●మాస్టర్ ప్లాన్పై పున ఃపరిశీలన చేయాలి: మేయర్
కోవిడ్–19 సమయంలో ప్రజాభిప్రాయాలు తీసుకోకుండా, ఎలాంటి సమావేశాలు నిర్వహించకుండా తయారు చేసిన మాస్టర్ ప్లాన్ను పునఃపరిశీలన చేయాలని మేయర్ పాకా సురేష్కుమార్ అన్నారు. వైజాగ్లో ఏకంగా రద్దు చేశారని, మనం కూడా ఆ విధంగా చేయవచ్చేమో పరిశీలించాలని సూచించారు. ప్రభుత్వ స్థలాలను ప్రైవేటు పరం చేస్తే వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవడం కష్టతరమవుతుందని, కార్పొరేషన్ స్థలాలు ప్రభుత్వ ఆధీనంలోనే ఉండాలన్నారు. గతంలో పాత మున్సిపల్ కార్యాలయ స్థలాన్ని సాయి మౌర్యకు లీజుకు ఇచ్చామని, ఆర్బిట్రేటర్ను నియమించుకొని ఆ సమస్య పరిష్కరించుకోవాలని న్యాయస్థానం చెప్పినా, ఇంతవరకూ అధికారులు దానిపై దృష్టి పెట్టలేదన్నారు. కార్పొరేషన్కు చెల్లించాల్సిన బకాయిలను ప్రభుత్వం విడుదల చేయాలని కోరారు.


