breaking news
Annamayya District News
-
క్లుప్తంగా
ఉపాధ్యాయుడి హఠాన్మరణం చిన్నమండెం : మండలంలోని టి.చాకిబండ జడ్పీ హైస్కూల్(తెలుగు)లో పనిచేస్తున్న ఉపాధ్యాయుడు శ్రీధర్రెడ్డి(55)కి పాఠశాలలోనే హఠాత్తుగా గుండెపోటు రావడంతో మృతి చెందారు. రోజు మాదిరిగా ఉదయం పాఠశాలకు వచ్చిన ఆయన హఠాత్తుగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు. తోటి ఉపాధ్యాయులు, విద్యార్థులు హుటాహుటిన ఆసుపత్రికి తరలిస్తుండగా తూర్పుపల్లి వద్దకు రాగానే మృతి చెందారు. శ్రీధర్రెడ్డి సొంత ఊరు సంబేపల్లె మండలం మొటుకువాండ్లపల్లె. ప్రస్తుతం చిన్నమండెం మండలంలో ఉపాధ్యాయుడిగా పనిచేస్తున్నారు. మృతుడికి భార్య, కుమారుడు కలరు. మండలంలోని తోటి ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. వైన్ షాపులో చోరీ గుర్రంకొండ : మండలంలోని గుర్రంకొండలోని ఆర్కే బ్రాందీషాపులో చోరీ జరిగింది. స్థానిక తూముకుంట రోడ్లో ఆర్కే బ్రాందీషాప్ నిర్వహిస్తున్నారు. బుధవారం వేకువ జామునే గుర్తుతెలియని దుండగులు బ్రాందీషాపు పైభాగంలో రేకు కత్తిరించి దుకాణంలో ప్రవేశించి చోరీకి పాల్పడ్డారు. దుకాణంలోని ఓ ల్యాప్టాప్, రూ.50 వేల విలువ చేసే మద్యం సీసాలు చోరీకి గురైనట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ రఘరామ్ సిబ్బందితో కలసి వచ్చి వైన్ షాపు, చోరి జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. షాపు నిర్వహకుల ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. ఎరచ్రందనం దుంగలు స్వాధీనం తిరుపతి అన్నమయ్యసర్కిల్ : అన్నమయ్య జిల్లా కేవీ.బావి అటవీ ప్రాంతంలో తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం పది ఎరచ్రందనం దుంగలను స్వాధీనం చేసుకుని ఇద్దరు స్మగ్లర్లను అరెస్టు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. టాస్క్ఫోర్స్ హెడ్ సుబ్బారాయుడు ప్రత్యేక కార్యాచరణ మేరకు టాస్క్ఫోర్స్ ఎస్పీ శ్రీనివాస్ ఆధ్వర్యంలో డీఎస్పీ ఎండీ షరీఫ్, సిబ్బంది కోడూరు పరిధిలోని కెవీ.బావి ఆటవీ ప్రాంతంలో కూంబింగ్ చేపట్టారు. బుధవారం తెల్లవారుజామున నొక్కోడి గుండం వద్ద కొందరు వ్యక్తులు ఎరచ్రందనం దుంగలు మోసుకుని వెళుతూ కనిపించారు. టాస్క్ఫోర్స్ పోలీసులను చూసి వారు తప్పించుకుని పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఆ ఇద్దరూ తమిళనాడుకు చెందిన వారుగా గుర్తించారు. దుంగలతో పాటు వారిద్దరినీ తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసుస్టేషన్కు తరలించారు. డీఎస్పీ శ్రీనివాస రెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాస్ విచారించారు. సీఐ సురేష్ కుమార్ కేసు నమోదుచేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. -
వృద్ధురాలి హత్యకేసులో సంచలన తీర్పు
రాజంపేట : ఎర్రబల్లికి చెందిన నర్రెడ్డి సమిత్రమ్మ(60) హత్య కేసులో రాజంపేట మూడో అదనపు జిల్లా జడ్జి ప్రవీణ్కుమార్ సంచలన తీర్పు వెలువరించారు. ప్రధాన నిందితురాలు వెలమచల ఇందిరమ్మకు జీవిత ఖైదు, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పుచెప్పారు. పట్టణ సీఐ నాగార్జున, ఎస్ఐ వెంకటేశ్ వెల్లడించిన వివరాలిలా ఉన్నాయి. 2019 మే, 2న తన తల్లి నరెడ్డి సుమిత్రమ్మను ఎవరో గుర్తుతెలియని వ్యక్తులు హత్య చేసి ఇంట్లో బంగారు వస్తువులను దోచుకెళ్లారని మృతురాలి కుమారుడు నర్రెడి్డ్ మహీధర్ పట్టణ పోలీసులకు ఫిర్యాదుచేశారు. అప్పటి సీఐ నిరంజన్కుమార్ కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారన్నారు. డీఎస్పీ ఆదేశాల మేరకు ఒంటిమిట్ట సీఐ దర్యాప్తు చేసి 2020 మార్చి, 9న వెలచలమల ఇందిరమ్మ(దేవరపల్లె, వెలిచలమల్ల పంచాయితీ,నంబూలపూలకుంట మండలం,అనంతపురం జిల్లా), నర్రెడ్డి శ్వేత(ఎర్రబల్లి,రాజంపేటటౌన్), ఓర్సు నాగరాజు (డ్రైవర్, కొండ్లవాండ్లపల్లె,నంబూపూలకుంట మండలం, అనంతపురం), మల్లెల రమేష్ (కూలి, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం, అనంతపురం), ఒర్సు మల్లికార్జున (డ్రైవర్, కొండ్లవాల్లపల్లె, నంబూలపూలకుంట మండలం అనంతపురం)లను అరెస్టు చేశారు. వారి వద్ద మృతురాలికి చెందిన సరుడు, రెండు గాజులు, డైమండ్ నెక్లస్, జత కమ్మలు, రెండు వెండి దీపాలు, హత్యకు ఉపయోగించిన దిండు స్వాధీనం చేసుకుని రిమాండ్కు పంపారు. తదుపరి సీఐ చంద్రశేఖర్ వారిపై చార్జ్షీట్ దాఖలు చేయగా మూడో అదనపు జిల్లా జడ్జి కోర్టులో విచారణ సాగింది. సాక్ష్యాలు నిజమని తేలడంతో వెలిచెలమల ఇందిరమ్మ(47)కు జీవిత ఖైదు విధిస్తూ మూడవ అదనపు జిల్లా జడ్జి తీర్పు వెలువరించారన్నారు. ఈ కేసులో నేరారోపణ రుజువు కానందున నర్రెడ్డి శ్వేత, ఒర్సు నాగరాజు, మల్లెల రమేష్, ఒర్సు మల్లికార్జున (విచారణలో మరణం)లకు విముక్తి కలిగించారన్నారు. సీఐ నిరంజన్కుమార్, హనుమంత్నాయక్, ఎం.చంద్ర శేఖర్, పీపీ షేక్జానీ, ప్రస్తుత పీపీ కొమ్మినేని వేణుగోపాల్, జీ.సుబ్బరాయుడు, ఏఎస్ఐ శంకరయ్యలను రాజంపేట ఎఎస్పీ మనోజ్రామ్నాథ్హెగ్డే అభినందించారని వెల్లడించారు. కేసులో ఇందిరమ్మకు జీవిత ఖైదు -
పింఛా ప్రాజెక్టును సందర్శించిన సబ్ కలెక్టర్
వివరాలు తెలుసుకుంటున్న సబ్ కలెక్టర్ భావన నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టి రోడ్డు సుండుపల్లె : మండలంలోని పింఛా ప్రాజెక్టును రాజంపేట సబ్ కలెక్టర్ భావన బుధవారం సందర్శించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు పురోగతి, ఇప్పటివరకు జరిగిన పనులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ప్రాజెక్టుకు వచ్చే జల వనరులు, కుడి, ఎడమ కాల్వల ద్వారా నీటి పంపిణీ తీరుపై ఆరా తీశారు. ప్రాజెక్టు వద్ద వాతావరణం ఆహ్లాద కరంగా ఉందని, పర్యటకులకు మరిన్ని వసతులు కల్పించి పార్కు ఏర్పాటు చేస్తే బాగుంటుందని తెలిపారు. నీటి ప్రవాహానికి కొట్టుకుపోయిన మట్టిరోడ్డు సుండుపల్లె : పింఛా ప్రాజెక్టు పైభాగంలో మోస్తరు వర్షాలు పడడంతో ప్రాజెక్టులోకి వరదనీరు చేరింది. దీంతో నదిలోకి నీటిని విడుదల చేశారు. ఈ ప్రవాహానికి రాయవరం బహుదా నదిపై ఉన్న మట్టి రోడ్డు కొట్టుకుపోయింది. వాహనాల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. వంతెన ఏర్పాటు చేసి శాశ్వత పరిష్కారం చూపాలని స్థానికులు కోరుతున్నారు. -
ఆన్లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య
పీలేరు రూరల్ : ఆన్లైన్ యాప్ వేధింపులతో యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. పీలేరు పట్టణం కట్టుకాలువ వీధికి చెందిన షేక్ ముబారక్ (25) పట్టణంలోని కడప రోడ్డు మార్గంలో చికెన్ సెంటర్ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపారనిమిత్తం ఆన్లైన్ యాప్లో అప్పు తీసుకుని వ్యాపారం నిర్వహించాడు. వ్యాపారం సరిగ్గా జరగక అప్పు చెల్లించలేక ఇబ్బందిపడ్డాడు. ఈ క్రమంలో ఆన్లైన్ యాప్ నిర్వాహకులు వేధింపులు తాళలేక మంగళవారం తన ఇంటిలో పురుగుల మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. అక్కడి చికిత్స పొందుతూ మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. కూలిన పాఠశాల గోడ చిట్వేలి : చిట్వేలి జడ్పీ ఉన్నత పాఠశాల ప్రహరీకి సంబంధించిన గోడ బుధవారం కురిసిన వర్షానికి ఒకచోట కూలిపోయింది. పాఠశాల ప్రారంభంగాక మునుపే ఉదయం ఏడు గంటల సమయంలో గోడ కూలింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో సంఘటనా స్థలాన్ని ప్రధానోపాధాయులు దుర్గరాజు పరిశీలించి ఉన్నతాధికారులకు సమాచారం అందించారు. రాయచోటి: పక్షవాతాన్ని జయించలేక ఇంటిలోని ఫ్యాన్కు ఉరి వేసుకొని ఓ యువతి తనువు చాలించింది. పట్టణంలోని పాత రాయచోటిలో నివాసముంటున్న గౌస్ మొహిద్దీన్ భార్య షేక్ మునీరా(39) గత ఆరు నెలలుగా పక్షవాతంతో బాధపడుతోంది. ఆసుపత్రులలో చికిత్స పొందినా.. ఆరోగ్యం మెరుగు పడక పోవడంతో మానసికంగా కుంగిపోయింది. బుధవారం సాయంత్రం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యాన్కు ఉరి వేసుకొని చనిపోయింది. సాయంత్రం 5.30గంటలకు భర్త వచ్చి చూడగా అప్పటికే ఆమె ఫ్యాన్కు వేలాడుతూ కనిపించింది. రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు తెలిపారు. మృతదేహాన్ని పంచనామా నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పేద విద్యార్థులకు వైద్యరంగంలో మరింత అవకాశాలు కల్పించాలనే దూరదృష్టితో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 17 ప్రభుత్వ మెడకల్ కాలేజీల స్థాపనకు శ్రీకారం చుట్టిందని, కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటీకరించేందుకు ప్రయత్నించడాన్ని అందరూ వ్యతిరేకించాలని వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు జంగం రెడ్డకిశోర్దాస్ అన్నారు. రాయచోటిలో బుధవారం ఆయన మాట్లాడుతూ గత ఐదేళ్లలో రూ.8,500 కోట్ల వ్యయంతో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల నిర్మాణానికి శ్రీకారం చుట్టగా, అందులో ఐదు మెడికల్ కాలేజీలు పూర్తి అయ్యాయని పేర్కొన్నారు. కరోనా విపత్కర పరిస్థితుల్లో ప్రైవేట్ హాస్పిటల్స్ ప్రజలను దోపిడీ చేయగా ప్రభుత్వాసుపత్రులు మాత్రం పేదలకు అండగా నిలిచిన విషయాన్ని గుర్తుచేశారు. కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టగానే ఇప్పటికే ఉన్న ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం చేయాలని నిర్ణయం తీసుకోవడం తగదన్నారు. ఏడాదిన్నర కాలంలోనే రూ.2.15 లక్షల కోట్ల రూపాయలు అప్పుచేసిన చంద్రబాబు ప్రజా వ్యతిరేక నిర్ణయాలను తీసుకోవడం ఆపేయాలన్నారు. జగన్ ప్రారంభించిన 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రస్తుత ప్రభుత్వం నిజాయితీగా పూర్తి చేయాలని కోరారు. ఈ నెల 19న ఉదయం 9.30 గంటలకు మదనపల్లి ప్రభుత్వ మెడికల్ కాలేజీ శానిటోరియం వద్ద చలో మెడికల్ కాలేజీ కార్యక్రమాన్ని శాంతియుతంగా నిర్వహిస్తున్నామని రెడ్డికిశోర్దాస్ ప్రకటించారు. ఈ కార్యక్రమానికి వైఎస్ఆర్సీపీ యువజన, విద్యార్థి విభాగలు, పార్టీ నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని విజయవంతం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
రూ.20వేల చెక్కును రూ.2.20 లక్షలుగా మార్చి
● పెద్దినేనికాలువ సర్పంచ్ బంధువు ఫోర్జరీ ● చెక్కు మార్చారని ప్రశ్నిస్తే అధికారులపై దూషణపర్వం ● గ్రేడ్–1 పంచాయతీ కార్యదర్శికి గుండెపోటు సుండుపల్లె : గ్రామ పంచాయతీలో అభివృద్ధి పనులకు ఇచ్చిన రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలకు మార్చిన సంఘటన సుండుపల్లె మండలంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. పెద్దినేనికాలువ పంచాయతీలో పనులు చేసినందుకు ఎంజీఎన్ఆర్ఈజీఎస్ నిధుల నుంచి సర్పంచ్ సంతకంతో కూడిన రూ.20 వేల చెక్కును ఆ సచివాలయ పంచాయతీ కార్యదర్శి శ్రీనాథ్రెడ్డి సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్రకు రాసి ఇచ్చారు. అయితే ఆ సర్పంచ్ బంధువైన పసుపులేటి నాగేంద్ర రూ.20 వేల చెక్కులో అంకెలు మార్చి రూ.2.20 లక్షలుగా రాసి ఆ నగదును తన సొంత అకౌంట్లోకి జమచేసుకున్నాడు. పంచాయతీ నిధుల నుంచి రూ.2.20 లక్షల నగదు డ్రా చేసినట్లు పంచాయతీ కార్యదర్శి చరవాణికి సమాచారం రావడంతో చూసి ఆశ్చర్యపోయిన ఆయన వెంటనే తమపై అధికారులకు జరిగిన విషయాన్ని తెలియజేశారు. డిప్యూటీ ఎంపీడీఓ సురేష్బాబుతో కలిసి బ్యాంకుకు నిధులు ఆపాలని బ్యాంకు మేనేజర్కు సమాచారం అందించారు. విషయం తెలుసుకున్న అధికారులు నిధులు డ్రా చేసిన వ్యక్తి అకౌంట్ను బ్లాక్ చేశారు. అప్పటికే ఆ అకౌంట్ నుంచి రూ.20 వేల నగదు డ్రా చేసినట్లు వారు తెలిపారు. రూ.20 వేల చెక్కును రూ.2.20 లక్షలుగా ఎందుకు మార్చావని డ్రా చేసిన వ్యక్తిని పంచాయతీ కార్యదర్శి ప్రశ్నించగా తీవ్ర పదజాలంతో దూషించాడు. దీంతో తీవ్ర ఒత్తిడికి గురైన పంచాయతీ కార్యదర్శి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లిన కొద్దిసేపటికి గుండెనొప్పి వస్తుండటంతో సిబ్బంది గుర్తించి స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన చికిత్స కోసం రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. -
వాహనం ఢీకొని మహిళ మృతి
కలకడ : గుర్తుతెలియని వాహనం ఢీకొని జరిగిన ప్రమాదంలో మహిళ మృతి చెందినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని కదిరాయచెర్వు పంచాయతీ ఎస్టీ కాలనీకి చెందిన పెద్దరెడ్డెప్ప భార్య శెట్టిపల్లె జయమ్మ(54) మంగళవారం పొలం వద్దకు నడచి వెళ్తోంది. మార్గమధ్యంలో గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో మదనపల్లె ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ జయమ్మ బుధవారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతురాలి భర్త ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ.. కలికిరి : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ మృతి చెందిన సంఘటన బుధవారం కలికిరిలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కలికిరి పట్టణం ఇందిరమ్మ కాలనీకి చెందిన పాలగిరి నూరుల్లా తన భార్య షరీఫా(46)తో కలిసి ద్విచక్ర వాహనంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి క్రాస్ రోడ్డుకు బయలుదేరారు. వెనుకవైపు నుంచి వచ్చిన మదనపల్లె డిపో బస్సు వీరి వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన షరీఫాను చికిత్స నిమిత్తం స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతిచెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. కారు ఢీకొని ఒకరు దుర్మరణం సంబేపల్లె : మండలంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఓ కారు స్కూటర్ను డీ కొన్న ప్రమాదంలో భాస్కర్రెడ్డి(77) దుర్మరణం చెందారు. పోలీసుల వివరాల మేరకు.. కలకడ మండలం బాలయ్యగారిపల్లెకు చెందిన నగిరిమడుగు భాస్కర్రెడ్డి స్కూటర్లో సొంత పనుల నిమిత్తం కలకడకు వెళ్లారు. తిరిగి స్వగ్రామానికి వస్తుండగా బాలయ్యగారిపల్లె క్రాస్ సమీపంలో రాయచోటి నుంచి చైన్నెకి వెళ్తున్న కారు స్కూటర్ను ఢీకొనడంతో భాస్కర్రెడ్డి అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటితాసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. మహిళ అదృశ్యం ఎర్రగుంట్ల : మండలంలోని హనుమనుగుత్తి గ్రామానికి చెందిన దుద్దేల శ్యామల(42) అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. శ్యామలకు మతిస్థిమితం సరిగా లేదు. ఈ నెల 9న మధ్యాహ్నం ఇంటి వద్ద నుంచి బయటకు వచ్చి కనిపించలేదు. కుటుంబ సభ్యులిచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేసున్నారు. -
ఆర్టీసీ అద్దెబస్సు బోల్తా
సిద్దవటం : సిద్దవటం నుంచి కడపకు వెళ్తున్న ఏపీ39యుజీ4591 నెంబర్ అల్ట్రా పల్లె వెలుగు ఆర్టీసీ అద్దె బస్సు బుధవారం భాకరాపేట సమీపంలోని కల్వర్టు వద్ద బోల్తా పడింది. ఈ బస్సులో బస్సు డ్రైవర్ వెంకటనారాయణ, కండెక్టర్ శివయ్యతోపాటు భారతీ, వెంకటేష్, సుబ్బనరసమ్మ, లక్ష్మమ్మలకు స్వల్ప గాయాలయ్యాయి. అద్దె బస్సు డ్రైవర్ వెంకటనారాయణ కథనం మేరకు..భాకరాపేట సమీపంలోని పెద్దవంక కల్వర్టు వద్ద కడప నుండి బద్వేల్కు వెళ్తున్న ఎక్స్ప్రెస్ ఆర్టీసీ బస్సు అతి వేగంగా వస్తుండగా కల్వర్టు రహదారిపై బస్సు నిలిపివేయడం జరిగిందన్నారు. బస్సులో అరవై మందికిపైగా ప్రయాణీకులు ఉన్నారని, బస్సు అదుపుతప్పి బోల్తా పడిందన్నారు. కండక్టర్ శివయ్యపై ప్రయాణికులు పడటంతో చేతికి గాయాలయ్యాయన్నారు. మరో నలుగురు ప్రయాణీకులకు కూడా స్వల్ప గాయాలతో బయటపడ్డారన్నారు. విషయాన్ని తెలుసుకున్న 11వ బెటాలియన్ పోలీసులు బస్సు అద్దాలను పగులుగొట్టి గాయపడిన వారిని బయటకు తీసి చికిత్స నిమిత్తం 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారని తెలిపారు. ప్రమాదం జరిగిన సమాచారం తెలుసుకున్న కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, బద్వేల్, కడప ఆర్డీఓలు జాన్ఇర్విన్, చంద్రమోహన్, 11వ ఏపీఎస్పీ వెంకటేశ్వర్లు, బద్వేల్ ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్, కమాండెంట్ ఆనంద్రెడ్డి, ఒంటిమిట్ట సీఐ బాబు, ఎస్ఐ మహమ్మద్ రఫీ, ఆర్అండ్బీ ఏఈ రామాంజనేయులు, డిప్యూటీ తహసీల్దారు మాధవీలత సంఘటనా స్థలానికి చేరుకొని సంఘటనకు దారి తీసిన కారణాలను తెలుసుకున్నారు. ఎస్ఐ మహమ్మద్ రఫీ మాట్లాడుతూ సంఘటనా స్థలానికి చేరుకొని బోల్తాపడిన ఆర్టీసీ బస్సును రెండు క్రేన్ల సహాయంతో తొలగించి ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టామన్నారు. కల్వర్టు వద్ద వాహనాలు నెమ్మదిగా వెళ్లేందుకు హెచ్చరిక బోర్డు ఏర్పాటుచేశామని తెలిపారు. ఆర్టీసీ కండక్టర్ శివయ్య ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. డ్రైవర్, కండక్టర్తో సహా, నలుగురికి స్వల్ప గాయాలు -
పరిశుభ్రతతో వ్యాధులు దూరం
ఒంటిమిట్ట: ప్రతి ఒక్కరూ వ్యక్తిగత, పరిసరాల పరిశుభ్రత పాటించాలని జిల్లా మలేరియా అధికారి డాక్టర్ పి మనోరమ తెలిపారు. శుభ్రతతో వ్యాధులు దరిచేరవని తెలిపారు.బుధవారం మండలంలోని చింతరాజుపల్లి పంచాయతీలోగల చింతరాజుపల్లి హరిజనవాడ, గాండ్లపల్లి గ్రామాలలో విష జ్వరాలు, కీటక వ్యాధులపై మలేరియా సబ్ యూనిట్ అధికారి డాక్టర్ ఐ సుబ్బరాయుడు, మండల వైద్యాధికారి డాక్టర్ భావనతో కలిసి ఆమె విస్తృత పర్యటన చేశారు. ఇంటింటికి తిరిగి లార్వా, వైరల్ జ్వరాల సర్వే నిర్వహించారు. అక్కడ అనారోగ్యంతో బాధఫడుతున్న కొంతమందికి విష జ్వరాలకు సంబంధించి రక్త పరీక్షలు చేయగా అందరికీ నెగిటీవ్ వచ్చినట్లు నిర్ధారించారు. ప్రతి ఒక్కరూ తమ ఇళ్లవద్ద మురికినీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలని మలేరియా అధికారు పేర్కొన్నారు.కార్యక్రమంలో హెల్త్ సూపర్ వైజర్ జి భాస్కర్ రెడ్డి, ఏ లక్ష్మీనరసమ్మ, ఆరోగ్య కార్యకర్తలు ఎస్ కరిమున్నీషా, ఎ వెంకటసుబ్బయ్య పాల్గొన్నారు. -
కష్టపడి పనిచేసేవారికి విశ్వకర్మ ఆదర్శం
రాయచోటి: వృత్తులకు ఆధ్యుడైన దైవిక వాస్తుశిల్పి విశ్వకర్మ కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని, ఆయను స్ఫూర్తిగా తీసుకుని చేతి, కుల వృత్తుల వారు తమలో నైపుణ్యాన్ని పెంపొందించుకోవాలని డీఆర్ఓ మధుసూదన్ రావు తెలిపారు. బుధవారం కలెక్టరేట్లో జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమశాఖ ఆధ్వర్యంలో విశ్వకర్మ జయంతిని నిర్వహించారు. డిఆర్ఓ మధుసూదన్ రావు విశ్వకర్మ చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులు అర్పించారు. కృష్ణుడు పరిపాలించిన పవిత్రమైన ద్వారకా నగరాన్ని, పాడవులకోసం ఇంద్రప్రస్థ రాజభవనాన్ని నిర్మించడంతోపాటు దేవతలకు అనేక అద్భుతమైన ఆయుధాలను తయారు చేశారన్నారు. విశ్వకర్మను దివ్య వడ్రంగి అని కూడా భావిస్తుంటారన్నారు. ఈ కార్యక్రమంలో బీసీ వెల్ఫేర్ అధికారి సురేష్, కలెక్టరేట్ ఏఓ నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. ఘన నివాళి: విశ్వకర్మ భగవానుడు కేవలం దేవతల శిల్పి మాత్రమే కాదని, కష్టపడి పనిచేసే ప్రతి ఒక్కరికీ ఆదర్శమని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి అభిప్రాయపడ్డారు. విశ్వకర్మ జయంతి సందర్భంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లి ఆదేశాల మేరకు రాయచోటిలోని జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విశ్వకర్మ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. విశ్వకర్మను నిర్మాణ శాస్త్రానికి సృష్టికర్తగా (ఆర్కిటెక్చర్), ఆధ్యుడిగా భావిస్తారన్నారు. చేతి వృత్తుల కళాకారులు, ఇంజినీర్లు, కార్మికులు, పారిశ్రామిక వేత్తలు వంటి వారందరికీ విశ్వకర్మ స్ఫూర్తిగా నిలుస్తారన్నారు. కార్యక్రమంలో ఏఆర్డీఎస్పీ ఎం శ్రీనివాసులు, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, ఇతర పోలీసులు అధికారులు పాల్గొన్నారు. -
శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత
రాయచోటి: జిల్లా ప్రజల భద్రతను కాపాడుతూ శాంతి భద్రతల పరిరక్షణకు ప్రాధాన్యత ఇవ్వాలని రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా సూచించినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి తెలిపారు. జిల్లా నూతన ఎస్పీ ధీరజ్ కనుబిల్లి బుధవారం విజయవాడలోని డీజీపీ కార్యాలయంలో రాష్ట్ర డీజీపీని మర్యాదపూర్వకంగా కలిశారు. నేరాల నివారణకు పటిష్ట చర్యలు, నేరస్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారన్నారు. మహిళలు, చిన్నారులు, వృద్ధులు సురక్షితంగా ఉండే వాతావరణం కల్పించాలన్నారు. రోడ్డు ప్రమాదాల నియంత్రణకు కఠిన నిబంధనలు అమలుతోపాటు అవగాహన కార్యక్రమాలు చేపట్టాలని సూచించినట్లు పేర్కొన్నారు. ప్రజల్లో పోలీసులపై నమ్మకం పెంచేలా పారదర్శక సేవలు అందించాలని, నేరస్తులకు కఠిన శిక్ష, ప్రజలకు న్యాయం జరిగేలా చూడటమే పోలీసు వ్యవస్థ లక్ష్యమని సూచించినట్లు తెలియపరిచారు. డీజీపీ ఆదేశాల మేరకు ప్రజల భద్రత, న్యాయం, శాంతి స్థాపనలో తన వంతు కృషి చేస్తామని ఎస్పీ పేర్కొన్నారు. -
పంట నమోదు ప్రక్రియ తనిఖీ
రాయచోటి: వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న పంట నమోదు కార్యక్రమాన్ని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. బుధవారం రాయచోటి రూరల్ మండలం, ఎగువ అబ్బవరం గ్రామంలో జరుగుతున్న పంట నమోదు ప్రక్రియను జేసీ పరిశీలించారు. రాయచోటి అర్బన్ ఆర్ఎస్కె ఇన్చార్జిని పంట నమోదు ప్రక్రియ గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రభుత్వం నుంచి వచ్చే అన్ని రాయితీలకు పంట నమోదు ముఖ్యమన్న విషయాన్ని ప్రజలకు తెలియజేయాలని జేసీ సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ, మండల వ్యవసాయ అధికారి కె రాజేంద్ర ప్రసాద్, విఏఏ శ్రీలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: డాక్టర్ .వైఎస్ఆర్ ఆర్కిటెక్చర్ అండ్ ఫైన్ ఆర్ట్స్ యూనివర్సిటీలోని ఆర్కిటెక్చర్ విద్యార్థులకు సీఓఏ(కౌన్సిల్ ఆఫ్ అర్టికల్చర్) నుంచి కోర్సులకు అనుమతులు, ఎన్రోల్మెంట్ నంబర్లు మంజూరయ్యాయని వైస్ చాన్సలర్ విశ్వనాథకుమార్ తెలిపారు. ఇందులో ఆర్కెటెక్చర్ విభాగానికి సంబంధించి 2020–21, 2021–22, 2022–23 బ్యాచ్ల విద్యార్థులకు సీఏఓ నుంచి కోర్సు అనుమతులు వచ్చాయన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు ఆనందాన్ని వ్యక్తం చేశారు. కడప కోటిరెడ్డిసర్కిల్: వైఎస్ఆర్ జిల్లా ఉపాధి కల్పన కార్యాలయం, ఏపీఎస్ఎస్డీసీ ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9.00 గంటలకు జమ్మలమడుగులోని సాయి పరమేశ్వర డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నారు. ఈ విషయాన్ని జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. 12 కంపెనీల ప్రతినిధులు ఇందులో పాల్గొంటారన్నారు. అభ్యర్థులు టెన్త్, ఇంటర్, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ, బీటెక్, ఎంటెక్ చదివి ఉండాలన్నారు. 18–40 సంవత్సరాల మధ్య వయస్సుగల అభ్యర్థులు ఇందుకు అర్హులన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతల ధృవపత్రాలు, ఫొటోలతో ఇంటర్వ్యూకు హాజరు కావాలని ఆయన సూచించారు. రాయచోటి టౌన్: మహిళలు ఆరోగ్యంగా ఉన్నప్పుడే కుటుంబం, సమాజం వృద్ధి చెందుతుందని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మినరసయ్య అన్నారు. ఈనెల 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరక కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా నిర్వహిస్తున్న స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు ఆధ్వర్యంలో రాయచోటి ఏరియా ఆస్పత్రిలో బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళల ఆరోగ్యంపై అవగాహన కలిగి ఉండాలని చెప్పారు. తల్లి ఆరోగ్యంగా ఉన్నప్పుడే పిల్లలకు పాల ద్వారా బలమైన ఆహారం అందుతుందన్నారు. మహిళలు సమయానుకూలంగా వైద్యుల సేవలు పొందాలని సూచించారు. కార్యక్రమంలో ప్రోగ్రాం స్టేట్ అబ్జర్వర్ మధుకర్, డాక్టర్ డి. సంద్య, డాక్టర్ శివప్రతాప్, ఏరియా ఆస్పత్రి సూపరిడెంటెంట్ డాక్టర డేవిడ్ సుకుమార్, ఐసీడీఎస్ పీడీహైమావతి, దేవశిరోమణి తదితరులు పాల్గొన్నారు. -
మదనపల్లె కేంద్రంగా అసాంఘిక వ్యవహారాలు
సాక్షి రాయచోటి: జిల్లాలో నూతనంగా బాధ్యతలు స్వీకరించిన కలెక్టర్ నిషాంత్కుమార్, ఎస్పీ ధీరజ్లకు సమస్యలు సవాలుగా మారనున్నాయి. అన్నమయ్య జిల్లా 2022 ఏప్రిల్ 4న ఆవిర్భవించింది. జిల్లాల పునర్విభజనలో భాగంగా రాయచోటిని జిల్లా కేంద్రంగా ఏర్పాటు చేసి ఆరు నియోజకవర్గాలతో జిల్లాను ఏర్పాటు చేశారు. అప్పటి నుంచి ఇప్పటివరకు పీఎస్ గిరీషా, అభిషిక్త్ కిశోర్, చామకూరి శ్రీధర్లు పనిచేయగా, నూతనంగా నాలుగో కలెక్టర్గా నిషాంత్కుమార్ బాధ్యతలు స్వీకరించారు. జిల్లాపోలీసు సూపరింటెండెంట్లుగా మొదటగా హర్షవర్దన్రాజు, గంగాధర్రావు, కృష్ణారావు, విద్యాసాగర్నాయుడులు పనిచేయగా జిల్లా ఐదో ఎస్పీగా ధీరజ్ బాధ్యతలు స్వీకరించారు. బాధ్యతలు స్వీకరించగానే విజయవాడలో సీఎంతో కలెక్టర్లు, ఎస్పీల సమీక్షల నేపథ్యంలో అక్కడికి వెళ్లారు. అయితే జిల్లాలో వేళ్లూనుకున్న సమస్యలు, ఇతర శాంతిభద్రతల పరంగా అనేక రకాల సమస్యలు కలెక్టర్, ఎస్పీలకు సవాలుగా మారుతున్నాయి. జిల్లా కేంద్రంలో సాగని అభివృద్ధి అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన అనంతరం వైఎస్ జగన్ సర్కార్ హయాంలో అభివృద్ధి పరంగా పరుగులు తీసింది. ఎక్కడికక్కడ జాతీయ రహదారుల్లో మహానీయుల విగ్రహాలు, డివైడర్లు, ప్రజలకు ఆహ్లాదాన్ని పంచే పార్కుల ఏర్పాటు ఇలా ప్రతి ఒక్క పని పరుగులు పెట్టింది. డీఎస్పీ కార్యాలయం, ఆర్అండ్బీ అతిథిగృహం, సచివాలయాలు, ఆర్బీకేలు ఇలా చెబుతూ పోతే చాలావరకు పూర్తయ్యాయి. ఆస్పత్రి ఆధునికీకరణ పనులు కూడా పూర్తి చేశారు. కొత్తహంగులు అద్దుకునే దశలో పనులు పెండింగ్లో పడిపోయాయి. ప్రధానంగా క్రికెట్ స్టేడియం, శిల్పారామం, నగరవనం, ఎంఐజీ లేఅవుట్ పనులు ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్లు ఉన్నాయి. ప్రస్తుత ప్రభుత్వ హయాంలో అక్కడక్కడ రోడ్లు మినహా మిగతా పనులన్నీ పెండింగ్లో ఉన్నాయి. ఇలాంటి తరుణంలో కొత్త ప్రణాళికతో నూతన కలెక్టర్ పెండింగ్ పనులతోపాటు ఇతర అభివృద్ది పనులను పరుగులు పెట్టించాలని ప్రజలు కోరుతున్నారు. ● జిల్లాకు సంబంధించి ఆర్థికంగా అభివృద్ధి చేయడానికి అనేక వనరులు ఉన్నాయి. మదనపల్లె, సిద్దవటం మండల పరిధిలోని చేనేత రంగం బాగా పటిష్టంగా ఉంది. అక్కడ ప్రభుత్వ పరంగా టెక్స్టైల్స్ పరిశ్రమలు తేవడం ద్వారా పలువురికి ఉపాధి కల్పించే అవకాశాలు ఉన్నాయి. రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట చెక్కబొమ్మల తయారీకి ప్రసిద్ధి. అలాగే రైల్వేకోడూరు, రాయచోటి, మదనపల్లె, రాజంపేట, పీలేరు ప్రాంతాల్లో మామిడి, అరటి, బొప్పాయి పంటల సాగు అధికంగా ఉంది. హార్టికల్చర్ పరంగా ఏదైనా అభివృద్ది చేసేందుకు అవకాశాలు ఉన్నాయి. జ్యూస్, గుజ్జు పరిశ్రమలు తీసుకు రావడం ద్వారా అటు రైతులకు, ఇటు యువతకు ఉపాధి లభిస్తుంది. తంబళ్లపల్లె, మదనపల్లె ప్రాంతాల్లో గ్రానైట్తోపాటు మైనింగ్ పరిశ్రమలు ఉన్నాయి. మంగంపేటలో పేరెన్నికగన్న బైరెటీస్, ముగ్గురాయి పరిశ్రమలు ఉన్నాయి. ఏపీఎండీసీపై ఆధారపడి వందల సంఖ్యలో చిన్నచిన్న పరిశ్రమలు ఉన్న నేపద్యంలో పూర్తి స్థాయిలో ప్రోత్సాహం అందిస్తే పెద్ద ఎత్తున ప్రయోజనాలు ఒనగూరనున్నాయి. ఆరితేరిన అక్రమార్కులు జిల్లాలో శాంతిభద్రతల పరంగా ప్రస్తుతం ఎలాంటి సమస్యలు లేకపోయినా చాలాచోట్ల అక్రమార్కులు ఆరితేరిపోయారు. ఎక్కడికక్కడ అసాంఘిక కార్యకలాపాలను నిర్వహిస్తూ అధికారం మాటున సొమ్ము చేసుకుంటున్నారు. జిల్లాలో ప్రస్తుతం పేకాట, దౌర్జన్యాలు, దాడులు అధికంగా సాగుతున్నాయి. ప్రధానంగా ఇసుక అక్రమ రవాణా రాత్రిపూట యథేచ్ఛగా సాగుతోంది. ఎర్రచందనానికి ప్రసిద్ధిచెందిన శేషాచలం అడవుల నుంచి అక్రమార్కులు దుంగలను తరలిస్తున్నారు. టాస్క్ఫోర్స్ పోలీసులు దాడులతో అప్పుడప్పుడు కొన్ని దుంగలు దొరకుతున్నాయి. రేషన్ బియ్యం అక్రమ రవాణా జోరుగా సాగుతోంది. మరోవైపు ప్రతినిత్యం ఆవులు, పశువులను పెద్ద సంఖ్యలో లారీలలో తరలిస్తున్నారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి రాయచోటి, మదనపల్లె మీదుగా బెంగుళూరుకు పెద్ద ఎత్తున పశువుల దందా సాగుతోంది. ఇందులో భాగంగా పలువురు పోలీసులతో మామూళ్లు మాట్లాడుకుని పశువుల రవాణాకు ఇబ్బందులు లేకుండా చేసుకుంటున్నట్లు పోలీసు వర్గాల్లోనే గుసగుసలు వినిపిస్తున్నాయి. అన్నమయ్య జిల్లా కలెక్టరేట్జిల్లాలోనే ప్రధాన పట్టణంగా గుర్తింపు పొందిన మదనపల్లెలో అసాంఘిక కార్యకలాపాలు రాజ్యమేలుతున్నాయి. పీలేరు, మదనపల్లె, రాయచోటి, రాజంపేట ప్రాంతాల్లో గంజాయి చాపకింద నీరులా విద్యార్థుల దరిచేరుతోంది. ఇందుకు ఉదాహరణగా గతంలో ఇద్దరు విద్యార్థులు గంజాయి మత్తులో రైలు కిందపడి మృతి చెందారు. మదనపల్లెలో కూడా గంజాయి వాసనలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ఇటీవల అనేక హత్యలు కూడా చోటుచేసుకున్నాయి. క్షణికావేశంలో జరిగే హత్యలు కొన్ని అయితే, ఓ సీఐ తల్లికి మాటమాటలు చెప్పి నగలు దోచుకుని మట్టుబెట్టిన వైనం గతంలో సంచలనం సృష్టించింది. బాలలపై అఘాయిత్యాలు, ఇతర అసాంఘిక కార్యకలాపాలు పెరిగిపోయాయి. జిల్లా ఎస్పీగా బాద్యతలు చేపట్టిన ధీరజ్ మదనపల్లైపె కూడా ప్రత్యేక దృష్టి సారించాలని స్థానికులు కోరుతున్నారు.జిల్లాలోని గువ్వలచెరువు ఘాట్, రాయచోటి–చిత్తూరు జాతీయ రహదారితోపాటు కడప–రేణిగుంట ప్రధాన రహదారిలోని రైల్వేకోడూరు, రాజంపేట ప్రాంతాల్లో రోడ్డు ప్రమాదాలు నిత్యకృత్యంగా మారాయి. మరోవైపు జిల్లాలో భూ కబ్జాలు, రౌడీయిజం పెరిగింది. రాయచోటి ఇటీవల వరుస ఘటనలు చోటుచేసుకున్నాయి. జిల్లా వ్యాప్తంగా అసాంఘిక కార్యకలాపాలపై నూతన ఎస్పీ ఉక్కుపాదం మోపాలని జిల్లా వాసులు కోరుతున్నారు. జిల్లా కలెక్టర్, ఎస్పీలకు స్వాగతం పలుకుతున్న సమస్యలు జిల్లాలో ఎక్కడ చూసినా పేకాట, విచ్చలవిడిగా మద్యం విక్రయాలు మదనపల్లె కేంద్రంగా హత్యలు అధికార పార్టీ ఆగడాలు, పెరిగిపోయినభూ ఆక్రమణలు, కబ్జాలు శేషాచలం అడవుల నుంచి తరలిపోతున్న ఎర్ర బంగారం -
వైఎస్ఆర్ జిల్లాలో వర్షం
కడప అగ్రికల్చర్: ఆల్పపీడనం కారణంగా జిల్లాలో మంగళవారం తెల్లవారుజాము నుంచి బుధవారం ఉదయం వరకు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం కురిసింది. జిల్లావ్యాప్తంగా కొండాపురం, మైలవరం, పెద్దముడియం, జమ్మలమడుగు. కలసపాడు, ఆట్లూరు మండలాలు మినహా మిగతా 30 మండలాల్లో వర్షం కురిసింది. జిల్లాలో చాలా మండలాల్లో ప్రస్తుతం ఉల్లిపంట కోతలు ప్రారంభించారు. తడికి ఉల్లిగడ్డలు దెబ్బతింటాయని ఉల్లి రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ వర్షం వరిపంట సాగు చేసిన రైతులకు చాలా మేలు.వరికి సోకిన చీడపీడలు తొలిగి పంట ఏపుగా పెరిగే అవకాశశం ఉంటుంది. మిగతా ఆరుతడి పంటలైన పత్తి, వేరుశనగ, పసుపు, మొక్కజొన్న, సజ్జ పంటలకు, మామిడి, సపోట, చీని, నిమ్మ, డ్రాగెన్ ప్రూట్ వంటి ఉద్యాన పంటలకు కూడా ఈ వర్షం మేలేనని రైతులు తెలిపారు. చాపాడులో అత్యధికంగా 80.2 మిల్లీమీటర్లు, కాశినాయనలో అత్యల్పంగా 1 మిల్లీమీటర్ వర్షం కురిసింది. -
ఆర్భాటం.. హంగామా?
మదనపల్లె సిటీ: మెగా డీఎస్సీ పేరుతో కూటమి ప్రభుత్వం ప్రచార ఆర్భాటానికి తెర లేపింది. 150 రోజుల పాటు కసరత్తు జరిపి హంగామా చేశారు. తీరా అర్హులకు న్యాయం చేశారా అంటే అదీ లేదు. అనర్హులకు, అనుకూలమైనవారికి ఉద్యోగాలు కల్పించారని ప్రచారం జరుగుతోంది .ఇప్పుడు నియామకపత్రాల పంపిణీ పేరుతో మరో డ్రామాను తెరమీదకు తెచ్చారు. ఈనెల 19న విజయవాడ వేదికగా నిర్వహించే కార్యక్రమంలో మెగా డీఎస్సీలో ఉద్యోగాలు పొందిన వారికి నియామకపత్రాలు పంపిణీ చేస్తామంటూ హంగామా సృష్టిస్తోంది. ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల నుంచి విజయవాడకు రావాలని ఆదేశాలు జారీ చేశారు. దీనిపై పలువురు మండిపడుతుండటంతో ఏం చేయాలో దిక్కుతోచక అధికారులు తలలు పట్టుకోవాల్సి వస్తోంది. ● ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల వ్యాప్తంగా నిర్వహించిన మెగా డీఎస్సీ కసరత్తు విమర్శలకు తావిస్తోంది.150 రోజుల పాటు సాగదీసి అర్హులకు మెండి చేయి చూపారని పలువురు మండిపడుతున్నారు. ఈనెల 15న మెగా డీఎస్సీ తుది ఎంపిక జాబితాను ప్రచురించారు. ఈ జాబితా ప్రచురించాక వందల సంఖ్యలో హెల్ప్డెస్క్కు కాల్ చేశారు. జిల్లా విద్యాశాఖ కార్యాలయాలకు వెళ్లారు. న్యా యం చేయాలని వేడుకున్నారు. అభ్యర్థులకు విద్యాశాఖ అఽ దికారులు సమాధానం చెప్పలేని స్థితిలో మిగిలిపోయారు. ● గతంలో ఎన్నడూ లేని విధంగా కూటమి ప్రభుత్వం డీఎస్సీ (డిస్టిక్ సెలెక్షన్ కమిటీ) పేరుతో తిలోదకాలు వదిలింది. నిబంధనల ప్రకారం డీఎస్సీ కసరత్తు మొత్తం ఎన్నో ఏళ్లుగా జిల్లా స్థాయిలోనే జరిగేది. అయితే ప్రస్తుతం రాష్ట్ర స్థాయిలోనే నిర్వహించారు. ఇందులో పలు అక్రమాలు జరిగాయని అభ్యర్థులు వాపోతున్నారు. ఫలితాలు వెల్లడించిన తర్వాత మెరిట్, రోస్టర్ ప్రకారం విడుదల చేయాల్సిన జాబితా ఆఖర్లో గందరగోళం సృష్టించారు.ఎంపిక జాబితా పేరుతో ఐదు సార్లు ప్రచురించి, కాల్లెటర్లు పంపి, సర్టిఫికెట్లు పరిశీలించారు. తీరా తుది జాబితా ప్రచురించే సమయానికి ఎక్కువ ర్యాంకులు ఉన్న అభ్యర్థులకు ఉద్యోగాలు, తక్కువ ర్యాంకులు వచ్చిన అభ్యర్థులకు అనర్హులుగా పేర్కొన్నారు. దీంతో వందలాది మంది నష్టపోయారు. ● మెగా డీఎస్సీలో ఎంపికై న అభ్యర్థులకు అందజేసే నియామకపత్రాలు పంపిణీ కసరత్తును కూటమి ప్రభుత్వం రాజకీయ ప్రచారంగా మలుచుకుంది. ఈ ప్రక్రియను రాష్ట్ర స్థాయిలో విజయవాడలో నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. అభ్యర్థులతో పాటు వారి కుటుంబసభ్యులు కూడా రావాలని విద్యాశాఖ అధికారులు సందేశాలు పంపారు. దాదాపు 500 కిలోమీటర్లు దూరం వెళ్లాలంటే ఎంతో వ్యయప్రయాసాలతో కూడుకున్న పని. డీఎస్సీకి ఎంపికై న వారిలో గర్భిణులు, చంటిపిల్లల తల్లులు కూడా ఉన్నారు. వీరు అంతదూరం వెళ్లాలంటే ఇబ్బందులు పడాలి. ప్రభుత్వ నిర్ణయంపై పలువురు మండిపడుతున్నారు. డీఎస్సీ ఆర్డర్లకు 500 కిలోమీటర్లు వెళ్లాలా! మండిపడుతున్న అభ్యర్థులు -
దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర
కలికిరి: దేశ భద్రతలో సీఆర్పీఎఫ్ కీలక పాత్ర పోషిస్తోందని సీఆర్పీఎఫ్ డీఐజీపీ అనుపమ్ శర్మ అన్నారు. కలికిరి సీఆర్పీఎఫ్ (సీఐఏటీ–3) 12వ వ్యవస్థాపక దినోత్సవం సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. వామపక్ష తీవ్రవాదం(ఎల్డబ్ల్యూఈ) ప్రాంతాల్లో మోహరించిన దళాలకు కౌంటర్ ఇన్సర్జెన్సీ శిక్షణను అందించడానికి తమిళనాడు రాష్ట్రం అవడిలో 2014 సెప్టెంబరు 15న గ్రూప్ సెంటర్ను ఏర్పాటు చేయడం జరిగిందని, తరువాత కలికిరిలో ప్రస్తుతం పూర్తి స్థాయి శిక్షణా సంస్థగా ఏర్పాటైనట్లు పేర్కొన్నారు. సైనిక్ సమ్మేళన్ నిర్వహించి కేంద్రంలో జరుగుతున్న వివిధ రకాల శిక్షణ, వసతి, ఇంకా అవసరమైన సదుపాయాలపై వివరించారు. జవాన్లతో ముఖాముఖిగా మాట్లాడారు. సీఆర్పీఎఫ్ దేశ సేవలో ముందుంటుందని, ఎలాంటి విపత్కర పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలన్నారు. ఈ సందర్భంగా కలికిరి బాలికల రెసిడెన్షియల్ డిగ్రీ కళాశాల విద్యార్థినులు చేపట్టిన సాంస్కృతి కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో సీఐఏటీ స్కూల్ కమాండెంట్ రాజేష్కుమార్, అధికారులు, జవాన్లు, కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
7 నుంచి భవ్య గుజరాత్ యాత్ర
కడప కోటిరెడ్డిసర్కిల్: భారతీయ రైల్వే శాఖలో భాగమైన ఐఆర్సీటీసీ ఆధ్వర్యంలో భవ్య గుజరాత్ యాత్రను చేపట్టనున్నామని ఐఆర్సీటీసీ ఏరియా మేనేజర్ వేణుగోపాల్ తెలిపారు. వైఎస్ఆర్ జిల్లా కడప రైల్వేస్టేషన్లో ఏర్పాటు చేసిన సమావేశంలో యాత్రకు సంబంధించిన బ్రోచర్లను ఆవిష్కరించి ఆయన మాట్లాడారు. అక్టోబర్ 7 నుంచి 10 రోజులపాటు ప్రత్యేక పర్యాటక రైలు ద్వారా భవ్య గుజరాత్ యాత్ర నిర్వహించనున్నట్లు తెలిపారు. ఈ యాత్రలో గరిష్టంగా 639 మంది యాత్రికులు పాల్గొనవచ్చన్నారు. ద్వారక, నాగేశ్వర్ ఆలయం, సోమనాథ్ ఆలయం, అహ్మదాబాద్, సూర్య దేవాలయం, సబర్మతి ఆశ్రమం, సబర్మతి నది తీరం, యునెస్కో వారసత్వ స్థలం రాణి కి వావ్, అలాగే ప్రపంచ ప్రఖ్యాత స్టాచ్యూ ఆఫ్ యూనిటీ వంటి పుణ్యక్షేత్రాలు, చారిత్రక క్షేత్రాలను ఈ యాత్రలో సందర్శించవచ్చని పేర్కొన్నారు. ఈ రైలు రేణిగుంట నుంచి గూడూరు, నెల్లూరు, ఒంగోలు, చీరాల, తెనాలి, విజయవాడ, ఖమ్మం, ఖాజీపేట, సికింద్రాబాద్, నిజాముద్దీన్, హుజూర్ సాహెబ్ నాందేడ్, పూణే మార్గంలో ప్రయాణించి తిరిగి అదే మార్గం ద్వారా రేణిగుంట చేరుతుందని వివరించారు. ప్రయాణికులకు ఉదయం టీ, బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్, వెజిటేరియన్ భోజనం, వాటర్ బాటిల్ వంటి సౌకర్యాలతోపాటు ప్రతి యాత్రికుడికి ప్రయాణ బీమా సదుపాయం కల్పించనున్నట్లు తెలిపారు. స్లీపర్ క్లాస్ టికెట్ ధర రూ.18,400.. 3 టైర్ ఏసీ టిక్కెట్ రూ.ఽ30,200.. 2 ఏసీ టిక్కెట్ ధర రూ.39,900 గా నిర్ణయించారని తెలిపారు. టికెట్ బుకింగ్ కోసం బి.యేసయ్య (9281495853), కె.పవన్కుమార్ ( 8287932313)లను సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఐఆర్సీటీసీ ప్రతినిధులు భాస్కర్ బాబు, యేసయ్య, ఈరన్న, దుర్గాప్రసాద్, ఇన్చార్జి స్టేషన్ మేనేజర్ వెంకటసుబ్బయ్య తదితరులు పాల్గొన్నారు. -
ఇతర రాష్ట్రాల నుంచి వ్యాపారులు
అమ్మవారి ఆలయంలో లభించే తలనీలాలకు విదేశాల్లో అధిక డిమాండ్ ఉండటంతో.. వేలం పాటలు రికార్డు స్థాయిలో పలుకుతుండటం గమనార్హం. దీంతో బయటి రాష్ట్రాల నుంచి వ్యాపారులు పెద్ద ఎత్తున తరలిరావడంతో వేలం పాటలో పోటీ బాగా పెరిగింది. తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కర్నూలు, అనంతపురం, కృష్ణా జిల్లాల నుంచి పెద్ద ఎత్తున వ్యాపారులు తరలివస్తారు. గతంలో రూ.10 లక్షల నుంచి రూ.12 లక్షలు మాత్రమే వేలం పాట పాడేవారు. ఈ ఏడాది రూ.18.76 లక్షలకు వేలం పాటలో వ్యాపారులు పాడుకొన్నారు. -
పోలీస్ స్టేషన్ ఎదుట మహిళ ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వారం రోజులుగా తన సమస్య పట్టించుకోలేదనే మనస్థాపంతో పోలీస్ స్టేషన్ ఎదుట ఓ మహిళ ఆత్మహత్యయత్నానికి పాల్పడిన సంఘటన మంగళవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. బాఽధితురాలి వివరాల మేరకు.. మండలంలోని సీటీఎం పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన మల్లికార్జున భార్య యశోద(32) ఏడాది కిందట భర్తతో విడిపోయి పుట్టింట్లో ఉంటోంది. తన భర్త హార్ట్ పేషంట్ కావడంతో వైద్య చికిత్స, ఇంటి నిర్మాణం కోసం, డ్వాక్రా గ్రూపులో రూ.4 లక్షల రుణం తీసుకుంది. భర్తతో విడిపోయే సమయంలో పెద్ద మనుషుల సమక్షంలో అప్పు చెల్లిస్తానని మల్లికార్జున ఒప్పందం చేసుకున్నారు. అయితే అప్పు చెల్లించకపోవడంతో డ్వాక్రా గ్రూపు సభ్యులు యశోదపై ఒత్తిడి తెచ్చారు. రుణం నీవు తీసుకున్నావు చెల్లించాల్సిందేనని పట్టుపట్టారు. తన సమస్యను పరిష్కరించాలని తాలూకా పోలీసు స్టేషన్కు వచ్చి యశోద ఫిర్యాదు చేసింది. పోలీసుల ఆ సమస్యను పట్టించుకోకపోవడంతో మనస్థాపం చెంది తన వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ యశోదను పరామర్శించి వివరాలు తెలుసుకున్నారు. సీఐ మాట్లాడుతూ బాఽధితురాలు యశోద ఎనిమిది నెలల క్రితం భర్తతో విడిపోయి మరో వ్యక్తితో సహజీవనం చేస్తోందన్నారు. ఆమె భర్త పిల్లలను పోషిస్తూ అప్పులు చెల్లిస్తూ, గుండె వైద్యం చేయించుకుంటున్నారన్నారు. ప్రస్తుతం అతడి భార్య యశోధ గ్రామంలోని ఇంటిని సైతం ఆమె పేరుపై మార్చి ఇవ్వాలని, పెద్ద మనుషులను తీసుకుని తాలూకా స్టేషన్కు వచ్చిందన్నారు. ఇది సివిల్ సమస్య కావడంతో కోర్టుకు వెళ్లి పరిష్కరించుకోవాలని సూచించామన్నారు. వారం రోజులుగా స్టేషన్కు వచ్చినట్లు చెప్పడం అవాస్తమన్నారు. -
చిత్తూరు, అనంతపురం జట్ల భారీ స్కోరు
నిఖిల్గౌడ్(153 పరుగులు) కనిష్(5 వికెట్లు) వికాస్(109 పరుగులు) మహేంద్రారెడ్డి(239) కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్లో రెండో రోజున చిత్తూరు, అనంతపురం జట్లు భారీ స్కోర్లు చేశాయి. కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 375 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 103.3 ఓవర్లలో 454 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని నిఖిత్ గౌడ్ అద్భుతంగా బ్యాంటింగ్ చేసి 22 ఫోర్లతో 153, బాలాజీ 59 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని కనిష్ చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి ఐదు, సాయి సూర్యతేజరెడ్డి రెండు, అక్షిత్రెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 68 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా 46, ధనుష్ నాయుడు 46 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని బ్రహ్మ సాయి తేజ్రెడ్డి మూడు వికెట్లు తీశాడు. కర్నూలు జట్టు ఇంకా 236 పరుగుల వెనుకంజలో ఉంది. దీంతో రెండో రోజు ఆట ముగిసింది. వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో...... వైఎస్సార్ ఏసీఏ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో 364 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 150.3 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 537 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని మహేంద్రారెడ్డి 30 ఫోర్లుతో అద్భుతంగా చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 239, వికాస్ 109 పరుగులు చేశాడు. కడప జట్టులోని షేక్ ఆదిల్ హుస్సేన్ మూడు, నరసింహ రెండు, చెన్నారెడ్డి రెండు వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 29 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 109 పరుగులు చేసింది. ఆ జట్టులోని విజయరామిరెడ్డి 59 పరుగులు, భరత్రెడ్డి 40 పరుగులు చేశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
కొత్త సార్లొస్తున్నారు
ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న డీఎస్సీ–2025 తుది అంకానికి చేరుకుంది. గతంలో నిర్వహించిన పరీక్షలో పొందిన మార్కులు, రిజర్వేషన్ల ప్రామాణికం అధారంగా 680 మంది అర్హుల జాబితా ప్రభుత్వం సోమవారం విడుదల చేసింది. మరో 32 పోస్టులను భర్తీ చేయలేదు. కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు ప్రభుత్వం మెగా డీఎస్సీ నిర్వహించింది. ఇటీవల అభ్యర్థులకు సంబంధించిన సర్టిఫికెట్ల వెరిఫికేషన్ పక్రియను కడప ఎస్వీ ఇంజినీరింగ్ కళాశాలలో పూర్తి చేసింది. ప్రస్తుతం ఉమ్మడి జిల్లాలో 712 పోస్టులకు గానూ, 680 మందిని ఎంపిక చేస్తూ తుది జాబితా విడుదల చేసింది. మరో 32 పోస్టులకు అర్హులైన అభ్యర్థులు లేరంటూ భర్తీ చేయకుండా మిగిల్చింది. గతంలో ఎన్ని పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేస్తే అన్నీ భర్తీ చేసేవారు. రిజర్వేషన్, రోస్టర్, మెరిట్ ప్రకారం అభ్యర్థి లేకపోతే ఆ తర్వాత అర్హత ఉన్న అభ్యర్థికి ఆ పోస్టు కేటాయించేవారు. కూటమి ప్రభుత్వం అలాకాకుండా సంబంధిత అభ్యర్థి లేకపోతే అ పోస్టును వదిలేసి తరువాత డీఎస్సీలో భర్తీ చేస్తామని చెబుతోంది. నిరుద్యోగిత పెరిగిన పరిస్థితుల్లో 32 పోస్టులు మిగిల్చడంపై అభ్యర్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొలువుల్లో చేరే వారికి శిక్షణ... కొత్తగా ఉపాధ్యాయ ఉద్యోగానికి ఎంపికైన అభ్యర్థుల కు శిక్షణ ఇచ్చేందుకు జిల్లా అధికారులు రంగం సిద్ధం చేసినట్లు తెలిసింది. ఉమ్మడి జిల్లాలో ఎంపికై న 680 మంది అభ్యర్థులకు ఈ నెల 19న అపాయింటెంట్ అ ర్డర్లు ఇవ్వనున్నట్లు సమాచారం. 22వ తేదీ నుంచి 29వ తేదీ వరకూ శిక్షణ ఇవ్వనున్నట్లు తెలిసింది. ఎంపికైన స్కూల్ అసిస్టెంట్లు, ఫిజికల్ డైరెక్టర్లు, ఎస్జీటీ లకు శిక్షణ అనంతరం వారికి స్థానాలు కేటాయించి పంపనున్నారు. కొత్త ఉపాధ్యాయులంతా దసరా సెలవుల తర్వాత విధుల్లో చేరే అవకాశం ఉంది. ఎంపికైన జాబితా వివరాలు... సబ్జెక్టు నోటిఫైడ్ ఎంపిక పోస్టులు చేసినవిఎస్ఏ సంస్కృతం 01 01 ఎస్ఏ తెలుగు 26 25 ఎస్ ఉర్దూ 07 06 ఎస్ఏ హింది 18 18 ఎస్ఏ ఇంగ్లీస్ 81 78 ఎస్ మ్యాథ్స్ 44 44 ఎస్ఏ మ్యాథ్స్ ఉర్దూ 01 01 ఎస్ఏ పీఎస్ 29 29 ఎస్ఏ పిఎస్ ఉర్దూ 03 01 ఎస్ బయాలజీ 52 50 ఎస్ఏ బయాలజీ ఉర్దూ 02 02 ఎస్ఏ సోసియల్ స్టడీ 60 58 ఎస్ఏ ఎస్ఎస్ ఉర్దూ 05 05 ఎస్ఏ పిఈ 82 80 ఎస్జిటి తెలుగు మీడియం 256 254 ఎస్జిటి ఉర్దూ మీడియం 45 28 మొత్తం 712 680 ఎంపిక తుది జాబితా విడుదల డీఈఓ ఆఫీసు, కలెక్టరేట్ల వద్ద జాబితా ప్రదర్శన జిల్లాలో 712 పోస్టులకు 680 మంది ఎంపిక 19న కొత్త ఉపాధ్యాయులకు అపాయింట్మెంట్ ఆర్డర్స్ ఈ నెల 22 నుంచి ఉపాధ్యాయులకు శిక్షణ? -
అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి..
మదనపల్లె రూరల్ : అనుమానాస్పద స్థితిలో డిగ్రీ విద్యార్థి మృతిచెందిన సంఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. శానిటోరియం కొత్తపల్లెకు చెందిన సందీప్, రుక్మిణి దంపతుల కుమారుడు సుచిత్(20) పట్టణంలోని ఓ ప్రైవేట్ డిగ్రీ కళాశాలలో బీసీఏ చదువుతున్నాడు. తండ్రి సందీప్ ఎనిమిదేళ్ల కిందట చనిపోగా, తల్లి రుక్మిణి వేరొకరిని పెళ్లి చేసుకుని వెళ్లిపోయింది. దీంతో సుచిత్, అవ్వ సుగుణమ్మతో కలిసి శానిటోరియం కొత్తపల్లెలో ఉంటున్నాడు. సోమవారం అర్ధరాత్రి వరకు ఫోన్ మాట్లాడి నిద్రపోయిన సుచిత్ ఉదయం బాత్ రూమ్లో చీరతో ఉరివేసుకున్నాడు. అవ్వ సుగుణమ్మ గమనించి బిగ్గరగా కేకలు వేసింది. చుట్టుపక్కల వారి సహాయంతో పోలీసులకు సమాచారం అందించింది. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని పరిశీలించారు. స్థానికులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. మార్చురీ గది వద్ద డీఎస్పీ మహేంద్ర, సీఐ కళా వెంకటరమణ మృతదేహాన్ని పరిశీలించారు. మృతిపై సందేహాలు ఉండడంతో అవ్వ సుగుణమ్మ ఫిర్యాదుమేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతికి ప్రేమ వ్యవహారం కారణమా...? లేదా ఇతర కారణాలు ఏమైనా ఉన్నాయా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. -
వరి రైతు విలవిల..
రాయచోటి : వర్షాకాలంలో తెగుళ్లతో వరి రైతు నష్టపోతున్నాడు. ఇప్పటికే యూరియా బస్తాల కోసం దుకాణాల చుట్టూ తిరుగుతున్న అన్నదాతలు ఇపుడు తమ వరి పైరుకు తెగుళ్లు సోకడంతో లబోదిబోమంటున్నారు. గత 15 రోజులుగా కురుస్తున్న వర్షాలు, వాతావరణంలో మార్పులకు వరి పంటకు కంకినల్లి, దోమ, ఆకు ఎండుతెగుళ్లు సోకాయి. వరి కర్రలు ఎర్రబారిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లా వ్యాప్తంగా సాధారణ సాగు 11432 హెక్టార్లకుగానూ, లోటు వర్షపాతం కారణంగా ప్రస్తుతం 4154 హెక్టార్లలో వరి సాగు చేశారు. 11 వేల ఎకరాలలో టమాట, 5వేల ఎకరాల్లో వంగ, మిరప పంటలు సాగుచేశారు. ఈ సారి వరిపంటకు తెగుళ్లు బెడద తీవ్రమైంది. వెలిగల్లు, పింఛా ప్రాజెక్టు క్రింద ఆయకట్టు, మదనపల్లి వాయల్పాడు, పీలేరు ప్రాంతాలలో చెరువుల కింద కొంతమేర, బావులు, బోరుబావుల్లో నీరు ఉన్న రైతులు వరిసాగు చేశారు. వరిపొట్ట దశకు వస్తుండటంతో క్రిమి కీటకాలు ఎక్కువయ్యాయి. కంకినల్లి, దోమ, ఆకు, ఎండు తెగుళ్లకు రైతులు మందులను పిచికారీ చేస్తున్నారు. ఇప్పటికే దున్నడానికి, నాటు వేయడానికి ఎరువులకు పెట్టుబడి పెట్టి సతమతమవుతుంటే కొత్తగా తెగుళ్లు రావడంతో రైతులు తలలు పట్టుకుంటున్నారు. వరికి తెగుళ్లు సోకాయి..... వరికి దోమ, కంకినల్లి, ఆకు ఎండుతెగుళ్లు సోకాయి. మందులను ఇప్పటికే పిచికారీ చేశాం. వాతావరణ మార్పులతో వరి పొట్ట దశలో ఉండగా రోగాలు వస్తున్నాయి. పెట్టుబడులు తడిసి మోపడయ్యాయి. దీనికి తోడు యూరియా దొరకడం లేదు. నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి. – బాలకృష్ణారెడ్డి, రైతు, పెద్దకాలవపల్లి -
ఐదుగురు నిందితులకు జైలు శిక్ష
సిద్దవటం : దొంగనోట్ల మార్పిడి కేసులో ఐదుగురు నిందితులకు జైలు శిక్ష, జరిమానా విధిస్తూ బద్వేల్ జడ్జి పద్మశ్రీ మంగళవారం తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ మహమ్మద్ రఫీ తెలిపారు. ఈ సందర్భంగా ఎస్ఐ మాట్లాడుతూ సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామ పంచాయతీలోని సాయి వైన్స్ షాపులో 2010లో కర్నూలు జిల్లా బనగానపల్లికి చెందిన యు.మాధవరెడ్డి, ఎం.షర్పుద్దీన్, టి.వెంకటేశ్వర్లు, ఎస్.అల్తాఫ్, ఎస్.హుస్సేన్వల్లి వేయి రూపాయల దొంగనోటు ఇచ్చి చెలామణి చేశారు. వైన్ షాపు క్యాషీయర్ జయ నరసింహులు ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ బొజ్జప్ప కేసు నమోదు చేయగా ఒంటిమిట్ట సీఐ రవిబాబు విచారణ చేశారు. తొమ్మిది మందిని అరెస్టు చేయగా సదరు కేసు బద్వేల్ అడిషనల్ అసిస్టెంట్ సెషన్ కోర్టు జడ్జి వై పద్మశ్రీ విచారించి ఒక్కొక్కరికి ఏడు సంవత్సరాల సాధారణ జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ తీర్పు వెలువరించినట్లు ఎస్ఐ తెలిపారు. ఇద్దరిపై నేరం రుజువు కానందున కేసు కొట్టి వేయడం జరిగిందన్నారు. సాక్షాధారాలతో నేరం రుజువు చేసి ఐదుగురికి శిక్షపడేలా కృషి చేసిన పోలీసు అధికారులు, సిబ్బందిని ఎస్పీ షెల్కే నితికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
నీటి సంపులో పడి బాలుడు మృతి
బి.కొత్తకోట : సరదాగా ఆడుకునే పసివాడిని నిర్మాణంలోని ఇంటి సంపు రూపంలో మృత్యువు కబళించింది. ఈ సంఘటన మంగళవారం సాయంత్రం బి.కొత్తకోట పట్టణం పిటిఎం రోడ్డులో జరిగింది. బాధితులు, పోలీసుల కథనం మేరకు.. పెద్దతిప్పసముద్రం మండలం సామాడపల్లెకు చెందిన కె.ఈశ్వరప్ప కొన్నేళ్ల క్రితం బి.కొత్తకోటకు వలస వచ్చి పండ్ల వ్యాపారం చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం ఎదురుగా ఉన్న వీధిలో నాలుగో తరగతి చదువుతున్న ఈశ్వరప్ప కుమారుడు కే.కళ్యాణ్ (9) మంగళవారం దేవాన్ష్, నాను తదితర పిల్లలతో కలిసి ఆడుకుంటున్నాడు. అదే వీధిలో ఓ ఇంటి నిర్మాణ పనులు జరుగుతుండడంతో అక్కడి సంపుపై మూత వేయకుండా వదిలేశారు. పిల్లలు ఆడుకుంటూ ఉండగా..కళ్యాణ్ కనిపించలేదు. దీంతో విషయాన్ని కుటుంబీకులకు తెలియజేశారు. ఆందోళనతో కళ్యాణ కోసం వెతగ్గా సంపులో పడి వుండగా గుర్తించి బిడ్డను తీసుకొని ఆసుపత్రికి వచ్చారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. అడుకుంటూ ప్రమాదవశాత్తూ సంపులో పడి ఊపిరాడక చనిపోయి ఉంటాడని భావిస్తున్నారు. ఒక్కగానొక్క కొడుకు కళ్యాణ్ మృతి విషయం తెలుసుకున్న కుటుంబీకులు, బంధువులు, ప్రజలు ఆసుపత్రికి చేరుకుని బోరున విలపించారు. ఈశ్వరప్పకు కుమార్తె కల్పన (13), కుమారుడు కళ్యాణ్ ఉన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు పంచాయతీ గొల్లపల్లికి చెందిన వివాహిత గాయత్రి(30) ఆత్మహత్యా యత్నానికి పాల్పడినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. సదరు మహిళ మంగళవారం పొలం వద్దకు వెళుతూ వెంట తెచ్చుకున్న పురుగుల మందు తాగి అపస్మారకస్థితికి చేరుకోగా బాధిత కుటుంబీకులు చికిత్స నిమిత్తం మదనపల్లి ప్రభుత్వాసుపత్రికి తరలించారన్నారు. ఆత్మహత్యా యత్నానికి గల కారణాలు పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. గుర్తుతెలియని వ్యక్తి మృతి మదనపల్లె రూరల్ : పట్టణంలోని ఆర్టీసీ బస్టాండు సమీపంలో ఓ వ్యక్తి మృతిచెంది ఉండడాన్ని గ మనించి స్థానికులు పోలీసులకు తెలిపారు. టూ టౌన్ పోలీసులు అతడి మృతిపై విచారించారు. గుర్తు తెలియని వ్యక్తి చుట్టుపక్కల యాచిస్తూ ఉండేవాడని చెప్పడంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. మృతిచెందిన వ్యక్తి బ్లూ కలర్ గళ్లలుంగీ, గోధుమ కలర్ షర్ట్ ధరించి ఉన్నాడని, సంబంధీకులు ఉంటే టూటౌన్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సీఐ తెలిపారు. బొలేరో ఢీకొని వృద్ధురాలు మృతి మదనపల్లె రూరల్ : బొలేరో ఢీకొని వృద్ధురాలు మృతిచెందిన ఘటన మంగళవారం కలకడ మండలంలో జరిగింది. కదిరాయనిచెరువు ఎస్టీ కాలనీకి చెందిన పెద్ద రెడ్డెప్ప భార్య జయమ్మ(64) మర్రిపాడు రోడ్డు మార్గంలో పొలం వద్దకు నడిచి వెళ్తోంది. బొంతలవారిపల్లె సమీపంలో బొలేరో వాహనం వేగంగా వచ్చి ఢీకొనడంతో తలకు తీవ్రగాయాలై అపస్మారక స్థితికి చేరుకుంది. కుటుంబీకులు 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకురాగా పరిస్థితి విషమించి మృతి చెందింది. మృతదేహాన్ని పోస్టు మార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కలకడ పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పిచ్చి కుక్క దాడిలో వృద్ధురాలికి గాయాలు రాయచోటి టౌన్ : పిచ్చి కుక్క దాడిలో లక్ష్మమ్మ(50)కు గాయాలయ్యాయి. రాయచోటి – సుండుపల్లె రోడ్డులో జగనన్న కాలనీ వద్ద అదే ప్రాంతానికి చెందిన లక్ష్మమ్మ నడచి వెళ్తుండగా వెనుక నుంచి పిచ్చికుక్క వచ్చి దాడి చేసింది. గాయాలైన ఆమెను స్థానికులు రాయచోటి ఆస్పత్రికి తరలించారు. వైద్యులు ఆమెకు రేబీస్ వ్యాధి టీకాలు వేశారు. పోక్సో కేసులో నిందితుడికి జైలు శిక్ష సంబేపల్లె : మండలంలోని నారాయణరెడ్డిపల్లె గ్రామానికి చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసిన జడపాల వెంకటరమణకు కడప జిల్లా ప్రధానకోర్టు న్యాయమూర్తి సి.యామని మంగళవారం శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. నిందితుడు జడపాల రమణ 2021లో నారాయణరెడ్డిపల్లెకు చెందిన 15 ఏళ్ల బాలికపై అత్యాచారం చేసినట్లు ఫిర్యాదు అందడంతో పోలీసులు కేసు నమోదు చేసి కోర్టుకు హాజరుపరిచారు. ఈ క్రమంలోనే రమణకు జిల్లా ప్రధాన కోర్టు న్యాయమూర్తి మూడేళ్ల జైలుశిక్ష రూ.20 వేల జరిమానా విధించినట్లు పోలీసులు తెలిపారు. -
తైక్వాండో జిల్లా జట్టుకు ఎంపిక
ప్రొద్దుటూరు కల్చరల్ : స్థానిక జార్జికారొనేషన్ క్లబ్లో మంగళవారం ఎస్జీఎఫ్ఐ అండర్–14, 17 బాల బాలికల జిల్లా స్థాయి తైక్వాండో ఎంపికలు ఉత్సాహంగా సాగాయి. జిల్లాలోని పలు ప్రాంతాలకు చెందిన 300 మంది క్రీడాకారులు పాల్గొని తమ క్రీడా నైపుణ్యంతో ఆకట్టుకున్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన క్రీడాకారులను రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక చేశారు. ఈ పోటీలను ఎస్జీఎఫ్ఐ సెక్రటరీ శ్రీకాంత్ రెడ్డి, జార్జికారొనేషన్ క్లబ్ కార్యదర్శి మార్తల సుధాకర్రెడ్డి, ఉపాధ్యక్షుడు బాలగంగిరెడ్డి, ఈసీ మెంబర్ రామసుబ్బారెడ్డి, విద్యుత్ బీసీ ఉద్యోగుల సంక్షేమ సంఘం అధ్యక్షుడు వెంకటమురళీమోహన్, శివారెడ్డి, శివకృష్ణ, అల్లాబకాష్, రాఘవ తదితరులు పర్యవేక్షించారు. -
గురుకుల యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలి
కడప రూరల్ : తన కుమారుడు కన్ను పోవడానికి కారణమైన రిషి వాటిక వ్యక్తి వెంకటేష్ వేద వ్యాస భారతి ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహించే రిషి వాటిక గురుకుల యాజమాన్యంపై చట్ట ప్రకారం తగిన చర్యలు తీసుకోవాలని కొండా అమర్నాథ్రెడ్డి కోరారు. సోమవారం ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తన కుమారుడు అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండల పరిధిలోని గట్టు గ్రామం వద్ద ఉన్న శ్రీ వేద వ్యాసా భారతీ ట్రస్ట్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న రిషి వాటిక గురుకులంలో మూడవ సంవత్సరం విద్యను అభ్యసిస్తున్నాడని తెలిపారు. ఇతర విద్యార్థులతో కలిసి ఆడుకుంటూ ఉండగా గురుకుల యాజమాన్యానికి సంబంధించిన వ్యక్తి వెంకటేష్ రాయితో తన కొడుకును కొట్టడంతో కన్ను పోయిందని ఆలస్యంగా తెలిసిందన్నారు. చికిత్స చేయించినా.. కంటి చూపు రాలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ఫీజు కట్టలేదన్న కోపంతోనే ఈ ఘటన జరిగిందని తన కుమారుడు తెలిపారని చెప్పారు. విషయం తెలుసుకునేందుకు స్కూల్కు వెళితే తననే చంపుతానని బెదిరించారని చెప్పారు. తనకు, తన కుమారునికి గురుకుల యాజమాన్యం నుంచి ప్రాణహాని ఉందని పేర్కొన్నారు. పోలీసులు నామమాత్రం సెక్షన్ల కింద కేసు పెట్టి చేతులు దులుపుకొన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారిపై కఠిన చర్యలు తీసుకుని, తమకు న్యాయం చేయాలని ఉన్నతాధికారులను కోరారు. -
నా బిడ్డను కాపాడండి
● అరుదైన వ్యాధితో బాధపడుతున్న నాగచైతన్య ● ప్రభుత్వం సహకరించాలంటూ తల్లి వేడుకోలుసుండుపల్లె : అనారోగ్యంతో బాధపడుతున్న తన కుమారుడు నాగచైతన్య(15)కి మెరుగైన వైద్యం అందించి కాపాడాలని తల్లి బోనంశెట్టి సుమలత ప్రభుత్వం, దాతలను వేడుకుంటోంది. వివరాలలోకి వెళ్లితే.. సుండుపల్లె మండల పరిధిలోని దిన్నెమీద బలిజపల్లి గ్రామానికి చెందిన బోనంశెట్టి నాగచైతన్య ఇంటర్మీడియెట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. పది రోజుల క్రితం తీవ్ర జ్వరం రావడంతో రాయచోటిలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో చూపించారు. జ్వరం తగ్గకుండా తీవ్రమైన కడుపునొప్పి రావడంతో.. మెరుగైన చికిత్స కోసం వేలూరు సీఎంసీకి తీసుకువెళ్లి వైద్యపరీక్షలు నిర్వహించారు. అక్కడ డాక్టర్లు వైద్య పరీక్షలు నిర్వహించి ఇతనికి బోన్ బ్లడ్ క్యాన్సర్ వ్యాధిగా నిర్ధారించారు. చికిత్స కోసం దాదాపు రూ.60 లక్షల వరకు ఖర్చవుతాయని డాక్టర్లు చెప్పడంతో.. ఆ నిరుపేద కుటుంబ సభ్యులు ఎటూతోచని దీనస్థితిలో కుప్పకూలిపోయారు. తన భర్త జీవనోపాధి కోసం కువైట్ దేశంలో పని చేసుకుంటూ జీవనాన్ని నెట్టుకొస్తున్నాడని, తమ బిడ్డకు ఈ వ్యాధి రావడంతో ఏమి చేయాలో తమకు దిక్కు తోచడం లేదని ఆమె కన్నీటి పర్యంతమవుతోంది. ప్రభుత్వం తమ బిడ్డకు ప్రాణభిక్ష పెట్టాలని ఆమె ప్రాధేయపడుతోంది. దాతలు కూడా ముందుకు వచ్చి తమ బిడ్డ వైద్యానికి సహాయం చేయాలని ఆమె వేడుకుంటోంది. -
మెడికల్ సీట్లను వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వం
పులివెందుల : పులివెందుల మెడికల్ కళాశాలకు 50 సీట్లు మంజూరైతే.. వద్దని వెనక్కి పంపిన దద్దమ్మ ప్రభుత్వమిదని కూటమిపై వైఎస్సార్సీపీ నాయకులు మండిపడ్డారు. సోమవారం పులివెందులలోని మెడికల్ కళాశాలను వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మైదుకూరు మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, డీసీ గోవిందరెడ్డి సందర్శించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మెడికల్ కళాశాలలో పూర్తయిన నిర్మాణాలు, ఆసుపత్రి భవనాలు, నర్సింగ్ కళాశాలను పరిశీలిస్తూ.. పూర్తయిన భవనాలను మీడియా ప్రతినిధులకు చూపించారు. అనంతరం వారు మెడికల్ కళాశాల ఎదురుగా.. కళ్లు ఉండి చూడలేని సీఎం చంద్రబాబు డౌన్ డౌన్, వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వం వర్థిల్లాలంటూ నినాదాలు చేశారు. ఈ కార్యక్రమంలో పులివెందుల మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్ప, రైతు విభాగపు నాయకులు సంబటూరు ప్రసాద్రెడ్డి, పులి సునీల్కుమార్, వేముల సాంబశివారెడ్డి, సర్వోత్తమరెడ్డి, రసూల్, వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, పులివెందుల నియోజకవర్గ స్థాయి నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. పూర్తి కాకపోతే.. సీట్లు ఎలా కేటాయిస్తారు? పులివెందుల మెడికల్ కళాశాలకు సీట్లు కేటాయిస్తే.. కూటమి వద్దని వెనక్కి పంపింది. నేషనల్ మెడికల్ కౌన్సిల్ ఆఫ్ ఇండియా వ్యవస్థ వచ్చి చూసి 50 సీట్లు కేటాయించిందంటే.. మెడికల్ కళాశాల పూర్తయినట్లా, పూర్తి కానట్లా? మెడికల్ కళాశాల పూర్తి కాకపోతే ఈ కళాశాలకు 50 సీట్లు ఎందుకు కేటాయిస్తారు. కోట్లు వెచ్చించి నిర్మిస్తే అందుబాటులోకి తెచ్చి మెరుగైన విద్య, వైద్యం అందిచ్చాల్సింది పోయి ప్రైవేట్ పరం చేయడం ఏమిటి? – రాచమల్లు శివప్రసాద్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే, ప్రొద్దుటూరు విష ప్రచారం 2024 మార్చిలో అప్పటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందుల మెడికల్ కాలేజీ ప్రారంభించారు. కాలేజీ, హాస్పిటళ్లకు కావాల్సిన ఎక్విప్మెంట్ మొత్తం వైఎస్సార్సీపీ పాలనలోనే వచ్చేసింది. రోజుకు ఓపీ 500 నుంచి 1000 మంది వరకు వైద్య సేవలు పొందుతున్నారు. టీడీపీ ఆ పార్టీ స్థానిక ఎమ్మెల్సీని పంపించి పులిందుల మెడికల్ కాలేజీ పూర్తి కాలేదని విష ప్రచారం చేయిస్తోంది. ప్రజలను మభ్యపెట్టాలని చూడటం తగదు. – ఎస్బీ అంజద్ బాషా, మాజీ డిప్యూటీ సీఎంజగన్కు పేరు వస్తుందనే ఉద్దేశంతోనే.. సామాన్య ప్రజలకు విద్య, వైద్యం అందించాలన్న ఉద్దేశంతో వైఎస్ జగన్మోహన్రెడ్డి మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారు. వాటిని ప్రారంభిస్తే వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందన్న ఉద్దేశంతో ప్రైవేట్ పరం చేసేందుకు కుట్ర పన్నుతున్నారు. ప్రజలతో కలిసి అలుపెరని పోరాటాలు చేసి ప్రైవేటీకరణను అడ్డుకుంటాం. ప్రజలు కూడా అన్ని గమనిస్తున్నారు. త్వరలో కూటమికి బుద్ధి చెబుతారు. – రఘురామిరెడ్డి, మాజీ ఎమ్మెల్యే, మైదుకూరు పులివెందుల మెడికల్ కళాశాల 90 శాతం పూర్తి కేవలం రూ.120 కోట్ల మేర పనులు పెండింగ్ ప్రైవేటు పరం చేసేందుకు సిద్ధమైన కూటమి అలుపెరగని పోరాటాలతో అడ్డుకుంటాం వైఎస్సార్సీపీ నాయకులు -
ఆర్టీపీపీ నుంచి గుట్టుగా స్క్రాప్ తరలింపు
సాక్షి టాస్క్ఫోర్స్ : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టు పరిశ్రమ నుంచి గుట్టు చప్పుడు కాకుండా పాత ఇనుము (స్క్రాప్)ను కొందరు బయటికి తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఆర్టీపీపీలోని 600 మెగావాట్ల ప్రాజెక్టు పనులు కొన్నేళ్ల కిందట పూర్తి అయ్యాయి. అందులో భాగంగా స్క్రాప్ (పాత ఇనుప ముక్కలు) నిలువ పేరుకుని పోయింది. అయితే ఇలా పక్కన పడి ఉన్న స్క్రాప్ను పరిశ్రమ యజమాన్యం టెండర్ల ద్వారా అమ్మకం వీలు ఉన్నప్పటికీ.. ఏ కారణం చేతనో చర్యలు తీసుకోవడం లేదు. తాజాగా ఎన్డీఏ కూటమికి చెందిన కొందరు స్క్రాప్పై కన్నేశారు. సంబంధిత అధికారులకు రాజకీయ వత్తిళ్లు కూడా లేకపోలేదు. గుట్టు చప్పుడు కాకుండా స్క్రాప్ బయటకు తరలిస్తూ సొమ్ము చేసుకుంటున్నారని కార్మిక వర్గాల ద్వారా తెలుస్తోంది. తాజాగా ఆర్టీపీపీ నుంచి బయటికి వెళ్తున్న స్క్రాప్ వాహనాన్ని పట్టుకోవడం, వదిలి పెట్టడటం కూడా జరిగిందని తెలుస్తోంది. సంబంధిత అధికారులపై రాజకీయ వత్తిళ్లు రావడంతో ఆ వాహనాన్ని వదిలేసినట్లు ప్రచారం జోరుగా జరుగుతోంది. పట్టుకున్న వాహనం సచివాలయ వద్ద ఉంచి మంతనాలు చేసిన తర్వాత.. వదిలి వేసినట్లు సమాచారం. కూటమి నేతలు ఆర్టీపీపీని ఆదాయ వనరుగా మర్చుకున్న విషయం బహిరంగ రహస్యం. ఆర్టీపీపీలో పని చేస్తున్న కొందరి సహాయ సహాకారాలు ఉండటం వల్ల స్క్రాప్ సులువుగా బయటకు పోతుంది. ఆర్టీపీపీ ప్రధాన గేట్ల వద్ద సీసీ కెమెరాలు ఉన్నాయని, ఏ విధంగా బయటికి పోతుందో సులువుగా తెలుసుకోవచ్చు. అయినా ఏ కారణం చేతనో సంబంధిత అధికారులు పట్టించుకోలేదనే విమర్శలు వినిపిస్తున్నాయి. సంబంధిత అధికారులు విధినిర్వహణలో నిబంధనలు పాటించడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తున్నాయి. ఈ విషయంపై ఆర్టీపీపీ సీఈ వాసుదేవరావును వివరణ కోరాగా.. ఆరా తీస్తామన్నారు. ఈ వ్యవహారం తన దృష్టికి రాలేదన్నారు. ఏదిఏమైనా విచారణ చేస్తామని, సంబంధిత వారిపై చర్యలు ఉంటాయన్నారు. అనంతరం కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డిని వివరణ కోరగా.. ఈ విషయం తన దృష్టికి రాలేదన్నారు. అయినా ఆర్టీపీపీలోని అన్ని విభాగాల అధికారులతో సంప్రదించి విచారణ చేస్తామన్నారు. ఆర్టీపీపీ అధికారులు ఫిర్యాదు చేయలేదన్నారు. ఫిర్యాదు చేస్తే విచారణ చేపడుతామని తెలిపారు. -
డీఎస్సీలో మూడో ర్యాంక్ సాధించిన హేమలత
ప్రొద్దుటూరు : ప్రొద్దుటూరు పట్టణంలోని రామేశ్వరానికి చెందిన హేమలత 43 ఏళ్ల వయసులో డీఎస్సీలో స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషు విభాగంలో మూడో ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ తాను 2004లో ఎంఎస్సీ బయోటెక్నాలజీ పూర్తి చేశానన్నారు. వివాహం అయ్యాక తన భర్త పల్లేటి శ్రీనివాసులరెడ్డి ప్రోత్సాహంతో బీఈడీ పూర్తి చేసి ప్రైవేట్స్కూల్ టీచర్గా పనిచేశానన్నారు. 2012 డీఎస్సీలో సైన్స్ సబ్జెక్టు దరఖాస్తు చేసినప్పుడు డిగ్రీలో తన సబ్జెక్టులు బయో కెమిస్ట్రీ, మైక్రోబయాలజీ కావడం, బోటని లేదా జువాలజీ ఉండాలన్న నియమంతో తన దరఖాస్తు రిజెక్ట్ అయిందన్నారు. తర్వాత ఎంఏ ఇంగ్లీషు పూర్తి చేసి 2018 డీఎస్సీలో 20వ ర్యాంకు సాధించాను. కానీ కేవలం రెండే పోస్టులు ఉండటంతో తనకు జాబ్ రాలేదన్నారు. అనంతరం ఇంటర్ కాలజీ ఇంగ్లీషు లెక్చరర్గా పనిచేస్తూ 2025 డీఎస్సీకి ప్రయత్నించి స్కూల్ అసిస్టెంట్ ఇంగ్లీషులో 3వ ర్యాంక్, టీజీటీ ఇంగ్లీషులో 17వ ర్యాంక్ సాధించానన్నారు. ఎంఈడీ కూడా పూర్తి చేశానన్నారు. వ్యవసాయం చేస్తూ తనకు సహాయ సహకారాలు అందించిన తన భర్త ప్రోత్సాహాన్ని, తన తల్లి సహకారాన్ని మరువలేనన్నారు. -
● వైఎస్ జగన్ హయాంలో వంతెన నిర్మాణం
2023 నవంబరులో ఎట్టకేలకు ఆ గ్రామస్తుల ఇబ్బందులు తొలగేందుకు వంకకు అడ్డంగా వంతెన నిర్మా ణం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ పట్టుదలతో వంతెన నిర్మాణానికి సీఎండీఎ ఫ్, జీజీఎంపీ కింద రూ. 57 లక్షలు మంజూరైంది. ఇది లా ఉండగా బ్రిడ్జి నిర్మాణం పూర్తయ్యేసరికి అంతలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఒక్క పైసా కూడా వీరయ్య యాదవ్కు అందలేదు. కానీ ఊరి మేలు కోసం ఇబ్బందులు ఉన్నప్పటికీ నిర్మాణ పనులు చేపట్టారు. ఈ వంతెన నిర్మాణంతో ఆ గ్రామానికి 200 సంవత్సరాలుగా ఉన్న ఇబ్బందులు తొలగిపోయాయి. దీంతో గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. -
నివేదనలే..పరిష్కారం లేదు
● ఎంతో ఆశతో కలెక్టరేట్కు వస్తున్న బాధితులకు జరగని న్యాయం ● ప్రజా వేదికకు భూములకు సంబంధించిన ఫిర్యాదుదారుల అధికం సాక్షి రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదికకు ఎన్నో వ్యయ ప్రయాసలకోర్చి పరుగులు పెడుతున్నా సమస్య పరిష్కారం కాకపోవడంతో నమ్మకం సన్నగిల్లుతోంది. అధికారం అండగా...ఆగడాలు మెండుగా...జిల్లాలో కొనసాగుతున్నాయి. జిల్లా ఉన్నతాధికారులు సైతం కలెక్టరేట్ ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కూర్చొనేందుకు కూడా బరువుగా భావిస్తుండడంతో బాధితులు తమ సమస్యలను ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాకుండా తల్లడిల్లిపోతున్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చిన బాధితులకు న్యాయం మాత్రం కొండంత దూరంలో కనిపిస్తోంది. ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థ నిర్వహించే అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వచ్చి గోడు వెళ్లబోసుకునేందుకు బారులు తీరుతున్నారు. ప్రతిసారి వచ్చినవారే మళ్లీమళ్లీ వస్తున్నారు. కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలుచేస్తున్నారు. కొత్త కలెక్టర్ రాకతోనైనా తమ సమస్యలు తీరుతాయని బాధితులు ఆశగా ఎదురుచూస్తున్నారు. న్యాయం కోసం జిల్లాలోని అటు తంబళ్లపల్లె, ఇటు రైల్వేకోడూరు, మదనపల్లె, రాజంపేట ఇలా చెబుతూపోతే దూర ప్రాంతాల నుంచి ఎన్నో ఆశలతో కలెక్టరేట్కు కదులుతున్నారు. కానీ పెన్షన్లు, ఇతరత్రా చిన్నపాటి సమస్యలకు కూడా ఒక్కోసారి పరిష్కారం గగనంగా మారుతోంది. ఎక్కువగా రెవెన్యూకు సంబంధించి ఆన్లైన్, అధికార పార్టీ నేతల కబంధ హస్తాల్లో చిక్కుకున్న స్థలాలను విడిపించమని, ఇతరత్రా దాడులు, వాటిపై ఫిర్యాదులు వస్తున్నాయి. దివ్యాంగులు, వృద్దులు, ఇ తర వ్యక్తిగత సమస్యలతో ప్రతి సోమవారం 250– 300 మంది వరకు వస్తున్నారు. ప్రధానంగా ఇంటి ప ట్టా, ఆన్లైన్ సమస్యలు, భూ కబ్జాలు, ఉద్యోగాలు, రుణాల కోసం, పరిహారం ఇలా అనేక సమస్యలతో కలెక్టరేట్కు న్యాయం కోసం వస్తున్నారు. ప్రజా సమ స్యల పరిష్కార వేదికకు సంబంధించి జిల్లా స్థాయి ఉన్నతాధికారులు కూడా డుమ్మా కొడుతుండడం.....కిందిస్థాయి సిబ్బందిని కార్యక్రమానికి పంపుతుండడంతో సమస్యల పరిష్కారం గగనంగా మారింది. కొత్త కలెక్టర్పైనే ఆశలు జిల్లాలో వివిధ ప్రాంతాల నుంచి ప్రతి సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వ్యవస్థకు భారీగా బాధితులు వస్తున్నా న్యాయం జరగలేదని బహిరంగంగానే చెబుతున్నారు. జేసీ ఆదర్శ రాజేంద్రన్తోపాటు కొంతమంది అధికారులు సమస్యల పరిష్కారంలో కొంతమేర కృషి చేస్తున్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్పై ఆశలు పెట్టుకున్నారు. ప్రధానంగా జిల్లాలో అధికార పార్టీ నాయకుల భూ ఆక్రమణలతోపాటు రెవెన్యూలో ఆన్లైన్, దాడులతో బెంబేలెత్తించడం, ఇతరుల భూములు లాక్కొవడం, ప్రభుత్వ భూములను కబ్జా చేయడం ఎక్కువైంది. ఇప్పటికే ఇలాంటి వ్యవహారాలై మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రాజంపేట తదితర ప్రాంతాల నుంచి ప్రజలు వచ్చి ఆక్రమణలపై ఫిర్యాదులు కూడా చేశారు. కొత్త కలెక్టర్ బాధ్యతలు చేపట్టిన నేపథ్యంలో మళ్లీ వచ్చి ఫిర్యాదు చేసేందుకు బాధితులు సిద్ధముతున్నారు. కలెక్టర్ నిశాంత్కుమార్ అనేక వ్యవహారాలపై మార్పునకు కృషి చేస్తారని జిల్లా వాసులు ఆశిస్తున్నారు. టమాట, బొప్పాయికి గిట్టుబాటు ధర కల్పించాలి టమాట, బొప్పాయికి గిట్టుబాటు ధర లేకపోవడంతో రైతులు అప్పుల పాలయ్యారు. మార్కెట్లో దళారీ వ్యవస్థ కారణంగా అన్నదాతలు మోసపోతున్నారన్నారు. టమాట, బొప్పాయి పండ్లను మార్కెట్కు తీసుకెళ్లినా అమ్ముడుపోక రోడ్లమీద పారవేయాల్సి వస్తోంది. పంటలకు గిట్టుబాటు లేకపోవడంతో ఆత్మహత్యల వరకు పరిస్థితులు వెళుతున్నాయి. ఇప్పటికై నా రైతాంగాన్ని ఆదుకునే చర్యలు చేపట్టాలని కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతున్నారు. నా పేరు సఫియాబీ. పీలేరు మండలం జాండ్ల గ్రామానికి చెందిన తనకు 1.5 ఎకరాల భూమి ఉంది. ఆన్లైన్కోసం ఆరు నెలలుగా తిరుగుతున్నాను. పీలేరు తహసీల్దార్ పట్టించుకోవడం లేదు. నేను లేని సమయంలో మా పక్క భూమి వాళ్లు ఆన్లైన్ చేసుకున్నారు. జరిగిన తప్పును గుర్తించి తనకు న్యాయం చేయాలి. నా పిత్రార్జితం వారసత్వ రీత్యా లభించిన భూమికి సంబంధించి 1బీ అడంగల్, పాసు పుస్తకం మంజూరు చేయాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నాను. అయినా ఫలితం లేదు. నాసమస్యను సత్వరమే పరిష్కరించాలి. – డి.సుధాకర్, బూర్లపల్లి కస్పా, పెద్దతిప్పసముద్రం మండలం -
నూతన ఎస్పీ బాధ్యతల స్వీకరణ
రాయచోటి : అన్నమయ్య జిల్లా నూతన ఎస్పీగా ధీరజ్ కనుబిల్లి సోమవారం బాధ్యతలు చేపట్టారు. ఉదయం రాయచోటిలోని జిల్లా ప్రధాన కార్యాలయానికి చేరుకున్న ఎస్పీకి పోలీసు యంత్రాంగం ఘన స్వాగతం పలికింది. ఈ సందర్భంగా తన సతీమణితో కలిసి ఎస్పీ బాధ్యతలను స్వీకరించారు. సాధారణ బదిలీల్లో భాగంగా జిల్లా ఎస్పీగా పనిచేసిన విద్యాసాగర్ నాయుడు కృష్ణాజిల్లా ఎస్పీగా బదిలీ అయ్యారు. ఆయన స్థానంలో అల్లూరి సీతారామరాజు జిల్లా అడిషనల్ ఎస్పీగా విధులు నిర్వహించిన ధీరజ్ కనుబిల్లి ఇక్కడి వచ్చారు. ఈ సందర్భంగా ఏఆర్ సిబ్బందితో ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. నేపథ్యం ఇదీ.. ధీరజ్ కనుబిల్లి 2020 బ్యాచ్లో ఐపీఎస్కు ఎంపికయ్యారు. 2021లో ఐఏఎస్కు ఎంపికయ్యారు. వీరి తల్లి పార్వతీ (గృహిణి), తండ్రి కె వెంకటరమణ. అడిషనల్ ఎస్పీగా శ్రీకాకుళం జిల్లాలో విధులు నిర్వహిస్తున్నారు. ఐఏఎస్గా ఎంపికై నా తన తండ్రిని స్ఫూర్తిగా తీసుకొని ఐపీఎస్గా కొనసాగుతున్నట్లు ఎస్పీ పేర్కొన్నారు.ఎస్పీని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మదనపల్లె డీఎస్పీ ఎస్ మహేంద్ర, రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ఏఆర్ డీఎస్పీ ఎం శ్రీనివాసులు కొత్త ఎస్పీని కలిసి శుభాకాంక్షలు తెలిపారు. జిల్లా ప్రత్యేకతను కాపాడతాం.... రాయచోటి : జిల్లా ప్రత్యేకతను కాపాడటంతో పాటు శాంతి భద్రతల విషయంలో నిక్కచ్చిగా విధులు నిర్వర్తిస్తామని నూతన ఎస్పీ ధీరజ్ కనుబిల్లి పేర్కొన్నారు. సోమవారం ఎస్పీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో శాంతి భద్రతలు, మహిళల సంరక్షణ, సైబర్ క్రైమ్, మాదక ద్రవ్యాల నిర్మూలన, ఎర్రచందనం అక్రమ రవాణాపై ప్రత్యేక దృష్టి సారిస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చిన ఫిర్యాదులను చట్టపరంగా వేగంగా పరిష్కరిస్తామని తెలిపారు. ప్రజలు ఇచ్చిన ఫిర్యాదులపట్ల అలసత్వం చేయకుండా చట్టపరిధిలో పరిష్కారం చూపాలని జిల్లా పోలీసు యంత్రాంగాన్ని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని జిల్లా ఎస్పీ నిర్వహించారు. -
రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ పరిధిలోని కాటిమాయకుంట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి అజ్మత్ ఆలీ రాష్ట్రస్థాయి టేబుల్ టెన్నిస్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ విషయాన్ని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు రవీంద్రబాబు తెలిపారు.ఈ నెల 12వ తేదీ కడప డీఎస్ఏ స్టేడియంలో ఎస్జీఎఫ్ అండర్–14 విభాగంలో నిర్వహించిన టేబుల్ టెన్నిస్ పోటీలో ఎస్. అజ్మత్ అలీ ప్రతిభ కనబరిచి రాష్ట్ర స్థాయికి ఎంపికయ్యాడని తెలిపారు. పీడి రమేష్ నాయక్ను కూడా ప్రధానోపాధ్యాయుడు అభినందించారు. పోస్టర్ ఆవిష్కరణ రాయచోటి : పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 15 నుంచి అక్టోబర్ 15వ తేదీ వరకు నిర్వహించే జాతీయ పశు వ్యాధి నివారణ పథకాన్ని రైతులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ పిలుపునిచ్చారు. గాలికుంటువ్యాధికి ఇంటి వద్దనే పశువులకు టీకాల పంపిణీ జరుగుతుందని జేసీ తెలిపారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో పశుసంవర్ధక శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన జాతీయ పశువ్యాధి నియంత్రణ పథకం పోస్టర్ను జేసీ ఆవిష్కరించారు. పశువులకు సకాలంలో టీకాలు వేయడం ద్వారా ఎన్నో వ్యాధులను అరికట్టవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా పశుసంవర్ధక శాఖ అధికారి గుణశేఖర్పిళ్లై, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. పోటీ పరీక్షల్లో ప్రతిభ – ఒకే సారి రెండు ఉద్యోగాలకు ఎంపిక కడప ఎడ్యుకేషన్ : కష్టపడితే సాధించలేనిది ఏదీ లేదని నిరూపించాడు కడపకు చెందిన మేకల గురు గోవర్ధన్ యాదవ్. తన మొదటి ప్రయతనంలోనే ఒకేసారి టీచర్ ఉద్యోగంతోపాటు సివిల్ పోలీస్ కానిస్టేబుల్ ఉద్యోగం సాధించి అందరికీ ఆదర్శంగా నిలిచాడు. ప్రతికూల పరిస్థితుల్లోనూ తన లక్ష్యం వైపు ప్రణాళికతో ముందుకు సాగి విజయం సాధించాడు. మేకల గురు గోవర్ధన్ యాదవ్,76.436 మార్కులతో 200 ర్యాంకుతో ఉపాధ్యాయ ఉద్యోగం సాధించారు.మా అమ్మగారి కోరిక మేరకు శ్ఙ్రీకష్టపడి చదివి టీచర్ ఉద్యోగం సాధించినట్లు గోవర్థన్ తెలిపారు. పేద విద్యార్థులకు మంచి విద్యను అందిస్తూనే తీరిక సమయంలో గ్రూప్–1 చదువుతానని పేర్కొన్నారు. -
ఊరికి దారి దొరికింది.. ఉపకారికి బిల్లు దక్కలేదు !
ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ రాయచోటి జగదాంబసెంటర్ : ప్రకృతి వ్యవసాయంతో పండించిన ఉత్పత్తులతో ఆరోగ్య పరిరక్షణ లభిస్తుందని ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటమోహన్ తెలియజేశారు. సోమవారం రాయచోటి పట్టణంలోని ఏడీ త్యాగరాజు రైతు బజార్లో ప్రకృతి వ్యవసాయ ఉత్పత్తుల ప్రత్యేక స్టాల్ను ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన రైతులకు ప్రకృతి వ్యవసాయ కూరగాయల వినియోగం వలన కలిగే లాభాలను వివరించారు. అనంతరం డీపీఎం వెంకటమోహన్ మాట్లాడుతూ రసాయన ఎరువులు, పురుగుమందులు లేకుండా ప్రకృతి విధానంలో పండే కూరగాయలు ఆరోగ్యానికి ఎంతో మేలు చేస్తాయని, అవి తినడం వలన రోగనిరోధకశక్తి పెరుగుతందని తెలిపారు. అదే విధంగా ప్రకృతి వ్యవసాయంతో తక్కువ ఖర్చుతో మంచి దిగుబడులు సాధించవచ్చని చెప్పారు. కార్యక్రమంలో పవన్, పద్మావతి, రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. వీరభద్రస్వామి దేవస్థానం అభివృద్ధికి కృషి చాపాడు : వైఎస్సార్ కడప జిల్లా అల్లాడుపల్లె శ్రీ వీరభద్ర స్వామి దేవస్థానం అభివృద్ధి కోసంకృషి చేస్తానని ఆలయ ఈఓ శంకర్ బాలాజీ తెలిపారు. మండలంలోని అల్లాడుపల్లె శ్రీ వీరభద్రస్వామి దేవస్థానం ఈఓగా శంకర్ బాలాజీ సోమవారం బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా ఆలయ చైర్మన్ పెరుగు వీరనారాయణ యాదవ్తో కలిసి దేవాలయాన్ని సందర్శించి ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మొగమూరు వంక ప్రవాహంతో ఇబ్బందులు పడేవారం. గ్రామానికి రాకపోకల కోసం వంతెన ని ర్మాణం చేపట్టడం ఆనందంగా ఉంది. వంతె న నిర్మాణానికి రూ. 57 లక్షలు మంజూరైంది. వంతెన నిర్మాణం పూర్తయి రాకపోకలు సాగుతున్నాయి. ఎన్నికల కోడ్ రావడంతో వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో బిల్లుల మంజూరుకు ఆటంకం ఏర్పడింది.తర్వాత వచ్చిన కూటమి సర్కార్ బిల్లులు చెల్లించకుండా కాలాయాపన చేస్తోంది. దీంతో కోర్టు మెట్లు ఎ క్కాల్సిన పరిస్థితి ఏర్పడింది. – బత్తల వీరయ్య యాదవ్, మాజీ ఎంపీపీ, ఓబుల్రెడ్డిపల్లె కడప సిటీ : ఆ గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలు పైబడి అయ్యింది. రాకపోకలకు గ్రామసమీపాన ఉన్న మొగమూరు వంక ప్రవాహంతో సమస్యలు తీవ్రతరంగా ఉండేవి. ఈ వంక పెద్ద ఎత్తున ప్రవహిస్తే మూడు రోజుల వరకు అన్ని కార్యకలాపాలు స్తంభించిపోయేవి. ఈ సమయంలో ఆ గ్రామంలో ఎవరైనా చనిపోతే మృతదేహాలను వంకలో ప్రవహించే నీటిలోనే వదిలేసే దుస్థితి. ఆ గ్రామంలో చదువుతున్న విద్యార్థులకు కూడా ఈ వంక ప్రవాహం పెద్ద ఆటంకంగా మారి చదువులు కుంటుపడేవి. వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో అప్పటి ఎమ్మెల్యే పి.రవీంద్రనాథ్రెడ్డి చొరవతో ఆ గ్రామానికి చెందిన మాజీ ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ వంతెన నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. దీంతో ఆ గ్రామానికి ఉన్న సమస్యలన్నీ తీరిపోయాయి. ఇది ఎక్కడో మారుమూల పల్లె కాదు... వైఎస్సార్ కడప జిల్లాలోని మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెకు అతి దగ్గరలో ఉన్న ఓబుల్రెడ్డిపల్లె. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య ఓబుల్రెడ్డిపల్లె గ్రామం ఏర్పడి 200 సంవత్సరాలకు పైగా అయ్యింది. అప్పటి నుంచి 2023 వరకు ఆ గ్రామ సమీపంలోని మొగమూరు వంక ప్రభావంతో వర్షాకాలంలో అన్ని విధాలుగా ఇబ్బందులు ఉండేవి. అప్పటి నుంచి 2022 వరకు ఆ గ్రామ సమస్యను ఎవరూ పట్టించుకున్న పాపాన పోలేదు. ప్రధాన రహదారికి దగ్గరలో ఉన్న గ్రామమైనప్పటికీ ఏ నాయకులు వారి సమస్యను పరిష్కరించేందుకు చొరవ చూపలేదు. పద్మవ్యూహంలాంటిది ఈ వంక వస్తే ఓబుల్రెడ్డిపల్లె వాసులకు అభిమన్యుడు పద్మవ్యూహంలో చిక్కుకున్నట్లు ఉండేది. అటు పాలగిరికి వెళ్లి మెయిన్రోడ్డుకు వచ్చేందుకు యేరు అడ్డు పడేది. నాగూరు మీదుగా వెళ్లి వేంపల్లెకు వెళ్లాలంటే పాములూరు వంక అడ్డుగా ఉండేది. ఈ వంక ప్రవాహం వస్తే ఎటువంటి రాకపోకలకు అవకాశమే లేదు. వంక ప్రవాహం తగ్గినంత వరకు వేచి ఉండాల్సిన పరిస్థితి ఉండేది. గొర్రెల కాపరులకు తప్పిన ప్రమాదం 2022 నవంబరులో ఓబుల్రెడ్డిపల్లె సమీపాన ఉన్న వంక ఉధృతంగా ప్రవహించిన పరిస్థితి. ఆ సమయంలో తండ్రీ కొడుకులు ఆవుల ఎర్రన్న యాదవ్, బాల మునీంద్రయాదవ్లు వంకకు పైన తమకు చెందిన గొర్రెలు ఉండటంతో అక్కడికి చేరుకునేందుకు వంకను దాటాలని ప్రయత్నించారు. కాకపోతే ప్రవాహం ఉధృతంగా ఉండటంతో నీళ్లలో కొట్టుకుని పోతుండగా, ఒక కంపచెట్టును ఆశ్రయించి ప్రాణాలు దక్కించుకున్నారు. ఆ విషయాన్ని గ్రామస్తులు గమనించి అప్పటి ఎంపీపీ బత్తల వీరయ్య యాదవ్ దృష్టికి తీసుకెళ్లగా ఆయన ఎమ్మెల్యే రవీంద్రనాథ్రెడ్డి దృష్టికి ప్రమాద ఘటన గురించి తెలియజేశారు. వెంటనే పోలీసులు రంగంలోకి దిగి బోట్ల సాయంతో తండ్రీకొడుకులను ప్రాణాలతో రక్షించారు. వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం ఓబుల్రెడ్డిపల్లెకు గ్రామ పరిసరాల్లో ఉన్న మొగమూరు వంక వర్షాకాలంలో అన్ని రకాల ఇబ్బందులను కలగజేస్తున్న పరిస్థితి. ఒక్కొక్కసారి ఈ వంక భారీ స్థాయిలో వర్షాలు కురిసినపుడు మూడు, నాలుగు రోజుల వరకు ప్రవాహం తగ్గే పరిస్థితి ఉండదు. అలాంటి సమయంలో గ్రామంలో ఎవరైనా మృతి చెందితే వంకను దాటేందుకు వీలుగాక వంకనీళ్లలోనే మృతదేహాలను వదిలి అంత్యక్రియలను పూర్తి చేయాల్సిన దుస్థితి నెలకొనేది. చదువులకు తప్పని తిప్పలు గ్రామంలో కేవలం 5వ తరగతి వరకే చదువుకునే వీలుంది. వర్షాకాలంలో అక్కడున్న వంక ప్రవాహంతో పై చదువులు చదివేందుకు తీవ్ర ఇబ్బందులు ఉండేవి. 5వ తరగతి తర్వాత 6వ తరగతి నుంచి పై తరగతులకు చదువుకునేందుకు వెళ్లేందుకు వేంపల్లె, వీరపునాయునిపల్లెకు వెళ్లాల్సి ఉంటుంది. వంక ప్రవాహం వల్ల చదువులకు తప్పని తిప్పలు కొనసాగేవి. చదువులు కుంటుపడేవి. కోర్టు మెట్లెక్కిన కాంట్రాక్టర్ ఊరి మేలు కోసం వంతెన నిర్మాణం చేపట్టిన వీరయ్య యాదవ్ ఎన్నిమార్లు విన్నవించినా కూటమి ప్రభుత్వం బిల్లుల మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహిస్తూ చివరకు ఒక్కపైసా కూడా చెల్లించకుండా మాటలతోనే సరిపెట్టారు. ఈ నేపధ్యంలో వీరయ్య యాదవ్ కోర్టు మెట్లు ఎక్కాల్సిన పరిస్థితి వచ్చింది. గత ప్రభుత్వం చేసిన పనులకు బిల్లులు చెల్లిస్తే ఎక్కడ వైఎస్ జగన్కు మంచి పేరు వస్తుందనే ఉద్దేశ్యంతో బిల్లులకు ఎగనామం పెట్టినట్లు తెలుస్తోంది. ఇవన్నీ పక్క నపెట్టి గ్రామ సమస్యను తీర్చేందుకు చేపట్టిన వంతెన నిర్మాణానికి కూటమి ప్రభుత్వం బిల్లు లు చెల్లించాలని గ్రామస్తులు కోరుతున్నారు. 200 సంవత్సరాలుగా ఉన్న సమస్య వంక వస్తే అంత్యక్రియలకు ఆటంకం వంక నీళ్లలోనే మృతదేహాలను వదిలేసే దుస్థితి చదువులకూ తప్పని తిప్పలు వైఎస్ జగన్ హయాంలో వంతెన నిర్మాణం తొలగిన అన్ని ఇబ్బందులు హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులు బిల్లులు మంజూరు కాకపోవడంతో కోర్టు మెట్లెక్కిన వైనం -
17 నుంచి స్వస్థ నారీ సశక్త్ అభియాన్
రాయచోటి టౌన్ : కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు సంయుక్తంగా కుటుంబ సంక్షేమశాఖ ద్వారా సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 2వ తేదీ వరకు చేపట్టిన స్వస్త్ నారీ సశక్త్ అభియాన్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా డీఎంహెచ్వో డాక్టర్ కె. లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. సోమవారం జిల్లా స్థాయి అధికారులతో సమావేశాన్ని నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ మహిళలు, పిల్లల ఆరోగ్య సంరక్షణ సేవలను బలోపేతం చేయడానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మహిళలు ఆరోగ్యంగా ఉంటే ఇల్లు, సమాజం, సాధికారత మెరుగుపడుతుందని తెలిపారు. ఈ కార్యక్రమాల ద్వారా మహిళలకు, పిల్లలకు మెరుగైన ఆరోగ్యాన్ని సమకూర్చడమే ధ్యేయమన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో ని వైద్య కేంద్రాల నుంచి జిల్లా స్థాయి ఆరోగ్య కేంద్రాల వరకు వైద్యాధికారులందరూ సమన్వంతో పని చేయాలని సూచించారు. -
మెడికల్ కాలేజీలప్రైవేటీకరణపై ఉద్యమం
కడప అర్బన్: రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేస్తే.. ప్రజలతో కలిసి ఉద్యమిస్తామని వైఎస్ఆర్సీపీ నేతలు స్పష్టం చేశారు. కడప నగర శివారులో 2006లో 230 ఎకరాల్లో రిమ్స్ను దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి స్థాపించారు. ఆయన కుమారుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి 2019లో అధికారంలోకి రాగానే 125 కోట్ల రూపాయలతో 452 పడకల సామర్థ్యంతో సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, 40.81 కోట్ల వ్యయంతో 100 పడకల సామర్థ్యంతో మానసిక వైద్యశాల, 107 కోట్ల రూపాయల వ్యయంతో 100 పడకల కేన్సర్ హాస్పిటల్కు 2019 డిసెంబర్ 23న శంకుస్థాపన చేశారు. ఈ మూడు హాస్పిటల్స్ నిర్మాణాలను పూర్తి చేసి 2023 డిసెంబర్ 23న ప్రజలకు అందుబాటులోకి తీసుకుని వచ్చారు. అలాగే పులివెందులలో మెడికల్ కళాశాల, అనుబంధంగా ఆసుపత్రి నిర్మాణ పనులు చేపట్టారు. ఈ క్రమంలో రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్ జగన్ పాలనలో ఏర్పాటు చేసిన మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు కూటమి ప్రభుత్వం కుట్ర పన్నుతోంది. ఈ నేపథ్యంలో కడప రిమ్స్ను వైఎస్ఆర్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా, కడప నగర మేయర్ కె.సురేష్బాబుతోపాటు వైఎస్ఆర్సీపీ నాయకులు, కార్యకర్తలు ఆదివారం పరిశీలించారు. అనంతరం అక్కడ పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టారు. అనంతరం వారు మీడియా బృందంతో మాట్లాడారు. రాష్ట్రంలో కూటమి అధికారంలోకి వచ్చిన 16 నెలలకే మెడికల్ కళాశాలలను ప్రైవేటు పరం చేసేందుకు సీఎం చంద్రబాబు సిద్ధమయ్యారని, అలా చేస్తే ఊరుకోబోమని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి, వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, ఆ పార్టీ నేతలు సులి సునీల్కుమార్, షేక్ షఫీ, కార్పొరేటర్లు పాకా సురేష్, బాలస్వామిరెడ్డితోపాటు పలువురు నాయకులు, మహిళా నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. విద్య, వైద్యం పేదలకు దూరం చేస్తే ఊరుకోం కార్పొరేట్ వ్యక్తులకు కూటమి దోచిపెట్టే యత్నం రిమ్స్ను పరిశీలించినవైఎస్ఆర్సీపీ నేతలు -
కారు ఢీకొని అన్నదమ్ములకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : కారు ఢీకొని కర్నాటకకు చెందిన అన్నదమ్ములు తీవ్రగాయాలపాలైన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో జరిగింది. కర్నాటక చేలూరు తాలూకా బైరప్పనహళ్లికి చెందిన మంజునాథరెడ్డి కుమారుడు మనీష్(25), శంకరరెడ్డి కుమారుడు శశి(17) వరుసకు అన్నదమ్ములు. వీరిద్దరూ బోయకొండకు వచ్చి అమ్మవారిని దర్శించుకుని స్వగ్రామానికి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. కురబలకోట మండలం కంటేవారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన కారు ఢీకొంది. ప్రమాదంలో వారు తీవ్రంగా గాయపడగా, స్థానికులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం గాయాలపాలైన శశిని మెరుగైన వైద్యం కోసం కుటుంబసభ్యులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. నాపై పోలీసులు దాడి చేశారుకడప అర్బన్ : హోటల్లో భోజనం చేస్తుండగా మైదుకూరు పోలీసులు తనపై దాడి చేసి తీవ్రంగా గాయపరిచారని మైదుకూరు మండలం జీవీ.సత్రానికి చెందిన కాకాని సాంబశివ ఆరోపించారు. ఈనెల 13వ తేదీన సాయంత్రం తమ గ్రామానికి సమీపంలో భోజనం చేస్తున్నాననే గానీ, ఎలాంటి అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడలేదని చెబుతున్నా లాఠీలతో చితకబాదారని తెలిపారు. ప్రస్తుతం రిమ్స్లో గాయాలతో చికిత్స పొందుతున్నానని, తనకు న్యాయం చేయాలని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశారు.కారు ఢీకొని తీవ్రంగా గాయపడిన శశిప్రమాదంలో తీవ్రంగా గాయపడి మోనిష్ -
వైద్యులు చేతులెత్తేస్తే..108 సిబ్బంది పురుడు పోశారు
మదనపల్లె రూరల్ : జిల్లా ఆస్పత్రికి ప్రసవ వేదనతో వచ్చిన ఓ మహిళకు.. తాము కాన్పు చేయలేమని వైద్యులు చేతులెత్తేశారు. గర్భిణిని తిరుపతికి తీసుకెళ్తుండగా, మార్గమధ్యంలో భాకరాపేట ఘాట్ వద్ద 108 వాహనంలోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. జిల్లా ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కనపరిస్తే.. 108 సిబ్బంది పురుడుపోశారని మహిళ కుటుంబీకులు చేతులెత్తి దండం పెట్టారు. వివరాల మేరకు.. నిమ్మనపల్లె మండలం వెంగంవారిపల్లె పంచాయతీ కత్తిరివారిపల్లెకు చెందిన సాగర్ భార్య భాగ్యమ్మ(20) రెండో కాన్పు నిమిత్తం పుట్టినిల్లు మదనపల్లె మండలం బసినికొండలో ఉంటోంది. శనివారం అర్ధరాత్రి తర్వాత ఆమెకు పురిటినొప్పులు మొదలవడంతో 108 వాహనం బసినికొండకు చేరుకుని భాగ్యమ్మను మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తెచ్చారు. వార్డులోకి తీసుకెళ్లేందుకు వీల్ఛైర్ లేకపోవడంతో కుటుంబసభ్యులు నొప్పులు పడుతున్న మహిళను నడిపించుకునే తీసుకెళ్లారు. ఆ సమయానికి డాక్టర్ అందుబాటులో లేకపోవడం, నర్సింగ్ సిబ్బంది నామమాత్రపు పరీక్షలు చేసి తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. ఆస్పత్రికి చేరుకున్న 108 సిబ్బంది ఈఎన్టీ రెడ్డి జశ్వంత్, పైలట్ సద్దాం గర్భిణి ప్రసవవేదనను గమనించి, ఈ స్థితిలో తిరుపతికి తరలిస్తే మార్గమధ్యంలో ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని, ఆస్పత్రిలోనే కాన్పు చేయండంటూ అభ్యర్థించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా చికిత్స గురించి మీరు చెప్పేదేంటి. ఆమెకు రక్తం ఆరు పాయింట్లు ఉంది. మేం రెఫర్ చేస్తే తీసుకెళ్లడం మీ బాధ్యత. తీసుకువెళ్లండంటూ గదమాయించారు. చేసేదేమీలేక 108 సిబ్బంది భాగ్యమ్మను తిరుపతికి తరలిస్తుండగా, మార్గమధ్యంలో నొప్పులు అధికమయ్యాయి. దీంతో భాకరపేట ఘాట్ సమీపంలో 108 వాహనంలోనే 3.5 కిలోల బరువున్న మగపిల్లవాడికి జన్మనిచ్చింది. 108 సిబ్బంది ప్రసవానంతర చికిత్సలు అందించి, మరింత మెరుగైన చికిత్స కోసం తిరుపతి మెటర్నరీ ఆస్పత్రిలో చేర్పించారు. -
108 సిబ్బంది లేకుంటే మా పరిస్థితి ఏమయ్యేది..
108 సిబ్బంది లేకుంటే, నా భార్య, బిడ్డ నాకు దక్కని పరిస్థితి. సమయానికి దేవుడిలా ఆదుకున్నారు. పురిటినొప్పులతో భార్య తల్లడిల్లిపోతోంది. ఇక్కడే డెలివరీ చేయండని వేడుకున్నా.. ఆస్పత్రి సిబ్బంది, రేపు సాయంత్రం వరకు కాన్పు జరిగే అవకాశం లేదు. తిరుపతికి వెళ్లండని పంపేశారు. సమయానికి 108 వాహనం అందుబాటులో ఉండి, అందులో వెళ్లాం కాబట్టి సరిపోయింది. అదే వైద్యుల మాట విని బస్సులో వెళ్లి ఉండి ఉంటే, మా పరిస్థితి ఏమయ్యేది. మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో వైద్యసేవలు ఏమాత్రం బాగోలేవు. – సాగర్, గర్భిణి భర్త -
కూటమి ప్రభుత్వం అన్ని రంగాలను అమ్మేందుకు తెరలేపింది
సీమ నడిబొడ్డున ఉన్న కడప సూపర్ స్పెషలిటీ వైద్యశాలను సైతం అమ్ముకునే, దోచుకునే కార్యక్రమానికి పాల్పడటం సిగ్గు చేటు. అప్పట్లో ఎయిమ్స్ కూడా ప్రైవేట్ బిల్డింగ్లో ఏర్పాటు చేశారు. కానీ వైఎస్ జగన్మోహన్రెడ్డి అలా కాకుండా బిల్డింగ్లు నిర్మించి, వాడుకలోకి తీసురావాలని భావించారు. నిజాన్ని అబద్ధం చేయాలనుకోవడం సరికాదు. ప్రజలు అన్ని గమనిస్తున్నారు. త్వరలో బుద్ధి చెబుతారు. – పి.రవీంద్రనాథ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ -
కనకదాస విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నాం
రాయచోటి : తిరుపతి పట్టణంలో రాష్ట్ర మంత్రి సవిత చౌదరి ఆధ్వర్యంలో అక్టోబర్ 5న జరిగే కనకదాస విగ్రహావిష్కరణను బహిష్కరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా కురబ సంఘం సభ్యులు, నాయకులు ప్రకటించారు. రాయచోటిలోని అజయ్ కల్యాణ మండపంలో కురబసంఘం సమావేశం ఆదివారం నిర్వహించారు. రాష్ట్ర కురవ, కురబ సంఘం అధ్యక్షుడు జబ్బల శ్రీనివాసులు మాట్లాడుతూ రానున్న మంత్రివర్గ విస్తరణలో కురబ కులం పేరు చెప్పుకుంటూ తన భర్త వెంకటేశ్వరచైదరిని పదవిని కాపాడుకునే ప్రయత్నం మంత్రి సవిత చేయడాన్ని తాము ఒప్పుకోమన్నారు. కురబలు సహకరించకపోతే సంఘం నాయకులనే మార్చేస్తామని హెచ్చరించడం తగదన్నారు. అధికారంకోసం ప్రగల్బాలు పలుకుతూ మంత్రి ఆధ్వర్యంలో జరుగుతున్న విగ్రహావిష్కరణను బహిష్కరించాలని కురబ సంఘం ఏకపక్షంగా తీర్మానించిందన్నారు. అలాగే అక్టోబర్ 12న విజయవాడలో నిర్వహించనున్న సమావేశంలో కురబలు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో పెపర్డ్ జిల్లా కురమ, కురబ, కురవ అధ్యక్షుడు, కె.రవిశంకర్, జిల్లా కురవ సంఘం అధ్యక్షుడు తరిగొండఈశ్వరయ్య, ప్రధాన కార్యదర్శి కప్పల రాజన్న, జిల్లా కోశాధికారి గోవిందు సుధాకర్, గుడి రామానుజులు, గుడిశ్రీనివాసులు, గౌనుపల్లి రెడ్డన్న, మంగిరి రమణ, బోనే మురళీ కుమార్, మంగిరి సురేష్, గుడి శివ, రవీంద్ర, శ్రీనివాసులు, రవి, చెన్న కృష్ణయ్య, నాగయ్య, గోవిందు, దనార్జన, రఘు, గిరి, మంచూరి అంజి తదితరులు పాల్గొన్నారు. -
చాలీ చాలని జీతాలతో చాకిరి
కడప ఎడ్యుకేషన్ : సమగ్రశిక్ష, విద్యా శాఖలో అత్యంత కీలకంగా పనిచేసే చిరుద్యోగులైన సీఆర్ఎంటీ(క్లస్టర్ రిజర్వు మొబైల్ టీచర్స్)లు, మండల లెవల్ అకౌంటెంట్లు, ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, డేటా ఎంట్రీ ఆపరేటర్లు చాలీచాలని వేతనాలతో చాకిరీ చేస్తూ కుటుంబాలను భారంగా మోస్తున్నారు. పెరిగిన నిత్యావసర సరకులు, ఇంటి అద్దెలు, ఖర్చులతో దిక్కుతోచని పరిస్థితిలో అల్లాడిపోతున్నారు. ఏళ్ల తరబడి పనిచేస్తున్నా ఏ ప్రభుత్వం కనికరించడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వాలు మారుతున్నా.. కనీస వేతనాలు, ఉద్యోగ భద్రత లేకుండా పనిచేయాల్సిన పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ చాలీచాలని జీతాలతో జీవితాలను ఏ విధంగా సాగించాలని మదిలో మదనపడుతున్నారు. సమాన పనికి సమాన వేతనం కల్పించాలన్న సుప్రీంకోర్టు తీర్పును ప్రభుత్వం గౌరవించకుండా, ఉద్యోగుల మధ్య వేతన అసమానతలను పెంచే విధంగా ఈ జీవో నంబర్–2ను అమలు చేస్తోంది. ఈ జీఓ కేవలం ఉద్యోగుల ఆర్థిక భద్రతను దెబ్బతీయడమేగాక, రాజ్యాంగం కల్పించిన ప్రాథమిక హక్కులను ఉల్లంఘిస్తోందని విద్యాశాఖలో పనిచేసే పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా విద్యా శాఖలో.. జిల్లా వ్యాప్తంగా మండల వనరుల కేంద్రంలో 156 మంది సీఆర్ఎంటీలు, 19 మంది మండల లెవల్ అకౌంటెంట్స్, 34 మంది ఎంఐఎస్ కో ఆర్డినేటర్లు, 35 మంది డేటా ఎంట్రీ ఆపరేటర్లు పనిచేస్తున్నారు. వీరంతా 2012లో ఉద్యోగాల్లో చేరారు. అప్పట్లో వీరికి నెలకు రూ.18,500 ఉండేది. ఆ తర్వాత వీరికి 2020లో గత వైసీపీలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రూ. 23,500కు వేతనం పెంచింది. ఆ తరువాత అధికారంలోకి కూటమి ప్రభుత్వం వారి గురించి పట్టించుకోవడం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారంలోకి వచ్చిన ఆరు నెలల్లోనే.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన ఆరు నెలల్లోనే కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు షాక్ ఇచ్చింది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ భాగస్వామ్యంతో నడుస్తున్న పథకాలలో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులకు, స్థానిక సంస్థల్లో పని చేస్తున్న ఔట్సోర్సింగ్ ఉద్యోగులకు మినిమమ్ టైం స్కేల్ వర్తింపచేయరాదని, 2025 జనవరి, 6వతేదీన జీవో నంబర్–2 విడుదల చేసింది. ప్రభుత్వ శాఖలలో మంజూరైన ఖాళీ పోస్టుల్లో పనిచేస్తున్న కాంట్రాక్టు ఉద్యోగులు మాత్రమే అర్హులని తేల్చింది. ఈ జీవో రాజ్యాంగ కల్పించిన సమానత్వ హక్కుకు విరుద్ధమని, కృత్రిమ ప్రాతిపదికలు సృష్టించి శ్రమకు తగ్గ వేతనం ఇవ్వకుండా ఉండడమే ఈ జీఓ ఉద్దేశమని సిబ్బంది ఆవేదన చెందుతున్నారు. ఇతర రాష్ట్రాలతో పోల్చితే, ఆంధ్రప్రదేశ్లో కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సరైన వేతన నిబంధనలు లేకపోవడం బాధాకరమని. ప్రభుత్వం ఆదర్శ యజమానిగా వ్యవహరించి, ఉద్యోగుల హక్కులను పరిరక్షించాలని కోరుతున్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చి.. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు సంక్షేమ పథకాలు అమలుచేస్తామని కూటమి ఎన్నికల మేనిఫెస్టోలో చేర్చినప్పటికీ ఈ ఏడాది కాలంలో ఎలాంటి చర్యలు తీసుకోలేదని వారు వాపోతున్నారు. ఇటీవల ఎన్టీఆర్ భరోసా పెన్షన్, నూతన రేషన్ కార్డులు, తల్లికి వందనం వంటి పథకాలు అమలు చేసినప్పటికీ చిరుద్యోగులకు వర్తింపచేయలేదని వారు తెలిపారు. నిత్యావసర ధరలు, రవాణా ఖర్చులు, వైద్య ఖర్చులు, ఇంటి అద్దె విపరీతంగా పెరగడంతో ఔట్ సోర్సింగ్ ఉద్యోగుల జీతాలు సరిపోవడంలేదని వాపోతున్నారు. నెలవారీ ఖర్చుల కోసం అప్పుచేయాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆరోగ్య భద్రత, పిల్లల విద్య, ఇంటి అద్దె భృతి, రేషన్ సబ్సిడీ పథకాలను ప్రత్యేకంగా అమలుచేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. ఉద్యోగుల వేతనాలను విరివిగా పెంచే చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. గత ప్రభుత్వం వికలాంగులు, ఒంటరి మహిళ పెన్షన్, కుటుంబ సభ్యులకు వద్ధాప్యం పింఛన్ తొలగించారు. వాటిని తిరిగి పునరుద్ధరించి ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు తోడ్పాటు ఇవ్వాలని కోరుతున్నారు. కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించాలి తెలుగుదేశం ప్రభుత్వం రిటైర్మెంట్ వయస్సు 58 నుండి 60 ఏళ్లకు పెంచింది. తదనంతరం వైఎస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం రెగ్యులర్ ఉద్యోగులకు 62 ఏళ్లకు పెంచింది. కానీ ఈ సౌకర్యం కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు వర్తించలేదు. తాజాగా కూటమి ప్రభుత్వం అంగన్వాడీ, ఆశా వర్కర్లకు గ్రాట్యూటీ అమలు చేస్తూ, రిటైర్మెంట్ వయస్సును 62 ఏళ్లకు పెంచినా ఔట్ సోర్సింగ్ ఉద్యోగులకు మాత్రం వర్తింప యకపోవడం వారికి నిరాశ కలిగిస్తోంది. అనేక సంవత్సరాలుగా తక్కువ జీతంతో పనిచేస్తూ, ఎలాంటి పదవీ విరమణ ప్రయోజనాలు లేకుండా, రిటైర్ అయ్యేసరికి కుటుంబానికి భారం అవుతున్న పరిస్థితి దురదృష్టకరమని ఆందోళన చెందుతున్నారు. వీరికి కూడా రెగ్యులర్ ఉద్యోగుల్లానే రిటైర్మెంట్ వయస్సు 62 సంవత్సరాలు, గ్రాట్యూటీ, పెన్షన్ పథకం లేదా ఉద్యోగ భద్రతకు దారిచూపే ప్రయోజనాలు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఏళ్లతరబడి పనిచేస్తున్నా కనికరించని ప్రభుత్వం కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగుల సంక్షేమం మరిచిన ప్రభుత్వం ఆరేళ్లుగా వేతనం పెంపుకోసం ఎదురుచూపు -
మల్లయ్యకొండ ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ: తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెఇపారు. ఈ సర్వీసలో సీ్త్రశక్తి పథకం కింద మహిళలు ఉచితంగా ప్రయాణించవచ్చన్నారు ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందని తెలిపారు. రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 15వ తేదీన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండలం, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు.అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. గంగమ్మా.. చల్లంగ చూడమ్మా లక్కిరెడ్డిపల్లి: కష్టాలు తొలగించి.. వర్షాలు కురిపించి సుభిక్షంగా ఉండేలా చూడు తల్లి అంటూ భక్తులు అనంతపురం గంగమ్మకు ప్రత్యేక పూజలు జరిపారు. ఆదివారం అమ్మవారి దర్శనార్థం భక్తులు పెద్దసంఖ్యలో ఆలయానికి వచ్చారు. ఈ సందర్భంగా మొక్కుబడులు ఉన్నవారు తలనీలాలు అర్పించి.. స్నానాలు ఆచరించి ఆలయ ప్రాంగణంలో అమ్మవారికి పొంగళ్లను సమర్పించి ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు తీర్థప్రసాదాలను అందజేశారు. సంబేపల్లె: మండల కేంద్రంలోని శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ ఆలయంలో ఆదివారం ప్రత్యేక పూజలు జరిగాయి. ముందుగా వేపాకులతో ఆలయ ప్రాంగణమంతా శుద్ధి చేశారు. అమ్మవారికి అర్చకులు ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. ఆలయం ముందు భాగంలో బీజాక్షరాలతో కలిగి ఉన్న మహిమగల రాయికి భక్తులు పూజలు నిర్వహించారు. గంగమ్మా చల్లంగ చూడమ్మా అని వేడుకున్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నారు. -
బాబు మాటలకు అర్థాలే వేరులే..
రాయచోటి : ముఖ్యమంత్రిగా చంద్రబాబు మాట్లాడే మాటలకు అర్థాలే వేరు అని లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్కుమార్రెడ్డి మండిపడ్డారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయలేదంటూనే కార్పొరేట్ వ్యక్తులకు అప్పగిస్తున్న వైనంపై రమేష్రెడ్డి తీవ్రంగా స్పందించారు. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు చేసేదొకటి ప్రజలకు చెప్పేది ఒకటి అన్నారు. వైఎస్.జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలోనే రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు మంజూరైన విషయాన్ని టీడీపీ నేతలు ఒప్పుకుంటూనే మరోవైపు స్థలాలు కేటాయించినంత మాత్రాన అభివ్దద్ది కాదని అబద్ధాలు చెప్పడం తగదన్నారు. మెడికల్ కళాశాలల నిర్వహణ చేతగాకనే పిపిపి ముసుగుతో ప్రైవేటుపరం చేస్తున్నారని విమర్శించారు. పేద, మద్యతరగతి పిల్లల విద్యా బోధనకు, ప్రజలకు ఉచిత వైద్యాన్ని అందించాలనే లక్ష్యంతో జగన్మోహన్రెడ్డి పనిచేశారని, చంద్రబాబు నాయుడు మాత్రం విద్య, వైదాన్ని కార్పోరేట్ వ్యక్తుల చేతుల్లో పెట్టే ప్రయత్నం చేస్తున్నారన్నారు. ప్రజా వ్యతిరేకతను ఇంత భారీ స్థాయిలో మూటకట్టుకున్న ప్రభుత్వం దేశంలో ఏ రాష్ట్రంలో లేదని, కూటమి పాలనలో అవినీతి దౌర్జన్యాలు, దోపిడీలు, అక్రమార్చన, రౌడీయిజం రాజ్యమేలుతోందన్నారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రాష్ట్ర ప్రజలందరూ వ్యతిరేకిస్తున్నారన్నారు. భవిష్యత్తులో ప్రజలు, విద్యార్థులు, ఉద్యోగులతో కలిసి పోరాటాలు చేస్తామన్నారు.మాజీ ఎమ్మెల్యే ఆర్ రమేష్ కుమార్ రెడ్డి -
కడప టు బీహార్!
రాజంపేట: ఉమ్మడి కడప జిల్లా వాసులకు గుడ్న్యూస్. ఎందుకంటే ఇప్పటి వరకు బీహార్, ఛత్తీస్గఢ్, ఒడిస్సా రాష్ట్రాలకు డైరెక్ట్ కనెకివిటీ రైలు ఉమ్మడి కడపజిల్లా రైలుమార్గంలో నడవలేదు. బీహార్లోని రక్సౌల్ నుంచి చర్లపల్ల్లి (తెలంగాణ) వరకు ఆరేళ్లుగా రైలు నడుస్తోంది. ఇప్పుడు ఈ వీక్లీ ఎక్స్ప్రెస్ను జిల్లా రైలుమార్గంలో తిరుపతి వరకు పొడిగిస్తూ నిర్ణయం తీసుకున్నారు. ఇప్పడు డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్ క్లియర్ కావడంతో ఉమ్మడి కడప జిల్లా ప్రయాణికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఈ నెల 20 నుంచి ఈ రైలు నేరుగా బీహార్ నుంచి చర్లపల్లి మీదుగా జిల్లా రైలుమార్గం గుండా తిరుపతికి చేరనుంది. ఇప్పటి వరకు గూడూరు జంక్షన్ నుంచి ఉమ్మడి కడప జిల్లా వాసులు బీహార్, ఒడిశా, ఛత్తీస్గఢ్ రాష్ట్రాలతో పాటు ఉత్తర తెలంగాణ ప్రాంతాలకు వెళ్లాలంటే కష్టాలు పడేవారు. రేణిగుంట–విజయవాడ మార్గంలోని గూడూరు జంక్షన్కు వెళ్లి తమిళనాడు, కేరళ తదితర రాష్ట్రాల నుంచి వచ్చే రైళ్లను ఆశ్రయించాల్సిన పరిస్థితులు ఉండేవి. ఈ జంక్షన్ ఉమ్మడి కడప జిల్లా వాసులకు చాలా దూరం. కడప నుంచి గూడూరుకు 141 కిలోమీటర్ల మేర ప్రయాణించాల్సి ఉంటుంది. దాదాపు మూడుగంటలకు పైగా సమయం పడుతుంది. ఏ రైలుకు వెళ్లాలన్న గూడూరు జంక్షన్కు 4 గంటల ముందే చేరుకోవాల్సి ఉంటుంది. దీనివల్ల ప్రయాణికులకు ఇక్కట్ల ప్రయాణం తప్పడం లేదు. ● 07052/51 నంబరుతో నడిచే రైలును రక్సౌల్(బీహార్) నుంచి తిరుపతి, తిరుపతి నుంచి రక్సౌల్కు పొడిగించారు. గుంతకల్, రాయచూరు, వికారాబాద్, సికింద్రాబాద్ మీదుగా వీక్లీ ప్రత్యేక రైలును నడపనున్నారు. ● ఝార్ఖండ్ రాష్ట్రంలోని ప్రముఖ జ్యోతిర్లింగమైన బైద్యనాథ స్వామిని దర్శించుకునేందుకు ఉమ్మడి కడప జిల్లావాసులకు వీలు కలుగుతుంది. ● ఉమ్మడి కడప జిల్లాలో రైల్వేపరంగా అనేక మంది ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన వేలాది మంది గుంతకల్ రైల్వేడివిజన్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాలు చేస్తున్నారు.వీరికి ఈ రైలు సౌకర్యవతంగా ఉంటుంది. ● బీహార్, ఝార్ఖండ్ రాష్ట్రాల్లోని ధన్బాద్, రాంచీ, జాసిద్, ఒడిశా రాష్ట్రంలోని రూర్కేలా, ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని దుర్గ్, రాయ్పూర్, బిలాస్పూర్ పట్టణాలకు మార్గం సుగమమం కానుంది. ● ఉత్తర తెలంగాణతో ఉమ్మడి కడప జిల్లా వాసులు అనుసంధానంగా ఈ రైలును నడవనుంది. దీంతో మంచిర్యాల, పెద్దపల్లి, ఖాజీపేట, తర్పూర్కాగజ్ నగర్లకు చేరుకోవచ్చు. డైరెక్ట్ కనెక్టివిటీకి లైన్క్లియర్ ఉమ్మడి కడప జిల్లా లైన్లో రక్సౌల్–చర్లపల్లి వీక్లీ 20 నుంచి తిరుపతి వరకు పొడిగింపు -
ప్రతిభకు పట్టం.. విజ్ఞాన్ మంథన్
మదనపల్లె సిటీ : విద్యార్థుల్లో దాగిన ప్రతిభను, కొత్త ఆలోచనలు, ఆవిష్కరణ వెలికితీసేందుకు కేంద్ర ప్రభుత్వం విద్యార్థి విజ్ఞాన్ మంథన్ (వీవీఎం) పేరుతో జాతీయస్థాయిలో ప్రతిభాన్వేషణ్ పరీక్ష నిర్వహిస్తోంది. ఇందులో ప్రతిభ చూపిన విద్యార్థులకు నగదు, ప్రోత్సాహకాలు, దేశంలో సీఎస్ఐఆర్, ఐఎస్ఆర్వో, బార్క్, డీఆర్డీవో, ప్రముఖ జాతీయ ప్రయోగశాలలు, పరిశోధనా సంస్థలను చూసే అవకాశం, ఇంటర్న్షిప్, ఉపకారవేతనం పొందే అవకాశాన్ని కలిగిస్తోంది. ’కేంద్ర సంస్థల ఆధ్వర్యంలో.. కేంద్ర ప్రభుత్వ సంస్థలైన నేషనల్ కౌన్సిల్ ఆఫ్ ఎడ్యుకేషన్ అండ్ రీసర్చ్ ట్రైనింగ్, శాస్త్ర, సాంకేతిక విభాగం సంయుక్తంగా పరీక్ష నిర్వహిస్తారు. దేశ వ్యాప్తంగా 6వ తరగతి నుంచి 11వ తరగతి వరకూ చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో పరీక్ష పాల్గొనవచ్చు. ఆసక్తిగల విద్యార్థులు వీవీఎం అధికారిక వెబ్సైట్లో రూ.200 రుసుం చెల్లించి వివరాలు నమోదు చేసుకోవాలి. వివిధ స్థాయిల్లో పరీక్ష వివిధ స్థాయిల్లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, గణితం, సామాన్యశాస్త్రం, విజ్ఞాన శాస్త్ర రంగంలో భారతీయ మేధావుల కృషి, సత్యేంద్రనాథ్, బోస్ జీవిత చరిత్ర, లాజికల్ థింకింగ్, రీజనింగ్ తదితర సబ్జెక్టుల్లో బహుళైచ్చిక విధానంలో ప్రశ్నలుంటాయి. వీవీఎం పరీక్ష సంబంధించి విద్యార్థులు మొదట పాఠశాల, జిల్లా, రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఇంటర్నెట్ ద్వారా పరీక్ష రాయవచ్చు. విద్యార్థి ఇంటి నుంచే ఆన్లైన్ విధానంలో, సెల్ఫోన్, ట్యాబ్, డెస్క్టాప్, ల్యాప్ట్యాప్ల ద్వారా పాల్గొనవచ్చు. ఆంగ్లం, హిందీతో పాటు 9 ప్రధాన ప్రాంతీయ భాషల్లో పరీక్షను నిర్వహిస్తారు. విద్యార్థులు తమ ఆసక్తిని బట్టి నచ్చిన భాషలో పరీక్ష రాయవచ్చు. ప్రతిభ చూపిన విద్యార్జులకు స్థాయిని బట్టి ద్రువపత్రాలు,నగదు ప్రోత్సాహకాలు, జ్ఞాపిక, ప్రశంసాపత్రాన్ని అందజేస్తారు. ప్రధానోపాధ్యాయుల కృషి అవసరం విద్యార్థుల్లో సైన్స్పై ఆసక్తి కలిగించి నూతన ఆవిష్కరణల వైపు ప్రోత్సహించేందుకు వీవీఎం పరీక్ష ఉపయోగపడుతుంది. ప్రభుత్వ,ప్రైవేటు పాఠశాలల విద్యార్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే విధంగా ఉపాధ్యాయులు కృషి చేయాలి. – భాస్కరన్, డివిజన్ సైన్సు అధికారి, మదనపల్లెవిద్యార్థులకు కేంద్ర ప్రభుత్వ ప్రోత్సాహకాలు -
జేఎన్టీయూ వాచ్మెన్ మృతి
కలికిరి : రోడ్డు ప్రమాదంలో జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలలో పనిచేస్తున్న వాచ్మెన్ హరినాథ్(47) మృతిచెందిన సంఘటన ఆదివారం సాయంత్రం చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని తిమ్మారెడ్డిగారిపల్లికి చెందిన హరినాథ్ జేఎన్టీయూ కళాశాలలో వాచ్మెన్గా పనిచేస్తూ అక్కడే క్వార్టర్స్లో ఉంటున్నాడు. ఆదివారం సాయంత్రం కళాశాల నుంచి సొంత పని నిమిత్తం స్వగ్రామానికి బయల్దేరాడు. మార్గ మధ్యంలో చింతలవారిపల్లి బస్టాపు వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి బోల్తా పడింది. ప్రమాదంలో హరినాథ్కు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన స్థానికులు ఆటోలో కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేశారు.ప్రమాదంలో ఇద్దరికి గాయాలు పుల్లంపేట : రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలయ్యాయి. పుల్లంపేట శ్రీరాములుపేటకు చెరందిన శివ, మణి ద్విచక్ర వాహనంలో చిట్వేలి నుంచి తమ గ్రామానికి వెళ్తున్నారు. దిగువపల్లి సమీపాన రోడ్డు ప్రక్కన ఉన్న కంచెను ఢీకొని కింద పడ్డారు. శివ, మణిలకు తీవ్ర గాయాలవగాయ్యా పోలీసులు రాజంపేట ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. మెరుగైన వైద్యంకోసం రాజంపేట నుంచి తిరుపతికి తరలించారు. -
ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి
నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి: ప్రణాళికాబద్ధంగా జిల్లా అభివృద్ధికి కృషి చేస్తానని జిల్లా నూతన కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం ఉదయం రాయచోటి కలెక్టరేట్కు చేరుకున్న ఆయనకు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. వేద పండితుల ఆశీర్వచనాల అనంతరం నిశాంత్ కుమార్ నూతన కలెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. 2014 ఐఏఎస్ బ్యాచ్కు చెందిన ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్గా పనిచేస్తున్న తనను రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జిల్లా కలెక్టర్గా నియమించిందని కలెక్టర్ తెలిపారు. జిల్లా జాయింట్ కలెక్టర్, సబ్ కలెక్టర్, డీఆర్ఓ, ఆర్డీఓ, జిల్లా అధికారులు,ప్రజా ప్రతినిధులు, ప్రజల సహకారంతో ప్రభుత్వ ఆదేశాలకు అనుగుణంగా సంక్షేమ, అభివృద్ధి పథకాలను సమర్థవంతంగా అమలు చేసేందుకు కృషి చేస్తానన్నారు. అనంతరం జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్లు కల్యాణి, భావన, డీఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏఓ నాగభూషణం నూతన కలెక్టర్కు శుభాకాంక్షలు తెలిపారు. . ● జిల్లాలోని అన్ని శాఖలు సమన్వయంతో పనిచేసి నిర్దేశించిన లక్ష్యాలను సాధించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ఆదివారం పీజీఆర్ఎస్ హాల్లో జిల్లా అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. నిర్దేశించిన లక్ష్యాల సాధనకు ప్రో యాక్టివ్గా పనిచేయాలన్నారు. అమరావతిలో ఈనెల 15, 16న కలెక్టర్ల సదస్సు జరగనుంది. ఈనేపథ్యంలో జిల్లాకు సంబంధించిన అతి ముఖ్యమైన విషయాల గురించి వివిధ శాఖల అధికారులను అడిగి తెలుసుకున్నారు. శ్రీ వీరభద్రస్వామిని దర్శించుకున్న కలెక్టర్ రాయచోటి టౌన్: రాయచోటి పట్టణంలోని శ్రీ వీరభద్రస్వామిని ఆదివారం నూతన కలెక్టర్ నిశాంత్కుమార్ దర్శించుకున్నారు. ఆయనకు ఈవో డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ప్రధాన అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. -
యువతిని మోసగించిన కేసులో వ్యక్తికి రిమాండ్
కలికిరి : యువతిని మోసగించిన కేసులో కలికిరికి చెందిన వ్యక్తిని రిమాండ్కు తరలించినట్లు సీఐ అనిల్కుమార్ తెలిపారు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి సమీపంలోని ఓ ప్రైవేటు కళాశాలలో ఎంసీఏ(ఉన్నతవిద్య) చదువుతున్న యువతిని కలికిరి పట్టణానికి చెందిన పఠాన్ ఇమ్రాన్ఖాన్ ప్రేమ పేరుతో వెంటబడి వంచించాడు. అనంతరం యువతితో వున్న ఫొటోలను ఆమె బంధువులు, స్నేహితులకు పంపి బ్లాక్ మెయిల్ చేయడంతో ఆమె కలికిరికి చేరుకుని తనకు న్యాయం చేయాలని పోలీసులను ఆశ్రయించింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టిన సీఐ అనీల్కుమార్ నిందితుడిని శనివారం సాయంత్రం వాల్మీకిపురం కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి నిందితుడిని రిమాండ్ విధించినట్లు తెలిపారు. గంజాయి స్వాధీనం: ముగ్గురి అరెస్ట్రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని బిజ్జవారిపల్లి క్రాస్ వద్ద ఆదివారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ సీఐ నీలకంఠ, సీఐ తులసీ ఆద్వర్యంలో దాడులు నిర్వహించారు. ఐదుగురు 2.700 కిలోల గంజాయిని తరలిస్తుండగా పట్టుకున్నారు. రాకేష్, హరి, సుమన్లను అరెస్ట్ చేసి ఆటో, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. మరో ఇరువురు పరారీలో ఉన్నట్లు సిబ్బంది తెలిపారు. అరెస్ట్ చేసినవారిని కోర్టులో హాజరు పరిచారు. విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధంకేవీపల్లె : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధమైన సంఘటన మండలంలోని దిగవగళ్ల గంటావారిపల్లెలో చోటుచేసుకుంది. బాధితుల కథనం మేరకు.. గంటావారిపల్లెకు చెందిన అనసూయమ్మ ఇంటిలో విద్యుత్షార్ట్ సర్క్యూట్తో ఆదివారం మంటలు వ్యాపించాయి. గ్రామస్తులు పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇచ్చారు. వారు వచ్చి మంటలు అదుపుచేశారు. అప్పటికే ఇంటిలోని వస్తువులు కాలిబూడిదయ్యాయి. విలువైన వస్తువులు, ఆస్తి పత్రాలు మంటల్లో కాలిపోయినట్లు బాధితురాలు తెలిపారు. యువతి ఆత్మహత్యఎర్రగుంట్ల : మండలంలోని పెద్దనపాడు గ్రామానికి చెందిని చిలంకూరు గంగమ్మ (25) ఇంట్లోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుందని యర్రగుంట్ల పట్టణ సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. పెద్దనపాడుకు చెందిన వీరాంజనేయులు, లక్ష్మీదేవి కుమార్తె గంగమ్మ. గంగమ్మకు పెళ్లి చూపులు చూస్తున్నా.. అవి కుదరడం లేదు. దీంతో గంగమ్మ ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. మృతురాలి తల్లి ఫిర్యాదుతో కేసు నమోదు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. -
పెద్ద వలంటీర్లమట
కూటమి ప్రభుత్వం వచ్చాక సచివాలయ వ్యవస్థను నిర్వీర్యం చేస్తున్నారు. ఒక్క సమస్య కూడా పరిష్కారం లేదు. కనీస డిమాండ్లు తీర్చకపోగా తమను పెద్ద వలంటీర్లని ఎగతాళి చేస్తున్నారు. ఉదయం ఆరు నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు పని చేయిస్తున్నారు. సంబంధం లేని విధులు అప్పగి స్తున్నారు. సర్వేల సమయంలో ప్రజలు ఓటీపీలు చెప్పడం లేదు, వాటిని ఎలా పూర్తి చేయాలి. ఉద్యోగుల సంక్షేమం పట్టించుకోకుండా ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. –జంగాల నందిని, మహిళా పోలీసు జేఏసీ కార్యనిర్వాహక కార్యదర్శి -
సీఎం అనుమతించినా.. ఫలితం లేదు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆర్టీిసీ ప్రభుత్వంలో విలీనానికి ముందే చేరిన ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చినా ఫలితం లేకుండా పోయిందని ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదరరావు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జి.వి.నరసయ్య డిమాండ్ చేశారు. నగరంలోని ప్రెస్క్లబ్లో శనివారం యూనియన్ జోనల్ సమావేశం నిర్వహించారు. మీడియాతో వారు మాట్లాడుతూ ఏపీఎస్సార్టీిసీ ఉద్యోగ సంఘాల విజ్ఞప్తుల మేరకు ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారన్నారు. ఉన్నతాధికారులు, ప్రభుత్వ పెద్దల అంగీకారం అనంతరం సీఎం గత నెల 28న ఆర్టీసి ఉద్యోగులకు పాత పద్ధతుల్లోనే పదోన్నతులు కల్పించాలని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారన్నారు. సంబంధిత జీఓను టిఆర్–బి అధికారులు జీఏడీకి పంపినా, అసిస్టెంట్ కమిషనర్ స్థాయి అధికారి మొండి వాదనలు చేస్తూ ఫైల్ కదలకుండా అడ్డుకుంటున్నారన్నారు. ఆరేళ్లుగా పదోన్నతుల కోసం ఎదురు చూస్తున్న 6000 మంది ఉద్యోగులు నిరుత్సాహానికి గురవుతున్నారని ఆరోపించారు. 11వ పీఆర్సీకి సంబంధించి 24 నెలల అరియర్స్, నాలుగు డీఏలు ప్రకటిస్తారని ఉద్యోగులు ఎదురు చూస్తున్నారన్నారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలను అమలు చేయకుంటే ఉద్యమబాట పడతామని హెచ్చరించారు. సీ్త్రశక్తి పథకం భవిష్యత్తులో విజయవంతంగా నడవాలంటే ప్రస్తుతం ఉన్న బస్సులు సరిపోవలేదని అన్నారు. వెంటనే 3000 బస్సులు కొనుగోలు చేయాలని, అన్ని కేటగిరీలలో సుమారు పదివేల పోస్టులను భర్తీ చేయాలని కోరారు. విద్యుత్ బస్సులను ఆర్టీసీ సిబ్బందితో నడిపించాలని కోరారు. ఈ సమావేశంలో పి.సుబ్రహ్మణ్యంరాజు, సి.నబీరసూల్, కె.మద్దిలేటి, కె.అర్జున, పి.ఏ.మజీద్, యన్.విజయకుమార్, సి.వి.మురళీధరన్, వి.వెంకటేశ్వర్లు, ఏ.మురగమ్మ, కె.బి.నాగార్జున రెడ్డి, యస్.ప్రసాద్ బాబు, జోనల్ వర్కింగ్ ప్రెసిడెంట్ యం.రామాంజనేయులు, వైస్ ప్రెసిడెంట్ విజయకుమార్, ట్రెజరర్ నాగేంద్రప్రసాద్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఈయూ రాష్ట్ర అధ్యక్షుడు పలిశెట్టి దామోదర్రావు -
బీటెక్ విద్యార్థికి రూ.61 లక్షల పరిహారం
ప్రొద్దుటూరు క్రైం : రోడ్డు ప్రమాదంలో గాయపడి రెండు కాళ్లను పోగొట్టుకున్న బీటెక్ విద్యార్థి వడ్ల సుమంత్కు రోడ్డు ప్రమాద పరిహార క్లెయిమ్ కింద రూ.61లక్షల చెక్ను మెగా లోక్ అదాలత్లో రెండో అదనపు జిల్లా జడ్జి సత్యకుమారి శనివారం అందజేశారు. వివరాల మేరకు.. ప్రొద్దుటూరులోని హనుమాన్నగర్కు చెందిన సుమంత్ బీటెక్ చదువుతున్నాడు. గత ఏడాది సెప్టెంబర్ 5న చిన్నాన్న సుధాకర్తో కలిసి బైక్లో ఎర్రగుంట్లకు వెళ్లాడు. పని ముగించుకొని ప్రొద్దుటూరుకు బయలుదేరారు. సుధాకర్ బైక్ నడుపుతుండగా సుమంత్ వెనుక కూర్చున్నాడు. పోట్లదుర్తి వద్దకు రాగానే వెనుకవైపు నుంచి వస్తున్న టిప్పర్ వారి బైక్ను ఢీకొంది. ఈ ఘటనలో సుమంత్ రెండు కాళ్లు నుజ్జు నుజ్జయ్యాయి. వెంటనే అతడిని కర్నూలుకు తీసుకెళ్లగా వైద్యులు పరీక్షించి హైదరాబాద్కు రెఫర్ చేశారు. వారికి సుమారు రూ.40 లక్షలకు పైగా ఖర్చయినట్లు కుటుంబసభ్యులు తెలిపారు. ఈ ఘటనపై ఎర్రగుంట్ల పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. బాఽధితులు కోర్టులో మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్ను దాఖలు చేశారు. మెగా లోక్ అదాలత్లో ఇన్సూరెన్స్ కంపెనీ ప్రతినిధులు, భాధితులకు రాజీ కుదరడంతో కోర్టు సూచన మేరకు చోళమండలం ఇన్సూరెన్స్ కంపెనీ పరిహారం కింద బీటెక్ విద్యార్థి సుమంత్కు రూ.61 లక్షల చెక్కును అందజేసింది. ఈ కార్యక్రమంలో న్యాయవాది ఎస్కే రియాజుద్ధిన్, కంపెనీ న్యాయవాది రాజశేఖర్రెడ్డి, సోమేశ్వరరావు పాల్గొన్నారు. -
టీడీపీ వారికే డైరెక్టర్ పదవులా?
కడప కోటిరెడ్డిసర్కిల్ : వైఎస్సార్ జిల్లాలో టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు రెడ్డి, కడప ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఏకపక్షంగా వ్యవహరిస్తున్న తీరు అభ్యంతరకరంగా ఉందని భారతీయ జనతా పార్టీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకట సుబ్బారెడ్డి విమర్శించారు. నగరంలోని పార్టీ కార్యాలయంలో విలేకరులతో శనివారం ఆయన మాట్లాడుతూ బీజేపీ, జనసేన నాయకులను సంప్రదించకుండా కేవలం టీడీపీ వారికే రిమ్స్లో డైరెక్టర్ పదవులు కట్టబెట్టారన్నారు. ఆరోగ్య శాఖ మంత్రి శంకుస్థాపనలకు వస్తామన్నా పట్టించుకోకుండా.. ఇతర కార్యక్రమాల్లో నిమగ్నం కావడం తగదన్నారు. కూటమి ప్రభుత్వంలో చంద్రబాబు, పవన్, బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్లు కలిసికట్టుగా ముందుకు వెళ్తున్నారన్నారు. అయితే ఆ సంబంధాలు దెబ్బతినేలా టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులురెడ్డి వ్యవహరిస్తున్నారన్నారు. కడప పరిస్థితిని సీఎం చంద్రబాబు, రాష్ట్ర మంత్రి లోకేష్ దృష్టికి తీసుకుపోతామన్నారు. ఎన్నికలకు ముందు బీజేపీ, జనసేన లేకుండా కార్యక్రమాలు చేపట్టేవారు కాదని, ప్రస్తుతం బీజేపీ, జనసేనను పట్టించుకునే వారే లేరన్నారు. ఇప్పటికై నా కూటమి సంబంధాలు మెరుగు పడేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో బీజేవైఎం జిల్లా అధ్యక్షుడు బొమ్మన విజయ్, బీజేపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కుమార్ నాయుడు, బీజేపీ నాయకులు శివనాయక్, రమణ చారి, లక్ష్మణ్రావు తదితరులు పాల్గొన్నారు. బీజేపీ అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి -
డ్రాగా ముగిసిన ఏసీఏ అండర్–23 మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–23 మల్టీ డే మ్యాచ్ మూడో రోజున డ్రాగా ముగిసింది. అనంతపురం–కర్నూలు జట్ల మధ్య కెఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో శనివారం మూడో రోజున ఎనిమిది వికెట్ల నష్టానికి 114 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో బ్యాంటింగ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 148 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఎంకె.దత్తారెడ్డి 57 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని అక్షిత్రెడ్డి నాలుగు, సాబ్జాన్ మూడు, కనిష్ రెండు వికెట్లు తీశారు. అనంతరం కర్నూలు జట్టు రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించి 74 పరుగులకు డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 22 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని దీపక్ మూడు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 16.1 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 111 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహేంద్ర 40 పరుగులు చేశాడు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. దీంతో తొలి ఇన్నింగ్స్ అధిక్యంతో కర్నూలు జట్టు మూడు పాయింట్లు దక్కించుకుంది. వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో..... వైఎస్సార్ స్టేడియంలో చిత్తూరు–నెల్లూరు జట్ల మధ్య జరిగిన మ్యాచ్ డ్రాగా ముగిసింది. శనివారం మూడో రోజున రెండు పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 40 ఓవర్లకు నాలుగు వికెట్లు కోల్పోయి 96 పరుగుల వద్ద డిక్లేర్డ్ చేసింది. ఆ జట్టులోని నిఖిలేశ్వర్ 40, పవన్ రిత్విక్ 23 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద రెండు వికెట్లు తీశాడు. అనంతరం రెండో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 58 ఓవర్లకు తొమ్మిది వికెట్లు కోల్పోయి 202 పరుగులు చేసింది. ఆ జట్టులోని రెడ్డి రుషిల్ 42, జివి,చరణ్జిత్ 67 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని సుజిత్రెడ్డి నాలుగు, మాధవ్ మూడు వికెట్లు తీశారు. దీంతో మ్యాచ్ డ్రాగా ముగిసింది. నెల్లూరు జట్టు తొలి ఇన్నింగ్స్లో అధిక్యం దక్కించుకుంది. నగదు తిరిగి ఇవ్వమన్నందుకు ఇద్దరిపై దాడి మదనపల్లె రూరల్ : నగదు తిరిగి ఇవ్వమని అడిగినందుకు ఇద్దరిపై దాడికి పాల్పడిన ఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం ఎద్దులవారిపల్లెకు చెందిన అబ్దుల్లా(47) అతడి తమ్ముడు ఖాదర్వలి(29) కురబలకోట మండలం ముదివేడుకు చెందిన బావాజాన్ వద్ద రూ.1.75 లక్షలకు రెండు పాడి ఆవులు కొనుగోలు చేశారు. అయితే, చెప్పిన మేరకు ఆవులు పాలు ఇవ్వకపోవడంతో తిరిగి వెనక్కి ఇచ్చి తమ డబ్బు చెల్లించాలని కోరారు. కొద్ది రోజులుగా నగదు ఇవ్వకుండా బావాజాన్ ఇబ్బంది పెట్టడంతో శనివారం అన్నదమ్ములు ఇద్దరూ ముదివేడుకు చేరుకుని తమకు రావాల్సిన నగదుపై బావాజాన్ను నిలదీశారు. దీంతో అతను తన అనుచరులతో కలిసి అబ్దులా, ఖాదర్వలిలపై దాడి చేయించాడు. గాయపడిన బాధితులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వాసుపత్రిలో చికిత్సలు పొందుతున్నారు. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన మూర్తి భార్య ఉలిగెమ్మ(24) భర్తతో గొడవపడి మనస్తాపం చెంది ఇంటివద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. అదేవిధంగా మండలంలోని పోతబోలు పంచాయతీ నడింపల్లెకు చెందిన వెంకటరమణ భార్య రెడ్డెమ్మ(50) అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది ఇంట్లోనే పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
వాకర్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్గా చేజర్ల
రాజంపేట: వాకర్స్ ఇంటర్నేషనల్ ఎలెక్ట్ గవర్నర్గా రాజంపేటకు చెందిన చేజర్ల సుబ్రహ్మణ్యంరాజు ఎన్నికయ్యారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ తిరుపతిలో వాకర్స్ ఇంటర్నేషనల్ డిస్ట్రిక్ 302 కేబినెట్ సమావేశం జరిగిందని తెలిపారు. నడకతో బీపీ, షుగర్, కొలెస్ట్రాల్ తగ్గి ఆరోగ్యంగా ఉంటారన్నారు. తనను ఏకగ్రీవంగా ఎన్నుకునేందుకు సహకరించిన ప్రతిఒక్కరికీ కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం చేజర్లను వాకర్స్ కమిటీ సభ్యులు శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. ఈ సమావేశానికి ప్రెసిడెంట్ డా.రవిరాజు, డిస్ట్రిక్ గవర్నర్ మాధవ నాయుడు, కొండూరు శరత్రాజు, కోనేటి రవిరాజు, వినాయగం, మనోహర్, పాండ్యన్, మునికృష్ణ, రామ్మోహన్వర్మ, శంకర్రాజు, సురేష్రాజు పాల్గొన్నారు. కాలువలో పడ్డ స్కార్పియో పులివెందుల రూరల్ : మండలంలోని రచ్చుమర్రిపల్లె వద్ద స్కార్పియో వాహనం అదుపు తప్పి కాల్వలో పడింది. ఈ ప్రమాదంలో ఆరుగురికి గాయాలయ్యాయి. పోలీసుల కథనం మేరకు.. కదిరి మండలం పట్నం పంచాయతీ ఏటిగడ్డ తండా గ్రామానికి చెందిన కిరణ్, శ్రీనివాసనాయక్, నారాయణ స్వామి, చంద్రనాయక్, రమేష్నాయక్, మహేంద్రబాబులతోపాటు మరో ఎనిమిది మంది జమ్మలమడుగు నియోజకవర్గ సమీపం లోని తండాకు స్కార్పియోలో బయలుదేరారు. రాయలాపురం వంతెన సమీపంలోని కాల్వ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి అదుపుతప్పి వాహనం కాల్వలో పడిపోయింది. దీంతో స్కార్పియోలోని ఆరుగురికి తీవ్రగాయాలయ్యాయి. ముగ్గురు పరిస్థితి విషమంగా ఉన్నట్లు పోలీసులు తెలిపారు. వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వ సర్వజన ఆసుపత్రికి తరలించారు. బాధితులు తమబంధువు పెళ్లిచూపులకు వెళ్తున్నట్లు వారు పోలీసులు తెలిపారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కరస్పాండెంట్పై పోక్సో కేసు మైదుకూరు : తన పాఠశాలలో చదువుతున్న పదో తరగతి విద్యార్థినిపై అసభ్యంగా ప్రవర్తించిన కరస్పాండెంట్పై మైదుకూరు పోలీసులు ఫోక్సో కేసు నమోదు చేశారు. స్థానిక ఓ పాఠశాలలో సదరు విద్యార్థిని ఒకటో తరగతి నుంచి చదువుతోంది. తల్లి కువైట్కు వెళ్లగా తండ్రితో కలిసి అమ్మమ్మ వద్ద ఉంటూ ప్రస్తుతం పదో తరగతి చదువుతోంది. ఆ విద్యార్థినిపై కరస్పాండెంట్ వెంకటేశ్వర్లు స్టడీ అవర్స్లో అసభ్యంగా ప్రవర్తించేవాడు. రెండు నెలలుగా విద్యార్థిని పాఠశాలకు వెళ్లకపోవడంతో అమ్మమ్మ అడిగింది. దీంతో కరస్పాండెంట్ ప్రవర్తన గురించి చెప్పింది. ఆ విషయమై పోలీస్స్టేషన్కు వెళ్లి విద్యార్థినితో వెంకటేశ్వర్లుపై ఫిర్యాదు చేయించింది. ఆ మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్టు అర్బన్ ఎస్ఐ చిరంజీవి తెలిపారు. స్కూల్ బస్సు ఢీకొని ఒకరు మృతి మైదుకూరు : మండలంలోని మాచుగారిపల్లె స్కూల్ బస్సు ఢీకొనడంతో బైక్పై వస్తున్న లంకల చిన్నఓబులేసు(45) మృతిచెందాడు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గంగాయపల్లెకు చెందిన చిన్న ఓబులేసు శుక్రవారం సాయంత్రం మాచుగారిపల్లె గ్రామానికి వస్తున్నారు. జీవీ.సత్రంలోని ప్రైవేట్ పాఠశాలకు చెందిన బస్సుమాచుగారిపల్లె వద్ద బైక్ను ఢీకొంది. తీవ్రంగా గాయపడిన చిన్న ఓబులేసును కడప రిమ్స్కు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. మృతుడి అన్న కుమారుడు లంకల ఓబులేసు ఫిర్యాదు మేరకు అర్బన్ ఏస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నారు. మితిమీరుతున్న స్కూల్ బస్సుల వేగం జీవీ సత్రంలోని ప్రైవేట్ పాఠశాలల బస్సులు మితిమీరిన వేగంతో తిరగడంతో పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయనే ఆరోపణలుస్తున్నాయి. జీవీ సత్రానికి చెందిన ఓ ప్రైవేట్ స్కూల్ బస్సు ఢీకొని గతంలో ట్రాన్స్జెండర్ మృతి చెందగా, తాజాగా బస్సు డ్రైవర్ మితిమీరిన వేగంతో నడపడంతో మరొకరు మృతి చెందారు. విద్యార్థుల భద్రత పట్టించుకోకుండా డ్రైవర్లు వాహనాలను వేగంగా నడుపుతున్నారని స్థానికులు చెబుతున్నారు. వారిపై చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. నవోదయలో సైన్స్ గ్రూప్ ఖాళీల భర్తీకి చర్యలు – సెప్టెంబరు 23 వరకు దరఖాస్తుల స్వీకరణ రాజంపేట : మండలంలోని నారమరాజుపల్లె సమీపంలోని జవహర్ నవోదయ విద్యాలయంలో ఇంటర్ ప్రథమ సంవత్సరం సైన్స్ గ్రూపులో(2025–2026) ఖాళీలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు ప్రిన్సిపల్ కె.గంగాధరన్ శనివారం ఓ ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి కడప జిల్లా విద్యార్ధులు దరఖాస్తు చేసుకోవాలన్నారు. పదో తరగతిలో సైన్స్, గణితంలో 60 శాతం మార్కులు, సరాసరి 60 శాతం మార్కులు వచ్చి ఉండాలన్నారు. విద్యార్థులు స్వయంగా వ చ్చి సెప్టెంబరు 23వ తేదిలోగా దరఖాస్తు అందచేయాలని కోరారు. పదో తరగతి మార్కుల జాబి తా, టీసీ వెంట తీసుకురావాలన్నారు. స్పాట్ అ డ్మిషన్ ఇవ్వాల్సి ఉంటుందని, జిల్లా వాసులేగాక ఇతర జిల్లాల విద్యార్థులు చేరవచ్చునన్నారు. -
కాయ్ రాజా కాయ్
క్రికెట్ బెట్టింగ్ అనగానే గుర్తొచ్చేది ప్రొద్దుటూరు. ఒక విధంగా చెప్పాలంటే క్రికెట్ బెట్టింగ్కు ఈ పట్టణం పుట్టినిల్లు అని చెప్పొచ్చు. మ్యాచ్లు ప్రారంభమైతే చాలు పోలీసులు నిఘా పెట్టడం.. ప్రతి రోజూ బుకీల అరెస్ట్ చేయడం తరచూ జరుగుతోంది. తాజాగా కాయ్ రాజా కాయ్ అంటూ యాప్లపై బెట్టింగ్ జోరుగా సాగుతోంది. కేంద్రం చట్టం చేసిన నేపథ్యంలో ఈసారైన అడ్డుకట్ట పడుతుందా అనేది ప్రశ్నార్థకంగా మారింది. ● ప్రొద్దుటూరు క్రికెట్ బుకీలకు కళ్లెం వేసేది ఎవరు? ● ఆసియా కప్ టీ20 టోర్నీతో జోరందుకున్న బెట్టింగ్ ● నేడు ఇండియా–పాకిస్థాన్ మధ్య క్రికెట్ మ్యాచ్ ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు పట్టణంలో ఒకప్పుడు క్రికెట్ బెట్టింగ్ నిర్వహణ అంటే టీవీ, మొబైల్ పోన్లు, రాసుకోవడానికి నోట్ బుక్కులు, లైన్బాక్స్ సెటప్ ఉండేది. వీటన్నింటినీ ఒక గదిలో ఏర్పాటుచేసుకొని లైవ్ క్రికెట్ మ్యాచ్లు చూస్తూ బెట్టింగ్ రాసేవాళ్లు. ఇందుకోసం గుమస్తా, డబ్బు వసూలు చేయడానికి బాయ్లను పెద్ద మొత్తంలో జీతాలు చెల్లించి నియమించుకునేవారు. ఐపీఎల్, వరల్డ్కప్ లాంటి వరుస క్రికెట్ మ్యాచ్లు జరిగే సమయంలోనూ బుకీలు ఇతర ప్రాంతాలకు వెళ్లేవారు. అయితే వీరు ఏ ప్రాంతంలో ఉన్నా టవర్ లొకేషన్ ఆధారంగా పోలీసులు సులభంగా పట్టుకునేవారు. ఘటనా స్థలంలో స్వాధీనం చేసుకున్న డబ్బునేగాక బ్యాంకుల్లో ఉన్న మొత్తాన్ని కూడా ఫ్రీజ్ చేసేవారు. సొంతంగా యాప్ల నిర్వహణ కొన్నేళ్ల తర్వాత టెక్నాలజీ మారిపోయింది. స్మార్ట్ మొబైల్తో టెక్నాలజీని క్రికెట్ బుకీలు ఉపయోగించారు. కొన్నేళ్ల నుంచి ఈ పద్ధతి ఆన్లైన్లో జోరుగా సాగుతోంది. వారిని పట్టుకోవడం పోలీసులకు సాధ్యం కావడం లేదు. ఇటీవల బెట్టింగ్ యాప్లు పెరిగిన నేపథ్యంలో యువత సులభంగా డౌన్లోడ్ చేసుకొని బెట్టింగ్ ఆడుతున్నారు. యాప్ల నుంచి ఆదాయం వస్తుండటంతో ప్రొద్దుటూరు బుకీల చూపు ఈ యాప్లపై మళ్లింది. లక్షల రూపాయలు వెచ్చించి కొందరు బుకీలు యాప్లను కొనుగోలు చేశారు. వాటి ఐడీలను తమ ముఖ్య అనుచరులకు ఇచ్చి బెట్టింగ్ దందా నిర్వహిస్తున్నారు. యాప్ల ద్వారా బుకీలు రూ.కోట్లు ఆర్జించినట్లు టాక్ నడుస్తోంది. ఇతర దేశాలకు వెళ్లి అక్కడి నుంచి యాప్ల ద్వారా ఈ బెట్టింగ్ కార్యకలాపాలు కొనసాగిస్తున్నారు. దీంతో వారిని పట్టుకోవడం పోలీసులకు సవాల్గా మారింది. నాలుగైదేళ్ల నుంచి క్రికెట్ బెట్టింగ్ కేసులు పూర్తిగా తగ్గిపోయాయి. కొత్త చట్టంతో చెక్ పడుతుందా? తక్కువ సమయంలో ఎక్కువ మొత్తం సంపాదించుకోండి.. రండి మీ అదృష్టాన్ని పరీక్షించుకోండి.. మీ ఫోన్లో ఆడుతూ రూ.వేలు, లక్షలు జేబులో వేసుకోండి శ్రీ అంటూ సినిమా హీరోలు, ఇతర సెలబ్రెటీలు టీవీల్లోనూ, సోషల్ మీడియాలో ప్రకటనలు గుప్పిస్తున్నారు. ఏ సామాజిక మాధ్యమాల్లో చూసినా ఇలాంటి ప్రకటనలే కనిపించేవి. వీటికి ఆకర్షితులైన యువత బెట్టింగ్ మాయలో పడిపోతున్నారు. ఐపీఎల్ లాంటి వరుస మ్యాచ్లు జరిగినప్పుడు ఆన్లైన్ బెట్టింగ్ ఆడేవారి సంఖ్య గణనీయంగా ఉంటుంది. ఆన్లైన్ బెట్టింగ్లో నష్టపోయి రెండు తెలుగు రాష్ట్రాల్లో అనేక మంది ప్రాణాలను కోల్పోయారు. కొన్ని నెలల క్రితం ప్రొద్దుటూరులో ఓ యువకుడు బెట్టింగ్లో అప్పులపాలై ఆత్మహత్య చేసుకున్నాడు. ఇదే ప్రాంతంలో ఐదు నెలల క్రితం ఆన్లైన్ క్రికెట్ బెట్టింగ్ నిర్వహిస్తున్న ముఠాపై పోలీసులు దాడులు చేశారు. దాడుల్లో 23 మందిని అరెస్ట్చేసి వారి నుంచి రూ.3.10లక్షల నగదును స్వాధీనం చేసుకున్నారు. ఇదే కేసులో పలువురు ప్రధాన బుకీలపై కేసు నమోదు చేశారు. అనేక మంది ప్రాణాలను బలితీసుకున్న ఆన్లైన్ బెట్టింగ్, గేమింగ్లను చెక్పెట్టే దిశగా అత్యంత కీలకమైన బిల్లును గత నెల 20న లోక్సభ ఆమోదించింది. ఆన్లైన్ గేమ్లను నిర్వహించినా, ప్రోత్సహించినా జైలు శిక్షతో పాటు భారీ జరిమానా విధించేలా ఈ బిల్లును కేంద్రం రూపొందించింది. రాష్ట్రపతి ఆమోదం అనంతరం ఇది చట్టంగా మారనుంది. గేమింగ్ యాక్ట్ బిల్లు ఆమోదం పొందిన తర్వాత ఆసియా కప్ టోర్నీ జరుగనుంది. ఆసియా కప్ టోర్నీలో భాగంగా ఆదివారం దుబాయ్ వేదికగా ఇండియా–పాకిస్తాన్ మధ్య హై ఓల్టేజీ టి20 క్రికెట్ మ్యాచ్ జరుగనుంది. ఆదివారం జరిగే మ్యాచ్కు ప్రొద్దుటూరుతోపాటు జిల్లా వ్యాప్తంగా రూ.వందల కోట్లు బెట్టింగ్ జరిగే అవకాశం ఉంది. బెట్టింగ్ యాప్లను కేంద్ర ప్రభుత్వం నిషేధించిన నేపథ్యంలో బుకీలు ఆన్లైన్లో పందేలు నిర్వహిస్తారా లేక ఆఫ్లైన్లో ఆడతారా అనేది తెలియాల్సి ఉంది. ప్రతిష్టాత్మకమైన ఈ క్రికెట్ మ్యాచ్లో ప్రొద్దుటూరు బుకీల ఆగడాలను పోలీసులు నిలువరిస్తారో లేదో చూడాలి మరి. -
మెడికల్ కళాశాలలపై చంద్రబాబు అబద్ధపు ప్రచారం
పులివెందుల : రాష్ట్ర ప్రభుత్వ మెడికల్ కళాశాలలపై ముఖ్యమంత్రి చంద్రబాబు, ఆయన అనుచరులు అబద్ధపు ప్రచారం చేస్తున్నారని వైఎస్సార్సీపీ డాక్టర్స్ విభాగం జిల్లా అధ్యక్షుడు డాక్టర్ నాగార్జునరెడ్డి అన్నారు. పులివెందుల ప్రభుత్వ మెడికల్ కళాశాలను వైఎస్సార్ వేషధారణలో శనివారం ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా నాగార్జునరెడ్డి మాట్లాడుతూ అనంతపురం సభలో చంద్రబాబు పాడేరు మెడికల్ కళాశాల మినహా, ఎక్కడ వైద్య కళాశాల నిర్మాణం జరగలేదని చెప్పడం దారుణమన్నారు. ఆయన వ్యాఖ్యలను నివృత్తి చేసేందుకే అందరికీ వైద్య కళాశాల చూపుతానని అన్నారు. ఉమ్మడి రాష్ట్రంలో 12 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు గతంలో ఉండేవని, వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయిన తర్వాత 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలు తీసుకొచ్చారన్నారు. గతంలో రోగులను అత్యవసర పరిస్థితిలో రాష్ట్రంలో సరైన వసతులు లేక హైదరాబాద్, చైన్నె. బెంగుళూరు ప్రాంతాలకు అంబులెన్స్లలో తీసుకెళ్లడం జరిగిందన్నారు. సరిహద్దులలో అంబులెన్స్లు ఆపి రాష్ట్రంలో వైద్యం చేయించుకోవాలని చెప్పారన్నారు. దీంతోపాటు చాలామంది మెడికల్ కళాశాల బిల్లులు కట్టుకోలేక ఇబ్బందులు పడుతుండేవారన్నారు. దీంతో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వంతో సంప్రదించి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు ప్రణాళిక రూపొందించారన్నారు. అందులో ఐఆదు మెడికల్ కళాశాలలు గత రెండేళ్లుగా కొనసాగుతున్నాయని, మరో నాలుగు మెడికల్ కళాశాలలు గత ఏడాది ప్రారంభం కావాల్సి ఉందన్నారు. గత ఏడాది మెడికల్ కళాశాలల ప్రారంభాలను ఆపి ప్రస్తుతం వాటిని పీపీపీ విధానం పేరుతో ఎలా పంచుకోవాలనే దానిపై కూటమి నాయకులు ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నారన్నారు. ప్రభుత్వానికి తగిన బుద్ధి చెప్పి నిర్ణయం వెనక్కి తీసుకునేలా కృషిచేస్తామన్నారు. -
శ్రీ భద్రకాళీ అమ్మవారికి రాహుకాల పూజ
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారి ఆలయంలో అమ్మవారికి రాహుకాల పూజను అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. శుక్రవారం ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు అమ్మవారికి రాహుకాల పూజలు నిర్వహించి పూలు, బంగారు ఆభరణాలు, బంగారు ఆభరణాలతో పాటు నిమ్మకాయలతో హారాలతో అందంగా అలంకరించి భక్తుల దర్శన ఏర్పాటు చేశారు. అలాగే భక్తులు అమ్మవారికి నిమ్మకాయలపై ఒత్తులు వెలిగించి హారతులు పట్టారు. భక్తులకు తీర్థప్రసాదాలు పంచి పెట్టారు. అత్తపై దాడిచేసిన అల్లుడు అరెస్టు నందలూరు : లేబాక గ్రామ పంచాయతీ మరాటి పల్లి గ్రామంలో అత్తపై దాడి చేసి పారిపోయిన నిందితుడిని అరెస్టు చేసినట్లు రాజంపేట ఏఎస్పీ మనోజ్ కుమార్ హెగ్డే పేర్కొన్నారు. శుక్రవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. ఈనెల 7 తేదీన సాయంత్రం లేబాక మరాఠ పల్లి కి చెందిన సింధే పద్మావతిభాయిని చంపాలనే ఉద్దేశంతో మచ్చుకత్తితో దాడిచేసి పారిపోయిన వాయకారి నరసింహులును నందలూరు బస్ స్టాండ్ వద్ద అదుపులోకి తీసుకొని అతని నుంచి మచ్చుకత్తిని స్వాధీనం చేసుకున్నామన్నారు. అనంతపురం టౌన్ కి చెందిన నరసింహులుకి 13 సంవత్సరాల క్రితం పద్మావతి భాయి కుతూరు మంజుల భాయితో వివామైంది. వారికి ఒక కొడుకు, కుతూరు ఉన్నారు. నరసింహులు చెడు అలవాట్లకు భానిసై భార్యను పిల్లలను పట్టించుకోకుండా హింసిస్తూ ఉండటంతో మంజుల భాయి భర్తకు దూరంగా తన ఇద్దరి పిల్లలను తల్లి పద్మావతి భాయి దగ్గర ఉంచింది. బతుకుదెరువు నిమిత్తం కువైట్కి వెళ్ళింది. అయితే భార్యా, పిల్లలు దూరం కావడానికి అత్తే కారణమని పగ పెంచుకొని, అతడి జల్సాలకు డబ్బు ఇవ్వలేదనే కోపంతో పద్మావతి భాయిని చంపాలని ప్లాన్ వేసుకొని ఈనెల 7వ తేదీ సాయంత్రం మచ్చుకత్తితో దాడి చేశాడు. ఈ ఘటనపై పద్మావతి భాయి కోడలు శ్యామల భాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు నందలూరు పోలీసులు కేసు నమోదు చేసి వాయకారి నరసింహులును ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, సిబ్బంది అరెస్ట్ చేశారు. రిమాండ్ నిమిత్తం నందలూరు కోర్టులో హాజరు పరిచినట్లు తెలిపారు. -
బతికుండగానే చంపేశారు
● రూ.2కోట్లు విలువైన ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని డెత్ సర్టిఫికెట్తో అమ్మేశారు ● ఎన్జీఓ ప్లాట్ 300కు సంబంధించి వెలుగుచూసిన సంఘటన ప్రొద్దుటూరు : బతికుండగానే ప్రభుత్వ ఉద్యోగి చనిపోయినట్లు ఏకంగా డెత్ సర్టిఫికెట్ను సృష్టించి రూ.2 కోట్ల విలువైన స్థలాన్ని మరొకరికి అమ్మారు. ప్రభుత్వ ఉద్యోగి వీఆర్ఎస్ పొంది ప్రతినెలా పెన్షన్ తీసుకుంటున్నారు. ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో జరిగిన ఈ సంఘటనను తెలుసుకుని అందరూ ముక్కున వేలేసుకుంటున్నారు. సంఘటన ఎవరు చేశారు.. ఎలా జరిగింది... ఎవరెవరి హస్తం ఉంది అనే వివరాల గురించి ఇప్పటి వరకు సంబంధిత అధికారులు ఆరా తీయలేదు. వివరాలు ఇలా ఉన్నాయి.. ప్రొద్దుటూరు పట్టణంలోని మైదుకూరు రోడ్డులో ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి 1980 ప్రాంతంలో ఎన్జీఓ ప్లాట్లు వేశారు. ప్రస్తుతం ఈ స్థలం విలువ రూ.కోట్లు పలుకుతోంది. ఈ కాలనీలోనే గంజికుంట సుబ్బరాయుడు (నీటి పారుదల శాఖ రిటైర్డు ఎస్ఈ)కు 1986లో సర్వే నంబర్ 194, 196లోని ప్లాట్ నంబర్ 300లోని 7.5 సెంట్ల స్థలాన్ని కేటాయించారు. ఆయన గత 40 ఏళ్లుగా తన స్థలాన్ని కాపాడుకుంటూ వస్తున్నారు. డెత్ సర్టిఫికెట్ సృష్టించి... గంజికుంట సుబ్బరాయుడు నీటి పారుదల శాఖలో ఎస్ఈగా పనిచేసి 2003లో వీఆర్ఎస్ పొంది ప్రభుత్వం నుండి ప్రతి నెల పెన్షన్ తీసుకుంటున్నారు. కర్నూలు నగరంలోని కృష్ణానగర్ ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ నుంచి పెన్షన్ పొందుతున్నారు. గంజికుంట సుబ్బరాయుడు, తన భార్య గంజికుంట వెంకటసుబ్బమ్మ ప్రొద్దుటూరు పట్టణంలోని బుడ్డాయపల్లెలో నివాసం ఉంటున్నారు. ఇది ఇలా ఉండగా.. హైదరాబాద్ నగరంలోని లింగంపల్లి హనుమాన్ ఆలయం వద్ద ఉన్న (ఆధార్ కార్డు 994947290378) వివరాలతో గంజికుంట సుబ్రహ్మణ్యం ఫేక్ డ్యాక్యుమెంట్లు సృష్టించి ఈ స్థలాన్ని కొండాపురం మండలం దత్తాపురం గ్రామానికి చెందిన వద్ది నారాయణ కుమారుడు నాగరాజు (ఆధార్ కార్డు నంబర్ 879824061289)కు రిజిస్టర్ చేయించారు. తన తండ్రి గంజికుంట సుబ్బరాయుడుతోపాటు తల్లి గంజికుంట లక్ష్మీదేవి మరణించినట్లు ఏకంగా మున్సిపాలిటీ నుంచి డెత్ సర్టిఫికెట్లు తీసుకుని జత చేశారు. వాస్తవానికి గంజికుంట సుబ్బరాయుడుకు గంజికుంట సుబ్రహ్మణ్యంకు ఎలాంటి సంబంధం లేదు. ఆయన ఎవరో వీరికి తెలియదు, ఎలాంటి సంబంధాలు లేవు. ఈ ఏడాది ఆగస్టు 13న ప్రొద్దుటూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో ఈ రిజిస్టర్ జరిగింది. స్టాంప్ రైటర్ తొండలదిన్నె శ్రీనివాసులు ఈ డాక్యుమెంట్ను తయారు చేయగా, దొరసానిపల్లెకు చెందిన వరద ఆంజనేయులు, డ్రైవర్ కొట్టాలకు చెందిన నల్లు జయశంకర్ సాక్షులుగా ఉన్నారు. తనకు జరిగిన మోసాన్ని తెలుసుకున్న గంజికుంట సుబ్బరాయుడు కొద్ది రోజుల క్రితం స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం అధికారులకు ఫిర్యాదు చేసినా స్పందన లేదు. ఈ విషయంపై శుక్రవారం సాయంత్రం జాయింట్ సబ్ రిజిస్ట్రార్ జీఎన్జీ రామదాసును సాక్షి వివరణ కోరగా ఫేక్ రిజిస్ట్రేషన్ జరిగినట్లు తనకు ఎవరు ఫిర్యాదు చేయలేదన్నారు. బతికుండగానే గంజికుంట సుబ్బరాయుడు మరణ ధృవీకరణ పత్రం గంజికుంట సుబ్బరాయుడు స్థలాన్ని రిజిస్ట్రేషన్ చేసిన పత్రాలు ప్రభుత్వ ఉద్యోగి స్థలాన్ని అమ్మిన వారు, కొన్నవారు -
అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలా?
కడప కార్పొరేషన్: కూటమి అట్టర్ఫ్లాప్ పాలనకు విజయోత్సవాలు నిర్వహించడం హాస్యాస్పదంగా ఉందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. కడపలో శుక్రవారం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 10వ తేదీ కూటమి నేతలు అనంతపురంలో ‘సూపర్ సిక్స్ సూపర్ హిట్’ అంటూ రాష్ట్ర వ్యాప్తంగా అన్ని నియోజకవర్గాల నుంచి డ్వాక్రా మహిళలను బలవంతంగా తరలించి విజయోత్సవ సభ నిర్వహించడం విచిత్రంగా ఉందన్నారు. పదహారు నెలలుగా అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడం, అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనబెట్టి రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేయడంలో.. 5లక్షల పింఛన్లు తొలగించడం, 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మోసం చేయడంలో.. నిరుద్యోగ భృతి, ఆడబిడ్డ నిధి ఇవ్వకుండా మోసం చేయడంలో సూపర్ హిట్ సాధించారని ఎద్దేవా చేశారు. 87లక్షల మందికి ‘తల్లికి వందనం’ ఇవ్వాల్సి ఉండగా, 54లక్షల మందికే ఇచ్చి, 16 నెలల్లో ఒక సిలిండర్ మాత్రమే ఉచితంగా ఇచ్చి, 5 రకాల సర్వీసుల్లోనే ఉచిత బస్సు ప్రయాణం కల్పించి బంపర్హిట్ కొట్టారని ఎద్దేవా చేశారు. ‘అన్నదాత సుఖీభవ’ పథకానికి మొదటి ఏడాది పంగనామం పెట్టారని, రెండో ఏడాది రూ.5వేలు మాత్రమే ఇచ్చి 7లక్షల మందికి కోత వేశారన్నారు. యాభై ఏళ్లు దాటిన ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్లు ఇస్తామని మోసగించారన్నారు. పదిహేనేళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబు ఒక్క మెడికల్ కళాశాలను స్థాపించలేదని, ఐదేళ్లు సీఎంగా పనిచేసిన వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 కొత్త మెడికల్ కాలేజీలు తీసుకొచ్చి మొనగాడుగా నిలిచారన్నారు. వాటిలో 10 మెడికల్ కాలేజీలను ఈ ప్రభుత్వం ప్రైవేటుకు అమ్మేయాలను కోవడం దారుణమన్నారు. సచివాలయాలు, ఆర్బీకేలను నిర్వీర్యం చేయడంలో..రైతులకు యూరియా దొరక్కుండా చేయడంలో ఈ ప్రభుత్వం విజయం సాధించిందన్నారు. వలంటీర్ల జీతం పదివేలకు పెంచుతామని చెప్పి ఆ వ్యవస్థనే ఎత్తేశారన్నారు. ప్రభుత్వ బడులు, వైద్యశాలలను.. ఆరోగ్యశ్రీ పథకాన్ని పతనావస్థకు తీసుకుపోయారన్నారు. కూటమి నేతలు విజయోత్సవ సభ నిర్వహించిన జిల్లాలోనే ఓ టీడీపీ ఎమ్మెల్యే జూనియర్ ఎన్టీఆర్ తల్లిని తీవ్రంగా అవమానిస్తే అతడిపై ఎలాంటి చర్యలు తీసుకోలేదన్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళలకు దక్కిన గౌరవం ఇదేనని ఎద్దేవా చేశారు. ఇక రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా ఉందన్నారు. అన్ని వ్యవస్థలను నిర్వీర్యం చేయడంలో సూపర్హిట్ పదిహేనేళ్లు ఒక్క మెడికల్ కాలేజీని స్థాపించారా? 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీల మంజూరు ఘనత వైఎస్ జగన్ది మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా -
కక్షపూరితం..దుర్మార్గం
పత్రికా స్వేచ్ఛ అనేది భావ ప్రకటన స్వేచ్ఛ అని ప్రభుత్వంలో ఉన్న వారికి తెలియంది కాదు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్ 19 (1)ఏ ప్రసాదించింది. ప్రజల గొంతుకై న పత్రిక పట్ల, పత్రిక ఎడిటర్ పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ప్రజాస్వామ్యానికి ఏమాత్రం ఇది మంచిది కాదు. పత్రికలో వచ్చే వార్త లేదా కథనంలో ఏవైనా అభ్యంతరాలు ఉంటే ప్రెస్ కౌన్సిల్కు ఫిర్యాదు చేసుకోవచ్చు. లేదా రిజాయిండర్ ఇవ్వవచ్చు. దానికి స్పందించకపోతే పరువునష్టం దావా వేసుకోవచ్చు. అంతేకాని భయపెట్టి తన దారిలోకి తెచ్చుకోవాలనే కుతంత్రంతో తప్పుడు కేసులు పెట్టడాన్ని సమాజం హర్షించదు. వెంటనే సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పెట్టిన కేసును ఎత్తివేయాలి. – మేడా రఘునాథరెడ్డి, రాజ్యసభసభ్యుడు -
ప్రభుత్వ భూమి కబ్జా
సాక్షి కడప: అన్నమయ్య జిల్లా పుల్లంపేట మండలం దళాయిపల్లి పంచాయతీ కేతరాజుపల్లె గ్రామ రెవెన్యూ 205, 206 సర్వే నంబర్లలోని సుమారు 40 ఎకరాల ప్రభుత్వ భూమిని టీడీపీ నేతలు ఆక్రమించినా రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదని... అంతేకాకుండా ఆక్రమించారని ప్రశ్నించిన వారిపై దాడులకు తెగబడటం ఎంత వరకు న్యాయమని సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య పేర్కొన్నారు. అందుకు సంబంధించి శుక్రవారం ఈశ్వరయ్య జరిగిన ఆక్రమణలపై రాష్ట్ర ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, రాష్ట్ర డీజీపీలకు ఆయన ఫిర్యాదు చేశారు. సత్వరం విచారణ జరిపి న్యాయం చేయాలని కోరారు. దళాయిపల్లి గ్రామ పంచాయతీకి చెందిన టీడీపీ నాయకులు రాజారెడ్డి, వెంకటసుబ్బయ్య, వెంకటరెడ్డి, ప్రభుత్వ భూమిని ఆక్రమించడం.. ఈనెల 9న పుల్లంపేట తహసీల్దార్కు ప్రభుత్వ భూమి కబ్జా అయిందని సీపీఐ నాయకత్వానా విన్నవించామన్నారు. ఆ విషయాన్ని తహసీల్దార్ కార్యాలయంలో పనిచేస్తున్న వీఆర్ఓ కబ్జాదారులకు సమాచారం అందించగా అది తెలుసుకున్న టీడీపీ నాయకులు 10 తేదీ రాత్రి 9 గంటలకు పుల్లంపేట మండల సీపీఐ కార్యదర్శి సెల్వకుమార్కు ఫోన్ చేసి రాత్రి పూట పిలిపించి అత్యంత దారుణంగా తిట్టారని, బెదిరించారని వివరించారు. దాంతో సరిపెట్టుకోకుండా 11వ తేదీ అర్ధరాత్రి 1 గంట సమయంలో సెల్వకుమార్, నిండు గర్భిణి అయిన భార్య బిందు ప్రియపై దాడి చేశారని తెలిపారు. ఆరుబయట నిద్రిస్తుండగా సెల్వకుమార్తోపాటు ఆయన భార్యపై టీడీపీ నాయకులు రాజారెడ్డి, వెంకటసుబ్బయ్య, వెంకటరెడ్డి, సాయికుమార్తోపాటు మరో పది మంది దాడి చేయడంతోపాటు భయభ్రాంతులకు గురిచేశారని పేర్కొన్నారు. అప్పటికి భార్యభర్తలు ఇరువురు ఇంటిలోకి వెళ్లి తలుపులు వేసుకోగా వాకిళ్లను తన్నుతూ భయపెట్టినట్లు తెలిపారు. అంతేకాకుండా ఇంటి ఆవరణలో ఉన్న ఎయిర్ కూలర్, టీవీఎస్ ఎక్సెల్ను ధ్వంసం చేయడంపై ఈశ్వరయ్య మండిపడ్డారు. ఇప్పటికే భారత కమ్యూనిస్టు పార్టీ పలు పర్యాయాలు భూమి కబ్జా జరుగుతున్న విషయం తెలియజేసినా తహసీల్దార్ పట్టించుకోకపోవడంపై పలు విమర్శలు వస్తున్నాయని తెలిపారు. గతంలో ఎన్నికల సమయంలో గొడవలు సృష్టించడంతోపాటు ఈవీఎంలు పగులగొట్టిన చరిత్ర ఉందని, ఇలాంటి వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆయన డిమాండ్ చేశారు. నిందితులపై హత్యాయత్నం కేసు, ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు కఠినంగా శిక్షించాలని, ప్రభుత్వ భూములను కబ్జా చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకుని, ప్రభుత్వ భూములను కాపాడాలని సీఎం, డిప్యూటీ సీఎం, హోమంత్రి, డీజీపీలను ఈశ్వరయ్య కోరారు. అందుకు సంబంధించి వారికి వినతి పత్రం అందించారు. పట్టించుకోని అధికారులు ఫిర్యాదు చేసిన సీపీఐ మండల కార్యదర్శి సెల్వకుమార్ ఫిర్యాదు చేశారనిభార్యతోపాటు సెల్వకుమార్పై టీడీపీ నాయకుల దాష్టీకం సీఎం, డిప్యూటీ సీఎం, హోంమంత్రి, డీజీపీలకు ఫిర్యాదు చేసిన సీపీఐ రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యుడు గుజ్జుల ఈశ్వరయ్య -
మళ్లీ వాయిదా పడిన గుత్తల వేలం
● పాత పాటదారులకు ఆమోదం ఇవ్వకపోవడంతో అవస్థలు ● గేటు వసూళ్ల ఆరోపణలపై అధికారులు దృష్టి పెట్టాలి మదనపల్లె : 2025–26 ఏడాదికి మదనపల్లె మున్సిపాలిటికి చెందిన వారపుసంత, దినసరి మార్కెట్, టౌన్హాలు, ప్రైవేటు బస్టాండ్ గుత్తలను అప్పగించేందుకు వరుసగా ఏడుసార్లు వేలం పాటలను నిర్వహించినా కనీస స్పందన లేకపోతోంది. శుక్రవారం మున్సిపల్ కార్యాలయంలో నిర్వహించిన ఏడోసారి వేలంపాటలు మళ్లీ వాయిదా పడ్డాయి. ఉదయం 11 గంటలకు పాటలను నిర్వహిస్తామని కమిషనర్ ప్రమీల ప్రకటించగా పాటదారుల కోసం కార్యాలయంలో ఎదురుచూశారు. పాత పాటదారుడు ఎస్ఏ.మస్తాన్ పాటలో పాల్గొనేందుకు వచ్చారు. ఎవరూ రాకపోవడంతో ఆయన వెనుదిరిగి వెళ్లిపోయారు. సాయంత్రం పాటదారులు హాజరవుతారని సమాచారంతో అధికారులు ఎదురుచూడగా ఇద్దరు హాజరైనప్పటికి వేలంపై ఆసక్తి చూపకుండా వెనుదిరిగి వెళ్లిపోయారు. దీనితో గుత్తలను అప్పగించేందుకు అధికారులు ప్రయత్నించినా వాటిని నిర్వహించుకునేందుకు లీజుదారుల్లో ఆసక్తి లేదని తేలిపోతోంది. వరుసగా జూలై తొమ్మిది, జూలై 17, జూలై 25, జూలై 30, ఆగష్టు 19, తర్వాత శుక్రవారం ఏడుసార్లు వేలంపాటలను నిర్వహించారు. దీనికోసం పత్రికల్లో ప్రకటనలు కూడా జారీ చే శారు. పరిస్థితి చూస్తుంటే ప్రకటనల కోసం చేసిన ఖర్చు కూడా వృథా అయినట్టే కనిపిస్తోంది. హెచ్చుపాట..ఆమోదం లేదు వాస్తవానికి 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి గుత్తలకు ఈ ఏడాది మార్చి 25న నిర్వహించారు. ఇందులో వారపుసంతకు రూ.పఠాన్ జాఫర్ ఖాన్ రూ.46.38 లక్షలతో హెచ్చుపాటదారునిగా నిలిచారు. దినసరి మార్కెట్కు ఎస్ఏ.మస్తాన్ రూ.1,18,64,000తో హెచ్చుపాటదారునిగా నిలిచారు. వీరికి గుత్తలను ఏప్రిల్ ఒకటి నుంచి అప్పగించాలి. అయితే కౌన్సిల్ ఆమోదం లేదని అధికారులు తదుపరి చర్యలు చేపట్టకుండా నిర్లక్ష్యం చేశారు. ఈలోపు గత లీజుదారుని గుత్తలీజు పూర్తవ్వడంతో కొత్త లీజుదారులకు అప్పగించలేదు. దీనితో ఏప్రిల్ నుంచి కొంతకాలం మున్సిపల్ సిబ్బంది గేటు ఫీజును వసూలు చేయగా, ఇటివల ప్రయివేటు వ్యక్తులు వసూలు చేస్తున్నారని వ్యాపారులు చెబుతున్నారు. దీనితో గేటు ఆదాయం ఎంత రావాలో, మున్సిపాలిటికి ఎంత జమ అవుతోందో అధికారులు గుర్తించాలి. గేటు వసూళ్లపై ఆరోపణలు వస్తున్నాయి. గత కౌన్సిల్ సమావేశంలో ఓ కౌన్సిలర్ ప్రయివేటు వ్యక్తులతో గేటు వసూళ్లు చేస్తున్నారని ఫోటోలు చూపి ఆరోపించడం తెలిసిందే. సిబ్బందికి బాధ్యతలు: లీజు అప్పగించే వరకు మున్సిపల్ సిబ్బందికి గేటు ఫీజు వసూలు బాధ్యతలు అప్పగిస్తే వసూళ్లు పారదర్శకంగా ఉంటాయని వ్యాపారులు స్పష్టం చేస్తున్నారు. గత ఆర్థిక సంవత్సరం గుత్త ఆదాయం ఎంత, ఇప్పుడు రోజువారీ వసూళ్లు ఎంత, ఎంత వసూళ్లు తేడా ఉందన్న విషయాన్ని అధికారులు గుర్తించాలి. ఏటా ఆదాయం పెరుగుతూ ఉంటుంది. దాన్ని ఆంచనావేసి మున్సిపాలిటికి ఎంత ఆదాయం దక్కాలన్న దానిపై అధికారులు సమీక్షించి బాధ్యతలు అప్పగిస్తే వసూళ్లు పక్కదారి పట్టకుండా ఆదాయం సమకూరే అవకాశం ఉందని వ్యాపారులు చెబుతున్నారు. మళ్లీ వేలం ప్రకటన : శుక్రవారం నిర్వహించిన వేలంపాటలకు ఇద్దరు హాజరైనా పాటల్లో పాల్గొనకుండా వెళ్లిపోయారు. దీనితో మరోసారి వేలం నిర్వహించేందుకు చర్యలు తీసుకుని ప్రకటన వెలువరిస్తామని కమిషనర్ కే.ప్రమీల తెలిపారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా
● ఆకట్టుకున్న సాంస్కృతిక కార్యక్రమాలు ● ముగిసిన కళా ఉత్సవ్–2025 పోటీలు జ్ఞాపికలను అందుకున్న విజేతలతో డీఈఓ సుబ్రమణ్యం కళా ఉత్సవ్ కార్యక్రమంలో భాగంగా ప్రదర్శనలు చేస్తున్న విద్యార్థినులు రాయచోటి : పాఠాలు చదువుతూ బిజీగా ఉండే విద్యార్థులు జిల్లాస్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలలో తమలోని ప్రతిభను బయటకు తీశారు. వివిధ సాంస్కృతిక పోటీల్లో విద్యార్థులు సత్తాచాటి శభాష్ అనిపించుకున్నారు. రాయచోటిలోని జిల్లా విద్యాశిక్షణా సంస్థ (డైట్)లో రెండు రోజులపాటు నిర్వహించిన ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాస్థాయి కళా ఉత్సవ్–2025 పోటీలు రెండురోజులపాటు ఉల్లాసంగా ఉత్సాహంగా సాగి శుక్రవారం ముగిశాయి. ఆరు కళారూపాలలో పన్నెండు అంశాలకు సంబంధించి వ్యక్తిగత, బృందాలకు నిర్వహించిన ఈ పోటీలలో 37 పాఠశాలలకు సంబంధించి 110 మంది విద్యార్థినీ విద్యార్థులు పోటాపోటీగా, ఉత్సాహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం విద్యార్థుల ప్రదర్శనలపట్ల అభినందనలు తెలియజేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలు వీరే... గాత్ర సంగీతం వ్యక్తిగత విభాగంలో నజియా తబస్సు (పభుత్వ బ్లైండ్ పాఠశాల, కడప) బృందం విభాగంలో హాసిని, హర్షిత, హిమబిందు (ఎంజేపీఏపీబీసిడబ్ల్యుఆర్ స్కూల్, నందలూరు), వాద్య సంగీతం వ్యక్తిగత విభాగంలో ఎస్ మహమ్మద్ సల్మాన్ (ప్రభుత్వ బ్లైండ్ పాఠశాల కడప), బృందం విభాగంలో జీవన్ కుమార్, సందీప్ రెడ్డి, భావన కుమార్, హరిప్రసాద్ (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి), నృత్యం వ్యక్తిగత విభాగంలో ఎస్ హాసిని (ఎంజీపీఏపీబీసిడబ్ల్యుఆర్ స్కూల్, నందలూరు), బృందం విభాగంలో గౌతమి, గంధర్విక, నాగ నిషిత, నందిని (జిల్లా పరిషత్ హైస్కూల్ కె రామాపురం, రాయచోటి మండలం), నాటకం విభాగంలో భాను ప్రసాద్, భాను ప్రకాష్, రామ్ గణేష్ రెడ్డి, పృద్విరాజు (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి) దృశ్యకళల వ్యక్తిగత విభాగం, చిత్రలేఖనంలో ఎస్ మహమ్మద్ జయిద్ (ప్రభుత్వ ఉన్నత పాఠశాల, డైట్, రాయచోటి) శిల్పకళలో యశ్వంత్ రెడ్డి (ఏపీ మోడల్ స్కూల్, సంబేపల్లి), బొమ్మల తయారీలో వీర అశ్విని (ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి), సాంప్రదాయ కథ చెప్పడం (బుర్రకథ) నందు సమీరా, పూజా(ఏపీ మోడల్ స్కూల్, రాయచోటి)లు రాష్ట్రస్థాయికి ఎంపికయ్యారు. జిల్లాస్థాయి పోటీలలో ప్రథమ స్థానం పొంది రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై న విజేతలకు డిఈఓ జ్ఞాపికలు, సర్టిఫికెట్లు అందజేశారు. ఈ కార్యక్రమ న్యాయ నిర్ణేతలుగా కేంద్ర, సాహిత్య అకాడమీ యువ పురస్కారం పొందిన ప్రముఖ రచయిత డాక్టర్ వేంపల్లి గంగాధర్, నాట్యకళాకారుడు స్వతంత్ర బాఉ, సంగీత ఉపాధ్యాయాఉలు నాగబూషణంలు వ్యవహరించారు. జిల్లాస్థాయి విజేతలుగా ఎంపికై న వారు అక్టోబర్ 24, 25వ తేదిలలో రాష్ట్రస్థాయిలో నిర్వహించే కళా ఉత్సవ్ పోటీలలో పాల్గొంటారని కళా ఉత్సవ్ జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయ సంఘం జిల్లా అధ్యక్షులు రామకృష్ణ, డిసిఈబీ సెక్రటరీ నాగమునిరెడ్డి, డైట్ అధ్యాపకులు, ఛాత్రోపాధ్యాయులు, జిల్లాలో వివిధపాఠశాలల నుండి వచ్చిన గైడ్ టీచర్లు, విద్యార్థినీ విద్యార్థులు పాల్గొన్నారు. -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
మదనపల్లె సిటీ : విద్యార్థులు క్రీడల్లోరాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజు అన్నారు. శుక్రవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–19 బాల,బాలికల ఫుట్బాల్ జట్ల ఎంపిక జరిగింది. విద్యార్థులు తమకు ఆసక్తికలిగిన క్రీడను ఎంచుకుని రాణించాలన్నారు. ఆటలు ఆడటం వల్ల ఆరోగ్యంతో పాటు ఉల్లాసంగా ఉంటారన్నారు.కార్యక్రమంలో ఎంఈఓలు ప్రభాకర్రెడ్డి, రాజగోపాల్, హెచ్ఎం సుబ్బారెడ్డి, పీడీలు మురళీదర్రెడ్డి, సుధాకర్, దేవకమ్మ, అన్సర్, నరేష్, మహేంద్రనాయక్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అండర్–19 బాలుర ఫుట్బాల్ జట్టు: పి.రేవంత్, డి.నరేష్, జి.రాఘవేంద్ర, వై.వంశీకళ్యాణ్, వి.కార్తీక్,, ఎం.జీవన్సాయి, పి.దీక్షిత్రెడ్డి, కె.త్రివేది, టి.జాకబ్జయంత్, ధామస్, వి.ఉదయ్ముని, జి.హరీష్భారత్, సి.సుధీర్, పి.మనోజ్కుమార్, ఎ కెల్విన్కెనత్, డి.శివరంగ్, పి.నికిత్ స్టాండ్బైలుగా సాయికిరణ్, ఎన్.జ్యోతిష్సాయి, ఎస్.ఇమ్రాన్సయ్యద్,పి.యాసర్లు ఎంపికయ్యారు. అండర్–19 బాలికల జట్టు: ఎన్.విష్ణుప్రియ, కె.నిశ్చిత,జి.హేమశ్రీ, ఎం.తన్మయ, పి.స్వాతి, యు.హారిక, జి.నూతనహర్షవర్థిని, బి.శశికళ,ఎ.హాతిక, జి.హాన్సిక, ఈ.దేవిక,ఎస్.సహనాజ్, జి.పూజిత, కె.నందిని, ఎం.భావ్య, ఎన్.పల్లవి, జె.అనిత, స్టాండ్బైలు కె.స్నేహ, ఎస్.తబుసుమ్, జి.మాలతి, కె.శుభశ్రీలు ఎంపికై నట్లు ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగరాజు తెలిపారు. ఎంపికై నవారు హిందుపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికై వారికి స్తానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శిక్షణ శిబిరం నిర్వహిస్తున్నట్లు పీడీలు దేవకమ్మ,అన్సర్, సుదాకర్,జలజ తెలిపారు. స్కూల్ గేమ్స్ జిల్లా కార్యదర్శి నాగరాజు -
జూనియర్ కబడ్డీ జట్ల ఎంపిక
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నగరంలోని డీఎస్ఏ ఇండోర్ స్టేడియంలో జూనియర్ కబడ్డీ ఎంపికలు నిర్వహించినట్లు జిల్లా క్రీడల ప్రత్యేకాధికారి జగన్నాధరెడ్డి తెలిపారు. శుక్రవారం ఇండోర్ స్టేడియంలో జరుగుతున్న కబడ్డీ ఎంపికలను నిర్వహించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఈ ఎంపికలకు జిల్లా నలుమూలల నుంచి బాలికలు 150 మంది, బాలురు 200 మంది హాజరైనట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో కబడ్డీ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ప్రవీణ్ కిరణ్, జిల్లా ఎస్జీఎఫ్ సెక్రటరి శ్రీకాంత్రెడ్డి, సెక్రటరి చంద్రావతి, జిల్లా కబడ్డీ ప్రెసిడెంట్ గురుశేఖర్, సెక్రటరి సుబ్బయ్య, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీవాణి,ఎస్జీఎఫ్ అండర్–19 సెక్రటరి చంద్రహాజరాజు, విక్టర్ కోచ్లు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయికి కబడ్డీ పోటీలకు ఎంపికై నది వీరే.. బాలురు జట్టు : వేణుసాయి, దుర్గశంకర్, బ్రహ్మయ్య, నూర్ భాష, మల్లి ఖార్జున, కలాం, సాయి ప్రసాద్, యశ్వంత్, జయంత్ నాయక్, హుస్సేన్, మల్లిఖార్జున, నరేంద్ర, జశ్వంత్, గఫార్ బాషా. బాలికల జట్టు : జ్యోత్న, నీల మహేశ్వరి, రంగ శివజ్యోతి, సునీత, పల్లవి, సిఎం రామలక్ష్మీ, వర మేఘన, హేమ ప్రియ, షషీనా, మైధిలి, అయ్యవారమ్మ, గంగాదేవి, అనిత, కృపా జ్యోతి. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై న బాలుర జట్టు రాష్ట్ర పోటీలకు ఎంపికై న బాలికల జట్టు -
ఉచిత బస్ ఎఫెక్ట్ .. పట్టాలు తప్పిన రైల్వే ఆదాయం
కూటమి ప్రభుత్వం ప్రవేశ పెట్టిన స్త్రీలకు ఉచిత బస్సు పథకం.. రైల్వే ఆదాయానికి గండికొండుతోంది. నిత్యం రద్దీగా ఉండే ప్యాసింజర్ రైళ్లు.. ఇప్పుడు వెలవెలబోతున్నాయి. మహిళా ప్రయాణికుల రాకపోకలు గణనీయంగా తగ్గాయి. దీంతో మహిళా బోగీలు ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఇప్పటికే రైళ్లలో కేంద్ర ప్రభుత్వం రాయితీలు తొలగిస్తూ వస్తున్న క్రమంలో.. ఈ పథకం రైల్వే ఆదాయానికి మరో దెబ్బ కొట్టింది. ఇప్పుడు ప్రత్యామ్నాయంగా కేంద్రం ఏ దిశగా అడుగులు వేస్తోందో.. వేచి చూడాల్సిందే. రాజంపేట: ఉభయ జిల్లాల మీదుగా మార్గంలో 25 స్టేషన్లు ఉండగా, డైలీ 30 (అప్ అండ్ డౌన్) రైళ్లు నడుస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తీసుకొచ్చిన ఉచిత బస్సు పథకంతో రైల్వేలకు వస్తున్న ఆదాయం పట్టాలు తప్పుతోంది. ఇప్పటి నుంచే అధికారుల్లో ఎర్నింగ్స్(ఆదాయం)పై ఆందోళన రోజురోజుకు హెచ్చరిల్లుతోంది. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలోని రైలుమార్గంలో నడిచే నంద్యాల–రేణిగుంట డెమో ప్యాసింజర్, అరకోణం నుంచి కడప వరకు నడిచే అరక్కోణం, తిరుపతి నుంచి హుబ్లీ మధ్య నడిచే ఇంటర్సిటీ ఎక్స్ప్రెస్ రైళ్లపై ఉచిత బస్ (సీ్త్రశక్తి పథకం) ప్రభావం పడింది. దీంతో రైల్వే ఆదాయనికి ఉచిత బస్ (ఆర్టీసీ) గండికొట్టిందనే రైల్వే నిపుణులు భావిస్తున్నారు. మరోవైపు మోదీ సర్కారు రాయితీలను రానురాను తీసేసుకుంటూ వస్తోంది. జర్నలిస్టుల పాస్లతోపాటు అన్ని రకాల రాయితీలకు మంగళం పాడిన సంగతి విదితమే. రైల్వేకమర్షియల్ విభాగాన్ని.. ఇప్పుడు ఉచితబస్తో ఎర్నింగ్స్ కోల్పోతున్న అంశం వేధిస్తోంది.రైలు ప్రయాణానికి మహిళలు దూరంఏ రైలులో అయినా గార్డుబ్రేక్ ముందు ఉండే లేడీస్కోచ్లో సీట్ల కోసం మహిళలు పోటీపడే పరిస్థితులు నిత్యం కొనసాగుతుండటం విదితమే. ప్రతి స్టేషన్లో అధికంగా మహిళలు ఈ కోచ్లో సీటు కోసం పోటీ పడుతుంటారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడం లేదు. లేడీస్కోచ్లో కనీసం పదిమంది కూడా లేని పరిస్థితులు కనిపిస్తున్నాయి. దీన్ని బట్టి చూస్తే మహిళా ప్రయాణికులు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణంపై ఆసక్తి చూపుతుండటమే.. ఇందుకు కారణమని రైల్వే వర్గాలు అభిప్రాయ పడుతున్నాయి. పైగా రాష్ట్రంలో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ఉచితమే అన్న భావనలో రైలు ప్రయాణాలకు స్వస్తి చెపుతుండటం గమనార్హం.మచ్చుకు.. ఒంటిమిట్ట తీసుకుంటే..ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధికారిక రామాలయం ఒంటిమిట్ట కోదండ రామాలయం. ఉమ్మడి కడప జిల్లా కానీ, కర్నూలు, అనంతపురం, చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, చిత్తూరు తదితర జిల్లాల నుంచి ఒంటిమిట్టలో ఆగే రైళ్లకు వచ్చేవారు. ఫలితంగా నిత్యం రూ.4 వేలు లోపు ఎర్నింగ్స్ వచ్చేంది. ఇప్పుడు అది రూ.400కు పడిపోయింది.చాలా బోగీల్లో ఖాళీగా సీట్లుముంబయి–చైన్నె రైలు మార్గంలోని ఉమ్మడి కడప జిల్లా మీదుగా నడిచే ప్యాసింజర్ రైళ్లు బోసిపోతున్నాయి. ప్రయాణపు ధర తక్కువ అయిన క్రమంలో మహిళా ప్రయాణికులతో రద్దీగా ఉండేవి. బోగీలు మహిళలతో కళకళలాడేవి. ఇప్పుడు ఆ దృశ్యాలు రైలు బోగీలు దూరమయ్యాయి. చాలా మటుకు బోగీల్లో సీట్లు ఖాళీగా కనిపిస్తున్నాయి.తెలంగాణ, తమిళనాడుకు వెళ్లే రైళ్లలో..తెలంగాణ, తమిళనాడుతోపాటు పలు రాష్ట్రాలకు వెళ్లే రైళ్లలో లాంగ్ జర్నీ లేడీస్ కనిపిస్తున్నారు. ఈ రైళ్లలో తిరుపతి, రేణిగుంట, రైల్వేకోడూరు, కడప, ఎర్రగుంట్ల, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు, తాడిపత్రి, గుత్తి, గుంతకల్లు, అనంతపురం, రాష్ట్ర సరిహద్దుల వరకు ప్రయాణం ఉచితంగానే మహిళలు కొనసాగిస్తున్నారు. ఈ క్రమంలో దూర ప్రాంత రైళ్లపై కూడా లోకల్ జర్నీ తగ్గిపోయిందని రైల్వే వర్గాలు పేర్గొంటున్నాయి. ఫలితంగా ఈ విధంగా కూడా రైల్వే ఆదాయాన్ని ఉచిత బస్ పథకం గండికొట్టింది.ప్యాసింజర్ రైళ్లపై తీవ్ర ప్రభావం ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రైలు మార్గంలో ప్రతి రైల్వేస్టేషన్లో ఎరి్నంగ్స్ పడిపోతున్నాయి. ప్రధానంగా ప్యాసింజర్ రైళ్ల ప్రయాణంలో ఈ పరిస్థితి చోటుచేసుకుంది. పేదోడి రైళ్లుగా నడు స్తున్న వీటిలో.. తక్కువ వ్యయంతో గమ్యాలకు చేరుకోవచ్చన్న భావనలో మహిళలు ప్రయాణాలు సాగించేవారు. ఇప్పుడు ఆర్టీసీ ఉచిత బస్సుతో రైలు ప్రయాణాలపై ఆసక్తి చూపడం లేదు. కడప నుంచి ఒంటిమిట్ట, నందలూరు, తిరుపతి, కాణిపాకం, తిరుచానూరు, శ్రీకాళహస్తి లాంటి పుణ్యక్షేత్రాలకు నంద్యాలడెమో, ఇంటర్సిటీ, అరకోణం రైళ్లను మహిళలు ఆశ్రయించేవారు. ఇప్పుడు ఆ పరిస్థితులు లేవు. నంద్యాల నుంచి కడప, తిరుపతి కానీ ఆర్టీసీ బస్సులలో ఉచిత ప్రయాణం చేస్తున్నారు. ఫలితంగా ఈ మూడు రైళ్లు ఆగే స్టేషన్లలో ఎర్నింగ్ పడిపోతున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా సమాచారం మార్గం: ముంబయి–చెన్నై రైళ్లు : 30 (అప్ అండ్ డౌన్) స్టేషన్లు: 25కిలోమీటర్లు: 180 -
పర్యవేక్షణ శూన్యం.. పచ్చదనం మాయం
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట కోదండ రామాలయంలో పచ్చదనం మాయమవుతోంది. టీటీడీ అధికారులు పెద్ద ఎత్తున మొక్కలు నాటడంతో పచ్చదనం పరుచుకుంది. ఆలయ పరిసర ప్రాంతంలోని ఎస్సీ బాలుర హాస్టల్ వద్ద పచ్చదనం ఆహ్లాదం కలిగిస్తోంది. మిగిలినవి మొక్కలు స్థానిక సీఎం విడిది గృహం వద్ద ఉంచారు. అయతే పర్యవేక్షణ లేకపోవడంతో ఇక్కడ నిత్యం పశువులు మొక్కలను పాడు చేస్తున్నాయి. మొక్కలను పెంచిన టీటీడీ అధికారులు వాటిని పట్టించుకోకపోవడంతో మొక్కలను పశువులు తినేస్తున్నాయని భక్తులు చెబుతున్నారు. – ఒంటిమిట్ట -
రెడ్బుక్ రాజ్యాంగంలో పత్రికా స్వేచ్ఛ కూడా లేదు
రాష్ట్రంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన రాజ్యాంగం అమలు కావడం లేదు. లోకేష్ రాసిన రెడ్బుక్ రాజ్యాంగం అమలవుతోంది. ఇందులో పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్రానికి కూడా స్థానం లేకుండా పోయింది. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే ఎడిటర్లపై కూడా కేసులు పెట్టడం దుర్మార్గం. స్టేట్మెంట్ పబ్లిష్ చేస్తే కేసులు పెడతారా? కంటెంట్ మారినా.. ఒక నాయకుడి ప్రెస్ మీట్ కవర్ చేస్తే కేసులు పెట్టడం ఏమిటి? పత్రికా స్వేచ్ఛ, వాక్ స్వాతంత్య్ర హక్కు ఈ రాష్ట్రంలో లేవా? ప్రజాస్వామ్య దేశంలో మొదటి సారి ఇలాంటి విచిత్రాలు చూస్తున్నాం. ఎంతో కాలం ఇలాంటి ఆగడాలు సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. –ఎస్బీ అంజద్బాషా, మాజీ డిప్యూటీ సీఎం సమంజసం కాదు ఒక రాజకీయ నాయ కుడు తన అభిప్రా యాన్ని తెలియయజేసినప్పుడు విలువైన సమాచారాన్ని ప్రజలకు చేరవేయడం ప్రజల పక్షాన ఉన్న పత్రికల బాధ్యత. అయితే ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు రాస్తే పత్రికలపై, ఎడిటర్లపై కేసులు పెట్టడం సమంజసం కాదు .అది పత్రికా స్వేచ్ఛను,వాక్ స్వాతంత్య్రాన్ని హరించడమే.కేసులు పెట్టడాన్ని ఖండిస్తున్నాం. ఇలాంటి ఆగడాలు ఎంతో కాలం సాగవు. దీనికి తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – కొరముట్ల శ్రీనివాసులు, మాజీవిప్, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు మీడియా స్వేచ్ఛను హరించడమే రాజకీయ నేతలు మాట్లాడిన మాటలను ప్రజల వద్దకు తీసుకెళ్లే మాధ్యమం మీడియా.ఈ క్రమంలో వారికి ఇష్టం లేని మాటలు మాట్లాడారని, ప్రజల గొంతుక అయిన పత్రిక పట్ల, ఎడిటర్ల పట్ల కక్షపూరితంగా వ్యవహరించడం దుర్మార్గం.ఇది మీడియా స్వేచ్ఛను హరించడమే. ప్రజాస్వామ్యానికి ఇది ఏమాత్రం మంచిది కాదు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా వార్తలు వస్తే.. వాటిని ఖండించవచ్చు లేదా సంబంధిత అధికారి లేదా పదవిలో ఉన్న నాయకుడు పరువు నష్టం దావా వేసుకునే వీలుంది. అయితే చంద్రబాబు సర్కారు కొత్త సంస్కృతికి తెర తీసింది. పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేయించడం..ఎడాపెడా అక్రమ కేసులు నమోదు చేసి కోర్టుల చుట్టూ తిప్పే ప్రక్రియను ఎంచుకుంది.ఆధారాల్లేని కేసులు చట్టప్రకారమే కాదు..ప్రజల ముందు కూడా నిలబడవు. –గడికోట శ్రీకాంత్ రెడ్డి, మాజీ చీఫ్ విప్ -
భార్య కోసం బైక్ పై వెళ్తూ దుర్మరణం
మదనపల్లె : భార్యను ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్ పై వెళ్తున్న భర్త దుర్మరణం పాలైన ఘటన గురువారం రాత్రి మదనపల్లె రూరల్ మండలంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మదనపల్లె ఎస్టేట్లో కాపురం ఉంటున్న వి.నాగార్జున (29) చేనేత కార్మికుడుగా పనిచేస్తూ జీవిస్తున్నాడు. వాల్మీకిపురం మండలం చింతపర్తిలో ఉన్న తన భార్య లావణ్యను ఇంటికి తీసుకొచ్చేందుకు బైక్ పై చింతపర్తికి బయలుదేరాడు. మార్గ మధ్యంలో కాశీరావుపేట వద్ద జాతీయ రహదారిపై గుర్తు తెలియని వాహనం నాగార్జున ను ఢీకొంది. ఈ ఘటనలో తీవ్రంగా గాయపడిన నాగార్జున అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రికి తరలించారు. మదనపల్లె రూరల్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.వాహనం ఢీకొని ఇద్దరికి గాయాలుమదనపల్లె : గర్భిణీ అయిన భార్య ఆస్పత్రికి తరలించగా.. ఆమె కోసం బైక్ పై మదనపల్లి వస్తున్న భర్త, అతని మిత్రుడు ప్రమాదానికి గురైన ఘటన గురువారం రాత్రి కురబలకోట మండలం అంగళ్లు వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు. బి.కొత్తకోటకు చెందిన శ్రీనాథ్ భార్య గర్భిణీ కావడంతో ఆమెను మదనపల్లె ఆసుపత్రికి తీసుకెళ్లారు. ఆమె వద్దకు వెళ్లేందుకు శ్రీనాథ్.. ములకల చెరువుకు చెందిన మిత్రుడు సురేష్ తో కలిసి బైక్ మీద బి.కొత్తకోట నుంచి మదనపల్లె కు బయలుదేరారు.మార్గ మధ్యంలో కురబలకోట మండలం అంగళ్లు హైవే పై వెళ్తుండగా వెనుక వేగంగా వచ్చిన గుర్తు తెలియని వాహనం బైక్ ను ఢీకొంది. దీనితో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 సిబ్బంది మస్తాన్, మనోహర్ స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో ఒకరిని తిరుపతికి రెఫర్ చేశారు. -
15 ఎర్రచందనం దుంగలు స్వాధీనం
వీరబల్లి (సుండుపల్లె): అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను తరలిస్తున్న స్మగ్లర్లను అరెస్టు చేసి వారి నుంచి 15 ఎర్రచందనం దుంగలను తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు బుధవారం స్వాధీనం చేసుకున్నారు. వివరాలలోకి వెళ్లితే.. సానిపాయి అటవీ ప్రాంతంలో అప్పయ్యగారిపల్లి సమీపంలో తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసులు సుబ్బరాయుడు, ఆర్ఎస్ఐ లింగాధర్ టీం కూంబింగ్ చేపట్టింది. అక్కడ రెండు కార్లలో కొందరు ఎర్రచందనం దుంగలను లోడ్ చేస్తూ కనిపించారు. టాస్క్ఫోర్స్ పోలీసులు వారిని చుట్టుముట్టగా పారిపోవడానికి ప్రయత్నించారని పోలీసులు తెలిపారు. వారిని వెంబడించి 15 మంది నిందితులను పట్టుకుని తనిఖీ చేయగా 15 ఎర్రచందనం దుంగలు లభించాయని పేర్కొన్నారు. పట్టుబడిన వారు అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన వారుగా గుర్తించామన్నారు. డీఎస్పీ శ్రీనివాసరెడ్డి, ఏసీఎఫ్ శ్రీనివాసులు విచారించినట్లు తెలిపారు. అనంతరం సీఐ సురేష్కుమార్ కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు వారు పేర్కొన్నారు. -
జిల్లా కలెక్టర్గా నిశాంత్ కుమార్
రాయచోటి: అన్నమయ్య జిల్లా నూతన కరెక్ట్ గా నిశాంత్ కుమార్ను నియమిస్తూ ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ప్రస్తుతం ఆయన ప్రొహిబిషన్ ఎకై ్సజ్ శాఖ డైరెక్టర్ గా పనిచేస్తున్నారు.. స్థానికంగా పనిచేస్తున్న జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ను బదిలీ చేస్తున్నట్లు ఉత్తర్వుల్లో పేర్కొంది. గత ఏడాది జూలై 7వ తేదీన శ్రీధర్ కలెక్టర్గా బాధ్యతలు చేపట్టారు. మదనపల్లె సిటీ: క్రీడాభారతి ఆధ్వర్యంలో నిర్వహించే క్రీడా జ్ఞాన పరీక్ష–25 దరఖాస్తు చేసుకోవాలని జిల్లా క్రీడాభారతి అధ్యక్ష, కార్యదర్శులు దిలీప్, నరేష్ తెలిపారు. వ్యక్తిగత, బృందం కుటుంబం, స్నేిహితుల కూటమి విభాగాలుగా క్రీడాభారతి డాట్ ఓఆర్జీ అనే వెబ్సైట్లో రిజిస్టర్ చేసుకోవాలన్నారు. ఈనెల 14వ జరిగే ఆన్లైన్ పరీక్షలో 25 నిమిషాల్లో 50 క్రీడా క్విజ్ ప్రశ్నలకు సమాధానం ఇవ్వాల్సి ఉంటుందన్నారు. ఇందులో ఎక్కువ మార్కులు సాధించి మొదటి స్థానంలో నిలిచిన వారికి రూ.లక్ష, రెండో స్థానం పొందిన వారికి రూ.50వేలు, మూడో స్థానంలో నిలిచిన వారికి రూ.25 వేలు, నాలుగో స్థానం పొందిన వారికి రూ.10వేలు చొప్పున బహుతులు అందజేయనున్నట్లు చెప్పారు. కురబలకోట: ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ)తో గ్లోబల్ అవకాశాలు లభిస్తాయని, ఇది ప్రపంచంలో సరికొత్త ప్రబల సాంకేతిక శక్తిగా మారుతోందని తమిళనాడులోని కేఎస్ రంగస్వామి ఇంజినీరింగ్ కళాశాల ప్రొఫెసర్ ఆర్. గోపాలకృష్ణన్ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో రెండు రోజుల పాటు జరిగిన కేరీర్ గైడెన్స్ కార్యక్రమంలో గురువారం ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ ప్రపంచ వ్యాప్తంగా విప్లవాన్ని సృష్టిస్తోందన్నారు. సాఫ్ట్, టెక్నికల్ స్కిల్స్, లీడర్షిప్ నైపుణ్యాలతో ఉపాధి, ఉద్యోగావకాశాలు సాకారం అవుతాయన్నారు. భవిష్యత్ ప్రపంచాన్ని శాసించేది కూడా ఏఐయేనన్నారు.వివిధ రంగాల్లో కీలకంగా మారుతున్న ఈ టెక్నాలజీపై విద్యార్థులు పట్టు సాధించి భవిష్యత్ నిర్మాణం చేసుకోవాలని సూచించారు. రాయచోటి టౌన్: రైతులు ఎరువులు, పురుగుమందులను వ్యవసాయ అధికారుల సూచనల మేరకే వినియోగించాలని జిల్లా వ్యవసాయాధికారి జి. శివనారాయణ తెలిపారు. గురువారం గొర్లమొదివీడు, యండపల్లె గ్రామాల రైతులతో సమావేశం నిర్వహించారు. రైతులుసేంద్రియ ఎరువులు వాడాలని సూచించారు. సేంద్రీయ పద్ధతిలో వ్యవసాయం చేయడం వల్ల నాణ్యతతో పాటు అధిక దిగుబడి వస్తుందన్నారు. భూమి సారవంతంగా మారుతుందన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి వ్యవసాయ శాఖ ఏడీఏ శ్రీలత, డీపీఎం బీవీ మోహన్, రాయచోటి ఎంఏవో రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.. -
అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన గురువారం మదనపల్లెలో జరిగింది. బి.కొత్తకోట మండలం కనికలతోపుకు చెందిన కృష్ణమూర్తి, సుజాతమ్మ దంపతుల కుమారుడు కె.వెంకటేష్(35) తన స్వగ్రామంలో రైస్మిల్, పౌల్ట్రీఫారం నిర్వహిస్తున్నారు. ఇతడు భార్య కీర్తి, కుమారుడు రేషంత్, కుమార్తె వెన్నెలతో కలిసి మదనపల్లెలోని నీరుగట్టువారిపల్లె చౌడేశ్వరీనగర్లో నివాసం ఉంటున్నారు. కొన్ని నెలల క్రితం మద్యం అలవాటు కారణంగా లివర్ దెబ్బతిని అనారోగ్యం పాలయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు ఆరు నెలలపాటు చిత్తూరులోని ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స చేయించారు. మూడునెలల క్రితం ఇంటికి వచ్చి వచ్చాడు. భార్య కీర్తి కోళ్లఫారం నిర్వహణకు వెళ్లగా.. మంగళవారం స్వగ్రామానికి వెళ్లిన వెంకటేష్ బుధవారం రాత్రి వెళ్లలేదు. గురువారం మధ్యాహ్నం పట్టణంలోని అయోధ్యనగర్ సమీపంలో ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండడాన్ని స్థానికులు గుర్తించి టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు వివరాలు ఆరా తీసి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు. వ్యాధి నయం కాదనే బెంగతో భర్త మనస్తాపం చెంది ఆత్మహత్య చేసుకున్నాడని మృతుడి భార్య కీర్తి ఫిర్యాదుచేసింది. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. -
రాయచోటిలో కళా ఉత్సవ్
రాయచోటి : విద్యార్థుల్లో కళాత్మక ప్రతిభ వెలికి తీసేందుకు కళా ఉత్సవ్–2025 జిల్లా స్థాయి పోటీలు గురువారం రాయచోటి డైట్లో గురువారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం ప్రారంభించి మాట్లాడుతూ తమ ప్రతిభ ప్రదర్శించేందుకు విద్యార్థులకు చక్కటి వేదిక కళా ఉత్సవ్ అన్నారు. జిల్లా నోడల్ అధికారి మడితాటి నరసింహారెడ్డి మాట్లాడుతూ గాత్ర, వాద్య సంగీతం, నృత్యం, నాటకం, దృశ్య కళలు, కథా కథనం పోటీల్లో 146 మంది విద్యార్థులు పాల్గొన్నాని తెలిపారు. ఆరు విభాగాలలోని పన్నెండు అంశాలలో రెండు రోజులపాటు పోటీలు నిర్వహిస్తున్నామన్నారు. ప్రథమ, ద్వితీయ. తృతీయ స్థానాలు పొందిన వారిని విజేతలుగా ప్రకటిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో రామకృష్ణ, నాగమునిరెడ్డి, స్వతంత్ర బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలి
మదనపల్లె సిటీ: నిర్దేశించిన లక్ష్యాలను అధిగమించాలని జిల్లా టీబీ, ఎయిడ్స్,లెప్రసీ అధికారి డాక్టర్ రమేష్బాబు అన్నారు. గురువారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో ఎఆర్టీ,ఐసీటీసీ,ఎస్టీఐ సిబ్బందితో సమీక్షా సమావేశం జరిగింది. హెచ్ఐవీ కేసులు నమోదు చేసి ఏఆర్టీలో రిజిస్ట్రేషన్ తప్పకుండా చేయించాలన్నారు. ఐఈసీ క్యాంపెయిన్ కాలేజీలు, హైరిస్క్ ప్రాంతాల్లో చేయాలన్నారు.హెచ్ఐవీపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతి హెచ్ఐవీ పాజటివ్ కేసులోనూ టీబీ పరీక్షలు చేయించాలన్నారు.ఐసీటీసీ,ఏఆర్టీ కేంద్రాల్లో సిబ్బంది సమన్వయంతో పని చేయాలన్నారు. ఎన్జీఓలతో కలిసి హైరిస్క్ ప్రాంతాల్లో క్యాంపులు నిర్వహించాలన్నారు. కార్యక్రమంలో సీపీఎం డేవిడ్ భాస్కర్, ఐసీటీసీ కౌన్సిలర్లు జయకుమార్,చంద్రమోహన్, పుల్లయ్యనాయుడు, దీప్తితో పాటు ఎన్జీవోల ప్రతినిధులు పాల్గొన్నారు. డీఎఎల్టీఓ రమేష్బాబు -
చోరీ కేసులో ఏడాది జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : చోరీ కేసుల్లో ముద్దాయికి మదనపల్లె రెండో అదనపు జ్యుడిషియల్ మొదటి తరగతి మేజిస్ట్రేట్ జే.కీర్తన, ఏడాది జైలు శిక్ష విధిస్తూ గురువారం తీర్పు ఇచ్చారు. మదనపల్లె పట్టణం చంద్రాకాలనీకి చెందిన కావడి సోమశేఖర్, 2021లో టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని వేర్వేరు ప్రాంతాల్లో చోరీకి పాల్పడ్డారు. అప్పటి పోలీస్ అధికారులు క్రైమ్నెంబర్.64/2021, 969/2021 కేసులు నమోదుచేసి నిందితుడిని అరెస్ట్ చేశారు. విచారణ అనంతరం గురువారం నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి రెండు చోరీ కేసుల్లోనూ 248(2) సీఆర్.పీ.సీ. కింద దోషిగా నిర్ధారిస్తూ ఏడాది పాటు సాధారణ జైలుశిక్ష, రూ.1,000 నగదు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. టూటౌన్ పోలీసులు నిందితుడిని సబ్జైలుకు తరలించారు. అప్పుల బాధతో వ్యక్తి ఆత్మహత్యరామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): అప్పులబాధ తాళలేక రామాపురం మండలం రాచపల్లె పంచాయతీ వడ్డెపల్లికు చెందిన కుంచపు నాగేంద్ర(35) ఆత్మహత్య చేసుకున్నట్లు రామాపురం పోలీసులు తెలిపారు. పోలీసుల వివరాల మేరకు.. కుంచపు నాగేంద్ర ఎక్కువగా అప్పులు చేశారు. ఈ నేపథ్యంలో ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు చెప్పారు. కేసు నమోదు చేసి పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించినట్లు పోలీసులు తెలిపారు. మృతునికి భార్య, ఇద్దరు కుమార్తెలు, కుమారుడు కలరు. -
విష జ్వరంతో చిన్నారి మృతి
ఓబులవారిపల్లె : మండలంలోని వైకోట గ్రామానికి చెందిన అంకిపల్లి చందన (08) అనే చిన్నారి విష జ్వరంతో గురువారం సాయంత్రం మృతిచెందింది. బంధువుల కథనం మేరకు.. అంకిపల్లి విజయ్, రాజేశ్వరీ దంపతులకు ఒక్కగానొక్క కుమార్తె చందన. వివాహం జరిగిన 18 ఏళ్ల తరువాత చందన పుట్టడంతో గారాబంగా ెపెంచుకున్నారు. బ్రతుకుదెరువుకోసం చిన్నారి తల్లిదండ్రులు గల్ఫ్ దేశానికి వెళ్లగా పెద్దనాన్న సుబ్రహ్మణ్యం వద్ద చందన ఉంటూ స్థానిక ప్రైవేటు పాఠశాలలో మూడో తరగతి చదువుతోంది. గురువారం మధ్యాహ్నం పాఠశాలకు వెళ్లిన చందన రెండుసార్లు వాంతులు కావడంతో ఉపాధ్యాయులు ఇంటికి పంపారు. హుటాహుటిన రైల్వేకోడూరు ప్రైవేటు ఆసుపత్రికి తీసుకెళ్లగా అక్కడ 105 డిగ్రీల జ్వరం చూపించింది. దీంతో పాపకు వాయువు వచ్చింది. మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలిస్తుండగా మార్గమధ్యంలో చిన్నారి మృతిచెందింది. విషయం తెలుసుకున్న చిన్నారి తల్లిదండ్రులు గల్ఫ్ దేశం నుంచి స్వదేశానికి బయలుదేరారు. చందన మృతితో వైకోట గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఇటీవల వర్షం కురవడంతో చెత్తా చెదారం కుళ్లి వారం రోజుల నుండి దోమలు అధికం కావడంతోవైకోట గ్రామంలోని ప్రజలు విషజ్వరాలతో బాధపడుతున్నారు. అటవీ అమరవీరుల త్యాగాలు మరువలేనివిరాజంపేట : అటవీ అమరవీరులు త్యాగాలు మరువలేనవని జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథసింగ్ అన్నారు. జిల్లా అటవీశాఖ కార్యాలయం(రాజంపేట)లో అమరవీరుల సంస్మరణ దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. డీఎఫ్ఓ క్యాంపస్లోని అమరవీరుల స్థూపం వద్ద నివాళులర్పించారు. ఈ సందర్భంగా అటవీ ఉద్యోగులనుద్దేశించి డీఎఫ్ఓ మాట్లాడుతూ అటవీశాఖలో సేవలందిస్తూ ప్రాణాలు పొగొట్టుకున్నవారిని ఆ శాఖ ఎప్పటికీ గుర్తుపెట్టుకుంటుందన్నారు. అటవీ ఉద్యోగులు ప్రతి ఒక్కరూ బాధ్యతాయుతంగా పనిచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో అటవీ అధికారులు పాల్గొన్నారు. బంగారం చోరీపెనగలూరు : మండలంలోని వడ్డి కాలనీ వద్ద జయమ్మ ఇంట్లో 13 తులాల బంగారం, పదివేల రూపాయలు నగదును దొంగలు అపహరించినట్లు ఎస్ఐ రవి ప్రకాష్ రెడ్డి తెలిపారు. వివరాల్లోకి వెళ్తే.. జయమ్మ కుటుంబ సభ్యులు ఆదివారం ఇంటికి తాళం వేసి కడపలోని తన బంధువుల ఇంటికి వెళ్లారు. తిరిగి బుధవారం రాత్రి వచ్చి చూడగా ఇంటి తలుపులు పగులకొట్టి ఉన్నాయి. బీరువా తాళాలు పగులకొట్టి బంగారు, నగదు అపహరించినట్లు గుర్తించి ఆమె పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. రాయచోటి నుంచి క్లూస్ టీమ్ వచ్చి పరిశీలించింది. బంగారు చోరీ కేసు సీఐ బివి.రమణ విచారిస్తున్నట్లు తెలిపారు. షాపులలో సీసీ కెమెరాలు బిగించుకోవాలని ఎస్ఐ రవిప్రకాష్ రెడ్డి కోరారు. వాహనం ఢీకొని రైతుకు తీవ్రగాయాలుబి.కొత్తకోట : పనిమీద బి.కొత్తకోటకు వచ్చి బైక్ పై తిరిగి వెళుతున్న రైతును గురువారం రాత్రి స్థానిక రంగసముద్రం రోడ్డులో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. వివరాలు..పీటీఎం మండలం రంగసముద్రంకు చెందిన రైతు సవరాల అన్నయ్య(60) సొంత పనిమీద బైక్ పై బి.కొత్తకోటకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా రంగసముద్రం రోడ్డులోని పెట్రోలు బంకు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీనితో అపస్మారక స్థితికి చేరుకున్న బాధితున్ని మదనపల్లెకు తరలించగా మెరుగైన వైద్యం కోసం తిరుపతి తరలించారు.రోడ్డు ప్రమాదంలో... గాలివీడు : మండల కేంద్రంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇరువురికి గాయలయ్యాయి. నూలివీడు నుంచి గాలివీడు వైపు వస్తున్న టెంపో ఎదురుగా వస్తున్న ద్విచక్ర వాహనం పరస్పరం ఢీ కొన్నాయి. ఇరువురికి గాయాలవడంతో క్షతగాత్రులను 108 వాహనంలో రాయచోటి ఆసుపత్రికి తరలించారు. గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పశువులు అడ్డొచ్చి.. మదనపల్లె: ఓ మహిళ బైక్ మీద పశువులు అడ్డొచ్చి ప్రమాదాన్ని గురైన ఘటన గురువారం రాత్రి జరిగింది. తంబళ్లపల్లె మండలం కుక్కరాజుపల్లికి చెందిన అనురాధ ( 33) కురబలకోట మండలం ముదివేడులో నర్సరీ నిర్వహిస్తోంది. పనులు ముగించుకొని రాత్రి ఇంటికి బైక్ మీద వెళుతుండగా ముదివేడు వద్ద పశువులు ఒక్కసారిగా అడ్డు రావడంతో అదుపుతప్పి ప్రమాదానికి గురి కావడంతో గాయపడింది. బాధితురాలిని ఆస్పత్రికి తరలించారు. విద్యార్థినికి జాతీయ పురస్కారం సుండుపల్లె : కేరళ రాష్ట్రం కొచ్చిన్లో ఆల్ఏజీ గ్రూప్ జిమ్నాస్టిక్స్ నేషనల్ చాంపియన్షిప్లో సుండుపల్లి వాసి కూరపాటి మౌక్తిక ప్రతిభ చూపారు. గ్రూపు, సింగిల్ విభాగాల్లో ద్వితీయ స్థానంలో నిలిచి జాతీయ పురస్కారం దక్కించుకున్నారు. సుండుపల్లె సాయన్నగారిపల్లెకు చెందిన రంగనాథ్బాబు కుమార్తె బెంగళూరు సంసిద్ ఇంటర్నేషనల్ స్కూల్లో ఆరో తరగతి చదువుతున్నారు. కేరళలో జరిగిన జిమ్నాస్టిక్ చాంపియన్స్ పోటీలలో ప్రతిభ కనపరిచి నేషనల్ అవార్డు అందుకున్నారు. -
కొరత.. కలత
యూరియా కోసం అన్నదాతల ఆవేదన రోదనగానే మారుతోంది. యూరియో.. రామచంద్రా అంటున్నా.. పట్టించుకునే నాథుడే కరువయ్యారు. ఒక బస్తా ఎరువుకోసం మండే ఎండలో.. పస్తులతో రోజంతా పడిగాపులు తప్పడం లేదు. చాంతాడంతా క్యూలైన్లో నిల్చోవాల్సి వస్తోంది. అప్పటికీ ఎరువు దొరుకుతుందో లేదో తెలియని పరిస్థితి. గత ప్రభుత్వ హయాంలో ఎన్నడూ చూడని దుస్థితిని ఎదుర్కొంటున్న రైతుకు.. కూటమి ప్రభుత్వం విషమ పరీక్ష పెడుతోంది. ● కొనసాగుతున్న యూరియా కష్టాలు ● క్యూలైన్లలో అవస్థలు పడుతున్న రైతులు నిమ్మనపల్లె/కురబలకోట: రైతులకు యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. గురువారం మండలంలోని రెడ్డివారిపల్లెలో 250, బండ్లపైలో 250, వెంగంవారిపల్లెలో 290, నిమ్మనపల్లెలో 224, ముష్టూరులో 200 మొత్తంగా 1,214 యూరియా బస్తాలను రైతులకు పంపిణీ చేశారు. అయితే తగినంత యూరియా అందుబాటులో లేకపోవడంతో తమకు అందుతుందో లేదో అన్న భయంతో అధికసంఖ్యలో పంపిణీ కేంద్రాల వద్దకు చేరుకున్నారు. ఈ క్రమంలో కొందరికి యూరియా అందినా మరికొందరికి పూర్తిగా దక్కకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఓ వైపు ఎండవేడిమి, ఉక్కపోత అధికంగా ఉన్నా క్యూలైన్లో వేచిచూస్తూ అవస్థలు పడ్డారు. నిమ్మనపల్లె రైతుసేవా కేంద్రాల వద్ద ఒకరిద్దరు స్పృహ తప్పారు. వెంటనే స్థానికంగా ఉన్న రైతులు నీరు అందించి సపర్యలు చేయడంతో కోలుకున్నారు. యూరియా కొరత లేదని ఇప్పటికే 200 మెట్రిక్ టన్నులు పంపిణీ చేశామని, మరో 150 మెట్రిక్ టన్నులు మండలానికి కేటాయించారని అధికారులు తెలిపారు. ● కురబలకోట మండలంలోనూ యూరియా కష్టాలు కొనసాగుతున్నాయి. రైతు సేవాకేంద్రాల వద్ద రైతులు బారులుతీరారు. సరిపడా నిల్వలు లేకపోవడంతో ఒక్కో రైతుకు ఒక బస్తామాత్రమే ఇస్తున్నారు. దీంతో పంటలు ఎలా సాగు చేసుకోవాలని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. యూరియా కొరతపై స్థానిక వ్యవసాయాధికారితో మాట్లాడగా మండలానికి 40 టన్ను లు వచ్చిందని, ఇంకా రావాల్సి ఉందని తెలిపారు. -
ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు గురువారం ప్రారంభం అయ్యాయి. స్థానిక కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కర్నూలు–అనంతపురం జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు తొలుత బ్యాటింగ్ ఎంచుకుని 57 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 222 పరుగులు చేసింది. ఆ జట్టులోని నయిముల్లా చక్కగా బ్యాటింగ్ చేసి 107 పరుగులు, సాయి గణేష్ 57 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని షేక్ కమిల్ రెండు వికెట్లు తీశాడు. అనంతరం వర్షం కారణంగా మ్యాచ్ నిలిపివేశారు. వైఎస్సార్ క్రికెట్ స్టేడియంలో.. వైఎస్సార్ఆర్ క్రికెట్ స్టేడియంలో నెల్లూరు–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుని 75 ఓవర్లకు మూడు వికెట్లు కోల్పోయి 407 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోషన్ పవన్ కుమార్ 213 బంతుల్లో 19 ఫోర్లు, 11 సిక్సర్లతో అద్బుతంగా బ్యాటింగ్ చేసి 226 పరుగులు చేశాడు. సోహర్ వర్మ 53 పరుగులు, సూతేజ్ రెడ్డి 89 పరుగులు చేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ప్రజా సమస్యలపై ప్రశ్నిస్తే.. కేసులా?
రాయచోటి : సమస్యలపై ప్రశ్నించే గొంతుకలను అణచివేసేలా కలెక్టర్, ఎస్పీలు అక్రమ కేసులు బనాయించడం సరికాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్ అన్నారు. సీపీఐ కార్యాలయంలో విలేకరులతో వారు మాట్లాడుతూ కమ్యూనిస్టులపై దేశంలో చేయని కుట్రలు, పెట్టని కేసులు లేవన్నారు. సమస్యలపై పోరాటాలు చేసే సందర్భంలో లాఠీ దెబ్బలు పడినా, తూటాలు పేలినా రక్తాన్ని చిందించడమేగానీ, వెనుకడుగు వేయలేదని గుర్తు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా యూరియా కొరకు అవస్థపడుతున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు లేదన్నారు. ఎనభై శాతం యూరియా బ్లాక్ మార్కెట్కు తరలిందంటూ సీపీఐ ఆధ్వర్యంలో ఈ నెల 8న వందలాది మంది రైతులు ధర్నాలు, నిరసన కార్యక్రమాలు చేపట్టామన్నారు. దీనిపై కేసులు పెట్టని పోలీసులు అన్నమయ్య జిల్లా మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేసిన వారిపై కేసులు నమోదు చేయడం దుర్మార్గమన్నారు. యూరియా పుష్కలంగా ఉంటే ఎందుకు రైతులకు టోకెన్లు ఇచ్చి సచివాలయాల చుట్టూ తిప్పుకుంటున్నారని ప్రశ్నించారు. మదనపల్లి, తంబళ్లపల్లి నియోజకవర్గాల చుట్టూ రైతులు తిరగడం నిజం కాదా అని ఆయన ప్రశ్నించారు. మదనపల్లి బీటీ కళాశాలను యూనివర్సిటీగా మారుస్తానని ఎన్నికల ప్రచారంలో చెప్పిన మాటను అమలు చేయాలని అడిగిన ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శిని స్టేషన్లో విచక్షణారహితంగా కొట్టడం సిగ్గు చేటన్నారు. మంత్రుల పర్యటనల సమయంలో కమ్యూనిస్టులను గృహనిర్భంధాల పేరుతో అదుపులోకి తీసుకోవడం ఎంతవరకు సబబు అని పేర్కొన్నారు. కోడూరు ప్రాంతంలో బొప్పాయి పండించే రైతన్నకు మద్దతు ధర కల్పించాలని అడిగిన కమ్యునిస్టు నాయకులపైనా బైండోవర్ కేసులు పెట్టడం పోలీసుల చేతకానితనానికి నిదర్శనమన్నారు. రాజంపేట సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటుచేసిన టోల్ ఫ్రీ నెంబరుకు ఎనిమిది ఫిర్యాదులందినా వారిపై ఎందుకు కేసులు పెట్టలేదని కలెక్టర్, ఎస్పీలను ఆయన ప్రశ్నించారు. జిల్లాలో భూ కబ్జాదారులు పెరిగిపోయి ప్రభుత్వ భూములను ఇష్టానుసారంగా దోచుకుంటున్న వారిపై కేసులు ఎందుకు పెట్టడం లేదన్నారు. ఎస్ఐలను పోలీసు స్టేషన్లో అధికార పార్టీ నాయకులు బెదిరిస్తున్నా కేసులు పెట్టని ఎస్పీ ప్రజలు, రైతుల సమస్యలపైన నిరసన తెలిపిన వారిపై నమోదు చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. కలెక్టర్, ఎస్పీలపై దశలవారీగా పోరాటాలు చేస్తామని హెచ్చరించారు. ఈ సమావేశంలో సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాల శ్రీనివాసులు, మండెం సుధీర్, పి.కోటేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు.సీపీఐ జిల్లా కార్యదర్శి పి మహేష్ -
ప్రబలుతున్న జ్వరం... వణుకుతున్న జనం
● అన్నింటా ప్రబలుతున్న విష జ్వరాలు ● కిక్కిరిసిన ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు ● ప్రభుత్వాస్పత్రిలో వేధిస్తున్న వైద్యుల కొరత బద్వేలు అర్బన్/ప్రొద్దుటూరు క్రైం : బద్వేల్ పట్టణంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. ఏ వార్డులో చూసినా ఇంటికి ఒకరు, ఇద్దరు చొప్పున జ్వర పీడితులు చికిత్సకు రావడంతో ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు కిక్కిరిసిపోతున్నాయి. వైద్యుల కొరత ఉండడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు. గత వారం రోజుల్లో బద్వేల్ ప్రభుత్వాసుపత్రిలో 250 నుండి 400 ఓపీ నమోదవుతుండటం పరిస్థితికి అద్దంపడుతోంది. ఏ ప్రైవేటు ఆసుపత్రి చూసినా జ్వరపీడితులు దర్శనమిస్తున్నారు. ఆస్పత్రి కిటకిటలాడుతున్నా తగినంతమంది వైద్యులు లేకపోవడం రోగులకు శాపంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రిలో వివిధ విభాగాల్లో 12 మంది వైద్యులు ఉండాల్సి ఉండగా, ఆరుగురే ఉన్నారు. వీరిలోనూ ఒకరు డిప్యుటేషన్పై వారంలో రెండు రోజులు మాత్రమే విధులు నిర్వర్తిస్తున్నారు. దీనికి తోడు రక్త పరీక్షలు నిర్వహించే యంత్రం మరమ్మతులకు గురికావడంతో రోగుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. రక్తనమూనాలు సేకరించి గాంధీనగర్ అర్బన్ హెల్త్సెంటర్లో పరీక్ష చేయిస్తుండడంతో ఇబ్బంది పడుతున్నారు. కిక్కిరిసిన చిన్నపిల్లల వార్డు ప్రొద్దుటూరు, పరిసర ప్రాంతాల్లో వైరల్ జ్వరాలు విజృంభిస్తున్నాయి. జిల్లా ఆస్పత్రిలో రోజూ సుమారు 1100 దాకా ఓపీ నమోదవుతోంది. మరోవైపు రాజుపాళెం, కామనూరు, కల్లూరు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల పరిధిలోనూ ఓపీ పెరిగింది. కొన్ని రోజులుగా రాత్రింబవళ్లు వర్షాలు పడుతుండడం, పారిశుద్ధ్యం అధ్వానంగా ఉండడంతో పలువురు జ్వరాల బారిన పడి ఆస్పత్రికి వస్తున్నారు. ప్రైవేట్ ఆస్పత్రులు కిటకిట లాడుతున్నాయి. ఎక్కువమంది చిన్నారులు జ్వరం, జలుబు, విరేచనాలతో ఇబ్బందిపడుతున్నారు. జిల్లా ఆస్పత్రిలో చిన్నపిల్లల వార్డు కిటకిటలాడుతోంది. 20 మంచాలు మాత్రమే ఉండడంతో 30 మంది చిన్నారులు చికిత్స తీసుకుంటున్నారు. మంచాల కొరత కారణంగా ఒక్కో మంచంలో ఇద్దరిని పడుకోబెట్టి చికిత్స అందిస్తున్నారు. ప్రైవేటుగా మరింతమంది చికిత్స పొందుతున్నారు. రక్త పరీక్షల కోసమే వేల రూపాయలు చెల్లించాల్సి వస్తోందని పిల్లల తల్లిదండ్రులు వాపోతున్నారు. ప్రభుత్వాసుపత్రిలో ఓపీ కోసం బారులు తీరిన జ్వరపీడితులు చిన్న పిల్లల వార్డులో చికిత్స పొందుతున్న చిన్నారులు -
హైవేపై తప్పిన ప్రమాదం
సిద్దవటం : బియ్యం రవాణా చేస్తున్న ఐచర్ హనం అతి వేగంగా వస్తూ మండలంలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై చర్చి వద్ద అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ఘటనలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం లేదని ఒంటిమిట్ట సీఐ బాబు తెలిపారు. రహదారికి అడ్డంగా ఉన్న వాహనాన్ని తొలగిస్తున్నామని, క్రాసింగ్లో వాహనాలు నెమ్మదిగా వెళ్లాలని సూచించారు. భూమి కోసం ఘర్షణ కలకడ : భూమి కోసం జరిగిన ఘర్షణలో ఇరువురికి తీవ్రగాయాలయ్యాయి. మండలంలోని కొత్తపల్లెకు చెందిన ప్రవీణ్కుమార్–ప్రసాద్రెడ్డిలకు భూవివాదం ఉంది. బుధవారం ఈ విషయమై మాటా మాటా పెరిగి ఘర్షణకు దిగారు. దీంతో ప్రవీణ్కుమార్పై కొడవలితో ప్రసాద్రెడ్డి, సునీతలు దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డారు. వాల్మీకీపురం ప్రభుత్వం ఆసుపత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైధ్యం కోసం మదనపల్లె ఏరియా ఆసుపత్రికి తరలించినట్లు తెలిపారు. -
రేషన్ కోసం వెళ్తూ... కారు ఢీకొని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : ఇంటింటికీ బియ్యం వాహనం ప్రభుత్వం రద్దు చేయడంతో రేషన్ బియ్యం తెచ్చుకోవాలని వెళ్తూ కారు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందగా, అతని మనవరాలు గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లెలో జరిగింది. బి.కె.పల్లెలో చిల్లర దుకాణం నిర్వహిస్తున్న బుడెన్సాబ్ కుమారుడు మస్తాన్(59) స్థానిక రేషన్ దుకాణానికి, మనవరాలు సమీహకౌసర్(09)తో కలసి ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. బైపాస్ రోడ్డులోని చంద్ర కాలనీ వద్ద, అనంతపురం నుంచి తిరుపతి వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో మస్తాన్ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి వెళ్లగా, మనవరాలు గాయపడింది. స్థానికులు బాధితులను స్థానిక ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన ఆసుపత్రి వైద్యులు మస్తాన్ అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. సమాచారం అందుకున్న టూటౌన్ పోలీసులు సంఘటన స్థలం వద్దకు వెళ్లి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ప్రమాదం జరిగిన వెంటనే కారు డ్రైవర్ పారిపోయినట్లు స్థానికులు తెలిపారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూ టౌన్ సీఐ రాజారెడ్డి తెలిపారు. కాగా మృతునికి భార్య హబీబున్నీసా, ఇద్దరు కుమార్తెలు ఓ కుమారుడు ఉన్నారు. -
ప్రభుత్వ సంస్థలను కాపాడుకుందాం
కడప కోటిరెడ్డిసర్కిల్ : దేశ ఆర్థిక వ్యవస్థకు వెన్నెముకగా నిలిచిన ప్రభుత్వ రంగ సంస్థలు ఎల్ఐసీని, జాతీయ బ్యాంకులను కేంద్ర ప్రభుత్వ విధానాలు బలహీన పరుస్తున్నాయని సీపీఎం రాజ్యసభ సభ్యుడు శివ దాసన్ తీవ్రంగా విమర్శించారు. సేవ్ పబ్లిక్ సెక్టార్ కమిటీ కన్వీనర్, ఎల్ఐసీ ఉద్యోగుల సంఘం ప్రధాన కార్యదర్శి ఎ.రఘునాథరెడ్డి అధ్యక్షతన బుధవారం కడప యూటీఎఫ్ భవన్లో జరిగిన ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక, పెన్షనర్ల సంఘాల సెమినార్ లో సీపీఎం రాజ్యసభ్యులు శివదాసన్ మాట్లాడుతూ దేశంలో యూనివర్సిటీలలో రెగ్యులర్ ఫ్యాకల్టీ లేరని, విద్యా రంగానికి బడ్జెట్ కేటాయింపులు తగ్గిపోయాయని అన్నారు. ఆరోగ్య రంగంలో కేటాయింపులు తగ్గిపోవడం వల్ల చిన్న చిన్న ఆరోగ్య సమస్యలు కూడా నియంత్రించలేని స్థితి నెలకొన్నదన్నారు. ఇలాంటి ప్రభుత్వానికి టీడీపీ, వైఎస్సార్ సీపీ మద్దతు ఇస్తున్నాయని అన్నారు. ప్రభుత్వాలు విగ్రహాలకు వందల కోట్లు ఖర్చు పెడుతున్నాయని, కానీ స్కూళ్లను, హాస్పిటల్స్ ను పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వ వ్యవస్థలను ప్రోత్సహించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపై, ప్రజాప్రతినిధులపై ఉందని, పెన్షన్ సదుపాయం అన్నది రాజ్యాంగ హక్కు అని పాలకులు గుర్తించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో అవధానం శ్రీనివాస్, శ్రీనివాస్రెడ్డి, లక్ష్మి రాజా, నాగమునిరెడ్డి, రాజశేఖర్ రాహుల్, రవితేజ, ఎన్.శివశంకర్ , రామ్మూర్తి నాయుడు, అజీజ్, లలిత, రామకృష్ణా రెడ్డి, సుధాకర్, వెంకటరామరాజు, సుబ్బారెడ్డి, డి.మొహమ్మద్, ఎ. సుబ్బారావు, వి.రామంజులరెడ్డి పాల్గొన్నారు. -
సారా విక్రేత అరెస్ట్
నిమ్మనపల్లె : బుధవారం ముష్టూరు గ్రామానికి చెందిన చిన్నఅప్పోడు(60) స్థానికంగా సారా తయారుచేసి విక్రయిస్తుండడంతో అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. నిందితుడిని అదుపులోకి తీసుకుని అతడి నుంచి పది లీటర్ల సారా స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసి రిమాండ్కు తరలించినట్లు చెప్పారు. భార్య కోసం సెల్ టవర్ ఎక్కిన భర్త రైల్వేకోడూరు అర్బన్ : తన భార్య ఇంటికి రాలేదని పట్టణంలోని ధర్మాపురానికి చెందిన బాలయ్య కుమారుడు పవన్ కళ్యాణ్ సెల్ టవర్ ఎక్కి నిరసన వ్యక్తం చేశాడు. కల్యాణ్ పదేళ్ల కిందట లతను వివాహం చేసుకున్నాడు. వీరికి కుమారుడు, కుమార్తె ఉన్నారు. ఇటీవల ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో లత పుట్టింటికి వెళ్లిపోయింది. ఎంత అడిగినా భార్య రాకపోవడంతో దిగులు చెందిన భర్త పట్టణంలోని పాత తహసీల్దారు కార్యాలయం సమీపంలోని సెల్ టవర్ ఎక్కి ఆత్మహత్యాయత్నం చేశాడు. తహసీల్దారు అమర్నాథ్, ఎస్సై లక్ష్మప్రసాద్రెడ్డి చేరుకొని బాధితుడికి నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. కుటుంబసభ్యులను పిలిపించి మాట్లాడతామని హామీ ఇవ్వడంతో కిందికి దిగి వచ్చాడు. ఆగిన ఐచర్ను ఢీకొన్న ప్రమాదంలో ఒకరు మృతి సంబేపల్లె : సిగ్నల్ లైట్లు వేయకుండా పిన ఐచర్ను ఢీకొని జరిగిన ప్రమాదంలో ఒకరు మృతి చెందారు. పోలీసుల వివరాల మేరకు.. మండలంలోని గుట్టపల్లె సమీపంలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై జరిగిన రోడ్డు ప్రమాదంలో చల్లా రామాంజులు (52) బుధవారం మృతిచెందారు. కలకడ మండలం బాటవారిపల్లెకు చెందిన రామాంజులు ద్విచక్ర వాహనంలో బుధవారం తెల్లవారుజామున రాయచోటికి వసుత్న్నారు. గుట్టపల్లె సమీపంలోకి రాగానే సిగ్నల్ లైట్లు లేకుండా జాతీయరహదారిపై ఆపిన ఐచర్ వాహనాన్ని డీకొన్నారు. ఈ ప్రమాదంలో రామాంజులు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాన్ని శవపరీక్ష నిమిత్తం రాయచోటి ఆసుపత్రికి తరలించారు. మృతుని కుమారుడు దేవేంద్ర ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పట్టణంలోని పాయిరామన్న వీధిలో కాపురముంటున్న సోమ శేఖర్(20) డిగ్రీ వరకు చదివి ఇంటి వద్దే ఉంటున్నాడు. కుటుంబ సమస్యలతో మనస్థాపం చెంది, ఇంటిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు కేకలు వేయడంతో స్థానికులు చేరుకుని బాధితుడిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. రామసముద్రం మండలంలో చెంబుకూరుకు చెందిన మహేష్ భార్య సునీత (25)కు జ్వరంతో బాధపడుతూ, మద్యం మత్తులో ఇంటికి వచ్చిన భర్త మహేష్ను ఆసుపత్రికి తీసుకువెళ్లాల్సిందిగా కోరింది. మహేష్ కుదరదనడంతో మనస్థాపం చెంది, జ్వరానికి తెచ్చుకున్న మాత్రలు ఒకేసారి మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు విచారణ చేస్తున్నారు. -
ఇద్దరు ఫీల్డ్ అసిస్టెంట్ల సస్పెన్షన్
రామసముద్రం : అక్రమాలకు పాల్పడిన ఎలవానెల్లూరు, కురిజల ఫీల్డ్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తున్నట్లు ప్రిసైడింగ్ అధికారి నందకుమార్ రెడ్డి తెలిపారు. రామసముద్రం తహసీల్దారు కార్యాలయం ఆవరణంలో బుధవారం సామాజిక తనిఖీ ప్రజా వేదిక నిర్వహించారు. నందరకుమార్రెడ్డి మాట్లాడుతూ 1 ఏప్రిల్, 2024 నుంచి 31 మార్చి 2025 వరకు జరిగిన వివిధ రకాల పనులపై సామాజిక తనిఖీ జరిగిందన్నారు. గడచిన ఏడాదిలో 1287 పనులకు రూ.9.63 కోట్లు ఖర్చు చేశారని తెలిపారు. ఉపాధి సిబ్బంది నుంచి రూ.31,365 వేలు, రైతుల నుంచి రూ.1,07,113 లక్షలు రికవరీ చేయాలని ఆదేశించామన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ శ్రీనివాసులు, ఎస్టీఎం లోకేశ్వర్ రెడ్డి, వెంకయ్య, గపూర్, మాధవి, గౌరీశంకర్, సిబ్బంది పాల్గొన్నారు. -
ఎమర్జెన్సీలో కూడా ఇలా లేదు..
నేను ఎమర్జెన్సీ రోజులను ప్రత్యక్షంగా చూసిన అనుభవంతో చెబుతున్నాను. ఆరోజుల్లో పత్రికలపై సెన్సార్షిప్ మాత్రమే ఉండేది. ఇప్పటిలాగా సాక్షి పత్రికా కార్యాలయాలు, పాత్రికేయులపై ప్రత్యక్ష దాడులకు పా ల్పడటం, కేసులు నమోదు చేయడం వంటివి చూడలేదు. వ్యక్తులు లేదా ప్రభుత్వంపై ఏవైనా వ్యతిరేక వార్తలు వచ్చిన సందర్భాల్లో వాటిని ఖండించాలి. నిజానిజాలేవో తెలియజేస్తూ ప్రకటనలు ఇవ్వాలి. ఒకవేళ పత్రికా యాజమాన్యం స్పందించకపోతే చట్టపరమైన చర్యలు తీసుకునే అవకాశం ఉంటుంది. ఇలాంటి పద్ధతులను పక్కకు నెట్టి దాడులు, ‘సాక్షి’ ఎడిటర్పై కేసులు నమోదు చేయడం అంటే అది పూర్తిగా అప్రజాస్వామికమవుతుంది. ఇలాంటి ధోరణులను ప్రజాస్వామిక వాదులు ముక్తకంఠంతో ఖండించాలి. – సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి, అధ్యక్షుడు, రాయలసీమ కార్మిక కర్షక సమితి, కడప రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణితో ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు బనాయించడం పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడిగానే పరిణించాల్సి ఉంటుంది. ఓ నాయకుడు ప్రెస్ కాన్ఫరెన్స్లో మాట్లాడిన విషయాలను వార్తగా ప్రచురిస్తే కేసు నమోదు చేయడం గతంలో ఎన్నడూ చూడలేదు. డీఎస్పీల పదోన్నతుల్లో లంచాలు చోటుచేసుకున్నాయనే కథనంపై ‘సాక్షి’ ఎడిటర్ ధనుంజయరెడ్డిపై వరుస కేసులు నమోదు చేయడం పత్రికా స్వేచ్ఛను కోరుకునే వారంతా తీవ్రంగా ఖండించాల్సిన విషయం. ఒకవేళ ‘సాక్షి’లో తప్పుడు కథనాలు ప్రచురితమయ్యాయని భావిస్తే వివరణ ఇవ్వాలి. నిజాలేవో వెల్లడించాలి. అంతేగానీ కేసులు, దాడులకు దిగడం రాజ్యాంగ హక్కులను కాలరాయడమే అవుతుంది. – పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ రోజురోజుకూ రాష్ట్రంలో పత్రికలపై దాడు లు పెచ్చరిల్లిపోతున్నాయి. రాష్ట్ర ప్రభు త్వ వైఫల్యాలు, అవినీతి వంటి అంశాలను వెలుగులోకి తీసుకు వస్తున్న ‘సాక్షి’పై ప్రభుత్వం కక్షగట్టి దాడులు చేయిస్తోంది. ఓ ప్రెస్కాన్ఫరెన్స్ వార్తను రాసినందుకు ఎడిటర్కు నోటీసులు ఇవ్వడం చూస్తుంటే, రాష్ట్రంలో పత్రికా స్వేచ్ఛ ఎలా ఉందో అర్థమవుతుంది. ‘సాక్షి’లో వచ్చిన వార్తలకు ఖండన లేదా వివరణ లాంటివి ఇవ్వకుండా ఎడిటర్పై కేసులు నమోదు చేసి భయభ్రాంతులకు గురిచేయాలనుకోవడం తగదు. పత్రికా స్వేచ్ఛపై జరుగుతున్న దాడులను చూస్తుంటే రాష్ట్రంలో ప్రజాస్వామిక పాలన ఉన్నట్లు కనిపించడం లేదు. ఇలాంటి ప్రభుత్వ ధోరణులను ప్రతి ఒక్కరూ ఖండించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవాలి. – సి.వెంకటరెడ్డి, రాష్ట్ర కౌన్సిల్ సభ్యుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ -
మహిళా సాధికారత కోసమే మిషన్ శక్తి పథకం
రాయచోటి : మహిళల భద్రత, సాధికారత పెంపొందించడమే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం మిషన్ శక్తి పథకాన్ని ప్రారంభించిందని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్ హాల్లో బుధవారం జరిగిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ జిల్లా మిషన్ శక్తి పథకంలో భాగంగా సంకల్ప కార్యక్రమాన్ని ఈ నెల 2వ తేదీ నుంచి 12వ తేదీ వరకు జిల్లాలో నిర్వహిస్తున్నామన్నారు. మహిళల భద్రతకు చట్టాలను చేయడం జరిగిందని, వాటిపై అవగాహన పెంచుకుని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. అనంతరం భేటీ భచావో, భేటీ పడావో, మహిళల భద్రత, చట్టపరమైన అవగాహన, ఉన్నత విద్య, వృత్తి శిక్షణ, నైపుణ్యాభివృద్ధి, మహిళలు–కౌమార బాలికల ఆరోగ్యం, పోషకాహారం, సమాజంలో జరిగే క్రైమ్ అంశాలపై అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమశాఖ అధికారిణి హైమావతి, తదితరులు పాల్గొన్నారు. -
కూలీల ఆటో బోల్తా
కురబలకోట : కూలీలతో వెళ్తున్న ఆటో అదుపు తప్పి బోల్తా పడటంతో ఎనిమిది మంది కూలీలు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..కురబలకోట మండలం ముదివేడులో టమాటాలు కోసేందుకు మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన కూలీలు జె.శ్రీనివాసులు (38), రమణమ్మ (50), సరస్వతి (48), రామసుధ (29), లక్ష్మి దేవి (35), ఎం.శ్రీనివాసులు (40), రవనమ్మ (40) ఆటోలో బుధవారం ఉదయం బయలు దేరారు. ముదివేడు దగ్గరగా వెళుతుండగా కృష్ణారెడ్డిగారిపల్లె వద్ద ఎదురుగా వచ్చిన మోటార్ సైకిల్ను తప్పించే క్రమంలో ఆటో అదుపు తప్పి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఆటోలోని కూలీలంతా కిందపడి గాయపడ్డారు. వారిని 108లో మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. వాహనంపై నుంచి పడి.. మరొకరికి మదనపల్లె రూరల్ : వాహనంపై నుంచి పడి ఒకరు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. చిత్తూరు జిల్లా పుంగనూరు నక్కబండ్లకు చెందిన దస్తగిరి కుమారుడు అసిఫ్(28), స్థానికం మండీలో పనిచేస్తున్నారు. ఐచర్ వాహనంలో మదనపల్లె నుంచి వెళ్తుండగా.. బైపాస్ రోడ్డులోని రాయల్ ఫర్నిచర్ సమీపంలో మరో కారు అకస్మాత్తుగా అడ్డుగా వచ్చింది. కంగారుపడ్డ ఐచర్ డ్రైవర్ సడన్ బ్రేక్ వేశాడు. దీంతో వాహనంపై కూర్చున్న ఆసిఫ్ అదుపుతప్పి పైనుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు మెరుగైన వైద్యం కోసం బాధితుడిని బెంగళూరుకు తీసుకువెళ్లారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఎనిమిది మందికి గాయాలు -
గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ
జమ్మలమడుగు రూరల్ : జమ్మలమడుగు–తాడిపత్రి రహదారిపై ఓ లారీ భీబత్సం సృష్టించింది. వేగంగా వస్తూ రహదారిపై వెళ్తున్న గొర్రెల మంద పైకి దూసుకెళ్లింది. వాటిని మేపే ఇద్దరు గొర్రెల కాపరులపై వెళ్లడంతో వారు అక్కడికక్కడే దుర్మరణం పాలయ్యారు. 15 గొర్రెలు మృతి చెందాయి. ఎస్ఐ రామకృష్ణ వివరాల మేరకు.. నంద్యాల జిల్లా అళ్లగడ్డ తాలూకా నల్లవాగుపల్లెకు చెందిన వెంకటేశ్వర్లు(45), ఆలమూరు గ్రామానికి చెందిన నరసింహులు(35) తమ యజమాని క్రిష్ణయ్యకు చెందిన గొర్రెలను మేపుతూ జీవనం సాగిస్తున్నారు. బుధవారం రాత్రి గండికోట ప్రాంతంలో గొర్రెలు మేపి స్వగ్రామానికి యజమాని క్రిష్ణయ్యతో కలిసి బయలుదేరారు. బుధవారం ఉదయం 6 గంటల ప్రాంతంలో బైపాస్ రోడ్డులో వెనుకవైపు నుంచి అతి వేగంగా గుర్తుతెలియని లారీ దూసుకువచ్చి ఢీకొంది. ఈ సంఘటనలో వెంకటేశ్వర్లు అక్కడికక్కడే మృతిచెందగా, నరసింహులును ప్రొద్దుటూరు ఆస్పత్రికి తీసుకెళ్తుండగా మృతి చెందారు. యజమాని క్రిష్ణయ్య ప్రమాదం నుంచి తృటిలో తప్పించుకున్నాడు. 15 గొర్రెలు మృతిచెందడంతో దాదాపు రూ. 2.50 లక్షల రూపాయల నష్టం వాటిల్లిందని, మృతుల కుటుంబాలకు అన్యాయం జరిగిందని క్రిష్ణయ్య ఆవేదన వ్యక్తం చేశారు. బాధిత కుటుంబసభ్యులు ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి బోరున విలపించారు. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకోని విచారిస్తున్నట్లు పట్టణ ఎస్ఐ తెలిపారు. ఇద్దరు వ్యక్తుల దుర్మరణం మృతిచెందిన వెంకటేశ్వర్లు, నరసింహులు -
ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో చోటు
మదనపల్లె రూరల్: పిట్ట కొంచెం..కూత ఘనం అన్న నానుడికి సరిగ్గా సరిపోతాడు మదనపల్లెకు చెందిన ఎం.సాయి కార్తికేయ సౌరవ్. వివిధ విభాగాల్లో పిల్లలు సాధించిన విజయాలను గుర్తించే ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్లో పేరు నమోదు చేసుకోవడం సాధారణ విషయం కాదు. పట్టణానికి చెందిన సాయి కార్తికేయ సౌరవ్కు ఏడేళ్ల వయస్సులో 40 రకాల రూబిక్ క్యూబ్లను అత్యంత వేగంగా పరిష్కరించగలడం, 500 క్యూబ్లతో రూబిక్ క్యూబ్స్ మొజాయిక్ ఆర్ట్ చేయడం అతడికి వెన్నతో పెట్టిన విద్య. అతి చిన్న వయస్సులో అతడు చూపిన అసాధారణ ప్రతిభను గుర్తించి ఆసియా బుక్ ఆఫ్ రికార్ుడ్సలో పేరు నమోదు చేయడమే కాకుండా, గ్రాండ్ మాస్టర్ సర్టిఫికేట్ను అందజేశారు. మదనపల్లె పట్టణం కొత్తపేటలో నివాసం ఉంటున్న డాక్టర్.ఎం.సాయికిషోర్, పలమనేరు ప్రభుత్వ ఆస్పత్రిలో సివిల్ సర్జన్గా పనిచేస్తున్నారు. భార్య శ్రీ గృహిణి. వీరి కుమారుడు ఎం.సాయి కార్తికేయ సౌరవ్(7) బెంగళూరులోని హొరమావు ఆర్చిడ్స్ ఇంటర్నేషనల్ స్కూల్లో రెండో తరగతి చదువుతున్నాడు. చిన్నప్పుడు క్యూబ్స్ పరిష్కారంపై సాయి కార్తికేయ శ్రద్ధను గమనించి తల్లిదండ్రులు ప్రోత్సహించారు. దీంతో అతడు చిన్నవయస్సులోనే 40 రకాల రూబిక్ క్యూబ్ను వేగంగా పరిష్కరించడమే కాకుండా 500 క్యూబ్లతో ఈశ్వరుడు, సాయిబాబా, కృష్ణ, కార్తికేయ, రామ, హనుమాన్, దుర్గా, జాతీయపతాకం, ప్రధాని మోదీ, రతన్టాటా, ఆస్ట్రోనాట్, సునీతా విలియమ్స్, విరాట్ కొహ్లి, నారుటో కార్టూన్..మొజాయిక్ ఆర్ట్ ద్వారా చిత్రాలను ఆవిష్కరిస్తాడు. సాయి కార్తికేయ సౌరవ్ ప్రతిభను గుర్తించిన ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్ అతడి పేరును గ్రాండ్ మాస్టర్స్ వరల్డ్కింగ్స్ టాప్ రికార్డ్స్ 2025 జాబితాలో నమోదుచేస్తూ ప్రశంసాపత్రాన్ని, సర్టిఫికెట్ను పోస్టు ద్వారా మంగళవారం అందజేశారు. రూబిక్ క్యూబ్స్ మొజాయిక్ ఆర్ట్లో మదనపల్లె విద్యార్థి ప్రతిభ -
జిల్లాకు స్వచ్ఛాంధ్ర అవార్డులు తీసుకురావాలి
రాయచోటి: ప్రభుత్వం పరిశుభ్రతకు అగ్రస్థానం ఇస్తున్న నేపథ్యంలో స్వచ్చాంధ్ర రాష్ట్ర, జిల్లాస్థాయి అవార్డుల ఎంపికలో నిర్దేశించిన ప్రతి పారామీటర్లో వందశాతం అభివృద్ధి సాధించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. బుధవారం కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్ రాజేంద్రన్తో కలిసి స్వచ్చాంధ్ర అవార్డులపై అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ నిర్దేశించిన పనిలో వెనుకబడితే సంబంధిత శాఖలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఇందుకోసం నియోజకవర్గ స్పెషల్ అధికారులు నిర్దేశించిన పారామీటర్లపై లోటు పాట్లను గుర్తించి సంబంధిత శాఖలకు తెలియజేయాలని కలెక్టర్ ఆదేశించారు. కాలక్షేపంగా కాకుండా ఉత్సాహంగా పనిచేస్తే ముఖ్యమంత్రి నుంచి అవార్డు పొందే అవకాశం ఉంటుందన్నారు. అన్ని శాఖలు, అధికారులు సమన్వయంతో కలిసికట్టుగా పనిచేసి స్వచ్ఛ అన్నమయ్య జిల్లాకు శ్రీకారం చుట్టాలని కలెక్టర్ ఆదేశించారు. సమావేశంలో సీపీఓ, డీఈఓ, ఐసీడీఎస్ పీడీ, డీపీఓ, డీఎంహెచ్ఓ పాల్గొన్నారు. కడప ఎడ్యుకేషన్: కడపలోని ఎస్కేఆర్ అండ్ ఎస్కేఆర్లో మహిళా డిగ్రీ కళాశాలలో గురువారం జవహర్ నాలెడ్జ్ సెంటర్ (జేకేసీ) వారు క్యాంపస్ డ్రైవ్ నిర్వహిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ సలీంబాషా తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి, ఇంటర్, డిగ్రీ, పోస్టు గ్రాడ్యుయేట్ పాసైన వారు ఈ ఉద్యోగాలకు అర్హులన్నారు. అసక్తి ఉన్న అభ్యర్థులు తమ రెజ్యూమ్తోపాటు సర్టిఫికెట్స్ జిరాక్స్ కాపీలతో కళాశాల ఆడిటోరియంలో హాజరుకావాలని ప్రిన్సిపాల్ తెలిపారు. -
ప్రతిభకు ఉపకారం
మదనపల్లె సిటీ: ప్రభుత్వ బడుల్లో గ్రామీణ,పేద,మధ్య తరగతి కుటుంబాలకు చెందిన పిల్లలే అధికంగా చదువుతుంటారు. చాలా మంది విద్యార్థులు ఆర్థిక కారణాలతో మధ్యలో బడి మానేసి విద్యకు దూరవుతున్నారు. దీంతో ప్రతిభావంతులైన పేద విద్యార్థులు చదువులు కొనసాగించేలా కేంద్ర ప్రభు త్వం ఉపకారవేతనం అందిస్తూ చేయూతనిస్తోంది. ఇందుకు ఏటా నేషనల్ మీన్స్ కం మెరిట్ స్కాలర్షిప్(ఎన్ఎంఎంఎస్) పరీక్ష నిర్వహిస్తోంది. ఎనిమిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఈ పరీక్షకు అర్హులు. ఇందులో అర్హత సాఽధిస్తే తొమ్మిదో తరగతి నుంచి ఇంటర్మీడియట్ వరకు నాలుగేళ్లు ఏటా రూ.12 వేల చొప్పున ఉపకారవేతనం అందుతుంది. దరఖాస్తుకు ఈనెల 4నుంచి 30వ తేదీ తుది గడువు విధించారు. పరీక్ష డిసెంబర్ 7వతేదీ నిర్వహిస్తారు. ఎవరు అర్హులు: ప్రస్తుతం 8వ తరగతి చదువుతూ 7 వ తరగతిలో ఓసీ,బీసీలైతే 55 శాతం, ఎస్సీ,ఎస్టీలైతే 50 శాతం మార్కులు లేదా దానికి సమాన మైన గ్రేడ్ పొందిన వారు అర్హులు. విద్యార్థి కుటుంబ వార్షిక ఆదాయం రూ.3.50 లక్షలకు మించరాదు. ప్రభుత్వ ఎయిడెడ్, స్థానిక సంస్థల పాఠవాలల్లో రెగ్యులర్గా చదువుతున్న వారు దరఖాస్తు చేసుకోవచ్చు. నవోదయ, కేంద్రీయ విద్యాలయాలు, సైనిక్ పాఠశాలలలు ,రాష్ట్ర ప్రభుత్వం ఆద్వర్యంలో నిర్వహిస్తున్న గురుకుల విద్యార్థులు ఈ పరీక్ష రాసేందుకు అవకాశం ఉంది. ఈ ఏడాది ఎనిమిదో తరగతి విద్యార్థులు WWW.bse.gov.in వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఏడాదికి రూ.12 వేలు ప్రస్తుతం 8వ తరగతి చదువుతున్నవారు ఈ పారితోషకానికి ఎంపికై తే 9 నుంచి 12వ తరగతి వరకు ఉపకారవేతనం అందుతుంది. ఏడాదికి రూ.12వేల చొప్పున మొత్తం రూ.48 వేలు ఇవ్వనున్నారు.విద్యార్థులు ఏదైనా జాతీయ బ్యాంకులో ఖాతా తీసి వివరాలు సమర్పిస్తే నేరుగా వారి ఖాతాలో జమచేస్తారు. రాష్ట్ర స్థాయిలో జిల్లాను ఒక యూనిట్గా తీసుకుని విభాగాల వారీగా అర్హుల జాబితాను రూపొందిస్తారు. ఇందులో రెండు ప్రశ్నపత్రాలలు ఉంటాయి. మూడు గంటల పాటు పరీక్ష సమయాన్ని కేటాయించారు. మెంటల్ ఎబిలిటీ పరీక్ష: వెర్బల్, నాన్ వెర్బల్, రీజనింగ్ నుంచి 90 ప్రశ్నలుంటాయి. దీనికి 90 మార్కులు స్కాలిసిస్ అప్టిట్యూట్ పరీక్ష: ఇందులో 7,8 తరగతుల స్థాయిలో నేర్చుకున్న గణితం, సామాన్య,సాంఘిక విషయాలపై ప్రశ్నలు ఇస్తారు. మొత్తం 180 మార్కులు. ఎన్ఎంఎంస్ పరీక్షకు వేళాయె సెప్టెంబర్ 30 వరకు దరఖాస్తు స్వీకరణ ప్రశ్నపత్రాలు సాధన చేయాలి జాతీయ ఉపకార వేతనాల పోటీ పరీక్ష పేద,మధ్య తరగతి విద్యార్థులకు వరం. 7,8 తరగతుల విషయాలతో పాటు రీజనింగ్ కోసం మాదిరి ప్రశ్నాపత్రాలు సాదన చేయాలి. –పురం రమణ, టీచర్, వివేకానంద మున్సిపల్ ఉన్నత పాఠశాల, మదనపల్లె సద్వినియోగం చేసుకోవాలి ప్రధానోపాధ్యాయులు ప్రతిభ కలిగిన విద్యార్థులను గుర్తించి, వారితో దరఖాస్తు చేయించడమే కాకుండా పరీక్ష రాసేలా ప్రోత్సహించాలి. ఉపాధ్యాయులు ప్రత్యేక సమయాన్ని కేటాయించి పిల్లలను పరీక్షలకు సన్నద్ధం చేయాలి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. –సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి -
ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలి
గుర్రంకొండ: ప్రస్తుత పరిస్థితుల్లో రైతులు ప్రకృతి వ్యవసాయంపై మొగ్గు చూపాలని జిల్లా వ్యవసాయాధికారి శివనారాయణ అన్నారు. బుధవారం మండలంలోని తరిగొండలో రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంటల సాగులో పచ్చరొట్ట, జీలుగు,జనుము వంటి ఎరువులను వినియోగించడం వల్ల భూసారం పెరుగుతుందన్నారు. వరి సాగు చేసే ముందు పొలంలో వేప, కానుగ ఆకు వేసి కలయ దున్నుకోవాలన్నారు. తద్వారా పంటకు చీడపీడలు సోకవని, మంచి దిగుబడులు సాధించవచ్చన్నారు. ఎకరం పంటకు యూరియా ఒకటి లేదా రెండు బస్తాల కంటే ఎక్కువగా వినియోగించవద్దన్నారు. అధిక యూరియా వినియోగం వల్ల భూసారం తగ్గిపోవడంతో పాటు భూగర్భ జలాలు కలుషితమవుతాయన్నారు. తద్వారా అనారోగ్య సమస్యలు తలెత్తుతాయన్నారు. యూరియాకు బదులుగా నారోయూరియాను పంటసాగులో ఉపయోగించవచ్చన్నారు. జిల్లాలో ఎక్కడా యూరియా కొరత లేకుండా చర్యలు చేపడుతున్నామని అన్నారు. కార్యక్రమంలో వాల్మీకిపురం ఏడీఏ నాగప్రసాద్, ఏవో నాగరత్నమ్మ, సిబ్బంది, రైతులు పాల్గోన్నారు. -
‘దేశం’లో రగడ!
సాక్షి ప్రతినిధి, కడప: కడప టీడీపీలో అసమ్మతి పోరు ముదిరింది. కడప కేంద్రంగా పరస్పర బలప్రదర్శనల జోరు ఊపందుకుంది. కమలాపురం , కడప నియోజకవర్గాల ఎమ్మెల్యేలు, నేతల మధ్య రగడ తీవ్ర స్థాయికి చేరింది. వరుస వివాదాలు నేపథ్యంలో ఏకంగా టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠానికి ఎసరు పెట్టారు. అధ్యక్షుడి మార్పు జరగాల్సిందేనంటూ ఓ వర్గం మంకు పట్టుబట్టింది.జిల్లా కేంద్రమైన కడపలో మునుపెన్నడూ లేని పరిస్థితులు కూటమి సర్కార్ 16 నెలల కాలంలో తెరపైకి వస్తున్నాయి. ‘మద్యం వ్యాపారం మా వర్గీయులే చేయాలంటూ’స్థానిక ఎమ్మెల్యే వర్గీయులు హుకుం జారీ చేయసాగారు. 30 ఏళ్లుగా మద్యం వ్యాపారంలో లక్ష్మిరెడ్డికి చెందిన రెండు బార్లు బలవంతంగా స్వాహా చేశారు. తాజాగా 27 బార్ల లైసెన్స్కు ప్రభుత్వం టెండర్లు ఆహ్వానిస్తే కేవలం 14 బార్లుకు మాత్రమే టెండర్లు దాఖలయ్యాయి. 13 బార్లకు సంబంధించి టెండర్లు పెండింగ్లో ఉన్నాయి. కడప కోటిరెడ్డి సర్కిల్ సమీపంలో బార్ ప్రారంభోత్సవానికి ప్రయత్నించగా, ఎమ్మెల్యే మాధవీరెడ్డి వర్గీయులు అడ్డుకున్నారు. ఇక్కడ బార్ పెట్టొద్దంటూ హంగామా చేశారు. ఇరువర్గాలు ప్రతిష్టాత్మకంగా తీసుకోవడం, కమలాపురం ఎమ్మెల్యే పుత్తా కృష్ణచైతన్యరెడ్డి బ్యానర్లతో వాహనాల్లో వచ్చిన కొంతమంది అక్కడి చేరుకొని పరస్పర సవాళ్లు చేసుకున్నారు. దీంతో కడప ఎమ్మెల్యే వర్గీయులు అక్కడి నుంచి జారుకున్నట్లు సమాచారం. కాగా, జిల్లా కేంద్రంలో నియంతృత్వ పోకడలకు చెక్ పెట్టాలనే దిశగా టీడీపీ నేతలు అడుగులు వేస్తున్నట్లు తెలుస్తోంది.టీడీపీ అధ్యక్ష పీఠానికి ఎసరుజిల్లా కేంద్రమైన కడపలో ఏకపక్ష చర్యలకు చెక్ పెట్టాలని తెలుగుదేశం పార్టీలో కొంతమంది నడుం బిగించారు. అడ్డదిడ్డంగా వ్యవహరిస్తున్న నేపథ్యంలో టీడీపీ జిల్లా అధ్యక్ష పీఠం మార్పు చేయాలనే దిశగా అడుగులు వేస్తున్నారు. ఎమ్మెల్యే మాధవీరెడ్డికి తోడుగా జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఉండడంతో ప్రజాస్వామ్య పరిస్థితులను కాలరాస్తున్నారని కొంతమంది టీడీపీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లినట్లు సమాచారం. ఆమేరకు ఇటీవల చోటుచేసుకున్న కొన్ని సంఘటనలను ఉదహరించినట్లు తెలుస్తోంది. పొలిట్బ్యూరో సభ్యుడుగా జిల్లా అధ్యక్షుడిగా శ్రీనివాసులరెడ్డికి రెండు పదవులు ఉన్న నేపధ్యంలో అధ్యక్ష పీఠం తప్పించాలని కోరినట్లు సమాచారం. ఆమేరకు టీడీపీ అధిష్టానం సైతం ఆలోచనలో పడినట్లు తెలుస్తోంది. కాగా, జిల్లా అధ్యక్షుడిగా ఎవరైతే బాగుంటుందనే అన్వేషణలో జమ్మలమడుగు ఇన్చార్జీ చదిపిరాళ్ల భూపేష్రెడ్డి పేరును ప్రతిపాదించినట్లు సమాచారం. టీడీపీలో భూపేష్రెడ్డి అందరీకి ఆమోదయోగ్యడుగా నిలువనున్నట్లు అధిష్టానం అంచనాకు వచ్చినట్లు తెలుస్తోంది. -
నియామకం
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన దిగువ పేర్కొన్న నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. రాష్ట్ర మహిళా విభాగం జాయింట్ సెక్రటరీగా పీలేరుకుచెందిన బి.హరితను, రాష్ట్ర ఎస్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా తంబళ్లపల్లెకు చెందిన శ్రీనివాసులునాయక్, రాష్ట్ర ఐటీ విభాగం ప్రధాన కార్యదర్శిగా కోడూరుకు చెందిన ఎం.చంద్ర కుళాయప్పలను నియమించారు. రాయచోటి టౌన్: రాష్ట్ర ఎన్జీవో అసోషియేషన్ ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడిగా బి. శ్రీనివాసులు రెండోసారి ఎంపికయ్యారు. మంగళవారం కడపలో నిర్వహించిన ఎన్నికల్లో ఆయన ఏకగ్రీవంగా ఎన్నికయ్యారని రాయచోటి తాలూకా ఎన్జీవోల సంఘం నాయకులు తెలిపారు. శ్రీనివాసులుకు పలువురు అభినందనలు తెలిపారు. రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ వీరభధ్రస్వామి ఆలయ ఈవో డివి రమణారెడ్డి కుమార్తె దేవిరెడ్డి శ్రావ్య బీడీఎస్లో గోల్డ్మెడల్ సాధించింది. 2021లో మెడిసిన్లో రాష్ట్ర స్థాయిలో మొదటి ర్యాంక్ సాధించింది. ప్రస్తుతం ఈమె ఎండీఎస్ చదువుతోంది. బీడీఎస్ (2021)లో రాష్ట్ర స్థాయి మొదటి ర్యాంక్ సాధించినందుకు మంగళవారం విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో రాష్ట్ర గవర్నర్ డాక్టర్ అబ్దుల్ నజీర్ ఆధ్వర్యంలో వైద్య విభాగం అధికారులు డాక్టర్ ఓపీ యాదవ్, డాక్టర్ పి. చంద్రశేఖర్ చేతుల మీదుగా గోల్డ్ మెడల్తో పాటు సిల్వర్ మెడల్ను అందుకున్నారు. ఈ సందర్బంగా తల్లిదండ్రులు, బంధువులు శ్రావ్యకు శుభాకాంక్షలు తెలియచేశారు. కురబలకోట: కురబలకోట మండలంలోని ఎగువ చెన్నామర్రి వద్ద చిరుత పులి ఆనవాళ్లు కలకలాన్ని సృష్టిస్తున్నాయి. మంగళవారం రాత్రి కట్టేసిన కుక్కను చిరుత చంపినట్లు గ్రామస్తులు చెబుతున్నారు. వివరాలు..హార్సిలీహిల్స్ పరివాహక ప్రాంతంలోని ఎగువ చెన్నామర్రికి చెందిన రెడ్డిశేఖర్ రెడ్డి ప్రతి రోజు రాత్రి సమయంలో పెంపుడు కుక్కను కాపలాగా పొలం వద్ద కట్టేసేవారు. మంగళవారం కూడా కట్టేశాడు. బుధవారం ఉదయం వచ్చి చూడగా కుక్క కన్పించలేదు. రక్తపు మరకలు కన్పించాయి. దీంతో భయాందోళనలకు గురయ్యారు. చిరుత కుక్కను చంపి తినేసి ఉంటుందని భావిస్తున్నారు. అటవీ శాఖ ఎఫ్బీఓ జయరాం స్థానికులను విచారించారు. చిరుత పాద ముద్రలను పరిశీలించారు. పొలాల వద్దకు వెళ్లే రైతులు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. హార్సిలీహిల్స్ నుండి ఈ చిరుత వచ్చి ఉండవచ్చని బావిస్తున్నారు. -
రోగులపై దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు
సిద్దవటం: రోగుల పట్ల వైద్య సిబ్బంది దురుసుగా ప్రవర్తిస్తే చర్యలు తప్పవని కడప డీఎంహెచ్ఓ నాగరాజు హెచ్చరించారు. మండలంలోని పి.కొత్తపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైద్య సిబ్బంది ఐడీ కార్డు, డ్రస్ కోడ్ తప్పనిసరిగా ధరించాలన్నారు. కాన్పుల వార్డు, పేషెంట్ల గదులు, వ్యాక్సినేషన్కు సంబంధించిన గదులను తనిఖీ చేశామన్నారు. గ్రామీణ ప్రాంతాల్లో విష జ్వరాలు రాకుండా జాగ్రత్తలు తీసుకోవాలని పేర్కొన్నారు. గ్రామీణ ప్రాంతాలలో నిర్వహించే 104 వాహనం వద్దకు వచ్చే రోగులకు రక్తనమూనాలు సేకరించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారులు డాక్టర్ ప్రవీణ్ కుమార్, డాక్టర్ రంగ లక్ష్మీ, ప్రాథమిక ఆరోగ్య సిబ్బంది, ఆశా కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. -
ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతుల జీవో ఇవ్వాలి
రాయచోటి : ఆర్టీసీ ఉద్యోగుల పదోన్నతలు ఇస్తున్నట్లు ప్రభుత్వం ప్రకటించడం కాదని, వాటిని అమలు పరచడానికి జీఓను విడుదల చేయాలని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జీవీ నరసయ్య డిమాండ్ చేశారు. మంగళవారం అన్నమయ్య జిల్లా ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా ఎగ్జిక్యూటీవ్ సమావేశాన్ని జిల్లా కార్యదర్శి బీసీ శేఖర్, జిల్లా అధ్యక్షులు సి.ఆనందబాబు అధ్యక్షతన రాయచోటిలో నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన జీవీ నరసయ్య మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి ఉద్యోగులకు రావాల్సిన డీఏ అరియర్స్, పెండింగ్ డీఏలు, పీఆర్సీ బకాయిలు, కొత్త పీఆర్సీ ఇవ్వాలన్నారు. కూటమి ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలని, పదవీ విరమణ చేసిన ఉద్యోగుల బకాయిలను తొమ్మిది నెలలుగా చెల్లించకుండా పెండింగ్ పెట్టారన్నారు. వెంటనే వాటిని చెల్లించాలని రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డిమాండ్ చేశారు. సమావేశంలో రాష్ట్ర సహాయ కార్యదర్శి ఎస్పీ బాబు, జిల్లా గౌరవ అధ్యక్షులు పి.నాగభూషణంరెడ్డి, జోనల్ నాయకులు వీటీ నాథ్, జీఎస్ మన్యం, జిల్లా వర్కింగ్ ప్రెసిడెంటు కేవీ రమణ, జిల్లా వైస్ ప్రెసిడెంటు శరత్ బాబు, జిల్లా కోశాధికారి కొండా ఈశ్వర్రెడ్డి, జిల్లా చీఫ్ వైస్ ప్రెసిడెంటు వి.ప్రకాష్, జిల్లా ప్రచార కార్యదర్శి కె.చలమారెడ్డి, జిల్లా నాయకులు చల్లా వెంకటేశ్వర్లు, ఎంఎస్ వాసులు, సుగుణ, సెల్వి, మెయింటినెన్స్ కమిటీ సభ్యులు సి.నరసింహులు, జిల్లాలో ఐదు డిపోలకు చెందిన ముఖ్య నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
ఒంటిమిట్ట హుండీ ఆదాయం లెక్కింపు
ఒంటిమిట్ట: ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండరామస్వామి ఆలయ నెలసరి హుండీ ఆదాయాన్ని మంగళవారం టీటీడీ అధికారులు లెక్కించారు. ఆగస్టు 18 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆదాయం రూ.3 లక్షల 85 వేల 100 వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. కడప కోటిరెడ్డి సర్కిల్: కరోనాకు ముందు ఉన్న పది రైల్వే స్టేషన్లలో స్టాపింగ్లను పునరుద్ధరిస్తూ రైల్వే అధికారులు ఉత్తర్వులు జారీ చేసినట్లు కడప రైల్వే కమర్శియల్ ఇన్స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. 16351 చత్రపతి శివాజీ టర్మినల్ నాగర్ కొయిల్ రైలు రాజంపేట, కోడూరులో ఆగుతుందన్నారు. 16381, 16382 కన్యాకుమారి – పుణే, పుణే – కన్యాకుమారి రైళ్లు నందలూరు, కొండాపురంలలో, 17622 తిరుపతి – ఔరంగబాద్ రైలు ఎర్రగుంట్లలో, 17652 కాచిగూడ చెంగల్పట్టు రైలు కోడూరులో, 22102 మధురై లోకమాన్య తిలక్ రైలు రాజంపేటలో స్టాపింగ్లు ఇచ్చారని ఆయన తెలిపారు. ఈ అవకాశాన్ని రైల్వే ప్రయాణికులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలి
ములకలచెరువు: సహజ ఎరువులు, నానో యూరియా వినియోగాన్ని ప్రోత్సహించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో మంగళవారం ములకలచెరువు మండలం సోంపల్లెలో నానో ఎరువులు, జీవన ఎరువులపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో యూరియా కొరత లేకుండా సమృద్ధిగా అందుబాటులో ఉంచినట్లు తెలిపారు. యూరియా ఎక్కువగా వినియోగించడం వల్ల భూసారాన్ని తగ్గించి భవిష్యత్తు తరాలకు నష్టాన్ని కలుగజేస్తుందని పేర్కొన్నారు. ఎక్కడైనా అధిక ధరకు విక్రయిస్తే చర్యలు తప్పవన్నారు. రైతు సేవా కేంద్రాల ద్వారానే ఎరువులు కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో మదనపల్లె సబ్ కలెక్టఽర్ చల్లా కల్యాణి, తహసీల్దారు ప్రదీప్, ఎంపీడీఓ హరినారాయణ తదితరులు పాల్గొన్నారు. ఇంటింటా చెత్త సేకరణ ఇంటింటా చెత్త సేకరణ క్రమ తప్పకుండా చేపట్టాలని కలెక్టర్ శ్రీధర్ తెలిపారు. మండలంలోని సోంపల్లె పంచాయతీలో చెత్త నుంచి సంపద సృష్టి తయారీ కేంద్రాన్ని ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు, సిబ్బందికి సూచనలు, సలహాలు అందజేశారు. -
మదనపల్లె వైద్య కళాశాలకు టెండర్
మదనపల్లె: మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలను పీపీపీ విధానంలో ప్రయివేటుకు అప్పగించేందుకు ప్రభుత్వం తొలి అడుగు వేసింది. మదనపల్లెతోపాటు మరో మార్కాపురం, ఆదోని, పులివెందుల ప్రభుత్వ వైద్య కళాశాలలను మొదటి విడతలో ప్రభుత్వ, ప్రయివేటు భాగస్వామ్య పద్ధతిలో అప్పగించేందుకు ప్రభుత్వం నిర్ణయించి మంగళవారం జీవో జారీ చేసింది. ఈ అప్పగింత ప్రక్రియకు సంబంధించిన బాధ్యతలను వైద్య సేవల మౌలిక వసతుల అభివృద్ధి సంస్థ (ఏపీఎంఎస్ఐడీసీ)కు ప్రభుత్వం అప్పగించింది. వీటికి సంబంధించి కమర్షియల్ ఫీజిబిలిటీ అధ్యయనం, ఇతర అంశాలను పరిగణనలోకి తీసుకోవాలని సూచించింది. పీపీపీ కింద నిర్వహణ బాధ్యతలు చూసేందుకు ముందుకు వచ్చే టెండర్దారునికి వార్షిక ఫీజులకు సంబంధించి రాయితీలు కూడా వర్తింపజేస్తున్నట్టు జీవోలో పేర్కొన్నారు. దీన్నిబట్టి చూస్తే పీపీపీ కింద మెడికల్ కళాశాలను దక్కించుకునే వారికి.. ప్రభుత్వం భారీగానే ప్రోత్సాహకాలను అందిస్తుందన్న విషయం అర్థమవుతోంది. దీనికి సంబంధించిన విధి విధానాలు, ఇతరా అంశాలను జీవోలో పొందుబరిచారు. పీపీపీ విధానంలో అప్పగిస్తామని జీవో జారీ చేసిన ప్రభుత్వం ఏడాది ఫీజులో రాయితీలు ఇస్తామంటూ ప్రకటన టెండర్దారునికి భారీగా ప్రోత్సాహం మదనపల్లె ప్రభుత్వ మెడికల్ కళాశాలను ప్రయివేటుకు అప్పగించవద్దని ప్రజల నుంచే కాకుండా రాజకీయ పార్టీలు, సంఘాల నుంచి తీవ్రమైన వ్యతిరేకత వస్తున్నా కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మంజూరు చేసిన ఈ కళాశాలకు రూ.475 కోట్లతో నిర్మాణాలు ప్రారంభమయ్యాయి. కళాశాల ప్రభుత్వ ఆస్పత్రిలో నడించించి, ప్రయివేటుకు వద్దని, సర్కారు ఆధీనంలోనే కళాశాలను నడపాలని డిమాండ్ చేస్తున్నా.. ప్రభుత్వం కనీసం పరిగణనలోకి తీసుకోవడం లేదు. పరిశీలిస్తామన్న హామీ కూడా ఇవ్వలేని ప్రభుత్వం.. ఇప్పుడు నిర్ణయించినట్టుగానే ప్రయివేటుకు అప్పగింత ప్రక్రియలో భాగంగా జీవో జారీ చేయడంతో మదనపల్లె ప్రజలు తీవ్రంగా స్పందిస్తున్నారు. దీనిపై ఆందోళనలకు సిద్ధమవుతున్నారు. -
భారీ ర్యాలీ
కడప – చిత్తూరు జాతీయ రహదారి నుంచి కలెక్టరేట్ వరకు వైఎస్సార్సీపీ నేతలు, కార్యకర్తలు భారీ ర్యాలీ నిర్వహించారు. వైఎస్సార్సీపీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకుడు, కడప మేయర్ సురేష్బాబు, పీలేరు, రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యేలు చింతల రామచంద్రారెడ్డి, కొరుముట్ల శ్రీనివాసులు, రాజంపేట నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్ కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిస్సార్ అహ్మద్, పుంగనూరు, మదనపల్లె పరిశీలకురాలు అనీషారెడ్డి, రాష్ట్ర ప్రచార విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ హరిప్రసాద్, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు ఎర్రంరెడ్డి ఆరంరెడ్డిల ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున శ్రేణులు కదిలి వచ్చాయి. జెండాలను చేతబూని, ప్లకార్డులతో మెరుపు వేగంతో దూసుకొచ్చారు. ర్యాలీగా వచ్చి కలెక్టరేట్ వద్ద నినాదాలతో హోరెత్తించారు. ప్రభుత్వ వైఖరిని నిరసిస్తూనే ప్లకార్డులు పట్టుకుని చేస్తున్న నినాదాలు హోరెత్తాయి. యూ రియా కొరతను నివారించాలని, రైతులకు వెంటనే సబ్సిడీపై ఎరువులను అందించడంతోపాటు పండ్ల తోటల రైతులకు మద్దతు ధర ప్రకటించాలని డిమాండ్ చేశారు. -
చావు ముందు ఎంతటి పెద్ద సమస్య అయినా చిన్నదే..
మనిషి జీవితానికి ముగింపు చావు. చావు ముందు ఎంత పెద్ద సమస్య అయి నా చాలా చిన్నదే. అందువల్ల క్షణికావేశంలో ఎవరు కూడా ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవడం అంత పిరికితనం మరొకటి లేదు. ఏదైనా బతికి సాధించాలే కాని బలవంతంగా ప్రా ణాలు తీసుకుంటే అమితంగా ప్రేమించే కుటుంబ సభ్యులను మానసిక క్షోభకు గురిచేసినట్లే. – కాశిగారి ప్రసాద్, అసోసియేట్ ప్రొఫెసర్, అన్నమాచార్య యూనివర్శిటీ, రాజంపేట మనిషికి జీవితం భగవంతుడు ఇచ్చిన వరం. అందువల్ల ఎన్ని సమస్యలు ఎదురైనా ఎదురొడ్డి నిలిచి బతికి జీవితాన్ని ఆస్వాదించాలి. అంతేకాని ఎట్టి పరిస్థితుల్లో ఆత్మహత్య చేసుకోకూడదు. ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన ఉన్నవారు మానసికంగా ప్రశాంతంగా ఉండలేరు. అలాంటి సమయంలో ఆత్మీయులతో మాట్లాడటం, వ్యాయామం, యోగా వంటివి చేస్తే మనసు కుదుటపడి మానసిక ప్రశాంతత నెలకొని ఆత్మహత్య చేసుకోవాలన్న ఆలోచన నుంచి బయటపడగలరు. – జి.భానుమూర్తిరాజు, రాష్ట్ర ప్రాంతీయ వ్యాయామ విద్య తనిఖీ అధికారి కొన్ని అనివార్య పరిస్థితుల కారణంగా కొంత మంది ఆత్మహత్యలు చేసుకుంటారు. కొంతమంది సమస్యను ఎదుర్కోలేక తనువు చాలించాలనుకొని తల్లిదండ్రులకు, జీవిత భాగస్వామికి, పిల్లలకు, తోబుట్టువులకు జాగ్రత్తలు చెబుతుంటారు. మరికొంత మంది క్షణికావేశంలో ఆత్మహత్యలు చేసుకుంటారు. ఇలాంటి వారు చనిపోతానంటూ బెదిరిస్తారు. ఎవరైనా అలా మాట్లా డితే పెడచెవిన పెట్టకుండా అప్రమత్తం కావాలి. వీలైతే మానసిక వైద్యులకు చూపించాలి. – డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరింటెండెంట్, ప్రభుత్వ ఆసుపత్రి, రాజంపేట -
ఒంటిమిట్టలో విష జ్వరాలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట మండలంలో విష జ్వరాలతో ప్రజలు కుదేలవుతున్నారు. ఈ సారి మునుపెన్నడూ లేని విధంగా ముసురు వర్షాలు పట్టుకోవడంతో వాతావరణంలో నెలకొన్న మార్పులు ప్రజల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపాయి. కీటక, నీటి జనిత వ్యాధులు ప్రబలడంతో అనారోగ్య సమస్యలు చుట్టుముట్టాయి. పిల్లలు, పెద్దలు జ్వరాలతో వణికిపోతున్నారు. ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రులు రోగులతో కిటకిటలాడుతున్నాయి. ఇంట్లో ఒకరికి వస్తే చాలు..... విష జ్వరాలు కారణంగా కుటుంబంలో ఒకరు జ్వరం బారిన పడితే చాలు ఆ ఇంటిల్లిపాదికి జ్వరాలు సోకుతున్నాయి. ముందుగా జలుబు, మళ్లీ దగ్గు, ఆ తరువాత ఒళ్లునొప్పులు ప్రారంభమై జ్వరానికి దారితీస్తున్నాయి. జ్వరం అని వెళ్తే జేబులు ఖాళీ చేస్తున్నారు... ప్రభుత్వ ఆసుపత్రుల్లో చూపించుకున్న వారికి జ్వరం తగ్గకపోవడంతో వారు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. అక్కడ జ్వరం అని వెళ్తే ఆ టెస్టులు ఈ టెస్టులు అని రోగుల వద్ద జేబులు ఖాళీ చేస్తున్నారు. టైపాయిడ్ అని వెళ్తే మలేరియా ఇంజక్షన్.. ఒంటిమిట్ట, సిద్దవటం మండలాల పరిధిలోని కొన్ని ప్రైవేటు ఆసుపత్రుల్లో ఒంటిమిట్ట ప్రజలు రోగాలకు చికిత్స చేయుంచుకుంటూ ఉంటారు. కొంత మంది టైపాయిడ్ జ్వరం అని వెళ్తే అక్కడి డాక్టర్లు మలేరియా, టైపాయిడ్కి సంబంధించిన రెండు ఇంజక్షన్లు రోగులకు వేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఐదు రోజులకు ఇంజక్షన్లు రాసిస్తే ఆ ఐదు రోజులు తమ వద్దనే వేయించుకోవాలని, వేరే ఏ ప్రభుత్వ ఆసుపత్రుల్లో వేయించుకోకూడదని కండీషన్లు కూడా పెడుతున్నారు. ఇలా ప్రజల రోగాలను వ్యాపారంగా మార్చుకునే ఆసుపత్రులపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. పెరిగిన బాధితులు..... ఒంటిమిట్ట మండలంలో విష జ్వరాలతో ఆసుపత్రికి వస్తున్న బాధితల సంఖ్య పెరిగింది. ఒంటిమిట్ట ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో రోజువారి ఓపీ సంఖ్య 170 మందికి పైగా వచ్చేవారు. కానీ విష జ్వరాలు పెరగడంతో 170 నుంచి 300కు చేరింది. విష జ్వరంతో వచ్చిన వారితో ఆసుపత్రిలోని పడకలు నిండిపోతున్నాయి. పడకలు చాలక సైలెన్ ఎక్కించుకునేవారు కుర్చీలోనే కూర్చొని సైలెన్ ఎక్కించుకోవాల్సి వస్తుంది. వర్షాలకు పరిసరాలు అపరిశుభ్రత కారణంగా దోమలు వ్యాప్తి చెందడంతో విష జ్వరాలు ప్రబలుతున్నట్లు వైద్యులు పేర్కొంటున్నారు. ఆగస్టు, సెప్టెంబర్ నెలల్లో టైఫాయిడ్ జ్వరాల తీవ్రత ఎక్కువగా ఉంది. ఒంటిమిట్ట పీహెచ్సీలో ఈనెల 9 వరకు నమోదైన కేసులలో వైరల్ ఫీవర్ 100కు పైనే, టైపాయిడ్ 29 కేసులు నమోదయ్యాయి. రోగులతో కిటకిటలాడుతున్న ఆసుపత్రులు ఒంటిమిట్ట పీహెచ్సీలో రోగులతో నిండిన పడకలు, ఒంటిమిట్ట పీహెచ్సీలో వైద్యాధికారి గది వద్ద బారులు తీరిన రోగులు నా కొడుకులు ఇద్దరికి టైఫాయిడ్ జ్వరా లు వచ్చాయి. వారికి రెండు రోజుల పా టు ఒంటిమిట్ట ప్రైవేటు ఆసుపత్రుల్లో వై ద్యం చేయించాను. అయినా తగ్గక పోయే సరికి వారిని కడపలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్పించి వైద్యం చేయించాను. కేవలం నా కొడుకులకే కాదు ఒంటిమిట్టలో చాలా మందికి జ్వరాలు వచ్చాయి. చిన్నపిల్లలు, పెద్దలు చేతికి సైలెన్ పెట్టుకుని అవస్థలు పడుతు న్నారు. అధికారులు స్పందించి మెరుగైన వైద్యం అందించాలి. – ఏలేశ్వరం మధుమూర్తి, ఒంటిమిట్ట గ్రామస్తులు వాతావరణ మార్పుల వల్ల విష జ్వరాల ప్రభా వం అధికంగా ఉంది. అయినా రోగులు ఆందో ళన చెందాల్సిన పనిలేదు. చికిత్స తీసుకుంటు న్న వారు త్వరగా కోలుకుంటున్నారు. రోగులు మందులు వాడటంతోపాటు రోగ నిరోధక శక్తి పెంపొందించే పండ్లు, ఆకుకూరలు, పౌష్టికాహారాన్ని తీసుకోవాలి. విటమిన్–సి ఎక్కువగా ఉండే నారింజ, బత్తాయి, డ్రాగన్, కెవీ పండ్లు రసాలు శ్రేయస్కరం. కాచిన నీరు తాగాలి. విషజ్వరాలు ఎక్కువ ఉన్న ప్రాంతంలో ప్రత్యేక వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేస్తున్నాం. – డాక్టర్ భావన, ఒంటిమిట్ట పీహెచ్సీ వైద్యాధికారి -
బతికి సాధిద్దాం
● ఆత్మహత్యలు వద్దు... జీవితమే ముద్దు ● జిల్లాలో ప్రతి ఏడాది పెరుగుతున్న ఆత్మహత్యలు ● ఈ ఏడాది ఎనిమిది నెలల్లో 191 మంది ఆత్మహత్య ● నేడు ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం రాజంపేట టౌన్ : జీవితంలో వెనక్కి తీసుకోలేనివి రెండే. ఒకటి గడిచిపోయిన కాలం, రెండవది ప్రాణం. ఆవేశంతో అనాలోచితంగా తీసుకునే నిర్ణయం మనిషి జీవితాన్నే చిదిమేస్తుంది. మనల్ని అమితంగా, పంచ ప్రాణంలా ప్రేమించే కుటుంబ సభ్యులకు తీరని విషాదాన్ని మిగులుస్తుంది. ఏదైనా సాధించాలనుకోవడం.. లేకుంటే గెలవడాన్ని లక్ష్యంగా పెట్టుకోవాలే కాని గెలుపే జీవితం కాకూడదు. ఒడినంత మాత్రాన జీవితం వృధా అనుకుంటే భవిష్యత్తు శూన్యంలా కనిపిస్తుంది. ఆత్మవిశ్వాసానికి మించిన విజయం మరొకటి లేదు. ప్రాణాలు తీసుకునే ముందు ఒక్కటంటే ఒక్క క్షణం ఆలోచిస్తే జీవితం విలువ ఏంటో తెలుస్తుంది. ఏ సమస్యకు ఆత్మహత్యకు పరిష్కారం కాదు. ఇదిలావుంటే ఆత్మహత్యలను నివారించేందుకు ప్రపంచ ఆరోగ్య సంస్థ, ఇంటర్నేషనల్ అసోసియేషన్ ఫర్ సూసైడ్ ప్రివెన్షన్ సంస్థ సంయుక్తంగా 2003వ సంవత్సరం నుంచి ప్రతి ఏడాది సెప్టెంబర్ 10వ తేదీన ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవాన్ని నిర్వహిస్తుంది. నేడు ‘ప్రపంచ ఆత్మహత్యల నివారణ దినోత్సవం’ సందర్భంగా ప్రత్యేక కథనం ఈ ప్రపంచంలో అత్యంత విలువైనది, వెలకట్టలేనిది ప్రాణం. జీవితం అన్నాక ఎన్నో ఒడిదుడుకులు, సమస్యలు ఎదురవుతుంటాయి. జీవితంలో అన్నింటినీ అధిగమించి అనుకున్న విజయాన్ని సాధించాలే కానీ.. బలహీన మనస్తత్వంతో ప్రాణం తీసుకుంటే ఏం వస్తుంది.. ఏమీ రాదు.. పైగా మన కుటుంబ సభ్యులు తీవ్ర వేదనకు గురవుతారు.. ఈ విషయం గుర్తుపెట్టుకుని బతికి సాధిద్దాం అనే దిశగా ముందడుగు వేయాలి. కాగా ఈ ఏడాది ఎనిమిది నెలల వ్యవధిలో జిల్లాలో 191 మంది ఆత్మహత్యలు చేసుకున్నారు. జిల్లాలో ప్రతి ఏడాది ఆత్మహత్యలు చేసుకునే వారి సంఖ్య కూడా పెరుగుతోంది. ఎంతపెద్ద సమస్య అయినా పరిష్కరించుకునేందుకు ఏదో ఒక మార్గంలో అవకాశాలు ఉన్నాయి. అయితే చిన్నచిన్న సమస్యలకే అనేక మంది మనోస్థైర్యాన్ని కోల్పోయి బలవంతంగా తమచేతులతోనే ప్రాణాలను తీసుకుంటున్నారు. ఎంత పెద్ద సమస్య వచ్చినా మనసు కుదుటపరుచుకొని గుండెనిబ్బరంతో ఆ సమస్యను పరిష్కరించుకునే దిశగా ఓర్పుగా అడుగులు వేయాలే తప్ప బలవన్మరణానికి పాల్పడితే తమను నమ్ముకున్న వారి పరిస్థితి ఏమిటో ఒక్కసారి ఆలోచించాలి. తనువు చాలించుకోవడానికి సిద్ధమయ్యాక ఒక్క క్షణం జన్మనిచ్చి కంటికి రెప్పలా చూసుకుంటున్న తల్లిదండ్రులను, అక్క, చెల్లి, అన్నయ్య, తమ్ముడు అంటూ ఆప్యాయతతో, ప్రేమానురాగాలతో పిలిచే తోబుట్టువులను, తమపై ఆధారపడ్డ కుటుంబ సభ్యులను ఒక్కసారి గుర్తు తెచ్చుకుంటే ఎంత కష్టాన్ని అయినా అలవోకగా జయించవచ్చు. చిన్నపాటి కారణాలతో ఆత్మహత్యలు.. తల్లిదండ్రులు మందలించారని, పరీక్షల్లో ఉత్తీర్ణులు కాలేక పోతున్నామని, ప్రేమ విఫలమైందని, చివరికి తల్లిదండ్రులు సెల్ఫోన్ చూడవద్దు అన్నందుకు కూడా విద్యార్థులు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఇక కుటుంబ కలహాలు, ఆర్థిక సమస్యలు, అనారోగ్య సమస్యలు, వ్యసనాలకు బానిసలవడం, భార్య కాపురానికి రాలేదని భర్త, భర్త కోప్పడ్డాడని భార్య ఇలా చిన్నచిన్న విషయాలకే విబేధాలు, గొడవలు, ఉద్వేగం, కుంగుబాటుకు గురై ఆత్మహత్యలు చేసుకుంటున్న సంఘటనలు అధికమవుతున్నాయి. ఇలా ఆత్మహత్యకు పాల్పడేవారంతా సమస్యకు పరిష్కారం వెతుక్కునే సామర్ద్యం లేక, సమస్య పరిష్కారానికి కొంత సమయమైనా వేచిచూసే ఆత్మస్దైర్యం లేనందు వల్ల అర్దాంతరంగా తనువు చాలిస్తూ కన్నవారిని, నమ్ముకున్న వారిని పుట్టెడు దుఃఖంలోకి నెట్టుతున్నారు. ఉరుకులు పరుగులమయమైన జీవనం కూడా ఒక కారణమే..గతంలో ఉమ్మడి కుటుంబాలు ఉండేవి. ఒకరి బాధను మరొకరు పంచుకునేవారు. కుటుంబంలో ఎవరికై నా ఏదైనా సమస్య వస్తే పెద్దలు ఆ సమస్యను పరిష్కరించి మేమున్నాము అన్న భరోసా ఇచ్చేవారు. ఇప్పుడు కాలం మారింది. ఉమ్మడి కుటుంబాల స్థానంలో చిన్న కుటుంబాలు ఏర్పడ్డాయి. ప్రతి ఒక్కరిది ఉరుకులు పరుగులమయమై జీవనమైంది. అందువల్ల కుటుంబ సభ్యులు వారంలో ఒకరోజైనా ఒకచోట కూర్చొని సరదాగా మాట్లాడుకోలేక పోతున్నారు. ఫలితంగా ఏదైనా సమస్య వచ్చినా కుటుంబ సభ్యులతో చెప్పుకొని పరిష్కరించుకోలేక వారిలో వారే కుమిలిపోయి చివరికి ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. ఆత్మహత్య చేసుకోవాలనుకునే వారిలో కొన్ని అసాధారణ లక్షణాలు ఉంటాయి. ఒంటరితనాన్ని కోరుకుంటారు. సకాలంలో ఆహారం తీసుకోరు. రాత్రి వేళల్లో నిద్రపోకుండా ఎక్కువగా ఆలోచిస్తుంటారు. కొన్నిమార్లు అసలు దేనికి కూడా స్పందించరు. బతికి ఏం లాభమని, చనిపోతే పోతుంది అని ముందుగానే పరోక్షంగా సంకేతాలిస్తారు. ఇలాంటి మాటలు ఎవరైనా మాట్లాడితే కుటుంబ సభ్యులు గుర్తించాలి. వారితో ప్రేమగా మాట్లాడి సమస్యను తెలుసుకొని పరిష్కారానికి తోడ్పాటిచ్చి తామున్నామన్న భరోసా ఇవ్వాలి. మానసిక వైద్యుడి వద్దకు తీసుకెళితే ప్రయోజనం కూడా ఉంటుంది. అవగాహన లేక పోవడం వల్లే... సమస్యలు ఎదురైనప్పుడు క్షణికావేశమే చాలా సందర్భాల్లో బలవన్మరణాలకు దారితీస్తుంది. జీవితంపై, సమస్యల పరిష్కరించుకునే విధానంపై సరైన అవగాహన లేక పోవడమే ఆత్మహత్యలు చేసుకోవడానికి ప్రధాన కారణం. ఆత్మహత్యలు చేసుకునేవారు సమస్యను తప్పించుకోవాలని చూస్తున్నారే తప్ప తమ కుటుంబ సభ్యులను మరిన్ని సమస్యల్లోకి నెట్టేస్తున్నామన్న విషయాన్ని గుర్తించలేక పోతున్నారు. తల్లిదండ్రులు కన్నబిడ్డలను ఎంతో అల్లారు ముద్దుగా పెంచుకుంటారు, అలాంటప్పుడు కన్నబిడ్డ ఆత్మహత్య చేసుకుంటే ఆ తల్లిదండ్రులు గుండెలవిసేలా రోదిస్తారు, జీవితాంతం మానసిక క్షోభను అనుభవిస్తారు. ఇక కుటుంబ పెద్ద ఆత్మహత్య చేసుకుంటే ఆ కుటుంబం పరిస్థితి అగమ్యగోచరంగా తయారవుతుంది. అందువల్ల జీవితంలో ఎదురయ్యే సమస్యలను పరిష్కరించుకోవాలే తప్ప ప్రాణాలు తీసుకోవడం సరైనది కాదని మానసిక నిపుణులు చెబుతున్నారు. -
తెలుగు తమ్ముళ్ల అత్యుత్సాహం
వీరబల్లి : మండల కేంద్రంలోని బస్టాండ్లో కరిము ల్లా అనే వ్యక్తి బోదకొట్టం నిర్మించుకొని టీ అమ్ముకొని జీవనం సాగించేవాడు. మంగళవారం రాజంపేట నియోజకవర్గం తెలుగుదేశం ఇన్చార్జ్ పదవి చేపట్టిన జగన్ మోహన్ రాజు మొట్టమొదటి సారిగా మండలానికి వచ్చారు. ఈ కార్యక్రమంలో భాగంగా మండల కేంద్రంలోని బస్టాండ్లో తెలుగు తమ్ముళ్లు అత్యుత్సాహంతో టపాసులు కాల్చడంతో అవి ఆ బోదకొట్టంపై పడి పూర్తిగా కాలిపోయింది. దీంతో కరీముల్లా కుటుంబం దిక్కుతోచని పరిస్థితిలో నిరుత్సాహంగా ఉండిపోయింది. కరీముల్లా ఇటీవల వేలు ఖర్చుచేసి బోదకొట్టం ఏర్పాటు చేసుకున్నాడు. టపాసులు పడి బోదకొట్టం దగ్ధం -
కూలిపోయిన బతుకులు
తనకల్లు/ వేంపల్లె : వారంతా రెక్కాడితే గానీ డొక్కాడని నిరుపేదలు. కూలి కాస్త ఎక్కువగా వస్తుందన్న ఆశతో జిల్లాదాటి వచ్చారు. రోజంతా టమాట తొలగింపు పనుల్లో అలసిపోయారు. సూర్యుడు అస్తమించే వేళ ఆ రోజు అందిన కూలి తీసుకుని స్వగ్రామాలకు ఆటోలో పయనమయ్యారు. ఇంట్లో బిడ్డల గురించి ఒకరు, భార్య ఆరోగ్యం గురించి మరొకరు ఇలా ఆలోచిస్తూ వెళ్తున్నారు. కానీ ఆటో బోల్తా పడగా వారి జీవితాలు అక్కడే ముగిసిపోయాయి. కూలీలతో వెళ్తున్న ఓ ఆటో మండలం పరిధిలోని కొక్కంటి సమీపంలోని మించిలవారికోట రోడ్డు వద్ద బోల్తా పడడంతో వైఎస్సార్ జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన వ్యసాయ కూలీలు పట్టా దేవనాథ్ (45), బత్తల హేమలత (32) మృతి చెందారు.తిరిగి వెళ్తూ.. తిరగిరాని లోకాలకువైఎస్సార్ కడప జిల్లా చక్రాయపేట మండలం కొండప్పగారిపల్లి, ఆంజనేయపురం, బురుజుపల్లి గ్రామాలకు చెందిన పలువురు వ్యవసాయ కూలీలు మంగళవారం ఉదయం ఆటోలో శ్రీసత్యసాయి జిల్లా తనకల్లు మండలంలోని అగ్రహారంపల్లికి చెందిన ఓ రైతు పొలంలో టమాట కోసేందుకు వచ్చారు. పని ముగిసిన అనంతరం అదే ఆటోలో స్వగ్రామాలకు బయలుదేరారు. అయితే మించిలివారికోట రోడ్డు వద్దకు రాగానే వేగంగా వెళ్తున్న ఆటో ఒక్కసారిగా అదుపు తప్పడంతో రోడ్డు పక్కన బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న బత్తల హేమలతకు తీవ్ర గాయాలు కావడంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. అదే ఆటోలో ప్రయాణిస్తున్న బూరుజుపల్లికి చెందిన పట్టా దేవనాథ్, పట్టా బయన్న, శివగంగ, కొండప్పగారిపల్లికి చెందిన పెద్ద గంగులయ్య, బురుజుపల్లికి చెందిన పట్టా బయప్ప, గాయపడ్డారు. షయం తెలుసుకున్న ‘వందేమాతరం టీం’ సభ్యులు బాగేపల్లి అశోక్, బాలు, నవీన్, తండేల్ తదితరులు క్షతగాత్రులను తమ ఉచిత అంబులెన్స్లో తనకల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పుట్టా దేవనాథ్ మృతి చెందాడు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ గోపి పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.బత్తల హేమలతకు భర్త రామాంజనేయులు కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వీరికి శివగంగ, బేబీ, గణేష్లు అనే ముగ్గురు పిల్లలు ఉండగా తల్లి వెంట కుమార్తె శివగంగ కూడా కూలి పనులకు వెళ్లింది. శివగంగకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. మృతుడు దేవనాథ్కు భార్య సుజాత, ఇద్దరు పిల్లలు బయప్ప, బయన్నలు ఉన్నారు. వీరు డిగ్రీ, ఇంటర్ చదువుకుంటున్నారు, మరో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. కూలీలు మృతి చెందడంతో వారి కుటుంబాల్లో విషాదఛాయలు అలముకున్నాయి. -
రిటైర్డ్ ఏఎస్పీకి ఘన వీడ్కోలు
రాయచోటి : పోలీసు వేసిన ప్రతి అడుగు, ధరించిన యూనిఫామ్, కృషి, క్రమశిక్షణ, నిజాయతీలన్నీ పోలీసు శాఖ చరిత్రలో నిలిచిపోతాయని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. పదవీ విరమణ పొందిన స్పెషల్ బ్రాంచ్ ఏఎస్ఐ నాయబ్ ఉస్మాన్ ఘనీ ఖాన్కు జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో ఘనమైన ఆత్మీయ వీడ్కోలు కార్యక్రమాన్ని నిర్వహించారు. చట్టం, ప్రజల కోసం పోలీసులు చేసిన త్యాగం అమూల్యమైందని ఏఎస్పీ అభిప్రాయపడ్డారు. విధి నిర్వహణ సమయంలో కుటుంబం చూపిన సహనం, మద్దతు కూడా ప్రశంసనీయమన్నారు. అనంతరం ఏఎస్ఐను అదనపు ఎస్పీ ఘనంగా సన్మానించి జ్ఞాపికను అందజేశారు. ఈ కార్యక్రమంలో స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ పి రాజా రమేష్, క్రైమ్ ఇన్స్పెక్టర్ ఎం చంద్రశేఖర్, డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం తులసీరామ్, ఆర్ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, పదవీ విరమణ పొందిన ఏఎస్ఐ కుటుంబ సభ్యులు, పోలీసు అధికారులు, పోలీసు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.వృద్ధుడిపై పిచ్చికుక్క దాడి మదనపల్లె రూరల్ : వృద్ధుడిపై పిచ్చికుక్క దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన సంఘటన సోమవారం గుర్రంకొండ మండలంలో జరిగింది. చెర్లోపల్లి పంచాయతీ చిలకుంట గ్రామానికి చెందిన రెడ్డప్పనాయుడు(70) ఇంటి ముందు కూర్చొని ఉండగా, అదే సమయంలో అటుగా వచ్చిన పిచ్చి కుక్క ఆయనపై దాడి చేసి, తీవ్రంగా కరిచి గాయ పరిచింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో తిరుపతికి రెఫర్ చేశారు.మల్టీ డే మ్యాచ్లో చిత్తూరు, నెల్లూరు విజయంకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు ఉత్సాహంగా కొనసాగాయి. సోమవారం రెండవ రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న మ్యాచ్లో అనంతపురం జట్టుపై చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో విజయం సాధించింది. 132 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 55.3 ఓవర్లలో 211 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తేజరెడ్డి 142 బంతుల్లో 12 ఫోర్లు, 2 సిక్సర్లతో అద్భుతంగా ఆడి 106 పరుగులు చేశాడు. రెడ్డి ప్రకాశ్ 30 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3, ప్రవీణ్కుమార్ సాయి 3 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 46.2 ఓవర్లకు 142 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని నిస్కయ్ 47, ప్రవీణ్ కుమార్ సాయి 32 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని అచ్యుతానంద అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బ్రహ్మసాయి తేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. తర్వాత రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్టు 14.5 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 113 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 52, జెనిక్ దాస్ 34 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని భార్గవ 2 వికెట్లు తీశాడు. దీంతో చిత్తూరు జట్టు 8 వికెట్ల తేడాతో రెండవ రోజే విజయం సాధించింది.కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో..కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప జట్టుపై నెల్లూరు జట్టు 69 పరుగుల తేడాతో విజయం సాధించింది. సోమవారం రెండవ రోజు 140 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 86.1 ఓవర్లలో 501 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని కారుణ్య ప్రసాద్ 167, సోహన్ వర్మ 68, మాధవ్ 66, శ్రీ హర్ష 58 పరుగులు చేశారు. కడప జట్టులోని ఎస్ఎండీ ఆయూబ్ 4, వరుణ్తేజ్రెడ్డి 4, చెన్నారెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 33.1 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని శివ కేశవ రాయల్ 53, నాగ చాతుర్య 33 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, నారాయణ 2, సూతేజ్రెడ్డి 2 వికెట్లు తీశారు. -
వాటర్షెడ్లో నిధుల దుర్వినియోగం
● కాంట్రాక్టర్లతో అధికారుల కుమ్మక్కు ● పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వాటర్షెడ్ చైర్మన్పెద్దతిప్పసముద్రం : మండలంలోని మడుమూరు పంచాయతీలో వాటర్షెడ్ ద్వారా జరుగుతున్న పనులు, నిధుల దుర్వినియోగంపై వాటర్షెడ్ చైర్మన్ మొరుంపల్లి శ్రీనివాసులు సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. ఈ సందర్భంగా చైర్మన్ మాట్లాడుతూ సంపతికోట మైక్రో వాటర్షెడ్ పరిధిలోని మడుమూరు పంచాయతీలో డకోట పాండ్స్, ఎంపీటీ లాంటి పనులను ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా చేపట్టారన్నారు. చెరువులు, ఏరు లాంటి ప్రదేశాల్లో పనుల నిషేధం ఉన్నా వాటర్షెడ్ సిబ్బంది కాంట్రాక్టర్లతో కుమ్మకై ్క ఇష్టారాజ్యంగా పనులు చేపట్టారన్నారు. అంతేగాక చెరువులోనే ఒకే చోట పనికి, మరో పనికి మధ్య కేవలం 30 మీటర్ల దూరంలోనే మూడు డకోట పాండ్స్ పనులు చేపట్టడం నిధుల దుర్వినియోగానికి అద్దం పడుతోందన్నాడు. వాటర్షెడ్లో పని చేసే ఇద్దరు సిబ్బంది పనుల మంజూరు కోసం తన వద్ద ఆరు సంతకాలు పెట్టించుకున్నారన్నాడు. అదే విధంగా దొడ్డిదారిలో బిల్లులు చేసుకునే నేపథ్యంలో, మరిన్ని సంతకాల కోసం తనతో పాటు కమిటీ సభ్యులను సైతం వెంటపడి అధికారులు బెదిరింపులకు పాల్పడుతున్నారని అసహనం వ్యక్తం చేశాడు. ప్రజలకు ఉపయోగకరంగా చేపట్టాల్సిన పనులను అధికారులు లోపాయికారి ఒప్పందాల కారణంగా నిధులను నీళ్లలా ఖర్చు చేస్తున్నా పట్టించుకునే నాథులే కరువయ్యారని ఆరోపించాడు. ఇటీవల కాలంలో పక్క మండలానికి చెందిన ఓ వ్యక్తికి, స్థానికంగా ఉన్న పలువురికి పనుల విషయంలో ఘర్షణ జరగ్గా స్థానికేతరుడికి రక్త గాయాలు అయినట్లు పేర్కొన్నాడు. వాటర్షెడ్లో ప్రజాధనం దుర్వినియోగానికి కారకులైన అధికారుల నుంచి నిధులను రికవరీ చేయించి ప్రజలకు ఉపయోగపడే పనులు చేపట్టేలా చర్యలు చేపట్టాలని తాను కలెక్టర్కు ఇచ్చిన ఫిర్యాదులో కోరినట్లు తెలిపాడు. -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
లక్కిరెడ్డిపల్లి : వైఎస్సార్సీపీ సానుభూతి పరులు అనే నెపంతో మండలంలోని 19, 25, 26 రేషన్ దుకాణాలపై సీఐ నారాయణ, ఎన్ఫోర్స్మెంట్ తహసీల్దార్ వెంకటరెడ్డి రెవెన్యూ సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు నిర్వహించి.. దుకాణాలలో ఎటువంటి చిన్నపాటి వ్యత్యాసాలు లేకుండానే ఆథరైజేషన్ లేదనే నెపంతో ఆరు కేసులు నమోదు చేయడం జరిగిందని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మండలంలోని మద్దిరేవుల గ్రామం రేషన్ షాప్ నెంబర్లు 25, 26, పందిళ్లపల్లి గ్రామ కస్సా రేషన్ షాప్ నెంబరు 19ను విజిలెన్సు అధికారులు తనిఖీలు చేపట్టడం జరిగింది. రేషన్ దుకాణాలలో బియ్యం, చెక్కర, అంగన్వాడీకి సంబంధించిన పామ్ ఆయిల్, కందిపప్పు, సన్నబియ్యంలలో చిన్నపాటి వ్యత్యాసాలు చూపెడుతూ కేసులు నమోదు చేసినట్లు రేషన్ డీలర్లు పేర్కొన్నారు. మండలంలోని 30 రేషన్ షాపులకు గత నాలుగేళ్లుగా ఆథరైజేషన్లు లేవనే విషయం సంబంధిత తహసీల్దార్కు తెలిపిన విషయమే అన్నారు. ఆథరైజేషన్లు ఆర్డీఓ కార్యాలయ సిబ్బంది ఇవ్వాల్సి ఉన్నా తహసీల్దార్ రర్యాలయ సిబ్బంది పట్టించుకోకపోవడంతోనే పెండింగ్లో ఉన్న విషయం రెవెన్యూ సిబ్బందికి తెలుసునని వాపోయారు. ఇప్పడేమో రేషన్ షాపులపై అధికార పార్టీ ఒత్తిడితో విజిలెన్సు అధికారులను పంపించి దాడులు చేయించడం, తమకు కోర్టు ఆర్డర్లు ఉన్నాయనే ఉత్తర్వులను విజిలెన్సు అధికారులు చూపించి, తమపై అసభ్య పదజాలాలు వాడుతూ బెదిరింపుకు దిగుతున్నారని రేషన్ డీలర్లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిల్వ ఉన్న సరుకులను సంబంధిత వీఆర్ఓలకు అప్పగిస్తున్నామంటూనే అధికార పార్టీ సానుభూతి పరుల ఇళ్లలోకి రేషన్ బియ్యాన్ని తరలించడం జరుగుతోందన్నారు. కేవలం అధికార పార్టీ ఒత్తిడి వల్లే తమ రేషన్ షాపులపై విజిలెన్సు దాడులు చేయించడం జరుగుతుందని రేషన్ డీలర్లు వాపోతున్నారు.వైఎస్సార్సీపీ సానుభూతి పరులనే నెపంతో.. -
గుప్త నిధుల కోసం ఆలయంలో తవ్వకాలు
రామసముద్రం : గుప్త నిధుల కోసం గుర్తుతెలియని దుండగులు త్రేతాయుగం నాటి ఆలయాన్ని ధ్వంసం చేసిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. భక్తుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఆర్.నడింపల్లి పంచాయతీ బల్లసముద్రం కొండపై వెలసిన శ్రీవాలీశ్వర ఆలయం త్రేతాయుగంలో అప్పటి వాలీ నిర్మించారు. ఆలయంలో ప్రతి సోమవారం పూజలు నిర్వహిస్తారు. వారం రోజులుగా కొండపైకి వెళ్లే దారిలో విద్యుత్ దీపాలు వెలగకపోవడంతో ఆర్.నడింపల్లి గ్రామానికి చెందిన భక్తులు మరమ్మతులు చేసేందుకు 10 మంది కొండపైకి సోమవారం ఉదయం వెళ్లారు. అయితే ఆలయ ముఖద్వారం వద్ద ఉన్న రాతి గోడను గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేసి ఉండటాన్ని గమనించి స్థానికులకు సమాచారం అందించారు. అప్పటి కాలంలో నిర్మించిన పురాతన ఆలయానికి ఉన్న పెద్ద పెద్ద రాతి గోడలను నిధుల కోసం ధ్వంసం చేసి సొరంగం పెట్టారు. ఈ విషయాన్ని స్థానికులు పోలీసులకు తెలియజేశారు. సంఘటన స్థలాన్ని సందర్శించని పోలీసులు మండలంలోనే ప్రఖ్యాతి గాంచిన అతి పురాతన ఆలయాన్ని గుర్తుతెలియని దుండగులు ధ్వంసం చేశారన్న విషయంపై ఫిర్యాదు చేసినా.. పోలీసులు సంఘటన స్థలాన్ని సందర్శించకపోవడంపై స్థానికులు, భక్తులు అసహనం వ్యక్తం చేశారు. గతంలో కూడా ఆలయం వద్ద ధ్వజస్తంభంను ధ్వంసం చేసి నిధులు దోచుకెళ్లిన దుండగులను గుర్తించలేదని వారు తెలిపారు. పురాతన ఆలయాన్ని గుప్త నిధుల కోసం తవ్వకాలకు పాల్పడిన ముఠాను పోలీసులు గుర్తించి అరెస్ట్ చేసి శిక్షించాలని డిమాండ్ చేశారు. -
పలు రైళ్లు ఇక హాల్టింగ్
● ఆదేశాలు జారీ చేసిన రైల్వే శాఖ ● నందలూరులో ఆగనున్న జయంతిరాజంపేట : దక్షిణ మధ్య రైల్వేలో పలు రైళ్లకు హాల్టింగ్స్ను పునరుద్ధరిస్తూ సౌత్సెంట్రల్ రైల్వే సోమవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగా జిల్లాలో నందలూరు, రాజంపేట, ఓబులవారిపల్లె, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో పలు రైళ్ల హాల్టింగ్స్కు రైల్వేబోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఈ నెల 10 నుంచి 12163(చైన్నె–ముంబై సూపర్) నంబరు గల రైలుకు కోడూరులో హాల్టింగ్ ఇచ్చారు. 16351(ముంబాయి–నాగర్కోయల్) నంబరు గల రైలు రాజంపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లలో ఈ నెల 12న నుంచి హాల్టింగ్ ఉంది. 16352 (నాగరకోయిల్ –ముంబాయి)నంబరు గల రైలుకు రాజంపేట, రైల్వేకోడూరులో ఈ నెల 11 నుంచి హాల్టింగ్ ఇచ్చారు. 16381/16382 నంబరు గల జయంతి రైలు నందలూరు, కోండాపురంలో ఈ నెల 10 నుంచి హాల్టింగ్ ఉంది. 17415/17416 నంబరు గల (తిరుపతి–కోల్హాపూర్) రాజంపేట, ఓబులవారిపల్లెలో హాల్టింగ్ ఇచ్చారు. ఈనెల 10 నుంచి ఈ హాల్టింగ్ అమలులోకి రానున్నది. 17622 నంబరు గల(గుంటూరు–తిరుపతి) రైలుకు ఎర్రగుంట్లలో ఈ నెల 13 నుంచి హాల్టింగ్ ఇచ్చారు. 17652 (కాచిగూడ –చైన్నె ఎగ్మోర్) నంబరు గల రైలుకు కోడూరు రైల్వేస్టేషన్లో ఈ నెల 11 నుంచి హాల్టింగ్ కొనసాగనున్నది. 18521/18522 నంబరు గల నందలూరు రైల్వేకేంద్రంలో తిరుమల ఎక్స్ప్రెస్ రైలుకు ఈనెల 10 నుంచి హాల్టింగ్ను ఇచ్చారు. 20953/ 54(చైన్నె–అహమ్మదాబాద్) నంబరు గల రైలు రాజంపేట, రైల్వేకోడూరులో ఈ నెల 13 నుంచి హాల్టింగ్ ఉంది. 22102 నంబరు గల (ముంబాయి–మధురై.వీక్లీ) రైలుకు రాజంపేటలో ఈనెల 19 నుంచి హాల్టింగ్ ఇచ్చారు. 22157 /22158 (ముంబాయి–చైన్నె ఎగ్మోర్ సూపర్ఫాస్ట్ మెయిల్) నంబరు గల రైలుకు రాజంపేట, రైల్వేకోడూరు రైల్వేస్టేషన్లో ఈ నెల 10 నుంచి హాల్టింగ్ను ఇచ్చారు. ఎంపీ మిథున్రెడ్డి కృషితో.. జిల్లాలో రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, రాజంపేట రైల్వేస్టేషన్లలో పలు రైళ్ల హాల్టింగ్స్ ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషితో మంజూరైనట్లుగా గుంతకల్ రైల్వే డీఆర్యుసీసీ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎంపీ మిథున్రెడ్డి రైల్వేశాఖమంత్రితోపాటు, దక్షిణమధ్య రైల్వే జీఎంలకు హాల్టింగ్స్ విషయంపై తెలియచేయడం జరిగిందన్నారు. ఎంపీ తరఫున తాను కూడా జీఎంను కలిసి ఎంపీ మిథునరెడ్డి సహకారంతో వినతులను అందజేశామన్నారు నందలూరు రైల్వేకేంద్రంలో జయంతి ఎక్స్ప్రెస్రైలుకు హాల్టింగ్ ఇవ్వడం జరిగిందన్నారు. -
తండ్రిపై తనయుడి దాడి
మదనపల్లె రూరల్ : మద్యానికి డబ్బు ఇవ్వలేదని తండ్రిపై తనయుడు దాడి చేసిన సంఘటన మదనపల్లె మండలంలో సోమవారం రాత్రి జరిగింది. కొత్తపల్లె పంచాయతీ ఈశ్వరమ్మకాలనీకి చెందిన షేక్గౌస్సాహెబ్’(65) వద్ద పెన్షన్ డబ్బు ఉంది. ఆ డబ్బు మద్యం తాగేందుకు కుమారుడు షేక్సైపుల్లా అడిగాడు. డబ్బు ఇవ్వడానికి నిరాకరించడంతో కర్రతో తండ్రిపై దాడి చేసి గాయపరిచాడు. బాధితుడిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి కేవీపల్లె : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని గ్యారంపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. గ్యారంపల్లె పంచాయతీ కొత్తపల్లెకు చెందిన గండికోట రమణ (50) ఆదివారం రాత్రి ద్విచక్రవాహనంలో పక్క గ్రామానికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. అయితే చిత్తూరు – కడప జాతీయ రహదారిలో రోడ్డు పక్కన ఆగి ఉన్న లారీని చీకటిలో గమనించకపోవడంతో ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆయన్ను చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. తహసీల్దారు సంతకాలు ఫోర్జరీ నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష కలికిరి : తహసీల్దారు సంతకాలు ఫోర్జరీ చేసి కోర్టుకు తప్పుడు ధ్రువీకరణ అందచేసినట్లు నిర్ధారణ కావడంతో నిందితునికి ఏడేళ్లు జైలు శిక్ష, ఇరవై వేలు రూపాయల జరిమానా విధిస్తూ వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి గురు అరవింద్ తీర్పునిచ్చారు. పోలీసుల కథనం మేరకు... కలికిరి పంచాయతీ వెంకటేశ్వరపురంలో నివాసం ఉండు ముల్లంగి రమేష్, గడ్డం శ్రీనివాసులుకు నివాస స్థలం విషయంలో తగాదాలున్నాయి. 2017లో గడ్డం శ్రీనివాసులు అప్పటి తహసీల్దారు సంతకాలు ఫోర్జరీ చేసి నకిలీ ఎంజాయ్మెంట్ ధృవీకరణ పత్రాన్ని పొందాడు. దీంతో గడ్డం శ్రీనివాసులు పోలీసులను ఆశ్రయించి న్యాయం చేయాలని ఫిర్యాదు చేశాడు. అప్పటి ఎస్ఐ పురుషోత్తంరెడ్డి కేసు నమోదు చేశారు. ప్రస్తుతం విచారణ తుదిదశకు చేరుకుని పూర్వాపరాలను పరిశీలించిన కోర్టు నిందితునికి శిక్ష విధుస్తూ తీర్పునిచ్చింది. పబ్లిక్ ప్రాసిక్యూటర్ శంకర్ కేసును వాదించారు. కేసుకు సంబంధించి సాక్షులను సకాలంలో కోర్టులో హాజరుపరచిన సీఐ అనీల్కుమార్, కోర్టు కానిస్టేబుల్ రెడ్డెప్పలను డీఎస్పీ క్రిష్ణమోహన్, ఎస్పీ విద్యాసాగర్నాయుడు అభినందించారు. -
ఇమామ్, మౌజన్లకు పెండింగ్ వేతనాలు ఇవ్వాలి
రాయచోటి టౌన్ : రాష్ట్ర వ్యాప్తంగా ఇమామ్, మౌజన్లకు ఇవ్వాల్సిన పెండింగ్ గౌరవ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని వైఎస్సార్సీపీ మదనపల్లె నియోజకవర్గ సమన్వయకర్త నిస్సార్ అహమ్మద్ డిమాండ్ చేశారు. పార్టీ రాష్ట్ర విభాగం పిలుపులో భాగంగా మైనార్టీ విభాగం జిల్లా శాఖ ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించారు. అనంతరం జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నిస్సార్ అహమ్మద్ మీడియాతో మాట్లాడుతూ మైనార్టీలకు గౌరవేతనాలు పెంచుతామని హామీ ఇచ్చిన కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆ మాట పూర్తిగా మరిచిపోయిందన్నారు. ఓట్లు వేయించుకునే వరకు ఒక విధంగా మాట చెప్పిన కూటమి ప్రభుత్వం.. అధికారంలోకి వచ్చిన తరువాత మీరు మాకెందుకు అన్న విధంగా ప్రవర్తిస్తోందని విమర్శించారు. అదే వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్న సమయంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇమాంలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ప్రతి నెల ఇచ్చేవారన్నారు. తెలుగుదేశం ప్రభుత్వం ఇమామ్లకు నెలకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు గౌరవ వేతనం ప్రతినెల చెల్లిస్తామని హామీ ఇచ్చిందన్నారు. కానీ జనవరి నుంచి ఇప్పటి వరకు చెల్లించకపోవడం దారుణమన్నారు. సెప్టెంబరు వరకు ఎనిమిది నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయన్నారు. గతేడాది ఎన్నికల సమయమైన ఏప్రిల్, మే, జూన్ నెలల వేతనాలు కూడా చెల్లించలేదన్నారు. ఇలా 11 నెలల గౌరవ వేతనాలు పెండింగ్లో ఉన్నాయని వివరించారు. దీనివల్ల ఇమామ్, మౌజన్లు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోందన్నారు. మసీదు కమిటీలు కూడా ఈ చెల్లింపులను భరించలేకపోతున్నాయన్నారు. జనవరి నుంచి సెప్టెంబరు వరకు ఉన్న పెండింగ్ వేతనాలు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రతినెల క్రమం తప్పకుండా వేతనాలు ఇవ్వాలని కోరారు. నూర్బాషా కార్పొరేషన్కు రూ.100 కోట్లు తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లెలో 20 ఏళ్ల క్రితం తెలుగు దేశం పార్టీనే షాదీ మహాల్ నిర్మాణం కోసం అరకొరగా నిధులు కేటాయించడంతో అది ఆదిలోని ఆగిపోయిందన్నారు. తరువాత దీనిని విస్మరించారని చెప్పారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం నిధులు కేటాయించి షాదీమహల్ పూర్తి చేయాలని, త్వరగా పూర్తి చేస్తే నిరుపేదలు ఉపయోగించుకొంటారని చెప్పారు. ఈ కార్యక్రమంలో వైఎస్పార్ సీపీ మైనార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కొలిమి హారూన్ బాషా, వైఎస్సార్ సీపీ మైనార్టీ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు బేపారీ మహమ్మద్, రాయచోటి మున్సిపల్ వైస్ చైర్మన్ ఫయాజూర్ రహిమాన్, రాయచోటి మైనార్టీ నాయకుడు జాఫర్ ఆలీఖాన్, మదనపల్లెకు చెందిన యూనస్, రహ్మతుల్లా, షఫీభాయ్, జబీవుల్లా, యాసీన్, తాజ్ భాయ్, సాధిక్ తదితరులు పాల్గొన్నారు. -
రైతు బిడ్డకు జాతీయస్థాయి పురస్కారం
వేముల : హైదరాబాద్లో కడప రైతు బిడ్డ గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి అరుదైన జాతీయ స్థాయి పురష్కారాన్ని కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతుల మీదుగా అందుకున్నారు. వేముల మండలం కుప్పగుట్టపల్లె గ్రామానికి చెందిన గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి పదేళ్ల క్రితం వైఎస్ జగన్మోహన్రెడ్డి సిఫార్సుతో టర్బో సర్వీసెస్ రంగంలో కేవలం రూ.1400 జీతంతో తన ప్రస్థానాన్ని ప్రారంభించారు. 2017లో కూకట్పల్లె కెపీహెచ్బీ కాలనీ కేంద్రంగా న్యూ ప్రీమియర్ టర్బో సర్వీసెస్ అనే సంస్థను స్థాపించాడు. ఓ టీవీ న్యూస్ చానెల్ తెలంగాణాలో నిర్వహించిన కార్యక్రమంలో బిజినెస్ ఎక్సలెన్స్ అవార్డులు ఈనెల 5వ తేదీన కేంద్ర మంత్రి కిషన్రెడ్డి చేతులమీదుగా గజ్జెల లక్ష్మీనారాయణరెడ్డి, ఆయన సతీమణి కళ్యాణిలు అందుకున్నారు. -
రైతుల కష్టాలు పట్టని ప్రభుత్వం
– వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్రెడ్డి రాయచోటి : రైతులకు న్యాయం చేయడంలో బాధ్యతగా ఉండాల్సిన కూటమి ప్రభుత్వం రైతుల బాధలు, కష్టాలను పట్టించుకోవడం లేదని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో రైతులపట్ల ప్రభుత్వ మొండి వైఖరిని తుర్పారా బట్టారు. రైతు భరోసా ఒకటిన్నర సంవత్సరానికి రూ.7 వేలు మాత్రమే ఇచ్చారన్నారు. కేంద్ర ప్రభుత్వంతో కాకుండా సంవత్సరానికి రూ. 20 వేలు ఇస్తామని, ఎన్నికల సమయంలో కూటమి పార్టీ నేతలు చెప్పారన్నారు. ఈ సంవత్సరంతో కలిపి రైతులకు ఇంకా రూ. 33 వేలు బాకీ పడ్డారన్నారు. వీటిని వెంటనే రైతులకు అందించాలని ఆయన డిమాండ్ చేశారు. వర్షాభావ పరిస్థితుల వల్ల పంటలు వేసుకోలేని దుర్భర పరిస్థితులు జిల్లాలో ఏర్పడ్డాయన్నారు. ఖరీఫ్ సీజన్లో 15శాతమే పంటలు సాగయ్యాయన్నారు. 85 శాతం సాగు చేయాల్సిన భూములు బీళ్లుగా మారాయన్నారు. ఈ ఏడాది మామిడి, టమాట, కర్బూజ, దోస తదితర పంటలకు గిట్టుబాటు ధరలు లేక రైతులు నష్టాలను మూటకట్టుకున్నారని తెలిపారు. అన్ని పంటలకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. పంటల బీమా మంజూరు ఊసేలేదన్నారు. తోతాపూరి మామిడిరైతులు ఖాతాలలో డబ్బులు జమ చేస్తామన్న ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టాలన్నారు. అన్నదాత పోరును విజయవంతం చేయాలి రాష్ట్రంలో అనేక జిల్లాల్లో యూరియా కొరత నెలకొంది. దీంతో యూరియా అందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ నేపథ్యంలో రైతులకు మద్దతుగా వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్ పిలుపు మేరకు ఈనెల 9న ఉదయం 9.30 గంటలకు అన్నదాత పోరు కార్యక్రమాన్ని చేపడుతున్నట్లు శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు.ఈ కార్యక్రమాన్ని రైతు నాయకులు, రైతులు జయప్రదం చేయాలని ఆయన పిలుపునిచ్చారు. -
నేడు వైఎస్సార్ సీపీ అన్నదాత పోరు
సాక్షి, రాయచోటి : అన్నదాతకు అనుక్షణం కష్టాలు తప్పడం లేదు. ఒకవైపు ప్రకృతి అల్లకల్లోలం చేస్తే, మరోవైపు ప్రభుత్వం కష్టాలు చూపిస్తోంది. పంటలు పండక... చేసిన అప్పులు తీర్చే మార్గం లేక రైతు కుంగిపోతున్నాడు. అయితే ఆపదలో ఆదుకోవాల్సిన ప్రభుత్వాలు ఇప్పటికీ చేష్టలుడిగి చూస్తుండడం ఆందోళన కలిగించే పరిణామం. ప్రతిసారి విత్తనం మొదలు..కాయ కోసే వరకు అగచాట్లు తప్పడం లేదు. పంట పండిన తర్వాత గిట్టుబాటు ధర లేక పండ్ల తోటరైతుల బాధలు వర్ణణాతీతం. ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ పూర్తిగా కరువు బారిన పడింది. అయితే ప్రత్యామ్నాయం వైపు అడుగులు వేస్తున్న అన్నదాతకు సబ్సిడీ విత్తనాలు, ఎరువులు అందించే పరిస్థితి కనిపించడం లేదు. వరితోపాటు ఇతర పంటలకు వినియోగించే యూరియా సమస్యలు కూడా వెంటాడుతున్నాయి. కొన్నిచోట్ల క్యూలైన్లలో నిలబడినా ప్రయోజనం లేకపోవంతో రైతులు అవస్థలు ఎదుర్కొంటున్నారు.జిల్లాలో ఖరీఫ్కు సంబంధించి సుమారు 1,30,000 ఎకరాల వరకు పంటలు సాగు కావాల్సి ఉండగా, ఈసారి కేవలం పది వేలలోపు మాత్రమే పంటలు సాగయ్యాయి. అది కూడా అరకొరగా వేరుశనగ, మినుము, వరి, జొన్న, పత్తి, కంది పంటలు సాగయ్యాయి. అయితే జిల్లాలో అధికంగా సాగయ్యే పంటల్లో ప్రధానంగా వేరుశనగ కాగా, వరిది రెండవస్థానం. అయితే విపత్కర పరిస్థితుల పుణ్యమా అని పంట సాగే కష్టంగా మారింది. ఇదిలా ఉంటే ప్రస్తుతం ప్రత్యామ్నాయం దృష్టి సారించిన అన్నదాతల మీద ఎరువుల బారం పడుతోంది. యూరియా అంతంత మాత్రంగా ఉండగా, మరోప్రక్క అనేక రకాల ఆంక్షలతో రైతులకు అందడం గగనంగా మారుతోంది. మొదట్లో డీఏపీ, ఇతర ఎరువులు కొంటేనే యూరియా ఇస్తామని మెలికపెట్టిన వ్యాపారులు, తర్వాత అధికారుల ఒత్తిడితో కొంతమేర తగ్గారు. అయితే మొదట్లో అధిక ధరలకు కూడా విక్రయాలు సాగాయి. ప్రస్తుతం యూరియా కోసం పలుచోట్ల బారులు తీరుతున్నారు.కరువులతో కకావికలంజిల్లాను కరువు పరిస్థితులు వెంటాడుతున్నాయి. 2024లోనూ కొంతమేర వర్షం పడటం, ఆ తర్వాత పడకపోవడంతో వేసిన పంటలు నిలువునా ఎండిపోయి రైతులు నష్టపోయారు. ఈసారి ఏకంగా వర్షపు ఛాయలు దరిదాపుల్లో కనిపించలేదు. ఆకాశం మేఘావృతం కావడం....తూతూ మంత్రంగా తుపాను జల్లులతో పదునుకే కష్టమై పోయింది. దీంతో అదును దాటుతున్నా పదును వర్షం కోసం ఎదురుచూసి విసిగిపోయారు. కానీ పదును లేదు...విత్తనం పడింది లేదు...దీంతో ఎక్కడ చూసినా బీడు భూములు దర్శనమిస్తున్నాయి.పండ్ల తోటల రైతులకు దొరకని గిట్టుబాటుజిల్లాలో మామిడి, బొప్పాయి, టమాటా, కర్బూజ, అరటి పంటలు విస్తారంగా సాగు చేస్తారు. అయితే రైతులకు ప్రతిసారి పంట పండించిన తర్వాత గిట్టుబాటు గగనంగా మారుతోంది. వాణిజ్య పంటలైన వేరుశనగ, ఇతర పంటలు కూడా గతంలో ధరలు లేక రైతులు అల్లాడిపోయారు. ఇటీవలి కాలంలో పండ్ల తోటల రైతులు సతమతమవుతున్నారు. మొన్నటివరకు మామిడి రైతులు గిట్టుబాటు ధరలు లేక అల్లాడిపోగా, ప్రస్తుతం బొప్పాయి రైతులు భగ్గుమంటున్నారు. దళారులు, వ్యాపారులు కుమ్మకై ్క రైతులను నిలువునా ముంచేస్తున్నారు. దీంతో గిట్టుబాటు ధర లభించకపండ్ల తోటల రైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది.రైతులకు సకాలంలో యూరియాతోపాటు మిగతా ఎరువులు అందించడంలో కూటమి సర్కార్ విఫలమైన నేపథ్యంలో వైఎస్సార్సీపీ పోరుబాటకు సంకల్పించింది. ప్రధానంగా రైతులకు అవసరమైన ఎరువులు అందించాలని డిమాండ్ చేస్తూ ఆందోళన బాటకు పిలుపునిచ్చింది. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలతోపాటు నియోజకవర్గాలు, ఆర్డీఓ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమాలు జరగనున్న తరుణంలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి కలెక్టరేట్ వద్ద వైఎస్సార్ సీపీ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టనున్నారు. జాతీయ రహదారి వద్ద నుంచి కలెక్టరేట్ వరకు ర్యాలీగా వెళ్లి అనంతరం ఉన్నతాధికారులకు వినతిపత్రాన్ని సమర్పించనున్నారు. ఇప్పటికే ఎక్కడికక్కడ నియోజకవర్గాల్లో పార్టీ ఇన్చార్జిలు పోస్టర్ల ఆవిష్కరణ చేపట్టి రైతులను భారీగా తరలి రావాలని పిలుపునివ్వడంతో పెద్ద ఎత్తున వైఎస్సార్ సీపీ శ్రేణులు రాయచోటి కలెక్టరేట్కు చేరుకోనున్నాయి. మంగళవారం ఉదయం 10 గంటల నుంచి కార్యక్రమం ప్రారంభం కానున్నట్లు పార్టీ వర్గాలు తెలియజేశాయి. -
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభధ్రస్వామి పల్లకీలో ఊరేగారు. ఆదివారం చంద్రగ్రహణం సందర్భంగా ఆలయాన్ని మూసివేశారు. సోమవారం తెల్లవారు జామున 5 గంటలకు ఆలయాన్ని తెరిచారు. ప్రత్యేక పూజలు జరిపారు. రాత్రి స్వామి, అమ్మ వారిని అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చిరు. మాఢవీధులు, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. కార్యక్రమంలో ఈవో డీవీ రమణారెడ్డి, ప్రధాన అర్చకులు పాల్గొన్నారు. సమస్యల పరిష్కారంలో అలసత్వం వద్దు రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంలో జిల్లా పోలీసు అధికారులు అలస్వం చేయరాదని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలియపరిచారు. సోమవారం రాయచోటిలోని పోలీసు ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు ఎస్పీ ప్రజల నుంచి వినతులు స్వీకరించారు. అర్జీదారులతో ముఖాముఖి మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కుటుంబ కలహాలు, సైబర్ మోసాలు, తల్లిదండ్రులకు వేధింపులు, భర్త, అత్తారింటి వేధింపులు, నకిలీ పత్రాలు, అధిక వడ్డీలు, ఆన్లైన్ మోసం, ప్రేమపేరుతో మోసం తదితర సమస్యలపై ఫిర్యాదుదారులు నుంచి అర్జీలు అందాయని ఆయన తెలిపారు.సమస్యలపై సంబంధిత పోలీసు అధికారులతో స్వయంగా ఫోన్లో మాట్లాడి సత్వరం బాధితులకు చట్టపరిధిలో తక్షణ న్యాయం అందించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నేడు సమావేశం కడప ఎడ్యుకేషన్ : కడపలోని ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో మంగళవారం ఉదయం 10 గంటలకు డీవీఈఓ ఆధ్వర్యంలో సమావేశం నిర్వహిస్తున్నట్లు ఉమ్మడిజిల్లా అండర్ 19 ఆర్గనైజింగ్ సెక్రటరీ చంద్రమోహన్రాజు తెలిపారు. ఎస్జీఎఫ్ఐ అండర్ 19 స్కూల్ గేమ్స్ సంబంధించి జిల్లా జట్లను ఎంపిక చేయడం కోసం ఈ సమావేశం నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. అన్ని మేనేజ్మెంట్లకు సంబంధించిన పీడీ, పీఈటీ, ఇన్చార్జు పీడీలు తప్పకుండా హాజరు కావాలని ఆయన తెలిపారు. వివరాలకు 9290760996 సంప్రదించాలని కోరారు. జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఎంపిక వేంపల్లె : జాతీయస్థాయి యోగాసన పోటీలకు ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ఎంపికై నట్లు డైరెక్టర్ ఏవీఎస్ కుమారస్వామి గుప్తా పేర్కొన్నారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ క్యాంపస్లో ఇంజనీరింగ్ విభాగంలో చదువుతున్న విద్యార్థులు బి.నాగ పవన్, ఎస్.అరవింద్, జి.విజయ్ కుమార్, డి.రవితేజ రాష్ట్రస్థాయి పోటీలలో పాల్గొని సత్తా చాటారని వెల్లడించారు. ఈనెల 11వ తేదీ నుండి 14వ తేదీ వరకు చత్తీష్ఘట్ బిలయోలో నిర్వహించే యోగాసన భారత్ జాతీయ స్థాయిపోటీల్లో పాల్గొననున్నారు. జాతీయ స్థాయికి ఎంపిక కావడంపై డైరెక్టర్తోపాటు పరిపాలన అధికారి రవికుమార్, డీన్ రమేష్ కై లాస్, అధ్యాపకులు విద్యార్థులను అభినందించారు. -
దేవగుడి x పోట్లదుర్తి
● గండికోటలో పనులు అడ్డుకుంటున్న ఎమ్మెల్యే ఆది వర్గం ● ఎస్పీకి ఫిర్యాదు చేసిన పోట్లదుర్తి నాయకులు ● తలలు పట్టుకుంటున్న అధికారులు టాస్క్ఫోర్సు : జమ్మలమడుగు నియోజకవర్గంలో ఆధిపత్య పోరు రోజు రోజుకు ఎక్కువవుతోంది. నియోజకవర్గంలో ‘పోట్లదుర్తి బ్రదర్స్’ ఎక్కడ పనులు చేపట్టిన ఆ పనులు అడ్డుకోవడం దేవగుడి బ్రదర్స్ అయిన ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి పరిపాటిగా మారిపోయింది. పర్యాటక కేంద్రమైన గండికోటలో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం కేంద్ర ప్రభుత్వం 70 కోట్లకు టెండర్లు పిలిచింది. ఈ టెండర్లను లెస్ వేసి రిత్విక్ కంపెనీ పేరుతో పోట్ల దుర్తి బ్రదర్స్ దక్కించుకున్నారు. ఇటీవల గ్రామంలో రిత్విక్ కంపెనీ గండికోట లో అభివృద్ధి పనులు చేపట్టడం కోసం యంత్రాలతో వెళ్లారు. స్థానిక శాసనసభ్యుడు ఆదినారాయణరెడ్డి స్థానిక నాయకులను రెచ్చగొట్టి పనులు అడ్డుకోవాలని సూచించారు. దీంతో స్థానిక నాయకులు పనులకు అడ్డు తగులుతూ వస్తున్నారు. ఇప్పటికే రెండు సార్లు మొదలు పెట్టగా రెండు సార్లు గ్రామస్తులు పనులు అడ్డుకున్నారు. చేసేదిలేక రిత్విక్ కంపెనీకి చెందిన ప్రతినిధులు ఎస్పీ, కలెక్టర్లకు ఫిర్యాదు చేశారు. స్థానికంగా ఉన్న అధికారులకు ఈ ఇద్దరి వివాదం తలనొప్పిగా మారిపోయింది. సోమవారం గండికోటలో పోలీసు బందో బస్తు మధ్య పనులు చేస్తున్న కంపెనీని సాయంత్రం గ్రామ సర్పంచ్ ఆధ్వర్యంలో స్థానికులు పనులు అడ్డుకున్నారు. కరవమంటే కప్పకు కోపం.. విడవమంటే పాముకు కోపం చందంగా.. స్థానికంగా ఇబ్బందులకు గురి అవుతున్నామంటూ అధికారులు వాపోతున్నారు. గతంలోనూ అంతే.. గతంలో వైఎస్సార్ కడప జిల్లా కొండాపురం మండలంలో టి.కోడురు పంచాయతీ పరిధిలో అదాని గ్రూప్ సోలార్ పవర్ ప్రాజెక్టు పనులకు ఎంపీ రమేష్నాయుడు దక్కించుకున్నారు. ఈ పనులు ప్రారంభించడానికి వెళ్లిన అధికారులపై దాడులు చేసి భయందోళనకు గురి చేశారు. అప్పట్లో ఈ దాడి సంచలనంగా మారింది. అనకాపల్లి ఎంపీ రమేష్ నాయుడు సీరియస్గా తీసుకోవడంతో అధికారులు సైతం అలర్టు అయ్యారు. పనులు చేపట్టడం కోసం భారీ బందోబస్తు ఏర్పాటు చేసి పనులు చేపట్టారు. అలాగే ఇటీవల స్థానిక రైతులకు అదనంగా పరిహారం ఇస్తామన్న హామీని అమలు చేయనందున దానికోసం కంపెనీ ముందు ధర్నా నిర్వహించే విధంగా దేవగుడి సోదరులు పావులు కదిపారు. సీఎంఓ కార్యాలయం నుంచి పోలీసు ఉన్నతాధికారులు ఆదేశాలు రావడంతో హుటాహుటిన డీఎస్పీ స్థానిక పోలీసులతో వెళ్లి స్థానిక నాయకులకు హెచ్చరికలు జారీ చేశారు. దీంతో స్థానిక నాయకులు ధర్నాను విరమించుకున్నారు. అదేవిధంగా ముద్దనూరులో సీఎం సురేష్ నాయుడు వర్గం బ్రాందీషాపు చేజిక్కించుకున్నారు. బ్రాందీషాపు ప్రారంభించటానికి రూములు అద్దెకు ఇవ్వకూడదంటూ ఆదినారాయణరెడ్డి వర్గానికి చెందిన ఓ నాయకుడు భయపెట్టడంతో స్థానికులు బ్రాందీషాపులకు రూములు అద్దెకు ఇవ్వలేని పరిస్థితి ఎర్పడింది. చివరకు బ్రాందీషాపుకు తమకు అప్పగించాలని డిమాండ్ చేశారు. అయితే సురేష్ నాయుడు అప్పటి ఎస్పీని కలిశారు. దీంతో సీరియస్గా తీసుకున్న అధికారులు కంటైనర్లో బ్రాందీషాపును మొదట ప్రారంభింపజేశారు. స్థానికంగానే అమ్మవారి భూ వివాదం... పోట్లదుర్తి గ్రామంలో ఉన్న పెద్దమ్మ అమ్మవారుకు సంబంధించిన భూములు, అభివృద్ధి విషయంతో పోట్లదుర్తి బ్రదర్స్, ఆదినారాయణరెడ్డి వర్గీయుల మధ్య ఘర్షణ ఎర్పడింది. ఎంపీ నిధులకింద అమ్మవారి ప్రాంగణం అభివృద్ధి చేయాలని సీఎంసురేష్ నాయుడు ఆధ్వర్యంలో పనులు చేపట్టారు. అయితే ఆదినారాయణ రెడ్డి వర్గీయులు పనులు అడ్డుకున్నారు. దీంతో రెండు వర్గాల మధ్య రాళ్లతో దాడులు చేసుకున్న పరిస్థితి ఏర్పడింది. ఇలా ప్రతి విషయంలో పోట్లదుర్తి, దేవగుడి వర్గీయుల మధ్య పనులు విషయంలో ఆధిపత్యం కొనుసాగుతూనే ఉంది. తన నియోజకవర్గంలో పోట్లదుర్తి బ్రదర్స్ పెత్తనం ఏమిటంటూ ఆదివర్గం, అధికార పార్టీలో ఉన్న తమ పనులే అడ్డుకుంటార అంటూ పోట్లదుర్తి బ్రదర్స్ పోటా పోటీ పెత్తనం చెలాయిస్తున్నారు. వీరి మధ్య స్థానకంగా ఉన్న అధికారులు ఎవరికి సర్దుబాటు చేయలేక నలిగిపోతున్నారు. మరి ఉన్నతాధికారులు.. ఆయా పార్టీ పెద్దలు ఎలా ముందుకెళతారో కాలమే నిర్ణయిస్తుంది. -
ఆలకించరు..ఆదుకోరు
● ప్రతి సోమవారం కలెక్టరేట్లో ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ ● బాధితులకు తప్పని ఇబ్బందులు రాయచోటి టౌన్/ సంబేపల్లె : అనేక బాధలు వెంటాడుతున్నాయి.. కష్టాలు మెండుగా ఉన్నాయి..ఎన్ని పోరాటాలు చేసినా, ఎంత ఆవేదన వెలిబుచ్చినా న్యాయం దొరకక వ్యయ ప్రయాసలకోర్చి జిల్లా కేంద్రానికి బాధితులు పరుగులు తీస్తున్నారు. అయినా పరిష్కారం దొరకకడంలేదు. పదే పదే తిరుగుతున్నా ఫలితంలేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలోని మూరుమూల ప్రాంతాల నుంచి కూడా ప్రతిసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి ఎన్నెన్నో కష్టాలు, మరెన్నో అవస్థలు పడి ఇక్కడికి వస్తున్నారు. న్యాయం చేయండి సారూ.. వీరి పేర్లు మార్గాని గంగులప్ప, మార్గాని నారాయణమ్మ.వీరిది అన్నమయ్య జిల్లా బి. కోత్తపేట. వీరికి ఒక కొడుకు ఉండే వాడు. రెండు సంవత్సరాల క్రితం చనిపోయాడు. కోడలు కూడా వెళ్లిపోయింది. దీంతో ఒంటరిగా జీవిస్తున్నారు.వీరికి 4.43 ఎకరాల భూమి ఉంది. దానిని సాగు చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. ఇతని తమ్ముడు భూమిని ఆక్రమించుకొనేందుకు సాగు చేసుకోవడానికి వీలు లేకుండా ఇబ్బంది పెడుతున్నాడు. మేము చనిపోతే అడిగే వారు ఎవరూ ఉండరని భావించి అటువైపు రానీయకుండా భయపెడుతున్నాడు. ఈ భూమిని మాకు దక్కేటట్లుగా చేయాలని రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసేందుకు వచ్చామని చెబుతున్నారు.కలెక్టర్కు రెండుసార్లు ఫిర్యాదు చేశాం. అయినా ఫలితం లేదంటున్నారు. ఇప్పటికై నా ఈ సమస్యను పరిష్కరించి న్యాయం చేయాలని వేడుకొంటున్నారు. నా భూమిని ఆక్రమించారు నా పేరు ముత్తన శ్రీరాములు, అన్నమయ్య జిల్లా బి. కోత్తపేట, నామాలపల్లె. మాకు పూర్వీకుల నుంచి మాకు 2.63 ఎకరాల భూమి ఉంది. దానిని మా తాత, మా నాన్న, ఇప్పుడు నేను సాగు చేసేవాడిని. అయితే కొంత కాలంగా ఆరోగ్యం బాగాలేక ఆ భూమిని సాగు చేయడంలేదు. దీంతో మా ఊరికి చెందిన ఇద్దరు వ్యక్తులు భూమిని ఆక్రమించారు.దీనిపై ఇప్పటి వరకు మూడు సార్లు జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేశాం. అధికారులు వస్తారు..భూమిని చూస్తారు...అయినా భూమి మాకు దక్కలేదు. ఇప్పటికై న కలెక్టర్ స్పందించి మాకు న్యాయం చేయాలి. -
వరాలందించే ఆరోగ్యమాత
● విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ ● ఘనంగా ముగిసిన ఆరోగ్యమాత ఉత్సవాలు ముగింపు ఉత్సవాలకు హాజరైన విశ్వాసులు విశేష అలంకారంలో ఆరోగ్యమాత స్వరూపం కడప సెవెన్రోడ్స్ : విశ్వసించిన వారికి వరాలు, దీవెనలు అందించి పరిపూర్ణమైన ఆరోగ్యాన్ని ఆరోగ్యమాత అందజేస్తుందని విశాఖ విశ్రాంత అగ్ర పీఠాధిపతులు మల్లవరపు ప్రకాశ్ అన్నారు. కడప నగరం రైల్వేస్టేషన్ సమీపంలోని ఆరోగ్యమాత పుణ్యక్షేత్రంలో నవదిన పూజ ప్రార్థన దినోత్సవాలు సోమవారంతో ఘనంగా ముగిశాయి. ముగింపు ఉత్సవాలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ నగరంలో ఆరోగ్యమాత ఉండడం రాయలసీమ ప్రాంతానికి ఆశీర్వాదకరమని, పది రోజులుగా ఆరోగ్యమాత నవదిన పూజా ప్రార్థనలు వైభవంగా జరిగాయన్నారు. సాయంత్రం 6 గంటలకు ఆయన ఆరోగ్యమాత పతాక అవరోహణ చేశారు. రెవరెండ్ ఫాదర్ బి.జ్వాన్నేస్, రెవరెండ్ ఫాదర్ డేవిడ్రాజు పరిశుద్ద జపమాల, దివ్యసత్ప్రసాద ఆశీర్వాదం చేశారు. ఉత్సవాల్లో జి.సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎర్రగుడిపాడుకు చెందిన ఏసన్న బృందం చెక్కభజన భక్తులను ఆకట్టుకుంది.ఈ కార్యక్రమంలో గురువులు ఎండీ ప్రసాద్రావు, ఇతర గురువులు, కన్యసీ్త్రలు, పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. -
రుణాల మంజూరుకు చర్యలు తీసుకోవాలి
రాయచోటి : ప్రభుత్వ పథకాలను ప్రజలకు అందించే విషయంలో బ్యాంకర్లు ప్రధాన పాత్ర పోషించాలని డీఆర్ఓ మధుసూదన్రావు పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లోని వీసీ హాలులో డీఆర్ఓ అధ్యక్షతన డిస్ట్రిక్ట్ కన్సల్టేటివ్ కమిటీ (డీసీసీ), డిస్ట్రిక్ట్ లెవల్ రివ్యూ కమిటీ (డీఆల్ఆర్సీ) బ్యాంకర్స్ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా అభివృద్ధిలో ప్రభుత్వంతోపాటు బ్యాంకింగ్ రంగం భాగస్వామ్యం కావాలన్నారు. స్వయం ఉపాధికోసం రుణాల అందజేతకు చర్యలు, వ్యవసాయానికి పంట రుణాలు, ప్రభుత్వ సంక్షేమ పథకాల్లో లబ్ధిదారుల చేరికను పెంచడం, మహిళా స్వయం సహాయక సంఘాలకు లక్ష్యం మేరకు రుణాలు అందించడంలో బ్యాంకర్లు కీలకపాత్ర పోషించాలని డీఆర్ఓ సూచించారు.కార్యక్రమంలో జిల్లా లీడ్ బ్యాంక్ మేనేజర్ ఆంజనేయులు, ఆర్బీఐ ఎల్డీఓ వీన్ కుమార్, స్టేట్ బ్యాంక్ రీజనల్ మేనేజర్ కోటిరెడ్డి, ఆంధ్ర ప్రగతి గ్రామీణ బ్యాంక్ రీజనల్ మేనేజర్ సుశాంత్ కుమార్, నాబార్డు డీడీఎం విజయ విహారి, యూనియన్ బ్యాంక్ డిప్యూటీ రీజనల్ హెడ్ బాషా, కేడీసీసీ బ్యాంక్ సీఈఓ రాజమణి తదితరులు పాల్గొన్నారు. జాబ్మేళా పోస్టర్ ఆవిష్కరణ రాయచోటి జగదాంబసెంటర్ : అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలోని కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం అనంతరం డీఆర్ఓ మధుసూదరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏడీ సర్వేయర్ భరత్కుమార్, జీఎస్డబ్ల్యూఎస్ లక్ష్మీపతి, జిల్లా నైపుణ్య అభివృద్ధి అధికారి దాసరి నాగార్జునతో కలిసి మెగా జాబ్మేళా పోస్టర్ను ఆవిష్కరించారు. ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (ఏపీఎస్ఎస్డీసీ) ఆధ్వర్యంలో రాయచోటిలోని శ్రీ శివ నర్సింగ్ కాలేజీలో ఈ నెల 10వ తేదీన ఉద్యోగమేళా నిర్వహించనున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి దాసరి నాగార్జున తెలిపారు. ఈ ఉద్యోగమేళాలో పలు ప్రముఖ కంపెనీలు పాల్గొంటున్నాయని తెలిపారు. మరిన్ని వివరాలకు 9550104260, 9177143181, 8897776368 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. -
విన్నూత ఆలోచన.. విశిష్ట ఆవిష్కరణ
www. inspireaawards. gov. in వెబ్సైట్లో ఇప్పటికే రిజిస్ట్రేషన్ చేసుకున్న పాఠశాల లాగిన్ ద్వారా సెప్టెంబర్ 15 తేదీలోపు పాఠశాల విద్యార్థులు వారి ఆలోచనలకు అనుగుణంగా రూపొందించిన ప్రాజెక్టుల వివరాలను నమోదు చేయాలి. అవార్డుకు ఎంపికై న ప్రతి విద్యార్థి జిల్లా స్థాయి వైజ్ఞానిక ప్రదర్శనలో తమ ప్రాజెక్టును ప్రదర్శించేందుకు వీలుగా రూ.10 వేల పారితోషికం అందిస్తారు.రాష్ట్ర స్థాయి పోటీల్లో సత్తా చాటి జాతీయ వైజ్ఞానిక ప్రదర్శనకు ఎంపికై న బాల శాస్త్రవేత్తలకు రూ.25 వేల వరకు తమ ప్రాజెక్టును మెరుగుపర్చుకునేందుకు శాస్త్ర సాంకేతిక శాఖ అదనపు నిధులు కేటాయిస్తుంది. ఇన్స్పైర్ మనాక్ పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు రాష్ట్రపతి భవన్ ,జపాన్ సందర్శన అవకాశాలతో పాటు ఇంజనీరింగ్ కాలేజీ విద్యలో మెరుగైన అవకాశాలు లభిస్తాయి. జాతీయ స్థాయిలో ఎంపికై న ప్రాజెక్టుకు పేటెంట్ లభించే అవకాశం కూడా ఉంది. పూర్తి వివరాలకు జిల్లా సైన్సు అధికారులను సంప్రదించాలి. మదనపల్లె సిటీ: బుర్రకు పదునుపెట్టి వినూత్న ఆలోచనలతో పాఠశాల స్థాయి నుంచే సృజనాత్మక ఆలోచనలు చేసేలా విద్యార్థులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం ఇన్స్పైర్ మనక్ పేరిట ప్రతిపాదనలు ఆహ్వానిస్తోంది విద్యార్థులను ప్రోత్సహించి ఉపకార వేతనాలు ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. కేంద్ర శాస్త్ర, సాంకేతిక మండలి, నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ సంయుక్తంగా ఇన్స్పైర్ మనక్ పేరిట ప్రతిపాదనలు పంపించేందుకు సెప్టెంబర్ 15 వరకు గడువు ఇచ్చింది. ఏటా నిర్వహణ కేంద్ర ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక మంత్రిత్వశాఖ వారు ఏటా ఇన్స్పైర్ అవార్డ్స్ మనాక్ పోటీలను నిర్వహిస్తున్నారు. నేషనల్ ఇన్నోవేషన్ ఫౌండేషన్ ,రాష్ట్ర సాంకేతిక మండలి సహకారంతో పాఠశాల విద్యార్థుల కోసం ఈ సరికొత్త వేదికను రూపొందించారు. దీనిలో అన్ని ప్రభుత్వ అనుబంధ విద్యా సంస్థల్లో ఆరు నుంచి పదో తరగతి చదువుతున్న విద్యార్థులు, వారికి బోధించే ఉపాధ్యాయులతో కలిసి పాల్గొనే అవకాశం కల్పించింది. ఇందులో భాగంగా 2025–26 విద్యా సంవత్సరానికి ఇన్స్పైర్ మనాక్ పోటీలకు విద్యార్థుల నుంచి ప్రాజెక్టులను ఆహ్వానిస్తున్నారు. జిల్లాలో 304 ఉన్నత, 162 ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. దీని కోసం 6 నుంచి 10 తరగతుల విద్యార్థులు తరగతికి ఒకరు వంతున పాఠశాలకు ఐదు ప్రాజెక్టులను నమోదు చేసుకునే అవకాశముంది. జిల్లాలో ఇప్పటి వరకు 1120 నామినేషన్లు వచ్చాయి. రాష్ట్రంలోనే జిల్లా ఇప్పటి వరకు మొదటి స్థానంలో ఉంది. దరఖాస్తు చేసుకునే విధానం తొలుత పాఠశాల స్థాయిలో ఐడియా కాంపిటేషన్ నిర్వహించాలి. స్థానిక సమస్యను పరిష్కరించేలా ఐడియా ఉండాలి. తరగతి వారీగా ఉత్తమ ఆలోచనను ఎంపిక చేసి, ఆలోచనకు అవసరమైన ప్రాజెక్టును రూపొందించాలి. విద్యార్థి పేరు, తండ్రి పేరు, తరగతి వివవరాలు నమోదు చేయాలి. విద్యార్థికి సంబంధించి బ్యాంకు ఖాతా నంబరు, ఆధార్ నంబర్, ఎంటర్ చేయాలి. విద్యార్థి ప్రాజెక్టు సంక్షిప్తంగా, రాత పూర్వకంగా పొందుపర్చి,సంబంధిత రైటప్ వెబ్సైట్లో ఎంటర్ చేయాలి. ప్రాజెక్టు పేరు, శాస్త్ర సాంకేతికతను సంబంధించి అంశాలు ఉండేలా చూసుకోవాలి. ప్రాజెక్టుల ఎంపిక రెండు నెలల్లో పూర్తి చేసి జిల్లా స్థాయిలో ప్రకటిస్తారు. తర్వాత వాటిని రాష్ట్ర స్థాయికి ఎంపికకు పంపిస్తారు. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగ నిమిత్తం బ్యాంకు ఖాతాలో రూ.10 వేలు జమ చేస్తారు. దరఖాస్తు చేసుకోవడానికి సెప్టెంబర్ 15 వతేదీ వరకు గడువు ఉంది. జిల్లా స్థాయిలో జరిగిన ఇన్స్పైర్ ప్రాజెక్టులను పరిశీలిస్తున్న డీఈఓ,అధికారులు (ఫైల్), జాతీయ స్థాయికి ఎంపికై న జిల్లా విద్యార్థి ప్రశంసాపత్రం అందకుంటున్న దృశ్యం (ఫైల్) 2022–23 జిల్లా స్థాయికి ఎంపికై నవి: 245 రాష్ట్ర స్థాయికి ఎంపికై నవి: 21 జాతీయ స్థాయికి ఎంపికై నవి: 2 2025–26 ఇప్పటి వరకు 1120 నామినేషన్లు వచ్చాయి. జిల్లా ఇన్స్పైర్ మనక్ వివరాలు 2023–24 నామినేషన్లు: 2700 జిల్లా స్థాయికి ఎంపికై నవి: 326 రాష్ట్ర స్థాయి: జరగాల్సి వుంది జాతీయస్థాయి: జరగాల్సి వుంది 2024–25 నామినేషన్లు: 2350 జిల్లా స్థాయికి ఎంపికై వనవి: 246 రాష్ట్ర స్థాయి: జరగాల్సి వుంది జాతీయ స్థాయి: జరగాల్సి వుంది ఇన్స్పైర్ మనక్ నామినేషన్ల నమోదుకు గడువు పెంపు బాల శాస్త్రవేత్తలను ప్రోత్సహిద్దాం చిన్న వయస్సులోనే విద్యార్తులను పరిశోధనల వైపు ప్రేరించడానికి ఇన్స్పైర్ అవార్డు పథకం ఉపయోగపడుతుంది. గైడ్ టీచర్లకు శిక్షణ ఇచ్చాం. ఎప్పటికప్పుడు సందేహాలు నివృత్తి చేస్తున్నాము. అగ్రస్థానమే లక్ష్యంగా సైన్స్ ఉపాధ్యాయులు పని చేస్తున్నారు. అందరి సహకారంతో లక్ష్యాన్ని సాధిస్తాం. –మార్ల ఓబుల్రెడ్డి,జిల్లా సైన్స్ అధికారిఅగ్రస్థానమే లక్ష్యం గత సంవత్సరం జిల్లా రాష్ట్రంలో మూడోస్థానం నిలిచింది. ఈ ఏడాది అగ్రస్థానమే లక్ష్యంగా 3000 ప్రాజెక్టులు సమర్పించాలని అధికారులు నిర్దేశించారు. ఇది సాధించడానికి ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలన్నీ నామినేషన్లు సమర్పించాలి. నమోదు వేగవంతం చేయడం ద్వారా విద్యార్థులు తమ ప్రతిభను ప్రద్శించడానికి సరైన వేదికను అందించినట్లు అవుతుంది. –సుబ్రమణ్యం జిల్లా విద్యాశాఖ అఽధికారి -
జిల్లా బ్యాడ్మింటన్ జట్ల ఎంపిక
జమ్మలమడుగు రూరల్ : వైఎస్సార్ జిల్లా బాల్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఉమ్మడి జిల్లా (వైఎస్సార్, అన్నమయ్య) జిల్లా స్థాయి జూనియర్ బాల బాలికల జట్ల ఎంపికలు నిర్వహించారు. ఆదివారం జమ్మలమడుగు మండలంలోని ఎస్.ఉప్పలపాడు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో ఎంపికలను జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు క్రిష్ణమూర్తి, వెంకటరమణ ఆధ్వర్యంలో నిర్వహించారు. అన్ని మండలాల నుంచి దాదాపు 50 మంది క్రీడాకారులు హాజరయ్యారు. జూనియర్ జిల్లా జట్టుకు బాలురు 10 మందిని, బాలికలు 10 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులు ఈ నెల 12, 13, 14వ తేదిల్లో అనంతరపురం జిల్లా బత్తలపల్లి మండలం రామాపురం గ్రామంలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని నిర్వాహకులు తెలిపారు.ఈ కార్యక్రమంలో సెలక్షన్ కన్వీనర్ ఓబయ్య, జిల్లా కార్యవర్గ సభ్యులు, వివిధ మండలాల అధ్యక్ష కార్యదర్శులు, సెలక్షన్ కమిటీ మెంబర్లు, సీనియర్ క్రీడాకారులు, వ్యాయామ ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జిల్లా బాలుర జట్టు మహమ్మద్ బాబా (రాజంపేట) కె.కౌశిక్, హైడెన్, డి.రాజేష్, వెంకటేశ్, చిన్న ఓబులేసు (దువ్వూరు) డి.షడ్రక్, రఫెల్ (చిన్న సింగనపల్లె) ఎస్.మురళి, రాజు (ఒంటిమిట్ట) ఎస్. షాజిద్(రాజంపేట) జిల్లా బాలికల జట్టు డి.కీర్తి, డి.నయోమి (చిన్న సింగనపల్లె) ఎం.స్వీటీ (ఎస్.ఉప్పలపాడు) జి.వర్షిణీ (తాళ్ల ప్రొద్దుటూరు) ఎం.గౌతమి, జి.సునంద, కె.చెర్లీన్, ఎస్.అశ్వీనీ, ఎస్.లక్ష్మీ (చియ్యపాడు) సౌత్జోన్ అండర్–23 మల్టీడే మ్యాచ్లు ప్రారంభం కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ అండర్–23 మల్టీ డే మ్యాచ్లు ప్రారంభం అయ్యాయి. ఆదివారం వైఎస్ఆర్ఆర్ క్రికెట్ స్టేడియంలో అనంతపురం– చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన అనంతపురం జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 50.5 ఓవర్లలో 180 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అర్జున్ టెండ్కూలర్ 64, వికాస్ 53 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని ముఖేష్ చక్కగా అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. రెడ్డి ప్రకాశ్ 2, బాలాజీ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన చిత్తూరు జట్లు 33 ఓవర్లకు 5 వికెట్లు కోల్పోయి 132 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 73, రెడ్డి ప్రకాశ్ 20 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని ప్రమోద్ కుమార్ 3 వికెట్లు తీశాడు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో కడప– నెల్లూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 43.5 ఓవర్లకు 257 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని భరత్రెడ్డి 66, ఎస్ఎండి ఆయూబ్ 51, శివ కేశవ 41 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని అఖిల్ 5, ఇకాక్షర్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 35.5 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 140 పరుగులు చేసింది. ఆ జట్టులోని సోహన్ వర్మ 53, శ్రీహర్ష 31 పరుగులు చేశారు. కడప జట్టులోని వరుణ్తేజ్ రెడ్డి 3 వికెట్లు, చెన్నారెడ్డి 1 వికెట్ తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. లాండ్రీ షాపులో అగ్నిప్రమాదంమైదుకూరు : లాండ్రీ నిర్వహిస్తున్న ఓ ఇంటిలో ఆదివారం విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో అగ్ని ప్రమాదం సంభవించి రూ.5 లక్షల మేర నష్టం వాటిల్లింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ప్రొద్దుటూరు రోడ్డు రాజారెడ్డి వీధిలో ఉంటున్న కంచర్ల ఆంజనేయులు నివాసం ఉంటున్న ఇంటిలోనే లాండ్రీ నిర్వహిస్తున్నాడు. ఆదివారం మధ్యాహ్నం స్విచ్ బోర్డులో షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు రేగి అగ్ని ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో ఫ్రిడ్జ్, మోటార్, టీవీ, బియ్యంతోపాటు ఇంట్లో ఉంచిన బంగారు ఆభరణాలు, నగదు, శుభ్రం చేసి ఇసీ్త్ర చేసేందుకు తీసుకొచ్చిన పలువురి పట్టుచీరలు, దుస్తులు అగ్నికి ఆహుతి అయ్యాయి. బాధిత కుటుంబ సభ్యులు కట్టుబట్టలతో మిగిలారు. ప్రొద్దుటూరు అగ్నిమాపక కేంద్రం నుంచి అగ్నిమాపక అధికారి, సిబ్బంది సంఘటన జరిగిన ఇంటి వద్దకు చేరుకుని మంటలను ఆర్పివేశారు. తమను ప్రభుత్వం ఆదుకోవాలని బాధితుడు ఆంజనేయులు కోరారు. -
సైడ్ ఎఫెక్ట్ లేని వైద్యం
హెల్దీ ఏజింగ్ లక్ష్యంగా వృద్ధులకు ఆయుష్షు పెరగడమే కాక ఆరోగ్యకరమైన జీవనశైలి కల్పించడంలోనూ ఫిజియోథెరపీ ఎంతగానో ఉపయోగపడుతుంది. కొన్ని వ్యాధులకు కనీసం మాత్ర కూడా వేసుకోకుండానే ఫిజియోథెరపీ ద్వారా నయం చేయవచ్చు. జిల్లాలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియోథెరపీ సేవలు అందుబాటులో ఉన్నాయి. రోగులు ఉచితంగా ఫిజియోథెరపీ సేవలు పొందవచ్చు. ఫిజియోథెరపీ వల్ల ఎలాంటి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. – డాక్టర్ పి.మహమ్మద్ సమియుల్లాఖాన్, ఫిజియోథెరపిస్టు, ప్రభుత్వ ఆసుపత్రి, జమ్మలమడుగు -
రోడ్డు ప్రమాదంలో ఉద్యోగి దుర్మరణం
మైదుకూరు : గుర్తుతెలియని వాహనం ఢీకొని ఆదివారం చిత్తూరు– కర్నూలు జాతీయ రహదారి బైపాస్పై కలసపాడుకు చెందిన వ్యవసాయ సహకార సంఘం ఉద్యోగి షేక్ ఖాదర్ హుస్సేన్ (52) దుర్మరణం చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. కలసపాడులోని పోలేరమ్మ వీధికి చెందిన ఖాదర్ హుస్సేన్ గ్రామంలోని ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో సీనియర్ అసిస్టెంట్గా పని చేస్తున్నాడు. ఆదివారం బ్యాంక్ పని మీద వెళుతున్నాను అంటూ భార్య ఫాతిమాకు చెప్పి మోటార్ బైక్పై బయల్దేరారు. మైదుకూరు శివారులో జాతీయ రహదారి బైపాస్పైన ఎదురుగా వస్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. సంఘటనలో బైక్పై ఉన్న ఆయన తీవ్ర రక్తగాయాలతో అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని మైదుకూరు అర్బన్ పోలీసులు పరిశీలించి ఖాదర్ హుస్సేన్ మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరుకు తరలించారు. మృతునికి మొదటి భార్య ద్వారా ఒక కుమారుడు, ఆమె మృతి చెందిన తర్వాత చేసుకున్న రెండో భార్య ఫాతిమాకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. -
నొప్పి మాయం.. సర్జరీ దూరం
● ఫిజియోథెరపీ దివ్య ఔషధం ● దీర్ఘకాలిక సమస్యలకు పరిష్కారం ● నేడు ప్రపంచ ఫిజియోథెరపీ దినోత్సవంరాజంపేట టౌన్ : ఇప్పుడు వయసుతో నిమిత్తం లేకుండా ప్రజలు వివిధ జబ్బుల బారిన పడుతున్నారు. ఇంకా చెప్పాలంటే తల్లి గర్భం నుంచే అనేక మంది అనారోగ్య సమస్యలతో పుడుతున్నారు. నరాలు, కండరాలు, బుద్ధిమాద్యం వంటి సమస్యలు అనేక మందికి పుట్టుకతోనే వస్తున్నాయి. వీటితోపాటు ఒక వయసు వచ్చాక ఏ కారణం చేత అయినా మనిషి మానసిక సమస్యలు, శారీరక నొప్పులతోపాటు పక్షవాతం తదితర వ్యాధుల బారిన పడతారు. ఇలాంటి వారిని ఆరోగ్యవంతుడిగా చేసేందుకు ఫిజియో థెరపీ ఎంతగానో దోహద పడుతుంది. మర్దనాలు, వ్యాయామాలకు ఆధునిక వైద్య పరికరాలు ఉపయోగించి చికిత్సలు అందించే విధానం ప్రస్తుతం అందుబాటులో ఉంది. కొంత కాలంగా ఫిజియోథెరపీ వైద్యంపై ప్రజల్లో అవగాహన బాగా పెరిగింది. ముఖ్యంగా పక్షవాతం వంటి జబ్బులకు థెరపీ సేవలతో ఆరోగ్య సిరిని సొంతం చేసుకోవచ్చని వైద్యులు చెబుతున్నారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో.. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో పలు ప్రభుత్వ ఆసుపత్రుల్లో ఫిజియో థెరపీ వైద్య సేవలు అందుబాటులో ఉన్నాయి. అలాగే 51 మండలాల్లో ఉన్న భవిత కేంద్రాల్లో అంగవైకల్యం, బుద్ధిమాంద్యం పిల్లలకు ఫిజియోథెరపీ సేవలను వైద్యులు అందిస్తున్నారు. ఇదిలా వుంటే భారతదేశంలో ఫిజియోథెరపీ సేవలు 1951వ సంవత్సరం నుంచి అందుబాటులోకి వచ్చాయి. సెప్టెంబర్ 8న ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకోవాలని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్ఓ) తీర్మానించింది. అందువల్ల 1996 నుంచి ఫిజియోథెరపీ దినోత్సవాన్ని జరుపుకొంటున్నారు. ఇవీ ప్రయోజనాలు ఫిజియోథెరపీ వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. ముఖ్యంగా ఒక వయసు వచ్చిన వారిని పట్టిపీడించే ప్రధాన సమస్య కండరాలు పట్టేయడం. అలాగే శరీరంలో వివిధ భాగాల్లో తలెత్తే నొప్పుల సమస్య. అయితే ఈ నొప్పులు రెండు రకాలు ఉంటాయని వైద్యులు చెబుతున్నారు. ఒకటి మెకానికల్ పెయిన్స్, రెండవది ఫిజికల్ పెయిన్స్. మెకానికల్ పెయిన్స్కు ఫిజియోథెరపీ బాగా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. పని చేసేటప్పుడు నొప్పులు ఎక్కువగా ఉండటం, విశ్రాంతి సమయంలో నొప్పులు తక్కువగా ఉంటే దీనిని మెకానికల్ పెయిన్స్గా వైద్యులు నిర్ధారించారు. అలాగే విశ్రాంతి సమయంలో నొప్పులు ఎక్కువగా ఉంటే దీనిని ఫిజికల్ పెయిన్గా వైద్యులు పేర్కొంటున్నారు. మనిషి నొప్పులను బట్టి వైద్యులు ఫిజియోథెరపీ ప్రారంభిస్తారు. ఇలాంటి నొప్పులకు ఫిజియోథెరపీ దివ్య ఔషధంలా పని చేస్తుందని వైద్యులు చెబుతున్నారు. నడుం, మోకాళ్ల నొప్పులకు చక్కటి పరిష్కారం చాలా మందికి ఒక వయసు వచ్చాక నడుము, మోకాళ్ల నొప్పుల సమస్యలు పట్టిపీడిస్తుంటాయి. కొంత మంది ఈ నొప్పులు తట్టుకోలేక ఆపరేషన్లు కూడా చేయించుకుంటారు. అయితే నొప్పులు ప్రారంభమైన వెంటనే ఫిజియోథెరపీ చేయించుకుంటే ఆపరేషన్ అవసరం ఉండదని వైద్యులు చెబుతున్నారు. చిన్నపాటి వ్యాయామాలతో శాశ్వత పరిష్కారం ఉంటుందని వైద్యులు పేర్కొంటున్నారు. వయసుతో సంబంధం లేకుండా ఎవరైనా ఫిజియోథెరపీ చేయించుకోవచ్చు. ప్రసవం తరువాత వచ్చే సమస్యలు నయం మహిళలకు ప్రసవం తరువాత వచ్చే సమస్యలకు ఫిజియోథెరపీ వైద్యం చాలా ఉపయోగపడుతుంది. ముఖ్యంగా ప్రసవం తరువాత నడుం నొప్పి, మెడనొప్పితో మహిళలు బాధపడుతుంటారు. గర్భం దాల్చినప్పుడు శరీరంలో వచ్చే మార్పులే ఇందుకు ప్రధాన కారణం. అనుభవం ఉన్న థెరపీ వైద్యులతో ఈ సమస్యకు చక్కటి పరిష్కార మార్గం లభిస్తుంది. పక్షవాతానికి తిరుగులేని వైద్యం ఫిజియోథెరపీ పక్షవాతానికి తిరుగులేని వైద్యం అని వైద్యులు చెబుతున్నారు. గతంలో పక్షవాతం వస్తే మనిషి మంచానికే పరిమితం అయ్యేవారు. అయితే థెరపీ కారణంగా ఏడాదిలోపే పక్షవాతం వచ్చిన వారు కోలుకొని తమ పనులు చేసుకోగలుగుతున్నట్లు వైద్యులు చెబుతున్నారు. ఇదిలావుంటే మెదడులో రక్తనాళాలకు రక్తం అందకపోతే నాడి కణజాలం చనిపోయి పక్షవాతానికి దారితీస్తుంది. థెరపీ వ్యాయామాల వల్ల తిరిగి మెదడు తద్వారా కండరాలు పని చేయడం ప్రారంభిస్తాయి. -
అనుమానాస్పద స్థితిలో వివాహిత మృతి
చిట్వేలి : మండల పరిధిలోని నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన దాసరి ప్రశాంతి(25) అనుమానాస్పద స్థితిలో మృతి చెందినట్లు ఆదివారం ఉదయం చిట్వేలి పోలీసులకు ఫిర్యాదు అందింది. వివరాలు ఇలా ఉన్నాయి. నెల్లూరుటౌన్ గాంధీ గిరిజన కాల నీకి చెందిన ప్రశాంతికి అన్నమయ్య జిల్లా చిట్వేలి మండలం నేతివారిపల్లి ఎస్టీ కాలనీకి చెందిన రాజేష్తో తొమ్మిది నెలల క్రితం వివాహం జరిగింది. తరువాత కొన్నాళ్ల నుంచి కుటుంబ కలహాలు మొదలు కావడం, అత్తారింటి వేధింపులు ఎక్కువ కావడంతో అనుమానస్పదంగా మృతి చెందినట్లు మృతురాలి తండ్రి దాసరి రమేష్ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గ్రహణం ఎఫెక్ట్.. ఆలయాలు మూసివేత
కడప సెవెన్రోడ్స్: సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా ఆదివారం కడప నగరంలోని ఆలయాన్నింటిని మూసివేశారు. ఆదివారం రాత్రి సంపూర్ణ చంద్రగ్రహణం భారతదేశంలో ఏర్పడింది. ఈ కారణంగా దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయాన్ని మధ్యాహ్నం 1.50 గంటలకు మూసివేశారు. సోమవారం తెల్లవారుజామున ఉదయం 6.00 గంటల నుంచి భక్తులకు స్వామి వారి దర్శనభాగ్యం కల్పించనున్నారు. అలాగే మున్సిపల్ హైస్కూలు వద్దగల శ్రీ రాజరాజేశ్వరీదేవి ఆలయం, గడ్డిబజారులోని శ్రీ బాలాజీ ఆలయం, బిల్టప్ వద్దగల శ్రీ విజయదుర్గాదేవి ఆలయం, శ్రీ కన్యకా పరమేశ్వరీదేవి ఆలయంతోపాటు ఇతర ఆలయాలను కూడా మూసివేశారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఆదివారం మూతపడింది. సంపూర్ణ చంద్రగ్రహణం కారణంగా రామాలయాన్ని మధ్యాహ్నం 1:50 గంటలకు మూసివేసినట్లు ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ తెలిపారు. తిరిగి సోమవారం తెల్లవారుజామున సుప్రభాతసేవ, ఆలయశుద్ధి, పుణ్యహవచనం, సంప్రోక్షణ, నివేదన అనంతరం యథావిధిగా భక్తులను స్వామివారి దర్శనానికి అనుమతిస్తామన్నారు. ఈ విషయాన్ని భక్తులు గమనించాలని కోరారు. కార్యక్రమంలో ఆలయ విజిలెన్స్ అధికారి గంగులయ్య, అర్చకులు శ్రావణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. రాయచోటి టౌన్: చంద్రగ్రహణం సందర్భంగా రాయచోటిలోని శ్రీ వీరభద్రస్వామి ఆలయాన్ని మూసివేశారు. అలాగే పాత రాయచోటిలోని శ్రీ అగస్తేశ్వర స్వామి ఆలయం, చెక్పోస్ట్ వద్ద వెలసిన శివాలయాలను మూసివేశారు. ఒంటిమిట్ట రామాలయ ప్రధాన గోపుర ద్వారాన్ని మూసివేస్తున్న దృశ్యం రాయచోటి శ్రీ వీరభద్రస్వామి ఆలయ తలుపులు వేస్తున్న అర్చకులు మూసివేసిన దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయం -
సర్కారు దవాఖానా.. ఓపీ రాసేదెవరన్నా..
● ఇదీ సిద్దవటం ఆస్పత్రి తీరు ● రోగులపై నర్సు ఆగ్రహంసిద్దవటం : సిద్దవటం ప్రభుత్వ ఆస్పత్రిలో ఆదివారం ఓపీ రాసేందుకు కూడా దిక్కులేకుండా పోయింది. పై పెచ్చుగా ఆసుపత్రికి వచ్చిన రోగులపై డ్యూటీ నర్సు ఆగ్రహం వ్యక్తం చేయడంతో మహిళా డాక్టర్కు ఫిర్యాదు చేశారు. ఇటీవల వాతావరణంలో చోటుచేసుకున్న మార్పుల వల్ల వైరల్ జ్వరాలు విజృంభించాయి. కుటుంబంలో ఒకరిద్దరికి జ్వరాలు సోకాయి. సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో రోజుకు 250 ఓపీల సంఖ్య ఉందంటేనే పరిస్థితి ఎలా ఉందో అర్థం చేసుకోవచ్చు. ఆసుపత్రికి వచ్చే రోగుల పట్ల కనీస మర్యాద లేకుండా.. ‘ఇవాళ ఆదివారం ఒక డాక్టర్ మాత్రమే ఉంటారని ఓపీ రాయం, బీపీ చూడం, కట్టు కట్టం’ అంటూ నర్సు విచక్షణ కోల్పోయి మాట్లాడటం పట్ల రోగులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం పేద ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేందుకు వేల కోట్లు వెచ్చించి కోట్లాది రూపాయలు ఉద్యోగులకు జీతాలు చెల్లిస్తుందని, అలాంటిది రోగుల పట్ల నర్సు కనీస మర్యాద లేకుండా ప్రవర్తించారని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉన్నతాధికారులు స్పందించి ఆమైపె చర్యలు తీసుకోవాలని వారు కోరుతున్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన కారు
కురబలకోట : కురబలకోట మండలం కంటేవారిపల్లె వద్ద హైవే పక్కనున్న టెర్రకోట కళాకారుడు మనోహర్ ఇంటిలోకి ఆదివారం ఉదయం కారు అదుపు తప్పి దూసుకెళ్లింది. బాధితుల కథనం మేరకు.. పలమనేరుకు చెందిన నలుగురు యువకులు ఆదివారం హార్సిలీహిల్స్కు కారులో బయలు దేరారు. కొంత సేపట్లో హిల్స్ చేరుకోవాల్సి ఉండగా.. సమీపంలోని కంటేవారిపల్లె వద్ద హైవే పక్కన అదుపు తప్పి ఏకంగా టెర్రకోట స్టాల్ ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ఘటన కలకలం సృష్టించింది. స్థానికులు ఒక్కసారిగా హతాశులయ్యారు. ఏమైందో ఏమోనని కలవరపడ్డారు. దూసుకెళ్లిన కారు ఒక్కసారిగా ఆగిపోయింది. ఊహించని ఈ సంఘటనలో అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదు. టెర్రకోట స్టాల్లోని కుండలు, బొమ్మలు నలిగిపోయాయి. రేకుల షెడ్డు ఊడిపడింది. టీవీఎస్ వాహనం, మరో మోటార్ సైకిల్ ధ్వంసమైంది. రూ.3 లక్షలకు పైగా ఆస్తి నష్టం సంభవించినట్లు బాధితులు తెలిపారు. కుర్రోళ్లు ఆదమరచి డ్రైవింగ్ చేయడంతో ఈ సంఘటన చోటు చేసుకున్నట్లు భావిస్తున్నారు. ఆ సమయానికి అక్కడ పెద్దలు టెర్రకోట కుండల పనులు చేసుకుంటున్నారు. పిల్లలకు సెలవు కావడంతో ఆడుకుంటున్నారు. ఇద్దరి పిల్లల్ని సెకన్ల ముందే కుటుంబీకులు లోనికి తీసుకెళ్లారు. దీంతో ఎవ్వరూ ఆ సమయంలో లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. కారు ఇంకొంచెం లోనికి వెళ్లి ఉంటే పెను ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు చెబుతున్నారు. ఆస్తి నష్టం తప్ప ప్రాణ నష్టం లేకపోవడంతో హమ్మయ్యా.. అంటూ అంతా ఊపిరి పీల్చుకున్నారు.తప్పిన ప్రమాదం -
భారత్ అగ్రదేశంగా అవతరించడమే మోదీ లక్ష్యం
రాజంపేట టౌన్ : భారతదేశం అగ్రదేశంగా అవతరించడమే ప్రధాన మంత్రి నరేంద్రమోదీ లక్ష్యమని రాష్ట్ర వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. రాజంపేటకు చెందిన నాగోతు రమేష్నాయు డు బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా ఎన్నికై న తరువా త తొలిసారిగా రాజంపేటకు విచ్చేసిన సందర్భంగా శనివారం పట్టణంలోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్లో బీజేపీ నాయకులు, కార్యకర్తలు అభినందన సభ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి మంత్రి ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. దేశ ఆర్దిక వ్యవస్థ దివాలా తీసిన తరుణంలో నరేంద్రమోదీ ప్రధాని అయ్యాక గాడిలో పెట్టారన్నారు. 2032 నాటికి భారతదేశం రెండవ అతిపెద్ద ఆర్థిక దేశంగా అవతరించబోతుందని ఆశాభావం వ్యక్తం చేశారు. కష్టపడి పనిచేసే కార్యకర్తలకు బీజేపీలో పదవులు వస్తాయని తెలిపారు. బీజేపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు, ఆదోని, జమ్మలమడుగు ఎమ్మెల్యేలు అరవ శ్రీధర్, డాక్టర్ పార్థసారధి, ఆదినారాయణరెడ్డి, ఎమ్మెల్సీ జకియాఖానం, బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్, టీడీపీ నియోజకవర్గ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు తదితరులు పాల్గొన్నారు. సోలార్ సిస్టం ప్రారంభించిన మంత్రి ఓబులవారిపల్లె : మంగంపేట గల్లా పెట్రోల్ బంక్లో శనివారం ఆరోగ్య శాఖా మంత్రి సత్యకుమార్ సోలార్ సిస్టమ్ను ప్రారంభించారు. అనంతరం మంగంపేట గ్రామస్తులు తమ సమస్యలు పరిష్కరించాలని మంత్రి దృష్టికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర కార్యదర్శి ఎన్.రమేష్ నాయుడు, గల్లా శ్రీధర్, బీజేపీ నాయకులు పాల్గొన్నారు. జెండా ఆవిష్కరణ వీరబల్లి : వీరబల్లి మండలం సానిపాయి గ్రామంలో రాయచోటి అసెంబ్లీ కన్వీనర్ ముక్కుపోకు రమణ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ జెండా ఆవిష్కరించారు. ఈ కార్యక్రమంలో పలువురు నాయకులు పాల్గొన్నారు. వైద్య ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ -
పిల్లల రక్షణ చట్టాల అమలుపై సమీక్ష
కడప అర్బన్ : రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ ఆదేశాల మేరకు జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి.యామిని, సీనియర్ సివిల్ జడ్జి, జిల్లా న్యాయసేవాధికార సంస్థ సెక్రటరీ ఎస్. బాబా ఫకృద్దీన్ ఆధ్వర్యంలో శనివారం కడపలోని కోర్టు ప్రాంగణంలో గల న్యాయ సేవా సదన్లో శ్రీబాలల న్యాయం, పిల్లల రక్షణ చట్టాల అమలులో సమస్యలు, సవాళ్ల్ఙు మొదలగు అంశాలపై జిల్లా అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి. యామిని మాట్లాడుతూ శ్రీబాలల న్యాయం, జేజేబీ చట్టం 2015, పోక్సో చట్టం 2012, పీసీఎంఏ 2006, బాల కార్మిక (నిషేధ మరియు నియంత్రణ) చట్టం 1986, పీసీ మరియు పీఎన్డీటీ చట్టం 1994, ఆర్టీఈ 2009, హెచ్ఏఎంఏ చట్టం 1956, ఆంధ్రప్రదేశ్ పంచాయతీ వికాస చట్టం 1977, ఎంటీపీ చట్టం 2021, అంగీకారాలు ఉన్న వ్యక్తుల హక్కుల చట్టం 2016 మొదలగు చట్టాల అమలులో సమస్యలు, సవాళ్లు మొదలు అంశాలపై వివరించారు. శాఖల వారీగా సమస్యలు, సవాళ్లు అంశాలను ఎదుర్కొంటున్న సమస్యలపై చర్చించారు. బాల్య వివాహాలు, గర్భధారణ, పిల్లల ఆరోగ్యం, విద్య, పునరావాసం, ప్రభుత్వ పథకాలు, దూరప్రాంతాల పిల్లల సదుపాయాలు అనే అంశాలను వివరించారు. లీగల్ సర్వీసెస్ హెల్ప్ లైన్ నెంబర్ 15100, చైల్డ్ హెల్ప్ లైన్ నెంబర్ 1098, దివ్యాంగ జన్ హెల్ప్ లైన్ నెంబర్ 14456 అంశాలపై అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో ఫస్ట్ అడిషనల్ జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఆఫ్ ఫస్ట్ క్లాస్ కడప కం జ్యువెనల్స్ బోర్డ్ ప్రిన్సిపల్ మెజిస్ట్రేట్ కె. భార్గవి, జిల్లాలో వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
ఏమని పిలవాలి..
ప్రస్తుతం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా పిలవాలో, వైద్య కళాశాలగా పిలవాలో తెలియని పరిస్థితి నెలకొంది. అయితే విచిత్రంగా ప్రభుత్వం రెండు పోస్టులు కొనసాగిస్తోంది. జిల్లా ఆస్పత్రికి ఉండే సూపరిండెంట్ పోస్టు, వైద్య కళాశాలకు ఉండే ప్రిన్సిపాల్ పోస్టును కొనసాగిస్తోంది. ఈ రెండు పోస్టులకు సీనియర్ అధికారి కోటేశ్వరీకి అప్పగించారు. ప్రిన్సిపాల్గా బాధ్యతలు చూసేందుకు వైద్య కళాశాల కొనసాగలేదు. సూపరిండెంట్గా ఉండేలా జిల్లా ఆస్పత్రిని చేసినట్టుగా కూడా లేదని తెలుస్తోంది. అయితే రెండు పోస్టులు కొనసాగిస్తుండటంతో జిల్లా ఆస్పత్రి, వైద్య కళాశాల రెండు కొనసాగుతున్నట్టుగానే భావించాల్సి వస్తుంది. -
చెరువు మట్టి.. నిలువునా లూటీ !
● రెచ్చిపోతున్న రియల్ మాఫియా ● చేతులు కట్టుకున్న అధికార యంత్రాంగం సర్కారుతోపు వద్ద హైవే పక్కన రియల్ భూమి చదునుకు తోలుతున్న చెరువు మట్టి నార్లపల్లె చెరువులో రెండు జేసీబీలు, పలు టిప్పర్లతో మట్టి తరలిస్తున్న దృశ్యం కురబలకోట : మండలంలోని నార్లపల్లె చెరువును మట్టి మాఫియా కబలిస్తోంది. జేసీబీలు, టిప్పర్లతో యథేచ్ఛగా మట్టితోలి అమ్మి సొమ్ము చేసుకుంటున్నారు. మూడు రోజులుగా చెరువులో జేసీబీలతో టిప్పర్లతో పబ్లిక్గా మట్టి తోలుతున్నా అధికార యంత్రాంగం మాత్రం చేతులు కట్టుకుని చోద్యం చూస్తున్నట్లుగా ఉంది. పరిసర గ్రామాల రైతులు నిట్టూరుస్తున్నారు. యథేచ్ఛగా అక్రమంగా చింతమాకులపల్లె సచివాలయం ఎదురుగా హైవే పక్కన ఉన్న రియల్ భూములకు ఈ మట్టి తోలుతున్నారు. అధికార యంత్రాంగం పట్టించుకోకపోవడం విడ్డూరంగా ఉందని విమర్శిస్తున్నారు. అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు మట్టిమాఫీయాకు మద్దతుగా నిలిచినట్లు చెబుతున్నారు. నాణ్యమైన మట్టి గ్రావెల్ కావడంతో ఈ చెరువు మట్టిని లూటీ చేస్తున్నారు. సంబంధిత అధికారులకు సమాచారం ఇచ్చినా వారు పట్టించుకోకపోవడం విడ్డూరంగా వుంది. వా మౌనంపై పరిసర గ్రామాల వారు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. టిప్పర్ మట్టి దూరాభారం బట్టి రూ. 10 వేల నుండి రూ.20 వేల వరకు కూడా పలుకుతోంది. మట్టి తోలడం ఆపకపోతే మట్టి మాఫియాను వారి వెనుక ఉన్న అధికార పార్టీ నాయకుడిని తరిమికొడతామని నార్లపల్లె చెరువుకు చెందిన ఆయకట్టు రైతులు హెచ్చరిస్తున్నారు. తరచూ ఇటుక బట్టీల నిర్వాహకులు కూడా ఈ మట్టిపై కన్నేసి కొల్లగొడుతున్నారు. కొందరు నాయకులు మట్టి తోలి జేబులు నింపుకుంటున్నారు. ఎలాంటి అనుమతులు లేకుండానే ఈ చెరువును క్యాష్ మైన్స్గా వాడుకుంటున్నారు. పల్లె ప్రాణం చెరువు. ఇలాంటి చెరువును కొల్లగొడుతుండడంతో స్థానికంగా ఉద్రిక్త పరిస్థితులకు కూడా ఆస్కారం ఇస్తోంది. మట్టి మాఫియా నిర్వాకంపై జిల్లా కలెక్టర్కు కూడా ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. సంబంధిత అధికారులను విచారించగా చెరువు మట్టి తోలకుండా కఠిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
● బొప్పాయి రైతులను ఆదుకుంటాం: కలెక్టర్ శ్రీధర్
చిట్వేలి: బొప్పాయి రైతులను ఆదుకుంటామని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అన్నారు. శనివారం మండలంలోని ఎం గొల్లపల్లి, దేవమాచుపల్లిలో బొప్పాయి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడారు. అనంతరం తహసీల్దార్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడుతూ చిట్వేలి, పెనగలూరు మండలాల్లో 58400 టన్నుల బొప్పాయిని రైతులు సాగుచేస్తున్నారన్నారు. ప్రస్తుతం 34500 టన్నులు విక్రయించగా 23900 టన్నుల పంట ఉందన్నారు. రైతులు, ట్రేడర్లు, దళారులను సమావేశ పరిచి బొప్పాయి కిలోకు రూ. 8 ధరగా నిర్ణయించారు. ధరలు తగ్గకుండా ఉండేందుకు పోలీసు, రెవెన్యూ, హార్టికల్చర్, ఇతర ప్రభుత్వ శాఖలను సమన్వయం చేసి చెక్పోస్టులు ఏర్పాటు చేశామన్నారు.రైతులకు సమాచారం అందించేందుకు ప్రత్యేకంగా కంట్రోల్ రూము కూడా ఏర్పాటు చేసినట్లు తెలిపారు. దేవమాచుపల్లిలో బొప్పాయి రైతులతో మాట్లాడుతున్న కలెక్టర్ శ్రీధర్ -
‘యూరియా అందుబాటులో ఉంది’
రాయచోటి: జిల్లాలో యూరియా అందుబాటులో ఉందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శనివారం రాత్రి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లాలోని యూరియా నిల్వ, బొప్పాయికి మద్దతు ధర తదితర అంశాలపై కలెక్టర్ జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడుతో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. తప్పుడు కథనాలతో రైతులను ఆందోళనకు గురిచేస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అధికారులు, ట్రేడర్స్, రైతు సంఘాల సమన్వయంతో బొప్పాయి ధర నిర్ణయించినట్లు చెప్పారు. టాప్ గ్రేడ్ బొప్పాయి కిలో రూ. 8, సెకండ్ గ్రేడ్ కిలో రూ. 7.50లుగా నేడు నిర్ణయించారన్నారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు మాట్లాడుతూ జిల్లాలో పంట తక్కువగా సాగు చేస్తున్నందున యూరియా అవసరం తక్కువగా ఉంటుందన్నారు. ప్రైవేట్ డీలర్ల వద్ద, రైతు సేవా కేంద్రాల్లో రైతులకు అవసరమయ్యే యూరియా అందుబాటులో ఉందన్నారు. కొంతమంది రైతులను రెచ్చగొట్టడం, కృత్రిమంగా యూరియా కొరత సృష్టించడం వంటి పనులు చేస్తున్నారన్నారు. ఈ పనులు చట్టరీత్యా నేరమని, అటువంటి పనులు చేస్తే చట్టరీత్యా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
రైతు సంక్షేమం పట్టని ప్రభుత్వం
రాయచోటి: రైతు సంక్షేమం గురించి కూటమి ప్రభు త్వం పట్టించుకోవడంలేదని, అన్నదాతలకు వైఎస్సార్సీపీ అండగా నిలుస్తుందని పార్టీ రాజంపేట పార్లమెంట్ పరిశీలకులు కె సురేష్బాబు, జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. రాయచోటిలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఈనెల 9న కలెక్టర్ కార్యాలయం ఎదుట నిర్వహించనున్న అన్నదాత పోరుకు సంబంధించిన పోస్టర్ను రాయచోటి మున్సిపల్ చైర్మన్ ఫయాజ్బాషాతో కలిసి వారు ఆవిష్కరించారు. రైతులు యూరియా కోసం తీవ్ర ఇబ్బందులు పడుతున్నా కూటమి ప్రభుత్వానికి కనికరం లేదని విమర్శించారు. ఎరువుల కోసం రైతులు క్యూలో నిలుచుంటే వారికి బఫే ఏర్పాటు చేయాలా అంటూ వ్యవసాయశాఖ మంత్రి అవహేళనగా మాట్టాడటం దారుణమని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రైతు భరోసా కేంద్రాలు ఏర్పా టు చేసి, వేలకోట్ల రూపాయల ధరల స్థిరీకరణ నిధిని ఏర్పాటు చేసి రైతులను అన్ని విధాలా ఆదుకున్నట్లు చెప్పారు పోరుబాట ద్వారా రైతు వ్యతిరేక ప్రభుత్వం మెడలు వంచాలన్నారు. యూరియాతో సహా రైతులకు అవసరమైన ఎరువులను వెంటనే పంపిణీ చేయాలన్నారు. ఎరువులు పక్కదోవ పట్టిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలన్నారు. పంటలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఉచిత పంటల భీమాను పునరుద్ధరించి వర్తింపజేయాలని వారు డిమాండ్ చేశారు. వర్షాల కారణంగా పంటలు దెబ్బతిన్న రైతులకు వెంటనే ఇన్పుట్ సబ్సిడీ ఇవ్వాలన్నారు. రైతుల సమస్యల పరిష్కారానికి ఈనెల 9న నిర్వహించే అన్నదాత పోరుబాట కార్యక్రమంలో జిల్లావ్యాప్తంగా ఉన్న రైతులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ నేతలు ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్బాబు 9న ‘అన్నదాత పోరు’ను విజయవంతం చేయాలి -
రణభేరిని జయప్రదం చేయండి
రాయచోటి : ఏళ్ల తరబడి అపరిష్కృతంగా ఉన్న ఆర్థిక, విద్యారంగ సమస్యల పరిష్కారం కోరుతూ ఈనెల 15వ తేదీ నుంచి 19వ తేదీ వరకు రాష్ట్ర వ్యాప్తంగా జరగనున్న యూటీఎఫ్ రణభేరిని జయప్రదం చేయాలని ఆ సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్లు పిలుపునిచ్చారు. శనివారం రాయచోటిలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయం వద్ద రణభేరికి సంబంధించిన పోస్టర్ను ఆవిష్కరించారు. ఉమ్మడి సర్వీసు రూల్స్ సమస్యకు ప్రభుత్వం పరిష్కారం చూపడం లేదన్నారు. బదిలీలు, ప్రమోషన్లు పూర్తయి మూడు నెలలు కావస్తున్నా ఉపాధ్యాయులు ఇంకా పాత స్థానాల్లో కొనసాగుతున్నారని తెలిపారు. నాణ్యమైన విద్యను అందిస్తామని చెబుతూనే ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు ప్రైవేటుకు తరలిపోయేలా కార్యక్రమాలు రూపొందిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా కార్యదర్శులు పి.వెంకట సుబ్బయ్య, వై.శ్రీధర్ రెడ్డి, ఫణీంద్ర కుమార్ యాదవ్, రాష్ట్ర కౌన్సిలర్ డి.చెంగలరాజు, సీనియర్ నాయకులు ఎస్.లక్ష్మీకుమార్, ఎం.నాగేశ్వర్ గౌడ్, వివిధ మండలాల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు నాగేంద్ర, మనోహర్, రామమూర్తి, శంకర్, శశికిరణ్, అమీన్, నాగార్జున, శివశంకర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
ఎన్ఐఆర్ఎఫ్ ర్యాంకింగ్లో వైవీయూకు ఉన్నత స్థానం
రాయచోటి : అందరికీ అన్నం పెట్టే అన్నదాతను కూటమి ప్రభుత్వం పూర్తిగా విస్మరించిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి రావుల నరసింహారెడ్డి విమర్శించారు. శనివారం అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో కూటమి పాలనలో రైతులకు జరుగుతున్న అన్యాయాలపై ఆయన మండిపడ్డారు. అధికారంలోకి రావడానికి అన్నదాత సుఖీభవ అనే పథకంతో రైతులను పూర్తిగా మోసం చేశారన్నారు. కనీసం ఇచ్చిన హామీలను కూడా అమలు చేయకుండా అంతా చేసేశామని గొప్పలు చెప్పుకోవడం సిగ్గుచేటన్నారు. పంటలకు వేసుకునే ఎరువులు, మందుల కోసం కూడా రైతులు గంటలు, రోజుల తరబడి క్యూలైన్లలో వేచి ఉండాల్సిన పరిస్థితులు నెలకొన్నాయన్నారు. యూరియా అందుబాటులో లేకపోవడంతో బ్లాక్ మార్కెట్లో కొనుగోలు చేస్తున్న పరిస్థితులు నెలకొన్నాయన్నారు. డ్వాక్రా నిధుల స్వాహాపై విచారణ జరపాలి రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణం కొత్తపేటలోని శ్రీ చౌడేశ్వరీ దేవి అమ్మవారి డ్వాక్రా సంఘం గ్రూపునకు సంబంధించిన నిధుల స్వాహాపై విచారణ జరపాలని ప్రజా సంఘం నాయకుడు శెట్టిపల్లె సాయికుమార్ జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్కు వినతి పత్రం అందజేశారు. ఈ గ్రూప్నకు గత ఏడాది జనవరి 11వ తేదీన రూ.12 లక్షలు రుణం మంజూరైందన్నారు. ఈ గ్రూపులో మొత్తం పది మంది ఉండాల్సి ఉండగా తొమ్మిది మంది మాత్రమే ఉన్నారని తెలిపారు. ఒక్కొక్కరికి రూ.97,000లు మాత్రమే వారి అకౌంట్లో జమ అయిందన్నారు. మిగిలిన రూ.3,27,000 ఏమి చేశారనే విషయమై విచారణ చేసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరారు. దేవదాయ భూముల సర్వే రామసముద్రం : రామసముద్రం మండలం ఆర్. నడింపల్లి పంచాయతీ బల్లసముద్రం గ్రామ సమీపంలో వెలసిన శ్రీ వాలీశ్వర స్వామి దేవాలయానికి సంబంధించిన భూములను శనివారం రెవెన్యూ అధికారులు సర్వే చేశారు. భూముల హద్దులను గుర్తించారు. సర్వే నివేదికను కలెక్టర్కు అందజేస్తామని ఈఓ రమణ తెలిపారు. దేవదాయశాఖకు చెందిన భూములను కబ్జా చేస్తే చట్టపరమైన చర్యలతో పాటు కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. కడప ఎడ్యుకేషన్ : బోధన, పరిశోధన, సేవ అనే దృక్పథంతో ఏర్పాటైన యోగి వేమన విశ్వవిద్యాలయం అనతి కాలంలోనే అత్యున్నత ప్రమాణాలతో పరిశోధనలతో ప్రముఖ విశ్వవిద్యాలయంగా కీర్తిని అందుకుంది. తాజాగా కేంద్ర ప్రభుత్వ విద్యా మంత్రిత్వ శాఖ విడుదల చేసిన నేషనల్ ఇన్స్టిట్యూట్ ర్యాంకింగ్ ఫ్రేమ్ వర్క్ (ఎన్ఐఆర్ఎఫ్)– 2025లో యోగి వేమన విశ్వవిద్యాలయానికి 51 నుంచి 100 లోపు ర్యాంకు లభించిందని విశ్వవిద్యాలయ ఉపకులపతి ఆచార్య అల్లం శ్రీనివాసరావు వెల్లడించారు. శనివారం విశ్వవిద్యాలయంలోని తన ఛాంబర్లో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ దేశంలో స్టేట్ పబ్లిక్ యూనివర్సిటీస్ 500 పైన ఉండగా అందులో వైవీయూ 51 నుంచి వందలోపు ర్యాంకు దక్కించుకోవడం విశ్వవిద్యాలయ సమష్టి కృషికి నిదర్శనమన్నారు. 2006లో ఏర్పాటైన వైవీయూ పాత విశ్వవిద్యాలయాలైన అనంతపురం జేఎన్టీయూ, ఎస్కేయూ, పద్మావతి విశ్వవిద్యాలయం వంటి వాటి సరసన నిలిచిందన్నారు. వైవీయూలో రామన్ ఫెలోషిప్, డాడ్ ఫెలోషిప్ పొందిన అధ్యాపకులు పనిచేస్తున్నారని అలాగే జర్మనీ, యూకే, యూఎస్ లలో పరిశోధనలు చేస్తున్నారని తెలిపారు. సెంట్రల్ యూనివర్సిటీ పరిధిలో సెవెన్ స్పోక్ యూనివర్సిటీలను ఎంపిక చేయగా వాటిలో ఒకటి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ రెండవది వైవీయూ కావడం గర్వకారణం అన్నారు. తద్వారా వైవీయూలో పరిశోధనకు రూ. 10 కోట్ల నిధులు రానున్నాయన్నారు. నిర్ణీత సమయంలో భారత ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు పంపిస్తూ మంచి ర్యాంకులు యూనివర్సిటీ సొంతం చేసుకోవడానికి కృషి చేస్తున్న ఐక్యూ ఏసీ బృందాన్ని వీసీ అభినందించారు. విశ్వవిద్యాలయ రిజిస్ట్రిర్ ఆచార్య పి.పద్మ మాట్లాడుతూ విద్యార్థుల సౌకర్యాలు, ప్లేస్మెంట్ పైన ప్రత్యేక దృష్టి సారించామని తెలిపారు. ఇంటర్నల్ క్వాలిటీ అసూరెన్స్ సెల్ (ఐక్యూ ఏసీ) సంచాలకులు డాక్టర్ ఎల్.సుబ్రహ్మణ్యం శర్మ, పీఎం ఉషా సమన్వయకర్త డాక్టర్ టి.చంద్రశేఖర్ మాట్లాడుతూ 2027 నాటికి 100 ప్రాజెక్టులతో న్యాక్ ఏ ప్లస్ గ్రేడ్ కోసం పోటీ పడతామని తెలిపారు. ఈ సమావేశంలో ఐక్యుఏసీ అసోసియేట్ డైరెక్టర్ డాక్టర్ సుభాష్ చంద్ర, సభ్యులు డాక్టర్ దాక్షాయని, డాక్టర్ కట్టా వెంకటేశ్వర్లు, ప్రజా సంబంధాల విభాగం సంచాలకులు డాక్టర్ పి. సరిత, డాక్టర్ కె. శ్రీనివాసరావు, డాక్టర్ తుమ్మలూరు.సురేష్ బాబు పాల్గొన్నారు. వైవీయూ వైస్ చాన్సలర్ ఆచార్య అల్లం శ్రీనివాసరావు -
ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ దుర్మార్గం
రాయచోటి : ప్రభుత్వ మెడికల్ కళాశాలలను కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయడం దుర్మార్గమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటిలో పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పేద విద్యార్థుల భవిష్యత్తు కోసం నిర్మించిన మెడికల్ కళాశాలలను ప్రభుత్వం ప్రైవేటీకరణ పేరుతో ముందుకు సాగడం అన్యాయమని విమర్శించారు. రాష్ట్రంలో ప్రతి పార్లమెంటు నియోజకవర్గానికి ఒక మెడికల్ కళాశాల ఉండాలన్న దూర దృష్టితో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి సాహసోపేత నిర్ణయంతో ఒకేసారి 17 మెడికల్ కళాశాలలు ఏర్పాటు చేశారన్నారు. వీటిలో ఏడు కళాశాలలకు ఎంసీఐ అనుమతులు లభించగా, మిగిలిన పది కళాశాలలకు ఎంసిఐ అనుమతులు ఇస్తే కూటమి ప్రభుత్వం స్వయంగా వాటిని తోసిపుచ్చిందన్నారు. ఒక మెడికల్ కళాశాల నుంచి రూ. 500 కోట్లు నుంచి రూ. 1000 కోట్లు వరకు కమీషన్లు తీసుకునే ప్రక్రియలో భాగంగానే ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమన్నారు. 25 ఏళ్ల పాటు అధికారంలో ఉన్న చంద్రబాబు నాయుడు ఒక ప్రభుత్వ మెడికల్ కళాశాలను కూడా ఇవ్వలేదంటే ఆయన దృష్టిలో పేదవారి విలువ ఏమిటో బహిరంగంగా తెలుస్తోందని విమర్శించారు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను మానకపోతే రాష్ట్ర యువతతో కలిసి పెద్దఎత్తున ప్రభుత్వాన్ని నిలదీయాల్సి వస్తుందని హెచ్చరించారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీకాంత్ రెడ్డి -
పట్టపగలే రెండిళ్లలో చోరీ
గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో పట్టపగలే రెండిళ్లలో చోరీ జరిగింది. గుర్తు తెలియని దుండగులు ఇళ్ల తాళాలు పగులగొట్టి లోనికి ప్రవేశించి బీరువాల్లోని విలువైన వస్తువులు ఎత్తుకెళ్లారు. స్థానిక బలిజగడ్డ వీధిలో అపోలో రెడ్డెప్ప, పరసా శ్రీనివాసులు కుటుంబాలు వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. శనివారం వారు ఇళ్లకు తాళాలు వేసుకొని వ్యవసాయ పనుల నిమిత్తం పొలాల వద్దకు వెళ్లారు. మధ్యాహ్నం ఇంటికి వచ్చి చూడగా అప్పటికే ఇంటి తాళాలు పగులగొట్టి ఉండడం గమనించారు. రెండిళ్లలోని బీరువాలను బద్దలు గొట్టి అందులో వస్తువులు చోరీ చేసినట్లు గుర్తించారు. జనసంచారం తక్కువగా ఉన్న ఈ ప్రాంతంలో దయం 11 గంటల నుంచి 12 గంటల మధ్యలోనే చోరీలు జరిగినట్లు స్థానికులు పేర్కొన్నారు. కాగా అపోలో రెడ్డెప్ప ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. పరసా శ్రీనివాసులు ఇంట్లో మాత్రం రూ. 60 వేలు నగదు, ఒక ఉంగరం, ఒకచైను, ఒక జత కమ్మలు చోరీకి గురైనట్లు తేలింది. వీటి విలువ సుమారు రూ. 2.50 లక్షలు ఉంటుందని బాధితులు పేర్కొన్నారు. జరిగిన సంఘటనపై స్థానిక పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ రఘరామ్ తమ సిబ్బందితో సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గత నెల రోజుల్లో ఇదే ప్రాంతంలో వరుసగా నాలుగు చోరీలు జరగడంతో జనం బెంబేలెత్తిపోతున్నారు. -
కారుకు నిప్పు
లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రమైన లక్కిరెడ్డిపల్లిలోని పాత మసీదు సమీపంలో మారుతీ కారుకు శుక్రవారం తెల్లవారుజామున గుర్తు తెలియని వ్యక్తులు నిప్పు పెట్టినట్లు బాధితుడు అన్వర్ బాష తెలిపారు. తన ఇంటి సమీపంలోని చెట్టు కింద కారు కొన్ని సంవత్సరాలుగా పెడుతున్నామన్నారు. శుక్రవారం తెల్లవారుజామున నిద్రపోయే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు కారుపై పెట్రోల్ పోసి నిప్పు పెట్టగా కారు కాలుకుంటూ టైరు పగిలి వెంటనే శబ్దం వచ్చిందని, బయటకు వచ్చి చూసేసరికి కారు అప్పటికే దగ్ధమైందని తెలిపారు. కారు సుమారు నాలుగు లక్షల రూపాయలు పైగా విలువ చేస్తుందన్నారు. పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్ఐ రవీంద్రబాబు సంఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేస్తామని ఎస్ఐ తెలిపారు. వృద్ధుడు అదృశ్యం బి.కొత్తకోట : స్థానిక కరెంట్ కాలనీకి చెందిన వృద్ధుడు వలీసాహెబ్ (65) అదృశ్యం కావడంపై కేసు నమోదు చేసినట్లు శుక్రవారం పోలీసులు తెలిపారు. వలీసాహెబ్కు అప్పుడప్పుడు మతిస్థితిమితం ఉండదు. దీనితో ఇంటినుంచి వెళ్లిన తర్వాత ఎక్కడైనా కనిపిస్తే కుటుంబీకులు ఇంటికి తీసుకెళ్తుంటారు. గతనెల 29న ఇంటినుంచి వెళ్లిన వలీసాహెబ్ ఆచూకీ లభ్యంకాకపోవడంతో కుమారుడు నయాజ్బాషా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. మద్యం దుకాణంలో చోరీ ఖాజీపేట : మండలంలోని ఎస్వీబీ మద్యం దుకాణంలో చోరీ జరిగింది. సుమారు నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బును దొంగలు దోచుకుపోయారు. ఖాజీపేట బ్రిడ్జి అవతల ఉన్న మద్యం దుకాణంకు చెందిన యజమానులు శుక్రవారం ఉదయం దుకాణం తెరిచి చూడగా వెనుక భాగంలోని తలుపు తెరిచి ఉండటం గమనించారు. వెంటనే దుకాణంలోనీ సీసీ కెమెరాలను పరిశీలించారు. గురువారం అర్ధరాత్రి ముఖానికి మాస్కు ధరించిన దొంగ తలుపు పగులకొట్టి లోనకు ప్రవేశించాడు. దుకాణంలోని నాలుగు కేసుల మద్యంతోపాటు క్యాష్ కౌంటర్లోని కొద్ది మొత్తంలో డబ్బు చోరీ చేసినట్లు గుర్తించారు. సీసీ కెమెరాలో ఉన్న దృశ్యలను పరిశీలించిన తరువాత ఖాజీపేట పోలీసులకు సమాచారం ఇచ్చారు. దాడిచేసిన నలుగురిపై కేసు కలకడ : ఇంటిమీదకు వచ్చి దాడిచేసి కొట్టి గాయపరిచిన నలుగురిపై కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ హరిబాబు తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. మండలంలోని కలకడ పంచాయతీ, కలకడ కొత్తపల్లె గ్రామానికి చెందిన సిద్దయ్య కుమారుడు అమరనాథను, అదే గ్రామానికి చెందిన నితిన్, తరున్, వినోద్, సంతోష్లు గురువారం రాత్రి కొట్టి గాయపరిచారు. వారి దాడిలో గాయపడ్డ అమరనాథ్, రాధికలను కలికిరి మండలం, మహల్ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. శుక్రవారం బాదితుడు అమరనాథ ఇచ్చిన ఫిర్యాదు మేరకు నిందితులు నలుగురుపై కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కమీషన్ల కోసమే ప్రైవేటుకు వైద్య కళాశాలలు
మదనపల్లె : రాష్ట్రంలో వైద్య కళాశాలలను కమీషన్ల కోసమే ప్రభుత్వం పీపీపీ విధానంలో ప్రైవేట్కు అప్పగించేందుకు సిద్ధమైందని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్ ఆరోపించారు. శుక్రవారం మదనపల్లె పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేబినెట్లో తీసుకున్న నిర్ణయాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోని పక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమిస్తామని అన్నారు. 63 ఏళ్ల లీజుకు అప్పగించడం వెనుక వందల కోట్లను కమీషన్ల రూపంలో దోచుకునేందుకు ఈ విధానం తెస్తున్నారని ఆరోపించారు.ప్రైవేట్కు అప్పగించడం ద్వారా రాజ్యాంగబద్ధంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వర్గాల పేద విద్యార్థులు రిజర్వేషన్ కోల్పోయి వైద్య విద్యకు దూరమై తీవ్రంగా నష్టపోతారని అన్నారు. పేదప్రజల ఆస్తిగా భావించే వైద్య కళాశాలలను ప్రయివేటు పేరుతో ఓ వర్గానికి ఆస్తులను కట్టబెట్టి వారిని ఆర్థికంగా బలోపేతం చేయడమే లక్ష్యంగా కనిపిస్తోందన్నారు. మదనపల్లె నుంచి రాజకీయ జీవితం ప్రారంభించిన మంత్రి సత్యకుమార్ యాదవ్ ఇక్కడి వైద్య కళాశాలను ప్రభుత్వపరంగా నడిపేలా చర్యలు తీసుకోవాలని కోరారు. లేనిపక్షంలో దోషిగా మిగిలిపోతారన్నారు. మదనపల్లె సమస్యలను పరిష్కరించాలని ప్రతిపక్ష నాయకునిగా ఆందోళన చేసిన ప్రస్తుత టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్ బాషా..వైద్య కళాశాల విషయంలో మాతో కలిసి పోరాటం చేస్తారో, పదవికి రాజీనామా చేస్తారో తేల్చుకోవాలని నిలదీశారు. వైద్య కళాశాలను ప్రయివేటుకు అప్పగిస్తుంటే ఎమ్మెల్యే ప్రభుత్వాన్ని ప్రశ్నించకుండా ఏం చేస్తున్నారని ఎద్దేవా చేశారు. వైద్య కళాశాలలకు లాభాలు లేనప్పుడు హెరిటేజ్ కంపెనీకి అధిక లాభాలు ఎలా వస్తున్నాయని ప్రశ్నించారు. సంపద సృష్టిస్తానని ప్రజలను నమ్మించి అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రజల సంపదను ప్రైవేట్వారి చేతుల్లో పెడుతున్నారని అన్నారు బీఎస్పీ నాయకులు సహదేవ, చంద్ర, బాలాజీ, మహేష్, ప్రశాంత్, శివ, అనిల్, రెడ్డెప్ప, వేణు పాల్గొన్నారు. బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతం కుమార్ -
పేకాట స్థావరంపై పోలీసుల దాడి
రాజంపేట : పట్టణంలోని వెంకటపల్లెరోడ్డులోని భవానీ నగర్ సమీపంలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై శుక్రవారం పట్టణ పోలీసులు దాడి చేశారు. ఈ సందర్భంగా అర్బన్ సీఐ నాగార్జున మాట్లాడుతూ జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో రాజంపేట ఏఎస్పీ ఆదేశాల మేరకు పేకాట స్థావరంపై దాడి చేసి 11 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. వారి వద్ద నుంచి రూ.15120 నగదును స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు నమోదుచేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. ప్రజలు అసాంఘిక కార్యక్రమాలపై సమాచారం ఇవ్వాలని, వారు పేర్లు గోప్యంగా ఉంచుతామని సీఐ తెలిపారు. సమాచారాన్ని 912110056 9(సీఐ), 9121100570 (ఎస్ఐ) నంబర్లకు తెలియజేయవచ్చని పేర్కొన్నారు. -
కుప్పం వద్దు.. ఇక్కడే ఉందాం!
మదనపల్లె: హంద్రీ–నీవా కుప్పం డివిజన్న్–12 కార్యాలయాన్ని మదనపల్లె ఎస్ఈ కార్యాలయం నుంచి కుప్పం తరలించి అక్కడికి వెళ్లి విధుల నిర్వహించేందుకు అధికారులు విముఖత చూపుతున్నారు. 2018లో మంజూరైన డివిజన్ కార్యాలయాన్ని కుప్పంలో ఏర్పాటు చేయకుండా మదనపల్లె ఎస్ఈ కార్యాలయంలోనే నిర్వహిస్తూ వస్తున్నారు. దీనిపై జూలై 31న సాక్షిలో ‘కదలరు..వదలరు’శీర్షికన కథనం ప్రచురితం కావడంతో అధికారులు ఉలిక్కిపడ్డారు. ఇన్నేళ్లుగా వెలుగులోకి రాకుండా సాగిపోతున్న వ్యవహారం బహిర్గతం కావడంతో అప్పటినుంచి కుప్పంకు వెళ్లకుండా ఏం చేయాలన్న దానిపై మల్లగుల్లాలు పడుతూ వస్తున్నారు. నెలరోజుల్లో పలు ఆసక్తికర విషయాలు చోటుచేసుకొంటున్నాయి. కుప్పం డివిజన్–12 ఈఈగా పనిచేస్తున్న వెంకటేశ్వర్లుపై మంత్రి నిమ్మల రామానాయుడు ఆగ్రహం వ్యక్తం చేయడం, మెమోల జారీకి ఆదేశించడం, తిరుపతి సీఈ చర్యలు తీసుకోవడం జరిగిపోయింది. ఈ నేపథ్యంలో మంత్రి దృష్టికి ప్రాజెక్టు అధికారులు కుప్పం నుంచి విధులు నిర్వహించడం లేదని రావడంతో కుప్పం ఈఈ మదనపల్లె సర్కిల్ కార్యాలయం నుంచి విధులు నిర్వహించేందుకు అంగీకరించడం లేదని తెలిసింది. పని చేస్తున్న ఉద్యోగులు కుప్పం రావాలని మౌఖికంగా ఆదేశాలు ఇచ్చారు. దీంతోపాటు కార్యాలయ గదులకు తాళాలు కూడా వేసేశారు. అయినప్పటికీ కుప్పం వెళ్లేందుకు ఎవరూ సిద్ధంగా లేకపోవడంతో రాజకీయంగా ఒత్తిడి తీసుకొచ్చి సీఎం చంద్రబాబు నియోజకవర్గం కుప్పంకు వెళ్లి విధులు నిర్వహించలేమని చెప్పి..మదనపల్లె నుంచి విధులు నిర్వహించేలా రాజకీయ నేతల ద్వారా ప్రయత్నాలు మొదలైనట్టు తెలిసింది. ఇందులో భాగంగా టీడీపీ నేతల ద్వారా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి నచ్చజెప్పేందుకు ప్రయత్నిస్తున్నారని సమాచారం. డివిజన్ కార్యాలయం మదనపల్లెలోనే కొనసాగించి, సబ్ డివిజన్ పేరుతో ఒక చిన్న గదిలో కార్యాలయం ప్రారంభించి అక్కడ ఎవరినో ఒకరిని పంపి..కార్యాలయం తరలించామని చెప్పుకునేందుకు అవస్థలు పడుతున్నారు. లేనిపక్షంలో పూర్తిస్థాయిలో డివిజన్ కార్యాలయాన్ని తరలించడమే అని మధనపడుతున్నారు. ● కుప్పం ఉప కాలువకు సంబంధించి జరుగుతున్న కాంక్రీటు లైనింగ్ పనులు పూర్తయిపోయాయి కాబట్టి కుప్పం నుంచి విధులు నిర్వహించాల్సిన అవసరం లేదంటూ కొందరు అధికారులు వింత వాదన లేవనెత్తారు. 2018లో మంజూరైన డివిజన్ కార్యాలయాన్ని ఇప్పటిదాకా కుప్పంలో ఏర్పాటు చేయని అధికారులపై చర్యలు తీసుకోవాల్సిన ప్రభుత్వం ఇంకా మీనమేషాలు లెక్కిస్తోంది. సీఎం అంగీకరిస్తారా గత టీడీపీ ప్రభుత్వంలో సీఎంగా ఉన్న చంద్రబాబు తన నియోజకవర్గానికి మంజూరు చేసిన డివిజన్ కార్యాలయం మదనపల్లెలోనే కొనసాగేందుకు అంగీకరిస్తారా అన్నదానిపై చర్చించుకొంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ ద్వారా సీఎంఓను సంప్రదించి ఈ విషయమై నిర్ణయం తీసుకోవాలని కోరితే అనుకూలమైన నిర్ణయం వెలువడే అవకాశం ఉండదని చెబుతున్నారు. దీంతో డివిజన్ కార్యాలయాన్ని కుప్పం తరలించడమే బెటర్ అని కొందరు అధికారులు చెబుతున్నారు. హంద్రీ–నీవా డివిజన్ తరలింపుపై మల్లగుల్లాలు -
కమనీయం.. శ్రీరంగనాథుని కల్యాణం
రంగనాథస్వామిని దర్శించుకుంటున్న వైఎస్ మనోహర్రెడ్డి, కల్యాణాన్ని తిలకిస్తున్న భక్తులు పులివెందుల టౌన్ : పట్టణంలోని శ్రీ రంగనాథ స్వామి దేవస్థానంలో స్వామివారి నూలు పూజా పవిత్రోత్సవాల్లో భాగంగా ఆలయంలో శుక్రవారం ఆలయ ప్రధాన అర్చకులు సోమేపల్లె కృష్ణరాజేష్ శర్మ నేతృత్వంలో భక్తులు చల్లా వంశీయుల సహకారంతో శ్రీదేవి భూదేవి సమేత శ్రీ రంగనాథ స్వామి కల్యాణోత్సవం అంగరంగ వైభవంగా జరిగింది. మంగళవాయిద్యాల నడుమ భక్త జనసందోహంతో వేద మంత్రోచ్ఛారణలతో కమనీయంగా స్వామివారి కల్యాణోత్సవం వైభవంగా నిర్వహించారు. మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్ రెడ్డి, మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, అంకాలమ్మ దేవస్థాన చైర్మన్ బ్యాటరీ ప్రసాద్, పెద్దిరాజు, తదితరులు స్వామివారిని దర్శించుకుని పూజలు నిర్వహించారు. అనంతరం వారికి ఆలయ చైర్మన్ సుధీర్ రెడ్డి ఘనంగా సన్మానించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కళ్యాణ అనంతరం చల్లా వంశీయుల సౌజన్యంతో వేలమందికి అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం సాయంత్రం శ్రీరంగనాథస్వామి గజ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. దీంతో శ్రీరంగనాథస్వామి నూలుపూజ పవిత్రోత్సవాలు ముగిశాయి. కార్యక్రమంలో ఆలయ ఈఓ కె.వి.రమణ, ఆలయ చైర్మన్ సుధీకర్ రెడ్డి, శ్రీరంగనాథ ట్రస్ట్ సీఈఓ అల్లం రంగనాయకులు, వాసవీ ఆలయ ప్రధాన అర్చకులు సాయి భరద్వాజ శర్మ, ఆలయ పాలకమండలి సభ్యులు కాంభోజి మల్లికార్జున, దశరథ రామిరెడ్డి, మాధవాచారి, మేడం దినేష్ కుమార్, ఆలయ సిబ్బంది,భక్తులు,తదితరులు పాల్గొన్నారు. ముగిసిన శ్రీరంగనాథస్వామి నూలు పూజ పవిత్రోత్సవాలు