధానమైన పనులను త్వరితగతిన పూర్తి చేయడం జరుగుతోందన్నారు. ఉత్సవాలకు ముందు పూర్తి కావాల్సిన పలు ముఖ్య మైన పనులను పరిశీలించి..ఎంట్రన్స్, వెలివేషన్, పార్కింగ్, అమినిటీ భవనం పనులను త్వరితగతిన పూర్తి చేయాలని ఏపీటీడీసీ ఇంజినీర్లు, ప్రాజెక్ట్ కన్సల్టెంట్లను ఆదేశించారు. గండికోట వద్ద వ్యూపాయింట్ తో పాటు, చారిత్రక వైభవాన్ని ప్రతిబింబించేలా నిర్మాణాలు చేపట్టాలన్నారు. అంతకుముందు వీసీ ద్వారా పర్యాటక ఈవెంట్ మేనేజ్మెంట్ ప్రతినిధులతో కలెక్టర్ ద్వారా సమీక్షించారు. జమ్మలమడుగు ఆర్డీవో సాయిశ్రీ, ఏపీ టీడీసీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ సుబ్రహ్మణ్యం, డీఈ పెంచలయ్య, పీఆర్ ఎస్ఈ మద్దన్న, జిల్లా టూరిజం అధికారి సురేష్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి జనవరి 11 నుంచి గండికోట ఉత్సవాల నిర్వహణ -
రాయచోటికి మద్దతు లేదనడం హేళన చేయడమే
● జిల్లా కేంద్రం మార్పు విషయంలో గడువు ఎందుకు కోరలేదు ● నోటిఫికేషన్ ఇవ్వకుండా జిల్లా కేంద్రాన్ని తరలించడం ఏంటి ● తుది నోటిఫికేషన్ వాయిదా వేసి ప్రజల అభిప్రాయాలు తీసుకోండి ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి రాయచోటి అర్బన్ : రాయచోటికి మద్దతులేదని.. రాయచోటికి జిల్లా కేంద్రంగా మద్దతు ఎవరూ ఇవ్వలేదని మంత్రి అనగాని సత్యప్రసాద్ అనడం ఇక్కడి ప్రజలను హేళన చేయడమేనని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీమంత్రి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. మంగళవారం ఆయన మీడియాకు ఒక వీడియో సందేశాన్ని విడుదల చేశారు. ‘అన్ని ప్రాంతాలకు నోటిఫికేషన్ ఇచ్చి దాదాపు 30 రోజులు గడువు ఇచ్చారు. కానీ రాయచోటిని జిల్లా కేంద్రం నుంచి తొలగించే విషయంపై ప్రభుత్వం ఎందుకు ప్రజల అభిప్రాయాలను తీసుకోలేదు. పద్ధతి ప్రకారం, ప్రజాస్వామ్య సిద్ధాంతాల ప్రకారం అన్నమయ్య జిల్లా కేంద్రాన్ని రాయచోటి నుంచి మదనపల్లెకు ఎందుకు తరలిస్తున్నారో చెప్పాలి. రాష్ట్రంలో జిల్లాల పునర్విభజన అంశంపై 927 విజ్ఞప్తులు వచ్చాయని చెబుతున్నారే కానీ రాయచోటి, మదనపల్లైపె ఎన్ని అభిప్రాయాలు వచ్చాయో చెప్పడం లేదు. సిద్ధవటం, ఒంటిమిట్ట మండలాలను కడప నుంచి రాజంపేటలో కలిపే విషయంపైన, రైల్వేకోడూరును తిరుపతిలో కలపడానికి, రాజంపేటను కడప జిల్లాలో కలపడానికి ప్రజల నుంచి అభిప్రాయాలు సేకరించారు కానీ, రాయచోటి ప్రజలపై కక్షసాధింపు చర్యలు చేపడుతూ కనీసం వారి అభిప్రాయాలు చెప్పుకోవడానికి ఒకరోజు కూడా గడువు ఇవ్వలేదు. దీనిపై న్యాయపోరాటానికి కూడా వెనుకడుగువేసే ప్రసక్తే లేదు. ప్రపంచంలో ఏ దేశంలోనైనా ఉరిశిక్ష పడ్డ ఖైదీకి చివరి కోరిక అడుగుతారు. ఇక్కడ మాత్రం అలా జరగలేదు. ఇప్పటికై నా తుది నోటిఫికేషన్ వాయిదా వేసి రాయచోటి ప్రాంత ప్రజల అభిప్రాయాలు కూడా సేకరించిన తరువాతు నిర్ణయం తీసుకోవాలి’ అని ఆ వీడియోలో డిమాండ్ చేశారు. ‘ప్రెసిడెంటల్ ఆర్డర్ రాలేదనడం దుర్మార్గం’ ‘గత ప్రభుత్వంలో ఏర్పాటైన జిల్లాలకు ప్రెసిడెంటల్ ఆర్డర్ రాలేదని కొంతమంది చెబుతున్నారు. నిజానికి 2023 ఆగస్టులో కేంద్రానికి పంపిన జిల్లాల పునర్విభజన ప్రకారం సమర్పించిన అప్పటి నివేదికలకు ఆర్డర్ ఇచ్చేందుకు ఆలస్యం చేశారు. ఇటీవల వాటికి ఆమోదం లభించింది. రాయచోటి ప్రజలను రెచ్చగొట్టే విధంగానే కూటమి నాయకులు, మంత్రులు మాట్లాడటం దుర్మార్గం. కొద్దిరోజుల క్రితం అసెంబ్లీలో రాయచోటి గురించి మరో ప్రాంత ఎమ్మెల్యే ఇష్టానుసారంగా మాట్లాడినప్పుడే రాయచోటి మీద కుట్ర జరుగుతోందని అర్థమైంది. రాయచోటిని తొలుత కార్నర్ చేసి.. ఆ తరువాత జిల్లా కేంద్రంగా కూడా లేకుండా చేశారు. ఇదే విషయంపై నేను గతంలో మాట్లాడితే స్థానిక నాయకులు ఇష్టారాజ్యంగా బూతులు మాట్లాడారు. జిల్లా కేంద్రంగా రాయచోటినే కొనసాగించే విధంగా ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకొచ్చేందుకు పోరాటాలు చేస్తాం’ అని శ్రీకాంత్రెడ్డి చెప్పారు. -
ఉపాధ్యాయులకు బోధన సమయాన్ని కేటాయించాలి
కడప ఎడ్యుకేషన్ : ప్రభుత్వ పాఠశాలల్లో పనిచేసే ఉపాధ్యాయులకు పిల్లలకు చదువు చెప్పే సమయాన్ని కేటాయించాలని బహుజన టీచర్స్ యూనియన్ (బీటీయూ ఏపీ) సంఘం రాష్ట్ర అధ్యక్షుడు మేకల శివార్జున కోరారు. మంగళవారం కడప బీటీయూ ఏపీ కార్యాలయంలో ముఖ్య కార్యకర్తలతో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పాధ్యాయులకు బోధనలో స్వేచ్ఛనివ్వకుండా తాము చెప్పినట్లే చదువు చెప్పాలని ప్రభుత్వం అనడం ఉపాధ్యాయులలోని సృజనాత్మక శక్తిని దెబ్బతీయటమేనన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సి. సుదర్శన్ బాబు, వైయస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు ఎం. గంగరాజు, కార్యనిర్వాహక సభ్యులు కె. జయరాముడు, టి.మనోహర్ పి. మురళి తదితరులు పాల్గొన్నారు. -
వైకుంఠ ఏకాదశికి ఏర్పాట్లు పూర్తి
కడప సెవెన్రోడ్స్ : వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని దేవునికడప శ్రీ లక్ష్మీవెంకటేశ్వరస్వామి ఆలయంలో టీటీడీ అధికారులు ఘనంగా ఏర్పాట్లు చేశారు. మంగళవారం ఏకాదశి సందర్భంగా స్వామి, అమ్మవార్లను ఉత్తర ద్వారంలో దర్శించుకోవడానికి వేల సంఖ్యలో భక్తులు తరలిరానున్నారు. ఇందుకు తగ్గట్లు అధికారులు భారీ క్యూలైన్లు, చలువ పందిళ్లు, షామియానాలు తదితర ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయాన్ని విద్యుద్దీపాలతో అలంకరించారు. ఉత్తర ద్వారం వద్ద స్వామి వారిని కొలువుదీర్చేందుకు అవసరమైన ఏర్పాట్లు చేశారు. ఆ ప్రాంతాన్ని వివిధ రకాల పూలమాలలతో అలంకరించారు. రాత్రి 1.30 నుంచి మంగళవారం ఉదయం 11.30 గంటల వరకు ఉత్తర ద్వారంలో స్వామి వారు భక్తులకు దర్శనమిస్తారు. ఉత్తర ద్వార దర్శనం వద్ద రూ.10 టిక్కెట్లు లేదంటే ఉచిత దర్శన ఏర్పాట్ల కోసం ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ఇక మూలవర్ల దర్శనం కోసం వెళ్లే భక్తులు రూ. 25, రూ.10 టిక్కెట్లు కొనుగోలు చేసి వెళ్లవచ్చు. అలాగే నగరంలోని గడ్డిబజారు శ్రీ లక్ష్మీ సత్యనారాయణస్వామి ఆలయంతోపాటు ఇతర వైష్ణవాలయాల్లో ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకుని విశేష ఏర్పాట్లు చేశారు. -
న్యూ ఇయర్కు గండికోట ముస్తాబు
● భారీగా పర్యాటకులు తరలివచ్చే అవకాశం ● ఇప్పటికే గదులన్నీ ఫుల్ ● టెంట్లకు గిరాకీజమ్మలమడుగు : నూతన సంవత్సరానికి స్వాగతం పలికేందుకు పర్యాటక కేంద్రమైన గండికోటకు భారీగా పర్యాటకులు తరలివస్తున్నారు. ఇటీవల పర్యాటక కేంద్రంగా గండికోటకు మంచి గుర్తింపు వచ్చింది. గ్రాండ్ కెన్యాన్గా ప్రపంచ గుర్తింపు పొందిన పెన్నానది లోయ అందాలను ఆస్వాదించడానికి పర్యాటకులు భారీగా వస్తున్నారు. గండికోటలో జనవరి వేడుకలను నిర్వహించునేందుకు ఇప్పటికే బెంగళూరు, చైన్నె, హైదరాబాద్ తదితర ప్రాంతాలనుంచి భారీగా పర్యాటకులు రూములు బుక్ చేసుకుంటున్నారు. హరితా హోటల్తోపాటు ప్రైవేట్ రిసార్టులలో ఉన్న రూములన్నీ పూర్తిగా భర్తీ కావడంతో టెంట్లపై దృష్టి సారిస్తున్నారు. ప్రమాదకరంగా మారుతున్న టెంట్లు.. నూతన సంవత్సరం ప్రారంభం సందర్భంగా గండికోటలో పర్యాటకుల సంఖ్య విపరీతంగా పెరిగిపోతుండటంతో రిసార్టు యజమానులు, టెంట్ నిర్వాహకులు పర్యాటకుల నుంచి భారీగా డబ్బులు వసూలు చేస్తున్నారు. ఖాళీ సమయాల్లో రూ.1500 నుంచి రూ.2000 వరకు వసూలు చేసేవారు. ప్రస్తుతం రూ.3వేల వరకు డబ్బులు వసూలు చేస్తున్నారు. ప్రమాదకరంగా ఉండే పెన్నానది కొండ సమీపంలోనే టెంట్లు వేస్తున్నారు. రాత్రిపూట విష పురుగులు ఎక్కువగా సంచరిస్తున్నా వారికి ఎలాంటి ప్రమాదాలు జరిగినా తమకు సంబంధం ఉండదంటూ వారు బాహాటంగానే చెబుతున్నారు. నూతన సంవత్సరంలో గండికోటలో మందు బాబుల సంఖ్య విపరీతంగా పెరిగిపోయి వేడుకల్లో అపశ్రుతులు జరిగే ప్రమాదం ఉందని, పోలీసులు రాత్రిపూట గస్తీ ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. -
టీచర్ కొట్టిందని తల్లిదండ్రుల ఆందోళన
బద్వేలు అర్బన్ : తమ కుమార్తెను ఉపాధ్యాయురాలు నిష్కారణంగా కొట్టిందని ఆరోపిస్తూ సోమవారం స్థానిక అంబేడ్కర్ బాలికల గురుకుల పాఠశాల వద్ద తల్లిదండ్రులు ఆందోళనకు దిగారు. అయితే సెలవులకు ఊరికి వెళ్లి ఆలస్యంగా వచ్చిందని మందలించామని, కొట్టలేదని ఉపాధ్యాయురాలు చెప్పారు. వివరాల్లోకి వెళితే.. అట్లూరు మండలం బాలిరెడ్డిబావి గ్రామానికి చెందిన నరసింహులు, ఆదిలక్షుమ్మల కుమార్తె కోటపాటి అరుణ గురుకుల పాఠశాలలో 10వ తరగతి చదువుతోంది. క్రిస్మస్ సెలవులకు ఈ నెల 24న ఊరికి వెళ్లిన అరుణ సోమవారం పాఠశాలకు వచ్చింది. ఈ సమయంలో పాఠశాల ఉపాధ్యాయురాలు రమణమ్మ తమ కుమార్తెను కొట్టిందని ఆరోపిస్తూ తల్లిదండ్రులు ఉపాధ్యాయురాలిని ప్రశ్నిస్తూ ఆందోళనకు దిగారు. తోటి ఉపాధ్యాయులు సర్దిచెప్పే ప్రయత్నం చేసినప్పటికీ వారు వినిపించుకోలేదు. అయితే శనివారమే పాఠశాలకు రావాల్సి ఉండగా ఎందుకు ఆలస్యం చేశావని, పరీక్షలు దగ్గరపడుతున్నాయి కదా అని గట్టిగా మందలించామే తప్ప కొట్టలేదని, శనివారం నుండి విద్యార్థిని తల్లిదండ్రులకు పాఠశాలకు పంపమని ఫోన్ చేస్తున్నా స్పందించకుండా వెటకారంగా మాట్లాడారని ఉపాధ్యాయురాలు రమణమ్మ తెలిపారు. ఈ విషయమై ఇన్ఛార్జి ప్రిన్సిపల్ భానుమతిని సంప్రదించగా సెలవులు అయిపోయినప్పటికీ పాఠశాలకు రాకపోవడంతో ఉపాధ్యాయురాలు గట్టిగా మందలించారని తెలిపారు. తల్లిదండ్రులు ఇచ్చిన ఫిర్యాదును ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళతానని తెలిపారు. -
రాజధాని పేరుతో రైతుల ఉసురు తీస్తున్న ప్రభుత్వం
పులివెందుల : రాజధాని నిర్మాణం పేరుతో కూటమి ప్రభుత్వం బలవంత భూసేకరణకు పాల్పడుతూ అమాయక రైతుల ప్రాణాలను తీస్తోందని కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి దుయ్యబట్టారు. పులివెందుల భాకరాపురంలోని వైఎస్ జగన్ క్యాంపు కార్యాలయంలో సోమవారం ఆయన మాట్లాడారు. ఇటీవల అమరావతికి చెందిన రామారావు అనే రైతు ల్యాండ్ పూలింగ్పై నిర్వహించిన సభలో ఇప్పటికే రాజధాని పేరుతో తనకున్న రెండెకరాలు ఇచ్చానని, ఇప్పుడు ఇంటిని కూడా అడుగుతున్నారని ప్రశ్నిస్తూ తీవ్ర ఆవేదనతో గుండె పోటుతో మరణించారన్నారు. రైతుల భూములనే కాకుండా వారి ఇళ్లను కూడా ఈ ప్రభుత్వం వదలడం లేదంటే ఎంత దుర్మార్గమో ప్రజలు ఆలోచించాలన్నారు. అంతేకాకుండా రాష్ట్రంలోని ఏపీఐఐసీ భూములను సైతం చంద్రబాబు ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టేందుకు శ్రీకారం చుట్టిందని ధ్వజమెత్తారు. రాష్ట్రంలోని అన్ని వ్యవస్థలను చంద్రబాబు తన లబ్ధి కోసం ప్రైవేట్పరం చేయడం దారుణమైన విషయమన్నారు. ఎన్నికలప్పుడు అనేక అబద్ధపు హామీలు ఇచ్చి ప్రజలను మభ్యపెట్టి అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలను పీడించడమే పనిగా ఈ ప్రభుత్వంలోని నాయకులు వ్యవహరిస్తున్నారని మండిపడ్డారు. ప్రజలు నేతల అనైతిక కార్యకలాపాలను గమనిస్తున్నారని, వారే తగిన విధంగా చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. అనంతరం ఎంపీ ప్రజా దర్బార్ నిర్వహించారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి -
వైకుంఠ ఏకాదశికి సర్వం సిద్ధం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకుని టీటీడీ వారు అన్ని ఏర్పాట్లను సిద్ధం చేశారు. నేడు తెల్లవారుజామున 1:35 నిమిషాల నుంచి ఉత్తర ద్వారా దర్శనానికి భక్తులను అనుమతిస్తారు. స్వామి దర్శనార్థం విచ్చేసే భక్తుల కోసం ప్రత్యేక క్యూలైన్ రామాలయ అంకనాలలో నుంచి ఉత్తర ద్వారం వద్దకు చేరుకునేలా ఏర్పాటు చేశారు. ఆలయాన్ని రంగురంగుల పూలు, విద్యుత్ దీపాలలతో అందంగా అలంకరించారు. స్వామివారి దర్శనం అనంతరం భక్తులకు ప్రసాదాలు పంపిణీ చేస్తారు. మంగళవారం ఉదయం 11 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రామాలయం తూర్పు వైపు ఉన్న అన్నప్రసాద కేంద్రం పక్కనే అన్నప్రసాదాలను భక్తులకు వడ్డిస్తారు. సుమారు 100 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట భద్రత ఏర్పాటుచేసినట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహారాజు తెలిపారు. శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో.. నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా ఉత్తర ద్వారం ఏర్పాటు చేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. మంగళవారం ఉదయం 9 గంటలకు స్వామి వారికి లక్ష తులసి అర్చన, ప్రత్యేక పూజలు ఉంటాయన్నారు. -
యువకుడిపై హత్యాయత్నం కేసులో ఇరువురి అరెస్టు
కడప అర్బన్ : మద్యం మత్తులో పవన్ అనే యువకుడిపై పిడిబాకుతో దాడి చేసిన కేసుకు సంబంధించి ఇద్దరు నిందితులను అరెస్టు చేసినట్లు కడప టూ టౌన్ ఇన్స్పెక్టర్ జి.ప్రసాదరావు తెలిపారు. సోమవారం కడప టూ టౌన్ పోలీస్ స్టేషన్న్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన వివరాలను వెల్లడించారు. ఈనెల 25న శంకరాపురం నివాసి నల్లిపోగు పవన్ క్రిస్మస్ పండుగ సందర్భంగా తన అమ్మమ్మ దండు వీరమ్మ నివాసమైన మాసాపేటకు వచ్చాడు. అదే రోజు మధ్యాహ్నం దొరలగోరీల వద్ద మద్యం తాగుతున్న మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్, గజ్జల కీర్తన్, గజ్జల ఏసుబాబుల వద్దకు పవన్ వెళ్లాడు. అందరూ కలిసి మొదట మద్యం తాగారు. పవన్కు హర్షవర్దన్కు మధ్య మనస్పర్థలు ఉండేవి. గతంలో తనపై కేసులు ఉన్నాయంటూ గంజాయి అమ్ముతున్నట్లు ప్రచారం చేసి అల్లరి పాలు చేశావంటూ హర్షవర్దన్ పవన్ను దూషించాడు. దీంతో పవన్ అక్కడి నుంచి నిర్మల కాన్వెంట్ వైపు నడుచుకుంటూ వెళ్లాడు. ఈ క్రమంలోనే వెనుక నుంచి ముగ్గురు పవన్ను వెంబడించి కత్తితో దాడి చేశారు. ఈ ఘటనలో మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్ పిడిబాకుతో పవన్పై దాడికి యత్నించగా, తప్పించుకునే క్రమంలో పవన్ తలపై తీవ్ర రక్తగాయమైంది. అదే సమయంలో గజ్జల కీర్తన్, గజ్జల ఏసుబాబులు పవన్న్ను కింద పడేసి కొట్టారు. పవన్ కేకలు వేయడంతో చుట్టుపక్కల ప్రజలు చేరుకునేలోపు నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. బాధితుడిని అతని మేనమామ దండు పెంచలయ్య 108 అంబులెన్స్ ద్వారా రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై దర్యాప్తు చేపట్టిన పోలీసులు మున్నంగి హర్ష అలియాస్ హర్షవర్దన్, గజ్జల కీర్తన్లను అరెస్టు చేసి, వారి వద్ద నుంచి దాడికి ఉపయోగించిన పిడిబాకును స్వాధీనం చేసుకున్నారు. మరో నిందితుడు గజ్జల ఏసుబాబు పరారీలో ఉన్నాడని, అతని కోసం ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టినట్లు వెల్లడించారు. గొడవల జోలికి వెళితే తాట తీస్తాం: కడప టూ టౌన్ సీఐ ప్రసాదరావు శాంతి భద్రతలకు విఘాతం కలిగించినా.. గొడవలకు వెళ్లినా చూస్తూ ఊరుకోమని వారి తాటతీస్తామని టూటౌన్ సీఐ ప్రసాద్ రావు హెచ్చరించారు. పిడిబాకుతో యువకునిపై దాడి చేసిన కేసుకు సంబంధించి ఇరువురు నిందితులను సోమవారం సాయంత్రం జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు మాసాపేట సర్కిల్ నుంచి కృష్ణా సర్కిల్ వరకు పోలీసులు నడిపించారు. నేరాల జోలికి వెళితే చూస్తూ ఊరుకోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో కడప టూ టౌన్ ఎస్ఐ రామకృష్ణతో పాటు పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
నేడు సమావేశం
కడప అగ్రికల్చర్ : కలెక్టరేట్లోని డీఆర్డీఏ మీటింగ్ హాల్లో మంగళవారం ఉదయం 10 గంటలకు రక్షిత సాగుపై షేడ్ నెట్ – పాలీ హౌస్ల గురించి అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు జిల్లా ఉద్యానశాఖ అధికారి సతీష్ తెలిపారు. ఆసక్తి కలిగిన రైతులు పాల్గొనాలని కోరారు. కడప సెవెన్రోడ్స్ : ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకు అత్యవసర సమయాల్లో సహాయం అవసరమైనపుడు టోల్ ఫ్రీ నెంబరు 1098కు డయల్ చేయవచ్చని ఇన్చార్జి జాయింట్ కలెక్టర్ ఎం.విశ్వేశ్వరనాయుడు అన్నారు. సోమవారం కలెక్టరేట్ సభా భవనంలో ఇందుకు సంబంధించిన వాల్ పోస్టర్లను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి జేసీ మాట్లాడుతూ బాలల సహాయవాణి 1098 అనేది భారతదేశంలో 24 గంటలు, 365 రోజులు అందుబాటులో ఉండే ఉచిత అత్యవసర టోల్ ఫ్రీ సేవ అని,ఇబ్బందుల్లో ఉన్న పిల్లలకు సహాయం అవసరమైనప్పుడు ఏ పిల్లవాడైనా ఈ నంబర్కు డయల్ చేయవచ్చన్నారు. వైద్య సహాయం, ఆశ్రయం, ఆహారం, కౌన్సెలింగ్, రక్షణ వంటి సేవలు అందుతాయన్నారు. జిల్లా మహిళా శిశు సంక్షేమం, మహిళా సాధికారిత అధికారి పి.రమాదేవి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధికారులు బాల్య వివాహాల నివారణపై ప్రతిజ్ఞ చేశారు. నేడు హుండీ ఆదాయం లెక్కింపు చింతకొమ్మదిన్నె: మండలంలోని కొత్తపేట సమీపంలో వెలసిన శ్రీ గంగమ్మ ఆలయంలో దేవాదాయశాఖ అధికారులు, ఆలయ పాలక మండలి సమక్షంలో మంగళవారం ఉదయం 10 గంటలకు దేవస్థానం శాశ్వత హుండీల ఆదా యం లెక్కింపు జరుపనున్నట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి యం.క్రిష్ణనాయక్ తెలిపారు. జమ్మలమడుగు రూరల్ : తప్పు చేసి జైలు జీవితాన్ని అనుభవిస్తున్న పేద ఖైదీలు ఎవరైనా ఉంటే ఉచిత న్యాయ సాయాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ అన్నారు. సోమవారం పట్టణంలోని సబ్ జైలును ఆయన సందర్శించి రికార్డులను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జైలులో ఖైదీలకు ఏమైనా సమస్యలు ఉంటే తన దృష్టికి తీసుకొని రావాలని సూచించారు. అనంతరం ఖైదీలతో మాట్లాడి వారి కేసు వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో జైలు సూపరింటెండెంట్, న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: ప్రజా సమస్యల పరిష్కార ధ్యేయంగా పనిచేస్తున్నామని ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ ఎస్. రమణ తెలిపారు. విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం విద్యుత్ శాఖ నిర్వహిస్తున్న డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ ఎస్ఈ కార్యక్రమానికి మంచి స్పందన లభించిందని ఎస్. రమణ అన్నారు. సోమవారం విద్యుత్ భవన్లో ఆయన డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమంలో పాల్గొని వినియోగదారులు ఫోన్ ద్వారా తెలిపే సమస్యలను స్వీకరించి, వాటి పరిష్కారానికి సంబంధిత అధికారులను ఆదేశించారు. జిల్లాలో 9 మంది వినియోగదారులు ఈ కార్యక్రమం ద్వారా తమ సమస్యలను తెలిపారని పేర్కొన్నారు. సమస్యలను త్వరలోనే పరిష్కరిస్తామని తెలిపారు. ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ మధుసూదన్, డీఈఈలు మోహన్, నాగమునిస్వామి, జేఈ సుధీర్ పాల్గొన్నారు. రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని తొలగిస్తూ మదనపల్లె జిల్లా కేంద్రంలో కలుపుతున్నట్లు తీసుకున్న ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకిస్తూ రాయచోటిలో ఆందోళనలు మిన్నంటాయి. సోమవారం జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన శాంతియుత ర్యాలీలో పలు రాజకీయ పార్టీల నాయకులు, ప్రజాసంఘాలు, విద్యార్థులు పాల్గొని సంఘీభావవాన్ని తెలిపారు. రాయచోటిలోని శివాలయం చెక్పోస్టు నుంచి సాగిన ర్యాలీ జూనియర్ కళాశాల, నేతాజీ సర్కిల్, బస్టాండు రోడ్డు, వైఎస్ఆర్ సర్కిల్ మీదుగా తిరిగి బంగ్లా సర్కిల్కు చేరుకుంది. నేతాజీ సర్కిల్లో మానవహారం చేపట్టి మదనపల్లె వద్దు రాయచోటి ముద్దు అంటూ నినాదాలు చేశారు. ప్రభుత్వ నిర్ణయాన్ని వెనక్కి తీసుకొని అన్ని విధాలుగా వెనుకపడిన రాయచోటిని జిల్లా కేంద్రంగా ఉంచాలని డిమాండ్ చేశారు. -
పోలీస్ కార్యాలయ ఏఓ గుండెపోటుతో మృతి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయ ఎ.ఓ. కె.వి.రమణ(56) సోమవారం తెల్లవారుఝామున గుండెపోటుతో ఆకస్మికంగా మృతి చెందారు. కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం ప్రైవేట్ ఆస్పత్రికి తరలించగా వైద్యులు పరీక్షించి అప్పటికే మరణించినట్లు ప్రకటించారు. కె.వి. రమణకు భార్య, కుమార్తె, కుమారుడు ఉన్నారు. ఆయన భౌతిక కాయాన్ని జిల్లా పోలీస్ కార్యాలయానికి తరలించారు. జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్తో పాటు పలువురు పోలీస్ అధికారులు, డీపీఓ సిబ్బంది కె.వి. రమణ భౌతిక కాయంపై పుష్పగుచ్చం ఉంచి నివాళులర్పించారు. వారి కుటుంబానికి ప్రగాఢ సంతాపం తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎ.ఆర్. అదనపు ఎస్పీ బి.రమణయ్య, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, వన్ టౌన్ సి.ఐ. చిన్నపెద్దయ్య, ఆర్.ఐలు శివరాముడు, సోమశేఖర్ నాయక్, డి.పి.ఓ సూపరింటెండెంట్లు శ్రీనివాస నాయక్, సురేష్, జిల్లా పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, డి.పి.ఓ. సిబ్బంది పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంపై దృష్టి
కడప అర్బన్ : జిల్లా పోలీస్ కార్యాలయంలో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పాల్గొని ప్రజల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు స్వీకరించారు. ఫిర్యాదు దారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను తెలుసుకున్నారు. మొత్తం 106 ఫిర్యాదులు(పీజీఆర్ఎస్) కు వచ్చాయి. ఈ సందర్భంగా ఎస్పీ, ప్రజల నుంచి ఫిర్యాదులు స్వీకరించి, వాటిని పరిశీలించి సంబంధిత పోలీస్ అధికారులతో ప్రత్యక్షంగా ఫోన్న్లో మాట్లాడారు. చట్టపరమైన పరిమితులలో నిర్ణీత గడువులోపు వాటిని పరిష్కరించాలంటూ స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. నడవలేని వృద్ధులు, దివ్యాంగుల కోసం ప్రత్యేకంగా వీల్ చైర్లను ఏర్పాటు చేశారు. వారి వద్దకు జిల్లా ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులను స్వీకరించారు. న్యాయం చేస్తామని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్. సుధాకర్, మహిళా పోలీసు స్టేషన్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ విద్యకు చంద్రగ్రహణం పట్టింది. కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో ..గజిబిజి నిర్ణయాలతో విద్యారంగం కునారిల్లింది. తల్లికి వందనంలో కోత పడింది.. గురువులకు ఇచ్చిన హామీ గాల్లో కలిసింది.. ఇక ఫీజు రీయింబర్స్మెంట్ ఊసే లేకుండా పోయింది..మొత్తంపై 2025లో వ
చిరిగిన బ్యాగులతో పాఠశాలకు వస్తున్న చిన్నారులు కడప ఎడ్యుకేషన్ : కూటమి ప్రభుత్వం అఽధికారంలోకి వచ్చాక ప్రభుత్వ విద్య అంతా మిథ్యగా తయారైయింది. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పూర్తిగా కొరవడింది. ఎక్కడి నిర్మాణలు అక్కడే ఆగిపోయాయి. విద్యార్థి మిత్ర పథకంలో ఇచ్చిన స్కూల్ బ్యాగులు, బూట్లు నాణ్యత లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోధనకు పరిమితం చేయాల్సిన గురువులను బోధనేతర పనులను అప్పగించి విద్యను నీరుగారుస్తున్నారు. దీనికి తగినట్టుకానే పథకాలను కూడా అమలు చేస్తున్నారు. ముఖ్యంగా ఈ ఏడాది సర్వేపల్లి రాధాకృష్ణన్ విద్యార్థి మిత్రం పథకం కింద చంద్రబాబు ప్రభుత్వం పాఠశాలకు సరఫరా చేసిన విద్యాకానుక సామగ్రి నాణ్యతంతా డొల్ల. ముఖ్యంగా పిల్లల పుస్తకాలను భద్ర పరచుకునేందుకు విద్యార్థులకు అందించిన బ్యాగు నాణ్యత సరిగా లేక ఇచ్చిన రెండు, మూడు నెలలకే చిరిగిపోయింది. దీంతో పిల్లలు పుస్తకాలను పాఠశాలకు తెచ్చుకునేందకు నానావస్థలు పడుతున్నారు. పిల్లలకు ట్యాబులేవీ! గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం 8వ తరగతి విద్యార్థులకు ట్యాబులు పంపిణీ చేసి సాంకేతిక విద్యకు దోహదపడింది. ఇక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే విద్యార్థులకు ఒక ట్యాబ్ను కూడా అందించలేదు. ఈ ప్రభుత్వం కార్పొరేట్ విద్యారంగంపై మమకారం చూపుతోందనే విద్యారంగ నిపుణలు విమర్శిస్తున్నారు. హామీల అమలెప్పుడో... ఎన్నికల ముందు ఉపాద్యాయులకు ఇచ్చిన హామీలను చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. 12వ పీఆర్సీ కోసం గత ప్రభుత్వం వేసిన కమిటీని రద్దు చేసిన ప్రభుత్వం ఇప్పటివరకు నూతన కమిటీని వేయలేదు. దీనిపై ఎన్నోసార్లు ఉపాధ్యాయ సంఘాలు ఆందోళనలు కూడా చేశారు. అయినా ఫలితం శూన్యం. కనీసం ఐఆర్ కూడా ప్రకటించపోవడంతో ఉపాధ్యాయుల వర్గాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. బోధనేతర పనులతో బోధనకు ఆటంకం... ఉపాధ్యాయులకు బోధనేతర బాధ్యతలు అప్పగించడం ద్వారా బోధన కుంటుపడుతోంది. విద్యార్థులను విద్యాభ్యాసానికి ప్రభుత్వం దూరం చేస్తుందని తమను బోధనకే పరిమితం చేయాలని సంఘ నాయకులు వాపోతున్నా చంద్రబాబు ప్రభుత్వం పెడచెవిన పెట్టింది. హాజరు నమోదు, మధ్యాహ్న భోజనం, యూనిపాం, మరుగుదొడ్ల శుభ్రత, యూనిఫాం ఇవన్నీ చాలవని తాజాగా సంసిద్ధం కార్యక్రమాన్ని కూడా అంటగట్టింది. వీటితో ఉపాధ్యాయులకు తలకు మించిన భారంగా తయారైందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇవికాదని మళ్లీ పేరెంట్ టీచర్స్ కమిటీ సమావేశాలు ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారాయి. వీటితోపాటు సమ్మెటివ్, ఫార్మెటివ్ ప్రశ్నపత్రాలను ఏరోజుకారోజు చేసి మార్కులను ఆన్లైన్ చేయడం వీటిన్నింటితో ఉపాధ్యాయులకు అవస్థలు తప్పడం లేదు. పేరుకే బదిలీలు... ఈ ఏడాది జులైలో ఉపాధ్యాయులకు బదిలీలను నిర్వహించింది. సింగల్ టీచర్ ఉన్న ఉపాధ్యా యులతోపాటు కొంతమంది ఉపాధ్యాయులు పాత స్టేషన్లలోనే విధులు నిర్వహిస్తున్నారు. బదిలీలై ఆరు నెలలు కావస్తున్నా నేటికి బదిలీ అయిన స్థానాలకు పంపలేదు. నిర్మాణాలు అలాగే... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మనబడి నాడు నేడు కింద ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్కు దీటుగా అభివృద్ధి చేశారు. ఈ ప్రభుత్వం కొలువుదీరాక 2025 సంవత్సరంలో జిల్లాలోని పాఠశాలల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా విదిల్చలేదు. దీంతో గత ప్రభుత్వంలో చేపట్టిన అభివృద్ధి పనులు నిలిచిపోయాయి. అమ్మకు ఎగనామం... చంద్రబాబు ప్రభుత్వం అందికారంలోకి వచ్చిన తొలి ఏడాది తల్లికి వందనం ఎగనామం పెట్టింది. దీంతో తీవ్ర విమర్శలు వచ్చాయి. దీంతో 2025లో పథకాన్ని అమలు చేసినా నిధుల్లో భారీగా కోత విధించింది. జిల్లాలో చాలా మంది విద్యార్థులకు అనర్హత వేటుతో డబ్బులను ఎగ్గొట్టారు. కొందరికి చెప్పిన డబ్బులంతా వేయకుండా కొందరి తల్లులకు రూ. 8వేలు మరికొంతమందికి రూ.9000, ఇంకొంతమందికి రూ. 11 వేలు చొప్పున మాత్రమే తల్లుల ఖాతాలకు జమ చేశారు. మారిన మధ్యాహ్న భోజన తీరు... గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న గోరుముద్ద పేరుతో రోజుకో మెనుతో మధ్యాహ్న భోజనాన్ని వడ్డించేవారు. దీంతో పిల్లలు ఇష్టంగా భోజనం తినేవారు. ఇప్పుడా పరిస్థితి లేదు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక డోక్కా సీతమ్మ మధ్యాహ్న భోజనం పథకం పేరుతో స్మార్ట్ కిచెన్ షెడ్డుల విధానం ప్రవేశ పెడుతున్నారు. ఇప్పటికే కడప, సీకేదిన్నె, జమ్మలమడుగు మండలాల్లో ఈ పథక అమలు జరగుతోంది. త్వరలో జిల్లా అంతటా ప్రారంభం కానుంది. ఈ విధానంలో పిల్లలకు చల్లటి భోజనం అందుతుందనే విమర్శలు ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధి పట్టని కూటమి ప్రభుత్వం గురువులకు ఇచ్చిన హామీలు అంతే తల్లికి వందనంలో నిలువునా కోతే ఫీజు రీయంబర్స్మెంట్ ఎగనామం 2025లో విద్యారంగం అస్తవ్యస్తం -
ఎర్రచందనం అక్రమ రవాణాపై పోలీసుల మెరుపుదాడి
రాయచోటి : అన్నమయ్య జిల్లాలోని శేషాచలం అడవుల నుంచి అక్రమంగా తరలిస్తున్న ఎర్రచందనం రవాణాపై పోలీసులు మెరుపుదాడి చేసి రూ. 61 లక్షలు విలువగల ఎర్రచందనాన్ని స్వాధీనం చేసుకున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. సోమవారం తెల్లవారుజామున చేపట్టిన దాడిలో ఎర్రచందనంతోపాటు ఇద్దరు స్మగ్లర్లను కూడా అదుపులోకి తీసుకున్నట్లు జిల్లా ఎస్పీ మీడియా సమావేశంలో వివరాలను వెల్లడించారు. ఎర్రచందనం స్మగ్లర్ల ఆటకట్టించేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం ఉక్కుపాదం మోపుతోందన్నారు. తమిళనాడు స్మగ్లర్లతో చేతులు కలిపి కొందరు స్థానికులు ఎర్రచందనం అక్రమ రవాణా చేస్తున్నారనే పక్కా సమాచారంతో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో ప్రత్యేక బృందాలు గాలింపు చేపట్టాయన్నారు. ఈ క్రమంలో వీరబల్లి మండల పరిధిలోని కురవపల్లి–ఉప్పరపల్లి రోడ్డు దేవదాశి చెరువు వద్ద అనుమానాస్పదంగా ఉన్న వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారన్నారు. 617 కేజీల బరువు ఉన్న 18 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నామన్నారు. అంతర్జాతీయ మార్కెట్లో వాటి విలువ సుమారు రూ. 61,70,000 ఉంటుందన్నారు. అలాగే ఒక కారు, ఒక మోటార్ సైకిల్ను స్వాధీనం చేసుకున్నామన్నారు. అన్నమయ్య జిల్లా, గడికోట గ్రామానికి చెందిన ఉప్పుతోళ్ల చంద్రమోహన్ (38), తమిళనాడు రాష్ట్రం, వేలూరు జిల్లాకు చెందిన రమేష్ వట్టన్ (38)లను పోలీసులు అదుపులోకి తీసుకున్నారన్నారు. అక్రమ రవాణాకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. -
న్యూ ఇయర్ వేడుకలు జాగ్రత్తగా చేసుకోండి
కడప అర్బన్ : నూతన సంవత్సర వేడుకలను జిల్లా ప్రజలు ప్రశాంతంగా జరుపుకోవాలని ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ కోరారు. వేడుకలను నిర్వహించుకునే వారు జాగ్రత్తలు పాటించాలని, ప్రమాదాలకు దూరంగా ఉంటూ పిల్లలు, పెద్దలు అందరూ వారి ఇళ్లలో ఉత్సవాలు జరుపుకోవాలని సూచించారు. డిసెంబర్ 31 రాత్రి జిల్లాలో నిర్వహించుకునే నూతన సంవత్సర వేడుకల సందర్భంగా ఎలాంటి ఘటనలు జరగకుండా పోలీస్ శాఖ తరఫున పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేశామని పేర్కొన్నారు. పట్టణ, గ్రామీణ ప్రాంతాల్లో డ్రంక్ అండ్ డ్రైవ్ తనిఖీలు ఉంటాయని వివరించారు. అలాగే ప్రజలకు ఇబ్బందులకు గురిచేసే విధంగా బహిరంగ ప్రదేశాల్లో నూతన సంవత్సర వేడుకలను నిర్వహిస్తే వారిపై తగు చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. పోలీసుల సూచనలు, నిబంధనలు ● రాత్రి 12:30 గంటలలోపు నూతన సంవత్సర వేడుకలు పూర్తి కావాలి. తర్వాత కొనసాగిస్తే చర్యలు. ● మైనర్స్ వాహనాలు నడపరాదు. ● టపాసులు, డీజే లు నిషేధం. ● మద్యం మత్తులో వాహనాలు నడపడం నేరం. ● రహదారులు బ్లాక్ చేసి వేడుకలు చేస్తే చర్యలు. ● మహిళల పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తే కఠిన చర్యలు. ● ర్యాష్ డ్రైవింగ్, బైక్ రేసింగ్, త్రిబుల్ రైడింగ్, సైలెన్సర్ లను తీసివేసి వాహనాలు నడపడం, శబ్ద కాలుష్యం చేస్తూ ఇతరులను ఇబ్బంది పెడితే వారిపై చట్టప్రకారం కఠిన చర్యలు. ● మద్యం దుకాణాలను నిర్ణీత సమయంలో మూసివేయాలి. ● బహిరంగ ప్రదేశాల్లో, ప్రభుత్వ స్థలాల్లో మద్యం తాగితే కేసుల నమోదు ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం ఇప్పుడు రాజంపేట రెవెన్యూ డివిజన్కు శాపంగా మారనుంది. బద్వేలు విడిపోయిన తర్వాత కేవలం రాజంపేట, రైల్వేకోడూరు అసెంబ్లీ సెగ్మంట్లను ఆధారం చేసుకొని డివిజన్ పాలన కొనసాగేది..ఇప్పుడు రైల్వేకోడూరు డివిజన్ నుంచి లెఫ్ట్ అయింది. ఇ
● రాజంపేట వాసుల్లో ఆందోళన ● తిరుపతిలోకి రైల్వేకోడూరు ● డివిజన్లోని ఐదు మండలాలు లెఫ్ట్ ● కడపలోకి రాజంపేట అసెంబ్లీ సెగ్మంట్ రాజంపేట : బ్రిటీషు కాలం నుంచి రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగిన రాజంపేటకు మరో ముప్పు పొంచి ఉంది. డివిజన్ పరిధిలో ఉన్న రైల్వేకోడూరు నియోజకర్గాన్ని తిరుపతి జిల్లాలోకి విలీనం చేస్తూ రాష్ట్ర కేబినెట్ నిర్ణయం తీసుకుంది. దీంతో రెవెన్యూ డివిజన్లో ఉన్న ఐదుమండలాలు తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయాయి. ఫలితంగా రెవెన్యూ డివిజన్ విస్తరణ రీత్యా బలహీనపడింది. నాలుగుమండలాలకు డివిజన్ డౌటే.. రాజంపేట రెవెన్యూ డివిజన్లో ఇప్పుడు ఒక్క రాజంపేట నియోజకవర్గం ఉంది. ఇందులో ఒంటిమిట్ట, సిద్ధవటం మండలాలు ఇప్పటికే కడప రెవెన్యూ డివిజన్ పరిధిలో కొనసాగుతున్నాయి. ఇక ఉండేది నందలూరు, రాజంపేట, వీరబల్లి, సుండుపల్లె మండలాలు. ఈ మండలాల పరిస్ధితి ఇప్పుడు అగమ్యగోచరంగా మారనుంది. డివిజన్ ఎత్తివేస్తే కడప రెవెన్యూ డివిజన్లోకి విలీనం చేస్తారా? అనేది ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. బద్వేలు డివిజన్లో 12 మండలాలు.. మూడేళ్ల క్రితం రాజంపేట డివిజన్ నుంచి బద్వేలు విడిపోయింది. ఆ డివిజన్లో అట్లూరు, బి.కోడూరు, బద్వేలు, బ్రహ్మంగారిమఠం, చాపాడు, దువ్వూరు, గోపవరం, కలసపాడు, ఖాజీపేట, మైదుకూరు, పోరుమామిళ్ల, కాశీనాయన మండలాలున్నాయి. వీటన్నింటిని బద్వేలు కేంద్రంగా రెవెన్యూ డివిజన్ పాలన కొనసాగుతోంది. జిల్లా కలెక్టరేట్ తర్వాత..జిల్లా కలెక్టరేట్ తర్వాత రాజంపేట సబ్కలెక్టరేట్ స్థా నం రాజంపేటది. జిల్లా కేంద్రంతో సమానంగా ఐఏఎస్ల పాలన ఇక్కడ కొనసాగింది. 1915లో 13 ఎకరా లకుపైగా విస్తీర్ణంలో సబ్కలెక్టరేట్ ఏర్పాటైంది. రాజంపేట, రైల్వేకోడూరు ఉమ్మడి నియోజకవర్గానికి ఈ సబ్కలెక్టరేట్ ప్రజాస్వామ్యపరంగా ప్రత్యేక భూమిక పోషించింది. ఇది వందేళ్లను పూర్తి చేసుకుంది. బ్రిటీషుకాలం నుంచి ఐఏఎస్ల రాజ్యం..1953 నుంచి రాజంపేట డివిజన్ కేంద్రంగా చేసుకొని సబ్కలెక్టర్లు పనిచేశారు. బ్రిటీషుకాలం నుంచి ఎందరో ఐఏఎస్లు ఇక్కడ సబ్కలెక్టర్లుగా పనిచేశారు. సీనియర్ ఐఎఎస్లు ఎంఎస్రాజాజీ, సతీనాయర్, డి. ఆరోరా, సి.రామచంద్రమూర్తి, టీఎస్ రంగాచారి, వల్లియప్పన్, ఎంఆర్సాయ్, మిన్నీమాథ్యుస్, జానకికృష్ణమూర్తి, ఎకే గోయల్, సతీసుజామన్, రణబీర్సుధన్, అజయ్జైన్, ప్రీతిమీనా, కేతన్గార్గ్ వైఖోమా నైదియాదేవి, ఇప్పుడు భావనలు సబ్కలెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. రెవిన్యూశాఖ పేరు ఇనుమడింప చేశారు. జిల్లాలో సగంభాగం రెవెన్యూ పాలన రాజంపేట సబ్కలెక్టరేట్ నుంచిఏ జరిగేది. డివిజన్ల ఏర్పాటు తర్వాత రాయచోటి కడప డివిజన్కు, జమ్మలమడుగులో ఉన్న బద్వేలును రాజంపేట డివిజన్ పరిధిలోకి తీసుకొచ్చారు.డివిజన్లు అయిన తర్వాత ఆర్డీవోలుగా కొంతమంది పనిచేశారు. అలాగే ఆర్డీఓ క్యాంప్ ఆఫీసు, క్వార్టర్స్తోపాటు రెవెన్యూహోం, జడ్జి క్వార్టర్స్, సభాభవనం లాంటి భవనాలు ఉన్నాయి. రెవెన్యూ డివిజన్ కేంద్రంగా కొనసాగిన రాజంపేటలో వివిధ ప్రభుత్వశాఖల కార్యాలయాల తరిలింపు ప్రభావం చూపనుంది. పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఎపీఎస్పీడీసీఎల్, ఐసీడీఎస్, అటవీశాఖ, పోలీసుశాఖ తదితర కార్యాలయాల డివిజన్ స్థాయి అధికారులు కొనసాగింపు ప్రశ్నార్థకరంగా మారునంది. కేవలం నాలుగు మండలాలకు డివిజన్ కార్యాలయాలు, అధికారులు ఉండరనే వాదన ప్రభుత్వ వర్గాల్లో వినిపిస్తోంది. కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై ఇక్కడి ప్రాంతీయులు ఆవేదన చెందుతున్నారు. సబ్కలెక్టరేట్ : రాజంపేట కేంద్రం : పార్లమెంటు నియోజకవర్గం ప్రారంభం : 1915 ఐఏఎస్లు : 20మంది కొత్త జిల్లా ప్రకటించకముందు రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలకే డివిజన్ పరిమితమైంది. ఇప్పుడు రైల్వేకోడూరు వెళ్లిపోయినట్లే. ఉండేది నాలుగుమండలాలే కావడంతో డివిజన్ కొనసాగించడంపై సందిగ్ధత నెలకొంది. నాలుగుమండలాలకు ఐఏఎస్ హోదా అధికారి, ఆర్డీవో స్థాయి అధికారుల సేవలు అవసరంలేదన్న భావనలు రెవెన్యూ నిపుణులే చెపుతున్నారు.నాలుగుమండలాల కోసం డివిజన్కేంద్రం కొనసాగించడంం వీలుకాదని చెపుతున్నారు. -
సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లిస్తే సహించం
కడప సెవెన్రోడ్స్ : ఎస్సీ ఎస్టీ సబ్ప్లాన్ నిధులను రాష్ట్ర ప్రభుత్వం దారి మళ్లిస్తే సహించబోమని సీపీఐ జిల్లా కార్యదర్శి గాలి చంద్ర అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట నిర్వహించిన ఆందోళనలో ఆయన మాట్లాడారు. సంక్షేమ పథకాలను పునరుద్ధరించి నిధులు కేటాయించాలన్నారు. జనాభా నిష్పత్తి ప్రకారం నిధులు ఇవ్వాలన్నారు. ప్రైవేటు రంగంలో రిజర్వేషన్లు కల్పించాలని కోరారు. తాము అధికారంలోకి వస్తే దళితులను అన్ని రకాల ఆదుకుంటామని కల్లబొల్లి హామిలు ఇచ్చిన చంద్రబాబు ఆ మేరకు కన్నెత్తి చూడడం లేదని విమర్శించారు. దళితుల అభ్యున్నతి కోసం సంక్షేమ పథకాలు పునరుద్ధరించకపోతే దశల వారీ ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి వెంకట శివ, మహిళా సమాఖ్య నాయకులు భాగ్యలక్ష్మి, సీపీఐ నగర నాయకులు మల్లికార్జున, బ్రహ్మం, డీహెచ్పీఎస్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు ఇమ్మానియల్, మునెయ్య తదితరులు పాల్గొన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర -
భూపేష్.. బోగస్ కమిటీల భరతం పట్టాలి
కడప రూరల్ : తెలుగుదేశం పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి ఇష్టానుసారంగా వ్యవహరించారు. పార్టీని నమ్ముకున్న వారిని నట్టేట ముంచారు. నూతనంగా జిల్లా అధ్యక్షుడిగా పార్టీ పగ్గాలు చేపట్టిన భూపేష్ సుబ్బరామిరెడ్డి అసలైన కార్యకర్తలకు న్యాయం చేయాలని ఆ పార్టీ సీనియర్ నాయకులు కోరారు. ఆదివారం స్థానిక అల్మాస్పేటలోని టీడీపీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో జయచంద్ర, మహమ్మద్ షా, కొండ్రెడ్డి జనార్దన్రెడ్డి, కొండా సుబ్బయ్యలు మాట్లాడారు. మొన్నటివరకు టీడీపీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న శ్రీనివాసులురెడ్డి కారణంగా పార్టీ తీవ్రంగా నష్టపోయిందన్నారు. ప్రధానంగా ఏళ్ల తరబడి పార్టీని నమ్ముకుని జెండాను మోసిన కార్యకర్తలకు తీవ్ర అన్యాయం జరిగిందన్నారు. కడప నగర కమిటీకి అధిష్టానం నుంచి ఆమోదం తెలుపలేదన్నారు. అయితే శ్రీనివాసులురెడ్డి అధిష్టానాన్ని ధిక్కరించి తాను నియమించుకున్న కమిటీని అఽధికారికంగా ప్రకటించడం దారుణమన్నారు. అలాగే జిల్లా కమిటీలో కూడా ఇష్టానుసారంగా పార్టీ ఫిరాయింపుదారులతో నింపేశారన్నారు. జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి ఈ కమిటీలను పరిశీలించి వాస్తవాలను గ్రహించి పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం చేయాలని కోరారు. -
ఉపాధి హామీ పథకానికి తూట్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : భారత జాతిపిత మహాత్మా గాంధీ పేరును జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి తొలగించి స్వాతంత్రోద్యమ స్ఫూర్తికి విఘాతం కలిగించే పద్ధతిలో ఎన్డీఏ ప్రభుత్వం వ్యవహరించడం దారుణమని సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర, జిల్లా కార్యవర్గ సభ్యుడు జి.వేణుగోపాల్ విమర్శించారు. సీపీఐ వందేళ్ల వార్షికోత్సవ వారోత్సవాల్లో భాగంగా ఆదివారం రామరాజుపల్లెలో సీపీఐ జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బ్రిటీష్ వారికి వ్యతిరేకంగా భారతదేశంలో సంపూర్ణ స్వాతంత్య్రం కావాలని పిలుపునిచ్చిన ఏకై క పార్టీ సీపీఐ అన్నా రు. దేశ స్వాతంత్య్ర పోరాటంలో పాల్గొన్న అనేక మంది త్యాగాలు చేశారని, జైలుకెళ్లారని, ప్రాణాలు సైతం తృణపాయంగా అర్పించారన్నారు. ఇలాంటి మహానుభావులను మోడీ ప్రభుత్వం విస్మరిస్తోందని మండి పడ్డారు. దేశంలో మతాల మధ్య చిచ్చు పెడుతూ దేశ సంపదనంతా అంబానీ, అదాని కార్పొరేట్ సంస్థలకు కట్టబెడుతున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో పలువురు సీపీఐ నాయకులు పాల్గొన్నారు. -
గాండ్ల తెలికుల హక్కుల సాధన కోసం పోరాటం
కడప ఎడ్యుకేషన్ : గాండ్ల తెలికుల హక్కుల సాధనే తమ ఎజండా అని హక్కుల సాధన కోసం ఎంతవరకై నా పోరాడుతామని అఖిల గాండ్ల తెలికుల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ల సంక్షేమ సంఘం(ఏజీటీయూపీఎస్ఎస్) రాష్ట్ర అధ్యక్షుడు వాకాటి హరికృష్ణ పేర్కొన్నారు. కడప నగరంలోని రాజరాజేశ్వరి ఆలయ ప్రాంగణంలో ఉన్న సమావేశం మందిరంలో ఆదివారం ఆంధ్రప్రదేశ్ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు కలకట విజయభాస్కర్ ఆధ్వర్యంలో సమావేశం జరిగింది. ఈ సందర్భంగా రాష్ట్ర అధ్యక్షుడు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉన్న అన్ని ప్రధాన ఆలయాల్లో గాండ్ల తెలికులకు పాలకమండలి చైర్మన్ పదవులు, డైరెక్టర్ పదవులు ఇచ్చేలా ప్రభుత్వం ప్రత్యేక జీఓ ఇవ్వాలన్నారు. అలాగే ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ పదవుల్లో కూడా గాండ్ల తెలికులకు కొన్ని సీట్లు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏపీ ఉద్యోగ ఉపాధ్యాయ పెన్షనర్ల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవాధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బగ్గిడి గోపాల్, మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య మాట్లాడుతూ సమాజంలో గాండ్ల తెలికులను కూడా అన్ని కులాలతో పాటు గుర్తించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏజీటీయూపీఎస్ఎస్ వ్యవస్థాపకుడు గిరి శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శి ముక్కెర హరినాథ్, ట్రెజరర్ యాదాటి శివప్రసాద్ , అనంతపురం జిల్లా అధ్యక్షుడు సిగిచర్ల నాగరాజు, జిల్లా గౌరవాధ్యక్షుడే కొసినేపల్లి శ్రీనివాసులు, రాష్ట్ర కోశాధికారి వీరపు లక్ష్మిపతి పాల్గొన్నారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
కడప కోటిరెడ్డిసర్కిల్ : నందలూరు– మంటపంపల్లి రైల్వే స్టేషన్ల మధ్య ఆదివారం ఉదయం ఓ వ్యక్తి రైలు నుంచి జారిపడి మృతి చెందాడు. రైల్వే పోలీసుల సమాచారం మేరకు.. కర్నూలు జిల్లా ఆస్పరి మండలం శంకరంబాడి గ్రామానికి చెందిన శ్రీనివాసులు(34) తిరుమల దర్శనం ముగించుకుని కేప్ పూణే ఎక్స్ప్రెస్ రైలులో స్వగ్రామానికి బయలుదేరాడు. మార్గమధ్యంలో రైలు నుంచి జారి కిందపడటంతో అక్కడికక్కడే మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గంజాయి ముఠా సభ్యుల అరెస్టు గుర్రంకొండ : గంజాయి ముఠా సభ్యులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి ఐదుకేజీల గంజాయిని పోలీసులు స్వాధీనం చేసుకొన్న సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ కథనం మేరకు గుర్రంకొండ పట్టణ పరిసరాల్లో గంజాయి విక్రయాలు జోరుగా జరుగుతున్నాయనే సమాచారం అందుకొన్న వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబుల ఆధ్వర్యంలోని రెండు వేర్వేరు పోలీసు బృందాలు ముమ్మరంగా గాలింపు చర్యలు చేపట్టాయి. ఆదివారం గ్రామానికి సమీపంలో గంజాయి విక్రయించేందుకు సిద్ధంగా ఉన్న ముఠా సభ్యులపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో మండలంలోని ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన కనగాని వెంకటరమణ (40), స్థానిక ఇందిరమ్మ కాలనీకి చెందిన గుటం సమీర్ (20), గుర్రంకొండ పట్టణం ఎస్ఎల్టీ వీధికి చెందిన షేక్ మహమ్మద్ సైఫ్ (19), తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లెకు చెందిన అరుణ్కుమార్ (19)లతో పాటు ఓ మైనర్ బాలుడిని అదుపులోకి తీసుకొని అరెస్టు చేసినట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. వారి వద్ద నుంచి ఐదు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకొని ముఠా సభ్యులపై కేసు నమోదు చేశామన్నారు. స్వాధీనం చేసుకొన్న గంజాయి విలువ రూ. లక్ష వరకు ఉంటుందన్నారు. గంజాయి ముఠా సభ్యుల్ని అదుపులోకి తీసుకోవడంలో మంచి ప్రతిభ కనబరిచిన వాల్మికిపురం సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ రవీంద్ర, హెడ్కానిస్టేబుల్ నాగరాజనాయక్లను ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించినట్లు ఆయన పేర్కొన్నారు. ముగ్గురు మండీ యజమానులకు నోటీసులు గుర్రంకొండ : ప్రభుత్వ నిబంధనలను పాటించని ముగ్గురు టమాటా మండీల యజమానులకు నోటీసులు జారీచేశామని వాల్మీకిపురం మార్కెట్ కమిటీ చైర్మన్ కోసూరి చంద్రమౌళి, వైస్ చైర్మన్ నౌషాద్ అలీ తెలిపారు. ఆదివారం స్థానిక మార్కెట్యార్డు ఉప కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడారు. మార్కెట్ కమిటీ నిబంధనల మేరకు మార్కెట్ యార్డుకు 8 కిలోమీటర్ల పరిధి వరకు ఎవరూ కూడా ప్రైవేట్ టమాటా మండీలను నిర్వహించకూడదన్నారు. అలా నిర్వహించే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకొంటామన్నారు. మదనపల్లె మార్కెట్యార్డులో జాక్పాట్లను ఫూర్తిగా రద్దు చేశారన్నారు. ఇదే విధానాన్ని ఇక్కడి మండీల యజమానులు పాటించాలన్నారు. కమీషన్లు పదిశాతం బదులు నాలుగు శాతం మాత్రమే తీసుకోవాలన్నారు. వచ్చేనెల నుంచి 25 కేజీల టమాటా క్రీట్ల స్థానంలో 15 కేజీల క్రీట్ల విధానాన్ని అమలు చేయాలన్నారు. ఈ సమావేశంలో మార్కెట్ కమిటీ ఇన్చార్జి కార్యదర్శి సునీల్, సిబ్బంది పాల్గొన్నారు. తండ్రి కోసం.. కుమారుడి మృతదేహం ఎదురుచూపుకురబలకోట : రోడ్డు ప్రమాదంలో గాయపడి ఆదివారం మృతి చెందిన కుమారుడి మృతదేహం సౌదీలోని తండ్రి రాక కోసం ఎదురు చూస్తున్న విషాదకర సంఘటన కురబలకోటలో చోటు చేసుకుంది. గ్రామస్తుల కథనం మేరకు..మండల కేంద్రం కురబలకోటకు చెందిన కె. తన్వీర్ (24) మూడు రోజుల క్రితం మదనపల్లి నుండి బైక్లో స్వగ్రామానికి వస్తూ మార్గ మధ్యంలోని గౌనివారిపల్లి వద్ద ప్రమాద వశాత్తు డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. మదనపల్లి జిల్లా ఆసుపత్రి నుండి మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ ఆదివారం మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని పోలీసులు కుటుంబీకులకు అప్పగించారు. జీవనోపాధి కోసం సౌదీలో ఉన్న తండ్రి కె. రెడ్డిబాషా రాక కోసం మృత దేహాన్ని ఇంటి వద్ద ఉంచారు. కుటుంబ సభ్యులను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. కురబలకోటలో విషాదం -
ఉపాధ్యాయులేమైనా యంత్రాలా!
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర విద్యాశాఖ కమిషనర్ ఉపాధ్యాయులను యంత్రాలుగా భావిస్తూ, నిరంతరం బోధనేతర కార్యక్రమాలతో విద్యా బోధనకు దూరం చేస్తూ వేధింపులకు గురిచేయడాన్ని ఆంధ్రప్రదేశ్ ఐక్య ఉపాధ్యాయ ఫెడరేషన్ (యూటీఎఫ్) తీవ్రంగా వ్యతిరేకిస్తోందని యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మాదన విజయకుమార్, పాలెం మహేష్ బాబు పేర్కొన్నారు. కడప యూటీఎఫ్ భవన్లో ఆదివారం జరిగిన జిల్లా కార్యవర్గ సమావేశంలో వారు మాట్లాడుతూ ఉపాధ్యాయులకు విద్యాశక్తి పేరుతో వందరోజుల ప్రణాళిక రూపొందించి, పండుగలు, సెలవు దినాలలో పనిచేయమనడం విడ్డూరంగా ఉందన్నారు. పదవ తరగతి విద్యార్థులకు ప్రతిరోజు పరీక్ష నిర్వహించి, అదే రోజు సాయంత్రానికల్లా మార్కులు ఆన్లైన్లో నమోదు చేయాలని ఒత్తిడి చేయడం సరైనది కాదన్నారు. ముస్తాబు కార్యక్రమం పేరుతో ఉపాధ్యాయులపై మరింత ఒత్తిడి పెంచుతున్నారన్నారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో ఉపాధ్యాయులకు తగినంత సమయం కేటాయించి నాణ్యమైన విద్యను విద్యార్థులకు అందించే ప్రణాళిక రూపొందించాలి కానీ ముస్తాబు, బోధనేతర పనుల ద్వారా ఉపాధ్యాయుల బోధన సమయాన్ని హరించే విధంగా ప్రణాళికలు రూపొందించడం వెనుక ప్రభుత్వ విద్యా రంగాన్ని పతనావస్థకు తీసుకు వెళ్లే ఆలోచన ఉన్నట్లు భావించవలసి వస్తుందని తెలిపారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎన్.నాగార్జున రెడ్డి, జిల్లా సహాధ్యక్షులు వై.రవికుమార్, డి.సుజాత రాణి, ట్రెజరర్ కె.నరసింహారావు, జిల్లా కార్యదర్శులు, రాష్ట్ర కౌన్సి ల్ సభ్యులు, వివిధ విభాగాల కన్వీనర్లు పాల్గొన్నారు. -
షూటింగ్బాల్ ఛాంపియన్షిప్లో జిల్లాకు తృతీయ స్థానం
మదనపల్లె సిటీ : రాష్ట్ర సీనియర్ షూటింగ్బాల్ ఛాంపియన్ షిప్ పోటీల్లో జిల్లా తృతీయ స్థానం దక్కించుకుంది. నెల్లూరు జిల్లా కావలిలో ఈనెల 25 నుంచి 26వ తేదీ వరకు జరిగిన రాష్ట స్థాయి పోటీల్లో జిల్లా జట్టు పాల్గొంది. మహిళల విభాగంలో 19 జట్లు పాల్గొన్నాయి, మూడో స్థానం కోసం జరిగిన పోటీలో అన్నమయ్య జిల్లా జట్టు కాకినాడ జట్టు తలపడ్డాయి. 21–15 స్కోరుతో మూడవ స్థానం దక్కించుకున్నట్లు షూటింగ్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి గౌతమి తెలిపారు. పురుషుల జట్టు కూడా సెమీఫైనల్స్ చేరుకుని కృష్ణ, పల్నాడు జిల్లాల జట్లుతో ఆడి నాలుగో స్థానంలో నిలిచిందన్నారు. క్రీడాకారులను జట్టు కోచ్ యూసఫ్, మేనేజర్ సుజాత, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్బాబు, సభ్యులు రెడ్డి శ్రీనివాస్, భారతి, సురేష్ తదితరులు అభినందించారు. -
ఆర్ఎస్ఎస్, బీజేపీతో రాజ్యాంగానికి ప్రమాదం
మదనపల్లె : దేశ అత్యున్నత రాజ్యాంగానికి బీజేపీ, ఆర్ఎస్ఎస్ వల్ల ప్రమాదం ఏర్పడిందని పలువురు వక్తలు ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం మదనపల్లిలో జరిగిన రాజ్యాంగ పరిరక్షణ సదస్సుకు హాజరైన హైకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సీపీఐ సెంట్రల్ కంట్రోల్ కమిషన్ చెర్మన్ డాక్టర్ కె.నారాయణ, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి. ఈశ్వరయ్య మాట్లాడారు. దేశ సంపదను కార్పొరేట్ ముసుగు వేసుకున్న దోపిడిదారులకు అప్పగిస్తున్నారని, సహజ వనరులు నాశనం చేస్తున్నారని ఆరోపించారు. ప్రశ్నించే ఆదివాసులను ఆపరేషన్ కగార్ పేరుతో బూటకపు ఎన్కౌంటర్లు చేస్తున్నారని అన్నారు. ఆపరేషన్ కగార్ కేవలం కార్పొరేట్ శక్తుల ప్రయోజనాల కోసమే అన్నారు. ప్రకృతి సంపదను అదానీకి దోచి పెట్టడానికి మోడీ ప్రభుత్వం కంకణం కట్టుకుందని విమర్శించారు. దేశ స్వాతంత్య్రం కోసం సీపీఐ నేతలు ఎన్నో నిర్బంధాలు, కుట్ర కేసులు ఎదుర్కొన్నారని, ఎంతో మంది ప్రాణాలు త్యాగం చేశారని వివరించారు. మోడీ ప్రభుత్వం ప్రజల ఆహారపు అలవాట్ల పైన, ధరించే దుస్తులపైన ఆంక్షలు విధిస్తూ, కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చులు పెడుతోందన్నారు. హిందుత్వం పేరుతో రాజకీయాలు చేస్తూ విద్వేషాలు రెచ్చగొడుతున్నారన్నారు. ఆర్ఎస్ఎస్, బీజేపీ నుండి భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రశ్నిస్తే అర్బన్ నక్సలైట్లని ముద్ర వేస్తారా సహజ సంపదను కొల్లగొట్టడానికే ఆపరేషన్ కగార్ మదనపల్లె సదస్సులో మాజీ న్యాయమూర్తి జస్టిస్ చంద్రకుమార్, సిపిఐ సెంట్రల్ కంట్రోల్ కమీషన్ చెర్మన్ నారాయణ, సిపిఐ రాష్ట్ర కార్యదర్శి జి ఈశ్వరయ్య -
జానపదంలో మేటి పరిశోధకుడు ‘పేటశ్రీ’
కడప ఎడ్యుకేషన్: జానపద పరిశోధనలో అనేక అంశాలను వెలుగులోకి తీసుకురావడమేగాక, విద్యార్థులచే పరిశోధనలు చేయించిన మేటి పరిశోధకులు ఆచార్య పేట శ్రీనివాసరెడ్డి అని మైదుకూరు తెలుగు అధ్యాపకుడు డాక్టర్.కోడూరు జయప్రకాశ్ అన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలోని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం నిర్వహిస్తున్న ’నెలనెలా సీమ సాహిత్యం’ 150వ సదస్సులో భాగంగా ’ఆచార్య పేట శ్రీనివాసరెడ్డి జీవితం– సాహిత్యం’ అనే అంశంపై ప్రసంగ కార్యక్రమం ఆదివారం బ్రౌన్శాస్త్రి సమావేశ మందిరంలో నిర్వహించారు.ఈ సందర్భంగా జయప్రకాశ్ మాట్లాడుతూ ఆచార్య పేట శ్రీనివాసులు రెడ్డి (పేటశ్రీ) కథారచయితగా, జానపద పరిశోధకులుగా, విమర్శకులుగా తనదైన శైలిలో సాహితీ వ్యాసంగాన్ని కొనసాగిస్తున్నారన్నారు. పేటశ్రీ జానపద సాహిత్యంపై విమర్శనా గ్రంథాలు రాయడమే కాక అనేక గేయాలను సంకలనం చేసి ప్రచురించారన్నారు. 150 కథలు, వివిధ పత్రికల్లో 230 వ్యాసాలు రాశారన్నారు. చిత్తూరు జిల్లా జానపద విజ్ఞానం, తెలుగు ఐతిహ్యాలు, తిరుపతి కథలు, తిరుమల కథలు, తిరుమల–తిరుపతి కథలు, గొబ్బి పాటలు, జానపద గేయాల్లో శ్రీకృష్ణుడు’ లాంటి అనేక రచనలు చేశారన్నారు. కార్యక్రమాన్ని సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్ చింతకుంట శివారెడ్డి సమన్వయం చేశారు. కార్యక్రమ ప్రారంభంలో వక్త డాక్టర్ కోడూరు జయప్రకాశ్ను సి.పి.బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రం సహాయ పరిశోధకులు డాక్టర్. చింతకుంట శివారెడ్డి, గ్రంథాలయ సహాయకులు జి.హరిభూషణరావు, జూనియర్ అసిస్టెంట్లు ఆర్.వెంకటరమణ, సిబ్బంది, ఎస్. సుబ్బరాయుడు, కొత్తపల్లె రామాంజనేయులు, కృష్ణానందం, కందిమళ్ల రాజారెడ్డి తదితరులు సత్కరించారు. కార్యక్రమంలో ప్రసాద్, చంద్రశేఖరరెడ్డి, శ్యామసుందర్ రెడ్డి, ముడియం కిశోర్ కుమార్, నాగిరెడ్డి, రఘునాథ రెడ్డి, మల్లేష్, దక్షిణామూర్తి, లక్ష్మిరెడ్డి, రమణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
● తాగుబోతుల లోకం
● ఆటో.. ఇటో.. ఎటో.. కడప నగరంలో రోజురోజుకు ఆటోల సంఖ్య పెరుగుతోంది. దీంతో ప్రధాన కూడళ్లలో ట్రాఫిక్ సమస్య ఏర్పడుతోంది. పాత బస్టాండ్, చెన్నూరు బస్టాండ్, వైవీ స్ట్రీట్, కృష్ణాసర్కిల్, సంధ్య సర్కిల్ ఆర్టీసీ బస్టాండ్, అప్సర సర్కిల్, బిల్టప్, ఐటీఐ వద్ద ట్రాఫిక్ సమస్య ముప్పుతిప్పలు పెడుతోంది. దీంతో ప్రజలు సమయానికి గమ్యం చేరలేక పోతున్నారు. ట్రాఫిక్ సమస్యపై అధికార యంత్రాంగం దృష్టి సారించాల్సి ఉంది.రాష్ట్రంలో నాణ్యమైన మందు పేరిట కల్తీ మద్యం అమ్మకాలు జరిగిన విషయం తెలిసిందే. మద్యం అమ్మకాలు పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం విచ్చలవిడిగా బార్లు, మద్యం షాపులకు అనుమతులు ఇచ్చింది. దీంతో మద్యానికి బానిసలుగా మారుతున్న వారు అధికమవుతున్నారు. ఫలితంగా వారిపై ఆధారపడిన కుటుంబాలు ఛిద్రమవుతున్నాయి. రాష్ట్ర ఖజానాకు ఆదాయం కావాలి. అంతే తప్ప ప్రజల ఆరోగ్యం ఏమైనా పట్టదు. దీంతో మందు బాబులు ఎక్కడ పడితే అక్కడ తప్ప తాగి రోడ్లపై పడిపోతున్నారు. నగరంలోని వివిధ ప్రాంతాల్లో కనిపించిన దృశ్యాలివి.– సాక్షి ఫొటోగ్రాఫర్, కడప -
మా కుమార్తె ఆచూకీ తెలపండి
ప్రొద్దుటూరు కల్చరల్ : వారం రోజులుగా కనిపించకుండా పోయిన తమ కుమార్తె ఆచూకీ తెలపాలని సీతం పల్లెకు చెందిన కొల్లుబోయిన వీరప్రతాప్, వెంకటలక్షుమ్మ దంపతులు కోరారు. స్థానిక ప్రెస్క్లబ్లో ఆదివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ తమ కుమార్తె ఈ నెల 20వ తేదీ రాత్రి 11 గంటల తర్వాత కనిపించకపోవడంతో అంతా వెతికామన్నారు. తర్వాత రోజు ఉదయం చాపాడు మండలం రామదాసుపల్లెకు చెందిన రాకేష్ అనే యువకుడు కిడ్నాప్ చేసినట్లు తెలిసిందన్నారు. ఈ విషయమై జిల్లా ఎస్పీని కలువగా మహిళా పోలీస్ స్టేషన్కు రెఫర్ చేశారన్నారు. వారం రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోలేదని, తమ కుమార్తె బతికుందో లేదో తెలియడం లేదని కన్నీటి పర్యంతమయ్యారు. ఇప్పటికై నా పోలీసులు తమ కుమార్తె ఆచూకీ కనుగొనాలని కోరారు. కడపలో అగ్నిమాపక శాఖ క్రీడలు కడప అర్బన్ : కడప నగరంలో అగ్నిమాపకశాఖ అధికారుల పర్యవేక్షణలో ఆదివారం క్రీడలను నిర్వహించారు. జిల్లా స్థాయిలో ఎంపికై న వారు ఈనెల 30వ తేదీన గుంటూరులో జరిగే రాష్ట్రస్థాయి క్రీడల్లో పాల్గొంటారు. అక్కడ ఎంపికై న వారిని రాజస్థాన్లో జరిగే నేషనల్ ఫైర్ సర్వీస్ గేమ్స్కు పంపిస్తామని కర్నూలు రేంజ్ ఆర్ఎఫ్ఓ భూపాల్ రెడ్డి తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎఫ్ఓ ధర్మారావు, ఏడీఎఫ్ఓ బసివి రెడ్డి, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని యువకుడి మృతిరాజుపాళెం : మండలంలోని అయ్యవారిపల్లె–టంగుటూరు గ్రామాల మధ్య ఆదివారం రాత్రి ఆర్టీసీ అద్దె బస్సు ఢీకొని రాజుపాళెం మండలం కొర్రపాడు గ్రామానికి చెందిన వంగల నూర్ బాషా (25) అనే యువకుడు మృతి చెందాడు. స్థానికులు, ఆయా గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు.. ఆళ్లగడ్డ నుంచి ప్రొద్దుటూరు వైపు వెళుతున్న ఆర్టీసీ అద్దె బస్సు టంగుటూరు వైపు వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ప్రమాదవశాత్తు ఢీ కొనడంతో యువకుడు అక్కడికక్కడే స్పృహతప్పి పడిపోయాడు. తీవ్రంగా గాయపడిన నూర్బాషాను 108 వాహనంలో ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందాడని తెలిపారు. సంఘటన స్థలానికి పోలీసులు చేరుకొని విచారిస్తున్నారు. కబ్జాలను అడ్డుకోండిసాక్షి టాస్క్ఫోర్స్ : బొమ్మవరం రెవెన్యూ పరిధిలోని సర్వే నంబర్లు 1107, 1109లో అగ్రవర్ణాల వారు దళితుల భూములను లాక్కుని కబ్జాలకు పాల్పడుతున్నారని, ఆ గ్రామ దళితులు పలుమార్లు రెవెన్యూ అధికారులకు విన్నవించుకున్నారు. క్షేత్రస్థాయిలో విచారించి అర్హులైన వారికి న్యాయం చేయాలని అధికారులను దళితవాడ గ్రామస్తులు కోరుతున్నారు. దాదాపు నాలుగు ఎకరాల భూమిలో చదును చేసి బోరు కూడా వేశారు. -
చంద్రబాబు పాలనలో బీసీలకు అన్యాయం
కడప కార్పొరేషన్ : చంద్రబాబు ప్రభుత్వంలో బీసీలకు తీవ్ర అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ అన్నారు. ఆదివారం పార్టీ కార్యాలయం వద్ద ఆయన మీడియాతో మాట్లాడుతూ బాబు జమానాలో బీసీల భవిష్యత్తు అంధకారంగా మారిందని, ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయకుండా బీసీలకు ద్రోహం చేస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వంలో బీసీలకు కనీసం ఉపముఖ్యమంత్రి పదవి కూడా ఇవ్వకపోవడం దారుణమన్నారు. 50 సంవత్సరాలు దాటిన బీసీలకు రూ. 4000 పింఛన్ ఇస్తానని ఇవ్వలేదని, బీసీలకు చట్టసభల్లో 33 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి, అసెంబ్లీలో తీర్మానం చేసి చేతులు దులుపుకున్నారన్నారు. స్థానిక సంస్థల్లో బీసీలకు 34 శాతం రిజర్వేషన్లు ఇస్తామని చెప్పిన హామీని గాలికి వదిలేశారన్నారు. బీసీలకు రక్షణ చట్టం తీసుకువస్తామని చెప్పి రక్షణ లేకుండా చేస్తున్నారని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వ బీసీ వ్యతిరేక విధానాలపై రాబోయే రోజుల్లో రాజీలేని పోరాటం చేస్తామని హెచ్చరించారు. -
అన్నమయ్యకు అన్యాయం చేయొద్దు
రాజంపేట : మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల ఖ్యాతిని నలుదిశలా ఇనుమడింప చేసేలా కొత్త జిల్లాల ఏర్పాటులో భాగంగా జిల్లాకు అన్నమయ్య నామకరణం చేస్తే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు అన్నమయ్య పేరు లేకుండా చేసేందుకు జరుగుతున్న ప్రతిపాదనలపై రాజంపేట ప్రాంతీయుల్లో ఆగ్రహ జ్వాలలు ఎగిసిపడుతున్నాయి. 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద.. ఆదివారం సాయంత్రం 108 అడుగుల అన్నమయ్య విగ్రహం వద్ద అన్నమయ్యకు అన్యాయం చేయవద్దంటూ చేసిన నినాదాలతో మార్మోగిపోయింది. రాజంపేట జిల్లా సాధన సమితి జాయింట్ యాక్షన్ కమిటీ నేతృత్వంలో ఉద్యమకారులు వినూత్న నిరసన తెలిపారు. అన్నమయ్య చరిత్ర కనుమరుగుచేయకండి.. రాజంపేట పార్లమెంటరీ కేంద్రంతో పుట్టిందని, సాగునీరు, తాగునీరు పుష్కలంగా ఉందని న్యాయవాదుల జేఏసీ నేత కొండూరు శరత్కుమార్రాజు అన్నారు. ఆదివారం అన్నమయ్య ఉద్యానవనంలో మీడియాతో మాట్లాడుతూ అన్నమయ్య పేరును తీసేయాలని ఆలోచన నిజమైతే చరిత్ర హీనులుగా మిగిలిపోతారన్నారు. అధికారుల మాటలను పక్కనపెట్టి, అన్నమయ్య సెంటిమెంట్ను గౌరవించి, పరిగణనలోకి తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో ఉద్యమకారులు పూలభాస్కర్, ప్రభాకర్నాయుడు, సికిందర్, నందకిషోర్గౌడ్, చల్లా సుధాకర్, రెడ్డయ్య, గుత్తా లతచౌదరి, కేఎంఎల్ నరసింహులు, కొండూరు విశ్వనాథరాజు, శివరామరాజు, జీవీసుబ్బరాజు తదితరులు పాల్గొన్నారు. కళ్లకు గంతలు కట్టుకుని.. అన్నమయ్య పేరు లేకుండానే చేస్తున్నారంటూ ఉద్యమకారులు కళ్లకు గంతలు కట్టుకొని నిరసన వ్యక్తంచేశారు. మోకాళ్లపై కూర్చుని వేడుకున్నారు.అన్నమయ్య విగ్రహం వద్ద వినూత్న నిరసన -
అక్రమంగా ఆన్లైన్ చేశారు
గ్రామ పొలం సర్వే నంబర్ 413లో 0.91 సెంట్ల భూమిని 50 ఏళ్ల క్రితం కొనుగోలు చేసి రిజిస్ట్రేషన్ చేసుకున్నాం. ఓర్సు చిన్నయ్య అనే వ్యక్తి బత్తుల తిరుపాలమ్మ అనే మహిళకు సర్వే నంబర్ 416,417లో కొంత భూమిని విక్రయించారు. రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లో పొరపాటున నా సర్వే నంబర్ 413 నమోదు చేశారు. ఈ పొరపాటును సవరించుకోవాలని బత్తల తిరుపాలమ్మ, నేను అనుకున్నాం. ఇంతలో తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి తిరుపాలమ్మ కుమారుడు శివకుమార్ను ఎగదోయడంతో డాక్యుమెంట్ సవరణ ఆగిపోయింది. నేను జాయింట్ కలెక్టర్ కోర్టులో కేసు వేయగా అది నడుస్తోంది. అలాగే 2021లో హైకోర్టులో రిట్ పిటిషన్ దాఖలు చేశాం. సర్వే నంబర్ 413లోని భూమి నా అనుభవంలోనే ఉన్నట్లు గతంలో తహసీల్దార్ ఇచ్చిన ఎండార్స్మెంట్ కూడా ఉంది. ఓవైపు రిట్ పిటీషన్, జేసీ కోర్టులో కేసు పెండింగ్లో ఉండగానే తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి నవంబర్లో శివకుమార్ పేరిట ఆన్లైన్ చేశారు. ఆ భూమిని తహసీల్దార్ ప్రత్యేక శ్రద్దతో తుపాకుల ప్రసాద్ అనే వ్యక్తికి రిజిస్ట్రేషన్ కూడా చేయించారు. పలుమార్లు నా సమస్యను అధికారులకు తెలిపినా పట్టించుకోలేదు. – గంపా చలపతి, నరసింగుపల్లె, పోరుమామిళ్ల మండలం గ్రామ పొలం సర్వే నంబర్ 205/5లో 2.13 ఎకరాల భూమి నా పేరిట ఉంది. 2012లో సబ్ డివిజన్ కూడా జరిగింది. నా భర్త జి.శ్రీనివాసులు ప్రొద్దుటూరు టూ టౌన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు. కాగా, మా భర్త అన్న హద్దులు చెరిపేసి మా భూమి ఆక్రమించారు. సర్వే చేసి హద్దులు నిర్దారించాలని ఆరుసార్లు చలనా కట్టగా, ఆరుసా ర్లు మా బావకు నోటీసులు ఇచ్చారు. అయితే తహసీల్దార్ చంద్రశేఖర్రెడ్డి, సర్వేయర్ కోనయ్య, వీఆర్వో సుబ్రమణ్యం సర్వే జరగకుండా అడ్డు పడుతున్నారు. మా భూమిలో అక్రమంగా ఏర్పాటు చేసిన ట్రాన్స్ఫార్మర్ విషయంపై విద్యుత్ అధికారులకు ఫిర్యాదు చేశాను. దీంతో ఆగ్రహించిన మా బావ మా ఇల్లు కూల్చి వేయించారు. ఎస్ఐ కేసు తీసుకోలేదు. మైదుకూరు డీఎస్పీకి ఫిర్యాదు చేయడంతో కేసు నమోదైంది. అయితే మాపైన కౌంటర్ కేసు నమోదు చేయించారు. – రమణమ్మ, రామేశ్వరం, పోరుమామిళ్ల -
వైకుంఠద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తి
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో మంగళవారం వైకుంఠ ఏకాదశి సందర్భంగా వైకుంఠ ద్వార దర్శనానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఉత్తర ద్వారం నుంచి సీతారామలక్ష్మణులను దర్శించుకునే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. చంటిపిల్ల తల్లులు, వయోవృద్ధుల కోసం ప్రత్యేక చర్యలు తీసుకోనున్నట్లు ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, టీటీడీ ఆలయ సివిల్ విభాగం ఏఈ అమర్నాథ్రెడ్డి తెలిపారు. కాల్ సెంటర్ సేవలను వినియోగించుకోండి కడప సెవెన్రోడ్స్ : ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం ఇప్పటికే ప్రారంభించిన మీ కోసం కాల్ సెంటర్ 1100 సేవలను వినియోగించు కోవాలని డీఆర్వో విశ్వేశ్వర నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు తమ ఫిర్యాదులకు సంబంధించిన సమాచారం తెలుసుకోవడానికి 1100 నంబర్కు కాల్ చేయవచ్చునన్నారు. పాత పీజీఆర్ఎస్లో నిర్వహణ ప్రజల నుంచి ఫిర్యాదులను స్వీకరించి వాటిని పరిష్కరించే ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)ను ఈ సోమవారం పాత పీజీఆర్ఎస్లో నిర్వహిస్తున్నట్లు డీఆర్వో తెలిపారు. అర్జీదారులు‘మీకోసం.ఏపీ.జీఓవీ.ఇన్’వెబ్సైట్లో తమ అర్జీలను నమోదు చేసుకోవచ్చన్నారు. డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమం డయల్ యువర్ కలెక్టర్ కార్యక్రమాన్ని సోమవారం ఉదయం 9.30 నుంచి 10.00 గంటల వరకు జరుగుతుందని డీఆర్వో తెలియజేశారు. ప్రజలు 08562–244437 ల్యాండ్ లైన్ నంబరుకు ఫోన్ చేసి తమ సమస్యలను విన్నవించుకోవచ్చని డీఆర్వో పేర్కొన్నారు. సాక్షి కథనంపై ‘రెవెన్యూ’లో కదలిక – నీటి మునక ప్రాంతం పరిశీలించిన అధికారులు కడప కార్పొరేషన్ : జిల్లా కేంద్రమైన కడపలో కొత్త కలెక్టరేట్కు కూతవేటు దూరంలో అత్యంత విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం అవుతున్న వైనంపై ఈనెల 28వ తేది ‘బాబోయ్ బూచోళ్లు’ శీర్షికతో సాక్షి ప్రచురించిన కథనంపై రెవెన్యూ శాఖలో కదలిక వచ్చింది. తహసీల్దార్ ఆదేశాల మేరకు ఆదివారం డిప్యూటీ తహసీల్దార్, ఆర్ఐ, వీఆర్ఓ లు ఎన్టీఆర్ నగర్ వద్దనున్న ప్రభుత్వ భూమి (నీటి మునక) ప్రాంతాన్ని పరిశీలించారు. ఇక్కడ వంక వెంబడి గతంలో నిర్మించిన అక్రమ కట్టడాలకు తహసీల్దార్ శివరామిరెడ్డి ఉన్న సమయంలో మార్కింగ్ వేసి కొన్నింటిని కూల్చివేశారు. తాజాగా కాలువకు అడ్డంగా మరికొన్ని ఆక్రమ కట్టడాలు పుట్టుకొచ్చినట్లు తెలుస్తోంది. చిన్నచౌకు గ్రామ పొలం సర్వే నంబర్లో సుమారు 8 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది రెవెన్యూ రికార్డుల్లో నీటి మునక, వంక పొరంబోకుగా ఉంది. దీనిపై ప్రైవేటు వ్యక్తులకు, రెవెన్యూ శాఖకు మధ్య చాలా ఏళ్లుగా కోర్టు కేసు కూడా నడుస్తున్నట్లు తెలుస్తోంది. కోట్లు విలువజేసే ఈ భూమిపై అ ధికార పార్టీ నేతల కన్ను పడింది. దీన్ని ఎలాగైనా సొంతం చేసుకునేందుకు పలు మార్గాల్లో ప్రయత్నాలు చేస్తున్నట్లు తెలిసింది. దీనికి స్థానిక ఎమ్మెల్యే, ఆ పార్టీ నేతల అండదండలు ఉన్నట్లు తెలుస్తోంది. శనివారం అధికారులు జరిపిన పరిశీలనలో కూడా వారు తమ వద్ద పొజిషన్ పత్రాలు ఉన్నాయని చెప్పినట్లు సమాచారం. -
కులాలు విస్మరించి ఐక్యత చాటాలి
పోరుమామిళ్ల : వేలాది సంవత్సరాల చరిత్ర కలిగిన హిందూ సమాజంలో కుల వివక్షకు స్థానం లేదని, 17 వ శతాబ్దంలో ఆంగ్లేయులు దేశంలో ప్రవేశించాకే విభేదాలు చోటు చేసుకున్నాయని స్వామి శివరామానందసరస్వతి, సూర్యనారాయణ(హైదరాబాద్), కిషోర్ (ధర్మవరం), శ్రీమతి భక్తవత్సల పేర్కొన్నారు. కులాల మధ్య విభేదాలు విస్మరించి హిందువులంతా ఐక్యంగా ఉండాలని అన్నారు. ఆదివారం పోరుమామిళ్ల పద్మావతి కల్యాణ మండపంలో జరిగిన హిందూ సమ్మేళన సభలో వారు మాట్లాడారు. కులం ఇంట్లోనే ఉండాలని, గడప దాటితే అందరం హిందువులమని, కులాల అడ్డుగోడలు ఉండకూడదన్నారు. హిందూ ధర్మ రక్షణ కోసం ఛత్రపతి శివాజీలాగా, వివేకానందుడిలాగా ధర్మపోరాటం చేయాలని కోరారు. అంతకు ముందు పట్టణ ఉత్తర శివారులోని శ్రీ అభయాంజనేయ స్వామి దేవస్థానం నుంచి పట్టణ దక్షణ శివారులోని పద్మావతి కల్యాణ మండపం వరకు ప్రదర్శన సాగింది. కళాకారులు కోలాటం చేస్తుండగా పలు పాఠశాలల విద్యార్థులు సీతారాములు, లక్ష్మణ, హనుమంత, శివుడు, భరతమాత, ఛత్రపతి, రాణిరుద్రమ, వివేకానందల వేషధారణలతో ఆకట్టుకున్నారు. ర్యాలీలో వివిధ గ్రామాల నుంచి వేలాదిమంది పాల్గొన్నారు. మహిళలు భారీ స్థాయిలో పాల్గొనడం పోరుమామిళ్ల చరిత్రలో ఇదే మొదటి సారి. పోరుమామిళ్లలో హిందూ సమ్మేళనం -
●యూరియా కోసం పాట్లు..
● ఈ ఏడాదంతా రైతులకు కష్టాలే ● చంద్రబాబు సర్కార్ నిర్లక్ష్యం.. రైతులకు శాపం ● యూరియా దొరకక అవస్థలు కడప అగ్రికల్చర్ : పట్టెడన్నం పెట్టే రైతన్నలకు ఈ ఏడాది కాలం కలిసిరాలేదు. ఖరీఫ్, రబీ రెండు సీజన్లలోనూ కష్టాల కడలిలో ఎదురీదారు. ఆరుగాలం పడిన రెక్కల కష్టం ప్రకృతి కన్నెర్రతో పంటలన్నీ వర్షార్పణం అయ్యాయి.పెట్టుబడులు రాక భారీగానష్టపోవాల్సి వచ్చింది. దీనికితోడు చంద్రబాబు సర్కార్ నిర్వాహకంతో మరింత ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వచ్చింది. ఖరీఫ్ సీజన్లో అకాల వర్షాలు రైతులను నిండా ముంచేశాయి.పంటలకు గిట్టుబాట ధరలు కూడా లేకపోవడంతో మరింత నష్టపోవాల్సి వచ్చింది. రబీ సీజన్లో సకాలంలో వర్షాలు లేక సాగు మందకొడిగా సాగుతోంది. మొత్తంగా చూస్తే ఈ ఏడాది రైతులకు సరిగా కలిసి రాలేదు. సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో... జిల్లాలో సెప్టెంబర్, అక్టోబర్ నెలల్లో కురిసిన ఎడతెరిపి లేని వర్షాల కారణంగా పలు పంటలకు నష్టం వాటిల్లింది. మోంథా తుపాను వల్ల కురిసిన వర్షాలకు వరిపంట నేలకొరిగింది. చిరుపొట్ట దశలో ఉన్న పంటంతా దెబ్బతిని తాలు గింజలు ఏర్పడ్డాయి. కొన్ని కోట్ల వరికంకి సుంకు కాలిపోయి పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. వరితోపాటు వేరుశనగ, మినుము, కంది, మొక్కజొన్నకు సంబంధించి 2242.7 ఎకరాల్లో, అలాగే ఉల్లిపంటకు 158 హెక్టార్లలో నష్టం జరిగింది. మోంథా తుపాను కారణంగా కురిసిన వరుస వర్షాలతో జిల్లాలో 7500 ఎకరాల్లో పంటలు దెబ్బతిన్నాయి. పంట నష్టానికి సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికీ ఒక్క రుపాయి కూడా విదల్చలేదు. తర్వాత కురిసిన అధిక వర్షాల వల్ల కూడా పంటలు దెబ్బతిన్నాయి. పెట్టుబడులు కూడా రాలేదని రైతులు వాపోతున్నారు. ఏది ఏమైనా ఈ ఏడాది రైతులకు కలిసి రాలేదు. ఉల్లిపంట ఊడ్చిపెటుకుపోయింది.. జిల్లాలో ఉల్లి రైతుల పరిస్థితి దయనీయం. జిల్లావ్యాప్తంగా దాదాపు 12 వేల ఎకరాల్లో ఉల్లిపంటను సాగు చేశారు. పంట చేతికొచ్చే సమయంలో కురిసిన వర్షాలకు నష్టపోయారు. చాలా మందికి సాగు ఖర్చులు కూడా రాలేదు. చంద్రబాబు సర్కార్ మాత్రం జిల్లాలో రెండు ఉల్లి కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేస్తామని చెప్పి మాట తప్పంది. దీనిపై వామ పక్షాలు అందోళన చేసినా ఫలితం లేకుండా పోయింది. దీనికి తోడు క్వింటాకు రూ.1200 మద్దతు ధర ప్రకటించినా ఉల్లి కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడంతో ఆ ధరకు కొనుగోలు చేసే వాళ్లు లేక రైతులు నష్టాపోయారు. చివరకు క్వింటా ధర రూ. 400 నుంచి రూ.200కు పడిపోయింది. దీంతో రైతులు పంటను పొలంలోనే వదిలేశారు. ఏది ఏమైనా ఈ ఏడాది ఉల్లిరైతు పూర్తిగా నష్టపోయారు. రాష్ట్ర ప్రభుత్వం మాత్రం వర్షాలకు దెబ్బతిన్న రైతులకు హెక్టారుకు రూ. 50 వేలు ఇస్తామని చెప్పి కర్నూలు జిల్లాకు ప్రకటించింది. రైతులు ఆందోళన చేయడంతో కడప జిల్లాకు కూడా ఇస్తామని ప్రకటించింది. కానీ ఇంతవరకు ఒక్క రైతుకు కూడా చెల్లించలేదు. ఆర్బీకే వ్యవస్థ నిర్వీర్యం... విత్తు నుంచి పంట ఉత్పత్తుల విక్రయం వరకు రైతులకు అన్ని విధాలా అండగా ఉండేందుకు అప్పటి జగన్ ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటు చేసింది. చంద్రబాబు సర్వార్ అధికారంలోకి రాగానే వాటి పేర్లను రైతు సేవా కేంద్రాలుగా మార్చింది. కానీ పేరుకు తగ్గ సేవ మాత్రం అందించలేక పోయింది. దీనికితోడు రేషనలైజేషన్ పేరుతో కొన్ని రైతు భరోసా కేంద్రాలను మూసి వేసింది. మిగిలిన వాటిని ఇతర సేవా కార్యక్రమాలకు వినియోగిస్తున్నారు. దీంతో లక్ష్యం నీరుగారి పోయింది. ఉచిత పంటల బీమాకు మంగళం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమలు చేసిన ఉచిత పంటలబీమా పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం ఎత్తివేయడంతో ప్రీమియం భారాన్ని రైతులే మోయాల్సి వచ్చింది. ప్రీమియం ఎప్పుడు చెల్లించాలో తెలియక చాలా మంది రైతులు సకాలంలో ప్రీమియం చెల్లింకలేకపోయారు. గత వైఎస్సార్సీసీ పాలనలో ప్రభుత్వమే ప్రీమియం చెల్లించింది.అన్నదాతలు ఎలాంటి దిగులు లేకుండా ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం గదెనెక్కగానే ఉచిత పంటల బీమాకు చెల్లు చీటి పాడింది. ఆరుతడి పంటలైన అరటి, ఉల్లి, టమాట పంటలకు గిట్టుబాటు ధర కల్పించలేదు. దీనికి తోడు సాధారణ రైతులకు కూడా ఒక ఏడాది అన్నదాత సుఖీభవ నిధులను ఎగరకొట్టారు. అలాగే కౌలు రైతులకు మెండిచేయి చూపిస్తూ అన్నదాత సుఖీభవ పథకం వర్తింప చేయక పోవడంతో వారు పూర్తిగా నష్టపోయారు. ఇలా 2025 జిల్లా రైతుల పాలిట చీకటి సంవత్సరంగా మారింది. వర్షాభావంతో ఎండిపోయిన పంటను దున్నేస్తున్న రైతు(ఫైల్) మోంథా తుపాను వర్షాలకు నీటి మునిగిన వరిపంట(ఫైల్) ఖరీఫ్ సీజన్లో యూరియా కోసం రైతులు పడరాని పాట్లు పడ్డారు. గతంలో ఎన్నడూ లేని విధంగా షాపులు, రైతు సేవా కేంద్రాలు, సొసైటీల వద్ద పడిగాపులు కాయాల్సి వచ్చింది.అయినా ఒక్కో రైతుకు ఒక బస్తా మాత్రమే ఇచ్చారు. అది సరిపోక బ్లాకులో కొద్దామంటే దొరకక చాలా ఇబ్బందులు పడ్డారు. యూరియా కోసం అందోళనలు కూడా చేశారు. అయినా ప్రభుత్వం సరిగా సరఫరా చేయలేక చేతులెత్తేసింది. చివరకు కొంతమంది రైతులు బ్లాకులో కొనుక్కొని అవసరాలను తీర్చుకున్నారు. -
సమస్యలకేదీ పరిష్కారం?
కడప సెవెన్రోడ్స్ : ప్రతి సోమవారం కలెక్టరేట్లో నిర్వహిస్తున్న ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ఓ ప్రహసనంగా మారింది. క్షేత్ర స్థాయిలో పరిష్కారం లభించకపోవడంతో కలెక్టర్కు మొర పెట్టుకుంటే సమస్యలు తీరుతాయన్న కొండంత ఆశతో వ్యయ ప్రయాసలు కోర్చి జనం గ్రీవెన్స్కు బారులు తీరుతున్నారు. అధికారుల ఎదుట తమ సమస్యలు ఏకరువు పెడుతున్నారు. ఫిర్యాదులు అధికంగా వచ్చే మొదటి పది శాఖల్లో రెవెన్యూ అగ్రగామిగా ఉంటోంది. మొత్తం వచ్చే ఫిర్యాదుల్లో భూమి సమస్యలే అత్యధికంగా ఉంటున్నాయి. పీజీఆర్ఎస్ ఫిర్యాదులు కుప్పలు తెప్పలుగా పేరుకుపోతున్నాయే తప్ప పరిష్కారానికి నోచుకోవడం లేదు. అర్జీల పరిష్కారానికి సంబంధించి అధికారులు చూపెడుతున్న గణాంకాలు క్షేత్ర స్థాయి వాస్తవాలకు బిన్నంగా ఉన్నాయి. ఆర్థికేతర అంశాలు సైతం పరిష్కారం కావడం లేదు. దీర్ఘకాల భూ సమస్యలు పరిష్కరించేందుకంటూ బుధవారం ఏర్పాటు చేస్తున్న ప్రత్యేక పీజీఆర్ఎస్ వల్ల కూడా ఫలితం కనిపించడం లేదు. జవాబుదారి తనం, పారదర్శకత, గడువులోపు అర్జీల పరిష్కారం వంటివి మాటలకే పరిమితం అవుతున్నాయి. దీంతో అర్జీదారులు వచ్చిన వారే మళ్లీ గ్రీవెన్స్కు రావడం సర్వసాధారణంగా మారింది. రెవెన్యూ క్లినిక్స్, జీరో టాలెరెన్స్ విధానం, ఆడిట్ వంటి పొద్దుపోని మాటలతో ప్రభుత్వం, అధికారులు ప్రజలను భ్రమల్లో ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. భూమి సమస్యలే అత్యధికం రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్ఓఆర్)కు సంబంఽధించి భూమి స్వభావం, వర్గీకరణ, విస్తీర్ణ సవరణకు సంబంధించిన అర్జీలు అధికంగా ఉంటున్నాయి. తర్వాత మ్యూటేషన్స్, ఇంటిపట్టాలు, రీ సర్వేకు సంబంధించి ఆర్ఓఆర్ డేటా సవరణలు, నిరుపేదలు, మాజీ సైనికులకు ప్రభుత్వ భూముల అసైన్మెంట్, ప్రభుత్వ పోరంబోకు భూముల ఆక్రమణలు వంటి సమస్యలు అధికంగా ఉన్నాయి. ముఖ్యంగా పోరుమామిళ్ల, బ్రహ్మంగారిమఠం, బద్వేలు, కాశినాయన, గోపవరం మండలాల నుంచి అధికంగా ఫిర్యాదులు వస్తున్నాయి. రెవెన్యూ అధికారులే కబ్జాలను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. పోరుమామిళ్ల మండలంలో బెంగళూరు–విజయవాడ గ్రీన్ఫీల్డ్ హైవే సమీపంలో సర్వే నంబర్ 72లో ఆర్ఎస్ఆర్ దాఖలా మేరకు 146 ఎకరాల భూమి ఉన్నట్లు తెలుస్తోంది. అయితే ఆ భూమిని సర్వే నంబర్ 73 అని చూపెట్టి ఇతరుల పేరుతో ఆన్లైన్ చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. కొందరు ఈ విషయంపై హైకోర్టులో రిట్ పిటీషన్ సైతం దాఖలు చేసినట్లు చెబుతున్నారు. పోరుమామిళ్లమండలంలో మచ్చుకు రెండు సమస్యలను పరిశీలిస్తే... ప్రహసనంగా పీజీఆర్ఎస్ పేరుకుపోతున్న ఫిర్యాదులు భూ సమస్యలే అత్యధికం -
రాయచోటిలో బంద్ ప్రశాంతం
● స్వచ్ఛందంగా దుకాణాలు మూత ● రాయచోటిని అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉంచాలని ఉధృతమైన ఆందోళనలు రాయచోటి : అన్నమయ్య జిల్లా కేంద్రంగా రాయచోటిని తొలగించి జిల్లాలోని నియోజకవర్గ కేంద్రాలను దిక్కుకొకటి చొప్పున కలుపుతున్నారన్న వార్తల ప్రచారంపై రాయచోటిలో ఆందోళనలు ఉధృతమయ్యాయి. చంద్రబాబు ప్రభుత్వం తీసుకుంటున్న నిర్ణయంపై రాయచోటిలో ఒక్కసారిగా నిరసనలు, ఆందోళనలు మిన్నంటాయి. రెండురోజులుగా ప్రజలు రోడ్లమీదకు వచ్చి తమ నిరసనను తెలియజేస్తున్నారు. జిల్లా సాధన కమిటీ ఆధ్వర్యంలో ఆదివారం తలపెట్టిన రాయచోటి బంద్ ప్రశాంతంగా ముగిసింది. వ్యాపారులు స్వచ్ఛందంగా దుకాణాలు మూసి బంద్కు సంపూర్ణ మద్దత్తును ప్రకటించారు.ఉద్యోగులు, ప్రజా సంఘాలు పలు రాజకీయ పార్టీల నేతలు బంద్కు మద్దతుగా నిలిచారు. బంద్ ప్రభావంతో ఉదయం పది గంటల వరకు బస్సుల రాకపోకలు ఆగిపోయాయి. జిల్లా సాధన సమితి ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీ రాయచోటిలోని శివాలయం చెక్ పోస్టు నుంచి చిత్తూరు జాతీయ రహదారి మీదుగా నేతాజీ సర్కిల్ వరకు సాగింది. అన్ని వర్గాల ప్రజలు ర్యాలీలో పాల్గొన్నారు. ర్యాలీ అనంతరం ఆర్టీసీ బస్సులు తిరిగాయి. జిల్లా విభజన చేయాలన్న ఆలోచన కూటమి నేతల కుట్రలో భాగమేనని ప్రజా సంఘాల నాయకులు విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం తన నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని వైఎస్సార్సీపీ నాయకులు, ఉద్యోగ, ప్రజా సంఘాలతోపాటు కూటమి పార్టీలోని నేతలు సైతం ప్రకటనల ద్వారా బహిర్గతం అవుతున్నారు ఈ నిర్ణయాన్ని వెనక్కు తీసుకోకపోతే ఆత్మహత్యలకై నా సిద్ధమని యువకులు సోషల్ మీడియా వేదికగా హెచ్చరిస్తున్నారు. శనివారం సాయంత్రం ఇద్దరు యువకులు విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. రానున్న రోజుల్లో అన్నమయ్య జిల్లా కేంద్రం విషయంపై ఆదోళనలను ఉధృతం చేసి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జిల్లా సాధన కమిటీ నాయకులు చెబుతున్నారు. -
ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంచుకోవాలి
కడప కోటిరెడ్డిసర్కిల్ : పోలీసు అధికారులు, సిబ్బంది తమ విధుల్లో వినియోగిస్తున్న ఆయుధాల పనితీరుపై పరిజ్ఞానం పెంపొందించుకోవాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో కడప నగర శివార్లలోని ఫైరింగ్ రేంజ్లో శనివారం పోలీసు అధికారులకు వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్పీ వార్షిక ఫైరింగ్ ప్రాక్టీస్లో పాల్గొన్నారు. ఆయుధ నైపుణ్యాలను పరీక్షించారు. ఫైరింగ్ ప్రాక్టీస్లో పోలీసులు విధుల్లో వినియోగించే ఆయుధాలతో ఫైరింగ్ చేయించారు. ఫైరింగ్లో ప్రతిభ కనబరిచిన పోలీసు అధికారులను, సిబ్బందిని అభినందించారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ ఫైరింగ్లో ప్రతి ఒక్కరు పాల్గొని మెలకువలు నేర్చుకోవాలన్నారు. శాంతి భద్రతల పరిరక్షణలో పోలీసుల సేవలు చాలా కీలకమని, అత్యవసర సమయాల్లో ప్రజల మాన, ధన, ప్రాణ రక్షణ కోసం ఎల్లవేళలా సంసిద్ధులై ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ అడిషనల్ ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, జిల్లాలోని డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ -
సకాలంలో పనులు పూర్తి చేయాలి
కడప ఎడ్యుకేషన్ : రాష్ట్ర, జిల్లా కార్యాలయం నుంచి వచ్చే పనులను సీఆర్ఎంటీలు సకాలంలో పూర్తి చేయాలని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ షేక్ షంషుద్దీన్, సమగ్రశిక్ష ప్రాజెక్టు కోఆర్డినేటర్ ఎస్.ప్రేమంత కుమార్ ఆదేశించారు. శనివారం కడప నగరంలోని జిల్లా పరిషత్ బాలికల ఉన్నత పాఠశాలలో జిల్లాలోని 36 మండలాలకు సంబంధించిన సీఆర్ఎం టీచర్లకు సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ విజయ్ భాస్కర్ ఆధ్వర్యంలో సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ కార్యాలయం నుంచి వచ్చే పనుల పైన ఒక్క రోజు ఓరియంటేషన్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖ అధికారి మాట్లాడుతూ సమగ్ర శిక్ష, విద్యాశాఖకు సంబంధించిన ప్రతి ప్రతి రిపోర్టు సీఆర్ఎం టీచర్ల ద్వారానే జరుగుతున్నాయన్నారు. 90 శాతం పనులు సకాలంలో జరుగుతున్నాయని మిగిలిన 10 శాతం కూడా త్వరితగతిన పూర్తి చేయాలని ఆదేశించారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ ప్రేమంత్కుమార్ మాట్లాడుతూ సీఆర్ఎం టీచర్లు తమ క్లస్టర్ పరిధిలో పూర్తి సమాచారాన్ని తమ దగ్గర క్రోఢీకరించుకొని ఉండాలని సూచించారు. ప్రధానమంత్రి పరీక్షా పే చర్చ జిల్లా నోడల్ ఆఫీసర్, డైట్ లెక్చరర్ గిరిబాబు మాట్లాడుతూ పరీక్షపై చర్చ 2026కు సంబంధించి ఉపాధ్యాయలు విద్యార్థుల తల్లిదండ్రులతో రిజిస్ట్రేషన్ చేయించాలని సూచించారు. సెక్టోరియల్ అధికారులు విజయ భాస్కర్, నరసింహరాజు, రమణమూర్తి, ఉపేంద్ర యాదవ్ తదితరులు మాట్లాడారు. -
రాతపై పట్టు.. మార్కులు రాబట్టు
● చేతిరాత పరీక్షల్లో ‘కీ’లకం ● టెన్త్, ఇంటర్ పరీక్షలకు ఆసన్నమైన సమయం ● విద్యార్థులు దస్తూరిపై సాధన చేయాలంటున్న నిపుణులు ● ప్రభుత్వ పాఠశాలల్లో చేతిరాతపై సాధన చేయిస్తున్న ఉపాధ్యాయులురాజంపేట టౌన్ : టెన్త్, ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలకు టైమ్టేబుల్ కూడా వచ్చేసింది. అత్యుత్తమ మార్కులు సాధించి మంచి గ్రేడింగ్ పాయింట్లతో ఉత్తీర్ణత సాధించాలన్న లక్ష్యంతో అనేక మంది విద్యార్థులు ఓ ప్రణాళికను సైతం రూపొందించుకొని చదవడం ప్రారంభించారు. అయితే ఏడాది పాటు చదివిన విషయాలను జవాబు పత్రంపై రాసే విధానం వల్ల కూడా మార్కులు, గ్రేడింగ్ పాయింట్లు ఆధారపడి ఉంటాయి. అయితే ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించే విద్యార్థులు తక్కువ మంది మాత్రమే ఉంటారు. విద్యార్థులు పరీక్షల్లో ప్రశ్నలకు సమాధానాలు రాయడం ఎంత ముఖ్యమో చేతిరాత కూడా అంతే ముఖ్యమన్న విషయాన్ని గుర్తుంచుకోవాలని చేతిరాత నిపుణులు సూచిస్తున్నారు. చేతిరాత బాగుంటే మూల్యాంకనం చేసే వారికి సులువుగా అర్థమవుతుంది. ఫలితంగా మంచి మార్కులు వేస్తారు. చేతిరాత బాగాలేకపోతే మూల్యాంకనం చేసే వారికి సమాధానం అర్థం కాకుంటే ఒకమార్కు లేదా అర్ధ మార్కు అయినా తగ్గే అవకాశం ఉంటుంది. ఇది గ్రేడింగ్ పాయింట్స్పై ప్రభావం చూపే అవకాశముంది. అందువల్ల విద్యార్థులు చేతిరాతపై ప్రత్యేక దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ఇంటర్మీడియట్ పరీక్షలకు రెండు నెలలలోపే సమయం ఉండగా, టెన్త్ పరీక్షలకు రెండు నెలలకు పైగా సమయం ఉన్నందున విద్యార్థులు రోజుకు అర్ధగంట అయినా చేతిరాతపై సాధన చేయాలని నిపుణులు సూచిస్తున్నారు. పరీక్షల్లో చేతిరాత ఎలా ఉండాలో నిపుణుల మాటల్లోనే.. ● ప్రతి విద్యార్థి ఆన్సర్షీట్ (బుక్లెట్)లో సమాధానాలను స్పష్టంగా రాయాలి. ● నాలుగు వైపులా మార్జిన్లు (బార్డర్లు) వేసుకుంటే చూసేందుకు అందంగా ఉంటుంది. ● ఒక లైనుకు మరో లైనుకు సెంటీమీటర్ గ్యాప్ ఇవ్వాలి. ● పదానికి, పదానికి తగనంత (ఒకటి లేదా రెండు అక్షరాల) స్పేస్ ఇవ్వాలి. ● బుక్లెట్లో వాక్యాలు పైకి కిందకు లేకుండా వరుస క్రమంలో ఉండాలి. ● కంటికి, పేపరుకు 30–35 సెంటిమీటర్ల దూరం ఉండాలి. ● బొటన వేలు, మూడవ వేలికి మధ్య చూపుడు వేలు సహాయంతో పెన్నును చక్కగా పట్టుకోవాలి. ఇలా చేయడం వల్ల రాసే సమయంలో పెన్ను స్పీడుగా ముందుకు కదులుతుంది. ● ముఖ్యంగా పరీక్షల సమయంలో విద్యార్థులు తగినంత విశ్రాంతి తీసుకోవాలి. విశ్రాంతి లేకుంటే ఆ ప్రభావం చేతిరాతపై కూడా పడుతుంది. ● మనసు ప్రశాంతంగా ఉంటే చేతిరాత చక్కగా వస్తుంది. -
ముందస్తు నోటీసులు లేకుండా బండ చప్పట ధ్వంసం
చాపాడు : తమ కుటుంబానికి ఎలాంటి ముందస్తు నోటీసులు లేకుండా ఇంటి వద్ద ఉన్న బండ చప్పటను జేసీబీ పెట్టి టీడీపీ నాయకులు అక్రమంగా తొలగించారని గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ చందా పార్వతి, భర్త చందా రామసుబ్బారెడ్డి(అబ్బిరెడ్డి) వాపోయారు. మండలంలోని బద్రిపల్లె గ్రామంలో శనివారం సిమెంట్ రోడ్డు నిర్మాణం కోసం మాజీ సర్పంచ్ చందా పార్వతి ఇంటి ముందు ఉండే బండ చప్పటను తొలగింపజేశారు. బండ చప్పటను జేసీబీతో తొలగించే క్రమంలో చందా రామసుబ్బారెడ్డి కుటుంబీకులు అభ్యంతరం చెప్పగా పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డు నిర్మాణ పనులపై వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ.. బద్రిపల్లె ఊరంతా గ్రామ కంఠంలో ఉందని, పూర్వీకుల నుంచి గ్రామంలో ఇళ్లు నిర్మించుకుని జీవిస్తున్నారన్నారు. ఈ క్రమంలో తమ దాయాదుల ఇళ్లకు రాకపోకల కోసం స్థలం ఏర్పాటు చేసుకుని బండ చప్పట వేసుకున్నామన్నారు. పదేళ్ల క్రితం తమ ఇళ్ల మధ్య రోడ్డు నిర్మాణం చేపట్టాలని అధికారులు భావించగా తాము అడ్డుకున్నామని తెలిపారు. ఈ సమయంలో కోర్టుకెళ్లగా రోడ్డు నిర్మాణ పనులు జరుగలేదన్నారు. ఈ క్రమంలో శనివారరం టీడీపీ నాయకుడు నారాయణ పోలీసులను వెంట బెట్టుకుని వచ్చి జేసీబీతో తమ ఇంటి ముందున్న బండ చప్పటను ధ్వంసం చేయించాడన్నారు. ఈ సంఘటనపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేస్తామ ని రామసుబ్బారెడ్డి కుటుంబీకులు తెలిపారు. -
ప్రీ క్వార్టర్ ఫైనల్ విజేత సౌరాష్ట్ర జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : బీసీసీఐ అండర్–19 కూచ్ బెహర్ ట్రోఫీ ప్రీ క్వార్టర్ ఫైనల్ మ్యాచ్లో సౌరాష్ట్ర జట్టు విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో ఆంధ్రా–సౌరాష్ట్ర జట్ల మధ్య జరుగుతున్న మ్యాచ్లో 34 పరుగుల తేడాతో సౌరాష్ట్ర జట్టు విజయం సాధించింది. ఆంధ్రా జట్టు బ్యాట్స్మన్ హానీష్ రెడ్డి 245 (డబుల్ సెంచరీ) చేశాడు. మిగతా బ్యాటర్లు చతికిల పడి బ్యాటింగ్లో రాణించలేకపోయారు. నాలుగో రోజు సౌరాష్ట్ర జట్టు 452 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. నిర్ణీత 118.5 ఓవర్లకు 483 పరుగులు చేసింది. ఆ జట్టులోని వాత్సల్ పటేల్ 62 పరుగులు చేశాడు. 522 పరుగుల విజయ లక్ష్యంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన ఆంధ్రా జట్టు నిర్ణీత ఓవర్లకు 488 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కె. హానీష్ వీరారెడ్డి 206 బంతుల్లో 17 ఫోర్లు, 8 సిక్సర్లతో 245 పరుగులు (డబుల్ సెంచరీ) చేశాడు. ఆనంద్ జోష్ 50 పరుగులు చేశాడు. సౌరాష్ట్ర జట్టులోని పుష్పరాజ్ జడేజా అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, మోహిత్ ఉల్వా 2 వికెట్లు తీశాడు. దీంతో సౌరాష్ట్ర జట్టు 34 పరుగుల తేడాతో విజయం సాధించింది. కాగా ఆంధ్రా జట్టు తొలి ఇన్నింగ్స్లో 248 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 488 పరుగులు చేసింది. సౌరాష్ట్ర జట్టు తొలి ఇన్నింగ్స్లో 286 పరుగులు, రెండవ ఇన్నింగ్స్లో 483 పరుగులు చేసింది, ఆంధ్రా జట్టులో బ్యాటింగ్లో రాణించి 245 పరుగులు చేసిన హానీష్ వీరారెడ్డికి ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ను జిల్లా క్రికెట్ అసోసియేషన్ కార్యదర్శి అవ్వారు రెడ్డి ప్రసాద్ అందజేశారు.విజృంభించిన ఆంధ్రా బౌలర్లు


