Annamayya District News
-
ఆవుల్లో కోహినూరు!
పుంగనూరు..● ఒక్క ఆవుతో మొదలై.. ఐదుకు చేరిక ● తక్కువ ఖర్చుతో పోషణ.. ఒక్కో దూడ ధర రూ. 1.50 లక్షల వరకు! ● పులిచెర్ల రైతు మురళీమోహన్రెడ్డి ‘గో’ మక్కువపులిచెర్ల (కల్లూరు), న్యూస్లైన్ : సాధారణంగా పశువుల పెంపకం అంటే శ్రమతో కూడుకున్న పని. గతంలో ప్రతి రైతు ఇంట్లో దేశీయ పశువులు ఉండేవి. కానీ ట్రాక్టర్ల రాకతో వాటి సంఖ్య తగ్గి, కేవలం పాల కోసం పెంచే జర్సీ ఆవులే ఊరూరా కనిపిస్తున్నాయి. ఇటువంటి తరుణంలో పులిచెర్లకు చెందిన రైతు గోటూరి మురళీమోహన్రెడ్డి విభిన్నంగా ఆలోచించారు. అంతరించిపోతున్న పుంగనూరు జాతి ఆవులపై మక్కువతో వాటి పెంపకాన్ని చేపట్టి నేడు తోటి రైతులకు ఆదర్శంగా నిలుస్తున్నారు. నమ్మకంతో మొదలై.. లాభసాటిగా మారి ఆరు సంవత్సరాల క్రితం, ఉదయాన్నే పుంగనూరు ఆవును చూస్తే శుభం జరుగుతుందన్న నమ్మకంతో మురళీమోహన్రెడ్డి రూ. 75 వేలు వెచ్చించి ఒక ఆవును కొనుగోలు చేశారు. మొదట ఇంటి ఆవరణలోనే పెంచినప్పటికీ, క్రమంగా వీటి సంఖ్య పెరగడంతో ప్రస్తుతం ఐదు ఆవులకు చేరింది. ఇందులో ఒక మగ ఆవు (నంది) కూడా ఉంది, దీని ద్వారానే బ్రీడింగ్ చేయిస్తున్నారు. సంఖ్య పెరగడంతో తన మామిడి తోపులో ప్రత్యేక షెడ్ ఏర్పాటు చేసి మనుషుల ద్వారా వీటిని కంటికి రెప్పలా చూసుకుంటున్నారు. ఇపుడు మరో ఆవు కూడా జతచేరనుంది. ఆదాయం ఇలా.. పాల ధర : ఈ ఆవు రోజుకు ఉదయం 2, సాయంత్రం 2 లీటర్ల పాలు ఇస్తుంది. లీటరు ధర మార్కెట్లో రూ.100 నుంచి రూ.200 వరకు పలుకుతోంది. దూడల విక్రయం : ఒక్కో దూడ ధర మార్కెట్లో రూ. 75 వేల నుంచి రూ. 1.50 లక్షల వరకు పలుకుతోంది. వ్యర్థాలకు డిమాండ్ : కేవలం పాలే కాకుండా, వీటి పేడ మరియు మూత్రానికి ప్రకృతి వ్యవసాయం చేసే వారి నుంచి విపరీతమైన డిమాండ్ ఉంది. బంగారుబాతు : నేటి కాలంలో పాడి పరిశ్రమ అంటే కేవలం పాల దిగుబడి మాత్రమే కాదు, మన దేశీయ పశు సంపదను కాపాడుకోవడం కూడా అని మురళీమోహన్రెడ్డి నిరూపిస్తున్నారు. తక్కువ పెట్టుబడి, తక్కువ రోగాలతో, అత్యధిక పోషక విలువలున్న పాలను అందించే పుంగనూరు ఆవుల పెంపకం రైతులకు నిజంగానే బంగారు బాతు లాంటిది. అంతరించిపోతున్న ఈ జాతిని కాపాడుకుంటూ, ఆర్థికంగా ఎదగవచ్చని ఆయన చాటిచెబుతున్నారు. -
కిచెన్లో చికెన్ కరువు
● కొండెక్కుతున్న కోడి ధరలు ● ఎండల దెబ్బకు కోళ్ల కొరత ● అప్పుల్లో కూరుకుపోతున్న రైతన్నమదనపల్లె అర్బన్ : మదనపల్లె ప్రాంతంలో మాంసం ధరలు సామాన్యులకు చుక్కలు చూపిస్తున్నాయి. ఒకప్పుడు మధ్యతరగతి కుటుంబాలకు అందుబాటులో ఉండే చికెన్, ఇప్పుడు ధరల విషయంలో నాటుకోడితో పోటీ పడుతోంది. ఎండల తీవ్రత వల్ల మార్కెట్లో కోళ్ల కొరత ఏర్పడి ధరలు అమాంతం పెరిగాయి. ధరల పెరుగుదల – గణాంకాలు గత జనవరిలో కిలో రూ. 170 నుంచి రూ. 200 మధ్య ఉన్న చికెన్ ధర, ప్రస్తుతం రూ. 250 నుంచి రూ. 270 కి చేరింది. నాణ్యమైన పెద్ద బ్రాయిలర్ కోళ్ల ధర అయితే ఏకంగా రూ. 330 నుంచి రూ. 360 పలుకుతోంది. నాటుకోడి కిలో ధర రూ.600 పలుకుతుండగా, మటన్ ధర కిలో రూ. 900 కి చేరడంతో, ప్రజలు చికెన్ వైపు మొగ్గు చూపుతున్నారు. ఎందుకీ పరిస్థితి? ఎండల సెగ : ఇటీవల సోకిన బర్డ్ ఫ్లూ వ్యాధి, తీవ్రమైన ఎండల వల్ల కోళ్లు భారీగా మృత్యువాత పడ్డాయి. నష్టాల్లో రైతు : లక్షలు ఖర్చు చేసి ఫారాలు ఏర్పాటు చేసినా, కోళ్ల మరణాలతో పెట్టుబడి కూడా రావడం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సిండికేట్ సెగ : కోళ్ల కంపెనీలు, ట్రేడర్స్ సిండికేట్గా మారి ధరలను నియంత్రిస్తుండటం వల్ల అటువినియోగదారులకు, ఇటు రైతులకు అన్యాయం జరుగుతోంది. భవిష్యత్తు ఏంటి జాతరల సీజన్ ప్రారంభమైన నేపథ్యంలో జూన్, జూలై నాటికి మటన్ ధర రూ. 1000 మార్కును తాకే అవకాశం ఉందని, ఈ క్రమంలో చికెన్ ధరలు కూడా ఆగస్టు (వినాయక చవితి) వరకు తగ్గే సూచనలు లేవని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. -
కార్పొరేట్కు దీటుగా కస్తూర్బా
● అత్యుత్తుమ విద్యాబోధన ● కేజీబీవీల్లోఅడ్మిషన్ల సందడి ● ఏప్రిల్ 1వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులకు అవకాశం ● 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు ఉచిత విద్య, వసతి ● బాలికల రక్షణే లక్ష్యం ● అంతా మహిళా సిబ్బందే మదనపల్లె సిటీ: పేద, అనాధ మరియు బడి బయట ఉన్న బాలికలకు అంతర్జాతీయ స్థాయి ప్రమాణాలతో విద్యాబుద్దులు నేర్పుతున్న కస్తూర్బాగాంధీ బాలికా విద్యాలయాలు నేడు కార్పొరేట్ విద్యా సంస్థలకు ధీటుగా రాణిస్తున్నాయి. జిల్లాలోని 17 కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైంది. ఆసక్తిగల విద్యార్థినులు ఏప్రిల్ 1వతేదీలోపు ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. జిల్లాలో బి.కొత్తకోట, చిన్నమండ్యం, గాలివీడు, కలకడ, కురబలకోట, లక్కిరెడ్డిపల్లె, ములకలచెరువు, పెద్దమండ్యం, పెద్దతిప్పసముద్రం, పుంగనూరు, రామాపురం, రామసముద్రం, రాయచోటి, సంబేపల్లి, తంబళ్లపల్లె, వగళ్లలలోని కేజీబీవీలలో అడ్మిషన్లకు నోటిఫికేషన్ విడుదల చేశారు. అర్హత, ఆసక్తిగల విద్యార్థులు డబ్యూ.డబ్యూ.డబ్యూ. ఏపీకెజీబీవీ.ఏపీసీఎఫ్ఎస్ఎస్.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. సీట్ల భర్తీ నిబంధనల మేరకు ఎస్సీ,ఎస్టీ,ఓబీసీ కేటగిరీ వారిగా ప్రాధాన్యత ఇస్తారు. ప్రస్తుతం 6వ తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు సీట్లను భర్తీ చేయనున్నారు. అందులో భాగంగా 6వ తరగతిలో మొత్తం సీట్లు భర్తీ చేస్తారు. 7 నుంచి ఇంటర్ సెకండియల్ వరకు ఖాళీల మేరకు అడ్మిషన్లు ఉంటాయి. విద్యావిధానం–గ్రూపులు ఇంటర్మీడియట్కు సంబంధించి ఒక్కో కేజీబీవీలో ఒక్కో గ్రూపును ప్రవేశపెట్టారు. 40 సీట్ల చొప్పున అడ్మిషన్లు ఉంటాయి. ఎంపీసీ,బైపీసీ,ఎంఈసీ,సీఈసీ,ఎంపీహెచ్డబ్యూ. ఎంఎల్టీ, అకౌంట్స్ గ్రూపులున్నాయి. పదో తరగతి పూర్తి చేసిన వారు ఉనోనత చదువులకు వెళ్లేలా ప్రత్యేక ప్రోత్సాహం అందిస్తున్నారు. కేజీబీవీల ప్రత్యేకతలు: ఆటలు,కరాటేలకు ప్రాధాన్యత ఇస్తారు. ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ లో శిక్షణ ఇస్తారు. ఆరోగ్యం, నైతిక విలువలు పెంపొందించేలా వ్యక్తిత్వ వికాసం తరగతులను నిర్వహిస్తారు. ప్రతి కేజీబీవీలో విద్యార్థులు ఆరోగ్య పరిస్థితులను పరీక్షించడానికి ఒక ఎఎన్ఎంలు ఉంటారు. కంప్యూటర్, వ్యాయామం, ఆరోగ్యం, వృత్తి నైపుణ్య విద్యను అమలు చేస్తున్నారు. తంబళ్లపల్లెలోని కస్తూర్బాగాందీ విద్యాలయం ప్రత్యేక తరగతుల్లో కేజీబీవీ విద్యార్థులు జిల్లాలోని కేజీబీవీల సంఖ్య : 17 6వ తరగతిలో ఖాళీలు : 680 7వ తరగతిలో ఖాళీలు : 81 8వ తరగతిలో ఖాళీలు : 19 9వ తరగతిలో ఖాళీలు : 25 10వ తరగతిలో ఖాళీలు : 27 ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం ఖాళీలు : 680 ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం ఖాళీలు : 216 జిల్లాలోని కేజీబీవీ పాఠశాలల్లో అడ్మిషన్లు జరుగుతున్నాయి. విద్యార్థినులు ఈ అవకాశం వినియోగించుకోవాలి. ఏప్రిల్ 1వతేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునేందుకు అవకాశముంది. పేద, అనాధ, బడిబయట పిల్లలు,బడి మానేసిన బాలికలు దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ ఎన్.అనూరాధ, సమగ్రశిక్ష అడిషనల్ప్రాజెక్టు కోఆర్డినేటర్. కేజీబీవీ పాఠశాలల్లోని ఉద్యోగుల సమిష్టి కృషితోనే మంచి ఫలితాలు సాధ్యమవుతున్నాయి. విద్యార్థుల ప్రతిభను మెరుగులు దిద్దేందుకు వారు నిరంతరం కృషి చేస్తున్నారు. జిల్లా స్థాయిలో రూపొందించిన ప్రణాళిను పకడ్బందీగా అమలు చేస్తున్నారు. దీంతో ఏటా పదో తరగతి ఫలితాలు మెరుగ్గా వస్తున్నాయి. – డాక్టర్ సుబ్రమణ్యం, డీఈఓ, -
ప్రజా సమస్యలను పరిష్కరించండి
మదనపల్లెఅర్బన్ : పీజీఆర్ఎస్ అర్జీల పరిష్కారంపై ప్రత్యేక దృష్టి సారించాలంటూ కలెక్టర్ నిషాంత్కుమార్ ఆదేశించారు. మదనపల్లె లోని కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కా ర వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ అర్జీల పరిష్కారంపై ఆయాశాఖల అధికారులు దృష్టి సారించాలన్నారు. ముఖ్యంగా అర్జీదారులతో నేరుగా మాట్లాడి పరిష్కారానికి కృషి చేయాలన్నారు. అలాగే గ్రామాల్లో పర్యటించి ప్రజా సమస్యల పరిష్కారానికి చొరవ చూపాలని సూచించారు. దీంతోపాటు సమస్యల పరిష్కారంలో లక్ష్యాలను చేరుకోవాలన్నారు. కాగా, సోమవారం ప్రజల నుంచి మొత్తం 332 అర్జీలను స్వీకరించినట్లు కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ శివనారాయణ్ శర్మ, సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి, ఆయాశాఖల అధికారులు పాల్గొన్నారు. అర్జీల వివరాలు కొన్ని.. ● మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ పాళెంకొండకు చెందిన కె.కృష్ణమూర్తి సమస్యను విన్నవిస్తూ తన భార్య పద్మావతమ్మ మూడేళ్ల కిందట పిడుగుపడి మరణించిందని చెప్పాడు. అయితే ఆమె పేరుమీద ఉన్న ఇల్లు తనపేరిట మార్చుకునేందుకు నానాకష్టాలు పడుతున్నట్లు ఆవేదన వ్యక్తం చేశాడు. నెలల తరబడి రెవెన్యూ అధికారుల చుట్టూ కాళ్లరిగేలా తిరుగుతున్నా.. ఎవరూ పట్టించుకోవడంలేదన్నాడు. పైగా లంచం డిమాండ్ చేస్తున్నట్లు ఆరోపించాడు. ● కురబలకోట మండలం నందిరెడ్డిగారిపల్లె పంచాయతీ ఎర్రజేనుపల్లెకు చెందిన ఎన్.బాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ సర్వేనంబర్–595లో ఉన్న 6.10 సెంట్ల వారసత్వ భూమిని అక్రమార్కులు కబ్జా చేశారన్నా డు. రీసర్వే చేసి తమ భూమిని తమకు అప్పగించాలంటూ అనేక సార్లు రెవెన్యూ అధికారులను కలసి విన్నవించినా వారు పట్టించుకోలేదన్నా డు. ముఖ్యంగా ఎక్కువ పొజిషన్లో ఉన్న వారు అక్రమార్కుల తో చేతులు కలిపి భూముల విక్రయానికి సిద్ధమయ్యారని ఆరోపించాడు. ఇదే జరిగితే తాము ఆర్థికంగా నష్టపోతామని ఆవేదన వ్యక్తం చేశాడు. ● భారత చైతన్య యువజన పార్టీ(బీసీవై)నాయకులు మాట్లాడుతూ బీసీల రక్షణ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కులగణన పూర్తి చేసి, బీసీ కార్పొరేషన్కు నిధులు విడుదల చేయాలన్నారు. అమరావతిలో బీసీలకు వెయ్యి ఎకరాలు కేటాయించి, ఎన్నికల్లో 44శాతం రిజర్వేషన్ కల్పించాలన్నారు. ఈ ఐదు డిమాండ్లను పరిష్కరించకుంటే కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా శాంతియుత ఆమరణ దీక్ష చేస్తామని హెచ్చరించారు. ● మదనపల్లె మండలం చిప్పిలి గ్రామానికి చెందిన లక్ష్మీసుకన్య, దేవేంద్ర దంపతులు మాట్లాడుతూ అంగన్వాడీ టీచర్ రాజేశ్వరీ, ఈమె భర్త కృష్ణారెడ్డి, సోదరి ప్రభావతమ్మలు చీటీలు నిర్వహిస్తూ తమను మోసం చేశారన్నారు. ఐదు చీటీలకు రూ.10లక్షలు మాత్రమే ఇచ్చి, మిగతా రూ.80లక్షలు ముంచేశారని ఆరోపించారు. తాలూకా పోలీసులు ఏకపక్షంగా వ్యవహరిస్తూ తమను పట్టించుకోవడంలేదన్నారు. తమకు రావాల్సిన సొమ్మును ఇప్పించి న్యాయం చేయాలంటూ బాధితులు కలెక్టర్కు విన్నవించారు. ఇళ్ల పట్టాలపై విచారణకు ఆదేశంరొంపిచెర్ల : రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని లక్ష్మీ నారాయణ కాలనీలో ప్రభుత్వం మంజూరు చేసిన ఇళ్ల పట్టాలపై విచారణకు జిల్లా కలెక్టర్ సుమితకుమార్ సోమవారం అదేశాలు జారీ చేశారు. సర్వేనంబరు 1605–1, 1606–2 లో 172 మంది లబ్ధిదారులకు ప్రభుత్వం ఇళ్ల పట్టాలను పంపిణీ చేసింది. అయితే ఇళ్ల పట్టాల పంపిణీలో స్థానిక ప్రజా ప్రతినిధులు చేతివాటం ప్రదర్శించి ఇతరులకు విక్రయించి సొమ్ము చేసుకున్నారని రొంపిచెర్లకు చెందిన దొరబాబు నాయుడు జిల్లా కలెక్టర్కు సోమవారం ఫిర్యాదు చేశారు. దీంతో 172 ఇళ్ల పట్టాలపై విచారణ చేసి నివేదిక ఇవ్వాలని కలెక్టర్ తహశీల్దార్ కిరణ్కుమార్ను అదేశించారు.కలెక్టర్ నిషాంత్కుమార్ -
జగన్ హయాంలోనే ఆలయాలకు మహర్దశ
సంబేపల్లె : గత వైఎస్ జగన్ ప్రభుత్వం హయాంలోనే ఆలయాలకు మహర్దశ కలిగిందని మాజీ మంత్రి ఆర్కే రోజా అన్నారు. రాయచోటి నియో జకవర్గంలోని సంబేపల్లె మండల శెట్టిపల్లె గ్రామం తిమ్మక్కగారిపల్లెలో నూతనంగా నిర్మించిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవంలో ఆమె ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. అంతకుముందు ఉత్సవ నిర్వాహకులు జి.ఉపేద్రనాథ్రెడ్డి, జెడ్పీటీసీ కవితారమేశ్రెడ్డి, రమేశ్కుమార్రెడ్డి, అనిరుధ్రెడ్డి మాజీ మంత్రి రోజాను ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి రోజా కొండలరాయుడు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఉత్సవ మూర్తికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా కొండలరాయుడు శ్రీ లక్ష్మీనరసింహస్వామి కృపాకటాక్షాలతో ప్రజలందరు సుఖసంతోషాలతో, ఐశ్వ ర్యాలతో జీవించాలని ఆకాంక్షించారు. గత వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రాయచోటి నియోజకవర్గం వ్యాప్తంగా ఎంపీ పీవీ మిథున్రెడ్డి, అప్పటి ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డిల కృషితో ఆలయాల నిర్మాణాలు విస్తృత స్థాయిలో చేపట్టడం అభినందనీయమన్నారు. లక్ష్మీనరసింహస్వా మి ఆశీస్సులు ప్రజలందరికీ లభించాలని ఆమె ఆకాంక్షించారు. కాగా శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో విగ్రహప్రతిష్ట మహోత్సవం సోమవారం వైభవంగా ప్రారంభమైంది. మూ డొందల ఏళ్లకు పైగా చరిత్ర కలిగిన కొండలరాయుడు శ్రీలక్ష్మీనరసింహస్వామికి శాస్త్రోక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించారు. విగ్రహం కదిలించి, దాన్యాదివాసం అనంతరం నూతన విగ్రహ ప్రతిష్టకు ముందు నిర్వహించే పిలుపు పూజలు అత్యంత వైభవంగా నిర్వహించారు. భక్తులు,ప్రజలతో మమేకం... పూజా కార్యక్రమాలుకు విచ్చేసిన భక్తులు ,ప్రజలతో మాజీ మంత్రి ఆర్కె. రోజా ఆత్మీయంగా మమేకమయ్యారు. ప్రతి ఒక్కరితో స్నేహపూర్వకంగా మాట్లాడి ప్రేమానురాగాలు పంచుకున్నారు. భక్తులతో కలిసి ఆధ్యాత్మిక వాతావరణంలో పాల్గొని అందరి అభిమానం పొందారు. శ్రీ లక్ష్మీనరసింహ స్వామి విగ్రహప్రతిష్ట మహోత్సవంలో మాజీ మంత్రి రోజా -
సమస్యల పరిష్కారానికే పీజీఆర్ఎస్
మదనపల్లెటౌన్: ప్రజల సమస్యలు పరిష్కరించేందుకే పీజీఆర్ఎస్ నిర్వహిస్తున్నట్లు జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా నూతన ఎస్పీ కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై వచ్చి న బాధితుల నుంచి అడిషనల్ ఎస్పీ అర్జీలను స్వీకరించారు. సత్వర చర్యలకు సంబంధిత సీఐ, ఎస్ఐలతో ఏఎస్పీ నేరుగా మాట్లాడి పరిష్కారం చూపారు. టీబీ ముక్త్ భారత్కు శ్రీకారం –కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె: జిల్లాలో క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించి క్షయ వ్యాధి రహిత జిల్లాగా మా ర్చాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. ప్రపంచ క్షయ నివారణ దినోత్సవం సందర్భంగా మంగళవారం నుంచి ప్రారంభమవుతున్న టీబీ ముక్త్ భారత్ అభియాన్–100 రోజుల కార్యక్రమంపై ప్రజ ల్లో అవగాహన కల్పించేందుకు సోమవారం క్షయ వ్యాధి రహిత ప్రచార పోస్టర్లను కలెక్టర్ అధికారులతో కలిసి విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 100 రోజుల కార్యక్రమాన్ని మూడు దశల్లో అమలు చేయనున్నట్లు వివరించారు. ఈ కార్యక్రమం ద్వారా క్షయ వ్యాధిని పూర్తిగా నిర్మూలించడం ప్రభు త్వ లక్ష్యమన్నారు. కార్యక్రమంలో డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మి నరసయ్య, అదనపు డీఎంహెచ్ఓ డాక్టర్ రాధిక ఆరోగ్య శాఖ సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె: సామాజిక న్యాయం కోసం జీవితాంతం పోరాడిన దొమ్మేటి వెంకటరెడ్డి ఆశయాలను స్ఫూర్తిగా తీసుకొని ముందుకు సాగాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. సోమవారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ హాలులో వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆయన చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వెంకటరెడ్డి సమాజసేవకు అంకితభావంతో పనిచేసిన మహనీయుడని కొనియాడారు. సామాజిక న్యాయం, సేవా భావం, ప్రజా సంక్షేమం కోసం ఆయన చేసిన కృషి మరువలేనిదని అన్నారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, కలెక్టర్ చల్లా కళ్యాణి, కెఆర్ఆర్సి డిప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్ రెడ్డి, సర్వే ఏడి భరత్ కుమార్, వెనుకబడిన తరగతుల సంక్షేమ అధికారి తేజస్విని పాల్గొన్నారు. -
బి.కొత్తకోటలో తప్పిన ప్రమాదం
– నేలపై కూలిన విద్యుత్ స్తంభం బి.కొత్తకోట: స్థానిక కాళికమ్మ గుడి వీధిలో సోమ వారం ఉదయం పెద్ద ప్రమాదం తప్పింది. వానరాలు విద్యుత్ తీగలపై విన్యాసాలు చేస్తూ గెంతడంతో విద్యుత్ స్తంభం మూడు ముక్కలైంది. ఆ సమయంలో వీధిలో జనసంచారం లేకపోవడంతో ప్రమాదం తప్పింది. కాళికమ్మ గుడి వీధి, పంజూరమ్మ గుడి వీధి మధ్యలో విద్యుత్ సరఫరా లైను సాగుతుంది. వీధి మూలన విద్యుత్ స్తంభం తుప్పు పట్టడంతో దాని విద్యుత్ తీగలపై వానరాలు అటు ఇటు గెంతాయి. విద్యుత్ స్తంభం ఒక్కసారి గా నేల కొరిగింది. ఎదురుగా నిలిపివుంచిన ఖాజాఖాన్కు చెందిన ఇన్నోవాపై పడి తర్వాత నేలపై పడింది. దాంతో విద్యుత్ స్తంభం ముక్కలై, విద్యుత్ సరఫరా ఆగిపోయింది. సమాచారం అందుకున్న డిస్కం ఏఈ విద్యుత్ సిబ్బందిని పంపించి కొత్త స్తంభం ఏర్పాటుకు చర్యలు చేపట్టారు. -
అంగరంగ వైభవంగా దాశరథి కల్యాణం
రాజంపేట : ఒంటిమిట్ట కోదండరామయ్య కల్యా ణం అంగరంగ వైభవంగా నిర్వహించేందుకు సర్వంసిద్ధం చేస్తున్నామని, మార్చి 30నాటికి ఏర్పాట్లు పూర్తి చేయాలని నిర్ణయించామని టీటీడీ జేఈవో వీరబ్రహ్మం తెలిపారు. సోమవారం ఆయన టీటీడీ వివిధ విభాగాల అధికారులతో కలిసి ఒంటిమిట్ట కోదండరామాలయం పరిసర ప్రాంతాలు, కల్యాణవేదిక వద్ద విస్తృతంగా జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడు తూ మాడవీధులు, క్యూలైన్లు, యాగశాల, పోటు, సాంస్కృతిక వేదికలను పరిశీలించి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. వేసవి ఉష్ణోగ్రతను దృష్టిలో ఉంచుకొని ఆలయ ప్రాంగణంలో జర్మన్షెడ్లు ఏర్పాటుచేస్తామన్నారు. తాగునీటి సదుపాయాలను కల్పిస్తామన్నారు. లేజర్ లైటింగ్, ఎల్ఈడీ తోరణాలు ఏర్పాటు చేసి, ఉత్సవాలకు అధ్యాత్మిక శోభ వచ్చేలా చర్యలు తీసుకుంటామన్నారు. పారిశుద్ద్యానికి అధిక ప్రాధాన్యత ఇస్తూ సిబ్బందిని నియమించాలని అధికారులకు సూచించారు. -
జిల్లా మేనేజర్గా దుర్గాప్రసాద్
మదనపల్లె : గృహనిర్మాణశాఖ జిల్లా మేనేజర్గా దుర్గాప్రసాద్ సోమవారం స్థానిక జిల్లా కార్యాలయంలో బాధ్యతలను స్వీకరించారు. చిత్తూరులో పనిచేస్తున్న ఆయనకు ఉద్యోగోన్నతి లభించడంతో ఇక్కడికి బదిలీ చేశారు. ఇన్చార్జ్ మేనేజర్ వెంకటరెడ్డి ఈ మేరకు ఆయనకు బాధ్యతలు అప్పగించారు. పేకాడుతూ పట్టుబడ్డ జనసేనాని! సాక్షి టాస్క్ఫోర్స్: అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలం ముష్టూరు పంచాయతీ దిగువపల్లెలో పెద్ద ఎత్తున పేకాట ఆడుతున్నట్లు సమాచారం అందటంతో నిమ్మనపల్లె ఎస్ఐ రామకష్ణ సిబ్బందితో ఆ పేకాట స్థావరంపై దాడిచేశారు. పేకాడుతున్న 11 మందిని అదుపులోకి తీసుకుని పోలీస్స్టేషన్కు తరలించారు. నిందితుల్లో అదే గ్రామానికి చెందిన జనసేన మండల అధ్యక్షుడు ప్రదీప్సింగ్ కూడా ఉన్నాడు. ఈ విషయం తెలుసుకున్న కూటమి నాయకులు కేసు నుంచి జనసేన మండల అధ్యక్షుడి పేరు తొలగించాలని ఎస్ఐ రామకృష్ణపై ఒత్తిడి తెచ్చారు. దీంతో పోలీసులు అతడిని తప్పించి 10 మందిపై కేసు నమోదుచేశారు. ప్రదీప్సింగ్ గురించి అడగగా, అతడు పోలీస్ ఇన్ఫార్మర్ అని చెప్పారు. పేకాట నిర్వహిస్తున్నట్లు సమాచారం ఇచ్చింది అతడేనన్నారు. -
వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదు
పీలేరురూరల్ : ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి వ్యర్థాల నిర్వహణలో నిర్లక్ష్యం తగదని రాష్ట్ర వైద్య విధాన పరిషత్ అదనపు డైరెక్టర్ డాక్టర్ కె. అనిల్కుమార్ అన్నారు. సోమవారం పీలేరు వంద పడకల ఏరియా ఆస్పత్రిని తనిఖీ చేశారు. ఆస్పత్రిలోని అన్ని విభాగాల్లోని బయోమెడికల్ వ్యర్థాల నిర్వహణ క్షుణ్ణంగా పరిశీలించారు. ఆస్పత్రిలోని వ్యర్థాలు ఎక్కడపడితే అక్కడ వేయొద్దని సూచించారు. వ్యర్థాల నిర్వహణలో అన్నమయ్య జిల్లాలో రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, వాల్మీకిపురం, పీలేరు ఆస్పత్రులను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. రాష్ట్ర స్థాయిలో అన్ని ప్రభుత్వ ఆస్పత్రులు వైద్య బృందా లు తనిఖీ చేస్తున్నట్లు చెప్పారు. ఇందులో భాగంగా ఉత్తమ ఫలితాలు సాధించిన ఆస్పత్రులకు పారిశుద్ధ్య ఎంపికతోనే ప్రోత్సాహకాలు లభిస్తాయని తెలిపారు. ఆస్పత్రులకు కూడా రాష్ట్ర స్థాయిలో కాయకల్ప అవార్డులతో సత్కరించనున్నట్లు వెల్లడించారు. ఈ కార్యక్రమంలో డీఎసీహెచ్ఎస్ డాక్టర్ లక్ష్మీప్రసాద్, జిల్లా క్వాలిటీ మేనేజర్లు ప్రభావతి, నాగరాణి, ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్, డాక్టర్ నాగవేణి, డాక్టర్ చంద్రశేఖర్ నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి గాయాలు
– ఒకరి పరిస్థితి విషమం కలికిరి: ఎదురెదురుగా వచ్చిన రెండు ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రగాయాలపా లు కాగా వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాలు... కందూరుకు చెందిన అల్తాఫ్ తన ద్విచక్రవాహనంలో సోమవారం రాత్రి పెట్రోల్క్యాన్తో కలికిరి నుంచి కందూరుకు వెళుతున్నాడు. అదే సమయంలో కందూరుకు చెందిన బావాజీ, పుంగనూరుకు చెందిన అప్సాన్ ద్విచక్రవాహనంలో కలికిరి వైపు వస్తున్నారు. కలికిరి సమీపం సామకుంటవారిపల్లి బస్టాప్కు కొంతదూరంలో రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. అల్తాఫ్ వద్దనున్న పెట్రోలు క్యాను పగలడంతో వాహనాల వేడిమికి మంటలు వ్యాపించాయి. అల్తాఫ్కు మంటలు అంటుకున్నాయి. బావాజీ, అప్సాన్లకు తీవ్ర రక్తగాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది క్షతగాత్రులను పీలేరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. కాగా అల్తాఫ్ ఆరోగ్య స్థితి విషమంగా ఉండటంతో కుటుంబ సభ్యులు వేలూరు సీఎంసీకి తరలించారు. బావాజీ, అప్సాన్లను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలించారు. ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ముఖ్యం తంబళ్లపల్లె: ప్రతి ఒక్కరికీ ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన ఉంటేనే బ్యాంకు లావాదేవీలలో సులభంగా లబ్ధి పొందగలరని ఆర్బీఐ కౌన్సెలర్లు శోభన్,శ్రీనివాసులు తెలిపారు. సోమవారం ఎంపీడీఓ కార్యాలయంలో అనంతపురం జిల్లా వలంటీరీ ఇంట్రిగేడ్ డెవలప్మెంట్ సొసైటీ(విడ్స్) ఆద్వర్యంలో ఆర్థిక అక్షరాస్యతపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. బడ్జెట్, పెన్షన్ ప్లానింగ్, పొదుపులు, సీనియర్ సిటిజెన్స్ బ్యాంకు సేవలను వివరించారు. ఎంపీడీఓ పాల్గొన్నారు. బాబోయ్.. ఆ మలుపు! బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డు మూడో మలుపు ప్రమాదకరంగా మారింది. ఆదివారం రాత్రి మూడో మలుపు వద్ద టాటా ఏస్ ప్రమాదం జరిగిన విషయం తెలిసిందే. ఇదే చోట సోమవారం సాయంత్రం జరిగిన బైక్ ప్రమాదం ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికుల కథనం మేరకు వివరాలు. గుర్రంకొండ మండలం తరిగొండకు చెందిన తోఫిక్ (22), జమీల్ (22)లు బైక్పై సోమవారం హార్సిలీహిల్స్ వచ్చారు. కొండపై సరదాగా గడిపిన ఇద్దరూ సాయంత్రం బైక్పై వెనుదిరిగారు. మూడో మలుపు వద్దకు రాగానే అదుపుతప్పిన బైక్ ఎడమవైపు ఉన్న ఇనుప రేలింగ్ను ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. 108లో బాధితులను మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.ఘటనపై పోలీసులు విచారిస్తున్నారు. మదనపల్లెలో వ్యక్తి అనుమానాస్పద మృతి మదనపల్లెటౌన్: మదపపల్లెలో ఓ వ్యక్తి అనుమానస్పదిస్థితిలో మృతి చెందడం సోమవారం వెలుగుచూసింది. ఇందుకు సంబంధించి రెండో పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. స్థానిక బొంబూ వీధికి చెందిన అన్సర్ (65) స్థానిక వారపు సంతలోని ఖాజా కూరగాయల మార్కెట్లో రైటర్ గా పనిచేస్తాడు. ఇతని భార్య సాజీద నాలుగేళ్ల క్రితమే అనారోగ్యంతో మరణించింది. అప్పటి నుంచి అన్సర్ తన ఇద్దరు కుమారులతో కలసి నివసిస్తున్నాడు. సోమవారం తను ఉంటున్న ఇంట్లో అనుమానస్పదంగా చనిపోయి ఉండటం స్థానికులు గుర్తించారు. తలపై గాయం ఉండడంతో ఎవరైనా కొట్టి చంపి ఉంటారని కుటుంబ సభ్యులు అనుమానంతో పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి వచ్చిన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించి పంచనామ అనంతరం పోస్టు మార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు విచారణలో ఉందని పోలీసులు తెలిపారు. -
ఒక్క బోరు వేసి చిచ్చు పెడతారా!
కురబలకోట: ‘రెండు గ్రామాలకు ఒక తాగునీటి బోరు వేసి తమాషా చూస్తున్నారా..పైగా ఏళ్లుగా పక్కా రోడ్డు కూడా లేదు..నీళ్లు సరిపడా రావడం లేదు..ఆఫీసుల్లో కూర్చుని ఏం చేస్తున్నారని’ మండలంలోని ఎర్రజేనువారిపల్లి గ్రామస్థులు నిలదీశారు. ‘సాక్షి’ దినపత్రికలో ‘రెండు గ్రామాల మధ్య తాగునీటి గొడవ..శత్రువులుగా మారిన బంధువులు..పరస్పర దాడులు..నెలకొన్న ఉద్రిక్తత అనే వార్త కథనం సోమవారం ప్రముఖంగా ప్రచురితమైన విషయం తెలిసిందే. దీనిపై సమగ్ర విచారణ జరపాలని ఉన్నతాధికారులు ఆదేశించారు. దీంతో సోమవారం ఆ గ్రామానికి వివిధ శాఖల అధికారులు వెళ్లారు. ఇంటికి ఒక బోరు వేసుకుంటున్న నేటి రోజుల్లో ఒక తాగునీటి బోరు వేసి రెండు గ్రామాల వారు నీళ్లు తాగమనడం ఎంతవరకు న్యాయమని గ్రామస్థులు నిలదీశారు. రెండు గ్రామాలకు ఒక బోరు వేసి అదీ నీటి సరఫరా బాధ్యత ఒక గ్రామానికి ఎలా అప్పగిస్తారని ప్రశ్నించారు. నీటి సరఫరాలో ఎర్రజేనువారిపల్లికి తొలి నుంచి అన్యాయం జరుగుతోందని విమర్సించారు. పక్కా రోడ్డు గురించి కూడా ఎందుకు పట్టించుకోరని మండిపడ్డారు. తమ ఊరికే ప్రత్యేకంగా బోరు వేసి తాగునీటి సమస్య పరిష్కరించాలన్నారు. దీంతో ఎంపీడీఓ గంగయ్య స్పందిస్తూ సత్వరం కొత్త బోరు వేసి నీటి సమస్య పరిష్కరిస్తామన్నారు. అదే విధంగా పక్కా రోడ్డుకూడా వేయడం జరుగుతుందని తెలిపారు. -
గడ్డిధరలు మండిపోతున్నాయి
ప్రస్తుతం ఎండు వరిగడ్డి ధరలు భగ్గుమంటుంటాయి. నెలరోజుల కిందట కిలో రూ.5 కే ఇచ్చేవారు. ఇప్పుడు కిలో రూ.8 నుంచి రూ.10కి పెంచేశారు. దళారులు ఇష్టారాజ్యంగా ధరలు పెంచేస్తున్నారు. ఈ కరువులో పశుపోషణ భారంగా మారింది. వచ్చే ఆదాయం కంటే ఖర్చు ఎక్కువగా వస్తోంది. – నరసమ్మ, పాడిరైతు, కమ్మపల్లె పశుపోషణ భారంగా మారింది పశుపోషణ భారంగా మారింది. నాకు రెండు ఆవులు ఉన్నాయి. పుష్కలంగా గడ్డిదొరికే రోజుల్లో ఒక్కో ఆవు 5 లీటర్ల పాలు ఇచ్చేది. ప్రస్తుతం పాల దిగుబడి తగ్గిపోతోంది. దీంతో పాలల్లో వచ్చే రాబడి ఎక్కువ శాతం పశుపోషణకే సరిపోతోంది. –రమణయ్య, పాడిరైతు, కురవపల్లె -
● భారంగా మారిన పశపోషణ
రోజురోజుకు పశుపోషణ భారంగా మారుతోందని పాడిరైతులు వాపోతున్నారు. ప్రస్తుతం వరిగడ్డి, వేరుశనగ పొట్టుకు డిమాండ్ ఏర్పడడంతో వైఎస్సార్, తిరుపతి జిల్లాల నుంచి ప్రతిరోజు ఎండుగడ్డిని దిగుమతి చేసుకొంటున్నారు. జిల్లాలో ప్రతిరోజు 7.128 టన్నుల గడ్డి అవసరం ఉంది. ఇందుకోసం పాడిరైతులు రూ 8.52కోట్ల మేరకు ఖర్చు చేస్తున్నారు. పచ్చిగడ్డికి తోడుగా వరిగడ్డిని వినియోగించడం వల్ల పాల ఉత్పత్తి ఎక్కువగా ఉంటుందని రైతుల నమ్మకం. దీంతో పచ్చిగడ్డి ఉన్నా ఎండు వరిగడ్డి, వేరుశనగ పొట్టుపై ఆసక్తి చూపిస్తున్నారు. నెలరోజుల క్రితం కిలో ఎండు వరిగడ్డి రూ. 5 ఉండేది. ప్రస్తుతం దళారులు ధరలు విపరీతంగా పెంచేసి రూ. 8 నుంచి రూ.10 వరకు పాడిరైతుల దగ్గర నుంచి వసూలు చేస్తున్నారు. రెండున్నర సెంట్ల పొలంలో ఉన్న మొక్కజొన్నలూ రూ. 2వేలకు, జొన్నలు రూ.1000, వేరుశనగ పొట్టు లోడు రు.25 వేల వరకు ఖర్చు చేసి కొనుగోలు చేయాల్సిన పరిస్థితి నెలకొంది.దీనికి తోడు ఫీడ్ దరలు రోజు రోజుకు ఆకాశనంటుతున్నాయి. -
రూ.వంద కోట్లు దాటిన టౌన్బ్యాంక్ డిపాజిట్లు
● నాలుగు జిల్లాల్లో సేవల విస్తరణ ● చైర్మన్ విద్యాసాగర్మదనపల్లె : మదనపల్లె కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ డిపాజిట్లు వంద కోట్లు దాటి రూ.102.03 కోట్లకు చేరిందని ఆ బ్యాంకు చైర్మన్ ఎన్.విద్యాసాగర్ అన్నారు. ఆదివారం బ్యాంకు ప్రధాన కార్యాలయంలో మహాజన సభ ఆయన అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన పనితీరు సమీక్షను బ్యాంకు సీఈవో పీవీ ప్రసాద్ విడుదల చేశారు. వివిధ అంశాలపై సభ్యులు చర్చించారు. బ్యాంకు లావాదేవిలు, పనితీరును సమీక్షించారు. అనంతరం విద్యాసాగర్ మాట్లాడుతూ 1964లో స్థాపించిన బ్యాంకు స్థిరంగా అభివృద్ధి సాధిస్తూ ప్రజల విశ్వాసాన్ని చూరగొందని అన్నారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో వ్యాపారం గణనీయంగా పెరిగినట్లు తెలిపారు. బ్యాంక్ డిపాజిట్లు రూ.102.03 కోట్లకు చేరుకోగా, రుణాలు రూ.78.22 కోట్లకు పెరిగాయన్నారు. మొత్తం వ్యాపారం రూ.111.22 కోట్లుగా నమోదైందన్నారు. బ్యాంకుకు రూ.11.81 కోట్ల లాభాలు వచ్చాయన్నారు. బ్యాంకును మరింత బలోపేతం చేయడానికి టైర్–1 స్థాయి నుంచి టైర్–2 స్థాయికి అప్గ్రేడ్ చేసే దిశగా చర్యలు తీసుకుంటున్నట్లు పేర్కొన్నారు. పీలేరులో బ్యాంకు ప్రారంభానికి ఏర్పాట్లు చేస్తున్నట్టు తెలిపారు. సీఈవో ప్రసాద్ మాట్లాడుతూ బ్యాంకు సేవల విస్తరణలో భాగంగా చిత్తూరు, తిరుపతి, శ్రీసత్యసాయి, వైఎస్సార్ కడప జిల్లాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించనున్నట్లు చెప్పారు. రైతులు, చిన్న వ్యాపారులకు రుణాల పంపిణీపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు తెలిపారు. డిజిటల్ బ్యాంకింగ్ సేవల్లో భాగంగా యూపీఐ, గూగుల్ పే, ఫోన్ పే, ఇంటర్నెట్ బ్యాంకింగ్ సౌకర్యాలు అందుబాటులోకి తీసుకొచ్చినట్టు చెప్పా రు. భవిష్యత్లో మరిన్ని శాఖలను ప్రారంభించి, గ్రామీణ ప్రాంతాల్లో బ్యాంకింగ్ సేవలను విస్తరించడమే లక్ష్యంగా పెట్టుకున్నట్లు తెలిపారు. సభలో వైస్ చైర్మన్ భాస్కర్కుమార్, డైరెక్టర్లు రవికాంత్, రవీంద్రనాథ్, ముక్తియార్ఖాన్, సోమశేఖర్, వెంకటేష్ ప్రసాద్, నాదేళ్ళ శివ, దేవేంద్ర, సర్దార్ఖాన్, భాస్కర్, నిరంజన్, ప్రసాద్, కోటేశ్వరరావు, ఆకుల కృష్ణమూర్తి, మేనేజర్ జయచంద్రనాయుడు, రాధిక, రాజశేఖర్, రవిచంద్రరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కలికిరి : ఎర్రచందనం దుంగలు పోలీసులు స్వాధీనం చేసుకుని ముగ్గురిని అదుపులోకి తీసుకున్నారు. స్థానిక పోలీస్స్టేషన్లో సీఐ అనీల్కుమార్ మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. జిల్లా పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నిఘా వుంచి ఆదివారం మధ్యాహ్నం మండల పరిధిలోని మేడికుర్తి క్రాస్ వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. తమిళనాడు వాసులు ఒక ద్విచక్రవాహనంలో ముగ్గురు రావడంతో వారిని ఆపడంతో తడబడిన వాళ్లు పొంతన లేని సమాధానం చెప్పడంతో అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. తరలించడానికి ఎర్రచందనం దుంగలు సిద్ధంగా ఉన్నాయని, ముందుగా దారి చూస్తున్నట్లు వారు పేర్కొన్నారు. దీంతో మేడికుర్తి క్రాస్ సమీపాన నల్లగుట్ట వద్ద దాచిన నాలుగు ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకుని నిందితులపై కేసు నమోదు చేశారు. అలాగే ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. నిందితులు తమిళనాడు వేలూరు జిల్లా అన్నిగట్టు తాలూకా తొంగమలైకి చెందిన సోదరులు చంద్రన్, రామరాజు, సెంగాడకు చెందిన దొరస్వామిగా గుర్తించారు. వీరు ఎర్రచందనం కూలీలుగా విచారణలో తేలిందని సీఐ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ రూ.6.65 లక్షల వరకు ఉంటుందని పేర్కొన్నారు. సమావేశంలో ఎస్ఐ రమణ, హెడ్కానిస్టేబుల్లు రాజేంద్రప్రసాద్, మహమ్మద్ రఫీ, పీసీలు విజయ్కుమార్, ఆర్.యల్లరాజ, బాబేషావల్లి, రమణయ్య, దినేష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
భూ వివాదంతో రైతుపై దాడి
మదనపల్లె టౌన్ : భూ వివాదం తలెత్తి రైతుపై ప్రత్యర్థులు దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఊలపాడు పంచాయతీ భూసాని కురప్పల్లికి చెందిన రైతు మంజునాథ్(45)కు అదే ఊరికి చెందిన సిద్దరాజు, వెంకటరమణ, శ్రీనివాసులుకు కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ క్రమంలో ఉదయం పొలం వద్దకు వెళ్తున్న మంజునాథ్ను.. దారి కాచి కర్రలతో కొట్టి తీవ్రంగా గాయపరిచారు. బాధితుడిని కుటుంబీకులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి వైద్యులు మెరుగైన వైద్యం అందించారు. రామసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఆటో బోల్తా.. ఆరుగురికి గాయాలుకేవీపల్లె : ఆటో బోల్తా పడి ఆరుగురికి గాయాలైన సంఘటన మండలంలోని కుప్పంవారిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. ఆదివారం మారేళ్ల నుంచి ఏపీ39డబ్ల్యూఈ0498 నంబరు గల ఆటో ప్రయాణికులతో పీలేరుకు బయలు దేరింది. మార్గం మధ్యలోని కుప్పంవారిపల్లె వద్ద ద్విచక్రవాహనాన్ని ఢీకొని అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో మారేళ్ల రెడ్డివారిపల్లెకు చెందిన చంద్రకళ, సులోచన, సంధ్యారాణి, జ్ఞానదీపిక, విజయ్కుమార్తోపాటు ద్విచక్రవాహనదారుడు సురేంద్ర గాయపడ్డారు. మరో ఇద్దరు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్యమదనపల్లె టౌన్ : ఉరి వేసుకుని ఇంటర్ విద్యార్థిని ఆత్మహత్య చేసుకుని మృతి చెందిన విషాదకర సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. ఆత్మహత్యకు సంబంధించి మృతురాలి కుటుంబీకులు, ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బ్రాహ్మణ వడ్డిపల్లెకు చెందిన రమణ కుమార్తె సౌజన్య(17) మదనపల్లెలోని ఓ ప్రయివేట్ కళాశాలలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతుండేది. ఆదివారం తల్లిదండ్రులతో కలసి వ్యవసాయ బోరు వద్దకు వెళ్లి, పాడి పశువులకు గడ్డి కోసుకుని ఇంటికి వచ్చింది. అంతలోనే ఎందుకు చిన్న మనసు చేసుకుందో ఏమో..? తను ఉంటున్న ఇంటిలోనే తల్లి చీర కొంగును ఫ్యానుకు బిగించి, ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. సంఘటనను గమనించిన తల్లిదండ్రులు బిడ్డను ఉరి నుంచి తప్పించి, చికిత్సల నిమిత్తం హుటాహుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, అప్పటికే సౌజన్య చనిపోయినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసుల సమాచారంతో ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యకు గల కారణాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
అడ్డుకున్న ప్రజలు
ఇసుక అక్రమ రవాణాను సుండుపల్లె: ఇసుక తవ్వకాల వల్ల భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని పంటలకు సాగునీరు, ప్రజలకు తాగునీరు అందడం లేదని, ఇసుక రీచ్ను ఆపాలని బహుదానది పరీవాహక ప్రాంతాల ప్రజలు, రైతులు ఆదివారం రీచ్ వద్ద ఆందోళన చేపట్టారు. మండల పరిధిలోని ఎరమనేనిపాలెం గ్రామ పంచాయతీ కుప్పగుట్ట సమీపంలో అధికార పార్టీ నాయకుల అండదండలతో టిప్పర్లతో ఇసుక తవ్వకాలు చేపట్టి బెంగళూరు, తమిళనాడు ప్రాంతాలకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఆదివారం హిటాచీలతో ఇసుక తవ్వకాలు జరిపి తరలిస్తుండగా అడ్డుకుని ఆందోళన చేపట్టారు. బహుదానదిలో ఇసుక అక్రమ తవ్వకాల వల్ల భూగర్భజలాలు తగ్గిపోతున్నాయని,దీనివల్ల బోర్లలో నీరు రాక సాగు చేసిన పంటలు ఎండిపోయే ప్రమాదం ఉందని, అలా జరిగితే మేం వలస వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడుతుందని రైతులు వాపోయారు. నిబంధనలు పాటించని రీచ్ నిర్వాహకులు ప్రభుత్వ అనుమతుల ప్రకారం ఇసుక రీచ్లో ఒక మీటర్ లోతు వరకు మాత్రమే ఇసుక తీయాల్సి ఉంటుంది. కానీ క్వారీ దక్కించుకున్న నిర్వాహకులు నిబంధనలను ఉల్లంఘిస్తున్నారు. వారిపై చర్యలు తీసుకోవడంతో పాటు అవసరమైతే క్వారీని రద్దు చేయాల్సిన అధికారులు ఇటువైపు కన్నెత్తి కూడా చూడటం లేదు. దాదాపు 4 నుంచి 5 కిలోమీటర్ల దూరం ఇసుకను తోడేసి విక్రయించుకుంటున్నారు. ● బహుదానదిలోని ఇసుకను హిటాచీలతో ప్రతి రోజూ వందలాది టిప్పర్లకు లోడ్చేసి కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలిస్తున్నారని, దీంతో నదిలో పెద్ద గుంతలు ఏర్పడ్డాయని పలుమార్లు మండల, జిల్లా అధికారులకు అర్జీల రూపంలో తెలియజేసినా ఇప్పటి వరకు ఎలాంటి చర్యలు తీసుకోలేదని గ్రామస్తులు వాపోయారు. ఇసుక అక్రమరవాణాకు పాల్పడతోంది అధికార పార్టీకి చెందిన నాయకులు కావడం వల్లే అధికారులు చూసీ చూడనట్లు వ్వవహరిస్తున్నారని చెబుతున్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ చొరవ తీసుకొని ఇసుక అక్రమరవాణాను అరికట్టి రీచ్ను రద్దు చేయాలని, లేకపోతే పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామన్నారు. రీచ్ వద్ద రైతులు, ప్రజల ఆందోళన -
ఒకటో తరగతికి ఆన్లైన్ దరఖాస్తు
మదనపల్లె: కేంద్రీయ విద్యాలయం ప్రవేశాలకు సంబంధించి ఒకటవ తరగతిలో చేరేందుకు విద్యార్థుల దరఖాస్తులను ఆన్లైన్ ( kvs angathan.nic.in) లో చేయాలని ప్రిన్సిపాల్ టి.వెంకటేశ్వర్లు ఆదివారం తెలిపారు. ధ్రువీకరణ పత్రాలతో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని, అభ్యర్థులు ఆరేళ్లు పైబడి ఉండాలని తెలిపారు. రెండు నుంచి ఐదో తరగతి వరకు ఆఫ్లైన్లో ఎస్టీ హస్టల్లోని తమ కార్యాలయంలో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. రెండో తరగతికి ఏడేళ్లు పైబడి, మూడో తరగతికి 8 ఏళ్లపైబడి, నాలుగో తరగతికి 9 ఏళ్లుపైబడి, ఐదో తర గతికి 10 ఏళ్లుపైబడి ఉండాలని తెలిపారు. దరఖాస్తుల రిజిస్ట్రేషన్కు ఏప్రిల్ రెండో తేది చివరిరోజని, పరిశీలనకు ఒరిజనల్ ధ్రువపత్రాలను తీసుకురావాలని కోరారు. వివరాలకు 9441738374, 95183 80684 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఎర్రగుంట్ల: వైఎస్సార్ కడప జిల్లా మేకలబాలయ్యపల్లె గ్రామంలో వెలసిన శ్రీ దుర్గమ్మ అమ్మవారిని భారత మహిళా క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. అదివారం మేకలబాలయపల్లి పరిధిలోని శ్రీదుర్గమ్మ అమ్మవారికి గ్రామస్తులు బోనాలను సమర్పించారు. ఈ నేపథ్యంలోనే శ్రీచరణి కుటుంబ సభ్యులతో కలసి అమ్మవారిని దర్శించుకుని, మొక్కులు తీర్చుకున్నట్లు ఆలయ నిర్వహకులు జి. వెంకటేశు తెలిపారు. -
ఘనంగా శతాధిక వృద్ధురాలి జన్మదిన వేడుకలు
కలికిరి : కలికిరి మండలం టి.సండ్రావారిపల్లి గ్రామం తొగటపల్లిలో గోరంట్ల సరస్వతమ్మ తన వారసులతో కలిపి 100వ పుట్టిన రోజు వేడుకను ఆదివారం జరుపుకొంది. జన్మదిన వేడుకకు సరస్వతమ్మ కుమారులు, వారి పిల్లలు, మనుమళ్లు, మనుమరాళ్లు ఇలా నాలుగు తరాల వారు హాజరు కావడం విశేషం. నాలుగు తరాల కుటుంబ సభ్యుల నడుమ పుట్టిన రోజు నిర్వహించుకోవడం అరుదైన ఘటనగా స్థానికులు చర్చించుకున్నారు. గోరంట్ల సరస్వతమ్మ కుమారులు గోరంట్ల గోపీనాథరెడ్డి, లోకనాథరెడ్డి, ప్రేమనాథరెడ్డి, కుమార్తె పండితమ్మ వారి పిల్లలతో కలిసి సరస్వతమ్మను సన్మానించి తమ ఉన్నతికి ఆమె చేసిన కృషిని గుర్తుచేసుకున్నారు. సరస్వతమ్మ 100వ పుట్టిన రోజు వేడుకతో గ్రామంలో సందడి వాతావరణం నెలకొంది. -
బొలేరో ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : బొలేరో ఢీకొని ఒకే కుటుంబంలోని ముగ్గురు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ముదివేడు పోలీసులు, బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లెకు చెందిన దంపతులు షరీఫ్(30), గులాబ్(25) తమ కుమార్తె షార (7)లతో మదనపల్లెకు రంజాన్ పండుగ సందర్భంగా వచ్చారు. పండుగ చూసుకుని తిరిగి ద్విచక్ర వాహనంలో స్వగ్రామానికి బయలుదేరారు. స్కూటర్ మార్గంమధ్యలోని కురబలకోట మండలం ముదివేడు క్రాస్ వద్దకు రాగానే వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలేరో ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ముగ్గురిని స్థానికులు 108 సాయంతో వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి వైద్య చికిత్సల అనంతరం భార్యభర్తలను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. 24,25 తేదీల్లో జీఎస్టీ సంస్కరణలపై సెమినార్ కడప ఎడ్యుకేషన్ : కడపలోని యోగి వేమన విశ్వవిద్యాలయంలో డిపార్ట్మెంట్ ఆఫ్ బిజినెస్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో ‘నెక్స్జన్ జీఎస్టీ సంస్కరణలు (జీఎస్టీ 2.0) దక్షిణ భారత రాష్ట్రాల్లో స్థోమత, ఉపాధి, ఆరోగ్యం, స్థిరత్వం, వికసిత్ భారత్పై ప్రభావం (జీఎస్టీ ఏఈహెచ్ఎస్–2కె26)’ అనే అంశంపై ఈ నెల 24, 25 తేదీలలో రెండు రోజుల పాటు జాతీయ సెమినార్ నిర్వహించనున్నట్లు కన్వీనర్ డాక్టర్ పి.సరిత తెలిపారు. ఆమె ఆదివారం మీడియాకు వివరాలు వెల్లడించారు. వస్తు, సేవల పన్ను (జీఎస్టీ) రంగంలో వస్తున్న సంస్కరణలపై అధ్యాపకులు, పరిశోధక విద్యార్థులు, విద్యార్థులు చర్చించుకోవడం ఈ సెమినార్ ముఖ్య ఉద్దేశమని వివరించారు. ఈ కార్యక్రమానికి అధ్యాపకులు, పరిశోధకులు, విద్యార్థులు భాగస్వాములై వికసిత్ భారత్ దృష్టితో జీఎస్టీ భవిష్యత్తుపై చర్చల్లో పాల్గొనాలని ఆమె కోరారు. -
నేడు ‘పీజీఆర్ఎస్’
మదనపల్లెటౌన్: మదనపల్లె నూతన జిల్లా ఎస్పీ కార్యాలయంలో సోమవారం పీజీఆర్ఎస్ కార్యక్రమం జరుగుతుందని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా ప్రజల నుంచి అర్జీలను నేరుగా స్వీకరించనున్నట్లు పేర్కొన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు సద్వినియోగం చేసుకోవాని కోరారు. వాల్మీకిపురం: వాల్మీకిపురం శ్రీ పట్టాభిరామాలయంలోని శ్రీ పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు సోమవారం అంకురార్పణతో ప్రారంభం కానున్నాయి. ఇందుకు కోసం టీటీడీ అధికారులు ఏర్పాట్లు పూర్తి చేశారు. పందిళ్లు, విద్యుత్ దీపాలంకరణలు, లైటింగ్ బోర్డులు, మైక్లు ఏర్పాటు చేశారు. ఉదయం స్వామివారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, మూలవర్లకు అభిషేకం, అలంకరణ, తోమాలసేవ, కొలువు, పంచాంగ శ్రవణం, అర్చన, మొదటి గంట, బలి, శాత్తుమొర నిర్వహిస్తారు. రాత్రి కై ంకర్యములు, స్వస్తి పుణ్యహవచనం, మృత్సంగ్రహణం, అంకురార్పణ, ఏకాంత సేవ కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు ఆలయ అధికారి క్రిష్ణమూర్తి, నాగరాజ, నగేష్లు తెలిపారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీనెలకొంది. అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. హిందువులతో పాటు ముస్లింలు పెద్ద ఎత్తున ఆలయానికి తరలిరావడం విశేషం. జమ్మలమడుగు: వైఎస్సార్ కడప జిల్లా ఉప్పలపాడు గ్రామానికి చెందిన తలారి మోహన్ అనే విద్యార్థి గేట్ పరీక్షల్లో జాతీయ స్థాయిలో 89వ ర్యాంకును సాధించాడు. గత ఫిబ్రవరి 19న గేట్పరీక్షలు నిర్వహించారు. ఈ నెల 19న వెలువడిని ఫలితాల్లో మోహన్ 89వర్యాంకు సాధించినట్లు తల్లిదండ్రులు లక్ష్మీదేవి, సంజీవరాయులు తెలిపారు. ప్రస్తుతం కర్నూల్ పుల్లారెడ్డి ఇంజినీరింగ్ కాలేజీ టెక్ ఫైనలియర్ చదువుతున్నట్లు చెప్పారు. కుమారుడు 89వ ర్యాంకు సాధించడం ఎంతో ఆనందంగా ఉందని తల్లిదండ్రులు పేర్కొన్నారు. -
హార్సిలీ హిల్స్ ఘాట్ లో తప్పిన ప్రమాదం
ప్రమాదంలో గాయపడిన వారు బి.కొత్తకోట: హార్సిలీ హిల్స్ మూడో మలుపులో ఆదివారం రాత్రి పెను ప్రమాదం తప్పింది.టాటా ఏస్ వాహనం బోల్తాపడటంతో ముగ్గురు గాయపడ్డారు. గ్రామస్తులు, పోలీసుల కథనం మేరకు వివరాలు. మదనపల్లె ఎస్టేట్ కు చెందిన 10 మంది బంధువులు టాటా ఏస్ వాహనంలో హార్సిలీహిల్స్ పర్యటనకు వచ్చారు. కొండపై సేదతీరి సాయంత్రం వెనుతిరిగారు. కొండనుంచి కిందికి వస్తుండగా ప్రమాదాలకు నిలయమైన ప్రొద్దుటూరు మలుపుగా పిలిచే అత్యంత క్లిష్టమైన మూడో మలుపు తిరుగుతుండగా ఒక్కసారిగా వాహనం అదుపుతప్పి బోల్తా పడింది. అందులోని పర్యాటకులు కేకలు వేశారు. ప్రమాదాన్ని పసిగట్టిన కాండ్లమడుగు గ్రామస్తులు ఘటనా స్థలం వద్దకు చేరుకున్నారు. వాహనంలో నుంచి సందర్శకులను బయటకు తీశారు. వారిలో అస్మత్ బీ(52) తలకు, యాసీన్ (15), నజీర్ (40)కు తీవ్ర గాయాలయ్యాయి. అనంతరం పోలీసులు, గ్రామస్తులు మరో వాహనంలో పర్యాటకులను మదనపల్లెకు తరలించారు. ● మూడో మలుపు వద్ద అధిక ప్రమాదాలు జరుగుతుంటాయి. అందువల్ల ఈ మలుపు వద్ద బలమైన ఇనుప గ్రిల్స్ ఏర్పాటు చేశారు. ఒకవేళ వాహనాలు అదుపుతప్పినా లోయలోకి పడకుండా ఇది రక్షిస్తుంది. గతంలో ఇక్కడ వాహనాలు మలుపు తిరగలేక నేరుగా లోయలోకి పడిన సందర్భాలు ఉన్నాయి. ఎందరో ప్రాణాలు కోల్పోయారు. అలాంటి చోట జరిగిన ఈ ప్రమాదంలో ప్రాణ నష్టం జరగకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. మూడో మలుపులో బోల్తాపడినటాటా ఏస్ ముగ్గురికి గాయాలు -
కరెంటు తీగల్లో చిక్కుకుని వేటగాడు మృతి
● అడవి జంతువుల వేట కోసం పన్నిన ఉచ్చులకు తానే బలి ● ప్రమాదంగా మార్చేందుకు తోటి వేటగాళ్లు కుట్రగుర్రంకొండ : అడవి జంతువుల వేట కోసం కొంత మంది వేటగాళ్లు ఏర్పాటు చేసిన కరెంటు తీగెల ఉచ్చులో.. సదరు వేటగాడే చిక్కుకొని మృతి చెందిన సంఘటన మండలంలోని తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లె సమీప పొలాల్లో జరిగింది. అయితే ఈ మృతికి కారణాన్ని ప్రమాదంగా మార్చేందుకు తోటి వేటగాళ్లు కుట్ర చేయడం గమనార్హం. ఏఎస్ఐ బొజ్జానాయక్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వాల్మీకిపురం మండలం వాల్మీకిపురం పంచాయతీలోని గొల్లపల్లె, ప్యారంపల్లెకు చెందిన పలువురు రాత్రిళ్లు అడవి జంతువుల వేట కోసం ఆయా గ్రామాల సమీపాన కరెంటు తీగెలతో ఉచ్చులు ఏర్పాటు చేస్తున్నారు. దీంతో అడవి జంతువులు వాటిలో చిక్కుకొని బలవుతున్నాయి. ఈ రెండు గ్రామాలు గుర్రంకొండ మండలం తరిగొండ పంచాయతీ ఇరగన్నగారిపల్లె సమీపానికి దగ్గరలోనే ఉన్నాయి. ఈ రెండు గ్రామాలకు చెందిన పలువురు రైతులకు ఇరగన్నగారిపల్లె సమీపంలో పొలాలు ఉన్నాయి. దీనికితోడు ఈ ప్రాంతంలోనే రెండు మండలాల సరిహద్దులో పెద్ద ఎత్తున అటవీ ప్రాంతం ఉంది. దీంతో పలువురు వేటగాళ్లు రాత్రిళ్లు కరెంటు తీగెలతో పొలాల వద్ద ఉచ్చులు ఏర్పాటు చేసి యథేచ్ఛగా అడవి జంతువులను వేటాడుతున్నారు. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన నల్లకాసుల వెంకట రమణ కుమారుడు నల్లకాసుల సుబ్రమణ్యం(25) మరి కొంత మంది ఒక బృందంగా ఏర్పడి గుర్రంకొండ మండల సరిహద్దులో ఉన్న రైతు పొలంలో కరెంటు తీగెలతో ఉచ్చు ఏర్పాటు చేశారు. గత శనివారం రాత్రి తాము ఏర్పాటు చేసిన కరెంటు తీగెల ఉచ్చులో అడవి జంతువులు పడ్డాయో లేదో చూద్దామని వెళ్లారు. అయితే పొరపాటున సుబ్రమణ్యం అదే ఉచ్చులో చిక్కుకొని అక్కడికక్కడే మృతి చెందాడు. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక తోటి వేటగాళ్లు సుబ్రమణ్యం మృతదేహాన్ని అక్కడి నుంచి తీసుకెళ్లి మరో పొలంలో విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఉన్న చోట ఉంచినట్లు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. పొరపాటున విద్యుత్ ప్రమాదం జరిగినట్లుగా చిత్రీకరించేందుకు కుట్రలు పన్ని మృతదేహాన్ని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఏఎస్ఐ తెలిపారు. జరిగిన సంఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. కాగా ఆదివారం పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని డాగ్స్క్వాడ్తో విచారణ చేపట్టారు. వాల్మీకిపురం పరిసరాల్లో గత కొద్ది రోజులుగా కరెంటు తీగెల ఉచ్చులు ఏర్పాటు చేసి అడవి జంతువులను వేటగాళ్లు వేటాడుతున్నట్లు గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. స్పందించి చర్యలు చేపట్టాల్సిన ట్రాన్స్కో అధికారులు పట్టించుకోవడం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. కొంతమంది ట్రాన్స్కో సిబ్బంది సహాయ సహకారాలతోనే వేటగాళ్లు అడవి జంతువులను వేటాడుతున్నారని గ్రామస్తులు బహిరంగంగా ఆరోపిస్తుండటం గమనార్హం. -
రెండు గ్రామాల మధ్య తాగునీటి గొడవ
● ఆ ఊర్లకు ఒకే తాగునీటి బోరు ● నీళ్లు వదిలే విషయమై వివాదం ● శత్రువులుగా మారిన బంధువులు ● పరస్పర దాడులు.. నెలకొన్న ఉద్రిక్తతకురబలకోట : బంధుత్వం మరచి తాగునీటి కోసం తగవులు పడ్డారు. ఒకప్పుడు ఆప్యాయంగా మసలుకున్న వారు పట్టుదలకు పోయి నీటి కోసం పరస్పరం శత్రువులుగా మారారు. కోపతాపాలతో రగిలిపోయారు. రక్త సంబంధం కన్నా తాగునీటి సమస్యే పెద్దదయింది. రెండు గ్రామాలకు ఒకే తాగునీటి బోరు.. నీటి సరఫరా విషయమై పరస్పర ఘర్షణలతోపాటు తీవ్ర ఉద్రిక్త పరిస్థితులకు దారితీసింది. తాగునీరు సక్రమంగా వదల లేదన్న కారణంగా తలెత్తిన వివాదం ఒక గ్రామం వారిపై మరో గ్రామం వారు దాడి చేశారు. రెండు గ్రామాలకు ఒకే బోరు ద్వారా నీటి వినియోగంపై వివాదం ముదిరి దాడులకు, పైపులైన్ ధ్వంసానికి దారితీసింది. ఆదివారం సీపీఐ నాయకులు సాంబశివ, మాధవ ఆ గ్రామాన్ని సందర్శించి దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ సంఘటనకు సంబంధించి అధికారులు, గ్రామస్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని పిచ్చలవాండ్లపల్లి గ్రామం లక్కసముద్రం ప్రాంతంలో ఎర్రజేనువారిపల్లి, బోడికుంట్లపల్లి ఉన్నాయి. రెండు గ్రామాల వారు ఒకే సామాజిక వర్గానికి చెందిన వారు. బంధువులు కూడా. ఒక గ్రామంలో నాలుగు కుటుంబాలు, సమీపంలోనే ఉన్న బోడికుంట్లపల్లిలో ఎనిమిది కుటుంబాలు ఉన్నాయి. ఏడాది క్రితం తాగునీటి బోరు వేయడానికి అధికారులు ప్రయత్నించగా.. జియాలజిస్టు బోడికుంట్లపల్లి వద్ద పాయింట్ చూపగా అక్కడ బోరు వేశారు. అక్కడి నుంచి సమీపంలోని ఎర్రజేనువారిపల్లికి పైపులైన్ ద్వారా నీటి సరఫరా చేస్తున్నారు. ఒక రోజు ఒక ఊరికి ఇంకో రోజు మరో ఊరికి నీరు సరఫరా చేయాలని అధికారులు సూచించారు. అయినా ఈ విషయంలో తొలి నుంచి రెండు ఊర్ల మధ్య మనస్పర్థలు తలెత్తుతూనే ఉన్నాయి. ఒకరు పైపులైన్ ధ్వంసం.. మరొకరు దారికి గొయ్యి బోరు, మోటారు అడవికుంట్లపల్లి ఆధీనంలో ఉండటంతో నీటి సరఫరాకు వారి దయా దాక్షిణ్యాలపై ఆధారపడాల్సి వస్తోందని ఎర్రజేనువారిపల్లి వాసుల ఆరోపణే కాదు మనసులో మొదటి నుంచి కోపం కూడా. ఈ క్రమంలో నీళ్లు సక్రమంగా వదలలేదని అడవికుంట్లపల్లి వాసులు తమ ఊరి ద్వారా రాకపోకలకు సాగించకుండా ఎర్రజేనువారిపల్లి వాసులు దారికి గొయ్యి తీశారు. దీంతో ఆ ఊరి వారు ఎర్రజేనువారిపల్లికి నీళ్లు వెళ్లకుండా ప్రతీకారంగా పైపులైన్ ధ్వంసం చేశారు. పరస్పరం దాడులు చేసుకున్నారు. బాధితులు మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తమ ఊరికే ప్రత్యేకంగా బోరు వేస్తే ఈ సమస్య రాదని ఎర్రజేనువారిపల్లి వారు డిమాండ్ చేస్తున్నారు. అధికారులు ఆ గ్రామాన్ని సందర్శించారు. ధ్వంసమైన పైపులైన్ను శనివారం పునరుద్ధరించి తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకున్నారు. దారికి తీసిన గొయ్యిని పూడ్చి రాకపోకలకు వీలు కల్పించారు. ఈ విషయమై ఎంపీడీఓ గంగయ్యను వివరణ అడగగా.. తాగునీరు వదిలే విషయమై రెండు ఊర్ల మధ్య కొంత కాలంగా విభేదాలు తలెత్తాయన్నారు. ఆ ప్రాంతాన్ని సందర్శించి సర్దిచెప్పడం జరిగిందన్నారు. ఎర్రజేనువారిపల్లికి ప్రత్యేకంగా బోరు వేసే విషయమై ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లినట్లు తెలిపారు. సమస్య శాశ్వత పరిష్కారానికి చర్యలు చేపడుతున్నట్లు తెలిపారు. -
ఆక్రమణలు.. అక్రమ నిర్మాణాలు
మదనపల్లె: మదనపల్లె పట్టణ నడిబొడ్డున సాగుతున్న బహుదా కాలువ యథేచ్ఛగా ఆక్రమణకు గురవుతోంది.ఈ కాలువ 4.5 కిలోమీటర్లు సాగుతుంది.దీని విలువ చెప్పలేనంతగా ఉంది. కాలువ కావడంతో దీనికి ఇరువైపులా ఆక్రమణలు జోరుగానే సాగుతున్నాయి. అధికారుల సాక్షిగా భవనాలు నిర్మించుకున్నారు. రోజురోజుకు కాలువ కుచించుకుపోతున్నా పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు లేకపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఇందులో భాగంగా బహుదాకాలువను తాజాగా రాంనగర్ పార్క్ సమీపంలోని అపార్ట్మెంట్ల వద్ద దురాక్రమణకు గురవుతోంది. కాలువలోకి భవన నిర్మాణాల శిథిలాలను తరలించి నింపి చదును చేస్తున్నారు. దీని పక్కనే సమాధులు కూడా ఉన్నాయి వాటిని కూడా కప్పేస్తున్నారు. ఈ ఆక్రమణ సాగుతున్నా కాలువలోకి ఆక్రమణ జరుగుతోందా లేదా అన్నదానిపై అధికారులు పట్టించుకోవడం లేదు. నీటిపారుదల శాఖ పరిధికి చెందిన ఈ కాలువ విషయంలో అన్ని ప్రభుత్వ శాఖలు కఠినచర్యలు చేపట్టాల్సి ఉంది. అయితే ఇప్పటికే కాలువ ఇరువైపులా జరిగిన నిర్మాణాలపైనే ఇంతవరకు అధికారులు చర్యలు తీసుకోలేదు. ఇలాంటి పరిస్థితుల్లో ఇప్పుడు జరుగుతున్న దురాక్రమణ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకుంటారో వేచి చూడాలి. ఆక్రమణ ఎవరు చేస్తున్నారు, కాలువ ఎంత పూడ్చారు, కాలువకు ఎంత నష్టం జరిగింది అన్న వివరాలపై అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి తేల్చాల్సి ఉంది. బాహుదా కాలువ అక్రమణపై రెవిన్యూ, మున్సిపల్, నీటి పురుష అధికారులు సంయుక్తంగా కఠిన చర్యలు చేపడితే గాని ఆక్రమణలపై ఉక్కు పాదం మోపే పరిస్థితి కనిపించడం లేదు. కోర్టు ఆదేశాలే అమలుకాలేదు మదనపల్లె పట్టణంలోని బి.కె.పల్లి గ్రామ పరిధిలో ఉన్న బహుదా కాలువపై, దానికి సంబంధించిన స్థలాల ఆక్రమణలపై 2008లో దాఖలైన రిట్ పిటిషన్న్పై విచారణ జరిపిన హైకోర్టు పిటిషన్న్లో పేర్కొన్న వివరాల ప్రకారం ఆక్రమణలు చేసినప్పటికీ, అధికారులు చర్యలు తీసుకోలేదని గుర్తించింది. ఈ అంశంపై తహసీల్దార్ ఇచ్చిన నివేదికలు, ఇతర రికార్డులను పరిశీలించిన కోర్టు, ఆక్రమణలు జరిగినట్లు స్పష్టమైన ఆధారాలు ఉన్నాయని దీనిపై అధికారులు చర్యలు తీసుకుని ఆక్రమణలను తొలగించాలని ఆదేశించింది. ఈ ఆదేశాలు ఇప్పటికి అమలుకు నోచుకోలేని ఇలాంటి పరిస్థితుల్లో బాహుదా కాలువను సంరక్షించడం సాధ్యమా అన్న అనుమనాలు వ్యక్తం అవుతున్నాయి. చర్యలు తీసుకుంటాం బహుదా కాలువ ఆక్రమణపై పరిశీలించి చర్యలు తీసుకుంటామని నీటిపారుల శాఖ ఈఈ సురేష్బాబు ఆది వారం అన్నారు. సోమవారం కాలువను పరిశీలించి ఏమేరకు ఆక్రమించారో పరిశీలించి విచారిస్తామని, తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. కుచించుకుపోతున్న బహుదా కాలువ అధికారిక చర్యలు శూన్యం కోర్టు ఆదేశాలున్నాఉలుకులేని అధికారులు -
ఆ పోలీస్ అధికారులపై చర్యలు చేపట్టేరా?
సాక్షి టాస్క్ఫోర్స్ : పులివెందుల సబ్ డివిజన్ అధికారితోపాటు మరో సీఐపై జాతీయ మానవ హక్కుల కమిషన్ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ చర్యలు చేపడతారా అని పలువురు చర్చించుకుంటున్నారు. వివరాలలోకి వెళితే.. గత నెల 25వ తేదీన పులివెందుల 4వ వార్డు వైఎస్సార్సీపీ కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్ ఫిర్యాదు నేపథ్యంలో జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) పులివెందుల సబ్ డివిజన్ అధికారితోపాటు మరో సీఐపై కేసు నమోదు చేసి నాలుగు వారాల్లోగా చర్యలు చేపట్టాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మరో మూడు రోజుల్లో గడువు ముగియనుండటంతో ఆ పోలీసు అధికారులపై జిల్లా ఎస్పీ ఎలాంటి చర్యలు చేపడుతారోనని వేచి చూస్తున్నారు. కౌన్సిలర్ కిశోర్తోపాటు గతేడాది పులివెందుల మాజీ మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్తోపాటు 13 మందిపై టీడీపీ నాయకుల ఒత్తిళ్ల మేరకు అప్పట్లో అక్రమ కేసు నమోదు చేయడం జరిగింది. అంతేకాక కిశోర్తోపాటు మరో ఐదుగురిపై థర్డ్ డిగ్రీ ప్రయోగించారు. దీనిపై కిశోర్ జాతీయ మానవ హక్కుల కమిషన్కు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే ఇందులో ఉన్న సీఐ స్థాయి అధికారి లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడి రిమాండ్లో ఉండటం గమనార్హం. అక్రమ కేసు బనాయించిన ఆ అధికారులపై చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. రోజూ రూ.కోట్లు చేతులు మారుతున్న వైనం పులివెందుల నియోజకవర్గంలో యథేచ్ఛగా జూదాలు జరుగుతున్నాయి. టీడీపీ నాయకుల కనుసన్నల్లో జూద స్థావరాలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గంలోని టీడీపీ నాయకుల స్వగ్రామంతోపాటు లింగాల మండలం, ఇతర ప్రాంతాలలో జూదాలు సాగుతున్నాయి. రోజుకు కోట్లాది రూపాయల డబ్బు చేతులు మారుతోంది. పులివెందులలో ఎన్నడూ లేని విష సంస్కృతిని టీడీపీ హయాంలో తీసుకొచ్చారని ఆ ప్రాంత ప్రజలు వాపోతున్నారు. గత నెలలో జరిగిన సంక్రాంతి పందేల ముసుగులో గోవా జూద సంస్కృతిని తెచ్చి యథేచ్ఛగా టెంట్లు వేసి జరిపించారు. వీటి ద్వారా టీడీపీ నాయకులు ప్రతి రోజు లక్షల్లో దండుకున్నారనే ఆరోపణలు ఉన్నాయి. పులివెందుల పట్టణానికి నూతనంగా వచ్చిన ఎస్ఐ తెలుగుదేశం పార్టీ జూదశాలపై దాడి చేయగా, ఆ ఎస్ఐని అధికార పార్టీ నాయకులు స్టేషన్లోనే దుర్భాషలాడటమే కాకుండా పులివెందుల నుంచి ట్రాన్స్ఫర్ కూడా చేయించారు. అప్పుల పాలవుతున్న కుటుంబాలు నియోజకవర్గంలో యథేచ్చగా జూదాలు ఆడుతుండటంతో.. వీటికి బానిసలైన కొంత మంది డబ్బులు పోగొట్టుకుని వారి కుటుంబాలు రోడ్డున పడుతున్నాయి. కొన్ని నెలల క్రితం సింహాద్రిపురం మండలానికి చెందిన ఓ వ్యక్తి జూదంలో డబ్బులు పోగొట్టుకుని ఆత్మహత్య చేసుకున్నట్లు సమాచారం. అంతేకాకుండా లింగాల మండలానికి చెందిన ఓ వ్యక్తి, పులివెందుల మండలానికి చెందిన మరో వ్యక్తి జూదంలో డబ్బులు కోల్పోయి అప్పుల పాలైనట్లుగా తెలుస్తోంది. సంక్రాంతి ముసుగులో జరిగిన జూదాలలో అనేక మంది డబ్బులు పొగొట్టుకుని అప్పుల పాలయ్యారు. వీరి కుటుంబాలు రోడ్డు పాలవ్వడానికి టీడీపీ నాయకులు నిర్వహిస్తున్న జూదశాలలే కారణమని బలమైన ఆరోపణలు ఉన్నాయి. కానీ అవన్ని తమకు పట్టనట్లుగా తమ అక్రమార్జనే ధ్యేయంగా టీడీపీ నాయకులు ముందుకు వెళ్తున్నారు. అరికట్టాల్సిన వారే.. పులివెందులలో ఖాకీపై ఖద్దరు సవారీ చేస్తుందనడానికి అక్కడ జరుగుతున్న సంఘటనలే ఉదాహరణలుగా చెప్పవచ్చు. అధికార పార్టీ నాయకుల ఒత్తిడి మేరకు వైఎస్సార్సీపీ నాయకులపైన అక్రమంగా కేసులు బనాయించి, ఇబ్బందులకు గురి చేస్తున్నారు. మట్కా, పేకాట వంటి అసాంఘిక కార్యకలాపాలు టీడీపీ నాయకుల కనుసన్నల్లో పేట్రేగిపోతున్నప్పటికీ పోలీసులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. ఇందుకు ఆయా పోలీసు అధికారులకు భారీ ఎత్తున ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. తమ కళ్లెదుటే జూదం జరుగుతున్నా పోలీసులు పట్టించుకోకపోవడంతో యథేచ్ఛగా జూదశాలలు నిర్వహిస్తున్నారు. అసాంఘిక కార్యకలాపాలను అరికట్టాల్సిన పోలీసులు చూసీచూడనట్లు వ్యవహరించడం పట్ల ప్రజల నుంచి తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వస్తోంది. థర్డ్ డిగ్రీ ప్రయోగించిన వారిపై ఎన్హెచ్ఆర్సీకి ఫిర్యాదు పులివెందులలో యథేచ్ఛగా జూదాలు అధికార పార్టీ నాయకుల కనుసన్నల్లో స్థావరాలు చోద్యం చూస్తున్న ఖాకీలు -
అందివచ్చిన బిడ్డ.. అనంతలోకాలకు..
మదనపల్లె టౌన్ : భద్రాచలం కొల్లిగూడెం వద్ద గోదావరి నదిలో స్నానానికి దిగి ఐదుగురు బీటెక్ విద్యార్థులు గల్లంతైన సంగతి పాఠకులకు తెలిసిందే. గోదావరిలో గల్లంతై మృతి చెందిన ఎస్ఆర్ఎమ్ విద్యార్థి సతీష్(21) స్వగ్రామం అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కొత్తవారిపల్లి పంచాయతీలోని కొయ్యలవారిపల్లిగా పోలీసులు గుర్తించారు. సతీష్.. నారాయణ కుమారుడు. శనివారం మృతదేహాన్ని గజఈతగాళ్ల సాయంతో వెలికితీశారు. విద్యార్థి సతీష్ తల్లిదండ్రులకు సమాచారం అందించడంతో వారు గోదావరి వద్దకు చేరుకున్నారు. చేతికి అంది వచ్చిన కొడుకు అనంత లోకాలకు వెళ్లిపోయాడని వారు గుండెలవిసేలా విలపించడం చూపరులను తీవ్రంగా కలచివేసింది. ఇన్నాళ్లు సరదాగా తిరుగుతూ తమతో ఎంతో ఆప్యాయంగా పలకరించి మాట్లాడే సతీష్ ఇక లేడని తెలుసుకున్న కొయ్యలవాండ్లపల్లి గ్రామస్తులు కన్నీటి పర్యంతమయ్యారు. ఇంజినీరింగ్ విద్యార్థి సతీష్ మృతితో కొయ్యలవారిపల్లెలో తీవ్ర విషాదం అలుముకుంది. ఆలయంలో అమ్మవారి తాళిబొట్టు అపహరణ వేంపల్లె : వేంపల్లెలోని పాపాఘ్ని నది సమీపంలో ఉన్న శ్రీదుర్గా గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడినట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. శనివారం తెల్లవారుజామున గుర్తు తెలియని దుండగులు గవిమల్లేశ్వర స్వామి ఆలయానికి ఉన్న తలుపులను పగులగొట్టి లోపలికి చొరబడ్డారు. ఆలయంలో ఉన్న దుర్గాదేవి అమ్మవారి తాళిబొట్టుతోపాటు బీరువాలో ఉన్న మరికొన్ని వస్తువులను దుండగులు ఎత్తుకెళ్లారు. రూ.3 వేల చిల్లర నాణేలు అపహరించారు. ఈ విషయాన్ని ఆలయ నిర్వాహకులు పోలీసులకు తెలిపారు. వారు ఆలయం వద్దకు వెళ్లి పరిశీలించారు. నిర్వాహకులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పట్టపగలే ఇంటి తాళాలు పగలగొట్టి..సుండుపల్లె : మండల పరిధిలోని రాయవరంలో శనివారం పట్టపగలే దొంగలు బీభత్సం సృష్టించారు. వివరాలలోకి వెళితే.. స్వర్ణలత అనే మహిళ ఇంటి తాళాలు పగులగొట్టి లోపలికి చొరబడి గుర్తు తెలియని దుండగులు బీరువాలోని 6.6 తులాల బంగారు నగలు రూ.25 వేల నగదు ఎత్తుకెళ్లారు. ఈ విషయంపై బాధితురాలు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కొయ్యలవారిపల్లెలో అలుముకున్న విషాదం -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
రాయచోటి : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు అయ్యాయి. వివరాల్లోకి వెళితే.. రాయచోటి రింగ్ రోడ్డు పరిధిలోని గాలివీడు–వరిగ మార్గంమధ్యలో స్కార్పియో వాహనం బోల్తాపడి ముగ్గురికి గాయాలైనట్లు సమాచారం. సినిమా చిత్రీకరణను తలదన్నేలా స్కార్పియో వాహనం పల్టీలు కొట్టుకుంటూ రోడ్డుకు పడమటి వైపున ఉన్న రాళ్లకుప్పపై పడింది. వాహనం రాయచోటి పట్టణ టీడీపీ నాయకునికి చెందినది కావడం గమనార్హం. దీంతో గాయపడ్డ వారిని గుట్టుచప్పుడు కాకుండా ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించినట్లు తెలిసింది. సంఘటనపై ఫిర్యాదు అందకపోవడంతో పోలీసులు కేసు నమోదు చేయలేదని తెలియవచ్చింది. స్కూటర్ను ఢీకొన్న కారు సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై బడ్డారెడ్డిగారిపల్లె సమీపంలో స్కూటర్ను కారు ఢీకొన్న సంఘటన చోటు చేసుకొంది. మండల పరిధిలోని అడవికమ్మపల్లె గ్రామం పాళెంగడ్డ దళితవాడకు చెందిన నాగబాబు సొంత పనులు చూసుకొని సొంత గ్రామానికి వెళ్తుండగా.. అరుణాచలం నుంచి ప్రొద్దుటూరు వెళుతున్న కారు బుడ్డారెడ్డిగారిపల్లె సమీపంలోకి రాగానే అదుపుతప్పి ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగబాబుకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితుడిని 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆటో ఢీకొని.. మదనపల్లె అర్బన్ : ఆటో ఢీకొన్న ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. మదనపల్లె పట్టణం అమ్మచెరువుమిట్టకు చెందిన వెంకటరమణ(40), శ్రీనివాసులు(45) కూలీ పనులు చేస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం సొంత పనులపై ద్విచక్రవాహనంలో పట్టణంలోకి బయలుదేరారు. దారిలో గొల్లపల్లె బైపాస్ రోడ్డులో ఎదురుగా వస్తున్న ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో వీరిద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
ఈదురు గాలులతో అప్రమత్తం
కడప అగ్రికల్చర్(వైఎస్ఆర్ జిల్లా) : బంగాళాఖాతంలో అల్పపీడనం కొనసాగుతోంది. దీంతో జిల్లాలో ఈదురుగాలులు, అకాల వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో పంట నష్టం వాటిల్లే ప్రమాదం ఉందని, రైతులు అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. ఈ నెల 19, 20 తేదీలలో వీచిన ఈదురుగాలులు, అకాల వర్షాలతో జిల్లాలోని వ్యవసాయ, ఉద్యాన పంటలకు భారీ నష్టం జరిగింది. ఇందులో భాగంగా వ్యవసాయ పంటలకు సంబంధించి జిల్లాలోని 6 మండలాల్లో 21 గ్రామాలలో 107 మంది రైతులకు చెందిన 98.40 హెక్టార్ల విస్తీర్ణంలో మొక్కజొన్న, సజ్జ పంటలు దెబ్బతిన్నాయి. అలాగే జిల్లాలోని రాజంపేట, సింహాద్రిపురం, తొండూరు, ముద్దనూరు మండలాల్లో ఉద్యాన పంటలకు సంబంధించి 62 మంది రైతులకు రూ.1.56 కోట్ల మేర నష్టం జరిగింది. ఇంకా మరో 2 రోజుల పాటు జిల్లాలో ఈదురుగాలులతో కూడిన వర్షాలు ఉన్నట్లుగా వాతావరణ సంస్థ తెలపడం జరిగింది. కావున జిల్లాలోని రైతులందరూ అప్రమత్తంగా ఉండాలని వ్యవసాయ అధికారులు రైతులకు సూచించారు. పంటలకు కలిగే నష్టాలు వర్షాలు అధికంగా కురవడం వల్ల పొలంలో నీరు నిలుస్తుంది. గాలిలో తేమ శాతం పెరగడం వల్ల పూతరాలటం, పంట పెరుగుదల కుంటుపడడంతోపాటు, పంట నాణ్యత కూడా లోపిస్తుంది. చీడ పీడల ఉధృతి పెరుగుతుంది. భూమిలోని పోషకాలు సరిగా మొక్కలకి అందక ఎదుగుదల ఆగిపోతుంది. విత్తనాలు మొలకెత్తకుండా కుళ్లిపోయే అవకాశం ఉంది. సకాలంలో తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా పంట నష్టాన్ని తగ్గించుకోవచ్చు. పలు పంటలలో తీసుకోవాల్సిన జాగ్రత్తలను జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణ్యేశ్వరరావు వివరించారు. వరద అనంతరం కొద్దిపాటి ముంపుకు గురైన పంటల్లో తీసుకోవాల్సిన జాగ్రత్తలు తెలిపారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వీలైనంత త్వరగా చేలల్లో అధికంగా ఉన్న నీటిని తీసివేయాలి. ● పంట ఎదుగుదలకు తోడ్పడే విధంగా బూస్టర్ డోస్ ఎరువులను వేసుకోవాలి. ● అధిక తేమ వల్ల ఉధృతి పెరిగే అవకాశం గల తెగుళ్లు, పురుగుల నివారణకు చర్యలు చేపట్టాలి. ● వర్షాలు ఆగిన వెంటనే అంతర సేద్యం చేసి కలుపు తొలగించుకోవాలి. ● నేల కొంచెం ఆరిన తరువాతే రసాయనిక ఎరువులను నేలలో వేసుకోవాలి. వరి పంటలో.. ● వరిలో పాము పొడ నివారణకు హెక్సాకొనజోల్ 2 మిల్లీలీటరు లేక ప్రోపికొనజోల్ 1 మిల్లీ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ట్రైసైక్లోజోల్ 0.6 గ్రాముల లేక ఐసోప్రోథయొలేన్ 1.5 మి.లీలు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● తెగుళ్ల ఉధృతి కనిపించట్లయితే ట్రైప్లోక్సీస్ట్రోబిన్ + టేబ్యుకొనజోల్ కలిసిన మందును 0.4 గ్రాముల లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● పడిపోయిన కుదళ్లను నిలబెట్టి గుంపులుగా కట్టాలి. గింజ మొలకెత్తకుండా, రంగుమారకుండా లీటరు నీటికి 50 గ్రాముల ఉప్పు కలిపి పిచికారీ చేయాలి. మొక్కజొన్న పంటకు.. ● నిలిచిన నీటిని తీసివేసిన తర్వాత, పంటపై 2 శాతం యూరియా(10 కిలోలు/హెక్టారు) లేదా 1 శాతం పొటాషియం నైట్రేట్ (5 కిలోలు/హెక్టారు) పిచికారీ చేయడం వల్ల పంట త్వరగా కోలుకుంటుంది. ● పడిపోయిన కుదళ్లను నిలబెట్టి గుంపులుగా కట్టాలి. మినుము, పెసరలలో.. ● అధికంగా నిలిచిపోయిన నీటిని బయటికి తీయాలి. ● ఇనుము లోపాన్ని సవరించడానికి, సమర్థంగా పంట కోలుకోవడానికి ఫెర్రస్సల్ఫేట్ 5.0 గ్రా + సిట్రిక్ యాసిడ్ 0.5 గ్రాములు, యూరియా 20 గ్రాములు లీటరు నీటికి పిచికారీ చేయాలి. ● వర్షాలు తగ్గగానే, ఒక వారం తర్వాత, 1 శాతం 19:19:19 లేదా పొటాషియం నైట్రేట్ పిచికారీ చేయాలి. వేరుశనగకు.. ● వేరుశనగలో ఆకుమచ్చ, కాండం కుళ్లు తెగులు ఉధృతి పెరగకుండా హెక్సాకొనజోల్ 2 మి.లీలు/ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● ఇనుము లోపాన్ని సవరించడానికి ఫెర్రస్సల్ఫేట్ 5 గ్రా/లీతోపాటుగా సిట్రిక్ యాసిడ్ 1 గ్రా/లీ పిచికారీ చేయాలి. ● పంట కోతకు సిద్ధంగా ఉన్న చోట వర్షాలు ఆగే వరకు పంటకోత ఆలస్యం చేయాలి. బంగాళాఖాతంలో కొనసాగుతున్న అల్పపీడనం మరో 2 రోజులపాటు వర్షాలు జాగ్రత్తలు పాటించాలంటున్న వ్యవసాయ అధికారులుసూచనలు పాటించాలి జిల్లా వ్యాప్తంగా కురుస్తున్న అకాల వర్షాలు, ఈదురు గాలులతో రైతులు అప్రమత్తంగా ఉండాలి. గాలులు, వర్షాలతో పంటలు దెబ్బతినకుండా ఉండేందుకు ప్రాథమిక సూచనలు, జాగ్రత్తలను ప్రతి రైతు పాటించాలి. దీంతో పంటనష్టం నుంచి సులభంగా రైతులు బయటపడేందుకు అవకాశం ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ జాగ్రత్తలు తీసుకోవాలి. – మట్టా సుబ్రమణ్యేశ్వరరావు, జిల్లా వ్యవసాయ అధికారి -
బి.కొత్తకోటలో సిలిండర్ నుంచి మంటలు
బి.కొత్తకోట : స్థానిక చికెన్ సెంటర్లో సిలిండర్ నుంచి మంటలు రావడంతో స్థానికుల్లో తీవ్ర భయాందోళనలు వ్యక్తమయ్యాయి. శనివారం రాత్రి స్థానిక బీరంగి రోడ్లోని ఓ చికెన్ సెంటర్లో నిర్వాహకుడు ఫయాజ్ సిలిండర్ మంటతో కోడిని కాల్చుతున్నాడు. ఆ సమయంలో పైపు దెబ్బతిన్న కారణంగా సిలిండర్కు మంటలు అంటుకున్నాయి. ఇది పేలిపోతుందన్న భయంతో నిర్వాహకులు మండుతున్న సిలిండర్ను లాక్కుంటూ రోడ్డుపైకి తీసుకొచ్చారు. ఇది చూసిన స్థానికులు భయాందోళనలతో కేకలు వేశారు. సిలిండర్ పేలే ప్రమాదం ఉందని పరుగులు తీశారు. తర్వాత స్థానికులు మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. కాగా సిలిండర్ను రోడ్డుపైకి లాక్కుని రావడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. రోడ్డుపై రాకపోకలు జరుగుతున్న సమయంలో ఇలా చేయడం మరింత ప్రమాదం అయ్యేదని ఆందోళన వ్యక్తం చేశారు. గండిమడుగులో మహిళ మృతదేహం లభ్యంగాలివీడు : మండలంలోని గండిమడుగు వద్ద మహిళ మృతదేహం లభ్యమైంది. నంది మండలానికి చెందిన అనితమ్మ (69) ప్రమాదవశాత్తు గండిమడుగులో మునిగి మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనపై శనివారం పోలీసులు కేసు నమోదు చేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం లక్కిరెడ్డిపల్లె ఆస్పత్రికి తరలించినట్లు వారు వెల్లడించారు. -
చోరీ అయిన బంగారు నగలు లభ్యం
చౌడేపల్లె : సత్యప్రమాణాలకు నిలయమైన రాజనాలబండ ప్రసన్నాంజనేయస్వామి ఖ్యాతి మరోసారి వెలుగులోకి వచ్చింది. చోరీకి గురైన 5 బంగారు ఉంగరాలు తిరిగి లభ్యం కావడంతో.. రాజనాల బండ మహిమ మరోసారి రుజువైందని స్థానికులు అంటున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. చిత్తూరుకు చెందిన ఓ దంపతుల ఇంట్లో గతేడాది డిసెంబరులో 5 బంగారు ఉంగరాలు చోరీకి గురయ్యాయి. చుట్టుపక్కల ప్రజలు వారికి రాజనాల బండ మహిమను వివరించారు. వారు గత నెలలో రాజనాలబండకు చేరుకొని పూజలు చేసి వెళ్లారు. అనుమానితులతో సమావేశమై రాజనాలబండలో శనివారం ప్రమాణం చేయాలని చెప్పగా.. ఉదయాన్నే ఇంటి ఆవరణలో ఆ ఉంగరాలు ప్రత్యక్షమయ్యాయి. వాటిని గుర్తించిన బాధితులు రాజనాలబండకు చేరుకొని స్వామివారి పాధాల చెంత పెట్టి పూజలు చేశారు. అనంతరం అర్చకులు కృష్ణమూర్తి, గ్రామపెద్దలు కలిసి బాధితులకు నగలు అందజేశారు.రాజనాల బండ మహిమే అంటున్న స్థానికులు -
దర్జాగా ప్రభుత్వ భూమి కబ్జా
రొంపిచెర్ల : ప్రభుత్వ భూమిని దర్జాగా కబ్జా చేస్తున్నారు. అడ్డుకోవాల్సిన అధికారులు చేతులెత్తేశారు. పైగా అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల మండలం బండకిందపల్లె గ్రామ పంచాయతీలో ఆక్రమణకు గురైన భూమిని రక్షించాల్సిన బాధ్యత గ్రామ పంచాయతీ కార్యదర్శులదేనని తహసీల్దార్ కిరణ్కుమార్ తెలియజేశారు. రూ.3 కోట్ల విలువ చేసే ప్రభుత్వ భూమి ఆక్రమణకు గురైందని కమోళ్లపల్లె, మట్లోళ్లపల్లె గ్రామస్తులు గత నెలలో జిల్లా కలెక్టర్ సుమిత్కుమార్కు గ్రీవెన్స్సెల్లో ఫిర్యాదు చేశారు. జాతీయ రహదారి పక్కన భూముల రేట్లు కోట్లలో పలుకుతుండడంతో కొందరు ఆక్రమణకు తెరలేపారు. రెవెన్యూ అధికారులు సకాలంలో స్పందించక పోవడంతో ఆక్రమణదారులు సర్వే నంబరు 36లో ప్రభుత్వ భూమిని ఆక్రమించి చుట్టూ పెన్సింగ్ వేసి మామిడి మొక్కలు కూడా నాటేశారు. ఈ భూమిలో ఎవరు ప్రవేశించరాదని సీసీ కెమెరాలతో నిఘా ఏర్పాటు చేశారు. అయితే ఈ భూమిని రక్షించాల్సిన బాధ్యత గ్రామ కార్యదర్శిదేనని తహసీల్దార్ రైతులకు రాత పూర్వకంగా తెలియజేశారు. ఇది చూసిన రైతులు అవాక్కు అయ్యారు. ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన తహసీల్దార్ ఈ వివాదంలో తప్పుకోవడం ఏమిటని ప్రశ్నిస్తున్నారు. అదే భూమిలో చెరువు కాలువను కూడా పూడ్చి వేశారని ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ప్రభుత్వ భూమిని కాపాడాల్సిన అధికారులు కొందరు ఆక్రమణదారుడికి అనుకూలంగా మారిపోయారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పుటికై నా రెవెన్యూ అధికారులు స్పందించి సప్లయ్ చానల్ను పునరుద్ధణ చేసి ఆక్రమణకు గురైన భూమిని స్వాధీనం చేసుకుని, ప్రభుత్వ అవసరాలకు వినియోగించుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. క్రిమినల్ కేసుల నమోదుకు ఆదేశం బండకిందపల్లె గ్రామ పంచాయతీలో 36 సర్వే నంబరులో ముగ్గురు వ్యక్తులు 1.37 ఎకరాల భూమిని ఆక్రమించుకుని మామిడి చెట్లు కూడా నాటుకున్నారని గుర్తించాం. వీరిపైన క్రిమినల్ కేసులు నమోదు చేయాలని రొంపిచెర్ల పోలీసులను ఆదేశించాం. గ్రామ పంచాయతీ పరిధిలోని చెరువులు, బండలు, కాలువల ఆక్రమణ జరిగితే, దానికి గ్రామ పంచాయతీ కార్యదర్శులే చర్యలు తీసుకోవాలి. – కిరణ్కుమార్, తహసీల్దార్ 36 సర్వే నంబరులో ముగ్గురు ఆక్రమణదారుల గుర్తింపు ఆ స్థల రక్షణ బాధ్యత కార్యదర్శిదే అంటున్న తహసీల్దార్ తహసీల్దార్ తీరుపై గ్రామస్తుల మండిపాటు -
అన్నదమ్ములపై దాడి
మదనపల్లె టౌన్ : అన్నదమ్ములపై కొందరు తాగుబోతులు విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాధితులు టూటౌన్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని మునెప్పకాలనీకి చెందిన నరసింహులు(29), ఆయన తమ్ముడు రెడ్డి నీలేశ్వర్(16) రాత్రి చౌడేశ్వరి అమ్మవారి జాతరలో నడుచుకుంటూ వెళ్తుండగా, ఆరోగ్యవరం యువకులు వారిని బైక్తో ఢీకొట్టారు. దీంతో నరసింహులు స్కూటరిస్టులను నిలదీశాడు. మదనపల్లె మండలం ఆరోగ్యవరానికి చెందిన మరి కొందరు యువకులను ఫోన్ చేసి పిలిపించి నరసింహులు, అతని తమ్ముడిపై విచక్షణా రహితంగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు టూ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మహిళపై భర్త ఎదుటే అసభ్య ప్రవర్తన మదనపల్లె టౌన్ : స్థానిక చౌడేశ్వరి అమ్మవారి జాతరలో మహిళపై భర్త ఎదుటే ఆకతాయిలు అసభ్యంగా ప్రవర్తించిన సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానికంగా ఉండే మమత ఆమె భర్త సురేష్తో కలసి బైక్పై చౌడేశ్వరి అమ్మవారి జాతరకు వవెళ్లారు. రాత్రి 11 గంటల ప్రాంతంలో అమ్మవారిని దర్శించుకుని వస్తుండగా.. కొంత మంది ఆకతాయి యువకులు మమత చుట్టూ తిరుగుతూ ఈలలు వేసి అసభ్యంగా ప్రవర్తించారు. భర్త వారిని అడ్డుకున్నాడు. స్థానికంగా ఉన్న కొందరు గమనించి ఆకతాయిలను పట్టుకుని స్తంభానికి కట్టేశారు. జాతరలో ఉన్న బందోబస్తు పోలీసులు.. నాగరాజు నాయక్, రఘును అదుపులోకి తీసుకుని టూటౌన్ పోలీస్ స్టేషన్కు తరలించారు. బాధితురాలు మమత ఫిర్యాదుపై కేసు నమోదు చేసే దర్యాప్తు చేస్తున్నారు. ప్రార్థన చేసి వస్తుండగా రోడ్డు ప్రమాదం మదనపల్లె టౌన్ : ఈద్గాలో ప్రార్థన చేసి వస్తున్న యువకుడిని గుర్తుతెలియని వాహనం ఢీకొట్టింది. ఈ సంఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలం సిటిఎంకు చెందిన ముబారక్(20) కురబలకోట మండలం చేనేతనగర్లో అమ్మమ్మ ఇంటికి రంజాన్ పండుగకు వచ్చాడు. స్థానికంగా ఉన్న ఈద్గాలో ప్రత్యేక ప్రార్థనలు ముగించుకుని బైకులో ఇంటికి బయలుదేరగా, మార్గంమధ్యలోని విశ్వం కాలేజీ వద్దకు రాగానే గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ముబారక్ను స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం వెంటనే తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై మధురామచంద్రుడు తెలిపారు. -
తాగునీటి పైప్లైన్ ధ్వంసం
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలోని ఎర్రజేండ్లలో తాగునీటి పైప్లైన్ ధ్వంసం చేసిన వారిని నిలదీయడంతో.. వారు మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరచారు. శనివారం జరిగిన ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. కురబలకోట మండలం పిచ్చలవాండ్లపల్లె పంచాయతీ ఎర్రజేండ్ల ఒక మారుమూల కుగ్రామం. గ్రామానికి దారి కూడా సరిగా లేని పల్లె. నాలుగు కుటుంబాల వారే అక్కడ జీవనం సాగిస్తున్నారు. అయితే పక్కనే ఉన్న అడివిగుంతల గ్రామానికి చెందిన శివప్ప, హరి, నాని, విష్ణు మరికొందరు ఎర్రజేండ్ల పల్లె ప్రజలతో తరచూ గొడవలు పడుతున్నారు. పాత కక్షల నేపథ్యంలో ఎర్రజేండ్లకు ఉన్న తాగు నీటి పైపు లైన్లను ధ్వంసం చేశారు. ఈ విషయమై స్థానిక సెక్రటరీ, పంచాయతీ అధికారులకు ఫిర్యాదు చేసినా వారు ఎర్రజేండ్ల గ్రామస్తుల తాగు నీటి సమస్యపై పట్టించుకోలేదని ఆరోపిస్తూ పైపు లు ధ్వంసం చేసిన శివప్ప వర్గీయులను శనివారం నిలదీశారు. ఆగ్రహంతో రెచ్చిపోయిన శివప్ప తన అనుచరులతో మూకుమ్మడిగా వచ్చి ఎర్రజేండ్లకు చెందిన గోవిందు, నారాయణ, నాగమణి, అలివేలుపై కర్రలతో విచక్షణా రహితంగా దాడి చేసి కొట్టారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితులను చికిత్సల నిమిత్తం కుటుంబీకులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ముదివేడు పోలీసులు దాడి ఘటనపై విచారణ చేస్తున్నారు.నిలదీసిన గ్రామస్తులపై మూకుమ్మడి దాడి -
మద్యం బాటిళ్లు స్వాధీనం
సింహాద్రిపురం : సింహాద్రిపురం మండలంలోని పలు గ్రామాల్లో పులివెందుల రూరల్ సీఐ సీతారామిరెడ్డి పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు శనివారం తనిఖీలు చేపట్టారు. ఇందులో భాగంగా మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన చిన్న ఓబుళరెడ్డి ఇంట్లో ఉన్న 12 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకుని, సీజ్ చేసి కేసు నమోదు చేసినట్లు హెడ్ కానిస్టేబుల్ చంద్రమోహన్రెడ్డి తెలిపారు. దాడుల్లో పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. దుకాణంలోకి దూసుకొచ్చిన ట్రాక్టర్రాజంపేట : పట్టణ పరిధి రైల్వేస్టేషన్ రోడ్డులోని ఓ స్టీల్, సిమెంట్ దుకాణంలోకి శనివారం ఇసుక ట్రాక్టర్ దూసుకొచ్చింది. త్రుటిలో ప్రమాదం తప్పింది. ఈ ప్రమాదంలో ప్రాణనష్టం చోటు చేసుకోకపోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. ప్రమాదవశాత్తు ఈ సంఘటన జరిగినట్లుగా స్థానికులు భావిస్తున్నారు. చక్రాయపేట ఎంపీపీ ఇంట్లో చోరీవేంపల్లె : వేంపల్లెలోని శ్రీచైతన్య పాఠశాల ప్రాంతంలో నివాసముంటున్న చక్రాయపేట ఎంపీపీ మాధవీ బాలకృష్ణ ఇంట్లో శనివారం తెల్లవారుజామున చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న 5 తులాల బంగారు, అర్ధ కేజీ వెండి ఆభరణాలు గుర్తు తెలియని దుండుగులు అపహరించారు. బాధితుడు బాలకృష్ణారెడ్డి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉగాది, రంజాన్ పండుగలు సందర్భంగా విద్యార్థులకు సెలవులు ఇవ్వడంతో పిల్లలను తీసుకొని సొంత గ్రామమైన చక్రాయపేట మండలం సురభి గ్రా మంలోని మలికివాండ్లపల్లెకు ఇంటికి తాళాలు వేసి వెళ్లారు. శనివారం సాయంత్రం బాలకృష్ణ సోదరి లక్ష్మీదేవి శుభ కార్యానికి పిలవడానికి వేంపల్లెకు రావడం జరిగింది. ఇంటి తలుపులు తెరిచి ఉండటంతో సోదరుడు ఇంట్లో ఉన్నాడని వెళ్లి చూడగా.. రెండు బీరువాలు తెరిచి ఉండటం గమనించింది. దొంగలు పడ్డారనే భయంతో సోదరుడైన బాలకృష్ణకు ఫోన్ చేసింది. తాము మలికివాండ్లపల్లెలో ఉన్నామని, ఏమి విషయం అని అడగగా.. మీ ఇంట్లో చోరీ జరిగిందని, త్వరగా రావా లని చెప్పడంతో ఆయన వెంటనే వచ్చారు. ఇల్లు, పరిసరాలను చూసి పోలీసులకు ఫిర్యాదు చేశారు. రెండు బీరువాలను పరిశీలించగా 5 తులాలకు సంబంధించిన రెండు బంగారు చైన్లు, కమ్మలు, ఉంగరాలతోపాటు అర్ధ కేజీ వెండి వస్తువులు అపహరణకు గురైనట్లు గుర్తించాడు. ఈ మేరకు ఆయన వేంపల్లె పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశా రు. దీంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకు ని పరిశీలించారు. వారు కేసు నమోదు చేసి దర్యా ప్తు చేస్తున్నారు. మండలంలోని వేంపల్లేలో, పాపా ఘ్ని నది సమీపంలో ఉన్న శ్రీదుర్గా గవి మల్లేశ్వరస్వామి ఆలయంలో ఒకే రోజు చోరీలు జరగడంతో ప్రజలు భయభ్రాంతులకు గురవుతున్నారు. ప్రాణం తీసిన ఈత సరదా కడప అర్బన్ : ఈత సరదా ఓ యువకుడి ప్రాణం తీసింది. రంజాన్ పండుగ సందర్భంగా సెలవు కావడంతో ఈతకెళ్లి మృత్యువాత పడ్డాడు. స్నేహితులతో కలిసి వెళ్లి బావిలో మునిగి ప్రాణాలు వదిలిన సంఘటన కడప నగరం రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో శనివారం చోటుచేసుకుంది. రిమ్స్ పోలీసుల వివరాల మేరకు.. కడప బీడీ కాలనీకి చెందిన షేక్ మహమ్మద్ హనీఫ్ (28) తన తండ్రితోపాటు తిరుపతిలో వెల్డింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే వాడు. రంజాన్ పండుగ సందర్భంగా స్నేహితులతో కలిసి బుడ్డాయిపల్లె వద్ద ఉన్న బావి వద్దకు వెళ్లి ఈత కొట్టాడు. కొద్దిసేపటికి నీటిలో మునిగి ప్రాణాలు కోల్పోయాడు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని రిమ్స్ మార్చురీకి తరలించినట్లు పోలీసులు తెలిపారు. -
కేంద్రీయ కల..సాకారం
మదన పల్లె కేంద్రీయ విద్యాలయానికి కేంద్రప్రభుత్వం ప్రిన్సిపాల్ను నియమించింది. కర్నూలు కేంద్రీయ విద్యాలయంలో హెడ్మాస్టర్గా పనిచేస్తున్న తమ్మిశెట్టి వెంకటేశ్వర్లను ఇన్చార్జ్ ప్రిన్సిపాల్గా నియమిస్తూ ఉత్తర్వు జారీ చేయడంతో శుక్రవారం ఆయన ఇక్కడ బాధ్యతలను స్వీకరించి కార్యకలాపాలను ప్రారంభించారు. మదనపల్లె: మదనపల్లెను విద్యా కేంద్రంగా తీర్చిదిద్దే చర్యల్లో భాగంగా కేంద్ర ప్రభుత్వ ప్రతిష్టాత్మక విద్యా కేంద్రం..కేంద్రీయ విద్యాలయం ద్వారా పేద విద్యార్థులకు ఉన్నత విద్యను అందించాలన్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి లక్ష్యం నెరవేరుతోంది. కేంద్రంపై ఒత్తిడితో ఆయన మంజూరు చేయించిన కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ మేరకు కేంద్రం చర్యలు తీసుకుంటూ ఈ విద్యా కేంద్రానికి ప్రిన్సిపాల్ను నియమిస్తూ చర్యలు తీసుకుంది. వచ్చే విద్యా సంవత్సరం 2026–27 నుంచే తరగతులను ప్రారంభించేందుకు నిర్ణయించగా దరఖాస్తులను ఆహ్వనిస్తూ ప్రకటన జారీ చేశారు. కూటమిప్రభుత్వం మోకాలడ్డినా కేంద్రప్రభుత్వంతో ఎంపీ నిత్యం సంప్రదిస్తూ మదనపల్లె ప్రతిష్టను ఇనుమడింపజేశారని ప్రజలు కొనియాడుతున్నారు. ఎస్టీ హస్టల్లో తరగతులు మదనపల్లెలోని నీటిపారుదలశాఖ ఆవరణలో నిర్మించిన గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల (బాలురు)ను కేంద్రీయ విద్యాలయం మార్చారు. గత ఏడాదే తరగతుల నిర్వహణకు అనుగుణంగా ఏర్పాట్లు పూర్తి చేశారు. ప్రస్తుతం తరగతుల నిర్వహణకు భవనం సిద్ధంగా ఉంది. ప్రస్తుతం ఒకటి నుంచి ఐదో తరగతి వరకు తరగతులను నిర్వహించి వచ్చే 2027–28 ఏడాదిలో తరగతుల సంఖ్యను పెంచనున్నారు. ప్రతి తరగతిని 40 సీట్లు ఉంటాయి. వీటిలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు చెందిన కేటగిరీ ఫోర్ ఉద్యోగుల పిల్లలకు సీట్ల కేటాయింపు ఉంటుంది. ఈ సీట్లకు కేంద్రప్రభుత్వ ఉద్యోగులు లేకుండా రాష్ట్రప్రభుత్వ ఉద్యోగుల పిల్లలకు అవకాశం ఉంటుంది. వీరితోపాటు సాధారణ పిల్లలకు సీట్లు కేటాయిస్తారు. ఇందులో ఎస్సీలకు 15శాతం, ఎస్టీలకు 7.5శాతం, ఓబీసీలకు 27శాతం రిజర్వేషన్ ఉంటుంది. దరఖాస్తుల ఆహ్వనం కేంద్రీయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి అడ్మిషన్లు ప్రారంభించారు. 1వ తరగతి అడ్మిషన్లకు దరఖాస్తులు మార్చి 20 నుంచి ఏప్రిల్ 2 వరకు ఆన్లైన్లో ద్వారా మాత్రమే స్వీకరిస్తారు. 2వ తరగతి నుంచి 5వ తరగతి వరకు దరఖాస్తులు విద్యాలయ కార్యాలయంలో అందుబాటులో ఉంటాయి. మొదటి తరగతికి దరఖాస్తు చేసుకునే విద్యార్థుల వయస్సు 31–03–2026 నాటికి కనీసం 6 సంవత్సరాలు పూర్తయి ఉండాలి. అన్ని అడ్మిషన్లు కేంద్రీయ విద్యాలయ సంఘటన్ మార్గదర్శకాల ప్రకారం నిర్వహిస్తారు. అడ్మిషన్లు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల పిల్లలే కాకుండా ఇతరులు కూడా ఆన్లైన్లో అధికారిక వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆన్లైన్లో అందిన దరఖాస్తులపై ఏప్రిల్ 19న పది గంటలకు 2 నుంచి ఐదో తరగతి విద్యార్థులకు సీట్ల కేటాయింపుకు లాటరీ పద్దతిలో ఎంపిక జరుగుతుంది. కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు వినతిపత్రం ఇస్తున్న ఎంపీ మిథున్రెడ్డి (ఫైల్) మదనపల్లెలో 2025–26 విద్యా సంవత్సరంలో కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించేలా స్థానిక ఎస్టీ హస్టల్ బాలుర భవనాన్ని సిద్ధం చేశారు. విద్యార్థుల తరగతుల నిర్వహణ, మౌలిక వసతుల కల్పన కోసం చర్యలు తీసుకున్నారు. త్వరితగతిన తరగతులు ప్రారంభం అయ్యేందుకు ఎంపీ మిథున్రెడ్డి ఎంపీల్యాడ్స్ నుంచి రూ.40 లక్షల నిధులు మంజూరు చేశారు. ఈ నిధులతో హస్టల్ భవనంపైన భవనాల నిర్మాణం, బాల, బాలికలకు వేర్వేరు మరుగుదొడ్లను నిర్మించారు. అయితే తరగతులను ప్రారంభించేందుకు కూటమి ప్రభుత్వం ఆసక్తి చూపలేదు. అధికారులు, కేంద్రం సిద్ధంగా ఉన్నామని చెప్పినా పట్టించుకోలేదు. దీనిపై వైఎస్సార్సీపీ లోక్సభాపక్షనేత, రాజంపేట ఎంపి పీవీ.మిథున్రెడ్డి పలుమార్లు కేంద్రమంత్రిని కలిసి విన్నవిస్తూనే ఒత్తిడి తెచ్చారు. ఫలితంగా మాకు కేటాయించిన 6.09 ఎకరాల భూమిని అప్పగించండి అంటూ అన్నమయ్యజిల్లా కలెక్టర్, ప్రభుత్వానికి కేంద్రం లేఖలు రాసింది. గత డిసెంబర్ 3న మిథున్రెడ్డి మళ్లి కేంద్రమంత్రి ధర్మేంద్ర ప్రధాన్ను కలిసి వినతిపత్రం అందించారు. ఇక్కడి పరిస్థితులు, తక్షణమే విద్యాలయం ప్రారంభించాల్సిన ఆవశ్యకతను వివరించారు. దీంతో కేంద్రం స్పందించి తరగతుల ప్రారంభానికి సిద్ధంమైంది. ఈ మేరకు ప్రిన్సిపాల్ను నియమించింది. -
ఇస్రో పిలుస్తోంది.. వెళ్దాం రండి..
రాయచోటి జగదాంబసెంటర్: అంతరిక్ష విజ్ఞానంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) ప్రతి ఏటా యువ విజ్ఞాన కార్యక్రమం (యువికా) నిర్వహిస్తోంది. ఇందులో భాగంగా ఈ ఏడాది చేపట్టబోయే కార్యక్రమం కోసం దేశవ్యాప్తంగా 9వ తరగతి విద్యార్థులను ఆహ్వానిస్తోంది. అంతరిక్ష పరిశోధనల్లో ఇటీవల ఇస్రో వంద ప్రయోగాలు పూర్తి చేసుకుంది. అగ్రదేశాలకు దీటుగా భారత్ పరిశోధనలు చేపడుతోంది. ఈ విజ్ఞానాన్ని విద్యార్థులకు తెలియజేసేందుకు, వారిలో స్ఫూర్తి నింపేందుకు ఇస్రో ఈ కార్యక్రమం చేపడుతోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది. ఆసక్తి ఉన్న విద్యార్థులు మార్చి 31వ తేదీలోగా www.isro.gov.in లో దరఖాస్తు చేసుకోవచ్చు. దరఖాస్తుల పరిశీలన అనంతరం ఏప్రిల్ 7న ఎంపికై న విద్యార్థుల జాబితా విడుదల చేస్తారు. మే 18 నుంచి విద్యార్థులను ఆహ్వానిస్తారు. మే 19 నుంచి 30 వరకు ముగింపు సందర్భంగా కార్యక్రమంలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు అందజేస్తారు. ఏడు కేంద్రాల్లో నిర్వహణ: ఇస్రో ఈ కార్యక్రమాన్ని దేశవ్యాప్తంగా ఏడు కేంద్రాల్లో చేపడుతోంది. డెహ్రాడూన్ (ఉత్తరాఖండ్), తిరువనంతపురం (కేరళ), సుళ్లూరుపేట (ఆంధ్రప్రదేశ్), బెంగళూరు (కర్ణాటక), అహ్మదాబాద్ (గుజరాత్), హైదరాబాద్ (తెలంగాణా), షిల్లాంగ్ (మేఘాలయ) 14 రోజుల పర్యటన ఇస్రో నిర్వహించే యువికా కార్యక్రమానికి ఎంపికై న విద్యార్థులకు ప్రయాణం, భోజన, వసతి సౌకర్యాలు ఇస్రో ఉచితంగా అందజేస్తుంది. ఎంపికై న విద్యార్థులను మే నెలలో 14 రోజుల పాటు ఇస్రోకు చెందిన స్పేస్ సెంటర్లకు తీసుకెళతారు. అక్కడ సైన్స్కు సంబంధించిన వింతలు, విశేషాలు, సప్తగ్రహ కూటమి తదితర అంశాలపై శాస్త్రవేత్తలు అవగాహన కల్పిస్తారు. శాస్త్రవేత్తలతో మాట్లాడే అవకాశం విద్యార్థులకు కల్పిస్తారు. అర్హులు ఎవరంటే.. ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలకు చెందిన 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. 8వ తరగతిలో సాధించిన మార్కులకు 50 శాతం వెయిటేజీ ఇస్తారు. స్పేస్, సైన్స్ క్లబ్లో ఉంటే ఐదు శాతం, జిల్లా, రాష్ట్ర, జాతీయ, అంతర్జాతీయ స్థాయిలో వ్యాసరచన, వకృత్వ పోటీల్లో ప్రతిభ చూపితే 10 శాతం, ఎన్సీసీ, స్కౌట్స్ అండ్ గ్రైడ్స్ విభాగాల్లో ఉన్న వారికి ఐదు శాతం, పల్లె ప్రాంతాలకు చెందిన వారికి 20 శాతం ప్రాధాన్యం కల్పిస్తారు. 9వ తరగతి విద్యార్థులకు అవకాశం యువికా–2026 దరఖాస్తులకుఈ నెల 31 తుది గడువు -
గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులు
మదనపల్లె: జిల్లాలో గ్యాస్ సమస్యలు తలెత్తకుండా గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించినట్టు జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు. శనివారం కలెక్టరేట్లో అధికారులు, గ్యాస్ ఏజెన్సీలు, డిస్ట్రిబ్యూటర్లతో గ్యాస్ సిలిండర్ల సరఫరా, నిల్వలు, డెలివరీ పరిస్థితులపై సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్పీజీ గ్యాస్ సిలిండర్ల సరఫరాలో కొరత లేదన్నారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా జిల్లాలోని 31 గ్యాస్ ఏజెన్సీలకు ప్రత్యేక అధికారులను నియమించగా పర్యవేక్షణ అధికారులుగా డివిజనల్ స్థాయి అధికారులను నియమించినట్టు చెప్పారు. అలాగే జిల్లా, డివిజన్ స్థాయిలో కంట్రోల్ రూములు ఏర్పాటు చేసి ప్రజల ఫిర్యాదులకు తక్షణమే స్పందించేలా చర్యలు చేపట్టినట్లు తెలిపారు. గ్యాస్ కొరత వస్తుందనే అపో హ తో ఆన్లైన్లో బుకింగ్ చేయడం అవసరం లేదని తెలిపారు. పట్టణ వినియోగదారులు 25 రోజులు, గ్రామీణ వినియోగదారులు 45 రోజుల గడువులో మాత్రమే బుకింగ్ చేసుకోవాలన్నారు. బుకింగ్ చేసిన తర్వాత ఒకటి నుంచి మూడు రోజులలో ఓటీపీ వస్తుందని, ఆ ఓటీపీ వచ్చిన తర్వాత మాత్రమే గ్యాస్ సరఫరా జరుగుతుందని తెలిపారు. గృహ వినియోగ సిలిండర్లు (14.21 కిలోలు) వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే నిత్యావసరాల చట్టం, 1955 ప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. కంట్రోల్ రూములు, టీమ్ వివరాలు -
ఇద్దరు ఎస్ఓల మార్పు
మదనపల్లె: మున్సిపాలిటీలకు ప్రభుత్వం నియమించిన ప్రత్యేకాధికారుల్లో(ఎస్ఓ) ఇద్దరిని మార్పుచేసినట్టు అధికార వర్గాలు తెలిపాయి. జిల్లాలోని రాయచోటి, పుంగనూరు మున్సిపాలిటీలకు వైఎస్సార్ కడపజిల్లా రాజంపేట, చిత్తూరు ఆర్డీఓలను నియమించారు. అయితే పొరుగుజిల్లాల ఆర్డీఓలు కావడంతో ఏ జిల్లాకు చెందిన అధికారులను ఆ జిల్లా మున్సి పాలిటీలకు నియమిస్తే పాలనా సౌలభ్యం ఉంటుదని భావించిన ప్రభుత్వం పుంగనూరుకు మదనపల్లె సబ్కలెక్టర్, రాయచోటికి అక్కడి అర్డీఓలను ప్రత్యేకాధికారులుగా నియమించారని అధికార వర్గాలు తెలిపాయి. కడప కార్పొరేషన్: కడప నగరం బిల్టప్ వద్దనున్న శ్రీ విజయదుర్గాదేవి ఆమ్మవారిని భారత మహిళ క్రికెట్ క్రీడాకారిణి శ్రీచరణి దర్శించుకున్నారు. శనివారం ఆమె కుటుంబ సభ్యులతో కలిసి అమ్మవారికి పట్టు వస్త్రాలు సమర్పించి ప్రత్యేక పూజల్లో పాల్గొన్నారు. ఆలయ నిర్వాహకులు దుర్గాప్రసాద్రావు వారికి స్వాగతం పలికి అమ్మవారి దర్శనం చేయించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ శ్రీచరణి తల్లి పదేళ్లుగా ప్రతి మంగళవారం రాహు, కేతు పూజలు నిర్వహిస్తుంటారని, ఈ రోజు కుటుంబ సమేతంగా వచ్చి మొక్కులు తీర్చుకున్నారని తెలిపారు. మదనపల్లెటౌన్: పంటలు నాశనం చేస్తున్న కోతులను బెదిరించేందుకు తారా జువ్వలు వెలిగిస్తుండగా రైతు తొడలోకి ఓ జువ్వ దూసుకెళ్లి తీవ్రంగా గాయపడ్డాడు. అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో శనివారం మధ్యాహ్నం జరిగిన ఘటనపై వివరాలు.. చీకిలబైలుకు చెందిన రైతు చిన్నయ్య(60)వ్యవసాయ బావి వద్ద సాగు చేసిన టమాటా, ఇతర కూరగాయల పంటల్లోకి కోతులు రావడంతో వాటిని తరిమేందుకు తారా జువ్వలు వెలిగించాడు. ఓ తారా జువ్వ తిరిగి ఆ రైతు తొడలోకి దూసుకుపోయి పేలిపోయింది. తీవ్రంగా గాయపడిన రైతును కుటుంబీకులు వెంటనే జిల్లా కేంద్రంలోని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ప్రాణాపాయం లేదని వైద్యులు తెలిపారు. -
అన్నమయ్య కాలిబాటలో భక్తులను అనుమతించాలి
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచిన కాలిబాటలో నడిచి వెళ్లి..ఆ కలియుగ ప్రత్యక్షదైవం శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకునే భాగ్యం ఈ సారైనా వేలాదిమంది భక్తులకు కల్పించాలని రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. కడప–రేణిగుంట జాతీయరహదారిలోని అన్నమయ్య ఉద్యానవనంలో టీటీడీ, అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న అన్నమాచార్యుల వర్ధంతి ముగింపు ఉత్సవాల్లో పాల్గొన్నారు.ఈసందర్భంగా ఆయన మా ట్లాడుతూ గతఏడాది అన్నమయ్య కాలిబాటలో వేలాది మంది భక్తులు తిరుమల మహాపాదయాత్ర చేపట్టాలని సిద్ధమయ్యారన్నారు. అయితే చివరి క్షణంలో ఈమార్గంలో యాత్రగా వెళ్లకూడదని అటవీశాఖ ఆంక్షలు పెట్టిందన్నారు. దీంతో భక్తుల మనోభావాలకు దెబ్బతగిలిందన్నారు.ఇలాంటి విధానం పునరావృతం కాకుండా ప్రభుత్వం, అటవీశాఖ చూడాలన్నారు. ● టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు ఆధ్వర్యంలో అన్నమాచార్యుని వర్ధంతి సందర్భంగా నిర్వహించిన సంగీతసభలు, హరికథలు భక్తులను అలరించాయి. రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి -
అకాలవర్షాల బీభత్సం
కడప అగ్రికల్చర్: కడప జిల్లాలో ప్రకృతి ప్రకోపానికి రైతులు విలవిల్లాడుతున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడన ప్రభావంతో రెండు రోజులుగా కురుస్తున్న అకాల వర్షాలు, బలమైన ఈదురు గాలులు జిల్లాలోని వ్యవసాయ, ఉద్యానవన పంటలను అతలాకుతలం చేశాయి. కోతకు సిద్ధంగా ఉన్న పంటలు కళ్లముందే నేలకొరగడంతో రైతులకు భారీ నష్టం వాటిల్లింది. అరటి రైతులకు కోలుకోలేని దెబ్బ జిల్లాలో ప్రధానంగా 52 హెక్టార్లలో అరటి పంట దెబ్బతింది. సుమారు 62 మంది రైతులకు రూ.156 లక్షల (1.56 కోట్లు) మేర నష్టం వాటిల్లిందని ఉద్యానశాఖ అధికారులు ప్రాథమికంగా గుర్తించారు. సింహాద్రిపురం మండలం: సింహాద్రిపురంలో 20 హెక్టార్లు (రూ.60 లక్షలు), కసనూరులో 17 హెక్టార్లలో (రూ. 51లక్షలు) పంట దెబ్బతింది. ముద్దనూరు మండలం: బొందలకుంట గ్రామంలో 12 మంది రైతులకు చెందిన 6 హెక్టార్లలో అరటి దెబ్బతిని రూ. 18 లక్షల నష్టం వాటిల్లింది. తొండూరు మండలం: బుచుపల్లిలో 5 మంది రైతులకు సంబంధించి 5 హెక్టార్లలో రూ. 15 లక్షల నష్టం జరిగింది. రాజంపేట మండలం: పెద్దకారంపల్లిలో ముగ్గురు రైతులకు సంబంధించి 2 హెక్టార్లలో రూ. 6 లక్షలు, బ్రాహ్మణపల్లెలో ఇద్దరు రైతులకు సంబంధించి 2 హెక్టార్లలో రూ. 6 లక్షల నష్టం వాటిల్లింది. మొక్కజొన్న: కొండాపురం, కమలాపురం, వీఎన్పల్లి, సింహాద్రిపురం మండలాల్లోని 21 గ్రామాల్లో 71.40 హెక్టార్లలో పంట నేలపాలైంది. సింహాద్రిపురం–2 గ్రామంలో 16 హెక్టార్లు, వీఎన్పల్లి ఇందకూరులో 8 హెక్టార్లలో నష్టం జరిగింది. సజ్జ: వీఎన్పల్లి, కాశినాయన, కొండాపురం మండలాల్లో 27 హెక్టార్లలో సజ్జ పంట దెబ్బతింది. వీఎన్పల్లిలో 12 హెక్టార్లు, కాశినాయన మండలం ఉప్ప లూరులో 7 హెక్టార్లలో పంట నష్టం వాటిల్లింది. వైఎస్సార్ కడప జిల్లాలో నేలకొరిగిన అరటి, మొక్కజొన్న, సజ్జ పంటలు సుమారు 150 హెక్టార్లలో పంట నష్టం..అవేదన వ్యక్తం చేస్తున్న అన్నదాతలు -
మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్ రెడ్డి శుభాకాంక్షలు
పుంగనూరు: రంజాన్ పండుగను పురస్కరించుకుని ముస్లిం సోదరులకు రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిధున్రెడ్డి శుభాకాంక్షలు తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట పార్లమెంట్ పరిధిలోని ముస్లిం కుటుంబాలన్నీ ఐకమత్యంతో, సుఖసంతోషాలతో ఈ పండుగను జరుపుకోవాలని వారు ఆకాంక్షించారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ.. క్రమశిక్షణ, ఐకమత్యం, దైవచింతనకు రంజాన్ పండుగ ప్రతీక అని కొనియాడారు. ఈ పండుగ అందరి జీవితాల్లో వెలుగులు నింపాలని వారు కోరారు. రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి రాజంపేట ఎంపీ పీవీ మిధున్రెడ్డి -
ఆదాయ లక్ష్యాలను సాధించాలి
కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె: ప్రభుత్వ ఖజానాకు రావాల్సిన ఆదాయ లక్ష్యాలను వంద శాతం సాధించేలా అధికారులు ప్రత్యేక కృషి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్ నుంచి వివిధ శాఖల అధికారులతో ఆయన వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు. ఎకై ్సజ్, మైనింగ్, అటవీ, రిజిస్ట్రేషన్, రవాణా, మున్సిపల్ మరియు వాణిజ్య పన్నుల శాఖల పనితీరుపై ఆయన క్షుణ్ణంగా చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పంచాయతీలు, మున్సిపాలిటీల పరిధిలో వాణిజ్య కార్యకలాపాలు పెరుగుతున్న నేపథ్యంలో, గృహ పన్నుల కంటే వాణిజ్య సంస్థల నుంచి వసూలు చేసే పన్నులపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూచించారు. వాణిజ్య సంస్థల నుంచి ప్రోపోర్షనల్ టాక్స్ వసూలు చేసేలా చర్యలు తీసుకోవాలని, వసూళ్ల ప్రక్రియలో పారదర్శకత ఉండాలని స్పష్టం చేశారు. శాఖల మధ్య సమన్వయం పెరగాలని, ప్రతి వారం బిల్లుల ప్రాసెసింగ్కు సంబంధించిన సమాచారాన్ని వాణిజ్య పన్నుల శాఖ అధికారులతో పంచుకోవాలని కోరారు. ఆదాయ లక్ష్యాల సాధనలో వెనుకబడిన శాఖలు తక్షణమే మెరుగుపడాలని ఆయన హెచ్చరించారు. ఈ సమావేశంలో స్పెషల్ డెప్యూటీ కలెక్టర్ చంద్రశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్య గొంతుకపై ప్రత్యేక కత్తి!
కడప కార్పొరేషన్: జిల్లాలోని మున్సిపల్ కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లో ప్రజాస్వామ్య పాలనను కూటమి ప్రభుత్వం పక్కన పెట్టింది. 2021 మార్చిలో ‘ఫ్యాన్’ ప్రభంజనంతో జిల్లాలోని అన్ని స్థానాలను క్లీన్స్వీప్ చేసిన వైఎస్సార్సీపీ పాలకవర్గాల ఐదేళ్ల పదవీ కాలం ఈ నెల 17తో ముగిసింది. అయితే, మళ్లీ ఎన్నికలు నిర్వహిస్తే ప్రజలు తమకు బుద్ధి చెబుతారనే భయంతో కూటమి ప్రభుత్వం ఎన్నికల ఊసెత్తకుండా, పట్టణ పాలనను అధికారుల పరంచేసింది. రాజంపేట మినహా జిల్లా వ్యాప్తంగా అన్ని మున్సిపాలిటీల్లోనూ ప్రత్యేకాధికారుల పాలన ప్రారంభమైంది. ● గత సార్వత్రిక ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత, వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలోని మున్సిపాలిటీలను లక్ష్యంగా చేసుకుని దమనకాండకు తెరలేపింది. ప్రజాప్రతినిధులను తమ పార్టీలోకి చేర్చుకునేందుకు సామ, దాన, భేద, దండోపాయాలను ప్రయోగించింది. కడప కార్పొరేషన్లో: 11 మంది కార్పొరేటర్లను బెదిరింపులు, ప్రలోభాలతో ఫిరాయింపజేశారు. ప్రొద్దుటూరులో: 17 మంది కౌన్సిలర్లపై ఒత్తిడి తెచ్చి పార్టీ మార్పించారు. పోలీసు కేసులు, గూండాగిరీతో భయపెట్టినా, మెజారిటీ ప్రతినిధులు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వానికే కట్టుబడి నిలవడం గమనార్హం. కుర్చీ కోసం కుట్రలు.. కడప నగరంలో కూటమి నేతల అరాచకం పరాకాష్టకు చేరింది. స్థానిక ఎమ్మెల్యే మాధవికి, మేయర్ కొత్తమద్ది సురేష్ బాబుకు మధ్య ప్రోటోకాల్ విషయంలో తలెత్తిన వివాదాన్ని సాకుగా చూపి, కేవలం కుర్చీ వేయలేదన్న అల్ప కారణంతో జీహెచ్ఎంసీ చట్టంలోని లొసుగులను వాడుకుని మేయర్పై అనర్హత వేటు వేయించారు. ప్రజాస్వామ్య చరిత్రలో ఇదొక చీకటి అధ్యాయంగా మిగిలిపోయింది. ఎన్ని కుతంత్రాలు పన్నినా మళ్లీ వైఎస్సార్సీపీ ప్రతినిధే మేయర్ పీఠాన్ని దక్కించుకోవడం కూటమి నేతలకు ఎదురుదెబ్బ తగిలింది. అభివృద్ధికి గండి.. ప్రజలకు ఇబ్బందులు తమకు అనుకూలంగా లేని మున్సిపాలిటీలకు నిధులు కేటాయించకుండా కూటమి ప్రభుత్వం వివక్ష చూపింది. పట్టణాల అభివృద్ధి కంటే రాజకీయ కక్ష సాధింపులకే ప్రాధాన్యతనిచ్చింది. ఇప్పుడు ప్రత్యేకాధికారుల పాలన రావడంతో సామాన్య ప్రజలు తమ సమస్యల కోసం అధికారుల చుట్టూ, ఆఫీసుల చుట్టూ తిరగాల్సిన దుస్థితి ఏర్పడింది. ఒక సమస్య వస్తే అడిగే దిక్కు లేని పరిస్థితి పట్టణాల్లో నెలకొంది. జిల్లాలో ముగిసినమున్సిపల్ పాలకవర్గాల గడువు. రాజంపేట మినహా నేటి నుంచిప్రత్యేకాధికారుల చేతుల్లోకి పురపాలన..ప్రజలకు తప్పని తిప్పలు. కూటమి సర్కార్ కుట్రలు, ఫిరాయింపుల మధ్యే ఐదేళ్ల ప్రస్థానం. నిధులు ఆపి.. అభివృద్ధిని అడ్డుకున్నా..వెరవని వైఎస్సార్సీపీ సైనికులు. -
టెన్త్ ఇంగ్లీష్ పరీక్ష వాయిదా
మదనపల్లె సిటీ: రంజాన్ పండుగ నేపథ్యంలో పదో తరగతి ఇంగ్లీష్ పరీక్ష వాయిదా పడింది. ఈ నెల 21న జరగాల్సిన ఈ పరీక్ష, వచ్చే నెల (ఏప్రిల్) 2వ తేదీన జరుగుతుందని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. 21వ తేదీ విధులకు కేటాయించిన ఇన్విజిలేటర్లు ఏప్రిల్ 2న యథావిధిగా హాజరుకావాలని ఆయన సూచించారు. రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని వెలసిన శ్రీ భద్రకాళీ అమ్మవారి ఆలయంలో శుక్రవారం రాహుకాల పూజలు అత్యంత భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్కుమార్, ఈవో వి. రమణారెడ్డిల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం జరిగింది. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, విశేష పూజలు నిర్వహించారు. అనంతరం అమ్మవారిని పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలు, రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. రాహుకాల పూజల విశిష్టతను చాటుతూ అమ్మవారికి నిమ్మకాయల హారాలను సమర్పించి సర్వాంగ సుందరంగా తీర్చిదిద్దారు. పూజా కార్యక్రమాల అనంతరం భక్తులకు అమ్మవారి దర్శనం కల్పించి, తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా అర్చకులు రాహుకాల పూజల వల్ల కలిగే ఆధ్యాత్మిక ప్రయోజనాలను భక్తులకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది, పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయంలో పీజీ కోర్సుల ప్రవేశానికి నిర్వహించే ఏపీపీజీసెట్ (APPGCET)–2026 దరఖాస్తు గడువును ఈ నెల 28వ తేదీ వరకు పొడిగించినట్లు సెట్ కన్వీనర్ డాక్టర్ టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. ఆసక్తి గల విద్యార్థులు ్చఞ. జౌఠి. జీుఽ వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని కోరారు. సందేహాల కోసం 8317532040, 8106604789 నంబర్లను సంప్రదించవచ్చు. సీపీ బ్రౌన్ భాషా పరిశోధన కేంద్రంలో ఉచితంగా దరఖాస్తు చేసుకునే సౌకర్యం ఉందని ఆయన పేర్కొన్నారు. -
రంజాన్ స్ఫూర్తిని కొనసాగించాలి
రంజాన్ పవిత్ర మాసంలో పాటించిన క్రమశిక్షణ, అలవర్చుకున్న సద్గుణాలను కేవలం ఈ నెలకే పరిమితం చేయకుండా జీవితాంతం కొనసాగించాలి. ధర్మబద్ధమైన జీవితాన్ని కొనసాగించాలి. రంజాన్ ఉపవాస దీక్షల ద్వారా నేర్చుకున్న నియమ నిబంధనలను నిత్య జీవితంలోనూ భాగం చేసుకోవాలి. – మౌలానా జలాలుద్దీన్ సాహెబ్, ప్రభుత్వ సర్ఖాజీ ప్రపంచ శాంతి కోసం ప్రార్థించాలి రంజాన్ మాసంలో అలవర్చుకున్న మంచి లక్షణాలను ఎల్లప్పుడూ కొనసాగించాలి. సద్గుణాలను నిరంతరం పాటించినప్పుడే అల్లాహ్ కరుణాకటాక్షాలు లభిస్తాయి. పండుగ శుభవేళ ప్రతి ముస్లిం సోదరుడు ప్రపంచ శాంతిని కాంక్షిస్తూ ప్రత్యేక ప్రార్థనలు చేయాలి. –ఇక్బాల్ అహ్మద్, మదనపల్లె ప్రభుత్వ ఖాజీ -
క్రీడా పోటీల్లో మెరిసిన కడప విద్యార్థులు
కడప ఎడ్యుకేషన్ : క్రమశిక్షణ, నిరంతర శ్రమ క్రీడాకారులను ఉన్నత స్థితిలో నిలబెట్టుతాయని ప్రభుత్వ పురుషుల కళాశాల (స్వయంప్రతిపత్తి) ప్రిన్సిపల్ డాక్టర్ ఎం. రవికుమార్ అన్నారు. ప్రొద్దుటూరులోని వైఎస్సార్ ఇంజినీరింగ్ కాలేజీలో రెండు రోజులపాటు జరిగిన యోగివేమన విశ్వవిద్యాలయం అంతర కళాశాలల అథ్లెటిక్స్ క్రీడా పోటీల్లో కడప ఆర్ట్స్ కళాశాల క్రీడాకారులు 20 పతకాలు సాధించారు. వారిని ప్రిన్సిపాల్ శుక్రవారం అభినందించి, భవిష్యత్తులో మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో కళాశాల వైస్ ప్రిన్సిపల్ డాక్టర్ ఎం.రమేష్, ఫిజికల్ ఎడ్యుకేషన్ డిపార్ట్మెంట్ ఇన్చార్జి డాక్టర్ టి.హజరతయ్య, అధ్యాపకులు, క్రీడాకారులు తదితరులు పాల్గొన్నారు. విజేతలు వీరే.. బీఏ తృతీయ సంవత్సరం విద్యార్థి జి.సింహాచలం 5 (1 స్వర్ణం, 2 రజతాలు, 2 కాంస్యాలు) పతకాలు, బీబీఏ తృతీయ సంవత్సరం కే మహేష్ నాలుగు రజత పతకాలు సాధించారు. బీఏ తృతీయ సంవత్సరం చదువుతున్న లోకేశ్వరరావు 5(1 స్వర్ణం, 3 రజతాలు, 1 కాంస్యం), టి.మనోజ్ కుమార్ 2 రజతాలు, వినోద్ 1 రజతం సాధించారు. బాలికల్లో నీలామహేశ్వరి జావెలిన్ త్రోలో రజితం, స్పందన 1500 మీటర్ల పరుగులో రజత పతకం సాధించారు. -
ఇంటి, నీటి పన్ను వసూళ్లలో గోల్మాల్ ?
● పీటీఎం గ్రామ సచివాలయంలో బిల్ బుక్కులు గల్లంతు ● ముగ్గురు కార్యదర్శులు, బిల్ కలెక్టర్లపై చర్యలకు సిఫారసు ● విచారణ చేపట్టిన డీఎల్పీవో పెద్దతిప్పసముద్రం : స్థానిక గ్రామ సచివాలయంలో గతంలో పని చేసిన పంచాయతీ కార్యదర్శుల వ్యవహారశైలి చూస్తుంటే ప్రజల సొమ్మును దోచుకో.. దాచుకో అన్నట్లుగా ఉంది. గత మూడేళ్లుగా ఇంటి, నీటి పన్నులకు సంబంధించి ప్రజల నుంచి వసూలు చేసిన సొమ్ములో రూ.లక్షల డబ్బు గోల్మాల్ అయినట్టు తెలుస్తోంది. పన్నుల వసూళ్ల రికార్డులు గల్లంతు కావడం వెనుక ఎవరి పాత్ర ఉందో విచారణలో వెల్లడి అయ్యే అవకాశం ఉంది. స్వర్ణ పంచాయతీలో భాగంగా పన్నుల వసూళ్లలో పీటీఎం వెనకబడటంతో డిప్యూటీ ఎంపీడీవో ప్రతాప్రెడ్డి ఫిర్యాదు మేరకు మదనపల్లి డీఎల్పీవో నాగరాజు రంగంలోకి దిగి ఇటీవల విచారణ చేపట్టారు. రూ.30 లక్షల ప్రజాధనం గోల్మాల్ స్థానిక గ్రామ పంచాయతీలో 1,800 దాకా గృహాలు ఉన్నాయి. ఒక్కో ఇంటికి ఏడాదికి రూ.500 నుంచి రూ.3 వేల దాకా ప్రజలు పన్నుల రూపంలో చెల్లిస్తున్నారు. ఒక్కో గృహానికి సగటున రూ.500 వసూలు చేసినా ఏడాదికి రూ.9 లక్షల నగదు పన్నుల రూపంలో వస్తుంది. 2023–2024 ఆర్థిక సంవత్సరం నుంచి గత ఏడాది జూన్ వరకు దాదాపుగా రూ.30 లక్షల వరకు వసూలు అయినట్టు తెలుస్తోంది. అయితే పన్నుల వసూళ్లకు సంబంధించిన రికార్డులు గల్లంతు అయ్యాయి. వసూలు చేసిన సొమ్ము ట్రెజరీకి ఎంత జమ చేశారు, సిబ్బందికి చెల్లించిన జీత,భత్యాల రికార్డులు సైతం అందుబాటులో లేకపోవడం శోచనీయం. ఇదిలా ఉండగా కొత్తగా గృహాలు నిర్మించేందుకు పంచాయతీ నుంచి ప్లాన్ అప్రూవల్లో కూడా కార్యదర్శులు పెద్ద మొత్తంలోప్రజల సొమ్ము స్వాహా చేసినట్లు ఆరోపణలు వస్తున్నాయి. -
పేద కుటుంబానికి పెద్ద కష్టం
తంబళ్లపల్లె : ఓ నిరుపేద కుటుంబానికి పెద్దకష్టం వచ్చింది. చేతిలో చిల్వి గవ్వ లేకపోవడంతో వైద్యం కోసం ఆదుకోవాలని వేడుకుంటోంది. తంబళ్లపల్లె మండలం కోసువారిపల్లె పంచాయతీ నల్లతిమ్మిరెడ్డిగారిపల్లెకు చెందిన అమరనాథరెడ్డిది మధ్య తరగతి కుటుంబం. ఆయనకు భార్య పద్మావతి, కొడుకు (6) ఉన్నారు. బెంగళూరులో ఉంటూ ప్రైవేటు కంపెనీలో చిన్న ఉద్యోగం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. పది రోజుల క్రితం తీవ్ర అనారోగ్యం చేయడంతో కుటుంబ సభ్యులు బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆస్పత్రిలో చేర్పించారు. పరీక్షించిన వైద్యులు కాలేయంతోపాటు రెండు కిడ్నీలు దెబ్బతిన్నాయని నిర్ధారించారు. దీంతో డయాలసిస్ చేస్తున్నారు. వైద్య సహాయం కోసం దాతలు ముందుకు వచ్చి ఆదుకోవాలని అమరనాథరెడ్డి భార్య పద్మావతి వేడుకుంటోంది. స్టేట్బ్యాంకు అకౌంట్ నంబర్ 33169323221 (ఐఎఫ్ఎస్సీ కోడ్ –ఎస్బీఐఎన్ 0016498)కు 7337040084 ఫోన్ నంబర్ను సంప్రందించాలని కోరింది. ఇంటర్ మూల్యాంకనం వాయిదా రాయచోటి : ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా పత్రాల మూల్యాంకనాన్ని ఈ నెల 22వ తేదీకి మార్చినట్లు జిల్లా ఇంటర్మీడియట్ విద్యాశాఖ అధికారి రవి తెలిపారు. సాధారణంగా ఈ నెల 21 నుంచి మూల్యాంకనం ప్రారంభం కావాల్సి ఉంది. 21వ తేదీన రంజాన్ పండుగ సందర్భంగా ఇంటర్మీడియట్ బోర్డు ఆదేశాల మేరకు 22వ తేదీ (ఆదివారం)కి వాయిదా వేసినట్లు శుక్రవారం డీఐఈఓ ఒక ప్రకటనలో తెలిపారు. శనివారం తెలుగు, హిందీ, ఇంగ్లిష్, మ్యాథ్స్, ఎకనామిక్స్, హిస్టరీ ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షా పత్రాల మూల్యాంకనం జరగాల్సిన విషయం అధ్యాపకులకు తెలిసిందే. వాయిదా విషయాన్ని జిల్లాలోని సంబంధిత ప్రిన్సిపాల్లు, అధ్యాపకులు గమనించి 22వ తేదీ మూల్యాంకానికి రావాలని తెలిపారు. ఎముకల డాక్టర్లను సరెండర్ చేయండి: ఎమ్మెల్యే మదనపల్లెటౌన్ : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి రోడ్డు ప్రమాదాల్లో కాళ్లు, చేతులు విరిగి ప్రాణాపాయస్థితిలో వచ్చే వారికి ఒక్క పీఓపీ కట్టు కూడా కట్టని ఆ ఇద్దరి ఎముకల డాక్టర్లను సరెండర్ చేయాలని ఎమ్మెల్యే షాజహాన్ బాషా ఆదేశించారు. శుక్రవారం జిల్లా ఆస్పత్రిని ఎమ్మెల్యే ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఎముకల డాక్టర్లు భరద్వాజ్, అర్చనలు విధులు సక్రమంగా చేయడం లేదనే ఆరోపణలు ఉన్నాయని, సూపరింటెండెంట్ వెంటనే స్పందించి భరద్వాజ్ను సరెండర్ చేసుకోవాలని ఆదేశించారు. ప్యాకెట్లో పైసా లేని పేదోళ్లు జిల్లా ఆస్పత్రిని నమ్ముకుని వస్తే ఇక్కడ ఇద్దరు ఎముకల డాక్టర్లు ఉండి కూడా కట్టుకూడా కట్టరంటే చాలా దారుణం అన్నారు. మనకు పని చేసే దాక్టర్లు కావాలే గానే పని చేయని డాక్టర్లు అవసరం లేదని వెంటనే భరద్వాజ్ను సరెండర్ చేయాలని ఎమ్మెల్యే తెలిపారు. అలాగే ఆస్పత్రిలో మందుల కొరత లేకుండా చూసుకునే బాధ్యత ఫార్మసీలపై ఉందన్నారు. అత్యవసరం అయితే హెచ్డీఎస్ నిధులు వెచ్చించి మందులు కొనుగోలు చేయాలని ఆదేశించారు. ఎమ్మెల్యే వెంట డాక్టర్ రాధిక, హెడ్ నర్సులు, సిబ్బంది పాల్గొన్నారు. మైదుకూరు : ఆర్థిక ఇబ్బందులతో ఓ యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైదుకూరులో జరిగింది. శుక్రవారం పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక ఇందిరమ్మ కాలనీలో నివాసం ఉంటున్న తుపాకుల శివశంకర్ (36) అనే యువకుడు గ్యాస్ స్టౌవ్లను రిపేరు చేస్తూ జీవనం సాగించేవాడు. ప్రొద్దుటూరుకు చెందిన అనిత అనే యువతితో వివాహం కాగా ఇద్దరు మగ పిల్లలు, ఇద్దరు ఆడ పిల్లలు సంతానం ఉన్నారు. తల్లిదండ్రుల నుంచి వేరుపడిన శివశంకర్ చెడు వ్యసనాలకు బానిసై ఆర్థిక ఇబ్బందులతో కుటుంబాన్ని పోషించలేక ఇబ్బందులు పడేవాడు. గురువారం రాత్రి భార్య, పిల్లలు అదే కాలనీలో తన ఇంటి సమీపంలో ఉన్న బంధువుల ఇంటికి వెళ్లడంతో శివశంకర్ ఇంటిలో ఉరి వేసుకున్నాడు. ● ఇంటి యజమానికి దెబ్బతిన్న కాలేయం, కిడ్నీలు ● ఆదుకోవాలని వినతి -
అప్పుడే.. నూరేళ్లు నిండాయా !
● లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు దుర్మరణం ● 50 మీటర్లు దాటింటే ప్రాణాలు దక్కేవి ● చీకిలబైలులో అలుముకున్న విషాదం మదనపల్లె టౌన్ : ‘అయ్యో బిడ్డల్లారా.. అప్పుడే నూరేళ్లు నిండాయా’ అంటూ ఆ చిన్నారుల తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదించారు. అప్పటి వరకు పిల్లల ఆటపాటలతో మురిసిపోయిన వారికి రోడ్డు ప్రమాదం కడుపుకోత మిగిల్చింది. లారీ ఢీకొని ఇద్దరు చిన్నారులు మృత్యువాత పడ్డ విషాదకర సంఘటన శుక్రవారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. ఘటనపై మృతుల కుటుంబీకులు, తాలుకా పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని చీకిలబైలుకు చెందిన శివారెడ్డి బెంగళూరులో ఉంటున్నాడు. తన ఇద్దరు పిల్లలను అక్కడే చదివించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఉగాది పండుగ కోసం గురువారం చీకిలబైలుకు శివారెడ్డి భార్యా పిల్లలతో వచ్చాడు. శుక్రవారం కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు సమీపంలోని బల్తమూరులో ఉంటున్న తన తమ్ముడు శ్రీనివాసులురెడ్డిని చూడటానికి కొడుకు కుశల్రెడ్డి(10)ని వెంట తీసుకుని బైకులో వెళ్లాడు. తమ్ముడిని పలకరించి తిరిగి ఇంటికి తన కుమారుడు కుశల్రెడ్డితోపాటు తమ్ముడు శ్రీనివాసులురెడ్డి కుమారుడు భువనేశ్వర్రెడ్డి(6)ని వెంట తీసుకుని తిరిగి చీకిలబైలుకు బయలుదేరాడు. స్కూటర్ చీకిలబైలుకు రాగానే తన ఇంటికి 50 మీటర్ల దూరంలో ఉన్న స్పీడు బ్రేకరు వద్ద స్లో చేయడంతో వెనకనే వేగంగా వస్తున్న లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో శివారెడ్డి ఒక వైపు, పిల్లలు మరో వైపు కింద పడడంతో.. పిల్లలపైకి లారీ దూసుకెళ్లి ఇద్దరూ అక్కడికక్కడే మృతి చెందారు. ఇక 50 మీటర్ల దూరం వెళ్లి ఉంటే క్షేమంగా ఇంటికి చేరుకునే వారని, లారీ వేగంగా వచ్చి ఢీకొనడంతో ప్రమాదం జరిగిందని స్థానికులు అంటున్నారు. సమాచారం అందిన వెంటనే తాలుకా ఎస్ఐ చంద్రమోహన్ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాలను పరిశీలించి పంచనామా నిర్వహించారు. అనంతరం పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.భువనేశ్వర్రెడ్డి మృతదేహం వద్ద విలపిస్తున్న తల్లి కుశల్రెడ్డిని చూసి రోదిస్తున్న తల్లి, బంధువులు భువనేశ్వర్రెడ్డి, కుశల్రెడ్డి, (ఫైల్) -
నెల రోజుల్లో పెళ్లి.. అంతలోనే విషాదం
● సర్కార్ తోపులో డివైడర్ను ఢీకొన్న బైక్ ● మృత్యువాత పడిన ముగ్గురు స్నేహితులు ● మరణంలోనూ వీడని స్నేహ బంధం సురేంద్ర, మహేష్, మాధవ (ఫైల్) కురబలకోట మండలం సర్కారుతోపులో చనిపోయిన ముగ్గురు చిన్న నాటి నుంచి మంచి స్నేహితులు. బి.కొంతకోటకు చెందిన సురేంద్ర మదనపల్లెకు రోజూ వచ్చి ఇక్కడ ఏదో ఒక పని చేసి డబ్బులు సంపాదించి తన తల్లిని పోషించకునేవాడు. అలాగే అమ్మచెరువు మిట్టకు చెందిన మహేష్ టీవీల మెకానిక్. మాధవ భవన నిర్మాణ కార్మికుడు. రోజూ మదనపల్లెలోనే ముగ్గురు కలిసేవారు. కలసి పని చేసే వారు కూడా. విడదీయరాని స్నేహం వారిది కావడంతో రాత్రి జరిగిన బైక్ ప్రమాదంలో మృత్యువు ముగ్గురిని కబళించింది. చావులోనూ వీడని స్నేహానుబంధం వారిదని పలువురు కన్నీరు పెట్టారు. మదనపల్లెటౌన్ : నెల రోజుల్లో బి.కొత్తకోట, మదనపల్లెకు చెందిన ఓ జంటకు పెళ్లి జరగాల్సి ఉంది. పండుగ పూట కడుపు నిండా తిని వెళ్లాలని కాబోయే భార్య కోరడంతో.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలో గురువారం రాత్రి జరుగుతున్న శ్రీచౌడేశ్వరీదేవి జ్యోతి ఉత్సవాలకు వచ్చిన యువకుడిని రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించింది. తనతోపాటు వెంట వచ్చిన మరో ఇద్దరి స్నేహితులు ప్రాణాలు కోల్పోయారు. చావులోనూ వారి స్నేహ బంధం వీడలేదు. ముగ్గురు మృతి చెందడంతో బి.కొత్తకోట మదనపల్లెకు చెందిన మూడు కుటుంబాల్లో తీవ్ర విషాదం అలుముకుంది. గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగి.. ముగ్గురు యువకులు మృతి చెందడం పాఠకులకు తెలసిందే. ఈ విషాదకర ఘటనపై ముదివేడు పోలీసులు, మృతుల కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోట కరెంటు కాలనీకి చెందిన జరిపిటి రఘు, నాగరత్న దంపతుల కుమారుడు జి.సురేంద్ర (23) డిగ్రీ వరకు చదువుకున్నాడు. మిలటరీ, ఆర్మీ ఉద్యోగాలకు ప్రయత్నం చేస్తున్నాడు. ఇంతలో మదనపల్లెకు చెందిన సమీప బంధువుల యువతితో కుటుంబ సభ్యులు పెళ్లి కుదిర్చారు. మరో నెల రోజుల్లో ఇద్దరికి పెళ్లి జరగాల్సి ఉంది. ఇంతలో రాత్రి మదనపల్లె పట్టణం నీరుగుట్టవారిపల్లెలో చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవం జరిగింది. ఈ వేడుకలకు కాబోయే భార్య ఆహ్వానించింది. ఈ క్రమంలో సురేంద్ర రాత్రి మదనపల్లెకు వచ్చాడు. అమ్మచెరువు మిట్టకు చెందిన సుశీల వెంకటేశ్వర్ దంపతుల కుమారుడు టీవీల మెకానిక్ మహేష్ (22)తో కలసి స్థానిక చంద్రాకాలనీలో ఉన్న మరో స్నేహితుడైన అంజనమ్మ, నరసింహ దంపతుల కుమారుడు మాధవ(23)ను కలిశాడు. వారిద్దరినీ కూడా విందుకు సురేంద్ర తీసుకువెళ్లారు. ముగ్గురు తృప్తిగా భోజనం చేశారు. చివరిసారిగా, మళ్లీ కలుద్దాం అంటూ ఆమెతో మాట్లాడి.. స్పోర్ట్స్ బైక్పై సురేంద్ర తన ఇద్దరి స్నేహితులతో స్థానిక రింగురోడ్డుకు చేరుకున్నారు. అర్ధరాత్రి కావస్తోంది. తనను బి.కొత్తకోటలో వదలి రావాలని మహేష్, మాధవలను సురేంద్ర కోరడంతో.. బైక్లో బి.కొత్తకోటకు బయలు దేరారు. మార్గంమధ్యలోని కురబలకోట మండలం సర్కారుతోపు వద్దకు రాగానే బైకు అదుపు తప్పిరోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో ముగ్గరిలో మహేష్, మాధవలు అక్కడికక్కడే మృతి చెందగా, సురేంద్రను కురబలకోట 108లో స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి గాయపడ్డ బాధితుడు మృతి చెందినట్లు నిర్ధారించారు. అతివేగమే ప్రమాదానికి కారణమా? స్నేహితులు ముగ్గురు కలసి బి.కొత్తకోటకు బైకులో బయలుదేరారు. స్పోర్ట్స్ బైక్లో వెళ్లే క్రమంలో మహేష్ బైక్ను స్పీడుగా నడపడం జరిగినట్లు సంఘటన జరిగిన తీరును బట్టి తెలుస్తోందని ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపారు. బైకు అదుపు తప్పడం వల్లనే రోడ్డు మధ్యలో ఉన్న డివైడర్ను ఢీకొట్టి ముగ్గురు స్నేహితులు ప్రాణాలు కోల్పోయినట్లు పోలీసులు చెబుతున్నారు. కొత్తకోటకు బయలుదేరకుండా ఉంటే.. ‘సురేంద్ర కొత్తకోటకు పోకుండా జాతరలో ఉండి ఉన్నా.. ఆ చౌడేశ్వరమ్మ నా బిడ్డలను బతికించేది’ అని మృతుడి తల్లి నాగరత్న కన్నీరు మున్నీరుగా విలపించింది. ఆరు నెలల క్రితం ఆ దేవుడు తన భర్తను పైకి తీసుకు పోయాడు. చేదోడు వాదోడుగా ఉన్న తన బిడ్డను దూరం చేసి తనను ఒంటరిదాన్ని చేశాడు. ‘నేనేమి పాపం చేశాను తండ్రీ’ అంటూ మృతుడు సురేంద్ర తల్లి గుండెలవిసేలా విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది. మూడు కుటుంబాల్లో .. బి.కొత్తకోట కరెంటు కాలనీ, మదనపల్లె అమ్మచెరువు మిట్ట, చంద్రా కాలనీల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. పెళ్లీడుకు వచ్చిన ముగ్గురు యువకులను రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు కబళించడంతో వారి కుటుంబాల్లో అంతులేని విషాదం అలుముకుంది. చేతికందివచ్చిన బిడ్డలు ఇక లేరని గుండెలు బాదుకుంటూ విలపించడంతో వారిని ఓదార్చడం ఎవరితరం కాలేదు. చావులోనూ వీడని స్నేహానుబంధంగా యువకుల మృతదేహాలు, విలపిస్తున్న సురేంద్ర, మాధవ తల్లులు ‘కురబలకోట మండలంలో గురువారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో పసిబడ్డలు ప్రాణాలు కోల్పోవడం తనను ఎంతగానే కలచివేసింది. వారి తల్లిదండ్రులకు ఆ లోటును ఆ దేవుడు కూడా పూడ్చలేడు’ అని ఎమ్మెల్యే షాజహాన్ బాషా తెలిపారు. జిల్లా ఆస్పత్రి మార్చురీ వద్దకు శుక్రవారం వచ్చిన ఎమ్మెల్యే మృతుల కుటుంబీకులను పరామర్శించారు. ధైర్యంగా ఉండాలని ఓదార్చారు. బిడ్డలు ఇంటికి వస్తారని వేయికళ్లతో ఎదురు చూసిన తల్లిదండ్రులకు కలిగిన లోటును.. ఆ దేవుడు కూడా పూడ్చలేడన్నారు. ప్రభుత్వం తరఫున బాధిత కుటుంబాలను అన్ని విధాలా ఆదుకుంటానని హాహా ఇచ్చారు. -
ఘనంగా ఉట్ల తిరునాల
ఉట్ల మాను ఎక్కేందుకు సిద్ధంగా ఉన్న యువకులు ఉట్ల మాను ఎక్కుతున్న యువకులు మదనపల్లె సిటీ : స్థానిక నీరుగట్టువారిపల్లెలోని శ్రీ చౌడేశ్వరి ఆలయంలో జ్యోతి ఉత్సవాలు పురస్కరించుకుని శుక్రవారం ఉట్ల తిరునాల ఘనంగా నిర్వహించారు. ఆలయం ఎదుట ప్రాంగణంలో ఉట్ల మాను ఏర్పాటు చేశారు. యువకులు ఎంతో ఉత్సాహంగా ఉట్ల మాను ఎక్కేందుకు ముందుకు వచ్చారు. ఎంతో ఉత్కంఠ భరితంగా సాగిన ఉట్లమాను కొందరు యువకులు ఎక్కి తమ ప్రతిభను నిరూపించుకున్నారు. ఉదయం ఆలయంలో చౌడేశ్వరి అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి పూజలు చేశారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కులు తీర్చుకున్నారు. కార్యక్రమంలో చౌడేశ్వరిదేవి దేవస్థానం అధ్యక్షులు పురాణం చంద్రశేఖర్, కార్యదర్శి పవన్కుమార్, కోశాధికారి రత్నమయ్య, శ్రీరాంచినబాబు, ఉప్పు రామచంద్ర తదితరులు పాల్గొన్నారు. -
అర్ధరాత్రి వేళలో దొంగ హల్చల్
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఓ దొంగ అర్ధరాత్రి వేళలో వరుస చోరీలకు పాల్పడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారడంతో నిందితున్ని పట్టుకునే పనిలో పోలీసులు నిమగ్నమయ్యారు. పోలీసుల కథనం మేరకు.. పట్టణంలోని సొసైటీ కాలనీ, ఆర్టీసీ బస్టాండు ప్రాంతాల్లో ఓ దొంగ అర్ధరాత్రి వేళల్లో ప్రయివేట్ ఆస్పత్రుల్లో చొరబడి వరుసగా చోరీలకు పాల్పడుతున్నట్లు పోలీసులకు ఫిర్యాదులు అందాయి. దీంతో పోలీసులు దొంగ కోసం ప్రత్యేక బృందాలతో శుక్రవారం గాలింపు చర్యలు చేపట్టారు. త్వరలోనే దొంగను పట్టుకుని ఆస్పత్రులలో చోరీలు జరగకుండా అరికట్టనున్నట్లు తెలిపారు. గోదావరిలో మదనపల్లె విద్యార్థి మృతి మదనపల్లె టౌన్ : భద్రాచలం పరిధిలోని కొత్తగూడెం వద్ద గోదావరి నదిలోకి స్నానానికి వెళ్లి ఐదుగురు బీటెక్ విద్యార్థులు శుక్రవారం గల్లంతయ్యారు. ఏడుగురు విద్యార్థులు నదిలోకి దిగగా వారిలో ఐదుగురు కొట్టుకు పోయారు. ఇద్దరు సురక్షితంగా బయట పడగా అభిరామ్, శ్రీకర్ , తేజ, సతీష్ , నవదీప్ నీటి ప్రవాహంలో గల్లంతయ్యారు. గత ఈతగాళ్లతో స్థానిక పోలీసులు మృతదేహాలను వెలికి తీశారు. చనిపోయిన ఇంజినీరింగ్ విద్యార్థుల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లెకు చెందిన సతీష్ ఉన్నట్లు అక్కడి పోలీసులు మదనపల్లె తాలుకా పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. దీంతో గోదావరి నదిలో ఈతకు వెళ్లి గల్లంతయిన విద్యార్థుల ఘటన వెలుగులోకి వచ్చిందని స్థానిక పోలీసులు తెలిపారు. మదనపల్లె యువకుడు తిరుపతిలో మృతి మదనపల్లె టౌన్ : మదనపల్లె యువకుడు తిరుపతిలో మృతి చెందినట్లు అక్కడి ఈస్ట్ పోలీసులు మదనపల్లె వన్ టౌన్ పోలీసులకు శుక్రవారం సమాచారం అందించారు. ఇందుకు సంబంధించి ఎస్ఐ రహీముల్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తిరుపతి పట్టణం ఎస్వీ మెడికల్ కాలేజీ–రుయా రోడ్డులోని ఫుట్ పాత్పై మదనపల్లె యువకుడు మృతి చెంది ఉండటాన్ని ఈస్ట్ పోలీసులు గుర్తించారు. మృతదేహం వద్ద లభించిన ఆధార్, పాన్ కార్డులో మృతుడు మదనపల్లె మండలం పొన్నూటి పాళ్యం కుమారపురం నమాజు కట్ట ప్రాంతానికి చెందిన శ్రీరాములు కుమారుడు ఎం.ప్రేమ్కుమార్(30)గా గుర్తించారు. వారు వెంటనే మదనపల్లె పోలీసులకు సమాచారం అందించారు. సంబంధీకులు మృతదేహాన్ని గుర్తించి ఈస్ట్ పోలీసులను ఆశ్రయించాలని తెలిపారు. -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు
మదనపల్లె టౌన్ : వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలయ్యాయి. మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దమండ్యం మండలం సిద్దవరానికి చెందిన శ్రీకాంత్(27) గురువారం ద్విచక్ర వాహనంలో పెద్దమండ్యంకు బయలుదేరాడు. సిద్దవరం మలుపు వద్దకు వెళ్లాగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడు ఇవ్వబోయి బైకు అదుపు తప్పి శ్రీకాంత్ కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. స్కూటర్ ఢీకొని.. జాతరలో పూసలు అమ్ముకోవడానికి వచ్చిన ఓ వృద్ధురాలిని స్కూటర్ ఢీకొని తీవ్రంగా గాయపడింది. పుంగనూరు మండలం పాళ్యంపల్లికి చెందిన జయన్న భార్య రాజేశ్వరి (65) పూసలు, చిన్న పిల్లల ఆట వస్తువులు పల్లెలకు తిగి అమ్ముకుని జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో గురువారం మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లెలోని చౌడేశ్వరీదేవి అమ్మవారి ఆలయంలో జరగనున్న చౌడేశ్వరీ అమ్మవారి ఉత్సవాలలో పూసలు, చిన్న పిల్లల ఆట వస్తువులు అమ్ముకోవడానికి వచ్చింది. రోడ్డు పక్కన వ్యాపారం చేసుకుందామని చౌడేశ్వరీదేవి గుడి సమీపంలో రోడ్డు దాటుతున్న రాజేశ్వరిని ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వేగంగా వచ్చి ఢీకొట్టి వెళ్లి పోయాడు. ఈ ప్రమాదంలో కాళ్లు, చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితురాలిని గమనించిన స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం వృద్ధురాలి పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతికి రెఫర్ చేశారు. రెండవ పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
జర్మనీతో అన్నమాచార్య యూనివర్సిటీ ఒప్పందం
● ఉన్నత విద్యా రంగంలో మరో ముందడుగు ● అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డిరాజంపేట : జర్మనీకి చెందిన యూనివర్సిటీ ఆఫ్ అప్లైడ్ మేనేజ్మెంట్ (యూఏఎం)తో రాజంపేట అన్నమాచార్య యూనివర్సిటీ అవగాహన ఒప్పందం కదర్చుకున్నట్లు అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి అన్నారు. గురువారం ఆయన మాట్లాడుతూ భారతదేశంలో కేవలం ఐదు విశ్వవిద్యాలయాలతో మాత్రమే భాగస్వామ్యం చేయాలని యూఏఎం నిర్ణయించిందన్నారు. ఇందులో అన్నమాచార్య యూనివర్సిటీ స్థానం సంపాదించుకోవడం గర్వకారణంగా ఉందన్నారు. హైదరాబాదులో ఉగాది సందర్భంగా కుదిరిన ఒప్పందంలో కంప్యూటర్ సైన్స్లో గేమ్ డిజైన్, సాఫ్ట్వేర్ అనుభవం, సాఫ్ట్వేర్ ఇంజినీరింగ్ వంటి ప్రత్యేకతలతో టు ప్లస్ టు ట్విన్ డిగ్రీ బ్యాచ్లర్ ప్రోగ్రాం ప్రారంభించనున్నామన్నారు. మొదటి రెండు సంవత్సరాలు ఇండియాలోని భాగస్వామ్య సంస్థ ఏయూతో , చివరి రెండు సంవత్సరాలు జర్మనీలో అభ్యసించే అవకాశం ఉంటుందన్నారు. కోర్సు పూర్తి చేసిన అనంతరం జర్మనీలో మాస్టర్స్ చదివే అవకాశం కల్పిస్తామన్నారు. దీని ద్వారా విద్యార్థులు అంతర్జాతీయ ప్రమాణాల విద్యతోపాటు విదేశీ అనుభవం, మెరుగైన కెరీర్ అవకాశాలు ఉంటాయన్నారు. జర్మనీ బృందంలో యూఏఎం అధ్యక్షుడు ప్రొఫెసర్ క్రిస్టియన్ వెర్నర్, అంతర్జాతీయ డైరెక్టర్ అలెగ్జాండర్ టర్న్ వాల్ట్, జర్మనీ సెంటర్ ఫర్ అడ్వాన్స్ స్టడీస్ అధినేత రాజ్ వంగపండు, ఇండో యూరోసింక్రనైజేషన్ సీఈవో డాక్టర్ బంగరాజులు ఉన్నారన్నారు. కాగా ఒప్పంద పత్రాలను ఏయూ ప్రో–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి, యూఏఎం అధ్యక్షుడు ప్రొఫెసర్ క్రిస్టియన్ వెర్నర్ పరస్పరం మార్పిడి చేసుకున్నారు. కార్యక్రమంలో ఏయూ వీసీ డా.సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జునరావు, అడ్మిషన్స్ డిప్యూటీ డైరక్టర్ డా.జయరామిరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
బైక్లు ఢీకొని ముగ్గురి మృతి
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కురబలకోట మండలంలో గురువారం అర్ధరాత్రి ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది. రెండు బైక్లు ఢీకొని ముగ్గురు యువకులు మృతి చెందారు. మండలంలోని సర్కారు తోపు వద్ద ఎదురెదురుగా వస్తున్న రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరు యువకులు అక్కడికక్కడే చనిపోగా, మరో యువకుడిని మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. అక్కడ అతను కూడా చనిపోయాడు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాలను పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రి మార్చరీకి తరలించారు. మృతుల్లో బి.కొత్తకోటకు చెందిన సురేష్, మదనపల్లెలోని చంద్రకాలనీకి చెందిన మాధవ, మహేష్లుగా పోలీసులు గుర్తించారు. మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది. -
వైభవంగా ‘శ్రీ పరాభవ’ ఉగాది వేడుకలు
మదనపల్లె, ఏప్రిల్: శ్రీ పరాభవ నామ సంవత్సరంలో జిల్లా సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరూ సుఖసంతోషాలతో వర్ధిల్లాలని ఇంచార్జ్ జాయింట్ కలెక్టర్ (జేసీ) మధుసూదనరావు ఆకాంక్షించారు. గురువారం మదనపల్లెలో దేవదాయ, పర్యాటక, రెవెన్యూ శాఖల సంయుక్త ఆధ్వర్యంలో ఉగాది వేడుకలను అత్యంత వైభవంగా నిర్వహించారు. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత తొలిసారిగా జరిగిన ఈ వేడుకల్లో పలువురు ప్రముఖులు, అధికారులు పాల్గొన్నారు. ప్రగతి పథంలో జిల్లా ఈ సందర్భంగా ఇంచార్జ్ జేసీ మాట్లాడుతూ, నూతన ఏడాదిలో వర్షాలు సమృద్ధిగా కురిసి వ్యవసాయం, పశుసంపదతో పల్లెలు కళకళలాడాలని కోరారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ నాయకత్వంలో జిల్లా అన్ని రంగాల్లో అభివృద్ధి చెందుతుందన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ, తెలుగువారికి ఉగాది పండుగ ఎంతో ప్రత్యేకమైనదని, ప్రజలందరూ ఆరోగ్యంగా ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు. పంచాంగ శ్రవణం – కవి సమ్మేళనం: అర్చకులు బాలాజీ స్వామి, విశ్వేశ్వర స్వామి బృందం పంచాంగ శ్రవణం చేస్తూ.. ఈ ఏడాది క్షేమం, ఆరోగ్యం, సస్యసమృద్ధి కలుగుతాయని తెలిపారు. అనంతరం జరిగిన కవి సమ్మేళనంలో తెలుగు భాషా గొప్పదనాన్ని కవులు కొనియాడారు. డాక్టర్ వేంపల్లి అబ్దల్ ఖాదర్, హసీనా బేగం, ఎస్.స్రవంతి, గాయత్రీదేవి తమ వచన కవితలతో అలరించగా, జలకనూరి మురళధర్ రాజు పద్య పఠనం చేశారు. వీరిని జేసీ ఘనంగా సత్కరించారు. సాంస్కృతిక ప్రదర్శనలు: జిల్లా విద్యాశాఖ ఆధ్వర్యంలో లావణ్య నాట్య గురుకులం, శ్రీ వేద సంగీత నిత్యాలయం, జెడ్పీ హైస్కూల్ విద్యార్థులు, సేవా భారతి బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు సభికులను ముగ్ధులను చేశాయి. తెలుగు సంస్కృతిని చాటిచెప్పేలా సాగిన ఈ ప్రదర్శనల్లో పాల్గొన్న చిన్నారులకు జ్ఞాపికలను అందజేశారు. అర్చకులకు పురస్కారాల ప్రదానం: సనాతన ధర్మానికి విశేష సేవలు అందించిన జిల్లాకు చెందిన నలుగురు అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాలను అందజేశారు. కే. రామాచార్యులు, పి. కృష్ణమాచార్యులు, డి. శివ శంకరాచార్యులు, పి. రెడ్డిస్వామిలను తలా రూ. 10,116 నగదు పురస్కారంతో పాటు ప్రశంసా పత్రం, పంచాంగం, శాలువాతో జేసీ సత్కరించారు. ఈ కార్యక్రమంలో దేవదాయ శాఖ జిల్లా అధికారి విశ్వనాధ్, పర్యాటక అధికారి నాగభూషణం, డీఈఓ సుబ్రహ్మణ్యం, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, హార్టికల్చర్ అధికారి సుభాషిణి, రెవెన్యూ సిబ్బంది మరియు ఆలయ ఈవోలు పాల్గొన్నారు. మదనపల్లె లో పంచాగ శ్రవణం చేస్తున్న పండితులు, మదనపల్లెలో ఉగాది వేడుకలను ప్రారంభిస్తున్న ఇన్చార్జి జేసీ మధుసూదనరావు జిల్లా సుభిక్షంగా ఉండాలని జేసీ ఆకాంక్ష ఘనంగా పంచాంగ పఠనం, కవి సమ్మేళనం అర్చకులకు రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కారాల ప్రదానం -
ఇంటిపై పిడుగుపాటు
బి.కొత్తకోట: అకాల వర్షంతో బుధవారం రాత్రి బి.కొత్తకోటలో ఓ ఇంటిపై పిడుగు పడింది. స్థానిక బీసీ కాలనీలోని శెట్టిపల్లి రోడ్డులో హైదర్ వల్లి నివాసం అంటున్నారు. ఈమధ్య ఇంటిపై మరో ఇంటి నిర్మాణం పనులు చేశారు. ఈ ఇల్లు ప్రారంభోత్సవానికి సిద్ధమవుతుండగా రాత్రి పిడుగు పడింది. దీని ప్రభావానికి గోడ పైకప్పు దెబ్బతింది. ఇంటిలోని ఎలక్ట్రికల్ వైర్లు, స్విచ్ బోర్డులు, మిగతా విద్యుత్ సామాగ్రి కాలిపోయింది. దీంతో బాధితులు నష్టపోయారు. జరిగిన నష్టానికి అధికారులు ఆదుకోవాలని బాధితులు కోరుతున్నారు. గేట్ పరీక్షలో ట్రిపుల్ ఐటీ విద్యార్థి ప్రతిభ వేంపల్లె : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో బీటెక్ చదువుతున్న కేశంరెడ్డి శ్రీవిద్య గురువారం విడుదలైన గేట్ పరీక్షా ఫలితాల్లో ఆల్ ఇండియాలో 452వ ర్యాంక్ సాధించింది. లింగాల మండలం తాతిరెడ్డిపల్లె గ్రామానికి చెందిన చంద్ర ప్రతాప్రెడ్డి, నాగజ్యోతి దంపతుల కుమార్తె కె.శ్రీవిద్య ఇంజనీరింగ్ నాలుగో సంవత్సరం చదువుతోంది. విద్యార్థిని ప్రతిభపై ట్రిపుల్ ఐటీ డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తతోపాటు అధ్యా పక బృందం హర్షం వ్యక్తం చేశారు. విద్యార్థినిని అభినందించారు. -
వన్డే మ్యాచ్లో కర్నూలు, నెల్లూరు జట్ల విజయం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ సీనియర్స్ మెన్ అంతర్ జిల్లాల వన్డే క్రికెట్ మ్యాచ్లు కొనసాగాయి. గురువారం కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన వన్డే మ్యాచ్లో కర్నూలు–చిత్తూరు జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన చిత్తూరు జట్టు నిర్ణీత 24,4 ఓవర్లకు 110 పరుగులకు ఆలౌట్ అయింది. పూర్య 61, సూర్య చరణ్ 18 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని సుదర్శన్రెడ్డి 4, ఆంజనేయులు 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 14.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 114 పరుగులు చేసింది. ఆ జట్టులోని కరణ్ షిండే 46, ఎంఎస్ గిరినాథ్ 21 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని మాధవ్ రాయుడు 2 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 6 వికెట్ల తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప–నెల్లూరు జట్లు పోటీపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన కడప జట్టు 50 ఓవర్లకు 7 వికెట్లు కోల్పోయి 260 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధనుష్ 102 బంతుల్లో 7 ఫోర్లు, 8 సిక్సర్లతో 127 పరుగులు చేశాడు. షేక్ జహీర్ అబ్బాస్ 44 పరుగులు చేశాడు. నెల్లూరు జట్టులోని సాకేత్ రామ్ 2, తోషిత్ యాదవ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 38.5 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 262 పరుగులు చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్రెడ్డి 122, సయ్యద్ పర్హాద్ ఖద్రీ 48 పరుగులు చేశారు. కడప జట్టులోని పఠాన్ షరీఫ్, ఆరిఫ్ బాషా, జహీర్ అబ్బాస్ తల ఒక వికెట్ తీశారు. దీంతో నెల్లూరు జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. -
తెలుగు క్యాలెండర్ ఆవిష్కరణ
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీరాములపేటలోని ఉపాధ్యాయ సేవా కేంద్రంలో గురువారం విజ్ఞాన సేవా సమితి వారి స్వస్తిశ్రీ పరాభవ నామ సంవత్సర క్యాలెండర్ను ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్టీఆర్ వైద్య విద్యాలయ పాలకమండలి సభ్యుడు డాక్టర్ టీడీ వరుణ్కుమార్రెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ తెలుగు సంస్కృతిని కాపాడాలనే సంకల్పంతో సామాన్య తెలుగు ప్రజలకు ఉపయోగపడే ఈ కాలమానిని తయారు చేసిన విజ్ఞాన సేవా సమితి కృషిని కొనియాడారు. ఎస్ఎల్టీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య, కోశాధికారి బోగా గంగాధర్, జిల్లా అధ్యక్షుడు ప్రసాద్, సుధాకర్, రిజ్వాన్ ఆలీ, షేక్షావల్లి చిరంజీవి తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్టలో ఆక్రమణల తొలగింపు
● అధికారులను అడ్డుకున్న దుకాణాదారులు ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయం ఆనుకుని వెనుక వైపు ఉన్న 1500/1బీ సర్వే నంబర్లో ఒంటిమిట్ట పంచాయతీకి చెందిన ఎంతో విలువైన గ్రామ కంఠాన్ని కొంత మంది కొన్నేళ్లుగా ఆక్రమించుకుని దుకాణాల పేరుతో ధనార్జన చేస్తున్నారు. వారిని చూసి మరి కొంత మంది ఈ మధ్య కాలంలో ఆక్రమణ చేసి, ముగ్గులు, రేకుల షెడ్లు, టెంట్లు వేసుకున్నారు. దీనిపై కొంత మంది మండల ప్రజా పరిషత్, పంచాయతీల అధికారులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈవోపీఆర్డీ చలపతి, ఒంటిమిట్ట పంచాయతీ కార్యదర్శి టి.కిశోర్ కుమార్ పోలీసు బందోబస్తుతో వచ్చి ఆక్రమణలను తొలగించడం మొదలు పెట్టారు. అయితే ఇది జరుగుతుండగా ఆక్రమణలు చేసిన ఇద్దరు వ్యక్తుల మధ్య వాగ్వాదం చోటు చేసుకుని, ఘర్షణకు దారి తీసింది. ఒక వ్యక్తి మరో వ్యక్తిపై సిమెంటు ఇటుకతో దాడి చేశాడు. ఈ దాడిలో ఒకరికి రక్త గాయాలు అయ్యాయి. బాధితుడిని కడప రిమ్స్కు తీసుకెళ్లారు. అక్కడ ఫిర్యాదు చేసినట్లు బాధితుడు తెలిపారు. ఘర్షణ అనంతరం ఆక్రమణల తొలగింపు మళ్లీ పుంజుకుంది. ఈ క్రమంలో ఆరు ఆక్రమణలను తొలగించి, మిగిలిన అక్రమ దుకాణాలను తొలగించబోతున్న ఈవోపీఆర్డీ చలపతి, ఇన్చార్జ్ పంచాయతీ కార్యదర్శిని అక్రమంగా దుకాణాలు నడుపుతున్న వ్యాపారస్తులు అడ్డుకున్నారు. తొలగిస్తే అన్ని దుకాణాలను తొలగించాలని, లేకుంటే ఇక్కడి నుంచి తాము దుకాణాలను తొలగించుటకు ఒప్పుకునే ప్రసక్తే లేదన్నారు. దీంతో 1500/1బీ సర్వే నంబర్లోని పంచాయతీ గ్రామకంఠంలో గత కొన్ని ఏళ్లుగా ఆక్రమణ చేసి, దుకాణాలను నడుపుతున్న వారందరి ఆక్రమణలను తప్పకుండా తొలగిస్తామని, ఈ నెల 21 వరకు దుకాణాదారులకు గడువు ఇవ్వడం జరిగిందని, ఆ లోపు వారే స్వచ్ఛందంగా తొలగించుకుంటే సరిపోతుందని, లేకుంటే తామే జేసీబీ సాయంతో తొలగించాల్సి వస్తుందని అధికారులు హెచ్చరించారు. తాము చెప్పిన సమయానికి దుకాణాలను తొలగించకుంటే అధికారులే తొలగించుకోవచ్చునని, ఇది వరకు దుకాణాదారులు తాము ఇచ్చిన నోటీసులలో సంతకాలు కూడా చేశారన్నారు. -
పిడుగుపాటుకు నాలుగు ఆవులు మృతి
కలకడ : పిడుగుపడి నాలుగు పాడిఆవులు మృతి చెందిన సంఘటన మండలంలోని నవాబుపేట పంచాయతీ చావిడికాడపల్లెలో జరిగింది. వెటర్నిటి అసిస్టెంట్ డైరెక్టర్ క్రిష్ణయ్య తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. బుధవారం రాత్రి కలకడ మండలంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. చావిడికాడపల్లెలో పి.వెంకటేశు కుమారుడు పి.వెంకటమణనాయుడు (అప్పయ్యచౌదరి) పాడి ఆవులను కట్టిన వసారుపై పిడుగు పడింది. ఈ సంఘటనలో నాలుగు పాడి ఆవులు మృతి చెందాయి. కేవలం పాడి ఆవులే ఆధారంగా జీవిస్తున్న పాడి రైతుకు తీవ్ర నష్టం చేకూరింది. జాతీయ ప్రమాద విపత్తుల కింద నివేదికలు పంపనున్నట్లు అసిస్టెంట్ డైరెక్టర్ క్రిష్ణయ్య, పశువైద్యాధికారి డాక్టర్ తేజకళ్యాణ్ లుతెలిపారు. తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతు అప్పయ్య చౌదరి కుటుంబ సభ్యులు కోరారు. రథోత్సవానికి రంగులు దిద్దుకుంటున్న రథం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట వార్షిక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏప్రిల్ 2వ తేదీన జరగబోవు రథోత్సవానికి ఒంటిమిట్ట రామయ్య రథం నూతన రంగులతో మెరుగులు దిద్దుకుంటుంది. టీటీడీ సివిల్ విభాగం అధికారులు రథోత్సవానికి ఒంటిమిట్ట రథాన్ని పూర్తి స్థాయిలో దృఢంగా ఉండేలా సిద్ధం చేస్తున్నారు. ఈ పనుల నాణ్యతలో గుత్తేదారుడు కట్టా సుబ్బరాయుడు రాజీ పడకుంగా శరవేగంగా పూర్తి చేసే పనుల్లో నిమగ్నం అయ్యారు. రథోత్సవానికి ముందే ఒంటిమిట్ట రథాన్ని అన్ని విధాలా సిద్ధం చేసి ఉంచాలని టీటీడీ సివిల్ విభాగం అధికారులు గుత్తేదారుడిని ఆదేశించారు. -
ఆత్మహత్యకు యత్నించిన విద్యార్థిని మృతి
పెద్దతిప్పసముద్రం : ఇంటర్మీడియట్ చదువుతున్న ఓ బాలిక చదువులో బాగానే ఉన్నా పరీక్షలు సరిగా రాస్తానో లేదోనన్న భయంతో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి.. అర్ధాంతరంగా అశువులు బాసిన విషాద సంఘటన మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ పరమేశ్ నాయక్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కందుకూరు పంచాయతీ గొల్లపల్లికి చెందిన రామ్మూర్తి, శశికళ దంపతుల కుమార్తె అస్మిత(17) బి.కొత్తకోటలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం చదివేది. బాలిక చదువులో కూడా చురుగ్గా ఉండేది. ఈ నేపథ్యంలో గత నెల 21 నుంచి ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ప్రారంభమయ్యాయి. పరీక్షా సమయం దగ్గర పడుతుండటంతో ఇంటి పట్టునే ఉన్న బాలికలో ఆందోళన మొదలైంది. దీంతో బాలిక జీవితంపై విరక్తి పెంచుకుంది. ఈ తరుణంలో గత నెల 22న తల్లిదండ్రులు పొలం వద్దకు వెళ్లగా బాలిక ఇంట్లో ఉన్న గడ్డి నివారణ మందు తాగి అపస్మారక స్థితికి చేరుకుంది. పొలం నుంచి ఇంటికి వచ్చిన కన్నవాళ్లు బాలిక నోట్లో నురగ వచ్చి అచేతన స్థితిలో ఉండటాన్ని చూసి హుటాహుటిన బి.కొత్తకోట ఆసుపత్రిలో ప్రథమ చికిత్స అనంతరం మదనపల్లికి తరలించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్ల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం బెంగళూరులోని బాఫిస్టు ఆసుపత్రికి తరలించారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బాలిక బుధవారం రాత్రి మృతి చెందినట్లు అక్కడి పోలీసులు తనకు సమాచారం అందించారని ఎస్ఐ తెలిపారు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం గురువారం కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్ఐ వెల్లడించారు. బాలిక ఆకస్మిక మృతితో గ్రామంలో విషాద ఛాయలు అలుముకున్నాయి.పరీక్షలు బాగా రాయలేననే భయంతో ఆత్మహత్యాయత్నం -
విద్యుత్ పోల్ నుంచి ఎగసిన మంటలు
● భయభ్రాంతులైన ప్రజలు ● కేబుల్ ఆపరేటర్లదే నిర్లక్ష్యంరాజంపేట రూరల్ : విద్యుత్ స్తంభం నుంచి ఒక్క సారిగా మంటలు ఎగసి పడటంతో.. చుట్టు పక్కల నివాసం ఉంటున్న ప్రజలు, దుకాణదారులు, ప్రయాణికులు భయభ్రాంతులైన సంఘటన పట్టణంలో గురువారం చోటు చేసుకుంది. స్థానిక కర్నాటం లాడ్జీ పక్కన ఉన్న విద్యుత్ పోల్ నుంచి మంటలు రావటంతో అవి ఎందుకు వస్తున్నాయో, దానివల్ల ఎటువంటి ప్రమాదం ముంచుకొస్తుందోనని సమీప ప్రాంతాల ప్రజలు హడలిపోయారు. సమయం పెరిగే కొద్ది మంటలు అధికం కావటంతో స్థానికులు అటు విద్యుత్ శాఖ అధికారులకు ఇటు ఫైర్ శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. సమాచారం అందుకున్న విద్యుత్ శాఖ అధికారులు సంఘటన స్థలానికి చేరుకొని మంటలను చూసి విద్యుత్ సరఫరాను నిలిపి వేశారు. విద్యుత్ పోల్కు ఏర్పాటు చేసిన యాంప్లి ప్లేయర్ బాక్స్ ఓవర్ హీట్ అయి పేలిపోవటంతో మంటలు చెలరేగాయని విద్యుత్ శాఖ అధికారులు గుర్తించారు. మంటలు పెద్దవి అయి పక్కన ఉన్న దుకాణాలకు అంటుకుని ఉంటే పెద్ద ప్రమాదమేనని స్థానికులు వాపొయారు. రానున్నది వేసవి కాలం. ఇదే విధంగా యాంప్లీ ఫ్లేయర్లు మండుతూ ఉంటే ఎటువంటి ప్రమాదాలు సంభవిస్తాయోనని పట్టణ ప్రజలు భయపడుతున్నారు. వివిధ కంపెనీలకు చెందిన కేబుల్ ఆపరేటర్లు పట్టణంలోని విద్యుత్ పోల్ల చుట్టూ ఇష్టాను సారంగా కేబుల్ వైర్లను చుట్టడంతోపాటు యాంప్లి ఫ్లేయర్లను ఏర్పాటు చేయటం కాకుండా ప్రత్యామ్నాయ మార్గాలు వెతుక్కోవాలని సూచిస్తున్నారు. ఈ విధంగా మంటలు చెలరేగటంలో తప్పిదం విద్యుత్ శాఖ అధికారులదా లేక కేబుల్ ఆపరేటర్లదా అని ప్రజలు ప్రశ్నిస్తున్నారు. ఇటువంటి సంఘటనలు పునారావృతం కాకుండా చూడాలని పట్టణ ప్రజలు కోరుతున్నారు. -
రైతు కంట కన్నీరు
ఇటు ఖేదం... అటు మోదంపెద్దతిప్పసముద్రం: ప్రకృతి కన్నెర్ర చేయడంతో అన్నదాతలు అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు. ఒకవైపు అతివృష్టి, మరోవైపు అనావృష్టితో ఏటా నష్టపోతున్న రైతులకు తాజాగా అకాల వర్షం కోలుకోలేని దెబ్బ తీసింది. పీటీయం–మద్దయ్యగారిపల్లి రోడ్డు ప్రాంతంలో సాగు చేసిన మొక్కజొన్న పంట గురువారం రాత్రి వీచిన భీకరమైన ఈదురు గాలులకు, అకస్మాత్తుగా కురిసిన వర్షానికి పూర్తిగా నేలపాలైంది. చేతికొచ్చే తరుణంలో తీవ్ర నష్టం: Ð]l$Æø 10 ÆøkÌZÏ ç³…r Mø™èlMýS$ Ð]lçÜ$¢…-§ýl-¯]lV> {ç³MýS–† OÐðlç³È™èlÅ… ÑÆý‡$^èl$-MýS$-ç³yýl-r…™ø OÆð‡™èl$Ë$ ÌS»Z-¨»Z-Ð]l$…-r$-¯é²Æý‡$. JMýS GMýSÆ> Ððl¬MýSP-g-Ÿ¯]l² ÝëVýS$MýS$ çÜ$Ð]l*Æý‡$ ₹30 ÐólÌS Ð]lÆý‡MýS$ ò³r$tºyìl ò³ sêtÐ]l$-°, ¨VýS$-ºyìl »êVýS$…sôæ GMýS-Æ>MýS$ 40 MìSÓ…sêâýæÏ Ð]lÆý‡MýS$ gŸ¯]l²Ë$ Ð]lÝë¢Ä¶æ$° BÕ…^éÐ]l$° OÆð‡™èl$Ë$ BÐól-§ýl¯]l Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. ç³…r ¯]lçÙt-´ù-Ƈ$$¯]l ÐéÇÌZ OÆð‡™èl$Ë$ Mösìæt AÆý‡-Ñ…§Šæ, ÐólÐ]l$-¯é-Æ>Ķæ$׿, ÝùÐ]l$Ôóæ-QÆŠæ, Ôèæ…MýSÆŠæ, A°ÌŒæ, Ð]l¬Æý‡ã, Æð‡yðlzç³µ, AÔZMŠS, ÑÔèæÓ-¯é-£ŠlË$ E¯é²Æý‡$. ò³r$t-ºyìl MøçÜ… {Oò³Ðólr$ Ð]lÅMýS$¢ ÌS Ð]l§ýlª A糚Ë$ ^ólíÜ ç³…r¯]l$ ÝëVýS$ ^ólÔ>Ð]l$°, ¡Æ> ç³…r ^ól†-Mö^óla çÜÐ]l$Ķæ$…ÌZ A…™é ±sìæ´ë-OÌñæ…§ýl° ÐéÆý‡$ MýS±²-Æý‡$-Ð]l¬-±²Æý‡-Ð]l#™èl$-¯é²Æý‡$. ప్రభుత్వ సహాయం కోసం వేడుకోలు: సర్వం కోల్పోయిన తమను ప్రభుత్వం తక్షణమే ఆదుకోవాలని, వ్యవసాయ అధికారులు క్షేత్రస్థాయిలో సర్వే నిర్వహించి నష్టపరిహారం అందించాలని బాధిత రైతాంగం వేడుకుంటోంది. మామిడి తోటకు వర్షంపులిచెర్ల (కల్లూరు): చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలో గురువారం తెల్లవారుజామున ఉరుములతో కూడిన భారీ వర్షం కురిసింది. ఎండాకాలం ఆరంభంలోనే భానుడి భగభగలతో అల్లాడుతున్న ప్రజలకు ఈ అకస్మాత్తు వర్షం ఎంతో ఊరటనిచ్చింది. మామిడి తోటలకు ప్రాణవాయువు ఈ నెలలో ఇప్పటివరకు వర్షపు జాడ లేకపోవడంతో ఆందోళన చెందుతున్న మామిడి రైతులకు ఈ వర్షం కొండంత అండగా నిలిచింది. ప్రస్తుతం మామిడి చెట్లు పూత, పిందె దశలో ఉండటంతో ఈ సమయాన కురిసిన వర్షం వల్ల పూత రాలకుండా ఉంటుందని రైతులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. అంతేకాకుండా, పిందెలు త్వరగా పెరిగి కాయ సైజు పెరగడానికి ఈ తేమ ఎంతో దోహదపడుతుందని వ్యవసాయ నిపుణులు పేర్కొంటున్నారు. రైతుల్లో హర్షాతిరేకాలు అకాల వర్షం సాధారణంగా పంటలకు నష్టం కలిగిస్తుందని భయపడే రైతులకు, ఈసారి ఇది వరంగా మారింది. ఎండ తీవ్రతకు ఎండిపోతున్న తోటలకు ఈ వర్షం జీవం పోసిందని, నాణ్యమైన దిగుబడి వచ్చే అవకా శం ఉందని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. -
క్రేట్లలో గోల్‘మాల్’.. వ్యాపారుల హల్చల్
● టమోటా మార్కెట్లో ధరల మాయాజాలం! ● ములకలచెరువులో రైతుల నిలువునా మోసం మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని టమోటా మార్కెట్ యార్డుల్లో, ముఖ్యంగా ములకలచెరువులో ధరల వెనుక పెద్ద మాయాజాలం సాగుతోంది. మార్కెటింగ్ శాఖ నిబంధనలను తుంగలో తొక్కి వ్యాపారులు, దళారులు ఆడుతున్న నాటకంలో సామాన్య రైతు బలైపోతున్నాడు. గరిష్ట ధర పేరుతో సాగుతున్న ప్రచారం వెనుక వాస్తవాలు పరిశీలిస్తే రైతులకు ఒరుగుతున్న లాభం శూన్యమని స్పష్టమవుతోంది. రికార్డు ధర.. కేవలం ప్రచారానికే! ఈ నెల 15న ములకలచెరువు మార్కెట్లో కిలో టమోటా రూ. 17 పలికినట్లు సోషల్ మీడియాలో భారీగా ప్రచారం చేశారు. పొరుగున ఉన్న మదనపల్లె (రూ.13.50), వాయల్పాడు (రూ.13.60), పుంగనూరు (రూ.11), వి.కోట (రూ.10) కంటే ఇక్కడ ఎక్కువ ధర ఉందంటూ ఊదరగొట్టారు. అయితే, వాస్తవానికి ఈ ధర కేవలం 10 శాతం పంటకు మాత్రమే దక్కింది. మిగిలిన 90 శాతం పంటను చాలా తక్కువ ధరకే కొనుగోలు చేసి రైతులను ముంచేశారు. 15 కిలోల క్రేట్ల విధానం అమలు కావడం లేదన్న విమర్శల నుంచి రైతుల దృష్టి మళ్లించడానికే ఈ ‘ధరల అస్త్రాన్ని’ ప్రయోగించినట్లు తెలుస్తోంది. కాగితాలకే పరిమితమైన ప్రభుత్వ ఆదేశాలు రైతులు మోసపోకూడదనే ఉద్దేశంతో వ్యవసాయ మార్కెటింగ్ డైరెక్టర్ గతేడాది డిసెంబర్ 29న స్పష్టమైన ఉత్తర్వులు జారీ చేశారు. 15 కిలోల క్రేట్ విధానం: 25 కిలోల క్రేట్ల స్థానంలో నిర్వహణ సులభంగా ఉండే 15 కిలోల క్రేట్లను ప్రవేశపెట్టాలి. జాక్పాట్ దోపిడీకి చెక్: అమ్మకాల సమయంలో ‘జాక్పాట్’ లేదా ఇతర పేర్లతో అనధికారికంగా డబ్బులు తగ్గించకూడదు. నిబంధనలు ఇవే: క్రేట్ ఎత్తు వరకు మాత్రమే టమాటాలు నింపాలి. ఐదు అంతస్తుల కంటే ఎక్కువ పేర్చకూడదు. ధరల ప్రదర్శన కోసం ఎలక్ట్రానిక్ బోర్డులు ఏర్పాటు చేయాలి. కానీ, ములకలచెరువులో ఇవేవీ అమలు కావడం లేదు. బాక్సుల సైజు పెద్దవిగా ఉంచి, తక్కువ ధరకే ఎక్కువ పరిమాణంలో టమోటాలను వ్యాపారులు దోచుకుంటున్నారు. ‘ములకలచెరువు వద్దు బ్రో..’ ఇక్కడి మోసాలపై రైతులు సోషల్ మీడియా వేదికగా నిప్పులు చెరుగుతున్నారు. ‘ములకలచెరువు చాలా మోసం బ్రో..’ బాక్స్ లెవల్ అంటారు కానీ బాక్సులు చాలా పెద్దగా ఉంటాయి అని నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. దీనికంటే కర్ణాటకలోని కోలార్, స్థానిక వడ్డిపల్లి, మదనపల్లె మార్కెట్లే నయమని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. 15వ తేదీ ఒకరోజు కిలో ధర రూ.17 పలికింది. ఆ తర్వాత ఎందుకు పలకలేదు, మిగతా మార్కెట్లలో పలుకుతున్న ధర ఇక్కడ ఎందుకు పలకడం లేదు. ఒకరోజు మాత్రమే ఎందుకు ధర పెరిగింది?. 15 బా క్సుల విధానం అమలు చేయాలని ప్రభుత్వం స్పష్టమైన ఆదేశాలు ఇస్తే.. ఆ ఒక్క విషయాన్ని విస్మరించిన మార్కెటింగ్ అధికారులు ఇతర అంశాలపై ఎందుకు దృష్టి పెడుతున్నారు, దీనికి కారణం ఏమిటి? అన్న అంశాలపై ఉన్నతాధికారులు కూడా ఎందుకు పట్టించుకోవడం లేదో ప్రశ్నార్థకంగా మారింది. -
రామ దర్శనం.. ముక్తి దాయకం
● 23 నుంచి పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలు ● 11 రోజుల పాటు ఉత్సవాలు ● ముస్తాబవుతున్న ఆలయంవాల్మీకిపురం : వాల్మీకిపురంలో వెలసిన పట్టాభిరామ స్వామిని దర్శించుకుంటే మోక్షం లభిస్తుందని భక్తుల విశ్వాసం. వాల్మీకి మహర్షి ఈ ప్రాంతంలో తపస్సు చేయడంతోనే ఈ గ్రామానికి వాల్మీకిపురం అన్న పేరు వచ్చిందని, శ్రీరామచంద్రుడు వాల్మీకం (పుట్ట)లో వెలిసినందున వాల్మీకిపురం అయిందన్న అభిప్రాయాలు ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఇక్కడ వెలసిన పట్టాభిరాముడికి ఏటా నిర్వహించే బ్రహ్మోత్సవాలు ఈ ఏడాది 23వ తేదీ (సోమవారం) నుంచి ప్రారంభం కానున్నాయి. ఆలయ ప్రాశస్త్యం అన్నమయ్య జిల్లా వాల్మీకిపురంలో వెలసిన శ్రీ పట్టాభిరామస్వామి దేవాలయం వెయ్యేళ్ల క్రితం నిర్మించినట్లు, 13వ శతాబ్దంలోనే ఈ పట్టాభిరామస్వామి దేవాలయాన్ని పునఃనిర్మాణం గావించినట్లు రికార్డులు తెలుపుతున్నాయి. 15వ శతాబ్దంలో తొలి తెలుగు వాగ్గేయకారుడు పద కవితా పితామహుడు శ్రీ తాళ్ళపాక అన్నమాచార్యులు వాల్మీకిపురం క్షేత్రాన్ని సందర్శించి ఎన్నో కీర్తనలు రచించారు. ఈ పట్టాభిరామాలయంలో గల మూల విగ్రహాలను మహర్షి జాంబవంతులు వారిచే ఒకే చోట ప్రతిష్ఠించడమైనది. వాల్మీకిపురం పరిసర ప్రాంతంలోని శతశృంగపర్వతాలలో వాల్మీకి మహర్షి తపస్సు చేశారని, ఈ కారణంగా వాల్మీకిపురం క్షేత్రం పురాణ ప్రసిద్ధి గాంచిందని చెబుతున్నారు. భారతదేశంలో ‘అయోధ్య’ తర్వాత శ్రీరామ క్షేత్రాలలో మొదటి స్థానం ‘వాల్మీకిపురమే’ అని ఇక్కడి వాసులు పేర్కొంటున్నారు. ఎంతో ఘనమైన చరిత్ర కల్గిన ఈ ఆలయానికి ఆనాటి రాజులు శ్రీకృష్ణదేవరాయులు, ఛత్రపతి శివాజీ, ఆయన తల్లి జిజియాబాయి, సాళువ నరశింగభూపతిరాయలవారు, ఆంగ్లేయుల అధిపతులలో థామస్ మన్రో, సి.పి బ్రౌన్, హార్డ్హార్డింగ్ వంటి వారు, ముస్లిం నవాబులు శ్రీరాముడికి సేవలు అందించి తరించారు. చింతల రామచంద్రారెడ్డి చొరవతో టీటీడీ అనుబంధం.. ఆలయ అనువంశిక ధర్మకర్తలుగా మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కుటుంబీకులు వ్యవహరించే వారు. దేవదాయ ధర్మాదాయ శాఖ ఆధ్వర్యంలో ఉన్న ఇంతటి చరిత్ర కల్గి పురాణ ప్రసిద్ధి గాంచిన శ్రీ పట్టాభిరామస్వామి ఆలయాన్ని 1997 ఫిబ్రవరి 23న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి చొరవతో తిరుమల–తిరుపతి దేవస్థానానికి అనుబంధ దేవాలయంగా చేర్చడమైనది. ఆనాటి నుంచి నేటి వరకు తిరుమల–తిరుపతి దేవస్థానం వారు ఎంతో వైభవంగా ఏటా శ్రీపట్టాభిరామ స్వామివారి బ్రహ్మోత్సవాలు నిర్వహిస్తున్నారు. అలాగే ఏడాదికి ఒక సారి పవిత్రోత్సవాలు, పట్టాభిషేక మహోత్సవాలు, ప్రతి మాసం పునర్వసు నక్షత్రాన్ని పురస్కరించుకొని స్వామివారి కల్యాణోత్సవం నిర్వహించడం జరుగుతుంది. -
ఆయకట్టు.. అక్రమార్కులే చుట్టూ !
● పీలేరులో అడ్డూఅదుపులేని చెరువుల ఆక్రమణలు ● కుంచించుకుపోతున్న జలవనరులు ● అధికారుల నిర్లక్ష్యంపై ఆయకట్టుదారుల ఆగ్రహం పీలేరు: మండలంలోని చెరువులు అక్రమార్కుల పాలి ట వరంగా మారుతున్నాయి. అడ్డూఅదుపు లేకుండా సాగుతున్న ఆక్రమణలతో ఒకప్పుడు జలకళతో ఉట్టిప డిన చెరువులు నేడు కుచించుకుపోతున్నాయి. అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తుండటంతో కబ్జాదారులు చెరువు భూములను ఆక్రమిస్తున్నారని ఆయకట్టుదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వేల ఎకరాల ఆయకట్టుకు ముప్పు పీలేరు మండల వ్యాప్తంగా మొత్తం 188 చెరువులు ఉండగా, వీటి కింద 1,795 ఎకరాల సాగు భూమి (ఆయకట్టు) ఉంది. ఇందులో మైనర్ ఇరిగేషన్ పరిధిలో 100 ఎకరాల కంటే ఎక్కువ ఆయకట్టు కలిగిన ఐదు ప్రధాన చెరువులు ఉన్నాయి భూగర్భ జలాలపై పెను ప్రభావం ఆక్రమణలకు తోడు, కొందరు మట్టిని యథేచ్ఛగా తోడేస్తుండటంతో చెరువుల నీటి నిల్వ సామర్థ్యం గణనీయంగా తగ్గిపోతోంది. దీనివల్ల వర్షాలు కురిసినా నీరు నిలవడం లేదని, ఫలితంగా చుట్టుపక్కల బోరుబావుల్లో భూగర్భ జలాలు అడుగంటిపోతున్నాయని రైతులు వాపోతున్నారు. సాగునీరు అందక పంటలు ఎండిపోయే పరిస్థితి నెలకొందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల స్పందన కోరుతున్న ప్రజలు: ఇప్పటికై నా రెవెన్యూ, ఇరిగేషన్ శాఖ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించకుండా తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. చెరువుల హద్దులను గుర్తించి, ఆక్రమణలను తొలగించి జలవనరులను కాపాడాలని డిమాండ్ చేస్తున్నారు.అయ్యపునాయుని చెరువు : 252 ఎకరాలు కుమ్మరపల్లె చెరువు : 252 ఎకరాలు గోవిందరెడ్డిపల్లె చెరువు : 200 ఎకరాలు చింతల చెరువు : 106 ఎకరాలు గూడరేవుపల్లె సూరప్ప చెరువు : 104 ఎకరాలు -
గాలివాన బీభత్సం.. వంద ఎకరాల్లో పంటనష్టం
చౌడేపల్లె: మండలంలో బుధవారం రాత్రి గాలీవాన బీభత్సం సృష్టించింది. పెనుగాలులతో కూడిన భారీ వర్షానికి బత్తలాపురం రోడ్డులోగల మారెమ్మ ఆలయం సమీపంలో విద్యుత్ స్తంభం నేలకొరిగింది.అలాగే వడగండ్ల వర్షంతో టమోటా పంటలకు నష్టం జరిగింది. గాలీవానతో ఖాన్సాబ్ మిట్ట నూరుల్లా కు చెందిన బీర తోట నేలకొరికింది. కట్టెలకు బీర తీగలు అల్లించడంతో వానకు గాలికి కట్టెలు విరిగి కుప్పకూలాయి. పంట దిగుబడి చేతికందే సమయంలో అకాల వర్షం అతలాకుతలం చేసిందని సుమారు రూ:లక్ష మేర ఆస్థినష్టం వాటిల్లినట్లు రైతు ఆవేదన వ్యక్తం చేశారు. మామిడి పిందెలు సైతం పెనుగాలులకు రాలిపోయాయి. సుమారు 100 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లినట్లు సమాచారం. -
మదనపల్లెలో జిల్లా పోలీస్ కార్యాలయం ప్రారంభం
మదనపల్లెటౌన్: మదనపల్లె పట్టణం, బెంగుళూరు రోడ్డులోని రేస్ బీఈడీ కాలేజి వద్ద నూతనంగా నిర్మించిన జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీన్ బుధవారం ప్రారంభించారు. ప్రారంభోత్సవంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, కలెక్టర్ నిశాంత్ కుమార్, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఎమ్మెల్యే షాజహాన్ బాషా పాల్గొన్నారు. అంతకుముందు వేద పండితుల ఆశీర్వచనాలు, మంగళవాయిద్యాల నడుమ సాయుధ పోలీసుల దళం (ఏఆర్) గౌరవ వందనం స్వీకరించిన అనంతరం అధికారులు కార్యాలయంలోని వివిధ విభాగాలను రికార్డు గదులను క్షుణ్ణంగా పరిశీలించారు. ఈ సందర్భంగా డీఐజీ, ఎస్పీ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖకు ఇది ఒక మైలురాయి అన్నారు. అత్యాధునిక , సాంకేతిక, మెరుగైన వసతులతో ఈ కార్యాలయాన్ని తీర్చిదిద్దడం జరిగిందన్నారు. ఇక నుంచి సేవలన్నీ ఎస్పీ కార్యాలయంలోనే జిల్లా ప్రజలు పొందవచ్చు అని తెలిపారు. టెక్నాలజీని వాడుకుంటూ నేర నియంత్రణలోనూ ప్రజల ఫిర్యాదులు పరిష్కరించడంలోనూ ముందుకు పోతున్నట్లు చెప్పారు. జిల్లాలో శాంతి భద్రతల పరిరణకు రాజీ పడకుండా ప్రజలకు సేవలు అందిస్తామని పేర్కొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ మాట్లాడుతూ.. పాలనా వికేంద్రీకరణ వల్ల సామాన్య ప్రజలకు ప్రభుత్వ సేవలు సులభతరం అవుతాయని వివరించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీలు ఏడుకొండలు, కృష్ణమోహన్, జిల్లా కార్యాలయంలోని వివిధ విభాగాల అధికారులు, సీఐ, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. సంయుక్తంగా పాల్గొన్న ఎస్పీ, కలెక్టర్ -
బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దాం
వాల్మీకిపురం: వాల్మీకిక్షేత్రంలోని శ్రీరాముడి బ్రహ్మోత్సవాలు వైభవంగా నిర్వహిద్దామని టీటీడీ డిప్యూటీ ఈవో వరలక్ష్మి అన్నారు. బుధవారం స్థానిక పట్టాభిరామాలయంలో టీటీడీ అధికారులు, అర్చకులతో కలసి వార్షిక బ్రహ్మోత్సవాల వాల్ పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ నెల 23 నుంచి వార్షిక బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా ప్రారంభమవుతాయన్నారు. అలాగే 29న శ్రీ సీతారాముల కళ్యాణోత్సవం , 30వ తేది రథోత్సవం, 2వ తేది పుష్పయాగంతో ఉత్సవాలు ముగియనున్నాయి. ప్రజలంతా పెద్ద ఎత్తున పాల్గొని, స్వామి వారి బ్రహ్మోత్సవాలను విజయవంతం చేయా లని ఆమె కోరారు. టీటీడీ అధికారులు, అర్చకులు క్రిష్ణస్వామి, భాషికాచార్యులు, రాంగోపాల్, మురళీ, సిబ్బంది నాగరాజ, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులకు ఉచిత ప్రయాణం
మదనపల్లె: ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణం దివ్యాంగులకు వరమని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. బుధవారం ఆయన స్థానిక ఆర్టీసీబస్టాండ్లో దివ్యాంగశక్తి పథకాన్ని ప్రారంభించారు. ఎమ్మెల్యే షాజహాన్బాషాతో కలిసి బస్సుకు పచ్చజెండా ఊపి కార్యక్రమాన్ని ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ ఉచిత టికెట్ను అందించి బస్సులో ప్రయాణించి దివ్యాంగులతో ముచ్చటించారు. వారి సమస్యలను, అభిప్రాయాలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 40 శాతం కంటే ఎక్కువ వైకల్యం ఉన్న దివ్యాంగులకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. జిల్లాలో వీరు 42,560 మంది ఉన్నారని వెల్లడించారు. డిపో మేనేజర్ అమరనాథ్, వెలుగు సెక్రటరీ ఎం.ఉదయ్మోహన్రెడ్డి, దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా అధ్యక్షుడు మౌలాలి పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ -
తెలుగు లోగిళ్లకు పండుగ కళ !
● జీవితం రుచి తెలిపే పండగ ఉగాది ● ఆలయాల్లో పంచాగ పఠనానికి ఏర్పాట్లు పూర్తి మదనపల్లె సిటీ: తెలుగువారి తొలి పండుగ ఉగాది పరాభవనామంతో వచ్చేసింది. కష్టసుఖాల కలయికగా.. మమేకమైన షడ్రుచుల సమ్మేళనంగా పలకరించనుంది. కోటి ఆశలతో.. కొంగొత్త కాంతులతో ప్రతి తెలుగువారింట వాలిపోయింది. ప్రతి ఇంటా విరబూసే తెలుగుదనమే ఉగాది పర్వదినం. వినూత్న ఆలోచనతో జిల్లా వాసుల హృదయాలను సంబరాల్లో ముంచెత్తడానికి గురువారం స్పూర్తిదాయక కార్య క్రమాలు ఉత్సాహంగా సాగనున్నాయి. పండుగల్లోకెల్లా ఉగాదికి ప్రత్యేకత ఉంది. ఏటా చైత్రశుక్ల పాడ్య మి రోజున వచ్చే ఈ పండుగను ప్రతి ఇంట్లో తోరణాలు కట్టి, వేపపూత పచ్చడి చేసి సాదరంగా ఆహ్వానిస్తారు. జీవిత గమనంలో కష్టసుఖాలను ప్రతిబింబించే షడ్రుచుల సమ్మేళనంతో ఈ పండుగ సరదగా సాగిపోతుంది. కవుల పండుగ ఉగాదిని కవుల పండుగా చెప్పవచ్చు. పండుగ నాడు కవి సమ్మేళనాలు నిర్వహించి అతో ఇంతో సంభావన ఇచ్చి కవులను సత్కరించడం పండుగ సంప్రదాయం. జిల్లాలోని మదనపల్లెలో మదనపల్లె రచయితల సంఘం ఆధ్వర్యంలో ప్రతి ఏడాది కవి సమ్మేళనాలు నిర్వహిస్తున్నారు. జిల్లాలోని ఆలయాల్లో సైతం పంచాగశ్రవణాలు నిర్వహించనున్నారు. ఏడాదిలో జరిగే విశేషాలను పండితులు వివరిస్తారు. పచ్చడి ఆరోగ్యదాయకం తెలుగువారి నూతన సంవత్సరాది ఉగాది. ప్రకృతి ద్వారా ఆరోగ్య రహస్యాలను అందించే మహత్తర పరమావధి.తీపి,కారం,ఉప్పు,చేదు,వగరు,పులుపు వంటి షడ్రుచులు ఆరోగ్యానికి అత్యంత శ్రేష్టకరం. తెలుగు లోగిళ్లల్లో చిందులేసే నవవసంత పరవళ్లు ఒకనాడు గ్రామీణ ప్రాంతాలకు సుసంపన్నం చేసవి. ఫ్యాషన్ ఒరవడిలో పాత ఆచారాలను మరచిపోకుండా సంస్కృతి,సంప్రదాయాలను ప్రతిబింబించే ఉగాది విశేషాలను ఈ తరం వారికి అవగాహన కల్పించాల్సిన అవసరం ఉంది. -
జిల్లా ప్రజలకు ఎంపీ, ఎమ్మెల్యే ఉగాది శుభాకాంక్షలు
పుంగనూరు: తెలుగువారి నూతన సంవత్సరం శ్రీ పరాభవనామ సందర్భంగా ఉమ్మడి జిల్లా ప్రజలకు మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి శుభాకాంక్షలు తెలిపారు. కొత్త సంవత్సరంలో ప్రజలు సుఖశాంతులతో జీవించాలని ఆకాంక్షించారు. ప్రజలకు, పార్టీ నాయకులకు, కా ర్యకర్తలకు ఉగాది శుభాకాంక్షలు తెలిపారు. బాధ్యతల స్వీకరణ మదనపల్లె: మదనపల్లె సెలక్షన్ గ్రేడ్ మున్సిపాలిటీ ప్రత్యేకాధికారిగా ఇన్చార్జ్ జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ మధుసూదనరావు బుధవారం బాధ్యతలు స్వీకరించారు. మున్సిపల్ కార్యాలయానికి వచ్చిన ఆయనకు కమిషనర్ ప్రమీల, సిబ్బంది స్వాగతం పలికారు. అనంతరం ఆయన బాధ్యతలను చేపట్టారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ సెలవులో ఉండటంతో డీఆర్ఓ ఇన్చార్జ్ జేసీగా అదనపు బాధ్యతలు చేపట్టనున్నారు. గండికోట నుంచికుప్పానికి తాగునీరు! కొండాపురం: గండికోట జలాశయం నుంచి కుప్పానికి తాగునీరు అందించేందుకు రూ.2,370 కోట్లతో పనులు చేపట్టినట్లు ఇరిగేషన్ సీఈ రవికుమార్, ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ప్రసన్న కుమార్ తెలిపారు. మంగళవారం గండికోట జలాశయం వద్ద జరుగుతున్న పనులను వారు పరిశీలించారు. జల్ జీవన్ పథకంలో భాగంగా రెండు విడతల్లో కుప్పానికి తాగునీరు తీసుకెళ్లేందుకు పనులు చేపట్టామన్నారు. మొదటి దశలో మదనపల్లె పీలేరు తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ప్రజలకు తాగునీరు అందుతుందన్నారు. జలాశయం వద్ద ఇంటెల్ వెల్ నిర్మాణంతో పాటు పైపులైను నిర్మాణ పనులను పరిశీలించారు. పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
పనుల్లో నాణ్యత ప్రమాణాలు పాటించాలి
పీడీ వెంకటరత్నంపీలేరు : ఉపాధి హామీ పనుల్లో నాణ్యతా ప్రమాణాలు పాటించాలని పీడీ వెంకటరత్నం అన్నారు. బుధవారం పీలేరు పట్టణంలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న సీసీ రోడ్లను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో మొత్తం 8.5 కిలోమీటర్లు సీసీ రోడ్లు నిర్మిస్తున్నట్లు తెలిపారు. రూ. 3.85 కోట్లతో నిర్మిస్తున్న సీసీ రోడ్డు నిర్మాణ పనులు వేగంగా జరుగుతున్నట్లు చెప్పారు. పీఆర్ ఏఈ, ఉపాధి ఏపీవో పనులు పర్యవేక్షించి నాణ్యతలో రాజీలేకుండా పనిచేయాలన్నారు. ఎంపీడీఓ శివశంకర్, ఏపీవో అశోక్రెడ్డి, పీఆర్ ఏఈ రామకృష్ణ నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డునిర్మాణ పనుల పరిశీలన కేవీపల్లె : ఉపాధి హామీ పథకాన్ని గ్రామీణ ప్రాంత ప్రజలు, కూలీలు సద్వినియోగం చేసుకోవాలని పీడీ వెంకటరత్నం అన్నారు. బుధవారం మండలంలోని గర్నిమిట్టలో ఉపాధి హామీ పథకంలో నిర్మిస్తున్న సీసీ రోడ్డును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రూ. 11.50 లక్షలతో 290 మీటర్ల పొడవు సిమెంట్ రోడ్డు నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఎంపీడీవో సుధాకర్, ఏపీవో నాగరాజ తదితరులు పాల్గొన్నారు. -
పరీక్షలు ముగిసిన వేళ..
● జ్ఞాపకాలు నెమరేసుకున్న విద్యార్థులు.. ● ఇళ్లకు వెళ్లే సమయంలో బరువెక్కిన చిట్టి హృదయాలు ఆ క్షణం.. పరీక్షలు ముగిశాయన్న సంతోషం కంటే తెలియని భావోద్వేగమేదో కదలాడింది..చూస్తుండగానే వారి కంట నీరొలికింది.. మళ్లీ ఎప్పుడు కలుస్తామో..ఏ కళాశాలలో కలిసి చదువుతామో అనే దిగులే వారి ముఖాల్లో తారసపడింది.. బుధవారం ఇంటర్మీడియట్ పరీక్షా కేంద్రాల వద్ద విద్యార్థుల మోముల్లో కనిపించిన హావభావాలివి. రెండేళ్లపాటు కలిసి చదువుకున్న తోటివారిని వీడిపోతున్నామనే బాధతో.. రెండేళ్ల జ్ఞాపకాల భారంతో వీడ్కోలు పలికారు.. రాజంపేట టౌన్: ఇంటర్మీడియట్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు బుధవారంతో ముగిశాయి. రెండేళ్ల పాటు ఒకే కళాశాలలో చదువుకున్న విద్యార్థులు ఇకపై అందరు ఒకేచోట కలిసి చదువుకోవడం వీలుపడదు. ఈ నేపథ్యంలో పలువురు విద్యార్థులు పరీక్ష అయిపోయాక కళాశాలలో ఉన్న రోజులను గుర్తు చేసుకున్నారు. బీటెక్, ఎంబీబీఎస్, డిగ్రీ వంటి చదువుల కోసం వేరు, వేరు కళాశాలల్లో చేరినా తమ స్నేహం ఇలాగే ఉండాలంటూ ఆత్మీయంగా మాట్లాడుకున్నారు. చివరగా బరువెక్కిన హృదయాలతో ఇళ్లకు పయనమయ్యారు. భవిష్యత్తుపై స్పష్టతతో విద్యార్థులు ఒకప్పుడు పరీక్షలు ముగిశాక విద్యార్థులు ఏ ఊరెళ్లాళి, సెలవుల్లో ఎలా సందడి చేయాలని ఆలోచించేవారు. ప్రస్తుత పోటీ ప్రపంచంలో రాణించి ఉజ్వల భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలంటే సమయం వృధా చేసుకోకూడదన్న ఆలోచనా ధృక్పథమే వారిలో స్పష్టంగా కనిపించింది. ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసిన అనేక మంది విద్యార్థులు సెలవులు సద్వినియోగం చేసుకొని తద్వారా ఉన్న త చదువులు చదవాలన్న ఆలోచనా సరళిలో ఉన్నట్లు వారి మాటల్లో తెలుస్తోంది. ఇంటర్ పరీక్షలు రాసి బయటకు వచ్చిన పలువురు విద్యార్థులను ‘సాక్షి’పలకరించగా భవిష్యత్తుపై వారికున్న ఆలోచన స్పష్టమైంది. ముగిసిన ఇంటర్ పరీక్షలు – జిల్లావ్యాప్తంగా చివరి రోజు పరీక్షకు 259 మంది గైర్హాజర్ కడప ఎడ్యుకేషన్: ఇంటర్ పరీక్షలు ముగిశాయి. గత నెల 23 నుంచి ప్రారంభమైన ఇంటర్ ప్రథమ, ద్వితీయ సంవత్సర పరీక్షలు బుధవారంతో ముగిశాయి. జిల్లావ్యాప్తంగా చివరిరోజు నిర్వహించిన ద్వితీయ సంవత్సరం కెమిస్ట్రీ పేపర్–2 పరీక్షకు 259 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఇంటర్ పరీక్షలు ముగియడంతో విద్యార్థులు సందడి చేస్తూ ఇళ్లకు పయనమయ్యారు. నేను డిగ్రీలో చేరుతాను. డిగ్రీ పూర్తయ్యాక పోటీ పరీక్షలకు ప్రిపేరవుతాను. బ్యాంకులో ఉద్యోగం సాధించాలన్నదే నాకోరిక. అందువల్ల పోటీ పరీక్షలకు ప్రిపేరయ్యే సందర్భంలో బ్యాంకులలో పోస్టులు పడితే బ్యాంకులో ఉద్యోగం సాధించేందుకు శక్తివంచన లేకుండా ప్రయత్నిస్తాను. ఒకవేళ బ్యాంకులో ఉద్యోగం రాకుంటే ఏదైనా ప్రభుత్వ ఉద్యోగం సాధించేందుకు కృషి చేస్తా. – సుస్మిత, రాజంపేట నేను ఇంటర్మీడియట్లో మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తా. మొదట నాముందున్న లక్ష్యం బీటెక్ చేయడం. బీటెక్ పూర్తయ్యాక ఎంటెక్ చేయాలన్నది నాకోరిక. బట్ బీటెక్ తరువాత అప్పటి పరిస్థితులను బట్టి నా ఫ్యూచర్ ప్లాన్ ఉంటుంది. ఏది ఏమైనా లైఫ్లో మంచి పొజిషన్లో ఉండాలన్నదే నాకోరిక. – ఫుర్ఖాన్, నందలూరు ఇంటర్మీడియట్ తరువాత అభ్యసించే విద్య భవిష్యత్తుకు ఎంతో ప్రధానమైనది. రాబోవు ఆరేడేళ్ల తరువాత ఎలాంటి ఉద్యోగాలు మెండుగా లభిస్తాయి, అందుకు తగ్గట్లు ఏ కోర్సులు చేయాలి అన్న విషయాలపై తల్లిదండ్రులు, విద్యావంతులతో చర్చించి నిర్ణయం తీసుకోవాలి.అందువల్ల ఒకటికి పదిమార్లు బాగా ఆలోచించి కోర్సులను ఎంపిక చేసుకోవాలి. – ఆకేపాటి రజనీకాంత్రెడ్డి, రిటైర్డ్ ప్రిన్సిపల్, రాజంపేట మా అమ్మ, నాన్న ఇద్దరు నిత్యం కష్టపడతారు. నేను ఇంటర్మీడియట్ పరీక్షలు బాగా రాశాను. మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తాను. బీటెక్లో మెకానికల్ బ్రాంచ్ తీసుకొని మెకానికల్ ఇంజనీర్ కావాలన్నదే లక్ష్యం. తల్లిదండ్రులు కష్టపడకుండా చూసుకోవా లన్నదే నా ఆశయం. – బిందు, రాజంపేట -
భవిష్యత్తు వివరించేది పంచాంగం
గ్రహాల ఆధారంగా ముహుర్తాలు పంచాగంలో వివరించారు. పంచాంగం భవిష్యవాణిని తెలుపుతుంది. దినాధిపతులు, తారాబలం కూడా తెలుసుకోవచ్చు. వర్షాలు, పంటలు, కాలం తదితర అంశాలు, వ్యాపారాలు, ఉద్యోగాల తదితర అంశాలను పంచాంగం ద్వారా వెల్లడవుతాయి. – శివకుమార్శర్మ, పంచాంగకర్త, మదనపల్లె. శ్రీ పరాభవనామ సంవత్సరం మంచి మార్పునకు నాందిగా పలుకుతుంది. ఈ రోజు తలంటుస్నానం ఆచరించి నూతన వస్త్రాలు ధరించి ఇష్టదైవాన్ని పూజించాలి. ఉగాది పచ్చడి స్వీకరిస్తే మంచి జరుగుతుంది. అలాగే పంచాంగం వినడం ద్వారా అరిష్టాలు తొలగి శుభదాయకంగా ఉంటుంది. – అజయ్స్వామి, వాస్తు, వేద పండితులు,మదనపల్లె. -
భూ కబ్జాలకు నిలయంగా ఒంటిమిట్ట
సాక్షి టాస్కపోర్స్: ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లి పంచాయతీ, వడ్డిపల్లి గ్రామంలో ఉన్న ప్రభుత్వ భూమిని స్థానిక అధికార పార్టీ నాయకుడు ఆక్రమించినట్లు అదే గ్రామానికి చెందిన చల్లా చంద్ర శేఖర్ అనే వ్యక్తి కడప జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పిర్యాదులో పేర్కొన్న వివరాల మేరకు..వడ్డిపల్లి గ్రామంలోని సర్వే నంబర్ 158 లో ఉన్న 1 ఎకరా 86 సెంట్ల ప్రభుత్వ భూమిని కొంత కాలంగా ఆక్రమించి ఉన్న స్థానిక అధికార పార్టీ నాయకుడైన గడ్డెం సుబ్బారెడ్డి నుంచి కాపాడాలని విన్నవించారు. కబ్జా దారుడైన స్థానిక గెడ్డెం సుబ్బారెడ్డికి సర్వే నంబర్ 157లో 0.93 సెంట్ల సొంత భూమి ఉంది, అయితే అదే సర్వే నంబర్కు ఆనుకుని ఉన్న 158 సర్వే నంబర్లో దాదాపు 100 సంవత్సరాలుగా వడ్డె కులస్తుల అనుభవంలో ఉన్న 1 ఎకరా 86 సెంట్ల గ్రామకంఠాన్ని గడ్డెం సుబ్బారెడ్డి అధికారం అడ్డుపెట్టుకుని దౌర్జన్యంగా అక్రమించుకొని, తన భూమిలో కలుపుకున్నాడన్నారు. ఇదే కాకుండా సదరు గ్రామానికి అనుకుని ఉన్న పలు ప్రభుత్వ భూములు, గ్రామకంఠాల స్థలాలను అధికార పార్టీ ముఖ్య నాయకుడి అండ చూసుకొని, దాదాపు 8ఎకరాల వరకు గడ్డెం సుబ్బారెడ్డి కుటుంబ సభ్యుల పేర్లతో ఆక్రమించినట్లు ఫిర్యాదు దారుడు తెలిపాడు.అక్రమించుకున్న ప్రభుత్వ భూములు, గ్రామకంఠాలను చదును చేసి కొన్ని చొట్ల కంచెను వేయగా, మరికొన్ని చోట్ల చెట్లను నాటి సాగు చేసుకుంటున్నాడని ఫిర్యాదు దారుడు చల్లా చంద్ర శేఖర్ పేర్కొన్నారు. కబ్జా రాయుడిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. -
పోలింగ్బూత్ కమిటీలే క్రీయాశీలకం
రాజంపేట : ఎన్నికల ప్రక్రియలో పోలింగ్ బూత్ కమిటీలే క్రీయాశీలకమని పోలింగ్ బూత్ కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్రెడ్డి వెల్లడించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అధ్యక్షతన ఆకేపాటి ఎస్టేట్ ఆడిటోరియంలో బుధవారం నిర్వహించిన పార్లమెంటరీ స్ధాయి బూత్స్ధాయి సమావేశం ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి రావాలంటే పోలింగ్ బూత్ కమిటీలు పక్బండందీగా పనిచేయాల్సిన అవసరం ఉంటుందన్నారు. త్వరలో ఎస్ఐఆర్ సర్వే జరగనున్నదన్నారు. ఈ సర్వేలో పోలింగ్ బూత్ల వారీగా ఓట్లను కోల్పోకుండా చూడాలన్నారు. అందుసంబంధించి ధృవపత్రాలను జతపరిచి, వాటిని ఎన్నికల అధికారుల దృష్టికి తీసుకెళ్లాల్సిన పరిస్ధితులను కల్పించుకోవాలన్నారు. స్ధానిక సంస్ధల ఎన్నికలను దృష్టిలో పెట్టుకుని, టీడీపీ ఎత్తుగడలను తిప్పికొడుతూ, ముందుస్తుగా ఓట్ల విషయంలో జాగ్రత్తలు తీసుకోవాల్సిన పరిస్ధితులు నేడున్నాయన్నారు. పోలింగ్ బూత్ ఏజెంట్ల నియామకంపై కూడా ఇప్పటి నుంచి దృష్టి సారించాలని తెలిపారు.ఎన్నికలసంఘం నియమనిబంధనలను అనుగుణంగా ముందుకెళ్లాలని సూచించారు. రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథరెడ్డి మాట్లాడుతూ గ్రామస్థాయిలో బలోపేతంగా పనిచేసినప్పుడే ఎన్నికల ప్రక్రియలో మంచి ఫలితాలు చూడగలమన్నారు. పోలింగ్బూత్ నియమాకానికి సంబంధించిన అంశాలపై పకడ్బందీగా ముందుకెళ్లాలన్నారు. ప్రతి ఓటు కీలకమనేది గుర్తుంచుకోవాలన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ సీఎం చేసుకోవాలంటే ఇప్పటినుంచే గ్రామ, మండల, నియోకవర్గస్థాయి వరకు కమిటీలో ఉన్న వారు చురుగ్గా పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ స్ధానిక సంస్ధల ఎన్నికలకు పార్టీ క్యాడర్ సిద్ధంకావాలన్నారు. టీడీపీని ఓడించేందుకు ఇప్పటి నుంచే సన్నద్ధం కావాలని సూచించారు. ఐదు సంవత్సరాలు తర్వాత వచ్చే ఎన్నికలప్రక్రియ కీలకమైందన్నారు. రైల్వేకోడూరు మాజీ శాసనసభ్యుడు కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కలిసికట్టుగా పార్టీ బలోపేతం కోసం కృషిచేద్దామన్నారు. పోలింగ్బూత్ కమిటీలు, గ్రామస్థాయి కమిటీలే ఎన్నికల ప్రక్రియలో కీలకభూమి పోషిస్తాయన్నారు. పార్టీలో వివిధ హోదాల్లో ఉన్న వారంతా పార్టీని బలోపేతం చేసుకోవాలని తెలిపారు. పోలింగ్బూత్ స్ధాయి వర్క్షాపులో రాష్ట్ర అధ్యక్షులు సుధాకర్రెడ్డి చెప్పేసూచనలు, సలహాలు పాటించేలా ముందుకెళ్లాలన్నారు. పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబులరెడ్డి మాట్లాడుతూ ఇప్పుడు కావాల్సింది కార్యకర్తలకు భరోసా ఇవ్వడమే అని అన్నారు. వారిలో మనోధైర్యం నింపే బాధ్యత నియోజకవర్గ స్థాయి నేతలు తీసుకోవాలన్నారు. కేసులకు భయపడే ప్రసక్తిలేదని, తిరిగి వైఎస్సార్సీపీని అధికారంలోకి తెచ్చుకోవాలన్నారు. రాయలసీమ జోన్ బూత్ కమిటి కన్వీనరు తల్లెం భరత్కుమార్రెడ్డి, జిల్లా బూత్కమిటీ అధ్యక్షుడు నడివీధి సుధాకర్లు ప్రసంగించారు. కార్యక్రమంలో రాజంపేట మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఎస్ఈసీ సభ్యుడు చొప్పా ఎల్లారెడ్డి, మండలపార్టీ కన్వీనర్ గోపిరెడ్డి, దొడ్డిపల్లె భాస్కర్రాజు, రామస్వామిరెడ్డి, టక్కోలు శివారెడ్డి, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ దండుగోపి, నియోజకవర్గ బూత్ కన్వీనర్లు రెడ్డి హరి, సూరం సుబ్బారెడ్డి, రవికుమార్రెడ్డి, తిప్పన నాగభూషణం, డీలర్ సుబ్బరామిరెడ్డి, పోలి రఘు, సుబ్బరామిరెడ్డి, భాస్కర్యాదవ్, కిషోర్కుమార్, బూత్ కమిటీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి రెహిమాన్ఖాన్, వైఎస్సార్, అన్నమయ్య, తిరుపతి జిల్లాకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, బూత్కమిటీల ప్రతినిధులు పాల్గొన్నారు.బూత్కమిటీల రాష్ట్ర అధ్యక్షుడు కె.సుధాకర్రెడ్డి -
ఉరి వేసుకుని యువతి ఆత్మహత్య
మదనపల్లెటౌన్ : భర్తతో దూరంగా ఉంటూ అనాథ ఆశ్రమంలో రిసెష్పనిస్టు ఉద్యోగం చేసుకుంటున్న యువతి ఉరేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. బుధవారం ఉదయం వెలుగు చూసిన ఘటనపై టూటౌన్ పోలీసుల కథనం మేరుకు.. మదనపల్లె మండలం, బసినికొండకు చెందిన తేజ కారు డ్రైవర్గా పనిచేసేవాడు. ఈ క్రమంలో వాల్మీకిపురం మంలం, చింతపర్తికి చెందిన చంద్రయ్య, రమణమ్మ దంపతుల కుమార్తె స్వాతి(29)ని ఎనిమిదేళ్ల క్రితం పెళ్లి చేసుకున్నాడు. కొంతకాలం వీరి కాపురం సజావుగా సాగింది. వీరికి పిల్లలు పుట్టలేదు. దీంతో భార్య భర్తల మధ్య మనస్పర్థల కారణంగా విభేదాలు తలెత్తి గొడవపడి విడిపోయారు. అప్పటి నుంచి స్వాతి పట్టణంలోని బర్మావీధిలోని చైతన్య సర్వీసెస్ సోసైటీ(అనాథ పిల్లల ఆశ్రమం)లో రిసెష్పనిస్టుగా పనిచేస్తూ అక్కడే ఉంటోంది. భార్య భర్తలు ఇద్దరు ఐదేళ్ల క్రితం కోర్టులో కేసులు వేసుకున్నారు. వాయిదాలకు తిరుగుతున్నారు. ఈ నేపథ్యంలో ఏమి జరిగిందో ఏమో స్వాతి తాను ఉంటున్న సొసైటీలోని గదిలో మంగళవారం అర్థరాత్రి తన చున్నీతో భవంనం పైకప్పునకు ఉన్న కమ్మీకి ఉరి వేసుకుని బలవన్మరణం చెందింది. ఉదయం గమనించిన సొసైటీ సిబ్బంది వెంటనే రెండో పట్టణ పోలీసులకు, మృతురాలి కుటుంబీకులకు సమాచారం అందించారు. సీఐ మహ్మద్ రఫీ, ఎస్ఐ నాగేశ్వర్ రావు, ఏఎస్ఐ సిబ్బందితో ఆశ్రమానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు.కాగా అదే సమయంలో చనిపోయిన స్వాతి భర్త తేజా ఘటనా స్థలం వద్దకు వచ్చాడు. అది గమనించిన మృతురాలి బంధువులు తేజపై కర్రలతో దాడి చేశారు. -
నిర్మాణపనులు త్వరగా పూర్తి చేయాలి
గుర్రంకొండ : మండలంలోని సరిమడుగు ప్రాథమిక పాఠశాలలో జరుగుతున్న నిర్మాణపనులు త్వరగా పూర్తి చేయాలని డీఈవో సుబ్రమణ్యం అన్నారు. బుధవారం స్థానిక పాఠశాలలో ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. విద్యార్థులతో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకొన్నారు. పాఠశాల రికార్డులను, రిజిష్టర్లను తనిఖీ చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యార్థులకు వడ్డించే మధ్యాహ్నాభోజనంలొ నాణ్యత పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంఈవో సురేంద్రబాబు, ప్రిన్సిపల్ సుమిత్ర, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. చెట్టుపైనుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లెటౌన్ : చింత చెట్టు పైనుంచి పడి కూలి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బుథవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని ఎర్రాతివారిపల్లెకు చెందిన రాజ శేఖర్(40) స్థానిక బండకాడపల్లెకు చెందిన ఓ రైతుకు చింత కాయలు కోయడానికి కూలి పనులకు వెళ్లాడు. సహచరులతో కలిసి చెట్టెక్కి చింత కాయలు కోస్తుండగా ప్రమాదవశాత్తు చెట్టుపై నుంచి కింద పడ్డాడు. తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు బాధితుడిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్సఅందించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. రాష్ట్రస్థాయి క్రీడల్లో ప్రతిభకడప కార్పొరేషన్ : విజయవాడలోని మంగళగిరిలో డాక్టర్స్ స్పోర్ట్స్ ఆకాడమీ వేదికగా నిర్వహించిన కామ్రెడ్ ఎన్వీఎస్ స్పోర్ట్స్ కార్నివాల్–2026లో రాష్ట్ర స్థాయిలో పోటీల్లో యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప జట్టు ప్రతిభ కనబరిచిందని బ్యాంకు రీజనల్ మేనేజర్ ఏ. లక్ష్మి తులసి తెలిపారు. బుధవారం క్రీడాకారులకు అభినందన సభ నిర్వహించారు. ఈ సందర్బంగా ఆమె మాట్లాడుతూ బ్యాంకు సేవల్లో తీరిక లేకుండా ఉండే అధికారులు, సిబ్బందికి క్రీడలు మానసిక ప్రశాంతతను కలుగజేస్తాయన్నారు. బ్యాంకు కార్యకలాపాలతోపాటు క్రీడల్లో కూడా రాణించడం శుభపరిణామమన్నారు. రాష్ట్ర స్థాయి క్రికెట్ టోర్నమెంట్లో కడప యూనియన్ బ్యాంకు జట్టు మూడో స్థానం సాధించిందన్నారు. అలాగే టగ్ ఆఫ్ వార్లో కడప జట్టు రాష్ట్ర చాంపియన్గా నిలించినట్లు చెప్పారు. క్రీడా స్ఫూర్తి, పట్టుదలతో పతకాలు సాధించిన క్రీడాకారులను ఆమె అభినందించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. స్కూల్ వ్యాన్ ఢీ: వ్యక్తికి తీవ్ర గాయలుఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణంలోని కడప రోడ్డులో ప్రైవేట్ స్కూల్ వ్యాన్ ఢీకొని నరసింహులు అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన బుధవారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. పట్టణంలోని శ్రీ గౌతమ్ హైస్కూల్కు చెందిన వ్యాన్ మధ్యాహ్నం విద్యార్థులతో కడప రోడ్డు మార్గలో వెళుతోంది. అదే సమయంలో నల్లింగాయపల్లి గ్రామానికి చెందిన నరసింహులు ద్విచక్రవాహనంలో ఇంటికి వెళుతుండగా వ్యాన్ ఢీకొంది. ఈ ప్రమాదంలో నరసింహులు తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ నుంచి మెరుగైన వైద్యం కోసం కర్నూల్కు తీసుకెళ్లారు. -
బావిలో పడి యువకుడు మృతి
సదుం : ప్రమాదవశాత్తు బావిలో పడి యువకుడు మృతి చెందిన సంఘటన మండలంలో బుధవారం జరగింది. స్థానికుల కథనం మేరకు.. కంభంవారిపల్లె పంచాయతీ గాండ్లపల్లెకు చెందిన మోహన్బాబు (26) వ్యవసాయ పొలం వద్ద మోటర్ మరమ్మతులకు మంగళవారం సాయంత్రం వెళ్లాడు. మరమ్మతులు చేస్తుండగా పక్కనే ఉన్న బావిలో ప్రమాదవశాత్తు పడి మృతిచెందాడు. స్థానికులు ఉదయం గుర్తించి మృతదేహాన్ని వెలికి తీశారు.కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రైలు కిందపడి గుర్తుతెలియని వ్యక్తి...కడప కోటిరెడ్డిసర్కిల్ : జిల్లాలోని భాకరాపేట – ఒంటిమిట్ట రైల్వే స్టేషన్ల మధ్యగల మాధవరం వద్ద బుధవారం సుమారు 40 సంవత్సరాల వయసు గల వ్యక్తి రైలు కిందపడి మృతి చెందాడని రైల్వే పోలీసులు తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి ఆచూకీ, మృతికి గల కారణాలపై విచారణ చేస్తున్నామన్నారు. మృతుడు సిమెంట్ కలర్ ఫుల్ షర్టు, నల్ల లుంగీ ధరించి ఉన్నాడన్నారు. మృతుడి ఆచూకీ తెలిసినవారు కడప రైల్వే పోలీసులు 9247575623, 9247575624 నంబర్లకు తెలియజేయాలన్నారు. -
నెలవంక కోసం.. ఆకాశం వంక
మదనపల్లె సిటీ : రోజంతా కఠిన ఉపవాసం.. దైవంపైనే మనసు లగ్నం.. పవిత్ర ఖురాన్ పఠనం, శ్రవణం..తోటివారిపై ప్రేమ, సోదరభావం, పేదలపై దయ,కరుణ,దాన,ధర్మాలు... ఇలా శుభాల వసంతం రంజాన్ మాసమంతా ముస్లింలు నియమ నిష్టలు.దైవ చింతనతో గడిపారు. నెల రోజుల పాటు సహరీ, ఇఫ్తార్, తరావీ ప్రార్థనల్లో లీనమైన ముస్లింలు గురువారం సాయంత్రం షవ్వాల్ నెలవంక కోసం ఆకాశం వంక వేయికళ్లతో ఎదురు చూస్తారు. ఇఫ్తార్ సమయంలో పేలే బాణాసంచా మందు భానుడు పశ్చిమ సంద్రంలో మునిగే సమయంలో అందరి చూపు ఆశాశం వైపే ఉంటుంది. ఆకాశంలో నీలిమేఘాల మాటు నుంచి మబ్బు తెరలు తొలగించుకుని అరసున్న ఆకారంలో కనిపంచే షవ్వాల్ నెల వంక కోసం అందరూ వెతుకుతారు. నీటిమేఘాల మాటు నుంచి అరుణాచల కాంతులతో వెలిగే అర్థ ఆకార చంద్రుడు..కనిపించగానే అందరితో పూర్ణానందం వెల్లిరిస్తుంది. ‘ఈద్ కా చాంద్ నజర్ ఆగయా...సబ్ కో ఈద్ ముబారక్ అంటూ ఒకరినొకరు అలింగనం చేసుకుని, ఈద్ శుభాకాంక్షలు తెలుపుకుంటారు. అంబరాన్నంటే సంబరాలు చేసుకుంటారు. ఈద్గా, మసీదులు ముస్తాబు ఈద్ ప్రార్థనలు కోసం జిల్లాలోని మదనపల్లె, రాయచోటి, రాజంపేట, రైల్వేకోడూరు, పీలేరు, వాల్మీకిపురం, గుర్రంకొండ, బి.కొత్తకోట ప్రాంతాల్లోని ఈద్గాలు, మసీదులు ముస్తాబవుతున్నాయి. మరో వైపు ముస్లింలు సోదరులు ఇంటిల్లిపాది కొత్తగా కొనుగోలు చేసిన దుస్తులను చూసి మురిసిపోతున్నారు. ఆడపడుచులు బిరియానీ మసాలాల తయారీలో లీనవుతున్నారు. చిన్నారులు తమ చేతులను మెహందీలతో అలంకరించుకుంటున్నారు. నెలవంక దర్శనంతోనే నిర్ణయం షాబాన్ నెల 30వ రోజున రంజాన్ నెలవంక దర్శనంతో ఉపవాసదీక్షను ప్రారంభించడం, 30 రోజుల అనంతరం షవ్వాల్ నెలవంక దర్శనంతో ఉపవాసదీక్షలను ముగించి ఈదుల్ఫితర్ పండుగను జరుపుకోవడంలోనూ నెలవంక దర్శనమే కీలకం, చాలా సందర్భాల్లో రంజాన్ నెల వంక వాతావరణ ప్రభావంతో కనిపించనప్పుడు మతగురువులు ముఖ్యంగా ప్రభుత్వ సర్ఖాజీలు,హాఫీజ్సాహెబ్ సమావేశమై రాష్ట్రంతో పాటు పొరుగు రాష్ట్రాల ముఫ్తీలు, హిలాల కమిటీలతో సమన్వయం చేసుకుని చంద్రుని దర్శన సమాచారం తెప్పించుకుంటారు. వారి నిర్ణయంతోనే రంజాన్ పండుగ నిర్ణయిస్తారు. గురువారం నెలవంక దర్శనమైతే శుక్రవారం పండుగ జరుపుకుంటారు. లైలతుల్ జాయెజా పవిత్ర రంజాన్ మాసం ముగింపు సందర్భంగా షవ్వాల్ నెలవంక దర్శనం అనంతరం ఆ రోజు రాత్రిని లైలతుల్ జాయోజాగా వ్యవహరిస్తారు. మసీదులలో ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. మసీదుల్లో ముస్లింలు ఎక్కువ సంఖ్యలో చేరి దైవ ప్రార్థనలు చేస్తారు. ఎక్కువ సమయం దివ్యఖురాన్ పారాయణం, శ్రవణంతో గడుపుతారు. -
దుఃఖాన్ని దిగమింగి పరీక్షకు..
పరీక్ష రాయడానికి వెళుతున్న విద్యార్థిని కోమలతండ్రి మృతదేహం వద్ద విలపిస్తున్న కోమలరామసముద్రం : ఓ వైపు పదోతరగతి పరీక్షలు ప్రారంభం.. మరోవైపు తండ్రి మరణంతో పుట్టెడు దుఃఖంలోనూ విద్యార్థిని పరీక్ష రాసిన ఘటన రామసముద్రంలో చోటుచేసుకుంది. వివరాలు.. రామసముద్రం కరుణాల వీధికి చెందిన పార్లపల్లి శ్రీనివాసులు (45) గత కొంత కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నాడు. ఇటివల అనారోగ్యం ఎక్కువ కావడంతో బెంగళూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. శ్రీనివాసులుకు ఇద్దరు కుమార్తెలు. రెండో అమ్మాయి కోమల ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం చదువుతోంది. ఈ నేపథ్యంలో బుధవారం కెమిస్ట్రీ పరీక్ష ఉంది. తండ్రి మృతదేహం ఇంటి వద్ద ఉండగా ఆ బాలిక పరీక్షకు హాజరైంది. విషాదంలోనూ ధైర్యంగా పరీక్ష రాసిన కోమలపై అధ్యాపకులు, సహా విద్యార్థులు, స్థానికులు సానుభూతి వ్యక్తం చేశారు. బాలిక పరీక్ష పూర్తయ్యాక కుటుంబ సభ్యులు అంత్యక్రియలు నిర్వహించారు. ఈ విషయం స్థానికులను. ఎంతగానో కలిచివేసింది. -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్ : వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యకు యత్నించారు. పోలీసుల కథనం మేరకు.. కలికిరి మండలం, మంచూరుకు చెందిన శివశంకర్(40) ప్రైవేట్ వాహన డ్రైవర్ గా పనిచేస్తాడు. మూడు రోజుల క్రితం శివశంకర్తో గొడవపడి గీత పుట్టినిల్లు అయిన చౌడేపల్లెకు అలిగి వచ్చేసింది. దీంతో భర్త భార్యను కాపురానికి పిలవడానికి అత్తగారి ఇళ్లు అయిన చౌడేపల్లెకు మంగళవారం వచ్చాడు. అక్కడ ఏం జరిగిందో ఏమో పురుగుల మందు తాగాడు.. గమనించిన స్థానికులు చౌడేపల్లి 108 సమాచారం అందించడంతో వారు అతన్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం వైద్యులు అతనికి మెరుగైన వైద్యం అందించి, ఆరోగ్యం కుదుట పడకపోవడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్చేశారు. ఘటనపై చౌడేపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ● మరో ఘటనలో అనంతపురం జిల్లా, పెనుగొండకు చెందిన జేసీబీ డ్రైవర్ వి.గణేష్(23) మదనపల్లెకు వచ్చి స్థానిక నీరుగట్టువారిపల్లె సమీపంలోని అమ్మచెరువుమిట్ట డౌన్ లో పురుగుల మందు తాగాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో వారు బాధితున్ని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి వైద్యం అందించారు. అయితే అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని ఆస్పత్రి సిబ్బంది కుటుంబీకుల సమాచారం అందించారు. వారు ఎంతకూ రాకపోవడంతో ఆస్పత్రిలోనే అడ్మిట్ చేశారు. వన్ టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● మదనపల్లె పట్టణం, నిమ్మనపల్లె క్రాస్ రోడ్డులో నివశిస్తున్న నాగేంద్ర(43), క్రాస్ రోడ్లు చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. కుటుంబ సమస్యల కారణంగా తాను ఉంటున్న ఇంట్లోనే తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నంకు పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని డాక్టర్లు రుయారు రెఫర్ చేశారు. పై మూడు ఘటనలపై పోలీసులు విచారణ చేస్తున్నారు. -
వేలంలో పంచాయతీకి రూ.18 లక్షల ఆదాయం
సదుం : స్థానిక పంచాయతీ వనరులకు బుధవారం బహిరంగ వేలం నిర్వహించారు. ఇందులో వారపుసంతను మనోజ్కుమార్ రూ.16.30 లక్షలకు దక్కించుకున్నారు. అలాగే దినసరి మార్కెట్ రూ.60, 500, ప్రైవేట్ బస్టాండు రూ.68 వేలు, పూలమార్కెట్ రూ.73, 500, జంతువధ శాల రూ.4 వేలు పలికాయి. గతేడాది కంటే సుమరు రూ.6 లక్షల అదనపు ఆదాయం వచ్చినట్లు అధికారులు తెలిపారు. కార్యక్రమంలో జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఎంపీడీఓ రాధారాణి, ఎస్ఐ విష్ణునారాయణ, సర్పంచ్ ఉషారాణి, వైస్ సర్పంచ్ బాబు రెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజు, పీడీఓ చలపతి పాల్గొన్నారు. -
రూ.1.54 కోట్ల విలుబైన సెల్ ఫోన్లు రికవరీ
మదనపల్లెటౌన్ : సెల్ ఫోన్ పోయిందంటే ఇక రాదు అనే పాత నమ్మకాన్ని చెరిపేస్తూ, అన్నమయ్య జిల్లా పోలీసులు అత్యాధునిక సాంకేతికతను వినియోగించుకుని ఒకే విడతలో రూ.1.54 కోట్లకు పైగా విలువచేసే 716 సెల్ ఫోన్లను రికవరీచేశారు. బుధవారం జిల్లా కేంద్రం మదనపల్లెలో జరిగిన తొమ్మిదో విడత సెల్ ఫోన్ల రికవరి మేళాలో బాధితులకు కర్నూల్ రేంజి డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు కలిసి బాధితులకు ఫోన్లను అందజేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. ఇప్పటి వరకు అన్నమయ్య జిల్లాలో రూ.6.20 కోట్ల విలువైన 2,953 సెల్ ఫోన్లను రికవవరీ చేసి ప్రజలకు అప్పగించినట్లు చెప్పారు.సెల్ పోన్లను రికవరీ చేయడంలో ప్రతిభ కనబరచిన క్రైం సిఐ మహమ్మద్ అలీ, ఛంద్రశేఖర్ వారి సిబ్బందిని అభినందించారు. ● జిల్లా ఎస్పీ ధరజ్ కునుబిల్లి మాట్లాడుతూ.. ఫోన్ పోతే పోలీస్ స్టేషన్కు రానవసరం లేదన్నారు. కేవలం 86888 30012 వాట్సాప్ నంబర్కు హాయ్ అని మేసేజ్ పంపితే మీరు పోగొట్టుకున్న ఫోన్ను మేమే వెతికిస్తామని తెలిపారు. ఈ సేవలకు ఎవరైనా డబ్బు అడిగితే ఇవ్వొద్దని, సేవలన్నీ పూర్తిగా ఉచితమని చెప్పారు. ● వాట్సాప్ ద్వారా 8688830012 కుమెసేజ్ పంపి వివరాలు నమోదు చేయాలని జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. ఆన్ లైన్ ద్వారా అయితే www.ceir.gov.in వెబ్సైట్లో మీ ఫోన్ను వెంటనే బ్లాక్ చేయాలన్నారు. -
హోటల్ అద్దె చెల్లించకుండా దౌర్జన్యం
భవన యజయాని ఆవేదనమదనపల్లె అర్బన్ : ‘ఏళ్లు గడుస్తున్నా.. హోటల్ అద్దె బకాయిలు చెల్లించకుండా పార్టీని అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేస్తున్నాడు’ అంటూ ఓ భవన యజమాని ఆవేదన వ్యక్తం చేశాడు. స్థానిక ప్రెస్క్లబ్లో మంగళవారం ఏర్పాటు చేసిన సమావేశంలో భవన యజమాని సుధాకర్రెడ్డి మాట్లాడారు. జనసేన ఏపీఐఐసీ డైరెక్టర్ మైఫోర్స్ మహేష్ కొంత కాలంగా గొల్లపల్లె బైపాస్ రోడ్డులోని తన భవనంలో హోటల్ నిర్వహిస్తున్నాడన్నారు. అగ్రిమెంట్ ప్రకారం నెలనెలా అద్దె చెల్లించాల్సి ఉందన్నారు. అయితే ఆరేళ్లు గడుస్తున్నా.. ఇంత వరకు అద్దె చెల్లించలేదన్నారు. దీంతో బకాయిల మొత్తం రూ.45 లక్షలకు చేరిందన్నారు. అద్దె అడిగిన ప్రతి సారి గొడవ చేస్తూ.. బెదిరిస్తున్నాడని వాపోయాడు. ముఖ్యంగా పార్టీని అడ్డుపెట్టుకుని దౌర్జన్యం చేస్తుండటంతో ఇటీవల పోలీసులకు ఫిర్యాదు చేశానన్నారు. పైగా న్యాయం కోరుతూ కోర్టును ఆశ్రయించినట్లు వివరించారు. అప్పు తీసుకుని ఇవ్వడం లేదు సీటీఎం రోడ్డుకు చెందిన ఆర్టీసీ మహిళా కండెక్టర్ రూప మాట్లాడుతూ మైఫోర్స్ మహేష్ కుటుంబ సభ్యులు తనను మోసం చేశారని వాపోయింది. పదేళ్ల కిందట మహేష్, అతని తల్లి ఆర్టీసీ కండెక్టర్ లక్ష్మీదేవి, సోదరుడు ఉమేష్ తన వద్ద రూ.18 లక్షలు తీసుకున్నారని చెప్పింది. వ్యాపారాల కోసం డబ్బు తీసుకుని అసలు, వడ్డీ చెల్లించకుండా కాలయాపన చేస్తున్నారని వివరించింది. పైగా తన పేరిట ఆస్తి రాసిస్తామని నమ్మించి మోసం చేశారని ఆవేదన వ్యక్తం చేసింది. డబ్బు చెల్లింపు, ఆస్తి రాసివ్వకపోగా.. చివరికి చంపుతామనే స్థాయికి దిగజారారంటూ కన్నీటి పర్యంతమైంది. ముఖ్యంగా తల్లీకొడుకుల నుంచి తనకు ప్రాణహాని ఉందని ఆరోపించింది. సీఎం, డిప్యూటీ సీఎంలతో తనకు సంబంధాలు ఉన్నాయని, తాను తలచుకుంటే నిన్ను అడ్రస్ లేకుండా చేస్తానంటూ మైఫోర్స్ మహేష్ బెదిరిస్తున్నాడని వాపోయింది. అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలంటూ బాధితురాలు విన్నవించింది. -
దోషులను వదిలి బాధితులపై కేసులా?
● టీటీడీ చైర్మన్ను తొలగించాలి ● మదనపల్లెలో వైఎస్సార్సీపీ నిరసన మదనపల్లె : టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు అనైతిక చర్యలను నిరసిస్తూ శాంతియుత నిరసన చేస్తున్న వైఎస్సార్సీపీ శ్రేణులపై దాడి చేసిన దోషులైన టీడీపీ నేతలను వదిలిపెట్టి బాధితులైన వైఎస్సార్సీపీ నేతలపై అక్రమ కేసులు పెట్టడం ఏ రాజ్యాంగ ధర్మమని వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. మంగళవారం స్థానిక గోళ్లపల్లె రోడ్డులోని అంబేడ్కర్ విగ్రహానికి పార్టీ శ్రేణులతో కలిసి వినతిపత్రం అందజేసి, నోటికి నల్ల రిబ్బన్లు కట్టుకుని నిరసన వ్యక్తం చేశారు. కూటమి పాలనకు, టీటీడీ చైర్మన్కు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ నాయుడు మొదటి నుంచి వివాదాస్పదంగా ప్రవర్తిస్తున్నారని అన్నారు. తిరుమల పవిత్రత దెబ్బతిసేలా వ్యవహరిస్తున్న ఆయన చైర్మన్ పదవికి అనర్హుడని, తక్షణమే తొలగించాలని డిమాండ్ చేశారు. పౌరుల హక్కులను కాలరాసేలా కూటమి పాలకులు వ్యవహరిస్తున్నారని విమర్శించారు. కూటమి పాలన మొదలైనప్పటి నుంచే ప్రతిపక్ష నేతలు, కార్యకర్తలపై అక్రమ కేసులు, దాడులు, వేధింపులతో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని అన్నారు. ఇలాంటి చర్యలను ప్రజాస్వామిక వాదులు ఖండించాలని పేర్కొన్నారు. నిరసన తెలపడం తప్పా? మున్సిపల్ చైర్మన్ మనూజ మాట్లాడుతూ శాంతియుతంగా నిరసన తెలపడం ప్రజాస్వామ్యం కాదా అని ప్రశ్నించారు. పాలకవర్గ చర్యలను ప్రశ్నించడం, ఖండించడం తప్పా అని నిలదీశారు. నిరసన వ్యక్తం చేస్తే దాడులు చేయిస్తూ, అక్రమ కేసులు బనాయించడం తగదన్నారు. సంక్షేమం, అభివృద్ధిపై ప్రభుత్వం దృష్టి పెట్టాలని కోరారు. కార్యక్రమంలో కౌన్సిలర్లు శ్రీనివాసులు, ప్రసాద్బాబు, ఈశ్వర్నాయక్, కోఆప్షన్ సభ్యులు శారదరెడ్డి, పార్టీ నేతలు హర్షవర్దన్రెడ్డి, వీఎస్ రెడ్డి, రఘనాథరెడ్డి, మల్లికార్జున, శీలం రమేష్, రేవతి, సుధాకర్, షాజహాన్ఽ బేగం, గౌసియా, నాగమణి, లలితమ్మ, నరసింహులు, మంజుల, శంకర్నాయక్, మహేష్, శ్రీకాంత్, చలపతి, చరణ్, చెన్నకృష్ణ, పవన్తేజ, నూర్, జబీవుల్లా, వెంకటేష్యాదవ్, రమణ పాల్గొన్నారు. -
సైబర్ నేరగాళ్ల ఉచ్చులో పడకండి
మదనపల్లె టౌన్ : సైబర్ నేరగాళ్ల ఉచ్చులో ప్రజలు పడవద్దని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ మేరకు ఆయన మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. కొత్త సాంకేతికతతో సైబర్ నేరగాళ్లు పుంతలు తొక్కుతున్నారన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉంటేనే తన కష్టార్జితాన్ని కాపాడుకోగలరని తెలిపారు. నేటి డిజిటల్ యుగంలో ఆన్లైన్ వేదికగా జరుగుతున్న అక్రమాలను దృష్టిలో ఉంచుకుని హెచ్చరించడం జరుగుతోందన్నారు. వాట్సప్, ఎస్ఎంఎస్ ద్వారా వచ్చే తెలియని లింకులు పొరపాటున కూడా ఓపెన్ చేయరాదన్నారు. అలాగే ఓటిపి, బ్యాంకు వివరాలు, పిన్ నంబర్లు ఎవరికీ చెప్పకూడడదని పేర్కొన్నారు. సైబర్ మోసానికి గురైతే ఏమి చేయాలి ఆన్లైన్ మోసానికి గురైతే ఏమాత్రం ఆలస్యం చేయకూడదన్నారు. ఆర్థిక పరమైన సైబర్ నేరం జరిగిన వెంటనే టోల్ ఫ్రీ నంబర్ 1930కు ఫిర్యాదు చేయాలని పేర్కొన్నారు. మోసం జరిగిన మొదటి గంట అత్యంత కీలకం అన్నారు. వెంటనే పోయిన డబ్బును ఫ్రీజ్ చేసి తిరిగి పొందే అవకాశం ఉంటుందని తెలిపారు. నేరుగా www.cybercrime.gov.in వెబ్సైట్లో కూడా ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఫిర్యాదు చేసేటప్పుడు ఉండాల్సిన వివరాలు ట్రాన్షక్షన్ ఐడీ, తేదీ, మోసగాళ్ల ఫోన్ నంబర్లు, ఖాతా వివరాలు ఉండాలని తెలిపారు. అలాగే చాటింగ్ స్క్రీన్ షాట్లు, వచ్చిన సందేశాల వివరాలను పొందుపరచాలని పేర్కొన్నారు. సైబర్ నేరగాళ్లు మీ అమామకత్వాన్ని, ఆశను పెట్టుబడిగా మార్చుకుంటారని తగు జాగ్రత్తలతో మెలగాలని ఎస్పీ వివరించారు. -
పేదల హక్కు.. ఫిత్రా, జకాత్
● రంజాన్ మాసంలో దాన,ధర్మాలకు అధిక ప్రాధాన్యం ● ఈ ఏడాది ఫిత్రా రూ.100గా ఖరారు మదనపల్లె సిటీ : ధనికులతో సమానంగా... పేదవర్గాలు కూడా జీవనం గడపాలి. ప్రత్యేకంగా పవిత్ర రంజాన్ను ఎలాంటి ఆర్థికపరమైన లోటుపాట్లు లేకుండా జరుపుకోవాలి. ఇది ఇస్లాం తత్వం. సమానత్వంతో కూడిన జీవనాన్ని నిర్దేశిస్తోంది. ధాన, ధర్మాలు, ధార్మిక సత్కార్యాలకు రంజాన్ మాసం అధిక ప్రాధాన్యత ఇస్తోంది. ఫిత్రా అంటే.. రంజాన్ మాసంలో జకాత్, ఫిత్రా ఇస్తారు. ఫిత్రా అనే పదానికి అర్థం తనతోపాటు ఇతరులకు సంతోషాన్ని ఇవ్వడం. ఈ నేపథ్యంలో ప్రతి వ్యక్తి పేదలకు దానం చేయాలని ఇస్లాం ఆదేశించింది. ఒక కుటుంబంలో ఎంత మంది కుటుంబ సభ్యులు ఉన్నా.. అందరి పేరిట పేదలకు దానం చేయాలని సూచించింది. రంజాన్ రోజున ప్రత్యేక నమాజు ఆచరించక ముందే ఫిత్రా చెల్లించాలంటూ ఆదేశించింది. ఇది ఒక విధిగా నిర్దేశించింది. దానం విధిగా మారడానికి హదీసులో ఇలా ఉంది. ఉపవాసి చిన్న చిన్న పొరపాట్లను దూరం చేయడానికి, పేదవారు కూడా అందరితో కలిసి పండుగను ఘనంగా జరుపుకోవడానికి దానం ఉపయోగపడుతుంది. ఏ రూపంలో చెల్లించాలి సాధారణ స్థితిలో ఉన్న ప్రతి ముస్లిం 1750 గ్రాముల గోధుములు లేకుంటే అంత సమానమైన డబ్బును పేదలకు దానం చేయడమే ఫిత్రా. ఈ ఏడాది మార్కెట్ ధరలకు అనుగుణంగా పెద్దలు రూ.100 ఖరారు చేశారు. అలాగే జావ 3.5 కేజీలు లేదా రూ.245 ఖర్జూరం, 3.5 కిలోలు లేదా రూ.1050 కూడా చెల్లించవచ్చు. 52.50 గ్రాముల వెండి లేదా 75 గ్రాముల బంగారం లేదా అంత విలువైన ధన,ఆస్తులు కలిగి వుండే ప్రతి ముస్లిం జకాత్కు అర్హుడు. తమ సొమ్మును లెక్కకట్టి అందులో నుంచి 2.5 శాతం పేదలకు పంచాలి. 70 రెట్ల పుణ్యం కల్మా, నమాజ్, రోజా, జకాత్, హజ్ అనేవి ఇస్లాంకు అల్లాహ్ రక్షించడమే కాకుండా వృద్ధి చేస్తారని మౌల్వీలు చెబుతున్నారు. సాధారణ రోజుల్లో కంటే రంజాన్ మాసంలో జకాత్ ఇచ్చే వారికి 70 రెట్ల పుణ్యం అధికంగా లభిస్తుందని, పరలోకంలోనూ లాభం చేకూరుతుందని ముస్లింల ప్రగాఢ విశ్వాసం. జకాత్ ఇవ్వడం వల్ల సమాజంలో ఆర్థిక అసమానతులు తొలగిపోతాయి. జకాత్ ఇవ్వని, రోజా ఉండని వ్యక్తిలో వ్యాపార ఆలోచన ఏర్పడుతుందని, తన లాభం చూసుకొని ఇతరుల బాధలు పట్టించుకోరని, ఇది ఇస్లాంకు వ్యతిరేకమని మౌల్వీలు చెబుతున్నారు. ఎవరు.. ఎవరికి చెల్లించాలి ధనవంతులు కాకపోయినా, కనీస ఆదాయ వనరులు ఉన్న వారు సైతం తమ కంటే పేద వారికి ఫిత్రా చెల్లించాలి. పండుగ నమాజుకు ముందుగా ఇంట్లో సంతానం కలిగితే శిశువు పేరు మీద కూడా దానం చేయాలి. పేద వర్గాలకే కాకుండా పేద విద్యార్థులు చదువుకునే మదర్సాలకు సైతం సమకూర్చవచ్చు. ఫిత్రా దానాన్ని ప్రతి ముస్లిం పాటించాలంటూ ఇస్లాం నిర్దేశించింది. ఉపవాసదీక్ష సమయంలో దీక్షా పరుని చెడు తలంపు, చెడు ఆలోచనలు, నోటి నుంచి వెలువడే అసత్యాలు, వంటి పొరపాట్లన్నీ క్షమార్హం అవుతాయంటూ మహ్మద్ ప్రవక్త (సల్లెల్లాహు అలైహివ సల్లం) చెప్పారు. – హాఫీస్ ఇక్బాల్ అహ్మద్, మతగురువు, మదనపల్లె రంజాన్ మాసంలో ప్రతి ముస్లిం జకాత్, ఫిత్రా ఇవ్వడం తప్పనిసరి. ఇస్లాంలో జకాత్ ఇవ్వడం కచ్చితమైనది. పంచ నియమాల్లో ఇది ఒకటి. దీనివల్ల అల్లాహ్ వారి ఆరోగ్యాలను కాపాడటంతోపాటు సిరిసంపదను వృద్ధి చేస్తారు. – పి.మమమ్మద్ఖాన్, మదనపల్లె -
నిరంకుశ ప్రభుత్వాన్ని సాగనంపాలి
● మళ్లీ జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలి ● మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వాల్మీకిపురం : నిరంకుశ అవినీతి పాలన అంతం కోసం ప్రజలందరూ ఏకం కావాలని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ దుష్ట పాలన నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలని పేర్కొన్నారు. పేద, బడుగు, బలహీన వర్గాలకు సంక్షేమ పథకాలు అందాలన్నా, రాష్ట్రం అభివృద్ధి పథంలో నడవాలన్నా 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ ముఖ్యమంత్రి కావాల్సిన అవసరం ఎంతైనా ఉందని స్పష్టం చేశారు. సంపద సృష్టించామని చంద్రబాబు ప్రభుత్వం బాకా ఊది చెబుతుంటే, ఆ సంపద తెలుగుదేశం పార్టీ నాయకుల జేబుల్లోకి చేరడం తప్ప ప్రజలకు ఒరిగింది శూన్యమన్నారు. ఎన్నో అబద్ధపు హామీలతో గద్దెనెక్కిన కూటమి నేతలు ఒక్క హామీని అమలు చేయకుండా ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారన్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రాష్ట్ర ప్రజలందరికీ అభివృద్ధి, సంక్షేమ ఫలాలు పార్టీలకతీతంగా అందించిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికే దక్కిందన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ప్రజలంతా సుభిక్షంగా ఉన్నారని, కష్టకాలంలో ప్రజలను అన్ని విధాలా ఆదుకున్న విషయాన్ని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి ఎక్కడికి వెళ్లినా లక్షలాది మంది ప్రజలు ఆయన వెంట వస్తున్నారని, ప్రజల్లో ఆయనుకున్న అభిమానం అలాంటిదన్నారు. అభివృద్ధి, సంక్షేమం రెండు కళ్లుగా వైఎస్ జగన్ పాలన సాగించారని తెలిపారు. జగనన్న పిలుపు మేరకు గ్రామాల్లో వైఎస్సార్సీపీ కమిటీలను ఏర్పాటు చేస్తున్నామని, కూటమి ప్రభుత్వ అరాచక పాలనను ప్రజల్లోకి తీసుకెళ్లాలని వైఎస్సార్సీపీ శ్రేణులకు సూచించారు. తద్వారా వచ్చే ఎన్నికల్లో ప్రజలే చంద్రబాబుకు బుద్ధి చెబుతారన్నారు. మనమంతా సమష్టిగా కృషి చేసి జగనన్నను ముఖ్యమంత్రిని చేసుకోవాలని, కష్టపడి పని చేసిన ప్రతి కార్యకర్తకు ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో నాయకులు నీళ్లభాస్కర్, కేశవరెడ్డి, శివారెడ్డి, సుధాకర్రెడ్డి, ద్వారకనాథరెడ్డి, రఘు, గోపాల్, మునిభాస్కర్, నాగరాజ, శ్రీనివాసులు, మధు, సిద్దారెడ్డి, ప్రభాకర్రెడ్డి, చలపతి తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని జింక మృతి
పెద్దతిప్పసముద్రం : స్థానిక బి.కొత్తకోట రోడ్డులోని పెద్దలైన్ సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని జింక మృతి చెందింది. ఈ విషయాన్ని ఎస్ఐ పరమేశ్ నాయక్ అటవీ శాఖ అధికారులకు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. వేసవి కారణంగా దాహం తీర్చుకునేందుకు వన్యప్రాణులు అటవీ ప్రాంతం నుంచి బయటికి వచ్చి రోడ్డు ప్రమాదాల్లో మృత్యువాత పడుతున్నాయి. ఈ జింక కూడా అలాగే మృతి చెందినట్లు తెలుస్తోంది. ఫారెస్ట్ అధికారులు మూగజీవాల గొంతు తడిపేందుకు అటవీ ప్రాంతాల్లో నీటి సౌకర్యం కల్పించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. రోడ్డు ప్రమాదంలో విద్యార్థికి తీవ్ర గాయాలు మదనపల్లెటౌన్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థి తీవ్రంగా గాయపడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, సింగిరి గుంటకు చెందిన రైతు చిట్టిబాబు కొడుకు రివి (13) చౌడేపల్లిలో 8వ తరతగతి చదువుతున్నాడు. రవికి జ్వరం వస్తుండడంతో తన తండ్రి వద్ద బైకు తీసుకుని చికిత్స కోసం చౌడేపల్లెకు వచ్చాడు. తిరిగి బైకులో ఇంటికి బయలుదేరాడు. స్కూటర్ మార్గ మద్యంలోని గుడి వద్ద ఏర్పాటు చేసిన స్పీడు బ్రేకర్ పై వెళ్లి అదుపు తప్పి పడడంతో తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న కుటుంబీకులు వెంటనే వచ్చి బాధితున్ని చికిత్సల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. పోరుమామిళ్ల పోస్టాఫీసులో చోరీ పోరుమామిళ్ల : పోరుమామిళ్ల పోస్టాఫీసులో రెండు లక్షలకు పైగా నగదు చోరీకి గురైంది. ఎస్ఐ హనుమంతు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. తలుపులు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు నగదు అపహరించారు. మంగళవారం ఉదయం పోస్టాఫీసు సిబ్బంది తలుపులు తెరచి ఉండటం గమనించి లోపల పరిశీలించారు. నగదు చోరీ జరిగినట్లు వారు గమనించి సమాచారం పోలీసులకు తెలిపారు. వెంటనే ఎస్ఐ హనుమంతు సిబ్బందితో వచ్చి పరిశీలించారు. పోస్టుమాస్టర్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. టిప్పర్ కింద పడి వ్యక్తి దుర్మరణం లింగాల : మండల పరిధి బోనాల గ్రామంలో మంగళవారం మధ్యాహ్నం టిప్పర్ కింద పడి దస్తగిరి (40) అనే వ్యక్తి దుర్మరణం చెందాడు. వివరాలలోకి వెళితే.. బోనాల నుంచి పొలాలకు టిప్పర్ల ద్వారా మట్టిని తరలిస్తున్నారు. ఈ క్రమంలో దస్తగిరి తన టిప్పర్కు మట్టి లోడు పోయించుకునేందుకు టిప్పర్ నుంచి దిగి మట్టిని లోడు చేయిస్తుండగా.. మరో టిప్పర్ రివర్స్లో వచ్చి వెనుక ఉన్న దస్తగిరిపై వెనుక టైర్లు ఎక్కాయి. దీంతో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. దస్తగిరి స్వగ్రామం వేముల మండలం చింతలజూటూరు. దస్తగిరి మృతదేహాన్ని పులివెందుల ప్రభుత్వాసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. -
భక్తిశ్రద్ధలతో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం
వాల్మీకిపురం: వాల్మీకిపురం పట్టాభిరామాలయంలో మంగళవారం టీటీడీ ఆధ్వర్యంలో కోయిల్ ఆళ్వార్ తిరుమంజనం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. పట్టాభిరాముడి బ్రహ్మోత్సవాలకు ముందు జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యంగా ఆలయ గర్భగుడి మొదలు పరిసరాలు, రాముడి బ్రహ్మ రథానికి సుగంధ ద్రవ్యాలతో శుద్ధి కార్యక్రమాలు నిర్వహించారు. అనంతరం ఆలయంలో మూలవర్లకు అభిషేకం, అర్చన, తోమాలసేవలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, అర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించినట్లు ఆలయ టీటీడీ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. ఫిబ్రవరి 13 నుంచి మార్చి 17 వరకు స్వామి వారి భక్తులు వేసిన కానుకలను టీటీడీ పరకామణి అధికారులు, సిబ్బంది లెక్కించారు. ఈ లెక్కింపులో స్వామి వారి హుండీ ఆదాయం 7 లక్షల 72 వేల, 502 రూపాయలు వచ్చినట్లు ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ స్పష్టం చేశారు. -
ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్య
లింగాల : మండల పరిధి కోమన్నూతల గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన మహిళ సోమవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ జగదీశ్వరరెడ్డి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. లింగాల మండలం బోనాల గ్రామానికి చెందిన జ్యోష్న (24), కోమన్నూతల గ్రామంలోని నారప్పగారి వీరబాబు ప్రేమించుకుని ఐదేళ్ల క్రితం వివాహం చేసుకున్నారు. వీరబాబు మద్యానికి బానిసయ్యాడు. కుటుంబ అవసరాలకు కూడా డబ్బులు ఇవ్వకుండా కూలీ పని చేసి సంపాదించిన మొత్తాన్ని మద్యానికి వెచ్చిస్తున్నాడు. దీంతో భార్యాభర్తల మధ్య మనస్పర్థలు పెరిగి తరచూ గొడవలు జరిగేవి. సోమవారం వీరబాబు పులివెందులకు అరటి కాయల లోడు చేసేందుకు వెళ్లాడు. ఆ సమయంలో కూడా ఫోన్ చేసి భార్యతో గొడవకు దిగాడు. దీంతో ఆమె మనస్తాపానికి గురై చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ విషయం గమనించి తోడి కోడలు రోజా ఇంట్లోకి వచ్చి చూడగా, ఉరి వేసుకుని వేలాడుతున్న జ్యోష్నను చూసి కేకలు వేయడంతో చుట్టు పక్కల వారు వచ్చి కాపాడే ప్రయత్నం చేశారు. అయితే జ్యోష్న అప్పటికే మృతి చెందిందని ఎస్ఐ తెలిపారు. జ్యోష్న మృతదేహాన్ని పులివెందుల ఏరియా ఆసుపత్రికి తరలించి మంగళవారం పోస్టుమార్టం నిర్వహించి వారి కుటుంబ సభ్యులకు అప్పగించారు. మృతురాలికి ఇద్దరు కుమారులు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు. -
హత్యాహత్నం కేసులో రెండేళ్లు జైలు
చింతకొమ్మదిన్నె : చింతకొమ్మదిన్నె పోలీసుస్టేషన్ పరిధిలో జరిగిన హత్యాయత్నం కేసులో ముద్దాయి శివప్రశాంత్కు కడప అదనపు అసిస్టెంట్ సెషన్స్ కోర్టు జడ్జి జీసీ ఆసిఫా సుల్తానా రెండేళ్ల సాధారణ జైలు శిక్ష, పది వేల రూపాయల జరిమానా విధించారు. చింతకొమ్మదిన్నె సీఐ బాలమద్దిలేటి తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. 2023 అక్టోబరు 26న సాయంత్రం ఆరు గంటల సమయంలో రోడ్డు క్రిష్ణాపురం గ్రామానికి చెందిన పిల్లనారిగాండ్ల గంగాదేవి కుమారుడు జగదీశ్ సింహాద్రి గ్రామంలోని రోడ్డు పైన హెయిర్ కటింగ్ కోసం వెళ్తుండగా.. కొంత మంది రోడ్డుపై నిలుచొని ఉండి, వారిలో ఒకరు జగదీష్ను ఊరు, పేరు వివరాలు అడిగారు. అలాగే ఎక్కడికి పోతున్నావ్ అని, నా గురించి నీకు తెలియదా అని అడగగా.. తెలియదని జగదీష్ సమాధానం తెలిపి తాను రామ్మోహన్రెడ్డి అంగడి వద్దకు నడుచుకుంటూ పోయేసరికి వెనుక వైపు నుంచి శివప్రశాంత్ స్కూటీలో వచ్చాడు. వచ్చి రావడంతోనే జగదీష్ను ఏరా కొడకా నేను అడిగితే సరిగ్గా సమాధానం చెప్పవా ఇంతకు ముందు ఒకరిని చంపినా, అయినా కూడా నా గురించి తెలియదా అంటూ బెదిరింపులకు దిగాడు. నాకే ఎదురు సమాధానాలు చెప్తావా నిన్ను చంపితే నీకు ఎవరు దిక్కు అని తన వద్ద ఉన్న బీరు బాటిల్తో తలపై కొట్టి వెంటాడి చంపాలనే ఉద్దేశంతో విచక్షణ రహితంగా పొడిచాడు. చుట్టుపక్కల వారు గమనించి అక్కడికి రాగా పారిపోతూ ఎప్పటికై నా నీ చావు నా చేతిలోనే అని బెదిరిస్తూ వెళ్లిపోయాడు. బాధితుడిని కుటుంబ సభ్యులు కడప రిమ్స్ హాస్పిటల్లో చేర్పించి, పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ విషయమై చింతకొమ్మదిన్నె పోలీస్స్టేషన్లో 2023 అక్టోబర్ 31న కేసు నమోదు చేశారు. పోలీసులు విచారణ చేసి నిందితుడు నరసరామయ్యగారిపల్లెకు చెందిన శివప్రశాంత్ అని గుర్తించి, అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరిచారు. కోర్టులో కేసు విచారణ సమయంలో చింతకొమ్మదిన్నె పోలీసులు సాక్షులను ప్రవేశ పెట్టడంతో, అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఒక్కసాం శ్రీనివాసులు సమర్థంగా వాదనలు వినిపించారు. నేరం నిరూపణ కావడంతో కోర్టు వారు ముద్దాయికి రెండు సంవత్సరాల సాధారణ జైలు శిక్ష, 10 వేల రూపాయల జరిమానా విధించారు. నేరం నిరూపించడటంలో దర్యాప్తు అధికారి ఎస్ఐ.శ్రీనివాసులురెడ్డి, కోర్టు మానిటరింగ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, హెడ్ కానిస్టేబుల్ పుల్లయ్య, హోంగార్డు రెడ్డయ్య, కేసు పర్యవేక్షణ చేసిన ప్రస్తుత సీఐ బాల మద్దిలేటిని ఎస్పీ అభినందించారు. -
డిగ్రీల కన్నా ఆవిష్కరణలే విజయానికి మార్గం
కురబలకోట : ఇంజినీరింగ్ విద్య కేవలం తరగతి గదులకే పరిమితం కాకుండా సరికొత్త ఆవిష్కరణలు, వినూత్న ఆలోచనలు వ్యవస్థాపకత కేంద్రంగా అభివృద్ధి చెందాల్సిన అవసరం ఉందని తమిళనాడుకు చెందిన అన్న యూనివర్సిటీ మెకానికల్ విభాగ ప్రొఫెసర్ డాక్టర్ ఎం.సత్య ప్రసాద్ అన్నారు. మంగళవారం అంగళ్లు మిట్స్ యూనివర్సిటీలో ఇంజినీరింగ్ విద్యలో ఆవిష్కరణలు–వ్యాపారోత్పత్తి అభివృద్ధి అంశంపై సాంకేతిక ఉపన్యాస కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ నేటి ఇంజినీరింగ్ విద్యార్థులు డిగ్రీలతో సరిపెట్టుకోకుండా సమాజంలో సంక్లిష్ట సమస్యలకు సాంకేతిక పరిష్కారాన్ని కనుగొనే దిశగా ఆలోచించాలన్నారు. హ్యాక్ధాన్, డిజైన్ థింకింగ్ వంటి వేదికల ద్వారా సృజనాత్మక ఆలోచనలను పెంపొందించుకోవాలన్నారు. అవసరాలకు సరిపోయే విధంగా సాంకేతిక విధానాలను అభివృద్ధి చేయాలన్నారు. కష్టమైన పనిని సులభ సాధ్యం చేయాలన్నారు. అప్పుడే ఇంజినీరింగ్ విద్యకు సార్థకత చేకూరగలదన్నారు. రైలు కింద పడి గుర్తు తెలియని వ్యక్తి మృతి సిద్దవటం : మండలంలోని భాకరాపేట రైల్వేస్టేషన్ సమీపాన ఉన్న మహబూబ్నగర్ గ్రామ పరిసర ప్రాంతంలో గుర్తు తెలియని మగ వ్యక్తి (50) మంగళవారం తెల్లవారుజామున రైలు కింద పడి మృతి చెందినట్లు రైల్వే పోలీసులు తెలిపారు. మృతుడి ముఖం గుర్తు పట్టడానికి వీలు లేని విధంగా గాయాలయ్యాయన్నారు. మృతి చెందిన వ్యక్తి ఆరెంజ్, తెలుపు గళ్ల చొక్కా, లైట్ బ్రౌన్ కలర్ ప్యాంటు ధరించి ఉన్నాడన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి మృతుడి మరణానికి గల కారణాలు, మృతుడి ఆచూకీ గురించి విచారణ చేస్తున్నామన్నారు. మృతుడి ఆచూకీ తెలిసిన వారు కడప రైల్వే సీఐ 9247575623, ఎస్ఐ 9247575624లకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
బడి కోసం.. డోనర్ యాప్
మదనపల్లె సిటీ: ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ప్రవేశపెట్టిన ‘బడి కోసం.. డోనర్ యాప్’ రిజిస్ట్రేషన్ల ప్రక్రియపై ప్రత్యేక దృష్టి సారించాలని సమగ్రశిక్ష అదనపు జిల్లా ప్రాజెక్టు కోఆర్డినేటర్ నున్నా అనూరాధ అధికారులను ఆదేశించారు. మంగళవారం స్థానిక సమగ్రశిక్ష కార్యాలయంలో 30 మండలాల విద్యాశాఖ అధికారులతో ఆమె సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. దాతలు ప్రభుత్వ పాఠశాలలకు సులభంగా విరాళాలు అందించేలా విద్యాశాఖ ఈ యాప్ను రూపొందించిందని తెలిపారు. గతంలో ప్రధానోపాధ్యాయులు సూచించిన 118 అంశాలను ప్రస్తుతం 82 కాంపోనెంట్లుగా కుదించినట్లు వెల్లడించారు. ప్రతి పాఠశాలలో అవసరమైన వసతులపై హె చ్ఎంలు సమగ్ర విశ్లేషణ చేసి, యాప్లో వివరాలు న మోదు చేశారో లేదో ఎంఈఓలు పర్యవేక్షించాలని సూ చించారు. సమగ్రశిక్ష ఈఈ సుధాకర్ పాల్గొన్నారు. -
ఆధునిక సాగుతోనే రైతులకు మేలు
నిమ్మనపల్లె: వ్యవసాయంలో లాభాలు గడించాలంటే రైతులు సంప్రదాయ పద్ధతులను వీడి, ఆధునిక సాగు మెళకువలపై అవగాహన పెంచుకోవాలని మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్ (డీఎం) శ్రీరాములు పిలుపునిచ్చారు. మంగళవారం ఆయన నిమ్మనపల్లె, రెడ్డివారిపల్లె రైతు సేవా కేంద్రాలతో పాటు సహకార సేవా సంఘాన్ని తనిఖీ చేశారు. ఎరువుల విక్రయాలు, పంపిణీ రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. అనంతరం మండల వ్యవసాయ అధికారి మంజులతో కలిసి ‘రైతన్న మీకోసం’ కార్యక్రమ కరపత్రాలను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఈనెల 16, 17, 18 మరియు 23, 24, 25 తేదీలలో అగ్రికల్చర్ అసిస్టెంట్లతో కూడిన సచివాలయ సిబ్బంది ప్రతి ఇంటిని సందర్శించి రైతుల సమాచారాన్ని సేకరిస్తారని తెలిపారు. ప్రతి బృందం రోజుకు 30 క్లస్టర్ల (90 గృహాలు) చొప్పున పర్యటించి రైతులకు ’పంచ సూత్రాల’ అమలుపై అవగాహన కల్పిస్తారు. రసాయన ఎరువులు, పురుగుమందుల వాడకాన్ని తగ్గించి, ప్రకృతి వ్యవసాయం వైపు రైతులను మళ్లించేలా సూచనలు చేస్తారు. ఏపీఏఐఎంఎస్ (APAIMS) యాప్ వినియోగంపై అవగాహన కల్పించడంతో పాటు రైతుల నుంచి ఫిర్యాదులు, సూచనలను స్వీకరిస్తారు. మార్కెట్ ధరలకు అనుగుణంగా లాభదాయకమైన పంటల వైపు రైతులు అడుగులు వేసేలా ప్రోత్సహిస్తారు. ఈ కార్యక్రమంలో వ్యవసాయ శాఖ సహాయకులు, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. మార్క్ ఫెడ్ డీఎం శ్రీరాములు -
చెరువులకు కరువు.. మాఫియాకు లాభం!
అమరావతి: ‘దొంగలు దొంగలు కలిసి ఊర్లు పంచుకున్నట్లు‘ ఉంది రాయచోటి నియోజకవర్గంలోని ప్రస్తుత పరిస్థితి. ప్రకృతి ప్రసాదించిన జలవనరులను కాపాడాల్సిన పాలకులే.. వాటిని అంగడి సరుకుగా మార్చేశారు. అధికార పార్టీ నేతల కన్ను చెరువులపై పడింది.. ఇంకేముంది జేసీబీలు గర్జిస్తున్నాయి, టిప్పర్లు పరుగులు తీస్తున్నాయి. నిబంధనలను తుంగలో తొక్కి, ప్రభుత్వ ఖజానాకు గండి కొడుతూ సాగుతున్న ఈ ’మట్టి’ భాగోతం వెనుక లక్షలాది రూపాయల ముడుపుల పర్వం నడుస్తోంది. జీవో ముసుగులో జిమ్మిక్కులు! రైతులకు మేలు చేయాలనే నెపంతో కూటమి ప్రభుత్వం తెచ్చిన ’ఒండ్రు మట్టి’ జీవో అక్రమార్కులకు వరంగా మారింది. వ్యవసాయ భూములకు తోలాల్సిన మట్టిని, ఇరిగేషన్ అధికారుల అండతో రియల్ ఎస్టేట్ లేఅవుట్లకు తరలిస్తున్నారు. క్యూబిక్ మీటరుకు రూపాయి చొప్పున నామమాత్రపు చలానా కట్టించి, వేల రూపాయల విలువ చేసే గ్రావెల్ను అక్రమంగా తరలిస్తున్నారు. ఇందుకోసం సంబంధిత శాఖల అధికారులకు భారీగా ముడుపులు అందుతున్నాయన్న ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. హద్దులు చెరిపేసి.. అక్రమ లేఅవుట్లుగా మార్చేసి! కడప–చిత్తూరు జాతీయ రహదారి వెంబడి ఉన్న చెరువులే లక్ష్యంగా ఈ దోపిడీ సాగుతోంది. లాభం చెరువు: సంబేపల్లి మండలం నారాయణరెడ్డిపల్లి జగనన్న కాలనీ మార్గంలో ఉన్న ఈ చెరువులో గత వారం రోజులుగా జేసీబీలతో భారీ గోతులు తీసి మట్టిని తరలిస్తున్నారు. దౌలత్ ఖాన్ చెరువు: జాతీయ రహదారిని ఆనుకుని ఉన్న ఈ చెరువు వెనుక భాగాన్ని ఇప్పటికే ఆక్రమించి, మట్టితో చదును చేసి లేఅవుట్లుగా మారుస్తున్నారు. ఇతర ప్రాంతాలు: రామాపురం, గాలివీడు, కలకడ, పీలేరు మండలాల సరిహద్దుల్లోని కుంటలు, వాగుల ను వదలకుండా మట్టి మాఫియా చెలరేగుతోంది. అధికారుల మౌనం.. ప్రజల ఆవేదన! అధికార పార్టీ ఒత్తిళ్లకు తలొగ్గి అధికారులు మౌనం వహించడంపై స్థానిక రైతులు మండిపడుతున్నారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్ గారు స్పందించి, క్షేత్రస్థాయిలో విచారణ జరిపి చెరువులను కాపాడాలని, ప్రభుత్వ ఆదాయాన్ని దోచుకుంటున్న మాఫియాపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. సంబేపల్లి మండలం లాభం చెరువు, దౌలత్ ఖాన్ చెరువులో మట్టి తవ్వకాలు రాయచోటిలో అడ్డూఅదుపు లేనిమట్టి దోపిడీ ఒండ్రు మట్టి ముసుగులో ‘గ్రావెల్’ దందా కూటమి నేతల అండ..అధికారుల ‘మామూళ్ల’ దండ! నారాయణరెడ్డిపల్లి, దౌలత్ ఖాన్చెరువుల ఉనికికే ముప్పు పగలు, రాత్రి తేడా లేకుండా వందలాది టిప్పర్లు జాతీయ రహదారిపై విచ్చలవిడిగా తిరుగుతున్నా.. పోలీస్, రెవెన్యూ, మైనింగ్ అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. సామాన్య రైతు తన అవసరానికి ఒక్క ట్రాక్టర్ మట్టి తోలాలంటే ఆంక్షలు విధించే అధికారులు.. అధికార పార్టీ నేతల అండతో సాగుతున్న ఈ భారీ దోపిడీని చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారు. అడిగేవారు లేకపోవడంతో ఆక్రమణదారులు చెరువులను సాగు భూములుగా, ప్లాట్లుగా మార్చేస్తున్నారు. -
నేడు ఎస్పీ కార్యాలయ ప్రారంభోత్సవం
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా పోలీసు యంత్రాంగం ప్రజలకు మరింత చేరువ కానుంది. మదనపల్లెలో నూతనంగా ఏర్పాటు చేసిన జిల్లా పోలీసు కార్యాలయాన్నిబుధవారం కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ అధికారికంగా ప్రారంభించనున్నారు. మదనపల్లె – బెంగళూరు రహదారిలోని మడికయల శివాలయం వెళ్లే దారిలో ఉన్న రేస్ బీఈడీ కళాశాల ప్రాంగణంలో ఈ నూతన కార్యాలయాన్ని ఏర్పాటు చేశారు. ఇప్పటికే జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రిలు ఈ భవనంలో ప్రత్యేక పూజలు నిర్వహించగా, బుధవారం డీఐజీ చేతుల మీదుగా రిబ్బన్ కట్ చేసి కార్యాలయాన్ని ప్రజలకు అందుబాటులోకి తీసుకురానున్నారు. ఈ ప్రారంభోత్సవంతో జిల్లా పోలీసు పరిపాలన కేంద్రం మదనపల్లె నుండి పూర్తిస్థాయిలో కార్యకలాపాలు సాగించనుంది. మదనపల్లె టౌన్: విపత్తు సమయాల్లో ప్రాణాలకు తెగించి పోరాడే అగ్నిమాపక శాఖాధికారుల సేవలకు గుర్తింపు లభించింది. అగ్నిప్రమాదాల నివారణలోనూ, ఆపదలో ఉన్న వారిని కాపాడటంలోనూ అసాధారణ ప్రతిభ కనబరిచిన మదనపల్లె అధికారులకు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉత్తమ సేవా ఉగాది పురస్కారాలను ప్రకటించింది. మదనపల్లె జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ రెడ్డి విధి నిర్వహణలో ప్రదర్శించిన అంకితభావానికి గాను ‘ఉత్తమ సేవా పతకం’ లభించింది. అలాగే, మదనపల్లె అగ్నిమాపక కేంద్రంలో లీడింగ్ ఫైర్ మ్యాన్గా విధులు నిర్వహిస్తున్న విజయ్ భాస్కర్ రెడ్డి కూడా సేవా పతకానికి ఎంపికయ్యారు. ఈ సందర్భంగా మదనపల్లె అగ్నిమాపక అధికారి శివప్ప మంగళవారం మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె పరిధిలో జరిగిన పలు అగ్నిప్రమాదాల సమయంలో వీరు ప్రాణ, ఆస్తి నష్టాలను నివారించడంలో కీలక పాత్ర పోషించారని కొనియాడారు. ప్రజల ప్రాణాలను, ప్రభుత్వ ఆస్తులను కాపాడటంలో అగ్నిమాపక సిబ్బంది ఎల్లప్పుడూ ముందుంటారని ఆయన పేర్కొన్నారు. కడప కార్పొరేషన్: ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని పారిశ్రామిక విద్యుత్ వినియోగదారుల సమస్యల సత్వర పరిష్కారం కోసం బుధవారం ప్రత్యేక ’సమస్యల పరిష్కార వేదిక’ను నిర్వహించనున్నట్లు సంస్థ సిఎండి శివశంకర్ లోతేటి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 10:30 నుండి 11:30 గంటల వరకు తిరుపతిలోని ఏపీఎస్పీడీసీఎల్ కార్పొరేట్ కార్యాలయంలో ఈ కార్యక్రమం నిర్వహిస్తామన్నారు. నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, కడప, అన్నమయ్య, అనంతపురం, శ్రీసత్యసాయి, కర్నూలు, నంద్యాల జిల్లాలవారు పారిశ్రామిక విద్యుత్ సమస్యలను త్వరితగతిన పరిష్కరించుకోవాలన్నారు. జిల్లా స్థాయిలో ఎస్ఈ కార్యాలయాల్లో మొదటి బుధవారం నిర్వహించిన కార్యక్రమాల్లో పరిష్కారం కాని సమస్యలను, ఈ మూడవ బుధవారం తిరుపతిలోని కార్పొరేట్ కార్యాలయంలో నేరుగా సీఎండీని కలిసి విన్నవించవచ్చని తెలిపారు. ప్రొద్దుటూరు: పర్యావరణ పరిరక్షణ కోసం తన జీవితాన్ని అంకితం చేసిన పద్మశ్రీ అవార్డు గ్రహీత ’వనజీవి’ దరిపల్లి రామయ్య జీవిత చరిత్ర ఆధారంగా నిర్మించిన లఘు చిత్రానికి అరుదైన గుర్తింపు లభించింది. ప్రొద్దుటూరు మండలం గోపవరం పంచాయతీ ఎంపీటీసీ బూసం రవీంద్రనాథ్ నిర్మించిన ఈ చిత్రానికి తెలంగాణ ప్రభుత్వం ఉత్తమ లఘు చిత్రంగా ఎంపిక చేస్తూ ‘గద్దర్ అవార్డు’ను ప్రకటించింది. చిత్రసీమలో తన తొలి ప్రయత్నంలోనే ఇంతటి ప్రతిష్టాత్మక అవార్డు రావడం పట్ల రవీంద్రనాథ్ సంతోషం వ్యక్తం చేశారు. వేముగంటి దర్శకత్వం వహించిన ఈ సినిమాలో సీనియర్ నటుడు బ్రహ్మాజీ ప్రధాన పాత్ర పోషించారు. కోటిన్నర మొక్కలు నాటి పర్యావరణ ప్రేమికుడిగా గుర్తింపు పొందిన రామయ్య బయోగ్రఫీ సమాజానికి స్ఫూర్తిదాయకంగా ఉంటుందని ఈ చిత్రాన్ని నిర్మించినట్లు నిర్మాత తెలిపారు. ఈనెల 19న ఉగాది పండుగ పురస్కరించుకుని తెలంగాణ ప్రభుత్వం నుంచి ఈ అవార్డును అందుకోనున్నారు. ప్రొద్దుటూరు గడ్డకు గర్వకారణంగా నిలిచిన రవీంద్రనాథ్ను మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఫోన్ ద్వారా ప్రత్యేకంగా అభినందించారు. -
వెంకటాద్రికి నందలూరులో స్టాపింగ్!
రాజంపేట: జిల్లాలో ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వే కేంద్రంలో చిత్తూరు–కాచిగూడ (12798–12797)మధ్య నడిచే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు రైల్వేబోర్డు అధికారులు అంగీకరించినట్లు సమాచారం. ఈ విషయాన్ని మంగళవారం రైల్వేబోర్డు అధికారులు తనకు తెలియజేశారని ఎంపీ మేడా రఘునాథ రెడ్డి వెల్లడించారు. వెంకటాద్రి సూపర్పాస్ట్ ఎక్స్ప్రెస్ నిలుపుదల విషయంపై రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి విశేష కృషి చేశారు. రైల్వేబోర్డుకు రైల్వేస్టాడింగ్ కమిటీ కౌన్సిల్ సభ్యుడి హోదాలో మేడా రఘునాథరెడ్డి వెంకటాద్రి ఎక్స్ప్రెస్ రైలు హాల్టింగ్ అంశంపై ఇటీవల రైల్వేబోర్డు అధికారులతో చర్చించారు. నందలూరు స్టేషన్ ప్రాధాన్యత .. ప్రయాణికుల అవసరాలను వారి దృష్టికి తీసుకెళ్లారు. ఈ నేపథ్యంలో సానుకూలంగా స్పందించిన రైల్వే ఉన్నతాధికారులు వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నిలుపుదలకు గ్రీన్సిగ్నల్ ఇచ్చారని.. త్వరలో హాల్టింగ్ ఉత్తర్వులు జారీ చేస్తారని మేడా ధృవీకరించారు. ఏడేళ్లకు వెంకటాద్రి హాల్టింగ్కు మోక్షం కోవిడ్–19 కంటే ముందు నందలూరులో వెంకటాద్రి ఎక్స్ప్రెస్కు హాల్టింగ్ ఉండేది. లాక్డౌన్ తర్వాత అన్ని రైళ్లను రద్దీ చేసిన అధికారులు.. తిరిగి పునరుద్ధరించే క్రమంలో నందలూరులో హాల్టింగ్ను ఎత్తివేశారు. తాజా గా నందలూరులో నిలుపుదలకు రైల్వే బోర్డు అంగీకరించడంతో ప్రయాణికులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. టైమింగ్ ఇలా.. కాచిగూడ నుంచి బయలుదేరే వెంకటాద్రి ఎక్స్ప్రెస్ నందలూరు రైల్వేకేంద్రానికి ఉదయం 4.45 తెల్లవారుజామున చేరుకుంటుంది. తిరుపతికి ఉదయం 6,15, చిత్తూరుకు 8.15 గంటలకు చేరుకుంటుంది. అక్కడి నుంచి చిత్తూరు రైల్వేస్టేషన్లో సాయంత్రం 4.30 గంటలు బయలుదేరి 8.15కు నందలూరు రైల్వేకేంద్రానికి చేరుకుంటుంది. కాచిగూడకు ఉదయం 6.గంటలకు చేరుకుంటుంది. ఈ రైలు నిలుపదలకు కృషిచేసిన ఎంపీ రఘునాథరెడ్డిని ప్రయాణికులు, ప్రజలు అభినందనలు తెలియచేస్తున్నారు. రైల్వే స్టాండింగ్కౌన్సిల్కు హాజరైన మేడా రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ సమావేశానికి హాజరైనట్లు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి ‘సాక్షి’కి తెలిపారు. ప్రధానంగా భారతీయ రైల్వేరోలింగ్ స్టాక్ ఉన్నతీకరణ,ఆధునీకరణ అనే అంశంపై జరిగిన సమావేశానికి తాను హాజరైనట్లు తెలిపారు. ఈ సందర్భంగా నందలూరులో వెంకటాద్రి హాల్టింగ్ అంశాన్ని ప్రస్తావించగా.., రైల్వేబోర్డు స్పందించిందన్నారు. రైల్వేబోర్డు నుంచి గ్రీన్సిగ్నల్! ఫలించిన రాజ్యసభ సభ్యుడు ‘మేడా’కృషి -
ఖురాన్ బోధనలు మానవాళికి ఆదర్శం
మదనపల్లె సిటీ: దివ్య ఖురాన్ బోధనలు మానవాళికి ఆదర్శమని సర్ఖాజీ మౌలానా జలాలుద్దీన్సాహెబ్ అన్నారు. రంజాన్ మాసంలోని 27వ రాత్రిని పురస్కరించుకుని ముస్లిం సోదరులు షబే ఖదర్ పర్వదినాన్ని సోమవారం రాత్రి నుంచి మంగళవారం ఉదయం వరకు భక్తశ్రదద్ధలతో జరుపుకున్నారు. పట్టణంలోని జామియా మసీదు,మోతీ మసీదు, మక్కా మసీదు, మదీనా మసీదు, ఉస్మానియా మసీదు ,మహమ్మదీయ మసీదులతో పాటు రూరల్ పరిధిలోని ఆరోగ్యవరం, సీటీఎం, బండికందపల్లెలోని మసీదుల్లో షబే ఖదర్ సందర్భంగా ప్రత్యేక ప్రార్థనలు చేశారు. స్థానిక జామియా మసీదులో ప్రభుత్వ సర్ఖాజీ మౌలానా జలాలుద్దీన్ ధార్మికోపన్యాసం చేశారు. దివ్య ఖురాన్ అవతరించిన మహోన్నత రేయి షబేఖదర్ అన్నారు. దివ్యఖురాన్ భోదనల ప్రకారం అందరూ నడుచుకుని ఆదర్శవంతమైన సమాజాన్ని నిర్మించాలన్నారు. ముఖ్యంగ పవిత్ర రంజాన్మాసంలో ఫిత్రా ,జకాత్ రూపంలో పేదలను ఆదుకోవాలన్నారు. షబేఖదర్ సందర్భంగా మసీదులన్నీ విద్యుత్దీపాలకాంతుల్లో ధగదగలాడాయి. ● షబే–ఏ–ఖదర్ ప్రత్యేక ప్రార్థనలు -
తొలి రోజు పరీక్షలు ప్రశాంతం
మదనపల్లె సిటీ: జిల్లా వ్యాప్తంగా పదో తరగతి పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. ఉదయం 8.30 గంటలకే విద్యార్థులు, తల్లిదండ్రుల కోలాహలంతో పరీక్ష కేంద్రాలు సందడిగా మారాయి. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభం కాగా 9 గంటలకే విద్యార్థులను కేంద్రాల్లోకి అనుమతించారు. మొత్తం 124 పరీక్ష కేంద్రాల్లో రెగ్యులర్ 21,614 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరు కావాల్సి ఉండగా 21.464 మంది హాజరయ్యారు. 150 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. పరీక్షా కేంద్రాల వద్ద పోలీసులు బందోబస్తు నిర్వహించారు. కేంద్రాల వద్ద తాగునీటితో పాటు వైద బృందం ఏర్పాటు చేశారు. దూర ప్రాంతాల విద్యార్థులకు ఆర్టీసీ బస్సుల్లో ఉచిత ప్రయాణంకు అనుమతించారు. జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తొలి రోజు పలు పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. కేంద్రాల్లోని వసతులు, పరీక్షల తీరును పరిశీలించారు. విద్యార్థులకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చర్యలు తీసుకున్నామన్నారు. ఏ సమస్య వచ్చినా తన దృష్టికి తీసుకురావాలని సూచించారు. -
ఏటిగడ్డ గంగమ్మ విగ్రహం కూలదోసిన దుండగులు
గుర్రంకొండ : ఏటిగడ్డ గంగమ్మతల్లి విగ్రహాన్ని కొంతమంది దుండగులు కూలదోయడంతో దళితులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంఘటన మండలంలోని శెట్టివారిపల్లెలో జరిగింది. గ్రామంలో తరతరాలుగా దళితులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి పూజలు నిర్వహిస్తున్నారు. ఈనేపథ్యంలొ గత ఆదివారం దళితులు ఏటిగడ్డ గంగమ్మతల్లికి జాతర చేశారు. అదేరోజు రాత్రి కొంతమంది దుండగులు అమ్మవారికి అలంకరించిన పూజ సామగ్రిని తొలగించారు. అంతేకాక విగ్రహాన్ని పెకలించి అక్కడే పడేశారు. విషయం తెలుసుకొన్న దళితులు సంఘటనా స్థలానికి చేరుకోవడంతో గ్రామంలో ఉద్రిక్తిత నెలకొంది. జాతర నిర్వహించిన రోజు కావాలనే అమ్మవారి విగ్రహాన్ని కూలదోసి గ్రామంలొ మత ఘర్షణలను సృష్టించడానికి కొంతమంది కుట్రలు పన్నుతున్నారని దళితులు పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై సోమవారం మదనపల్లె జిల్లా కలెక్టర్ కార్యాలయంలోనూ, స్థానిక పోలీస్స్టేషన్లొనూ ఫిర్యాదులు చేసినట్లు వారు తెలిపారు. ఈ విషయయమై ఎస్ఐ రవీంద్రబాబును వివరణ కోరగా శెట్టివారిపల్లెలో సంఘటనా స్థలానికి వెళ్లామన్నారు. ఈ విషయం గురించి స్థానిక తహసీల్దార్కు సమాచారం అందించామన్నారు. సదరు స్థలాన్ని సర్వేచేసి తగిన చర్యలు చేపడతామని ఎస్ఐ పేర్కొన్నారు. -
ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి
చౌడేపల్లె : చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక దౌర్జన్యాలు, దాడులు, అక్రమ సంపాదన, అడుగడునా ఆక్రమణలు, అక్రమ కేసులు వివిధ రకాల ప్రభుత్వ వైఫల్యాలను పార్టీశ్రేణులు ప్రజల్లోకి తీసుకెళ్లాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సూచించారు. సోమవారం తిరుపతిలో పెద్దిరెడ్డి నివాసంలో చౌడేపల్లె మండలనుంచి వెళ్లిన నేతలతో సమావేశమయ్యారు. ఇటీవల వైఎస్సార్సీపీలో వివిధ విభాగాల్లో పలువురికి పదువులు కేటాయించిన విషయం తెలిసిందే. పార్టీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శిగా నియమితులైన ఏ. రుక్మిణమ్మ, వైస్ ఎంపీపీ సుధాకర్రెడ్డి, మండల పార్టీ అఽధ్యక్షుడు నాగభూషణరెడ్డి, వెంకటరమణలతోపాటు పలువురు నేతలు పెద్దిరెడ్డికి పుష్పగుచ్ఛం అందజేసి కృతజ్ఞతలు తెలిపారు. పెద్దిరెడ్డి మాట్లాడుతూ వివిధ విభాగాల్లో పదవులు పొందిన నేతలకు మరింత బాధ్యతలు రెట్టింపు అయ్యాయని, గుర్తుచేశారు. కష్టపడి పార్టీ కోసంపనిచేస్తున్న నేతలు, కార్యకర్తలసేవలకు తగిన గుర్తింపునిచ్చి అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు. గంజాయి మత్తులో విచక్షణ కోల్పోయి మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు జరుగుతున్నా ప్రభుత్వం తీసుకొనే చర్యలు ఎక్కడా అని ప్రశ్నించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలుచేయకుండా ప్రజలను మోసం చేసిన ప్రభుత్వానికి గుణపాఠం చెప్పడానికి ప్రజల్లో మద్దత్తు తీసుకురావాలని, ఇందుకోసం ప్రతికార్యకర్త సైనికుల్లా పనిచేయాలని సూచించారు. కార్యక్రమంలో పార్టీ ఉపాధ్యక్షులు వెంకరమణ, లడ్డూరమణ నాయకులు బ్రహ్మానందరెడ్డి, షంషీర్, నరేష్, గోపి, రామకృష్ణ, రెడ్డప్పరెడ్డి, బాబురెడ్డి, వెంకటరెడ్డి, అల్తాఫ్, రాజారెడ్డి,సోని, యశోద,గంగాధర్,గంగిరెడ్డి, మంజునాథ్,ఆనందాచార్యులు తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
సమస్యకు.. పరిష్కారమేదీ!
మదనపల్లె రూరల్: కలెక్టరేట్లో ప్రతి వారం నిర్వహించే ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అర్జీలు పేరుకుపోతున్నాయి తప్పా.. సమస్యకు పరిష్కారం దొరకడం లేదు. అర్జీదారులు పలుమార్లు కలెక్టరేట్కు వచ్చి అర్జీలు ఇవ్వాల్సిన దుస్థితి ఏర్పడుతోంది. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో కలెక్టర్ నిశాంత్కుమార్, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఆర్వో మధుసూధనరావు, జీఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి, డ్వామా పీడీ వెంకటరత్నం, సర్వే ఏడీ భరత్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అన్నమయ్యజిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలపై ప్రజలు 346 అర్జీలను అందజేశారు. దళితులకు అన్యాయం చేసిన అధికారులు నిమ్మనపల్లె మండల రెవెన్యూ అధికారులు దళితులభూమికి సంబంధించి ఇతరులకు 1బీ మంజూరుచేసి అన్యాయం చేశారని, వారిపై అట్రాసిటీ యాక్ట్ సెక్షన్ 4 కింద చర్యలు తీసుకోవాలని బహుజనసేన రాష్ట్ర అధ్యక్షులు శ్రీచందు డిమాండ్ చేశారు. సోమవారం రాచవేటివారిపల్లె ఎస్సీ కాలనీకి చెందిన బాధితులతో కలిసి కలెక్టరేట్లో నిరసన తెలిపారు. మాచిరెడ్డిగారిపల్లెలో మాల కదిరప్ప కుటుంబసభ్యులకు 4.13 ఎకరాల భూమి ఉంటే, దానికి ఆనుకుని ఇతరులకు చెందిన భూమి ఉంటే, రెవెన్యూ అధికారులు కదిరప్ప సర్వే నెంబర్ను సబ్డివిజన్ చేసినట్లుగా వన్బీ నోషనల్ ఖాతాలో ఇతరుల పేర్లు ఎక్కించి వన్బీ మంజూరు చేశారన్నారు. దీంతో వారు దళితుల భూముల్లోకి ప్రవేశించి దౌర్జన్యంగా చదునుచేసి సిమెంట్ కాంపౌండ్ వాల్ నిర్మించారన్నారు. ఈ విషయమై రెండుసార్లు బాధితుడు రెడ్డిప్రసాద్ పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదుచేసినా ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. దళితుల భూమిని అనధికారికంగా ఆక్రమించిన దుండగులపై, భూమిని ఇతరులకు కట్టబెట్టిన రెవెన్యూ అధికారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. నారిగానిపల్లెలో ఆస్పత్రి నిర్మించాలి.... రామసముద్రం మండలం నారిగానిపల్లెకు మంజూరైన ప్రభుత్వ ఆస్పత్రిని, కమ్మవారిపల్లెలో నిర్మాణం చేస్తున్నారని, తక్షణమే దాన్ని నిలిపేసి తమ గ్రామంలోనే నిర్మించాలని గ్రామస్తులు విన్నవించారు. నారిగానిపల్లెలో ఆస్పత్రి నిర్మాణానికి స్థలం ఇచ్చామని, మండల తహసీల్దార్ కమ్మవారిపల్లెలో ఆస్పత్రి నిర్మాణానికి అనుమతి ఇవ్వలేదని, పై విషయాలను దృష్టిలో ఉంచుకుని తమకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలి... అనారోగ్యం కారణంగా మంచానికే పరిమితం కావడంతో కుటుంబపోషణ కష్టమవుతోందని, ప్రభుత్వం దివ్యాంగ పెన్షన్ మంజూరు చేయాలని బి.కొత్తకోట బజారువీధికి చెందిన దినకర్ కుమార్ అర్జీ సమర్పించారు. నిలిపివేసిన పెన్షన్ ఇప్పించండి.... దివ్యాంగుడైన తనకు గతంలో అందుతున్న దివ్యాంగ పెన్షన్ను ప్రస్తుతం అధికారులు నిలిపివేశారని, నడవలేని పరిస్థితిలో ఉన్న తనకు తిరిగి పెన్షన్ మంజూరుచేసి ఆదుకోవాలని బి.కొత్తకోట మండలం గొల్లపల్లెకు చెందిన బి.మనోహర్ వినతిపత్రం అందజేశారు. ప్రజల సమస్యలు తెలుసుకుంటున్న కలెక్టర్ నిశాంత్కుమార్, దళితుల భూమి ఆక్రమించిన వారిపై చర్యలు తీసుకోవాలని బహుజనసేన ఆధ్వర్యంలో కలెక్టరేట్లో నిరసన ప్రజా సమస్యల పరిష్కార వేదికకుఅర్జీల వెల్లువ ఫిర్యాదులు స్వీకరించినకలెక్టర్ నిశాంత్కుమార్ర్ -
పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిది
మదనపల్లె రూరల్: ప్రత్యేక ఆంధ్ర రాష్ట్ర సాధన కోసం 58 రోజుల పాటు ఆమరణ నిరాహారదీక్ష చేసి, ప్రాణత్యాగం చేసిన అమరజీవి పొట్టి శ్రీరాములు త్యాగం మరువలేనిదని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. అమరజీవి పొట్టిశ్రీరాములు జయంతి సందర్భంగా సోమవారం మదనపల్లె కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సమావేశ మందిరంలో ప్రత్యేక కార్యక్రమం ఏర్పాటు చేశారు. అమరజీవి పొట్టిశ్రీరాములు చిత్రపటానికి స్థానిక ఆర్యవైశ్యసంఘ ప్రతినిధులతో కలిసి పూలమాల వేసి నివాళులు అర్పించారు. అమరావతిలో శాఖమూరు పార్కులో 58 అడుగుల పొట్టిశ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సీఎం చంద్రబాబునాయుడు ఆవిష్కరిస్తున్న కార్యక్రమాన్ని వర్చువల్ విధానంలో ప్రత్యక్షంగా వీక్షించారు. అనంతరం కలెక్టర్ మీడియాతో మాట్లాడుతూ తెలుగు ప్రజల ఆత్మగౌరవం కోసం పొట్టిశ్రీరాములు చేసిన పోరాటం భాషా ప్రయుక్త రాష్ట్రాల ఏర్పాటుకు, ఆంధ్రప్రదేశ్ ఆవిర్భావానికి పునాది వేసిందన్నారు. పీజీఆర్ఎస్ హాల్లో పొట్టి శ్రీరాములు జయంతి సందర్భంగా ఏర్పాటుచేసిన ఫొటోగ్యాలరీని కలెక్టర్ నిశాంత్కుమా ర్ పరిశీలించారు. అంతకు ముందు పట్టణంలోని జెడ్పీహైస్కూల్ సమీపంలోని కోమటివాని చెరువు ట్యాంక్బండ్ వద్ద పొట్టి శ్రీరాములు విగ్రహానికి ఇన్చార్జ్ జేసీ, డీఆర్వో మధుసూధనరావు పూలమాల వేసి నివాళులు అర్పించారు. తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ ప్రమీల, బీసీ వెల్ఫేర్ ఆఫీసర్ తేజస్విని, ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, ఆర్యవైశ్యసంఘం అధ్యక్షులు బింగిపాండు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్కుమార్ -
మనస్తాపంతో మహిళ ఆత్మహత్య
రామసముద్రం : రామసముద్రం మండలంలోని పెద్దకురపల్లి పంచాయతీ తిరుమలరెడ్డి పల్లి గ్రామానికి చెందిన ఆకుతోట సుధారాణి (29) మనస్తాపానికి గురై చీరతో ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది. ఎస్ఐ ఉమామహేశ్వర్రెడ్డి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సుధారాణి ఫోన్లో మాట్లాడుతుండగా భర్త వెంకటరమణ గమనించి ఫోన్ లాక్కొని మందలించాడు. దీంతో మనస్తాపానికి గురైన ఆమె ఇంట్లోని గదిలో చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. గమనించిన కుటుంబీకులు పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ సంఘటన స్థలానికి చేరుకుని విచారించారు. కారు దగ్ధం పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక జేఎన్టీయూ కళాశాల వెనుకవైపు ఉన్న జగనన్న కాలనీలో గుర్తు తెలియని కారు దగ్ధమైంది. కారు దగ్ధమై సుమారు 10రోజులై ఉంటుందని ఆ ప్రాంత ప్రజలు చర్చించుకుంటున్నారు. కారును ఎవరు దగ్ధం చేసి ఉంటారు, ఎందుకు చేసి ఉంటారో తెలియాల్సి ఉంది. కారు బోల్తా: ఒకరికి గాయాలుపులివెందుల రూరల్ : పట్టణంలోని జగనన్న కాలనీకి వెళ్లే రోడ్డులో సోమవారం అర్ధరాత్రి కారు బోల్తా పడింది. ఈ సంఘటనలో కారు డ్రైవర్ హరీష్కు గాయాలయ్యాయి. పట్టణంలోని పాత బస్టాండ్ సమీపంలో ఒక సెల్ పాయింట్లో మేనేజర్ గా పనిచేస్తున్న హరీష్ జగనన్న కాలనీకి వెళ్లే రహదారిలో వేగంగా వెళుతూ రాయి ఎక్కడంతో కారు బోల్తా పడింది. ఈ ఘటనలో హరీష్ గాయపడ్డాడు. -
● వీటికి డిమాండ్
మదనపల్లె: పల్లె నిధులపై పచ్చ నేతలు కన్నేశారు. జిల్లాలోని 411 పంచాయతీల పాలకవర్గాలకు పదవీకాలం ఏప్రిల్ రెండుతో ముగియనుంది. దాంతో మూడో తేదినుంచి ప్రత్యేక అధికారుల పాలన మొదలవుతుంది. పంచాయతీలకు మండలస్థాయి అధికారులను ప్రత్యేక అధికారులను నియమించుకోవాలని ఇప్పటికే ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. ఈ నేపథ్యంలో పంచాయతీల్లో తమ పెత్తనం చెలాయించడం కోసం టిడిపి నేతలు ఇప్పటి నుంచే పావులు కదుపుతున్నారు. తమ మాట వినే అధికారులను నియమించుకుని పంచాయతీల్లో ఉన్న నిధులను అభివృద్ధి పేరుతో అడ్డంగా దోచుకునేందుకు పచ్చ పన్నాగమే పన్నుతున్నారు. రూ.39 కోట్ల నిధులు అధికార వర్గాల సమాచారం మేరకు..జిల్లాలోని గ్రామపంచాయతీల్లో ఫిబ్రవరి 28 నాటికి రూ.39.53 కోట్ల 15వ ఆర్థిక సంఘం నిధులు నిల్వ ఉన్నాయి. ఇవికాక వృత్తిపన్ను, తలసరి గ్రాంటు నిధులు ఉన్నాయి. ఈ నిధులను ప్రస్తుత సర్పంచులు సద్వినియోగం చేసేందుకు అడ్డంకులు ఎదురువుతున్నాయి. కూటమి పాలన కావడంతో స్థానిక నేతల ఒత్తిళ్లతో కార్యదర్శులు, అధికారులు నిధుల వినియోగానికి కొర్రీలు వేస్తూ రావడం జరిగింది. దీంతో ప్రస్తుతం పంచాయతీల ఖాతాల్లో సాధారణ నిధులతోపాటు 15వ ఆర్థిక సంఘం నిధులు భారీగా ఉన్నాయి. ఈ నిధులను ఏప్రిల్లోగా సద్వినియోగం చేయాల్సి ఉంది. ఏప్రిల్ రెండో తేది వరకు సర్పంచుల పాలన ఉంటుంది, మూడో తేది నుంచి ప్రత్యేక పాలన రానుండటంతో ఈ నిధులను అప్పుడే తమకిష్టమైన పనులకు వాడుకొవచ్చన్న ఆశతో టీడీపీ నేతలు ఉంటున్నారు. ఏడుగురు సర్పంచులు లేరు జిల్లాలోని మదనపల్లె, పీలేరు, రాయచోటి డివిజన్ల పరిధిలో 411 గ్రామపంచాయతీలుండగా వాటిలో ఏడు పంచాయతీలకు వివిధ కారణాలతో సర్పంచులు లేరు. కలికిరి, వలసపల్లె, రంగసముద్రం, పరికిపాపిరెడ్డిగారిపల్లె, దేవపట్ల, కన్నెమడుగు, పుదిపట్లకు సర్పంచులు లేవు. అలాగే 44 వార్డులకు సభ్యులు లేరు. ఇవి ఇప్పటికి ఖాళీగానే ఉన్నాయి. వాళ్లకే అవకాశం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో మెజార్టీ గ్రామపంచాయతీ సర్పంచులు వైఎస్సార్సీపీ మద్దతుదారులే ఉన్నారు. అప్పుడు పనిచేసిన అధికారులంటే టీడీపీ శ్రేణులకు గిట్టడం లేదు. ఏ చిన్న సమస్య అయినా వారు వాడుతున్న ఊతపదం..ఆ ప్రభుత్వంలో మేం ఇబ్బందిపడ్డాం, ఫలానా అధికారి మాకొద్దు అంటూ చెబుతున్నారు. కొన్ని విషయాల్లో అయితే గత ప్రభుత్వంపై బురదజల్లి ఫలానా అధికారి అలా చేశారు, ఇలా చేశారంటూ ప్రచారం చేసుకుంటూ అధికారులను బలిపశువులు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో గ్రామపంచాయతీలకు ప్రభుత్వం ప్రత్యేకాధికారులుగా మండలస్థాయి అధికారులను నియమించే అధికారం కలెక్టర్లకు అప్పగించడంతో ఇప్పుడు వారి నియామకంపై టీడీపీ నేతలు దృష్టి పెట్టారు. తమకు ఫలానా అధికారి కావాలి, ఆయనుంటేనే తమ పనులు జరుగుతాయంటూ కావాల్సిన వారినే నియమించుకునేలా ప్రయత్నాలు మొదలయ్యాయి. బి.కొత్తకోట రూ.1,24,39,736 చిన్నమండ్యం రూ.3,34,56,042 చౌడేపల్లె రూ.1,10,69,421 గాలివీడు రూ.2,47,69,921 గుర్రంకొండ రూ.66,60,040 కలకడ రూ.35,26,248 కలికిరి రూ.1,74,52,181 కేవిపల్లె రూ.82,30,390 కురబలకోట రూ.72,85,484 లక్కిరెడ్డిపల్లె రూ.2,09,92,201 మదనపల్లె రూ.2,19,74,060 ములకలచెరువు రూ.45,47,948 నిమ్మనపల్లె రూ.36,77,358 పెద్దమండ్యం రూ.1,50,46,872 పెద్దతిప్పసముద్రం రూ.2,13,02,164 పీలేరు రూ.2,35,30,997 పుంగనూరు రూ.3,03,19,504 రామాపురం రూ.1,06,86,308 రామసముద్రం రూ.2,22,49,714 రాయచోటి రూ.1,89,54,377 సంబేపల్లి రూ.61,09,869 సదుం రూ.2,48,75,218 తంబళ్లపల్లె రూ.63,85,154 వాల్మీకిపురం రూ.3,04,67,228 మండలం నిధులు ఏప్రిల్ 2 తర్వాత ప్రత్యేకాధికారులపాలనలోకి పంచాయతీలు మాటవినే అధికారులనేఎస్ఓలుగా నియామకం జిల్లాలో సాధారణ నిధులు కాక..రూ.39.53 కోట్ల 15వ ఆర్థిక సంఘనిధులు నిల్వ ఈ నిధులపై కన్నేసిన ‘తమ్ముళ్లు’ అధిక ఆదాయం, మున్సిపాలిటీ శివారు పంచాయతీలకు ఎస్ఓలుగా పనిచేసేందుకు డిమాండ్ పెరుగుతోందని ప్రచారం జరుగుతోంది. ఇప్పటికే టీడీపీ నేతలు ఎవరిని ఎక్కడ నియమించాలన్న దానిపై కసరత్తు చేస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. కొత్తపల్లె, ఈశ్వరమ్మకాలనీ, కురవంక, బసినికొండ, రామాచార్లపల్లె, కొండామర్రిపల్లె, తట్టివారిపల్లె, కోళ్లబైలు, అంకిశెట్టిపల్లె, పొన్నుటిపాళెం, అంగళ్లు, కురబలకోట, నందిరెడ్డిగారిపల్లె, ముదివేడు, కడపక్రాస్, బడికాయలపల్లె, కోటావూరు, గట్టు, ములకలచెరువు, బురకాయలకోట, తంబళ్లపల్లె, పెద్దమండ్యం, కందుకూరు, కలిచర్ల, పీలేరు, సదుం, సోమల, చౌడేపల్లె, కలకడ, కలికిరి, వాల్మీకిపురం, చింతపర్తి, లక్కిరెడ్డిపల్లె, చిన్నమండెం..మండల కేంద్రాలు, పుంగనూరు, రాయచోటి మున్సిపాలిటి శివారు పంచాయతీలకు ఎస్ఓలుగా విధులు నిర్వహించేందుకు అసక్తి చూఫుతున్న అధికారులు ఉన్నారు. -
పీజీ ప్రవేశాలకు దరఖాస్తుల ఆహ్వానం
కడప ఎడ్యుకేషన్: ఆంధ్రప్రదేశ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కామన్ ఎంట్రెన్స్ టెస్ట్ (ఏపీపీజీసెట్)–2026 నకు ఈనెల 19వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని యోగి వేమన విశ్వవిద్యాలయ ప్రవేశాల సంచాలకులు డాక్టర్ టి. లక్ష్మిప్రసాద్ తెలిపారు. డిగ్రీ ఇప్పటికే పూర్తి చేసుకున్న వారు చివరి సంవత్సరం పరీక్షలు రాయబోయే వారు ఈ వెబ్సైట్ https://cets. apsche.ap.gov.inను క్లిక్ చేసి దరఖాస్తు చేసుకోవాలన్నారు. యోగి వేమన విశ్వవిద్యాలయంలో ప్రవేశాలు పొందగోరే విద్యార్థులు దరఖాస్తులు చేసుకోవాలని పేర్కొన్నారు. వైవీయూలో 29 కోర్సులు ఉన్నాయని ఆయా అర్హతలను బట్టి ఎంపిక చేసుకోవాలన్నారు. ఏవైనా సందేహాలు ఉంటే డాక్టర్ పి లక్ష్మిప్రసాద్ సెల్ నెంబర్ (8317532040)ను, డాక్టర్ సరిత (81066 04789)లను సంప్రదించాలని సూచించారు. హుండీ ఆదాయం లెక్కింపు బ్రహ్మంగారిమఠం: బి.మఠంలో ఉన్న శ్రీమాతా ఈశ్వరీదేవి మఠంలో సోమవారం హుండీల ఆదాయాన్ని లెక్కించగా రూ 5,09,041 నగదు వచ్చిందని మఠం ఈఓ బివీ జగన్మోహన్రెడ్డి తెలిపారు. అలాగే తలనీలా కోసం వేలం వేయగా రూ 71వేలు ఆదాయం వచ్చిందని చెప్పారు. కార్యక్రమంలో ఈశ్వరీదేవిమఠం మఠాధిపతి శివకుమారస్వామి, మఠం సిబ్బంది పాల్గొన్నారు. కురబలకోట: మండలంలోని అంగళ్లు గ్రామంలో సోమవారం నిర్వహించిన టమోటా మార్కెట్, గొర్రెల సంత, వారపు సంత గేటు వసూళ్లకు సంభంధించి పంచాయతీ కార్యాలయంలో జరిగిన వేలంపాటలు పోటాపోటీగా సాగాయి. పారదర్శకంగా నిర్వహించిన ఈ వేలం పాటలకు వ్యాపారులు, స్థానికులు పెద్ద సంఖ్యలో హాజరయ్యారు. డీఎల్పీవో నాగరాజు, ఎంపీడీవో గంగయ్య, డిప్యూటి ఎంపీడీఓ బాలమూర్తి, పంచాయతీ కార్యదర్శి ఉదయ్కుమార్, అంగళ్లు సర్పంచ్ పోరెడ్డి విశ్వనాథ్రెడ్డిల సమక్షంలో వేలంపాటలు నిర్వహించారు. ఈ నేపథ్యంలో టమోటా మార్కెట్ సంతగేటు వసూళ్ళను అంగళ్ళు గ్రామానికి చెందిన తోట అశోక్కుమార్ రూ.44.50 లక్షలకు దక్కించుకున్నారు. గొర్రెల సంత గేటు వసూళ్లను పీ.ద్వారకనాథ్రెడ్డి రూ.53.30 లక్షలకు, వారపు సంత గేటు వసూళ్లను జంగా హరినాథ్రెడ్డి రూ.8.10 లక్షలకు దక్కించుకున్నారు. ఈ మూడు సంతల వేలం పాటల ద్వారా గ్రామ పంచాయతికి రూ.1,05,81,000ల ఆదాయం వచ్చినట్లు అధికారులు వెళ్లడించారు. మదనపల్లె సిటీ: జిల్లా సమగ్రశిక్షలోని 15 మండలాల భవిత కేంద్రాల్లో ఖాళీగా ఉన్న 5 ఫిజియోథెరపిస్టుల పోస్టులను ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేసినట్లు జిల్లా సమగ్ర శిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర్ అనూరాధ తెలిపారు. సోమవార సమగ్రశిక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో ఎంపికై న అభ్యర్థులకు నియామకపత్రాలు అందజేశారు. జిల్లా వ్యాప్తంగా 32 మంది అభ్యర్థులు పోస్టులకు దరఖాస్తు చేసుకోగా ప్రతిభ ఆధారంగా ఎంపికై నవారు బాధ్యతాయుతంగా పని చేయాలన్నారు. జయశ్రీ (చిట్వేలు, పెన గలూరు, నందలూరు), బి.సునీల్నాయక వాల్మీకిపురం, కలికిరి, రామసముద్రం), కోమల (కురబలకోట, కెవి.పల్లి, కలకడ) మమతరాణి (బి.కొత్తకోట, పీటీఎం, ములకలచెరువు), హరీష్కుమర్రాజు (ఎంఆర్ పల్లి, రామాపురం ,రాజంపేట)భవిత కేంద్రాలను కేటాయించినట్లు తెలిపారు. సహిత విద్య కోఆర్డినేటర్ జనార్థన్, సీఎంవో కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్టలో నిత్యాన్నదాన కేంద్రం ప్రారంభం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి వచ్చేసే భక్తులకు నిరంతరం అన్నప్రసాదం పంపిణీ చేసేందుకు ఆలయ ఆవరణలో నూతనంగా ఏర్పాటు చేసిన తాత్కాలిక నిత్య అన్నప్రసాద కేంద్రాన్ని సోమవారం టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు ప్రారంభించారు. కలెక్టర్ చెరుకూరి శ్రీధర్, టీటీడీ ఏఈవో వెంకయ్య చౌదరి, ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, టీటీడీ సీవీఎస్వో మురళికృష్ణ, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, టీటీడీ జేఈవో వీరబ్రహ్మం, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్దె తో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా నిత్య అన్నప్రసాద కేంద్రం ప్రధాన ద్వారానికి ఉండే రిబ్బన్ కటింగు చేయడంతో పాటు సీతారామలక్ష్మణ విగ్రహాలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ గతేడాది శ్రీ సీతారాముల కల్యాణోత్సవానికి విచ్చేసిన ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఆదేశాల మేరకు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయానికి విచ్చేసే భక్తులకు నిరంతరాయంగా అందించాలని ఉద్దేశంతో అన్ని వసతులు ఏర్పాటు చేసిన ఈ తాత్కాలిక నిత్య అన్నప్రసాద కేంద్రాన్ని ప్రారంభిచినట్లు ఆయన తెలిపారు. దీనికి ముందు ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలోని మూలవిరాట్ ని ఆయన దర్శించుకున్నారు. -
టీడీపీ – జనసేన నాయకుల బాహాబాహీ
పులిచెర్ల(కల్లూరు)– మండల పరిషత్ కార్యాలయ ఆవరణలో.. సోమవారం అందరూ చూస్తుండగా టీడీపీకి చెందిన 106 రామిరెడ్డిగారిపల్లెకు చెందిన సర్పంచ్ అనిత భర్త గోపీనాథ్రెడ్డి.. అదేగ్రామానికి చెందిన జనసేన మండపార్టీ అధ్యక్షుడు చంద్రబాబు బాహాబాహీకి దిగారు. ఆఫీసు సిబ్బంది సమక్షంలోనే ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు.అక్కడున్న కొందరు దీనిని వీడియో తీయడంతో అదికాస్త వైరల్గా మారి అందరికీ తెలిసింది.జనసేన నాయకుడు చంద్రబాబుపై స్థానిక టీడీపీ సర్పంచ్ భర్త గోపీనాథ్ స్థానిక వీఆర్ఓతో ఏదేదో అసభ్యకరంగా అన్నాడనిచెప్పగా.. దీనిపై నువ్వు విన్నావా అని గోపీ, చంద్రబాబును అడగడంతో మాటామాటా పెరిగింది. అందరూ చూస్తుండంగానే చెప్పుతో కొట్టుకోవడం వరకు వెళ్లింది. -
పూల రైతుకు ‘ధరా’ఘాతం
● దారుణంగా పతనమైన పూలధరలు ● తీవ్రంగా నష్టపోయిన రైతులు ● కోయకుండా తోటల్లోనే వదిలేస్తున్న వైనంగుర్రంకొండ : ఈ ఏడాది పూలసాగు చేపట్టిన పూల రైతులు నట్టేట మనిగిపోయారు. మార్కెట్లో ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. మార్కెట్లో ప్రస్తుతం కిలో బంతి, రబ్బరు చామంతి ఇతర పూల ఽరకాల ధరలు రూ. 5 లోపే పలుకుతున్నాయి. జిల్లా మొత్తం రూ.20.01 కోట్ల మేరకు రైతులు నష్టపోయారు. మార్కెట్లకు తీసుకెళ్లినా కొనేవారు లేక పోవడంతో అక్కడే వదిలేసి వచ్చేస్తున్నారు. దీంతో రైతులుతోటల్లోనే పూలు కోయకుండా వదిలేస్తున్నారు. జిల్లాలో ఈ ఏడాది పండుగలు, ఉత్సవాలను దృష్టిలో ఉంచుకొని రైతులు వివిధ రకాల పూలతోటల సాగు చేపట్టారు. సాగు చేసిన పూలకు మంచి ధరలు వస్తాయని ఆశించారు. అయితే వీరి ఆశలు అడియాసలయ్యాయి. ధరలు పతనం కావడంతో నష్టపోయారు. నెల రోజులు క్రితం మార్కెట్లో కిలో రూ. 30 నుంచి రూ.40 వరకు ధరలు పలికాయి. ప్రస్తుతం రూ.5లోపే ధరలు పలుకుతుండడంతో పెట్టుబడి కూడా చేతికొచ్చే అవకాశం లేక రైతులు భారీగా నష్టపోతున్నారు. ఎకరానికి రూ. లక్ష నుంచి రూ.1.50 లక్షలు సాగుఖర్చు ఎకరం బంతి పూల సాగుకు రూ.85వేల నుంచి రూ.లక్ష వరకు ఖర్చు వస్తుంది.ఎకరం పొలానికి 10 వేల మొక్కలు నాటాల్సి ఉంటుంది. నర్సరీల్లో 10 వేల మొక్కల ధర రూ.25 వేల నుంచి రూ. 45 వేల వరకు చెల్లించాలి.ఎరువులు, దుక్కులు,కూలీలు, మందులు, పూలకోతవరకు వచ్చే ఖర్చులు కలుపుకొంటే గరిష్టంగా రూ. 85 వేల నుంచి రూ. లక్ష వరకు ఖర్చు వస్తుంది. ఇదే రబ్బరు బంతిపూల తోటల సాగుకు ఎకరానికి రూ. 1.50లక్షల వరకు ఖర్చు అవుతుంది. మంచి దిగుబడి వస్తే ఎకరానికి ఐదు టన్నుల బంతిపూలు, రబ్బరు బంతి అయితే ఎనిమిది టన్నుల దిగుబడి వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో బంతిపూల ధర కిలో రూ.4 నుంచి రూ.5వరకు మాత్రమే పలుకుతోంది. ఈలెక్కన కనీసంపెట్టుబడి ఖర్చులు కూడా చేతికందక రైతులు దారుణంగా నష్టపోతున్నారు. జిల్లాలో రూ.20.01 కోట్ల మేరకు నష్టం జిల్లాలో ఈ సీజన్లో వివిధ రకాల పూలతోటలు సాగు చేసిన రైతులు రూ. 20.01 కోట్లు మేరకు నష్టపోయారు. ఎకరం సాగుకు రకాన్ని బట్టి రూ. 1లక్ష నుంచి రూ.1.50 లక్షల వరకు ఖర్చు వస్తుంది. జిల్లా మొత్తం మీద ప్రస్తుతం కోతకొచ్చి అదనుమీదున్న పంటలు 940 ఎకరాల వరకు ఉంది. కనీసం ఒక్క కోత కూడా కోయకుండా పంటలను అలాగే వదిలేసిన రైతులు 80 శాతం మేరకు ఉన్నారు. కొంతమంది పూలు కోసి బెంగుళూరు, చైన్నె వంటి నగరాల్లోని మార్కెట్లకు తీసుకెళ్లారు. ఆక్కడ కొనేవారు లేక పూల బస్తాలను అలాగే వదిలేసి వస్తున్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. దీంతో పెట్టుబడి మొత్తం రైతులు నష్టపోయారు. ప్రస్తుతం పూల రైతుల పరిస్థితి దారుణంగా మారింది. ఆరుగాలం కష్టపడి సాగు చేసినా మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక భారీగా నష్టపోయారు. ఉగాది, శ్రీరామనవమితోపాటు జిల్లాలో జరగనున్న జాతర్లపైనే పూల రైతులు ఆశపెట్టుకొని తోటలను కాపాడుకొంటున్నారు.పండగలపైనే ఆశ పెట్టుకొన్నాం మార్కెట్లో పూల ధరలు దారుణంగా పడిపోయాయి. కిలో రూ. 5లోపే ఉన్నాయి. మార్కెట్కు తీసుకెళ్లినా గిట్టుబాటు ధరలు లేవు. దీంతో అదనుమీదున్న పూలు కోసేసి పారేస్తున్నాము. మిగిలినవి కాపాడుకొంటే కనీసం ఉగాది, శ్రీరామనవమి పండుగలకై నా ధరలు పెరుగుతాయనే ఆశతో ఉన్నాం. పండుగ సమయాల్లోనూ ఇవే ధరలు ఉంటే పూర్తిగా నష్టపొతాం. – సుభధ్రమ్మ, పూలరైతు, వెల్లంవారిపల్లెపెట్టుబడి కూడా రాలేదు ఈ ఏడాది బంతిపూలు సాగు చేసి పూర్తిగా మునిగిపోయాం.నెలరోజుల ముందు మార్కెట్లో మంచి ధరలు ఉన్నాయి. ప్రస్తుతం పూర్తిగా పడిపోయాయి. ఎకరం పొలంలో సాగు చేశాను. అన్ని ఖర్చులు కలుకొంటే కనీసం పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితిలేదు. పూలసాగు నష్టాలే మిగిల్చింది. – నాగరాజ, పూలరైతు మొరంపల్లె -
‘బార్’ ఎన్నికల వేడి!
● నామినేషన్ల పర్వం ప్రారంభం ● ప్యానెళ్ల వారీగా బరిలోకి ప్లీడర్లు ● సీఈవోలు నామినేషన్ల స్వీకరిస్తున్న వైనంరాజంపేట : జిల్లా న్యాయవాద వర్గాల్లో ఆయా బార్ అసోసియేషన్ ఎన్నికలు రాజుకున్నాయి. సోమవారం నుంచి నామినేషన్ల పర్వం మొదలైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న వివిధ కోర్టులకు సంబంధించి బార్ అసోసియేషన్లు తమ తమ అభ్యర్థులను గెలిపించుకునేందుకు పోటీపడుతున్నారు. బార్ కౌన్సిల్ ఓటరు జాబితాను ఖరారు చేసింది. జిల్లాలో ఏయే కోర్టు పరిధిలో.. జిల్లాలో కడప, బద్వేలు, జమ్మలమడుగు, నందలూరు, ప్రొద్దుటూరు,పులివెందుల,రాజంపేట, రాయచోటి, రైల్వేకోడూరు, మైదుకూరు, కమలాపురం,లక్కిరెడ్డిపల్లె కోర్టుల పరిధిలో ఉన్న బార్ అసోసియేషన్ కార్యవర్గాలు ఉన్నాయి. వీటి పరిధిలో ఉన్న న్యాయవాదులు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. న్యాయవాదుల సమాచారం మేరకు జిల్లా వారీగా ఓటర్లు వివరాలు ఇలా ఉన్నాయి. కడప(760), రాజంపేట (155), రైల్వేకోడూరు(35), నందలూరు (24), పులివెందుల (24), కమలాపురం (20), మైదుకూరు (16), జమ్మలమడుగు(30), రాయచోటి (113), ప్రొద్దుటూరు(316), బద్వేలు (69) , ఉన్నాయి. సభ్యుల సంఖ్య ఇటీవల పెరిగి ఉండవచ్చని న్యాయవాద వర్గాలు అంటున్నాయి. నామినేషన్ల ప్రక్రియ ఇలా.. నామినేషన్ల పర్వం సోమవారం మొదలైన నేపథ్యంలో రాజంపేట కోర్టు వరకు వస్తే ఈనెల 22 వరకు కొనసాగనుంది. 23న పరిశీలన నిర్వహించనున్నారు. 24న నామినేషన్ల ఉపసంహరణ ఉంటుంది. 25న అభ్యర్థుల జాబితాను ప్రకటించనున్నారు. ఈనెల 30న పోలింగ్ ఉంటుంది. ఉదయం 9గంటల నుంచి 4 గంటల వరకు పోలింగ్ ప్రకియ కొనసాగనుంది. అదే రోజు కౌంటింగ్ ఉంటుంది. ఫలితాలను ఆయా బార్ అసోసియేషన్ల కేటాయించిన చీఫ్ ఎలక్షన్ ఆఫీసర్ ప్రకటించనున్నారు. ఇదే విషయాన్ని రాజంపేట సీఈవో సురేష్ కుమార్ ధ్రువీకరించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి బార్ అసోసియేషన్ జరుగుతాయని, బార్ కౌన్సిల్ నుంచి నియమనిబంధనల మేరకు ఎన్నికలు జరుగుతాయని వెల్లడించారు. నామినేషన్ డిపాజిట్ ఇలా.. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థులు తమ నామినేషన్ దాఖాలు చేయాలంటే డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. వివిధ హోదాలకు ఒక్కో రకంగా డిపాజిట్ నిర్ణయించారు. ప్రెసిడెంట్కు రూ.3వేలు, వైస్ ప్రెసిడెంట్కు రూ.2,500, జనరల్ సెక్రటరీకి రూ.2వేలు, జాయింట్ సెక్రటరీ రూ.1,500, లైబ్రరీ సెక్రటరీకి రూ.1500, ట్రెజరీకి రూ.1500, స్పోర్ట్స్–కల్చరల్ సెక్రటరీకి రూ.1500, మహిళాప్రతినిధికి రూ.1500 చెల్లించాల్సి ఉంటుంది. ఆయా బార్ అసోసియేషన్ల నిర్ణయం మేరకు డిపాజిట్స్ ఉంటాయని చెబుతున్నారు. ఈనెలాఖరులోపు బార్ అసోసియేషన్కు ఎన్నికలు జరగకుంటే,అందులోని సభ్యులకు రాష్ట్ర బార్కౌన్సిల్ నుంచి వచ్చే లబ్ధి దూరమవుతుందని సీనియర్ న్యాయ వాది కొండూరు శరత్కుమార్ రాజు తెలిపారు. జిల్లాలోని వివిధ కోర్టులో పరిధిలోని సీనియర్ న్యాయవాదులు తమ అభ్యర్థులను బరిలోకి దింపేందుకు ప్యానెల్ను సిద్ధం చేసుకుంటున్నారు. బార్ అసోసియేషన్ ఎన్నికల్లో వివిధ రాజకీయపార్టీ మద్దతుదారులు కూడా పోటీ చేసేందుకు సన్నద్ధమవుతున్నారు. కొన్నిచోట్ల ఏకగ్రీవాలకు ప్రయత్నాలు కూడా చేసుకుంటున్నారు. -
పాము కాటుతో రైతు మృతి
వేంపల్లె : వేంపల్లె మండలంలోని బక్కన్నగారిపల్లెలో పాము కాటుతో రైతు పి.మహేందర్ (35) మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వివరాలు.. మండలంలోని బక్కన్నగారిపల్లె గ్రామానికి చెందిన మహేందర్ తన నిమ్మ తోటలోకి ఈ నెల 11వ తేదీ వెళ్లారు. పాము కాటుకు గురి కావడంతో నాటు వైద్యంతోపాటు పుట్టపర్తిలోని సత్యసాయి చారిటబుల్ ట్రస్ట్ ఆసుపత్రిలో చికిత్స చేయించినట్లు బంధువులు చెప్పారు. అయితే పరిస్థితి విషమించడంతో ఆదివారం సాయంత్రం మహేందర్ మృతి చెందినట్లు తెలిపారు. మృతునికి భార్య పుష్పవతి, ఇద్దరు కుమారులు శశాంక్, సాత్విక్ లు ఉన్నారు. మృతుని తమ్ముడు విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రభుత్వ ఇఫ్తార్ ఇలాగేనా?
● హాజరుకాని ఎమ్మెల్యేలు, అధికారులు ● మదనపల్లెలో మొక్కుబడిగా నిర్వహణ ● ముస్లింలకు అవమానంమదనపల్లె : ముస్లింల పట్ల ప్రభుత్వానికి ఎంత చిత్తశుద్ధి ఉందో ఆదివారం మదనపల్లెలో ప్రభుత్వ అధికారిక ఇఫ్తార్ విందు తేటతెల్లం చేసింది. దీనిపై మదనపల్లె ముస్లిం వర్గాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. ప్రభుత్వ కార్యక్రమం అంటూ మొక్కుబడిగా నిర్వహించి, చేతులు దులుపుకుంటారా అని ప్రశ్నిస్తున్నారు. ఇఫ్తార్ పేరుతో అవమానించడం తగదంటూ నిలదీస్తున్నారు. ఒక్క అధికారి లేరు ప్రభుత్వం అధికారికంగా ప్రతి జిల్లాలో ముస్లింలకు ఇఫ్తార్ విందు ఇవ్వాలని నిర్ణయించింది. ఈ మేరకు అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లెలోని ఓ కల్యాణ మండపంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. దీనికి సంబంధించి అధికారులు నిర్వహణ బాధ్యతలను పర్యవేక్షించాల్సి ఉంది. అయితే ఈ పరిస్థితి పూర్తిగా లేదు. చిన్నస్థాయి ఉద్యోగి కూడా హాజరు కాలేదు. జిల్లాస్థాయి అధికారుల పర్యవేక్షణలో జరగాల్సి ఉండగా కొందరు టీడీపీ నేతలు నిర్వహించిన కార్యక్రమంగా మారిపోయింది. ఇఫ్తార్ విందుకు జిల్లాస్థాయిలో ముఖ్య నాయకులను, ప్రజా ప్రతినిధులను, ముస్లిం వర్గానికి చెందిన మత పెద్దలను అధికారులే ఆహ్వానించి ఏర్పాట్లు చేయాల్సి ఉంది. అయితే ఇవేమీ జరగలేదు. కనీసం ప్రభుత్వ కార్యక్రమం అన్న విషయాన్ని మరిచిపోయారు. ఒక్క అధికారి కూడా ఇటువైపు కన్నెత్తి చూడలేదు. ఒక్క ఎమ్మెల్యేనే.. ప్రభుత్వ ఇఫ్తార్ విందు అంటే జిల్లాలోని ఎమ్మెల్యేలు, మంత్రి హాజరు కావాల్సి ఉంటుంది. అయితే స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జిల్లా టీడీపీ అధ్యక్షుడు ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శి పటాన్ ఖాదర్ ఖాన్, మైనార్టీ విభాగం రాష్ట్ర నాయకులు ఎస్ఏ.మస్తాన్, పౌరసరాఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్ తాజ్.. ఇలా కొందరు టీడీపీ నేతలు హాజరయ్యారు. ఆదివారం జిల్లా మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి మదనపల్లెకు వచ్చి తిరిగి వెళ్లిపోయారు. ఆయన కూడా హాజరు కాలేదు. అధికారికంగా ఆయనను ఆహ్వానించారా లేదా అన్నది కూడా తెలియడం లేదు. తంబళ్లపల్లె, పుంగనూరు, పీలేరు ఎమ్మెల్యేలను ఆహ్వానించారా లేదా అన్నది కూడా తెలియని పరిస్థితి నెలకొంది. జిల్లాస్థాయిలో ప్రభుత్వం ఇచ్చిన ఇఫ్తార్ విందు సాదాసీదాగా ముగిసింది. అధికారులు లేరు, ప్రజాప్రతినిధులు లేరు. ఇలాంటి పరిస్థితుల్లో ఇది జిల్లా స్థాయి ఇఫ్తార్ విందు అవుతుందా అని ప్రశ్నిస్తున్నారు. -
భార్య అలిగి పుట్టింటికి వెళ్లిందని..
మదనపల్లెటౌన్ : భార్య అలిగి పుట్టినింటికి వెళ్లిందన్న కోపంతో భర్త ఆత్మహత్యకు యత్నించాడు. ఈ సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం, తెట్టు గ్రామం, ఆరోగ్యపురానికి చెందిన ప్రభుకుమార్(32) భార్య రవణమ్మ కుటుంబ సమస్యల కారణంగా భర్తతో గొడవపడి, అలిగి రెండు రోజుల క్రితం పుట్టింటికి వెళ్లింది. కాపురానికి పిలిచినా ఆమె రాకపోవడంతో తీవ్ర మనస్థాపానికి గురైన ప్రభుకుమార్ పురుగుల మందుతాగాడు. కుటుంబీకులు గమనించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్పించి చికిత్స అందించారు. అతని ఆరోగ్యం కుదుట పడక పోవడంతో తిరుపతి రుయాకు వెళ్లాలని వైద్యులు రెఫర్చేశారు. ముదివేడు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు.కుటుంబ సమస్యతో యువకుడు..మదనపల్లెటౌన్ : పురుగుల మందుతాగి యువకుడు ఆత్మహత్యకు యత్నించిన సంఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకుములకలచెరువు మండలం, పర్తికోటకు చెందిన మంజునాథ్(27), కుటుంబ సమస్యల కారణంగా ఇంట్లో వారితో గొడవపడ్డాడు. దీంతో తీవ్ర మనస్థాపాఆనికి గురై పురుగుల మందుతాగాడు. గమనించిన కుటుంబీకులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్తితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్చేశారు. ములకలచెరువు పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
నేటినుంచి అందుబాటులోకి అన్నప్రసాద వితరణ కేంద్రం
ఒంటిమిట్ట(రాజంపేట): ఒంటిమిట్ట కోదండరామాలయంలో సోమవారం నుంచి ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం అందుబాటులోకి రానుంది. ఈ మేరకు ఆదివారం ఉచిత అన్నప్రసాద వితరణ కేంద్రం ఏర్పాటుకు సంబంధించిన పనులు పూర్తి చేశారు. తూర్పు గాలిగోపురం ఎదురుగా మండపం సమీపంలో దాతల సహకారం, తిరుమల తిరుపతి దేవస్ధానం నిధులతో శ్రీ కోదండరామస్వామి ఆలయం ఉచిత అన్న ప్రసాదవితరణ కేంద్రాన్ని అందుబాటులోకి తీసుకొచ్చారు. ఒక బంతికి 200 మంది కూర్చొని భుజించేలా ఏర్పాటుచేస్తున్నామని తిరుమ తిరుపతి దేవస్ధానం డిప్యూటీ ఇంజినీరు (సివిల్) మాదాసి నాగరాజు తెలియజేశారు. పనులను ఇన్చార్జి డిప్యూటీ ఈవో శివప్రసాద్, టీటీడీ సివిల్ డీఈ నాగరాజు, ఆలయ సూపరింటెండెంట్ హనుమంతులు పర్యవేక్షించారు. కాగా బ్రహ్మోత్సవాలు ప్రారంభంకానున్న నేపథ్యంలో భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకొని తాత్కాలికంగా అన్నప్రసాదవితరణ కేంద్రాన్ని తీసుకొస్తున్నట్లు టీటీడీ అధికారులు తెలిపారు. . తొక్కిసలాట, తోపులాటకు తావులేకుండా ప్రశాంతంగా అన్నప్రసాదాలను భక్తులు స్వీకరించేలా సివిల్ ఇంజనీరింగ్ డిపార్టుమెంట్ డీఈ మాదాసి నాగరాజు నేతృత్వంలో ఏర్పాట్లు పూర్తి చేశారు. కాగా మూడు పూటల అన్నప్రసాదవితరణ కేంద్రం భక్తులకు సేవలందించనున్నట్లు టీటీడీ వర్గాలు తెలిపాయి. -
కారు, బైక్ ఢీ: యువకుడి దుర్మరణం
వల్లూరు : కడప – తాడిపత్రి ప్రధాన రహదారిలో మండల పరిధిలోని కొప్పోలు బస్టాపు వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కొప్పోలు ఎస్సీ కాలనీకి చెందిన పెద్దగాండ్ల బాలాజీ (27) అనే యువకుడు దుర్మరణం చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు సొంత పని మీద వల్లూరుకు వచ్చిన బాలాజీ ఇంటికి ద్విచక్రవాహనంలో బయలుదేరాడు. కొప్పోలు బస్టాపు వద్ద రోడ్డు దాటుకుంటుండగా కడప నుంచి కమలాపురం వస్తున్న కారు ఢీకొట్టింది. దీంతో బాలాజీ తీవ్రంగా గాయపడ్డాడు. బంధువులు, స్థానికులు 108 వాహనంలో చికిత్స కోసం కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం మార్చురీకి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
ఆ ఎమ్మెల్యేలకు సన్స్ట్రోక్!
సాక్షి ప్రతినిధి, కడప: ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో ఆ ఇద్దరు భాగస్వామ్య ఎమ్మెల్యేలు. ఆయా నియోజకవర్గాల్లో వారు శాసిస్తున్నా, తనయులు చట్టాలకు లోబడి మసలుకోవడంలో కట్టడి చేయలేకపోయారు. నిషేధిత మత్తు పదార్థాలు సేవిస్తూ పోలీసులకు పట్టుబడడంతో అభాసుపాలవుతున్నారు. ఫలితంగా ఆయా ఎమ్మెల్యేలకు ‘సన్’స్ట్రోక్ తప్పడం లేదు. వారే మైదుకూరు, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు సుధాకర్యాదవ్, ఆదినారాయణరెడ్డి. సరిగ్గా రెండున్నర్ర నెలల వ్యవధిలో జిల్లాకు చెందిన ఎమ్మెల్యే తనయులు ఇద్దరూ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టబడడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. పైగా పుట్టా సుధాకర్ యాదవ్ కుమారుడు మహేష్ యాదవ్ ఎంపీ కావడం గమనార్హం. ● జమ్మలమడుగు ప్రభుత్వ ఆస్పత్రి అభివృద్ధి కమిటీ మాజీ చైర్మన్, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్రెడ్డి ఈ ఏడాది జనవరి 3న డ్రగ్స్ కేసులో హైదరాబాద్ నార్శింగ్ పోలీసులకు చిక్కారు. పరీక్షలు నిర్వహించిన పోలీసులు డ్రగ్స్ పాజిటివ్ రావడంతో అదుపులోకి తీసుకున్నారు. ఆపై డ్రగ్ ఆడిక్షన్ సెంటర్కు అప్పగించారు. అప్పట్లో ఈవార్త తెలుగు రాష్ట్రాల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ తనయుడు ఏలూరు పార్లమెంటు సభ్యుడు మహేష్యాదవ్ ఈగల్ టీమ్ పోలీసులకు పట్టుబడ్డారు. తెలంగాణ మాజీ ఎమ్మెల్యే పైలెట్ రోహిత్రెడ్డి ఫామ్ హౌస్లో అనూహ్యంగా శనివారం రాత్రి పోలీసులకు చిక్కారు. ● మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ తనయుడు మహేశ్యాదవ్ మాజీ మంత్రి యనమల రామకృష్ణుడుకు అల్లుడు కావడంతో ఏలూరు లోక్సభ టీడీపీ అభ్యర్థిత్వం దక్కింది. ఆపై ఎన్నికల్లో పార్లమెంటు సభ్యుడుగా ఎన్నికయ్యారు. ఏలూరు ఎంపీగా ప్రాతినిథ్యం వహిస్తున్నారు. తాజాగా డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు చిక్కడం తెలుగురాష్ట్రాల్లో హాట్ టాపిక్గా మారింది. స్థాయి పెరిగినా వ్యక్తిత్వ లోపం... ఎమ్మెల్యే కొడుకు.. ఆపై ఎంపీ హోదా.. ఉన్నతంగా వ్యవహరించాల్సింది పోయి ఇలా డ్రగ్స్ కేసులో దొరకడంపై ప్రజలు తూర్పారబడుతున్నారు. స్థాయి..హోదా పెరిగినా తన బుద్దిని బహిర్గతం చేసుకున్నారని విశ్లేషకులు దెప్పిపొడుస్తున్నారు. కాంట్రాక్టర్గా హైదరాబాద్లో స్థిరపడినప్పటికీ ప్రజాజీవితంతో ముడిపడి ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాల్సి ఉంది. ఇవేవి లెక్క చేయకుండా ఏకంగా డ్రగ్స్ వ్యవహారంలో దొరికిపోవడంతో జిల్లాలో నవ్వులపాలయ్యారు. 2014 ఎన్నికల ముందు కూడా మహేష్యాదవ్ బ్రహ్మంగారిమఠం మండలానికి చెందిన వారి సామాజిక వర్గానికే చెందిన ఓ నేతను ఇష్టానుసారంగా దూషించారు. కులంపేరుతో రెచ్చగొట్టే చర్యలకు దిగారు. ఇదంతా సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. దాంతో అంతో ఇంతో మద్దతుగా నిలిచిన నేతలు సైతం రాత్రికి రాత్రే దూరమయ్యేలా మహేష్ యాదవ్ వ్యవహారశైలి కన్పించింది. ఆ ఎన్నికలల్లో టీడీపీ అభ్యర్థిగా బరిలో ఉన్న పుట్టా సుధాకర్ యాదవ్ ఓటమికి అది కూడా ఓ ప్రధాన కారణంగా నిలిచిందని పలువురు వెల్లడిస్తున్నారు. అప్పట్లో ప్రత్యక్ష రాజకీయాల్లో క్రీయాశీలకంగా లేరని సర్దిచెప్పుకున్నా, తాజాగా డ్రగ్స్ వ్యవహారంలో పట్టుబడడంతో తన బుద్ధి పోనిచ్చుకోలేదని పలువురు నిలదీస్తున్నారు. పుట్టా తనయుడు, ఎంపీ మహేష్ యాదవ్ మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్ఆది తనయుడు సుధీర్రెడ్డిజమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి నాడు డ్రగ్స్ కేసులో ఎమ్మెల్యే ఆది తనయుడు సుధీర్రెడ్డి తాజాగా మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ తనయుడు మహేష్యాదవ్ హైదరాబాద్ కేంద్రంగా డ్రగ్స్ వ్యవహారంలో తలమునకలు తీవ్ర చర్చనీయాంశంగామారిన వ్యవహారం జమ్మలమడుగు ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి తనయుడు సుధీర్రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే సుధాకర్యాదవ్ తనయుడు మహేష్యాదవ్ డ్రగ్స్ తీసుకుంటూ పోలీసులకు పట్టుబడి వారి తండ్రులకు మచ్చ తీసుకొచ్చారని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఈవ్యవహారంలో ప్రత్యక్ష రాజకీయాల్లో ఉన్న మహేష్యాదవ్ మరింతగా చెడ్డపేరు మూటగట్టుకున్నారు. రక్త నమూనాలో డ్రగ్స్ శాంపిల్స్ పాజిటివ్ లభించినా పార్లమెంటు సభ్యుడు కావడంతో స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపినట్లు సమాచారం. గడిచిన ఐదు నెలల క్రితం సైబర్ నేరస్తుల వలలో చిక్కుకున్న ఎమ్మెల్యే సుధాకర్యాదవ్కు తాజాగా ‘సన్’స్ట్రోక్ భారీగా తగిలింది. -
శుభాల రేయి షబ్–ఏ–ఖదర్
మదనపల్లె సిటీ: ముస్లింలకు శుభప్రదమైన, పుణ్యప్రదమైన రాత్రి షబేఖదర్ రానే వచ్చింది. దీనిని లైలతుల్ఖదర్ అని కూడా పిలుస్తారు. షబ్ అంటే రాత్రి, ఖద్ర్ అంటే ఉన్నతమైన అని అర్థం. రంజాన్ మాసంలో 27వ రాత్రి వచ్చే షబ్ ఏ ఖద్ర్ రోజునే పవిత్ర దివ్యఖురాన్ అవతరించిందని ముస్లింల నమ్మకం. సోమవారం ముస్లింలు లైలతుల్–ఖదర్ పర్వదినాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో జరుపుకోనున్నారు. ఈ పవిత్ర రేయంతా ఇషా నమాజ్ నుంచి తెల్లవారుజామున సెహరి వేళ వరకు ముస్లింలు అధ్యాత్మికంగా గడుపుతారు. పగలంతా రోజా ఉంటారు. రాత్రంతా ప్రత్యేక ప్రార్థనలు చేస్తారు. తరావీహ్ నమాజ్, బయాన్, హదీస్, ఖురాన్ తిలావత్, సలాతుజ్, తజ్బీ, తహజ్జుద్ నమాజ్, దువా ఇలా రేయంతా అల్లాహ్ ఆరాధనలో గడుపుతారు. తోబా, అస్తగ్ఫిరుల్లా చదివి తప్పుల నుంచి క్షమా పణ కోరి, నరకం, నరకాగ్ని నుంచి ముక్తి కోరుతారు. ఈ లైలతుల్ ఖద్ర్ రాత్రంతా జాగరణ చేసి, అధ్యాత్మికంగా గడిపిన వ్యక్తికి వెయ్యి నెలలకుపైగా ప్రార్థనలు చేసిన పుణ్యం లభిస్తుందని ముస్లింల విశ్వాసం. విద్యుద్దీపాల వెలుగుల్లో మదనపల్లెలోని జామియా మసీదు -
జీవితంపై విరక్తితో వ్యక్తి ఆత్మహత్య
లక్కిరెడ్డిపల్లి : జీవితంపై విరక్తి చెంది వంటేరు ప్రసాదు (26) అనే వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ గోల్గొండ శోభ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కస్తూరురాజుగారిపల్లికి చెందిన వంటేరు వ్రసాద్ భార్య మూడేళ్ల క్రితం మృతి చెందింది. దీంతో అప్పట్లో మృతుడిపై కేసు నమోదైంది. ఈ కేసుపై కొన్ని రోజులుగా కోర్టుకు వాయిదాలు తిరుగుతున్నాడు. గురువారం లక్కిరెడ్డిపల్లి కోర్టుకు వాయిదాకు వెళ్లి పందేళపల్లి సమీపంలోని వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో విషద్రావణం తాగి శుక్రవారం మృతి చెందాడు. ఆదివారం ఉదయం పశువుల కాపరులు ఆ మార్గంలో వెళ్తుండగా వెలిగల్లు ప్రాజెక్టు కాలువలో మృతదేహం కనిపించింది. వెంటనే వారు పోలీసులకు సమాచారం ఇచ్చారు, దీంతో పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య
ముద్దనూరు : మండల కేంద్రంలోని యానాదికాలనీకి చెందిన సుశీల(34) అనే వివాహిత మహిళ ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుంది.ఏఎస్ఐ శ్రీనివాసులరెడ్డి సమాచారం మేరకు వివరాలు..సుశీల తన భర్త నితిన్తో కలిసి డీఎన్పల్లె సమీపంలోని ఓ తోటలో కాపలాకూలీలుగా పనిచేస్తున్నారు.గత కొంత కాలంనుంచి కడపలో ఉన్న సుశీల తండ్రికి సంబంధించిన ఆస్తి విషయంలో ఆమె సోదరితో సమస్య నెలకొంది.ఈనేపథ్యంలో శనివారం రాత్రి సుశీల ఆమె భర్తతో కలసి తోట వద్ద తన తండ్రి ఆస్తివిషయంపై చర్చించి తీవ్ర మనస్థాపానికి గురైంది. అదే రోజు రాత్రి చీరతో ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది.ఆదివారం మృతురాలి భర్త ఫిర్యాదుమేరకు కేసు నమోదు చేసి దర్యాప్తుచేస్తున్నట్లు ఏఎస్ఐ తెలిపారు. నియామకంకడప కోటిరెడ్డిసర్కిల్ : భారతీయ జనతాపార్టీకి బత్తల పవన్ కుమార్ అందించిన సేవలు గుర్తించి పార్టీ అధిష్టానం నేచర్ వెల్ఫేర్ కౌన్సిల్ కడప జిల్లా చైర్మన్గా నియమించింది. ఈ సందర్భంగా పవన్ కుమార్ మాట్లాడుతూ తన నియామకానికి సహకరించిన బీజేపీ మాజీ రాష్ట్ర అధ్యక్షుడు, ఎమ్మెల్సీ సోము వీర్రాజు, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బీఎన్ మాధవ్, రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్య కుమార్, రాష్ట్ర అధికార ప్రతినిధి, ఏపీ మార్క్ ఫెడ్ డైరెక్టర్ వంగల శశిభూషణ్ రెడ్డి, పార్టీ జిల్లా అధ్యక్షులు జంగిటి వెంకటసుబ్బారెడ్డిలకు కృతజ్ఞతలు తెలిపారు. జిల్లాలో పర్యావరణ పరిరక్షణ కోసం కృషి చేస్తానని తెలియజేశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతిసిద్దవటం : మండలంలోని భాకరాపేట గ్రామం ఎంపీపీ స్కూల్ సమీపంలో ఆదివారం గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందారు. సమాచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని విచారించారు. ఈ సందర్భంగా ఎస్ఐ హారిక మాట్లాడుతూ భాకరాపేట గ్రామంలో గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడని మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీకి తరలించామన్నారు. ఎవరైనా అతన్ని గుర్తుపడితే 9121100581, 9121100584 నంబర్లకు సమాచారం తెలపాలని ఎస్ఐ తెలియజేశారు. అడవికి నిప్పుపెట్టిన గుర్తు తెలియని వ్యక్తులు కలసపాడు : మండలంలోని ముసల్రెడ్డిపల్లె గ్రామం వద్ద ఉన్న అడవికి ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు గ్రామానికి చెందిన పెద్దిరెడ్డి చిన్నవెంకటరెడ్డికి చెందిన సర్వే నంబర్ 105 లోని మామిడి తోటలోకి వ్యాపించాయి. గమనించిన రైతు స్థానికుల సహకారంతో మంటలను అదుపు చేశారు. ఈ ప్రమాదంలో ఆరు సంవత్సరాల వయస్సు గల 50 మామిడిచెట్లు, మూడు సంవత్సరాలు వయస్సు గల 80 శ్రీగంధం చెట్లు కాలిపోయాయి. కేసుల పరిష్కారంలో వైఎస్సార్ కడప జిల్లాకు ప్రథమ స్థానం కడప అర్బన్ : వైఎస్సార్ కడప జిల్లాలో ఈనెల 14న జరిగిన జాతీయ లోక్ అదాలత్లో 1,03,591 కేసులు పరిష్కారం చేసి లబ్ధిదారులకు రూ.24,01,72,158 కక్షిదారులకు చెల్లించారు. జిల్లా వ్యాప్తంగా 23 బెంచీలు ఏర్పాటు చేశారు. జాతీయ లోక్ అదాలత్ లో జిల్లావ్యాప్తంగా 103343 క్రిమినల్ కేసులు, 248 సివిల్ కేసులు, 53 ఫ్రీ లిటిగేషన్ కేసులు పరిష్కారమయ్యాయని జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని తెలియజేశారు. కడపలో 11720 కేసులు, పొద్దుటూరు, మైదుకూరులో 15303, రాజంపేటలో7116, రాయచోటిలో 9635, బద్వేల్లో 8105, జమ్మలమడుగులో 9700, సిద్ధవటంలో 5070, రైల్వేకోడూరులో 6117, పులివెందులలో 8394, నందలూరులో 6055, లక్కిరెడ్డిపల్లిలో 10093, కమలాపురంలో 6283 కేసులు పరిష్కారమైనట్లు చెప్పారు. కేసుల పరిష్కారానికి తోడ్పడిన న్యాయవాదులకు, రెవెన్యూ సిబ్బందికి, పోలీసు అధికారులకు, కృతజ్ఞతలను తెలియజేశారు. కేసుల పరిష్కారంలో వైఎస్ఆర్ కడప జిల్లా ప్రథమస్థానంలో నిలిచిందని చెప్పారు. -
ప్రాణం తీసిన బైక్ పొగ
● పుంగనూరులో విషాదం ● ఒకే కుటుంబంలో నలుగురు మృతి ● నిద్రలోనుంచి..మృత్యుఒడికి ● ప్రాణాలతో బయటపడ్డ బిందుకుటుంబ పెద్ద అమాయకత్వం ఆ ఇంటిలోని నలుగురి పాలిట శాపంగా పరిణమించింది. కుటుంబ పనుల కోసం సౌకర్యంగా ఉంటుందని కొనుగోలు చేసిన ద్విచక్ర వాహనం కన్న తండ్రి, కడుపున పుట్టిన బిడ్డలపాలిట మృత్యు శకటంగా మారింది. టూ వీలర్ నుంచి వెలువడిన విషవాయువులతో ఆదమర్చి గాఢ నిద్రలో ఉన్న నలుగురు విగత జీవులుగా మారారు. ఈ విషాదకర ఘటన ఆదివారం పుంగనూరు పట్టణంలో జరిగింది. పుంగనూరు : పుంగనూరులో విషాదం జరిగింది. ద్విచక్రవాహనం (బైక్) నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ పీల్చి ఊపిరాడక ఒకే ఇంటిలో నలుగురు మృతి చెందారు.. వివరాలు.. పట్టణంలోని త్యాగరాజవీధిలో నాయీబ్రాహ్మణ కులానికి చెందిన మురళి, ఆయన భార్య రేవతి, మురళి తండ్రి రామచంద్ర (75) ఉంటున్నారు. మురళికి కార్తీక్(15), బిందు (14)తో పాటు కవలపిల్లలు చందన(7), చరిత(7) ఉన్నారు. కార్తీక్ స్థానిక జెడ్పీ హైస్కూల్లో 7వ తరగతి చదువుతున్నాడు. చరిత, చందనలు ప్రైవేట్స్కూల్లో ఒకటో తరగతి చదువుతున్నారు. ఇలా ఉండగా మురళికి చెందిన ద్విచక్రవాహనం బోరుకు రావడంతో మెకానిక్ వద్దకు వెళ్లి శనివారం బాగు చేయించాడు. బైక్ను తీసుకొచ్చి రాత్రి మెకానిక్ సూచనల మేరకు స్టార్టింగ్లోనే ఇంటిలోని హాల్లో పెట్టాడు. మురళి దంపతులు మిద్దైపెన గల గదిలో పడుకున్నారు. తాత రామచంద్ర, మనవడు కార్తీక్ ,కవలపిల్లలు చరిత, చందనలు తాతతో కలసి నిద్రకు ఉపక్రమించారు. కాగా మరో మనవరాలు బిందు బంధువుల ఇంటికి వెళ్లడంతో ఆ పాప ఇంటిలో లేదు. ఇంట్లో కిటికీలు లేకపోవడంతో బైక్ నుంచి వచ్చే కార్బన్ మోనాకై ్సడ్ ఇంట్లో చుట్టుకుంది. తాత, మనవడు, మనవరాళ్లు ఆ విషవాయులను పీల్చడంతో రాత్రి నిద్రలోనే ప్రాణాలు కోల్పోయారు. ఉదయం మిద్దైపె నుంచి కిందకు వచ్చిన మురళి, ఆయన భార్య నలుగురు చనిపోయిన విషయాన్ని గమనించారు. పోలీసులకు ఫిర్యాదు చేశారు. సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించారు. కేసు దర్యాప్తు చేపట్టారు. మృతదేహాలను పోస్టుమార్టంకు తరలించారు. ఈ విషయం పట్టణంలో దావానలంలా వ్యాపించడంతో పట్టణ ప్రజలు అధిక సంఖ్యలో మురళి ఇంటికి వచ్చారు. మృతదేహాలకు నివాళులర్పించారు. ప్రాణాలతో బయటపడిన బిందు.. విషవాయువులు పీల్చి మృతి చెందిన కుటుంబంలో ఉన్న బిందు ప్రాణాలతో బయటపడింది. శనివారం తమ బంధువుల ఇంటికి వెళ్లింది. లేకపోతే విషవాయువులకు బిందు కూడా బలయ్యేది. ఎమ్మెల్యే, ఎంపీ పరామర్శ.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందిన విషయం తెలుసుకున్న మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ మిదున్రెడ్డిలు సంతాపం తెలిపారు. తక్షణమే మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషాను సంఘటన స్థలానికి పంపారు. బాధిత కుటుంబానికి అండగా నిలవాలని సూచించారు. బాధిత కుటుంబాన్ని ఆదుకుంటామని హామి ఇచ్చారు. -
మనసులో ముద్రించుకున్న జ్ఞానాన్ని కాగితంపై ఒలికించే క్షణం రానే వచ్చింది. ‘జవాబు’గా అక్షరరూపంలో రాసే సమయం ఆసన్నమైంది. సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధమైంది. తొలిసారిగా ‘పబ్లిక్ పరీక్ష’ రాస్తున్న ఓ విద్యార్థీ.. పరీక్షలనే భయాన్న
జిల్లాలో మొత్తం పదవ తరగతి విద్యార్థులు: 21,526 బాలురు: 10,598 బాలికలు: 10,928 కంపార్ట్మెంటల్: 623 జిల్లాలో పరీక్షా కేంద్రాలు: 124 ఓపెన్ స్కూలు విద్యార్థులు: 648 పరీక్షలకు సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు: 30 ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు: 09 పరీక్షల నిర్వహణకు ఉపయోగించే ఇన్విజిలేటర్లు, సిబ్బంది: 2602 పరీక్షల సమయం: ఉశ్రీశ్రీ 9.30 నుంచి 12.45 గంటల వరకు సాక్షి అన్నమయ్య: పదవ తరగతి పరీక్షలకు సమయం ఆసన్నమైంది. ఈ మేరకు విద్యాశాఖ ఏర్పాట్లు పూర్తి చేసింది. జిల్లా వ్యాప్తంగా 124 పరీక్షా కేంద్రాలను ఏర్పాటు చేసి పకడ్బందీగా నిర్వహించేందుకు అవసరమైన అన్ని చర్యలు చేపట్టారు. ఎక్కడికక్కడ పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలుతోపాటు సమీప ప్రాంతాల్లో జిరాక్స్ కేంద్రాలు, ఇతర ఇంటర్నెట్ సెంటర్లను కూడా మూసివేసేలా ఆదేశాలు జారీ చేశారు. విద్యార్థులకు ఆల్ ది బెస్ట్ అన్నమయ్య జిల్లాకు సంబంధించి మదనపల్లె, రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లె, పుంగనూరులలో ఓపెన్ స్కూలు విద్యార్థులను కలుపుకుని కంపార్టుమెంటల్, రెగ్యులర్ విద్యార్థుల పరంగా 22,149 మంది విద్యార్థులు ఉన్నారు. 124 పరీక్షా కేంద్రాల్లో సోమవారం జరిగే తొలి పరీక్షకు విద్యార్థులు హాజరు కానున్నారు. ఉదయం 9.30 గంటలకు పరీక్ష ప్రారంభమై మధ్యాహ్నం 12.45 గంటలకు ముగియనుంది. పదవ తరగతి పరీక్షలు రాసే విద్యార్థులందరికీ ‘సాక్షి’ ఆల్ ది బెస్ట్ చెబుతోంది. పరీక్షల నిర్వహణకు ప్రత్యేక స్క్వాడ్ బృందాలు జిల్లాలోని 124 కేంద్రాల్లో పదవ తరగతి పరీక్షలు జరగనుండగా మాస్ కాపీయింగ్తోపాటు ఇతర అక్రమాలను నిరోధించేందుకు జిల్లా విద్యాశాఖ స్క్వాడ్ బృందాలను నియమించింది. ఇందులో భాగంగా తొమ్మిది ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలతోపాటు 30 సిట్టింగ్ స్వ్కాడ్ బృందాలను కూడా సిద్ధం చేశారు. అంతేకాకుండా జిల్లా వ్యాప్తంగా 8 సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి విద్యాశాఖ ప్రత్యేక చర్యలకు ఉపక్రమించింది. పదవ తరగతి పరీక్షా కేంద్రాల్లో సుమారు 2 వేల మందికి పైగా సిబ్బందిని వివిధ విభాగాలకు సంబంధించి నియమించారు. ఆదివారం మదనపల్లె పరిఽధిలో రాష్ట్ర పరిశీలకులు నారాయణరావుతోపాటు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం పలు కేంద్రాలను పరిశీలించారు. పటిష్ట బందోబస్తు పరీక్షల నేపధ్యంలో కేంద్రాల వద్ద జిల్లా పోలీసు యంత్రాంగం పటిష్ట బందోబస్తు ఏర్పాట్లు చేసింది. ఎక్కడికక్కడ కేంద్రాల వద్ద ప్రజలు లేకుండా ఉండేందుకు చర్యలు చేపట్టారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమలు చేస్తున్నారు. అలాగే ప్రతి కేంద్రం వద్ద భద్రతా చర్యల్లో పోలీసు సిబ్బందిని నియమించారు. మదనపల్లె సిటీ: పదో తరగతి పరీక్షా కేంద్రాలను రాష్ట్ర విద్యాశాఖ ప్రత్యేక పరిశీలకులు నారాయణరావు మదనపల్లెలోని పలు పరీక్షా కేంద్రాలను పరిశీలించారు. ఆదివారం జెడ్పీ ఉన్నత పాఠశాలలోని పరీక్షా కేంద్రాలను చూశారు. పరీక్షా కేంద్రాల వద్ద అన్ని ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. ఆయన వెంట డీఈఓ సుబ్రమణ్యం, డివైఈఓ లోకేశ్వరరెడ్డి, జిల్లా పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ శ్రీనివాసరాజు, ఎఈఓలు ప్రభాకర్రెడ్డి, రాజగోపాల్ ఉన్నారు. పది పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి చేసిన విద్యాశాఖ పరీక్షల పర్యవేక్షణకు సిట్టింగ్, ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు అన్ని కేంద్రాల వద్ద పటిష్ట బందోబస్తు... 144 సెక్షన్ పరీక్షలకు ఏర్పాట్లు పూర్తి అన్నమయ్య జిల్లాలో పదో తరగతి పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. విద్యార్థులు ఉదయం నిర్ణీత సమయానికి కేంద్రానికి చేరుకోవాలి. పుస్తకాలు, ఇతర ఎలాంటి వస్తు సామగ్రి సమీప ప్రాంతాలకు తీసుకురాకూడదు. పరీక్షల పర్యవేక్షణకు ప్రత్యేకంగా సిబ్బందిని నియమించాం. ఎక్కడా ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా జిల్లా విద్యాశాఖ అన్ని చర్యలు చేపట్టింది. రాష్ట్ర పరిశీలకులు నారాయణరావు ఆధ్వర్యంలో పరీక్షలు సజావుగా నిర్వహించేందుకు కృషి చేస్తున్నాం. –డీఈఓ సుబ్రమణ్యం మదనపల్లెటౌన్: జిల్లాలో సోమవారం నుంచి ప్రారంభం కానున్న పదవ తరగతి వార్షిక పరీక్షలను పారదర్శకంగా నిర్వహించేందుకు పోలీసు శాఖ అన్ని ఏర్పాట్లు పూర్తిచేసిందని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఆదివారం ఆయన పోలీస్ అధికారులతో కలసి సమీక్ష నిర్వహించి బందోబస్తుపై కీలక ఆదేశాలు జారీచేశారు. జిల్లా వ్యాప్తంగా 124 సెంటర్లలో పరీక్షలు జరగనున్నాయని తెలిపారు. వాటిలో 88 పరీక్షా కేంద్రాల వద్ద గతంలో జరిగిన కొన్ని సంఘటనల దృష్ట్యా ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మరింత అప్రమత్తంగా వ్యవహరించనున్నట్లు పేర్కొన్నారు. పరీక్షా కేంద్రంలోకి ప్రవేశించే విద్యార్థులు, ఇన్విజిలేటర్లు, ఇతర సిబ్బందిని క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతనే అనుమతిస్తారన్నారు. విద్యార్థినుల కోసం, మహిళా పోలీసులను నియమించినట్లు తెలిపారు. పరీక్షా కేంద్రాల వద్ద 144 సెక్షన్ అమల్లో ఉంటుందని తెలిపారు. అనధికారిక వ్యక్తులు, తల్లిదండ్రులు గుమిగూడటం నిషేధం అన్నారు. పరీక్షా కేంద్రాలకు పరిసరాల్లో జిరాక్స్ సెంటర్లు, మూసివేయాలని ఆదేశించారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
సుండుపల్లె : అక్రమంగా తరలిస్తున్న 21 ఎర్రచందనం దుంగలను ఆదివారం స్వాధీనం చేసుకున్నట్లు సానిపాయి అటవీ శాఖ అధికారి వై.చంద్రశేఖర్రెడ్డి తెలిపారు. అన్నమయ్య జిల్లా అటవీ శాఖ అధికారి ఆదేశాల మేరకు రాయవరం సెక్షన్ రాయవరం క్రాస్ దగ్గర అటవీ శాఖ సిబ్బంది వాహనాలను తనిఖీ చేస్తుండగా ఒక ఇన్నోవా వాహనాన్ని ఆపడానికి ప్రయత్నించగా డ్రైవర్ ఆపకుండా వెళ్లాడు. అటవీ శాఖ సిబ్బంది దానిని వెంబడించి గుండ్లపల్లి సమీపంలోని గొల్లపల్లి చెరువు దగ్గర డ్రైవర్ కారును వెనుకకు మల్లించే క్రమంలో కారు బోల్తాపడింది డ్రైవర్ తప్పించుకొని పారిపోయాడు. అందులో 612 కేజీలు బరువున్న 21 ఎర్రచందనం దుంగలు, కారును అటవీ శాఖ సిబ్బంది స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ దాదాపు రూ.6 లక్షలు ఉంటుందని వారు తెలిపారు. అలాగే జిల్లెళ్ల మంద బీట్ సమీపంలోని పోర కనుమ ప్రదేశంలో 254 కేజీల బరువున్న 10 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఆయన తెలిపారు. వాటి విలువ రూ.1.25 లక్షలు ఉంటుందని ఆయన తెలిపారు. -
సర్వే ఎంప్లాయీస్ అసోసియేషన్ జిల్లా కార్యవర్గ ఎన్నిక
మదనపల్లె రూరల్ : ఆంధ్రప్రదేశ్ సర్వే ఎంప్లాయిస్ అసోసియేషన్, అన్నమయ్యజిల్లా కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఆదివారం జిల్లా సర్వే కార్యాలయ ఆవరణలో జరిగింది. జిల్లా ఎన్నికల అధికారి ఏ.సోమశేఖర్, అసిస్టెంట్ ఎలక్షన్ ఆఫీసర్ వై.ఎస్.సలీమ్ ఆధ్వర్యంలో నిర్వహించిన ఎన్నికల్లో జిల్లా అధ్యక్షులుగా పుంగనూరు మండల సర్వేయర్ బి.శ్రీనివాసులునాయక్, కార్యదర్శిగా గుర్రంకొండ మండల సర్వేయర్ జి.కిరణ్మయి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. కమిటీలో మదనపల్లె మండల సర్వేయర్ బీ.వి.సుబ్రహ్మణ్యం ఉపాధ్యక్షులుగా, చౌడేపల్లె విలేజ్ సర్వేయర్ బి.సురేంద్రనాయక్ జాయింట్ సెక్రటరీ, ములకలచెరువు మండల సర్వేయర్ ఎస్.మహమ్మద్ రఫీ ట్రెజరర్గా, డిస్ట్రిక్ట్ సర్వే కార్యాలయం జూనియర్ అసిస్టెంట్ సుజిత్ కుమార్, పెద్దమండ్యం మండల సర్వేయర్ ఎస్.హసీన్తాజ్, రాయచోటి విలేజ్ సర్వేయర్ ఎం.భారతి, పుంగనూరు విలేజ్ సర్వేయర్ బి.రామమూర్తి, జిల్లా సర్వే కార్యాలయం చైన్మెన్ బి.గంగయ్య, మదనపల్లె విలేజ్ సర్వేయర్ వై.చక్రపాణి నాయుడు ఎగ్జిక్యూటివ్ కమిటీ మెంబర్లుగా ఎన్నికయ్యారు. అన్నమయ్యజిల్లాలో సర్వేశాఖకు సంబంధించిన ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి నూత న కార్యవర్గం కృషి చేస్తుందని సభ్యులు తెలిపారు. -
ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వేదిక కావాలి
కడప ఎడ్యుకేషన్ : ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారానికి వైఎస్సార్ టీచర్స్ ఆసోసియేషన్ నూతన కార్యాలయం వేదిక కావాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి అన్నారు. కడపలోని నాగరాజుపేట స్మిత్ రోడ్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నూతన జిల్లా కార్యాలయాన్ని ఆదివారం వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథ్ రెడ్డి, మాజీ ఉప ముఖ్యమంత్రి అంజద్ బాష, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ. రామచంద్రారెడ్డి, కడప నగర మేయర్ పాకా సురేష్ కుమార్ ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాజీ ముఖ్యమంత్రి రాజశేఖర్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం వారు మాట్లాడుతూ ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం పూర్తి నిర్లక్ష్యం వహిస్తోందన్నారు. ఉపాధ్యాయులకు ఇవ్వాల్సిన బకాయిలు, ఐఆర్, నాలుగు డీఏలను పెడింగ్లో పెట్టారన్నారు. పీఆరీసీ నూతన కమిటీ చైర్మన్ను ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివ, వెస్ట్ జోన్ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, పార్టీ నాయకులు కృష్ణారెడ్డి, ఏపీ వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్నాథరెడి, ప్రధాన కార్యదర్శి కిరణ్, వైఎస్సార్సీపీ ఉపాధ్యాయ, ఉద్యోగ సంఘ జిల్లా అధ్యక్షుడు రమేష్, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ వెంకటనాథరెడ్డి, రాష్ట్ర ఉపాధ్యక్షుడు సురేష్రెడ్డి, జగన్మోహన్రెడ్డి, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ మల్లికార్జునరెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఘనంగా అన్నమాచార్యుల వర్ధంతి మహోత్సవాలు రాజంపేట : తాళ్లపాక అన్నమాచార్యుల 523 వర్ధంతి మహోత్సవాలు తాళ్లపాక, 108 అన్నమయ్య అడుగుల విగ్రహం వద్ద ఆదివారం ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా అన్నమయ్య విగ్రహానికి పాలు, పెరుగు, తేనే, పంచదార, టెంకాయ నీరు, పసుపు, గంధం, సుగంధ, పరిమళ ద్రవ్యాలతో అర్చకులు శుద్ధి చేశారు.అనంతరం హారతి, మహానివేదన చేపట్టారు. భక్తులు దర్శించుకుని తీర్ధప్రసాదాలను స్వీకరించారు. అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు నగరసంకీర్తనలో పాల్గొన్నారు. కడపలో వైఎస్సార్టీఏ కార్యాలయం ప్రారంభం -
బైక్లు ఢీ: ఒకరు మృతి
పుంగనూరు : మండలంలోని భీమగానిపల్లె సమీపంలో ఉన్న శ్రీకృష్ణదేవరాయుల విగ్రహం కూడలిలో ఆదివారం రెండు ద్విచక్రవాహనాలు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఒకరు మృతి చెందగా, ఇద్దరు గాయపడ్డారు. పట్రపల్లెకి చెందిన సుబ్బిరెడ్డి(65) పుంగనూరుకు సొంత పనులపై బైక్లో వస్తుండగా, పుంగనూరు నుంచి మదనపల్లెకు ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఎన్ఎస్.పేటకు చెందిన నజీర్(35 ) నదీమ్ (30) భీమగానిపల్లె సర్కిల్ వద్దకు రాగానే ఎదురెదురుగా ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో సుబ్బిరెడ్డి అక్కడేక్కడే మృతి చెందాడు. గాయపడిన వారిని స్థానికులు 108లో ఏరియా ఆసుపత్రికి తరలించి చికిత్సలు చేయించారు. ఈ మేరకు పోలీసులు, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మేసీ్త్ర అదృశ్యంపై కేసు నమోదుమదనపల్లెటౌన్ : మదనపల్లెలో మేసీ్త్ర అదృశ్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. టూటౌన్ పోలీసుల కథనం మేరకు.. స్థానిక ఎస్బీఐ కాలనీలో నివాసం ఉంటున్న మారెప్ప కుమారుడు ఎస్.సోమశేఖర్ (34), మేసీ్త్ర పనులు చేసేవాడు. ఈ క్రమంలో శుక్రవారం ఉదయం ఇంటి నుండి పనుల నిమిత్తం వెళ్లిన సోమశేఖర్ తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబీకులు పలుచోట్ల గాలించారు.ఆచూకీ లభించక పోవడంతో చేసేది లేక సోమశేఖర్ భార్య సోను టూ టౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు రెండో పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు తెలిపారు. మామిడి తోటలోకి దూసుకెళ్లిన కారులక్కిరెడ్డిపల్లె : రాయచోటి–వేంపల్లె జాతీయ రహదారి మార్గంలోని మద్దిరేవుల వంక సమీపంలో ఆదివారం రాత్రి బోయకొండ నుంచి వేంపల్లెకు వెళతున్న కారు అదుపుతప్పి మామిడి తోటలోకి దూసుకెళ్లింది. ఈ ఘటనలో ఇద్దరు యువకులు గాయపడ్డారు. స్థానికులు గమనించి కారులో ఇరుక్కున్న ఇద్దరిని బయటికి తీయడంతో ప్రమాదం తప్పింది. బ్రిడ్జ్కి అటువైపు ఇటువైపు ఎటువంటి ప్రమాద సూచిక బోర్డులు లేకపోవడంతో బ్రిడ్జి వద్ద పలు ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. డిగ్రీ విద్యార్థి అదృశ్యంవేంపల్లె : వేంపల్లెలోని స్థానిక బలిజ సంఘం వీధికి చెందిన నామా వెంకట పూజిత్ అనే డిగ్రీ విద్యార్థి అదృశ్యమైనట్లు విద్యార్థి తల్లిదండ్రులు శ్రీనువాసులు, హేమలత తెలిపారు. వెంకట పూజిత్ కడప నగరంలోని ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీకాం మొదటి సంవత్సరం చదువుతున్నాడు. శనివారం వేంపల్లె నుంచి కళాశాలకు వెళుతున్నానని ఉదయం 7 గంటలకు తల్లిదండ్రులకు చెప్పి వెళ్లిన విద్యార్థి ఆదివారం కూడా ఇంటికి రాలేదు. తల్లిదండ్రులకు చెందిన వాట్సాప్లో తాను ఇంటికి రాను, ఇంట్లో వాళ్లు చెబుతున్న పనులు చేయలేనని మెసేజ్ పంపినట్లు తెలిపారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో విద్యార్థి తల్లిదండ్రులు ఫిర్యాదు చేశారు. ఈమేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
మదనపల్లెలో ఎస్పీ కార్యాలయం ప్రారంభం
మదనపల్లెటౌన్:మదనపల్లెలో స్థానిక బెంగుళూరు రోడ్డులో అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభించారు. ఉద యం వేద పండితులతో కలసి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి ప్రత్యే పూజలు నిర్వహించారు. అనంతరం జిల్లా ఎస్పీ కార్యాలయాన్ని ప్రారంభించి మాట్లాడా రు. మదనపల్లె కేంద్రంగా అన్నమయ్య జిల్లా ఎస్పీ కార్యాలయం ప్రారంభించి, ప్రజలకు అందుబాటులో ఉంటామని పేర్కొన్నారు. ఇక నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జిల్లా ఎస్పీ కార్యా లయం నుంచి ఉంటుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో పట్టణంలోని సీఐలు, ఎస్ఐలు, సిబ్బంది పాల్గొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 16న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు ‘డయల్ యువర్ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా వినియోగదారులు మొబైల్ నంబర్ 89777 16661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8.30 గంటల నుంచి 9.30 గంటల వరకు ‘డయల్ యువర్ ఎస్ఈ’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లా స్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టిని తీసుకువచ్చేందుకు వీలుగా వినియోగదారులు 9440817449 నంబర్కు కాల్ చేయవచ్చు. ఈ అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఏపీఎస్పీడీసీఎల్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో వివరించారు. రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్ధలిలోని సిద్దేశ్వరస్వామి ఆలయాన్ని తెలంగాణా పోలీస్ అధికారి డా.తరుణ్జోషి ఆదివారం దర్శించుకున్నారు. ఆలయంలో ఏకాతాతయ్యను దర్శించుకున్నారు. అన్నమాచార్యులు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామిని కూడా దర్శించుకున్నారు. కడప ఎడ్యుకేషన్: విద్యాశాఖ చరిత్రలో ఎప్పుడూ లేని విధంగా ఈ ఏడాది పదవ తర గతి పబ్లిక్ పరీక్షల తంతు సాగుతోంది. ఇన్విజిలేటర్లు మొదలుకుని చీఫ్లు, డీఓలను జిల్లా పరిధిలో డీఈఓ కాకుండా రాష్ట్ర కమిషనర్ కార్యాలయం నుంచి నేరుగా విధులను కేటా యించడం గందరగోళానికి గురి చేస్తోంది. పైగా ఈ ఏడాది పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు ఇన్విజిలేటర్లుగా ప్రైవేటు స్కూల్ టీచర్లను నియ మించారు. గతంలో పరీక్షల నిర్వహణకు అనుభవం ఉన్న టీచర్లను సూపరింటెండెంట్లుగా, డిపార్టుమెంట్ల్ ఆఫీసర్లుగా నియమిస్తూ దీర్ఘకాలిక ఆరోగ్య సమస్యలున్న వారికి మినహాయింపు ఇచ్చే వారు. ప్రస్తుతం సీనియర్ ఉపాధ్యాయుల సమస్యలను పరిగణనలోకి తీసుకోకుండా విధులను కేటాయించడం గమనార్హం. అదే విధంగా ఇన్విజిలేటర్లగా గతంలో ఎప్పు డూ లేని విధంగా 25 శాతం మంది ప్రైవేటు స్కూల్ టీచర్లకు పరీక్షల డ్యూటీలు నియమించడంపై సర్వత్రా చర్చనీయాంశమవుతోంది. ఇన్విజిలేషన్ డ్యూటీ ఎంతో బాధ్యతాయుమైనది. కేంద్రాల్లో ఏదైనా తప్పు జరిగితే ప్రభుత్వ స్కూల్ టీచర్లపై కఠిన చర్యలు తీసుకుంటారనే భయంతోనైనా టీచర్లు అక్రమాలకు ఆస్కారం లేకుండా విధులు నిర్వహిస్తారు. కానీ ప్రైవేటు స్కూల్ టీచర్లు తప్పులు చేసినా వారిపై విద్యా శాఖ ఎలాంటి చర్యలు తీసుకోదని అలాంటి సమయంలో సీఎస్, డీఓలను బాధ్యులను చేసే అవకాశం ఉంటుందని ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లెటౌన్ : కుటుంబ సమస్యలతో మహిళ ఆత్మహత్యాయత్నంకు పాల్పడింది. ఈ సంఘటన ఆదివారం రామసముద్రం మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు మండలంలోని ఎర్రప్పల్లికి చెందిన గురప్ప భార్య శాంతమ్మ(37) కుటుంబ సమస్యలతో ఇంట్లో గొడవపడింది. దీంతో తీవ్ర మనస్థాంచెంది పురుగుల మందుతాగింది. గమనించిన కుటుంబీకులు ఆమెను చికిత్సల నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకొచ్చారు. పరీక్షించిన వైద్యులు ఆస్పత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. రామసముద్రం పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కారు,ట్రావెల్స్ బస్సు ఢీ
ఇద్దరు దుర్మరణం, మరో ఇద్దరికి తీవ్ర గాయాలుకడప అర్బన్ : కడప నగర శివారులోని కడప– తిరుపతి హైవేలో ఈనెల 13వ తేదీ రాత్రి హెచ్పీ పెట్రోల్ ఫిల్లింగ్ స్టేషన్, టాటా షోరూం సమీపంలో కారును, ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు అక్కడికక్కడే దుర్మరణం చెందారు. మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. కడప ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ సీఐ సురేష్ రెడ్డి తెలిపిన వివరాల మేరకు.. తమిళనాడు రాష్ట్రం తిరువళ్లూరు జిల్లా పల్లిపట్టు గ్రామానికి చెందిన పవన్ కుమార్ (27), నాగ మేనక (28)తో పాటు బెంగళూరు నగరానికి చెందిన వెంకటరాజు (54), సాయి (26) కారులో తమ గ్రామం నుంచి హైదరాబాద్కు బయలుదేరి వెళుతుండగా కడపలో ఎదురుగా ట్రావెల్స్ బస్సు వేగంగా వచ్చి కారును ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో మేనక, పవన్కుమార్ మృతిచెందగా, మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారు ప్రస్తుతం రిమ్స్లో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు కడప ట్రాఫిక్ సీఐ తెలిపారు. -
మేము ఎక్కాల్సిన రైలు జీవితకాలం లేటు
రాజంపేట : జిల్లా కేంద్రం కడప నుంచి ఐటీ రాజధాని బెంగళూరుకు రైలు ప్రయాణం చేయాలన్న జిల్లా వాసుల ఆకాంక్ష దశాబ్దాలుగా అపరిష్కృతంగానే మిగిలిపోయింది. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో కడప–బెంగళూరు మధ్య నేరుగా రైలు మార్గం పనులకు శ్రీకారం చుట్టినప్పటికీ, అది నేటికీ పూర్తిస్థాయిలో అందుబాటులోకి రాలేదు. ఫలితంగా వేలాది మంది సాఫ్ట్వేర్ ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారులు నిత్యం ప్రైవేటు ట్రావెల్స్ దోపిడీకి గురవుతూ, భారీ వ్యయంతో బస్సుల్లో ప్రయాణించాల్సి వస్తోంది. పరిష్కారం ఉన్నా పట్టించుకోరా? జిల్లా వాసుల ఇబ్బందులకు మైసూరు–రేణిగుంట సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ (22135/22136) పొడిగింపు రూపంలో ఒక చక్కని పరిష్కారం కనిపిస్తోంది. ప్రస్తుతం వారానికి ఒకసారి నడుస్తున్న ఈ రైలు శనివారం ఉదయం 8 గంటలకే రేణిగుంట చేరుకుని, తిరిగి సాయంత్రం 5 గంటల వరకు అక్కడే ఖాళీగా (స్టేబుల్) ఉంటోంది. ఈ తొమ్మిది గంటల విరామ సమయంలో రైలును లైనుపై నిలపడం వల్ల ఇతర రైళ్ల రాకపోకలకు ఆటంకం కలగడమే కాకుండా, ప్లాట్ఫారమ్ రద్దీ పెరిగి అనేక రైళ్లు ఔటర్లో ఆగాల్సిన దుస్థితి నెలకొంది. అదే సమయంలో ఈ రైలును కడప వరకు నడిపితే లైను రద్దీ తగ్గడమే కాకుండా, జిల్లా వాసులకు వారంతంలో బెంగళూరు వెళ్లేందుకు మార్గం సుగమమవుతుంది. దీనికి కడప, నందలూరు, రాజంపేట, కోడూరు స్టేషన్లలో హాల్టింగ్ కల్పిస్తే వేలాది మందికి లబ్ధి చేకూరుతుంది. అటకెక్కిన పాత మార్గం.. అంతుచిక్కని కొత్త లైను కడప–బెంగళూరు రైలు మార్గానికి 2008–09 బడ్జెట్లో ఆమోదం లభించింది. 2010లో రూ.1000 కోట్ల అంచనా వ్యయంతో పనులు ప్రారంభమైనా, వైఎస్సార్ మరణం తర్వాత అవి పెండ్లిమర్రి వద్దే ఆగిపోయాయి. మరోవైపు 2020లో రూ.2,505 కోట్ల అంచనా వ్యయంతో ముద్దనూరు–ముదిగుబ్బ కొత్త లైనును తెరపైకి తెచ్చినా, అది కాగితాలకే పరిమితమైంది. పొరుగు జిల్లాల నుంచి బెంగళూరుకు అనేక రైళ్లుఉన్నా, కడపజిల్లా పట్ల రైల్వేఅధికారులు చూపుతు న్న వివక్షపై ప్రజాసంఘాలు మండిపడుతున్నాయి. బెంగళూరుకు పట్టాలెక్కని కల.. కడపకు రైల్వే శాఖ మొండిచెయ్యి! దశాబ్దాల నాటి డిమాండ్.. అటకెక్కిన వైఎస్సార్ హయాం నాటి ప్రాజెక్టు మైసూరు ఎక్స్ప్రెస్ను పొడిగిస్తే తీరనున్న జిల్లా వాసుల ఇబ్బందులు రేణిగుంటలో రైలు ‘విశ్రాంతి’.. జిల్లా ప్రయాణికులకు ‘అశాంతి’ -
ముస్లింల రుణం తీర్చుకోలేం
● ఇఫ్తార్కు రూ.4.35 లక్షలు ● ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ మిధున్రెడ్డిఇఫ్తార్ విందుకు విరాళం అందిస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్రెడ్డిఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపి మిధున్రెడ్డిలకు స్వాగతం పలుకుతున్న ముస్లింలుపుంగనూరు : ముస్లింలకు ఎంత సేవ చేసినా వారి రుణం తీర్చుకోలేమని వైఎస్సార్సిపి రీజనల్ కోఆర్డినేటర్ మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి తెలిపారు. శనివారం పట్టణంలోని అంజుమన్ కమిటీ హాల్లో ఎమ్మెల్యే, ఎంపీలు ముస్లింలకు ఇఫ్తార్విందు ఏర్పాటు చేశారు. పట్టణంలోని 29 మసీదుల్లో ఇఫ్తార్ నిర్వహించేందుకు ప్రతి ఏటా ముస్లింలకు పెద్దిరెడ్డి కుటుంబం ఇఫ్తార్ విరాళం రూ. 4.35 లక్షలను ఎమ్మెల్యే పంపిణీ చేశారు.అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ వైఎస్సార్సీపీకి ముస్లింలు వెన్నెముకగా నిలిచారన్నారు. తమ కుటుంబానికి తొలినుంచి ముస్లింలు అండగా ఉంటున్నారని తెలిపారు. ముస్లింల అభివృద్ధికి తమ కుటుంబం సేవ చేస్తుందని చెప్పారు. ఈ సందర్భంగా ముస్లింలకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, మైనార్టీ కార్పొరేషన్ చైర్మన్ ఇక్భాల్, ముతవల్లిలు, అంజుమన్ కమిటీ అధ్యక్షుడు ఎంఎస్.సలీం, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్షరీఫ్, వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ము, వైఎస్సార్సిపి రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, బైరెడ్డిపల్లి రెడ్డెప్ప, జింకావెంకటాచలపతి, ఎంపిపి భాస్కర్రెడ్డి, అమరనాథరెడ్డి, కొత్తపల్లె చెంగారెడ్డి, ముస్లిం పెద్దలు కిజర్ఖాన్, ఇంతియాజ్, నూరుల్లా, ఖాదర్, మహబూబ్బాషా, ఇర్ఫాన్ పాల్గొన్నారు. బాబు మాటలు నమ్మకండి.. తెలుగుదేశం ప్రభుత్వాధినేత చంద్రబాబు నాయుడు మాటలు నమ్మరాదని పెద్దిరెడ్డి సూచించారు. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలు చంద్రబాబు అమలు చేయలేదని దుయ్యబట్టారు. ముస్లింలకు ఏనాడు గుర్తింపు ఇవ్వలేదని ఆరోపించారు. పరిపాలనలో భాగస్వామిగా ఉన్న ఉపముఖ్యమంత్రి ఏమైన పట్టించుకుంటున్నారా అంటూ నిలదీశారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ఇచ్చిన హామీలని నేరవేర్చారని, ముస్లిం మైనార్టీలకు అగ్రస్థానం కల్పించారని పేర్కొన్నారు. జగన్కు అండగా ఉండాలని, ఆయనను తిరిగి ముఖ్యమంత్రిని చేసుకునేందుకు కృషి చేయాలని కోరారు. వక్ఫ్బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలి:ఎంపీ రాష్ట్రం, దేశంలో ఉన్న వక్ఫ్బోర్డు ఆస్తులను మనమే కాపాడుకోవాలని ఎంపీ మిధున్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఆయన ఇఫ్తార్ విందులో ముస్లింలతో కలిసి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి సూచనల మేరకు వక్ఫ్బోర్డు బిల్లును వ్యతిరేకించామన్నారు. రాష్ట్రంలో వక్ఫ్బోర్డు ఆస్తులను కాపాడుతామన్నారు. ప్రస్తుతం ఇతర సంస్థల ద్వారా ప్రభుత్వం వక్ఫ్ బోర్డు ఆస్తులను అన్యాక్రాంతం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం ముస్లింలకు రంజాన్ శుభాకాంక్షలు తెలిపారు. -
కుమారుడితో కలిసి దొంగతనాలు చేయించిన తల్లి, అక్క అరెస్ట్
● రూ.7.50 లక్షల విలువైన బంగారు నగలు స్వాధీనం ● వివరాలు వెల్లడించిన కడప చిన్నచౌక్ సీఐ ఓబులేసుకడప అర్బన్ : కడప నగరంలోని పలు ప్రాంతాల్లో జరిగిన దొంగతనాల కేసులను చిన్నచౌక్ పోలీసులు ఛేదించారు. కుమారుడు, అతని స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయిస్తున్న తల్లి, అక్కను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.7 లక్షల 50 వేల విలువ చేసే 50 గ్రాముల బంగారు వస్తువులను స్వాధీనం చేసుకున్నట్లు కడప చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. అరెస్టు అయిన వారిలో కడప నగరం ఎం. జె కుంట చెందిన ఉదయగిరి అమ్మాజాన్, చిరిదాపల కులాయమ్మలు ఉన్నారని తెలిపారు. తన కుమారుడు పెద్ద కుల్లాయప్ప అలియాస్ లడ్డూ, అతని స్నేహితులతో కలిసి కడపలోని శంకరాపురం, చిన్నచౌక్ ప్రాంతం, ఎర్రముక్కపల్లి, ఏపీహెచ్బీ కాలనీ ప్రాంతాల్లో జరిగిన 5 దొంగతనాల కేసుల్లో తమ పాత్ర ఉన్నట్లు నిందితురాలు నేరాన్ని అంగీకరించినట్లు తెలిపారు. లడ్డూను గతంలో అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు సీఐ తెలిపారు. వీరు గతంలో కూడా చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ పరిధిలో పలు కేసుల్లో నిందితులుగా ఉన్నట్లు వెల్లడించారు. పెద్ద కుల్లాయప్పపై కడప జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్లలో ఇప్పటికే దొంగతనాల కేసులు నమోదై ఉన్నాయని తెలిపారు. వీరు తమ కుమారుడికి అండగా నిలుస్తూ, అతని స్నేహితులతో కలిసి దొంగతనాలు చేయించి, దొంగిలించిన సొత్తును కుదువకు పెట్టడం లేదా అమ్మడం ద్వారా జీవనం సాగిస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. కుమారుడిని పోలీసులు అరెస్ట్ చేసే సమయంలో పోలీసుల విధులకు ఆటంకం కలిగించడం, ఆత్మహత్య చేసుకుంటామని బెదిరించడం వంటి చర్యలు కూడా చేస్తూ వచ్చారన్నారు. గతంలో ఒక సందర్భంలో తన కుమారుడిని విడుదల చేయకపోతే విషపదార్థం తాగి ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించి ఘటన కూడా జరిగినట్లు పేర్కొన్నారు. వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు, కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఎ. వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో చిన్నచౌక్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ జి. ఓబులేసు, ఎస్ఐలు ఎన్. రాజరాజేశ్వరరెడ్డి, యు. ప్రతాప్ రెడ్డి పోలీసు సిబ్బంది ప్రత్యేక నిఘా ఏర్పాటు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. దొంగతనాల కేసులను ఛేదించి నిందితులను అరెస్ట్ చేసిన సీఐ,ఎస్ఐలను, పోలీసు సిబ్బందిని కడప సబ్ డివిజినల్ పోలీస్ అధికారి ఎ. వెంకటేశ్వర్లు అభినందించి రివార్డులకు సిఫార్సు చేసినట్లు తెలిపారు. -
పదో తరగతి పరీక్షలకు సర్వం సిద్ధం
● 124 కేంద్రాల్లో 22,149 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు ● 8 సమస్యాత్మక కేంద్రాల్లో సీసీ కెమెరాలు, 9 ఫ్లయింగ్ స్క్వాడ్స్ ● విద్యార్థులకు అందుబాటులో హెల్ప్లైన్ నెంబర్.91000 40686 మదనపల్లె సిటీ : పదో తరగతి పరీక్షలు పకడ్బందీగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సర్వం సిద్ధం చేసిందని డీఈఓ సుబ్రహ్మణ్యం తెలిపారు. శనివారం స్థానిక డీఈఓ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. మార్చి 16 నుంచి ఏప్రిల్ 1వతేదీ వరకు పరీక్షలు జరుగుతాయన్నారు. ఉదయం 9.30 గంటల నుంచి మధ్యాహ్నం 12.45 వరకు కొనసాగుతాయన్నారు. అన్నమయ్యజిల్లాలో 124 కేంద్రాల్లో 22,149 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారన్నారు. పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా సమయానికి అరగంట ముందుగా కేంద్రాలకు చేరుకోవాలన్నారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి 1,177 మంది ఇన్విజిలేటర్లను, 124 కేంద్రాలకు 248 చీఫ్ సూపరిండెంట్ డిపార్ట్మెంట్ ఆఫీసర్లను నియమించామన్నా రు. జిల్లాలో 8 పరీక్ష కేంద్రాలను సమస్యాత్మక కేంద్రాలుగా గుర్తించి సీసీ కెమెరాలు ఏర్పాటుచేసినట్లు తెలిపారు. చింతపర్తి, సీటీఎం పరీక్ష కేంద్రాలను పరిశీలించామని, ఎక్కడ ఎలాంటి ఇబ్బంది తలెత్తినా వెంటనే తమ దృష్టికి తేవాల్సిందిగా సిబ్బందికి ఆదేశాలిచ్చామన్నారు. స్టేట్ అబ్జర్వర్ ఆధ్వర్యంలో తొమ్మిది మంది ఫ్లయింగ్ స్క్వాడ్ సిబ్బందికి ప్రత్యేక మీటింగ్ నిర్వహిస్తామన్నారు. పదోతరగతి పరీక్షలపై విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి ఫిర్యాదులు స్వీకరించేందుకు డీఈఓ కార్యాలయంలో హెల్ప్లైన్ నెంబర్ 91000 40686 ఏర్పాటుచేశామని, సోమవారం ఉదయం 6 గంటల నుంచి 24 గంటలు అందుబాటులో ఉంటుందన్నారు. మంచి ఫలితాలతో అన్నమయ్యజిల్లాను రాష్ట్రంలో మొదటిస్థానంలో నిలపాలని విద్యార్థులను కోరారు. విద్యార్థులందరికీ ఆల్ ది బెస్ట్ చెప్పారు. -
నమో నారసింహా
గుర్రంకొండ : మండలంలోని తరిగొండలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో శనివారం టీటీడీ ఆధ్వర్యంలో స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అలంకరించారు. వేకువజామున స్వామివారికి అభిషేకాలు జరిపారు. తోమాలసేవ, ఏకాంత సేవ కావించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికు చేరుకొని స్వామివారిని దర్శించుకున్నారు. మామిడి తోటకు నిప్పుచౌడేపల్లె : మండలంలోని 29 ఏచింతమాకులపల్లె పంచాయతీ ఖాన్సాబ్మిట్టకు చెందిన అన్సర్బాషాకు చెందిన మామిడితోట కంచెకు శనివారం గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టారు. మంటలు మామిడి తోట చుట్టూ వ్యాపించడంతో గుర్తించిన రైతు పుంగనూరు ఫైర్ సిబ్బందికి సమాచారం ఇచ్చారు.ఫైర్ ఆఫీసర్ సుబ్బరాజు ఆధ్వర్యంలో వారు ఘటనా స్థలానికి చేరుకొన్నారు. వాహనం వెళ్లడానికి దారిలేకపోవడంతో ఫైర్ బీటర్స్, గ్రామస్తులు కలిసి మంటలను అదుపుచేశారు. సుమారు రూ:20 వేల వరకు ఆస్తినష్టం వాటిల్లినట్లు రైతు తెలిపారు. నేడు ఏపీ వైఎస్సార్టీపీ జిల్లా కార్యాలయం ప్రారంభంకడప ఎడ్యుకేషన్ : కడప నగరం జిల్లా పరిషత్ సమీపంలోని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టా కార్యాలయం వద్ద ఏపీ వైఎస్సార్ టీచర్ అసోసియేషన్ జిల్లా కార్యాలయాన్ని ఆదివారం ప్రారంభిస్తున్నట్లు వైఎస్సార్ టీఏ జిల్లా అధ్యక్షుడు సింగారెడ్డి అమర్నాథరెడ్డి, ప్రధాన కార్యదర్శి కిరణ్లు తెలిపారు. వైఎస్సార్ సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి తదితరులు కార్యక్రమానికి హాజరవుతారని వారు తెలిపారు. -
మహిళ అదృశ్యం పై కేసు నమోదు
మదనపల్లెటౌన్: మహిళ అదృశ్యంపై పోలీసులు కేసు నమోదుచేశారు. ఇందుకు సంబంధించి మదనపల్లె తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ శనివారం మీడియాకు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, కోళ్లబైలు గ్రామం, నీరుగట్టువారిపల్లె వద్ద ఉన్న వెంకటేశ్వరపురానికి చెందిన షేక్ మహమ్మద్ రవూఫ్ భార్య మెహతాజ్ బేగం పిల్లలకు తినుబండారాలు తీసుకురావడానికి అంగడికి వెళుతున్నానని ఇంట్లో చెప్పి వెళ్లింది. తిరిగి రాకపోవడంతో రవూఫ్ బంధువుల ఇళ్లల్లో ఆరా తీసినా భార్య ఆచూకీ లభించలేదు. దీంతో చేసిది లేక స్థానిక తాలూక పోలీసులను ఆశ్రయించి శనివారం ఫిర్యాదు చేశాడు. ఈమేరకు కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. పిచ్చికుక్క దాడి:ఐదుగురికి గాయాలు చౌడేపల్లె : మండలంలోని ఏ.కొత్తకోట గ్రామంలో శనివారం పిచ్చి కుక్క వీరంగం సృష్టించింది. ఈ ఘటనలో ఐదుగురికి తీవ్రగాయాలయ్యాయి. పది ఆవుదూడలను ఇష్టానుసారంగా కరిచింది. చంద్రమౌళి, కత్తి కృష్ణారెడ్డి ,బీహార్బాషాలతో పాటు మరో ఇద్దరిని కరిచింది. అలాగే వెంకటరమణ, వసంతమ్మ, చంద్రమౌళిలకు తోపాటు మరో ఏడుగురికి చెందిన ఆవుదూడలను కరిచినట్లు స్థానికులు తెలిపారు. గాయపడిన వారిని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించి వైద్యసేవలందించారు. నియామకంసాక్షి అన్నమయ్య : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు వైఎస్సార్ సీపీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగం కార్యదర్శిగా రాయచోటికి చెందిన వాయలపాటి ఆనంద్కుమార్రెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ కేంద్ర కార్యాలయంలో ఉత్తర్వులు జారీ చేసింది. వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా రుక్మిణమ్మ చిత్తూరు కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శిగా పుంగనూరు నియోజకవర్గానికి చెందిన రుక్మిణమ్మ నియమితులయ్యారు. ఆమేరకు వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం శనివారం ఒక ప్రకటనలో తెలియజేసింది. -
కారు ఢీ: వ్యాపారికి తీవ్రగాయాలు
మదనపల్లెటౌన్ : బి.కొత్తకోట మండలంలో కారు ఢీకొని చెక్కిలాల వ్యాపారి తీవ్రంగా గాయపడ్డాడు. శనివారం జరిగిన ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. బి.కొత్తకోట పట్టణానికి చెందిన శ్రీరాములు(52), ఇంట్లో తయారు చేసిన చెక్కిలాలు, నిప్పట్లు, మురుకులను పల్లెలకు తీసుకెళ్లి రోజూ విక్రయించి వచ్చేవాడు. ఈ క్రమంలో రోజూ మాదిరిగానే శనివారం శ్రీరాములు బైకులో చెక్కిలాలను తీసుకుని కాండ్లమడుగు క్రాస్ వద్దకు వ్యాపారం నిమిత్తం వస్తుండగా, కోళ్ల ఫారం వద్దకు రాగానే కారు వేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకొచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, అతని పరిస్థితి ఆందోళన కరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్చేశారు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సిఐ గోపాల్ రెడ్డి తెలిపారు. -
పట్టపగలే చోరీ:10 తులాల బంగారం అపహరణ
గాలివీడు : మండలపరిధి నూలివీడు గ్రామంలోని వడ్లపల్లిలో శనివారం పట్టపగలే చోరీ జరిగింది. గ్రామానికి చెందిన శిబ్యాల ప్రమీలమ్మ ఇంటిలో ఎవరూ లేని సమయంలో దొంగలు చొరబడి సుమారు 10 తులాల బంగారం, వెండి గొలుసులు, నగదును దోచుకెళ్లినట్లు బాధితురాలు తెలిపారు. ఉదయం కుటుంబ సభ్యులు గొర్రెలను మేపడానికి బయటకు వెళ్లిన సమయంలో ఈ ఘటన జరిగినట్లు తెలిసింది. ఇంటికి తిరిగి వచ్చిన తర్వాత తలుపులు తెరిచి ఉండటం గమనించిన ప్రమీలమ్మ లోపలికి వెళ్లి చూడగా నగలు, నగదు కనిపించకలేదు. సమాచారం అందుకున్న గాలివీడు ఎస్ఐ నరసింహారెడ్డి సిబ్బందితో కలిసి ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
అధికారాన్ని అడ్డం పెట్టుకొని ఎమ్మెల్సీ అక్రమాలు
● ప్రకాష్ నగర్లో 2.10 ఎకరాలు ఆక్రమించేందుకు యత్నం ● బాధితుడు అంబవరం సహదేవరెడ్డి ఆరోపణకడప కార్పొరేషన్ : అధికారాన్ని అడ్డంపెట్టుకొని ఎమ్మెల్సీ సి.రామచంద్రయ్య అక్రమణలకు పాల్పడుతున్నారని కడప నగరానికి చెందిన అంబవరం సహదేవరెడ్డి ఆరోపించారు. శనివారం వివాద స్థలం వద్ద వారు మీడియాతో మాట్లాడుతూ కడప నగరంలో చిన్నచౌకు గ్రామ పొలంలో సర్వే నంబర్ 9.8 నందు 22.50 ఎకరాల భూమిపై కుటుంబ సభ్యుల మధ్య వివాదం నడుస్తోందన్నారు. ఇందులో కోర్టు 4.20 ఎకరాలను సబ్ డివిజన్ చేసి 1ఏ, 2బీగా నిర్ణయించి, నాకు, మా అన్నదమ్ములకు చెరి సగం పంచుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చిందన్నారు. ఈ ఆస్తిపై ఎమ్మెల్సీ సి. రామచంద్రయ్య కన్నేసి కాజేయాలని చూస్తున్నారని ఆరోపించారు. ఈ భూమి రూ.30కోట్ల విలువ చేస్తుందని, అందువల్ల తనపై, తన కుటుంబ సభ్యులపై దౌర్జన్యానికి, బెదిరింపులకు పాల్పడుతూ మానసికంగా వేధిస్తున్నారన్నారు. 2006 సంవత్సరం నుంచి 2018 వరకు ఈ కేసు కోర్టులో నడిచి తీర్పు వచ్చిందన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి మాకు సంబంధించిన 2.10 ఎకరాల భూమిలో రోడ్డు, ప్లాట్లు వేసి దౌర్జన్యంగా కబ్జా చేయాలని చూస్తున్నారన్నారు. అందులో ఉన్న తమ చిన్నాన్న ఏ. రామక్రిష్ణారెడ్డి సమాధిని కూడా కూల్చివేశారన్నారు. దీనిపై జిల్లా ఎస్పీకి, పోలీసులకు ఫిర్యాదు చేసినా ఎలాంటి స్పందన లేదన్నారు. 2018లో కోర్టు ఇచ్చిన ఉత్తర్వులపై ఎమ్మెల్సీ తన వారసులతో హైకోర్టులో అప్పీలు చేశారని కోర్టు దానిని డిస్మిస్ చేసిందన్నారు. ఎమ్మెల్సీ దౌర్జన్యాన్ని తాము అడ్డుకోగా తమపై చిన్నచౌకు పోలీస్స్టేషన్లో తప్పుడు ఫిర్యాదు చేయించి ఎఫ్ఐఆర్ నమోదు చేయించారన్నారు. అది తప్పుడు ఫిర్యాదు అని పోలీసులు రెఫర్ చేశారన్నారు. -
టమోటా మాయాజాలం !
మదనపల్లె: అన్నమయ్య జిల్లాలోని టమాటా రైతులకు అండగా ఉండాల్సిన మార్కెటింగ్ శాఖ అధికారులు పక్కదారి పడుతున్నారు. జిల్లా కేంద్రమైన మదనపల్లెతో పాటు పుంగనూరు, రాయచోటి, గుర్రంకొండ, కలకడ వంటి ప్రధాన మార్కెట్లలో 15 కిలోల క్రేట్ల విధానం సక్సెస్ఫుల్గా నడుస్తుంటే, ములకలచెరువు మార్కెట్లో మాత్రం పాత పద్ధతిలోనే దోపిడీ సాగుతోంది. దీనిపై శ్రీసాక్షిశ్రీలో ప్రచురితమైన కథనాలకు స్పందించిన అధికారులు, క్షేత్రస్థాయిలో చర్యలు తీసుకోకుండా కేవలం నివేదికలకే పరిమితం కావడం విమర్శలకు తావిస్తోంది. నివేదికలో నిజం.. మాటల్లో కాలయాపన! ఈ నెల 12న ములకలచెరువు మార్కెట్ను సందర్శించిన మార్కెటింగ్ శాఖ జిల్లా ఏడీ త్యాగరాజు, అక్కడ 15 కిలోల క్రేట్ల విధానం అమలు కావడం లేదని తన నివేదికలో స్పష్టంగా పేర్కొన్నారు. ఇప్పటికీ 25 కిలోల బాక్సులతోనే విక్రయాలు సాగుతున్నాయని, అదే ప్రకారం బిల్లింగ్ జరుగుతోందని రీజనల్ జాయింట్ డైరెక్టర్ కు ఇచ్చిన నివేదికలో అంగీకరించారు. అయితే, మీడియా ప్రతినిధులతో మాట్లాడేటప్పుడు మాత్రం నిబంధనలు పాటించని వారి లైసెన్సులు రద్దు చేస్తాం్ఙ అని హెచ్చరించడం వారి ‘ద్వంద్వ వైఖరి’కి అద్దం పడుతోంది. ధరల వ్యత్యాసం..రైతుకు కోట్లలో నష్టం: మార్కెట్ల మధ్య ధరల వ్యత్యాసం రైతును కోలుకోలేని దెబ్బ తీస్తోంది. శనివారం మదనపల్లె మార్కెట్లో మొదటి రకం టమాటా కిలో రూ. 12 పలికితే, ములకలచెరువులో మాత్రం రూ. 9 నుంచి రూ. 10 మాత్రమే లభించింది. 25 కిలోల బాక్సుల విధానం వల్ల వ్యాపారులు శ్రీనాణ్యత్ఙ సాకుతో ఎక్కువ కాయలను తక్కువ ధరకే దక్కించుకుంటున్నారు. దీనివల్ల రైతుకు కిలోపై రూ. 2 నుండి రూ. 3 వరకు నష్టం వాటిల్లుతోంది. ప్రస్తుతం అన్–సీజన్ కావడంతో నెలకు సగటున 1,200 టన్నుల కాయ వస్తోంది. అదే సీజన్లో అయితే నెలకు 6,000 టన్నులకు పైగా టమాటా వస్తుంది. ఈ లెక్కన సీజన్ ప్రారంభమైతే రైతులు కోట్లలో నష్టపోవాల్సి వస్తోంది. సాకుల పేరుతో దోపిడీకి సహకారం: హమాలీల కొరత, రవాణా సౌలభ్యం పేరుతో కొందరు రైతులు 25 కిలోల క్రేట్లనే కోరుతున్నారని అధికారులు చెబుతుండటం గమనార్హం. ఒకే జిల్లాలో రెండు మార్కెట్లకు రెండు వేర్వేరు నిబంధనలు ఉండటం అధికారుల చిత్తశుద్ధిని ప్రశ్నార్థకం చేస్తోంది. రైతులకు అవగాహన కల్పిస్తున్నామనే సాకుతో అధికారులు దోపిడీకి పరోక్షంగా సహకరిస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలెక్టర్ గారు సమీక్షించాలి ఈ అస్తవ్యస్త పరిస్థితులపై కలెక్టర్ నేరుగా జోక్యం చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. మార్కెటింగ్ అధికారులు ఇచ్చే నివేదికలు వాస్తవాలకు విరుద్ధంగా ఉంటున్నాయని, కలెక్టర్ స్వయంగా సమీక్షిస్తేనే బాధ్యులపై చర్యలు తీసుకునే అవకాశం ఉంటుందని ఆశిస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలను తుంగలో తొక్కే వ్యాపారుల లైసెన్సులను సస్పెండ్ చేయాలని, అన్ని మార్కెట్లలో 15 కిలోల విధానాన్ని కచ్చితంగా అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ములకలచెరువులో అమలుకాని 15 కిలోల క్రేట్ల విధానం 25 కిలోల బాక్సులతోనే విక్రయాలు ఏడీ నివేదికలో పచ్చి నిజాలు మీడియా ముందు మాత్రం గంభీర ప్రకటనలు కలెక్టర్ జోక్యం చేసుకుంటేనే రైతులకు న్యాయం మార్కెటింగ్ అధికారుల ద్వంద్వ వైఖరిపై అన్నదాతల ఆగ్రహం -
మెరిసిన బంగారుబిడ్డలు
● కష్టార్జితానికి గుర్తింపు.. నందలూరుకు చెందిన మండిపల్లి శ్రీషిత ఎంఎస్సీ (కెమిస్ట్రీ)లో అద్భుత ప్రతిభ కనబరిచి ఏకంగా మూడు బంగారు పతకాలను కై వసం చేసుకుంది. ఎంఎస్సీ కెమిస్ట్రీలో టాపర్గా నిలవడంతో పాటు, పీజీ కోర్సుల్లో ఆల్రౌండ్ ప్రతిభ కనబరిచినందుకు, కెమిస్ట్రీ విభాగంలో అత్యుత్తమ ప్రదర్శన ఇచ్చినందుకు గాను ఈ పతకాలు లభించాయి. తండ్రి వేణుమాదవ్రెడ్డి వ్యవసాయం చేస్తూ కుమార్తెను చదివించగా, తల్లి పరిమళ గృహిణి. ‘నాన్న కష్టానికి తగ్గ ఫలితం దక్కింది. ● వాచ్మెన్ కుమార్తెకు స్వర్ణ పతకం ప్రొద్దుటూరుకు చెందిన లాజర్,దేవిరాణిల కుమార్తె సువర్ణ ఎంఏ (హిస్టరీ అండ్ ఆర్కియాలజీ)లో బంగారు పతకం పొందింది. లాజర్ నైట్ వాచ్మెన్గా పనిచేస్తూ కూతురిని చదివించారు.‘సామాన్య కుటుంబం నుంచి వచ్చి స్వర్ణ పతకం సాధించడం గర్వంగా ఉంది‘ అని సువర్ణ పేర్కొన్నారు. ● టైలర్ కుమార్తెకు రెండు స్వర్ణాలు కర్నూలు జిల్లా ఆదోనికి చెందిన ప్రకృద్దీన్, షాకీరాల కుమార్తె తస్లీమా ఎంఏ జర్నలిజంలో రెండు బంగారు పతకాలను సాధించింది. తండ్రి టైలర్గా పనిచేస్తూ కుమార్తెను ఉన్నత చదువులు చదివించగా, తండ్రి కష్టాన్ని గుర్తించిన తస్లీమా శ్రమించి చదివి ఈ ఘనత సాధించింది. పతకాలు సాధించడం పట్ల ఆమె సంతోషం వ్యక్తం చేసింది. ● టిఫిన్ సెంటర్ నిర్వాకుడి కుమారుడు ప్రతిభ గుంటూరుకు చెందిన శివలింగం నాయక్, ఏసు జమ్మల కుమారుడు పవన్కుమార్ నాయక్ ఎంఏ ఎకనామిక్స్లో అత్యధిక మార్కులు సాధించి బంగారు పతకాన్ని కై వసం చేసుకున్నాడు. తండ్రి శివలింగం నాయక్ టిఫిన్ సెంటర్ నిర్వహిస్తూ కుమారుడిని చదివించారు. తండ్రి ఆశయాలకు అనుగుణంగా పవన్ రాణించి పతకాన్ని సాధించాడు. -
లారీ బాడీ బిల్డింగ్ షెడ్డులో అగ్ని ప్రమాదం
మదనపల్లె టౌన్ : మదనపల్లె– పుంగనూరు రోడ్డులోని బసినికొండలో శుక్రవారం ఓ లారీ బాడీ బిల్డింగ్ షెడ్డులో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో సుమారు రూ.1.50 లక్షలకు పైగా ఆస్తినష్టం వాటిల్లింది. అగ్ని ప్రమాద ఘటనపై స్థానిక అగ్నిమాపక అధికారి శివప్ప మీడియాకు తెలిపిన వివరాలు.. బసినికొండలో స్థానికంగా ఉండే బాబ్ జాన్ కొత్త, పాత లారీలకు బాడీ బిల్డింగ్ పనులు సిబ్బందితో చేయిస్తారు. ఈ క్రమంలో షెడ్డుకు సమీపంలో ఉన్న గడ్డి మైదానానికి గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు అంటించడంతో కాలుతూ వచ్చి, బాబ్ జాన్ లారీ బాడి బిల్డింగ్ షెడ్డుకు మంటలు వ్యాపించాయి. సిబ్బంది తేరుకుని మంటలు అదుపు చేసేలోపే షెడ్డులోని కొయ్యలు మండుకున్నాయి. వెంటనే అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు అదుపు చేశారు. షెడ్డులో ఉన్న దాదాపు రూ.10 లక్షలకు పైగా ఆస్తి నష్టం జరగకుండా అధికారులు సకాలంలో కాపాడారు. అలాగే పక్కన ఉన్న లారీలకు, షెడ్లకు మంటలు వ్యాపించకుండా కంట్రోల్ చేశామని శివప్ప తెలిపారు. -
కరెంటు షాక్తో యువకుడికి గాయాలు
మదనపల్లె టౌన్ : కరెంటు షాక్ కొట్టి ఉత్తరప్రదేశ్ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ సంఘటన గురువారం రాత్రి మదనపల్లెలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉత్తరప్రదేశ్ రాష్ట్రానికి చెందిన పలువురు యువకులను స్థానిక నీరుగట్టువారిపల్లెకు చెందిన రాము ఇటీవల కూలీ పనులు చేయించుకోవడానికి తీసుకు వచ్చాడు. తక్కువ కూలీలతో రాత్రి వేళల్లో.. కొత్తగా నిర్మించే ఇళ్లకు పీఓపీ పనులు చేయించేవాడు. ఈ క్రమంలో నీరుగట్టువారిపల్లె సమీపంలోని రింగు రోడ్డు వద్ద ఓ భవనానికి పీఓపీ పనులు చేస్తుండగా తస్లీం(19)కరెంటు షాక్కు గురయ్యాడు. తీవ్రంగా గాయపడ్డ అతన్ని సహచరులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువెళ్లారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్స అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని అనంతరం వారు తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. స్థానిక టూటౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ యువకుడు వాస్మోల్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడి మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో చేరాడు. ఘటనపై ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బి.కొత్తకోట మండలం గట్టు గ్రామానికి చెందిన విజయ్(26) కుటుంబ సమస్యల కారణంగా తీవ్ర మనస్తాపానికి గురయ్యాడు. దీంతో జీవితంపై విరక్తి చెంది ఇంట్లో ఉన్న వాస్మోల్ పాయిజన్ తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి, ప్రథమ చికిత్సలు అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో డాక్టర్ల సలహాపై వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా నారాయణరెడ్డి
పీలేరురూరల్: పీలేరు హంద్రీనీవా యూనిట్–2 స్పెషల్ డిప్యూటీ కలెక్టర్గా ఎం.వి.ఎస్. నారాయణరెడ్డి శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటి వరకు ఈ పోస్టులో ఆర్డీఓ ఎ. శ్రీనివాస్ ఇన్ఛార్జిగా కొనసాగుతూ వచ్చారు. కడప తహసీల్దార్గా పనిచేస్తున్న నారాయణరెడ్డి, పదోన్నతిపై పీలేరుకు బదిలీ అయ్యారు. ఎస్డీసీ బాధ్యతలతో పాటు పీలేరు అసెంబ్లీ నియోజకవర్గ (163) ఎలక్టోరల్ రిజిస్ట్రేషన్ ఆఫీసర్గా కూడా ఆయన అదనపు బాధ్యతలు చేపట్టారు. బాధ్యతలు స్వీకరించిన నారాయణరెడ్డికి స్థానిక తహశీల్దార్ శివకుమార్ పుష్పగుచ్ఛం అందజేసి సాదర స్వాగతం పలికారు. వాల్మీకిపురం: ఉపాధిహామీలో అవినీతికి పాల్పడితే చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం అన్నారు. శుక్రవారం స్థానిక ఎంపీడీవో కార్యాలయం వద్ద సామాజిక బహిరంగ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మండలంలో 1225 పనులకు రూ.7.83 కోట్లు ఖర్చు చేసి వాటిపై నివేదికలో వివరించినట్లు చెప్పారు. ఇందులో భాగంగా రూ.29,477 రికవరీకి ఆదేశించి, సిబ్బందికి రూ.37వేలు జరిమానా విధించినట్లు తెలిపారు. -
ప్రాణం తీసిన ఆన్లైన్ బెట్టింగ్
– గడ్డి మందు తాగి యువకుడి ఆత్మహత్య ములకలచెరువు : ఆన్లైన్ బెట్టింగ్ యాప్లో డబ్బులు పోగొట్టుకొని ఒక యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. కుటుంబ సభ్యులు, పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని దేవులచెరువు పంచాయతీ నీరుగట్టువారిపల్లెకు చెందిన జి.అనిల్కుమార్(25) ఇంటర్ పూర్తి చేసి గుంటూరులో ఉద్యోగం చేసుకునే వాడు. ఈ క్రమంలో ఆన్లైన్లో బెట్టింగ్లకు అలవాటుపడి డబ్బులు అప్పు చేశాడు. బెట్టింగ్ కోసం చేసిన అప్పులు తీర్చలేక మనోవేదనకు గురయ్యాడు. ఈ క్రమంలో బుధవారం గడ్డి నివారణ మందు తాగి ఇంట్లో వాంతులు చేసుకుంటుండగా గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచనల మేరకు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రమాదేవి హాస్పిటల్కు తీసుకెళ్లారు. గురువారం రాత్రి అక్కడి నుంచి స్విమ్స్కు తరలిస్తుండగా మృత్యువాత పడ్డాడు. మృతుడి తల్లి జి.రామలక్ష్మమ్మ ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి
● ఢీకొన్న కారు, బొలేరో వాహనం ● ఇద్దరికి తీవ్ర గాయాలు ● మృతులు అనంతపురం జిల్లా వాసులు ములకలచెరువు : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు మృతి చెందిన సంఘటన శుక్రవారం తెల్లవారుజామున మండలంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురానికి చెందిన ఆదిలక్ష్మికి చిత్తూరు జిల్లా పలమనేరు వద్ద విరూపాక్షిపురంలో పక్షవాతానికి మందు తినిపించడం కోసం డ్రైవర్ ఖాదర్వలి, కుటుంబ సభ్యులు మురళి, వనజాక్షి ఒక కారులో ప్రయాణమయ్యారు. ములకలచెరువు మండలం గొడ్డావులకోట వద్దకు రాగానే టమాట క్రేట్లతో ఎదురుగా వస్తున్న బొలేరో ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు డ్రైవర్ ఖాదర్వలి(48), ఆదిలక్ష్మి(62) సంఘటన స్థలంలోనే మృత్యువాతపడ్డారు. బొలేరో డ్రైవర్ బాలాజీ నాయక్(35), మురళి(45), వనజాక్షి(40)లకు తీవ్ర గాయాలయ్యాయి. అటువైపు వెళ్లే ప్రయాణికులు 108, పోలీసులకు సమాచారం అందించారు. గాయపడిన వారిని 108 సాయంతో అనంతపురం ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె హాస్పిటల్కు తరలించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. రాత్రి అనంతపురం ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న వనజాక్షి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ప్రతాప్ తెలిపారు. మృతి చెందిన ఖాదర్వలి, ఆదిలక్ష్మి


