వెన్నుపోటు బాబు
సంక్షేమం, అభివృద్ధికి
సమతుల్యత లేదు
కూటమి సర్కార్ 2026–27 ఆర్థిక సంవత్సరానికి ప్రవేశపెట్టిన బడ్జెట్లో సంక్షేమం, అభివృద్ధికి సమతుల్యత పూర్తిగా లోపించింది. ఇది పూర్తిగా అబద్దాలు, మోసాల బడ్జెట్గా మారింది. కూటమి ప్రభుత్వం మూడు ఓటాన్ అకౌంట్ బడ్జెట్లు పెట్టినా ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ 6 హామీల్లో 4 హామీల గూర్చి పట్టించుకోలేదు. నిరుద్యోగులను, మహిళలను, రైతులను, ఉద్యోగులను ఈ బడ్జెట్ మోసగించింది. నిరుద్యోగ భృతిగానీ, ఏడాదికి 4 లక్షల ఉద్యోగాల చొప్పున ఈ రెండేళ్లల్లో 8 లక్షల ఉద్యోగుల హామీకి ఎక్కడా చోటు కల్పించలేదు.
– పాకా సురేష్ కుమార్, మేయర్, కడప
ఎస్సీ, ఎస్టీలకు ఒరిగింది శూన్యం
రాష్ట్ర బడ్జెట్ వల్ల ఎస్సీ, ఎస్టీలకు ఒరిగింది శూన్యమని చెప్పవచ్చు. 50 ఏళ్లు దాటిన ఎస్సీ,ఎస్టీ, బీసీ, మైనార్టీలకు పెన్షన్ అమలుపైనా బడ్జెట్లో కేటాయింపులు చేయలేదు. 2 సెంట్ల ఇళ్ల స్థలం ప్రస్తావనగానీ, ఫీజు రియంబర్స్మెంట్ బకాయిల గురించి పట్టించుకోలేదు. సంక్షేమానికి 17.3 శాతం నుండి 16 శాతానికి తగ్గిందని, ఎస్సీ, ఎస్టీ సబ్ప్లాన్కు నిధుల కేటాయింపులు లేవు. చిన్న తర హా పరిశ్రమల కింద ఎస్సీ,ఎస్టీలకు రావాలిసిన రాయితీలపై స్పష్టత ఇవ్వలేదు.
– సీహెచ్ వినోద్ కుమార్, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ మాజీ అధ్యక్షుడు
వెన్నుపోటు బాబు


