మత్స్యశాఖ అభివృద్ధికి కృషి
కడప అగ్రికల్చర్ : మత్స్యశాఖను అభివృద్ధిబాటలో నడిపించేందుకు అందరి డైరెక్టర్స్తో కలిసి కృషి చేస్తామని ఫిషర్మెన్ కో–ఆపరేటివ్ సొసైటిస్ ఫెడరేషన్ ఛైర్మెన్ యాటగిరి రాంప్రసాద్ పేర్కొన్నారు. కడపలోని మత్స్యశాఖ కార్యాలయంలో మంగళవారం జిల్లా డైరెక్టర్లతో కలిసి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశంలో కడప జిల్లా మత్స్య శాఖ అధికారి రవి కుమార్, ఎప్డిఓలు, వీఎఫ్ఏలతో పాల్గొన్నారు. ఈ సమావేశంలో సొసైటీల ఆడిట్, న్యూ సొసైటీల ఏర్పాటు, పథకాల అమలు, డీఎఫ్సీఎస్ ఆదాయం పెంచుట తదితర అంశాలపై చర్చించారు. అలాగే ఫిష్ మార్కెట్, మత్స్యకారుల సమస్యలు, తదితర అంశాలతో పాటు భవిష్యత్ కార్యాచరణ పై చర్చించారు.


