కరెంటోళ్ల జనబాటతో సమస్యలు పరిష్కారం | - | Sakshi
Sakshi News home page

కరెంటోళ్ల జనబాటతో సమస్యలు పరిష్కారం

Mar 14 2026 7:48 AM | Updated on Mar 14 2026 7:48 AM

ఒంటిమిట్ట : కరెంటోళ్ల జనబాటతో విద్యుత్‌ సమస్యలు పరిష్కారం అవుతాయని విద్యుత్‌ శాఖ తిరుపతి సర్కిల్‌ జీఎం ఎస్‌.శ్రీనివాసులు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని కొండమాచుపల్లి గ్రామంలో జిల్లా, మండల విద్యుత్‌ శాఖ అధికారులతో కలిసి ఆయన కరెంటోళ్ల జనబాట కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జీఎం విద్యుత్‌ తీగకు అడ్డుగా ఉన్న చెట్ల కొమ్మలను విద్యుత్‌ సిబ్బంది చేత తొలగించడం, విద్యుత్‌ వినియోగదారులను అడిగి వారి సమస్యలను తెలుసుకోవడం జరిగింది. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో లూజుగా ఉన్న విద్యుత్‌ లైన్లను బిగిస్తామని, దెబ్బతిన్న కరెంట్‌ స్తంభాలను మారుస్తామని, ట్రాన్స్‌ఫార్మర్‌ల వద్ద శుభ్రం చేయిస్తామన్నారు. అలాగే విద్యుత్‌ మీటర్లలో సమస్యలు ఉంటే పరిష్కరిస్తామన్నారు. ఏదేమైనా ప్రజలకు 24 గంటలు నాణ్యమైన విద్యుత్‌ సరఫరాను అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో కొండమాచుపల్లి సర్పంచ్‌ మేరువ శివనారాయణ, ఏడీ పి.సుబ్రమణ్యం, ఏఈ జయకేశవరెడ్డి, లైన్‌ ఇన్‌స్పెక్టర్‌ మహబూబ్‌ బాషా, లైన్‌ మెన్‌ జనార్దన్‌రెడ్డి, విద్యుత్‌ శాఖ సిబ్బంది పాల్గొన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement