రైల్వే సమస్యలను పరిష్కరించాలి
కేంద్ర రైల్వే శాఖ మంత్రి దృష్టికి తీసుకెళ్లిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
పులివెందుల: రైల్వే శాఖ మంత్రి అశ్వని వైష్ణవ్ను బుధవారం ఢిల్లీలో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి కలిశారు. లేఖ ద్వారా రైల్వే సమస్యలను విన్నవించారు. వైఎస్సార్ కడప జిల్లాలోని కమలాపురం రైల్వే స్టేషన్లో చైన్నె – ముంబై మెయిల్ ఎక్స్ప్రెస్ రైలు నిలుపుదల చేయాలని, అలాగే మరికొన్ని ఎక్స్ప్రెస్ రైళ్లు కొండాపురం, ఎర్రగుంట్లలో నిలుపుదల చేయాలని ఎంపీ అందులో పేర్కొన్నారు. దీంతో పాటు జిల్లాలోని పలు రైల్వే సమస్యలను మంత్రి దృష్టికి తీసుకెళ్లి ఆయా సమస్యలను పరిష్కరించాలని అవినాష్ రెడ్డి కోరారు.


