ఫిర్యాదు దారులకు న్యాయం చేయాలి
కడప అర్బన్ : ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పిజిఆర్ఎస్)కు వచ్చిన ఫిర్యాదు దారులకు చట్ట పరిధిలో న్యాయం చేయాలని అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీస్ కార్యాలయంలోని కాన్ఫరెన్స్ హాలులో ఎస్పీ షెల్కేనచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్బాబు సోమవారం ‘ప్రజా ఫిర్యాదుల పరి ష్కార వేదిక‘ కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి విచ్చేసిన ప్రజలతో అదనపు ఎస్పీ మాట్లాడారు. వారి ఫిర్యాదులను పరిశీలించి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీస్ అధికా రులకు ఆదేశాలు జారీ చేశార మహిళా పీఎస్ డీఎస్పీ బాలస్వామి రెడ్డి పాల్గొన్నారు.


