ధర లేక ...
శనగ పంటకు సరైన ధర లేదు. క్వింటా రూ. 4800 నుంచి రూ. 5100 పోతుంది. దీంతో చేసేందేమి లేక సంచుల్లో నింపుకుని ఇళ్లలో వేసుకుంటున్నాం. సంచుల్లో నింపినందుకు, తూకం వేసినందుకు ఒక్కో క్వింటాపైన వంద రూపాయల ఖర్చు వస్తుంది. మద్దతు ధర ఉంటే ఈ ఖర్చు తగ్గేది. పది రూపాయలు వచ్చేది. – బోధం కుళ్లాయిరెడ్డి,
మాలేపాడు గ్రామం, ఎర్రగుంట్ల
మద్దతు ధరతో కొనుగోలు చేయాలి
7 ఎకరాల్లో శనగ పంటను సాగు చేశాను, ప్రస్తుతం ఒకటిన్నర ఎకరాలో కొత కోశాను. ఎకరాకు 10 క్వింటాళ్లు చొప్పున దిగుబడి వచ్చింది. కానీ ధర మాత్రం బాగా లేదు. ప్రభుత్వం మద్దతు ధరతో రైతుల నుంచి శనగలను కోనుగోలు చేయాలి. లేకుంటే నష్టపోతారు. –శివరామిరెడ్డి,కంచన్నగారిపల్లె, కమలాపురం మండలం
ప్రభుత్వ నిర్ణయం సరికారు
ప్రభుత్వం శనగ సాగు చేసిన ప్రతి రైతు నుంచి పంట కొనుగోలు చేయాలి. కానీ అలాకాకుండా ప్రతి గ్రామంలో 50 మంది చొప్పున ప్రతి రైతు నుంచి 25 క్వింటాళ్లు లేదా 5 ఎకరాలలోపు ఉన్న సన్న, చిన్నకారు రైతులకు సంబంధించిన దిగుబడిని మాత్రమే కొనుగోలు చేస్తామని పేర్లు నమోదు చేయించుకుంది. ప్రభుత్వ నిర్ణయం సరికాదు. – దస్తగిరి రెడ్డి,
జిల్లా రైతు సంఘ నాయకులు.
ధర లేక ...
ధర లేక ...


