breaking news
Annamayya District News
-
విద్యా సంస్థల్లోకి నో ఎంట్రీ !
● విద్యార్థి సంఘాలపై నిషేధం ● కూటమి పాలనపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్న విద్యావేత్తలు, విద్యార్థి సంఘాలు మదనపల్లె సిటీ : కూటమి ప్రభుత్వ చర్యలు విద్యార్థులు, ఉపాధ్యాయుల స్వేచ్ఛను, ప్రజాస్వామ్య హక్కులను హరించేలా ఉన్నాయి. విద్యార్థి సంఘాలను నియంత్రించి, వారి గొంతును అణచి వేయడమే లక్ష్యంగా పెట్టుకుంది కూటమి సర్కారు. రాజ్యాంగం కల్పించిన విద్యార్థుల హక్కుకు సంకెళ్లు వేస్తూ నిరంకుశ పాలనను కొనసాగిస్తోందని విద్యార్థి సంఘాల నేతలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో ప్రాథమిక పాఠశాలలు 1,711, ప్రాథమికోన్నత 162, ఉన్నత పాఠశాలలు 304 ఉన్నాయి. ప్రభుత్వ జూనియర్ కాలేజీలు 24, ప్రైవేటు 58, ఎయిడెడ్ 1, ఆదర్శ 17, సాంఘిక సంక్షేమ 10, బీసీ గురుకులాలు 1, కేజీబీవీ 22, వృత్తి విద్యా కాలేజీలు 10 ఉన్నాయి. గత నెలలో విద్యార్థి సంఘాల నేతలు ప్రభుత్వ సంక్షేమ వసతి గృహాలు, పాఠశాలల్లో వసతి లేమిని ప్రభుత్వం దృష్టికి తీసుకొచ్చేందుకు ప్రయత్నించారు. దీంతో ప్రభుత్వం విద్యార్థి సంఘాలపై కక్ష పెంచుకుని పాఠశాలలు, సంక్షేమ హాస్టళ్లలోకి విద్యార్థి సంఘాలకు అనుమతి ఇవ్వద్దంటూ ఉత్తర్వులు జారీ చేసింది. కాలేజీల్లోకి రాకూడదంటూ మరో జీఓ.. విద్యను వ్యాపారంగా మార్చడం, వసతి గృహాల్లో నాసిరకమైన వసతులు, పలు సమస్యలు ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కాలేజీల్లో అడ్మిషన్లు, అధిక ఫీజు వసూలు, అధిక ధరలకు పుస్తకాలు అమ్మడంపై విద్యార్థి సంఘాలు మండిపడ్డాయి. దీంతో ప్రభుత్వం మరోసారి జూనియర్ కాలేజీల్లోకి సైతం విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ మరో జీఓను జారీ చేసింది. విద్యార్థి సంఘాలు విద్యారంగంలోని సమస్యల పరిష్కారం కోసం విద్యార్థుల్లో సామాజిక చైతన్యాన్ని కలిగిస్తాయి. నాయకత్వ లక్షణాలు, సామాజిక అవగాహనకు, హక్కులు, బాధ్యతలను నేర్పిస్తాయి. అయితే రాష్ట్ర ప్రభుత్వ చర్యల వెనుక విద్యార్థి సంఘాలను అణచివేయడం ద్వారా ప్రశ్నించే, పోరాడే శక్తులను నిలువరించాలని, విద్యార్థుల్లో సామాజిక చైతన్యం లేకుండా చేయాలనే ఉద్దేశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రభుత్వ ఉత్తర్వులు ప్రజాస్వామ్య విరుద్ధమైనవని, నిరంకుశత్వ ధోరణికి నిదర్శనమని విద్యావేత్తలు అభిప్రాయపడుతున్నారు. -
కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి ఆటోబోల్తా
● నలుగురికి తీవ్ర గాయాలు ● ఇద్దరి పరిస్థితి విషమం మదనపల్లె రూరల్ : వివాహానికి వెళుతుండగా, మార్గమధ్యంలో కుక్క అడ్డురావడంతో ఆటో అదుపుతప్పి బోల్తాపడిన ఘటనలో నలుగురికి తీవ్రగాయాలు కాగా, ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది. గురువారం పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన నాగలక్ష్మి(45), భార్గవి(25), అంజనమ్మ(45), కల్యాణి(30) నలుగురు కలిసి అదే ప్రాంతానికి చెందిన శ్రీరామకృష్ణ ఆటోలో తంబళ్లపల్లె మండలం ఎర్రగుట్టపల్లెలో పెళ్లికి బయలుదేరారు. మార్గమధ్యంలో తంబళ్లపల్లె మండలం తిమ్మయ్యగారిపల్లె వద్ద ఆటోకు అడ్డుగా కుక్క రావడంతో, డ్రైవర్ సడెన్బ్రేక్ వేయడంతో అదుపుతప్పి ఆటో బోల్తా పడింది. ప్రమాదంలో నాగలక్ష్మి, భార్గవిలు తీవ్రంగా గాయపడ్డారు. అంజనమ్మ, కల్యాణికి స్వల్ప గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. నాగలక్ష్మి, భార్గవి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తంబళ్లపల్లె పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. తీవ్రంగా గాయపడిన నాగలక్ష్మి, భార్గవి -
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్
భూగర్భజలాల పెంపుపై ప్రత్యేక దృష్టి రాయచోటి: జిల్లాలో భూగర్భజలాల పెంపుపై ప్రత్యేక దృష్టి సారిస్తామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. గురువారం అమరావతి నుంచి భూగర్భజలాల పరిణామాల స్థాయిపై జిల్లా కలెక్టర్లు, జాయింట్ కలెక్టర్లు, నీటి వినియోగదారుల సంఘాల డిస్ట్రిబ్యూటరీ కమిటీ అధ్యక్షులు, జల వనరుల సిబ్బందితో ముఖ్యమంత్రి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, ఇరిగేషన్ ఎస్ఈ వెంకటరమణయ్య, సాగునీటి వినియోగదారుల సంఘాల చైర్మన్లు, సభ్యులు పాల్గొన్నారు. జిల్లాలోని మూడు మండలాల్లో భూగర్భజల పరిణామాలు 20 శాతం కన్నా తక్కువగా ఉన్నాయని కలెక్టర్ తెలిపారు. వీటి పరిమాణస్థాయి పెంపుదలకు చర్యలు తీసుకుంటామని ముఖ్యమంత్రికి కలెక్టర్ నివేదించారు. రాజంపేట డివిజన్లో అధిక వర్షపాతం నమోదు కావడం, అలాగే తిరుమలలో కురిసిన వర్షం ఈ ప్రాంతాలకు చేరుకోవడం వల్ల భూగర్భజలాల పరిణామాల స్థాయి బాగుందన్నారు. మదనపల్లె డివిజన్లో యావరేజ్ స్థాయిలో, రాయచోటి డివిజన్లో తక్కువగా ఉందన్నారు. -
మున్సిపల్ ఖజానాకు రూ.20 లక్షల గండి
మదనపల్లె : మదనపల్లె మున్సిపల్ ఖాజానాకు వెళ్లాల్సిన లీజు సొమ్ముకు అధికారులు గండి కొడుతున్నారని సీపీఐ జిల్లా సహయ కార్యదర్శి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మురళీ ఆరోపించారు. గురువారం వారు మీడియాతో మాట్లాడుతూ ప్రస్తుత ఆర్థిక దినసరి, వారపు సంత గేటు వసూళ్ల లీజును హెచ్చు పాటదారునికి అప్పగించడంలో అధికారులు ఎందుకు అలసత్వం ప్రదర్శించారని ప్రశ్నించారు. కౌన్సిల్ దీనికి ఎందుకు ఆమోదం తెలపలేదో చెప్పాలని డిమాండ్ చేశారు. లీజు అప్పగించడంలో జరిగిన జాప్యం ఫలితంగా రోజుకు రూ.48వేల ఆదాయాన్ని మున్సిపాలిటీ కోల్పోయిందన్నారు. రూ.20 లక్షల దాకా జరిగిన నష్టం జరిగితే కమిషనర్ ఎందుకు మౌనంగా ఉన్నారని ప్రశ్నించారు. కర్ణాటక సరిహద్దులో కారు ఢీకొని ఇద్దరికి గాయాలు మదనపల్లె రూరల్ : కర్ణాటక సరిహద్దు ప్రాంతం రాయల్పాడు సమీపంలో కారు, బైక్ ఢీకొన్న ఘటనలో చీకలబైలుకు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. చీకలబైలుకు చెందిన గంగరాజు(27), శశి(24) ఇద్దరు భవన నిర్మాణ కార్మికులు. జీవనోపాధిలో భాగంగా కర్ణాటకలో పనికి వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, రాయల్పాడు సమీపంలో ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు బాధితులను ఆటోలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రాయల్పాడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య బి.కొత్తకోట : ఇంటర్ విద్యార్థిని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన గురువారం జరిగింది. మదనపల్లె జిల్లా ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం మేరకు.. బి.కొత్తకోట సమీపంలోని శెట్టిపల్లికి చెందిన ఎం.నాగరాజు కుమార్తె స్రవంతి (16) ఇంటర్ చదువుతోంది. తల్లి దండ్రులు పొలం పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి వచ్చారు. విద్యార్థిని ఇంట్లో ఉరి వేసుకోగా గుర్తించిన కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా మృతి చెందిందని డాక్టర్లు తెలిపారు. -
ప్రజాస్వామ్యబద్ధంగా జెడ్పీటీసీ ఎన్నికలు జరగలేదు
ఒంటిమిట్ట(సిద్దవటం): ఒంటిమిట్ట, పులివెందులలో జెడ్పీటీసీ ఉప ఎన్నికలు ప్రజాస్వామ్య బద్ధంగా జరగలేదని ఒంటిమిట్ట జెడ్పీటీసీ వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పేర్కొన్నారు. గురువారం ఒంటిమిట్టలో ఆయన మాట్లాడుతూ 13వ తేదీ జరిగిన ఎన్నికలు తీరు బాగాలేదన్నారు.కానీ ఈరోజు ఫలితాలు వెలువడ్డాయి. పులివెందులలో వైఎస్ఆర్సీపికీ 683, ఒంటిమిట్టలో 6513 ఓట్లు వచ్చయన్నారు. ఒంటిమిట్టలో 11 గంల వరకు 8వేల ఓట్లు పోలయ్యాయన్నారు. తర్వాత పోలీసు ప్రొటెక్షన్తో మంత్రి వచ్చి 10వేల పై చిలుకు రిగ్గింగ్ చేసుకున్నారు.ప్రజాస్వామ్యబద్ధంగా ఎన్నికలు జరిగింటే గెలుపు మాదేనని, టీడీపీవారు ఓటమి చెందేవారన్నారు. మీకు ఓపెన్ చాలెంజ్ చేస్తున్నా, సిటింగ్ జడ్జి చేత ప్రతి గ్రామానికి పోదాం.. ప్రతి ఓటరును పిలుస్తాం.. వారు ప్రజాస్వామ్యబద్ధంగా ఓటు వేసిఉంటే వేలిమీద సిరాచుక్క ఉండాలన్నారు. ఒంటిమిట్ట, పులివెందులలో చేతిమీద సిరా చుక్క లేకుంటే మీరు ప్రజాస్వామ్యానికి విరుద్ధంగా ఓట్లు వేసుకున్నట్లే కదా అని అన్నారు. ఈ చాలెంజ్కు మంత్రులు, నాయకులుగాని, సంబరాలు చేసుకునేవారు ఎవరైనా సరే ఒప్పుకుంటారా అని ప్రశ్నించారు. మా ఏజెట్లను, ఓటర్లను కొట్టి ఓట్లను రిగ్గింగ్ చేసుకున్నారన్నారని ఆయన తెలిపారు. . -
భలే కేటుగాళ్లు..!
తిరుపతి క్రైమ్ : సెల్ ఫోన్లు చోరీ చేసి ఆ సెల్ ఫోన్ ద్వారా బాధితుల బ్యాంకు ఖాతాలోని నగదు హాంఫట్ చేస్తున్న కేటుగాళ్లను పోలీసులు అరెస్ట్ చేశారు. గురువారం తిరుపతి డీఎస్పీ భక్తవత్సలం ఈస్ట్ పోలీస్ స్టేషన్ విలేకరులకు తెలిపిన వివరాలు..హైదరాబాద్కు చెందిన హరికృష్ణ, అన్నమయ్య జిల్లాకు చెందిన అశోక్, నెల్లూరు జిల్లాకు చెందిన గడ్డం కసిరెడ్డి ఓ ముఠాగా ఏర్పడి నగరంలో సెల్ఫోన్ల చోరీకి పాల్పడేవారు. అలా చోరీ చేసిన మొబైల్ ఫోన్లలో ఆ వ్యక్తుల ఫోన్ పే, గూగుల్ పేను పరిశీలించి అందులో నగదును సరికొత్త ఎత్తుగడలతో కొట్టేసేశారు. ఏటీఎం సెంటర్ వద్ద కాపు కాసి, అక్కడకు వచ్చే వారికి తమ వారు హాస్పిటల్లో ఉన్నారని, డబ్బులు చాలా అవసరమని ఫోన్ పే చేస్తామని, కావాలంటే కమీషన్ కూడా ఇస్తామని వారిని నమ్మిస్తారు. ఇలా కహానీలు చెప్పి వీరంతా 49 సెల్ ఫోన్లు దొంగతనం చేసి 3.6 లక్షలు కాజేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. హరికృష్ణ నుంచి రూ.లక్ష, 40 సెల్ ఫోన్లు, అశోక్ నుంచి రూ.90 వేలు, 6 సెల్ ఫోన్లు, కసిరెడ్డి నుంచి రూ.90 వేలు, మూడు సెల్ ఫోన్లు స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసును ఛేదించడంలో ఈస్ట్ సీఐ శ్రీనివాసులు, ఎస్ఐ హేమాద్రి, సిబ్బంది కృషి చేశారని డీఎస్పీ వారిని అభినందించారు. సెల్ ఫోన్లు చోరీ చేసి బ్యాంకు ఖాతాల్లో నగదు హాంఫట్ ముగ్గురు నిందితుల అరెస్ట్ 46 సెల్ఫోన్లు, రూ.2.8లక్షలు స్వాధీనం నిందితులు హైదరాబాద్, అన్నమయ్య జిల్లా, నెల్లూరు వాసులు -
జెండా పండుగకు సర్వం సిద్ధం
రాయచోటి: జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని పోలీస్ పరేడ్ మైదానంలో స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఇందుకు సంబంధించి పోలీస్ పరేడ్ గ్రౌండ్లో ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ వేడుకలకు రాష్ట్ర రవాణా, యువజన, క్రీడల శాఖా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై జాతీయ జెండా ఆవిష్కరించనున్నారు. నేటి కార్యక్రమాలు ● ఉదయం 8.50 గంటలకు జిల్లా పోలీసు సూపరింటెండెంట్ రాక, పరేడ్ద్వారా ‘‘జనరల్ సెల్యూట్’’ ప్రదర్శన ● 8.55 గంటలకు కలెక్టర్, జిల్లా మెజిస్ట్రేట్ ఆగమనం, పరేడ్ ద్వారా ‘‘జనరల్ సెల్యూట్’’ ప్రదర్శన ● 8.58 గంటలకు ముఖ్య అతిథిగా మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఆగమనం ● 9 గంటలకు జాతీయ పతాకావిష్కరణ ● 9.05 గంటలకు ముఖ్య అతిథి పరేడ్ సందర్శన ● 9.15 గంటలకు మంత్రి సందేశం ● 9.45 గంటలకు పోలీసుల కవాతు ● 9.50 గంటలకు స్వాతంత్య్ర సమరయోధుల సన్మాన కార్యక్రమం ● 9.55 గంటలకు డాగ్షో ● 10 గంటలకు వివిధ ప్రభుత్వ శకటాల ప్రదర్శన ● 10.30 గంటలకు అగ్నిమాపక శాఖ ద్వారా సాంస్కృతిక కార్యక్రమాలు, అగ్నిమాపక శాఖ ప్రదర్శన ● 11 గంటలకు సాంస్కృతిక కార్యక్రమం, ఎన్సీసీ, స్కౌట్స్లో పాల్గొనే వారి ఫొటో షూట్ ● 11.10 గంటలకు ఉద్యోగులకు ఉత్తమ సేవా సర్టిఫికెట్ల ప్రదానం ● 11.55 గంటలకు ముఖ్య అతిథి వివిధ శాఖల స్టాళ్లు సందర్శన, లబ్దిదారులకు ఆస్తుల పంపిణీ ● 12.05 గంటలకు జాతీయ గీతంతో కార్యక్రమం ముగింపు -
ఆర్టీపీపీ వద్ద ఘోర రోడ్డు ప్రమాదం
జమ్మలమడుగు : మండల పరిధిలోని కలమల్ల గ్రామ సమీపంలో ఆర్టీపీపీ వద్ద బ్రిడ్జిపైన గురువారం ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. అతి వేగంగా వచ్చిన ఫ్లైయాష్ టిప్పర్ ముందు వెళుతున్న బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో సుభాషిణి(35), గాయత్రి(25) అనే ఇద్దరు మహిళలు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. వెంకటేష్ అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. సంఘటన స్థలాన్ని కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి పరిశీలించారు. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. ముద్దనూరు మండల పరిధిలోని కోసినేపల్లి గ్రామానికి చెందిన వెంకటరమణయ్య ఆర్టీపీపీలోని లోకోషెడ్లో పని చేస్తుండగా, వెంకటేశు కాంట్రాక్టు కార్మికుడిగా పనిచేస్తున్నాడు. వీరిద్దరూ అన్నదమ్ములు. గురువారం వారి బంధువులకు సంబంధించిన వివాహానికి ప్రొద్దుటూరుకు బైక్లో బయలుదేరారు. బైక్ను వెంకటేష్ నడుపుతుండగా అతని భార్య గాయత్రి, వెంకటరమణయ్య భార్య సుభాషిణి వెనుక కూర్చున్నారు. వీరు ఆర్టీపీపీ నుంచి కలమల్ల మీదుగా బైక్లో బ్రిడ్జిపై వెళుతుండగా అధిక లోడుతో వస్తున్న ఫ్లైయాష్ టిప్పర్ వెనుక వైపు నుంచి బైక్ను ఢీకొట్టింది. బైక్పై ఉన్న వెంకటేష్, గాయత్రి, సుభాషిణి కిందపడ్డారు. టిప్పర్ వేగంగా గాయత్రి, సుభాషిణిలపై దూసుకెళ్లింది. దీంతో వారిద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎంత సేపటికి 108 వాహనం రాకపోవడంతో సంఘటన స్థలానికి వచ్చిన కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తన జీపులో తీవ్ర గాయాలైన వెంకటేష్ను ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. గాయత్రికి ఇద్దరు, సుభాషిణికి ఇద్దరు సంతానం ఉన్నారు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటన స్థలాన్ని మాజీ ఎమ్మెల్యే డాక్టర్ ఎం.సుధీర్రెడ్డి పరిశీలించారు. న్యాయం చేయాలంటూ ధర్నా.. మృతుల కుటుంబాలకు న్యాయం చేయాలంటూ స్థానికులు, కార్మికులు బ్రిడ్జిపైనే మృతదేహాలను పెట్టుకుని ధర్నా చేపట్టారు. ఫ్లైయాష్ అధికంగా లోడు చేసుకుంటూ టిప్పర్లు, లారీలు మనుషులను తొక్కించుకుంటూ పోతున్నాయని ఆగ్రహం వ్యక్తం చేశారు. టిప్పర్ల యజమానులేమో బూడిదలో ఆదాయం పొందుతుండగా జనం మాత్రం ఇలా మృత్యువాత పడుతున్నారని స్థానికులు ఆవేదన వ్యక్తం చేశారు. గాయపడిన వెంకటేష్ మృతి చెందిన గాయత్రి, సుభాషిణి బైక్ను ఢీకొన్న ఫ్లైయాష్ టిప్పర్ ఇద్దరు మహిళలు దుర్మరణం మరొకరికి తీవ్ర గాయాలు సంఘటన స్థలాన్ని పరిశీలించిన మాజీ ఎమ్మెల్యే డాక్టర్ మూలె సుధీర్రెడ్డి కన్నీరు మున్నీరుగా విలపించిన బంధువులు -
ఆరుతడి పంటల రైతుల్లో అలజడి
● జిల్లాలో కొనసాగుతున్న వర్షాలు ● ఉరకలెత్తుతున్న కుందూ, పెన్నా నదులు కడప అగ్రికల్చర్ : జిల్లాలో గత వారం రోజులకుపైగా కురుస్తున్న వర్షాలతో అన్నదాతల్లో అలజడి నెలకొంది. అల్పపీడనం కారణంగా ఎక్కడపడితే అక్కడ ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తున్నాయి. దీంతో ఆరుతడి పంటల రైతుల్లో ఆందోళన మొదలైంది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో ముందుగా సాగు చేసిన ఆరుతడి పంటలకు కొన్నింటికి మేలు జరిగినా మరి కొన్ని చోట్ల మాత్రం ఇబ్బందికరమే. దీంతోపాటు ఆలస్యంగా సాగు చేసిన ఆరుతడి పంటల రైతులకు మాత్రం గుండెల్లో గుబులు పట్టుకుంది. ముఖ్యంగా ఉల్లి, మినుము, జొన్న ఇలాంటి పంటలు సాగు చేసిన రైతులకు మాత్రం ఆందోళన తప్పడం లేదు. కొన్ని చోట్ల ఉల్లి పంట రెండు నెలల దశలో కూడా ఉంది. ఇప్పుడిప్పుడే గడ్డలు ఏర్పడే దశ కావడంతో వారు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షానికి పొలాల్లో వర్షపు నీరు నిలిస్తే ఎర్రగడ్డలు కుళ్లిపోయే ప్రమాదం ఉంది. వేలకు వేలు ఖర్చు పెట్టి సాగుచేసిన పంట మరో నెల రోజుల్లో చేతికొచ్చే సమయంలో ఇలాంటి ఎడతెరిపి లేని వర్షాలతో పంటనష్టం జరిగే అవకాశం ఉంది. ఈ వర్షాలు ఇలాగే మరో నాలుగు రోజులు కొనసాగితే మాత్రం ఎర్రగడ్డ రైతులకు నష్టం వాటిల్లే ప్రమాదం అధికంగా ఉంది. దీంతోపాటు ఉద్యాన పంటలైన పూల రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. వారం రోజుల నుంచి కురుస్తున్న వర్షంతో పూలు నాణ్యత తగ్గుతున్నాయని రైతన్నలు తెలిపారు. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షంతో పత్తి రైతులు కూడా ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షాలు ఇలాగే కొనసాగితో పంటలకు తెగుళ్ల బెడద పెరుగుతుందని అన్నదాతలు ఆందోళన చెందుతున్నారు. ఉధృతంగా పెన్నా, కుందూ నదులు.. వరుసగా కురుస్తున్న వర్షాలతో పాటు ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాలకు పెన్నా, కుందూ నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. చాపాడు మండలం అల్లాడుపల్లె దేవళాల వద్ద కుందూనది, చెన్నూరు, సిద్దవటం వద్ద పెన్నా నదులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. పులివెందులలో అత్యధికంగా... గురువారం తెల్లవారుజూము నుంచి పులివెందులలో అత్యధికంగా 9.6 ఎంఎం వర్షం కురిసింది. అలాగే వేములలో 9 ఎంఎం, ఖాజీపేటలో 6.8 ఎంఎం, సీకేదిన్నెలో 6.4 ఎంఎం, చక్రాయపేటలో 5.8 ఎంఎం, సింహాద్రిపురంలో 5.6 ఎంఎం, కడప, చెన్నూరులలో 5.2, తొండూరు, పెండ్లిమర్రిలో 4.6, రాజుపాలెం, దువ్వూరు, వల్లూరులలో 4.2, వేముల, మైదుకూరు, జమ్మలమడుగు, వేంపల్లిలో 4, కొండాపురంలో 3.8 మిల్లీ మీటర్ల వర్షం కురిసంది. సిద్దవటంలో 3 మిల్లీమీటర్లు, ప్రొద్దుటూరులో 2.6, బద్వేల్లో 2.4, చాపాడు, బి.మఠంలలో 2.2, కలసపాడులో 1.8, గోపవరం, అట్లూరు, ముద్దనూరులలో 1.2 మి.మీ. వర్షం కురిసింది. పంట సాగు (హెక్టార్లలో ) మొక్కజొన్న 1772 సజ్జ 710 జొన్న 48 కంది 285 మినుము 1502 వేరుశనగ 983.38 పొద్దుతిరుగుడు 225 ఆముదం 23.2 పత్తి 3524.27 -
కారు ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్పై వెళుతున్న యువకుడిని కారు ఢీకొనడంతో తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం పుంగనూరు నియోజకవర్గం బండ్లపల్లె పంచాయతీ నల్లగుట్టపల్లెలో జరిగింది. పెద్దనల్లూరి పల్లెకు చెందిన అగస్తప్ప కుమారుడు ప్రవీణ్కుమార్ (30) వ్యక్తిగత పనుల నిమిత్తం పుంగనూరుకు వెళ్లి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా, మార్గమధ్యంలోని నల్లగుట్టపల్లె వద్ద ఎదురుగా వస్తున్న కారు ఢీకొంది. ప్రమాదంలో ప్రవీణ్కుమార్ తలకు తీవ్ర గాయం కావడంతో పాటు కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాల్సిందిగా వైద్యులు రెఫర్ చేశారు. అయితే బాధిత కుటుంబం తిరుపతికి వెళ్లలేమని, ఇక్కడే స్థానికంగా వైద్యం అందించాల్సిందిగా విన్నవించారు. అయితే ఆస్పత్రి సిబ్బంది, తమ వద్ద తలకు చికిత్స అందించేందుకు వైద్యుడు లేడని చెప్పడంతో బాధిత కుటుంబ సభ్యులు క్షతగాత్రుడిని ఆస్పత్రిలోనే పెట్టుకుని ఏం చేయాలో తెలియక ఇబ్బందులు పడ్డారు. -
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ సీపీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లా పీలేరు అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన సి.రాహుల్ చక్రవర్తిరెడ్డిని రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శిగా నియమించారు. ఈమేరకు పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాయచోటి జగదాంబసెంటర్: 2025–26, 2026–27 అండర్–14, 17 విభాగాల్లో జిల్లా స్కూమ్ గేమ్స్ కార్యదర్శిగా పనిచేయడానికి అర్హత, ఆసక్తి గల స్కూల్ అసిస్టెంట్స్ (ఫిజికల్ ఎడ్యుకేషన్/పీఈటీలు) నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. స్కూల్ అసిస్టెంట్స్గా 10 సంవత్సరాలు అనుభవం కలిగిన వారు అర్హులన్నారు. ఈ నెల 20వ తేదీలోపు రెండు ప్రతులను జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి చేర్చాలని డీఈఓ ప్రకటనలో పేర్కొన్నారు. క్రీడా ప్రతిభా అవార్డుకు.. ఆగస్టు 29న జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా క్రీడా ప్రతిభా అవార్డు 2025కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ కె.సుబ్రహ్మణ్యం గురువారం ఒక ప్రకటనలో తెలిపారు.ఈ నెల 18వ తేదీలోగా దరఖాస్తులను డీఈఓ కార్యాలయంల సమర్పించాలని చేర్చాలని కోరారు. మదనపల్లె: మదనపల్లె స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ ఉస్మాన్ ఘనీ ఖాన్ నా యబ్ ప్రతిష్టాత్మక విశిష్ట సేవా పతకానికి ఎంపికయ్యారు. శాంతిభద్రతల పరిరక్షణ, విధినిర్వహణలో చిత్తశుద్ధి ప్రదర్శించే పోలీసు అధికారులకు కేంద్ర ప్రభుత్వం ఇచ్చే ఈ పతకానికి ఘనీ ఖాన్ ఎంపిక కావడంతో జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు గురువారం ఆయనను అభినందించారు. విశిష్ట సేవలకు గుర్తింపుగా ఇచ్చే ఈ పతకం అన్నమయ్య జిల్లాకు లభించడం గర్వకారణమని కొనియాడారు. 1987లో పోలీసుశాఖలో కానిస్టేబుల్గా చేరిన ఘనీ ఖాన్ ఉమ్మడి చిత్తూరుజిల్లాలోని మదనపల్లె ఒకటవ, రెండవ పట్టణ పోలీస్స్టేషన్లు, మొలకలచెరువు, బి.కొత్తకోట, యర్రావారిపాళెం, గుడిపాల, సీఐ విభాగంతోపాటు వివిధ చోట్ల పని చేశారు. ఆయన విధి నిర్వహణలో ఇప్పటిదాక 70 నగదు రివార్డులు, 50 జీఎస్ఈలను ఉన్నతాధికారుల నుంచి అందుకున్నారు. జమ్మలమడుగు: మైలవరం జలాశయం నుంచి పెన్నానదిలోనికి భారీగా నీటిని విడుదల చేశారు. పెన్నానదిలోనికి మైలవరం జలాశయం నుంచి పదివేల క్యూసెక్కుల నీటిని అధికారులు సోమశిల ప్రాజెక్టుకు విడుదల చేశారు. పోతిరెడ్డి పాడు హెడ్ రెగ్యులేటర్ ద్వారా జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వార 13వేల క్యూసెక్కుల నీరు గండికోట జలాశయంలోనికి వస్తుంది. ప్రస్తుతం గండికోట జలాశయంలో 16టీఎంసీల వరకు నీరు నిల్వ ఉంది. అదేవిధంగా మైలవరం జలాశయంలో 5 టీఎంసీల నీరు నిల్వ ఉంది. పై నుంచి వస్తున్న నీటిని అధికారులు నేరుగా పెన్నాలోకి విడుదల చేస్తున్నారు. కలికిరి: డాక్టర్ వైఎస్సార్ హార్టికల్చర్ యూనివర్సిటీ పరిధిలోని హార్టికల్చర్ పాలిటెక్నిక్ కళాశాలల్లో డిప్లొమా ఇన్ హార్టికల్చర్, డిప్లొమా ఇన్ హార్టికల్చర్–ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు ఈ నెల 20న వెంకట్రామన్న గూడెంలో యూనివర్సిటీ పరిపాలన కేంద్రంలో స్పాట్ అడ్మిషన్లు జరుగుతాయి. ఈ విషయాన్ని కలికిరి హార్టికల్చర్ కళాశాల ప్రిన్సిపాల్ స్వరాజ్య లక్ష్మీ తెలిపారు. బాలురకు కలికిరి, నూజివీడు, బాలికలకు రామచంద్రాపురం, మడకశిర కళాశాలలు ఉన్నాయని తెలిపారు. పదోతరగతి ఉత్తీర్ణులై, ఇంటర్ ఫెయిలైన విద్యార్థులు కూడా అర్హులని తెలిపారు. అర్హత, ఆసక్తి కలిగిన వారు ఈ నెల 20న వెంకట్రామన్న గూడెంలోని యూనివర్సిటీకి విద్యార్హత, టీసీ, కుల, ఆధాయ ధృవీకరణ, ఆధార్ కార్డులు, ఫొటోలతో హాజరవ్వాలని ఆమె కోరారు. -
కలలు..కల్లలు
తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటుచేయాలని దశాబ్దాల కాలం నుంచి చేస్తున్న ప్రతిపాదనను రైల్వేబోర్డు తిరస్కరించింది. వైఎస్సార్సీపీ ఎంపీలు తమ వంతుగా కృషిచేశారు. కూటమి ఎంపీలు పట్టించుకోలేదు. దీంతో ఉభయ వైఎస్సార్ జిల్లాకు చెందిన ప్రయాణికుల ఆశలు అడియాశలయ్యాయి. ● బాలాజీ రైల్వే డివిజన్ ఏర్పాటుసాధ్యం కాదని తేల్చిచెప్పిన రైల్వేబోర్డు ● నోరుమెదపని కూటమి పార్టీల ఎంపీలు ● ప్రయాణికుల ఆశలు అడియాసలు.. రాజంపేట: తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ఇక లేనట్టే..ఇది సాధ్యం కాదని రైల్వేబోర్డు తేల్చి చెప్పింది.సౌత్కోస్ట్ జోన్ ఏర్పాటుకు హద్దులు తీసుకొచ్చిన రైల్వేబోర్డు తిరుపతి బాలాజీ డివిజన్ ఏర్పాటు అంశం తెరపైకి వచ్చింది. ఈ డివిజన్ ఏర్పాటైతే ఉభయ వైఎస్సార్ జిల్లాలోని రైలుమార్గాలు, రైల్వేలు అభివృద్ధి చెందుతాయని ఇక్కడి వారు ఆశించారు. అయితే రైల్వేబోర్డు వారి ఆశలపై నీళ్లు చల్లింది.కూటమి పార్టీల ఎంపీలు నోరుమెదపకపోవడంపై సీమ వాసుల్లో సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.రైల్వేబోర్డు చైర్మన్ నిర్ణయంపై ప్రజల్లో వ్యతిరేకత పెల్లుబుకుతోంది. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్ ఉన్నా .. రైల్వే స్టాండింగ్ కమిటీ చైర్మన్గా జిల్లా వాసి సీఎం రమేష్ ఉండి కూడా తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు విషయంలో ఏమీ చేయలేకపోయారనే విమర్శలున్నాయి. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలను కలుపుతూ ఏర్పాటయ్యే బాలాజీ డివిజన్ విషయంలో సీఎం రమేష్ విఫలమయ్యారనే ఆరోపణలు ఉన్నాయి. గుంతకల్ వెళ్లాలంటే దూరాభారం.... తరుచూ సమావేశాలకు గుంతకల్ డివిజన్ కేంద్రానికి వెళ్లి రావాలంటే అధికారులు, కార్మికులు ఇబ్బ ందులు పడుతున్నారు. గుంతకల్, గుంటూరు, విజయవాడ నాలుగు డివిజన్లతోపాటు కొత్తగా బాలాజీ డివిజన్ ఏర్పాటుచేసి విశాఖజోన్లో కలిపితే బాగుంటుందని రైల్వే నిపుణులు అంటున్నా రు. ఆ దిశగా ఎంపీలు రైల్వేమంత్రిత్వశాఖపై ఒత్తిడి తీసుకురావాలని సీమవాసులు కోరుతున్నారు. ● బాలాజీ డివిజన్ ఏర్పాటైతే తిరుపతి–గూడూరు (92.96కిమీ), తిరుపతి–కాట్పాడి (104.39కిమీ), పాకాల–మదనపల్లె (83కిమీ), రేణిగుంట–కడప (125కిమీ)లైన్ కలిపే అంశాన్ని గతంలోనే రైల్వే అధికారులు పరిశీలించారు. కాగా జిల్లా మీదుగా వెలిగొండ అడవుల్లో నుంచి వెళ్లే కృష్ణపట్నం రైల్వేలైన్ కూడా విజయవాడ డివిజన్లోకి వెళ్లింది. అయితే కొత్త డివిజన్కు రైల్వేబోర్డు రెడ్సిగ్నల్ వేసింది. తిరుపతి ఎంపీ గురుమూర్తికి రైల్వేబోర్డు పంపిన లేఖలో ఈవిషయాన్ని స్పష్టంగా తెలియచేసింది. బాలాజీ డివిజన్ ఆవశ్యకతను గుర్తించాలి ప్రజల అవసరాల దష్ట్యా బాలాజీ డివిజన్ ఏర్పాటు ఆవశ్యకతను రైల్వేబోర్డు గుర్తించాల్సిన అవసరం ఉంది. కడప, అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లాలకు బాలాజీ డివిజన్ కీలకం అవుతుంది. రైల్వేబోర్డు సాధ్యంకాదనడం అవివేకమే. రైల్వే యంత్రాంగ పరంగా చూస్తే గుంతకల్ డివిజన్ అనుకూలంకాదని రైల్వేవర్గాలే చెపుతున్నాయి.ఎంపీలు ఈ విషయంలో ఐక్యంగా పోరాడాలి. –భూమనశివశంకర్రెడ్డి, వైఎస్సార్సీపీ గ్రీవెన్స్సెల్ రాష్ట్ర ప్రధానకార్యదర్శి, నందలూరు రైల్వేబోర్డు పునరాలోచించాలి రాజ్యసభలో తిరుపతి కేంద్రంగా బాలాజీ డివిజన్ ఏర్పాటు ప్రాధాన్యత గురించి తెలియచేశాను. అలాగే తిరుపతి ఎంపీ గురుమూర్తి, రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు కూడా ఈ విషయం గురించి రైల్వేమంత్రిత్వశాఖకు తెలియచేస్తూ వచ్చారు. బాలాజీ డివిజన్ ఏర్పాటు వల్ల వైఎస్సార్, అన్నమయ్య జిల్లాలోతోపాటు చిత్తూరు, తిరుపతి, నెల్లూరు జిల్లా ప్రాంతాలకు రైల్వేపరంగా న్యాయం జరుగుతుంది. ఆ దిశగా రైల్వేబోర్డు చైర్మన్ పునరాలోచించాలి. –మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు -
ఎంపీ మిథున్రెడ్డి విడుదల కోసం పెద్దదర్గాలో ప్రార్థనలు
కడప సెవెన్రోడ్స్ : రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి త్వరగా విడుదల కావాలని ఆకాంక్షిస్తూ వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ ప్రతినిధులు బుధవారం పెద్ద దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. తొలుత వారు దర్గాలోని ప్రధాన గురువులు హజరత్ పీరుల్లాసాహెబ్ మాలిక్ మజార్ను దర్శించుకుని ఫాతెహా చేశారు. అనంతరం దర్గాలోని ఇతర గురువుల మజార్లను కూడా దర్శించుకుని ప్రార్థనలు నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్ మాట్లాడుతూ మృదు స్వభావి, ప్రజా నాయకుడు, సామాన్య కార్యకర్తను కూడా ఎంతో అభిమానంతో పలకరించే మిథున్రెడ్డిని రాజకీయ కక్షతోనే అక్రమంగా అరెస్టు చేశారన్నారు. ఎన్ఆర్ఐలతోపాటు వారి కుటుంబ సభ్యులకు తమవంతుగా తోడ్పాటు అందించిన పెద్దిరెడ్డి మిథున్రెడ్డి బెయిలుపై విడుదల కావాలని దర్గా గురువులను ప్రార్థించామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ కువైట్ కమిటీ సభ్యులు షేక్ గఫార్, ఎన్.సుబ్బారెడ్డి, సి.అమర్నాథ్ రెడ్డి, రాష్ట్ర మైనారిటీ ప్రధాన కార్యదర్శి అలీ అక్బర్, ప్రధాన అధికార ప్రతినిధి షేక్ గౌస్ బాషా (చాక్లెట్) కార్పొరేటర్లు షేక్ షంషీర్, షేక్ జిలాన్ (డిష్ జిలాన్), జి. ప్రవీణ్, కుమార్రెడ్డి, షేక్ గయాజ్, బాబుభాయి, నాసర్, రాజాసాబ్, పీర్బాషా, ఫారూఖ్, అహ్మద్, మస్తాన్ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగుల న్యాయమైన సమస్యలను పరిష్కరించాలి కడప కోటిరెడ్డిసర్కిల్ : ఏపీఎస్ ఆర్టీసీలో పనిచేస్తున్న ఉద్యోగుల న్యాయమైన సమస్యలను సత్వరమే పరిష్కరించేలా ప్రభుత్వం, యాజమాన్యం తగిన చర్యలు చేపట్టాలని నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. ఆర్టీసీ ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోరుతూ రెండవ రోజు బుధవారం అసోసియేషన్ నాయకులు కడప ఆర్టీసీ బస్టాండులోని ప్రధాన ద్వారం వద్ద ఆందోళన నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉద్యోగులకు సంబంధించి తక్షణమే పీఆర్సీ కమిషన్ను ఏర్పాటు చేయాలని, వేతన సవరణ జరిగి ఇప్పటికే రెండు సంవత్సరాలు పూర్తయినందున వెంటనే ఐఆర్ ప్రకటించాలని, గవర్నర్పేట–2 డిపోకు చెందిన 4.15 ఎకరాల స్థలాన్ని లులూ సంస్థకు బదలాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 8 వేల ఖాళీలను డైరెక్ట్ రిక్రూట్మెంట్ ద్వారా భర్తీ చేయాలని, గత నాలుగేళ్లుగా నిలిచిపోయిన పదోన్నతులు వెంటనే ఇవ్వాలని, నాన్ ఆపరేషన్ ఉద్యోగుల పెండింగ్ సమస్యలు పరిష్కరించాలని, ఉద్యోగుల అనారోగ్య సెలవులకు పూర్తి జీతం చెల్లించాలని, ఈహెచ్ఎస్ స్థానంలో పాత వైద్య విధానాన్ని పునరుద్దరించాలని, గ్యారేజీ ఉద్యోగుల అపరిష్కృత సమస్యలను పరిష్కరించడంతోపాటు మహిళా ఉద్యోగులకు ప్రభుత్వ జీఓ ప్రకారం పిల్లల సంరక్షణ సెలవులు మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ రీజినల్ ప్రెసిడెంట్ నాగముని, డిపో ప్రెసిడెంట్ జయరాం, గ్యారేజ్ సెక్రటరీ మల్లేష్, డిపో జాయింట్ సెక్రటరీ లక్ష్మయ్య, సీఎస్ రెడ్డి, రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
బినామీ వ్యక్తులు గోకులం షెడ్లు నిర్మించుకోవచ్చా?
గుర్రంకొండ : అసలు లబ్ధిదారులు కాకుండా బినామీ వ్యక్తులు గోకులం షెడ్లు నిర్మించుకోవచ్చా, వీటిని మీరు సమర్థిస్తూ ప్రోత్సహిస్తున్నారా అంటూ మండలంలోని శెట్టివారిపల్లెకు చెందిన రైతులు ఉపాధిహామీ అధికారులను నిలదీశారు. ప్రభుత్వ స్థలా ల్లో గోకులం షెడ్లు నిర్మించుకోవడం తప్పు కాదా వీటిని మీరు సమర్థించడం ఎంతవరకు సబబని వారు ప్రశ్నించారు. బుధవారం స్థానిక ఉపాధిహామీ కార్యాలయంలో సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. మండలంలోని శెట్టివారిపల్లె, టి.రాచపల్లె గ్రామాల్లో గోకులం షెడ్ల నిర్మాణాల ప్రస్తావన రాగానే వాగ్వాదం చెలరేగింది. శెట్టివారిపల్లెలో ఒకరి పేరుమీద మంజూరైన గోకులం షెడ్లు మరొకరు నిర్మించుకొన్నారని రైతులు ఫిర్యాదు చేశారు. అందులో ప్రభుత్వ స్థలంలో వీటిని నిర్మించుకొన్నారని అధికారుల దృష్టికి తీసుకొచ్చారు. కొన్ని చోట్ల గోకులం షెడ్లను కోళ్లఫారాలుగా మార్చేశారని వారు పేర్కొన్నారు. టి.రాచపల్లెలో గోకులం బిల్లుల మంజూరులో ఉపాధిహామీ సిబ్బంది లంచాలు వసూలు చేశారని రైతు ఫిర్యాదు చేశారు. బినామీ పేర్లతో నిర్మించుకొంటే తప్పేలేదని, సమస్య ఉంటే వారే చూసుకొంటారనే ధరోణిలో జిలా ఉన్నతాధికారులు తప్పులను సరిదిద్దే ప్రయత్నం చేశారు. దీంతో ఆగ్రహించిన రైతులు మీరే తప్పులను ప్రోత్సహించడం దారుణమన్నారు. ఇలాగైతే మాకూ ఓ నాలుగు గోకులం షెడ్లు మంజూరు చేయండి మేము బినామీ పేర్లతో కట్టుకొంటామని రైతులు అధికారులను కోరారు. షెడ్లు నిర్మాణాల సమయంలోనే తాము ఎన్నోమార్లు స్థానిక ఉపాధిహామీ అధికారులకు, సిబ్బందికి ఫిర్యాదు చేశామని అయినా వారు పట్టించుకోకుండా బినామీ వ్యక్తులకు బిల్లులు చేయడం ఎంతవరకు సబబని అధికారులను నిలదీశారు. పోరంబోకు స్థలంలో గోకులం షెడ్లు నిర్మిస్తున్నారని ఫిర్యాదు చేసినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. కనీసం గోకులం షెడ్లు నిర్మించే స్థలాలకు సంబంధించిన ఒన్బీ అడంగల్ కాపీలను కూడా చూడకుండా ఉపాధిహామీ సిబ్బంది ఎలా బిల్లులు చేస్తారని రైతులు నిలదీశారు. వీటిపై రెవెన్యూ అధికారులు, ఎంపీడీఓతో ఒక కమిటీ వేసి పూర్తి స్థాయిలో విచారణ జరిపిస్తామని విచారణలో వాస్తవాలు తేలితే తదుపరి చర్యలు తీసుకొంటామని పీడీ సమాధానమిచ్చారు. వీటిని మీరు ప్రోత్సహిస్తున్నారా? ప్రభుత్వ స్థలాల్లో గోకులం కట్టుకున్నా తప్పుకాదా? అధికారులను నిలదీసిన రైతులు -
పెన్నానదిలో యువకుడి గల్లంతు
ప్రొద్దుటూరు క్రైం : స్థానిక రామేశ్వరం సమీపంలోని రెండు కుళాయిల వద్ద ఉన్న పెన్నానదిలో నాయుని విక్రమ్ (20) అనే యువకుడు గల్లంతయ్యాడు. రూరల్ పోలీసులు తెలిపిన మేరకు.. మిట్టమడివీధికి చెందిన నాయుని విక్రమ్ వన్టౌన్ సర్కిల్లోని టీ దుకాణంలో మాస్టర్గా పని చేస్తున్నాడు. అతను తన స్నేహితులు వెంకటసాయి, ముత్తయ్య, శివలింగమయ్యలతో కలిసి బుధవారం పెన్నానదికి వెళ్లాడు. మిత్రులందరూ పెన్నానదిలో కొంత సేపు సరదాగా గడిపారు. కొంత సేపటి తర్వాత మళ్లీ వస్తానని చెప్పి విక్రమ్ వారికి దూరంగా వెళ్లాడు. అలా వెళ్లిన అతను నీటిలో గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని బోటు సాయంతో నదిలో గాలించారు. నీరు ఎక్కువగా ప్రవహిస్తుండటంతో విక్రమ్ ఆచూకీ తెలియలేదు. దీంతో కుటుంబ సభ్యులు రోదించసాగారు. యువకుడి తల్లి రుక్మిణీ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ పోలీసులు తెలిపారు. అవయవ దానం చేసి.. ప్రాణదాతగా నిలిచి.. మైలవరం : అవయవ దానం గురించి ప్రజల్లో అవగాహన కల్పించేందుకు ఏటా ఆగస్టు 13న ప్రపంచ అవయవ దాన దినోత్సవం నిర్వహిస్తారు. సరిగ్గా ఇదే రోజున వైద్యులు కల్పించిన అవగాహనతో మరణించిన ఓ వ్యక్తి కుటుంబ సభ్యులు అవయవ దానం చేసి స్ఫూర్తి ప్రదాతలుగా నిలిచారు. వివరాలు ఇలా.. ఈనెల 10వ తేదీన మైలవరం రిజర్వాయర్ గేట్ల వద్ద ప్రమాదవశాత్తు గోడ మీద పడిన దుర్ఘటనలో శివరామసుబ్బయ్య అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. చికిత్స నిమిత్తం అతన్ని కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి బుధవారం మృతి చెందాడు. వైద్యులు ఇచ్చిన స్ఫూర్తితో మృతుని కుటుంబ సభ్యులు కిడ్నీ, లివర్, ఊపిరితిత్తులను దానం చేశారు. -
భర్త మద్యం మానలేదని బలవన్మరణం
నిమ్మనపల్లె : కులాలు వేరైనా పెద్దలను ఎదిరించి ప్రేమ వివాహం చేసుకుంది.. ఎన్నో ఆశలతో కొత్త జీవితాన్ని ప్రారంభించిన కొంత కాలానికి భర్త మద్యానికి బానిస కావడంతో, ఎలాగైనా మాన్పించాలనుకుంది.. అందుకోసం ఎన్నోసార్లు భర్తతో గొడవ పడింది.. భర్త అలవాటును మార్చలేక.. తన వాళ్ల ముందు తలెత్తుకోలేక.. తీవ్ర మనస్థాపానికి గురై ఆ అభాగ్యురాలు తనువు చాలించింది. ఈ సంఘటన మంగళవారం రాత్రి నిమ్మనపల్లె మండలంలో జరిగింది. పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం పంచాయతీ రామాపురం గ్రామానికి చెందిన మలిశెట్టిపల్లె వెంకటరమణ, వెంకట రమణమ్మ దంపతుల కుమార్తె ఎం.రత్నమ్మ ఎం.ఫార్మసీ వరకు చదివి, మదనపల్లె ఎన్టీఆర్ సర్కిల్లోని అపోలో మెడికల్ షాప్లో పనిచేస్తూ ఉండేది. నిమ్మనపల్లి మండలం కొండయ్యగారిపల్లి పంచాయతీ వెంకోజిగారిపల్లెకు చెందిన బల్లాపురం చంద్రశేఖర్ కుమారుడు జ్యోతి శేఖర్ తల్లిదండ్రులు మరణించడంతో అమ్మమ్మ ముని సుబ్బమ్మతో ఉంటూ డిగ్రీ వరకు చదువుకొని మదనపల్లె అపోలో ఫార్మసీలో చేరాడు. ఈ క్రమంలో ఇద్దరి మధ్య ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. కులాలు వేరు కావడంతో పెద్దలు పెళ్లికి ఒప్పుకోలేదు. దీంతో కొన్నాళ్ల తర్వాత 2019 సంవత్సరంలో పెద్దలను కాదని ఇరువురు తవళం నేలమల్లేశ్వర స్వామి ఆలయంలో ప్రేమ వివాహం చేసుకున్నారు. వీరికి ముని పుష్కర్ నందన్ అనే ఒకటిన్నర ఏడాది బాబు ఉన్నాడు. వివాహం అనంతరం ఇరువురు ఉద్యోగాలు మానేసి, ఇంటివద్దే ఉంటూ జ్యోతి శేఖర్ పెయింటింగ్ పనులకు వెళ్తుండగా , రత్నమ్మ స్థానికంగా పనులకు వెళ్లేది. కొంతకాలంగా జ్యోతి శేఖర్ విపరీతంగా మద్యానికి బానిస అయ్యాడు. మద్యం సేవించి ఇంటికి వచ్చిన సమయంలో భార్యతో అతిగా గొడవపడేవాడు. ఈ క్రమంలో తరచు భార్యాభర్తల మధ్య మద్యం అలవాటు విషయమై విభేదాలు తలెత్తి గొడవపడేవారు. మూడు నెలలుగా రత్నమ్మ భర్తను నీవు మద్యం అలవాటు మానకపోతే నేను చచ్చిపోతాను అంటూ బెదిరించేది. ఈ నేపథ్యంలో మంగళవారం భర్త మద్యం సేవించి ఇంటికి రాగా ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం జ్యోతి శేఖర్ ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. రాత్రి తిరిగి ఇంటికి వచ్చేటప్పటికి, రత్నమ్మ ఇంటికి గడియ పెట్టి ఉండడంతో, జ్యోతి శేఖర్ కిటికీలో నుంచి లోనికి చూడగా భార్య ఉరి వేసుకొని వేలాడుతూ ఉండటం గమనించాడు. వెంటనే తలుపులు బద్దలు కొట్టి స్థానికుల సాయంతో భార్యను కిందికి దించి, వెంటనే స్థానిక పీహెచ్సీ కేంద్రానికి తీసుకువెళ్లారు. పరీక్షించిన వైద్య సిబ్బంది రత్నమ్మ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని ఇంటికి తీసుకువచ్చారు. ఈ విషయం స్థానికులు పోలీసులకు తెలియజేయడంతో, వారు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. బుధవారం ఉదయం తహసీల్దార్ తపస్విని స్థానికుల సమక్షంలో శవ పంచనామా నిర్వహించి వాంగ్మూలం రికార్డ్ చేశారు. అనంతరం మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి తండ్రి వెంకటరమణ ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు -
చనిపోయిన వాళ్లు ఉపాధి హామీ పనులు చేశారు
గుర్రంకొండ : నాలుగేళ్ల క్రితం చనిపోయిన వాళ్లు ఉపాధిహామీ పనులు చేశారు. గోకులం షెడ్ల నిర్మాణంలో మంజూరైన బిల్లుల్లో అవకతవకలు జరిగాయి. ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజినీర్లు ఉపాధిహామీ కూలీలుగా పనిచేసి బిల్లులు చేసుకొన్నారు. ఇవన్నీ గుర్రంకొండ మండలంలో ఏడాదిగా జరిగిన ఉపాధి హామీ పనుల్లో జరిగిన వింతలు, విశేషాలు. దీనికి సంబంధించి ఒక టెక్నికల్ అసిస్టెంట్, ఒక ఫీల్డ్ అసిస్టెంట్లను ఉన్నతాధికారులు సస్పెండ్ చేశారు. ఉపాధిహామీ అక్రమాల్లో మొత్తం రూ. 2,39,372 అవినీతి జరిగినటు అఽఽధికారులు లెక్కలు తేల్చి ఎనిమిది పనులపై విచారణకు ఆదేశించారు. వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండలోని ఉపాధిహామీ కార్యాలయంలో బుధవారం పీడీ వెంకటరత్నం ఆధ్వర్యంలో సామాజిక తనిఖీ బహిరంగ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 2024–25 ఏడాదికి సంబంధించి మొత్తం రూ.5.50 కోట్లు ఉపాధి హామీ పనులు జరిగాయన్నారు. ఇందులో కూలీలకు వేతనాల కింద రూ.4.30 కోట్లు, మెటీరియల్ చెల్లింపుల కింద రూ. 1.20 చెల్లించామన్నారు. గ్రామాల వారీగా ఉపాధి హామీ పనుల్లో జరిగిన అవినీతిని చదివి వినిపించారు. ● సరిమడుగులో 2021లో చనిపోయిన ఓ వ్యక్తి 2024లో పనిచేసినట్లు మస్టర్లలో చూపించి బిల్లు డ్రా చేసుకొన్నారు. ఇదే పంచాయతీలో చిన్న రమణ అనే వ్యక్తి 2023లో చనిపోగా ప్రస్తుతం అతను వారం రోజుల పాటు ఉపాధి హామీ పనులు చేసినట్లు రికార్డుల్లో చూపించి బిల్లులు డ్రా చేసుకొన్నారు. ● గుర్రంకొండ, సరిమడుగు గ్రామాల్లో అంగ్నవాడీ టీచర్లు, బెంగుళూరులో ఉద్యోగం చేసుకొనే సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉపాధి హామీ పనులు చేసినట్లు చూపించి బిల్లులు డ్రా చేసుకొన్నట్లు విచారణలో తేలింది. ● శెట్టివారిపల్లె, టి.రాచపల్లె, సరిమడుగు గ్రామాల్లో ఒకరి పేరుమీద మంజూరైన షెడ్లు బినామీ వ్యక్తులు నిర్మించుకొని బిల్లులు చేసుకొన్నట్లు విచారణలో తేలింది. ● టి.రాచపల్లెలో గోకులం షెడ్లు బిల్లుల మంజూరు కోసం ఉపాదిహామీ సిబ్బంది రైతుల దగ్గర నుంచి రూ.20 వేలు లంచం వసూలు చేసినట్లు విచారణలో తేలినట్లు అధికారులు తెలిపారు. ● పదిగ్రామాల్లో బినామీ పేర్లతో మస్టర్లలో ఒకరే ఫోర్జరీ సంతకాలు చేసి లక్షలాది రూపాయల నిధు లు డ్రా చేసుకొన్నారు. ఇందులో ఫీల్డ్ అసిస్టెంట్లు, వారి కుటుంబ సభ్యులు పనులు చేయకపోయినా వారి పేర్లు మస్టర్లలో నమోదు చేసుకొని బిల్లులు డ్రా చేసుకొన్నట్లు అధికారులు ప్రకటించారు. ● రెండు గ్రామాల్లో ఫారంఫాండ్ పనులు చేయకపోయినా ఉపాధిహామీ సిబ్బంది బినామీ పేర్లతో మస్టర్లు వేసుకొని బిల్లులు డ్రా చేసుకొన్నారు. ● మస్టర్లలో కూలీల సంతకాలను కొంతమంది నాయకులు ఫోర్జరీ చేసి బిల్లులు డ్రా చేసుకొన్నారు. ● గుర్రంకొండ, టి.పసలవాండ్లపల్లె గ్రామాల్లో హౌసింగ్ బిల్లులను లబ్ధిదారుల పేరుమీద కాకుండా బినామీ వ్యక్తుల పేర్లతో బిల్లులు చేసుకొన్నారు. ● వీటికి సంబంధించి ఉపాధిహామీ సిబ్బందికి రూ. 7 వేలు జరిమానా విధించారు. కాగా ఉపాధిహామీ పనుల్లో జరిగిన అక్రమాల్లో రూ. 2,39,372 ఆవినీతి జరిగినట్లు ప్రకటించారు. ఇందుకు సంబంధించి సరిమడుగు ఫీల్డ్ అసిస్టెంట్ పూజిత, టెక్నికల్ అసిస్టెంట్ మదన్మోహన్రాజులను సస్పెండ్ చేసినట్లు పీడీ వెంకటరత్నం తెలిపారు. మండంలో వివాదాస్పదంగా మారిన ఎనిమిది పనులపై ఎంపీడీవో, ఏపీడీలతో విచారణ కమిటీ ఏర్పాటు చేశామన్నారు ఈ కార్యక్రమంలో ఏపీడీ మధుబాబు, ఏఓ బ్రహ్మానందరెడ్డి, ఏపీవో జయరామిరెడ్డి, సింగిల్విండో అధ్యక్షుడు ఎంఎల్ఎన్ మూర్తిరావ్, సింగిల్విండో మాజీ అధ్యక్షుడు మహాత్మారెడ్డి తదితరులు పాల్గొన్నారు. గోకులం బిల్లుల్లో గోల్మాల్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఉద్యోగులు కూలీలే రూ.2,39,372 రికవరీకి ఆదేశం -
వైఎస్సార్సీపీ యువజన విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్గా భూమన అభినయ్రెడ్డి
రాజంపేట : వైఎస్సార్సీపీ యువజన విభాగం స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ (జోన్–4)గా తిరుపతి మాజీ ఎమ్మెల్యే భూమన కరుణాకర్రెడ్డి తనయుడు భూమన అభినయ్రెడ్డిని ఆ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నియమించారు. ఈ మేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటన విడుదల చేసింది. అభినయ్రెడ్డి తిరుపతి నగర కార్పొరేషన్ డిప్యూటీ మేయర్గా పనిచేశారు. ఈయన జోన్–4 పరిధిలో అన్నమయ్య, చిత్తూరు, తిరుపతి, ప్రకాశం, నెల్లూరు జిల్లాలు ఉన్నాయి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ యువజన విభాగం తరపున వైఎస్సార్సీపీ బలోపేతానికి తన వంతు కృషి చేస్తానన్నారు. -
సామాజిక తనిఖీ బహిరంగ సభలో టీడీపీ నేతల బాహాబాహీ
గుర్రంకొండ : సామాజిక తనిఖీ బహిరంగ సభా ప్రాంగణంలో టీడీపీ నేతలు ఘర్షణకు దిగారు. మండలంలోని శెట్టివారిపల్లెలో జరిగిన అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు సభా ప్రాంగణం వద్దనే బాహాబాహీకి దిగాయి. సవాళ్లు, ప్రతిసవాళ్లతో సభా ప్రాంగణం దద్దరిల్లిపోవడంతో అధికారులు హడలెత్తిపోయారు. బుధవారం స్థానిక ఉపాధి హామీ కార్యాలయంలో సామాజిక తనిఖీ బహిరంగ సభ నిర్వహించారు. 2024–25 ఏడాదికి సంబంధించి మండలంలో ఉపాధి హామీ పనుల్లో జరిగిన అక్రమాలను అధికారులు బహిరంగంగా చదివి వినిపించారు. ఈ సందర్భంగా మండలంలోని శెట్టివారిపల్లెలో గోకులం షెడ్ల నిర్మాణాల్లో జరిగిన అవినీతిపై టీడీపీలోని రెండు వర్గాలు గత కొన్ని రోజులుగా ఆరోపణలు చేసుకోవడంతో పాటు జిల్లా అధికారులకు పరస్పరం ఫిర్యాదులు చేసుకొన్నారు. ఇదే విషయమై బహిరంగసభలోనూ వాగ్వాదం చేసుకొన్నారు. సదరు గ్రామానికి సంబంధించి పూర్తి వివరాలు అధికారులు చదివి వినిపించిన తరువాత అందరూ కలిసి సభ జరుగుతున్న భవనం వెలుపలికి చేరుకున్నారు. గోకులం షెడ్లలో జరిగిన అవినీతిపై ప్రశ్నించడానికి మీరెవరంటూ టీడీపీ నేతలు రెండు వర్గాలగా విడిపోయి బాహాబాహీకి దిగారు. మాపైనే ఫిర్యాదు చేస్తారా అంటూ ఒక వర్గం నేతలు తిట్ల పురాణం అందుకున్నారు. దీంతో మరో వర్గం రెచ్చిపోవడంతో వాగ్వాదం పెద్దదిగా మారి అక్కడి పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. అరుపులు, కేకలతో సభా ప్రాంగణం గందరగోళంగా మారడంతో అధికారులు హడలెత్తిపోయారు. అందరు కలసి సమావేశం నుంచి వెలుపలికి వచ్చి టీడీపీలోని ముఖ్యనాయకులు, అధికారులు రెండువర్గాల వారికి నచ్చజెప్పి అక్కడి నుంచి పంపించి వేశారు. ఉపాధిహామీ పనుల్లో జరిగిన అవినీతిపై టీడీపీ నేతలు పరస్పరం ఘర్షణ పడటం పట్టణంలో చర్చనీయాంశంగా మారింది. అవినీతిపై వాగ్వాదం సవాళ్లు, ప్రతిసవాళ్లతో దద్దరిల్లిన ప్రాంగణం -
మత్తుకు బానిసలైతే భవిష్యత్తు నాశనమే
రాయచోటి టౌన్ : మత్తుకు బానిసైతే మీ భవిష్యత్తు నాశనమవుతుందని పోలీసు అధికారులు విద్యార్థులకు సూచించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు బుధవారం రాయచోటి డివిజన్ పరిధిలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలు, కళాశాలల్లో నషా ముక్త్ భారత్ అభియాన్ అనే కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం విద్యార్థులతో కలసి మత్తుకు బానిసలం కాము అనే నినాదంతో ప్రతి/్ఞ చేయించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నేటి తరం యువత మత్తుకు బానిసగా మారి హత్యలు, నేరాలకు పాల్పడుతూ తమ భవిష్యత్తును నాశనం చేసుకొంటున్నారని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆయా ప్రాంతాలకు చెందిన పోలీసు అధికారులు పాల్గొన్నారు. లారీలు ఢీకొని ఇద్దరు డ్రైవర్లకు గాయాలు మదనపల్లె రూరల్ : రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొనడంతో ఇద్దరు డ్రైవర్లు తీవ్రంగా గాయపడిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. కుప్పం వడ్డిపల్లెకు చెందిన డ్రైవర్ నారాయణస్వామి(30) టెంపోలో మదనపల్లె టమాటా మార్కెట్కు బయలుదేరాడు. హైదరాబాదుకు చెందిన వెంకటదుర్గారావు(45) లారీలో పలమనేరుకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని 150వ మైలువద్ద రెండు లారీలు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ప్రమాదంలో లారీల్లోని ఇద్దరు డ్రైవర్లు గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను 108 అంబులెన్స్లో మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ జరుపుతున్నారు. గర్భిణి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : గర్భిణి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన బుధవారం పీటీయం మండలంలో జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. పీటీఎం మండలం టి.సదుంకు చెందిన శ్రీకాంత్ భార్య పావని(27) ప్రస్తుతం ఏడు నెలల గర్భిణి. వీరికి ఏడేళ్ల కుమారుడు ఉన్నాడు. కాగా భర్త కొంతకాలంగా తనను, బిడ్డను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో తీవ్ర మనస్తాపానికి గురైంది. పురుగుమందు తాగి ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పీటీయం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వరకట్న మరణం కేసులో పదేళ్ల జైలు శిక్ష
నందలూరు : వరకట్న మరణం కేసులో ముద్దాయి పామూరు సాయివర్ధన్కు రాజంపేట 3వ ఏడీజే కోర్టు పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. బుధవారం ఆయన మాట్లాడుతూ నందలూరు టౌన్ బ్రాహ్మణవీధికి చెందిన పామూరి సాయివర్ధన్ తన భార్య పామూరి లక్ష్మీప్రసన్న(22)ను అదనపు కట్నం కోసం వేధించేవాడు. దీంతో ఆమె భర్త వేధింపులు తాళలేక 2023వ సంవత్సరం మార్చి 29వ తేదీన తన చున్నీతో ఉరి వేసుకొని చనిపోయినట్లు, మృతురాలి తండ్రి రావూరు కనకరత్న ఆచారి పోలీసులకు ఫిర్యాదు చేశారు. అప్పటి నందలూరు ఏఎస్ఐ జేవీ సుబ్బరాయుడు క్రైం నెంబర్ 79/2023, యు/సెక్షన్ 304(బి) ఐపీసీ ప్రకారం కేసు నమోదు చేశారు. అప్పటి రాజంపేట డీఎస్పీ జి.శివభాస్కర్రెడ్డి, మరో డీఎస్పీ వీఎన్కె చైతన్య సాక్షులను విచారించి, సాక్ష్యాధారాలను సేకరించి దర్యాప్తు చేసి సమగ్ర నివేదికను కోర్టుకు సమర్పించారు. ఆ నివేదిక ఆధారంగా రాజంపేట 3వ ఏడీజే కోర్టు విచారణ జరిపి ముద్దాయికి పదేళ్ల జైలు శిక్ష విధిస్తూ తీర్పు వెలువరించింది. -
రేషన్ షాపులపై ఫిర్యాదులు వస్తే చర్యలు
మదనపల్లె రూరల్ : రేషన్ షాపులకు సంబంధించి ఎలాంటి ఫిర్యాదులు వచ్చినా విచారించి కఠిన చర్యలు తీసుకుంటామని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హెచ్చరించారు. బుధవారం పట్టణంలోని రేషన్ షాపులను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. షాపునకు స్టాక్ ఎంత వచ్చింది? పంపిణీ ఎంత చేశారు ? మిగిలిన సరుకులను తనిఖీ చేశారు. స్థానికంగా ఉన్న రేషన్ లబ్ధిదారులను రేషన్ షాపు యజమాని సమయపాలన పాటిస్తున్నారా..? సరుకులను కచ్చితమైన తూకంతో అందిస్తున్నారా అనే విషయాలపై ఆరా తీశారు. ప్రతినెలా ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు విధిగా రేషన్ షాపులు తెరవాలన్నారు. 65 సంవత్సరాలకు పైబడిన వారికి, దివ్యాంగులకు వారి ఇంటివద్దనే రేషన్ ఇవ్వాలన్నారు. రేషన్ దుకాణం పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని, వినియోగదారులతో మర్యాదపూర్వకంగా వ్యవహరించాలన్నారు. రేషన్ షాపుల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో సివిల్ సప్లయిస్ డీటీ ఎన్.ఫిరోజ్ఖాన్, రెవెన్యూ సిబ్బంది పాల్గొన్నారు.జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ -
మూడు ముక్కలాట?
మదనపల్లె: కూటమి ప్రభుత్వ ప్రభావమో, స్థానిక రాజకీయ వర్గపోరు వల్లనో కాని మదనపల్లె వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పదవికి చాలామంది పోటీ పడుతున్నారు. ఇక్కడి పరిస్థితులు మూడు పార్టీల మధ్య చైర్మన్ పదవి మూడు ముక్కలాటగా మారింది. ఎవరికి వారు చైర్మన్, కమిటీ డైరెక్టర్ల పదవులకు జాబితాలు తమ నేతల ద్వారా సమర్పించుకున్నట్టు తెలుస్తోంది. ఈ వ్యవహారంలో అధికార పార్టీకి చెందిన స్థానిక టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ది కీలకపాత్ర ఉంటుంది. చైర్మన్ పదవికి ఎవరి పేరు సిఫార్సు చేశారో ఆయన మనసులోని మర్మం బయట పెట్టడం లేదు. దీనికి స్థానిక రాజకీయ పరిస్థితులే కారణమని చెబుతున్నారు. ఎమ్మెల్యే మర్మం రహస్యం మదనపల్లె మార్కెట్ కమిటీకి చైర్మన్గా ఎమ్మెల్యే షాజహాన్ ఒకరి పేరును సిఫార్సు చేశారని, ఆ పేరు గుర్తులేదని మార్కెటింగ్శాఖ ఉన్నతాధికారి ఒకరు చెప్పారు. అంటే ఎమ్మెల్యే సిఫార్సు చేసిన ఆ నేత పేరు బయటకు రాకపోవడం బట్టి చూస్తే కూటమి పార్టీలు అప్రమత్తం అవుతాయని, లేదంటే వ్యతిరేకత వస్తుందని రహస్యంగా ఉంచారని భావిస్తున్నారు. ఇది వర్గపోరు మరింత తీవ్రత పెంచితే తలనొప్పి తప్పదని జాగ్రత్తలు తీసుకుని ఉండొచ్చు. ఎలా ఉన్నప్పటికి ఈ వ్యవహారం కిందిస్థాయి మార్కెటింగ్శాఖ అధికారులు తమకు తెలియదని అంటున్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పేర్లు బహిరంగం కాకూడదన్న ఆలోచనతో ఉన్నట్టు కనిపిస్తోంది. అయితే కమిటీ చైర్మన్గా ఎవరున్నా దానికి గౌరవ చైర్మన్ ఎమ్మెల్యేనే కాబట్టి అధికారాలన్ని ఆయనే చెలాయించే అవకాశం లేకపోలేదు. ఎమ్మెల్యే ఆదేశాలను ఽఅధికారులు దిక్కరించి వ్యవహరించే పరిస్థితి ఉండదు కనుక..ఎమ్మెల్యే కూటమి పార్టీల తీరును గమనించేందుకు ఆ పేరును రహస్యంగా ఉంచారేమో అని పార్టీ వర్గాల్లో చర్చించుకొంటున్నారు. జనసేన కమిటీ సిఫార్సు స్థానిక జనసేన నేత చైర్మన్, డైరెక్టర్ల పేర్లతో కమిటీకి సిఫార్సు చేశారు. జనసేన మంత్రి, టీడీపీకి చెందిన ఓ మంత్రి ద్వారా తాను సిఫార్సు చేసిన కమిటీకి ఆమోదం లభించేలా ప్రయత్నిస్తున్నట్టు తెలుస్తోంది. ఇది ఎమ్మెల్యే సిఫార్సు చేసిన కమిటీకి పోటీగా సిఫార్సు చేసినట్టు పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. దీంతో కూటమి పార్టీల మధ్య పోటీ నెలకొన్నట్టే. అయితే ఎమ్మెల్యే సిఫార్సుకు ఆమోదం లభిస్తుందా లేక జనసేన కమిటీకి పదవులు లభిస్తాయా అన్నది చర్చనీయాంశమైంది. అధికారంలోని రెండుపార్టీల మధ్య పోటీ నెలకొన్నట్టు తెలుస్తోంది. కాగా కమిటీలో డైరెక్టర్ పదవుల కోసం బీజేపీకి చెందిన కొందరి నుంచి వారి వ్యక్తిగత వివరాలను సేకరించారు. కొందరి పేర్లను సిఫార్సు చేశా రని బీజేపీ వర్గాలు పేర్కొంటున్నాయి. బీజేపీకి వైస్చైర్మన్ పదవిని కట్టబెట్టే పరిస్థితులు కనిపిస్తున్నాయి. నేనే చైర్మన్.. నేనే మార్కెట్ చైర్మన్ అంటూ ఓ స్థానిక నేత తమపై పెత్తనం చెలాయించడం పట్ల మార్కెటింగ్ అధికారులు తీవ్ర అసహనానికి గురవుతున్నారు. మదనపల్లె మార్కెట్ చైర్మన్ పదవిని కలెక్టర్ శ్రీధర్ జనరల్ మహిళకు కేటాయిస్తూ ఉత్తర్వు జారీ చేశారు. ప్రభుత్వం ఇంతవరకు చైర్మన్ను నియమిస్తూ ఉత్తర్వు జారీచేయలేదు. అయితే ఆ నాయకుడు మార్కెట్ యార్డులో పరిస్థితుల గురించి అదేమైంది, ఇదేమైంది, నేను బాధ్యతలు చేపట్టే వరకు ఏపని చేయొద్దు అంటూ హుకుం జారీ చేయడంపై అధికారులు విస్తుపోతున్నారు. తమ్ముళ్ల తికమక కూటమి పార్టీల మధ్య మార్కెట్ కమిటీ వ్యవహరం రసవత్తరంగా మారడంతో టీడీపీ తమ్ముళ్లు తికమక పడుతున్నారు. పదవులను పొందడం కోసం ఎదురుచూస్తున్నారు. పొరుగు నియోజకవర్గాల్లో నామినేటెడ్, సింగిల్విండో త్రీమెన్ కమిటీలు భర్తీ చేస్తుంటే.. మదనపల్లెలో ఇవేమిలేక నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్ కమిటీలోనైనా పదవులు పొందాలనుకుంటే కూటమి పార్టీల మధ్య పోటీతో తమ్ముళ్లు ఉసూరుమంటున్నారు. కనీసం పార్టీ పదవులనైనా దక్కుతాయంటే అవీ ఎండమావిగానే కనిపిస్తున్నాయని నిట్టూరుస్తున్నాయి. వర్గాల మధ్య పోరుతో ఎవరికి ఏ పదవి ఇస్తారో లేక ఇవ్వరో అని ఆశలు వదులుకుంటున్నారు. మదనపల్లె చైర్మన్ పదవికి ఎమ్మెల్యే పంపిన పేరు రహస్యం జనసేన తరపునా పేర్లతోకమిటీకి సిఫార్సు బీజేపీ వర్గీయులకు డైరెక్టర్ పోస్టులు తానే చైర్మన్ అంటూ అధికారులపై ఓ నేత పెత్తనం -
వైఎస్ జగన్ను కలిసిన సుబ్బారెడ్డి
ఒంటిమిట్ట : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డిని బుధవారం జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో కలిశారు. ఈ సందర్భంగా ఒంటిమిట్టలో మంగళవారం జరిగిన జెడ్పీటీసీ ఉప ఎన్నిక గురించి ఆయనతో చర్చించారు. ఇంతటి ఘోరమైన ఎన్నికలు తమ జీవితంలో చూడలేదన్నారు. మండలంలో ఏర్పాటు చేసిన ప్రతి బూత్లో మంత్రి మండిపల్లి రాంప్రసాద్ సమక్షంలో ఆయన మనుషులు రిగ్గింగ్ చేశారని తెలిపారు. ఇక్కడ జరిగిన దౌర్జన్యాలు, అక్రమాల గురించి మాజీ సీఎంకు వివరించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట వైఎస్సార్ సిప మండల అధ్యక్షులు టక్కోలు శివారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కాటమరాజు స్థల పట్టాను రద్దు చేయండి
గాలివీడు : కొన్ని వందల సంవత్సరాలుగా గ్రామ ప్రజలందరూ సంక్రాంతి రోజున కాటమరాజు దగ్గర చిట్లాకుప్ప వేసుకొని పశువులను బెదిరిస్తూ పండగ చేసుకుంటూ వస్తున్నారని, ఈ స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తి పట్టా చేసుకొని చుట్టూ కంచె వేశాడని, ఈ స్థలానికి సంబంధించి డీకేటీ పట్టాను రద్దుచేసి గ్రామ ప్రయోజనాల కోసం కాటమరాజు ఉత్సవానికి కేటాయించాలని జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి తహసీల్దార్ భాగ్యలతకు సూచించారు. నూలివీడు పంచాయతీ నాగూరివాండ్లపల్లెకు సమీపంలో ఉన్న స్థలాన్ని అదే గ్రామానికి చెందిన వేరే వ్యక్తి డీకేటీ పట్టా చేయించుకుని దాని చుట్టూ కంచె వేసిన విషయాన్ని గ్రామ ప్రజలు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు బుధవారం స్థానిక తహసీల్దార్తో కలిసి కలెక్టర్ కాటంరాజు స్థలాన్ని పరిశీలించారు.అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ కాటమరాజు స్థలాన్ని ఆక్రమించుకున్న కుటుంబ సభ్యులకు ఎన్ని ఎకరాల వరకు డీకేటీ పట్టా ఉంది.. ఎంతమంది పేర్ల మీద డీకేటీ ఉంది అనే విషయాన్ని పరిశీలించాలన్నారు. వెంటనే కాటమరాజు స్థలాన్ని ఆక్రమించుకొన్న డీకేటీ పట్టాను రద్దు చేయడానికి తగిన ప్రతిపాదనలు తమకు పంపాలని తహసీల్దార్కు తెలియజేశారు. గుడి స్థలాలను కబ్జా చేసేవారిపై చర్యలు తీసుకోవాలని తెలిపారు.కాటమరాజు స్థల వివాదం విషయం తమ దృష్టికి వచ్చిందని. ఇరుపక్షాలతో మాట్లాడి కాటంరాజు ఉత్సవాన్ని జరుపుకోవడానికి స్థలం ఇవ్వాలని తాను కూడా వారికి తెలియజేసినట్లు తహసీల్దార్ భాగ్యలత కలెక్టర్కు విన్నవించారు. ఆధునిక బోధనా పద్ధతులు తప్పనిసరి రాయచోటి : అంగన్వాడీ సెంటర్లలో ఈసీసీ కార్యక్రమాల ద్వారా పిల్లలకు ఆధునిక బోధనా పద్ధతులు అనుసరించడం అవసరమని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం అమరావతి నుంచి ప్రిన్సిపల్ సెక్రటరీ సూర్యకుమారి అంగన్వాడీ సెంటర్లలో ఈసీసీ కార్యకలాపాలపై వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్తోపాటు సీ్త్ర శిశు సంక్షేమ శాఖ పీడీ హైమావతి పాల్గొన్నారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పిల్లలు ఆధునిక బోధనా పద్ధతులు అనుసరించేలా చర్యలు తీసుకోవాల్సి ఉందని,వారిభవిష్యత్తుకు ఇది బలమైన పునాది అవుతుందని పేర్కొన్నారు. జిల్లాలోని 11 ప్రాజెక్టుల పరిధిలోని 2275 అంగన్ వాడీ కేంద్రాల్లో 35248 మంది పిల్లలకు పౌష్టికాహారం, ప్రాథమిక విద్యను అందిస్తున్నామని వివరించారు. తంబళ్లపల్లిలో అంగన్ వాడీ కేంద్రాన్ని పరిశీలించి మూవబుల్ గ్రీన్ బోర్డులు ఏర్పాటు చేయడం వల్ల మంచి ఫలితాలు వచ్చాయని తెలిపారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
రాజంపేట ఎంపీపీగా రమణమ్మ
రాజంపేట టౌన్ : రాజంపేట మండల ప్రజా పరిషత్ అధ్యక్షురాలిగా (ఎంపీపీ) మండలంలోని తుమ్మల అగ్రహారానికి చెందిన ఆరెళ్ళ రమణమ్మ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గతంలో ఎంపీపీగా ఉన్న వై.వెంకటనారాయణ మృతి చెందడంతో ఆ పదవి ఖాళీ ఏర్పడింది. దీంతో అధికారులు బుధవారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయ సభాభవనంలో ఎంపీపీ పదవికి ఎన్నిక నిర్వహించారు. ఈ నేపథ్యంలో గత స్థానిక సంస్థల ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున కూచివారిపల్లె–2 ఎంపీటీసీగా ఎన్నికై న ఆరెళ్ళ రమణమ్మ ఎంపీపీ పదవికి నామినేషన్ దాఖలు చేశారు. రమణమ్మ ఆభ్యర్థిత్వాన్ని ఆర్.బుడుగుంటపల్లె ఎంపీటీసీ, మండల ఉపాధ్యక్షుడు ఆకేపాటి రంగారెడ్డి ప్రతిపాదించగా తాళ్ళపాక ఎంపీటీసీ డి.మధుసూదన్వర్మ బలపరిచారు. రాజంపేట మండలంలో మొత్తం 16 ఎంపీటీసీలకు ఇద్దరు మృతి చెందారు. దీంతో 14 మంది ఎన్నికలో పాల్గొని రమణమ్మను ఎంపీపీగా ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. డివిజనల్ డెలప్మెంట్ ఆఫీసర్ నరసింహమూర్తి ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. ఈకార్యక్రమంలో ఎంపీడీఓ పగడాల వరప్రసాద్ పాల్గొన్నారు. అనంతరం ఆరెళ్ల రమణమ్మ విలేకరులతో మాట్లాడుతూ మండల అభివృద్ధికి కృషి చేస్తానని తెలిపారు.ఈసందర్భంగా ఎంపీటీసీలకు ఆమె కృతజ్ఞతలు తెలిపారు. -
మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వీసీగా యువరాజ్
కురబలకోట : అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వైస్ చాన్స్లర్(వీసీ)గా ప్రొఫెసర్ యువరాజ్ నియమితులయ్యారు. ఈ విషయాన్ని యూనివర్సిటీ చాన్స్లర్ డాక్టర్ నాదెళ్ల విజయభాస్కర్ చౌదరి బుధవారం పేర్కొన్నారు.యూనివర్సిటీ ప్రో చాఽన్స్లర్ ఎన్. ద్వారకనాఽథ్ యువరాజ్కు నియామక ఉత్తర్వును అందజేశారు. అడ్మిషన్ల కోసం అదనపు నోటిఫికేషన్ రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని ప్రైవేట్ పాఠశాలల్లో 1వ తరగతిలో అడ్మిషన్ల కోసం అదనపు నోటిఫికేషన్ ప్రభుత్వం ఇచ్చిందని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 20లోగా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. విద్యార్థుల అర్హత నిర్ధారణ ఈ నెల 21న, లాటరీ ఫలితాల ప్రకటన 25వ తేదీన, పాఠశాలల్లో అడ్మిషన్లు ఖరారు చేయడం ఈ నెల 31న ఉంటుందన్నారు. రేపు మాంసం విక్రయం నిషేధం రాజంపేట : రాజంపేటలో ఆగస్టు 15న మాంసం విక్రయాలు, జంతువధఽ నిషేధం అమలులో ఉంటుందని మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు బుధవారం తెలిపారు. హోటల్స్, రెస్టారెంట్ల్లో మాంసం అమ్మరాదన్నారు. ఈ నియమాలు అతిక్రమించిన వారిపై భారీ జరిమానా విధించి, చట్టపరమైన చర్యలు తీసుకుంటామని వెల్లడించారు. 17న బాల్బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక రాజంపేట టౌన్ : రాజంపేట పట్టణంలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడామైదానంలో ఈనెల 17వ తేదీ ఉదయం 9 గంటలకు ఉమ్మడి వైఎస్సార్ జిల్లా జట్టుకు బాల్బ్యాడ్మింటన్ క్రీడాకారులను ఎంపిక చేయనున్నారు. ఈ విషయాన్ని బాల్బ్యాడ్మింటన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు వై.కృష్ణమూర్తి, జి.వెంకటరమణ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సబ్ జూనియర్స్ విభాగంలో బాల, బాలికలు, సీనియర్స్ విభాగంలో పురుషులు, మహిళల ఎంపికలు ఉంటాయన్నారు. జిల్లా జట్టుకు ఎంపికై న వారు ఈనెల 29 నుంచి మూడు రోజుల పాటు ప్రకాశంజిల్లా చేవూరులో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. వివరాలకు 9490181104, 7036907303 నంబర్లలో సంప్రదించాలని తెలిపారు. ‘పింఛా’లో పెరిగిన నీటిమట్టం సుండుపల్లె : గత కొద్ది రోజులుగా కురుస్తున్న వర్షాలకు పింఛా ప్రాజెక్టులో నీటిమట్టం పెరుగుతోంది.బుధవారం సాయంత్రానికి 258 క్యూసెక్కుల ఇన్ఫ్లో చేరగా ప్రస్తుతం 996.6 అడుగుల నీరు నిల్వ ఉంది. ప్రాజెక్టులో మొత్తం నీరు 81.74 శాతంగా ఉందని జలవనరుల శాఖ ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు మాట్లాడుతూ ప్రాజెక్టుకు ఎగువ ప్రాంతం నుంచి వస్తున్న వరదల కారణంగా ప్రాజెక్టు నిండే అవకాశం ఉందని, ఏ సమయంలోనైనా గేట్లు ఎత్తుతారని, అందువల్ల ప్రాజెక్టుకు దిగువ ప్రాంతాల్లో ఉండే ప్రజలు అప్రమత్తంగా ఉండాలని తెలియజేశారు. కౌంటింగ్కు పటిష్ట భద్రత కడప సెవెన్రోడ్స్ : పటిష్టమైన భద్రతా బలగాల మధ్య కౌంటింగ్ నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వైఎస్సార్ కడపజిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పేర్కొన్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు సంబంధించి బుధవారం సాయంత్రం కడప రిమ్స్ సమీపంలోని మౌలానా అబుల్ కలాం ఆజాద్ ఉర్దూ నేషనల్ యూనివర్సిటీలో ఏర్పాటు చేసిన కౌంటింగ్ కేంద్రాన్ని జేసీ అదితి సింగ్తో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ స్ట్రాంగ్ రూముల్లో పోస్టల్ బ్యాలెట్ ఓట్లతో పాటు, పోలింగ్ కేంద్రాల్లో పోలైన ఓట్లతో నిక్షిప్తమైన బ్యాలెట్ బాక్సులను అత్యంత సురక్షితంగా భద్రపరచామన్నారు. వివిధ రాజకీయ పార్టీల ఏజెంట్లు కౌంటింగ్ ప్రక్రియను పరిశీలించేందుకు వీలుగా ఏర్పాట్లు చేశామన్నారు. ఓట్ల లెక్కింపు కోసం ఓట్ల లెక్కింపు కోసం ఇప్పటికే సిబ్బందిని ఏర్పాటు చేసి మైక్రోఅబ్జర్వర్లు, కౌంటింగ్ ఏజెంట్లు, సూపర్వైజర్లను నియమించి కౌంటింగ్ పై వారికి శిక్షణ కూడా ఇవ్వడం జరిగిందన్నారు. రౌండ్ల వారీగా కౌంటింగ్ సమాచారం కోసం మీడియా సెంటర్ను కుడా ఏర్పాటు చేశామన్నారు. -
పచ్చ జెండా కట్టినా వదలని 'ఎల్లో' మూకలు
అన్నమయ్య: గత ఎన్నికల్లో టీడీపీకే ఓట్లు వేశాము.. మా అంగడిపైనా టీడీపీ జెండాలే ఉన్నాయి.. అయినా సరే టీటీడీ అధికారులు, పోలీసులు మా అంగడిని ఖాళీ చేయాలంటూ వేధింపులకు గురి చేస్తున్నారు. వీరికి పరోక్షంగా టీడీపీ నాయకులే వత్తాసు పలుకుతున్నారు. ఈ వయస్సులో మేము ఎక్కడికి వెళ్లి జీవించాలి అంటూ మండలంలోని తరిగొండ గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు ఆవేదన చెందుతున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన ఎన్. అబ్దుల్ రౌఫ్, ఎన్. గులాబ్ జాన్ దంపతులు గ్రామంలోని రామాపురం క్రాస్ వద్ద రోడ్డుపక్కనే బజ్జీల దుకాణం నిర్వహించుకొంటూ జీవనం సాగిస్తున్నారు. 15 సంవత్సరాలుగా ఇదే వీరికి జీవనాధారం. బజ్జీల దుకాణం పైన రెండు టీడీపీ జెండాలను కట్టుకొని వ్యాపారం చేసుకొంటున్నారు. అయితే గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు వీరిపై కక్ష గట్టి వేధింపులకు దిగారు. వీరు దుకాణం నిర్వహిస్తున్న స్థలం టీటీడీకి చెందింది. ఏళ్ల తరబడి టీటీడీ అధికారులకు వీరు అద్దెలు చెల్లిస్తూ రసీదులు పొందారు. వీరితో పాటు ఇంకా పలు దుకాణాలను ఈ స్థలాల్లో పలువురు నిర్వహించుకొంటున్నారు. అయితే గత కొంతకాలంగా గ్రామానికి చెందిన కొంతమంది టీడీపీ నాయకులు తమ దుకాణం తొలగించాల్సిందిగా టీటీడీ అధికారులు, పోలీసులపై ఒత్తిడి తీసుకొస్తున్నట్లు వృద్ధ దంపతులు ఆరోపిస్తున్నారు. సాధారణ అసెంబ్లీ ఎన్నికలు ముగిసిన తరువాత ఇప్పటికే మూడు చోట్ల దుకాణం పెట్టుకోగా అన్ని చోట్ల ఖాళీ చేయించారని వారు వాపోయారు. కనీసం ఈ స్థలంలోనైనా దుకాణం నిర్వహించుకొందామంటే టీడీపీ నాయకులు అధికారులను, పోలీసులను తమపైకి పంపించి వేధిస్తున్నారని ఆవేదన చెందారు. మాతో పాటు ఇంకా పలువురు ఇక్కడ దుకాణాలు నిర్వహించుకొంటున్నా అఽధికారులు వారిని వదిలిపెట్టి మమ్మల్నే ఖాళీ చేయమంటూ వేధిస్తుండడం దారుణమన్నారు. టీటీడికి చెల్లించిన రసీదులు చూపించినా కనికరించడం లేదని వారు పేర్కొన్నారు. తమకు అధికారులు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. -
నేడు హుండీ ఆదాయం లెక్కింపు
సిద్దవటం: మండల పరిధి వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజస్వామి ఆలయ హుండీ ఆదాయాన్ని బుధవారం లెక్కించనున్నట్లు ఈఓ శ్రీధర్ తెలిపారు. ఉదయం 10 గంటలకు ఆలయ ఆవరణలో దేవదాయ శాఖ అధికారుల సమక్షంలో లెక్కించడం జరుగుతుందన్నారు. కావున ఈ కార్యక్రమంలో భక్తులు పాల్గొనాలని ఆయన కోరారు. ఈ– క్రాప్ నమోదు చేసుకోవాలి రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): పంట సాగు చేసిన ప్రతి రైతు ఈ క్రాప్ నమోదు చేయించుకోవాలని అన్నమయ్య జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ తెలిపారు. రామాపురం మండలం చిట్లూరు గ్రామంలో మంగళవారం రైతు సేవా కేంద్ర సిబ్బంది ఈ క్రాప్ చేస్తున్న ప్రక్రియను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట నష్టం, ధాన్యం కొనుగోలు, ప్రభుత్వ రాయితీలు, ఏమి రావాలన్నా ఈ క్రాప్ చేయించుకోవాలన్నారు. ఈ క్రాప్ చేసుకోని రైతులకు ప్రభుత్వం నుంచి ఎలాంటి పథకాలు అమలు కావన్నారు. ఈ కార్యక్రమంలో లక్కిరెడ్డిపల్లి సహాయ వ్యవసాయ సంచాలకులు జయరాణి, మండల వ్యవసాయాధికారి నాగమణి, ప్రభావతి, రైతు సేవా కేంద్రం సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. జగనన్న కాలనీ, డంపింగ్ యార్డు పరిశీలన రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): రామాపురం మండల కేంద్రంలోని డంపింగ్ యార్డు, జగనన్న కాలనీలను అన్నమయ్య జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా డంపింగ్ యార్డులో చెత్తసేకరణ చేయాలని, అలాగే డంపింగ్యార్డును పరిశుభ్రంగా ఉంచాలని స్థానిక సర్పంచ్ నాగభూషణ్రెడ్డి, పంచాయతీ సెక్రటరీ ఓబులమ్మలకు సూచించారు. చెత్త సేకరణ అన్నది రాష్ట్ర వ్యాప్తంగా యుద్ధప్రాతిపదికన జరుగుతున్నదని, చుట్టుపక్కల ఉన్న పొడి, తడి చెత్తనలు వేరుగా చేయించాలని తెలిపారు. పరిసరాల పరిశుభ్రత ఎంతో ముఖ్యమని పరిసరాల్లో సేకరించిన చెత్తను తప్పకుండా డంపింగ్యార్డుకు వచ్చే విధంగా చర్యలు చే పట్టాలని పంచాయతీ కార్యదర్శిని ఆదేశించారు. అనంతరం నల్లగుట్టపల్లి గ్రామంలోని హౌసింగ్ కాలనీని ఆయన పరిశీలించి మండలంలో పూర్తి కాని గృహాలను పూర్తి చేయించాలని హౌసింగ్ ఏఈకి సూచించారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ నాగభూషణ్రెడ్డి, ఎంపీడీఓ జాషువా, హౌసింగ్ ఏఈ కేఎన్ఎం ప్రసాద్, డిప్యూటీ తహసీల్దార్ కృపావతి, ఆర్ఐ సమ్మద్ఖాన్, వీఆర్ఓ రాధిక, ఏపీఓ పెంచలయ్య, పంచాయతీ కార్యదర్శి ఓబులమ్మ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. అభ్యాసంతో నైపుణ్యాభివృద్ధి రాయచోటి జగదాంబసెంటర్: అటల్ టింకరింగ్ ల్యాబ్లలో అభ్యాసం కల్పించి విద్యార్థులలో నైపుణ్యాభివృద్ధిని పెంపొందింపచేయాలని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం సూచించారు. మంగళవారం కలకడ మండలం బాటవారిపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో నిర్వహించిన మెగా టింకరింగ్డే కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలోని అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్లలో మెగా టింకరింగ్ డే నిర్వహించామని తెలిపారు. నిపుణుల ప్రత్యక్ష ప్రమేయం లేకుండా ప్రాజెక్టులను రూపొందించడం నేటి కార్యక్రమం ప్రత్యేకమని అన్నారు. అటల్ ఇన్నోవేషన్ మిషన్ వారు న్యూఢిల్లీ నుంచి నిర్వహించిన ప్రత్యక్ష ప్రసార కార్యక్రమాన్ని అనుసరించి అటల్ టింకరింగ్ ల్యాబ్లలో విద్యార్థులు వ్యాక్యూమ్ క్లీనర్లను రూపొందించారని అన్నారు. ఇలాంటి స్వయం అభ్యాస కార్యక్రమాల ద్వారా విద్యార్థులు తమ భవిష్యత్తుకు ఉపయోగపడే నైపుణ్యాలను పెంపొందించుకుంటున్నారని అన్నారు. జిల్లాలోని అన్ని అటల్ టింకరింగ్ ల్యాబ్లలో ప్రతి వారం ఇలాంటి తరగతులు నిర్వహించాలని సూచించారు. అనంతరం ఆయన డీవార్మింగ్ డే నిర్వహణను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు వెంకటసుబ్బయ్య, అటల్ ల్యాబ్ ఇన్చార్జి టీచర్ శేఖర్బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
●ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : ఉరి వేసుకుని వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన సోమవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారిపల్లె మారుతీ నగర్ కు చెందిన వెంకటేష్ భార్య కృష్ణమ్మ (44) కుటుంబ సమస్యల కారణంగా సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. తల్లిదండ్రులు మందలించారని.. తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నీరుగట్టువారి పల్లె అయోధ్య నగర్కు చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు ఉదయ్ కుమార్ (25) నాలుగు రోజులపాటు ఇంటికి రాకుండా వెళ్లిపోయాడు. తిరిగి ఇంటికి వచ్చిన కుమారుడిని తల్లిదండ్రులు పద్ధతి మార్చుకోవాలంటూ మందలించారు. దీంతో మనస్థాపం చెందిన ఉదయ్ కుమార్ ఇంటి వద్ద నిద్రమాత్రలు మింగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే యువకుడిని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
ప్రియురాలిని దూరం చేశారని..
ప్రేమికుడి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : పెద్దలను ఎదిరించి ప్రియురాలిని పెళ్లి చేసుకుంటే, కేసు పెడతామని బెదిరించి, స్టేషన్కు పిలిపించి తమను విడదీశారని మనస్థాపంతో ప్రేమికుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. నీరుగట్టువారిపల్లె యోగివేమన వీధికి చెందిన కొండారెడ్డి, సావిత్రమ్మల దంపతుల కుమారుడు బయ్యారెడ్డి (21) ప్రైవేటు అంబులెన్స్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. ఇంటర్మీడియట్ చదివే సమయంలో కొండామారిపల్లెకు చెందిన భవిత (21)ను ప్రేమించాడు. నాలుగేళ్లుగా ఇద్దరు ఒకరినొకరు ప్రేమించుకున్నారు. వీరి పెళ్లికి పెద్దలు ఒప్పుకోకపోవడంతో ఈనెల 7వతేదీన ఇంటి నుంచి వెళ్లిపోయి కాణిపాకంలో వివాహం చేసుకున్నారు. అనంతరం బెంగళూరు వెళ్లారు. ఈ క్రమంలో భవిత తల్లిదండ్రులు తాలూకా పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు వారిని 9వతేదీన మదనపల్లె పోలీసు స్టేషన్కు రప్పించారు. ఇరువురు మేజర్లు కావడంతో కౌన్సెలింగ్ ఇచ్చారు. కౌన్సెలింగ్ అనంతరం భవిత తాను ఏడాది పాటు తల్లిదండ్రులతోనే ఉంటానని, బయ్యా రెడ్డి ప్రవర్తనలో మార్పువస్తే తల్లిదండ్రులను ఒప్పించి కాపురానికి వెళ్తానంటూ స్టేట్మెంట్ ఇచ్చి తల్లిదండ్రులతో వెళ్లింది. ఈ క్రమంలో ప్రియురాలు దూరమైందన్న మనస్థాపంతో బయ్యారెడ్డి మంగళవారం విషద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బయ్యారెడ్డి, అతని తండ్రి కొండారెడ్డి విలేకరులతో మాట్లాడుతూ పోలీసు స్టేషన్లో కౌన్సెలింగ్ ముందు వరకు తనతో ఉంటానన్న భవిత కౌన్సెలింగ్ అనంతరం తల్లిదండ్రులతో పాటు వెళ్లటంలో పోలీసులు కీలకంగా వ్యవహరించి తమకు అన్యాయం చేశారని ఆరోపించారు. ఈ విషయమై సీఐ కళా వెంకటరమణను వివరణ కోరగా ప్రేమ వివాహం చేసుకున్న బయ్యారెడ్డి, భవితలకు స్టేషన్లో కౌన్సెలింగ్ మాత్రమే ఇచ్చామని, భవిత రాతపూర్వకంగా స్టేట్మెంట్ ఇచ్చి తల్లిదండ్రులతో వెళ్లిందన్నారు. -
పోలీసింగ్ ఫెయిల్యూర్
● ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల్లో పరిహాసమైన ప్రజాస్వామ్యం.. ● బరితెగించిన పచ్చ మూక.. రాయచోటి రౌడీల వీరంగం సాక్షి రాయచోటి/రాజంపేట: ఒంటిమిట్టలో జెడ్పీటీసీ ఉప ఎన్నికల పోలింగ్లో రిగ్గింగ్ యథేచ్ఛగా సాగింది. మండలంలో 30 పోలింగ్ బూత్లు ఉంటే ప్రతి చోట పోలీసులు, ఎన్నికల సిబ్బంది సహకారం ఎల్లో గ్యాంగ్కు లభించింది. టీడీపీ నేతలు, కార్యకర్తలు నేరుగా పోలింగ్ బూత్ల్లోకి చొరబడి, ఓటర్ల నుంచి ఓటరు స్లిప్లు లాక్కుని వారే ఓటు వేసుకున్నారు. అడ్డుకోవాల్సిన పోలీసులు, అధికారులు మిన్నకుండిపోయారు. మంత్రి నేతృత్వంలో వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు మంత్రి మండిపల్లె రాంప్రసాద్రెడ్డి నేతృత్వంలో టీడీపీ శ్రేణులు.. పోలింగ్ బూత్లలో వున్న వైఎస్సార్సీపీ ఏజెంట్లపై దాడులు చేశారు. ప్రధానంగా మంటంపంపల్లె, చిన్నకొత్తపల్లె, గంగపేరూరు, నడింపల్లె తదితర పోలింగ్ బూత్లలో ఉదయం నుంచి ఏజెంట్లను బయటికి లాగి పడిసే ప్రయత్నాలు మొదలయ్యాయి. ఈ సంఘటనలతో పోలింగ్ బూత్ల వద్ద ఉద్రిక్తత పరిస్థితులు నెలకొన్నాయి. అడ్డుకోవడానికి వైఎస్సార్సీపీ నేతల యత్నం సమాచారం తెలుసుకున్న రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్రెడ్డి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, ఎమ్మెల్యే సుధా, ఎమ్మెల్సీ గోవింద్రెడ్డిలు వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పోలింగ్ బూత్ వద్దకి చేరుకున్నారు. ఆ సమయంలో టీడీపీ నేతల దౌర్జన్యానికి అడ్డుతగులుతున్నారని భావించి.. వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేయాలని పోలీసులకు అధిష్టానం నుంచి ఆదేశాలు వచ్చినట్లు సమాచారం. దీంతో వైఎస్ఆర్సీపీ నేతలను అరెస్ట్ చేసి ఒంటిమిట్ట, కడప రిమ్స్, చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లకు తరలించారు. తరువాత సాయంత్రం విడుదల చేశారు. బౌన్సర్లతో టీడీపీ నేతలు హల్చల్ అధికార పార్టీ నేతలు తమ వెంట తెచ్చుకున్న బౌన్సర్లతో పోలింగ్ బూత్ల వద్ద హల్చల్ చేశారు. టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, మరికొందరి నేతల వెంట బౌన్సర్లు కనిపించడం వివాదానికి దారి తీసింది. ఓటు హక్కును కోల్పోయిన ఒంటిమిట్ట వాసులు జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో మంగళవారం జరిగిన పోలింగ్ ప్రక్రియలో ఒంటిమిట్ట వాసులు ఓటు హక్కును కోల్పోయారు. పోలింగ్ బూత్లలో కూడా ఓటు వేసే పత్రాలను సిబ్బంది, పచ్చమూకలు కలిసి.. పోలీసులు సహకారంతో ఇతరుల ఓటును టీడీపీ అభ్యర్థికి వేసుకున్నారు. అడిగితే దౌర్జన్యంగా పోలీసు సహకారంతో బయటికి పంపించే పరిస్థితులు ఏర్పడ్డాయి. ఓటు తమ చేతిలో లేకుండా పోయే సరికి పలువురు పోలింగ్ బూత్ల వద్ద ప్రజాస్వామ్యం ఎక్కడ ఉందంటూ పెదవి విరిచారు. రాయచోటి రౌడీలపై ఆగ్రహం పవిత్ర పుణ్యక్షేత్రం ఉన్న ఒంటిమిట్టలో రాయచోటి రౌడీల వీరంగంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సంస్కృతిని తీసుకొచ్చిన పచ్చనేతల తీరుతెన్నులపై విరుచుకు పడుతన్నారు. బయటి వారిని రప్పించి, దౌర్జన్యం చేసిన సంఘటనలతో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిపై ఒంటిమిట్టలోని అన్ని సామాజికవర్గ ఓటర్లలో సానుభూతి పెరిగింది. ఇలాంటి సంస్కృతి ఇక్కడ అక్కర్లేదని కొంత మంది పచ్చనేతలు తీరుతెన్నులపై విరుచుకు పడుతన్నారు. పులివెందులలో విష సంస్కృతికి బీజం సాక్షి టాస్క్ఫోర్స్: జరిగిన పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలలో విష సంస్కృతి బట్టబయలైంది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఎన్నికలు జరిగాయి. వేలాది మంది టీడీపీ అల్లరి మూకలవల్ల ఓటర్లు, ఏజెంట్లు భయబ్రాంతులకు గురయ్యారు. ఇంత జరుగుతున్నా పోలీసులు చోద్యం చూస్తున్నారే తప్ప ఎటువంటి చర్యలు చేపట్టలేదు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లి పోలింగ్ బూత్లను మంగళవారం టీడీపీ మూకలు ఆక్రమించుకున్నారు. అలాగే టీడీపీ నాయకులు సాక్షి వాహనాన్ని చుట్టుముట్టి వాహనాన్ని బాది తాళాలు లాక్కొన్నారు., చొక్కా పట్టి కిందకు దించే ప్రయత్నం చేశారు. కొత్తపల్లిలో ‘సాక్షి’ మీడియా వాహనాలు ధ్వంసం చేశారు. ఎర్రిపల్లె, కొత్తపల్లెల్లో వైఎస్సార్సీపీ నాయకుడు ఆనంద్పై టీడీపీ అల్లరి మూకల దాడి చేశారు. తుమ్మలపల్లె, కనంపల్లెలలో కట్టెలు పట్టుకుని టీడీపీ మూకలు గొడవలు చేశారు. తుమ్మలపల్లెలో షామియానా వేసి టిఫిన్, భోజనాలు ఏర్పాటు చేశారు. అచ్చివెళ్లిలో వైఎస్సార్సీపీ ఏజెంట్లను టీడీపీ నాయకులు అడ్డుకున్నా పోలీసులు ప్రేక్షక పాత్ర వహించారు. మోట్నూతలపల్లెలో టీడీపీ మూకలు వైఎస్సార్సీపీ వాహనాలను ధ్వంసం చేశారు. కొత్తపల్లె, నల్లగొండువారిపల్లె, తుమ్మలపల్లె పోలింగ్ బూత్లలోకి వైఎస్సార్సీపీ ఏజెంట్లను అనుమతించకుండా ఆక్రమించుకున్నారు. ఎర్రిపల్లెలో పోలింగ్ బూత్ను ఆధీనంలోకి తీసుకుని ప్రజలు వెళ్లకుండా అడ్డుకున్నారు. వైఎస్ఆర్ జిల్లా పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో పోలీసింగ్ ఫెయిల్యూర్ అయింది. ఈ రెండు స్థానాల్లో పేరుకు మాత్రమే పోలీసు అధికారులు, సిబ్బందిని కలిపి దాదాపు 1400 మందిని బందోబస్తు విధులకు నియమించినట్లు ఉన్నతాధికారులు ప్రచారం చేశారు. డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా వుంచామని ఆర్భాటంగా చెప్పుకొచ్చారు. గత కొన్ని రోజులుగా కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయప్రవీణ్, జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్, పోలీసు అధికారులు, సిబ్బందితో కలిసి పకడ్బందీగా బందోబస్తు విధులను నిర్వహిస్తున్నామని ప్రచారం చేసుకున్నారు. కానీ ఎన్నికల సందర్భంగా పోలింగ్ సమయంలో మాత్రం టీడీపీ వారికే వత్తాసు పలుకుతూ, వారు ఎన్ని దౌర్జన్యాలకు పాల్పడినా, దాడులకు తెగబడినా కేవలం ప్రేక్షకపాత్రను పోషించారనే చెప్పవచ్చు. ఒంటిమిట్ట మండలంలోని 30 పోలింగ్ కేంద్రాలలో ఉదయం సాఫీగా ప్రారంభమైన పోలింగ్ 10 గంటల సమయం నుంచి సీన్ మారిపోయింది. టీడీపీ రాష్ట్ర మంత్రి రాంప్రసాద్రెడ్డి, టీడీపీ రాజంపేట నియోజకవర్గ నాయకుడు చమర్తి జగన్మోహన్రాజు ప్రతి పోలింగ్ కేంద్రాన్ని సందర్శించారు. వైఎస్ఆర్సీపీకి చెందిన ఏజెంట్లను బెదిరించి బయటికి పంపించారు. -
హర్ ఘర్ తిరంగాలో అందరూ పాల్గొనాలి
రాయచోటి: ప్రతి పౌరుడు జాతీయ సమగ్రత, ఐక్యత చాటుకునేలా కార్యక్రమాల్లో పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా మంగళవారం రాయచోటిలో హర్ ఘర్ తిరంగా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరేట్ నుంచి బంగ్లా సర్కిల్ వరకు జిల్లా పర్యాటక శాఖ, వివిధ ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో బైక్ ర్యాలీ చేపట్టారు. ఈ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ పచ్చజెండా ఊపి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డివిజన్, మండల కేంద్రాల్లో హర్ఘర్ తిరంగాను ఘనంగా నిర్వహించేలా ఏర్పాట్లు చేశామని తెలిపారు. ప్రతి ఒక్కరూ ఇలాంటి కార్యక్రమాల్లో పాల్గొనాలన్నారు. స్వాతంత్రోద్యమ స్ఫూర్తిని నింపడానికి గుర్తుగా ఈ కార్యక్రమాన్ని రూపొందించడం జరిగిందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, డీపీఓ రాధమ్మ, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, జిల్లా పర్యాటక శాఖ నాగభూషణం, జిల్లా అధికారులు, విద్యార్థినీ విద్యార్థులు, వివిధ శాఖల సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. స్వాతంత్య్ర దినోత్సవం ఘనంగా నిర్వహించాలి పోలీస్ పరేడ్ మైదానంలో జరిగే 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలను పండుగ వాతావరణంలో కనుల పండువగా నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ జిల్లా అధికారులను ఆదేశించారు. మంగళవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో 79వ భారత స్వాతంత్య్ర దినోత్సవ వేడుకల ముందస్తు ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వేడుకలలో అధికారులకు కేటాయించిన విధులు సమన్వయంతో పక్కాగా నిర్వహించి కార్యక్రమాన్ని విజయవంతం చేయా లని సూచించారు. జెండా వందన కార్యక్రమానికి అవసరమైన అన్ని ఏర్పాట్లను పూర్తి చేయాలని, వేదికను అందంగా అలంకరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పరేడ్ మైదానంలో సాంస్కృతిక కార్యక్రమాల నిర్వహణకు సంబంధించిన ఏర్పాట్లపై చర్చించారు. అభివృద్ధి పథకాల కార్యక్రమాలను ప్రతిబింబిస్తూ వివిధ శాఖలు ఏర్పాటు చేసే శకటాల ప్రదర్శన ఆకర్షణీయంగా అందరినీ ఆకట్టుకునేలా ఉండాలన్నారు. ఆయా శాఖల ఎగ్జిబిషన్ స్టాల్స్ను కూడా ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, ఏఎస్పీ వెంకటాద్రి, డీఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాస్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ -
అన్నదాత సుఖీభవ కోసం వెళ్తూ.. వృద్ధురాలి మృతి
మదనపల్లె రూరల్ : అన్నదాత సుఖీభవ పథకంలో డబ్బులు పడలేదన్న విషయమై ఆందోళన చెందుతూ, ఎందుకు పడలేదో కనుక్కునేందుకు సచివాలయానికి బయలుదేరిన వృద్ధురాలు ఆటో బోల్తా పడటంతో మృతి చెందిన ఘటన మంగళవారం జరిగింది. మదనపల్లె మండలం బొమ్మనచెరువు పంచాయతీ టేకులపాలెం పందివారిపల్లెకు చెందిన పగడాల వెంకటరమణ భార్య చిన్న పాపమ్మ (66) తనకు అన్నదాత సుఖీభవ పథకంలో భాగంగా నిధులు అందకపోవడంతో, ఈ విషయమై సచివాలయానికి బయలుదేరింది. టేకులపాలెం వద్ద రామసముద్రం మండలం అజ్జిరెడ్డిగారిపల్లెకు చెందిన రామిరెడ్డి ఆటోలో ఎక్కింది. ఆటో బొమ్మనచెరువుకు వస్తుండగా, మార్గమధ్యంలోని లాభాల గంగమ్మ గుడికి సమీపంలోని మలుపు వద్ద ఎదురుగా బొలేరో వాహనం రావడంతో, వాహనాన్ని తప్పించేందుకు ఆటోను పక్కకు తిప్పగా అదుపుతప్పి బోల్తా పడింది. ఆటోలో ఉన్న చిన్న పాపమ్మ కిందపడి తీవ్రంగా గాయపడింది. ఆటో డ్రైవర్ రామిరెడ్డి సైతం స్వల్పంగా గాయపడడంతో గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలోని వైద్యులు పరీక్షించి చికిత్స అందించే లోపే చిన్నపాపమ్మ పరిస్థితి విషమించి మృతి చెందింది. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. -
ఫిర్యాదులు సకాలంలో పరిష్కరించాలి
రాయచోటి : బాధితుల ఫిర్యాదులను నిర్ణీత సమయంలోగా చట్ట పరిధిలో పరిష్కరించాలని జిల్లా పోలీస్ యంత్రాంగాన్ని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదేశించారు. సోమవారం జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో అదనపు ఎస్పీ ఫిర్యాదులు స్వీకరించారు. ప్రజల నుంచి నేరుగా ఫిర్యాదులు స్వీకరించి, వారితో ముఖాముఖిగా మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీసు అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదటి ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ చేసి వారి సమస్యలను పరిష్కరిస్తామని అదనపు ఎస్పీ తెలిపారు. డివిజన్ అభివృద్ధికి కృషి చేయాలి రాయచోటి : మదనపల్లె డివిజన్ అభివృద్దికి అన్ని శాఖల సహకారంతో ముందుకు సాగాలని నూతన సబ్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టిన చల్లా కల్యాణికి జిల్లా కలెకట్ ఛామకూరి శ్రీధర్ సూచించారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో జిల్లా కలెక్టర్ను మదనపల్లి సబ్ కలెక్టర్ మర్యాదపూర్వకంగా కలిసి పూల మొక్కను అందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ శ్రీధర్ సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణిని అభినందించారు. అనంతరం మదనపల్లిలోని తన కార్యాలయంలో సబ్ కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతల స్వీకరణ రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి మున్సిపల్ కమిషనర్గా జి.రవి సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఇటీవల జరిగిన బదిలీల్లో రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసుబాబు నెల్లూరు కార్పొరేషన్ కార్యాలయానికి టీపీఆర్ఓగా బదిలీ అయ్యారు. ఏపీ గ్రీనరీ, బ్యూటిఫికేషన్లో జనరల్ మేనేజర్గా పని చేస్తున్న జి.రవి రాయచోటి కమిషనర్గా బదిలీపై వచ్చారు. ఈయన గతంలో తాడిపత్రి, మదనపల్లి, ఆముదాలవలస మున్సిపల్ కమిషనర్గా విధులు నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్గా బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆయన మాట్లాడారు. పట్టణంలో పారిశుధ్యానికి ప్రాధాన్యత ఇస్తామని, స్వచ్ఛ రాయచోటినే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రమాణ స్వీకారానికి మంత్రి హాజరు రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని రాజ్రెసిడెన్సీలో జరిగిన మార్కెట్ కమిటీ చైర్మన్ వరలక్ష్మి ప్రమాణ స్వీకారానికి సోమవారం రాష్ట్ర మంత్రి నాదెండ్ల మనోహర్ హాజరయ్యారు. అనంతరం ఆయన వెంటనే వెళ్లిపోయారు. మొదటిసారి కోడూరుకు వచ్చినప్పటికీ అభివృద్ధిపై సమీక్షించకుండా, హామీలు ఇవ్వకుండా పర్యటన ముగించారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ ఇన్చార్జి ముక్కారూపానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. మైలవరం నుంచి నీటి విడుదల జమ్మలమడుగు : మైలవలరం జలాశయం నుంచి పెన్నానదికి నీటిని విడుదల చేసినట్లు ఈఈ రమేష్ పేర్కొన్నారు. గండికోట జలాశయం నుంచి ఐదువేల క్యూసెక్కుల నీరు మైలవరం జలాశయంలోకి వస్తోందని ఆయన తెలిపారు. ఈ నీటిని దిగువనున్న పెన్నా నదిలోకి విడుదల చేస్తున్నామన్నారు. సోమవా రం ఉదయం 1500 క్యూసెక్కులు సాయంత్రానికి ఐదు వేల క్యూసెక్కుల నీరు జలాశయం నుంచి దిగువకు పోతుందన్నారు. -
ఎర్రచందనం కేసులో ఒకరికి ఏడాది జైలు
తిరుపతి లీగల్ : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో మదనపల్లి, కొత్త ఇండ్లు, రంగారెడ్డి కాలనీకి చెందిన కొలై రవి అలియాస్ బాబుకు ఏడాది జైలు శిక్ష, పదివేల రూపాయలు జరిమానా విధిస్తూ తిరుపతిలోని ఎర్రచందనం కేసుల విచారణ జూనియర్ జడ్జి ఎస్.శ్రీకాంత్ సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం మేరకు.. కడప ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బంది 2010 ఫిబ్రవరి 23వ తేదీ కడప డివిజన్, కడప రేంజ్, ఆలంఖాన్పల్లి అటవీ ప్రాంతం సమీపంలో నిందితుడు రవి మరో ఇద్దరితో కలిసి 3703 కిలోల 146 ఎర్రచందనం దుంగలను తరలిస్తుండగా ఫారెస్ట్ సిబ్బంది అదుపులోకి తీసుకున్నారు. అరెస్టు చేసి కోర్టులో హాజరు పరచగా న్యాయమూర్తి కేసు పూర్వాపరాలు పరిశీలించి ఈమేరకు శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతిమదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి తిరుపతి రుయా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వ్యక్తి మృతి చెందినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మదనపల్లె మండలం బీఎన్ రెడ్డి కాలనీలో నివాసం ఉంటున్న అట్లూరి రాజన్న(65) ఈనెల 7వ తేదీ సాయంత్రం ఎర్రగానిమిట్ట సమీపంలో ఆటో కోసం రోడ్డుపై వేచి ఉండగా, అదే సమయంలో అటువైపుగా వచ్చిన గుర్తు తెలియని ఇన్నోవా కారు ఢీకొని వెళ్లిపోయింది. దీంతో తీవ్రగాయాల పాలైన రాజన్నను స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. టీటీడీకి రూ.10 లక్షలు విరాళం తిరుమల : వైఎస్సార్ జిల్లాకు చెందిన సీఆర్ అసోసియేట్స్ సంస్థ అధినేత చరణ్ తేజ్ టీటీడీ ఎస్వీ అన్న ప్రసాదం ట్రస్టుకు సోమవారం రూ.10,10,116 విరాళంగా అందించారు. ఈమేరకు దాత తిరుమలలోని టీటీడీ అదనపు కార్యాలయంలో అదనపు ఈవో సీహెచ్ వెంకయ్య చౌదరికి విరాళం డీడీ అందజేశారు. -
కిక్కుకు.. పర్మిట్!
● మద్యం షాపులకు అనుగుణంగా పర్మిట్ రూములు ● నెలాఖరుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చేందుకు కసరత్తు ● అప్పటివరకు కూడా ఆగని మద్యం వ్యాపారులు ● ఇప్పటికే అనధికారికంగా ఏర్పాటుతకడప వైఎస్ఆర్ సర్కిల్ : మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు కూటమి ప్రభుత్వం పచ్చ జెండా ఊపేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం బార్ అండ్ రెస్టారెంట్ అనుమతి పునరుద్ధరణ ప్రక్రియ జరుగుతోంది. దీనిని ఈ నెలాఖరుకు పూర్తి చేయడంపై ఎకై ్సజ్ శాఖ అధికారులు కసరత్తు చేస్తున్నారు. ఈ ప్రక్రియ పూర్తయిన వెంటనే మద్యం షాపులకు అనుబంధంగా పర్మిట్ రూముల ఏర్పాటుకు మార్గదర్శకాలు వెలువడనున్నాయి. వాస్తవానికి మద్యం షాపులు ప్రారంభమైనప్పటి నుంచే వాటి యజమానులు చాలా చోట్ల గుట్టు చప్పుడు కాకుండా పర్మిట్ రూములు ఏర్పాటు చేసేశారు. ఇప్పుడు ప్రభుత్వమే దీనికి అనుమతులు ఇస్తుందన్న సమాచారంతో ఇంకా విచ్చల విడిగా పర్మిట్ రూములు తెరిచి పూర్తిగా తాగించేస్తున్నారు. గ్లాసులు, వెజ్, నాన్ వెజ్, స్నాక్స్ ఏర్పాటు చేసి మరీ విక్రయిస్తున్నారు. అర్థరాత్రి వరకు తెరిచే ఉంచుతున్నారు. దీంతో మందుబాబులు అక్కడే తాగి తూలుతుండడంతో అటుగా వెళుతున్న ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు పర్మిట్కు రైట్ రైట్... మద్యం ద్వారా వస్తున్న ఆదాయాన్ని మరింతగా పెంచుకునేందుకు కూటమి ప్రభుత్వం కొత్త మార్గాలు వెతుకుతోంది. ఇందులో భాగంగా మద్యం దుకాణం వద్దే పర్మిట్ రూములకు అనుమతి ఇవ్వాలని నిర్ణయించింది. ఈ విధానాన్ని పునః ప్రారంభించే దిశగా ఎకై ్సజ్ శాఖ ఇప్పటికే కసరత్తు పూర్తి చేసింది. ఈ నెలాఖరులోపు పర్మిట్ రూములకు అనుమతులివ్వాలని ప్రభుత్వం ఉత్తర్వులు సైతం జారీ చేసింది. నూతన విధానంలో భాగంగా కూటమి ప్రభుత్వం మద్యం దుకాణాలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టింది. అప్పటినుంచి జిల్లావ్యాప్తంగా మద్యం విక్రయాలు విచ్చలవిడిగా సాగుతున్నాయి. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. వీటికి అనుబంధంగా ఒక్కొక్కటిగా చొప్పున 153 సిట్టింగ్ రూములు ఏర్పాటు కానున్నాయి. కార్పొరేషన్, మున్సిపల్ పరిధిలో పర్మిట్ రూమ్కు రూ.7.50 లక్షలు ఇతర ప్రాంతంలో రూ.5 లక్షల చొప్పున ప్రభుత్వం ఫీజు ప్రకటించింది. సగటు చొప్పున ఒక్కో షాపునకు రూ.5 లక్షలు వసూలు చేసిన ప్రభుత్వానికి అదనంగా రూ.80 కోట్లు ఆదాయం సమకూరనుంది. గతంలో టీడీపీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని పర్మిట్ దుకాణాలకు ఏడాదికి రూ.5 లక్షలు పరిమిత ఫీజుగా ఉండేది. ఇప్పుడు దానిని రెండు కేటగిరీలుగా మారుస్తున్నారు. ఆదాయమే లక్ష్యమా.. ఆదాయమే లక్ష్యంగా ప్రభుత్వం నూతన మద్యం పాలసీ తీసుకు వచ్చింది. జిల్లా వ్యాప్తంగా 153 మద్యం షాపులకు గాను 3100 దరఖాస్తులు రాగా ఒక్కొక్కరి నుంచి రూ. 2 లక్షలు చొప్పున ప్రభుత్వం వసూలు చేసింది. తద్వారా రూ.62 కోట్లు ఆర్జించింది. షాపులు దక్కించుకున్న వ్యా పారులు ఆరు విడతల్లో లైసెన్స్ ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. లైసెన్స్ ఫీజుల్లో 1/6 వంతు చెల్లించారు. పర్మిట్ రూము లు సైతం అందుబాటులోకి వస్తే ఆదా యం మరింతగా పెరిగే అవకాశం ఉంటుంది. అయితే ప్రభుత్వమే ఆదాయం లక్ష్యంగా మద్యాన్ని ఏరులై పారిస్తోందని దీనివల్ల శాంతిభద్రతల సమస్యలు తలెత్తే ప్రమాదం పొంచి ఉంటుందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే సమస్త సౌకర్యాలతో... ఇప్పటికే ప్రతి షాపు వద్ద ఒక పర్మిట్ రూమును అనధికారికంగా తెరిచేశారు. అది కూడా ఏదో చిన్న గది అనుకుంటే పొరపాటే. సువిశాల ప్రాంగణంలో ప్రభుత్వ నిబంధనలను అతిక్రమించి మరీ ఏర్పాటు చేశారు. మందుబాబులు కూర్చుని తాగేందుకు కుర్చీలు, టేబుళ్లు, వేశారు. వర్షం, ఎండా పడకుండా విశాలమైన షెడ్లు వేసి బయటికి తెలియకుండా జాగ్రత్తలు తీసుకున్నారు. షెడ్ల లోపల పెద్ద ఫ్లడ్లైట్లు వేసి మరీ మందు అందజేస్తున్నారు. మంచింగ్ కోసం అన్ని రకాల నాన్ వెజ్ ఆహార పదార్థాలను అక్కడే ఉంచుతున్నారు. ఎంత సేపైనా కూర్చునేందుకు అవకాశం కల్పిస్తుండడంతో మద్యం ప్రియులు ఉదయం నుంచి రాత్రి వరకు అక్కడే తప్ప తాగి తూలుతున్నారు. -
ఓటరు స్లిప్పు లేకున్నా గుర్తింపు కార్డుతో ఓటు
● పోలింగ్ జరిగే అన్ని గ్రామాలకు బస్సులు, ఆటోలు ● కడప కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్ : పులివెందుల, ఒంటిమిట్ట మండలాల్లో మంగళవారం జరగనున్న పోలింగ్లో ఓటర్లంతా నిర్భయంగా తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి సోమవారం ఒక ప్రకటనలో కోరారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జరిగే జెడ్పీటీసీ ఎన్నికల్లో రాష్ట్ర ఎన్నికల కమిషన్ నియమ నిబంధనల మేరకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామన్నారు. బ్యాలెట్బాక్సుల ద్వారా పోలింగ్ ప్రక్రియ కొనసాగుతుందన్నారు. డిస్ట్రిబ్యూషన్ సెంటర్ నుంచి పోలింగ్ మెటీరియల్ ఆయా పోలింగ్ కేంద్రాలకు పంపామన్నారు. ఓటర్లకు పోలింగ్ కేంద్రాల వివరాలతో కూడిన స్లిప్పులను పంపిణీ చేశామన్నారు. ఒకవేళ ఎకవరికై నా ఓటరు స్లిప్పులు లేకపోతే గుర్తింపు కార్డుతో వెళ్లి వివరాలు తెలియజేసి ఓటు హక్కును వినియోగించుకోవాలన్నారు. ఓటర్లు తప్పకుండా తమ వెంట ఫొటో గుర్తింపు కార్డును తీసుకెళ్లి ఓటు వేయాలన్నారు. పోలింగ్ జరిగే అన్ని గ్రామాలకు ఆర్టీసీ బస్సులు, ఆటోలు అందుబాటులో ఉంచామన్నారు. అన్ని పోలింగ్ కేంద్రాల వద్ద నలుగురు సిబ్బందితో హెల్ప్డెస్క్ ఉంటుందన్నారు. క్యూలైన్ మేనేజ్మెంట్ సిస్టమ్ ద్వారా ఓటర్లు తమ ఓటుహక్కును వినియోగించుకోవాలని సూచించారు. సామాజిక మాధ్యమాల్లో ఎవరైనా అనవసరమైన రెచ్చగొట్టే వదంతులు ప్రసారం చేసినా, స్పందించకుండా ఓటర్లు ప్రశాంతంగా ఓటు వేయాలన్నారు. సాయంత్రం 5 గంటల సమయానికి క్యూలైన్లో నిలుచున్న వారందరితో ఓటు వేయిస్తారన్నారు. -
నులిపురుగుల నివారణతో ఆరోగ్యం
రాయచోటి టౌన్ : నులిపురుగుల నివారణతో పిల్లలు ఆరోగ్యంగా ఉంటారని వైద్య ఆరోగ్య శాఖ అడిషనల్ డైరెక్టర్ డాక్టర్ అనిల్ కుమార్ తెలిపారు. మంగళవారం విద్యార్థులకు అల్బెండజోల్ పంపిణీ కార్యక్రమం నిర్వహణలో భాగంగా సోమవారం రాయచోటి నియోజక వర్గంలోని లక్కిరెడ్డిపల్లె, గాలివీడు, రామాపురం, రాయచోటి ప్రాంతాలలోని పాఠశాలలు, హాస్టళ్లు, అండన్వాడీ కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా పిల్లలకు పంపిణీ చేసేందుకు ఉంచిన ఐఈసీ సామగ్రిని పరిశీలించారు. అనంతరం డీఎంహెచ్వో కార్యాలయంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించే అధికారులతో సమావేశం నిర్వహించి, విజయవంతం చేసేందుకు కావాల్సిన ఏర్పాట్లు చేయాలని సూచించారు. అంతకు ముందుగా నులిపురుగుల నివారణ పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో స్టేట్ కన్సల్టెంట్ హరికృష్ణ, డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్య, డీఐవో డాక్టర్ ఉషశ్రీ, డాక్టర్ రియాజ్ బేగ్, ఆర్బీఎస్కే ప్రోగ్రాం అధికారి డాక్టర్ ఇ ప్రతాప్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థుల ఆరోగ్యంపై శ్రద్ధ అవసరం గాలివీడు : విద్యార్థుల ఆరోగ్యంపై ఉపాధ్యాయులు శ్రద్ధ వహించాలని వైద్య ఆరోగ్యశాఖ అడిషనల్ డైరెక్టర్ అనిల్ కుమార్ సూచించారు. మండలంలోని నూలివీడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను ఆయన సందర్శించారు. విద్యార్థులతో ముచ్చటిస్తూ నిర్లక్ష్యం చేయకుండా ఐరన్ మాత్రలు, ఆల్బెండాజోల్ మాత్రలు తీసుకుని ఆరోగ్యంగా ఉండాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ప్రోగ్రాం ఆఫీసర్ రియాజ్, డాక్టర్ శ్వేతా, వైద్య సిబ్బంది, ప్రధానోపాధ్యాలు రాజశేఖర్, ఉపాధ్యాయులు మనోహర్, ఫయాజ్, హరీష్, రమేష్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
విలేకరి బెదిరిస్తున్నాడని మహిళా సర్పంచ్ ఫిర్యాదు
కాశినాయన : మండలంలోని కత్తెరగండ్ల గ్రామ పంచాయతీ సర్పంచ్ చెన్నుపల్లె సుభద్రమ్మ తనను మహబూబ్ బాషా అనే పత్రికా విలేకరి వేధిస్తున్నాడని సోమవారం నరసాపురం పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐ రమణకు ఫిర్యాదు చేశారు. తాను విలేకరినని, కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయజ్యోతికి పీఏను అని పాత పనులకు బిల్లు ఇవ్వాలని బెదిరిస్తున్నాడని సర్పంచ్ తెలిపారు. 2017–18 సంవత్సరంలో తాను గ్రామ పంచాయతీ కార్యాలయంలో మరుగుదొడ్డిని నిర్మించానని, అప్పుడు తనకు బిల్లులు రాలేదని, ఇప్పుడు బిల్లులు ఇవ్వాలని వేధిస్తున్నాడని పేర్కొన్నారు. సర్పంచ్పై విలేకరి ఫిర్యాదు రూ.50 లక్షలు గ్రామ పంచాయతీలో అవినీతి జరిగిందని పత్రికలో తాను వార్త రాసినందుకు సర్పంచ్, ఆమె బంధువులు తనను చంపుతామని బెదిరిస్తున్నారని నరసాపురం పోలీస్ స్టేషన్లో విలేకరి మహబూబాషా ఫిర్యాదు చేశారు. విచారణ చేపట్టి కేసు నమోదు చేస్తామని పోలీసులు తెలిపారు. -
మాండవ్య నది నీటిని మళ్లించారు
రాయచోటి టౌన్ : మాండవ్య నదిపై నిర్మించిన చెక్డ్యామ్ పక్కన కాలువ ఏర్పాటు చేసి నీటిని మళ్లించారని దీనిపై పరిశీలించి తమకు న్యాయం చేయాలని ఓదివీడు గ్రామ ప్రజలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. ఈ నది పరివాహక ప్రాంతంలో ఓదివీడు, కస్పా, బెస్తపల్లె, గంగరాజుపల్లె, పత్తిరాజుగారిపల్లె, మట్లి గ్రామాలకు చెందిన దాదాపు 500 ఎకరాల భూముల్లో పంటలు పండించుకోలేని పరిస్థితి ఏర్పడిందన్నారు. చెక్డ్యాం ఎత్తును తగ్గించి తమకు న్యాయం చేయాలని కోరారు. బావిలో పడి వ్యక్తి మృతి రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం కుమ్మరపల్లె పంచాయతీ ఎగువ దళితవాడకు చెందిన రేనిమాని చిన్నప్ప(52) అనే వ్యక్తి బావిలో పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. బావిలో మోటారు చెడిపోయిందని చూసేందుకు వెళ్లి సోమవారం ఉదయం బావిలో పడిపోయాడు. కొద్ది గంటల పాటు పైకి రాకపోవడంతో గ్రామస్తులు ఆయన ఆచూకీ కోసం గాలింపు చర్యలు చేపట్టారు. చిన్నప్ప బావిలో ఉన్న మోటారు కింద పడి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. తెగిపడిన విద్యుత్ తీగలుగుర్రంకొండ: వర్షాలకు 11 కేవీ విద్యుత్ తీగలు ఒక్కసారిగా తెగిపడ్డాయి. అయితే అక్కడ జనసంచారం లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. ఈ సంఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. సోమవారం గుర్రంకొండ బస్టాండులో హోరున వర్షం కురుస్తోంది. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతంలో ఒక్క సారిగా 11 కేవీ విద్యుత్ తీగలు తెగి ఓ వైపు దుకాణాల మీద మరోవైపు నిత్యం జనాలు కూర్చోనే బల్లల వద్ద పడ్డాయి. ఆయితే వర్షం కారణంగా సకాలంలో అక్కడ జనసంచారం లేక పోవడంతో ప్రాణాపాయం తప్పింది. వెంటనే బస్టాండులో విద్యుత్ సరఫరా నిలిపివేశారు. ట్రాన్స్కో సిబ్బంది అక్కడికి చేరుకొని మరమ్మతులు చేపట్టారు. -
ఎంపీ మిథున్రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని ప్రార్థనలు
పీలేరు రూరల్ : అక్రమ మద్యం కేసులో అరెస్ట్ అయిన రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి జైలు నుంచి విడుదల కావాలని కోరుతూ సోమవారం పీలేరు నియోజకవర్గంలోని ముస్లింలు కర్ణాటకలో ప్రసిద్ధ మురగముల్లా అమ్మాజాన్ బావాజాన్ దర్గాలో ప్రత్యేక ప్రార్థనలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎలాంటి ఆధారాలు లేకుండా కేవలం పెద్దిరెడ్డి కుటుంబంపై కక్షసాధింపు చర్యల్లో భాగంగా ఎంపీని అరెస్ట్ చేశారన్నారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ డాక్టర్ హబీబ్బాషా, మైనారిటీ నాయకులు అబ్దుల్ కలీమ్, కలకడ కరీముల్లా, ఎస్. అబీద్, అత్తార్ కాలేషా, షాజహాన్, ఖాదర్బాషా, అమీన్పీర్, సమీ, జాకీర్, ఇమ్రాన్, అలీఅన్సర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆవుల కుటుంబానికి వైఎస్ జగన్ పరామర్శ
సంబేపల్లె : వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఆవుల వేణుగోపాల్ రెడ్డి మరణ వార్తను మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ద్వారా తెలుసుకున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆయన కుటుంబాన్ని ఫోన్లో పరామర్శించారు. సోమవారం ఆవుల కుమారులు ఆవుల విష్ణువర్దన్ రెడ్డి, ఆయన సోదరుడు ఆవుల మల్లికార్జున రెడ్డిలతో ఫోన్లో మాట్లాడి తీవ్ర సంతాపం ప్రకటించారు. అలాగే మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రా రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సజ్జల రామకృష్ణా రెడ్డిలు కూడా ఫోన్ ద్వారా తమ ప్రగాఢ సానుభూతిని వ్యక్తం చేశారు. నివాళులు అర్పించిన ప్రముఖులు.. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ రెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యేలు గడికోట మోహన్ రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, చింతల రామచంద్రా రెడ్డి, ద్వారక నాథ్ రెడ్డి, లక్ష్మీదేవమ్మ, దేశాయి తిప్పారెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ మదనపల్లె ఇన్చార్జ్ నిస్సార్ అహ్మద్, మార్క్ఫెడ్ మాజీ చైర్మన్ నల్లారి తిమ్మారెడ్డి, మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇంతియాజ్ అహమ్మద్, జెడ్పీ మాజీ వైస్ చైర్మన్ దేవనాథరెడ్డి, రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ ఛైర్మన్ దశరథరామిరెడ్డి తదితరులు ఘనంగా నివాళులు అర్పించారు. -
ఎన్నికల ప్రక్రియపై సూచనలు కీలకం
జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ శ్రీధర్రాయచోటి : ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు కీలకమని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో అన్నమయ్య జిల్లాలో ఓటర్ల సవరణ – 2025, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు, వివిధ రకాల ఫారంలు తదితర అంశాలపై పలు రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్షా సమావేశం నిర్వహించారు. రాజకీయ పార్టీల ప్రతినిధులతో గత సమావేశంలో చర్చించిన వివిధ విషయాలు, సంబంధిత చర్యలను డీఆర్ఓ మధుసూధనరావు క్లుప్తంగా వివరించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ అన్ని రాజకీయ పార్టీలు బీఎల్ఏలను నియమించి సంబంధిత నియామక పత్రాలను ఈఆర్ఓలకు సమర్పించాలని తెలిపారు. బీఎల్ఓలపై సమీక్షిస్తూ జీఎస్డబ్ల్యూఎస్ శాఖలో బదిలీల కారణంగా చాలా మంది బీఎల్ఓలు మారారని సంబంధిత వివరాలను రాజకీయ పార్టీలకు అందజేయాలని డీఆర్ఓకు సూచించారు. సమావేశంలో రాజంపేట మదనపల్లె సబ్ కలెక్టర్లు హెచ్ఎస్ భావన, చల్ల కళ్యాణి, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు. హెచ్ఐవీ నిర్మూలనపై అవగాహన రాయచోటి జగదాంబసెంటర్ : ఇండియా ఫైట్స్ హెచ్ఐవీ అండ్ ఎస్టీఐ అనే థీమ్తో హెచ్ఐవీ నిర్మూలనపై జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో జిల్లా హెచ్ఐవీ/ఎయిడ్స్ నిర్మూలన, నియంత్రణ మండలి(డీఏపీసీయూ) రూపొందించిన గోడపత్రికను పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెచ్ఐవీ లేదా ఎయిడ్స్పై ప్రజల్లో అవగాహన పెంపొందించేందుకు ఈ గోడపత్రికలు ఎంతో ఉపయోగపడతాయన్నారు. హెచ్ఐవీ, ఎయిడ్స్ లేదా ఇతర సుఖ వ్యాధులు పట్ల అవగాహనతో ఎక్కువ మంది హెచ్ఐవీ రక్త పరీక్షలు చేసుకునేలా ముందుకు రావడం జరుగుతుందని పేర్కొన్నారు. హెచ్ఐవీ బాధితుల పట్ల ఉన్న చిన్నచూపు, వివక్షతను రూపుమాపేందుకు హెచ్ఐవీ చట్టం 2017, టోల్ఫ్రీ నంబర్ 1097 మొదలైన వాటిపై అవగాహన కల్పించడం జరుగుతోందన్నారు. ఈ ఆవిష్కరణలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్య శాఖ అధికారి లక్ష్మీనరసయ్య, పీసీఎస్ఎస్ ప్రాజెక్ట్ మేనేజర్ టి.స్వాతి, సిబ్బంది పాల్గొన్నారు. -
రెండు బైకులు ఢీ
ఓబులవారిపల్లె : మంగంపేట జాతీయ రహదారి డాబా హోటల్ వద్ద సోమవారం ఎదురెదురుగా రెండు బైకులు ఢీ కొనడంతో ఇద్దరు యువకులకు తీవ్ర గాయాలయ్యాయి. పోలివాండ్లపల్లి గ్రామానికి చెందిన ప్రవీణ్ పల్సర్ బైక్పై రైల్వేకోడూరు నుంచి వస్తుండగా మంగంపేట గ్రామం నుంచి బైకుపై ఎం.బాబు కోడూరు వైపు వెళ్తుండగా ఎదురెదురుగా ఢీ కొన్నారు. ప్రమాదంలో ఇద్దరికీ కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. ఏపీఎండీసీ అంబులెన్సులో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు.ఇద్దరికి తీవ్ర గాయాలు -
అతి వేగం.. ఆపై సెల్ఫోన్ మాట్లాడుతూ..
పుల్లంపేట : ఓ చేత్తో బైకు రైడింగ్.. మరో చేత్తో సెల్ఫోన్లో మాట్లాడుతూ వేగంగా వెళ్లి నిలిచి ఉన్న లారీని ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని ఏపీ మోడల్ స్కూల్ సమీపంలో కడప–రేణిగుంట జాతీయ రహదారిపై సోమవారం ఈ ప్రమాదం జరిగింది. పుల్లంపేట మండలం, కొత్తపేట గ్రామానికి చెందిన పోలిచెర్ల సునీత, శ్రీను దంపతుల కుమారుడు పోలిచెర్ల వినయ్ సోమవారం మధ్యాహ్నం రాజంపేట నుంచి ద్విచక్ర వాహనంపై అధిక వేగంతో సెల్ఫోన్ మాట్లాడుకుంటూ వెళ్లాడు. మోడల్ స్కూల్ సమీపంలోని ఆంజనేయస్వామి దేవాలయం వద్ద నిలబడి ఉన్న లారీని వెనుకవైపు నుంచి ఢీ కొట్టాడు. దీంతో వినయ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు రాజంపేట ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. లారీని ఢీకొన్న ద్విచక్ర వాహనం యువకుడికి తీవ్ర గాయాలు -
ఘనంగా హర్ఘర్ తిరంగా ర్యాలీ
రాయచోటి : ఆజాది కా అమృత్ మహోత్సవ్లో భాగంగా హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో ఘనంగా నిర్వహించారు. సోమవారం రాయచోటిలో విద్యా, పర్యాటకతోపాటు పలు ప్రభుత్వ శాఖల ఆధ్వర్యంలో చేపట్టిన ర్యాలీని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ జెండా ఊపి ప్రారంభించారు. రాయచోటిలోని చిత్తూరు రోడ్డు వద్ద ఉన్న శివాలయం నుంచి బంగ్లా సర్కిల్ వరకు నిర్వహించారు. అక్కడ విద్యార్థిని, విద్యార్థులతోపాటు కలిసి అధికారులు, సిబ్బంది మానవహారంగా ఏర్పడ్డారు. అక్కడ జాతీయ గీతాన్ని ఆలపించారు. ర్యాలీలో వంద మీటర్ల జాతీయ జెండా ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. కార్యక్రమంలో జిల్లా పర్యాటకశాఖ అధికారి నాగభూషణం, డీఐఈఓ రవికుమార్, డైట్ కాలేజీ ప్రిన్సిపాల్ అజయ్ కుమార్, డీఈఓ సుబ్రమణ్యం, డీఎస్పీ కృష్ణమోహన్, జీఎస్డబ్ల్యూ లక్ష్మీపతి, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, ఎంపీడీఓ సురేష్ బాబు, వివిధ శాఖల జిల్లా అధికారులు, ప్రభుత్వ, ప్రైవేటు జూనియర్ కళాశాలల బాల బాలికలు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
అక్రమ వసూళ్లు రూ.16.40 లక్షలు
కడప కార్పొరేషన్ : కడప నగరపాలక సంస్థలో 2024 ఆగస్టు నెల నుంచి సుమారు రూ.16.40 లక్షలు యూజర్ చార్జీల పేరుతో అక్రమ వసూళ్లు చేసినట్టు తేలిందని కమిషనర్ మనోజ్ రెడ్డి వెల్లడించారు. సోమవారం కార్పొరేషన్ కార్యాలయంలోని తన చాంబర్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వం యూజర్ చార్జీలు వసూలు చేయవద్దని చెప్పినప్పటికీ వ్యాపార సంస్థల నుంచి క్లాప్ యూజర్ చార్జీలు వసూలు చేశారని వచ్చిన ఆరోపణలపై ఆరు ప్రత్యేక బృందాలతో పూర్తిస్థాయి విచారణ చేపట్టామన్నారు. ఇందులో భాగంగా 2414 మందిని విచారించగా 258 మంది తాము యూజర్ చార్జెస్ ఇచ్చామని చెబుతూ అందుకు సంబంధించిన రశీదులు, ఆధారాలు చూపారన్నారు. మిగిలిన 2156 మంది తాము ఎలాంటి యూజర్ చార్జీలు చెల్లించలేదని చెప్పారన్నారు. రూ.4,20,750లకు స్లిప్పులు తగిన ఆధారాలు ఉన్నాయని, రూ.12,19,500లకు ఎలాంటి ఆధారాలు లేవన్నారు. ఇందులో 2024 ఆగస్టు నుంచి కార్పొరేషన్కు రూ.7 లక్షలు జమ అయిందన్నారు. తమ విచారణలో బయటపడిన నాలుగు లక్షల 20 వేల 750 రూపాయలు కూడా ఇందులో ఉన్నాయని తెలిపారు. దీనిపై ఇదివరకే ఎనిమిది మందిపై చర్యలు తీసుకున్నామని, ఇప్పుడు మరో ఏడుగురు శానిటరీ సెక్రటరీలు, ముగ్గురు ఆప్కాస్ సిబ్బందిపై చర్యలు తీసుకున్నామన్నారు. ఇంకా ఎవరి దగ్గరైనా ఆధారాలు ఉంటే తెలపాలని, వాటిపై కూడా విచారణ చేస్తామన్నారు. ఇకపై యూజర్ చార్జీలు వసూలు చేయకుండా పటిష్ట చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఎల్ఆర్ఎస్ను సద్వినియోగం చేసుకోవాలి అనధికారికంగా లేఔట్లు వేసిన వారు, అందులో ప్లాట్లు కొన్నవారు 24వ తేదీలోపు ఆన్లైన్లో ఎల్ఆర్ఎస్కు దరఖాస్తు చేసుకోవాలని కమిషనర్ సూచించారు. 2025 జూన్ 30కి ముందు రిజిస్టర్ అయిన ప్లాట్ల యజమానులు ఈ స్కీమ్కు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులన్నారు. 45 రోజుల్లో మొత్తం ఫీజు చెల్లించిన వారికి 10 శాతం, 90 రోజుల్లో చెల్లించిన వారికి ఐదు శాతం రాయితీ ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు ఏడు శాతం చెల్లిస్తే సరిపోతుందన్నారు. కడప నగరంలో సుమారు వందకు పైగా అనధికారిక లేఔట్లు ఉన్నాయని, వీరంతా ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అందులో రూ. 7 లక్షలు నగరపాలక సంస్థకు చెల్లింపు రూ. 4.20 లక్షలకు ఆధారాలు లభ్యం ఆరు బృందాలతో 2414 మందిని విచారణ మీడియాతో కడప నగర పాలక సంస్థ కమిషనర్ మనోజ్రెడ్డి -
జెడ్పీటీసీ ఉప ఎన్నికకు పటిష్ట భద్రత
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక శాంతియుతంగా నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులకు సూచించారు. సోమవారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని టీటీడీ విడిది గృహంలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక భద్రత విధులను నిర్వహించేందుకు వచ్చిన పోలీసు అధికారులు, సిబ్బందికి ఆయన దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పోలింగ్ కేంద్రాల వద్ద ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, ఓటర్లు ప్రశాంతంగా తమ ఓటును వినియోగించుకునేలా పోలీసులు భద్రత కల్పించాలని సూచించారు. పోలింగ్ కేంద్రాల వద్ద ఎక్కడే గానీ జనాలు గుమికూడేలా ఉండకుండా విధులు నిర్వహించాలన్నారు. ఈ ఉప ఎన్నికకు మొత్తం 625 మంది పోలీసు సిబ్బంది విధులు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీలు, సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. -
టిప్పర్ డ్రైవర్ ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, ఆటో తీసివ్వలేదని మనస్తాపంతో టిప్పర్ డ్రైవర్ ఆత్మహత్య చేసుకున్న ఘటన సోమవారం సాయంత్రం వెలుగుచూసింది. గాలివీడు మండలం సలారివారిపల్లెకు చెందిన బాలయ్య, నారాయణమ్మ దంపతుల రెండో కుమారుడు మల్లూరి అనిల్కుమార్(32)కు బి.కొత్తకోట మండలం బడికాయలపల్లెకు చెందిన రవి కుమార్తె స్వరూపతో పదేళ్ల క్రితం పెళ్లయింది. అనిల్కుమార్ టిప్పర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. ఐదేళ్ల క్రితం ఉపాధి కోసం మదనపల్లెకు వచ్చి బసినికొండ అంబేద్కర్ కాలనీలో నివాసం ఉంటున్నాడు. వీరికి కుమారుడు జేమ్స్కింగ్(6), కుమార్తె లిప్సిక(4) ఉండగా, వారు బడికాయలపల్లెలో అమ్మమ్మ వద్ద ఉంటూ చదువుకుంటున్నారు. భార్య స్వరూప మదనపల్లెలోని ఓ హోటల్లో పనిచేసేది. ఈ క్రమంలో కొంతకాలం క్రితం టిప్పర్ డ్రైవర్గా పనిమానేసి ఆటో కొనుగోలు చేయాలని అనిల్ భార్యతో చర్చించాడు. అందుకు అవసరమైన నగదు అత్తింటివారిని అడగమని భార్యకు చెప్పి ఇద్దరూ వెళ్లి అడిగారు. అయితే అత్తింటివారు తాము నగదు సమకూర్చలేమని తేల్చి చెప్పారు. దీంతో ఇంటికి చేరుకున్న భార్యాభర్తలు ఇదే విషయమై గొడవపడ్డారు. భార్య తాను పనిచేసి నగదు సమకూర్చుతానని, వారంరోజుల క్రితం తిరుపతికి వెళ్లి ఓ హోటల్లో పనికి కుదిరింది. భార్య ఇంటి నుంచి వెళ్లిపోయిన అనంతరం అనిల్కుమార్ ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అయితే నాలుగురోజులుగా ఈ విషయాన్ని ఎవరూ గుర్తించకపోవడంతో సోమవారం సాయంత్రం ఇంట్లో నుంచి దుర్వాసన వస్తుండటంతో ఎదురింట్లోని వ్యక్తి కిటికీలో నుంచి ఇంట్లోకి తొంగి చూశాడు. అనిల్ ఉరికి వేలాడుతున్న విషయం గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో తాలూకా ఎస్ఐ గాయత్రి ఘటనాస్థలానికి చేరుకుని వివరాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుడి తల్లి నారాయణమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ గాయత్రి తెలిపారు. -
అదుపు తప్పి లోయలో పడిన సిమెంట్ లారీ
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్) : రామాపురం మండలం గువ్వలచెరువు ఘాట్లోని రెండవ మలుపు వద్ద సిమెంట్ లారీ సోమవారం అదుపు తప్పి లోయలో పడిపోయింది. రామాపురం పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. చిత్తూరు జిల్లా బంగారుపాలెంకు చెందిన లారీ డ్రైవర్ ధనుంజయ ఎర్రగుంట్ల నుంచి బెంగళూరుకు ఎన్ఎల్ 01 ఎల్ 1786 నంబర్ గల లారీలో సిమెంట్ తీసుకువెళ్తుండగా అదుపు తప్పి లోయలో పడిపోయింది. స్థానికుల సాయంతో పోలీసులు డ్రైవర్ను బయటకు తీసి రక్షించారు. గాయపడిన వ్యక్తిని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
త్రుటిలో తప్పిన ప్రమాదం
చిన్నమండెం : పవిత్ర పుణ్య క్షేత్రం గండి నుంచి మదనపల్లెకు వెళ్తున్న కారుకు త్రుటిలో ప్రమాదం తప్పింది. మదనపల్లెకు చెందిన ప్రయాణిలు గండి దర్శనం చేసుకుని తిరిగి వెళ్తుండగా చిన్నమండెం మండలం దేవగుడిపల్లె వద్దకు రాగానే కారు అదుపు తప్పింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారుగోడపై నుంచి పడి మహిళకు తీవ్ర గాయాలుమదనపల్లె రూరల్ : ఇంటి గోడపై నుంచి పడి మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఈశ్వరమ్మ కాలనీకి చెందిన రెడ్డెమ్మ ఇంటికి ఫైబర్ నెట్ కనెక్షన్ ఇవ్వగా, ఆ వైరు కిందకు వేలాడుతుండటంతో, ఇంటిగోడ పైకి ఎక్కి సరిచేసే క్రమంలో అదుపుతప్పి కిందకు పడి తలకు తీవ్ర గాయమైంది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు.రైలు కింద పడి ఆత్మహత్యరైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని అనంతరాజుపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్ మధ్యలో ఆర్.రాచపల్లి రైల్వేగేటు సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వృద్ధుడు(60) రైలు కిందపడి ఆత్మహత్య చేసుకొన్నట్లు రైల్వే పోలీస్ హెడ్ కానిస్టేబుల్ గౌరీశంకర్ తెలిపారు. మృతుడు తెల్లపంచ, షర్ట్ ధరించినట్లు తెలిపారు.గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడి మృతిమైదుకూరు : మైదుకూరు – బద్వేలు రహదారిలో మండలంలోని బసవాపురం టోల్గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని డేరంగుల పవన్ కుమార్ (23) అనే యువకుడు మృతి చెందాడు. ఎర్రగుంట్లకు చెందిన పవన్ కుమార్, నాగరాజు నాయక్ అనే వారు శనివారం రాత్రి మోటార్ బైక్పై బద్వేలు వైపు నుంచి వస్తుండగా టోల్ గేట్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. సంఘటనలో తీవ్రంగా గాయపడిన పవన్ కుమార్ను 108 వాహనంలో మైదుకూరు ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్టు వైద్యులు తెలిపారు. ప్రమాదంలో నాగరాజు నాయక్ స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. మృతి చెందిన పవన్ కుమార్ అవివాహితుడని తెలుస్తోంది. సంఘటనపై కేసు నమోదు చేసుకొని ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్టు మైదుకూరు అర్బన్ పోలీసులు ఆదివారం తెలిపారు. -
కూలిన వంతెన స్థానంలో అప్రోచ్ రోడ్డు
సిద్దవటం : కడప–బద్వేలు మార్గ మధ్యంలోని అటవీ ప్రాంతంలో కిటికీల వంతెన కూలిపోయిన నేపథ్యంలో ఆదివారం అప్రోచ్ రోడ్డు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆర్ అండ్ బి ఏఈ రామాంజనేయులు మాట్లాడుతూ రహదారికి ప్రత్యామ్నాయంగా ఏర్పాటు చేసిన అప్రోచ్ రోడ్డుకు గ్రావెల్ వేయించి డోజర్తో చదును చేయించామన్నారు. దీంతో లారీలు, బస్సులు యాథావిధిగా రాకపోకలు సాగిస్తాయన్నారు. అప్రోచ్ రోడ్డు రహదారిపై సిమెంటు పైపులు వేసి రహదారిని ఎత్తు లేపుతామన్నారు. లేదంటే వర్షాలకు గ్రావెల్ కొట్టుకు పోతుందన్నారు. -
దేశ రక్షణ కమ్యూనిస్టులతోనే సాధ్యం
మదనపల్లె రూరల్ : దేశానికి రక్షణగా నిలబడింది. నిలిచేది కమ్యూనిస్టులు మాత్రమేనని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గుజ్జుల ఈశ్వరయ్య అన్నారు. సీపీఐ అన్నమయ్య జిల్లా 2వ మహాసభల్లో భాగంగా తొలిరోజైన ఆదివారం పట్టణంలోని మిషన్ కాంపౌండ్ నుంచి పెద్దసంఖ్యలో కార్మికులతో ర్యాలీ నిర్వహించారు. అనంతరం శ్రీ కృష్ణ థియేటర్ ఎదురుగా సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్.నరసింహులు అధ్యక్షతన ఏర్పాటు చేసిన బహిరంగసభలో ఈశ్వరయ్య మాట్లాడారు. ప్రధాని నరేంద్రమోదీ దేశ సంపదను కార్పొరేట్ రంగాలకు దోచిపెడుతున్నారన్నారు. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి నేటివరకు ప్రజాధనంతో ఏర్పాటైన ఎల్ఐసీ, రైల్వే, విమానం, ఓడరేవులు, రోడ్లు, బ్యాంకులు, బీఎస్ఎన్ఎల్ తదితర ప్రభుత్వ రంగ సంస్థలను అదానీ, అంబానీలకు కారుచౌకగా కట్టబెట్టేస్తున్నారన్నారు. ఏడాదికి 2కోట్ల ఉద్యోగాలు ఇస్తానన్న మోదీ పాలనలో ఒక ఉపాధి అవకాశం దొరకలేదన్నారు. దేశప్రజల సొమ్మును దోచుకుని కార్పొరేట్ రంగాలకు చెందిన వ్యక్తులు విదేశాల్లో దాచుకుంటే, వారికి రూ.16లక్షల50 కోట్లు బ్యాంకు రుణాలు మాఫీ చేసిన ఘనత బీజేపీకే దక్కిందన్నారు. రాష్ట్రానికి ప్రత్యేక హోదా, రాష్ట్ర అభివృద్ధికి ప్రత్యేక ప్యాకేజీ ప్రకటించిన కేంద్ర ప్రభుత్వం అవి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంటే తిరిగి రెండోసారి అమరావతి అభివృద్ధి కోసం శంకుస్థాపన చేసేందుకు ప్రధాని మోదీని ఆహ్వానించడం సిగ్గుచేటన్నారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విద్యుత్చార్జీలు, స్మార్ట్ మీటర్లపైన తీవ్ర వ్యతిరేకత కనబరిచిన టీడీపీ, స్మార్ట్మీటర్లు, విద్యుత్చార్జీల భారాన్ని ప్రజల మీద మోపడంలో వెనకడుగు వేయడం లేదన్నారు. కేంద్ర ప్రభుత్వంలో కీలకపాత్ర పోషిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి కోసం 10వేల కోట్లు ప్రత్యేక ప్యాకేజీని సాధించుకుని జిల్లా అభివృద్ధికి దోహదపడాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ రాష్ట్ర సమితి సభ్యులు జల్లా విశ్వనాథ్, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి మహేష్, ప్రజానాట్యమండలి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిన్నం పెంచలయ్య, కార్యవర్గసభ్యులు పాల్గొన్నారు. రాష్ట్రానికి నిధులు తేవడంలో కూటమిప్రభుత్వం వైఫల్యం జిల్లా సమగ్రాభివృద్ధికి 10వేల కోట్లు కేటాయించాలి సీపీఐ అన్నమయ్యజిల్లా 2వ మహాసభలు ప్రారంభం -
దేవపట్ల సర్పంచ్ ఆవుల వేణుగోపాల్రెడ్డి కన్నుమూత
సంబేపల్లె : వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, దేవపట్ల సర్పంచ్ ఆవుల వేణుగోపాల్రెడ్డి (73) మృతి చెందారు. ఆదివారం తెల్లవారుజామున ఆయన తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన మదనపల్లెలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందారు. ఆయన మరణ వార్త వినగానే ఆవుల కుటుంబ సభ్యులతో పాటు రాయచోటి నియోజకవర్గం, సంబేపల్లె మండల వ్యాప్తంగా విషాద ఛాయలు అలుముకున్నాయి. నిత్యం ప్రజలలోనే.. ఆవుల వేణుగోపాల్రెడ్డి నిత్యం ప్రజల మనిషిగానే మెలిగేవారు. ఎవరు ఏ సహాయం కావాలని అడిగినా స్పందించే నాయకుడని గ్రామస్తులు పేర్కొంటున్నారు. అలానే పేద విద్యార్థుల విద్యకు అండగా నిలిచేవారు. దేవపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రం, పాఠశాలలు, రోడ్లు వంటి మౌలిక వసతుల కల్పనకు ఆయన చేసిన కృషి ఎనలేనిది. ఆయన చిన్న వయస్సులోనే సినీ నిర్మాణంపై ఆసక్తి చూపుతూ దేవపట్ల – సంబేపల్లె ప్రాంతాలలో పలు చిత్రాల చిత్రీకరణకు సహకరించారు. వేణుగోపాల్రెడ్డికి ముగ్గురు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు అమెరికాలో స్థిరపడగా, రెండవ కుమారుడు ఆవుల విష్ణువర్దన్రెడ్డి డీసీఎంస్ చైర్మన్గా పని చేశారు. అలాగే ఆమె కోడలు నాగశ్రీలక్ష్మి ప్రస్తుతం సంబేపల్లె ఎంపీపీగా ఉన్నారు. మూడో కుమారుడు మల్లికార్జునరెడ్డి వ్యాపార రంగంలో రాణిస్తున్నారు. కాగా మండల పరిధిలోని దేవపట్ల పంచాయతీ ఆవులవాండ్లపల్లెలో 12 వ తేదీ మంగళవారం అంత్యక్రియలు నిర్వహిస్తున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. -
కారు ఢీకొని యువకునికి గాయాలు
పీలేరు రూరల్ : కారు ఢీకొని యువకునికి తీవ్ర రక్తగాయాలైన సంఘటన పీలేరు పట్టణం తిరుపతి రోడ్డులో జరిగింది. ఎస్ఐ లోకేష్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. చంద్రగిరికి చెందిన సుమంత్(19), తన ద్విచక్రవాహనంలో ఆదివారం ఉదయం పీలేరు నుంచి చంద్రగిరికి తిరుగు వెళుతున్న సమయంలో విద్యుత్ సబ్ స్టేషన్ సమీపంలో కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో గాయపడిన సుమంత్ను స్థానికులు పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుడు సుమంత్ను మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఈ ప్రమాదంపై ఎస్ఐ లోకేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జెడ్పీటీసీ ఉప ఎన్నికలకు పకడ్బందీగా బందోబస్తు
కడప అర్బన్ : ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న ఉప ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో 1400 మంది పోలీసు సిబ్బందితో పకడ్బందీగా విధులను నిర్వహించేందుకు తగిన ఏర్పాట్లు చేశామని వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో మీడియాకు వివరాలను తెలియజేశారు. పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికకు 550 మంది పోలీసులు, 4 ఏపీఎస్పీ ప్లటూన్లు, ఏఆర్ పోలీసు బలగాలతో కట్టుదిట్టమైన బందోబస్తు నిర్వహించనున్నామన్నారు. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానంలో ఉప ఎన్నికకు 650 మందికి పైగా పోలీసులు బందోబస్తు నిర్వహించనున్నారన్నారు. ఇప్పటివరకు పులివెందులలో 500 మందిపై, ఒంటిమిట్టలో 650 మందిపై బైండోవర్ కేసులను నమోదు చేశామన్నారు. ఆదివారం సాయంత్రం 5 గంటలకు ప్రచారానికి తెరపడిందన్నారు. స్థానికేతరులు ఆయా ప్రాంతాలలో వుండకూడదన్నారు. ప్రతి పోలింగ్ కేంద్రాల వద్ద డ్రోన్ కెమెరాలు, సీసీ కెమెరాలతో నిఘా వుంచుతామన్నారు. ఎక్కడా ఎలాంటి అల్లర్లు జరగకుండా నిరంతరం పర్యవేక్షిస్తామన్నారు. చట్టాన్ని ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. 1400 మంది పోలీసు అధికారులు, సిబ్బందితో విధులు ప్రశాంతంగా ఎన్నికలు జరిగేందుకు కృషి వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ వెల్లడి -
సీ అండ్ డీ ప్రదేశంలో బీ గ్రేడ్ బైరెటీస్ ఖనిజం
ఓబులవారిపల్లె : తక్కువ గ్రేడ్ ఖనిజమైన సి అండ్ డి గ్రేడ్ యాడ్లో విలువైన బి గ్రేడ్ ఖనిజం తరలించి విక్రయిస్తున్నట్లు గుర్తించారు. ఈ విషయంపై ఆదివారం పెద్దఎత్తున బయట ప్రచారం జరుగుతోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి మంగంపేట ఏపీఎండీసీలో ఖనిజం అమ్మకాల్లో భారీ ఎత్తున అవకతవకలు జరుగుతున్నాయి. సి అండ్ డీ గ్రేడ్ 0.4 గ్రావిటీ కలిగి ఉండి రూ. 2200 టన్ను ధరతో ఏపీఎండీసీ విక్రయాలు చేస్తోంది. అయితే 1.2 గ్రావిటీ కల్గిన బి గ్రేడ్ ఖనిజం టన్ను ధర దాదాపు రూ. 6 వేలు ఉంది. గనుల నుండి వెలికి తీసిన బి గ్రేడ్ ఖనిజాన్ని కేటాయించిన స్థలంలో కాకుండా సి అండ్ డి గ్రేడ్ ఖనిజం ఉన్న యార్డుకు తరలించి సి అండ్ డి గ్రేడ్ ధరకు బి గ్రేడ్ ఖనిజాన్ని అక్రమంగా తరలించుకుని పోతున్నారు. దీంతో కోట్లాది రూపాయలు ప్రభుత్వ ధనాన్ని కొల్లగొడుతున్నారు. శనివారం బి గ్రేడ్ ఖనిజాన్ని సి అండ్ డి యార్డులో తోలినట్లు గమనించిన సిబ్బంది అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో అధికారులు ఖనిజాన్ని పరిశీలించారు. ఈ విషయంపై సీపీఓ గోపినాథ్ను వివరణ కోరగా బైరెటీస్ ఖనిజాన్ని పరిశీలించామన్నారు. అనాలసిస్ చేసిన అనంతరం 0.7 గ్రావిటీ వచ్చిందని అది సి అండ్ డి గ్రేడ్ ఖనిజమే అని నిర్ధారించినట్లు తెలిపారు.కోట్ల రూపాయలు కొల్లగొడుతున్న వైనం -
కిడ్నాప్ కేసులో న్యాయం చేయలేదని పోలీస్ స్టేషన్ ముట్టడి
రామసముద్రం : మైనర్ బాలిక కిడ్నాప్ కేసులో నిందితుడిని పట్టుకోవడంలో పోలీసులు నిర్లక్ష్యం చేశారని ఆరోపిస్తూ బాధిత కుటుంబీకులు ఆదివారం పోలీస్ స్టేషన్ను ముట్టడించారు. బాధితుల వివరాల మేరకు రామసముద్రం ఆంజనేయస్వామి కాలనీకి చెందిన మైనర్ బాలికను బి.కొత్తకోటకు చెందిన గణేష్ అనే యువకుడు ఏడోతేదీ రాత్రి ఇంటితాళాలు పగలగొట్టి కిడ్నాప్ చేసి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు. అంతేకాకుండా ఇంటి బీరువాలో ఉన్న బంగారు నగలు, మూడు లక్షల నగదు ఎత్తుకెళ్లాడని బాధితులు ఆరోపించారు. ఈ విషయమై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేయడంతో తామే నిందితుని ఆచూకీ కనుక్కొని ఆదివారం మైనర్ బాలికతో పాటు గణేష్ను పోలీసులకు అప్పగించినట్లు బాధితులు తెలిపారు. ఇంటి నుంచి ఎత్తుకెళ్లిన బంగారు నగలు, డబ్బు నిందితుని నుంచి రాబట్టి అతనిపై కేసు నమోదు చేయాలని బాధితులు పోలీసులను డిమాండ్ చేశారు. ఒకానొకదశలో పోలీస్ స్టేషన్లోకి దూసుకెళ్లారు. ఈ విషయంపై గణేష్పై పోక్సో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రమేష్బాబు తెలిపారు. -
గంగమ్మా..కరుణించమ్మా
లక్కిరెడ్డిపల్లె: గంగమ్మ దేవతా కరుణించి కాపాడు తల్లీ అంటూ మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీ అనంతపురం గంగమ్మ దేవతకు భక్తులు ఆదివారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రావడంతో క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. మొక్కులు ఉన్న భక్తులు అమ్మవారికి బోణాలు సమర్పించారు. తలనీలాలు అర్పించారు. అర్చకులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. పెన్నా పరవళ్లు సిద్దవటం: మండల కేంద్రమైన సిద్దవటంలోని పెన్నానది ఆదివారం తెల్లవారు జాము నుంచి ఉధృతంగా ప్రవహిస్తోంది. నదీ పరివాహక ప్రాంతాల్లో, రెండు రోజులుగా కురిసిన భారీ వర్షాలకు వరద నీరు వచ్చి చేరింది.పెన్నానది లోలెవల్ కాజ్వే పైకి ఎవరినీ వెళ్లనీయకుండా సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ కాజ్వేకి ఇరువైపులా ముళ్లకంపతో కంచె వేయించారు.నదిలో సుడిగుండాలు ఉన్నాయని, కొత్తవ్యక్తులు, స్థానికులు ఎవరూ నదిలోకి దిగవద్దని ఎస్ఐ తెలియజేశారు. హార్సిలీహిల్స్ నిర్మానుష్యం బి.కొత్తకోట: మారిన వాతావరణ పరిస్థితులతో మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ నిర్మాణుష్యంగా మారింది. ఆదివారం సందర్శకుల సందడితో కొండపై ఆహ్లదకరమైన పరిస్థితులు కనిపిస్తాయి. అయితే చల్లటిగాలులతో చలి పెరగడం, ముసురుపట్టి వర్షాలు కురుస్తుండటంతో పర్యాటకుల రాక ఆగిపోయింది. దీనితో కొండపై ఎక్కడచూసిన జన సంచారం లేక నిర్మానుష్యంగా మారింది. జగన్మోహన్ రాజుపై దాడికి యత్నం సాక్షి టాస్క్ఫోర్స్: మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని హరిత రెస్టారెంట్లో టీడీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజుపై సొంత పార్టీ కార్యకర్తలే దాడికి యత్నించారు. వివరాల్లోకి వెళితే ఒంటిమిట్ట మండలం జెడ్పీటీసీ ఉప ఎన్నిక నేపథ్యంలో బూత్లకు సంబంధించి కొత్త వారిని నియమించడంతో ఒంటిమిట్ట తెలుగు తమ్ముళ్లలో ఆగ్రహావేశాలు తారస్థాయికి చేరాయి.. ఇది వరకు ఇన్చార్జీలుగా పని చేసిన తెలుగు తమ్ములంతా ఆదివారం స్థానిక హరిత రెస్టారెంట్లో చమర్తిపై తిరగబడ్డారు. ఈ విషయంలో ఒంటిమిట్టకు చెందిన ఓ యువకుడు చమర్తి జగన్మోహన్రాజుపై దాడికి యత్నించడం సంచలనంగా మారింది. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ప్రజలు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోండి పులివెందుల : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటర్లు స్వేచ్ఛగా ఓటు హక్కు వినియోగించుకోవాలని.. ఇది రాజ్యాంగబద్దంగా ఇచ్చిన హక్కని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం పులివెందుల మండలం మోట్నూతలపల్లె గ్రామంలో వైఎస్సార్సీపీ నాయకులు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ శ్రేణులతో కలిసి ఆయన ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఈ జెడ్పీటీసీ ఎన్నిక చాలా చిన్నదని, జెడ్పీటీసీ మహేశ్వరరెడ్డి చనిపోయిన సందర్భంలో ఆయన కొడుకు హేమంత్రెడ్డిని జెడ్పీటీసీ అభ్యర్థిగా వైఎస్సార్సీపీ బరిలోకి దించిందన్నారు. సాధారణంగా ఈ ఎన్నికను సానుభూతికి వదిలేస్తారన్నారు. కానీ, ఆదినారాయణరెడ్డి లాంటి జిమ్మిక్కులు చేసే వ్యక్తులకు తోడు చంద్రబాబు, లోకేష్ ఇక్కడ ఎన్నికకు పోటీకి వచ్చారన్నారు. పోటీ చేయడం వరకు తప్పేమి లేదు గానీ, వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను బెదిరింపులకు గురిచేయడం, ఆర్థికంగా ప్రలోభాలతో మభ్యపెట్టడం దారుణమన్నారు. -
వైఎస్సార్సీపీ విజయం తథ్యం
ఒంటిమిట్ట(రాజంపేట): జెడ్పీటీసీ ఉపఎన్నికల ప్రచార చివరిరోజు ఆదివారం ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీ చేపట్టింది. ఈ ర్యాలీలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. కూటమి కుట్రలను తిప్పికొట్టేలా వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా కొనసాగిన ర్యాలీకి విశేషస్పందన లభించింది. ఒంటిమిట్ట వీధులు జనంతో కిక్కిరిసిపోయాయి. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థుల విజయం తథ్యమని ధీమాను వ్యక్తంచేశారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ పులివెందుల, ఒంటిమిట్ట వైఎస్ జగన్మోహనరెడ్డి అడ్డా అన్నారు. ఎంతమంది ఎన్నికుట్రలు పన్నినా, కేబినెట్ కదిలివచ్చినా చేసేదేమి ఉండదని, ఓటమి చవిచూడటం తప్ప అన్నారు. రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి మాట్లాడుతూ జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో కూటమి కుట్రలను ఒంటిమిట్ట వాసులే ఓటు అనే ఆయుధంతో తిప్పికొడతారన్నారు. ఎన్నికలకోడ్ ఉల్లంఘన యథేచ్ఛగా ఒంటిమిట్టలో కొనసాగిందని ఉన్నతాధికారులకు తెలిసినా అడ్డుకోలేని నిస్సహాయస్థితిలో ఉన్నారన్నారు. పులివెందుల, ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ అభ్యర్థులకు ప్రజలే అండగా నిలుస్తున్నారన్నారు. ర్యాలీతో వైఎస్సార్సీపీ క్యాడర్లో నూతనోత్సహం వెల్లివిరిసింది. పాజిటివ్ ధృక్పథంతో ముందుకుసాగారు. ఫ్యాన్ గుర్తుకు ఓటువే యాలంటూ ఓటర్లకు పిలుపునిచ్చారు. వైఎస్సార్సీపీ అభ్యర్ధి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ ఆశీర్వదించాలని మండల ఓటర్లను అభ్యర్థిచారు. ● ర్యాలీలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు అంజద్బాషా, కొరముట్ల శ్రీనువాసులు, రఘురామిరెడ్డి, కడప జెడ్పీచైర్మన్ రామగోవిందరెడ్డి, స్ధానిక సీనియర్ నేత ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డి, ,రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి,కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి వెంకటసుబ్బారెడ్డి, రాష్ట్ర మహిళా ప్రధానకార్యదర్శి ఏకులరాజేశ్వరిరెడ్డి, ఒంటిమిట్ట మండల కన్వీనరు టక్కోలు శివారెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దాబాబుల్రెడ్డి, రైల్వేకోడూరు వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, రాయలసీమ వైఎస్సార్సీపీ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్కుమార్రెడ్డి, దళితనేత పులిసునీల్కుమార్, వడెర సంఘం రాష్ట్రనేత వడ్డెరమణ,గల్ఫ్ వైఎస్సార్సీపీ కన్వీనరు ఇలియాస్ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్టలో భారీ ప్రచార ర్యాలీ ఫ్యాన్ గుర్తుకే ఓటువేయాలని నేతల అభ్యర్థన -
పోలింగ్కు సర్వం సిద్ధం
● ముగిసిన ప్రచార ఘట్టం ● ఓటరు స్లిప్పుల పంపిణీ పూర్తి ● సమస్యాత్మక పోలింగ్ కేంద్రాల గుర్తింపు ● కట్టుదిట్టమైన బందోబస్తు ఏర్పాటు ● కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి,ఎస్పీ ఈజీ అశోక్కుమార్ కడప సెవెన్రోడ్స్: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12వ తేది జరగనున్న ఎన్నికలను ప్రశాంతంగా నిర్వహించేందుకు అవసరమైన ఏర్పాట్లు పూర్తి చేశామని కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి తెలిపారు. ఆదివారం ఎస్పీ ఈజీ అశోక్కుమార్తో కలిసి కలెక్టరేట్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఒంటిమిట్టలో 30 పోలింగ్ కేంద్రాలు, పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు మొత్తం 45 కేంద్రాలు ఏర్పాటు చేశామని వెల్లడించారు. పోలింగ్ ఉదయం 7.00 నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు జరుగుతుందన్నారు. సాయంత్రం ఐదు గంటల సమయానికి పోలింగ్ కేంద్రం వద్ద క్యూలో నిలుచున్న వారంతా ఓటు వేసేంతవరకు పోలింగ్ కొనసాగుతుందన్నారు. సోమవారం సాయంత్రానికంతా పోలింగ్ సిబ్బంది ఆయా కేంద్రాలకు చేరుకుంటారని తెలిపారు. ఇప్పటికే పోలింగ్ సిబ్బందికి సంబంధించిన తొలి విడత ర్యాండమైజేషన్ పూర్తి చేశామని, రెండవ విడత సోమవారం నిర్వహిస్తున్నామని వివరించారు. గత ఎన్నికల్లో చోటుచేసుకున్న హింసాత్మక సంఘటనలను దృష్టిలో ఉంచుకుని పులివెందులలో 15 పోలింగ్ కేంద్రాలు, ఒంటిమిట్టలో 10 పోలింగ్ కేంద్రాలను సమస్యాత్మకమైనవిగా గుర్తించామన్నారు. వీటిలో సీసీ కెమెరాలు, వెబ్కాస్టింగ్ వంటి ఏర్పాట్లు ఉంటాయన్నారు. వెబ్కాస్టింగ్కు అవకాశం లేనిచోట్ల మైక్రో అబ్జర్వర్లను నియమిస్తున్నామని తెలిపారు. పోలింగ్ కేంద్రాల్లో అవసరమైన అన్ని సదుపాయాలను ఇప్పటికే ఏర్పాటు చేశామన్నారు. ప్రతి పోలింగ్ ఏరియాకు ఒక మైక్రో అబ్జర్వర్ ఖచ్చితంగా ఉంటారన్నారు. ప్రచారం ఆదివారం సాయంత్రం 5 గంటలకు ముగిసిందని, రాష్ట్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ఆయా ప్రాంతాల నుంచి స్థానికేతరులు వెళ్లిపోవాలన్నారు. లేనిపక్షంలో మోడల్ కోడ్ ఆఫ్ కాండక్ట్ ప్రకారం చర్యలు తీసుకుంటామన్నారు. ఇప్పటికే ఓటరు స్లిప్పుల పంపిణీ దాదాపు పూర్తి కావచ్చిందని, ఇంకా మిగిలిన వారికి కూడా పంపిణీ చేస్తామన్నారు. పులివెందుల జెడ్పీటీసీ పరిధిలోని మూడు గ్రామ పంచాయతీల్లో పోలింగ్ కేంద్రాల మార్పుపై అభ్యంతరాలతో కూడిన పలు వినతులు రాగా, వాటిని రాష్ట్ర ఎన్నికల సంఘానికి పంపించామన్నారు. ● ఎస్ఈసీ ఆదేశాల మేరకు ఓటర్ల కోసం బస్సులు, ఆటోలు అందుబాటులోకి తీసుకు వస్తున్నామని తెలిపారు. వీటిని ఉపయోగించుకుని ఓటుహక్కును వినియోగించుకోవాలన్నారు. అలాగే హెల్ప్డెస్క్, సిబ్బందిని ఏర్పాటు చేశామన్నారు. ఎవరైనా హింసాత్మక సంఘటనలకు పాల్పడితే చర్యలు తీవ్రంగా ఉంటాయని హెచ్చరించారు. పులివెందుల మండలంలోని నల్లపురెడ్డిపల్లె, నల్లగొండువారిపల్లె, వి.కొత్తపల్లె ఓటర్లను ఒక పోలింగ్ కేంద్రం నుంచి మరో పోలింగ్ కేంద్రానికి మార్చడం పట్ల వస్తున్న విమర్శలను ప్రస్తావించగా, వివరాలను తొలుతే ప్రదర్శించి అభ్యంతరాలను ఆహ్వానించామని కలెక్టర్ చెప్పారు. ఎలాంటి అభ్యంతరాలు రాకపోవడం వల్ల వీటిని ఖరారు చేశామన్నారు. ఈనెల 14వ తేది కడప సమీపంలోని మను పాలిటెక్నిక్ కళాశాలలో కౌంటింగ్ నిర్వహణకు అవసరమైన అన్ని ఏర్పాట్లు ఇప్పటికే పూర్తి చేశామన్నారు. పోలింగ్ సజావుగా సాగేందుకు వీలుగా కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేశామని ఎస్పీ ఈజీ అశోక్కుమార్ తెలిపారు. సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలు గుర్తించామన్నారు. సీసీ కెమెరాలతోపాటు రూట్ మొబైల్స్, స్టైకింగ్ ఫోర్స్ను ఏర్పాటు చేశామన్నారు. అలాగే 13 జిల్లా సరిహద్దు చెక్పోస్టులతోపాటు పులివెందుల, ఒంటిమిట్ట పరిసరాల్లోని 15 చెక్పోస్టుల వద్ద పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. పాత నేరస్తులను బైండోవర్ చేస్తున్నామన్నారు. పెట్రోలింగ్ పార్టీలు, మొబైల్ వీడియో కెమెరాలు, నేత్ర వాహనాలతోపాటు రెండు అత్యాధునిక డ్రోన్స్ వినియోగిస్తున్నామని వివరించారు. గ్రామాలను క్లస్టర్లుగా విభజించామన్నారు. ఈ సమావేశంలో రిటర్నింగ్ అదికారి ఓబులమ్మ పాల్గొన్నారు. కట్టుదిట్టమైన భద్రత: ఎస్పీ -
● పోలింగ్కు అధికారుల ఏర్పాట్లు
ఈనెల 12వ తేదీన జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి పోలింగ్ నేపథ్యంలో అధికారులు ఏర్పాట్లు ముమ్మరం చేశారు. ప్రధానంగా పోలింగ్బూత్ల పరిశీలన మొదలుకొని అక్కడ ఏర్పాట్లతోపాటు టేబుళ్లు, సిబ్బంది ఇలా అన్నిచర్యలు చేపట్టారు. ఇప్పటికే జిల్లా కలెక్టర్ డాక్టర్శ్రీధర్ చెరుకూరితోపాటు ఎస్పీ ఈజీ అశోక్కుమార్లు ఆయా ప్రాంతాల్లో పర్యటించి ఏర్పాట్లపై సూచనలు సలహాలు ఇచ్చారు. పులివెందులతోపాటు ఒంటిమిట్ట ప్రాంతాల్లో సుమారు 1100 మందికి పైగా బందోబస్తు నిమిత్తం పోలీసులను వినియోగిస్తున్నారు. -
ట్రాక్టర్ ఒరిగి ఇద్దరు కూలీలు దుర్మరణం
చిన్నమండెం : ట్రాక్టర్ ఒరగడంతో అందులో ప్రయాణిస్తున్న ఇద్దరు కూలీలు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. ఒరిస్సా రాష్ట్రానికి చెందిన మజ్హీసింగ్(23), గలగసింగ్(20), లక్ష్మణ్సింగ్లు చిన్నమండెం–పెద్దమండ్యం జాతీయ రహదారిలో హైవోల్టేజీ విద్యుత్ లైన్ పనులు చేస్తున్నారు. పనులు ముగించుకొని ట్రాక్టర్లో చిన్నమండెంకు వస్తుండగా పడమటికోన గ్రామం తొగటపల్లె సమీపంలో ట్రాక్టర్ పక్కకు ఒరిగిపోయింది. ఈ ప్రమాదంలో మజ్హీసింగ్(23), గలగసింగ్(20) అక్కడికక్కడే మృతి చెందారు. లక్ష్మణ్సింగ్కు గాయాలయ్యాయి. మృతదేహాలను రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వృద్ధురాలి మృతి సిద్దవటం : కడప రిమ్స్లో చికిత్స పొందుతూ గుర్తు తెలియని వృద్ధురాలు మృతి చెందినట్లు సిద్దవటం ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. శనివారం ఆయన మాట్లాడుతూ సిద్దవటం మండలం భాకరాపేట వద్ద శుక్రవారం తెల్లవారుజామున రోడ్డు పక్కన పడిఉన్న గుర్తు తెలియని వృద్ధురాలిని కడప రిమ్స్లో చేర్పించామన్నారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందినట్లు తెలిపారు. ఆమె వివరాలు తెలిసిన వారు ఒంటిమిట్ట సీఐ బాబు, 9121100581, సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ 9121100584 నంబర్లకు సమాచారం ఇవ్వాలని ఆయన కోరారు. ప్రమాదంలో గాయపడి.. కోలుకోలేక..ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో గాయపడిన మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. వివరాలు... స్థానిక మండల కేంద్రం ఇందిరా కాలనీకి చెందిన వెంకటరమణ, భార్య శాంతమ్మలు కలిసి గత గురువారం ద్విచక్రవాహనంలో పనుల మీద మదనపల్లెకు వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గ మధ్యంలో వేపూరికోట వద్ద శాంతమ్మ చీర బైక్ చక్రానికి చుట్టుకొని కిందపడిపోయింది. ఈ ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతి రుయా ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మత్తుకు బానిసలు కావద్దు రాయచోటి టౌన్ : మత్తుకు బానిసలై జీవితాలను బుగ్గిపాలు చేసుకోవద్దని అన్నమయ్య జిల్లా ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ అధికారి జి. మధుసూదన్ అన్నారు. శనివారం రాయచోటి పట్టణంలోని బంగ్లా సర్కిల్ వద్ద కార్మికులతో ఆయన మాట్లాడారు. రోజంతా కష్టపడి పని చేసి వచ్చిన డబ్బులను మద్యం, ఇతర మత్తు పదార్థాల కోసం ఖర్చు పెడితే ఆర్థికంగా, ఆరోగ్యపరంగా నష్టపోవడమే గాక జీవితం కూడా చిన్నాభిన్నమవుతుందన్నారు. మావనత సంస్థ సభ్యుడు సహదేవ రెడ్డి మాట్లాడుతూ మత్తుకు దూరంగా ఉండి మీ పిల్లల ఉన్నత భవిష్యత్తు కోసం కృషి చేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జోగేంద్ర, డైట్ కళాశాల ఇన్చార్జి ప్రిన్సిపల్ నరసింహారెడ్డి, ఎకై ్సజ్ సీఐ గురుప్రసాద్, ఎస్ఐ ఓ. హుస్సేన్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
గిట్టుబాటు కరువై.. సాగు బరువై..!
గుర్రంకొండ : జిల్లాలో రోజురోజుకు అల్లనేరేడు తోటలు అంతరించిపోతున్నాయి. గత రెండేళ్లుగా మార్కెట్లో అల్లనేరేడుకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. ఈ సీజన్లో మార్కెట్లో కిలో రూ. 30 నుంచి రూ. 40 వరకు ధరలు పలకడం గమనార్హం. దీంతో ఈ ఏడాది జిల్లాలో అల్లనేరేడు రైతులు రూ. 40.50 కోట్ల మేరకు నష్టపోయారు. నష్టాలు భరించలేక జిల్లాలో పలు చోట్ల అల్లనేరేడు చెట్లను రైతులు నరికి వేస్తున్నారు. జిల్లాలో 3240 హెక్టార్లలో పంటసాగు జిల్లాలో అల్లనేరేడు తోటల పెంపకం 3240 హెక్టార్లలో రైతులు చేపట్టారు. ఎకరం అల్లనేరేడు తోటల పెంపకానికి రూ. లక్ష వరకు ఖర్చు వస్తుంది. మొక్కలు నాటడం దగ్గర నుంచి కాయలు కాసేంతవరకు ఆరు సంవత్సరాల పాటు ఏడాదికి రూ. 80 వేలు చొప్పున తోటల నిర్వహణ ఖర్చు వస్తుంది. ఎరువులు, పురుగు నివారణ మందులు, మొక్కలు ఏపుగా పెరిగేందుకు అవసరమైన కట్టెలు వంటివి ఆరేళ్లపాటు ఖర్చులు వస్తాయి. ఈ లెక్కన ఎకరం తోటకు కాయలు కాసేవరకు రైతుకు రూ. 5 లక్షల వరకు ఖర్చు వస్తుంది. ఆ తరువాత ప్రతి ఏడాది కాయలు కాసే పంట దిగుబడిని బట్టి ఆదాయం ఉంటుంది. ఎకరాకు రూ. లక్ష ఆదాయం.. ఆరేళ్ల పాటు తోటల్ని కాపాడుకున్న తరువాత మార్కెట్లో మంచి ధరలు ఉంటే ఎకరానికి రూ. లక్ష ఆదాయం వస్తుంది. ఏడాదికి ఎకరం తోటలో సుమారు 800 కేజీల నుంచి టన్ను వరకు పంట దిగుబడి వస్తుంది. మార్కెట్లో కిలో ధర రూ. 100 పలికితే ఎకరానికి రూ. లక్ష వరకు ఆదాయం రైతుకు సమకూరుతుంది. గత కొన్నేళ్లుగా మార్కెట్లో కిలో ధరలు రూ. 100 తగ్గిన దాఖలాలు లేవు. దీంతో జిల్లాలో పలువురు రైతులు అల్లనేరేడు తోటల పెంపకంతో నిలకడైన ఆదాయం వస్తుందని భావించి ఎక్కువగా తోటల్ని సాగు చేశారు. రెండేళ్లుగా మారిన లెక్కలు.. ఏం జరిగిందో తెలియదు కానీ గత రెండేళ్లుగా అల్లనేరేడు తోటల పెంపకం నష్టాలు తీసుకొచ్చింది. ఓ వైపు ఊజిదోమలతోపాటు ఇతర రోగాలు వ్యాపించడంతో మార్కెట్లో గిట్టుబాటు ధరలు లభించలేదు. ఈ ఏడాది మంచి సీజన్లో కిలో రూ. 30 నుంచి రూ. 40 ఽలోపే మార్కెట్లో ధరలు పలికాయి. రోగాల కారణంగా కాయలు దెబ్బతినడంతో బయటి రాష్ట్రాల్లో డిమాండ్ తగ్గిపోయింది. దీంతో బయటి రాష్ట్రాలకు మన జిల్లా నుంచి ఎగుమతులు చాలా వరకు తగ్గిపోయాయి. దీంతో లక్షలాది రూపాయలు ఖర్చుచేసి సాగు చేసిన అల్లనేరేడుకు ఎకరానికి రూ. 30లోపే ఆదాయం వచ్చింది. దీంతో అటు వ్యాపారులు, ఇటు రైతుల అంచనాలు తప్పాయి. దీంతో ఈ ఏడాది అల్లనేరేడు సాగు చేసిన రైతులు రూ. 40.50 కోట్ల మేరకు నష్టపోయారు. రెండేళ్లుగా ఇదే పరిస్థితి నెలకొనడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లింది. ముఖం చాటేస్తున్న వ్యాపారులు.. రెండేళ్ల క్రితం తోటల వద్దకే వచ్చి తోటల్ని ఏడాదికి ముందే కొనుగోలు చేసే వ్యాపారులు ప్రస్తుతం ముఖం చాటేస్తున్నారు. రైతులు రెండు రకాలుగా తోటల్ని వ్యాపారులకు విక్రయిస్తుంటారు. కాయలు కాయక మునుపే ఎకరా తోటలకు ఒక రేటు నిర్ణయించి ముందుగానే కొనుగోలు చేస్తుంటారు. మరోవైపు రైతులే కాయలు కాసే వరకు వేచి ఉండి ఆ తరువాత వ్యాపారులకు పంటను విక్రయిస్తుంటారు. అయితే ఈ ఏడాది మార్కెట్లో ధరలు పుంజుకోక పోవడంతో వ్యాపారులు అల్లనేరేడు తోటలపై ఆసక్తి చూపించలేదు. రైతులు పలుమార్లు వ్యాపారుల్ని సంప్రదించినా ఫలితం కనిపించలేదు. మరోవైపు ఎంతో కొంత అడ్వాన్స్ చెల్లించిన వ్యాపారులు మాత్రం విధిలేని పరిస్థితిలో కాయల్ని కోసి మార్కెట్కు తరలించి ఎంతో కొంత సొమ్ము చేసుకున్నారు. అయితే రైతులకు మాత్రం నష్టాలు వచ్చియని చూపించి మిగిలిన సొమ్ము చెల్లించలేక ఇబ్బందులు పడ్డారు. పలుచోట్ల వ్యాపారులు పంటకొనుగోలుకు అడ్వాన్స్లు చెల్లించినా ధరలు లేకపోవడంతో అటువైపు వెళ్లడం మానేశారు. నష్టాలు భరించలేక అల్లనేరేడు తోటల్ని నరికేస్తున్న రైతులు ఈ సీజన్లో కిలో రూ. 30 నుంచి రూ.40 ధరలు జిల్లాలో రూ. 40.50 కోట్ల మేర రైతులకు నష్టం తోటల్లోనే వదిలేశాము ఈ సంవత్సరం అల్లనేరేడు కాయల్ని కొనేవారు లేరు. వ్యాపారులు రెండేళ్ల క్రితం తోటలవద్దకే వచ్చి కొనుగోలు చేశారు. ఈ ఏడాది మేము బలవంతం చేసినా రాలేదు. కూలీల ఖర్చు భరించలేక, మార్కెట్కు తీసుకెళ్లేందుకు సరైన సౌకర్యాలు లేక కాయల్ని చెట్లలోనే వదిలేశాము. ఈ ఏడాది ఒక్క రూపాయి ఆదాయం కూడా రాకపోవడంతో నష్టపోయాం. – సుధాకర, అల్లనేరేడు రైతు, గుర్రంకొండ చెట్లను కోసేస్తున్నారు మా ప్రాంతంలో చాలా మంది రైతులు అల్లనేరేడు చెట్లను కోసేస్తున్నారు. మార్కెట్లో కాయలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో చాలా నష్టపోయాము. చేసేదిలేక కొంతమంది రైతులు తోటల్లోని చెట్లను వ్యాపారులకు ఉచితంగా ఇచ్చేసి కోసేస్తున్నారు. అల్లనేరేడుకు ఇలాంటి దుస్థితి ఎన్నడూ రాలేదు. – గయాజ్, అల్లనేరేడు రైతు, గుర్రంకొండ. -
పిడుగుపాటుతో 47 గొర్రెలు మృతి
తంబళ్లపల్లె : పిడుగుపాటుతో 47 గొర్రెలు మృతి చెందిన విషాద సంఘటన శనివారం మండలంలో జరిగింది. మండలంలోని ఆర్ఎన్ తాండా పంచాయతీ బోనాసువారిపల్లెకు చెందిన రెడ్డమ్మ బంగారు తాకట్టు పెట్టి, పలువురు రైతుల వద్ద అప్పులు చేసి గొర్రెలు కొని వాటితో జీవనం సాగిస్తోంది. శుక్రవారం రాత్రి గొర్రెలను షెడ్డులో తోలింది. వర్షం వల్ల పడిన పిడుగు తాకిడికి 47 గొర్రెలు మృతి చెందాయి. శనివారం ఉదయం గొర్రెలు బయట తోలేందుకు వెళ్లగా ఒక్కసారిగా గొర్రెలు మృతి చెందడం చూసి బోరున విలపిస్తూ కుప్పకూలింది. సమాచారం అందుకున్న పశుసంవర్థకశాఖ ఏడీ డాక్టర్ సుమిత్ర, పశువైద్యులు డాక్టర్ విక్రమ్రెడ్డి, ఇందులు సంఘటన స్థలానికి వెళ్లి బాధితులను పరామర్శించి మృతి చెందిన గొర్రెలకు పోస్టుమార్టం నిర్వహించారు. పిడుగుపాటుకే మృతి చెందినట్లు నిర్ధారించారు. మరో ఆరు గొర్రెలు చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా చికిత్స చేశారు. సమాచారం అందుకున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి గ్రామానికి వెళ్లి బాఽధితులను ఓదార్చి పరామర్శించారు. రూ.50 వేలు ఆర్థిక సహాయం అందించారు. ప్రభుత్వం బాధితులకు నష్టపరిహారం ఇచ్చి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఆయన వెంట వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ చౌడేశ్వర్, సర్పంచుల సంఘం అధ్యక్షుడు సుధాకర్రెడ్డి, సర్పంచ్ చెన్నకేశవరెడ్డి, నాయకులు సురేంద్రనాథ్, భాస్కర్రెడ్డి, ప్రభాకర్రెడ్డి, కొండయ్య తదితరులు ఉన్నారు. -
అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్య
గాలివీడు : మండలంలోని కొర్లకుంట పంచాయతీ పెద్దరెడ్డివారిపల్లెకు చెందిన నిర్జీ శంకరయ్య (38) అనే వ్యక్తి అప్పుల బాధ తట్టుకోలేక ఆత్మహత్య చేసుకున్నట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. వారి కథనం మేరకు.. మృతుడు రజక వృత్తితో పాటు వ్యవసాయం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించేవాడు. ఇతనికి నలుగురు ఆడపిల్లలు ఉన్నారు. వారిని పోషించడంలో అప్పులు ఎక్కువ చేశాడు. వాటిని తీర్చుకోలేక గురువారం రాత్రి పురుగుల మందు తాగాడు. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు వెంటనే కడప రిమ్స్కు తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శనివారం మృతి చెందాడు. కుటుంబ పెద్ద మృతి చెందడంతో వారి కుటుంబంలో విషాద ఛాయలు ఆలముకున్నాయి. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అనారోగ్యంతో వివాహిత.. రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని సూర్య నగర్లో నివాసముంటున్న విద్యుత్ శాఖ ఏఈ యోగానంద్ భార్య చిన్న రెడ్డెమ్మ (40) శనివారం ఉదయం ఇంట్లో ఫ్యానుకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఈమె గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతోంది. మానసిక స్థితి బాగాలేక ఆత్మహత్య చేసుకున్నట్లు తెలిసింది. పోలీసులు కేసు నమోదు చేశారు. రెండు టిప్పర్లు ఢీ బి.కొత్తకోట : మదనపల్లె వైపు నుంచి కదిరి వైపు వెళ్తున్న టిప్పర్ను మరో టిప్పర్ ఢీకొన్న ఘటన శనివారం రాత్రి మండలంలోని జాతీయ రహదారిపై పెద్దపల్లె వద్ద జరిగింది. వివరాలు ఇలా.. మదనపల్లె నుంచి రెండు టిప్పర్లు ఒకదాని వెంట ఒకటి వెళ్తున్నాయి. ముందు వెళ్తున్న టిప్పర్ డ్రైవర్ పెద్దపల్లె సమీపంలోకి రాగానే బ్రేక్ వేయడంతో వెనుక వస్తున్న టిప్పర్ ఢీకొంది. ఈ ప్రమాదంలో డ్రైవర్ అనురాగ్ యాదవ్ (50) టిప్పర్లోనే ఇరుక్కుపోవడంతో స్థానికులు బయటకు తీశారు. వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. బాధితుడు బీహార్లోని భేటియా జిల్లా శ్యాంపూర్ గ్రామస్తుడు. -
ప్రజలే నా బలం.. వైఎస్సార్సీపీ నా ఊపిరి
ప్రజలే నా బలం.. వైఎస్సార్సీపీ నా ఊపిరి అంటున్నారు ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి. ఉప ఎన్నికల్లో పోటీ చేస్తున్న ఆయనతో జరిపిన ఇంటర్వ్యూ వివరాలు. – రాజంపేటప్రశ్న : మూడోసారి జెడ్పీటీసీ అభ్యర్థిగా పోటీ చేస్తున్న మీకు ఈ ఎన్నికలు కలిసివస్తాయని భావిస్తున్నారా? జవాబు : ఒంటమిట్ట మండల ప్రజలు ఇరగంరెడ్డి కుటుంబానికి అండగా ఉంటూ వస్తున్నారు. రెండు సార్లు జెడ్పీటీసీ ఎన్నికల్లో ఆదరించారు. మూడోసారి ఆదరిస్తారనే ప్రగాఢ విశ్వాసం నాకు ఉంది. ప్రశ్న : తటస్థ ఓటర్లు మీకు అండగా నిలుస్తారనుకుంటున్నారా? జవాబు : ఈ ఎన్నికలో ప్రజలే నాకు బలం. వైఎస్సార్సీపీ నాకు ఊపిరి. దశాబ్ద కాలానికి పైగా మండలంలో ప్రజాసేవ చేస్తూ వస్తున్నా. రాజకీయాలకు నేను కొత్తకాదు. తటస్థ ఓటర్లు తప్పకుండా నావైపు మొగ్గు చూపుతారు. ప్రశ్న : చంద్రబాబు పాలన ప్రభావం ఈ ఎన్నికల్లో ఉంటుందంనుకుంటున్నారా? జవాబు : కచ్చితంగా ఉంటుంది. చంద్రబాబు పాలనపై వ్యతిరేకత కనిపిస్తోంది. జెడ్పీటీసీ ఎన్నికల నుంచి వ్యతిరేక ఓటు బహిర్గతమవుతోంది. అదే రాబోవు సార్వత్రిక ఎన్నికల్లో కూడా కొనసాగుతుంది. ప్రశ్న : టీడీపీ అధికారంలో ఉంది. ఈ ఉప ఎన్నికల్లో పోటీ చేయడం సాహిసించడమే కదా? జవాబు : వైఎస్సార్సీపీ ఽఅధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆశీస్సులు పుష్కలంగా ఉన్నాయి. అలాగే నాకు అండగా ఓటర్లు, కార్యకర్తలు, నాయకులు ఉన్నారు. మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, స్కిల్డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డితోపాటు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలతోపాటు పార్టీ పెద్దల మద్దతు, సహకారం సంపూర్ణంగా ఉంది. టీడీపీ అధికారంలో ఉన్నా వారికి ఒరిగేది ఏమీ లేదు. ప్రశ్న : ఈనెల 12న పోలింగ్ ప్రక్రియ సజావుగా సాగుతుందనే నమ్మకం ఉందా? జవాబు : పోలింగ్ ప్రక్రియను రాష్ట్ర ఎన్నికల సంఘం పకడ్బందీగా నిర్వహిస్తుందని భావిస్తున్నాము. అధికారపార్టీ దౌర్జన్యాలు చేస్తే ఓటర్లు నిశితంగా గమినించి, తగిన రీతిలో ఓటు అనే ఆయుధంతో బుద్ధి చెబుతారు. ప్రజాస్వామ్యబద్ధంగా పోలింగ్ జరగాలని వైఎస్సార్సీపీ కోరుకుంటోంది. ఓటర్లు ప్రశాంత వాతావరణంలో ఓటు వేసేలా చూడాల్సిన బాధ్యత ఎన్నికల సంఘానిదే. ఆ దిశగా జిల్లా రెవెన్యూ, పోలీసు యంత్రాంగం దృష్టి సారించాలి. ప్రశ్న : ఒక జెడ్పీటీసీ స్థానం కోసం పదుల సంఖ్యలో క్యాబినెట్ను ఒంటిమిట్టకు రప్పించారు. అంత అవసరమా? జవాబు : ఈ ఎన్నికలు చంద్రబాబును భయపెడుతున్నాయి. ఇక్కడ ఓడిపోతే తన పాలన ప్రజా వ్యతిరేక పాలన అనేది తేలిపోతుంది. అలా కాకుండా ఉండేందుకు చంద్రబాబు తన క్యాబినెట్ను ఒంటిమిట్టలో మకాం వేశారు. అప్రజాస్వామ్య పద్ధతిలో గెలిచేందుకు అన్ని ప్రయోగాలు చేస్తున్నట్లుగా సమాచారం వస్తోంది. అన్నింటిని అడ్డుకునేందుకు వైఎస్సార్సీపీ క్యాడర్ సిద్ధంగా వుంది. -
కడప– బద్వేలు మార్గంలో కూలిన వంతెన
సిద్దవటం : కడప– బద్వేలు మార్గంలోని అటవీ ప్రాంతంలో సాహెబ్ బావి రహదారికి సమీపంలో కిటికీల వంతెన శనివారం కూలిపోయంది. దీంతో వాహనాల రాకపోకలు స్తంభించి పోయాయి. ఈ రహదారి గుండా నెల్లూరు, బద్వేలు కలువాయి, పోరుమామిళ్ల తదితర ప్రాంతాలకు ప్రయాణికులు వెళుతుంటారు. 1983లో ఈ వంతెన నిర్మించారు. శనివారం అధిక లోడుతో వాహనాలు ప్రయాణించడంతో వంతెన కూలిపోయిందని ద్విచక్ర వాహనదారులు తెలిపారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ సిబ్బందిని సంఘటన స్థలానికి పంపి ప్రయాణికులు ఎవరినీ రోడ్డు దాటనీయకుండా చర్యలు చేపట్టారు. అధికారులు రెండు జేసీబీ యంత్రాలతో వంతెన పక్కనే అప్రోచ్ రోడ్డుకు చర్యలు చేపట్టారు. ఈ పనులను బద్వేలు ఆర్డీఓ చంద్రమోహన్ పరిశీలించారు. అనంతరం సాయంత్రానికి ఈ మార్గంలో వాహనాల రాకపోకలు యధావిధిగా కొనసాగాయి. -
ఎన్ని కుట్రలు చేసినా గెలుపు వైఎస్సార్సీపీదే
ఒంటిమిట్ట: తెలుగుదేశం పార్టీ అధికారాన్ని అడ్డుపెట్టుకుని ఎన్ని కుట్రలు చేసినా ఈ నెల 12న జరగబోయే జెడ్పీటీసీ ఉప ఎన్నికలో విజయం సాధించేది వైఎస్సార్సీపీయేనని వైఎస్సార్సీపీ కీలక నేతలు ధీమా వ్యక్తం చేశారు. .శనివారం మండల పరిధిలోని మంటపంపల్లి, రామచంద్రాపురం, అచ్చంపేట, ఎస్టీ కాలనీ, పెన్నపేరూరు గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి ప్రచారం నిర్వహించారు.ఇంటింటికి తిరిగి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి అభ్యర్థి ఇరగంరెడ్డి సు బ్బారెడ్డిని గెలిపించాలని ప్రజలను అభ్యర్థించారు. ● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట, పులివెందుల అభ్యర్థులను గెలిపించి, వైఎస్ జగన్ మోహన్రెడ్డికి బహుమతిగా అందిస్తామన్నారు. ● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు సాధ్యం కాని హామీలను ఇచ్చి, అధికారంలోకి వచ్చాక వాటిని అమలు చేయకుండా ప్రజలను నమ్మించి మోసం చేయడమే అని అన్నారు. ● వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ..పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికను ప్రభుత్వం ఉద్దేశ పూర్వకంగానే తీసుకొచ్చారని, కేవలం 8 నెలలు ఉన్న ఈ పదవికి ప్రభుత్వం ఇన్ని కోట్లు ఖర్చు చేయడం వెనుక ఉన్న ఆంతర్యం ఏమిటో తెలియడం లేదన్నారు. ● ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ..ఓటర్లను, నాయకులను భయభ్రాంతులకు గురిచేస్తూ ఉప ఎన్నికలో కూటమి ప్రభుత్వం గెలిచేందుకు సిద్ధమవుతోందని తెలిపారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ..ముస్లిం, మైనారిటీలకు మేలు చేసింది ఎవరంటే దివంగత నేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి, ఆయన తనయుడు వైఎస్ జగన్ అన్నారు. ఇంతటి మేలు చేసిన వారికి మద్దతుగా జెడ్పీటీసీ ఉప ఎన్నికలో సుబ్బారెడ్డి ని గెలిపించాలని కోరారు. ● రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ..కుప్పంలో గత జెడ్పీటీసీ ఎన్నికల్లో వంద శాతం వైఎస్సార్సీపీ కై వసం చేసుకోవడంతో సీఎం చంద్రబాబు అవమానాన్ని భరించలేక వైఎస్ జగన్ ఇలాక అయిన కడప జిల్లాలో వైఎస్సార్సీపీ ని ఓడించి జగన్ను అప్రతిష్టపాలు చేయాలనే ఉద్దేశంతో ఉప ఎన్నికను నిర్వహిస్తున్నారన్నారు. ● మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు మహిళలను నిలువునా మోసం చేశారన్నారు. తాను అధికారంలోకి వస్తే ఉచిత బస్సు, అడబిడ్డ నిధి వంటి పథకాలను అమలు చేస్తానని చెప్పారని, ఇప్పటిదాకా వాటి గురించి పట్టించుకోలేదన్నారు. ● కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి మాట్లాడుతూ..టీడీపీ ఎన్ని కుయుక్తులు పన్నినా జెడ్పీటీసీ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీని గెలుస్తుందని తెలిపారు. నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డి, మేడా మధుసూదన్ రెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్ కుమార్, రాష్ట్ర కడప అధికార ప్రతినిధి జైచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు జంగంరెడ్డి కిశోర్ దాస్, స్థానిక నాయకులు మంటపంపల్లి సర్పంచ్ బాదుల్లా, మల్లిరెడ్డి, జేసీబీ సుబ్బారెడ్డి, మనోహర్ రెడ్డి, పెన్నపేరూరు ఎంపీటీసీ ముమ్మడి నారాయణరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ కీలక నేతలు -
తెగిన పోగులు.. మారని బతుకులు
మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న నేతన్నల సమస్యలు గాలికి వదిలేశారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీల్లో భాగంగా మగ్గం కలిగిన ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ అందిస్తామన్నారు. తొమ్మిది నెలల క్రితం జీఓ జారీ చేసి ఏడాది తరువాత ఉచిత విద్యుత్ పథకం అమలు చేయనున్నట్లు ప్రకటించారు. అది కూడా పలు కొర్రీలు పెట్టారు. దీంతో చాలా మంది లబ్దిదారులు ఈ పథకంకు దూరంకానున్నారు. దీనిపై నేతన్నలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి సర్కారు చిన్నచూపు కూటమి సర్కారు చేనేతలను చిన్నచూపు చేస్తోంది. కార్మికులను ఎంతగానో ఆదుకున్న నేతన్న నేస్తం పథకానికి మంగళం పాడింది. ప్రభుత్వం నుంచి సాయం అందకపోవడంతో చేనేతలు పీకల్లోతు నష్టాల్లో కూరుకుపోయారు. దీంతో చాలా మంది కార్మికులు రేషం, వార్పు ధరలు తగ్గే వరకు మగ్గాలు నిర్వహించకుండా అపేస్తున్నారు. మరికొందరు రేయింబవళ్లు మగ్గం నేస్తూ తక్కువ కూలీతో బతుకు వెళ్లదీస్తున్నారు. ఇంతటి దయనీయమైన పరిస్థితులు ఎదుర్కొంటున్నారు. కుదేలైన చేనేత రంగం: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత చేనేత రంగం కుదేలైంది. పట్టుచీరల తయారీలో వినియోగించే ముడి పట్టుధర ఆకాశన్నంటుతోంది. గత ఏడాది అక్టోబర్లో కిలో రూ4,800 ఉండగా ప్రస్తుతం రూ.5,800 పలుకుతోంది. వార్పు ధరలు ఆరు నెలలుగా పెరుగుతుండటంతో తయారీదారులపై భారం పడుతోంది. ముడిపట్టు ధరకు అనుగుణంగా చీరల ధరలు పెరగకపోవడంతో తయారీదారులపై భారం పడుతోంది. జిల్లాలో చేనేతరంగంపై 18 వేల కుటుంబాలు ఆధారపడి జీవిస్తుండగా సుమారు 35 వేల మంది కార్మికులు, అనుబంధరంగాల వారు ఆధారపడి జీవిస్తున్నారు. అందులో మదనపల్లె(నీరుగట్టువారిపల్లె)లో 12 వేల కుటుంబాలు ఉన్నాయి. అలాగే కలకడ, తంబళ్లపల్లె, నిమ్మనపల్లె, వాల్మీకిపురం, కురబలకోట,బి.కొత్తకోట, పుల్లంపేట, చిన్నమండ్యం, గాలివీడు, సంబేపల్లి, రాజంపేట, వీరబల్లి మండలాల్లో చేనేతకుటుంబాలు ఉన్నాయి. నేతన్న నేస్తంతో పరిస్థితి మెరుగ్గా ముడిపట్టు ధరలు పెరగడం, తగ్గడం సహజంగా జరుగుతోంటుంది. ఈ ఒడిదుడుకులను తట్టుకునేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకాన్ని ప్రారంభించింది. ఈ పథకంలో భాగంగా అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఒక్కో చేనేత కుటుంబానికి ఏడాదికి రూ.24 వేలు ముడి పట్టురాయితీ ఒకేసారి బ్యాంకు ఖాతాలో జమ చేసి ఆదుకునేవారు. ఇలా ఐదేళ్ల పాటు క్రమం తప్పకుండా సాయం అందించారు. కరోనా వంటి కష్టకాలంలో రెండు నెలలు ముందుగానే నేతన్న నేస్తం నిధులు కార్మికుల ఖాతాల్లో జమ చేశారు. ఫలితంగా చేనేత కార్మికులు ప్రభుత్వం అందించిన సాయంతో చేనేత మగ్గాలను ఆధునీకరించుకుని గతంలో కంటే మెరుగైన డిజైన్లను వేసుకుని ఎక్కువ లాభం సంపాదించి అభివృద్ధి చెందారు. వైఎస్సార్సీపీ పాలనలో నేతన్న నేస్తం వివరాలు సంవత్సరం లబ్ధిదారులు నిధులు సబ్సిడీ అందజేయాలి మగ్గం కలిగిన ప్రతి కుటుంబానికి ఉచిత విద్యుత్ హామీ త్వరగా అమలు చేయాలి. ప్రస్తుతం చేనేత రంగం సంక్షోభంలో ఉంది. పట్టు పరిశ్రమలో వార్పు, జరీ కొనుగోలుకు సబ్బిడీ అందజేయాలి. –బాలచంద్ర, చేనేత కార్మికుడు, నీరుగట్టువారిపల్లె. మదనపల్లెహామీలు అమలు చేయాలి చేనేతకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలి. ఎన్నికల్లో చేనేత రంగానికి ఇచ్చిన 25 హామీలు ఇప్పటికీ అమలు చేయకపోవడం సిగ్గుచేటు. చేనేత వస్త్రాలపై జీఎస్టీ రద్దు చేయాలి. చేనేతలను అన్ని విధాల ఆదుకోవాలి. –నిస్సార్అహ్మద్, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్తఅర్హులకు ఉచిత విద్యుత్ పథకం అందించాలి కూటమి ప్రభుత్వం ప్రకటించిన ప్రతి చేనేత కుటుంబానికి ఉచిత విద్యుత్ పథకం అర్హులందరికి అందించాలి. మగ్గం ఉన్న వారితో పాటు చేనేత అనుబంధరంగాలైన వైడింగ్, రాట్నం చుట్టడం, రంగులు, అచ్చులు అద్దకం వంటిపై ఆధారపడి జీవిస్తున్నారు. వీరికి కూడా ఈ పథక అమలయ్యేలా చూడాలి. లబ్దిదారులను తగ్గించాలన్న సాకుతో కొర్రీలు పెడుతున్నారు. –శీలం రమేష్, వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు నేతన్నల డిమాండ్లు ఇవీ పట్టుచీరలకు మద్దతు ధర కరువు ఉచిత విద్యుత్ హామీలోనూ కోతలే ఆదుకోని కూటమి సర్కారు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలోనేతన్ననేస్తంతో ఊరట చేనేత కార్మికులకు నేతన్న నేస్తం పథకం అమలు చేయాలి. మగ్గం కలిగిన ప్రతి చేనేత కార్మికుడికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్ వర్తింపజేయాలి. చేనేత వస్త్ర ఉత్పత్తులకు జీఎస్టీ ఎత్తి వేయాలి. కాటన్, సిల్క్ జరీలపై 50 శాతం రాయితీ ఇవ్వాలి, చేనేత కార్మికులకు 45 సంవత్సరాలకే పింఛన్ మూంజూరు చేయాలి. చేనేత సహకార సంఘాలకు ఎన్నికలు నిర్వహించి సంఘాలను బలోపేతం చేయాలి. ఆత్మహత్మలు చేసుకున్న చేనేత కార్మికులకు రూ.7లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. 2021 5837 రూ.14,00,88,000 2022 6118 రూ.14,68,32,000 2023 6937 రూ.16,64,88,000 -
పదవులు ఎప్పుడిస్తారు.. బాబూ!
మదనపల్లె: పొరుగు నియోజకవర్గాల్లో తమ్ముళ్లు అధికారిక పదవులతో దర్జాగా తిరుగుతుంటే..పదవుల వడ్డింపు మాకెప్పుడంటూ తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గాలకు చెందిన తెలుగు తమ్ముళ్లు కళ్లు కాయలు కాచేలా ఎదురుచూస్తున్నారు. అధికారంలోకి వచ్చి ఏడాది దాటిపోయినా ఇంకా తమవరకు పదవులు దరిచేరకపోవడంపై నియోజకవర్గ నేతలు, పార్టీ అధిష్టానంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ మూడు నియోజకవర్గాల్లోని టీడీపీలో నెలకొన్న వర్గపోరు, స్థానిక నేతలపై అసంతృప్తి కారణంగా పదవుల భర్తీకి అధిష్టానం మొగ్గు చూపడం లేదని స్పష్టంగా తెలుస్తోంది. ముఖ్యంగా సింగిల్విండో మండల స్థాయి కమిటీల ఏర్పాటు, ఆ పదవులను ఆశిస్తున్న స్థానిక నాయకులు దీనిపై ఆశలు పెట్టుకున్నారు. మిగతా నియోజకవర్గాల్లో సింగిల్విండో త్రీమెన్ కమిటీలను భర్తీ చేస్తూ అందులో ఒకరిని చైర్మన్గా ఇద్దరిని సభ్యులుగా నియమిస్తున్నారు. ఇప్పటికే నియోజకవర్గ ఇన్చార్జీలు లేక ఎమ్మెల్యేల సిఫార్సు మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేస్తోంది. అయితే తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గాల్లో త్రీమెన్ కమిటీల ఏర్పాటు పూర్తిగా ఆపేశారు. ఒక్కో మండలంలో ముగ్గురు టీడీపీ నేతలకు పదవుల ఆవకాశం వస్తుంది. దీనికోసం పదవులు ఆశిస్తున్న స్థానిక నాయకులు నియోజకవర్గ నేతలు, ఎమ్మెల్యే చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. తంబళ్లపల్లెలో ఓడిపోయిన అభ్యర్థి జయచంద్రారెడ్డి ఉండగా మదనపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ ఉన్నారు. రాజంపేటలో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి సుగవాసి బాలసుబ్రమణ్యం ఆ పార్టీ వీడి వైఎస్సార్సీపీలో చేరారు. దీంతో అక్కడ ఇన్చార్జి లేకపోగా ఇప్పటికీ ఎవరికి పార్టీ బాధ్యతలను అధిష్టానం అప్పగించలేదు. రాజంపేటలో ప్రస్తుతం టీడీపీకి నాయకత్వలోపం ఉంది. వ్యతిరేకత..తమ్ముళ్లపై ప్రభావం నియోజకవర్గాల్లో టీడీపీ నేతలపై నెలకొన్న వ్యతిరేకత, వర్గపోరు వల్ల తమ్ముళ్లకు పదవులు దక్కుండా పోతున్నాయి. తంబళ్లపల్లెలో జయచంద్రారెడ్డిపై సీనియర్లు, పార్టీ శ్రేణుల్లో తీవ్ర వ్యతిరేకత ఉంది. బహిరంగంగా, సోషల్మీడియాలోనే కాక, ఈ మధ్య పార్టీ కేంద్రకారా్యాలయంలో జరిగిన ముఖ్యల సమావేశంలో జయచంద్రారెడ్డి సమక్షంలోనే వ్యతిరేకత వ్యక్తం చేశారు. అంతకుముందు హార్సిలీహిల్స్పై జరిగిన సమావేశంలో మంత్రి జనార్దన్రెడ్డి, జోన్–4 ఇన్చార్జ్ దీపక్రెడ్డి సమక్షంలో జయచంద్రారెడ్డి, వ్యతిరేక వర్గం మధ్య ముష్టిఘాతాలు, బాహాబాహికి తలపడ్డారు. దీంతో సమావేశం అర్ధంతరంగా ముగిసింది. జయచంద్రారెడ్డిని మార్చాలన్న ప్రతిపాదన, డిమాండ్ ఉన్నప్పటికీ ప్రత్యామ్నయ నేత లేకపోవడంతో అధిష్టానం నిశ్శబ్దంగా ఉంది. బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, పెద్దమండ్యం, తంబళ్లపల్లె, కురబలకోట మండలాల తమ్ముళ్లకు పదవులు ఎండమావిగా మారింది. మదనపల్లెలో టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి రావడంతో ఆయన్ను పార్టీ సీనియర్లు, మాజీ ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారు. దీంతో నియోజకవర్గం విషయంలో అధిష్టానం పెద్దగా ఆలోచించడం లేదని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ కారణంగానే అభివృద్ధి పనులకు అనుమతులు కూడా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఫలితంగా సింగిల్విండో పదవులపై ఆశలు పెట్టుకున్న నిమ్మనపల్లె, మదనపల్లె రూరల్, రామసముద్రం మండలాలకు చెందిన టీడీపీ తమ్ముళ్లు తమకు పదవులు ఎప్పుడిస్తారని ఎదురుచూస్తున్నారు. రాజంపేట నియోజకవర్గంలో భిన్న పరిస్థితులు కనిపిస్తున్నాయి. ఇన్చార్జి ఎవరో తేలకపోవడం, ఆ బాధ్యతను ఆశిస్తున్న నేతలు ఒకరికి మించి ఉండటంతో అక్కడ వర్గపోరు తీవ్రంగానే ఉంది. ఈ పరిస్థితి వల్ల తమకు సింగిల్విండో పదవులు దక్కడం లేదంటూ తమ్ముళ్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నియోజకవర్గంలోని మన్నూరు, నందలూరు, పెద్దివీడు,వీరబల్లి, మట్లి, సుండుపల్లె, తిమ్మసముద్రం, చిన్నఓరంపాడు సింగిల్విండోలకు త్రీమెన్ కమిటీల నియామకం ఇంతవరకు జరగకుండా పెండింగ్లో ఉన్నాయి. దీనితో అధిష్టానం పదవులను ఇచ్చేందుకు ఎప్పుడు కరుణిస్తుందా అని తమ్ముళ్లు ఎదురుచూస్తున్నారు. తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట నియోజకవర్గాల్లో తమ్ముళ్ల ఎదురుచూపు భర్తీ చేయని సింగిల్విండోత్రీమెన్ కమిటీలు జోన్–4 ఇన్చార్జితో చెప్పుకున్నా కుదరని సయోధ్య -
పింఛా ప్రాజెక్టుకు వరదనీరు
సుండుపల్లె: ఇటీవల కురిసిన వర్షాలతో పింఛా ప్రాజెక్టులోకి వరదనీరు చేరింది. ప్రాజెక్టు నీటి సామర్థ్యం వెయ్యి అడుగులు ఉండగా శనివారం ఉదయానికి 993.90 అడుగులు నీటి నిల్వ ఉందని జలవనరుల శాఖ ఏఈఈ నాగేంద్రనాయక్ తెలిపారు. ఎడమ కాలువ ద్వారా ఒక క్యూసెక్కు, కుడికాలువ ద్వారా 6 క్యూసెక్కుల నీరు వ్యవ సాయ పొలాలకు వెళ్తున్నట్లు ఆయన తెలిపారు. ప్రిసైడింగ్ అధికారులకు శిక్షణ కడప సెవెన్రోడ్స్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో ప్రిసైడింగ్ అధికారులు బ్యాలెట్ బాక్స్ వినియోగంపై పూర్తి స్థాయిలో అవగాహన పెంచుకోవాలని జెడ్పీ సీఈఓ, రిటర్నింగ్ అధికారి ఓబులమ్మ తెలిపారు. శనివారం కలెక్టరేట్లో ప్రిసైడింగ్ అధికారులకు, ఏపీఓలకు బ్యాలెట్ బాక్స్ ల వినియోగంపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. డీఆర్వో విశ్వేశ్వర నాయుడు, డివిజనల్ డెవలప్మెంట్ ఆఫీసర్స్ వి.విజయలక్ష్మి, రిసోర్స్ పర్సన్స్ పాల్గొన్నారు. నూలివీడులో వెలుగుచూసిన శాసనం కడప సెవెన్రోడ్స్: గాలివీడు మండలం నూలివీడులో అరుదైన శాసనం వెలుగు చూసినట్లు ఆర్కిలాజికల్ సర్వే ఆఫ్ ఇండియా డైరెక్టర్ (ఏపిగ్రఫీ) మునిరత్నంరెడ్డి శనివారం ఒక ప్రకట నలో తెలిపారు. ఒక పాఠశాల ఉపాధ్యాయుని సమాచారం మేరకు నూలివీడు గ్రామ సమీపాన ఉన్న ఓ పెద్ద రాతి గుండుకు ఈ శాసనం మలిచారని తెలిపారు. విజయనగర కాలం నాటి శాసనంగా గుర్తించామని పేర్కొన్నారు. శాసనాలలో ఉన్న చారిత్రక ప్రాధాన్యత దృష్ట్యా వాటిని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత ప్రజలపై ఉందన్నారు. ఈ అంశంపై ప్రజలకు అవగాహన కల్పిస్తామని వివరించారు. -
● పరువుకోసం పాకులాట
సాక్షి రాయచోటి: వైఎస్సార్జిల్లాలో జరుగుతున్న పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఆదివారంతో ప్రచారానికి తెరపడనుంది. ఇప్పటికే అభ్యర్థులతోపాటు మద్దతుదారుల ప్రచారంతో పల్లె ప్రాంతాలు హోరెత్తాయి. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థులకు మద్దతుగా ప్రధాన నాయకులు రంగంలో దిగి జోరుగా ప్రచారం నిర్వహించారు. మరోవైపు టీడీపీ ప్రచారం చేస్తూనే..ఇంకోవైపు దౌర్జన్యాలు, దాడులతో బెంబేలెత్తించారు. ఏదో ఒక రకంగా వైఎస్సార్ సీపీ నాయకులను అడ్డుకోవడంతోపాటు భయపెట్టడమే లక్ష్యంగా పావులు కదుపుతున్నారు. ఇప్పటికే పోలింగ్ బూత్ల విషయంలో పచ్చరాజకీయం తెరమీదికి రావడం, స్థానికంగా ఉన్నవారు మరో బూత్లోకి వెళ్లి ఓటు వేసే కొత్త సంప్రదాయానికి తెరతీయడంపై ప్రజాగ్రహం పెల్లుబుకుతోంది. సార్వత్రిక ఎన్నికలు కాకపోయినా కేవలం జెడ్పీటీసీ స్థానాల విషయంలోనే కూటమి సర్కార్ ప్రతిష్ఠాత్మకంగా తీసుకుని అనైతిక చర్యలకు పాల్పడుతోంది. ● జిల్లాలోని పులివెందులతోపాటు ఒంటిమిట్టలోనూ గెలువడం కష్టమని భావించి నేతలు ప్రలోభానికి తెర తీస్తున్నారు. కొన్నిచోట్ల గుంపగుత్తగా ఓట్లను కొనేందుకు కూడా సిద్ధమవుతున్నారు. భయపెట్టడం, బెదిరించడం, అవసరాన్ని బట్టి ఆర్థికంగా ఆశలు చూపి స్థానిక ప్రజలతోపాటు నాయకులను తమవైపు తిప్పుకోవడం, ఇతర అనేక హామీలతో ఎన్నికల ఎత్తుగడలతో ముందుకు వెళుతున్నారు. ఒంటిమిట్టతోపాటు పులివెందులలోనూ ఇప్పటికే ప్రచారంతోపాటు అవసరానికి మించి డబ్బులు ఖర్చు చేసిన కూటమి నేతలు రానున్న రెండు, మూడు రోజుల్లో భారీ ఎత్తున నగదు పంపిణీకి సిద్ధమవుతున్నారు. ముఖ్య నేతల ఆదేశాలతో కిందిస్థాయిలో ఓటర్లను ఏదో ఒకరకంగా తమవైపు తిప్పుకునేందుకు ఆగచాట్లు పడుతున్నారు. ఒంటిమిట్టలో ఏకంగా మంత్రులు మకాం వేసి పన్నాగం నడిపిస్తుండగా, పులివెందులలోనూ శనివారం మంత్రులతోపాటు ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఇతర కీలక నేతల ఆధ్వర్యంలో ప్రచారం కొనసాగించారు. ఎన్నికల నేపథ్యంలో పోలింగ్ రోజున పోలీసులపై కూడా పెద్ద స్థాయిలో ఒత్తిడి తీసుకు వచ్చి టీడీపీ ఆటలు సాగేలా కార్యచరణ ప్రణాళిక రూపొందిస్తున్నారు. మరోవైపు వైఎస్సార్సీపీ నేతలను ఇబ్బందులకు గురి చేయడంపై ప్రజాస్వామ్యవాదులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కడికి అక్కడ ప్రలోభాలకు తెర లేపుతున్న టీడీపీ అధికారంలో ఉండి ఓడిపోతే పరువు పోతుందన్న ఆందోళనలో కూటమి జిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలు ఎన్నో ఏళ్ల చరిత్రలో వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ గెలుచుకుంటూ వస్తోంది. ఈసారి కూడా బలమైన అభ్యర్థులే బరిలో నిలవడంతోపాటు మాజీ సీఎం, వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్జగన్మోహన్రెడ్డి సొంత నియోజకవర్గం కావడంతో గెలుపుపై పూర్తి ధీమాగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఉన్నాయి. ఒంటిమిట్టలోనూ ఇదే పరిస్థితి శ్రేణుల్లో కనిపిస్తోంది. అయితే అధికారంలో ఉన్న టీడీపీ ఓడిపోతే ఉన్న పరువు పోతుందని కూటమి శ్రేణు లు ఎంతకై నా తెగించేందుకు సిద్ధమవుతున్నాయి. ఒంటిమిట్టతోపాటు పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలకు సంబంధించి ఆదివారంతో ప్రచారానికి తెర పడనుంది. జులై 30 నుంచి ఆగస్టు 1వ తేది వరకు నామినేషన్లకు అవకాశం కల్పించగా, పులివెందులలో 11, ఒంటిమిట్టలో 11 మంది అభ్యర్థులు బరిలో నిలిచారు. ఇప్పటివరకు వైఎస్సార్ సీపీ నేతలు అన్ని గ్రామాల్లోనూ విస్తృతంగా ప్రచారం నిర్వహించారు. ఏది ఏమైనా వైఎస్సార్ సీపీ గెలుపుపై ధీమాతో ఉండగా, టీడీపీ నేతలు నిరాశ నిస్పృహాలతో కనిపిస్తుండం గమనార్హం. -
ఖరీఫ్.. ఖతం
● వ్యవసాయశాఖ చరిత్రలో దారుణమైన పరిస్థితి ● 62,178 హెక్టార్లకు సాగైంది కేవలం 5,655 హెక్టార్లలోనే ● ఇలాంటి పరిస్థితి ఎన్నడూ ఎరుగని రైతాంగం ● కూటమి ప్రభుత్వం వచ్చాకరెండో ఏడాది కుదేలైన వ్యవసాయం ఏటా తగ్గుతున్న ఖరీఫ్ సాగు సంవత్సరం సాగు కావాల్సింది బీళ్లు: (హెక్టార్లలో) (హెక్టార్లలో)2022 86,795 56,062 2023 82,589 61,297 2024 65,386 40,990 2025 62,178 56,523 మదనపల్లె: జిల్లా ఖరీఫ్ వ్యవసాయ చరిత్రలో ఎరుగని దారుణమైన పరిస్థితులు నెలకొన్నాయి. సాధారణంగా ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు నెలకొనడం, పంటల దిగుబడిపై ప్రభావం చూపడం జరిగేది. మొదటిసారి రైతులు పంటనే సాగు చేయలేని దయనీయమైన పరిస్థితి మొదటిసారి కనిపిస్తోంది. వెంటాడుతున్న వర్షాభావం, చినుకు కరువు కావడం, పంటలు పెట్టలేని పరిస్థితికి దారితీసినప్పటికి ఊహకందని విధంగా సాగు విస్తీర్ణంలో 90.08 శాతం భూములు బీళ్లుగా మారడాన్ని రైతాంగం జీర్ణించుకోలేకపోతోంది. ఇప్పటికే పెట్టిన 9.92 శాతం పంటలు కూడా చేతికందే పరిస్థితి లేదు. వ్యవసాయంపై పెట్టుబడు పెట్టి పంటలు సాగు చేసే రైతాంగం తీవ్రస్థాయిలో నష్టపోతోంది. ఇప్పటి పరిస్థితులు ఇంకెంత కాలం వెంటాడుతాయో అన్న ఆందోళన వారిలో వ్యక్తం అవుతోంది. దారుణమైన సాగు ప్రస్తుత ఖరీఫ్లో పంటల సాగు విషయంలో వ్యవసాయశాఖ జిల్లా వ్యాప్తంగా 62,178 హెక్టార్లలో 32 రకాల పంటలు సాగవుతాయని ప్రణాళిక అమలు చేసింది. నిర్ణయించిన సాగు విస్తీర్ణంలో అన్ని పంటలు సాగవ్వాలి. అయితే ఆగస్టు నాలుగో తేదీనాటి లెక్క ప్రకారం సాగైన పంటలు పది మాత్రమే. ఇందులోనూ అతి తక్కువ విస్తీర్ణం. సాగు ప్రణాళికలో ప్రధానమైన పంట వేరుశేనగ, రైతులు ఈ పంటపైనే అత్యధికంగా ఆధారపడి సాగు చేస్తారు. పంట పూర్తయ్యాక ధర పలుకుతుందని ఆశలు పెట్టుకుంటారు. ఇలాంటి పంట జిల్లాలో 40,639 హెక్టార్ల సాగు అవుతుందని భావించి దానికి తగ్గట్టుగా రాయితీ వేరుశనగ విత్తన కాయలను పంపీణీ చేశారు. అయితే ఈనెల నాలుగు నాటికి 2,870 హెక్టార్లలోనే విత్తనం పడింది. ఈ పంట కూడా చేతికందే పరిస్థితి కనిపించడం లేదు. వెంటాడుతున్న వర్షాభావం జిల్లాలో వర్షాభావ పరిస్థితులు వెంటాడుతున్నాయి. గత ఖరీఫ్లో వర్షాభావం కారణంగా సాగు చేసిన పంటలు చేతికందలేదు. పెట్టిన పెట్టుబడి కోల్పోయిన రైతాంగానికి కూటమి ప్రభుత్వం 19 మండలాల్లో కరువు ఉందని ప్రభుత్వం ప్రకటించింది. పంట నష్టాలపై నివేదికలు వెళ్లినా ఇప్పటిదాకా పైసా పరిహారం చెల్లించలేదు. ఇదే పరిస్థితి ప్రస్తుత ఖరీఫ్లో పునరావృతమైంది. జూన్ నుంచే వర్షాలు ఆశించిన మేరకు కురవలేదు. వాతావరణంలో మార్పులు కనిపించడంతో పంటలు బాగా పండుతాయని ఆశించిన రైతాంగానికి ఖరీఫ్ ప్రారంభంలోనే నిరాశ మిగిలింది. జూన్లో తీవ్ర వర్షపాత లోటు ఉండగా అది జూలై నెలలోనూ కొనసాగింది. దీంతో పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపింది. జూలైలో ఒక్క మండలంలోనూ అధిక వర్షం కురవలేదు. నాలుగు మండలాల్లో మాత్రమే సాధారణ వర్షపాతం నమోదవగా, 20 మండలాల్లో 20 నుంచి 59 శాతం లోటు వర్షపాతం నమోదైంది. ఆరు మండలాల్లో అతితక్కువ వర్షపాతం నమోదైంది. కూటమి ప్రభుత్వం వచ్చాకా వరుసగా రెండో ఏడాది దుర్భిక్ష పరిస్థితులు నెలకొన్నాయి. వ్యవసాయంరంగం కదేలైంది. వర్షపాత వివరాలు (మి.మీ) నెల కురవాల్సింది కురిసింది లోటు జూన్ 75.1 17.9 76.2 జూలై 90.5 73.7 18.2 ఆగస్టు 99.8 – 100.0 సాగు చేయలేక.. 15 ఎకరాల పోలం ఉన్నప్పటికి ఖరీఫ్లో పంటలు సాగుచేయలేక బీళ్లుగా వదిలేశాను. గత ఖరీఫ్లో సాగు చేసి పెట్టుబడి కూడా చేతికందలేదు. ప్రస్తుతం వర్షాలు లేవు.పంటలను సాగు చేసిన తిరిగి పెట్టుబడి దకకుతుందన్న నమ్మకం లేదు. –గోపాల్రెడ్డి, కురబలకోట ఆరెకరాలు బీడు ఆర్ఎన్తాండాలో ఆరు ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. నిరుడు ఈ భూమిలో వేరుశనగ సాగు చేస్తే పెట్టుబడి మొత్తం నష్టపోయాను. పైసా దక్కలేదు. ప్రస్తుతం వేరుశనగ సాగు చేసేందుకు పెట్టుబడి, విత్తనం సిద్ధం చేసుకున్నప్పటికి వర్షం లేదు. ఫలితంగా విత్తనకాయలను విక్రయించక తప్పదు. వర్షాభావంతో పంటల సాగుచేయలేక ఇబ్బంది పడుతున్నాం. –కష్ణా నాయక్, ఆర్ఎన్తాండ, తంబళ్లపల్లె -
‘హరిత’ వేదికగా ఎల్లో పాలిట్రిక్స్
● ఒంటిమిట్టకు కదులుతున్న కేబినెట్ ● హరిత హోటల్లో మంత్రుల మకాం ● కార్యకర్తలతో బహిరంగంగా సమావేశాలు రాజంపేట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నిక వైఎస్సార్సీపీకి అనుకూలమనే సంకేతాలతో టీడీపీ అధిష్టానం రాష్ట్ర కేబినెట్ను ఇక్కడికి పంపుతోంది . రోజుకొక మంత్రి వస్తున్నారు. ఒక్క జెడ్పీటీసీ స్థానం కోసం కేబినెట్ కదిలిరావడం చూసి ఓటర్లు ఆశ్చర్యచకితులవుతున్నారు. కులాలవారీగా మంత్రులను రంగంలోకి దింపుతున్నారు. శుక్రవారం రాష్ట్ర మంత్రులు మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, జనార్ధన్రెడ్డి, ఫరూఖ్లు ఒంటిమిట్టలో వివిధ ప్రాంతాల్లో వేర్వేరుగా ఓటర్లను ప్రసన్నం చేసుకున్నారు. పోలింగ్ నాటికి ఎంతమంది మంత్రులు దిగుతారో చెప్పలేని పరిస్థితి. తమవంతుగా జనసేన నుంచి కదిరి ఎమ్మెల్యే కందికుంట వెంకటప్రసాద్,ఎమ్మెల్సీ అనురాధలు ఉన్నారు. ● ఆదినుంచి వైఎస్సార్సీపీకి కంచుకోటగా ఉన్న ఒంటిమిట్టలో జెడ్పీటీసీ స్థానాన్ని కై వసం చేసుకోవాలని అధికారపార్టీ పావులు కదుపుతోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు మంత్రులను ఒంటిమిట్టకు పంపిస్తున్నారు. గ్రామాల్లో ఇప్పటికే డబ్బులు, పనులను ఎరవేస్తున్నారు. అయినప్పటికీ ఒంటిమిట్ట మండల వాసులు కూటమి అధికారబలానికి తలొగ్గడంలేదు. దీంతో టీడీపీ అధిష్టానం ఆందోళనకు గురవుతోంది. మరోవైపు వైఎస్సార్సీపీ ప్రచార పర్వంలో దూసుకుపోతోంది. ఏ గ్రామానికి వెళ్లినా జనం నుంచి అనుహ్య స్పందన లభిస్తోంది. ● ఒంటిమిట్టకు వస్తున్న మంత్రులకు మాత్రం ఎన్నికల కోడ్ వర్తించడంలేదు. అధికారాన్ని అడ్డు పెట్టుకొని ఈ ఎన్నికల్లో గెలుపోందాలనే ఉద్దేశంతో సర్వం ఒడ్డుతున్నారు. ఎన్నికల కోడ్ను అధికారులు పక్కాగా అమలు చేయాలి.అయితే ఆ పరిస్థితులు ఇక్కడ కనిపించడంలేదు. ఎన్నికల సంఘం మార్గదర్శకాలు ఒంటిమిట్టలో అమలుకావడంలేదన్న విమర్శలున్నాయి. ● ఒంటిమిట్ట రామాలయానికి సమీపంలో ఉన్న ఏపీ టూరిజంకు సంబంధించిన హరిత హోటల్ ఇప్పుడు జెడ్పీటీసీ ఉపఎన్నికల్లో ఎల్లో పాలిట్రిక్స్కు వేదికగా మారిందన్న విమర్శలు వెలువడ్డాయి. ఇక్కడి నుంచి మంత్రుల మంతనాలు, కార్యకర్తలు, నాయకుల భేటీలు జరిగిపోతున్నాయి.అయితే హరిత హోటల్ నిర్వాహకులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. యాత్రికులు వచ్చేందుకు వీలులేని పరిస్థితులు ఏర్పడ్డాయి.ఇది హరిత హోటలా..కూటమి కార్యాలయమా అన్న అనుమానాలు తలెత్తున్నాయి. ● ఈనెల 12న ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉపఎన్నిక పోలింగ్ జరగనున్న నేపథ్యంలో ఎన్నికల కోడ్ అమలు ఎక్కడా కనిపించడంలేదు. ఎన్నికల అధికారులు కూడా పత్తా లేకుండా పోయారనే విమర్శలున్నాయి. ఇప్పుడే ఇలా ఉంటే పోలింగ్ నాటికి పరిస్థితి ఏ విధంగా ఉంటుందోనని ఒంటిమిట్ట ప్రాంతీయులు భయాందోళనకు గురవుతున్నారు. -
సెలవురోజుల్లో పాఠశాలలు నిర్వహిస్తే చర్యలు
రాయచోటి టౌన్: జిల్లా వ్యాప్తంగా ఉన్న అన్ని యాజమాన్యాల పాఠశాలలు ప్రభుత్వం ప్రకటించిన సెలవు దినాలలో పాఠశాలలు నిర్వహించరాదని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అందుకు విరుద్ధంగా ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే వారిపై చర్యలు తప్పవని హెచ్చరించారు. ధర్మకర్తలమండలి నియామకానికి దరఖాస్తులు రాయచోటి టౌన్: జిల్లా వ్యాప్తంగా నాలుగు ఆలయాలకు సంబంధించి ధర్మకర్తల మండలి నియామకం కోసం దరఖాస్తు చేసుకోవాలని జిల్లా దేవదాయశాఖ అధికారి సి. విశ్వనాఽథ్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయం, మదనపల్లె పట్టణంలోని శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి ఆలయం, గుర్రంకొండ మండలం చెర్లోపల్లిలోని శ్రీ రెడ్డెమ్మ దేవస్థానం, తంబల్లపల్లెలోని మల్లయ్యకొండ మల్లికార్జునస్వామి ఆలయాల ధర్మకర్తల మండళ్ల నియామకానికి నోటిఫికేషన్ జారీ అయిందన్నారు. ఆసక్తి గలవారు ఈ నెల 26 లోగా దేవదాయశాఖ వారు ఇచ్చిన ప్రొఫార్మా ప్రకారం దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. జిల్లాస్థాయి హాకీ ఎంపికలు రాయచోటి జగదాంబసెంటర్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) మేజర్ ధ్యాన్చంద్ జయంతిని పురస్కరించుకొని జిల్లా స్థాయి హాకీ పోటీలకు ఎంపికలు శుక్రవారం జరిగినట్లు జిల్లా హాకీ సెక్రటరీ నాగేశ్వరరావు తెలిపారు.ఎంపికై న క్రీడాకారులు జోనల్ స్థాయిలో తిరుపతిలో జరిగే హాకీ టోర్నమెంట్లో పొల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా హాకీ ఫౌండర్ చంద్రశేఖర్, శాప్ కోచ్ చంద్రశేఖర్, రాజు స్కూల్ హాకీ కోచ్ నారాయణ, క్రీడాకారులు పాల్గొన్నారు. జిల్లాలో వర్షం రాయచోటి: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి నుంచి శుక్రవారం తెల్లవారుజాము వరకు విస్తారంగా వర్షాలు కురిశాయి. జిల్లాలోని కుంభంవారిపల్లి (కెవీపల్లి)లో 110.2 మిల్లీమీటర్లు, కోడూరులో 107.2 మిల్లీ మీటర్ల మేర వర్షపాతం నమోదైంది. పుల్లంపేట 5.4, గుర్రంకొండ 6.6, రామసముద్రం 7.2, కురబలకోట 10 మిల్లీ మీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. నందలూరు 96.4, చిన్నమండెం 92, కలికిరి 72.2, రాజంపేట 69.8, టి సుండుపల్లి 60.2, పెద్దమండెం 57.8, బి కొత్తకోట 55, ములకల చెరువు 42, నిమ్నపల్లి 41.4, కలకడ 40.2, వాల్మీకిపురం 38.4, పెద్దతిప్ప సముద్రం 37, సంబేపల్లి 36.4, తంబళ్లపల్లి 36.4, గాలివీడు 34.4, రామాపురం 33.4, పీలేరు 34.4, లక్కిరెడ్డిపల్లి 30., రాయ చోటి 27.2, వీరబల్లి 27. చిట్వేలి 24.8, ఓబులవారిపల్లి 24, మదనపల్లి 16.2, పెనగలూరులో 12.8 మిల్లీ మీటర్లు వంతున వర్షం కురిసింది. -
రాజకీయ సంప్రదాయాన్ని మంటగలిపారు
ఒంటిమిట్ట: ఒక పార్టీ నుంచి గెలిచిన వ్యక్తులు ఏదేని కారణం చేత చనిపోతే వారి స్థానంలో కుటుంబ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం రాజకీయ సంప్రదాయం. అలాంటి సంప్రదా యాన్ని పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నిక విషయానికి వచ్చే సరికి టీడీపీ మంటగలిపిందని వైఎస్సార్సీపీ నేతలు పేర్కొన్నారు. శుక్రవారం మండల పరిధిలోని చింతరాజుపల్లి, మృకుందాశ్రమం, శ్రీకోదండ రామనగర్ కాలనీ, ఒంటిమిట్ట ఎస్సీకాలనీల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి కడప మేయర్ సురేష్ బాబు, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి ప్రచారం చేశారు. సాయంత్రం అభ్యర్థితో కలిసి బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కడప పార్లమెంట్ పరిశీలకులు అజయ్ రెడ్డి సంఘీభావం తెలిపి, ఇంటింటి ప్రచారం నిర్వహించారు. ● బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ మాట్లాడుతూ.. రెండు సార్లు జెడ్పీటీసీ గా గెలిచిన ఇగరంరెడ్డి సుబ్బారెడ్డి ని ముచ్చటగా మూడోసారి గెలిపించాలని ఆమె కోరారు. ● కడప నగర మేయర్, రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు సురేష్బాబు మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తోంది. ఇంత వరకు వారు చెప్పిన ఒక్క హామీ కూడా నెరవేర్చలేదు. అలాంటి మోసపూరిత ప్రభుత్వానికి మన బుద్ది చెప్పాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి ఓటు వేసి అత్యధిక మెజారిటీతో గెలిపించాలని, రాబోయే సార్వత్రిక ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి వెంటే ఉన్నాం అని నిరూపిద్దామన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా మాట్లాడుతూ.. కూటమి ప్రభుత్వం రెడ్ బుక్ రాజ్యాన్ని నడిపిస్తోందన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చడం లేదన్నారు. ఈ ప్రభుత్వాని బద్ధి చెప్పాలంటే ఈ ఉప ఎన్నికలో ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి సుబ్బారెడ్డిని గెలిపించాలని కోరారు. ● ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ...ఈ ఉప ఎన్నికలో ఎవరూ భయపడాల్సిన అవసరం లేదని, అవసరమైతే ప్రాణాలకు తెగించి మన పార్టీ ఉనికిని కాపాడుకోవాలని తెలిపారు. ● ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ..ఆకేపాటి అమరనాథ్రెడ్డి రాజంపేట ఎమ్మెల్యే అయినందున జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేశారు. దీంతో ఇక్కడ జెడ్పీటీసీ ఉప ఎన్నిక వచ్చిందన్నారు. ఈ ఎన్నికలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ● రాష్ట్ర అధికార ప్రతినిధి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ.. వైఎస్సార్ కంచు కోట అయిన కడప జిల్లాలోని రెండు జెడ్పీటీసీ స్థానాలు గెలుచుకోవడానికి టీడీపీ సామవేద దండోపాయాలను ఉపయోగిస్తున్నారని, ఎవరెన్ని పన్నాగాలు పన్నినా ఒంటిమిట్ట, పులివెందుల మండలాలలో వైఎస్సార్సీపీ జెండా పాతడం ఖాయమని ఆయన తెలిపారు. ● మాజీ జెడ్పీ చైర్మన్, వైఎస్సార్సీపీ నాయకులు సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడుతూ.. ప్రజా సంక్షేమం కోరే నాయకుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సీఎం అయితే రాష్ట్ర సుభిక్షంగా ఉంటుందన్నారు. ● రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి మాట్లాడుతూ... పోలీసులు రాజ్యాంగాన్ని గౌరవించి, నిష్పక్షపాతంగా ఈ ఉప ఎన్నికలను నిర్వహించాలని కోరారు. ● కడప పార్లెంట్ పరిశీలకులు అజయ్రెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట మండలంలో ఎవ్వరి నోట విన్నా కూటమి ప్రభుత్వం చేసిన మోసాలే చెబుతున్నారన్నారు. ఈసారి మాత్రం తప్పక వైఎస్ జగన్మోహన్రెడ్డిని గెలిపించుకుంటా మని తెలిపారు. ● వైఎస్సార్సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి మాట్లాడుతూ.. గతంలో రెండు సార్లు తనను జెడ్పీటీసీగా గెలిపించారని, ఈసారి కూడా గెలిపించాలని, సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. కార్యక్రమంలో రాష్ట్ర విద్యార్థి విభాగం ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్యరెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, బీసీ సెల్ అధ్యక్షుడు రాజమోహన్ నాయుడు, మండల ప్రచార విభాగ అధ్యక్షుడు రాజశేఖర్ రాయల్, రవిరెడ్డి, రమేష్ తదితరులు పాల్గొన్నారు. ఒంటిమిట్ట ఉప ఎన్నిక ప్రచారంలో వైఎస్సార్సీపీ నేతలు -
పదేళ్లుగా సబ్ కలెక్టరేట్లో పాగా..
రాజంపేట : రెవిన్యూ శాఖ గుండె లాంటింది సబ్ కలెక్టరేట్. ఈ శాఖలో ఎన్నో కీలక వ్యవహారాలు సాగుతుంటాయి. అయితే ఇద్దరు వ్యక్తులు కార్యాలయాన్ని తమ చేతుల్లోకి తీసుకుని నడిపిస్తున్నారే ఆరోపణలున్నాయి. పదేళ్ల నుంచి డిప్యూటేషన్ పేరుతో ఇక్కడే పాగా వేశారంటే.. ఏ స్ధాయిలో వారి అధికారాలు చెల్లుబాటు అవుతున్నాయో తెలుస్తోంది. అధికారులు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉండిపోతున్నారు. రెవెన్యూ శాఖలో భూములకు సంబంధించిన కీలక వ్యవహారాల ఫైల్కు వీరి ఆమోదం లభించాలి. అప్పుడే రైతుల పనులు సక్రమంగా జరిగిపోతాయి. అన్ని వ్యవహారాలు ఆ ఇద్దరితోనే నేరుగా జరుగుతున్నాయని బహిరంగంగా చర్చ సాగుతోంది. పదేళ్లుగా ఒకే చోట... రెవెన్యూ పరంగా అసైన్మెంట్, వెబ్ల్యాండ్ కరెక్షన్, 22ఏ,(డాట్ల్యాండ్), ల్యాండ్ అసైనేషన్, అల్ట్రీనేషన్తోపాటు భూములకు సంబంధించి వివిధ పనులు చాలా కీలకం. పదేళ్ల నుంచి కీలకమైన ఆ విభాగాలకే ఆ ఇద్దరు ఉద్యోగులు పరిమితమయ్యారు. ఇతర మండల రెవెన్యూ కార్యాలయాల్లో పనిచేయాల్సి ఉన్నా.. మళ్లీ డిఫ్యుటేషన్పై సబ్ కలెక్టర్కు వచ్చి కొనసాగుతున్నారని ఉద్యోగులు చెబుతున్నారు. రెవెన్యూపరంగా అత్యధిక నాలెడ్జ్ కలిగిన అధికారులు చాలామంది ఉన్నా.. వీరితో ఎందుకు పనిచేయించుకుంటున్నారో తెలియడం లేదని కొందరు ప్రశ్నిస్తున్నారు. వీరికి ఇక్కడ పనిచేసే అవకాశం కల్పించిన ఆ ఉన్నతాధికారి ఇపుడు పనిచేయడం లేదు. సబ్ కలెక్టర్, ఆర్డీవోలు మారినా.. వీరు మాత్రం ఫెవీకాల్ వీరుల్లా సబ్ కలెక్టరేట్లోనే ఉండిపోతున్నారు. కొన్నేళ్లుగా ఇలాంటి భూపరమైన కీలక విభాగాలు ఇద్దరి చేతిలో పెట్టుకున్నారంటే సబ్ కలెక్టరేట్లో రెవెన్యూ పరిపాలన పరిస్థితి ఏవిధంగా ఉందో ఇటే అవగతమవుతోంది. పట్టించుకోని సబ్ కలెక్టర్, ఆర్డీవోలు సబ్ కలెక్టరేట్లో ఇద్దరు ఉద్యోగులు కీలకమైన ల్యాండ్ వింగ్ రెవెన్యూ విభాగంలో డిప్యూటేషన్ సాకుతో ఏళ్ల తరబడి కొనసాగుతున్నారంటే కారణాలు అనేకమే ఉన్నాయనే విమర్శలున్నాయి. కొత్తగా వచ్చిన సబ్కలెక్టర్ గానీ, ఆర్డీవోలు గాని వీరి గురించి ఆలోచన చేయడం లేదు. రైతులు ఆ ఇద్దరి పైస్థాఽయి ఉన్నతాధికారులను కలవకుండా నేరుగా వీరి వద్దకు వచ్చి పని చక్కబెట్టుకొనిపోతుంటారనే ఆరోపణలున్నాయి. ఏళ్ల తరబడి ఒకే విభాగాన్ని అంటిపెట్టుకున్న వీరిని నూతనంగా నియమితులైన సబ్ కలెక్టర్ భావనతోనైనా ప్రక్షాళన జరుతుందా అని ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. ఏయే విభాగాలు ఎవరెవరు చూస్తున్నారనే అంశంపై ఇప్పటికే ఆమె దృష్టి సారించారు. భూపరమైన విభాగాలు తమ ఆధీనంలో ఉంచుకొని విధులు నిర్వహిస్తున్న వారి వ్యవహారంపై ఆమె ఏ విధంగా చర్యలు తీసుకుంటుందో వేచిచూడాల్సిందే. విధులు వేరే చోట.. కీలకమైన విభాగాలు వారి చేతిలోనే పట్టించుకోని సబ్ కలెక్టర్లు, ఆర్డీవోలు -
మైలవరం జలాశయానికి నీరు విడుదల
కొండాపురం : గండికోట జలాశయం గేట్లు ఎత్తి మైలవరం జలాశయానికి ఐదువేల క్యూసెక్కుల నీటిని శుక్రవారం విడుదల చేసినట్లు జీఎన్ఎస్ఎస్ ఈఈ ఉమామహేశ్వర్లు తెలిపారు. ఆయన మాట్లాడుతూ ఆవుకు రిజర్వాయర్ నుంచి జీఎన్ఎస్ఎస్ కాలువ ద్వారా 13 వేల క్యూసెక్కుల నీటి ప్రవాహం ప్రాజెక్టులోకి కొనసాగుతున్నట్లు తెలిపారు. జలాశయం పూర్తి సామర్థ్యం 26.85 టీఎంసీలు కాగా, ప్రస్తుతం జలాశయంలో 16 టీఎంసీల నిల్వలు ఉన్నాయని తెలిపారు. శెట్టివారిపల్లె మొయిన్ రెగ్యులేటర్ నుంచి గాలేరి నగరి సృజల స్రవంతి కాల్వ ద్వారా వామికొండ రిజర్వాయర్కు 300 క్యూసెక్కుల నీరు తరలిస్తున్నామన్నారు. గండికోట ఎత్తిపోతలపథకం ద్వారా నాలుగు మోటర్లతో నీటిని చిత్రావతి బ్యాలెన్స్ రిజర్వాయర్కు పంపింగ్ చేస్తున్నట్లు ఆయన తెలిపారు. -
రామయ్య సన్నిధిలో వరలక్ష్మీ వ్రతం
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామాలయంలో వరలక్ష్మీ వ్రతం శుక్రవారం వైభవంగా నిర్వహించారు. అర్చకులు పెద్ద సంఖ్యలో హాజరైన మహిళలతో పవన్కుమార్, మనోజ్కుమార్లు శాస్త్రోక్తంగా వ్రతాన్ని చేయించారు. అనంతరం వారు మాట్లాడుతూ వరలక్ష్మీ వ్రతం ఆచరిస్తే ధన, ధాన్య, ఐశ్వర్యాలు కలుగుతాయని శాస్త్రాలు చెబుతున్నాయన్నారు. అనంతరం టీటీడీ, హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో శుక్రవారం సౌభాగ్యం కార్యక్రమాన్ని నిర్వహించారు. మహిళలకు గాజులు, పసుపు, కుంకుమ, అక్షింతలు, పుస్తక ప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ ఈఓ ప్రశాంతి, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, సూపరింటెండెంట్ హనుమంతయ్య, భక్తులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ పెట్రోల్ బంకులో గోల్మాల్
రాజంపేట : రాజంపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు ఆవరణలోని పెట్రోల్ బంకులో భారీ గోల్మాల్ వెలుగుచూసింది. కొందరు సిబ్బంది తమ వ్యక్తిగత ఫోన్పే క్యూ ఆర్ కోడ్లు పెట్టుకుని నగదు మళ్లించుకున్నట్లు సమాచారం. ఈ విషయంపై అధికారులు కాస్త పోలీసులకు ఫిర్యాదు చేయడంలో అసలు విషయం వెలుగు చూసింది. దీనిపై బస్టాండు పరిసర ప్రాంతాల్లో విచారించగా కొద్ది రోజులుగా ఈ పెట్రోలు బంకులో ఫోన్పేను నిషేధించినట్లు అక్రమాలే కారణమని స్థానికులు తెలిపారు. గత డిసెంబరు నుంచి ఇప్పటి వరకూ బంకుకు ఫోన్పే ద్వారా జమ చేసిన మొత్తం రూ.40 లక్షలు కొందరి వ్యక్తిగత ఖాతాలో జమైనట్లు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అధికారులు ఈ వ్యవహారంపై పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు సమాచారం.క్యూఆర్ కోడ్తో రూ.40 లక్షలు స్వాహా -
జిల్లా స్థాయి బాస్కెట్బాల్ జట్టు ఎంపిక
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాల ఆవరణలో జిల్లా స్థాయి అండర్–22 విభాగంలో పురుషులు, మహిళల జట్లను శుక్రవారం ఎంపిక చేశారు. బాస్కెట్బాల్ క్రీడా జిల్లా ప్రెసిడెంట్ చింతల శ్రీధర్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగిన ఈ ఎంపికలకు వివిధ ప్రాంతాల నుంచి క్రీడా కారులు హాజరయ్యారు. పురుషుల విభాగంలో మదనపల్లికి చెందిన పి.చైతన్య, వి.దీపేష్, ఎ.మౌనీష్, ఎం.వెంకటసాయి, ఎంఎస్ నిహార్, వాల్మీకిపురానికి చెందిన కె.కార్తికేయ, ఎస్.రెడ్డిశ్రీకర్, ఎస్.క్రిష్ణ కౌశిక్, ఎం.తరుణ్కుమార్, టి.అరవింద్, ఎస్.నియాజ్, తరిగొండకు చెందిన హేమంత్ ఎంపికయ్యారు. మహిళల విభాగంలో మదనపల్లికి చెందిన కె.హిమశ్రీ, కె.కౌశల్య, సీటీఎంకు చెందిన హరిశ్రిత, రేణుక, వాల్మీకిపురానికి చెందిన ఇ.హిమజ, తరిగొండకు చెందిన జి.గాయత్రి, ఎల్.హర్షిత, సి.స్వాతి, ఎం.మమత, జి.గాయత్రి, రామాపురానికి చెందిన నిహారిక, గుర్రంకొండకు చెందిన భవ్యశ్రీ, సబ్స్టిట్యూట్ ప్లేయర్లుగా మరో నలుగురిని ఎంపిక చేశారు. ఈ కార్యక్రమంలో బాస్కెట్ బాల్ క్రీడా జిల్లా కార్యదర్శి రవి, ఎంఈఒ సుబ్రహ్మణ్యం, పాఠశాల హెచ్ఎం వసుంధర, ఎస్ఐ చంద్రశేఖర్, పీడీలు కిరణ్, రెడ్డివరప్రసాద్, సీనియర్ బాస్కెట్బాల్ క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. -
గండి ఆంజన్న దర్శనానికి ఏర్పాట్లు
చక్రాయపేట : శ్రావణమాసంలో మూడో శనివారం రోజున భారీ సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉండడంతో ప్రత్యేక ఏర్పాట్లు చేసినట్లు ఆలయ సహా య కమిషనర్ వెంకట సుబ్బయ్య, చైర్మన్ కావలికృష్ణతేజ తెలిపారు. అధిక సంఖ్యలో తరలివచ్చే భక్తుల కోసం లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేశామని తెలిపారు. రాత్రి బసచేసే వారి కాలక్షేపానికి సాంస్కృతిక కార్యక్రమాలు ఉంటాయని చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకూ దాతలు అన్నదానం చేస్తారన్నారు. వీఐపీ పాసులు పొందినవారు నిర్ణయించిన సమయంలో వస్తేనే అనుమతిస్తామని తెలిపారు. ఉదయం ఐదు గంటల నుంచి 8 గంటల వరకు, సాయంత్రం 5 గంటల నుంచి 8 గంటల లోపు వచ్చి దర్శనం చేసుకోవాలన్నారు. గత శనివారం జరిగిన తప్పిదాలను దృష్టిలో పెట్టుకుని మరింత జాగ్రత్తలు తీసుకుంటున్నట్లు తెలిపారు. ఆలయ ప్రధాన, ఉప ప్రధాన ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు మాట్లాడుతూ ఉదయం మూడు గంటలకు సుప్రభాతసేవ, ఉత్సవమూర్తులకు అభిషేకం(ఏకాంతం), అలంకరణ, ఆరాధన, ఐదు గంటలకు మహామంగళ హారతి నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన భాగ్యం కల్పిస్తామని తెలిపారు. స్వామి సన్నిధిలో తిరుపతి జిల్లా జడ్జి గండి వీరాంజనేయ స్వామిని శుక్రవారం సాయంత్రం తిరుపతి జిల్లా జడ్జి రామచంద్రుడు కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. ఆలయ అర్చకులు ఆయనచే ప్రత్యేక పూజలు చేయించి తీర్థప్రసాదాలు అందజేశారు. ఆయన వెంట ఆర్కే వ్యాలీ సీఐ ఉలసయ్య, ఎస్సై రంగనాయకులు పాల్గొన్నారు. సీఐ మాట్లాడుతూ మూడో శనివారం కావడంతో పులివెందుల డీఎస్పీ మురళి ఆధ్వర్యంలో ఐదుగురు సీఐలు, 15 మంది ఎస్సైలు, 200 మంది పోలీసులు, హోం గార్డులు, మహిళా పోలీసులు బందోబస్తులో పాల్గొంటారని తెలిపారు. వాహనాలను గండిలోకి అనుమతించమని వారు తెలిపారు. -
అక్రమ మద్యం పట్టివేత
ఒంటిమిట్ట : మండలంలోని కొండమాచుపల్లి–బాపనపల్లి మార్గంలో మదు శ్రీనివాసరెడ్డి(46)ఎనిమిది మద్యం బాటిళ్లను తీసుకెళ్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. అతడిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. గాలివాన బీభత్సం కలకడ : కలకడ మండలంలో గురువారం రాత్రి గాలివాన బీభత్సం సృష్టించింది. కలకడ, కె.బాటవారిపల్లె, బాలయ్యగారిపల్లెలో చెట్లు నేలకూలాయి. రేకులషెడ్లు కూలిపోయాయి. విద్యుత్ లైన్లు దెబ్బతిన్నాయి. దీంతో గురువారం రాత్రి 10 గంటల నుంచి శుక్రవారం సాయంతంర వరకు విద్యుత్ సరఫరా లేకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. విద్యుత్ సరఫరా పునరుద్ధరించేందుకు చర్యలు చేపట్టారు. గాలివాన వల్ల మండలవ్యాప్తంగా టమాట పంటలు దెబ్బతిన్నాయి. ఉత్సాహంగా క్రీడల పోటీలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : 2025 జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకొని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో శుక్రవారం క్రీడల పోటీలు ఉత్సాహంగా సాగాయి. నగరంలోని క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ, వెయిట్ లిప్టింగ్ పోటీలలో అధిక సంఖ్యలో క్రీడాకారులు పాల్గొన్నారు, డీఎస్ఎ క్రీడా మైదానంలో బాస్కెట్బాల్, వాలీబాల్, బాక్సింగ్, ఖోఖో, కబడ్డీ పోటీలను నిర్వహించగా క్రీడాకారులు ప్రతిభ చూపారు. ప్రతిభ చూపిన వారిని జట్టుగా ఏర్పాటుచేస్తామని జిల్లా క్రీడల అభివృద్ది అధికారి కె. జగన్నాథరెడ్డి తెలిపారు. ఎంపికై న జట్టు ఈ నెల 11న తిరుపతిలో నిర్వహించే జోనల్ స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. గాలిబండపై బైకర్లకు చెక్ బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్లోని గాలిబండపై బైకర్ల హంగామాకు చెక్ పడింది. వివిధ ప్రాంతాల నుంచి వచ్చే బైకర్లు గాలిబండపై విన్యాసాలు చేస్తూ కిందకు వెళ్తుంటారు. ఇది చాలా ప్రమాదకమైనది కావడంతో పోలీసులు హెచ్చరిస్తున్నారు. అయినా హంగామా ఆగకపోవడంతో మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఎస్పీ మహేంద్ర గాలిబండను పరిశీలించారు. బైక్లు వెళ్లే మార్గంలో ఇనుప కమ్మీలతో ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. సీఐ జీవన్ గంగనాధ్బాబు శుక్రవారం దీనిని పరిశీలించి బందోబస్తుగా సిబ్బందిని ఏర్పాటుచేశారు. దీంతో ఇకపై బైకర్లు గాలిబండపైకి వెళ్లకుండా చెక్ పడింది. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై మండలంలోని నారాయణరెడ్డిపల్లె గ్రామం వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గరు వ్యక్తులు గాయపడ్డారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని 104 వాహనంలో డేటా ఆపరేటర్గా పనిచేస్తున్న బాలక్రిష్ణంరాజు నారాయరెడ్డిపల్లె సచివాలయం నుంచి ద్విచక్ర వాహనంలో రాయచోటికి వెళ్తున్నారు. తిరుపతి నుంచి రాయచోటికి మరో వాహనంలో నాగార్జు న, బిందు దంపతులు వస్తున్నారు. రెండు వాహనాలు అదుపు తప్పడంతో ముగ్గురు కిందపడి గాయాలపాలయ్యారు. 108 సహయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వేర్వేరు ప్రమాదాల్లో మరో ముగ్గురికి మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. కపలకోట మండలం అంగళ్లకు చెందిన అక్బర్సాబ్ కుమారుడు ముస్తఫా(48) తన భార్యతో కలిసి ద్విచక్ర వాహనంలో కర్ణాటకలోని మురుగుముళ్ల దర్గాకు బయలుదేరాడు. మార్గమధ్యంలోని రాయల్పాడు సమీపంలో వాహనం అదుపు తప్పి రోడ్డు డివైడర్ను ఢీకొనడంతో కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. అదే విధంగా పట్టణంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన మురారి(20), అతని స్నేహితుడు పురుషోత్తం(18) కలిసి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. పల్లె క్లాసు వద్ద మరో ద్విచక్ర వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. యువకుడి బొటనవేలు కొరికేసిన కానిస్టేబుల్ వీరబల్లి : భూ తగాదా విషయంలో యువకుడి బొటనవేలు కానిస్టేబుల్ కొరికేసిన సంఘటన శుక్రవారం చోటుచేసుకుంది. పోలీసులు, బాధితుడి వివరాల మేరకు.. వీరబల్లి మండలం ఈడిగపల్లిలో నివాసముంటున్న వీరబల్లి దయానందం కుమారుడు వేంకటేశ్వర్లు ప్రస్తుతం విజయవాడలో ఏఆర్ కానిస్టేబుల్గా పనిచేస్తున్నారు. అదే గ్రామానికి చెందిన వీరబల్లి శివకుమార్ కుమారుడు వినోద్ కుమార్తో వీరికి భూమి తగాదా ఉంది. శుక్రవారం ఈ విషయపై ఇరు వర్గాల మధ్య ఘర్షణ జరిగింది. ఈ నేపథ్యంలో మాటామాటా పెరగడంతో ఆగ్రహంతో వినోద్కుమార్ బొటనవేలును వేంకటేశ్వర్లు కొరికేయగా, అతడి కుమారుడు వినయ్ వినోద్ కుమార్ కారును పగులగొట్టారు. ఈ సంఘటనపై వినోద్కుమార్ స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. కానిస్టేబుల్, అతడి కుమారుడిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు. -
బుద్దునికొండ కథ సుఖాంతం
మదనపల్లె : నెలరోజులుగా మదనపల్లెలో ఉద్రిక్త పరిస్థితులకు కారణమైన బుద్దునికొండపై తథాగతుని తల వేరుచేసిన ఘటనపై వివాదం ముగిసింది. డీఎస్పీ మహేంద్ర పోలీసులు, సంఘాలతో సమావేశమై సమన్వయం నెలకొల్పడంతో ఉద్రిక్త పరిస్థితులకు తెరపడింది. గత జూలై 2వ తేదీన మదనపల్లె సమీపంలోని బుద్దునికొండపై భారతీయ అంబేడ్కర్ సేన ప్రతిష్టించిన బుద్ధ విగ్రహం తల వేరుచేసి చేతుల్లో ఉంచిన ఘటన వెలుగుచూసింది. దీనికి కారకులైన వారిపై చర్యలు తీసుకోవాలని బాస్ వ్యవస్థాపక అధ్యక్షుడు శివప్రసాద్ డిమాండ్ చేయగా, పోలీసులు వీఆర్ఓ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అనంతరం నిరాహారదీక్ష చేయడం, పోలీసులు భగ్నం ప్రయత్నం, తర్వాత అరగుండుతో నిరసనలు..ఈ వ్యవహరంపై బాస్ శ్రేణులపై మూడు కేసులు నమోదు చేయడంతో పరిస్థితులు ఉద్రిక్తతకు దారితీశాయి. ఈ పరిస్థితుల్లో సామాజిక మాధ్యమాల్లో విమర్శలు తీవ్రం చేసిన బాస్ నేతలు..ఈ నెల 9న మదనపల్లెలో నిరసనకు పిలుపునిచ్చారు. ఇద్దరు మైనర్ పిల్లలు కారణమని ఎస్పీ ప్రకటించడం, దీన్ని బాస్ వ్యతిరేకించడం జరిగిపోయింది. డీఎస్పీ మహేంద్ర, సీఐలు సత్యనారాయణ, రామచంద్ర, వీకేసీ పార్టీ ఏపీ, తెలంగాణ ఇన్చార్జి బాలసింగం, బాస్ ప్రతినిధులు కేవి.రమణ, గణపతి, శ్రీనివాసులు, ముత్యాలమోహన్, దొరస్వామి తదితరులతో గురువారం చర్చలు జరిపారు. ఘటన దర్యాప్తు విషయంలో పరస్పరం సహకరించుకోవాలని డీఎస్పీ మహేంద్ర, సంఘాల నేతలు నిర్ణయించారు. కేసులపై న్యాయపరంగా ముందుకు తీసుకెళ్తామని డీఎస్పీ సూచించగా ఈ విషయంలో బాస్, వీకేసీలు పోలీసులకు సహకరిస్తారని స్పష్టం చేశారు. చలో మదనపల్లె నిరసన కార్యక్రమాన్ని రద్దు చేసుకుంటున్నట్లు వారు ప్రకటించారు. ఈ నెల 23న వీకేసీ పార్టీ జాతీయ అధ్యక్షుడు తిమావళవన్ మదనపల్లెకు వస్తున్నారని, బుద్దునికొండ సందర్శించి అదే రోజు నూతన బుద్దుని విగ్రహ ప్రతిష్ట చేస్తారని బాస్ నేతలు తెలిపారు. దీంతో ఇప్పటిదాకా నెలకొన్న ప్రతిష్టంభన తొలగిపోయింది. డీఎస్పీ సమక్షంలో వీకేసీ, బాస్ నేతలతో చర్చలు రేపటి చలో మదనపల్లె నిరసన రద్దు -
రైతులను బెదిరించి.. డబ్బు డిమాండ్
మదనపల్లె రూరల్ : వ్యవసాయ అవసరాలకోసం ఎద్దులు, ఆవు కొనుగోలు చేసి తమిళనాడుకు తీసుకువెళ్తున్న రైతుల వాహనాన్ని అడ్డగించి డబ్బు డిమాండ్ చేసిన ఇద్దరిని అరెస్టు చేసినట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో విలేకరులకు వివరాలను ఆయన వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం తిరువణ్ణామలై జిల్లా ఆరణి తాలూకా మయూరు గ్రామానికి చెందిన రైతులు బాలాజీ, కమలకన్నన్ అనంతపురం జిల్లా గోరంట్ల పశువుల సంతలో వ్యవసాయ అవసరాల కోసం ఆవు, మూడు దూడలు, రెండు ఎద్దులను కొనుగోలు చేశారు. టీఎన్97ఏ1451 నెంబర్ లారీలో తమిళనాడుకు తీసుకువెళ్లేందుకు బయలుదేరారు. అన్నమయ్య జిల్లా మదనపల్లి పట్టణం బైపాస్ రోడ్డులోని ఆర్టీవో కార్యాలయం సమీపానికి చేరగానే.. పట్టణంలోని ప్రశాంత్నగర్కు చెందిన రాజేంద్ర ప్రసాద్ కుమారుడు చేగూరి నాగార్జున(36), నీరుగట్టువారిపల్లెకు చెందిన శివకుమార్ కుమారుడు ఉరుపు సురేష్కుమార్ (27) అడ్డుకున్నారు. పశువుల తరలింపునకు సంబంధించిన ధ్రువపత్రాలు చూపించమని అడిగారు. రైతులు ఇవ్వగా.. వాటిని చించి వాహనంతోపాటు వెళ్లాలంటే రూ.10వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రైతులు ఒప్పుకోకపోవడంతో దౌర్జన్యంచేసి దాడికి పాల్పడ్డారు. అంతేగాక ఆ పశువుల యజమాని మురళిదాసానికి ఫోన్ చేసి నగదు ఇవ్వకపోతే మీ మనుషులను చంపేస్తామని బెదిరించారు. సాయంత్రం పోలీస్ స్టేషన్కు తరలిస్తామంటూ కోర్టుభవన సముదాయం వద్దకు చేరుకోగా, నిందితులకు మద్దతుగా మరికొంతమంది వచ్చారు. రైతులు పోలీస్స్టేషన్కు వెళ్లేందుకు సిద్ధమవడంతో నిందితులు పరారయ్యారు. రైతు బాలాజీ ఫిర్యాదు మేరకు సీఐ కళావెంకటరమణ కేసు నమోదు చేశారు. నిందితులైన నాగార్జున, సురేష్కుమార్లను చిప్పిలి హంద్రీనీవా కాలువ సమీపంలో అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించారు. ఈ కేసులో మరింతమంది నిందితులు ఉన్నారని, విచారణ అనంతరం వారిని అరెస్టు చేస్తామన్నారు. అక్రమ వసూళ్లకు పాల్పడితే ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఎస్సై గాయత్రి తదితరులు పాల్గొన్నారు. ఇద్దరు నిందితుల అరెస్ట్ -
ఎన్నికల నిర్వహణకు పటిష్ట చర్యలు: ఎస్పీ
కడప అర్బన్: పులివెందుల, ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానాలకు ఈనెల 12న జరగనున్న ఎన్నికలను పకడ్బందీగా నిర్వహించేందుకు కట్టుదిట్టమైన ఏర్పాట్లను చేపట్టినట్లు ఎస్పీ అశోక్కుమార్ అన్నారు. గురువారం కడపలోని జిల్లా పోలీసు కార్యాలయం ఆవరణంలో ‘పెన్నార్ పోలీస్ కాన్ఫరెన్స్’హాల్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. పులివెందులలో జరిగిన దాడులు, అల్లర్ల సంఘటనలపై సమగ్రంగా విచారిస్తున్నామన్నారు. సంఘటనలకు బాధ్యులైన వారిపై చట్టపరంగా చర్యలను తీసుకుంటామని స్పష్టం చేశారు. ఎన్నికల ప్రచార సమయంలోనూ ఆ ప్రాంతానికి చెందిన వారు కాకుండా ఇతరులకు అనుమతి లేదన్నారు. పులివెందుల జెడ్పీటీసీ స్థానంలో ప్రశాంత వాతావరణంలో ఎన్నిక జరిగేందుకు దాదాపు 600 మంది పోలీసు అధికారులు, సిబ్బందిని కేటాయించామన్నారు. -
ఎరువు నిల్వలపై ఆందోళన వద్దు
ఒంటిమిట్ట : జిల్లాలో ఎరువు నిల్వలు ఉన్నాయని.. రైతులు ఆందోళన పడవద్దని వ్యవసాయ శాఖ జేడీఏ చంద్రానాయక్ అన్నారు. మండలంలోని రాచపల్లి రైతు సేవా కేంద్రాన్ని గురువారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతు భరోసా కేంద్రాలలోనేగాక ప్రైవేటు డీలర్ల వద ఎరువు అందుబాటులో ఉందన్నారు. కాంప్లెక్స్, యూరియా కలిపి వేస్తే ఎలాంటి ప్రయోజనం ఉండదని అన్నారు. వరిపంటకు యూరియా 90 కేజీలు చొప్పున రెండు దపాలుగా వేస్తే సరిపోతుందని, అదనంగా యూరియా వాడటంతో నష్టం కలుగుతుందన్నారు. ఈ కార్యక్రమంలో ఏవో జయలక్ష్మి, అమరావతి, వంశీ, రైతులు పాల్గొన్నారు. చోరీకి యత్నం.. దొంగకు దేహశుద్ధి రాజుపాళెం : పట్ట పగలే రహదారి పక్కనే ఉన్న ఇంట్లో ఓ దొంగ చోరీకి యత్నించగా.. గ్రామస్థులు పట్టుకుని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించిన సంఘటన రాజుపాళెం మండలం టంగుటూరులో గురువారం చోటుచేసుకుంది. గ్రామస్తుల వివరాల మేరకు. కానగూడూరు ప్రధాన రహదారిలోని ఉంటున్న రైతు నంద్యాల వెంకట సుబ్బయ్య గ్రామానికి దూరంగా ఉన్న సచివాలయం వద్ద పని నిమిత్తం వెళ్లారు. తిరిగి ఇంటికి చేరుకోగా అప్పటికే ఇంటి తలుపులు మూసివేసి దుండగుడు ఇంట్లో ఉన్న ఇనుప బీరువా పగలగొట్టే పనిలో కనిపించారు. రైతు వెంకటసుబ్బయ్యను చూసి దుండగుడు ఇనుప రాడ్డుతో దాడికి పాల్పడ్డాడు. రైతు కేకలు వేయడంతో చుట్టుపక్కల వారంతా వచ్చి దుండగుడిని పట్టుకొని దేహశుద్ధి చేసి పోలీసులకు అప్పగించారు. తీవ్రగాయాలైన వెంకట సుబ్బయ్యను ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ బాల మద్దిలేటి, ఎస్ఐ వెంకటరమణ పరిశీలించారు. చోరీకి పాల్పడిన దుండగుడు దూవ్వూరు మండలం జిల్లెల్ల గ్రామానికి చెందిన తిమ్మారెడ్డి, షేక్ మహమ్మద్ రఫీగా పోలీసులు గుర్తించినట్లు సమాచారం. తాళ్లపాకలో వరలక్ష్మీవ్రతం రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో తిరుమల తిరుపతి దేవస్థానాల ఆధ్వర్యంలో వరలక్ష్మీ వ్రతంను ఘనంగా నిర్వహించనున్నట్లు తాళ్లపాక టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ వ్రతంలో పాల్గొనే మహిళలకు అమ్మవారి కుంకమ, గాజులు, పసుపుదారం, కంకణాలు ఉచితంగా అందజేస్తామన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్ ఆధ్వర్యంలో ఈ వ్రతం నిర్వహిస్తామన్నారు. రాజంపేట పరిసర ప్రాంతాల మహిళలు విశేష సంఖ్యలో పాల్గొనాలని కోరారు. బాల్ పురస్కార్కు దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి టౌన్ : ప్రధాన మంత్రి రాష్ట్రీయ బాల్ పురస్కార్ అవార్డు కోసం దరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సీ్త్ర శిశు సంక్షేమ సాధికారత అధికారి గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. 18 సంవత్సరాల లోపు పిల్లలు (31 జూలై 2025) లోపు పిల్లలు ఈ దరఖాస్తులు చేసుకోవచ్చున్నారు. ఆదర్శవంతమైన పనులు, జాతీయ స్థాయిలో క్రీడలు ఆడటం, సంఘ సేవ, సైన్స్, టెక్నాలజీ, పర్యావరణం, ఆర్ట్స్, లలిత కళలు, వినూత్నమైన సేవలు అందించిన వారు దీనికి అర్హులన్నారు. ఆసక్తి కలిగిన వారు ఈనెల 15వ తేది లోగా దరఖాస్తులు చేసుకోవాలన్నారు. 10న బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడి రాక రాజంపేట రూరల్ : బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ ఈ నెల 10వ తేదీన జిల్లా పర్యటనకు వస్తున్నట్లు బీజేపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు పోతుగుంట రమేష్నాయుడు తెలియజేశారు. స్థానిక బీజేపీ కార్యాలయంలో గురువారం బీజేపీ నాయకులతో ఆయన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా కేంద్రమైన రాయచోటిలో 10న మాధవ్ చేపట్టే కార్యక్రమంలో కార్యకర్తలు పాల్గొని జయప్రదం చేయాలన్నారు. -
ఇన్స్పైర్ నామినేషన్లు సమర్పించండి
రాయచోటి: ఇన్స్పైర్ మనాక్ అవార్డుల కోసం అధిక సంఖ్యలో నామినేషన్లు సమర్పించి అన్నమయ్య జిల్లాను అగ్రస్థానంలో నిలపాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం సైన్స్ ఉపాధ్యాయులకు సూచించారు. రాయచోటి పట్టణంలోని డైట్ హాల్లో గురువారం జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన డివిజనల్ స్థాయి ఇన్స్పైర్ మనాక్ శిక్షణ కార్యక్రమానికి డీఈఓ ముఖ్య అతిథిగా విచ్చేసి మాట్లాడారు. స్థానిక సమస్యలకు పరిష్కారం చూపేలా ప్రాజెక్టులను రూపొందించాలన్నారు. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక మండలి విభాగం, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లు సంయుక్తంగా నిర్వహిస్తున్న ఇన్స్పైర్ మనాక్ అవార్డుల కోసం 6–12 తరగతులు చదువుతున్న విద్యార్థులు ఈ పోటీలలో పాల్గొనేలా చూడాలన్నారు. నామినేషన్లను జాతీయ స్థాయిలో పరిశీలించి అత్యుత్తమ అన్వేషణాత్మక ఆలోచనలను ఇన్స్పైర్ అవార్డుకు ఎంపిక చేస్తారన్నారు. అవార్డుకు ఎంపికై న ఒక్కొక్క విద్యార్థికి రూ.10 వేలు అందిస్తారన్నారు. వీరికి జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలలో పోటీలు నిర్వహించి అత్యుత్తమ ప్రాజెక్టుకు మేధోసంపత్తి హక్కులు ఇస్తారన్నారు. రాయచోటి డివిజన్ పరిధిలోని 11 మండలాల నుంచి సైన్స్ ఉపాధ్యాయులు ఈ శిక్షణ తరగతులకు హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో డైట్ సీనియర్ లెక్చరర్ మడితాటి నరసింహారెడ్డి, రాజంపేట మండల విద్యాశాఖ అధికారి సుబ్బరాయుడు, సెక్టోరియల్ అధికారి జనార్ధన్, రీసోర్స్ సభ్యులు సెట్టెం ఆంజనేయులు, శివలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడి అమానుషం
రాయచోటి: ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడి అమానుషమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. బీసీ వర్గానికి చెందిన ఎమ్మెల్సీపై దాడి చేయడం ఎంత వరకు న్యాయసమ్మతమని గురువారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో ఆయన ప్రశ్నించారు. ఎన్నికల ప్రచారానికి వెళ్లే ప్రజా ప్రతినిధులకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు చేతులు ఎత్తేయడం, ఓ డీఐజీ స్థాయి అధికారి సంఘటనను పత్తి వ్యాపారంగా అభివర్ణించడం ప్రజాస్వామ్య విలువలను దిగజార్చుతోందన్నారు. గ్రామంలో వాహనాన్ని అడ్డగించి ధ్వంసం చేయడం, బీసీ వర్గానికి చెందిన రమేష్ యాదవ్పై, అలాగే వేల్పుల రాము అనే వ్యక్తిపై దాడులు చేయడం అధికార పార్టీ దౌర్జన్యానికి అద్దం పడుతోందన్నారు. రమేష్ యాదవ్ను ఫోన్లో పరామర్శించినప్పుడు దేవుడి దయతో ప్రాణాలతో బయటపడ్డానని చెప్పడం తనను బాధించిందన్నారు. రమేష్ యాదవ్పై జరిగిన దాడిని తాము తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. ఈ దాడుల వెనుక ఉన్న ప్రతి ఒక్కరినీ గుర్తించి, వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. రక్షణ చట్టం ఏమైంది? బీసీలకు రక్షణ చట్టం తెస్తానని చంద్రబాబు ఎన్నికల సమయంలో చెప్పారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఇప్పుడు కూటమి ప్రభుత్వంలో బీసీలు దాడులకు గురి కావడం విచారకరమన్నారు. 50 ఏళ్లు నిండిన వారికి పెన్షన్ ఇస్తామని చెప్పి ఇప్పుడు ఆ ఆలోచన చేయడం లేదన్నారు. జగన్ ప్రభుత్వం బీసీ మహిళలకు అందించిన చేయూత, ఆసరా పథకాలను ఎత్తివేసి మోసగించారన్నారు. మగ్గం ఉన్న చేనేతలకు క్రమం తప్పకుండా ఏటా రూ.24 వేలను జగన్ ప్రభుత్వం అందించేదన్నారు. చేనేతలకు ఈ పదునాలుగు నెలలలో ఏ పథకం అందివ్వలేదన్నారు. గత ప్రభుత్వంలో చేనేతలకు మెటీరియల్ కొనుగోళ్లకు ఏడాదికి అందించిన రూ. 24 వేల స్థానంలో రూ.50 వేలు అందించే ఏర్పాట్లు చేయాలని, దానిపై ఆలోచనలు చేయకుండా బీసీలపైన దాడులు చేసి తీవ్రంగా గాయపరచడం దుర్మార్గమన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
విజయం తథ్యం
సాక్షి రాయచోటి: వైఎస్సార్ జిల్లా ఒంటిమిట్ట ఆధ్యాత్మిక కేంద్రంలో వైఎస్సార్సీపీ జెండా ఎగుర వేసేందుకు ఆ పార్టీ రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఒకపక్క ప్రచారంతోపాటు మరోపక్క ఓటు బ్యాంకు ఉన్న నేతలతో ఎప్పటికప్పుడు మాట్లాడుతూ ఇప్పటికే దూసుకుపోతున్న వైఎస్సార్సీపీ నేతలకు.. విజయ బావుటా ఎగురవేసేందుకు అవసరమైన వ్యూహాన్ని వివరించారు. ప్రస్తుత రోజులతోపాటు ఎన్నికల ముందు అనుసరించాల్సిన విధానాన్ని వివరించడంతోపాటు సమష్టిగా పని చేస్తూ.. ఒక పథకం ప్రకానం ముందుకు వెళితే విజయం తథ్యమని వివరిస్తూ వచ్చారు. కార్యకర్తలు, నాయకులు, నేతలు, శ్రేణులు ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బా రెడ్డిని గెలిపించి వైఎస్సార్సీపీ జెండా ఎగురవేయా లని సూచించారు. ఒంటిమిట్టలో జెడ్పీటీసీ అభ్యర్థి సుబ్బారెడ్డి అతిథి గృహం వద్ద రాష్ట్ర రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి నేతలతో చర్చించడంతోపాటు సమీక్షించి విజయానికి వ్యూహం రచించారు.అన్ని వర్గాల ఓట్లపై దృష్టివైఎస్సార్ సీపీ నేతలకు రీజినల్ కో ఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దిశానిర్దేశం చేశారు. ఎన్నికలకు సంబంధించి పోలింగ్ రోజున అనుసరించాల్సిన వ్యూహాలతోపాటు ఇతర అనేక అంశాలపై చర్చించారు. రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, చిత్తూరు మాజీ ఎంపీ రెడ్డప్ప, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా, రాజంపేట, కడప మేయర్ కొత్తమద్ది సురేష్బాబు, కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తదితరులతో పూర్తి స్థాయిలో సమీక్ష నిర్వహించారు. జెడ్పీటీసీ అభ్యర్థి విజయమే లక్ష్యంగా పని చేస్తూ అన్ని వర్గాల ఓట్లు వైఎస్సార్సీపీకి లభించేలా కార్యాచరణ అమలు చేయాలని సూచించారు.వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా పెద్ద ఎత్తున నేతలు ప్రచారం నిర్వహిస్తున్నారు. గురువారం రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, కడప మేయర్ సురేష్ బాబు, కడప పార్లమెంటు పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, పద్మశాలీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ జింకా విజయలక్ష్మి, జిల్లా యువజన విభాగపు అధ్యక్షుడు శివప్రసాద్రెడ్డి, వీరబల్లి ఎంపీపీ గాలివీటి రాజేంద్రనాథరెడ్డి, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, రాష్ట్ర మైనార్టీ నాయకులు షఫి ఇలియాజ్, మాజీ కార్పొరేటర్లు శ్రీరంజన్, జయచంద్రారెడ్డిలతోపాటు పలువురు నేతలు పాల్గొన్నారు. కొత్తమాధవరంలోని పెద్దరోడ్డు వీధి, స్టేట్ బ్యాంక్ వీధి, భద్రావతి, భావ నారాయణస్వామి ఆలయ పరిసర ఆలయం వీధితోపాటు అన్ని వీధులలో కలియ తిరిగారు. అలాగే గురువారం సాయంత్రం సాలాబాద్లో మైదుకూరు మాజీ ఎమ్మెల్యే ఎస్.రఘురామిరెడ్డి, పెద్ద పేరూరు, తప్పెటవారిపల్లెల్లో ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధలు ప్రచారం నిర్వహించారు.రాష్ట్రంలో ప్రస్తుతం జరుగుతున్న ఉప ఎన్నికలలో భాగంగా అన్ని స్థానాలలో వైఎస్సార్సీపీ విజయ దుందుభి మోగిస్తుందని, అలాగే ఒంటిమిట్ట, పులివెందులలో కూడా విజయం తథ్యమని పార్టీ కీలక నేతలు పేర్కొన్నారు. అందుకు సంబంధించి గురువారం ఒంటిమిట్ట మండలంలోని మాధవరం, ఇతర గ్రామాల్లో ప్రచారం సందర్భంగా పలువురు మాట్లాడుతూ టీడీపీ, పోలీసులు ఎన్ని ఆరాచకాలకు తెరతీసినా చివరకు వైఎస్సార్సీపీ విజయాన్ని ఎవరూ ఆపలేరని పేర్కొన్నారు. ధర్మ పోరాటంలో విజయం వైఎస్సార్సీపీ పక్షాన ఉంటుందని వివరించారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజార్టీతో గెలిపించాలని పలువురు కోరారు.కుడుమలూరు గ్రామంలో జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డితో కలిసి వైఎస్ఆర్సీపీ వైఎస్ఆర్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథరెడ్డి ప్రచారం నిర్వహించారు. -
మెరుగైన వైద్య సేవలు అందించండి
మదనపల్లె రూరల్: ఆస్పత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్యసేవలు అందించాలని డీఎంహెచ్ఓ లక్ష్మీనరసయ్య ఆదేశించారు. గురువారం పట్టణ పరిధి నిమ్మనపల్లె రోడ్డులోని అర్బన్ హెల్త్ సెంటర్ను ఆయన ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆస్పత్రిలోని రికార్డులను పరిశీలించారు. అనంతరం సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వర్షా కాలంలో పలు వ్యాధులు ప్రబలే అవకాశం ఉందని, క్షేత్రస్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. క్యాన్సర్ లక్షణాలు ఉన్న రోగులను గుర్తించి స్క్రీనింగ్ చేయాలన్నారు. కార్యక్రమంలో వైద్యులు డాక్టర్ కీర్తిప్రియ, ఆస్పత్రి సిబ్బంది పాల్గొన్నారు. హర్ఘర్ తిరంగాపై ర్యాలీ రాయచోటి: స్వాతంత్య్ర ఫలాలు, వాటి విలువలు, త్యాగాలను స్మరించుకునేందుకు హర్ఘర్ తిరంగా కార్యక్రమాన్ని జిల్లాలో నిర్వహిస్తున్నట్లు నోడల్ అధికారి నాగభూషణం పేర్కొన్నారు. గురువారం ఉదయం రాయచోటి పురపాలక సంఘం, పట్టణ పేదిరక నిర్మూలన సంస్థ, జిల్లా పర్యాటక తదితర శాఖల ఆధ్వర్యంలో రాయచోటిలో హర్ఘర్ తిరంగా కార్యక్రమంపై అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. ‘అక్షర ఆంధ్ర’పై శిక్షణ రాయచోటి టౌన్: అక్షర ఆంధ్ర అనే కార్యక్రమంపై రాయచోటి డైట్ కేంద్రంలో గురువారం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా వయోజన విద్య నోడల్ ఆఫీసర్ సుబ్రహ్మణ్యంరెడ్డి మాట్లాడుతూ అక్షర ఆంధ్ర, ఉల్లాస్ (సమాజంలోని అందరికీ జీవిత కల అభ్యాసంపై అవగాహన) అంశాల ద్వారా వివిధ వృత్తులలో ఉన్న 15 ఏళ్లు పైబడిన వయోజనులను దృష్టిలో ఉంచుకొని ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. వీరిలో ఎక్కువగా ఎస్హెచ్జీ లబ్ధిదారులు, ఆయాలు, వంట వండేవారు, వివిధ రకాల సహాయకులు, కాపలాదారులు వంటి వారిని అక్షరాస్యులుగా తీర్చిదిద్దేందుకు ఉపయోగపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో పీడీడీఆర్డీఏ సత్యనారాయణ, ఏపీఎంలు, సీఎంఎంలు, ఎంపీడీవోలు, ఎంఈవోలు, ఉపాధి హామీ ఏపీవోలు తదితరులు పాల్గొన్నారు. ‘సూర్యఘర్’పై అవగాహన కల్పించాలి రాజంపేట రూరల్: ప్రధాన మంత్రి సూర్యఘర్ పథకంపై విస్తృతంగా ప్రచారం చేయాలని విద్యుత్శాఖ సీజీ ఎం.జానకీరామ్ ఆదేశించారు. రాజంపేటలోని డివిజనల్ విద్యుత్శాఖ కార్యాలయంలో గురువారం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో విద్యుత్ శాఖ ఎస్సీ ఆర్ చంద్రశేఖరరెడ్డి, డీఈఈ ఎన్ రాజశేఖరరెడ్డి, డీఈలు సురేంద్రనాథ్, భాస్కరరావు, మురళీధర్రెడ్డి, ఏఈలు ఏంవీ చంద్రశేఖర్, కుమార్, ఈశ్వరరాజు, షఫీ, శ్రీనివాసులు, యోగనాందం, సుబ్రమణ్యం, కిరణ్కుమార్, చలపతీ, బాలసుబ్రమణ్యం, తదితరులు పాల్గొన్నారు. విద్యుత్ బిల్లు ఆదా రాయచోటి జగదాంబసెంటర్ : ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంతో వినియోగదారులకు విద్యుత్ బిల్లు ఆదా అవుతుందని ఏపీఎస్పీడీసీఎల్ చీఫ్ జనరల్ మేనేజర్ జానకిరామ్ పేర్కొన్నారు. రాయచోటి పట్టణం మాసాపేటలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ప్రధానమంత్రి సూర్యఘర్ పథకంపై విద్యుత్ శాఖ అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో విద్యుత్ శాఖ రాయచోటి ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ పి.యుగంధర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, పలు శాఖల బ్యాంకు మేనేజర్లు, పీఎం సూర్యఘర్ వెండార్స్ తదితరులు పాల్గొన్నారు. -
ప్రచారంలో టీడీపీ వర్గీయుల రగడ
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికలో అభ్యర్థిని ఎంపిక చేసిన తరువాత.. అందరూ కలిసికట్టుగా ఎంపిక చేసిన అభ్యర్థి అని అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు ఒక పక్క ప్రకటించారు. కానీ అది కేవలం పార్టీ పరువు కాపాడుకునేందుకే అభ్యర్థిని ఎన్నుకున్నట్లు తెలుస్తోంది. ఎందుకంటే అందరూ కలిసి అభ్యర్థి విజయానికి కృషి చేయాల్సింది పోయి.. వర్గ విభేదాలను మనసులో ఉంచుకుని సందర్భంగా వచ్చినప్పుడల్లా ప్రదర్శిస్తున్నారు. గురువారం మండల పరిధిలోని దవంతరపల్లిలో జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారానికి వెళ్లిన టీడీపీ సీనియర్ నాయకుడు, కల్లుగీత కార్మిక సంఘం మాజీ డైరెక్టర్ కొమర వెంకట నరసయ్య, మండల టీడీపీ అధ్యక్షుడు గజ్జల నరసింహారెడ్డి వాగ్వాదానికి దిగారు. పూర్తి విరాల్లోకి వెళితే.. వీరిలో వెంకటనరసయ్య మేడా విజయశేఖర్రెడ్డి వర్గం అయితే నరసింహారెడ్డి చమర్తి జగన్మోహన్రాజు వర్గం. వీరి మధ్య గత కొంత కాలంగా వర్గ విభేదాలు నడుస్తూ ఉండేవి. ఈ క్రమంలో ఒక రోజు కొమర వెంకట నరసయ్య సామాజిక మధ్యమంలో నరసింహారెడ్డిపై వార్డు మెంబర్గా గెలవలేని వ్యక్తిని మండల అధ్యక్షుడిగా చేశారంటూ ఘాటుగా విమర్శించారు. అంతే కాదు కొంత కాలం నరసింహారెడ్డి సుగవాసి వర్గంలో కూడా పని చేశారు. కానీ అప్పుడు వెంకట నరసయ్య జగన్మోహన్రాజు వర్గంలో ఉన్నారు. ఆ సమయంలో ఒంటిమిట్ట పంచాయతీలో రెవెన్యూ సదస్సు నిర్వహించారు. ఆ సదస్సులో నరసింహారెడ్డిని, ఆయన అనుచరులను వెంకట నరసయ్యతోపాటు ఆయన అనుచరులు ఒంటిమిట్ట పంచాయతీకి సంబంఽధించిన రెవెన్యూ సదస్సులో పక్క ఊరి వారికి ఏం పని ఉందని అసభ్య పదజాలంలో దూషించారు. ఇది ఇలా ఉంటే ఏమైందో తెలియదు సుగవాసి టీడీపీపై అసంతృప్తితో పార్టీకి ఆయన రాజీనామాచేసి వైఎస్సార్సీపీలో చేరడంతో సుగవాసి వర్గంలో ఉన్న నరసింహారెడ్డి జగన్మోహన్రాజు వర్గంలో చేరారు. అది ఇష్టంలేని వెంకట నరసయ్య.. జగన్మోహన్రాజు వర్గాన్ని వీడి మేడా విజయశేఖర్రెడ్డి వర్గంలో చేరారు. ఇవ్వన్ని మనసులో పెట్టుకున్న నరసింహారెడ్డి సమయం కోసం ఎదురు చూస్తున్నట్లు.. గురువారం మండల పరిధిలోని దవంతరపల్లిలో జరిగే ప్రచారానికి రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి హరిప్రసాద్ వస్తున్నాడని తెలిసి వెంకట నరసయ్య అక్కడికి వెళ్లాడు. అది చూసిన నరసింహారెడ్డి అతనికి జరిగిన అవమానాలన్నీ గుర్తుకు తెచ్చుకుని కోపోద్రిక్తుడై వెంకట నరసయ్యతో.. ‘నిన్ను ఎవ్వడు ఇక్కడికి రమ్మన్నాడు, ఏ ఊరి నీది’ అని అవమానంగా మాట్లాడాడు. దీంతో అవమానం భరించలేక వెంకట నరసయ్య నరసింహారెడ్డికి ఎదురు తిరిగాడు. ఇద్దరి మధ్య అసభ్య పదజాలంతో మాటల యుద్ధం జరిగింది. ఇది చూసిన ప్రజలు ఇదేం విడ్డూరం అంటూ నోరు వెళ్లబెట్టి చూస్తూ ఉండి పోయారు. ఈ ఘటన ఎంత వరకు దారి తీస్తుందోనని మండల ప్రజలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఒంటిమిట్టలో భగ్గుమన్న విభేదాలు జగన్మోహన్రాజు, మేడా విజయశేఖర్రెడ్డివర్గీయుల మాటల యుద్ధం -
కుప్పం వెళ్దామా వద్దా!
మదనపల్లె: హంద్రీ–నీవా కుప్పం డివిజన్ కార్యాలయం మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలోనే నిర్వహిస్తున్న విషయాన్ని ‘కదలరు.. వదలరు’ శీర్షికన సాక్షిలో ఇటీవల కథనం ప్రచురితం కావడం తెలిసిందే. ఈ కథనంతో ఇంతకాలం గుట్టుచప్పుడు కాకుండా నడిచిపోతున్న డివిజన్ వ్యవహారం వెలుగులోకి రావడం, కుప్పం ఈఈ మదనపల్లెలో ఉంటున్న విషయం మంత్రి నిమ్మల రామానాయుడు దృష్టికి వెళ్లడంతో.. ఇప్పుడు ఈ సమస్యపై ఎలా ముందుకు వెళ్లాలన్న సందిగ్ధం అధికారుల్లో నెలకొంది. సాక్షి కథనం మంత్రి నిమ్మల, ఈఎన్సీ దృష్టికి వెళ్లినట్టు అధికార వర్గాలు చెబుతున్నాయి. దీంతో ఇక డివిజన్ కుప్పానికి తరలించాల్సిన పరిస్థితి తప్పదన్న సంకేతాలు కనిపిస్తున్నాయి. అధికారులు కూడా ఇకపై కుప్పం నుంచే విధులు నిర్వహించాల్సి ఉంటుందని కింది స్థాయి ఉద్యోగులకు చెబుతున్నట్టు తెలిసింది. లేదా కుప్పం డివిజన్ కార్యాలయం ప్రారంభించి అక్కడ ఒక బోర్డు పెట్టి డివిజన్ను కుప్పానికి తరలించినట్టు చెప్పే ప్రయత్నం కూడా జరుగుతున్నట్టు అధికార వర్గాల్లో చర్చ జరుగుతోంది. అక్కడ ఒకరిద్దరు సిబ్బందిని ఉంచి.. మదనపల్లె నుంచే విధులు నిర్వహించుకోవచ్చన్న అభిప్రాయంతో ఉన్నట్టు చెబుతున్నారు. ఏది ఏమైనప్పటికీ విషయం ప్రభుత్వం దృష్టికి వెళ్లడంతో.. అధికారులు ఎలాంటి నిర్ణయం తీసుకుంటారో తెలియాల్సి ఉంది. ఇలా ఉండగా కుప్పం డివిజన్ ఎట్ మదనపల్లె పేరుతో ప్రభుత్వం నుంచి ఉత్తర్వులు తెచ్చుకోవాలని ఉన్నతాధికారులకు కొందరు సూచన చేసినట్టు తెలిసింది. ఇలా ఉత్తర్వు తెచ్చుకుంటే మదనపల్లె నుంచి కుప్పానికి వెళ్లి విధులు నిర్వహించే పరిస్థితి ఉండదని ఎత్తుగడ వేసినట్టు కార్యాలయ వర్గాలు చర్చించుకొంటున్నాయి. ముఖ్యంగా సీఎం నియోజకవర్గానికి మంజూరైన డివిజన్ను మదనపల్లెలో ఉండేలా.. ఉత్తర్వులు ఇచ్చే అవకాశం ఏ మాత్రం ఉండదని మరికొందరు స్పష్టంగా చెబుతున్నారు. సాక్షి కథనంతో అధికారుల మల్లగుల్లాలు -
కరడుగట్టిన దొంగల అరెస్టు
కడప అర్బన్ : వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ తప్పించుకు తిరుగుతున్న ఇద్దరు కరడుగట్టిన దొంగలను పోలీసులు పట్టుకున్నారు. వారి నుంచి రూ.60 లక్షల విలువ చేసే అర కిలో బంగారం, రూ.10 లక్షల విలువ చేసే పది కిలోల వెంటి ఆభరణాలు స్వాధీనం చేసుకున్నారు. విలేకరులతో వైఎస్సార్ కడప జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ నిందితుల వివరాలను గురువారం వెల్లడించారు. కడప జిల్లా బద్వేల్ టౌన్ పరిధిలోని చెన్నంపట్టిమిట్ట వద్ద నివాసముంటున్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, గౌరీశంకర్నగర్కు చెందిన నూతి వెంకటసుబ్బయ్య గత రెండేళ్లుగా తాళం వేసిన ఇళ్లు పగలు గుర్తించడం, రాత్రి చోరీలకు పాల్పడడం అలవాటు చేసుకున్నారు. వీరు ఎరచ్రందనం అక్రమ రవాణా చేయడమేగాక, కడప, నెల్లూరు జిల్లాలో తాళం వేసిన ఇళ్ల తలుపులు పగలగొట్టి చోరీకి పాల్పడ్డారు. అయితే ఇళ్ల చోరీలో తక్కువ మొత్తంలో బంగారు ఆభరణాలు లభించడంతో సంతృప్తి చెందక, ఎక్కువ మొత్తంలో ఆభరణాలు దోచుకోవాలని ప్రయత్నం మొదలుపెట్టారు. ఈ నేపథ్యంలోనే కడప, అన్నమయ్య, సత్యసాయి, నెల్లూరు, కాకినాడ జిల్లాల్లోని బంగారు దుకాణాలకు తాళాలు పగులగొట్టి బంగారు, వెండి ఆభరణాలు, నగదు దోచుకెళ్లారు. గుంటూరులో బైక్ చోరీ చేశారు. ఈ ప్రయత్నంలోనే గతంలోనూ అరెస్టుయి జైలుకు వెళ్లాడని పోలీసుల విచారణలో తేలింది. తీరికసమయాల్లో పేకాడడం, సహచరులతో లంకమల అడవికి వెళ్లి నాటు తుపాకీతో వన్యప్రాణులను వేటాడడం చేశారు. గుమ్మళ్ల వెంకటసుబ్బయ్యపై గతంలో 28 వరకూ ఎర్ర చందనం అక్రమ రవాణా, 38 చోరీ కేసులు నమోదయ్యాయి. ఇతడిపి పీడీ యాక్ట్ ఉండడమేగాక, జైలు శిక్ష అనుభవించి బయటికి వచ్చాడు. చోరీలు పెరగడంతో పోలీసుల నిఘా జిల్లాలోని పోరుమామిళ్ల, బి.కోడూర్, మైదుకూర్, బద్వేల్ టౌన్, కలసపాడు, ఖాజీపేట, కాశినాయన, దువ్వూరు పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లపై పగలు రెక్కీచేసి, రాత్రి సమయాలలో బంగారు, వెండి ఆభరణాలు, నగదు చోరీలు ఇటీవల పెరిగాయి. దాదాపు 12 ఇళ్లు, బంగారు దుకాణంలోనూ ఈ చోరీలు జరగడంతో ఎస్పీ ఈజీ.అశోక్ కుమార్ సీరియస్గా తీసుకున్నారు. మైదుకూర్ డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్ ఆధ్వర్యంలో బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, మైదుకూరు యూసీపీఎస్ ఇన్స్పెక్టర్ రమణారెడ్డి, బద్వేల్ రూరల్ ఎస్ఐ కె.శ్రీకాంత్, సిబ్బందిని ప్రత్యేక బృందంగా నియమించి నిఘా పెంచారు. గోపవరం మండలం పీపీకుంట సమీపంలోని చెలిమికుంట అటవీ ప్రాంతంలో ఎరచ్రందనం దుంగలు నరికి కర్ణాటకలోని కటికనహళ్లికి అక్రమ రవాణా చేస్తున్నారనే సమాచారం తెలియడంతో పోలీసులు తనిఖీలు చేపట్టారు. ఈ నేపథ్యంలోనే గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్య ఎరచ్రందనం రవాణా చేసూం్త పట్టుబడ్డారు. వారి నుంచి బొలెరో వాహనం, నాలుగు ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ స్వాధీనం చేసుకున్నారు. అనంతరం వారిని విచారించగా గత నేరచరిత్ర కలిగిన వ్యక్తులని గుర్తించారు. అనంతరం పలు చోట్ల చోరీలకు పాల్పడినట్లు తెలియడంతో అరెస్టు చేశారు. పోలీసులకు ఎస్పీ ప్రశంస మోస్ట్ వాంటెడ్గా ఉన్న గుమ్మళ్ల వెంకటసుబ్బయ్య, నూతి వెంకటసుబ్బయ్యలను అత్యంత చాకచక్యంగా అరెస్టు చేసి, చోరీ సొత్తు, ఎర్రచందనం దుంగలు, నాటు తుపాకీ రికవరీ చేసిన మైదుకూరు డీఎస్పీ రాజేంద్ర ప్రసాద్, బద్వేల్ రూరల్ సీఐ ఎం.నాగభూషణ్, రమణారెడ్డి, కె.శ్రీకాంత్, చిరంజీవి, శివప్రసాద్, సిబ్బందిని ఎస్పీ అభినందించి ప్రశంసాపత్రాలను అందజేశారు. అర కిలో బంగారం, పది కిలోల వెండి ఆభరణాలు, బైక్ స్వాధీనం నాటు తుపాకీ, బొలెరో వాహనం, ఎర్రచందనం దుంగలు స్వాధీనం -
బిడ్డకు తల్లి పాలే శ్రేయస్కరం
రాయచోటి: పుట్టిన బిడ్డ మానసిక, శారీరక ఎదుగుదలకు తల్లి పాలే శ్రేయస్కరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. ప్రపంచ తల్లి పాల వారోత్సవాల సందర్భంగా గురువారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి కార్యక్రమాన్ని జేసీ అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్య, ఆరోగ్యశాఖలో పని చేసే క్షేత్రస్థాయి సిబ్బంది.. ప్రతి గర్భిణి సీ్త్రకి, ప్రసవించిన ప్రతి తల్లికి, వారి ఇంటిలోని కుటుంబ సభ్యులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించాలని తెలిపారు. వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన ‘తల్లి ముర్రుపాలు.. బిడ్డకు మొదటి టీకా’ పోస్టర్స్ను విడుదల చేశారు. కార్యక్రమంలో జీఎస్డబ్ల్యూ లక్ష్మీపతి, ప్రభుత్వ ఆసుపత్రి గైనకాలజిస్ట్ కోటేశ్వరీ, ఐసీడీఎస్ పీడీ హైమావతి, సీడీపీఓలు, సూపర్ వైజర్లు పాల్గొన్నారు. ప్రజలు సంతృప్తి చెందేలా సేవలందివ్వాలి ప్రజలు సంతృప్తి చెందేలా అధికారులు, సిబ్బంది సేవలందివ్వాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ స్వర్ణాంధ్ర పి–4 కార్యక్రమం, ఐవీఆర్ఎస్ ద్వారా ప్రజల నుంచి అభిప్రాయాల సేకరణ తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫిరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ మధుసూదన్రావు, వివిధ శాఖల జిల్లా అధికారులు హాజరయ్యారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురికి తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పెద్దమండ్యం మండలం కలిచెర్ల పంచాయతీ గుర్రంవాండ్లపల్లెకు చెందిన పూజిత(18), తన అక్క కుమార్తె కోమలి(5)తో కలిసి ద్విచక్రవాహనంలో మదనపల్లెకు బయలుదేరింది. మార్గమధ్యంలో కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్ ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా ములకలచెరువుకు చెందిన పెయింటర్ వెంకటరమణ భార్య శాంతమ్మ(45) అనారోగ్యం కారణంగా చికిత్సకై కుమారుడితో కలిసి ద్విచక్ర వాహనంలో మదనపల్లె ఆస్పత్రికి వచ్చి తిరిగి ఇంటికి వెళ్తున్నారు. మార్గమధ్యంలో వేపూరికోట వద్ద ఆమె చీర కొంగు బైక్ వెనుకచక్రంలో చిక్కుకుని కిందపడి తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం బాధితురాలి పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
మిద్దైపె నుంచి పడి కార్మికుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : మిద్దైపె నుంచి జారిపడి భవన నిర్మాణ కార్మికుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. పట్టణంలోని గౌతమీ నగర్కు చెందిన ఎల్లప్ప కుమారుడు శ్రీనివాసులు(25) భవన నిర్మాణ పనుల్లో భాగంగా కమ్మీ పని చేస్తున్నాడు. గురువారం సీటీఎంలో ఓ ఇంటిపై పనులు చేస్తుండగా ప్రమాదవశాత్తూ జారి నిటారుగా కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు లక్కిరెడ్డిపల్లి : మండలంలోని రాయచోటి–వేంపల్లి రహదారి మార్గంలోని మర్రిచెట్టు వద్ద గురువారం ఉదయం చైన్నెకు వెళ్తున్న కారు ఢీకొని చైతన్య అనే వ్యక్తికి తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని చౌటపల్లి గ్రామానికి చెందిన చైతన్య కొత్తపల్లిలో నివాసముంటున్నారు. గాయపడిన చైతన్యను స్థానికులు మెరుగైన చికిత్సకోసం కడప రిమ్స్కు తరలించినట్లు తెలిపారు. పురుగుల మందు తాగి రైతు ఆత్మహత్య చిన్నమండెం : మండలంలోని కలిబండ గ్రామం కొల్లవాండ్లపల్లెకు చెందిన రైతు ఈశ్వర్రెడ్డి(38) పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. గత కొద్ది రోజులుగా ఈశ్వర్రెడ్డి విపరీతమైన కడుపునొప్పితో బాధపడుతుండేవాడని తెలిపారు. ఈ క్రమంలోనే నొప్పి భరించలేక పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నట్లు బంధువులు తెలిపారు. పిడుగు పడి ఇల్లు ధ్వంసం నిమ్మనపల్లె : పిడుగు పడి ఇల్లు ధ్వంసమైన సంఘటన నిమ్మనపల్లె మండలంలో గురువారం తెల్లవారుజామున జరిగింది. బుధవారం అర్ధరాత్రి దాటాక మండలంలో కురిసిన వర్షానికి అగ్రహారం పంచాయతీ బండమీదపల్లె హరిజనవాడలో వెంకటరమణకు చెందిన ఇంటిపై పిడుగుపడింది. ఆ సమయంలో వెంకటరమణ భార్య సరోజతోపాటు బయట ఉండటంతో ఎటువంటి ప్రాణనష్టం జరగలేదు. ఇంటి గోడలు, పైకప్పు, ఇంట్లోని వస్తువులు పూర్తిగా ధ్వంసమై పెద్దమొత్తంలో నష్టం వాటిల్లింది. బాధితుడు రెవెన్యూ అధికారులకు ఫిర్యాదుచేయగా ఎస్ఐ తిప్పేస్వామి, ఆర్ఐ రమేష్, వీఆర్వో ప్రవీణ్కుమార్ క్షేత్ర స్థాయిలో పరిశీలించి, నష్టంపై అంచనా వివరాలతో నివేదిక ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు తెలిపారు. -
టీ తాగుతూ చర్చించుకుందాం
రాయచోటి జగదాంబసెంటర్ : రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ ఉద్యోగులు ఎదుర్కొంటున్న సమస్యలకు పరిష్కార మార్గాన్ని అన్వేషిస్తూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సంఘం(ఏపీజీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కెఆర్.సూర్యనారాయణ టీ తాగుతూ చర్చించుకుందాం కార్యక్రమాన్ని ప్రారంభించారని ఏపీజీఏ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు డాక్టర్ డి.లక్ష్మీప్రసాద్ తెలిపారు. రాయచోటి మండల పరిషత్ కార్యాలయం ఆవరణలో రండి టీ తాగుతూ మాట్లాడుకుందాం కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డా.లక్ష్మీప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగులకు రావాల్సిన పీఆర్సీ, డీఏ బకాయిల విషయం ప్రభుత్వం పట్టించుకోలేదని, మూడేళ్ల సరెండర్ లీవ్స్ పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడచినా ఉద్యోగుల సమస్యలపై స్పందించకపోవడం ఆవేదన కలిగిస్తోందన్నారు. ఇప్పటికే ఉద్యోగులకు సుమారు రూ.25 వేల కోట్ల బకాయి ఉందని ఈ మొత్తాన్ని ఎలా తీరుస్తారో అర్థం కావడం లేదన్నారు. ఈ కార్యక్రమంలో సురేష్బాబు, మోహన్బాబు, ఎంపీడీఓ రామచంద్ర, తహసీల్దార్ ఎంవీ.సుబ్రహ్మణ్యంరెడ్డి, రాజా, ఉద్యోగులు పాల్గొన్నారు. -
యువతి అదృశ్యం
మదనపల్లె రూరల్ : యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ అన్సర్ బాషా తెలిపారు. పట్టణంలోని శెట్టివారివీధికి చెందిన ఓ యువతి(17) ఈ నెల 4వ తేదీన ఇంటి నుంచి వెళ్లి కనిపించకుండాపోయింది. కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో గురువారం యువతి తండ్రి వన్టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో మిస్సింగ్ కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి మదనపల్లె రూరల్ : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి చికిత్స పొందుతూ వ్యక్తి మృతిచెందినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. ఈ నెల 3న మండలంలోని వేంపల్లె హరిజనవాడకు చెందిన వెంకటస్వామి కుమారుడు శంకర వ్యక్తిగత పనులపై ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. చీకల బైలు పంచాయతీ దారువారిపల్లె వద్ద ఐచర్ వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. తిరుపతి రుయా ఆస్పత్రిలో చేర్చగా.. చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు సీఐ తెలిపారు. కేసు విచారణ చేస్తున్నామన్నారు. త్రుటిలో తప్పిన ప్రమాదం ఓబులవారిపల్లె : మండలంలోని చిన్నఓరంపాడు సమీపంలోని కల్వర్టు వద్ద గురువారం సాయంత్రం మినీ లారీ బోల్తా కొట్టింది. మినరల్ వాటర్ బాటిళ్ల లోడుతో తిరుపతి వైపు వెళ్తూ డ్రైవర్ లారీని అతివేగంగా నడిపాడు. మలుపు వద్ద బోల్తా కొట్టింది. ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదు. లారీలో చిక్కుకున్న డ్రైవర్ను బయటకు తీయగా అతని భయంతో పారిపోయాడు. ఎస్ఐ మహేష్ నాయుడు, సిబ్బంది ట్రాఫిక్ను పునరుద్ధరించారు. టీటీడీ అధికారుల తీరుపై భక్తుల నిరసన ఒంటిమిట్ట : రాష్ట్ర దేవాలయంగా గుర్తించిన ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి దేవస్థాంలో భక్తులు రామనామ స్మరణ చేస్తున్న సమయాన మైక్ కట్ చేసి అశ్రద్ధగా, అవమానకరంగా వ్యవహరించిన టీటీడీ అధికారుల వల్ల భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయని తిరుపతి అన్నమయ్య కళాక్షేత్రం పీఠాధిపతి శ్రీ విజయ శంకరస్వామి అన్నారు. ఈ చర్యకు నిరసనగా గురువారం ఉదయం 11 గంటలకు దేవస్థానం ఎదుట భక్తులు భారీగా గుమిగూడి రామనామ స్మరణ నిర్వహించారు. ఈ అవమానానికి భజన భక్తులు, మహిళలు, స్థానిక ప్రజలు పెద్ద సంఖ్యలో హాజరై తమ ఆవేదనను వ్యక్తం చేశారు. భక్తులను అవమానించే విధంగా ఆలయ అధికారుల తీరును నిరసిస్తూ.. భక్తులు రామనామమే రక్ష అంటూ ఆలయ ప్రాంగణాన్ని మార్మోగించారు. భక్తి భావాలకు టీటీడీ అధికారులు అవమానం కల్గించకూడదని వారు స్పష్టం చేశారు. గడువు పొడగింపు కడప ఎడ్యుకేషన్ : నవోదయ విద్యాలయంలో ఆరో తరగతి ప్రవేశాలకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు ఆగష్టు 13వతేదీ వరకూ గడువు పొడగించినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. 2025–26 సంవత్సరంలో 5వ తరగతి చదువుతున్న విద్యార్థుల నుంచి ఆన్లైన్లో దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. -
బలమైన నమ్మకానికి ప్రతీక భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్
బి.కొత్తకోట : బలమైన నమ్మకం, పటిష్ట దృఢత్వం, వినియోగదారుల నమ్మకానికి భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ప్రతీకగా నిలుస్తుందని భారతీ సిమెంట్ టెక్నికల్ మేనేజర్ సి.చాయాపతి అన్నారు. స్థానిక బైపాస్రోడ్డులోని భగవాన్ సాయిరాం స్కూల్ ఎదురుగా భారతి సిమెంట్ డీలర్, ఎస్ఎల్వీ ఎంటర్ ప్రైజస్ అండ్ బోర్వెల్స్ నిర్వాహకులు సి.వేణుగోపాల్రెడ్డి ఆధ్వర్యంలో గురువారం తాపీ మెసీ్త్రలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా చాయాపతి మాట్లాడుతూ భారతీ సిమెంట్ ప్రత్యేకతలు, నాణ్యతా ప్రమాణాలు, విశిష్ట అంశాలను వివరించారు. సిమెంట్ తయారీ విధానం, భవన నిర్మాణ కార్మికులు, తాపీ మేసీ్త్రలు పాటించాల్సిన అంశాలపై అవగాహన కల్పించారు. జర్మనీ టెక్నాలజీ, రోబోటెక్ క్వాలిటీ కంట్రోల్ సాంకేతిక నిపుణులు పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలతో భారతీ ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ ఉత్పత్తి చేస్తున్నట్లు చెప్పారు. టెంపర్ ఫ్రూఫ్ బస్తాలతో మార్కెట్లోకి ఇస్తున్నందున తూకం తగ్గడం ఉండదని, ఎట్టి పరిస్థితుల్లోనూ అవకాశం లేదన్నారు. సిమెంట్ రంగంలో భారతీ అగ్రస్థానంలో నిలిచిందన్నారు. అనంతరం మెసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద బీమా పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో మార్కెటింగ్ మేనేజర్ ఎం.సుబ్బరాయుడు, డీలర్ సి.వేణుగోపాల్రెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
స్కూల్ వ్యాన్ కిందపడి బాలుడు దుర్మరణం
నిమ్మనపల్లె : ముద్దుముద్దుగా మాట్లాడుతూ బడికి వెళ్లిన పసివాడు.. ఇంటికి చేరకుండానే అనంత లోకాలకు చేరాడు. రోజూ తాను ప్రయాణించే స్కూల్ వ్యాన్ రూపంలో బాలుడిని మృత్యువు బలితీసుకుంది. నిమ్మనపల్లె మండలంలో గురువారం ఈ సంఘటన జరిగింది. మండలంలోని వెంగంవారిపల్లె పంచాయతీ పాత కొండసానివారిపల్లెకు చెందిన మల్లికార్జున, శ్రావణి దంపతుల కుమారుడు దివాకర్(4) నిమ్మనపల్లె విజయవాణి స్కూల్లో నర్సరీ చదువుతున్నాడు. పాఠశాల ముగిసిన అనంతరం స్కూల్ వ్యాన్లో ఇంటికి బయలుదేరాడు. పాతకొండసానివారిపల్లె వద్ద విద్యార్థులను తల్లిదండ్రులు వ్యాన్ నుంచి కిందకు దించారు. బస్సు దిగిన దివాకర్ వెనుక నుంచి కాకుండా నిలిచి ఉన్న బస్సు ముందువైపు నుంచి ఇంటికి వెళ్లేందుకు ప్రయత్నించాడు. ఇది గమనించని డ్రైవర్ వాహనాన్ని ముందుకు నడపడంతో దివాకర్ వ్యాన్ కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. వెంటనే కుటుంబసభ్యులు నిమ్మనపల్లె పీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే బాలుడు మృతి చెందినట్లు నిర్ధారించడంతో తల్లిదండ్రులు కన్నీరుమున్నీరయ్యారు. స్కూల్ వ్యాన్లో అటెండర్ లేకుండా డ్రైవర్ ఒకడే విద్యార్థులను తీసుకురావడంతో ఈ ప్రమాదం జరిగిందని తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేశారు. నిమ్మనపల్లె పోలీసులు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న పది ఎర్రచందనం దుంగలను బుధవారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీశాఖ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం సెక్షన్ సుండుపల్లె బీట్ పరిధిలోని సద్దికూళ్లవంక చెక్పోస్టు దగ్గర అటవీశాఖ అధికారులు నాకాబందీ నిర్వహించారు. ఒక హుండాయ్ కారు వేగంగా వచ్చి బారిగేట్ వేసిన విషయం పసిగట్టి సుండుపల్లె మార్గంలోకి వెళ్లగా అటవీ సిబ్బంది వెంబడించారు. సిబ్బందిని చూసి వాహనాన్ని నిలిపి ఇద్దరు వ్యక్తులు పరారయ్యారు. వాహనం తనిఖీ చేయగా అందులో 326 కేజీలు గల పది ఎర్రచందనం దుంగలున్నాయి. ఎర్రచందనం దుంగలు, కారును స్వాధీనం చేసుకుని పారిపోయిన వ్యక్తుల కోసం గాలిస్తున్నట్లు ఎఫ్ఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. వాటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ తనిఖీలో రాయవరం డీవైఆర్ఓ రమేష్బాబు, ఎఫ్బీఓ అంజన స్వామి, గౌషా, బేస్ క్యాంప్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతిచెందిన సంఘటన బుధవారం కలకడలో జరిగింది. ఎస్ఐ రామాంజనేయులు కథనం మేరకు...కలికిరి మండలం మేడికుర్తి గ్రామానికి చెందిన ఆర్.దస్తగిరిసాబ్ కుమారుడు ఆర్.అబ్దుల్రహిమాన్(55) తాపీ మేసీ్త్రగా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. మంగళవారం సాయంత్రం కలకడలో పని ముగించుకుని వెళ్తుండగా వర్షం కురవడంతో ఆగిపోయారు. మరుసటిరోజు బుధవారం ఉదయం 4–30 గంటల సమయంలో కలికిరి వైపు నడచి వెళ్తుండగా కలకడ హెచ్పీ పెట్రోల్ బంకు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. తీవ్రగాయాలైన అబ్దుల్రహిమాన్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య రెహనా, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తన స్థలం ఆక్రమిస్తున్నారని మహిళ వినతి కురబలకోట : తమ స్థలంలో దౌర్జన్యంగా మరొకరు పాగా వేసి అక్రమంగా కట్టడం నిర్మించారని కురబలకోటకు చెందిన బాధిత మహిళలు పర్విన్, రేష్మా బుధవారం కలెక్టర్కు విన్నవించారు. వారి కథనం మేరకు..మండలంలోని దొమ్మన్నబావి హైవే పక్కన వారికి రూ.4 కోట్లు విలువైన 28 సెంట్ల స్థలం ఉంది. ఇటీవల అదే ఊరికి చెందిన ఒకరు దౌర్జన్యంగా ఆక్రమించి కట్టడం నిర్మించారు. అభ్యంతరం చెబితే తమపై దౌర్జన్యానికి వచ్చారని బాధితులు తెలిపారు. ఆక్రమణదారుడికి అధికార పార్టీ నాయకుల అండదండలు ఉన్నాయని వాపోతున్నారు. సర్వే నిర్వహించి న్యాయం చేయాలని కోరారు. పోలీసులను ఆశ్రయించిన ప్రేమజంట నందలూరు : రక్షణ కల్పించాలంటూ ప్రేమ జంట నందలూరు పోలీసులను ఆశ్రయించిన సంఘటన బుధవారం సాయంత్రం చోటుచేసుకుంది. ఎస్ఐ మల్లిఖార్జునరెడ్డి వివరాల మేరకు.. మండలంలోని టంగుంటూరు గ్రామానికి చెందిన చలమాల నవీన్ కుమార్, పులివెందుల మండలం భాకరపురం గ్రామానికి చెందిన సయ్యద్ మనీషా ఐదేళ్లుగా ప్రేమించుకుంటున్నారు. ఇద్దరు మేజర్లు కావడంతో బుధవారం ఇంటి నుంచి బయటకు వచ్చి రాజంపేట సమీపంలోని పోలిచెరువు కట్ట వద్ద ఆంజనేయస్వామి గుడిలో పెళ్లి చేసుకున్నారు. అంనంతరం తమ బంధువుల నుంచి రక్షణ కల్పించాలని కోరుతూ తమను ఆశ్రయించారని ఎస్ఐ తలెఇపారు. ఇరువురి కుటుంబీకులను పిలిపించి ఘర్షణలకు పాల్పడకుండా సామరస్యంగా ఉండాలని కౌన్సిలింగ్ ఇచ్చినట్లు తెలిపారు. -
పొలం కంచె ధ్వంసం
రాజంపేట : మండలంలోని పెద్దకారంపల్లె పరిధిలోని మిట్టపల్లె ప్రాంతంలో ఈశ్వరరాజు అనే రైతుకు సంబంధించి పొలం కంచెను బుధవారం కొందరు ధ్వంసం చేశారు. లింగంపల్లె గ్రామానికి చెందిన హస్తి వెంకట్రాజు, లక్ష్మీకర్రాజు, భానుప్రకాశ్రాజు తన పొలం కంచెను ధ్వంసం చేశారని బాధిత రైతు మన్నూరు పోలీసులకు ఫిర్యాదు చేశారు. దాదాపు రూ.20 లక్షల మేర నష్టం వాటిల్లిందని రైతు ఆవేదన వ్యక్తం చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు సిద్దవటం : మండలంలోని కడప– చైన్నె జాతీయ రహదారిలోని మిట్టపల్లె సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. సిద్దవటం పోలీస్ స్టేషన్లో కానిస్టేబుల్గా పనిచేస్తున్న రాఘవేంద్ర మాధవరం–1 నుంచి ద్విచక్ర వాహనంలో స్టేషన్కు వెళ్తున్నారు. మిట్టపల్లె గ్రామానికి చెందిన సోమశేఖర్ ద్విచక్ర వాహనంలో మాధవరం–1కు వెళ్తున్నారు. మార్గమధ్యంలో ఇరువురి వాహనాలు ఢీకొన్నాయి. రాఘవేంద్రకు తీవ్రగాయాలవగా 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. సోమ శేఖర్కు స్థానికంగా ప్రథమ చికిత్స చేయించి రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నామని ఎస్ఐ తెలిపారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళల అదృశ్యం నిమ్మనపల్లె : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు అదృశ్యం కాగా, కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. మండలంలోని బండ్లపైకి చెందిన నరేష్ పెయింటింగ్ పనులు చేస్తూ జీవిస్తున్నాడు. ఈ నెల 3న పనుల కోసం మదనపల్లెకు వెళ్లగా అతడి భార్య గాయత్రి(22) కట్టెలు తీసుకువస్తానని వెళ్లి కనిపించకుండా పోయింది. ఇంటికి వచ్చిన నరేష్ భార్యను వెతికినా కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. నిమ్మనపల్లె కందూరు రోడ్డుకు చెందిన సయ్యద్ఖాన్ భార్య సబీహా ఐదోతేదీ మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లి కుమారుడికి భోజనం క్యారియర్ ఇచ్చి వస్తానని వెళ్లి కనిపించకుండా పోయింది. ఆమె భర్త, కుటుంబసభ్యులు పలుచోట్ల వెతికినా ఆచూకీ లభించకపోవడంతో బుధవారం పోలీసులకు ఫిర్యాదుచేశాడు. ఆమేరకు కేసులు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
హార్సిలీహిల్స్కు పతంజలి, ఒబెరాయ్ వస్తున్నాయి !
బి.కొత్తకోట : పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్కు పతంజలి, ఒబెరాయ్ హోటల్స్ వస్తున్నాయని కలెక్టర్ శ్రీధర్ వె వెల్లడించారు. బుధవారం ఆయన మండలంలోని హర్సిలీహిల్స్పై టౌన్షిప్ కమిటీ ఆధ్వర్యంలో చేపట్టిన అభివృద్ధి, సుందరీకరణ పనులను జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్ర, సబ్కలెక్టర్ మేఘస్వరూప్లతో కలిసి ఆయన పరిశీలించారు. ఈ సందర్బంగా మీడియాతో మాట్లాడుతూ హార్సిలీహిల్స్లో పతంజలి కార్యకలాపాల నిర్వహణపై టూరిజంతో అవగాహన ఒప్పందం చేసుకుంటుందని, భూ కేటాయింపు కావాలని కోరలేదని స్పష్టం చేశారు. టూరిజం నిర్వహణలోని భవనాల్లోనే పతంజలి కార్యకలాపాలు సాగిస్తుందని చెప్పారు. ఒబెరాయ్ సంస్థకు 20 ఎకరాలు కేటాయించామని, ఆ సంస్థ బోర్డ్ ఆఫ్ డైరెక్టర్స్ మీటింగ్లో నిర్ణయం తీసుకున్నాక ఇక్కడ చర్యలు ప్రారంభిస్తారని అన్నారు. ఖరీఫ్ వ్యవసాయం 9.9శాతానికి పరిమితమైందని, భూగర్భజలాలు అడుగంటిపోయిన కారణంగా ప్రత్యామ్నయ చర్యలు చేపడతామని చెప్పారు. తంబళ్లపల్లె నుంచి రైలులో ఢిల్లీకి టమాట తరలించేలా కసరత్తు చేస్తున్నామని చెప్పారు. హార్సిలీహిల్స్పైకి వచ్చే సాధారణ పర్యాటకుల సంఖ్య పెరిగిందని చెప్పారు. మందుబాబుల కట్టడి, పారిశుద్ధ్యంపై చర్యలు కుటుంబాలతో వచ్చే సాధారణ పర్యాటకులకు మందుబాబు కారణంగా ఇబ్బందులు తలెత్తకుండా భధ్రతా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ శ్రీధర్ చెప్పారు. ఐ లవ్ హార్సిలీహిల్స్ బోర్టులోని అక్షరాలను మందుబాబులు ధ్వంసం చేయడంపై అసంతృప్తి వ్యక్తం చేశారు. దీన్ని గాలిబండపై ఏర్పాటు చేసి రోజులు గడవకనే ధ్వంసం చేయడం సరి కాదన్నారు. దీనికోసం నలుగురు సెక్యూరిటీ గార్డులను నియమించి వారితో భద్రత కొనసాగిస్తామన్నారు. పారిశుధ్య పనులకు పది మంది కార్మికుల నియామకం, వాకింగ్ ట్రాక్ నిర్మాణం,వీధిదీపాల కోసం టెండర్లు పిలిచినట్టు చెప్పారు. వీఎస్ఆర్ భవనం అద్దె నెలకు రూ.50వేల నుంచి రూ.1.80 లక్షలకు పెంచామని, రెవెన్యూ అతిథిగృహం నెలకు రూ.1.05 లక్షలకు అప్పగించామని చెప్పారు. కొండపై కొత్తగా నిర్మించిన, ఏర్పాటు చేసిన వాటర్ఫాల్స్, వెల్కం హార్సిలీహిల్స్, ఐ లవ్ హార్సిలీహిల్స్ బోర్డులు, జిడ్డు సర్కిల్, వివేకానంద సర్కిళ్లకు జరుగుతున్న సుందరీకరణ పనులను పరిశీలించారు. తహసీల్దార్ ఎ.బావాజాన్, కమీషనర్ జీవీ.పల్లవి, ఎంపీడీఓ కృష్ణవేణి, ఆర్ఎస్డీటీ బాలాజీ, ఆర్ఐ వీరాంజనేయులు, వీఆర్ఓ జయరామిరెడ్డి, టూరిజం మహేష్ బుజ్జి, ఉద్యోగులు పాల్గొన్నారు. అభివృద్ది పనులు తిలకించిన కలెక్టర్ శ్రీధర్ -
గండికోట డ్యాంలో గుర్తుతెలియని శవం లభ్యం
కొండాపురం : గండికోట ప్రాజెక్టు నీటిలో రైల్వే వంతెన వద్ద గుర్తుతెలియని ఓ యువకుడు శవం బుధవారం లభ్యమైనట్లు కొండాపురం ఎస్ఐ ప్రతాప్రెడ్డి తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు.. మండలంలోని పాత కొండాపురం–ఏటూరు వైపు వెళ్లే పాతదారి వద్ద రైల్వే వంతెన సమీపంలో గండికోట జలాశయం వెనుక జలాల్లో 4.5 అడుగుల గుర్తుతెలియని మృత దేహం కనిపించడంతో గొర్రెల కాపరులు పోలీసులకు సమాచారం అందించారు. వారు చేరుకొని మృత దేహాన్ని బయటికి తీశారు. మృతుడు జీన్స్ ఫ్యాంట్ ధరించాడని, వయస్సు 20 నుంచి 30 సంవత్సరాల మద్య ఉంటుందని పోలీసులు తెలిపారు. వివరాలు తెలిస్తే ఎస్ఐ 9121100612, సీఐ 9121100611 ఫోన్లకు సమచారం ఇవ్వాలని తెలిపారు. -
ఇన్స్ఫైర్ మనక్ ఓరియంటేషన్కు హాజరుకావాలి
రాయచోటి : డివిజనల్ స్థాయి ఇన్స్ఫైర్ మనక్ ఓరియంటేషన్ కార్యక్రమంలో ఉపాధ్యాయులు పాల్గొనాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం కోరారు. అన్నమయ్య జిల్లాలోని మూడు డివిజన్లలో ఇన్స్ఫైర్ మనక్ అవార్డు నామినేషన్లకు సంబంధించి అవగాహన తరగతులు గురువారం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రాయచోటిలోని డైట్, మదనపల్లి, రాజంపేట జెడ్పీ పాఠశాలల్లోనూ శిక్షణా తరగతులు ఉంటాయని, ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్య పాఠశాలల నుంచి ఒక ఉపాధ్యాయుడు ఓరియంటేషన్కు హాజరు కావాలన్నారు. పీజీ కోటాను తగ్గించడం దారుణం ఓబులవారిపల్లె : 2025–26 విద్యా సంవత్సరం నుంచి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో పనిచేస్తున్న డాక్టర్లకు పీజీ కోటాను 20 శాతం నుంచి 15 శాతానికి తగ్గించడం దారుణమని వైద్యాధికారులు గురు మహేష్, డాక్టర్ రాజశేఖర్ అన్నారు. విలేకరులతో వారు మాట్లాడుతూ ఎలాంటి సమాచారం లేకుండా మీడియా ద్వారా నిర్ణయాన్ని తెలియజేయడం ఏమిటని వారు ప్రశ్నించారు. గిరిజన ప్రాంతాలలో పనిచేస్తున్న వైద్యులను ఇది తీవ్రంగా నిరాశకు గురిచేసిందన్నారు. ఈ నిర్ణయం భవిష్యత్తులో మారుమూల గ్రామాలలో పనిచేస్తున్న వైద్యుల సంఖ్యపై ప్రభావితం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వైద్యులను మోసగించిందని, వెంటనే తీసుకున్న నిర్ణయాలు వెనక్కు తీసుకోవాలని వారు కోరారు. ఊయలే.. ఉరితాడై – గొంతుకు బిగుసుకుపోయి బాలిక మృతి జమ్మలమడుగు : సరదాగా ఆడుకునే ఊయలే.. గొంతుకు బిగుసుకుపోయి అరీఫా(9) ప్రాణం తీసింది. అల్లారు ముద్దుగా పెంచుకున్న పాప చనిపోవడంతో ఇంటిల్లిపాదీ కన్నీరు మున్నీరయ్యారు. ఎర్రగుంట్ల పట్టణం వినాయకనగర్ కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను విషాదంలో నింపింది. సీఐ నరేష్బాబు వివరాల మేరకు.. వినాయకనగర్ కాలనీలో నివాసముంటున్న అలీబాషా స్థానిక నాపరాయి గనిలో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. ఈయన కుమార్తె ఆరీఫా పట్టణంలోని ప్రభు త్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. సా యంత్రం స్కూల్నుంచి వచ్చిన ఆరీఫా ఇంట్లో ఎవ రూ లేకపోవడంతో ఊయలతో సరదాగా ఆడుకుంటోంది. ఈ సందర్భంగా చీర ఊయల మెడకు బిగించుకుపోవడంతో ఊపిరాడక మరణించింది. ఇంటికి వచ్చిన కుటుంబ సభ్యులు పాపను చూసి సృహ కో ల్పోయిందని భావించి ఆసుపత్రికి తీసుకుపోయారు. వైద్యులు పరీక్షించి ఆరీఫా మృతిచెందినట్లు ధ్రువీకరించారు. పాప మరణం స్థానికులను కలవరపెట్టింది. -
చేనేతలను విస్మరించిన కూటమి ప్రభుత్వం
ప్రొద్దుటూరు : రాష్ట్రంలో చేనేతలను కూటమి ప్రభుత్వం విస్మరించిందని వైఎస్సార్సీపీ పద్మశాలీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి తెలిపారు. విలేకరులతో బుధవారం ఆమె మాట్లాడుతూ రాష్ట్రంలో లక్ష కుటుంబాలు చేనేత వృత్తిపై ఆధారపడి జీవిస్తున్నాయన్నారు. 2014లో చేనేతలకు చంద్రబాబు ఇచ్చిన 25 హామీలు బుట్టదాఖలు చేశారని విమర్శించారు. 2024 మేనిఫెస్టోలో చేనేతలకు ఉచిత విద్యుత్, జీఎస్టీ ఫ్రీ హామీలిచ్చినా వాటిని అమలు చేయలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అమలుచేసిన అన్ని సంక్షేమ పథకాలను తాము ఇస్తామని హామీ ఇచ్చిన సీఎం చంద్రబాబు ఏడాదిన్నర గడచినా ఇవ్వలేదని విమర్శించారు. ఆప్కోను నిర్వీర్యం చేసి, చేనేత వ్యవస్థను అధఃపాతాళానికి తొక్కారని, వారంతా మళ్లీ ఆత్మహత్యలు చేసుకునేలా ప్రేరేపిస్తున్నారని సీఎం చంద్రబాబుపై ధ్వజమెత్తారు. గత ప్రభుత్వంలో జగనన్న ప్రతి చేనేత కుటుంబానికి రూ.24 వేల చొప్పున ఐదేళ్లు రూ.1,20,000లు వారి ఖాతాల్లో నేరుగా జమ చేశారన్నారు. నేతన్న నేస్తం పథకం ద్వారా రూ.983 కోట్లు ఆర్థిక సాయం అందించారని, కరోనా కష్ట కాలంలోనూ ఈ మొత్తం అందించిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. ఆప్కో వస్త్రాలను అమెజాన్, ఫ్లిప్కార్ట్ సంస్థల ద్వారా పరిచయం చేసి చేనేతలను అగ్రగామిగా నిలిపారని తెలిపారు. వెంకటగిరి, మాధవరం, ధర్మవరం, మంగళగిరి, పెడన వంటి ప్రాంతాల్లో చేనేతలకు రెండు సెంట్ల స్థలాలు ఇచ్చి ఇళ్ల నిర్మాణానికి శంకుస్థాపన చేశారన్నారు. చంద్రబాబు నాయుడు ప్రజలను మోసం చేయకుండా.. ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పద్మశాలీ విభాగం రాష్ట్ర అధ్యక్షురాలు జింకా విజయలక్ష్మి -
సారీ డాడీ క్షమించు...
మదనపల్లె రూరల్ : ‘మీరు నన్ను ఎంతో ప్రేమగా చూశారు.. నేను బాగా చదువుకుని మంచి జాబ్ చేయాలని ఎన్నో కలలు కన్నావు.. కానీ నేను చదువుకోలేకపోతున్నా డాడీ నన్ను క్షమించు’ అంటూ సుసైడ్ నోట్ రాసి తనువు చాలించింది బీటెక్ విద్యార్థిని రెడ్డి శ్రావణి(21). పట్టణంలోని రామారావు కాలనీలో జరిగిన ఈ సంఘటన స్థానికులను కలచివేసింది. పోలీసులు, స్థానికుల వివరాల మేరకు.. కాలనీకి చెందిన వెంకటసుధాకర్, సుగుణ దంపతులకు అశ్వని, ప్రసన్న, శ్రావణి ముగ్గురు కుమార్తెలు. పెద్ద కుమార్తె అవ్వనికి వివాహం కాగా, రెండో కుమార్తె ప్రసన్న బెంగళూరులో ఉద్యోగం చేస్తోంది. మూడో కుమార్తె పులివెందుల జేఎన్టీయూ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతోంది. చేనేత కార్మికుడైన వెంకట సుధాకర్ భార్య సుగుణ ఐదేళ్ల క్రితం మృతి చెందగా కుమార్తెలను కష్టపడి చదివించారు. ఇంట్లో ఒంటరిగా ఉంటున్నాడు. రెండు రోజుల కిందట శ్రావణి వరలక్ష్మీ వ్రతం చేసుకునేందుకు పులివెందుల కాలేజీ నుంచి ఇంటికి వచ్చింది. అదే రోజున తల్లిదండ్రుల ఆశలకు అనుగుణంగా తాను చదువుకోలేకపోతున్నానని సుసైడ్ నోట్ రాసి ఆత్మహత్య చేసుకోవాలని నిర్ణయించుకుంది. బుధవారం ఉదయాన్నే వెంకటసుధాకర్ స్నానం చేసుకుని గుడికి వెళ్లగా, ఇంట్లో ఎవరూ లేకపోవడంతో గదిలోకి వెళ్లి తాడుతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. గుడి నుంచి ఇంటికి తిరిగి వచ్చిన తండ్రి వెంకటసుధాకర్ ఉరికి వేలాడుతున్న కుమార్తెను చూసి హతాశుడయ్యాడు. స్థానికుల సహాయంతో ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించాడు. పరీక్షించిన అత్యవసర విభాగం వైద్యులు అప్పటికే ఆమె మృతి చెందినట్లు నిర్ధారించారు. వెంకట సుధాకర్ ఫిర్యాదుమేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. మళ్లీ జన్మంటూ ఉంటే మీ కూతురిగానే పుడుతా.. సూసైడ్ నోట్ రాసి బీటెక్ విద్యార్థిని ఆత్మహత్య -
థర్మాకోల్ ప్లేట్లలో ఆహారం తింటే ప్రమాదం
చిన్నమండెం : థర్మాకోల్ పేట్లలో ఆహారం తీసుకుంటే ప్రమాదమని ఆహార భద్రతా అధికారి వెంకటరెడ్డి అన్నారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ చిన్నమండెం మండల కేంద్రంలో ఇటీవల పానీపూరీ విక్రయిస్తున్న దుకాణాల్లో థర్మాకోల్ ప్లేటు వాడుతున్న విషయం గమనించి వ్యాపారులను మందలించామని తెలిపారు. వినియోగదారుల నుంచి ఇటీవల ఫిర్యాదులు వసుత్న్నాయని తెలిపారు. జనాల బలహీనతలతో వ్యాపారం చేయకూడదని, మండల వ్యాప్తంగా పానీపూరీ దుకాణాలపై తనిఖీలు చేపట్టామన్నారు. వేడిగా ఉన్న కట్లెట్, పానీపూరీ తదితర ఫాస్ట్ఫుడ్ థర్మాకోల్ ప్లేట్లలో ఇవ్వడం గుర్తించామన్నారు. వాటిలో ఆహారం తీసుకుంటే ప్లాస్టిక్ కణాలు వేడికి ఆహార పదార్థాల్లో కలిసి కడుపులోకి వెళ్తాయని, కాలేయం దెబ్బతిని ఆరోగ్యంపై ప్రభావం చూపుతుందన్నారు. క్రమంగా క్యాన్సర్ బారిన పడే ప్రమాదం ఉందని తెలిపారు. వినియోగదారుల నుంచి ఫిర్యాదులు వస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. స్టీలు పాత్రలే వాడాలని, పానీపూరి తయారీలో నాణ్యత విలువలు పాటించాలని సూచించారు. -
టీడీపీ నేత బీటెక్ రవి బరి తెగిస్తున్నారు. జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో తన సతీమణిని అభ్యర్థిగా నిలబెట్టిన ఆయన గెలుపు కోసం అడ్డదారులు తొక్కుతున్నారు. పచ్చని పల్లెల్లో అల్లకల్లోలం సృష్టిస్తూ విష సంస్కృతికి తెర తీస్తున్నారు. ఆది నుంచి హత్యా రాజకీయాల్నే నమ్ముకున్
సాక్షి టాస్క్ఫోర్స్: టీడీపీ ఇన్చార్జ్ బీటెక్ రవి అరాచకానికి కేరాఫ్ అడ్రస్గా నిలుస్తున్నారు. గతంలో ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు చేసిన ఆయన తాజాగా పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికలు కేంద్రంగా అల్లకల్లోలం సృష్టిస్తున్నారు. భౌతిక దాడులు.. హత్యాయత్నం ఘటనలు వరుసగా తెరపైకి వస్తున్నాయి. తీవ్ర ఘర్షణలు..అల్లర్లు సృష్టించేందుకే నియోజకవర్గ వ్యాప్తంగా కొంతమందిని బ్యాచ్లుగా ఎంపిక చేసి.. ఎంచుకున్న వారిపై హత్యాయత్నానికి కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ● టీడీపీ ఇన్ఛార్జి బీటెక్ రవికి హైటెక్ తెలివితేటలు అధికమని ఆయన సన్నిహితులు వ్యాఖ్యానిస్తుంటారు. అది నిజమని పలుమార్లు రుజువైంది. 2001 స్థానిక సంస్థల ఎన్నికల్లో సింహాద్రిపురం ఎంపీపీగా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కొమ్మా రామలింగారెడ్డి ఎన్నికయ్యారు. ఒకే ఒక ఎంపీటీసీ సభ్యుడి ఆధిక్యతతో ఆయన విజయం సాధించారు. మెజార్టీ సభ్యుడిగా ఉన్న కొమ్మారామలింగారెడ్డి హత్యతో ఎంపీపీ ఖాళీ ఏర్పడితే ఆస్థానం గెలుపొంది చేజేక్కించుకోవచ్చునే ఎత్తుగడను బీటెక్ రవి ప్రయోగించారు. వెరసి ఎంపీపీ కొమ్మా రామలింగారెడ్డి హత్య తెరపైకి వచ్చిందని విశ్లేషకులు వివరిస్తున్నారు. ఆపై ఏర్పడ్డ ఫ్యాక్షన్ నేపధ్యంలో ప్రతీకార హత్యలు లేకపోలేదు. ఇంటి వాస్తు కోసం రోడ్డుకు అడ్డంగా గోడ ఏర్పాటు కసనూరు గ్రామానికి చెందిన బీటెక్ రవి సింహాద్రిపురంలో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు. నూతనంగా నిర్మించుకున్న ఇంటికి పరమడ వైపు రోడ్డు ఉంది. రోడ్డు అడ్డంగా గోడ కట్టారు. కారణమేమంటే వాస్తుకు అనువుగా రోడ్డుకు అడ్డంగా గోడ కట్టేశారు. అటువైపు ఇళ్లున్న వాళ్లంతా గగ్గోలు పెడుతున్నారు. బీటెక్ రవి అనుచరులు దాడులు చేస్తారనే భయం వారిని బాహాటంగా ప్రశ్నించకుండా చేసింది. ఫలితంగా రోడ్డుకు అడ్డంగా గోడ నిర్మించినా చూస్తుండిపోయిన దుస్థితి నెలకొంది. జెడ్పీటీసీ ఎంట్రీలోనూ అదే పరిస్థితి... సింహాద్రిపురానికి చెందిన బీటెక్ రవి తన సతీమణి లతాను పులివెందుల జెడ్పీటీసీగా పోటీ చేయించడం వెనుక పెద్ద వ్యూహమే ఉన్నట్లు తెలుస్తోంది. పులివెందుల పట్టణం, రూరల్లో దందాలు, సెటిల్మెంట్లు మొత్తం వ్యవహారం గుప్పిట్లోకి తెచ్చుకునేందుకు వ్యూహాత్మకంగా అడుగులు వేసినట్లు సమాచారం. స్థానికంగా టీడీపీ నేతలు పోటీకి ఆసక్తిగా ఉన్నా, బీటెక్ రవి తన కుటుంబ సభ్యుల్ని పోటీలో దింపడం వెనుక ఈ ప్రాంతంపై పట్టు సాధించాలనే తపన అధికంగా ఉందని విశ్లేషకులు భావిస్తున్నారు. వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి తుమ్మల హేమంత్రెడ్డి లోకల్. ఇక టీడీపీ అభ్యర్థి మారెడ్డి లత నాన్ లోకల్ అయినప్పటికీ పోటీకి ఆసక్తి చూపడం వెనుక బహుళ ప్రయోజనాలున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. పులివెందుల ప్రశాంతతకు భంగం... ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి బాధ్యతలు చేపట్టిన తర్వాత ఇక్కడి ప్రజలు, రైతులు కక్షలకు దూరంగా ఉండి పూర్తిగా వ్యవసాయం బాటపట్టారు. అందుకు అనువైన పరిస్థితులు మహానేత కల్పించారు. మెట్ట ప్రాంతానికి సాగునీరు వచ్చి చేరింది. ఆదాయం కళ్లు చూడడం, క్రమేపి ప్రశాంత వాతావరణానికి జనాలు అలవాటు పడ్డారు. 2004 నుంచి 2024 వరకూ పులివెందులలో ప్రశాంత వాతావరణం కొనసాగేది. కూటమి అఽధికారంలోకి వచ్చిన తర్వాత ప్రశాంతతకు భంగం ఏర్పడింది. తాజాగా జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో అది మరింత ఎక్కువైంది. మంగళవారం రాత్రి సైదాపురం సురేష్కుమార్రెడ్డి, అమరేష్రెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. బుధవారం మధ్యాహ్నం నల్లగొండుగారిపల్లెలో ఎమ్మెల్సీ రమేష్యాదవ్, వేల్పుల రామలింగారెడ్డి టార్గెట్గా హత్యాయత్నం చేశారు. టీడీపీ మూకలు బరితెగించి గ్రామస్తుల సమక్షంలోనే వేల్పుల రామలింగారెడ్డి హత్యకు విశ్వయత్నం చేశారు. పెట్రోల్ పోసి నిలువునా అంటించడానికి ప్రయత్నించారు. వాహనాలు ధ్వంసం చేశారు. అద్దాలను సమ్మెటతో పగలగొట్టి వాహనంలోకి పెట్రోల్ చల్లారు. తీవ్ర భయాందోళనలు సృష్టించారు. నల్లగొండుగారిపల్లె గ్రామస్తులు అడ్డుగా నిలవడంతో వేల్పుల రామలింగారెడ్డి ప్రాణాలతో బతికిపోయారని ప్రత్యక్ష సాక్షులు వివరిస్తున్నారు. ఇవన్నీ పరిశీలిస్తే అరాచకానికి నిలువెత్తు రూపంగా బీటెక్ రవి నిలుస్తున్నారని విశ్లేషకులు భావిస్తున్నారు. నాడు ఎంపీపీ పదవి కోసం హత్యా రాజకీయాలు! తాజాగా పులివెందులలో ఎంట్రీలోనూఇదే సంస్కృతికి బీజం పట్టణ ప్రశాంతత కలుషితం అవుతోందనిప్రజాస్వామ్యవాదుల ఆవేదన లోకల్ నాయకులకు అవకాశం ఇవ్వకుండా రంగప్రవేశం వెనుక అతి పెద్ద స్కెచ్ -
హంద్రీ–నీవాలో అక్రమ ప్రమోషన్లు!
మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండో దశ మదనపల్లె సర్కిల్–3 పరిధిలో జరిగిన అక్రమ ఉద్యోగ నియామకాలు, అక్రమ పదోన్నతుల వ్యవహారం వెలుగులోకి వచ్చింది. దీనిపై జలవనరులశాఖ ఈఎన్సీ ఆగ్రహం వ్యక్తం చేస్తూ చర్యలు తీసుకోవాలని, బాధ్యులైన వారిపై నివేదిక పంపాలని మదనపల్లె ఎస్ఈకి రెండు మెమోలు జారీ చేశారు. ఏపీఈఎస్ఎస్ నిబంధనల షెడ్యూల్ ప్రకారం టెక్నికల్ అసిస్టెంట్ ఉద్యోగ నియామకానికి అవసరమైన అర్హత కోసం ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ నిర్వహించే ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్ మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో ఉత్తీర్ణత సాధించాలి. నియామకాలు, బదిలీలు, పదోన్నతులను పరిగణలోకి తీసుకునేటప్పుడు సర్వీసు నియామకాల జీవో, ప్రభుత్వ సూచన లను పాటించాలని స్పష్టమైన ఆదేశాలను ప్రభుత్వం జారీ చేసింది. అయితే ప్రాజెక్టు ఉన్నతాధికారులు ఈ నిబంధనలు, జీవోలను తుంగలో తొక్కారు. ఇవేమి తమకు పట్టవని పక్కన పడేశారు. చేయాల్సింది చేసేశాక ఇప్పుడు మెమోలు జారీ అవుతున్నా వాటిని డొంట్ కేర్ అంటున్నారు. అక్రమ ప్రమోషన్ల వివరాల్లోకి వెళితే.. మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలో పనిచేస్తున్న ఓ మహిళా ఉద్యోగి డిప్లొమా (ఈసీఈ)తో టెక్నికల్ అసిస్టెంట్గా నియమితులయ్యారు. 2013 మార్చిన ఏడున ఆమెకు టెక్నికల్ అసిస్టెంట్ నుంచి జూనియర్ టెక్నికల్ ఆఫీసర్గా పదోన్నతి కల్పించారు. తర్వాత 2022 జూలై ఒకటిన జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ నుంచి టెక్నికల్ ఆఫీసర్గా మరోసారి పదోన్నతి పొందారు. పదోన్నతులు పొందిన తర్వాత దీనికి అవసరమైన అర్హత కలిగిన విద్యను దూర విద్య ద్వారా అభ్యసించేందుకు అనుమతి కోరుతూ ఉన్నతాధికారులకు నివేదించడంతో అక్రమ పదోన్నతుల వ్యవహారం పసిగట్టారు. దీంతో గతంలోనే ఎస్ఈలకు సర్కులర్ మెమోలను ఈఎన్సీ అధికారులు జారీ చేశారు. అక్రమ నియామకాలపై గతంలో మెమోలు ఇచ్చినా ఎందుకు మౌనంగా ఉండి ఇప్పటిదాకా కొనసాగిస్తున్నారని ఈ ఏడాది ఏప్రిల్ 24, జూలై 21న జారీ చేసిన మెమోల్లో ఎస్ఈని ఈఎన్సీ ప్రశ్నించారు. 14 ఏళ్ల తర్వాత ఎస్ఈ ఆ మహిళా ఉద్యోగి ఇప్పుడు డ్రాఫ్ట్స్మ్యాన్ ఐటీఐ విద్య అభ్యసించేందుకు అనుమతి ప్రతిపాదనలను..అక్రమ పదోన్నతులపై ఎలాంటి వివరణ ఇవ్వకుండా పంపడంపై విస్మయం వ్యక్తం చేసిన ఈఎన్సీ జూలై 21న జారీ చేసిన మెమోలో మహిళ ఉద్యోగికి అక్రమ పదోన్నతులు కల్పించిన అధికారుల పేర్లతో వివరాలు పంపాలని ఆదేశించారు. మరో ముగ్గురికి పదోన్నతులు మహిళా ఉద్యోగికి కట్టబెట్టిన పదోన్నతులతో సరిపెట్టని ఉన్నతాధికారులు సర్కిల్ పరిధిలో పని చేస్తున్న మరో ముగ్గురు ఉద్యోగులకు ఇదే విధంగా అక్రమ పదోన్నతులు కల్పించారు. మదనపల్లె సర్కిల్ పరిధిలోని కుప్పం డివిజన్లో పని చేస్తున్న బ్లూ ప్రింటర్ ఆపరేటర్లు వై.చెన్నయ్య, కే.అబ్బిరెడ్డెయ్య, కదిరి డివిజన్లో పని చేస్తున్న పి.ఖాదర్బాషాల విద్యార్హత ప్రకారం పదోన్నతులు కల్పించాలి. అయితే అధికారులు ఇవేమి పట్టించుకోలేదు. వీరు పదోన్నతులు పొందాలంటే..నిబంధనల ప్రకారం ట్రేడ్ టెస్ట్ (డ్రాఫ్ట్స్మ్యాన్) సివిల్ లేదా మెకానికల్ కోర్సులో అర్హత సాధించి ఉండాలి. అయితే దీన్ని పట్టించుకోని అధికారులు ముగ్గురికి టెక్నికల్ అిసిస్టెంట్లుగా పదోన్నతులు కల్పించారు. ఈ పదోన్నతులను పసిగట్టిన ఈఎన్సీ మదనపల్లె ఎస్ఈకి జూలై 8న మెమో జారీ చేశారు. ఈ ముగ్గురి పదోన్నతులపై ఇంతవరకు చర్యలులేవు. వీరికి పదోన్నతులు ఎలా ఇచ్చారు, దీనికి బాధ్యులైన అధికారులు ఎవరు, వారి వివరాలు, సమ్రగ నివేదిక పంపాలంటూ మెమోలో కోరారు. ఏం జరుగుతోంది? బాధ్యులైన వారిపై నివేదిక ఇవ్వాలనిమెమోలిచ్చినా పట్టించుకోని అధికారులు అర్హత లేకున్నా టెక్నికల్ అసిస్టెంట్లుగాఎలా ఇచ్చారని ఈఎన్సీ ఆగ్రహం హంద్రీ–నీవా ప్రాజెక్టు కార్యాలయ పరిధిలో అక్రమ పదోన్నతుల వ్యవహరం వెలుగులోకి రావడంతో అసలు కార్యాలయంలో ఏం జరుగుతోందన్న చర్చ మొదలైంది. మదనపల్లె సర్కిల్–3 కార్యాలయం పరిధిలో సత్యసాయిజిల్లా ధర్మవరంలో డివిజన్–10, కదిరిలో డివిజన్–9, 10, కర్నూలుజిల్లా ఎమ్మిగనూరులో గురురాఘవేంద్ర ప్రాజెక్టు–2, కుప్పం డివిజన్–12లతోపాటు సర్కిల్ కార్యాలయం నడుస్తున్నాయి. దీనితో ఎక్కడెక్కడో ఉన్న కార్యాలయాల్లో ఇంకా ఇలాంటి అక్రమ ప్రమోషన్లు, బదిలీ జరిగాయా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. చర్యలు చేపట్టాం ఈఎన్సీ ఇచ్చిన మెమోలపై అక్రమ పదోన్నతుల వ్యవహరంపై చర్యలు మొదలు పెట్టినట్టు ఎస్ఈ విఠల్ ప్రసాద్ సాక్షికి చెప్పారు. కోరిన మేరకు ఈఎన్సీకి నివేదించడంతో పాటు, తీసుకోవాల్సిన చర్యలపై దృష్టి పెట్టామని చెప్పారు. -
మున్సిపల్ కమిషనర్గా రవి
రాయచోటి: రాయచోటి మున్సిపల్ కమిషనర్గా జి రవి నియమితులయ్యారు. స్థానికంగా పనిచేస్తున్న కమిషనర్ వాసుబాబును నెల్లూరు మున్సిపల్ కార్పొరేషన్కు బదిలీ చేశారు. ఆయన స్థానంలో విజయవాడలో మున్సిపల్ డైరెక్టర్ కార్యాలయంలో పనిచేస్తున్న జి రవిని బదిలీపై ఇక్కడ నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. బాధ్యతల స్వీకరణ రాజంపేట: రాజంపేట సబ్కలెక్టర్గా హెచ్ఎస్ భావన బుధవారం బాధ్యతలు స్వీకరించారు. సబ్ కలెక్టరేట్కు ఆమె వచ్చిన సందర్భంగా అధికారులు, సిబ్బంది పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. ఇక్కడ పనిచేసిన వైకోమానైదియాదేవిని బదిలీ చేశారు. ఈమె స్ధానంలో భావనను ప్రభుత్వం నియమించింది. ● బాధ్యతలు తీసుకున్న అనంతరం సబ్కలెక్టర్ భావన రాయచోటి లోని కలెక్టరేట్ చాంబర్లో జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్నుమర్యాదపూర్వకంగా కలిశారు. ● బదిలీ అయిన సబ్కలెక్టర్ వైకోమానైదియాదేవిని కలెక్టరేట్ సిబ్బంది సన్మానించి, వీడ్కోలు పలికారు. అయితే ఈమెకు ఇంకా పోస్టింగ్ ఇవ్వలేదు. పరిపాలనాధికారి శ్రీధర్, సబ్కలెక్టరేట్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. నిత్యాన్నదానానికి విరాళం రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి ఆలయంలో నిర్వహించే నిత్యాన్నదాన కార్యక్రమానికి కన్నడ భక్తుడు రూ.1,00,000 విరాళం సమర్పించారు. కర్నాటక రాష్ట్రం ఆహార భద్రత శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప ఆయన భార్య నాగరత్నమ్మలు నెల రోజుల క్రితం లక్కిరెడ్డిపలె శ్రీ మాతంగి పీఠం నిర్మించేందుకు వచ్చినపుడు శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఇక్కడ నిర్వహించే నిత్యాన్నదానం కోసం విరాళం అందిస్తానని చెప్పారు. ఆయన ప్రతినిధితో రూ.1లక్ష స్కాన్ ద్వారా స్వామి వారి ఖాలో జమ చేశారు. ఈ మొత్తం ద్వారా వచ్చిన వడ్డీతో ప్రతి సంవత్సరం ఆయన జన్మదినం రోజున భక్తులకు అన్నదానం కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. -
ఆధ్యాత్మిక క్షేత్రంలో ఎన్నికల కోలాహలం!
సాక్షి రాయచోటి: ఆధ్యాత్మిక క్షేత్రం..భక్తులతో అలరాలే ఏకశిలానగరంలో రాజకీయ కోలాహలం కనిపిస్తోంది. ప్రధానంగా వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి గెలుపు లక్ష్యంగా పార్టీ నేతలు పావులు కదుపుతున్నారు. ఎక్కడికక్కడ చర్చలు...గెలుపునకు అవసరమైన వ్యూహాలు...ప్రత్యర్థి వర్గాల ద్వారా ఓట్లు రాబట్టేందుకు అవసరమైన ప్రణాళికలతో సాగుతున్నారు.నామినేషన్లతో పాటు పరిశీలన, ఉపసంహరణ ముగియడంతో అభ్యర్థులంతా ప్రచారంపై దృష్టి సారించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రచారంలో దూసుకుపోతోంది. పార్టీలోని పలువురు కీలక నేతలంతా వచ్చి ప్రచారంలో పాల్గొంటూ అభ్యర్థి సుబ్బారెడ్డికి మద్దతుగా కదం తొక్కుతున్నారు. ● వైఎస్సార్ కడపజిల్లాలోని ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి సంబంధించి వైఎస్సార్ సీపీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా బుధవారం రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్రెడ్డి, మాజీ డిప్యూటీసీఎం అంజద్బాషా, వైఎస్సార్ సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, కడప నగర మేయర్, అన్నమయ్య జిల్లా పార్లమెంట్ పరిశీలకులు సురేష్బాబు, కడప పార్లమెంట్ పరిశీలకులు కొండూరు అజయ్రెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి, వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతోపాటు కడప డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, సోషల్ వెల్ఫేర్ బోర్డు మాజీ చైర్మన్ పులి సునీల్కుమార్, రాష్ట్ర కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, గిడ్డంగుల సంస్థ మాజీ డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. బుధవారం సాయంత్రం నరవకాటిపల్లెలో ఇరగంరెడ్డి సుబ్బారెడ్డికి మద్దతుగా ఎంపీ మేడా రఘునాథరెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గొల్లపల్లి, దర్జిపల్లి గ్రామాల్లో బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డితోపాటు బద్వేలు నియోజకవర్గ నాయకులు ప్రచారంలో పాల్గొని వైఎస్సార్ సీపీ అభ్యర్థిని దీవించాలని కోరారు. పార్టీ శ్రేణులతోపాటు నాయకులు, కార్యకర్తలు బాణసంచా పేలుస్తూ డప్పు వాయిద్యాల నడుమ ప్రచారం కొనసాగించారు. పులివెందుల, ఒంటిమిట్టల్లో గెలుపు తథ్యం ఒంటిమిట్టతోపాటు పులివెందుల జెడ్పీటీసీ స్థానాల్లో వైఎస్సార్ సీపీ గెలుపు తథ్యమని, దీనిని ఎవరూ ఆపలేరని పార్టీ కీలక నేతలు ఉద్ఘాటించారు.బుధవారం ప్రచారంలో భాగంగా పాల్గొన్న అనంతరం వారు మాట్లాడారు. పులివెందుల, ఒంటిమిట్ట జడ్పీటీసీ స్థానాలను వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కై వసం చేసుకుంటుందని విశ్వాసం వ్యక్తం చేశారు. పులివెందులలో ఎన్ని అరాచకాలు సృష్టించినా ఏమి చేయలేరని...పోలీసులు కూడా పక్షపాత ధోరణి విడనాడాలని వారు హితవు పలికారు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 14 నెలలవుతున్నా ప్రజలకు ఏ ఒక్క హామీని అమలు చేయలేకపోయిందని, ప్రజలు ఎటువంటి పథకాలూ అందుకోవడం లేదని విమర్శించారు. ప్రజలు ఈ ఉపఎన్నికలో తమ ఓటుతో ప్రభుత్వం పాలనపై గట్టి సమాధానం చెబుతారని తెలిపారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయానికి మద్దతు ఇవ్వాలని నాయకులు కోరారు. ● ఒంటిమిట్టలోని శ్రీ కోదండ రామాలయంలో బుధవారం పలువురు వైస్సార్ సీపీ నేతలు ప్రత్యేక పూజలు నిర్వహించారు.ప్రచార పర్వంలో భాగంగా పార్టీ నేతలు తొలుత స్వామి వారిని దర్శించకున్నారు. పార్టీ నేతలకు అర్చకులు సాదర స్వాగతం పలికి తీర్థ ప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. పులివెందులలో దాడి హేయం: ఇరగంరెడ్డిఒంటిమిట్ట: వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలోని నల్లగొండువారిపల్లెలో వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై జరిగిన దాడి హేయమైన చర్య అని ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి అన్నారు. బుధవారం ఉప ఎన్నిక ప్రచారం అనంతరం ఆయన విలేకర్లతో మాట్లాడారు. పులివెందుల జెడ్పీటీసీ ఎన్నికలో టీడీపీకి ఓటమి భయం పట్టుకుందన్నారు. దాని పర్యవసానమే ఎమ్మెల్సీ రమేష్ యాదవ్పై దాడులు జరగడానికి కారణమన్నారు. టీడీపీ గూండాలు దాడి చేసినా రక్తం చిందించి వైఎస్సార్సీపీని గెలిపించుకుంటామన్నారు. ఒంటిమిట్టలో వైఎస్సార్సీపీ కీలక నేతల ఇంటింటి ప్రచారం -
నిత్యపూజ స్వామి తలనీలాల వేలం పాట
సిద్దవటం: శ్రీ నిత్యపూజ స్వామికి భక్తులు సమర్పించుకునే తలనీలాల వేలం పాటను వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన నాగయ్య రూ. 5.10 లక్షలకు దక్కించుకున్నారని ఈఓ శ్రీధర్ తెలిపారు. సిద్దవటం మండలం వంతాటిపల్లె గ్రామ సమీపంలోని లంకమల్ల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజస్వామి ఆలయంలో తలనీలాల హక్కు కోసం మంగళవారం సిద్దవటంలోని శ్రీ రంగనాథస్వామి ఆలయంలో ఉదయం 11 గంటలకు బహిరంగ వేలం పాటను నిర్వహించారు. ఈ వేలం పాటలో ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు, కమలాపురం, కడప, సిద్దవటం ప్రాంతాలకు చెందిన ఆరుగురు పాటదారులు పాల్గొన్నారని ఈఓ తెలిపారు. అలాగే ఆలయ ఆవరణలో తాత్కాలిక షాప్లకు నిర్వహించిన వేలం పాటను సిద్దవటం ఎగువపేటకు చెందిన కూనా విజయభాస్కర్ రూ.1,43,000 దక్కించుకున్నారని పేర్కొన్నారు. కార్యక్రమంలో రాజంపేట దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ జనార్దన్, ఆలయ సిబ్బంది చంద్ర తదితరులు పాల్గొన్నారు. కొనసాగుతున్న వర్షాలు కడప అగ్రికల్చర్: అల్పపీడనం కారణంగా వైఎస్ఆర్ కడప జిల్లాలో వర్షాలు కొనసాగుతున్నాయి. ఇందులో భాగంగా మంగళవారం కొండాపురంలో అత్యధికంగా 20.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అలాగే సింహాద్రిపురంలో 10.6 మి.మీ, లింగాలలో 9.2, జమ్మలమడుగులో 4.2, మైలవరంలో 3.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. -
ఉప పోరు.. ప్రచార జోరు
ముగిసిన నామినేషన్ల ఉపసంహరణ ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రచారం జోరందుకుంది. ఆ పార్టీ నాయకులు గ్రామాల్లోకి ఎక్కడికి వెళ్లినా.. ప్రజలు బ్రహ్మరథం పడుతున్నారు. మంగళవారం మండల పరిధిలోని సాలాబాదు, గంగపేరూరు గ్రామాలో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, కడప మేయర్ సురేష్ బాబు, కోడురు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డిలు అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి తో కలిసి జెడ్పీటీసీ ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా గ్రామాల్లో ఇంటింటికి వెళ్లి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, ఇరగంరెడ్డిని గెలిపించాలని అభ్యర్థించారు. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..అధికారంలోకి వచ్చిన వెంటనే మహిళలకు ఉచిత బస్సును ఏర్పాటు చేస్తామని చెప్పి, తీరా అధికారం చేజిక్కించుకున్న తరువాత అదిగో.. ఇదిగో..అంటున్న ఈ కూటమి ప్రభుత్వానికి ఇరగంరెడ్డి గెలిపు ఒక గుణపాఠం కావాలన్నారు. ● రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి మాట్లాడుతూ..అందరికి అనువుగా ఉండే రాజధాని అమరావతి అంటూ..కొద్ది పాటి వర్షాలకే నీట మునిగిపోయే ప్రాంతాన్ని రాజధానిగా చేసి, ప్రజలకు అందివ్వాల్సిన సంక్షేమ పథకాల నిధులన్నీ రాజధానికి దోచి పెడుతున్న సీఎం చంద్రబాబుకు ఈ ఎన్నిక చెంపపెట్టుకావాలన్నారు. – – బద్వేల్ ఎమ్మెల్యే దాసరి సుధా మాట్లాడుతూ..ఉన్నత చదువు చదివిన యువతకు 20 లక్షల ఉద్యోగాలు కల్పిస్తామని హామీలు ఇచ్చి నిరుద్యోగ యువతను మోసం చేస్తున్న మోసపూరిత ప్రభుత్వానికి సుబ్బారెడ్డి గెలుపు గుణపాఠం కావాలన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ.. బీసీలకు 50 సంవత్సరాలకే నెలకు రూ. 4 వేల పెన్షన్ ఇస్తానన్న సీఎం చంద్రబాబు హామీ నెరవేర్చకపోవడంతో బీసీల ఆశలు అవిరయ్యాయి. ఇలాంటి సాధ్యం కాని హామీలు ఇచ్చిన కూటమి ప్రభుత్వం ఎంతో కాలం ఉండదన్న నిజం ఈ ఉప ఎన్నికతో నిరుపించాలన్నారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మాట్లాడుతూ..చేనేత కార్మికులకు ఉచితంగా ఇస్తానన్న 200 యూనిట్ల కరెంటును కూడా ఇంతవరకు అమలు చేయకపోవడం కూటమి ప్రభుత్వం చేతకాని పాలనకు నిదర్శనం, ఇలాంటి అసమర్ధత ప్రభుత్వానికి ఓటు అనే అయుధంతో బుద్ధి చెప్పాలన్నారు. ● కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ.. దేవాలయాల్లో పనిచేసే నాయీ బ్రహ్మాణులకు ఇస్తానన్న రూ. 25 వేల గౌరవ వేతనం ఇస్తామంటూ ఆశ కల్పిస్తున్నారన్నారు. అలాంటి ఆశలను చూపే వారికి మనం ఓటుతో బుద్ధి చెప్పాలన్నారు. ● కోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో బీసీలకు ఇస్తానన్న 34 శాతం రిజర్వేషన్ కూడా ఇవ్వకుండా కూటమి నేతలు మోసాలు చేస్తున్నారు. వారికి బీసీల విలువ తెలియాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీ అభ్యర్థికి ఓటు వేయాలన్నారు. ● ఎమ్మెల్సీ గోవిందరెడ్డి మాట్లాడుతూ..మెగా డీఎస్సీ అని కేవలం 16 వేల ఉద్యోగాలకు నోటిఫికేషన్ జారీ చేసి, మెగా డీఎస్సీ అని కోతలకు పోతున్న ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అధికారంలోకి వచ్చిన ఏడాదికే 2 లక్షల 50 వేల ఉద్యోగాల ఇచ్చిన సంగతిని గుర్తు చేయాలంటే ఈ ఉప ఎన్నికలో వైఎస్సార్సీపీకి ఓటు వేయాలన్నారు ● రాయచోటి మాజీ ఎమ్మెల్యే రమేష్ రెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికల సమయంలో ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అది వైఎస్సార్సీపీకే సాధ్యమన్నారు. కానీ కూటమి నాయకులు హామీలను చిత్తశుద్ధితో అమలు చేయడం లేదన్నారు. అలాంటి వారికి ప్రజల చిత్తశుద్ది అంటే ఏమిటో ఈ ఉప ఎన్నికల్లో రుచి చూపాలన్నారు. ● జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి మాట్లాడుతూ..సీఎం చంద్రబాబు హామీలు..మోసాలకు నిలయాలని, అలాంటి మోసాలు చేసిన కూటమి ప్రభుత్వానికి ఉప ఎన్నికలో బుద్ధి చెప్పాలన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, అన్నమయ్య జిల్లా ఉపాధ్యక్షురాలు అజంతమ్మ, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, ఒంటిమిట్ట మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, సాలాబాదు సర్పంచ్ స్వర్ణలత, ఉప సర్పంచ్ వెంకటేశ్వరరెడ్డి, గంగపేరూరు సర్పంచ్ కూండ్ల బుజ్జమ్మ, వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షులు మేరువ శివనారాయణ వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి, ముమ్మడి వెంకటకృష్ణారెడ్డి, లంకారామిరెడ్డి, గంగిరెడ్డి పాల్గొన్నారు. సాక్షి రాయచోటి: ఎన్నికలు జరుగుతున్న రెండు మండలాల్లో ఎన్నో ఏళ్లుగా ఏకఛక్రాదిపత్యమే కొనసాగుతోంది. ఆది నుంచి కూడా వైఎస్ కుటుంబానికి కంచుకోటలుగా ఉండడమేగాక, ఆ కుటుంబం బలపరిచిన అభ్యర్థులే గెలుపుబావుటా ఎగురవేస్తూ వస్తున్నారు. అభ్యర్థి ఎవరైనా కులమతాలు, వర్గాలు బేధం చూడకుండా ఓటర్లు గెలుపును ఏకపక్షం చేస్తూ వస్తున్నారు. దివంగత సీఎం వైఎస్సార్ హయాం నుంచి ఇప్పటివరకు 25 ఏళ్ల చరిత్రను పరిశీలించినా పులివెందులతోపాటు ఒంటిమిట్టలోనూ కాంగ్రెస్, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులే విజయఢంకామోగిస్తూ వస్తున్నారు. టీడీపీ కుట్రలు...కుయుక్తులు వైఎస్సార్ జిల్లాలోని ఒంటిమిట్ట మండలానికి సంబంధించి జెడ్పీ చైర్మన్గా ఆకేపాటి అమర్నాథరెడ్డి కొనసాగుతూ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గం నుంచి వైఎస్సార్సీపీ అభ్యర్థిగా పోటీ చేసి గెలుపొందారు. ఈ నేపథ్యంలో ఒంటిమిట్ట జెడ్పీటీసీతోపాటు జెడ్పీ చైర్మన్ పదవికి రాజీనామా చేయడంతో ఒంటిమిట్ట ఉప ఎన్నిక అనివార్యమైంది. అలాగే పులివెందులకు సంబంధించి గతంలో జెడ్పీటీసీగా పనిచేస్తున్న మహేశ్వర్రెడ్డి మృతి చెందడంతో అక్కడ కూడా ఎన్నిక తప్పనిసరిగా మారింది. ఈ నేపథ్యంలో రెండుచోట్ల బలంగా ఉన్న వైఎస్సార్ సీపీని ఢీ కొట్టలేక అధికారంలో ఉన్న కూటమి సర్కార్ కుట్రలు, కుతంత్రాలు, కుయుక్తులతోపాటు దాడులకు తెగబడుతోంది. పోలీసుల ద్వారా బైండోవర్ పేరుతో వైఎస్సార్ సీపీ నేతలను భయపెట్టడం ఒక ఎత్తయితే, మరోవైపు వైఎస్సార్ సీపీ నాయకులపై ప్రత్యక్ష దాడులకు దిగుతూ భయాందోళనలు సృష్టిస్తున్నారు. ప్రశాంతంగా ఉన్న ప్రాంతాల్లో కూడా అలజడులు సృష్టించి క్యాడర్ను ఆందోళనలకు గురి చేయాలని చూస్తున్నారు. ఏదో ఒక రకంగా వైఎస్సార్ సీపీ శ్రేణులను భయబ్రాంతులకుగురి చేయాలన్న సంకల్పంతో టీడీపీ పులివెందులలో వికృత చేష్టలకు తెర తీయడంపై పలువురు రాజకీయ విశ్లేషకులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. వైఎస్సార్ సీపీ కీలక నేతల ప్రచారం జిల్లాలోని పులివెందుల మండలంలో వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి హేమంత్రెడ్డికి మద్దతుగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాద్రెడ్డి ఫ్రచారం నిర్వహిస్తుండడంతో సందడి వాతావరణం నెలకొంది. మరోవైపు ఒంటిమిట్ట మండలానికి సంబంధించి వైఎస్సార్ సీపీ జెడ్పీటీసీ అభ్యర్థిగా ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి పోటీ చేస్తున్న నేపథ్యంలో ఆయనకు మద్దతుగా జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, కడప నగర మేయర్ సురేష్బాబు, ఎమ్మెల్యే డాక్టర్ సుధ, ఎమ్మెల్సీ రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి తదితరులు ప్రచారంలో పాల్గొంటున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ కీలక నేతలు గ్రామాల్లో ముమ్మరంగా ప్రచారం చేస్తుండడంతో మరోవైపు టీడీపీ కూడా ప్రచారం చేస్తోంది. వేడెక్కిన రాజకీయం జిల్లాలో రెండు జెడ్పీటీసీలకు సంబంధించి ఎన్నికలు జరుగుతుండడంతో రాజకీయం వేడెక్కింది. ఈ ఎన్నికలను టీడీపీ అధిష్ఠానం సీరియస్గా తీసుకుని అధికార బలాన్ని ఇష్టారాజ్యంగా వాడుకుంటున్నారు. ఇన్చార్జి మంత్రి సవిత పులివెందులలో కూర్చొని మంత్రాంగం నడిపిస్తుండగా, ఒంటిమిట్టలో మంత్రి రాంప్రసాద్రెడ్డి ఎక్కడికక్కడ పావులు కదుపుతున్నారు. జెడ్పీటీసీ లాంటి చిన్నపాటి ఎన్నికలను కూడా అధికారంలోకి కూటమి సర్కార్ ప్రతిష్టాత్మకంగా తీసుకుని పరువు కాపాడుకునేందుకు అవసరమైన చర్యలు చేపట్టడం గమనార్హం. ఎన్నికల నేపథ్యంలో పోలీసు యంత్రాంగాన్ని వినియోగించడం మొదలుకొని ఏదో రకంగా మంత్రులు అక్కడే మకాం వేసి ప్రత్యేకంగా కృషి చేస్తున్న తీరును చూసి పలువురు విస్మయం చేస్తున్నారు. ఒంటిమిట్ట టీడీపీ అభ్యర్థిగా ముద్దు కృష్ణారెడ్డి ఒంటిమిట్ట: ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికకు సంబంధించి టీడీపీ అభ్యర్థిగా అడ్డలూరు ముద్దు కృష్ణారెడ్డి పేరును మంగళవారం అధిష్టానం ప్రకటించింది. దీంతో మధ్యాహ్నం 3 గంటలకు కడప జెడ్పీ కార్యాలయంలో పార్టీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్ మోహన్ రాజుతో కలిసి ముద్దుకృష్ణారెడ్డి సీఈఓ ఓబులమ్మ చేతులు మీదుగా బీ–ఫారం అందుకున్నారు. కడప సెవెన్రోడ్స్: ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు జరగనున్న ఎన్నికలకు సంబందించిన నామినేషన్ల ఉపంసహరణ మంగళవారం మధ్యాహ్నం 3 గంటలకు ముగిసింది. పులివెందుల స్థానానికి 12 మంది, ఒంటిమిట్ట స్థానానికి 21 మంది తొలుత నామినేషన్లు సమర్పించారు. ఉపసంహరణల అనంతరం ఒంటిమిట్టలో 11 మంది, పులివెందులలో 11 మంది బరిలో ఉన్నారు. ఒంటిమిట్టలో.. ఒంటిమిట్ట జెడ్పీటీసీ స్థానానికి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), పూల విజయభాస్కర్ (కాంగ్రెస్), ముద్దుకృష్ణారెడ్డి (తెలుగుదేశం పార్టీ), అరిగేల సౌమిత్రి చంద్రనాథ్, కోనేటి హరి వెంకట రమణ, గుండు మల్లికార్జునరెడ్డి, టక్కోలి శివారెడ్డి, నడివీధి సుధాకర్, వై.మధుమూర్తి, మామిళ్ల ఈశ్వరయ్య, వెంకటేశ్ నంద్యాల స్వతంత్రులుగా పోటీలో ఉన్నారు. పులివెందులలో.. పులివెందుల స్థానానికి తుమ్మల హేమంత్రెడ్డి (వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ), మారెడ్డి లతారెడ్డి (తెలుగుదేశం పార్టీ) మొయిళ్ల శివ కల్యాణ్రెడ్డి (కాంగ్రెస్), అంకిరెడ్డి సురేష్కుమార్రెడ్డి, తుమ్మనూరు అనిల్కుమార్రెడ్డి, నాగేళ్ల సాంబశివారెడ్డి, భూమిరెడ్డి రవీంద్రారెడ్డి, మారుజోళ్ల గజేంద్రనాథ్రెడ్డి, మారెడ్డి జయభారత్రెడ్డి, ముద్దిగారి వెంగళరెడ్డి, యాదటి సునీల్యాదవ్ స్వతంత్య్ర అభ్యర్థులుగా రంగంలో ఉన్నారు. తిరుగులేని ఆధిక్యం ముమ్మరంగా ఎన్నికల ప్రచారం ఆది నుంచి వైఎస్ కుటుంబం బలపరిచిన వారిదే గెలుపు పులివెందుల, ఒంటిమిట్టల్లోనూ 25 ఏళ్ల చరిత్రలో విజయం ఏకపక్షం అధికారం అండగా..కుట్రలకు తెర తీస్తున్న టీడీపీ నామినేషన్లు, పరిశీలన, ఉపసంహరణ ముగియడంతో వేడెక్కిన రాజకీయం వైఎస్సార్ కడపజిల్లాలోని ఒంటిమిట్ట, పులివెందుల జెడ్పీటీసీ స్థానాలకు సంబంధించి ఏళ్ల చరిత్రను పరిశీలిస్తే ప్రతిసారి తిరుగులేని ఆధిక్యత వైఎస్సార్ కుటుంబం బలపరిచిన అభ్యర్థులదే కనిపిస్తోంది. దాదాపు 25 ఏళ్లలో పలు దఫా లుగా జరిగినా ప్రతి ఎన్నికలోనూ అటు కాంగ్రెస్ (వైఎస్సార్ హయాంలో), తర్వాత క్రమంలో వైఎస్సార్ సీపీ అభ్యర్థులు విజయఢంకా మోగిస్తూ వస్తున్నారు. ఎప్పుడు చూసినా ప్రజలు కూడా నమ్మకానికి, విశ్వాసానికి ప్రతీకగా నిలుస్తున్న వైఎస్సార్ కుటుంబం వైపే మొగ్గుచూపుతున్నారు. వర్గాలు, వైషమ్యాలు, రాజకీయాలను పక్కనపెట్టి ఓటర్లు కూడా వైఎస్సార్ కుటుంబం ఎవరికి మద్దతు ఇస్తే వారినే గెలిపిస్తూ తమ అభిమానాన్ని చాటుకుంటూ వస్తున్నారు. ఒంటమిట్ట బరిలో 11 మంది పులివెందులలో 11 మంది -
నేడు మినీ ఉద్యోగమేళా
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో ఈ నెల 6వ తేదీన మినీ ఉద్యోగమేళాను నిర్వహించనున్నారు. ప్రముఖ కంపెనీ అయిన కడపకు చెందిన షిర్డీ సాయి ఎలక్ట్రికల్ లిమిటెడ్ వారు ట్రైనీ క్వాలిటీ ఎగ్జిక్యూటివ్, ట్రైనీ సూపర్వైజర్, హెచ్ఆర్ ట్రైనీ ఎగ్జిక్యూటివ్ ఉద్యోగాలకు ఇంటర్వ్యూలు నిర్వహించనున్నారు. ఆసక్తి గల నిరుద్యోగులు ఒరిజినల్ సర్టిఫికెట్లతో ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని నిర్వాహకులు తెలియజేశారు. ఉద్యోగంలో చేరిన వారు ఐదు సంవత్సరాల బాండ్ ఇవ్వాల్సి ఉంటుందని, అందుకు సమ్మతించినవారు మాత్రమే హాజరు కావాలని చెప్పారు. ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా గుర్తింపు కురబలకోట: రాష్ట్రంలో ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాలగా అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలకు గుర్తింపు లభించిందని యూనివర్సిటీ ప్రతినిధి యువరాజ్ మంగళవారం తెలిపారు. ఇండియన్ సొసైటీ ఫఽర్ టెక్నికల్ ఎడ్యుకేషన్ వారు ఉత్తమ ఇంజినీరింగ్ కళాశాల అవార్డుకు ఎంపిక చేసినట్లు తెలిపారు.అదే విధంగా ఈ కళాశాల విద్యార్థిని కాగిత భార్గవికి రాష్ట్ర ఉత్తమ ఎలక్ట్రికల్ ఎలక్ట్రానిక్స్ ఇంజినీరింగ్ విద్యార్థినిగా, బీటెక్ విద్యార్థి కార్తీక్ కోవికి ఉత్తమ కంప్యూటర్ సైన్స్ విద్యార్థిగా అవార్డులు దక్కినట్లు తెలిపారు. వాట్సాప్ గవర్నెన్స్ ద్వారా ప్రభుత్వ సేవలు నందలూరు: దేశంలోనే మొదటిసారిగా రాష్ట్ర ప్రభుత్వం మన మిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ సేవలను అందుబాటులోకి తెచ్చిందని జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్పిళ్లై, ఎంపీడీఓ రాధాకృష్ణన్ పేర్కొన్నారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి మేజర్ గ్రామ పంచాయతీ కార్యాలయం నుంచి ప్రజల చేతిలో ప్రభుత్వ వాట్సాప్ గవర్నెన్స్ సేవలపై మంగళవారం ర్యాలీ నిర్వహించారు. అనంతరం సచివాలయంలో నిర్వహించిన పీ–4 గ్రామసభలో వారు మాట్లాడుతూ మనమిత్ర వాట్సాప్ గ్రూప్ ద్వారా ప్రభుత్వ పథకాల గురించి ప్రజల్లోకి తీసుకెళ్లడానికి వీలుగా ఉంటుందని అన్నారు. వాట్సాప్ నంబర్ 95523 00009 ద్వారా 200 పథకాల గురించి అవగాహన కల్పించాలని సచివాలయ సిబ్బందికి తెలియజేశారు. నాగిరెడ్డిపల్లె, నందలూరు సచివాలయాల్లో ఇప్పటి వరకు 100 బంగారు కుటుంబాలను గుర్తించినట్లు తెలిపారు. నాగిరెడ్డిపల్లె పంచాయతీ కార్యదర్శి బండ్ల సురేష్కుమార్, వెంకటరమణ, వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. రుణ ప్రణాళికపై అవగాహన వీరబల్లి్: రుణ ప్రణాళికలపై స్వయం సహాయక సంఘాలకు అవగాహన కల్పించాలని జిల్లా గ్రామీణాభివృద్ధి సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ బండి సత్యనారాయణ తెలిపారు. మంగళవారం స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రతి మహిళా తమ జీవనోపాధుల ఏర్పాటుకు ఎంతో రుణం కావాలని, దానికి సంబంధించిన వివరాలు యాప్లో బయోమెట్రిక్ ద్వారా నమోదు చేయనున్నట్లు చెప్పారు. వివరాలన్నీ బ్యాంకు మేనేజర్ లాగిన్కు వెళ్తాయన్నారు. సంఘం ద్వారా తీసుకున్న అన్ని లావాదేవీలు ఆన్లైన్ ద్వారా వెళ్తాయని తెలిపారు. పలు విషయాలపై సిబ్బందికి సూచనలు, సలహాలు ఇచ్చారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్లు వెంకటరమణ, లీగల్ కో–ఆర్డినేటర్ ఆనందబాబు, స్థానిక ఏపీఎం ఖాదర్ వల్లి, సీసీఎల్ కృష్ణయ్య, సుధాకర్, గంగాధర్, నాగేంద్ర తదితరులు పాల్గొన్నారు. ప్రతిష్టాత్మకంగా పీ4 అమలు రాయచోటి: పీ–4 కార్యక్రమాన్ని జిల్లాలో పటిష్టంగా అమలు చేసేందుకుచర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ ఈనెల 19 నుంచి పీ– 4 అమలుకు ప్రభుత్వం నిర్ణయించిందని తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా బంగారు కుటుంబాలకు మెరుగైన తోడ్పాటు ఇచ్చేందుకు ఉద్యమ స్ఫూర్తితో ముందుకెళ్లాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో పేదరిక నిర్మూలన కోసం బంగారు కుటుంబాలుగా నమోదైన వారికి చేయూతను ఇవ్వడం కోసం ఆగస్టు 15లోగా మార్గదర్శకుల నమోదు పూర్తి చేయాలన్నారు. అనంతరం వివిధ అంశాలకు సంబంధించి పలు సూచనలు కలెక్టర్ జారీ చేశారు. -
ప్రభుత్వ స్థలం.. పరాధీనం
● టీడీపీ నాయకుడి భూ బాగోతం ● క్రీడామైదానానికి కేటాయించిన భూమి ఆక్రమణ ● కలెక్టర్కు ఫిర్యాదు చేసినాఫలితం శూన్యం టాస్క్ఫోర్స్: అన్నమయ్యజిల్లా రాజంపేటలో అధికారం అండగా టీడీపీ శ్రేణులు భూ ఆక్రమణలకు తెరతీస్తున్నారు. తమను ఎవరు ఏమి చేయలేరన్న ధైర్యం..అడిగేవారు లేరన్న ధీమాతో టీడీపీ నాయకులు అడ్డదారులకు రాచబాట వేసుకొని వెళుతున్నారు. ఇప్పటికే భూములు, స్థలాలు, మద్యం, ఇసుక, మట్టి వంటివాటిని దోచేస్తున్నారు. రాజంపేట పరిధిలో భూములు కోట్లాది రూపాయిలు విలువ చేస్తున్న తరుణంలో తెలుగు తమ్ముళ్లు సులువుగా కోటీశ్వర్లు అయ్యేందుకు ప్రణాళికలు వేసుకున్నారు. ఖాళీ జాగా వేసేయ్ పాగా అన్నచందంగా భూకబ్జాల పర్వం కొనసాగుతోది. పేద ప్రజలు ఏమాత్రం విలువ చేయని ప్రాంతంలో రెండు సెంట్ల ప్రభుత్వ స్థలంలో చిన్నపాటి గుడిసె వేసుకున్నా అధికారులు ఆగమేఘాల మీద చర్యలకు ఉపక్రమిస్తారు. అయితే రాజంపేట మండలంలో కూటమి నాయకులు కోట్లాది రూపాయిల విలువ చేసే భూములు, స్థలాలు కబ్జాచేస్తున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలావుంటే.. రాజంపేట మండలంలోని మిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్ 1066లో చుండువారిపల్లెలో ఉన్న ఎస్టీ ఆశ్రమ పాఠశాలకు సంబంధించిన నాలుగు ఎకరాల క్రీడామైదానాన్ని మండలంలోని అదే గ్రామానికి చెందిన చుండు సుధీర్ దర్జాగా ఆక్రమించుకున్నాడు. ప్రస్తుతం ఆ ప్రాంతంలో ఎకరా భూమి మార్కెట్ విలువ ప్రకారం నాలుగు కోట్ల రూపాయిల వరకు ఉన్నట్లు ఆ పరిసర ప్రాంతాలకు చెందిన ప్రజలు చెబుతున్నారు. ఆమేరకు నాలుగు ఎరకాల స్థలం దాదాపు 16 కోట్ల రూపాయిల విలువ చేస్తుంది. ఆక్రమించుకున్న భూమిలో సుధీర్ భవనం నిర్మించుకోవడంతో పాటు పలు రకాల పండ్ల చెట్లను కూడా దర్జాగా సాగు చేసుకుంటున్నాడు. ఎస్టీ విద్యార్థుల సౌకర్యార్థం కేటాయించిన స్థలం కావడం వల్లే తనను ఎవరు అడగరన్న ధీమాతో సుధీర్ భూ ఆక్రమణకు తెగబడినట్లు తెలుస్తోంది. క్రీడామైదానం కోసం కేటాయించిన స్థలాన్ని దర్జాగా ఆక్రమించుకున్న విషయాన్ని జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదులు అందాయి. అయినా అధికారులు అటువైపు కన్నెత్తి కూడా చూసేందుకు సాహసం చేయడం లేదంటే అధికార పార్టీ నాయకుల దౌర్జన్యాలు ఏస్థాయిలో ఉన్నాయో అర్థం చేసుకోవచ్చు. చుండు సుధీర్ తెలుగుదేశం పార్టీ మండల అధ్యక్షుడు గన్నే సుబ్బనరసయ్యనాయుడుకు ముఖ్య అనుచరుడిగా ఉంటుండటం వల్ల అధికారులకు కొంతమంది ఫిర్యాదులు చేస్తున్నా పట్టించుకోవడం లేదన్న విమర్శలు వినిపిస్తున్నాయి. జిల్లా కలెక్టర్, ఇతర అధికారులకు ఫిర్యాదుమిట్టమీదపల్లె పొలం సర్వే నంబర్లోని 1066 సర్వే నెంబర్లో నాలుగు ఎకరాల భూమిని చుండు సుధీర్ కబ్జా చేసినట్లు అదే పంచాయితీలోని కొమ్మివారిపల్లె అరుంధతివాడకు చెందిన గొంటు మణి తెలిపాడు. ఈ ఏడాది మార్చి నెలలో రెండుమార్లు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో సుధీర్ భూకబ్జాపై ఫిర్యాదు చేశానని, దాదాపు ఐదు నెలలు అయినా ఏ అధికారి కూడా ఈ భూమిని కనీసం చూడను కూడా లేదని మణి ఆరోపించాడు. -
విషగుళికలు తిని వ్యాపారి ఆత్మహత్య
ప్రొద్దుటూరు : పట్టణంలోని బాక్రాపేట వీధికి చెందిన వేరుశనగకాయల వ్యాపారి ఉండేల పెద్ద ఓబుళరెడ్డి (55) విష గుళికలు తిని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పట్టణ శివారులోని కంపోస్టు యార్డులో పెద్ద ఓబుళరెడ్డి వేరుశనగ మిల్లు నిర్వహిస్తున్నాడు. పలువురు వ్యాపారుల వద్ద వేరుశనగ కాయలు తెచ్చి వ్యాపారం సాగించాడు. అప్పుల భారంతో మంగళవారం ఉదయం తన మిల్లులోనే విష గుళికలు మింగాడు. పరిస్థితి విషమించడంతో అతనిని స్థానిక హోమస్ పేటలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పెద్ద ఓబుళరెడ్డి మృతి చెందాడు. ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న సమయంలో ఆయన తనపై జరిగిన దాడి సంఘటనను పెన్నుతో చేతిలో రాసుకున్నట్లు గుర్తించారు. ఆయనకు భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుమార్తెలకు వివాహం చేశారు. ఈ మేరకు రూరల్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
ఓటమి భయంతోనే వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు
కడప కార్పొరేషన్ : పులివెందుల జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో ఓటమి తప్పదని భావించి వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు బనాయిస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి ఆరోపించారు. జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో మంగళవారం ఆయన మాట్లాడుతూ ఇటీవల టీడీపీలో చేరిన పులివెందుల మండల ఉపాధ్యక్షుడు విశ్వనాథరెడ్డిని వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శివశంకర్రెడ్డి, ఎంపీ వైఎస్.అవినాష్రెడ్డి పీఏ రాఘవరెడ్డిలు పార్టీలోకి రావాలని సముదాయించేందుకు ప్రయత్నించారన్నారు. భాస్కర్రెడ్డి ఫోన్ చేస్తే విశ్వనాథరెడ్డి ఫోన్ ఎత్తలేదని.. ఈ మాత్రానికే బెదిరించినట్లు కేసుపెట్టడం దారుణమన్నారు. వైఎస్.భాస్కర్రెడ్డి, దేవిరెడ్డి శంకర్రెడ్డిల బెయిల్ రద్దు చేయాలని సీబీఐని కోరుతామని టీడీపీ పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి, పులివెందుల నియోజకవర్గ టీడీపీ ఇంచార్జ్ బీటెక్ రవి మాట్లాడటాన్ని బట్టి చూస్తే వారి కుట్ర బయటపడుతోందన్నారు. ఆచ్చివెళ్లి ఎస్సీ కాలనీకి చెందిన వారిని బలవంతంగా టీడీపీలో చేర్చుకున్రాని దళితులు చెబితే ఎందుకు కేసు నమోదు చేయలేదని ప్రశ్నించారు. శాంతియుతంగా ఇంటింటి ప్రచారం చేస్తుంటే ఓటమి భయంతో టీడీపీ నేతలు అక్రమ కేసులకు తెరతీశారన్నారు. ఈకార్యక్రమంలో షేక్ షఫీ, బి.సుబ్బరాయుడు, ఎన్.వెంకటయ్య, తదితరులు పాల్గొన్నారు. -
అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు అవకాశం
కడప కార్పొరేషన్ : జిల్లాలోని అన్ని పంచాయితీలలో అనధికార లే అవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అవకాశం కల్పించిందని జిల్లా పంచాయితీ అధికారి జి.రాజ్యలక్ష్మి ఓ ప్రకటనలో తెలిపారు. విక్రయ ఒప్పందం లేదా హక్కు పత్రంతో ఉన్న అనధికార లే అవుట్కు 90 రోజుల్లో వ్యక్తిగతంగా రెగ్యులైజేషన్ స్కీం(ఎల్ఆర్ఎస్)కు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. ఆగష్టు 4వ తేదీ నుంచి ఎల్ఆర్ఎస్ వెబ్సైట్ ఓపెన్లో ఉంటుందన్నారు. ఓపెన్ స్పేస్ చార్జీలు 45 రోజుల్లో పూర్తిగా చెల్లిస్తే పది శాతం, 90 రోజుల్లో చెల్లిస్తే 5 శాతం పెనాల్టీ తగ్గింపు ఉంటుందన్నారు. ఇప్పటికే ఐపీఎల్పీ ఆమోదింపబడిన దరఖాస్తులకు ప్రాధాన్యం ఇవ్వబడుతుందని, కొత్తగా వచ్చిన దరఖాస్తులను తక్షణం పరిష్కరించడం జరుగుతుందన్నారు. వివరాలకు 9849966639 నంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. -
పోలీస్ శిక్షణా కేంద్రం పరిశీలించిన ఎస్పీ
కడప అర్బన్ : కడప శివారులోని పోలీస్ శిక్షణా కేంద్రాన్ని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్ మంగళవారం పరిశీలించారు. స్టైఫెండరీ క్యాడెట్ ట్రైనీ పోలీస్ కానిస్టేబుళ్ల(స్సీటీపీసీ)కు శిక్షణ ప్రారంభం కానున్న నేపథ్యంలోడీటీసీ పరిసర ప్రాంతాలు, మౌలిక వసతులు, బ్యారక్లు, కిచెన్, జిమ్, తరగతి గదులు, పరేడ్ గ్రౌండ్ను చూసి త్వరితగతిన శిక్షణకు పూర్తి ఏర్పాట్లు చేసుకోవాలని సూచించారు. అనంతరం శారీరక శిక్షణ, పరేడ్ ప్రాక్టీస్, ఇతర శిక్షణ కార్యక్రమాలకు ఉపయోగపడే మైదానం, క్లాస్ రూమ్స్, రన్నింగ్ ట్రాక్, పరేడ్ గ్రౌండ్స్, డ్రిల్ ఏరియా, బాటిల్ అబ్స్టాకల్స్ను పరిశీలించి సిబ్బందికి తగు సూచనలు చేశారు. శిక్షణ కేంద్రంలో వసతి సదుపాయాలు ఏర్పాటుచేసుకోవాలని, మౌలిక వసతుల ఏర్పాటుకు ప్రత్యేక శ్రద్ధ అవసరమని పేర్కొన్నారు. డీటీసీ డీఎస్పీ అబ్దుల్కరీం, డీటీసీ ఇన్స్పెక్టర్ ఎస్.వినయ్కుమార్రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
నా భర్తను బతికించండి..
రాయచోటి టౌన్ : తమను ఎవరైనా ఆదుకొంటారని...తన భర్తకు ప్రాణబిక్ష పెడతారనే కొండం ఆశతో ఎదురు చూస్తోంది...వెంకటసుబ్బమ్మ అనే మహిళ....? నా అనే వారు ఎవరూ లేక మంచానికే పరిమితమైన భర్త కోసం..పిల్లలను ఎలాగైనా చదివించాలనే తపన... వెరసి కొండంత భారాన్ని మోస్తోంది. ఆమెను కదిలిస్తే కన్నీళ్లు పర్యంతమవుతాయి. ఆమె మాటల్లోనే...నా భర్త పేరు సుబాష్చంద్ర బోస్...మే ము రాయచోటి పట్టణంలోని కొత్తపేటలోని నాలుగు కుళాయీల సమీపంలో కాపురం ఉంటున్నాము. నా భర్త సుబాష్ చంద్రబోస్ (గతంలో వివిధ పత్రికలలో రిపోర్టర్గా పనిచేశాడు) ఫర్టిలైజర్ మేనేజర్గా పనిచేస్తూ వచ్చే డబ్బుతో జీవనం సాగించేవాళ్లం. మాకు కుమార్తె మౌనిక, కుమారుడు ధరణీధర్ ఉన్నారు. మా సంసారం సాఫీగా సాగిపోతున్న సందర్భంలో మే 16వతేది జరిగిన రోడ్డు ప్రమాదం ఒక్కసారిగా మా కాపురాన్ని రోడ్డున పడేసింది. చిన్నమండెం మండలం కేశాపురం వద్ద నా భర్త స్కూటర్పై వస్తుండంగా ఒక కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తలకు హెల్మెట్ ధరించడంతో గాయాలు కాలేదు కానీ.. కాళ్లు, నడుము భాగం పూర్తిగా విరిగిపోయింది. పరిస్థితి విషమంగా ఉండటంతో రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చి డాక్టర్లను సంప్రదిస్తే తిరుపతికి రెపర్ చేశారు. అక్కడ పలు ఆస్పత్రులలో చికిత్స చేయించినా ఎలాంటి ప్రయోజనం లేదు. అనంతరం ఏలూరు ఆస్పత్రికి వెళ్లమన్నారు. అక్కడ 11 యూనిట్ల రక్తం ఎక్కించారు. పది రోజుల తరువాత ఆపరేషన్ చేసి కుడికాలు తొడభాగంలో కండ తీసి ఎడమ కాలుకు ఆపరేషన్ చేశారు. నడుము విరిగిపోవడంతో స్టీల్ రాడ్ బిగించారు. అప్పటికే రూ.15లక్షలు మంచినీళ్లప్రాయంగా అయిపోయాయి. దొరికినకాడికిల్లా... తీసుకొచ్చి ఖర్చుపెట్టినా ఎలాంటి ప్రయోజం కనిపించడంలేదు. మంచానికే పరిమితమై ద్రవపదార్థాలు మాత్రమే ఇస్తున్నాం. కనీసం ఒక వైపు కదలలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేసినా వారు పట్టించుకోలేదు. మా ఫిర్యాదు తీసుకోలేదు. కేసు నమోదు చేసి ఉంటే మాకు ఎంతో కొంత న్యాయం జరిగుండేది. ఇప్పుడు కుటుంబాన్ని పోషించడానికి చేతిలో చిల్లిగవ్వ లేదు. పాప ఇంటర్ ఎంపీసీ పూర్తిచేసి ఎంసెట్ కౌన్సిలింగ్కు వెళ్లాలని ఉన్నా చదివించే స్థోమత లేక ఆపేశాం. బాబు పదో తరగతి పాసయ్యాడు. విజయవాడలో ఉన్నాడు. వాడిని మాన్పించాలనే ఆలోచనలో ఉన్నాం. మందులు కొనుక్కోవడానికి పది రూపాయలు లేక చాలా ఇబ్బంది పడుతున్నాం. ఇరుగు పొరుగువారు చేసే సాయంతో కాలం వెళ్లదీస్తున్నాం. దాతలు సహాయం చేసి తిరిగి నా భర్తను బ్రతికిస్తే చాలు...వారికి రుణపడి ఉంటాం. దాతల సహకారం.... సుభాష్చంద్రమోబోస్ కుటుంబానికి రాయచోటి జర్నలిస్టులు రూ.13 వేల ఆర్థిక సహాయం అందించగా, రాయచోటి జిన్నా సేవా సంస్థ యజమాని రూ.10 వేలు ఆర్థిక సహాయం చేసి అంబులెన్స్ సమకూర్చారు. భవిష్యత్తుల్లో మరింత సహాయసహాకాలు అందిస్తానని వారికి హామీ ఇచ్చారు. వారి కుటుంబానికి ఆర్థికంగా సహకరించే వారు ఫోన్ నంబర్ 9618218655కు ఫోన్ పే ద్వారా ఆర్థిక సహాయం అందిచాల్సిందిగా వారు కోరారు. ఆదుకోవాలంటూ భార్య కంటతడి ప్రమాదంలో గాయపడి మంచానికి పరిమితమైన భర్త పిల్లల చదువు మాన్పించిన తల్లిదండ్రులు -
యోగాతోనే ఏకాగ్రత, మానసిక ప్రశాంతత సాధ్యం
కడప ఎడ్యుకేషన్ : మానసిక ఒత్తిడి నుంచి బయటపడి శారీరక దృఢత్వంతోపాటు మానసిక ప్రశాంతత, ఏకాగ్రత పొందేందుకు విద్యార్థులకు యోగా ఔషధం లాగా పనిచేస్తుందని విద్యాశాఖ రాష్ట్ర డిప్యూటీ డైరెక్టర్ దేవరాజు అన్నారు. వృత్యంతర శిక్షణలో భాగంగా కడప నగర శివారులోని గ్లోబర్ ఇంజినీరింగ్ కళాశాలలో కేజీబీవీల ఉపాధ్యాయులకు మంగళవారం యోగాపై అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా దేవరాజు మాట్లాడుతూ ఉపాధ్యాయినులు యోగాపై అవగాహన పెంచుకుని కేజీబీవీ విద్యార్థినులకు నేర్పించాలన్నారు. సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కోఆర్డినేటర్ నిత్యానందరాజు మాట్లాడుతూ యోగా నిర్వహించడంతో శారీరక, ఆరోగ్య సమస్యలకు పరిష్కారం దొరుకుతుందన్నారు. అనంతరం యోగా ట్రైనర్ శ్రీలక్ష్మి ఉపాధ్యాయినులకు యోగాపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో అకడమిక్ మానిటరింగ్ ఆఫీసర్ వీరేంద్ర, అసిస్టెంట్ స్టాటికల్ ఆఫీసర్ సంజీవరెడ్డి, అఖిల్, అనూష, వింధ్యారాణి, తదితరులు పాల్గొన్నారు. -
ఫుట్బాల్ బాలికల విజేత వైఎస్సార్ జిల్లా
మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే విద్యార్థులకు మంచి భవిష్యత్తు ఉంటుందని మదనపల్లె డీఎస్పీ మహేంద్ర అన్నారు. మండలంలోని పోతోబోలు వేదా పాఠశాలలో నిర్వహించిన రాష్ట్ర స్థాయి సబ్ జూనియర్స్ పుట్బాల్ పోటీల్లో విజేతలకు మంగళవారం బహుమతుల ప్రదానం జరిగింది. రాష్ట్రస్థాయి సబ్ జూనియర్స్ బాలికల ఫుట్బాల్ పోటీల్లో ఫైనల్స్లో విన్నర్స్గా వైఎస్సార్ కడప జిల్లా నిలిచింది. రన్నర్స్గా అనంతపురం, తృతీయ స్థానంలో అన్నమయ్య జిల్లా నిలిచాయి. విజేతలకు బహుమతులు అందించిన అనంతరం డీఎస్పీ మాటాల్డుతూ విద్యార్థి స్థాయి నుంచి క్రీడలపై ఆసక్తి పెంచుకోవాలని, ఎంచుకున్న క్డ్రీడలో ప్రతిభ కనబరిస్తే ఉన్నతస్థాయికి చేరుకునే అవకాశాలున్నాయని తెలిపారు. ఆటల్లో గెలుపు, ఓటములు సహజమని రెండింటినీ సమానంగా తీసుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దిలీప్కుమార్, కార్యదర్శి మురళీధర్, కోచ్లు హరి, పవన్, సుబ్రహ్మణ్యం, శ్రీనివాసులు, సురేష్, ఉమాదేవి, కమలేష్, అంజనప్ప, బాలాజీ పాల్గొన్నారు. -
డిగ్రీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్ : ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర ఉన్నత విద్యామండలి ఖరారు చేసిన షెడ్యూల్ మేరకు 2025–26 విద్యా సంవత్సరానికిగానూ ప్రథమ సంవత్సరం డిగ్రీ కోర్సులలో ప్రవేశాల కొరకు దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు కడప ప్రభుత్వ పురుషుల కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ ఆగష్టు 18వ తేదీ నుంచి కళాశాలలో రిజిస్ట్రేషన్లు మొదలవుతాయని తెలిపారు. జిల్లాలో, జిల్లా బయట ఇంటర్మీడియట్ లేదా తత్సమాన కోర్సు పూర్తి చేసిన విద్యార్థినీ, విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. ఆగష్టు 21 నుంచి 23వ తేదీ వరకు ప్రత్యేక కేటగిరీ పత్రాల పరిశీలన, 21 నుంచి 24వ తేదీవరకు కళాశాలల ఎంపికకు వెబ్ ఆప్షన్ల నమోదు, 25వ తేదీ వరకు వెబ్ ఆప్షన్ల మార్పుకు అవకాశం ఉంటుందన్నారు. కళాశాల బోధన, బోధనేతర సిబ్బందిచే విద్యార్థుల కోసం కళాశాలలో సహాయ కేంద్రం ఏర్పాటుచేసినట్లు తెలిపారు. దరఖాస్తు చేసుకున్న విద్యార్థులకు ఆగష్టు 27న సీట్లను కేటాయిస్తారని, 28వ తేదీ నుంచి తరగతులు ప్రారంభిస్తారని తెలిపారు. -
విద్యార్థిని అదృశ్యంపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలోని ఎస్టీ కాలనీకి చెందిన సు భాషిణి ఈ నెల 2వ తేదీ నుంచి కనిపించలేదని బంధువు గుర్రమ్మ ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. గుర్రమ్మ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి.. ఎస్టీ కాలనీకి చెందిన సుభాషిణి టక్కోలు జెడ్పీ హైస్కూల్లో ఎనిమిదో తరగతి చదువుతోంది. ఈ నెల 2వతేదీ పాఠశాల ముగిసిన తరువాత ఆమె ఇంటికి రాలేదని బంధువులు తెలిపారు. తమ బంధువు కు బాగాలేదంటూ నమ్మించి వరుసకు మేనమా మ అయిన వ్యక్తి ద్విచక్ర వాహనంలో తీసుకెళ్లాడ ని వారు తెలిపారు. బాలిక బంధువు గుర్రమ్మ ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసుకొని విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. భార్యాభర్తలపై దాడి మదనపల్లె రూరల్ : స్థల వివాదం, వ్యక్తిగత కక్షలతో భార్యాభర్తలపై దాడిచేసిన ఘటన మంగళవారం కురబలకోట మండలంలో జరిగింది. నందిరెడ్డిగారిపల్లెకు చెందిన భార్యాభర్తలు అబ్దుల్బాషా(27), అమ్మాజాన్(22)లపై అదే ప్రాంతానికి చెందిన మహబూబ్బాషా, చాంద్బాషా, నన్నీబీలు దాడికి పాల్పడ్డారు. దాడిలో భార్యాభర్తలు గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మున్సిపల్ ఉద్యోగిపై దాడి కేసులో ఇద్దరి అరెస్ట్ మదనపల్లె రూరల్ : మున్సిపల్ ఫిట్టర్గా పనిచేస్తున్న సుధాకర్పై దాడి చేసిన సంఘటనలో ఇద్దరిని అరెస్టు చేసినట్లు వన్టౌన్ ఎస్ఐ వెంకట శివకుమార్ తెలిపారు. కుమారపురానికి చెందిన రాజా(46), నిమ్మనపల్లె మండలం బండ్లపై పంచాయతీ భూమలగడ్డకు చెందిన ప్రదీప్(30)లను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. కేసులో మరో నిందితుడైన రవిని అరెస్ట్ చేయాల్సి ఉందన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టిన లారీ రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి–మదనపల్లె రోడ్డులో విద్యుత్ స్తంభాన్ని లారీ ఢీకొన్న సంఘటనలో పెనుప్రమాదం తప్పింది. విద్యుత్ శాఖ అధికారులు, స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మదనపల్లె రోడ్డు మార్గంలో ఏపీ39యువై 4126 నెంబర్ లారీ అతివేగంగా వచ్చి 11 కెవీ విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి సమీపంలోని ఇంటి ముందు ఆగిపోయింది. ఈ ప్రమాదంలో పోల్ మొత్తం పూర్తిగా డ్యామేజ్ అయింది. స్పందించిన విద్యుత్తు సిబ్బంది హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకొని ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సరఫరా నిలిపివేశారు. విద్యుత్ సరఫరాను పునరుద్ధరించి ప్రజలకు ఎటువంటి ఆటంకం కలగకుండా చేశారు. సకాలంలో స్పందించడంతో ఎలాంటి ప్రాణ, ఆస్థి నష్టం జరగలేదని అధికారులు తెలిపారు. -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన షకీలా(35) కూలి పనులు చేస్తూ జీవిస్తోంది. భర్త లేకపోవడంతో కుటుంబాన్ని పోషించుకుంటూ ఒక కుమార్తెకు వివాహం చేసింది. ఈ క్రమంలో రెండురోజుల కిందట ఇంటికి వచ్చిన కుమార్తెతో కుటుంబ సమస్యలపై మంగళవారం గొడవపడింది. అనంతరం మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పురిటి బిడ్డకు పునర్జన్మసుండుపల్లె : మండల కేంద్రంలోని ప్రాథమిక వైద్యశాలలో 11 రోజుల పురిటి బిడ్డకు ప్రాణం పోశాడు డాక్టర్ దిలీప్ గుప్తా. వివరాలలోకి వెళ్లితే.. రాయవరం గ్రామంలో 11 రోజుల చిన్న బిడ్డకు స్నానం చేయిస్తున్న సమయంలో పొరపోయింది. వెంటనే ఊపిరితిత్తుల్లోకి నీరు చేరడంతో ఊపిరాడక ప్రాణాపాయస్థితిలో బిడ్డ అల్లాడిపోయింది. తల్లిదండ్రులు వెంటనే పాపను సుండుపల్లె ప్రభుత్వాసుపత్రికి తీసుకురాగా.. అక్కడ విధులు నిర్వహిస్తున్న డాక్టర్ దిలీప్ గుప్తా, ఫర్హాఖానం వైద్యం అందిచారు. బిడ్డ ప్రాణాలను కాపాడి పునర్జన్మ ప్రసాదించారు.తల్లిదండ్రులు వైద్యులకు కృతజ్ఞతలు తెలిపారు. 8న అండర్–22 క్రీడల పోటీలుకడప వైఎస్ఆర్ సర్కిల్ : జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురష్కరించుకొని శాప్ అదేశాల మేరకు ఈ నెల 8న అండర్–22 టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడల అభివృద్ధి అధికారి కె.జగన్నాథరెడ్డి తెలిపారు. డాక్టర్ వైఎస్ క్రీడా పాఠశాలలో అర్చరీ, హాకీ వెయిట్ లిప్టింగ్(అన్ని విభాగాలు) పోటీలు, డీఎస్ఏ స్టేడియంలో అథ్లెటిక్స్, బాడ్మింటన్, బాక్సింగ్, బాస్కెట్బాల్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ పోటీలు జరుగుతాయన్నారు. ప్రతి విభాగంలో విజేతగా నిలిచి ఎంపికై న జట్టు తిరుపతిలో ఈ నెల 11వతేదీ నుంచి 14వ తేదీ వరకు జరగనున్న జోనల్స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందన్నారు. అర్హులైన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. బెల్డ్ షాపులపై పోలీసుల దాడులు లింగాల : మండలంలోని గుణకణపల్లెలో బెల్టు షాపులపై పోలీసులు దాడులు నిర్వహించారు. గ్రామానికి చెందిన లోమడ శ్రీనివాసులు ఇంట్లో సోదాలు నిర్వహించి 12 అక్రమ మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకున్నారు. శ్రీనివాసులును అరెస్టు చేశామని హెడ్ కానిస్టేబుల్ రాజు తెలిపారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు భారతి విద్యార్థి ఎంపిక
కమలాపురం : మండలంలోని నల్లలింగాయపల్లెలోని డీఏవీ భారతి పాఠశాలకు చెందిన పదో తరగతి విద్యార్థి ఎంవీ.నరేష్ రాష్ట్ర స్థాయి జావెలిన్ త్రో పోటీలకు ఎంపికై నట్లు ప్రిన్సిపల్ శివ్వం కిషోర్కుమార్ తెలిపారు. విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ భారతి సిమెంట్ కార్పోరేషన్ ప్రైవేట్ లిమిటెడ్లోని డీఏవీ భారతి పాఠశాల విద్యార్థులు ఈ నెల 3న ప్రొద్దుటూరు మున్సిపల్ గ్రౌండ్లో జరిగిన జిల్లా స్థాయి అథ్లెటిక్ పోటీల్లో పాల్గొన్నారు. జావెలిన్త్రోలో నరేష్ ప్రతిభ కనబరిచి ప్రథమ స్థానంలో నిలిచారు. ఈ నెల 9వ తేదీ నుంచి 11వతేదీ వరకూ బాపట్లలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో నరేష్ పాల్గొంటారని ప్రిన్సిపల్ తెలిపారు. ఈ సందర్భంగా పరిశ్రమ సీఎంఓ సాయిరమేష్, హెచ్ఆర్ హెడ్ గోపాల్రెడ్డి, ఐఆర్అండ్పీఆర్ హెచ్.భార్గవ్ రెడ్డి, డీఏవీ ప్రాంతీయ అధికారి శేషాద్రి విద్యార్థితో పాటు పీడీ రామచంద్రను అభినందించారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తలపై దాడి
నందలూరు : మండలంలోని చింతకాయపల్లి గ్రామంలో ఆదివారం రాత్రి వైఎస్సార్సీపీ, టీడీపీ నాయకులు రేషన్షాపు మార్పిడి విషయమై ఘర్షణ పడ్డారు. ప్రభుత్వం మాది మేము చెప్పినట్లే వినాలంటూ టీడీపీ నాయకులు వైఎస్సార్సీపీ నాయకుడు చింతకాయల ఎల్లయ్యపై దాడి చేశారు. దాడిని అడ్డుకోబోయిన చింతకాయల నరసింహులుపై కత్తితో దాడి చేయగా తలకు తీవ్ర గాయమైంది. చింతకాయల శేషాద్రిపై రాడ్తో దాడి చేయడంతో భుజానికి తీవ్రంగా గాయమైంది. క్షతగాత్రుడిని హుటాహుటిన రాజంపేట ప్రభుత్వాసుపత్రికి బంధువులు తరలించారు. వైఎస్సార్సీపీ నాయకులపై దాడి చేసిన చుక్కా నీలేష్, చుక్కా కొండయ్య, చుక్కా చంద్ర, చుక్కా శశిధర్, చుక్కా మణెమ్మ, చుక్కా వెంకటేష్, చుక్కా చంద్రలపై పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ సంఘటనపై ఇరువర్గాలపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. -
బాధితులకు సత్వర న్యాయం అందించండి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే అర్జీలను నిర్ణీత గడువులోపు సత్వరం పరిష్కరించాలని జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో సోమవారం ప్రజల నుంచి ఎస్పీ అర్జీలు స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను ముఖాముఖిగా అడిగి తెలుసుకున్నారు. వృద్ధులు, దివ్యాంగులు, మహిళలకు సంబంధించిన ఫిర్యాదులపై సత్వరం స్పందించి పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం వడ్డిపల్లి గ్రామానికి చెందిన బత్తల సుబ్బమ్మ (70) తన సమస్యను చెప్పుకునేందుకు ఎస్పీ కార్యాలయానికి వచ్చారు. ఎస్పీ ఆమె వద్దకే వెళ్లి సమస్య విన్నారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదును క్షుణ్ణంగా పరిశీలించి చట్టపరిధిలో వృద్ధురాలి సమస్యను పరిష్కరించాలని లక్కిరెడ్డిపల్లి ఎస్ఐను ఆదేశించారు.పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ -
నల్ల తుమ్మచెట్ల అక్రమార్కులపై చర్యలకు జేసీ ఆదేశం
కలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం మండల పరిధిలోని మంచూరు గ్రామ పంచాయతీలో వున్న తిమ్మిరెడ్డికుంట, కొత్తకుంటలో ఎలాంటి అనుమతులు లేకుండా నల్ల తుమ్మ చెట్లను ఆ గ్రామ పంచాయతీ సర్పంచ్ కె.జ్యోతి భర్త పి.సురేష్ విక్రయించి సొమ్ము చేసుకోవడంపై సోమవారం సాక్షిలో ‘నల్ల తుమ్మ చెట్లు అక్రమ రవాణా’ కథనం ప్రచురితమైంది. అలాగే మంచూరు గ్రామస్తులు శంకర్రెడ్డి తదితరులు సాక్షిలో ప్రచురితమైన కథనంతో సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా జాయింట్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన జేసీ ఆదర్శ రాజేంద్రన్ నల్లతుమ్మ చెట్లు అక్రమ రవాణాపై సమగ్ర విచారణ జరిపి అక్రమదారులపై కేసు నమోదు చేయాలని జిల్లా పంచాయతీ అధికారిని ఆదేశించారు. ఈ మేరకు డీపీఒ ఆదేశాల మేరకు మదనపల్లి డీఎల్పీఓ నాగరాజ సోమవారం సాయంత్రం మంచూరు పంచాయతీ పరిధిలోని తిమ్మిరెడ్డికుంట, కొత్తకుంటలను పరిశీలించారు. రెండు కుంటలలో కలిపి సుమారు 60 చెట్లకు పైగా కోసినట్లు గుర్తించామన్నారు. పంచాయతీరాజ్ శాఖ నుంచి తుమ్మచెట్ల వేలానికి గానీ, తరలింపునకు గానీ, కటింగ్కు గానీ ఎలాంటి అనుమతులు లేవని, అటవీశాఖ నుంచి మాత్రం కటింగ్ ఆర్డర్ ఉన్నట్లు తమ విచారణలో తేలిందని డీఎల్పీఒ వివరించారు. అలాగే గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించామన్నారు. గ్రామస్తుల వివరాలు, పంచాయతీ కార్యదర్శి వివరణ అనంతరం, విచారణ నివేదికను డీపీఓకు పంపనున్నట్లు డీఎల్పీఒ పేర్కొన్నారు. పంచాయతీ కార్యదర్శి సుమతి, మంచూరు సచివాలయ ఇంజినీరింగ్ అసిస్టెంట్ డీఎల్పీఓ వెంట పాల్గొన్నారు. -
అది అన్నదాత దుఃఖీభవ పథకం
రాయచోటి : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రైతులకు అందించింది అన్నదాత సుఖీభవ కాదని, అన్నదాత దుఃఖీభవ పథకమని వైఎస్సార్సీపీ రైతు విభాగం అధ్యక్షుడు వై.ఆరంరెడ్డి, రాష్ట్ర బూత్ వింగ్ జనరల్ సెక్రటరీ రహిమాన్ ఖాన్లు దుయ్యబట్టారు. వైఎస్సార్సీపీ రాష్ట విభాగం పిలుపు మేరకు సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట జిల్లా రైతు సంఘం నాయకులు, సభ్యులు, రైతులు కూటమి ప్రభుత్వ నిరంకుశత్వ పోకడలపై విమర్శలు గుప్పించారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి నవరత్నాల పేరిట ప్రవేశపెట్టిన వైఎస్సార్ రైతు భరోసా పథకానికి కూటమి ప్రభుత్వం సూపర్ సిక్స్లో అన్నదాత సుఖీభవ అని నమ్మించి రైతులను నట్టేట ముంచిందన్నారు. గత ఏడాది కేంద్ర ప్రభుత్వం ద్వారా రూ. 2 వేలు జమ చేశారే తప్ప రాష్ట్ర ప్రభుత్వం నుంచి చిల్లిగవ్వ విడుదల చేయలేదన్నారు. పీఎం కిసాన్ కూడా కొంతమంది రైతులకు మాత్రమే వేసి మిగిలిన రైతులకు మొండి చేయి చూపారన్నారు. రైతులంటే చంద్రబాబుకు మొదటి నుంచి చిన్నచూపే అని ఆరోపించారు. గతంలో మహానేత వైఎస్సార్ ఉచిత విద్యుత్ ప్రకటిస్తే విద్యుత్ తీగలపై రైతులు బట్టలు ఆరేసుకోవాలని చంద్రబాబు ఎద్దేవా చేశారన్నారు. చంద్రబాబు అధికారంలో ఉంటే కరువు విలయతాండవం చేస్తుందన్నారు. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 57 లక్షల మంది రైతులకు రైతు భరోసా ద్వారా సంక్షేమం అందిస్తే కూటమి ప్రభుత్వంలో 12 లక్షల మంది రైతులకు పీఎం కిసాన్ అందకుండా చేశారంటూ మండిపడ్డారు. అనంతరం జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. -
తమిళనాడులో ఘోర రోడ్డు ప్రమాదం
పీలేరురూరల్ : తమిళనాడు రాష్ట్రం తిరుత్తణి సమీపంలో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో పీలేరు మాజీ సర్పంచ్ ఎ.ఎస్. హుమయూన్ (65), ఆయన సోదరుడు షాజహాన్ (55) మృతి చెందగా, ఆయన కుమారుడు, వార్డు మెంబరు హబీబ్బాషా పరిస్థితి విషమంగా ఉంది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిలక్ వీధికి చెందిన మాజీ సర్పంచ్ ఎ.ఎస్. హుమయూన్ కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. చైన్నెలో చికిత్స పొందడానికి సోమవారం తెల్లవారుజామున 3 గంటలకు ఇంటి నుంచి కారులో బయలుదేరారు. అయితే ఉదయం 6.30 గంటల సమయంలో తిరుత్తణి వద్ద ఆగి ఉన్న లారీని కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో హుమయూన్, ఆయన సోదరుడు షాజహాన్ అక్కడి కక్కడే మృతి చెందారు. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన హబీబ్బాషాను స్థానికుల సాయంతో తిరుత్తణి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం చైన్నె అపోలో ఆస్పత్రికి తీసుకెళ్లారు. అతని పరిస్థితి విషమంగా ఉంది. ప్రమాదంలో మృతి చెందిన హుమయూన్ రెండు పర్యాయాలు పీలేరు గ్రామ పంచాయతీ సర్పంచ్గా పని చేశారు. ఆయన మృతి పట్ల పలువురు దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. విషయం తెలుసుకున్న పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఫోన్ ద్వారా హుమయూన్ సోదరులను పరామర్శించి ధైర్యం చెప్పారు. అలాగే ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డి ప్రగాఢ సానుభూతి వ్యక్తం చేశారు. మృత్యువులోనూ వీడని బంధం.. మాజీ సర్పంచ్ హుమయూన్కు తోడు నీడగా ఉంటున్న సోదరుడు షాజహాన్ మృత్యువు లోనూ వీడని బంధంగా మృతి చెందడంతో పలువురిని కలచివేసింది. ఒకే కుటుంబంలో అన్నాదమ్ములు ఇద్దరు మృతి చెందడం, మరొకరి పరిస్థితి విషమంగా ఉండడంతో పీలేరులో విషాద ఛాయలు అలుముకున్నాయి. వారి కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. పీలేరు మాజీ సర్పంచ్ హుమయూన్, ఆయన సోదరుడు మృతి కుమారుడి పరిస్థితి విషమం పీలేరులో అలుముకున్న విషాద ఛాయలు -
రూపానంద రెడ్డి అండతో ప్రభుత్వ భూమి కబ్జా
పుల్లంపేట : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పుల్లంపేట మండలం అనంతసముద్రం, కొమ్మనవారిపల్లి గ్రామాలలో టీడీపీ ఇన్చార్జి రూపానందరెడ్డి అండతో ప్రభుత్వ భూములు యథేచ్ఛగా ఆక్రమణలకు గురవుతున్నాయని పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి ఆరోపించారు. సోమవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ అనంత సముద్రం గ్రామానికి చెందిన ముద్దా సుబ్బారెడ్డి ఆయన కుమారుడు ముద్దా సుభాష్లు 40 ఎకరాల ప్రభుత్వ భూములు ఆక్రమించారని తెలిపారు. అనంత సముద్రంలో సర్వే నెంబరు. 326, 330/3, 331, 339/1, 1194/2లో ఉండే ప్రభుత్వ భూములే కాకుండా గ్రామ కంఠం సర్వే నెంబర్లకు సంబంధించి 327/2, 328, 329, 321/1లో ప్రభుత్వ భూమి ఐదు ఎకరాలు ఆక్రమించుకున్నారన్నారు. అలాగే కేతు సుబ్బరామిరెడ్డి, కేతు రజనీకాంత్ రెడ్డిలు 13 ఎకరాల భూమిని సర్వే నెంబరు. 1089/1, 128/1, 129/1లలో ఆక్రమించుకున్నారన్నారు. అనంతసముద్రం ఎంపీటీసీ కుమారుని భూమిని సైతం ఆక్రమించారని తెలిపారు. పలుమార్లు సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదన్నారు. -
14లోపు రైతులు పంటల బీమాకు దరఖాస్తు చేసుకోవాలి
సిద్దవటం : పసుపు, ఉల్లి పంటలకు సంబంధించి బీమా వర్తింపు కోస ఈనెల 14లోపు రైతులు పంట బీమాకు దరఖాస్తు చేసుకోవాలని ఉద్యాన శాఖ అఽధికారి జయభరత్రెడ్డి తెలిపారు. సిద్దవటం మండలంలోని బొగ్గిడివారిపల్లె గ్రామంలో సోమవారం పసుపు పంటను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పంట బీమా కోసం ఈ– పంట నమోదు తప్పనిసరిగా చేయించుకోవాలన్నారు. ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన కింద పసుపు, ఉల్లి పంటల బీమా కోసం ప్రీమియం చెల్లించేందుకు ఈనెల 14 వరకు ప్రభుత్వం గడువు పొడిగించిందన్నారు. పసుపు పంటకు ఎకరాకు రూ. 180, ఉల్లి పంటకు ఎకరాకు రూ.90 చెల్లించాలన్నారు. పుసుపు పంటకు బీమా మొత్తం హెక్టారుకు రూ. 2, 25000, ఉల్లికి బీమా మొత్తం హెక్టారుకు రూ. 1,12,500 వర్తిస్తుందని తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొని కొరియర్ వాహనం బోల్తా
సిద్దవటం : మండలంలోని సిద్దవటం గ్రామ సమీపంలో అన్నపూర్ణ భిక్షేశ్వర స్వామి ఆలయం వద్ద సోమవారం కొరియర్ పార్సిల్ వాహనం రోడ్డు పక్కన ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని వాహనం వంకలో బోల్తా పడింది. కడప నుంచి బద్వేలుకు సోమవారం కొరియర్ పార్సిల్ను తీసుకు వెళుతున్న వాహనం నేకనాపురం రహదారి దాటుకొని శ్రీ అన్నపూర్ణ భిక్షేశ్వర స్వామి ఆలయం వద్దకు రాగానే విద్యుత్ స్తంభాన్ని వాహనం ఢీకొనడంతో స్తంభం విరిగి పోయింది, వాహనం వంకలో బోల్తాపడింది. దీంతో సిద్దవటంలో 4 గంటల పాటు విద్యుత్కు అంతరాయం కలిగింది. వాహనంలో ఉన్న కిషోర్, చాంద్బాషా అనే ఇద్దరు వ్యక్తులకు గాయాలు కావడంతో 108 వాహనంలో వారిని రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. జరిగిన ఘటనపై సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ ఆధ్వర్యంలో పోలీసులు విచారణ జరుపుతున్నారు. -
శిల్పారామం తరహాలో టెర్రకోటకు అంగళ్లులో క్రాఫ్ట్ విలేజ్
కురబలకోట : తిరుపతి శిల్పారామం తరహాలో టెర్రకోట హస్త కళాకారుల సంక్షేమం కోసం కురబలకోట మండలంలోని అంగళ్లు బైపాస్ పక్కన క్రాఫ్ట్ విలేజ్ను ఏర్పాటు చేయిస్తామని రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరిప్రసాద్ హామీ ఇచ్చారు. సోమవారం ఆయన అంగళ్లులోని టెర్రకోట సీఎఫ్సీ సెంటర్ను సందర్శించారు. అనంతరం అక్కడ జరిగిన సభలో ముఖ్య అతిథిగా మాట్లాడుతూ హస్తకళలను ప్రోత్సహించడానికి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల నుండి ఆర్థిక వనరులను తీసుకు రావడంతో పాటు టెక్నాలజీని తీసుకు వస్తామన్నారు. ఈ కళకు ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు వస్తామన్నారు. ఉప ముఖ్య మంత్రి పవన్ కళ్యాణ్చే వీటికి ప్రమోషన్ కూడా చేయించి డిమాండ్ సృష్టించి తగిన ఆదాయ వనరులు పెంపొందేలా చూస్తామన్నారు. పీ–4 పథకంలో హస్త కళలను చేర్చామన్నారు. టెర్రకోట కళాకారులకు బంకమట్టి, మిషనరీ సౌకర్యం కల్పిస్తామన్నారు. శాలివాహన చైర్మన్ ఈశ్వర్, నియోజక వర్గ టీడీపీ నాయకులు డి. జయచంద్రారెడ్డి, పి. సాయినాఽఽథ్, సీఈఓ కృష్ణమూర్తి, టెర్రకోట సంఘ నాయకులు దుర్గం మల్లికార్జున, కంటేవారిపల్లె బాలాజీ, శ్రీనివాసులు, సురేంద్ర, పద్మావతమ్మ, కళావతి తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర హస్తకళల నైపుణ్యాభివృద్ధి సంస్థ చైర్మన్ పసుపులేటి హరి ప్రసాద్ -
పోలీసుల అదుపులో నిందితుడు
నందలూరు : నందలూరు పోలీసు స్టేషన్లో క్రైమ్ నెంబర్ 15/2022 కేసులో ఏ4 నిందితుడిగా ఉన్న తిరుపతి పట్టణం కరకంబేడు వీధికి చెందిన చంద్ర రమేష్ అనే నిందితుడిని పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అతను స్టోర్ బియ్యం విక్రయం కేసులో నిందితుడిగా ఉండి, కోర్టు వాయిదాలకు హాజరుకానందున కోర్టు అతనిపై నాన్ బెయిలబుల్ వారంట్ జారీ చేసింది. ఈ నేపథ్యంలో పోలీసులు అతన్ని అదుపులోకి తీసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి తెలిపారు. నిందితుడిని సోమవారం నందలూరు కోర్టులో హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించిందన్నారు. ఆటో ఢీకొని వృద్ధురాలి మృతికలికిరి : ఆటో ఢీకొని వృద్ధురాలు మృతి చెందిన సంఘటన సోమవారం కలికిరి పట్టణ పరిధిలో జరిగింది. పోలీసుల కథనం మేరకు... కేవీ పల్లి మండలం నూతనకాల్వ గ్రామం దిండువారిపల్లికి చెందిన చింతపర్తి మంగమ్మ(82) కలికిరిలోని తన బంధువుల ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం పోలీస్ స్టేషన్ సమీపంలో రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా కలికిరి పట్టణానికి చెందిన సుబహాన్ ఆటోతో ఢీకొన్నాడు. ప్రమాదంలో వృద్ధురాలికి గాయాలు కావడంతో కుటుంబ సభ్యులు స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మంగమ్మ కుమార్తె రామ కుమారి ఫిర్యాదు మేరకు ఆటో డ్రైవరు సుబహాన్పై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ మదన్మోహన్ రెడ్డి తెలిపారు. మున్సిపల్ ఉద్యోగిపై దాడి మదనపల్లె రూరల్ : మున్సిపల్ ఉద్యోగిపై దాడి చేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. రామారావుకాలనీకి చెందిన సుధాకర్ మున్సిపాలిటీలో ఫిట్టర్గా పనిచేస్తున్నాడు. సోమవారం మధుసూదన థియేటర్ సమీపంలోని ఎస్కే.ఆయిల్ స్టోర్స్ వెనుకవైపున ఉన్న ఇంటిలో ఉండగా, కుటుంబ వివాదంలో భాగంగా గాంధీపురానికి చెందిన రాజా, రవి, ప్రదీప్ అనుచరులతో వచ్చి సుధాకర్పై దాడికి పాల్పడ్డారు. దాడిలో సుధాకర్ తీవ్రంగా గాయపడగా గమనించిన కుటుంబ సభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్టౌన్ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఇంటర్లో ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం రాజంపేట రూరల్ : జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ మొదటి సంవత్సరం సైన్స్ విభాగంలో ప్రవేశానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపల్ గంగాధరన్ ఒక ప్రకటనలో తెలిపారు. 2024–2025లో పదో తరగతి ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. ఈనెల 10వ తేదీలోగా దరఖాస్తులను జేఎన్వీవైఎస్ఆర్డీఐఎస్టీఆర్ఐసీటీ జీ మెయిల్.కాం చిరునామాకు మెయిల్ చేయాలని కోరారు. -
దేవుడా.. ఎంత పని చేశావయ్యా!
ములకలచెరువు: అయ్యో దేవుడా మా మీద దయలేదా.. ఎంత పని చేశావయ్యా.. మూడు కుటుంబాల్లో ఒక్కొక్కరు మాత్రమే ఉన్నారు.. వారూ తనువు చాలించారు.. మాకెందుకయ్యా ఇంత వేదన ఇచ్చావంటూ మృతుల కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరవుతూ విలపించిన దృశ్యం చూపరుల హృదయాలను కలచి వేసింది.మండలంలోని పెద్దపాళ్యం ఫ్లై ఓవర్ వద్ద ఆదివారం రాత్రి ఆర్టీసీ బస్సు ద్విచక్రవాహనాన్ని ఢీ కొట్టడంతో వేపూరికోట పంచాయతీ కుటాగోళ్లపల్లెకు చెందిన ముగ్గురు యువకులు మృతి చెందిన సంఘటన పాఠకులకు తెలిసిందే. కె.చంద్రప్ప కుమారుడు కె.వెంకటేష్ (26), కె.వేమనారాయణ కుమారుడు తరుణ్ (21), కె.ఓబులేసు కుమారుడు కె.మనోజ్ (20)లు ములకలచెరువుకు వెళ్తుండగా ప్రమాదంలో మృతి చెందారు. సోమవారం మృతదేహాలను పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అందించారు. వీరి అంత్యక్రియలకు చుట్టుపక్కల గ్రామాల నుంచి ప్రజలు తరలివచ్చారు. కుటుంబ సభ్యుల రోదన చూపరులకు కంట తడిపెట్టించింది. ఉద్యోగాలు చేసుకుంటూ బెంగళూరులో ఉంటున్న ముగ్గురు ఒక్కసారిగా మృతి చెందడంతో కుటాగోళ్లపల్లెలో విషాద ఛాయలు అలుముకున్నాయి. బరువెక్కిన గుండెలతో మృతులకు అంత్యక్రియలు నిర్వహించారు. అదేవిధంగా బురకాయలకోట పంచాయతీ ఎరమాసివారిపల్లెకు చెందిన శ్రీనివాసులు (45) గుర్తు తెలియని వాహనం ఢీ కొట్టడంతో ఆదివారం రాత్రి మృతి చెందాడు. ములకలచెరువు పోలీసులు మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. అనంతరం అంత్యక్రియలు నిర్వహించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పటిష్ట బందోబస్తు ఏర్పాటు : ఎస్పీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను సోమవారం జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ పోలీసు అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆగస్టు 12వ తేదీన ఒంటిమిట్ట మండలంలో జరుగుతున్న జెడ్పీటీసీ ఎన్నికకు సంబంధించి మండలంలోని సమస్యాత్మక పోలింగ్ కేంద్రాలను పరిశీలించామన్నారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ తెలిపారు. కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్ సుధాకర్, కడప టౌన్ డీఎస్పీ ఎ వెంకటేశ్వర్లు, స్పెషల్ ప్రాంచ్ ఇన్స్పెక్టర్ ఆర్ పురుషోత్తం రాజు, ఒంటిమిటట సిఐ టి బాబు, సిద్దవటం ఎస్ఐ ఎం మహమ్మద్ రఫీ, సిబ్బంది పాల్గొన్నారు. -
సత్వరమే సమస్యల పరిష్కారం
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారం విషయంలో అధికారులు బాధ్యతగా పనిచేసి వాటిని సత్వరమే పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తున్నట్లు చెప్పారు. కాబట్టి అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. 12న జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమం రాయచోటి జగదాంబసెంటర్ : వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 12వ తేదీన జాతీయ నులిపురుగల నిర్మూలన కార్యక్రమం నిర్వహించనున్నట్లు , పిల్లలు మరియు కిశోర బాలలకు (ఒక సంవత్సరం నుండి 18 సంవత్సరాల వయస్సు గల పిల్లలకు) ఉచితంగా ఆల్బెండజోల్ మాత్రలు పంపిణీ చేయనున్నుట్ల జిల్లా కలెక్టర్ శ్రీధర్చామకూరి తెలిపారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జాతీయ నులిపురుగుల నిర్మూలన కార్యక్రమానికి సంబంధించి గోడపత్రికను కలెక్టర్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి లక్ష్మీనరసయ్య, వైద్య ఆరోగ్య సిబ్బంది శివప్రతాప్, ఇంతియాజ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ శ్రీధర్ -
పరిసరాల శుభ్రతతోనే దోమల నివారణ
రాయచోటి : పరిసరాల పరిశుభ్రతతోనే దోమల నివారణకు మార్గమని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ రామచంద్రారెడ్డి అన్నారు. మలేరియా నిర్మూలన కార్యక్రమంలో భాగంగా సోమవారం రాయచోటిలోని ఎస్ఎన్ కాలనీ పట్టణ ఆరోగ్య కేంద్రం పరిధిలోని ఎగువ అబ్బవరం సచివాలయం, రాయుడు కాలనీలో ఏసీఎం స్ప్రేయింగ్ కార్యక్రమాన్ని ప్రారంభించారు. అలాగే స్కూల్ హెల్త్ ప్రోగ్రామ్, అంగన్ వాడీ సెంటర్లో తల్లిపాల వారోత్సవాల కార్యక్రమాలను పర్యవేక్షించారు. ఈ సందర్భంగా జిల్లా మలేరియా అధికారి మాట్లాడుతూ దోమల నివారణకు స్ప్రేయింగ్ అనేది ప్రతి ఇంటికి చేయించుకోవాలన్నారు. 2027 నాటికి మలేరియా రహిత జిల్లాగా మార్చాలని ఆయన వైద్య సిబ్బందిని ఆదేశించారు. ఆ దిశగా సిబ్బంది ప్రజలతో మమేకమై పనిచేయాలన్నారు. కార్యక్రమంలో పట్టణ ఆరోగ్య కేంద్ర వైద్యాధికారి నవీన్, మలేరియా సబ్ యూనిట్ అధికారి జయరామయ్య, సూపర్ వైజర్ నూర్జహాన్, హెల్త్ అసిస్టెంట్ రవిశంకర్, రామచంద్ర, ఏఎన్ఎం రేష్మ, ఆశా కార్యకర్తలు పాల్గొన్నారు. -
ప్రతిభకు పరీక్ష
మదనపల్లె సిటీ : విద్యార్థులు పరిశోధన, ప్రయోగాల్లో రాణించేలా ఏటా కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంధన్ (వీవీఎం) పేరుతో జాతీయ స్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. కేంద్ర ప్రభుత్వ శాస్త్ర సాంకేతిక సమాచార సంస్థ ఆద్వర్యంలో ఎన్సీఈఆర్టీ, విజ్ఞాన్ ప్రసాద్,విజ్ఞానభారతి సంయుక్తంగా ఈ పరీక్షలు నిర్వహిస్తున్నా, ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు నగదు ప్రోత్సాహకాలతో పాటు భారతదేశ ప్రముఖ పరిశోధన సంస్థల్లో ఇంటర్న్షిప్, స్కాలర్షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఈ పరీక్షకు 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ఇప్పటికే ప్రారంభమైంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో ఆరో తరగతి నుంచి ఇంటర్ ప్రథమ సంవత్సరం ఎంపీసీ, బైపీసీ చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. సెప్టెంబర్ 30లోపు దరఖాస్తు చేసుకోవాలి. దరఖాస్తు చేసుకోండిలా... విద్యార్థి విజ్ఞాన్ మంథన్ పరీక్ష రాసేందుకు ఆసక్తి ఉన్న విద్యార్థులు రూ.200 చెల్లించి వీవీఎం అనే వెబ్సైట్లో వివరాలు నమోదు చేసుకోవాలి. పరీక్ష జరిగే రోజు విద్యార్థులు వారికి అందుబాటులో ఉన్న మొబైల్, ల్యాప్టాప్, డెస్క్టాప్, డిజిటల్ పరికరాలలో ఏదైనా ఒక దాని ద్వారా నిర్దేశించిన అప్లికేషన్ను గూగుల్ ప్లేస్టోర్ నుంచి డౌన్లోడ్ చేసుకోవాలి. ఇంటి నుంచే పరీక్షకు హాజరయ్యే అవకాశం ఉంది. పుస్తకాలు వెబ్సైట్లో అందుబాటులో ఉన్నాయి. పోటీ పరీక్షను జూనియర్, సీనియర్ విభాగాల్లో నిర్వహిస్తారు. 6 నుంచి 8 తరగతులకు జూనియర్, 9 నుంచి 11 తరగతులకు సీనియర్ గ్రూపుగా విభజిస్తారు. ఇందులో తెలుగు, హిందీ, ఆంగ్లం తదితర ప్రాంతీయ భాషల్లో పరీక్ష ఉంటుంది. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. పాఠశాల స్థాయి ప్రాథమిక పరీక్ష రాసిన విద్యార్థుల్లో తరగతుల వారీగా ప్రతిభ మొదటి 20 మందిని ఎంపిక చేస్తారు. 6 నుంచి 11 తరగతులకు మొత్తం 120 మందిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. ఇందులో ప్రతిభ చూపిన ప్రతి తరగతి నుంచి ముగ్గురు వంతున మొత్తం 18 మందిని జాతీయ స్థాయికి ఎంపిక చేస్తారు. వంద మార్కులకు పరీక్ష నమూనా పరీక్ష అక్టోబర్ 28 నుంచి 30 తేదీల వరకు నిర్వహిస్తారు. ప్రధాన పరీక్ష నవంబర్ 19న అబ్జెక్టివ్ విధానంలో ఉంటుంది. జూనియర్, సీనియర్ రెండు విభాగాల్లో ప్రశ్నకు ఒక్కో మార్కు చొప్పున 100 మార్కులుంటాయి. సెక్షన్–ఎలో విజ్ఞానశాస్త రంగంలో భారతీయ మేధావుల కృషి 20, శాంతి స్వరూప్ భట్నాగర్ జీవిత చరిత్ర నుంచి 20 ప్రశ్నలు, సెక్షన్–బిలో జూనియర్ ,సీనియర్ విద్యార్థులకు గణితం, ఫిజిక్స్,కెమిస్రీ, బయాలజీ సబ్జెక్టుల నుంచి 50, లాజికల్ థింకిం గ్,, రీజనింగ్ నుంచి 10 ప్రశ్నలుంటాయి. నగదు ప్రోత్సాహకాలు: జాతీయస్థాయిలో విజేతలకు ప్రథమ, ద్వితీయ, తృతీయ బహుమతిగా వరుసగా రూ.25 వేలు, రూ.15 వేలు, రూ.10 వేలతో పాటు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేస్తారు. జాతీయ, జోనల్ స్థాయి విజేతలుగా నిలిచిన విద్యార్థులకు డీఆర్డీఓ, ఇస్త్రో, సీఎస్ఐఆర్, బీఏఆర్సీ వంటి ప్రఖ్యా త జాతీయ ప్రయోగశాలలు, పరిశోధన సంస్థల్లో ఒకటి నుంచి మూడు వారాల పాటు ప్రత్యేక శిక్షణ, ఇంటర్న్షిప్కు ఎంపిక చేస్తారు. 6 నుంచి ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులకు అవకాశం విద్యార్థి విజ్ఞాన్ మంథన్కు దరఖాస్తుల ఆహ్వానం ఆన్లైన్ రిజిస్ట్రేషన్కు తుది గడువు సెప్టెంబర్ 30 -
మోసాలు చేస్తున్న ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పండి
వైఎస్సార్సీపీ సీనియర్ నేతలు ఒంటిమిట్ట : 2024 ఎన్నికల్లో రాష్ట్ర ప్రజలకు అబద్ధపు హామీలు ఇచ్చి మోసాలు చేస్తున్న కూటమి ప్రభుత్వానికి ఓటుతో బుద్ధి చెప్పే అవకాశం వచ్చిందని, ఈ నెల 12న జరగబోయే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ఉప ఎన్నికల్లో వైఎస్సార్సీపీ అభ్యర్థి ఫ్యాన్ గుర్తుకు ఓటు వేసి, మీ సత్తా కూటమి ప్రభుత్వానికి చూపించాలని మండల ప్రజలతో రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథ్రెడ్డి, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే సుధా, కడప మేయర్ సురేష్ బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజాద్బాషా, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి అన్నారు. సోమవారం మండల పరిధిలోని చింతరాజుపల్లి, కోనరాజుపల్లి పంచాయతీల్లోని గ్రామాల్లో అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి ఉప ఎన్నిక ప్రచారాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఇంటింటికి తిరిగి జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాని ప్రజలను కోరారు. అనంతరం మేడా రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..తప్పుడు హామీలు ఇచ్చి రాష్ట్ర ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఎన్నికతో బుద్ధిచెప్పాలన్నారు. ● ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ..సూపర్ సిక్స్ అంటు అధికారంలోకి వచ్చిన సీఎం నారా చంద్రబాబు నాయుడు అహంకారాన్ని అణిచేవిధంగా ఎన్నిక ఫలితాలు తీసుకురావాలని అన్నారు. ● ఎమ్మెల్యే సుధా మాట్లాడుతూ..రాష్ట్రంలో 18 సంవత్సరాలు నిండిన మహిళలకు ఇస్తానన్న ఆడబిడ్డ నిధి పథకం అమలు చేయలేమన్న టీడీపీ నేతలకు ఈ ఉప ఎన్నికల పలితాలు చెంప పెట్టుకావాలన్నారు. ● కడప మేయర్ సురేష్ బాబు మాట్లాడుతూ..ఉన్నత చదువులు చదువుకుని ఉద్యోగాలు రాక నిరుద్యోగులుగా ఉన్న వారికి నిరుద్యోగ భృతిని ఇస్తానని మోసం చేసిన ప్రభుత్వానికి ఈ ఉప ఎన్నిక ఫలితాలతో సిగ్గు రావాలన్నారు. ● మాజీ డిప్యూటీ సీఎం అంజాద్ బాషా మాట్లాడుతూ..రైతులకు ప్రతి ఏటా కేంద్రం ఇస్తున్న రూ. 2 వేలతో కలిపి రూ. 20వేలు ఇస్తానని రైతన్నను నిలువులా ముంచేసిన ప్రభుత్వాన్ని ఓటు అనే ఆయుధంతో ఓడించాలన్నారు. ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతూ..ఫించన్లు పెంచినట్లే పెంచి వెనుకల గోతులు తీసినట్లు సుమారు 1లక్ష 50 వేల మంది పింఛన్దారులను అనర్హులగా చేసిన సీఎం చంద్రబాబుపై ఈ ఉప ఎన్నిక సహాయంతో మీ తిరుగుబాటును చూపించాలన్నారు. – మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి మాట్లాడుతూ..ఇది మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటూనే ఒక పక్క రెడ్ బుక్ పరిపాలన సాగిస్తుంది ఈ కూటమి ప్రభుత్వం. ఈ రెడ్ బుక్ పరిపాలనలో ప్రభుత్వ వైఫల్యాన్ని ఎత్తి చూపే వారందరిపై అక్రమ కేసులు, హత్యా రాజకీయం, మహిళలపై అత్యచారాలు, దాడులు చేస్తూ శాంతి భద్రతలు అనేటివి మంటగలుస్తున్నాయి. అలాంటి అధికార పార్టీ ని ఓడించి శాంతిభద్రతలను కాపాడాలని కోరారు. ● ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి మాట్లాడుతూ..రాజంపేట నియోజకవర్గంలో అధికార పార్టీ రాజు లేని రాజ్యంగా తయారైందన్నారు. ఒంటిమిట్ట మండల అభివృద్ధి, ప్రజా సమస్యల పరిష్కారానికి సంబంధించి మండల నాయకులు, కార్యకర్తల మధ్య సఖ్యత లేక వర్గ పోరుతో వారి ఉనికిని కాపాడుకునేందుకు ప్రజలను ఇబ్బంది పెడుతున్నారన్నారు. అలాంటి వారిని మనం గెలిపించినా ఉపయోగం ఉండదన్నారు. ● రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ..ఒంటిమిట్ట వైఎస్సార్సీపీ జెడ్పీటీసీ అభ్యర్థి ఇరగంరెడ్డి సుబ్బారెడ్డిని గెలిపిస్తే మండలంలోని ప్రజా సమస్యలు పరిష్కారం అవుతాయని, మండల అభివృద్ధి ముందుకు పోతుందని తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి ఏకుల రాజేశ్వరి, ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, రాష్ట్ర మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, నందలూరు ఎంపీపీ మేడా విజయభాస్కర్ రెడ్డి, రాజంపేట నియోజకవర్గ యూత్ వింగ్ అధ్యక్షుడు కూండ్ల ఓబుల్ రెడ్డి, రాజంపేట బీసీ సెల్ అధ్యక్షుడు రాజమోహన్నాయుడు, కోనరాజుపల్లి సర్పంచ్ శేఖర్రెడ్డి, ఒంటిమిట్ట మండల పంచాయతీ రాజ్ అధ్యక్షుడు మేరువ శివనారాయణ, వైఎస్సార్సీపీ మండల ప్రచార విభాగం అధ్యక్షుడు రాజశేఖర్రాయల్, జంగాల శివశంకర్ పాల్గొన్నారు. -
సెప్టెంబర్ 8 నుంచి కడపలో వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : సెప్టెంబర్ 8,9,10, తేదీలలో అఖిల భారత వ్యవసాయ కార్మిక సంఘం జాతీయ కౌన్సిల్ సమావేశాలు కడప నగరంలో నిర్వహించనున్నట్లు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు తెలిపారు. ఆదివారం కడప నగరంలోని యూటీఎఫ్ కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో భూ పంపిణీ –సాగునీరు – పారిశ్రామిక అభివృద్ధి అనే అంశంపై రాష్ట్ర సెమినార్ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ కౌన్సిల్ సమావేశాలకు దేశవ్యాప్తంగా 29 రాష్ట్రాల నుంచి 200 మంది జాతీయ నాయకులతో పాటు కేరళ, బెంగాల్, త్రిపుర, తమిళనాడు, రాజస్థాన్ రాష్ట్రాల నుంచి ఎన్నికై న ఎంపీలు, ఎమ్మెల్యేలు హాజరవుతారని తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం భూమి లేని పేదలకు భూ పంపిణీ చేపట్టాలని డిమాండ్ చేశారు. ‘ఉంటే ప్రభుత్వ భూముల్లో ఉంటాము– లేకుంటే జైల్లో ఉంటాము‘ అనే నినాదంతో వ్యవసాయ కార్మికులందరూ గ్రామ, గ్రామాన దండుగా ఐక్య భూ పోరాటాలకు సంసిద్ధం కావాలని పిలుపునిచ్చారు. భూమిలేని గ్రామీణ నిరుపేదలకు భూ పంపిణీ చేస్తేనే నిజమైన అభివృద్ధి సాధ్యమని తెలిపారు. కేరళలోని వామపక్ష ప్రభుత్వం ప్రతి కుటుంబానికి 3 ఎకరాల భూమి, ప్రతి వ్యవసాయ కార్మికునికి రోజువారీ కూలి 1000 రూపాయలు ఇస్తోందని చెప్పారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అంబానీ, అదానీలకు 20 లక్షల కోట్ల ఆదాయం పెంచారని, వ్యవసాయ కార్మికులకు రోజువారి ఆదాయం 200 కూడా పెంచలేదని విమర్శించారు. జిల్లాలో మొదటి విడతగా 7 మండలాల్లో 20 గ్రామాలలో భూ పోరాటాలు ప్రారంభిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు జి.చంద్రశేఖర్, జిల్లా ప్రధాన కార్యదర్శి వి.అన్వేష్, ఐద్వా జిల్లా అధ్యక్షురాలు ఐ.ఎం.సుబ్బమ్మ, చేతి ఉత్పత్తిదారుల సంఘం జిల్లా నాయకులు వి.పి.బయన్న, వీ.శివ నారాయణ, డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు ఎం.చిన్ని, వి.శివకుమార్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి బి.జకరయ్య తదితరులు పాల్గొన్నారు. -
మహిళా ప్రయాణికురాలిపై దురుసు ప్రవర్తన
వేంపల్లె : రాయచోటి ఆర్టీసీ డిపోకు చెందిన బస్సులో కండక్టర్ మహిళా ప్రయాణికురాలిపై దురుసుగా ప్రవర్తించాడు. ఆదివారం వేంపల్లె–రాయచోటి బస్సులో కండక్టర్ మహిళ మెడపై చెయ్యి వేసి నెట్టి ఆమెను దుర్భాషలాడాడు. ఆమె పోలీస్ స్టేషన్కు వెళ్దాం పద అన్న తర్వాత కండక్టర్ తగ్గాడు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న రాయచోటి డిపో బస్సులోనే ఇలా జరగడం చాలా బాధాకరమని ప్రయాణికులు మండిపడ్డారు. చిన్నపాటి వర్షానికి కారడం దారుణం.. వేంపల్లె – రాయచోటికి ప్రయాణించే ఆర్టీసీ బస్సు చాలా దారుణంగా ఉందని ప్రయాణికులు మండిపడ్డారు. ఆదివారం రాయచోటి డిపోకు చెందిన ఏపీ02జెడ్ 0254 నంబర్ గల ఏపీఎస్ ఆర్టీసీ ఆర్డినరీ బస్సులో ప్రయాణికులు మొత్తం వర్షపు నీటితో తడిచిపోయారు. వర్షం పడితే ఆ బస్సులో ప్రయాణికులు స్నానం చేసినట్లే అని వాపోతున్నారు. ఈ బస్సులో ప్రతి కిటికీకి అద్దం ఒకటే ఉంది. రాయచోటి ఆర్టీసీ డీఎం గమనించి ఇలాంటి పాతబడిన, కాలం చెల్లిన బస్సులను నడపొద్దని ప్రయాణికులు కోరుతున్నారు.