breaking news
Annamayya District News
-
ఉపాధిలో అంతులేని అవినీతి
రాయచోటి : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఉపాధి హామీ పథకంలో అవినీతి అంతులేకుండా పోయిందని జిల్లాలోని ప్రజాప్రతినిధులు విమర్శించారు. వైఎస్సార్సీపీ పిలుపు మేరకు సోమవారం పంచాయతీరాజ్ వ్యవస్థను బలోపేతం చేయాలని డిమాండ్ చేస్తూ వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు జిల్లా కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. డిమాండ్లు ● ఉపాధి హామీ పథకంలో చోటు చేసుకుంటున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం దర్యాప్తు జరిపించాలి ● రైతు, కూలీ శ్రామికుల హక్కులను కాపాడాల్సిన బాధ్యత కేంద్రానిదని స్పష్టం చేశారు. ● ఉపాధి హామీ పనులను గ్రామ పంచాయతీల ద్వారానే నిర్వహించి కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలి. ● సర్పంచులకు తల్లికి వందనం పథకం తక్షణమే వర్తింప చేయాలి ● కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన 15వ ఆర్థిక సంఘం నిధులు రూ.1150 కోట్లు స్థానిక సంస్థలకు బకాయి లేకుండా తక్షణమే జమ చేయాలి. ● జీఓ ఎంఎస్ 11ను రద్దు చేసి, గాలిలో తేలుతున్న 1350 మంది పంచాయతీ సెక్రటరీలకు నియామకాలు చేపట్టాలి. 10 నెలలుగా వేతనాలు లేకుండా బాధపడుతున్న వారి జీతాలను వెంటనే విడుదల చేయాలి. ● స్థానిక సంస్థల బలోపేతం కోసం జడ్పీటీసీ, ఎంపీపీ, సర్పంచ్, ఎంపీటీసీల గౌరవ వేతనాలను పెంచి, వాయిదా లేకుండా చెల్లించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ పంచాయతీ వింగ్ అధ్యక్షుడు మాసన వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ విభాగ సెక్రటరీ గాలివీటి ప్రవీణ్రెడ్డి, వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర జనరల్ సెక్రటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి, మేధావుల ఫోరం నియోజకవర్గ అధ్యక్షుడు జానం రవీంద్ర, కోడూరు పంచాయతీరాజ్ అధ్యక్షుడు శివశంకర్రెడ్డి, రాజంపేట పంచాయతీరాజ్ అధ్యక్షుడు లక్ష్మీనారాయణరెడ్డి, కౌన్సిలర్ సుగవాసి ఈశ్వర్ప్రసాద్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, సర్పంచ్ రామాంజులు, హరినాథరెడ్డిలతో పాటు పలువురు నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.జిల్లా కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ నేతలు -
కార్మిక వేతన భారం మేం భరిస్తాం
మదనపల్లె : రాష్ట్రంలోని మున్సిపాలిటీల్లో పని చేస్తున్న ఇంజినీరింగ్ కార్మికులు తమ సమస్యలపై రెండునెలలుగా ఆందోళనలు, దీక్షలు చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే కార్మికుల సమస్యలు తీరుస్తామని హామీ ఇచ్చినా పట్టించుకోవడం లేదు. దీంతో రాష్ట్రంలో మొట్టమొదటగా అన్నమయ్యజిల్లా మదనపల్లె మున్సిపల్ కౌన్సిల్ స్పందించింది. మదనపల్లె మున్సిపల్ కార్యాలయం ఎదుట కార్మికులు 27 రోజులుగా దీక్షలు చేస్తున్నా స్థానిక టీడీపీ ఎమ్మెల్యేకాని, ఆ పార్టీ నేతలు కాని పట్టించుకోలేదు. కనీసం పరామర్శించి డిమాండ్లు ఏమిటో అడిగింది లేదు. కార్మికుల సమస్యలపై మానవీయ కోణంలో మున్సిపల్ కౌన్సిల్ స్పందించింది. సోమవారం సాయంత్రం నిర్వహించిన అత్యవసర కౌన్సిల్ సమావేశం సందర్భంగా కార్మికులు హాలు ముందు బైఠాయించారు. వారు డిమాండ్ చేస్తున్న వేతనాలపై వైస్ చైర్మన్ జింకా చలపతి, కౌన్సిలర్ ప్రసాద్లు సమావేశంలో చర్చించారు. మున్సిపాలిటి తరపున వ్యత్యాస వేతనం చెల్లించేందుకు మున్సిపాలిటీ సిద్ధంగా ఉందని ప్రకటించారు. ఇప్పుడు చెల్లిస్తున్న వేతనానికి ఎంత అదనంగా అడుగుతున్నారో ఆ మొత్తాన్ని మదనపల్లె మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లిస్తామని ప్రకటించి ఈ మేరకు తీర్మాణం చేస్తున్నట్టు ప్రకటించారు. సేవలకు ప్రతిరూపం పదవీ విరమణరాయచోటి : రెవెన్యూ శాఖలో సుదీర్ఘ కాలంపాటు విధులు నిర్వర్తిస్తూ పదవీ విరమణ పొందడం వారి సేవల కు ప్రతి రూపమని జిల్లా కలెక్టర్ ఛామకూ రి శ్రీధర్ అన్నారు. సోమవారం పదవీ విరమణ పొందిన మదనపల్లి హెచ్ఎన్ఎస్ఎస్ స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ రాఘవేంద్ర, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ దైవాదీనంలను కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా కలెక్టర్ ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ ఉద్యోగులకు బదిలీ, పదవీ విరమణలు సర్వసాధారణమన్నారు. రెవెన్యూ శాఖలో సుదీర్ఘకాలంపాటు విధులు నిర్వర్తించడం అభినందనీయమన్నారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహ కుమార్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో గాయపడిన యువకుడి మృతి ఒంటిమిట్ట : గత నెల 24వ తేదీ ఒంటిమిట్ట కోదండరామస్వామి కల్యాణ వేదిక వద్ద కడప–చైన్నె జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి, చికిత్స పొందుతున్న సాయి ప్రకాష్ (25) సోమవారం మృతి చెందాడు. పోలీసు వివరాల మేరకు జూన్ 24వ తేదీన మంత్రాలయం నుంచి కడప వైపు వెళ్తున్న సాయి ప్రకాష్ ద్విచక్ర వాహనానికి రాజంపేట వైపు వస్తున్న ద్విచక్ర వాహనం ఎదురుగా రావడంతో రెండు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో సాయి ప్రకాష్ తలకు తీవ్ర గాయం కావడంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడి నుండి మెరుగైన చికిత్స కోసం సోమవారం కర్నూలులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు సాయి ప్రకాష్ తండ్రి నాగేంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.రాష్ట్రంలో మొదట స్పందించిన మదనపల్లె మున్సిపాలిటీ -
బస్సు ఢీ కొని యువకుడి మృతి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం ఎస్.ఉప్పరపల్లి వద్ద సోమవారం ఉదయం హైదరాబాదు నుంచి పాండిచ్చేరి వెళ్తున్న ట్రావెల్స్ బస్సు చైన్నె నుంచి ఎర్రగుంట్లకు పల్సర్ బైక్పై వెళ్తున్న బి.గోపాల్ (25)ను ఢీ కొనడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న ఎస్ఐ లక్ష్మీప్రసాద్, సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకొని కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వివాహిత అదృశ్యం మదనపల్లె రూరల్ : వివాహిత అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ సీఐ ఎరీషావలీ తెలిపారు. సుండుపల్లెకు చెందిన మాధవి(20)కి, పట్టణంలోని మారుతీనగర్కు చెందిన చేనేత కార్మికుడు విజయ్కుమార్తో పదినెలల క్రితం వివాహమైంది. ఆమె ఇంటి వద్దే ఉంటుండగా, భర్త విజయ్కుమార్ స్థానికంగా చేనేత పనులకు వెళ్లేవాడు. ఈనెల 26న ఉదయం 7 గంటలకు విజయ్కుమార్ పనులకు వెళ్లి పది గంటలకు టిఫిన్ చేసేందుకు ఇంటికి రాగా, భార్య మాధవి కనిపించకపోవడంతో ఆమె సెల్కు ఫోన్చేశాడు. సమాధానం రాకపోగా ఫోన్ స్విచ్ఆఫ్ రావడంతో పలుచోట్ల కుటుంబ సభ్యులతో కలిసి గాలించాడు. ఆచూకీ లభించకపోవడంతో సోమవారం వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గుప్త నిధుల కోసం తవ్వకాలు కొండాపురం : మండల పరిధిలోని పాత తాళ్లప్రొద్దుటూరు గ్రామంలోని శివాలయంలో ఆదివారం రాత్రి గుప్త నిధుల కోసం గుర్తు తెలియని వ్యక్తులు తవ్వకాలు చేపట్టినట్లు స్థానికులు తెలిపారు. గండికోట జలాశయంలో ముంపునకు గురైన గ్రామాల్లో ఆలయాల్లో గుప్త నిధులు ఉంటాయని దొంగలు టార్గెట్ చేస్తున్నారు. పాత తాళ్లప్రొద్దుటూరు లోని శివాలయం గుడిలో శివ లింగం చుట్టు తవ్వకాలు చేపట్టడంతో సోమవారం మండల తహసీల్దార్ గుర్రప్ప, స్థానిక పోలీసులు పరిశీలించారు. ముంపు గ్రామాల్లో జనసంచారం లేకపోవడంతో పురాతన ఆలయాల్లో తవ్వకాలు జరుపుతున్నారు. అధికారులు చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
గుళ్లు..గోపురాలు చూసేందుకు వచ్చాం
పెద్దతిప్పసముద్రం : ఏదో గుళ్లు, గోపురాలు చూసేందుకు వచ్చాం..ఇదేం అధికారిక కార్యక్రమం కాదు అని తెలుగు గంగ ప్రాజెక్టు చీఫ్ ఇంజినీర్ వరప్రసాద్ వ్యాఖ్యానించారు. సోమవారం ఆయన వెంట 12 వాహనాల్లో ఎస్ఈ, ఈఈ, డీఈలు, కాంట్ట్రాకర్లతో కలసి పెద్దతిప్పసముద్రంలోని హంద్రీనీవా కాలువ పంప్ హౌస్కు విచ్చేశారు. కాంట్రాక్టర్ క్యాంపు వద్దకు వెళ్లారు. కాలువ పనులను పరిశీలించారు. అంతమంది అధికారులతో వచ్చిన సీఈని కలిసిన మీడియా ప్రతినిధులు ఆకస్మిక పర్యటన వివరాలను తెలియజేయాలని కోరారు. మీరు రాసుకునే అంత వివరాలైతే ఏం లేవు, ఏదో గుళ్లు, గోపురాలను చూడటానికి వచ్చామని సమాధానం ఇచ్చారు. ఒక మంత్రి లేదా ఒక ఎమ్మెల్యే పర్యటన లాగా కాన్వాయ్ను తలపించేలా 12 వాహనాల్లో హెచ్ఎన్ఎస్ఎస్ అధికార బృందం రావడం వివరాలను గోప్యంగా ఉంచడం వెనుక మతలబు ఏమిటో అధికారులకే ఎరుక. అధికారులు పర్యటించిన ప్రాంతంలో సీఈ చెప్పినట్టు గుళ్లు, గోపురాలు లేవు. కరువుతో బీళ్లు వారిన పొలాలు, పారని హంద్రీనీవా పుంగనూరు ఉపకాలువ కనిపిస్తాయి. గుళ్లు, గోపురాలు లేని కాంట్రాక్టర్ క్యాంపు వద్దకు ఎందుకు వెళ్లారు. ఆయన వెంట అధికారుల బృందం ఎందుకొచ్చిందో ఆయనే చెప్పాలి. -
వైద్యుడు.. కనిపించే దేవుడు
ఒక్కమాటలో చెప్పాలంటే వైద్యులు దేవుళ్లతో సమానం. మనిషి అనారోగ్యం బారిన పడిన సమయంలో వైద్యుడు చేసే సేవలు వెలకట్టలేనివి. తల్లి జన్మనిస్తే.. వ్ర అనారోగ్య సమస్యలు వచ్చినప్పుడు, ప్రమాదాలు జరిగినప్పుడు, రిస్క్తో కూడిన శస్త్ర చికిత్సలు చేయాల్సి వచ్చినప్పుడు వైద్యులు పునర్జన్మను ప్రసాదిస్తారు. ప్రస్తుత పరిస్థితుల్లో ఆహారం, వాతావరణంలో వస్తున్న మార్పుల కారణంగా వివిధ జబ్బులతో మనిషి బాధపడాల్సి వస్తుంది. రోగుల ప్రాణాలను కాపాడటమే లక్ష్యంగా వైద్యులు సేవలు అందిస్తున్నారు. అనేక మంది వైద్యులు మానవత్వంతో పేదలకు, అభాగ్యులకు వైద్యం అందించి వారి ప్రాణాలను నిలుపుతున్నారు. అందుకే వైద్యో నారాయణో హరి అంటుంటారు పెద్దలు. రోగి పరేషాన్కు ఏ ఆపరేషన్ చేయాలో వైద్యుడికే తెలుస్తుంది. నాడి పట్టి గుండె గుబుళ్లను గుర్తించి దిగులును దూరం చేసే కనిపించే దేవుడే వైద్యుడు.రాజంపేట టౌన్ : వైద్య వృత్తి ఎంతో పవిత్రమైనది. అందువల్లే వైద్యులకు సమాజంలో ఎంతో గుర్తింపు, గౌరవం దక్కుతుంది. కొన్ని రకాల జబ్బుల బారిన పడిన వారి వద్దకు వెళ్లేందుకు కుటుంబ సభ్యులు కూడా భయపడుతుంటారు. అయితే అలాంటి రోగుల వద్దకు కూడా వెళ్లి వైద్యం చేసేది ఒక్క వైద్యుడు మాత్రమే. ప్రతి శాఖలో ఉద్యోగులకు, చివరికి దినసరి కూలీలకు కూడా సెలవులుంటాయి. కాని వైద్యులకు మాత్రం సెలవు ఉండదు. కొన్ని సందర్భాల్లో క్షణం తీరిక కూడా ఉండదు. పిల్లలతో, కుటుంబ సభ్యులతో సంతోషంగా గడిపేందుకు కూడా కొంత మంది వైద్యులకు సమయం ఉండదంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. చేదు అనుభవాలు.. వైద్యులకు ఆదివారాలు ఉండవు. ఎమర్జెన్సీ కేసు వచ్చిందంటే ఎక్కడున్నా సరే పరిగెత్తుకుంటూ వెళ్లాల్సిందే. రోగి ప్రాణాలను నిలిపేందుకు వైద్యులు తమ జీవితాలను కూడా త్యాగం చేస్తుంటారు. అలాంటి వైద్యులకు ఒక్కో మారు చేదు అనుభవాలు సైతం ఎదురవుతుంటాయి. రోడ్డు ప్రమాదాలు జరిగినప్పుడు, ఆరోగ్య సమస్య తలెత్తినప్పుడు సరైన సమయానికి వైద్యుడి వద్దకు తీసుకురాలేక చివరి దశలో వైద్యుడి వద్దకు తీసుకొస్తే వైద్యుడు ఆ మనిషి ప్రాణాన్ని కాపాడేందుకు శక్తివంచన లేకుండా కృషి చేస్తాడు. అయితే కొన్ని సందర్భాల్లో వైద్యుడు మనిషి ప్రాణాలను కాపాడలేక పోతాడు. ఆ సందర్భంలో మృతుని కుటుంబ సభ్యులు ముందూ వెనకా ఆలోచించకుండా ఆందోళనకు దిగడం, దాడులు చేయడం అక్కడక్కడా జరుగుతున్నాయి. ఇది చాలా బాధాకరమనే చెప్పాలి. మానసిక ఒత్తిడి ఎక్కువే.. వైద్యులకు వ్యక్తిగత జీవితాల్లో మానసిక ఒత్తిళ్లు ఎక్కువే ఉంటాయి. వృత్తిలోని సాధకబాధకాలను అర్థం చేసుకోవాలనే ఉద్దేశంతో చాలా మంది వైద్యులు అదే వృత్తిలో ఉన్న వారిని తమ జీవిత భాగస్వామిగా ఎంచుకుంటారు. రోజంతా రోగుల సేవలో కనిపించే వైద్యులు వేడుకలు, పండుగల్లో కనిపించడం చాలా అరుదు. అందులో ఇబ్బందులున్నా ఎదుర్కొంటారు కాని ఇతరులకు చెప్పరు. అలాంటి వైద్యులను గౌరవించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉంది. జగన్ హయాం నుంచి పల్లెలకు విస్తరించిన వైద్య సేవలు.. ఒకప్పుడు చిన్నపాటి జ్వరం, జలుబు వంటివి చేసినా గ్రామీణ ప్రాంతాల ప్రజలు ఎంతో దూరంలో ఉండే పీహెచ్సీలకు లేకుంటే పట్టణ ప్రాంతాల్లో ఉండే ఆసుపత్రులకు వచ్చి వైద్య సేవలు పొందేవారు. అయితే దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి ప్రవేశ పెట్టిన 104 వాహనాల వల్ల గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజల ఇంటిముంగిటకే వైద్య సేవలు అందుబాటులోకి వచ్చాయి. 104 వాహనాల ద్వారా వైద్య సిబ్బంది నెలలో రెండు రోజులు మాత్రమే గ్రామీణ ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందిస్తారు. అయితే 2019వ సంవత్సరంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక సచివాలయాల వ్యవస్థ తీసుకొచ్చి ప్రతి సచివాలయంలో వైద్య సిబ్బంది నియామకానికి చర్యలు తీసుకున్నారు. అందువల్ల గ్రామీణ ప్రాంతాల ప్రజలకు ఇప్పుడు వైద్య సేవలు నిత్యం అందుబాటులో ఉంటున్నాయి. పూర్వజన్మ సుకృతం వైద్యవృత్తిలో ఎంతో సంతృప్తి ఉంటుంది. రోగులకు వైద్య సేవలు అందించడం నా పూర్వ జన్మసుకృతంగా భావిస్తాను. నేను ఎంతో ఇష్టంగా ఈ వృత్తిని ఎంచుకున్నాను. అనేక సర్జరీలు చేశాను. సర్జరీలు విజయవంతంగా పూర్తి అయిన ప్రతిసారి ఎంతో ఆనందంగా ఉంటుంది. సమాజంలో ఎంతో గౌరవ మర్యాదలు ఉన్న ఈ వృత్తిలో నేను ఉండటం ఎంతో ఆనందంగా ఉంది. – డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట పేదల వైద్యుడు జీవీ సుబ్బారెడ్డిరాజంపేట పట్టణంలో దాదాపు యాభై ఏళ్లుగా రోగులకు వైద్య సేవలు అందిస్తున్న డాక్టర్ జీవీ సుబ్బారెడ్డి పేదల డాక్టర్గా గుర్తింపు పొందారు. నామమాత్రపు ఫీజుతో ఆయన మెరుగైన వైద్యం అందిస్తారు. అందువల్ల ఆయన వద్దకు ఇప్పటికీ పెద్దఎత్తున పేద ప్రజలు వైద్యం పొందేందుకు వస్తుంటారు. నామమాత్రపు ఫీజు కూడా ఇచ్చుకోలేని వారి వద్ద ఆయన ఒక్కపైసా కూడా తీసుకోకుండానే వైద్యం అందిస్తారు. అందువల్లే డాక్టర్ జీవీ.సుబ్బారెడ్డిని రాజంపేట ప్రాంత ప్రజలు పేదల డాక్టర్ అని ఎంతో అభిమానిస్తారు. మీ సేవలకు వందనం రోగుల ప్రాణాలు కాపాడటంలో శక్తి వంచన లేకుండా శ్రమించే దేవుళ్లు నేడు డాక్టర్స్ డే -
ప్రజా ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందుతున్న ప్రజల ఫిర్యాదుల పట్ల అలసత్వం చేయరాదని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశించారు. రాయచోటిలోని జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ప్రజల సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడారు. సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలని, బాధితులకు చట్ట పరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ సూచించారు.పోలీసు అధికారులను ఆదేశించిన జిల్లా ఎస్పీ -
వేర్వేరు ఘటనల్లో ఆరుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాద ఘటనల్లో ఆరుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం అడవిచెరువు గ్రామానికి చెందిన పెద్దినాయుడు(30), అమరనారాయణ(45), అతని భార్య అనూరాధ(40), ప్రతాప్నాయుడు(38) తిరుమల వెంకటేశ్వరస్వామి దర్శనానికి వెళ్లి సోమవారం ఉదయం కారులో తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, మార్గమధ్యంలోని చింతపర్తి సమీపంలో హైవే వద్ద వాహనం అదుపుతప్పి కల్వర్టులోకి దూసుకెళ్లింది. ప్రమాదంలో నలుగురు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మదనపల్లె మండలం పోతబోలుకు చెందిన వెంకటరమణ కుమారుడు పి.గంగాద్రి(32) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. సోమవారం పుంగనూరు మండలం చండ్రమాకులపల్లె జెడ్పీహైస్కూల్ నుంచి ఉపాధ్యాయురాలిని తీసుకువచ్చేందుకు ద్విచక్రవాహనంలో వెళ్లాడు. మార్గమధ్యంలో ఓ ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఎదురుగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి కుడి కాలు విరిగింది. అదేవిధంగా బీహార్కు చెందిన టైల్స్ కార్మికులు అశోక్సహానీ(45) ములకలచెరువులో రూమ్ అద్దెకు తీసుకుని ఉంటూ పనులు చేసుకుంటున్నాడు. సోమవారం రూమ్ నుంచి పని ప్రదేశానికి ద్విచక్రవాహనంలో వెళుతుండగా, వాహనం అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. తలకు తగిలిన గాయంతో అపస్మారక స్థితికి వెళ్లాడు. దీంతో గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
హోరాహోరీగా ఫుట్బాల్ చాంపియన్ షిప్ పోటీలు
మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి బాలుర జూనియర్ ఫుట్బాల్ చాంపియన్షిప్ పోటీలు హోరా హోరీగా జరుగుతున్నాయి. మదనపల్లె సమీపంలోని వేదా పాఠశాలలో సోమవారం వివిధ జిల్లాల జట్ల మధ్య పోటీలు నిర్వహించారు. సెమీ ఫైనల్స్లో సత్యసాయి–అనంతపురం జిల్లా జట్లు పోటీపడగా 2–0 స్కోరుతో సత్యసాయి జిల్లా జట్టు విజయం సాధించింది. మరో సెమీ ఫైనల్స్లో తిరుపతి–విశాఖపట్నం జట్లు పోటీ పడగా 7–4 స్కోరుతో తిరుపతి జట్టు గెలుపొందింది. ఫైనల్స్కు సత్యసాయి, తిరుపతి జట్లు చేరాయి. మంగళవారం తిరుపతి–సత్యసాయి జట్ల మధ్య పోటీ జరగనుంది. పోటీలను ఫుట్బాల్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్, మహేంద్ర, సిరాజ్, ఇర్షాద్, బాలాజీ, పవన్, చినబాబు పర్యవేక్షించారు. -
అనుమానాస్పద స్థితిలో మహిళ మృతి
ఒంటిమిట్ట: మండలంలోని మల్లేశ్వరపురానికి చెందిన అలిశెట్టి లక్ష్మీదేవి (57) సోమవారం కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల వివరాల మేరకు జూన్ 14వ తేదీన అలిశెట్టి లక్ష్మీదేవి, ఆమె కుటుంబ సభ్యులు ఐదుగురు విద్యుత్ త్ వైర్ల విషయమై వారి దాయాదులైన మరో వర్గానికి చెందిన ఆరుగురితో ఘర్షణ పడ్డారు. జూన్ 14న ఇరువర్గాలు ఒకరిపై ఒకరు ఫిర్యాదు చేసుకున్నారు. వారి మధ్య సఖ్యత కుదరకపోవడంతో జూన్ 28వ తేదీ రెండో వర్గంలోని 12 మందిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఇది ఇలా ఉండగా జూన్ 29వ తేదీన అలిశెట్టి లక్ష్మీదేవి అనారోగ్యంతో కడపలోని ప్రైవేటు ఆసు పత్రిలో చేరగా అక్కడ ఆరోగ్య పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. అలిశెట్టి లక్ష్మీదేవి మృతి చెందిన విషయాన్ని తెలుసుకున్న ఆమె చిన్న కూతురు శిరీషా జూన్ 14వ తేదీన జరిగిన ఘర్షణలో తన తల్లికి లోపల గాయాలు తగలడంతో ఆరోగ్యం క్షీణించి ఆసుపత్రి పాలై మృతి చెందినట్లు అనుమానంగా ఉందని పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కుమారుడితో సహా తండ్రి అదృశ్యంమదనపల్లె రూరల్ : కుమారుడితో సహా తండ్రి అదృశ్యమైన ఘటనపై కేసు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని కొత్త ఇండ్లు రంగారెడ్డి కాలనీకి చెందిన నారాయణ కుమారుడు మునిరత్నం(42) కారు డ్రైవర్గా పనిచేస్తున్నాడు. కొంతకాలం నుంచి మద్యానికి తీవ్రంగా బానిసై తరచూ భార్యతో గొడవపడేవాడు. ఈక్రమంలో ఒకసారి కుమార్తెను ఇంటి నుంచి తీసుకెళ్లిపోయాడు. కొద్దిరోజుల తర్వాత కూతురు ఇంటికెళ్లాలని పట్టుబట్టడంతో తీసుకువచ్చి ఇంటివద్ద దింపేశాడు. ఈ క్రమంలో ఈనెల 23న భార్య ఆదిలక్ష్మితో గొడవపడి కుమారుడు మనోజ్కుమార్(7)ను వెంటతీసుకుని ఇంటి నుంచి వెళ్లిపోయాడు. అప్పటి నుంచి కుటుంబ సభ్యులు వారి ఆచూకీ కోసం పలుచోట్ల గాలించినా ఫలితం లేకపోవడంతో ఆదిలక్ష్మి సోమవారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
●గిరిజనుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలి
సాక్షి రాయచోటి : సార్వత్రిక ఎన్నికల అనంతరం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు కష్టాలతోపాటు సమస్యలు పెరిగిపోయాయి. వైఎస్సార్ సీపీ హయాంలో వరుసపెట్టి ప్రతినెలలోనూ సంక్షేమం అందుకుంటూ హాయిగా సాగిన ప్రజల జీవన ప్రయాణం కష్టంగా మారింది.కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ పథకాలను పూర్తి స్థాయిలో అందించకపోవడంతో అన్ని వర్గాలకు సంక్షేమం అందని ద్రాక్షగా మారింది. ఇదే తరుణంలో అధికార పార్టీ నాయకులకు ఇసుక, మద్యం షాపుల రూపంలో ఆదాయం ఒనగూరుతుండగా, ప్రజలకు సమస్యల తిప్పలు తిప్పడం లేదు. ప్రతినిత్యం ప్రజలు సమస్యలతో సతమతమవుతూ...పరిష్కారానికి దారి దొరకక అధికారుల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అధికార పార్టీకి సంబంధించిన చోటామోటా నేతలు ఎక్కడికక్కడ ఖాళీ స్థలాలపై కన్నేయడం...ఖాళీగా ఉన్నాయి కదా అని కబ్జా చేయడం, ఎవరికీ తెలియకుండా ఆన్లైన్లో మార్పులు, చేర్పులకు తెర తీస్తున్నారు. ఈ నేపద్యంలో ఎక్కడికక్కడ సమస్యలు కూడా తాండవిస్తున్నాయి. ఆ సమస్యలకు పరిష్కారం చూపాలంటూ జిల్లా కేంద్రమైన రాయచోటిలోని కలెక్టరేట్కు పరుగులు పెడుతున్నారు. సమస్యలతో కలెక్టరేట్కు బారులు రాష్ట్ర ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహించే ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వినతిపత్రాలతో బాఽ దితులు పోటెత్తుతున్నారు. ఉరుకులు, పరుగులతో క లెక్టరేట్కు క్యూ కడుతున్నారు. దూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి అధికారుల చెంతకు చేరుతున్నారు. సమస్యలు పరిష్కరించండి మహాప్రభో అంటూ మొర పెట్టుకుంటున్నారు. పెన్షన్ అందించాలని ఒకరు..రేషన్కార్డు ఇవ్వాలని మరొకరు...ఇల్లు ఎప్పుడొస్తారంటూ మరొకరు వరుసపెట్టి వస్తున్నారు. వికలాంగులు, వృద్ధులు పింఛన్ల కోసం కలెక్టరేట్ తలు పు తట్టడం కనిపిస్తోంది. తాగునీటి సమస్యతోపాటు ఔట్సోర్సింగ్ పద్ధతిన ఉపాధి కల్పించాలని పలువురు అధికారులను కలుస్తున్నారు. ప్రతి సోమవారం 350–400 మంది ప్రజలు వివిధ రకాల సమస్యలతో దూర ప్రాంతాల నుంచి ఇక్కడికి వస్తున్నారు. ప్రభుత్వంపై పెరుగుతున్న వ్యతిరేకత సమస్యలు అధికం కావడంతో ప్రజల్లో ప్రభుత్వం వ్యతిరేకత కూడా పెరుగుతోంది. వివిధ వర్గాల కార్మికులు రోడ్డెక్కుతున్నారు. సోమవారం వస్తేచాలు ప్రజా ఆందోళనలు అధికమవుతున్నాయి. ప్రభుత్వం పూర్తి స్థాయిలో హక్కుదారులకు న్యాయం చేయకపోవడంతో రోడ్డెక్కాల్సిన దుిస్థితి నెలకొంది. ఒంటికాలితో వినూత్న నిరసన జిల్లా కేంద్రమైన రాయచోటిలోని మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ ఔట్సోర్సింగ్ ఇంజినీరింగ్ వర్కర్లు వినూత్న నిరసన చేపట్టారు. సోమవారం ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు వీవీ రమణ, రాయచోటి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల సంఘం అధ్యక్షుడు అక్బర్ అలీఖాన్ ఆధ్వర్యంలో కార్మికులు మున్సిపల్ కార్యాలయం ఎదురుగా ఒంటి కాలిపై నిలుచుని వినూత్న నిరసన చేపట్టారు. సుమారు 20 మంది కార్మికులు తొమ్మిది రోజులుగా రిలే దీక్షల్లో కూర్చొని తమ నిరసన తెలియజేస్తున్నారు. మున్సిపల్ పరిధిలో పనిచేస్తున్న ఔట్సోర్సింగ్ ఇంజినీరింగ్ వర్కర్లకు తల్లికి వందనం అమలు చేయాలని, మట్టిఖర్చులు రూ. 20 వేలు ఇవ్వాలని, పీఎఫ్, ఈపీఎఫ్, ఈఎస్ఐలు సరిచేయాలని, ప్రభుత్వ సంక్షేమ పథకాలన్నింటిని అమలు చేయాలని నిరసన వ్యక్తం చేశారు. ప్రభుత్వం నుంచి స్పందన రాకపోవడంతో దీక్షలు కొనసాగిస్తున్నారు. ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలి మదనపల్లె మండలం కోళ్లబైలు పంచాయతీ ఇందిర మ్మ కాలనీలో అభయ ఆంజనేయస్వామి ఆలయ నిర్మాణానికి అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. పలు హిందూ సంఘాల ప్రతినిధులు కాషాయ జెండా చేతబూని ఆలయ నిర్మాణానికి రెవెన్యూ అధికారులు అడ్డు తగులుతున్నారని, వెంటనే సమస్యను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. అనంతరం కలెక్టర్ శ్రీధర్కు వారు వినతిపత్రం సమర్పించారు. ఆశా కార్యకర్తల సమస్యలు పరిష్కరించాలి ఆశా కార్యకర్తల సమస్యలను పరిష్కరించని పక్షంలో జులై 9 నుంచి సమ్మె బాట పట్టనున్నారు. అందుకు సంబంధించి సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు సోమవారం సమ్మె నోటీసును జిల్లా వైద్యాధికారి లక్ష్మినరసయ్యకు ఆశా వర్కర్లతో కలిసి అందజేశారు. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, కార్మిక చట్టాలను పునరుద్ధరించాలని డిమాండ్చేస్తూ సమ్మె బాట పట్టనున్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికకు పోటెత్తుతున్న బాఽధితులు కారణాలు ఏవైనా...దొరకని పరిష్కారం గిరిజనుల భూములను ఆక్రమించిన వారిపై చర్యలు చేపట్టాలని సీపీఐ ఆధ్వర్యంలో కలెక్టరేట్ ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో ఆందోళన చేపట్టారు. పెద్దమండ్యం మండలం బండ్రేవు గ్రామ పరిధిలోని అవికె నాయక్ తాండాలో 35 కుటుంబాలు నివసిస్తున్నాయని..వీరి పూర్వీకుల పేరుతో 102, 103 సర్వే నంబర్లలో ఉన్న 50 ఎకరాల భూమి వీరు సాగుచేసుకుంటున్నారన్నారు. అయితే గిరిజనుల భూములను కొందరు కబ్జా చేసి పట్టాలు పొంది ఆక్రమించుకున్నారని కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. -
డెంగీ నివారణకు కృషి చేద్దాం
రాయచోటి టౌన్ : డెంగీ నివారణకు కృషి చేద్దామని జిల్లా వైద్య ఆరోగ్యశాఖాధికారి డాక్టర్ ఎల్. లక్ష్మీనరసయ్య పిలుపునిచ్చారు. సోమవా రం రాయచోటి జిల్లా వైద్యా ఆరోగ్యశాఖ కార్యాలయంలో జాతీయ డెంగీ వారోత్సవ పోస్టర్లు ఆవిష్కరించారు.అనంతరంమాట్లాడుతూ ఈడి స్ విజిప్టి దోమ కాటుతో డెంగీ వస్తుందన్నారు. దోమల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని తెలిపారు. ఎంపీహెచ్ ఈఓవై శ్రీనివాసుల రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ట్రిపుల్ ఐటీలో ప్రారంభమైన అడ్మిషన్ల ప్రక్రియ వేంపల్లె : వైఎస్సార్ జిల్లా ఇడుపులపాయ ఆర్కేవ్యాలీ ట్రిపుల్ ఐటీలో సోమవారం విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించారు. డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా, పరిపాలన అధికారి రవికుమార్, డీన్ అకడమిక్ రమేష్ కై లాస్ ప్రారంభించారు. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన బి.మేఘన తొలి అడ్మిషన్ పొందగా.. సత్యసాయి జిల్లా బుక్కపట్నం గ్రామానికి చెందిన బి.హరీష్ రెండవ అడ్మిషన్, కర్నూలు జిల్లా దేవనకొండ మండలం అలారుదిన్నె గ్రామానికి చెందిన బి.మహేశ్వరి మూడవ అడ్మిషన్ పొందారు. డైరెక్టర్ కుమారస్వామి గుప్తా ఎంపికై న మొదటి, మూడు ర్యాంకుల విద్యార్థులకు ప్రవేశ పత్రాలతోపాటు బహుమతులను ప్రదానం చేశారు. తొలి రోజు 538 మందికి అడ్మిషన్లు పిలవగా, 481 మంది హాజరై అడ్మిషన్లను పొందారు. వెఎస్సార్ను స్మరించుకున్న విద్యార్థులు రాష్ట్ర నలుమూలల నుంచి అడ్మిషన్లు పొందేందుకు విద్యార్థులు వచ్చారు. ఈ నేపథ్యంలో దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డిని వారు స్మరించుకున్నారు. ఆయన ఈ ట్రిపుల్ఐటీలను స్థాపించడం వల్లే తమ లాంటి పేద విద్యార్థులకు ఇలాంటి అవకాశం వచ్చిందన్నారు. ఆయనను ఎన్నటికీ మరువలేమన్నారు. -
టీడీపీ నాయకుల దౌర్జన్యం
రాయచోటి : కూటమి ప్రభుత్వంలో భాగస్వాములైన టీడీపీ నాయకుల దౌర్జన్యాలకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. ప్రభుత్వ భూ ఆక్రమణలే కాకుండా ప్రైవేట్ వ్యక్తులకు సంబంధించిన భూములను సైతం దౌర్జన్యంగా ఆక్రమించి సొంతం చేసుకుంటున్న ఉదంతాలు జిల్లాలో తరచూ జరుగుతున్నాయి. ఈ క్రమంలోనే రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి సొంత నియోజకవర్గంలో భూఆక్రమణలు వెలుగుచూస్తున్నాయి. గాలివీడు మండలం కొర్లకుంట పంచాయతీ చావిడిపల్లికి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు పేరం సురేంద్రారెడ్డి పేరున ఉన్న 65 సెంట్ల పట్టా భూమిని టీడీపీ నాయకులు దౌర్జన్యంతో ఆక్రమించి కంచ వేసేశారు. గ్రామ పొలంలోని సర్వే నంబర్ 183/1లో 0.65 ఎకరాల పట్టా భూమిలో ఉన్న వేపచెట్లను నరికి తరలించుకుపోయారు. ఈ విషయంపై స్థానిక పోలీసు, రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం లేదు. గత కొన్ని నెలలుగా సురేంద్రారెడ్డికి చెందిన నిమ్మతోటకు నీరు వేసుకోవడానికి కూడా ఇబ్బందులు పెడుతున్నారని జిల్లా కలెక్టర్కు విన్నవించుకున్నారు. భూ ఆక్రమణల సమయంలో ఘర్షణకు దిగిన వైఎస్సార్సీపీ నాయకులపైన కేసులు బనాయించి ఆర్థికంగా మానసికంగా ఇబ్బందులు పెట్టాలన్న దురుద్దేశంతోనే స్థానిక నాయకులు ఇలాంటి దురాగతాలకు పాల్పడుతున్నట్లు విమర్శలు ఉన్నాయి. సురేంద్రారెడ్డి భూమిలోని చెట్లను తొలగించి జేసీబీల సాయంతో భూమి అంతా చదును చేసి రాత్రికి రాత్రే మామిడిమొక్కలు నాటి ఆ పొలం చుట్టూ రాళ్లు నాటి కంచె వేశారు. భూఆక్రమణ సమయంలో స్థానికంగా ఉన్న టీడీపీ నేత తన అనుచరులతో కలిసి రెచ్చగొట్టే వ్యాఖ్యలు కూడా చేసినట్లు స్థానిక వైఎస్సార్సీపీ నేతలు తెలిపారు. ఈ భూమికి సంబంధించిన వన్–బి, అడంగల్, ఆర్హెచ్ నకల్ నమూనాలలో కూడా సురేంద్రారెడ్డి పేరున రికార్డు అయింది. స్థానిక టీడీపీ నాయకులు చేస్తున్న దౌర్జన్యాలు, ఆక్రమణల విషయంపై గాలివీడు తహసీల్దార్, పోలీస్స్టేషన్, జిల్లా కలెక్టర్ స్థాయి వరకు విన్నవించుకున్నా న్యాయం జరగడం లేదన్న విమర్శలు ఉన్నాయి. ఇప్పటికై నా ఉన్నతాధికారులు గ్రామాన్ని సందర్శించి భూమి రికార్డులను పరిశీలించి, గ్రామంలో నెలకొన్న పరిస్థితులపై అధ్యయనం చేసి బాధితులకు న్యాయం చేయాల్సిన అవసరం ఉంది. వైఎస్సార్సీపీ కార్యకర్తల పట్టా భూమి ఆక్రమణ రెవెన్యూ, పోలీసు కార్యాలయాల చుట్టూ తిరిగినా జరగని న్యాయం -
‘దేవుడా ఎంత పని చేశావయ్యా.. మీ దర్శనం కోసం నిన్ను తలచుకుంటూ భయ భక్తులతో వచ్చాం.. మాపై దయలేదా.. రోడ్డు ప్రమాదంతో ఎంతో వేదన కలిగించే ఇలాంటి పరిస్థితి ఎదురైంది. చదువుకుంటున్న ఇద్దరు విద్యార్థులు తనువు చాలించారు.. ఇంకో గృహిణి విగత జీవిగా మారింది. మాకెందుకయ్యా
● మాటలకు అందని విషాదం ● తిరుమల దైవ దర్శనానికి వెళ్లి వస్తుండగా ఘోర ప్రమాదం ● ముగ్గురి మృతితో గొల్లుమన్న బాగేపల్లె ● పది మందికి తీవ్ర గాయాలు కురబలకోట : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం చెన్నామర్రి మిట్ట వద్ద సోమవారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదం పెను విషాదాన్ని మిగిల్చింది. కర్నాటక రాష్ట్రం బాగేపల్లెకు చెందిన మూడు కుంటుంబాల వారు డ్రైవర్తో కలిపి 15 మంది తిరుమల దైవ దర్శనానికి వెళ్లారు. తిరుగు ప్రయాణంలో ట్రావెల్ టెంపోలో స్వగ్రామానికి వస్తుండగా మండలంలోని చెన్నామర్రి వద్ద ఎదురుగా వచ్చిన కంటైనర్ లారీ ఢీకొనడంతో ఈ ఘోరం జరిగింది. మేఘర్ష్ (16), చరణ్ (17), శ్రావణి (24) అక్కడికక్కడే విగత జీవులుగా మారారు. మరో పది మంది తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో నరసింహారెడ్డి (49), రూప (40) ఆదర్స్ (19), రామంద్రప్ప (45), కళావతి (40), దర్సన్ (16), శివప్ప(42), సునందమ్మ (38) చైత్ర (19) తోపాటు ట్రావెల్ టెంపో ఢ్రైవర్ మంజునాధ (42) ఉన్నారు. అర్తనాదాలు, విలాపాలతో సంఘటన స్థలం శోకతప్తమైంది.గుండెలవిసే వేదనలతో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి నిండిపోయింది. కాళ్లు, చేతులు విరిగిన వారు, తలలు పగిలిన వారు ఇలా వివిధ రకాలుగా గాయాల పాలైన వారిని చూసి గుండె తరుక్కుపోయింది. విషాదంతో కర్నాటకలోని బాగేపల్లె, కొత్త ఉడుంపల్లె గొల్లు మన్నాయి. పెనుప్రమాదం సంభవించడంతో కురబలకోట, మదనపల్లె ప్రాంతాలు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డాయి. మృతి చెందిన ముగ్గురి మృత దేహాలను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం నిర్వహించారు. గాయపడిన వారిని 108 వాహనం, పోలీసు వాహనంలో తరలించారు. డ్రైవర్ మంజునాథ తీవ్రంగా గాయపడడంతో మాట్లాడలేని పరిస్థితిలో ఉన్నారు. నరసింహారెడ్డి, శివప్ప కుటుంబాలకు చెందిన వారిని మెరుగైన వైద్యం కోసం కర్నాటక రాష్ట్రంలోని వివిధ ఆసుపత్రులకు తరలించారు. ఇదిలా ఉండగా ట్రావెలర్ టెంపోను ఢీకొని వెళ్లిపోయింది కంటైనర్ లారీగా గుర్తించారు. వాహనంతో పాటు డ్రైవర్ కోసం పోలీసులు విభిన్న కోణాల్లో ముమ్మరంగా గాలిస్తున్నారు. కొలిక్కి వచ్చినట్లు చెబుతున్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ, ముదివేడు ఎస్ఐ దిలీప్కుమార్ కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ప్రమాదకర దృశ్యాలు హృదయ విదారకంగా మారాయి. టాప్తో సహా లేచిపోయింది ట్రావెలర్ టెంపో డ్రైవర్ పక్కగా ఎదురుగా వచ్చిన లారీ ఢీకొట్టడంతో అటు వైపు ఉన్న వారు ముగ్గురు చనిపోగా పది మంది గాయపడ్డారు. లారీ వేగంగా ఢీ కొట్టడంతో టెంపో ట్రావెలర్ వాహనం టాప్ ఏమాత్రం లేకుండా లేచిపోయింది. సీట్లలోనే తీవ్ర గాయాలతో పడిఉండటం చలింపజేసింది. మరికొందరు చెల్లా చెదురుగా రోడ్డుపై పడిపోయారు. పోలీసులు సకాలంలో స్పందించారు. స్థానికులు కూడా సహాయక చర్యలతో మానవత్వాన్ని చాటుకున్నారు. ఒక్కో కుటుంబలో ఒక్కరు.. రోడ్డు ప్రమాదంలో ఒక్కో కుటుంబానికి చెందిన ఒకరు మృతి చెందడం కలవరాన్ని కల్గిస్తోంది. బాగేప ల్లె నుంచి నరసింహారెడ్డి, రామచంద్రప్ప, శివప్ప కు టుంబాల వారు తిరుమల యాత్ర వెళ్లారు. నరసింహారెడ్డి కుటుంబంలో అతని కుమారుడు మేఘర్ష్ (16), రామచంద్రప్ప కోడలు శ్రావణి (24), శివప్ప కుటుంబం నుంచి చరణ్ (17) మృతి చెందారు. వీరిలో శ్రావణికి ఐదేళ్ల క్రితం వివాహమైంది. మిగిలిన వారు విద్యార్థులు. బంధువులు కన్నీరుమున్నీరవుతున్నారు. అదృష్టవంతులు ప్రమాదానికి గురైన ట్రావెలర్ టెంపో డ్రైవర్ మంజునాథ పక్క సీట్లో బాగేపల్లెకు చెందిన అశోక్ (32) కూర్చున్నాడు. ఇతని వెనుక సీట్లో బాగేపల్లె దగ్గరున్న ఎ. కొత్తపల్లెకు చెందిన ఏడో తరగతి విద్యార్థి హేమంత్ కూర్చున్నారు. ఇతను ఒక్కడే తిరుమల గుండు చేయించుకున్నారు. వీరు డ్రైవర్కు ఎడమ పక్కన సీట్లలో ఉండడం వల్ల పెను ప్రమాదం నుండి తప్పించుకున్నారు. 15 మందిలో వీరిద్దరికి రక్త గాయాలు కాలేదు. అంత ప్రమాదంలో వీరు బతికి బట్టకట్టడం అధృష్టమేనని చెబుతున్నారు. పక్కనే ఉన్న డ్రైవర్ మంజునాధ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లారు. బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. మూడు కుటుంబాలు విభిన్న వృత్తుల్లో ఉన్నారు. నరసింహారెడ్డి బాగేపల్లిలో డిష్ నిర్వహిస్తున్నారు. రామచంద్రప్ప ప్రొవిజినల్ స్టోర్, శివప్ప వ్యవసాయం చేస్తున్నారు. -
రెండు కార్లు ఢీ
సంబేపల్లె : చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారిపై మండల పరిధిలోని మొటుకువాండ్లపల్లె క్రాస్ సమీపంలో రెండు కార్లు ఢీ కొన్న ప్రమాదంలో 8 మందికి గాయాలయ్యాయి. పోలీసుల వివరాల మేరకు.. అనంతపురం జిల్లా గుత్తి ఆర్ఎస్ నగర్కు చెందిన చరణ్తేజ్ అమ్మ లక్ష్మీదేవి, మామలు తిమ్మరాజు, గుర్రప్పలతో కలిసి అన్నమయ్యజిల్లా కేవీపల్లె మండల గ్యారంపల్లె సమీపంలోని గురుకుల పాళాశాలలో ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశం కోసం సర్టిఫికెట్ పరిశీలనలో భాగంగా కళాశాలకు వెళుతున్నారు. ఈ క్రమంలోనే నంద్యాల జిల్లా ఆళ్లగడ్డకు చెందిన వెంకటశివారెడ్డి, అమ్మ జయమ్మ, భార్య వెంకటేశ్వరమ్మ, కొడుకు ఉమాకాంత్రెడ్డి, కూతురు శిరీషా, మామ రామిరెడ్డి, అత్త లక్ష్మీదేవమ్మలు కారులో అరుణాచలం శివున్ని దర్శించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా అదుపు తప్పి రెండు కార్లు ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో వెంకటశివారెడ్డి, గుర్రప్ప మినహా అందరికీ గాయాలయ్యాయి. వెంటనే వారిని రాయచోటి ప్రభ్వుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తీసుకెళ్లారు. సంఘటన స్థలాన్ని సంబేపల్లె పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేశారు. వైద్యుల నిర్లక్ష్యంతో బాలింత మృతిబద్వేలు అర్బన్ : బద్వేలు మున్సిపాలిటీ పరిధిలోని తొట్టిగారిపల్లె పీహెచ్సీ వైద్యుల నిర్లక్ష్యంతో తన భార్య ప్రాణాలు కోల్పోయినట్లు బద్వేలు మండలం గుండంరాజుపల్లి ఎస్టీ కాలనీకి చెందిన శ్రీనివాసులు ఆరోపించారు. ఆయన తెలిపిన వివరాల మేరకు తన భార్య అయిన పామూరి పెంచలమ్మ మూడవ కాన్పులో ఆదివారం తెల్లవారుజామున ఇంటి దగ్గరే బిడ్డకు జన్మనిచ్చింది. అయితే అధికంగా రక్తస్రావం అవుతుండడంతో తొట్టిగారిపల్లె పీహెచ్సీ ఏఎన్ఎంను సంప్రదించగా ఆసుపత్రి వద్దకు తీసుకువెళ్లాలని సూచించడంతో ఆటోలో పీహెచ్సీకి తరలించారు. అక్కడ డ్యూటీలో ఉన్న నర్సు డాక్టర్కు ఫోన్ చేసి డాక్టర్ సూచనలతో ట్రీట్మెంట్ ఇచ్చినట్లు బాధితులు చెబుతున్నారు. రక్తస్రావం ఆగకపోవడంతో వేరే ఆసుపత్రికి తీసుకెళ్లాలని సూచించడంతో పట్టణంలోని మరొక ఆసుపత్రికి తరలిస్తుండగా మృతి చెందింది. 8 మందికి గాయాలు -
రోడ్డు ప్రమాదంలో తండ్రీ కూతురు దుర్మరణం
పుల్లంపేట : విధి ఆడిన వింత నాటకంలో తండ్రీ, కూతురు దుర్మరణం చెందారు. వివరాల్లోకి వెళ్తే.. పుల్లంపేట మండలం, దళవాయిపల్లి గ్రామానికి చెందిన బుక్కా వెంకట సుబ్బారెడ్డి (45), కుమార్తె బుక్కా స్నేహలత (18)లు శనివారం రాత్రి రోడ్డు ప్రమాదంలో మృతి చెందారు. బుక్కా వెంకట సుబ్బారెడ్డి జీవనోపాధి నిమిత్తం గల్ఫ్ దేశానికి వెళ్లాడు. పది రోజుల క్రితం ఇంటికి రావడంతో ఇంటిల్లిపాది ఆనందంగా గడిపారు. హైదరాబాదులో బీటెక్ ప్రథమ సంవత్సరం చదువుతున్న కుమార్తె స్నేహలత తండ్రి రావడంతో ఇంటికి వచ్చింది. చిట్వేలిలో చదువుతున్న కుమారుడిని పిలుచుకుని వచ్చేందుకు వెంకటసుబ్బారెడ్డి తన కుమార్తె స్నేహలతను తీసుకుని శనివారం బైకుపై బయలుదేరారు. చిట్వేలి నుంచి తిరిగి వస్తుండగా రాజంపేట సమీపంలో అతివేగంగా వచ్చిన స్కార్పియో వాహనం వీరి బైక్ను ఢీ కొంది. ఈ ప్రమాదంలో కుమార్తె స్నేహలత అక్కడికక్కడే మృతి చెందగా, తండ్రి వెంకట సుబ్బారెడ్డిని ఆసుపత్రికి తరలించగా గంట వ్యవధిలోనే మృతి చెందాడు. కుమారుడు వెంకటరమణారెడ్డి(13) స్వల్ప గాయాలతో బయటపడ్డాడు. దీంతో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి. ఖాళీ బిందెలతో మహిళల నిరసన సిద్దవటం : మండలంలోని మాధవరం–1 గ్రామ పంచాయతీ పరిధిలోని వెంకటేశ్వరపురంలో నెలకొన్న తాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులను కోరినా స్పందించలేదని గ్రామ మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆదివారం వారు ఖాళీ బిందెలతో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. అనంతరం స్థానిక మహిళలు మాట్లాడుతూ గత రెండు వారాలుగా తాగునీరు రావడం లేదన్నారు. సుదూర ప్రాంతాలకు వెళ్లి తాగునీరు తెచ్చుకుంటున్నామన్నారు. ఉన్నతాధికారులు తమ సమస్యను పరిష్కరించి తాగునీరు అందించాలని వారు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక మహిళలు పారిజాతం, లక్ష్మిదేవి, ఈశ్వరమ్మ, పద్మావతి, వెంకటసుబ్బమ్మ తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగాల పేరుతో మోసంకడప అర్బన్ : జిల్లాలో ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, కస్తూర్బా కళాశాలల్లో కేరీర్ కౌన్సెలింగ్ డెవలప్మెంట్ అధికారి(సీసీడీఓ) పేరిట ఉద్యోగాలు ఖాళీగా ఉన్నాయంటూ కడపకు చౌటుపల్లె రోడ్డులో నివాసముంటున్న రవి అలియాస్ రఫి కొంతమంది నిరుద్యోగులను నమ్మ బలికించాడు. ఒక్కో నిరుద్యోగి వద్ద నుంచి రూ.5 లక్షల నుంచి 6.50 లక్షల వరకు వసూలు చేశాడని బాధితులు ఆరోపిస్తున్నారు. ఈ సందర్భంగా బాధితులు రవి అలియాస్ రఫీ నివసిస్తున్న ఇంటి వద్ద ఆదివారం ఉదయం ఆందోళన చేపట్టారు. బాధితులు మాట్లాడుతూ రవి అలియాస్ రఫీ తమకు ఉద్యోగాలను ఇప్పిస్తామంటూ ఒకొక్కక్కరి దగ్గరి నుంచి రూ. 6:50 లక్షలను తీసుకున్నాడన్నారు. నిరుద్యోగులైన తమకు ఉద్యోగం వస్తే అప్పు ఎలాగైనా తీర్చుకోవచ్చనే ధైర్యంతో తొలుత కొందరు డబ్బులిచ్చి ఉద్యోగాల్లో చేరారన్నారు. సంబంధిత అధికారి సంతకం చేసిన నియామక ఉత్తర్వులను తీసుకుని 2024 ఆగస్టులో ఉద్యోగాల్లో చేరారన్నారు. ప్రభుత్వ జూనియర్ కళాశాలలకు వెళ్లగా అక్కడున్న అధికారులు కూడా తమను ఉద్యోగాల్లో చేర్చుకున్నారని వారు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 21 మంది ఉద్యోగాల్లో చేరామన్నారు. మూడు నెలల పాటు పని చేశామన్నారు. తరువాత ఉన్నతాధికారులు నిర్వహించిన తనిఖీల్లో తమ నియామకాలు చెల్లవంటూ రద్దు చేసి ఇళ్లకు పంపించారన్నారు. -
వాటర్ ట్యాంకుపైకి ఎక్కి నిరసన
మదనపల్లె : స్థానిక మున్సిపల్ కార్యాలయ ఆవరణలోని రక్షిత మంచినీటి పథకం ట్యాంకుపైకి ఎక్కిన మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికులు ఆదివారం నిరసన తెలిపారు. తమ న్యాయమైన డిమాండ్లను తీర్చాలంటూ కార్మికులు 26 రోజులుగా దీక్షలు, నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి స్పందన లేకపోవడంతో కార్మికులు ట్యాంకుపైకి వెళ్లి ప్రభుత్వ వ్యతిరేక నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో రెడ్డెప్ప, గోపాలకృష్ణ, సజాద్, నాగరాజు, బాబు, కన్నయ్య, రాజేశ్వరి పాల్గొన్నారు. మొహర్రం ఉత్సవాలు ప్రారంభం చిన్నమండెం : మొహర్రం ఉత్సవాలలో జిల్లాలోనే ప్రసిద్ధి గాంచిన చిన్నమండెం పీర్లమకాన్లో ఆదివారం పీర్లను నిర్వాహకులు కొలువుదీర్చారు. ఈ సందర్భంగా పలు పూజాదిక్రతువులను నిర్వహించారు. జులై 5న పీర్ల పండుగ మహోత్సవంలో భాగంగా గంధపు పీరుకు పలు కార్యక్రమాలను నిర్వహించనుండగా కడప పెద్ద దర్గా పీఠాధిపతి హజరత్ ఖ్వాజా సయ్యద్ షా ఆరీఫుల్లా హుస్సేని పాల్గొననున్నారు. 108 వాహనంలో ప్రసవం ఒంటిమిట్ట : పురిటి నొప్పులతో బాధ పడుతున్న మహిళ శనివారం అర్థరాత్రి 108 వాహనంలోనే ప్రసవించింది. అంబులెన్స్ టెక్నీషియన్ నాగబాబు వివరాల మేరకు ఒంటిమిట్ట మండలం మంటపంపల్లి పంచాయతీ మారయ్య గారి పల్లెకు చెందిన జరీనా తన మూడవ కాన్పుకు పురిటి నొప్పులు మొదలు కావడంతో స్థానిక పీహెచ్సీకి ఓ ప్రైవేటు వాహనంలో వచ్చారు. అక్కడ ఉన్న స్టాఫ్నర్స్ కడప రిమ్స్కు తీసుకెళ్లాలని రెఫర్ చేయడంతో అక్కడి నుంచి జరీనాను 108 వాహనంలో కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. కానీ మార్గమధ్యంలో భాకరాపేట గ్రామ సమీపంలో జరీనాకు ప్రసవం నొప్పులు ఎక్కువ కావడంతో 108 అంబులెన్స్లో ఉన్న టెక్నీషియన్ నాగబాబు డెలివరీ చేశారు. జరీనా పండంటి మగ బిడ్డకు జన్మనిచ్చింది. తల్లి బిడ్డ క్షేమంగా ఉన్నారు. చికిత్స నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. 108 వాహనం పైలెట్ భాస్కర్ కూడా సహకరించారు. -
ముగ్గురు అంతర్ జిల్లా దొంగల అరెస్టు
నందలూరు : మండలంలోని నందలూరు గ్రామ పంచాయతీ దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద ముగ్గురు దొంగలను పట్టుకుని వారి వద్ద నుంచి రూ. 25 లక్షలు విలువ చేసే 250 గ్రాముల బంగారం, రూ.14 వేల నగదు స్వాధీనం చేసుకున్నట్లు రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. తమకు అందిన సమాచారం మేరకు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఆదివారం మధ్యాహ్నం దుర్గాపురం క్రాస్ రోడ్డు వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా పోలీసులను చూసి ఆవుల సంజయ్య, ఆవుల ఈశ్వరమ్మ, ఆవుల ప్రమీల అనే వ్యక్తులు పారిపోయేందుకు ప్రయత్నించారన్నారు. వారిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి ఈమేరకు నగలు, నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు శ్రీ సత్యసాయి జిల్లా నంబులపూలకుంటకు చెందిన వారన్నారు. వీరిపైన నందలూరులో రెండు కేసులు, వేంపల్లి, పులివెందుల, అనంతపురం 3వ టౌన్, ఆళ్లగడ్డ టౌన్, నంద్యాల వన్ టౌన్లలో దొంగతనం కేసులు ఉన్నాయన్నారు. అంతర్ జిల్లాల దొంగలను చాకచక్యంగా పట్టుకున్న ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బందిని జిల్లా ఎస్పీ అభినందించినట్లు తెలిపారు.రూ.25 లక్షల బంగారు నగలు స్వాధీనం -
ముళ్ల పొదల్లో ఆలయం హుండీ
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయ చెరువు కట్టపై వెలసిన గంగమ్మ ఆలయం హుండీని రెండు నెలల క్రితం గుర్తు తెలియని దుండగులు అపహరించుకెళ్లారు. హుండీని పగల గొట్టేందుకు దుండగులు విఫల యత్నం చేశారు. ఈ నేపథ్యంలో శనివారం చెరువు కట్ట కింద సమీప ముళ్ల పొదల్లో దుండగులు పడేసిన హుండీని పశువుల కాపరులు గుర్తించారు. విషయం తెలుసుకున్న చెరువు సంఘం అధ్యక్షుడు మండ్లిపల్లి రమేష్ బాబు, ఆలయ పూజారి నరసింహులు, పెద్ద నీరుగట్టి రెడ్డెప్పలు ఘటనా స్థలానికి చేరుకుని హుండీని స్వాధీనం చేసుకున్నారు. అనంతరం హుండీ తాళాలు తీసి అందులో ఉన్న రూ.1,400ల నగదును ఆలయ పూజల కోసం వినియోగించాలని పూజారికి అందజేశారు. మండలంలో ఇటీవల జరుగుతున్న వరుస చోరీల కారణంగా ప్రజలు హడలెత్తిపోతున్నారు. చోరీల విషయంపై ఎస్ఐ హరిహర ప్రసాద్ను వివరణ కోరగా గ్రామాల్లో ఎవరైనా కొత్త వ్యక్తులు సంచరించినా, అనుమానాస్పదంగా తచ్చాడుతూ కనిపించినా తక్షణం పోలీసులకు సమాచారం ఇవ్వాలని ప్రజలకు సూచించామన్నారు. -
జిల్లా అభివృద్ధికి రూ.10వేల కోట్లు ఇవ్వాలి
మదనపల్లె : అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్దికి ప్రభుత్వం రూ.10వేల కోట్ల నిధులు కేటాయించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ కార్యాలయంలో మదనపల్లెలో నిర్వహించే జిల్లా రెండవ మహాసభలపై నాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సాగు, తాగునీటి సమస్యలు, ప్రాజెక్టుల పూర్తిపై దృష్టి పెట్టని ప్రభుత్వం రాందేవ్ బాబాకు హార్సిలీహిల్స్ను కట్టబెట్టేందుకు ఎందుకంత తొందరని ప్రశ్నించారు. బాబాకు హార్సిలీహిల్స్పై అడుగు స్థలం ఇచ్చినా ఉద్యమాలు నిర్వహిస్తామని హెచ్చరించారు. కడప–బెంగళూరు రైల్వేమార్గం పనులు పూర్తి చేయించాలని కోరారు. బీటీ కళాశాలను విశ్వవిద్యాలయం చేయాలన్నారు. యోగా ప్రచారం కోసం రూ.300 కోట్లు ఖర్చుపెట్టిన ప్రభుత్వానికి సమస్యలు పట్టకపోయినా మదనపల్లెకు విమానాశ్రయం కట్టిస్తానని ప్రకటించడం హస్యాస్పదమని అన్నారు. చంద్రబాబుకు చిత్తశుద్ధి ఉంటే మదనపల్లె ప్రాంత రైతాంగ సమస్యలను పరిష్కరించాలన్నారు. సమావేశంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, మహేష్, కృష్ణప్ప, సాంబశివ, మనోహర్రెడ్డి, సుమిత్రమ్మ, మురళి, చిన్నయ్య, శీను పాల్గొన్నారు. -
ఆటో ఢీకొని గుర్తు తెలియని వ్యక్తి మృతి
పులివెందుల రూరల్ : పట్టణంలోని ముద్దనూరుకు వెళ్లే రోడ్డులో ఆదివారం సాయంత్రం ఆటో ఢీకొని రోడ్డుపై కాగితాలు ఏరుకునే గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు.. పోలీసులకు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తొండూరు మండలం క్రిష్ణంగారిపల్లె గ్రామానికి చెందిన బాలాజి పాల డెయిరీ ఆటో పులివెందులకు ప్రయాణికులను ఎక్కించుకుని వస్తుండగా ముద్దనూరు రోడ్డు సమీపంలోని హనుమాన్ గోల్డెన్ సిటీ వద్ద రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని వ్యక్తిని ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆ వ్యక్తి (57) అక్కడికక్కడే మృతి చెందాడు. ఆటోలో ప్రయాణిస్తున్న షబానా, శంషాద్లకు స్వల్ప గాయాలయ్యాయి. గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల సర్వజన ఆసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ప్రమాదానికి గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. -
బి.కొత్తకోటలో తమ్ముళ్ల రచ్చ!
బి.కొత్తకోట : టీడీపీ వర్గపోరు మరోసారి భగ్గుమంది. ఆదివారం స్థానిక షాదీమహల్లో బి.కొత్తకోట పట్టణ టీడీపీ కమిటీ ఎన్నిక కోసం పార్టీ శ్రేణులు సమావేశమయ్యారు. పోటీలో ఉండాలనుకున్న నాయకుల పేర్లను సిద్ధం చేసుకుంటున్న స్థానిక నాయకులను కొందరు మా పేర్లు రాసుకోండి అంటూ డిమాండ్ చేశారు. దీంతో మొదలైన గొడవ తోపులాటకు దారితీసింది. గత ఎన్నికల్లో ఓడిపోయిన టీడీపీ అభ్యర్థి జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గీయులు కమిటీ ఎంపిక ప్రక్రియలో పాల్గొన్నారు. పట్టణంలోని సీనియర్లు, పదవులను కోరుతున్న నాయకులతో అభిప్రాయాలను సేకరిస్తున్నారు. ఇంతలో కొండ్రెడ్డి వర్గంతోపాటు జయచంద్రారెడ్డి వర్గీయులు సమావేశానికి హాజరయ్యారు. పార్టీలో ఉంటున్న సీనియర్లు, కష్టపడిన వారికి కమిటీల్లో చోటు కల్పించాలని జయచంద్రారెడ్డి వర్గ నాయకులు డిమాండ్ చేశారు. దీనికి అందరూ బరిలో నిలబడవచ్చని వ్యతిరేక వర్గం సూచించింది. దీంతో ఒకరిపై ఒకరు ఆగ్రహావేశాలు వ్యక్తం చేసుకొంటూ తోసుకున్నారు. కుర్చీలతో కొట్టుకునేందుకు సిద్ధమయ్యారు. సవాళ్లు విసురుకున్నారు. ఈ విషయం తెలుసుకున్న ఏఎస్ఐ భాస్కర్నాయక్, పోలీసులు షాదీమహల్ చేరుకున్నారు. వివాదం వద్దంటూ పోలీసులు వారించారు. ఈ వివాదంతో కమిటీ ఎన్నిక జరగకుండానే సమావేశం ముగిసింది.టీడీపీ పట్టణ కమిటీ ఎన్నికలో ఉద్రిక్తత -
ఆంధ్రా కువైట్లో ఏపీఎన్ఆర్టీఎస్ ఎత్తివేత!
రాజంపేట : ఉమ్మడి కడప జిల్లాలో ఆంధ్రా కువైట్గా ప్రసిద్ధికెక్కిన రాజంపేటలో ఏపీఎన్ఆర్టీఎస్ (ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ) కార్యాలయం ఎత్తివేశారు. దీంతో గల్ఫ్ వాసులను ఆదుకునే పరిస్ధితులు లేకుండా పోయాయి. కువైట్ దేశం వలన రాజంపేటలోని ఎస్బీఐ రాష్ట్రంలోనే మొదటి స్ధానంలో నిలిచింది. ఎన్ఆర్ఐ ఖాతాలను బట్టి రాజంపేట ఆంధ్రా కువైట్గా పేరు గడించింది. ఈ నేపథ్యంలో రాజంపేటను గుర్తించి, గల్ఫ్ దేశాలలో ఉండే వారి కోసం ప్రవాసాంధ్రులకు సేవలందించేందుకు గాను వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి అయిన తొలినాళ్లలో న్యూ బోయనపల్లె(కడప–రేణిగుంట జాతీయరహదారి)లో ఏర్పాటు చేశారు. ఆ కార్యాలయాన్ని కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో ఖాళీ చేశారు. రాయలసీమ జిల్లాల కోసం రాజంపేటలో ఏర్పాటు.. రాయలసీమ జిల్లాలలోని గల్ఫ్వాసుల కోసం రాజంపేటలోనే ఏపీఎన్ఆర్టీఎస్ ఏర్పాటు చేయడం గమనార్హం. ఇప్పుడు భవన యజమాని టూ లెట్ బోర్డు పెట్టేశారు. దీంతో ఏపీఎన్ఆర్టీఎస్ కార్యాలయం ఎత్తివేసినట్లుగా గల్ఫ్వాసులు గుర్తించారు. ఉమ్మడి జిల్లా నుంచి ఎడారి దేశాలకు.. రాయలసీమలో ప్రధానంగా ఉమ్మడి కడప జిల్లా నుంచి అధికంగా ఎడారి దేశాలకు వెళ్లేవారి సంఖ్య లక్షల్లో ఉంటుంది. జీవనోపాధి కోసం నాలుగు దశాబ్దాలుగా ఎడారి దేశాలకు రాకపోకలు సాగిస్తూనే ఉన్నారు. ప్రధానంగా కువైట్, ఖత్తర్, దుబాయ్, సౌదీ అరేబియా, బహ్రెయిన్, అబుదాబి, లెబనాన్, మస్కట్ దేశాలు ఉన్నాయి. గల్ఫ్ దేశాలకు వెళ్లే వారు అధికంగా 60 శాతం చదువురాని వారు ఉన్నారు. మోసాలపాలైన వారి కోసం.. మోసానికి గురై జైలుపాలై అనేక సమస్యలలో ఇరుక్కున్నవారు కూడా ఉమ్మడి కడప జిల్లాలో ఉన్నారు. వారిని అన్ని విధాలుగా ఆదుకునేందుకు నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఏపీఎన్ఆర్టీఎస్ను బలోపేతం చేశారు. సీమలో గల్ఫ్వాసులు అధికంగా ఉన్న కారణంగా రాజంపేటలో సొసైటీ కార్యాలయాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. దీని ద్వారా వందలాది మంది గల్ఫ్ బాధితుల సమస్యలకు పరిష్కారం చూపారు. గల్ఫ్దేశాలలో జీవించేందుకు, వారిలో నైపుణ్యం పెంపొందించేందుకు శిక్షణ కార్యక్రమాలు నిర్వహించారు. విదేశాలకు వెళ్లేవారు, నివసిస్తున్న వారి కోసం హెల్ప్లైన్ నంబర్లను అందుబాటులోకి తీసుకొచ్చారు. సురక్షిత వలసలపై వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాలలో అవగాహన కార్యక్రమాలను సొసైటీ నిర్వహించింది. సొసైటీ ద్వారా దేశ వ్యాప్తంగా 200 కంటే ఎక్కువ మందిని కో–ఆర్టినేటర్లను నియమించారు. ఏపీఎన్ఆర్టీఎస్ ఏమేమి చేసిందంటే.. ప్రవాసాంధ్రులకు సహాయనిధి, భరోసా బీమా, ఆన్లైన్ ఐటీ శిక్షణ, ఏపీ పోలీసు ఎన్ఆర్ఐ సెల్, ఫ్రీ–డిపార్టుమెంట్ ఓరియంటేషన్ అండ్ ట్రైనింగ్, ఏపీఎన్ఆర్టీఎస్ ట్రస్ట్ కనెక్టు టు ఆంధ్రా, పెట్టుబడులు సలహాలు, పవిత్ర నాణేలు, ఆర్థిక పునర్ వ్యవస్థీకరణ కేంద్రం, పాస్పోర్టులో సలహాలు, మరణించిన ఎన్ఆర్టీఎస్ బంధువులకు ఎక్స్గ్రేషియా, అధునాతన ఐటీ కోర్సులలో ఆన్లైన్ శిక్షణ , అంతర్జాతీయ నైపుణ్య శిక్షణ, అంతర్జాతీయ కంపెనీలలో నియామకాల సౌకర్యం వంటి ఉచిత సేవలను అందజేశారు. జగన్న పాలనలో గల్ఫ్ బాధితులకు భరోసా ఏపీఎన్ఆర్టీఎస్తో ఎందరికో ఆపన్నహస్తం కూటమి పాలనలో సేవలకు మంగళంఏపీఎన్ఆర్టీఎస్తో విదేశాలలో ఉన్నవారికి భరోసా ఏపీఎన్ఆర్టీఎస్ ద్వారా విదేశాలలో ఉన్నవారికి భరోసా కల్పించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఈ సొసైటీ ద్వారా విస్తతృంగా సేవా కార్యక్రమాలను నిర్వహించారు. ఆ దిశగా అనేక మంది విదేశీ బాధితులను ఆదుకునేందుకు సొసైటీ ముందుకు నడిచేలా జగనన్న ప్రభుత్వం ఏపీఎన్ఆర్టీఎస్ను తీర్చిదిద్దింది. చిల్లా కిరణ్, యూఎస్ఏ, వెంకటరెడ్డిపల్లె, రైల్వేకోడూరుజగనన్న పాలనలో ఏపీఎన్ఆర్టీఎస్ బలోపేతం వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా కొనసాగిన పాలనలో ఏపీఎన్ఆరీటీఎస్ బలోపేతం చేశారు. అప్పటి వరకు ఇలాంటి సొసైటీ ఒకటి ఉందనేది చాలా వరకు తెలియదు. వైఎస్సార్సీపీ పాలనలో సొసైటీ ద్వారా ఎందరో గల్ఫ్ బాధితులను ఆదుకున్నారు. కోవిడ్–19లో తనదైన రీతిలో సేవలందించారు. రాయలసీమలో గల్ఫ్ వాసుల కుటుంబాలు అధికంగా ఉన్నాయి. ఆ దృష్ట్యా రాజంపేటలో సొసైటీ ఏర్పాటు చేశారు. –గోవిందు నాగరాజు, వైఎస్సార్సీపీ గల్ఫ్ కో–కన్వీనర్, కువైట్ -
నేడు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం
రాయచోటి జగదాంబసెంటర్ : కూటమి ప్రభుత్వం చేసే అవినీతి పనులపై వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఈ నెల 30వ తేదీన కలెక్టర్కు వినతిపత్రం సమర్పించే కార్యక్రమం ఉంటుందని రాయచోటి నియోజకవర్గ పంచాయతీ విభాగం ప్రెసిడెంట్ మాసన వెంకటరమణ, రాష్ట్ర పంచాయతీ విభాగం సెక్రటరీ గాలివీటి ప్రవీణ్రెడ్డిలు తెలిపారు. ఈ మేరకు వారు ఆదివారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో కరపత్రాలను విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ రాష్ట్రంలో ఉపాధి హామీ పథకంలో జరుగుతున్న అవినీతిపై కేంద్ర ప్రభుత్వం విచారణ చేయించాలన్నారు. ఎన్ఆర్ఈజీఎస్ చట్టం మేరకు ఉపాధి హామీ పనులు గ్రామ పంచాయతీల ద్వారానే జరిపించాలని కూలీలకు సకాలంలో బిల్లులు చెల్లించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం జనరల్ సెక్రటరీ సూరం వెంకటసుబ్బారెడ్డి, మేధావుల ఫోరం రాయచోటి నియోజకవర్గ అధ్యక్షుడు జానం రవీంద్ర, చిట్లూరు సర్పంచ్ రామాంజులు, వైఎస్సార్సీపీ నాయకులు పేయల శివశంకర్, సంజీవయ్య, హజరత్ ఖాదర్వలీ తదితరులు పాల్గొన్నారు. -
బైకుతో హోంగార్డును ఢీకొన్న మైనర్ బాలుడు’
కలికిరి : వాహనాల తనిఖీలలో భాగంగా వాహనాన్ని ఆపిన హోంగార్డును మైనర్ బాలుడు బైకుతో ఢీకొని వెళ్లిపోయాడు. దీంతో హోంగార్డుకు కుడి కాలు విరిగింది. పోలీసుల కథనం మేరకు.. కలికిరి పట్టణ పరిధిలో పోలీసులు వాహనాలు తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో హోంగార్డు చింతల ప్రతాప్ రెడ్డి వాహనాలను ఆపుతున్నాడు. అటుగా వచ్చిన మైనర్ బాలుని వాహనాన్ని ఆపాడు. అతను ఆపకుండా హోంగార్డును ఢీకొని వెళ్లాడు. ప్రమాదంలో హోంగార్డుకు వాహనం తగిలి కిందపడ్డాడు. కాలు విరిగి గాయాలపాలయ్యాడు. దీంతో పోలీసులు అతన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించగా ప్రథమ చికి త్స అనంతరం తిరుపతికి రెఫర్ చేశారు. ఈ మేరకు మైనర్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు హెడ్కానిస్టేబుల్ మదనమోహన్ రెడ్డి తెలిపారు. -
మీలో ఉందా.. ఆలోచనా శక్తి!
మదనపల్లె సిటీ: విద్యార్థుల్లో, ఆలోచన శక్తిని పెంపొందించి పరిశోధనల వైపు ఆసక్తిని కల్పించేందుకు కేంద్ర ప్రభుత్వం ఏటా ఇన్స్పైర్మనాక్ అవార్డుల పేరుతో ప్రోత్సహిస్తుంది. కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ఆధ్వర్యంలో నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ , డిపార్టుమెంట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ వారు చేపడుతున్న ఈ కార్యక్రమానికి ప్రస్తుత విద్యా సంవత్సరం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. దేశవ్యాప్తంగా 6 నుంచి 12 తరగతులు చదువుతున్న విద్యార్థుల నుంచి లక్ష ప్రాజెక్టులను ఎంపిక చేసి ఒక్కోదానికి రూ.10 వేల చొప్పున అందజేసి ప్రోత్సహిస్తుంది. విద్యాశాఖ పరిధిలోని అన్ని యజమాన్యాలు, ప్రభుత్వం, ప్రైవేట్, కస్తూర్బాగాంధీ, మోడల్ స్కూల్స్, అన్ని పాఠశాలల విద్యార్థులు ఇందులో పాల్గొనవచ్చు. ఇన్స్పైర్ అవార్డులు పొందిన విద్యార్థులు జిల్లా, రాష్ట్ర ,జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొనడానికి అవకాశం ఉంటుంది. ప్రస్తుతం 2025–26 ఇన్స్పైర్ మనాక్ అవార్డుల ప్రదర్శనకు ప్రకటన జారీ చేసింది. ఇందుకు సంబంధించి ప్రతిపాదనలు పంపించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. ఏటా ప్రతిష్టాత్మకంగా.... కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ ఏటా ఇన్స్పైర్ మనాక్ పోటీలను ప్రతిష్టాత్మకంగా నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ,రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఈ సరికొత్త వేదికను రూపొందించారు. దీనిలో అన్ని ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. జిల్లాలో 304 ఉన్నత, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దీని కోసం 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు తరగతికి ఒకరు వంతున పాఠశాలకు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే అవకాశం ఉంది. 2008–09 నుంచి ఏటా నిర్వహించే ఇన్స్పైర్ మనాక్ పోటీలకు ప్రభుత్వ, ప్రైవేటు మేనేజ్మెంట్ల పాఠశాలల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. వెబ్సైట్లో నమోదు ఇలా.. విద్యార్థులు వెబ్సైట్ www.inspireaawards. gov.inలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. జిల్లా అథారిటీ ఆమోదం తర్వాత విద్యార్థి మెయిల్ ఐడీకి యూజర్ ఐడీతో కూడిన లింకు వస్తుంది. యూజర్ ఐడీకి పాస్వర్డ్ను క్రియేట్ చేసుకోవాలి.విద్యార్థి తన సమాచారంతో పాటు బ్యాంకు లేదా తపాలా ఖాతా, ఆధార్ నంబర్లను నమోదు చేయాలి. ఎంచుకున్న ప్రాజెక్టును సంక్షిత్తంగా వెబ్సైట్లో నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషికం అందిస్తారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్ ,జపాన్ సందర్శన అవకాశాలతో పాటు ఇంజినీరింగ్ కాలేజీ విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్సు అధికారులను సంప్రదించాలి. ప్రోత్సహించాలి విద్యార్థులలో పరిశోధనలపై ఆసక్తిని పెంచడానికి,పిల్లల్లో సృజనాత్మకతను వెలికితీయడానికి ఇన్స్పైర్ మానక్ అవార్డులు మంచి అవకాశం. ఆసక్తి ఉన్న విద్యార్థులను ఉపాధ్యాయులు ప్రోత్సహించాలి. ప్రాజెక్టులు తయారు చేయించాలి. –మార్ల ఓబుల్రెడ్డి, జిల్లా సైన్సు అధికారిచక్కని అవకాశం విద్యార్థులు తమలోని సృజనాత్మక ప్రతిభను ప్రదర్శించేందుకు ఇన్స్పైర్ మనాక్ ఒక చక్కని అవకాశం. ఈ పోటీల్లో విద్యార్థులందరూ పాల్గొనేలా ఆయా పాఠశాలల ప్రధానోపాధ్యాయులు ప్రత్యేక చొరవ చూపాలి. జిల్లా నుంచి అధికంగా నామినేషన్లు నమోదు అయ్యేలా చర్యలు తీసుకోవాలి. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్లో గొప్ప శాస్త్రవేత్తలను కలుసుకునే అవకాశం లభిస్తుంది. –సుబ్రమణ్యం, డిఈఓతొలుత పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను పరిష్కరించేలా ఐడియా ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి వివవరాలు నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబర్, ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి,సంబంధిత రైటప్ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతను సంబంధించి అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టుల ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 తేదీ వరకు గడువు ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం ఇన్స్పైర్ మనాక్ నామినేషన్ల నమోదుకు శ్రీకారం సెప్టెంబర్ 15 వరకు గడువు -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 30వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో కలెక్టర్ పేర్కొన్నారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే కార్యక్రమానికి రావాలని తెలిపారు. క్రీడలతోనే ఉజ్వల భవిష్యత్తు మదనపల్లె సిటీ: విద్యార్థులు క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ అధికారి గౌస్భాషా అన్నారు. మదనపల్లె సమీపంలోని వేద పాఠశాలలో రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు ఆదివారం ప్రారంభమయ్యాయి. పోటీలను ఎమ్మెల్యే షాజహాన్బాషా ప్రారంభించారు. విద్యార్థి దశ నుంచి క్రీడపట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా పుట్బాల్ అసోషియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్కుమార్, మురళీధర్, రాష్ట్ర పరిశీలకులు సిరాజ్అహ్మద్, చినబాబు,కమలేష్, పవన్ తదితరులు పాల్గొన్నారు. మొదటి రోజు అన్నమయ్య, తిరుపతి, సత్యసాయి, వైజాగ్ జిల్లాల జట్లు పోటీల్లో పాల్గొన్నాయి. రెడ్డెమ్మా..కరుణించమ్మా... గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తజన సందడి నెలకొంది. భక్తులు అమ్మవారికి వేకువజామునే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానం ఆచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. పలువురు భక్తులు తలనీలాలు సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు.రాయలసీమ జిల్లాలతో పాటు కర్నాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. -
నిబంధనలు గాలికి..
కడప అగ్రికల్చర్: కడప కలెక్టరేట్ ఆవరణలోని ఉద్యాన, వ్యవసాయశాఖ కార్యాలయంలో రెండోరోజు ఉమ్మడి కడపజిల్లా సచివాలయ ఉద్యాన, వ్యవసాయ సహాయకులు బదిలీ కౌన్సెలింగ్ కొనసాగింది. రెండోరోజు కూడా అధికారులు ప్రభుత్వ నిబంధనలు తుంగలో తొక్కారు. ఎమ్మెల్యేల సిఫార్సులకే ప్రాధాన్యత ఇచ్చినట్లు తెలిసింది. కూటమి నేతలు ఇచ్చిన లెటర్లతోపాటు వారి ఫోన్లకే ప్రాధాన్యత కల్పించినట్లు పలువురు ఉద్యోగులు ఆరోపించారు. కూటమి నేతలు చెప్పిన వాళ్లకే మంచి స్థానాలను కేటాయించారని చర్చించుకున్నారు. వ్యవసాయ సహాయకులకు సంబంధించి 94 మందికి ఆదివారం కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో కూడా స్పౌజ్, మెడికల్ కేసులను ఏమాత్రం పరిగణలోకి తీసుకోలేదని వాపోయారు. ప్రభుత్వ నిబంధనలను పరిగణలోకి తీసుకోకుండా తమకు అన్యాయం చేశారని పలువురు బాధితులు ఆవేదనను వ్యక్తం చేశారు. ఒక డిజేబుల్ అమ్మాయిని లక్కిరెడ్డిపల్లె నుంచి రాజుపాలెం మండలానికి బదిలీ చేసినట్లు, మరో మెడికల్ గ్రౌండ్ ఉన్న అబ్బాయిని పెద్దముడియం నుంచి వీఎన్పల్లెకు బదిలీ చేసినట్లు తెలిసింది. ఈ విషయంలో తమకు అన్యాయం జరిగిందని మెరపెట్టుకున్నా అధికారులు పెడచెవిన పెట్టారని తెలిసింది. అలా ఒకరిద్దరికి కాకుండా చాలా మందికి అన్యాయం జరిగినట్లు తెలిసింది. కౌన్సెలింగ్కు వచ్చిన అభ్యర్థులను ర్యాంకుల వారీగా పిలిపించి వారికి వచ్చిన స్థానాలను కేటాయించారు. అయితే ఈ స్థానాలను తరువాత ఇచ్చే అర్డర్లో కనపరుస్తారా లేక అధికార పార్టీ నేతలు చెప్పిన వాళ్లకు కట్టుబెడతారా అనే ఆందోళన వ్యక్తం చేశారు. ప్రస్తుతం బదిలీల్లో అన్యాయం జరిగిన వ్యవసాయ సహాయకులంతా ధర్నాకు సిద్ధమవుతున్నట్లు తెలిసింది. రెండవ రోజు కూడా సరైన వసతులు లేక వ్యవసాయ సహాయకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. అలాగే ఉద్యానశాఖ సహాయకులకు సంబంధించి రెండోరోజు కౌన్సెలింగ్ నిర్వహించారు. ఉద్యాన, వ్యవసాయ సహాయలకు బదిలీలకు సంబంధించి డీఏఓ చంద్రనాయక్ డీహెచ్ఓ రవిచంద్రబాబులు మాట్లాడుతూ రెండో రోజు బదిలీల కౌన్సిలింగ్ను కూడా సిఫారస్సులకు తావు లేకుండా నిర్వహించామని తెలిపారు. ● రైతు సేవా కేంద్రాలకు వచ్చిన ఎరువులును విక్రయించగా వచ్చిన డబ్బులను ప్రభుత్వానికి చెల్లించకుండా గతంలో కొందరు వ్యవసాయ సహాయకులు సొంతానికి వాడుకున్నారు. ప్రస్తుత బదిలీల్లో డబ్బులు వాడుకున్న వారికి ఈ వ్యవహారం గుదిబండగా మారింది. బకాయి డబ్బులను చెల్లిస్తేనే బదిలీకి అనుమతి ఇస్తామని, లేకుంటే లేదని అధికారులు వారికి సూచించినట్లు తెలిసింది. దీంతో బకాయిలు ఉన్న కొంతమంది డబ్బులు చెల్లించగా అధిక మొత్తంలో బకాయిలు ఉన్న వారు మాత్రం చెల్లించలేకపోయినట్లు తెలిసింది. ఈ వ్యవహారంలో అధికారులు వారితో ఒప్పందం తీసుకుని బదిలీలో చోటు కల్పించినట్లు తెలిసింది. రెండోరోజు మెడికల్ గ్రౌండ్, స్పౌజ్ కేసులకు అన్యాయం అధికారి పార్టీ నేతల సిఫార్సులకే పెద్దపీట అన్యాయం జరిగిందని ఆందోళన -
బంగారు భవిత
గ్రామీణ విద్యార్థులకు వేంపల్లె: గ్రామీణ పేదవర్గాలకు చెందిన ప్రతిభావంతులైన విద్యార్థులకు అంతర్జాతీయస్థాయి ఇంజినీరింగ్ విద్యను అందించేందుకు దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి ఆలోచనలకు రూపమే ట్రిపుల్ ఐటీలు. వీటిని ఆర్జేయూకేటీ నిర్వహిస్తోంది. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025– 26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ సోమవారం నుంచి ప్రారంభం కానుంది. తెలిపారు. ఉదయం 9 గంటలకు క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుందన్నారు. ఈనెల 23న రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీలు నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలకు సంబంధించి అధికారులు ఎంపిక జాబితా విడుదల చేశారు. ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి సంబంధించి ఈనెల 30 వ తేదీ, జులై 1వ తేదీలలో ఎంపికై న విద్యార్థులకు కౌన్సెలింగ్ పక్రియ ఉంటుంది. ఈ పక్రియకు కావలసిన అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమార స్వామిగుప్తా తెలిపారు. రెండు రోజుల్లో 1,060 మందికి కౌన్సెలింగ్ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం నిర్వహిస్తున్న కౌన్సెలింగ్లో భాగంగా రెండు రోజుల్లో ప్రత్యేక కేటగిరీ మినహా 1060మందికి కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. 30వ తేదీ (సోమవారం) 530 మంది అభ్యర్థులకు, జూలై 1వ తేదీన 530 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. కౌన్సెలింగ్కు అవసరమైనవి పదోతరగతి హాల్ టికెట్, పదోతరగతి మార్కుల జాబితా, టెన్త్ టీసీ, కాండక్ట్ సర్టిఫికెట్, స్టడీ సర్టిఫికెట్ (4వ తరగతి నుంచి 10వ తరగతి వరకు), మీసేవా కేంద్రం నుంచి తీసుకున్న కుల ధ్రువీకరణ పత్రం, ఈ ఏడాది ఏప్రిల్ తర్వాత మీసేవా కేంద్రం ద్వారా తీసుకున్న ఆదాయ ధ్రువీకరణ పత్రం, అభ్యర్థి, అతని తల్లిదండ్రుల రెండు పాసు పోర్టు ఫొటోలు, రేషన్ కార్డు, అభ్యర్థి ఆధార్ కార్డు, విద్యార్థులకు ఎవరికై నా బ్యాంకు లోన్ అవసరమైతే పైన పేర్కొన్న సర్టిఫికెట్లన్నీ నాలుగు సెట్లు, అభ్యర్థి తండ్రి ఉద్యోగి అయితే ఎంప్లాయి ఐడెంటీ కార్డు, శాలరీ సర్టిఫికెట్, అభ్యర్థి తండ్రి పాన్, ఆధార్, ఓటర్ ఐడీ కార్డు అందజేయాలి. విద్యార్థులు ఎలా రావాలంటే .. అనంతపురం, కర్నూలు, కడప, చిత్తూరు తదితర జిల్లాల వైపు నుంచి వచ్చేవారు వేంపల్లె బస్టాండుకు చేరుకున్న తర్వాత అక్కడి నుండి ప్రతి నిమిషానికి ఇడుపులపాయకు ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి ప్రత్యేక బస్సులు ఉన్నాయి. వేంపల్లె నుంచి ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీకి 15 కిలోమీటర్లు దూరం మాత్రమే ఉంది. అంతేకాకుండా వేంపల్లె బస్టాండు, నాలుగు రోడ్ల కూడలిలో దిగిన తర్వాత అక్కడనుండి వీరన్నగట్టుపల్లి మీదుగా ట్రిపుల్ ఐటీకి నిత్యం ఆటోలు ఉంటాయి. ● క్రమశిక్షణ..ఉత్తమ విద్యాబోధన ఆరేళ్ల సమీకృత ఇంజినీరింగ్ విద్యా బోధనలో భాగంగా ఆహ్లాదకరమైన వాతావరణం, నాణ్యమైన విద్యాబోధన, క్రమశిక్షణ, ఉత్తమ సామాజిక స్పృహ ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ సొంతం. ఉదయం 7గంటలకు అల్పాహారం, అనంతరం అసెంబ్లీ, 8 గంటల నుంచి 12 గంటల వరకు తరగతులు, ఒంటిగంట వరకు భోజన విరామం, మళ్లీ ఒంటిగంట నుంచి సాయంత్రం 5గంటల వరకు తరగతులు తరగతులు, అనంతరం టీ, స్నాక్స్, 6గంటల వరకు ఆటలు, రాత్రి 7గంటలకు భోజనం, అనంతరం రాత్రి 10 గంటల వరకు స్టడీ అవర్స్ ఇవి ట్రిపుల్ ఐటీ విద్యార్థుల దైనందిన కార్యక్రమాలు. మొదటి రెండు సంవత్సరాలు ఇంటర్ కు సమానమైన పీయూసీ కోర్సును, తర్వాత నాలుగేళ్లు ఇంజినీరింగ్ విద్యను బోధిస్తారు. ‘ట్రిపుల్ ఐటీలో చేరిన తర్వాత విద్యార్థులు మొదటి, రెండు సంవత్సరాలు (పీయూసీ) ఏడాదికి రూ.45 వేలు, తర్వాత నాలుగేళ్లు (ఇంజనీరింగ్) ఏడాదికి రూ.50వేల చొప్పున చెల్లించాలి. ఫీజు రీయింబర్స్మెంట్కు అర్హత కలిగిన విద్యార్థులకు ప్రభుత్వమే చెల్లిస్తుంది. ప్రభుత్వం చెల్లించిన నగదుపోను మిగిలిన సొమ్మును విద్యార్థులే చెల్లించాల్సి ఉంటుంది. కౌన్సెలింగ్కు ఏర్పాట్లు పూర్తి రాజీవ్ గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయ పరిధిలోని ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2025–26 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల కౌన్సెలింగ్ ప్రక్రియకు అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. సోమవారం ఆర్కే వ్యాలీ ట్రిపుల్ క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో 530 మంది విద్యార్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు భోజనం వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. నేటి నుంచి ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్ -
గంగమ్మ ఆలయంలో భక్తుల రద్దీ
లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న లక్కిరెడ్డిపల్లెలోని అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం గంటల కొద్దీ క్యూలైన్లలో వేచి ఉన్నారు. గంగమ్మా ..కరుణించమ్మా.. సకాలంలో వర్షాలు కరుపించు తల్లీ అంటూ భక్తులు అంటూ వేడుకున్నారు. జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి కూడా భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలు అందజేశారు. ప్రత్యేక అలంకరణలో అమ్మవారు -
● ఐదు మండలాలు జిల్లాలోకి...
మదనపల్లె: అడక్కుంటే అమ్మైనా అన్నం పెట్టదు అన్నది సామెత. అయితే పుంగనూరు నియోజకవర్గ ప్రజలు తాము ఉంటున్న చిత్తూరుజిల్లా నుంచి తప్పించి అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేయండని అడగకపోయినా ప్రభుత్వమే రాజకీయ నిర్ణయం తీసుకుని విభజన చేస్తోంది. ఏదైనా సమస్య ఉంటే ప్రజలే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించాలని విన్నవించుకుంటారు. అయితే ఎవరూ అభ్యర్థించకపోయినా ఒక ప్రాంత ప్రజలను, భౌగోళికంగా అనువైన పరిస్థితుల నుంచి తప్పించి మరో ప్రాంతంలో కలిపితే దాన్ని రాజకీయ విభజన అని చెప్పవచ్చు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే చిత్తూరుజిల్లాలోని పుంగనూరు నియోజకవర్గాన్ని అన్నమయ్యజిల్లాలోకి కలపాలంటూ ప్రజల నుంచి వినతులు లేకపోయినా ప్రభుత్వం రాజకీయ విభజన చేపట్టింది. ప్రభుత్వం నుంచి నిర్ణయం వెలువడుతూ ఉత్తర్వు రావడం, అదేరోజు అన్నమయ్యజిల్లా కలెక్టర్ నోటిఫికేషన్ జారీ చేయడం చకచకా జరిగిపోయాయి. నెలరోజుల గడువుతో అభ్యంతరాలను ఆహ్వనించిన ప్రభుత్వం ఇప్పుడు అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేసేందుకు సిద్ధమైపోయింది. అభ్యంతరం లేకుండా విభజన వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉమ్మడి చిత్తూరుజిల్లాను విభజించి కొత్త జిల్లా ఏర్పాటు ప్రక్రియ విషయంలో ఒక్క అభ్యంతరం లేకుండా ప్రజలకు అనుకూలమైన విధంగా చర్యలు తీసుకున్నారు. ఉమ్మడిజిల్లాకు చెందిన పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరుజిల్లాలో ఉంచేసి, మిగిలిన తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాలను అన్నమయ్యజిల్లాలో కలిపారు. దీనిపై ప్రజల నుంచి అభ్యంతరాలు వ్యక్తం కాలేదు. దీనితో సునాయసంగా కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియ ముగిసింది. పుంగనూరు నియోజకవర్గం చిత్తూరులో కొనసాగించే విషయంలోనూ అభ్యంతరాలు లేవు. అంటే నియోజకవర్గ ప్రజలు చిత్తూరులో కొనసాగేందుకు సముఖత వ్యక్తం చేశారు. కూటమి రాగానే విభజన మంత్రం అందుకుంది. అడక్కుండానే మార్పు పుంగనూరు నియోజకవర్గ ప్రజలు తమను అన్నమయ్యజిల్లాలోకి విలీనం చేయాలన్న విన్నపాలు తెరపైకి తేలేదు. ఇప్పుడున్న స్థితినే కోరుకున్నారు. డివిజన్ కేంద్రం మదనపల్లెకు రావడం కంటే చిత్తూరు కేంద్రం దగ్గరని ఇక్కడి ప్రజలకు తెలుసు. మదనపల్లెకు చౌడేపల్లి, పుంగనూరు పట్టణం మినహా మిగిలిన సోమల, సదుం, పులిచర్ల, రొంపిచర్ల మండలాలు భౌగోళికంగా పాలనాపరంగా చిత్తూరు దగ్గరలో ఉంటుంది. పులిచర్ల మండలం చిత్తూరు, తిరుపతిజిల్లా కేంద్రాలకు సమీపంలో ఉంటుంది. మిగిలినవన్నీ మదనపల్లెకు దూరంగా ఉంటాయి. దీన్ని పట్టించుకోకుండా ప్రభుత్వం మదనపల్లె డివిజన్లో కలిపేసేందుకు నిర్ణయించింది. పెద్దిరెడ్డిపై కక్షతోనే.. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై రాజకీయంగా కక్ష సాధించేందుకు ఎన్నో ప్రయత్నాలు జరిగాయి. తప్పుడు ఆరోపణలతో ఇబ్బందులకు గురి చేసే యత్నాలు సాగాయి. అందులో నిజాలు లేవని తేలిపోవడంతో ప్రభుత్వం రాజకీయంగా దెబ్బతిసేలా అభివృద్ధి పనులు, రిజర్వాయర్ల పనులను అడ్డుకుంది. అయినా దాహం తీరని ప్రభుత్వం పుంగనూరు నియోజకవర్గాన్ని చిత్తూరునుంచి వేరుచేసి అన్నమయ్యజిల్లాలో కలిపేందుకు సిద్ధమై ఈ మేరకు చర్యలు పూర్తి చేస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చిత్తూరుజిల్లాలో పుంగనూరు ఉంచడంపై ఒక్క అభ్యంతరం లేదు ప్రస్తుతం ఎవ్వరూ అడక్కపోయినా అన్నమయ్యజిల్లాలో కలిపేందుకుప్రభుత్వం నుంచి చకచకా ఆదేశాలు, అమలు పుంగనూరు నియోజకవర్గంలోని ఆరు మండలాలు, ఒక మున్సిపాలిటీని అన్నమయ్య జిల్లాలోకి విలీనం చేయనున్నారు. అయితే పులిచర్ల మండలం మదనపల్లె డివిజన్లోకి మారే విషయంలో ప్రజల నుంచి చిత్తూరు కలెక్టరేట్కు అభ్యంతరాలు వచ్చాయి. అలాగే అధికార టీడీపీ నేతలు చిత్తూరు లేదా తిరుపతి డివిజన్లో కొనసాగించేలా ప్రయత్నాలు చేస్తున్నారు. దీంతో అన్నమయ్యజిల్లాలోకి ఐదు మండలాలు కలిపితే అవి మదనపల్లె రెవెన్యూ డివిజన్లోకి కలుపుతారు. వీటిలో రొంపిచర్ల పీలేరుకు దగ్గర్లో ఉంటుంది, మదనపల్లెకు 80 కిలోమీటర్లకుౖపైగా దూరం కాబట్టి రాయచోటి డివిజన్లో కలిపే అవకాశం లేకపోలేదు. దీంతో మండలాల సంఖ్య 35కు, పుంగనూరు మున్సిపాలిటీతో కలిపి మున్సిపాలిటీల సంఖ్య నాలుగుకు చేఽరుతుంది. ఒక నగర పంచాయతీ ఉంటుంది. 32.28 చదరపు కిలోమీటర్ల విస్తీర్ణం కలిగిన పుంగనూరు నియోజకవర్గంలో ఓటర్ల సంఖ్య 2,29,261 మంది. ఇది భౌగోళికంగా తూర్పున తిరుపతిజిల్లా, పశ్చిమాన కర్ణాటక, ఉత్తరాన అన్నమయ్యజిల్లా సరిహద్దు కలిగి ఉంది. ఈ విలీనం తర్వాత అన్నమయ్యజిల్లా స్వరూపం మారిపోనుంది. -
రోడ్డు ప్రమాదంలో ప్రకాశం జిల్లా వాసి దుర్మరణం
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న రోడ్డుప్రమాదంలో ప్రకాశంజిల్లా వాసి దుర్మరణం చెందిన ఘటన శనివారం కర్ణాటక సరిహద్దులోని రాయల్పాడు సమీపంలో జరిగింది. ప్రకాశం జిల్లా పెద్దచెర్లోపల్లె పంచాయతీ ముర్గాని గ్రామానికి చెందిన ఎరుకులయ్య కుమారుడు పెద్దిరెడ్డి గారి పేరారెడ్డి(32) ద్విచక్రవాహనంలో మదనపల్లె మీదుగా బెంగళూరు వైపు వెళుతున్నాడు. మార్గమధ్యంలోని కర్ణాటక సరిహద్దు రాయల్పాడు వద్ద ఎదురుగా వచ్చిన కారు ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పేరారెడ్డిని స్థానికుల సహాయంతో రాయల్పాడు పోలీసులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి జేబులోని ఆధార్కార్డు, సెల్ఫోన్లోని నంబర్ల ఆధారంగా ఆచూకీని గుర్తించి, కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాయల్పాడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
బనకచర్ల గేమ్ ఛేంజర్ కాదు
రాయచోటి టౌన్ : బనకచర్ల గేమ్ ఛేంజర్ కాదు.. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రజలను మభ్యపెట్టే ప్రాజెక్టు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటిలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు పదే పదే బనకచర్ల గేమ్ఛేంజర్ అని మాట్లాడుతున్నారన్నారు. గేమ్ ఛేంజర్ అంటే ఏమిటి.. ? దీని వలన ప్రజలకు ఏమి మేలు జరుగుతుందనే ఆలోచన నాయకులకు లేదా అని ప్రశ్నించారు. బనక చర్ల క్రాస్కు రూ.85 వేల కోట్లతో టెండర్లు పిలుస్తామని చంద్రబాబు చెబుతున్నారన్నారు. బనక చర్ల క్రాస్కు పోలవరం నుంచి రూ.లక్ష కోట్లు ఖర్చుపెట్టి నీళ్లు వదిలితే ఇక్కడ కొత్తగా ఆయకట్టు పెరుగుతుందా అని అడిగితే సమాధానం లేదన్నారు. ఆయకట్టు స్థిరీకరిస్తున్నారా అని అడిగినా స్పందన లేదన్నారు. రాజధానిలో భవన నిర్మాణాల కోసం అడుగుకు రూ.12000 నుంచి 15000ల మధ్య రేటుతో టెండర్లు పిలవడం చూస్తే ఎంత ప్రజాధనం వృథా అవుతుందో తెలుస్తుందన్నారు. తాము రాజధానికి వ్యతిరేకం కాదని, ప్రజల సెంటిమెంట్ను ఉపయోగించుకొని ఈ రకమైన దోపిడీ చేయడం సరైనదేనా అని అడుగుతున్నామన్నారు. రాయచోటి ప్రాంతంలో సాగునీటి ప్రాజెక్టుల కోసం ఎంతో కష్టపడి ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, పీవీ మిథున్రెడ్డిల సహకారంతో 45 శాతం పనులు పూర్తి చేయించామన్నారు. మిగిలిన పనులు పూర్తి చేయమంటే పలికే వారు లేరన్నారు. రాజధాని పే రుతో జరుగుతున్న అవినీతిని బయటకు రానీయ కుండా దృష్టి మరల్చేందుకే చంద్రబాబు బనకచర్ల క్రాస్ను తెరపైకి తెచ్చారన్నారు. చంద్రబాబు నా యుడుకు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ నాలుగు ప్రశ్నలు సంధిస్తే దానికి సమాధానం ఇవ్వడం లేదన్నారు. వైఎస్ జగన్ను భూస్థాపితం చేస్తామని చంద్రబాబు మాట్లాడుతున్నారని అది ప్రజాస్వామ్యంలో జరగదన్నారు. ఎఎవరికీ అధికారం శాశ్వతం కాదన్న విషయాన్ని గ్రహించాలన్నారు. జిల్లా కేంద్రం ఏర్పాటుకు కృషి చేశా.. తొలుత తాను ఎమ్మెల్యే అయినప్పుడు గల్లా అరుణ కుమారి ద్వారా రూ.60 కోట్లతో రాయచోటిలో రింగ్ రోడ్డును నిర్మింపచేశానన్నారు. దాంతో రూ.15 వేల కోట్ల రియల్ ఎస్టేట్ జరిగిందని, అది సంపద సృష్టి అన్నారు. తహసీల్దార్ స్థాయిలో ఉన్న రాయచోటిని జిల్లా కేంద్రంగా మార్చామన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ప్రజలను మభ్యపెట్టే మాటలు కాకుండా ప్రతిపక్షం అడుతున్న వాటికి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైస్ చైర్మన్ ఫయాజుర్ రహిమాన్, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, పట్టణ అధ్యక్షుడు నవాజ్, ఎస్పీఎస్ రిజ్వాన్, కౌన్సిలర్లు గౌస్ఖాన్, అల్తాఫ్, సుగవాసి ఈశ్వర్ప్రసాద్, వాల్మీకి సంఘం జిల్లా అధ్యక్షుడు గువ్వల బుజ్జిబాబు, మేధావుల ఫోరం నియోజక వర్గం అధ్యక్షుడు జానం రవీంద్ర యాదవ్, ఖలీల్, చిన్నమండెం సుక్కా అంజనప్ప తదితరరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులు
పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక లక్ష్మీహాలు సమీపంలో నివాసముంటున్న రాజకుళ్లాయమ్మ అనే మహిళ ఈనెల 18న కడప రిమ్స్లో మగ బిడ్డకు జన్మనిచ్చింది. ఐదు రోజుల క్రితం రాజకుళ్లాయమ్మ కడప రిమ్స్ నుంచి పుట్టింటికి వచ్చింది. ఈ నేపథ్యంలోనే పసికందును రాజకుళ్లాయమ్మ స్నేహితురాలు కుమారి అపహరించి తీసుకెళ్లింది. దీంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. నిందితురాలు కుమారి తమ బంధువుల ఇంటి దగ్గర ఉండడంతో పులివెందుల పోలీసులు ఆమెను అరెస్టు చేసి పులివెందుల స్టేషన్కు తీసుకొచ్చారు. ఈ సందర్భంగా పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్ మాట్లాడుతూ రాజకుళ్లాయమ్మ, కుమారి ఇద్దరూ పులివెందుల మండల పరిధిలోని నల్లపురెడ్డిపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ఏఎన్ఎంలుగా పనిచేస్తున్నారని తెలిపారు. కుమారి శుక్రవారం రాజకుళ్లాయమ్మ ఇంటి దగ్గరికి వెళ్లి ఇంట్లో ఎవరూ లేని సమయంలో పసికందును అపహరించి తీసుకెళ్లిందన్నారు. బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి 24 గంటల్లోనే పసికందును కిడ్నాప్ చేసిన నిందితురాలిని అరెస్ట్ చేశామన్నారు. కిడ్నాప్ కేసును ఛేదించిన పోలీసులను ఆయన అభినందించారు. -
లేబర్ కోడ్లు రద్దు కోరుతూ జులై 9న దేశవ్యాప్త సమ్మె
రాయచోటి : కేంద్ర ప్రభుత్వం పెట్టుబడిదారుల ప్రయోజనాల కోసం తీసుకువచ్చిన లేబర్ కోడ్లను రద్దు చేయాలని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు జి.ఓబులు డిమాండ్ చేశారు. ఇందుకోసం జులై 9న జరిగే దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని కోరారు. శనివారం రాయచోటిలోని సీఐటీయూ కార్యాలయంలో కౌలు రైతు సంఘం నాయకులు రమేష్బాబు, రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎస్.రామచంద్ర, సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సిహెచ్ చంద్రశేఖర్ల అధ్యక్షతన జరిగిన జిల్లా విస్తృత స్థాయి సదస్సులో ఆయన మాట్లాడారు. అమెరికా అధ్యక్షుడు ట్రంప్ మెప్పు కోసమే ప్రధాని మోడీ కార్మికవర్గం మీద భారాలు వేస్తూ లేబర్ కోడ్లను తెచ్చారన్నారు. విశాఖ ఉక్కు లాంటి సంస్థలో కార్మికులను తొలగించి ప్రైవేటీకరణ చేయడానికి పూనుకుంటే రాష్ట్రంలో టీడీపీ, జనసేన పార్టీలు నోరు మెదపకపోవడం దారుణమన్నారు. వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి పి.శ్రీనివాసులు మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెబుతున్న విజన్ 2047 బూటకమని తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ ఆఫీస్ బేరర్స్ రవికుమార్, భాగ్యలక్ష్మీ, రాజేశ్వరి తదితరులు పాల్గొన్నారు. -
●హార్సిలీహిల్స్ బాబాదే
పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను యోగాగురువు రాందేవ్ బాబాకు ఇచ్చేసినట్టే అన్న సంకేతాలను సీఎం చంద్రబాబు ఇచ్చేశారు. హార్సిలీహిల్స్కు చరిత్ర ఉంది, రాందేవ్ బాబా వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తే అందుకు అవసరమైన మౌలిక వసతులన్నీ కల్పిస్తానని ఆయనను ఉద్దేశించి ప్రకటించారు. ఏప్రిల్ 14న పతంజలి ప్రతినిధులు హార్సిలీహిల్స్లో పర్యటించి వెళ్లాక రాందేవ్ బాబా స్వయంగా ఈనెల 25న హార్సిలీహిల్స్ వచ్చి బాగుంది ప్రపంచ స్థాయి వెల్నెస్ సెంటర్ ప్రారంభిస్తామని ప్రకటించి..హార్సిలీహిల్స్ నచ్చేసిందని నేరుగానే చెప్పేశారు. ఇక్కడినుంచి వెళ్లిన రెండోరోజే చంద్రబాబు సమక్షంలో హార్సిలీహిల్స్ను ప్రపంచ స్థాయిలో గుర్తింపు తెస్తానని రాందేవ్ బాబా చెప్పడం, దానికి చంద్రబాబు కొనసాగింపుగా వెవెల్నెస్ సెంటర్ కోసం అన్ని వసతులు కల్పించడమేకాక మినీ విమానాశ్రయం కూడా కడతానని అడక్కనే వరం ఇచ్చేశారు. దీంతో త్వరలోనే హార్సిలీహిల్స్ పతంజలి ఖాతాలోకి జమకావడం ఖాయమైపోయింది. మదనపల్లె: ఉట్టికి ఎగరలేదుకాని స్వర్గానికి నిచ్చెన వేసిందనేది సామెత. ఇప్పుడీ సామెత సీఎం చంద్రబాబుకు సరిగ్గా అతుకుతుంది. కరువు, పంటలకు గిట్టుబాటు ధర లేదు, పెట్టిన పెట్టుబడిలో పైసా తిరిగి పొందక రైతులు వందల కోట్లు నష్టపోతున్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు దిక్కులేదు. రైతు సమస్యలను కనీసం పట్టించుకోని సీఎం చంద్రబాబు మదనపల్లెకు మినీ విమానాశ్రయం కడతానంటూ ప్రకటించడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. శుక్రవారం జరిగిన టూరిజం పెట్టుబడుల సమావేశంలో ప్రసంగించిన చంద్రబాబు మదనపల్లె ప్రాంతం ఎదుర్కొంటున్న కష్టాలు, సమస్యలు, రైతుల ఇబ్బందులు పట్టించుకోకుండా ఇక్కడికి మినీ విమానాశ్రయం తెస్తానని ప్రకటించడం పక్కా వ్యాపార దృక్ఫథంతో వ్యవహరిస్తున్నారని ఈ ప్రాంత ప్రజలు బాహాటంగా విమర్శిస్తున్నారు. శాశ్వత కరువును పారదోలడంపై ఏనాడూ సమీక్షించని చంద్రబాబు బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ను రాందేవ్ బాబాకు ఇచ్చేందుకు, ఆయన కోసమే అన్నట్టుగా మదనపల్లెలో మినీ విమానాశ్రయం కడతానంటూ గొప్పగా ప్రకటించడంపై మేధావులు, కార్మిక నేతలు మండిపడుతున్నారు. మదనపల్లె డివిజన్ రైతులు ఏడాదికాలంలో పండించిన దోస, కర్భూజ, టమాట, వేరుశెనగ, అల్లనేరేడు, మామిడి, వంగ పంటలకు కనీస ధర లేదు. ప్రతిపంటలోనూ తీవ్ర నష్టాలు చవిచూశారు. వీటిపై స్పందించని సీఎం చంద్రబాబు వ్యాపార సంస్థల కోసం విమానాశ్రయం తెస్తాననడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. అవసరం లేకున్నా... 2019 ఎన్నికల సమయంలో చంద్రబాబు మదనపల్లెలో పర్యటించి ఇక్కడ విమానాశ్రయం కడతానని ప్రకటించారు. ఇక్కడ విమానాశ్రయం కట్టాల్సినంతటి అవసరం లేదు. ఆ స్థాయిలో ఫ్యూజిబులిటీ కూడా లేదు. ఇక్కడికి 100 కిలోమీటర్ల దూరంలో బెంగళూరు అంతర్జాతీయ, 130 కిలోమీటర్ల దూరంలో రేణిగుంట అంతర్జాతీయ, 120 కిలోమీటర్ల దూరంలో కడప విమానాశ్రయాలు ఉన్నాయి. అయినప్పటికీ ఇక్కడి ప్రజల చెవుల్లో పూవ్వులు పెట్టేందుకు ప్రయత్నించి విమానాశ్రయం పెడతానంటూ ప్రకటించారు. దీనిపై జోకులు వేసుకున్న ప్రజలు 2019 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిని ఓడించారు. అయితే ఈ మారు బాబా రాందేవ్ కోసమే అన్నట్టు ఆయన సమక్షంలో మదనపల్లెకు మినీ విమానాశ్రయం కడతానంటూ ప్రకటించారు. మదనపల్లె (హార్సిలీహిల్స్) అంతర్జాతీయ స్థాయి వెల్నెస్ సెంటర్గా అభివృద్ధి చెందాలని, అందుకు మినీ విమానాశ్రయం తెస్తామని, ఎవరూ అడక్కపోయినా, దాని అవసరం లేకపోయినా ప్రకటించి అందర్ని విస్తుపోయేలా చేశారు. మదనపల్లె చుట్టూ మూడు విమానాశ్రయాలు ఉన్నా, ఇక్కడికి విమానాశ్రయం అవసరం లేకున్నా మళ్లీ ఆదే పాట పాడిన చంద్రబాబు వ్యాపార సంస్థల కోసమే ఈ మాటను లెవనెత్తారు. దీనివల్ల సామాన్య ప్రజలు, రైతులు, వ్యాపారులు ఒరిగేదేమి లేదు. రైతుల నోట్లో మట్టికొట్టి.. మదనపల్లెకు విమానాశ్రయం అంటున్న సీఎం చంద్రబాబు వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రైతాంగ సంక్షేమ కార్యక్రమాలను రద్దుచేసి రైతుల నోట్లో మట్టి కొట్టిన విషయాన్ని గుర్తు చేస్తున్నారు. రూ.8,175,91 కోట్ల విలువైన మదనపల్లె డివిజన్కు చెందిన సాగునీటి ప్రాజెక్టులను రద్దు చేసి రైతులకు తీరని ద్రోహం చేశారు. రూ.759.50 కోట్ల ముదివేడు ప్రాజెక్టు, రూ.1,217.49 కోట్ల పుంగనూరు ఉపకాలువ విస్తరణ పనులు నిలిపివేత, రూ.4,373.23 కోట్ల గాలేరు–నగరి, హంద్రీనీవా ప్రాజెక్టు అనుసంధానం పనులు రద్దు, రూ.1,825.69 కోట్లతో చేపట్టిన వాటర్ గ్రిడ్ పథకాన్ని రద్దు చేసి ప్రజల, రైతుల అభివృద్ది ఆకాంక్షలపై నీళ్లు చల్లారు. 2014–19లో ఇచ్చిన హామీల్లో కొన్ని.. రైతుల కష్టాలకు దిక్కులేదు.. మదనపల్లెకు విమానాశ్రయమట 2019 ఎన్నికలకు ముందు ఇదేపాట పాడిన వైనం ఇప్పుడు మినీ ఏయిర్పోర్ట్ కడతానని ప్రకటన పారిశ్రామికాభివృద్ధి కోసం బెంగుళూరు నుంచి అనంతపురంజిల్లా మీదుగా తంబళ్లపల్లె మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలను కలుపుతూ రింగ్ రోడ్ నిర్మాణం.. జిల్లాలో పాడిరైతుల ద్వారా 50 లక్షల లీటర్ల పాల ఉత్పత్తి పెంచేలా ప్రణాళిక.. హర్టికల్చర్ హబ్గా తంబళ్లపల్లె.. పల్లెల్లో 400 నుంచి 500 పశువులకు వసతికి పశువుల హాస్టళ్లు, బయోగ్యాస్ ఉత్పత్తి.. తంబళ్లపల్లె టమాట రైతులకు రూ.10కోట్ల ప్యాకేజీ.. టమాట ఆధారిత పరిశ్రమను స్థాపనకు పెప్సికో కంపెనీతో సంస్థల ఏర్పాటు.. కురబలకోట మండలంలోని హార్డ్వేర్, సాఫ్ట్వేర్, ఐటీ సంస్థలను స్థాపన. ఇలా పదుల సంఖ్యలో హామీలు ఇచ్చిన చంద్రబాబు ఒక్కటీ నెరవేర్చలేదు. -
కొత్తరైలు మార్గంలో తొలిప్రయాణం!
రాజంపేట: హైదరాబాద్ నుంచి తిరుపతికి కొత్తమార్గంలో తొలి ప్రయాణం అందుబాటులోకి రానుంది. జూలై 4 నుంచి నాందేడ్–తిరుపతి మధ్య తిరిగే రైలును పిడుగురాళ్ల–శావల్యపురం మధ్య నూతనంగా నిర్మించిన మార్గం ద్వారా మార్కాపురం, నంద్యాల, కడప మీదుగా తిరుపతికి తొలిసారిగా నడపనున్నారు. నెమలిపురి, రొంపిచెర్ల రైలు కూత తొలిసారి వినపడనుంది. జూలై 11, 18, 25 తేదీల్లో తిరుపతికి, జూలై 6, 13, 20, 27 తేదీల్లో నాంధేడ్కు ఈ రైలు ప్రయాణిస్తుంది. టైమింగ్స్ ఇలా.. నాందేడ్లో సాయంత్రం 4.30కి, బాసరకు 6గంటలకు, నిజమాబాద్కు 6.25కు చేరుకుంటుంది. కామారెడ్డి మీదుగా మేడ్చల్కు రాత్రి 8గంటలకు, చెర్లపల్లెకు 9.30గంటలకు వస్తుంది, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడిమీదుగా పిడుగురాళ్లకు రాత్రి 12.30గంటలకు చేరుకుంటుంది. దొనకొండ,మార్కాపుం రోడ్, కంభం, గిద్దలూరు మీదుగా నంద్యాల ఉదయం 5.30గంటలకు వస్తుంది. జమ్మలమడుగు, ఎర్రగుంట్ల, కడపకు 8.50కి చేరుకుంటుంది. నందలూరు, రాజంపేట, కోడూరు, రేణిగుంట మీదుగా తిరుపతికి మధ్యాహ్నాం 12.30 గంటలకు చేరుకుంటుంది. రిటర్న్ జర్నీలో తిరుపతిలో మధ్యాహ్నం 2.20 గంటలకు బయలుదేరుతుంది. కడపకు 4.15కు, నంద్యాలకు 7,45గంటలకు చేరుకుంటుంది. నాంధేడ్కు మరుసటిరోజు ఉదయం 9.30గంటలకు బయలుదేరుతుంది. తిరుపతి–నాందేడ్ మధ్య ప్రత్యేక రైలు జిల్లా వాసులు బాసర, షిర్డీ వెళ్లేందుకు అనుకూలం -
డ్రాగా ముగిసిన కడప–కర్నూలు మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో భాగంగా శనివారం మూడో రోజు కడప –కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. 14 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కర్నూలు జట్టు 97 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 331 పరుగులు చేసింది. ఆ జట్టులోని విష్ణు వర్దన్ నాయుడు 134 బంతుల్లో 100 పరుగుల సెంచరీ చేసి నాటౌట్గా నిలిచాడు. సాయి గణేష్ 72 పరుగులు చేశాడు. కడప జట్టులోని శివశంకర్ 3 వికెట్లు, ఆర్దిత్రెడ్డి 2 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో 765 పరుగులు చేసిన విషయం తెలిసిందే. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన నెల్లూరు–అనంతపురం మ్యాచ్లో ఆనంతపురం జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. శనివారం మూడో రోజు 173 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 99.2 ఓవర్లలో 405 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 211 బంతుల్లో 135 పరుగులు, షాహుల్ హమీద్ 89 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి 3 వికెట్లు, కేహెచ్ వీరారెడ్డి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 24.3 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 94 పరుగులు చేసి విజయం సాధించింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి 37 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని షాహుల్ హమీద్ 2 వికెట్లు తీశాడు.కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో 6 వికెట్ల తేడాతో అనంతపురం జట్టు విజయం -
క్వాంటమ్ కంప్యూటింగ్ జీవన విధానాన్ని మార్చే టెక్నాలజీ
కురబలకోట : క్వాంటమ్ కంప్యూటింగ్ జీవన విధానాన్ని మార్చే టెక్నాలజీ కాగలదని పుదుచ్చేరిలోని నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అసోసియేట్ ప్రొఫెసర్ బి. సురేంద్రన్ అభిప్రాయపడ్డారు. అంగళ్లు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాలలో అనంతపురం జేఎన్టీయూతో కలసి క్వాంటమ్ న్యూరో మార్పిక్ కంప్యూటింగ్ ఫర్ సస్టైనబుల్ జనరేటివ్ ఏఐపై ఐదు రోజుల పాటు జరిగే ఫ్యాకల్టీ డెవలప్మెంట్ ప్రోగ్రామ్ శనివారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ లక్షల సంవత్సరాలు పట్టే లెక్కల్ని క్వాంటమ్ కంప్యూటర్లు నిమిషాల్లో చేయగలవన్నారు. భవిష్యత్తులో భద్రతా వ్యవస్థలు, పరిశ్రమలు, ఆరోగ్య సంరక్షణ, ఆర్థికం, మీడియా, కమ్యూనికేషన, సైబర్ భద్రత, విద్య, వాతావరణం, ఖగోళ పరిశోధన వంటి రంగాలను ప్రభావితం చేసేలా జనరేటివ్ ఏఐ వేగంగా అభివృద్ధి చెందిందన్నారు. క్వాంటమ్ టెక్నాలజీ మానవ జీవితంపై తీవ్ర ప్రభావాన్ని చూపుతుందన్నారు. విద్యార్థులు, యువత ఈ రంగంలో రాణిస్తే కీలకమైన స్థానానానికి చేరుకోవచ్చన్నారు. -
బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసు నమోదు
సిద్దవటం : మండలంలో బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవిస్తున్న ఆరుగురిపై కేసులు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. స్థానిక పోలీసు స్టేషన్లో శనివారం ఆయన మాట్లాడుతూ బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించడం చట్టరీత్యా నేరమన్నారు. ఇతరులకు ఇబ్బందికరంగా మద్యం సేవిస్తూ ప్రజలకు అసౌకర్యం కల్పిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. తల్లీబిడ్డల అదృశ్యం బి.కొత్తకోట : తల్లి, ఇద్దరు బిడ్డల అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు హెడ్ కానిస్టేబుల్ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన కథనం మేరకు..బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన బత్తుల వాసు 14 ఏళ్ల క్రితం సునీలను వివాహం చేసుకున్నాడు. వీరికి సందీప్, కీర్తన సంతానం. శుక్రవారం ఉదయం వాసు పనుల నిమిత్తం ఇంటి నుంచి బయటకు వెళ్లి సాయంత్రం తిరిగి వచ్చాడు. ఇంటిలో చూడగా భార్య, పిల్లలు కనిపించలేదు. ఆందోళనకు గురైన వాసు సోదరుడు ఆంజనేయులతో కలిసి బి.కొత్తకోట, పరిసర ప్రాంతాల్లో గాలించినా ఆచూకీ లభ్యం కాలేదు. దీనితో వాసు ఫిర్యాదు మేరకు అదృశ్యంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతిఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు మొయిందిపల్లికి చెందిన రేవూరి శంకరయ్య (50)ను రైల్వేస్టేషన్కు వెళ్లే దారిలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై రాత్రి 10 గంటలకు గుర్తు తెలియని వాహనం ఢీ కొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలుసుకున్న వెంటనే సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కడప రిమ్స్కు తరలించి కేసు నమోదు చేశారు. -
భూ ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవాలి
వీరబల్లి : దళిత, గిరిజనుల భూములు ఆక్రమిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని సీపీఐ ఆధ్వర్యంలో శనివారం డిప్యూటీ తహసీల్దార్ శ్రీధర్ రెడ్డికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా సీపీఐ అన్నమయ్య జిల్లా కార్యవర్గ సభ్యుడు సిద్దిగాళ్ల శ్రీనివాసులు మాట్లాడుతూ గడికోట గ్రామ పరిధిలోని వేల్పుల మిట్ట హరిజనవాడ, గిరిజనులలు వాడల్లో ఉన్న వారికి సర్వే నెంబరు. 1128/7, 1128/9లో 2006లో అప్పటి కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో అసైన్మెంట్ కమిటీ ద్వారా ఒక్కొక్కరికి ఎకరా చొప్పున పంపిణీ చేశారన్నారు. ఈ మధ్యకాలంలో కొంతమంది ఆ భూములను జేసీబీల ద్వారా చదును చేసే ప్రయత్నం చేస్తూ దళిత, గిరిజనుల కుటుంబాలను భయపెడుతున్నారన్నారు. అధికారులు స్పందించి దళితులకు న్యాయం చేయాలని కోరారు. -
పంజంకు కన్నీటి వీడ్కోలు!
సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్: వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్ పంజం సుకుమార్రెడ్డి (64)కి పార్టీ నేతలు, శ్రేణులు, కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు శనివారం కన్నీటి వీడ్కోలు పలికారు. అందరితో కలుపుగోలుగా ఉంటూ ఆప్యాయంగా పలుకరించడమే కాకుండా నవ్వుతూ మాట్లాడే పంజం సుకుమార్రెడ్డిని తలుచుకుని పలువురు కన్నీటి పర్యంతమయ్యారు. అనారోగ్యంతో చైన్నెలోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం తెల్లవారుజామున ఆయన తుదిశ్వాస విడిచిన విషయం అందరికీ తెలిసిందే. శనివారం ఉదయం అంత్యక్రియుల నిర్వహించారు. అంతకుముందు అన్నమయ్య, వైఎస్సార్ కడప, తిరుపతితో పాటు ఇతర జిల్లాలకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు, శ్రేణులు పెద్ద ఎత్తున తరలివచ్చి కన్నీటి నివాళి అర్పించారు. పంజం కుటుంబ సభ్యులతోపాటు బంధుమిత్రులు శోకసంద్రంలో మునిగిపోయారు. నేతల నివాళి రైల్వేకోడూరు మండల పరిధిలోని అనంతరాజుపేట పంచాయతీ తూర్పుపల్లిలో పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్దకు చేరుకున్న పార్టీ కీలక నేతలు నివాళులర్పించారు. మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రీజినల్ కో ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, కడప పార్లమెంట్ పరిశీలకులు, స్కిల్ డెవలప్మెంట్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, ఆర్టీసీ మాజీ రాష్ట్ర చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్రెడ్డి, వైస్ ఎంపీపీ ధ్వజారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, వత్తలూరు సాయికిషోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి, రాష్ట్ర వ్యవసాయశాఖ మాజీ సలహాదారుడు సంబటూరు ప్రసాద్రెడ్డి తదితరులు నివాళులర్పించారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి మృతి చెందారన్న విషయం తెలుసుకుని శుక్రవారం రైల్వేకోడూరుకు వచ్చిన సాక్షి దినపత్రిక ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డి పంజం సుకుమార్రెడ్డి పార్థివ దేహం వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించారు. అనంతరం సుకుమార్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించారు. పంజం సందీప్రెడ్డితో పాటు ఆయన కుటుంబ సభ్యులను ఓదార్చి ప్రగాఢ సంతాపాన్ని తెలియజేశారు. అలాగే జనసేన, టీడీపీ నాయకులు కూడా పంజం సుకుమార్రెడ్డికి నివాళులర్పించారు. రైల్వేకోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్, టీడీపీ నాయకురాలు ముక్కా వరలక్ష్మి కూడా నివాళులర్పించారు. ఘనంగా అంతిమ వీడ్కోలు తూర్పుపల్లిలోని పంజం సుకుమార్రెడ్డి ఇంటి వద్ద నుంచి అంతిమ యాత్ర సాగింది. పార్టీ శ్రేణులు, నేతలు, గ్రామస్తులు, కుటుంబీకులు భారీగా పాల్గొన్నారు. ఇంటి వద్ద నుంచి పంజం సుకుమార్రెడ్డి వ్యవసాయ పొలం వద్దకు తీసుకెళ్లి అక్కడే అంత్యక్రియలు నిర్వహించారు. పార్టీపట్ల నిజాయితీ కలిగిన నాయకుడు: మాజీమంత్రి పెద్దిరెడ్డి సీనియర్ నాయకులు పంజంసుకుమార్రెడ్డి మృతి చెందడం భాదాకరమని, అలాగే తను నమ్మిన పార్టీ, వైఎస్ఆర్ కుటుంబం పట్ల నిజాయితీకలిగిన నాయకుడని మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తెలిపారు. సుకుమార్రెడ్డి రాజకీయాల్లో ఉన్ననాటి నుంచి తనకు పరిచయం ఉందని తెలిపారు. పార్టీ పటిష్టతకు నిబద్ధతతో పని చేసేవాడని తెలిపారు. ఆయన మృతి పార్టీకి తీరని లోటని తెలిపారు. వారి కుటుంబ సభ్యులకు వైఎస్సార్సీపీ, అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అండదండలు అన్ని వేళలా ఉంటాయని తెలిపారు. కడసారి చూసేందుకు భారీగా తరలివచ్చిన పార్టీ శ్రేణులు సుకుమార్రెడ్డి పార్థివదేహం వద్ద నివాళులర్పించిన పెద్దిరెడ్డి, అంజద్బాషా తదితరులు -
రహదారి కబ్జాకు కూటమి నాయకుల యత్నం
రాజంపేట రూరల్ : ప్రభుత్వం అధికారంలోకి రాగానే కూటమి నాయకుల అరాచకాలకు, కబ్జాలకు అడ్డు అదుపు లేకుండా పోయిందనేది బహిరంగ రహస్యం. తాము చేసేది చట్టం.. చెప్పిందే న్యాయంగా కూటమి నాయకుల తీరు కొనసాగుతుంది. అందుకు ఉదాహరణగా మండల పరిధిలోని ఊటుకూరు పంచాయతీలో శుక్రవారం పట్ట పగలు రహదారిని కబ్జా చేసేందుకు కూటమి నాయకులు ప్రయత్నించడాన్ని చెప్పుకోవచ్చు. రహదారి కోసం పోరాటం.. ఊటుకూరు పంచాయతీలోని సర్వే నెంబరు 224, 225లలో గల 3 ఎకరాల పట్టా భూమిలోకి వెళ్లేందుకు రహదారి కోసం వైఎస్సార్సీపీ కార్యకర్త జగదాభి నాగేశ్వరరాజు కొన్ని సంవత్సరాలు పోరాటం చేశారు. చివరకు హై కోర్టు 2023లో నాగేశ్వరరాజుకు అనుకూలంగా రహదారి నిర్నాణం కోసం తీర్పునిచ్చింది. అదే విధంగా రెవిన్యూ, ఇరిగేషన్శాఖ అధికారులు పలు పర్యాయాలు వివాద స్థలంను సందర్శించి అన్ని రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించి నాగేశ్వరరాజుకు రహదారిని నిర్మించుకునేందుకు అనుమతులు ఇచ్చారు. అధికారులతో పాటు పోలీసుల సమక్షంలో 2023లో రహదారిని నిర్మించుకున్నారు. కబ్జాకు యత్నం.. రహదారిని నిర్మించిన స్థలం 1947 సర్వే నెంబరులోని 43 సెంట్లు ఆర్ఎస్ఆర్ ప్రకారం గయ్యాళీ పొరంబోకుది. కూటమి ప్రభుత్వంకు చెందిన చేజర్ల వాసుదేవరాజు ఈ స్థలంను కబ్జా చేసుకునేందుకు దౌర్జన్యంకు యత్నించారు. శుక్రవారం ఉదయం పాత రహదారిపై జేసీబీని ఉంచి వాసుదేవరాజు అతని మనుషులు మాటు వేసి ఉన్నారు. పొలంలో ఉన్న నాగేశ్వరరాజు ఇంటికి వెళ్లగానే రహదారిని జేసీబీతో తొలగించాలనేది వారి పన్నాగం. అయితే పొలం నుంచి తమ ఇంటికి వెళతున్న నాగేశ్వరరాజు జేసీబీ ఆగి ఉండటం చూసి అనుమానం వచ్చి జేసీబీ డ్రైవర్ను నిలదీయగా పొంతన లేని సమాధానాలు చెప్పసాగాడు. అనంతరం మాటు వేసిన వాసుదేవరాజు అతని మనుషలను చూపించాడు. దౌర్జన్యం ఆపై దాడి.. విషయం బయట పడటంతో మాటు వేసిన వాసుదేవరాజు అతని మనుషులు దాదాపు 20 మంది జేసీబీ వద్దకు వచ్చి నాగేశ్వరరాజుతో వాగ్వివాదంకు దిగారు. నాగేశ్వరరాజు జేసీబీకి అడ్డు పడటంతో మూకుమ్మడిగా దౌర్జన్యంచేసి ఆపై విచక్షణా రహతంగా దాడి చేసి గాయ పరిచారు. సమాచారం అందుకున్న మన్నూరు పోలీసులు సంఘటనా స్థలం వద్దకు వచ్చి మందలించటంతో వాసుదేవరాజు వర్గం తగ్గింది. ప్రాణాపాయం తప్పి తీవ్ర గాయాల పాలైన నాగేశ్వరరాజును వారి కుటుంబ సభ్యులు పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న నాగేశ్వరరాజును మన్నూరు సీఐ కుళాయప్ప తన సిబ్బందితో వచ్చి వివరాలు అడిగి తెలుసుకొని ఫిర్యాదు స్వీకరించారు. తనకు వాసుదేవరాజు వలన ప్రాణహాని ఉందన్నారు. వ్యవసాయమే ఆధారం.. నాకు ఉన్న 3 ఎకరాలే నాకు జీవనాధారం. నాకు ఉన్నది ముగ్గురు అమ్మాయిలే. నాకు ఎవరు లేరు. నాకు వ్యవసాయమే ఆధారం. నా పిల్లలను పోషించాలన్నా నేను జీవించాలన్నా ఆ పొలమే దిక్కు. ఆ భూమికి దారి లేకుంటే మా కుటుంబం మొత్తం ఆత్మ హత్య చేసుకోవాల్సిందే. దయతో ఉన్నత అధికారులు స్పందించి తమ పొలంకు ఉన్న రహదారి కబ్జా కాకుండా కాపాడాలని నాగేశ్వరరాజు వేడుకుంటున్నాడు. -
ఖాజావలి కుటుంబానికి అండగా ఉంటాం
రాయచోటి టౌన్ : భవనం పై నుంచి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందిన ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ రాయపాటి ఖాజావలి కుటుంబ సభ్యులకు అండగా ఉంటామని అన్నమయ్య జిల్లా విద్యాసాగర్ నాయుడు అన్నారు. ఖాజావలి కడప పట్టణంలోని అశోక్ నగర్లో తన ఇంటిపై తన భార్యతో కలిసి తాల్బార్ పట్ట కప్పేప్రయత్నంలో ఇంటి పైకప్పు సిమెంట్ రేకులు పగిలి కిందపడ్డాడన్నారు. ఈ ప్రమాదంలో ఆయన తలకు గాయాలు కావడంతో ఆస్పత్రికి తరలించినప్పటికీ పరిస్థితి విషమించి మృతి చెందాడన్నారు. ఆయనకు భార్య మాబున్నిసాతో పాటు నలుగురు ఆడపిల్లలు కూడా ఉన్నారని తెలిపారు. వారి కుటుంబానికి పోలీస్ శాఖ అండ ఉంటుందని చెప్పారు. అంతకు ముందుగా పోలీస్ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించారు. దహన సంస్కారాల కోసం రూ.1లక్ష నగదు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ యం. శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్ యం. పెద్దయ్య, అన్నమయ్య, కడప పోలీసులు పాల్గొన్నారు. -
మతసామరస్యానికి ప్రతీక మొహర్రం
రాజంపేట టౌన్ : ఇస్లాం క్యాలెండర్ ప్రకారం గురువారం రాత్రి నెలవంక దర్శనమివ్వడంతో నూతన సంవత్సరం ప్రారంభమైంది. మొదటి నెల మొహర్రం కావడంతో హజ్రత్ ఇమామ్ హుస్సేన్ బలిదానం జ్ఞాపకార్థం పదిరోజుల పాటు సంతాప కార్యక్రమాలు జరుపుకుంటారు. అందువల్ల శుక్రవారం జిల్లాలోని వివిధ పట్టణాల్లో అనేక గ్రామాల్లో పీర్ల చావిడిలలో పీర్లను కొలువుదీర్చారు. ఇదిలావుంటే మొహర్రం నెలలోనే ఇస్లాం మత ప్రవక్త మహమ్మద్ రసూలల్లా సొల్లేల్లాహు అలైహి వసల్లం మనవళ్లు ఇస్లాం మత వ్యాప్తి కోసం కర్బాలా మైదానం (సౌదీ)లో పది రోజుల పాటు యుద్ధం చేశారు. ఈ యుద్ధంలో వారి వంశానికి చెందిన 72 మంది అసువులు బాసి వీరమరణం పొందారు. వారిని స్మరించటానికి ప్రతి ఏడాది మొహర్రం నెలలో పది రోజుల పాటు కార్యక్రమాలు చేస్తారు. అందులో భాగంగా జిల్లాలోని అనేక ప్రాంతాల్లో పీర్లు కొలువుదీరాయి. ఈసందర్భంగా పీర్లను కొలిచేవారు చదివింపులు చేసి ప్రార్థనలు చేస్తారు. మత సామరస్యానికి ప్రతీక.. మొహర్రం మత సామరస్యానికి ప్రతీక అని చెప్పాలి. అనేక గ్రామాల్లో మొహర్రం ను హిందువులే ముందు ఉండి జరిపిస్తారు. కొన్ని గ్రామాల్లో హిందువుల ఇంటి నుంచి పీర్లు వెళ్ళడం, కొన్ని సాంప్రదాయమైన కార్యక్రమాలు సైతం హిందువులే చేపడతారు. ఈ సాంప్రదాయాలన్నీ కూడా అనాదిగా వస్తున్నాయి. పీర్ల పండుగను పురస్కరించుకొని చేపట్టే సాంప్రదాయమైన కార్యక్రమాలను హిందు, ముస్లీంలు గౌరవంగా కూడా భావిస్తారు. ఇక ధనవంతులు పీర్ల వేడుకకు లక్షలాది రూపాయిలు కూడా వెచ్చిస్తారు. ఈసందర్భంగా ప్రజా ప్రతినిధులను, రాజకీయ నాయకులను సైతం ఆహ్వానించి అట్టహాసంగా పీర్ల పండుగ నిర్వహిస్తారు. గ్రామాల్లో కోలాహల వాతావరణం మొహర్రం సందర్భంగా పట్టణాల్లోకంటే గ్రామీణ ప్రాంతాల్లో సందడి వాతావరణం నెలకొంటుంది. పలు ప్రాంతాల్లో పీర్ల వేడుకలను అట్టహాసంగా నిర్వహిస్తారు. అందువల్ల ఆయా గ్రామాల ప్రజలు తమ బంధువులను, మిత్రులను, ఆత్మీయులను సైతం మొహర్రంకు ఆహ్వానిస్తారు. ఇక ప్రజలు ఒక కుటుంబ సభ్యుల్లా రాత్రి వేళల్లో పీర్లచావిడి వద్దకు చేరి సాంప్రదాయమైన కార్యక్రమాలు చేపడతారు. పీర్లను ఊరేగించే సమయంలో యువత ఆనందానికి ఆకాశమే హద్దు అన్న విధంగా ఉంటుంది. కొన్ని ప్రాంతాల్లో నిత్యం అన్నదాన కార్యక్రమాలు చేపడతారు. అలాగే నిత్యం రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాలను ఏర్పాటు చేస్తారు. అందువల్ల మొహర్రం నిర్వహించే గ్రామీణ ప్రాంతాల్లో పదిరోజుల పాటు సందడి వాతావరణం నెలకొంటుంది. ప్రారంభమైన మొహర్రం కార్యక్రమాలు జిల్లా వ్యాప్తంగా కొలువుదీరిన పీర్లు గ్రామాల్లో సందడి వాతావరణం -
ఆసుపత్రిలోని ఏఆర్టీ కేంద్రం తనిఖీ
మదనపల్లె రూరల్ : మదనపల్లెలోని జిల్లా ఆసుపత్రిలో ఉన్న ఏఆర్డీ, ఐసీటీసీ కేంద్రాలను జిల్లా ఎయిడ్స్ నివారణ విభాగం క్లస్టర్ ప్రోగ్రాం అధికారి వి. భాస్కర్ తనిఖీ చేశారు. శుక్రవారం ఏఆర్టీ,ఐసీటీసీ విభాగాల్లోని పలు రికార్డులను పరిశీలించారు. వైద్య సేవలపై సిబ్బందికి తగు సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏఆర్టీ, ఐసీటీసీ ద్వారా రోగులకు మరిన్ని వైద్యసేవలు అందించేందుకు కృషి చేస్తామన్నారు. ఇదివరకు మదనపల్లె ప్రభుత్వాసుపత్రి ఏఆర్టీ కేంద్రాన్ని చిత్తూరు జిల్లా ఎయిడ్స్ కంట్రోల్ విభాగం వారు తనిఖీలు చేసేవారని, ఇకపై కడప జిల్లా పరిధిలోకి ప్రభుత్వం మార్చిందన్నారు. ఆసుపత్రిలో హెచ్ఐవీ బాధితులకు అందుతున్న వైద్యసేవలు, అందుబాటులో ఉన్న మందులు, పరీక్షల కిట్లు, ఇతర సౌకర్యాలపై ఆరా తీశారు. కొన్ని రకాల కిట్లు కొరత ఉన్నట్లు తమ దృష్టికి వచ్చిందని సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామన్నారు. ఆసుపత్రిలో రక్తనిధి కేంద్రాన్ని వేరే భవనంలోకి మార్చడంపై సూపరింటెండెంట్ డాక్టర్ కోటేశ్వరితో చర్చించారు. కార్యక్రమంలో జిల్లా ఎయిడ్స్ నివారణ, నియంత్రణ విభాగం జిల్లా అకౌంటెంట్ ఎస్. అప్రోజ్, ప్రోగ్రాం అధికారి అబ్దుల్ సాదిక్, ఐసీటీసీ సిబ్బంది జయకుమార్, పుల్లయ్యనాయుడు, దీప్తి పాల్గొన్నారు. -
పరుగుల సునామీ సృషించిన కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో రెండవ రోజు కడప జట్టు పరుగుల సునామీ సృష్టించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో కడప జట్టు గెలుపు దిశగా పయనిస్తోంది. తొలి ఇన్నింగ్స్లో 401 ఓవర్నైట్ స్కోర్తో శుక్రవారం రెండవ రోజు బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 175.4 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 765 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని ఆర్. ప్రణీల్రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 477 బంతుల్లో 39 ఫోర్లతో 353 భారీ పరుగులు చేశాడు. టి.సుదర్శన్ 161 బంతుల్లో 11 ఫోర్లు, 3 సిక్సర్లతో 114 పరుగులు చేశాడు, ఎన్. విష్ణు సాయి 68 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లిఖార్జున 2 వికెట్లు తీశాడు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 7 ఓవర్లలో 1 వికెట్ కోల్పోయి 14 పరుగులు చేసింది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో 194 ఓవర్ నైట్ స్కోర్తో రెండవ రోజు బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు 77 ఓవర్లలో 524 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎ. జయంత్ కృష్ణ 37 ఫోర్లు, 3 సిక్సర్లతో 221 అత్యధిక పరుగులు చేశాడు. కెహెచ్ వీరారెడ్డి 175 బంతుల్లో 157 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని తేజ 4 వికెట్లు, లోకేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 173 పరుగులు చేసింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 72 పరుగులు చేశాడు. 353 పరుగులు చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్రెడ్డి 765 భారీ స్కోరు చేసిన కడప జట్టు -
విద్యుత్ వాడకంపై అవగాహన పెంచుకోవాలి
రాయచోటి టౌన్ : విద్యుత్ వాడకంపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని రాయచోటి ట్రాన్స్కో డివిజన్ శాఖ సూపరింటెంటెంట్ ఇంజనీరు ఆర్.చంద్రశేఖర్ రెడ్డి తెలిపారు. శుక్రవారం రాయచోటి విద్యుత్ డివిజన్ శాఖ కార్యాలయంలో విద్యుత్ భద్రతా వారోత్సవాల నిర్వహణపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ వినియోగదారులు అవగాహన కలిగి ఉండాలని అప్పుడే విద్యుత్ వినియోగంపై సరైన ప్రణాళిక ఉంటుందన్నారు. విద్యుత్ వాడకంలో అనేక సందర్భాలలో జాగ్రత్తలు పాటించకుండా ఉండటంతో ప్రమాదాలు జరుగుతుంటాయని, అలాగే అధిక విద్యుత్ వినియోగం చేస్తుంటామన్నారు. అనేక చోట్ల విద్యుత్ లైన్లు ఉన్నప్పటికీ ఆ లైన్ కిందనే ఇళ్ల నిర్మాణాలు చేస్తుంటారని, దీని వలన ప్రమాదాలు జరుగుతుంటాయని, కొన్ని సందర్భాలలో ప్రాణాలు కూడా కోల్పోతుంటారన్నారు. విద్యుత్ లైన్ కింద ఇళ్ల నిర్మాణాలు చేయరాదని సూచించారు. ఈ క్రమంలో ఏడు సూత్రాలు కలిగిన పోస్టర్ ప్రజల అవగాహన కోసం ప్రదర్శనకు ఏర్పాటు చేశారు. -
కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్న వారిపై చర్యలు తీసుకోవాలి
రాయచోటి జగదాంబసెంటర్ : కాల్మనీ పేరుతో వేధింపులకు పాల్పడుతున్న అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శుక్రవారం ఈ మేరకు కాల్ మనీ వేధింపుల బాధితులతో కలిసి జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీనివాసులు మాట్లాడుతూ మదనపల్లి పట్టణంలో ఏకాంబరంరెడ్డి, ఖాదర్వల్లి, ఆనంద్, అనురాధ అనేవారు ఒంటరి మహిళలను టార్గెట్ చేసి అప్పులు ఇచ్చి వారి చేత ఖాళీ చెక్కులు, బాండ్లు తీసుకుని అత్యధిక వడ్డీలు వసూలు చేయడమే కాకుండా, తీవ్రమైన వేధింపులకు పాల్పడుతున్నారని ఆరోపించారు. కాల్మనీ విషయంలో పోలీసులు వ్యవహరించిన తీరు అనుమానాస్పదంగా ఉందని అన్నారు. అత్యధిక వడ్డీలు, వేధింపులు తట్టుకోలేక గౌరీ లాంటి వారు బహిరంగ ప్రకటన చేయగలిగారు కానీ, చాలా మంది బయటకు చెప్పుకోలేని పరిస్థితి ఉందని అన్నారు. అనంతరం జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ మోసపూరితంగా ఉండే వారి పట్ల జాగ్రత్తగా ఉండాలని, ఖాళీ చెక్కులు, బాండ్లు ఇవ్వకూడదని సూచించారు. జిల్లా పోలీస్ సూపరింటెండెంట్కు ఫోన్చేసి కాల్మనీ వేధింపులకు పాల్పడుతున్న వారిపై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కాల్ మనీ బాధితులు గౌరీ, సుజాతలతో పాటు సీపీఎం నాయకులు రామాంజులు, రామచంద్ర, మాధవ తదితరులు పాల్గొన్నారు. -
పంజం సుకుమార్ రెడ్డి మృతి తీరనిలోటు
రైల్వేకోడూరు అర్బన్: రైల్వేకోడూరు నియోజకవర్గ వైఎస్ఆర్సీపీ సీనియర్ నాయకుడు, వ్యవసాయ సలహా మండలి మాజీ చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి (64) ఆకస్మిక మృతి పార్టీకి తీరని లోటని వైఎస్సార్సీపీ నాయకులు అన్నారు. అనారోగ్యంతో చైన్నెలో శుక్రవారం పంజం సుకుమార్రెడ్డి మృతిచెందిన నేపథ్యంలో వైఎస్సార్సీపీ జిల్లా అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి.. మాజీ ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, మాజీ ఎమ్మెల్సీ పుత్తా నరసింహారెడ్డి తదితరులు అనంతరాజుపేటలో పంజం మృతదేహాన్ని సందర్శించారు నివాళులర్పించి వారి కుటుంబ సభ్యులకు ప్రగాడ సానుభూతి తెలిపారు. 40 ఏళ్లుగా క్రియాశీలక రాజకీయాల్లో చురుగ్గా ఉన్న పంజం సుకుమార్ రెడ్డి గత ప్రభుత్వంలో జిల్లా వ్యవసాయ సలహామండలి చైర్మన్గా, డీఆర్యూసీసీ సభ్యుడిగా, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శిగా, అనంతరాజుపేట సర్పంచ్గా, ప్రైవేట్స్కూల్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్గా పలు పదవులు చేపట్టారు. తనదైన శైలిలో వాటికి వన్నె తెచ్చారు. వైఎస్సార్ కుటుంబం వెంట నడుస్తూ వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అభివృద్ధికి కృషి చేశారు. ప్రముఖుల నివాళి పంజం సుకుమార్రెడ్డి మృతి విషయం తెలుసుకున్న టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, ‘సాక్షి’ ఎడిటర్ రక్కసి ధనుంజయరెడ్డి, మాజీఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, భూమన అభినయ్రెడ్డి, స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ మాజీ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, వత్తలూరు సాయికిశోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులురెడ్డి తదితర నాయకులు పంజం స్వగ్రామానికి చేరుకున్నారు. సుకుమార్రెడ్డి మృతదేహానికి నివాళులు అర్పించారు. కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలిపారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ ముస్తాక్, సీనియర్ నాయకులు కుమార్ రెడ్డి, రామనాథంలు పంజం సుకుమార్రెడ్డి భౌతికకాయం వద్ద నివాళులర్పించారు. నేడు అంత్యక్రియలు: వైఎస్సార్సీపీ నాయకులు పంజంసుకుమార్రెడ్డి భౌతికకాయానికి శనివారం ఉదయం అంత్యక్రియలు నిర్వహించనున్నారు. కాగా, మాజీమంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి శనివారం ఉదయం అనంతరాజుపేటకు రానున్నారు. పంజం మృతదేహానికి నివాళులు అర్పించనున్నారు. -
నిర్దేశించిన లక్ష్యాలను సాధించేలా పనిచేయాలి
రాయచోటి: స్వర్ణాంధ్ర విజన్–2047 పకడ్బందీ అమలులో భాగంగా నియోజకవర్గ యాక్షన్ ప్లాన్లో నిర్దేశించిన లక్ష్యాలను సాధించేందుకు సచివాలయ సిబ్బంది పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సుపరిపాలన తొలి అడుగు, నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్పై ఎంపీడీఓలు, తహసీల్దార్లు, స్పెషల్ అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ప్రభుత్వం నిర్దేశించిన పది ప్రధాన సూత్రాలతో కార్యాచరణ ప్రణాళికను నిర్దేశించుకొని జిల్లా అభివృద్ధికి తోడ్పాటు అందించాలని సూచించారు. డేటా మేనేజ్మెంట్,, డేటా అనాలసిస్లో సచివాలయ సిబ్బంది చురుగ్గా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. ఈవీఎం గోడౌన్ వద్ద పటిష్ట నిఘా ఉండాలి రాయచోటి: జిల్లా కేంద్రంలో ఈవీఎంలను భద్రపరిచి గోదాము వద్ద 24–7 ప్రకారం నిరంతరం పటిష్ట నిఘా ఉండాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమిషన్ ఆదేశాల మేరకు త్రైమాసిక తనిఖీలో భాగంగా రాయచోటి పట్టణం మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాలు బీయులు, సీయూలు, వీవీ ప్యాట్లను, అక్కడ భద్రతా చర్యలను కలెక్టర్ క్షుణ్ణంగా పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాల గురించి రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. కార్యక్రమంలో డీఆర్ఓ కె మధుసూదన్రావు, ఆర్డీఓ ఏ శ్రీనివాస్, తహసీల్దార్ నరసింహకుమార్ తదితరులు పాల్గొన్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గంలో అక్కులప్ప మదనపల్లె రూరల్: ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్(ఏపీయూడబ్ల్యూజే) రాష్ట్ర కార్యవర్గంలో మదనపల్లెకు చెందిన సీనియర్ జర్నలిస్ట్ బండపల్లి అక్కులప్పకు మరోసారి అవకాశం లభించింది. ఒంగోలులో ఈనెల 25, 26 తేదీల్లో రెండురోజుల పాటు జరిగిన 36వ రాష్ట్ర మహాసభల్లో అక్కులప్ప రాష్ట్ర కార్యవర్గంలోకి ఎన్నికయ్యారు. వరుసగా మూడుసార్లు రాష్ట్ర కార్యదర్శిగా సేవలందించిన ఆయనకు ఏపీయూడబ్ల్యూజేతో సుమారు మూడు దశాబ్దాల అనుబంధం ఉంది. 1996లో మొదటిసారి జిల్లా కార్యవర్గ సభ్యుడిగా ఎన్నికై న అక్కులప్ప, ఆపై జిల్లా కార్యదర్శిగా, అధ్యక్షుడిగా, రాష్ట్ర కార్యదర్శిగా, డిప్యూటీ జనరల్ సెక్రటరీగా ఏపీయూడబ్ల్యూజేలో వివిధ హోదాల్లో పనిచేశారు. అన్నమయ్యజిల్లా నుంచి జాతీయ కౌన్సిల్ సభ్యుడిగా ఉన్న అక్కులప్పను తాజాగా రాష్ట్ర కార్యవర్గంలోకి తీసుకున్నారు. కూటమి ప్రభుత్వానికి ఉద్యోగుల సెగ కురబలకోట: కూటమి ప్రభుత్వంపై ఏడాదికే ఉద్యోగ వర్గాల్లో తీవ్ర స్థాయిలో అసంతృప్తి సెగలు ఎగిసిపడుతున్నాయి. వివిధ శాఖల ఉద్యోగులు చుక్కలు చూపిస్తున్నారు. బదిలీల జీఓలో అస్పష్టత ఉందని ఇటీవల సచివాలయ ఉద్యోగులు నిరసన వ్యక్తం చేశారు. తాజాగా గ్రామ కార్యదర్శులు సమస్యల పరిష్కారం కోసం శనివారం సామూహిక సెలవులో వెళుతున్నారు. పని భారం ఎక్కువ, గ్రూప్ మీట్స్ అధికం కావడం, పీజీఆర్ఎస్ పనులు,ఇతర శాఖల అధికారుల పెత్తనం, సర్వేల భారం, తీవ్రమైన పనితో వ్యాధులు బారిన పడటం, విధి నిర్వహణలో తీవ్ర వత్తిడి కారణంగా అకాల మరణాలు సంభవించడంతో పాటు వివిధ సమస్యల పరిష్కారం కోసం జిల్లా కల్టెక్టర్ను కలసి వినతి పత్రం ఇస్తున్నట్లు పంచాయతీ కార్యదర్సుల సమాఖ్య ప్రతినిధులు తెలిపారు. ఇందులో భాగంగా జిల్లాలోని ఆయా మండలాల్లో సామూహిక సెలవు కోరుతూ ఎంపీడీఓలకు గ్రామ కార్యదర్శులు శుక్రవారం వినతి పత్రం అందజేశారు. కురబలకోట ఎంపీడీఓ గంగయ్యకు కూడా మండలంలోని గ్రామ కార్యదర్సులు సామూహిక సెలవులో వెళుతున్నట్లు వినతి పత్రం అందజేశారు. పాలనలో అనుభవం ఉందని చెప్పుకుంటున్న సీఎం చంద్రబాబు కూటమి ప్రభుత్వంపై వరుసగా వివిధ శాఖల ఉద్యోగులు నిరసనల పర్వం అందుకోవడం చర్చనీయాంశంగా మారింది. -
నియంతను తలపిస్తున్న చంద్రబాబు
కూటమి పాలనలో సంక్షేమం.. అభివృద్ధి లేదు: రాజ్యసభ సభ్యుడు మేడా కూటమి పాలనలో సంక్షేమం..అభివృద్ధి లేవని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి అన్నారు. సంపద సృష్టిస్తామని తరచూ చెప్పే ముఖ్యమంత్రి చంద్రబాబు తన నారా కుటుంబానికి, తన కోటరీ వాళ్లకు మాత్రమే సంపద సృష్టిస్తున్నారని విమర్శించారు. ఎన్నికల ముందు ఇచ్చిన వాగ్ధానాలను అమలు చేయమని అడిగిన వారిపై అక్రమ కేసులు బనాయిస్తూ దౌర్జన్యకర పాలనకు తెరతీశారన్నారు. ప్రజల సంక్షేమం కోసం వైఎస్ఆర్సీపీ శ్రేణులు కూటమి ప్రభుత్వంపై పోరాడాలని ఆయన పిలుపునిచ్చారు. రాయచోటి: రాష్ట్రంలో నియంత పాలన కొనసాగుతోందని, చంద్రబాబు నియంతను తలపిస్తున్నారని వైఎస్సార్సీపీ రీజినల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. రాయచోటిలో శుక్రవారం జిల్లా వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి ఆధ్వర్యంలో జిల్లా పార్టీ సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఏడాది పాలన వైఫల్యాలను ఎండగట్టారు. వైఎస్ జగన్ మోహన్రెడ్డి కంటే మెరుగ్గా పథకాలను అందిస్తామని చంద్రబాబు ప్రజలను నమ్మించి మోసం చేశారన్నారు. కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో మోసపోయిన రాష్ట్ర ప్రజలు ఎన్నికల కోసం ఎదురు చూస్తున్నారని అయన అన్నారు.ఎన్నికల హామీలను నెరవేర్చాలని ఎవరైనా అడిగితే మీ నాలుక మందం అయిందని చంద్రబాబు అనడం విడ్డూరంగా ఉందన్నారు. కరోనా సమయంలోనూ అప్పటి సీఎం జగన్ ఏ సంక్షేమ పథకాన్ని నిలుపుదల చేయకుండా వంద శాతం హామీలను నెరవేర్చారన్నారు. ప్రజలకు నేరుగా రూ.3 లక్షల కోట్ల నిధులను అందించిన ఘనత జగన్కే దక్కుతుందన్నారు. మాట తప్పడం చంద్రబాబు నైజం అన్నారు. 2014 సమయంలోనూ జాబు రావాలంటే బాబు రావాలని ఊదరగొట్టారని, అధికారంలోకి వచ్చిన తరువాత లక్షలాది కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ ఉద్యోగాలను తొలగించారని మాజీ మంత్రి గుర్తు చేశారు. పార్టీ అధినేత జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు గడప గడపకు వెళ్లి కూటమి పాలన వైఫల్యాలను తెలియపరుస్తూ గత వైసీపీ పాలనలో అందించిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని పార్టీ సమన్వయకర్తలు, నాయకులు, వివిధ విభాగాల నాయకులు కార్యకర్తలకు సూచించారు. పార్టీ కేంద్ర కార్యాలయం విడుదల చేసిన క్యూఆర్ కోడ్ స్కాన్ చేస్తే చంద్రబాబు చేసిన మోసాలను ప్రజలకు అర్థం అవుతాయన్నారు. ఇదే విషయాన్ని ప్రజలకు వివరించి జగన్ మోహన్ రెడ్డి పాలనకు, కూటమి నయవంచన పాలనకు ఉన్న తేడాలను ప్రజలకు వివరించాలన్నారు. జిల్లా రాజకీయాలలో మంచి ప్రాధాన్యం కలిగిన సుగవాసి కుటుంబం నుంచి వచ్చిన బాలసుబ్రమణ్యం ఎటువంటి పదవులు ఆశించకుండా పార్టీలో చేరడం సంతోషమన్నారు. జిల్లాలో పార్టీకి మరింత బలం చేకూరిందన్నారు. పార్టీలో ఆయనకు మంచి ప్రాధాన్యత, భవిష్యత్తు ఉంటాయని మాజీ మంత్రి చెప్పారు. కార్యక్రమంలో రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి, ఎమ్మెల్యేలు పెద్దిరెడ్డి ద్వారకనాథ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సుగవాసి సుబ్రమణ్యం, నిస్సార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు ● సూపర్ సిక్స్తో పాటు 146 హామీలను ఇచ్చి అధికారంలోకి వచ్చి ఏడాదైనా ఒకటి రెండు మినహా ఏ ఒక్కటీ అమలు చేయలేదని ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి అన్నారు. రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని విమర్శించారు. ఐఏఎస్, ఐపీఎస్లపై కూడా కూడా అక్రమ కేసులు పెట్టి వేధించడం దారుణం అన్నారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో ఎన్నికల సమయంలో టపాసులు పేలి కన్ను దెబ్బతిందన్న నెపంతో మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్రెడ్డి, రమేష్కుమార్రెడ్డి, ఎంపీపీ సుదర్శన్రెడ్డిలతో సహా 19 మందిపై అక్రమ కేసులు నమోదు చేశారన్నారు. బద్వేలులో శ్రీకాంత్రెడ్డి అనే పార్టీ వర్గీయుడి ఇంటిని అక్రమంగా కూల్చేశారన్నారు. మంచి ప్రభుత్వం అని చెప్పుకుంటున్న టీడీపీ నేతలు ప్రజల వద్దకు వస్తారని, ఏఏ హామీలు నెరవేర్చారో చెప్పే వరకు ఎక్కడికక్కడ ప్రజలు నిలదీయాలన్నారు. ● జగన్ ప్రజాక్షేత్రంలోకి వస్తుంటే టీడీపీకి గుండెలు అదురుతున్నాయని తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి అన్నారు. రాష్ట్రంలో జగన్కు రోజు రోజుకూ ప్రజాదరణ పెరుగుతోందన్నారు. ప్రతి వైఎస్ఆర్సీపీ కార్యకర్త జగన్ అడుగుజాడల్లో అడుగేసి పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కోరారు. గ్రామాల్లో ఎక్కడికి వెళ్లినా కూటమి పాలనపై వ్యతిరేకత వినిపిస్తోందన్నారు. ఇదే విషయాన్ని పార్టీ ఆదేశానుసారం ప్రజలలోకి వెళ్లి కూటమి పాలన వైఫల్యాలను ప్రజలకు వివరిద్దామని చెప్పారు. ● చంద్రబాబు పాలనపై రోజు రోజుకూ ప్రజా వ్యతిరేకత పెరుగుతోందని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. పల్లెలు, పట్టణాలలో ఎక్కడకు వెళ్లినా టీడీపీకి ఓటు వేసి తప్పు చేశామని ప్రజలే నిర్భయంగా చెబుతున్నారన్నారు. ఇదే సమయంలో ప్రభుత్వ వైఫల్యాలను వైఎస్ఆర్సీపీ శ్రేణులు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలన్నారు. కూటమి ప్రభుత్వాన్ని గద్దె దింపేందుకు ప్రతి కార్యకర్త సైనికుడిగా పనిచేయాలని మాజీ ఎమ్మెల్యే కోరారు. 2029లో వైఎస్ జగన్ సీఎం కావడం తథ్యం అని అన్నారు. ● కూటమి పాలనలో రైతుల పరిస్థితి దీనంగా మారిందని మదనపల్లె ఇన్చార్జి నిస్సార్అహమ్మద్ ధ్వజమెత్తారు. కూటమి నాయకుల స్వప్రయోజనాలు తప్ప ప్రజల సమస్యలను పట్టించుకోవడం లేదన్నారు. మామిడి, టమోటా రైతులకు గిట్టుబాటు ధరలు లేక పూర్తిగా నష్టపోయారన్నారు. రాబోయే రోజుల్లో జగన్ 2.0లో కార్యకర్తలకు పెద్దపీట వేయడం జరుగుతుందన్నారు. ● చంద్రబాబు పాలనలో ధన ఉన్మాదం రాజ్యమేలుతోందని జెడ్పీ మాజీ చైర్మన్, ఇటీవల టీడీపీని వీడి వైఎస్ఆర్సీపీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వంలో అవినీతి, అక్రమాలు జరగడం లేదని ఆ పార్టీల్లో ని 164 శాసనసభ్యులలో ఎవరైనా కాణిపాకంలో ప్రమాణం చేస్తారా అని సవాల్ విసిరారు. అవినీతి అక్రమాలు జరుగుతున్నాయని నేను ప్రమాణం చేయడానికి సిద్ధంగా ఉన్నానన్నారు. ఎన్నికల సమయంలో చంద్రబాబు చెప్పినవవి ఒకటి, అధికారంలోకి వచ్చిన తరువాత ఇంకొకటి చేస్తున్నారన్నారు. చంద్రబాబు పాలనలో జరుగుతున్న అన్యాయాలపై ప్రజలను మేలుకొలపాలన్నారు. మీలో ఒక్కడిగా, తోడుగా ఉండి వైఎస్ఆర్సీపీ విజయానికి కృషి చేస్తానని బాలసుబ్రమణ్యం ఈ సందర్భంగా చెప్పారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె మున్సిపల్ చైర్పర్సన్ మనూజారెడ్డి, ఏపీఎండీసీ మాజీ ఛైర్పర్సన్, వైఎస్ఆర్సీపీ అన్నమయ్య జిల్లా మహిళా అధ్యక్షురాలు షమీంఅస్లాం, జిల్లా మహిళా నాయకురాళ్లు అజంతమ్మ, మహిత తదితరులు పాల్గొన్నారు. కూటమి ప్రభుత్వ మోసాలను ప్రజలకు తెలియజేయాలి వైఎస్ఆర్సీపీ రీజనల్ కోఆర్డినేటర్, మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
భర్త ఇంటి ముందు బైఠాయింపు
నందలూరు: తన భర్తతో తనను కలిపి న్యాయం చేయాలంటూ ఓ మహిళ అత్తగారి ఇంటి ముందు తండ్రితో కలిసి బైఠాయించిన సంఘటన నందలూరులో చోటు చేసుకుంది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి.. మండలంలోని అరవపల్లికి చెందిన హనుమంతు మురళి, శ్రీలక్ష్మీ కుమారుడు దేవేంద్రప్రసాద్కు వేంపల్లెకు చెందిన యనమల వెంకటనారాయణ, లక్ష్మీదేవిల కుమార్తె శారదతో 2014లో వివాహమైంది. నాలుగు సంవత్సరాల పాటు సంసారం సజావుగా సాగింది. 2018లో అత్తా కోడళ్ల మధ్య మనస్పర్ధలు రావడంతో తన పుట్టింటికి శారద వెళ్లింది. ఇదే అదునుగా భావించిన ప్రసాద్ కోర్టును ఆశ్రయించి తన భార్య ఆరోగ్యం సరిగా లేదంటూ కోర్టును పెడదోవ పట్టించి 2021లో విడాకులు తీసుకున్నాడు. విషయం తెలుసుకున్న శారద పోలీసులకు ఫిర్యాదు చేసి రాజంపేట కోర్టును ఆశ్రయించడంతో జులై 2024లో విడాకులను రద్దు చేసింది. అప్పటి నుంచి తన భర్తను కలవాలని ప్రయత్నిస్తుంటే ఈ రోజు, రేపు, మాపు అంటూ సంవత్సరం నుంచి కాలం గడిపి తనను అత్తగారింటికి రానివ్వలేదని వాపోయారు. తిరిగి తాము గురువారం పోలీసులను ఆశ్రయించామన్నారు. వారు తన భర్తకు ఫోన్ చేయగా వెంటనే సెల్ స్విచ్ ఆఫ్ చేసుకుని ఇంటికి తాళాలు వేసుకుని పరారయ్యారని తెలిపారు. పెద్దలు, పోలీసులు తనను తన భర్తతో కలిపి తన సంసారాన్ని నిలబెట్టాలని బాధితురాలు వేడుకుంటోంది. -
మున్సిపల్ వైస్ చైర్మన్, మహిళా కౌన్సిలర్, మరో 16 మంది పై కేసు నమోదు
రాయచోటి : రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ పి.దశరథరామిరెడ్డి, 15వ వార్డు కౌన్సిలర్ పి.విజయమ్మతోపాటు మరో 16 మందిపై రాయచోటి అర్బన్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఇరిగేషన్ రిటైర్డ్ డీఈ మండెం ఆదినారాయణ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అర్బన్ సీఐ బి.వి. చలపతి తెలిపారు. రాయచోటి పట్టణ పరిధిలోని 553 సర్వే నంబరులో భూ తగదా విషయంపై దశరథరామిరెడ్డి తన అనుచరులతో కలిసి మే 22వ తేదీన దాడికి ప్రయత్నించినట్లు ఫిర్యాదు అందిందన్నారు. అప్పటి నుంచి రాజీకి ప్రయత్నించగా కుదరకపోతే కేసు నమోదు చేశారు. అయితే అధికార పార్టీ నాయకుల ఆదేశాల మేరకే తమపైన కేసు నమోదు చేశారని మున్సిపల్ వైస్ చైర్మన్ దశరథరామిరెడ్డి మీడియాకు తెలిపారు. రైతుపై ఆర్టీసీ కార్గో సిబ్బంది దాడిరాయచోటి : మామిడి పండ్ల ప్యాకెట్లను పార్సల్ చేయడానికి వెళ్లిన రైతుపై ఆర్టీసీ కార్గో సిబ్బంది దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన చోటు చేసుకుంది. రాయచోటి పట్టణం కొత్తపేటలో నివాసం ఉంటున్న రైతు బాబు రెడ్డి (30) తోటలో పండించిన మామిడికాయలను బంధువులకు పంపించేందుకు రెండు ప్యాకెట్లను తీసుకొని రాయచోటి ఆర్టీసీ బస్టాండ్లో గల పార్సెల్ సర్వీస్ సెంటర్కు వెళ్లారు. రైతు తెచ్చిన ప్యాకెట్లు చిన్నవిగా ఉండటంతో రెండు కలిపి ఒకటిగా పంపుకోవచ్చని అక్కడున్న ఆర్టీసీ సిబ్బంది బాబు రెడ్డికి సూచించారు. రెండిటిని కలిపి ఒకే ప్యాకేజీలో పార్సల్ చేయాలని కొరియర్ సిబ్బందికి సూచించారు. పార్సెల్ సర్వీస్ లో పనిచేస్తున్న అంజి నాయక్, సాయి అనే యువకులు ఆ మామిడి పండ్లు రెండు పార్సెల్ ఒకటిగా పంపించడం కుదరదని నిర్లక్ష్యంగా సమాధానం ఇవ్వడంతో పాటు పార్సెల్ పంపేందుకు వచ్చిన రైతు పై దాడికి దిగారు. ఈ క్రమంలో ఇరువురి మధ్య వాగ్వాదం పెరిగి ఘర్షణకు దారి తీసింది. పార్సెల్ సర్వీస్ లో పనిచేసే అంజి నాయక్, సాయి లు ఇద్దరు కలిసి వేయింగ్ మిషన్ తో బాబు రెడ్డి తలపై బలంగా కొట్టడంతో పాటు తీవ్రంగా గాయపరిచారు. దాడిలో బాబు రెడ్డి తీవ్రంగా గాయపడమే కాకుండా అతని జేబులో ఉన్న 50 వేలు నగదు కూడా గల్లంతయిందని బాధితుడు వాపోయాడు. తీవ్రంగా గాయపడిన బాబు రెడ్డి పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదు చేశారు. చికిత్స నిమిత్తం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మామిడి పండ్లు పార్సల్ పంపేందుకు వెళ్లిన రైతు బాబురెడ్డిపై దాడి చేసిన ఆర్టీసీ కార్గో సిబ్బందిని కఠినంగా శిక్షించాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. గంజాయి విక్రయిస్తున్న వ్యక్తి అరెస్ట్ప్రొద్దుటూరు క్రైం : పట్టణ శివారు ప్రాంతంలోని రైల్వేస్టేషన్ సమీపంలో గంజాయి విక్రయిస్తున్న వ్యక్తిని ప్రొద్దుటూరు ఎకై ్సజ్ అధికారులు అరెస్ట్ చేశారు. ఈ ప్రాంతంలో గంజాయి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో ప్రొద్దుటూరు ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి సిబ్బందితో కలిసి గురువారం దాడులు నిర్వహించారు. దాడిలో సీకే దిన్నె మండలంలోని మామిళ్లపల్లె గ్రామానికి చెందిన బి.రామాంజనేయులు అనే వ్యక్తిని అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 1.5 కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఇతను స్థానికంగా ఉన్న పలు కళాశాలల విద్యార్థులను లక్ష్యంగా చేసుకొని గంజాయి విక్రయిస్తున్నట్లు సీఐ తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండుకు తరలించామన్నారు. -
బైకులు ఎదురెదురుగా ఢీకొని యువకుడి దుర్మరణం
మదనపల్లె రూరల్ : బైకులు ఎదురెదురుగా ఢీకొని ఓ యువకుడు దుర్మరణం చెందగా, మరో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. మృతుని కుటుంబ సభ్యులు, పోలీసులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోట మండలం గట్టు పంచాయతీ పట్రవారి పల్లెకు చెందిన కృష్ణమూర్తి, ఈశ్వరమ్మ దంపతుల కుమారుడు హరీష్ (24), తన బంధువు, వృత్తిరీత్యా డ్రైవర్ అయిన బాబు మోహన్(25)తో కలసి స్కూటీలో వ్యక్తిగత పనులపై పుంగనూరుకు వెళ్లారు. అక్కడి నుంచి బాబు మోహన్ టాటా ఏస్ వాహనం తీసుకుని బయలు దేరాడు. హరీష్ స్కూటీ వాహనంలో స్వగ్రామానికి బయలుదేరి వస్తుండగా, మదనపల్లె సమీపంలోని వలసపల్లి పంచాయతీ జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద, పట్టణంలోని రామారావు కాలనీకి చెందిన బైక్ మెకానిక్ స్వామినాథ్ (28) మద్యం మత్తులో, మరో ఇద్దరితో కలిసి ద్విచక్ర వాహనంలో వేగంగా వెళ్లి స్కూటీని ఢీకొన్నాడు. ప్రమాదంలో స్కూటీ నడుపుతున్న హరీష్ ఎగిరి దూరంగా పడటంతో తలకు తీవ్ర గాయమై, చెవులు, ముక్కులలో అధిక రక్తస్రావం జరిగి అపస్మారక స్థితికి వెళ్లాడు. వెనుకనే టాటా ఏస్ వాహనంలో వస్తున్న బాబు మోహన్ గుర్తించి అదే వాహనంలో ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించాడు. పరీక్షించిన ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు హరీష్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. స్వామినాథ్ కూడా తీవ్రంగా గాయపడటంతో చికిత్స అందించారు. హరీష్ మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మృతుడు పట్రావారిపల్లె వాసి మరో యువకుడికి తీవ్ర గాయాలు -
బూత్ కమిటీ సమావేశంలో తెలుగు తమ్ముళ్ల వాగ్వాదం
నందలూరు : నందలూరు షాదీఖానాలో గురువారం నిర్వహించిన బూత్ కమిటీ సమావేశంలో తెలుగు తమ్ముళ్లు వర్గాలుగా విడిపోయి వాగ్వాదం చేసుకున్నారు. కుటుంబ సాధికారత సమితి (కేఎస్ఎస్) కమిటీలు వేసేటప్పుడు తమకు ఎందుకు చెప్పలేదని కొంత మంది టీడీపీ నాయకులు ప్రశ్నించడంతో వైఎస్సార్సీపీ నుంచి వచ్చిన నాయకులందరికీ చెప్పాల్సిన అవసరం లేదని కొంత మంది నాయకులు తెలపడంతో వాగ్వాదం మొదలైంది. నందలూరు మండల పరిశీలకుడు ఆరే సుధాకర్నాయుడు ఇరువర్గాలకు సర్దిచెప్పడంతో గొడవ సద్దుమణిగింది. రాజంపేట టీడీపీ ఇన్చార్జిని ప్రకటించకపోవడంతో ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని పలువురు అసహనం వ్యక్తం చేశారు. -
ఏటీఎం కార్డు తస్కరించి రూ.25 వేలు డ్రా
నందలూరు : మండల కేంద్రంలోని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంకు ఏటీఎంలో ఓ వ్యక్తికి మాయమాటలు చెప్పి ఏటీఎం కార్డు తస్కరించి రూ.25 వేలు డ్రా చేసిన సంఘటన గురువారం చోటు చేసుకుంది. బాధితుడు విశ్రాంత ఉపాధ్యాయుడు సానిపాటి నరసింహులు వివరాల మేరకు ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ ఏటీఎంలో డబ్బులు విత్డ్రా చేసుకునేందుకు వెళ్లగా గుర్తుతెలియని వ్యక్తి మాయమాటలు చెప్పి తన ఏటీఎం కార్డును చోరీ చేసి ఎస్బీఐ ఏటీఎంలో రూ.25 వేలు డ్రా చేసుకున్నాడు. ఈ విషయంపై స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశానని బాధితుడు తెలిపారు. నాటు సారా కేసులో ఒకరి అరెస్టురైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం బుడిగుంటపల్లి పంచాయతీ, దేశెట్టిపల్లి క్రాస్ వద్ద నాటుసారా తరలిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి ఐదు లీటర్ల నాటుసారా స్వాధీనం చేసుకున్నారు. ఈ సందర్భంగా సీఐ తులసీ మాట్లాడుతూ నాటుసారా, అక్రమ మద్యం వంటి వాటిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. అనంతరం నిందితుడిని కోర్టులో హాజరుపరిచారు. స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు ప్రాధాన్యం పెంచాలి కడప ఎడ్యుకేషన్ : రాష్ట్రంలో స్పోర్ట్స్ రంగంలో తలెత్తిన ఫేక్ సర్టిఫికెట్స్ సమస్యలపై దృష్టి సారిచి వాటికి అడ్డుకట్ట వేసి స్కూల్ గేమ్స్ ఫెడరేషన్కు ప్రాధాన్యత పెంచాలని ఏపీపీఈటీస్ అండ్ ఎస్ఏపీఈ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి ప్రవీణ్కిరణ్, సభ్యులు కోరారు. ఈ విషయమై రాష్ట్ర రవాణా, యువ జన, క్రీడాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిని రాయచోట్లోని స్టేట్ గెస్ట్హౌస్లో కలసి వినతిపత్రం అందజేశారు. -
మదనపల్లెలో కాల్ మనీ కీచకులు
మదనపల్లె రూరల్ : సరిగ్గా ఏడేళ్ల క్రితం టీడీపీ ప్రభుత్వంలో విజయవాడలో వెలుగు చూసిన కాల్ మనీ వ్యవహారం మళ్లీ పడగ విప్పుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా కాల్ మనీ విష సంస్కతి విస్తరిస్తోంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక మహిళలపై రోజురోజుకు అఘాయిత్యాలు, అరాచకాలు, అకృత్యాలు పెరిగిపోతున్నాయి. నిన్నటికి నిన్న సాక్షాత్తు ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంలో అప్పు కట్టలేదని మహిళను చెట్టుకు కట్టేసి అమానుషంగా శిక్షించిన ఘటన మరువక ముందే.. మదనపల్లిలో వడ్డీ కోసం వ్యభిచారం చేయమని ఒత్తిడి తెచ్చేంతగా రాక్షసులు బరి తెగించారంటే పరిస్థితి ఎలా ఉందో ఊహించుకోవచ్చు. టీడీపీ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు విజయవాడ కేంద్రంగా కాల్ మనీ సెక్స్ రాకెట్ రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం అందరికీ తెలిసిందే. సరిగ్గా అలాంటిదే మదనపల్లెలో జరుగుతున్న వ్యవహారంపై సాక్షి వెలుగులోకి తెచ్చిన కథనం రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశమైంది. బాధిత మహిళ గౌరీకి మహిళా సంఘాలు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధులు మద్దతుగా నిలిచారు. మదనపల్లె కాల్ మనీ ఘటనపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తక్షణమే స్పందించాలని డిమాండ్ చేస్తున్నారు. కుప్పంలో అప్పు తీర్చలేదని ఓ మహిళను చెట్టుకు కట్టేసి హింసించిన ఘటనలో తక్షణమే స్పందించిన సీఎం చంద్రబాబు, మదనపల్లెలో రజక సామాజిక వర్గానికి చెందిన చెందిన బీసీ మహిళ, మరికొందరు బడుగు జీవులపై జరుగుతున్న అన్యాయాలపై కనీస స్పందన లేకపోవడంపై విమర్శలను సంధిస్తున్నారు. పేద, మధ్యతరగతి ప్రజల అవసరాలను ఆసరాగా చేసుకుని అధిక వడ్డీలకు అప్పులు ఇచ్చి ముక్కు పిండి మరీ వసూలు చేస్తూ దౌర్జన్యాలకు పాల్పడే ముఠాలు మదనపల్లెలో అధికమయ్యాయి. డైలీ, వీక్లీ, మంత్లీ.. పేరుతో వందకు పది రూపాయల నుంచి 45 రూపాయల వరకు, ఖాళీ చెక్కులు, ప్రామిసరీ నోట్లు ష్యూరిటీగా ఉంచుకొని ఎడాపెడా రుణాలను ఇచ్చేస్తున్నారు. అప్పు తీసుకున్న మహిళలు సకాలంలో చెల్లించకపోయినా, కాస్త ఆలస్యం చేసినా ఇళ్ల వద్దకు వెళ్లి వారిని దుర్భాషలాడటం, లైంగికంగా వేధింపులకు గురి చేయడం సర్వసాధారణమైపోయింది. కాల్ మనీ పేరిట మహిళలను వేధించిన వారికి ఉన్న పలుకుబడులు బాధితులకు న్యాయం జరగనీయకుండా చేస్తున్నాయి. మదనపల్లెలో నీరుగట్టువారిపల్లె, రామారావు కాలనీ, అనప గుట్ట, కురవంక, వీవర్స్ కాలనీ, బసినికొండ, ప్రశాంత్ నగర్ తదితర ప్రాంతాల్లో ముఖ్యంగా చేనేత కార్మికులు నివసించే చోట వడ్డీ వ్యాపారం విస్తృతంగా కొనసాగుతోంది. వడ్డీ రాక్షసుల ఆగడాలపై బాధిత మహిళలు బుధవారం సాక్షితో మాట్లాడారు. తమ పేర్లు వెల్లడించవద్దని కోరుతూ తాము ఎదుర్కొన్న వేధింపులను ఏకరువు పెట్టారు. అప్పులు తీర్చమని తమపై ఒత్తిడి తెస్తూ వడ్డీ వ్యాపారులు మానసికంగా శారీరకంగా తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారన్నారు. వాటిని భరించలేక పోలీసులను ఆశ్రయించి కేసు పెట్టేందుకు ప్రయత్నిస్తే, మధ్యవర్తుల ద్వారా రాజీమార్గాలను ఎంచుకొని, తరువాత తమ వద్ద నుంచి తీసుకున్న ఖాళీ బ్యాంకు చెక్కులతో కోర్టులో కేసులు వేసి వేధిస్తున్నారని తెలిపారు. రుణాల చెల్లింపు కోసం తమ వద్ద ఆస్తులను రాయించుకుని వేధిస్తున్నారన్నారు. వీరి బాధల నుంచి బయటపడేందుకు జిల్లా స్థాయి పోలీస్ అధికారులను, తాము సంప్రదించాలని భావిస్తున్న విషయాన్ని ముందే పసిగట్టి, తమకంటే ముందే జిల్లా పోలీస్ కార్యాలయానికి వెళ్లి తమపై ఫిర్యాదు చేసి సోషల్ మీడియాలో తమను దోషులుగా చిత్రీకరించి, వారి వేధింపులను ఆగడాలను కనుమరుగయ్యేలా చేసుకోవాలని ప్రయత్నిస్తున్నారు. స్థానిక పోలీసులకు వారి ఆగడాలపై ఫిర్యాదులు చేస్తే పట్టించుకోకుండా వడ్డీ రాక్షసులకే వత్తాసు పలుకుతున్నారనే విమర్శలున్నాయి. అప్పు తీసుకున్న పాపానికి వడ్డీలకు వడ్డీ చెల్లించినా, తమకు రుణ బాధల నుంచి విముక్తి కలగలేదని కన్నీటి పర్యంతమయ్యారు. ప్రభుత్వం, అధికారులు స్పందించి వడ్డీ వ్యాపారుల కోరల నుంచి తమను రక్షించాలని బాధితులు కోరుతున్నారు. మనిషి ఆర్థిక అవసరాలను అవకాశంగా తీసుకొని వ్యాపారులు దోచుకుంటున్నా, అధిక వడ్డీలు, అక్రమ వసూళ్ల పేరుతో అమాయకులను బలిచేసే వారిపై ఉక్కుపాదం మోపుతామని, వసూళ్ల పేరుతో మహిళలను బెదిరించి, వేధిస్తే క్రిమినల్ కేసులు పెడతామని.. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటి ఘటనలు జరగకుండా ప్రత్యేక నిఘా వ్యవస్థను ఏర్పాటు చేస్తామని, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొనే వారే టార్గెట్గా జరిగే వడ్డీ వ్యాపారాలను కూటమి సర్కార్ సీరియస్గా తీసుకుంటుందని హెచ్చరించిన హోం మంత్రి అనిత... మదనపల్లె ఘటనపై చర్యలు తీసుకోకవడంపై సర్వత్రా విమర్శలు వినిపిస్తున్నాయి. కూటమి ప్రభుత్వంలో మహిళలపై పెరుగుతున్న అఘాయిత్యాలు రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన సాక్షి కథనం బాధితురాలు గౌరీకి మహిళా సంఘాల మద్దతు వడ్డీ రాకాసురులపై గళం విప్పిన బాధిత మహిళలు -
భవనం మీద నుంచి కింద పడి ఏఆర్ హెడ్ కానిస్టేబుల్ మృతి
కడప కోటిరెడ్డి సర్కిల్ : అన్నమయ్య జిల్లాలోని పోలీసు హెడ్ క్వార్టర్స్లో ఏ ఆర్ హెడ్ కానిస్టేబుల్ గా పనిచేస్తున్న రాయపాటి ఖాజావలీ (50) ప్రమాదవశాత్తు భవనం మీద నుంచి కిందపడి మృతి చెందినట్లు చిన్నచౌక్ ఎస్ఐ రాజరాజేశ్వర్ రెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు గురువారం సాయంత్రం కడప అశోక్ నగర్ లోని తమ ఇంటి సిమెంటు రేకులపై వర్షం నీళ్లు పడకుండా ప్లాస్టిక్ పట్ట కప్పేందుకు తన భార్యతో కలిసి పైకి ఎక్కారు. ఇద్దరూ పట్ట కప్పుతుండగా ఖాజావలీ నిలుచున్న ప్రదేశంలో ప్రమాదవశాత్తు సిమెంటు రేకులు విరగడంతో పైనుంచి కింద పడ్డాడు. తల వెనుక భాగంలో రక్త గాయమై ముక్కు నుంచి రక్తం కారుతూ అపస్మారక స్థితిలోకి వెళ్లాడు. వెంటనే అతని భార్య బంధువులతో కలిసి నగరంలోని ఆసుపత్రికి తీసుకెళ్లగా అప్పటికే అతను మరణించినట్లు డాక్టర్లు తెలిపారు. ఇతనికి భార్య మాబున్నీ, నలుగురు కుమార్తెలు ఉన్నారు. ఈమేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
భారీ స్కోరు దిశగా కడప జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు భారీ స్కోరు దిశగా ఆడుతోంది. తొలి రోజు గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ స్టేడియంలో కడప, కర్నూలు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 93 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 401 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రణీల్ రెడ్డి తన బ్యాటింగ్తో విజృంభించి 291 బంతుల్లో 23 ఫోర్లతో 201 పరుగులు చేశాడు. గురు విఘ్నేష్ 147 బంతుల్లో 15 ఫోర్లు, 6 సిక్సర్లతో 139 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 2 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం కిక్రెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు, అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 50.4 ఓవర్లకు 212 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని మన్విత్రెడ్డి 48, సయ్యద్ షాహుల్ హుస్సేన్ 32 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టీవీ సాయి ప్రతాప్ రెడ్డి అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు, వరుణ్ సాయి నాయుడు 4 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 1 వికెట్ కోల్పోయి 194 పరుగులు చేసింది. ఆ జట్టులోని కేహెచ్ వీరారెడ్డి, 107 బంతుల్లో 19 ఫోర్లు, 2 సిక్సర్లతో 103 పరుగులు చేయగా జయంత్ కృష్ణ 78 పరుగులు చేశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.డబుల్ సెంచరీ చేసిన కడప బ్యాట్స్మెన్ ప్రణీల్ రెడ్డి -
గొడవ పడొద్దన్నందుకు కత్తితో దాడి
మదనపల్లె రూరల్ : తోడికోడళ్ల మధ్య సమస్య ఏర్పడి గొడవ జరిగితే, పుట్టింటి వారు వచ్చి గొడవ ఎందుకని ప్రశ్నిస్తే కత్తితో దాడి చేసిన ఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. బాధితులు తెలిపిన వివరాలు.. సత్యసాయి జిల్లా కదిరి పట్టణం రాజీవ్ నగర్కు చెందిన అమృత ను, మదనపల్లె పట్టణం కుమారపురంలో ఉన్న మున్సిపల్ ఉద్యోగి శ్రీనివాసులుకు ఇచ్చి 15 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. శ్రీనివాసులు తన ఇద్దరు అన్నదమ్ములైన శంకర, గోవిందుతో కలిసి ఒకే కాంపౌండ్లో వేర్వేరుగా నివాసం ఉంటున్నారు. గురువారం ఉదయం శ్రీనివాసులు ఇంటి వద్ద లేని సమయంలో అమృతకు తోడికోడళ్లయిన మంగమ్మ, అనసూయమ్మతో వివాదం ఏర్పడి, ఘర్షణ చోటు చేసుకోగా, వారందరు కుటుంబ సభ్యులతో కలిసి అమృతపై దాడి చేసి కొట్టారు. ఈ విషయం ఆమె పుట్టింటి వారికి చెప్పడంతో, వారు పది మందితో కలిసి కుమారపురానికి వచ్చారు. గొడవెందుకని మాట్లాడే ప్రయత్నం చేస్తుండగానే, అనసూయమ్మ కుమార్తె భారతి ఇంట్లో ఉన్న సత్తూర్ ( కత్తి)తో అమృత ఆడపడుచు అయిన శివకుమార్ భార్య సురేఖ (30)పై దాడి చేసింది. దీంతో ఆమె తలకు తీవ్ర గాయమైంది. మిగతా వారైనా శంకర, గోవిందు, భువనేశ్వరి, మంగమ్మ అనసూయమ్మలు కదిరి నుంచి వచ్చిన అమృత బంధువులపై దాడి చేశారు. దాడిలో కళ్యాణ్ కుమార్ (30), రాజ్యలక్ష్మి(27) గాయపడ్డారు. స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఘటనపై వన్ టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
డ్రగ్స్ మహమ్మారి అణుబాంబు కంటే ప్రమాదకరం
డ్రగ్స్రహిత జిల్లాగా మారుద్దాం: కలెక్టర్ కలెక్టర్ చామకూరి శ్రీధర్ మాట్లాడుతూ డ్రగ్స్రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు అందరూ కలిసికట్టుగా కృషి చేయాలని అన్నారు. మాదక ద్రవ్యాలను ఉపయోగించడం వల్ల సమాజానికి, మనకు, మన భవిష్యత్తు తరాల వారికి ఎంత ప్రమాదకరమో తెలియజేసేందుకు ప్రభుత్వం ఈ కార్యక్రమాన్ని చేపట్టిందన్నారు. జిల్లాలోని వివిధ శాఖలు, విద్యాసంస్థలు మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీలో పెద్దఎత్తున పాల్గొన్నట్లు చెప్పారు. మదనపల్లిలో ఆరువేల మందితో, రాజంపేటలో రెండువేల మందితో, ఇలా ప్రతి మండలాలలో 500 మందితో మాదక ద్రవ్యాల వ్యతిరేక ర్యాలీ కార్యక్రమాన్ని నిర్వహించినట్లు తెలిపారు. రాయచోటి: డ్రగ్స్ మహమ్మారి అణుబాంబు కంటే ప్రమాదకరమని, దాని నివారణకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి పేర్కొన్నారు. మాదక ద్రవ్యాల దుర్వినియోగం, అక్రమ రవాణా, అంతర్జాతీయ వ్యతిరేక దినోత్సవం సందర్భంగా గురువారం మంత్రి రాంప్రసాద్ రెఢ్డి, జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు తదితరులు రాయచోటి పట్టణం శివాలయం సర్కిల్ నుంచి జెండా ఊపి ర్యాలీని ప్రారంభించారు. అనంతరం ఏర్పాటు చేసిన సభలో మంత్రి మాట్లాడుతూ డ్రగ్స్ మహమ్మారి భారతదేశమే కాదు యావత్ ప్రపంచాన్ని వణికిస్తోందన్నారు. దీనిని మొక్కగా ఉన్నప్పుడే తుంచివేసే ఉద్దేశంతో ఇలాంటి కార్యక్రమాన్ని కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో ఏర్పాటు చేసినట్లు చెప్పారు. ● జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ సమాజంలో విద్యార్థులు, యువత మాదక ద్రవ్యాల వినియోగం, రవాణా చేయడం ద్వారా కేసులు పడి తద్వారా ఉద్యోగాలకు అర్హత సాధించక వారి జీవితాలను నాశనం చేసుకుంటున్నారని పేర్కొన్నారు.మాదక ద్రవ్యాలు వినియోగించినా, అమ్మినా, నిల్వ ఉంచినా, రవాణా చేసినా నేరంగా పరిగణిస్తారన్నారు. దీనికి ఏడు సంవత్సరాలు జైలుశిక్ష విధించే అవకాశం ఉంటుందన్నారు. అలాగే ఎవరైనా వినియోగించి చనిపోయినా అమ్మినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటమని తెలిపారు. అనంతరం జిల్లా ఎస్పీ మాదక ద్రవ్యాల దుర్వినియోగ నివారణపై అందరిచేత ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీ, డీఈఓ సుబ్రమణ్యం తదితరులు పాల్గొన్నారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి -
5 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
రాజంపేట: నందలూరు సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వచ్చేనెల 5 నుంచి 13వ తేదీ వరకు జరగనున్నాయి. బ్రహ్మోత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు చర్యలు తీసుకోవాలని టీటీడీ చైర్మన్ బీఆర్నాయుడు అధికారులను ఆదేశించారు. తిరుమల టీటీడీ చైర్మన్ క్యాంపు కార్యాలయంలో టీటీడీ అదనపు ఈవో వెంకయ్యచౌదరితో కలిసి గురువారం తాళ్లపాక, సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఈవో మాట్లాడుతూ భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా ఏర్పాట్లు చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈవోలునటేష్బాబు, ప్రశాంతి పాల్గొన్నారు. బ్రహ్మోత్సవ వివరాలు: జూలై 05 ఉదయం 10.30 నుంచి 11గంటలకు ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ప్రారంభమైవుతాయి. ప్రతి రోజు ఉదయం 8గంటలకు , రాత్రి 7గంటలకు వాహనసేవలు జరుగనున్నాయి. 6న హంసవాహనం, 7న సింహవాహనం,8న హనుమంతవాహనం, 9న గరుడవాహనం, 10న సూర్యప్రభ, చంద్రప్రభవాహనం ,11న కల్యాణోత్సవం, 12 రథోత్సవం, 13న చక్రస్నానం, రాత్రి ధ్వజావరోహణం ఉంటాయి. 11న జరిగే కల్యా ణోత్సవంలో గృహస్తులు (ఇద్దరు)రూ.500 చెల్లించి పాల్గొనవచ్చు. గృహస్తులకు ఒక ఉత్తరీయం, ఒక రవికె, అన్నప్రసాదం అందజేయనున్నారు. జూలై 14న సాయంత్రం పుష్పయాగం జరుగుతంది.. టీటీడీ హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టు , దాస సాహిత్య ప్రాజెక్టుల ద్వారా ప్రతి రోజు ఆధ్యాత్మిక , భక్తి సంగీత, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించనున్నారు. కాగా తాళ్లపాకలో జూలై 05 నుంచి 15వతేది వరకు శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నారు. -
నెత్తురోడ్లుతున్నాయ్!
రహదారులు నెత్తురోడుతున్నాయి. మితిమీరిన వేగం.. నిర్లక్ష్యం.. నిద్ర లేమి.. వెరసి రోడ్డు ప్రమాదాలతో ఎరుపెక్కాయి. ఇటీవల జిల్లాలో జరిగి న వరుస ప్రమాదాలు ఆందోళన కలిగిస్తున్నాయి. ఎంతో మంది ప్రాణాలు పోతున్న ఈ ఘటనలు ఆయా కుటుంబాలు తీవ్ర విషాదాన్ని నింపుతున్నాయి. 2025 మే 26న గువ్వల చెరువు ఘాట్ రోడ్డులో కారు లారీ ఢీ కొన్న ప్రమాదాలల్లో ఐదుగురు మృత్యువాత పడ్డారు. ● గత వారంలో రాయచోటి నుంచి హైదరా బాదుకు వెళుతున్న ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు అదుపు తప్పి బోల్తా పడింది.జాతీయ రహదారి వెంబడి ఇష్టానుసారంగా వాహనాలు నిలపకుండా చూడాలి. నిబంధనల మేరకు ముందు, వెనుక వాహనాలకు రిఫ్లైక్టింగ్ స్టిక్కర్లు అతికించాల్చిన అవసరం ఉంది. ఇవి రాత్రి వేళల్లో వాహనచోదకునికి ముందు వాహనం ఉందనే విషయాన్ని సృష్టంగా కనిపించేలా చేస్తుంది. వేగ నియంత్రణ, మద్యం మత్తులో వాహనాలు నడపకుండా చూడాలి. అతి వేగంతో దూసుకెళుతున్న వాహనాలను నిఘా కెమెరాలతో గుర్తించి వెంటనే కళ్లెం వేయాలి. సంబంధిత వాహన యజమాని సెల్ఫోన్కు సందేశం పంపి అప్రమత్తం చేయాలి. బ్లాక్ స్పాట్లలో సూచిక బోర్డులు, విద్యుద్దీపాలు, రహదారి మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు ఏర్పాటు చేయాలి. హైవే పెట్రోలింగ్ సిబ్బంది నిరంతరం గస్తీ నిర్వహించేలా చూడాలి. రోడ్డు సేఫ్టీ కమిటీ నిర్ణయాలను అమలు చేయాలి. వాష్ అండ్ గో కార్యక్రమాన్ని పున:ప్రారంభించాలి. ప్రైవేట్ బస్సులపై ప్రత్యేక దృష్టి సారించాలి. నిరంతరం తనిఖీలు నిర్వహిస్తూ వేగ నియంత్రణ చర్యలు చేపట్టాలి. డ్రంక్ అండ్ డ్రైవ్ పరీక్షలు నిర్వహించాలి. కడప వైఎస్ఆర్ సర్కిల్: జిల్లాలో ఐదు నెలల వ్యవధిలో సమారు 307 ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. సుమారు 172 మంది మృత్యువాత పడగా 364 మంది క్షతగాత్రులయ్యారు. వేగ నియంత్రణ అమలు చేయకపోవడం, రోడ్ సేఫ్టీ కమిటీ సమావేశాల్లో తీసుకున్న నిర్ణయాలను ఆచరణలో పెట్టకపోవడంతోనే ప్రమాదాలు జరగుతున్నాయి. అధికారులు ఈ విషయాల్లో పున: సమీక్షించాల్సిన అవసరం ఉంది. కారణాలెన్నో...... మితి మీరిన వేగం, మద్యం మత్తు, ఓవర్ టేక్, అకస్మాత్తుగా వాహనం నిలపడం, ట్రాఫిక్ నిబంధనల అతిక్రమణ పరిమితికి మించి ప్రయాణికులను ఎక్కించుకోవడం తదితర విషయాలు ప్రమాదాలకు కారణాలుగా నిలుస్తున్నాయి. ప్రధానంగా జాతీయ రహదారులపై లారీలను ఇష్టానుసారంగా నిలిపేస్తున్నారు. హోటళ్లు, డాబాలు, ఇతర దుకాణాల వద్ద హైవేకి అనుకొని ఆపుతున్నా రు. ఈ క్రమంలో వెనుక వచ్చే వాహనాలు వేగాన్ని నియంత్రించలేక వాటిని ఢీ కొంటున్నాయి. లారీలను ఎక్కడపడితే అక్కడ నిలపకుండా విశ్రాంతి స్థలాల్లో మాత్రమే నిలపాల్సి ఉన్న అక్కడ సౌకర్యాలు అంతంతమాత్రంగానే ఉండటంతో రోడ్లకు అనుకొని, చెట్ల కింద ఆపడం ద్వారా ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి, ప్రైవేట్ బస్సులు అధికంగా రాత్రి వేళ తిరుగుతుంటాయి. ఈ క్రమంలో అందులో క్లీనర్గా పని చేసే వారు అరకొర డ్రైవింగ్తో అప్పుడప్పుడు వాహనాలు నడుపుతున్నారు. రాత్రి వేళ ఎదురుగా వచ్చే వాహనాలను తప్పించడం, ముందు వెళుతున్న వాటిని వేగంగా అధిగమించే క్రమంలో పట్టుకోల్పోయి ప్రమాదాలకు కారణమవుతున్నారు. తీర్మానం చేసినా.... ఉమ్మడి జిల్లాలో ప్రమాదాలు అధికంగా జరిగే 70 బ్లాక్ స్పాట్లను అధికారులు గుర్తించారు. ఆయా ప్రాంతాల్లో ఇసుక డ్రమ్ములు, బారికేడ్లు, రహదారుల మలుపుల వద్ద రేడియం స్టిక్కర్లు, సోలార్ విద్యుద్దీపాలు, సూచిక బోర్డులు ఏర్పాటు చేయాలని రోడ్ సేప్టీ సమావేశాల్లో తీర్మానించారు. అది కార్యరూపం దాల్చినా కేవలం ఒకటి రెండు చోట్లకే పరిమితమైంది. అనంతరం అధికారులు అటు వైపు దృష్టి సారించిన దాఖల్లా లు లేవు. ఇప్పటికై నా అధికారులు స్పదించాల్సిన అవసరం ఎంతయినా ఉంది. నిద్ర మత్తులో వాహనాలను నడపడం వల్ల ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయని అధికారులు గతంలోనే గుర్తించారు. వాహన డ్రైవర్ల నిద్ర మత్తు తొలగేలా వాష్ అండ్ గో కార్యక్రమాన్ని ప్రారంభించారు. అప్పట్లో ప్రమాదాలు కొంతమేర తగ్గుముఖం పట్టా యి. కాలక్రమంలో దీనికి బ్రేక్ పడింది. సంవత్సరం ప్రమాదాలు మృతులు క్షతగాత్రులు ఇలా చేస్తే... ఒకరి నిర్లక్ష్యం..మరొకరికి ప్రాణ సంకటం మితిమీరిన వేగంతోనేరోడ్డు ప్రమాదాలు ఐదు నెలల్లో172 మంది మృత్యువాత రోడ్డు నిబంధలను ఉల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేస్తాం రోడ్డు నియమ నిబంధలను ఉల్లంఘించే వాహనదారులపై కేసులు నమోదు చేస్తాం. వాహనాల వేగ నియంత్రణను అరికట్టేందుకు స్పీడ్ లేజర్ గన్లతో తనిఖీలు చేపడుతున్నాం. మద్యం మత్తుల్లో వాహనాలను నడిపితే కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటాం. –నిరంజన్రెడ్డి, ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్, వైఎస్ఆర్ జిల్లా 2020 825 307 970 2021 861 368 949 2022 801 403 837 2023 631 372 730 2024 664 321 737 2025 307 172 364 మే వరకు -
‘వందేభారత్’ ట్రయల్ రన్ విజయవంతం
కడప కోటిరెడ్డిసర్కిల్: దేశంలో అధిక వేగంతో నడుస్తున్న రైళ్లలో ఒకటైన వందే భారత్ రైలు గురువారం కడప– రేణిగుంట మార్గంలో ట్రయల్ రన్ నిర్వహించారు. కాచిగూడ–చైన్నె మార్గంలో వందేభారత్ రైలు నడిపేందుకు ఈ ట్రయల్ రన్ నిర్వహించినట్లు సమాచారం. కాగా 130 కి.మీ. స్పీడ్తో రైలు నడిచినా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాలేదని రైల్వే అధికారులు గుర్తించారు. ట్రయల్ రన్ విజయవంతం కావడంతో త్వరలోనే ఈ మార్గంలో వందేభారత్ రైలు నడిచే అవకాశాలు ఉన్నట్లు సమాచారం. 220 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం కడప నగర శివార్లలోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో గురువారం జరిగిన కౌన్సెలింగ్కు 86001వ ర్యాంకు నుంచి 104000 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు హాజరయ్యారు. మొత్తం 220 మంది అభ్యర్థులు తమ కౌన్సెలింగ్ను పూర్తి చేసుకుని ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, చీఫ్ వెరిఫికేషన్ ఆఫీసర్ ఎస్ఆర్ లక్ష్మి ప్రసాద్, వెరిఫికేషన్ ఆఫీసర్లు వసుంధర, మల్లేశ్వరమ్మ, లావణ్య, రాజేష్ కళాశాల సిబ్బంది పాల్గొన్నారు. నేటి కౌన్సెలింగ్కు... నేడు నిర్వహించబోయే కౌన్సిలింగ్కి జిల్లావ్యాప్తంగా 104001 నుంచి 120000 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులు రావాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. జీవాలకు నట్టల నివారణ మందు వేయించాలి సుండుపల్లె: గొర్రెలు, మేకల పెంపకం దారులు తమ జీవాలకు నట్టల నివారణ మందును తప్పకుండా వేయించాలని జిల్లా పశుసంవర్ధకశాఖ సంయుక్త సంచాలకుడు డాక్టర్ గుణశేఖర్పిళ్లై పేర్కొన్నారు. గురువారం సుండుపల్లె మండల కేంద్రానికి సమీపంలోని ఈడిగపల్లెలో గొర్రెలకు ఉచితంగా నట్టల నివారణ మందులను వేసినట్లు ఆయన తెలిపారు. జులై 10వ తేదీ వరకు ఈ కార్యక్రమం జరగుతుందని చెప్పారు. ఈ అవకాశాన్ని మేకలు, గొర్రెల కాపర్లు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ప్రస్తుతం వర్షాకాలం కావడంతో మూగజీవాలకు పలు రకాల వ్యాధులు వచ్చే అవకాశాలు ఉన్నాయన్నారు. పశువైద్యాధికారులు సూచ నలు పాటించి నివారణ చర్యలు తీసుకోవాలని తెలిపారు. కార్యక్రమంలో సహాయ సంచాలకులు డాక్టర్ విజయ్కుమార్, డీఎంహెచ్ఓ డాక్టర్ మాలకొండయ్య, డాక్టర్ శ్రీధర్రెడ్డి, సంబేపల్లి పశువైద్యాధికారి లోకేష్, ఏడీ వెంకటేశ్వరరెడ్డి, గోపాలమిత్ర సిబ్బంది పాల్గొన్నారు. -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
రాయచోటి జగదాంబ సెంటర్ : మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులకు 36 జీఓ అమలు చేయాలని రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట బుధవారం అర్ధనగ్న ప్రదర్శనతో నిరసన తెలిపారు. ఈ సందర్భంగా మున్సిపల్ ఇంజినీరింగ్ విభాగం అధ్యక్ష, కార్యదర్శులు అక్బర్, శంకరయ్య మాట్లాడుతూ పని గంటలు పెంచి కేవలం రూ.15 వేల వేతనం ఇస్తున్నారని పారిశుద్ధ్య కార్మికులతో పాటు రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి ఆప్కాస్ కొనసాగించాలని లేదంటే పర్మినెంట్ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మున్సిపల్ కార్మికుల ధర్నాకు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ.రామాంజులు, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఫయాజ్బాషా, సలీం మద్దతు ప్రకటించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మీ, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు. -
హార్సిలీహిల్స్ పతంజలికేనా?
బి.కొత్తకోట : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ టూరిజం యూనిట్ను కూటమి ప్రభుత్వం పతంజలి సంస్థకు కట్టబెట్టేస్తుందా అన్న అనుమానాలను నిజం చేస్తూ గురువారం పతంజలి సంస్థ రాందేవ్ బాబా స్వయంగా ఇక్కడికి వస్తున్నారు. దీనికి సంబంధించిన ఏర్పాట్లు చేసే పనుల్లో అధికారులు తలమునకలయ్యారు. హార్సిలీహిల్స్ను ప్రైవేటు పరం చేసేందుకు తీవ్రంగా ప్రయత్నిస్తున్నారని సాక్షి పలు కథనాలు ప్రచురించింది. ఏప్రిల్ 23 ‘స్టెర్లింగ్ పోయే..పతంజలి’ వచ్చే శీర్షికన సాక్షి ప్రచురించిన కథనం నిజమే అని స్పష్టం అవుతోంది. చైన్నెకి చెందిన స్టెర్లింగ్ కంపెనీకి పర్యాటకశాఖ యూనిట్ను కట్టబెట్టేందుకు ప్రయత్నించి, అందుకు ఆస్తులను పరిశీలించుకునేందుకు సంస్థ బృందానికి అధికారిక అతిథి మర్యాదలను కల్పించారు. తర్వాత వెలుగులోకి రాని కారణాలతో ఆ సంస్థ వెనక్కు వెళ్లింది. తర్వాత పతంజలి ప్రతినిధుల బృందం ఏప్రిల్ 14న హార్సిలీహిల్స్ వచ్చి ఇక్కడి పరిస్థితులు, అతిథి గృహాలు, రెస్టారెంట్, ఖాళీ స్థలాలను పరిశీలించి వెళ్లింది. ఈ బృందం రాందేవ్ బాబాకు ఇక్కడి పరిస్థితులు వివరించి ఉంటారని, దీనితో ఆయనే స్వయంగా ఇక్కడికి వస్తున్నట్టు అర్థమవుతోంది. అధికారికంగా బాబా పర్యటన షెడ్యూలులో గురువారం ఉదయం డెహ్రాడూన్ నుంచి విమానంలో తిరుపతికి చేరుకుని, అక్కడికి సమీపంలోని కొన్నిచోట్ల పరిశీలనలు జరిపాక మధ్యాహ్నం హార్సిలీహిల్స్ చేరుకుంటారు. ఇక్కడి పర్యాటకశాఖ యూనిట్ను పరిశీలిస్తారని, మధ్యాహ్నం టూరిజం రెస్టారెంట్లో భోజనం చేస్తారని షెడ్యూలులో పేర్కొన్నారు. ఇక్కడి వాతావరణ పరిస్థితుల మేరకు పతంజలి కార్యకలాపాలను నిర్వహించుకునేందుకు అనువైన ప్రాంతంగా భావిస్తున్నట్టుగా చెబుతున్నారు. కాగా స్టెర్లింగ్ సంస్థకు టూరిజంను ఇచ్చేసి ప్రైవేటు పరం చేస్తారన్న ఆందోళనతో ఉన్న ఉద్యోగులకు ఆ సంస్థ తప్పుకోవడంతో ఊరట చెందారు. తర్వాత పతంజలి ప్రతినిధులు పరిశీలించి వెళ్లినప్పటి నుంచి తీవ్ర ఆందోళనతో ఉన్నారు. 2000లో ఇక్కడ పర్యాటకశాఖ యూనిట్ ప్రారంభం నుంచి దీన్ని నమ్ముకుని పని చేస్తున్న సిబ్బంది, కార్మికులు ఇప్పుడు ఆందోళనలో ఉన్నారు. పతంజలికి అప్పగిస్తే తమ బతుకులు ఏం కావాలని మధనపడుతున్నారు. పాతికేళ్లుగా టూరిజంను నమ్ముకున్న సిబ్బంది ఇప్పుడు మరో ఉపాధి వెతుక్కునే పరిస్థితుల్లో లేరు. అందులోనూ 45 నుంచి 50 ఏళ్లు వయసు దాటిన సిబ్బంది ఉన్నారు. వీరు మళ్లీ కొత్తగా ఉద్యోగాల కోసం పోరాటం చేసే పరిస్థితుల్లో లేరు. ఈ పరిస్థితుల్లో రాందేవ్బాబా రాక, అనంతర పరిణామాలపై ఏం జరుగుతుందో అన్న ఆందోళన సిబ్బందిలో వ్యక్తం అవుతోంది. ఆయన వచ్చి వెళ్లాక స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏప్రిల్ 14 టూరిజం యూనిట్ను పరిశీలించిన బృందం నేడు రాందేవ్ బాబా రాక ఉద్యోగుల్లో ప్రైవేటుకు ఇచ్చేస్తారా అన్న ఆందోళన -
నా ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలి
పులివెందుల టౌన్ : తన ప్లాటుపై జరిగిన అక్రమ రిజిస్ట్రేషన్ను రద్దు చేయాలని బాధితురాలు శ్రీపతి రామమునెమ్మ కోరారు. బుధవారం పట్టణంలోని స్థానిక శ్రీకృష్ణదేవరాయ బలిజ సంఘం కార్యాలయంలో ఆమె కుటుంబ సభ్యులతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ స్థలం విషయంలో తనకు అన్యాయం చేసిన టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి, సంబంధిత వ్యక్తులపై క్రిమినల్ చర్యలు తీసుకోవాలని సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్, మంత్రి నారా లోకేష్, ఎస్పీ అశోక్కుమార్లకు విన్నవించానన్నారు. తన స్థలాన్ని పునరుద్ధరించి రక్షణ కల్పించాలన్నారు. అలాగే ప్రభుత్వ కాలువ ఆక్రమణలతో పాటు సంబంధిత మున్సిపల్, రిజిస్ట్రేషన్ అధికారులపై కూడా విచారణ జరపాలని కోరారు. తన ప్లాటు నెంబర్ 10ను మల్లెల రాజేశ్వరి నుంచి కొనుగోలు చేశానని, రెవెన్యూ ఖాతాలో తన పేరు కూడా నమోదైందన్నారు. అయితే టీడీపీ నాయకుడు అక్కులగారి విజయ్కుమార్రెడ్డి అసలైన అమ్మకందారుతో కలిసి అక్రమ లాభార్జన కోసం అదే లింక్ డాక్యుమెంట్ను ఉపయోగించి దొంగ రిజిష్టర్ చేయించుకున్నారన్నారు. అలాగే తన స్థలంతోపాటు పక్కన ఉన్న ప్రభుత్వ కాలువ భూమిని కూడా విజయ్కుమార్రెడ్డి ఆక్రమించాడని, మున్సిపల్ అనుమతులు లేకుండా ఇళ్లు నిర్మించారన్నారు. ఈనెల 23వ తేదీ సోమవారం రాత్రి విజయ్కుమార్రెడ్డి, లక్షుమయ్యలతోపాటు మరికొంతమంది రాత్రివేళ నిబంధనలకు విరుద్ధంగా తన స్థలంలోకి ప్రవేశించి సిమెంట్ నిల్వ కోసం ఏర్పాటు చేసిన రేకుల షెడ్డును ధ్వంసం చేసి జేసీబీ ద్వారా స్థలాన్ని చదును చేశారన్నారు. -
రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం చెంబకూరు –మదనపల్లె రోడ్డు మార్గంలోని బలిజపల్లె వద్ద గత శనివారం గుర్తు తెలియని వాహనం ఢీకొని దిగువపల్లెకి చెందిన లక్ష్మీ నరసమ్మ(65) మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన కృష్ణమ్మ, శ్రీనివాసులుకు తీవ్ర గాయాలు కాగా వారిని మదనపల్లె ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం చైన్నె ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శ్రీనివాసులు మంగళవారం రాత్రి మృతి చెందాడు. మృతుడికి భార్య, కుమారుడు ఉన్నారు. అయితే పోలీసులు ఇప్పటి వరకు ప్రమాదానికి కారణమైన వాహనాన్ని గుర్తించకపోవడంపై మండల ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గుర్తు తెలియని వ్యక్తి ఆత్మహత్య మదనపల్లె రూరల్ : ఉరివేసుకుని గుర్తు తెలియని వ్యక్తి (55) మృతి చెందిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. బెంగళూరు రోడ్డు చిప్పిలి సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని కిందకు దించి పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతి చెందిన వ్యక్తి నైలాన్ తాడుతో ఉరి వేసుకోగా, దాదాపు రెండు రోజుల క్రితం సంఘటన జరిగి ఉంటుందని పోలీసులు చెబుతున్నారు. సంబంధీకులు ఎవరైనా ఉంటే పోలీసు స్టేషన్లో సంప్రదించాలని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ఏడుగురు జూదరుల అరెస్టు రాయచోటి : రాయచోటి మండలం, ఎండపల్లి పంచాయతీ, రామిరెడ్డిగారిపల్లి సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేశారు. బుధవారం సాయంత్రం ఎస్ఐ విష్ణువర్దన్ ఆధ్వర్యంలో ఏడుగురు జూదరులను అరెస్టు చేశారు. వీరి నుంచి రూ. 4,400 నగదు స్వాధీనం చేసుకున్నారు. -
బీటెక్ రవి బంధువు వీరంగం
సాక్షి టాస్క్ఫోర్స్ : పులివెందుల నియోజకవర్గంలో రోజురోజుకు టీడీపీ గుండాలు రెచ్చిపోతున్నారు. దాడులు, బెదిరింపులతో చెలరేగిపోతున్నారు. ఏదో ఒక రకంగా భయపెట్టి పంతం నెగ్గించుకోవాలన్న ఆలోచనతో ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అధికారం అండగా ఉందని, తమను ఎవరూ ఏమీ చేయలేరన్న ధీమాతో పెట్రేగి పోతున్నారు. ఎక్కడ చూసినా గొడవలు, బెదిరింపులతో ప్రత్యర్థులను బెదరగొట్టి పని కానిస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. వేంపల్లె మండలం ట్రిపుల్ ఐటీ ఓల్డ్ క్యాంపస్ పరిధిలో ఉన్న జైస్వాల్ కంపెనీకి చెందిన క్యాంటీన్ను ఎలాగైనా చేజిక్కించుకోవాలన్న ఉద్దేశంతో పులివెందుల టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి బీటెక్ రవి బంధువు, వేంపల్లె మండల ఇన్చార్జి అయిన రఘునాథరెడ్డి రెచ్చిపోయారు. మీరు ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని, మేము నడుపుకోవాలంటూ బెదిరింపులకు దిగడంతోపాటు ఏకంగా అక్కడ ఉన్న జైస్వాల్ కంపెనీ మేనేజర్ ఖాన్పై దాడులకు తెగబడ్డారు. ప్రత్యేకంగా రెండు వాహనాలతోపాటు బైకుల్లో వచ్చిన రఘునాథరెడ్డి, అతని అనుచరులు బీభత్సం సృష్టించారు. ఈ వ్యవహారంతో స్థానికులు ఉలిక్కిపడ్డారు. ఇలాంటి ఘటనలతో టీడీపీ ప్రతిష్ట మరింత దిగజారుతోందని ఆ పార్టీలోని కొందరు నేతలు బహిరంగంగా వ్యాఖ్యానిస్తున్నారు. ట్రిపుల్ ఐటీ ఓల్డ్ క్యాంపస్లో క్యాంటీన్ మేనేజర్పై దాడి ఇక్కడి నుంచి వెళ్లిపోవాలని జైస్వాల్ కంపెనీ వారికి బెదిరింపులు -
మహిళలపై అఘాయిత్యాలను అడ్డుకోలేరా?
మదనపల్లె రూరల్ : మహిళలపై జరుగుతున్న అత్యాచారాలు.. అఘాయిత్యాలను ప్రభుత్వం ఎందుకు అడ్డుకోలేకపోతోందని అఖిల భారత మహిళా సంఘం ఐద్వా రాష్ట్ర కార్యదర్శి రమాదేవి ప్రశ్నించారు. బుధవారం ఆమె మదనపల్లెలో వడ్డీ రాక్షసుల ఆగడాల పై స్పందిస్తూ.. వేధింపులకు గురైన గౌరీ ఇంటికి వెళ్లి పరామర్శించారు. ఆమెకు జరిగిన అన్యాయంపై ఆరా తీశారు. మరికొంతమంది బాధితులతో మాట్లాడిన అనంతరం గౌరీతో కలిసి స్థానిక ప్రెస్క్లబ్లో మీడియా సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆర్థిక అవసరమున్న మహిళలను లక్ష్యంగా చేసుకుంటున్న కొంతమంది వడ్డీ వ్యాపారులు వారికి అధిక వడ్డీకి అప్పులు ఇస్తూ, వారి వద్ద నుంచి అసలు కన్నా పదింతలు ఎక్కువగా వడ్డీ వసూలు చేస్తున్నారన్నారు. మదనపల్లెలో గౌరీ అనే మహిళకు స్థానికంగా ఉంటున్న మాజీ సైనికుడు ఏకాంబరరెడ్డి, ఆదివేని ఆనంద్, అతని భార్య మంజుల, బండి హరినాథ్, అతని భార్య అనురాధలు అప్పు ఇచ్చారన్నారు. వారి అప్పు తీర్చేసినా ఇంకా డబ్బులు ఇవ్వాలని వేధించడం, డబ్బులు కట్టలేని పక్షంలో వ్యభిచారం చేసి చెల్లించమని బలవంత పెట్టడం, అంతు చూస్తామని బెదిరించడం విచారకరమన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోకపోవడంతో నిందితులకు మరింత ఊతమిచ్చినట్లు అయిందన్నారు. ఈ సమావేశంలో బాధితురాలు గౌరి, ఐద్వా రాష్ట్ర కమిటీ సభ్యురాలు, జిల్లా ఇన్చార్జి సాయి లక్ష్మి, అన్నమయ్య జిల్లా కన్వీనర్ భాగ్యమ్మ, చిత్తూరు జిల్లా కన్వీనర్ భువనేశ్వరి, మదనపల్లె పట్టణ కమిటీ సభ్యులు రెడ్డి ప్రసన్న, షాహినా పాల్గొన్నారు.అఖిల భారత మహిళా సంఘం (ఐద్వా) రాష్ట్ర కార్యదర్శి రమాదేవి -
అతిగా మద్యం తాగి..
మదనపల్లె రూరల్ : అతిగా మద్యం తాగి గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందిన సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని చిత్తూరు బస్టాండు టౌన్ హాలుకు సమీపంలో షాపు రూముల ముందు ఓ గుర్తు తెలియని వ్యక్తి మృతి చెంది పడి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. మృతి చెందిన వ్యక్తి మంగళవారం ఉదయం నుంచి అక్కడే ఉంటూ మద్యం సేవిస్తున్నాడని బుధవారం మధ్యాహ్నం వరకు మెలకువగానే ఉన్నట్లు స్థానికులు తెలిపారు. అతిగా మద్యం తాగడం వల్ల ఆరోగ్యం దెబ్బతిని పరిస్థితి విషమించి మృతి చెంది ఉంటాడని తెలిపారు. సంఘటన స్థలానికి చేరుకున్న వన్టౌన్ పోలీసులు మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. అభివృద్ధికి పరిశ్రమలే కీలకంరైల్వేకోడూరు అర్బన్ : సమాజంలో గ్రామాలు, పట్టణాలు అభివృద్ధి చెందడానికి పరిశ్రమలే కీలకమని జిల్లా సబ్ కలెక్టర్ వైఖోమ్ నదియా దేవి పేర్కొన్నారు. బుధవారం మండలంలోని అనంతరాజుపేట పంచాయతీలో ఉన్న రామదాస్ మినరల్స్ కంపెనీ ఏర్పాటుకు గ్రామ సభ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ సమాజ అభివృద్ధికి పరిశ్రమలు ఎంతో అవసరమన్నారు. అలాగే చుట్టు పక్కల నిరుద్యోగ సమస్య తీరుతుందన్నారు. అలాగే స్థానిక ఎంపీటీసీ మల్లికార్జున మాట్లాడారు. ఈ కార్యక్రమంలో మిల్లు యజమానులు, అధికారులు పాల్గొన్నారు. -
రాజంపేటలో తెలుగు తమ్ముళ్ల గొడవ
రాజంపేట : రాజంపేట తెలుగుదేశం పార్టీలో తమ్ముళ్ల గొడవ తారాస్థాయికి చేరింది. బుధవారం స్ధానిక రోడ్లు భవనాల అతిథి గృహం (అన్నమయ్య అతిథి గృహం)లో త్రిసభ్య కమిటీ సమావేశం నిర్వహించారు.ఈ క్రమంలో మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు వర్గీయులు ఇన్చార్జి విషయంపై గొడవకు దిగారు. ఇన్చార్జి లేకుండానే సమావేశం ఏమిటి అని ప్రస్తావన తెరపైకి వచ్చింది. బలిజ సామాజిక వర్గానికి చెందిన కొందరు, రాజు వర్గానికి చెందిన కొందరి మధ్య సవాళ్లు విసురుకున్నారు. పార్టీ సర్వనాశనమవుతోందని పరస్పరం దూషించుకున్నారు. వాదోపవాదాలు చోటుచేసుకున్నాయి. తోపులాట కొనసాగింది. ఇరువర్గాలను శాంతింప చేసే పనిలో కొందరు తమ్ముళ్లు మధ్యస్తం చేశారు. కానీ ఫలితం లేకుండా పోయింది. సమావేశం రసభాసగా మారిపోయింది. టీడీపీ కార్యాలయంగా గుర్తింపు పొందిన ఆర్అండ్బీ అన్నమయ్య అతిథి గృహంలో ఇరువర్గాల అరుపులు, కేకలతో దద్దరిల్లిపోయింది. పరిశీలకుడు శివ ఎదుట తమ్ముళ్లు బాహాబాహీకి దిగారు. ఇంతవరకు రాజంపేట ఇన్చార్జి ఎవరనేది అధిష్టానం తేల్చకపోవడంతో ఇరు వర్గాల మధ్య అగ్గి రాజుకుంది. బలిజ సామాజిక వర్గానికి చెందిన జువ్వాది అదృష్టదీపుడు సమావేశంలో బత్యాల చెంగల్రాయుడుకు మద్దతుగా నిలిచారు. అయితే ఇది జీర్ణించుకోలేని చమర్తి వర్గం వారు రగిలిపోయారు. టీడీపీ నాయకుడు ఆనంద్ మరికొంతమందితో వాదులాట తారా స్థాయికి చేరింది. ఇక చేసేదేమీలేక సమావేశాన్ని అర్థంతరంగా ముగించేశారు. కులాల వారీగా టీడీపీలో నేతలు విడిపోయారు. పరస్పరం వాదోపవాదాలు పరిశీలకుని ఎదుటే బాహాబాహీ టీడీపీలో బయటపడిన వర్గ విభేదాలు -
సౌమ్యనాథ స్వామి బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు
నందలూరు : టీటీడీ అనుబంధంగా ఉన్న శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో జరగనున్న వార్షిక బ్రహ్మోత్సవాలకు విస్తృత ఏర్పాట్లు చేపట్టాలని అధికారులను టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం ఆదేశించారు. అధికారులతో కలిసి ఆయన బ్రహ్మోత్సవాల ఏర్పాట్లను బుధవారం పరిశీలించారు. శ్రీ సౌమ్యనాథ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాలు జులై 5న ఉదయం 10.30 గంటల నుంచి 11 గంటల వరకు ధ్వజారోహణంతో ప్రారంభమవుతాయన్నారు. ప్రతి రోజు ఉదయం 8 గంటలకు, రాత్రి 7 గంటలకు వాహనసేవలు ఉంటాయన్నారు. బ్రహ్మోత్సవాలకు హాజరయ్యే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఆలయ పరిసరాలు ప్రతి రోజూ పరిశుభ్రంగా ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. భక్తులకు దర్శనం, తాగునీరు, ప్రసాదాలు పంపిణీలో ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. టీటీడీ హిందూ ధర్మ ప్రచార పరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టుల ఆధ్వర్యంలో ప్రతి రోజూ హరికథలు, ఆధ్యాత్మిక, భక్తి, సంగీత కార్యక్రమాలు చేపట్టాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈలు వెంకటేశ్వర్లు, మనోహరం, డిప్యూటీ ఈఓలు నటేష్బాబు, శివప్రసాద్, ప్రశాంతి, డీఎఫ్ఓ ఫణికుమార్ నాయుడు, పట్టణీకరణ నిపుణుడు శ్రీరాముడు, ఇతర అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. తాళ్లపాక ఆలయాలను అభివృద్ధి చేస్తాంరాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్ధలి తాళ్లపాకతోపాటు అలయాలను అభివృద్ధి చేస్తామని తిరుమల తిరుపతి దేవస్ధానం జెఈవో వీరబ్రహ్మం తెలిపారు. టీటీడీ అధికారులతో కలిసి తాళ్లపాకలోని సిద్దేశ్వరస్వామి ఆలయం, 108 అన్నమయ్య విగ్రహ ప్రాంతం,. ప్రారంభానికి నోచుకోని శ్రీవారి ఆలయంను ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల 6నుంచి 15వతేది వరకు తాళ్లపాకలోని చెన్నకేశవ, సిద్దేశ్వరస్వామి ఆలయాల వార్షిక బ్రహ్మోత్సవాలను పురస్కరించుకొని పరిశీలించామన్నారు. కార్యక్రమంలో టీటీడీ డీఎఫ్ఓ ఫణికుమార్, డిప్యూటీ ఈఓ నటేష్బాబు, శివకుమార్, ప్రశాంతి, ఇంజనీరింగ్ ఎస్ఈ మనోహర్, ఈఈ సుమతి, విద్యుత్ ఎస్ఈ వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.టీటీడీ జేఈఓ వి.వీరబ్రహ్మం -
శాఖల సమన్వయంతోనే ఆదాయం పెంపు
రాయచోటి: అన్ని శాఖల సమన్వయంతోనే వార్షిక ఆదాయం పెంపు సాధ్యమని, పన్నుల పరిధిలోని అన్నింటినీ తీసుకురావడానికి అధికారులు సమన్వయంతో పనిచేయాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్లో జీఎస్టీ ఆదాయంపై వివిధ శాఖల అధికారులతో జిల్లా కలెక్టర్ సమన్వయ సమావేశాన్ని నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఇన్చార్జ్ జీఎస్టీ అధికారి, జిల్లా పంచాయతీశాఖ మున్సి పాల్టీలు, మున్సిపల్ కార్పోరేషన్లు, ఆడిట్ శాఖ తదితర శాఖల జీఎస్టీ ఆదాయాన్ని పెంచేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పలు సూచనలు చేశారు. రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ, అభివృద్ధి కార్యక్రమాలకు అవసరమయ్యే ఆదాయాన్ని పన్నులు ద్వారా సమీకరిస్తుందని కలెక్టర్ అన్నారు. రాష్ట్ర జీఎస్టీ ఆదాయాన్ని పెంచడానికి అన్ని శాఖల అధికారులు సమన్వయంతో పనిచేయాలన్నారు. సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి, రాజంపేట సబ్ కలెక్టర్లు మేఘస్వరూప్, వైఖోమ్ నదియా దేవి, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా జీఎస్టీ శాఖ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ప్రజాస్వామ్య విలువలను కాపాడిన యోధులను స్మరించుకునేందుకే.. ఎమర్జెన్సీ సమయంలో ప్రజాస్వామ్య విలువలను కాపాడిన యోధులను స్మరించుకునేందుకే రాజ్యాంగ హత్య దినం జరుపుకుంటున్నామని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో రాజ్యాంగ హత్య దినంను నిర్వహించారు. డీఆర్ఓ మధుసూదనరావు, అదనపు ఎస్పీ వెంకటాద్రి మాట్లాడారు. ● జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
టీడీపీలో కలవరం!
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లా తెలుగుదేశం పార్టీలో కలవరం మొదలైంది. పార్టీ అధిష్ఠానం టీడీపీలో గట్టి పట్టున్న వారిని పట్టించుకోకపోవడం, నియోజకవర్గ ఇన్ఛార్జిలనుప్రకటించకపోవడం, ప్రస్తుత సర్కార్లో అవినీతి కార్యకలాపాలు చోటుచేసుకుంటున్నా మిన్నకుండిపోతుండడం వంటి ఘటనలతో పార్టీలో సీనియర్ నాయకులు మనస్థాపం చెందుతున్నారు. ఎప్పటినుంచో పార్టీని నమ్ముకుని కష్టపడి పనిచేసిన వారికి కాకుండా అప్పటికప్పుడు పార్టీలోకి వచ్చిన వారికి టీడీపీ అధిష్ఠానం పదవులు కట్టబెడుతుండడంపై కూడా పార్టీలోని సీనియర్ నాయకులు రగలిపోతున్నారు. ప్రధానంగా జిల్లాలో కాపు సామాజిక వర్గానికి చెందిన నాయకులను టీడీపీ కరివేపాకులా వాడుకుని వదిలేసిందన్నది మెజార్టీ ప్రజల నుంచి అభి ప్రాయం వ్యక్తమవుతోంది. ఈ నేపధ్యంలోనే ఎన్ని అవమానాలకు గురిచేసినా పార్టీని అంటిపెట్టుకుని పనిచేసిన మాజీ జెడ్పీ చైర్మన్, టీడీపీ రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గ అభ్యర్థి, మాజీ ఎంపీ దివంగత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి బాలసుబ్రమణ్యంను పార్టీ అధిష్టానం అవమానాలకు గురి చేయడంతో తిరుగుబాటు బావుటా ఎగురవేసి టీడీపీకి రాజీనామా చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఆయన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో చేరడంతో టీడీపీలో కలవరం మొదలైంది. రాజంపేట నుంచి పోటీ చేసినా... ఎన్నికల్లో రాజంపేట నుంచి ఎమ్మెల్యే అభ్యర్థిగా సుగవాసి బాలసుబ్రమణ్యం పోటీ చేశారు. పాలకొండ్రాయుడు కుటుంబం నుంచి రాయచోటికి అవకాశం పరిశీలించాలని పదేపదే అడిగినా కాదని, రాజంపేట నియోజకవర్గం అప్పగించారు. అయినా బాలసుబ్రమణ్యం వెనుకంజ వేయకుండా రాజంపేట టీడీపీ టిక్కెట్పై పోటీ చేశారు. ఏరు దాటకముందు ఓడ మల్లన్న..ఏరు దాటాక బోడి మల్లన్న అన్న చందంగా.. టీడీపీ అధిష్టానం వ్యవహరించడంపై పార్టీలో తీవ్ర చర్చ జరుగుతోంది. ఎన్నికల తర్వాత ఓడిపోయిన అభ్యర్థికి అధికారంలోకి వచ్చిన కూటమి సర్కార్ ఇన్ఛార్జి పదవిని కట్టబెట్టకుండా నాన్చుడు ధోరణితో ముందుకు వెళ్లింది. అంతవరకు బాగానే ఉన్నా మరోపక్క ఇంకో నాయకుడిని అదే నియోజకవర్గంలో ప్రోత్సహించడం వెనుక పొమ్మనకుండానే పొగబెట్టినట్లు అర్థమవుతోంది. వైఎస్ జగన్ సమక్షంలో పార్టీలో చేరిన సుగవాసి బాలసుబ్రమణ్యం అన్నమయ్య జిల్లాలో ఇదే బాటలో మరికొందరు -
వైఎస్సార్సీపీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో జిల్లా నేతలు
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విస్తృతస్థాయి సమావేశంలో జిల్లాకు చెందిన ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, మేయర్, జిల్లా అధ్యక్షులు తదితరులు హాజరయ్యారు. బుధవారం విజయవాడలోని తాడేపల్లి కేంద్ర కార్యాలయంలో పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం జరిగింది. ఈ సమావేశంలో జిల్లా నుంచి పార్టీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మెన్ రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు పి. రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, కడప మేయర్ కె. సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల ఆస్తులకు రక్షణ కల్పించండి
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి ప్రజల ఆస్తులకు రక్షణ లేకుండా పోయిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఉద్దేశ పూర్వకంగా తమపై విమర్శలు చేసిన ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డి తమ పార్టీ అధికారంలోకి వచ్చాక విచ్చలవిడిగా భూ ఆక్రమణలను, కబ్జాలను ప్రోత్సహిస్తున్నారన్నారు. ఆయన మంగళవారం తన స్వగృహంలో విలేకరులతో మాట్లాడుతూ ప్రొద్దుటూరు ఎంపీపీ శేఖర్ యాదవ్పై సోమవారం రాత్రి టీడీపీ వర్గీయులు దాడి చేశారన్నారు. సోమవారం రాత్రి ఎంపీపీ స్థలంలోని నిర్మాణాలను కొత్తపల్లె సర్పంచ్ శివచంద్రారెడ్డి అనుచరులు, టీడీపీ కౌన్సిలర్ మునీర్ జేసీబీతో పడగొట్టారన్నారు. గత కొద్ది రోజులుగా ఈ స్థలం తనదని శేఖర్ వద్దకు మునీర్ రాగా ఆయన నిజం నిగ్గు తేల్చాలని పోలీస్ స్టేషన్కు దాదాపు 10 మార్లు తిరిగారన్నారు. ఎమ్మెల్యే వరదరాజులరెడ్డి వర్గీయులు కావడంతో పోలీసులు అధికార పార్టీకి తలొగ్గి నిజాలను బయటికి వెల్లడించలేదన్నారు. వాస్తవానికి రూ.500 స్టాంప్ పేపర్పై టీడీపీ వర్గీయులు చూ పించిన డాక్యుమెంట్కు సంబంధించిన సర్వే నంబర్ 547 ప్రొద్దుటూరు మున్సి పాలిటీ పరిధిలోని రామేశ్వరం గ్రామ పొలానికి సంబంధించిందన్నారు. ఈ ఆఽ దారాలు కూడా సబ్ రిజిస్ట్రార్ ఆఫీసులో లేవని, కేవలం దొంగ సంతకాలు, సీళ్లు వేసి తయారు చేసిన వాటిని చూపుతున్నారన్నారు. ప్రొద్దుటూరులో నకిలీ స్టాంప్లు, దొంగ సంతకాలు వ్యాపారం జోరుగా సాగుతోందని తెలిపారు. కొత్తపల్లె గ్రామ పంచాయతీలో విచ్చల విడిగా కబ్జాలు కొత్తపల్లె గ్రామ పంచాయతీలో సర్పంచ్ శివచంద్రారెడ్డి ఎన్నికై నప్పటి నుంచి విచ్చల విడిగా భూ కబ్జాలు, ఆక్రమణలు జరుగుతున్నాయని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఆరోపించారు. అధికార పార్టీ ప్రభావం కారణంగానే అక్కడ అవినీతి రాజ్యమేలుతోందన్నారు. ఒక ముఠా ఏర్పడి దొంగ సంతకాలు, నకిలీ స్టాంప్లు తయారు చేస్తోందన్నారు. ఈ విషయంపై విచారణ జరపాలని స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ ఐజీకి ఫిర్యాదు చేస్తున్నామని తెలిపారు. ఎంపీపీ, సర్పంచ్ ఆస్తులకు, ప్రాణాలకు రక్షణ లేకుండాపోతే ఇక సామాన్య ప్రజల పరిస్థితి ఏమిటని ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం వచ్చిన ఏడాదిలోనే ఎన్నో భూ ఆక్రమణలను, కబ్జాలు జరిగాయని తెలిపారు. అవినీతి విచ్చల విడిగా పెరిగిపోయిందన్నారు. ఈ సమావేశంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ఆయిల్ మిల్ ఖాజా, జెడ్పీ కోఆప్షన్ మాజీ సభ్యుడు అక్బర్, ఉప సర్పంచ్ రాఘవేంద్రారెడ్డి, కౌన్సిలర్ గరిశపాటి లక్ష్మీదేవి, తొగటవీరక్షత్రియ సంఘం జిల్లా అధ్యక్షుడు బండారు సూర్యనారాయణ, ఎంపీటీసీ ఓబయ్య యాదవ్, వైఎస్సార్సీపీ నాయకుడు శివ పాల్గొన్నారు. ఎంపీపీ స్థలానికే దిక్కు లేదు ఫేక్ డాక్యుమెంట్లపై ఐజీకి ఫిర్యాదు కొత్తపల్లె పంచాయతీలో విచ్చలవిడిగా భూ కబ్జాలు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
ప్రభుత్వ రంగ సంస్థలను బలహీనపరచడం తగదు
కడప సెవెన్రోడ్స్ : ప్రభుత్వ రంగ సంస్థలను, కార్మిక చట్టాలను నిర్వీర్యం చేసే కేంద్ర ప్రభుత్వ విధానాలను వ్యతిరేకిస్తూ జూలై 9న దేశవ్యాప్త సమ్మెకు సిద్ధం కావాలని ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం కడప డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథరెడ్డి పిలుపునిచ్చారు. మంగళవారం డివిజన్ అధ్యక్షుడు అవధానం శ్రీనివాస్ ఆధ్వర్యంలో స్థానిక డివిజనల్ కార్యాలయం ఎదుట దేశవ్యాప్త పిలుపు మేరకు జరిగిన నిరసన ప్రదర్శనలో ఆయన మాట్లాడారు. పార్లమెంట్ సమావేశాల్లో బీమా చట్టాల సవరణ బిల్లును ప్రవేశపెట్టనున్నారని, దీనిని తాము వ్యతిరేకిస్తున్నామని అన్నారు. ఎల్ఐసీలో ప్రభుత్వం తన వాటాలను ఉపసంహరించుకునే కార్యక్రమం మరోమారు చేపట్టనుందని, దీనిని ప్రతిఘటిస్తున్నామన్నారు. బీమా ప్రీమియంలపై ప్రస్తుతం ఉన్న 18 శాతం జీఎస్టీని తగ్గించాలని ఆయన కోరారు. 3,4 తరగతుల సిబ్బంది కోసం రిక్రూట్మెంట్ తక్షణం చేపట్టాలన్నారు. దేశంలో చాలా రాష్ట్ర ప్రభుత్వాలు కొత్త పెన్షన్ విధానానికి స్వస్తి పలికి పాత పెన్షన్ విధానాన్ని అమలుకు సిద్ధపడుతున్నాయని, ఎల్ఐసీలో కూడా అందరికీ పాత పెన్షన్ విధానమే అమలు చేయాలన్నారు. ఈ నిరసన కార్యక్రమంలో యూనియన్ నేతలు వసుప్రద, వారిజాతమ్మ, కేసీఎస్ రాజు, అమీనా పర్వీన్, రత్న కిషోర్, శ్రీవాణి, శశికళ, కుమార్, రఘు, చిన్నయ్య, గౌస్, హనుమ తదితరులు పాల్గొన్నారు. జులై 9న దేశవ్యాప్త సమ్మెను జయప్రదం చేద్దాం నిరసన ప్రదర్శనలో ఎల్ఐసీ సంఘం డివిజన్ ప్రధాన కార్యదర్శి రఘునాథ్రెడ్డి -
25న రాజ్యాంగ హత్యా దినం
రాయచోటి: భారత ప్రభుత్వం ప్రకటించిన నేపథ్యంలో ఈ నెల 25న రాజ్యాంగ హత్యా దినంగా అన్నమయ్య జిల్లాలో జరుపుకొంటున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ తెలిపారు. మంగళవారం ఆయన పత్రికా ప్రకటన విడుదల చేశారు. దేశవ్యాప్తంగా 1975 జూన్ 25న ఎమ ర్జెన్సీ విధించిన నేపథ్యంలో.. భారత ప్రభుత్వం జూన్ 25న రాజ్యాంగ హత్య దినంగా ప్రకటించిందన్నారు. ఎమర్జెన్సీ విధించి 50 ఏళ్లు అయిన సందర్భంగా రాజ్యాంగం, దాని విలువలపై ప్రజలకు అవగాహన కల్పించేందుకు వివిధ కార్యక్రమాలు చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. డీఎంహెచ్ఓను కలిసిన వైద్యాధికారులు రాయచోటి జగదాంబసెంటర్: అన్నమయ్య జిల్లా డీఎంహెచ్ఓగా బాధ్యతలు చేపట్టిన డాక్టర్ లక్ష్మీనరసయ్యను వైద్య శాఖకు చెందిన పలువురు వైద్యాధికారులు మంగళవారం కలిశారు. ఈ సందర్భంగా రాయచోటిలోని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో జిల్లా డీపీఎంఓ రియాజ్బేగ్, జిల్లా ఏపీ ఎంసీఏ అధ్యక్షులు సాల్మోహన్, జిల్లా జనరల్ సెక్రటరీ తలారి భాస్కర్, వైస్ ప్రెసిడెంట్ భరత్, ప్రవీణ, రమ్య, ఇంద్రజ.. డీఎంహెచ్ఓకు శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం డీఎంహెచ్ఓ మాట్లాడుతూ మనందరం ప్రజల ఆరోగ్యం కోసం పని చేయాల్సిన బాధ్యత ఉందని వారితో అన్నారు. ప్రతి ఒక్కరూ సహకారం అందించి వైద్యశాఖలో జిల్లాకు మంచి పేరు తీసుకొద్దామని ఆయన తెలియజేశారు. నేటి నుంచి మదనపల్లికి గుంటూరు ఎక్స్ప్రెస్ కలికిరి: తిరుపతి–గుంటూరు ఎక్స్ప్రెస్ రైలు బుధవారం నుంచి తిరుపతి నుంచి మదనపల్లి వరకు నడువనుంది. మదనపల్లి నుంచి తిరుపతి వరకు అన్ రిజర్వుడు స్పెషల్ ట్రైన్గా నడుపనున్నారు. తిరుపతి నుంచి యథావిధిగా ఎక్స్ప్రెస్గా నడువనుంది. దీంతో మదనపల్లి నుంచి తిరుపతి వరకు రైలు ప్రయాణికులకు సూపర్ ఫాస్ట్ చార్జీలు అమలులోకి రానున్నాయి. అన్ రిజర్వుడు సూపర్ ఫాస్ట్ (07261) ఉదయం 5.15 గంటలకు తిరుపతిలో బయల్దేరి పాకాలకు 5.55 గంటలకు, పీలేరు 6.25కి, కలికిరి 6.40కి, మదనపల్లికి 8.15 గంటలకు చేరుకుంటుంది. తిరిగి 07261 రైలు మదనపల్లిలో సాయంత్రం 3 గంటలకు బయల్దేరి 3.30కి కలికిరి, పీలేరు 3.45కి, పాకాల 4.50కి, తిరుపతికి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి యథావిధిగా గుంటూరు ఎక్స్ప్రెస్(17262)గా సాయంత్రం 7.25 గంటలకు బయల్దేరి రేణిగుంట, రైల్వేకోడూరు, రాజంపేట, నందలూరు, కడప జంక్షన్, కమలాపురం, యర్రగుంట్ల జంక్షన్, ప్రొద్దుటూరు, జమ్మలమడుగు, కోవెలకుంట్ల, బనగానపల్లి, నంద్యాల జంక్షన్, గిద్దలూరు, కంభం, మార్కాపురం రోడ్, దొనకొండ, వినుకొండ, నరసరావుపేట, మీదుగా ఉదయం 7.20 గంటలకు గుంటూరుకు చేరుకుంటుంది. ఈ రైలు సదుపాయంతో మదనపల్లి, కలికిరి, పీలేరు, పాకాల ప్రాంత వాసులకు కడప, నంద్యాల, మార్కాపురం రోడ్, నరసారావుపేట తదితర ప్రాంతాలకు రైలు ప్రయాణం అందుబాటులోకి వచ్చినట్లయింది. ‘ఉర్దూ’ నేర్చుకోవడానికి దోహదం రాయచోటి టౌన్: ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోవచ్చని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం తెలిపారు. స్థానిక డీఈఓ కార్యాలయంలో మంగళవారం ‘ఉర్దూ భాషను సులభంగా నేర్చుకోండిలా’ అనే పుస్తకాన్ని ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పుస్తకాన్ని అజీజియా ఎడ్యుకేషనల్ ట్రస్టు ఆధ్వర్యంలో రచయిత అబ్దుల్ వహీద్ విద్యార్థులకు సులభంగా అర్థమయ్యే విధంగా, త్వరగా నేర్చుకునే విధంగా రూపొందించారని పేర్కొన్నారు. ఇంగ్లిష్ మీడియం పాఠశాలలో రెండవ భాషగా ఉర్దూను ఎంచుకున్న విద్యార్థులకు ఎంతో ఉపయోగ పడుతుందని తెలిపారు. అనంతరం నోబుల్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షులు కొండూరు శ్రీనివాస రాజు మాట్లాడుతూ ఉర్దూ భాష నేర్చుకోవడానికి ఇలాంటి పుస్తకాలు ఎంతో అవసరం ఉంటాయన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ప్రభుత్వ ఉన్నత పాఠశాల ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, రాష్ట్ర ఉర్దూ టీచర్స్ అసోసియేషన్ స్టేట్ కన్వీనర్ షేక్ మహమ్మద్ హషీం, పాలం రాజ, గోపాల్, బాబా ఫకృద్దీన్, సురేష్ బాబు తదితరులు పాల్గొన్నారు. -
సీఎంఏలో 44వ ర్యాంకు
లక్కిరెడ్డిపల్లి: మండల పరిధి అనంతపురం పంచాయతీలోని గుడ్లవారిపల్లికి చెందిన గూడె వెంకటరమణ సీఎంఏలో ఆల్ ఇండియా కోటాలో 44వ ర్యాంకు సాధించారు. ఈ విద్యార్థి మంగళవారం ఢిల్లీలో గోల్డ్ మెడల్ అందుకున్నారు. వెంకటరమణ నిరుపేద కుటుంబంలో పుట్టారు. ఐదో తరగతి వరకు లక్కిరెడ్డిపల్లి విశ్వభారతి హైస్కూల్, ఏపీ మోడల్ స్కూల్లో పదో తరగతి వరకు, ఇంటర్ గుంటూరు మాస్టర్ మైండ్ కళాశాలలో చదివారు. ఉత్తమ ర్యాంకు సాధించేందుకు తల్లిదండ్రులు సహదేవరెడ్డి, రెడ్డమ్మ, ఉపాధ్యాయుల సహకారం మరువలేనిదని ఆయన అన్నారు. వెంకటరమణ దేశ స్థాయిలో అత్యుత్తమ ర్యాంక్ సాధించడంపై గ్రామస్తులు, బంధువులు హర్షం వ్యక్తం చేశారు. -
ఉచితంగా న్యాయ సాయం
రాయచోటి: కోర్టుల ద్వారా అందుతున్న ఉచిత న్యాయ సహాయా న్ని పేద, మధ్య తరగతి ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎస్.బాబా ఫకృద్దీన్ తెలిపారు. ఏపీ న్యాయ సేవాధికార సంస్థ, వైఎస్సార్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఆదేశాల మేరకు మంగళవారం రాయచోటి సబ్ జైలును సీనియర్ సివిల్ జడ్జి సందర్శించారు. ఈ సందర్భంగా సబ్ జైలు లీగల్ ఎయిడ్ క్లినిక్, జైలు రిజిస్టర్లను పరిశీలించారు. అనంతరం ఖైదీలతో సమావేశమయ్యారు. లీగల్ ఎయిడ్ క్లినిక్ ప్రాధాన్యత, జైలు లోపల ఖైదీల హక్కులను తెలియజేశారు. ఉచిత న్యాయ సాయం, లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ సిస్టమ్పై అవగాహన కల్పించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్లైన్ నంబర్ 15100పై వివరించారు. కార్యక్రమంలో రాయచోటి సబ్ జైలు సూపరింటెండెంట్, ప్యానల్ న్యాయవాది తదితరులు పాల్గొన్నారు. ఉపాధి పనుల తనిఖీ సంబేపల్లె: మండల పరిధిలోని గుట్టపల్లె, ఎస్.సోమవరం గ్రామాల్లో మంగళవారం పీడీ వెంకటరత్నం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయా గ్రామాల్లో జరుగుతున్న నీటి నిల్వ గుంతలు, హార్టికల్చర్, పిట్టింగ్ తదితర పనులను ఆయన పరిశీలించారు. అనంతరం ఉపాధి కూలీలతో బిల్లులు తదితర వివరాలపై ఆరా తీశారు. కార్యక్రమంలో ఏపీఓ, ఉపాధి సిబ్బంది పాల్గొన్నారు. -
మట్టికొట్టుకుపోవద్దు!
పొలాలకు కాదు వెంచర్లకు.. దేవుని కడప మట్టిని పొలాలకు అని చెప్పి అధికారుల వద్ద అనుమతి తోసుకుని వెంచర్లకు తరలిస్తూ వేలకు వేలు దండుకుంటూ వ్యాపారం చేస్తున్నారని స్థానికులు వాపోయారు. అది కూడా ట్రాక్టర్లతో తొలుకుంటామని అనుమతులు తీసుకుని భారీ ట్రిప్పర్లతో రాత్రింబవళ్లు మట్టిని తరలిస్తూర్నారని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి చెరువుమట్టి తరలింపును ఆపకపోతే ఆందోళనను ఉధృతం చేస్తామని స్థానికులు హెచ్చరించారు. స్థానికుల ఆందోళనకు ఎన్ఎస్యూఐ నాయకులు మద్దతిచ్చారు. కడప అగ్రికల్చర్: రోజంతా టిప్పర్ల శబ్దాలే.. రోడ్డంతా గుంతలే.. ఇళ్లంతా దుమ్మూ ధూళే.. వీళ్ల పోరుకు సస్తాన్నాం.. అంటూ దేవునికడప వాసులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవుని కడపలో చెరవుమట్టిని తరలించొద్దని మంగళవారం ఆందోళన చేశారు. ట్రాక్టర్లతో కాకుండా భారీ వాహనాలతో మట్టిని తరలిస్తున్నారని ఆలా తరలించ వద్దని రోడ్డుపై అడ్డంగా నిలబడి నిరసన చేపట్టారు. నిబంధనలకు వ్యతిరేకంగా చెరువులో మట్టి తవ్వకాలు చేపడుతున్నారు. మట్టి తరలింపు వాహనల రాకపోకల కారణంగా పాతకడప నుంచి వాటర్ గండికి వెళ్లే రహదారి గుంతలమయంగా మారింది. భారీ వాహనాలతో మట్టిని తరలించడం వల్ల రోడ్లన్నీ గుంతలు పడటంతోపాటు దుమ్ముదూళంతా ఇళ్లలోకి వస్తోందని స్థానికులు వాపోయారు. దీంతోపాటు దుమ్ముకు దగ్గు, ఆయాసం వస్తోందని బాధ వ్యక్తం చేశారు. వాహనాల తాకిడి, శబ్థాలతో ఇళ్లలో ఉండలేక పోతున్నామని చెప్పారు. వాహనాల తాకిడికి పిల్లలు పాఠశాలకు పంపాలంటే భయమేస్తోందని ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాలతో తమ పిల్లలకు ప్రమాదం పొంచి ఉందని వాపోయారు. దీంతోపాటు ముసిలి, పెద్దవాల్లు రోడ్లపైన తిరగలేక పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ వ్యవహారం 20 రోజులుగా జరుగుతోందని, దీన్ని పట్టించుకునే నాధుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే భారీ వాహనాలు నిత్యం ఆలయం మీదుగానే అధిక సంఖ్యలో వెళ్లుతుండటంతో భక్తులకు ఎంతో అసౌకర్యం కలుగుతుందని తెలిపారు. దేవునికడప చెరువులోజోరుగా తవ్వకాలు మట్టిని తరలించవద్దనిదేవుని కడపలోస్థానికుల ఆందోళన -
4 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు: జిల్లాలో అత్యంత ప్రాశస్త్యం పొందిన ఆలయాలలో ఒకటైన సౌమ్యనాథ స్వామి దేవాలయం బ్రహ్మోత్సవాలు జూలై 4 నుంచి నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్ తెలిపారు. ఆయన మంగళవారం పత్రికా ప్రకటన విడుదల చేశారు. 13వ తేదీ వరకు 10 రోజుల పాటు వైభవంగా బ్రహ్మోత్సవాలు జరుగుతాయని పేర్కొన్నారు. 4న ఉద యం తిరుమంజనం, రాత్రి అంకురార్పణ, 5న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 6న ఉదయం పల్లకీ సేవ, రాత్రి హంస వాహనం, 7న ఉదయం పల్లకీ సేవ, రాత్రి సింహవాహనం, 8న ఉదయం పల్లకీసేవ, రాత్రి హనుమంతు వాహనం, 9న ఉదయం శేష వాహనం, రాత్రి గరుడ వాహనం, 10న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహన సేవలు ఉంటాయని తెలిపారు. 11న ఉదయం కల్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 12న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 13న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని వివరించారు. -
సమస్యాత్మక ప్రదేశాల్లో కూంబింగ్
సిద్దవటం : సిద్దవటం రేంజిలోని గొల్లపల్లె సెక్షన్లోని సమస్యాత్మక ప్రదేశాలలో కూంబింగ్ నిర్వహించామని సిద్దవటం రేంజర్ కళావతి తెలిపారు. సిద్దవటం అటవీశాఖ కార్యాలయంలో మంగళవారం రేంజర్ మాట్లాడుతూ కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ఆదేశాల మేరకు సిద్దవటం ఫారెస్టు రేంజి పరిధిలోని గొల్లపల్లె, రోళ్లబోడు, ఫారెస్టు బీట్లలో సమస్యాత్మక ప్రదేశాల్లో ఎర్రచందనం స్మగ్లర్ల కోసం సోమవారం నుంచి కూంబింగ్ నిర్వహించామన్నారు. అటవీ ప్రాంతాల్లోని సమీప గ్రామాల్లో ప్రజలకు ఎవరైనా కొత్త వ్యక్తులు అనుమానాస్పదంగా కనబడితే వెంటనే అటవీ అధికారులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ కార్యక్రమంలో డీఆర్ఓ ఓబులేస్, ఫారెస్టు బీటు ఆఫీసర్లు మధు, ఆది విశ్వనాథ్, పెంచల్రెడ్డి, అసిస్టెంటు బీటు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. ఏడుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టుఓబులవారిపల్లె : వై.కోట చెరువు అలుగు వద్ద మంగళవారం ఎర్రచందనం దుంగలను కారులోకి ఎక్కిస్తున్న ఏడుగురిని అరెస్టు చేసినట్లు ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. ఆయన విలేకరులతో మాట్లాడుతూ పక్కా సమాచారంతో చెరువు అలుగు సమీపానికి చేరుకోగానే అక్కడ కారులోకి ఎర్రచందనం దుంగలు మోస్తూ ఏడుగురు తారసపడ్డారని తెలిపారు. తమను చూడగానే రాళ్లతో దాడి చేసేందుకు ప్రయత్నించారన్నారు. తాము చాకచక్యంగా వారిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వారివద్ద నుంచి ఒక కారు, నాలుగు ఎర్రచందనం దుంగలు, ఆరు మొబైల్ ఫోన్లు, ఐదు గొడ్డళ్లు, ఒక రంపం, మూడు టార్చిలైట్లు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అరెస్టు చేసిన నిందితులు తిరుపతికి చెందిన కారు డ్రైవర్ ముత్యాల వెంకటేష్తోపాటు ఆరుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన ఎర్రచందనం కూలీలు ఉన్నారని తెలిపారు. ఈ ఎర్రచందనం అక్రమ రవాణాకు సూత్రధారులైన ముగ్గురు స్మగ్లర్లు పరారీలో ఉన్నట్లు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అరెస్టు అయిన ఏడుగురిని తిరుపతి ఎర్రచందనం కోర్టు మెజిస్ట్రేట్ ఎదుట హాజరుపరిచి రిమాండుకు తరలించామని వివరించారు. -
డిప్లొమా ఫలితాలలో సీబీఐటీ విద్యార్థుల ప్రతిభ
చాపాడు : స్టేట్ బోర్డు ఆఫ్ టెక్నికల్ ఎడ్యుకేషన్ ఇటీవల విడుదల చేసిన డిప్లొమో ఫస్టియర్, సెకెండియర్ ఫోర్త్ సెమిస్టర్ పరీక్షా ఫలితాలలో స్థానిక చైతన్య భారతి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (సీబీఐటీ) విద్యార్థులు ఉత్తమ ఫలితాలు సాధించినట్లు డిప్లమో హెచ్ఓడీ జే.రమేష్బాబు తెలిపారు. ఫస్టియర్ సీఎంఈలో ఎం.కళ్యాణి 98.30, ఎం.శ్రీవర్ని 94.20, బీఎస్.బీబీ ఖతీజా, పి.అజయ్కుమార్ 91.60, షేక్ బాబా రియాజ్ 90.90, సయ్యద్ లిక్తియా 90,50, ఈసీఈలో కె.పూర్ణ అక్షయ 98.27, ఎం.ఉషశ్రీ 94.72, బి.వెంకట అనూష 90.90, పి.లక్ష్మి సుజన 95.72, ఎన్.భవిత 94.54, పి.ఆదికేశవరెడ్డి 94.54, ఎస్కే సనాఅఫీఫా 93.90 శాతం మార్కులు సాధించారన్నారు. ఈఈఈలో షేక్. మహమ్మద్ జుబేర్ 95.70, బి.మహ్మద్ యాసిన్ 86 శాతం మార్కులు సాధించగా, సెకెండియర్ సీఎంఈలో జి.కీర్తితేజ 98.88, ఎం.వెంకటలక్ష్మి 95.44, జి.చంద్రిక 95.22, పి.గంగశృజన 97.11, పి.స్నేహ 95.55, పి.అంజనీదేవి 93.77, ఈసీఈలో బి.లాస్య 98.90, కె.వెంకటస్వప్న 97.90, కె.జాహ్నవి 97.10, కె.మెహజాబి 98.90. పి.రమ్యశ్రీ 97.50, ఎన్.గురుశ్రావ్య పూజిత 95.80, ఎస్.రహిమున్నీస 95.80, ఈఈఈలో సి.మునికుమార్ 97.60, ఆర్.దినేష్రెడ్డి 96.00, ఎన్.లోకేష్ 92.30 శాతం మార్కులతో ఉత్తమ ఫలితాలు సాధించారు. తమ కాలేజీ విద్యార్థులు సాధించిన ఫలితాల పట్ల కరస్పాండెంట్ డాక్టర్ వి.జయచంద్రారెడ్డి, సీఈఓ వి.లోహిత్రెడ్డి, డైరెక్టర్ అడ్మిన్ డాక్టర్ జి.శ్రీనివాసులరెడ్డి, ప్రిన్సిపాల్ డాక్టర్ ఎస్.శృతి, అధ్యాపక బృందం హర్షం వ్యక్తం చేశారు. -
● ఎందుకు రాలేదని.. అడిగితే దాడి
రాయచోటి: సూపర్ సిక్స్ పథకాలలో భాగంగా తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే.. అంత మందికి రూ.15 వేల చొప్పున జమ చేస్తామని ఎన్నికల ముందు కూటమి పెద్దలు పెద్ద ఎత్తున ప్రచారం చేశారు. నీకు 15 వేలు, నీకు 15 వేలు, నీకు 15 వేలు అంటూ ఊదరగొట్టారు. ఇద్దరు ఉంటే రూ.30 వేలు, ముగ్గురు ఉంటే రూ.45 వేలు ఇస్తామంటూ చెప్పుకొచ్చారు. తీరా అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయిన నేపథ్యంలో ఎట్టకేలకు తల్లికి వందనం పథకం సొమ్ములు తల్లుల ఖాతాల్లో జమ అవ్వడం మొదలయ్యాయి. హామీ ఇచ్చినట్లుగా రూ.15 వేలు కాకుండా రూ.13 వేలే జమ చేశారు. కరెంటు బిల్లు ఎక్కువ వచ్చిందనే కారణంతో.. జిల్లాలో కూటమి సర్కారు అట్టహాసంగా అమలు చేసిన తల్లికి వందనం పథకంలో చిన్న చిన్న తప్పిదాలతో చాలా మంది అర్హులైన విద్యార్థులకు ఆర్థిక సాయం జమ కాక తల్లులు సచివాలయాల చుట్టూ పరుగులు పెడుతున్నారు. సచివాలయాలు, బ్యాంకులు, కరెంట్ ఆఫీసులు, రెవెన్యూ కార్యాలయాల వద్దకు పరుగులు తీస్తున్నారు. బ్యాంకు ఖాతాల్లో తల్లికి వందనం డబ్బు జమ కానట్లు తెలియడంతో చాలా మంది ఉసూరుమంటూ వెనుతిరిగి వెళుతున్నారు. కొందరికి విద్యుత్ వినియోగం ఎక్కువ అనే కారణంతో పథకం సొమ్ములు జమ కాలేదని తెలియడంతో విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు క్యూ కడుతున్నారు. కొందరికి ఎలాంటి భూమి లేకపోయినా 10, 15 ఎకరాలు భూములు ఉన్నాయన్న సమాచారంతో తహసీల్దార్ కార్యాలయం చుట్టూ ప్రదక్షిణలు చేయడం పరిపాటిగా మారింది. ఆధార్ కార్డు, రేషన్ కార్డులలో పేర్లు తప్పులు దొర్లిన వాటిని సరిచేసుకోవడానికి ఉపాధి పనులను వదిలి రోజుల తరబడి తిరగాల్సి వస్తోంది. ఇలా చిన్న చిన్న తప్పుల కారణంగా అర్హులైన వారికి కూడా తల్లికి వందనం డబ్బులు జమ కాలేదు. ఇంటి పేరున ఎవరికో ఇన్ కమ్ ట్యాక్స్ ఉందన్న నెపంతో అర్హుల జాబితాలో పేరు కనిపించకుండా పోయింది. పూర్తి స్థాయి విచారణ చేపట్టకుండా.. ఏడాది కిందట నుంచి పథకాన్ని అమలు చేస్తున్నామని చెబుతున్న కూటమి ప్రభుత్వం ముందుగానే అర్హుల జాబితా ఎందుకు బయట పెట్టలేదని ప్రశ్నిస్తున్నారు. తల్లికి వందనం లిస్టు తయారు చేసే ముందు అధికారులు లబ్ధిదారుల విషయంలో పూర్తిస్థాయి విచారణ చేపట్టకుండా నిర్లక్ష్యంగా పూర్తి చేయడంతో అర్హులైన వారు నేడు పలు రకాల తిప్పలు, ఇక్కట్లకు గురవుతున్నారు. మొదట అధికారులు సక్రమంగా విచారణ చేసి ఉంటే ఇలాంటి సమస్యలు ఉత్పన్నం అయ్యేవి కావన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి అధికారుల నిర్లక్ష్యమే ప్రధాన కారణం కావడంతో విద్యార్థుల తల్లిదండ్రులు పనులను వదిలిపెట్టి పలు కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. అర్హులమని సచివాలయం హెల్పేర్ అసిస్టెంట్లకు సర్టిఫికెట్స్ అందజేస్తున్నారు. ఈ సర్టిఫికెట్ ఆధారంగా వీరు అర్హులుగా చాలా మంది నమోదవుతున్నారు. తప్పు చేసిన అధికారులపై చర్యలేవి? మొదట అనర్హులుగా ఉన్న వారు వారి దిద్దుబాటుతో అర్హులుగా మారుతున్నారు. ఇలాంటి సమస్యలు ఎదురైన చోట ఉన్నత స్థాయి అధికారులు పర్యవేక్షించి గతంలో తప్పు చేసిన అధికారులపై చట్టపరమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. తప్పు చేసిన అధికారులను ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో ఉద్యోగుల్లో నిర్లక్ష్య భావం ఎక్కువ అవుతుందని మేధావులు అభిప్రాయపడుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఉన్నత ఆశయంతో చేపట్టే పథకాలు అధికారుల నిర్లక్ష్యంతో అర్హులకు అందకుండా పోతున్నాయి. ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలుకు అర్హుల జాబితా తయారీ సమయంలోనే క్షుణ్ణంగా పరిశీలిస్తే అర్హులకు ఇలాంటి ఇబ్బందులు తప్పవని అభిప్రాయపడుతున్నారు. ఏదేమైనా కూటమి పాలనలో సంక్షేమ పథకాల అమలు విషయంలో ఇటు అధికారులు, అటు ప్రజలకు ఇబ్బందులు తప్పడం లేదన్న విమర్శలు ఉన్నాయి. దివ్యాంగులకూ అందని దైన్యం ఈమె పేరు తూగు రమాదేవి. కురబలకోట మండలంలోని ఆంగళ్లు గ్రామం మొలకవారిపల్లె. ఈమె వికలాంగురాలు. చందన ఒక్కటే కుమార్తె. స్థానిక మొలకవారిపల్లె ప్రభుత్వ పాఠశాలలో నాలుగో తరగతి చదువుతోంది. తల్లికి వందనం రూ. 13 వేలు జమ అయి ఉంటుందని బ్యాంకుకు వెళ్లారు. ఇంత వరకు జమ కాలేదు. వీరికి సెంటు భూమి కూడా లేదు. ఏళ్లుగా బాడుగ ఇంటిలో కాలం వెల్లదీస్తున్నారు. వీరి కంటే ఆ ఊరిలో పేదవారు లేరు. ఈమె భర్త సాధారణ కూలీ. ఆపై ఇతను కూడా వికలాంగుడే. తల్లికి వందనంకు అన్ని అర్హతలు ఉన్నా బ్యాంకు ఖాతాకు డబ్బులు జమ కాకపోవడం విచిత్రంగా ఉంది. మన మిత్ర యాప్లో పరిశీలిస్తే ఈ పథకానికి అర్హులు కాదు అని వస్తోంది. అధికారులను అడిగితే తగిన స్పందన లేదు. ఇంటిలో ఎంత మంది పిల్లలున్నా ఇస్తామన్నారు. ఈమె వరకు చూస్తే ఉన్న ఒక్కరికి కూడా తల్లికి వందనం జమ కాలేదు. దీన్ని బట్టి ఈ పథకం ఎలా అమలు అవుతోందో అర్థం చేసుకోవచ్చని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేస్తోంది. ఒక పిల్లోడికి పడింది.. ఇంకో పిల్లోడికి పడలేదు నాపేరు మొక్కపల్లి కృష్ణమ్మ. మాది రాజంపేట. నాకు ఇద్దరు కొడుకులు. అయితే పదో తరగతి చదువుతున్న నా చిన్నకొడుకు సత్తయ్యకు తల్లికి వందనం పడింది. ఇంటర్మీడియెట్ రెండో సంవత్సరం చదువుతున్న రెడ్డయ్యకు పడలేదంట. మాకు తెలిసిన ఆయన సెల్ఫోన్లో చూసి చిన్నోడికి వచ్చినట్లు ఉంది, పెద్దోడికి రానట్లు ఉంది అని చెప్పినాడు. ఒక పిల్లోడికి వచ్చి, ఇంకో పిల్లోడికి రాకపోవడం అన్యాయం కదా సారు. జగన్ ప్రభుత్వంలో అమ్మఒడి ఒకేసారి ఇద్దరు పిల్లోళ్ళకు డబ్బులు పడేవి. మేము రజకులం. మా ఇంటాయన చనిపోయాడు. నేను రజక వృత్తి చేసుకొని పిల్లోళ్లను చదివించుకుంటూ కట్టం మీద బతుకుతున్నాము. ప్రభుత్వం చెప్పినట్లు ఎంతమంది ఉంటే అంత మందికి తల్లికివందనం డబ్బులు వేయాలి. భూమి లేకున్నా... ఉన్నట్లుగా..నా పేరు అవటాల సుగుణమ్మ, మాది రామాపురం మండలం నల్లగుట్టపల్లి పంచాయతీ. నా పేరున ఒక సెంటు భూమి లేదు. నా కుమారుడు రాయచోటిలో 7వ తరగతి చదువుతున్నాడు. ప్రభుత్వం నుంచి తల్లికి వందనం పథకానికి అనర్హుల జాబితాలో పేరు ఇచ్చారు. ఇదేమని తెలుసుకోవడానికి సచివాలయానికి వెళితే తన పేరున పది ఎకరాల భూమి ఉందని చెబుతున్నారు. పథకం డబ్బులు ఇవ్వకపోయినా ఫర్వాలేదు. నా పేరున ఉన్న పది ఎకరాల ఆస్తి ఎక్కడ ఉందో చూపిస్తే నేను అక్కడికి వెళ్లి వ్యవసాయం చేసుకుంటానని అడిగితే అధికారుల నుంచి సమాధానం లేదు. ఇదే విషయంపై రెవెన్యూ కార్యాలయానికి వెళ్లినా న్యాయం జరగలేదు. సుమో అమ్మినా ఉన్నట్లుగా చూపించారు నా పేరు నజ్మా, మదనపల్లె పట్టణం చంద్రకాలనీ. నా భర్త మస్సూర్ అలీఖాన్. డ్రైవర్గా పని చేస్తున్నాడు. మాది మధ్య తరగతి కుటుంబం. మాకు ఒక పాప, బాబు. పాప ఫర్హాజాన్. రెండో తరగతి చదువుతుంది. తల్లికి వందనం వస్తుందనే ఆశతో ప్రైవేటు స్కూలులో చేర్పించాం. తల్లికి వందనం లిస్టులో అనర్హత ఉందని వచ్చింది. మాకు రెండేళ్ల క్రితం సుమో ఉండేది. బాడుగలు సరిగా రాపోవడంతో అమ్మేశాం. ఈ విషయం తెలియజేసినా ఫోర్వీలర్ ఉందని వచ్చింది. సుమో లేదని చెప్పినా ఇలా చేశారు. ఇప్పుడు స్కూలులో ఫీజు కట్టమంటున్నారు. తల్లికి వందనం వస్తుందనుకుంటే ఇలా చేశారు. అరకొరగా అమలు ప్రభుత్వం తల్లికి వందనం పథకంలో భారీగా కోతలు విధించింది. అధికారులు చేసిన చిన్న తప్పులు అర్హుల పాలిట శాపంగా మారాయి. పథకం అమలులో ఎక్కడా రాజీలేదని ప్రభు త్వం చెబుతున్నా... క్షేత్ర స్థాయిలో చూస్తే పరిస్థితి భిన్నంగా కనిపిస్తోంది. అర్హత కలిగిన పేదలు, మధ్య తరగతి విద్యార్థుల తల్లిదండ్రులకు పథకం అందక దిక్కులు చూస్తున్నారు. ఒకానొక దశలో గత పాలనలో ఇచ్చిన హామీలు చేయకుండానే చేతులెత్తేసిన విధంగానే.. ఈ పాలనలో కూడా మాటలతో కాలం వెల్లదీయాలన్న ఆలోచనలకు ప్రతిపక్షం, ప్రజ లు గట్టిగా తిరగబడటంతో విధి లేని పరిస్థితులలో అరకొర పథకాలను అమలు చేసి చేతులు దులుపుకొనే ప్రయత్నానికి ఒడిగట్టిందన్న విమర్శలు ఉన్నాయి. ప్రతిపక్ష పార్టీ, ప్రజల వ్యతిరేకతను భరించలేక తల్లికి వందనం పథకాన్ని అమలు చేయడానికి సిద్ధమైంది. అర్హులకూ అందని ద్రాక్షలా పథకం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణ అధికారుల నుంచి అందని సహకారం పైసలు ఇవ్వందే పనులు కావడం లేదంటున్న బాధితులు కొత్త నిబంధనలు, అధికారులు చేసిన చిన్న చిన్న తప్పులు పథకాలకు ప్రజలను దూరం చేస్తోంది. ఇందులో భాగంగానే తల్లికి వందనంలో తల్లులకు తిప్పలు తప్పడం లేదు. జరిగిన తప్పులను సరిదిద్దుకోవడానికి, పెంచిన కరెంట్ బిల్లులు తగ్గించుకునేందుకు పిల్లల తల్లిదండ్రులు సచివాలయాలు, విద్యుత్, రెవెన్యూ, విద్యాశాఖ కార్యాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. ఇదే అదునుగా భావిస్తున్న కొంత మంది అధికారులు, సిబ్బంది పైసలు ఇవ్వందే పనులు పూర్తి చేయడం లేదన్న విమర్శలు ఉన్నాయి. కూటమి ప్రభుత్వం కూడా ఇదే అదునుగా భావించి పథకాల అమలులో సంఖ్య ఎంత తగ్గితే అంత మంచిదన్న భావనలో ఉంది. తల్లికి వందనం డబ్బులు విషయంపై అడగడానికి వెళ్లిన తల్లిదండ్రుల పైన బి.కొత్తకోట మండల పరిధిలో సచివాలయ వెల్ఫేర్ అధికారి దాడి చేసిన సంఘటన కూడా జిల్లాలో సంచలనం రేపింది. ఈ దాడి వెనుక అధికార పార్టీ నాయకుల హస్తం ఉన్నట్లు ప్రచారం జరుగుతోంది. -
మాజీ ముఖ్యమంత్రిని కలిసిన నేతలు
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు, ఎమ్మెల్సీ ఆర్. రమేష్ యాదవ్, వైఎస్సార్ జిల్లా బీసీ విభాగం అధ్యక్షుడు ఎన్. శివరామ్ కలిశారు. మంగళవారం విజయవాడలోని తాడేపల్లి క్యాంపు కార్యాలయంలో ఆయనను కలిసి పలు విషయాలను వివరించారు. ముఖ్యంగా జిల్లా బీసీ విభాగం చేపట్టిన కార్యక్రమాలు, భవిష్యత్లో రాష్ట్ర పార్టీ ఆదేశానుసారం జిల్లా పార్టీ అధ్యక్షుల ఆధ్వర్యంలో జిల్లా బీసీ విభాగం ఎలా పనిచేస్తుందో విధి విధానాల గురించి వివరించారు. దీనిపై వైఎస్ జగన్మోహన్ రెడ్డి స్పందిస్తూ మీలాంటి వారికి పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని కూటమి ప్రభుత్వం బీసీలకు ఇచ్చిన మోస పూరిత హామీలపై ప్రజల పక్షాన పోరాడాలని సూచించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ను కలిసిన ఎన్ఆర్ఐలు కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని గల్ఫ్ ఎన్ఆర్ఐలు కలిశారు. మంగళవారం తాడేపల్లిలోని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయంలో వారు ఆయనను కలిసి ప్రవాసాంఽధ్రుల సమస్యలను ఆయన దృష్టికి తెచ్చారు. ఇరాన్, ఇజ్రాయెల్ మధ్య యుద్ధం జరుగుతున్న నేపథ్యంలో అక్కడ ఉన్న మన తెలుగువారు జాగ్రత్తలు తీసుకోవాలని, భారత ప్రభుత్వ ఆదేశాలను అనుసరించాలని కోరుతూ వైఎస్సార్సీపీ సోషల్ మీడియా ద్వారా సందేశం ఇవ్వాలని వారికి సూచించారు. వైఎస్ జగన్ను కలిసిన వారిలో ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ ఏ. సాంబశివారెడ్డి, గల్ఫ్ కన్వీనర్ బీహెచ్ ఇలియాస్, కువైట్ ఐటీ ఇన్చార్జి షేక్ అఫ్సర్ అలీ, బీసీ సభ్యుడు నరసింహ యాదవ్, మైనార్టీ సభ్యుడు షేక్ నాసర్, ఖతార్ మైనార్టీ ఇన్చార్జి షేక్ దర్బార్ తదితరులు ఉన్నారు. -
రెండు బైకులు ఢీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్టలోని కడప–చైన్నె జాతీయ రహదారిలో రెండు బైకులు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. పోలీసుల క నం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కర్నూలు జిల్లా, మంత్రాలయం నుండి కడప వైపు వెళ్తున్న ఏపీ40హెచ్5631 నెంబరుగల బైకు ఒంటిమిట్టలోని కోదండరామస్వామి కల్యాణ వేదిక మొదటి గేటు వద్ద ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారి దగ్గరకు రాగానే కల్యాణ వేదిక ఎదురుగా పంచర్ షాపు నుండి ఏపీ 40బిఒ6680 నెంబరుగల బైకు అకస్మాత్తుగా రావడంతో ఎదురెదురుగా ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో మంత్రాలయానికి చెందిన సంపత్, ప్రకాష్ (24) అనే ఇద్దరు యువకులకు గాయాలయ్యాయి. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు 108కి సమాచారం ఇచ్చారు. హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది గాయపడిన వారిని అదే వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. అక్కడ గాయపడిన వారిలో సంపత్ రిమ్స్ నుంచి చెప్పాపెట్టకుండా వెళ్లిపోయాడని, కానీ అక్కడ ఉన్న ప్రకాష్ పరిస్థితి కాస్త విషమంగా ఉందని పోలీసులు తెలిపారు. కుటుంబ సమస్యలతో ఇద్దరి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో కుటుంబ సమస్యల కారణంగా ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుర్రంకొండ మండలం చెర్లోపల్లి గ్రామానికి చెందిన బాలాజీ భా ర్య శ్రీదేవి (28) కుటుంబ సమస్యల కారణంగా విషద్రావణం తాగింది. ఆమె భర్త మూడేళ్ల క్రితం మృతి చెందగా ఇద్దరు పిల్లలతో కలిసి అత్తవారి ఇంట్లో ఉంటోంది. అత్తతో మనస్పర్థలు ఏర్పడి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మదనపల్లె మండలం తట్టివారిపల్లె పంచాయతీ గోవర్థన్ నగర్కు చెందిన నాయక్ భార్య లక్ష్మి (30) కుటుంబ సమస్యల కారణంగా సోమవారం రాత్రి ఇంట్లోనే ఉరివేసుకుంది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీదేవిని తిరుపతికి రెఫర్ చేయగా, లక్ష్మిని కుటుంబ సభ్యులు పట్టణంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.సృజన ఆత్మహత్యకు కారణాలు వెల్లడించాలిరాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ పరిధిలోని మిట్టవాండ్లపల్లెకు చెందిన సృజన ఆత్మహత్యకు గల కారణాలు పోలీసులు వెల్లడించాలని సీపీఎం నాయకులు డిమాండ్ చేశారు, మంగళవారం మృతురాలి కుటుంబ సభ్యులను పరామర్శించారు. కార్యక్రమంలో సీపీఎం నాయకులు రామాంజులు, రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అతిగారిపల్లిలో వినాయక విగ్రహం అపహరణ
పెనగలూరు : మండలంలోని అతిగారిపల్లి బీసీ కాలనీ వద్ద పురాతన కాలం నాటి వినాయక విగ్రహాన్ని సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. బీసీ కాలనీ ఇంగ్లీషు మీడియం స్కూల్ మధ్యలో ఈ వినాయక విగ్రహం పురాతన కాలం నాటిదన్నారు. రోజూ భక్తులు అక్కడ పూజలు చేసేవారని తెలిపారు. త్వరలో ఇక్కడ ఆలయాన్ని నిర్మించాలని చందాలు కూడా వసూలు చేస్తున్నట్లు తెలిసింది. ఈ తరుణంలో రాత్రి వేళలో విగ్రహాన్ని అపహరించారు. ఈ విగ్రహాన్ని జడవారిపల్లి రూటు వరకు ఈడ్చుకొని వెళ్లి అక్కడి నుంచి వాహనంలో తీసుకెళ్లినట్లు ఆనవాళ్లు కనిపిస్తున్నాయి. ఈ విగ్రహం చోరీపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. మహిళ ఆత్మహత్య సిద్దవటం : మండలంలోని మాధరవం–1 గ్రామ పంచాయతీ వెంకటేశ్వరపురం గ్రామానికి చెందిన నందం జయలక్ష్మి(27) అనే మహిళ మంగళవారం ఫ్యానుకు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకుంది. భర్త నరసింహులు మాట్లాడుతూ తన భార్యకు మతిస్థిమితం లేదని కడప, తిరుపతి వైద్యశాలలో వైద్యం చేయించామన్నారు. తనకు ఐదేళ్ల కుమారుడు పెంచల్రామ్ ఉన్నాడని, ఈ అబ్బాయి తల్లిలేని బిడ్డగా మిగిలిపోయాడని బోరున విలపించాడు. ఈ విషయమై ఎస్ఐ మహమ్మద్రఫీ మాట్లాడుతూ మృతురాలి తండ్రి సుబ్రమణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో కడప జట్టు ఘన విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లో మంగళవారం మూడో రోజు కడప జట్టు చిత్తూరు జట్టుపై ఘన విజయం సాధించింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెండు వికెట్లు కోల్పోయి 12 పరుగుల ఓవర్ నైట్ స్కోర్తో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 30.4 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 142 పరుగులు చేసింది. దీంతో 329 పరుగులతో కడప జట్టు ఘన విజయం సాధించింది. చిత్తూరు జట్టులోని సోహన్రెడ్డి 47, సాయి చరణ్ 30 పరుగులు చేశారు. కడప జట్టులోని నాగకుళ్లాయప్ప 5 వికెట్లు, చరణ్ 4 వికెట్లు తీశారు. కాగా తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 399 పరుగులు చేయగా చిత్తూరు 97 పరుగులకు ఆలౌట్ అయింది. కడప జట్టు రెండో ఇన్నింగ్స్లో 169 పరుగులు చేసిన విషయం తెలిసిందే. డ్రాగా ముగిసిన నెల్లూరు–కర్నూలు మ్యాచ్ వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన నెల్లూరు–కర్నూలు మ్యాచ్ డ్రాగా ముగిసింది. మంగళవారం మూడో రోజు రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 78.2 ఓవర్లలో 9 వికెట్లు కోల్పోయి 415 పరుగులకు డిక్లేర్ చేసింది. ఆ జట్టులోని తోషిత్ యాదవ్ 155 బంతుల్లో 170 పరుగులు, మన్విత్రెడ్డి 106 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని నౌషన్ కళ్యాణ్ 3 వికెట్లు, మల్లికార్జున 2 వికెట్లు, విఖ్యాత్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 9 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 59 పరుగులు చేసింది. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. కాగా తొలి ఇన్నింగ్స్లో నెల్లూరు జట్టు 464 పరుగులు చేయగా కర్నూలు జట్టు 171 పరుగులకు ఆలౌట్ అయిన విషయం తెలిసిందే. -
ఆమోదం లేదు.. జీతాలు లేవు!
మదనపల్లె: సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ అయిన మదనపల్లెలో పారిశుధ్య పనుల నిర్వహణ కోసం అధికారులు నియమించుకున్న 80 మంది దినసరి పారిశుధ్య కార్మికుల నియామకం ప్రభుత్వ ఆమోదం మేరకు జరగలేదని స్పష్టం అవుతోంది. కోవిడ్–19 కోసం గత ప్రభుత్వం కార్మికులను నియమించుకునేందుకు అనుమతి ఇచ్చి తర్వాత ఆ వ్యవస్థను ఆపేసింది. అయితే 2024 జూలైలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన ఓ మెమో ఆధారంగా మున్సిపాలిటీల్లో దినసరి పారిశుధ్య కార్మికులను నియమించుకోగా చాలా చోట్ల ప్రభుత్వం నుంచి నియామక అనుమతులు ఉన్నాయా లేవా అన్న పరిశీలన లేకనే వేతనాలు మంజూరు చేస్తున్నారన్న అంశం చర్చనీయాంశమైంది. అయితే మదనపల్లె మున్సిపాలిటీకి సంబంధించి ప్రీ ఆడిట్లో ఈ విషయాన్ని పసిగట్టడంతో ఏ మున్సిపాలిటీలోనూ జరగని విధంగా వేతనాలకు బ్రేక్ పడింది. మిగతా మున్సిపాలిటీల్లో వేతనాలు ఇస్తున్నప్పుడు మదనపల్లెకు ఎందుకు చెల్లించరు అన్న వాదన ఉన్నప్పటికి తిరుపతి జిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటీలో కార్మికులను తొలించిన విషయాన్ని ఉదహరిస్తున్నారు. మెమో ఆధారంగా నియామకం మదనపల్లె మున్సిపాలిటీలో 80 మంది పారిశుధ్య దినసరి కార్మికులను ప్రభుత్వం జారీ చేసిన మెమో ఆధారంగా అధికారులు నియమించుకొన్నట్టు తెలుస్తోంది. మెమోలో మూడు అంశాలను సూచించారు. సంస్థల ద్వారా కార్మికులను నియమించుకోవడం, వారికి రూ15వేల వేతనం మున్సిపల్ సాధారణ నిధుల నుంచి చెల్లించడం, పారిశుధ్య పనులను కాంట్రాక్ట్ సంస్థలకు అప్పగించి యాంత్రీకరణ చర్యలు తీసుకోవడం. దీంతో కార్మికులను నియమించుకునే వెసులుబాటు మెమోలో ఉన్నప్పటికి తర్వాత ఈ మెమోపై మున్సిపల్శాఖ నుంచి మార్గదర్శకాలు జారీ కాలేదని అభ్యంతరం. ప్రభుత్వం నుంచి డీఎంఏకి ఈ మెమో జారీ అయ్యింది కాని డీఎంఏ నుంచి ఎలాంటి ఉత్తర్వు లేదన్నది ప్రీ ఆడిట్ వాదన. ఈ విషయం పక్కన పెడితే పారిశుధ్య కార్మికులను నియమించుకున్నాక ప్రభుత్వ ఆమోదం కూడా పొందలేదు. దీంతో కార్మికుల నియామకం, వేతనాల చెల్లింపు సాధ్యపడదని ప్రీ ఆడిట్ లేవనెత్తిన ప్రశ్నలు. లేఖలకు లభించని ఆమోదం దినసరి పారిశుధ్య కార్మికుల వేతనాల చెల్లింపునకు 2024 డిసెంబర్ వరకు ప్రీ ఆడిట్ అభ్యంతరాలు లేవు. అంతకుముందు వేతనాల కోసం పంపిన బిల్లులు పంపినట్టుగా మంజూరవుతూ వచ్చాయి. తర్వాత ఆభ్యంతరం వ్యక్తం కావడం, నియామక అనుమతుల విషయంపై ప్రీ ఆడిట్ కోరడంతో సమస్య వెలుగులోకి వచ్చింది. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటిదాకా వేతనాలు పెండింగ్లో ఉండిపోయాయి. ఈ పరిస్థితుల్లో నియమించుకున్న పారిశుధ్య కార్మికులకు ఆమోదం తెలపాలని కోరుతూ మున్సిపల్ అధికారులు ఒకటికి మూడుసార్లు ప్రభుత్వానికి లేఖలు రాశారు. ఈ లేఖలపై ఇప్పటికి స్పందన లేదని తెలిసింది. ● ప్రీ ఆడిట్ నాయక్ బదిలీ కావడంతో ఆయన స్థానంలో హిమేష్ నియమితులయ్యారు. దీంతో అందరూ ఆయన నిర్ణయం కోసం ఆశలు పెట్టుకున్నారు. తాజాగా మదనపల్లె మున్సిపాలిటి దినసరి పారిశుద్ద్య కార్మికులకు వేతనం మంజూరు చేయాలని అధికారులు బిల్లులు పెట్టారని సమాచారం. కొత్త ప్రీ ఆడిట్ వేతనాల మంజూరుకు మిగిలిన మున్సిపాలిటీల పద్దతిని పరిగణలోకి తీసుకుని ఆమోదం తెలుపుతారా లేదా అన్నది ఉత్కంఠ నెలకొంది. శ్రీకాళహస్తి తరహా నిర్ణయమే పరిష్కారం రాష్ట్రమంతా దినసరి పారిశుధ్య కార్మికులను నియమించుకున్నారు..మేం కూడా నియమించామని మదనపల్లె మున్సిపల్ కమిషనర్ చెబుతుండగా..తిరుపతిజిల్లా శ్రీకాళహస్తి మున్సిపాలిటి అంశాన్ని ఆడిట్ వర్గాలు తెరపైకి తెస్తున్నారు. కోవిడ్–19 కోసం నియమించుకున్న కార్మికులను కొనసాగిస్తుండగా గత ఏడాది నవంబర్లో ప్రీ ఆడిట్లో వారి నియామకంపై సందేహాలు వ్యక్తం చేస్తూ 25 మంది కార్మికుల వేతనాలను నిలిపివేశారు. తర్వాత మున్సిపల్ కమిషనర్..కార్మికులు పనిచేసిన కాలానికి వేతనాలు మంజూరు చేయాలని, దీనిపై వ్యక్తమయ్యే ఏ అభ్యంతరానికై నా బాధ్యత వహిస్తామని కమిషనర్ ఇచ్చిన లేఖతో వేతనాలు మంజూరు చేయగా..తర్వాత కార్మికులను విధుల నుంచి తొలగించారు. ఇప్పుడు మదనపల్లె విషయంలోనూ శ్రీకాళహస్తి తరహాలో తీవ్ర ఇబ్బందులు పడుతున్న మదనపల్లె కార్మికులకు వేతనాలు చెల్లించాక..వారి విధులపై తదుపరి నిర్ణయం తీసుకునే అవకాశం కమిషనర్కు కల్పిస్తే రెండువైపులా సమస్యకు పరిష్కారం లభిస్తుంది. లేదంటే కార్మికులకు తీవ్రంగా నష్టపోవాల్సిన పరిస్థితి వస్తుంది. మదనపల్లె మున్సిపాలిటీలో 80 మంది పారిశుధ్యకార్మికుల వ్యవహారం.. లేఖలపై ఆమోదం తెలపని ప్రభుత్వం వేతనాల మంజూరుకు బిల్లులు పంపిన అధికారులు కొత్త ప్రీ ఆడిట్ నిర్ణయంపైనే ఆశలు ఆమోదంతోనే నియామకం ప్రభుత్వ ఉత్తర్వు మేరకే పారిశుధ్య కార్మికులను నియమించుకుని పనులు చేయిస్తున్నాం. వారికి నెలవేతనం రూ.15వేలు చెల్లించే అంశం ప్రభుత్వ మెమోలోనే ఉంది. దీనికి మున్సిపల్ కౌన్సిల్ కూడా ఆమోదం తెలిపింది. అయితే ప్రీ ఆడిట్లో అభ్యంతరం పెట్టి వేతనాలు నిలిపివేశారు. నియామకం అంతా నిబంధనల ప్రకారమే జరిగింది. పనులు చేసిన పారిశుధ్య కార్మికులకు వేతనాలు చెల్లించి న్యాయం చేసేందుకు కృషి చేస్తున్నాం. –ప్రమీల, మదనపల్లె కమీషనర్ -
సంక్షేమ పథకాలు వర్తింపచేయాలి
రాయచోటి: అంగన్వాడీలందరికీ సంక్షేమ పథకాలు వర్తింపజేయాలని డిమాండ్ చేస్తూ సోమవారం రాయచోటిలోని కలెక్టరేట్ ఎదుట సీఐటీయూ ఆధ్వర్యంలో అంగన్ వాడీ ఉద్యోగులు పెద్దఎత్తున ధర్నా నిర్వహించారు.ధర్నా అనంతరం కలెక్టరేట్ డీఆర్ఓ మధుసూదన్ రావుకు వినతిపత్రం సమర్పించారు. అనంతరం జిల్లా అధ్యక్షురాలు శ్రీలక్ష్మీ, కార్యదర్శి రాజేశ్వరీ, వర్కింగ్ ప్రెసిడెంట్ భాగ్యలక్ష్మీలు మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి సంవత్సరం దాటినా అంగన్వాడీల జీవితాల్లో మార్పు రాలేదన్నారు. ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయకుండా కాలయాపన చేయడం తగదన్నారు. ముఖ్యంగా సమ్మె కాలపు హామీలు అమలు చేయలేదన్నారు. తక్కువ వేతనంతో జీవనం సాగిస్తున్న వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేయకపోవడం దారుణమన్నారు. ఎఫ్ఆర్ఎస్ యాప్ రద్దు చేసి పనిభారం తగ్గించాలని అన్నారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం గ్రాట్యుటీ అమలు చేయాలని వారు డిమాండ్ చేశారు. హామీలు తప్ప అమలు లేదు.. ఎన్నికల సమయంలో అంగన్వాడీ వర్కర్లకు, ఉద్యోగులకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు శ్రీనివాసులు ఆరోపించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు విజన్–2047 పేరుతో ఆంధ్ర ప్రదేశ్ను స్వర్ణాంధ్ర ప్రదేశ్గా మారుస్తానని చెబుతున్న మాటలు బూటకంగా మారాయన్నారు. అంగన్ వాడీలను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలన్నారు.లక్కిరెడ్డిపల్లి డివిజన్ పరిధిలో సిబ్బందికి జీతాలు రాలేదన్నారు.సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎ రామాంజులు మాట్లాడుతూ గ్రాట్యుటీ అమలు,కనీస వేతనం రూ. 26 వేల కోసం జూలై 9న జరిగే దేశ వ్యాప్త సమ్మెను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. అనంతరం డీఆర్ఓ సమక్షంలో పీడితో జరిగిన సమీక్షా సమావేశంలో అంగన్ వాడీ సమస్యలన్నీ పరిష్కారం చేస్తామని హామీ ఇచ్చారు.ఈ కార్యక్రమంలో జిల్లా నాయకులు సుకుమారి, మధురవాణి, ఈశ్వరమ్మ, విజయ, భూకై లేశ్వరీ, ఓబుళమ్మ, కుమారి, చంద్రావతి, ప్రభావతి తదితరులు పాల్గొన్నారు. కల్టెరేట్ ఎదుట అంగన్వాడీల ధర్నా -
ద్విచక్రవాహనాల దొంగను అరెస్ట్ చేసిన కర్ణాటక పోలీసులు
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాల చోరీకి పాల్పడిన దొంగను సోమవారం మదనపల్లెలో కర్ణాటక పోలీసులు అరెస్ట్ చేసి, 25 ద్విచక్రవాహనాలను స్వాధీనం చేసుకుని కర్ణాటకకు తరలించారు. పట్టణానికి చెందిన హేమంత్(24) బెంగళూరులోని హెచ్ఏఎల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ద్విచక్రవాహనాలు చోరీచేసి మదనపల్లెలో తలదాచుకున్నాడు. ద్విచక్రవాహనాల చోరీపై కేసుల విచారణలో భాగంగా కర్ణాటక పోలీసులు సాంకేతిక ఆధారాల సహాయంతో నిందితుడు మదనపల్లెలో ఉన్నట్లు నిర్ధారించుకుని సోమవారం హెచ్ఏఎల్ స్టేషన్ ఎస్ఐ దామయ్య ఆధ్వర్యంలో పోలీస్ సిబ్బంది వచ్చి నిందితుడు హేమంత్ను అదుపులోకి తీసుకున్నారు. విచారణలో చోరీ చేసిన వాహనాలు మదనపల్లెలో 10, చౌడేపల్లె మండలం బోయకొండ వద్ద 15 దాచి పెట్టినట్లు చెప్పడంతో వాటిని స్వాధీనం చేసుకున్నారు. వాహనాలను వన్టౌన్ పోలీస్ స్టేషన్ నుంచి లారీలో ఎక్కించి నిందితుడితో పాటు కర్ణాటకకు తరలించారు. -
కూటమి పాలనలో ఒరిగింది శూన్యం
మదనపల్లె రూరల్ : కూటమి ప్రభుత్వం ఏడాది పాలనలో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య అన్నారు. అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధికి రూ.10వేల కోట్లు నిధులు కేటాయించాలని, జిల్లాలోని సమస్యలు పరిష్కరించాలని సీపీఐ ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లె సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసన తెలిపారు. కార్యక్రమంలో సీపీఐ, కాంగ్రెస్, బహుజనసేన నాయకులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా జి.ఈశ్వరయ్య మాట్లాడుతూ మదనపల్లె పట్టణ ప్రజల దాహార్తి తీర్చేందుకు నిర్మించిన చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్స్టోరేజీ ట్యాంకు మొరవ పనులు మాత్రమే పెండింగ్లో ఉన్నాయని, రూ.15 కోట్లు కేటాయిస్తే పనులు పూర్తవుతాయన్నారు. మదనపల్లె పరిసర ప్రాంతాల్లో టమాటా ఆధారిత పరిశ్రమలు నెలకొల్పితే రైతాంగానికి కనీసం గిట్టుబాటు ధర లభిస్తుందన్నారు. రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్ట్లను పూర్తిచేయకుండా గోదావరి నది బనకచర్ల నుంచి నీళ్లు తెస్తామని చెప్పడం హాస్యాస్పదమన్నారు. కడప నుంచి మదనపల్లె మీదుగా బెంగళూరుకు రైల్వే లైను నిర్మాణ పనులు తక్షణమే ప్రారంభించాలన్నారు. కాంగ్రెస్ పార్టీ నాయకులు రెడ్డిసాహెబ్, బహుజనసేన శ్రీచందు మాట్లాడారు. కార్యక్రమంలో సీపీఐ నాయకులు కృష్ణప్ప, మనోహర్రెడ్డి, సాంబశివ, మురళీ, కాంగ్రెస్పార్టీ నాయకులు ఎస్.కే.బాషా, మహమ్మద్ షరీఫ్, ఖాదర్బాషా, ఈశ్వరమ్మ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు జి.ఈశ్వరయ్య -
మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల నిరసన
రాయచోటి జగదాంబసెంటర్ : ఏళ్ల తరబడి పనిచేసినా మున్సిపల్ ఇంజనీరింగ్ కార్మికుల జీవితాలలో మార్పు లేదని కూటమి ప్రభుత్వం స్పందించి జీఓ 36 అమలు చేయాలని ఏపీ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎ.రామాంజులు డిమాండ్ చేశారు. సోమవారం రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి కలెక్టరేట్ ఎదుట వారు ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పారిశుధ్య కార్మికులతో పాటు రూ.21 వేలు వేతనం ఇవ్వాలన్నారు. వయో పరిమితి 62 సంవత్సరాలకు పెంచి ఆప్కాస్ కొనసాగించాలని లేదా పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని డీఆర్ఓ మధుసూదనరావుకు అందజేశారు. ఈ కార్యక్రమంలో వాటర్ సెక్షన్ అధ్యక్షుడు అక్బర్, ఇంజినీరింగ్ కార్మికులు దేవా, రమేష్, శ్రీనివాసులు, వెంకటేశ్వర్లు, వెంకటలక్ష్మీ, మౌనిక, రమణ తదితరులు పాల్గొన్నారు. -
ఫిర్యాదుల పరిష్కారంలో అలసత్వం తగదు
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా అందిన ఫిర్యాదుల పట్ల అలసత్వం వహించరాదని పోలీసు యంత్రాంగాన్ని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి ఆదేశించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఎీస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదుదారుల నుంచి అర్జీలను స్వీకరించి, అర్జీదారులతో అదనపు ఎస్పీ ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ప్రజల సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వర న్యాయం అందించేలా కృషి చేయాలన్నారు.జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి -
జీఓ నంబర్ 5ను రద్దు చేయాలని సచివాలయ ఉద్యోగుల నిరసన
రాయచోటి : గ్రామ, వార్డు సచివాలయ ఉద్యోగుల బదిలీలు, రేషనలైజేషన్ కోసం విడుదల చేసిన జీఓ నంబర్ 5ను రద్దు చేయాలంటూ సచివాలయ ఉద్యోగులు నిరసన తెలిపారు. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్లో భోజన విరామ సమయంలో నిరసన తెలియజేసి అనంతరం డీఆర్ఓ మధుసూదన్ రావుకు వినతి పత్రం ఇచ్చారు. కలెక్టర్ కార్యాలయం ఎదుట గ్రామవార్డు, సచివాలయం ఎంప్లాయిస్ సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు గుడి నాగరాజు మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకొచ్చిన జీఓల వలన సచివాలయ ఉద్యోగులకు ఇబ్బందిగా మారిందన్నారు. ఈ జీఓను తక్షణమే ప్రభుత్వం రద్దు చేయాలని కోరారు. సొంత మండలం, మున్సిపాల్టీలలోనే పోస్టింగ్స్ ఇవ్వాలని, రేషనలైజేషన్ ప్రక్రియ చేసిన తరువాతనే బదిలీలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సచివాలయ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు వినోద్ కుమార్, ఏపీఎన్జీఓ సంఘం తాలుకా ఉపాధ్యక్షులు హరి ప్రసాద్, లక్ష్మీ ప్రస్న, జీనత్, వేణు, యుగంధర్, అధిక సంఖ్యలో సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
ఢిల్లీలో కీర్తి ప్రతిష్టలు చాటిన తంబళ్లపల్లె విద్యార్థిని
తంబళ్లపల్లె: రాజకీయరంగంలో టీఎన్ విశ్వనాథరెడ్డి 1962లో రాజంపేట ఎంపీగా ఏకగ్రీవంగా ఎన్నికై అప్పటి ప్రధాని జవహలాల్ నెహ్రూ చేతుల మీదుగా పార్లమెంట్ భవనంలో సత్కారాలు అందుకుని తంబళ్లపల్లె పేరు ప్రతిష్టలను చాటారు. నేడు విద్యారంగంలో మరో మారు పల్లెటూరి విద్యార్థిని తేజస్విని సీఎంఏలో ఆలిండియా మొదటి ర్యాంకు సాధించి భారత రాష్ట్రపతి దౌప్రది ముర్ము చేతుల మీదుగా సర్టిఫికెట్, మెడల్స్ అందుకుని తంబళ్లపల్లె పేరు నిలిపింది. తంబళ్లపల్లె మండలం కన్నెమడుగుకు చెందిన కె.రఘరామిరెడ్డి, నాగవేణి దంపతుల కుమార్తె తేజస్విని చిన్న తనం నుంచి చదువులో ప్రతిభ చాటుతూ జూన్ 2024 విడుదలైన సీఎంఎ పరీక్షల్లో ఆలిండియా మొదటి స్థానంలో నిలిచింది. వ్యవసాయ కుటుంబంలో పుట్టి రోజువారి తల్లిదండ్రుల కష్టాన్ని గుర్తించి పట్టుదలతో చదివింది.అనుకున్న లక్ష్యాన్ని సాధించింది. ఢిల్లీలోని విజ్ఞాన భవన్లో సోమవారం జరిగిన కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము చేతుల మీదుగా మెడల్, సర్టిఫికెట్ అందుకుంది. సీఏ ఫైనల్ ఫలితాల్లో ఆలిండియాలో 14 ర్యాంకు దక్కించుకోవడం గమనార్హం. రాష్ట్రపతి చేతుల మీదుగా సర్టిఫికెట్ అందజేత -
అనారోగ్యం భరించలేక ఆత్మహత్య
గాలివీడు : అనారోగ్యంతో మనస్తాపం చెందిన కలపల గోవిందాచారి(59) విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలో జరిగింది. ఎస్ఐ రామకృష్ణ కథనం మేరకు కొర్లకుంట గ్రామం కుమ్మరపల్లెకు చెందిన గోవిందాచారి కొన్ని సంవత్సరాలుగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఈక్రమంలో ఆయన ఆరోగ్యం మరింత క్షీణించింది. దీంతో ఈనెల 19 వ తేదీన విష ద్రావణం తాగాడు. కొన ఊపిరితో ఉన్న అతన్ని కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు ఎస్ఐ రామకృష్ణ తెలిపారు. మృతునికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. బస్సు ఎక్కుతుండగా బంగారు నగలు చోరీజమ్మలమడుగు రూరల్ : పట్టణంలోని పాతబస్టాండ్లో ప్రయాణికురాలి బ్యాగ్ నుంచి 6 తులాల బంగారు చోరీ జరిగినట్లు ఎస్ఐ హైమావతి తెలిపారు. కొండాపురం మండలం తాళ్ల ప్రొద్దుటూరు గ్రామానికి చెందిన ప్రవళ్లిక తన భర్తతో కలసి స్వగ్రామమైన పెద్దముడియం మండలం జంగాలపల్లె గ్రామానికి వెళ్లేందుకు జమ్మలమడుగు బస్టాండ్కు వచ్చింది. కొద్ది సేపటికి బస్సు రావడంతో హ్యాండ్ బ్యాగ్ తీసుకుని భర్తతో కలసి బస్సు ఎక్కింది. కాసేపటి తర్వాత బ్యాగ్ చూసుకోగా అందులో బంగారు నగలు ఉన్న చిన్న బ్యాగ్ కనిపించలేదు. వెంటనే భర్తతో కలసి జమ్మలమడుగు పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసింది. -
గాయపడిన వ్యక్తి మృతి
కలకడ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందినట్లు హెడ్ కానిస్టేబుల్ రమేష్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ మండలం, కె.బాటవారిపల్లె పంచాయతీ కలకడ మాదిగపల్లెకు చెందిన వెంకట్రమణ(70) తన ద్విచక్రవాహనం లో 17వతేదీన కలకడనుంచి స్వగ్రామానికి చేరుకుంటున్న చేరుకుంటున్న సమయంలో కలకడ జగనన్న కాలనీ వద్ద ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో రక్తగాయాలయ్యాయి. ఈ ప్రమాదంలో గాయపడిన వెంకట్రమణను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడినుంచి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు మృతుని చిన్న భార్య రెడ్డెమ్మ సోమవారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు హెడ్కానిస్టేబుల్ రమేష్ కేసు నమోదు చేశారు. మృతుడికి ఇద్దరు భార్యలు, ఒక కుమారుడు, ఒక కుమార్తె ఉన్నారు. మహిళ మెడలో గొలుసు చోరీమదనపల్లె రూరల్ : ఆటో కోసం వేచి చూస్తున్న మహిళ మెడలోని గొలుసును గుర్తుతెలియని వ్యక్తి చోరీచేసిన ఘటన సోమవారం మదనపల్లెలో జరిగింది. బీటీ కళాశాలలో తెలుగు అధ్యాపకురాలిగా పనిచేసి పదవీ విరమణ పొందిన నరసింహారెడ్డి భార్య సత్య (65) పట్టణంలోని సొసైటీకాలనీలో నివసిస్తోంది. సోమవారం వ్యక్తిగత అవసరాల నిమిత్తం షాపింగ్కు వెళ్లేందుకు స్థానిక రామాలయం వద్దకు వచ్చి ఆటో కోసం వేచి చూస్తుండగా, ద్విచక్రవాహనంలో వచ్చిన గుర్తు తెలియని వ్యక్తి ఆమె మెడలోని బంగారు గొలుసును లాక్కుని క్షణాల్లో పరారయ్యాడు. ఆమె తేరుకునేలోపు కనిపించకుండా పోయాడు. దీంతో బాధితురాలు వన్టౌన్ పోలీస్స్టేషన్లో బంగారు గొలుసు చోరీపై ఫిర్యాదు చేసింది. గొలుసు 32 గ్రాముల బరువు కలిగి సుమారు రూ.2లక్షలు విలువ ఉంటుందని ఫిర్యాదులో పేర్కొంది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎరీషావలీ తెలిపారు. -
ఊసే లేని ఫీజు రీయింబర్స్మెంట్
కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలను విడుదల చేయలేదు.విద్యాదీవెన,వసతి దీవెన నిధుల కోసం విద్యార్థులు ఏడాదిగా ఎదురు చూస్తున్నారు.గత వైఎస్సార్ సీపీ పాలనలో త్రైమాసికం ముగిసిన వెంటనే పూర్తి ఫీజు రీఎంబర్స్ మెంట్ మంజూరు చేసేవారు.కానీ ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. విద్యార్థులు అప్పులు చేసుకుని చదువుకుంటున్నారు. – జంగంరెడ్డి కిషోర్ దాస్, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు యువతను మోసం చేసిన ఘనత చంద్రబాబుదే నిరుద్యోగులకు 20లక్షల ఉద్యోగాలు ఇప్పిస్తామని చెప్పి ఉద్యోగాలు ఇవ్వ లేదు సరికదా ఉన్న ఉద్యో గాలు ఊడపీకుతూ నిరుద్యోగులను నిలువునా ముంచారు. అధికారంలోకి వస్తే నెలకు రూ.3,000 నిరుద్యోగ భతి ఇస్తామని నమ్మిం చి ఇవ్వకుండా ఎగనామం పెట్టారు. ఈ కూటమి ప్రభుత్వం గత ఏడాది కా లంగా విద్యార్థులను, యువతను మోసం చేస్తున్న వైనాన్ని నిలదీస్తున్నాం. తక్షణమే కూటమి ప్రభుత్వం హామీలను అమలు చేయాలి. – శివప్రసాద్ రెడ్డి, జిల్లా యువజన విభాగం అధ్యక్షుడు నిరుద్యోగుల ప్రస్తావనే లేదు ప్రభుత్వం ఏర్పడి ఏడాది గడుస్తున్నా నిరుద్యోగుల ప్రస్తావన లేదు. నిరు ద్యోగ భృతి హామీ అయితే ఇచ్చారు గానీ అమలుపై ఆసక్తి చూపడంలేదు. అసలు నిరుద్యోగభృతి అమలు చేసే ఉద్దేశం ఈ ప్రభుత్వానికి ఉందా? లేకుంటే ఎప్పటిలానే యూటర్న్ తీసుకుంటారా? అర్థం కావడంలేదు. –హరిప్రసాద్రెడ్డి, వైఎస్ఆర్ సీపీ ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ -
జిల్లా సమగ్రాభివృద్ధికి నిధులు కేటాయించాలి
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా సమగ్రాభివృద్ధి కోసం రాష్ట్ర ప్రభుత్వం రూ. 10 వేల కోట్లు నిధులు కేటాయించాలని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్ నరసింహులు డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ రాయచోటి నియోజక వర్గం కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ హంద్రీ నీవా కాలువ పనులు వెంటనే పూర్తి చేయాలన్నారు. వెలిగల్లు ప్రాజెక్టు, శ్రీనివాస రిజర్వాయర్, ఝరికోన కాలువ పనులు పూర్తి చేసి రైతులకు తాగునీరు, సాగునీరు అందించాలని కోరారు. పీలేరు కార్యదర్శి వెంకటేష్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి, సీపీఐ పట్టణ కార్యదర్శి జగన్ బాబు, రైతు సంఘం నియోజక వర్గం అధ్యక్షుడు హరినాథ నాయుడు, అంజాద్ అలీఖాన్ పాల్గొన్నారు. -
ఎల్లో రియల్టర్లకు కరెంటోళ్లు దాసోహం!
రాజంపేట : రైతులు, వినియోగదారుల ప్రయోజనాల కంటే ఎల్లో రియల్టర్ల ప్రయోజనాలే విద్యుత్ అధికారులకు ఎక్కువయ్యాయి. వెంచర్లకు విద్యుత్ స్తంభాల సరఫరా వ్యవహారమే ఇందుకు నిదర్శనం. రాజంపేట–రాయచోటి రోడ్డులోని జగనన్నకాలనీకి ఎదురుగా ఉన్న స్థలంలో ఏర్పాటు చేసిన వెంచర్లో ఏపీఎస్పీడీసీఎల్ విద్యుత్ స్తంభాలు వేసుకున్నారని ఆరోపణలు ఆ శాఖను రోడ్డుపైకి తీసుకొచ్చాయి. కరెంటు స్తంభాలపై ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ గుర్తులు చెరిపివేశారు. లేఔట్కు కరెంటు పోల్స్ తరలింపు వ్యవహారం ఇప్పుడు హాట్టాపిక్గా మారింది. కరెంటు స్తంభాల కోసం రైతులు, ప్రజలు కరెంటోళ్ల చుట్టూ తిరుగుతున్న పరిస్థితులు అనేకం ఉన్నాయి. దొడ్డిదారిన కరెంట్ పోల్స్ తరలింపు ఇలా.. అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల ఉద్ద ఉన్న తాళ్లపాక సబ్ సెంటర్కు ఈనెల 17న 9 మీటర్ల విద్యుత్ స్తంభాలు, 11 మీటర్ల విద్యుత్ స్తంభాలు 26 వచ్చాయి. ఈనెల 6న నార్త్ ఏఈ శ్రీనివాసులు చెప్పారని 9 మీటర్లకు సంబంధించి 8 కరెంటు పోల్స్ను కాంట్రాక్టర్ రవి, జె.వెంకటసుబ్బయ్య తీసుకెళ్లినట్లుగా రిజిస్టర్లో నమోదు అయింది. ఈ విషయాన్ని ఏఈ ధ్రువీకరిస్తున్నారు. రూరల్ ఏఈ వద్దకు రియల్టర్లు.. రూరల్ ఏఈ ఈశ్వరరాజు వద్దకు ముందుగా లేఔట్దారులు (టీడీపీ నేతలు) వచ్చారు. కరెంట్ఫోల్స్ కావాలని అడిగారు. లేఔట్ అప్రూవల్ ఉంటేనే కరెంటు స్తంభాలకు ప్రతిపాదనలు పంపుతామని చెప్పారు. ఆ తర్వాత ఆ నేతలు ఏఈని సంప్రందించలేదు. ఈ విషయంపై ఏఈ మాట్లాడుతూ వెంచర్లో తమ శాఖకు సంబంధించిన కరెంటు స్తంభాలు ఉన్నట్లుగా గుర్తించి ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లామన్నారు. వెంచర్ ఉన్న స్థలం మౌలా పేరుతో ఉందన్నారు. అయితే పేరు వేరొకరిదైనా, వెంచర్ వేసున్నది టీడీపీ నేతలేనని తెలుస్తోంది. ఉన్నతాధికారి ఒకరికి చేయితడిపారంటా.. ఎల్లో రియల్టర్ వెంచర్లో కరెంటు స్తంభాలు తరలింపు వెనుక ఏపీఎస్పీడీసీఎల్ ఉన్నతాధికారి ఒకరికి చేయి తడిపారనే ఆరోపణలు ఉన్నాయి. అడ్డు చెబుతాడనే కారణంతో కరెంటు స్తంభాల తరలింపు వ్యవహారం కోసం మరో డివిజన్ స్థాయి ఉన్నతాధికారిని శిక్షణ పేరుతో వారం రోజుల పాటు రాయచోటికి పంపినట్లు తెలిసింది. ఈ వారంలోపు 14 కరెంటు స్తంభాలు వెంచర్లో ఏర్పాటు చేసుకున్నారు. స్తంభాలపై ఉన్న ఏపీఎస్పీడీసీఎల్ పేర్లు, సీరియల్ నెంబర్లు చెరిపివేశారు. విజిలెన్స్ అధికారుల విచారణ.. బ్రాహ్మణపల్లె సమీపంలో టీడీపీ నేతలు వేసుకున్న వెంచర్లో స్తంభాలను విజిలెన్స్ అధికారులు పరిశీలించారు. ఈ స్తంభాలు ఎక్కడి నుంచి వచ్చాయి?ఎవరు తీసుకొచ్చారు, ఎవరు ఈ విద్యుత్ స్తంభాలను నాటారన్న కోణంలో ఆరా తీసినట్లు తెలిసింది. విచారణ అనంతరం ఉన్నతాధికారులకు నివేదికలు వెళ్లనున్నాయి. టీడీపీ నేతల తీరుపై విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు అందడంతో కరెంటు స్తంభాల తరలింపు వ్యవహారం వెలుగులోకి వచ్చింది. వెంచర్కు ఏపీఎస్పీడీసీఎల్ స్తంభాలు సరఫరా స్తంభాలపై ఆనవాళ్లు లేకుండా చేసిన వైనం ఆరా తీస్తున్న ఏపీఎస్పీడీసీఎల్ విజిలెన్స్ విభాగం -
వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో స్థానం
రాయచోటి: జిల్లా కలెక్టర్చామకూరి శ్రీధర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించారు. వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్, లండన్ వారు అందించిన సర్టిఫికెట్ను సోమవారం రాష్ట్ర రాజధాని అమరా వతిలో సీఎం చంద్రబాబునాయుడు చేతుల మీదుగా కలెక్టర్ శ్రీధర్ ఎస్పీ విద్యాసాగర్నాయుడుతో కలిసి అందుకున్నారు.మే 28న జిల్లాలో కలెక్టర్ ఆధ్వర్యంలో ఒక గంట యోగా సెషన్లో 13,594 మంది హెల్త్ వర్కర్స్తో యోగా చేయించిన సందర్భంగా జిల్లా కలెక్టర్ వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు సాధించారు.29 నుంచి జూనియర్ ఫుట్బాల్ పోటీలు మదనపల్లె సిటీ: మదనపల్లె సమీపంలోని వేదా పాఠశాలలో ఈనెల 29,30 తేదీల్లో రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్బాల్ ఛాంఫియన్ షిప్ పోటీలు జరగనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు దిలీప్కుమార్ తెలిపారు. ఈ మేరకు సోమవారం పాఠశాల కరస్పాండెంట్, ప్రిన్సిపాల్ను మర్యాదపూర్వకంగా కలిశారు. రాష్ట్ర స్థాయి పోటీలకు అన్ని ఏర్పాట్లు చేయాలని కోరారు. ఆయన వెంట పుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మురళీధర్,కోచ్ మహీంద్ర పాల్గొన్నారు.డీఎంహెచ్బాధ్యతల స్వీకరణరాయచోటి: జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధి కారిగా డాక్టర్ లక్ష్మీనరసయ్య బాధ్యతలు స్వీకరించారు. సోమవారం రాయచోటిలోని జిల్లా వైద్య, ఆరోగ్యశాఖ కార్యాలయంలో బాధ్యతలు చేపట్టారు. జిల్లా డీఎంహెచ్ఓగా డీఐఓ డాక్టర్ ఉషశ్రీ ఇన్చార్జ్గా విధులు నిర్వహించారు. సాధారణ బదిలీల్లో భాగంగా కర్నూలు ప్రాంతీయ శిక్షణ కేంద్రం ప్రిన్సిపాల్గా ఉన్న లక్ష్మీ నరసయ్య ఇక్కడకి వచ్చారు. గతంలో ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మహల్, ఎర్రకోటపల్లి పీహెచ్సీలలో వైద్యాధికారిగా, మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఆర్ఎంఓగా పనిచేశారు. జిల్లా కలెక్టర్ ఆదేశానుసారం అందకి సహకారంతో జిల్లాను వైద్య ఆరోగ్యశాఖ అన్ని ఇండికేటర్లలో మొదటి స్థానంలో ఉండేందుకు కృషి చేస్తానన్నారు. ఈ సందర్భంగా నూతన డీఎంహెచ్ఓను కార్యాలయంలో ప్రోగ్రామ్ అధికారులు,కార్యాలయ సిబ్బంది, యూనియన్ ప్రతినిధులు, ఆరోగ్య సిబ్బంది కలిసి అభినందనలు తెలిపారు. -
25న వైఎస్సార్సీపీలో చేరుతున్నా
జెడ్పీ మాజీ చైర్మన్ సుబ్రమణ్యం రాయచోటి: వైఎస్సార్సీపీ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి సమక్షంలో ఈనెల 25వ తేదీన వైఎస్సార్సీపీలో చేరుతున్నట్లు జెడ్పీ మాజీ చైర్మన్ సుగవాసి సుబ్రమణ్యం ప్రకటించారు. సోమవారం ఈ విషయాన్ని రాయచోటిలో విలేకరులకు వెల్లడించారు. రాజంపేట మాజీ ఎంపీ, రాయచోటి మాజీ ఎమ్మెల్యే దివంగత నేత సుగవాసి పాలకొండ్రాయుడు పెద్ద కుమారుడు సుగవాసి సుబ్రమణ్యం 20 రోజుల కిందట టీడీపీకి రాజీనామా చేసిన విషయం తెలిసిందే. 2024 ఎన్నికల్లో రాజంపేట అసెంబ్లీ నుంచి టీడీపీ అభ్యర్థిగా ఈయన పోటీలో ఉన్నారు. ఈ సందర్భంగా మీడి యాతో సుబ్రమణ్యం మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో చేరిక విషయం ఈ రోజు తీసుకున్న నిర్ణయం కాదన్నారు. గత పది సంవత్సరాలుగా ఎన్నో సందర్భాల్లో తన తండ్రితో చర్చించడం జరిగిందన్నారు. ప్రజా సంక్షేమం కోసం తన తండ్రిబాటలో నడిచి, భవిష్యత్తులో వారి సేవా భావానికి అనుగుణంగా తాను వేసి ప్రతి అడుగు ఉంటుందన్నారు. పార్టీలో చేరడానికి గల కారణాలు, జరిగిన పర్యావసనాలన్నీ ప్రతి ఒక్కరిని నేరుగా కలిసి వివరిస్తానని తెలిపారు. ఇప్పుడున్న పరిస్థితుల్లో కార్యకర్తలను, నాయకులను ఇబ్బందులకు గురి చేయడం మంచిది కాదని భావించానన్నారు. అందువల్లనే తాను ఒక్కన్నే వెళ్లి పార్టీలో చేరిన అనంతరం ప్రతి ఒక్కరినీ నేరుగా కలుసుకొని అంతా వివరిస్తానని ఉధ్ఘాటించారు. -
అంతర్ జిల్లా కాపర్ వైర్ల దొంగ అరెస్టు
మదనపల్లె రూరల్ : ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి అందులోని కాపర్ వైర్ దొంగతనం చేసే అంతర్ జిల్లా దొంగను అరెస్ట్ చేసి, రూ.11లక్షల 42వేల 600 విలువ కలిగిన 626 కిలోల కాపర్ వైరును స్వాధీనం చేసుకున్నట్లు డీఎస్పీ మహేంద్ర తెలిపారు. సోమవారం స్థానిక డీఎస్పీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. సత్యసాయిజిల్లా ఓబులదేవునిచెరువు మండలం అల్లాపల్లి పంచాయతీ బురుజుపల్లెకు చెందిన గంగిరెడ్డి కుమారుడు కోటిరెడ్డి రామకృష్ణారెడ్డి(48) తన పక్క గ్రామమైన పగడాలవారిపల్లెకు చెందిన వెంకటేష్తో కలిసి అన్నమయ్య, సత్యసాయిజిల్లాలోని 11 పోలీస్ స్టేషన్ల పరిధిలో కాపర్ వైర్ల చోరీకి పాల్పడ్డారన్నారు. ఆయా స్టేషన్ల పరిధిలో వీరిపై 40 ట్రాన్స్ఫార్మర్ల నుంచి కాపర్వైర్ల దొంగతనాలకు సంబంధించి 28 కేసులు నమోదయ్యాయన్నారు. అన్నమయ్య జిల్లాలోని బి.కొత్తకోట మండలంలో 14, మదనపల్లె 1, పీటీఎం 1, ములకలచెరువు 7, గాలివీడు 3, కురబలకోట 1, పుల్లంపేట 2, నందలూరు 1, పీలేరు 2, సత్యసాయిజిల్లా నల్లచెరువు 1, గాండ్లపెంట 2 తలపుల మండలం 3, తనకల్లులో 1 మొత్తం 40 ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి కాపర్ వైర్ చోరీ చేసినట్లుగా కేసులు నమోదయ్యాయన్నారు. కేసుల విచారణలో భాగంగా జిల్లాకు చెందిన క్రైమ్ సీఐ చంద్రశేఖర్, బి.కొత్తకోట సీఐ జీవన్ గంగానాథ్ బాబు ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేసి సాంకేతిక ఆధారాల సహాయంతో దర్యాప్తు చేశామన్నారు. సోమవారం నిందితుల్లో ఒకడైన రామకృష్ణారెడ్డి...బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం కంబళ్లపల్లె వద్ద వాహనాలు తనిఖీ చేస్తుండగా, చేతిలో ప్లాస్టిక్ సంచితో వస్తూ, పోలీసులను చూసి పారిపోయే ప్రయత్నం చేశాడన్నారు. అతన్ని అదుపులోకి తీసుకుని విచారించగా, చోరీలకు సంబంధించిన వివరాలను తెలుపుతూ నేరం అంగీకరించాడన్నారు. నిందితుడు తెలిపిన సమాచారం మేరకు బి.కొత్తకోట మండలం బీరంగి గ్రామం రంగసముద్రం ఏరు వద్ద గల చెట్టు పొదల్లో దాచి ఉంచిన 626 కిలోల కాపర్ వైండింగ్ వైరును స్వాధీనం చేసుకున్నామన్నారు. ఈ కేసులో మరో నిందితుడైన వెంకటేష్ పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలింపు ముమ్మరం చేస్తున్నట్లు తెలిపారు. కేసు విచారణలో ప్రతిభ చూపిన హెడ్కానిస్టేబుళ్లు పి.నరసింహులు, శంకర, కానిస్టేబుళ్లు రాఘవరెడ్డి, శివ, శంకర, దొరబాబు, చలపతి, హోంగార్డు సుబ్బయ్యలను అభినందించారు. -
ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలి
రాయచోటి : ప్రజా సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని డీఆర్ఓ మధుసూదనరావు అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో డీఆర్ఓ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా అందిన ప్రజల సమస్యలను అత్యంత ప్రాధాన్యతతో పరిష్కరించాలని డీఆర్ఓ తెలిపారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదుల పరిష్కారంపై నేరుగా పర్యవేక్షణ చేస్తోందన్నారు. ప్రతి సమస్యను, ప్రజల నుంచి వచ్చే ఫీడ్ బ్యాక్ను ప్రభుత్వం సీరియస్గా పరిశీలిస్తుందన్నారు. అధికారులు ప్రాధాన్యతగా ఫిర్యాదులను నూరు శాతం పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఏడీ సర్వే భరత్కుమార్, జీఎస్డబ్ల్యుఎస్ శాఖ జిల్లా అధికారి లక్ష్మీపతి, ఎస్డీసీ రాఘవేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి
రామసముద్రం : గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి చెందిన సంఘటన సోమవారం సాయంత్రం రామసముద్రం మండలంలో జరిగింది. ఎలవానెల్లూరు పంచాయతీ కొత్తూరుకు చెందిన మేకల వెంకటరమణ (45) కర్ణాటకలోని సోమయాజులపల్లెకు వెళ్లి వస్తుండగా, కర్నాటక సరిహద్దులో గుర్తు తెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో వెంకటరమణ తలకు, కాలికి తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు వెంటనే గాయపడిన వ్యక్తిని శ్రీనివాసపురం ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించడంతో మృతి చెందినట్లు గ్రామస్తులు తెలిపారు.తండ్రి కోసం తపించి తనయుడి మృతినందలూరు : మండలంలోని నాగిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఎర్రకొండు శివసాయి(25) కువైట్లో ఉన్న తన తండ్రి రాక కోసం పరితపించి అనారోగ్యానికి గురై మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. ఎర్రకొండు రామకృష్ణయ్య జీవనోపాధి నిమిత్తం కువైట్ దేశానికి వెళ్లాడు. అక్కడ ఎడారిలో పనిచేసేవాడు. రామకృష్ణయ్య పనిచేస్తున్న సేఠ్ తన పాస్పోర్ట్ తీసుకుని తనతో పనిచేయించుకుంటూ పదేళ్లుగా జీతం ఇవ్వడం లేదని, ఇంటికి పంపించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ ఒక వీడియోను ఇటీవల ఇంటికి పంపించాడు. ఆ వీడియోను చూసిన శివసాయి మరింత కుంగిపోయాడు. ఈ బెంగతో ఆదివారం రాత్రి కన్నుమూశాడు. దీంతో కుటుంబ సభ్యులు శోక సంద్రంలో మునిగిపోయారు. ఇప్పటికై నా రామకృష్ణయ్యను ఇండియాకు పంపించాలని భార్య, పిల్లలు కోరుకుంటున్నారు. -
చేతనైతే ఉద్యోగాలు ఇవ్వండి.. కడుపుకొట్టకండి
రైల్వేకోడూరు అర్బన్: సీఎం చంద్రబాబు చేతనైతే ఉద్యోగాలు ఇవ్వాలని, తమపై కోపంతో ప్రతిపక్షనాయకులను ఎదుర్కోలేక తమ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన రూ. 20 వేలు రూ. 30 వేలు సంపాదించుకునే ఉద్యోగుల కడుపుకొట్టొద్దని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం స్థానిక పార్టీకార్యాలయంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులుతో కలిసి విలేకరులతో మాట్లాడారు. రాష్ట్రంలోని వివిధ సంస్థల్లో యువకులకు తమ ప్రభుత్వంలో ఉద్యోగాలు కల్పిస్తే తమపై కోపంతో వాటిని పీకేసి వారి కుటుంబాలు రోడ్డున పడేటట్లు చేసిన పాపం ముఖ్యమంత్రి చంద్రబాబు, డిప్యూటీసీఎం పవణ్, మంత్రి లోకేష్లదేనని పేర్కొన్నారు. ఏపీఎండీసీలో తీసేసిన ఉద్యోగులను తిరిగి తీసుకోవాలని అన్నారు. ఎన్నికల ముందు చంద్రబాబు,లోకేష్లు 25లక్షల మందికి ఉద్యోగాలు, నిరుద్యోగులకు నిరుద్యోగ భృతి ఇస్తామని చెప్పారని, అధికారంలోకి వచ్చాక ఉన్న ఉద్యోగాలు ఉడగొడుతూ యువకులకు ద్రోహం చేస్తున్నాని అన్నారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అధికారం చేపట్టిన వేంటనే 2 లక్షల మందికి పైగా యువకులకు వివిధ రకాల ఉద్యోగావకావశాలు కల్పించారని, ప్రజలకు సంక్షేమం అందించారని గుర్తు చేశారు. ఏపీఎండీసీలో స్థానికతకు ప్రాధాన్యం ఇస్తూ ఇక్కడి చదువుకొన్న యువతకు మేము ఉద్యోగాలు ఇస్తే చంద్రబాబు రాగానే ఎటువంటి నోటీసులు ఇవ్వకుండా తొలగించడం దారుణమని తెలిపారు.అధికారం, ప్రభుత్వాలు మారినప్పుడల్లా ఇలా చేస్తే ఉద్యోగులు, యువతలో అభద్రతా భావం ఏర్పడుతుందని తెలిపారు. రాజకీయాల్లో నాయకత్వం వహించే నాయకులు ఆదర్శంగా ఉండాలన్నారు. తమపై రాజకీయ కక్షసాధింపులో భాగంగా యువకులకు అన్యాయం చేయడం సబబు కాదన్నారు. ఉద్యోగాలు కోల్పోయిన వారికి అండగా ఉండి న్యాయపోరాటం చేస్తున్నామని తెలిపారు. ఎన్ని ప్రభుత్వాలు మారినా కాంట్రాక్టర్లు, పారిశ్రామిక వేత్తలు తమపనులు చేసుకొంటున్నారని, ఇలా చిరుద్యోగులపై కక్ష సాధింపు సరి కాదన్నారు. కార్యకర్తలకు, ప్రజలకు అండగా ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్రమేష్, వెలగచర్లశివారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, పంజం సందీప్రెడ్డి, తల్లెంభరత్కుమార్రెడ్డి, అన్వర్బాషా, హరికృష్ణ, మారెళ్లరాజేశ్వరి, బండారుమల్లి, గల్లాశ్రీనివాసలు, ఆర్వీరమణ, డమ్ము రఘు, డీవీరమణ తదితరులు పాల్గొన్నారు. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, మాజీఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. తొలి రోజు ఆదివారం కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప, చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో కడప జట్టు 89.2 ఓవర్లలో అన్ని వికెట్లు కోల్పోయి 399 పరుగులు చేసింది. ఆ జట్టులోని నాగ కుళ్లాయప్ప 182 బంతుల్లో 17 ఫోర్లతో 101 పరుగులు చేసి అద్భుతంగా ఆడారు. సాయి ఆర్దిత్ 60 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని సాయి చరణ్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. ధనుష్ 2, తేజేష్ 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు, కర్నూలు జట్లు తలపడ్డాయి, ముందుగా టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో 90 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 362 పరుగులు చేసింది. ఆ జట్టులోని మన్విత్రెడ్డి 87 బంతుల్లో 86, కారుణ్య ప్రసాద్ 78, చైతన్య తేజ 62 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని రేవంత్ 2 వికెట్లు తీశాడు. -
చేనేత కార్మికులను ప్రభుత్వం ఆదుకోవాలి
వీరబల్లి : చేనేత కార్మికులను కూటమి ప్రభుత్వం ఆదుకోవాలని వైఎస్సార్సీపీ చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడం నాగభూషణం కోరారు. ఆదివారం మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మాజీ ఎంపీపీ గాలివీటి విజయభాస్కర్ రెడ్డి నివాసంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. గత జగనన్న ప్రభుత్వంలో ప్రతి చేనేత కార్మికుల ఖాతాలో సంవత్సరానికి రూ. 24 వేలు జమ చేసేవారన్నారు. ప్రస్తుత ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన సంక్షేమ పథకాలు అందక ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. అనంతరం చేనేత విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎంపికై న మోడం నాగభూషణంను గాలివీటి విజయభాస్కర్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పంచాయతీ విభాగం ప్రధాన కార్యదర్శి గాలివీటి వీరనాగిరెడ్డి సన్మానించారు. ఈ కార్యక్రమంలో మండల వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షుడు నరేంద్ర నాయుడు, ఎల్లంపల్లి వార్డు మెంబర్ నాగభూషణం, మట్లి పంచాయతీ చేనేత కార్మికులు నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈ నెల 23వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితో పాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. గంగమ్మకు బోనాల సమర్పణ లక్కిరెడ్డిపల్లి: కోరిన కోరికలు తీర్చే కొంగు బంగారంగా లక్కిరెడ్డి పల్లె మండల పరిధిలోని అనంతపురంలో గంగమ్మ ఆలయం విరాజిల్లుతోంది. ఆదివారం ఆలయానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. గంగమ్మా ..కరుణ చూపు తల్లీ అంటూ భక్తులు వేడుకున్నారు.కొందరు బోనాలు సమర్పించారు. మరికొందరు తలనీలాలు అర్పించి మొక్కులు తీర్చుకున్నారు. సకాలంలో వర్షాలు కురిపించి పంటలు బాగా పండేలా దీవించమ్మా అంటూ రైతులు వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు. 27 నుంచి ఎస్ఎఫ్ఐ అఖిల భారత మహాసభలు మదనపల్లె సిటీ: కేరళలోని కొజికోడ్లో జూన్ 27 నుంచి 30 వరకు ఎస్ఎఫ్ఐ 18వ అఖిల భారత మహాసభలు జరగనున్నాయి. విద్యార్థులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు నరసింహ సర్వేపల్లి అన్నారు. ఆదివారం మహాసభలకు సంబంధించిన పోస్టర్స్ను స్థానికంగా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నరసింహ మాట్లాడుతూ... దేశవ్యాప్తంగా 50లక్షల సభ్యత్వంతో అతిపెద్ద విద్యార్థిసంఘంగా ఎస్ఎఫ్ఐ ఉందన్నారు. అందరికీ విద్య, ఉపాధి, శాసీ్త్రయ విద్యావిధానం కోసం ఉద్యమిస్తోందన్నారు. నూతన జాతీయ విద్యావిధానంతో ప్రభుత్వ విద్యారంగాన్ని పూర్తిగా నిర్లక్ష్యం చేస్తూ కార్పొరేటీకరణ, ప్రైవేటీకరణ, కాషాయీకరణ చేస్తూ నీరుగార్చేలా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు వ్యవహరిస్తున్నాయన్నారు. పేద, బడగు, బలహీనవర్గాల విద్యార్థులు ఉన్నత చదువులు చదవడం కష్టతరంగా ఉందన్నారు. కొఠారి కమిషన్ పేర్కొన్న విధంగా జీడీపీ 6శాతం, రాష్ట్ర బడ్జెట్లో 30శాతం నిధులు విద్యారంగానికి కేటాయించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా ఉపాధ్యక్షులు అఫ్రిద్, జిల్లా కమిటీ సభ్యుడు జయబాబు, సమీర్, నాయకులు శ్రీధర్నాయక్, తరుణ్కుమార్, హర్షవర్ధన్, కార్తీక్, యశ్వంత్, వేణు తదితరులు పాల్గొన్నారు.రెండో రోజు 155 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాల కోసం రెండవ రోజు ఆదివారం కడప లోని ప్రభుత్వ మహిళా పాలిటెక్నిక్ కళాశాలలో నిర్వహించిన పాలిసెట్ కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగింది. జిల్లావ్యాప్తంగా 15001వ ర్యాంకు నుంచి 32 వేల ర్యాంకులకు సంబంధించిన అభ్యర్థులు కౌన్సెలింగ్ కేంద్రానికి చేరుకుని తమకు సంబంధించి దృవపత్రాలను పరిశీలించుకున్నారు. రెండవ రోజు కౌన్సెలింగ్కు 155 మంది అభ్యర్థులు హాజరై తమ ధృవ పత్రాలను పరిశీలించుకున్నారు. ఈ కౌన్సెలింగ్ కార్యక్రమంలో కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి, ఛీప్ వెరిఫికేషన్ ఆపీసర్ దామోధర్, వెరిఫికేషన్ ఆఫీసర్లు అనిత, బాగ్యశ్రీ, రేణుకా, రాజేష్ పాల్గొన్నారు. నేటి కౌన్సెలింగ్కు... సోమవారం నిర్వహించబోయే కౌన్సెలింగ్ కార్యక్రమానికి జిల్లావ్యాప్తంగా 32000 నుంచి 50 వేల ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు తమకు సంబంధించిన ధ్రువపత్రాలను పరిశీలించుకోవాలని కో ఆర్డినేటర్ సీహెచ్ జ్యోతి తెలిపారు. -
నామినేటెడ్ పదవుల్లో కురుబలకు ప్రాధాన్యత ఇవ్వాలి
మదనపల్లె రూరల్ : కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నామినేటెడ్ పదవుల్లో కురుబ కులానికి ప్రాధాన్యత ఇవ్వాలని ఏపీ కురుబ, కురుమ, కురువ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు కోరారు. ఆదివారం మదనపల్లె మండలం టిడ్కో గృహాల సమీపంలోని గాయత్రి పార్క్లో ఏపీ కురుబ సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం జరిగింది. సమావేశంలో కురుబ కుల అభివృద్ధికి తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లాల్సిన సమస్యలు, కురుబ సంఘం రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ యువత, మహిళా, ఉద్యోగుల కమిటీ ఏర్పాటు, తిరుపతిలో కనకదాస విగ్రహం ఏర్పాటు, ఆవిష్కరణ, కమ్యూనిటీ భవనానికి స్థలం కేటాయింపు విషయమై ప్రభుత్వ పెద్దలను కలవడం తదితర అంశాలపై చర్చించారు. సమావేశంలో భాగంగా కురుబ యువత కమిటీని ప్రకటించారు. సత్యసాయిజిల్లా కురుబ యువత జిల్లా ప్రధాన కార్యదర్శిగా కొంగటి రమేష్, అనంతపురం జిల్లా రాష్ట్ర కురుబ యువత జాయింట్ సెక్రటరీగా చెలిమి గురుమూర్తి, ఉపాధ్యక్షులుగా కప్పల జమదగ్ని, సత్యసాయిజిల్లా రాష్ట్ర కురబ యువత కార్యదర్శి కొంక నాగార్జున, కురుబ యువత ఉపాధ్యక్షులు బ్యాల్ల పార్థసారధి, వర్కింగ్ ప్రెసిడెంట్గా కప్పల సుదర్శన్, గౌరవ అధ్యక్షులుగా ఆర్.రాజశేఖర్, కార్యదర్శిగా కె.నాగభూషణకు నియామక పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో ఏపీ కురుబ సంఘం జనరల్ సెక్రటరీ వి.లింగమూర్తి, ట్రెజరర్ సి.విఠల్గౌడ్, వైస్ ప్రెసిడెంట్లు కె.నాగేశ్వరరావు, కె.రెడ్డికుమార్, సెక్రటరీ వి.వెంకటరమణ, కురుబ యువత రాష్ట్ర అధ్యక్షుడు కాటమయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇటుకల బట్టీకి చెరువు మట్టి
కలికిరి : చెరువుల్లో మట్టి తరలింపునకు ఇరిగేషన్ శాఖ అధికారులు అధికారికంగా అనుమతులిస్తున్నారు. సాధారణంగా రైతులు తమ పొలాలకు మట్టి అవసరమై ఇరిగేషన్ శాఖ అధికారులకు దరఖాస్తు చేసుకుని తగిన భూమి ఆధారాలు, ఇరిగేషన్ శాఖకు నామమాత్రపు రుసుము చెల్లించాలి. దీంతో ఇరిగేషన్ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి సంబంధిత చెరువు నుంచి పొలానికి అవసరమైన మట్టిని తరలించుకోవడానికి అనుమతులు జారీ చేయాలి. ఇలాగే మండలంలోని పల్లవోలు గ్రామంలో గడికి చెందిన కొందరు రైతులు తమ పొలాలకు మట్టి అవసరమని సంబంధిత రికార్డులతో సహా ఇరిగేషన్ శాఖ అధికారులకు గడి సమీపంలోని గుంతలవానిచెరువు నుంచి మట్టి తరలించడానికి దరఖాస్తు చేసుకున్నారు. ఎలాంటి క్షేత్ర స్థాయి పరిశీలనలు చేపట్టని అధికారులు ఏకపక్షంగా ఒక రైతుకు మాత్రమే అనుమతి ఉత్తర్వులు జారీ చేసి, మిగిలిన రైతులను నిత్యం కార్యాలయం చుట్టూ తిప్పుకుంటున్నారు. రాజకీయ అండదండలుంటేనే మట్టి తరలింపునకు అనుమతులు ఇస్తామని స్వయంగా ఇరిగేషన్ శాఖ అధికారులు చెబుతుండటంతో గ్రామానికి చెందిన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే అనుమతులు పొందిన వ్యక్తి మాత్రం పొలానికి కాకుండా ఇటుకల వ్యాపార నిమిత్తం బట్టీకి మట్టిని రాత్రి పగలు తేడా లేకుండా తరలించుకుంటున్నాడు. ఇదేమని అడిగిన రైతులపై తనకు అనుమతులున్నాయని చెబుతున్నాడు. దీనిపై ఇరిగేషన్ శాఖ మండల ఇన్చార్జి జేఈ గోపీక్రిష్ణను వివరణ కోరగా రైతుకు పొలానికి మట్టి తరలించడానికి అనుమతి ఇచ్చామని, ఇటుకల బట్టీకి మట్టి తరలిస్తుండటం తమ దృష్టికి రాలేదన్నారు. బట్టీకి తరలింపుపై విచారించి చర్యలు తీసుకుంటామన్నారు.చోద్యం చూస్తున్న ఇరిగేషన్ అధికారులు -
నిలిచిన నిధులు..ఆగిన పనులు
రాయచోటి: నేతి బీరకాయలో నెయ్యి ఉండదన్న చందంగా కూటమి పాలనలో గ్రామీణ పాలన సాగుతుందన్న ఆరోపణలు ఉన్నాయి. పల్లె సీమల అభివృద్ధి కోసం పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతామన్న డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాటలు కూడా నీటి మూటలయ్యాయి. కూటమి సర్కార్ పాలనా పగ్గాలు చేపట్టిన తర్వాత కేంద్ర ప్రభుత్వం కేటాయించిన 15వ ఆర్థిక సంఘం నిధులు గ్రామాలకు చేరలేదు. దీంతో అభివృద్ధి కుంటుబడింది. గ్రామీణ ప్రాంతాల్లో అభివృద్ధి పనులు చేపట్టేందుకు జనాభా ప్రాతిపదికన కేంద్రం ఏటా ఆర్థిక సంఘం రెండు విడతలుగా నిధులు మంజూరు చేస్తుంది. టైడ్, బేసిక్ నిధుల రూపంలో విడుదల చేసే వీటిని ఆర్థిక సంఘం నిబంధనల మేరకు స్థానిక సంస్థలు వినియోగించాలి. బేసిక్ గ్రాంట్ను గ్రామాల్లో సీపీ రోడ్లు, డ్రెయిన్లు, కమ్యూనిటీ హాళ్లు, శ్మశాన వాటిక అభివృద్ధి, వీధిలైట్ల నిర్వహణ తదితర వాటికి వ్యయం చేయాల్సి ఉంది. టైడ్ గ్రాంటును పారిశుధ్య నిర్వహణ, తాగునీటి సరఫరా, ఓడీఎఫ్ అమలు తదితర ప్రాథమిక అవసరాలకు ఖర్చు చేయాలి. కేంద్రం నుంచి ఈ నిధులు తొలుత రాష్ట్ర ప్రభుత్వానికి చేరుతాయి. అక్కడి నుంచి రాష్ట్ర ప్రభుత్వం ఆర్థిక సంఘం నిబంధనల మేరకు పంచాయతీలకు జమ చేస్తుంది. నెలలు గడుస్తున్నా .. జిల్లాలో 30 మండలాల్లో 501 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. 2024–25 ఆర్థిక సంవత్సరానికి 15వ ఆర్థిక సంఘం నుంచి దాదాపు రూ. 28 కోట్ల మేర కేంద్రం కేటాయింపు చేసింది. తొలి విడతగా రూ. 7.88 కోట్లను అక్టోబర్ నెలలో విడుదల చేసింది. ఈ ఏడాది ప్రారంభంలో సుమారు రూ. 20.78 కోట్లను 15వ ఫైనాన్స్ కమిషన్ జిల్లాకు కేటాయించింది. ఈ నిధులను రాష్ట్ర ప్రభుత్వం జిల్లాకు కేటాయించాల్సి ఉంది. ఆర్థిక సంవత్సరం ముగిసిపోయినా నెలల తరబడి ఇవ్వకుండా కాలయాపన చేస్తోంది. మండలాల వారీగా మంజూరైన నిధులు... బి కొత్తకోట రూ. 4.41 లక్షలు, చిన్నమండెం రూ. 3.64 లక్షలు, చిట్వేలి రూ. 6.09 లక్షలు, గాలివీడు రూ. 9.74 లక్షలు, గుర్రంకొండ రూ. 4.32 లక్షలు, కలకడ రూ. 4.13 లక్షలు, కలికిరి రూ. 9.38 లక్షలు, కుంభంవారిపల్లి రూ. 7.36 లక్షలు,కోడూరు రూ. 15.14 లక్షలు, కురబల కోట రూ. 5.73 లక్షలు, లక్కిరెడ్డిపల్లి రూ. 5.57 లక్షలు, మదనపల్లి రూ. 6.39 లక్షలు, ములకల చెరువు రూ. 7.70 లక్షలు, నందలూరు. రూ. 6.10 లక్షలు, నిమ్మనపల్లి రూ. 5.38 లక్షలు, ఓబులవారిపల్లి రూ. 9.63 లక్షలు, పెద్దమండెం రూ. 6.12 లక్షలు, పెనగలూరు రూ. 1.16 కోట్లు, పీలేరు రూ. 7.35 లక్షలు, పిటీఎం రూ. 80.26 లక్షలు, పుల్లంపేట రూ. 56.89 లక్షలు, రాజంపేట రూ. 1.18 కోట్లు, రామాపురం రూ. 60.15 లక్షలు, రామసముద్రం రూ. 69.42 లక్షలు, రాయచోటి రూ. 50.95 లక్షలు, సంబేపల్లి రూ. 44.53 లక్షలు, టి సుండుపల్లి రూ. 64.16 లక్షలు, తంబళ్లపల్లి రూ. 72.29 లక్షలు, వాల్మీకిపురం రూ. 58 లక్షలు, వీరబల్లి రూ. 59.22 లక్షలు. పడకేసిన ప్రగతి... కూటమి సర్కార్ నిర్వాకం జమ కాని 15వ ఆర్థిక సంఘం నిధులు రెండు నెలలు కిందటే జిల్లాకు రూ. 20.78 కోట్లు విడుదల చేసిన కేంద్రం పంచాయతీలకు అందక కుంటుపడిన అభివృద్ధి నిధుల విడుదలలో జాప్యం కావడంతో గ్రామాల్లో జరగాల్సిన అభివృద్ధి పనులకు ఆటంకాలు ఏర్పడ్డాయి. ఇంటి పన్నులపై వచ్చే ఆదాయం సిబ్బంది జీతభత్యాలు, పారిశుధ్యం, వీధిలైట్ల నిర్వహణకు కూడా చాలని పరిస్థితి ఉంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అర్భాటంగా సీసీ రోడ్ల నిర్మాణాలకు బిల్లులు ఇవ్వకపోవడంతో మిగిలిన పనులు మధ్యలో ఆగిపోయాయి. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. చాలా గ్రామాల్లో నిధులు రావన్న ఉద్దేశంతో సిమెంట్ రోడ్ల నిర్మాణం ఆగిపోవడంతో స్థానికులు అదే రోడ్లపై ప్రయాణం సాగిస్తున్నారు. డ్రైజీనే వ్యవస్థ అస్తవ్యస్తంగా తయారైంది. నిధుల కొరతతో అనేక గ్రామాల్లో వీధి లైట్లు వెలగడం లేదు. పారిశుధ్య నిర్వహణ అధ్వానంగా ఉండటంతో ప్రజలు అవస్థలు పడుతున్నారు.గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి నిధుల కొరత వేధిస్తోందని సర్పంచ్లు వాపోతున్నారు. రెండో విడత నిధులు మండలాలవారీగా కేటాయింపులు జరిగాయని, త్వరలోనే విడుదల కావాల్సి ఉందని జిల్లా పంచాయతీ అధికారిణి రాధిక తెలిపారు.గ్రామాల అభివృద్ధి కోసం ఏవేవో చేస్తామంటూ ఎన్నికల ముందు వాగ్దానాలు ఇచ్చి, ఉపన్యాసాలు చేసిన నాయకుల కళ్లెదుటే నిధులు దారి మళ్లిపోతున్నాయన్న విమర్శలు ఉన్నాయి. 15వ ఫైనాన్స్ రెండో విడత నిధులను పంచాయతీలు కేటాయించి ఆయా ప్రాంతాల అభివృద్ధికి సహకరించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. -
భర్త మరణాన్ని మరువక ముందే భూమి ఆక్రమణ
కురబలకోట : విద్యుత్ షాక్తో భర్తను కోల్పోయి తేరుకోక మునుపే వితంతువు భూమిని ఓ కుటుంబం ఆక్రమించడం మానవత్వాన్ని ప్రశ్నిస్తోంది. కురబలకోట మండలం అంగళ్లులో ఈ దుస్సంఘటన జరగడం కలవరాన్ని కల్గిస్తోంది. మనో వేదనలో ఉన్న వితంతువు భూమిని ఆక్రమించి ఆమెను తీవ్ర మనోవేదనకు గురిచేయడం పట్ల అంతటా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వయో వృద్ధురాలైన అత్త, మరో వైపు చిన్నబిడ్డలతో ఉన్న ఆమె ఈ దుర్మార్గంపై కన్నీటి పర్యంతమవుతున్నారు. భూ ఆక్రమణపై బాధితురాలు గాండ్లపెంట శకుంతల ఉన్నతాధికారులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు. మండలంలోని కనసానివారిపల్లెకు చెందిన యువరైతు గాండ్లపెంట రెడ్డెప్పరెడ్డి (38) ఇటీవల విద్యుత్ షాక్తో మృతి చెందారు. కుటుంబానికి జీవనాధారంగా ఉన్న అతని ఆకస్మిక మృతితో ఆ కుటుంబం ఇంకా కోలుకోలేదు. ఈ క్రమంలో అంగళ్లులో కడప మార్గంలో హైవే పక్కన ఉన్న ఆమెకు చెందిన 92 సెంట్ల భూమిపై మండలంలోని తుమ్మచెట్లపల్లెకు చెందిన ఓ కుటుంబం కన్నేసి ఆక్రమించిందని బాధితురాలు శకుంతల ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. లిటిగేషన్ డాక్యుమెంట్ సృష్టించి అధికార పార్టీ అండతో భూ ఆక్రమణకు పాల్పడ్డారని వేదన పడుతోంది. ఏళ్లుగా వంశ పారంపర్యంగా ఆధీనంలో వున్న భూమికి న్యాయం చేయకపోతే కుటుంబంతో సహా ఆత్మహత్యకు పాల్పడతామని ఉన్నతాధికారులతో పాటు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఆదివారం ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. అంతేగాకుండా ఆక్రమిత భూమి వద్ద బాధితురాలు అత్త బిడ్డలతో కలసి నిరసన కార్యక్రమం చేపట్టారు. భర్త ఉన్నప్పుడు భూమి వైపు కన్నెత్తి చూడలేదు. అతను చనిపోయాక దౌర్జన్యంగా భూ ఆక్రమణకు పాల్పడి చుట్టూ ఫెన్సింగ్లా రాళ్లు నాటారని తెలిపారు. ఏళ్లుగా ఆధీనంలో ఉంటూ భూ హక్కు పత్రాలు, రిజిస్ట్రేషన్ డాక్యుమెంట్లు, పట్టాదారు పాసు బుక్కులు కూడా ఉన్న తమ భూమిని ఆక్రమించడం ఏమిటనిఽ బాధితురాలు ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై అధికారులను విచారించగా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. జిల్లా ఎస్పీకి కూడా ఫిర్యాదు చేసినట్లు బాధితురాలు తెలిపారు. న్యాయం చేయకపోతే సామూహిక ఆత్మహత్యే శరణ్యం ఉన్నతాధికారులకు బాధితురాలి ఫిర్యాదు -
ప్రజా సమస్యలను గాలికి వదిలేసిన బాబు
రాజంపేట టౌన్: చంద్రబాబునాయుడు ప్రజా సమస్యలను గాలికి వదిలేశాడని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆరోపించారు. మండలంలోని బాలరాసపల్లె గ్రామంలో ఎమ్మెల్యే ఆదివారం పర్యటించి ప్రజల సమస్యలను తెలుసుకున్నారు. అనంతరం విలేకరులతో ఆయన మాట్లాడుతూ యోగాంధ్ర పేరుతో మూడు వందల కోట్లకు పైగా ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేశాడని ఎమ్మెల్యే ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్రంలో అనేక ప్రాజెక్టులు అసంపూర్తిగా ఉన్నా, రోడ్లు అధ్వానంగా ఉన్నాయన్నారు. యోగాంధ్రకు చేసిన ఖర్చుతో అనేక ప్రజా సమస్యలు పరిష్కారం అయ్యేవన్నారు. చంద్రబాబునాయుడు పాలన పచ్చ పత్రికల్లో తప్ప మరెక్కడా కనిపించడం లేదని, కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాదయినా ఏ ఒక్క సమస్య పరిష్కరించకపోగా ఎన్నికల హామీలను గాలికి వదిలేశారని ఆరోపించారు. ఏడాది కాకముందే ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. జగన్ ఎక్కడ పర్యటించినా ప్రజలు వేలాదిగా తరలి రావడమే ఇందుకు నిదర్శనమని తెలిపారు. ప్రజల్లో జగన్కు ఉన్న స్పందన చూస్తే వచ్చే ఎన్నికల్లో రాష్ట్రంలోని అన్ని పార్టీలు కలిసి పోటీ చేసినా ఒక్క సీటు కూడా సాధించలేవన్నారు. వైఎస్సార్ సీపీకి 175కు 175 సీట్లు వస్తాయని ఎమ్మెల్యే తెలిపారు. ● నందలూరుకు చెందిన రిటర్డ్ రైల్వే డాక్టర్ భాస్కర్ కుమారుడు ధీరజ్కుమార్ గత సివిల్స్ ఫలితాల్లో ర్యాంకు సాధించి మహారాష్ట్రలో ఎస్పీగా పనిచేస్తున్నారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆదివారం ఆయనను ఎస్టేట్కు ఆహ్వానించి సత్కరించారు. నందలూరుకు చెందిన పలువురు ఐఏఎస్లు అయ్యారని, ఇప్పుడు ధీర్జ్కుమార్ ఐపీఎస్ కావడం ఎంతో గర్వకారణమని తెలిపారు. ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి -
గుర్తు తెలియని వాహనం ఢీకొని మహిళ మృతి
రామసముద్రం : గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో ఒకరు మృతి చెందగా మరో ఇద్దరు తీవ్రంగా గాయపడిన సంఘటన రామసముద్రం మండలంలో శనివారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ దిగువపల్లి గ్రామానికి చెందిన లక్ష్మీనరసమ్మ(65), కృష్ణమ్మ, శ్రీనివాసులు ద్విచక్రవాహనంలో సమీప గ్రామమైన పనసమానుకుంటలో రామకోటి కార్యక్రమానికి బయలు దేరారు. చెంబకూరు–మదనపల్లి రోడ్డు మార్గంలోని బలిజపల్లి క్రాస్ వద్ద మదనపల్లి నుంచి ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలు కాగా గమనించిన స్థానికులు వెంటనే క్షతగ్రాత్రులను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ లక్ష్మీనరసమ్మ మృతి చెందింది. కాగా కృష్ణమ్మ తలకు , భుజానికి తీవ్ర గాయాలు కాగా శ్రీనివాసులు కాలు విరిగింది. పరిస్థితి విషమంగా ఉండటంతో శ్రీనివాసులును మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అక్కడి వైద్యుల సిఫారసు మేరకు వేలూరు సీఎంసీకి తీసుకెళ్లారు. కృష్ణమ్మ పరిస్థితి విషమంగా ఉండటంతో మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. సంఘటన స్థలాన్ని ఆదివారం మదనపల్లి రూరల్ సీఐ సత్యనారాయణ పరిశీలించి వివరాలు సేకరించారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు.ఇద్దరికి తీవ్ర గాయాలు -
దుప్పి మాంసం విక్రయిస్తున్న వ్యక్తి అరెస్టు
రైల్వేకోడూరు అర్బన్ : పట్టణంలోని రైల్వే స్టేషన్ రోడ్డులో దుప్పి మాంసం విక్రయిస్తున్న కొనిరెడ్డి రామసుబ్బారెడ్డి అనే వ్యక్తిని ఆదివారం అటవీశాఖ అధికారి శ్యామసుందర్ ఆధ్వర్యంలో అరెస్టు చేశారు. విచారణ అనంతరం తగిన చర్యలు తీసుకుంటామన్నారు. భర్తపై గొడ్డలితో దాడి మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో వివాదం చోటుచేసుకుని భర్తపై భార్య గొడ్డలితో దాడి చేసిన ఘటన శనివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. తట్టివారిపల్లె పంచాయతీ టిడ్కో ఇళ్ల వద్ద నివాసం ఉంటున్న మోహన్ నాయక్(45) తన భార్య శారదతో కుటుంబ అవసరాల కోసం ఉంచిన నగదు ఖర్చు విషయమై వివాదం చోటుచేసుకుంది. మాటామాటా పెరగడంతో ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. ఈ క్రమంలో గొడ్డలి తీసుకుని శారద భర్త మోహన్నాయక్పై దాడిచేసింది. దాడిలో మోహన్నాయక్ తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. మద్యానికి డబ్బు ఇవ్వలేదని..మదనపల్లె రూరల్ : మద్యం తాగేందుకు భార్య నగదు ఇవ్వకపోవడంతో భర్త దాడిచేసిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. నెమలినగర్ వడ్డిపల్లెలో భార్యాభర్తలు మోహన్, గాయత్రి నివాసం ఉంటున్నారు. మోహన్కు మద్యం తాగే అలవాటు ఉంది. అందులో భాగంగా ఆదివారం తనవద్ద మద్యం సేవించేందుకు డబ్బు లేకపోవడంతో భార్య గాయత్రిని అడిగాడు. ఆమె తనవద్ద లేదని సమాధానం ఇవ్వడంతో ఆవేశానికి లోనై ఇటుక రాళ్లతో ఆమైపె దాడి చేశాడు. దాడిలో ఆమె తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. వన్టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు. పొలంలో తెగి పడిన కాలుపెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ కొత్తపల్లికి చెందిన బైరెడ్డి (38) అనే రైతు కాలు ప్రమాదవశాత్తు తెగి పడింది. వివరాలిలా.. ఆదివారం రోటివేటర్తో పొలాన్ని చదును చేసే క్రమంలో వదులుగా ఉన్న రోటివేటర్ బోల్ట్లను బిగించే ప్రయత్నం చేస్తుండగా ట్రాక్టర్ ఒక్కసారిగా ముందుకు దూసుకుపోయింది. దీంతో బోల్ట్లు బిగిస్తున్న బైరెడ్డి కాలు మోకాలి వరకు తెగిపోయింది. గ్రామస్తులు వెంటనే 108 వాహనం ద్వారా మదనపల్లి జిల్లా ఆసుపత్రిలో ప్రథమ చికిత్స చేయించి మెరుగైన వైద్యం కోసం బెంగళూరుకు తీసుకెళ్లినట్లు గ్రామస్తులు తెలిపారు. మిథున్రెడ్డి, ఆకేపాటి భేటీ రాజంపేట : రాజంపేట లోక్సభ సభ్యుడు పీవీ మిథున్రెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథ్రెడ్డిలు ఆదివారం భేటీ అయ్యారు. పట్టణ శివార్లలో అయ్యప్పస్వామి ఆలయం వద్ద ఎంపీ, ఎమ్మెల్యే సమావేశమై పలు అంశాలపై చర్చించారు. కార్యక్రమంలో రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనువాసులు, రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర నాయకుడు చొప్పా ఎల్లారెడ్డి, పుల్లంపేట, రాజంపేట, నందలూరుకు చెందిన నేతలు పాల్గొన్నారు. -
రెడ్డెమ్మతల్లీ.. కరుణించమ్మా..
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన రెడ్డెమ్మతల్లి ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. రెడ్డెమ్మతల్లీ కరుణించమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఈసందర్భంగా అమ్మవారికి వేకువజామునే నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు జరిపారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.కొందరు భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లీమ్లు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరావడం విశేషం. ప్రశాంతంగా బదిలీ ప్రక్రియ కడప ఎడ్యుకేషన్: కడపలోని డీఈఓ కార్యాలయంలో ఆదివారం నిర్వహించిన 1998,2008 డీఎస్సీ ఎంటీఎస్ ఉపాధ్యాయుల బదిలీ ప్రక్రియ ప్రశాతంగా జరిగింది. ఈ కార్యక్రమం ఉదయం 11 గంటలకు ప్రారంభమై సాయంత్రం 5 గంటలకు ముగిసింది. జిల్లావ్యాప్తంగా ఉన్న 901 ఖాళీలను ప్రదర్శించగా జిల్లాలో ఉన్న ఎంటీఎస్ ఉపాధ్యాయులు తమకు సంబంధించిన స్థానాలకు కోరుకుని బదిలీపై వెళ్లారు. జిల్లావ్యాప్తంగా 206 మంది ఎంటీఎస్ ఉపాధ్యాయులకుగాను 201 మంది బదిలీ కౌన్సిలింగ్కు హాజరయ్యారు. మిగతా ఐదు మంది అభ్యర్థులకు బదిలీ కౌన్సెలింగ్కు గైర్హాజరయ్యారు. -
టీడీపీలో కులాల కుంపటి.!
రాజంపేట : వర్గ విభేదాలకు నిలయమైన రాజంపేట తెలుగుదేశం పార్టీలో అధికారపెత్తనం కోసం కులాల కుంపటి రాజుకుంటోంది. ఆదివారం నియోజకవర్గ కేంద్రమైన రాజంపేటలోని తోట కళ్యాణ మండపంలో నియోజకవర్గ వ్యాప్తంగా బలిజల ఆత్మీయ సమావేశం నిర్వహించారు. ఈ ఆత్మీయ సమావేశం ప్రధానంగా టీడీపీలో బలిజలకు అన్యాయం జరిగిందనే విధంగా కొనసాగినట్లుగా అధిష్టానానికి నివేదికలు వెళ్లినట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. నియోజకవర్గంలోని రాజంపేట టౌన్, రాజంపేట రూరల్, నందలూరు, ఒంటిమిట్ట, సుండుపల్లె, వీరబల్లి మండలాలకు చెందిన బలిజ సామాజికవర్గానికి చెందిన గ్రామ, మండల స్థాయి నేతలు తరలి వచ్చారు. 500 మంది వచ్చినట్లుగా లెక్కలు వేసుకుంటున్నారు. అయితే టీడీపీకి చెందిన బలిజ సామాజిక వర్గంలో పేరొందిన సీనియర్లు , ముఖ్యనేతలు పాల్గొనకపోవడం గమనార్హం ఇన్చార్జి పదవి తమకే ఇవ్వాలనే అల్టిమేటం.. టీడీపీ ఇన్చార్జి పదవి తమకే ఇవ్వాలనే అల్టిమేటం ఆత్మీయ సమావేశం ద్వారా అధిష్టానానికి ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. ఇప్పటికే టీడీపీలో పసుపులేటి బ్రహ్మయ్య, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం లాంటి బలిజ నేతలకు అన్యాయం జరిగిందనే భావన సమావేశంలో నేతలు వ్యక్తం చేసుకున్నారు. సమావేశంలో కడపలో ఉంటున్న హరిప్రసాద్, మోదుగల కళావతమ్మ ఇంజినీరింగ్ కళాశాల అధినేత పెంచలయ్య సోదరులు, కుప్పాల వెంకటసుబ్బయ్య, ప్రముఖ న్యాయవాది కృష్ణకుమార్, బండారు బాలయ్య, పూల భాస్కర్, వెంకటసుబ్బయ్యతోపాటు వివిధ మండలాలకు చెందిన బలిజ నేతలు, రాజంపేట పట్టణానికి చెందిన నేతలు పాల్గొన్నారు. ఈ సమావేశం ద్వారా టీడీపీ ఇన్చార్జి పదవి హరిప్రసాద్కు ఇవ్వాలనే డిమాండ్ పరోక్షంగా బలిజనేతలు తెరపైకి తీసుకొచ్చారు. ఈయన కడపకే పరిమితమైన నాయకుడిగా చెలామణి అవుతున్నా ఇప్పుడు తాను ఒంటిమిట్ట మండలానికి చెందిన వ్యక్తిననే భావనతో ఇన్చార్జి రేసులోకి వచ్చారు. బలిజలకు అధిష్టానం అనుకూలమా.. ప్రతికూలమా.. టీడీపీ ఇన్చార్జి పదవి బలిజేతరుల నేతలకు ఇవ్వడానికి అధిష్టానం దృష్టి సారించినట్లుగా పార్టీ వర్గాల్లోనే ప్రచారం జరుగుతోంది. అందువల్లనే బలిజ సామాజిక వర్గానికి చెందిన వారు తరచూ ఆత్మీయ సమావేశాలు పెట్టుకొని టీడీపీ కుర్చీని దక్కించుకోవాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. వీరికి ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అనుకూలమా, ప్రతికూలమా అనేది ఇంకా బహిర్గతం కాలేదు. ప్రస్తుతానికి ఇన్చార్జిని ప్రకటించే విషయంలో అధిష్టానం వెనకడుగుపై అనేక ఆలోచనలు, అనుమానాలు పుట్టుకొస్తున్నాయి. బలిజేతరుల వైపు చూపు..! ఇప్పటికే క్షత్రియ సామాజిక వర్గానికి చెందిన, రాజు విద్యాసంస్ధల అధినేత చమర్తి జగన్మోహన్రాజు, రెడ్డి సామాజికవర్గం నుంచి మేడా విజయశేఖర్రెడ్డిలు ఇన్చార్జి పదవిని ఆశిస్తున్నారు. బలిజ సామాజిక వర్గానికి చెందిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, రాయచోటికి చెందిన సుగవాసి బాలసుబ్రమణ్యంను అధిష్టానం గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థులుగా పోటీ చేయించింది. వారి ఓటమి తర్వాత ఆ సామాజికవర్గం దిశగా ఇప్పుడు అధిష్టానం ఆలోచన చేయడం లేదన్న వాదన పార్టీ వర్గాల్లో వినిపిస్తోంది. కానీ బలిజలు రాజంపేట తమదే.. టీడీపీ కుర్చీ తమకే అన్నట్లుగా భీష్మించుకొని కూర్చున్నారు. అధిష్టానం ఎటువైపు మొగ్గుచూపుతుందో వేచి చూడాల్సిందే. ఇన్చార్జి కుర్చీకోసం బలిజల సిగపట్లు బలిజేతర నేతలపై అధిష్టానం దృష్టి ? తాజాగా తెరపైకి కడపకు చెందిన బలిజ నేత -
సైబర్ మోసగాళ్లతో జాగ్రత్తగా ఉండాలి
రాయచోటి: సైబర్ మోసగాళ్ల పట్ల జిల్లా ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, వారి వలలో పడరాదని జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు వివిధ మార్గాల ద్వారా ప్రజలను మోసం చేయడానికి ప్రయత్నిస్తున్నారన్నారు. సైబర్ మోసాల బారిన పడకుండా ఉండటానికి ప్రజలు తీసుకోవాల్సిన జాగ్రత్తలను ఎస్పీ వివరించారు. గుర్తు తెలియని నంబర్ల నుంచి వచ్చే ఫోన్ కాల్స్, మెసేజ్లు, ఏపీకే ఫైల్స్, జీమెయిల్స్ పట్ల జాగ్రత్తగా ఉండాలన్నారు. లాటరీ తగిలిందని, బహుమతులు వచ్చాయని చెప్పే మోసపూరిత సందేశాలను నమ్మవద్దని కోరారు. అలాగే బ్యాంకు ఖాతా వివరాలు, ఏటీఎం పిన్, ఓటీపీ వంటి వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని స్పష్టం చేశారు. ఆన్లైన్ లావాదేవీలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలని తెలిపారు. సురక్షితమైన వెబ్సైట్లను మాత్రమే ఉపయోగించాలని ఎస్పీ నొక్కి చెప్పారు. అనుమానాస్పద లింక్లను క్లిక్ చేయవద్దన్నారు. తెలియని యాప్లను డౌన్లోడ్ చేసుకోవద్దని సూచించారు. ఏదైనా సైబర్ మోసం జరిగినట్లు అనుమానం వస్తే వెంటనే పోలీసులకు లేదా సైబర్ క్రైమ్ హెల్ప్లైన్ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని ఆయన ప్రజలను కోరారు. ప్రజలందరూ అప్రమత్తంగా ఉండి సైబర్ మోసాలను నివారించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
పుత్తూరు సిద్ధార్థలో గ్రాడ్యుయేషన్ డే
నారాయణవనం : పుత్తూరు సిద్ధార్థ ఇంజినీరింగ్ కళాశాలలో శుక్రవారం గ్రాడ్యుయేషన్ డేను ఘనంగా నిర్వహించారు. అనంతపురం జేఎన్టీయూ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ సుదర్శనరావు, వోల్వా గ్రూప్ రిటైర్డ్ డైరెక్టర్ ఇందు శేఖర్ ముఖ్య అతిథులుగా పాల్గొని పాస్ అవుట్ ఇంజినీరింగ్ విద్యార్థులకు పతకాలు, పట్టాలు అందజేశారు. అనంతరం ఆడిటోరియంలో జరిగిన కాన్వొకేషన్ డే సమావేశంలో కళాశాలల చైర్మన్ డాక్టర్ అశోకరాజు మాట్లాడుతూ గ్రామీణ విద్యార్థులకు మెరుగైన సాంకేతిక విద్యను అందించేందుకు సిద్ధార్థ గ్రూప్ కళాశాలలు కృషి చేస్తున్నట్టు తెలిపారు. ప్రపంచ స్థాయి ల్యాబ్, డిజిటల్ లైబ్రరీ, ఇంకుబేషన్ సెంటర్లను అభివృద్ధి చేశామన్నారు. విద్యా ప్రమాణాలు, నాణ్యతలో రాజీ పడకుండా విద్యను అందిస్తున్నామని పేర్కొన్నారు. వైస్ చాన్సలర్ సుదర్శనరావు మాట్లాడుతూ తోటి వారితో పోటీ పడి సృజనాత్మక, ఇన్నోవేటివ్ విద్యపై శ్రద్ధ చూపాలన్నారు. యువ ఇంజినీర్లు నిరంతరం పరిశోధనలపై దృష్టి సారించాలన్నారు. సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 903 మంది, సిద్ధార్థ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ కళాశాలలో ఉత్తీర్ణత పొందిన 485 మందికి డిగ్రీ కాన్వొకేషన్లు అందజేశారు. 2024–25 విద్యా సంవత్సరానికి సంబంధించి 17 మంది విద్యార్థులకు స్వర్ణ పతకాలు, ప్రశంసా పత్రాలు అందజేశారు. కార్యక్రమంలో యూనివర్సిటీ నామినీస్ ప్రశాంతి, అరుణక్రాంతి, ప్రిన్సిపాల్ మధు, జనార్దనరాజు, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినర్ విజయభాస్కర్, గోపి, హెచ్ఓడీలు, అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
మామిడికి గిట్టుబాటు ధర కల్పించాలి
రాజంపేట రూరల్ : మామిడికి గిట్టుబాటు ధర కల్పించి రైతులను ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్కు శనివారం మామిడిని సాగు చేసే రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. మామిడికి గిట్టుబాటు ధర లేకపోవడంతో ఎంతో నష్టపోయామని వాపోయారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే ఆకేపాటి మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతులకు అండగా ఉండాల్సింది పోయి వారిని నట్టేట ముంచుతోందని మండిపడ్డారు. రైతులను అన్ని విధాలుగా ఆదుకున్న ఘనత దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డికే దక్కుతుందన్నారు. అలాగే వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో కూడా రైతులకు అండగా ఉంటూ వారని అక్కున చేర్చుకున్నారని కొనియాడారు. నేడు కూటమి ప్రభుత్వం రైతులను అన్ని విధాలుగా మోసం చేసి దోచుకుంటోందని ధ్వజమెత్తారు. రైతులను విస్మరిస్తే కూటమి ప్రభుత్వానికి పతనం తప్పదని హెచ్చరించారు.ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
దాడికి పాల్పడిన టీడీపీ నాయకుడిపై కేసు
మదనపల్లె రూరల్ : సొంత పార్టీ కార్యకర్త, అనుచరుడిపై తంబళ్లపల్లెకు చెందిన టీడీపీ నాయకుడు సీడ్ మల్లికార్జున నాయుడు, కుమారుడు శశిధర నాయుడుతో కలిసి దాడి చేసిన ఘటనపై శుక్రవారం రాత్రి వన్టౌన్ పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. కురవంక హోసన్నా చర్చి సమీపంలో నివసిస్తున్న చంద్రమోహన్ కుమారుడు సి.అనిల్కుమార్ చాలా కాలంగా టీడీపీ నాయకుడు సీడ్ మల్లికార్జున ప్రధాన అనుచరుడిగా ఉండేవాడు. ఆరునెలల క్రితం అనిల్కుమార్, సీడ్ మల్లికార్జున నాయుడు వెంట తిరగడం వదిలేసి, మరో నాయకుడైన కట్టా దొరస్వామినాయుడు వద్దకు చేరాడు. కొద్దిరోజుల క్రితం కట్టా దొరస్వామినాయుడు జన్మదినం సందర్భంగా బ్యానర్లు ఏర్పాటు చేశాడు. తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డికి వ్యతిరేకంగా వాట్సప్లో పోస్ట్ పెట్టాడు. విషయం తెలుసుకున్న సీడ్ మల్లికార్జున నాయుడు, ఈనెల 10వతేదీ ఉదయం 6.30 గంటలకు కుమారుడు శశిధరనాయుడు, డ్రైవర్ రాజేష్తో కలిసి అనిల్కుమార్ ఇంటికి వెళ్లాడు. అనిల్ భార్య గీత చూస్తుండగా, సోషల్ మీడియాలో తమకు వ్యతిరేకంగా పోస్టులు పెడతావా అని పిడిగుద్దులు గుద్దుతూ, చేతులతో కొడుతూ, కాలితో తన్నుతూ బీభత్సం సృష్టించారు. ఈ తతంగాన్ని డ్రైవర్ రాజేష్ సెల్ఫోన్లో చిత్రీకరించాడు. తాను పోస్ట్ పెట్టలేదని ప్రాధేయపడుతున్నా వినిపించుకోకపోగా, కాళ్లతో తన్నుతూ తాము దాడి చేసిన విషయం ఎవరికై నా చెబితే అంతుచూస్తామని బెదిరించారు. తర్వాత ఈనెల 20వ తేదీన సోషల్ మీడియాలో సీడ్ మల్లికార్జుననాయుడు వీడియోను పోస్ట్ చేశారు. వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ కావడంతో, అనిల్ తనకు జరిగిన అవమానంపై, శుక్రవారం రాత్రి వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సీడ్ మల్లికార్జున నాయుడు, శశిధర నాయుడుపై ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ ఎరీషావలి తెలిపారు. -
వీఆర్ఓ కృష్ణప్ప సస్పెన్షన్
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి టౌన్కు సంబంధించిన వీఆర్ఓ కృష్ణప్పను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి ఉత్తర్వులు జారీ చేశారు.టౌన్ పరిధిలోని సర్వే నంబరు 705/2లోని రెండు ఎకరాల డీకేటీ భూమిని మరొకరికి రిజిస్ట్రేషన్ చేసి ఆన్లైన్లో నమాదు చేశారని పట్టణానికి చెందిన సాయిలీల కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈమేరకు వీఆర్ఓను విధుల నుంచి తొలగించినట్లు కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. 25న ప్రవేశ పరీక్ష కడప రూరల్: డాక్టర్ బి.ఆర్ అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల్లో ప్రవేశాలకు ఈనెల 25న పరీక్షలు నిర్వహించనున్నట్లు కడప చిన్నచౌక్ గురుకుల పాఠశాల ప్రిన్సిపల్ ఎల్.మాధవీలత తెలిపారు. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో 6వ తరగతి నుంచి 9వ తరగతిలో మిగిలి ఉన్న ఖాళీలను భర్తీ చేస్తున్నట్లు పేర్కొన్నారు. ఈ ప్రవేశాలకు సంబంధించిన దరఖాస్తులను ఈనెల 23 వరకు స్వీకరిస్తామని తెలిపారు. 25వ తేదీన ఉదయం 10 నుంచి 12 గంటల వరకు ప్రవేశ పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ పరీక్షను కడప చిన్న చౌక్ డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకుల పాఠశాలలో నిర్వహిస్తామని వివరించారు. నేడు రగ్బీ జట్టు ఎంపిక కడప వైఎస్ఆర్ సర్కిల్: ఉమ్మడి కడప జిల్లాలో ఆదివారం జూనియర్ బాల బాలికల రగ్బీ జిల్లా జట్టు ఎంపికలు నిర్వహించనున్నట్లు రగ్బీ అసోసియేషన్ సెక్రటరీ వి. ధన నారాయణ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 28–29న 18 ఇయర్స్ కేటగిరి కి సంబంధించిన బాల బాలికల రగ్బీ ఇంటర్ జిల్లాల టోర్నమెంట్ కర్నూలులో జరుగుతుందన్నారు. ఇందులో భాగంగా ఉమ్మడి కడప జిల్లా జట్టు కోసం ఎంపికలు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ ఎంపికలు కడప మునిసిపల్ స్టేడియంలో జరుగుతాయన్నారు. వివరాలకు 8297059998ను సంప్రదించాలని సూచించారు. నమో నారసింహ గుర్రంకొండ: మండలంలోని గుర్రంకొండ, తరిగొండ గ్రామాల్లో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయాల్లో స్వామివార్లకు విశేష పూజలు నిర్వహించారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో తరిగొండ ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. యోగినీ ఏకాదశి సందర్భాన్ని పురస్కరించుకొని వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించారు. అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తోమాల సేవ, ఏకాంతసేవ కావించారు. ఈసందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు.భక్తులు పెద్దఎత్తున ఆలయానికి చేరుకున్నారు. నమో నారసింహ...కాపాడు తండ్రి అని వేడుకున్నారు. భక్తులకు అర్చకులు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
యోగాను అభ్యసించి మానసికంగా దృఢంగా ఉండాలి
రాయచోటి: యోగాను ప్రతిరోజు అభ్యసించి శారీరకంగా, మానసికంగా దృఢంగా ఉండాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అభిప్రాయపడ్డారు. జిల్లాను యోగాంధ్ర కార్యక్రమంలోని వివిధ అంశాల్లో మొదటి స్థానంలో నిలిపిన జిల్లా ప్రజలకు కలెక్టర్ అభినందనలు తెలిపారు. 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా శనివారం రాయచోటిలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల గ్రౌండ్లో కలెక్టర్ నాయకత్వంలో 5 వేల మందితో యోగా కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించారు. రాయచోటిలో 5 వేల మందితో, 5050 ప్రాంతాల్లో 8 లక్షల మందితో యోగా కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్ మాట్లాడుతూ జిల్లాలో మే 21 నుంచి జూన్ 21 వరకు యోగాంధ్ర కార్యక్రమాలను విజయవంతంగా నిర్వహించడంలో కృషి చేసిన జిల్లా అధికారులకు, ఎంపీడీఓలకు ముఖ్యంగా రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, పీడీ డీఆర్డీఏ సత్యనారాయణ, రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసు, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణంలను ప్రత్యేకంగా అభినందించారు. కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఆర్ఓ మధుసూదన్రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, రాయచోటి మున్సిపల్ కమిషనర్ వాసు, రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, జిల్లా పర్యాటక శాఖ అధికారి నాగభూషణం, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. అందరూ యోగా సాధన చేయాలి పరిపూర్ణ జీవనశైలికి యోగా ఒక బాటగా నిలుస్తుందని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి అన్నారు. జిల్లా ఎస్పీ వి విద్యాసాగర నాయుడు ఆదేశాల మేరకు అదనపు ఎస్పీ ఆధ్వర్యంలో రాయచోటి పోలీసులు పరేడ్ మైదానంలో 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని నిర్వహించారు. యోగా గురువులు పోలీసు సిబ్బందికి యోగాలో ఉన్న మెలకువలు నేర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ పరిపూర్ణ ఆరోగ్యాన్ని సంపాదించుకోవడానికి నిరంతర యోగా సాధన చేయాలన్నారు.కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్, ఎం పెద్దయ్య, యోగా గురువులు నారాయణ, సహదేవరెడ్డి, శ్రీనివాసులు, రవిచంద్రారెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
ట్రాక్టర్ను ఢీ కొన్న కంటైనర్
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మంటపంపల్లి గ్రామ సమీపంలో కడప–చైన్నె జాతీయ రహదారిపై ట్రాక్టర్ను కంటైనర్ ఢీకొంది. పోలీసుల వివరాల మేరకు శనివారం తెల్లవారుజామున మూడు గంటలకు చైన్నె నుంచి కడప వైపు వెళ్తున్న కంటైనర్ మంటపంపల్లి సమీపంలోకి రాగానే రాజంపేట వైపు వెళ్తున్న ట్రాక్టర్ను ఢీ కొట్టి బోల్తాపడింది. అదృష్టవశాత్తు ఈ ప్రమాదంలో ఎవరికీ ఏమి కాలేదు. అయితే కంటైనర్ రోడ్డుకు అడ్డంగా పడిపోవడంతో కిలోమీటర్ల మేర ట్రాఫిక్ స్తంభించి పోయి వాహనదారులు ఇబ్బందులు పడ్డారు. రెండు బైక్లు ఢీ కొని యువకుడి మృతి మైదుకూరు : రెండు బైక్లు ఢీకొన్న సంఘటనలో ఓ యువకుడు మృతి చెందిన సంఘటన మైదుకూరు మండలం చెర్లోపల్లె సమీపంలో శనివారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చింతకొమ్మదిన్నె మండలం లక్కిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన దొడ్డి పద్మావతి తన కుమారుడు గంగాధర్ (20)తో కలసి చెర్లోపల్లెలో ఉన్న ఆమె చెల్లెలు గుర్రమ్మ ఇంటికి వచ్చింది. అక్కడి నుంచి చాపాడు మండలం నాగులపల్లె గ్రామంలో గుర్రమ్మ కుమార్తె సీమంతానికి హాజరయ్యేందుకు మోటార్ బైక్పై తల్లి కొడుకు బయల్దేరారు. చెర్లోపల్లె సమీపంలో వీరి బైక్ ఎదురుగా వస్తున్న మరో బైక్ ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో బైక్ నడుపుతున్న గంగాధర్ తీవ్ర గాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. యువకుని తల్లి పద్మావతికి తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను చికిత్స కోసం 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. సంఘటనపై మైదుకూరు అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో విమానాశ్రయం సమీపంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో వల్లూరు మండల పరిధిలోని పుల్లారెడ్డి పేట గ్రామానికి చెందిన బి.భాస్కర్ రెడ్డి (38) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసులు తెలిపిన సమాచారం మేరకు పుల్లారెడ్డిపేటకు చెందిన భాస్కర్ రెడ్డి భార్య చెవి సంబంధిత శస్త్ర చికిత్స చేయించుకుని కడపలోని ఓ ఆసుపత్రిలో ఉన్నారు. భార్య వద్దకు వెళ్లేందుకు భాస్కర్రెడ్డి తన కుమారుడు ప్రణీత్ రెడ్డితో కలిసి ద్విచక్ర వాహనంలో కడపకు బయలు దేరాడు. విమానాశ్రయం సమీపంలో వారు ప్రయాణిస్తున్న ద్విచక్ర వాహనాన్ని వెనుక వైపు నుంచి వస్తున్న సిమెంట్ ట్యాంకర్ ఢీకొట్టింది. దీంతో కిందపడ్డ భాస్కర్రెడ్డిపై ట్యాంకర్ ఎక్కడంతో అతని శరీరం ఛిద్రంగా మారి అక్కడికక్కడే మృతి చెందాడు. అతని కుమారుడు ప్రణీత్ రెడ్డి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాలుడిని 108 వాహనంలో ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. శాటిలైట్ రంగంపై అవగాహన అవసరం చాపాడు : విద్యార్థి దశ నుంచే చదువుతో పాటు శాటిలైట్ రంగంపై అవగాహన కలిగి ఉండాలని, ఇందుకోసం ఆయా పాఠశాలలు చర్యలు తీసుకోవాలని ఇస్రో ప్రాజెక్టు మాజీ డైరెక్టర్, సీనియర్ సైంటిస్ట్ టీకే సుందరమూర్తి పేర్కొన్నారు. స్థానిక ఇంటర్నేషనల్ ఢిల్లీ పబ్లిక్ స్కూల్లో ఏర్పాటు చేసిన స్పేస్ ల్యాబ్ను శనివారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ దేశ ప్రథమ ప్రధాని జవహర్లాల్ నెహ్రూ శాస్త్ర సాంకేతిక పరిజ్ఞానాన్ని అభివృద్ధి చేయడం ఆయన ముందు చూపునకు నిదర్శనమన్నారు. పాఠశాల చైర్మన్ డాక్టర్ వి.జయచంద్రారెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు కేవలం పుస్తకాల ద్వారా మాత్రమే జ్ఞానం పొందలేరని ప్రయోగశాల ద్వారా నేర్చుకున్న విద్య ఎప్పటికీ గుర్తుండి పోతుందన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల డైరెక్టర్ వి.లోహిత్రెడ్డి, ప్రిన్సిపాల్ బి.రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా జట్టుకు ఎంపిక
నందలూరు : అండర్–19 బాలికల విభాగంలో సీఏవైడీ కడప జిల్లా క్రికెట్ జట్టుకు రాజంపేటకు చెందిన కేంద్రీయ విద్యాలయం విద్యార్థిని మోహనవైష్ణవి బౌలింగ్ ఆల్రౌండర్గా, రిషిత మీడియం ఫాస్ట్ బౌలింగ్ విభాగంలో ఎంపికై నట్లు సబ్ సెంటర్ కోచ్లు గయాజ్, ఫిరోజ్ ఖాన్ లోడీలు పేర్కొన్నారు. ఈ సందర్భంగా ఎంపికై న ఇద్దరు అమ్మాయిలు మాట్లాడుతూ జిల్లా జట్టుకు ఎంపికయ్యేలా శిక్షణ ఇచ్చిన ట్రైనర్ శివకోటి, పీఈటీ రాహుల్, కోచ్లు, సీఏవైడీ ప్రెసిడెంట్ భరత్రెడ్డి, సెక్రటరీ రెడ్డిప్రసాద్, డీసీఓ ఖాజామైనుద్దీన్, ఉమెన్ క్రికెట్ కోఆర్డినేటర్ విష్ణుమోహన్లకు ధన్యవాదాలు తెలిపారు. టిప్పర్ ఢీకొని తీవ్ర గాయాలుముద్దనూరు : స్థానిక కొత్త బస్టాండు సమీపంలో శనివారం టిప్పర్ ఢీకొని ద్విచక్రవాహనదారుడికి తీవ్ర గాయాలయ్యాయి. పవన్కుమార్రెడ్డి అనే వ్యక్తి కడప రహదారిలో వెళ్తుండగా కొత్త బస్టాండు వైపు నుంచి వస్తున్న ఓ టిప్పర్ ఢీకొంది. ఈ ఘటనలో పవన్కు కాలు విరగడంతో పాటు గాయాలయ్యాయి. -
కూటమి ప్రభుత్వంలో యువతకు అన్యాయం
కడప అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే ప్రజలను అన్ని విధాలుగా మోసం చేసిందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కమలాపురం మాజీ ఎమ్మెల్యే పి. రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వం యువతతో పాటు, విద్యార్థులకు సకాలంలో పథకాలను వర్తింపచేయకుండా దగా చేస్తోందని, ఈ విధానానికి వ్యతిరేకంగా ఈనెల 23న కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయం నుంచి ‘యువతపోరు’ పేరుతో ర్యాలీగా కలెక్టరేట్కు బయలుదేరి కలెక్టర్కు వినతిపత్రం ఇస్తామన్నారు. ఈ కార్యక్రమం నిర్వహించేందుకు పోలీసుల అనుమతి కోసం శనివారం కడపలోని జిల్లా ఎస్పీ క్యాంప్ కార్యాలయంలో ఎస్పీ ఈజీ అశోక్కుమార్ను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఆధ్వర్యంలో యువజన, విద్యార్థి విభాగాల నాయకులు కలిసి వినతిపత్రం అందజేశారు. అనంతరం రవీంద్రనాథ్రెడ్డి మీడియాతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 13 నెలల్లోనే యువతతోపాటు, రైతులకు, మహిళలకు అన్ని వర్గాలకు మోసం చేసిందన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలను కల్పిస్తామని, లేదంటే ప్రతినెలా రూ. 3000 నిరుద్యోగ భృతిని అందజేస్తామని చెప్పి అమలు చేయలేదన్నారు. వీటిపై ప్రభుత్వాన్ని నిలదీసేందుకే ‘యువతపోరు’ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు. తమ ప్రభుత్వ హయాంలో ప్రవేశపెట్టిన ‘అమ్మ ఒడి’ పథకానికి ‘తల్లికి వందనం’ అనే పేరు మార్చి ఏడాది తరువాత ఇటీవల ఎంతమంది తల్లుల బ్యాంకు ఖాతాలలో రూ. 15000 చొప్పున వేశారో అంచనాకు రాలేదన్నారు. ఎవరెవరికి, ఏయే షరతులను విధించి ఆ పథకానికి దూరం చేశారో తేలాలన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ ఎంతమంది విద్యార్థులకు వర్తింపచేశారో కూడా తెలియాల్సి ఉందన్నారు. గత ఏడాది కాలం నుంచి ఫీజు రీ యింబర్స్మెంట్లో భాగంగా విద్యాకానుక, విద్యాదీవెన, వసతి దీవెన పథకాలు వర్తింపచేయకపోవడంతో విద్యార్థులు ఇబ్బందులను ఎదుర్కొంటున్నారన్నారు. అధికారంలోకి రాకమునుపు తల్లికి వందనం ఎలాంటి షరతులు లేకుండా అందరికి వర్తింపజేస్తామని, ఎంతమంది పిల్లలుంటే వారందరికి పథకం వర్తింపజేస్తామని ‘బాబు ష్యూరిటీ’ పేరుతో హామీలను ఇచ్చారని, సూపర్ సిక్స్లో ఏ పథకం సక్రమంగా అమలు చేయకపోయినా ‘చొక్కా పట్టుకుని నిలదీయండి’ అని చెప్పారన్నారు. తల్లికి వందనం, విద్యాదీవెన, వసతి దీవెన, విదేశీ విద్యాదీవెన, విద్యాకానుక లాంటి పథకాలను చంద్రబాబు అమలు చేయకపోవడంతో 13 నెలల్లోనే దాదాపు రూ.22వేల కోట్లు లబ్ధిదారులకు బకాయిలు పడ్డారన్నారు. ఈ పథకాలను అమలు చేసేంత వరకు తాము పోరాడుతూనే ఉంటామన్నారు. వైఎస్సార్సీపీ యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు దేవిరెడ్డి ఆదిత్య, యువజన విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షుడు షఫీవుల్లా, నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, విద్యార్థి విభాగం నగర అధ్యక్షుడు శివారెడ్డి పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి ఈనెల 23న యువత పోరు ర్యాలీ అనుమతి కోసం జిల్లా ఎస్పీకి వినతిపత్రం -
మామిడి రైతులను ప్రభుత్వం ఆదుకుంటుంది
రైల్వేకోడూరు అర్బన్ : అన్నమయ్య జిల్లాలో మామిడి రైతులకు కల్గిన ఇబ్బందులు ప్రభుత్వం గుర్తించి వారి సమస్యలు పరిష్కరించడానికి అన్ని చర్యలు తీసుకుంటోందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్ పేర్కొన్నారు. ఆయన శనివారం ఆకస్మికంగా రైల్వేకోడూరులో పర్యటించి మామిడి రైతుల సమస్యలు తెలుసుకున్నారు. మార్కెట్ యార్డులో రైతులు, వ్యాపారులతో మాట్లాడి అనంతరం శెట్టిగుంటలోని జ్యూస్ ఫ్యాక్టరీని పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వేకోడూరు, రాజంపేట పరిధిలో 2630 హెక్టార్లలో తోతాపూరి మామిడి రకాన్ని రైతులు సాగు చేస్తున్నారని, వీటిలో 22 వేల మెట్రిక్ టన్నులు దిగుబడి వస్తుందన్నారు. కచ్చితంగా ప్రతి రైతుకు ప్రభుత్వం ప్రకటించిన కేజీకి రూ. 4లు సబ్సిడీ అందిస్తామని పేర్కొన్నారు. అలాగే ఫ్యాక్టరీల సామర్థ్యాన్ని బట్టి రైతులు మామిడి కాయలు కోసి అందించాలన్నారు. ఏ ఒక్క రైతుకు నష్టం వాటిల్లకుండా చూసుకుంటామని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, తహసీల్దార్ అమరనాథ్ తదితరులు పాల్గొన్నారు. -
భావితరాలకు నవోదయం
మదనపల్లె సిటీ: కార్పొరేట్ పాఠశాలల ధీటుగా అత్యున్నత ప్రమాణాలతో కూడిన విద్య,ఉత్తమ విలువలు,దేశభక్తి , క్రీడలు ఇలా అన్ని రంగాల్లో విద్యార్థులను నిపుణులుగా తీ ర్చిదిద్దుతూ అదర్శంగా నిలుస్తోంది ఉమ్మడి చిత్తూరు జి ల్లాలోని మదనపల్లె సమీపం వలసపల్లి, ఉమ్మడి కడప జి ల్లాలోని రాజంపేటలోని జవహర్ నవోదయ విద్యాలయా లు. గ్రామీణ ప్రాంత విద్యార్థులకు వరంగా మారిన నవోద య విద్యాలయాల్లో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవే శానికి దేశవ్యాప్తంగా నోటిఫికేషన్ విడుదలైంది. ఆరో తరగతిలో ప్రవేశాలకుగాను దరఖాస్తులను ఆహ్వానిస్తున్నారు. ’నెట్లో దరఖాస్తుల ఆహ్వానం విద్యాలయంలో ప్రవేశానికి డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.నవోదయ.జీవోవీ.ఇన్ అనే వెబ్సైట్లో ఇంటర్నెట్లో దరఖాస్తులు సమర్పించాలి. పాఠశాలలో ఆరో తరగతిలో 80 సీట్లు ఉంటాయి. దరఖాస్తు సమర్పణకు జులై 29 చివరి తేదీగా ప్రకటించారు. ఈ ఏడాది డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. రిజర్వేషన్లు: విద్యాలయంలోని 80 సీట్లలో 75 శాతం (60 సీట్లు) గ్రామీణ ప్రాంత, 25 శాతం (20 సీట్లు) పట్టణ ప్రాంత విద్యార్థులకు కేటాయిస్తారు. అందులో 15 శాతం ఎస్సీ, 7.5 శాతం ఎస్టీ, 3 శాతం దివ్యాంగులు, బాలికలకు 1/.3 వంతు రిజర్వేషన్ అమలు చేస్తారు. అభ్యర్థి ఫోటో, సంతకం, తల్లి/ తండ్రి/ సంరక్షకుడి సంతకంతో దరఖాస్తులు సమర్పించాలి. ’సీబీఎస్ఈ సిలబస్... నాణ్యమైన విద్య ఆరో తరగతి ప్రవేశం పొందితే ఇంటర్మీడియట్ వరకు ఉచితంగా బోధిస్తారు. విద్యార్థుల్లో జాతీయ సమైక్యత భావాన్ని పెంపొందించేలా వలస (మైగ్రేషన్ ) విధానాన్ని ప్రవేశపెట్టింది. ఏటా తొమ్మిదో తరగతి చిన్నారులను ఇతర రాష్ట్రాలకు పంపిస్తారు. ఇతర రాష్ట్రాల నుంచి వారిని ఇక్కడికి తీసుకువస్తారు. ఆరో తరగతి నుంచి కంప్యూర్ విద్య బోధిస్తారు. ఆధునాతన వసతులతో కూడిన గ్రంథాలయం, ఎస్సీసీ, క్రీడలకు ప్రత్యేకంగా శిక్షణ ఇస్తారు. ప్రతి ఏటా శతశాతం ఉత్తీర్ణ సాధిస్తూ ప్రతిభ చాటుతున్నారు. దరఖాస్తుల ఆహ్వానం అర్హతలు ఇలా... 3,4,5 తరగతులు ప్రభుత్వం లేదా గుర్తింపు పొందిన పాఠశాలలో చదవాలి. అయిదో తరగతి తప్పనిసరిగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో చదివి ఉండాలి. అధార్కార్డు తప్పనిసరి. లేదా తహసీల్దార్ కార్యాలయం నుంచి నివాస ధ్రువీకరణ పత్రం అవసరం. అభ్యర్థి తల్లిదండ్రలు ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందినవారై ఉండాలి. అభ్యర్థుఽలు 1.5.2014 నుంచి 31.07.2016 మధ్య జన్మించిన వారు అర్హులు. పారదర్శకంగా ఎంపిక ప్రక్రియ: విద్యాలయంలో ప్రవేశాల పరీక్ష,ఎంపిక పూర్తిగా పారదర్శకంగా ఉంటుంది. విద్యార్థుల మార్కుల ఆధారంగానే ప్రవేశాలు ఉంటాయి. దళారులను నమ్మవద్దు. దరఖాస్తు, ప్రవేశపరీక్ష, ఎంపిక ప్రక్రియ పూర్తిగా ఇంటర్నెట్లోనే ఉంటుంది. ప్రవేశపరీక్షపై భయం వీడి విద్యార్థులు కష్టపడి చదివితే సులువుగా ప్రవేశం పొందవచ్చు. –గీత, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, మదనపల్లె -
యువత పోరును విజయవంతం చేయండి
రాయచోటి టౌన్ : యువత పోరు కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్ కుమార్రెడ్డి పిలుపునిచ్చారు. శనివారం రాయచోటి వైఎస్సార్సీపీ కార్యాలయంలో యువత పోరు పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో అధికారంలోకి వచ్చేందుకు చంద్రబాబు నాయుడు అనేక రకాల హామీలు ఇచ్చారన్నారు. వాటిలో ప్రధానంగా ఆరు పథకాలకు సూపర్ సిక్స్ అని పేరు పెట్టి అమలు చేస్తానని నమ్మించారన్నారు. అధికారంలోకి వచ్చిన తరువాత వాటిని మరిచారని విమర్శించారు. అమ్మకు వందనం పేరుతో తల్లులకు కూడా మోసం చేస్తున్నాడని ఆరోపించారు. రాష్ట్రంలో 80 లక్షలకు పైగా అర్హత కలిగిన వారు ఉంటే ప్రభుత్వం మాత్రం 50 లక్షల మందికి మాత్రమే ఇస్తోందన్నారు. ఇక యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పిన ప్రభుత్వం ఆ మాటే ఎత్తడం లేదన్నారు. ఉద్యోగం ఇవ్వకపోతే నిరుద్యోగ భృతి రూ.3000 ఇస్తానని చెప్పారని కానీ ఏడాది పూర్తి అవుతున్నా ఆ విషయం పట్టించుకోలేదన్నారు. చంద్రబాబు చేసిన మోసాలను ఎండగట్టేందుకు ఈ నెల 23వ తేదీ రాయచోటిలోని కలెక్టర్ కార్యాలయం ఎదుట యువత పోరు కార్యక్రమాన్ని చేపట్టనున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి శిబ్యాల విజయభాస్కర్, మైనార్టీ నాయకుడు కొలిమి హరూన్ బాషా, యువజన విభాగం అధ్యక్షుడు శివప్రసాద్ రెడ్డి, జిల్లా విద్యార్థి విభాగం అధ్యక్షుడు కిశోర్ దాస్ రెడ్డి, పరుశురాం నాయుడు, రెడ్డికుమార్, అజ్మత్ బాషా తదితరులు పాల్గొన్నారు. -
పులివెందులలో దుండగుల హల్ చల్
పులివెందుల రూరల్ : పట్టణంలోని పెద్దకొండప్ప కాలనీ–2లో శుక్రవారం రాత్రి కొందరు దుండగులు హల్ చల్ చేశారు. అర్థరాత్రి వీధిలోకి ప్రవేశించిన దుండగులు ఇళ్ల ముందు పార్కు చేసి ఉన్న దాదాపు 10 ద్విచక్ర వాహనాలను కింద పడవేసి.. కొన్నింటిని పగులగొట్టి వెళ్లారు. ఉదయాన్నే కాలనీ వాసులు రాత్రి జరిగిన సంఘటనను చూసి భయభ్రాంతులయ్యారు. వీరు కాలనీలో వీధి వెంట దర్జాగా నడుచుకుంటూ వెళుతున్న దృశ్యాలు సీసీ కెమెరాలో రికార్డు అయ్యాయి. ఇటీవల ఏదో ఒక ప్రాంతంలో చిన్న చిన్న చోరీలు జరుగుతుండటంతో పట్టణ ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పులివెందుల పట్టణంలో చాలామంది యువత గంజాయి, మద్యానికి అలవాటుపడి డబ్బుల కోసం నేరాలకు పాల్పడుతున్నట్లు సమాచారం. ఈ నేపథ్యంలో ఈ చర్యకు పాల్పడింది ఆకతాయిలా.. లేక దొంగలా అనేది తేలాల్సి ఉంది. పోలీసులు స్పందించి చర్యలు చేపట్టాలని కాలనీ వాసులు కోరుతున్నారు. -
డిష్యుం...డిష్యుం..!
● ముష్టి ఘాతాలకు దిగిన తెలుగుతమ్ముళ్లు ● అక్రమ సంపాదనలో తేడాలు ● కడప ఎమ్మెల్యే ఇంట్లోనే పరస్పర దాడి ● సర్దిచెప్పిన జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సాక్షి ప్రతినిధి, కడప: అక్రమ సంపాదన వారి మధ్య వైరం పెంచింది. అధికారం అడ్డుగా పెట్టుకొని చేస్తున్న అక్రమ వ్యవహారాలు బెడిసికొట్టాయి. గత ప్రభుత్వ కాలంలో విపక్షంగా పోరాటం చేశాం, ఇప్పుడు స్వపక్షంలో ఉంటూ పోరాటం చేయాల్సి వస్తోందని మాటామాటా పెరిగింది. అంతే ఒక్కమారుగా ముష్టి ఘాతాలు పడ్డాయి. జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి సాక్షిగా వారి సొంతత ఇంట్లో తెలుగుతమ్ముళ్లు పరస్పర దాడులు చేసుకున్నారు. విశ్వసనీయ సమాచారం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కడప నగర కార్పొరేషన్లో 50డివిజన్లుకు 49 డివిజన్లు వైఎస్సార్సీపీ కై వసం చేసుకుంది. ఒకే ఒక్క డివిజన్తో తెలుగుదేశం పార్టీ సరిపెట్టుకోవాల్సి వచ్చింది. కాగా జనరల్ ఎన్నికల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వం కోల్పోయింది. తర్వాత చోటుచేసుకున్న పరిణామాల్లో 8మంది వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీలో చేరారు. వారిలో 8వ డివిజన్ కార్పొరేటర్ లక్ష్మీదేవి అమె భర్త అండ్లూరు బాలకృష్ణారెడ్డి ఉన్నారు. అధికారం అడ్డుపెట్టుకొని సొమ్ము చేసుకోవాలనే తపనే వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు తెలుగుదేశం పార్టీ కండువా కప్పుకునేలా చేసిందని విశ్లేషకుల అంచనా. వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు టీడీపీలో చేరే వరకు టీడీపీ కోసం పనిచేసిన వారికి ఎమ్మెల్యే మాధవిరెడ్డి వద్ద మంచి ప్రాధాన్యత లభించేది. ఎప్పుడైతే 8మంది కార్పొరేటర్లు టీడీపీలో చేరారో, అప్పటి నుంచి తెలుగుదేశం పార్టీ కోసం ఎన్నికల్లో కష్టపడ్డ వారికి ప్రాధాన్యత క్రమేపి తగ్గింది. ఈ క్రమంలో పాత, కొత్త తెలుగుతమ్ముళ్ల మధ్య తేడాలు వచ్చాయి. అక్రమ సంపాదనలో పోటీ పెరిగింది. ఒకరి ప్రయత్నంలో మరొకరి జోక్యం ఎక్కువైంది. ఆ క్రమంలో ఎప్పటి నుంచో ఉన్న ఆగ్రహావేశాలు ఒక్కమారుగా బహిర్గతమయ్యాయి. పాతకడప మాజీ సర్పంచ్ కృష్ణారెడ్డి, ఇటీవల తెలుగుదేశం పార్టీలో చేరిన అండ్లూరు బాలకృష్ణారెడ్డి ఒకరికొకరు నా వ్యవహారంలో నీ జోక్యం అనవసరమంటూ మాటలు పెట్టుకున్నారు. ఇరువురి మధ్య మాటామాటా పెరిగింది. ఆపై ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఇంట్లోనే పరస్పర ముష్టిఘాతాలకు పాల్పడ్డారు. వారిలో ఒకరికి గోడకు తగులుకొని స్వల్ప గాయమైనట్లు సమాచారం. పక్క రూములో ఉన్న జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఇరువురికి సర్దిచెప్పాల్సి వచ్చింది. ఈమొత్తం వ్యవహారం అక్రమ కార్యకలాపాల నేపథ్యంలో చోటుచేసుకున్నట్లు తెలుస్తోంది. -
యోగా.. ఒంటికి మంచిదేగా..
ఇంటిని ఎలా శ్రద్ధగా నిర్మించుకుంటారో.. ఒంటిని(బాడీ) అలానే బాగు చేసుకోవాలి. డబ్బు లేని ఇల్లు ఉందేమో కానీ.. నేటి రోజుల్లో జబ్బు లేని ఇల్లు అరుదుగా కనిపిస్తుంది. ప్రపంచానికి దేశం అందించిన గొప్ప వరం యోగా. ఆరోగ్యంగా ఉండాలంటే యోగ సాధన ప్రధానం అని నిపుణులు చెబుతున్నారు. ఆసనాలతో ఆసుపత్రులు, మందులు, ఆపరేషన్లకు దూరంగా ఉండవచ్చునని అవగాహన కల్పిస్తున్నారు. నేడు అంతర్జాతీయ యోగ దినోత్సవం కావడంతో వేలాది మంది యోగ సాధనకు సిద్ధమవుతున్నారు. కురబలకోట : మారిన జీవన శైలి ప్రజారోగ్యంపై ప్రభావాన్ని చూపుతుంది. శారీకర శ్రమ లేకపోవడమే ఇందుకు ప్రధాన కారణం. సాంకేతిక పరిజ్ఞానం పెరిగిందని ముచ్చటపడుతున్నా.. వ్యాధులు కూడా అదే స్థాయిలో విజృంభిస్తుండడం కలవరం కలిగిస్తోంది. అనారోగ్యానికి గురైనప్పుడు ఆసుపత్రుల చుట్టూ తిరుగుతున్నారేగానీ.. ఆరోగ్య సాధనకు ప్రత్యామ్నాయ మార్గాలు ఉన్నాయనే సంగతిని విస్మరిస్తున్నారు. దేశంలో పూర్వీకులు అందించిన యోగా ఎన్నో రోగాలను నియంత్రణలో ఉంచుతుంది. పూర్వం రుషులు, యోగులు, మునులు, సిద్ధులు, సాధువులు యోగాతో ఆరోగ్యాన్ని నిక్షేపంగా ఉంచుకున్నారు. రోజూ అర గంట యోగ చేస్తే ఎలాంటి రోగమైనా కుదుటపడుతుందని అనుభవజ్ఞులు చెబుతున్నారు. మనిషి జీవన విధానం. వ్యక్తిగత, శారీరక, మానసిక ఆరోగ్యాన్ని మెరుగుపరుస్తుంది. శ్వాస క్రియ ద్వారా కణజాలానికి ఆక్సిజన్ అందడంతో క్రమేణా రోగాలు దూరమవుతాయి. ఆరోగ్యానికి వాకింగ్, ఎక్సర్ సైజ్, ధ్యానం, జిమ్లు తోడ్పడతాయి. తగినంత వెలుతురు, గాలి ఉంటే చాలు ఉన్న చోటునే కాదు ఎక్కడైనా ఆసనాలు చేసుకోవచ్చు. ప్రపంచాన్ని వణికించిన కరోనా మహమ్మారి తర్వాత ఆరోగ్యంపై అంతా దృష్టి సారిస్తున్నారు. శనివారం అంతర్జాతీయ యోగ దినోత్సవం రోజునైనా ఆసనాలు ప్రారంభించి ఆరోగ్య సాధనకు కృషి చేద్దామని పలువురు తమ అభిప్రాయాలు వెలిబుచ్చుతున్నారు. ముఖ్య ఆసనాలు భుజంగాసనం, పద్మాసనం, వజ్రాసనం, హలాసనం, సర్వాంగాసనం, శీర్షాసనం, శవాసనం, మయూరాసనం, వృక్షాసనం, పశ్చిమోత్తాసనం, చతురంగ దండాసనం, వీరభధ్ర ఆసనం, ధనురాసనం, నౌకాసనం, బలాసనం, చక్రాసనం, ఉష్ట్రాసనం, తాడాసనం, శలభాసనం, భ్రమరి, ప్రాణాయామం, సూర్య నమస్కారం లాంటివి ముఖ్యమైనవి. ఆసనాలతో ఆరోగ్యానికి రక్షణ నేడు అంతర్జాతీయ యోగా దినోత్సవం -
వేటగాళ్ల ఉచ్చులో పడి రైతుకు గాయాలు
మదనపల్లె రూరల్ : అటవీ జంతువుల కోసం వేటగాళ్లు పన్నిన కరెంట్ ఉచ్చులో పడి ఓ రైతు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం పెద్దమండ్యం మండలంలో జరిగింది. దిగువపల్లెకు చెందిన పెద్దిరెడ్డి కుమారుడు రైతు శ్రీనివాసులురెడ్డి(58) గురువారం రాత్రి తన పొలం వద్దకు వెళ్లాడు. రాత్రి వేళ గమనించకుండా పొలానికి సమీపంలో వేటగాళ్లు వన్యప్రాణుల కోసం ఏర్పాటుచేసిన కరెంట్ ఉచ్చులో చిక్కుకుని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. పెద్దమండ్యం పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
● రెండు పార్లమెంటరీస్టేషన్లలో ఆగని రైలు
3700 కిలో మీటర్ల మేర 48 గంటల పాటు నడిచే హంససఫర్ జిల్లా మీదుగా కశ్మీరుకు వెళ్లే ఈరైలుకు హాల్టింగ్ కల్పించాలని గతంలోనే కడప, రాజంపేట ఎంపీలు వైఎస్ అవినాష్రెడ్డి, పీవీ మిథున్రెడ్డి కేంద్ర రైల్వేమంత్రిత్వశాఖను కోరారు. పార్లమెంటరీ స్టేషన్లు అయిన కడప, రాజంపేటలో స్టాపింగ్ ఇవ్వాలని దక్షిణ మధ్యరైల్వే జనరల్ మేనేజరు నుంచి రైల్వే మంత్రిత్వశాఖను జిల్లా ప్రయాణికులు కోరుతున్నారు. రాజంపేట, కడప రైల్వేస్టేషన్లలో హంసఫర్ రైలుకు స్టాపింగ్కు రైల్వేమంత్రిత్వశాఖ, బోర్డు గ్రీన్సిగ్నల్ ఇస్తే కొంతవరకు రైలుకు ఎర్నింగ్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయని రైల్వే వర్గాలే ధృవీకరిస్తున్నాయి. -
ఆదాయం పెంచి అభివృద్ధికి కృషి చేయాలి
కురబలకోట: జిల్లాలోని పంచాయతీలు ఆదాయ వనరులను పెంపొందించుకుని గ్రామాల అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ సూచించారు. శుక్రవారం ఆమె మండలంలోని అంగళ్లులో పర్యటించారు. పారిశుద్ధ్య పనులను, సంపద తయరీ కేంద్రాలను పర్యవేక్షించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ కొత్తగా నిర్మించిన భవనాలకు పన్నులు విధించాలన్నారు. అలాగే నిబంధనలకు విరుద్ధంగా నిర్మించిన భవనాలు, అంగళ్లులో అక్రమంగా నిర్మించిన పీజీ హాస్టళ్లపై వెంటనే తగు చర్యలు తీసుకోవాలన్నారు. అవసరమైతే అక్రమ భవనాలు నిర్మించిన వారికి నోటీసులు జారీ చేసి రెగ్యులర్ చేయకపోతే కూల్చి వేయాలన్నారు. కేంద్ర, రాష్ర ప్రభుత్వాల నుంచి వచ్చే నిధులపైనే ఆధారపడకుండా సొంత ఆదాయ వనరులను కూడా పంచాయతీలు పెంపొందించుకోవాలన్నారు. పంచాయతీలను ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. ఆస్తి పన్ను, పన్నేతర ఆదాయ వనరులు సక్రమంగా వసూలు చేయాలన్నారు. పన్నులతోనే పంచాయతీల అభివృద్ధి సాధ్యమని ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. గ్రేడ్ల వారిగా పంచాయతీలను పరిగణిస్తున్నట్లు తెలిపారు. ఆమె వెంట డీఎల్పీఓ నాగరాజు, డిప్యూటీ ఎంపీడీఓ అశ్విని, అంగళ్లు, కురబలకోట గ్రామ కార్యదర్శులు ఉదయ్ కుమార్, శేషగిరికుమార్ పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి రాధమ్మ -
తొలి అవకాశాన్ని వదులుకోవద్దు
రాజంపేట టౌన్: చదువుకున్న వ్యక్తి జీవితంలో స్థిరపడాలంటే ఉద్యోగం తప్పని సరి అని తొలిసారిగా వచ్చే ఉద్యోగ అవకాశాలను ఎవరు కూడా వదులుకోకుండా సద్వినియోగం చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్ సిహెచ్.రామ్మూర్తి తెలిపారు. రాజంపేటలోని ప్రభుత్వ ఐటీఐలో శుక్రవారం నిర్వహించి జాబ్మేళాలో ఆయన మాట్లాడారు. ఆర్థికంగా వెనకబడిన వారు త్వరగా ఉద్యోగ, ఉపాధి అవకాశాలు పొందాలన్న లక్ష్యంతో ఐటీఐ కోర్సును పూర్తి చేస్తారన్నారు. అభ్యర్థులు తమ ముంగిటికే వచ్చిన ఉద్యోగ అవకాశాలను నిర్లక్ష్యం చేయవద్దని సూచించారు. ఇటీవలే ఐటీఐ పూర్తి చేసిన వారికి, ఐటీఐ పరీక్షలు రాయబోయే విద్యార్థులను ఏ కంపెనీ కూడా తమ అనుభవం గురించి అడగదన్నారు. జాబ్ మేళా లో వివిధ కంపెనీలు ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నాయన్నారు. అవకాశాలను సద్వినియో గం చేసుకోవాలన్నారు. జాబ్మేళాలో ఎల్అండ్డీ కంపెనీ ప్రతినిధి ప్రమోద్, యాంత్రిక పవర్ సూల్యూషన్ ప్రతినిధి హర్ష, జేవై సాఫ్ట్వేర్ సొల్యూషన్స్ ప్రతినిధి కార్తీక్ కుమార్, టాఫే కంపెనీ ప్రతినిధి సికిందర్ పాల్గొన్నారు. -
ఎనిమిది గంటల పనిదినాల పెంపుపై నిరసన
రాయచోటి : ఎనిమిది గంటలపాటు పనిచేయాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై కార్మికులకు నిరసన తెలిపారు. సీఐటీయూ ఆధ్వర్యంలో శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయం ఎదుట మున్సిపల్ శానిటేషన్, ఇంజినీరింగ్ సిబ్బంది మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బీవీ.రమణ మాట్లాడుతూ ఎనిమిది గంటల ఆరోగ్యం, ఎనిమిది గంటల నిద్ర ఉంటే మనిషి ఆరోగ్యంగా ఉంటారన్నారు. ప్రపంచ ఆరోగ్య సంస్థ సూచనలు లెక్కచేయకుండా కార్పోరేట్ల జేబు నింపడానికి కార్మికులు, కూలీల శ్రమ దోచిపెట్టడం తగదన్నారు. మున్సిపల్ కార్మికులకు తల్లికి వందనం పథకం వర్తింపజేయాలని, పారిశుద్ధ్య వాహన డ్రైవర్లకు రూ.24,500 వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. తమ న్యాయపరమైన డిమాండ్లను పరిష్కరించని పక్షంలో జూన్ 23వ తేదీ నుంచి సమ్మె చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో రాంబాబు, అక్బర్, శంకరయ్య, రమణ, చెన్నయ్య, చంద్రశేఖర్, ఆంజనేయులు, రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
‘వన్ ఫైల్, వన్ లైఫ్’ నినాదంతో పనిచేయాలి
రాయచోటి: వన్ ఫైల్, వన్ లైఫ్ అనే నినాదంతో రెవెన్యూశాఖ పనిచేయాలని, పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి అంశంలో ముడిపడిన శాఖ రెవెన్యూ శాఖ అని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో శుక్రవారం రెవెన్యూ డే వేడుకల కార్యక్రమం ఘనంగా నిర్వహించారు.కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, మదనపల్లి సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, డీఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. రెవెన్యూ డే మీ అందరితో కలిసి జరుపుకోవడం చాలా సంతోషకరమని, అలాగే రెవెన్యూ సిబ్బంది అందరూ కూడా మంచిగా పనిచేసి జిల్లాకు మంచి పేరు వచ్చే విధంగా భవిష్యత్తులో పనిచేయాలని కలెక్టర్ అన్నారు. రెవెన్యూ సిబ్బందికి ఏ పని అప్పచెప్పినా పూర్తిస్థాయిలో శ్రద్ధతో లక్ష్యాన్ని చేరుకునే విధంగా పని చేస్తున్నారన్నారు. రాష్ట్రంలో 26 జిల్లాల్లో ప్రభుత్వ పథకాల అమలు తీరులో చాలా పథకాలలో అన్నమయ్య జిల్లా మొదటి స్థానంలోఉండడం గర్వించదగ్గ విషయమన్నారు. అదే విధంగా ప్రభుత్వ కార్యక్రమాలలో 60 నుండి 70 శాతం వరకు రెవెన్యూ శాఖకు సంబంధించినవే ఉంటాయన్నారు. ప్రజల నుండి వచ్చే రెవెన్యూ సమస్యలను పరిష్కరించేందుకు రెవెన్యూ శాఖలో జాప్యం ఎక్కువగా ఉందన్న అపోహను తొలగించుకోవాలన్నారు. అందుకు టెక్నాలజీని ఉపయోగించుకొని ఎప్పటికప్పుడు శిక్షణ పొంది ప్రజల సమస్యలను పరిష్కరించి ప్రజలకు ఒక నమ్మకాన్ని కల్గించే విధంగా రెవెన్యూ శాఖ సిబ్బంది పనిచేయాలన్నారు. ఏ శాఖకు కష్టం వచ్చినా రెవెన్యూ శాఖ ముందు ఉంటుందన్నారు. రెవెన్యూశాఖ ఎంత పురాతనమైనది, ఏ విధంగా ఏర్పడింది, దాని ప్రాముఖ్యత, రికార్డులు నిర్వహణ సిబ్బంది పనితీరు, క్రమ శిక్షణ, సమాజంలో వారి ప్రాముఖ్యత, భూత భవిష్యత్తు, వర్తమానాలలో ఏ విధంగా విధులు నిర్వహించారనే విషయాలు, సలహాలు, సూచనలు జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, రాయచోటి ఆర్డీఓ, రెవెన్యూ, రిటైర్డ్ ఉద్యోగులు తెలిపారు. సీనియర్ ఉద్యోగులకు సన్మానం: రెవెన్యూ డే సందర్భంగా జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్, మదనపల్లి సబ్ కలెక్టర్లు, కలెక్టర్ కార్యాలయం ఆవరణంలో భారీ కేక్ను కట్ చేశారు. ఈ సందర్భంగా సీనియర్ ఉద్యోగులను, పదవీ విరమణ పొందిన రెవెన్యూ ఉద్యోగులను, ఉత్తమ సేవలు అందించి వివిధ హోదాలలో పనిచేస్తున్నటువంటి సిబ్బందికి ప్రశంసా పత్రం, శాలువాలతో జిల్లా కలెక్టర్ సన్మానించారు. కార్యక్రమంలో రాయచోటి తహశీల్దార్ నరసింహ కుమార్, కలెక్టరేట్ ఉద్యోగులు, తహసీల్దార్లు, రెవెన్యూ ఉద్యోగులు తదితరులు పాల్గొన్నారు. పుట్టుక నుంచి మరణం వరకు ప్రతి అంశంలో ముడిపడిన శాఖ రెవెన్యూ శాఖ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ఛామకూరి కలెక్టరేట్లో ఘనంగా రెవెన్యూ డే వేడుకలు -
బ్రహ్మంగారి హుండీ ఆదాయం రూ.32లక్షలు
బ్రహ్మంగారిమఠం: ప్రముఖ పుణ్యక్షేత్రం శ్రీ పోతులూరు వీరబ్రహ్మంద్రస్వామి మఠంలో శుక్రవారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు.మూడునెలల్లో భక్తులు సమర్పించిని కానుకలను లెక్కించగా రూ.32లక్షలు నగదు, 13 గ్రాముల బంగారం, 280గ్రాములు వెండి ఆభణాలు వచ్చినట్లు దేవస్థానం మేనేజర్ ఈశ్వరాచారి తెలిపారు. కార్యక్రమంలో స్థానిక పరిపాలనా అధికారి శంకర్బాలాజీ, ఎండోమెంట్ అధికారులు, పూర్వపు మఠాధిపతి కుమారులు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. వైద్య సేవలు మెరుగు పడాలి ప్రొద్దుటూరు క్రైం: జిల్లా ఆస్పత్రిలో వైద్య సేవలు ఇంకా మెరుగు పడాల్సిన అవసరం ఉందని డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జాయింట్ కమిషనర్ డాక్టర్ రమేష్నాథ్ తెలిపారు. ప్రొద్దుటూరు జిల్లా ఆస్పత్రిని శుక్రవారం ఆయన తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాలను క్షుణ్ణంగా పరిశీలన చేసి ఆయా విభాగాల అధికారులు, సిబ్బందితో మాట్లాడారు. ఏవైనా లోటుపాట్లు ఉంటే సరి చేసుకోవాలని సూచించారు. వార్డులను తనిఖీ చేసి అక్కడి ఇన్పేషెంట్లతో రమేష్నాథ్ మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆస్పత్రిలో పారిశుధ్యం సరిగా లేదని మెరుగుపడాల్సిన అవసరం ఉందన్నారు. ఓపీ విభాగాలు అపరిశుభ్రంగా ఉండటంతో అసంతృప్తి వ్యక్తం చేశారు. ఆస్పత్రిలోని సిబ్బంది, వైద్యుల ఖాళీలను త్వరలో భర్తీ చేస్తామని తెలిపారు. ఆస్పత్రిలోని సమస్యలపై మెడికల్ సూపరింటెండెంట్ శ్రీవాణి, వైద్యులు ఆనంద్బాబులతో చర్చించారు. కార్యక్రమంలో వైద్యులు గోపాల్, రూపానంద్, నర్సింగ్ సూరింటెండెంట్ రాణమ్మ, అన్ని విభాగాల సిబ్బంది పాల్గొన్నారు. -
ఇరువర్గాలపై కేసు నమోదు
కలికిరి : స్థానిక మార్కెట్ యార్డులో గురువారం ఉదయం కూలీల మధ్య చోటు చేసుకున్న చిన్నపాటి తగాదా చిలికి చిలికి గాలివానగా మారి రెండు ఊర్ల మధ్య ఘర్షణకు దారితీసింది. పోలీసులు జోక్యం చేసుకుని గురువారం సాయంత్రం ఇరువర్గాల వారిని పోలీస్ స్టేషన్కు పిలిపించి బైండోవర్ చేసుకోవడానికి ప్రయత్నించినా తిరిగి అక్కడ ఇరువర్గాల వారు ఘర్షణ పడ్డారు. పరిస్థితి అదుపులోకి రాకపోవడంతో గురువారం రాత్రి ఇరువర్గాలకు చెందిన 12 మందిపై కేసు నమోదు చేశారు. మార్కెట్ సమీపంలోని గిరిజన కాలనికి చెందిన శ్రీనివాసులు ఇచ్చిన ఫిర్యాదుపై కలికిరి మాదిగపల్లికి చెందిన పవన్, వెంకటేష్, బాలాజీ, చరణ్, సాయి, సమరలపై, అలాగే కలికిరి మాదిగపల్లికి చెందిన బాలాజీ పిర్యాదు మేరకు గిరిజనకాలనీకి చెందిన శ్రీనివాసులు, బన్ని, సత్య, కౌశిక్, సతీష్, రఘులపై కేసు నమోదు చేసినట్లు సీఐ రెడ్డి శేఖర్రెడ్డి తెలిపారు. అలాగే మార్కెట్ యార్డులో ఇకపై ఎలాంటి తగాదాలు చోటు చేసుకోకుండా ఉదయం 4 గంటల నుంచి పోలీసు నిఘా ఏర్పాటు చేసినట్లు సీఐ తెలిపారు. ద్విచక్ర వాహనాల దొంగ అరెస్టురైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని పలు వాహనాలను చోరీ చేసిన నిందితుడిని సీఐ హేమసుందర్ రావు ఆధ్వర్యంలో శుక్రవారం అరెస్టు చేశారు. అతడి నుంచి ట్రాక్టర్, ద్విచక్ర వాహనం స్వాధీనం చేసుకున్నారు. సీఐ మాట్లాడుతూ నిందితుడు గతంలో పలు కేసుల్లో ముద్దాయిగా ఉన్నాడని, అనంతపురం జిల్లాలో 12 కేసులు అతడిపై నమోదైనట్లు తెలిపారు. పోలీస్ జాగిలం మృతి తీరనిలోటుకలకడ : దొంగలను పట్టుకోవడంతో సేవలు అందించి గోల్డ్మెడల్ అవార్డు పొందిన జాకీ మృతి పోలీస్ వ్యవస్థకు తీరని లోటు అని రిజర్వ్ ఇన్స్పెక్టర్(ఆర్ఐ) పెద్దయ్య, ఇన్చార్జ్ సీఐ ప్రసాద్బాబు అన్నారు. పులివెందుల వెటర్నిటీ ఆసుపత్రిలో అనారోగ్యంతో మృతి చెందిన జాకీ అంత్యక్రియలు కలకడ పోలీస్ స్టేషన్ పరేడ్ గ్రౌండ్ ఆవరణలో శుక్రవారం నిర్వహించారు. నాలుగు రౌండ్లు కాల్పులు జరిపి గౌరవ వందనంతో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్బంగా పోలీస్ అధికారులు మాట్లాడుతూ ఎర్రచందనం దొంగలను పట్టుకోవడంలోనూ, చోరీ కేసులు చేధిచడంలోనూ జాకీ 9 ఏళ్లు సేవలందించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కలకడ, వాల్మీకిపురం, రిజర్వ్పోలీసులు పాల్గొన్నారు. -
ఆదర్శ పాఠశాల ప్రిన్సిపల్పై విచారణ
కలకడ : కలకడ ఆదర్శపాఠశాల ప్రిన్సిపల్ మల్లంగ్షా వలిపై శుక్రవారం విచారణ చేపట్టారు. మల్లంగ్షావలి ప్రిన్సిపల్గా పనిచేసిన సమయంలో విద్యార్థులకు పురుగులు పట్టిన బియ్యంతో భోజనం వండారని, ఎన్నో అవకతవకలకు పాల్పడ్డారని ఆరోపణలు వచ్చాయి. దీంతో జిల్లా విద్యా శాఖ అధికారి, కడప ఆర్జేడీ విచారణ చేయాలని మదనపల్లె డీవైఈఓ లోకేశ్వర్రెడ్డిని ఆదేశించారు. ఈ మేరకు ఆయన విద్యార్థులు, పాఠశాల అభివృద్ధి కమిటీ సభ్యులు, ఉపాధ్యాయులతో వేర్వేరుగా విచారణ చేశారు. ప్రిన్సిపల్ సమాధానం తీసుకుని నివేదిక ఉన్నతాధికారులకు పంపుతామని డీవైఈఓ తెలిపారు. అనంతరం విధ్యార్థులతో కలిసి భోజనం చేశారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు మునీంద్రనాయక్, వెంకట్రమణరెడ్డి, ఇన్చార్జి ప్రిన్సిపల్ గంగాధర్, తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో మిగిలివున్న సీట్ల భర్తీ కోసం రెండవ విడత అడ్మిషన్ల ప్రక్రియను చేపడుతున్నట్లు ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్ సి.రామ్మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదవ తరగతి ఉత్తీర్ణులై ఆసక్తిగల అభ్యర్థులు జూలై 12వ తేదీలోపు www.iti.a p.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. దరఖాస్తు చేసుకున్న అనంతరం తమకు సమీపంలో ఉన్న ప్రభుత్వ ఐటీఐలలో విధిగా వెరిఫికేషన్ చేయించుకోవాలని తెలిపారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తారన్నారు. అర్హులైన అభ్యర్థులకు జూలై 21వ తేదీ కౌన్సె లింగ్ ఉంటుందని, ఆ కౌన్సెలింగ్లో అభ్యర్థులు ఖాళీలను బట్టి తమకు నచ్చిన ఐటిఐ, ట్రేడ్లను ఎంపిక చేసుకోవచ్చని తెలిపారు. డిజిటల్ అసిస్టెంట్ సస్పెన్షన్ బి.కొత్తకోట: మండలంలోని వడిగలవాండ్లపల్లె సచివాలయ డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫకృద్దీన్ను సస్పెండ్ చేస్తూ కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఉత్తర్వు జారీ చేశారు. బుధవారం గుండ్లవారిపల్లె గ్రామానికి చెందిన అనూరాధ, శంకర, నాగభూషణంలు తల్లికి వందనం పథకం గురించి ఆరా తీసేందుకు సచివాలయం వచ్చారు. ఆక్కడ పనిచేస్తున్న డిజిటల్ అసిస్టెంట్ బాబా ఫకృద్దీన్ సరైన సమాధానం ఇవ్వకుండా దురుసుగా ప్రవర్తించడమే కాకుండా వారిపై దాడి చేసి గాయపరచినట్టు బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశారు. దీనిపై స్పందించిన కలెక్టర్ శ్రీధర్ గురువారం గుండ్లవారిపల్లెకు వెళ్లి బాధితులను పరామర్శించి ధైర్యం చెప్పారు. ఈ నేపథ్యంలో ఎంపీడీఓ కృష్ణవేణి బాధితులు, గ్రామస్తులను విచారించారు. నివేదికను ఉన్నతాధికారులకు పంపగా ఈ మేరకు చర్యలు తీసుకున్నారు. ఈ ఘటనపై కలెక్టర్ శ్రీధర్ మదనపల్లె సబ్కలెక్టర్ను విచారణ అధికారిగా నియమించారు. స్కిల్హబ్ సెంటర్ ద్వారా ఉపాధి కల్పన శిక్షణ రాయచోటి టౌన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం ఏపీ స్టేట్ డెవలప్మెంట్ కార్పోరేషన్ ( ఏపీఎస్ఎస్డీసీ) ద్వారా రాయచోటి ప్రభుత్వ పాలిటెక్నికల్ స్కిల్ హబ్ సెంటర్లోని వెబ్ డెవెలపర్, టైలరింగ్లో శిక్షణ నిర్వహించి ఉపాధి కల్పించనున్నట్లు ఆ కళాశాల ప్రిన్సిపల్ పి. శివశంకర్, జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఆసక్తి కలిగిన వారు తమ పేరును రిజిష్టేన్ చేసుకోవాలని కోరారు. స్కిల్ హబ్ సెంటర్ కోర్సు మూడు నెలలు కాలపరిమితి ఉంటుందని, దీనికి ఇంటర్ లేదా దైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు దరఖాస్తులు చేసుకోవచ్చున్నారు. అలాగే టైలరింగ్ కోర్సు మూడు నెలల కాలపరిమితి ఉంటుందని, దీనికి 10వ తరగతి పాస్ లేదా ఫేయిలైనవారు దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. తిరుపతి నుంచి మదనపల్లికి స్పెషల్ ప్యాసింజర్ రైలు కలికిరి: తిరుపతి నుంచి మదనపల్లి వరకు స్పెషల్ ప్యాసింజర్ రైలును ఈ నెల 25 నుంచి జూలై నెల 31వ తేదీ వరకు నడుపనున్నట్లు రైల్వే ఉన్నతాధికారులు ఉత్తర్వులు జారీ చేశారు. తిరుపతిలో ఉదయం 5.15 గంటలకు బయల్దేరే స్పెషల్ ప్యాసింజరు (07261) పాకాలకు 05.55 గంటలకు, పీలేరు కు 6.25 గంటలకు కలికిరికి 6.40 గంటలకు మదనపల్లికి 8.15 గంటలకు చేరుకుంటుంది. తిరిగి మదనపల్లిలో మధ్యాహ్నం 3 గంటలకు స్పెషల్ ప్యాసింజరు(07262) కలికిరి 3.30 గంటలకు, పీలేరుకు 03.57 గంటలకు, పాకాలకు 4.50 గంటలకు, తిరుపతికి సాయంత్రం 6 గంటలకు చేరుకుంటుంది. కాగా తిరుపతి–గంటూరు ఎక్స్ప్రెస్ను మదనపల్లి వరకు పొడిగించి తాత్కాలికంగా స్పెషల్ ప్యాసింజరుగా నడుపనున్నారు. ఆగస్టు నెల నుంచి ఇదే రైలుకు రిజర్వేషన్ సౌకర్యం కూడా అందుబాటులోకి రానున్నట్లు సమాచారం. ఉద్యోగాలకు ఎంపిక కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో శుక్రవారం జాబ్ మేళా నిర్వహించారు. ప్రముఖ కంపెనీలైన ఎల్ అండ్ టి, కోల్గేట్, రానే టెక్నాలజీస్, సిస్కోల్, గ్రీన్టెక్, షిర్డిసాయి కంపెనీ, టివిఎస్, ఆపోలా ౖటైల్స్, చానెల్ప్లే, జాన్డీర్, ఆటోమోటివ్, అమర్రాజా, కియా కంపెనీలు పాల్గొన్నాయని ప్రభుత్వ ఐటీఐల జిల్లా కన్వీనర్ జ్ఞానకుమార్ తెలిపారు. ఈ జాబ్మేళాకు జిల్లావ్యాప్తంగా 312 మంది విద్యార్థులు హాజరుకాగా వివిధ ట్రేడ్స్కు సంబంధించి 256 మంది ఉద్యోగాలకు ఎంపికై నట్లు జ్ఞానకుమార్ తెలిపారు. ఉద్యోగాలకు ఎంపికై న వారిని జ్ఞానకుమార్తోపాటు పలు ప్రభుత్వ ఐటీఐ కళాశాలల ప్రిన్సిపాళ్లు అభినందించారు. -
రైలు కింద పడి యువకుడు ఆత్మహత్య
కమలాపురం : పట్టణంలోని తెలుగు వీధికి చెందిన హరీష్ కుమార్ (26) రైలు కింద పడి శుక్రవారం ఆత్మహత్య చేసుకున్నాడు. రైల్వే పోలీసుల వివరాల మేరకు.. పట్టణానికి చెందిన హరీష్ కుమార్ శుక్రవారం రాత్రి కమలాపురం పట్టణ శివారులోని చెరువు కట్ట వద్ద రైల్వే ట్రాక్పై గుర్తు తెలియని రైలు కింద పడి ఆత్మహత్య చేసుకున్నాడు. శరీరం రెండు ముక్కలైంది. ట్రాక్ మాన్ సమాచారం మేరకు రైల్వే పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. మృతదేహానికి పంచనామా నిర్వహించి పోస్ట్ మార్టమ్ నిమిత్తం రిమ్స్కు తరలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కువైట్ వెళ్లిన హరీష్ మూడు మాసాల క్రితం కమలాపురం వచ్చాడని, మృతి గల కారణాలు తెలియరావాల్సి ఉందని వారు తెలిపారు. లారీ డ్రైవర్కు జైలుశిక్షవల్లూరు(చెన్నూరు) : మద్యం సేవించి లారీ నడుపుతూ పోలీసుల తనిఖీల్లో పట్టుబడిన వ్యక్తికి ఏడు రోజుల జైలు శిక్ష, రూ 2,500 జరిమానా విధిస్తూ కడప ఫస్ట్ స్పెషల్ జేఎస్సీఎమ్ కోర్టు శుక్రవారం తీర్పు చెప్పినట్లు చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి తెలిపారు. మండలంలో గురువారం పోలీసులు బ్రీత్ అనలైజర్ సహాయంతో తనిఖీలు నిర్వహించారు. వేల్పూర్ల రామకృష్ణ మద్యం తాగి లారీ నడుపుతూ పట్టుబడ్డాడు. పోలీసులు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరచగా నేరం రుజువు కావడంతో కడప ఫస్ట్ స్పెషల్ జుడీషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు మేజిస్ట్రేట్ మంగళ గౌరీ జైలు శిక్ష విధించినట్లు సీఐ తెలిపారు. ఏపీజీబీ కార్యాలయంపై సోలార్ యూనిట్ కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప ఏపీజీబీ హెడ్ ఆఫీస్ అనెక్స్ భవనంపై 100 కిలోవాట్ల ఆన్గ్రిడ్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్లను ప్రారంభించామని ఆ బ్యాంకు చైర్మన్ కె.ప్రమోద్కుమార్రెడ్డి తెలిపారు. శుక్రవారం సోలార్ యూనిట్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ ప్రధానమంత్రి సూర్యఘర్ ముఫ్త్ బిజిలీ యోజన కార్యక్రమం కింద రూ.52 లక్షల ఖర్చులతో 100 కిలోవాట్ల ఆన్ గ్రిడ్ రూఫ్ టాప్ సోలార్ యూనిట్ ప్రారంభించామన్నారు. అలాగే అనంతపురం ప్రాంతీయ కార్యాలయంలో రూ.14 లక్షలతో 25 కిలోవాట్ల ఆన్గ్రిడ్ స్టిమ్, 29 బ్రాంచ్లలో 89 కిలో వాట్ల సామర్థ్యంగల ఆఫ్ గ్రిడ్ సిస్టమ్లను ఏర్పాటుచేశామన్నారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ డ్యూటీ ఆఫీసర్ అరుణకుమార్, జీఎంలు హర్కేశ్వర్ ప్రసాద్, పవన్కుమార్సింగ్, కడప ప్రాంతీయ మేనేజర్ శ్రీనివాసప్రసాద్, బ్యాంకు సిబ్బంది పాల్గొన్నారు. -
బీరు బాటిళ్లతో యువకుల హల్చల్
మదనపల్లె రూరల్ : పట్టణంలోని నీరుగట్టువారిపల్లె రామిరెడ్డి లే అవుట్లోని వివేకానంద స్కూల్ సమీపంలో కొందరు యువకులు బీరు బాటిళ్లు పట్టుకుని శుక్రవారం హల్చల్ చేశారు. పాఠశాలకు వెళ్లే దారిలో రోడ్డుపై గొడవపడుతూ వీరంగం సృష్టించారు. అదే మార్గంలో పాదచారులు, విద్యార్థులు వెళుతున్నా లెక్కపెట్టకుండా ఒకరిపై ఒకరు పిడి గుద్దులు గుద్దుకుంటూ అరుపులు, కేకలతో భయం కలిగించేలా వ్యవహరించారు. చేతిలో బీరు బాటిల్తో పరిగెత్తుతూ, స్థానికులను భయాందోళనకు గురిచేశారు. ఈ ఘటనను కొందరు సెల్ఫోన్లో చిత్రీకరించి, పోలీసులకు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న ఆకతాయిలు...మెల్లగా అక్కడి నుంచి జారుకున్నారు. పాఠశాల పరిసర ప్రాంతాల్లో పోలీసులు నిఘా పెంచాలని స్థానికులు కోరుతున్నారు. -
బైక్పై నుంచి జారిపడి వృద్ధురాలి మృతి
మదనపల్లె రూరల్ : బైక్పై నుంచి జారిపడి తీవ్రంగా గాయపడిన వృద్ధురాలు మృతి చెందిన సంఘటన శుక్రవారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. జంగాలపల్లెకు చెందిన రాజమ్మ(80)కు అనారోగ్యంగా ఉండడంతో డాక్టర్ వద్దకు వెళ్లేందుకు బంధువు శ్రీరాములు ద్విచక్ర వాహనంలో చౌడేపల్లెకు బయలుదేరింది. చికిత్స అనంతరం తిరిగి స్వగ్రామానికి వస్తుండగా, మార్గమధ్యంలో కుక్క అడ్డు రావడంతో వాహనం అదుపుతప్పింది. బైక్పై కూర్చొన్న రాజమ్మ ప్రమాదవశాత్తూ జారి కిందపడింది. తలకు తీవ్రగాయాలు కాగా 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ మృతిచెందింది. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించి, చౌడేపల్లె పోలీసులకు అవుట్ పోస్ట్ సిబ్బంది సమాచారం అందించారు. -
సూక్ష్మంలో మోక్షం
యోగాతో శరీరంలో జాయింట్స్ కదులుతాయి. సూక్ష్మంలో మోక్షం లాంటిది. కండరాల దృఢత్వం, నాడీ వ్యవస్థ చైతన్యంగా మారుతుంది. రక్త ప్రసరణ మెరుగవుతుంది. తద్వారా రోగ నిరోధక శక్తి పెరుగుతుంది. యోగా సాధకులు, అభ్యాసకులు పది మందిలో ప్రత్యేకంగా కన్పిస్తారు. తనకున్న ఆరోగ్య సమస్యలు నియంత్రణలో ఉన్నాయి. – సురేష్, సివిల్ ఇంజినీరు ఆన్లైన్లో నేర్చుకున్నా వివిధ రోగాల నియంత్రణలో యోగా దివ్య ఔషదం. నేను ఆస్ట్రేలియాలో పని చేస్తున్నా. మూడేళ్లుగా ఆన్లైన్ ద్వారా యోగాసనాలు చేస్తున్నా. ప్రస్తుత రోజుల్లో రోగం వస్తే డాక్టర్లు, ఆసుపత్రుల వైపు చూస్తున్నారే గాని యోగా తదితర వ్యాయామాలు ఉన్నాయన్న సంగతినే మరచిపోతున్నారు. యోగాతో వ్యాధులు నియంత్రణలో ఉంటాయని గుర్తించా. – ప్రతాప్, ఆస్ట్రేలియా విద్యార్థి స్థాయిలోనే నేర్చుకోవాలి ప్రతి విద్యార్థి చదువు సంధ్యలతో పాటు యోగా విధిగా నేర్చుకోవాలి. తల్లిదండ్రులు ప్రోత్సహించాలి. చిన్న వయస్సులోనే వివిధ జబ్బులతో బాధపడుతున్నవారు ఎందరో. యోగా శ్వాస క్రియ ద్వారా చాలా మట్టుకు రోగాలు నియంత్రణలో ఉంటాయి. చదువుల్లో రాణించడానికి శారీరక ఆరోగ్యం, మానసిక ఉల్లాసం, జ్ణాపకశక్తి,ఏకాగ్రత ముఖ్యం. –ఓం ప్రకాష్, యోగా సాధకులు