సిద్దవటం : మండలంలోని భాకరాపేట రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న మహబూబ్నగర్ గ్రామ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మగ వ్యక్తి (50) మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ముఖం గుర్తు పట్టడానికి వీలు లేని విధంగా గాయాలయ్యాయన్నారు. మృతి చెందిన వ్యక్తి ఆరెంజ్, తెలుపు గళ్ల చొక్కా, లైట్ బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి మరణానికి గల కారణాలు, మృతుడి ఆచూకీ గురించి విచారణ చేస్తున్నామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే సీఐ 9247575623, ఎస్ఐ 9247575624లకు సమాచారం ఇవ్వాలని కోరారు.


