తీవ్ర మానసిక ఒత్తిడి
కూటమి ప్రభుత్వం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను తీవ్రమైన మానసిక ఒత్తిడికి గురి చేస్తోంది. బోధనకు మాత్రమే పరిమితం చేస్తామంటూనే.. నిరంతరం బోధనేతర కార్యక్రమాల పేరుతో ఉపాధ్యాయులను వేధిస్తున్నారు. ఉపాధ్యాయులు విద్యార్థులకు బోధన చేయలేక, మరో పక్క ప్రభుత్వం ప్రవేశపెడుతున్న యాప్లతో పాటు బోధనేతర కార్యక్రమాలను నిర్వహించలేకపోతున్నారు. చివరకు ఆత్మహత్యకు కూడా యత్నిస్తున్నారు. ప్రభుత్వ విద్యను నిర్వీర్యం చేసేందుకు ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా వ్యవహరిస్తూ ఉపాధ్యాయులను వేధింపులకు గురి చేస్తోంది. –విజయకుమార్, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు


