రెండుకు చేరిన మృతుల సంఖ్య | - | Sakshi
Sakshi News home page

రెండుకు చేరిన మృతుల సంఖ్య

Mar 11 2026 7:47 AM | Updated on Mar 11 2026 7:47 AM

మదనపల్లె టౌన్‌ : మదనపల్లె పుంగనూరు రోడ్డులోని క్రిష్ణాపురం జ్యూస్‌ ఫ్యాక్టరీ వద్ద ఆదివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే చనిపోగా, మరొకరు చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తాలుకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. వలసలపల్లె పంచాయతీ పుంగనూరు రోడ్డులోని క్రిష్ణాపురానికి చెందిన సుబ్రమణ్యం కుమారుడు శివప్రసాద్‌(28), అన బావమరిది మోహిత్‌(6)ను వలసపల్లె కాలనీలో వదిలి రావడానికి బైకులో అర్ధరాత్రి బయలుదేరాడు. స్కూటర్‌లో వెళ్తుండగా సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మురళి(35) పలమనేరుకు వస్తుండగా రెండు బైకులు జ్యూస్‌ ప్యాక్టరీ వద్ద ఢీకొన్నాయి. ఈ సంఘటనలో శివప్రసాద్‌ అక్కడికక్కడే దుర్మరణం చెందడం తెలిసిందే. తీవ్రంగా గాయపడిన కదిరికి చెందిన మురళి, క్రిష్ణాపురానికి చెందిన మోహిత్‌లను స్థానికులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించారు. మురళి పరిస్థితి విషమించడంతో కుటుంబీకులు వచ్చి బెంగళూరుకు తరలించారు. అక్కడ ఓ ప్రయివేట్‌ ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. మురళి మృతితో రోడ్డు ప్రమాద మృతుల సంఖ్య రెండుకు చేరిందని సీఐ తెలిపారు.. కాగా ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన బాలుడు మోహిత్‌కు ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉండగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement