breaking news
Annamayya District News
-
ఎస్ఐఆర్పై ఏమరుపాటు వద్దు
పీలేరు : ఓట్లు తొలగించడంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు సిద్ధహస్తుడని, కావున ఎస్ఐఆర్పై ఏమరుపాటు వద్దని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక వీఎస్ఆర్ కల్యాణ మండపంలో పీలేరు, కేవీపల్లె, కలికిరి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ ముఖ్య నాయకులు, బీఎల్ఏలకు స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్ కార్యక్రమం దేశ వ్యాప్తంగా జరుగుతోందన్నారు. పక్క రాష్ట్రాల్లో సర్వేలో భాగంగా భారీగా ఓట్లు తొలగించడం జరిగిందని తెలిపారు. మన రాష్ట్రంలో ఓట్ల తొలగింపునకు టీడీపీ ప్రత్యేక యాప్ తయారు చేసి, వైఎస్సార్సీపీ వర్గానికి చెందిన ఓట్ల తొలగింపునకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. ప్రతి ఓటు కీలకమైందని, ఏ ఒక్క ఓటు పోకుండా అప్రమత్తంగా ఉండాల్సిన బాధ్యత వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఏలపై ఉందన్నారు. ఎస్ఐఆర్ సర్వే కార్యక్రమంలో బీఎల్వో సహకరించకపోతే జిల్లా కలెక్టర్కు గానీ, ఆర్డీవోకు గానీ ఫిర్యాదు చేయవచ్చునని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ కల్పలతారెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి, హరీష్రెడ్డి, డాక్టర్ ఇక్బాల్అహ్మద్, నల్లారి తిమ్మారెడ్డి, శ్రీఖర్రెడ్డి, నరసింహారెడ్డి, ఎంపీపీ సతీష్రెడ్డి, నూర్జహాన్, జెడ్పీటీసీ ఎ.టి.రత్నశేఖర్రెడ్డి, గజ్జెల శృతి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్లు దండు జగన్మోహన్రెడ్డి, వెంకటరమణారెడ్డి, రమేష్రెడ్డి, మహితా ఆనంద్, నియోజకవర్గ పరిశీలకులు ఉదయ్కుమార్, బూత్ కమిటీల జిల్లా అధ్యక్షుడు సుధాకర్, నాయకులు మాసుంరఫీ, మల్లీశ్వరి, నాగరాజమ్మ, లక్ష్మీ, అరుణ, హరిత, ఎన్.వి. చలపతి, గజ్జెల శీన్రెడ్డి, చక్రధర్, సి.కె.యర్రమరెడ్డి, భానుప్రకాష్రెడ్డి, ఉదయ్కుమార్, కాలనీ చిన్న, విజయశేఖర్రెడ్డి, షాకీర్, పి.ద్వారకనాథరెడ్డి, భువనేశ్వర్రెడ్డి, లోకనాథరెడ్డి, నీరజ, రాజేశ్వరి, రాజ్యలక్ష్మీ, షపూరా, బావాజి, హరి, సురేంద్రరెడ్డి, అమరనాథరెడ్డి, మునీర్, దావూద్, అబీద్, ఉబేదుల్లా, రియాజ్, షబ్బీర్, అనుష్క తదితరులు పాల్గొన్నారు.మాట్లాడుతున్న ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డిసమావేశంలో పాల్గొన్న వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఏలు వైఎస్సార్సీపీ నాయకులు, బీఎల్ఏలు అప్రమత్తంగా ఉండాలి ఎంపీ మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి -
ఓటు హక్కు కాపాడుకోవాలి
గుర్రంకొండ : ఓటు హక్కు కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యతని రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి అన్నారు. శుక్రవారం స్థానిక గోల్డెన్ ప్లాజా కల్యాణ మండపంలో కలకడ, గుర్రంకొండ, కలికిరి మండలాలకు చెందిన వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలతో సర్పై అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సర్ ప్రక్రియలో బీఎల్ఏలే అన్ని పనులు చేసుకోవడం కష్టమవుతోందన్నారు. వారికి స్థానిక నాయకులు సహకారం అందించాలని సూచించారు. అనంతరం పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి మాట్లాడుతూ సర్ ప్రక్రియలో బీఎల్వోఏలు, గ్రామస్థాయి నాయకులు సమష్టిగా కష్టపడాలన్నారు. అలాగైతేనే కార్యకర్తల ఓట్లు కాపాడుకోగలుతామన్నారు. మనం నిర్లక్ష్యం చేస్తే అన్ని ఎన్నికల్లో తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుందన్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్అహ్మద్, రాష్ట్ర ఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్రెడ్డి, సర్ రాష్ట్ర పరిశీలకులు వజ్ర భాస్కర్రెడ్డి, భరత్భూషణ్రెడ్డి, పార్టీ నియోజకవర్గ పరిశీలకులు ఉదయ్కుమార్, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ రవికుమార్రెడ్డి, మండల పార్టీ కన్వీనర్లు ముక్తియార్ ఆలీఖాన్, పులి శివారెడ్డి, కమాలాకర్రెడ్డి, జెడ్పీటీసీ హారిక, ఆనంద్, ఎంపీపీలు అప్పల్ల, శ్రీదేవి, మాజీ ఎంపీపీలు నక్కాచంద్రశేఖర్, జమీర్, జయచంద్రారెడ్డి, నాయకులు జెల్లా రాజగోపాల్రెడ్డి, శ్రీనివాసులు రెడ్డి, రాంపల్లి రమేష్, కేశవరెడ్డి, నీళ్ల భాస్కర్, కలీమ్, షావత్ ఆలీఖాన్, ప్రకాష్రెడ్డి, వెంకటశివారెడ్డి, ఎల్వీ రమణ, జగన్మోహన్, ఎస్వీ రమణ తదితరులు పాల్గొన్నారు. -
పంట ఉత్పత్తులకు గిట్టుబాటు ధర కల్పించాలి
సాక్షి, మదనపల్లె : రైతులు పండిస్తున్న పంటలకు ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని ఏపీ రైతు సంఘం రాష్ట్ర కార్యదర్శి ప్రభాకర్రెడ్డి డిమాండ్ చేశారు. శుక్రవారం మదనపల్లెలోని రైతు సంఘం కార్యాలయంలో ఆ సంఘ జిల్లా ప్రథమ మహాసభలో ఆయన మాట్లాడారు. రైతులు పండించిన పొగాకు, మిర్చి, పత్తి, జొన్న, వరి, టమాట పంటలకు గిట్టుబాటు ధర లేక తీవ్రంగా నష్టపోతున్నారన్నారు. ప్రభుత్వం రైతు ఆధారిత పరిశ్రమలు ఏర్పాటు చేసి, కోల్డ్ స్టోరేజీలను నిర్మించాలని కోరారు. జిల్లా కార్యదర్శి రామచంద్ర మాట్లాడుతూ రైతులకు పంటల బీమా సౌకర్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు. హంద్రీనీవా కాలువలు పూర్తి చేసి, చెరువులకు అనుసంధానం చేసి నీళ్లు ఇవ్వాలని కోరారు. పాడి పరిశ్రమ సంక్షోభంలోకి వెళ్లిపోతోందని పాడి రైతులను ఆదుకోవాలని, పెట్టుబడి ఖర్చుకు తగినట్టుగా ధరలను పెంచాలన్నారు. టమాట రైతులను నష్టాల నుంచి గట్టెక్కించడానికి జ్యూస్ ఫ్యాక్టరీ నెలకొల్పాలని కోరారు. అనంతరం ఆ సంఘ జిల్లా నూతన కమిటీని ఎన్నుకున్నారు. జిల్లా అధ్యక్షుడిగా ఎం.మనోహర్ రెడ్డి, కార్యదర్శిగా ఎస్.రామచంద్ర, కమిటీ సభ్యులుగా ఎన్.వెంకటరమణారెడ్డి, ఎం.రమేష్ బాబు, సుబ్రమణ్యంరెడ్డి, పెద్ద రెడ్డప్ప ఎన్నికయ్యారు. -
మామిడి కాయల ట్రాక్టర్ బోల్తా
పులిచెర్ల(కల్లూరు) : కల్లూరు ఘాట్ రోడ్డులో శుక్రవారం మధ్యాహ్నం మామిడి కాయల లోడ్తో వెళుతున్న ట్రాక్టరు అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో రోడ్డుకు అడ్డంగా పడిన ఈ ట్రాక్టరులోని కాయలు రోడ్డంతా పడిపోయాయి. యర్రావారిపాళెం మండలం నెరబైలు నుంచి మామిడి కాయల లోడుతో దామల్ చెరువు మండీకి వెళుతున్న ట్రాక్టరు టైరు పంచరు కావడం, కొక్కీ ఊడి పోయి ట్రాలీ బోల్తా పడడంతో ఈ సంఘటన జరిగింది. అయితే ఎవరికీ గాయాలు కూడా లేదు.ఉత్సవ విగ్రహం చోరీ చౌడేపల్లె : మండలంలోని 29ఏ చింతమాకులపల్లె పంచాయతీ బయ్యపల్లెలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామి వారి పంచలోహ ఉత్సవమూర్తి విగ్రహం చోరీకి గురైంది. శుక్రవారం ఆలయంలో పూజలు చేసేందుకు వెళ్లిన భక్తులు గుర్తించి గ్రామస్తులకు సమాచారమిచ్చారు. విగ్రహంతోపాటు దీప జ్యోతులు సైతం చోరీకి గురయ్యాయి. వీటి విలువ సుమా రు రూ.2 లక్షలు ఉంటుందని గ్రామస్తులు చెప్పా రు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇద్దరు మైనర్ బాలికల అదృశ్యంనిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): అన్నమయ్య జిల్లా నిమ్మనపల్లె మండలంలో ఒకే రోజు ఇద్దరు మైనర్ బాలికలు అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. ఇద్దరికీ 16 ఏళ్ల వయసు కావడంతో తల్లిదండ్రులు తీవ్ర ఆందోళన చెందుతున్నారు. బాలికల తల్లిదండ్రులు గురువారం రాత్రి వేర్వేరుగా నిమ్మనపల్లె పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. వారి ఫిర్యాదు మేరకు ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు ప్రత్యేక బృందంతో గాలింపు చర్యలు చేపడుతున్నట్లు తెలిసింది. వ్యక్తి ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : భార్య విడాకుల కోసం కోర్టులో కేసు వేసిందన్న మనస్తాపంతో ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. శుక్రవారం మదనపల్లి మండలంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితుడి కుటుంబీకులు, జిల్లా ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని బసినికొండ పంచాయితీ గంగన్నగారిపల్లెకు చెందిన శివకుమార్(35) భవన కార్మికుడిగా పని చేస్తూ భార్య ఐశ్వర్య, పిల్లల్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో ఐశ్వర్య భర్త తనకు వద్దని అలిగి పుట్టినింటికి వెళ్లిపోయింది. అనంతరం ఓ అడ్వకేట్ సాయంతో స్థానిక కోర్టులో భర్త తనకు వద్దని కోరుతూ.. విడాకులకు దాఖలు చేసింది. ఈ విషయం తెలుసుకున్న శివకుమార్ తీవ్ర మనస్తాపం చెంది జీవితంపై విరక్తి చెందాడు. ఇతను ఉంటున్న ఇంటిలో తాడుతో ఉరి వేసుకోవడంతో, పిల్లల గమనించి కేకలు పెట్టగా స్థానికులు వచ్చి బాధితుడిని ఉరి నుంచి తప్పించి స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు మెరుగైన వైద్యం అందించి, అక్కడి నుంచి తిరుపతి రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వృద్ధుడి మృతికడప అర్బన్ : కడప నగరంలోని కోటిరెడ్డి సర్కిల్ దగ్గర మురళి హాలుకు వెళ్లే దారిలో గుర్తుతెలియని వృద్ధుడు(60) ఈనెల 22వ తేదీన మృతి చెందాడు. అతని ఆచూకీ తెలియకపోవడంతో కడప రిమ్స్ మార్చురీలో ఉంచారు. తగిన ఆధారాలతో తమను సంప్రదిస్తే మృతదేహాన్ని అప్పగిస్తామని కడప వన్టౌన్ పోలీసులు శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. -
హోరాహోరీగా అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో ఏసీఏ సౌత్జోన్ అండర్ 16 మల్టీడే క్రికెట్ పోటీలు హోరాహోరీగా సాగుతున్నాయి. శుక్రవారం గ్రౌండ్ 1లో చిత్తూరు, అనంతపురం క్రికెట్ టీంలు తలపడ్డాయి. ఇన్నింగ్స్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు 96 ఓవర్లలో నాలుగు వికెట్లు నష్టానికి 344 పరుగులు చేసింది. చిత్తూరు జట్టుకు చెందిన బ్యాట్స్మెన్ లిఖిత్ ఇరగంరెడ్డి 234 బంతుల్లో 102 పరుగులు చేశారు. ఇదే జట్టుకు చెందిన తనీస్వర్ టెండూల్కర్ 268 బంతుల్లో 186 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. వీరిద్దరూ సెంచరీలతో చెలరేగి 67.4 ఓవర్లలో 221 పరుగులుభాగస్వామ్యం నెలకొల్పడంతో.. చిత్తూరు జట్టు భారీ స్కోర్లో ముందుకు వెళ్లడంతోపాటు బ్యాటింగ్ చేస్తోంది. అలాగే గ్రౌండ్ 2లో కర్నూలు, కడప జిల్లా జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కర్నూలు జట్టు 76 ఓవర్లలో 374 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఇందులో కర్నూల్ జట్టుకు చెందిన బ్యాట్స్మెన్ నిశాంత్ రెడ్డి 129 బంతులు ఆడి 109 పరుగులతో సెంచరీ తీశాడు. నేడు కడప జట్టు బ్యాటింగ్కు దిగనుంది. ఈ పోటీలను శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్, ప్రసన్న కుమార్, షోయబ్, జవహర్ బాష, హరీష్ రెడ్డి, గిరీష్ తదితరులు పర్యవేక్షిస్తున్నారు. -
భక్తిశ్రద్ధలతో హజరత్ పీరుల్లా మాలిక్ గంధోత్సవం
● పలు రాష్ట్రాల నుంచి హాజరైన భక్తులు ● దర్గా అంతటా పూల కళ దర్గా ఆవరణలో భక్తుల సందడి విద్యుద్దీప వెలుగులో పెద్దదర్గా ప్రవేశ ద్వారం కడప సెవెన్రోడ్స్ : దేశ వ్యాప్తంగా ప్రముఖ ఆధ్యాత్మిక, పర్యాటక క్షేత్రంగా పేరు గాంచిన కడప పీరుల్లామాలిక్ దర్గా మరోమారు తన విశిష్ఠతను చాటుకుంది. దర్గా గురువులు హజరత్ పీరుల్లా మాలిక్ సాహెబ్ సజీవ సమాధి అయిన సందర్భంగా ఏటా ఈ ఉరుసును వైభవోపేతంగా నిర్వహిస్తారు. ఈ మారు కూడా ఉరుసును రెట్టించిన ఉత్సాహంతో నిర్వహించారు. శుక్రవారం ఈ సందర్భంగా దర్గా అంతటా విద్యుద్దీపాలు అలంకరించారు. ముఖ్యంగా దర్గాలోని గురువుల మజార్ ప్రాంతాన్ని పూర్తిగా రంగురంగుల పూలతో అలంకరించారు. దర్గా ప్రాంగణమంతా పూల పరిమళం నిండి భక్తులను మైమరిపించింది. ఈ సందర్భంగా ఉద యం దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ గంధం సమర్పించి ప్రార్థనలు చేసి పవిత్ర జలాన్ని భక్తులకు అందజేశారు. రాత్రి ప్రధాన గురువుల మజార్ వద్ద మరోమారు గంధం సమర్పణ చేసి ప్రార్థనలు చేశారు. – మొహర్రం మాసాన్ని పురస్కరించుకుని దర్గా ఆవరణలో ఏర్పాటు చేసిన పీర్లను శుక్రవారం ఊరేగింపుగా తీసుకెళ్లి నీళ్లతో శుభ్రపరిచి పెట్టెల్లో భద్రపరిచారు. అంతకుముందు దర్గా పీఠాధిపతి హజరత్ సయ్యద్షా ఆరీఫుల్లా హుసేనీ సాహెబ్ ఫాతెహా నిర్వహించి ప్రసాదాన్ని పంపిణీ చేశారు. -
గంజాయి వద్దు.. జీవితం ముద్దు
● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె టౌన్ : అంతర్జాతీయ మాదకద్రవ్యాల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మదనపల్లె పోలీసు ప్రధాన కార్యాలయంలో అవగాహన సదస్సు అడిషనల్ ఎస్పీ వేంకటాద్రి ఆధ్వర్యంలో జరిగింది. కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ముఖ్య అతిథిగా పాల్గొని విద్యార్థినీ విద్యార్థులకు మాదకద్రవ్యాల వినియోగంతో తలెత్తే పరిణామాలపై సందేశం ఇచ్చారు. ‘గంజాయి వద్దు బ్రో.. జీవితాలు ముద్దు’, ‘మత్తు జీవితాన్ని చేస్తుంది చిత్తు’ అంటూ నినాదాలు చేస్తూ విద్యార్థులను చైతన్య పరిచారు. మాదక ద్రవ్యాలు యువత భవిష్యత్తును నాశనం చేస్తాయని, వాటికి దూరంగా ఉండి ఉజ్వల భవిష్యత్తును నిర్మించు కోవాలని సూచించారు. ఏఎస్పీ, ఎకై ్సజ్ అసిస్టెంట్ సూపరింటెండెంట్ జోగేంద్ర మాట్లాడుతూ ప్రెండ్షిప్ పేరుతో మొదట దగ్గరగా చేరి ఉచితంగా గంజాయి, కూల్ లిప్స్కు అలవాటు చేస్తారని అప్పటికే ఆ మత్తుకు బానిసై గంజాయి లేకుంటే బతకలేని స్థితికి చేరుకుంటారన్నారు. ‘యాంటీ డ్రగ్’ కేసుల్లో ఇరుక్కుంటే భవిష్యత్ అంధకారమై జీవితం నాశనం అవుతుందన్నారు. అనంతరం కార్యక్రమానికి హాజరైన అధికారులు, ఉపాధ్యాయులు, విద్యార్థుల చేత మాదక ద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో శ్రీ గుడ్విల్ కంప్యూటర్స్ అజయ్, పెద్దమడ్యం ఉపాధ్యాయురాలు కళ్యాణ లక్ష్మి, వివిధ కళాశాలల విద్యార్థులు పాల్గొన్నారు. -
అంతర్పంటసాగుతో అధిక దిగుబడి
కలకడ : సాగు భూమిలో పంటమార్పిడి, వేరుశనగ పంటలో అంతర్పంటల సాగుతో ప్రతి రైతు అధిక దిగుబడి, అధిక ఆదాయం పొందవచ్చని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ అన్నారు. శుక్రవారం మండలంలోని కె.బాటవారిపల్లె పంచాయతీలో రైతులు సాగుచేసిన వేరుశనగ పంటను పరిశీలించారు. ఎల్నినో పరిస్థితికి ముందస్తు సన్నద్ధత, నివారణ చర్యలు తెలియజేశారు. సకాలంలో వేరుశనగ విత్తనాలు విత్తుకోలేని రైతులు ఆముదాలు, కందిపంట, ఉలవ సాగుపై దృష్టి పెట్టిలని సూచించారు. ఈకార్యక్రమంలో జిల్లా ప్రకృతి వ్యవసాయశాఖ అధికారి వెంకటమోహన్, మండల వ్యవసాయశాఖ అధికారి శ్రీనివాసన్, రైతు సేవాకేంద్రం సిబ్బంది ఇంద్రజ తదితరులు పాల్గొన్నారు. -
● స్వర్ణాంధ్ర సారథులు!
పాలకుల రంగుల ప్రకటనల వెనుక కన్నీటి నిజాలు కడప వీధుల్లో కొట్టొచ్చినట్లు కనిపిస్తున్నాయి. వందల కోట్లు ఖర్చు పెట్టి పేదలను ధనికులను చేస్తామని గొప్పలు చెబుతున్నా.. కృష్ణా హాల్ వక్ఫ్ కాంప్లెక్స్ వద్ద బడికి వెళ్లాల్సిన వయసులో కాళ్లకు చెప్పులు కూడా లేకుండా చిన్నారులు చీకటి, మురికి కాలువల్లో ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుంటున్నారు. ఆ మురికిలో ప్లాస్టిక్ ముక్కలు వెతికి స్క్రాప్ దుకాణంలో వేస్తేనే వారి పూట గడుస్తుంది. రేపటి పౌరుల భవిష్యత్తు ఇలా వీధులపాలవుతుంటే.. పాలకుల ప్రచారాల సంబరాలు ఎవరి కోసం అని, స్వర్ణాంధ్ర సారథులు వీరేనా అని జనం ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్, కడప. -
దూసుకొచ్చిన మృత్యువు
పీలేరు రూరల్ : కుటుంబ సభ్యులంతా ముచ్చట్లలో మునిగిపోయారు.. నవ్వుల్లో తేలియాడుతున్నారు. వారి సంతోషాలను మోసుకెళ్తున్న ఆటోను ఓ రాకాసి కారు మృత్యువై వచ్చి ఢీకొంది. అంతే ముచ్చట్లు మూగబోయాయి.. నవ్వులు బోసిపోయాయి. క్షణాల్లో వారి ఆనందం ఆవిరైంది. ఆటోను కారు ఢీకొన్న విషాధ సంఘటన పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లె మిట్ట మలుపు వద్ద చిత్తూరు – కడప జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. ఈ ప్రమాదంలో ముగ్గురు మృత్యువాత పడగా.. మరో ఏడుగురు తీవ్ర గాయాలపాలై ఆస్పత్రిలో చేరారు. వివరాలు ఇలా ఉన్నాయి. పీలేరు మండలం రేగళ్లుకు చెందిన బాబాఫకృద్డీన్ భార్య కె.ఇర్ఫానీ(45) స్వగ్రామమైన కలికిరి మండలం దూదేకులపల్లెలో ఏటా మొహర్రం (పీర్ల) పండుగ ఘనంగా నిర్వహిస్తారు. ఈ క్రమంలో గురువారం దూదేకులపల్లెకు వెళ్లడానికి అదే గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ సయ్యద్ ముబారక్ (55) ఆటోను బాడుగకు తీసుకుని ఇర్ఫానీ తోపాటు అత్త అయిన కె.మెహరూన్బీ(70), కుమారులు మొహమ్మద్ వాహిద్ (16), కె.మొహమ్మద్ నౌహిద్(18), బాబా ఫకృధ్ధీన్ సోదరి హుస్సేన్బీ కుమారులు అఫ్జల్ (14), ఆసీఫ్ (16) వెళ్లారు. గురువారం అర్ధరాత్రి వరకు పండుగ జరుపుకొని శుక్రవారం తెల్లవారుజామున 12.30 గంటల సమయంలో స్వగ్రామం రేగళ్లు వెళ్లడానికి ఆటోలో బయలుదేరారు. వీరితోపాటు దూదేకులపల్లెకు చెందిన సోహైబ్ (16), సోహన్(18) అదే ఆటోలో పీలేరుకు రావడానికి బయలుదేరారు. అయితే కడప జిల్లా కమలాపురానికి చెందిన కారు డ్రైవర్ వెంకటరమణ, భార్య ప్రశాంతి, కుమార్తె కుసుమప్రియ, మరో మహిళ సుబ్బలక్ష్మీ తిరుమల నుంచి కారులో సొంతూరికి బయలుదేరారు. చిత్తూరు – కడప జాతీయ రహదారిలో ఠాణావడ్డిపల్లె మిట్ట మలుపువద్ద కారు వేగంగా వెళ్లి ఆటోను ఢీకొంది. ఆటో డ్రైవర్ ముబారక్ (55), మెహరూన్బీ (70) అక్కడికక్కడే మృతి చెందారు. వాహిద్ (16)ను మెరుగైన చికిత్స నిమిత్తం తిరుపతికి తరలిస్తుండగా మార్గంమధ్యలో మృతి చెందాడు. మిగిలిన ఆరుగురితోపాటు కారు డ్రైవర్ వెంకటరమణ తీవ్రంగా గాయపడడంతో.. చికిత్స నిమిత్తం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం క్షతగాత్రులను తిరుపతికి తరలించారు. అతివేగమే ప్రమాదానికి కారణమని ప్రాథమికంగా పోలీసులు నిర్ధారించారు. రేగళ్లుకు చెందిన బాబాఫకృద్దీన్, ఆయన చిన్న కుమారుడు కరీముల్లా మినహా అందరూ మొహర్రం పండుగకు ఆటోలో వెళ్లారు. ప్రమాదంలో ఆయన తల్లి మెహరూన్బీ, కుమారుడు మొహమ్మద్ వాహిద్ మృతి చెందగా, భార్య ఇర్ఫానీ, మరో కుమారుడు నౌహిద్ తీవ్రంగా గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. దీంతో బాబాఫకృద్ధీన్ను ఓదార్చడం ఎవరితరం కాలేదు. బాబాఫకృద్ధీన్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుల కుటుంబాలకు పరామర్శ పీలేరు రూరల్ : ఆటోను కారు ఢీకొన్న ప్రమాదంలో మృతి చెందిన వారి మృతదేహాలను పీలేరు ప్రభుత్వాస్పత్రి మార్చురీకి తరలించారు. విషయం తెలుసుకున్న మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి సుధీర్రెడ్డి ఆస్పత్రి వద్దకు చేరుకున్నారు. మృతుల కుటుంబ సభ్యులను పరామర్శించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు అశోక్రెడ్డి, సుధీర్రెడ్డి, సతీష్, మోహన్రెడ్డి, బాలకృష్ణ తదితరులు పాల్గొన్నారు. కె.మెహరూన్బీ మొహర్రం వేళ విషాదం ఠాణావడ్డిపల్లె వద్ద ఘోర రోడ్డు ప్రమాదం ముగ్గురు దుర్మరణం, ఏడుగురికి గాయాలు అతి వేగమే ప్రమాదానికి కారణం -
రైలు జోలికొస్తే జైలు!
రాజంపేట : రైల్వే ప్రయాణికుల భద్రతకు రోజురోజుకూ ముప్పు పెరుగుతోంది. ఇటీవలి కాలంలో కొందరు ఆకతాయులు, అంతర్రాష్ట్ర దొంగల ముఠాలు రైల్వే వ్యవస్థలను లక్ష్యంగా చేసుకుని దాడులకు తెగబడుతున్నారు. రైళ్లపై రాళ్లు వేయడం, సిగ్నలింగ్ వ్యవస్థలను అడ్డగోలుగా ధ్వంసం చేయడం, చైన్ లాగి రైళ్లను ఆపి ప్రయాణికులను దోచుకోవడం వంటి నేరాలు విపరీతంగా పెరిగిపోయాయి. కొందరు ఆకతాయులు రైలు ఇంజన్లను లక్ష్యంగా చేసుకుని రాళ్లతో దాడి చేస్తుండటంతో రైళ్ల రాకపోకలకు తీవ్ర ఆటంకం కలుగుతోంది. అత్యంత సున్నితమైన వ్యవస్థ.. ప్రమాదాలకు ఆస్కారం రైళ్ల సురక్షిత రాకపోకలను నియంత్రించే సిగ్నలింగ్ వ్యవస్ధ అత్యంత సాంకేతికమైనది, చాలా సున్నితమైంది. అయితే, లాభాపేక్షతో దోపిడీలకు పాల్పడే దుండగులు, బాధ్యతారాహిత్యంగా ప్రవర్తించే ఆకతాయులు ఈ వ్యవస్థను ధ్వంసం చేయడం లేదా టాంపరింగ్ (అక్రమ మార్పులు) చేయడం లాంటి చర్యలకు తెగబడుతున్నారు. దీనివల్ల ఒకే ట్రాక్పైకి రెండు రైళ్లు రావడం లేదా సిగ్నల్స్ తప్పుగా చూపించడం జరిగి ఘోర రైలు ప్రమాదాలు సంభవించే అవకాశం ఎక్కువగా ఉంటుందని రైల్వే సాంకేతిక నిపుణులు హెచ్చరిస్తున్నారు. దుండగులు చేసే ఇటువంటి పనులు వందలాది మంది అమాయక ప్రయాణికుల ప్రాణాలను నేరుగా పణంగా పెట్టడమేనని రైల్వే అధికారులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వారం క్రితం గుంటూరు జిల్లా పరిధిలో ఒక అంతర్రాష్ట్ర దొంగల ముఠా ఏకంగా రైల్వే సిగ్నల్స్ వ్యవస్థను టాంపరింగ్ చేసి, రైలు ఆగిన వెంటనే ప్రయాణికులపై పడి వారి వద్ద ఉన్న విలువైన బంగారు ఆభరణాలు, నగదును దోచుకెళ్లిన ఘోర ఉదంతం ఇందుకు నిదర్శనం. అనవసరంగా చైన్ లాగితే.. ఏడేళ్ల దాకా జైలు రైలు ప్రయాణంలో అత్యవసర సమయాల్లో వాడటం కోసం ప్రతి బోగీలోనూ అలారం చైన్లను ఏర్పాటు చేస్తారు. అయితే, ప్రయాణికులు ఎలాంటి కారణం లేకుండా అనవసరంగా చైన్లాగితే అది చట్టప్రకారం తీవ్రమైన నేరం. దొంగతనాలకు పాల్పడటం కోసమో, ఆకతాయితనంతోనో చైన్ లాగి రైళ్లను అర్ధంతరంగా ఆపితే ఊరుకునేది లేదని అధికారులు హెచ్చరిస్తున్నారు. రైల్వే నిబంధనలను అతిక్రమిస్తే ‘రైల్వే చట్టం 1989’ లోని సెక్షన్లు 141, 151, 153, 174(ఎ) తో పాటు, ‘1966 చట్టం’ లోని సెక్షన్ 3 ప్రకారం భారీ జరిమానాతో పాటు గరిష్టంగా ఏడేళ్ల వరకు కఠిన జైలుశిక్ష పడే అవకాశం ఉంది. వందేభారత్పై రాళ్ల దాడి.. లోకో పైలట్కు గాయాలు మరోవైపు ప్రతిష్టాత్మక వందేభారత్ రైలుపై కొద్దిరోజుల కిందట దుండగులు రాళ్లు రువ్వడంతో రైలు కిటికీ అద్దాలు పూర్తిగా పగిలిపోయాయి. ఆ గాజు ముక్కలు గుచ్చుకుని లోపల కూర్చున్న ప్రయాణికుడికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో మరికొంతమంది ఆకతాయులు వేగంగా వెళ్తున్న రైలింజన్పై రాయి విసరడంతో విండ్ షీల్డ్ పగిలి లోపల ఉన్న లోకో పైలట్ (డ్రైవర్) తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ దారుణాలపై రైల్వే ప్రొటెక్షన్ ఫోర్స్ మరియు రైల్వే అధికారులు తీవ్రంగా స్పందించారు. కేంద్ర ప్రభుత్వ ఆస్తులను ధ్వంసం చేసినా, ప్రయాణికుల ప్రాణాలకు ముప్పు కలిగించినా రైల్వే చట్టాల ప్రకారం కఠినమైన జైలుశిక్షలు తప్పవని అధికారులు ఘాటుగా హెచ్చరిస్తున్నారు. ట్రాక్లపై ‘టాంపరింగ్’.. రైళ్లపై ‘రాళ్ల’ దాడి చేస్తే ఏడేళ్ల కఠిన శిక్ష ఘోర రైలు ప్రమాదాలకు ఆకతాయుల కుట్ర వందేభారత్ అద్దాలు ధ్వంసం.. లోకో పైలట్, ప్రయాణికులకు తీవ్ర గాయాలు అనవసరంగా చైన్ లాగితే చట్టప్రకారం జైలు శిక్ష -
ప్రభుత్వ భూమి కోసం తమ్ముళ్ల తన్నులాట
● రెండు వర్గాల మధ్య ఘర్షణ ● గాయపడ్డ రాజేష్, శరత్రాయచోటి : ప్రభుత్వ భూముల ఆక్రమణ విషయంలో తెలుగు తమ్ముళ్ల మధ్య నెలకొన్న వర్గ విభేదాలు దాడులు, ప్రతిదాడులకు దారి తీశాయి. గురువారం సాయంత్రం రాయచోటి ప్రభుత్వాసుపత్రి ఆవరణలో తెలుగు తమ్ముళ్ల మధ్య చోటు చేసుకున్న సంఘటన యుద్ధ వాతావరణాన్ని తలపించింది. టీడీపీ క్లస్టర్ ఇన్చార్జ్ మురికినాటి వెంకటసుబ్బారెడ్డి, చెన్నముక్కపల్లి గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు చవ్వాకుల రాజేష్ వర్గీయుల మధ్య ఈ ఘర్షణ జరిగింది. ఈ సంఘటనలో చవ్వాకుల రాజేష్, అతని సోదరుడు శరత్కు రక్తగాయాలయ్యాయి. రాయచోటి మండలం దిగువ అబ్బవరం రెవెన్యూ గ్రామం సర్వే నెంబర్ 15లోని ప్రభుత్వ భూమి విషయమై ఇరువర్గాల మధ్య గత కొన్ని రోజులుగా వైరం నడుస్తోంది. సర్వే నంబర్ 15లో ఉన్న 2.74 ఎకరాల భూమి మురికినాటి సుబ్బారెడ్డి భార్య సుగుణమ్మ పేరున డీకేటీ పట్టా ఉందని సమాచారం. ఇదే భూమిపై చవ్వాకుల రాజేష్, దిగువ అబ్బవరం గ్రామానికి చెందిన టీడీపీ నేతలు స్వాధీనం చేసుకునే క్రమంలో ఇరువర్గాలు కోర్టును ఆశ్రయించాయి. భూ తగాదా విషయం జేసీ కోర్టులో ఉన్నట్లు సమాచారం. తన భార్య పేరున ఉన్న భూమిపై అధికారులకు ఫిర్యాదు చేయడం, కోర్టుకు వెళ్లడం ఎంత వరకు సమంజసం అంటూ గురువారం సాయంత్రం ఆర్డీఓ కార్యాలయం ఎదుట ఎదురుపడిన చవ్వాకుల రాజేష్ను సుబ్బారెడ్డి నిలదీశారు. ఈ విషయంలో మాటకుమాట పెరిగి ఇరువురు ఘర్షణపడ్డారు. ఘర్షణలో గాయాలపాలైన రాజేష్ను చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విషయం తెలుసుకున్న రాజేష్ సోదరుడు శరత్, పార్టీ మండల అధ్యక్షులు గండికోట సుధాకర్, అబ్బవరం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులు ప్రభుత్వాసుపత్రికి చేరుకున్నారు. ఇంతలో రాజేష్ సోదరుడు శరత్ మురికినాటి సుబ్బారెడ్డికి ఫోన్ చేసి దమ్ముంటే ఆసుపత్రిలోకి వచ్చి వెళ్లాలని సవాల్ విసరడంతో సుబ్బారెడ్డి అనుచరులు ఒక్కసారిగా ఆసుపత్రికి చేరుకున్నారు. దీంతో ఆసుపత్రి ఆవరణంలో తమ్ముళ్ల తగాదాతో ఉద్రిక్త పరిస్థితులు ఏర్పడ్డాయి. ఇరు వర్గాల వారు రాళ్లు రువ్వుకుంటూ దాడులకు దిగారు. రాళ్ల దాడిలో శరత్ తలపై బలమైన గాయమైంది. భూ ఆక్రమణ కోసం పోటీ ఇప్పటికే రాయచోటి పరిసర ప్రాంతాలలో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను తెలుగు తమ్ముళ్లు ఆక్రమించుకుంటున్నారన్నది బహిరంగ రహస్యం. దిగువ అబ్బవరం గ్రామ పరిధిలోని 13/2 సర్వే నెంబర్లో ఉన్న 50 సెంట్ల ప్రభుత్వ భూమి ఆక్రమణ విషయంలో కూడా ఇరువర్గాల మధ్య రాజకీయ వార్ నడిచింది. ఈ రెండు సర్వే నెంబర్లలోని ప్రభుత్వ భూమి విలువ కోట్ల రూపాయలు పలుకుతుందని స్థానికులు చెబుతున్నారు. ఈ భూమిని రెవెన్యూ అధికారులతో కలిసి గుట్టుచప్పుడు కాకుండా డీకేటీ పట్టాలను పొందడంతోపాటు సబ్ రిజిస్టర్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ కూడా చేసిన విషయం వెలుగులోకి వచ్చింది. ఈ సంఘటనలో రిజిస్ట్రేషన్కు అవకాశం కల్పించిన రెవెన్యూ అధికారులను పక్కన పెట్టి, సబ్ రిజిస్టర్ను జిల్లా కలెక్టర్ సస్పెండ్ చేశారన్న ఆరోపణలు వినిపించాయి. అంతేకాకుండా రిజిస్ట్రేషన్ను రద్దు చేస్తూ కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. 50 సెంట్ల ఆక్రమణ విషయంలో సుబ్బారెడ్డి తమకు వ్యతిరేకంగా పనిచేశాడన్న సమాచారం మేరకు 15 సర్వే నంబర్లోని సుబ్బారెడ్డి భూమిపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతోపాటు నకిలీ పత్రాలతో భూమిని ఆక్రమించారని చవ్వాకుల రాజేష్ అతని అనుచరులు కోర్టును ఆశ్రయించినట్లు సమాచారం. ఏది ఏమైనా రాయచోటిలో భూ ఆక్రమణలు, తహసీల్దార్, పోలీస్స్టేషన్లలో జరుగుతున్న పంచాయతీలలో తెలుగు తమ్ముళ్ల మధ్య కొనసాగుతున్న వార్ ఎప్పుడు ఏ రూపంలో విరుచుకుపడుతుందోనన్న భయం స్థానికుల్లో నెలకొంది. -
ముఖ్యమంత్రి ప్రైవేట్ సైన్యంలా పోలీస్ శాఖ
ప్రొద్దుటూరు : -Æ>-çÙ‰…ÌZ AçÜË$ {糿¶æ$™èlÓ-Ð]l$-¯ól§ól Ìôæ§ýl-°, ´ùÎçÜ$ Ô>Q Ð]l¬QÅÐ]l$…{† ^èl…{§ýl»êº$ ¯éĶæ¬-yýl$MýS$ JMýS {Oò³ÐólsŒæ Oòܯ]lÅ…Ìê Ð]l*Ç ç³°-^ól-Ýù¢…§ýl° OÐðlG-ÝëÞÆŠ‡-ïÜï³ Æ>çÙ‰ A«¨-M>Æý‡ {糆-°«¨, Ð]l*i GÐðl$ÃÌôæÅ Æ>^èlÐ]l$Ë$Ï ÕÐ]l-{ç³-Ýë-§ýl-Æð‡yìlz ¡{Ð]l-Ýë¦-Ƈ$$ÌZ «§ýlÓf-Ððl$™é¢Æý‡$. {´÷§ýl$ªr*-Æý‡$ÌZ° ™èl¯]l M>Å…‹³ M>Æ>Å-ÌSĶæ$…ÌZ VýS$Æý‡$-ÐéÆý‡… fÇ-W¯]l Ò$yìlĶæ* çÜÐ]l*-ÐólÔèæ…ÌZ BĶæ$¯]l Ð]l*sêÏ-yýl$-™èl*.. Æ>çÙ‰-ÐéÅ-ç³¢…V> ¡{Ð]l çÜ…^èl-ÌS¯]l… çÜ–íÙt…-_¯]l ÝëÆ‡$$-MýS–çÙ~ ÌêMýS-‹³-yðl™Œæ E§ýl…-™èlÐól$ C…§ýl$MýS$ °§ýl-Æý‡Ø¯]l-Ð]l$-¯é²Æý‡$. ÝëÆ‡$$-MýS–-çÙ~Oò³ Æð‡…yýl$ ¯é¯Œl »ñæÆ‡$$-ÌS-º$ÌŒæ ÐéÆð‡…r$Ï E…yýlV>, sê‹Ü-P-¸ùÆŠ‡Þ ´ùÎ-çÜ$Ë$ ÑfĶæ$-Ðéyýl íÜsîæ MýSÑ$çÙ-¯]lÆŠæ B§ól-Ô>ÌS Ðól$Æý‡MýS$ ^èlrt-Ñ-Æý‡$§ýl®…V> MýS–çÙ~ÌS…MýS ´ùÎ‹Ü õÜtçÙ-¯ŒSMýS$ Aç³µW…^éÆý‡° BÆø-í³…-^éÆý‡$. fVýSY-Ķæ$Åõ³r ç³Ç-«¨ÌZ° çÜ$Ð]l*Æý‡$ ₹30 ¯]l$…_ ₹40 MørÏ ÑË$-OÐðl¯]l çܦÌê-°MìS çÜ…º…«¨…_ A«¨-M>Æý‡ ´ëÈt GÐðl$ÃÌôæÅ, G…ï³ÌS íœÆ>ŧýl$ Ðól$Æý‡MóS íÜsîæ MýSÑ$-çÙ-¯]lÆŠæ B§ól-Ô>ÌS™ø MýS–çÙ~-ÌS…MýS ïÜI ¯éVýSÆ>k ÝëÆ‡$$MýS–çÙ~¯]l$ ¡çÜ$-MðS-âêÏÆý‡° Æ>^èl-Ð]l$Ë$Ï A¯é²Æý‡$. ÐéÆý‡… ÆøkÌS ´ër$ A{MýSÐ]l$ °Æý‡¾…«§ýl…ÌZ E…_, _{™èl-íßæ…-çÜË$ ò³sìæt ^èl…õ³íÜ, _Ð]l-Æý‡MýS$ VýS$r$t^èl-糚yýl$ M>MýS$…yé ÔèæÐé°² §ýlçßæ¯]l… ^ólÔ>Æý‡° Ð]l$…yìlç³-yézÆý‡$. ´ùÎ‹Ü õÜtçÙ-¯ŒSÌZ M>±, BçÜ$ç³-{†ÌZ M>± GÌê…sìæ ïÜïÜsîæÒ çœ#sôæ-iË$, A…™èlÅ-{MìSĶæ$ÌS B«§é-Æ>Ë$ Ð]l$ÇÄ¶æ¬ VýS*VýS$ÌŒæ í³MýSaÆŠ‡Þ ÌS¿ýæÅ… M>MýS$…yé Ýë„>ÅÌS¯]l$ ç³NÇ¢V> ™èl$yìl-_ò³-sôæt-Ô>Æý‡° «§ýlÓf-Ððl$™é¢Æý‡$. D MóSçÜ$ÌZ MóSÐ]lÌS… ïÜI ¯éVýSÆ>-k¯]l$ Ð]l*{™èlÐól$ Ð]l¬§éª-Ƈ$$V> ^ólÆý‡ayýl… A™èlÅ…™èl àÝëÅ-çܵ§ýl-Ð]l$-¯é²Æý‡$. J…rÇV> ¡çÜ$-MðS-âýæÏyýl…, íßæ…íÜ…^èl-yýl…, ^èl…ç³-yýl…, ÔèæÐé°² M>ÌS-ayýl… JMýS ïÜIMóS Ýë«§ýlÅÐ]l* A° {ç³Õ²…_¯]l Æ>^èl-Ð]l$-Ë$Ï.. MóSçÜ$ÌZ E¯]l² A«¨-M>Æý‡ ´ëÈt GÐðl$ÃÌôæÅ, G…ï³, ´ùÎ‹Ü »ê‹Ü-ÌS¯]l$ çÜ…Æý‡-„ìS…-^ól…-§ýl$MóS ^èl…{§ýl»êº$ Mö™èl¢ ¯érM>-°MìS ™ðlÆý‡-Ìôæ-´ëÆý‡° ÑÐ]l$-ÇØ…-^éÆý‡$. ´ùÎ-çÜ$Ë$ ÌêMýS‹³yðl™Œæ ^ólõÜ¢, †ÇW B ´ùÎ‹Ü Ô>Q Ðéǯól Ñ^éÆý‡×æ A«¨-M>Æý‡$-Ë$V> °Ä¶æ$-Ñ$…-^èl-yé°² çÜ${ï³…-MøÆý‡$t ™èl糚-º-sìæt…-§ýl-°.. çÜçßZ§øÅ-VýS$ÌS¯]l$ Æý‡„ìS…^ól AÐ]l-M>Ôèæ… E…r$…¨ M>ºsìæt MýS_a-™èl…V> ïܽ-I-™ø¯ól Ñ^éÆý‡×æ ^ólƇ$$…-^éÌS° VýS™èl…ÌZ A™èl$ů]l²™èl ¯éÅĶæ$-Ý릯]l… B§ól-Õ…-_…§ýl° BĶæ$¯]l VýS$Æý‡$¢-^ól-Ô>Æý‡$. OÐðlG-ÝëÞ-ÆŠ‡-ïÜï³ A«¨-¯ól™èl OÐðlG‹Ü fVýS¯Œl Ððl*çßæ-¯Œl Æð‡yìlz »ê«¨-™èl$yýl$ ÝëÆ‡$$-MýS–çÙ~ ™èlÍÏ Ñf-Ķæ$-ÌS„ìS-ð ç³Æ>-Ð]l$ÇØ…-_¯]l ™èlÆ>Ó™ól Ð]l¬QÅÐ]l$…{† Æý‡…VýS-{ç³ÐólÔèæ… ^ólÔ>-Æý‡-¯é²Æý‡$. Ñf-Ķæ$-ÌS-„ìS-ð ¿ýæÄ¶æ$-ò³-sêtÆø, {ç³ÌZ-¿ýæò³-sêtÆø ™ðlÍ-Ķæ$§ýl$ M>± ™èlÆ>Ó™èl BÐðl$ 'Ð]l*MýS$ ¯éÅĶæ$… fÇW…¨' A° {ç³MýS-sìæ…-^èlyýl… Ððl¯]l$MýS ò³§ýlª VýS*yýl$-ç³#-u>×îæ fÇW…§ýl° A¯]l$-Ð]l*¯]l… Ð]lÅMýS¢… ^ólÔ>Æý‡$. BÐðl$MýS$ OÐðlG-ÝëÞÆŠæ M>…{VðS‹Ü ´ëÈt Ð]l$ÇÄ¶æ¬ fVýS-¯Œl A°² Ñ«§éÌê A…yýlV> E…sêÆý‡°, ¿ýæÄ¶æ$-ç³yýl-MýS$…yé ÐéçÜ¢ÐéË$ ÐðlÌSÏ-yìl…-^éÌS° MøÆ>Æý‡$. D òœ*Æý‡ E§ýl…-™èl…Oò³ Cç³µ-sìæMóS OÐðlG-ÝëÞ-ÆŠ‡-ïÜ-ï³™ø ´ër$ fyýl {ÔèæÐ]l-׊æ-MýS$Ð]l*ÆŠæ OòßæMø-Æý‡$tÌZ í³ÌŒæ ÐólÔ>-Æý‡-°, D ¯ðlÌS 29¯]l fÇVóS OòßæMøÆý‡$t Ñ^é-Æý‡-׿ÌZ MóSçÜ$¯]l$ ïܽIMìS Aç³µ-W…-^éÌS° MøÇ¯]l-糚yól »ê«¨-™èl$-ÌSMýS$ çÜOÆð‡¯]l ¯éÅĶæ$… fÆý‡$-VýS$™èl$…§ýl° Æ>^èl-Ð]l$Ë$Ï çܵçÙt… ^ólÔ>Æý‡$. çÜÐ]l*-Ðól-Ôèæ…ÌZ OÐðlG-ÝëÞ-ÆŠ‡-ïÜï³ ç³rt-×ê«§ýlÅ-„ýS$yýl$ ¿¶æ*Ñ$Æð‡yìlz Ð]l…Ö-«§ýlÆŠ‡-Æð‡yìlz, Ð]l*i G…ï³ï³ Ððl$r$t-ç³ÌñæÏ {糿ê-MýS-ÆŠ‡-Æð‡yìlz ´ëÌŸY-¯é²Æý‡$. -
కారు, ఆటో ఢీకొని నలుగురికి గాయాలు
కలసపాడు : మండలంలోని పోరుమామిళ్ల ప్రధాన రహదారి శంఖవరం, పిడుగుపల్లె గ్రామాల మలుపు వద్ద గురువారం కారు, ఆటో ఢీకొనడంతో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. పోరుమామిళ్ల మండలం దమ్మనపల్లె గ్రామానికి చెందిన వారు ఆటోలో మండలంలోని చెన్నుపల్లెలో తమ బంధువుల అంత్యక్రియలకు ఆటోలో వెళుతుండగా.. అదే సమయంలో బద్వేలుకు చెందిన వారు కొండపేటలో వారి బంధువుల వివాహానికి హాజరై తిరిగి బద్వేలుకు కారులో వెళుతున్నారు. ఈ రెండు వాహనాలు మలుపు వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ప్రయాణిస్తున్న సుబ్బరాయుడు, నారాయణమ్మ, మరో ఇద్దరు మహిళలకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితులను స్థానికులు 108 వాహనంలో పోరుమామిళ్ల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. బైక్లు ఢీకొని ఇద్దరికి..పోరుమామిళ్ల : మండలంలోని కాలువకట్ట వద్ద గురువారం రెండు బైకులు ఢీకొనడంతో ఇరువురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో ఒకరు కొత్తూరు, మరొకరు చింతలపల్లెకు చెందిన వారని తెలిసింది. బాధితులను స్థానికులు వెంటనే ఆసుపత్రికి తరలించినట్లు సమాచారం. గోడ కూల్చివేతపై కేసు నమోదుకడప అర్బన్ : కడప నగరం సీఎస్ఐ స్కూల్ ఆవరణలో నూతనంగా నిర్మిస్తున్న భవన గోడను కూల్చి వేసిన వారిపై కేసు నమోదు చేసినట్లు కడప వన్టౌన్ ఎస్ఐ అమర్నాథరెడ్డి తెలిపారు. ఆయన వివరాల మేరకు.. సీఎస్ఐ స్కూల్ ఆవరణలో నూతనంగా చర్చికి సంబంధించిన కమిటీ వారు భవనాన్ని నిర్మిస్తున్నారు. భవన నిర్మాణాన్ని ఆపాలంటూ కడపకు చెందిన డేనియల్ ప్రదీప్ మరి కొందరితో కలిసి గురువారం గోడను కూల్చివేశారు. చర్చికి సంబంధించిన సెక్రటరీ ఆనందరావు ఫిర్యాదు మేరకు డేనియల్ ప్రదీప్తోపాటు మరికొందరిపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.ప్రమాదంలో గాయపడిన మహిళలు -
వైఎస్ జగన్ నేతృత్వంలోనే కాపులకు న్యాయం
కడప కార్పొరేషన్ : మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి నేతృత్వంలోనే కాపులకు న్యాయం జరుగుతుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి సింగసాని గురుమోహన్ అన్నారు. గురువారం జిల్లా పార్టీ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రశ్నించేందుకే పార్టీ పెట్టానన్న పవన్.. బలిజలపై దాడులు జరుగుతుంటే ఎందుకు ప్రశ్నించడం లేదన్నారు. జనసేనకు వచ్చిన ఏకై క రాజ్యసభ సీటును కూడా కమ్మ కులానికి ఇచ్చారన్నారు. జనసేన పార్టీ తరఫున కడప జిల్లాలో రెండు డైరెక్టర్ పోస్టులు తప్ప, ఒక్క చైర్మన్ పదవి కూడా ఇవ్వలేదన్నారు. కాపులకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అత్యధిక గౌరవం ఇచ్చారని, రామచంద్రయ్యకు ఎమ్మెల్సీ, గురు ప్రసాద్కు చైర్మన్, మాచునూరు చంద్రకు మున్సిపల్ చైర్మన్, క్రిష్ణ చైతన్యకు గండి ఆలయ చైర్మన్ పదవి ఇచ్చారని గుర్తు చేశారు. ఏ పార్టీ కాపులకు ఎక్కువ విలువ ఇస్తుందో కాపు కులస్తులు ఆలోచించాలన్నారు. టీడీపీలో హరిప్రసాద్కు జాతీయ పదవి ఇచ్చి లోకేష్ పర్యటనలో కింద కూర్చోపెట్టి అవమానించారని పేర్కొన్నారు. కాపులకు టీడీపీ, జనసేన పార్టీల్లో విలువ లేదన్నారు. ఎవరి హయాంలో కాపులకు మేలు జరిగిందో చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని తెలిపారు. గాదె సాయిక్రిష్ణను పవన్ క్రిమినల్ అన్నాడని, క్రిమినల్ అయితే చంపే హక్కు ఎవరిచ్చారని వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు దాసరి శివప్రసాద్ ప్రశ్నించారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ కాపు నేతలు తోటక్రిష్ణ, మల్లికార్జున కిరణ్, రామక్రిష్ణ, సింధు, సాయిదత్త పాల్గొన్నారు. -
నేడు ఫుట్బాల్ జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో శుక్రవారం ఫుట్బాల్ జిల్లా సబ్ జూనియర్స్, జూనియర్ బాలికల జట్ల ఎంపిక జరుగుతుందని జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. పాఠశాలలో మధ్యాహ్నం 3 గంటలకు ఎంపిక జరుగుతుందని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు 9502074146ను సంప్రదించాలని సూచించారు. పోస్టర్ల ఆవిష్కరణ సాక్షి, మదనపల్లె: ఇషా గ్రామోత్సవ కార్యక్రమ పోస్టర్లను వైద్య, ఆరోగ్యశాఖ మంత్రి సత్యకుమార్ ఆవిష్కరించారు. గురువారం మదనపల్లెకు వచ్చిన మంత్రి స్థానిక బీజేపీ సీనియర్ నేత చల్లపల్లి నరసింహారెడ్డిని కలిశారు. సందర్భంగా పార్టీ నాయకులతో కలిసి ఆయన మాట్లాడుతూ గ్రామీణ యువతకు తమ ప్రతిభను ప్రదర్శించుకునే వేదికగా ఇషా పోటీలు నిలుస్తాయన్నారు. జిల్లా అధ్యక్షులు పులి నరేంద్ర కుమార్ రెడ్డి, విజయభారతి సేతు, బీజేపీ సీనియర్ నాయకులు బర్నేపల్లె రవికుమార్, అజ్మతుల్లా ఖాన్, డాక్టర్ బాబు పాల్గొన్నారు. పెరటి కోళ్ల పెంపకంతో ఉపాధి – పశు సంవర్తక శాఖ జేడీ గుణశేఖర పిళ్లై మదనపల్లె టౌన్: నిరుద్యోగ యువత ఆర్థిక ఇబ్బందులు అధిగమించాలంటే పెరటి కోళ్ల పెంపకం ఉత్తమ మార్గ మని అన్నమయ్య జిల్లా పశుసంవర్ధక శాఖ జేడీ కే.గుణశేఖర పిళ్లై సూచించారు. గురువారం మద నపల్లె జేడీ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. భారీ బడ్జెట్తో కోళ్ల ఫారాలు నెల కొల్పలేని నిరుద్యోగ యువత తక్కువ ఖర్చుతో లాభాలు ఆర్జించ వచ్చన్నారు. మాంసాహారం, గుడ్లకు డిమాండ్ ఉన్న పెరటి నాటి కోళ్లను పెంచు కోవాలని సూచించారు. ముఖ్యంగా గిరిరాజ, వనరాజ, గ్రామప్రియ, రాజశ్రీ రకాల కోళ్లు త క్కువ పెట్టుబడితో మంచి ఆదాయం ఇస్తాయని జేడీ తెలిపారు. ఆసక్తి ఉన్న యువత పశుసంవర్ధక శాఖను సంప్రదిస్తే సాంకేతిక సహాయం, మార్గదర్శనం అందిస్తామని సూచించారు. మదనపల్లె సిటీ: జాతీయ విద్యాశిక్షణ, పరిశోధనంస్థ, విజ్ఞానభారతి, నేషనల్ కౌన్సిల్ ఆప్ సైన్స్ మ్యూజియం సంస్థలు సంయుక్తంగా జాతీయ స్థాయిలో నిర్వహించే సైన్స్ టాలెంట్ పరీక్షల పోస్టర్ను గురువారం డీఈఓ సుబ్రమణ్యం ఆవిష్కరించారు. ఈ సందర్భంగా డీఈఓ మాట్లాడుతూ విజ్ఞానశాస్త్రంపై ఆసక్తి కలిగి, సృజనాత్మక ఆలోచనలు పంచుకోవడానికి విద్యార్థులకు మంచి అవకాశమన్నారు. ఈ పోటీల్లో ఆరవ తరగతి నుంచి 11వ తరగతి వరకు చదువుకునే విద్యార్థులు పాల్గొనవచ్చునన్నారు. ఆసక్తికలిగిన విద్యార్థులు తమ పేర్లను నమోదు చేసుకుని పరీక్షలకు హాజరు కావాలన్నారు. వివరాలకు సెల్ 7702202288తో పాటు, httpr:/vvm.orf,in వెబ్సైట్లో మరిన్ని వివరాలు పొందవచ్చని వివరించారు. ప్రజల హక్కులను కాలరాసిన ఎమర్జెన్సీ కురబలకోట: నాడు ఇందిరా గాంధీ విధించిన ఎమర్జెన్సీ దేశ చరిత్రలోనే చీకటి అధ్యాయమని రాష్ట్ర వైద్యారోగ్య మరియు కుటుంబ సంక్షేమ శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అన్నారు. కురబలకోట మండలంలోని అంగళ్లు గోల్డెన్వ్యాలీ కళాశాలలో గురువారం జరిగిన ప్రజా స్వామ్య హత్యాదినం సభలో ముఖ్య అతిధిగా ఆయన మాట్లాడుతూ అత్యవసర పరిస్థితి వల్ల రాజ్యాంగ హక్కులు హరించబడ్డాయన్నారు. ప్రజా స్వామ్యాన్ని ఉక్కు పాదంతో అణచివేసిన రోజే ప్రజా స్వామ్య హత్యదినంగా పరిగణించడం జరుగుతోందన్నారు. ఎమర్జెన్సీ కాలంలో ప్రతిపక్ష నాయకులను జైలుకు పంపడం, పత్రికలపై ఆంక్షలు విధించడం వంటి చర్యలు ప్రజల గొంతుక నొక్కివేయడమేనన్నారు. ఇవి పునరావృతం కారాదన్నారు. -
పోతబోలు వద్ద చిరుత సంచారం?
మదనపల్లె టౌన్: జిల్లాలోని మదనపల్లె మండలం, పోతబోలు గ్రామానికి సమీపంలోని నూరు కుప్పలకొండ పరిసరాల్లో చిరుతపులి సంచరిస్తోందని గురువారం పుకార్లు షికారు చేశాయి. ఈ విషయమై పోతబోలు మాజీ సర్పంచ్ పటాన్ ఖాదర్ ఖాన్ వెంటనే ఫారెస్ట్, పోలీస్ అధికారులకు సమాచారం అందించారు. స్పందించిన ఫారెస్ట్ రేంజ్ అధికారి జయప్రసాద్ రావు సిబ్బందిని పోతబోలుకు పంపించారు. వారు ప్రస్తుతం చిరుత అడుగు జాడలను గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా రాత్రి వేళల్లో బయట తిరగవద్దని, పిల్లలు, పశువులను జాగ్రత్తగా చూసుకోవాలని ఫారెస్ట్ అధికారులు సూచించారు. -
ముగిసిన వైఎస్ జగన్ పర్యటన
● పులివెందులలో మూడు రోజులు పర్యటించినమాజీ సీఎంవైఎస్ జగన్ ● భూమయ్యగారిపల్లెలో శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టలో మాజీ సీఎం ● పులివెందులలో పలు అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవాలు పులివెందుల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పులివెందులలో మూడు రోజుల పర్యటన గురువారంతో ముగిసింది. పర్యటనలో భాగంగా రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులను ఆయన ఆప్యాయంగా పలకరించారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసులకు భయపడొద్దని.. అండగా ఉంటానంటూ ధైర్యం కల్పించారు. రాబోయే రోజులలో మన ప్రభుత్వం ఏర్పడి మంచి రోజులు వస్తాయని పార్టీ కేడర్లో ధైర్యం నింపుతూ పర్యటన సాగించారు. తొలిరోజు భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. బుధవారం రెండవ రోజు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొన్నారు. అనంతరం పులివెందులలో అభివృద్ధి ప్రారంభోత్సవ కార్యక్రమంలో రూ.1.50కోట్ల ఎంపీ నిధులతో నిర్మించిన సీసీ రోడ్లను ప్రారంభించారు. మూడవ రోజు గురువారం ఉదయం మాజీ సీఎం వైఎస్ జగన్ బెంగుళూరుకు పయనమయ్యారు. వైఎస్ జగన్మోహన్రెడ్డికి వీడ్కోలు పలికిన వారిలో రాజంపేట ఎమ్మెల్యే అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, కల్పలతారెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి, మాజీ మంత్రి అంజాద్ బాషా, కమలాపురం వైఎస్సార్సీపీ ఇన్ఛార్జి నరేన్, నేతలు వజ్ర భాస్కర్రెడ్డి, వైఎస్ మనోహర్రెడ్డి, వేముల మండల పరిశీలకులు వేల్పుల రామలింగారెడ్డి తదితరులు ఉన్నారు. -
గాయపడిన యువకుడు మృతి
మదనపల్లె టౌన్ : కారు బోల్తా పడి తీవ్రంగా గాయపడ్డ యువకుడు చికిత్స పొందుతూ మృతి చెందాడు. మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ వెల్లడించిన వివరాలు.. మండలంలోని అంకిశెట్టిపల్లికి చెందిన కొప్పల కిషోర్ కుమార్ అలియాస్ చంటి ఈ నెల 17న తన స్వగ్రామంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి, తిరుపతి నుంచి వస్తున్న బంధువులను ఆర్టీసీ బస్టాండ్ వద్ద కారులో ఎక్కించుకుని అంకిశెట్టిపల్లికి బయలుదేరాడు.మార్గమధ్యంలో అంకిశెట్టిపల్లి రోడ్డులోని సమాధుల తోట వద్ద మలుపులో కారు అదుపుతప్పి బహుద కాలువలోకి దూసుకెళ్లి ప్రమాదానికి గురైంది. ఈ ఘటనలో కారులో ఉన్న ఆరుగురూ తీవ్రంగా గాయపడ్డారు. అందులో కిషోర్ కుమార్ కోమాలోకి వెళ్లాడు. స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించి ప్రథమ చికిత్స అందించారు. అక్కడి నుంచి కిషోర్ కుమార్ను మెరుగైన వైద్యం కోసం తిరుపతిలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మంగళవారం అర్థరాత్రి కిషోర్ కుమార్ మృతి చెందాడు. పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని బుధవారం అంకిశెట్టిపల్లికి తీసుకువచ్చారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. ముగ్గురికి తీవ్ర గాయాలు చౌడేపల్లె : బైక్ను బొలెరో వాహనం ఢీకొన్న ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన బుధవారం బోయకొండ మార్గంలోని మేకలవారిపల్లె వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పెద్దపంజాణి మండలం రాయలపేట సమీపంలోని గమ్కొండ కు చెందిన రవి, సుబ్రమణ్యం, గురునాథ్లు బైక్లో బోయకొండ వద్ద టమోటా తోటలో కూలి పనుల కోసం వెళ్తున్నారు. మేకలవారిపల్లె వద్ద ఒక్కసారిగా పంట పొలాల్లో నుంచి రోడ్డుపైకి బొలెరో రావడంతో ఎదురుగా వస్తున్న బైక్ను ఢీకొంది. గాయపడిన వారిని స్థానిక ప్రవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. మెరుగైన వైద్యసేవల కోసం మదనపల్లెకు తీసుకెళ్లారు. ఆటో డ్రైవర్కు..కురబలకోట : కారు ఢీకొని ఆటో బోల్తా పడి డ్రైవర్ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. ముదివేడు పోలీసులు వివరాలు వెల్లడించారు. మండలంలోని సింగన్న గారిపల్లెకు చెందిన ఆంజనేయులు(55) సొంతంగా ఆటో నడుపుకుని జీవనం సాగిస్తున్నాడు. రోజులాగే అంగళ్లు నుంచి ప్రయాణికులను ఆటోలో దొమ్మన్నబావికి తరలించాడు. ప్రయాణికులను దించి తిరిగి అంగళ్లుకు బయలుదేరాడు. దొమ్మన్నబావి బ్రిడ్జి వద్ద ఎదురుగా వస్తున్న కారు ఆటోను ఢీకొట్టడంతో ఆటో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ ఆంజనేయులును 108 సిబ్బంది వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. -
రహదారి నిబంధనలు పాటించాలి : జిల్లా ఎస్పీ
మదనపల్లె టౌన్ : ప్రజలు రహదారి నిబంధనలు కచ్చితంగా పాటించాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. బుధవారం మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో దివ్యాంగులు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ ఏర్పాటు చేసిన కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పాల్గొన్నారు. ప్రజలకు 100 హెల్మెట్లను ఉచితంగా పంపిణీ చేసి, ద్విచక్ర వాహన దారులు ప్రమాదాల బారిన పడకుండా తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని సూచించారు. అనంతరం ఎస్పీ ఆదేశాలతో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి ఆధ్వర్యంలో యువతలో చైతన్యం కోసం పోలీసు ప్రధాన కార్యాలయం నుంచి అన్నమయ్య సర్కిల్ వరకు భారీ బైక్ ర్యాలీ నిర్వహించారు. అనంతరం చాముండేశ్వరి సర్కిల్ వద్ద మత్తుకు వ్యతిరేకంగా సంతకాల సేకరణ చేపట్టారు. నోడల్ ఆఫీసర్ ఆర్.వి.క్రిష్ణ కిషోర్, సర్వోదయ ప్రెసిడెంట్ ఆదినారాయణ రెడ్డి, ట్రాఫిక్ సీఐ గురునాథ్, పోలీసు, మున్సిపల్, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న కారుపీలేరురూరల్ : ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన కారు విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న సంఘటన పీలేరు పట్టణం సదుం మార్గం పెద్దిరెడ్డిగారిపల్లె వద్ద బుధవారం రాత్రి చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు – సదుం మార్గంలో బుధవారం రాత్రి ముందు వెళుతున్న ద్విచక్రవాహనాన్ని తప్పించబోయిన ఇన్నోవా కారు రోడ్డు పక్కన విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. స్తంభం విరిగి కారుపై పడింది. అయితే కారులోని ప్రయాణీకులు పెనుప్రమాదం నుంచి సురక్షితంగా బయటపడ్డారు. -
అదనపు కట్నం వేధింపులపై కేసు నమోదు
మదనపల్లె టౌన్ : అదనపు కట్నం కోసం కోడల్ని వేధించిన ఆరోపణలపై అత్త, ఆమె భర్త పై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. ఇందుకు సంబంధించి తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండలంలోని కోళ్ల బైలు కాలనీకి చెందిన ఇంద్రజ ను ఆమె భర్త పవన్ కుమార్, అత్త శంకరమ్మ అదనపు కట్నం కోసం వేధింపులకు గురి చేయడంతో కేసు నమోదైందని తెలిపారు. ఫిర్యాదు వివరాల ప్రకారం.. ఇంద్రజకు, పవన్ కుమార్కు ఐదు సంవత్సరాల క్రితం వివాహమైంది. తదుపరి కాండ్లమడుగు క్రాస్ వద్ద కలిసి జీవిస్తున్నారు. భర్త పవన్ కుమార్ మద్యానికి అలవాటు పడి, అదనపు కట్నం కోసం ఇంద్రజను వేధిస్తున్నట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఫిర్యాదు ఆధారంగా కేసు నమోదు చేసి తాలూకా పోలీస్ స్టేషన్న్లో దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. గాజులవారిపల్లె పాఠశాలపై నివేదిక ఇస్తాం చౌడేపల్లె : మండలంలోని వెంగళపల్లె పంచాయతీ గాజులవారిపల్లె ప్రాథమిక పాఠశాలలో చదువుతున్న 3, 4, 5 తరగతులను మర్రిమాకులపల్లె పాఠశాలకు విలీనం పై గత రెండు రోజులుగా సాక్షిలో కథనం ప్రచురితమైన విషయం విధితమే. స్పందించిన ఎంఈఓ బుధవారం మాట్లాడుతూ ఉన్నతాధికారుల ఆదేశాల ప్రకారం తాము ఎస్ఎంసీ కమిటీ తీర్మాణం మేరకు విలీనంపై చర్యలు చేపట్టినట్లు చెప్పారు. ప్రస్తుతం ఆగ్రామంతోపాటు మోట్లపల్లె, నరసాపురం, యానాధిపాళ్యం నుంచి మర్రిమాకులపల్లె పాఠశాలకు విద్యార్థులు బడికి వెళ్లడానికి పడుతున్న అవస్థలు, దూరం 5 కిలోమీటర్లు ఉందని తల్లిదండ్రులు అధికారులకు వినతిచేశారన్నారు. తల్లిదండ్రుల అభ్యర్థన మేరకు ఈ విషయాన్ని డీఈఓ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. ఈ విషయాన్ని విద్యాశాఖ కమిషనర్ చెంతకు తీసుకెళ్లేలా ఉన్నతాధికారులకు సమస్యను వివరించి ఆ గ్రామంలోనే ఆ తరగతులు కొనసాగించేలా చూస్తామని వివరించారు. ఉద్యమ్ సర్టిఫికెట్తో ప్రయోజనాలుసదుం : పరిశ్రమల మంత్రిత్వ శాఖ జారీ చేసే ఉద్యమ్ సర్టిఫికెట్తో మహిళలు నిర్వహించే వ్యాపారాలకు గుర్తింపు లభిస్తుందని జిల్లా పరిశ్రమల ప్రోత్సాహక అధికారి నాగార్జున తెలిపారు. స్థానిక సీ్త్ర శక్తి భవనంలో ఉద్యమ్ రిజిస్ట్రేషన్లపై మహిళా సంఘ సభ్యులకు వర్క్ షాప్ నిర్వహించారు. ఈ సర్టిఫికెట్ పొందితే తక్కువ వడ్డీకే రుణాలు, ప్రభుత్వ రాయితీలు లభిస్తాయన్నారు. మహిళలు దీనిని సద్వినియోగం చేసుకుని వ్యాపారవేత్తలుగా అభివృద్ధి చెందాలని ఆకాంక్షించారు. -
విద్యార్థిపై హత్యాయత్నం
● 8 కుట్లు పడిన వైనం ● మండిపడుతున్న విద్యార్థి తల్లిదండ్రులువాల్మీకిపురం : అన్నమయ్య జిల్లా వాల్మీకిపురం పీవీసీ ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతున్న ఇద్దరు విద్యార్థుల మధ్య మంగళవారం పుస్తకాల గొడవ జరిగింది. మండలంలోని గొల్లపల్లికి చెందిన విద్యార్థి హర్షవర్థన్ పుస్తకాలను పట్టణానికి చెందిన విద్యార్థి భరత్ రాజ్ దొంగలించాడు. దొంగలించిన విషయం తెలుసుకుని.. ఇలా పుస్తకాలను దొంగలించడం తప్పు కదా అంటూ భరత్రాజ్ను నిలదీశాడు. వీరి మధ్య వాగ్వాదం జరిగి ఎవరి ఇంటికి వాళ్లు మంగళవారం సాయంత్రం వెళ్లిపోయారు. బుధవారం ఉదయం భరత్రాజ్ తన వెంట తెచ్చుకున్న నగదుతో రూ.5 వెచ్చించి చిన్నపాటి చాకును కొనుగోలు చేసి దాన్ని జోబులో పెట్టుకొని పాఠశాలకు వచ్చాడు. వచ్చి తోటి విద్యార్థులతో మాట్లాడుతూ.. హర్షవర్థన్ రానివ్వండి వాడి కథ చూస్తా ఈ రోజు అంటూ.. హెచ్చరికలు జారీ చేశాడు. అనంతరం తరగతి గదిలోకి వెళ్లిపోయాడు. పొరుగున ఉన్న గొల్లపల్లి నుంచి హర్షవర్థన్ తరగతి గదిలోకి వచ్చి పుస్తకాలను కింద పెట్టేందుకు ఒంగాడు. ఈలోపే భరత్రాజ్ తన వెంట తెచ్చుకున్న చిన్నపాటి చాకుతో హర్షవర్థన్ మెడపై బలంగా కోశాడు. దీంతో హర్షవర్థన్కు తీవ్ర రక్తగాయాలు అయ్యాయి. ఈ సంఘటనతో ప్రభుత్వ పాఠశాల విద్యార్థులు ఒక్కసారిగా ఉలిక్కి పడ్డారు. గాయపడిన విద్యార్థిని హుటాహుటిన స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. విద్యార్థి మెడపై దాదాపు 8 కుట్లు పడినట్లు వైద్యులు తెలిపారు. బాధితుడు స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై బాధితుడి తల్లిదండ్రులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
టమాటా ధరలు ఢమాల్
● వారంరోజులుగా తగ్గిపోతున్న ధరలు ● మార్కెట్లో కిలో టమాటా రూ.11 ● 15రోజుల కిందట ధరతో పోల్చితే 75 శాతం కోత ● జిల్లాలో పెరిగిన పంట దిగుబడులు ● బయటి రాష్ట్రాల్లో దిగుబడితో తగ్గుతున్న ధరలు ● ఆవేదనలో టమాటా రైతులుగుర్రంకొండ : టమాటా ధరలు ఒక్కసారిగా ఢమాల్ అంటూ పడిపోయాయి. వారం రోజులుగా టమాటా ధరలు మార్కెట్లో రోజు రోజుకు పతనమవుతున్నాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో టమాటా ధర రూ. రూ.11కు పడిపోయింది. 15 రోజుల కిందట మార్కెట్లో ధరలతో పోల్చితే 75 శాతం ధరల్లో కోత పడింది. దీంతో రైతులు లబోదిబో మంటున్నారు. 34వేల ఎకరాల్లో ప్రస్తుత పంట దిగుబడి జిల్లా పరిధిలో ప్రస్తుతం 34వేల ఎకరాల్లో టమాటా దిగుబడి వస్తోంది. ప్రతి ఏడాది ఈసీజన్లో 34 వేల నుంచి 40వేల ఎకరాల్లో టమాటా పంట దిగుబడి వస్తుంది. ఇటీవల కురిసిన వర్షాలకు టమాటా తోటలు బాగా పుంజుకొన్నాయి. దీంతో టమాటా పంట దిగుబడి ప్రస్తుతం అధికంగా వస్తోంది. పదిహేనురోజుల కిందట జిల్లాలో వచ్చిన టమాటా దిగుబడులతో పోల్చితే ప్రస్తుతం 65 శాతం పెరిగింది. ఇదేనెలలో పదిహేను రోజులకిందట జిల్లా వ్యాప్తంగా 12 వేల ఎకరాల్లో మాత్రమే పంట దిగుబడి వచ్చింది. ప్రస్తుతం వాతావారణంలో సంభవించిన మార్పులు, ఆడపాదడపా కురిసిన వర్షాలతో టమాటా తోటల్లో పంట దిగుబడులు రోజు రోజుకు పెరుగుతుండడం గమనార్హం. మార్కెట్లో పతనమవుతున్న ధరలు ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా ఉన్న టమాటా మార్కెట్లలో రోజు రోజుకు ధరలు పతనమవుతున్నాయి. 15 రోజులు కిందట 25 కేజీల టమాటా క్రీట్ ధరలు అత్యధికంగా రూ.1000 నుంచి రూ.1100వరకు ధరలు పలికాయి. అయితే ప్రస్తుతం ఒక క్రీట్ ధర రూ. 250 నుంచి రూ. 300 లోపే పలుకుతున్నాయి. వారం రోజులుగా మార్కెట్లో టమాటా ధరలు రోజురోజుకు తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇవే ధరలు నిలకడగా ఉంటే కనీసం పంట సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి ఉండదని రైతులు ఆవేదన చెందుతున్నారు. వాతావరణ మార్పులతో దిగుబడులు అధికం ఇటీవల కురుస్తున్న వర్షాలకు, మారిన వాతావరణం కారణంగా జిల్లాలో టమాటా తోటల్లో పంట దిగుబడులు పుష్కలంగా వస్తున్నాయి. పదిహేను రోజుల కిందట జిల్లాలో ప్రతిరోజు 2500 నుంచి 3 వేల మెట్రిక్ టన్నుల దిగుబడి మాత్రమే వచ్చింది. ప్రస్తుతం పంట దిగుబడులు పెరగడంతో 10వేల మెట్రిక్ టన్నుల పంట దిగుబడి మార్కెట్లకు వస్తుండడం గమనార్హం. ప్రస్తుతం దిగుబడి ఆశాజనకంగా ఉన్నా ధరలు రోజురోజుకు తగ్గిపోతుండడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బయట రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాలో దిగుబడి ఎక్కువ బయట రాష్ట్రాలతో పాటు రాయలసీమ జిల్లాలో టమాటా దిగుబడి నిలకడగా వస్తుండడంతో ఇక్కడి టమాటా ధరలు పెరగడం లేదని వ్యాపార వర్గాలు అంటున్నాయి. తమిళనాడు, ఒరిస్సా, చత్తీస్ఘడ్, మధ్యప్రదేశ్, పశ్చిమబెంగాల్ తోపాటు రాయలసీమ జిల్లాలైన అనంతరపుం, శ్రీసత్యసాయి, వైఎస్సార్ జిల్లాలో టమాటా దిగుబడులు రోజు రోజుకు పెరిగిపోతున్నాయి. దీంతో బయట రాష్ట్రాల వ్యాపారులు మన జిల్లాకు రావడం లేదు. దీంతో ఇక్కడి టమాటాలు బయట రాష్ట్రాలకు ఎగుమతి చేయక పోవడంతో ధరలు తుగ్గుముఖం పట్టాయి. స్థానిక వ్యాపారులే టమాటాలను కొనుగోలు చేసి ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీంతో ధరలు పాతాళానికి పడిపోతుండడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నాయి. ప్రభుత్వం వైపు టమాటా రైతుల చూపు మార్కెట్లో టమాటా ధరలు అత్యధికంగా పలుకుతున్నప్పుడు ధరలు తగ్గించి విక్రయించాలని మార్కెట్ అధికారులను ఆదేశించే ప్రభుత్వం నేడు తమను ఆదుకోవాలని టమాటా రైతులు కోరుతున్నారు. 25 కేజీల టమాటా క్రీట్ ధర గతంలో రూ. 2500 ఉన్నప్పుడు ప్రభుత్వం మార్కెట్లో ధరలు తగ్గించి రూ.1000కే ప్రజలకు అందించిన దాఖలాలు ఉన్నాయి. అదే విధంగా నేడు ధరలు తగ్గుముఖం పడుతున్నందున ప్రభుత్వమే గిట్టుబాటు ధరలు కల్పించి టమాటాలు కొనుగోలు చేయాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కనీసం ఒక టమాటా క్రీట్ ధర రూ. 1000 కి ప్రభుత్వం కొనుగోలు చేసి తమను ఆదుకోవాలని రైతులు అంటున్నారు.మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేవు మార్కెట్లో టమాటాకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. వారంరోజులుగా ధరలు రోజురోజుకు తగ్గుముఖం పడుతున్నాయి. బయట రాష్ట్రాల్లో తో పాటు మన రాష్ట్రంలోని పలు జిల్లాల్లో టమాటా దిగుబడులు ఎక్కువగా వస్తున్నాయని వ్యాపారులు అంటున్నారు. దీంతో బయటరాష్ట్రాల వ్యాపారులు జిల్లాకు రాకపోవడంతో టమాటా ధరలు ఆశించినంతగా పెరగడం లేదు. ధరలు తగ్గిపోతుండడంతో నష్టపోతున్నాం. – పూజారి రెడ్డెప్ప, టమాటా రైతు, దౌలత్ఖాన్పల్లెప్రభుత్వమే టమాటాలు కొనుగోలు చేయాలి.. మార్కెట్లో టమాటా ధరలు తగ్గిపోతుండడంతో ప్రభుత్వమే చొరవచూపి రైతులు పండించిన టమాటాలను గిట్టుబాటు ధరలకు కొనుగోలు చేయాలి. టమాటా ధరలు అత్యధికంగా ఉన్నప్పుడు రైతుల దగ్గర ప్రభుత్వం తగ్గించి కొనుగోలు చేసి ప్రజలకు అందించింది. ఇప్పుడు ధరలు తగ్గిపోయినందున ప్రభుత్వం గతంలో మా వద్ద కొనుగోలు చేసిన క్రీట్ ధర రూ.1000కు ఇప్పుడు తీసుకొని రైతులును ఆదుకోవాలి. – వెంకటరమణ, టమాటా రైతు, మొరంపల్లె -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
రాయచోటి : రాయచోటి– సుండుపల్లి మార్గంలోని అనుంపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రవమాదంలో లోకేశ్వర నాయుడు (32) మృతి చెందగా మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సుండుపల్లి మండలం, మడితాటి గ్రామంలో జరిగిన వివాహ వేడుకలు చూసుకొని బుధవారం వేకువజామున 1.30 గంటలకు స్వగ్రామానికి వెళ్తున్న సమయంలో మార్గ మధ్యలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు కలరు. రాయచోటి రూరల్ మండలం, మాధవరం పంచాయతీ, ఇర్రివాండ్లపల్లి, మద్దేవాండ్లపల్లి, జురుకుబాండ్లపల్లి, కురవపల్లికి చెందిన తొమ్మిది మంది మంగళవారం రాత్రి ఆటో ద్వారా సుండుపల్లి మండల పరిధిలో జరిగిన బంధువులు వివాహానికి హాజరయ్యారు. వివాహానికి హాజరై తిరుగు ప్రయాణంలో అనుంపల్లి దాటిన తరువాత ఆటోను బహిర్భూమికి వెళ్లేందుకు రోడ్డు పక్కన ఆపారు. ఆ సమయంలో సుండుపల్లి వైపు నుంచి అతివేగంగా వచ్చిన లారీ రోడ్డు పక్కన నిలబడి ఉన్న ఆటోను ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో లోకేశ్వర నాయుడు అక్కడికక్కడే మృతి చెందగా పి మనోహర్, ఆవుల శ్రీనివాసులు తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన ఇద్దరినీ ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. సంఘటనపై రాయచోటి పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు తెలిపారు.మరో ఇద్దరికి గాయాలు -
ఎంపీ మిథున్రెడ్డి కృషితో రూ.3 లక్షలు మంజూరు
సాక్షి, మదనపల్లె : క్యాన్సర్ వ్యాధితో బాధపడుతున్న వ్యక్తి పట్ల రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి మానవత్వం చాటుకుని ప్రధాన మంత్రి సహాయ నిధి నుంచి రూ.3 లక్షలు మంజూరు చేయించారు. మదనపల్లె పట్టణంలోని ఇందిరానగర్కు చెందిన గొల్లపల్లి అబ్దుల్ ఖయ్యూం క్యాన్సర్ వ్యాధితో బాధపడుతూ బెంగళూరులోని రామయ్య ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఆయన వైద్య చికిత్సకు అవసరమైన ఆర్థిక సహాయం కోసం ఎంపీ మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఆయన స్పందించి రూ.3 లక్షలు మంజూరు చేయించగా ఆ లేఖను బుధవారం స్థానిక వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ వ్యాధిగ్రస్తుని భార్య ఫౌజియాకు అందజేశారు. ఈ సందర్భంగా నిసార్ అహ్మద్ మాట్లాడుతూ అబ్దుల్ ఖయ్యూం దయనీయ పరిస్థితిని మిథున్ రెడ్డి దృష్టికి తీసుకెళ్లగా, ఆర్థిక సహాయం మంజూరు చేయించి ఆదుకున్నారని అన్నారు. పార్టీ పరిశీలకులు జింకా చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి వీఎస్ రెడ్డి, లియాఖత్ ఆలీ, తట్టి నాగరాజ రెడ్డి, ఎన్ నవాజ్, తాళే సుబ్రహ్మణ్యం, మొహమ్మద్ సోహైల్ పాల్గొన్నారు. -
4 కిలోల గంజాయి స్వాధీనం
రాయచోటి : అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ఇద్దరు యువకులను అదుపులోకి తీసుకుని వారి నుంచి నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి అర్బన్ సీఐ బివి చలపతి తెలిపారు. రాయచోటి టౌన్ పోలీస్స్టేషన్లో బుధవారం రాత్రి ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో గంజాయి అక్రమ రవాణా వివరాలను సీఐ వెల్లడించారు. అన్నమయ్య జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో మాదక ద్రవ్యాల నిర్మూలనకు ప్రత్యేక చర్యలు కొనసాగుతున్నాయని చెప్పారు. రాయచోటి టౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో నమోదైన గంజాయి అక్రమరవాణా కేసు దర్యాప్తులో ఉందన్నారు. జిల్లా పోలీసు అధికారుల ఆదేశాల మేరకు రాయచోటి టౌన్ సబ్ ఇన్స్పెక్టర్ విష్ణువర్ధన్, ప్రత్యేక పోలీసు బృందంతో కలిసి ప్రధాన నిందితుల కోసం విస్తృత గాలింపు చర్యలు చేపట్టామన్నారు. దర్యాప్తులో భాగంగా నిందితుల కదలికలను సాంకేతిక ఆధారాలు, విశ్వసనీయ సమాచారం ద్వారా గుర్తించామన్నారు. ఒడిశా రాష్ట్రంలోని గంజాం జిల్లాకు వెళ్లి కేసులో ప్రధాన నిందితులుగా ఉన్న అరుణ్కుమార్, యశ్వంత్లను పోలీసు బృందం అదుపులోకి తీసుకుందన్నారు. వారి వద్ద నుండి అక్రమ రవాణా చేస్తున్న 4 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. చట్టపరమైన నిబంధనల ప్రకారం వారిని అరెస్టు చేశామన్నారు. అనంతరం నిందితులను స్థానిక న్యాయస్థానం ముందు హాజరుపరచగా న్యాయస్థానం ఆదేశాల మేరకు రిమాండ్కు తరలించినట్లు వివరించారు. -
ఆటో బోల్తా – ఇద్దరికి గాయాలు
మదనపల్లె టౌన్ : ఆటో బోల్తా పడి ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. తాలూకా పోలీసుల కథనం ప్రకారం.. పట్టణంలోని చంద్ర కాలనీకి చెందిన కె.చందు (20), కృష్ణ (20) మంచి స్నేహితులు. వీరిద్దరూ రోజూ ఆటోలో పల్లెలకు వెళ్లి గుజిరి సేకరించి అమ్ముకుని జీవనం సాగిస్తున్నారు. ఈ క్రమంలో గుజిరి సేకరణ కోసం పల్లెలకు ఆటోలో వెళుతుండగా, మదనపల్లె – పుంగనూరు రోడ్డు, 150వ మైలు రాయి వద్ద ఆటో అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రులను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి, రెండు కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డ చందును మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. మరో యువకుడు కృష్ణ జిల్లా ఆసుపత్రిలోనే చికిత్స పొందుతున్నాడు. ప్రమాదంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీ మదనపల్లె టౌన్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని బైక్ రైడర్ పరిస్థితి విషమించిన సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. స్థానికుల కథనం ప్రకారం.. మదనపల్లె పట్టణం నీరుగట్టువారిపల్లి, చౌడేశ్వరి నగర్కు చెందిన మగ్గాల యజమాని దామోదర్ రెడ్డి(50) బైక్పై చౌడేపల్లి మండలంలోని ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ గంగమ్మను దర్శించుకునేందుకు వెళ్లారు. అమ్మవారిని దర్శించుకుని తిరుగు ప్రయాణంలో ఇంటికి వస్తుండగా, మదనపల్లె మండలం కొండామరిపల్లి పంచాయతీ, ముంబై–చైన్నె జాతీయ రహదారిపై వెన్నెల రెస్టారెంట్ మలుపు వద్ద గుర్తుతెలియని వాహనం వెనుక నుంచి ఢీకొట్టి ఆగకుండా వెళ్లిపోయింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ దామోదర్ రెడ్డిని 108 సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించినా ఆరోగ్యం కుదుటపడలేదు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు వెంటనే ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వాహనం కోసం గాలిస్తున్నారు. అల్లనేరేడు చెట్టుపై నుంచి పడి కూలీకి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : అల్లనేరేడు కాయలు కోసేందుకు చెట్టు ఎక్కిన కూలీ కొమ్మ విరిగి కిందపడి తీవ్రంగా గాయపడ్డ ఘటన బుధవారం బి.కొత్తకోట మండలంలో జరిగింది.బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. బి.కొత్తకోటకు చెందిన నరేష్(39) ఊరికి సమీపంలోని ఓ వ్యక్తి తోటలో అల్లనేరేడు కాయలు కోసేందుకు కూలి పనులకు వెళ్లాడు. సహచరులతో కలిసి చెట్టు ఎక్కి కాయలు కోస్తుండగా కొమ్మ విరిగిపోయింది. కింద పడి తీవ్రంగా గాయపడిన నరేష్ను స్థానికులు వెంటనే గుర్తించి మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కుటుంబీకులు వెంటనే బాధితున్ని స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. -
విజయాలను కై వసం చేసుకున్న చిత్తూరు, కర్నూలు జట్లు
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర మల్టీడే క్రికెట్ అంతర్ జిల్లాల పోటీలు హోరాహోరీగా జరుగుతున్నాయి. బుధవారం గ్రౌండ్ 1 క్రీడా మైదానంలో అనంతపురం, కర్నూలు క్రికెట్ టీంలు తలపడ్డాయి. ఇన్నింగ్స్లో టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న అనంతపురం జట్టు 53.4 ఓవర్లలో 176 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కర్నూల్ జట్టు 104 ఓవర్లలో 7 వికెట్ల నష్టానికి 433 పరుగులు చేసి డిక్లర్ చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు 87.5 ఓవర్లలో 238 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. దీంతో కర్నూలు జట్టు 19 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. ఇందులో కర్నూలు జట్టు ఫాస్ట్ బౌలర్ వెంకట హరిహరణ్ 74 పరుగులు ఇచ్చి మూడు వికెట్లు తీసుకొని తన ప్రతిభను చాటాడు. గ్రౌండ్ 2లో నెల్లూరు, చిత్తూరు జిల్లా క్రికెట్ జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు 99.2 ఓవర్లలో 405 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన చిత్తూరు జిల్లా జట్టు 98 ఓవర్లలో 477 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నెల్లూరు జట్టు 47.5 ఓవర్లలో 188 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం 147పరుగుల లక్ష్యంతో ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 16 ఓవర్లలో 6 వికెట్లు కోల్పోయి తన లక్ష్యాన్ని చేరుకొని రెండో విజయాన్ని తన ఖాతాలో వేసుకొంది. ఇందులో చిత్తూరు జట్టుకు చెందిన ఆఫ్ బ్రేక్ బౌలర్ దినేష్ 84 పరుగులు ఇచ్చి 8 వికెట్లు తీసుకున్నాడు. ఇదే జట్టుకు చెందిన తేజేష్ 52 బంతుల్లో 46 పరుగులు చేసి నాటౌట్గా నిలిచి జట్టు విజయంలో వీరు ఇరువురు కీలకపాత్ర పోషించారు. ఈ కార్యక్రమంలో శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్, ప్రసన్న కుమార్, షోయబ్ పాల్గొన్నారు. -
26న మొహ్రరం సెలవు
మదనపల్లె సిటీ: మొహర్రం పండుగ పురస్కరించుకుని ఈనెల 26న ప్రభుత్వ పాఠశాలలకు సెలవు ప్రకటించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. 25న (గురువారం) ఆప్షనల్ సెలవు ఇచ్చినట్లు ఆయన పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కలికిరి: కలికిరిలోని డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి ఉద్యాన డిప్లొమో కోర్సుకు దరఖాస్తు లు ఆహ్వానిస్తున్నట్లు కళాశాల ప్రిన్సిపాల్ కె.స్వ రాజ్యలక్ష్మీ తెలిపారు. 10వ తరగతి ఉత్తీర్ణులైన వారు ఈ కోర్సుకు అర్హులని తెలిపారు. దరఖాస్తుల కోసం డీఆర్వైఎస్ఆర్హెచ్యూ.ఏపీ.జీఒవీ.ఇన్ వైబ్సైట్లో సంప్రదించాలన్నారు. కలికిరి ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో బాలురకు 40 సీట్లు అందుబాటులో ఉండగా, మడకసిరలోని ఉద్యాన పాలిటెక్నిక్ కళాశాలలో బాలికలకు 60 సీట్లు అందుబాటులో ఉన్నట్లు పేర్కొన్నారు. అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ లోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు 7382633691, 9963409137 నంబర్లలో సంప్రదించాలని ఆమె కోరారు. బాధ్యతల స్వీకరణ మదనపల్లె టౌన్: జిల్లా ప్రభుత్వ సుపత్రి సూపరింటెండెంట్గా మస్రుర్ అహమ్మద్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో ఇక్కడ పనిచేస్తున్న డాక్టర్ రమేష్ అదే అస్పత్రిలో ఆసుపత్రి ప్రిన్సిపాల్ గా కొనసాగుతున్నారు. ఆస్పత్రి నూతన సూపరింటెండెంట్ గా బాధ్యతలు స్వీకరించిన మస్రుర్ అహమ్మద్ ను ఆస్పత్రి ఆర్ఎంవో డాక్టర్ రాధిక, ఇతర విభాగాల డాక్టర్లు సిబ్బంది మర్యాదపూర్వకంగా కలిశారు. అనంతరం డాక్టర్ మస్రుర్ అహమ్మద్ మాట్లాడుతూ.. ఇకపై ఆసుపత్రిలో అన్ని రకాల వైద్య సేవలు పేదలకు అందుబాటులోకి తీసుకురానున్నట్లు తెలిపారు. -
గంజాయి దందాలో ఎమ్మెల్యే కుమారుడు
సాక్షి, మదనపల్లె: మదనపల్లె ప్రాంతంలో జరుగుతున్న అక్రమ గంజాయి వ్యాపారంలో ఎమ్మెల్యే షాజహాన్ బాషా కుమారుడి పాత్రపై సమగ్ర విచారణ జరగాలని మాజీ ఎమ్మెల్యే, వైఎఎస్సార్సీపీ సీఈసీ మెంబర్ డాక్టర్ దేశాయి తిప్పారెడ్డి, స మన్వయకర్త ఎస్.నిసార్ అహ్మద్ డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో వారు మాట్లాడుతూ చంద్రబాబు పాలనలో యువతకు ఉపాధి కల్పించకపోగా గంజాయికి బానిసలు చేస్తున్నారని మండిపడ్డారు. వేలామంది యువకుల జీవితాలు నాశనం అవుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. మదనపల్లె, పరిసర ప్రాంతాలు గంజాయి విక్రయాలకు అడ్డాగా మారాయని దీనికి కారణం ఎవరని పోలీసులు అరా తీయగా ఈ విషయాలు వెలుగులోకి వచ్చాయని పేర్కొన్నారు. ఇటీవల కాలంలో చోటుచేసుకున్న పరిణామాలు, జరిగిన ఘటనలను పరిశీలిస్తే ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై అనుమానాలు బలపడుతున్నాయని అన్నారు. గత ఏడాది అక్టోబర్ 31న మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి కేసుకు సంబంధించి ఓ ముఖ్య వ్యక్తి పేరు ప్రస్తావనకు వచ్చిందని, ఆ ముఖ్య వ్యక్తి ఎమ్మెల్యే కుమారుడన్న అనుమానాలు బలపడుతున్నాయని ఆరోపించారు. వందల కిలోల గంజాయి పట్టుబడుతోందని దీని వెనుక ఉన్న ఎమెల్యే కుమారుడి పాత్ర వెలికి తీయాలని కోరారు. యువతకు ఆదర్శంగా ఉండాల్సిన ప్రజాప్రతినిధి, ఆయన కుమారుడు యువత జీవితాలను నాశనం చేసే గంజాయి వ్యాపారంలో ఉండడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. మదనపల్లె ప్రాంతంలో గంజాయి గొడవలకు ఎమ్మెల్యే, వారి కుమారుడు అండగా ఉండడం, వారిని కేసుల నుంచి తప్పిస్తున్నారని ఆరోపించారు. ఈ విషయాల్లో వారు ఎందుకు జోక్యం చేసుకుంటున్నారో స్పష్టం చేయాలన్నారు. గతంలో ఓ పోలీసు అధికారి మదనపల్లె నియోజకవర్గంలో గంజాయి వ్యాపారం అధికమైందని గుర్తించి దాని మూలాలు ఆరా తీయగా ఓ ముఖ్య నాయకుడి పాత్ర ఉందని ఆయన వెల్లడించినట్లు చెప్పారు. ఈ దందా ఆపకపోతే కేసు నమోదు చేయాల్సి వస్తుందని హెచ్చరించినట్టుగా గుర్తు చేశారు. బెంగళూరు బస్టాండ్ లో గంజాయి సేవించిన యువకులు ఓ యువకుడిని చితకబాదగా పోలీసులు రంగ ప్రవేశం చేసి దాడి చేసిన వారిని ఒకటవ పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకుంటే వారిపై కేసు లేకుండా కాపాడింది, బయ్యారెడ్డి కాలనీలో గంజాయి విక్రయాల గ్రూపుల మధ్య గొడవ జరిగితే, జోక్యం చేసుకోవద్దని పోలీసులను ఆదేశించింది ఎమ్మెల్యే కుమారుడే అని పేర్కొన్నారు. ఇలా గంజాయి వ్యవహారాల్లో ఎమ్మెల్యే కుమారుడు ఉన్నాడన్నది బహిరంగ రహస్యమని అన్నారు. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే కుమారుడి పాత్రపై తక్షణమే విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీని కోరారు. పెంచుపాడు ప్రాంతంలో గంజాయి సాగు కావడం వెనక అధికార పార్టీ నేతల ప్రమేయమే ఉందని ఆరోపించారు. క్యాష్ అండ్ క్యారీ ఎమ్మెల్యే తాను అభివృద్ధి చేశానని పదేపదే చెప్పుకుంటున్న ఎమ్మెల్యే పనుల కోసం వచ్చిన వారినుంచి పనికి ఓ రేటు పెట్టి క్యాష్ అండ్ క్యారీగా వసూళ్లకు పాల్పడుతున్నారని మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి ఆరోపించారు. ఈ విషయాన్ని టీడీపీ కార్యకర్తలే ధ్రువీకరుస్తున్నారని పేర్కొన్నారు. ప్రజాసేవ చేయాల్సిన ఎమ్మెల్యే వసూళ్లపై ఉన్న శ్రద్ధ అభివృద్ధిపై లేదని, అభివృద్ధి చేసిన ఎంపీ మిథున్ రెడ్డి పై అర్థం లేని ఆరోపణలు చేస్తున్నారని మండిపడ్డారు. పార్టీలో పట్టు కోల్పోయిన ఎమ్మెల్యే వైఫల్యాలను ప్రశ్నిస్తే సహించలేకపోతున్నారని అన్నారు. ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలని హితువు పలికారు. మేం ప్రతిపక్షంలో ఉన్నప్పుడు అభివృద్ధి కోసం చంద్రబాబుకు విజ్ఞప్తి చేశాం, ఇప్పుడు కూడా అదే చేస్తున్నామని చెప్పారు. మిథున్ రెడ్డి కృషితో మంజూరైన మెడికల్ కళాశాల, బీటి కళాశాలను విశ్వవిద్యాలయం చేయడం, కేంద్రీయ విద్యాలయానికి పక్క భవనాలు, మంజూరైన ఇతర అభివృద్ధి పనులను కొనసాగించాలని విజ్ఞప్తి చేస్తున్నామన్నారు. ఎంపిపై భూ కబ్జా ఆరోపణలు చేస్తున్న ఎమ్మెల్యే ఆధారాలతో విచారణ జరపాలని డిమాండ్ చేశారు. నీటి సమస్య తీర్చలేరా మున్సిపాలిటీలో అభివృద్ధి చేస్తామని చెబుతున్న మీరు, అభివృద్ధికి ఆమోదం తెలిపింది వైఎస్సార్సీపీ కౌన్సిల్ అన్న విషయాన్ని ఎమ్మెల్యే గుర్తించాలని మాజీ మున్సిపల్ చైర్మన్ మనూజ అన్నారు. ఆమె మాట్లాడుతూ ఇప్పుడు పట్టణంలో నీటి సమస్య ఉంది, ఎనిమిది రోజులకు ఒకసారి నీటి సరఫరా అవుతోంది, దీన్ని ఎందుకు పట్టించుకోరని నిలదీశారు. అధికారులు పనిచేయకపోవడం వల్లే మీరు వార్డుల్లో పర్యటిస్తున్నారా అని ఎద్దేవా చేశారు. మా పాలనలో అధికారుల చేత ప్రజలకు పనులు చేయించాం, ఇలా పర్యటిస్తూ అధికారుల చేత పని చేయించలేదని అన్నారు. సమావేశంలో మున్సిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు జన్నే శేషాచలపతి, దండు కరుణాకర్రెడ్డి, ఇర్పాన్ షేక్, హర్షవర్దన్రెడ్డి, ప్రసాద్బాబు, శ్రీనివాసులు, కోటావారిపల్లె రాజా, శ్రీకాంత్రెడ్డి, శరత్రెడ్డి, లియాఖత్అలీ, వీఎస్.రెడ్డి, కోటూరి ఈశ్వర్, చరణ్ పాల్గొన్నారు. మిథున్ రెడ్డిపై అర్థరహిత ఆరోపణలు చేస్తున్న షాజహాన్ బాషాను ఎమ్మెల్యే చేసింది ఆయనే అన్న విషయాన్ని గుర్తు పెట్టుకోవాలని పార్టీ మైనార్టీ నాయకుడు గుండ్లూరు రఫీ అన్నారు. ఆయన మాట్లాడుతూ ఎమ్మెల్యే కమిటీ సభ్యుడిగా ఉన్న షాదీ మహల్ కు రూ.20 లక్షలు ఇచ్చింది ఎంపీ అన్న విషయాన్ని మరిచారా అని ప్రశ్నించారు. మిథున్ రెడ్డి మంజూరు చేసిన అభివృద్ధిని కొనసాగిస్తే ఆయనకు పేరు వస్తుందని అడ్డుకుంటున్న ఎమ్మెల్యే అభివృద్ధి గురించి మాట్లాడడం విడ్డూరంగా ఉందన్నారు. విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఎస్పీకి వినతి మిమ్మల్ని ఎమ్మెల్యే చేసింది మిథున్ రెడ్డి మీడియా సమావేశంలో మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆగ్రహం -
అక్రమ కేసులకు భయపడొద్దు
బుధవారం శ్రీ 24 శ్రీ జూన్ శ్రీ 2026నేడు భూమయ్యగారిపల్లెకు మాజీ సీఎం వైఎస్ జగన్ వేముల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం వేముల మండలంలోని భూమయ్యగారిపల్లె గ్రామంలో పర్యటించనున్నారు. గ్రామంలో నూతనంగా నిర్మించిన గట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవానికి ఆయన హాజరు కానున్నారు. ఇందుకు సంబంధించి బుధవారం వైఎస్ జగన్ పులివెందులలో ఉదయం 9గంటలకు బయలుదేరి 10గంటలకు భూమయ్యగారిపల్లె గ్రామానికి చేరుకుంటారని కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన శ్రీగట్టు శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయ ప్రారంభోత్సవం అనంతరం అక్కడ ప్రత్యేక పూజలలో పాల్గొంటారు. అనంతరం అక్కడ నుంచి బయలుదేరి సమీపంలోని బండలాగుడు మైదానానికి చేరుకుని రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను ప్రారంభిస్తారు. అనంతరం వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు ఓబుళరెడ్డి శ్రీరామిరెడ్డి నివాసానికి చేరుకుంటారు. ఇటీవల ఓబులరెడ్డి శ్రీ రామిరెడ్డి అనారోగ్యంతో మృతి చెందారు. ఈ నేపథ్యంలో ఆయన కుటుంబ సభ్యులను వైఎస్ జగన్ పరామర్శిస్తారు. సాక్షి కడప/పులివెందుల : ‘రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అక్రమ కేసులకు తెర తీశారు. వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలే లక్ష్యంగా దాడులు చేస్తున్నారు. ఏదోక రకంగా ఇబ్బంది పెట్టడమే పనిగా పెట్టుకుని పోలీసుల ద్వారా అక్రమ కేసులు బనాయిస్తున్నారు. ఈ విషయం ప్రజలందరికీ తెలుసు. అక్రమ కేసుల విషయంలో న్యాయ పోరాటం చేస్తాం. శ్రేణులెవరూ భయపడొద్ద’ని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ధైర్యం ఇచ్చారు. మూడు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం సాయంత్రం పులివెందులకు చేరిన ఆయన తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్ నిర్వహించారు. రాష్ట్రంలోని వివిధ ప్రాంతాలకు చెందిన ప్రజలు, నాయకులు, కార్యకర్తలు జననేతను కలిసి తమ సమస్యలను వివరించారు. కడప కార్పొరేషన్ మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి వైఎస్ జగన్ను కలిశారు. ఇటీవల పోలీసులు తనపై పెట్టిన అక్రమ కేసుల నేపథ్యంలో పూర్వాపరాలను అధినేతను కలిసి వివరించారు. జనంతో పోటెత్తిన క్యాంపు కార్యాలయం మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాకతో పులివెందులలో క్యాంపు కార్యాలయం ప్రజలతో పోటెత్తింది. జైజగన్ నినాదాలతో క్యాంపు కార్యాలయం హోరెత్తింది. వివిధ జిల్లాల నుంచి తనను కలవడానికి వచ్చిన అభిమానులు, పార్టీ శ్రేణులు, ఇతర అన్ని వర్గాల ప్రజలను వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరించారు. కార్యకర్తల కష్టసుఖాలు అడిగారు. టీడీపీ నేతల అరాచకాలతో ఇబ్బందులు పడిన బాధితుల బాధలు ఓపిగ్గా వింటూనే ‘నేనున్నానని.. మీకేం కాదని’ భరోసా ఇచ్చారు. పలువురి సమస్యలను సావధానంగా విన్న ఆయన వాటిని పరిష్కరించాలని ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి సూచించారు. ఆయేషాకు పరామర్శ పులివెందుల హెలీప్యాడ్ నుంచి భాకరాపురంలోని క్యాంపు కార్యాలయానికి వస్తున్న సమయంలో భాకరాపురానికి చెందిన ఆయేషాను మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శించారు. బ్రెయిన్ టీబీతో బాధపడుతున్న ఆయేషాకు మూడేళ్ల క్రితం వైద్య సహాయం అందించిన వైఎస్ జగన్, ప్రస్తుతం ఆమె ఆరోగ్యం మళ్లీ క్షీణించిందని తెలుసుకుని కాన్వాయ్ను ఆపి స్వయంగా దిగివచ్చి ఆమెను పరామర్శించారు. అవసరమైన వైద్య సహాయాన్ని అందిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంగా ఆయేషా భర్త బాబా ఫక్రుద్దీన్ మాట్లాడుతూ ‘వైఎస్ జగన్ దయ వల్లే గతంలో మెరుగైన వైద్యం అందిందని.. ఆయన చేసిన మేలు ఎప్పటికీ మర్చిపోలే’మని కృతజ్ఞతలు తెలిపారు. పోలీసులు ఎటువంటి చర్యలు తీసుకోలేదు ఇటీవల టీడీపీ నాయకుల దాడిలో తీవ్రంగా గాయపడిన యూసీఐఎల్ ఉద్యోగి సుగుణాథరెడ్డి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని కలిశారు. సుగునాథరెడ్డితోపాటు యూసీఐఎల్ ఉద్యోగులు దాడి జరిగిన ఘటనను వివరించారు. దాడి ఘటనకు సంబంధించి టీడీపీ నేతలపై కేసు నమోదు చేసిన పోలీసులు ఇంతవరకు వారిని అదుపులోకి తీసుకోలేదని, ఎలాంటి చర్యలు చేపట్టలేదని వాపోయారు. దీనికి వైఎస్ జగన్మోహన్రెడ్డి స్పందిస్తూ రాష్ట్రంలో టీడీపీ నాయకులు పోలీసులను అడ్డు పెట్టుకుని ఆరాచకాలు చేస్తున్నారని, త్వరలోనే వారికి బుద్ధి చెప్పే రోజులు వస్తాయన్నారు. అధైర్యపడొద్దని.. పార్టీ అన్ని విధాలుగా అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి చర్చించారు. ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు వైఎస్సార్ జిల్లా పార్టీ అధ్యక్షుడు పోచంరెడ్డి రవీంద్రనాథరెడ్డి, కడప మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, మాజీ ఎమ్మెల్యేలు రఘురామిరెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్ బాషా, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, డీసీ గోవింద రెడ్డి, పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, కల్పలతారెడ్డి, రమేష్ యాదవ్, వైఎస్సార్సీపీ సెంట్రల్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, హిందూపురం ఇన్ఛార్జి, రాయచోటి మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ పులివెందుల పరిశీలకులు పూల శ్రీనివాసరెడ్డి, మాజీ కడప మేయర్ పాకా సురేష్, పులివెందుల మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్ పర్సన్ రుక్మిణీదేవి, వైఎస్సార్సీపీ స్టేట్ ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ మెంబర్ సొహైల్, బద్వేలు నాయకుడు విశ్వనాథరెడ్డి, జమ్మలమడుగు నాయకుడు గిరిధర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. నాయకులు, కార్యకర్తలు, శ్రేణులకు ధైర్యం చెప్పిన మాజీ సీఎం వైఎస్ జగన్ పులివెందుల క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం వైఎస్ జగన్ను కలిసిన ఎంపీ, ఎమ్మెల్యే, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అధికార ప్రతినిధులు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు -
చైర్మన్గారూ.. ఈ ప్రశ్నలకు సమాధానాలేవీ !
● ఎంపీ మిథున్రెడ్డి విచారణ డిమాండ్తో ఉలికిపడ్డ టౌన్బ్యాంకు చైర్మన్ ● ఆరోపణలు కప్పిపుచ్చుకునేందుకు ప్రెస్మీట్.. నిజాలను దాటవేస్తూ తీవ్ర తంటాలు! సాక్షి, మదనపల్లె: మదనపల్లె సహకార టౌన్బ్యాంకులో సాగుతున్న అవినీతి, అక్రమ నియామకాలు, నిధుల దుర్వినియోగంపై సమగ్ర విచారణ జరపాలని ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి సోమవారం డిమాండ్ చేశారు. ఈ నిలదీతతో ఉలికిపాటుకు గురైన చైర్మన్ నాదేళ్ల విద్యాసాగర్, తన తప్పులను కప్పిపుచ్చుకునేందుకు మంగళవారం అత్యవసర మీడియా సమావేశం నిర్వహించారు. అయితే, ఆయన మాట్లాడిన అంశాల్లో అడుగడుగునా వాస్తవాలను విస్మరించి, అసలు బ్యాంకులో ఏమీ జరగడం లేదని చెప్పుకునేందుకు తంటాలు పడ్డారు తప్ప అడిగిన ప్రశ్నలకు మాత్రం సమాధానాలు చెప్పలేకపోయారు. చైర్మన్ను వేధిస్తున్న పంచప్రశ్నలు: ● రహస్య నియామకాల మతలబు ఏంటి?తాత్కాలి క ఉద్యోగాల భర్తీలో ఆర్బీఐ నిబంధనలు, రిజర్వేష న్లు ఎందుకు పాటించలేదు? ఒక్కో పోస్టును రూ.8 లక్షలకు అమ్ముకున్నారనే ఆరోపణలను ఎందుకు ఖండించలేదు? ఈ పెంపకంలో ఆ ‘ముఖ్య నాయకుడు’, అతని ‘ముఖ్య అనుచరుడి’ వాటా ఎంత? ● వారసత్వ పదవులపై దాగుడుమూతలెందుకు?: అర్హులైన వారున్నా సొంత కుమారుడు బాలాజీ, గోపాలకృష్ణ అనే ఆప్తుడిని కో–ఆప్టెడ్ డైరెక్టర్స్గా ఎందుకు నియమించారు? ‘సాక్షి’లో కథనం వచ్చే వరకు ఆ నివేదికను సహకార శాఖకు ఎందుకు దాచారు? కుటుంబ ఆధిపత్య ప్రచారాన్ని ఎందుకు ఖండించలేదు? ● డిపాజిట్లలో మీ పెట్టుబడి ఎంత?వడ్డీ రేట్లు ఎక్కు వగా ఉండటం వల్లే రిటైర్డ్ ఉద్యోగులు రూ.106 కోట్ల డిపాజిట్లు చేశారు. మరి దీనిపై మీ ప్రభావమే ఉంటే, మీ పాలకవర్గంలో ఒక్కరైనా పది రూపాయలైనా ఎందుకు డిపాజిట్ చేయలేదు? ● సంబంధం లేని ఉత్సవానికి రూ.26 లక్షలా?: వందో వార్షికోత్సవం జరిగిన 2024 జూన్ నాటికి ఈ పాలకవర్గమే లేదు. మరి నవంబర్లో వచ్చాక, ఏకంగా 17 నెలల తర్వాత రూ.26 లక్షల బ్యాంకు సొమ్మును ఉత్సవం పేరిట ఎందుకు తగలేశారు? ● వైరుధ్యాల లెక్కలపై నిజమేది?: శతవార్షికోత్సవ వేడుకల ఖర్చులపై సీఈఓ ప్రసాద్ రూ.23 లక్షలు అంటే, చైర్మన్ రూ.26 లక్షలు అని ఎందుకు విరుద్ధంగా చెప్తున్నారు? ఫంక్షన్ హాల్ వినియోగానికి రూ.5 లక్షల ఖర్చు చేశారని నిసార్ అహ్మద్ చెబితే, దాన్ని రూ.10 లక్షలుగా మార్చి పరువు నష్టం దావా వేస్తాననడం విడ్డూరం కాదా? ప్రోటోకాల్ను పక్కనబెట్టి ప్రాంతీయ ప్రజాప్రతినిధులైన ఎంపీ మిథున్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలను ఈ ఉత్సవానికి ఆహ్వానించకుండా ఉద్దేశపూర్వకంగా విస్మరించిన రాజకీయ కక్షసాధింపు ఉదంతాన్ని కూడా చైర్మన్ ప్రెస్మీట్లో చెప్పుకోలేకపోయారు. ప్రెస్మీట్లో సమాధానం లేని ఈ ప్రశ్నలన్నీ టౌన్బ్యాంకు వ్యవహారాల్లో సాగుతోన్న అక్రమాలకు నిలువెత్తు అద్దం పడుతున్నాయి. ఏ తప్పు జరక్కపోతే బ్యాంకు వ్యవహారాలపై విచారణకు డిమాండ్ చేస్తే అంగీకరించవచ్చు కదా. గుమ్మడికాయల దొంగ అంటే భుజాలు తడుముకున్నట్టుంది చైర్మన్ పరిస్థితి. -
1న డీఈఈసెట్–2026 ప్రవేశ పరీక్ష
రాయచోటి : ఆంధ్రప్రదేశ్ డిప్లమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ కామన్ ఎంట్రన్స్ టెస్టు (ఏపీ డీఈఈసెట్–2026) ప్రవేశ పరీక్షను జూలై 1న నిర్వహిస్తున్నట్లు డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని డైట్ కళాశాలలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కంప్యూటర్ ఆధారిత పరీక్ష (సీబీటీ) విధానంలో ఈ ప్రవేశ పరీక్ష ఉంటుందన్నారు. పరీక్షకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు అధికారిత వెబ్సైట్ ద్వారా తమ హాల్ టికెట్లు డౌన్లోడు చేసుకోవాలని సూచించారు. పరీక్ష రోజున హాల్ టికెట్తోపాటు ప్రభుత్వం జారీ చేసిన ఏదో ఒక ఫొటో, గుర్తింపుకార్డు (ఆధార్, ఓటరు గుర్తింపు కార్డు, డ్రైవింగ్ లైసెన్సు, పాస్ పోర్టు మొదలైనవి) వెంట తీసుకురావాలని తెలిపారు. డీఈఈసెట్–2026 పరీక్ష నిర్వహణ కోసం ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో ఐదు పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేసినట్లు వెల్లడించారు. వాటిలో ప్రొద్దుటూరులోని శ్రీ రాజేశ్వరీ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ, కడపలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల, కేఎల్ఎం ఉమెన్స్ ఇంజినీరింగ్ కళాశాల, రాయచోటిలోని శ్రీ సాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్, భాస్కర్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పరీక్షా కేంద్రాలుగా ఉన్నాయని తెలిపారు. అభ్యర్థులు తమ హాల్ టికెట్ పేర్కొన్న సమయాన్ని పరిశీలించి పరీక్షా కేంద్రానికి కనీసం ఒక గంట ముందుగా చేరుకోవాలన్నారు. సమావేశంలో డైట్ అధ్యాపకులు కొండ వెంకటసుబ్బారెడ్డి, మహమ్మద్ ఇలియాస్, ఉషా మాధురి, నిర్మల తదితరులు పాల్గొన్నారు. అంతర్రాష్ట్ర గజ దొంగ అరెస్ట్ – రూ.6.5 లక్షల బంగారు, వెండి ఆభరణాలు సీజ్ మదనపల్లె టౌన్ : జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు సంపాదించాలనే దురాశతో.. అంతర్రాష్ట్ర స్థాయిలో భారీ దొంగతనాలకు పాల్పడుతున్న ఒక కరుడుగట్టిన గజ దొంగను అన్నమయ్య జిల్లా పోలీసులు మంగళవారం చాకచక్యంగా అరెస్ట్ చేశారు. ఈ వివరాలను మదనపల్లె ఎస్పీ కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ మీడియాకు వెల్లడించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరానికి చెందిన షేక్ ఖాజాపీర్(30) వృత్తి రీత్యా పెయింటర్. ఇతనికి పెద్ద కుటుంబం ఉండటం, ఆదాయం చాలకపోవడంతోపాటు క్రికెట్ బెట్టింగ్లకు బానిసై చోరీల బాట పట్టాడు. ఈ క్రమంలో జూన్ 23న అన్నమయ్య జిల్లాలోని చిన్నమండెం మండలం వండాడి క్రాస్ రోడ్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా నిందితుడు పట్టుబడ్డాడు. నిందితున్ని డీఎస్పీ కృష్ణ మోహన్ పర్యవేక్షణలో జిల్లా సీసీఎస్ సీఐ చంద్రశేఖర్ తన సిబ్బందితో విచారణ చేశారు. సుమారు 50 ఇళ్లలో వరుస దొంగతనాలు చేసినట్లు నిందితుడు నేరం అంగీకరించాడు. అతని వద్ద నుంచి చిన్నమండెం, కలకడ, గుర్రంకొండ పోలీస్ స్టేషన్ల పరిధిలో చోరీకి గురైన రూ.6 లక్షల విలువైన 42 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.50 వేల విలువైన 250 గ్రాముల వెండి వస్తువులు, ఒక ద్విచక్ర వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడిపై గతంలో అనంతపురం జిల్లాలో 20, కర్ణాటకలో 10, అన్నమయ్య జిల్లాలో 10 పాత కేసులు ఉన్నాయి. తాజాగా జిల్లాలో నమోదైన 7 కేసుల్లో నిందితుడు. ఈ కేసును ఛేదించి, నిందితుడిని పట్టుకోవడంలో ప్రతిభ కనబరిచిన రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్, సీసీఎస్ సీఐ చంద్రశేఖర్, రూరల్ ఇన్స్పెక్టర్ ఎస్.కె.రోషన్, చిన్నమండెం ఎస్ఐ వి.సుధాకర్, పోలీస్ సిబ్బంది, క్రైమ్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
అభివృద్ధిపై టీడీపీ నేతలు ప్రశ్నించరా !
● రూ.కోట్ల అభివృద్ధిని చేతుల్లో పెడితే రద్దు చేస్తారా ● చంద్రబాబు సర్కార్ తీరుపై ఎంపీ మిథున్రెడ్డి ఆగ్రహం సాక్షి, మదనపల్లె: జగనన్న పాలనలో మదనపల్లె అభివృద్ధికి రూ.వందల కోట్ల నిధులు మంజూరు, విద్య, వైద్య రంగాల అభివృద్ధ్దికి చేపట్టిన పనులను నిలిపివేస్తే.. దీన్ని ఎందుకు అడ్డుకున్నారని టీడీపీ నేతలు చంద్రబాబును ప్రశ్నించరా అని రాజంపేట ఎంపీ, లోక్సభ పక్ష నేత పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి నిలదీశారు. అడ్డుకున్న పనుల గురించి ప్రశ్నిస్తే విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు. సోమవారం స్థానిక పార్టీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వం రూ.వందల కోట్లతో మెడికల్ కళాశాల పనులు చేస్తే ఈ ప్రభుత్వం నిలిపేసిందని ధ్వజమెత్తారు. బీటీ కళాశాలను యూనివర్సిటీగా చేస్తూ ఇచ్చిన జీవోను అడ్డుకున్నారు, మదనపల్లెకు మంజూరైన రహదారి నిర్మాణ పనులను ఆపివేస్తూ ఉత్తర్వులు ఇచ్చారు..ఇలా అభివృద్ధిని చంద్రబాబు అడ్డుకుంటుంటే టీడీపీ నేతలు ఎందుకు మా ట్లాడడం లేదని ప్రశ్నించారు. ఈ రెండేళ్లలో అభివృద్ధికి నిధులు ఇచ్చిన దాఖలాలు లేవని అన్నారు. జిల్లా కేంద్రం ఇచ్చారు కానీ పైసా అభివృద్ధి చేశారా అని ప్రశ్నించారు. ప్రభుత్వం నిలిపి వేసిన రోడ్ల పనులను పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. మదనపల్లెకు బైపాస్ రోడ్డు కోసం కేంద్రమంత్రికి విన్నవించగా ప్రస్తుత ఆర్థిక ప్రణాళికలో బైపాస్ రోడ్డును నివేదించారని, త్వరలోనే రహదారి మంజూరు అవుతుందని పేర్కొన్నారు. వైఎస్సార్ సీపీ అధికారంలోకి వచ్చినా జిల్లా కేంద్రం మదనపల్లె మారదన్నారు. ఈ విషయంలో తప్పుడు ప్రచారం జరుగుతోందని స్పష్టం చేశారు. ప్రభుత్వమే జిల్లా కేంద్రానికి నిధులు ఇవ్వకుండా నిర్లక్ష్యం చేస్తోందని ఆరోపణలు చేశారు. మదనపల్లె టౌన్ బ్యాంక్ అక్రమాలపై విచారణ ది మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్ లో జరుగుతున్న అక్రమాలపై విచారణ జరపాలని ఎంపీ మిథున్ రెడ్డి డిమాండ్ చేశారు. బ్యాంకు వ్యవహారాల్లో జరుగుతున్న అక్రమాలపై టీడీపీకి చెందిన సానుభూతిపరులే ఈ విషయాలను వెలుగులోకి తెస్తున్నారని అన్నారు. ఈ పరిస్థితుల్లో బ్యాంకులో ఏ స్థాయిలో అక్రమాలు జరుగుతున్నాయో నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉందని, దీనిపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు, ఎస్ఈసీ షమీం అస్లాం, మాజీ మున్సిపల్ చైర్మన్ వి.మనూజ, మాజీ వైస్ చైర్మన్ జింకా వెంకటా చలపతి, బీసీ కమిషన్ మాజీ సభ్యులు జన్నే శేషాచలపతి, పరిశీలకులు బాబ్జాన్, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షుడు హర్షవర్ధన్ రెడ్డి పాల్గొన్నారు. కూటమిపాలన చూశాక ప్రజలు జగనన్న పాలనను గుర్తుకు చేసుకుంటున్నారని.. వచ్చే ఎన్నికల్లో గత ప్రభుత్వంలో జగనన్న పాలనే ప్రామాణికంగా వైఎస్ఆర్సీపీ మళ్లీ అధికారంలోకి రాబోతోందని ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. స్థానిక ఎన్నికల్లో తమ పార్టీ విజయం సాధిస్తుందని ధీమా వ్యక్తం చేశారు. అమరావతి నిర్మాణానికి వైఎస్ఆర్సీపీ వ్యతిరేకం కాదని, అభివృద్ధి పేరిట ఇక్కడ జరుగుతున్న దోపిడీని వ్యతిరేకిస్తున్నామని అన్నారు. మదనపల్లె మెడికల్ కళాశాలను పీపీపీ విధానంలో అప్పగించేందుకు ప్రభుత్వం ప్రయత్నిస్తే ఒక్క టెండర్ దాఖలు కాలే దని గుర్తు చేశారు. తక్షణమే మదనపల్లె కళాశాల సంపూర్తి పనులు పూర్తిచేసి వైద్య సేవలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ ప్రభుత్వం మామి డి రైతులకు అనుకూలంగా ఊరట కలిగించే ఒక ప్రకటన చేయలేదన్నారు.తంబళ్లపల్లెలో మల్లయ్య కొండ మైనింగ్ ప్రతిపాదనల విషయంలో ప్రజలకు మద్దతుగా ఉంటామని, ఎట్టి పరిస్థితుల్లోనూ మైనింగ్ జరగనివ్వమని స్పష్టం చేశారు. డీఎస్సీలో జరిగిన కుంభకోణంపై విచారణ జరగాలని డిమాండ్ చేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. సోమవారం చోటుచేసుకున్న ఘటనలపై పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని చీకిలబైలుకు చెందిన శ్రీనివాసులు (33), అంగళ్లు మెడికల్ కళాశాలలో పనిచేస్తున్నాడు. రోజులాగే బైక్పై విధులకు వెళుతుండగా అమ్మ చెరువు మిట్టపై ఆటో ఢీకొనడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. అదే రోజు అంకిశెట్టిపల్లికి చెందిన నారాయణరెడ్డి 65, స్థానిక గుడికి వెళ్లి స్వామిని దర్శించుకుని తిరిగి వస్తుండగా సమాధుల తోట వద్ద కారు ఢీకొని గాయపడ్డాడు. బాధితులు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. తాలూకా పోలీసులు కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. షార్ట్ సర్క్యూట్తో టైలర్షాపులో మంటలుపులిచెర్ల(కల్లూరు) : కల్లూరు పులిచెర్ల రోడ్డులోని హరి టైలర్షాపులో సోమవారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి.షాపు నుంచి మంటలు వస్తుండటం గమనించిన స్థానికులు షాపు యజమానికి సమాచారం అందించారు. ఆయన వెంటనే పీలేరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం ఇవ్వడంతో వారు వచ్చి మంటలు ఆర్పేశారు.అప్పటికే షాపులోని కుట్టు మిషన్లు, దుస్తులు పూర్తిగా కాలిపోయాయి. రూ.2లక్షలు నష్టం వాటిల్లిందని బాధితుడు వాపోయాడు. ఈ ఘటనపై పోలీసులతో మాట్లాడగా మాకు ఎలాంటి ఫిర్యాదు అందలేదని తెలిపారు. అతిగా మద్యం తాగి వ్యక్తి మృతి మదనపల్లె టౌన్ : అతిగా మద్యం తాగి ఓ నాయీ బ్రాహ్మణుడు మృతి చెందిన సంఘటన సోమవారం ఉదయం మదనపల్లెలో వెలుగుచూసింది. సత్యసాయి జిల్లా, కదిరి పిల్ల వంక కాలనీకి చెందిన నారాయణ అదే ప్రాంతంలో బార్బర్షాపు నిర్వహిస్తున్నాడు. మృతుని భార్య భాగ్యలక్ష్మి తెలిపిన వివరాల ప్రకారం.. ఐదు రోజులుగా షాపుకు వెళ్లకుండా ఇంట్లోనే అతిగా మద్యం తాగుతూ ఉన్నాడు. ఆదివారం రాత్రి నారాయణ తీవ్ర అస్వస్థతకు గురయ్యాడు. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని చికిత్స కోసం స్విమ్స్కు తరలిస్తుండగా, మార్గ మధ్యలో మృతి చెందాడు. ఈ ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఏపీఎల్ మ్యాచ్లు విజయవంతం కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన ఆంధ్ర ప్రీమియర్ లీగ్ (ఏపీఎల్) సీజన్–5 మ్యాచ్లు విజయవంతమైనట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ భరత్రెడ్డి పేర్కొన్నారు. సోమవారం వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఏపీఎల్ మ్యాచ్లు కడపలో నిర్వహించేందుకు సహకరించిన ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు కేశినేని చిన్ని, సానా సతీష్లకు ధన్యవాదాలు తెలియజేస్తున్నామన్నారు. కడప ప్రజలు వేలాదిగా తరలివచ్చి మ్యాచ్లను వీక్షించడం ఆనందంగా ఉందన్నారు. గ్రామీణ స్థాయిలో క్రీడాకారులను వెలికి తీసేందుకు ఇటువంటి మ్యాచ్లు దోహదపడతాయన్నారు. వైఎస్ రాజారెడ్డి స్టేడియాన్ని ధర్మశాల స్టేడియంతో పోల్చడం గర్వంగా ఉందన్నారు. ఈ మ్యాచ్లో పాల్గొన్న ఏడు టీముల క్రీడాకారులు స్టేడియాన్ని చూసి అద్భుతంగా ఉందని కొనియాడారని తెలిపారు. రాబోయే రోజుల్లో మరిన్ని పెద్ద మ్యాచ్లను నిర్వహించేందుకు ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ నాయకులు సహకరిస్తామని హామీ ఇచ్చారన్నారు. మరో ఐదు వేల మంది మ్యాచ్లను వీక్షించేందుకు అదనంగా స్టేడియం సామర్థ్యాన్ని పెంచేలా కృషి చేస్తామన్నారు. -
పచ్చిరొట్ట.. పంట దిట్ట
గుర్రంకొండ : ఖరీఫ్ పంటలసాగుకు సన్నద్ధమవుతున్న ఈ తరుణంలో వివిధ రకాల పంటల సాగు చేసే రైతుల కోసం ముందుగా పచ్చిరొట్ట సాగు చేసుకొంటే పొలాలు సారవంతమవుతాయి. తద్వారా భూమిలో భూసారం పెరిగి అధిక పంట దిగుబడులు సాధించవచ్చని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. పచ్చిరొట్ట విత్తనాలు ప్రస్తుతం పంపిణీ చేస్తున్నారు రైతులు వరి, టమాటా, ఇతర కూరగాయాల పంటల సాగులో సేంద్రియ ఎరువులను తగు పాళ్లలో భూమికి అందించడంలో పచ్చిరొట్ట ఉపయోగపడుతుంది. జూన్నెలలో ఖరీఫ్ పంటల సాగు కోసం రైతులు సిద్ధమవుతున్నారు. ఈ నేపథ్యంలో పచ్చిరొట్ట సాగుకు ఇదే అదను అని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. ఈ రకం ఎరువు వినియోగం వల్ల భూమి గుళ్లబారుతుంది. పొలానికి నీటిని, పోషక పదార్థాలను నిల్వ ఉంచుకొనే శక్తి పెరగడంతో మొక్కల వేర్లకు గాలి, నీరు, పోషకాలు పుష్కలంగా అందుతాయి. జనుము జీలుగలు, పిల్లిపెసర వంటి పచ్చిరొట్ట విత్తనాలను ఎరువుగా తక్కువ ఖర్చుతోనే పెంచుకోవచ్చు. పంటలో కలుపుమొక్కలను కూడా నివారించవచ్చు. వర్షం నీరు వృథాగా పోకుండా భూమిలో ఇంకేలా చేస్తుంది. పప్పుజాతి పచ్చిరొట్టపైరు వల్ల భూమిలో నత్రజనిని స్థిరీకరించి భూసారం పెంపొందించవచ్చు. పచ్చిరొట్ట పైరు బాగా పెరిగి, ఆకులు ఎక్కువగా కాండం వచ్చి మెత్తగా ఉండేలా చూసుకోవాలి. వీలైనంత వరకు లెగ్గింగ్ జాతి మొక్కలను పెంచడం వల్ల పైర్లపై నత్రజని బుడిపెల ద్వారా గాలిలో నత్రజని స్థిరీకరిస్తాయి. ఇవి త్వరగా కుళ్లిపోయే ప్రభావం కలిగిఉంటాయి. ఇవి అన్ని రకాల నేలలకు అనుకూలంగా ఉండడంతో పాటు నీటి ఎద్దడి తట్టుకొని పెరుగుతుంది. పచ్చిరొట్ట పైర్ల వేర్లు భుమిలోకి త్వరగా చొచ్చుకొని పోయే గుణం కలిగి ఉంటుంది. సేంద్రీయ కర్బనం పెంచుకోవడానికి.. సేంద్రియ కర్బనం లేకపోవడంతో వరిపంటకు శాపంగా మారుతోంది. పెరుగుతున్న ఉష్ణోగ్రతలు, వర్షపాతంలో వస్తున్న మార్పులు పంట అవశేషాల్ని తొలగించడం లేదా కాల్చేయడం, భూమికోతకు గురికావడం, సరైన యాజమాన్య పద్ధతులు పాటించక పోవడం.. ఇవన్నీ సేంద్రీయ కర్బన లోపానికి కారణాలే. భూమిలో సేంద్రియ కర్బనాన్ని పెంపొందించుకోవడానికి పచ్చిరొట్ట ఎరువు విత్తనాలు సాగుచేసుకోవడమే ఉత్తమమైన మార్గమని వ్యవసాయాధికారులు సూచిస్తున్నారు. సేంద్రియ కర్బనం పెంచడానికి జీలుగ, జనుము, పిల్లపెసర అద్భుతమైన పచ్చిరొట్ట ఎరువు. ఇది భూమి సారాన్ని, సారవంతతను మెరుగుపరిచి పంట దిగుబడులు పెరిగేలా చేస్తుంది. భూసారంపెరుగుతుంది పొలాల్లో పచ్చిరొట్ట విత్తనాలు చల్లుకోవడం వల్ల భూసారం పెరుగుతుంది. సేంద్రియ ఎరువుల గుణం భూమిలో ఎక్కువగా ఉంటుంది. తద్వారా ఎన్నో రకాల జబ్బులకు కారణమైన రసాయనికి ఎరువుల వినియోగం చాలా వరకు తగ్గించుకోవచ్చు. స్వచ్ఛమైన, ఆరోగ్యానికి మేలు చేసే పంటదిగుబడులు సాధించవచ్చు. – రత్నమ్మ, ఎవో, గుర్రంకొండ భూసారం పెరుగుదలకు దోహదం -
చేతులు తడిపితేనే ఉపాధి బిల్లులు
ఉపాధి హామీ పనుల బిల్లులకు క్షేత్ర స్థాయి సిబ్బంది వారానికి రూ.300 నుంచి రూ.500 వరకు అడుగుతున్నారు. ఇవ్వకపోతే బిల్లులు పెట్టడం లేదు. కొత్త పనులు చూపడం లేదు. ఎందకు అని ప్రశ్నిస్తే కక్ష సాఽధింపుతో వ్యవహరిస్తున్నారు. పనులు చేయని వారికి కూడా బిల్లులు పెడుతున్నారు. ఉపాధి హామీ సిబ్బంది బరితెగించిపోయారు. కలెక్టర్కు ఫిర్యాదు చేశా. విచారణకు ఆదేశించారు. – మేకల యోగానంద, ఎగువతూగుపల్లి, గాలివీడు మండలం సాంకేతిక కారణాల వల్ల నాకు రెండు ఆధార్ కార్డులు ఉన్నట్లుగా సిస్టమ్ చూపుతోంది. ఒకటి క్యాన్సిల్ చేసి మరో ఆధార్ నెంబరుతో రేషన్ కార్డుకు అనుసంధానం అయ్యేలా చర్యలు తీసుకోవాలి. ఫింగర్ వేస్తే ఆధార్ నెంబరు చూపడం లేదు. భవిష్యత్తులో స్కాలర్షిప్, ఫీజు రీయింబర్స్మెంట్, విద్యా ప్రవేశాలు తదితర ప్రభుత్వ సంక్షేమపథకాలలో సమస్యలు తలెత్తుతాయని డబుల్ ఆధార్ కార్డుల సమస్య పరిష్కరించాలి. – రోహిత్, ట్రిపుల్ ఐటీ విద్యార్థి, మిట్టా మాలపల్లి, పెద్దమండ్యం మండలం -
కార్మికుల ఉద్యమ బాట
● ఆర్టీసీని ప్రైవేటుపరం చేసే కూటమి కుట్రపై ఉద్యోగుల మండిపాటు ● జేఎసీ ఏర్పాటు ● నేటి నుంచి జిల్లా వ్యాప్తంగా నిరసనలు మదనపల్లె సిటీ: ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు. చంద్రబాబు ప్రభుత్వానికి వ్యతిరేకంగా దశల వారీగా ఉద్యమాన్ని చేపట్టడానికి సమాయత్తమయ్యారు. ఆర్టీసీ యూనియన్లు అన్ని ఏకమై మంగళవారం నుంచి పోరాటం చేయనున్నాయి. ఈ ఉద్యమాన్ని నడిపించేందుకు వివిధ యూనియన్ల నాయకులు జేఎసీ (జాయింట్ యాక్షన్ కమిటీ)ని ఏర్పాటు చేశారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ నెల 23వతేదీ నుంచి జేఏసీ ఆధ్వర్యంలో కార్మికులు నిరసన కార్యక్రమాలకు శ్రీకారం చుట్టనున్నారు. జిల్లాలో మదనపల్లె–1,2, పీలేరు, రామచోటి, పీలేరు, పుంగనూరు డిపోలు ఉన్నాయి. ఆయా డిపోల పరిధిలో 2,155 మంది ఆర్టీసీ కార్మికులు పని చేస్తున్నారు. ప్రైవేట్పరం చేసేలా... రాష్ట్రంలో అధికారంలో ఉన్న చంద్రబాబు ప్రభు త్వం ఆర్టీసీని ప్రైవేటుపరం చేయడానికి అడుగులు వేస్తోంది. దీన్ని ఆర్టీసీ కార్మికులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. ప్రధానంగా విద్యుత్బస్సులను ఆర్టీసీ ఆధ్వర్యంలోనే నడపాలని... ప్రైవేటు వారికి అప్పగించొద్దంటూ డిమాండ్ చేస్తున్నారు. ఇప్పటికే విద్యుత్ బస్సులను సాకుగా చూపుతూ చంద్రబాబు సర్కారు రాష్ట్రంలోని పలు డిపోలను ప్రైవేటుకు అప్పగించడంపై కార్మికులు తీవ్ర ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా పీఆర్సీ కూడా అమలు చేయాలని ముక్తకంఠంతో కోరుతున్నారు. పెండింగ్ డీఏలన్నీ విడుదల చేయాలని కోరుతున్నారు. ముఖ్యంగా సీ్త్రశక్తి పథకం అమలులో ఆర్టీసీ కార్మికులు పలు సమస్యలను ఎదుర్కొంటున్నారు. చిన్న సాకులు చూపి ఆర్టీసీ కార్మికులకు పనిష్మెంట్ ఇస్తున్నారు. దీంతో ఉద్యోగభద్రత లేకుండా పో తోందని వారు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వీటితోపాటు అనేక డిమాండ్లపై ఆర్టీసీ కార్మికులు ఉద్యమబాట పట్టనున్నారు. -
నేడు పులివెందులకు వైఎస్ జగన్ రాక
● మూడు రోజులపాటు పర్యటించనున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ● తొలిరోజు ప్రజలతో మమేకం ● 24న భూమయ్యగారిపల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్టకు హాజరు పులివెందుల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 23వ తేదీనుంచి మూడు రోజులపాటు జిల్లాలో పర్యటించనున్నారు. ఇందులో భాగంగా మంగళవారం మధ్యాహ్నం 2.40గంటలకు బెంగుళూరులోని యలహంకలో ఉన్న తన నివాసం నుంచి బెంగుళూరులోని జక్కూర్ ఎయిర్డ్రోంకు బయలుదేరుతారు. 3గంటలకు బెంగుళూరు ఎయిర్డ్రోం నుంచి హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.30గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. 3.50గంటలకు అక్కడి నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. అనంతరం రాత్రి 7గంటల వరకు క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ● 24వ తేదీ బుధవారం ఉదయం 9.00గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన వేముల మండలం భూమయ్యగారిపల్లె గ్రామంలోని శ్రీలక్ష్మీనరసింహస్వామి ఆలయానికి బయలుదేరుతారు. 10 గంటలకు ఆలయానికి చేరుకుంటారు. 11.00గంటల వరకు శ్రీలక్ష్మీనరసింహస్వామి విగ్రహ ప్రతిష్ట వేడుకలో పాల్గొననున్నారు. అనంతరం అక్కడి నుంచి పులివెందుల భాకరాపురంలోని తన క్యాంపు ఆఫీస్కు రోడ్డు మార్గాన బయలుదేరుతారు. మధ్యాహ్నం 1గంటకు భాకరాపురంలో ఉన్న తన క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. అనంతరం రాత్రి 7గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో వైఎస్ జగన్ ప్రజా దర్బార్ నిర్వహించనున్నారు. ● 25వ తేదీ ఉదయం 8.10గంటలకు భాకరాపురంలోని హెలీప్యాడ్ నుంచి బెంగళూరుకు తిరుగుపయనమవుతారు. -
భర్త నుంచి ప్రాణహాని : ఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : భర్త నుంచి ప్రాణహాని ఉందని ఓ యువతి జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేసింది. రాయచోటి నియోజకవర్గం, లక్కిరెడ్డిపల్లి మండలం, మద్దిరేవుల పంచాయతీ, అప్పలరాజుగారి పల్లెకు చెందిన రామరాజు ట్రాన్స్కోలో కాంట్రాక్టు లైన్మెన్గా పనిచేస్తున్నాడు. అతని భార్య ఎస్.లలిత ఎస్పీ కార్యాలయంలో వినతి పత్రం అందించింది. 2014లో తాను బిడ్డల్ని పుట్టినింటిలో వదిలి బతుకుదెరువు కోసం కువైట్ వెళ్లి 2019లో తిరిగి వచ్చానని తెలిపింది. ఆరు తులాల బంగారం, సుమారు 5 లక్షల నగదు భర్తకు ఇచ్చానని, అంతా వాడేసి మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తూ తనపైనే నిందలు వేస్తున్నాడని ఆరోపించింది. భర్త రామరాజుతో పాటు అతని స్నేహితులు గజపతిరాజు, అంజితో కలిసి చంపడానికి కుట్ర పన్నారని వాపోయింది. భయంలో మూడు నెలల క్రితం కాకులారంలోని పుట్టింటికి వచ్చానని, అక్కడ కూడా దాడి చేసి వేధిస్తుండడంతో మదనపల్లెకు వచ్చి తలదాచు కుంటున్నా నని కన్నీటి పర్యంత మైంది. పోలీసులు న్యాయం చేయకపోతే ఆత్మహత్య చేసుకుంటానని ఆమె ఆవేదన వ్యక్తం చేసింది. -
సేంద్రియ సాగుతో అధిక లాభాలు
రొంపిచెర్ల : సేంద్రీయ పద్ధతిలో పంటలను సాగుచేయడం వల్ల అధిక లాభాలు పొందవచ్చని చిత్తూరు జిల్లా వ్యవసాయాధికారి మురళి అన్నారు. సోమవారం రొంపిచెర్ల మండలం చెంచెంరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ ఆర్.బేస్తపల్లెలో జరిగిన రైతన్న మీ కోసం కార్యక్రమంలో పాల్గొని ప్రసంగించారు. సోయాబిన్ పంటను సాగు చేసే రైతులకు ప్రభుత్వం ఉచితంగా విత్తనాలు ఇస్తుందన్నారు. దిగుబడి వచ్చిన తర్వాత ప్రభుత్వమే క్వింటా రూ.4500కు కొనుగోలు చేస్తుందన్నారు. యురియా ,డీఏపీ పంట నమోదు బట్టి ఇవ్వనున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీపీఎం శివశంకర్, కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త సోమశేఖర్, ఏవో శ్రావణి, ఏఈవో ఖాదర్బాషా, రైతు సహయ కేంద్రాల ఇన్చార్జిలు తదితరులు పాల్గొన్నారు. -
ఎల్నినోను అధిగమిద్దాం
పీలేరు రూరల్ : రైతుల ఎల్నినో పరిస్థితులను అధిగమించడానికి తగు చర్యలు తీసుకోవాలని జిల్లా సహజ వ్యవసాయ విభాగం ప్రాజెక్టు మేనేజర్ మోహన్ అన్నారు. సోమవారం బోడుమల్లువారిపల్లె రైతు సేవా కేంద్రం పరిధిలో ‘రైతన్న మీకోసం’ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు తక్కువ నీరు అవసరమయ్యే పప్పు ధాన్యాలు, కూరగాయలు పంటలు ప్రకృతి వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయాలని సూచించారు. ఏడీఏ కరుణాకర్రెడ్డి, ఎంపీడీవో శివశంకర్, ఏవో రమాదేవి, సిబ్బంది శ్రీదేవి, సుబ్రమణ్యం, వెంకటరమణా నాయక్, రహంతుల్లా పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం వాల్మీకిపురం: పట్టణంలోని ఏపీ మైనార్టీ బాలికల గురుకుల జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న కెమిస్ట్రీ సబ్జెక్టును బోధించేందుకు అర్హులైన మహిళా గెస్ట్ ఫ్యాకల్టీ నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ప్రిన్సిపాల్ పద్మ తెలిపారు. దరఖాస్తులు చేసుకునే అభ్యర్థి సంబంధిత సబ్జెక్టులో ఎంఎస్సీ ద్వితీయ శ్రేణిలో సాధించి ఉండాలని పేర్కొన్నారు. బోధన అనుభవం ఉన్న వారికి ప్రాధాన్యత ఉంటుందన్నారు. అభ్యర్థులు ఈ నెల 25లోపు బయోడేటా, సర్టిఫికెట్లతో కళాశాలలో సంప్రదించాలని కోరారు. పీడీలు జాబ్ చార్ట్ పాటించాలి మదనపల్లె సిటీ: పీఈటీలు, పీడీలలు జాబ్ చార్ట్ను తప్పకకుండా పాటించాలని డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. సోమవారం స్థాని క జెడ్పీ ఉన్నత పాఠశాలలో పీఈటీ,పీడీలకు వ్యా యామ విద్యావిధానాలపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. పాఠశాలల్లో వ్యాయామ, ఆరోగ్య విద్య అభివృద్ధి కోసం తీసుకోవాల్సిన చర్యల గురించి వివరించారు. రికార్డులు, స్కిల్ రిజిస్టర్, స్టార్ రిజిస్టర్, అచీవ్మెంట్ తనిఖీ చేసి ధ్రువీకరించారు. పాఠశాల వ్యాయామ విద్య తనిఖీ అధికారి మహబూబ్బాషా, పీడీల సంఘ అధ్యక్షులు రమేష్బాబు కార్యదర్శి భద్రయ్య, అన్సర్, శివకుమార్, బాలాజీ పాల్గొన్నారు. విద్యా ప్రమాణాలు పెంచాలి– కళాశాల విద్య ఆర్జేడీ మధుసూదన్ శర్మ కడప ఎడ్యుకేషన్: విద్యార్థులలో విద్యా ప్రమాణాలు పెండంతోపాటు ఉద్యోగ అవకాశాలను అందిపుచ్చుకునే విధంగా విద్యార్థులను తీర్చిదిద్దాలని డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాల్స్కు కళాశాల విద్యాశాఖ ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) డాక్టర్. మధుసూధన్ శర్మ సూచించారు. సోమవారం కడప ప్రభుత్వ పురుషుల కళాశాలలో కడప, అన్నమయ్య జిల్లాల ప్రభుత్వ డిగ్రీ కళాశాలల ప్రిన్సిపాళ్లతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో ఆయన మాట్లాడారు. 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన డిగ్రీ మొదటి సంవత్సరం అడ్మిషన్లు గత సంవత్సరం కంటే మెరుగయ్యేటట్లు చూడాలని సూచించారు. ఈ సమావేశంలో కడప జిల్లా ఉమ్మడి నోడల్ రీసోర్సు సెంటర్ అధ్యక్షులు ఎం రవి కుమార్, సభ్యులు సలీంబాషా పాల్గొన్నారు. -
అర్జీలతో హోరెత్తిన పీజీఆర్ఎస్
● వెల్లువలా సమస్యలు ● మళ్లీ మళ్లీ వస్తున్నా పరిష్కారమేదీ..!? ఈమె పేరు షేక్ షర్మిల. మదనపల్లి పట్టణంలోని ఎన్వీఆర్ లే అవుట్. పుట్టుకతో మూగ, చెవుడు. భర్త కూడా మూగ వాడే. ఈమెకు విలాంగుల ఫించన్ వచ్చేది. ఏడాది క్రితంగా పింఛన్ నిలచిపోయింది. నిత్యావసర సరుకులు రావడం లేదు. కారణం ఏంటని సచివాలయానికి వెళ్లి అడిగితే వారు చెప్పిన మాట విని ఆమెకు సాయంగా వెళ్లిన వారు నిశ్చేష్టులయ్యారు. షర్మిల చనిపోయినట్లు రేషన్ కార్డులో డైడ్ అని ఉంది. దీంతో పింఛన్ రాలేదని చెప్పడంతో నిస్సహాయురాలైన ఆమె ఖంగుతింది. ఓ యూనియన్ నాయకుల సహకారంతో ఆమె సోమవారం పీజీఆర్ఎస్లో జిల్లా కలెక్టర్ను కలసి అర్జీ ద్వారా గోడు వెల్లబోసుకుంది. మదనపల్లి (కురబలకోట): పీజీఆర్ఎస్లో వచ్చే సమస్యలకు నాణ్యమైన పరిష్కారం చూపిస్తున్నామన్న అధికారుల మాటలు నీటి మూటలుగానే మిగిలిపోతున్నాయి. ప్రతివారం వెల్లువలా వచ్చి పడుతున్న అర్జీలు పరిష్కారం కాక మూలన చేరుతున్నాయి. ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్లో భాగంగా ఈ వారం కూడా కలెక్టరేట్ అర్జీదారులతో కిటకిటలాడింది. వ్యక్తిగత, సామాజిక, ఉపాధి హామీ అవకతవకలు, దారి సమస్య, చెరలో చెరువులు, ప్రభుత్వ భూముల కబ్జా, భూ ఆక్రమణ, రీసర్వే లోపాలు, ఇతర రెవెన్యూ సమస్యలపై సుమారు 374 దాకా అర్జీలు వచ్చినట్లు అధికారులు వెల్లడించారు. పీజీఆర్ఎస్ అధికార కార్యక్రమం కాబట్టి ఏదో ఒక రోజు సమస్య పరిష్కారం కాకపోతుందా అనే ఆశతో వారం వారం అర్జీలతో క్యూకడుతున్నట్లు పలువురు ఆవేదనతో చెబుతున్నారు. క్షేత్రస్థాయిలో అధికారుల నిర్లక్ష్యం.. చిత్తశుద్ధి లోపం... పైసలిస్తేగానీ ఫైలు ముట్టుకోని నైజంతోనే సమస్య పరిష్కారం కావడం లేదని బాధితులు వాపోతున్నారు. మరి ఉన్నతాధికారులు ఈ విషయాలపై దృష్టి పెడతారో ... ఎప్పటిలాగే అర్జీలు తీసుకోవడంతోనే సరిపెడతారో చూడాలి. -
బాలికపై లైంగిక దాడి కేసులో పదేళ్ల జైలు
సదుం/ చిత్తూరు అర్బన్ : మైనర్ బాలికపై లాంగిక దాడికి పాల్పడ్డ కేసులో వగళ్ల మోహన్ రెడ్డి (37) అనే ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష విధిస్తూ చిత్తూరులోని పోక్సో కోర్టు సోమవారం తీర్పునిచ్చింది. అదనపు పబ్లిక్ ప్రాసిక్యూటర్ మోహన కుమారి ఈ కేసు వివరాలను వెల్లడిస్తూ.. సదుం మండలం గుట్టమీదపల్లె బస్టాప్ వద్ద 2014 మే 24వ తేదీన 17 ఏళ్ల బాలిక బస్సు కోసం వేచి ఉన్నారు. ఈ సమయంలో గుట్టమీదపల్లె గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ మోహన్రెడ్డి తన ఆటోలో ఆమెను ఎక్కించుకున్నాడు. కొద్ది దూరం వెళ్లాక, ఆటోను డైవర్ట్ చేసి బాలికను నిర్మానుష్య ప్రాంతానికి తీసుకెళ్లి లైంగిక దాడికి పాల్పడ్డాడు. విషయం బటయ చెబితే యాసిడ్ పోస్తానని బెదిరించాడు. అదేరోజు బాలికను హైదరాబాద్కు తీసుకెళ్లాడు. బాలికను వదిలేయాలని మోహన్రెడ్డి స్నేహితుడు చెప్పగా, అక్కడే వదిలేశాడు. ఆపై బాలిక తన స్వగ్రామానికి చేరుకుని కుటుంబ సభ్యులకు జరిగిన విషయం చెప్పింది. దీనిపై బాధిత బాలిక కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదుతో సదుం పోలీసులు కేసు నమోదుచేసి, నిందితుడిని అరెస్టు చేసి కోర్టుకు తరలించారు. న్యాయస్థానంలో సాక్ష్యాధారాలతో సహా నేరం రుజువుకావడంతో ముద్దాయికి పదేళ్ల జైలుశిక్ష, రూ.16 వేల జరిమానా విధిస్తూ పోక్సో కోర్టు ఇన్చార్జ్ న్యాయమూర్తిగా ఉన్న జిల్లా ప్రధాన న్యాయమూర్తి అరుణ సారిక తీర్పునిచ్చారు. ఇక బాధితురాలికి రూ.5 లక్షల పరిహారం ప్రభుత్వం తరపున అందచేయాలని జిల్లా కలెక్టర్ను కోర్టు ఆదేశించింది. -
డిమాండ్ల సాధనకు ఆర్టీపీపీ ఉద్యోగుల నిరసన
ఎర్రగుంట్ల : విద్యుత్తు సంస్థలలో పనిచేస్తున్న ఉద్యోగులు, కార్మికుల న్యాయమైన డిమాండ్లను పరిష్కరించాలని కోరుతూ సోమవారం ఆర్టీపీపీలోని ప్రధాన గేటు వద్ద విద్యుత్తు స్ట్రగుల్ కమిటీ ఆధ్వర్యంలో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి మాట్లాడుతూ.. సమస్యలు పరిష్కరించడంలో యజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందన్నారు. వేతన సవరణ సంప్రదింపుల కమిటీని నియమించాలని, కార్మికులను సంస్థఽలో విలీనం చేయాలని, కనీస వేతనం ఇవ్వాలని, రెగ్యులర్ చేయాలని డిమాండ్ చేశారు. ఉద్యోగుల డీఏలు పెండింగ్లో ఉన్నాయని, వాటిని వెంటనే ప్రకటించాలన్నారు. కార్యక్రమంలో కమిటీ నాయకులు కార్మికులు పాల్గొన్నారు. -
విలీనం వద్దు.. మా ఊర్లోనే బడి కొనసాగించాలి
చౌడేపల్లె : మండలంలోని వెంగళపల్లె పంచాయతీ గాజులవారిపల్లెలో గల ప్రభుత్వ పాఠశాలలోని3,4,5 తరగతుల విద్యార్థులను మర్రిమాకులపల్లె ప్రభుత్వ పాఠశాలలో విలీనం వద్దు.. మా ఊర్లోని బడిలోనే ఆ తరగతులను కొనసాగించాలని తల్లితండ్రులు ఎంఈఓ కేశవరెడ్డిని కోరారు. సోమవారం గాజులవారిపల్ల పాఠశాలలో గ్రామస్తులు, తల్లితండ్రులతో ఎంఈఓ, ఉపాధ్యాయులు సమావేశమయ్యారు. ఈ పాఠశాలనుంచి 12మంది విద్యార్థులు మర్రిమాకులపల్లె పాఠశాలలో చేరాల్సి ఉంది. పాఠశాల పునఃప్రారంభమై పదిరోజులవుతున్నా విలీనం చేసిన బడికి విద్యార్థులు వెళ్లకపోవడంతో సమాచారం అందుకొన్న ఎంఈఓ గ్రామానికి చేరుకొని తల్లిదండ్రులకు సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే తల్లితండ్రులు దీనికి ససేమిరా అన్నారు. అటవీ ప్రాంతానికి సమీపంలో గల తమ గ్రామంనుంచి మర్రిమాకులపల్లెకు సుమారు 2 కిలోమీటర్లకు పైగా పిల్లలునడిచి వెళ్లాలని, పిల్లలకు భద్రత ఎలా చెప్పండి అని ప్రశ్నించారు. ట్రావెల్ చార్జీలు ఇస్తామని చెప్పినా తిరస్కరించారు. తమ గ్రామంలో ఉన్న బడిలోనే 5వ తరగతి వరకు కొనసాగిస్తే తమ పిల్లలను బడికి పంపుతామని లేకుంటే పంపేది లేదన్నారు. సమీపంలోని మోట్లపల్లె పాఠశాలలో ఉన్న 13మంది విద్యార్థులతో కలిపి గాజులవారిపల్లెలోనే 5వ తరగతి వరకు కొనసాగించేలా చూడాలని కోరారు. ఈ విషయం గురించి నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని ఎంఈఓ పేర్కొన్నారు. కాగా మర్రిమాకులపల్లె ప్రాథమిక పాఠశాల హెచ్ఎం మురళీమోహన్ వ్యవహార శైలి బాగాలేదని, దురుసుగా ప్రవర్తించడంతోపాటు తల్లితండ్రులను హేళన చేస్తూ మాట్లాడారని ఎంఈఓ ఎదుట వాగ్వాదం జరిగింది. ఇకమీదట అలాంటివి పునరావృతం కాకుండా చూస్తామని ఎంఈఓ తెలిపారు.ఎంఈఓకు తల్లితండ్రుల వినతి -
దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయాలి
కడప సెవెన్రోడ్స్ : దళిత క్రైస్తవులకు రిజర్వేషన్లు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ అఖిల భారత దళిత క్రైస్తవ హక్కుల పరిరక్షణ సమితి నాయకుడు సంగటి చిన్న ఏసోబు ఆధ్వర్యంలో సోమవారం ర్యాలీ, కలెక్టరేట్ ఎదుట ధర్నా జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆర్సీఎం బిషప్ సగినాల పాల్ప్రకాశ్ ఈ సందర్బంగా మాట్లాడుతూ ఎస్సీలు ఏ మతంలో చేరినా రిజర్వేషన్లు అమలు చేస్తున్నారుగానీ క్రెస్తవ మతం స్వీకరిస్తే అమలు చేయకపోవడం ఏపాటి న్యాయమని ప్రశ్నించారు. మతం మారే హక్కు రాజ్యాంగం కల్పించిందని పేర్కొన్నారు. 1950 నాటి రాష్ట్రపతి ఉత్తర్వులు రద్దు చేయాలన్నారు. దళిత క్రైస్తవుల పట్ల వివక్ష ఉండరాదన్నారు. తమ న్యాయమైన పోరాటానికి అన్ని పక్షాలు మద్దతు ఇవ్వాలని కోరారు. మహాజన రాజ్యం పార్టీ నాయకుడు సంగటి మనోహర్ మాట్లాడుతూ సుప్రీం కోర్టు తీర్పు, రాష్ట్రపతి ఉత్తర్వులు రాజ్యాంగ విరుద్దమన్నారు. దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు రద్దు చేసే అధికారం పార్టీమెంట్కు సైతం లేదని స్పష్టం చేశారు. సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ మాట్లాడుతూ ముస్లింలకు వ్యతిరేకంగా కేంద్ర ప్రభుత్వం ఎన్ఆర్సీ తీసుకొచ్చినపుడు ఎవరూ వ్యతిరేకించలేదన్నారు. దీంతో ఇప్పుడు దళిత క్రైస్తవుల రిజర్వేషన్లు రద్దు చేస్తున్నారన్నారు. సీపీఐ నగర కార్యదర్శి ఎన్.వెంకట శివ మాట్లాడుతూ పార్లమెంటులో చట్టసవరణ చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎస్ఏ సత్తార్, బండి జకరయ్య, ఫాదర్ ఆనంద్, ఫాదర్ సగిలి రవిచంద్ర తదితరులు పాల్గొన్నారు. అనంతరం కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిని కలిసి వినతిపత్రం సమర్పించారు. -
రోడ్డుప్రమాదంపై కేసు నమోదు చేయలేదు
మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్పై కేసు నమోదు చేయకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడిపై బాధితులు జిల్లా ఎస్పీ ధీరజ్కు ఫిర్యాదు చేశారు. మదనపల్లె పట్టణం, నక్కలదిన్నె తాండాకు చెందిన దంపతులు హేమంత్ కుమార్ నాయక్, శ్రావణ మే 23న బి.కొత్తకోట మండలం, చలిమామిడి గ్రామానికి బైక్పై వెళ్లారు. కురబలకోట మండలం, కంటేవారిపల్లి వద్ద వెనుక నుంచి వచ్చిన ఏపీ 39యూపీ 8834 నంబర్ బొలెరో వాహనం బైక్ ను బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో హేమంత్ కుమార్ నాయక్ కుడి చేయి విరిగింది. శ్రావణికి కుడి కాలు విరగడంతో పాటు అబార్షన్ జరిగింది కడుపులో ఉన్న కవల పిల్లలు మృతి చెందారు. అదే రోజు ముదివేడు పోలీసు స్టేషనన్లో ఫిర్యాదు చేసినా ఎస్ఐ మధురామచంద్రుడు ఇప్పటి వరకు విచారణ చేయకుండా, ప్రమాదానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయలేదని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం మదనపల్లె లో జరిగిన పీజీఆర్ఎస్ కార్యక్రమంలో జిల్లా ఎస్పీ ధీరజ్ను కలిసి వినతిపత్రం అందజేశారు. నిర్లక్ష్య వాహన దారులపై కఠిన చర్యలు తీసుకుని తమ కుటుంబానికి న్యాయం చేయాలని పోలీసు యంత్రాంగాన్ని కోరారు.ముదివేడు ఎస్ఐపై జిల్లా ఎస్పీకి ఫిర్యాదు -
బెల్ట్ షాపు నిర్వాహకుడి అరెస్ట్
మదనపల్లె టౌన్ : పట్టణంలో బెల్ట్ షాపు నిర్వహిస్తున్న వ్యక్తిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించినట్లు మదనపల్లె ఎకై ్సజ్ సీఐ భీమలింగా తెలిపారు. సోమవారం సీఐ మీడియాతో మాట్లాడుతూ.. చంద్ర కాలనీ వద్ద బెల్ట్ షాపు నడుస్తున్నట్లు సమాచారం అందడంతో ఎస్ఐ జెబివుల్లా, సిబ్బంది వెళ్లి నిర్వాహకుని ఇంట్లో సోదా చేశారని చెప్పారు. బెల్ట్ షాపు నిర్వహిస్తున్న గంగయ్యను అరెస్టు చేసి అతని వద్ద నుంచి 10 మద్యం బాటిళ్లను సీజ్ చేశామన్నారు. కేసు నమోదు చేసిన అనంతరం నిందితుడిని రిమాండ్కు తరలించామని సీఐ వెల్లడించారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగితే కేసులు మదనపల్లె ఎకై ్సజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో 26 మద్యం షాపులు, 6 బార్లు ఉన్నాయని సీఐ తెలిపారు. సెట్టింగ్ రూములు కాదని, బహిరంగ ప్రదేశాల్లో మద్యం తాగుతూ దాడుల్లో పట్టుబడితే వారిపై కేసులు నమోదు చేసి అరెస్టు చేస్తామని భీమలింగా హెచ్చరించారు. విద్యార్థి అదృశ్యం: కేసు నమోదుమదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలోని ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్న విద్యార్థి అదృశ్యం కావడం కలకలం రేపుతోంది. విద్యార్థి తల్లిదండ్రులు రెండో పట్టణ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. తంబళ్లపల్లె నియోజకవర్గం పీటీఎం మండలంలోని మల్లెలకు చెందిన రోహిత్ రెడ్డి(13) స్థానికంగా ఉన్న ఓ ప్రైవేట్ స్కూల్లో 8వ తరగతి చదువుతున్నాడు. మూడు రోజుల క్రితం విద్యార్థి అదశ్యం కావడంతో స్కూల్ యాజమాన్యం వారు తల్లిదండ్రులకు సమాచారం అందించారు. వారు పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించకపోవడంతో రెండో పట్టణ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. కారు ఢీకొని వ్యక్తి దుర్మరణందువ్వూరు : దువ్వూరు మండలం కడప – కర్నూలు జాతీయ రహదారిపై పెద్దజొన్నవరం మెట్ట వద్ద సోమవారం రాత్రి కారు ఢీకొనికి వ్యక్తి దుర్మరణం చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. పెద్ద జొన్నవరం ఎస్సీ కాలనీకి చెందిన రేకులకుంట పెద్ద సుబ్బరాయుడు (50) కూలి పనికి వెళ్లి ఇంటికి వెళ్లే క్రమంలో రోడ్డు దాటుతుండగా కర్నూలు నుంచి కడపకు వెళుతున్న టాటా నెక్సాన్ కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన పెద్ద సుబ్బరాయుడు అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. మృతుడు కూలి పనులకు వెళ్లి జీవనం సాగించేవాడు. అతనికి భార్య జయలక్ష్మి ఉంది. మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు దువ్వూరు ఎస్ఐ ధనుంజయుడు తెలిపారు. జాతీయ స్థాయి చెస్ టోర్నీలో ప్రతిభ కడప వైఎస్ఆర్ సర్కిల్ : బెంగళూరులోని మార్తహళ్లి, లేక్ వ్యూ పబ్లిక్ స్కూల్లో ఈ నెల 21న నిర్వహించిన రెండో చెస్ టైటాన్స్ ఓపెన్ ఏజ్ కేటగిరీ టోర్నమెంట్ జాతీయ స్థాయి చెస్ పోటీల్లో కడపకు చెందిన క్రీడాకారిణులు ప్రతిభ కనబరిచి బహుమతులు సాధించినట్లు అనీష్ దర్బారి చెస్ అకాడమీ చీప్ కోచ్ అనీష్ దర్బారి తెలిపారు.అండర్–16 బాలికల విభాగంలో గోరంట్ల తేజోమయి 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి ద్వితీయ స్థానం, అండర్–12 బాలికల విభాగంలో గంట లక్ష్మీ మానస్రీ 7 రౌండ్లలో 5 పాయింట్లు సాధించి 5వ స్థానం పొందినట్లు చెప్పారు. నిర్వాహకులు వీరికి ట్రోఫీ, ప్రశంసా పత్రం అందజేశారు. జిల్లా నుంచి పాల్గొన్న ఇతర క్రీడాకారులు కూడా మంచి ఆటతీరును ప్రదర్శించారన్నారు. -
ఇంట్లోకి దూసుకెళ్లిన ట్రాక్టర్
రాయచోటి టౌన్ : వీధుల వెంట చెత్త సేకరించి తీసుకెళ్లే మున్సిపల్ ట్రాక్టర్ పాతరాయచోటి శివాలయం వీధిలో ఇంట్లోకి దూసుకెళ్లింది. ఆదివారం ఉదయం వీధుల వెంట మొత్తం చెత్తను సేకరించి తీసుకెళ్లుతోంది. రోడ్డు వెంట వెళ్లాల్సిన ట్రాక్టర్.. రోడ్డు దిగి పక్కనే ఉన్న ఇంటిలోకి దూసుకెళ్లింది. ఈ ప్రమాదంలో ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అక్కడి వారందరూ ఊపిరి పీల్చుకున్నారు. ట్రాక్టర్ డ్రైవర్ మద్యం మత్తులో ఉండటంతో ఇలా జరిగిందని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇంటి గోడను ఢీకొన్న కారు పుంగనూరు : పట్టణంలోని నక్కబండలో ఓ బాలుడు కారు నడిపి ఇంటి గోడను ఢీకొనడంతో బాలుడు స్వల్పంగా గాయపడిన సంఘటన ఆదివారం జరిగింది. నక్కబండ ప్రాంతానికి చెందిన బాలుడు సరదాగా కారు నడుపుతూ అక్కడ ఇంటి గోడను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో బాలుడికి గాయాలయ్యాయి. కారు ముందుభాగం దెబ్బతింది. వెంటనే ఆ ప్రాంత వాసులు బాధితుడిని ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్ : భూ వివాదం కారణంగా ఇరు వర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. ఒక వర్గానికి చెందిన తండ్రి, కుమారుడితోపాటు మరో వర్గానికి చెందిన ఒకరికి స్వల్ప గాయాలయ్యాయి. శనివారం అర్ధరాత్రి మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ ఎనమలవారిపల్లెలో ఈ ఘటన జరిగింది. బాధితులు ఆదివారం తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. సునీల్ కుమార్, త్రిలోక్ కుమార్ వర్గాల మధ్య కొంత కాలంగా భూ వివాదం నడుస్తోంది. ఈ విషయమై త్రిలోక్ కుమార్, అతని పిన తండ్రి మోహన్ రావ్ ఇంటికి సునీల్ కుమార్ తన వర్గీయులు చిట్టిబాబు, రామచంద్రతో కలిసి అర్ధరాత్రి వెళ్లి గొడవకు దిగారు. ‘మా నాన్నతో అసభ్యంగా ఎందుకు మాట్లాడావు’ అంటూ ప్రశ్నించడంతో మాటకుమాట పెరిగింది. ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తితో.. వారిస్తున్న త్రిలోక్ కుమార్పై సునీల్ కుమార్ దాడి చేశాడు. ఘర్షణ తీవ్రరూపం దాల్చడంతో ఇరు వర్గాలకు చెందిన ముగ్గురికి స్వల్ప గాయాలయ్యాయి. బాధితులను కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అనంతరం ఇరు వర్గాల వారు పరస్పరం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ చంద్రమోహన్, సీఐ కళా వెంకటరమణ కేసు విచారణ చేస్తున్నారు. చిన్నమండెం : మండలంలోని వండాడి గ్రామం కదిరోళ్లపల్లె వద్ద ఆదివారం టమాట లోడుతో వెళ్తున్న బొలెరో వాహనం వెనుక టైరు పగిలి బోల్తా పడింది. మదనపల్లె నుంచి టమోటా లోడుతో విజయవాడకు కడప–బెంగళూరు జాతీయ రహదారిపై వెళ్తుండగా ఈ ఘటన చోటుచేసుకుంది. ఎవరికీ ప్రాణనష్టం, గాయాలు కాకపోవడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. క్రేట్లు కింద పడటంతో టమాటలు రోడ్డు పాలయ్యాయి. -
ఆరోగ్య యోగం
మదనపల్లి (కురబలకోట) : యోగాను తాత్కాలిక కార్యక్రమంగా కాకుండా ప్రతి ఒక్కరి దైనందిన జీవితంలో భాగం కావాలని.. అప్పుడే ఆరోగ్య యోగం దక్కుతుందని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఆదివారం మదనపల్లి పట్టణంలోని మిషన్ కాంపౌండ్ మైదానంలో యోగాభ్యసనాల కార్యక్రమం నిర్వహించారు. అంతర్జాతీయ యోగా గురువు డాక్టర్ పాల్ బ్రహ్మకుమార్ యోగాసనాలు చేయించారు. యోగా ఆరోగ్యకరమైన జీవనశైలికి పునాది అని ఎస్పీ అన్నారు. దీనిని అలవాటుగా చేసుకుని ఆరోగ్య సమాజ నిర్మాణానికి తోడ్ప డాలని కోరారు. విద్యార్థులకు ప్రశంసా పత్రాలు అందజేశారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా, జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు పాల్గొన్నారు. -
బాలిక వైద్యానికి ఎంపీ భరోసా
● చికిత్సకు బెంగళూరు తరలింపు పుంగనూరు: ఓ పేద బాలిక గుండె జబ్బుతో బాధపడుతుండటాన్ని చూసి రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిథున్రెడ్డి చలించారు. తక్షణమే ఆదివారం బాలికను బెంగళూరులోని వైదేహి ఆసుపత్రికి తీసుకెళ్లి చికిత్స చేయించాలని సూచించారు. పెద్దమండ్యం మండలం సాయిబులవారిపల్లెలో నివాసం ఉన్న జబివుల్లా, తహరీన్ దంపతులకు ఆలియ(10) అనే కుమార్తె ఉంది. ఈ బాలిక గుండెజబ్బుతో బాధపడుతోంది. చికిత్సకు లక్షలాది రూపాయలు కావడంతో తల్లిదండ్రులు తల్లడిల్లారు. ఈ విషయం వైఎస్సార్సీపీ జిల్లా సేవాదళ్ అధ్యక్షుడు, పుంగనూరుకు చెందిన ఎస్టీఎఫ్ సిద్ధిక్కు తెలియడంతో.. ఆయన వెంటనే ఎంపీ మిథున్రెడ్డి వద్దకు బాలికతోపాటు ఆమె తల్లిదండ్రులను తీసుకెళ్లారు. ఎంపీ తక్షణమే బాలికకు అవసరమైన ఆపరేషన్లకు ఆర్థిక సాయం అందిస్తామని భరోసా కల్పించారు. బాలికను బెంగళూరు ఆసుపత్రికి తీసుకెళ్లే ఏర్పాటు చేశారు. దీనిపై బాలిక తల్లిదండ్రులు ఎంపీకి కృతజ్ఞతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు సిద్దు, బాబుల్లి, షఫి తదితరులు పాల్గొన్నారు. -
ప్లే ఆఫ్స్కు చేరే జట్లు ఒక విశ్లేషణ
ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్–5 లీగ్ దశ ముగింపునకు చేరుకున్న తరుణంలో, విజయవాడ సన్షైనర్స్ రికార్డు పరుగుల విధ్వంసం (–0.334 నుండి ఏకంగా +0.643 ూఖఖ) పాయింట్ల పట్టికను పూర్తిగా మార్చేసింది. ప్రస్తుతం ఐదు జట్లు 6 పాయింట్లతో సమానంగా నిలవడంతో ప్లేఆఫ్స్ రేసు రసవత్తరంగా మారింది. ఈ తాజా పాయింట్ల పట్టిక సమీకరణాల ఆధారంగా టాప్–4 కు చేరుకునే జట్ల అవకాశాల సమగ్ర విశ్లేషణ: భీమవరం బుల్స్ : 100% ప్లేఆఫ్స్ బెర్త్ ఖరారు ప్రస్తుత స్థితి : 6 మ్యాచ్ల్లో 4 విజయాలు, 8 పాయింట్లతో టేబుల్ టాపర్గా కొనసాగుతోంది. +1.204 రన్ రేట్తో లీగ్లో అత్యంత పటిష్టమైన స్థితిలో ఉంది. ప్లేఆఫ్స్ అవకాశాలు : వీరు అధికారికంగా ప్లే ఆఫ్స్ బెర్త్ను ఖరారు చేసుకున్నారు. లీగ్ దశ ముగిసేసరికి వీరు మొదటి రెండు స్థానాల్లో నిలిచి ‘క్వాలిఫైయర్–1’ ఆడటం దాదాపు ఖాయం. విజయవాడ సన్షైనర్స్ : అత్యంత సురక్షిత జోన్ ప్రస్తుత స్థితి : 6 మ్యాచ్ల్లో 3 విజయాలు, 6 పాయింట్లతో రెండో స్థానానికి దూసుకొచ్చింది. కాకినాడపై సాధించిన 110 పరుగుల రికార్డు విజయంతో రన్ రేట్ ఏకంగా +0.643లోకి జంప్ అయింది. ేప్లఆఫ్స్ అవకాశాలు : 6 పాయింట్లు ఉన్న మిగతా జట్ల కంటే విజయవాడ రన్ రేట్ చాలా బలంగా ఉంది. కాబట్టి మిగిలిన జట్ల మ్యాచ్ ఫలితాలతో సంబంధం లేకుండా విజయవాడ సన్షైనర్స్ టాప్–4 లో నిలవడం 99% ఖాయం. కాకినాడ కింగ్స్ : అవకాశాలు సజీవం ప్రస్తుత స్థితి : 6 మ్యాచ్ల్లో 3 విజయాలు, 6 పాయింట్లతో మూడో స్థానంలో ఉంది. విజయవాడ చేతిలో దారుణంగా ఓడిపోవడంతో వీరి రన్ రేట్ +1.623 నుంచి +0.425 కు పడిపోయింది. ప్లేఆఫ్స్ అవకాశాలు : రన్ రేట్ తగ్గినప్పటికీ ఇప్పటికీ ప్లస్లోనే ఉండటం వీరికి కలిసి వచ్చే అంశం. కింద ఉన్న వైజాగ్, అమరావతి జట్ల కంటే మెరుగైన రన్ రేట్ ఉండటం వల్ల కాకినాడ కింగ్స్ టాప్–4 లో నిలిచే అవకాశాలు 90% మెరుగ్గా ఉన్నాయి. అమరావతి రాయల్స్ : ఒక మ్యాచ్ చేతిలో ఉంది (గోల్డెన్ చాన్స్) ప్రస్తుత స్థితి : కేవలం 5 మ్యాచ్ల్లోనే 3 విజయాలతో 6 పాయింట్లు సాధించి ఐదో స్థానంలో ఉంది. నెట్ రన్ రేట్ దారుణంగా –0.686గా ఉండటం పెద్ద మైనస్. ప్లేఆఫ్స్ అవకాశాలు : అమరావతికి లీగ్లో ఇంకా ఒక మ్యాచ్ మిగిలి ఉంది. ఆ ఆఖరి మ్యాచ్లో గెలిస్తే వీరు 8 పాయింట్లతో చాలా సులభంగా టాప్–4 లోకి (బహుశా రెండో స్థానంలోకి) దూసుకెళ్తారు. ఒకవేళ ఓడిపోతే మాత్రం రన్ రేట్ మైనస్ వల్ల లీగ్ నుంచి తప్పుకోవాల్సి వస్తుంది. టాప్–4 కు కొర్రీలు పెట్టే ఇతర జట్ల సమీకరణాలు స్మార్ట్సిటీ వైజాగ్ లయన్స్ : ముంచుకొస్తున్న ముప్పు : 6 మ్యాచ్ల్లో 3 విజయాలతో 6 పాయింట్లు ఉన్నప్పటికీ, వీరి లీగ్ మ్యాచ్లు పూర్తయ్యాయి. రన్ రేట్ –0.167 మైనస్లో ఉంది. అమరావతి రాయల్స్ తన ఆఖరి మ్యాచ్లో గెలిచినా.. లేదా కింద ఉన్న రాయలసీమ భారీ తేడాతో గెలిచినా వైజాగ్ లయన్స్ టాప్–4 రేసు నుంచి అధికారికంగా బయటకు పోక తప్పదు. రాయల్స్ ఆఫ్ రాయలసీమ : ‘మిరకల్’ జరగాలి : ప్రస్తుతం 5 మ్యాచ్ల్లో 2 విజయాలతో 4 పాయింట్లతో ఆరో స్థానంలో ఉంది. అయితే వీరి రన్ రేట్ (–0.205) వైజాగ్, అమరావతి కంటే మెరుగ్గా ఉంది. తమ ఆఖరి మ్యాచ్లో రాయలసీమ భారీ మార్జిన్తో గెలిచి, అమరావతి రాయల్స్ తన చివరి మ్యాచ్లో ఓడిపోతే.. రాయలసీమ 6 పాయింట్లు మరియు మెరుగైన రన్ రేట్ ఆధారంగా 4వ జట్టుగా ప్లేఆఫ్స్కు అర్హత సాధిస్తుంది. తుంగభద్ర వారియర్స్ : అవుట్ ఆఫ్ రేస్ : 6 మ్యాచ్ల్లో కేవలం 4 పాయింట్లు, దారుణమైన రన్ రేట్ (–1.446) కారణంగా వీరు టోర్నీ నుంచి అధికారికంగా తప్పుకున్నారు. ఫైనల్ ప్రిడిక్షన్ : భీమవరం బుల్స్, విజయవాడ సన్షైనర్స్, కాకినాడ కింగ్స్లు దాదాపు కన్ఫర్మ్ అవ్వగా.. 4వ స్థానం కోసం అమరావతి రాయల్స్ మరియు రాయల్స్ ఆఫ్ రాయలసీమ మధ్య ఆఖరి మ్యాచ్ల ఉత్కంఠ పోరు సాగనుంది. -
సన్షైనర్స్ సునామీ
కడప వైఎస్సార్ సర్కిల్ : ఆంధ్ర ప్రీమియర్ లీగ్ లో భాగంగా విజయవాడ సన్షైనర్స్ బ్యాటర్లు ఆకాశమే హద్దుగా రికార్డుల చరిత్రను తిరగరాశారు. ఓపెనర్లు మున్నంగి అభినవ్ (137 నాటౌట్), కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ (130) విధ్వంసకర శతకాలతో కాకినాడ కింగ్స్ బౌలర్లను ఊచకోత కోశారు. వీరిద్దరి వీరవిహారంతో ఏపీఎల్ చరిత్రలోనే అత్యధికంగా నిర్ణీత 20 ఓవర్లలో కేవలం ఒకే ఒక్క వికెట్ నష్టానికి ఏకంగా 290 పరుగుల కొండంత స్కోరు నమోదైంది. అనంతరం భారీ లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టు 20 ఓవర్లలో 9 వికెట్లకు 180 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో విజయవాడ సన్షైనర్స్ 110 పరుగుల భారీ తేడాతో సంచలన విజయాన్ని సొంతం చేసుకుంది. ఓపెనర్ల ప్రపంచ రికార్డు భాగస్వామ్యం కాకినాడ కింగ్స్ కెప్టెన్ మనీష్ గొలమారు టాస్ గెలిచి విజయవాడ సన్షైనర్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. కానీ, ఆ నిర్ణయం కాకినాడకు భారీ నష్టాన్ని మిగిల్చింది. తొలుత బ్యాటింగ్కు దిగిన విజయవాడ ఓపెనర్లు మొదటి ఓవర్ నుంచే కాకినాడ బౌలర్లకు నరకం చూపించారు. మున్నంగి అభినవ్ కేవలం 69 బంతుల్లో 9 ఫోర్లు, 10 గగనతల సిక్సర్లతో 137 పరుగులు చేసి అజేయంగా నిలిచాడు. మరోవైపు కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ కేవలం 53 బంతుల్లోనే 13 ఫోర్లు, 9 భారీ సిక్సర్లతో 130 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వీరిద్దరూ మొదటి వికెట్కు ఏకంగా 260 కి పైగా పరుగుల రికార్డు భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. ఆఖర్లో షేక్ జహీర్ అబ్బాస్ కేవలం 2 బంతుల్లో 2 సిక్సర్లతో 12 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా మున్నంగి అభినవ్ ఎంపకయ్యాడు. బౌలింగ్లోనూ సన్షైనర్స్ మెరుపులు 291 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కాకినాడ కింగ్స్ జట్టుకు మొదటి ఓవర్లోనే విజయవాడ బౌలర్లు షాక్ ఇచ్చారు. కెప్టెన్ మనీష్ గొలమారు (0) ఖాతా తెరవకుండానే అవుట్ కాగా, అర్జున్ టెండూల్కర్ (17), అభిషేక్ రెడ్డి (9)లు త్వరగానే పెవిలియన్ చేరారు. మిడిలార్డర్లో పిన్నింటి తపస్వి (27), ఒమ్మి భాస్వంత్ కృష్ణ (30), మిట్టా లేఖాజ్ రెడ్డి (31), హరిశంకర్ రెడ్డి (20)లు పోరాడినప్పటికీ రన్ రేట్ ఒత్తిడి కారణంగా వికెట్లు సమర్పించుకున్నారు. విజయవాడ బౌలర్లలో బి.ప్రణవ్ రెడ్డి 3 వికెట్లు (3/30) తీసి కాకినాడ వెన్ను విరవగా, తన్నీరు భరత్ 2 వికెట్లు, సాయి వెంకట సుమిత్, సిద్ధార్థ, లలిత్ మోహన్ తలా ఒక వికెట్ పడగొట్టి విజయవాడకు భారీ విజయాన్ని అందించారు. ● ఓవర్ టు మంగళగిరి ఆంధ్ర ప్రీమియర్ లీగ్ – 2026 సీజన్–5 కై ్లమాక్స్ సమరం మంగళగిరి (అమరావతి)లోని ఏసీఏ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియం వేదికగా జరగనుంది. జూన్ 24 నుంచి జూన్ 30 వరకు ఇక్కడ జరగబోయే లీగ్ మ్యాచ్లు, ప్లేఆఫ్స్ మరియు ఫైనల్ మ్యాచ్ల సమగ్ర షెడ్యూల్ వివరాలు.. -
తుంగభద్రపై రాయల్ గర్జన
కడప వైఎస్సార్ సర్కిల్ : కడప వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా జరిగిన ఏపీఎల్ రసవత్తర పోరులో రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సర్వశ్రేష్ఠ ప్రదర్శనతో తుంగభద్ర వారియర్స్ పై 6 వికెట్ల తేడాతో సంచలన విజయాన్ని నమోదు చేసింది. తుంగభద్ర నిర్దేశించిన 133 పరుగుల మోస్తరు లక్ష్యాన్ని రాయలసీమ బ్యాటర్లు ఏమాత్రం ఒత్తిడికి లోనవకుండా, మరో 35 బంతులు మిగిలి ఉండగానే కేవలం 14.1 ఓవర్లలోనే 4 వికెట్లు కోల్పోయి సునాయాసంగా ఛేదించారు. పవర్ప్లేలోనే కోలుకోలేని దెబ్బ తొలుత టాస్ గెలిచిన రాయలసీమ కెప్టెన్ ధ్రువ కుమార్ రెడ్డి తుంగభద్ర వారియర్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. తుంగభద్ర వారియర్స్ బ్యాటింగ్ రాయలసీమ బౌలర్ల ధాటికి తీవ్రంగా ఒడిదొడుకులకు లోనైంది. నిర్ణీత 20 ఓవర్లలో ఆ జట్టు 9 వికెట్ల నష్టానికి 132 పరుగుల మోస్తరు స్కోరు మాత్రమే చేయగలిగింది. రాయలసీమ బౌలర్లు పవర్ప్లేలోనే కోలుకోలేని దెబ్బతీశారు. కల్ది అజయ్ కుమార్ నిప్పులు చెరిగే బౌలింగ్తో ఓపెనర్లు కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ (1), శ్రీ సమన్యు దత్తా (2)లతో పాటు కాకి సూర్య జయంత్ (5)లను పట్టుమని 10 పరుగులు కూడా దాటకముందే పెవిలియన్ చేర్చాడు. ఆ తర్వాత పార్థసారథి కూడా చెలరేగడంతో తుంగభద్ర జట్టు 39 పరుగులకే 5 వికెట్లు కోల్పోయి తీవ్ర సంక్షోభంలో పడింది. ఆనంద్ జోసియా ఒంటరి పోరాటం వికెట్లు పడుతున్నా ఒక ఎండ్లో గుత్తా రోహిత్ (34 బంతుల్లో 28) ఇన్నింగ్స్ను నిలబెట్టే ప్రయత్నం చేయగా, మిడిలార్డర్ బ్యాటర్ కంచెర్ల ఆనంద్ జోసియా విధ్వంసకర ఇన్నింగ్స్తో జట్టును ఆదుకున్నాడు. రాయలసీమ బౌలర్లపై ఎదురుదాడికి దిగిన ఆయన.. కేవలం 38 బంతుల్లోనే 4 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 160.53 స్ట్రైక్ రేట్తో 61 పరుగులు సాధించి ఒంటరి పోరాటం చేశాడు. ఈ ఇన్నింగ్స్ వల్లే తుంగభద్ర జట్టు గౌరవప్రదమైన స్కోరు సాధించగలిగింది. రాయల్స్ ఆఫ్ రాయలసీమ బౌలర్లలో పార్థసారథి జి.జి అత్యంత అద్భుతంగా బౌలింగ్ చేసి 4 ఓవర్లలో కేవలం 20 పరుగులిచ్చి 3 కీలక వికెట్లు (3/20) పడగొట్టాడు. ఆయనకు తోడుగా కల్ది అజయ్ కుమార్ 4 ఓవర్లలో 24 పరుగులిచ్చి 3 వికెట్లు (3/24) తీసి టాప్ ఆర్డర్ను క్లీన్ చేయగా, గణేష్ సతివాడ 2 వికెట్లతో తుంగభద్ర పరుగుల వేగాన్ని పూర్తిగా అడ్డుకున్నారు. గరిమెళ్ల తేజ విధ్వంసం లక్ష్య చేధనలో రాయలసీమకు ప్రారంభంలోనే గట్టి షాక్ తగిలింది. ఓపెనర్ కమ్ కెప్టెన్ ధ్రువ కుమార్ రెడ్డి (0) మొదటి బంతికే అవుట్ కాగా, సిహెచ్ సాయి సందీప్ 6 బంతుల్లోనే 2 ఫోర్లు, ఒక సిక్సర్తో 15 పరుగులు చేసి అవుట్ అయ్యాడు. వై.తేజ రెడ్డి (9), జి.మన్విత్ రెడ్డి (5)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గరిమెళ్ల తేజ తుంగభద్ర బౌలర్లపై పగబట్టినట్లు విరుచుకుపడ్డాడు. కేవలం 42 బంతుల్లోనే 6 ఫోర్లు, 5 అద్భుతమైన సిక్సర్లతో ఏకంగా 73 పరుగులు సాధించి అజేయంగా నిలిచాడు అతనికి తోడుగా ఎ.సాయి సూర్య తేజ (24 బంతుల్లో 30 నాటౌట్, 1 ఫోర్, 2 సిక్సర్లు) బాధ్యతాయుతంగా ఆడి అజేయ భాగస్వామ్యంతో జట్టును గెలిపించాడు. తుంగభద్ర బౌలర్లలో మాధా దీపక్ 2 వికెట్లు తీశారు. -
24న భూమయ్యగారి పల్లెకు వైఎస్ జగన్ రాక
● పర్యటనపై స్థానిక నేతలతో చర్చించిన ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ● బండలాగుడు పోటీల ప్రాంతం పరిశీలనవేముల : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 24న వేముల మండలం భూమయ్య గారి పల్లెలో పర్యటించనున్నారు. గ్రామంలో రూ. 1.50 కోట్లతో నూతనంగా శ్రీలక్ష్మీ నరసింహ స్వామి ఆలయం నిర్మించారు.ఈ ఆలయంలో 23 నుంచి విగ్రహప్రతిష్ట వేడుకలు జరుగనున్నాయి.వైఎస్ జగన్మోహన్రెడ్డి 24న జరిగే కార్యమానికి హజరుకానున్నారు. దీంతో కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్ సీపీ మండల ఇన్చార్జి నాగేళ్ల సాంబశివారెడ్డి, జెడ్పీటీసీ కె వెంకటబయపురెడ్డి, మండల పరీశీలకులు లింగాల రామలింగారెడ్డితో కలిసి పర్యటన ఏర్పాట్ల ను పరిశీలించారు. విగ్రహ ప్రతిష్ట సందర్భంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటించే ప్రాంతాలను వారు పరిశీలించారు. వైఎస్ జగన్ రాక సందర్భంగా జనాలు భారీగా తరలి వచ్చే అవకాశం ఉన్నందువల్ల ఎలాంటి ఇబ్బందులు లేకుండా చూడాలని నిర్వాహకులకు సూచించారు. వైఎస్ జగన్ ఆలయానికి చేరుకున్న వెంటనే వేద పండితులు పూర్ణ కుంభంతో స్వాగతం పలకనున్నారు. అనంతరం ఆలయంలో జరిగే అభిషేకం, ప్రత్యేక పూజల్లో ఆయన పాల్గొననున్నారు. అనంతరం అక్కడ నుంచి బండలాగుడు పోటీలు నిర్వహించే ప్రాంతానికి చేరుకుని పోటీలను ప్రారంభిస్తారని ఎంపీ తెలిపారు. మూడు రోజుల పాటు జరిగే లక్ష్మీనరసింహస్వామి ఆలయ విగ్రహ ప్రతిష్ట వేడుకులకు ఎంత మంది హజరవుతారనే విషయాలపై నేతలతో ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చర్చించారు.10 వేల మంది వస్తారని అంచనా వేస్తున్నామని, భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకుంటున్నామని జెడ్పీటీసీ ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి వివరించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు చల్లా వెంకటనారాయణ, చందా మలిరెడ్డి, విష్ణు వర్ధన్రెడ్డి, రాజారెడ్డి, రామచంద్రారెడ్డి, మధుసూదన్రెడ్డి, స్థానికులు పాల్గొన్నారు. -
రెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లెలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. సీమ జిల్లాలతో పాటు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం. మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. మదనపల్లె డిపో నుంచి ఉదయం 6.00, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయని పేర్కొన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ సాక్షి, మదనపల్లె : కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించనున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని వివరించారు. నేడు డయల్ యువర్ ఎస్ఈసాక్షి, మదనపల్లె : విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలను సోమ వారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం దృష్టికి తీసుకురావాలని డిస్కం జిల్లా ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు 94408 17449 నెంబరు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. నేడు ఎంపీ మిథున్రెడ్డి రాక సాక్షి, మదనపల్లె : రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత పీవీ.మిథున్రెడ్డి సోమవారం మదనపల్లెకు రానున్నారని ఆ పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆదివారం తెలిపారు. ఉదయం పదిన్నర గంటలకు మిథున్రెడ్డి స్థానిక ఎంపీ కార్యాలయానికి చేరుకుని సాయంత్రం వరకు అక్కడే ఉంటారని తెలిపారు. పార్టీ నేతలు, కార్యకర్తలను కలిసి ‘సర్’తో పాటు వివిధ అంశాలపై సమీక్షిస్తారని వెల్లడించారు. నేడు కౌన్సెలింగ్ కడప ఎడ్యుకేషన్ : ఉమ్మడి వైఎస్సార్ కడపజిల్లాకు చెందిన డీఎస్సీ 2008, డీఎస్సీ 1998 మినిమమ్ టైమ్ స్కిల్(ఎంటీఎస్) ఉపాధ్యాయులకు పోస్టింగ్ల కేటాయింపునకు సోమ వారం కడపలోని డీఈఓ కార్యాలయం ఆవరణలో కౌన్సెలింగ్ జరగనుంది. ఈ విషయా న్ని డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. పైన పేర్కొన్న ఉపాధ్యాయులు ఉదయం 10 గంటలకు హాజరు కావాలని సూచించారు నిర్ణీత తేదీ, సమయానికి హాజరుకాని మినిమమ్ టైమ్ స్కేల్ ఉపాధ్యాయులకు తదుపరి ఎటువంటి కౌన్సెలింగ్ నిర్వహించే అవకాశం ఉండదని డీఈఓ పేర్కొన్నారు. హార్సిలీహిల్స్ వద్ద తనిఖీలు మదనపల్లె టౌన్ : ప్రముఖ పర్యాటక కేంద్రమైన హార్సిలీ హిల్స్ వద్ద ఆదివారం ట్రాన్స్పోర్ట్, పోలీస్ శాఖలు సంయుక్తంగా వాహన తనిఖీలు నిర్వహించాయి. హార్సిలీ హిల్స్పైకి వెళ్లే వాహనాలను లక్ష్యంగా చేసుకుని డీటీఓ అశోక్ ప్రతాప్ రావు, బి.కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తమ సిబ్బందితో కలిసి చెక్పోస్ట్ ఏర్పాటు చేశారు. ఈ తనిఖీల్లో నిబంధనలు ఉల్లంఘించిన 16 మందిపై కేసులు నమోదు చేశారు. ఒక్క రోజులోనే రూ.37,800 జరిమానా వసూ లు చేశారు. ఈ తనిఖీల్లో ఎంవీఐలు దినేష్ చంద్ర, శివలింగయ్య, శ్రీహరి, బి.కొత్తకోట పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
కోతులు రాల్చిన కోహినూర్లు
పై ఫొటోలో కనిపిస్తున్న పచ్చటి కాయలను చూసి ఏ సాదాసీదా మామిడి కాయలో అనుకుంటే ఊరగాయలో కాలేసినట్లే! ఇది ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రమైన తలకోన అడవుల్లో ప్రకృతి ప్రసాదించిన వంద శాతం సేంద్రీయ అడవి మామిడి పంట! తలకోన జలపాతం పరిసరాల్లో ఏపుగా పెరిగిన ఈ చెట్ల కాయలు ఇప్పుడు ఇక్కడికి వచ్చే పర్యాటకులను అమితంగా ఆకర్షిస్తున్నాయి. ఇక్కడి మామిడి చెట్లు ఆకాశాన్ని తాకేంత ఎత్తులో పెరగడంతో మనుషులు ఎక్కి కాయలు కోయడం అసాధ్యం. మరి ఈ కాయలు మార్కెట్లోకి ఎలా వస్తున్నాయో తెలుసా? ఇక్కడి కొండముచ్చులు, కోతుల సైన్యమే ఆ పనిని ఉచితంగా చేసిపెడుతున్నాయి. కోతులు చెట్ల కొమ్మలపై చిందులు వేస్తూ కాయలను కిందకు రాల్చితే.. చుట్టుపక్కల గ్రామాలకు చెందిన స్థానికులు, కూలీలు వాటిని జాగ్రత్తగా ఏరుకుని ఇలా బకెట్లలో నింపి పర్యాటకులకు అమ్ముతూ ఉపాధి పొందుతున్నారు. తోటల్లో లాగా ఈ చెట్లకు ఎలాంటి రసాయన ఎరువులు లేదా పురుగుమందులు పిచికారీ చేయరు. ఈ కాయలు సహజసిద్ధమైన పులుపును కలిగి ఉండటంతో నిల్వ ఊరగాయలు పెట్టుకోవడానికి ఇల్లాళ్లు ఎగబడుతున్నారు. ఇక్కడ కిలోల లెక్క ఉండదు. ఒక్కో కాయను రూ.5 చొప్పున విక్రయిస్తున్నారు. ఒకవేళ బస్తాల రూపంలో కావాలంటే 20 కిలోల బస్తా రూ.5,000 వరకు పలుకుతూ కాసుల వర్షం కురిపిస్తోంది. బయట మార్కెట్లో మామిడికి గిట్టుబాటు ధర లేక రైతులు ఆవేదన చెందుతుంటే, తలకోనలో మాత్రం ఈ అడవి మామిడికి గిరాకీ ఓ రేంజ్లో ఉండటం విశేషం. – రొంపిచెర్ల -
నాడు ఫౌంటెయిన్.. నేడు నో మెయింటెయిన్!
సరిగ్గా ఏడాది క్రితం, కొండపై పర్యాటకాన్ని అంబరానికి ఎత్తేస్తామంటూ ముగ్గురు అగ్రశ్రేణి ఐఏఎస్ అధికారులు..అప్పటి కలెక్టర్ శ్రీధర్, జేసీ ఆదర్శ్ రాజేందర్, సబ్ కలెక్టర్ మేఘ స్వరూప్ ఇక్కడికి విచ్చేశారు. లక్షల రూపాయల ప్రజాధనాన్ని ’చిలకరిస్తూ’.. నీటిని తుంపర్లుగా వెదజల్లే కలర్ఫుల్ ఫౌంటెయిన్, రాళ్లపై నుంచి రొమాంటిక్గా దుముకే ఆర్టిఫిషియల్ జలపాతాన్ని కొబ్బరికాయలు కొట్టి అట్టహాసంగా ప్రారంభించారు. అధికారులు అలా కొండ దిగారో లేదో.. వారం తిరక్కముందే ఈ ఫౌంటెయిన్ మోటార్లు కూడా శాశ్వతంగా ’స్విచ్చాఫ్’ అయిపోయాయి. నిర్వహణను గాలికి వదిలేయడంతో, ఇప్పుడు ఆ లక్షల రూపాయల ఫౌంటెయిన్ కాస్తా పర్యాటకులు పడేసే ప్లాస్టిక్ కవర్లు, ఖాళీ బాటిళ్లకు అఫీషియల్ ’డస్ట్బిన్’గా ప్రమోషన్ పొందింది. కొండపై తాగడానికి నీళ్లు లేక పర్యాటకులు అల్లాడుతుంటే.. ఇక్కడ మాత్రం లక్షలు పోసి ’మురికి దిబ్బ’ను తయారు చేయడం అధికారుల క్రియేటివిటీకి నిదర్శనం. ట్విస్ట్ ఏమిటంటే..ఇటీవలే ప్రస్తుత కలెక్టర్, టౌన్షిప్ కమిటీ చైర్మన్ (సబ్ కలెక్టర్), పర్యాటక శాఖ అధికారులు తదితర బృందమంతా కాన్వాయ్ కట్టుకుని హార్సిలీహిల్స్పై ’రౌండ్స్’ వేశారు. ముఖద్వారం వద్దే కళ్లెదుట వెలిగిపోతున్న ఈ ’సుందర మురికి గుంట’ను దాటుకునే కొండపైకి వెళ్లినా.. ఒక్క అధికారి కంటికి కూడా ఇది ఆనకపోవడం ఈ శతాబ్దపు అతిపెద్ద వింత! ఈ ఫౌంటెయిన్ను చూసి పర్యాటకులు ‘కొత్తగా వచ్చే పర్యాటకులు బోర్ ఫీల్ అవ్వకుండా ఉండటానికి, ముఖద్వారం వద్దే అధికారుల నిర్లక్ష్యం ఏ రేంజ్లో ఉంటుందో లైవ్ డెమో చూపించడానికి ఈ ఏర్పాటు చేసినట్లున్నారు‘ అని పరాచికాలాడుతున్నారు. – టి.షామీర్బాషా(సాక్షి,మదనపల్లె) -
చినుకు లేదు.. చింత తప్ప
మూపురాలు ఆడిస్తూ పొలమంతా అడుగులేయాల్సిన కాడెద్దులు మూలనున్న కాడిని చూస్తూ మౌనంగా నెమరేస్తుంటే.. పండగలా సాగు చేద్దామనుకున్న కర్షకలోకం.. రాలే చినుకు కోసం కళ్లు ‘కాయలు’కాసేలా ఎదురుచూస్తుంటే.. పుడమితల్లి ‘బీడు’ పడి దిక్కులు చూస్తోంది. పచ్చని చీర చుట్టి మురిసిపోవాలనుకున్న తన ఆశ ఆవిరయ్యేలా ఉందని దిగాలు పడుతోంది. అటు.. మేఘం వర్షించక.. ఇటు విత్తనం రాక.. ఖరీఫ్ సీజన్ బోసిపోయింది. సాక్షి, మదనపల్లె : ఖరీఫ్ సీజన్ వస్తే రైతన్నలకు క్షణం తీరిక ఉండదు. పొలాల దుక్కుల్లో మునిగిపోతారు.. ఎరువులు కొనుగోలు చేయడంలో.. మేలైన విత్తనాల సేకరణలో బిజీ అయిపోతారు.. తొలకరి వర్షాలు మొదలవగానే కాడెద్దులకు పూజ చేసి.. పొలంలో పంటవిత్తడం మొదలు పెడతారు. ప్రస్తుత ఖరీఫ్లో ఏ పల్లెలో చూసిన ఈ పరిస్థితుల్లో కానరావడం లేదు. వర్షించని ఆకాశం, దుక్కులకు నోచుకోని పొలాలు, ఇళ్లల్లో కనిపించని విత్తనం.. ఫలితంగా ఖరీఫ్ సాగుకు అడుగేపడలేదు. సాధారణంగా ఏప్రిల్ చివరి వారం నుంచి రైతులు ఖరీఫ్ సాగు మొదలుపెట్టి జూన్ రెండో వారానికి 70 శాతానికి పైగా సాగు పూర్తి చేస్తారు. ఈసారి కనుచూపుమేరలో సాగు కనిపించడం లేదు. ఖరీఫ్ ముగిసేందుకు మిగిలింది మూడు వారాలే అయినా ప్రభుత్వం నుంచి రైతులకు విత్తనం అందడం లేదు, వరుణుడు చినుకు వదలడం లేదు. ఫలితంగా ఖరీఫ్ నిరాశగా ముగిసేలా కనిపిస్తోంది. పంపిణీ ప్రశ్నార్థకమే! ఈ ఖరీఫ్ లో జిల్లాకు 43 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలను పంపిణీ చేసేందుకు ప్రభుత్వం కేటాయింపులు చేసింది. జిల్లాలోని 25 మండలాలకు ఈ విత్తనాన్ని అధికారులు కేటాయింపులు చేశారు. జూన్ మొదటి వారానికి విత్తన కాయల పంపిణీ పూర్తి కావాల్సి ఉంది. ప్రభుత్వం నిర్లక్ష్యం ఫలితంగా సాగుపై.. జిల్లా రైతాంగంపై తీవ్ర సంక్షోభం నెలకొంది. ఇప్పటిదాకా జిల్లాకు సరఫరా చేసిన విత్తన కాయలు కేవలం 16 వేల క్వింటాళ్లకు లోపే. అధికారిక లెక్క ప్రకారం ఇంకా 20 వేల క్వింటాళ్లకు పైగా విత్తన కాయలు జిల్లాకు సరఫరా కావాల్సి ఉంది. వీటి సరఫరా ఎప్పుడు జరుగుతుంది, మండలాలకు తరలించే రైతులకు ఎప్పుడు పంపిణీ చేస్తారు అన్నది ప్రశ్నార్థకంగా మారింది. ఖరీఫ్ సీజన్ ము గింపు దశకు చేరుకున్నందున విత్తన కాయలు సరఫరా చేసినా ప్రయోజనం ఉంటుందా అన్నది అనుమానం. ఈపాటికే ప్రభుత్వం విత్తన కాయలను సరఫరా చేసి ఉంటే ఇకపై కురిసే వర్షాలను నమ్ముకుని పంట సాగు చేసే అవకాశం అంతో ఇంతో ఉండేది. ఇప్పుడు ఆ పరిస్థితి ఉంటుందో లేదో చెప్పలేమని కర్షకులు వాపోతున్నారు. సాగులో ప్రభుత్వానిది ఒక వైఫల్యమని మండిపడుతున్నారు. విత్తు పడలేదు జిల్లాలోని 25 మండలాలకు కలిపి సాగు కావలసిన భూ విస్తీర్ణంలో ఇప్పటివరకు ఒక శాతం కూడా సాగు కాలేదు. జిల్లా వ్యాప్తంగా 46,055 హెక్టార్లలో పంటలు సాగు అవుతాయని వ్యవసాయ శాఖ అంచనా వేసింది. ఈ అంచనా గత ఖరీఫ్ కంటే చాలా తక్కువ. అయినప్పటికీ ఖరీఫ్ సాగు దయనీయంగా ఉంది. ఇప్పటిదాకా కేవలం 437 హెక్టార్లలో సాగైంది. వేరుశనగ అధికంగా 27,015 హెక్టార్లలో సాగు కావాల్సి ఉండగా 352 హెక్టార్లలో మాత్రమే సాగైంది అంటే ఖరీఫ్ పరిస్థితి ఎలా ఉందో అర్థమవుతుంది. ఇక మిగిలిన మూడు వారాల్లో 99 శాతం విస్తీర్ణం సాగు సాధ్యపడుతుందా? అంటే సందేహమే. 43 వేల క్వింటాళ్ల విత్తనం కేటాయిస్తే.. పంపిణీ చేసింది 16 వేల క్వింటాళ్లే 46,055 హెక్టార్లకు సాగైంది 437 హెక్టార్లలోనే ఖరీఫ్ ముగుస్తున్నాజిల్లాలో ఒక శాతం కూడా సాగు లేదుజిల్లాలో వర్షపాతం దారుణంగా ఉంది. జిల్లా వ్యాప్తంగా మే నెలలో సగటు వర్షపాతంగా నమోదైనప్పటికీ ఆ ప్రభావం సాగుపై ఎక్కడా కనిపించలేదు. దీన్నిబట్టి చూస్తే కొన్నిచోట్ల కురిసిన వర్షం జిల్లా అంతటా సగటుగా లెక్కించారని తెలుస్తోంది. జూన్ నెల విషయానికి వస్తే సగటు 77.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా ఆదివారం నాటికి 47.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు వ్యవసాయ శాఖ లెక్కలు చెబుతున్నాయి. ఈ మాత్రం వర్షపాతం కురిస్తే పంటల సాగు అంతో ఎంతో ముందుకు సాగుతాయి. అయినప్పటికీ విత్తు మాటే లేకుండా పోయింది. జూన్లో ఇప్పటిదాకా కురిసిన 47.8 మిల్లీమీటర్ల వర్షం వ్యవసాయానికి సరిపోదు. ఈ ప్రభావం కూడా సాగుపై తీవ్రంగా చూపిస్తోంది. జూలై 15 లోపు వర్షాలు కురిస్తే రైతులు పంటలు సాగు చేయడానికి అనువు. ప్రధానంగా వేరుశనగ పంట. ఈలోపు వర్షాలు కురువకపోతే ఇక ఖరీఫ్ ఫై ఆశలు వదిలేసినట్టే. -
ప్రశ్నించిన విద్యార్థి నేతలపై కేసులు
పుంగనూరు : అధికార పార్టీకి చెందిన మంత్రికి సంబంధించిన నారాయణ పాఠశాల అక్రమాలను, యాజమాన్యం విద్యార్థులను దోపిడీ చేయడంపై.. ప్రశ్నించిన విద్యార్థి సంఘాల నాయకులపై ఆదివారం పోలీసులు కేసు నమోదు చేసి, స్వామి భక్తి చాటుకున్న సంఘటన పుంగనూరులో జరిగింది. పట్టణంలోని సూర్యనగర్లో గల నారాయణ ప్రైవేటు పాఠశాల యాజమాన్యం పుస్తకాలు, బ్యాగులను చట్టవిరుద్ధంగా విక్రయిస్తూ తల్లిదండ్రుల వద్ద వేలాది రూపాయలు వసూలు చేస్తోందని శనివారం ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర సమితి కార్యదర్శి మున్నా, ఓబీసీ సంఘాల ప్రతినిధులు సురేష్యాదవ్, విక్రమ్ యాదవ్, వెంకట్యాదవ్ శాంతియుతంగా నిరసన తెలిపి, ధర్నా నిర్వహించారు. ఈ సమయంలో పోలీసులు రంగ ప్రవేశం చేసి విద్యార్థి నాయకుల ధర్నాను విరమింపజేశారు. కానీ అక్కడితో కథ ముగియలేదు. దీనిపై ప్రిన్సిపాల్ పవన్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీంతో నలుగురు విద్యార్థి సంఘాల నాయకులపై ఎఫ్ఐఆర్ నంబరు: 151 /2026 కేసును సెక్షన్ల 329(4), 351(2), 126(2), 292రెడ్విత్(3)5 బీఎన్ఎస్ కింద కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడుతున్నారు. దీనిపై విద్యార్థి సంఘాలు మండి పడుతున్నాయి. అక్రమాలపై ప్రశ్నిస్తే కేసులు నమోదు చేస్తారా అంటూ నిలదీస్తున్నారు. అధికార పార్టీ వారు తమను ప్రశ్నించిన వారిపై.. పోలీసులను అడ్డుపెట్టుకుని కేసులు నమోదు చేయించడం పలు విమర్శలకు దారి తీస్తోంది. నారాయణ పాఠశాల వద్ద ధర్నాతో రంగంలోకి పోలీసులు -
విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యం
రాయచోటి : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా ప్రమాణాల పెంపే లక్ష్యంగా విద్యార్థుల అభ్యాసన నైపుణ్యాలపై దృష్టి పెట్టాలని కలెక్టర్ నిశాంత్కుమార్ ఉపాధ్యాయులను ఆదేశించారు. రాయచోటి మండల పరిధిలోని ఏపీ సోషల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ గురుకుల పాఠశాలను శనివారం కలెక్టర్ ఆకస్మికంగా సందర్శించి విద్యా ప్రమాణాలు, విద్యా ర్థుల అభ్యాస స్థాయిలను పరిశీలించారు. ఈ సందర్భంగా స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర – నెట్జీరో హెల్తీ క్యాంపస్ కార్యక్రమంలో భాగంగా పాఠశాల ఆవరణంలో మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. అనంతరం పాఠశాలలోని వంటశాల, భోజనశాల, ఇతర సౌకర్యాలను పరిశీలించిన కలెక్టర్ విద్యార్థులతో నేరుగా మాట్లాడి వారి అభ్యాస స్థాయిని స్వయంగా పరిశీలించారు. జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి దామోదర్రెడ్డి, ఎంపీడీఓ సునీల్కుమార్, పాఠశాల ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
పాలిటెక్నిక్ అడ్మిషన్ నమోదు ప్రక్రియ షురూ
రాయచోటి టౌన్ : పాలిటెక్నికల్ అడ్మిషన్ల ఆన్లైన్ నమోదు ప్రక్రియ ప్రారంభమైందని రాయచోటి పాలిటెక్నిక్ కళాశాల ప్రిన్సిపల్ పి.శివశంకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. పాలీసెట్ ద్వారా అర్హత సాధించిన విద్యార్థులు హెల్ప్లైన్ సెంటర్ల ద్వారా సేవలు పొందవచ్చని పేర్కొన్నారు. అర్హత సాధించిన విద్యార్థులు ఈనెల 24 నుంచి 30వ తేది వరకు ఆన్లైన్ ద్వారా సర్టిఫికెట్లు వెరిఫికేషన్, ప్రాసెసింగ్ఫీజుల చెల్లింపు పూర్తి చేసుకోవాలని తెలిపారు.ఆన్లైన్ ద్వారా ధృవీకరణ పూర్తి కానివారు/ వివరాలలో మార్పులు అవసరం అయిన వారు 25వ తేది నుంచి జులై 1వ తేది వరకు సర్టిఫికెట్ వెరిఫికేషన్ చేసుకోవాలని సూచించారు. వెబ్ ఆప్షన్లు నమోదు 29 నుంచి జులై 3వ తేది వరకు, వెబ్ ఆప్షన్లు మార్పు కోసం జులై 4వ తేది ఉంటుందని, సీట్లు కేటాయింపు జులై 6వ తేది ఉంటుందని, స్వీయ నివేదిక, కళాశాలలో రిపోర్టింగ్ జులై 7వ తేది నుంచి 10వ తేది వరకు ఉంటుందని వివరించారు.మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలి పీలేరు : గ్రామీణ ప్రాంతంలో మెరుగైన ఆరోగ్య సేవలు అందించాలని జిల్లా ఇమ్యునైజేషన్ అధికారిణి డాక్టర్ ఉషశ్రీ అన్నారు. శనివారం స్థానిక మోడల్ కాలనీలో నిర్వహించిన వ్యాధి నిరోధక టీకాల కార్యక్రమాన్ని తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రాథమిక ఆరోగ్య రక్షణలో భాగంగా శిశువులకు వేసే టీకాల వివరాలు, వాటి ప్రయోజనాలపై శిశువు తల్లిదండ్రులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రస్తుతం 0–5 పిల్లల ఆరోగ్య సంక్షేమానికి నిర్వహిస్తున్న ‘స్టాఫ్ డయేరియా’ కార్యక్రమంలో జింక్ మాత్రలు, ఓఆర్ఎస్ ద్రావణం ప్రాముఖ్యతను తల్లులకు వివరించాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీహెచ్ఈవో శ్రీనివాసులు, ఏఎన్ఎంలు అరుణ, సీహెచ్వో సౌజన్య తదితరులు పాల్గొన్నారు. సచివాలయానికి తాళంసాక్షి, మదనపల్లె : మదనపల్లె పట్టణంలోని మోతి నగర్ సచివాలయానికి శనివారం తాళం పడింది. వివిధ కార్యక్రమాలతో బిజీగా ఉండాల్సిన సచివాలయం తాళం వేసి ఉండడం చూసి జనం ముక్కునవేలేసుకున్నారు. సచివాలయ సేవలు సక్రమంగా అందడం లేదన్న విమర్శలకు ఈ ఘటన బలం చేకూరుస్తోంది. -
విత్తనకాయలు.. మరీ ఇంత చెత్తనా!
పై సంచి నిండా ఉన్నది కేవలం వేరుశెనగ కాయలు మాత్రమే కాదు.. ఒక నిరుపేద రైతు గుండెల్లో దాచుకున్న ఖరీఫ్ ఆశలు! వర్షాలు పడకపోయినా, అప్పుల భారం వెంటాడుతున్నా.. ‘భూమి తల్లిని నమ్ముకుంటే ఏదో ఒకరోజు బతుకు నిలబడుతుంది’ అనే నమ్మకంతో రైతు చేతులు చాచాడు. కష్టకాలంలో ప్రభుత్వం ఇస్తున్న రాయితీ దక్కుతుందని ఆశపడి, అక్షరాలా రూ. 1,890 చేతిలో పెట్టి ‘నారాయణి రకం’ విత్తనాల సంచిని ఇంటికి తెచ్చుకున్నాడు. తీరా పొలంలో చల్లుకుందామని ఆశల సంచి విప్పిన రైతుకు.. గుండె ఆగినంత పనైంది. కాయల నిండా పొట్టు, ఎండిపోయిన పుల్లలు, మట్టి తప్ప గింజల ముచ్చటే లేదు. కాయలను కనీసం శుద్ధి (గ్రేడింగ్) కూడా చేయకుండా, చెత్తాచెదారంతో నింపేసి రైతుల కళ్లు గప్పారు. అందులో ఉన్న కాయలన్నీ గింజ లేని ‘బుడతలు’గా, చప్పిడిగా మారిపోయాయి. 30 కేజీల బరువున్న ఈ సంచిలో సగం కాయలు కూడా మొలకెత్తడానికి పనికొచ్చేలా లేవంటే క్షేత్రస్థాయిలో దగా ఏ స్థాయిలో జరిగిందో అర్థం చేసుకోవచ్చు. – కేవీ పల్లె -
హోరాహోరీగా క్రికెట్ పోటీలు
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో అండర్ 16 బాలుర మల్టీడే క్రికెట్ అంతర్ జిల్లా పోటీలు హోరాహోరీగా సాగాయి. శనివారం కర్నూలు క్రికెట్ జట్టుపై 78 పరుగుల తేడాతో ఉమ్మడి చిత్తూరు జిల్లా క్రికెట్ జట్టు విజయం సొంతం చేసుకుంది. అంతకు ముందు గ్రౌండ్ 1లో జరిగిన కడప, నెల్లూరు క్రికెట్ టీంలు తలపడ్డాయి. కడప జట్టు 97 ఓవర్లలో 364 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 40.4 ఓవర్లలో 128 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత ఫాలో ఆన్లో రెండవ ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 64.2 ఓవర్లలో 173 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో కడప జిల్లా జట్టు 63 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. అలాగే గ్రౌండ్ 2లో జరిగిన ఇన్నింగ్స్లో చిత్తూరు, కర్నూలు జిల్లా క్రికెట్ జట్లు తలపడ్డాయి. కర్నూలు క్రికెట్ జట్టు 82.1 ఓవర్లలో 342 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 114.3 ఓవర్లలో 595 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. తర్వాత రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 51.4 ఓవర్లలో 175 పరుగులకు ఆలౌట్ అయ్యింది. దీంతో చిత్తూరు జిల్లా క్రికెట్ జట్టు ఇన్నింగ్స్ 78 పరుగుల విజయాన్ని సొంతం చేసుకుంది. ఈ కార్యక్రమంలో విజయ్, సతీష్ యాదవ్, శ్రీధర్ కుమార్, సునీల్ కుమార్, ప్రసన్న కుమార్, జవహర్బాష, హరీష్, రెడ్డిగిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
స్థలం కబ్జాకు యత్నం
మదనపల్లె టౌన్ : చట్టబద్ధంగా కొనుగోలు చేసిన ప్లాట్లను పత్రాలు లేని వ్యక్తులు కబ్జా చేయడానికి యత్నిస్తున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మదనపల్లె ప్రెస్క్లబ్లో బాధితులు విలేకరులతో మాట్లాడారు. కురబలకోట మండలం అంగళ్లు పంచాయతీ సర్వే నంబర్ 638 పార్ట్లోని ప్లాట్లను 2021లో మదనపల్లె సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్ చేయించుకున్నామని తెలిపారు. ప్లాట్లను కొనుగోలు సమయంలో మధ్యవర్తిగా వ్యవహరించిన సి.ఎమ్. రెడ్డి బతికున్నంత కాలం ఎవరూ జోలికి రాలేదని, ఇటీవల ఆయన మరణించడంతో కొందరు హక్కులు లేని వ్యక్తులు, భూకబ్జాదారులు ప్లాట్లలోకి చొరబడి సరిహద్దు రాళ్లను తొలగిస్తూ ఆస్తి నష్టం కలిగిస్తున్నారని ఆరోపించారు. ఈ వివాదంపై గతంలోనే ముదివేడు పోలీసులకు ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. అక్రమార్కుల బారి నుంచి చట్టబద్ధమైన తమ ప్లాట్లను కాపాడి న్యాయం చేయాలని అధికారులను కోరారు. కాగా ఈ విషయమై శుక్రవారం భూమి తనదేనని భూ యజమాని సయ్యద్ బాషా, అతని సోదరులు తన భూమిని తులసీధర నాయుడు అన్యాక్రాంతం చేయాలని చూస్తున్నట్లు ఆరోపించడం కొసమెరుపు.కబ్జాకాకుండా కాపాడాలని బాధితుల వేడుకోలు -
●రోళ్లమడుగులో స్టార్ హీరో ధనుష్ హంగామా
రాజంపేట: ప్రకృతి ప్రసాదించిన అద్భుత దృశ్యాలు, దట్టమైన లోయలతో అలరారుతున్న శేషాచలం అటవీ ప్రాంతం ప్రస్తుతం తమిళ సినిమా పరిశ్రమకు (కోలీవుడ్) ప్రధాన షూటింగ్ హబ్గా మారింది. ఎర్రచందనం స్మగ్లింగ్ నేపథ్య కథల కోసం సహజసిద్ధమైన లొకేషన్లు ఇక్కడ పుష్కలంగా ఉండటంతో, కోలీవుడ్ అగ్ర దర్శకులు మరియు స్టార్ హీరోలు తమ సినిమాల చిత్రీకరణ కోసం శేషాచలానికి క్యూ కడుతున్నారు. రెండు జిల్లాల్లో విస్తరించిన ఎర్రచందనం సంపద అల్లు అర్జున్ నటించిన పుష్ప సినిమా తర్వాత ఎర్రచందనం బ్యాక్డ్రాప్ కథలపై తమిళ సినీ వర్గాలు ప్రత్యేక దృష్టి సారించాయి. ఎర్రచందనం చెట్లు విస్తారంగా ఉండే దట్టమైన అటవీ ప్రాంతం, సెలయేర్లు, లోయలు తమిళ దర్శకులను విపరీతంగా ఆకర్షిస్తున్నాయి. ఈ కొండల్లో కేవలం విలువైన కలప మాత్రమే కాకుండా యురేనియం, ఐరన్, గ్రాఫైట్, కాల్షియం వంటి ఖనిజాలు కూడా ఉన్నాయి. ప్రకృతి అందాల నిలయం.. చెయ్యేరు నదీ తీరం శేషాచల కొండల గుండా ప్రవహించే చెయ్యేరు (బహుదా) నదీపరీవాహక ప్రాంతం అటవీ నేపథ్య సినిమాలకు అత్యంత అనుకూలంగా ఉంది. గతంలో చియాన్ విక్రమ్ నటించిన ప్రతిష్టాత్మక పీరియాడిక్ చిత్రం ‘తంగలాన్’ లోని పలు యాక్షన్ ఘట్టాలను కూడా ఈ నదీ పరివాహక ప్రాంతంలోనే చిత్రీకరించారు. సినిమా, బుల్లితెర షూటింగ్లకు అనుకూలంగా ఉండే ప్రధాన లొకేషన్లు ఇవే రోళ్లమడుగు – బాలరాజుపల్లె: లోయల నడుమ సహజసిద్ధమైన యాక్షన్ సీక్వెన్సులకు పెట్టింది పేరు. అన్నమయ్య డ్యాం ఏరియా: జల వనరులు, కొండల కలయికతో అద్భుతమైన విజువల్స్ అందిస్తోంది. రాజంపేట – రాయచోటి ఘాట్ రోడ్డు: దట్టమైన వృక్షసంపదతో కూడిన ఈ ఘాట్ రోడ్డు ఛేజింగ్ సీన్లకు కేరాఫ్ అడ్రస్గా నిలుస్తోంది. గతంలో ఇక్కడ పనిచేసిన డీఎఫ్ఓ శ్రీనివాసులరెడ్డి తీసుకొచ్చిన ‘రెడ్వుడ్ జంగిల్ సఫారీ’ మార్గాలు, డీప్ ఫారెస్టులోని అరుదైన అందాలు ప్రస్తుతం తమిళ సినిమాటోగ్రాఫర్లను కట్టిపడేస్తున్నాయి. రోళ్లమడుగు అటవీ ప్రాంతం శేషాచలంలో చిత్రీకరించన పుష్ప సినిమా పోస్టర్నిజానికి అడవి వదిలి ఊళ్లోకి రావడం ఆ ‘చుక్కల దుప్పి’కి అస్సలు ఇష్టం లేదు. కానీ ఏం చేస్తుంది? కాస్త దారి తప్పింది..కాసేపట్లో జనాల మధ్యకు వచ్చి పడింది! అడవి ముచ్చట్లు చూసి మురిసిపోవాల్సిన చోట, ఊరి కుక్కల మొరుగుడు విని ఆ బుజ్జాయి గుండె గుభేలుమంది. పిడుగుల్లాంటి కుక్కలు వేట మొదలుపెట్టే లోపే.. ‘రెడ్డివారిపల్లె’ గ్రామస్తులు రంగంలోకి దిగారు. వన్యప్రాణిపై తమకున్న కాస్తంత దయను చాటుతూ.. కుక్కలను తరిమికొట్టి, ఆ చిట్టి దుప్పిని కంటికి రెప్పలా కాపాడారు. అధికారులకు సమాచారం అందడం ఆలస్యం.. అటవీ క్షేత్రాధికారి జయప్రసాద్రావు టీమ్ స్పాట్కు చేరిపోయింది. ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ సబియా సుల్తానా, బీట్ ఆఫీసర్లు చంద్రకళ, ప్రభాకర్ రెడ్డిలు ఆ వన్యప్రాణికి కళ్లకు గంతలు కట్టి, కాళ్లు కదలకుండా జాగ్రత్తగా అమర్చి.. ఫారెస్ట్ జీపు డిక్కీలోకి ఎక్కించారు. అధికారులంతా జీపులో తిష్టవేసి పర్యవేక్షిస్తుంటే, కింద ఉన్న డాక్టర్ గారు ఆ దుప్పికి కళ్లముందే ప్రథమ చికిత్స అందిస్తున్నారు. మొత్తానికి పచ్చని తోటలు, అడవి మధ్యలో సాగిన ఈ ‘జీప్ జర్నీ’ ముగిశాక.. ఆ చుక్కల సుందరిని మళ్లీ రిజర్వ్ ఫారెస్ట్ ఏరియాలో క్షేమంగా వదిలేశారు. – పీలేరు రూరల్ ప్రకృతి అందాలకు నిలయమైన శేషాచలం అటవీ ప్రాంతంలో భారీ ఎత్తున సినిమా షూటింగ్లు నిర్వహించేలా తెలుగు చలనచిత్ర పరిశ్రమ (టాలీవుడ్) ప్రత్యేక దృష్టి సారించాలి.శేషాచలం అడవుల అద్భుత నేపథ్యం మన సొంత పరిశ్రమ కంటే పొరుగు పరిశ్రమలకే ఎక్కువగా ఉపయోగపడుతోంది. ఇప్పటికే తమిళ సినీ పరిశ్రమకు (కోలీవుడ్) చెందిన అగ్ర దర్శకులు, స్టార్ హీరోలు శేషాచలం అటవీ ప్రాంతానికి వచ్చి ఇక్కడి లోయలు, నదీ తీరాలలో సినిమా షూటింగ్లు చేయడం మన ప్రాంతానికి ఎంతో గర్వకారణం. – బాలరాజు చంద్రశేఖర్రాజు, అధ్యక్షుడు, తెలుగు కళాసమితి, కువైట్. శేషాచలం అటవీ ప్రాంతంలోని అద్భుతమైన లొకేషన్లను తమిళ సినీ వర్గాలు గుర్తించి, ఇక్కడి అందాలను తమ సినిమాల ద్వారా ప్రపంచానికి పరిచయం చేస్తుండటం శుభపరిణామం. గతంలో ఎన్టీఆర్ తన ప్రతిష్టాత్మక చిత్రం ‘శ్రీమద్విరాట్ వీరబ్రహ్మేంద్రస్వామి చరిత్ర’ సినిమా తీసే క్రమంలో రాజంపేట పరిసరాల్లో పర్యటించారు. ఆ సమయంలో అనంతరాజుపేటలోని ప్రసిద్ధ పంజం (పీవై) భవనంలో బస చేశారు. ఆ సందర్భంలోనే శేషాచలం అటవీ ప్రాంతంలోని పలు కీలకమైన సన్నివేశాలను, విజువల్ షాట్స్ను ఇక్కడే చిత్రీకరించారు. తెలుగు దర్శకులు, నిర్మాతలు వీటిపై దృష్టి సారించి ఇక్కడ షూటింగ్స్ నిర్వహించాలి. – పంజం మనోహర్రెడ్డి, పీవై థియేటర్ అధినేత, రాజంపేట. కోలీవుడ్కు కేరాఫ్ అడ్రస్గా శేషాచలం ప్రకృతి అందాలకు నిలయం ఎర్రచందనం స్మగ్లింగ్ బేస్డ్ సినిమా షూటింగ్లు రోళ్లమడుగులో ధనుష్ సందడి తాజాగా ప్రముఖ తమిళ స్టార్ హీరో ధనుష్ నటిస్తున్న భారీ చిత్రానికి సంబంధించిన కీలక షెడ్యూల్ను శేషాచలం అడవుల పరిధిలో చిత్రీకరిస్తున్నారు. రోళ్లమడుగు, రాజంపేట–రాయచోటి ఘాట్ రోడ్డు పరిసర ప్రాంతాలలో సినిమాకు సంబంధించిన ముఖ్యమైన యాక్షన్ సీన్లను తెరకెక్కిస్తున్నారు. ధనుష్ రాకతో శేషాచలం అడవుల్లో కోలీవుడ్ సినీ వర్గాల సందడి నెలకొంది. ఆయనను చూసేందుకు స్థానిక అభిమానులు షూటింగ్ స్పాట్కు తరలివస్తున్నారు. -
కన్న కొడుకే మోసం చేశాడు
మదనపల్లె టౌన్ : వృద్ధాప్యంలో అండగా ఉండాల్సిన కొడుకే మోసం చేశాడని నీరుగట్టువారి పల్లికి చెందిన సాలమ్మ (70) ఆవేదన వ్యక్తం చేశారు. శనివారం మదనపల్లె ప్రెస్క్లబ్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆమె తన గోడు వెల్లబోసుకున్నారు. తన కుమారుడు కప్పల రామచంద్ర జీవితాంతం ఏ లోటు రాకుండా సాకుతానని నమ్మించి తన వద్ద ఉన్న నగదు, బంగారాన్ని తీసుకున్నాడని, ఆ తర్వాత తనను పట్టించుకోవడం లేదని ఆరోపించారు. అంతే కాకుండా తన ఆస్తులు, బంగారం, డబ్బులు కొడుకుపై నమ్మకంతో ఇచ్చానని, అవి ఇప్పుడు తిరిగి ఇవ్వనని బెదిరిస్తున్నాడని ఆరోపించింది. ‘దేవరా... నాకు న్యాయం చేయండి‘ అంటూ కన్నీటి పర్యంతమయ్యారు. వృద్ధాప్యం లో తనకు జీవనోపాధి కష్టంగా మారిందని, ఈ విషయంపై కలెక్టర్, ఎస్పీ, ఇతర అధికారులు స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు. రైతుపై కత్తితో దాడి మదనపల్లె టౌన్ : పాత వివాదాల నేపథ్యంలో అర్ధరాత్రి వేళ రైతుపై తన ప్రత్యర్థి కత్తితో దాడి చేసిన సంఘటన కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం, అంగళ్లు గ్రామం తుంగవారిపల్లెకు చెందిన రైతు జె. హరిప్రసాద్ (26) అంగళ్లు టమోటా మార్కెట్ నుంచి టమాట అమ్మకాలు ముగించుకొని ట్రాక్టర్లో ఇంటికి వస్తుండగా ఊరికి సమీపంలోని చెరువు కట్టపై అదే గ్రామానికి చెందిన తన ప్రత్యర్థి ప్రసాద్, అతని అనుచరులు ట్రాక్టర్ని ఆపి గొడవ చేశారు. మాట మాట పెరిగి ముందుగానే వెంట తెచ్చుకున్న కత్తితో రైతు హరిప్రసాద్పై దాడి చేశాడు. సమాచా రం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని దర్యాప్తు చేపట్టారు. గాయపడిన హరిప్రసాద్ను మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. గంజాయి కేసులో మరో నిందితుడు అరెస్టుపెద్దతిప్పసముద్రం : అక్రమంగా గంజా యిని తరలిస్తున్న కేసులో మరో నిందితుడిని శనివారం అరె స్టు చేసినట్లు ఎస్ఐ పరమేశ్ నాయక్ తెలిపారు. గతేడాది నమోదైన గంజాయి కేసులో ఆరవ నిందితుడిగా ఉన్న మదనపల్లికి చెందిన చల్లా తేజ్ కుమార్ (23) మండలంలోని బూర్లపల్లి క్రాస్ వద్ద ఉండగా అరెస్టు చేశామన్నారు. తనిఖీలో రెండు కిలోల గంజాయి పట్టుబడిందన్నారు. నిందితుడిని రిమాండ్కు తరలించామని ఎస్ఐ వెల్లడించారు. కుక్క దాడిలో బాలుడికి గాయాలు మదనపల్లె టౌన్ : కుక్క దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం నిమ్మనపల్లి మండలంలో జరిగింది. మండలంలోని రాచవేటి వారి పల్లె పంచాయతీ, గుండ్ల బురుజుకు చెందిన దంపతులు విజయ్ కుమార్ కవితల కుమారుడు కుందన్(7) వీధిలో బంతాట ఆడుకుంటూ ఉండగా ఒక్కసారిగా కుక్క బాలుడి మొహం మీద కరచి తీవ్రంగా గాయపరిచింది. కుటుంబీకులు గమనించి బాలుడిని ఆస్పత్రికి తరలించారు. నకిలీ మద్యం కేసులో విచారణములకలచెరువు : ములకలచెరువు నకిలో మద్యం కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ నుంచి బహిష్కరించిన దాసరపల్లి జయచంద్రారెడ్డి, ఆయన బావమరిది మంత్రి గిరిధర్ రెడ్డిని శనివారం మదనపల్లె ఎకై ్సజ్ కార్యాలయంలో విచారణ చేపట్టారు. ఎనిమిది నెలల క్రితం వెలుగుచూసిన నకిలీ మద్యం వ్యవహారం వీరి ఆధ్వర్యంలో జరుగుతున్నట్లు పత్రికల్లో రావడంతో కూటమి ప్రభుత్వం వీరిని పార్టీ నుంచి బహిష్కరించిన విషయం తెలిసిందే.తాజాగా వీరు విదేశాల నుంచి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ నేపథ్యంలో వారిద్దరిని ఎకై ్సజ్ అధికారులు విచారించారు. సుమారు 6 గంటల పాటు విచారించిన సిట్ అధికారులు కేసుకు సంబంధించి నిజానిజాలు రాబట్టినట్లు తెలుస్తోంది.తల్లి సాలమ్మ ఆవేదన -
భీమవరాన్ని బుల్డోజ్ చేసిన తుంగభద్ర వారియర్స్
● జ్ఞానేశ్వర్ ‘కెప్టెన్’ ఇన్నింగ్స్ ● సాయిశ్రవణ్ హాఫ్ సెంచరీ వృథా కడప వైఎస్సార్ సర్కిల్: కడప వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియం వేదికగా శనివారం మధ్యాహ్నం జరిగిన ఏపీఎల్ రసవత్తర పోరులో తుంగభద్ర వారియర్స్ జట్టు బ్యాటింగ్, బౌలింగ్ విభాగాల్లో సమష్టిగా రాణించి ఘన విజయాన్ని అందుకుంది. టాస్ గెలిచిన తుంగభద్ర వారియర్స్ కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ మొదట బౌలింగ్ ఎంచుకుని భీమవరం బుల్స్ జట్టును బ్యాటింగ్కు ఆహ్వానించాడు. సాయి శ్రవణ్ హాఫ్ సెంచరీ భీమవరం బుల్స్ బ్యాటింగ్ ప్రదర్శన మోస్తరుగా సాగింది. తుంగభద్ర వారియర్స్ కట్టడి బౌలింగ్తో నిర్ణీత 20 ఓవర్లలో భీమవరం జట్టు 9 వికెట్ల నష్టానికి 153 పరుగులు మాత్రమే చేయగలిగింది. గత మ్యాచ్ సెంచరీ హీరో రేవంత్ రెడ్డి (17), కెప్టెన్ హేమంత్ రెడ్డి (13)లు త్వరగానే పెవిలియన్ చేరారు. ఈ క్లిష్ట సమయంలో వన్డౌన్ బ్యాటర్ టి.వి. సాయి శ్రవణ్ బాధ్యతాయుత ఇన్నింగ్స్ ఆడాడు. అతను కేవలం 32 బంతుల్లోనే 6 ఫోర్లు, 1 సిక్సర్తో 50 పరుగులు చేసి జట్టును ఆదుకున్నాడు. మిడిలార్డర్ బ్యాటర్లు మోపాడ రవికిరణ్ (5), బెందలం సాత్విక్ (15)లు విఫలమైనా.. లోయర్ ఆర్డర్లో వచ్చిన బి. మునీష్ వర్మ విలువైన ఇన్నింగ్స్ ఆడాడు. అతను 21 బంతుల్లో 4 ఫోర్లు, 1 సిక్సర్తో 35 పరుగులు చేసి నాటౌట్గా నిలవడంతో భీమవరం గౌరవప్రదమైన స్కోరు సాధించింది. తుంగభద్ర వారియర్స్ బౌలర్లలో ఎన్.సాయి చరణ్ పదునైన బౌలింగ్తో భీమవరం బ్యాటర్లను వణికించి 3 వికెట్లు పడగొట్టాడు. అంతర్జాతీయ అనుభవం ఉన్న సౌరభ్ కుమార్ సైతం 4 ఓవర్లలో కేవలం 22 పరుగులిచ్చి 2 కీలక వికెట్లు తీసి పరుగుల వేగాన్ని కట్టడి చేశాడు. జ్ఞానేశ్వర్, సూర్య జయంత్ల వీరవిహారం! లక్ష్య చేధనలో తుంగభద్ర వారియర్స్ ఓపెనర్ సమన్యు దత్తా (1) త్వరగానే అవుట్ అయినా.. వన్ డౌన్లో వచ్చిన గుట్టా రోహిత్ (9) సిక్సర్తో పర్వాలేదనిపించాడు. అయితే, మరో ఓపెనర్ అయిన కెప్టెన్ సి.ఆర్.జ్ఞానేశ్వర్ మాత్రం క్రీజులో పాతుకుపోయి 56 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లతో ఏకంగా 75 పరుగులు సాధించి జట్టు విజయాన్ని ఖాయం చేశాడు. మిడిలార్డర్లో కాకి సూర్య జయంత్ 33 బంతుల్లో 5 ఫోర్లు, 2 సిక్సర్లతో 46 పరుగులు చేసి గట్టి సహకారాన్ని అందించాడు. ఆఖర్లో ఆనంద్ జోసియా (13 నాటౌట్) విక్టరీ లైన్ దాటించాడు. భీమవరం బౌలర్లలో చెన్నుపాటి రవి తేజ 3 వికెట్లు తీసినప్పటికీ జట్టును ఓటమి నుంచి కాపాడలేకపోయాడు. భీమవరం బుల్స్ ఇన్నింగ్స్: కె. రేవంత్ రెడ్డి(సి) శ్రీ సమన్యు దత్తా (బి) సౌరభ్ కుమార్(17 పరుగులు 15 బంతుల్లో), ఎమ్.హేమంత్ రెడ్డి ( ఛి)(సి) కాకి సూర్య జయంత్ (బి) గవ్వల మల్లికార్జున – 13 (10), టి.వి. సాయి శ్రవణ్(సి) కాకి సూర్య జయంత్ (బి) మాధా దీపక్– 50(32), మోపాడ రవికిరణ్(బి) సౌరభ్ కుమార్– 5(9), బెందలం సాత్విక్(సి) గవ్వల మల్లికార్జున (బి) ఎన్.సాయి చరణ్– 15 (18), ఎమ్. ధీరజ్ కుమార్ (ఎల్బీడబ్యు) (బి) ఎన్.సాయి చరణ్–1 (2), బి.మునీష్ వర్మ నాటౌట్–35 (21), కేవీ కశ్యప్ ప్రకాష్(సి) గవ్వల మల్లికార్జున (బి) చీపురపల్లి స్టీఫెన్– 6 (2), చల్లారపు శివ(సి) కంచెర్ల ఆనంద్ జోసియా (బి) ఎన్.సాయి చరణ్–1 (2), సత్యనారాయణ రాజు రనౌట్ (చీపురపల్లి స్టీఫెన్)–1 (1), బైలపూడి యశ్వంత్ నాటౌట్–5 (8), ఎక్స్ట్రాలు: 04 మొత్తం స్కోరు: 153/9 (20 ఓవర్లు) తుంగభద్ర వారియర్స్ ఇన్నింగ్స్ (ఛేజింగ్): సి.ఆర్.జ్ఞానేశ్వర్ (c)(¼) ^ðl¯]l$²´ësìæ Æý‡Ñ ™ólf&75 (56), } çÜÐ]l$¯]l$Å §ýl™èl¢า) & (¼) ^ðl¯]l$²-´ësìæ Æý‡Ñ ™ólf&1 (2), VýS$sêt Æøíßæ-™Œæ(íÜ) çÜ™èlÅ-¯éÆ>Ķæ$׿ Æ>k (¼) O»ñæÌSç³Nyìl Ķæ$ÔèæÓ…™Œæ&9 (8), M>MìS çÜ*Æý‡Å fĶæ$…-™Œæ(íÜ) »ñæ…§ýlÌS… Ýë†ÓMŠS (¼) ^ðl¯]l$²-´ësìæ Æý‡Ñ ™ólf&46 (33), MýS…^ðlÆý‡Ï B¯]l…§Šæ gZíÜĶæ* ¯ésosŒæ&13 (8), ^èlÆý‡-׊æh™Œæ h.Ñ.-¯é-sosŒæ&1 (1), ఎక్స్టాలు: 09 మొత్తం స్కోరు: 154/4 (18.0 ఓవర్లు) ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్: సి.ఆర్. జ్ఞానేశ్వర్ (తుంగభద్ర వారియర్స్) – 75 పరుగులు. -
వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు మృతి
వాల్మీకిపురం : వేర్వేరు రైలు ప్రమాదాల్లో ఇద్దరు యువకులు మృతి చెందిన సంఘటన శనివారం మండలంలోని ఇట్లంవారిపల్లి వద్ద చోటు చేసుకుంది. రైల్వే ఎస్సై బాలక్రిష్ణ కథనం మేరకు.. శనివారం మండలంలోని ఇట్లంవారిపల్లి వద్ద కాచిగూడ నుంచి మధురైకి వెళ్తున్న రైలుకు ఎదురగా వెళ్లి గుర్తు తెలియని యువకుడు (32) ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఈ విషయం తెలుసుకున్న రైల్వే పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్నారు. ఇట్లంవారిపల్లి బ్రిడ్జి సమీపంలో మరో యువకుడి మృతదేహం పడి ఉండడాన్ని పోలీసులు గమనించారు. ఇతను అస్సాం రాష్ట్రానికి చెందిన వాడిగా గుర్తించారు. ఆధార్ కార్డులో పేరు టి.చైతు (36), తండ్రి టి.మంజుగా గుర్తించినట్లు తెలిపారు. మృతదేహాలను శవపరీక్షల నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు రైల్వే ఎస్సై బాలక్రిష్ణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వీరులారా..వందనం !
● చరిత్రకు సాక్ష్యంగా శిలలు ● పడమటి ప్రాంతంలో ఆరో శతాబ్ధం నాటి ఆనవాళ్లు ములకలచెరువు: పడమటి రాయలసీమ పల్లెల్లో నేటికీ అడుగడుగునా దర్శనమిచ్చే రాతి మండపాలు, వాటిలో పోరాట భంగిమల్లో చెక్కిన ఎత్తయిన శిలలు కేవలం సాధారణ కట్టడాలు కావు.. శతాబ్దాల నాటి వీర యోధుల నెత్తుటి గాథలకు సజీవ సాక్ష్యాలు. బాణులు, వైదుంగులు ఏలిన సామంతుల కాలం నాటి సరిహద్దు సమరాలైనా.. పాలెగాళ్ల కాలంలో సాగిన దివిటీ దొంగల దండయాత్రలైనా.. ఊరి ఆత్మగౌరవాన్ని, పశుసంపదను కాపాడేందుకు ప్రాణాలర్పించిన సామాన్య అమరవీరుల త్యాగాలను ఈ ‘వీరశిలలు’ నేటికీ చాటిచెబుతున్నాయి. 8వ శతాబ్దపు యోధుడు ‘కత్తి వీరయ్య’ ఒకప్పుడు పడమటి పల్లెలకు రాత్రి పూట కంటిమీద కునుకు ఉండేది కాదు. దొంగల గుంపులు పడి దోచుకోవడం, అడ్డువచ్చిన వారిని నరకడం, ఆడవాళ్లను చెరబట్టడం వంటి దురాగతాలకు పాల్పడేవి. ఈ అరాచకాలను ఎదిరించడానికి ‘కత్తి వీరయ్య’ అనే యోధుడు నడుం బిగించాడు. కత్తి యుద్ధంలో ఆరితేరిన వీరయ్య, తన ఊరి యువకులను పోగేసి ప్రత్యేక పోరాట శిక్షణ ఇచ్చి ఒక దళాన్ని తయారుచేశాడు. వీరయ్య చేతిలో కత్తి ఉందంటే ఎదురునిలిచే దమ్ము ఏ దోపిడీ ముఠాకూ ఉండేది కాదు. ఎన్నో దొంగల ముఠాలను ఈ దళం మట్టుబెట్టింది. చివరకు దొంగలతో జరిగిన ఒక భీకర పోరులో వీరయ్య వీరమరణం పొందాడు. ఈ పరాక్రమానికి గుర్తుగా బి.కొత్తకోట మండలం ఆలేటివారిల్లె శివార్లలో నేటికీ 7 అడుగుల ఎత్తయిన భారీ వీరశిల దర్శనమిస్తుంది. ఎనిమిదో శతాబ్దానికి చెందిన ఈ వీరశిలపై వీరయ్య పరాక్రమ సంగతులను దేవనాగరి లిపిలో శాసనంగా చెక్కారు. 12వ శతాబ్దంలో ములకలచెరువు మండలంలోని గూడుపల్లె సమీపంలో పాపాఘ్ని నది ఒడ్డున ఉన్న చెన్నప్పగారిపల్లె అగ్రహారం మీద దివిటీ దొంగలు అరాచకానికి తెగబడ్డారు. అప్పుడు బలిజ వీరుడు వీర చెన్నకేశవ నాయకత్వంలో ఊర్లోని యువకులు ఆత్మరక్షణ పోరాటం సాగించారు. దొంగలతో జరిగిన భీకర పోరులో చెన్నకేశవతో పాటు ఆయన అనుచరులు కొందరు వీరమరణం పొందారు. నేలకొరిగిన ఆ యోధుల జ్ఞాపకార్థం గూడుపల్లె పంచాయతీ చెరువుకిందపల్లె శ్మశానంలో కత్తి, డాలు పట్టుకుని యుద్ధం చేస్తున్నట్లు ఉండే చెన్నకేశవ వీరశిలను, మండపాన్ని ప్రతిష్ఠించారు. ఇది 12వ శతాబ్దపు పోరాటానికి సాక్ష్యంగా ఇప్పటికీ నిలిచి ఉంది. ఇది కాకుండా, ములకలచెరువు మండలం పెద్దపాళ్యం పంచాయతీ రామానాయునికోట సమీపంలో పెద్దేరు ఒడ్డున కూడా 11వ శతాబ్దానికి చెందిన మరో వీరశిల ఉంది. ఆరో శతాబ్దం నుంచే స్మరణ సంప్రదాయం క్రీస్తుశకం ఆరో శతాబ్దంలో పశ్చిమ చాళుక్య చక్రవర్తి రెండో పులకేసి కాలం నుంచే ఇలా అమరులైన వీరులను స్మరిస్తూ శిలలను నాటే సంప్రదాయం ఉన్నట్లు ఈ ప్రాంతంలో లభించిన శాసనాల ద్వారా స్పష్టమవుతోంది. చెన్నకేశవ సమాధిపై ఏర్పాటు చేసిన రాతి వీరశిలపై చెక్కిన కత్తి, డాలుఆలేటివారిపల్లె సమీపంలో కత్తి వీరయ్య సమాధిపై ఏర్పాటు చేసిన వీరశిల చరిత్రకు సాక్ష్యాలుగా నిలవాల్సిన ఈ వీరశిలలు ప్రస్తుతం తీవ్ర నిర్లక్ష్యానికి గురై అంతరించిపోతున్నాయి. సంరక్షణ కరువై ఎన్నో శిల్పాలు కూలిపోతుండగా.. బి.కొత్తకోట బీసీ కాలనీ రోడ్డు పక్కన, కురబలకోట రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న అత్యంత విలువైన వీరశిలలను గతంలో గుప్తనిధుల ముఠాలు ధ్వంసం చేసి, పగులగొట్టడంతో అవి ముక్కలై పడి ఉన్నాయి. మన పూర్వీకుల త్యాగాలకు ప్రతీకలైన ఈ చారిత్రక సంపదను పురావస్తు శాఖ అధికారులు వెంటనే స్వాధీనం చేసుకుని రక్షణ చర్యలు చేపట్టాలని చరిత్ర పరిశోధకులు, స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
క్యాపిటల్ను మట్టికరిపించిన కింగ్స్
కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియం వేదికగా జరిగిన ఏపీఎల్ సీజన్–5 సమరంలో కాకినాడ కింగ్స్ సర్వశ్రేష్ఠ ప్రదర్శనతో క్యాపిటల్ అమరావతి రాయల్స్ను 120 పరుగుల భారీ తేడాతో చిత్తు చేసింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్కు దిగిన కాకినాడ కింగ్స్ జట్టు ఆరంభంలో ఓపెనర్ అర్జున్ టెండూల్కర్ (1) వికెట్ కోల్పోయినప్పటికీ, ఆ ఒత్తిడిని ఏమాత్రం క్షేత్రస్థాయిలోకి రానివ్వకుండా బ్యాటింగ్ పవర్ హౌస్లా విరుచుకుపడింది. ఓపెనర్ అభిషేక్ రెడ్డి (57), మిట్టా లేఖాజ్ రెడ్డి (53)లు విధ్వంసకర అర్థశతకాలతో చెలరేగగా, కెప్టెన్ మనీష్ గొలమారు (33), పిన్నింటి తపస్వి (41)లు సిక్సర్ల వర్షం కురిపించడంతో కాకినాడ నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 225 పరుగుల హిమాలయ స్కోరును బోర్డుపై ఉంచగలిగింది. అనంతరం 226 పరుగుల భారీ లక్ష్య చేధనతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ జట్టుకు రన్ రేట్ ఒత్తిడి ఆరంభం నుంచే శాపంగా మారింది. కాకినాడ పేసర్లు హరిశంకర్ రెడ్డి, కావూరి సాయితేజలు పవర్ప్లేలోనే టాప్ ఆర్డర్ వెన్ను విరవడంతో అమరావతి బ్యాటింగ్ లైన్ పూర్తిగా కుప్పకూలింది. మిడిలార్డర్లో ఎస్. దుర్గా వరప్రసాద్ (13 బంతుల్లో 30) ఒక్కడే వేగంగా ఆడి ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరోవైపు కరణ్ షిండే (4), కేవీ శశికాంత్ (11) లాంటి లీగ్ సీనియర్లు కనీస పోటీ ఇవ్వకుండా ఘోరంగా వైఫల్యం చెందారు. కాకినాడ స్పిన్నర్ సిరపారపు ఆశిష్ కేవలం 13 పరుగులకే 4 వికెట్లు (4/13) పడగొట్టి అమరావతి టెయిల్ ఎండర్లను క్లీన్ చేయడంతో, ఆ జట్టు కేవలం 12.1 ఓవర్లలోనే 105 పరుగులకే ఆలౌట్ అయి ఘోర పరాజయాన్ని చవిచూసింది. కాకినాడ కింగ్స్ తరఫున ఐదో నంబర్లో బ్యాటింగ్కు వచ్చిన మిట్లా లేఖాజ్రెడ్డి ఆఖరి ఓవర్లలో రన్ రేట్ను పతాక స్థాయికి తీసుకెళ్లినందున ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’ అవార్డును గెలుచుకున్నారు. కాకినాడ కింగ్స్ ఇన్నింగ్స్ : పిట్టా అర్జున్ టెండూల్కర్ (రనౌట్–యశ్వంత్ గొల్లపూడి) (2 బంతుల్లో 1), మనీష్ గొలమారు (సి) ఎస్. దుర్గ వరాప్రసాద్ (బి) బండారు అయ్యప్ప (16 బంతుల్లో 33), అభిషేక్ రెడ్డి (బి) తలచిట్ల దీపు భార్గవ్ (38 బంతుల్లో 57), పిన్నింటి తపస్వి (సి) శీరం వెంకట రాహుల్ (బి) బండారు అయ్యప్ప (26 బంతుల్లో 41), మిట్టా లేఖాజ్ రెడ్డి (సి) వరుణ్ సాత్విక్ (బి) కేవీ శశికాంత్ (30 బంతుల్లో 53), మువ్వల యువన్ (నాటౌట్) (11 బంతుల్లో 25), గద్దె సమన్విత్ (నాటౌట్) (1 బంతుల్లో 0) మొత్తం స్కోరు: 225/5, ఓవర్లు: 20.0, ఎక్స్ట్రాలు: 15 క్యాపిటల్ అమరావతి రాయల్స్ ఇన్నింగ్స్ యారా సందీప్ (సి) గద్దె సమన్విత్ (బి) హరిశంకర్ రెడ్డి (11 బంతుల్లో 13), శీరం వెంకట రాహుల్ (బి) కావూరి సాయితేజ (8 బంతుల్లో 11), వరుణ్ సాత్విక్ (ఎల్బీడబ్ల్యు) (బి) సిరపారపు ఆశిష్ (2 బంతుల్లో 0), కరణ్ షిండే (సి) వి.గిరి ప్రసాద్ (బి) కావూరి సాయితేజ (3 బంతుల్లో 4), పైలా అవినాష్ (సి) పిన్నింటి తపస్వి (బి) వి.గిరి ప్రసాద్ (11 బంతుల్లో 6), ఎస్.దుర్గవరప్రసాద్ (బి) పిన్నింటి తపస్వి (13 బంతుల్లో 30), కేవీ శశికాంత్ (సి) గద్దె సమన్విత్ (బి) వి.గిరి ప్రసాద్ (7 బంతుల్లో 11), ఉద్దరాజు అహితేష్ వర్మ (సి) గద్దె సమన్విత్ (బి) సిరపారపు ఆశిష్ (6 బంతుల్లో 15), బండారు అయ్యప్ప (సి) అభిషేక్ రెడ్డి (బి) సిరపారపు ఆశిష్ (6 బంతుల్లో 9), తలచిట్ల దీపు భార్గవ్ (సి) గద్దె సమన్విత్ (బి) సిరపారపు ఆశిష్ (1 బంతుల్లో 0), ఎమ్.తోషిత్ యాదవ్ (నాటౌట్) (5 బంతుల్లో 2) మొత్తం స్కోరు: 105/10, ఓవర్లు: 12.1, ఎక్స్ట్రాలు: 04 -
సిలిండర్ నుంచి మంటలు... ఇద్దరికి తీవ్రగాయాలు
మదనపల్లె టౌన్ : గ్యాస్ సిలిండర్లో మంటలు చెలరేగి ఇంటి యజమాని సహా మెకానిక్ సైతం తీవ్రంగా గాయపడ్డారు. శనివారం ఉదయం మదనపల్లి పట్టణంలో చోటు చేసుకున్న ఘటనపై బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు... పట్టణంలోని రామనగర్లో నివాసముంటున్న నరసింహులు, శారద ఇంట్లో కొద్దిరోజులుగా సిలిండర్ నుంచి గ్యాస్ లీక్ అవుతోంది. ఈ క్రమంలో గ్యాస్ సిలిండర్లు, స్టౌలు రిపేర్ చేస్తానని స్థానిక అప్పారావు తోటకు చెందిన ఆయాజ్(52) శనివారం ఉదయం శారద ఉంటున్న వీధికి వచ్చాడు. గమనించిన శారద తన ఇంట్లో ఉన్న సిలిండర్లో గ్యాస్ లీక్ అవుతున్న విషయాన్ని ఆయాజ్కు చెప్పి రిపేర్ చేయాలని కోరింది. దీంతో ఇంట్లో ఉన్న సిలిండర్ ను బయటకు తీసుకొచ్చి రిపేరు చేసే క్రమంలో సిలిండర్ లో ఒక్కసారిగా మంటలు చెలరేగి ఆయాజ్ తో పాటు శారద సైతం తీవ్రంగా గాయపడ్డారు. గాయపడ్డ ఇద్దరినీ స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆయాజ్ తీవ్రంగా గాయపడ్డాడని మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. రెండవ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
పచ్చపండుగకు.. లక్షల్లో దండగ !
● మదనపల్లె టౌన్ బ్యాంకులో ఆర్బీఐ రూల్స్కు పాతర ● ప్రజల బ్యాంకును ‘టీడీపీ లిమిటెడ్’గా మార్చేసిన చైర్మన్ ● సొమ్ము ‘బ్యాంకు’ది.. సోకు ‘నాదెండ్ల’ది! ● వందేళ్ల కార్యక్రమంలో వివక్ష ● ఎంపీ మిథున్రెడ్డి, పెద్దిరెడ్డిల విస్మరణ సాక్షి,మదనపల్లె: ‘ది మదనపల్లె కోఆపరేటివ్ టౌన్ బ్యాక్ లిమిటెడ్’ వందేళ్ల ఉత్సవం పేరిట రూ.లక్షల నిధులను నీళ్ళలా ఖర్చు చేసి దుర్వినియోగం చేసిన ఉదంతం తాజాగా వెలుగులోకి వచ్చింది. పార్టీలు, రాజకీయాలతో సంబంధం లేకుండా.. రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కఠిన పర్యవేక్షణలో స్వతంత్రంగా నడవాల్సిన ‘ది మదనపల్లె కో–ఆపరేటివ్ టౌన్ బ్యాంక్ లిమిటెడ్’లో పచ్చ నేతల రాజకీయ కక్షసాధింపు చర్యలు తారస్థాయికి చేరాయి. ఈ ప్రతిష్టాత్మక ప్రజల బ్యాంకు పాలకవర్గ చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్ అచ్చమైన టీడీపీ నాయకుడు కావడంతో, బ్యాంకును కాస్తా ‘టీడీపీ లిమిటెడ్ బ్యాంకు’గా మార్చేశారు. వందేళ్ల ఉత్సవాల పేరిట 17 నెలలు ఆలస్యంగా, గతేడాది డిసెంబర్ 3న నిర్వహించిన సభకు సంబంధించి ఇచ్చిన అధికారిక పత్రికా ప్రకటనలలోనూ వైఎస్సార్ సీపీకి చెందిన కీలక ప్రజాప్రతినిధులపై తీవ్ర వివక్ష చూపించారు. ఎంపీ మిథున్రెడ్డి, సీనియర్ నేత పెద్దిరెడ్డిలపై నిర్లక్ష్యం! ఈ బ్యాంకు కార్యకలాపాలు సాగుతున్న పరిధిలోని వైఎస్సార్ సీపీ ప్రజాప్రతినిధులపై పాలకవర్గం ఉద్దేశపూర్వకంగా, రాజకీయ కక్షతోనే నిర్లక్ష్యం వహించింది. ఈ బ్యాంకు రాజంపేట పార్లమెంట్ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గం నుంచి వరుసగా మూడుసార్లు హ్యాట్రిక్ ఎంపీగా గెలిచిన పీవీ.మిథున్రెడ్డి అత్యంత కీలకమైన ప్రజాప్రతినిధి. అలాంటిది, ఈ ఉత్సవ అధికారిక ప్రకటనల్లో ఆయనకు కనీస ప్రాధాన్యత ఇవ్వకుండా అవమానించారు. అలాగే పుంగనూరులో ఈ బ్యాంకు బ్రాంచి కార్యాలయం విజయవంతంగా నడుస్తోంది. అక్కడ వైఎస్సార్ సీపీ సీనియర్ నేత, మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. కనీసం అక్కడ తమ బ్యాంకు బ్రాంచి ఉందన్న కనీస ఆలోచన కూడా లేకుండా.. పత్రికా యా డ్స్లో స్థానిక ఎమ్మెల్యే ఫొటో లేకుండా చేశారు. కాగా, తంబళ్లపల్లె నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డికి కూడా పాలకవర్గం మొండిచేయే చూపింది. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన టీడీపీ ఎమ్మెల్యేలు, కనీసం ప్రజాప్రతినిధులు కూడా కాని పచ్చ నాయకుల ఫొటోలను మాత్రం లక్షల రూపాయల బ్యాంకు సొమ్ముతో ఇచ్చిన పత్రికా ప్రకటనల్లో ప్రముఖంగా ప్రచురించి పెద్దపీట వేశారు. బ్యాంకు టీడీపీకి మాత్రమే సంబంధించినదా? ఈ పగటిదోపిడీ మరియు ఏకపక్ష వైఖరి చూసి బ్యాంకు ఖాతాదారులు, సభ్యుల్లో తీవ్ర చర్చనీయాంశమైంది. ‘ఈ బ్యాంకు కేవలం టీడీపీకి మాత్రమే సంబంధించినదా? టీడీపీ నేతలు ఫొటోలు వేసుకొని ప్రచారం చేసుకునేందుకు సామాన్యుల, ఖాతాదారుల సొమ్మును ఎలా దుబారా చేస్తారు?’ అని సభ్యులు నిలదీస్తున్నారు. ఒకవైపు సావనీర్ నిండా కూటమి మంత్రులు, ఎమ్మెల్యేల భజన లేఖలతో నింపేసి, మరోవైపు చైర్మన్ నాదెండ్ల విద్యాసాగర్కు చెందిన సొంత కల్యాణమండపాన్ని వేదికగా చేసుకుని నిధులు మళ్లించారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సామాన్యుల సొమ్మును కూటమి నేతల విందులు, ప్రచారాలకు తగలేసిన ఈ ‘పచ్చ’ దోపిడీపై తక్షణమే ఆర్బీఐ మరియు సహకార శాఖ ఉన్నతాధికారులు స్పందించి పూర్తిస్థాయి విచారణ జరపాలని పట్టణ ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. శత వసంతాల ఉత్సవానికి చేసిన మొ త్తం ఖర్చు రూ.23 లక్షలు మాత్రమే. ఈ ఉత్సవానికి రూ. 43 లక్షలు ఖర్చు చేశారన్న ప్రచారంలో నిజం లేదు. ఖర్చులు బాగా తగ్గించుకున్నాం. సావనీర్ ముద్రించడానికి వివిధ వర్గాల నుంచి సేకరించిన ప్రకటనల సొమ్మును మాత్రమే వినియోగించాం. – టౌన్బ్యాంకు సీఈవో పీవీ ప్రసాద్ -
శారీరక,మానసిక ఆరోగ్యానికి యోగా
రాయచోటి: శారీరక, మానసిక ఆరోగ్య పరిరక్షణకు యోగా దోహదపడుతుందని డైట్ ఇన్చార్జి ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి అన్నారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం–2026ను పురస్కరించుకొని రాయచోటి డైట్లో అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాలకు చెందిన ఆరు నుంచి పదోతరగతి వరకు చదువుతున్న విద్యార్థుల కోసం ఆరోగ్యానికి యోగా అనే అంశంపై ఈనెల 18న పోస్టర్ తయారీ పోటీలు నిర్వహించారు. ఇందులో ప్రతిభ కనబరిచిన విద్యార్థుల వివరాలను శుక్రవారం డైట్లో ప్రకటించారు. అన్నమయ్య జిల్లా నుంచి బి శశికల (పదోతరగతి, ఏపీ మోడల్ స్కూల్, చిన్నమండెం) ప్రథమ, డి అలేఖ్య (9వ తరగతి, జడ్పీ హైస్కూల్, కె రామాపురం, రాయచోటి మండలం) ద్వితీయ, పి యోజిత్ శ్రీ నందన్ (8వ తరగతి,జడ్పీ హైస్కూ ల్, గాలివీడు మండలం) తృతీయ స్థానాలు సాధించారు. వైఎస్సార్ కడప జిల్లా నుంజి ఎం సుశాంత్ (9వ తరగతి, జెడ్పీ హైస్కూల్,ఉప్పలవాండ్లపల్లి,చక్రాయపేట మండలం) ప్రథమ, వి చందు (9వ తరగతి కార్పోరేషన్ హైస్కూల్, గాంధీనగర్, కడప) ద్వితీయ, కె మానస (8వ తరగతి, జడ్పీ గర్ల్స్, జయనగర్ కాలనీ, కడప) తృతీయ స్థానాలు సాధించారు. అంతర్జాతీయ యోగా దినోత్సవం సందర్భంగా జూన్ 21న విజేతలకు మెరిట్ సర్టిఫికెట్లు అందజేస్తామని నరసింహారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె సుబ్రమణ్యం విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు రెడ్డప్పరెడ్డి, యుగంధర్, ఓబుల్ రెడ్డి, శివప్రసాద్, ఇలియాస్, ఉపాధ్యాయులు రాజేశ్వరీ, ప్రసాదరాజు తదితరులు పాల్గొన్నారు. -
నెట్ జీరో హెల్తీ క్యాంపస్ పథకం అమలుకు ఎంఓయూ
రాయచోటి : రాష్ట్ర వ్యాప్తంగా అమలు చేయనున్న ‘నెట్ జీరో హెల్తీ క్యాంపస్’ కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎంపికై న విద్యాసంస్థల్లో పథకం అమలుకు జిల్లా యంత్రాంగం కీలక చర్యలు ప్రారంభించిందని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలోని చాంబర్లో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో కలెక్టర్ సమక్షంలో కన్హాహార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ ప్రతినిధులతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుని సంబంధిత పత్రాలను పరస్పరం అందజేసుకున్నారు. ఇటీవల జరిగిన కలెక్టర్ల సమావేశంలో రాష్ట్ర ప్రభుత్వం ఈ కార్యక్రమానికి రూపకల్పన చేసిన విషయం విదితమే. జిల్లా నుంచి 48 విద్యాసంస్థలు ఎంపికకావడం హర్షణీయమని కలెక్టర్ చెప్పారు. 1.5 ఎకరాలకు పైగా విస్తీర్ణం కలిగిన రెసిడెన్షియల్ పాఠశాలలు, హాస్టళ్లు ఈ కార్యక్రమం పరిధిలోకి తీసుకురానున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా సోషల్ వెల్ఫేర్ అధికారి దామోదర్రెడ్డి, డ్వామా పీడీ వెంకటరత్నం, కన్హా హార్ట్ఫుల్నెస్ ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గొన్నారు. సమస్యలు వేగంగా పరిష్కరించాలి. రాయచోటి ఆర్డీఓ కార్యాలయంలో రెండో శుక్రవారం ఒక నెల – ఒక నియోజకవర్గం – నాలుగు సందర్శనలు కార్యక్రమాన్ని నిర్వహించారు. శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, ఆర్డీఓ శ్రీనివాస్లు పాల్గొన్నారు. ప్రజలు, రైతుల నుంచి సమస్యలను తెలుసుకుని వారి నుంచి వినతిపత్రాలను జిల్లా కలెక్టర్, ఆర్డీఓ, తహసీల్దార్లు స్వీకరించారు. ప్రజా సమస్యలను వేగంగా పరిష్కరించేందుకు అధికారులు క్షేత్రస్థాయికి మరింత చేరువ కావాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ సూచించారు. ప్రతి అధికారి క్షేత్రస్థాయిలో ప్రజలకు అందుబాటులో ఉండాలన్నారు. ఒక నియోజకవర్గం – ఒక మండలం – నాలుగు సందర్శనాలు కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కారానికి సమర్థవంతమైన వేదికగా నిలుస్తోందన్నారు. ఈ అవకాశాన్ని ప్రజలు వినియోగించుకోవాలన్నారు. సమావేశంలో ఆర్డీఓ శ్రీనివాస్, తహసీల్దార్ యామిని, పంచాయతీరాజ్, వ్యవసాయ, విద్య, వైద్య, నీటిపారుదల శాఖల అధికారులు, సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
శుభ ఘడియలొచ్చాయ్..!
● మోగుతున్న పెళ్లిభాజాలు మదనపల్లె సిటీ: అధిక జ్యేష్టమాసం ముగిసి నిజ జ్యేష్టమాసం ప్రారంభమైంది. దీంతో అన్ని ప్రాంతాల్లో శుభకార్యాలకు సంబఽంధించి హడావుడి ప్రారంభమైంది. ఆయా ఇళ్లల్లో సందడి వాతావరణం నెలకొంది. అధిక జ్యేష్టమాసంలో ముహుర్తాలు ఉండవు. నిజజ్యేష్టమాసం ప్రారంభం కావడంతో ఈనెల 16 నుంచి నెల రోజుల పాటు ముహుర్తాలు కొనసాగుతున్నాయి. నెల రోజుల పాటు వివాహాలకు, గృహప్రవేశాలకు,ఇతర శుభకార్యక్రమాలకు అనువుగా ఉన్నట్లు పండితులు వివరిస్తున్నారు. అలాగే నెల తర్వాత మళ్లీ శ్రావణమాసంలో మంచి ముహుర్తాలు ఉన్నాయని పండితులు చెబుతున్నారు. నిజ జ్యేష్టమాసం ముగిసిన తరువాత వచ్చే ఆషాడంలో ముహుర్తాలు ఉండవు. జూలై 15 నుంచి ఆగస్టు 12వ తేదీ వరకు దాదాపు ఆ నెలరోజులు శుభకార్యాక్రమాలకు బ్రేక్ పడుతుంది. తర్వాత మళ్లీ భాద్రపదమాసంలోనూ శుభ కార్యక్రమాలకు అవకాశముండదని పండితులు చెబుతున్నారు. జిల్లా వ్యాప్తంగా రానున్న నాలుగు మాసాల్లో వందలాది వివాహాలు జరగనున్నట్లు పండితులు చెబుతున్నారు. జిల్లాలో సుమారు వెయ్యికిపైగా కళ్యాణమండపాలు, హోటల్స్, కన్వెన్షన్ సెంటర్లు, కమ్యూనిటీ హాల్స్కు డిమాండ్ పెరిగింది. ప్రధానంగా పట్టుచీరల కోసం మదనపల్లె (నీరుగట్టువారిపల్లె), బంగారు కొనుగోలు కోసం ప్రొద్దుటూరు ప్రాంతాలోని వాణిజ్యకేంద్రాల్లో సందడి నెలకొంది.’ముఖ్యమైన ముహుర్తాలు:మంచి ముహుర్తాలు ఉన్నాయి నిజజ్యేష్టం, శ్రావణం, ఆశ్వీయుజ మాసాల్లో మంచి ముహుర్తాలు ఉన్నాయి. అధిక జ్యేష్టం, ఆషాడం, భాద్రపదాలు శూన్యమాసాలు కావడంతో ముహుర్తాలు ఉండవు. కాబట్టి ముహుర్తాలు ఉన్న మాసాల్లో అధిక సంఖ్యలో శుభకార్యాలు జరగడానికి అవకాశముంది. ఇప్పటికే చాలా మంది వివాహ ముహుర్తాలు నిర్ణయించుకుని ఏర్పాట్లు చేసుకుంటున్నారు. – ఆలూరి ఫణికుమార్శర్మ, వేదపండితులు,మదనపల్లె. -
23 నుంచి స్పోర్ట్స్ స్కూల్లో ప్రవేశానికి పరీక్షలు
మదనపల్లె సిటీ: డాక్టర్ వైఎస్సార్ స్పోర్ట్స్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి 4వ తరగతి నుంచి 6వ తరగతి వరకు ప్రవేశాలకు ఈనెల 23,24 తేదీల్లో జిల్లా స్థాయి ఎంపిక పరీక్షలు జరుగుతాయని డీఎస్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. స్థానిక బీటీ కాలేజీ క్రీడామైదానంలో ఉదయం 7 గంటలకు హాజరుకావాలన్నారు. ఎంపిక పరీక్షల్లో ఎత్తు, బరువు,30 మీటర్ల పరుగుపందెం, వెర్టికల్ జంప్, స్టాండింగ్ బ్రాడ్జంప్, మెడిసిన్బాల్త్రో, షటిల్రన్, ఫార్వర్డ్ బెండ్ అండ్ రీచ్, 800 మీటర్ల పరుగుపందెం వంటి మోటార్ ఎబిలీటీ పరీక్షలు జరుగుతాయన్నారు. అభ్యర్థులు జనన ధృవీకరణపత్రం, స్టడీ సర్టిఫికెట్, కులం, ఆదాయం, స్థానికత ధృవీకరణపత్రాల ఒరిజనల్స్ తీసుకురావాలని ఆయన పేర్కొన్నారు. పది ఫలితాల్లో 91.28 ఉత్తీర్ణత మదనపల్లె సిటీ: పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షా ఫలితాల్లో 91.28 ఉత్తీర్ణత సాధించినట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. శుక్రవారం పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫలితాలు ప్రకటించారు. జిల్లాలో 2994 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. ఇందులో బాలురు 1882, బాలికలు 1112 మంది పరీక్షలకు హాజరయ్యారు. బాలురు 1693 మంది, బాలికలు 1037 మంది ఉత్తీర్ణులయ్యారు. రాష్ట్ర స్థాయిలో జిల్లా 11వ స్థానంలో నిలిచినట్లు తెలిపారు. రీకౌంటింగ్కు సబ్జెక్టుకు రూ.500, రీవెరిఫికేషన్కు రూ.1000 చొప్పున ఈనెల 20 నుంచి 26వ తేదీలోపు చెల్లించాలని ఆయన తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపిక పుంగనూరు : రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనక్ పోటీలకు స్థానిక అడవినాథునికుంట మోడల్స్కూల్కు చెందిన ఇద్దరు విద్యార్థులు ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ రమ తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ మోడల్స్కూల్ విద్యార్థులు షేక్ మయీన్తాజ్, డి.ఉషశ్రీలు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. వీరికి గైడ్గా టీచర్లుగా మనోహర్నాయక్, తనూజ వ్యవహరించారని తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా సైస్స్ఫేర్ ఆఫీసర్ మోహన్సింగ్ వారిని అభినందించారు. హోరాహోరీగా అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర మల్టిడే క్రికెట్ అంతర్ జిల్లాల పోటీలు హోరాహోరీగా సాగాయి. శుక్రవారం గ్రౌండ్ –1లో కడప, నెల్లూరు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న కడప జట్టు 364 పరుగులు చేసి ఆలౌటైంది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన నెల్లూరు జట్టు 128 పరుగులు చేసి ఆలౌటైంది. గ్రౌండ్– 2లో జరిగిన చిత్తూరు, కర్నూలు మ్యాచ్లో కర్నూల్ జట్టు 342 పరుగులు చేయగా... చిత్తూరు జట్టు 511 పరుగులు చేసి ఆటను కొనసాగిస్తున్నట్లు కోచ్ సునీల్ కుమార్ తెలిపారు. ఈ కార్యక్రమంలో విజయ్, సతీష్యాదవ్, శ్రీధర్ కుమార్, జవహర్ బాష, హరీష్, తదితరులు పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు శనివారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు కలెక్టరేట్లోని జిల్లా ఉపాధికల్పనాధికారి కార్యాలయంలో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి అందెల సురేష్కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు.ఐసీఐసీఐ బ్యాంకులో సేల్స్ రిలేషన్షిప్ మేనేజర్ ఉద్యోగానికి ఏదైనా డిగ్రీ పాసైన అభ్యర్థులు అర్హులన్నారు. అలాగే టయోవిజన్ కాంపోజిటివ్ టెక్నాలజీ సంస్థలో ప్రొడక్షన్, క్వాలిటీ ఇంజినీర్లు, క్యూఎంఎస్ ఇంజినీర్ తదితర ఉద్యోగాలకు డిప్లొమా, బీటెక్, ఎంటెక్ చదివిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. అల్డిక్సన్ కంపెనీలో వివిధ ఉద్యోగాలకు ఎస్ఎస్సీ నుంచి పీజీ వరకు, ఐటీఐ డిప్లొమా అర్హత గల అభ్యర్థులు హాజరు కావచ్చన్నారు. నేటినుంచి కేవీకేలో శిక్షణ కడప ఎడ్యుకేషన్: కడప ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం(కేవీకే)లో ఆర్య పథకం ద్వారా గ్రామీణ యువతకు వానపాముల ఎరువు తయారీపై ఈ నెల 20 నుంచి 22 వరకు శిక్షణ కార్యక్రమం జరగనుంది. ఈ విషయాన్ని కేవీకే అధిపతి డాక్టర్ శిల్పళక ఒక ప్రకటనలో తెలిపారు. ఆసక్తి గల రైతులు, యువత 8096888039 నంబర్కు ఫోన్ చేసి పేరు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మయీన్తాజ్ ఉషశ్రీ -
బైక్ ఢీకొని వృద్ధురాలికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: రోడ్డు దాటుతున్న వృద్ధ మహిళను బైక్ ఢీకొని తీవ్ర గాయాలు పాలైన సంఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు ములకలచెరువుకు చెందిన పీరమ్మ (70) మధ్యాహ్నం రోడ్డు దాటుతుండగా అదుపు తప్పిన బైక్ ఆమెను ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆమెకు తీవ్ర గాయాలయ్యాయి. కు టుంబ సభ్యులు బాధితురాలిని చికిత్స కోసం మద నపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆమె కోలుకుంటోందని డాక్టర్లు తెలిపారు. ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలో శుక్రవారం జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ముదివేడు పోలీసులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం, కోసువారిపల్లికి చెందిన రైతు భాస్కర్ రెడ్డి(56) వ్యవసాయ పరికరాలు కొనుగోలు చేసేందుకు బైకులో మదనపల్లెకి బయలుదేరాడు. కురబలకోట ఫ్లైఓవర్ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో భాస్కర్ రెడ్డికి కాలు విరిగింది. స్థానికులు గమనించి వెంటనే 108కు సమాచారం అందించారు. వారు వెంటనే ఘటన స్థలం వద్దకు చేరుకుని ప్రథమ చికిత్స అందించారు.కురబలకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రామసముద్రం: రోడ్డుప్రమాదంలో గాయపడిన మాజీ వలంటీర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. వివరాలిలా ఉన్నాయి. రామసముద్రం మండలం చెంబకూరు గ్రామ పంచాయతీకి చెందిన వైఎస్సార్సీపీ నాయకుడు చంద్రశేఖర్ కుమారుడు గురుప్రసాద్ (32) సొంత పని నిమిత్తం సోమవారం ద్విచక్ర వాహనంలో కర్ణాటక రాష్ట్రం కోలారు జిల్లా శ్రీనివాసపురం వెళ్లి తిరిగి స్వగ్రామానికి బయలుదేరాడు. కల్లుకుంట గ్రామం వద్ద వాహనం అదుపుతప్పి రోడ్డుపై పడి తలకు తీవ్ర గాయలయ్యాయి. విషయం తెలుసుకున్న కుటుంబ సభ్యులు అతన్ని చికిత్స నిమిత్తం కోలారు మెడికల్ ఆసుపత్రికి తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ శుక్రవారం మృతి చెందాడు. గురుప్రసాద్ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో వలంటీర్గా పనిచేసి ప్రజల మన్ననలు పొందాడు. గురుప్రసాద్ మృతదేహానికి వైఎస్సార్సీపీ, కూటమి నాయకులు, గ్రామస్తులు, స్నేహితులు నివాళులు అర్పించారు. -
నకిలీ బంగారం పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముఠా అరెస్టు
మదనపల్లె టౌన్: నకిలీ బంగారు పూసల దండ చూపించి అమాయక ప్రజల నుంచి డబ్బులు దోచుకుంటున్న ముఠా గుట్టును మదనపల్లె 2టౌన్ పోలీసులు రట్టు చేశారు. ఈ కేసులో ఏడుగురిని అరెస్ట్ చేసి నకిలీ బంగారం, కత్తులు, కారు స్వాధీనం చేసు కున్నారు. డీఎస్పీ పావని కథనం మేరకు అన్నమయ్య జిల్లాలోని పుంగనూరు, వీర బల్లి మండలాలకు చెందిన ఏడుగురు వ్యక్తు లు ఒక ముఠాగా ఏర్పడి అమాయకులను లక్ష్యంగా చేసుకున్నారని తెలిపారు. ఎలా మోసం చేశారంటే... తమ పొలంలో జేసీబీతో పని చేస్తున్న సమయంలో బంగారం దొరికినట్లు నమ్మించి, నకిలీ బంగారు పూసల దండలను అసలు బంగారంగా చూపించి తక్కువ ధరకు ఇస్తామని చెప్పి బాధితులను నమ్మించి డబ్బులు తీసుకునే ప్రయత్నం చేశారరు. ఈ నెల 10న బాధితులకు ఫోన్ చేసి భూమిలో దొరికిన సుమారు 3 కిలోల బంగారు పూసల దండ తమ వద్ద ఉందని, డబ్బులు అవసరమని, తక్కువ ధరకు ఇస్తామని నమ్మబలికారని చెప్పారు. బాధితులు డబ్బులతో మదనపల్లెకు రాగా, 17న స్థానిక అన్నమయ్య సర్కిల్ సమీపంలో వారిని కలుసుకొని నకిలీ బంగారు పూసల దండ చూపించి, అనంతరం హైవే వైపు ఖాళీ ప్రదేశానికి తీసుకెళ్లి కత్తులు చూపించి బెదిరించి నగదు తీసుకున్నారని తెలిపారు. కేసు దర్యాప్తులో భాగంగా 19న ఉదయం 9:20 గంటలకు మదనపల్లె– రాయచోటి జాతీయ రహదారి సమీపంలోని అన్నమయ్య సర్కిల్ నుంచి హైవే వైపు వెళ్లే రోడ్డులో పోలీసులు వాహనాలు తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన టయోటా ఇన్నోవా కారును ఆపి తనిఖీ చేసి అందులో ఉన్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నట్లు తెలిపారు. వారిని విచారించగా నేరాన్ని అంగీకరించారన్నారు. నిందితుల వద్ద సొత్తు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. అరైస్టెన వారి వివరాలు: పుంగనూరు మండలం, పాలెంపల్లి పంచాయతీ, జై నగర్ కాలనీకి చెందిన రాన్న చరణ్(19), ఎం.వినోద్ కుమార్(29), ఎం. రూక్ జాన్ రూపన్(35), వీరబల్లి మండలం, తాటిగుంటపల్లి పంచాయతీ, పికారిపాలెంకు చెందిన రాన్న మల్లన్న(46), శోమల్ చలపతి(70), రాణ కృష్ణబాబు(22), మల్లి, పికారిపాలెం గ్రామం, వీరబల్లి మండలం, రాన్న పండి(46), జై నగర్ కాలనీ, పాలెంపల్లి, పుంగనూరు మండలాలకు చెందిన వారు ఉన్నారని డీఎస్పీ తెలిపారు.ఈ కేసులో ప్రతిభ కనబరిచిన సీఐ మహమ్మద్ రఫీ ఎస్ఐ నాగేశ్వరరావు రామాంజనేయులు ఏ ఎస్ ఐ రమణ ఐడి సిబ్బందిని, డీఎస్పీ అభినందించి రివార్డులను ప్రకటించారు. ఫోటోలు ఉన్నాయి -
సన్షైనర్స్ను కుమ్మేసిన బుల్స్
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఆంధ్రా ప్రీమియర్ లీగ్ 2026 సీజన్–5 సమరంలో భాగంగా కడప నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో మూడో రోజు జరిగిన తొలి మ్యాచ్లో భీమవరం బుల్స్ జట్టు సంచలన విజయంతో దూసుకుపోయింది. విజయవాడ సన్షైనర్స్తో జరిగిన ఈ హై–స్కోరింగ్ థ్రిల్లర్లో భీమవరం బుల్స్ బ్యాటర్లు సిక్సర్లు, ఫోర్ల వర్షం కురిపించి ఘన విజయాన్ని సాధించారు. టాస్ గెలిచిన భీమవరం బుల్స్ కెప్టెన్ మొదట బౌలింగ్ ఎంచుకున్నాడు. అశ్విన్ హెబ్బార్ ధమాకా.. విజయవాడ భారీ స్కోరు! తొలుత బ్యాటింగ్కు దిగిన విజయవాడ సన్షైనర్స్ జట్టుకు ఓపెనర్లు అదిరిపోయే శుభారంభాన్ని అందించారు. లీగ్ స్టార్ అశ్విన్ హెబ్బార్ మైదానంలో విరుచుకుపడుతూ కేవలం 29 బంతుల్లోనే 11 ఫోర్లు, 3 సిక్సర్లతో ఏకంగా 73 పరుగులు చేసి పరుగుల వరద పారించాడు. 10 ఓవర్లు ముగిసేసరికి ఒక వికెట్ నష్టానికే 124 పరుగులు చేసిన విజయవాడ జట్టులో, మిడిల్ ఆర్డర్ బ్యాటర్ జహీర్ అబ్బాస్ (25 బంతుల్లో 48, 4 ఫోర్లు, 3 సిక్సర్లు), హర్షవర్ధన్ (23 బంతుల్లో 33, 2 ఫోర్లు, 2 సిక్సర్లు) లు ధాటిగా ఆడారు. అయితే ఆఖరి ఓవర్లలో భీమవరం బౌలర్లు పీవీఎస్ఎన్ రాజు (3 వికెట్లు), సీహెచ్ రవితేజ, బి.యశ్వంత్ (తలో రెండు వికెట్లు) లు అద్భుతంగా కట్టడి చేయడంతో విజయవాడ సన్షైనర్స్ జోరు తగ్గింది. అయినా నిర్ణీత 20 ఓవర్లలో 9 వికెట్ల నష్టానికి 212 పరుగుల భారీ స్కోరును నమోదు చేసింది. రేవంత్ రెడ్డి విధ్వంసకర శతకం.. 17.3 ఓవర్లలోనే ఫినిష్! అనంతరం 213 పరుగుల హిమాలయ లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన భీమవరం బుల్స్ జట్టుకు ఆదిలోనే ఎదురుదెబ్బ తగిలింది. ఓపెనర్ హేమంత్రెడ్డి త్వరగానే అవుట్ కాగా, మరొక ఎండ్లో క్రీజులోకి వచ్చిన రేవంత్ రెడ్డి కడప మైదానాన్ని తన సిక్సర్లతో హోరెత్తించాడు. విజయవాడ బౌలర్లను ముప్పుతిప్పలు పెడుతూ ఏకంగా 61 బంతుల్లో 14 ఫోర్లు, 8 భారీ సిక్సర్లతో 126 పరుగులు చేసి సంచలన సెంచరీ సునామీ సృష్టించాడు. అదేవిధంగా మిడిల్ ఆర్డర్ బ్యాటర్ రవికిరణ్ కూడా వేగంగా ఆడుతూ 24 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 46 పరుగులు చేసి జట్టును విజయ తీరాల వైపు నడిపించాడు. వీరిద్దరి వీరవిహారంతో భీమవరం బుల్స్ జట్టు మరో 15 బంతులు మిగిలి ఉండగానే, కేవలం 17.3 ఓవర్లలోనే 3 వికెట్ల నష్టానికి 218 పరుగులు చేసి చిరస్మరణీయ విజయాన్ని సొంతం చేసుకుంది. మైదానాన్ని ఉర్రూతలూగించిన భీమవరం బుల్స్ బ్యాటర్ రేవంత్రెడ్డి ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు.రేవంత్రెడ్డి (126), భీమవరం బుల్స్ 61 బంతుల్లోనే 126 పరుగులతో రేవంత్ రెడ్డి వీరవిహారం అశ్విన్ హెబ్బార్(73) మెరుపులు వృథా 213 పరుగుల భారీ లక్ష్యాన్ని 17.3 ఓవర్లలోనే ఊదేసిన భీమవరం పీవీఎస్ఎన్ రాజు మూడువికెట్ల పంజా రసవత్తర పోరులో భీమవరం సరికొత్త రికార్డు ఉర్రూతలూగిన కడప స్టేడియం విజయవాడ సన్ షైనర్స్ ఇన్నింగ్స్ : అభినవ్ (సి)మునీష్ (బి) పీవీఎస్ఎన్ రాజు (18 బంతుల్లో 26), అశ్విన్ హెబ్బర్ (సి)హేమంత్ (బి) యశ్వంత్ (73 బంతుల్లో 29), హర్షవర్దన్ (సి)సాత్విక్ (బి) శ్రావణ్ (18 బంతుల్లో 26), షేక్ జహీర్ అబ్బాస్ (సి)హేమంత్ (బి)రాజు (25 బంతుల్లో 48), పాండురంగరాజు (సి)రాజు (బి) యశ్వంత్ (11 బంతుల్లో 19), సిద్దార్థ (సి) హేమంత్ (బి)రవితేజ (2 బంతుల్లో 1), ఏవీవీ విజయ్ (సి)హేమంత్ (బి) రాజు ( 03 బంతుల్లో 06),ప్రశాంత్ (సి) రవి కిరణ్ (బి) రవితేజ(3 బంతుల్లో 2), జీఎస్వీ సుమిత్ (రనౌట్–రవికిరణ్, రాజు)(2 బంతుల్లో 1), లలిత్మోహన్ (నాటౌట్) (2 బంతుల్లో 2)భరత్ (నాటౌట్) 00 మొత్తం స్కోరు : 212/9 ఓవర్లు 20, ఎక్స్ట్రాలు : 04 బీమవరం బుల్స్ ఇన్నింగ్స్ : హేమంత్రెడ్డి (సి)ప్రశాంత్ (బి) సుమిత్ (6 బంతుల్లో 9), రేవంత్రెడ్డి (నాటౌట్) (61 బంతుల్లో 126), సాయిశ్రావణ్ (సి) శంబు అఖిల్ (డి)సుమిత్ (9 బంతుల్లో 19), రవికిరణ్ రటౌట్ ((సబ్) పిన్నింటి తేజస్వి / తన్నీరు భరత్) (24 బంతుల్లో 46), సాత్విక్ (నాటౌట్) (6 బంతుల్లో 14) మొత్తం స్కోరు : 218/3 ఓవర్లు 17.3, ఎక్స్ట్రాలు : 04 -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
– హత్య చేశారని పోలీస్ స్టేషన్ వద్ద బంధువుల ఆందోళన.. మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో శుక్రవారం అర్థరాత్రి జరిగిన జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే దుర్మరణం చెందాడు. కావాలనే చంపి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని కుటుంబీకులు మదనపల్లె తాలూకా పోలీస్ స్టేషన్ ఎదుట ఆందోళనకు దిగారు. తాలూకా పోలీసులు మతుని కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని నారమాకుల తాండాకు చెందిన చిన్న బుడ్డానాయక్ (38) వ్యవసాయం చేస్తాడు. ఇతనికి ఆశ కార్యకర్తగా పనిచేసే భార్య ప్రమీల, కుమారులు ప్రభానాయక్, డేవిడ్ నాయక్, పవన్నాయక్ లు ఉన్నారు. గురువారం అర్ధరాత్రి దాటిన తర్వాత చిన్నబుడ్డానాయక్ ద్విచక్రవాహనంలో మదనపల్లెకు వస్తుండగా, మార్గమధ్యంలోని రామాపురం, దండువారిపల్లె వద్ద గుర్తుతెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో అతను అక్కడికక్కడే మృతిచెందాడని పోలీసులు అనుమానిస్తుండగా, రోడ్డు ప్రమాదం కాదని, కావాలనే ఎవరో కొట్టి చంపేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని బంధువులు ఆరోపిస్తూ పోలీసుస్టేషన్ వద్ద ఆందోళన చేశారు. అనంతరం తాలూకా సీఐ కళా వెంకటరమణకు ఫిర్యాదు చేశారు. చనిపోయిన వ్యక్తి భార్యకు మరో వ్యక్తితో వివాహేతర సంబంధం ఉందని, వారిద్దరూ కలిసి చంపేసి రోడ్డు ప్రమాదంగా సష్టిస్తున్నారని అనుమానం వ్యక్తం చేశారు. అనంతరం గ్రామానికి వెళ్లిన బంధువులు మృతుడి భార్యపై, గ్రామానికి చెందిన వ్యక్తి ఇంటిపైకి గొడవకు దిగారు. ఘటనపై కేసు నమోదు చేసిన ఎస్ఐ చంద్రమోహన్ గ్రామానికి చేరుకుని అనుమానాలపై ఫిర్యాదు చేస్తే కేసు నమోదు చేస్తామన్నారు. ప్రస్తుతానికి రోడ్డు ప్రమాదంపై కేసు నమోదు చేసినట్లు, విచారణలో కొత్త అంశాలు తెలిస్తే సెక్షన్లు మారుస్తామని చెప్పడంతో మృతుడి కుటుంబ సభ్యులు శాంతించారు. పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థిని ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షల్లో ఫెయిల్ అయ్యానన్న మనస్తాపంతో ఓ విద్యార్థిని ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన ములకలచెరువు మండలంలో గురువారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలానికి చెందిన 17 ఏళ్ల యువతి స్థానికంగా ఉండే ఓ కాలేజీలో ఇంటర్ చదువుతోంది. గురువారం విడుదలైన అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ఫలితాల్లో కామర్స్ సబ్జెక్టులో ఫెయిల్ కావడంతో తీవ్ర మనస్తాపానికి గురై గన్నేరు పప్పు తినింది. కుటుంబసభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందించారు. -
ఖాకీ గంజాయి నాటకం..బూటకం
● అడ్డంగా బుకై ్కన కడప పోలీసులు ● సీసీ ఫుటేజీ, ఎస్ఐ ఐడీ కార్డుతో హైకోర్టులో గుట్టురట్టు ● హేబియస్ కార్పస్ పిటిషన్ వేసినందుకు బాధితులపై ‘పీడీ యాక్ట్’ పెట్టాలని పగ సాక్షి ప్రతినిధి, కడప: ఎవరినో సంతోష పెట్టడానికి, మరొకరి కళ్లల్లో ఆనందం చూడాలనే తపనతో అమాయకులను కేసుల్లో ఇరికించబోయిన పోలీసులు ఇప్పుడు తాము తవ్విన గోతిలో తామే అడ్డంగా పడిపోయారు. ఒక అక్రమాన్ని కప్పిపుచ్చుకోవడానికి గంజాయి డ్రామా ఆడిన ఖాకీలకు, ఇప్పుడు హైకోర్టు ‘హేబియస్ కార్పస్’ ఉచ్చు దెబ్బకు చెమటలు పడుతున్నాయి. లాడ్జి సీసీ ఫుటేజీతో సహా అన్నీ కోర్టుకు జీవనోపాధి కోసం చైన్నె వెళ్లిన కడపకు చెందిన రియాజ్, అతుల్లను మే 12 అర్ధరాత్రి దాటిన తర్వాత కడప చిన్నచౌక్ పోలీసులు చట్టవిరుద్ధంగా, కిడ్నాప్ తరహాలో అదుపులోకి తీసుకున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వారిద్దరినీ ఏపీ39జీజెడ్ 1608 నంబర్ గల స్విఫ్ట్ డిజైర్ కారులో గుట్టుచప్పుడు కాకుండా కడపకు తరలించారు. తాము చేసిన పని ఎవరికీ తెలియదనుకున్న పోలీసుల అతి తెలివికి చైన్నె లాడ్జి యాజమాన్యం గట్టి షాకే ఇచ్చింది. కడప పోలీసులు లాడ్జిలో చొరబడి బాధితులను ఈడ్చుకెళ్లిన విజువల్స్ మొత్తం అక్కడ ఉన్న సీసీటీవీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ య్యాయి. అంతటితో ఆగకుండా, దాడికి వచ్చిన కడప ఎస్ఐకి సంబంధించిన ఐడీ ఆధారాలు సైతం అక్కడ దొరికిపోయాయి. ఈ సాక్ష్యాలన్నింటినీ రియాజ్ తరఫు న్యాయవాదులు హైకోర్టుకు సమర్పించడంతో పోలీసులు అడ్డంగా బుక్కయ్యారు. గంజాయి డ్రామా ఫ్లాప్.. ఇప్పుడు పీడీ యాక్ట్ కుట్ర! హైకోర్టులో పిటిషన్ నంబర్ 14533/2026 ద్వారా హేబియస్ కార్పస్ కేసు దాఖలవడంతో.. ఆ ఉచ్చు నుంచి తప్పించుకోవడానికి మే 15న కడప వన్టౌన్ పోలీసులు పాతబస్టాండ్ వద్ద వీరిద్దరినీ గంజాయితో పట్టుకున్నామంటూ తప్పుడు కేసు బనాయించి రిమాండ్కు పంపారు. అయితే ఈ అక్రమ గంజాయి కేసు కోర్టులో నిలబడకపోవడంతో జూన్ 15న వీరికి బెయిల్ మంజూరైంది. కాగా, తమ అక్రమాలను ప్రశ్నిస్తూ హైకోర్టును ఆశ్రయించినందుకు ప్రతిఫలంగా.. బాధితులు ఇద్దరూ జైలు నుంచి విడుదల కాగానే వారిపై ఏకంగా పీడీ యాక్ట్ నమోదు చేయాలనే క్రూరమైన ఆలోచనలో పోలీసులు ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. అందుకోసమే గత మూడు రోజులుగా కడప సెంట్రల్ జైలు ప్రాంగణంలో చిన్నచౌక్, వన్టౌన్ పోలీసులు స్పెషల్ టీమ్లతో కలిసి వాహనాలలో తిష్ట వేసి కూర్చున్నారు. -
నేటి నుంచి ట్రిపుల్ ఐటీలో కౌన్సెలింగ్
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో 2026– 27 విద్యా సంవత్సరానికి సంబంధించి అడ్మిషన్ల ప్రక్రియ శుక్రవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 8:00 గంటలకు క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో కౌన్సెలింగ్ ప్రక్రియ జరుగుతుంది. అన్ని ఏర్పాట్లను అధికారులు పూర్తి చేసినట్లు డైరెక్టర్ ప్రొఫెసర్ గడ్డం విజయ్ ప్రకాష్ తెలిపారు. అందుకు సంబంధించి కొత్తగా వచ్చిన విద్యార్థులకు, తల్లితండ్రులకు భోజన వసతి, మౌలిక వసతులు తదితర ఏర్పాట్లు చేశారు. ముందుగా ట్రిపుల్ ఐటీ ముఖ ద్వారం వద్ద విద్యార్థులు టోకెన్ తీసుకుని సెంట్రల్ లైబ్రరీలో దరఖాస్తు పూర్తి చేసుకుని సర్టిఫికెట్లు వెరిఫికేషన్ ఉంటుంది. అనంతరం పదవ తరగతిలో పాసైన ఒరిజినల్ సర్టిఫికెట్లు, టీసీ, విద్యార్థి ఫోటోలు, తల్లిదండ్రుల ఫోటోలు తదితర వాటిని పొందుపరిచి అడ్మిషన్ పూర్తి చేస్తారు. రెండు రోజుల్లో 1,010 మందికి కౌన్సెలింగ్ : ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో ప్రథమ సంవత్సరంలో ప్రవేశం కోసం 19వ తేదీ శుక్రవారం 500 మంది అభ్యర్థులకు, 20వ తేదీ శనివారం 510 మంది అభ్యర్థులకు కౌన్సెలింగ్ నిర్వహించనున్నారు. ఇందుకోసం రాష్ట్రంలోని నలుమూలల నుంచి సీట్లు వచ్చిన అభ్యర్థులు పాల్గొననున్నారు. అభ్యర్థులందరికీ ఇప్పటికే ట్రిపుల్ ఐటీ అధికారులు కాల్ లెటర్లు, వారి మొబైళ్లకు సందేశాలు పంపించారు. అలాగే ఒంగోలు ట్రిపుల్ ఐటీ క్యాంపస్ కి సంబంధించి ఈనెల 22, 23 తేదీలలో ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ త్రిబుల్ ఐటీ క్యాంపస్లోనే అడ్మిషన్ల ప్రక్రియ జరుగుతుంది. జూలై 1వ తేదీ నుంచి తరగతులు ప్రారంభమవుతాయి. -
రెండేళ్లలో జిల్లా అభివృద్ధి శూన్యం !
● కూటమిపాలనలో ఏం ఒరిగిందో చెప్పని మంత్రులు, ఎమ్మెల్యేలు ● గత ప్రభుత్వంపై విమర్శలకే నేతల ప్రత్యేక శ్రద్ధ సాక్షి, మదనపల్లె: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ రెండేళ్లలో జిల్లాలో చేపట్టిన అభివృద్ధి శూన్యమనే విషయం రెండేళ్ల పండగ సభ సాక్షిగా తేలిపోయింది.గురువారం మదనపల్లెలోని ఓ కళ్యాణ మండపంలో రాష్ట్రంలో రెండేళ్ల నమ్మకం అభివృద్ధి, సంక్షేమం పేరిట ఓ ఉత్సవ సభను నిర్వహించారు. ఈ సభకు ఇద్దరు మంత్రులు, ఇద్దరు ఎమ్మెల్యేలు హాజరయ్యారు. టీడీపీ, జనసేన, బీజేపీ నేతలు వచ్చారు. జిల్లాలో చేపట్టిన అభివృద్ధి ఏమిటో చెప్పలేక విమర్శలు, ఆరోపణలు, గత ప్రభుత్వంపై నిందలు, చంద్రబాబుపై ప్రశంసలకే సభ పరిమితమై ముగిసింది. ఒక్క అభివృద్ధి మాట లేదు తొలుత కలెక్టర్ నిశాంత్కుమార్ జలధార, పింఛన్ల గురించి కొద్దిసేపు వివరించారు. ఆపై జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ.జనార్దన్ రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్ రెడ్డి హాజరై మాట్లాడుతూ గత పాలనలో ఏమి జరగలేదని, అభివృద్ధి, సంక్షేమం లేదని, కూటమి ప్రభుత్వం బాగుందని చెప్పుకున్నారు. స్థానిక ఎమ్మెల్యే షాజహాన్బాషా ఆత్మస్తుతి పరనిందకే పరిమితమయ్యారు. జిల్లాస్థాయిలో నిర్వహించిన ఈ సభలో ఈ రెండేళ్లలో ప్రభుత్వం జిల్లాకు ఏం అభివృద్ధి చేసింది అనే విషయాన్ని ఎవరూ చెప్పలేదు. జిల్లా కేంద్రం రాయచోటిని మదనపల్లెకు తరలించడం మినహా జరిగిన అభివృద్ధి ఏది లేదన్న విషయం మంత్రుల మాటల్లోనే తేటతెల్లమైంది. నిజంగా అభివృద్ధి జరిగి ఉంటే ఇద్దరు మంత్రులు తమ ప్రభుత్వం ఫలానా చేసిందని చెప్పుకుని ఉండేవారు కదా అని ప్రజలు కూడా చర్చించుకుంటున్నారు. చంద్రబాబు తెచ్చారట రూ.2,400 కోట్లతో వాటర్ గ్రిడ్ పథకాన్ని గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం వైఎస్.జగన్ మంజూరు చేసి పనులు చేపట్టారు. హంద్రీనీవా ప్రాజెక్టును దివంగత నేత వైఎస్సార్ చేపట్టారు. ఈ రెండు పనులు చేపట్టిన ఘనత చంద్రబాబుదని ఎమ్మెల్యే కిశోర్ కుమార్ రెడ్డి సభ సాక్షిగా అబద్ధాలు వల్లె వేయడం గమనార్హం. కిశోర్ కుమార్ రెడ్డి మాటలపై అక్కడికొచ్చిన ప్రజలే ముక్కున వేలేసుకున్నారు. ఇతరులు చేసిన పనిని తాము చేశామని చెప్పుకోవడం విడ్డూరమని చర్చించుకోవడం కనిపించింది. వేదిక నిండా నాయకులే అధికారిక కార్యక్రమమైనా వేదికపై కలెక్టర్ తప్ప మిగతా వాళ్లంతా కూటమికి చెందిన రాజకీయ నాయకులే ఉన్నారు. వారిలో అధికారిక హోదా కలిగిన ఎమ్మెల్యేలు, మంత్రులు, మరో ఇద్దరు మినహా అంతా పార్టీ క్యాడరే ఉన్నారు. రెండేళ్ల ప్రభుత్వ అభివృద్ధిపై నిర్వహించిన సభ టీడీపీ సభగానే ముగిసింది. సభ మధ్యలో మహిళలు, క్యాడర్ వెళ్ళిపోతుండగా ఎమ్మెల్యే మైక్ తీసుకొని కూర్చోమంటూ అభ్యర్థించారు. -
రాయల్గా తొలి విజయం
కడప సాక్షిప్రతినిధి: ఆంధ్ర ప్రీమియర్ లీగ్ 2026 సీజన్లో భాగంగా కడప వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో గురువారం జరిగిన డబుల్ హెడర్ తొలి మ్యాచ్లో రాయల్స్ ఆఫ్ రాయలసీమ తొలి వియం అందుకుంది. మధ్యాహ్నం 2 గంటలకు మొదలైన ఈ హై–స్కోరింగ్ థ్రిల్లర్ మ్యాచ్లో కాకినాడ కింగ్స్ విధ్వంసకర ఇన్నింగ్స్కు రాయల్స్ ఆఫ్ రాయలసీమ దూకుడుగా సమాధానమిచ్చి విజయాన్ని అందుకుంది. అభిషేక్ రెడ్డి సెంచరీ మొదట బ్యాటింగ్ చేసిన కాకినాడ కింగ్స్ జట్టుకు ఓపెనర్ అభిషేక్ రెడ్డి (60 బంతుల్లో 112 నాటౌట్) సునామీ సెంచరీకితోడు, ఆఖర్లో మిట్టా లేఖాజ్ రెడ్డి (17 బంతుల్లో 37) మెరుపులు మెరిపించడంతో నిర్ణీత 20 ఓవర్లలో 5 వికెట్లకు 211 పరుగుల భారీ కొండను బోర్డుపై ఉంచింది. తేజ, వాసుల వీరవిహారం! భారీ లక్ష్య చేధనలో రాయలసీమ ఓపెనర్లు ధ్రువ కుమార్ రెడ్డి (14), మామిడి వంశీ కృష్ణ (11)లు త్వరగానే అవుట్ అయ్యారు. ఆ తర్వాత వచ్చిన సీహెచ్ సాయి సందీప్ (26) ధాటిగా ఆడాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన గరిమెళ్ల తేజ అద్భుతమైన ఇన్నింగ్స్ ఆడాడు. కేవలం 43 బంతుల్లో 6 ఫోర్లు, 3 సిక్సర్లతో 76 పరుగులు సాధించి ఆఖరి వరకు నిలబడి జట్టును గెలిపించాడు. వై.తేజ రెడ్డి (41) ఇతనికి సహకారమందించాడు. లోయర్ ఆర్డర్లో వచ్చిన యాడ్ల వాసు కేవలం 14 బంతుల్లోనే 2 ఫోర్లు, 5 భారీ సిక్సర్లతో 42 పరుగులు సాధిం రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టు మరో 9 బంతులు మిగిలి ఉండగానే విజయాన్ని నమోదు చేసింది. ‘రాయల్’ విక్టరీ.. ‘కింగ్స్’పై సంచలన విజయం! గరిమెళ్ల తేజ(76) విధ్వంసం.. యాడ్ల వాసు(42) పరుగుల సునామీ 212 పరుగుల భారీ లక్ష్యాన్ని 18.3 ఓవర్లలోనే ఊదేసిన రాయల్స్! -
అమరావతిపై ‘లయన్స్’ పంజా!
సాక్షి ప్రతినిధి, కడప: కడప రాజారెడ్డి స్డేడియంలో గురువారం సాయంత్రం 6 గంటలకు జరిగిన మ్యాచ్లో సింహాద్రి వైజాగ్ లయన్స్, అమరావతి రాయల్స్పై 44పరుగుల తేడాతో గెలిచింది. టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన వైజాగ్ లయన్స్కు ప్రారంభంలోనే కెప్టెన్ రికీ భుయ్ (5) వికెట్ కోల్పోయి పెద్ద షాక్ తగిలింది. ఆ ఒత్తిడిని ఏమాత్రం క్షేత్రస్థాయిలోకి రానివ్వకుండా కోగటం హనీష్ వీరా రెడ్డి (34 బంతుల్లో 62), మహీప్ కుమార్ (41 బంతుల్లో 62) మూడో వికెట్కు అద్భుతమైన జుగల్ బందీ భాగస్వామ్యంతో ఇన్నింగ్స్ను నిలబెట్టారు. ఆఖర్లో మార్తల ధనుష్ 14 బంతుల్లోనే 3 ఫోర్లు, 3 భారీ సిక్సర్లతో 257 స్ట్రైక్ రేట్తో ఏకంగా 36 పరుగులు సాధించి ఫినిషర్ పాత్రను పోషించడంతో వైజాగ్ లయన్స్ 20 ఓవర్లలో 202 పరుగుల భారీ కొండను బోర్డుపై ఉంచగలిగింది. చేతులెత్తేసిన అమరావతి 203 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన అమరావతి రాయల్స్ జట్టుకు రన్ రేట్ ఒత్తిడి ఆరంభం నుంచే శాపంగా మారింది. కెప్టెన్ యర్రా సందీప్ (17), వరుణ్ సాత్విక్ (8)లు పవర్ప్లేలోనే వికెట్లు సమర్పించుకున్నారు. ఉప్పర గిరినాథ్ (37) కొద్దిసేపు నిలకడగా ఆడినా ‘రిటైర్ అవుట్’ కావడం ఆశ్చర్యపరిచింది. మిడిలార్డర్లో ఎస్.దుర్గ వరాప్రసాద్ (31 బంతుల్లో 42) ఒంటరి పోరాటం చేసినప్పటికీ, మరోవైపు కరణ్ షిండే (2), కేవీ శశికాంత్ (0) వంటి లీగ్ సీనియర్లు వైఫల్యం చెందడంతో అమరావతి 19 ఓవర్లలోనే 158 పరుగులకు ఆలౌట్ అయింది. వైజాగ్ లయన్స్ బౌలర్ల పంజా వైజాగ్ లయన్స్ భారీ స్కోరు చేయడమే కాకుండా బౌలింగ్లోనూ అత్యంత పదునైన వ్యూహాలను అమలు చేసింది. ముఖ్యంగా పి.గిరినాథ్ రెడ్డి (3/29) మిడిలార్డర్ వెన్ను విరవగా, కె.ప్రమోద్ కుమార్ (3/34) టెయిల్ ఎండర్లను క్లీన్ చేసి అమరావతి పతనాన్ని వేగవంతం చేశారు. షేక్ మహ్మద్ కామిల్ (3 ఓవర్లలో 13 రన్స్) అత్యంత పొదుపుగా బౌలింగ్ చేసి రన్ రేట్ పెరిగేలా ఒత్తిడి తెచ్చాడు. -
సరిహద్దు గ్రామాలు గజ గజ!
– మూడు రోజులుగా ఏనుగుల గుంపు విధ్వంసం సుండుపల్లె:శేషాచలం అటవీ ప్రాంతం నుంచి దారితప్పి వచ్చిన గజరాజుల గుంపులు సుండుపల్లె మండల పరిధిలోని ముడుంపాడు గ్రామ పంచాయతీలోని గోపాలకృష్ణపురం, నగిరి, ఆరోగ్యపురంతో పాటు మరికొన్ని సరిహద్దు ప్రాంతాలలోని పంట పొలాలలో మంగళవారం, బుధవారం అర్ధరాత్రి సమయాలలోవిరుచుకుపడ్డాయి. చేతికొచ్చిన మామిడి, కొబ్బరి తోటలను, వరినార్లను పూర్తిగా నాశనం చేశాయి. అలాగే పంట బోర్లు, నీటిసరఫరా పైపులైన్లు, పొలాల రక్షణకు వేసుకున్న కంచె కూసాలను సైతం ధ్వంసం చేసి రైతులకు ఆర్థిక నష్టాన్ని మిగిల్చాయి. ప్రస్తుతం తోటలలో మామిడికాయల కోతలు జోరుగా కొనసాగుతున్న తరుణంలో ఏనుగుల భయంతో తోటల్లోకి వెళ్లడానికి కూలీలు ససేమిరా అంటున్నారు. ఏనుగులు వరుసగా దాడులు చేస్తుండటంతో సుండుపల్లె, కేవీ పల్లె మండలాలలోని అటవీ ప్రాంత గ్రామాల ప్రజలు బిక్కుబిక్కుమంటున్నారు. గజరాజులు పల్లెలను ముట్టడిస్తున్నా అటవీ అధికారులు కంటితుడుపు చర్యలతో సరిపెడుతున్నారే తప్ప, వాటిని అడవిలోకి తోలేందుకు శాశ్వత చర్యలు చేపట్టడం లేదని రైతాంగం మండిపడుతోంది. -
అధునాతన గ్రౌండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఐదు రోజులు జరిగే ఏపీఎల్ క్రికెట్ పండుగ బుధవారం ప్రారంభమైంది. కాగా ఈ మ్యాచ్ల కోసం ఇప్పటికే గ్రౌండ్ను పలు అభివృద్ధి పనులు చేశారు. దీనికి సంబంధించి ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ వర్చువల్గా ప్రారంభించారు. దేశవాళీ మ్యాచ్లను సైతం కడప ఆతిథ్యం ఇవ్వాలని అధ్యక్ష కార్యదర్శులు ఆకాంక్షించారు. స్టేడియంను నూతనంగా రెన్యువెట్ చేస్తూ ఇన్ఫ్రాస్ట్రక్చర్ను అభివృద్ధి చేస్తూ మెరుగైన మ్యాచ్లు నిర్వహిస్తూ మంచి గ్రౌండ్గా తీర్చిదిద్దడమే లక్ష్యమని పేర్కొన్నా రు. రాబోయే రోజుల్లో మరింతగా సౌకర్యాలు పెంచి మరిన్ని మ్యాచులు కడప స్టేడియంలో జరిగే విధంగా చూస్తామని భరత్ రెడ్డి స్పష్టం చేశారు. ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ట్రెజరర్ శ్రీనివాస్, సి ఓ ఓ గిరీష్ డోంగ్రి , సీఏఓ జై కిషన్, ఏసీ ఏ గేమ్ డెవలప్మెంట్ మేనేజర్ ఎమ్మెస్ కుమార్, కడప క్రికెట్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ముని కుమార్ రెడ్డి, సెక్రటరీ రెడ్డి ప్రసాద్, స్టేడియం కమిటీ చైర్మన్ శ్రవణ్ కుమార్ రెడ్డి, కన్వీనర్ సంజయ్ కుమార్ రెడ్డి సిబ్బంది పాల్గొన్నారు. ఆకట్టుకున్న సునీత ప్రదర్శన ఏపీఎల్ మ్యాచ్ ప్రారంభం సందర్భంగా సినీ నేపధ్య గాయనీ సునీత తన గానమాధుర్యంతో అందరినీ అలరించా రు. సినిమాల్లో ఆలపించిన గీతాలతోపాటు ఇతర పాటలను పాడి అందరిలోనూ ఉత్తేజాన్ని నింపారు. ఏసీఏ అధ్యక్షుడు కేశినేని శివనాథ్, సెక్రటరీ సానా సతీష్ అభివృద్ధి పనులు వర్చువల్గా ప్రారంభం -
బతుకు చింత...విలువ ఎంత?
● ధరల్లేక పుంగనూరులో వందేళ్ల కుటీర పరిశ్రమ కుదేలు ● 15 వేల కుటుంబాల కన్నీరు ● సగానికి పడిపోయిన కోల్డ్ స్టోరేజ్ నిల్వలు ● రంగు మారుతున్న సరుకుతో వ్యాపారుల విలవిల ● నాడు జీఎస్టీ రద్దుతో అండగా నిలిచిన ‘పెద్దిరెడ్డి’ ● నేడు కూటమి పాలనలో కుప్పకూలిన మార్కెట్! పుంగనూరు: సుమారు శతాబ్ద కాలంగా నాణ్యమైన చింతపండు ఉత్పత్తికి పుంగనూరు దేశంలోనే ఎంతో ప్రసిద్ధి చెందింది. ఇక్కడి ‘నల్ల బంగారానికి’ అంతర్జాతీయంగానూ బ్రాండ్ ఇమేజ్ ఉంది. అయితే, వందేళ్ల ఘన చరిత్ర కలిగిన ఈ రంగం ఇప్పుడు పాలకుల నిర్లక్ష్యం, నిలకడలేని ధరల కారణంగా తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. నమ్ముకున్న 300 మందికి పైగా వ్యాపారులు నష్టాల ఊబిలో మునగగా, దీనిపైనే ఆధారపడిన 15వేల కూలీల కుటుంబాల బతుకులు రోడ్డున పడ్డాయి. దేశవ్యాప్త దిగుమతులు.. ఇళ్లే ఫ్యాక్టరీలు! పుంగనూరులో ఈ రంగం ఒక పెద్ద కుటీర పరిశ్రమగా విరాజిల్లుతోంది. కర్ణాటక (గుండల్పేట, మాండ్యా, చింతామణి, శ్రీనివాసపురం, సిరా), మహారాష్ట్ర (ఔరంగాబాద్), తెలంగాణ (నిజామాబాద్), బీహార్ (రాంచి), ఛత్తీస్గఢ్ (జగదల్పూర్, రాయపూర్) ప్రాంతాల నుంచి ఏటా సుమారు 50,000 టన్నుల చింతకాయలను (కట్టికాయ) ఇక్కడి వ్యాపారులు దిగుమతి చేసుకుంటారు. 300 మందికి పైగా వ్యాపారులు ఈ కాయలను నేరుగా కూలీల ఇళ్లకే పంపిస్తారు. పుంగనూరు నియోజకవర్గంతో పాటు పరిసర మండలాల్లో దాదాపు 15,000 కుటుంబాలు ఈ చింతకాయను శ్రీపూపండుశ్రీగా మార్చే పనిపైనే జీవిస్తున్నాయి. ‘చపాతీ’ల తయారీ 20 కేజీల కాయను కొట్టి పూపండుగా మార్చి, 25 చపాతీలు (ముద్దలు) తయారు చేస్తారు. ఒక్కో కుటుంబం రోజుకు 100 నుండి 150 చపాతీలు చేస్తుంది. ఒక్కో చపాతీకి రూ.12 కూలీ లభిస్తుంది. ‘బిస్కెట్’: 20 కేజీల పూపండును 75 అరకిలో బిస్కెట్ తరహా ప్లాస్టిక్ ప్యాకెట్లుగా ప్యాక్ చేస్తారు. ఒక ప్యాకెట్కు రూ. 8 చొప్పున కూలీ ఇస్తారు. రోజుకు ఒక్కొక్కరు 80 ప్యాకెట్ల వరకు ప్యాక్ చేస్తారు. ఇలా ఇళ్లలోనే తయారైన నాణ్యమైన చింతపండు మద్రాసు, చైన్నె, ప్రొద్దుటూరు, విజయవాడ, హైదరాబాద్, మంగళూరు వంటి మహానగరాలకు ఎగుమతి అవుతుంది. కోల్డ్ స్టోరేజీల లెక్కలు.. మగ్గిపోతున్న సరుకు! పుంగనూరు పట్టణంలో ఉన్న 8 కోల్డ్ స్టోరేజీలే ఈ వ్యాపారానికి ప్రాణాధారం. అయితే ప్రస్తుత సంక్షోభం ఇక్కడి నిల్వలపై స్పష్టంగా కనిపిస్తోంది. సాధారణంగా ప్రతియేటా ఈ గోడౌన్లలో సుమారు 3,000 లారీల చింతకాయను నిల్వ చేస్తారు. కానీ ఈసారి ధరలు నిలకడగా లేకపోవడం, వ్యాపారాలు మందకొడిగా సాగడంతో ప్రస్తుతం కేవలం 1,500 లారీల సరుకు మాత్రమే నిల్వ ఉంది. లకడ లేని ధరల కారణంగా గత రెండేళ్లుగా కోల్డ్స్టోరేజ్ల్లోనే చింతకాయ మగ్గిపోతోంది. సరుకు ఎక్కువ కాలం నిల్వ ఉండటంతో అది నల్లగా మారి రంగు కోల్పోతోంది. దీనివల్ల మార్కెట్లో క్వాలిటీ పడిపోయి, వ్యాపారులు, రైతులు తీవ్రంగా నష్టపోయే ప్రమాదం ముంచుకొచ్చింది. జూన్, జూలై నెలల్లోనైనా ధరలు కలిసివస్తాయని వ్యాపార వర్గాలు ఆశగా ఎదురుచూస్తున్నాయి. వైఎస్సార్సీపీ హయాంలో జీఎస్టీ రద్దు.. నేడు కూటమి నిర్లక్ష్యం! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పుంగనూరు చింతపండు వ్యాపారుల కష్టాలను గుర్తించి, మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలు ప్రత్యేక చొరవ తీసుకున్నారు. నాటి సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డితో కలిసి వారు కేంద్ర ప్రభుత్వంతో సుదీర్ఘంగా చర్చలు జరిపి, చింతపండుపై ఉన్న జీఎస్టీని పూర్తిగా తీసివేయించి చరిత్రాత్మక ఉపశమనాన్ని అందించారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వ హయాంలో ఈ వందేళ్ల పరిశ్రమ మళ్లీ మూలనపడింది. ధరల పతనంతో పరిశ్రమ కుదేలవుతున్నా, ప్రస్తుత పాలకులు కనీసం పట్టించుకోకపోవడంపై స్థానిక కార్మిక, వ్యాపార వర్గాలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నాయి. దేశానికే రుచి చూపించే పుంగనూరు నల్ల బంగారం నేడు పాలకుల ఉదాసీనత వల్ల వెలవెలబోతోంది. 15 వేల కుటుంబాల కళ్లల్లో ఆనందం చూడాలంటే కూటమి ప్రభుత్వం తక్షణమే స్పందించాలి. పుంగనూరు మార్కెట్ కమిటిలో కట్టికాయగా సిద్ధం చేసిన దృశ్యం, పుంగనూరు మార్కెట్ కమిటిలో లారీలలో దిగుమతి చేస్తున్న చింతకాయమార్కెట్లో ప్రస్తుత ధరల పట్టిక కట్టికాయ (లారీ సరుకు) : రూ. 4.50లక్షలు కట్టికాయ (కిలో) : రూ.45 పూపండు (కిలో) : రూ.70 నుంచి రూ.100 చపాతీ పండు (కిలో) : రూ.110 నుంచి 120 -
సెన్సేషనల్.. సన్షైనింగ్ !
చంద్రుడిలోని కాంతినంతా దోసిళ్లతో కుమ్మరించినట్లు .. కాంతి పుంజమేదో నేలపై వాలినట్లు.. ప్లడ్ లైట్లు వెలుగులు పంచగా.. ఆట మెరిసింది.. పాట విరిసింది.. తొలిసారి ‘ఏపీఎల్ పండగ’ కడపకు రాగా.. అభిమానుల గుండె గడప ఉత్సాహంతో నిండిపోయింది... పిల్లా జల్లా తరలిరాగా వైఎస్ రాజారెడ్డి స్టేడియం జనసంద్రమైంది.. మైదానంలో బ్యాటర్లు విజృంభించడంతో ‘బౌండరీ’ చిన్నబోయింది.. అప్పుడప్పుడూ బంతి చుక్కల్ని ముద్దాడుతూ సిక్సుగా మారింది.. గ్యాలరీలో క్రీడాభిమానుల కేరింతలకు మైదానం మురిసిపోయింది.. బుధవారం విజయవాడ సన్షైనర్స్, తుంగభద్ర వారియర్స్ జరిగిన మ్యాచ్ ఆద్యంతం రసవత్తరంగా సాగింది. క్రికెట్ జిల్లా వాసులకు కనువిందు చేసింది. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అశ్విన్ హెబ్బర్సాక్షి ప్రతినిధి, కడప : కడపలో బుధవారం జరిగిన మ్యా చ్లో విజయవాడ సన్ షైనర్స్ జట్టు, తుంగభద్ర వారియర్స్ జట్లు హోరాహోరీగా తలపడ్డాయి. ఆద్యంతం ఉత్కంఠభరితంగా సాగిన ఈ రసవత్తర పోరులో 19 పరుగుల తేడాతో తుంగభద్ర వారియర్స్పై విజయవాడ సన్ షైనర్స్ జట్టు సంచలన విజయాన్ని నమోదు చేసింది. టాస్ గెలిచిన విజయవాడ.. ముందుగా మ్యాచ్ ప్రారంభానికి గాను బీసీసీఐ మెంబర్ చాముండేశ్వరి నాథ్ టాస్ వేసి ఈ సీజన్ను అధికారికంగా ప్రారంభించారు. టాస్ గెలిచిన విజయవాడ సన్షైనర్స్ జట్టు కెప్టెన్ అశ్విన్ హెబ్బార్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. తొలుత ఇన్నింగ్స్ ప్రారంభించిన విజయవాడ ఓపెనర్ అశ్విన్ హెబ్బార్ మైదానంలో బౌండరీల వర్షం కురిపిస్తూ వీరవిహారం చేశాడు. కేవలం 48 బంతుల్లోనే 9 ఫోర్లు, 4 సిక్సర్లతో ఏకంగా 85 పరుగులు సాధించి జట్టుకు భారీ పునాది వేశాడు. అతనికి తోడుగా లోకల్ బాయ్, మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మెన్ జహీర్ అబ్బాస్ కూడా చెలరేగి ఆడాడు. కేవలం 25 బంతుల్లోనే 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు చేసి హాఫ్ సెంచరీతో విజృంభించాడు. దీంతో విజయవాడ సన్షైనర్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు మాత్రమే కోల్పోయి 198 పరుగుల భారీ స్కోరు సాధించింది. తుంగభద్ర బౌలర్లలో దీపక్ 2 వికెట్లు, హిమ శ్రీనివాస్ 2 వికెట్లు తీశారు. పోరాడి ఓడిన తుంగభద్ర వారియర్స్.. అనంతరం 199 పరుగుల భారీ విజయ లక్ష్యంతో బ్యాటింగ్ను ప్రారంభించిన తుంగభద్ర వారియర్స్ జట్టును విజయవాడ బౌలర్ భరత్ తన పదునైన బౌలింగ్తో వణికించాడు. అయితే, తుంగభద్ర ఓపెనర్ సమన్యు 24 బంతుల్లో 7 ఫోర్లు, 3 సిక్సర్లతో 51 పరుగులు చేసి గట్టిగా రాణించాడు. అతనికి తోడుగా సత్యనారాయణ 21 బంతుల్లో 4 ఫోర్లతో రాణించగా.. మ్యాచ్ ఆఖరిలో సౌరవ్కుమార్ 15 బంతుల్లో 2 ఫోర్లు, 2 సిక్సర్లతో (24 పరుగులు) ధాటిగా ఆడినప్పటికీ జట్టుకు విజయాన్ని అందించలేకపోయాడు. విజయవాడ సన్షైనర్స్ బౌలర్ భరత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 4 కీలక వికెట్లు పడగొట్టగా, సుమిత్ 2 వికెట్లు తీశారు. దీంతో తుంగభద్ర వారియర్స్ నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 179 పరుగులకే పరిమితమై ఓటమి పాలైంది. దంచికొట్టిన ఇన్నింగ్స్ ఆడిన విజయవాడ సన్షైనర్స్ బ్యాటర్ అశ్విన్ హెబ్బర్ ‘ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్’గా ఎంపికయ్యాడు. -
మహిళ ఆత్మహత్య
కేవీపల్లె : పురుగుల మందు తాగి మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ కుంటిమేకలవారిపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి కుంటిమేకలవారిపల్లెకు చెందిన ఎం. వెంకటరమణ, సులోచన (45)కు ఇరవై ఏళ్ల క్రితం వివాహమైంది. కుమారుడు లక్ష్మీనారాయణ తిరుమలలో ఓ దుకాణంలో పని చేస్తున్నాడు. కుమార్తె ధనలక్ష్మీ తొమ్మిదో తరగతి చదువుతోంది. బుధవారం ఇంటి వద్ద మనస్పర్థలతో భార్యాభర్తలు గొడవ పడ్డారు. అనంతరం వెంకటరమణ గొర్రెలు మేపుకోవడానికి వెళ్లాడు. క్షణికావేశానికి లోనైన సులోచన పురుగుల మందు తాగింది. తిరిగి ఇంటికి వచ్చిన వెంకటరమణ భార్య పరిస్థితి చూసి చికిత్స నిమిత్తం గర్నిమిట్ట పీహెచ్సీకి తరలించారు. అనంతరం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. భార్యపై కోపంతో ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : పెళ్లయి ఆరు నెలలు కూడా తిరగక ముందే ఓ యువకుడు తన భార్యపై కోపంతో విషం తాగి ఆత్మహత్యకు యత్నించాడు. కుటుంబ సభ్యుల కథనం మేరకు.. కురబలకోట మండలం, పిచ్చలవాండ్లపల్లి పంచాయతీ పంది వానిపెంటకు చెందిన ఓబులేసు కుమారుడు లోకేష్ (21) ఆరు నెలల క్రితం వివాహం చేసుకున్నాడు. భార్యా భర్తలు గొడవపడి లోకేష్ బుధవారం మనస్తాపంతో విషం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో వైద్యుల సలహామేరకు కుటుంబీకులు లోకేష్ను అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పీఎండీఎస్ విధానం లాభదాయకం రామాపురం : ప్రకృతి వ్యవసాయంలో పీఎండీఎస్ విధానం రైతులకు లాభదాయకమని అధికారులు పేర్కొన్నారు. జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ (డీపీఎం)వెంకటమోహన్, రీజియన్ కన్సల్టెంట్ చంద్రశేఖర్ ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాల అమలు, పీఎండీఎస్ విధానాన్ని పరిశీలించారు.ఈ సందర్బంగా వారు మాట్లాడుతూ వర్షాలు ప్రారంభం కాకముందే పైలైటెజేషన్ చేసిన విత్తనాలను విత్తడం ద్వారా తొలి వర్షాలను సమర్ధవంతంగా వినియోగించుకోవచ్చని,దీనివల్ల మొలకశాతం పెరిగి పంటల ఎదుగుదల మొరుగుపడుతుందని వివరించారు. అలాగే డీఆర్పీఎం నమూనా ద్వారా కరువు పరిస్థితులను ఎదుర్కోవడంతో పాటు నేలలో తేమను ఎక్కువకాలం నిల్వ ఉంచుకోవచ్చన్నారు. కార్యక్రమంలో ఎన్ఎఫ్ఏ యశోద,ఎం.టి మధుకర్,ఎంటిఎల్ భూపాల్రెడ్డి రైతులు, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. నగలు,నగదు అపహరణసంబేపల్లె : మండల పరిధిలోని గుట్టపల్లె గ్రామ కస్పాలో చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారి సమీంలో బుధవారం రాత్రి భారీ చోరి జరిగింది. వివరాలమేరకు అఖిల భారత పంచాయతీ పరిషత్ జనరల్ సెక్రటరీ, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు ఎం.చిదంబర్రెడ్డి నివాసంలోకి గుర్తు తెలియని వ్యక్తులు తలుపులు పగలకొట్టి చొరబడ్డారు. బీరువాలు, లాకర్లు ధ్వసం చేసి 400 గ్రామల బంగారం, 12 కిలోలు వెండి, రూ. 2 లక్షల నగదు, 30 పట్టుచీరలు దొంగలించినట్లు బాధితులు తెలిపారు. గత కొన్ని రోజులుగా చిదంబర్రెడ్డి కుటుంబసభ్యులతో కలిసి పొరుగు రాష్ట్రాల్లో ఉన్నారు. ఈ క్రమంలో ఇంటిలో ఎవరూ లేని సమయంలో చోరీ జరిగింది. చిదంబర్రెడ్డి నివాసం పక్కనే ఉన్న ఆంజనేయులు ఇంటిలో కూడా దొంగలు పడి రెండు రింగ్లను దొంగలించినట్లు తెలిపారు. విషయం తెలుసుకున్న రూరల్ సీఐ రోషన్, ఎస్ఐ రవికుమార్లు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. క్లూస్ టీమ్, డాగ్ స్కాడ్ చిదంబర్రెడ్డి ఇంటితో పాటు సమీప ప్రాంతాల్లో పరిశీలించారు. -
విద్యుత్ స్తంభం మీద పడి మహిళకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : విద్యుత్ స్తంభం మీద పడి ఓ మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం పుంగనూరు మండలంలో జరిగింది. బాధితురాలి కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని పాలెంపల్లె పంచాయతీ, సికారిపాలెంకు చెందిన చిన్న రాయుడు భార్య శాంతి (30) ఆధార్ కార్డు తీసుకునేందుకు తన చంటి బిడ్డను ఎత్తుకొని పాలెంపల్లెలోని సచివాలయం వద్దకు వెళ్లింది. అక్కడ విద్యుత్ స్తంభాలు కుప్పగా వేసి ఉండడంతో వాటి మీద కూర్చుని బిడ్డకు పాలు ఇస్తుండగా, ప్రమాదవశాత్తు స్తంభం కాలిమీదకు దొర్లి శాంతి కాలుకు తీవ్రగాయమైంది. బాధితురాలిని పుంగనూరు 108 సిబ్బంది చికిత్స కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు వెళ్లాలని వైద్యులు సూచించారు. రెండు బైక్లు ఢీకొని రైతుకు.. మదనపల్లె టౌన్ : సామసేను గట్లపై బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో కర్ణాటక రైతు తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్థుతం అతని పరిస్థితి విషమంగా మారింది. బి.కొత్తకోట పోలీసుల కథనం మేరకు వివరాలు.. కర్ణాటక రాష్ట్రంలోని రాయలపాడు మండలం, బాలేవారిపల్లెకు చెందిన రైతు గంగిరెడ్డి(60) సొంతపనిపై బైక్లో సరిహద్దులో ఉన్న బి.కొత్తకోట మండలం, గట్టుకు వచ్చాడు. అక్కడ పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా, సామసేను గట్లపై ఎదురుగా వచ్చిన మరో బైక్ గంగిరెడ్డి బైక్ను ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు.డాక్టర్లు పరీక్షించి, అతని పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు రైతును కర్ణాటకకు తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదుచేసిదర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆటో–బైక్ ఢీకొని మదనపల్లె టౌన్ : ఆటో, ద్విచక్ర వాహనం ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. బుధవారం కురబలకోట మండలంలో చోటు చేసుకున్న ఈ ఘటనపై ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లెకు చెందిన ఎస్. బాబాజాన్ (36) సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బయలుదేరాడు. కురబలకోట మండలం రైల్వే ఫ్లై ఓవర్ బ్రిడ్జి వద్దకు రాగానే ఆటో, బైక్ ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో గాయపడిని బాబాజాన్ను స్థానికులు జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతను చికిత్స పొందుతున్నాడు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. టమాట లారీ బోల్తాపడి.. ములకలచెరువు : అదుపుతప్పి టమాట లారీ బోల్తాపడటంతోపాటు ఒక కారును ఢీ కొంది. ఈ సంఘటనలో ఇద్దరికి స్వల్పగాయాలయ్యాయి. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... మదనపల్లె నుంచి మహారాష్ట్ర రాష్ట్రం పూణేకు టమాట లోడుతో వెళ్తున్న లారీ వేపూరికోట బ్రిడ్జిపై అదుపుతప్పి బోల్తాపడింది. సత్యసాయి జిల్లా గోరంట్ల నుంచి తిరుపతికి వెళ్తున్న కారును సైతం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారులో వెళ్తున్న లోకేష్(25), లక్ష్మిదేవమ్మ(55)లకు స్వల్పగాయాలయ్యాయి. లారీ రోడ్డుకు అడ్డంగా పడడంతో గంట సేపు ట్రాఫిక్ అంతరాయం కలిగింది. టమాటాలు నేలపాలయ్యాయి. సంఘటన స్థలానికి ఎస్ఐ ఉమామహేశ్వర్రెడ్డి చేరుకొని ట్రాఫిక్ అంతరాయం లేకుండా జేసీబీ సహాయంతో పక్కకు జరిపించారు. గాయపడిన వారిని మదనపల్లె ప్రభుత్వ హాస్పెటల్కు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
అదరగొట్టిన ‘లోకల్ బాయ్’
సాక్షి కడప : వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో విజయవాడ సన్ షైనర్స్ వర్సెస్ తుంగభద్ర వారియర్స్ మధ్య జరిగిన మ్యాచ్లో కడప లోకల్ బాయ్ అదరగొట్టాడు. విజయవాడ తరఫున మిడిల్ ఆర్డర్లో బరిలో దిగిన కడపకు చెందిన జహీర్ అబ్బాస్ కేవలం 25 బంతులలోనే నాలుగు 4 సిక్స్లు, మూడు ఫోర్లతో 52 పరుగులు చేశారు.. లోకల్ బాయ్ ఆడుతున్నప్పుడు ప్రేక్షకుల నుంచి విశేష ఆదరణ లభించింది అబ్బాస్ సిక్స్లు, ఫోర్లు కొట్టినప్పుడల్లా ‘పక్కా లోకల్’ పాటలతో స్టేడియం హోరెత్తిపోయింది. ఆకట్టుకున్న ‘రోబో’ కడపలోని వైయస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో రోబో ఆకట్టుకుంది. ప్రత్యేకంగా వీఐపీలు వచ్చిన సందర్భంలోనూ.. ఇతర కెప్టెన్లు టాస్కు వెళుతున్న సందర్భంలో రోబో అలా స్టేడియంలో కనిపించి సందడి చేసింది. జహీరో అబ్బాస్ 52 నాటౌట్ (24 బంతుల్లో) సిక్సర్లు 4, ఫోర్లు 3 -
దేశాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం
మదనపల్లె టౌన్ : దేశాభివృద్ధికి సమష్టిగా పనిచేద్దాం. రాష్ట్రానికి గత రెండు సంవత్సరాల్లో రూ.14 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి. దేశాన్ని సంక్షేమం దిశగా తీసుకుపోతున్నాం. రాయలసీమకు హైదరాబాద్, బెంగళూరు, చైన్నెలతో కలిపే మూడు ప్రధాన ఎకనామిక్ కారిడార్లు వచ్చాయని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు పీవీఎన్ మాధవ్ తెలిపారు. బుధవారం మదనపల్లె లోని శ్రీకృష్ణ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడిగా పులిరెడ్డి నరేంద్ర కుమార్ రెడ్డి ప్రమాణ స్వీకారం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా హాజరైన మాధవ్ మాట్లాడుతూ.. రాష్ట్రాన్ని అభివృద్ధి దిశగా ప్రధాని నరేంద్ర మోడీ తీసుకెళ్తున్నారని చెప్పారు. హార్టికల్చర్, ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లతో ఆహార భద్రతకు కేంద్ర ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందన్నారు. త్వరలో రాయలసీమ విజన్ డాక్యుమెంట్ తీసుకురావడానికి ఆలోలిస్తున్నామని పేర్కొన్నారు. విదేశీ వస్తువులను కొనవద్దని ఆయన సూచించారు. దేశ నిర్మాణంలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని పలుపునిచ్చారు. సమావేశంలో మాజీ సీఎం నల్లారి కిరణ్ కుమార్రెడ్డి, సాయిలోకేష్, శాసన మండలి డిప్యూటీ చైర్మన్ జకియాఖానం, డాక్టర్ అజంతుల్లా ఖాన్, భగవాన్, చల్లపల్లినరసింహారెడ్డి, ఎనుగొండ మధునాయుడు, తదితరులు పాల్గొన్నారు.బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ -
అడవి జంతువు దాడిలో ఆవు మృతి
చిన్నమండెం : మండల పరిధిలోని కొత్తపల్లె పంచాయతీ శ్రీనివాసపురం రిజర్వాయర్ పాత వట్టంవాండ్లపల్లెకు చెందిన రాపూరి ఆనంద్కు చెందిన ఆవు అడవి జంతువు దాడి చేయడంతో మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. బుధవారం తెల్లవారుజామున ఆవును అడవి జంతువు కొరికేయడంతో మృతిచెందింది. విషయం తెలుసుకున్న పశువైద్యాధకారి గణేష్, ఫారెస్ట్ ఎఫ్ఎస్ఓ భరణికుమార్, రఘుపతిరాజు, ఎఫ్బీఓ రెడ్డప్పలు సంఘటనా స్థలానికి చేరుకుని మృతిచెందిన ఆవును పరిశీలించారు. రైతు రాపూరి ఆనంద్కు 4 పెద్ద ఆవులు, 4 చిన్న ఆవులు ఉన్నాయి. మృతిచెందిన ఆవు విలువ రూ.1.10 లక్షలు ఉంటుందని ప్రభుత్వం తనను ఆదుకోవాలని రైతు కోరుతున్నాడు. పట్టపగలే చోరీచిన్నమండెం : మండల పరిధిలోని కేశాపురం గ్రామం దేవళంపేటలో బుధవారం పట్టపగలే చోరీ జరిగింది. టీచర్ రెడ్డప్ప ఇంట్లోకి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి చోరీకి పాల్పడ్డారు. బాధితుని కథనం మేరకు తన భార్య మధ్యా హ్నం ఇంటికి తాళం వేయకుండా పక్కనే ఉన్న అమ్మగారి ఇంటికి వెళ్లింది. తిరిగి వచ్చి చూడగా బీరువా తెరిచి ఉంది. అందులోని 50 గ్రాముల బంగారు, రూ.50 వేల నగదు చోరీకి గురైనట్లు గుర్తించామన్నారు. ఈ విషయమై చిన్నమండెం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్ఐ సుధాకర్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆరా తీశారు. లారీ ఢీకొని టమాటా రైతు మృతికలికిరి : కలికిరి టమాటా మార్కెట్ యార్డులో చోటు చేసుకున్న ట్రాక్టరు ప్రమాదంలో రైతు మృతి చెందిన ఘటన బుధవారం తెల్లవారుజామున చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు...సోమల మండలం తమ్మినాయునిపల్లి గ్రామం పేగలవారిపల్లికి చెందిన మల్లికార్జున(30) టమాటాలను డ్రైవర్ గౌతమ్ సాయంతో తన ట్రాక్టరులో బుధవారం ఉదయం 4 గంటలకు కలికిరి వ్యవసాయ మార్కెట్కు తీసుకొచ్చాడు. టమాటాలను అన్లోడ్ చేయడానికి ట్రాక్టరును రివర్స్ చేస్తుండగా వెనుకవైపునున్న లారీని ఢీకొంది. ట్రాక్టరు, లారీ మధ్యలో ఇరుక్కోవడంతో రైతు మల్లికార్జునకు తీవ్రగాయాలయ్యాయి. గమనించిన తోటి రైతులు, వ్యాపారులు గాయపడ్డ మల్లికార్జున కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. గాయపడిని వ్యక్తిని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అందించిన వైద్యులు మెరుగైన వైద్యం కోసం తిరుపతి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మల్లికార్జున మృతి చెందాడు. మృతుని తండ్రి చంద్రయ్య ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. -
పాత్రధారులకు శిక్షతో సరిపోతుందా!
‘పచ్చ’గా గంజాయి దందా..● కూటమి రాజ్యంలో బార్లా తెరిచిన అంతర్రాష్ట్ర సరిహద్దులు ● పల్లె పల్లెకూ విస్తరిస్తున్న మహమ్మారి! ● వరుస పట్టివేతలతో కదులుతున్న నెట్వర్క్! పెద్దతిప్పసముద్రం/ప్రొద్దుటూరు క్రైం : ఒకప్పుడు సాగునీరు, పాడిపంటలతో ప్రశాంతతకు కేరాఫ్ అడ్రస్గా నిలిచిన రాయలసీమ గడ్డ.. నేడు మత్తు పదార్థాల వ్యాపారులకు కాసుల వర్షం కురిపించే అడ్డాగా మారుతోంది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా విభజన తర్వాత ఏర్పాటైన కడప, అన్నమయ్య జిల్లాల్లో తెలుగుదేశం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి గంజాయి అక్రమ రవాణా, వినియోగం మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గతంలో ఎన్నడూ లేని విధంగా మారుమూల పల్లెల నుంచి నగరాల నడిబొడ్డు వరకు గంజాయి మహమ్మారి విచ్చలవిడిగా లభ్యమవుతోంది. అధికార పార్టీ నేతల అండదండలు పుష్కలంగా ఉండటంతో, పాత నేరస్థులు సైతం ఎటువంటి భయం లేకుండా బెంగళూరు, ఒరిస్సా వంటి పొరుగు రాష్ట్రాల నుంచి డ్రగ్స్ దిగుమతి చేసుకుంటూ యువతను సర్వనాశనం చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. టి.సదుం క్రాస్ వద్ద 2 కిలోల గంజాయి.. పాత నేరస్థుడికి పచ్చజెండా! అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలో తాజాగా జరిగిన గంజాయి పట్టివేత ఉదంతం క్షేత్రస్థాయిలో సాగుతోన్న అక్రమ వ్యాపారానికి నిలువెత్తు అద్దం పడుతోంది. మండలంలోని టి.సదుం క్రాస్ వద్ద పోలీసులు జరిపిన మెరుపు తనిఖీల్లో రెండు కిలోల గంజాయిని అక్రమంగా రవాణా చేస్తూ అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లిలోని బెంగళూరు రోడ్డు, గిరిరావ్ వీధికి చెందిన గంగిశెట్టి శివకుమార్ (22) అనే నిందితుడు పట్టుబడ్డాడు. నిందితుడి గత చరిత్రను పరిశీలించిన అధికారులకు విస్తుపోయే నిజాలు తెలిశాయి. ఇతను గతంలోనూ బెంగళూరులో గంజాయిని కొనుగోలు చేసి ఇక్కడి పరిసర ప్రాంతాల్లో విక్రయిస్తూ మదనపల్లి వన్ టౌన్, టూ టౌన్ పోలీసులకు పట్టుబడి జైలు శిక్ష కూడా అనుభవించి వచ్చాడు. ప్రొద్దుటూరు శివారులో.. మరోవైపు కడప జిల్లా ప్రొద్దుటూరు పట్టణ శివారులోని కొత్తపల్లె సర్కిల్ వద్ద ఎకై ్సజ్ పోలీసులు జరిపిన దాడిలో అంతర్రాష్ట్ర గంజాయి నెట్వర్క్ మరో ముక్క బయటపడింది. ఎకై ్సజ్ సీఐ సురేంద్రారెడ్డి, కడప ఎన్ఫోర్స్మెంట్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ ఎం.నీలకంఠారెడ్డిలు సంయుక్తంగా మైదుకూరు రోడ్డులో తనిఖీలు చేపట్టారు. కొత్తపల్లె సర్కిల్ వద్ద ప్లాస్టిక్ సంచిని చేతిలో పట్టుకుని అనుమానాస్పదంగా తిరుగుతున్న పెరుగు అనిల్ కుమార్ అనే యువకుడు, అధికారుల వాహనాలను చూసి పారిపోవడానికి ప్రయత్నించగా ఎకై ్సజ్ సిబ్బంది వెంటాడి అదుపులోకి తీసుకున్నారు. కమలాపురం మండలంలోని సంబటూరు గ్రామానికి చెందిన పెరుగు అనిల్ గతంలో వ్యాపారం చేసేవాడు. ఇటీవల నష్టాలు రావడంతో కుటుంబ పోషణ సాకుతో, సులభంగా డబ్బు సంపాదించేందుకు గంజాయి దందాలోకి దిగాడు. ఒరిస్సాలోని బరంపురం ప్రాంతానికి చెందిన గుర్తు తెలియని వ్యక్తుల వద్ద నుంచి ఈ గంజాయిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఇక్కడికి తీసుకువస్తున్నట్లు నిందితుడు ఎకై ్సజ్ అధికారుల ఎదుట ఒప్పుకున్నాడు. అతని వద్ద నుంచి స్వాధీనం చేసుకున్న 3.5 కిలోల ఎండు గంజాయి విలువ మార్కెట్లో రూ. 40 వేల పైనే ఉంటుందని అధికారులు నిర్ధారించారు. గతంలో భారీ నెట్వర్క్లపై వేటు.. నేడు పాలకుల ఉదాసీనత! కడప, అన్నమయ్య జిల్లాల సరిహద్దు ప్రాంతాల్లో గంజాయి ముఠాల కదలికలు కొత్తేమీ కాదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పీటీఎం–ములకలచెరువు మండలాల సరిహద్దు ప్రాంతమైన సండ్రడవి వద్ద ఏకంగా 104 కిలోల గంజాయితో పాటు 12 మంది నిందితులను వాహనాలతో సహా పట్టుకుని యంత్రాంగం ఉక్కుపాదం మోపింది.కానీ కూటమి సర్కారు కొలువుదీరిన తర్వాత మళ్లీ పాత నెట్వర్క్లు పుంజుకున్నాయి. అధికార పార్టీ నేతలు జూదం, క్రికెట్ బెట్టింగులు, ఇసుక, మట్టి మాఫియాల్లో మునిగితేలుతూ సొంత లాభాలు చూసుకుంటున్నారే తప్ప, జిల్లాలో యువతను నిర్వీర్యం చేస్తోన్న గంజాయి కట్టడిపై చిత్తశుద్ధి చూపడం లేదని ప్రతిపక్షాలు మండిపడుతున్నాయి. అయితే ఈ నల్లమందు సామ్రాజ్యం వెనుక ఉన్న అసలు సిసలైన ’పెద్ద తలకాయల’ను ఎందుకు పట్టుకోవడం లేదనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఈ రెండు జిల్లాలను డ్రగ్స్ రహితంగా మార్చాలంటే కేవలం చిన్న చిన్న పాత్రధారులను కాకుండా, అధికార పార్టీ అండతో చెలరేగిపోతోన్న ప్రధాన గంజాయి మాఫియా డెన్లపై సర్జికల్ స్ట్రైక్ చేయాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు.గ్రామాలకు పాకిన మహమ్మారి.. గాడి తప్పుతున్న యువత! గతంలో కేవలం పెద్ద నగరాలు, పట్టణాలకే పరిమితమైన గంజాయి అమ్మకాలను వ్యాపారస్థులు నేడు మారుమూల గ్రామాలకు సైతం విస్తరింపజేశారు. ప్రొద్దుటూరులో పట్టుబడిన అనిల్, పరిసర ప్రాంతాల్లోని కళాశాల విద్యార్థులకు, రోజువారీ కూలీలకు నిత్యం గంజాయి విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నాడు. గంజాయి అమ్మకాలు, వినియోగానికి ఊరి చివర ప్రాంతాలు, ప్రహరీ గోడల వెనుక, నిర్మానుష్య ప్రదేశాలను అడ్డాగా మార్చుకుని విక్రేతలు దర్జాగా దందా సాగిస్తున్నారు. పరిసర మండలాల్లో విచ్చలవిడిగా విక్రయాలు జరుగుతుండటంతో యువత మత్తులో మునిగి తేలుతోంది. మత్తుకు బానిసలైన యువత తమ జీవితాలను అర్ధాంతరంగా చేతులారా నాశనం చేసుకుంటున్నారు. ఫలితంగా కన్నవాళ్ళు కన్నీరు మున్నీరు అవుతున్నారు. ‘పచ్చ‘నోట్ల కక్కుర్తి కోసం సాగుతున్న ఈ గంజాయి దందా..పచ్చని జిల్లాల భవిష్యత్తును బుగ్గిపాలు చేస్తోంది. పాలకపార్టీలకు చెందిన కొందరు నాయకుల అండతో సాగుతున్న ఈ అక్రమ నెట్వర్క్ను అణచివేయకపోతే యువత మత్తు ఊబిలో కూరుకుపోయే ప్రమాదం పొంచి ఉంది. -
ఆలయ భూముల ఆక్రమణలపై చర్యలు తీసుకోగలరా?
చౌడేపల్లె : కోట్లాది రూపాయల విలువ చేసే మృత్యుంజయేశ్వరస్వామి ఆలయానికి చెందిన భూములు ఆక్రమణలకు గురయ్యాయని, దమ్ముంటే వాటిని స్వాధీనం చేసుకొనే సత్తా మీకుందా అంటూ దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ (ఏసీ) విశ్వనాథ్ను అర్చకుడు ప్రశ్నించారు. బుధవారం స్థానిక మృత్యుంజయేశ్వరస్వామి ఆలయంలో వివిధ సేవా టికెట్ల అనధికార వసూళ్లపై విచారణ చేపట్టారు. ఈ ఏడాది జనవరి 26 నుంచి ఆలయంలో భక్తుల నుంచి వివిధ సేవాటికెట్లు వసూలు చేయాలని కమిషనర్ నుంచి ఆదేశాలు వచ్చాయన్నారు. ఆ శాఖ అధికారులు టికెట్లు విక్రయించే క్రమంలో అర్చకులు, సిబ్బంది మధ్య ప్రతిరోజూ వాగ్వాదం జరుగుతోంది. దీంతో అధికారులు టికెట్లు వసూలు చేయరాదని అర్చకులు హైకోర్టు న్యాయస్థానంలో ఫిల్ దాఖలు చేశారు. భక్తులనుంచి అర్చకులు నాలుగు సొంత ఖాతాలకు నగదు అధిక మొత్తంలో జమ అయినట్లు విచారణలో గుర్తించినట్లు విశ్వనాథ్ తెలిపారు. టికెట్లను సిబ్బంది, అర్చకుల సమన్వంతో విక్రయించి వచ్చిన ఆదాయాన్ని ఆలయ ఖాతాకు జమ చేసి వాటిని జీతం, ఆలయ నిర్వహణకు అధికారిక ఉత్తర్వుల రూపంలో చెల్లిస్తామని ఏసీ చెప్పడంతో అర్చకులు ససేమిరా అన్నారు. కోర్టులో కేసు విచారణ పూర్తయ్యేవరకు టికెట్లు విక్రయించరాదని అర్చకులు వాదించారు. కోర్టు ఉత్తర్వులు వెలువడేంతవరకు యధావిధిగా దేవదాయశాఖ సిబ్బంటి సేవా టికెట్లు విక్రయిస్తారని వారికి అర్చకులు సహకరించాలని సూచించారు.అర్చకత్వం కోసం కేటాయించిన సుమారు 70 ఎకరాల భూములు ఆక్రమణకు గురయ్యాయని వాటిని తమకు స్వాదీనం చేయాలని ఏసీకి విన్నవించారు. దేవదాయశాఖ ఇన్స్పెక్టర్ శశికుమార్, ఈఓ రమణ, సిబ్బంది వెంకటరమణ, అర్చకులు సుబ్రమణ్యం, కుమారస్వామి, మహేష్ ఉన్నారు. ఆలయానికి సుమారు 375 ఎకరాల మాన్యం, ఇనాం భూములున్నాయని, అవి ఆక్రమణదారుల చెరలో ఉన్నాయని దేవదాయశాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్కు అర్చకులు వివరించారు. వాటిని స్వాధీనం చేసుకొవాలని కోరుతూ ఇదివరకే 14 కేసులు కోర్టులో వేశామని, విచారణ వివిధ దశలో ఉనట్లు విశ్వనాథ్ వెల్లడించారు. పూర్వీకులనుంచి స్వామివారికి కలిగిన ఆభరణాలు, ఆస్తులు, చరిత్ర పై ఆరా తీస్తూ విచారణ చేపట్టారు.దేవదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్తో అర్చకుడు -
హామీలు నెరవేర్చకుండా పర్యటనలా?
సాక్షి, మదనపల్లె : మదనపల్లె వాసులకు చంద్రబాబు హామీలను నెరవేర్చకుండా పర్యటనకు రావడం సిగ్గుచేటని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు విమర్శించారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో విద్య, వైద్యం నీరుగారిపోయిందని, మెడికల్ కాలేజీని గత ప్రభుత్వం మంజూరు చేస్తే దాన్ని ప్రైవేటుకు ఇచ్చేందకు ప్రయత్నించి నిర్వీర్యం చేశారని ఆరోపించారు. బీటీ కళాశాలలో ఇంటర్మీడియట్, పీజీ కోర్సులు లేకుండా చేశారన్నారు. కృష్ణా జలాలను కుప్పంకు తరలించుకుని కరువు ప్రాంతాలపై నిర్లక్షం చేస్తారా అని ప్రశ్నించారు. ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి ఆక్రమణలు తొలగించి రోడ్లను వెడల్పు చేసి, సిగ్నల్ లైట్ సిస్టం తీసుకురావాలని, హబ్ ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. కలికిరి, పీలేరు ప్రాంతాల్లో పరిశ్రమల కోసం తీసుకున్న భూములను ప్రభుత్వం వెనక్కి తీసుకొని పరిశ్రమలు ఏర్పాటు చేసే ఔత్సాహికులకు ఇచ్చి పరిశ్రమలు ఏర్పాటుకు తగు చర్యలు చేపట్టాలన్నారు. మదనపల్లెకు ఏయే హామీలు నెరవేర్చబోతున్నారో చంద్రబాబు ప్రకటించిన తర్వాతే ఇక్కడికి రావాలన్నారు. నాయకులు మండెం సుధీర్, నాగరాజుపాల్గొన్నారు. -
అ..అంటే అమ్మ.. ఆ.. అంటే ఆకాంక్ష!
అమ్మ ప్రేమకు హద్దులు లేవు.. ఆమె బాధ్యతకు సమయపాలన లేదు. ఓ వైపు కుటుంబ పోషణ కోసం నమ్ముకున్న వృత్తిపై బాధ్యత, మరోవైపు బిడ్డ భవిష్యత్తు బాగుండాలనే ఆకాంక్ష. ఈ రెంటినీ సమన్వయం చేస్తూ ఒక శ్రామిక తల్లి పడుతున్న తపన మదనపల్లె–తంబళ్లపల్లె ప్రధాన రహదారిలోని ఓ పెట్రోల్ బంకులో మంగళవారం సాక్షాత్కరించింది. సదరు మహిళ స్థానిక ఇండియన్ ఆయిల్ పెట్రోల్ బంకులో పంప్ ఉమెన్గా విధులు నిర్వహిస్తోంది. పాఠశాల సమయం ముగిసిన తర్వాత ఆమె కుమార్తె నేరుగా తల్లి పనిచేసే బంకు వద్దకు చేరుకుంది. వాహనాలకు పెట్రోల్ పోసే పని ఒత్తిడి నడుమ.. కాస్త ఖాళీ సమయం దొరికినా విసుగు చెందకుండా తన బిడ్డ పక్కన కూర్చుంటోంది. బంకు మెట్లపైనే కూతురిని కూర్చోబెట్టుకుని, ఉపాధ్యాయులు ఇచ్చిన హోంవర్క్ బుక్ను దగ్గరుండి పరిశీలిస్తూ, ఎలా రాయా లో ఓపికగా నేర్పిస్తోంది. బిడ్డను మంచి ప్రయోజకురాలిని చేయాలనే ఆ తల్లి తపన కన్నప్రేమకు, శ్రమజీవుల నిరంతర పోరాటానికి నిలువెత్తు అద్దం పడుతోంది. – మదనపల్లె సిటీ. -
మాకు బడి, గుడి, ఆస్పత్రి, వీధిలైట్లు కావాలి
మేము రెండేళ్లుగా ఇక్కడ కాపురం ఉంటున్నాము. అయితే మాకు, మా పిల్లలకు కావాల్సిన వసతులు లేకపోవడంతో చాలా ఇబ్బంది పడుతున్నాము. కనీసం ఇన్ని ఇళ్లకు ఒక ఆస్పత్రి కూడా ఏర్పాటు చేయలేదు. బడి లేదు. చిన్న పిల్లలను బడికి పంపాలంటే సుమారు 3 కిలోమీటర్ల దూరం తీసుకెళ్లాలి. 6వ తరగతి నుంచి 10వ తరగతి వరకు ఇక్కడే బడి ఏర్పాటు చేయాలి. ఏదైనా జబ్బు చేస్తే రాయచోటి ఆస్పత్రులకు ఆటో ద్వారా వెళ్లాల్సి వస్తోంది. సామూహికంగా పూజలు చేసుకొనేందుకు గుడి లేదు. మూడు రోజుల క్రితం ఇంటి బయట నిద్రిస్తున్న సమయంలో మా ఇంటిలోకి పాము వచ్చింది. వీధిలైట్లు వెలుగుతూ ఉంటే పాముల భయం ఉండదు. – ఝాన్సీ, లబ్ధిదారురాలు, జగనన్న కాలనీ. -
ఆహ్లాదం దూరం.. సమస్యలు విహారం
పీలేరు రూరల్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పిల్లలకు, పెద్దలకు ఆహ్లాదాన్ని నింపిన పార్కు.. నేడు నిర్వహణ లోపంతో పూర్తిగా నిర్వీర్యం అయ్యే పరిస్థితి నెలకొంది. వివరాల్లోకి వెళితే... దినదినాభివృద్ధి చెందుతున్న పీలేరులో ప్రజల చిరకాల వాంఛ అయిన పార్క్ను గత ప్రభుత్వ హయాంలో రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కృషితో ఏర్పాటు చేశారు. ఎన్నో ఏళ్లుగా పీలేరు పట్టణంలో పిల్లల ఆట విడుపు, పెద్దల విశ్రాంతికి, వాకింగ్ చేసుకోవడానికి పార్కు లేకపోవడంతో చాలా నిరుత్సాహంగా ఉండేవారు. ఇలాంటి తరుణంలో ప్రత్యేక చొరవ చూపి పార్క్ (శ్రీ కాశీవిశాలాక్షి ఉద్యానవనం) ఏర్పాటు చేశారు. పీలేరు పట్టణం నడిబొడ్డున కోటపల్లె జిల్లా పరిషత్ బాలికల పాఠశాల ఎదురుగా సర్వే నంబరు 493లో రెండెకరాల స్థలం పార్క్ కోసం కేటాయించారు. ఎంపీ, మాజీ ఎమ్మెల్యే ప్రత్యేక చొరవతో పార్క్కు కావాల్సిన స్థలాన్ని అభివృద్ధి చేశారు. సుమారు రూ.20 లక్షలతో ఈ స్థలంలో పెద్దలకు అనుగుణంగా వాకింగ్ ట్రాక్లు, విశ్రాంతి బల్లలు ఏర్పాటు చేశారు. ఆహ్లాదకర వాతావరణం నింపడానికి వివిధ రకాల ఆకర్షణీయమైన పూల మొక్కలు, పచ్చదనం నింపేలా స్పాంజ్ గ్రాస్ ఏర్పాటు, చిన్న చిన్న ఫంక్షన్లు నిర్వహించుకోవడానికి ఓపెన్ ఆడిటోరియం ఏర్పాటు చేశారు. వెలగని విద్యుత్ దీపాలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం పార్క్ నిర్వహణ గురించి పట్టించుకోకపోవడంతో నిర్వీర్యం అవుతోంది. గ్రామ పంచాయతీ అధికారులు గానీ, నాయకులు గానీ పార్క్ నిర్వహణపై పూర్తిగా విస్మరించడంతో రోజురోజుకు దయనీయంగా తయారైంది. ప్రస్తుతం పార్క్లో గ్రాస్, మొక్కలు మొత్తం ఎండిపోయిన పరిస్థితి నెలకొంది. పిల్లల ఆటవిడపు వస్తువులు, కూర్చుని సేద తీరే బల్లలు విరిగిపోయాయి. రాత్రి సమయంలో విద్యుత్ దీపాలు కూడా వెలగక పోవడంతో పార్క్ అంధకారంలోకి వెళ్లి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారింది. ప్రస్తుతం పార్క్లో యువకులు క్రికెట్ ఆడుకుంటూ క్రీడామైదానంగా మార్చేశారు. మరోవైపు పశువులను పార్క్లో మేపుతున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో పార్కు ఏర్పాటు కూటమి పాలనలో అటకెక్కిన నిర్వహణ పూర్తిగా ఎండిపోయిన స్పాంజ్ గ్రాస్పీలేరు పంచాయతీ పరిధిలోని పార్కును అభివృద్ధి చేసేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నాం. పంచాయతీ నిధులతో ఇద్దరు వాచ్మెన్లను ఏర్పాటు చేస్తాం. అలాగే పార్కులో అన్ని సౌకర్యాలు కల్పించేందుకు కృషి చేస్తాం. పట్టణ ప్రజలకు ఆహ్లాదకరమైన వాతావరణం కల్పించడానికి పంచాయతీ నిధులు కేటాయించి అభివృద్ధి చేస్తాం. పశువులు లోనికి వెళ్లకుండా పార్క్కు ఫెన్సింగ్ వేపిస్తాం. – బ్రహ్మానందరెడ్డి, ఈవో, పీలేరు -
ఏపీఎల్కు సర్వం సిద్ధం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలో తొలిసారిగా నిర్వహించనున్న ఆంధ్ర ప్రీమియర్ లీగ్ సీజన్–5 మ్యాచ్ల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని ఏసీఏ ఇన్ఫ్రా స్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ సభ్యుడు భరత్రెడ్డి తెలిపారు. మంగళవారం నగర శివార్లలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. బుధవారం నుంచి మ్యాచ్లు ప్రారంభమవుతాయన్నారు. రిమ్స్ సమీపంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో జరుగుతున్న ఏపీఎల్ మ్యాచ్లను జిల్లా ప్రజలు వీక్షించి ప్రోత్సహించాలన్నారు. ఈ మ్యాచ్ల్లో కడపకు చెందిన 9 మంది క్రీడాకారులు ఆడనున్నట్లు వివరించారు. ఎటువంటి ఎంట్రీ ఫీజు లేదని, ఉచితంగా మ్యాచ్లను వీక్షించవచ్చని తెలిపారు. బీసీసీఐ మెంబర్ చాముండేశ్వరినాథ్తో పాటు ఏసీఏ నుంచి పలువురు పెద్దలు హాజరు కానున్నారన్నారు. ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ సీఈఓ గిరీష్ గోగ్రే, ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ హెడ్ కోచ్ గ్యారీ స్టేడ్, జిల్లా క్రికెట్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి రెడ్డిప్రసాద్, అధ్యక్షుడు మునికుమార్రెడ్డి, స్టేడియం కమిటీ మెంబర్ సంజయ్కుమార్ పాల్గొన్నారు. -
కన్నవారే..కంటిపాప !
పుంగనూరు: కాలం పడగ విప్పితే కన్నీళ్లే జీవితమవుతాయి. వృద్ధాప్యంలో కొడుకులు చేతికర్రలై నడిపిస్తారని ఆశపడ్డ ఆ వృద్ధ తల్లిదండ్రులకు.. ఇప్పుడు వారే ఆ కొడుకులకు కంటిచూపుగా మారాల్సి వచ్చింది. నడి వయసులో తమను మహారాజుల్లా చూసుకోవాల్సిన బిడ్డలు.. అంధత్వంతో కదలలేని స్థితికి చేరుకుంటే, ఏడు పదుల వయసులోనూ ఆ దంపతులు కన్నీళ్లను గుండెల్లోనే దాచుకుంటూ కన్నప్రేమను పంచుతున్నారు. పుంగనూరులో వెలుగుచూసిన ఈ హృదయవిదారక గాథ, సమాజంలో మాసి పోని మానవత్వానికి.. కన్నప్రేమకు నిదర్శనంగా నిలిచింది. ఎలిమెంటరీ స్కూల్కు వెళ్లే వయసులోనే అలుముకున్న చీకటి మండలంలోని బత్తలాపురం గ్రామానికి చెందిన ఈటి అగిస్తి, జయమ్మ దంపతులు కూలీపని చేసి జీవిస్తున్నారు. వీరికి ఇద్దరు కుమారులు. పెద్ద కుమారుడు మోహన్కు ఇప్పుడు 36 ఏళ్లు, చిన్న కుమారుడు గోపినాథ్కు 34 ఏళ్లు. మోహన్ చిన్నప్పుడు ఎలిమెంటరీ స్కూల్లో చేరే సమయంలో హఠాత్తుగా కనుచూపు మందగించింది. ఆ విధి వంచన అంతటితో ఆగలేదు. అదే సమయంలో రెండో కుమారుడు గోపినాథ్ కూడా చూపు కనపడకుండా పడిపోయాడు. ఆందోళన చెందిన తల్లిదండ్రులు ఉన్నదంతా అమ్ముకుని, అప్పులు చేసి ఎన్నో ఆసుపత్రుల చుట్టూ తిరిగారు. కానీ ఏ డాక్టరూ వారి జీవితాల్లో వెలుగులు నింపలేకపోయారు. ఆ రోజు నుంచి ఆ పసివాళ్ల ఆలనా, పాలనా పూర్తిగా ఈ పేద తల్లిదండ్రులపైనే పడింది. ఏడు పదుల వయసులో.. అవిశ్రాంత శ్రామికుడు ప్రస్తుతం 70 ఏళ్ల వయసులో ఉన్న ఈటి అగస్తి నిజానికి శారీరకంగా విశ్రాంతి తీసుకోవాల్సిన సమయం. కానీ, కన్నప్రేమ ఆ ముసలి దేహానికి కొండంత బలా న్ని ఇస్తోంది. ఏమాత్రం విసుగు చెందకుండా ఉద యం లేవగానే కొడుకులు మోహన్, గోపినాథ్లను చేతులు పట్టుకుని తీసుకెళ్లి కాలకృత్యాలు తీరుస్తాడు. ఉదయం 9 గంటలకల్లా ఇద్దరికీ స్వయంగా స్నానం చేయించి, అల్పాహారం తినిపించి, బట్టలు వేసి, తలకు నూనె పెట్టి దువ్వడం వరకు ప్రతి ఒక్క కార్యక్రమాన్ని తండ్రే ‘అన్నీ తానై’ చూసుకుంటున్నాడు. రెక్కాడితే గాని డొక్కాడని బతుకులు మరోవైపు తల్లి జయమ్మ వంటచేసి పిల్లలకు పెట్టడం, ఆ తర్వాత వృద్ధ దంపతులిద్దరూ కలిసి పొట్టకూటి కోసం కూలీ పనులకు వెళ్లడం వీరి దినచర్యగా మారింది. తాము పనికి వెళ్తేనే ఇల్లు గడుస్తుంది. కానీ ఇంట్లో కదలలేని స్థితిలో ఉన్న ఇద్దరు కొడుకులను వదిలి వెళ్లడం వారికి ప్రతిరోజూ నరకప్రాయంగా మారుతోంది. ‘మా ముసలితనం మాకు భారమైపోతోంది. ఒంట్లో ఓపిక నశిస్తోంది. కానీ, మేము కనుమూస్తే మా ఇద్దరు అంధ కొడుకులను ఎవరు చూస్తారనే భయమే మమ్మల్ని బతికిస్తోంది’ అని ఆ వృద్ధ తండ్రి కన్నీళ్లు పెట్టుకుంటుంటే స్థానికుల గుండెలు చెరువవుతున్నా యి. వయసు ఉడిగిపోయినా, దేహం సహకరించకపోయినా కొడుకుల కోసం అహర్నిశలు శ్రమిస్తున్న ఆ తల్లిదండ్రుల ప్రేమే.. ఆ చీకటి జీవితాలకు వెలుగు. ప్రభుత్వం స్పందించి ఈ కుటుంబానికి ఆసరాగా నిలవాల్సిన అవసరం ఎంతైనా ఉంది. బత్తలాపురంలో గుండెలను పిండేస్తున్న వృద్ధ దంపతుల జీవన పోరాటం అంధత్వపు చీకట్లలో కుమారులు ఏడు పదుల వయసులోనూ ఆరని కన్నప్రేమ కూలీ పనులకు వెళ్తూనే.. ముప్పై ఏళ్లుగా కొడుకులకు అన్నీ తానైన తల్లిదండ్రులు -
పుంగనూరులో పచ్చసెగలు!
పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో విభేదాలు ఒక్కసారిగా రోడ్డుకెక్కాయి. స్థానిక టీడీపీ ముఖ్య నేత (ఇన్ఛార్జ్) అవినీతి అక్రమాలకు పాల్పడుతూ, సొంత క్యాడర్ను ఇబ్బంది పెడుతూ పార్టీకి తీవ్ర నష్టం చేకూరుస్తున్నారంటూ నియోజకవర్గానికి చెందిన కీలక అసమ్మతి నేతలు మంగళవారం మంగళగిరిలోని పార్టీ కేంద్ర కార్యాలయంలో రాష్ట్ర మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ను నేరుగా కలిసి ఫిర్యాదు చేశారు. నియోజకవర్గంలో తక్షణమే తగిన చర్యలు తీసుకోకపోతే రాబోయే రోజుల్లో పార్టీ తీవ్రంగా దెబ్బతినే ప్రమాదం ఉందని హెచ్చరించారు. అసమ్మతి నేతల భారీ భేటీ.. ఆరోపణల వెల్లువ! మండల నాయకుడు సుబ్రమణ్యంరాజు, పట్టణ నేత మధుసూదన్రాయల్తో పాటు జనార్ధన్, పెద్దమోహన్నాయుడు, గంగులప్ప, నాగరాజాచారి, శివ, రాఘవరాయల్, సదుం వెంకట్రమణారెడ్డి, శ్రీనివాసులురెడ్డి, వినోద్, దేవేంద్ర, అమర తదితర ముఖ్య నేతల ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు భారీగా తరలివెళ్లి లోకేష్ను కలిశారు. ఈ సందర్భంగా స్థానిక నాయకత్వం సాగిస్తున్న అక్రమ దందాలను లోకేష్ ముందు ఉంచారు. ముఖ్యంగా ప్రముఖ పుణ్యక్షేత్రమైన బోయకొండ గంగమ్మ గుడి వద్ద భక్తులపై జరుగుతున్న దాడులు, అక్కడ సాగుతున్న అక్రమ వసూళ్లపై ఆధారాలతో సహా ఫిర్యాదు చేసినట్లు తెలిసింది. ఉద్యోగాల పేరిట రూ.5 లక్షల దందా! దీనికి తోడు నియోజకవర్గంలో విద్యుత్ శాఖ (ట్రాన్స్కో) లో ఆపరేటర్ పోస్టుల నియామకానికి సంబంధించి స్థానిక నేత పెద్ద ఎత్తున అవినీతికి తెరలేపారని వారు ఆరోపించారు. ఒక్కో అభ్యర్థి దగ్గర నుంచి ఏకంగా రూ.5 లక్షల వరకు వసూలు చేశారని లోకేష్ దృష్టికి తీసుకెళ్లారు. తక్షణమే నియోజకవర్గంలో పెండింగ్లో ఉన్న మండల పార్టీ కన్వీనర్ల నియామకాలు చేపట్టాలని, అలాగే బోయకొండ దేవస్థానానికి కొత్త పాలక మండలిని ఏర్పాటు చేసి పార్టీని రక్షించాలని కోరారు. లోకేష్ సావధాన పరిశీలన – చర్యలకు హామీ నియోజకవర్గ నాయకుల ఆవేదనను, ఫిర్యాదులను నారా లోకేష్ సుదీర్ఘంగా, సావదానంగా విన్నారు. పుంగనూరులో గ్రూపు రాజకీయాలకు స్వస్తి పలికి, పార్టీని బలోపేతం చేసే దిశగా నియోజకవర్గ ఇన్ఛార్జ్ మార్పుతో పాటు అవినీతి ఆరోపణలపై తగిన చర్యలు తీసుకుంటామని ఆయన హామీ ఇచ్చినట్లు అసమ్మతి వర్గ నేతలు వెల్లడించారు. ఈ పరిణామంతో పుంగనూరు నియోజకవర్గ టీడీపీ రాజకీయాల్లో ఒక్కసారిగా పెను కలకలం రేగింది. టీడీపీ నేతపై లోకేష్కు ఫిర్యాదు ఇన్ఛార్జ్ మార్పుపై హామీ అవినీతి అక్రమాలతో పార్టీకి తీవ్ర నష్టం అసమ్మతి నేతల ఆరోపణ బోయకొండ దోపిడీ, ట్రాన్స్కో పోస్టుల్లో రూ.5 లక్షల వసూళ్లపై నివేదిక సావదానంగా విన్న లోకేష్.. త్వరలోనే చర్యలు తీసుకుంటామని వెల్లడి -
విద్యార్థుల సర్వతోముఖాభివృద్ధే లక్ష్యం
మదనపల్లె సిటీ: విద్యార్థుల సమగ్రాభివృద్ధే సమగ్ర శిక్ష లక్ష్యమని సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ ఎన్.అనూరాధ అన్నారు. జిల్లాలో పాఠశాలలు పునః ప్రారంభమైన నేపథ్యంలో సాక్షితో మాట్లాడారు. పాఠశాలల విద్యార్థులకు అందాల్సిన సర్వేపల్లి రాధాకృష్ణ విద్యామిత్ర కిట్స్, నాడు–నేడు పనులు కేజీబీవీల పనితీరుపై ముచ్చటించారు. నాడు..నేడు పాఠశాలలు జిల్లాలో 448 పాఠశాలల్లో నాడు–నేడు రెండో దశలో ఆగిపోయిన నిర్మాణపనులపై మండల, జిల్లా కమిటీలు ఇచ్చే నివేదికలు కలెక్టర్ దృష్టికి తీసుకుపోతాం. అవసరమైన చోట్ల నిర్మాణం పనులు చేపడతాం. ఈ దిశగా ఇప్పటికే ఇంజనీరింగ్, ఎంఈఓలు, ప్రధానోపాధ్యాయులకు ఆదేశాలు జారీ చేశాం. కార్పొరేట్కు ధీటుగా ప్రభుత్వ బడులను తీర్చిదిద్దుతాం. పాఠశాలలకు సంబంధించి మైనర్ రిపేర్లను చేపట్టేందుకు అనుమతి ఇచ్చాం. దీనిపై మనబడి–మన భవిష్యత్తు అకౌంట్లలోని నిధులను వినియోగించుకోవచ్చు. రూ.10 కోట్లతో మోడల్ ప్రైమరీలో టాయిలెట్ల నిర్మాణంజిల్లాలోని 276 మోడల్ ప్రైమరీ పాఠశాలలో రూ.10 కోట్లతో టాయిలెట్ల నిర్మాణం చేపట్టను న్నాం. దీనికి సంబంధించి ప్రభుత్వం నుంచి అనుమతులు కూడా వచ్చాయి. దీంతో పాటు 8 చోట్ల కేంద్రప్రభుత్వ సహకారంతో 5.57 కోట్ల బడ్జెట్తో బాలికల కోసం ప్రత్యేకంగా ఆధునిక టాయిలెట్లను కూడా నిర్మించనున్నాం. బడి బయట పిల్లల కోసంబడి పిలుస్తోంది కార్యక్రమంలో ఆయా పాఠశాలల హెచ్ఎంలు, ఎంఈఓలు స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఇప్పటివరకు 1వ తరగతిలో 9,559 మందిని చేర్పించాం. అలాగే జిల్లాలోని 25 భవిత కేంద్రాల పరిధిలో 212 మంది ప్రత్యేక అవసరాల పిల్లలను గుర్తించాం. వీరిందరిని భవిత కేంద్రాల్లో చేర్పించి వారి మానసిక పరిస్థితిని మెరుగుపరచడంతో పాటు విద్యాబోధన కూడా అందిస్తాం. జిల్లాకు నాలుగు ఆటిజం కేంద్రాలు మంజూరయ్యాయి. మదనపల్లె (జెడ్పీహెచ్ఎస్), రాయచోటి(మాసాపేట) పీలేరు(కోటపల్లి),పుంగనూరు (మున్సిపల్ ఉన్నత పాఠశాలలు) నిర్మాణపనులు ముగింపు దశకు చేరుకున్నాయి. కేజీబీవీలలో నాణ్యమైన విద్యజిల్లాలో 17 కేజీబీవీలు ఉన్నాయి. విద్యాలయాల్లో నాణ్యమైన విద్య అందిస్తున్నాం. జూనియర్ ఇంటర్ కమ్ డెర్మాటరీ నిర్మాణపనులు జరుగుతున్నాయి. దీంతో విద్యార్థినులకు ఆధునిక సౌకర్యాలు కల్పించనున్నాం. కేజీబీవీల్లో ఖాళీగా 22 పీజీటీ,సీఆర్టీ పోస్టులు భర్తీకి నోటిఫికేషన్ ఇచ్చాం. జూన్ 26వతేదీలోపు కొత్త టీచర్లు ఆయా కేజీవీవీలో విధుల్లో చేరుతారు. ఈ ఏడాది నుంచి స్నానానికి వేడి నీటి సదుపాయం కల్పించేందుకు సోలార్ ఫలకలు ఏర్పాటు చేస్తున్నాం. ప్రతి విద్యార్థికి విద్యామిత్ర కిట్లుప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్తులకు వి ద్యామిత్ర కిట్లు అందజేస్తాం. పాఠ్యపుస్తకాలు, నో టు పుస్తకాలు,డిన్షనీరలు,బెల్టు,యూనిఫాం వచ్చా యి. బ్యాగు,షూ కూడా త్వరలో అందజేస్తాం.‘సాక్షి’తో సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ఎన్.అనూరాధ -
మహిళలు ఆర్థికంగా స్థిరపడాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : మహిళలు టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులను నేర్చుకుని వాటి ద్వారా ఆర్థికంగా స్థిరపడాలని ఇందిరా మహిళా మండలి ప్రెసిడెంట్ వైఎస్ భారతీరెడ్డి పేర్కొన్నారు. సోమవారం కడప నగర శివార్లలో గల రిమ్స్ సమీపంలోని ఇందిరా మహిళా మండలిలో మొదటి విడత ఉచిత టైలరింగ్, బ్యూటిషియన్ కోర్సులు మూడు నెలలు పూర్తి చేసుకున్న మహిళలకు సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. ఈ కార్యక్రమంలో ఇందిరా మహిళా మండలి ట్రైనింగ్ ఇన్చార్జి సరస్వతమ్మ, మెంబర్లు ఎ.సుశీలమ్మ, స్వర్ణలత తదితరులు పాల్గొన్నారు. -
నేడు మొహర్రం మాసం ప్రారంభం
చిన్నమండెం : నెలవంక దర్శనమివ్వడంతో బుధవారం నుంచి మొహర్రం మాసం ప్రారంభం కానుంది. ఈ మేరకు నిర్వాహకులు చిన్నమండెం మండల కేంద్రంలో గంధపు పీర్లను నిలబెట్టారు. మండల కేంద్రంలోని పీర్లమకాన్లో గంధపు పీర్లను నిలబెట్టి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. నేటి నుంచి పది రోజుల పాటు మొహర్రం వేడుకలను నిర్వహించనున్నారు.కారు ఢీకొని యువకుడికి గాయాలురామసముద్రం : మండలంలోని యంబాడి మలుపు వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు గాయపడ్డాడు. గాయపడిన శ్రీకాంత్ వివరాల మేరకు.. కురప్పల్లి గ్రామానికి చెందిన సుబ్రహ్మణ్యం కుమారుడు శ్రీకాంత్(27) తన ద్విచక్ర వాహనంపై గ్రామానికి వెళుతుండగా ఎదురుగా వేగంగా వస్తున్న కారు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో శ్రీకాంత్ రోడ్డుపై పడిపోయి తీవ్ర గాయాల పాలయ్యాడు. స్థానికులు వెంటనే స్పందించి అతడిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనకు సంబంధించి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యార్థిని అదృశ్యం సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట బీసీ కాలనీకి చెందిన పదిహేడున్నరేళ్ల విద్యార్థిని అదృశ్యమైన ఉదంతంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపాల్రెడ్డి మంగళవారం తెలిపారు. ఆయన కథనం మేరకు.. స్థానిక ఓ ప్రయివేటు జూనియర్ కళాశాలలో మైనర్ అయిన విద్యార్థిని చదువుతోంది. సోమవారం ఉదయం ఇంటి నుంచి కళాశాలకు వెళ్లిన విద్యార్థిని తిరిగి రాలేదు. విద్యార్థిని కోసం కుటుంబీకులు గాలించినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులను ఆశ్రయించిన తల్లి ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ గోపాల్రెడ్డి తెలిపారు. మహిళ మెడలో బంగారు గొలుసు చోరీ మదనపల్లె టౌన్ : రోడ్డు పక్కన నడుచుకుంటూ వెళ్తున్న మహిళ మెడలోంచి దుండగుడు బంగారు గొలుసు చోరీ చేశాడు. మంగళవారం సాయంత్రం చోటు చేసుకున్న ఈ ఘటనపై మదనపల్లె వన్ టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని ఏగవ కురవంకలో నివాసముంటున్న శ్రీనివాసులు భార్య భార్గవి టైలరింగ్ పని చేస్తూ జీవనం సాగిస్తోంది. ఈ క్రమంలో సాయంత్రం స్థానిక ఆర్ఆర్ వీధికి షాపింగ్కు వెళ్లింది. షాపింగ్ పూర్తయ్యాక నడుచుకుంటూ ఇంటికి వస్తుండగా, స్థానిక సొసైటీ కాలనీ వద్దకు రాగానే హెల్మెట్ ధరించి బైక్పై వచ్చిన దొంగ.. భార్గవి మెడలో ఉన్న 24 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లాడు. బాధితురాలు వెంటనే వన్టౌన్ పోలీసులను ఆశ్రయించి ఫిర్యాదు చేయడంతో, కేసు నమోదు చేశారు. -
వివాహేతర సంబంధం అనుమానంతోనే హత్య
● వంశీ హత్య కేసులో ముగ్గురి అరెస్ట్ ● ప్రధాన నిందితుడి కోసం గాలింపుకడప అర్బన్ : తన భార్యతో డ్రైవర్ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానంతో యజమాని చింతా రామసుబ్బారెడ్డి మరో ముగ్గురితో కలిసి దారుణంగా హత్య చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ వివరాలను కడప రిమ్స్ పోలీస్ స్టేషన్లో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ రాజగోపాల్ వెల్లడించారు. హత్య సంఘటనకు రెండు రోజులు ముందు ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి సింగపూర్ టౌన్షిప్లో ఓ ఇంటిని అద్దెకు తీసుకున్నాడు. మరో ముగ్గురు నిందితులైన దేవకుమార్, నాగార్జున, శ్రీనివాసులను తన దగ్గరకు పిలిపించుకున్నాడు. ఈ నెల10వ తేదీ కడప రిమ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలో రామసుబ్బారెడ్డి తన సహచరులతో వంశీని సదరు ఇంటికి పిలిపించుకుని కత్తులతో దారుణంగా హత్య చేశారు. తన భార్య మధురవాణితో కారు డ్రైవర్ వంశీ వివాహేతర సంబంధం కలిగి వున్నాడనే అనుమానం పెనుభూతంగా మారింది. వంశీ, మధురవాణిలు వ్యాపార నిమిత్తం వేరే రాష్ట్రాలకు పోయినప్పుడు పది రోజులు కానీ, 20 రోజులు అక్కడే ఉండి కలిసి ఉంటున్నట్లు, అలాగే తన పిల్లలు, తన భార్య కూడా రామసుబ్బారెడ్డి మాట వినకుండా, డ్రైవర్ వంశీనే మంచోడు అని చెబుతూ కుటుంబ సభ్యులందరూ లెక్క చేయకపోవడంతో అది చూసి ఓర్చుకోలేకపోయాడు. రామసుబ్బారెడ్డి ఎలాగైనా డ్రైవర్ వంశీని అడ్డు తొలగించాలనుకున్నాడు. తనకు తెలిసిన బుడ్డాయపల్లెకు చెందిన దేవకుమార్, మోడీమీదిపల్లికి చెందిన నాగార్జున, శ్రీనివాసులు సహాయం తీసుకున్నాడు. పక్కా స్కెచ్ వేశారు. పథకం ప్రకారం హత్యకు ప్లాన్ వేసి అతన్ని సింగపూర్ టౌన్షిప్లోని ఒక ఇంటిలోనికి తీసుకెళ్లి కత్తులతో పొడిచి చంపారు. మృతదేహాన్ని ఒంటిమిట్ట మండలం సాలాబాదు రోడ్డులోని సోమశిల జలాలకు దగ్గరలో గుర్తుతెలియని ప్రదేశంలో కొండ దగ్గర పడేశారు. ఈ హత్య కేసులో దేవకుమార్, నాగార్జున, శ్రీనివాసులును అరెస్టు చేసి వారి వద్ద నుంచి, రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, రెండు రాడ్లు ఒక కారు స్వాధీనం చేసుకొని వారిని రిమాండ్కు పంపించారు. ప్రధాన నిందితుడు రామసుబ్బారెడ్డి కోసం గాలింపు చర్యలు చేపడుతున్నారు. -
మదనపల్లె నేతల అవినీతిపై విచారణ జరపండి
● ఇచ్చిన హామీలు అమలు చేయండి ● చంద్రబాబుకు బీఎసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతమ్ డిమాండ్సాక్షి, మదనపల్లె : మదనపల్లె అభివృద్ధి కోసం చంద్రబాబు, లోకేష్ ఇచ్చిన హామీలను తక్షణమే అమలు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బి.గౌతమ్కుమార్ డిమాండ్ చేశారు. మంగళవారం స్థానిక ఆ పార్టీ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈనెల 20న ఇక్కడికి వస్తున్న చంద్రబాబు ఇచ్చిన హామీలను గుర్తు చేసుకొని వాటిని నెరవేర్చాలన్నారు. ప్రధానంగా హంద్రీ–నీవా ప్రాజెక్టును పూర్తి చేసి మదనపల్లెలోని అన్ని చెరువులు, చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ను కృష్ణా జలాలతో నింపాలని కోరారు. బీటీ కళాశాలను యూనిర్సిటీగా పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయాలన్నారు. మదనపల్లెలో టమాట ప్రాసెసింగ్ యూనిట్కు శంకుస్థాపన చేయాలని కోరారు. స్థానిక మెడికల్ కళాశాల ప్రయివేటీకరణ చర్యలను నిలిపివేసి, వాటి నిర్మాణ పనులను పూర్తి చేసి ప్రభుత్వ ఆధ్వర్యంలోనే కొనసాగించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాను మదనపల్లె జిల్లాగా ప్రకటించాలన్నారు. ప్రభుత్వ భాగస్వామ్య కూటమి పార్టీల నేతల అవినీతి, భూకబ్జాలపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ప్రతిపక్షంలో ఉండగా వైఎస్సార్సీపీ నేతలపై లోకేష్ అవినీతి, భూకబ్జాలు, అక్రమాలపై ఆరోపణలు చేశారన్నారు. ఇప్పుడు మదనపల్లెలో కూటమి నాయకులపై భూకబ్జాలు, అవినీతి, అక్రమాలు ఆధారాలతో సహా రుజువయినప్పటికి ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. దీనిపై తమ పార్టీ పోరాటం చేస్తుందని, నిష్పక్షపాతంగా చంద్రబాబు విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
‘అంతరార్థం’.. ‘పిండి’తార్థం చెబుతాం!
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని చరిత్రాత్మక శ్రీ అగస్త్యేశ్వర స్వామి ఆలయంలో ఎండోమెంట్ ట్రస్టుబోర్డుకు సమాంతరంగా కొందరు ప్రైవేట్ సొసైటీని ఏర్పాటు చేసిన వ్యవహారంపై ఎండోమెంట్ ఉన్నతాధికారులు రంగంలోకి దిగారు. సాక్షాత్తూ ఆలయ చైర్మన్ వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకులు సతీష్కుమార్, మహేశ్వర శర్మలు అధ్యక్ష, ఉపాధ్యక్షులుగా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో దొడ్డిదారిన సొసైటీని రిజిస్ట్రేషన్ చేయించిన సంగతి తెలిసిందే . ఈ కుట్రలపై మంగళవారం ‘సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన ’అంతరార్థం అగస్త్యేశ్వరునికెరుక’ శీర్షికన ఇచ్చిన కథనం జిల్లా వ్యాప్తంగా తీవ్ర కలకలం రేపింది. ఈ కథనంపై దేవదాయ శాఖ ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి అక్రమాలపై ఆరా తీశారు. అడ్డంగా దొరికిపోయి.. రద్దు చేస్తామంటూ బుకాయింపు! ‘సాక్షి’ దెబ్బకు అక్రమ సొసైటీ సూత్రధారుల్లో ఒక్కసారిగా ఉలికిపాటు మొదలైంది. ఆలయ నిధులను దేవాదాయ శాఖ పరిధి నుంచి తప్పించేందుకు ఈ సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందని ఎండోమెంట్ ఉన్నతాధికారులు సదరు కమిటీని గట్టిగా ప్రశ్నించినట్లు తెలిసింది. దాంతో అడ్డంగా దొరికిపోయిన కొందరు సొసైటీ సభ్యులు.. ‘దీనిపై చర్చించాల్సింది, చెప్పుకోవాల్సింది ఏముంది.. కావాలంటే సొసైటీని రద్దు చేస్తాం, ఎందుకు దీన్ని ఇంతగా రాద్దాంతం చేస్తున్నారు‘ అంటూ భయంతో అధికారుల ముందే బుకాయించినట్లు సమాచారం. అయితే, ఈ సొసైటీ ఏర్పాటు వ్యవహారం ఎండోమెంట్ శాఖలోని కొందరు కిందిస్థాయి అధికారులకు తెలియకుండా జరిగి ఉండదని భక్తులు గట్టిగా ఆరోపిస్తున్నారు. మా మెడకు చుట్టుకుంటుంది.. కొందరు అర్చకుల ఆవేదన! ఇదిలా ఉండగా, ఈ అక్రమ సొసైటీ వ్యవహారం ఆలయ అర్చక వర్గాల్లో తీవ్ర ఘర్షణకు దారితీసింది. తమకు ఎలాంటి ప్రమేయం లేకపోయినా, తమ అంగీకారం తీసుకోకుండా కేవలం చైర్మన్, ప్రధాన అర్చకులు బలవంతంగా తమ పేర్లను సొసైటీలోకి లాగారని కొందరు తోటి అర్చకులు బాహాటంగానే ఆవేదన వ్యక్తం చేసినట్లు తెలిసింది. ప్రభుత్వ చట్టాల ఉల్లంఘన కింద ఈ దొంగ సొసైటీ వ్యవహారం ఎక్కడ తమ ఉద్యోగాల మెడకు చుట్టుకుంటుందోనని వారు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. విచారణకు ఆదేశించిన అసిస్టెంట్ కమిషనర్ శివాలయంలో వెలుగుచూసిన ఈ సమాంతర ప్రైవేట్ సొసైటీ ఏర్పాటు విషయమై ఎండోమెంట్ అసిస్టెంట్ కమిషనర్ కర్బాలాజీని ‘సాక్షి’ వివరణ కోరగా.. ఈ వ్యవహారంపై క్షేత్రస్థాయికి వెళ్లి విచారణ జరిపి పూర్తి నివేదిక సమర్పించాలని ఇన్స్పెక్టర్కు స్పష్టం చేశామన్నారు. ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా ప్రైవేట్ సొసైటీ ఏర్పాటు చేసినట్లు వాస్తవమని తేలితే చైర్మన్, అర్చకులతో సహా బాధ్యులందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన తేల్చిచెప్పారు. ఈ పరిణామంతో అక్రమార్కులకు ముచ్చెమటలు పడుతున్నాయి. -
ఈతకు వెళ్లి బాలుడి మృతి
అట్లూరు : ఈతకు వెళ్లి ప్రమాదవశాత్తు చెరువులో మునిగి సుశాంత్(13) అనే బాలుడు మృతి చెందిన సంఘటన అట్లూరు మండలంలో మంగళవారం చోటు చేసుకుంది. స్థానికుల వివరాల మేరకు.. కమలకూరు గ్రామానికి చెందిన కొర్రపాటి తిరుపాల్, రాధిక దంపతులకు ఇద్దరు కుమారులు ఉన్నారు. పెద్ద కుమారుడు సుశాంత్, రెండో కుమారుడు సునీల్ ఉన్నారు. మంగళవారం సాయంత్రం ఇరువురు పిల్లలు గ్రామ సమీపంలో ఉన్న చిన్న చెరువులో ఈతకొట్టేందుకు వెళ్లారు. ముందుగా సుశాంత్ చెరువులోకి దిగాడు. మునిగిపోతున్న సుశాంత్ను చూసిన సునీల్ గ్రామంలోకి వచ్చి గ్రామస్తులకు తెలిపారు. బంధువులు, స్థానికులు అక్కడికి వెళ్లే సరికి సుశాంత్ మృతి చెందాడు. కమలకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుశాంత్ 7వ తరగతి పూర్తి చేసుకుని 8వ తరగతిలో చేర్పించాలని తల్లిదండ్రులు కలల కన్నారు. ఇంతలోనే ఈత రూపంలో తమ కుమారుడు మృతి చెందాడని తల్లిదండ్రులు రోదనలు మిన్నంటాయి. విషయం తెలుసుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. -
నారు ఉంది.. నీరే లేదు
పులిచెర్ల (కల్లూరు): ఖరీఫ్ రైతులకు ఆదిలోనే కష్టాలు మొదలయ్యాయి. ఎన్నో ఆశలతో సాగు చేపట్టిన వారికి ప్రకృతి సహకరించడం లేదు. ఇప్పటివరకు ఆశించిన స్థాయిలో వర్షాలు కురవలేదు. మరోవైపు ప్రాజెక్టుల నుంచి కూడా పూర్తిస్థాయిలో సాగునీరు అందడం లేదు. పంట సాగుపై నీలినీడలు కమ్ముకున్నాయి. వర్షాలు పడకపోవడంతో చెరువులు, వాగుల్లో చుక్కనీరు కూడా లేదు. బోర్లను నమ్ముకొని పంటలు సాగు చేద్దామంటే భూగర్భజలాలు అడుగంటాయి. దీంతో రైతులు టమాటా సాగుకు సిద్ధం చేసుకున్న పొలాలను ఖాళీగా వదిలేశారు. ఈ ప్రభావం నర్సీరీలపై తీవ్రంగా చూపింది. మొక్కలు ముదిరిపోతున్నాయి. ఏంచేయాలో అర్థంకాక నర్సరీలు సాగుచేసిన రైతులు లబోదిబోమంటున్నారు. వర్షాలు లేక నర్సరీల్లో నారు సిద్ధంగా ఉన్నప్పటికీ వారు సకాలంలో పంట సాగుచేయలేకపోతున్నారు. వర్షాభావ పరిస్థితుల వల్ల రైతులు కూరగాయల సాగుకు మొగ్గు చూపడం లేదు. ముదురుతున్న నారు రైతులు నారు కొనుగోలు చేయకపోవడంతో నర్సరీల్లో టమాటా, వంగ, మిరప నార ముదురుతోంది. మండలంలో టమాటాకు గిరాకీ ఉండడంతో నర్సరీ యజమానులు ఎక్కువ విస్తీర్ణంలో నార పోశారు. మండలంలో దాదాపు 18 నర్సరీలు ఉన్నాయి. ప్రస్తుతం వర్షాలు సరిగా పడక పోవడంతో రైతులు సాగుకు మొగ్గు చూపలేదు. దీంతో నర్సరీల్లోని నారు ముదురుతోంది. వర్షాలు పడుంటే టమాటా సాగు చేసేవారు. అయితే ప్రస్తుతం వర్షాలు లేవు. లక్షలాది రూపాయలు ఖర్చుపెట్టి నారు పెంచిన రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. సాధారణంగా నర్సరీలో విత్తనం నుంచి నారుగా తయారు కావడానికి సుమారు 40 రోజులు పడుతుంది. అనంతరం 15 రోజులకు దాన్ని రైతులు అమ్ముకోవాల్సి ఉంది. కొనుగోలు చేసిన రైతులు ఆ నారును వెంటనే నాటాలి. ఆ తర్వాత నాటినా కాయలు కాస్తాయన్న నమ్మకం ఉండదు. వర్షాభావ పరిస్థితుల కారణంగా రైతులు నారును కొనుగోలు చేయడం లేదు. ముందుకు సాగని ఖరీఫ్ సాగు అడుగంటిన భూగర్భ జలాలు నష్టపోతున్న నర్సరీల యజమానులు -
హౌసింగ్ ఏఈ సుబ్రమణ్యం అరెస్ట్
ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్లో జరిగిన రూ.1.70 కోట్ల విలువైన ఐరన్ చోరీ కేసులో ఎట్టకేలకు త్రీ టౌన్ పోలీసులు కీలక పురోగతి సాధించారు. ఈ మెగా స్కామ్లో ప్రధాన నిందితుడు, హౌసింగ్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యంను పోలీసులు సోమవారం రాత్రి అధికారికంగా అరెస్ట్ చేశారు. మంగళవారం ఆయనను కోర్టులో హాజరుపరిచి, రిమాండ్ నిమిత్తం కడప సెంట్రల్ జైలుకు తరలించారు. వివరాలిలా ఉన్నాయి. ప్రొద్దుటూరు రూరల్ హౌసింగ్ గోడౌన్ నుంచి ఇటీవల సుమారు 268.71 టన్నుల ప్రభుత్వ ఐరన్ మాయమైంది. ఈ గోడౌన్కు ఇన్చార్జిగా ఉన్న ఏఈ సుబ్రమణ్యం ప్రమేయం లేకుండా ఇంత భారీ ఎత్తున ఐరన్ పక్కదారి పట్టే అవకాశం లేదని నిర్ధారించిన హౌసింగ్ పీడీ రాజారత్నం పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో గత నెల 26న త్రీ టౌన్ పోలీసులు ఏఈపై క్రిమినల్ కేసు నమోదు చేయగా, ఉన్నతాధికారులు ఆయనను సస్పెండ్ చేశారు. కేసు నమోదైనప్పటి నుంచి పరారీలో ఉన్న ఏఈ కోసం పోలీసులు ప్రత్యేక బృందాలతో గాలింపు చేపట్టి ఎట్టకేలకు అదుపులోకి తీసుకున్నారు. అరెస్ట్ అయినప్పటికీ ఏఈ సుబ్రమణ్యం పోలీసుల విచారణకు అస్సలు సహకరించడం లేదని సమాచారం. ఇనుమును ఎక్కడకి తరలించారు, ఎవరికి విక్రయించారు అనే ప్రశ్నలకు పొంతన లేని సమాధానాలు ఇస్తుండటంతో పోలీసులకు ఈ విచారణ సవాల్గా మారింది. దీంతో పూర్తి నిజాలు రాబట్టేందుకు కోర్టు అనుమతితో నిందితుడిని పోలీస్ కస్టడీలోకి తీసుకునేందుకు అధికారులు సిద్ధమవుతున్నారు. పెద్దల గుండెల్లో రైళ్లు.. బయటపడనున్న అసలు సూత్రధారులు కొన్ని రోజుల క్రితం ఏఈ సుబ్రమణ్యం ఒక వీడియో విడుదల చేస్తూ, ఈ ఐరన్ చోరీ వెనుక కొంతమంది ఉన్నతాధికారుల హస్తం ఉందని ఆరోపించారు. ప్రస్తుత పోలీసు విచారణలో కూడా కొందరు హౌసింగ్ అధికారులతో పాటు బయటి వ్యక్తుల పేర్లను ఆయన వెల్లడించినట్లు తెలుస్తోంది. ఈ కేసుతో సంబంధం ఉన్న మరికొందరు అనుమానితులను కూడా పోలీసులు ప్రస్తుతం రహస్యంగా విచారిస్తున్నారు. వీరంతా నోరు విప్పితే హౌసింగ్ శాఖలోని పెద్ద తిమింగలాల పాత్రతో పాటు ఈ స్కామ్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల పేర్లు త్వరలోనే బయటపడే అవకాశం ఉంది. రూ.1.70 కోట్ల ఐరన్ చోరీ కేసు రూరల్ హౌసింగ్ గోడౌన్లో 268 టన్నుల ఇనుము మాయం కడప సెంట్రల్ జైలుకు తరలింపు నోరు విప్పని నిందితుడు పోలీస్ కస్టడీకి తీసుకునేందుకు త్రీటౌన్ పోలీసుల కసరత్తు కీలక అధికారుల పాత్రపై ఏఈ ఆరోపణలు -
చేదు మిగిల్చిన తీపి ఫలం !
ఆరుగాలం శ్రమించినా... రైతన్న కష్టానికి ‘ఫలం’దక్కడం లేదు.. తీపిని పంచే మామిడి రైతు జీవితాల్లో చేదుగానే మారుతోంది. అటు ప్రకృతి సహకరించక.. ఇటు కూటమి కనికరించక ఏటా నష్టమే మిగులుతోంది. మామిడి రైతులకు ఈ సారీ నిరాశే మిగిలింది. ● మామిడి రైతులకు ఏటా పెరుగుతున్న కష్టాలు ● దిగుబడి రాక....ధరలేక తల్లడిల్లిపోయిన మామిడి రైతు ● ప్రస్తుత సీజన్లోనూ గిట్టుబాటు ధర లేక పతనం ● కూటమి సర్కార్లో రెండవ ఏడాది కొనసాగిన కష్టకాలం సాక్షి అన్నమయ్య : కూటమి సర్కార్లో మామిడి రైతులకు కష్టకాలం వెంటాడుతోంది. గతేడాది ధరల్లేక పంటను కొనుగోలు చేసేవారు కానరాక రైతులు కాయలను జ్యూస్ ఫ్యాక్టరీ వద్ద పారబోశారు. మరికొంతమంది రోడ్లపైనే పడేశారు. ఆ చేదు జ్ఞాపకాలను ఈ ఏడాది పంటైనా మరిపిస్తుందని.. తియ్యటి లాభాలు పంచుతుందని ఆశపడ్డ మామిడి రైతుకు నిరాశే ఎదురైంది. చేదు రెట్టింపైంది. దిగుబడులు లేక...ధరలు రాక... మామిడి పంట నిలువునా దెబ్బతీసింది. దీనికితోడు తెగుళ్లు.. వాతావరణ పరిస్థితులు ఈ సీజన్ను పూర్తిగా దెబ్బకొట్టాయి. మరోవైపు ఆదుకోవాల్సిన ప్రభుత్వం చేష్టలుడిగి చూస్తుండిపోయింది. అన్నమయ్య జిల్లాలో మామిడిని భారీగా సాగు చేస్తున్నారు. పదుల సంఖ్యలో మామిడి రకాలు సాగులో ఉన్నాయి. జిల్లా నుంచి ఏటా 150–200 టన్నుల మేర సరుకు ఇతర రాష్ట్రాలకు వెళుతోంది. అటువంటి పరిస్థితులు ఉన్న జిల్లాలో మామిడి రైతులు గడ్డుకాలం ఎదుర్కొంటున్నారు. దిగుబడులు కేవలం 20–30 శాతానికి పడిపోగా.. ధర పాతాళానికి దిగజారింది. ఇక తోతాపురి రకం మామిడి అట్టడుగుకు పడిపోయింది. మామిడి రైతుకు ఏదీ చేయూత? మామిడి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నా ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోవడం బాధాకరం. ఇటీవల వీచిన గాలివానకు అనేక చోట్ల మామిడి కాయలు రాలిపోయాయి. అంతకుముందు తొలిమంచు ప్రభావంతో పూత, పిందె సరిగా రాకపోగా, తర్వాత వచ్చినా కూడా చీడపీడలు పంటను దెబ్బతీశాయి. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోలేదు. గతేడాది ధరలు లేక రోడ్లపై మామిడి కాయలు పారపోస్తున్న సందర్భంలో సీజన్ చివరి దశలో ఏదో కొంతమేర కిలోకు రూ. 45 ఇచ్చారు. ఈసారి ఇంతవరకు చేయూత అందించే ఆలోచన కూడా సర్కార్ చేయకపోవడంపై మామిడి రైతులు మండిపడుతున్నారు. వరుసగా రెండో ఏడాది నష్టమే! సాధారణంగా మామిడి పంటకు సంబంధించి మార్చి నుంచి జూన్ వరకు సీజన్గా పరిగణిస్తారు. ప్రస్తుత పరిస్థితి చూస్తే వరుసగా రెండో ఏడాది రైతు నష్టపోయాడు. కాగా గతేడాది చేదు అనుభవాల దృష్ట్యా ఇప్పటికే చాలాచోట్ల రైతులు మామిడి పంటను కొట్టివేశారు. ఈసారి కూడా ధరలు లేక మామిడి రైతు ఆశలపై నీళ్లు చల్లడంలో మామిడి సాగుపై రైతుల్లో అనాసక్తి మొదలైంది. నాకు 20 ఎకరాలు పైబడి మామిడి తోట ఉంది. ఈఏడాది ఎరువులు, పురుగుమందులకు ఖర్చుచేసిన మేర కూడా మామిడిలో ఆదాయం రాలేదు. అసలే దిగుబడి అంతంతంగా ఉంటే.. ధర కూడా తక్కువగా పలికింది. దీంతో పెట్టుబడి కూడా రాని పరిస్థితి ఉంది. ప్రభుత్వం కనీసం పట్టించుకున్న పాపాన పోలేదు. – సిద్దక నాగిరెడ్డి, సిద్ధకవాండ్లపల్లె కస్తూరిరాజుగారిపల్లె , లక్కిరెడ్డిపల్లి ఈ ఏడాది మామిడికాయలకు రేట్లు రాక చాలా నష్టపోయాం. ఏడాది పొడవునా నీళ్లు పడుతూ, పలు రకాల యూరియాలు వాడుతూ, కూలీలను ఏర్పాటు చేసుకుని మామిడి తోటను కాపాడుకుంటూ వచ్చాం. తీరా చూస్తే మార్కెట్లో మామిడికాయలకు రేటు విపరీతంగా పడిపోయింది. ఎప్పుడూ ఇలాంటి నష్టాన్ని చవిచూడలేదు. ప్రభుత్వం ఆదుకోవాలి. – జయశంకర్రెడ్డి, మామిడితోట రైతు, చిన్నమండెం -
జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి
కడప ఎడ్యుకేషన్: రాయలసీమ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బందికి సోమవారం ఒకేషనల్ జూనియర్ లెక్చరర్ల పదోన్నతి కార్యక్రమాన్ని నిర్వహించారు. కడపలోని ఇంటర్ విద్య ఆర్జేడీ కార్యాలయంలో సోమవారం ఈ పదోన్నతి కార్యక్రమాన్ని ఆర్జేడీ సురేష్బాబు ఆధ్వర్యంలో నిర్వహించారు. ఇందులో ఉమ్మడి చిత్తూరు జిల్లాకు చెందిన నాన్ టీచింగ్ సిబ్బంది అయిన పార్వతి, దీప్తి, శిరీష, అపర్ణ,, అశ్విని, భాస్కర్, కిషోర్, శివకుమార్ తదితరులకు ఒకేషనల్ జూనియర్ లెక్చరర్లుగా పదోన్నతి కల్పించారు. పదోన్నతి పొందిన వారిని చిత్తూరు నాన్ టీచింగ్ స్టాప్ జిల్లా అధ్యక్షులు విశ్వేశ్వర్ రెడ్డి, కళాశాల విద్య ఆర్జేడీ సురేష్ బాబుకు ధన్యవాదాలు తెలిపారు. -
వైఎస్సార్సీపీ కార్యకర్తపై హత్యాయత్నం
రామాపురం: వైఎస్సార్ కడప జిల్లా రామాపురం మండలంలోని సుద్దమల్ల గ్రామం దూదేకులపల్లిలో సోమవారం సాయంత్రం చోటుచేసుకున్న దారుణ హత్యాయత్నం ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. పాత కక్షల నేపథ్యంలో ఫరీద్ అనే వ్యక్తి, వైఎస్సార్సీపీ కార్యకర్త బత్తల రమణ తమ్ముడైన బత్తల రాజాపై పదునైన కత్తితో విచక్షణారహితంగా దాడి చేసి పొడిచాడు. తీవ్ర రక్తస్రావంతో కుప్పకూలిన రాజా పరిస్థితి విషమంగా మారడంతో, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు అతన్ని తక్షణమే కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడిన ఫరీద్కు అధికార పక్షం అండదండలు ఉన్నాయని, ఆ రాజకీయ ధీమాతోనే ఈ ఘాతుకానికి తెగబడ్డాడని బాధిత కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నాయకులు ఆరోపిస్తున్నారు. నిందితుడిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ ఘటనపై పోలీసులను సంప్రదించగా, తమకు ఇప్పటివరకు ఎలాంటి అధికారిక ఫిర్యాదు అందలేదని, బాధితుల నుంచి సమాచారం రాగానే కేసు నమోదు చేసి పూర్తి స్థాయి విచారణ జరుపుతామని తెలిపారు. యువకుడిపై కత్తిపోట్ల ఉదంతంతో సుద్దమల్ల గ్రామంలో ప్రస్తుతం ఉద్రిక్త వాతావరణం నెలకొంది. -
అంతరార్థం అగస్య్తేశ్వరునికెరుక !
● ప్రొద్దుటూరు శివాలయంలో సమాంతర సొసైటీ కలకలం ● చైర్మన్, అర్చకులు అధ్యక్ష, కార్యదర్శులుగా సేవా సంఘం రిజిస్ట్రేషన్ ● ఈఓ, అధికారిక రశీదులను కాదని సొంత అకౌంట్లతో చందాల వసూళ్లకు స్కెచ్ ● నేటి నుంచే మహా కుంభాభిషేకం ప్రొద్దుటూరు క్రైం: ప్రొద్దుటూరులోని శ్రీ అగస్త్యేశ్వరస్వామి ఆలయం అత్యంత ప్రాచీనమైనది. ఇక్కడ కొంతకాలంగా తరచూ వివాదాలు నడుస్తున్నాయి. తాజా గా ‘శ్రీ అగస్త్యేశ్వర ప్రగతి సేవాసంఘం’ పేరుతో ఆల య కమిటీ చైర్మన్గా వ్యవహరిస్తున్న వంగల నారాయణరెడ్డి గౌరవాధ్యక్షుడిగా, అర్చకుడు సతీష్కుమార్ అధ్యక్షుడిగా, మరో అర్చకుడు మహేశ్వర శర్మ ఉపాధ్యక్షుడిగా, ఉదయ్భాస్కర్ ప్రధాన కార్యదర్శిగా సంస్థను రిజిష్టర్ చేయించడం అనేక అనుమానాలకు తావిస్తోంది. సంస్థ బైలాలో కూడా శివాలయానికి సంబంధించిన సేవా కార్యక్రమాలను నిర్వహించేందుకు, ఇతర సామాజిక కార్యక్రమాలు నిర్వహించేందుకు ఈ సంస్థ ఏర్పాటు చేసుకున్నట్లు పేర్కొన్నారు. జీతాలు ప్రభుత్వానివి.. సొసైటీలు ప్రైవేటా?! ఎండోమెంట్ ఆలయంలో అర్చకులుగా విధులు నిర్వహిస్తూ, ప్రభుత్వ ఖజానా నుంచి జీతాలు తీసుకుంటున్న అర్చకులు, దేవాదాయ శాఖ నుంచి గౌరవవేతనం తీసుకుంటున్న చైర్మన్ శివాలయం పేరుతో మరో సొసైటీని ఏర్పాటు చేయడం అనేది పూర్తిగా చట్టవిరుద్ధమైన చర్య అని ఎండోమెంట్ అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆలయ పెద్దలే ఇందులో ఉండటం వల్ల ఈ సొసైటీ ఆలయానికి అధికారికంగా సంబంధించిందేనని భ్రమపడి సామాన్య ప్రజలు, శివయ్య భక్తులు ఇతోధికంగా భారీ విరాళాలు ఇచ్చే ప్రమాదం ఉంది. ప్రభుత్వం ఏర్పాటు చేసిన చట్టబద్ధమైన కమిటీ ఉండగా, మళ్లీ ఈ కమిటీలోని వ్యక్తులే దొడ్డిదారిన మరో సొసైటీని ఎందుకు ఏర్పాటు చేయాల్సి వచ్చిందో తెలియాల్సి ఉంది. ఈఓ పర్యవేక్షణకు పాతర.. నిబంధనల ప్రకారం ఆలయ ట్రస్టు బోర్డు ద్వారా చందాలు లేదా విరాళాలు వస్తే దానికి తగిన అధికారిక రశీదు ఇచ్చి, ఆలయ కార్యనిర్వహణాధికారి (ఈఓ) పర్యవేక్షణలోనే ట్రస్టు బోర్డు సభ్యులు వాటిని ఖర్చు చేయాల్సి ఉంటుంది. అంతేగాని వ్యక్తిగతంగానో, ప్రైవేట్ సొసైటీల పేరుతోనో చందాలు వసూలు చేయడం, తమకు ఇష్టమొచ్చినట్లు స్వతహాగా ఖర్చు చేయడం ఎండోమెంట్ యాక్ట్కు పూర్తిగా విరుద్ధం. మహా కుంభాభిషేకం వేళ అధికారుల ఆరా! ఈ వివాదం ఇలా ఉంటే, మంగళవారం (జూన్ 16) నుంచి ‘మహా కుంభాభిషేకం మహోత్సవాలు’ ప్రారంభం కానున్నాయి. సరిగ్గా ఇటువంటి పవిత్రమైన సందర్భంలోనే ఈ అక్రమ సేవాసంఘం వ్యవహారం బయటకు రావడంతో భక్తులలో సందేహాలు వ్యక్తమవుతున్నాయి. కాగా, ఈ వ్యవహారాలపై ఉన్నతాధికారులు ఇప్పటికే ఆరా తీస్తున్నట్లు సమాచారం. -
కొనసాగుతున్న సౌత్జోన్ క్రికెట్ పోటీలు
వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర మల్డీడే క్రికెట్ అంతర్ జిల్లాల పోటీలు రెండవ రోజు కొనసాగాయి. సోమవారం గ్రౌండ్ 1 లో కర్నూల్ , నెల్లూరు జట్లు తలపడ్డాయి. తొలి ఇన్నింగ్స్లో కర్నూల్ జట్టు 72.3 ఓవర్లలో 258 పరుగులు చేసి ఆలౌట్ అయ్యింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన నెల్లూరు జట్టు 218 పరుగులకే ఆలౌటయింది. అనంతరం రెండో ఇన్నింగ్ ప్రారంభించిన కర్నూల్ జట్టు 27 ఓవర్లు ఆడి, 1వికెట్ నష్టానికి 61 పరుగులు చేసి ఇన్నింగ్స్ ఆడుతుంది. అలాగే గ్రౌండ్ 2లో కడప జిల్లా జట్టు 63.3 ఓవర్లలో 316 పరుగులు చేసి ఆలౌట్ కాగా, అనంతరం బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 288 పరుగులకే పరిమితమైంది. -
గున్నమామిడీ కొమ్మ మీద.. పండ్లు ఒకటయ్యాయి!
పల్లెటూరి తోటల్లో ఇలాంటి చిన్న చిన్న వింతలే పెద్ద సంచలనాలు. గుర్రంకొండలోని ఓ మామిడి తోటలో ఒకే తొడిమకు రెండు మామిడిపండ్లు జంటగా అతుక్కుపోయి కనిపించిన దృశ్యం ఇప్పుడు స్థానికులను విశేషంగా ఆకర్షిస్తోంది. పసుపు పచ్చని దేహంతో, అచ్చం కవలలలా ఉన్న ఈ మామిడిపండు ఫొటో ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది.బయటికి ఒకే పండుగా కనిపిస్తున్నా, లోపల మాత్రం రెండు విడివిడి ముట్టెలు దాచుకుని ‘రెండు మనసులు.. ఒకే ప్రాణం‘ అన్నట్టుంది ఈ జంట మామిడి. కూలీలు కాయలు కోస్తుండగా కంటపడిన ఈ వింతను చూడటానికి జనం తోట వైపు పరుగులు తీస్తున్నారు. వృక్షశాస్త్ర నిపుణులు దీనిని జన్యుపరమైన మార్పుల వల్ల జరిగే ’ఫాసియేషన్’ అని చెప్తున్నా.. ఆ పల్లెటూరి ప్రజలకు మాత్రం ఇది ఒక అందమైన ప్రకృతి బహుమతి! 18న జెడ్పీ సర్వసభ్య సమావేశంకడప వైఎస్సార్ సర్కిల్ : ఈ నెల 18వ తేదీన జిల్లా ప్రజా పరిషత్ (జెడ్పీ) సాధారణ సర్వసభ్య సమావేశాన్ని నిర్వహించనున్నట్లు సీఈవో సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. కడప నగరంలోని జిల్లా ప్రజా పరిషత్ సమావేశ మందిరంలో ఈ సమావేశం జరగనుంది. సమావేశానికి ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా పరిషత్ ప్రాదేశిక నియోజకవర్గ సభ్యులు (జెడ్పీటీసీలు), అధికారులు అందరూ తప్పనిసరిగా హాజరుకావాలన్నారు. – గుర్రంకొండ -
అడుగడుగునా ఆక్రమణలు.. పాతిక భాగం పూడిక!
● కాలువ వెంబడి పూడ్చివేతలు ● యథేచ్ఛగా అక్రమ నిర్మాణాలు ● బ్రిడ్జి వద్ద కాలువ వెడల్పు పూడ్చివేత ● టాక్సీ స్టాండ్గా మారిన కాలువ గర్భం ● పట్టించుకోకుంటే 1996 వరద ముప్పు తప్పదు! సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణం నడిబొడ్డున ప్రవహించే చరిత్రాత్మక బుగ్గ కాలువకు కష్టకాలం వచ్చింది. ఒకప్పుడు స్వచ్ఛమైన నీటి ప్రవాహంతో సాగిన ఈ కాలువ, ప్రస్తుతం తన రూపురేఖలను పూర్తిగా కోల్పోతోంది. అక్రమార్కుల పూడ్చివేతలు, అడ్డగోలు కబ్జాల కారణంగా కాలువ గర్భం రోజురోజుకూ కుంచించుకుపోతోంది. అసలు పట్టణంలో కాలువ ఉందా లేదా అన్న స్థితికి చేరుకుంటున్నా, పరిరక్షించాల్సిన మున్సిపల్, రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు కనీస చర్యలు తీసుకోకపోవడంపై స్థానికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 3 కిలోమీటర్ల పొడవునా విస్తరణ మదనపల్లె పట్టణ పరిధిలో ఈ బుగ్గ కాలువ దాదాపు 3 కిలోమీటర్ల పొడవుతో ప్రవహిస్తూ కీలకమైన జలవనరుగా నిలుస్తోంది. పట్టణంలోని అనేక ప్రధాన మురికివాడలు, కాలనీల మీదుగా ఈ ప్రవాహం సాగుతుంది. బొమ్మనచెరువు రోడ్డు నుంచి ప్రారంభమై.. ఈశ్వరమ్మ కాలనీ, యాహల్లి లేఅవుట్, ముగ్గురాళ్ల వంక, వివేకానంద నగర్, చెంబకూరు రోడ్డు, వాల్మీకి వీధి, చిత్తూరు బస్టాండు, మున్సిపల్ కార్యాలయం పక్కనుంచి బాంబు బజార్ మీదుగా బాహుదా కాలువలో కలుస్తుంది. అక్కడి నుండి నిమ్మనపల్లె మండలంలోని ప్రతిష్టాత్మక బాహుదా ప్రాజెక్టులోకి చేరుకుంటుంది. 1996 వరద చేదు జ్ఞాపకాలు.. సురక్షిత మదనపల్లె సాధ్యమేనా? బుగ్గ కాలువ ఆక్రమణల వల్ల భవిష్యత్తులో పట్టణానికి ఎంతటి ఘోర ముప్పు పొంచి ఉందో చెప్పడానికి గత చరిత్రే నిదర్శనం. 1996 జూన్ నెలలో మదనపల్లెకు భయంకరమైన వరదలు సంభవించాయి. అప్పట్లో బుగ్గ కాలువ, బాహుదాలు ఉప్పొంగి పట్టణాన్ని ముంచెత్తడంతో భారీగా ప్రాణ, ఆస్తి నష్టం వాటిల్లింది. ఆ ప్రమాదం తర్వాత అప్పట్లో అధికారులు బుగ్గ కాలువ వెంబడి ఉన్న ఆక్రమణలను కఠినంగా తొలగించి, బాధితులకు ప్రత్యామ్నాయంగా ఇంటి స్థలాలు ఇచ్చారు. అయినప్పటికీ కాలక్రమేణా మళ్లీ కబ్జాలు చోటుచేసుకున్నాయి. కాలువ వెడల్పు నిరంతరం తగ్గిపోతుండటం వల్ల భవిష్యత్తులో భారీ వర్షాలు కురిసి నీటి ప్రవాహాలు పొంగినప్పుడు 1996 నాటి విపత్కర పరిస్థితులు మళ్లీ తలెత్తడం ఖాయమని మేధావులు హెచ్చరిస్తున్నారు. మున్సిపల్, రెవెన్యూ, జలవనరుల శాఖ అధికారులు సంయుక్తంగా నిఘా పెట్టి, కఠినమైన చర్యలు తీసుకుంటే తప్ప బుగ్గ కాలువకు మోక్షం లేదు. సురక్షితమైన మదనపల్లె కోసం ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు ఇప్పటికై నా ఈ సమస్యపై ప్రత్యేక దృష్టి సారించాల్సి ఉంది. లేదంటే భవిష్యత్తులో సంభవించే విపత్కర పరిస్థితులకు అందరూ బాధ్యత వహించాల్సి వస్తుంది.బుగ్గ కాలువకు ఇరువైపులా ప్రతిరోజు ఎక్కడో ఒకచోట ఆక్రమణలు యథేచ్ఛగా కొనసాగుతూనే ఉన్నాయి. అక్రమార్కులు మొదట కాలువకు ఇరువైపులా మెల్లగా మట్టిపోస్తూ పూడ్చివేస్తున్నారు. ఆ తర్వాత వాటిపై శాశ్వత పక్కా నిర్మాణాలు చేపడుతున్నారు. ఈ అక్రమ నిర్మాణాల వల్ల కాలువ వెడల్పు భారీగా తగ్గిపోయి, కొన్నిచోట్ల కేవలం సన్నటి వంకలా మారిపోయింది. మున్సిపల్ ఆఫీసు వద్ద ఉన్న ప్రధాన బ్రిడ్జి కింద కాలువ అసలు వెడల్పు ఎంత ఉందో.. ఆ మేరకు ఆక్రమించి నిర్మాణాలు చేసేశారు. ప్రస్తుతం ఈ కాలువలో పాతిక భాగానికి పైగా పూర్తిగా పూడిపోయింది. కేవలం మిగిలిన కొద్ది భాగం మాత్రమే నీటి ప్రవాహానికి అనుకూలంగా ఉంది. ఎగువ నుంచి దిగువ వరకు ఇదే పరిస్థితి నెలకొన్నా అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. -
పంట పొలాలపై ఏనుగుల దాడి
కేవీపల్లె : పంట పొలాలపై ఏనుగుల గుంపు దాడి చేసిన సంఘటన మండలంలోని జిల్లేళ్లమంద, పెద్దతాండా, బసన్నగారిపల్లె ప్రాంతాల్లో శనివారం రాత్రి చోటు చేసుకుంది. ఏనుగులు గుంపు రాత్రి సమయంలో మామిడి తోటల్లోకి ప్రవేశించి మామిడి చెట్లు, కొబ్బరి, పనస చెట్లను ధ్వంసం చేశాయి. అలాగే మామిడి తోటకు చుట్టూ ఏర్పాటు చేసిన ముళ్ల (రాతి) కూసాలు, కంచెను తొక్కి నాశనం చేశాయి. డ్రిప్ పైపులుసైతం తొక్కి నష్టం కల్గించాయి. ఆదివారం ఉదయం మామిడి తోటల్లో ఏనుగులు సంచరించి చెట్లను ధ్వంసం చేసినట్లు బాధిత రైతులు గుర్తించి ఫారెస్ట్, రెవెన్యూ, ఉద్యాన శాఖ అధికారులకు సమాచారం ఇచ్చారు. ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ జయప్రసాద్రెడ్డి ఆదేశాల మేరకు ఫారెస్ట్ బీటు అధికారి శ్రీనివాసన్ ఆధ్వర్యంలో సిబ్బంది మామిడి తోటలను పరిశీలించారు. జిల్లేమంద నుంచి ఉస్తికాయలపెంట వైపు వెళ్లి ఎనుబోతుల వంక, ఎర్రమడుగు ప్రాంతం గుండా శేషాచలం అటవీ ప్రాంతంలో ఏనుగులు వెళ్లినట్లు ఎఫ్బీవో తెలిపారు. ఉద్యానశాఖ, రెవెన్యూ అధికారులు పంట నష్టం అంచనా వేసి అటవీశాఖకు నివేదిక ఇవ్వాలని తెలిపారు. కార్యక్రమంలో ఉద్యానశాఖ అధికారి సుకుమార్రెడ్డి, రెవెన్యూ, అటవీ సిబ్బంది పాల్గొన్నారు. -
ఆశలు విత్తుకొనేనా!
సాక్షి, అన్నమయ్య : జిల్లావ్యాప్తంగా రెండు రోజులుగా కురుస్తున్న విస్తారమైన వర్షాలతో అన్నదాతల్లో ఖరీఫ్ సాగుపై ఆశలు చిగురించాయి. ఈ ఏడాది జిల్లాలో ఖరీఫ్ సీజన్ సాగు లక్ష్యాన్ని వ్యవసాయ అధికారులు 60 వేల హెక్టార్లుగా నిర్ణయించారు. దానికి తగ్గట్టుగానే వరుణుడు కరుణించడంతో జిల్లా అంతటా సాగు పనులు మొదలుపెట్టేందుకు రైతాంగం సన్నద్ధమవుతోంది. రెండు రోజుల్లో అత్యధికంగా గాలీవీడు మండలంలో 132 మి.మీ భారీ వర్షపాతం నమోదైంది. మిగిలిన అ్చన్ని మండలాల్లో కూడా వర్షాలు విస్తారంగా పడ్డాయి. నిజానికి ఈ ఖరీఫ్లో ఎల్నినో ప్రభావం ఉంటుందని, వర్షాలు సరిగ్గా కురవవని వాతావరణ శాఖ ముందుగానే అంచనా వేయడంతో రైతులు సాగుపై పెద్దగా ఆసక్తి చూపలేదు. దీనివల్ల ప్రారంభంలో సాగు విస్తీర్ణం గణనీయంగా తగ్గిపోయింది. గత ఏడాది ఇదే సమయానికి జిల్లాలో 490 హెక్టార్లలో వేరుశనగ విత్తగా.. ప్రస్తుతం కేవలం 228 హెక్టార్లలో మాత్రమే విత్తనాలు పడ్డాయి. ఈ మొత్తం సాగు లక్ష్యంలో సింహభాగం, అంటే దాదాపు 67 శాతం (40 వేల హెక్టార్లు) కేవలం వేరుశనగ పంట సాగుకే కేటాయించారు. ఇక 12 వేల హెక్టార్ల లక్ష్యంతో వరి పంట రెండో స్థానంలో ఉండగా, మొక్కజొన్న 3,500 హెక్టార్లు, కందులు 1,500 హెక్టార్లలో సాగు చేయాలని లక్ష్యంగా పెట్టారు. రాగి, మినుములు, ఉలవలు, అలసందలు, అనుములు 500 హెక్టార్ల చొప్పున..జొన్న, సజ్జ 250 హెక్టార్ల చొప్పున కేటాయించారు. తీరని విత్తనాల కొరత.. 19 మండలాలకు శూన్యం! వర్షాలు పడి భూమి పదునెక్కినా ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల రైతులకు ఇక్కట్లు తప్పడం లేదు. సాగుకు అత్యంత కీలకమైన రాయితీ (సబ్సిడీ) విత్తనకాయలు ఇప్పటివరకు జిల్లాలకు పూర్తిస్థాయిలో చేరుకోలేదు. జిల్లావ్యాప్తంగా ఈ ఏడాది 43 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తనకాయలు అవసరమని గుర్తించి, ప్రభుత్వం కూడా అంతే పరిమాణంలో బడ్జెట్ కేటాయింపులు చేసింది. కానీ, ఆదివారం నాటికి జిల్లాకు సరఫరా అయింది అందులో 10 శాతం కూడా లేదు.ప్రస్తుతానికి కురబలకోట, వాల్మీకిపురం, పీలేరు, కలికిరి, నిమ్మనపల్లి, మదనపల్లె మండలాలకు కలిపి కేవలం 4,447 క్వింటాళ్ల విత్తనాలను మాత్రమే సరఫరా చేశారు. జిల్లాలోని మొత్తం 25 మండలాలకు.. ఇంకా 19 మండలాలకు కిలో విత్తనకాయలు కూడా సరఫరా కాలేదు. వర్షాలు పడిన వెంటనే జూలై 15 లోపు విత్తనాలు వేసుకోవాల్సిన తరుణంలో.. రాయితీ విత్తనాల పంపిణీలో జరుగుతున్న ఆలస్యంపై రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తక్షణమే స్పందించి విత్తనకాయలను సరఫరా చేయాలని డిమాండ్ చేస్తున్నారు. జిల్లా అంతటా రెండు రోజులుగా విస్తారంగా వర్షాలు గాలీవీడులో అత్యధికంగా 132 మి.మీ నమోదు ఖరీఫలో 60 వేల హెక్టార్ల సాగు లక్ష్యం ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఇంకా 19 మండలాలకు చేరని విత్తనకాయలు ఈ ఏడాది కేటాయించిన వేరుశనగ విత్తనాల్లో కేవలం 10 శాతమే సరఫరా -
ఏసీఏ సౌత్ జోన్ క్రికెట్ పోటీలు ప్రారంభం
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో ఏసీఏ సౌత్ జోన్ అండర్ 16 బాలుర క్రికెట్ జట్టు పోటీలు ప్రారంభం అయ్యాయి. గ్రౌండ్ ఏలో కర్నూలు, నెల్లూరు మ్యాచ్ను సీడీసీఏ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ కుమార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోటీల్లో చిత్తూరు, కడప, అనంతపురం, కర్నూలు, నెల్లూరు జిల్లా జట్లు పాల్గొంటాయని తెలిపారు. ఈ పోటీలు 20 రోజుల పాటు జరుగుతాయని తెలిపారు. అనంతరం గ్రౌండ్–బీలో అనంతపురం, కడప జట్ల మధ్య మ్యాచ్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో కోచ్లు ప్రసన్న కుమార్, షోయబ్, జవహర్ బాష, హరీష్ రెడ్డి, గిరీష్ తదితరులు పాల్గొన్నారు. -
అమ్మవారి సేవలో కర్ణాటక ఏడీఐజీ
చౌడేపల్లె : కోరిన కోర్కెలు తీర్చే దైవంగా పేరుగాంచిన బోయకొండ అమ్మవారిని కర్ణాటక రాష్ట్ర అదనపు డీఐజీ చంద్రశేఖర్ ఆదివారం దర్శించుకొన్నారు. ఆయనకు ఆలయ మర్యాదలతో ఈఓ ఏకాంబరం స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలను చేయించిన అనంతరం అమ్మవారి విశిష్ట చరిత్రను అర్చకులు వివరించారు. అలాగే కర్ణాటకలోని ఎలక్ట్రానిక్ సిటీ ఎమ్మెల్సీ రామోజీ గౌడ అమ్మవారిని దర్శించుకొన్నారు. వీరికి ఆలయ అఽధికారులు సత్కరించి, జ్ఞాపికలతో పాటు తీర్థప్రసాదాలను అందజేశారు. రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికపీలేరురూరల్ : యోగాంధ్ర రాష్ట్ర స్థాయి పోటీలకు పీలేరు కోటపల్లె జెడ్పీ బాలికల పాఠశాల నుంచి ముగ్గురు విద్యార్థినులు ఎంపికై నట్లు ఎంఈవో పద్మావతి తెలిపారు. ఆదివారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ వ్యాసరచన పోటీలో జిల్లా స్థాయిలో ప్రథమ స్థానం సాధించిన పదో తరగతి విద్యార్థిని ధృతి, క్విజ్ పోటీల్లో ద్వితీయ స్థానం సాధించిన తొమ్మిదో తరగతి విద్యార్థిని మాధవి, వ్యాసరచనలో మూడో స్థానం సాధించిన గురు విశ్రాంతి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికై నట్లు వివరించారు. సౌత్ జోన్ అండర్–16 క్రికెట్ పోటీలకు..మదనపల్లె సిటీ : సౌత్ జోన్ అండర్–16 బాలుర అంతర్ జిల్లా మల్టీ డే క్రికెట్ పోటీలకు మదనపల్లెకు చెందిన నలుగురు క్రీడాకారులు ఎంపికై నట్లు మదనపల్లె క్రికెట్ అకాడమీ ప్రధాన కోచ్ జనార్థన్ తెలిపారు. షారిక్ అక్తర్ (ఓపెనింగ్ బ్యాట్స్మన్), తేజేష్(లెఫ్ట్ఆర్మ్ లెగ్ స్నిన్నర్), ఎస్ఎండి మౌలా (రైట్ ఆర్మ్ ఫాస్ట్ బౌలర్), వి.జె.నోయల్ (మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్) ఎంపికై నట్లు తెలిపారు. జూన్ 14 నుంచి జులై 2 వరకు వాల్మీకిపురంలోని జీవీఎస్సీఎస్ క్రికెట్మైదానంలో పోటీలు జరుగుతాయన్నారు. ‘మిట్స్’కు 4ఏ రేటింగ్కురబలకోట : కేరీర్స్ ర్యాంకింగ్స్–26లో మదనపల్లి దగ్గర అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీకి 4ఏ రేటింగ్ దక్కినట్లు వీసీ యువరాజ్ తెలిపారు. విద్యా ప్రమాణాలు, పరిశోధన, ఆవిష్కరణలు, పరిశ్రమల అనుసంధానం, ఉపాధి అవకాశాలు, మౌలిక సదుపాయాలు, అధ్యాపకుల నైపుణ్యం వంటి కీలక అంశాల ఆధారంగా నిర్వహించిన మూల్యాంకనంలో జాతీయస్ఠాయిలో ఈ అరుదైన గుర్తింపు లభించడానికి కారణమైన సిబ్బందిని ఛాన్సలర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రో ఛాన్సలర్ ద్వారకనాఽథ్, అభినందించారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్సాక్షి, మదనపల్లె : స్థానిక కలెక్టరేట్లో సోమవారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఉదయం 11 గంటల నుంచి ప్రజల ఫిర్యాదులను స్వీకరిస్తామని తెలిపారు. ప్రజలు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదులను అధికారులు స్వీకరిస్తారని తెలిపారు. కిందిస్థాయిల్లో పరిష్కారంకాని ఫిర్యాదులను ప్రజలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు వచ్చి ఫిర్యాదు చేయాలన్నారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్లో కూడా ఫిర్యాదులను నమోదు చేసుకోవచ్చని తెలిపారు. -
ప్రభుత్వ బడుల బలోపేతమే లక్ష్యం
మదనపల్లె సిటీ: జిల్లాలో ప్రభుత్వ బడుల బలోపేతంపై దృష్టి పెట్టామని జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం పేర్కొన్నారు. విద్యార్థులకు అవసరమైన సౌకర్యాల కల్పనపై ప్రత్యేక శ్రద్ధ వహించి నాణ్యమైన విద్య అందించేందుకు చర్యలు చేపట్టామన్నారు. ప్రవేశాల సంఖ్య పెంచేందుకు ప్రయత్నిస్తున్నామని వివరించారు. ఈనెల 12వతేదీ నుంచి బడులు తెరుచుకున్న నేపథ్యంలో డీఈవో ‘సాక్షి’తో మాట్లాడారు. ● బడి పిలుస్తోంది కార్యక్రమంలో భాగంగా ఉపాధ్యాయులందరూ కలిసి నిర్వహించాం. ఇందులో 1వ తరగతిలో 9,559 మంది విద్యార్థులను చేర్పించడం జరిగింది. రాష్ట్రంలోనే మూడో స్థానంలో నిలిచాం. అందరి సహకారంతో లక్ష్యం అధిగమించాం. ● జిల్లా కేంద్రానికి ఇప్పటికే వంద శాతం మేరకు పుస్తకాలు వచ్చాయి. టెక్ట్స్ పుస్తకాలు 5,59,378, వర్క్ బుక్కులు 1,26,136, ఆక్స్ఫర్డ్ డిక్షనరీలు 11,497, పిక్టోరియల్ డిక్షనరీలు 9,850 వచ్చాయి. బ్యాగులు,షూలు త్వరలో వస్తాయి. వాటిని అందజేస్తాం. ● పాఠశాలలో మైనర్ రిపేర్లు చేయించాలని ఆదేశించాం. 265 మోడల్ పాఠశాలల్లో టాయిలెట్ల నిర్మాణానికి చర్యలు తీసుకుంటున్నాం.1042 ఆర్ఓ ప్లాంట్లు పనిచేయడం లేదు. వీటిని ఏజెన్సీ ద్వారా ఐదు సంవత్సరాలు గ్యారంటీతో రిపేరీ చేయిస్తాం.‘సాక్షి’తో డీఈవో సుబ్రమణ్యం -
మున్సిపల్ ఆఫీస్ పక్కనే ‘టాక్సీ స్టాండ్’ అరాచకం!
మదనపల్లె పట్టణంలో అద్దె కార్లు నడుపుకుంటూ జీవించే డ్రైవర్ల సంఖ్య చాలా ఎక్కువ. అయితే, వీరికి పట్టణంలో ప్రత్యేకంగా ఎలాంటి టాక్సీ స్టాండ్ లేకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ఈ తరుణంలో అక్రమార్కులు ఏకంగా బుగ్గ కాలువనే టాక్సీ స్టాండ్గా మార్చేశారు. మున్సిపల్ ఆఫీస్ పక్కనే ప్రవహించే కాలువలో ఎగువ నుంచి వచ్చే నీరు ఒకవైపుకే వెళ్లేలా కృత్రిమంగా మట్టి దిబ్బలను ఏర్పాటు చేశారు. కాలువలో ఒక పక్కన సన్నటి నీటి ప్రవాహాన్ని ఉంచి, మిగిలిన సువిశాల కాలువ స్థలంలో అడ్డగోలుగా టాక్సీలను నిలిపి ఉంచుతున్నారు. డ్రైవర్ల సమస్యను గుర్తించి అధికారులు వీరికి వేరే చోట ప్రత్యేకంగా టాక్సీ స్టాండ్ ఏర్పాటు చేయాల్సి ఉన్నా ఆ ఊసే ఎత్తడం లేదు. -
చెట్టును ఢీకొన్న బైక్
మదనపల్లె టౌన్: బైక్ను అతివేగంగా నడిపిన ఓ యువకుడు రోడ్డు ప్రమాదానికి గురై ఆసుపత్రి పాలయ్యాడు. ఆదివారం గుర్రంకొండ మండలంలో చోటుచేసుకున్న ఈ ఘటనపై మదనపల్లె జిల్లా ఆసుపత్రి ఔట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం, బోడిగుట్ట కు చెందిన బాబు కుమారుడు కె. అరవింద్ (20) సొంత పనిమీద బైక్లో గుర్రంకొండ మండలంలోని తరిగొండకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి స్వగ్రామానికి వస్తుండగా వేగాన్ని నియంత్రించలేక రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొట్టాడు. తీవ్రంగా గాయపడిన యువకుడిని స్థానికులు మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించారు. అతని పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో కుటుంబీకులు ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రవీంద్ర తెలిపారు. ద్విచక్రవాహనం ఢీకొని.. కలకడ : ద్విచక్రవాహనం ఢీ కొని ఇద్దరు చిన్నారులుకు తీవ్ర రక్తగాయాలైన సంఘటన ఆదివారం చిత్తూరు–కర్నూలు జాతీయరహదారిపై జరిగింది. స్థానికుల కథనంమేరకు వివరాలిఉన్నాయి. రాయచోటి టౌన్కు చెందిన బాషా కుటుంబసభ్యులు రెండు ద్విచక్రవాహనాల్లో కలకడకు వస్తుండగా ముందుగా వెళుతున్న బైక్ను వెనుకనుంచి వారి మరో ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో సుహేల్, మున్నా తీవ్రంగా గాయపడ్డారు, ద్విచక్రవాహనం దెబ్బతింది. గాయపడిన వారిని స్థానికులు ఆటోలో కలకడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్లారు. ● యువకుడికి గాయాలు -
వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: వేర్వేరు కారణాలతో ముగ్గురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ఆదివారం జరిగిన ఘటనలపై జిల్లా ఆసుపత్రి ఔట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పుంగనూరు పట్టణం ప్రకాశం కాలనీకి చెందిన శివశంకర్ (45) భార్యతో గొడవపడి మనస్తాపానికి గురయ్యాడు. భార్య ఇంట్లో వంట చేస్తుండగా బెడ్రూమ్లోకి వెళ్లి ఉరి వేసుకున్నాడు. పిల్లలు గమనించి కేకలు వేయడంతో భార్య, స్థానికులు వచ్చి అతడిని కాపాడారు. మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా డాక్టర్లు చికిత్స అందించారు. ప్రస్తుతం ప్రాణాపాయం తప్పి కోలుకుంటున్నాడు. ములకలచెరువు మండలం బురకాయలకోటలో మహబూబ్ బాషా భార్య షకీలా (38) కుటుంబీకులతో గొడవపడి ఫినాయిల్ తాగింది. వెంటనే ఆమెను మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందించారు. పట్టణంలోని నీరుగట్టువారిపల్లికి చెందిన శివశంకర్ భార్య భార్గవి (25) భర్తతో గొడవపడి విషం తాగింది. కుటుంబీకులు గమనించి జిల్లా ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు మెరుగైన వైద్యం అందించడంతో ఆమె కోలుకుంటోంది. -
మృత్యువులోనూ వీడని భార్యభర్తల బంధం
● రోడ్డు ప్రమాదంలో భార్యాభర్తలు మృతి మదనపల్లె టౌన్: కష్టసుఖాల్లో ఒకరికొకరు కలకాలం తోడుగా ఉంటామని చేతిలో చేయ్యేసి ఒట్టు పెట్టిన ఆ దంపతులు మృత్యువులోనూ ఒక్కటయ్యారు.రోడ్డుప్రమాద రూపంలో మృత్యువు భార్యాభర్తలను బలితీసుకున్న సంఘటన అన్నమయ్య జిల్లా పుంగనూరు మండలంలో ఆదివారం చోటు చేసుకుంది. మృతుల కుటుంబీకులు, పుంగనూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన దంపతులు అమీర్ (45), సల్మా (40), వారి కుమారుడు ముస్తాకిర్ (19) సొంత పనిమీద ద్విచక్ర వాహనంలో పుంగనూరు బయలుదేరారు. ఈడిగిపల్లి వద్దకు వెళ్లగానే బైక్ను వెనుక నుంచి వేగంగా వచ్చిన బొలెరో ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో దంపతులు అమీర్, సల్మా అక్కడికక్కడే మతి చెందారు. వారి కుమారుడు ముస్తాకిర్ తీవ్రంగా గాయపడి మత్యువుతో పోరాడు తున్నాడు. సంఘటన సమాచారం అందుకున్న పుంగనూరు పోలీసులు వెంటనే ఈడిగిపల్లికి చేరుకుని మృత దేహాలను పోస్టుమార్టం నిమిత్తం పుంగనూరు ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. గాయపడిన ముస్తాకిర్ను పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. బొలెరో డ్రైవర్ పరారీలో ఉన్నాడు. కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. చావులోనూ భార్యాభర్తల మూడు ముళ్ల బంధం వీడలేదని పలువురు కన్నీటి పర్యంత మయ్యారు. పుంగనూరు రోడ్డు ప్రమాదంలో మదనపల్లె రామారావు కాలనీకి చెందిన భార్యాభర్తలు మృతి చెందడంతో ఆ ప్రాంతమంతా విషాదంలో మునిగింది. -
ఆగిఉన్న లారీని ఢీకొన్న బస్సు
మదనపల్లె టౌన్: కర్ణాటకలోని చింతామణి వద్ద ఆగి ఉన్న లారీని మార్కాపురం బస్సు ఢీకొన్న ఘటనలో ఆంధ్రప్రదేశ్కు చెందిన 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి విషమంగా ఉంది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి చింతామణి ఎస్ఐ శివరాజ్ తెలిపిన వివరాల ప్రకారం.. ఏపీలోని ప్రకాశం జిల్లా పామూరు నుంచి బెంగళూరు వెళ్తున్న ఉదయగిరి డిపో ఆర్టీసీ బస్సు ఆదివారం తెల్లవారుజామున సుమారు 3:30 గంటల ప్రాంతంలో కర్ణాటక రాష్ట్రంలోని చింతామణి బైపాస్లోని మాడికేరి క్రాస్ వద్ద ఆగి ఉన్న లారీని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బస్సులోని 20 మంది ప్రయాణికులు గాయపడ్డారు. వారిలో ముగ్గురి పరిస్థితి ఆందోళనకరంగా ఉండటంతో స్థానిక ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం వారిని కుటుంబీకులు బెంగళూరుకు తీసుకెళ్లారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 20 మందికి గాయాలు -
మా భూములను ఆన్లైన్లో మార్చేశారు
రొంపిచెర్ల: మా భూములను రెవెన్యూ అధికారులు అన్లైన్లో మార్చేశారని, మాకు న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీ ముంతావారిపల్లెకు చెందిన బాధితురాలు జి. హైమావతి అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మా మామ చెంచయ్యకు సర్వే నంబర్ 2972–1లో 1.38 సెంట్లు, 2973–3బి1లో 95 సెంట్ల భూమి ఉందన్నారు. అయితే మా మామకు నలుగురు కుమారులని, వీరిలో ముగ్గురు మృతి చెందారని, మూడో కుమారుడు వెంకటరమణ మాత్రమే జీవించి ఉన్నారని తెలిపారు. నా భర్త సుధాకర్ కూడా మృతి చెందారని చెప్పారు. దీంతో తన బావ వెంకటరమణతో కలిసి మా మామ పేరుతో ఉన్న ఆస్థిని మా పేరుతో పట్టాదారు పాసు పుస్తకం మార్పు కోసం దరఖాస్తు చేశామని తెలిపారు. అయితే అ భూమిని గ్రామానికి చెందిన వి.వెంకటరమణ, కుమారి ఇద్దరు 2023లో వారి పేర్లతో అన్లైన్ చేసుకున్నారని ఆరోపించారు. 20 సంవత్సరాల వయస్సు గల 70 మామిడి చెట్లు కూడా ఉన్నాయని చెప్పారు. భూమి ఆన్లైన్లో మార్చేసిన విషయం గురించి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశామని తెలిపారు. అయితే రొంపిచెర్ల తహసీల్దార్ కలెక్టర్కు పంపిన నివేదికలో భూమి మా ఆధీనంలో ఉన్నట్లుగాని, మామిడి చెట్లు, సమాధులు ఉన్నట్లుగాని కనపరచలేదన్నారు. ఈ ఏడాది మామిడి పంట ద్వారా రూ.15 వేలు ఆదాయం కూడా వచ్చిందన్నారు. రెవెన్యూ అధికారులు ఏకపక్షంగా కలెక్టర్కు నివేదిక పంపారని ఆరోపించారు. దీనిపై సమగ్రమంగా విచారణ జరిపి న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యమని తెలిపారు. న్యాయం చేయకపోతే ఆత్మహత్యే శరణ్యం బాధితురాలు హైమావతి -
చమర్తి దౌర్జన్యాలకు చరమగీతం!
ఒంటిమిట్ట: రాజంపేట నియోజకవర్గ టీడీపీలో అంతర్గత విభేదాలు ఒక్కసారిగా భగ్గుమన్నాయి. నియోజకవర్గ ఇన్ఛార్జ్ చమర్తి జగన్ మోహన్ రాజు తీరుపై సొంత పార్టీ సీనియర్ నాయకులే తిరుగుబాటు జెండా ఎగరేశారు. ఒంటిమిట్ట మండల పరిధిలోని మంటపంపల్లిలో ఆదివారం టీడీపీ సీనియర్ నాయకుడు కిరణ్ స్వామి నివాసంలో నియోజకవర్గంలోని 6 మండలాలకు చెందిన ముఖ్య నేతలు అత్యవసర అసమ్మతి సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా సీనియర్ నాయకులు చమర్తి జగన్ మోహన్ రాజుపై తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దశాబ్దాలుగా పార్టీ గెలుపు కోసం, జెండా మోసి కష్టపడిన నిబద్ధత గల నాయకులను, కార్యకర్తలను ఇన్ఛార్జ్ పూర్తిగా విస్మరించారని ధ్వజమెత్తారు. నిన్న మొన్న పార్టీలోకి వచ్చిన ఇసుక, మట్టి మాఫియా శక్తులను చమర్తి చేరదీస్తున్నారని.. వారికే కీలక పదవులు కట్టబెడుతూ, వారు చెప్పిందే వేదంగా పాలిస్తున్నారని తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సమావేశం ధ్వంసం.. నేతల బాహాబాహీ పోరు చమర్తిపై వ్యతిరేక స్వరాలు వినిపిస్తున్న తరుణంలో ఇన్ఛార్జ్ వర్గానికి చెందిన జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, మంటపంపల్లి ఎంపీటీసీ సుంకేసుల బాషా, మండల క్లస్టర్ ఇన్ఛార్జ్ ఈశ్వరయ్య మరికొంతమంది అనుచరులతో కలిసి అక్కడికి దూసుకొచ్చారు. తమకు సమాచారం లేకుండా ఒంటిమిట్టలో సమావేశం ఎలా నిర్వహిస్తారంటూ సీనియర్ నేతలతో వాదనకు దిగారు. సమావేశాన్ని బలవంతంగా భగ్నం చేసేందుకు ప్రయత్నించడంతో ఇరువర్గాల మధ్య మాట మాట పెరిగి, పరిస్థితి బాహాబాహీ వరకు దారితీసింది. గ్రామంలో ఉద్రిక్త వాతావరణం నెలకొనడంతో సమాచారం అందుకున్న ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు తన సిబ్బందితో కలిసి తక్షణమే ఘటనా స్థలానికి చేరుకున్నారు. శాంతిభద్రతల పరిరక్షణ దృష్ట్యా అక్కడ ఎలాంటి సమావేశాలు నిర్వహించడానికి వీల్లేదని ఇరువర్గాలకు తేల్చి చెప్పారు. పోలీసుల జోక్యంతో అసమ్మతి నాయకులు తమ సమావేశాన్ని రద్దు చేసుకుని వెనుదిరిగారు. చమర్తి వర్గీయుల దాడితో సమావేశం రద్దయిన అనంతరం, టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకట నరసయ్య, ఒంటిమిట్ట నేత కిరణ్ స్వామి సంయుక్తంగా విలేకర్ల సమావేశం నిర్వహించారు. నియోజకవర్గంలో చమర్తి జగన్ మోహన్ రాజు నాయకత్వ లోపం ఎక్కడ బయటపడుతుందోనన్న భయంతోనే తమ సమావేశాన్ని రౌడీయిజంతో భగ్నం చేశారని ఆగ్రహం వ్యక్తం చేశారు. మండలాలతో సంబంధం లేని చమర్తి అనుచరులను, సొంత కుటుంబ సభ్యులను మండల ఇంచార్జ్లుగా నియమించి.. దశాబ్దాలుగా పార్టీని నమ్ముకున్న కార్యకర్తలను అవమానిస్తున్నారని మండిపడ్డారు. ఇదే తీరు కొనసాగితే రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో రాజంపేటలో టీడీపీకి భారీ ఎదురుదెబ్బ తగలడం ఖాయమని హెచ్చరించారు. రాజంపేట టీడీపీలో భగ్గుమన్న అసమ్మతి రణరంగంగా మారిన మంటపంపల్లి -
విద్యుత్ వైర్ చోరీ
గాలివీడు : మండల పరిధిలోని నూరివీడు గ్రామం బోడసానివాండ్లపల్లెకు చెందిన మహిళా రైతు కె.సాలమ్మ, బి.శివారెడ్డిలకు చెందిన విద్యుత్ వైర్ను శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారు. ఆదివారం ఉదయం పొలాల వద్దకు వెళ్లి చూడగా వైర్ చోరీకి గురైనట్లు గుర్తించారు. వెంటనే స్థానిక పోలీస్స్టేషన్లో రైతులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు గాలివీడు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మదనపల్లె టౌన్: గడ్డిని యంత్రంతో కత్తిరిస్తుండగా ప్రమాదవశాత్తు చేయి పడి మహిళ చేతి వేళ్లు రెండు తెగిపోయిన సంఘటన రామసముద్రం మండలంలో ఆదివారం జరిగింది.బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని నారిగానిపల్లి పంచాయతీ ఎగువ లంబంవారిపల్లికి చెందిన రామకష్ణ భార్య రమణమ్మ (46) ఇంటి వద్ద పాడి పశువులకు గడ్డిని యంత్రంతో కత్తిరిస్తూ ఉండగా పొరపాటున చేయి యంత్రంలో పడింది. దీంతో ఆమె రెండు వేళ్లు తెగిపోయాయి. కుటుంబీకులు ఆమెను సమీప ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. తొండూరు : తొండూరు మండలంలోని గంగనపల్లె గ్రామంలో వెలసిన గంగమ్మ గుడిలో శనివారం అర్ధరాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఆలయంలోకి చొరబడి హుండీని పగులగొట్టి నగదును అపహరించారు. ఆదివారం ఉదయం అర్చకుడు ఆలయ తలుపులు తీసి చూడగా చోరీ జరిగినట్లు గుర్తించి గ్రామ పెద్దలకు సమాచారం అందించారు. హుండీలో ఎంత నగదు ఉందనే విషయం తెలియరాలేదు. కొన్ని వారాలుగా హుండీ ఆదాయాన్ని లెక్కించలేదు. దీంతో హుండీలో ఎక్కవ మొత్తంలో నగదు ఉంటుందని గ్రామస్థులు పేర్కొంటున్నారు. కమలాపురం : కమలాపురం జడ్పీటీసీ సభ్యురాలు లింగాల సుమిత్రా భర్త రాజశేఖర్ రెడ్డిపై దాడి చేసిన సునీల్ అనే యువకుడిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ విద్యాసాగర్ తెలిపారు. ఆయన తెలిపిన సమాచారం మేరకు.. శనివారం రాత్రి రాజశేఖర్రెడ్డి భోజనం చేశాక వాకింగ్ చేస్తుండగా అదే గ్రా మానికి చెందిన ఉప్పర సునీల్ కత్తితో పొడిచాడన్నారు. శరీరం వెనుక, ముందు వైపు కూడా దాదాపు 12 చోట్ల పొడిచాడన్నారు. కత్తిపోట్లకు గురైన రాజశేఖర్ రెడ్డి కేకలు వేయడంతో నిందితుడు పరారయ్యాడు. క్షతగాత్రుడుని చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు జిల్లా ఆసుపత్రికి తరలించారన్నారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం రాజశేఖర్ రెడ్డిని హైదరాబాద్కు తరలించినట్లు ఎస్ఐ వివరించారు. గ్రామంలో ఈ ఏడాది జనవరి 1న కేక్ కట్ చేసే నేపథ్యంలో గ్రామంలోని యువకులు ఘర్షణ పడ్డారు. ఆ సమయంలో రాజశేఖర్ రెడ్డి వారిని మందలించి ఇంటికి పంపారు. అప్పటి నుంచి రాజశేఖర్రెడ్డిపై పగ పెంచుకున్న సునీల్ దాడికి పాల్పడి ఉండాడని గ్రామస్థుల ద్వారా తెలిసిందన్నారు. భాధితుడి భార్య సుమిత్రా ఫిర్యాదు మేరకు సునీల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. నిందితుని కోసం గాలింపు చర్యలు చేపట్టామని ఎస్ఐ తెలిపారు. -
తెలుగు‘బెంగ’.. ఖాళీ ‘క్వార్టర్స్’ !
బద్వేలు: పట్టణ కేంద్రంలోనే ఉన్నా పగలే నిర్మానుష్య వాతావరణం.. చీకటి పడితే పోకిరీలకు కొండంత అండ.. ఇదీ బద్వేలు మున్సిపల్ కార్యాలయానికి కూతవేటు దూరంలో ఉన్న తెలుగుగంగ కాలనీ క్వార్టర్ల ప్రస్తుత దయనీయ స్థితి. ఒకప్పుడు ప్రభుత్వ ఉద్యోగుల నివాసాలతో కళకళలాడిన ఈ ప్రభుత్వ భవనాలు, రెండు దశాబ్దాలుగా పాలకుల, అధికారుల నిర్లక్ష్యంతో ప్రస్తుతం అసాంఘిక కార్యకలాపాలకు నయా అడ్డాగా మారాయి. విద్యాసంస్థలు, మున్సిపాలిటీ ఆఫీస్ నడుమ ఘోరం ఈ శిథిలావస్థకు చేరుకున్న తెలుగుగంగ క్వార్టర్లు పట్టణంలోని అత్యంత కీలకమైన ప్రాంతాల మధ్య ఉండటం గమనార్హం. ఒకవైపు ప్రముఖ బిజివేముల వీరారెడ్డి విద్యాసంస్థల ప్రాంగణం, మరోవైపు తెలుగుగంగ ప్రధాన రహదారి వీధి.. ఇంకోవైపు అత్యంత సమీపంలోనే బద్వేలు మున్సిపాలిటీ కార్యాలయ సముదాయం ఉన్నాయి. ఇంతటి ముఖ్యమైన లొకేషన్లలో ఉన్నప్పటికీ, ఈ సువిశాల ఖాళీ స్థలం పగలు, రాత్రి అనే తేడా లేకుండా ఎప్పుడూ నిర్మానుష్యంగానే ఉంటుంది. క్వార్టర్ల చుట్టూ ఖాళీ స్థలం అధికంగా ఉండటంతో కంపచెట్లు విపరీతంగా పెరిగి చూడటానికి ఒక ‘చిట్టడవి’లా తయారైంది. ఈ చిట్టడవే ప్రస్తుతం మందుబాబులకు, పేకాట రాయుళ్లకు ప్రత్యేక రక్షణ వలయంలా ఉపయోగపడుతోంది. గదుల నిండా మద్యం బాటిళ్లు.. గంజాయి, వ్యభిచారం కలకలం! తెలుగుగంగ కాలనీలో నిర్మించిన ఈ 30కి పైగా క్వార్టర్ల భవనాలలో ఒక్కో దానికి ఐదారు గదులు ఉన్నాయి. ఈ విశాలమైన గదుల వసతి పోకిరీలకు మరింత సౌకర్యంగా మారింది. భవనాల గదుల లోపల, పైన ఎటు చూసినా ఖాళీ మద్యం బాటిళ్లు కుప్పలు తెప్పలుగా దర్శనమిస్తున్నాయి. కొందరు పగలు రాత్రి అన్న తేడా లేకుండా ఇక్కడ చేరి మద్యం సేవిస్తూ, పేకాట జోరుగా సాగిస్తున్నారు. ఈ పాడుపడిన క్వార్టర్లను ఆవాసాలుగా చేసుకుని కొందరు వ్యభిచారం కూడా సాగిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. వీటికి తోడు కొందరు రిక్షా కార్మికులు, ఆకతాయిలు ఇక్కడికి వచ్చి గంజాయి తాగుతూ డ్రగ్స్ దందాకు కూడా తెరలేపుతున్నారు. పోలీసుల గస్తీ.. శూన్యం! దారుణాలపై స్థానిక కాలనీవాసులు పలుమార్లు పోలీసులకు గట్టిగా ఫిర్యాదులు చేశారు. అయితే, ఫిర్యాదు చేసిన ఒకటి రెండు రోజులు మాత్రం పోలీసులు ఆ ప్రాంతంలో మొక్కుబడిగా గస్తీ నిర్వహించి, ఆ తర్వాత మళ్లీ అటువైపు వెళ్లడం మానేశారన్న ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. పోలీసుల గస్తీ నిలిచిపోవడంతో అల్లరి మూకలు మళ్లీ యథేచ్ఛగా తమ కార్యకలాపాలు సాగిస్తూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నాయి. ఇప్పటికై నా జిల్లా పోలీసు ఉన్నతాధికారులు స్పందించి, ఆ కంపచెట్లను పూర్తిగా తొలగించి, అక్కడ పటిష్టమైన పోలీసు నిఘా మరియు శాశ్వత గస్తీ కేంద్రం ఏర్పాటు చేయాలని ఆ ప్రాంత ప్రజలు ముక్తకంఠంతో కోరుతున్నారు. బద్వేలు నడిబొడ్డున అసాంఘిక కార్యక్రమాలు మున్సిపల్ ఆఫీస్ పక్కనే పోకిరీల రాజ్యం కాలనీలో మద్యం, వ్యభిచారం, గంజాయి జోరు D M>ÓÆý‡t-ÆŠ‡ÞMýS$ çÜÒ$-ç³…ÌZ¯ól ™ðlË$-VýS$-VýS…VýS Æøyýl$z M>ÌS-±, ÒÆ>-Æð‡yìlz 1, 2 M>ÌS± {ç³fÌS °Ðé-ÝëË$ E¯é²Æ‡$$. CMýSPyìl MýS$r$…»êÌSMýS$ ^ðl…¨¯]l í³ÌSÏË$, Ð]l$íßæ-âýæË$ {ç³†Æøþ D ¿ýæÄ¶æ*-¯]lMýS M>ÓÆý‡tÆý‡Ï Ò$§ýl$-V>¯ól ™èlÐ]l$ ѧéÅçÜ…çܦ-ÌSMýS$, 糯]l$-ÌSMýS$ वे-âêÏÍÞ E…r$…-¨. AMýSPyýl °Æý‡…-™èlÆý‡… †ÇVóS AÌSÏÇ Ð]lÊMýS-ÌS¯]l$, AÝë…íœ$MýS ÔèæMýS$¢-ÌS¯]l$ ^èl*íÜ Ñ§éÅ-Æý‡$¦Ë$, ÝëÐ]l*¯]lÅ {ç³fË$ ¡{Ð]l ¿ýæÄ¶æ*…§ø-âýæ-¯]l-ÌSMýS$, Cº¾…§ýl$ÌSMýS$ VýS$Æý‡-Ð]l#-™èl$-¯é²Æý‡$. -
కన్నీళ్లు తెప్పించిన ఘటన
మదనపల్లె టౌన్: మదనపల్లె పట్టణంలో కన్నీళ్లు తెప్పించే ఘటన జరిగింది. బిడ్డ పుట్టిందన్న ఆనందంతో భార్యకు కాఫీ తీసుకురావడానికి పరుగులు తీసిన యువకుడిని కారు ఢీకొట్టింది. దీంతో రెండు కాళ్లు విరిగి అతడు కూడా మంచం పట్టాల్సిన దుస్థితి ఏర్పడింది. ఆదివారం అర్ధరాత్రి జరిగిన ఈ ఘటనపై వన్ టౌన్ పోలీసులు, బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. ములకలచెరువు మండలం కాలవపల్లికి చెందిన మౌలాలి తన భార్య రేస్మాను ప్రసవం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తీసుకొచ్చాడు. ఆమె అర్ధరాత్రి ఆడబిడ్డకు జన్మనిచ్చింది. తల్లిదండ్రులు ‘ఆడబిడ్డ పుట్టింది‘ అని చెప్పడంతో సంతోషంతో భార్యకు కాఫీ తీసుకురావాలని మౌలాలి ఆసుపత్రి వద్ద ఉన్న తిరుమల హోటల్ వైపు పరుగులు తీశాడు. రోడ్డు దాటే క్రమంలో ఆసుపత్రి వద్ద వేగంగా వచ్చిన కారు అతన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మౌలాలి రెండు కాళ్లు విరిగాయి. స్థానికులు అతన్ని అదే ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటన తెలిసిన ప్రతి ఒక్కరూ కన్నీరు పెట్టుకున్నారు. -
పేదల సొంతింటి కలను సాకారం చేస్తాం!
ప్రొద్దుటూరు: పేదల సొంతింటి కలను సాకారం చేయడమే కూటమి ప్రభుత్వ ప్రధాన లక్ష్యమని రాష్ట్ర గృహ నిర్మాణ, సమాచార పౌరసంబంధాల శాఖమంత్రి కొలుసు పార్థసారథి తెలిపారు. ప్రొద్దుటూరు నియోజకవర్గ పరిధిలోని బొల్లవరం హౌసింగ్ లేఅవుట్లో శనివారం ఆయన స్థానిక ఎమ్మెల్యే నంద్యాల వరదరాజులరెడ్డితో కలిసి క్షేత్రస్థాయిలో పర్యటించారు. అక్కడ అసంపూర్తిగా నిలిచిపోయిన గృహ నిర్మాణాలను మంత్రి నిశితంగా పరిశీలించి, లబ్ధిదారులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు.ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ, మెప్మా మహిళా సంఘాలకు సంబంధించిన నిధుల వినియోగంలో సుమారు రూ.48 కోట్ల మేర అవినీతి జరిగినట్లు ఫిర్యాదులు వచ్చాయన్నారు. దీనిపై సమగ్ర విచారణకు ఆదేశించామని, వాస్తవాలను వెలికితీసి నిధులు పక్కదారి పట్టించినవారిపై కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. రాష్ట్రవ్యాప్తంగా 8.50 లక్షల ఇళ్ల లక్ష్యం రాష్ట్రంలో పేదల గృహ నిర్మాణ రంగాన్ని శరవేగంగా ముందుకు తీసుకెళ్తున్నామని మంత్రి వివరించారు. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 4.50 లక్షల ఇళ్లను పూర్తి చేసి లబ్ధిదారులకు అందించామన్నారు. ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్న మరో 4 లక్షల ఇళ్లను కూడా యుద్ధప్రాతిపదికన పూర్తి చేసి పేదలకు అందజేస్తామని, ఇళ్ల నిర్మాణంతో పాటు లేఅవుట్లలో తాగునీరు, విద్యుత్, డ్రైనేజీ, అంతర్గత రహదారులు వంటి మౌలిక సదుపాయాల కల్పనకు ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోందని మంత్రి పార్థసారథి తెలిపారు. ఈ కార్యక్రమంలో జమ్మలమడుగు ఆర్డీఓ శిరీష, హౌసింగ్ సీఈ వేణుగోపాల్, జిల్లా హౌసింగ్ పీడీ రాజారత్నం, తహసీల్దార్ ఉదయభాస్కర్, హౌసింగ్ డీఈలు, వివిధ శాఖల అధికారులు పెద్ద సంఖ్యలో లబ్ధిదారులు పాల్గొన్నారు. -
ఆ ఊరి భూములకు... రైతులకు ‘గుర్తింపు’ కరువైంది. కళ్లముందు భూమి ఉన్నా.. దశాబ్దాలుగా సాగులో ఉన్నా ..ఆన్లైన్లో నుంచి గాయబ్ అయింది. ఫలితంగా ఆఊరికంటూ గుర్తింపు లేకుండా పోయింది.. వారి గడప వరకు ఏ సంక్షేమ పథకమూ రాని పరిస్థితి నెలకొంది. అన్నమయ్య జిల్లా గుర్రంకొం
అదొక పెద్ది గ్రామం ● రెవెన్యూ రికార్డుల్లో జాడేలేని చిట్టిబోయనపల్లె ● ఆన్లైన్లో కనబడని 1800 ఎకరాల చిట్టిబోయనపల్లె భూములు ● రైతు గుర్తింపు కార్డు కోసం అన్నదాతల పడిగాపులు గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం ‘పెద్ది’ సినిమాలోని కొండకింద ఊరును తలపిస్తోంది. ఈ ఊరు పరిధిలో సుమారు 328 మంది రైతులకు సంబంధించి 1800 వందల ఎకరాల భూమి ఉంది. రెండేళ్ల వరకు అంటే.. కూటమి కొలువుదీరక ముందు వరకు రెవెన్యూ రికార్డుల్లో ఊరు భద్రంగా ఉంది. భూములకు, వన్బీలు, అడంగ్లు, మ్యూటేషన్లు, ప్రభుత్వ పథకాలు పక్కాగా అందేవి. కూటమి ప్రభుత్వం అధికారంలో వచ్చాక వీరి బతుకు దుర్భరంగా మారింది. ఏకంగా ఊరంతా రెవెన్యూ రికార్డుల్లో మాయమైంది. ఆన్లైన్లో గ్రామానికి సంబంధించిన ఒక్క రైతు భూమి కనిపించడం లేదు. దీంతో రెండేళ్లుగా ఊరిలో ఒక్కరికి కూడా రెవెన్యూ సేవలు అందకపోగా రైతులకు వ్యవసాయ పథకాలు అందడం లేదు. తాజాగా ప్రభుత్వం రైతు గుర్తింపు కార్డుల కోసం ఏర్పాటు చేసిన ప్రత్యేక వెబ్సైట్లోనూ భూముల జాడే లేకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. బ్యాంకుల్లో పంట రుణాలు పొందాలంటే గుర్తింపు కార్డు తప్పనిసరి. ఫలితంగా గ్రామానికి చెందిన రైతులు రైతు గుర్తింపు కార్డుల కోసం యుద్ధమే చేస్తున్నారు. కాళ్లకున్న చెప్పులు అరిగేలా కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. రెండేళ్లుగా రెవెన్యూ సేవలు బంద్ చిట్టిబోయనపల్లె గ్రామానికి సంబంధించి రెండేళ్లుగా రెవెన్యూ సేవలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో బ్యాంకుల్లో రుణాలు పొందిన రైతులు మళ్లీ రీషెడ్యూల్ చేసుకోవాలన్నా ఆన్లైన్లో అడంగల్, ఒన్బీలు రాకపోవడంతో పలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇకమీదట రైతులకు రైతు భరోసా పధకం వర్తించాలంటే తప్పనిరిగా రైతుగుర్తింపు కార్డు ఉండాలనే నిబంధన రావడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా ఇప్పటికే మండల వ్యాప్తంగా 6125 మంది రైతు గుర్తింపు కార్డులు వెబ్సైట్లో నమోదు చేశారు. అయితే చిట్టిబోయనపల్లె రైతులకు మాత్రం ఇంతవరకు గుర్తింపు కార్డు నమోదు ప్రక్రియ జరగపోవడం విచారకరం. ఇప్పటికైనా కూటమి ప్రభుత్వం తమను కరుణించాలని వేడుకుంటున్నారు. చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతులకు రైతు గుర్తింపు కార్డులు జారీ ప్రక్రియ సక్రమంగా జరగడం లేదనే విషయం జిల్లా వ్యవసాయ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. రెండేళ్లుగా ఈ సమస్య ఉంది. రైతుసేవాకేంద్రాలకు వచ్చే రైతుల వద్ద నుంచి మేం జిరాక్స్కాపీలను తీసుకొని వెబ్సైట్లో సమస్య పరిష్కారం కాగానే సమాచారం అందిస్తామని చెప్పి పంపిస్తున్నాం. – రత్నమ్మ, ఏఓ, గుర్రంకొండ. చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలో రైతుల పొలాలకు సంబంధించి మ్యూటేషన్లు కావడం లేదు. చాలా రోజులుగా ఈ భూములకు సంబందించి ఆన్లైన్లోనే సమస్య ఉంది. ఆన్లైన్లో ఈ భూములకు సంబందించిన వివరాలు ప్రభుత్వం ఫ్రీహోల్డ్లో ఉంచింది. ఈ సమస్యను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లాం. తొందరలొనే సమస్యకు పరిష్కారం లభిస్తుందని అధికారులు చెబుతున్నారు. – ఫణికుమార్, తహసీల్దార్, గుర్రంకొండ. -
‘15 కిలోల క్రేట్లు’ అమలు !
సాక్షి, మదనపల్లె: ములకలచెరువు వ్యవసాయ మార్కెట్లో 15 కిలోల క్రేట్ల విధానం ఎట్టకేలకు అమలులోకి వచ్చింది. దీని అమలుకు సంబంధించి సాక్షిలో కథనాలు ప్రచురితమయ్యాయి. అలాగే రైతు సంఘం నాయకుడు బి.పద్మనాభ రెడ్డి ఆధ్వర్యంలో రైతులు కూడా నిరసన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రస్తుతం క్రేట్ల విధానంలో మార్పు తీసుకొచ్చారు. మార్కెటింగ్ శాఖ అధికారులు మండి యజమానులతో సమావేశం నిర్వహించి నోటీసులు జారీ చేశారు. అలాగే దీనిపై రైతుల్లో అవగాహన కల్పిస్తూ మార్కెట్ యార్డులో మైక్ ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించాలని, రైతులకు ఇబ్బందికర పరిస్థితులు తలెత్తకూడదని, వాటి వివరాలు మైకుల ద్వారా తెలియజేస్తూ అవగాహన కల్పిస్తున్నారు. సమస్యలుంటే తమకు ఫిర్యాదు చేయాలని అధికారులు తెలిపారు. చిప్పిలి వద్ద చిరుత సంచారం? మదనపల్లె టౌన్: మదనపల్లె మండలం, చిప్పిలి వద్ద చిరుత పులి సంచారం వార్తలు శనివారం కలకలం రేపాయి. గ్రామానికి చెందిన కృష్ణకిషోర్ పొలంలో చిరుత పులి అడుగులు గుర్తించినట్లు సమాచారం రావడంతో గ్రామస్తులు భయాందోళనకు గురయ్యారు. విషయం తెలుసుకున్న ఎఫ్ఆర్ఓ జయప్రసాద్ రావు ఆదేశాలతో అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు చిప్పిలికి చేరుకుని పాదముద్రలను పరిశీలించారు. గుర్తులను పరిశీలించిన అనంతరం చిరు త పాదముద్రలు కాదని ప్రాథమికంగా నిర్ధారించారు. పూర్తి నిర్ధారణ అయ్యే వరకు గ్రామ ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ఆర్టీపీపీలో 15 నుంచి ఆందోళనలు ఎర్రగుంట్ల : విద్యుత్ ఉద్యోగుల, కార్మికుల సమస్యల పరిష్కరాల కోసం ఈ నెల 15 నుంచి దశల వారీగా చేస్తున్నట్లు ఏపీ విద్యుత్ ట్రేడ్ యూనియన్స్ స్ట్రగుల్ కమిటీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సుబ్బిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ మేరకు ఆర్టీపీపీలో తన యూనియన్ కార్యాలయంలో ఆందోళనలకు సంబంధించి కరపత్రాలను విడుదల చేసినట్లు తెలిపారు. ఆగస్టు నెలలో చలో విజయవాడకు పిలుపు ఇచ్చినట్లు తెలియజేశారు. -
జిల్లా రైతుకు పురస్కారం
కడప అగ్రికల్చర్: పెండ్లిమర్రి మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన అభ్యుదయ రైతు పి.రాజశేఖర్కు రాష్ట్ర స్థాయి అత్యున్నత గుర్తింపు లభించింది. గుంటూరులోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం 63వ స్థాపక దినోత్సవ వేడుకలను పురస్కరించుకుని ఆయనకు ప్రతిష్టాత్మక ‘ఉత్తమ అభ్యుదయ రైతు’ పురస్కారాన్ని అందజేశారు. గుంటూరులో జరిగిన ఈ ఘనమైన వేడుకల్లో విశ్వవిద్యాలయ ఉపకులపతి (వైస్ ఛాన్సలర్) సత్యనారాయణ చేతుల మీదుగా రైతు రాజశేఖర్ ఈ అవార్డుతో పాటు ప్రశంసాపత్రం, మెమెంటోతో పాటు రూ.25,000 నగదు బహుమతిని అందుకున్నారు. రైతు పి.రాజశేఖర్ సాధించిన ఈ విజయానికి ఊటుకూరు కృషి విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, కేవీకే అధిపతి డాక్టర్ వి.శిల్పకళ, సిబ్బంది ఆయనను శనివారం ఘనంగా సత్కరించారు. -
గండికోట.. గ్రాండ్ కాన్వాస్ !
జమ్మలమడుగు: గ్రాండ్ కాన్యాన్ ఆఫ్ ఇండియా పేరుగాంచిన గండికోట ఇపుడు గ్రాండ్ కాన్వాస్గా మారుతోంది. 11వ శతాబ్దం నాటి చరిత్రాత్మక గండికోట ప్రస్తుతం అంతర్జాతీయ పర్యాటక రంగంతో పాటు సినీ గ్లామర్తో సరికొత్త వైభవాన్ని సంతరించుకుంటోంది. ఒకప్పుడు కనీస వసతులు లేక వెనుకబడిన ఈ ప్రాంతం, నేడు కేంద్ర ప్రభుత్వ భారీ నిధులు, సౌత్ ఇండియన్ అగ్ర దర్శకులు, హీరోల చిత్రాల షూటింగులతో దేశవ్యాప్తంగా ప్రత్యేక గుర్తింపును పొందుతోంది. ప్రకృతి ప్రసాదించిన అద్భుత సౌందర్యం, శతాబ్దాల నాటి చారిత్రక వైభవం, ప్రభుత్వ నిధుల మద్దతు తోడవడంతో గండికోట పర్యాటక రంగంలో సరికొత్త మైలురాళ్లను అధిగమిస్తూ, టాలీవుడ్–కోలీవుడ్లకు నయా అడ్రస్గా అవతరించింది. రూ. 72 కోట్లతో శరవేగంగా అభివృద్ధి పనులు గండికోటను ప్రపంచ స్థాయి పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దేందుకు కేంద్ర ప్రభు త్వం రూ. 72 కోట్ల రూపాయల ‘సాస్కి’ నిధులను విడుదల చేసింది. ఈ భారీ నిధులతో కోట మౌలిక సదుపాయాలు, అంతర్గత రహదారులు, తాగునీరు, వ్యూ పాయింట్ల సుందరీకరణ పనులు వేగవంతంగా జరుగుతున్నాయి. 2004లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో ‘హరిత హోటల్’ నిర్మాణంతో మొదలైన ఈ పర్యాటక ప్రస్థానం, ప్రస్తుతం అంతర్జాతీయ లుక్ను సొంతం చేసుకుంటోంది. వీరచరిత్రకు అద్దం పడుతున్న పీరియాడిక్ చిత్రాలు బ్రిటీషర్లపై తిరుగుబాటు చేసిన తొలి స్వాతంత్య్ర సమరయోధుడు ఉయ్యాలవాడ నరసింహారెడ్డి రేనాటి గడ్డ (కొవెలకుంట్ల, జమ్మలమడుగు) పరిసరాలలో సాగించిన వీరపోరాటాలు నేటికీ సినీ దర్శకులకు గొప్ప స్ఫూర్తినిస్తున్నాయి. మెగాస్టార్ చిరంజీవి : ‘సైరా నరసింహారెడ్డి’ ఉయ్యాలవాడ నరసింహారెడ్డి జీవిత గాథతో తెరకెక్కిన ఈ చిత్రంలో చిరంజీవి గుర్రపు స్వారీ చేస్తూ సాగించే హై–వోల్టేజ్ యాక్షన్ సీక్వెన్సులను అధునాతన గ్రాఫిక్స్ హంగులతో ఇక్కడే అద్భుతంగా ఆవిష్కరించారు. విజయ్ దేవరకొండ – ‘రణబాలి’ 1850–1890ల నాటి బ్రిటిషు వ్యతిరేక పోరాట యోధుడి కథతో విజయ్ దేవరకొండ, రష్మిక మందన నటిస్తున్న ఈ సినిమా షూటింగ్ ఇటీవలే ఇక్కడ ఐదు రోజుల పాటు సాగింది. రంగనాథస్వామి ఆలయం, జుమ్మా మసీదు, పెన్నా నది లోయలలో గుర్రపు స్వారీ, శత్రు సంహార ఘట్టాలను తెరకెక్కించారు. పవన్ కళ్యాణ్ : ‘హరిహర వీరమల్లు’ మొఘలాయిల కాలం నాటి చారిత్రక నేపథ్యంలో సాగే ఈ భారీ చిత్రానికి సంబంధించిన రిస్కీ స్టంట్స్ , యాక్షన్ షాట్స్ను డూప్ సహాయంతో గండికోట కట్టడాల మధ్యే చిత్రీకరించారు. సౌత్ ఇండియన్ స్టార్ల ‘ఫేవరెట్’ స్పాట్ గండికోటలోని అద్భుతమైన భౌగోళిక లోయలు, చారిత్రక కోట గోడలు విజువల్ వండర్గా నిలుస్తుండటంతో దర్శకులు ఇక్కడికి క్యూ కడుతున్నారు. తమిళనాడు సూపర్ స్టార్, సీఎం విజయ్ ప్రస్తుతం రాజకీయాల్లో చురుగ్గా ఉంటూ ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన విజయ్ నటించిన బ్లాక్బస్టర్ చిత్రాలు ‘కత్తి’, ‘పులి’ షూటింగ్స్ ఇక్కడే జరిగాయి. కమల్ హాసన్: శంకర్ దర్శకత్వంలో వచ్చిన గ్లోబల్ ప్రాజెక్ట్ ‘భారతీయుడు–2’కు సంబంధించి కీలక ఘట్టాలను ఇక్కడ ఒడిసిపట్టారు. సూపర్ స్టార్ మహేష్ బాబు: హై–టెక్నికల్ యాక్షన్ థ్రిల్లర్ ‘స్పైడర్’ చిత్రానికి గండికోట వేదికై ంది. గ్లోబల్ స్టార్ ప్రభాస్: ప్రభాస్ నటించిన పీరియాడిక్ లవ్ స్టోరీ ‘రాధేశ్యామ్’ లోని కొన్ని అందమైన విజువల్స్ ఇక్కడే షూట్ చేశారు. దర్శక ధీరుడు రాజమౌళి: ట్రెండ్ సెట్టర్ మూవీ ‘మర్యాద రామన్న’ (సునీల్ హీరో) చిత్రంలోని మెజారిటీ భాగం ఇక్కడే చిత్రీకరించారు. గోపీచంద్ నటించిన అడ్వెంచరస్ చిత్రం ‘సాహసం’ లోని లోయల యాక్షన్ సీన్స్ గండికోట బ్యాక్డ్రాప్లోనే సాగుతాయి. -
పాము కాటుతో తల్లీబిడ్డల పరిస్థితి విషమం
బి.కొత్తకోట : పాము కాటేసి తల్లీబిడ్డల పరిస్థితి విషమించిన ఘటన బి.కొత్తకోటలో జరిగింది. కలకలనం రేపుతున్న ఘటనపై బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని జనుపువారిపల్లికి చెందిన వెంకటరమణ భార్య పార్వతమ్మ, ఆమె కుమారుడు ప్రభాకర్ ఇంట్లో ఉండగా అకస్మాత్తుగా వచ్చిన నాగుపాము ఒకరి తరువాత మరొకరిని కాటేసింది. తల్లి,కుమారుడు తేరుకునే లోపే తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. కుటుంబీకులు గమనించి తల్లీబిడ్డలను చికిత్సల కోసం వెంటనే మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి, ప్రథమ చికిత్స అందించారు. అయినప్పటికీ వారి పరిస్థితి మెరుగు పడక పోవడంతో డాక్టర్ల సలహాపై తిరుపతికి తరలించారు. -
కడప, రాజంపేటలో రైల్వే జీఎం పర్యటన
రాజంపేట/కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప, రాజంపేట రైల్వేస్టేషన్లలో దక్షిణ మధ్య రైల్వే జనరల్ మేనేజర్ సందీప్ మాథూర్ శనివారం పర్యటించారు. ఈ సందర్భంగా ఆయన రైల్వేస్టేషన్లలోని పలు విభాగాలను పరిశీలించారు. అమృత్ భారత్ పథకం కింద జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీశారు. వీటిని సకాలంలో పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఆయనకు రాజంపేటలో గుంతకల్ డీఆర్యూసీ సభ్యుడు తల్లం భరత్కుమార్రెడ్డి.. రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి వివిధ రైల్వే సమస్యలపై రూపొందించిన లేఖలను అందజేశారు. జీఎం సానుకూలంగా స్పందించారు. జీఎంను కలిసిన వారిలో వైఎస్సార్సీపీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి మడగలం శ్రీనివాసులు, వైఎస్సార్సీపీ ఎన్ఆర్ఐ నాయకుడు ధారా వెంకటరమణ తదితరులు ఉన్నారు. అలాగే ఒంటిమిట్ట జెడ్పీటీసీ ముద్దుకృష్ణారెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ యెద్దల విజయసాగర్ తదితరులు తమ ప్రాంత సమస్యలపై వినతిపత్రం అందజేశారు. కడపలో సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నేతలు వినతిపత్రం సమర్పించారు. ఈ కార్యక్రమంలో కడప డివిజనల్ రైల్వే మేనేజర్ చంద్రశేఖర్ గుప్తా, ప్రిన్సిపల్ చీఫ్ ఆపరేషన్ మేనేజర్ వినీత్కుమార్, ఇతర అధికారులు సురేష్కుమార్, రాజ్కుమార్, శ్రావణ్కుమార్, మనోజ్, సుదర్శన్రెడ్డి, చంద్రశేఖర్, కోటేశ్వరరావు, మోహన్రెడ్డి, జనార్దన్ పాల్గొన్నారు. -
భూ వివాదం.. దంపతులపై దాడి
మదనపల్లె టౌన్ : భూ వివాదం తలెత్తి దంపతులపై ప్రత్యర్థులు దాడి చేసిన సంఘటన శనివారం పెద్దమండెంలో జరిగింది. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పెద్దమండెంలో కాపురం ఉంటున్న దంపతులు వెంకటరమణ (60), అతని భార్య రమాదేవి (50)లకు అదే ఊరికి చెందిన సత్యనారాయణ, రామకృష్ణ, రెడ్డెమ్మలతో భూ వివాదం నడుస్తోంది. భూ సర్వే విషయమై గొడవ తలెత్తి ఇరువురి మధ్య ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణలో దంపతులు వెంకటరమణ, రమాదేవిలపై సత్యనారాయణ, రామకృష్ణ, రెడ్డెమ్మలు మూకుమ్మడిగా కర్రలతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. బాధితులను కుటుంబీకులు మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. అనంతరం పెద్దమండెం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
యువకుడిపై కోడి కత్తులతో దాడి
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : నిమ్మనపల్లె మండలంలో ఓ యువకుడిపై ప్రత్యర్థులు కోడి కత్తులతో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడ్డారు. శనివారం రాత్రి చోటు చేసుకున్న ఈ ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ యర్రాతివారిపల్లెకు చెందిన రామక్రిష్ణ కుమారుడు ఆవల నరేష్(27) ఓ ప్రైవేట్ బస్సుకు డ్రైవర్గా పని చేస్తున్నాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన ఆయన భోజనం చేసి, ఇంటి ముందు రోడ్డు పక్కన ఉన్న వాటర్ ట్యాంక్ బండపై కూర్చుని ఉండగా.. పాత కక్షలు మనసులో పెట్టుకున్న అదే ఊరికి చెందిన నవీన్, సంతోష్, లోకి ఒక్కసారిగా కోడి కత్తులతో దాడి చేశారు. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన బాధితుడిని కుటుంబీకులు హుటాహుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆసుపత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి చికిత్సలు అందించడంతో నరేష్ కోలుకుంటు ఉన్నాడు. నిమ్మనపల్లె పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మెలకువలు పాటించు.. దిగుబడి సాధించు
● భూసార పరీక్షలు తప్పనిసరి ● విత్తనశుద్ధితో మొక్కకు సంరక్షణ ● వేరుశనగ సాగుకు సన్నద్ధమవుతున్న రైతులుగుర్రంకొండ : ఖరీఫ్ సీజన్లో సాగు చేసే వేరుశనగ పంటలో మెలకువలు పాటిస్తే అధిక దిగుబడులు సాధించవచ్చు. జిల్లాలో రైతులకు ముఖ్యమైన సాగు పంట వేరుశనగ. పడమటి ప్రాంతాల్లో 40 శాతం మంది రైతులు ఈ పంట సాగుపై ఆధారపడి జీవిస్తున్నారు. ప్రస్తుతం జిల్లాలో వేరుశనగ పంట సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు. విత్తనకాయల పరీక్ష పాటించకపోతే నష్టమే ఖరీఫ్ సీజన్లో వేరుశనగ పంట సాగు చేయడానికి ముందుగా విత్తనకాయల పరీక్ష నిర్వహించాల్సి ఉంటుంది. దీంతో విత్తనకాయల్లో మొలకెత్తే శాతం తెలిసిపోతుంది. ఒకట్రేలో మట్టి, ఇసుక, ఎరువులతో నింపి 100 విత్తన గింజల్ని నాటాల్సి ఉంటుంది. 12 రోజుల అనంతరం మొలకెత్తే శాతం బట్టి నాణ్యత పరీక్ష తెలుస్తుంది. ప్రభుత్వ లెక్కల ప్రకారం 80 నుంచి 90 శాతం వరకు మొలకెత్తితేనే నాణ్యమైన విత్తనాలుగా నిర్ధారించవచ్చు. కాబట్టి ప్రతి రైతు తాము కొనుగోలు చేసిన విత్తనాలను ముందుగా ఇలా పరీక్ష చేసుకోవాలి. రెండేళ్లకు ఒకమారు భూసార పరీక్షలు వేరుశనగ సాగు చేసే పొలాల్లో రెండేళ్ల కొకమారు భూసార పరీక్షలు చేయించాలి. పంట సాగు చేసిన ప్రతి సారి భూమిలో నత్రజని, భాస్వరం వినియోగం ఎక్కువగా ఉంటుంది. భూసార పరీక్షలో ఎంత మేరకు వీటి శాతం తగ్గిందో తెలుసుకోవచ్చు. తద్వారా పంట సాగు ముందు పొలంలో తగినంత మేరకు వీటిని పిచికారి చేస్తే భూసారం మళ్లీ యథాస్థితికి చేరుకుంటుంది. వ్యవసాయాధికారులే రైతుల పొలాల వద్దకు వచ్చి భూసార పరీక్షల నిమిత్తం మట్టిని సేకరించుకొని వెళుతుంటారు. సూక్ష్మపోషకాలు వేరుశనగ పంట సాగు చేసే పొలాల్లో సూక్ష్మపోషకాల సమతుల్యత సరి చేసుకోవాల్సి ఉంటుంది. పొలాలను దుక్కులు చేసేటప్పుడు, విత్తనాలు వేసే సమయంలో సూక్ష్మ పొషకాల మందులను వినియోగించాల్సి ఉంటుంది. బోరాన్, సల్ఫర్ వేరుశనగ పంట సాగులో బోరాన్, సల్ఫర్ను వినియోగించాలి. తద్వారా వేరుశనగలో కాయలు నాణ్యతగా వస్తాయి. వాటి బరువు కూడా పెరుగుతుంది. జింక్ జింక్ వినియోగించడం వల్ల వేరుశనగ మొక్కల్లో కాండం, మొక్క ఎదుగుదల ఎక్కువగా, ధృడంగా ఉంటుంది. కాయల్లో గింజ ఏర్పడే శాతం పెరుగుతుంది. జిప్సం పొలాల్లో జిప్సం చల్లడం వల్ల గింజల్లో నూనె శాతం ఎక్కువగా ఏర్పడుతుంది. పొలాలు దుక్కులు చేసే సమయంలో ఎకరానికి 200 కేజీల జిప్సం చల్లాలి. విత్తనశుద్ధి తప్పనిసరి వేరుశనగ పంట సాగులో విత్తనశుద్ధి చేసుకోవాలి. డీఎమ్ 45 అనే రకం విత్తనశుద్ధి మందును ఎకరానికి సరిపడే విత్తన గింజల్లో 180 గ్రాములు కలపాల్సి ఉంటుంది. ఈ మందును విత్తనగింజల్లో కలిపిన తరువాతే పొలంలో విత్తాలి. తద్వారా గింజల్ని ఆవహించే తినేసే వేరుతొలుచు పురుగులు దూరంగా వెళ్లిపోతాయి. అంతేకాక విత్తనాలు మెలకెత్తే వరకు సంరక్షణగా ఉంటాయి. కలుపు మొక్కల నివారణ వేరుశనగ పంట సాగులో కలుపు మొక్కల నివారణ మందులు వాడాలి. పొలంలో విత్తనాలు వేసిన రోజు సాయంకాలం గానీ, ఆ మరుసటి రోజు గానీ ఈ రకం మందులు పిచికారి చేయాలి. ఎకరం పొలానికి ఒకటిన్నర లీటరు పెండామిథాలిన్ అనే మందును 200 లీటర్ల నీటిలో కలిపి పంట పొలంపై పిచికారి చేయాలి. ఇలా చేయడం వల్ల విత్తనాలు వేసినప్పటి నుంచి రెండు నెలల పాటు కలుపు మొక్కలు పెరగకుండా చూడవచ్చు. అంతర్ పంటలు వేరుశనగ సాగులో అంతర్ పంటలు కూడా సాగు చేయడం వల్ల పంటకు ఎంతో రక్షణగా ఉంటుంది. పొలంలో విత్తనగింజలు వేసే ఆరుసాళ్లు(వరుసలు)కు ఒక సాళు కందులు, అలసందలు వంటి విత్తనాలు వేయాల్సి ఉంటుంది. పొలం చుట్టూ రెండు నుంచి నాలుగు వరసలు జొన్నలు వేయాలి. వీటి వల్ల పక్క పొలాల నుంచి వైరస్, ఇతర క్రిమికీటకాలు, ఎర్రగొంగళి పురుగులు పంటను ఆహించకుండా చేయవచ్చు. లోతైన దుక్కులతో మేలు వేరుశనగ సాగుకు ముందే పొలాల్లో లోతైన దుక్కులు చేయడం వల్ల అధిక పంట దిగుబడులు సాధించవచ్చు. సాధారణంగా పడమటి మండలాల్లో మే నెలలో తొలకరి వర్షాలకు దుక్కులు చేయడం ప్రారంభిస్తారు. పలువురు రైతులు దుక్కుల చేసే ముందు ఎరువులను పొలాలపై చల్లుతారు. ఆ తరువాత లోతైన దుక్కులు చేపడతారు. తద్వారా పొలం పైనున్న ఎరువులు భూమి లోపలకి చేరి పంట సాగు ప్రారంభానికి ముందే సారవంతమైన ఎరువుగా మారుతుంది. పంట సాగు చేసే సమయం కంటే ముందు కనీసం రెండు మార్లు లోతైన దుక్కులు చేస్తుంటారు. తద్వారా పంట సాగు చేసే పొలం ఎంతో సారవంతమవుతుంది. -
●ఊపిరిపోసిన వైఎస్సార్
చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామానికి ఊపిరిపోసింది మహానేత వైఎస్సారే. 2005 సంవత్సరం ముందు వరకు అవి శోత్రియం భూములుగా ఉండేవి. దశాబ్దాల తరబడి రైతులు భూములు సాగు చేసుకుంటున్నా ఆయా భూములపై హక్కులుగానీ, పట్టాదారుపాసుపుస్తకాలు ఉండేవి కావు. చుట్టుపక్కల గ్రామాలకు ప్రభుత్వ పథకాలు అందినా ఇక్కడి రైతులకు ఎలాంటి ప్రభుత్వ పథకాలుగానీ, పంటసాయంగానీ అందేవి కావు. 2005లో అప్పటి ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డి 50 ఏళ్ల శోత్రియం భూముల సమస్యకు పరిష్కారం చూపారు. ఎనిమిది విడతలుగా అక్కడి రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలను మంజూరు చేశారు. -
అనుమానాస్పద స్థితిలో యువకుడి మృతి
తిరుపతి క్రైం : తిరుపతి నగరంలోని సంజయ్ గాంధీ కాలనీలో ఓ యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన కలకలం రేపింది. పోలీసుల కథనం మేరకు.. అన్నమయ్య జిల్లా పీలేరు మండలం ఈతమాకుల వడ్డిపల్లికి చెందిన పి.భానుప్రకాష్ (26) మూడేళ్ల కిందట తిరుపతికి చెందిన వి.నాగవేణిని ప్రేమ వివాహం చేసుకున్నాడు. అప్పటి నుంచి ఆ దంపతులు తిరుపతిలో నివాసం ఉంటున్నారు. ఇటీవల భానుప్రకాష్ తన తల్లిని కలిసేందుకు వెళ్లే విషయంలో భార్యతో విభేదాలు ఏర్పడ్డాయి. దీంతో అతడు మానసికంగా తీవ్ర ఆవేదనకు గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి తిరుపతిలోని తన నివాసంలో భానుప్రకాష్ చీరతో ఉరివేసుకుని మృతి చెందాడు. తన కుమారుడి మరణంపై అనుమానాలు ఉన్నాయని, పూర్తి స్థాయిలో విచారణ జరపాలని తల్లి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె ఫిర్యాదు మేరకు తిరుపతి ఈస్ట్ పోలీసులు.. అనుమానాస్పద మృతి కేసు నమోదు చేశారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఈస్ట్ పోలీస్ స్టేషన్ ఇన్స్పెక్టర్ వి.శ్రీనివాసులు తెలిపారు. -
లాటరీ టికెట్ల విక్రయాలపై దాడులు
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో అక్రమ లాటరీ టికెట్ల విక్రయాలపై పోలీసులు మెరుపు దాడి చేసి ఇద్దరు నిర్వాహకులు సహా పది మందిని అరెస్టు చేశారు. రెండో పట్టణ ఎస్ఐ నాగేశ్వరావు తెలిపిన వివరాల మేరకు.. జిల్లా ఎస్పీ ధీరజ్కు మదనపల్లె కేంద్రంగా విచ్చలవిడిగా లాటరీ టికెట్ల విక్రయాలు జరుగుతున్నట్లు సమాచారం అందింది. జిల్లా ఎస్పీ ఆదేశాలతో మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ రవి నాయక్, రెండో పట్టణ ఎస్ఐ నాగేశ్వరరావు, ఒకటో పట్టణ ఎస్ఐ రహీముల్లా సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. పట్టణంలోని కోమిటివారి చెరువు సమీపాన ఉన్న జ్ఞానోదయ గ్రౌండ్లో ప్రశాంత్ నగర్కు చెందిన తండ్రీకొడుకులు జాకీర్, ఆసిఫ్ లాటరీ టికెట్లు విక్రయిస్తుం డగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఈ మెరుపు దాడిలో విక్రేతలతోపాటు లాటరీ టికెట్లు కొంటున్న మరో పది మందిని అదుపులోకి తీసుకున్నారు. నిందితుల వద్ద నుంచి రూ.6,920 నగదు, 10 లాటరీ టికెట్లు స్వాధీనం చేసుకున్నారు. నిందితులపై లాటరీ చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు.ఇద్దరు నిర్వాహకులు సహా 10 మంది అరెస్ట్ -
భార్గవరెడ్డి కుటుంబ సభ్యులకు జగన్ పరామర్శ
ఎర్రగుంట్ల : వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఫోన్ ద్వారా వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి కుటుంభ సభ్యులను శనివారం పరామర్శించారు. ఇటీవల వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ యర్రంరెడ్డి విశ్వభార్గవరెడ్డి గుండెపోటుతో మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ విషయం తెలుసుకుని శనివారం విశ్వభార్గవరెడ్డి కుమారుడు యర్రంరెడ్డి ఉదయ్కుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి స్వయంగా ఫోన్ చేసి పరామర్శించారు. కుటుంబానికి అన్ని విధాలుగా అండగా ఉంటామని, అధైర్యపడద్దని చెప్పారు. 17 నుంచి ఏపీఎల్ మ్యాచ్లుకడప వైఎస్ఆర్ సర్కిల్ : కడపలోని వైఎస్ రాజారెడ్డి క్రికెట్ స్టేడియంలో ఈనెల 17 నుంచి 21వ తేదీ వరకు ఆంధ్ర ప్రీమియల్ లీగ్ ఐదవ సీజన్ మ్యాచ్లు నిర్వహిస్తున్నట్లు ఏసీఏ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ కమిటీ మెంబర్ భరత్రెడ్డి తెలిపారు. శనివారం కడప నగరంలోని వైఎస్ రాజారెడ్డి స్టేడియంలో ఏపీఎల్ మ్యాచ్లకు సంబంధించిన పోస్టర్లను ఆయన ఆవిష్కరించి మీడియాతో మాట్లాడారు. ఈ ఆంధ్ర ప్రీమియర్ లీగ్ మ్యాచ్లను ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా మొత్తం 9 మ్యాచ్లు కడపలో జరుగుతాయన్నారు. ఇందులో విజయవాడ సన్సైనర్స్, తుంగభద్ర వారియర్స్, క్యాపిటల్ అమరావతి రాయల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్, రాయల్స్ ఆఫ్ రాయలసీమ, కాకినాడ కింగ్స్, బీమవరం బుల్స్, సింహాద్రి వైజాగ్ లయన్స్ జట్లు పోటీల్లో పాల్గొంటాయన్నారు. ఈ మ్యాచ్లు మధ్యాహ్నం 2 గంటలకు, సాయంత్రం 6.30 గంటలకు ప్రారంభమవుతాయన్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను దాదాపు రూ.7 కోట్లతో పూర్తి చేయడం జరిగిందన్నారు. ఈ మ్యాచ్లకు రోజుకొక అతిథితో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అందజేయడంతోపాటు టాస్ వేయడం జరుగుతుందన్నారు. మ్యాచ్లో సినీ ప్రముఖులైన గాయకులు సునీత, సింహా, గీతామాధురి, కృష్ణచైతన్య, సంగీత వాయిద్యకారులు శ్రీహరి పాల్గొని ప్రేక్షకులను అలరిస్తారన్నారు. ఈ మ్యాచ్లను తిలకించేందుకు ఎంట్రీ ఉచితమని వివరించారు. గ్యాలరీల్లో ప్రేక్షకులకు కావాల్సిన మంచినీటి సౌకర్యాన్ని కల్పించి స్టాల్స్ను కూడా ఏర్పాటు చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షులు మునికుమార్రెడ్డి, కార్యదర్శి రెడ్డిప్రసాద్, స్టేడియం చైర్మన్ శ్రావణ్రాజ్రెడ్డి, వైస్ చైర్మన్ పృథ్వి, స్టేడియం కన్వీనర్ సంజయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు.


