Annamayya District News
-
సాంకేతిక పరిజ్ఞానంతో అధిక దిగుబడులు
రాయచోటి టౌన్ : నూనె గింజల పంటల సాగుకు సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి సాగు చేస్తే అధిక దిగుబడులు సాధించవచ్చని భారత నూనె గింజల పరిశోధన సంస్థ సీనియర్ శాస్త్రవేత్త డాక్టర్ ముంగేష్ దుబే అన్నారు. గురువారం రాయచోటి మండల పరిధిలోని శిబ్యాల గ్రామంలో నూనె గింజల సాగుపై రైతులతో సమావేశం నిర్వహించారు. దేశ వ్యాప్తంగా 700 జిల్లాలో రెండు వేలకు పైగా శాసీ్త్రయ బృందాల ద్వారా అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారి రవిచంద్రబాబు మాట్లాడుతూ నూతన వ్యవసాయ పద్ధతులు పాటిస్తూ అధిక దిగుబడులు సాధించాలన్నారు. పండ్ల తోటల సాగులో కూడా కొత్తరకాల పండ్ల తోటలను ఎంచకోవాలని సూచించారు. ప్రభుత్వ పథకాలను రైతులు సద్వినియోగం చేసుకొని వాటి ద్వారా మంచి దిగుబడులతో పాటు అధిక లాభాలు ఆర్జించవచ్చని చెప్పారు. ఏరువాక (ఖరీఫ్) సేద్యానికి రైతులు సిద్ధం కావాలని రాయచోటి వ్యవసాయ శాఖ అధికారి దివాకర్ రైతులకు కోరారు. వేరుశనగ, కంది, నువ్వులు వంటి వ్యవసాయ పంటల సాగులో పాటించాల్సిన పద్ధతులను కృషి విజ్ఞాన కేంద్రం సేద్య విభాగం శాస్త్రవేత్త డాక్టర్ మహేశ్వరి సూచించారు. డాక్టర్ ఐ.సురేష్ కుమార్రెడ్డి మాట్లాడారు. ఈ కార్యక్రమంలో గ్రామసర్పంచ్ నాగేశ్వరరావు, రైతులు రామకృష్ణం రాజు, ఉద్యానశాఖ అధికారిణి నాగమణి, ఆత్మ ఏటీఎంలు, రైతులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ ఘాట్ వద్ద షర్మిల ఘన నివాళి
వేంపల్లె : వేంపల్లి మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రంలో ఉన్న వైఎస్సార్ సమాధి వద్ద పీసీసీ చీఫ్ షర్మిల ఘనంగా నివాళులర్పించారు. గురువారం పులివెందుల పర్యటనకు విచ్చేసిన ఆమె వేంపల్లె మండలంలోని ఇడుపులపాయ వ్యవసాయ క్షేత్రానికి విచ్చేశారు. వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి ప్రత్యేక ప్రార్థనలు చేశారు అక్కడే ఉన్న వైఎస్సార్ విగ్రహానికి కూడా పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఆమె కాంగ్రెస్ నాయకులతో వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కాంగ్రెస్ పార్టీ బలోపేతం పని చేయాలని కోరారు. కాంగ్రెస్ పాలనలో వైఎస్సార్ చేపట్టిన సంక్షేమ పథకాలను ప్రజలకు వివరించాలని కోరారు. ఆమె వెంట కాంగ్రెస్ పార్టీ జిల్లా అధ్యక్షురాలు విజయ జ్యోతి, ప్రొద్దుటూరు కాంగ్రెస్ సమన్వయ కర్త ఇర్ఫాన్ బాషా, పులివెందుల సమన్వయ కర్త ధృవకుమార్ రెడ్డి, వేంపల్లె మండల అధ్యక్షుడు రామకృష్ణ, రామాంజనేయరెడ్డి, బాలం సుబ్బరాయుడులతో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు పాల్గొన్నారు.పైనాపిల్ కాసింది..!పుల్లంపేట : పుల్లంపేట మండలం, అనంతంపల్లి గ్రామానికి చెందిన శేషారెడ్డి తన ఇంటిలో పైనాపిల్ మొక్క తెచ్చి నాటాడు. దీంతో పైనాఫిల్ విరగకాయడంతో గ్రామంలోని ప్రజలు వింతగా చూస్తున్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో పైనాపిల్ పండదని, అలాంటిది శేషారెడ్డి ఇంటిలో విరగకాయడంతో పలువురు ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు.నిమ్మతోట దగ్ధంపెనగలూరు : పెనగలూరు మండలం, కాకర్లవారిపల్లి పంచాయతీ వెంకటనారాయణ పల్లి వద్ద నిమ్మతోట దగ్ధమైనట్లు ఫైర్ అధికారి శివయ్య తెలిపారు. గురువారం వేపాటి వారిపల్లికి చెందిన పి.పెంచలయ్య నిమ్మతోట అగ్నికి ఆహుతవుతుండగా ఫైర్ సిబ్బందికి ఫోన్ చేయడంతో వెంటనే వారు అక్కడికి చేరుకుని ఆర్పివేసినట్లు తెలిపారు. ఈ ప్రమాదంలో చుట్టూ ఉన్న కంచె పూర్తిగా దగ్ధమైంది. సకాలంలో ఫైర్ సిబ్బంది స్పందించడంతో నిమ్మతోట పూర్తిగా దగ్ధం కాలేదు. దాదాపు రూ.80 వేలకుపైగా నష్టం వాటిల్లినట్లు ఫైర్ అధికారి తెలిపారు. -
కడప – బెంగళూరు రైల్వే ప్రస్త్తావన లేదు
రాయచోటి: రాయచోటి, కడప–బెంగుళూరు రైల్వేలైను విషయంపై కడపలో జరిగిన మహానాడులో ప్రస్తావించకపోవడం బాధాకరమని సీపీఐ రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు అన్నారు. గురువారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ నూతనంగా ఏర్పడిన అన్నమయ్య జిల్లాలో ఎలాంటి అభివృద్ధి జరగలేదని, కనీసం కడప–బెంగళూరు రైల్వేలైను రావడం ద్వారా కొద్దివరకు ప్రయోజనం ఉంటుందన్నారు. జిల్లా అభివృద్ధికి దోహదపడే రైల్వేలైను ఏర్పాటుకు ఈ ప్రభుత్వం చొరవ చూపాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు జక్కుల వెంకటేష్, ఎంఆర్ ఆంజనేయులు, వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. -
భక్తులకు అసౌకర్యం లేకుండా యోగా కార్యక్రమం
నందలూరు : శ్రీ సౌమ్యనాథ స్వామి ఆలయంలో ఈ నెల 31వ తేదీన నిర్వహించే యోగా కార్యక్రమం వల్ల భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకూడదని జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులకు సూచించారు. యోగ కార్యక్రమ ఏర్పాట్లపై శనివారం అయన అధికారులతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కార్యక్రమానికి కలెక్టర్ చామకూరి శ్రీధర్ హాజరవుతారన్నారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చూడాలని, అందుకు పోలీసుల సహకారం తీసుకోవాలని తెలిపారు. అనంతరం జాయింట్ కలెక్టర్ సౌమ్యనాథ స్వామిని దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో టూరిజం అధికారి నాగభూషణం, ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, ఈఓఆర్డీ సునీల్కుమార్, డాక్టర్ కార్తీక్విశ్వనాథ్, ఎంఈఓలు అనంతకృష్ణ, నాగయ్య, ఏఓ మల్లికార్జున, ఏపీఓ మురళి, ఏపీఎం శ్రీహరి తదితరులు పాల్గొన్నారు. -
అహల్య బాయి త్రిశతాబ్ది జయంతి వేడుకలు ఘనంగా నిర్వహిద్దాం
రాయచోటి టౌన్ : అహల్య బాయి హోల్కర్ త్రి శతాబ్ది ఉత్సవాలు ఘనంగా నిర్వహించుకుందామని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంటరీ వ్యవహారాల సహాయమంత్రి ఎల్.మురుగున్ పేర్కొన్నారు. గురువారం రాయచోటి సాయి సుధ కల్యాణ మండపంలో బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయి లోకేష్ ఆధ్వర్యంలో ఈ నెల 31వతేదీన జరిగే త్రి శతాబ్ది జయంతి వేడుకల నిర్వహణపై సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు. ఆమె కాశీ నుంచి కన్యాకుమారి వరకు దేవాలయాల పునర్నిర్మాణానికి చేసిన కృషి అమోఘమైనదన్నారు. బాల్య వివాహాల నిర్మూలన కోసం కృషి చేశారన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ జకియా ఖానం, బీజేపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్ నాయుడు, ఎస్సీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు గుడిసె దేవానంద్, జిల్లా మహిళా అధ్యక్షురాలు సునీత నారాయణ వర్మ తదితరులు పాల్గొన్నారు. ఆధ్యాత్మిక కేంద్రంగా మాతంగి మహా పీఠంరాయచోటి టౌన్ : లక్కిరెడ్డిపల్లె మండలంలోని మాతంగి మహా పీఠం అధ్యాత్మిక కేంద్రంగా వెలుగొందుతుందని కేంద్ర సమాచార ప్రసార శాఖ, పార్లమెంట్ వ్యవహారాల సహాయ మంత్రి మురుగన్ అన్నారు. జగద్గురు శ్రీ ఆది శంకరాచార్య శ్రీ శారద లక్ష్మి నరసింహా పీఠాధిపతులు స్వయంప్రకాశ సచ్చిదానంద స్వామి సరస్వతి సంకల్పం మేరకు లక్కిరెడ్డిపల్లెలోని దొర్రిచెరువు సమీపంలో శ్రీమాతంగి మహాపీఠ శిల శాస్త్ర ప్రతిష్టకు ఆయన హాజరయ్యారు. ముందుగా రాయచోటిలోని స్టేట్ గెస్ట్ హౌస్లో అల్పాహారం చేశారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడుతూ ఈ మహా పీఠం ప్రపంచానికి ఆధ్యాత్మికను నేర్పి ఆది గురువుగా నిలిచిందన్నారు. ఈ కార్యక్రమంలో కర్నాటక రాష్ట్ర ఆహార, ప్రజా సరఫరాల శాఖ మంత్రి కెహెచ్ మునియప్ప, బీజేపీ, కాంగ్రెస్ పార్టీ నాయకులు పాల్గొన్నారు. -
బైకును ఢీకొన్న లారీ
పుల్లంపేట : కడప–చైన్నె జాతీయ రహదారి మోడల్ స్కూల్ సమీపంలో గురువారం బైకును లారీ ఢీ కొన్న సంఘటనలో బైకుపై వెళ్తున్న మహిళ ఎడమచేయి లారీ కింద పడటంతో నుజ్జునుజ్జు అయింది. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. వీరబల్లి మండలం, తొట్టికిందపల్లి దళితవాడ గ్రామానికి చెందిన రామ్మోహన్, సునీత దంపతులు. వీరు సునీత పుట్టినిల్లు అయిన పుల్లంపేట మండలం, అనంతంపల్లి పంచాయతీలోని జానకీపురానికి ద్విచక్ర వాహనంపై బయలుదేరారు. పుల్లంపేట మోడల్ స్కూల్ సమీపంలోకి రాగానే కడప–రేణిగుంట జాతీయ రహదారిపై ఎదురుగా లారీ అతివేగంగా వచ్చి ద్విచక్ర వాహనాన్ని ఢీ కొంది. ఈ ప్రమాదంలో రామ్మోహన్కు తీవ్ర గాయాలు కాగా, సునీత కుడిచేతికి స్వల్ప గాయాలు కాగా, ఎడమ చేయి లారీ కిందపడటంతో నుజ్జు నుజ్జు అయ్యింది. క్షతగాత్రులను హుటాహుటిన రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఆ తర్వాత మెరుగైన వైద్యంకోసం తిరుపతికి తీసుకెళ్లినట్లు ఎస్ఐ శివకుమార్ తెలిపారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు.మహిళ ఎడమ చేయి నుజ్జునుజ్జు -
బైరెటీస్ మిల్లులను ఆదుకోవాలి
ఓబులవారిపల్లె : మంగంపేట ఏపీఎండీసీ గనుల బైరెటీస్ ఖనిజం ఆధారితంగా నిర్మించిన పల్వరైజింగ్ మిల్లులను ఆదుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ చంద్రశేఖర్ కోరారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఏపీఎండీసీ గనుల విస్తరణలో ఇల్లు, భూములు కోల్పోయిన నిర్వాసిత కుటుంబాల వారు అప్పులు చేసి స్థానికంగా చిన్న పరిశ్రమలైన మిల్లులను ఏర్పాటు చేసి అందులో యాభై మందికి జీవనోపాధి కల్పిస్తున్నారన్నారు. దాదాపు 175 మిల్లులు ఉన్నాయన్నారు. తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చాక ఎగుమతిదారులకు సీ అండ్ డీ గ్రేడ్ ఖనిజం ధర తగ్గించి ఇవ్వడం మిల్లులకు మరో ధర ఇవ్వడం ఏమిటని ప్రశ్నించారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో మిల్లులకు రాయితీలతో ఖనిజాన్ని సరఫరా చేసే వారని గుర్తు చేశారు. ప్రస్తుతం మిల్లులకు రాయితీపై ఖనిజం సరఫరా లేక దాదాపు మిల్లులన్నీ మూతపడి కార్మికులు జీవనోపాధి కోల్పోయారన్నారు. వెంటనే మిల్లులకు రాయితీపై ఖనిజాన్ని సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సీఐటీయూ కార్యదర్శి జాన్ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
డ్వాక్రా మహిళల తరలింపు సరికాదు
మదనపల్లె రూరల్ : డ్వాక్రా మహిళలను రాజకీయ పార్టీల సమావేశాలకు బలవంతంగా తరలించడం సరైనది కాదని సీపీఐ జిల్లా కార్యదర్శి పీఎల్.నరసింహులు అన్నారు. మహిళా సాధికారత, ఆర్థికాభివృద్ధి కోసం స్వయంప్రతిపత్తితో డ్వాక్రా సంఘాల ఏర్పాటు జరిగిందన్నారు. వీటిపైన రాజకీయ జోక్యం ఏమాత్రం తగదన్నారు. గ్రామీణ, పట్టణ డ్వాక్రా మహిళలను రాజకీయ పార్టీల సమావేశాలకు బలవంతంగా తీసుకెళ్లడం, మీటింగ్లకు రాకపోతే మీకు లోన్లు ఇవ్వమని, డ్వాక్రా గ్రూపుల గ్రేడింగ్ను తగ్గిస్తామని బెదిరించడం సరైన పద్ధతి కాదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరారు. కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యవర్గ సభ్యులు కృష్ణప్ప, సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి మురళి, రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
చంద్రా కాలనీలో చోరీ
మదనపల్లె రూరల్ : పట్టణంలోని చంద్రాకాలనీలో చోరీ జరిగిన విషయం గురువారం వెలుగుచూసింది. స్థానికంగా ఉండే కుమార్ కుటుంబంతో కలిసి ఈనెల 21న బంధువుల ఇంటికి కడపకు వెళ్లాడు. బుధవారం రాత్రి తిరిగి ఇంటికి రాగా తలుపులు, తాళాలు పగలగొట్టి ఉండటంతో ఇంట్లోకి వెళ్లి పరిశీలించగా, చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఘటనలో రూ.60వేల విలువచేసే బంగారు నగలు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుని వెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదులో పేర్కొన్నాడు. కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ రామచంద్ర తెలిపారు. భూ తగాదా కేసులో ఆరుగురి అరెస్టు చాపాడు : మండల పరిధిలోని రాజుపాళెం గ్రామంలో జరిగిన భూ తగాదా కేసులో ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఏఎస్ఐ నాగేంద్ర ప్రసాద్ తెలిపారు. పల్లెం శ్రీనివాసులు, మహేష్ బాబు, వెంకట రమణ, వెంకటసుబ్బయ్య, సురేష్, సతీష్ కుమార్లను అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి రిమాండ్ విధించినట్లు పేర్కొన్నారు. నలుగురిపై తేనెటీగల దాడిసిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటంలోని గురుకుల కళాశాల సమీపంలో గురువారం నలుగురు వ్యక్తులపై తేనెటీగలు దాడిచేశాయి. సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రి సమీపంలోని గురుకుల కళాశాల వద్ద ఉన్న తేనె తుట్టైపె ఆకతాయిలు రాళ్లు వేశారు. దీంతో అవి ఒక్కసారిగా బయటకు వచ్చాయి. రహదారి వెంబడి వెళుతున్న వారిపై దాడిచేసి గాయపరిచాయి. ఈ దాడిలో జంగాలపల్లె, మూలపల్లె, సిద్దవటం, భాకరాపేట గ్రామాలకు చెందిన వెంకటబాలాజీ, మల్లికార్జున, అమీర్ బాషా, మరొకరు గాయపడ్డారు. వీరికి సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో డాక్టర్ ప్రకాష్ ఆధ్వర్యంలో చికిత్స చేశారు. వైద్యాధికారి డాక్టర్ ప్రకాష్ మాట్లాడుతూ తేనెటీగలు నలుగురిని బలంగా కుట్టడం వల్ల భాకరాపేట గ్రామానికి చెందిన అమీర్బాషా ఆరోగ్య పరిస్థితి విషమంగా ఉందన్నారు.గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యంకాశినాయన : మండలంలోని జ్యోతిక్షేత్రం సమీపంలోని గరుడాద్రి వద్ద గుర్తు తెలియని వ్యక్తి మృతదేహం లభ్యమైంది. కాశినాయన పోలీసులు మృతదేహాన్ని పరిశీలించగా అప్పటికే గుర్తు పట్టలేని విధంగా ఉంది. పోరుమామిళ్ళ వైద్యాధికారి కరీమ్ ఘటన స్థలానికి వచ్చి పోస్టుమార్టం చేశారు. పోలీసులు కేసు నమోదు చేశారు. -
భవన నిర్మాణాలకు పటిష్టమైనది భారతి సిమెంట్
ఒంటిమిట్ట : అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాలకు భారతి సిమెంట్ పటిష్టమైందని భారతి సిమెంట్ డీజీఎం ఓబుల్ రెడ్డి, జిల్లా ప్రధాన మార్కెటింగ్ అధికారి ప్రతాప్ రెడ్డి, జిల్లా టెక్నికల్ ఇంజినీర్ శ్రీకాంత్ రెడ్డి, సేల్స్ ఆఫీసర్ రమణా రెడ్డి తెలిపారు. ఒంటిమిట్టలోని శ్రీ లక్ష్మి వెంకటేశ్వర ఎంటర్ప్రైజెస్ సమీపంలోని మేసీ్త్రలకు సిమెంట్ వినియోగంపై అవగాహన సదస్సు జరిగింది. ఈ సందర్భంగా భారతి సిమెంట్ ప్రతినిధులు మాట్లాడుతూ భారతి సిమెంట్ రోబోటెక్ టెక్నాలజీతో తయారవుతుందని, అల్ట్రాఫాస్ట్ నాణ్యత కలిగి ఉంటుందన్నారు. రొబోటిక్స్ ప్రయోగశాల, జర్మన్ టెక్నాలజీ తక్కువ సమయంలో ఎక్కువ కట్టడాలు చేయగల సామర్థ్యం కలవన్నారు. ఇతర కంపెనీల సిమెంట్ ఐదు గంటల్లో సెట్ అయితే భారతి అల్ట్రాఫాస్ట్ రెండు గంటల్లో సెట్ అవుతోందని, దృఢత్వం కల్గి ఉంటుందని, కట్టడాలు త్వరగా పూర్తవుతాయని తెలిపారు. అనంతరం మేసీ్త్రలకు లక్ష ఉచిత బీమా బాండ్, బీమా పత్రాలను యాభై మంది మేసీ్త్రలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్ పాండురంగారెడ్డి, మేసీ్త్రలు పాల్గొన్నారు. -
అక్రిడిటేషన్ కార్డుల గడువు పొడిగింపు
రాయచోటి: మీడియా అక్రిడిటేషన్ కార్డుల వ్యాలిడిటీని మరో మూడు నెలలపాటు పొడిగించినట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ గురువారం పత్రికలకు అందజేసిన ప్రకటనలో పేర్కొన్నారు. సమాచార పౌర సంబంధాల శాఖ డైరెక్టర్ నుంచి నేడు జిల్లాకు సమాచారం అందిందన్నారు. అక్రిడిటేషన్ కార్డుల వ్యాలిడిటీని జూన్ 1 నుంచి ఆగస్టు 31 వరకు లేదా కొత్త కార్డులు జారీ చేయడం గానీ, ఏది ముందు జరిగితే అప్పటి వరకు కార్డులు పొడిగించినట్లు పేర్కొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలో హిజ్రాల కోసం స్వయం ఉపాధి శిక్షణకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు విభిన్న ప్రతిభావంతులు, హిజ్రాలు, వయోవృద్ధుల సంక్షేమ శాఖ అధికారి ఆర్వి కృష్ణకిశోర్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. టైలరింగ్, బ్యూటీషియన్, కారు డ్రైవింగ్ తదితర కోర్సుల్లో శిక్షణ ఇస్తారన్నారు. ఆసక్తి గల హిజ్రాలు తమ వివరాలతో వైఎస్ఆర్ కడప జిల్లాలోని కొత్త కలెక్టర్ కార్యాలయం ప్రాంగణంలోని ఆఫీసులో జూన్ 10లోపు నమోదు చేసుకోవాలని ఆయన తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి హిజ్రాల గుర్తింపు ధృవపత్రం, ఆధార్, రేషన్కార్డు, రెండు ఫొటోలు కావాలని ఆయన సూచించారు. ప్రశాంతంగా ఏపీఆర్జేసీ కౌన్సెలింగ్ కేవీపల్లె: మండలంలోని గ్యారంపల్లె ఏపీ గురుకుల కళాశాలలో ఏపీఆర్జేసీ ప్రవేశాల కౌన్సెలింగ్ ప్రశాంతంగా జరిగినట్లు రాయలసీమ రీజియన్ కన్వీనర్, గ్యారంపల్లె ఏపీఆర్జేసీ ప్రిన్సిపాల్ డాక్టర్ చెన్నకేశవులు తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాయలసీమ రీజియన్ పరిధిలో కడప, కర్నూలు, చిత్తూరు, అనంతపురం ఉమ్మడి జిల్లాల నుంచి పలువురు విద్యార్థులు కౌన్సెలింగ్కు హాజరైనట్లు తెలిపారు. గ్యారంపల్లె బాలుర, కర్నూలు ఉర్దూ మైనారిటీ బాలుర, కొడిగేనహళ్లి బాలుర గురుకుల పాఠశాలకు సంబంధించి సీట్ల భర్తీకి ప్రత్యేక కేంద్రాలు ఏర్పాటు చేసి కౌన్సెలింగ్ నిర్వహించినట్లు చెపారు. ఎంపీసీ గ్రూపునకు 123, బైసీపీ 119 మంది, ఎంఈసీ గ్రూపునకు 86 మంది సీట్లు పొందినట్లు వివరించారు. కార్యక్రమంలో డాక్టర్ జయం శ్రీనివాస గుప్తా, అసిస్టెంట్ కన్వీనర్ బ్రహ్మాజి, కోడిగిన హళ్లి ప్రిన్సిపాల్ జలజ, కర్నూల్ మైనారిటీ కళాశాల ప్రిన్సిపాల్ ముభసీరబేగం, అధ్యాపకులు రామకృష్ణ, రమాదేవి, శేఖర్, సురేష్, పురుషోత్తం, తనూజ, కొండయ్య, షకీల్ అహ్మద్, సయ్యద్బాషా, రామకృష్ణయ్య తదితరులు పాల్గొన్నారు. -
ప్రయాణికుల కస్సుబస్సు
గువ్వలచెరువు ఘాట్రోడ్డులో స్తంభించిన రాకపోకలు రాయచోటి: కడప నగరంలో తలపెట్టిన మహానాడు కార్యక్రమం సందర్భంగా కడప–రాయచోటి మార్గంలోని గువ్వలచెరువు ఘాట్రోడ్డులో రాకపోకలు స్తంభించిపోయాయి. గురువారం మధ్యాహ్నం అన్నమయ్య, చిత్తూరు జిల్లాలోని నియోజకవర్గాల నుంచి వాహనాల రాకతో ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడింది. ప్రభుత్వం రవాణా విషయంలో జాతీయ రహదారి, ఘాట్ రోడ్డు దృష్ట్యా ప్రత్యేక నిర్వాహక చర్యలు తీసుకోకపోవడంతో ట్రాఫిక్ తీవ్రరూపం దాల్చిందని పలువురు విమర్శించారు. నాలుగు గంటల పాటు రవాణా అటూ ఇటూ సాగకపోవడంతో మహానాడుకు వచ్చిన వాహనాలు ప్రాంగణానికి వెళ్లకుండానే వెనుతిరిగాయి. ఇదే సమయంలో అనేకమందికి తినడానికి ఆహారం, మంచినీరు లభించక ఆకలి దప్పులతో అలమటించారు. ● మహానాడు సభకు 1847 బస్సుల వినియోగం ● ప్రజలకు తప్పని ప్రయాణ కష్టాలుసాక్షి కడప: తెలుగుదేశం పార్టీ నిర్వహించిన మహానాడుకు జనాలను తరలించేందుకు తమ్ముళ్లు నానా తంటాలు పడ్డారు. మరోవైపు ఆర్టీసీ బస్సులన్నీ మహానాడు వైపే వేయడంతో ప్రయాణికుల కష్టాలు అన్నీ ఇన్నీ కావు. గంటల తరబడి నిరీక్షించాల్సిన పరిస్థితి ఏర్పడింది.రాష్ట్ర ప్రభుత్వ తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. టీడీపీ అధినేత చంద్రబాబు సైతం ముఖ్యమంత్రి హోదాలో అక్కడే ఉండడం..మంత్రులు, నేతలంతా అక్కడే మకాం వేయడంతో అధికార యంత్రాంగం వారి మెప్పుకోసం వెంపర్లాడిందే తప్ప ప్రజల కష్టాలను గాలికి వదిలేసింది. వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లోని బస్టాండ్లలో ఎక్కడ చూసినా జనాలు బస్సుల కోసం నిరీక్షిస్తూ కనిపించారు. ● చివరి రోజు తక్కువ జనాలు కనిపిస్తే మహానాడు విఫలమైందన్న భావన కలుగుతుందని ఎక్కడికక్కడ డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలను తరలించారు. మహానాడా...మజాకా అన్నట్లు అటు డ్వాక్రా మహిళలు, ఉపాధి కూలీలు రావాలంటూ అల్టిమేటం జారీ చేసి తీసుకెళ్లారు. ఎక్కడ చూసినా సభ వద్ద, బయటి ప్రాంతాల్లో డ్వాక్రా మహిళలు దర్శనమిచ్చారు. యానిమేటర్లు, ఫీల్డ్ అసిస్టెంట్లను ఇంత మందిని తరలించాలని...బస్సులో తీసుకొచ్చిన వారి ఫొటోలతో పాటు సంతకాలను తీసుకున్నట్లు తెలియవచ్చింది. ● కడపలో జరుగుతున్న మహానాడుకు సంబంధించి రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 1847 బస్సులను వినియోగించారు. సుదూర ప్రాంతాలతోపాటు రాయలసీమ ప్రాంతంలోని అన్ని డిపోల నుంచి పెద్ద ఎత్తున బస్సులను వినియోగించడంతో ఆర్టీసీ బస్టాండులో బస్సులు లేకపోవడంతో ప్రయాణీకులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అనంతపురం జిల్లా నుంచి 170, సత్యసాయి 167, చిత్తూరు 130, తిరుపతి 245, నంద్యాల 196, కర్నూలు 110, వైఎస్సార్ కడప 274, అన్నమయ్య 240, ప్రకాశం 85, నెల్లూరు 230 బస్సులను వినియోగించారు. ఆర్టీసీ బస్సులు మహానాడు దారి పట్టడంతో బస్టాండులు ఖాళీగా దర్శనమిచ్చాయి. ప్రయివేటు స్కూళ్ల బస్సులను వదల్లేదు మదనపల్లె: మదనపల్లె, పరిసర ప్రాంతాల్లోని ప్రయివేటు స్కూలు బస్సులను వదల్లేదు. ఆయా స్కూళ్లలోని బస్సులు మహానాడుకు ఇవ్వాల్సిందిగా రవాణశాఖ అధికారుల ఒత్తిడితో పంపించారు. -
మందుబాబులకు పండుగ
సాక్షి ప్రతినిధి, కడప: మహానాడు నేపథ్యంలో కడప గడపలో మద్యం ఏరులై పారింది. కడప లో నెలరోజులు పాటు ఖర్చు అయ్యే మద్యం మూడు రోజుల్లోనే ఖర్చైంది. గురువారం బహిరంగసభ కారణంగా గ్రామాల గల్లీల నుంచి ప్రధాన రహదారుల వరకూ మద్యం ప్రియులు ఆనందడోలికల్లో మునిగిపోయారు. జనసమీకరణ కోసం పచ్చనోట్లు పంచడంతో అందుకున్న వారు ఎక్కడిక్కడ మద్యం తాగుతూ కనిపించారు. మందు బాబులకు ఉల్లాసం.... మహానాడు కార్యక్రమం మద్యం ప్రియులకు ఉల్లాసంగా ఉండిపోయింది. పెగ్గు, ఫుడ్ ఉండడంతో మూడు రోజులు పాటు తెలుగుతమ్ముళ్లుతో కలిసి జల్సా చేశారు. చివర రోజు బహిరంగసభకు జనసమీకరణ నేపధ్యంలో ఆ దూకుడు మరింతగా సాగింది. కడప గడపలో 22 మద్యంషాపులుంటే దాదాపు అన్నీంట్లో రద్దీ విపరీతంగా ఉండిపోయింది. మంగళ, బుధవారాలల్లో నగరంలోని మద్యంషాపులల్లో వ్యాపారం రూ.65లక్షలు చొప్పున చోటుచేసుకోగా గురువారం 5 రెట్లు అధికంగా దాదాపు రూ.3కోట్లు పైబడి వ్యాపారం లభించినట్లు సమాచారం. చిత్తూరు–కర్నూల్ జాతీయ రహదారి వెంబడి మందుబాబులు తిష్టవేసి మద్యం సాగారు. ఇటు కడప–రేణిగుంట రహదారిలో కూడా అలాంటి పరిస్థితి కన్పించింది. కడప రింగు రోడ్డు 22కిలోమీటర్లు పొడవునా అడుగడుగునా మందు ప్రియులు మద్యం తాగుతూ కన్పించింది. -
ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణకు సిద్ధం కావాలి
జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ రాయచోటి: జూన్ 5న ప్రపంచ పర్యావరణ దినోత్సవ నిర్వహణకు సిద్ధం కావాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో ప్రపంచ పర్యావరణ దినోత్సవ వేడుకలు, జిల్లాలో వన మహోత్సవ నిర్వహణ తదితర అంశాలపై కలెక్టర్, జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ్ సింగ్లు సంయుక్తంగా సమావేశం నిర్వహించారు. జిల్లాలో అటవీశాతాన్ని పెంచడానికి అధికారులందరూ కృషిచేయాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా అటవీశాఖ అధికారి జగన్నాథ సింగ్ మాట్లాడుతూ జిల్లాలో తడి నేలలు ఎక్కువగా ఉన్నాయన్నారు. తడినేలల కమిటీలోని సభ్యులు సంబంధిత నివేదికలను వెంటనే అందించాలని కోరారు. జిల్లాలో అటవీశాతంపై వివిధ శాఖల జిల్లా అధికారులతో చర్చించారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్ తదితరులు పాల్గొన్నారు. -
మాజీ సీఎం ఎన్టీఆర్కు నివాళి
రాయచోటి: మాజీ ముఖ్యమంత్రి దివంగత ఎన్టీ రామారావుకు అన్నమయ్య జిల్లా పోలీసులు ఘనంగా నివాళులు అర్పించారు. ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బుధవారం నందమూరి తారక రామారావు జయంతి సందర్భంగా ఆయన చిత్రటానికి రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పూలమాల వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం.పెద్దయ్య, ఎస్ఐలు, ఆర్ఎస్లు, జిల్లా పోలీసు కార్యాలయ సిబ్బంది, పోలీసు సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు పాల్గొన్నారు. కలెక్టరేట్లో.. అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయంలో దివంగత మాజీ సీఎం ఎన్టీఆర్ 102వ జయంతి వేడుకలను నిర్వహించారు. బుధవారం కలెక్టరేట్లోని ప్రజా భవనంలో కలెక్టర్ ఆదేశాల మేరకు డీఆర్ఓ మధుసూదనరావు ఆధ్వర్యంలో ఎన్టీఆర్ చిత్రపటానికి నివాళులర్పించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, జిల్లా విద్యాశాఖ అధికారి శివప్రకాష్రెడ్డిలు మాట్లాడారు. రాయచోటి తహసీల్దార్ నరసింహకుమార్, ల్యాండ్ సెక్షన్ సూపరింటెండెంట్ క్రాంతికుమార్, కోఆర్డినేషన్ సెక్షన్ సూపరింటెండెంట్ రెడ్డప్పరెడ్డి, కలెక్టరేట్ సిబ్బంది, విద్యార్థులు పాల్గొన్నారు. భారతి సిమెంట్స్ను వినియోగించండిగాలివీడు : గ్రామీణ ప్రాంతాలలో గృహాలు, కట్టడాలకు భారతి సిమెంటు వాడుతూ నాణ్యత పెంచుకోవాలని భారతి సిమెంట్స్ ప్రతినిధులు సూచించారు. బుధవారం వారు స్థానిక డీలర్ ఆధ్వర్యంలో గృహ నిర్మాణదారులు, బేల్దార్లు, బిల్డర్లతో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఓబీసీ 53 గ్రేడ్తో నాణ్యమైన సిమెంటును సరఫరా చేస్తున్నామన్నారు. ప్రతి ఒక్కరూ భారతి సిమెంటును వాడి నాణ్యత మేరకు తమ కట్టడాలను శాశ్వతం చేసుకోవాలన్నారు. కార్యక్రమంలో భారతి సిమెంట్స్ యాజమాన్యం, పలువురు బేల్దార్లు, గృహాల యజమానులు పాల్గొన్నారు. -
మహానాడులో మదనపల్లె జిల్లా ప్రకటించాలి
మదనపల్లె రూరల్ : కడపలో జరుగుతున్న మహానాడులో మదనపల్లె జిల్లాను ప్రకటించి, ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, మంత్రి లోకేష్ ప్రజలకు ఇచ్చిన ఎన్నికల హామీని నిలబెట్టుకోవాలని జిల్లా సాధన సమితి కన్వీనర్ పీటీయం.శివప్రసాద్ డిమాండ్ చేశారు. మహానాడులో మదనపల్లె జిల్లా ప్రకటనకు డిమాండ్ చేస్తూ స్థానిక ప్రెస్క్లబ్లో బుధవారం మదనపల్లె జిల్లా సాధన సమితి మీడియా సమావేశం ఏర్పాటు చేసింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండేళ్లక్రితం మహానాడు సందర్భంగా మదనపల్లెలో నిర్వహించిన మినీ మహానాడులో, టీడీపీ జాతీయ అధ్యక్షుడి హోదాలో ఎన్నికల సందర్భంగా గత ఏడాది మదనపల్లె బెంగళూరు బస్టాండ్లో నిర్వహించిన ఎన్నికల బహిరంగసభలో మదనపల్లె జిల్లా ఏర్పాటు తన బాధ్యతగా పేర్కొన్నారన్నారు. అలాగే యువగళం పాదయాత్ర సందర్బంగా టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి హోదాలో నారా లోకేష్ రొంపిచెర్ల, మదనపల్లె సభల్లో మాట్లాడుతూ..తాము అధికారం చేపట్టిన మొదటి ఆరు నెలల్లో మదనపల్లె, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలను కలిపి మదనపల్లె జిల్లా ఏర్పాటుచేస్తామని ప్రకటించారన్నారు. అయితే టీడీపీ అధికారంలోకి వచ్చి ఏడాది కావస్తున్నా...ఇప్పటికీ మదనపల్లె జిల్లా ఏర్పాటు ప్రక్రియ ప్రారంభించలేదని విమర్శించారు. సమావేశంలో మదనపల్లె జిల్లా సాధన సమితి నాయకులు ముత్యాల మోహన్, టి.ఏ.పీర్బాషా, కోనేటి దివాకర్రావు, బురుజురెడ్డి ప్రసాద్, గంగాధర్, రవిశంకర్, బి.నరసింహులు, కిరణ్ తదితరులు పాల్గొన్నారు. -
ఇసుక దిబ్బల కోసం తెలుగు తమ్ముళ్ల తగువులాట.!
సాక్షి టాస్క్ఫోర్స్ : అధికారం వచ్చిందే తడవు అన్నట్లుగా టీడీపీ వర్గీయులు పేట్రేగిపోతున్నారు. మనకెవరూ అడ్డూ, అదుపు లేరనేలా ఆక్రమణలకు పాల్పడుతున్నారు. ఈ క్రమంలో ఆక్రమణల్లో తలమునకలైన టీడీపీ వర్గీయుల్లోని ఇరువర్గాలకు చెందిన వారు ఒకరిపై మరొకరు దాడులకు తెగబడుతున్నారు. చాపాడు మండలం వి.రాజుపాళెం గ్రామానికి చెందిన టీడీపీ వర్గీయులు మంగళవారం పట్టపగలే కత్తులు, రాడ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. రాజుపాలెం గ్రామ సమీంపలోని పెన్నానది పరివాహకంలో సర్వే నెంబరు 490లో ప్రభుత్వ ఇసుక దిబ్బలు ఉన్నాయి. దీనికి ఇరువైపులా భూములు సాగు చేసుకుంటున్న రాజుపాలెంకు చెందిన టీడీపీలో ఒక వర్గానికి చెందిన పల్లెం శ్రీనివాసులు, వెంకటసుబ్బయ్య, మరో వర్గానికి చెందిన నలసింగ్ పెద్ద కుల్లాయప్ప, చిన్న కుల్లాయప్ప కుటుంబాలకు చెందిన వారు ఇసుక దిబ్బల కోసం మంగళవారం ఘర్షణ పడ్డారు. కొన్ని రోజుల క్రితం ఇదే విషయమై ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణలో పలువురు గాయపడ్డారు. మంగళవారం కూడా కుల్లాయప్ప కుటుంబీకులు ఇసుక దిబ్బల నుంచి ఇసుకను తరలిస్తుండగా పల్లెం శ్రీనివాసులు కుటుంబీకులు అడ్డుకునేందుకు వెళ్లి ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణలో కత్తులు, ఇసుప రాడ్లు, కర్రలతో దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో విచక్షణా రహితంగా కొట్టుకున్నారు. తీవ్రంగా గాయపడిన పవన్కుమార్ను కర్నూలుకు, తలకు గాయమైన మధును కడప రిమ్స్కు తరలించగా, మహేష్ అనే వ్యక్తి ప్రొద్దుటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘర్షణపై ఇరువర్గాల ఫిర్యాదు మేరకు ఇరువర్గాలకు చెందిన 14 మందిపై కేసులు నమోదు చేశారు. జిల్లాలో టీడీపీ ప్రతిష్టాత్మకంగా మహానాడు కార్యక్రమం నిర్వహిస్తుండగా జన సమీకరణ కోసం ఆయా నియోజకవర్గాల నుంచి జనాలను తరలించే పనుల్లో అధికార పార్టీ నేతలు బిజీగా ఉండగా రాజుపాళెం గ్రామంలో టీడీపీ వర్గీయులు ఘర్షణకు దిగడం గమనార్హం. పెన్నానదిలో వందల ఎకరాల్లో ఆక్రమణలు.. మండలంలోని రాజుపాళెం, తిప్పిరెడ్డిపల్లె గ్రామాల మధ్య గల పెన్నానది పరివాహకంతో పాటు నదిలో ఇసుక దిబ్బల్లో వందల ఎకరాల్లో భూములు ఆక్రమణకు గురయ్యాయి. సర్వే నెంబర్లు 487, 488లలో 7.25 ఎకరాల ఆయకట్టు ఉండగా, 489–2లో 22 ఎకరాలు, 490లో 20 ఎకరాలకు పైగా ఇసుక దిబ్బలు ఉండగా, 538లో వంద ఎకరాలకు పైగా ఏటి పొరంబోకు ఉంది. ఈ స్థలం అంతా ఆక్రమణకు గురై వ్యవసాయ భూములుగా మారాయి. ఈ క్రమంలో ఆక్రమణకు గురైన పొలాల మధ్య ఉన్న ఇసుక దిబ్బలలో ఉన్న ఇసుకను పొలాలకు తోలుకునేందుకు, ఇసుక తొలగించి వ్యవసాయ భూమిగా మార్చుకునేందుకు టీడీపీ వర్గీయుల మధ్య తరచూ ఘర్షణలు జరుగుతుండటం చర్చనీయాంశంగా మారింది. సమస్యాత్మక దిబ్బలను పరిశీలించిన రెవెన్యూ అధికారులు.. మండలంలోని రాజుపాలెం గ్రామ సమీపంలో టీడీపీ వర్గీయుల మధ్య ఘర్షణకు కారణమైన పెన్నానది పరివాహకంలో ఇసుక ఇబ్బలను తహసీల్దారు రమాకుమారి తమ సిబ్బందితో కలసి పరిశీలించారు. ఈ ఇసుక దిబ్బలు పూర్తిగా ప్రభుత్వ పరిధిలోనివని, వీటిపై ఎవరికీ హక్కు లేదని, హక్కు ఉన్నట్లు పత్రాలు తీసుకువస్తే విచారించి పరిశీలిస్తామని ఇరువర్గాలకు తెలిపారు. చాపాడు మండలం వి. రాజుపాళెంలో టీడీపీ వర్గాల మధ్య ఘర్షణ కత్తులు, రాడ్లతో దాడులు.. 14 మందిపై కేసులు నమోదు జిల్లాలో మహానాడు వేళ టీడీపీ వర్గీయుల మధ్య బయటపడ్డ విభేదాలు -
పోలీస్ కార్యాలయంలో ఘనంగా ఎన్టీఆర్ జయంతి
కడప అర్బన్ : ‘తెలుగు ప్రజల కోసం పాలనాపరంగా పలు సామాజిక సంస్కరణలు అమలు చేసిన ఘనత దివంగత మాజీ ముఖ్యమంత్రి నందమూరి తారక రామారావుకే దక్కుతుందని ఏఆర్ అదనపు ఎస్పీ రమణయ్య పేర్కొన్నారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో ఎన్టీఆర్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ ఆదేశాల మేరకు ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా అనేక సేవలందించడంతో పాటు చలనచిత్రాల్లో, నిజజీవితంలోనూ తెలుగుజాతి ఆత్మగౌరవాన్ని, కీర్తిని ప్రపంచ వేదికపై చాటి చెప్పిన మహనీయుడు ఎన్టీఆర్ అన్నారు. ఎన్టీఆర్ తెలుగు ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచారన్నారు. ఈ కార్యక్రమంలో ఏఆర్ డీఎస్పీ కె.శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
సిద్దవటం : మండలంలోని సాబ్బావి రహదారి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉదయగిరికి చెందిన ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా.. నెల్లూరు జిల్లా ఉదయగిరికి చెందిన వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మాడాల వెంకట శ్యాంప్రసాద్ తన సొంత కారులో రాష్ట్ర నాయకుడు పట్టెడ రమణను ఎక్కించుకొని కడప ప్రెస్క్లబ్లో సమావేశానికి బయలుదేరారు. మండలంలోని సాబ్బావి రహదారి సమీపంలోకి రాగానే కల్వర్ట్ను ఢీకొని కారు మూడు పల్టీలు కొట్టింది. కారులో ప్రయాణిస్తున్న ఇద్దరికి తీవ్ర గాయాలు కావడంతో వారిని దార వెంట ప్రయాణికులు 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. సమాచారం తెలుసుకున్న సిద్దవటం పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ప్రమాదం జరిగిన తీరును పరిశీలించారు. విద్యుత్ స్తంభాన్ని ఢీ కొన్న కారురైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలం మైసూరువారిపల్లి పంచాయతీ శాంతినగర్లోని కడప–తిరుపతి ప్రధాన రహదారిపై బుధవారం విద్యుత్ స్తంభాన్ని కారు ఢీ కొంది. తెలంగాణ రాష్ట్రం మహబూబ్నగర్కు చెందిన వారు కారులో వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగింది. విద్యుత్ స్తంభం కుప్పకూలడంతో విద్యుత్కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. కారులో ప్రయాణిస్తున్న వారు సురక్షితంగా ఉన్నారు. -
పాముకాటుతో ఇద్దరికి అస్వస్థత
మదనపల్లె రూరల్ : పాముకాటుతో ఇద్దరు అస్వస్థతకు గురై స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన చంద్రమ్మ(50) పొలం పనులు చేసుకుంటుండగా, పాముకాటుకు గురైంది. తీవ్ర అస్వస్థతకు గురికాగా, కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా పీటీఎం మండలం బురుజుపల్లెకు చెందిన రామకృష్ణ, జ్యోతి దంపతుల కుమారుడు పి.అరుణ్తేజ్(8) ఇంట్లో నిద్రిస్తుండగా, బుధవారం తెల్లవారుజామున గుర్తు తెలియని విషపురుగు కాటేసింది. తీవ్ర అస్వస్థతకు లోనుకాగా, కుటుంబ సభ్యులు కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించి, మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. -
చిట్టీ డబ్బులు అడిగితే కుటుంబంపై దాడి
మదనపల్లె రూరల్ : ఆపద సమయంలో ఆదుకుంటుందని, కష్టార్జితాన్ని కపిలేశ్వర్ చిట్ఫండ్స్ సంస్థలో చిట్టీల రూపంలో జమచేస్తే...కంతులు పూర్తయినా డబ్బులు ఇవ్వకపోగా, అడిగినందుకు అనుచరులు, సిబ్బందితో బాధిత కుటుంబంపై యాజమాన్యం దాడికి పాల్పడిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. ప్రొద్దుటూరు నుంచి మూడు వాహనాల్లో మదనపల్లెకు వచ్చిన కపిలేశ్వర్ చిట్స్ ఎండీ సీకే నాయుడు అనుచరులు, చిట్టీ డబ్బులు చెల్లించిన కస్టమర్ రామ్మోహన్రెడ్డి, అతని భార్య రత్నకుమారి, కుమార్తె రమ్యశ్రీపై దాడికి పాల్పడి విచక్షణారహితంగా కొట్టడమే కాకుండా మెట్లపై నుంచి కిందకు తోసేశారు. దీంతో బాధితుడు, ప్రజాసంఘాల మద్దతుతో కపిలేశ్వర్ చిట్స్ కార్యాలయం ఎదుట ధర్నాకు దిగడంతో ఉద్రిక్త వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న టూటౌన్ పోలీసులు ఘటనాస్థలానికి చేరుకుని దాడిపై బాధితుల నుంచి వివరాలు సేకరించారు. దాడికి పాల్పడిన వ్యక్తులను విచారించి, వారు వచ్చిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని స్టేషన్కు తరలించారు. ఘటనపై బాధితులు తెలిపిన వివరాలు.. పట్టణంలోని ఎస్టేట్ శివాజీనగర్, పద్మావతి కల్యాణమండపం సమీపంలో నివాసం ఉంటున్న బి.రామ్మోహన్రెడ్డి ఆర్టీసీ–2డిపోలో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. అతనికి భార్య రత్నకుమారి, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కుటుంబ భవిష్యత్ అవసరాల కోసం సీటీఎంరోడ్డులోని కపిలేశ్వర్ చిట్స్లో రామ్మోహన్రెడ్డి పేరుపై రూ.5 లక్షలు, భార్య రత్నకుమారి పేరుపై రూ.5లక్షలు చిట్టీలు వేశారు. 50 కంతులు పూర్తిగా చెల్లించాడు. ఆగస్టు–2024కు చిట్టీ కంతులు పూర్తికాగా, యాజమాన్యం చిట్టీ నగదు చెల్లించాల్సి ఉంది. అయితే గడువు పూర్తయి పదినెలలు కావస్తున్నా.. కేవలం రూ.1లక్ష 20వేలు మాత్రమే బాధితులకు చెల్లించారు. మిగిలిన నగదు చెల్లించకుండా వారిని వేధిస్తూ వచ్చారు. ఈ క్రమంలో పలుమార్లు కార్యాలయం చుట్టూ బాధితులు తిరిగినా ఫలితం లేకపోవడంతో విసిగిపోయారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో నగదు చెల్లించాలని బాధితుడు గట్టిగా నిలదీయడంతో ఏప్రిల్ 18కి పూర్తిగా చెల్లిస్తామని యాజమాన్యం చెప్పింది. అయినా అప్పటికీ చెల్లించకపోవడంతో విసిగిపోయిన బాధితులు బుధవారం చిట్ కార్యాలయానికి చేరుకుని సిబ్బందిని నిలదీశారు. కార్యాలయానికి తాళాలు వేసి నిరసన తెలిపేందుకు ప్రయత్నించారు. యాజమాన్య వైఖరిపై టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసేందుకు వెళ్లగా, నగదు లావాదేవీలు కోర్టులో తేల్చుకోవాలని పోలీసులు చెప్పి పంపేశారు. ఇంటికి చేరుకున్న రామ్మోహన్రెడ్డికి మధ్యాహ్నం 3 గంటల సమయంలో కపిలేశ్వర్ చిట్స్ మేనేజర్ నరసింహులు ఫోన్చేసి, ఎండీ సీకే నాయుడు వచ్చారని, మీ నగదు చెల్లిస్తారు. కార్యాలయానికి రావాలంటూ కోరాడు. దీంతో రామ్మోహన్రెడ్డి, భార్య రత్నకుమారి, కుమార్తె రమ్యశ్రీతో కలిసి చిట్స్ కార్యాలయానికి 3.30 గంటలకు చేరుకున్నాడు. అప్పటికే ప్రొద్దుటూరు నుంచి మూడు వాహనాల్లో వచ్చిన ఎండీ సీకే నాయుడు, అనుచరులతో కలిసి కార్యాలయంలో ఉన్నారు. బాధితులు కార్యాలయానికి వచ్చిన వెంటనే అనుచరులు, కార్యాలయ సిబ్బంది ఎండీ సీకే నాయుడు సమక్షంలో ఒక్కసారిగా మూకుమ్మడిగా రామ్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులపై దాడిచేసి విచక్షణారహితంగా కొట్టారు. దాడిలో రామ్మోహన్రెడ్డి పళ్లు విరగడంతో పాటు రక్తగాయాలై తీవ్రంగా గాయపడ్డాడు. మహిళలు అని చూడకుండా రత్నకుమారి, రమ్యశ్రీలను అసభ్యపదజాలంతో దూషిస్తూ కొట్టడంతో పాటు దిక్కున్నచోటు చెప్పుకోమంటూ మెట్లపై నుంచి కిందకు తోసేశారు. దీంతో బాధితుడు నడిరోడ్డుపై తనకు జరిగిన అన్యాయంపై ఆవేదన వ్యక్తం చేస్తూ బంధుమిత్రులతో కలిసి నిరసన తెలిపాడు. బాధితుడికి అండగా బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు మద్దతు తెలిపి చిట్స్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దీంతో పోలీసులు అక్కడకు చేరుకుని బాధితులతో మాట్లాడారు. దాడి ఘటనపై ఫిర్యాదు తీసుకున్నారు. దాడికి పాల్పడిన వ్యక్తులు, వచ్చిన మూడు వాహనాలను స్వాధీనం చేసుకుని, స్టేషన్కు తరలించారు. ఘటనపై విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కంతులు పూర్తయి ఏడాది కావస్తున్నా డబ్బులు చెల్లించని కపిలేశ్వర్ చిట్స్ యాజమాన్యాన్ని నిలదీస్తే.. అనుచరులు, సిబ్బందితో కలిసి హత్యాయత్నం టూటౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు.. మూడు వాహనాలు స్వాధీనం -
యోగాతో సంపూర్ణ ఆరోగ్యం
మదనపల్లె: యోగాతో సంపూర్ణ ఆరోగ్యం, మానసిక ప్రశాంతత సిద్దిస్తుందని కలెక్టర్ శ్రీధర్ చామకూరి అన్నారు. బుధవారం ఉదయం స్థానిక బెంగళూరు రోడ్డులోని బీటీ కళాశాల మైదానంలో యోగా కార్య క్రమం నిర్వహించారు. జిల్లా అధికారులతోపాటు వివిధ ప్రాంతాల నుంచి హజరైన మండల, గ్రామస్థాయి అధికారులు, ఆరోగ్యశాఖ సిబ్బంది, సచివాలయ ఉద్యోగులు, అంగన్వాడీ కార్యకర్తలు, విద్యార్థులు, పలుశాఖల ఉద్యోగులతో యోగాసనాలను వేశారు. కలెక్టర్ శ్రీధర్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, జెసీ ఆదర్శ్ రాజేంద్ర, సబ్కలెక్టర్ వై.మేఘస్వరూప్ యోగాసనాలు వేశారు. ఈ సందర్భంగా హజరైన వారిని ఉద్దేశించి కలెక్టర్ మాట్లాడుతూ భారతీయ సంస్కృతిలో యోగాకు ప్రాముఖ్యత ఉందన్నారు. మానసిక, శారీరక, అధ్యాత్మిక ఉన్నతికి ఉపయోగం కలుగుతుందన్నారు. ఆనందకరమైన జీవితానికి యోగాఅవసరమని అన్నారు. వయసుతో నిమిత్తం లేకుండా పిల్లల నుంచి పెద్దల వరకు యోగాను అచరించవచ్చన్నారు. మే 21 నుంచి జూన్ 21 వరకు యోగా మాసోత్సవాలను జరుపుతున్నట్టు చెప్పారు. యోగా గురువు పాల్ బ్రహ్మకుమార్ 15 మంది ఉప గురువులతో కలిసి 45 నిమిషాల పాటు హజరైన వారితో యోగాసనాలు వేయించారు. కార్యక్రమానికి ముందు విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు ఆకట్టుకున్నాయి. తర్వాత మైదానం నుంచి చిప్పిలి వరకు హజరైన వారితో ర్యాలీ నిర్వహించారు. కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ సుబ్బరాజు, డీఎఫ్ఓ జగన్నాధ్సింగ్, మదనపల్లె కమీషనర్ ప్రమీల, హార్టికల్చర్, హౌసింగ్ జిల్లా అధికారులు రవిచంద్రారెడ్డి, సాంబశివయ్య పాల్గొన్నారు. కలెక్టర్ శ్రీధర్ చామకూరి -
మహానాడుకు సుగవాసి కుటుంబం దూరం
రాయచోటి: టీడీపీ ఆవిర్భావం నుంచి ఆ పార్టీతో అడుగులు వేసిన సుగవాసి కుటుంబం, ఆయన అనుచరులు నేడు కడప గడ్డపై జరుగుతున్న మహానాడు వేదికకు దూరమయ్యారు. ఒక్క మాటలో చెప్పాలంటే పార్టీ అధిష్టానమే సుగవాసి కుటుంబాన్ని దూరం చేసుకుందన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. బుధవారం దివంగత నేత ఎన్టీ రామారావు జయంతిని రాయచోటిలోని సుగవాసి పార్టీ కార్యాలయంలో నిర్వహించారు. మహానాడులో సుగవాసి కుటుంబాన్ని పట్టించుకోలేదన్న ఆవేశం, ఆక్రోశం ఆయన వర్గీయుల్లో కట్టలు తెంచుకుంటుంది. సుగవాసి పాలకొండ్రాయుడు తనయులకు ప్రాధాన్యం లేకపోవడంతో బాల సుబ్రమణ్యం, ప్రసాద్ బాబులు మహానాడుకు దూరమయ్యారని తెలిసింది. వారి అనుయాయులు కూడా మహానాడు కార్యక్రమానికి వెళ్లలేదని సమాచారం. రాష్ట్ర టీడీపీ కార్యనిర్వహక కార్యదర్శి, టీడీపీ పాలకమండలి మాజీ సభ్యులు సుగవాసి ప్రసాద్ బాబు తన అనుయాయులతో ఎన్టీఆర్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గంలోని సుగవాసి అనుచరులు పెద్దఎత్తున హాజరై సంఘీభావం తెలిపారు. తండ్రి ఆశయ సాధనకోసం.. తండ్రి ఆశయాలకు అనుగుణంగా నడుచుకుంటానని సుగవాసి ప్రసాద్ బాబు అన్నారు. రాబోయే రోజుల్లో అందరి అభిప్రాయం మేరకు రాజకీయాలలో అడుగులు వేస్తామన్నారు. ఎన్నికష్టాలు వచ్చినా పార్టీని, కుటుంబాన్ని నమ్ముకున్న నాయకులు, కార్యకర్తలకు అండగా ఉంటామని తెలిపారు. సుగవాసి భవన్లో ఎన్టీఆర్ జయంతి వేడుకలు -
●చిత్తశుద్ధి లేకపోవడంతోనే పేలవంగా మహానాడు
కడపలో నిర్వహిస్తున్న మహానాడుకు రెండో రోజు పూర్తిగా ఆదరణ కరవయ్యింది. మొదటి రోజు అంతంత మాత్రంగా హాజరైన తెలుగు తమ్ముళ్లు, రెండు రోజు పూర్తిగా ముఖం చాటేశారు. మహానాడు ప్రాంగణం వైపే చూడని వారు కొందరైతే, వచ్చిన వారు కూడా ప్రసంగాలు ప్రారంభం కాగానే తిరుగుబాట పట్టారు. వెరసి మహానాడు ప్రాంగణం, చుట్టుపక్కల రహదారులన్నీ ఖాళీగా దర్శనమిచ్చాయి. ఎంతో ఆర్భాటంగా మహానాడును కడపలో నిర్వహించుకుంటున్నాం అని చెప్పుకున్న టీడీపీ బోర్లా పడింది. సొంత పార్టీ కార్యకర్తల నుంచే ఆదరణ కరవైంది. దీనికి ప్రధాన కారణం నేతలల్లో చిత్తశుద్ధి లేకపోవడమేనని పలువురు చెప్పుకొస్తున్నారు. మహానాడులో రెండో రోజు ఉదయాన్నే ఖాళీ కుర్చీలు దర్శనమిచ్చాయి. ఇక ఆ టెంట్ల కింద ఉన్న జనాలు తప్ప కనుచూపు మేర ఎక్కడా జనం కనిపించలేదు. సొంత పార్టీ కార్యకర్తలే మహానాడుకు డుమ్మా కొట్టడం ఇప్పుడు తెలుగుదేశం పార్టీ నాయకులకు మింగుడు పడటం లేదని విఽశ్లేషకులు వెల్లడిస్తున్నారు. -
మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యం
రైల్వేకోడూరు అర్బన్: కడపలో టీడీపీ, ముఖ్యమంత్రి చంద్రబాబు నిర్వహిస్తున్న మహానాడుతో రాష్ట్రానికి ఒరిగింది శూన్యమని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. కేవలం గతప్రభుత్వాన్ని విమర్శించడం, లోకేష్ను పొగుడుకోవడంతోనే రెండురోజులు సరిపెట్టారన్నారు.జనం లేక మహానాడు వెలవెలబోయిందని అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ అమలు చేయలేని హామీలతో ప్రజలను నమ్మించి ఓట్లు దండుకొని, పథకాలు ఎగ్గొట్టి పండుగ చేసుకుంటున్నారని తెలిపారు. ప్రజలకు చేసిన మోసాలకు చివరకు వరుణుడు కూడా ఆగ్రహించారని పేర్కొన్నారు. ఎన్నికలకు ముందు ప్రజలకు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ పథకాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. అన్నిరంగాల్లో గత ప్రభుత్వం యువతకు అందించిన ఉద్యోగాలు పీకేసి, గత ప్రభుత్వం చేసిన అభివృద్ధి పనులు ప్రారంభించుకుంటూ ఏ ముఖం పెట్టుకొని మహానాడు నిర్వహిస్తున్నారని విమర్శించారు. జనాలు రాకపోవడంతో డ్వాక్రాసంఘాలు, గ్రామాల్లోని ప్రజలను మహానాడుకు రాకుంటే పథకాలు రావంటూ కొందరు అధికారులు బలవంతంగా మూడోరోజుకు తరలించే ప్రయత్నం చేస్తున్నారని చెప్పారు. మహిళలు, యువతులు మాయమవుతున్నా పవణ్కళ్యాణ్ పట్టించుకోలేదని, ఒక్కమాట కూడా మాట్లాడలేదన్నారు. వైఎస్ జగన్ హయాంలో ప్రజలకు అన్ని పథకాలు అందించారని గుర్తు చేశారు. క రోనా కష్టకాలం ఉన్నప్పటికీ సంక్షేమ పథకాలకు కేటాయించిన నిధులు, ఇప్పుడు చంద్రబాబు కే టాయించిన నిధుల గురించి ప్రజలు గమనించా లన్నారు. రెడ్బుక్తోనే పరిపాలన చేయాలని తండ్రీకొడుకులు, పవన్కళ్యాణ్ చూస్తున్నారని తెలిపారు. జగనన్న పరిపాలన విలువ ఇప్పుడు ప్రజలకు తెలుస్తోందని పేర్కొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
పేదలను మోసగిస్తున్న కూటమి ప్రభుత్వం
రైల్వేకోడూరు అర్బన్ : కూటమి ప్రభుత్వం ఏర్పడి ఏడాది కావస్తున్నా లక్షా యాభై వేల కోట్ల రూపాయలు అప్పులు చేసి పేద ప్రజలకు ఎలాంటి పథకాలు అమలు చేయకుండా వారిమీదే భారం వేస్తూ పరిపాలన సాగిస్తోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. మంగళవారం స్థానిక వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రజలకు అనేక హామీలు ఇచ్చి ఏ ఒక్కటీ అమలు చేయకుండా మోసం చేసిన ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు పేరుతో సంబరాలు చేసుకోవడం ప్రజలను అవమానించడమే అన్నారు. మండలానికి నాలుగు మద్యం షాపులు, నలభై బెల్టుషాపులు పథకం అమలు చేశారని ఎద్దేవా చేశారు. అలాగే విద్యుత్ చార్జీల పేరుతో రూ. 15,480 కోట్లు ప్రజలపై భారం మోపారన్నారు. కూటమి పాలనలో పాఠశాలల్లో కూడా డ్రగ్స్, గంజాయి ప్రవేశించడం అవమానకరమన్నారు. రాష్ట్రంలో రైతులకు ఏ ఒక్క పంటకు కూడా గిట్టుబాటు ధర లేకుండా మహానాడులో భోజనాలు చేయడం సిగ్గుచేటని ధ్వజమెత్తారు. ఏడాదిలో ఆత్మహత్య చేసుకున్న ఏ ఒక్క రైతుకు కూడా పంట నష్ట పరిహారం చెల్లించలేదన్నారు. మహిళలపై అత్యాచారాలు, ఇసుక, మద్యం, మైనింగ్లలో విచ్చలవిడిగా దోపిడీలకు పాల్పడుతున్నారని తీవ్ర స్థాయిలో విరుచుకుపడ్డారు.మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
గొర్రెల మందపై దూసుకెళ్లిన లారీ
గుర్రంకొండ : గొర్రెల మందపై లారీ దూసుకెళ్లడంతో ఏడు పొట్టేళ్లు మృతి చెందగా తొమ్మిది గొర్రెలు తీవ్రంగా గాయపడిన సంఘటన మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ ఎరుకలవానిమిట్ట వద్ద జరిగింది. కలకడ మండలం నడిమిచెర్ల గ్రామానికి చెందిన చంద్రమోహన్ అనే గొర్రెలకాపరి గొర్రెల మందను కాచుకొంటూ జీవనం సాగిస్తున్నాడు. పొలాలపై మందను నిలిపేందుకు మండలంలోని చెర్లోపల్లె పంచాయతీ ఎరుకలవానిమిట్ట వద్ద ఉన్న పొలాల్లోకి తన గొర్రెల మందను తోలుకొచ్చాడు. మంగళవారం మందను సమీప గుట్టల్లో మేపుకొని తిరిగి పొలాలవైపు వస్తుండగా రాయచోటి నుంచి మదనపల్లె వైపు వెళుతున్న లారీ గొర్రెల మందపై దూసుకెళ్లింది. ఈ సంఘటనలో ఏడు పొట్టేళ్లు ఆక్కడికక్కడే మృతి చెందగా తొమ్మిది గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. గాయపడిన గొర్రెల పరిస్థితి కూడా విషమంగా ఉన్నట్లు బాధిత గొర్రెల కాపరి తెలిపాడు. ఈ ప్రమాదంలో రూ.2లక్షల నష్టం వాటిల్లిందన్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘురామ్ తెలిపారు.ఏడు పొట్టేళ్లు మృతి -
రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్
బి.కొత్తకోట : జిల్లాలో ఉపాధి హామీ పథకంలో పని చేసిన సీసీ రోడ్లు, కూలీలకు రూ.100 కోట్ల బిల్లులు పెండింగ్లో ఉన్నాయని జిల్లా నీటి యాజమాన్య సంస్థ ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం తెలిపారు. స్థానిక ఉపాధి కార్యాలయంలో ఆయన మంగళవారం ఫాం పాండ్స్ పనులపై క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో మూడు నెలలుగా ఉపాధి ఎఫ్ఏ, టీఏలు, ఏపీఓలకు వేతనాలు అందలేదన్నారు. వీరికి త్వరలోనే వేతనాలు జమ అవుతాయని చెప్పారు. జిల్లాలో 11 వేల ఫాం పాండ్స్ నిర్మాణం కోసం పనులు చేపట్టగా.. ఇప్పటి దాకా 5,109ను రూ.25 కోట్ల వ్యయంతో పూర్తి చేసినట్టు చెప్పారు. ప్రస్తుతం జిల్లాలో 71 వేల మంది ఉపాధి పనులు చేస్తుండగా.. అందులో 26 వేల మంది ఫాం పాండ్స్ పనులు చేస్తున్నారని తెలిపారు. నెల రోజులుగా ఉపాధి పనులు చేసే కూలీల సంఖ్య పెరిగిందన్నారు. మండల ఉపాధి సిబ్బందితో సమీక్ష నిర్వహిస్తూ.. మండలానికి 225 కంపోస్టు యార్డులు మంజూరైనట్టు చెప్పారు. ఈ నెలఖారులోగా 263 ఫాం పాండ్స్ నిర్మాణాలు పూర్తి చేయాలని ఆదేశించారు. 200 ఎకరాల్లో ఉద్యానవనాల పెంపకం లక్ష్యంగా నిర్ణయించామని, దీనిపై రైతులను గుర్తించి మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలని కోరారు. కూలీల సంఖ్యను 1,370కు పెంచాలని సూచించారు. యోగాంధ్ర యాప్లో ఉపాధి కూలీలను రిజిస్ట్రేషన్ చేయాలని కోరారు. సమావేశంలో ఏపీడీ నందకుమార్, ఏపీఓ వెంకటేష్ తదితరులు పాల్గొన్నారు. ప్రభుత్వ లక్ష్యాలను పూర్తి చేయకుంటే చర్యలు పెద్దతిప్పసముద్రం : ఉపాధి హామీ పథకంలో భాగంగా సిబ్బందికి నిర్దేశించిన ప్రభుత్వ లక్ష్యాలను నెలాఖరులోగా పూర్తి చేయకుంటే చర్యలు తప్పవని డ్వామా పీడీ వెంకటరత్నం స్పష్టం చేశారు. మంగళవారం ఆయన మండలంలోని క్షేత్ర, సాంకేతిక సహాయకులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఖాళీగా ఉన్న ఫీల్డ్ అసిస్టెంట్ పోస్టుల భర్తీకి చర్యలు చేపడుతున్నామన్నారు. ఆయన వెంట ములకలచెరువు క్లస్టర్ ఏపీడీ నందకుమార్రెడ్డి ఉన్నారు. ఫాం పాండ్స్ పనులకు రూ.25 కోట్ల వ్యయం పీడీ వెంకటరత్నం -
పశ్చిమబెంగాల్ సైబర్ నేరస్తుడు మదనపల్లెలో అరెస్టు
మదనపల్లె రూరల్ : ఉద్యోగాలిప్పిస్తానని డబ్బులు తీసుకుని మోసం చేయడంతో పాటు సైబర్ నేరాలకు పాల్పడి మదనపల్లెలో తలదాచుకున్న పశ్చిమబెంగాల్కు చెందిన సైబర్ నేరస్తుడిని ఆ రాష్ట్రానికి చెందిన పోలీసులు మంగళవారం అరెస్టు చేశారు. కలకత్తాకు చెందిన జిజాన్స్(40) స్థానికంగా ఓ ప్రైవేట్ కంపెనీలో పనిచేస్తూ పలువురికి ఉద్యోగాలిప్పిస్తానని నగదు వసూలు చేసుకున్నాడు. అంతేకాకుండా సైబర్ నేరాలకు పాల్పడ్డాడు. దీంతో అతడిపై ఆరు నెలల క్రితం కలకత్తా పోలీసులు రెండు కేసులు నమోదు చేశారు. అప్పటి నుంచి పరారీలో ఉన్న జిజాన్స్ మదనపల్లెకు వచ్చి స్థానికంగా మార్పూరి వీధిలోని టీ హోటల్లో పనిచేస్తూ తలదాచుకున్నాడు. కేసు దర్యాప్తులో భాగంగా కలకత్తా పోలీసులు సెల్ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా నిందితుడు మదనపల్లెలో ఉన్నట్లు గుర్తించారు. మంగళవారం ముగ్గురు పశ్చిమబెంగాల్ పోలీసులు మదనపల్లెకు చేరుకుని, టూటౌన్ పోలీసుల సాయంతో జిజా న్స్ను అరెస్ట్ చేశారు. జిల్లా ప్రభుత్వ ఆస్పత్రిలో వైద్య పరీక్షలు నిర్వహించి స్థానిక కోర్టులో హాజరు పరిచారు. అనంతరం నిందితుడిని కలకత్తాకు తరలించారు. -
నిధుల స్వాహా కథ.. కంచికేనా?
మదనపల్లె : కథలన్నీ కంచికి చేరుతాయన్న సామెతలాగా.. మదనపల్లె మున్సిపాలిటీలో లక్షల నిధుల స్వాహా కథ కూడా కంచికి చేరేలా కనిపిస్తోంది. మదనపల్లె స్పెషల్ గ్రేడ్ మున్సిపాలిటీలో 2022–23 గుత్తలకు సంబంధించి రూ.29.50 లక్షల నిధులు స్వాహా విషయాన్ని ఈ నెల 14న ‘సాక్షి’ వెలుగులోకి తీసుకొచ్చిన విషయం తెలిసిందే. 2022 ఏప్రిల్ ఒకటి నుంచి 2023 మార్చి 31 వరకు వారపుసంత, జంతువధశాల, దినసరి మార్కెట్ను వేలం ద్వారా రూ.94.55 లక్షలకు గుత్తకు అప్పగించారు. ఈ గుత్త పొందిన లీజుదారుడు చెల్లించిన నిధులు, స్వాహా అంశాన్ని అధికారులు ఇంకా కొలిక్కి తీసుకురాలేదని తెలుస్తోంది. రెండు రోజులు విచారణ పైసా సొమ్ము చెల్లించినా ఆన్లైన్ ద్వారా జమ చేసి చెల్లింపుదారునికి ఆన్లైన్ రశీదులు ఇస్తారు. అయితే ఈ గుత్తకు సంబంధించి రూ.29.50 లక్షల చెల్లింపు జరిగినట్టు, అందుకు చేతిరాత రశీదులు ఇచ్చిన ఉద్యోగి.. ఆపై సొమ్మును మున్సిపాలిటీకి జమ చేయలేదని గుర్తించారు. ఈ విషయం ‘సాక్షి’లో ప్రచురితం కావడంతో అధికారులు రెండురోజుల పాటు విచారణ చేసి ముగించారు. విచారణలో సొమ్ము చెల్లింపుపై స్వాహా చేసిందెవరు, ఇందులో ఎవరెవరి ప్రమేయం ఉంది అనే వివరాలను ఆరా తీయలేదని తెలుస్తోంది. మొత్తం ఆరోపణలకు కేంద్రమైన రశీదులు ఇవ్వడంపై ప్రధానంగా దృష్టి పెట్టి విచారణ చేస్తే.. వాస్తవాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉండేది. అనుమానాలు ఎన్నో.. నిధుల స్వాహా రెండేళ్లుగా నలుగుతుండటంపై ఎన్నో అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. గుత్తల సొమ్ము చెల్లించాల్సిన లీజుదారు నిర్ణయించిన గడువులోగా సొమ్ము జమ చేయకుంటే మూడు నెలల ముందే.. లీజును రద్దు చేసే అవకాశం ఉన్నా, అధికారులు ఎందుకు చర్యలు తీసుకోలేదు. సొమ్ము జమ అయినట్టు చేతిరాత రశీదులు చూపించి లీజుదారు రద్దు నుంచి తప్పించుకున్నారా?.. ఇదే జరిగివుంటే నిబంధనలకు విరుద్ధంగా జరిగిన ఈ వ్యవహారంపై అప్పుడే అధికారులు చర్యలు తీసుకోవాల్సింది. అలా కాకుండా లీజు పూర్తయ్యాక సొమ్ము చెల్లింపు కోసం న్యాయపరమైన చర్యలు చేపట్టడం మున్సిపల్ నిబంధనల మేరకే జరిగిందా? రశీదులు ఇచ్చారంటే సంబంధిత ఉద్యోగి లీజుదారు నుంచి సొమ్ము తీసుకున్నట్టు ఎవరైనా భావిస్తారు. ప్రధానంగా డబ్బు తీసుకున్నట్టు రశీదులు ఇవ్వడం ఈ వ్యవహారంలో కీలకమైంది. కాబట్టి అధికారులు తగిన రీతిలో లీజుదారు, సంబంధిత ఉద్యోగిని విచారణ చేస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయి. ఇంత పెద్ద మొత్తానికి చేతిరాత రశీదులపై తేలికగా తీసుకోవాల్సిన అంశం కాదని మున్సిపల్ సిబ్బంది చర్చించుకొంటున్నారు. ముగింపు ఎలా..! గుత్తల సొమ్ము స్వాహా వ్యవహారానికి ఎలా ముగింపు పలకాలన్న దానిపై అధికారులు మల్లగుల్లాలు పడుతున్నట్టు తెలుస్తోంది. న్యాయపరమైన చర్యలు తీసుకున్నామని అధికారులు చెబుతున్నా.. స్వాహా విషయాన్ని ‘సాక్షి వెలుగులోకి తీసుకురావడంతో అధికారుల్లో కదలిక వచ్చి, రెండు రోజులు ఉద్యోగులతో రహస్య విచారణ జరిపారు. ఆ విచారణలో ఏమి తేల్చారో బయటకు పొక్కలేదు కానీ.. ఈ స్వాహా కథకు ముగింపు పలకడం కోసం దారులు వెతుకుతున్నట్టు తెలుస్తోంది. ‘సాక్షి’ కథనంతో రహస్య విచారణ రూ.29.50 లక్షలకు చేతి రశీదులపై జరగని విచారణ లీజుదారు డబ్బు చెల్లించకున్నా కొనసాగించిన వైనం ఈ వ్యవహారంపై ముగింపు పలకలేక మల్లగుల్లాలు? -
చెక్బౌన్స్ కేసులో రూ.15 లక్షలు జరిమానా
తంబళ్లపల్లె : చెక్ బౌన్స్ కేసులో బెంగళూరుకు చెందిన ఓ వ్యక్తికి రూ.15లక్షలు జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ మంగళవారం స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో న్యాయమూర్తి ఉమర్ఫారూఖ్ తీర్పు ఇచ్చారు. బెంగళూరుకు చెందిన లోకనాథరెడ్డి 2018లో తంబళ్లపల్లె వాసి రామమూర్తికి ఇచ్చిన చెక్ బౌన్స్ అయింది. బాఽధితుడు స్థానిక జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో పిటిషన్ వేశారు. బాధితుడి తరపున న్యాయవాది గఫార్ కేసు వాదనలు వినిపించారు. విచారణ పూర్తయి నేరం రుజువుకావడంతో లోకనాథరెడ్డికి రూ.15 లక్షలు జరిమానాతో పాటు ఏడాది జైలు శిక్ష విధిస్తూ న్యాయమూర్తి తీర్పు చెప్పారు. ప్రభుత్వ భూమి కబ్జా.! పుల్లంపేట : కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక ప్రభుత్వ భూములను కొందరు యథేచ్ఛగా ఆక్రమించుకుంటున్నారు. మండల వ్యాప్తంగా 400 ఎకరాల ప్రభుత్వ భూములు అన్యాక్రాంతమయ్యాయి. యథేచ్ఛగా భూముల్లో చెట్లు నాటుకొని పంటలు సాగు చేస్తున్నారు. పూర్వకాలం నుంచి గ్రామంలో చనిపోయిన వారి భార్యలు గాజు, పూస తీసే భూమిని చిన్న ఓరంపాడు వీఆర్ఓ రాంబాబు, వీఆర్ఏ రామచంద్రలు ఆక్రమించుకుంటున్నారని మంగళవారం రెడ్డిపల్లి గ్రామానికి చెందిన వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సర్పంచ్ ఎల్లయ్య దీనిపై మాట్లాడుతూ తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా స్పందించలేదన్నారు. మొక్కుబడిగా ఆర్ఐ విచారణ చేపట్టి వీఆర్ఓ, వీఆర్ఏకు సహకరిస్తున్నారని ఆరోపించారు. తమ ఆక్రమణను అడ్డుకుంటే మీ అంతు చూస్తామని కూటమి నాయకులు బెదిరిస్తున్నారని సర్పంచ్ తెలిపారు. ఈ విషయంపై పుల్లంపేట తహసీల్దార్ అరవింద కిషోర్ను వివరణగా కోరగా ఆక్రమణదారులపై తక్షణం చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఫ్లెక్సీ పడి టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడికి తీవ్ర గాయాలు కడప అర్బన్ : మహానాడు ప్రాంగణం సమీపంలో జరిగిన ప్రమాదంలో టీడీపీ ఎస్సీ సెల్ నాయకుడు గాయపడ్డాడు. మోటారు సైకిల్పై వెళ్తున్న పెండ్లిమర్రి మండలం పాత సంగటిపల్లెకు చెందిన చెండ్రాయుడు (52)పై మంగళవారం మధ్యాహ్నం 2.30 గంటల సమయంలో ఫ్లెక్సీ పడటంతో తీవ్ర గాయాలయ్యాయి. అతన్ని వెంటనే ఆస్పత్రికి తరలించారు. డీఈఓ వెబ్సైట్లో సీనియారిటీ జాబితాకడప ఎడ్యుకేషన్ : మున్సిపల్ మేనేజ్మెంట్ ప్రొద్దుటూరులో పని చేస్తున్న సెకండరీ గ్రేడ్ టీచర్స్ నుంచి స్కూల్ అసిస్టెంట్ పదోన్నతుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కోసం 01:03 నిష్పత్తిలో ప్రొవిజినల్ సీనియారిటీ జాబితా జిల్లా విద్యాశాఖాధికారి వెబ్సైట్లో ఉంచినట్లు డీఈఓ షేక్ షంషుద్దీన్ తెలిపారు. ఉపాధ్యాయులు సంబంధిత ధ్రువపత్రాలతో కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్లో ఈనెల 28వ తేదీ హాజరు కావాలని కోరారు. -
లాంజ్ బాత్రూమ్లో యువకుడి మృతి
నెల్లూరు(క్రైమ్) : నెల్లూరు ఆర్టీసీ ప్రాంగణంలోని ఎంఎస్ఆర్ డీలక్స్ లాంజ్ బాత్ రూమ్లో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల కథనం మేరకు.. తిరుపతి జిల్లా బీఎన్ కండ్రిగ మండలం కారనిమిట్టకు చెందిన ఎస్.విజయకుమార్ (26) మదనపల్లెలోని ఓ ప్రైవేట్ వైద్యశాలలో అనస్థీషియా టెక్నీషియన్గా పనిచేస్తున్నాడు. అతనికి రెండు నెలల క్రితం సమీప బంధువైన ఉషతో వివాహమైంది. సోమవారం విజయకుమార్ మదనపల్లెలోని వైద్యశాలకు వెళ్లాడు. డాక్టర్ సూచనల మేరకు మందులు తీసుకెళ్లేందుకు నెల్లూరుకు వచ్చాడు. ఆర్టీసీ బస్టాండ్లోని రిజర్వేషన్ కౌంటర్ పక్కనే ఉన్న ఎంఎస్ఆర్ డీలక్స్ లాంజ్లో బాత్రూమ్కు వెళ్లాడు. అక్కడే కుప్పకూలి మృతి చెందాడు. ఈ విషయాన్ని గమనించిన లాంజ్ నిర్వాహకులు చిన్నబజారు పోలీసులకు సమాచారం అందించారు. వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. బాధిత కుటుంబ సభ్యులకు సమాచారం అందించి మృతదేహాన్ని జీజీహెచ్ మార్చురీకి తరలించారు. మంగళవారం నెల్లూరుకు చేరుకున్న బాధిత కుటుంబం విజయకుమార్ మృతదేహాన్ని చూసి కన్నీటి పర్యంతమైంది. మృతుని తమ్ముడు చందు ఫిర్యాదు మేరకు చిన్నబజారు పోలీసులు కేసు నమోదు చేశారు. మృతికి గల కారణాలు తెలియరావాల్సి ఉంది. ఎస్ఐ వీసీ సుబ్రమణ్యం కేసు దర్యాప్తు చేస్తున్నారు. వీరపునాయునిపల్లెలో దారుణ హత్య వీరపునాయునిపల్లె : మండల కేంద్రమైన వీరపునాయునిపల్లెలో మంగళవారం దారుణ హత్య జరిగింది. వీరపునాయునిపల్లెకు చెందిన అనిమెల ఆంజనేయులు అలియాస్ సుమో ఆంజనేయులు (45) మంగళవారం ఉదయం 11 గంటల ప్రాంతంలో బైకుపై ఇంటికి వెళుతుండగా కొంత మంది గుర్తు తెలియని వ్యక్తులు అటకాయించి గొంతు కోసి, కత్తులతో పొడిచి దారుణంగా హత్య చేశారు. తమ ఇంటి వద్ద నివాసముంటున్న బెలుకూరి నరేష్, నవీన్లతో తమకు చాలా కాలంగా సమస్యలున్నాయని వారే ఈ హత్య చేసి ఉండవచ్చని మృతుడు ఆంజనేయులు భార్య కమలమ్మ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మంజునాథ్ తెలిపారు. డీఎస్పీ వెంకటేశ్వర్లు, సర్కిల్ ఇన్స్పెక్టర్ చల్లని దొర ఆదేశాల మేరకు నిందితుల కోసం ప్రత్యేక బృందాలతో గాలింపు చర్యలు చేపట్టినట్లు ఎస్ఐ తెలిపారు. ఈతకు వెళ్లి ఇంటర్ విద్యార్థి మృతితొండూరు : తొండూరు మండలం ఊడవగండ్ల గ్రామానికి చెందిన ఇంటర్ విద్యార్థి దాసరి దేవా సాయి యల్లారెడ్డి(17) మంగళవారం ఈతకోసం వెళ్లి బావిలో మునిగి మృతి చెందాడు. మృతుడి బంధువుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. దాసరి దేవా సాయి యల్లారెడ్డి బంధువులతో కలిసి గ్రామంలోని బావి వద్దకు ఈతకు వెళ్లాడు. అందరూ సరదాగా ఈత కొడుతున్న క్రమంలో దేవసాయి ప్రమాదవశాత్తు బావిలోని మెటికల కింద ఉండిపోవడంతో శ్వాస ఆడక మృతి చెందాడు. అగ్నిమాపక సిబ్బంది శ్రమించి మృతదేహాన్ని వెలికి తీశారు. ఆత్మహత్యకు యత్నించిన యువకుడి మృతి కడప అర్బన్ : కడప నగరం తాలూకా పోలీస్ స్టేషన్ పరిధిలో భగత్ సింగ్ నగర్లో నివాసముంటున్న వారం రామాంజులు (21) అనే యువకుడు ఈనెల 21వ తేదీన విష ద్రావణం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. రామాంజులు చింతకొమ్మదిన్నెకు చెందిన ఓ యువతిని ప్రేమించాడు. తల్లిదండ్రులు ఆ యువతి వరుస కాదని వివాహం చేసేందుకు అంగీకరించలేదు. దీంతో ఆవేదనకు గురై ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు తీసుకెళ్లారు. చికిత్స పొందుతూ ఈనెల 26వ తేదీన మృతి చెందాడు. -
యోగాంధ్రకు సర్వం సిద్ధం
మదనపల్లె రూరల్ : అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, యోగాంధ్ర కార్యక్రమంలో భాగంగా మదనపల్లెలో బుధవారం నిర్వహించనున్న జిల్లా స్థాయి మెగా యోగాకు సంబంధించిన ఏర్పాట్లు శరవేగంగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి, జేసీ ఆదర్శ రాజేంద్రన్, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్.. పట్టణంలోని బెంగళూరు రోడ్డు బీటీ కాలేజీ గ్రౌండ్స్లో యోగా కార్యక్రమానికి చేస్తున్న ఏర్పాట్లను మంగళవారం క్షేత్ర స్థాయిలో పరిశీలించారు. నిర్వహణకు సంబంధించి వివిధ అంశాలపై అధికారులతో చర్చించారు. మైదానంలో ప్రత్యేక పారిశుధ్య కార్యక్రమాలు చేపట్టి పరిశుభ్రంగా ఉంచాలని, తాత్కాలిక మరుగుదొడ్లు ఏర్పాటు చేయాలన్నారు. సుమారు 5,00 మంది యోగా చేసేందుకు అనువుగా మైదానంలో మ్యాట్ ఏర్పాటు చేయాలని, వచ్చిన వారందరికీ తాగునీటి ఏర్పాట్లు ఉంచాలన్నారు. యోగా ట్రైనర్, ఆసనాలకు సంబంధించి చెప్పే మాటలు అందరికీ వినపడేలా సౌండ్ సిస్టం ఏర్పాటు చేయాలన్నారు. యోగాలో పాల్గొనే అంగన్వాడీ టీచర్లు, వర్కర్లు, హెల్పర్లు, ఏఎన్ఎంలు, మెడికల్ అధికారులు, ఆశా కార్యకర్తలు క్రమశిక్షణతో సంఘటితంగా కార్యక్రమాన్ని విజయవంతం చేసేలా అధికారులు అవగాహన కల్పించాలన్నారు. ముఖ్యంగా ట్రాఫిక్ క్రమబద్ధీకరణ, వాహనాల పార్కింగ్కు చేపట్టాల్సిన చర్యలపై పోలీసు అధికారులకు సూచనలిచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కె.ప్రమీల, తహసీల్దార్ కె.ధనంజయులు, డిప్యూటీ డీఎంహెచ్ఓ రమేష్బాబు, ఎంపీడీఓ తాజ్మస్రూర్ తదితరులు పాల్గొన్నారు. -
ఆగిన వీరభద్రస్వామి ఆలయ అభివృద్ధి పనులు
రాయచోటి టౌన్ : రాయచోటికే తలమానికంగా నిలిచిన శ్రీ వీరభద్ర స్వామి ఆలయం అభివృద్ధి పనులు ఆగిపోయాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఆలయ అభివృద్ధి కోసం రూ. కోట్లు ఖర్చు చేశారు. అలాంటిది ఇప్పుడు ఒక్క పని కూడా ముందుకు సాగడం లేదు. ప్రధానంగా వీరభద్రస్వామి ఆలయానికి చెందిన పనుల్లో స్వామి వారి ఆలయానికి పడమర దిక్కున ప్రహరీకి ఆనుకొని ఉన్న ఆక్రమణల తొలగింపు అంశాన్ని అప్పటి ఎమ్మెల్యే, చీఫ్ విప్ శ్రీకాంత్రెడ్డి ఎంతో చాకచక్యంగా పరిష్కరించారు. అంతేకాకుండా వారికి నష్టపరిహారం చెల్లించడంతో పాటు ఇంటి స్థలాలు కూడా కేటాయించి ఇళ్ల నిర్మాణాలకు సహకరించారు. ఆ వెంటనే పశ్చిమ రాజగోపురం రూ.158 కోట్లతో నిర్మించారు. అలాగే గర్భాలయంపై పిడుగు పడటంతో 2020లోనే మళ్లీ రూ.33 లక్షలతో పునర్నిర్మాణ పనులు పూర్తి చేశారు. అనంతరం రూ.38 లక్షలతో మాఢవీధులు నిర్మించారు. చివరగా ఆలయానికి వచ్చే భక్తుల సౌకర్యం కోసం ఐదు అంతస్తుల భవనాలు నిర్మించేందుకు రూ.1.58 కోట్లతో 2023 జనవరి 26న పనులు ప్రారంభించారు. మూడు అంతస్తుల వరకు గోడలు కూడా పూర్తయ్యాయి. ఆ తర్వాత ఆ పనులు ఎక్కడికక్కడ ఆగిపోయాయి. పనులు ఆగిపోయిన విషయమై ఆలయ ఈఓ డీవీ రమణారెడ్డిని వివరణ కోరగా నూతన కమిటీ ఏర్పడ్డాక మిగిలిన పనులు పూర్తి చేయిస్తామన్నారు. యువకులపై పోలీసుల దాడి దారుణం పోరుమామిళ్ల : తెనాలిలో ముగ్గురు యువకులపై పోలీసులు నడిరోడ్డుపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడం అమానుషమని, చట్టాన్ని వారి చేతుల్లోకి తీసుకోవడం రాజ్యాంగరీత్యా నేరమని మానవహక్కుల సంఘం జిల్లా చీఫ్ గంగన్న, ప్రతినిధులు ఫణిరావు, శ్రీనివాసులు పేర్కొన్నారు. మంగళవారం స్థానిక కార్యాలయంలో వారు మాట్లాడుతూ పోలీస్ స్టేషన్లో దండించడం పక్కనపెట్టి బహిరంగంగా నడిరోడ్డుపై ముగ్గురు యువకులను కూర్చోబెట్టి అరికాళ్లపై లాఠీలతో మోదడం చూస్తున్నవారిని భయకంపితులను చేసిందన్నారు. అమానుషంగా ప్రవర్తించిన ఇద్దరు సీఐలపై చర్య తీసుకోవాలని కోరారు. రౌడీలను దారిలో పెట్టే పద్ధతి ఇదేనా అని ప్రశ్నించారు. -
● అభివృద్ధిని కొనసాగిస్తామని కూడా చెప్పలేని దుస్థితి..
● ప్రతిష్టాత్మక విద్యా సంస్థలన్నీ ‘వైఎస్’ హయాంలోనే.. సాక్షి ప్రతినిధి, కడప: మహానాడులో చంద్రబాబు.. తెలుగు తమ్ముళ్ల పరువు తీసి రోడ్డున పడేశారు. ‘వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డా కడపలో మహానాడు పెడుతున్నాం. ఇక అన్నీ మారిపోయాయి.. రాయలసీమ రూపురేఖలు రేపటి నుంచి మారిపోతాయి’ అంటూ తెలుగుదేశం నేతలు బీరాలు పలికారు. మహానాడు సందర్భంగా.. ఏ వేదిక దొరికినా, ఇదే అంశాన్ని ఊదరగొట్టారు. తీరా మహానాడులో చంద్రబాబు రాయలసీమ అభివృద్ధి అంశాన్నే పక్కన పెట్టడంతో.. టీడీపీ నేతలు తల పట్టుకుంటున్నారు. వైఎస్సార్, జగన్ చేసిన అభివృద్ధిని.. ఖాతాలో వేసుకునే యత్నం.. ‘కడప ఇక ఎవరి అడ్డా కాదు.. టీడీపీ వారి అడ్డా’ అంటూ బీరాలు పలికిన టీడీపీ నేతలు మరో అడుగు ముందుకు వేసి.. ఈ మహానాడు రాయలసీమ రూపురేఖలనే మార్చబోతోందంటూ ప్రగల్భాలు పలికారు. ఈ మహానాడులో రాయలీసీమ అభివృద్ధికి తమ అధినేత చంద్రబాబు ఎన్నెన్నో ప్రకటనలు చేయబోతున్నారంటూ.. మీడియా ముందు ఊదరగొట్టేశారు. మరో అడుగు ముందుకు వేసి దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిలు కడప జిల్లాలో చేసిన అసామాన్యమైన అభివృద్ధిని కూడా తమ ఖాతాలోనే వేసుకున్నారు. సీమ, కడపను అభివృద్ధి చేయాలంటే ఒక్క టీడీపీతోనే సాధ్యం అంటూ గొప్పగా డప్పాలు కొట్టుకున్నారు. తీరా మహానాడు ప్రారంభమైంది. తమ అధినేత చంద్రబాబు యథావిధిగా తనదైన శైలిలో పాత చింతకాయపచ్చడి ప్రసంగాన్ని బయటకు తీశారు. గత పదిహేనేళ్లుగా చెబుతున్న.. ‘రాయలసీమను హార్టికల్చర్ హబ్గా మారుస్తా, ఇండస్ట్రియల్ కారిడార్గా మారుస్తాను’ అంటూ ఊకదంపుడు ఉపన్యాసం చెప్పి ముగించేశారు. వెరసి తెలుగు తమ్ముళ్లకు నోట్లో వెలక్కాయ పడ్డట్లయింది. తమ అధినేత రాయలసీమ అభివృద్ధికి ఎన్నెన్నో చేస్తారని, కనీసం మాటలైనా చెప్తారని ఆశపడ్డ సీమ నేతలకు చంద్రబాబు ప్రసంగం మింగుడుపడటం లేదు. పైడిపాలెం ప్రాజెక్టును కూడా.. టీడీపీ అధినేత చంద్రబాబు ఇప్పటికే 15 ఏళ్ల పాటు ముఖ్యమంత్రిగా పని చేశారు. జిల్లాలో చెప్పుకొనేందుకు కూడా ఆయన చేపట్టిన ప్రధాన అభివృద్ధి అంటూ లేదు. పైగా మంజూరైన ఉర్దూ యూనివర్సిటీని కర్నూలుకు తరలించారు. ఆ స్థానంలో హజ్హౌస్ మంజూరు చేశారు. చెప్పుకునేందుకు నిర్ధిష్టమైన అభివృద్ధి అంటూ ఏదీ లేదని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. పైడిపాలెం ప్రాజెక్టును ముఖ్యమంత్రి హోదాలో ప్రారంభించినప్పటికీ.. ఆ పనులను దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 95 శాతం పూర్తి చేశారు. మిగిలిపోయిన పనులను పూర్తి చేసి ముఖ్యమంత్రి హోదాలో చంద్రబాబునాయుడు ప్రారంభించారు. అంతకు మించి జిల్లాలో చేపట్టిన అభివృద్ధి గురించి చెప్పుకొనేందుకు అస్కారమే లేదని పలువురు వెల్లడిస్తున్నారు. ఈ నేపథ్యంలో మహానాడులో ఆత్మస్తుతి, పరనిందకు పరిమితమయ్యారని విశ్లేషకులు భావిస్తున్నారు. పథకం పేరు పూర్తి చేసిన వారు ప్రారంభించిన వారు రాయలసీమ అభివృద్ధి కాదు కదా వైఎస్ జగన్మోహన్రెడ్డి చేపట్టిన అభివృద్ధి పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. వాటిని కొనసాగిస్తానన్న ఒక్క మాట కూడా మాట్లాడలేదు. మరో వైపు వివిధ రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాలు గతంలో చంద్రబాబు రాయలసీమకు ఇచ్చిన హామీలను ప్రశ్నించడం మొదలుపెట్టారు. విభజన హామీల్లో భాగంగా కడప ఉక్కు సంగతేంటని వారు ప్రశ్నిస్తుంటే.. చంద్రబాబు మాత్రం ఆ ఒక్కటీ అడక్కు అన్నట్లు ఆ విషయాన్నే మాట్లాడలేదు. దీనికి తోడు ఇప్పటికే పులివెందులకు వచ్చిన 50 మెడికల్ సీట్లను వెనక్కు పంపడం, కొప్పర్తి ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్ను అమరావతి తరలించుకుపోవడం, రాయలసీమ గ్రామీణ బ్యాంకు కేంద్ర కార్యాలయాన్ని రాజధానికి తరలించుకుపోవడం వంటి అంశాలపై రాయలసీమ ప్రజలు ఇప్పటికే ఉద్యమాలు చేస్తున్నారు. ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్, ఏపీజీబీ ప్రధాన కార్యాలయం ఇక్కడే ఉంచుతానని మైదుకూరు సభలో హామీ ఇచ్చిన చంద్రబాబు.. ఈ మహానాడులో వాటి గురించి ఒక్క మాట కూడా మాట్లాడలేదు. ప్రభుత్వం మారడంతో ఆగిపోయిన అమృత్ స్కీంలో భాగంగా రూ.500 కోట్లతో మాజీ సీఎం వైఎస్ జగన్ చేపట్టిన మంచినీటి ప్రాజెక్టు, కడపలో నిర్మిస్తున్న ఆర్కిటెక్చర్ యూనివర్సిటీ నిధులు వంటి ఎన్నో అంశాలను చంద్రబాబు ప్రస్తావించనే లేదు. ఇదంతా ఒక ఎత్తయితే ఏదో అత్యుత్సాహంలో రాయలసీమ రూపురేఖలే మారిపోతాయని మంత్రులు, ఎమ్మెల్యేలు బీరాలు పలికితే.. వారి ఆశలపై చంద్రబాబు నీళ్లు పోశారు. ఇప్పుడు రాయలసీమ వాసులకు ఏం సమాధానం చెప్పాలో అంటూ తెలుగు తమ్ముళ్లు లోలోన మథన పడిపోతున్నారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. కడప అభివృద్ధి కోసం పసుపు పండుగని చెప్పుకొచ్చిన టీడీపీ సీఎం చంద్రబాబు ప్రసంగంలో నోచుకోని ప్రణాళికలు ఊకదంపుడు ఉపన్యాసంతో సరిపెట్టిన వైనం ఆత్మస్తుతి, పరనిందకే ప్రాధాన్యత యోగిమేమన యూనివర్సిటీ, జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాలు, ట్రిపుల్ఐటీ, రిమ్స్ మెడికల్, డెంటల్ కళాశాలలు మంజూరు చేసి పూర్తి చేశారు. ఆయన తనయుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా క్యాన్సర్ హాస్పిటల్, సూపర్ సెష్పాలిటీ వైద్యశాల, 100 పడకల మానసిక వైద్యశాల, పుష్పగిరి ఐ హాస్పిటల్, డాక్టర్ ఎల్వీ ప్రసాద్ ఐ హాస్పిటల్, ఆర్కిటెక్చర్ పైన్ ఆర్ట్స్ యూనివర్సిటీ, పులివెందులలో మెడికల్ కళాశాల, వైద్యశాల ఏర్పాటు చేశారు. చెప్పుకొనేందుకు సీఎం చంద్రబాబుకు ఒక్కటంటే ఒక్కటి కూడా ప్రతిష్టాత్మకమైన సంస్థ జిల్లాలో లేకపోవడం గమనార్హం. గండికోట ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ వామికొండ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ సర్వారాయసాగర్ ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ వెలుగల్లు ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి డాక్టర్ వైఎస్సార్ బ్రహ్మంసాగర్ డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి సోనియాగాంధీ పైడిపాలెం ప్రాజెక్టు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి చంద్రబాబునాయుడు -
ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర టీడీపీకి లేదు: సురేష్ బాబు
రాష్ట్ర చరిత్రలో ఒంటరిగా పోటీ చేసి గెలుపొందిన చరిత్ర తెలుగుదేశం పార్టీకి లేదని మేయర్ సురేష్ బాబు అన్నారు. 2024 ఎన్నికల్లో కూడా బీజేపీ, జనసేనతో పొత్తు పెట్టుకొని అధికారంలోకి వచ్చారని గుర్తు చేశారు. కడపలో మహానాడు నిర్వహించే అర్హత చంద్రబాబుకు లేదన్నారు. మహానేత వైఎస్సార్, వైఎస్ జగన్ల వల్లే ఈ జిల్లా అభివృద్ధి చెందిందని, దుష్టబుద్ధితో వైఎస్సార్ కడప జిల్లాగా పేరు మార్చారని మండిపడ్డారు. జిల్లాలో ఉక్కు పరిశ్రమ నిర్మాణం చేయాలని మహానాడులో తీర్మాణం చేయాలని డిమాండ్ చేశారు. జిల్లాలో అధికార, పోలీసు యంత్రాంగం అధికార పార్టీ తొత్తులుగా పనిచేస్తున్నారని, వారం రోజులుగా వారు ప్రజా సమస్యలను గాలికొదిలేసి మహానాడు కార్యక్రమం ఏర్పాట్లలో మునిగి తేలుతున్నారని విమర్శించారు. ప్రజలకు క్షమాపణ చెప్పండి: అంజద్బాషా ఎన్నికల హామీలు నెరవేర్చనందుకు ముఖ్యమంత్రి చంద్రబాబు మహానాడు వేదికగా ప్రజలకు క్షమాపణ చెప్పాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ఎద్దేవా చేశారు. మహానాడు సందర్భంగా టీడీపీ నాయకులు స్వాతంత్య్ర సమరయోధులు, మహానాయకుల విగ్రహాలకు పార్టీ జెండాలు కట్టడం దారుణమన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో ఏం సాధించారని, ఏం ఘన కార్యాలు చేశారని మహానాడు నిర్వహిస్తున్నారో ప్రజలకు చెప్పాలన్నారు. విభజన హామీలైన ఉక్కు పరిశ్రమ, వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ వంటి వాటిని మోదీ కాళ్ల వద్ద తాకట్టు పెట్టారని విమర్శించారు. జగన్ అడ్డాలో మహానాడు నిర్వహించామని టీడీపీ నేతలు సంబరపడుతున్నారని, ఇది ఎప్పటికీ జగన్ అడ్డానేనని వారు గుర్తుంచుకోవాలని హితవు పలికారు. -
ఎమ్మెల్సీ సీఆర్సీ, సుగవాసి డుమ్మా!
సాక్షి ప్రతినిధి, కడప: బలిజ సామాజికవర్గనేతల్ని టీడీపీ విస్మరిస్తోందా...ఎన్నికల్లో వాడుకొని ఆపై ప్రాధాన్యత లేకుండా దూరం పెట్టిందా...అంటే అవుననే అంటున్నారు రాజకీయ విశ్లేషకులు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య, సుగవాసి బాలసుబ్రమణ్యం మహానాడుకు దూరంగా ఉండడమే దీనికి నిదర్శనమని ఉదహరిస్తున్నారు. ఎమ్మెల్సీ రామచంద్రయ్య ది సుదీర్ఘ రాజకీయ ప్రస్థానం. ఎన్నో పదవులు అలంకరించిన నాయకుడు. మొన్నటి ఎన్నికల్లో టీడీపీ విజయం కోసం విశేషంగా పనిచేశారు. ఏడాది తిరక్కముందే ఆ పార్టీలో కనుమరుగయ్యారు. దీనికి కారణం తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉండడమే అని తెలుస్తోంది. భవిష్యత్లో తమకు అడ్డుగా నిలుస్తారనే అభద్రతాభావంతో స్థానిక నేతలు ఎన్నికల వరకు వాడుకొని వదిలేసినట్లు ప్రచారం జరుగుతోంది. జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో రామచంద్రయ్యకు ప్రాధాన్యత లభించలేదు. దీంత ఉనికి కోసమే పార్టీలో ఉండిపోవాల్సిన దుస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలోనే పార్టీ పసువు పండుగగా చెప్పుకుంటున్న మహానాడుకు గైర్హాజరయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. రాయలసీమ బలిజ నేతలకుపొగబెడుతున్న టీడీపీ మహానాడుకు దూరంగా ఉండిపోయిన నేతలు -
నైరుతి ఆగమనం.. రైతుల్లో కలవరం
రాయచోటి: నైరుతి రుతుపవనాలు ఈ ఏడాది త్వరగా అన్నమయ్య జిల్లాలోకి ప్రవేశించాయి. ఈ నెల 26న రాయలసీమలోకి రావడంతో.. జిల్లాలోనూ పలకరించాయి. దీంతో ఒక్కసారిగా వాతావరణంలో మార్పులు వచ్చాయి. నైరుతి రుతుపవనాల రాక పట్ల ఓ వైపు సంతోషం వ్యక్తం అవుతోంది. మరో వైపు ఖరీఫ్ సీజన్ మొదలవుతున్నా.. అవసరమైన విత్తనాల సేకరణ ఆలస్యమవుతోందన్న భయం రైతులను వెంటాడుతోంది. గతేడాది పంటల్లో నష్టం రావడంతో.. చేతిలో చిల్లిగవ్వలేదు. దుక్కులు, విత్తనాలు, ఎరువుల కోసం ఎక్కడి నుంచి డబ్బులు తేవాలో దిక్కుతెలియని పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం రైతు భరోసాను ఇంత వరకు ఇవ్వలేదు. దీంతో వర్షాలు కురుస్తున్నాయన్న సంతోషం కంటే సాగుకు అవసరమైన డబ్బులు ఎలా సంపాదించాలో అర్థంకాని పరిస్థితి రైతులను కలవరపెడుతోంది. సాధారణంగా ఏటా జూన్ 8 నుంచి 12వ తేదీల మధ్య రుతుపవనాలు జిల్లాలోకి ప్రవేశిస్తాయి. ఈ ఏడాది ముందుగానే వర్షాలు కురవడంతో ఖరీఫ్ సీజన్ పట్ల రైతుల్లో ఆశలు చిగురించాయి. రుతు పవనాల ప్రభావం రుతుపవనాల ప్రభావంతో అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా జల్లులు కురుస్తున్నాయి. భారత వాతావరణ శాఖ ప్రకారం మే 26 నుంచి 29 వరకు జిల్లాలో మోస్తరు, భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలియజేయడంతో అధికారులు కూడా అప్రమత్తమవుతున్నారు. వాతావరణ పరిస్థితులు రుతుపవనాల ముందస్తు ప్రవేశం కారణంగా జిల్లాలో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు, ఉరుములు, మెరుపులు, గాలివానలు సంభవిస్తున్నాయి. ఈ వర్షాలు పంటల సాగుకు అనుకూలంగా ఉండే అవకాశం ఉందని వ్యవసాయ అధికారులు చెబుతున్నారు. ఖరీఫ్ సాగుకు అనుకూలంగా లోతు దుక్కులు దున్నుకోవాలని సూచిస్తున్నారు. రైతులకు సూచనలు రుతు పవనాల ముందస్తు ప్రవేశం ఖరీఫ్ పంటల సాగుకు అనుకూలంగా ఉంటుందని వ్యవసాయ, అనుబంధ శాఖల అధికారులు చెబుతున్నారు. రైతులు వర్షపాతం మోతాదును బట్టి సాగు ప్రణాళికలు రూపొందించుకోవడం మంచిదంటున్నారు. అవసరం కొండంత.. కేటాయింపులు గోరంతఖరీఫ్ సాగుకు అవసరమైన వేరుశనగ విత్తన కాయల కేటాయింపులో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గతేడాది వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం రైతులకు అవసరమైన విధంగా జిల్లాకు 45 వేల క్వింటాళ్ల వేరుశనగ విత్తన కాయలు సబ్సిడీపై అందించింది. ఈ ఏడాది కేటాయింపులోనే ఆలస్యమవుతూ వస్తోంది. మరో పది రోజుల్లో ఖరీఫ్ సీజన్ ప్రారంభమవుతున్నా.. అందుకు అనుగుణంగా విత్తన కాయల కేటాయింపు చేపట్టలేదు. రెండు రోజుల కిందట అన్నమయ్య జిల్లాకు 26 వేల క్వింటాళ్ల విత్తన కాయలను కేటాయిస్తున్నట్లు ప్రకటన వెలువడింది. జిల్లాలో ఖరీఫ్ సీజన్లో 65 వేల హెక్టార్లలో సాధారణ సాగు ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ఇందులో ప్రధానంగా జిల్లాలోని రాయచోటి, పీలేరు, తంబళ్లపల్లి, మదనపల్లి ప్రాంతాల్లో వేరుశనగ పంటను సాగు చేస్తారు. సాగుకు అనువుగా విత్తనపు కాయలను రైతులు సిద్ధం చేసుకుని సీజన్ ప్రారంభంలో విత్తుకునేలా చూడాలని కోరుతున్నా.. ఆ దిశగా అధికారులు, ప్రభుత్వం స్పందించడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. మొదలైన తొలకరి వర్షాలు విత్తన సేకరణలో ఇక్కట్లు ప్రభుత్వ ఆర్థిక సాయం కరువు చేతిలో డబ్బు లేక అవస్థలు -
అక్కడ కిక్కు.. ఇక్కడేమో ట్రాఫిక్కు!
సాక్షి కడప: మహానాడుతో ప్రజలు తిప్పలు పడ్డారు. కడప శివారు చుట్టూ ఎటుపోయినా ట్రాఫిక్ చక్రబంధంలో చిక్కిచిక్కి విలవిల్లాడారు. వాహనాలు కదలక...అడుగు ముందుకు పడక....ఎటువైపు పోలేక సతమతమయ్యారు. కడప నగరం నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లాల్సిన వారు ట్రాఫిక్ సమస్యతో అవస్థలు పడుతూ అసహనం వ్యక్తం చేయడం కనిపించింది. పరిస్థితిని తెలుసుకుని డీఐజీ కోయ ప్రవీణ్, ఇతర పోలీసు అధికారులు వచ్చి ట్రాఫిక్ను కొంతమేర క్రమబద్ధీకరించినా తర్వాత మళ్లీ యథాస్థితి నెలకొంది. ట్రాఫిక్ సమస్య టీడీపీ పెద్దలతోపాటు కేంద్ర మంత్రులకూ తగిలింది. కేంద్ర మంత్రులు రామ్మోహన్నాయుడు , పెమ్మసాని చంద్రశేఖర్ ట్రాఫిక్లో ఇరుక్కుపోవడం గమనార్హం. టీడీపీ నేతలు ఇష్టానుసారం వాహనాలు నిలబెడుతూ నిర్లక్ష్యంగా వ్యవహరించా రు. పలుచోట్ల టీడీపీ నేతలు ట్రాఫిక్ను సరిదిద్దుతు న్న పోలీసులపైనే రుసరుసలాడడం కనిపించింది. మందుబాబులం.. మేము మందుబాబులం... మహానాడు సందర్భంగా మందుబాబులు ఫుల్ జోష్లో కనిపించారు. వైన్షాపుల వద్ద ఎక్కువ సంఖ్యలో పచ్చ చొక్కాల వారే కనిపించడం గమనార్హం. ఓ వైపు జనాలు ట్రాఫిక్లో చిక్కుకుపోగా.. మరోవైపు తమ్ముళ్లు కిక్కులో గడిపారు. రింగ్ రోడ్డు వెంబడి నిలిచిపోయిన వాహనాలు అటు, ఇటుపోలేక ప్రజలకు తిప్పలు -
మట్టి తరలింపు కొండంత!
అనుమతులు కొంత..ఒంటిమిట్ట : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి సంవత్సర కాలం గడిచింది. అప్పటి నుంచి రెడ్బుక్ పరిపాలన మీద పెట్టిన ధ్యాస ప్రజా పరిపాలనపై పెట్టకుండా అక్రమార్జనకు కూటమి నేతలు నేనంటే నేను అంటూ వరుస పెడుతున్నారు. ప్రజలనే కాకుండా జల వనరులను కూడా దోచుకునే విషయంలో ఏమాత్రం తగ్గకుండా ఉన్నారు. ఇసుక, మట్టి, అడవిని కూడా దోచుకునేందుకు వెనుకాడటం లేదు. దోచుకుని దాచుకోవడంలో కూటమినేతల తరువాతనే మరెవరైనా అనే విధంగా మండలంలో నేతలు వ్యవహరిస్తున్నారు. ఇదే తంతు ఒంటిమిట్ట మండల కేంద్రంలో జరుగుతోంది. మండల కేంద్రమైన ఒటిమిట్ట చెరువులో రైతులకు ఉచితంగా మట్టి తరలింపు అనే ముసుగులో మూడురోజుల నుంచి కూటమి నేతలు ఇరిగేషన్ అనుమతులకు విరుద్ధంగా మట్టిని దోచేస్తున్నారు. రైతులకు ఉచితం అంటూ ఆదేశాలు ఉన్నా ఇక్కడి కూటమి నేతలు మాత్రం ఒక్కో ట్రిప్పు ట్రాక్టర్ మట్టికి రూ. 600 లెక్కన రైతుల వద్ద నుంచి ముక్కుపిండి వసూలు చేస్తున్నారనే విమర్శలున్నాయి. భారీ యంత్రాలతో ట్రాక్టర్లకే కాకుండా పెద్దపెద్ద టిప్పర్లకు మట్టిని పోసి తరలిస్తున్నారు. రెవెన్యూ అధికారుల అనుమతులు ఉన్న పొలాలకు మాత్రమే మట్టి తరలించాలన్న నిబంధన ఉంది. ప్రస్తుతం రెవెన్యూ అధికారులు రెండు గ్రామాలలోని ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి ఇవ్వగా దానికి విరుద్ధంగా అనుమతులు లేని గ్రామాలకు కూడా మట్టిని తరలించి కూటమి నేతలు రోజుకు లక్షల్లో సొమ్ము చేసుకుంటున్నారు. అనుమతుల ముసుగులో ప్రతి రోజు దాదాపు 500 ట్రిప్పులపైబడి అక్రమ మట్టి రవాణా చేస్తున్నారు. అనుమతులకు విరుద్ధంగా మట్టి మాఫియా జరుగుతుందన్న సమాచారం సంబంధిత అధికారులకు తెలిపినా వారి వద్ద నుంచి ఎలాంటి చలనం లేకపోవంతో సంబంధిత అధికారులకు భారీ ముడుపులు ముట్టాయని మండలంలో చర్చ జరుగుతోంది. ముగ్గురు రైతులకు మాత్రమే అనుమతి.. మట్టి తరలింపుపై మండలంలోని సాలాబాదు, ఒంటిమిట్ట గ్రామ రైతులుగా ఉన్న ముగ్గురికి మాత్రమే మూడు రోజుల క్రితం ఒంటిమిట్ట చెరువులో వారి పొలాలకు మట్టి తరలించుకునేందుకు అనుమతి ఇచ్చామని ఒంటిమిట్ట రెవెన్యూ ఇన్స్పెక్టర్ భాస్కర్ రెడ్డి తెలిపారు. జేసీబీ సహకారంతో చెరువులో మట్టిని తరలించొచ్చు.. రైతులకు ఉచితంగా మట్టిని తరలించే విషయంలో జేసీబీని వాడుకోవచ్చు. ట్రాక్టర్లే కాకుండా టిప్పర్లను కూడా రవాణాకు ఉపయోగించవచ్చు. రైతులకు పూర్తి ఉచితంగా మట్టిని తరలించాలి. ఒక క్యూబిక్ మీటర్కు కేవలం ఒక రూపాయి మాత్రమే రైతు ప్రభుత్వానికి చెల్లించాలి. వారు చెల్లించిన రూపాయి కూడా మళ్లీ తిరిగి వారి ఖాతాలోకి జమ చేస్తాము. మూడు రోజులపాటు 500 క్యూబిక్ మీటర్ల వరకు తవ్వుకోమని అనుమతి ఇచ్చాం. అలా కాకుండా అనుమతులకు విరుద్ధంగా మట్టి రవాణా చేస్తే వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటాం. – కిషోర్, ఇరిగేషన్ శాఖ ఏఈ -
విద్యుత్ షాక్తో తాపీ మేసీ్త్ర మృతి
పీలేరు రూరల్ : విద్యుత్ షాక్తో తాపీమేసీ్త్ర మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణం మదనపల్లె మార్గం ఏపీఐఐసీ 3వ లేఅవుట్లో జరిగింది. వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిలక్వీధిలో కాపురం ఉంటున్న అఫ్సర్పాషా (40) రోజువారి పనుల్లో భాగంలో ఏపీఐఐసీ 3వ లేఅవుట్లో ఇంటి నిర్మాణ పనికి వెళ్లాడు. అయితే ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురై కిందపడ్డాడు. గమనించి సహచర కూలీలు చికిత్స నిమిత్తం పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు డాక్టర్లు నిర్ధారించారు. మృతునికి భార్య ఫాతిమా, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. -
నిర్ణీత సమయంలోగా ఫిర్యాదులను పరిష్కరించాలి
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదికలో వచ్చే ఫిర్యాదులను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. సోమవారం అన్నమయ్య జిల్లా ఎస్పీ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాల మేరకు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ప్రజల నుంచి అదనపు ఎస్పీ నేరుగా ఫిర్యాదులను స్వీకరించి వారి సమస్యలను ముఖాముఖి మాట్లాడి అడిగి తెలుసుకున్నారు. ఫిర్యాదులను సంబంధిత పోలీస్ అధికారులకు అప్పగించి సకాలంలో పరిష్కరించాలని ఆదేశించారు. వికలాంగులు, వృద్ధులు, మహిళల ఫిర్యాదులకు మొదట ప్రాధాన్యతనిస్తూ సత్వరమే సమగ్ర విచారణ జరిపి వారి సమస్యలను పరిష్కరిస్తామని పేర్కొన్నారు.అదనపు ఎస్పీ వెంకటాద్రి -
వైస్ విగ్రహాలకు కట్టిన పసుపు జెండాలు తొలగించకుంటే ఆందోళన
వల్లూరు : మహానాడు సందర్భంగా విచ్చల విడిగా అధికార దుర్వినియోగానికి పాల్పడుతున్న టీడీపీ మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పసుపు జెండాలు, తోరణాలను కట్టడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పోచిమరెడ్డి రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. కడపలో మంగళవారం జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ కార్పొరేషన్ పరిధిలో ఎవరైనా జెండాలు గానీ, లేక మరేవైనా కట్టినప్పుడు మరుసటి రోజే తొలగించే కార్పొరేషన్ అధికారులు అధికార టీడీపీ పట్ల అతి ప్రేమ చూపుతూ పసుపు జెండాలు, తోరణాలను అలాగే ఉంచడం సిగ్గుచేటన్నారు. ఇప్పటికై నా అధికారులు విజ్ఞతతో స్పందించి వైఎస్ విగ్రహాల వద్ద ఉన్న పసుపు పచ్చ జెండాలను, తోరణాలను వెంటనే తొలగించాలని డిమాండ్ చేశారు. అధికారులు తొలగించక పోతే మంగళవారం ఉదయం 11 గంటలకు కడప – మైదుకూరు రోడ్డులో ఉన్న ఇర్కాన్ సర్కిల్లో పెద్ద ఎత్తున ధర్నా కార్యక్రమాన్ని చేపడతామని ఆయన హెచ్చరించారు. అధికారులను సొంత పార్టీ పనులకు ఉపయోగించడం సిగ్గుచేటు మహానాడు పూర్తిగా టీడీపీకి చెందిన సొంత కార్యక్రమం, అలాంటి సొంత పనులకు ప్రభుత్వ ఉద్యోగులను వినియోగించుకోవడం అఽధికార దుర్వినియోగానికి పరాకాష్ట అన్నారు. జిల్లా కలెక్టర్ నుంచి ఇతర జిల్లా స్థాయి అఽధికారులు సైతం ఇదేదో ప్రభుత్వ కార్యక్రమం అన్నట్లు మహానాడు కార్యక్రమానికి టీడీపీ నాయకుల కంటే అధిక ప్రాధాన్యత ఇవ్వడం ిసిగ్గుచేటని విమర్శించారు. మహానాడు వద్ద కేటాయించిన విధులకు హాజరయ్యేందుకు వస్తూ కటౌట్ విరిగి ఇద్దరు వీఆర్ఓలు తీవ్రంగా గాయపడటం బాధాకరమన్నారు. మహానాడు కాదది విద్రోహ నాడు సూపర్ సిక్స్ హామీలంటూ ప్రజలను మోసగించి అఽధికారంలోకి వచ్చిన టీడీపీ సంవత్సర పాలనలో ప్రజలకు చేసింది శూన్యమని రవీంద్రనాథరెడ్డి విమర్శించారు. సంవత్సరం పూర్తి కావచ్చినా ఇప్పటికీ ఏ ఒక్క హామీని నెరవేర్చకపోవడంతో ఆ పార్టీ పట్ల ఇప్పటికే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. దాని నుంచి ప్రజలను పక్కదోవ పట్టించడానికి మహానాడు కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారని, ఇది మహానాడు కాదని, విద్రోహనాడని ఆయన ధ్వజమెత్తారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి -
నష్టాల సేద్యం.. యువరైతు బలవన్మరణం
పెద్దతిప్పసముద్రం : ఆరుగాలం కష్టపడి సేద్యం చేసే రైతన్నలు సాగు చేసిన పంటలకు గిట్టుబాటు ధరల్లేక జీవితంపై విరక్తి చెంది అర్థంతరంగా తనువు చాలిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ బురదవాండ్లపల్లికి చెందిన గంగిరెడ్డి కుమారుడు రాహుల్ రెడ్డి 25) బీటెక్ పూర్తి చేశాడు. ప్రైవేటు ఉద్యోగం కన్నా స్వగ్రామంలోనే వ్యవసాయం చేద్దామని నిర్ణయించుకున్నాడు. ఈ నేపథ్యంలో సొంత పొలంతో పాటు చుట్టు పక్కల ఉన్న పొలాలను కౌలుకు తీసుకున్నాడు. సుమారు 25 ఎకరాల్లో టమాటా, దోస, పుచ్చకాయ లాంటి పంటలను సాగు చేసేందుకు రూ.20 లక్షల దాకా ఽపెట్టుబడి పెట్టాడు. ఈ తరుణంలో కంటికి రెప్పలా కాపాడుకున్న పంటలు కాపునకు వచ్చాయి. దిగుబడి బాగానే ఉన్నా సాగు చేసిన పంటలకు ధరలు ఒక్కసారిగా పతనమయ్యాయి. అష్ట కష్టాలు పడి రూ.లక్షలు వెచ్చించి సాగు చేసిన పంటల ధరలు గణనీయంగా పడిపోవడంతో జీవితంపై విరక్తి పెంచుకున్నాడు. ఈ నేపథ్యంలో ఈ నెల 16న యువ రైతు రాహుల్రెడ్డి వ్యవసాయ బోరుకు వద్దకు వెళ్లి గడ్డి మందును తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గమనించిన గ్రామస్తులు హుటాహుటిన బి.కొత్తకోట, మదనపల్లిలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో వైద్యం చేయిచారు. అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి సోమవారం తనువు చాలించాడు. మృతుడి పెద్దనాన్న వెంకటరమణారెడ్డి ఫిర్యాదు మేరకు పీటీఎం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఆత్మహత్యకు యత్నించిన వివాహిత మృతి
మదనపల్లె రూరల్ : భర్త వేధింపులు భరించలేక, క్షణికావేశంలో ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించిన వివాహిత ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందింది. కర్నాటక రాష్ట్రం చింతామణికి చెందిన రాణి(30) భర్తతో విడాకులు తీసుకుని కుమార్తె లేఖన, కుమారుడు సుమిత్తో వేరుగా ఉంటోంది. ఈ క్రమంలో మూడేళ్ల కిందట సత్యసాయిజిల్లా పాలసముద్రం మండలం బోయలపల్లెకు చెందిన డ్రైవర్ అశోక్తో రాణికి పరిచయం ఏర్పడి సహజీవనం చేసేంతవరకు వెళ్లింది. అయితే అశోక్కు అంతకు మునుపే తంబళ్లపల్లెకు చెందిన మౌనిషాతో వివాహమైంది. ప్రస్తుతం ఆమె గర్భిణిగా ఉంది. కొద్దిరోజుల క్రితం అశోక్కు ప్రమాదంలో కాలు విరగడంతో రాణి దగ్గరుండి చికిత్స చేయించి, కోలుకున్నాక స్వగ్రామంలో విడిచిపెట్టింది. తల్లిదండ్రుల సూచన మేరకు అశోక్తో సహజీవనం వద్దనుకుని బెంగళూరుకు వెళ్లి కూలిపనులు చేసుకుంటోంది. ఈనెల 22న గురువారం అశోక్ రాణికి ఫోన్చేసి నీతో మాట్లాడాలని కోరడంతో కుమార్తె లేఖనను వెంటతీసుకుని 23 వ తేదీ శుక్రవారం మదనపల్లెకు వచ్చింది. ఇద్దరూ కలుసుకున్నాక, తమ బంధం కొనసాగింపు విషయమై గొడవపడ్డారు. నీ వేధింపులు నేను భరించలేనంటూ మనస్తాపంతో రాణి కుమార్తెను తీసుకుని అక్కడి నుంచి వెళ్లిపోయింది. దీంతో ఆమె కోసం పట్టణమంతా వెతికి కనిపించకపోవడంతో రాత్రి ఊరికి వెళ్లేందుకు అశోక్ ఆర్టీసీ బస్టాండుకు చేరుకున్నాడు. బస్టాండ్లో రాణి కనిపించడంతో మరోసారి ఆమెతో గొడవకు దిగాడు. దీంతో ఆవేశంతో రాణి బస్టాండ్ వెనుక వైపు ఉన్న కోమటివానిచెరువు కట్ట వద్దకు వెళ్లి ఒంటిపై పెట్రోల్ పోసుకుని ఆత్మహత్యకు యత్నించింది. ప్రమాదంలో ఆమె శరీరం 70 శాతానికి పైగా కాలిపోయింది. గమనించిన స్థానికులు హుటాహుటిన ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించగా, టూటౌన్ పోలీసులు ఆమె నుంచి వాంగ్మూలం నమోదు చేశారు. అత్యవసర విభాగంలో చికిత్స పొందుతూ, పరిస్థితి విషమించి సోమవారం మృతి చెందింది. -
చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లే లక్ష్యం
ప్రొద్దుటూరు కల్చరల్ : చట్టసభల్లో బీసీలకు 50 శాతం రిజర్వేషన్లు కల్పించడమే తన లక్ష్యమని రాజ్యసభ సభ్యుడు, జాతీయ బీసీ సంక్షేమ సంఘం వ్యవస్థాపకుడు ఆర్.కృష్ణయ్య అన్నారు. ప్రొద్దుటూరులో సోమవారం బీసీ సమాఖ్య ఆధ్వర్యంలో ఆత్మీయ సమ్మేళనానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బీసీలు అభివృద్ధి చెందాలంటే విద్యతోనే సాధ్యమన్నారు. బీసీలు అంతా ఏకమై బలమైన బీసీ ఉద్యమాలను నిర్మిస్తే బీసీల డిమాండ్లన్నీ సాధించుకోగలమన్నారు. సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వై.నాగేశ్వరరావు మాట్లాడుతూ బీసీలకు ప్రత్యేక మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేసి జనాభా నిష్పత్తి ప్రకారం బీసీలకు ప్రత్యేక బడ్జెట్ కేటాయించాలన్నారు. రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు యలగాల నూకానమ్మ మాట్లాడారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ బచ్చల పుల్లయ్య, బీసీ సమాఖ్య అధ్యక్షుడు డాక్టర్ సోమా లక్ష్మీనరసయ్య, సహ అధ్యక్షుడు సందు శివనారాయణ, రాష్ట్ర సెక్రటరీ జనరల్ బీవీ రాజు, జిల్లా అధ్యక్షుడు జింకా జయప్రకాష్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు లక్ష్మీదేవి, జిల్లా యువజన అధ్యక్షుడు శివనారాయణ యాదవ్, రాష్ట్ర ప్రచార కార్యదర్శి గురుమూర్తి, రాష్ట్ర యాదవ కార్పొరేషన్ డైరెక్టర్ బాలకృష్ణయాదవ్, రాష్ట్ర మహిళా ఉపాధ్యక్షురాలు సుభాన్బీ, రాష్ట్ర కార్యదర్శి రెడ్డెయ్య, విజయకుమార్, గురప్ప, గోపాలకృష్ణ పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో బాలుడి మృతి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని నవాబుకోట పంచాయతీ వరికసువుపల్లిలో సోమవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో పురిషిత్రెడ్డి (13) అనే బాలుడు మృతి చెందాడు. వరికసువుపల్లికి చెందిన ఎర్రవ్వగారి సుధాకర్ కుమారుడు పురిషిత్రెడ్డి రోడ్డుపై నడుచుకుంటూ వెళుతుండగా బి.కొత్తకోట నుంచి టి.సదుం వైపు వెళుతున్న ఓ లారీ వేగంగా దూసుకు వచ్చి బాలుడిని ఢీకొంది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. గ్రామస్తులు వెంటనే లారీని వెంబడించి డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. -
విద్యార్థులకు ఇచ్చిన హామీలు నెరవేర్చని ప్రభుత్వం
మదనపల్లె సిటీ : రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు ఇచ్చిన హామీలు నేటికి నెరవేర్చలేదని ఎస్ఎఫ్ఐ అఖిల భారత మాజీ అధ్యక్షుడు వెంకటేశ్వరావు అన్నారు. సోమవారం మదనపల్లె సమీపంలోని విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో ఎస్ఎఫ్ఐ విద్యా, వైజ్ఞానిక సదస్సులో పాల్గొన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ విద్యా సంస్థలను నియంత్రించాల్సిన ప్రభుత్వం వాటికి రెడ్ కార్పెట్ పరుస్తుందని ఆరోపించారు. మోదీ ప్రభుత్వంలో విద్యలో కార్పొరేటీకరణ, కేంద్రీకరణ, కాషాయీకరణ దిశగా అడుగులు వేస్తోందని తెలిపారు. పాఠ్యాంశాలలో వాస్తవ చరిత్రను కాలరాస్తున్నారని చెప్పారు. రాష్ట్ర నూతన అధ్యక్ష, కార్యదర్శుల ఎంపిక.. ఎస్ఎఫ్ఐ సదస్సులో రాష్ట్ర అధ్యక్షుడిగా పి.రామమోహన్, కార్యదర్శిగా కె.ప్రసన్నకుమార్ను ఎన్నుకున్నారు. కార్యక్రమంలో కేంద్ర కమిటీ సభ్యులు పావని, పరమేష్, వెంకటేష్, జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు నరసింహ, రమణ పాల్గొన్నారు. -
కొడుకు కాజేసిన ఆస్తిని ఇప్పించండి
మదనపల్లె రూరల్ : తనకు తెలియకుండా కొడుకు రిజిస్ట్రేషన్ చేసుకున్న భూమిని తిరిగి తనకు ఇప్పించడంతో పాటు కుమారుడి నుంచి జీవనభృతి వచ్చే లా చూడాలని ఓ వృద్ధుడు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ను వేడుకున్నాడు. సోమవారం సాయంత్రం సబ్ కలెక్టర్ కార్యాలయంలో సీనియర్ సిటిజన్స్ కోర్టు నిర్వహించారు. అందులో భాగంగా నిమ్మనపల్లె మండలం సామకోటవారిపల్లె పంచాయతీ ఎర్రంవారిపల్లెకు చెందిన ఎన్.మల్రెడ్డి (87) సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఎదుట హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. తన భార్య కమల మ్మ చాలాకాలం క్రితమే చనిపోయిందని, తనకు ముగ్గురు కుమార్తెలు రాణి, లక్ష్మీదేవి, చంద్రకళతో పాటు కుమారుడు ఆనందరెడ్డి ఉన్నాడన్నారు. కుమార్తెలందరికీ పెళ్లిళ్లు అయిపోయాయని, కుమారుడు ఆనందరెడ్డి తిరుపతిలో స్థిరపడ్డాడన్నారు. నిమ్మనపల్లె మండలం అగ్రహారం రెవెన్యూ గ్రామ పరిధిలో ఖాతా నంబర్.149, సర్వేనంబర్. 1094/3 లో 1.36, సర్వే నంబర్. 1094/5బి లోని 0.76 సెంట్లు మినహా.. తన పేరు మీద ఉన్న ఆస్తులన్నీ కుమారుడు ఆనందరెడ్డికి రాసి ఇచ్చానన్నారు. తన వద్ద ఉన్న నగదును కుమారుడికే ఇచ్చివేశానన్నారు. ఏడాది క్రితం ఖాతా నంబర్.149లో ఉన్న 2.12 సెంట్ల భూమిని కుమారుడు ఆనందరెడ్డి తనకు తెలియకుండానే తన పేరుపై మార్చుకున్నాడన్నారు. అప్పటి నుంచి తనను పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేస్తూ ఇంటి నుంచి తరిమేశాడన్నారు. దీంతో ఒంటరి జీవితం అనుభవించలేక, ప్రస్తుతం మదనపల్లెలోని చిన్నకుమార్తె చంద్రకళ వద్ద ఉంటున్నట్లు తెలిపారు. ఆస్తిపాస్తులు లాగేసుకుని, తనను ఏమాత్రం పట్టించుకోని కుమారుడు ఆనందరెడ్డిపై చర్యలు తీసుకోవాలన్నారు. తాను రాసి ఇచ్చిన భూముల రిజిస్ట్రేషన్ రద్దుచేసి తిరిగి తనకు అప్పగించడమే కాకుండా తన జీవనం కోసం కుమారుడి నుంచి జీవనభృతి ఇప్పించి ఆదుకోవాలన్నారు.సీనియర్ సిటిజన్స్ కోర్టులో సబ్ కలెక్టర్కు వినతి -
2023 మే 11 నాటికి పరిస్థితి
ముదివేడు రిజర్వాయర్ మంజూరు : రూ.759.50 కోట్లు పని విలువ : రూ.500.30 కోట్లు ఎల్ఏ, పునరావాసం : రూ.154.80 కోట్లు మిగతా వ్యయం : రూ.104.40 కోట్లు జరిగిన పని : రూ.167.30 కోట్లు మిగిలిన పని : రూ.332.32 కోట్లు నేతికుంటపల్లె రిజర్వాయర్ మంజూరు : రూ.717.80 కోట్లు పని విలువ : రూ.571.810 కోట్లు ఎల్ఏ, పునరావాసం : రూ.28.63 కోట్లు మిగతా వ్యయం : రూ.117.36 కోట్లు జరిగిన పని : 472.95 కోట్లుఒ మిగిలిన పని : 98.86 కోట్లు ఆవులపల్లె రిజర్వాయర్ మంజూరు : రూ.667.20 కోట్లు పని విలువ : రూ.481.09 కోట్లు ఎల్ఏ, పునరావాసం : రూ.84.11 కోట్లు మిగతా వ్యయం : రూ.101 కోట్లు జరిగిన పని : 28.16 కోట్లు మిగిలిన పని : 453.93 కోట్లు -
దయనీయంగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల పరిస్థితి
– అప్నా రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.ఏవీ సుబ్బారెడ్డి మదనపల్లె రూరల్ : విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించి, దేశానికి తిరిగివచ్చిన వైద్య విద్యార్థుల పరిస్థితి ఆంధ్రప్రదేశ్లో దయనీయంగా ఉందని ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్హోమ్స్ అసోసియేషన్(అప్నా) రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్.ఏవీ సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ..విదేశాల్లో వైద్యవిద్యను అభ్యసించి స్వదేశానికి తిరిగొచ్చిన విద్యార్థులు నేషనల్ మెడికల్ కౌన్సిల్ మార్గదర్శకాలకు అనుగుణంగా ఒక ఏడాది ఇంటర్న్షిప్(హౌస్సర్జన్) పూర్తిచేయాల్సి ఉంటుందన్నారు. అయితే ఏపీ మెడికల్ కౌన్సిల్లో అనిశ్చితి కారణంగా ఏడాది హౌస్సర్జన్ పూర్తిచేసినప్పటికీ, పర్మినెంట్ రిజిస్ట్రేషన్ లభించకపోవడంతో అనేక వ్యయప్రయాసలకు ఓర్చి వైద్యవిద్యను అభ్యసించిన వారి పరిస్థితి దయనీయంగా మారిందన్నారు. ఎనిమిది నెలలుగా ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్స్ చేస్తున్న ఆందోళనపై ఆంఽధ్రప్రదేశ్ ప్రైవేట్ హాస్పిటల్స్ అండ్ నర్సింగ్ హోమ్ అసోసియేషన్ లోతైన అధ్యనయం చేశాక, వారికి అన్యాయం జరుగుతోందని తెలుసుకుని అండగా నిలవాలని నిర్ణయం తీసుకున్నట్లు తెలిపారు. నేషనల్ మెడికల్ కమిషన్ చాలా స్పష్టమైన మార్గదర్శకాలను రూపొందించినప్పటికీ, ఆంధ్రప్రదేశ్లో తప్ప మిగిలిన అన్ని రాష్ట్రాలు ఒక సంవత్సరం ఇంటర్న్షిప్కు మెడికల్ కౌన్సిల్ పర్మినెంట్ రిజిస్ట్రేషన్ ఇస్తుండటంతో వారు మెడికల్ పీజీ ఎంట్రన్స్ రాసేందుకు అర్హులవుతున్నారన్నారు. రాష్ట్రంలో ఆ పరిస్థితి లేదన్నారు. పీజీ ఎంట్రెన్స్కు సంబంధించి దరఖాస్తు చేసుకునేందుకు పదిరోజుల గడువు ఉన్న నేపథ్యంలో రాష్ట్రప్రభుత్వం సానుకూలంగా నిర్ణయం తీసుకోవాలన్నారు. లేనిపక్షంలో వేలమంది ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్లు విద్యాసంవత్సరాన్ని నష్టపోతారన్నారు. ఈ విషయమై మెడికల్ కౌన్సిల్ చైర్మన్ డాక్టర్.శ్రీహరిరావును కలిసి, ఫారిన్ మెడికల్ గ్రాడ్యుయేట్ల సమస్యలు, వాటిని పరిష్కరించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై పూర్తి సమాచారంతో వినతిపత్రాన్ని సమర్పించామన్నారు. దానిపై ఆయన సానుకూలంగా స్పందించారన్నారు. ఖనిజ నిక్షేపాలపై కేంద్రం అన్వేషణ ప్రొద్దుటూరు రూరల్ : మండలంలోని కొత్తపల్లె గ్రామ పంచాయతీకి సంబంధించి కొత్తపల్లె గ్రామ పరిసరాల్లో సోమవారం నుంచి కేంద్ర ప్రభుత్వ సంస్థ అధికారులు ఖనిజ నిక్షేపాల కోసం తవ్వకాలు ప్రారంభించారు. ప్రత్యేక వాహనాలను ఏర్పాటు చేసుకుని 20 అడుగుల లోతు వరకు బోర్లు వేసి ఖనిజాల కోసం అన్వేషణ సాగిస్తున్నారు. ఇందుకోసం అనేక వాహనాలను ఏర్పాటు చేశారు. ముందుగా సంబంధిత రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకుని పనులను ప్రారంభించారు. ఉత్తరాది రాష్ట్రాలకు చెందిన అధికారులు ఈ పనులు చేపడుతున్నారు. గతంలో హెలికాప్టర్ ద్వారా పర్యటించి ఖనిజాలు నిక్షేపాలు ఉండొచ్చని చూపించిన జియోట్యాగ్ ఆధారంగా ప్రస్తుతం పరిశీలన చేస్తున్నారు. -
టీడీపీ..మహా కవ్వింపు !
● రెచ్చగొట్టే చర్యలు మానుకోవాలి సాక్షి ప్రతినిధి, కడప : మహానాడు సందర్భంగా కడపలో టీడీపీ కవ్వింపు చర్యలకు దిగుతోంది. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలతో పాటు, రాజ్యాంగ నిర్మాత బీఆర్ అంబేద్కర్ విగ్రహాన్ని, దేశ చిహ్నమైన అశోక చక్రాన్ని కూడా అవమానిస్తున్నారు. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రచార పిచ్చి అందరి మనోభావాలు దెబ్బతినేలా చేస్తోంది. ప్రతి సర్కిల్లో పసుపు జెండాలు కట్టి అన్ని వర్గాలనూ రెచ్చగొట్టే పనిలో పడింది. నేటి నుంచి మూడు రోజుల పాటు కడపలో చేపట్టనున్న మహానాడు కోసం నగరంలో ప్రతి చోటా ఫ్లెక్సీలు, జెండాలతో నింపేస్తున్న టీడీపీ నేతలు, మహనీయులను కూడా అవమానపరుస్తున్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అడ్డాలో మేం జెండా ఎగురవేశాం అని చెప్పుకునేందుకు టీడీపీ నానా తంటాలు పడుతోంది. గత ఎన్నికల్లో ఎలాగోలా గట్టెక్కినా టీడీపీ, ఇప్పుడు తామేదో గొప్ప విజయం సాధించినట్లు కడపలో మహానాడు నిర్వహించుకుంటోంది. అంతవరకూ సరే అనుకున్నా, దీని కోసం ప్రత్యర్థి పార్టీలను, వివిధ వర్గాలను రెచ్చగొట్టే చర్యలకు దిగడం సమస్యాత్మకంగా మారుతోంది. కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి ప్రచార పిచ్చి మహనీయులను సైతం అవమానపరిచే స్థాయికి వెళ్లింది. నగరంలోని అలంఖాన్పల్లి సర్కిల్, కృష్ణాపురం సర్కిళ్లలో దివంగత సీఎం డాక్టర్ వైఎస్సార్ విగ్రహాలు ఉన్నాయి. ఆ విగ్రహాలకు కూడా పసుపు జెండాలు కట్టడం ఇప్పుడు వివాదాస్పదంగా మారింది. మహనీయుడికి పసుపుతోరణం రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్నీ అవమానించడంపై అంబేద్కర్ వాదులంతా మండిపడుతున్నారు. కడపలో ఎమ్మెల్యే ప్రచార ఆర్భాటంలో మహనీయులను అవమానపరచడం ఏమిటని వారు ప్రశ్నిస్తున్నారు. కడప నగరంలోకి అంబేద్కర్ విగ్రహం చుట్టూ టీడీపీ జెండాలు కట్టడం ఇప్పుడు ఆయన అభిమానులకు ఆగ్రహాన్ని తెప్పించింది. అంబేద్కర్ విగ్రహం వద్ద టీడీపీ తీరును నిరసిస్తూ నేలపై కూర్చుని మాలమహానాడు నేతలు నిరసన తెలిపారు. మహాత్మగాంధీ, ప్రకాశం పంతులు, సైనిక్ సర్కిల్, అన్నమయ్య విగ్రహం ఇలా అన్నీ విగ్రహాలను పసువుమయం చేశారు. అన్ని వర్గాల మనోభావాలు దెబ్బతింటున్నా పట్టించుకోని అధికారులు.. పైగా మహానాడు సేవలో మునిగి తేలుతుండడం గమనార్హం. ఎవరి పార్టీపై వారికి అభిమానం ఉండటం సహజమే. హద్దులు దాటి పక్కవారిని రెచ్చ గొట్టేలా ప్రయత్నించడం సరైంది కాదని విశ్లేషకులు అంటున్నారు. ఇలాంటి కవ్వింపు చర్యలు మంచిది కాదని హితవు పలుకుతున్నారు. ఇదిలా ఉంటే నిత్యం మహానాడు పనులను పర్యవేక్షిస్తున్న జిల్లా పోలీసు యంత్రాంగం ఇలాంటి చర్యలను ఎలా సమర్థ్ధిస్తుందనే ప్రశ్న తలెత్తుతోంది. ఒక్క వైఎస్సార్ విగ్రహమే కాదు... చివరికి దేశ చిహ్నమైన అశోకచక్రంతో కూడిన వై జంక్ష న్ సర్కిల్ను కూడా పసుపు జెండాలతో కప్పేయడం గమనార్హం. అలాగే మరో అడుగు ముందుకు వేసి రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబా సాహెబ్ అంబేద్కర్ విగ్రహాన్ని పసుపు మయం చేసేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహాలకు పచ్చ తోరణాలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహాన్ని అశోక చక్రాన్నీ వదలని ‘తమ్ముళ్లు’ రగిలిపోతున్న అభిమానులు... మాల మహానాడు నేతల నిరసన చోద్యం చూస్తున్న కార్పొరేషన్ యంత్రాంగం -
మామిడి పంటకు ధర కల్పించాలి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండలంలో మామిడి పంటలకు ధర కల్పించాలని సోమవారం మామిడి రైతులు, వ్యాపారులు స్థానిక ప్రైవేటు మార్కెట్ యార్డు వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మార్కెట్ యార్డు మాజీ అధ్యక్షుడు కె మణి మాట్లాడుతూ జూస్ ఫ్యాక్టరీ యాజమాన్యం మామిడి కాయల కోత తర్వాత కుట్రపూరితంగా ధరలు తగ్గిస్తూ రైతులు, వ్యాపారులు నష్టపోయే విధంగా కు ట్రలు చేస్తోందన్నారు. మామిడి కాయలను తోలుకొని ధరల్లో వ్యత్యాసాలు చూపడం తగదన్నారు. అధికారులు, కూటమి ప్రభుత్వ నాయకులు తక్షణమే పరిష్కరించకుంటే ఆమరణ నిరాహార దీక్షకు సిద్ధమవుతామని వారు హెచ్చరించారు. ముఖ్యమంత్రికి ఘన స్వాగతం కడప సెవెన్రోడ్స్ : వైఎస్సార్ జిల్లాలో జరగనున్న మహానాడు కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమవారం గన్నవరం విమానాశ్రయం నుంచి బయలుదేరిన సీఎం చంద్రబాబునాయుడు సాయంత్రం 7:35 గంటలకు కడప విమానాశ్రయానికి చేరుకున్నారు. ఆయనకు అధికారులు, ప్రజాప్రతినిధులు స్వాగతం పలికారు. కడప విమానాశ్రయంలో జిల్లా టీడీపీ అధ్యక్షుడు, పోలిట్ బ్యూరో సభ్యుడు శ్రీనివాసులు రెడ్డి, మైదుకూరు ఎమ్మెల్యే పుట్టా సుధాకర్ యాదవ్, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి,జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్లు పుష్ప గుచ్చం అందజేసి స్వాగతం పలికారు. అనంతరం సీఎం మహానాడు ప్రాంగణానికి సాయంత్రం 7.40 గంటలకు రోడ్డు మార్గాన బయలుదేరి వెళ్లారు. దరఖాస్తుల ఆహ్వానం కడప అగ్రికల్చర్ : బిందు, తుంపర సేంద్య పరికరాలు కావాల్సిన రైతులు ఆంధ్రప్రదేశ్ మైక్రో ఇరిగేషన్ ప్రాజెక్టు ద్వారా పొందాలని వైఎస్సార్ జిల్లా మైక్రో ఇరిగేషన్ అధికారి వెంకటేశ్వరరెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బిందు, తుంపర సేద్య పరికరాల కోసం రైతులు రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రైతులు కోరిన కంపెనీ ఎంపిక చేసుకుని పేరు నమోదు చేసుకోవాలని చెప్పారు. 2025–26 ఆర్థిక సంవత్సరానికి ఏపీ ఎంఐపి ద్వారా నిర్ణయించబడిన సబ్సిడీ ప్రకారం పట్టాదారు పాసుపుస్తకంలో 5 ఎకరాల వరకు పొలం కలిగిన చిన్న, సన్నకారు, ఎస్సీ, ఎస్టీ రైతులకు 100 శాతం సబ్సిడీ, ఇతరులకు 90 శాతం సబ్సిడీ, అలాగే మధ్య రకం రైతులు 5 నుంచి 10 ఎకరాల పొలం గల రైతులకు 90 శాతం, పెద్ద రైతులు అంటే 12.5 ఎకరాలు గల రైతులకు 50 శాతం సబ్సిడి ద్వారా డ్రిప్పు పరికరాలు అందజేస్తామన్నారు. పేరు నమోదు చేసుకున్న రైతుల పొలాల్లో ప్రాథమిక తనిఖీ జరిగిన తరువాత రైతు చెల్లించాల్సిన రైతు వాటా రిజిస్టర్ అయిన ఫోన్ నెంబర్కు ఎస్ఎంఎస్ ద్వారా సంక్షిప్త సమాచారం వస్తుందని వివరించారు. -
‘ప్రత్యేక’ పిల్లల్లో.. మానసిక వికాసం
రాజంపేట టౌన్ : తల్లిదండ్రులకు తమ పిల్లలే ప్రపంచం. వారి భవిష్యత్తు బాగుండాలని వారు ఎంతైనా కష్టపడతారు. ఇక మానసిక ఎదుగుదల లేని చిన్నారుల తల్లిదండ్రులు వారి పిల్లలను అనుక్షణం అంటిపెట్టుకొని వారి బాగోగులు చూసుకుంటూ ఉంటారు. అనునిత్యం వారి ఎదుగుదలపై ఆందోళన చెందుతూ ఉంటారు. అయితే అలాంటి చిన్నారుల కోసమే ప్రతి మండలంలో భవిత కేంద్రాలు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో 30 ఽభవిత కేంద్రాలు ఉన్నాయి. వీటి ద్వారా ప్రత్యేక అవసరాలు గల చిన్నారుల అభివృద్ధికి పలు కార్యక్రమాలు చేపడతారు. ఆటపాటలతో కూడిన విద్యా బోధన, స్పీచ్ థెరఫి, ఫిజియో థెరఫి సేవలను అందిస్తారు. జిల్లా వ్యాప్తంగా సాగుతున్న సర్వే ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారిని భవిత కేంద్రంలో చేర్పించి మంచి భవిష్యత్తు కల్పించేందుకు జిల్లా వ్యాప్తంగా ఐఈఆర్పీలు ఇంటింటి సర్వే నిర్వహిస్తున్నారు. ఈసందర్భంగా ప్రత్యేక అవసరాలు గల పిల్లలను గుర్తించి వారి తల్లిదండ్రులకు భవిత కేంద్రానికి పిల్లలను పంపిస్తే వివిధ పథకాలు పొందవచ్చని, ఆటపాటలతో కూడిన విద్యాబోధన, మౌలి క వసతులు తదితర వివరాలను తెలియ చేస్తున్నారు. అందువల్ల తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను భవిత కేంద్రంలో చేర్పించేందుకు ముందుకు వస్తున్నట్లు ఐఈఆర్పీలు చెబుతున్నారు. అనేక ప్రయోజనాలు మానసిక వైకల్యం, చెవుడు, మూగ, పోలియో తదితర లోపాలతో జన్మించి భవిత కేంద్రంలో చేరిన పిల్లలకు అర్థమయ్యే రీతిలో ఆటపాటలతో కూడిన విద్యను అందిస్తారు. వారిలో మనోధైర్యాన్ని నింపుతూ భవిష్యత్తుపై ఆశలు నింపుతారు. వినూత్న కార్యక్రమాలతో దాదాపు సాధారణ పిల్లల్లాగే చదువుకునేలా, ఆడుకునేలా అక్కడి ఐఈఆర్పీలు కృషి చేస్తారు. ఫిజియో థెరఫితో శారీరక సేవలు ప్రత్యేక అవసరాలు కలిగిన చిన్నారులకు పాఠశాల విద్యతో పాటు వారంలో ఒకరోజు పిజియో థెరఫి సేవలను అందిస్తారు. దీని ద్వారా దివ్యాంగ పిల్లల్లో శారీరక మార్పు జరిగి ఎంతో ప్రయోజనం చేకూరుతుంది. అలాగే అవసరాన్ని బట్టి చెవుడు, మూగ, పోలియో వంటి శారీరక రుగ్మతలకు ప్రత్యేక శస్త్ర చికిత్సలు చేస్తారు. ఈసేవలతో పాటు మానసిక, శారీరక దివ్యాంగుల పిల్లలకు, పిల్లలను భవిత కేంద్రాలకు తీసుకొచ్చే తల్లిదండ్రులకు ఎస్కార్ట్, రవాణా ఖర్చులు కూడా ప్రభుత్వం ఇస్తుంది. ఇక్కడికి రాలేని పిల్లలకు ఐఈఆర్పీలు వారి ఇంటివద్దకే వెళ్లి విద్య నేర్పడంతో పాటు తీసుకోవాల్సిన జాగ్రత్తల గురించి అవగాహన కల్పిస్తారు. ఇంటివద్ద విద్య నేర్చుకునే పిల్లలకు కూడా ప్రభుత్వం అలవెన్స్ ఇస్తుంది. భవిత కేంద్రాలతో బంగారు భవిష్యత్తు జిల్లాలో 30 కేంద్రాలు ప్రత్యేక అవసరాల పిల్లలకు ఆటపాటలతో విద్య సద్వినియోగం చేసుకోవాలి మానసిక, శారీరక దివ్యాంగ పిల్లలను తల్లిదండ్రులు విధిగా భవిత కేంద్రాల్లో చేర్పించాలి. ప్రత్యేక అవసరాలుగల పిల్లలకు ఈ కేంద్రాలు వరంలాంటివి.వీటిని సద్వినియోగం చేసుకోవాలి. ఈవిద్యా సంవత్సరంలో జిల్లాకు ఐదు ఆటిజం కేంద్రాలు కూడా మంజూరయ్యాయి. – కొన్నిపాటి జనార్దన్, సమ్మిళిత సహిత విద్య కో–ఆర్డినేటర్, అన్నమయ్యజిల్లా -
సమస్యలకు సత్వర పరిష్కారం
కలెక్టర్ ఛామకూరి శ్రీధర్రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే ప్రజల సమస్యలను సత్వరం బాధ్యతగా పరిష్కరించాలని జల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర మాట్లాడుతూ పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలన్నారు. అనంతరం వివిధ సమస్యలతో వచ్చిన ప్రజల నుండి అర్జీలను స్వీకరించారు. ఈ కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డిఆర్ఓ మధుసూదన్ రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ రాఘవేంద్ర, వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. యోగా నేర్చుకో..ఆయుస్సు పెంచుకో దైనందిన జీవితంలో యోగాను భాగస్వామ్యం చేసుకోవడం వల్ల మానసిక ప్రశాంతతోపాటు మనిషి ఆయుస్సు కూడా పెరిగేందుకు దోహదపడుతుందని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. సోమవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ యోగా వల్ల ఆరోగ్యవంతమైన ఆంధ్రప్రదేశ్ ఏర్పడుతుందని అభిప్రాయపడ్డారు. యోగాపై ప్రజలలో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ఈనెల 28వ తేదీ జిల్లా ఇన్చార్జి మంత్రి, జిల్లా మంత్రి ఆధ్వర్యంలో ప్రజా ప్రతినిధులు, అంగన్వాడీ హెల్పర్లు, టీచర్లు, ఆశా, హెల్త్ వర్కర్లు తదితరులు ఐదువేల మందితతో మదనపల్లె బీటీ కాలేజీ గ్రౌండ్లో ఒకేచోట యోగా నిర్వహించేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నట్లు తెలిపారు.ఈ కార్యక్రమం ఉదయం 6 నుంచి 8 గంటల వరకు జరగుతుందన్నారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
మదనపల్లె సిటీ : రోడ్డుప్రమాదంలో ఓ యువకుడు మృతిచెందిన సంఘటన మదనపల్లె మండలం బార్లపల్లె వద్ద ఆదివారం తెల్లవారు జామున జరిగింది . బెంగుళూరు రూరల్ మండలం చోళప్పనహళ్లికి చెందిన వెంకటేశప్ప కుమారుడు నరేష్(25) మదనపల్లెకు సొంత పనుల మీద ద్విచక్ర వాహనంలో వచ్చాడు. రాత్రి పనులు ముగించుకుని ఇంటికి వెళ్తుండగా బార్లపల్లె వద్ద ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో నరేష్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానికులు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. మృతుడి జేబులోని ఆధార్ కార్డు ఆధారంగా కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. రూరల్ సీఐ కళావెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. విద్యుత్ తీగలు తగిలి వ్యక్తి మృతికలకడ : అడవి పందులను చంపడానికి అమర్చిన విద్యుత్ తీగలు తగిలి ఓ వ్యక్తి మృతి చెందగా, మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు, గ్రామస్తుల కథనం మేరకు.. సంబేపల్లి మండలం సోమవరం పమీపంలో బ్రహ్మంగారి మఠం గ్రామంలోని ఎస్టీ కాలనీకి చెందిన ఏకరి మురళి(24), నారాయణనెల్లూరు జిల్లా పామర్రు మండలం గురకాయపేటకు చెందిన నారాయణ(38) కంప చెట్లు కాల్చి బొగ్గులు చేసుకుని విక్రయించి జీవనం సాగిస్తున్నారు. శనివారం రాత్రి కుందేళ్ల వేట నిమిత్తం కలకడ మండలం ఎగువబట్టావారిపల్లి సమీపంలోని కోమటివాని చెరువు సమీపానికి వెళ్లారు. గుర్తుతెలియని వ్యక్తులు అడవి పందులను చంపడానికి అక్కడ ఏర్పాటు చేసిన విద్యుత్ తీగలు తాకారు. షాక్తో మురళి అక్కడికక్కడే మృతి చెందగా, నారాయణకు తీవ్ర గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. దుకాణంలోకి దూసుకెళ్లిన కారుపుల్లంపేట : కడప–చైన్నె జాతీయ రహదారి రామక్కపల్లి వద్ద ఆదివారం మధ్యాహ్నం తిరుపతి నుంచి రాజంపేటకు వైపు వెళ్తున్న ఇన్నోవా కారు రామక్కపల్లి రోడ్డు ప్రక్కన ఉన్న దుకాణంలోకి దూసుకెళ్లింది. అదృష్టవశాత్తూ దుకాణంలో ఎవరూ లేకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. బైక్లు ఢీకొని ఒకరు దుర్మరణంరాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలోని మన్నూరు పోలీస్ స్టేషన్ పరిధిలో రెండు బైక్లు ఢీకొని ఒకరు దుర్మరణం చెందారు. మరో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. ఓబుళవారిపల్లె మండలం చిన్నంపల్లెకు చెందిన గూడూరు గణేశ్రాజు (16) బైక్లో వెళ్తున్నారు. మరో బైక్ వేగంగా వస్తోంది. రాజంపేట బైపాస్ రహదారిలోని పద్మప్రియ కల్యాణమండపం వద్దకే చేరగానే రెండు బైక్లు ఢీకొన్నాయి. ప్రమాదంలో గూడూరు గణేష్రాజు(16) అక్కడికక్కడే మృతి చెందారు. బైకులో ఉన్న మరో ఇద్దరికి తీవ్ర గాయాలవడంతో చికిత్స నిమిత్తం రాజంపేట వైద్యశాలకు తరలించారు. మన్నూరు పోలీసులు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. -
రాష్ట్రంలో రాజకీయ అరాచకపాలన
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం రాజకీయ అరాచక పాలన సాగిస్తోందని, దేశ ప్రజల ఆత్మగౌరవాన్ని ప్రధాని నరేంద్రమోదీ తాకట్టు పెట్టారని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య అన్నారు. రైల్వే కోడూరులో విలేకరులతో ఆయన మాట్లాడుతూ ఆపరేషన్ సింధూర్ పేరుతో భారతీయులను చంపిన టెర్రరిస్టులను ఎంత మందిని హతమార్చారో ప్రధాని తెలపలేదన్నారు. దేశంలోని అటవీ సంపద కార్పొరేట్ కంపెనీలకు ధారదత్తం చేయడానికి మావోయిస్టులను బూటకపు ఎన్కౌంటర్ చేశారన్నారు. 2007లో వైఎస్ రాజశేఖర్ రెడ్డి శంఖుస్థాపన చేసిన ఉక్కు పరిశ్రమను వెంటనే నిర్మించాలన్నారు. అప్పట్లో సీఎం రమేష్ ఈ ప్లాంట్ కోసం నిరాహారదీక్ష చేసినా, ఇప్పటికీ శంకుస్థాపన రాళ్లు వెక్కిరిస్తున్నాయని పేర్కొన్నారు. రైతులకు అన్నదాత సుఖీభవ క్రింద రూ. 20 వేలు ఇవ్వలేదని, అమ్మకు వందనం, నిరుద్యోగ భృతి హామీల ఊసే ఎత్తలేదని ఎద్దేవా చేశారు. జూన్ 2న అన్ని మండల కేంద్రాలలో ఆందోళన చేపడుతున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహులు, నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, పండుగోల మణి, దార్ల రాజశేఖర్, చైతన్య, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు.సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు గుజ్జల ఈశ్వరయ్య -
అశ్రునయనాల నడుమ ప్రమాద మృతులకు అంత్యక్రియులు
బద్వేలు అర్బన్/బి.కోడూరు : గువ్వల చెరువు ఘాట్రోడ్డులో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన చింతపుత్తాయపల్లె గ్రామానికి చెందిన శ్రీకాంత్రెడ్డి, శిరీషల అంత్యక్రియలు ఆదివారం అశ్రునయనాల నడుమ ముగిశాయి. బంధువులు, స్నేహితులు కడసారి చూసేందుకు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఇదిలా ఉంటే బి.కోడూరు మండలంలోని గంగిరెడ్డిపల్లె సాయిహర్షిణి, రుషికేశవరెడ్డిల మృతదేహాలకు భారీ జనసందోహంతో కన్నీటి వీడ్కోలు పలికారు. పిల్లలను కడసారి చూసేందుకు తల్లిదండ్రులైన జర్మనీ నుండి వచ్చిన తిరుపతిరెడ్డి, కడసారి చూపు కోసం ఆసుపత్రి నుండి అంబులెన్స్లో తీసుకువచ్చిన శశికళలను ఓదార్చడం ఎవరితరం కాలేదు. ఎమ్మెల్సీ డీసీగోవిందరెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి దేవసాని ఆదిత్యరెడ్డి, ఆర్టీసీ జోనల్ మాజీ చైర్మన్ రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, నియోజకవర్గ బూత్కన్వీనర్ల సమన్వయకర్త కె.రమణారెడ్డి, బద్వేలు మున్సిపల్ చైర్మన్ రాజగోపాల్రెడ్డి, నాయకులు బోడపాడు రామసుబ్బారెడ్డి, వెంకటేశ్వర్రెడ్డి, వీరనారాయణరెడ్డి, బి.కోడూరు మండల అధ్యక్షుడు రామకృష్ణారెడ్డి, ప్రభాకర్రెడ్డిలు మృతదేహాలకు నివాళులర్పించి ప్రగాఢ సానుభూతి తెలియజేయడంతో పాటు వారి కుటుంబ సభ్యులను ఓదార్చారు. వీరి వెంట చంద్రశేఖర్రెడ్డి, లక్ష్మీనరసారెడ్డి, జయరామిరెడ్డి, పోలిరెడ్డి, యోగానందరెడ్డి, వెంకటసుబ్బారెడ్డి పాల్గొన్నారు.నివాళులర్పించిన ఎమ్మెల్సీ డీసీ.గోవిందరెడ్డి -
తక్కువ వ్యయంతోనే అన్నమయ్య ప్రాజెక్టు
మంత్రి నిమ్మల రాజంపేట: తక్కువ వ్యయంతో అన్నమయ్య ప్రాజెక్టు నిర్మించేలా ప్రణాళిక రూపొందిస్తున్నామని రాష్ట్ర మంత్రి నిమ్మల రామానాయుడు అన్నారు. ఆదివారం రాజంపేటలో టీడీపీ నియోజకవర్గ నాయకులు, కార్యకర్తల సమావేశం నిర్వహించారు. అనంతరం చిలకలూరిపేట ఎమ్మెల్యే పత్తిపాటి పుల్లారావుతో కలిసి ఆయన మీడియాతో మాట్లాడారు. ప్రాజెక్టు పూర్తి అయ్యేలోపు లిఫ్ట్ ద్వారా కాలువలకు నీరందించే అంశంపై దృష్టి పెడతామన్నారు. ఎన్టీఆర్ తెలుగుదేశం పార్టీ పెట్టిన తర్వాత రాయలసీమలో ఎంత అద్భుత స్పందన వచ్చిందో, అదే స్పందన 2024లో వచ్చిందన్నారు. ఇరిగేషన్ రంగంలో తెలుగుగంగ, జీఎన్ఎస్ఎస్, హంద్రీనీవా, హెచ్ఎల్సీ, ఇలా ఎన్నో ప్రాజెక్టులు టీడీపీ హయాంలోనే నిర్మించామన్నారు. రాష్ట్రంలో మిగతా ప్రాజెక్టుల కంటే రాయలసీమలోని హంద్రీనీవా ప్రాజెక్టుకు అత్యధికంగా బడ్జెట్లో రూ.3240 కోట్లు కేటాయించామన్నారు. ఒంటిమిట్ట భూకబ్జాదారులను కఠినంగా శిక్షిస్తామన్నారు. యువనేత లోకేష్ సారధ్యంలో జరుగుతున్న మహానాడు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తోందన్నారు. రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజు, నియోజకవర్గంలోని వివిధ మండలాలకు చెందిన నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మహిమాన్వితుడు బత్తులయ్య స్వామి
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి రాజంపేట: మహిమాన్వితుడు బత్తులయ్య స్వామి అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి అన్నారు. ఆదివారం బత్తులయ్య సమాధి వద్ద ఆయన ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ బత్తులయ్య 300 సంవత్సరాల క్రితం జీవసమాధి అయ్యారన్నారు. ఆకేపాడు తదితర ప్రాంతాల్లో అనేకమంది బత్తులయ్య స్వామిపై భక్తి భావాలను చూపారన్నారు. ఆయన జీవసమాధి ఒక చరిత్రాత్మకమన్నారు. ఆయన వెంట స్థానిక వైఎస్సార్సీపీ నాయకులు, గ్రామపెద్దలు, భక్తులు పాల్గొన్నారు. ప్రజలను చల్లగా చూడాలి తల్లి.. కోరిన కోర్కెలు తీర్చే తల్లి అనంతపురం తల్లిగా భక్తులు కొలుచుకుంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథ్రెడ్డి అన్నారు. ఆదివారం బాలిరెడ్డిపల్లెలో వెలసిన అనంతపురమ్మ తల్లి పొంగుబాళ్ల మహోత్సవంలో ఎమ్మెల్యే పాల్గొని పూజలు నిర్వహించారు. ప్రజలను చల్లగా చూడాలని ఆయన ప్రార్థించారు. -
టీడీపీలో ఫ్లెక్సీల రగడ
సాక్షి ప్రతినిధి, కడప: తెలుగుదేశం పార్టీలో వర్గవిభేదాలు తీవ్రస్థాయికి చేరాయి. ఇప్పటికే కడపలో ఇరువర్గాలు ఒకరిపై మరొకరు దుమ్మెత్తి పోసుకున్నారు. కొందర్ని సాగనంపాలనే యోచనలో వ్యూహాత్మకంగా ఓ వర్గం అడుగులు వేయగా, అదే స్థాయిలో ప్రతిఘటిస్తూ వైరిపక్షం ప్రశ్నలను సంధించింది. బాధ్యులు స్పందించకపోగా, కేడర్ను ఉసిగొల్పారు. ఇలాంటి పరిస్థితిలో తాజాగా ఫ్లెక్సీల రగడ తెరపైకి వచ్చింది. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఏర్పాటు చేసిన ఫ్లెక్సీలను గుర్తుతెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు. ఊటుకూరు బ్రిడ్జి నుంచి రింగు రోడ్డు వెంట పెట్టిన ఫ్లెక్సీలను ఏకంగా కోసేశారు. ఇలాంటి పరిస్థితి మునుపెన్నడూ లేదని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ముందుగా ఎవరు ఆక్రమిస్తే.. మహానాడు సందర్భంగా కడప నగరం పసుపు మయమైంది. నగరంలో భారీ స్థాయిలో పసుపు జెండాలు, తోరణాలు, ఫ్లెక్సీలు వెలిశాయి. కార్పొరేషన్కు పైసా చెల్లించకుండానే వీటిని ఏర్పాటు చేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముందుగా ఎవరు జాగా ఆక్రమిస్తే.. వారిదే ఫ్లెక్సీ అన్నట్లుగా నేతలు ఉండిపోయారు. ఈక్రమంలో ఎయిర్పోర్టు నుంచి రింగురోడ్డు వెంట కూడా భారీ స్థాయిలో ఫ్లెక్సీలు వెలిశాయి. అందులో ప్రధానంగా ఎమ్మెల్యే మాధవీరెడ్డి, పొలిట్బ్యూరో సభ్యుడు శ్రీనివాసులరెడ్డి ఫ్లెక్సీలే ఉండిపోయాయి. ఇతర నియోజకవర్గాల నేతలకు ఆస్కారం లేకుండా ఏర్పాటు చేశారు. కమలాపురం అసెంబ్లీ సెగ్మెంట్ పరిధిలో కూడా.. ఆ దంపతుల ఫ్లెక్సీలే వెలిశాయి. కాగా ఆదివారం ఉదయానికి ఎమ్మెల్యే మాధవీరెడ్డి, జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులరెడ్డి ఫ్లెక్సీలు ఏకంగా కోతకు గురయ్యాయి. ●వర్గ విభేదాలేనా... ఫ్లెక్సీల ఆధిపత్యమా? నగర తెలుగుదేశంలో పూర్తి స్థాయిలో వర్గ విభేదాలు ఉన్నాయి. అలంఖాన్పల్లె లక్ష్మిరెడ్డి కుటుంబాన్ని టీడీపీ నుంచి దూరం చేసేందుకు చర్యలన్నీ పూర్తి అయ్యాయి. అదే స్థాయిలో కార్పొరేటర్ ఉమాదేవితో సహా.. ఎమ్మెల్యే మాధవీరెడ్డి, శ్రీనివాసులరెడ్డి చర్యలపై తీవ్రస్థాయిలో వారు కూడా ధ్వజమెత్తారు. ఈ క్రమంలో ఫ్లెక్సీల ధ్వంసరచన వారిపైకి నెట్టేందుకు ఎవరైనా చేశారా? అనే అనుమానాలు లేకపోలేదు. మరోవైపు కడపతోపాటు కమలాపురం పరిధిలో కూడా ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫ్లెక్సీల ఆధిపత్యం ప్రదర్శించారు. అక్కడి తెలుగుతమ్ముళ్లకు ఆగ్రహం వచ్చి.. ప్రత్యక్ష చర్యలకు పాల్పడ్డరాని విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. జిల్లాలో తెలుగుదేశం పార్టీలో సఖ్యత లేదనడానికి ఎమ్మెల్యే, జిల్లా అధ్యక్షుడి ఫ్లెక్సీల ధ్వంసం నిదర్శనంగా నిలుస్తుండటం గమనార్హం. ఎమ్మెల్యే మాధవీరెడ్డి ఫ్లెక్సీలు ధ్వంసం ముందస్తుగా అన్ని ప్రాంతాల్లో ఏర్పాటు మరొకరికి అవకాశం లేకుండా ప్రధాన ప్రాంతాల్లో ఆక్రమణ కార్పొరేషన్కు పైసా చెల్లించకుండానే.. -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి, వాటిని పరిష్కరించేందుకు ఈనెల 26వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల డివిజన్ స్థాయిలో కూడా ఈ కార్యక్రమం ఉంటుందన్నారు. మత్స్యశాఖ డీడీగా రాఘవరెడ్డి కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లా మత్స్యశాఖ ఎఫ్ఏసీ డిప్యూటీ డైరెక్టర్గా నంద్యాల జిల్లా జేడీగా పని చేస్తున్న రాఘవరెడ్డి నియమితులయ్యారు. ప్రస్తుతం కడప ఏడీగా పని చేస్తున్న రెడ్డెయ్య ఎఫ్ఏసీ డీడీ విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన స్థానంలో రాఘవరెడ్డిని నియమించారు. ఈయన ఒకటి, రెండు రోజుల్లో బాధ్యతలు స్వీకరించనున్నారు. విజయవంతానికి చర్యలు తీసుకోవాలి కడప రూరల్: మహానాడు విజయవంతానికి అన్ని చర్యలు తీసుకోవాలని రాష్ట్ర మంత్రులు తెలిపారు. కడప నగర శివారులోని మహానాడు ప్రాంగణంలో జరుగుతున్న సన్నాహాక కార్యక్రమాలను వారు పరిశీలించారు. అనంతరం ఆర్అండ్బీ గెస్ట్హౌస్లో నిర్వహించిన సమావేశంలో అచ్చెన్నాయుడు, నారాయణ, గొట్టిపాటి రవికుమార్ మాట్లాడుతూ నేతలు, కార్యకర్తలు, శ్రేణులు కలిసికట్టుగా పని చేయాలన్నారు. భద్రత, వసతి, వేదికలు, రవాణాతోపాటు ఇతర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఎలాంటి లోపాలు లేకుండా చర్యలు తీసుకోవాలని సూచించారు. కార్యక్రమంలో ఉమ్మడి వైఎస్ఆర్ జిల్లా నేతలు పాల్గొన్నారు. విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదే మదనపల్లె సిటీ: విద్యా వ్యవస్థను కాపాడుకోవాల్సిన బాధ్యత విద్యార్థులదేనని ఎస్ఎఫ్ఐ జాతీయ అధ్యక్షుడు విపి సాను అన్నారు. ఆదివారం మద న పల్లె సమీపంలోని అంగళ్లు విశ్వం ఇంజినీరింగ్ కాలేజీలో జరుగుతున్న ఎస్ఎఫ్ఐ రాష్ట్ర విద్యా, వైజ్ఞానిక శిక్షణా తరగతులకు హాజర య్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చి 75 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటి వరకు పేదవారికి విద్య అనేది అందని ద్రాక్షగానే మారిందన్నారు. కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వం తీసుకు వస్తున్న విద్యా వ్యతిరేక విధానాలు విద్యార్థులకు విద్యను మరింత దూరం చేస్తున్నాయని విమర్శించారు. నూతన జాతీయ విద్యా విద్యావిధానం పేరుతో విద్యలో కాషాయీకరణ, కేంద్రీకరణ, కార్పొరేటీకరణను కేంద్ర ప్రభుత్వం తీసుకువస్తోందన్నారు. దీనిని విద్యార్థులందరూ ప్రతిఘటించాలన్నారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు ప్రసన్నకుమార్, జిల్లా అధ్యక్ష,కార్యదర్శులు నరసింహ, రమణ, నాయకులు రామమోహన్, అబ్దుల్లా, నవిత, ప్రవళ్లిక, వివిధ జిల్లాల ప్రతినిధులు హాజరయ్యారు. మహానాడు తెచ్చిన తిప్పలు కడప సెవెన్రోడ్స్: టీడీపీ మహానాడు వల్ల మంగళవారం ఏపీ ఈఏపీ సెట్–2025 పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులకు తిప్పలు తప్పేటట్లు లేవు. నగర శివారులోని పబ్బాపురంలో ఈ నెల 27 నుంచి 29వ తేదీ వరకు తెలుగుదేశం పార్టీ మహానాడు కార్యక్రమాలు నిర్వహిస్తోంది. ఉభయ తెలుగు రాష్ట్రాల నుంచి ఆ పార్టీకి చెందిన ప్రజాప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలు వేలాదిగా తరలి రానున్నారు. మహానాడు తొలిరోజే ఏపీ ఈఏపీ సెట్ పరీక్ష ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించనున్నారు. నగరంలోని కందుల ఓబుల్రెడ్డి మెమోరియల్ కాలేజీ ఆఫ్ ఇంజినీరింగ్, కేఎస్ఆర్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్, కేఎల్ఎం కాలేజ్ ఆఫ్ ఇంజినీరింగ్ ఫర్ ఉమెన్, అన్నమాచార్య ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్సెస్ పరీక్షా కేంద్రాలకు కేటాయించిన విద్యార్థులు పలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఉంది. ఎందుకంటే ఈ పరీక్షా కేంద్రాలన్నీ మహానాడు నిర్వహించే ప్రాంతానికి సమీపంలో ఉండటమే కారణం. సాధారణంగా ఉండే ట్రాఫిక్తోపాటు మహానాడు కార్యక్రమానికి వచ్చే వాహనాలతో పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలిగే అవకాశం ఉన్నట్లు భావిస్తున్నారు. అందుకే విద్యార్థులు ఈ పరీక్షా కేంద్రాలకు ఉదయం 7.30 గంటల్లోపే చేరుకోవాలని ఏపీ ఈఏపీ సెట్–2025 చైర్మన్, జేఎన్టీయూ కాకినాడ ఉప కులపతి ప్రొఫెసర్ సీఎస్ ఆర్కే ప్రసాద్ ఒక ప్రకటనలో సూచించారు. -
యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయండి
కలెక్టర్ చామకూరి శ్రీధర్ మదనపల్లె రూరల్: అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకుని, రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తు న్న యోగాంధ్రప్రదేశ్ కార్యక్రమంలో భాగంగా 28న మదనపల్లెలో అంగన్వాడీ, ఆరోగ్య కార్యకర్తలతో మెగా యోగా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు జిల్లా కలె క్టర్ చామకూరి శ్రీధర్ తెలిపారు. ఆదివారం పట్టణంలోని బీటీ కళాశాల మైదానంలో మెగా యోగా కార్యక్రమానికి సంబంధించి చేయాల్సిన ఏర్పాట్లపై జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్తో కలిసి అధికారులకు పలు సూచనలు, ఆదేశాలిచ్చారు. యోగా ద్వారా చేకూరే ఆరోగ్య ప్రయోజనాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేందుకు రాష్ట్ర ప్రభుత్వం సన్నాహాలు చేస్తున్న నేపథ్యంలో...మదనపల్లె మెగా యోగా కార్యక్రమాన్ని విజయవంతం చేయాల్సిన బాధ్యత, అధికారులందరిపై ఉందన్నారు. ఏర్పాట్లలో అన్ని శాఖలు సమన్వయంతో పనిచేయాలన్నారు. వివిధ అంశాలపై అధికారులకు పలు సూచనలు ఇచ్చారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ కే.ప్రమీల, తహసీల్దార్ ధనంజయులు, ఐసీడీఎస్ సీడీపీఓ సుజాత, ఎంపీడీఓ తాజ్మస్రూర్, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ రమేష్బాబు, మండల సర్వేయర్ రెడ్డిశేఖర్ పాల్గొన్నారు. -
పరిహారం.. పరిహాసం!
మదనపల్లె: జిల్లా కరువు రైతులకు అందించాల్సిన పరిహారంపై కూటమి ప్రభుత్వం పరిహసిస్తోంది. మట్టిని నమ్ముకుని సేద్యం చేసే రైతన్న కష్టాలపై కనికరించి కన్నీళ్లు తుడవాల్సిన ప్రభుత్వం తనకేమీ పట్టనట్టు వ్యవహరిస్తోంది. గత ఏడాది జరిగిన పంట నష్టాలకు పరిహారం చెల్లించాల్సిన ప్రభుత్వం కడపలో మహానాడు నిర్వహణలో బీజీగా ఉంటే..కర్షకులు కష్టాలతో ఖరీఫ్ సేద్యానికి సిద్ధమయ్యారు. వర్షాలను నమ్ముకుని విత్తనం విత్తి ఆకాశం వైపు చూస్తూ పంటలను సాగు చేసే రైతులు ఈ ఖరీఫ్లోనైనా పంటలు పండకపోతాయా అని ఆశగా ఎదురు చూస్తున్నారు. ప్రకృతి కనికరిస్తుందో లేదోకాని..కర్షకులకు అండగా నిలవాల్సిన ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ పంట నష్ట పరిహారం, ఫెంగల్ తుపాను పరిహారం ఇంతవరకు చెల్లించలేదు. అన్నదాత సుఖీభవ పేరుతో ఇస్తామన్న పెట్టుబడి సాయం కూడా ఇవ్వలేదు. దీంతో రైతులు అన్నివైపుల నుంచి సహకారం లేక చతికిలపడ్డారు. విత్తనం లేదు..ధర చెప్పరు ఖరీఫ్ సాగుకు రైతులు సిద్ధమయ్యారు. పొలాల్లో దుక్కులు చేస్తున్నారు. ఇకపై కురిసే వర్షాలకు పంటలను విత్తడం మొదలవుతుంది. రైతులకు ఏటా పంపిణీ చేసే వేరుశనగ విత్తన కాయల కేటాయింపు చేసిన ప్రభుత్వం వాటిని ఇంతవరకు సరఫరా చేయలేదు. దీంతో రైతులు బహిరంగ మార్కెట్లో కొనుగోలు చేయాలా లేక ప్రభుత్వం ఎప్పటి నుంచి పంపిణీ చేస్తుంది అన్నది ఇప్పటి వరకు ప్రకటించలేదు. రైతులకు 45వేల క్వింటాళ్ల విత్తన కాయలను కేటాయించారు. ఈ విత్తన ధర ఎంత, రాయితీ ఎంత ఇస్తారు, రైతు కిలోకి ఎంత ధర చెల్లించాలి అన్న సమాచారం కూడా ఇప్పటికి ఇవ్వలేదు. జిల్లా వ్యాప్తంగా ఈ ఖరీఫ్లో 62,890 హెక్టార్లలో అన్ని పంటలు సాగవుతాయని వ్యవసాయశాఖ ప్రణాళిక సిద్ధం చేసింది. కేంద్రం రిక్త హస్తం.. గత ఖరీఫ్లో నెలకొన్న కరువుపై ఈ ఏడాది జనవరి 8న కేంద్ర కరువు బృందం తంబళ్లపల్లె, మదనపల్లె నియోజకవర్గాల్లో పర్యటించి వెళ్లింది. అయితే కేంద్రం కూడా రైతాంగాన్ని ఆదుకోవడం కోసం ముందుకు రాలేదు. వేరుశనగ విత్తనం కొంతమేరకు ఉచితంగా పంపిణీ చేయాలని నిర్ణయించడం మినహా ఆర్థిక ప్రయోజనం కలిగించే విధంగా నిర్ణయం తీసుకోలేదు. దీంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కరువు జిల్లాకు మొండిచెయ్యి చూపించాయని రైతులు మథన పడుతున్నారు. కష్టాలతో ఖరీఫ్ సాగు.. జిల్లాలో ఖరీఫ్ సాగు కష్టాలతో మొదలైంది. వేరుశనగ ఎకరా సాగు చేయాలంటే రూ.15 నుంచి రూ.20 వేల దాకా ఖర్చవుతుంది. పొలం దుక్కులు మొదలు, పంట ఒబ్బడి చేసే వరకు ఈ ఖర్చు చేయాలి. ఈ పెట్టుబడి ప్రస్తుతం రైతులకు భారంగా మారింది, గత ఖరీఫ్లో పంటలు నష్టపోవడం, పరిహారం అందకపోగా ప్రభుత్వం రైతు భరోసా పథకాన్ని అమలు చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. ప్రభుత్వం నుంచి ఏడాదిగా రైతాంగానికి పైసా సాయం అందలేదు. దీంతో ఇప్పుడు పెట్టుబడి భారంగా మారింది. ఇంట్లోని బంగారం తాకట్టులో పెట్టగా బ్యాంకుల్లో ఇప్పటికే తీసుకున్న రుణాలు చెల్లించలేక రెన్యూవల్ చేశారు. దీంతో ప్రస్తుతం ప్రభుత్వం సాయం చేయాల్సిన పరిస్థితి ఉన్నప్పటికి పట్టించుకోవడం లేదు. ఖరీఫ్ పరిహారానికి దిక్కులేదు2024 ఖరీఫ్ సేద్యం రైతాంగాన్ని కుదేలు చేసింది. పెట్టిన పెట్టుబడిలో పైసా వెనక్కి రాలేదు. అన్ని పంటలు కలుపుకుని 65,386 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా వర్షాభావ పరిస్థితులతో 24,396 హెక్టార్లలోనే పంటలు సాగు చేశారు. దీంతో ప్రభుత్వం 19 మండలాల్లో కరువు ఉన్నట్టు ప్రకటించింది. మొత్తం సాగు విస్తీర్ణంలో 37.31 శాతం విస్తీర్ణమే సాగైనట్టు లెక్కలు తేల్చారు. ఈ సాగైన పంటల్లో 12,723 హెక్టార్లలో పంటలు పూర్తి నష్టపోయినట్లు వ్యవసాయశాఖ నిర్ధారించింది. ఇందులో వేరుశనగ సాగు చేసిన 23,987 మంది రైతులు పంట పెట్టుబడులు కోల్పోయారని నిర్ధారించి వీరికి రూ.21.50 కోట్ల పంట పెట్టుబడి పరిహారం చెల్లించాలని వ్యవసాయశాఖ ప్రభుత్వానికి అదే ఏడాది నివేదికలను పంపింది. అయితే ఇప్పటి వరకు ఈ పరిహారం ఊసేలేదు. మళ్లీ ఖరీఫ్ వచ్చేసినా ప్రభుత్వం మాత్రం కనికరించడం లేదు. పంటల సాగుకు అవసరమైన పెట్టుబడి కోసం రైతులు అవస్థలు పడుతున్నారు. ఫెంగల్ పరిహారం అంతే.. గత ఏడాది నవంబర్లో వచ్చిన ఫెంగల్ తుపాను ప్రభావంతో జిల్లాలోని గుర్రంకొండ, మదనపల్లె, నిమ్మనపల్లె, రామసముద్రం, కురబలకోట, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, రామాపురం, పీలేరు, కేవీపల్లి, చిన్నమండెం, సంబేపల్లె, రాయచోటి, వాల్మీకిపురం మండలాల్లో తుపాను తీవ్ర ప్రభావం చూపింది, ఈ మండలాల్లోని 100 గ్రామాల్లో పంటలకు నష్టం వాటిల్లింది. 1,098 హెక్టార్లలో 2,560 మంది రైతులకు చెందిన పంటలు నష్టపోయారు. ఈ నష్టాన్ని అంచనా వేసిన వ్యవసాయశాఖ రైతులకు రూ.1.80 కోట్ల పరిహారం చెల్లించాలని అదే నెలలో ప్రభుత్వానికి నివేదికలు పంపినా ఇప్పటివరకు చలనం లేదు. ఫెంగల్ పరిహారం రూ.1.80 కోట్ల మాటే లేదు 2024 ఖరీఫ్ నష్ట పరిహారం రూ.21.5 కోట్ల ఊసే లేదు పెట్టుబడి కోసం ఖరీఫ్ రైతాంగం అవస్థలు సాగు పనులు మొదలైనా ఇంకా నిర్ణయించని రాయితీ ధర కష్టాలతోనే కాడి కట్టిన రైతన్న కరువు రైతాంగంపై కనికరించని ప్రభుత్వం -
మహానాడుకు భారీ బందోబస్తు
కడప అర్బన్ : రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు ఈ నెల 27, 28, 29వ తేదీలలో జిల్లాలో పర్యటిస్తున్న నేపథ్యంలో ఎలాంటి పొరపాట్లకు తావులేకుండా బందోబస్తు నిర్వర్తించాలని జిల్లా ఎస్పీ ఈజీ.అశోక్కుమార్, అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు, సీఐడీ ఎస్పీ శ్రీధర్, నార్కోటిక్స్ ఎస్పీ పి.నగేష్ పేర్కొన్నారు. సీఎంతో పాటుపలువురు వీఐపీలు, మంత్రులు మహానాడులో పాల్గొనే నేపథ్యంలో సికె దిన్నె పరిధిలోని మహానాడు వేదిక, జయరాజ్ గార్డెనన్ హాల్, మాధవీ కన్వెన్షన్ హాల్లో జిల్లా పోలీసు అధికారులు, సిబ్బందితో వారు ప్రత్యేక సమావేశం నిర్వహించారు. ప్రజలకు అసౌకర్యం కలగకుండా విధులు నిర్వర్తించాలన్నారు. ట్రాఫిక్పరంగా అవాంతరాలు లేకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. అనంతరం పబ్బాపురం వేదిక వరకూ కాన్వాయ్ వచ్చే మార్గంలో చేపట్టాల్సిన భద్రతాచర్యలపై కాన్వాయ్ రిహార్సల్స్లో ఎస్పీ పాల్గొ పాల్గొని దిశానిర్దేశం చేశారు.జిల్లా ఎస్పీ ఈజీ అశోక్ కుమార్ -
● మహానాడుకు డుమ్మా కొట్టే యోచన
● కాపు నేతల్ని విస్మరిస్తున్న తెలుగుదేశం పార్టీ ● ఎమ్మెల్సీ సీఆర్సీ, మాజీ ఎమ్మెల్సీ బత్యాల, సుగవాసి బ్రదర్స్కు అప్రాధాన్యత ● మినీ మహానాడు కార్యక్రమానికి దూరంగా ఆ ముగ్గురు ● ఎన్నికల్లో ముందు పెట్టుకొని, ఆపై పక్కన పెట్టిన స్థానిక నేతలు ● రాష్ట్ర మహానాడుకు దూరంగా ఉండిపోవాలని నిర్ణయం! సాక్షి ప్రతినిధి, కడప: ‘యథా రాజా తథా ప్రజా’ అన్నట్లుగా అధినేత చంద్రబాబు స్ఫూర్తితో.. స్థానిక టీడీపీ నేతలు యూజ్ అండ్ త్రో పాలసీ అందిపుచ్చుకున్నారు. ఎన్నికల్లో వాడుకుని ఆపై ఏమీ పట్టనట్లు వదిలేశారు. ఉమ్మడి వైఎస్సార్ జిల్లాలో కాపు(బలిజ) సామాజిక వర్గ నేతల్ని క్రమేపీ దూరం చేశారు. ‘ఆలోచనలు, వ్యూహం, ఎత్తుగడలు మీవే, ఆచరణలో మాత్రమే మేముంటామ’ని చెప్పుకొచ్చి ఎన్నికల్లో వాడుకున్నారు. ఎమ్మెల్యేలుగా ఎన్నికైన తర్వాత విస్మరించారు. అలాంటి బాధితుల్లో ఎమ్మెల్సీ రామచంద్రయ్య, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం, ప్రసాద్బాబు ప్రధానంగా నిలుస్తున్నారని విశ్లేకులు భావిస్తున్నారు. భవిష్యత్తులో అడ్డుగా నిలుస్తారనే.. తెలుగుదేశం పార్టీలో అంతర్గత విభేదాలు తీవ్రస్థాయిలో ఉన్నాయి. భవిష్యత్తులో అడ్డుగా నిలుస్తారనే అభద్రతా భావంతో.. ఎన్నికల్లో వాడుకున్న అనేక మందిని తర్వాత వదిలేశారు. మేధస్సు, సామాజిక బలంతో ఎమ్మెల్సీ రామచంద్రయ్యకు ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ కండువా కప్పారు. సీనియన్ నేత అయినందు వల్ల.. ఎన్నికల్లో ఆయన బలాన్ని బాగా వాడుకున్నారు. తర్వాత విస్మరిస్తూ వచ్చారు. జిల్లాలో అధికారిక కార్యక్రమాల్లో ఎందులోనూ ఆయనకు ప్రాధాన్యత లభించలేదు. ఎమ్మెల్యే మాధవీరెడ్డి పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. ఉనికి కోసం అన్నట్లుగా రామచంద్రయ్య చర్యలు ఉండిపోయాయి. ఇంటి వద్దనే ప్రజాదర్బార్ లాంటి కార్యక్రమాలు చేపడుతూ.. తాను కూడా ఉన్నానని హెచ్చరికలు పంపే చర్యలకు పాల్పడినట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. సుగవాసి కుటుంబానిదీ అదే పరిస్థితి.. రాయచోటి పాలకొండ రాయుడు పేరు తెలియని రాజకీయ నేత.. రాష్ట్రంలోనే ఉండరంటే అతిశయోక్తి కాదు. మునుపటి కాలంలో రాయచోటి ఎన్నికలంటే ప్రత్యక్ష యుద్ధం తెరపైకి వచ్చేది. 1978, 83, 99, 2004లలో ఆయన రాయచోటి ఎమ్మెల్యేగా ఎన్నికయ్యారు. 1984–89 కాలంలో రాజంపేట ఎంపీగా గెలుపొందారు. మండిపల్లి, సుగవాసి కుటుంబాల మధ్య ప్రత్యక్ష యుద్ధం నడిచేది. అలాంటిది మొన్నటి ఎన్నికల్లో మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అభ్యర్థిగా ఎంపిక చేసినా.. సుగవాసి పాలకొండరాయుడు కుటుంబం తెలుగుదేశం పార్టీ ఉన్నతికి పని చేసింది. ఎన్నికల తర్వాత సుగవాసి బాలసుబ్రమణ్యం, ప్రసాద్బాబులను ఆ పార్టీ దూరంగా పెట్టింది. రాజంపేట అభ్యర్థిగా ఎన్నికల్లో నిలిచిన సుగవాసి బాలసుబ్రమణ్యానికి కనీసం ఇన్చార్జి పదవి కూడా అప్పగించలేదు. మరోవైపు పాలకొండరాయుడు మృతి చెందితే.. సీఎం చంద్రబాబు స్వయంగా పరామర్శించిన దాఖలాలు కూడా లేవు. ఇవన్నీ పరిశీలిస్తే కాపులను జిల్లాలో వ్యూహాత్మకంగా దూరంగా పెడుతున్నట్లు విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. బత్యాల.. ఎక్కడ?రైల్వేకోడూరులో అన్నీ తానై నడిపించిన మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు ఇటీవల కాలంలో రాజకీయంగా కనుమరుగయ్యారు. రైల్వేకోడూరు, రాజంపేట సెగ్మెంట్లల్లో కాపు సామాజిక వర్గాన్ని అనువుగా మల్చుకునేందుకు ఎన్నికల ముందు ఆయనకు ప్రాధాన్యత లభించింది. తర్వాత రాజకీయంగా దెబ్బకొట్టే చర్యలకు టీడీపీ పాల్పడుతోంది. గతంలో విశ్వనాథనాయుడుకు ఇన్చార్జి బాధ్యతలు అప్పగించి దెబ్బ కొట్టగా, తాజాగా ఎలాంటి ప్రాధాన్యత లభించడం లేదు. కనీసం రైల్వేకోడూరులోనూ పరిగణనలోకి తీసుకోకుండానే ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆయన వర్గీయులు వాపోతున్నారు. ఇప్పటికే ఎమ్మెల్సీ రామచంద్రయ్య, బత్యాల చెంగల్రాయుడు, సుగవాసి బాలసుబ్రమణ్యం మినీ మహానాడు కార్యక్రమానికి హాజరు కాలేదు. అందుబాటులో ఉండి కూడా.. టీడీపీ నుంచి ఆశించిన స్థాయిలో చొరవ లేకపోవడంతో హాజరు కాలేదని తెలుస్తోంది. ఈక్రమంలో రాష్ట్రస్థాయిలో కడప గడపలో నిర్వహిస్తున్న మహానాడుకు కూడా హాజరు కాకుండా దూరంగా ఉండిపోవాలని ఆయా నేతల అనుచరులు డిమాండ్ చేస్తున్నట్లు సమాచారం. ఆ మేరకు ఆ మగ్గురు మహానాడు డుమ్మా కొట్టే యోచనలో ఉన్నట్లు తెలుస్తోంది. -
28న తైక్వాండో పోటీలు
పోరుమామిళ్ల: పట్టణ శివారులోని మల్లకతువ వద్ద ఉన్న వెంకటేశ్వర ఫంక్షన్ హాలులో ఈ నెల 28న జిల్లా స్థాయి తైక్వాండో పోటీలు, రాష్ట్ర స్థాయి సెలక్షన్స్ జరుగుతాయని జిల్లా తైక్వాండో అసోసియేషన్ సెక్రటరీ నాయబ్రసూల్ ఒక ప్రకటనలో తెలిపారు. బుధవారం జరిగే ఈ పోటీల్లో పాల్గొనే వారు ఆధార్కార్డు, పాస్పోర్టు సైజ్ ఫొటోలు, పుట్టిన తేదీ ధ్రువీకరణ పత్రంతో హాజరు కావాలని ఆయన పేర్కొన్నారు. పోటీలు న్యూ ఆంధ్రప్రదేశ్ తైక్వాండో అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతాయన్నారు. విజయం సాధించిన వారు అనంతపురం జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనుటకు అర్హులని వివరించారు. -
చెరువు మట్టితో టీడీపీ నేత వ్యాపారం
ఖాజీపేట : ఎదుటి వారికి చెప్పేందుకే నీతులుంటాయి అన్న మాటలు వారికి వర్తించవేమో.. ఓ వైపు మైదుకూరు, దువ్వూరు చెరువులు, కొండల నుంచి గ్రీన్ఫీల్డ్ హైవే పనులకు మట్టి తరలిస్తుంటే రెవెన్యూ అధికారులపై ఒత్తిడి తీసుకువచ్చి చర్యలు చేపట్టిన ఎమ్మెల్యే పుట్టా సుధాకర్యాదవ్.. ఖాజీపేట మండలం దుంపలగట్టు చెరువు నుంచి కొన్ని రోజులుగా వందల ట్రాక్టర్లతో టీడీపీ నేత మట్టిని తరలిస్తూ లక్షలు సంపాదిస్తున్నప్పటికీ పట్టించుకోవడం లేదని రైతులు, టీడీపీ వర్గీయులు నివ్వెరపోతున్నారు. కర్నూలు–కడప జాతీయ రహదారి సమీపంలో ఖాజీపేట మండలంలోని దుంపలగట్టు చెరువులో ఇటీవల కేసీ కెనాల్ డిస్ట్రిబ్యూటరీ కమిటీ చైర్మన్గా ఎన్నికై న ఓ టీడీపీ నేత రాత్రింబవళ్లు జేసీబీలు పెట్టి ట్రాక్టర్లతో మట్టిని తరలిస్తూ ఒక్కో గ్రామానికి ఒక్కో రేటు చొప్పున విక్రయిస్తున్నారు. దుంపలగట్టు చెరువు నుంచి రాములపల్లె చెరువులోకి దారి ఏర్పాటు చేసి అక్కడి నుంచి హైవే రోడ్డు మీదుగా చెన్నూరు, ఖాజీపేట మండలాల్లో అన్ని గ్రామాలకు మట్టిని తరలిస్తూ అమ్ముకుంటున్నారు. అనుమతులు లేవు.. నిబంధనలు వ్యతిరేకిస్తూ.. దుంపలగట్టు చెరువులో కేసీ కెనాల్ తూముల కంటే తక్కువ లోతుకు చెరువు చేరుకుంది. ఈ క్రమంలో చెరువు మట్టి మరింత లోతుగా తీస్తే పంట పొలాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారుతుంది. ఈనే పథ్యంలో దుంపలగట్టు చెరువులో మట్టి తవ్వకాలకు ఎలాంటి అనుమతులు ఇవ్వడం లేదని అధికారులు చెబుతున్నారు. అయినప్పటికీ టీడీపీ వర్గీయు డు దర్జాగా చెరువు చెరబట్టి త్రవ్వకాలు జరుపుతూ మట్టిని అమ్ముకోవడం శోచనీయం. టీడీపీ ప్రభు త్వం ఏర్పాటైన ఏడాదిలో కడప నగర సమీపంలో మహానాడు నిర్వహించేందుకు ఓ ఏర్పాట్లు జరుగుతున్నాయి. ఈ ఏర్పాట్లను పర్యవేక్షించేందుకు ఎమ్మెల్యేలు, మంత్రులు కడప–కర్నూలు జాతీయ రహ దారి వెంటే వెళ్తున్నారు. ఈ దారి పక్కనే దుంపలగట్టు చెరువు నుంచి టీడీపీ వర్గీయులు వందల సంఖ్యలో ట్రాక్టర్లు పెట్టి అక్రమంగా మట్టితరలిస్తున్నా పట్టించుకోకపోడం విస్మయం కలిగిస్తోంది. అక్రమ మట్టి త్రవ్వకంపై ఆర్డీఓ, తహసీల్దారు, కేసీ కెనాల్ అధికారులు ఫిర్యాదు చేసినా స్పందించడం లేదని గ్రామస్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రతిప్రతినిధులు, అధికారులు స్పందించి దుంపలగట్టు చెరువులోని మట్టి అక్రమ రవాణపై చర్యలు తీసు కుని చెరువును కాపాడాలని కోరుకుంటున్నారు. దుంపలగట్టు చెరువు నుంచి అక్రమంగా మట్టి తరలింపు ఫిర్యాదు అందినా పట్టించుకోని రెవెన్యూ, కేసీ కెనాల్ అధికారులు ఈ దారి నుంచే మహానాడు ప్రాంగణానికి టీడీపీ నేతలు, మంత్రులు, ఎమ్మెల్యేలు -
వర్షాలు కురుస్తున్నాయి.. విష సర్పాలతో జరభద్రం
రాజంపేట టౌన్ : ఈ ఏడాది రుతుపవనాలు ముందస్తుగానే వచ్చేశాయి. వాతావరణం చల్లబడడమేగాక వర్షాలు కురుస్తున్నాయి. ఇదిలా వుంటే ఇన్ని రోజులు ఎండ వేడిమికి కటవల్లో, చెట్ల నీడన దాగిన విష సర్పాలు ప్రస్తుతం వాతావరణం చల్లబడడంతో పొదల్లోకి వచ్చి చేరుతాయి. అలా బయటకు వచ్చిన విష సర్పాలు రైతులను, ప్రజలను కాటేసే ప్రమాదం ఉంటుంది. సాధారణ సర్పాలైతే పెద్దగా ప్రాణాపాయం ఉండదు. అదే విష సర్పాలు కాటేస్తే వెంటనే వైద్యం చేయించుకోవాల్సిందే. లేకుంటే ప్రాణాలు కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. వర్షాకాలంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల ప్రజలు, రైతులు అప్రమత్తంగా ఉండాల్సిన అవసరం ఉంది. విష ప్రభావం ఉన్న పాములివే కట్లపాము, నాగుపాము, రక్తపింజరి, జెర్రిపోతు వంటి పాముల్లో విష ప్రభావం ఎక్కువగా ఉంటుంది. కట్లపాము కాటేసిన క్షణాల్లోనే విషం రక్తకణాల్లో కలుస్తుంది. ఏమాత్రం ఆలస్యం లేకుండా వైద్యుడిని సంప్రదించి వైద్యం చేయించు కోకుంటే మనిషి ప్రాణాపాయస్థితికి చేరుకుంటాడు. అలాగే నాగుపాము కాటేసిన పదిహేను నిమిషాల్లోనే శరీరంలోకి విషం ఎక్కుతుంది. ఇక రక్తపింజరి కాటేసిన రెండు గంటల్లో విషం శరీరంలోకి చేరుతుంది. జెర్రిపోతు కాటేసిన పెద్ద ప్రమాదం ఉండదు. అయినా చికిత్స చేయించుకోవాలి. పాముకాటును బట్టి వైద్యం పాముకాటును బట్టి కాటేసింది విషపు పామా కాదా నిర్దారణ అవుతుంది. కాటులో రెండు కోరల మధ్య దూరం, లోతును బట్టి వైద్యులకు తెలుస్తుంది. పాము కరిచిన చోట నీలంగా, వంగ పండు రంగులా మారుతుంది. ఉబ్బులా, లావుగా అవుతుంది. ఈ లక్షణాలను బట్టి వైద్యులు కాటేసింది విషపు పామా కాదా అని నిర్ధారిస్తారు. కొంతమంది పాము కాటువేయగానే ఆ ప్రాంతాన్ని కోస్తే రక్తంతోపాటు విషం బయటకు వస్తుందని కత్తి, బ్లేడు వంటి వాటితో గాటు పెడతారు. అలా ఏమాత్రం చేయకూడదని వైద్యులు సూచిస్తున్నారు. ఒకొక్కమారు పాముకాటుకంటే కోసిన గాయం ప్రమాదకరంగా మారవచ్చు. పాము, తేలు కాటు వేసిన వెంటనే ఆలస్యం చేయకుండా వైద్యుడిని సంప్రదించాలి. ఎలాంటి లక్షణాలుంటాయి ● పాము కాటువేసిన ప్రదేశంలో కోరల గాయం స్పష్టంగా కనిపిస్తుంది. నొప్పి తీవ్రంగా ఉంటుంది. ● విషం క్రమంగా పైకి వ్యాపిస్తూ తిమ్మిరిగా అనిపిస్తుంది. పాక్షికంగా పక్షపాతం రావచ్చు. ● నాలుక మందమైనట్లు, గొంతు కండరాలు బిగుసుకున్నట్లు ఉంటుంది. ● కళ్లు మగతగా, శరీరం మత్తుగా ఉండి స్పృహ కోల్పోవచ్చు. రైతులు ఈ జాగ్రత్తలు తీసుకోవాలి ప్రస్తుతం వర్షాలు కురుస్తున్నందున రైతులు పంట పొలాల వద్దకు వెళ్లే సమయంలో, పొలాల గట్టుమీద నడుచుకుంటూ వెళ్లేటపుడు కర్రచప్పుడు చేస్తూ నడవడం మంచిది. పొలాలకు వెళ్లే రైతులు టార్చిలైటు వేసుకుంటూ వెళ్లాలి. ధాన్యం బస్తాలు నిల్వ వుండే చోట, గడ్డివాములు ఉండే ప్రాంతంలో ఎలుకలు, కప్పలు తిరుగుతుంటాయి. అందువల్ల పాము తినేందుకు ఆ ప్రాంతాలకు వచ్చే అవకాశం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆ సమయంలో పాదరక్షలు విధిగా వేసుకువెళ్లాలి.మంచి మందులు ఉన్నాయి పాముకాటుకు ప్రభుత్వ ఆసుపత్రుల్లో మంచి మందులున్నాయి. ఆ వ్యక్తికి ఏఆర్వీ, యాంటి స్నేక్ వీణం మందులతో వైద్యం అందిస్తాం. ఎవరికై నా పాము కరిస్తే నాటు వైద్యం చేయకుండా వెంటనే ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాలి. కొంతమంది పాముకాటు గురైన వెంటనే నాటుమందు, ఆకుపసురుతో వైద్యం చేసుకొని సరిపెడతారు. ఇలా చేస్తే ప్రాణాలను సైతం కోల్పోయే ప్రమాదం లేకపోలేదు. – డాక్టర్ పాలనేని వెంకట నాగేశ్వరరాజు, సూపరిండెంట్, రాజంపేట -
మున్సిపాల్టీలో పన్నులు వసూలు చేయండి
కడప ఎడ్యుకేషన్ : మున్సిపాలిటీల పరిధిలో పన్ను వసూళ్లపై దృష్టి సారించాలని రాష్ట్ర పురపాలక, పట్టణాభివృద్ధి శాఖ మంత్రి నారాయణ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లోని వీసీ హాల్లో మున్సిపల్ అధికారులతో ఆదివారం ఆయన సమీక్షించారు. సమీక్షా సమావేశం ఆయన మాట్లాడుతూ ఆస్తి పన్ను వసూళ్లకు అధిక ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతి వార్డుకు క్లస్టర్ స్థాయి పన్నుల జాబితా రూపొందించాలన్నారు. వాటర్ టాక్స్, అడ్వర్టైజ్మెంట్, ట్రేడ్ లైసెన్స్, షాప్ రెంట్లు, బిల్డింగ్ ఛార్జీల వసూళ్లపై దృష్టి సారించాలన్నారు. బద్వేల్, కమలాపురం అండర్ అసెస్మెంట్లపై సర్వే చేయించాలన్నారు. టౌన్ ప్లానింగ్లో ఆన్లైన్ విధానాన్ని రెండు నెలల్లో అమలు చేస్తామన్నారు. రాబోయే రెండేళ్లలో రూ.125 కోట్లతో నూతన స్లీపింగ్ మిషన్లను అందుబాటులోకి తీసుకువస్తామన్నారు. సమావేశంలో అధికారులు, తదితరులు పాల్గొన్నారు.రాష్ట్ర పురపాలక శాఖ మంత్రి నారాయణ -
ఏఐ ద్వారా చర్మ వ్యాధుల గుర్తింపు
కురబలకోట : చర్మ వ్యాధుల గుర్తింపులో ఏఐ (ఆర్టి ఫిషియల్ ఇంటిలిజెన్స్) ఆధారిత పోర్టబుల్ స్కిన్ డిసీజ్ డిటెక్షన్ఽ సిస్టమ్ను అభివృద్ధి చేసినట్లు ప్రిన్సిపల్ యువరాజ్ తెలిపారు. విలేకరులతో ఆయన మాట్లాడుతూ అంగళ్లులోని మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల ఈసీఈ విభాగ ఆఽఖరి సంవత్సర విద్యార్థులు ఎం.సాయికృష్ణ, పి.తన్వీరుద్దీన్ ఈ ఘనత సాధించారన్నారు. డెర్మోస్కోపీ చిత్రాల ద్వారా చర్మ వ్యాధులను గుర్తించడానికి డీప్ లెర్నింగ్ మోడల్స్ను ఉపయోగిస్తుందన్నారు. రోగులు, ఆరోగ్య సంరక్షణ కార్మికులు సకాలంలో చర్యలు తీసుకోడానికి ఉపయోగపడుతుందన్నారు. తద్వారా సకాలంలో వైద్య పరీక్షలు అందజేయవచ్చన్నారు. విభాగాధిపతి రాజశేఖరన్, ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ డాక్టర్ నాగశ్వేత, అసిస్టెంట్ ప్రొఫెసర్ టి.మణివన్నన్ సహకారంతో ఇది తయారు చేశారని తెలిపారు. అనంతరం విద్యార్థులను కరస్పాండెంట్ ఎన్.విజయభాస్కర్చౌదరి అభినందించారు. -
పురుగుల మందు తాగి యువకుడి మృతి
పీలేరురూరల్ : పురుగుల మందు తాగి యువకుడు ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. పీలేరు పట్టణం లక్ష్మీపురానికి చెందిన కె.రమేష్ కుమారుడు వినయ్కుమార్(30)కు ఆరు నెలలు కిందట చంద్రగిరి మండలం అరశపల్లెకు చెందిన నాగరాజ కుమార్తె శశికళతో వివాహమైంది. కొన్ని రోజుల కిందట వీరి దాంపత్య జీవితంలో సమస్యలు మొదలయ్యాయి. శశికళ పుట్టింటికి వెళ్లిపోగా.. పెద్దలు నచ్చజెప్పినా తిరిగి కాలేదు. దీంతో మనస్తాపం చెందిన వినయ్ కుమార్ ఆదివారం సాయంత్రం పురుగుల మందు తాగి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. గమనించిన కుటుంబసభ్యులు ఆయనను ప్రభుత్వాస్పత్రికి తరలించారు. చికిత్సపొందుతూ మృతిచెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. -
గుజిరీ దుకాణంలో గంజాయి
మదనపల్లె రూరల్ : పట్టణంలో గంజాయి విచ్చలవిడిగా దొరుకుతోంది. చాపకింద నీరులా మత్తు విస్తరిస్తోంది. పట్టణ శివారు, నిర్మానుష్య ప్రాంతాల్లో యువకులు గంజాయి తీసుకుని మత్తులో జోగుతున్నారు. ఈఎస్టీఎఫ్ సీఐ వి.యల్లయ్య, ప్రొహిబిషన్, ఎకై ్సజ్ బీఎంపీపీ సీఐ సత్యశ్రీనివాస్ తెలిపిన వివరాల మేరకు.. నక్కలదిన్నె తండా సమీపంలోని పాత సామాన్లు, స్క్రాప్ విక్రయించే గుజిరీ దుకాణంలో గంజాయి విక్రయాలు జరుగుతున్నట్లు తమకు సమాచారం అందిందన్నారు. ప్రొహిబిషన్, ఎకై ్సజ్, బీఎంపీపీ, రాయచోటి ఈఎస్టీఎఫ్ సీఐ, సిబ్బంది సంయుక్తంగా దాడులు నిర్వహించారని తెలిపారు. పొన్నేటిపాళెంకు వెళ్లే దారిలోని గుజిరీ దుకాణంలో గంజాయి విక్రయిస్తుండగా పట్టుకుని 2.100 కిలోల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ప్రధాన నిందితుడు మోషే అలియాస్ బన్ను పారిపోగా, ఎస్.మహమ్మద్బాషా (22), సయ్యద్సద్దాం (35), బి.దినకర్ (21), పి.సాయిప్రసాద్ (25)లను అరెస్టు చేసి, గంజాయి రవాణాకు వినియోగిస్తున్న హోండా డియో టూవీలర్ను సీజ్ చేశామన్నారు. సీఐ సత్య శ్రీనివాస్ మాట్లాడుతూ చిన్నవయస్సులోనే యువకులు మాదక ద్రవ్యాలకు బానిసలయితే వారి భవిష్యత్తు అగమ్యగోచరంగా తయారవుతుందన్నారు. ఆస్పత్రిలో పారిపోయే ప్రయత్నం గంజాయి అమ్ముతుండగా పట్టుకున్న నిందితులను రిమాండ్కు పంపే ముందు వైద్య పరీక్షల కోసం ఎక్సై జ్ సిబ్బంది జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. నిందితులను పరీక్షిస్తుండగా గంజాయి మత్తులో ఉన్న పల్లపోలు సాయిప్రసాద్ పోలీసుల కళ్లుగప్పి తప్పించుకునేందుకు ప్రయత్నించాడు. వేగంగా పరిగెత్తగా, అప్రమత్తమైన ఆస్పత్రి సెక్యూరిటీ సిబ్బంది అతడిని పట్టుకున్నారు. మత్తులో ఉన్న సాయి ప్రసాద్ పిచ్చిపిచ్చిగా మాట్లాడుతూ, మత్తులో తూలడం కనిపించింది.ఐదుగురి అరెస్టు, 2.100 గ్రాముల స్వాధీనం -
హార్సిలీహిల్స్ ఘాట్లో బైక్ ప్రమాదం
బి.కొత్తకోట : సరదాగా హార్సిలీ హిల్స్ పర్యటనకు వచ్చి వెనుదిరిగిన పర్యాటకులు ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికుల కథనం మేరకు.. మదనపల్లె పట్టణం విజయనగర కాలనీకి చెందిన నిఖిల్ (20), నితిన్ (22), చీకలగుట్టకు చెందిన భరత్ (19) హార్సిలీహిల్స్ సందర్శించేందుకు బైక్పై వచ్చారు. సాయంత్రం వరకూ సేదతీరి మదనపల్లెకు వెనుదిరిగారు. ఘాట్ రోడ్డుపై వస్తుండగా ఎదురుగా వస్తున్న కారును తప్పించబోయి ప్రమాదానికి గురయ్యారు. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడడంతో స్థానికుల సహకారంతో మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. నిఖిల్, నితిన్లనుమెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. భరత్ స్థానికంగానే చికిత్స పొందుతున్నాడు. ఈ ఘటనపై పోలీసులు వివరాలు సేకరిస్తున్నారు. కాగా సరదాగా సేద తీరి ప్రకృతి అందాలను తిలకించి వెళ్తుండగా ప్రమాదానికి గురికావడంపై స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ముగ్గురు పర్యాటకులకు తీవ్ర గాయాలు -
సర్పంచ్ భర్త కారుపై దాడి
గుర్రంకొండ : మండలంలోని ఎల్లుట్ల గ్రామ సర్పంచ్ లలిత భర్త మురళీకృష్ణ కారుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడి చేసిన సంఘటన శుక్రవారం రాత్రి జరిగింది. పోలీసుల కథనం మేరకు మురళీ కృష్ణ మండల టీడీపీ నాయకుడిగా, గుర్రంకొండ క్లస్టర్ టీడీపీ ఇన్చార్జిగా వ్యవహరిస్తున్నారు. శుక్రవారం పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్కుమార్రెడ్డితో కలసి కడపలో నిర్వహించనున్న మహానాడు ఏర్పాట్లు పరిశీలించేందుకు వెళ్లారు. తిరుగు ప్రయాణంలో తాను గుర్రంకొండకు వస్తున్నానని ఇంటి దగ్గర నుంచి కారు తీసుకురావాల్సిందిగా డ్రైవర్ రెడ్డిశేఖర్కు ఫోన్ చేశారు. డ్రైవర్ కారు తీసుకొని గుర్రంకొండకు వస్తుండగా మార్గమధ్యంలో తురకపల్లె కనుమ వద్ద కొందరు కారును అడ్డగించి అద్దాలు పగులగొట్టినట్లు డ్రైవర్ పేర్కొన్నాడు. కంట్లో కారంపొడి చల్లి తనపై దాడి చేసేందుకు ప్రయత్నించినట్లు డ్రైవర్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు శనివారం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘరామ్ తెలిపారు. రహదారి విస్తరణకు పరిహారం చెల్లించాలి లక్కిరెడ్డిపల్లి : మండల కేంద్రంలోని మూడవ వార్డు, నాలుగో వార్డు పరిధిలో జాతీయ రహదారికి ఇళ్లు కోల్పోతున్న కుటుంబాల వారు శనివారం డిప్యూటీ తహసీల్దార్ రెడ్డన్నకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ చాగలమర్రి నుంచి రాయచోటి వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారికి సంబంధించి ఆయా ఇళ్ల వారికి నష్ట పరిహారం చెల్లించారన్నారు. తిరిగి ఇప్పుడు ముందు కోల్పోతున్న దానికంటే ఎక్కువగా మార్కింగ్ వేశారన్నారు. అందుకు తగిన పరిహారం చెల్లించి న్యాయం చేయాలని కోరారు. పురుగుల మందు తాగి వ్యక్తి ఆత్మహత్యచాపాడు : మండలంలోని ద్వారకానగరం గ్రామానికి చెందిన చింతకుంట దస్తగిరి (33) అనే వ్యక్తి శుక్రవారం రాత్రి పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. దస్తగిరి గత కొన్ని రోజులుగా అప్పుల బాధతో మనస్థాపానికి గురయ్యాడు. ఈ నేపథ్యంలో శుక్రవారం సాయంత్రం పురుగుల మందు తాగాడు. రిమ్స్లో చికిత్స పొందుతూ మృతి చెందాడు. -
ద్విచక్రవాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనం ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం రాత్రి మండలంలో జరిగింది. పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీకి చెందిన నాగరాజు కుమారుడు కిషోర్ (29) ద్విచక్రవాహనంలో ఇంటికి వస్తుండగా క్రిష్ణాపురం జ్యూస్ఫ్యాక్టరీ వద్ద మరో ద్విచక్రవాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ..నిమ్మనపల్లె : ఆర్టీసీ బస్సు ఢీకొని మహిళ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మండలంలో జరిగింది. సోమల మండలం కందూరు పంచాయతీ చెరుకువారిపల్లెకు చెందిన సతీష్రెడ్డి భార్య సుజాత (35) కుమారుడిని మదనపల్లె పట్టణం వివేకానందనగర్లో ఉంటున్న పుట్టింటిలో వదిలి వెళ్లేందుకు ద్విచక్రవాహనంలో వచ్చింది. తిరిగి ద్విచక్రవాహనంలో మదనపల్లె నుంచి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని కొండయ్యగారిపల్లె పంచాయతీ కొమ్మిరెడ్డిగారిపల్లె క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన ఆర్టీసీ బస్సు ఢీకొంది. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా గమనించిన స్థానికులు 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. స్థానిక పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. కరెంటు షాక్తో..మదనపల్లె రూరల్ : కరెంటు షాక్కు గురై మహిళ గాయపడిన సంఘటన శనివారం పుంగనూరు మండలంలో జరిగింది. కృష్ణాపురం గ్రామానికి చెందిన శివకుమార్ భార్య తులసీ (35) ఇంటి ముందు ఉన్న కమ్మిపై బట్టలు ఆరేస్తుండగా సమీపంలోని సర్వీసు వైరు తగిలి కరెంటు షాక్కు గురైంది. ప్రమాదంలో ఆమె గాయపడగా కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. రోడ్డు ప్రమాదంలో కూలీ మృతిమదనపల్లె : తంబళ్లపల్లెలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందిన విషాదకర సంఘటన శనివారం రాత్రి పరసతోపు వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు.. మండలంలోని ఏటిగడ్డపల్లెకు చెందిన లక్ష్మీనారాయణ(66) దినసరి కూలితో జీవనం సాగిస్తాడు. ఇంటి నుండి భోజనం చేసి మామిడి కాయలతోపునకు కాపలా నిమిత్తం పరసతోపు వద్దకు రాగానే గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. దీంతో అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్ఐ లోకేష్ రెడ్డి వెంటనే ఘటన స్థలం వద్దకు చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం కోసం మదనపల్లి ప్రభుత్వాసుపత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామని తెలిపారు. మృతి చెందిన అఘోరి కృష్ణానంద భారతి పరమహంసగా గుర్తింపుచిట్వేలి : చిట్వేలి మండల పరిధిలోని గుండాలకోన గుండంలో పడి శుక్రవారం మృతి చెందిన అఘోరిని శ్రీకృష్ణానంద భారతి పరమహంస(33)గా గుర్తించినట్లు రైల్వేకోడూరు రూరల్ సీఐ వెంకటేశ్వర్లు శనివారం తెలిపారు. అఘోరికి సంబంధించిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆమె చిన్న వయస్సులోనే యూకే లండన్లో నివసించి ఆధ్యాత్మిక చింతనలో ఉంటూ సత్యాన్వేషణ చేశారు. తన సంపాదన అంతా దానధర్మాలు చేసి భారతదేశం వచ్చి విజయనగరం జిల్లా గుర్లమండలం, పున్నపురెడ్డిపేట శ్రీ సిద్దయోగాశ్రమం, బ్రహ్మర్షి లక్ష్మణానంద స్వామి వద్ద సిద్ధ విద్య స్వీకరించారని ఆశ్రమ కార్యనిర్వాహక సభ్యుడు పవన్ కుమార్ తెలిపారు. అఘోరి గుండాల కోన గుండం పై భాగంలో ధ్యానం చేస్తూ కాలు జారి గుండంలో పడి మృతి చెందినట్లు తెలిసిందన్నారు. భౌతిక కాయాన్ని ఆశ్రమ సభ్యుడు పవన్ కుమార్కు శనివారం మధ్యాహ్నం అప్పగించినట్లు సీఐ తెలిపారు. టైలరింగ్, బ్యూటీ థెరపీపై శిక్షణతంబళ్లపల్లె : స్థానిక టీఎన్.వెంకటసుబ్బారెడ్డి మెమోరియల్ ప్రభుత్వ ఐటీఐలో రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ స్కిల్ హబ్ సెంటర్ ద్వారా మహిళలకు టైలరింగ్, బ్యూటీ థెరపీపై శిక్షణ ఇస్తున్నట్లు ప్రిన్సిపల్ శ్రీనివాసులురెడ్డి, కో ఆర్డినేటర్ చౌడయ్య తెలిపారు. మూడు నెలల పాటు ఈ శిక్షణ ఇస్తారని, 15 సంవత్సరాలకు పైబడి 45 ఏళ్ల వయస్సు లోపు ఉన్న మహిళలు అర్హులన్నారు. ఆసక్తి కలిగిన మహిళలు ఈ నెల 29వ తేదీ లోపు ఐటీఐ కార్యాలయంలో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ నంబర్ 9618655759లో సంప్రదించాలన్నారు. -
వైఎస్సార్సీపీ అనుబంధ విభాగాల అధ్యక్షుల నియామకం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షుడు వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాలోని వివిధ మండలాల అనుబంధ విభాగాల అధ్యక్షులను నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. గుర్రంకొండ మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా పి. కిరణ్కుమార్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎస్.సరస్వతి, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎ.గురుశేఖర్, బీసీ విభాగం అధ్యక్షులుగా కె.గురుమూర్తి, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా ఆర్.సుందరయ్య, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా బి.నాగేంద్రనాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్.మునీర్ అహ్మద్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.సుబ్రమణ్యం, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎం.పవన్కుమార్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా ఎస్.రాజగోపాల్, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా ఎంవీ రమణారెడ్డి, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుడిగా పి.నజీర్, చేనేత విభాగం అధ్యక్షులుగా కె.రామకృష్ణ, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా డి.నారాయణ, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడిగా కేఎస్ అస్లం, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఇ.ప్రభాకర్నాయుడు, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా ఎస్.శ్రీపతి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా కె.నాగరాజ, ప్రచార విభాగం అధ్యక్షుడిగా సి.రమణయ్యలు నియమితులయ్యారు. కలకడ మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా కె.దామోదర్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా సరళ, రైతు విభాగం అధ్యక్షుడిగా బి.వెంకట ప్రసాద్రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా శేఖర్ మాధవ్, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా పి.రామాంజులు, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.రామకృష్ణ నాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా వరుగు సద్దాం, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎస్ఎం ముబారక్ అహ్మద్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా టీఎస్ షావత్ అలీఖాన్, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా వి.మధుసూదన్రెడ్డి, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుడిగా పి.మహమ్మద్ రఫీ, చేనేత విభాగం అధ్యక్షులుగా జి.శ్రీనివాసులు, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఆర్.వెంకట రమణ, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడిగా బి.లక్ష్మన్న, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా టి.రేఖానందరెడ్డి,సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా బి.వెంకటేశ్వరనాయుడు, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా బి.యల్లప్ప, ప్రచార విభాగం అధ్యక్షుడిగా జి.శ్రీనివాసులురెడ్డిలు నియమితులయ్యారు. కలికిరి మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా వి.ఫయాజ్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా టి.విజయారెడ్డి, రైతు విభాగం అధ్యక్షుడిగా కె.వేణుగోపాల్రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా జె.వీరభద్రయ్య, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా సి.సహదేవ, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా జె.రమేష్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా వి.ఖాదర్బాష, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా వి.కృష్ణమూర్తి, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా సి.ఓబుల్రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా టి.జయప్రకాశ్రెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా ఓ.ధనుంజయ, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుగా ఎస్.జాకీర్, చేనేత విభాగం అధ్యక్షులుగా పి.ఆనంద, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా జి.రాజగోపాల్, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా వి.జ్యోతి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఎస్.మస్తాన్, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా వి.భాను ప్రకాశ్, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎస్.రవికుమార్,ప్రచార విభాగం అధ్యక్షుడిగా వి.సునీల్కుమార్రెడ్డి నియమితులయ్యారు. కేవీ పల్లె మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా కె.నాగరాజ, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.స్వప్న, రైతు విభాగం అధ్యక్షుడిగా ఎస్.జయప్రకాశ్రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా కె.నాగేశ్వర, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా కె.రెడ్డెప్ప, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా డి.చంద్రానాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా జి.ఫిరోజ్ఖాన్,క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా పి.విజయ్కుమార్,విద్యార్థి విభాగం అధ్యక్షులుగా సి. గోవర్దన్రెడ్డి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా వి.గణపతిరెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా సి.చంద్రారెడ్డి, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుగా వి.బాలకృష్ణ, చేనేత విభాగం అధ్యక్షులుగా బి.చౌడయ్య, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎ.రమణ, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడిగా సీకే యల్లారెడ్డి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఉమాదేవి, సాంస్కృతిక విభాగం అధ్యక్షుడిగా ఆర్.సురేష్, సోషల్ మీడియా విభాగం అధ్యక్షుడిగా ఎం.జదీశ్వర్రెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా బి.మహేంద్రారెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఎస్.గౌస్బాషలు నియమితులయ్యారు. పీలేరు మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా బి.దినేష్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.రాజేశ్వరి, రైతు విభాగం అధ్యక్షుడిగా చక్రపాణిరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా ఎన్.నాగభూషణ, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా సి.వెంకటేశ్వర, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.మునీంద్ర,మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్.మసూద్, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా ఎస్కే మహమూద్ ముస్తాక్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా ఎ.సందీప్రెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా జయపాల్రెడ్డి, వలంటీర్స్ విభాగం అధ్యక్షుడిగా పి.రామాంజులు,చేనేత విభాగం అధ్యక్షులుగా సుబ్రమణ్యం, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా రవీంద్రారెడ్డి, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షుడిగా ఎస్.మహబూబ్బాష, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఎస్.సబీన,సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా సాహూర్బాష, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా రామచంద్ర, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఇస్మాయిల్ నియమితులయ్యారు. వాల్మీకిపురం మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా జి.జగదీష్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.స్వాతి, రైతు విభాగం అధ్యక్షుడిగా వై.మల్లేశ్వరరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా బి.చంద్రశేఖర, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా కె.రఘు, ఎస్టీ విభాగం అధ్యక్షులుగావినోద్కుమార్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఆర్ఎం అసర్ ఖతీర్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా శ్యాం, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా భవాని ప్రసాద్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా పీవీ రామకృష్ణారెడ్డి,వలంటీర్స్ విభాగం అధ్యక్షులుగా ఆర్.శివ, చేనేత విభాగం అధ్యక్షులుగా బి.శ్రీనివాసులురెడ్డి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా బి.మంజుల, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఓజీ మల్లయ్య, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా బి.రాజిబాబు, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా డి.శ్రీనివాసులు, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఎం.నరసింహారెడ్డి నియమితులయ్యారు. రామాపురం మండలం యువజన విభాగం అధ్యక్షుడిగా భరత్కుమార్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా సి.రాజసులోచన, రైతు విభాగం అధ్యక్షుడిగా జి.నాగబసిరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా డి.బసయ్య, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా వి.సురేష్, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా శంకర్ నాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా అయ్యుబ్ అలీఖాన్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఈఎస్ విజయ్కుమార్, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా వి.ఖాదర్బాష, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా పి.వెంకటరెడ్డి, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుగా ఎం.జయరాం, చేనేత విభాగం అధ్యక్షులుగా బి.వెంకటేశ్, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎన్.హరినాథ్, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షులుగా ఎస్.అంజి, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఎం.మాధవి,సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా కె.వీరారెడ్డి, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా జి.శివారెడ్డి, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా టి.రామ్మోహన్రెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షులుగా ఎం.రామచంద్రారెడ్డిలు నియమితులయ్యారు. సంబేపల్లె మండలం యువజన విభాగం అధ్యక్షులుగా జి.హరీష్కుమార్రెడ్డి, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎం.భాగ్యమ్మ, రైతు విభాగం అధ్యక్షులుగా పి.అమర్నాథరెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా పి.నాగరాజు, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా వై.రామ్మోహన్, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా బి.శ్రీనునాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగాషేక్ మహబూబ్బాష, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎం.రెడ్డెయ్య, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా పి.రాజశేఖర్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా కె.వాసుదేవరెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా జి.చంద్రశేఖర్రెడ్డి, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుగా వి.శ్రీనివాసులురెడ్డి, చేనేత విభాగం అధ్యక్షులుగా సహదేవ, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా వి.ప్రతాప్రెడ్డి, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షులుగా పి.రవీంద్రనాయుడు, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా ఎం.నాగరత్నమ్మ, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఓ.చిన్న భద్రయ్య, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా కె.బాలాజీ, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎన్.సుభాన్, ప్రచార విభాగం అధ్యక్షుడిగాఎం.అశోక్రెడ్డిలు నియమితులయ్యారు. కురబలకోట మండలం యువజన విభాగం అధ్యక్షులుగా జె.లోకేష్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా ఎన్.రమాదేవి, రైతు విభాగం అధ్యక్షులుగా ఎస్.వెంకట సుబ్బారెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా సి.మోహన, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా కె.సుధాకర్, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా రామచంద్ర, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా నౌషద్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఆనంద్, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా అబ్దుల్, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా కృష్ణారెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా జి.అశోక్రెడ్డి, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుగా జె.ప్రతాప్, చేనేత విభాగం అధ్యక్షులుగా భాస్కర్రెడ్డి, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎంపీ పద్మనాభరెడ్డి, వెఎస్సార్ టీయూసీ అధ్యక్షులుగా జి.మధుకర్రెడ్డి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఈశ్వర్, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా అమన్, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎన్.శ్రీకాంత్రెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా గోపాల్రెడ్డి నియమితులయ్యారు. పెద్దమండ్యం మండలం యువజన విభాగం అధ్యక్షులుగా ఎస్.సాదిక్, మహిళా విభాగం అధ్యక్షురాలిగా జి.వెంకటలక్ష్మి, రైతు విభాగం అధ్యక్షులుగా టి.ఈశ్వర్రెడ్డి, బీసీ విభాగం అధ్యక్షులుగా సి.బాలాజీ, ఎస్సీ విభాగం అధ్యక్షులుగా సి.మల్లయ్య, ఎస్టీ విభాగం అధ్యక్షులుగా బి.ఆంజనేయులు నాయక్, మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్.ఫయాజ్, క్రిస్టియన్ మైనార్టీ విభాగం అధ్యక్షులుగా ఎస్.సాలమ్మ, విద్యార్థి విభాగం అధ్యక్షులుగా సి.రామిరెడ్డి, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షులుగా ఎస్.కుమార్రెడ్డి, ఆర్టీఐ విభాగం అధ్యక్షులుగా సి.శ్రీనివాసులు, వలంటీర్స్ విభాగం అధ్యక్షులుగా బి.రామచంద్ర, చేనేత విభాగం అధ్యక్షులుగా ఎం.మల్లికార్జున, వాణిజ్య విభాగం అధ్యక్షులుగా ఎం.నరసింహులు, వైఎస్సార్ టీయూసీ అధ్యక్షులుగా టి.నరసింహులు, అంగన్వాడీ విభాగం అధ్యక్షురాలిగా జె.హరికుమారి, సాంస్కృతిక విభాగం అధ్యక్షులుగా ఎన్.సుధాకర్రెడ్డి, సోషల్ మీడియా విభాగం అధ్యక్షులుగా జి.కిశోర్, దివ్యాంగుల విభాగం అధ్యక్షులుగా ఎ.ఈశ్వర్రెడ్డి, ప్రచార విభాగం అధ్యక్షుడిగా ఎం.కుమార్నాయుడు నియమితులయ్యారు. -
కాలువ కబ్జాను పట్టించుకోని అధికారులు
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలోని కోట్ల రూపాయలు విలువ చేసే కాలువ 1.55 సెంట్లు కబ్జాకు గురైందని, అర్జీ ఇచ్చి మూడు నెలలైనా అధికారులు పట్టించుకోవడం లేదని సీనియర్ నాయకుడు ఓజీ శ్రీనివాసులు రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మర్రిమాను వద్ద నుండి ప్రభుత్వ ఆసుపత్రి, వై.కోట రోడ్డులో విలువైన కాలువ భూమి కబ్జాకు గురైందని, ఫిబ్రవరి 3వ తేదీ ప్రజా పరిష్కార వేదిక కార్యక్రమంలో రెవెన్యూ అధికారులకు అర్జీ ఇచ్చానన్నారు. అయితే ఇప్పటి వరకు రెవెన్యూ అధికారులు పట్టించుకోలేదన్నారు. కోట్ల రూపాయలు విలువచేసే కాలువ భూమి కబ్జాలకు పాల్పడి దళారులు అమ్ముకుంటున్నారన్నారు. దీనిపై ఇటీవల రాజంపేట సబ్ కలెక్టర్ వైఖోమ్ నదియా దేవికి ఫిర్యాదు చేశామన్నారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మదనపల్లె రూరల్ : ఉపాధి కోసం విదేశాలకు వెళ్లి, కుటుంబాన్ని తనతోపాటు తీసుకెళ్లాలని స్వగ్రామానికి వచ్చిన వ్యక్తి, విధి వక్రించి గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో దుర్మరణం పాలైన సంఘటన శుక్రవారం రాత్రి తంబళ్లపల్లె మండలంలో జరిగింది. పెద్దమండ్యం మండలం ముసలికుంట పంచాయతీ గోనెపోతులవారిపల్లెకు చెందిన సిద్ధప్పనాయుడు, రెడ్డెమ్మ దంపతుల కుమారుడు జి.శేషప్పనాయుడు(31), ఉపాధి నిమిత్తం కువైట్కు వెళ్లి అక్కడ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. 20 రోజుల క్రితం తన కుటుంబాన్ని అక్కడికే తీసుకెళ్లాలని స్వగ్రామానికి వచ్చాడు. ఈ నేపథ్యంలో తన భార్య లక్ష్మీ అపర్ణ తల్లి ఈశ్వరమ్మకు అనారోగ్యం కావడంతో మదనపల్లెలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. శుక్రవారం ఆమెకు ఆపరేషన్ నిర్వహించగా, శేషప్పనాయుడు ఆస్పత్రికి వచ్చి ఆమెను చూసి తిరిగి ద్విచక్రవాహనంలో స్వగ్రామానికి రాత్రివేళలో బయలుదేరాడు. మార్గమధ్యంలోని తంబళ్లపల్లె మండలం రెడ్డికోట పంచాయతీ కుక్కరాజుపల్లె క్రాస్ వద్ద గుర్తుతెలియని వాహనం వేగంగా వచ్చి ఢీ కొంది. ప్రమాదంలో శేషప్పనాయుడుకు తీవ్ర గాయాలై, కొన ఊపిరితో ఉండగా గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన అత్యవసర విభాగ వైద్యులు అతను అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. దీంతో అవుట్పోస్ట్ సిబ్బంది తంబళ్లపల్లె పోలీసులకు సమాచారం అందించి మృతదేహాన్ని పోస్ట్మార్టం నిమిత్తం మార్చురీ గదికి తరలించారు. శనివారం పోస్టుమార్టం పూర్తయిన అనంతరం శేషప్పనాయుడు మృతదేహాన్ని తంబళ్లపల్లె ఎస్ఐ లోకేష్ రెడ్డి మృతుని కుటుంబ సభ్యులకు అప్పగించారు. శేషప్పనాయుడుకు చంద్రశేఖర్నాయుడు(10), మల్లిక(08) ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవితంలో స్థిరపడి, కుటుంబాన్ని తనతోపాటు కువైట్కు తీసుకెళ్లి సంతోషంగా జీవించాలనుకున్న శేషప్పనాయుడు మృతితో కుటుంబంలో విషాదం నెలకొంది.మృతుడు 20 రోజుల క్రితం కువైట్ నుంచి రాక -
ఐటీఐ అభ్యర్థులకు సర్టిఫికెట్ల పరిశీలన
రాజంపేట టౌన్ : ఐటీఐలలో ప్రవేశాల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 26వ తేదీ సాయంత్రం ఐదు గంటలలోపు సమీపంలోని ప్రభుత్వ ఐటీఐలలో ఒరిజినల్ సర్టిఫికెట్లను పరిశీలన (వెరిఫికేషన్) చేయించుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణ సంస్థ జిల్లా కన్వీనర్ రామిరెడ్డి రఘురామిరెడ్డి శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోకుంటే వారి పేరు మెరిట్ జాబితాలోకి తీసుకోబడదన్నారు. జిల్లాలో మూడు ప్రభుత్వ, 12 ప్రైవేట్ ఐటీఐలు ఉన్నాయని వివరించారు. వెబ్సైట్లో జాబితా రాయచోటి టౌన్ : రాయలసీమ పరిధిలోని అనంతపురం, చిత్తూరు, కడప, కర్నూల్ పూర్వపు జిల్లాలోని 32 మంది ప్రధానోపాధ్యాయులు ఆన్లైన్లో సమర్పించిన బదిలీల ఆప్లికేషన్లు ఆప్రూవల్ చేసి జాబితాను ఆర్జేడీ వెబ్సైట్లో ఉంచినట్లు పాఠశాల విద్య ఆర్జేడీ కాగిత శామ్యూల్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రధానోపాధ్యాయులు ఈ సీనియారిటి జాబితాను పరిశీలించుకోవాలని వారు సూచించారు. నూతన నియామకం కడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు నాయకులను పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. పీలేరుకు చెందిన కె.మహితను స్టేట్ మహిళా విభాగం ప్రధాన కార్యదర్శిగా, రాజంపేటకు చెందిన పి.రెహ్మన్ఖాన్ను రాష్ట్ర బూత్ కమిటీల విభాగం ప్రధాన కార్యదర్శిగా, ఒంటిమిట్ట తేజను రాష్ట్ర ప్రచార విభాగం కార్యదర్శిగా, మదనపల్లెకు చెందిన డి.శేఖర్రెడ్డిని రాష్ట్ర మేధావుల ఫోరం ప్రధాన కార్యదర్శిగా నియమించారు. క్రిస్టియన్ మైనార్టీ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా.. అన్నమయ్య జిల్లా రాజంపేట అసెంబ్లీ నియోజకవర్గానికి చెందిన హస్తవరం ఆనందకుమార్ను రాష్ట్ర క్రిస్టియన్ మైనార్టీ విభాగం ప్రధాన కార్యదర్శిగా నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. 31న సౌమ్యనాథాలయంలో యోగాంధ్ర నందలూరు : జిల్లాలో ప్రసిద్ధి గాంచిన శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయంలో ఈ నెల 31న ఉదయం 8 గంటలకు యోగాంధ్ర కార్యక్రమం నిర్వహించనున్నట్లు జిల్లా టూరిజం అధికారి నాగభూషణం పేర్కొన్నారు. నందలూరులోని శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఆయన శనివారం పరిశీలించి, దేవదాయ శాఖ అధికారులతో ఏర్పాట్లపై చర్చించారు. అనంతరం మాట్లాడుతూ జూన్ 21న జాతీయ యోగా దినోత్సవం పురస్కరించుకుని రాష్ట్ర వ్యాప్తంగా యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు ఆదేశాలు జారీ చేయడం జరిగిందని తెలిపారు. అందులో భాగంగా జిల్లాలోని నాలుగు ప్రధాన పర్యాటక కేంద్రాల వద్ద యోగాంధ్ర కార్యక్రమాలు నిర్వహించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ ఆదేశించారన్నారు. ఈ మేరకు శ్రీ సౌమ్యనాథస్వామి ఆలయాన్ని ఎంపిక చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రాధాకృష్ణంరాజు, ఈఓపీఆర్డీ సునీల్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఎలాంటి సేవలు అందడం లేదు
రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రైతు భరోసా కేంద్రాల ద్వారా రైతులకు ఎలాంటి సేవలు అందడం లేదు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా.. పథకాలను మాత్రం యథాతథంగా కొనసాగించాలి. అప్పుడే రైతులకు మేలు జరుగుతుంది. ప్రభుత్వాలు మారినప్పుడల్లా వారికి అనుకూలంగా పథకాలను మార్చడం, సేవలను నిర్వీర్యం చేయడం సబబు కాదు. రాజకీయాలకు అతీతంగా ఆర్బీకే సేవలను నిర్వహించాల్సిన అవసరం ఉంది. – మద్దిరేవుల సుదర్శన్రెడ్డి, ఎంపీపీ, లక్కిరెడ్డిపల్లి -
పోలీస్ వాహనానికి ఫైన్
రాయచోటి : చట్టానికి ఎవరూ అతీతులు కారు. చట్టప్రకారం నడుచుకోవడం అందరి బాధ్యత. అయితే కొందరు చట్టాలను ఉల్లంఘిస్తుంటారు. ఈ నేపథ్యంలో శనివారం ఓ కానిస్టేబుల్ తన బైక్ నంబర్ ప్లేట్పై వాహనం రిజిస్ట్రేషన్ నంబరు వేయకపోవడాన్ని గుర్తించిన సీఐ మొదటి తప్పుగా జరిమానాతో సరిపెట్టారు. ఈ అరుదైన సంఘటన అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి పట్టణంలోని నాలుగురోడ్ల కూడలిలో చోటు చేసుకుంది. అనునిత్యం రద్దీగా ఉండే ఈ ప్రాంతలో ఓ కానిస్టేబుల్ ద్విచక్రవాహనం నంబరు ప్లేట్ మీద నంబర్ లేకుండా.. పోలీస్ అని బోర్డు తగిలించుకొని రయ్ మని వెళ్తుండగా త్రిబుల్ స్టార్ ట్రాఫిక్ పోలీస్ అధికారి విశ్వనాథరెడ్డి గుర్తించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా పోలీస్ వెళ్తున్న ద్విచక్ర వాహనాన్ని ఆపి నంబర్ ప్లేట్పై రిజిస్ట్రేషన్ నంబర్ లేకపోవడం పట్ల కానిస్టేబుల్ను సీఐ ప్రశ్నించారు. నిబంధనలకు విరుద్ధంగా నంబర్ ప్లేట్ మీద నంబర్ లేకుండా పోలీస్ అని రాయడం నేరమంటూ ఫొటో తీసి రూ.335 జరిమానా వేశారు. వెంటనే పేరు తొలగించి రిజిస్ట్రేషన్ నంబర్ను వేయించుకోవాలని ఆ కానిస్టేబుల్కు చెప్పి పంపారు. ఈ దృశ్యం అక్కడ ఉన్న ప్రజలను ఆశ్చర్యచకితులను చేసింది. సీఐ చిత్తశుద్ధిని ప్రజలు ప్రశంసించగా.. మిగిలిన వాహనదారులకు హెచ్చరికగా ఉందన్న వ్యాఖ్యలు కూడా వినిపించాయి. నంబర్ ప్లేట్పై పోలీస్ అని రాయడం చట్ట విరుద్ధం రూ. 335 జరిమానా విధించిన సీఐ -
మినీ మహానాడుకు కీలక నేతల డుమ్మా
రాయచోటి : రాయచోటి నియోజకవర్గంలో టీడీపీ నిర్వహించిన మినీమహానాడు కార్యక్రమానికి కీలక నేతలు డుమ్మా కొట్టడం చర్చనీయాంశమైంది. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ఆధ్వర్యంలో గాలివీడు మండల కేంద్రంలో శనివారం మినీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుగవాసి పాలకొండరాయుడు తనయులు సుబ్రమణ్యం, ప్రసాద్బాబు, లక్కిరెడ్డిపల్లి మాజీ ఎమ్మెల్యే ద్వారకానాథరెడ్డితోపాటు వారి అనుచరులు దూరంగా ఉన్నారు. 40 ఏళ్లుగా టీడీపీకి సేవలు అందిస్తూ పార్టీ అభివృద్దికి పాటుపడిన సుగవాసి కుటుంబానికి ప్రాధాన్యత కల్పించకపోవడంపై అభిమానులు మండిపడుతున్నారు. మినీ మహానాడులో దివంగత నేత సుగవాసి పాలకొండరాయుడుకు కనీసం నివాళులు అర్పించకపోవడం ఎంత వరకు సమంజసమంటూ సోషల్ మీడియా వేదికగా విమర్శలు గుప్పిస్తున్నారు. టీడీపీ ఆవిర్భావం నుంచి నిన్న జరిగిన సార్వత్రిక ఎన్నికల వరకు పార్టీ గెలుపు కోసం పని చేసిన సీనియర్ నేతకు ఇచ్చే గౌరవం ఇదేనా అంటూ ప్రశ్నిస్తున్నారు. పార్టీకి పెద్ద దిక్కుగా, సీనియర్ నేతగా, నియోజకవర్గ అభివృద్ధిలో తనదైన ముద్రవేసుకున్న పాలకొండరాయుడుకు పార్టీ అధినేత చంద్రబాబు నాయుడు, ఆయన తనయుడు లోకేష్ బాబు, స్థానిక నేతలు తగిన గౌరవం ఇవ్వడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. శనివారం నిర్వహించిన మినీ మహానాడుకు సుగవాసి వర్గానికి, పార్టీలోని పాత సీనియర్ నేతలకు పిలుపు లేకపోవడంపై పార్టీలోని ఆ వర్గాలు కినుక వహించినట్లు తెలియవచ్చింది. టీడీపీ పండుగలా జరుపుకొనే మినీ మహానాడుకు పార్టీలోని సుగవాసి పాలకొండరాయుడు తనయులు సుబ్రమణ్యం, ప్రసాద్ బాబుతోపాటు వారి వర్గం, పాత సీనియర్ నేతలు దూరం కావడంపై నియోజకవర్గంలో సర్వత్రా చర్చనీయాంశమైంది. రాయచోటిలో సుగవాసి, ద్వారకానాథరెడ్డి దూరం -
మహిళకు తీవ్రగాయాలు
మదనపల్లె రూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ గాయపడిన సంఘటన శుక్రవారం మండలంలో జరిగింది. గుర్తుతెలియని మహిళ(60) బసినికొండ, కొండామర్రిపల్లెలో భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తోంది. ఎప్పటిలాగే భిక్షాటనకు వెళుతుండగా.. కొండామర్రిపల్లె రోడ్డు సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ప్రమాదంలో ఆమె తీవ్రంగా గాయపడగా, స్థానికులు బసినికొండ మహిళా పోలీస్కు సమాచారం అందించారు. స్థానికుల సహాయంతో మహిళా పోలీస్ బాధితురాలిని ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. గుండంలో పడి అఘోరి మృతి చిట్వేలి : నగిరిపాడు పంచాయతీ పెద్దూరు అటవీ ప్రాంతంలోని గుండాలకోన గుండంలో పడి అఘోరి మృతిచెందింది. శివరాత్రి సందర్భంగా ఆమె గుండాల కోనను సందర్శించి..ఐదురోజుల తర్వాత తిరిగి వెళ్లినట్లు సమాచారం. మళ్లీ గురువారం గుండాలకోనకు వచ్చి నిర్మానుష్యమైన ప్రాంతానికి వెళ్లినట్లు భక్తులు తెలిపారు. అనంతరం శుక్రవారం గుండంలో శవమై తేలింది. అటవీ సమీప గ్రామాల ప్రజలు ఈ విషయం స్థానిక పోలీసులకు తెలియజేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకొని మృత దేహాన్ని వెలికితీయించారు. అఘోరికి సంబంధించి ఎలాంటి సమాచారం లేకపోవడంతో మృతదేహాన్ని కోడూరు మార్చురీలో ఉంచినట్లు తెలిపారు. అఘోరికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే చిట్వేలి స్టేషన్కు సమాచారం అందించాలని కోరుతున్నారు. పూర్తి వివరాలకు ఎస్ఐ 9121100579, సిఐ 9121100576 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఓపెన్ పరీక్షలో మాస్ కాపీయింగ్ – కుప్పలు తెప్పలుగా చిట్టీలు మదనపల్లె రూరల్ : ఓపెన్ టెన్త్ పరీక్షల్లో యథేచ్చగా మాస్ కాపీయింగ్ జరిగింది. పట్టణం లోని జెడ్పీ హైస్కూల్లో జరిగిన పదో తరగతి ఓపెన్ సప్లిమెంటరీ గణితం పరీక్షలో మాస్ కాపీయింగ్ చేయించినట్లు తెలిసింది. విద్యార్థులు చిట్టీలు తీసుకుని వెళ్లి పరీక్ష రాసి, వాటిని పాఠశాల ప్రాంగణంలోనే పడేసి వెళుతున్నారు. ఎక్కడ చూసినా కుప్పలు తెప్పలుగా చిట్టీలు దర్శనమిస్తున్నాయి. డీవైఈఓ లోకేశ్వరరెడ్డి వివరణ కోరగా...తాను పీలేరులో ఉన్నానని, రేపు సెంటర్ను తనిఖీ చేసి చర్యలు తీసుకుంటామన్నారు. తీగలు తగిలి గేదె మృతి సింహాద్రిపురం : మండలంలోని అహోబిలం గ్రామానికి చెందిన గంగిరెడ్డికి చెందిన గేదె విద్యుత్తు షాక్కు గురై మృతిచెందింది. గ్రామానికి చెందిన గంగిరెడ్డి, నాగేశ్వరరెడ్డి, రాజారెడ్డి, రవీంద్రనాథరెడ్డి తమ గేదెలను సమీపాన ఉన్న చెరువు గట్టున మేపుకొనేందుకు తీసుకెళ్లారు. గంగిరెడ్డికి చెందిన గేదె అక్కడే ఉన్న విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ తీగలకు తగలడంతో షాక్కు గురై మృతి చెందింది. రూ.92వేలు నష్టపోయానని బాధిత రైతు గంగిరెడ్డి తెలిపారు. పోలీస్ బైక్ దొరికింది ప్రొద్దుటూరు క్రైం : కర్నాటక వాసి ఎత్తుకెళ్లిన బ్లూకోల్ట్స్ బైక్ దొరకడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. పట్టణంలో అనుమానాస్పదంగా తిరుగుతున్న కర్నాటక రాష్ట్రానికి చెందిన వ్యక్తిని బుధవారం రాత్రి రూరల్ పోలీసులు అదుపులోకి తీసుకున్న విషయం తెలిసిందే. అతడిని విచారించగా మతిస్థిమితం లేని వ్యక్తిగా నిర్ధారణ అయింది. ఉదయం ఇంటికి పంపాలని పోలీసులు అతన్ని స్టేషన్లోనే పెట్టుకున్నారు. ఈ క్రమంలో గురువారం వేకువ జామున స్టేషన్లో నుంచి బ్లూకోల్ట్స్ బైక్తో పరారైన విషయం పాఠకులకు విదితమే. అయితే పట్టణ శివారు ప్రాంతంలో పడేసి వెళ్లిన బ్లూకోల్ట్స్ బైక్ను గురువారం ఉదయం రూరల్ పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. కర్నాటకు వాసిని కూడా అదుపులోకి తీసుకొని కుటుంబ సభ్యులకు అప్పగించారు. -
ఆక్రమణల తొలగింపుతో ఉద్రిక్తత
సాక్షి టాస్క్ఫోర్స్ : బద్వేల్–నెల్లూరు రోడ్డులోని దుకాణాల ఎదుట ఆక్రమణల తొలగింపు శుక్రవారం ఉద్రిక్తతకు దారి తీసింది. మున్సిపాలిటీని ముండ మోపించేందుకే వచ్చాడంటూ టీడీపీ నాయకులు మున్సిపల్ కమిషనర్పై తీవ్ర పదజాలంతో విరుచుకుపడే పరిస్థితి తలెత్తింది. వివరాల్లోకి వెళ్తే.. బద్వేల్ పట్టణ సుందరీకరణ పనుల్లో భాగంగా మున్సిపల్ కమిషనర్ వివి.నరసింహారెడ్డి ఆదేశాల మేరకు పట్టణ ప్రణాళిక అధికారి సతీష్, సిబ్బంది నరసయ్య ఆధ్వర్యంలో రోడ్డుపై ఉన్న బోర్డులు, రేకుల షెడ్డులను తొలగించే పనులు చేపట్టారు. ఈ సమయంలో ఓ దుకాణం ఎదుట ఏర్పాటు చేసిన సిమెంటు బల్లలు తొలగించారు. స్థానికుల ద్వారా సమాచారం అందుకున్న టీడీపీ మున్సిపాలిటీ నాయకుడు మిత్తికాయల రమణ అక్కడికి చేరుకుని మున్సిపల్ సిబ్బందితో వాగ్వాదానికి దిగాడు. ముందస్తు నోటీసులు ఇవ్వకుండా ఎలా తొలగిస్తారంటూ ఆగ్రహంతో ఊగిపోయాడు. సచివాలయ ప్లానింగ్ సెక్రటరీల ద్వారా ముందస్తు సమాచారం ఇచ్చామని పట్టణ ప్రణాళిక విభాగం అధికారులు చెబుతున్నప్పటికీ వినిపించుకోకుండా వారిపై చిందులేశాడు. అంతటితో ఆగకుండా ఈ కమిషనర్ బద్వేల్ మున్సిపాలిటీని ముండమోపించేందుకే వచ్చాడు.. నాశనం చేసి పోతాడు అంటూ తీవ్ర పదజాలంతో విరుచుకుపడ్డాడు. మీరు మనుషులను తీసుకువచ్చి ఇలా చేయడం సరికాదని సిబ్బంది అనగా.. మనుషులను పంపిస్తే పరిస్థితి ఇలా ఉండదంటూ బెదిరింపులకు దిగారు. సిబ్బంది చేసేదిలేక ఆక్రమణల తొలగింపు నిలిపేసి వెనుదిరిగారు. జరిగిన విషయాన్ని మున్సిపల్ కమిషనర్ దృష్టికి తీసుకుపోవడంతో పోలీసు బందోబస్తు నడుమ ఆక్రమణలు తొలగించారు. మున్సిపల్ అధికారుల విధులకు ఆటంకం కలిగిస్తూ వారిని ఇష్టానురీతిలో మాట్లాడినప్పటికీ పోలీసులకు ఎటువంటి ఫిర్యాదు చేయకపోవడం గమనార్హం. ప్రభుత్వ ఉద్యోగులను బెదిరించిన టీడీపీ నాయకుడిపై చర్యలు తీసుకోకపోతే ప్రభుత్వ ఉద్యోగుల మనోభావాలు, ఆత్మస్థైర్యం దెబ్బతింటుందని కొందరు ఉద్యోగులు చర్చించుకోవడం కనిపించింది. మున్సిపల్ సిబ్బందితో టీడీపీ నేత వాగ్వాదం కమిషనర్పై తీవ్ర పదజాలంతో నేత ఆగ్రహం -
పదో తరగతి విద్యార్థిని అదృశ్యం
గుర్రంకొండ : పదో తరగతి విద్యార్థిని అదృశ్యమైన సంఘటన మండలంలోని మర్రిమాకులపల్లెలో జరిగింది. గ్రామానికి చెందిన వెంకటేశ్, సుమలతల కుమార్తె వర్షిత(16) స్థానిక తెలుగు జెడ్పీ హైస్కూల్లో పదో తరగతి చదివింది. పది పరీక్ష ఫెయిల్ కావడంతో గుర్రంకొండ తెలుగు జెడ్పీ హైస్కూల్లో గురువారం సప్లమెంటరీ పరీక్ష రాసేందుకు వచ్చింది. రాసిన అనంతరం ఇంటికి చేరుకోకపోవడంతో తల్లిదండ్రులు గుర్రంకొండకు చేరుకొని వాకబు చేశారు. రెండు రోజులుగా విద్యార్థిని ఆచూకీ కోసం గాలించినా కనపడకపోవడంతో ఆమె తల్లిదండ్రులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అదృశ్యం కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘరామ్ తెలిపారు. 370 లీటర్ల సారా ఊట ధ్వంసం మదనపల్లె రూరల్ : బి.కొత్తకోట మండలంలో దాడులు జరిపి 370 లీటర్ల సారా ఊట ధ్వంసం చేసినట్లు సీఐ భీమలింగ తెలిపారు. విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ బి.కొత్తకోట మండలం సుబ్బిరెడ్డిగారిపల్లెలో ఎకై ్సజ్ అధికారులు శుక్రవారం దాడులు నిర్వహించారని తెలిపారు. జి.కృష్ణప్ప కుమారుడు జి.రవికుమార్(30), టి.సుబ్బయ్య కుమారుడు టి.ఆనంద్(34), అదే గ్రామానికి చెందిన కె.వెంకటరమణ(70)లు సారా విక్రయిస్తుండగా ఆరెస్టు చేశామన్నారు. వారి వద్ద పది లీటర్ల సారాను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. దీంతోపాటు తయారీకి సిద్ధంగా ఉంచిన 370 లీటర్ల సారా ఊటను ధ్వంసం చేశామన్నారు. ముగ్గురు వ్యక్తులపై వేర్వేరుగా కేసులు నమోదుచేసి రిమాండ్కు పంపామన్నారు ఎక్సైజ్ అధికారులు పాల్గొన్నారు. -
డేంజర్ జోన్లో క్వారీకి ఎలా అనుమతిస్తారు ?
పంటలు నష్టపోతున్నామని గోవిందంపల్లి గ్రామస్థులు ఆగ్రహం ఓబులవారిపల్లె : డేంజర్ జోన్గా ప్రకటించినప్పటికీ.. ఏపీఎండీసీ మంగంపేట గనికి 500 మీటర్ల దూరంలో కంకర క్వారీకి ఎలా అనుమతిస్తారని గోవిందంపల్లి గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. కాలుష్యం కా రణంగా తమ పంటలు నష్టపోతున్నామని మైన్స్ అధికారులకు రైతులు ఫిర్యాదు చేయడంతో అన్నమయ్య జిల్లా మైన్స్ ఏడీఎం సుబ్రహ్మణ్యం సిబ్బందితో కలిసి శుక్రవారం క్వారీ ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా గ్రామస్థులు వారితో మాట్లాడుతూ కంకర క్వారీలో నిర్వహించే భారీ పేలుళ్ల కారణంగా వాహనదారులు ఆందోళనకు గురవుతున్నారని తెలిపారు. కాలుష్యంతో పంటలకు నష్టం వాటిల్లుతోందని, శ్వాసకోశ, కిడ్నీ, క్యాన్సర్ వ్యాధుల బారిన పడి చాలామంది మృతి చెందారని ఆరోపించారు. తమ ఆస్తులు అమ్ముకున్నా ఆసుపత్రులకు సరిపోదని వారు వాపోయారు. గోవిందంపల్లి ప్రజలను కాపాడాలని, చర్య లు తీసుకోకపోతే విజిలెన్స్ అధికారులకు ఫిర్యాదు చేస్తామన్నారు. ఏడీ సుబ్రమణ్యం కంకర క్వారీ క్రషర్లను పరిశీలించి మాట్లాడుతూ పూర్తిస్థాయిలో నివేదిక సిద్ధం చేసి ఉన్నతాధికారులకు తెలియజేస్తామన్నారు. ఈ కార్యక్రంమలో రామసుబ్రహ్మణ్యం, సింగ్, గోపీనాథ్, తదితరులు పాల్గొన్నారు. -
రాజంపేటలో.. తమ్ముళ్ల రాద్ధాంతం
రాజంపేట తమ్ముళ్లలో ఇన్చార్జి గోల మళ్లీ మొదలైంది. శుక్రవారం టీడీపీ నేత చమర్తి జగన్మోహన్రాజు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి అంటూ సోషల్ మీడియా, మీడియా గ్రూపులలో ప్రచారం జరిగింది. దీంతో నియోజకవర్గ టీడీపీ క్యాడర్లో విభేదాలు భగ్గుమన్నాయి. రాజంపేట : రాజంపేట ఇన్చార్జి నియామకంపై సామాజిక మాధ్యమాల్లో పెద్ద ఎత్తున చర్చమొదలైంది. శుక్రవారం వ్యూహాత్మకంగా చమర్తిని ఇన్చార్జిగా నియమించారంటూ పార్టీ క్యాడర్కు సామాజిక మాధ్యమాల ద్వారా తెలిపారు. దీంతో ఆ పార్టీ క్యాడర్లో కొందత గందరగోళం మొదలైంది. కడప మినీ మహానాడు నేపథ్యంలో రాజంపేటలో గురువారం జరిగిన సభలో పరిశీలకుడు దుర్గాప్రసాద్ తాత్కాలిక సమన్వయకర్తగా చమర్తి జగన్మోహన్ రాజు పనిచేస్తారని తెలిపారు. దానిని చమర్తి వర్గీయులు రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి అంటూ తమ క్యాడర్లోకి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. దీంతో వైరివర్గ నేతలు ఇన్ఛార్జిగా చమర్తిని ఎలా నియమిస్తారంటూ రగిలిపోయారు. దీంతో రాజంపేట టీడీపీలో ఇన్చార్జి నియామకం వ్యవహారం దుమారం లేపింది. ఇన్చార్జిగా ఇప్పటికీ ఎవరినీ నియమించలేదంటూ అదే పార్టీలోని వైరీవర్గ నేతలు సోషల్ మీడియా గ్రూపులు వేదికగా విమర్శలు చేయడం ప్రారంభించారు. దీంతో విభేదాలు మరోసారి బయటపడ్డాయి. ఇన్చార్జిగా అధిష్టానం ఎవరినీ ఇంతవరకు నియమించలేదని కొందరు మాటల తుటాలు పేల్చుకున్నారు. చమర్తి ఇన్చార్జి అనగానే ఆయన సామాజికవర్గంలో సంతోషం వ్యక్తం కాగా, గత ఎన్నికలో పోటీ చేసిన ఓడిపోయిన సుగవాసిని కాదని చమర్తికి ఏవిధంగా ఇన్చార్జి ఇస్తారంటూ కొందరు పెదవి విరుస్తున్నారు. సుగవాసి సైలంట్గా ఉన్న నేపథ్యంలో ఇన్చార్జి వ్యవహారంపై టీడీపీ అధిష్టానం కొలిక్కి తీసుకురాలేని పరిస్థితి పోతోంది. మహానాడు జనం తరలింపు నేత ఎవరు.. టీడీపీలో వర్గ విభేదాలు పొడచూపడంతో కడపలో మహానాడుకు జనం తరలింపు ప్రశ్నార్ధకరంగా మారింది. పార్టీకి పెద్దదిక్కు ఎవరో తెలియని సంకటస్థితి నెలకొంది. పార్టీ క్యాడర్ను మహానాడుకు మళ్లించాలంటే లక్షల రూపాయిల వ్యయం అవుతుంది. విభేదాల నేపథ్యంలో ఎవరూ ముందుకురాలేదని, చమర్తి జగన్మోహన్రాజుకు తాత్కాలిక సమన్వయకర్త బాధ్యతలు అప్పగించడమే ఇందుకు కారణమనే చర్చ మొదలైంది. సీనియారిటికే ప్రాధాన్యం ఇవ్వాలని పలువురు నేతలు నిరసన గళం విప్పారు. పార్టీ కోసం కష్టపడి పనిచేసిన క్యాడర్ను కాదని, కొత్తవారికి చోటు ఇచ్చే అంశాన్ని ప్రధానంగా ప్రస్తావించినట్లు తెలుస్తోంది. ఐదేళ్లలో దర్జాగా అధికారం అనుభవించిన నేతలు, ప్రజాప్రతినిధులు టీడీపీలో చేరిన నేపథ్యంలో మినీ మహానాడు వేదికగా సీనియర్లు చేసిన వ్యాఖ్యలు దుమారం లేపాయి. ఈ వ్యాఖ్యలు కొత్త నేతలకు మింగుడుపడటం లేదు. ఎటూ తేలని రాజంపేట టీడీపీ ఇన్ఛార్జి నియామకం తాత్కాలిక ఇన్ఛార్జిగా చమర్తి ఉంటారని ప్రకటన రగిలిపోయిన ప్రత్యర్థి వర్గ టీడీపీ నాయకులు మహానాడుకు జన తరలింపు ప్రశ్నార్థకం గుడ్డి కన్నా మెల్ల మేలు ఒంటిమిట్ట : టీడీపీ రాజంపేట తాత్కాలిక సమన్వయకర్తగా చమర్తి జగన్మోహన్రాజును ప్రకటించడంపై టీడీపీ ఒంటిమిట్ట సీనియర్ నాయకుడు కొమర వెంకటనరసయ్య చేసిన వ్యాఖ్యలు వివాదం రేపాయి. స్థానిక హరిత హోటల్లో విలేకరులతో టీడీపీ సీనియర్ నాయకుడు కొమర వెంకటనరసయ్య మాట్లాడుతూచమర్తి నియామకంపై గుడ్డి కన్నా మెల్ల మేలు అంటూ అతడు విలేకరుల సమావేశంలో వ్యంగాస్త్రం విసిరారు. తాత్కాలిక సమన్వయకర్తగా దమ్మున్న నాయకుడిని నియమించి ఉంటే బాగుండేదని మాట్లాడారు. -
రగులుతున్న తమ్ముళ్లు!
మదనపల్లె: రాష్ట్రమంతా వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ పోస్టులను భర్తీ చేస్తుంటే..తమవంతు ఎప్పు డని మదనపల్లె, తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ తమ్ము ళ్లు ఎదురు చూస్తున్నారు.మరోవైపు పోస్టులు భర్తీ కాకపోవడానికి స్థానిక నేతల తీరే కారణమంటూ ఇటు సీనియర్లు, అటు కష్టపడి పనిచేసిన నాయకులు రగిలిపోతున్నారు.పార్టీ కోసం కష్టపడిన నాయకులను విస్మరించి తమ వర్గీయులకు మాత్రమే పదవులు కట్టబెట్టేలా మదనపల్లె, తంబళ్లపల్లె టీడీపీ ముఖ్యులు చేసిన ప్రయత్నాల వల్లే నామినేటెడ్ పోస్టులను పెండింగ్లో పెట్టారని మండిపడుతున్నారు. పనిచేయని వారికి సిఫార్సు మదనపల్లె మార్కెట్ కమిటీ చైర్మన్ కోసం సిఫార్సు చేసిన పేర్లలో సీనియర్లను గుర్తించకపోగా, పార్టీ కోసం పని చేయని వారి పేర్లను సిఫార్సు చేసినట్టు పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది. పదిమందికి పైగా పేర్లను సిఫార్సు చేస్తే అందులో ఒకరు కూడా పార్టీ సూచించిన క్లస్టర్, యూనిట్, బూత్ కమిటీల్లో లేరని, అలాగే కీలకమైన కుటుంబ సాధికార సారధుల జాబితాలో లేరని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు అనుకూలమైన వ్యక్తులు కావడం లేదా వారికి పదవులు దక్కే అవకాశం లేదని తెలిసి సిఫార్సు చేసి ఉంటారని పార్టీ వర్గాలు చెబుతున్నాయి. పార్టీ విధివిధానాల ప్రకారం సిఫార్సు చేయకపోవడం వల్లే కమిటీ నియామకం జరగలేదని స్పష్టమవుతోంది. అలాగే ఎమ్మెల్యే షాజహాన్బాషా పార్టీలోని మిగిలిన వర్గాలను పక్కనపెట్టడం కూడా ఒక కారణం. వ్యతిరేక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వకపోవడం వల్ల అన్ని వర్గాల మధ్య ఏకాభిప్రాయం కోసం పెండింగ్ పెట్టారని చెబుతున్నారు. ఎమ్మెల్యేకు అనుకూలమైన వారికే ప్రాధాన్యత దక్కుతోందని పార్టీ సీనియర్లు బాహాటంగా చెబుతున్నారు. ఇటీవల జరిగిన కొన్ని ఎన్నికలు, వాటికి ఎంపికై న నాయకులే నిదర్శనమని చెబుతున్నారు. చెప్పుకుందామంటే మంత్రి రాకపోయే మదనపల్లె నియోజకవర్గ టీడీపీలో నెలకొన్న పరిస్థితులను జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్ రెడ్డికి చెప్పుకునేందుకు పార్టీ శ్రేణులు సిద్ధమయ్యాయి. గత నెల 13న మదనపల్లెలో మంత్రితో సమావేశం కావాలని నిర్ణయించారు. అదేరోజు హార్సిలీహిల్స్పై తంబళ్లపల్లె నియోజకవర్గం సమావేశం రసాభాస కావడంతో మంత్రి వెళ్లిపోయారు. ఇక్కడినుంచి మదనపల్లె పార్టీ సమావేశానికి హాజరు కావాల్సి ఉన్నా ఇక్కడ కూడా ఇదే పరిస్థితి ఉత్పన్నమవుతుందని భావించి రాకుండా కర్నూలు జిల్లా వెళ్లిపోయారు. మంత్రి వస్తారని ఎదురుచూసిన పార్టీ శ్రేణులకు నిరాశ మిగిలింది. తంబళ్లపల్లెలో పోటాపోటీ మూడు మార్కెట్ కమిటీల పెండింగ్పై ఆగ్రహం తంబళ్లపల్లె నియోజకవర్గంలో బి.కొత్తకోట, ములకలచెరువు వ్యవసాయ మార్కెట్ కమిటీలు ఉన్నాయి. ఈ కమిటీల చైర్మన్ పదవులపై సీనియర్ నాయకులు, పార్టీ కోసం కష్టపడిన వాళ్లు ఆశలు పెట్టుకున్నారు. అయితే వీరందరినీ కాదని స్థానిక నియోజకవర్గ నేత జయచంద్రారెడ్డి ఎవరూ ఊహించని నాయకుల పేర్లను చైర్మన్ పదవులకు సిఫార్సు చేశారని పార్టీ వర్గాలు అసంతప్తి వ్యక్తం చేస్తు న్నాయి.మొదట ములకలచెరువు మార్కెట్ చైర్మన్ పదవి ఎస్సీ మహిళకు, బి.కొత్తకోట కమిటీ చైర్మన్ పదవి బీసీ మహిళకు కేటాయించారు. తర్వాత ఏౖ మెందో కానీ ఈ రిజర్వేషన్లు తారుమారయ్యాయి. ములకలచెరువు బీసీ, బి.కొత్తకోట ఎస్సీ మహిళకు రిజర్వ్ చేస్తూ కలెక్టర్ రెండోసారి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ వ్యవహారం కూడా జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గానికి మింగుడు పడలేదు. సీనియర్లు, పార్టీకి పనిచేసిన వారికి గౌరవం ఇవ్వకపోవడం వారిలో ఆగ్రహం తెప్పిస్తోంది. దీనికి పోటీగా జయచంద్రారెడ్డి వ్యతిరేక వర్గం మార్కెట్ కమిటీ, ఇతర నామినేటెడ్ పోస్టుల భర్తీకి పేర్లు సిఫార్సు చేశారు. అధిష్టానం పదవుల భర్తీ వ్యవహారాన్ని పక్కన పెట్టినట్లు పార్టీలో చర్చించుకుంటున్నారు. -
ఎన్నికల ప్రక్రియ పటిష్టానికి సూచనలు అందించండి
రాయచోటి: జిల్లాలో ఎన్నికల ప్రక్రియను పటిష్టం చేయడానికి రాజకీయ పార్టీల అభిప్రాయాలు, సూచనలు ఎంతో కీలకమని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని తన ఛాంబర్లో అన్నమయ్య జిల్లాలో ఓటర్ల సవరణ–2025 పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో కలెక్టర్ సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. సమావేశంలో డీఆర్ఓ మధుసూదనరావు గత సమావేశంలో చర్చించిన వివిధ విషయాలు, ప్రస్తుత సమావేశానికి సంబంధించిన అంశాలపై రాజకీయ పార్టీల ప్రతినిధులకు క్లుప్తంగా వివరించారు. 18 సంవత్సరాలు నిండిన ఓటర్లను నమోదు చేయడంలో రాజకీయ పార్టీలు కూడా భాగస్వాములు కావాలన్నారు. ప్రతి పార్టీ బూత్ లెవల్ అసిస్టెంట్లను నియమించుకొని జాబితాను సమర్పించాలని కోరారు. ఈ సందర్భంగా రాజకీయ పార్టీ ప్రతినిధులు వెలిబుచ్చిన సందేహాలను కలెక్టర్ నివృత్తి చేశారు. విధులలో నిర్లక్ష్యం వహించిన ఇద్దరు పంచాయతీ సెక్రటరీలపై చర్యలకు ఆదేశం లక్కిరెడ్డిపల్లి: మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల్లో ప్రతి ఇంటికి వెళ్లి తడి, పొడి చెత్తలను వేర్వేరుగా సేకరించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఎంపీడీఓ, డీఎల్పీఓ, పంచాయతీ సెక్రటరీలను ఆదేశించారు. శుక్రవారం లక్కిరెడ్డిపల్లి మండంలో పర్యటించారు. ఈ సందర్భంగా అనంతపురం పంచాయతీలోని చెత్తనుంచి సంపద సృష్టి తయారీ కేంద్రాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. సేకరించిన చెత్తను ఎక్కడ డంప్ చేశారు అని కలెక్టర్ ప్రశ్నించగా పంచాయతీ సెక్రటరీలు సరిగా సమాధానాలు ఇవ్వలేకపోయారు. విధుల పట్ల నిర్లక్ష్యం వహించడమే కాకుండా ఉన్నతాధికారుల ఆదేశాలు పాటించకపోవడంతో అనంతపురం గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎం మధుసూదన, మద్దిరేవుల గ్రామ పంచాయతీ సెక్రటరీ ఎంఎన్ రజనీష్ రెడ్డిలను సస్పెండ్ చేయాలని అధికారులకు కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. పంచాయతీ సెక్రటరీలు విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే షోకాజ్ నోటీలు జారీ చేయాలని ఇన్చార్జ్ ఎంపీడీఓకు సూచించారు. అనంతరం మండలంలో ప్రభుత్వ పథకాల అమలుపై ఆయాశాఖల అధికారులతో సమీక్షించారు. వ్యవసాయ, ఉద్యాన పంటలపై సమీక్షిస్తూ మండలంలో ఎంతమంది రైతులకు నూతన, రెన్యూవల్ సీసీ ఆర్సీ కార్డులు జారీ చేశారు, ఇంకనూ ఎంతమందికి జారీ చేయాల్సి ఉంది అని అడిగి తెలుసుకున్నారు. గృహ నిర్మాణశాఖ సమీక్షలో భాగంగా గత వారం రోజుల ప్రగతిని సమీక్షించారు. మండలంలో ఎక్కడా తాగునీటికి ఇబ్బంది లేకుండా చర్యలు తీసుకోవాలని ఆర్డబ్ల్యూఎస్ అధికారులను ఆదేశించారు. సమావేశంలో హౌసింగ్ పీడీ శివయ్య, డీఎస్ఓ రఘురాం, ఇన్చార్జి ఎంపీడీఓ ఉషారాణి, తహసీల్దార్ శ్రీనివాసులు పాల్గొన్నారు. రాజకీయ పార్టీ నేతలతో కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
అన్నమయ్య జిల్లాలోకి మరో ఆరు మండలాలు బదిలీ
రాయచోటి: ప్రభుత్వ ఆదేశాలను అనుసరించి చిత్తూరు జిల్లాలోని పుంగనూరు నియోజకవర్గ పరిధిలో ఆరు మండలాలను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ ప్రాథమికంగా జిల్లా గెజిట్ రాజపత్రాన్ని జారీ చేశారు. ఈ మేరకు గెజిట్ రాజపత్రాన్ని శుక్రవారం పత్రికలకు విడుదల చేసిన ఒక ప్రకటనలో జిల్లా కలెక్టర్ తెలిపారు. ఏపీ ప్రభుత్వం జీఓ ఆర్టీ నెంబరు. 463, ఈనెల 22వ తేది చిత్తూరు జిల్లా నుండి ఆరు మండలాలను అన్నమయ్య జిల్లాకు బదిలీ చేస్తూ ప్రాథమిక నోటిఫికేషన్ జారీ చేశారు. ఈ మేరకు ఆంధ్రప్రదేశ్ జిల్లాల ఏర్పాటు చట్టం 1974 (7)వ) చట్టంలోని సెక్షన్ 3లోని ఆరవ ఉప విభాగం క్రింద సంబంధిత ప్రాంతాల మెరుగైన పరిపాలన, అభివృద్ది దృష్ట్యా చిత్తూరు జిల్లాలోని పలమనేరు రెవెన్యూ డివిడన్ నుండి పుంగనూరు, చౌడేపల్లి, సోమల, సదుం మండలాలను మరియు అదే జిల్లాలోని చిత్తూరు రెవెన్యూ డివిజన్ నుండి రొంపిచర్ల, పులిచెర్ల మండలాలను అన్నమయ్య జిల్లా పరిధిలో ఉన్న మదనపల్లి రెవెన్యూ డివిజన్కు బదిలీ చేయాలని ప్రభుత్వం ప్రతిపాదిస్తున్నట్లు ప్రకటించారు. పై ప్రతిపాదన వలన ప్రభావితమగు జిల్లాలో నివసించే వ్యక్తులు అభ్యంతరాలు, సూచనలను ఇంగ్లీషు లేదా తెలుగులో లిఖితపూర్వకంగా అన్నమయ్య జిల్లా కలెక్టర్, చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయాలకు గెజిట్ నోటిఫికేషన్ ప్రచురించిన తేది నుంచి ముప్పై రోజుల గడువు ముగిసేలోపు లేదా అంతక ముందే చేరేలా పంపాల్సి ఉంటుందని సదరు గెజిట్లో కలెక్టర్ పేర్కొన్నారు. ● జిల్లా కలెక్టర్చే గెజిట్ నోటిఫికేషన్ -
రూ.4కోట్ల ప్రభుత్వ స్థలానికి విముక్తి
గుర్రంకొండ: ఎన్నో దశాబ్దాలుగా కబ్జాదారుల కోరల్లో చిక్కుకొన్న ప్రభుత్వ స్థలానికి మోక్షం లభిస్తోంది. రూ. 4 కోట్లు విలువచేసే స్థలానికి కబ్జాల సంకెళ్ల నుంచి విముక్తి లభించింది. వీఎల్ డబ్ల్యూ క్వార్టర్స్ స్థలంలో వాణిజ్య సముదాయ గదుల నిర్మాణానికి రూ. 23 లక్షలు మంజూరు అయ్యాయి. కాగా మరికొంత స్థలంలో అతిథి గృహం నిర్మాణానికి అధికారులు ప్రతిపాదనలు సిద్ధం చేస్తున్నారు. ● గుర్రంకొండ పట్టణం నడిబొడ్డున కడప–బెంగు ళూరు మార్గంలోఎన్హెచ్ 340 జాతీయరహదారి పక్కన పాత వీఎల్ డబ్ల్యూ క్వార్టర్స్ భవనాలు ఉన్నా యి. మండల వ్యవస్థకు ముందు పంచాయతీ సమితీలు ఉన్న కాలంలో ఇక్కడ విలేజ్ డెవలప్మెంట్ అధి కారి నివాసం ఉండడానికి ప్రభుత్వం 1967లో సర్వే నంబర్ 117లో 3.5సెంట్ల స్థలంలో క్వార్టర్స్ నిర్మించింది. మండల వ్యవస్థ వచ్చిన తర్వాత ఈ భవనాల్లో కొద్దిరోజులు ప్రభుత్వ కార్యాలయాలు నిర్వ హించారు. అనంతరం భవనం శిథిలమవడంతో ఆక్రమణలు మొదలయ్యాయి. ప్రస్తుతం ఈ స్థలం మండల పరిషత్ కార్యాలయం ఆధీనంలో ఉంది. మెల్లగా పలువురు ఈ భవనం చుట్టూ ఉన్న స్థలాలను ఆక్ర మించుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకోవడం ప్రారంభించారు. మార్కెట్ విలువ ప్రకారం ఈ స్థలం రూ.4 కోట్లు ఉంటుందని అధికారులు అంచనా వేశారు. ● కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఎంతో విలువైన ఈ ప్రభుత్వ స్థలంపై నేతల కన్నుపడింది. అధికారంలోకి వచ్చిన రోజుల వ్యవధిలోనే సదరు స్థలాన్ని ఆక్రమించి దుకాణాల ఏర్పాటు చేసుకొన్నారు. దుకాణాలు ఏర్పాటు చేసుకొనే విషయమై అధికార పార్టీ నేతలమధ్య పెద్ద ఎత్తున ఘర్షణ జరిగింది. స్థలాల ఆక్రమణల కోసం నాయకులు వర్గాలుగా విడిపోయి బహిరంగంగా ఘర్షణకు దిగారు. అప్పట్లో పోలీసులు రంగ ప్రవేశం చేయడంతో వివాదం సద్దుమణిగింది. తదనంతరం నేతల మధ్య రాజీ కుదుర్చుకొని దుకాణాలు ఏర్పాటు చేసుకున్నారు. అప్పట్లో ఈ సంఘటన సంచలనం కలిగించింది. ● రెండునెలల క్రితం జెడ్పీసీఈవో గుర్రంకొండలో పర్యటించారు. మండల పరిషత్ కార్యాలయం ఆఽధీనంలో ఉన్న సదరు స్థలాన్ని సందర్శించి ఆక్రమణలు పరిశీలించారు. ఎన్హెచ్ 340 జాతీయ రహదారి పక్కనే ఉండడంతో పాటు పట్టణం నడిబొడ్డున ఉన్నందున ఈ స్థలాన్ని సక్రమంగా వినియోగించుకొంటే మండలానికి ఆదాయం సమకూరుతుందని భావించారు. వ్యాపార సముదాయం కింద గదుల నిర్మాణానికి ప్రతిపాదనలు సిద్ధం చేసి పంపించాలని ఆదేశించారు. ప్రతిపాదనలు పంపిన వెంటనే జిల్లా పరిషత్ అధికారులు ప్రస్తుతానికి రెండు గదులు నిర్మించడానికి రూ. 23.50 లక్షలు మంజూరు చేశారు. అంతే కాకుండా ఇక్కడి స్థలంలో ఉన్న ఆక్రమణలను తొలగించడానికి అధికారులు సన్నాహాలు చేపడుతున్నారు. పదిరోజుల్లో టెండర్ల ప్రక్రియ నిర్వహించనున్నారు. ఆప్పటిలోగా ఆక్రమణలు తొలగించనున్నారు. దీంతో దశాబ్దాలుగా ఈస్థలానికి పట్టిన రాజకీయ గ్రహణం వీడనుందని గ్రామస్తులు చర్చించుకొంటున్నారు. ఆక్రమణల తొలగింపునకు రంగం సిద్ధం గదుల నిర్మాణానికి రూ. 23 లక్షల నిధులు మంజూరు గదుల నిర్మాణాం చేపడతాం పాత వీఎల్డబ్ల్యూ క్వార్టర్స్ శిథిలమైన స్థలం మండలపరిషత్ ఆధీనంలో ఉంది. ఇక్కడ రెండు గదులను నిర్మించడానికి జెడ్పీసీఈవో రూ.23.50 లక్షలు మంజూరు చేశారు. పదిరోజుల్లో టెండర్ల ప్రక్రియ జరుగుతంది. అప్పటిలోగా సదరు స్థలాల్లో ఉన్న ఆక్రమణలను పూర్తిగా తొలగిస్తాం. – వెంకటేశులు, ఎంపీడీవో, గుర్రంకొండ -
‘జాతీయ గ్రామ ఉత్కర్ష అభయాన్’ పక్కాగా అమలవ్వాలి
రాయచోటి: జిల్లాలో గిరిజనులకు దర్తిఅభజన జాతీయ గ్రామ ఉత్కర్ష అభయాన్–2025 పథకం పక్కాగా అమలయ్యేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి మండల అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. గిరిజన సంక్షేమశాఖ ఆధ్వర్యంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల సహాయంతో నిర్వహించే ఈ కార్యక్రమంపై గిరిజనులకు విస్తృత అవగాహన కల్పించాలన్నారు. సమావేశంలో జేసీ ఆదర్శ్ రాజేంద్రన్, గిరిజన సంక్షేమశాఖ అధికారి తేజస్విని పాల్గొన్నారు. సకాలంలో సరుకులు అందించాలి లక్కిరెడ్డిపల్లి: మండల కేంద్రంలోని పౌరసరఫరాల గోదామును శుక్రవారం జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి రఘురాం ఆకస్మిక తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చౌక దుకాణాలకు సరుకులను సకాలంలో చేరవేయా లని గోదాం ఇన్చార్జి మల్లికార్జున బాబుకు సూచి ంచారు. గోదాములోని నిత్యావసర వస్తువుల నిల్వలను పరిశీలించారు. అక్రమాలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీటీ శివప్రసాద్, సిబ్బంది పాల్గొన్నారు. వెలిగల్లు రిజర్వాయర్కు సిబ్బంది కొరత గాలివీడు: గాలివీడు మండలంలోని వైఎస్సార్ వెలిగల్లు రిజర్వాయర్ కు సిబ్బంది కొరత ఏర్పడింది. 4.64 టీఎంసీ నీటి నిల్వ సామర్థ్యం కలిగిన రిజర్వాయర్కు కుడి, ఎడమ కాలువల ద్వారా సుమారు 25 వేల ఎకరాల ఆయకట్టు ఉంది. దీనికి నిర్వహణ సిబ్బంది లేక ఆయకట్టదారులు ఇబ్బంది పడుతున్నారు. 16 మంది జేఈలుగా ఉండగా ఒకరు విధులు నిర్వహిస్తుండడం గమనార్హం. వెంటనే రాష్ట్ర ప్రభుత్వం, జిల్లా కలెక్టర్ వైఎస్సార్ వెలిగల్లు రిజర్వాయర్ కు తగిన సిబ్బందిని ఏర్పాటు చేయాలని గాలివీడు మండల ప్రజలు, ఆయకట్టుదారులు కోరుతున్నారు. సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలి పుల్లంపేట: వర్షాకాలంలో వచ్చే సీజనల్ వ్యాధులపై అప్రమత్తంగా ఉండాలని, నియంత్రణకు మందుస్తు చర్యలు చేపట్టాలని జిల్లా మలేరియా అధికారి రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం పుల్లంపేట ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. డాక్టర్ మనోజ్ చంద్ర ఆధ్వర్యంలో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో సమావేశం నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 274 పైలేరియా కేసులు నమోదయ్యాయన్నారు. పైలేరియా వ్యాధి దోమల ద్వారా వ్యాపిస్తుంది, కాబట్టి దోమల నుంచి దూరంగా ఉండాలని సూచించారు. అనంతరం ఇద్దరు వ్యాధిగ్రస్తులకు కిట్లు పంపిణీ చేశారు. ప్రతి శుక్రవారం డ్రైడే పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో సీహెచ్ఓ రాజ, సూపర్ వైజర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
ప్రధాన డిమాండ్లు
సాక్షి రాయచోటి: ఆక్రోశం అడుగడుగునా కనిపిస్తోంది..చేసిన పాపం లేదు...చెడుకు పోనే లేదు...కానీ వారు మాత్రం అన్యాయమై పోతున్నారు. ప్రజల ఆరోగ్యం కోసం అనుక్షణం పరితపించే వైద్య విభాగానికి సంబంధించిన వారికి కష్టాలు మొదలయ్యాయి. బాబు...మా మొర ఆలకించండి....మేమెన్నో కష్టాలు పడుతున్నామంటూ రోజుల తరబడి ఉద్యమబాట పట్టినా పట్టించుకునే పరిస్థితే లేదు. గత కొన్ని రోజులుగా ఆందోళన బాటపట్టారు కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓలు). వారి వేదన చూసి కూడా కూటమి సర్కార్ కనికరించకపోవడం గహనార్హం. సమస్యలపై పోరుబాట జిల్లాలో వైద్య ఆరోగ్యం, కుటుంబ సంక్షేమశాఖ ప రిధిలో ఆయుష్మాన్ భారత్ కింద సుమారు 375 మంది పనిచేస్తున్నారు.ప్రభుత్వం పెండింగ్ సమస్యలతోపాటు ఈపీఎఫ్, ఇతర ఉద్యోగుల మాదిరిగా భద్రత ను కల్పించాలని కోరుతున్నారు. హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంటు, ఎక్స్గ్రేషియా, ట్రాన్స్ఫర్, మాతృత్వ సెలవులు ఇలా అన్నింటిని అమలు చేయాలని ఉద్యమబాట పట్టారు. అయితే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వా లు తెలిసినా తెలియనట్లు ఉన్నాయే తప్ప వారిని పట్టించుకున్న దాఖలాలు లేవు. ఒక్క అన్నమయ్య జిల్లాలోనే కాదు...రాష్ట్ర వ్యాప్తంగా ప్రతిరోజు ఏదో ఒక ఆందోళన కొనసాగిస్తున్నా ప్రభుత్వానికి చీమకుట్టినట్లు కూడా లేకపోవడంపై వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 25 రోజులుగా ఉద్యమం జిల్లాలో ఆయుష్మాన్ భారత్ కింద పనిచేస్తున్న 375 మంది ప్రతిరోజు రాయచోటిలోని కలెక్టరేట్ వద్ద ఆందోళన కార్యక్రమాల్లో పాల్గొంటున్నారు. ప్రత్యేకంగా కలెక్టరేట్ మెయిన్ గేటు పక్కన టెంటువేసి వినూత్న నిరసనలు చేపడుతున్నారు. ప్రభుత్వానికి బుద్ధి ప్రసాదించాలని, తమ డిమాండ్లను నెరవేర్చి న్యాయం చేయాలని ఏదో ఒక కార్యక్రమం కొనసాగిస్తున్నారు. ఇన్ని చేస్తున్నా ప్రభుత్వంలో స్పందన కలగకపోవడం పట్ల తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. మండు వేసవిలో నిత్యం శిబిరంలో కూర్చొంటూ తమ సమస్యలు పరిష్కరించాలని వేడుకుంటున్నారు. ఏది ఏమైనా 25 రోజులుగా ఉద్యమం చేస్తున్నా ఎటువంటి చిన్నపాటి స్పందన లేకపోవడంతో కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు తీవ్ర విచారం వ్యక్తం చేస్తున్నారు. అలుపెరుగని పోరాటం చేస్తున్నాపట్టించుకోని కూటమి ప్రభుత్వం రోజుకొక తరహాలో వినూత్న నిరసన 25 రోజులుగా సమ్మెలోనే.. ప్రజలకు వైద్య సేవలు దూరం ఆయుష్మాన్ భారత్ నిబంధనల ప్రకారం ఉద్యోగ భద్రత కల్పించాలి ఎన్హెచ్ఎం ఉద్యోగులతో సమానంగా 23 శాతం వేతన సవరణ జరగాలి పని ఆధారిత ప్రోత్సాహకాలను క్రమబద్దీకరించాలి ఈపీఎఫ్ఓ పునరుద్దరించాలి క్లినిక్ అద్దె బకాయిలను వెంటనే చెల్లించి క్రమబద్దీకరించాలి నిర్దిష్టమైన జాబ్చార్టు అందించాలి ఎఫ్ఆర్ఎస్ నుంచి సీహెచ్ఓలను మినహాయింపు ఇవ్వాలి హెచ్ఆర్ పాలసీ, ఇంక్రిమెంట్, ట్రాన్స్ఫర్లు, ఎక్స్గ్రేషియా, పితృత్వ సెలవులు తదితరాలు అమలు చేయాలి. -
గండి క్షేత్రం.. భక్తజన సందోహం
చక్రాయపేట: హనుమజ్జయంతి సందర్భంగా గురువారం గండి వీరాంజనేయ స్వామి సన్నిధి జైశ్రీరామ్ అనే రామనామ స్మరణతో మారు మోగింది. గండిక్షేత్రానికి పెద్ద ఎత్తున భక్తులు తరలివచ్చారు. ఆలయ సహాయ కమీషనర్ వెంకటసుబ్బయ్య, చైర్మన్ కావలి కృష్ణతేజల ఆధ్వర్యంలో ప్రధాన,ఉప ప్రధాన,ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్,రాజగోపాలాచార్యులు లు స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. ముగిసిన వేడుకలు: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో నాలుగు రోజులుగా జరుగుతున్న హనుమజ్జయంతి వేడుకలు గురువారంతో ముగిశాయి.చివరి రోజున త్రికాల ఆరాధన,పంచసూక్త హోమం,మన్యు సూక్త హోమం,ఆంజనేయ స్వామి మూలమంత్ర తదితర హోమాలు నిర్వహించారు. ఘనంగా శోభాయాత్ర: గండి వీరాంజేయ స్వామి సన్నిధి నుంచి ప్రారంభమైన హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగింది. చక్రాయపేటలో వెలసిన శ్రీవేంకటేశ్వర,రాచరాయస్వామి ఆలయాల ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ యాత్ర గండి నుంచి అద్దాలమర్రి, కుమార్లకాల్వ, చిలేకాంపల్లెల మీదుగా చక్రాయపేటలోని ఆలయాల వద్ద ముగించారు.ఆలయాల చైర్మన్ మోపూరి రామాంజనేయ రెడ్డి,మాజీ చేర్మెన్లు చక్రపాణిరెడ్డి, ఓబుళరెడ్డి, సభ్యులు పాల్గొన్నారు. -
స్తంభాన్ని ఢీకొని స్కూటరిస్టు మృతి
చాపాడు : మండలంలోని మైదుకూరు– ప్రొద్దుటూరు జాతీయ రహదారిలో విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని కొత్తపల్లె ప్రభుకుమార్(41) గురువారం మృతి చెందారు. మండలంలోని కొట్టాల గ్రామానికి చెందిన ప్రభుకుమార్ లింగాపురం వెళ్లి తిరిగి బైక్లో వస్తున్నారు. పల్లవోలు సమీపంలోని కాశినాయన వృద్ధాశ్రమ సమీపంలో ప్రమాదశాత్తూ బైక్ అదుపుతప్పి స్తంభాన్ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో ప్రభుకుమార్కు తీవ్ర గాయాలవడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తునట్లు ఎస్ఐ చిన్నపెద్దయ్య తెలిపారు. మావోయిస్టులపై హత్యాకాండను ఆపండి – వీసీకే పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శివప్రసాద్ మదనపల్లె రూరల్ : ఎన్కౌంటర్ల పేరుతో మావోయిస్టులపై కేంద్ర ప్రభుత్వం కొనసాగిస్తున్న హత్యాకాండను ఆపి వారితో చర్చలు జరపాలని విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం శివప్రసాద్ ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి నంబాల కేశవరావుతో సహా 25మంది మావోయిస్టులను ఎన్కౌంటర్ పేరుతో హత్యచేయడాన్ని ఖండించారు. కొన్ని నెలలుగా మధ్య భారత అడవుల్లో ఆపరేషన్ కగార్ పేరుతో భారత ప్రభుత్వం హత్యాకాండ కొనసాగిస్తోందన్నారు. ఛత్తీస్గఢ్ రాష్ట్రం నారాయణపూర్ జిల్లా అబూజ్మడ్లో ప్రభుత్వ బలగాలు జరిపిన కాల్పుల్లో మావోయిస్టు పార్టీ ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ నంబాల కేశవరావు అలియాస్ బసవరాజుతో పాటు మరో 25మందికి పైగా మృతి చెందడం బాధాకరమన్నారు. శాంతిచర్చల కోసం మావోయిస్టుపార్టీ కేంద్రప్రభుత్వాన్ని పదే పదే కోరిందని తెలిపారు. ఆపరేషన్ కగార్ని ఆపివేసి మావోయిస్టులతో శాంతి చర్చలు జరపాలని మేధావులు, ప్రజాస్వామిక వాదులు కేంద్రప్రభుత్వాన్ని కోరుతున్నా బీజేపీ ప్రభుత్వం ఏమాత్రం పట్టించుకోకపోగా, మావోయిస్టులపై నరమేధాన్ని తీవ్రతరం చేసిందన్నారు. అడవి నుంచి ఆదివాసీలను ఖాళీ చేయించి, అడవిలో సంపదను కార్పొరేట్ కంపెనీలకు దోచిపెట్టేందుకే ప్రభుత్వం ఆపరేషన్ కగార్ చేపట్టిందని ఆరోపించారు. ప్రభుత్వం చేస్తున్న ఈ హత్యలపై సుప్రీంకోర్టు సిట్టింగ్ జడ్జిచే న్యాయవిచారణ జరిపించాలని కోరారు. బూటకపు ఎన్కౌంటర్లో మరణించిన నంబాల కేశవరావు, మావోయిస్టు పార్టీ సభ్యులకు వీసీకే పార్టీ తరఫున విప్లవజోహార్లు తెలుపుతున్నామన్నారు. -
ఇక రుణాలన్నీ ఆన్ౖలైన్లో మంజూరు
బి.కొత్తకోట: మహిళా సంఘాలకు మంజూరు చేసే రుణాలన్నీ ఇకపై డిజిటల్ విధానంలో ఉంటాయని జిల్లా గ్రామీణాభివృద్ధిశాఖ ప్రాజెక్టు డైరెక్టర్ సత్యనారాయణ అన్నారు. గురువారం స్థానిక వెలుగు కార్యాలయంలో సంఘమిత్రలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన వారికి రుణాల మంజూరుకు సంబంధించి వ్యవహరించాల్సిన విధానంపై అవగాహన కల్పించారు. మొదట సీసీ లాగిన్లో రుణానికి సంబంధించిన వివరాలు నమోదు చేశాక ఏపీఎం లాగిన్కు.. అక్కడినుంచి బ్యాంక్ మేనేజర్ లాగిన్కు వెళుతుందన్నారు. బ్యాంకు మేనేజర్లు వీటిని పరిశీలించి ఎవరికి ఎంత రుణం మంజూరు చేయాలి అన్నది నిర్ణయిస్తారన్నారు. ఇకపై సంఘమిత్రలు, సభ్యులు బ్యాంకుల వద్దకు వెళ్లాల్సిన అవసరం ఉండదన్నారు.వార్షిక జీవనోపాదులు, రుణ ప్రణాళిక మొత్తం ఆన్లైన్లో ఉంటుందని చెప్పారు. ఏసీ గంగాధర్, ఏపీఎం రాజేశ్వరీ, సీసీలు,సంఘమిత్రలు పాల్గొన్నారు. 3 నెలల్లో లక్ష్యం సాధించాలి కలికిరి: ఉపాధి సిబ్బందికి నిర్దేశించిన లక్ష్యం మేరకు కూలీలకు పని దినాలు కల్పించాలని ఉపాధి హామీ పీడీ వెంకటరత్నం అన్నారు. గురువారం స్థానిక సీఎల్ఆర్సీ కార్యాలయంలో కలికిరి క్లస్టర్ పరిధిలోని సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీల లక్ష్యం మూడు నెలల్లో సాధించాలని, ఫాంపాండ్ల లక్ష్యాలను జూన్ నెలలోపు పూర్తి చేయాలని ఆదేశించారు. అన్ని గ్రామ పంచాయతీ పరిధిలో హార్టికల్చర్ ప్రోగ్రాంలో భాగంగా లబ్ధిదారుల ఎంపిక చేపట్టి, ప్రతి రైతు ఉద్యాన పంటల సాగు చేపట్టేలా చూడాలన్నారు. ఉపాధి కల్పనలో శ్రద్ధ చూపండి మదనపల్లె: ఉపాధిహామీ పథకం ద్వారా కూలీలకు పనులు కల్పించే విషయంలో శ్రద్ధ చూపాలని డ్వామా పీడీ వెంకటరత్నం అధికారులను సూచించారు. గురువారం ఆయన మదనపల్లె రూరల్ మండలంలోని వలసపల్లె పంచాయతీలో జరుగుతున్న ఫాంపాండ్ పనులను పరిశీలించారు. కూలీలతో మాట్లాడారు. కూలీ ఎంత వస్తుంది, ఇబ్బందులున్నాయా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఫాంపాండ్ పనులు నాణ్యత ఉండేలా చూడాలన్నారు. కూలీలకు పనులు కల్పించడమే కాకుండా వాటి ద్వారా ప్రయోజనం కలగాలని కోరారు. ఇచ్చిన పనుల లక్ష్యాలను సత్వరమే పూర్తి చేసేలా క్షేత్రస్థాయి సిబ్బంది కృషి చేయాలని కోరారు. ఎంపీడీఓ తాజ్మస్రూర్, ఏపీఓ చెన్నకేశవులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రాబోయేది.. జగనన్న ప్రభుత్వమే
గాలివీడు : మళ్లీ రాష్ట్రంలో జగనన్న ప్రభుత్వమే అధికారంలోకి వస్తుందని రాష్ట్ర మాజీ డీఓపీ జల్లా సుదర్శన్ రెడ్డి అన్నారు. స్థానిక సాయిమేఘన పెట్రోల్ బంక్ వద్ద జెడ్పీటీసీ ఖాదర్ మొహిద్దీన్, తదితరులతో కలిసి విలేకరులతో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత ఉందని, మారుమూల ప్రాంతాలకు వెళ్లినా జగనన్నే కావాలని ప్రజలు ఆకాంక్షిస్తున్నట్లు తెలిపారు. పేదరిక నిర్మూలన లక్ష్యంగా సంక్షేమ పథకాలు ప్రవేశపెట్టి ప్రతి కుటుంబంలో వెలుగులు నింపిన ఘనత జగన్మోహన్రెడ్డిదే అన్నారు. విద్య, వైద్యం కోసం అనేక కార్యక్రమాలు ప్రవేశపెట్టారని, కరోనా విపత్కర సమయంలోనూ ప్రజలను ఆదుకున్న ఘనత ఆయనకే దక్కిందన్నారు. ఈ కార్యక్రమంలో మద్దిరాల భానుమూర్తి రెడ్డి, చెన్నకేశవరెడ్డి, రామాంజులు రెడ్డి, ఉమాప్రభాకర్, వల్లెపు నగేష్, రమణారెడ్డి, జల్లా ధనుంజయరెడ్డి, వెంకటరెడ్డి, అమీన్, తదితరులు పాల్గొన్నారు. మాజీ డీఓపీ జల్లా సుదర్శన్రెడ్డి -
అంతర్ జిల్లా దొంగల ముఠా పట్టివేత
రాయచోటి: వివిధ ప్రాంతాల్లో చోరీలకు పాల్పడుతూ బంగారం, వెండి దోచుకెళ్లిన అంతర్ జిల్లా దొంగల ముఠాను అన్నమయ్య జిల్లా పోలీసులు పట్టుకున్నా రు. వారి నుంచి కిలో బంగారం, మూడు కిలోల వెండి, నగదు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి పోలీ స్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ విద్యాసాగర్ నాయు డు విలేకరులకు ఆ వివరాలు గురువారం వెల్లడించారు. పశ్చిమ గోదావరి జిల్లా కోయలగూడెం మండలం లక్కవరం గ్రామానికి చెందిన తోట శివకుమార్ అలియాస్ శివ భవానీ (33) గతంలో విజయవాడ, బందర్, గుంటూరు, మంగళగిరి, తాడేపల్లి గూడెం, హనుమాన్ జంఖ్షన్, కోయిలగూడెం, రాజమండ్రి, తుని, అనకాపల్లి, చీపురుపల్లి ప్రాంతాలలో చోరీలకు పాల్పడ్డారన్నారు. ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలో 150 కేసులలో అరెస్టయి జైలు శిక్ష అనుభవించి ఇటీవల బెయిల్పై విడుదలయ్యారన్నారు. బయటకు వచ్చిన వెంటనే చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలం మొరవారిపల్లికి చెందిన జెట్టి సుబ్రహ్మణ్యం(27), అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు మండలం మాధవరం పోడు గ్రామానికి చెందిన సూరేపల్లి వెంకటేష్(21)లతో పరిచయం పెంచుకుని చోరీలు చేయడం మొదలు పెట్టారు. తిరుపతి, అన్నమయ్య జిల్లాల పోలీస్ స్టేషన్ల పరిధిలో తాళం వేసిన ఇళ్లను టార్గెట్గా చేసుకొని నేరాలకు పాల్పడుతున్నారన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా 17 ప్రాంతాలలో వీరు దొంగతనాలకు పాల్పడినట్లు పేర్కొన్నారు. వీరిపై బొమ్మూరు, నక్కలపల్లి, తిరుచానూరు పీఎస్లలో ఐదు, పీలేరు పీఎస్లో రెండు, రాయచోటి అర్బన్, రాజంపేట అర్బన్ పీఎస్లలో రెండు, ఓబులవారిపల్లి, మన్నూరు అర్బన్ పీఎస్లో 4 కేసులు గతంలో నమోదయ్యాయని అన్నారు. ఊటుకూరు సంజీవరాయ స్వామి దేవాలయం వద్ద ఈ నెల 21న వారిని అరెస్టు చేసినట్లు ఎస్పీ తెలిపారు. వారి నుంచి కోటి రూపాయలు విలువచేసే కిలో బంగారం, మూడు కిలోల వెండి, రూ.1.40లక్షల నగదు, రెండు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం చేసుకున్నట్లు వివరించారు. మరింత బంగారాన్ని ఫైనాన్స్ కంపెనీ, ఇతర వ్యక్తుల వద్ద రికవరీ చేయాల్సి ఉందన్నారు. కేసు ఛేదించడంలో ప్రతిభ కనబరిచిన రాజంపేట ఏఎస్పీ మనోజ్ రామనాథ్ హెగ్డే, మన్నూరు అర్బన్ సీఐ ఎస్.కుళాయప్ప, సీసీఎస్ ఇన్స్పెక్టర్ ఎం.చంద్రశేఖర్, ఓబులవారిపల్లి ఎస్ఐ పి.మహేష్, సీసీఎస్ ఎస్ఐ రామకృష్ణారెడ్డి, సిబ్బందిని ఎస్పీ విద్యాసాగర్ నాయుడును అభినందించారు. వివిధ ప్రాంతాల్లో 17 చోట్ల చోరీలు బంగారు నగలు, వెండి స్వాధీనం జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడు -
కేంద్రీయ విద్యాలయ స్థలం కబ్జా
మదనపల్లె రూరల్ : ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్య అందించేందుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలం కబ్జాకు గురైంది. వేల కోట్ల రూపాయల విలువ కావడంతో కొందరు అక్రమార్కులు యథేచ్ఛగా నిర్మాణాలు జరిపి ఆక్రమించారు. అధికారులు పరిశీలించడంతో అసలు విషయం వెలుగు చూసింది. మండలంలోని వలసపల్లె పంచాయతీలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు చేసేందుకు స్థలం కేటాయించారు. అనంతపురం–కృష్ణగిరి జాతీయ రహదారికి ఆనుకుని ఉన్న ఈ స్థలం ఖాళీగా ఉండడంతో కొందరు కబ్జా చేసి అక్రమ నిర్మాణాలు చేపట్టారు. రెవెన్యూ, పంచాయతీ అధికారులు అడ్డుకునేందుకు వీలు లేకుండా జహా కాలనీ పేరుతో బోర్డు ఏర్పాటుచేసి పనులు చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ సంఘటన్(కేవీఎస్) డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధ, సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ గురువారం ఆ స్థలం పరిశీలించేందుకు వెళ్లగా.. ఆక్రమణల విషయం వెలుగు చూసింది. పనులు నిలిపివేయాలని ఆదేశం కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన సర్వే నెంబర్0496/5 స్థలంలో కొంతమేర, రెవెన్యూ సర్వీసెస్ బిల్డింగ్కు సంబంధించిన సర్వే నెంబర్ 713/1, 2లో మరింత స్థలాన్ని ఆక్రమించి నిర్మాణా లు చేపట్టినట్లు అధికారులు గుర్తించారు. ఇదే కా కుండా.. కేంద్రీయ విద్యాలయం, హంద్రీ–నీవా కా లువకు ఆనుకుని ఉన్న రెండెకరాల స్థలం పదికోట్ల విలువ చేస్తుంది. ఇక్కడ దాదాపు వందకు పైగా పునాదులు వేసి పనులు సాగిస్తున్నారు. ఆక్రమణలను గుర్తించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ వెంటనే నిర్మాణాలపై చర్యలు తీసుకోవాలని రెవెన్యూ అధి కారులను ఆదేశించారు. రికార్డులు ఉంటే చూపాల ని సంబంధిత నిర్మాణదారులకు సూచించారు. పూర్తిస్థాయిలో విచారణ జరిపి సమగ్ర నివేదిక ఇవ్వాలని సర్వేయర్, ఆర్ఐలను ఆదేశించారు. రూ.10 కోట్ల తో అక్రమ నిర్మాణాలు జహా కాలనీ పేరుతో బోర్డు ఏర్పాటు సబ్ కలెక్టర్ పరిశీలనలో వెలుగులోకి -
28న ఐదువేల మందితో యోగా నిర్వహించాలి
రాయచోటి: ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన యోగాంధ్ర–2025లో భాగంగా ఈనెల 28న ఒకే ప్రాంతంలో ఐదువేల మందితో యోగా కార్యక్రమం నిర్వహించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్ నుంచి సబ్ కలెక్టర్లు, ఆర్డీఓ, జిల్లా అధికారులతో కలెక్టర్ వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. యోగాంధ్ర–2025 మాసోత్సవాల నిర్వహణ, తడి, పొడి చెత్త సేకరణ తదితర అంశాల్లో చేపట్టాల్సిన పనులపై దిశా నిర్దేశం చేశారు. జిల్లా నుంచి పది లక్షల మంది యోగా కార్యక్రమంలో పాల్గొనేలా అధికారులు కృషి చేయాలన్నారు. ఇందుకు ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. ● జిల్లాలోని 500 గ్రామ పంచాయతీలు, మున్సిపాల్టీల్లో ప్రతిరోజూ చెత్త సేకరణ చేయాలని కలెక్టర్ ఆదేశించారు. ఇందులో తడి, పొడి చెత్తలను విడిగా సేకరించాలని, ఈ దశగా ప్రజలలో అవగాహన పెంపొందించాలన్నారు. జిల్లాలోని అన్ని బస్టాండ్లలో మెరుగైన వసతులు కల్పించాలని తెలిపారు. బస్టాండ్ పరిసరాలలో క్రమం తప్పకుండా పారిశుధ్య కార్యక్రమాల నిర్వహణ బాగుండాలని సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్రావు, సబ్ కలెక్టర్ వైఖోన్ నదియా దేవి, ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
ముహూర్తం ఖరారు
మదనపల్లె కేంద్రీయ విద్యాలయానికిమదనపల్లె రూరల్: పట్టణ ప్రజలు ఎప్పుడెప్పుడా అని ఎదురుచూస్తున్న కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కృషి ఫలించింది. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో మదనపల్లెకు మంజూరైన కేంద్రీయ విద్యాలయం(కేవీఎస్) ఈ విద్యాసంవత్సరం నుంచే ప్రజలకు అందుబాటులోకి రానుంది. కేంద్రీయ విద్యాలయ సంఘటన డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధ...సబ్ కలెక్టర్ మేఘస్వరూప్తో కలిసి గురువారం మండలంలోని వలసపల్లె పంచాయతీలో కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన స్థలాన్ని పరిశీలించారు. అనంతపురం–కృష్ణగిరి జాతీయరహదారికి ఆనుకుని సర్వే నంబర్లు.713/3, 713/4, 496/2, 496/3లో మొత్తం..6.09 ఎకరాల భూమిని కేటాయించినట్లు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్, కేవీఎస్ అధికారులకు తెలిపారు. దీంతో వారు స్థలానికి సంబంధించిన ఫొటోలు, వీడియోలు తీసుకున్నారు. తర్వాత అక్కడ నుంచి బయలుదేరి పట్టణంలోని బీసీ వెల్ఫేర్ హాస్టల్ ప్రాంగణంలో నిర్మించిన కేంద్రీయ విద్యాలయ తాత్కాలిక భవనాన్ని పరిశీలించారు. తరగతుల నిర్వహణకు, పాఠశాల ప్రారంభానికి అనువుగా ఉన్నాయని సంతృప్తి వ్యక్తం చేశారు. తర్వాత సబ్ కలెక్టర్ కార్యాలయానికి చేరుకుని, చేయాల్సిన ఏర్పాట్లపై చర్చించారు. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్...కేంద్రీయ విద్యాలయానికి సంబంధించి వలసపల్లె పంచాయతీలో కేటాయించిన 6.09 ఎకరాల స్థలానికి సంబంధించి అడ్వాన్స్డ్ పొజిషన్కు సంబంఽధించిన పత్రాలను కేవీఎస్, హైదరాబాద్ రీజియనల్ ఆఫీస్, డిప్యూటీ కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనూరాధలకు స్వాధీనం చేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ...కేంద్రీయ విద్యాలయం, మదనపల్లెలో 2025–26 విద్యాసంవత్సరం నుంచి మొదటగా 1 నుంచి 5 తరగతుల వరకు కార్యకలాపాలను ప్రారంభిస్తున్నామన్నారు. వచ్చే ఏడాది 6వతరగతి, మరుసటి సంవత్సరం 7 ఇలా పెంచుకుంటూ వెళతామన్నారు. అడ్మిషన్లకు సంబంధించి ఆఫ్లైన్ నోటిఫికేషన్ను వారం, పదిరోజుల్లో ప్రకటిస్తామన్నారు. వలసపల్లెలో శాశ్వత భవనాల నిర్మాణం పూర్తయ్యాక, పాఠశాలను పూర్తిస్థాయిలో అక్కడి నుంచే నిర్వహిస్తామన్నారు. కార్యక్రమంలో రాజంపేట బీజేపీ పార్లమెంటరీ అధ్యక్షుడు సాయిలోకేష్, కేంద్రీయ విద్యాలయ తిరుపతి సబ్ ఇన్చార్జి చంద్రశేఖర్, తహసీల్దార్ ధనంజయులు, ఆర్ఐ భరత్రెడ్డి, మండల సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వో నాగేశ్వర్ తదితరులు పాల్గొన్నారు. ఫలించిన ఎంపీ మిథున్రెడ్డి కృషి తరగతుల ప్రారంభానికి త్వరలో నోటిఫికేషన్ భూమి, భవనాలను కేవీఎస్ అధికారులకు అప్పగించిన సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఫలించిన ఎంపీ కృషి మదనపల్లెను ఎడ్యుకేషన్ హబ్గా తీర్చిదిద్దుతానని హామీ ఇచ్చిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాజంపేట పార్లమెంటరీ పరిధిలో ఏర్పాటుచేయాలనుకున్న మెడకల్ కాలేజీని మదనపల్లెకు కేటాయించేలా చూశారు. బీటీ కళాశాలను ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకురావడమే కాకుండా, యూనివర్సిటీగా అప్గ్రేడ్ చేస్తూ జీఓ తీసుకొచ్చారు. పేద పిల్లలకు ఉన్నత ప్రమాణాలతో కూడిన విద్యను అందించేందుకు ప్రతిష్టాత్మకమైన కేంద్రీయ విద్యాలయాన్ని మదనపల్లెకు మంజూరు చేయించడమే కాకుండా వలసపల్లె పంచాయతీలో జాతీయరహదారికి ఆనుకుని 6.09 ఎకరాల స్థలాన్ని కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఎంపీ నిధులు రూ.50లక్షలు మంజూరుచేసి, తాత్కాలిక భవన నిర్మాణపనులను పూర్తి చేయించారు. ఈ విద్యాసంవత్సరం నుంచి కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభం అవుతుండటంపై నియోజకవర్గ ప్రజలు హర్షం వ్యక్తం చేస్తూ, ఎంపీ మిథున్రెడ్డికి ఽకృతజ్ఞతలు తెలిపారు. -
నిండు చూలాలిని చూడకనే.. తండ్రి మృతి
● కుమార్తె కోసం కువైట్ నుంచి వస్తూ విదేశాల్లో చనిపోయిన తండ్రి ● రూ.2.5 లక్షలు కడితే మృతదేహం ఇస్తామన్న ఆస్పత్రి నిర్వాహకులు రాజంపేట: నిండు చూలాలైన తన కుమార్తెకు కాన్పు చేయించేందుకు విదేశాల నుంచి బయలుదేరిన తండ్రి.. ఆస్పత్రి పాలై కానరాని లోకాలకు చేరారు. మృతదేహం కావాలంటే రూ.2.5 లక్షలు కట్టాలంటూ కొలంబో ఆస్పత్రి వారు చెప్పడంతో కడచూపుకై నా నోచుకోలేకపోతున్నామని తల్లి, కుమార్తెలు కన్నీరు మున్నీరవుతున్నారు. రాజంపేటలో జరిగిన ఈ సంఘటన వివరాలు ఇలా ఉన్నాయి.. రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన రాజుబోయిన మనోహర్(45) రాజంపేట పట్టణంలోని రామనగర్లో నివాసముంటున్నారు. బ్రతుకు దెరువు కోసం ఎనిమిది నెలల కిందట కువైట్కు వెళ్లారు. ఇతడికి భార్య రాజేశ్వరి, కుమార్తె మౌనిక, కుమారుడు ఉన్నారు. కుమార్తె నిండు చూలాలు కావడంతో బిడ్డకు కాన్పు చేయించేందుకు తండ్రి ఈ నెల 17న ఇండియాకు వచ్చేందుకు కువైట్ విమానశ్రయంలో బోర్డింగ్ తీసుకున్నారు. అక్కడ శ్రీలంక విమానం ఎక్కినా.. ఇంటికి రాలేదు. దీంతో ఆయన భార్య రాజేశ్వరి పోలీసులకు ఫిర్యాదు చేశారు. విచారించగా మనోహర్కు విమానంలో ఆరోగ్య సమస్య తలెత్తడంతో కొలంబో ఆస్పత్రిలో చేర్చారని, కోలుకోలేక అక్కడే మృతి చెందారని సమాచారం వచ్చింది. విషయం తెలుసుకుని భార్య, పిల్లలు బోరున విలపించారు. కడచూపుకై నా నోచుకుందామని అడిగితే.. రూ.2.5 లక్షలు కడితే మృతదేహంఇస్తామని కొలంబో ఆస్పత్రి సిబ్బంది చెప్పడంతో నిశ్చేష్టులయ్యారు. ఏమి చేయాలో తోచక ఇంటి వద్దే కన్నీరు మున్నీరవుతున్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వం, ప్రజాప్రతినిధులు జోక్యం చేసుకుని మనోహర్ మృత దేహాన్ని ఇండియాకు తెప్పించాలని వారు కోరుతున్నారు. వ్యవసాయ బోర్ల వద్ద కేబుల్ చోరీ గుర్రంకొండ : నాలుగు వ్యవసాయ బోర్లు, బావుల వద్ద వరుస చోరీలు జరిగిన సంఘటన మండలంలోని టి.రాచపల్లెలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి... గ్రామానికి చెందిన నలుగురు రైతులు గురువారం వ్యవసాయ పనుల నిమిత్తం తమ పొలాల వద్దకు వెళ్లారు. కేబుల్ వైర్లు కత్తిరించి.. ఫీజు క్యారియర్లు బయటపడి ఉండడంతో వ్యవసాయ పరికరాలు చోరికి గురయ్యాయని గుర్తించారు. గ్రామానికి చెందిన రమేష్బాబు పొలంలో 30మీటర్ల కేబుల్, సురేంద్రరెడ్డి పొలంలో 50 మీటర్లు, రఘనాథరెడ్డి పొలంలో 45 మీటర్లు, సిద్ధమల్రెడ్డి పొలంలో 25 మీటర్ల కేబుల్ వైర్లు, ఫీజు కారియర్లు దోచుకెళ్లారు. రమేష్బాబు పొలంలో రూమ్ తాళాలు పగులగొట్టి అందులో వ్యవసాయ పరికరాలు, సామగ్రి తీసుకెళ్లారు. చోరికి గురైన వస్తువులు, కేబుళ్ల విలువ లక్ష రూపాయలు ఉంటుందని రైతులు తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఉపాధిలో ‘చిలక్కొట్టుడు’ !
గాలివీడు : మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం పక్కదారి పడుతోంది. కూలీలకు బిల్లులు చెల్లింపులో ఫీల్డ్ అసిస్టెంట్లు అక్రమాలకు తెర తీశారు. నీకింత.. నాకింత అంటూ వాటాలు పంచుకున్నారు. గాలివీడు మండలంలోని 17 గ్రామ పంచాయతీల్లో దాదాపు 14వేల జాబ్ కార్డుదారులు ఉన్నారు. వీరిలో 5వేల మంది పనులకు వెళ్తున్నారు. వీరి అవసరాలు ఆసరాగా తీసుకున్న ఫీల్డ్ అసిస్టెంట్లు వారు పనులకు వెళ్తే ఓ రేటు.. వెళ్లకుంటే మరో రేటు పెట్టి మరీ అక్రమ వసూళ్లకు పాల్పడుతున్నారు. మస్టర్లలో పేరు నమోదు మొదలు బిల్లులు చెల్లింపు వరకూ వారి కనుసన్నల్లోనే జరుగుతోంది. ఖాతాలో పడిన వెంటనే.. ఫీల్డ్ అసిస్టెంట్లు జాబ్ కార్డులు కలిగిన తమ అనుకూల ఉపాధి కూలీలను ఎంపిక చేసుకుంటున్నారు. ఉపాధి బిల్లు మొత్తం బ్యాంకు ఖాతాలో పడిన వెంటనే కూలీ తన అకౌంట్ నుండి తీసి ఎఫ్ఏలకు ఇవ్వాలి. దీనికి ఒప్పుకున్న వారి పేర్లు మాత్రమే ఉపాధి మస్టర్లలో చేరుస్తున్నారు. గ్రూపులుగా ఏర్పాటుచేసుకుని పనికి వెళ్లే వారైతే.. బిల్లు మొత్తం ఖాతాలో పడిన వెంటనే ఒక్కొక్క కార్డుదారుడు రూ.200 ఫీల్డ్ అసిస్టెంట్ కు ఇవ్వాలి. పనికి వెళ్లని వారైతే .. తమ ఖాతాలో బిల్లు జమ కాగానే 50 శాతం నగదు ఫీల్డ్ అసిస్టెంట్కు ముట్టజెప్పాల్సిందే. ఈ లెక్కన ఫీల్డ్ అసిస్టెంట్లు అప్పనంగా సొమ్ము ఆర్జిస్తున్నారు. ఇలా ఒక్కో పనికి రూ.20 వేల నుంచి రూ.30 వేలు సంపాదిస్తున్నారు. జిల్లా యంత్రాంగం ఉపాధి అక్రమాలపై దృష్టి సారించి అక్రమ వసూళ్లను కట్టడి చేయాలని ప్రజలు కోరుతున్నారు. బిల్లుల చెల్లింపులో ఫీల్డ్ అసిస్టెంట్ల చేతివాటం -
రాజంపేట సబ్వేకి కదలిక!
● సబ్వే అందుబాటులోకి రాక అనేక ఇబ్బందులు... రాజంపేట 103 ఎల్సీగేట్ స్ధానంలో సబ్వే నిర్మాణం అందుబాటులోకి రాక ప్రజలు, విద్యార్ధులు, మహిళలు, ఇరువైపుల ఉన్న ప్రాంతీయులు అనేక ఇబ్బందులు పడుతున్నారు. సబ్వేలో కనీసం ఆటో, బైకులు, పాదచారులు వెళ్లేందుకు అనుకూలంగా రైల్వేశాఖ నిర్మించినప్పటికి, రెండువైపు అప్రోచ్రోడ్డు వేసే అంశం చిరకాలంగా పెండింగ్లో పడిపోయింది. ఇటీవల గంగమ్మ జాతర సందర్భంగా సబ్వే అందుబాటులో లేకపోవడంతో వందలాది అనేక ఇబ్బందులు పడిన సంగతి తెలిసిందే. ఇప్పటికి పట్టాలు దాటి అవలివైపు వెళ్లాల్సి వస్తోంది.భవిష్యత్తులో రైల్వేట్రాక్కు ఫెన్సింగ్ వేస్తే ఇక దారి వుండదనే వాదన వినిపిస్తోంది. రైలుపట్టాలు దాటడం రైల్వేచట్టం ప్రకారంగా నేరమైనప్పటికి స్ధానికులు తప్పనిపరిస్ధితులో కొనసాగించాల్సి వస్తోంది. ● రూ.5కోట్లు కేటాయింపు ● స్థానికులలో చిగురించిన ఆశలు ● సబ్వేకి అప్రొచ్రోడ్డ్డు ప్రశ్నార్ధకరం ● ఫలించిన ఎంపీ మిథున్రెడ్డి కృషి రాజంపేట: పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట రైల్వేస్టేషన్ యార్డులో అర్ధాంతరంగా ఆగిపోయిన సబ్వేకి కదిలికవచ్చింది. గుత్తి–రేణిగుంట రైలుమార్గంలో రాజంపేట యార్డు 103 లెవ ల్ క్రాసింగ్ గేట్కు ప్రత్యామ్నాయంగా నిర్మితం చేసి న సబ్వేకి రూ.5కోట్ల 22లక్షలు కేటాయించారు. దీంతో సబ్వే నిర్మాణం అంశం స్ధానికంగా చర్చనీయాంశంగా మారింది. రాష్ట్ర ప్రభుత్వం రాజంపేట సబ్వే నిర్మాణ విషయంలో నిధుల లేమితో వెనకడుగు వేసినట్లుగా స్ధానికంగా విమర్శలున్నాయి. దివంగత సీఎం వైఎస్సార్ హయాంలో ఆర్వోబి రాజంపేట రైల్వేగేటు సమస్య తీవ్రరూపం దాల్చిన క్రమంలో దివంగత సీఎం వైఎస్రాజశేఖర్రెడ్డి పాల నలో ఆనాటి ఎమ్మెల్యే కొండూరు ప్రభావతమ్మ, ప్రస్తుత ఎమ్మెల్యే, అప్పటి డీసీసీ అధ్యక్షునిగా ఆకేపాటి అమరనాథ్రెడ్డి చొరవ కృషితో రోడ్ ఓవర్ బ్రిడ్జి నిర్మితౖమైంది. రాజంపేట–రాయచోటి మార్గంలో ఇప్పుడు వాహనాల రాకపోకల సుగమమైంది. ఆర్వోబి ఇరువైపుల వారికి రాకపోకల సమస్య ఆర్వోబి నిర్మించిన తర్వాత ఇరువైపుల ఉన్న ప్రాంతీయులకు రాకపోకల సమస్య ఉత్పన్నమైంది. రైల్వేగేటుకు ఇరువైపుల ఉన్న ప్రాంతాల వారికి ఆర్వోబితో నిమిత్తం లేకుండా ఆర్యూబీ నిర్మించాలని కోరా రు. అయితే ఆర్వోబి ఉన్న చోట ఆర్యూబీ ఇచ్చే పరిస్ధితులు లేని కారణంగా సబ్వే నిర్మితానికి ముందుకు వచ్చింది. రైల్వేశాఖ నిథులు కేటాయింపులు జరిగాయి. సబ్వే నిర్మితం తుదిదశకు చేరుకునేలా పనులు జరిగాయి. అనేక కారణాలతో సబ్వే నిర్మాణం మరుగునపడింది. ఇప్పటికి ఒకటిన్నర దశాబ్ధకాలం అయింది. వెంటాడుతున్న అప్రోచ్ రోడ్డు నిర్మాణ వ్యవహారం.. సబ్వే నిర్మాణానికి అప్రోచ్ రోడ్డు నిర్మాణవ్యవహారమే అడ్డంకీగా మారింది. సబ్వేకు అటు రాయచోటి వైపు, ఇటు రాజంపేట వైపు ఉన్న నిర్మాణాలు కారణంగా సబ్వే పూర్తికావడానికి బ్రేక్ పడింది. ఈ విషయంలో పురపాలకసంఘం, రోడ్లు భవనాల శాఖలు ఒకరిమీద ఒకరు చెప్పుకుంటూ కాలాన్ని వెల్లదీసిన సంగతి తెలిసిందే. అలాగే సబ్వేకు ఇరువైపు ప్రాంతాలకు చెందిన వారు కొందరు కోర్టుకు కూడా వెళ్లిన సంగతి తెలిసిందే. కోర్టులో ఉండటంతో రెండు శాఖలు ఏమీ చేయలేని నిస్సహాయస్ధితిలో ఉన్నారు. గతంలో సబ్కలెక్టర్గా పనిచేసిన ప్రీతిమీనాతోపాటు అనేకమంది అధికారులు, ప్రజాప్రతినిధులు సబ్వే ప్రాంతాన్ని పరిశీలించిన సంగతి విధితమే. రైల్వేమంత్రి, జీఎం,డీ ఆర్ఎం వరకు వినతులు రైల్వేమంత్త్వ్రిశాఖ, దక్షిణమధ్యరైల్వే జనరల్ మేనేజరు, గుంతకల్ రైల్వే డివిజనల్ మేనజరు వరకు రాజంపేట సబ్వే నిర్మాణం అంశం వెళ్లింది. సబ్వే నిర్మాణం పూర్తి కోసం ఆందోళనలు, నిరసనలు జరిగాయి. రాజంపేట లోక్సభ సభ్యుడుపీవీ మిథున్రెడ్డి ఇదే అంశాన్ని పలుమార్లు రైల్వేమంత్రిత్త్వశాఖ, ఎస్సీ రైల్వే జీఎం దృష్టి తీసుకెళ్లారు. ఫలితంగా 2025–2026 రైల్వే బడ్జెట్లో రాజంపేట సబ్వేకి రూ.5కోట్ల 22 లక్షలు నిధులు కేటాయింపులు జరిగాయి. ఈ మేరకు పింక్బుక్లో వెల్లడించారు. సబ్వేను త్వరితగతిన పూర్తి చేయాలి సబ్వే నిర్మాణవిషయంలో కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వం సమన్వయంతో త్వరితగతిని పూర్తి చేయాలి. రైల్వేబడ్జెట్లో రాజంపేట 103 లెవల్ క్రాస్గేట్ స్ధానంలో సబ్వే నిర్మాణానికి నిధులు కేటాయించడం హర్షణీయము. సబ్వేను అందుబాటులోకి తీసుకొస్తే ఆర్వోబికి ఇరువైపు ఉన్న ప్రాంతీయులు ఇబ్బందులు తీరుతాయి. –రెడ్డిమాసి రమేష్నాయుడు, వైఎస్సార్సీపీనేత, రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కృషితోనే నిధుల కేటాయింపు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి రాజంపేట సబ్వే నిర్మాణ అంశాన్ని రైల్వేశాఖ దృష్టికి తీసుకెళ్లారు. అలాగే సెక్షన్ అనేక ప్రాంతాల్లో ఆర్యూబీల నిర్మాణానికి కృషిచేశారు. ఇప్పుడు పెండింగ్లో ఉన్న సబ్వే నిర్మాణానికి రైల్వేంత్రి, జీఎం దృష్టికి తీసుకెళ్లారు. ఎంపీ కృషి ఫలితంగా రైల్వేబడ్జెట్లో సబ్వే నిర్మాణానికి నిధులు కేటాయించారు. –తల్లెంభరత్రెడ్డి, సభ్యుడు, గుంతకల్ డీఆర్యుసీసీ -
కళాశాల గదుల వేలం వాయిదా
ప్రొద్దుటూరు : స్థానిక శ్రీకృష్ణ గీతాశ్రమంలోని మలయాళస్వామి బీఈడీ కళాశాల గదుల వేలంపాట వాయిదా పడింది. పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ రామచంద్రాచార్యులు ప్రకటించారు. దీంతో దేవాదాయ శాఖకు మరింత నష్టం వాటిల్లినట్లయింది. అయితే స్థానిక అధికార పార్టీ ప్రజాప్రతినిధి ప్రమేయంతోనే వేలంపాట నిర్వహించలేదని, కళాశాల నిర్వాహకులకు అనుకూలంగా సదరు ప్రజాప్రతినిధి వ్యవహరించి ఫోన్ చేయడంతోనే వాయిదా వేశారని చర్చ సాగుతోంది. బహిరంగ వేలం నిర్వహిస్తే ఈ గదులకు నెలకు రూ.లక్ష వరకు ఆదాయం లభించే అవకాశం ఉన్నా.. అధికారుల తీరుతో అందకుండాపోయింది. ఏడేళ్లుగా అద్దె చెల్లించలేదు దేవాదాయ శాఖ ఆధ్వర్యం శ్రీకృష్ణ గీతాశ్రమంలో 7,744 చదరపు అడుగుల విస్తీర్ణంలో మూడు అంతస్తుల్లో మలయాళ స్వామి బీఈడీ కళాశాల నిర్వహిస్తున్నారు. ఈ భవనాలకు ఏడేళ్లుగా కళాశాల నిర్వాహకులు అద్దె చెల్లించడం లేదు. కళాశాల యాజమాన్యం గతంలో కోర్టును ఆశ్రయించడంతో గత ఏడాది సెప్టెంబర్ 11న అప్పీల్ను కోర్టు కొట్టివేసింది. దీంతో ఈఓ ఏడేళ్ల బకాయిలు రూ.7 లక్షలు చెల్లించాలని పలుమార్లు నోటీసులిచ్చినా నిర్వాహకులు స్పందించలేదు. నాలుగు రోజుల కిందట కళాశాల భవనాలను ఈవో సీజ్ చేసి వేలం నిర్వహిస్తామని ప్రకటన విడుదల చేశారు. విషయం తెలుసుకున్న కళాశాలల నిర్వాహకులు వేలం పాటలో పాల్గొనేందుకు గీతాశ్రమానికి వచ్చారు. అయితే పర్యవేక్షణ అధికారి రాకపోవడంతో వాయిదా వేశామని ఈఓ తెలిపారు. పది రోజుల తర్వాత తిరిగి వేలం నిర్వహిస్తామని పేర్కొన్నారు. గతంలోనూ ఇలాగే.. దేవాదాయశాఖకు సంబంధించిన గదులను లోపాయికారీ ఒప్పందాలతో తక్కువ ధరకే అద్దెకు ఇస్తున్నారని బీజేపీ జిల్లా అధ్యక్షుడు జంగిటి వెంకటసుబ్బారెడ్డి తెలిపారు. వేలం పాట నిర్వహణను పరిశీలించేందుకు బుధవారం ఆయన ఇక్కడికి వచ్చారు. ఈఓతో ఆయన మాట్లాడుతూ గతంలోలాగే జరుగుతోందని ఇక్కడికి వచ్చానని, ప్రస్తుతం అదే రీతిన వేలం పాట నిర్వహించకుండా వాయిదా వేశారని అన్నారు. గతంలో వేలం జరిపినట్లు రికార్డులు తయారుచేసి అతి తక్కువ బాడుగకు ఇచ్చారని ఆయన తెలిపారు. ఎవరైతే ఆశ్రమానికి వ్యతిరేకంగా కోర్టులో కేసులు వేశారో వారికే రూములను అప్పజెప్పడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. పది రోజుల తర్వాత అయినా పారదర్శకంగా వేలం పాట నిర్వహించాలని ఈఓను కోరారు. నిబంధనలకు విరుద్ధంగా దేవాదాయశాఖ ఆదాయానికి గండి కొట్టొద్దని తెలిపారు. ఇలా జరిగితే న్యాయ పోరాటం చేస్తానన్నారు. అధికార పార్టీ నేత ఒత్తిడే కారణమా? -
భూసార పరీక్ష.. పంట దిగుబడికి రక్ష
వ్యవసాయ డివిజన్ల వారీగా మట్టి నమూనాల సేకరణ లక్ష్యాలు ఇలా ఉన్నాయివ్యవసాయ మండలాల నమూనాల డివిజన్ సంఖ్య సంఖ్య కడప 6 3366 కమలాపురం 4 3300 పులివెందుల 5 3696 ముద్దనూరు 4 2674 ప్రొద్దుటూరు 4 3107 మైదుకూరు 4 2904 బద్వేలు 4 1814 పోరుమామిళ్ల 5 3427 మొత్తం 36 24,288 వల్లూరు : భూసార పరీక్షలను నిర్వహించుకుని భూముల స్వభావం, అందులోని పోషక విలువల ఆధారంగా తగిన పంటలను ఎంపిక చేసుకుని సాగులో మెలకువలు పాటించడం వలన అధిక దిగుబడులను సాఽధించడానికి అవకాశాలు ఉన్నాయని వ్యవసాయ నిపుణులు తెలుపుతున్నారు. నేలలు తమలో సహజంగా ఇమిడి వున్న పోషక పదార్థాలతోబాటు మనం అదనంగా వేసే సేంద్రీయ , రసాయనిక ఎరువుల్లోని పోషకాలను పంటలకు అందజేస్తాయి. ఈ పోషక విలువలతో బాటు భూమిలోని చౌడు గుణం, సున్నం శాతం, నేల కాలుష్యం మొదలైన వాటి స్థాయిలను తెలుసుకోవడానికి భూసార పరీక్ష ఉపయోగపడుతుంది. అంతేగాక నేలల్లో వివిధ రకాల నేలలు వుండగా అందులో కొన్ని రకాల నేలల్లో ప్రత్యేకించి కొన్ని పంటలు సాగుకు అనుకూలంగా వుండి మంచి దిగుబడులు వస్తాయి. భూమి స్వభావాన్ని తెలుసుకోవడం ద్వారా అందుకు తగిన పంటలను సాగు చేసి మంచి ఫలితాలను పొందవచ్చు. సాగు ఖర్చులు తగ్గించుకోవడానికి.. కనీసం రెండు లేక మూడు సంవత్సరాలకు ఒకసారి భూసార పరీక్షలను చేయించుకుని తమ పొలాల్లోని వివిధ పోషక పదార్థాల విలువలను తెలుసుకోవడం ద్వారా తగిన మోతాదులోనే ఎరువులను వాడడానికి అవకాశం ఉంటుంది. దీని వలన అవసరమైన పోషకాలను మాత్రమే పంటలకు అందించడం వలన అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశాలు ఉంటాయి. అంతే కాక భూమిలో నిల్వ ఉన్న వివిధ పోషకాలను సమర్థవంతంగా వినియోగించుకుని ఆశించిన దిగుబడులను పొందవచ్చు. సరైన పద్ధతిలో పరీక్షలు నిర్వహిస్తేనే ఫలితం.. కాగా భూసార పరీక్ష నిర్వహించడంలో సరైన పద్ధతిని పాటిస్తేనే సత్ఫలితాలు ఉంటాయి. కావున భూసార పరీక్షలు నిర్వహించేటపుడు రైతులు కొన్ని జాగ్రత్తలను తప్పనిసరిగా పాటించడం వలన మంచి ప్రయోజనం ఉంటుంది. ● పొలంలో ఇంగ్లీషు వీ అక్షరం ఆకారంలో 15 సెం, మీ వరకు పారతో గుంత తీసి అందులో పై పొర నుండి కింది పొర వరకు ఒక పక్కగా మట్టిని సేకరించాలి. ● ఒక ఎకరా విస్తీర్ణంలో 8 నుండి 10 చోట్ల సేకరించిన మట్టిని ఒక చోట చేర్చి బాగా కలిపి 4 భాగాలుగా చేయాలి. అందులో ఎదురెదురుగా వున్న భాగాలను తీసుకుని మిగిలిన భాగాలను తీసి వేయాలి. ఇదే విధంగా మట్టి పరిమాణం 1/2 కిలో వచ్చే వరకు చేయాలి. ● సేకరించిన మట్టిలో రాళ్లు, వేర్లు లేకుండా చేసి నీడలో ఆరబెట్టాలి. ● మట్టి నమూనా సేకరణకు రసాయనిక, సేంద్రీయ ఎరువులకు ఉపయోగించిన సంచులను వాడరాదు. ● గట్ల దగ్గర, పంట కాల్వలలో, చెట్ల కింద, ఎరువులను కుప్పలుగా వేసిన చోట, ఎప్పుడూ నీరు నిల్వ వుండే ప్రదేశంలో మట్టి నమూనాను సేకరించరాదు. ● పొలంలో చౌడు ప్రాంతం ఉన్నట్లైతే ప్రత్యేకంగా నమూనాను తీసి పంపాలి. ● పండ్ల తోటల సాగుకు పంట రకాన్ని బట్టి 3 నుండి 6 అడుగుల లోతు వరకు గుంతను తీసి ప్రతి అడుగుకు కొంత మట్టిని సేకరించి పంపాల్సి ఉంటుంది. రైతులకు ఉపయుక్తంగా భూసార పరీక్షా పత్రాలు.. సేకరించిన మట్టి నమూనాలను అందుబాటులోని భూసార పరీక్షా కేంద్రాలకు పంపితే వారు పరీక్షలు నిర్వహించి వివిధ పోషక విలువల శాతాన్ని నమోదు చేస్తారు. వీటిని కార్డులలో పొందుపరిచి రైతులకు అందచేస్తారు. ఇందులో ఉదజని సూచిక, లవణ సూచిక, సేంద్రీయ కర్బణంలతో బాటు ప్రధాన పోషకాలైన నత్రజని, బాస్వరం, పొటాషియం, సూక్ష్మ ధాతు పోషకాలైన గంధకం, జింక్, బోరాన్, ఇనుము, మాంగనీసు, రాగి వంటి వాటి విలువల శాతాన్ని నమోదు చేస్తారు. దీనితో బాటు సాధారణంగా అవి ఉండాల్సిన శాతాన్ని బట్టి పరీక్షల్లో నమోదైన విలువల స్థాయిలను తక్కువ, ఎక్కువ, సాధారణం, మధ్యస్థం, అతి తక్కువ, అతి ఎక్కువ వంటి వివరాలతో సూచిస్తారు. వీటిని ఆధారంగా చేసుకుని పంటలకు వాడాల్సిన ఎరువుల మోతాదులను, వాడే విధానాలను సైతం సూచిస్తారు. ఇవి పాటించడం వలన రైతులు పంటల సాగులో ఖర్చులను తగ్గించుకుని నికర ఆదాయాన్ని పెంపొందిచుకునే అవకాశాలు వున్నాయి. ఈ క్రమంలో వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో భూసార పరీక్షల నిర్వహణకు గానూ మట్టి నమూనా సేకరణను ఇప్పటికే ప్రారంభించారు. గత ఏడాది మట్టి నమూనాల సేకరణ లక్ష్యం 17800 కాగా, 2025– 26 సంవత్సరానికి గానూ జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో మొత్తం 24,288 మట్టి నమూనాలు సేకరించాలని లక్ష్యంగా నిర్ణయించారు. జిల్లా వ్యాప్తంగా 36 మండలాల్లో మట్టి నమూనాల సేకరణ ప్రారంభం జిల్లా లక్ష్యం – 24,288 నమూనాలు భూసార పరీక్షతో ప్రయోజనాలు.. భూసార పరీక్ష చేయించుకుని నేల స్వభావాన్ని బట్టి పంటలను సాగు చేయడం వలన మంచి ఫలితం ఉంటుంది. భూమిలోని పోషకాల విలువలను తెలుసుకోవడం ద్వారా అవసరమైన పోషకాలను మాత్రమే ఎరువుల రూపంలో వాడవచ్చు. దీంతో అనవసర ఖర్చులను తగ్గించుకోవడానికి అవకాశం ఉంది. – ఏవీ నరసింహారెడ్డి, సహాయ వ్యవసాయ సంచాలకులు, కమలాపురం -
ఉపాధి కల్పించాలి
ఎండీయూ వాహనాలను నిలిపి వేయాలన్న ఆలోచనను ప్రభు త్వం విరమించాలి.ప్రస్తుతం పనిచేస్తున్న ఆపరేటర్లు, హెల్పర్లకు ఉపాధి కల్పించాలి. వైఎస్ జగన్ సర్కార్ ఉన్నతాశయంతో కార్డుదారులకు ఇబ్బందులు లేకుండా ఇంటి వద్దకే రేషన్ సరుకులను తీసుకొచ్చింది. ఈ విధానాన్ని తొలగించడంతో కార్డుదారులు మళ్లీ సరుకుల కోసం అనేక ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో ప్రభుత్వం పునరాలోచన చేయాలని వైఎస్సార్ సీపీ తరుపున డిమాండ్ చేస్తున్నాం. – ఆకేపాటి అమర్నాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే -
3 కిలో మీటర్లు వెళ్లాలి
తంబళ్లపల్లె మండలం కొత్తకురవపల్లెకు చెందిన గుల్జార్బీకి రేషన్కార్డు ఉంది. గతంలో ఊరికి మూడు కిలోమీటర్ల దూరంలోని కే.రామిగానిపల్లె చౌక దుకాణం (షాప్ నంబర్ 10) వెళ్లి నిత్యావసరాలు తెచ్చుకునేది. భర్తతోపాటు కూలీ పనులు చేసుకుని జీవిస్తున్న ఆమెకు ఎండీయూ సేవలతో ఎంతో ఉపశమనం కలిగింది. కూలీకి వెళ్లినా ఎండీయూ వాహనం ఎప్పుడొస్తుందో ముందే చెప్పేవారు. కూలీపనికి వెళ్లినా మధ్యలో వచ్చి సరుకులు తీసుకునేవాళ్లు. తిరిగి చౌక దుకాణాల ద్వారా రేషన్ ఇస్తే తీసుకునేందుకు మూడు కిలోమీటర్లు వెళ్లాలి. అక్కడ డీలర్ ఎప్పుడు ఇస్తే అప్పుడు వెళ్లి క్యూలో నిలబడి గంటల తరబడి నిరీక్షించాల్సి వస్తుందని గుల్జార్బీ ఆవేదన వ్యక్త చేస్తోంది. ● నిత్యావసర సరుకులకు డీలర్ల వద్ద మళ్లీ క్యూ కట్టాల్సిందే ● ఇంటిముంగిటకే ఇస్తున్న ఎండీయూ సేవలు నిలిపివేస్తూ కూటమి ప్రభుత్వ నిర్ణయం ● ఇకపై కిలోమీటర్ల దూరం వెళ్లాలి..డీలర్లు ఎప్పుడిస్తే అప్పుడే వెళ్లి సరుకులు తెచ్చుకోవాలి ● మళ్లీ పాతరోజులు వచ్చాయని లబ్ధిదారుల ఆవేదన -
ఐఎఫ్ఎస్కు అంబటి బాలాజీ
గాలివీడు: మండలంలోని బోరెడ్డిగారిపల్లెకు చెందిన అంబటి బాలాజీ ప్రతిభ కనబరచి యూపీఎస్సీలో 65 వ ర్యాంకు సాధించారు.కేంద్ర పబ్లిక్ సర్వీస్ కమిషన్ (యూపీఎస్సీ) నిర్వహించిన ఇండియన్ ఫారెస్ట్ సర్వీసెస్ (ఐఎఫ్ఎస్) – 2024 తుది ఫలితాల్లో రెండు తెలుగు రాష్ట్రాల అభ్యర్థులు సత్తా చాటారు. దేశవ్యాప్తంగా మొత్తం 143 మంది ఈ సర్వీసులకు ఎంపిక కాగా, వారిలో పది మందికి పైగా తెలుగు తేజాలు ఉండటం విశేషం.అందులో అన్నమయ్య జిల్లా గాలివీడు మండలం బోరెడ్డిగారి పల్లెకు చెందిన అంబటి బాలాజీ జాతీయ స్థాయిలో 65 వ ర్యాంకు సాధించి, తెలుగు రాష్ట్రాల నుంచి ఉత్తమ ర్యాంకర్గా నిలిచారు.ఈ సందర్భంగా బాలాజీ స్పందిస్తూ తన తాత అంబటి వెంకటరమణ , తల్లిదండ్రులు రఘునాథ, రామలక్షుమ్మ, ఆన్న వదిన లోకేష్,జ్యోత్స్న, అక్క బావ స్వాతి రవిచంద్ర భార్య గౌతమి కుటుంబసభ్యుల ప్రోత్సాహంతోనే ఇది సాధ్యమైందని అన్నారు. ఇంటర్ వరకు జవహర్లాల్ నవోదయ విద్యాలయం రాజంపేట, ఇంజినీరింగ్ ( బీటెక్ –ఈసీఈ) ఎస్వీ యూనివర్సిటీలో పూర్తి చేశాక సివిల్స్ కు ఒక సంవత్సరం కోచింగ్ తీసుకున్నానని, తరువాత సొంత ప్రిపరేషన్ కొనసాగించానని చెప్పారు. 2020 లో గ్రామ వార్డు సచివాలయం పోటీ పరీక్షలో స్టేట్ ఫస్ట్ ర్యాంకు వచ్చిందన్నారు. కొద్దినెలలు మాత్రమే ఉద్యోగం చేసినట్లు చెప్పారు. తరువాత రిజైన్ చేసి మళ్లీ సివిల్స్ ప్రిపేర్ అయినట్లు తెలిపారు.2023 సివిల్స్ తరహాలోనే సెంట్రల్ గవర్నమెంట్లో ఈపీఎఫ్లో ఎన్ఫోర్స్మెంట్లో జాయిన్ అయ్యానని, ఇప్పుడు సివిల్స్ ఐఎఫ్ఎస్లో సెలెక్ట్ అయ్యానని తెలియజేశారు. ఐఏఎస్ సాధించాలన్నదే తన అంతిమ లక్ష్యమని, దానిని నెరవేర్చుకుంటానని ఆయన పేర్కొన్నారు. -
ముత్తూట్ సిబ్బంది చేతివాటం
– సొమ్ము స్వాహా కేసులో ముగ్గురి అరెస్టు బి.కొత్తకోట : ముత్తూట్ సిబ్బంది చేతివాటం ప్రదర్శించారు. స్థానిక రంగసముద్రంరోడ్డులోని ముత్తూట్ ఫైనాన్స్ శాఖలో సొమ్ము జమచేయకుండా స్వాహా చేశారు. ఆలస్యంగా పోలీసులకు ఫిర్యాదు అందడంతో ముగ్గురు ఉద్యోగులను అరెస్టు చేసినట్లు ఇన్ఛార్జి సీఐ లక్ష్మన్న తెలిపారు. ఆయన కథనం మేరకు..ఫైనాన్స్ సంస్థ బ్రాంచ్లో మదనపల్లెకు చెందిన దూదేకుల ఇమ్రాన్బాషా(30), పెద్దతిప్పసముద్రం మండలం మల్లెలకు చెందిన జరిపిటి హరీష్(29), బి.కొత్తకోట మండలం గుమ్మసముద్రం పంచాయతీకి చెందిన ముగిలన్నగారి హరికృష్ణ (26) వివిధ హోదాల్లో పనిచేస్తున్నారు. కార్యాలయంలో బంగారు ఆభరణాలను కుదవపెట్టే ఖాతాదారులతో సొమ్ము వసూలు చేసినా.. బ్రాంచీలో జమ చేయకుండా స్వాహా చేస్తున్నారు. కొందరు ఖాతాదారులు ఇటీవల నగలు విడిపించుకునేందుకు రాగా ఇంకా రుణం పెండింగ్లో ఉందని, చెల్లిస్తే ఇస్తామని చెప్పడంతో ఖంగుతిన్నారు. ఈ విషయం దావానలంలా అందరికీ తెలియడంతో కొందరు ఖాతాదారులకు అనుమానం కలిగి తమ రుణాలపై ఆరా తీయగా ఇదే పరిస్థితి ఎదురైంది. ఈ విషయం సంస్థ ఉన్నతాధికారులకు చేరడంతో విజిలెన్స్ బృందంతో విచారణ చేయించారు. అనుమానించినట్టుగానే ఆ ముగ్గురు సిబ్బంది రూ.65.76 లక్షలు ముత్తూట్ సంస్థకు జమ చేయకుండా స్వాహా చేశారని తేలడంతో చర్యలు చేపట్టారు. రీజనల్ ఫైనాన్స్ మేనేజర్ ఎస్.దేవరాజు ఫిర్యాదుపై కేసు నమోదు చేసి ముగ్గురిని మండలంలోని హార్సిలీహిల్స్ క్రాస్ వద్ద అరెస్టు చేసినట్లు సీఐ తెలిపారు. విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఉపకరణాలు కడప ఎడ్యుకేషన్ : విభిన్న ప్రతిభావంతులకు ప్రత్యేక ఉపకారణాలు అందించినట్లు జోన్ 4 పాఠశాల విద్య ప్రాంతీయ సంయుక్త సంచాలకులు(ఆర్జేడీ) కాగిత శామ్యూల్ అన్నారు. స్థానిక సమగ్ర శిక్ష కార్యాలయంలో విభిన్న ప్రతిభావంతులకు బుధవారం ఉపకారణాల పంపిణీ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అవసరాలను దృష్టిలో పెట్టుకుని కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థ అలింకో ఉపకరణాలు తయారుచేసి అందిస్తోందన్నారు. సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో అర్హులను గుర్తించి వీల్ చైర్స్, సీపీచైర్స్, రోలేటర్స్ అందించామని తెలిపారు. ఉపకారణాలు సద్వినియోగం చేసుకునేలా తల్లిదండ్రులు, ప్రత్యేక ఉపాధ్యాయులు చర్యలు తీసుకోవాలని కోరారు. సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో ఆర్డినేటర్ నిత్యానంద రాజు, విభిన్న ప్రతిభవంతుల శాఖ జిల్లా సంచాలకులు కృష్ణ కిశోర్ మాట్లాడుతూ ఉపకారణాలతో దివ్యాంగులు తమ లోపాలు అధిగమించి రాణించేందుకు అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో విజయ్కుమార్, రమణమూర్తి, కేశవరెడ్డి, విశ్వనాథరెడ్డి, వీరేంద్ర, మమత, విజయమ్మ, పద్మ, గంగులప్ప, చంద్ర, రాజా, తదితరులు పాల్గొన్నారు. -
యోగాతోనే శారీరక, మానసిక ఆరోగ్యం
రాయచోటి: శారీరక, మానసిక ఉరోగ్యం, భావోద్వేగాల సమతుల్యతలు యోగాతోనే సాధ్యమని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. జూన్ 21న 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం ఉదయం రాయచోటిలోని మున్సిపల్ పార్కులో నిర్వహించిన కర్టెన్ రైజర్ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యా ప్తంగా యోగాంధ్ర కార్యక్రమం నిర్వహిస్తున్నారన్నా రు. ఇందులో భాగంగా జిల్లాలో నేటి నుండి జూన్ 21వ తేదీ వరకు జిల్లా వ్యాప్తంగా యోగా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. . జోనల్ మాస్టర్ ప్లాన్ కోసం నివేదికలు రూపొందించాలి జిల్లా పరిధిలోని శ్రీపెనుశిల లక్ష్మీ నరసింహ అభయారణ్యం, శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్క్ ప్రాంతాల ఏకో సెన్సిటివ్ జోన్ల నిర్మాణాలకు రూపొందించనున్న జోనల్ మాస్టర్ ప్లాన్కు వారంలోగా పటిష్టమైన నివేదికలను రూపొందించి, సమర్పించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్స్హాల్లో సబ్ డీఎఫ్ఓ ఆధ్వర్యంలో వివిధ శాఖల అధికారులతో కలెక్టర్ సమావేశం నిర్వహించారు. జిల్లాలోని రాజంపేట, చిట్వేలి మండలాల పరిధిలో 185.42 చదరపు కిలోమీటర్ల మేర శ్రీ పెనుశిల లక్ష్మీ నరసింహ అభయారణ్యం, ఓబులవారిపల్లి, కోడూరు, చిట్వేలి మండలాల పరిధిలో 87.02 చదరపు కిలోమీటర్ల మేర శ్రీ వెంకటేశ్వర నేషనల్ పార్కు విస్తరించి ఉందని కలెక్టర్ తెలిపారు. పర్యావరణ హిత సున్నితమైన ఈ ప్రాంతాల అభివృద్ధికి ప్రభుత్వం మాస్టర్ ప్లాన్ రూపొందిస్తోందన్నారు. ఇందులో భాగంగా గుర్తించిన ఎకో సెన్సిటివ్ జోన్ ప్రాంతాల్లో నిషేదించాల్సిన, ప్రమోట్, రెగ్యులేట్ చేయాల్సిన అంశాల్లో జోనల్ మాస్టర్ ప్లాన్లో పొందుపరచడానికి వారంలోగా ఆయా శాఖలు తప్పనిసరిగా నివేదికలు సమర్పించాలన్నారు. అంతకు ముందు సెంటర్ ఫర్ ఎన్విరాన్మెంట్ అండ్ డెవలప్మెంట్ హైదరాబాద్ సంస్థ రీజినల్ డైరెక్టర్ కె జయచంద్ర జోనల్ మాస్టర్ ప్లాన్ రూపకల్పనకు సంబంధించి ఆయా శాఖలు దృష్టి సారించాల్సిన అంశాల గురించి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా అవగాహన కల్పించారు. కార్యక్రమంలో సబ్ డీఎఫ్ఓ సుబ్బరాజు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ -
ఏటీఎస్లలోనే వాహనాల ఫిట్నెస్ పరీక్షలు
రాయచోటి టౌన్: ఇకపై వాహనాల ఫిట్నెస్ పరీక్షలు ఆటోమేటెడ్ టెస్టింగ్ స్టేషన్లలో (ఏటీఎస్) పొందాల్పి ఉంటుందని జిల్లా రవాణా అధికారి ప్రసాద్ బుధవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ ఏటీఎస్ కేంద్రం సర్వే నంబర్ 1064 మాసాపేట, రాయచోటి జిల్లా హెడ్ క్వార్టర్ నుంచే నిర్వహించుకోవాలని సూచించారు. ఇకపై మ్యానువల్ పద్ధతి ద్వారా ఆర్టీవో కార్యాలయంలో వాహనాల ఫిట్నెస్ పరీక్షలు నిర్వహించరని తెలిపారు. ఈ విషయం వాహనదారులు గమనించాలని కోరారు. ఏపీ ఈఏపీ సెట్కు 2493 మంది హాజరు కడప ఎడ్యుకేషన్: ఏపీ ఈఏపీ సెట్ ఆన్లైన్ పరీక్షలు బుధవారం రెండు సెషన్స్లో జరిగాయి. జిల్లావ్యాప్తంగా 2493 మంది అభ్యర్థులు హాజరయ్యారు. కడపలో ఐదు పరీక్షా కేంద్రాలు, పొద్దుటూరులోని మూడు పరీక్షా కేంద్రాలకుగాను 2621 మంది అభ్యర్థులకుగాను 128 మంది గైర్హాజరయ్యారు. ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్కు సంబంధించి 95.12 శాతంగా హాజరు నమోదయింది. జెడ్పీలో బదిలీలకు దరఖాస్తుల ఆహ్వానం కడప సెవెన్రోడ్స్: జిల్లా పరిషత్లో సాధారణ బదిలీల ప్రక్రియ ప్రారంభమైంది. రాష్ట్ర ప్రభుత్వ ఉత్తర్వు నెంబరు 23, ఫైనాన్స్ అండ్ ప్లానింగ్, తేది 15.05.2025 మేరకు ఈనెల 16 నుంచి జూన్ 2వ తేదిలోపు సాధారణ బదిలీలు జరగనున్నాయి. ఒకేచోట ఐదేళ్లు పూర్తయిన ఎంపీడీఓలు, మినిస్ట్రీరియల్, నాల్గవ తరగతి సిబ్బంది అధికారుల అనుమతితో రిక్వెస్ట్ బదిలీ దరఖాస్తులు ఈనెల 25వ తేదీ సాయంత్రం 5.00 గంటల్లోపు జిల్లా పరిషత్ కార్యాలయంలో సమర్పించాల్సి ఉంటుందని సీఈఓ ఓబులమ్మ తెలిపారు. ప్రస్తుతం పనిచేస్తున్న చోట ఐదేళ్లు సర్వీసు పూర్తయిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంటుంది. ఏదైనా రిక్వెస్ట్, అడ్మినిస్ట్రేటివ్ గ్రౌండ్స్ కింద బదిలీ కావాలని కోరుకునే వారు కూడా దరఖాస్తులు సమర్పించుకోవచ్చు. క్రమశిక్షణా చర్యలుగానీ లేదా శాఖాపరమైన చర్యలు ఉన్నవారు బదిలీకి అనర్హులవుతారు. సాధారణ బదిలీలపై వచ్చేనెల 3 నుంచి మళ్లీ నిషేధం అమలులోకి వస్తుంది. ఆర్డీఎస్ఎస్ పనుల్లో వేగం పెంచాలి కడప కార్పొరేషన్: రివాంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం(ఆర్డీఎస్ఎస్) కింద మంజూరైన పనులను వేగంగా పూర్తి చేయాలని ఏపీఎస్పీడీసీఎల్ పర్యవేక్షక ఇంజినీర్ ఎస్. రమణ ఆదేశించారు. బుధవారం స్థానిక విద్యుత్ భవన్లో ఆర్డీఎస్ఎస్ పథకం కింద జరుగుతున్న పనులపై ఆయన సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఎస్ఈ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పథకం ద్వారా గ్రామీణ ప్రాంతాలలో త్రీఫేస్ విద్యుత్ వ్యవస్థను ఏర్పాటు చేయుటకు ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకుందని తెలిపారు. ఈ పనులలో వేగవంతం పెంచాలని, తద్వారా గ్రామీణ ప్రాంత ప్రజలకు త్వరగా లబ్ధి చేకూరటమే కాకుండా విద్యుత్ వ్యవస్థ పటిష్టవంతంగా తయారవుతుందని తెలిపారు. వెల్ఫేర్ అసిస్టెంట్ సస్పెన్షన్ రాయచోటి: మదనపల్లి మండలం, కోళ్లబైలు–1 గ్రామ సచివాలయ వెల్ఫేర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న డి.ద్వారకనాథ్నాయుడును జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సస్పెండ్ చేశారు. విధి నిర్వహణలో లంచం తీసుకొని మోసం చేయడంపై బుధవారం కలెక్టర్ కార్యాలయం నుంచి సస్పెన్షన్ ఉత్తర్వులు వెలువడ్డాయి.గతంలో వాల్మీకిపురం మండలం, కుర్పర్తి సచివాలయంలో పనిచేస్తున్న సమయంలో కుర్పర్తి గ్రామానికి చెందిన రెడ్డప్ప, హరీష్లకు ప్రధాన మంత్రి యోజన పథకం కింద రూ. 6 లక్షలు రుణం మంజూరు చేయిస్తామని రూ. 30 వేలు వారిద్దరి నుంచి తీసుకొన్నట్లు కలెక్టర్కు ఫిర్యాదు అందింది. దీంతో నివేదికను అందజేయాలని మదనపల్లె ఎంపీడీఓను కలెక్టర్ ఆదేశించారు. రెడ్డప్ప, హరీష్లు ఆర్జీలో పేర్కొన్న విధంగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ మోసం చేసినట్లు నిర్ధారణ చేస్తూ మదనపల్లె ఎంపీడీఓ ఇచ్చిన ప్రాథమిక నివేదిక ఆధారంగా సదరు వెల్ఫేర్ అసిస్టెంట్ను కలెక్టర్ సస్పెండ్ చేశారు. సదరు ఉద్యోగి సర్వీస్ రిజిస్టర్లో సస్పెన్షన్ను నమోదు చేయాలని మదనపల్లె మండల సహాయ సాంఘిక సంక్షేమ అధికారిణి ఆదేశించారు. ముందస్తు అనుమతి లేనిదే డి.ద్వారకనాథ్ నాయుడు గ్రామాన్ని విడిచి వెళ్లరాదని ఆదేశాల్లో పేర్కొన్నారు. విధి నిర్వహణలో అవినీతికి పాల్పడితే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ హెచ్చరించారు. -
శిక్షణా కేంద్రం అభివృద్ధికి సహకరించండి
మదనపల్లె రూరల్ : హార్సిలీహిల్స్లోని ప్రాంతీయ శిక్షణ కేంద్రం అభివృద్ధికి సహకరించాలని స్కౌట్స్ అండ్ గైడ్స్ అధికారులు కోరారు. స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి, స్కౌట్ అధికారులు సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ను ఆయన కార్యాలయంలో బుధవారం కలిసి పుష్పగుచ్ఛం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 1959 మే, 23న అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ గవర్నర్ భీమసేన్ సాచార్ హార్సిలీహిల్స్లోని శిక్షణ కేంద్రానికి స్థలాన్ని కేటాయించడం జరిగిందని వివరించారు. అప్పటి నుంచి 8 జిల్లాలకు చెందిన రాయలసీమ విద్యార్థులేగాక, ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన విద్యార్థులు శిక్షణ పొందడం జరిగిందన్నారు. ప్రహరీ నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని, స్కౌట్ భవనానికి నీటి సరఫరా పునరుద్ధరించాలని కోరారు. సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ మాట్లాడుతూ హార్సిలీ హిల్ స్కౌట్స్ అండ్ గైడ్స్ స్థలానికి సంబంధించిన వివరాలు తెప్పించుకుని దాని అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, జాయింట్ సెక్రటరీ భాస్కర్రెడ్డి, అసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్ మహమ్మద్ ఖాన్, బేసిక్ స్కౌట్ మాస్టర్స్ చంద్రశేఖర్ రెడ్డి, అన్వర్ బాషా, లక్ష్మీపతి, కబ్ మాస్టర్స్ భూపతి, గంగాధర్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమతొకటి.. తరలించేది మరొకటి..
● తువ్వ మట్టి పేరుతో ఇసుక అక్రమ రవాణా ● టక్కోలు పెన్నా నదిలో జేసీబీ యంత్రాలతో తవ్వకాలు సిద్దవటం: తువ్వ మట్టి తరలింపునకు అనుమతి పొంది.. ఇసుక అక్రమంగా తరలిస్తున్న ఉదంతమిది. సిద్దవటం మండలం టక్కోలు గ్రామనికి చెందిన ఒక వ్యక్తి భూమి సాగు కోసం తువ్వ మట్టి తరలింపునకు అనుమతి పొందారు. టక్కోలు సమీపంలోని పెన్నానది నుంచి.. వంద ట్రిప్పుల మట్టికి మండల రెవెన్యూ శాఖ అఽధికారుల నుంచి అనుమతి తెచ్చుకున్నారు. అయితే తువ్వ మట్టి ముసుగులో.. పెన్నా నదిలో జేసీబీ యంత్రాలతో ఇసుక తవ్వకాలు జరుపుతున్నారు. ట్రాక్టర్ల ద్వారా కడపకు తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మంగళవారం పట్టపగలు యథేచ్ఛగా తరలిస్తున్న దృశ్యం స్థానికులకు కనిపించింది. ఇసుక అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేయాల్సిన రెవెన్యూ, మైనింగ్, పోలీస్ శాఖల వారు పట్టించుకోవడం లేదని వారు ఆరోపించారు. ఇదిలా ఉండగా గృహ నిర్మాణాల అవసరాలకే రాష్ట్ర ప్రభుత్వం ఉచిత ఇసుక తరలింపునకు అనుమతి ఇవ్వగా.. కొంత మంది కడపకు అక్రమంగా రవాణా చేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. ఇలాగే జరిగితే పెన్నా నదికి వరదలు సంభవించినప్పుడు తమ భూములు కోతకు గురయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
●రాజంపేట పార్లమెంటు పరిశీలకులు సురేష్బాబుకు సన్మానం
సాక్షి రాయచోటి: ‘కూటమి సర్కారు అధికార పగ్గాలు చేపట్టి ఏడాది కాకమునుపే ప్రజల్లో తీవ్ర స్థాయిలో వ్యతిరేకత వచ్చింది.. ప్రభుత్వం అవలంబించే ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పటికప్పుడు వైఎస్సార్సీపీ శ్రేణులు సమరోత్సాహంతో తిప్పికొట్టాలి. అంతేకాకుండా ప్రజల సంక్షేమం కోసం పార్టీ శ్రేణులు ఎప్పటికప్పుడు కూటమిపై ఆందోళన బాట పట్టాలి. భవిష్యత్తులో వైఎస్సార్సీపీ అధికారంలోకి రావడం తథ్యం. యువత, పార్టీ నేతలు, అనుబంధ విభాగాలు, పార్టీ శ్రేణులు, సానుభూతిపనులు, అభిమానులు రెట్టించిన ఉత్సాహంతో పని చేస్తూ ప్రజల్లో విశ్వసనీయత పెంచాలి. తద్వారా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బలపడటంతోపాటు తిరుగులేని విధంగా దూసుకు వెళ్లేలా ప్రతి ఒక్కరూ పాటుపడాలి’ అని పార్టీ కీలక నేతలు పిలుపునిచ్చారు. అందుకు సంబంధించి మంగళవారం అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటిలోని పార్టీ కార్యాలయంలో జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు, కడప నగర మేయర్ కొత్తమద్ది సురేష్బాబు, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె పార్టీ ఇన్చార్జి నిసార్ అహ్మద్తోపాటు పలువురు నేతలు పార్టీకి సంబంఽధించిన అనేక అంశాలపై సమీక్ష చేశారు. ఈ సందర్భంగా పార్టీ బలోపేతం, అనుబంధ విభాగాల పటిష్టత, ఇతర అనేక అంశాలపై చర్చించారు. అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలి అన్నమయ్య జిల్లాలోని అన్ని నియోజకవర్గాల సమన్వయకర్తలతోపాటు పార్టీ శ్రేణులు, అనుబంధ విభాగాల నాయకలు, ఇతర పార్టీ శ్రేణులు వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలని నేతలు పిలుపునిచ్చారు. అంతేకాకుండా కలిసికట్టుగా ముందుకు వెళుతూ ప్రజా ఆందోళనల్లో పెద్ద ఎత్తున పాల్గొనాలని.. ప్రభుత్వం అన్యాయం చేసిన వారికి పార్టీ తరుఫున పోరుబాట చేపట్టేలా కార్యకర్తలు ముందుండాలన్నారు. ఇప్పటికే కూటమి సర్కార్కు ప్రజల నుంచి పెద్ద ఎత్తున వ్యతిరేకత వ్యక్తమవుతోందని.. ఇంతకుమునుపు ఏ ప్రభుత్వానికి ఏడాదిలోపే ఇంత వ్యతిరేకత కనిపించలేదని అభిప్రాయపడ్డారు. సూపర్సిక్స్ అమలు చేయకపోగా, ఇతర సంక్షేమాన్ని అందించని వైనాన్ని ప్రజలు చర్చించుకుంటున్నారని ఈ సందర్భంగా చర్చకు వచ్చింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన ప్రతి కార్యకర్త, పార్టీ శ్రేణులు, నాయకులు అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అందరూ కదం తొక్కుతూ కదలాలని.. అధికారంలోకి రావడమే లక్ష్యంగా పని చేయాలని వారు సూచించారు. ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరుబాట రాష్ట్రలలోని కూటమి ప్రభుత్వం అవలంబిస్తున్న నియంతృత్వ పోకడలపై ఎప్పటికప్పుడు పోరుబాట పట్టేలా నేతలు పథక రచన చేశారు. వైఎస్సార్సీపీ కీలక నేతల సమీక్ష సందర్భంగా.. ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ఎప్పుటికప్పుడు ఉద్యమబాట పట్టాలని నిర్ణయించారు. అంతేకాకుండా అధిష్టాంనం ఆదేశాల మేరకు వివిధ కార్యక్రమాలు చేపడుతూనే మరోపక్క అన్నమయ్య జిల్లాలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ వారికి అండగా నిలువాలని నిర్ణయించారు. కూటమి అరాచకాలు, భూకబ్జాలు, బెదిరింపులు, అక్రమ వ్యవహారాలపై పోరుబాట పట్టాలని సంకల్పించారు. రానున్న కాలంలో కూటమి ప్రభుత్వ ఆగడాలను అడ్డుకోవడంతోపాటు ప్రజలకు మద్దతుగా నిలవాలని సమీక్షలో ఏకాభిప్రాయం వ్యక్తం చేశారు. బలోపేతమే ధ్యేయం జిల్లాలోని అన్ని నియోజకవర్గాలతోపాటు మండలాలు, గ్రామాల్లో పార్టీ బలోపేతమే లక్ష్యంగా పని చేద్దామని ప్రతిన బూనారు. ప్రధానంగా మండల కమిటీలతోపాటు నియోజకవర్గ, జిల్లా అనుబంధ కమిటీలను ఎప్పటికప్పుడు సకాలంలో వేసుకుని.. అందులో అన్ని వర్గాలకు సముచితన్యాయం కల్పించడం ఒక లక్ష్యం కాగా.. మరో పక్క వైఎస్సార్సీపీని బలోపేతం చేయడంతోపాటు అన్ని విధాలుగా ప్రభుత్వంపై పోరాటానికి ముందుండేలా సమాయత్తం చేశారు. వైఎస్సార్సీపీని అధికారంలోకి తేవడమే లక్ష్యంగా పని చేయాలి సంస్థాగతంగా మరింత బలోపేతం అయ్యేందుకు ప్రణాళిక అన్ని విభాగాలు, అనుబంధ కమిటీల్లో నాయకులను నియమించేలా కసరత్తు ప్రభుత్వ నియంతృత్వ పోకడలపై పోరాడేందుకు వ్యూహ రచన కార్యకర్తలతోపాటు నాయకులు, శ్రేణులు కదనోత్సాహంతో ముందుకు సాగాలని నేతల పిలుపు అన్నమయ్య జిల్లా రాజంపేట పార్లమెంటు పరిశీలకునిగా ఎన్నికై న కడప నగర మేయర్ సురేష్బాబును నేతలు సన్మానించారు. జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమర్నాథరెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పార్టీ అఽధికార ప్రతినిది, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె పార్టీ ఇన్చార్జి నిస్సార్ అహ్మద్ తదితరులు సురేష్బాబును సత్కరించారు. ఆయనకు బొకే అందించి శుభాకాంక్షలు తెలియజేశారు. -
హార్సిలీహిల్స్ సుందరీకరణకు ప్రణాళిక
బి.కొత్తకోట: మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ అభివృద్ధి, సుందరీకణ కోసం ప్రణాళిక అమలు చేస్తున్నట్లు జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్ర తెలిపారు. మంగళవారం ఆయన మదనపల్లె సబ్కలెక్టర్, హార్సిలీహిల్స్ టౌన్షిప్ కమిటీ చైర్మన్ మేఘస్వరూప్, తహసీల్దార్ మొహమ్మద్ అజారుద్దీన్, పీకేఎం ముడా ఇంజినీర్లు, డీఈ సూర్యనారాయణతో కలిసి కొండపై విస్త్రృతంగా పరిశీలనలు నిర్వహించారు. కొండపై అతిథిగృహాలు, గాలిబండ, జిడ్డు సర్కిల్, స్విమ్మింగ్ పూల్, గవర్నర్బంగ్లా తదితర ప్రాంతాల్లో పర్యటించారు. ఎక్కడెక్కడ అభివృద్ధి పనులు చేపట్టాలి, సుందరీకణ పనులు చేయాలి, వాటికి సంబంధించి ఎలాంటి చర్యలు చేపట్టాలి అనే అంశాలపై సమీక్ష చేశారు. రెవెన్యూ అతిథిగృహం ప్రయివేటుకు అప్పగించగా.. దాన్ని ఎప్పటి లోగా ప్రారంభిస్తారని జేసీ లీజుదారునితో చర్చించారు. రెండు వారాల్లో ప్రారంభిస్తామని చెప్పగా.. త్వరితగతిన పనులు పూర్తి చేసి పర్యాటకులకు గదులను అందుబాటులోకి తీసుకురావాలని సూచించారు. అనంతరం జేసీ మీడియాతో మాట్లాడుతూ గాలిబండ వద్ద సందర్శకులు ప్రకృతి అందాలను తిలకించేందుకు బెంచీలు ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. జిడ్డు సర్కిల్ ప్రాంతాన్ని సుందరీకరిస్తామని, పర్యాటకులు వినియోగించే ప్లాస్టిక్ వస్తువులు రోడ్లపై పారబోయకుండా డస్ట్బిన్లను ఏర్పాటు చేస్తామన్నారు. అరకు కాఫీ హౌస్ను ప్రారంభించడం, కొత్త టాయిలెట్ల నిర్మాణ పనులు చేపడుతామని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా, స్థానిక అధికారులు పాల్గొన్నారు. జేసీ ఆదర్శ్రాజేంద్ర -
కన్నేశారు.. కమ్మేస్తున్నారు!
హుండీ ఆదాయం లెక్కింపు సంబేపల్లె: జిల్లాలో ప్రసిద్ధి చెందిన శ్రీ దేవరరాయి నల్లగంగమ్మ అమ్మవారి ఆలయ హుండీ ఆదాయాన్ని మంగళవారం లెక్కించారు. బ్యాంక్ అధికారుల పర్యవేక్షణలో ఈ కార్యక్రమం చేపట్టారు. మొత్తం రూ.3,23,700 ఆదాయం వచ్చినట్లు ఈఓ కొండారెడ్డి తెలిపారు. ఈ నగదును బ్యాంక్ ఖాతాలో జమ చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఫారంపాండ్ పనుల పరిశీలన గాలివీడు: మండలంలోని నూలివీడు గ్రామం చీమల చెరువుపల్లిలో మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం ద్వారా చేపడుతున్న ఫారంపాండ్ పనులను ఉపాధి పీడీ వెంకటరత్నం మంగళవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన సిబ్బందితో మాట్లాడుతూ కూలీలకు అత్యధిక పనిదినాలు కల్పించి, ఆర్థిక భరోసా ఇవ్వాలని సూచించారు.. పీడీ వెంట ఏపీఓలు హరిబాబు, రామచంద్ర, టీఏ, ఎఫ్ఏలు తదితరులు పాల్గొన్నారు. దేవదాయ భూములను పరిరక్షించాలి రాయచోటి: జిల్లాలోని దేవదాయ శాఖ భూములను పరిరక్షించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ సంబంధిత అధికారులను ఆదేశించారు. మంగళవారం రాయచోటి కలెక్టరేట్లోని మినీ వీడియో కాన్ఫరెన్సు హాల్లో దేవాలయ భూముల పరిరక్షణపై జిల్లా స్థాయి భూ సంరక్షణ కమిటీ సభ్యులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరియైన ధరకు వేలం నిర్వహించి భూములను లీజుకు ఇవ్వాలని ఆదేశించారు. దేవాలయాల్లో పారిశుధ్య కార్యక్రమాలను పక్కాగా నిర్వహించాలని పేర్కొన్నారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, దేవదాయశాఖ అధికారి సి.విశ్వనాథ్, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, టెంపుల్ ఈఓలు, తనిఖీదారులు, కమిటీ సభ్యులు పాల్గొన్నారు. ● ప్రభుత్వ భూమిఆక్రమణకు యత్నం ● అధికారులుఅడ్డుకుంటున్నా.. వదలని అక్రమార్కులు ● కబ్జాదారులకుకూటమి నేతల అండ ● సరిహద్దులు లేకపోవడంతో చెలరేగుతున్న వైనం గుర్రంకొండ: ప్రభుత్వ భూములపై కొందరు అక్రమార్కులు కన్నేసి.. కబ్జా చేస్తున్నారు. అధికారులు అడ్డుకుంటున్నా.. పట్టువదలని విక్రమార్కుల్లా ప్రయత్నం చేస్తున్నారు. కూటమి నేతల అండతో ముందుకు సాగుతున్నారు. మండలంలోని గుర్రంకొండ పంచాయతీ చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామ సమీపంలో సర్వే నంబరు 87/8లో 2 ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఇది గుర్రంకొండ పట్టణ సమీపంలో.. జాతీయ రహదారి 340 పక్కనే ఉండటంతో.. భారీగా విలువ చేస్తోంది. ఈ భూమికి సంబంధించి ఇంత వరకు ఎవరికీ పట్టాలు ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో ఎకరం రూ.2 కోట్ల వరకు పలుకుతోంది. దీంతో కొంత మంది కబ్జాదారుల కన్ను పడింది. గుట్టుచప్పుడు కాకుండా సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. వారి నుంచి కాపాడుకోవడానికి రెవెన్యూ అధికారులు నెలన్నర క్రితం సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా.. వాటిని కొంత మంది కూటమి నేతలు అడ్డుకుని రెవెన్యూ ఆధికారులను అక్కడి నుంచి పంపించి వేసిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. హెచ్చరిక బోర్డులు ఏర్పాటు కొన్నాళ్లు గుంభనంగా ఉన్న కబ్జాదారులు అప్పట్లో మళ్లీ తమ ప్రయత్నాలు ప్రారంభించారు. ఈ నేపథ్యంలో నెల క్రితం తహసీల్దార్ శ్రీనివాసులు ఆధ్వర్యంలో సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వే నంబరు 87/8లో ఎవరికీ పట్టాలు ఇవ్వలేదని, ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. మళ్లీ మొదలైన కబ్జా యత్నాలు: కొన్నాళ్లు వేచి చూసిన కబ్జాదారులు మళ్లీ ఆ భూమిని ఆక్రమించే ప్రయత్నాలు మొదలు పెట్టారు. రెండు రోజులుగా ముమ్మరం చేశారు. ఆ భూమిలో ఉన్న వేప తదితర చెట్లను మెల్లమెల్లగా నరికి వేస్తున్నారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి.. భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చాలా చదును చేసే పనుల్లో భాగంగా.. బయటి ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. ఇప్పటికే మట్టికుప్పలు దర్శనమిస్తుండటం గమనార్హం. రెవెన్యూ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూమి ఆక్రమణ పనులు మెల్లగా మొదలు పెడుతున్నారు. ముందుకు సాగని సర్వే పనులు నెలన్నర క్రితం ఆగిపోయిన ప్రభుత్వ భూమి సర్వే పనులు.. మళ్లీ ముందుకు సాగడం లేదు. కేవలం బోర్డులు పెట్టి వదిలేయడంతో మళ్లీ కబ్జా యత్నాలు పుంజుకొంటున్నాయి. ఇప్పటికై నా అధికారులు సర్వే పనులు పూర్తి చేసి.. సరిహద్దులు నిర్ణయించి ప్రభుత్వ భూములు కాపాడా లని గ్రామస్తులు కోరుతున్నారు. చెట్ల నరికివేతను అడ్డుకున్నాం చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబరు 87/8లో ఉన్న ప్రభుత్వ భూమిలో కొంత మంది చెట్లను నరికివేస్తుండడంతో అడ్డుకొని పంపించి వేశాం. ఇప్పటికే సదరు భూముల్లో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశాం. ఈ భూములకు సంబంధించి పూర్తి స్థాయిలో సర్వే చేయించి త్వరలోనే సరిహద్దులు ఏర్పాటు చేస్తాం. ఆ భూములు ఆక్రమణకు గురికాకుండా కాపాడుతాం. – శ్రీనివాసులు, తహసీల్దార్, గుర్రంకొండ -
సురభి లే అవుట్లో చోరీ
మదనపల్లె రూరల్ : మండలంలోని పొన్నూటిపాలెం పంచాయతీ సురభి లే అవుట్లో సోమవారం చోరీ జరిగింది. సుమారు రూ.10 లక్షల విలువైన నగదు, బంగారు, వెండి ఆభరణాలు చోరీకి గురైనట్లు బాధితురాలు నాగపరిమళ తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేసింది. నక్కలదిన్నె సత్సంగ్ సమీపంలోని సురభి లేఅవుట్ రోడ్డులో శంకరరెడ్డి, నాగపరిమళ దంపతులు నివాసముంటున్నారు. సత్సంగ్ ఫౌండేషన్కు చెందిన స్వాస్థ ఆస్పత్రిలో నాగపరిమళ కంప్యూటర్ ఆపరేటర్గా పనిచేస్తోంది. సోమవారం ఆమె విధులకు వెళ్లగా భర్త శంకరరెడ్డి పట్టణంలోకి వచ్చాడు. విధులు ముగించుకుని ఇంటికి వచ్చిన నాగపరిమళ ఇంట్లో వస్తువులు చిందరవందరగా, బీరువా తలుపులు పగలగొట్టి ఉండడంతో చోరీ జరిగినట్లు నిర్ధారించుకుని భర్త శంకరరెడ్డికి విషయం తెలిపారు. ఆయన డయుల్ 100కు ఫోన్చేసి పోలీసులకు సమాచారం అందించారు. తాలూకా సీఐ కళావెంకటరమణ సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించారు. బాధితులను అడిగి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్టీమ్ ద్వారా వేలిముద్రలు, ఆధారాలు సేకరించారు. అనంతరం మంగళవారం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. కాగా చోరీ ఘటనలో తమ ఇంట్లోని బీరువాలో ఉంచిన సుమారు 100గ్రాములకు పైగా బంగారు ఆభరణాలు, దాదాపు 400 గ్రాముల వెండి ఆభరణాలు, రూ.50వేల నగదు గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకు వెళ్లినట్లు బాధితులు తెలిపారు. రూ.10 లక్షల విలువైన ఆభరణాల అపహరణ -
సమస్యలు పరిష్కరించేంత వరకు ఖాళీ చేసేది లేదు
ఓబులవారిపల్లె : మండలంలోని కాపుపల్లి, హరిజనవాడ, అరుంధతివాడ పునరావాస గ్రామాల్లో సమస్యలు పూర్తి స్థాయిలో పరిష్కరించేంతవరకూ ఖాళీ చేసేది లేదని ఆయా గ్రామాల ప్రజలు స్పష్టం చేశారు. స్థానిక ఎంపీడీఓ సభా భవనంలో మంగంపేట గ్రామస్థులతో తహసీల్దారు శ్రీధరరావు, సీపీవో సుదర్శన్రెడ్డి, తదితరులు అభిప్రాయ సేకరణ నిర్వహించారు. గ్రామస్తులు మాట్లాడుతూ పునరావాస కాలనీలో రామాలయ నిర్మాణం గ్రామ ఆలయ కమిటీకి అప్పగించాలని కోరారు. 72 ఎకరాల శ్మశాన స్థలాన్ని ఎపీఎండీసీ తీసుకని, రెండు ఎకరాలు మాత్రమే శ్మశానానికి ఏ విధంగా కేటాయిస్తారని వారు ప్రశ్నించారు. అన్ని కులాలకు 40 ఎకరాల స్థలం ఉండాలన్నారు. రాయలసీమ బూత్ కమిటీ అధ్యక్షుడు తల్లెం భరత్కుమార్రెడ్డి మాట్లాడుతూ గ్రామంలో 750కి పైగా కుటుంబాలకు పునరావాసం కల్పించాల్సి ఉందని, 150 కుటుంబాలకు పరిహారం అందించాల్సి ఉందన్నారు. మృతుల కుటుంబాలకు పరిహారం అందించి, కుటుంబంలో ఒకరికి ఉద్యోగాలు కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు గుత్తిరెడ్డి హరినాథరెడ్డి, సర్పంచ్ మినుగు సుధాకర్, గ్రామస్థులు గుజ్జల శ్రీనివాసులురెడ్డి, కౌలూరు రమణారెడ్డి, రాజగోపాల్ రెడ్డి, వేణుగోపాల్ రెడ్డి, విష్ణువర్దన్ రెడ్డి, దేవకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మినీ మహానాడుకు బత్యాల, కస్తూరి డుమ్మా
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు టీడీపీ ఇన్ఛార్జి ముక్కా రూపానందరెడ్డి ఆధ్వర్యంలో జరిగిన మినీ మహానాడుకు టీడీపీ రాష్ట్ర కార్యదర్శి, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్ రాయుడు, టిడిపి రాష్ట్ర నిర్వహక కార్యదర్శి, మాజీ ఇన్చార్జ్ కస్తూరి విశ్వనాథ నాయుడు హాజరుకాకపోవడంపై పలువురు టీడీపీ శ్రేణులు చర్చించుకున్నారు. స్థానిక రాజు రెసిడెన్షీలో మంగళవారం ముందస్తుగా టీడీపీ మహానాడు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి కస్తూరి, బత్యాల వర్గీయులు హాజరుకాలేదు. గత నెలలో రూపానందరెడ్డి కార్యాలయం వద్ద బయటపడ్డ వర్గ విభేదాలు ఇంకా సమసిపోలేదని పలువురు గుసగుసలాడుకుంటున్నారు. షార్ట్ సర్క్యూట్తో ఇల్లు దగ్ధం ఓబులవారిపల్లె : విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో మండలంలోని జె.వడ్డిపల్లి గ్రామానికి చెందిన డి.నారాయణమ్మ ఇల్లు మంగళవారం దద్ధమైంది. వేసవికాలం కావడంతో నారాయణమ్మ ఇంటి బయట నిద్రిస్తోంది. తెల్లవారుజామున విద్యుత్తు షార్ట్ సర్క్యూట్తో ఇంటిలో మంటలు వ్యాపించాయి. ఇరుగుపొరుగు మంటలు అదుపుచేసే లోగా వస్తువులు కాలిపోయాయి. ఇటీవల అనారోగ్యంతో బాధపడుతూ చికిత్స కోసం రూ.1,50,000ల నగదు తెచ్చి ఇంట్లో ఉంచింది. ఆ డబ్బు కూడా కాలి బూడిదవడంతో ఆమె బోరున విలపించింది. సామగ్రి కాలిపోయి కట్టుబట్టలతో ఉన్నతనను ఆదుకోవాలని ఆమె వేడుకుంది. ఉరి వేసుకుని బీటెక్ విద్యార్థి మృతి పులివెందుల రూరల్ : పులివెందుల పట్టణంలోని అంబకపల్లి రోడ్డు సమీపంలో ఫ్యాన్కు ఉరేసుకొని యువతి స్వాతి మృతిచెందింది. పోలీసుల కథన మేరకు.. వరప్రసాద్, కళావతిల కుమార్తె స్వాతి బీటెక్ పూర్తి చేసింది. ఉద్యోగం కోసం ఎన్ని ప్రయత్నాలు చేసినా రాకపోవడంతో జీవితం మీద విరక్తి చెంది ఫ్యాన్కు ఉరేసుకొని మృతి చెందినట్లు సీఐ చాంద్బాషా తెలిపారు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
గౌరవం లేదు.. వేతనం రాదు
కాశినాయన : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వ చ్చినప్పటి నుంచి ప్రజాప్రతినిధులకు విలువ లేకుండాపోయిందనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. గ్రా మంలో ఏ పనులు చేయించలేని పరిస్థితి తమకు ఉండడంతో గౌరవం లేకుండాపోయిందని, దానికి తోడు కనీసం రెండేళ్ల నుంచి గౌరవ వేతనాలు అందలేదని పలువురు ఎంపీటీసీలు ఆరోపిస్తున్నారు. ఉమ్మడి కడ ప జిల్లాలో 559 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వారికి ప్రతి నెలా రూ.3వేల గౌరవ వేతనం ఇవ్వాల్సి ఉంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రెండు విడతల్లో గౌరవ వేతనాలు చెల్లించారు. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో గత ప్రభుత్వం ఎంపీటీసీలకు చెల్లించలేకపోయింది. 2024 జూలై, 30న కొత్తగా కూటమి ప్రభుత్వం కొలు వుదీరింది. అంతకుముందు పెండింగ్ వేతనాలతోపాటు దాదాపు రెండేళ్ల గౌరవ వేతనం రావాల్సి ఉంది. నేటికీ ప్రభుత్వం వాటిపై దృష్టి సారించలేదని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రజలచే ఎంపికై న ప్రజాప్రతినిధులకు ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమం, అభివృద్ధి పథకాల్లో ప్రాధాన్యం ఇవ్వకుండా టీడీపీ నాయకులకు ప్రాధాన్యం ఇస్తున్నారని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సర్వసభ్య సమావేశాలకే పరిమితంః కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత సర్వసభ్య సమావేశాలకు హాజరుకావడం మినహా ప్రజల సమస్యలను పరిష్కరించలేకపోతున్నామని పలువురు ఎంపీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండల స్థాయి అధికారుల సమస్యలను తీసుకువచ్చినా పట్టించుకున్న పాపాన పోవడంలేదని చెబుతున్నారు. కనీసం ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు తమను ఆహ్వానించక పోవడం దారుణమని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిధులు మంజూరుపై తమకు కనీస సమాచారం ఇవ్వడం లేదని, వివక్షకు గురిచేస్తున్నారని వారు మండిపడుతున్నారు. పలువురు ఎంపీటీసీల ఆవేదన -
విద్యుత్ చీకటి ఒప్పదంతో ప్రజలకు వెన్నుపోటు
రైల్వేకోడూరు అర్బన్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వం యూనిట్ రూ.2.60 పైసలతో ఒప్పందం చేసుకొంటే గగ్గోలు పెట్టిన కూటమి నాయకులు, ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలు.. సీఎం చంద్రబాబు తాజాగా యూనిట్ రూ.4.60తో ఒప్పందం చేసుకుంటే స్పందించరేమని రాష్ట్ర వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు, మాజీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి ప్రశ్నించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో వారు మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం అప్పుడు 2.60 పైసలతో సెకీతో ఒప్పందం చేసుకొంటే చంద్రబాబు, ఎల్లో మీడియా గగ్గోలు పెట్టాయన్నారు. ఇపుడు యాక్సిస్తో రూ.4.60 పైసలకు ఏరకంగా ఒప్పందం చేసుకుంటారు... ఇది కుంభకోణం కాదా అని ఎద్దేవా చేశారు. 25 ఏళ్లు ఒప్పందాలతో భవిష్యత్తు తరాలపై భారం మోపిన చంద్రబాబు ఏం చేసినా ఈనాడు, ఆంద్రజ్యోతి పత్రికలు కిమ్మనకున్నాయని విమర్శించారు. రాష్ట్రానికి మేలు చేయడానికి సోలార్ ఎనర్జీపై కేంద్ర సంస్థ సెకీ నిబంధనల మేరకు అప్పటి ఏపీ ప్రభుత్వం యూనిట్కు రూ.2.60 పైసలతో కొనేందుకు ఒప్పందం చేసుకుంటే అమెరికాకు లింకులు పెడుతూ ప్రజలను పక్కదోవ పట్టిస్తూ రెండు పత్రికలు విష ప్రచారం చేసాయన్నారు ఇప్పుడు చంద్రబాబు మోపుతున్న భారాలు, తక్కువ కాలంలో చేసిన అప్పుల భారం వారికి కనపడడం లేదా అని ప్రశ్నించారు. ఏడాదిలో ప్రజలపై సుమారు రూ.15,835 కోట్లు విద్యుత్ సర్దుబాటు చార్జీల పేరుతో భారం మోపడం ఏమిటని ఆయన ప్రశ్నించారు. సూపర్ సిక్స్ పథకాలు అందిస్తామని ఊదర కొడుతూ పేదలను నమ్మించి వంచన చేశారని పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్జగన్మోహన్రెడ్డి పరిపాలలో అన్ని రంగాలు అభివృద్ధి చెందాయన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు -
నిధుల రైలు వచ్చేసింది
రాజంపేట : 2025–2026 బడ్జెట్ నుంచి విడదులైన నిధుల రైలు ఎట్టకేలకు వచ్చేసింది..బడ్జెట్ నిధుల కేటాయింపులకు సంబంధించి పింక్ బుక్ (కీ బడ్జెట్ డేటా)ఆలస్యంగా విడుదలైంది. దీనిని పరిశీలిస్తే బడ్జెట్లో ఉభయ వైఎస్సార్ జల్లాకు పెద్దగా ఒరిగిందేమిలేదు. కొత్తలైన్లు, కొత్తరైళ్లు లేవు. పాడిందేపాటరా అన్న సామెత ఇప్పుడు విడుదలైన నిధులకు సరిగ్గా సరిపోతుందని రైల్వే నిపుణులు భావిస్తున్నారు . ● 255.4కిలోమీటర్ల దూరం కలిగిన కడప–బెంగళూరు రైల్వేలైన్ 2014లో ప్రారంభమైంది. యూపీఏ ప్రభుత్వంలో మంజూరైన రైలుమార్గానికి వ్యయం రూ.20వేలకోట్లు అంచనా వేశారు .2016–2017లో రూ.58కోట్లు, 2017–2018లో రూ.240కోట్లు. 2018–2019లో రూ.175 కోట్లు, 2022–2023లో రూ.289 కోట్లు– 2023–2024లో రూ.10లక్షలు, 2025–2026లో ఈబీఆర్(ఎస్) కింద రూ.21లక్షలు కేటాయింపులు జరిగాయి. కడప–బెంగళూరు రైల్వేలైన్పై కేంద్ర ప్రభుత్వం స్పందన ఆశాజనకంగా లేదనేది నిధుల కేటాయింపులను బట్టి తెలుస్తోంది. అందువల్ల పనులు వేగం అందుకోలేకపోతున్నాయి. 14 ఏళ్లవుతున్నా ప్రాజెక్టు నత్తనడకన సాగుతోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వం బడ్జెట్లో రైల్వేలైన్కు రూ.185 కోట్లు కేటాయించిన సంగతి తెలిసిందే. గత టీడీపీ హయాంలో రాష్ట్ర ప్రభుత్వం ఆశించిన మేర నిధులు కేటాయించలేదు. ఆన్గోయింగ్ ప్రాజెక్టులకు 126 కిలోమీటర్ల దూరం కలిగిన ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గానికి ఈబీఆర్(ఎస్) కింద రూ.30.15 కోట్లు కేటాయించారు. 113 కిలోమీటర్ల దూరం కలిగిన కృష్ణపట్నం–ఓబులవారిపల్లె రైలుమార్గానికి డిపాజిట్(ఆర్వీఎన్) కింద 267 కోట్ల వ్యయం చేస్తున్నారు. ● 2020లో బడ్జెట్లో ముద్దనూరు–ముదిగుబ్బ అనే కొత్త లైన్ తెరపైకి రావడంతో పులివెందులకు రైలుకూత వినిపించేందుకు ఆశలు అప్పట్లో రేకేత్తించాయి. ఈ సారి బడ్జెట్లో 65 కిలోమీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–ముదిగుబ్బ కొత్తలైన్ ఆర్ఈటీ సర్వే కింద రూ.16లక్షలు కేటాయించారు. ● 110 కిలో మీటర్ల దూరం ఉన్న ముద్దనూరు–పులివెందుల–శ్రీసత్యసాయి ప్రశాంతి నిలయం లైన్కు రూ.2 కోట్లు ఫైనల్ లొకేషన్ సర్వేకు కేటాయించారు. రాష్ట్రంలో తనకంటూ ప్రత్యేక గుర్తింపు కలిగిన నియోజకవర్గ కేంద్రమైన పులివెందులలో రైలుకూత కోసం ఎన్నో ఏళ్లుగా అక్కడి వాసులు ఎదురుచూస్తున్నారు. తమ ప్రాంత మీదుగా రైలుమార్గం వెళితే రైలుకూత వినివచ్చునన్న భావనలో ఉన్నారు. మొక్కుబడిగా నిధుల కేటాయింపు ఎన్డీఏ, యూపీఏ ప్రభుత్వలో తెరపైకి వచ్చిన కొత్త లైన్ల సర్వేలకు ప్రతి బడ్జెట్లో మొక్కుబడిగా నిధులు కేటాయింపులు జరిగాయి. కంభం–ప్రొద్దుటూరు లైన్(142కి.మీ) రూ.10లక్షలు డిపాజిట్ చేశారు. సర్వేకు పరిమితమైన భాకారాపేట–గిద్దలూరు లైన్ను గాలికి వదిలేశారు. గుంతకల్–రేణిగుంటలైన్లో 3, 4 లైన్కు సర్వే గుంతకల్–రేణిగుంట మధ్య 3, 4 లైన్ నిర్మాణానికి రైల్వేబోర్డు గ్రీన్సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా బడ్జెట్లో సర్వేకు ఉపక్రమించింది. ఫైనల్ లోకేషన్ సర్వే కింద గుంతకల్–ఓబులవారిపల్లెకు(256 కి.మీ) రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి. 56 కిలోమీటర్ల దూరం ఉన్న ఓబలవారిపల్లె– రేణిగుంటకు ఫైనల్ లోకేషన్ సర్వే కోసం రూ.1 కోటి వ్యయం చేయనుంది. ప్రస్తుతం డబుల్లైనులో రైళ్లు నడుస్తున్నాయి. 3,4 లైన్ల నిర్మాణం సకాలంలో పూర్తయితే రైళ్ల ట్రాఫిక్ రద్దీ తగ్గుతుంది. కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు నిధుల కేటాయిపు ఉభయవైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడప రైల్వేస్టేషన్ ఆధునికీకరణకు రూ.18 కోట్ల కేటాయింపులు జరిగాయి. పార్శిల్ ఆఫీసు ఆధునికీకరణ చేయనున్నారు. ఓపెన్ వెయిటింగ్ హాల్తోపాటు , రూ.4 కోట్లతో ఎస్కలేటర్స్ సౌకర్యం కోసం బడ్జెట్లో కేటాయింపులు జరిగాయి. అప్గ్రేడ్స్టేషన్ కింద పీలేరు, రాజంపేటలో స్టేషన్ అభివృద్ధి పనులకు నిధులు కేటాయింపు జరిగాయి. గుత్తి–పుల్లంపేట రూ.18కోట్లతో 29 స్టేషన్లలో ఎలక్ట్రానిక్ ఇంటర్ లాకింగ్సిస్టమ్ బలోపేతం చేసే దిశగా చర్యలు చేపట్టారు. ప్లాట్ఫాంల పొడిగింపు... గుంతకల్–రేణిగుంట మార్గంలో ప్లాట్ఫాంలను పొడిగించనున్నారు. రూ.3 కోట్లతో 24/26/ఎల్హెచ్బీ బోగీలకు అనుకూలంగా రాజంపేట, కోడూరు స్టేషన్లలో నిర్మితం చేయనున్నారు. ఇదే విధంగా ముద్దనూరులో రూ.3 కోట్లతో ప్లాట్ఫాం అభివృద్ధి పనులు చేపట్టనున్నారు. గూడ్స్షెడ్ల అభివృద్ధి రైల్వేకోడూరులో గూడ్స్షెడ్ను రూ.11 కోట్లతో, ముద్దనూరు గూడ్స్షెడ్ రూ.13 కోట్లతో అభివృద్ధి చేయనున్నారు. శెట్టిగుంట, రాజంపేటలో ట్రాక్మిషన్ సైడింగ్స్,రెస్ట్రూం తదితర సౌకర్యాల కోసం రూ.5 కోట్లు కేటాయించారు. రాజంపేట యార్డులోని సబ్వేకు రూ.5 కోట్ల కేటాయింపులు జరిగాయి. కడప–బెంగళూరు లైన్కు స్వల్పనిధులు రేణిగుంట–గుంతకల్ 3,4లైన్కు సర్వే -
కొనుగోలు చేసిన భూమిపైనా ‘పచ్చ’ కుట్ర
మదనపల్లె : మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబంపై కక్షకట్టి పచ్చ మీడియా కట్టుకథలను అల్లుతోంది. న్యాయబద్ధంగా కొనుగోలు చేసిన భూమిపైనా విషం కక్కుతున్నారు. నిజాలు లేకున్నా అడ్డగోలు రాతలతో ఇబ్బందులకు గురి చేయాలన్న ప్రయత్నాలు విఫలం అవుతున్నా మళ్లీ మళ్లీ అవే కట్టుకథలు అల్లుతున్నారు. ఇందులో భాగమే సోమవారం మదనపల్లె పట్టణం బీకేపల్లె గ్రామంలో పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేసిన భూమి పక్కన ప్రభుత్వ భూమి ఆక్రమణ అంటూ తప్పుడు కథనం వండివార్చారు. అయినా అక్కడ ఆక్రమణ ఏదిలేదని తేలిపోయింది. అధికారులు కూడా ఎన్ఓసీ మేరకు భూమి కొనుగోలు జరిగిందని స్పష్టం చేశారు. దీనికి సంబంధించి వివరాల్లోకి వెళ్తే.. 1959 జూన్ 30న మాజీ సైనికుడు ఆకుల సిద్దప్పకు అప్పటి ప్రభుత్వం పట్టా మంజూరు చేసింది. 2002 జూలై 29న మదనపల్లె సబ్–రిజిస్ట్రార్ కార్యాలయంలో తన ఆస్తులు వారసులకు దక్కేలా రాసిన వీలునామాను రిజిస్టర్ చేయించారు. 2006 మే ఏడున ఆయన చనిపోయాక వీలునామా ప్రకారం పట్టా భూమి కుమారుడు ఆకుల రామాంజులుకు సక్రమించింది. ఈ భూమికి ఎన్ఓసీ కోసం హైకోర్టులో పిటిషన్ దాఖలు చేయగా 2018 ఫిబ్రవరి 23న ఆయనకు అనుకూలంగా తీర్పు వచ్చింది. ఈ భూమికి వారసుడైన రామాంజులు 2018 ఫిబ్రవరి 9న తన కుమార్తె ఆకుల శ్రీప్రియ పేరిట వీలునామా రాశారు. ఆయన 2018 మార్చి 13న చనిపోయారు. తర్వాత ఈ భూమిపై శ్రీప్రియకు వారసత్వ హక్కు ఏర్పడింది. దీంతో ఆమె హైకోర్టు తీర్పు మేరకు తమ భూమికి ఎన్ఓసీ జారీ చేయాలని అప్పటి కలెక్టర్ గిరీషాకు దరఖాస్తు చేసుకోగా తహసీల్దార్ కార్యాలయంలో రికార్డులు, జారీచేసిన పట్టా వివరాలు, కోర్టు తీర్పు, ఉన్నతాధికారుల నివేదికను పరిశీలించి అన్ని సక్రమంగానే ఉన్నాయని నిర్ధారించాక కలెక్టర్ 2023 మే 3న ఎన్ఓసీఓ జారీ చేశారు. దీంతో భూమిని విక్రయించుకునే హక్కు శ్రీప్రియకు దక్కింది. 3.40 ఎకరాలు కొనుగోలు బీకేపల్లె రెవెన్యూ గ్రామంలోని సర్వే నంబర్ 552/7లోని మాజీ సైనికుడికి కేటాయించిన భూమిలో 3.40 ఎకరాలను పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేశారు. వారసురాలు శ్రీప్రియ నుంచి నిబంధనల ప్రకారం కొనుగోలు చేసి వ్యవసాయ భూమిని రిజిస్ట్రేషన్ చేయించుకున్నారు. ఈ భూమికి సంబంధించి ఆకుల సిద్దప్ప, ఆయన కుమారుడు రామాంజులు బాబుకు పట్టాదారు పాసుపుస్తకాలు, అడంగల్, వన్బీలును రెవెన్యూ అధికారులు మంజూరు చేసి ఉన్నారు. పక్కాగా న్యాయబద్ధంగా ఉన్న భూమి కావడంతోనే పెద్దాయన కుటుంబీకుల పేరిట కొనుగోలు చేశారు. 2024 అసెంబ్లీ ఎన్నికల సమయంలో సమర్పించిన అఫిడవిట్లో తమ కుటుంబానికి ఈ సర్వేనంబర్లో వ్యవసాయ భూమి ఉందని పెద్దాయన స్పష్టంగా పేర్కొన్నారు. పక్కనే ప్రభుత్వ భూమి ఉందని.. కొనుగోలు చేసిన ఈ భూమి పక్కనే ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూమితో ఎలాంటి సంబంధం లేదు. కొన్న భూమి వరకే ఉన్నప్పటికి ప్రభుత్వ భూమిని ఆక్రమించారని ఆరోపణలు చేస్తున్నారు. దీనికి సంబంధించి ఎలాంటి ఆనవాళ్లు లేవు. భూమిలో ఎలాంటి కార్యకలాపాలు సాగలేదు. అయినప్పటికీ భూమిని ఆక్రమించారంటూ ఆరోపిస్తూ కథనం వండారు. అందులో చెరువులు, కుంటలు లేవు, అయినా ఉన్నట్టు ప్రచారం చేశారు. సోమవారం సాయంత్రం సర్వే నంబర్ 552/1లోని 1.35 ఎకరాల ప్రభుత్వ భూమికి రెవెన్యూ అధికారులు గాడిని తవ్వించారు. ప్రభుత్వ భూమి ఖాళీగా ఉన్నట్టు, ఆక్రమణ లు లేవని రెవెన్యూ అధికారులు ఈ సందర్భంగా నిర్ధారించారు. ఎలాంటి వివాదం లేదు సర్వేనంబర్ 552/7లో కొనుగోలు చేసిన 3.40 ఎకరాల భూమి పక్కాగా ఉందని తహసీల్దార్ కే.ధనంజయలు స్పష్టం చేశారు. ఈ భూమిపై ఎలాంటి వివాదం లేదని, పక్కనే ఉన్న 1.35 ఎకరాలు ప్రభుత్వ భూమి కావడంతో స్వాధీనం చేసుకున్నట్టు చెప్పారు. ఇందులో ఎలాంటి నిర్మాణాలు జరగలేదని స్పష్టం చేశారు. మాజీ సైనికుడి పట్టాకు ఎన్ఓసీ ఇచ్చిన కలెక్టర్ ఆపై వారసురాలి ద్వారా సర్వేనంబర్ 552/7లో 3.40 ఎకరాల కొనుగోలు 2024 ఎన్నికల అఫిడవిట్లో ఈ భూమి వివరాలు పేర్కొన్న పెద్దిరెడ్డి అయినా ఆక్రమణ అంటూ కట్టుకథ -
సిరులు కురిపించని విరులు
పూలసాగు విస్తీర్ణం : 3150 సాగు చేసే రైతులు : 2350 సాగుకు అయిన ఖర్చు : రూ.31.50కోట్లు ఈఏడాది పంట నష్టం : రూ.22కోట్లు జిల్లాలో పూలసాగు చేసిన రైతుకు ఈ ఏడాది నిరాశే మిగిలింది. జిల్లా మొత్తం 2350 మంది 3150 ఎకరాల్లో పూల సాగు చేపట్టారు. నారుమొక్కలు, ఎరువులు, దుక్కులు, మల్చింగ్ కవర్, కూలీల ఖర్చు కలుపుకొంటే ఎకరం బంతిపూల సాగుకు రూ. 80 వేలు నుంచి రూ.లక్షవరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో సగటున కిలో బంతిపూల ధర రూ. 10 వరకు ధరలు పలుకుతున్నాయి. కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు,ఇతరత్రా ఖర్చులు కలుపుకొంటే పూలను మార్కెట్కు తీసుకెళ్లే రైతులు ఖాళీ చేతులతో వచ్చేస్తున్నారు. గత ఏడాది ఇదే సీజన్లో బంతి పూల ధరలు కిలో రూ. 40 నుంచి రూ.50 వరకు ధరలు పలికాయి. ఈ సీజన్ జిల్లా మొత్తం మీద పూల సాగు చేసిన రైతులు రూ.22కోట్ల మేరకు నష్టపోయారు. -
జిల్లా ఆస్పత్రిలో గుర్తు తెలియని వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో గుర్తుతెలియని వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి జరిగింది. రెండు రోజుల క్రితం గుర్తు తెలియని వ్యక్తి తీవ్ర అనారోగ్యంతో ఉండగా, స్థానికుల సమాచారంతో 108 సిబ్బంది ములకలచెరువు నుంచి మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్థానిక వైద్యులు అతనికి ఐసీయూ విభాగంలో ఉంచి చికిత్స అందిస్తుండగా, ఆదివారం రాత్రి పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని మార్చురీ గదిలో ఉంచారు. అతనికి సంబంధించిన వారు ఎవరైనా ఉంటే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో సంప్రదించాలన్నారు. పాము కాటుకు రైతు కూలీ..లక్కిరెడ్డిపల్లి : మండలంలోని మద్దిరేవుల గ్రామం రెడ్డివారిపల్లికి చెందిన వీరబల్లి వెంకటరమణ (44) అనే రైతు కూలీ ఆదివారం అర్థరాత్రి ఇంట్లో నిద్రిస్తుండగా పాటుకాటుకు గురై మృతి చెందినట్లు స్థానికులు తెలిపారు. మృతునికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. భార్య బతుకుదెరువు కోసం కువైట్కు వెళ్లింది. వెంకట రమణ మృతితో కుటుంబ సభ్యులు శోకసంద్రంలో మునిగిపోయారు. ప్రభుత్వం నుంచి ఆర్థిక సాయం అందజేసి మృతుని కుటుంబాన్ని ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి
మదనపల్లె రూరల్ : ద్విచక్ర వాహనం ఢీకొని మహిళా కూలీ మృతి చెందిన సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితులు తెలిపిన మేరకు వివరాలు.. మండలంలోని పోతబోలు పంచాయతీ దళితవాడకు చెందిన వెంకటేష్ భార్య ఆర్. రమణమ్మ (55) భర్త మృతి చెందడంతో కూలి పనులు చేసుకుంటూ జీవిస్తోంది. ఆమె కుమారుడు కుషాల్ కుమార్ ఆటో డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. రమణమ్మ ఆదివారం స్థానిక కూలీలతో కలిసి పొలం పనులకు వెళ్లింది. సాయంత్రం కూలి పనులు ముగించుకుని తిరిగి వచ్చి, పోతబోలు నుంచి దళితవాడకు వెళ్తుండగా, ద్విచక్ర వాహనంలో ఒక యువకుడు వేగంగా వచ్చి ఆమెను ఢీకొని, ఎవరు గమనించలేదని అక్కడి నుంచి పారిపోయాడు. ప్రమాదంలో రమణమ్మ తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితిలోకి వెళ్లింది. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించడంతో వారు హుటాహుటిన అక్కడికి చేరుకు ని వెంటనే ఆమెను ఆసుపత్రికి తీసుకువెళ్లే ప్రయత్నం చేశారు. మార్గమధ్యంలో ఆమె మృతి చెందినట్లు నిర్ధారించుకుని, తిరిగి ఇంటికి తీసుకువచ్చి అంత్యక్రియలకు సిద్ధమయ్యా రు. అయితే మృతదేహాన్ని ఫ్రీజర్బాక్స్లో పెడుతు న్న సమయంలో ఒంటిపై తీవ్ర గాయాలను గుర్తించారు. ఈ లోపు సంఘటనా స్థలం వద్ద రమణమ్మను పోతబోలు గ్రామానికి చెందిన యాసిన్ లేపి కూర్చోబెడుతుండగా, తాము చూశామని తోటికూలీలు చెప్పారు. దీంతో యాసిన్ను ప్రశ్నించగా, అతను బుకాయించగా, కుటుంబ సభ్యులు తాలూకా పోలీ సులకు ఫిర్యాదు చేశారు. మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీ గదికి పోస్టుమార్టం నిమి త్తం తీసుకువచ్చారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బాధితులకు అండగా ఉందాం
రాయచోటి: ప్రజల నుంచి అందుతున్న ఫిర్యాదులను పరిష్కరించి వారికి అండగా నిలుద్దామని జిల్లా ఎస్పీ వి విద్యాసాగర్ నాయుడు పేర్కొన్నారు. సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు. జిల్లా నలుమూలల నుంచి వచ్చిన ఫిర్యాదు దారుల నుంచి ఎస్పీ అర్జీలను స్వీకరించారు. వారితో మాట్లాడి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ఆయా పోలీసు స్టేషన్ల పరిధిలోని అధికారులకు టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమస్యలను వివరించి పాటి పరిష్కారానికి చట్టపరిధిలో చర్యలు చేపట్టాలని ఎస్పీ సూచించారు. జిల్లా కేంద్రానికి రాలేని వికలాంగులు, ఇతర ప్రజలు స్థానికంగా ఉన్న పోలీస్ స్టేషన్లో వినతులు అందిస్తే తదుపరి చర్యలు చేపడతామని ఎస్పీ పేర్కొన్నారు. నూతన నియామకంకడప కార్పొరేషన్ : వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురిని పార్టీ రాష్ట్ర అనుబంధ విభాగ కమిటీల్లో వివిధ హోదాల్లో నియమించినట్లు ఆ పార్టీ కేంద్ర కార్యాలయం ఒక ప్రకటనలో తెలిపింది. స్టేట్మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రాయచోటికి చెందిన షేక్ కరమల హరూన్బాషా, స్టేట్ పంచాయతీరాజ్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా రాజంపేటకు చెందిన గాలివీటి వీర నాగిరెడ్డి, స్టేట్ దివ్యాంగుల విభాగం ప్రధాన కార్యదర్శిగా రాజంపేటకు చెందిన దారా సుధాకర్లను నియమించారు. 34 మంది పోలీసుల బదిలీరాయచోటి : జిల్లాలో 34 మంది పోలీసులకు స్థానచలనం కల్పిస్తూ జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఉత్తర్వులు జారీ చేసినట్లు సమాచారం. జిల్లాలో నలుగురు ఏఎస్ఐలు, 13 మంది హెడ్కానిస్టేబుళ్లు, 17 మంది పోలీసులు స్థానచలనం కల్పించిన వారిలో ఉన్నారు. ఉత్తర్వులు అందుకున్న వారు ఒకటి రెండు రోజుల్లో బాధ్యతలను చేపట్టాలని ఎస్పీ ఆదేశించినట్లు పోలీసు వర్గాల సమాచారం. ప్రశాంతంగా ప్రారంభమైన పది సప్లిమెంటరీ పరీక్షలు రాయచోటి : జిల్లా వ్యాప్తంగా పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు సోమవారం ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. మొదటి రోజు తెలుగు పరీక్షకు జిల్లా వ్యాప్తంగా 28 కేంద్రాల్లో ప్రైవేట్ అభ్యర్థులకు సంబంధించి 1365 మందికి 961 మంది హాజరుకాగా 404 మంది గైర్హాజరయ్యారు. జిల్లాలోని పరీక్ష కేంద్రాలను ఫ్లయింగ్స్క్వాడ్, సిట్టింగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీ చేశాయి. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం పరీక్ష కేంద్రాల్లో సౌకర్యాలను పరిశీలించారు. పరీక్ష నిర్వహణపై సిబ్బందికి తగిన సూచనలు, సలహాలను ఇచ్చారు. -
జల్సాలకు అలవాటుపడి.. దారి దోపిడీలకు పాల్పడి..
కడప అర్బన్ : జల్సాలకు అలవాటు పడి, అక్రమ ధనార్జన కోసం ఒంటరిగా ఉన్న మహిళల మెడలో బంగారు గొలుసులను లాక్కొని పోవడం, రోడ్డుపై వచ్చే వాహనాలను ఆపి వారిని కొట్టి డబ్బు, నగలు దోపిడీ చేయడం వంటి నేరాలకు పాల్పడిన ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రెండు బంగారు చైన్లు(5 తులాలు), ఒక బుల్లెట్ మోటారు సైకిల్, ఒక కత్తి, 4 సెల్ ఫోన్లు, రూ.10200 నగదు కలిపి మొత్తం రూ.6,50,000 విలువ గల సొమ్మును స్వాధీనం చేసుకున్నారు. కడప సబ్ డివిజన్ పరిధిలో కమలాపురం మెయిన్ రోడ్ వేదాస్ స్కూల్ దగ్గర సోమవారం ఉదయం 11 గంటలకు జిల్లా ఎస్పీ ఈజీ అశోక్కుమార్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు, కమలాపురం సర్కిల్ ఇన్స్పెక్టర్ షేక్ రోషన్ పర్యవేక్షణలో వల్లూరు ఎస్ఐ పెద్ద ఓబన్న, కమలాపురం ఎస్ఐ విద్యా సాగర్ తమ సిబ్బందితో కలిసి ముగ్గురు నిందితులను అరెస్ట్ చేశారు. సోమవారం సాయంత్రం తన కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వివరాలు వెల్లడించారు. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన చక్రకోళ్ల ప్రశాంత్ 13 కేసులలో నిందితుడిగా వున్నాడు. చాపాడు మండలం బద్రిపల్లెకు చెందిన పందిటి ఉదయ్ కుమార్ పండ్ల వ్యాపారం చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతనిపై జిల్లాలో 10 కేసులున్నాయి. చాపాడు మండలం, పల్లవోలు గ్రామానికి చెందిన దుంపల వినోద్ కూలిపని చేసుకుని జీవనం సాగించేవాడు. ఇతను జిల్లాలో 23 కేసులలో నిందితుడిగా వున్నాడు. వీరు ముగ్గురు జల్సాలకు అలవాటు పడి సులభంగా డబ్బు పొందేందుకు దోపిడీలను మార్గంగా ఎంచుకున్నారు. ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు గొలుసులు లాక్కెళ్లడం, ఒంటరిగా బైకుపై వెళ్లే వారిని బెదిరించి వారి వద్ద నుంచి నగలు, నగదు దోపిడీ చేయడం లాంటి నేరాలకు పాల్పడేవారు. నేరాలు చేసేందుకు వీరు వాడుతున్న బుల్లెట్ మోటార్ బైకును తిరుపతిలోని కరకంబాడి రోడ్డులో డీ మార్ట్ వద్ద చోరీ చేసి తీసుకొచ్చారు. సోమవారం వారు ముగ్గురు నేరం చేసేందుకు మోటార్ బైకుపై వస్తుండగా కడప–కమలాపురం మార్గంలో పోలీసులు అరెస్టు చేశారు. నిందితుల నేరాల వివరాలు ఇలా.. ● ఫిబ్రవరి 11న తేదీ వల్లూరు మండలం ఇ.కొత్తపల్లి గ్రామ సమీపంలో కాంతమ్మ అనే మహిళ మెడలో నుంచి 31.63 గ్రాముల పురి తిరిగిన బంగారు గొలుసును లాక్కొని వెళ్లారు. ● మార్చి 3వ తేదీన తిరుపతి కరకంబాడి రోడ్ లో ఉన్న డీమార్ట్ సూపర్ మార్కెట్ వద్ద రాయల్ ఎన్ఫీల్డ్ మోటార్ సైకిల్ను చోరీ చేశారు. ● ఏప్రిల్ 5వ తేదీన కడప–కమలాపురం మెయిన్ రోడ్ మదీనా కాలేజీ వద్ద కడప వైపు నుంచి టీవీఎస్ ఎక్స్ఎల్పై పాల డబ్బాలను పెట్టుకొని వస్తున్న వ్యక్తిని బలవంతంగా ఆపి బెదిరించి అతని వద్ద నుంచి ఐదు వేల రూపాయలు దోచుకున్నారు. ● కమలాపురం మండలం కోగటం గ్రామ సమీపంలో పొలాల వద్ద ఒక మహిళ మెడలో ఉన్న 4. 20 గ్రాముల సాదా బంగారు గొలుసును లాక్కెళ్లారు. ● వల్లూరు మండలం గోటూరు క్రాస్ దాటిన తరువాత ఓబాయపల్లి గ్రామ సమీపంలో ఆటోలోని వ్యక్తిని బయటికి లాగి అతని జేబులో ఉన్న 5200 రూపాయల నగదును బలవంతంగా లాక్కెళ్లారు. ఈ కేసులలో ప్రతిభ కనబరిచిన సిబ్బందిని జిల్లా ఎస్పీ అశోక్ కుమార్, కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు ప్రత్యేకంగా అభినందించారు. పోలీసుల సూచనలు.. తల్లిదండ్రులకు దూరంగా హాస్టళ్లలో ఉండి చదువుకునే పిల్లల కదలికలపై నిఘా ఉంచాలని డీఎస్పీ కోరారు. పిల్లల మీద శ్రద్ధ చూపకపోతే వారి బంగారు భవిష్యత్తు పాడు కావడమే కాకుండా అనుకున్న లక్ష్యాలను చేరుకోలేరన్నారు. మహిళలు బయటకు వచ్చే సందర్భంలో తాము ధరించిన ఆభరణాలు కనిపించ కుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. విలువైన వస్తువులు బ్యాంకు లాకర్లో పెట్టుకోవాలన్నారు. అనుమానితులు గ్రామ పరిసరాల్లో కనిపిస్తే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. ముగ్గురు నిందితుల అరెస్టు నగలు, నగదు, బుల్లెట్ వాహనం స్వాధీనం నిందితులంతా చాపాడు మండల వాసులు విలేకరుల సమావేశంలో కడప డీఎస్పీ వెంకటేశ్వర్లు వెల్లడి -
గోపవరం ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచింది
ప్రొద్దుటూరు : గోపవరం గ్రామ పంచాయతీ ఉపసర్పంచ్ ఉప ఎన్నికలో ప్రజాస్వామ్యం గెలిచిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. వైఎస్సార్సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థిగా బీరం రాఘవేంద్రారెడ్డి ఎన్నికైన అనంతరం సోమవారం తన స్వగృహంలో ఆయన విజయం సాధించిన అభ్యర్థులతో కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచమల్లు మాట్లాడుతూ అనేక అవాంతరాల మధ్య, అభద్రత పరిస్థితుల నడుమ ఉప సర్పంచ్ ఎన్నిక ఎట్టకేలకు జరిగిందన్నారు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొని అత్యంత ప్రశాంతంగా, సజావుగా ఎన్నిక జరిపించి ప్రజా స్వామ్యాన్ని గెలిపించారన్నారు. ఎన్నికలో విజయం సాధించడం కన్నా ప్రజాస్వామ్యాన్ని గెలిపించిన జిల్లా కలెక్టర్, ఎస్పీ, డీఎస్పీ, పోలీసు సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి చక్కగా విధులు నిర్వహించారన్నారు. ఎన్ని మార్లు ఓడినా, గెలిచినా ప్రజాస్వామ్యాన్ని గెలిపించడమే ముఖ్యమన్నారు. గతంలో జరిగిన పొరపాటును వరదరాజులరెడ్డి సరిదిద్దుకున్నారన్నారు. వాస్తవానికి మార్చి 27న జరిగిన ఎన్నికల్లోనే తాము గెలవాల్సి ఉందని, టీడీపీ వైఖరి వల్ల ఎన్నిక వాయిదా పడిందన్నారు. 20 మంది వార్డు సభ్యుల్లో తమ వైపు 14 మంది ఉన్నా అడ్డదారిన గెలవాలని టీడీపీ చేసిన ప్రయత్నాలు నెరవేరలేదన్నారు. వార్డు సభ్యులను స్ఫూర్తిగా తీసుకుంటాం ఎన్ని ఆటుపోట్లు ఎదురైనా చివరి వరకు తమ వెంట నడిచిన గోపవరం గ్రామ పంచాయతీ వార్డు మెంబర్లను తాము స్ఫూర్తిగా తీసుకుంటామని రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. డబ్బులు ఇస్తామని, ప్రలోభాలకు గురిచేయడంతోపాటు బెదిరించి భయపెట్టారన్నారు. ఏమి చేసినా తమ వార్డు సభ్యులు ఎదరొడ్డి నిలబడి చివరకు తమకు విజయాన్ని అందించారన్నారు. ఇది మా జెండా గొప్పతనమని తెలిపారు. వైఎస్సార్సీపీలో ఉండి పదవులు అనుభవించిన తర్వాత పార్టీని వీడిన రాజ్యసభ సభ్యులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు ఇలాంటి వారిని స్ఫూర్తిగా తీసుకోవాలని సూచించారు. వచ్చే ఏడాది జరిగే స్థానిక సంస్థల ఎన్నికల్లో తప్పక విజయం సాధిస్తామని, 2029 ఎన్నికల్లో తమ పార్టీ తప్పక గెలుస్తుందని ధీమా వ్యక్తం చేశారు.మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి -
వంగసాగుతో నష్టపోయాం
ఈసీజన్లో వంగపంట సాగు చేసి పూర్తిగా నష్టపోయాం. మార్కెట్లో ధరలు రోజురోజుకు తగ్గిపోతున్నాయి. సుమారు రూ.1.50లక్షల మేరకు పెట్టుబడి సాగు ఖర్చు నష్టపోయాం. గత ఏడాది ఇదే సీజన్లో వంగ పంటకు మార్కెట్లో మంచి ధరలు పలికాయి. ఇప్పుడు కిలో రూ.10 వరకు ఉండటంతో గిట్టుబాటు కావడం లేదు. – గంగులమ్మ, గంగిరెడ్డిగారిపల్లె టమాట కోయకుండా వదిలేశాం మార్కెట్లో టమాటాలకు గిట్టుబాటుధరలు లేక పోవడంతో కాయలు కోయకుండా అలాగే తోటల్లొనే వదిలేశాం. ఈసీజన్లో ఒక ఎకరాలో పంట సాగు చేశా. రూ. 2 లక్షలవరకు పెట్టుబడి కోసం ఖర్చు చేశా. ఇప్పటివరకు రూ. 20 వేలు కూడా చేతికందలేదు. భవిష్యత్తులో ధరలు పెరుగుతాయనే ఆశ లేదు. ఏమి చేయాలో దిక్కుతోచడం లేదు. పంటనష్టపోయిన తమను ప్రభుత్వమే ఆదుకోవాలి – రాజారెడ్డి, కొత్తపల్లె ప్రభుత్వం ఆదుకోవాలి జిల్లాలో రైతులు సాగు చేస్తున్న ఒక్క పంటకు కుడా ఈ ఏడాది గిట్టుబాటు ధరలు లేక పోవడం దారుణం. ప్రభుత్వం పంటలభీమా పథకం కిందనైనా వారిని ఆదుకోవాలి. ముఖ్యంగా కష్టపడి సాగు చేసిన టమాటా పంటకు మార్కెట్లో ధరలు లేకపోవడం వేలాది మంది రైతులు నష్టపోయారు. నష్టపోయిన రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ప్రభుత్వం పంటల బీమా చేసుకొన్నవారితోపాటు బీమా చేసుకోని వారిని కూడా ఆదుకోవాలి. – రమేష్బాబు, రైతుసంఘం జిల్లా ఉపాధ్యక్షుడు, గుర్రంకొండ. -
సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యం వద్దు
రాయచోటి: ప్రజా సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యధోరణి తగదని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోసోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఈసందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రజల సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని చెప్పారు. కార్యక్రమంలో సంయుక్త కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదన్రావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఎస్డీసీ రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ● వెనుకబడిన తరగతుల సంక్షేమ హాస్టల్లో ఉండి చదువుకొని ఉత్తమ ర్యాంకులను సాధించడం జిల్లాకు గర్వకారణమని కలెక్టర్ శ్రీధర్ పేర్కొన్నారు. ఉత్తమ ర్యాంకులు సాధించిన విద్యార్థులకు అభినందనలు తెలిపారు. సోమవారం ర్యాంకులు సాధించిన వారికి ప్రశంసా పత్రాలు, జ్ఞాపికలు, నగదు బహుమతులను కలెక్టర్ చేతుల మీదుగా అందజేశారు. -
గోపవరం ఉప సర్పంచ్ పదవి వైఎస్సార్సీపీకే
ప్రొద్దుటూరు రూరల్ : ప్రతిష్టాత్మకంగా జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నికలో ఆ పదవి వైఎస్సార్సీపీకే దక్కింది. గ్రామ పంచాయతీ కార్యాలయంలో సోమవారం ఉదయం 11 గంటలకు ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఉప సర్పంచ్ ఎన్నికను నిర్వహించారు. సర్పంచ్తో పాటు మొత్తం 20 మంది వార్డు మెంబర్లు ఉండగా వైఎస్సార్సీపీ తరపున 14 మంది వార్డు మెంబర్లు హాజరయ్యారు. సర్పంచ్ మోషాతోపాటు సభ్యులు అందరూ ఏకగ్రీవంగా ఉపసర్పంచ్గా బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలిపి ఎన్నుకున్నారు. ఎన్నిక అనంతరం ఎన్నికల అధికారి రామచంద్రారెడ్డి ఉప సర్పంచ్ ఎన్నిక ధ్రువపత్రాన్ని బీరం రాఘవేంద్రారెడ్డికి అందించారు. డీఎస్పీ భావన ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. టీడీపీకి చెందిన వార్డు మెంబర్లు ఈ ఎన్నికకు గైర్హాజరయ్యారు. 8వ వార్డు అభ్యర్థి వైఎస్సార్సీపీకే మద్దతు వైఎస్సార్సీపీ తరపున విజయం సాధించిన 8వ వార్డు మెంబర్ గాయత్రి గతంలో టీడీపీలో చేరారు. మార్చి నెలలో ఉప సర్పంచ్ ఎన్నిక నిర్వహించినప్పుడు కూడా ఆమె టీడీపీ తరపునే ఉన్నారు. అనూహ్యంగా సోమవారం జరిగిన ఉప సర్పంచ్ ఎన్నికల్లో గాయత్రి వైఎస్సార్సీపీ ఉప సర్పంచ్ అభ్యర్థి బీరం రాఘవేంద్రారెడ్డికి మద్దతు తెలపడం విశేషం. సంబరాలు అత్యంత ప్రతిష్టాత్మకంగా సోమవారం జరిగిన ప్రొద్దుటూరు మండలం గోపవరం గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ ఎన్నిక ఏకగ్రీవమైంది. దీంతో మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి ఇంటి వద్ద పెద్ద ఎత్తున బాణసంచా పేల్చి స్వీట్లు పంపిణీ చేశారు. ఒత్తిళ్లకు గురి చేసినా, ప్రలోభాలకు లొంగకుండా వైఎస్సార్సీపీకి అండగా నిలిచిన వార్డు సభ్యులను అందరూ ప్రశంసిస్తున్నారు. -
వంగపంటకు గిట్టుబాటు ధర ఏదీ..
జిల్లాలో వంగపంట సాగు విస్తీర్ణం : 2450 ఎకరాలు సాగు చేసే రైతులు : 1810 సాగుకు అయిన ఖర్చు : రూ.19.60కోట్లు ఈ ఏడాది పంట నష్టం : రూ. 16కోట్లు ఈ ఏడాది వంగ పంట సాగు చేసిన రైతులకు బెంగే మిగిలింది. జిల్లాలో ఈ సీజన్లో 1810 మంది 2450 ఎకరాల్లో వంగ పంట సాగు చేశారు. నారు మొక్కల నుంచి దుక్కులు, ఎరువులు, మందులు, కూలీల ఖర్చు కలుపుకొంటె ఎకరం పంట సాగుకు రూ. 70 వేలు నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. ప్రస్తుతం మార్కెట్లో కిలో వంగ ధర రూ.10 వరకు ధర పలుకుతోంది. జిల్లాలో సాగు చేసే వంగను ఎక్కువగా తమిళనాడు రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లోని మార్కెట్లకు తరలిస్తుంటారు. కోతకులీలు, రవాణాఖర్చులు, కమీషన్లు లెక్కిస్తే ఏమీ మిగలడంలేదని, పంటసాగు భారంగా మారుతోందని రైతులు ఆవేదన చెందుతున్నారు. గత ఏడాది ఇదీ సీజన్లో కిలో వంగ మార్కెట్లో రూ.20 నుంచి రు.30 వరకు ధరలు పలికాయి. ప్రస్తుతం తమిళనాడులో వంగ సాగు అక్కడి మార్కెట్లకు ఎక్కువగా వస్తుండడంతో పాటు డిమాండ్ తక్కువగా ఉండడంతో వంగ ధరలు పతనమయ్యాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఈ ఏడాది జిల్లాలో వంగసాగు చేసిన రైతులకు రూ.16కోట్లు మేరకు పంట నష్టం వాటిల్లింది. -
వర్షానికి కూలిన మిద్దె
పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతీ గజ్జెలవారిపల్లికి చెందిన శంకర్రెడ్డి అనే వ్యక్తికి చెందిన మిద్దె వర్షం కారణంగా కూలిపోయింది. ఇంటి పైకప్పునకు వేసిన బలమైన రాతి కప్పులు ఒక్కసారిగా కూలిపోయాయి. రాతి కప్పులు పగలడంతో ఇంట్లో ఉన్న ధాన్యం, వంట పాత్రలు, టీవీ ధ్వంసం అయ్యాయి. అంతేగాక ఈ ఘటనలో శంకర్రెడ్డి భార్య నేత్రావతికి నడుం భాగం, కుమారుడు ఆదర్శ (23)కు కుడి కాలు దెబ్బతింది. ఇంటి పైకప్పు పూర్తిగా కూలిపోవడంతో రూ.4లక్షల నష్టం వాటిల్లడమే గాక తాము అద్దె ఇంట్లో తల దాచుకుంటున్నామని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం ఆదుకోవాలని వారు కోరారు. మార్కెట్ యార్డులో వ్యక్తి ఆత్మహత్యమదనపల్లె రూరల్ : మదనపల్లె మార్కెట్ యార్డులో ఓ వ్యక్తి ఉరివేసుకొని ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన సోమవారం వెలుగు చూసింది. స్థానిక మార్కెట్ యార్డులో సురేంద్ర(45) అనే వ్యక్తి కూలి పనులు చేసుకుంటూ ఉండేవాడు. భిక్షాటన కూడా చేసేవాడు. కూలి డబ్బులతో అన్నా క్యాంటీన్లో భోజనం చేస్తూ, మార్కెట్ యార్డ్ పరిసరాల్లోనే ఉండేవాడు. సోమవారం ఉదయం మార్కెట్ యార్డ్ పక్కనే ఉన్న పోలీస్ అవుట్ పోస్ట్ వెనుక వైపున గదిలో అతను ఉరి వేసుకుని ఉండటాన్ని స్థానికులు గమనించి టూ టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతిసుండుపల్లె : రోడ్డు ప్రమాదంలో షేక్ మహమ్మద్(26) అనే యువకుడు మృతి చెందాడు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. రాయవరం గ్రామానికి చెందిన షేక్ మహమ్మద్ తన అత్త తహషీన్ కుమారుడు అయిన షేక్ మహమ్మద్ను ఎంసెట్ పరీక్షకు ద్విచక్రవాహనంలో రాజంపేటకు తీసుకుని వెళ్లాడు. పరీక్ష అనంతరం తిరిగి సుండుపల్లెకు వస్తుండగా మార్గమధ్యంలో సానిపాయి–సుండుపల్లె ప్రధాన రహదారిలో కృష్ణారెడ్డిచెరువు సమీపంలో ఎదురుగా వస్తున్న లగేజీ టెంపో, ద్విచక్రవాహనం ఢీకొన్నాయి. ఈ ఘటనలో ద్విచక్రవాహనం నడుపుతున్న షేక్ మహమ్మద్ అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుకవైపు కూర్చున్న యువకుడికి రక్త గాయాలయ్యాయి. మృతుని అన్న షరీఫ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నంబి.కొత్తకోట : మండలంలోని బయ్యప్పగారిపల్లె పంచాయతీ గట్టమీద దళితవాడకు చెందిన వరాలయ్య (60) సోమవారం ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సమస్యలతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు యత్నించడంతో కుటుంబీకులు గుర్తించి మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పశుగ్రాసంగా టమాటాలు
జిల్లాలో టమాటా సాగు విస్తీర్ణం : 13800 ఎకరాలు సాగు చేసే రైతులు : 12800 సాగుకు అయిన ఖర్చు : రూ.465కోట్లు ఈ ఏడాది పంట నష్టం : రూ. 325కోట్లు జిల్లాలో ప్రస్తుతం 12800 మంది రైతులు 14800 ఎకరాల్లో టమాటా పంట సాగు చేసారు. పంటసాగు కొసం ఇప్పటికే రూ.465 కోట్లు ఖర్చు చేశారు. అయితే ఈసీజన్లో రైతులు పండించిన పంటకు గిట్టుబాటు ధరలు లేక పోవడంతో రూ.325 కోట్ల మేరకు నష్టపోయారు. మార్కెట్లో ప్రస్తుతం 25కేజీల టమాట క్రీట్ ధర రూ.150లోపే ధర పలుకుతోంది. సగటున సరాసరి కిలో రూ.5లోపే ధర ఉంది. ఒక ఎకరం పంట సాగుకు రూ. 2లక్షల వరకు ఖర్చు అవుతోంది. ప్రస్తుతం మార్కెట్లో ధరలు అంతంత మాత్రంగా ఉండడంతో మార్కెట్కు టమాటాలను చేర్చేవరు అయ్యే ఖర్చు కుడా రైతులకు మిగలడం లేదు. కోతకూలీలు, రవాణా ఖర్చులు, కమీషన్లు, జాక్పాట్లు కలుపు కొంటే మార్కెట్కు టమాటాలను తీసుకొచ్చే రైతులకు తమ చేతి నుంచే అదనపు ఖర్చు వస్తుండడంతో బెంబేలెత్తిపోతున్నారు. పలువురు నాలుగు కోతలు కోసిన తర్వాత పంటను అలాగేే పొలంపై వదిలేస్తున్నారు. దీంతో పలుచోట్ల టమాటా పంట పశుగ్రాసంగా మారిపోతోంది. -
అప్పు తీర్చమంటే బెదిరిస్తున్నారు
రాయచోటి టౌన్ : తమ వద్ద అప్పు తీసుకున్నారు.. ఇప్పుడు అడిగితే బెదిరిస్తున్నారంటూ మదనపల్లె పట్టణానికి చెందిన కొందరు మహిళలు అన్నమయ్య జిల్లా ఎస్పీ విద్యాసాగర్ నాయుడుకు సోమవారం ఫిర్యాదు చేశారు. అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ మదనపల్లె టౌన్ పరిధిలో సుజాత, సుంకర లావణ్య, పద్మప్రియ, గౌరి, నాగరత్న, నళిని, నాగమణి అనే మహిళలు తమవద్ద పలు దఫాలుగా రూ.3.5 కోట్లు అప్పుగా తీసుకున్నారని వారు తెలిపారు. తమ పిల్లలకు ఫీజులు కట్టాలని కొందరు ఇంటిలో అవసరం ఉందని మరి కొందరు ఇలా రకరకాల అవసరాల కోసం తమ దగ్గర అప్పు చేశారన్నారు. తమ డబ్బులు ఇవ్వాలని అడిగితే వారంతా ఒక గ్రూపుగా ఏర్పడి తమ ఇళ్ల వద్దకు వచ్చి దుర్భాషలాడటం, నానా యాగి చేయడం, గొడవకు దిగడం చేస్తున్నారని వాపోయారు. చేసేది లేక తాము కోర్టుకు వెళ్లామని చెప్పారు. తమపై కోర్టుకు వెళతారా అంటూ మరింత రెచ్చిపోయి గొడవకు వస్తున్నారని తెలిపారు. వీరిలో సుజాత అనే మహిళపై క్రిమినల్ కేసులు ఉన్నాయని, తాము ఫిర్యాదు చేసిన తరువాత విదేశాలకు వెళ్లేందుకు పాస్పోర్టు కూడా సిద్ధం చేసుకొందన్నారు. ఆమె పాస్పోర్టు రద్దు చేసి తమకు న్యాయం చేయాలని కోరారు. ఎస్పీకి ఫిర్యాదు చేసిన వారిలో సుగుణ, భారతి, కుసుమ, శ్రీదేవి, అనూరాధ, సునీత, సరస్వతి తదితరులు ఉన్నారు.ఎస్పీకి బాధిత మహిళల ఫిర్యాదు -
నేటి నుంచి టెన్త్ సప్లిమెంటరీ పరీక్షలు
రాయచోటి: పదోతరగతి పరీక్షల్లో ఉత్తీర్ణత కాని వారికి నిర్వహించే సప్లిమెంటరీ పరీక్షలకు విద్యాశాఖ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈనెల 19 నుంచి 28వ తేదీ వరకు జరిగే పరీక్షలకు ప్రభుత్వం షెడ్యూల్ విడుదల చేసిన విషయం తెలిసిందే. గతంలో పదోతరగతి విద్యార్థులు సప్లిమెంటరీ పరీక్ష రాసినట్లైతే వారికి ఆ సర్టిఫికెట్పై సప్లిమెంటరీగా నమోదయ్యేది. అయితే ప్రస్తుతం రెగ్యులర్ విద్యార్థులుగానే పరిగణించనున్నారు. జిల్లాలో 28 పరీక్ష కేంద్రాల్లో 4817 మంది విద్యార్థులు పరీక్షలు రాయనున్నారు. మరో తొమ్మిది కేంద్రాల్లో 2920 మంది ఓపెన్ స్కూల్ విద్యార్థులు పరీక్షలు రాసేలా అధికారులు చర్యలు తీసుకున్నారు. 24 వరకు ఓపెన్ స్కూల్ పరీక్షలు ఏపీ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో ఓపెన్ స్కూల్ విద్యార్థులకు సైతం ఈనెల 19 నుంచి 24వ తేదీ వరకు సప్లిమెంటరీ పరీక్షలను నిర్వహిస్తున్నారు. ఈ పరీక్షలకు పదోతరగతితోపాటు ఇంటర్మీడియట్ విద్యార్థులు హాజరవుతారు. జిల్లాలో 2920 మంది విద్యార్థులు హాజరవుతున్నట్లు అధికారులు తెలిపారు. ఈ పరీక్షలకు పదోతరగతికి 4, ఇంటర్మీడియట్కు 5 సెంటర్ల వంతున పరీక్ష కేంద్రాలను సిద్ధం చేశారు. అధికారుల నియామకం: జిల్లాలో పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు 28 మంది చీఫ్ సూపరింటెండెంట్లు, 28 మంది డిపార్టుమెంటల్ ఆఫీసర్లను నియమించారు. ప్రశ్నపత్రాలను భద్రపరిచేందుకు వివిధ పోలీస్ స్టేషన్లను ఎంపిక చేశారు. అదే విధంగా ఓపెన్ స్కూల్కు సంబంధించి మరో తొమ్మిది మంది అధికారులను కేటాయించారు. పరీక్షల నిర్వహణకు 250 మంది ఇన్విజిలేటర్లను అధికారులు నియమించారు. ఐదు ప్లైయింగ్ స్క్వాడ్లు, పది స్క్వాడ్ బృందాలు పరీక్షలను పర్యవేక్షించనున్నట్లు అధికారులు తెలిపారు. ● మార్చి 19వ తేది నుంచి పదోతరగతి విద్యార్థులకు పరీక్షలను నిర్వహించనున్నారు. ఆ పరీక్షలలో వివిధ సబ్జెక్టులలో 4817 మంది ఉత్తీర్ణత సాధించలేదు. వీరితోపాటు గతంలో ఉత్తీర్ణత సాధించని వారికి ఈ సప్లిమెంటరీ పరీక్షల్లో అవకాశం కల్పించారు. ● జిల్లా వ్యాప్తంగా 28 పరీక్ష కేంద్రాలు ● పరీక్ష రాయనున్న 4817 మంది విద్యార్థులు ● ఓపెన్ స్కూల్ పరీక్షలకు మరో 9 కేంద్రాలు ప్రత్యేక తరగతులుగత ఏడాదిలాగానే పదోతరగతి పరీక్షలు తప్పిన విద్యార్థులకు ఆయా పాఠశాలల్లో ప్రత్యేత తరగతులు నిర్వహించి వారు ఉత్తీర్ణులు అయ్యే విధంగా ఉపాధ్యాయులు తీర్చిదిద్దారు. జిల్లాలోని ఆయా సబ్జెక్టులకు చెందిన ఉపాధ్యాయులు ప్రతిరోజూ ప్రత్యేక తరగతులను తీసుకొని తప్పిన విద్యార్థులను పరీక్షలకు సమాయాత్తం చేశారు. ఈ సందర్భంగా కొన్ని మెళకువలను నేర్వారు. పరీక్షల విభాగం వారు హాల్ టికెట్లు ఆయా పాఠశాలలకు పంపించగా ప్రధానోపాధ్యాయులు డౌన్లోడ్ చేసి విద్యార్థులకు అందించే కార్యక్రమాన్ని కూడా పూర్తి చేశారు. అన్ని ఏర్పాట్లు పూర్తి పదోతరగతి సప్లిమెంటరీ పరీక్షల నిర్వహణకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. పరీక్ష కేంద్రాలలో మౌలిక వసతుల కల్పనకు సంబంధించి చర్యలు తీసుకున్నాం. విద్యుత్, రవాణా, రెవెన్యూ, హెల్త్ తదితర శాఖల అధికారుల సహకారంపై కలెక్టర్ ఆదేశాల మేరకు ఉత్తర్వులు ఇచ్చాం. –సుబ్రమణ్యం, జిల్లా విద్యాశాఖ అధికారి, అన్నమయ్య జిల్లా -
నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ
కడప ఎడ్యుకేషన్ : ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాలకు సంబంధించి ఏపీ ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ పరీక్ష(ఏపీఈఏపీసెట్)– 2025 నేటి నుంచి ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా ప్రారంభం కానుంది. ఈ పరీక్షలను కంప్యూటర్ ఆధారిత(ఆన్లైన్) విధానంలో నిర్వహించనున్నారు. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు సిద్ధం చేశారు. ఇందులో భాగంగా 19, 20 తేదీల్లో అగ్రికల్చర్, ఫార్మసీ(బైపీసీ) కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనుండగా, ఈ నెల 21వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ఇంజినీరింగ్ కోర్సుల ప్రవేశ పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ప్రతి రోజు ఉదయం, సాయంత్రం రెండు సెషన్స్లో పరీక్షలు జరగనున్నాయి. ఇందులో ఉదయం సెషన్ 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంట వరకు, అలాగే మధ్యాహ్న సెషన్ 2.00 గంటల నుంచి సాయంత్రం 5.00 గంటల వరకు ఆన్లైన్లో నిర్వహించనున్నారు. రెండు సెషన్స్లో పరీక్ష.. ఉదయం సెషన్కు సంబంధించి 7.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. మధ్యాహ్నం పరీక్షకు 12.30 గంటల నుంచి 2 గంటల వరకు పరీక్షా కేంద్రంలోకి అనుమతిస్తారు. ఉదయం 9 గంటలు, మధ్యాహ్నం 2 గంటల తరువాత నిమిషం ఆలస్యమైనా ఎట్టి పరిస్థితుల్లోనూ పరీక్షా కేంద్రంలోకి అనుమతించరు. పరీక్ష జరిగే రోజు కనీసం గంట ముందుగా కేంద్రానికి చేరుకోవాలి. కేంద్రాల దగ్గర తనిఖీలతోపాటు బయోమెట్రిక్ హాజరు నమోదు, సంతకం చేయాల్సి ఉన్నందున చివరి నిమిషంలో హడావుడి పడకుండా చూసుకోవాలి. విద్యార్థులు వెంట తీసుకురావాల్సిన వస్తువులు.. ● విద్యార్థులు ఆన్లైన్లో దాఖలు చేసిన ఏపీ ఈఏపీ సెట్ –2025 దరఖాస్తు ప్రింటవుట్ కాపీతో పొందుపర్చిన నిర్ణీత బాక్స్లో విద్యార్థి కలర్ పాస్ పోర్టు సైజ్ ఫొటోను అతికించి సంబంధిత కళా శాల ప్రిన్సిపాల్తో సంతకం చేయించుకోవాలి. ● పరీక్ష జరిగే జరిగే రోజున సదరు ప్రింటవుట్ కాపీతోపాటు హాల్ టికెట్ వెంట తీసుకుని వెళ్లాలి. బ్లూ, బ్లాక్ కలర్ బాల్ పాయింట్ పెన్ను అనుమతిస్తారు. గుర్తింపు కోసం ఇంటర్ హాల్ టికెట్, పాస్పోర్టు, పాన్కార్డు, ఆధార్కార్డు, డ్రైవింగ్ లైసెన్స్, ఓటర్ ఐడీలలో ఏదో ఒకటి ఒరిజినల్ తీసుకుని వెళ్లాలి. ఇవి మినహా ఇతర ఏ వస్తువులు అనుమతించరు. ● విద్యార్థి ఫొటో అతికించిన ఆన్లైన్ దరఖాస్తు కాపీ పై పరీక్షా కేంద్రంలో ఇన్విజిలేటర్ సమక్షంలో సంతకం చేసి ఎడమ చేతి బొటనవేలి ముద్ర వేయాలి. నేటి నుంచి ఏపీ ఈఏపీ సెట్ ఏర్పాట్లను సిద్ధం చేసిన అధికారులు 19, 20న అగ్రికల్చర్, ఫార్మసీ ప్రవేశ పరీక్షలు 21 నుంచి 27 వరకు ఇంజినీరింగ్ ప్రవేశ పరీక్షలు -
దళిత విద్యార్థిపై దాడి చేసిన వారిపై చర్యలు తీసుకోవాలి
ఓబులవారిపల్లె : తిరుపతి విద్యానికేతన్లో బీటెక్ తృతీయ సంవత్సరం చదువుతున్న జేమ్స్ అనే దళిత విద్యార్థిపై అగ్రవర్ణాల విద్యార్థులు సాయి, రూపేష్లు దాడి చేయడం అమానుషమని అంబేద్కర్ సేవా సమితి రాష్ట్ర అధ్యక్షుడు పోలంరెడ్డి మల్లికార్జున అన్నారు. ఆదివారం చిన్నఓరంపాడులో విలేకరులతో మాట్లాడుతూ అగ్రవర్ణాల వారు జేమ్స్పై విచక్షణా రహితంగా దాడిచేసి కట్టేసి కొట్టి మూత్రం పోసిన దారుణమైన ఘటనపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నిందితులపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ, హత్యాయత్నం కేసు నమోదు చేయాలని కోరారు. దళిత విద్యార్థికి న్యాయం జరగని పక్షంలో తిరుపతి ఎస్పీ కార్యాలయం ఎదుట సోమవారం నుంచి ధర్నా చేస్తామన్నారు. ఈ సమావేశంలో భారత బహుజన రాష్ట్ర నాయకుడు కె. లక్ష్మీనారాయణ, ఎం.శ్రీను, దళిత నాయకుడు మన్యం బ్రహ్మయ్య పాల్గొన్నారు. -
గంగమ్మా.. చల్లంగా చూడమ్మా.
లక్కిరెడ్డిపల్లి: చల్లంగా చూడమ్మా..గంగమ్మా అంటూ అనంతపురం గంగమ్మను భక్తులు వేడుకున్నారు. ఆదివారం ఆలయ ప్రాంగణం భక్తులతో కిటకిటలాడింది. అమ్మవారికి భక్తులు బోనాలు సమర్పించారు.తలనీలాలు అర్పించారు. ఆలయ పూజారులు అమ్మవారిని పూలతో ప్రత్యేకంగా అలంకరించారు. విశేష పూజలు జరిపారు.పూజల అనంతరం భక్తులక తీర్థప్రసాదాలు అందజేశారు.కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ఎయిడ్స్ రహిత సమాజం నిర్మిద్దాం రాయచోటి టౌన్: ఎయిడ్స్ రహిత సమాజం నిర్మించేందుకు అందరం కలసి కట్టుగా పని చేద్దామని జిల్లా అడిషనల్ డీఎంహెచ్వో డాక్టర్ శైలజ పిలుపునిచ్చారు. ఆదివారం రాత్రి రాయచోటిలో జిల్లా ఎయిడ్స్ నియంత్రణ, నివారణ సంస్థ వారి ఆధ్వర్యంలో ఏరియా ఆస్పత్రి నుంచి కొవ్వొత్తులతో ర్యాలీ నిర్వహించారు. హెచ్ఐవీ పట్ల ప్రజల్లో అవగాహన పెంచి ప్రభుత్వం అందించే సేవలను, వాటి ప్రాధాన్యతను ప్రజలకు వివరించాలని చెప్పారు. ప్రజా చైతన్య సేవా సంఘం ప్రాజెక్టు డైరెక్టర్ చెన్నారెడ్డి డీఏపీసీయూ సిలార్ సాబ్, జిల్లా క్షయనివారణ సూపర్వైజర్ గంగన్న, ఐసీటీసీ ల్యాబ్ టెక్నీషియన్ శంకర్ బాబు, తదితరులు పాల్గొన్నారు. -
నోటీసులు ఇవ్వకుండా తొలగించడం అన్యాయం
కడప కార్పొరేషన్ : కడప నగరం మద్రాసు రోడ్డులోని డాక్టర్ వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో లీజుకు ఉన్న వ్యాపారులకు ఎలాంటి ముందస్తు నోటీసులు ఇవ్వకుండా షాపులు తొలగించడం అన్యాయమని మేయర్ సురేష్ బాబు అన్నారు. ఆదివారం ఉదయం ఆయన కార్పొరేటర్లు, వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి నగరపాలక అధికారులు తొలగించిన షాపులను పరిశీలించి, వ్యాపారులతో మాట్లాడారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులపై చేస్తున్న దౌర్జన్యాలు, అక్రమాలు, హత్యలకు అడ్డూ అదుపూ లేకుండా పోయిందన్నారు. మహిళలని చూడకుండా అనంతపురం, వైజాగ్, గుంటూరు ప్రాంతాల్లో దాడులకు తెగబడ్డారని, హత్యలు చేశారని గుర్తు చేశారు. ప్రజాస్వామ్యానికి పాతరేసి రెడ్బుక్ పాలన పాలన సాగిస్తున్నారని, 29 రాష్ట్రాల్లో ఎక్కడా ఇలాంటి అరాచక పాలన లేదన్నారు. రాష్ట్రమంతా ఒక ఎత్తు అయితే కడపలో మరొక ఎత్తుగా ఉందన్నారు. ఎమ్మెల్యేకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి గొంతునొక్కే విధంగా కక్ష సాధిస్తున్నారన్నారు. నగర ప్రథమ పౌరుడినైన తన ఇంటిపైనే చెత్త వేయించారని, ప్రశ్నించే వారు ఉండకూడదని వారి నోరు నొక్కేలా ప్రయత్నిస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో 10 గదులు ఉన్నాయని, 2007లో వీరంతా బహిరంగ వేలంలో రూ.7.50 లక్షలు చెల్లించి లీజుకు తీసుకున్నారన్నారు. అప్పటి నుంచి ఇప్పటి వరకూ వ్యాపారం జరిగినా, జరక్కపోయినా, కోవిడ్ సమయంలోనూ బాడుగ చెల్లిస్తూ ఉన్నారన్నారు. వీటిలో వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి జయచంద్రారెడ్డికి కూడా ఒక గది ఉందని, ఆయన్ను లక్ష్యంగా చేసుకొని అందరి షాపులు ధ్వంసం చేయడం దారుణమన్నారు. గదుల పక్కనే కార్పొరేషన్ నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్లు, ఉర్దూ పాఠశాల ప్రహరీ వీటికంటే ముందుకు ఉన్నాయని మీడియాకు చూపారు. వ్యాపారులు ట్రేడ్లైసెన్స్, అడ్వర్టైజ్మెంట్ ట్యాక్స్, ఎన్క్రోచ్మెంట్ ట్యాక్స్ చెల్లిస్తున్నప్పటికీ ఆక్రమణల పేరిట తొలగించడం అన్యాయమన్నారు. కడపలో ముడుపులు చెల్లించలేదని వెంచర్లను నిషేధించారని, గతంలో ఏడాదికి 3వేలకు పైగా ప్లాన్ అప్రూవల్స్ అయ్యేవని, కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి ప్రతి దానికి కప్పం కట్టాల్సి రావడం వల్లే ఈ ఏడాది 500 అప్రూవల్స్ కూడా కాలేదన్నారు. నగరపాలక అధికారుల వల్ల నష్టపోయిన వ్యాపారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, వారికి నష్ట పరిహారం ఇప్పించడానికి న్యాయ పోరాటం చేస్తామన్నారు. నాపై ఉన్న కక్షతో ఇతరుల జీవనోపాధి దెబ్బతీయడం దారుణం– జయచంద్రారెడ్డి తనపై కక్ష ఉంటే నా గదులు మాత్రమే తొలగించాలిగానీ, పక్కనున్నవారి షాపులు కూడా తొలగించి వారి జీవనోపాధి దెబ్బతీయడం దారుణమని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి అన్నారు. షాపింగ్ కాంప్లెక్స్ వద్ద 60 అడుగుల రోడ్డు ఉంది, నాగులపుట్ట, విద్యుత్ స్తంభాలు, పబ్లిక్ టాయ్లెట్లు, పాఠశాల ప్రహరీ కంటే లోపలే షాపులు ఉన్నాయన్నారు. ఎమ్మెల్యేపై విమర్శలు చేసే వారి గొంతు నొక్కాలనే ఇలా చేశారన్నారు. సాయంత్రవేళ అంగళ్లన్నీ మూసిన తర్వాత కూల్చివేయడం అన్యాయమన్నారు. సూర్యనారాయణ వల్లే తాను కొంతకాలం పార్టీకి దూరంగా ఉన్నానే తప్పా, వారిలాగా వేరే పార్టీ కండువా కప్పుకోలేదన్నారు. ఆడిటోరియం బయట, నెహ్రూపార్కు బయట ఉన్న షాపుల వద్ద సూర్యనారాయణరావు డబ్బులు వసూలు చేశాడన్నది అక్షర సత్యమన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు పులి సునీల్, యానాదయ్య, శ్రీరంజన్రెడ్డి, బీహెచ్ ఇలియాస్, ఐస్క్రీం రవి, త్యాగరాజు, దేవిరెడ్డి ఆదిత్య, సింధు, దాసరి శివ, షఫీ, రామ్మోహన్రెడ్డి, బసవరాజు, సుబ్బరాయుడు, శివకోటిరెడ్డి, రామలక్ష్మణ్రెడ్డి, కె. బాబు, చెన్నయ్య, రెడ్డి ప్రసాద్, లక్ష్మయ్య పాల్గొన్నారు. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో ఒక్కొక్కరికి రూ.2లక్షల మేర నష్టం వ్యాపారులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుంది రాష్ట్రమంతా ఒక రకమైన పాలన.. కడపలో మరో రకమైన పాలన మేయర్ సురేష్ బాబు మండిపాటు -
పాఠశాలల్లో సమాంతర మీడియం కొనసాగించాలి
మదనపల్లె సిటీ : పిల్లలకు స్వేచ్ఛనిచ్చి ఇష్టం వచ్చిన మీడియంను ఎంచుకునే విధంగా పాఠశాలల్లో తెలుగు మీడియంను ఇంగ్లీషు మీడియంకు సమాంతరంగా పునః ప్రారంభించడం లేదా కొనసాగించడం చేయాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు ఎన్.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక యూటీఎఫ్ కార్యాలయంలో యూనియన్ నాయకులతో సమావేశం నిర్వహించారు. ప్రతి ప్రాథమిక పాఠశాలకు విద్యార్థుల సంఖ్యతో నిమిత్తం లేకుండా ఇద్దరు ఉపాధ్యాయులను కేటాయించాలన్నారు. ఉన్నత పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య 45 దాటితే రెండవ సెక్షన్కు అనుమతించాలన్నారు. ఈనెల 21వతేదీన పాత జిల్లా కేంద్రంలో జరగబోయే డీఈఓ కార్యాలయ ముట్టడి కార్యక్రమాల్లో ఉపాధ్యాయులు పాల్గొని విజయవంతం చేయాలని కోరారు. సమావేశంలో జిల్లా కార్యదర్శులు పురం రమణ, ఆదినారాయణ, నాయకులు విజయకుమార్, సుధాకర్, రవిప్రకాష్, మురళి, అజంతుల్లా తదితరులు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలి
కడప రూరల్ : ఎస్సీ వర్గీకరణ అంశానికి సంబంధించి రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్దాలని ఏపీ ఎమ్మార్పీఎస్ రాష్ట్ర అధ్యక్షుడు పేరుపోగు వెంకటేశ్వరరావు మాదిగ కోరారు. ఆదివారం స్ధానిక వైఎస్సార్ మెమోరియల్ ప్రెస్క్లబ్లో మాదిగ సంఘాలతో రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అసెంబ్లీలో చట్టం చేసేలోపు ఎస్సీ వర్గీకరణకు సంబంధించిన రోస్టర్ పాయింట్ల లోపాలను సరిదిద్ది మాల, మాదిగ వర్గాలకు న్యాయం చేయాలన్నారు. తెలంగాణ ముఖ్యమంతి రేవంత్రెడ్డి వర్గీకరణ అంశానికి సంబంధించి సమన్యాయం చేస్తున్నారని తెలిపారు. అలాగే ఎస్సీ సబ్ ప్లాన్ నిధులలో ఏబీసీడీ వర్గీకరణ చేయాలన్నారు. కార్యక్రమంలో దళిత సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు కొత్తపల్లి ఎల్లయ్య, ఏపీ ఎమ్మార్పీఎస్ తెలుగు రాష్ట్రాల కార్యదర్శి గొడుగునూరు మునెయ్య, తప్పెట హరిబాబు, మాతంగి సుబ్బరాయుడు, తప్పెట శివ, వెంకటసుబ్బయ్య, కొన్నెపల్లె మునెయ్య తదితరులు పాల్గొన్నారు. -
నిరంకుశత్వం, కక్ష సాధింపే కూటమి ప్రభుత్వ లక్ష్యం
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వంలో నిరంకుశత్వం, కక్ష సాధింపే లక్ష్యంగా రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు విమర్శించారు. శనివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి లక్ష్యంగా వారిపై కేసులు పెట్టేందుకు గత ప్రభుత్వం నిర్వహించిన మద్యం పాలసీని సాకుగా చూపుతున్నారన్నారు. రాజకీయ కక్ష సాధింపులో భాగంగా సంబంధం లేని ధనుంజయ్రెడ్డి, కృష్ణమోహరెడ్డి, బాలాజీ, రాజ్కసిరెడ్డిలను అరెస్టు చేసి వారివద్ద బలవంతపు వాంగ్మూలాలు తీసుకొంటున్నారని ఆరోపించారు. సీఐడీని పావుగా వాడుకుంటున్నారని తెలిపారు. కూటమి ప్రభుత్వంలో మద్యాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించి సిండికేట్గా మారి విచ్చల విడిగా బెల్ట్ షాపుల ద్వారా దోచుకొంటున్నారని విమర్శించారు. తమ ప్రభుత్వంలో ప్రభుత్వం ద్వారానే నిర్వహించి ప్రభుత్వానికి ఆదాయం చేకూర్చామన్నారు. ఇవేకాకుండా రాష్ట్రంలో జరుగుతున్న హత్యలు, దాడులు, దౌర్జన్యాలు, విధ్వంసాలు చూస్తే ఆటవిక, అరాచక పాలన నడుస్తోందని అర్థమవుతోందన్నారు. కొత్త పథకాలు ఇవ్వక పోగా ఉన్న పథకాలు ఆపేసి దోపిడీలు, దౌర్జన్యాలకు తెరలేపారని ధ్వజమెత్తారు. వైస్ ఎంపీపీ రామిరెడ్డి ధ్వజారెడ్డి, సీహెచ్ రమేష్, జిల్లా యువజన అధ్యక్షుడు శివారెడ్డి, మందల నాగేంద్ర, తల్లెం భరత్కుమార్రెడ్డి, ప్రతాప్రెడ్డి, బండారుమల్లి, డీవీరమణ, దామర్ల సిద్దయ్య, వెంకటరెడ్డి, ఇర్ఫాన్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల -
రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం
– ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి పెద్దతిప్పసముద్రం : డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ రచించిన భారత రాజ్యాంగాన్ని పక్కన బెట్టిన చంద్రబాబు రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగం అమలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి విమర్శించారు. శనివారం ఆయన మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి ప్రజా సంక్షేమాన్ని గాలికొదిలేసి కక్షపూరిత చర్యలకు పాల్పడుతూ కుయుక్తులు పన్నుతున్నారని మండి పడ్డారు. ఎన్నికల వేళ ఇచ్చిన సూపర్ సిక్స్ హామీలను తుంగలో తొక్కి డైవర్షన్ పాలిటిక్స్కు తెర లేపుతున్నారన్నారు. ఐఏఎస్, ఐపీఎస్లతో పాటు రిటైర్డ్ అధికారుల మీద కూడా కక్ష గట్టి తప్పుడు కేసులు బనాయించడం ఎంత వరకు సమంజసమని ప్రశ్నించారు. వైఎస్సార్సీపీ హయాంలో మద్యం కల్తీ జరుగుతోందని ఆరోపించిన వారే ఇప్పుడు అవే డిస్టలరీల నుంచి మద్యాన్ని ఎలా కొనుగోలు చేస్తారన్నారు. పరిపాలనలో చంద్రబాబు ఘోరంగా విఫలం కావడం వల్లే ప్రజల దృష్టిని మళ్లించేందుకు తప్పుడు రాజకీయాలు చేస్తున్నారని ధ్వజమెత్తారు. కేంద్ర ప్రభుత్వానికి చెందిన ఐటీ ఈడీల దర్యాప్తులో చంద్రబాబు స్కిల్ స్కాంలో అడ్డంగా దొరికి జైలుకు వెళితే ఇదంతా కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి చేయించాడని దృష్టిలో ఉంచుకుని ఇప్పుడు కక్ష పూరిత చర్యలకు పాల్పడటం సమంజసం కాదన్నారు. బాలిక అదృశ్యం పెద్దతిప్పసముద్రం : మండలంలోని పులికల్లుకు చెందిన ఓ మైనర్ బాలిక (16) ఐదు రోజుల క్రితం ఇంటి నుంచి అదృశ్యమైంది. చుట్టు పక్కల గ్రామాలు, బంధువుల ఊళ్లలో గాలించినా ఆచూకీ లభించలేదు. బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమో దు చేసినట్లు ఎస్ఐ హరిహర ప్రసాద్ తెలిపారు. మాటలకే స్వచ్ఛాంధ్ర.. స్వర్ణాంధ్ర – ఎగువ అబ్బవరం కాలనీలో తొలగని మురుగునీరు రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం ఒకవైపు చెత్తరహిత ప్రాంతాలుగా మార్చాలని చెబుతున్నా స్థానిక మున్సిపల్ అధికారులు అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తున్నారన్న విమర్శలు ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటి మున్సిపాలిటీ పరిధిలో ప్రధాన వీధులు మినహా మిగిలిన వీధులలో ఎక్కడికి వెళ్లినా బురదమయమైన రహదారులు ముక్కుపుటాలు అదిరే దుర్గంధం వెదజల్లే చెత్తకుప్పలు కనిపిస్తాయి. శనివారం రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, జిల్లా కలెక్టర్ శ్రీధర్ మున్సిపల్ అధికారులు కలిసి స్వచ్ఛ ఆంధ్ర– స్వర్ణ ఆంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఎగువ అబ్బవరం కాలనీ(33వ వార్డు)లో మున్సిపల్ సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా స్వచ్ఛ ఆంద్ర – స్వర్ణాంధ్ర కార్యక్రమాలు ఎక్కడా కనిపించలేదు. కాలనీలోని రోడ్లు చెత్తా చెదారం, మురికినీటితో నిండిపోయాయని ఆ వార్డు ప్రజలు వాపోతున్నారు. అబ్బవరం కాలనీలో కనీస మౌలిక సదుపాయాలకు నోచుకోలేక పోతున్నామని చెబుతున్నారు. వర్షం వస్తే మురుగునీటి కాలువలు లేక మురుగునీరు రోడ్ల మీదనే ప్రవహిస్తుంది. మలేరియా లాంటి వ్యాధులు ప్రబలి ప్రజలు తీవ్ర అనారోగ్యం బారిన పడుతున్నారని గ్రామస్తులు చెబుతున్నారు. షోకాజ్ నోటీసులు అందుకున్న తహసీల్దార్ లింగాల : లింగాల మండల తహసీల్దార్గా 2022 నుంచి 2024 వరకు పనిచేసిన లక్ష్మీనారాయణ షోకాజ్ నోటీసులు అందుకున్నారు. 20 ఏళ్ల కాల పరిమితితో అసైన్డ్ భూములపై రైతులకు యాజమాన్య హక్కు కల్పిస్తూ చట్ట సవరణ చేసిన విషయం తెలిసిందే. అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంలో 2003 సంవత్సరానికి ముందు ఉన్న భూములను చేయాల్సి ఉంది. అయితే లక్ష్మీనారాయణ 2024–25 సంవత్సర భూములను కూడా ఫ్రీ హోల్డ్ చేశారని విచారణలో తేలింది. మండలంలోని లోపట్నూతల, లింగాల, కామసముద్రం గ్రామాల్లోని 76 ఎకరాల అసైన్డ్ భూములను ఫ్రీ హోల్డ్ చేయడంపై జిల్లా రెవెన్యూ ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు ప్రస్తుత తహసీల్దార్ ఈశ్వరయ్య తెలిపారు. పశువులు మేపుకునేందుకు వెళ్లి.. – పిడుగుపాటుకు వ్యక్తి మృతి చాపాడు : మండల పరిధిలోని పల్లవోలు గ్రామంలో శనివారం సాయంత్రం పిడుగు పడి బాలాయపల్లె సుబ్బ రమణయ్య(40) అనే వ్యక్తి మృతి చెందాడు. గ్రామంలోని దళితవాడకు చెందిన బాలాయపల్లె సుబ్బరమణయ్య అలియాస్ సుబ్రమణ్యం శనివారం సాయంత్రం గేదెలు మేపుకునేందుకు గ్రామ సమీపంలోని స్మశానవాటిక దగ్గర ఉండే పొలాల్లోకి వెళ్లాడు. ఇతనితో పాటు సమీపంలో మరికొంత మంది మహిళలు గేదెలను మేపుకుంటున్నారు. సాయంత్రం 6 గంటల ప్రాంతంలో ఉరుములు, మెరుపులతో కూడిన వర్షం పడింది. ఈ క్రమంలో ఒక్కసారిగా పిడుగు పడటంతో అతను స్పృహ తప్పి పడిపోయాడు. అతను పడిపోయిన స్థలం వద్ద పశువులన్నీ గుంపుగా ఉండటంతో గుర్తించిన సమీపంలోని మహిళలు అతని వద్దకు వెళ్లారు. వెంటనే ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య ఆదిలక్ష్మితో పాటు యుక్త వయస్సుకు వచ్చిన కుమారుడు, కుమార్తె ఉన్నారు. పిడుగు పాటుకు సుబ్బరమణయ్య మృతి చెందటంతో గ్రామంలో విషాదం నెలకొంది. మృతుడి కుటుంబాన్ని ప్రభుత్వమే ఆదుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
ప్రాణం తీసిన పిడుగు
కురబలకోట : MýS$Æý‡-º-ÌS-Mør Ð]l$…yýlÌS… A…VýS-â¶æ$ÏÌZ Ôèæ°-ÐéÆý‡… Æ>{† í³yýl$VýS$ ´ër$ C§ýlªÇ {´ë×êÌS¯]l$ ºÍ-¡çÜ$-MýS$…-¨. D ÑÚë-§ýl-MýSÆý‡ çÜ…çœ$-r-¯]lMýS$ çÜ…º…«-«¨…_ ÝëŠి-£ýl²-MýS$ÌS MýS£ýl¯]l… Ðól$Æý‡MýS$...-Ôèæ-°-ÐéÆý‡… Æ>{† Hyýl$ VýS…rÌS {´ë…™èl…ÌZ MýS$Æý‡-º-ÌS-Mør Ð]l$…yýlÌS…ÌZ° A…VýS-â¶æ$ÏÌZ EÆý‡$-Ð]l¬Ë$ Ððl$Æý‡$-ç³#-ÌS™ø MýS*yìl¯]l Ð]lÆý‡Û… ç³yìl…¨. A…VýSâ¶æ$Ï rÐ]l*-sê Ð]l*Æð‡P-sŒæÌZ K Ð]l$…yîlÌZ Rê§ýlÆŠ‡ Ð]lÎ (41) OÆð‡r-ÆŠ‡V> ç³°-^ól-õÜ-Ðéyýl$. C™èl-°¨ Ð]l$§ýl-¯]lç³ÌñæÏ §ýlVýSYÆý‡ MøâýæÏO»ñæË$ M>ÌS-±. A…VýSâ¶æ$Ï Ð]l*Æð‡P-sŒæÌZ rÐ]l*-sê-ÌS¯]l$ ÌZyýl$ ^ólƇ$$çÜ*¢ §ýlVýSY-Æý‡$¯]l² ^ðlr$t MìS…§ýl E…yýlV> í³yýl$VýS$ ç³yìl…¨. ©…™ø JMýSP-Ýë-ÇV> BĶæ$¯]l MìS…§ýlç³-yìl-´ùĶæ*yýl$. A™èl°² º†-MìS…-^èl-yé°MìS Ý린-MýS$Ë$ ÑÔèæÓ-{ç³-Ķæ$™èl²… ^ólÔ>Æý‡$. BçÜ$ç³-{†MìS BsZÌZ ™èlÆý‡-ÍçÜ$¢…yýlV> ^èl°-´ù-Ķæ*Æý‡$. A§ól çÜÐ]l$-Ķæ$…ÌZ rÐ]l*-sê Ð]l*Æð‡PsŒæMýS$ Ð]l$Æø OÐðlç³# çÜÒ$-ç³…ÌZ° K sîæ ÝëtÌŒæÌZ sîæ ™éVýS-yé-°MìS Ð]l_a¯]l Ð]l$…yýl-ÌS…ÌZ° ™èl$…V>-ÐéÇ-ç³-ÌñæÏMýS$ ^ðl…¨¯]l ¯éĶæ$ç³# {MìSçÙ~ç³µ (60) MýS*yé í³yýl$VýS$ ´ër$MýS$ E¯]l²-r$Ï…yìl MìS…§ýl-ç³yìl ´ùĶæ*yýl$. BĶæ$¯]l MýS*yé °Ñ$ÚëÌS Ð]lÅÐ]l-«¨ÌZ ^èl°´ù-Ķæ*yýl$. C™èl¯]l$ AÑ-Ðéíßæ-™èl$yýl$. JMóS çÜÐ]l$Ķæ$…ÌZ ÐólÆó‡ÓÆý‡$ {´ë…™é-ÌSMýS$ ^ðl…¨¯]l C§ýlªÆý‡$ í³yýl$VýS$-´ër$MýS$ Ð]l$–† ^ðl…§ýlyýl… ¡{Ð]l ÑÚë-§é°² MýSÍ-W…-_…-¨. అంగళ్లులో ఇద్దరి మృతి -
ఆక్రమణల పేరు చెప్పి అరాచకం
కడప కార్పొరేషన్ : కడప శాసనసభ్యురాలు ఆర్. మాధవి ఆదేశాలతో కడప నగరపాలక సంస్థ టౌన్ప్లానింగ్ అధికారులు ఆక్రమణల పేరుతో అరాచకం సృష్టిస్తున్నారు. తనకు వ్యతిరేకంగా ఎవరు మాట్లాడినా వారి ఆస్తులను ధ్వంసం చేయడం లేదా వారి ఆర్థిక మూలలను దెబ్బతీసే పనిలో ఎమ్మెల్యే, వారి అనుచరులు నిత్యం నిమగ్నమవుతున్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తాజాగా మొన్న వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి పి. జయచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ కార్పొరేటర్లు ఎమ్మెల్యేకు, వైఎస్సార్సీపీ నుంచి పార్టీ ఫిరాయించిన కార్పొరేటర్లకు వ్యతిరేకంగా ప్రెస్మీట్ పెట్టి విమర్శించారు. 24వ డివిజన్ కార్పొరేటర్ కె. సూర్యనారాయణ, 2వ డివిజన్ కార్పొరేటర్ సుబ్బారెడ్డిలపై ఆరోపణలు చేశారు. అలా మాట్లాడిన మరుసటి రోజే మద్రాసు రోడ్డులో నగరపాలక సంస్థకు చెందిన వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో ఆక్రమణలున్నాయంటూ టౌన్ప్లానింగ్ అధికారులను ఉసిగొల్పి కూల్చివేశారు. సదరు వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో రెండు గదులను జయచంద్రారెడ్డి లీజుకు తీసుకొని ఉండటం గమనార్హం. షాపింగ్ కాంప్లెక్స్ లీజుకు ఉన్నవారంతా వర్షం పడకుండా, వర్షపునీరు షాపు ముందు నిలబడకుండా, షాపులోకి వచ్చి వెళ్లేందుకు వీలుగా తాత్కాలికంగా రేకులు అమర్చుకొని, ముందువైపు తాపలు, ర్యాంపులు ఏర్పాటు చేసుకున్నారు. అయితే అవన్నీ పర్మినెంట్ స్ట్రక్చర్స్ కాదు. ముఖ్యంగా మున్సిపల్ ఉర్దూ బాలుర హైస్కూల్ ప్రహరీ, మున్సిపల్ స్డేడియం పక్కన నగరపాలక సంస్థ నిర్మించిన పబ్లిక్ టాయ్లెట్లు వీటికంటే ముందుకు ఉన్నా....టౌన్ప్లానింగ్ అధికారులు వాటి జోలికి వెళ్లకపోవడం గమనార్హం. తాత్కాలిక నిర్మాణాలన్నీ విద్యుత్ స్తంభాలకు లోపలే ఉన్నప్పటికీ కూల్చివేయడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వైఎస్సార్ షాపింగ్ కాంప్లెక్స్లో తాత్కాలిక నిర్మాణాల తొలగింపు ఎమ్మెల్యేకు, ఫిరాయింపు కార్పొరేటర్లకు వ్యతిరేకంగా మాట్లాడినందుకు కక్ష సాధింపు -
ఉత్సాహంగా క్యారమ్స్ పోటీలు
కడప ఎడ్యుకేషన్ : కడప నగరంలోని వైఎస్సార్ ఇండోర్ స్టేడియంలో శనివారం క్యారమ్స్ పోటీలు ఉత్సాహంగా జరిగాయి. బాలికల విభాగంలో ప్రశాంతి ప్రథమ, దేవిశ్రీ ద్వితీయ స్థానంలో నిలిచారు. బాలుర విభాగంలో అండర్ 11 పోటీలలో రెమంత్ ప్రథమ, అబ్దుల్ఖాదర్ ద్వితీయ స్థానంలో, అండర్ 14 విభాగంలో రంగనాథ్ ప్రథమ, ద్వారకనాథ్ ద్వితీయ స్థానంలో నిలిచారు. పురుషుల విభాగంలో ఆబిద్ ప్రథమ, జశ్వంత్ ద్వితీయ స్థానంలో విజేతలుగా నిలిచారు. ఈ కార్యక్రమంలో వాలీబాల్ కోచ్ శ్రీనివాసులు, హ్యాండబాల్ కోచ్ మునాఫ్, బాడ్మింటన్ కోచ్లు పాల్గొన్నారు.