breaking news
Annamayya District News
-
అపరిష్కార వేదిక..ఆశలు లేవిక!
● కాళ్లరుగుతున్నా అర్జీదారులకు నిరాశే ● కలెక్టరేట్లో 345 అర్జీల స్వీకరణ ● స్పందించని క్షేత్రస్థాయి అధికారులుమదనపల్లి (కురబలకోట) : వివిధ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ యంత్రాంగాన్ని ఆశ్రయించే ప్రజలకు పీజీఆర్ఎస్ (ప్రజా గ్రీవెన్స్ రీడ్రెస్సల్ సిస్టమ్) చివరి ఆశగా నిలుస్తోంది. అయితే, సోమవారం మదనపల్లి కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్ హాల్ అర్జీదారులతో కిక్కిరిసిపోయింది. స్థానికంగా పనులు కాక, సుదూర ప్రాంతాల నుంచి వ్యయప్రయాసలకోర్చి వచ్చిన బాధితులకు ఇక్కడా నిరాశే ఎదురవుతోంది. ‘తిరిగి తిరిగి కాళ్ల చెప్పులు అరిగిపోతున్నా.. సమస్య మాత్రం ఎక్కడ వేసిన గొంగళి అక్కడే’ అన్నట్లుగా ఉందని అర్జీదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తొలిసారి ఎంతో ఆశతో అర్జీ ఇస్తే, నెలలు గడుస్తున్నా మోక్షం లభించడం లేదని, దీంతో ఈ వ్యవస్థపై భ్రమలు తొలగిపోతున్నాయని వాపోతున్నారు. ఉన్నతాధికారులు కింది స్థాయి సిబ్బందికి ఫైళ్లను పంపుతున్నా.. క్షేత్రస్థాయిలో ఆశించిన ఫలితం కనిపించడం లేదు. కాగా, సోమవారం కలెక్టరేట్ హాల్లో ఇన్చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు బాధితుల నుంచి 345 అర్జీలను స్వీకరించారు. వీటిని నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని కింది స్థాయి అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్లో వెల్లువెత్తిన కొన్ని ప్రధాన సమస్యలు ఇవీ.. ఆధార్ తప్పులతో ‘తల్లికి వందనం’ దూరం కురబలకోట మండలం అంగళ్లు గ్రామం కమతంపల్లికి చెందిన జి.నాగమణి కుమార్తె దివ్యశ్రీ పేరు, వారింటి పక్కన ఉన్న షేక్ జైనుబీ ఖాతాలో తప్పుగా నమోదైంది. ఫలితంగా ‘తల్లికి వందనం’ పథకం డబ్బులు జమ కావడం లేదని నాగమణి పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. బ్యాటరీ వాహనం కోసం వృద్ధుడి నిరీక్షణ ములకలచెరువు మండలం కదరినాథునికోట (గాలేటివారిపల్లి)కు చెందిన దివ్యాంగుడు పూజారి వెంకటప్ప (72) తనకు మూడు చక్రాల బ్యాటరీ వాహనాన్ని మంజూరు చేయాలని ఇన్చార్జి కలెక్టర్ను కోరారు. దీనిపై స్పందించిన కలెక్టర్.. తగు చర్యలు తీసుకోవాలని వికలాంగుల కార్పోరేషన్ అధికారులను ఆదేశించారు. వంద ఎకరాల చెన్నయాని చెరువు ఆక్రమణ వాల్మీకిపురం మండలం మాధవవరంపల్లి గ్రామ పరిధిలోని 100 ఎకరాల ’చెన్నయాని చెరువు’ ఆక్రమణలకు గురవుతోందని ఆయకట్టుదారులు ఫిర్యాదు చేశారు. కొందరు చెరువుకు కంచె వేసి, మట్టి తోలి, పంటలు సాగు చేస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే సర్వే నిర్వహించి ఆక్రమణలు తొలగించాలని ఇన్చార్జి కలెక్టర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. కోరినా రాని సర్వేయర్ కురబలకోట మండలం తట్టివారిపల్లికి చెందిన వి.ఉత్తన్న తన వివాదాస్పద భూమిని సర్వే చేయాలని పలుమార్లు కోరినా సర్వేయర్ రావడం లేదని ఫిర్యాదు చేశారు. రికార్డుల ప్రకారం భూమిని కొలిచి సరిహద్దులు నిర్ణయించాలని కోరారు. ఉత్తర్వులు వచ్చినా అందని సీఎంఆర్ఎఫ్ తంబళ్లపల్లి మండలం గోపిదిన్నె గ్రామం కొత్తపల్లికి చెందిన దివ్యాంగుడు చిన్న కుళ్ళాయప్ప 2019లో రోడ్డు ప్రమాదానికి గురయ్యారు. వైద్య చికిత్సల కోసం సీఎంఆర్ఎఫ్ (ముఖ్యమంత్రి సహాయ నిధి) కింద రూ.2 లక్షలు మంజూరైనట్లు ఉత్తర్వులు వచ్చినా.. ఆరేళ్లుగా నేటికీ ఆ సొమ్ము అందలేదు. విజయవాడ కార్యాలయానికి వెళ్లగా ఉత్తర్వులలో తేదీ మార్చుకుని వస్తేనే తిరిగి మంజూరు చేస్తామని అధికారులు చెప్పడంతో, ఆ తేదీని మార్చి ఇవ్వాలని ఆయన ఇన్చార్జి జిల్లా కలెక్టర్ను కోరారు. నా భూమిలో దారి వేయడానికి చూస్తున్నారు లక్కిరెడ్డిపల్లి మండలం అనంతపురం గ్రామం చౌటపల్లికి చెందిన ఎన్.రామకృష్ణారెడ్డి పీజీఆర్ఎస్లో అభ్యర్థిస్తూ.. తనకు ఉన్న అరకొర పొలంలో కొందరు దారి వేయడానికి ప్రయత్నిస్తున్నారని, ఆ చర్యను అడ్డుకోవాలని కోరారు. ఇప్పటికే పొలానికి దారి ఉన్నప్పటికీ, కేవలం రాజకీయ కారణాలతోనే కొందరు తన భూమిపై కన్నేసి మరో దారి కోసం ప్రయత్నిస్తున్నారని వాపోయారు. జూదరుల కొమ్ముకాస్తున్న హోంగార్డులు గుర్రంకొండ పోలీస్ స్టేషన్ హోంగార్డులు రాఘవ, చంద్రశేఖర్ జూదరులు, కోడిపందాల నిర్వాహకుల వద్ద మామూళ్లు వసూలు చేస్తూ వారికి కొమ్ముకాస్తున్నారని కురబలకోట మండలం మట్లివారిపల్లికి చెందిన కిడ్నీ బాధితుడు ఇ.రెడ్డెప్పనాయుడు ఫిర్యాదు చేశారు. వ్యవసాయం చేసుకునే తన పొలం వద్దకు జూదరులు పేకాట ఆడటానికి వచ్చేవారని, ఆ నెపంతో హోంగార్డులు తన వద్ద నుంచి రూ.30 వేలు తీసుకుని ఇవ్వడం లేదని, పైగా తప్పుడు కేసులో ఇరికిస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. దీనిపై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని ఇన్చార్జి కలెక్టర్ పోలీసు అధికారులను ఆదేశించారు. -
‘స్క్రబ్ఎక్స్’.. అంతా బోగస్!
మదనపల్లె టౌన్ : ఇంట్లో కూర్చునే సులభంగా డబ్బు సంపాదించవచ్చంటూ స్క్రబ్ఎక్స్ పేరుతో నమ్మించి, వేలాది మంది కస్టమర్ల నుంచి కోట్ల రూపాయలు వసూలు చేసిన బోగస్ కంపెనీ బోర్డు తిప్పేసింది. పెట్టుబడిదారులకు ఆశ చూపిన విధంగా నగదు చెల్లించకుండా కార్యాలయానికి తాళం వేసి నిర్వాహకులు పరారయ్యారు. నెల్లూరుకు చెందిన తిరుమల కోదండ రమేష్ సీఈవోగా ఉన్న ఈ కంపెనీ, ఇన్స్ట్రాగామ్ రీల్స్ ద్వారా భారీ ఎత్తున ప్రచారం సాగించింది. రూ.1 లక్ష పెట్టుబడి పెడితే నెలకు ఏకంగా రూ.24 వేలు ఇస్తామని నమ్మబలికింది. అలాగే రూ.80 వేలు కడితే 15 రోజులకు రూ.6 వేలు, రూ.1.30 లక్షలు కడితే రూ.12 వేలు ఇస్తామని నమ్మించి, గృహిణులను ప్రధానంగా టార్గెట్ చేసి కోట్ల రూపాయలు వసూలు చేసింది. ఒప్పందం ప్రకారం నెలకు రావాల్సిన రూ.24 వేలు రాకపోవడంతో బాధితులకు అనుమానం వచ్చింది. దీంతో తిరుపతి, పలమనేరు, మదనపల్లె, బి.కొత్తకోట, ములకలచెరువు ప్రాంతాల నుంచి బాధితులు మదనపల్లెలోని కంపెనీ ఆఫీస్ వద్దకు క్యూకట్టారు. ఒక్క తిరుపతి నుంచే 100 మందికి పైగా బాధితులు ఉన్నట్లు తెలుస్తుండగా, జిల్లా వ్యాప్తంగా ఈ సంఖ్య మరింత పెరిగే అవకాశం ఉంది. మోసపోయినట్లు గ్రహించిన బాధితులు పలమనేరుకు చెందిన ఓంకార్, ములకలచెరువుకు చెందిన రఫీ, హిదయతుల్లా, మదనపల్లెకు చెందిన హరి, గౌసియా, అరుణ, శంకరమ్మ, తులసి, తిరుపతికి చెందిన గణేష్, సుధారాణి, ప్రియాంక, బి.కొత్తకోటకు చెందిన మంజుల, తులసి తదితరులు మదనపల్లె టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల నుంచి ఫిర్యాదు స్వీకరించిన ఎస్ఐ నాగేశ్వరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. ఈ కంపెనీ చేతిలో మోసపోయిన బాధితులు ఎవరైనా ఉంటే వెంటనే తగిన ఆధారాలతో టూ టౌన్ పోలీసులను సంప్రదించాలని ఎస్ఐ సూచించారు. లక్ష పెట్టుబడికి నెలకు రూ.24 వేల ఆశ చూపిన నిర్వాహకులు ఇన్స్టా రీల్స్తో గృహిణులను బురిడీ కొట్టించి కోట్ల రూపాయల లూటీ కార్యాలయానికి తాళం వేసి సీఈవో పరార్ -
● డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణకు వైఎస్సార్సీపీ డిమాండ్ ● జిల్లావ్యాప్తంగా హోరెత్తిన యువత నిరసన ర్యాలీలు ● ఫీజు రీయింబర్స్మెంట్, వసతి దీవెన బకాయిలు విడుదల చేయాలని గర్జన ● విద్యాశాఖ మంత్రి రాజీనామాకు డిమాండ్
రాయచోటిలో వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో భారీ ర్యాలీ సాక్షి, అన్నమయ్య: దగా డీఎస్సీపై ప్రజా పోరు నింగినంటింది. పోలీసులను అడ్డు పెట్టి వైఎస్సార్సీపీ చేపట్టిన నిరసన ర్యాలీని కట్టడి చేయాలని చూసి కూటమి ప్రభుత్వ ప్రయత్నం విఫలమైంది. ఖాకీల ఆంక్షల సంకెళ్లు యువత, వైఎస్సార్సీపీ శ్రేణుల ర్యాలీల ముందు నిలవలేకపోయాయి. పట్టణ.. పురవీధులన్నీ వైఎస్సార్సీపీ శ్రేణులతో పోటెత్తాయి. డీఎస్సీలో అక్రమాలు వెలికితీయాలని చిత్తశుద్ధితో కొనసాగిస్తున్న ఉద్యమాన్ని వైఎస్సార్ సీపీ శ్రేణులు విజయవంతంగా నిర్వహించాయి. పులివెందులలో లాఠీఛార్జి చేసినా ర్యాలీ ముందుకు సాగించారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా పోలీసులు కట్టడి చేసిన కార్యకర్తలు ఇసుమంత కూడా వెనక్కి తగ్గలేదు. పైగా మరింత దూకుడుగా నిరశన కొనసాగించారు. ● జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ సోమవారం చేపట్టిన నిరసన ర్యాలీ విజయవంతమైంది. డీఎస్సీలో అక్రమాలు చోటుచేసుకున్నాయని, నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లి అయినవారికి కట్టబెట్టారనే ఆరోపణలకు భారీ ఎత్తున ప్రజా మద్దతు లభించింది. అక్రమాలకు తెరలేపిన మంత్రి నారాలోకేష్ రాజీనామా చేయాలనే డిమాండ్ను వైఎస్సార్సీపీ శ్రేణులు ముక్తకంఠంతో నినదించాయి. సాక్షి అన్నమయ్య : రాష్ట్రంలో డీఎస్సీకి సంబంధించిన జరిగిన పరీక్షల్లో అవకతవకలపై సీబీఐ విచారణ చేపట్టాలని, మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ వైస్సార్ సీపీ శ్రేణులు, నిరసన కారులు రోడ్డెక్కారు. అంతేకాకుండా విద్యార్థులకు రావాల్సిన ఫీజు రీఎంబర్స్మెంట్ బకాయిలు, నిరుద్యోగ భృతి, వసతి దీవెన నిధులు విడుదల చేయాలని వైఎస్సార్ సీపీ శ్రేణులు గర్జించాయి. ఎక్కడికక్కడ కొన్నిరోజులుగా రిలే దీక్షలతోపాటు ఆందోళనలతో కదం తొక్కుతున్నారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ అధ్యక్షులు వైఎస్జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ శ్రేణులు, నేతలు, కార్యకర్తలు కూటమి ప్రభుత్వం చేసిన అవకతవకలపై ప్రత్యేక విచారణ కోరుతూ ఉద్యమబాట పట్టారు. అందులో భాగంగా సోమవారం నిరసన ర్యాలీలతో హోరెత్తించారు. అడుగడుగునా పోలీసులు ఆంక్షలు పెట్టినా వెనుకడుగు లేకుండా అడుగులుముందుకేస్తూ ర్యాలీలను విజయవంతం చేశారు. అన్నమయ్య జిల్లాలోనిఅన్ని నియోజకవర్గాల్లో పెద్ద ఎత్తున సాగిన ఉద్యమ హోరు అన్ని వర్గాల నుంచి సంపూర్ణ మద్దతు లభించింది. పీలేరులో చింతల....మదనపల్లెలో నిసార్... పీలేరు నియోజకవర్గంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ చేపట్టిన ర్యాలీ కార్యక్రమానికి విశేష స్పందన లభించింది. ప్రత్యేకంగా నియోజకర్గంలోని కేవీ పల్లెలో భారీ ర్యాలీ నిర్వహించారు. మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు కదం తొక్కాయి. జెండాలు చేతబూని నినాదాలతో హోరెత్తించాయి. పెద్ద ఎత్తున యువత, నిరుద్యోగులు కూడా సంఘీభావం వ్యక్తం చేశారు. అలాగే అన్నమయ్య జిల్లా కేంద్రమైన మదనపల్లెలో నిరసన ర్యాలీ ఉవ్వెత్తిన ఎగిసిపడింది. మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, నిరుద్యోగులు గర్జించారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా చేస్తున్న నినాదాలతో మదనపల్లె పట్టణం హోరెత్తింది. ర్యాలీ టీటీడీ కల్యాణ మండపం నుంచి అంబేడ్కర్ విగ్రహం వరకు ర్యాలీ కొనసాగింది. ప్రధాన రోడ్లపై సాగిన ర్యాలీకి అపూర్వ ఆదరణ లభించింది గర్జించిన పుంగనూరు జిల్లాలోని పుంగనూరులో వైఎస్సార్సీపీ నేతలు,కార్యకర్తలు, శ్రేణులతో నిరసన హోరెత్తింది. పార్టీ ఇచ్చిన పిలుపు మేరకు కదిలిన శ్రేణులు కదం తొక్కుతూ అడుగులు వేశారు. ఎక్కడ చూసినా జనమే జనం కనిపించారు. బస్టాండులోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి ప్రారంభమై ర్యాలీ అంబేడ్కర్ సర్కిల్ వరకు కొనసాగింది. పార్టీకి సంబంధించి ప్రధాన నాయకులతోపాటు కార్యకర్తలు, శ్రేణులు నిరసన ర్యాలీలో కొనసాగారు. తంబళ్లపల్లెలోనూ నిరసన హోరు నియోజకవర్గ కేంద్రమైన తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీ ర్యాలీ విజయవంతంగా కొనసాగింది. పట్టణంలోని వైఎస్సార్సర్కిల్ నుంచి రాగిమానుసర్కిల్ వరకు ర్యాలీ చేపట్టారు. డీఎస్సీ అక్రమాలపై పార్టీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేస్తూ కూటమి ప్రభుత్వానికి వ్యతిరేకంగా ర్యాలీలో నినాదాలు చేశారు. అన్నిమండలాల నుంచి పార్టీ నేతలు, కార్యకర్తలు తరలివచ్చి విజయంతం చేశారు. అందరూ సమిష్టిగా ముందుకు వచ్చి కార్యక్రమం నిర్వహించడం విశేషం. పోలీసుల ఆంక్షలపై.. జిల్లాలోని రాయచోటిలో ర్యాలీకి పోలీసులు ఆంక్షలు పెట్టడంపై శ్రేణులు రగిలిపోయారు. అతి తక్కువ మందితో ర్యాలీ నిర్వహించుకోవాలంటూ పోలీసులు ఇచ్చిన ఆదేశాలతో వైఎస్సార్సీపీ నేత లు, కార్యకర్తలు ఆగ్రహం వ్యక్తం చేశారు. మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని డిమాండ్ చేయడంతోపాటు డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ నిర్వహించాలని కోరారు. -
మహిళపై పొట్టేలు దాడి
నిమ్మనపల్లి (మదనపల్లె టౌన్) : గొర్రెల మందలోని ఓ పొట్టేలు దాడి చేయడంతో మహిళ తీవ్రంగా గాయపడిన ఘటన సోమవారం ఉదయం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. నిమ్మనపల్లె మండలం, చలిమామిడికి చెందిన రాజన్న గొర్రెలు మేపుకుని జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో ఆయన భార్య ఎల్లమ్మ (45) చెత్త ఊడ్చేందుకు గొర్రెల మంద వద్దకు వెళ్లింది. ఈ సమయంలో అక్కడ ఉన్న ఓ పొట్టేలు ఒక్కసారిగా ఆమైపె దాడి చేసింది. ఈ దాడిలో ఎల్లమ్మ తుంటి ఎముక విరిగి తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు 108 అంబులెనన్స్లో బాధితురాలిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు ఎల్లమ్మకు ప్రథమ చికిత్సలు అందించి, మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. -
నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
పీలేరురూరల్ : పీలేరు పోలీస్ సర్కిల్ కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ డాక్టర్ కోయా ప్రవీణ్ సోమవారం తనిఖీ చేశారు. రికార్డులను పరిశీలించారు. పెండింగ్ కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ సర్కిల్ పరిధిలో నేరాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. చోరీల పట్ల ప్రత్యేక దృష్టి సారించి రాత్రి సమయంలో పోలీస్ గస్తీ పెంచాలన్నారు. త్వరలో పీలేరులో జరుగనున్న వినాయక చవితి ఉత్సవాలు ప్రశాంతంగా జరిగేటట్లు ముందస్తు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, రాయచోటీ డీఎస్పీ ఎం.ఆర్. కృష్ణమోహన్. ఇన్చార్జి సీఐ లక్ష్మన్, ఎస్బీ సీఐ సదాశివయ్య, ఎస్ఐలు లోకేష్, రహీమ్ తదితరులు పాల్గొన్నారు. ఒడిశా యువతి ఆత్మహత్య చౌడేపల్లె : కూలీ పనుల కోసం ఒడిశా రాష్ట్రం నుంచి వచ్చిన చాందిని చుర (19) అనే యువతి ఫ్యాన్కు ఉరివేసుకుని సోమవారం రాత్రి ఆత్మహత్యకు పాల్పడింది. స్థానికుల కథనం మేరకు.. ఒడిశా రాష్ట్రం నిమ్మర్లు జిల్లాకు చెందిన విజయ్ కుమార్తె చాందిని చుర.. తన అక్క ఊర్వశి చుర, బావ రంజిత్లతో కలిసి చౌడేపల్లె మండలం లద్దిగం జోగిండ్లు వద్ద గల ఓ ప్రైవేట్ ఇటుకల బట్టీలో కూలీ పనుల కోసం వచ్చింది. ఏం జరిగిందో ఏమో కానీ, సోమవారం రాత్రి బట్టీ వద్ద తాము ఉంటున్న ఇంట్లోనే చాందిని ఫ్యాన్కు ఉరివేసుకుని ప్రాణాలు విడిచింది. సమాచారం అందుకున్న ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకుని విచారణ చేపట్టారు. సదరు యువతి అనారోగ్య కారణాల రీత్యా మృతి చెందిందని, గతంలో కూడా రెండు సార్లు ఆత్మహత్యకు యత్నించిందని కుటుంబ సభ్యులు తెలిపినట్లు ఎస్ఐ పేర్కొన్నారు. పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వివరించారు. -
నష్టాలు భరించ లేక మామిడి చెట్లు తొలగింపు
రొంపిచెర్ల : ప్రతి సంవత్సరం నష్టాలు తప్ప లాభాలు చూడలేక ఓ రైతు ఐదు ఎకరాల పొలంలో మామిడి చెట్లును తొలగించిన సంఘటన రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ కుమ్మరపల్లెలో చోటు చేసుకుంది. రైతు కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. కుమ్మరపల్లెకు చెందిన రైతు నాగరాజ 15 సంవత్సరాల క్రితం ఐదు ఎకరాల పొలంలో 350 తోతాపురి రకం మామిడి చెట్లు నాటారు. ప్రతి సంవత్సరం 20 టన్నుల మామిడి కాయల దిగుబడి వస్తుంది. అయితే మార్కెట్లో గిట్టుబాటు ధరలు లేక పోవడంతో చేసేదేమి లేక చెట్లను తొలగించాల్సి వచ్చిందన్నారు. ఈ ఏడాది టన్ను రూ.3000 ధర పలికిందన్నారు. గత ఏడాది మామిడి పంట కోసం కొట్టిన మందుల ఖర్చు కూడా రాలేదు. అందుకే బిడ్డలాంటి మామిడి చెట్లను నరికి వేశానని విలపించారు. రెండు సంవత్సరాలుగా ధరలు పూర్తిగా తగ్గి పోయ్యాయిని తెలిపారు. మామిడి చెట్లు తొలగించిన పొలంలో ఇతర వ్యవసాయ పంటలను పండించాలని నిర్ణయం తీసుకున్నట్లు రైతు నాగరాజ తెలిపారు. -
ప్రజలకు మరింత చేరువ కావాలి: డీఐజీ
మదనపల్లి టౌన్: ప్రజలకు పోలీసు సేవలు మరింత చేరువ కావాలని కర్నూలు రేంజి డీఐజీ డాక్టర్ కోయ ప్రవీణ్ ఆదేశించారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి సోమవారం ఆయన పీలేరు, మదనపల్లి పోలీస్ స్టేషన్లను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా డీఐజీ మాట్లాడుతూ.. స్టేషన్కు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, పెండింగ్ కేసులను త్వరగా పరిష్కరించాలని అధికారులకు సూచించారు. సైబర్ నేరాలు, మహిళా భద్రతపై ప్రజల్లో విస్తృతంగా అవగాహన కల్పించాలన్నారు. సాంకేతికతను వాడుకుంటూ దర్యాప్తు వేగవంతం చేయాలని దిశానిర్దేశం చేశారు. అంతకుముందు ఎస్పీ పీలేరు స్టేషన్ ఆవరణలోని ఖాళీ స్థలాన్ని పరిశీలించి సూచనలు చేశారు. ఈ తనిఖీల్లో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సీఐలు, ఎస్ఐలు పాల్గొన్నారు. ఈ – క్రాప్ బుకింగ్ చేసుకోండి ములకలచెరువు: ఎల్నినో ప్రభావంతో పంటలు నష్టపోతున్న రైతులు ఈ – క్రాప్ బుకింగ్ చేసుకోవాలని గుంటూరు వ్యవసాయశాఖ కమిషనరేట్ డెప్యూటీ డైరెక్టర్ పోలప్ప అన్నారు. సోమవారం ఆయన మండలంలోని వేపూరికోటలో ఈ – క్రాప్ బుకింగ్, పంటల పరిస్థితిని పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ... ఎల్నినో ప్రభావం నివారించడానికి కార్యచరణ ప్రణాళిక సిద్దం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా పంటలు పండించిన రైతులు ప్రధానమంత్రి ఫసల్బీమా యోజన పథకం ద్వారా బీమా చేసుకోవాలన్నారు. ఈ సమయంలో కంది, ఉలవలు విత్తుకోవచ్చని రైతులకు సూచించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి ఏడీఏ నవీన్కుమార్, ఏఓ స్రవంతి తదితరులు పాల్గొన్నారు. హజ్ యాత్రికులకు కడపలోనే ఇమిగ్రేషన్ ఏర్పాటు చేయాలి కడప సెవెన్రోడ్స్ : కడప విమానాశ్రయం అన్ని రకాలుగా అభివృద్ధి చెంది అన్ని వసతులు కలిగిన నేపథ్యంలో పవిత్ర హజ్ యాత్రకు వెళ్లే వారికి ఇమిగ్రేషన్తోపాటు కడప నుంచి నేరు గా విమానం ద్వారా జిద్దాకు చేరుకునేలా చూ డాలని ఏపీ ఉలేమా అయిమ్మ కమిటీ ప్రతినిధులు కోరారు. ఈ మేరకు సోమవారం వారు కలెక్టరేట్లో జరిగిన పీజీఆర్ఎస్లో డీఆర్వో మల్లికార్జునుడికి వినతిపత్రం అందజేశారు. వైఎస్సార్ కడప జిల్లా రాయలసీమ మధ్యలో ఉన్నందున జిల్లాతోపాటు అన్నమయ్య, అనంతపురం, హిందూపురం, కర్నూలు, నెల్లూరు జిల్లాలకు చెందిన హాజీలకు ఉపయోగకరంగా ఉంటుందన్నారు. దీనివల్ల రాయలసీమ హాజీలకు వ్యయ ప్రయాసలు తగ్గుతాయని అందులో పేర్కొన్నారు. అలాగే కడపలో ఉన్న హజ్ హౌస్ను వాడుక లోకి తీసుకురావాలని, ఇతర జిల్లాల నుంచి వచ్చే హాజీలను భవనంలో వసతి ఏర్పాటు చేయాలన్నారు. ఈ కార్యక్రమంలో మౌల్వీలు మహమ్మద్ అలీ బద్దాదీ సాహెబ్, వలీవుల్లా హుస్సేనీ సాహెబ్, న్యామతుల్లా సాహెబ్, అబ్దుల్ రెహమాన్ సాహెబ్, షకృద్దీన్ సాహెబ్, ఖలీలుల్లా సాహెబ్, వాహిద్ అలీ సాహెబ్, టీడీపీ నాయకుల అమీర్ బాబు, డీసీసీ మాజీ అధ్యక్షులు నజీర్ అహ్మద్, సంఘ సేవకులు సలావుద్దీన్ పాల్గొన్నారు. కేజీబీవీ ప్రొవిజినల్మెరిట్ జాబితా విడుదల కడప ఎడ్యుకేషన్:జిల్లాలోని కేజీబీవీ ఉపాధ్యాయ పోస్టుల భర్తీకి సంబంధించి జిల్లావ్యాప్త ప్రొవిజినల్ మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు సమగ్రశిక్ష అడిషనల్ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ అనురాధ తెలిపారు. మెరిట్ జాబితా, ఖాళీలు, రోస్టర్ మరియు సర్టిఫికేట్ వెరిఫికేషన్ షెడ్యూల్ వివరాలను htt p://kadapadoe.i n వెబ్సైట్లో అందుబాటులో ఉంచామన్నారు.అభ్యర్థులు తమ వివరాలను పరిశీలించుకుని, ఏవైనా అభ్యంతరాలు ఉంటే తగిన ఆధారాలతో ఈ నెల 12వ తేదీ లోపల httpr://kfbvrecruitment.apcfrr.inలో ఫిర్యాదు నమోదు చేయాలని సూచించారు. ధ్రువపత్రాల పరిశీలనకు ఎంపికై న అభ్యర్థులు ఈ నెల 13వ తేదీన కడప శంకరాపురంలోని ‘స్కౌట్ హాల్’ నందు అసలు సర్టిఫికేట్లతో హాజరుకావాలని ఆమె కోరారు. -
‘జైలుభరో’ విజయవంతం
రాయచోటి : సంయుక్త కిసాన్ మోర్చా పిలుపు మేరకు కార్మిక, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో సోమవారం రాయచోటిలో చేపట్టిన ‘జైలుభరో’ నిరసన కార్యక్రమం విజయవంతమైంది. ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బి.వి.రమణ అధ్యక్షతన తహసీల్దార్ కార్యాలయం నుంచి పోలీస్ స్టేషన్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం.సుధీర్ కుమార్, అధ్యక్షులు సిద్దిగాళ్ల శ్రీనివాసులు, కేవీపీఎస్ జిల్లా కో–కన్వీనర్ డి.సి.వెంకటయ్య మాట్లాడుతూ.. ప్రభుత్వాల ప్రజావ్యతిరేక విధానాల వల్ల రైతులు, కార్మికులు తీవ్రంగా నష్టపోతున్నారని మండిపడ్డారు. సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం కార్మికులకు కనీస వేతనం రూ.26 వేలు అమలు చేయాలని, వ్యవసాయ కూలీలకు ఉపాధి కల్పించాలని, రైతాంగ సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో వివిధ సంఘాల నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. -
● మీ చేయూతే ఆ కుటుంబానికి ఆశాకిరణం
కళ్లముందే కుటుంబ పెద్ద కనుమూసే దుస్థితిని చూస్తూ ఆ కుటుంబ సభ్యులు రోదిస్తున్న తీరు కలచివేస్తోంది. సమాజంలోని దాతలు, సేవా సంస్థలు, మానవతావాదులు స్పందించి యోగేశ్వర్ రెడ్డి చికిత్సకు ఆర్థిక సహాయం అందించాలని కుటుంబ సభ్యులు కన్నీటి పర్యంతమవుతూ విజ్ఞప్తి చేస్తున్నారు. మీరు అందించే సాయం రూ.100 అయినాం రూ.500 అయినాం రూ.1,000 అయినాం మీకు సాధ్యమైనంత సహాయం చేయండి. చిన్న సహాయం కూడా, అనేక మంది కలిసి అందిస్తే ఒక ప్రాణాన్ని కాపాడటానికి పెద్ద బలంగా మారుతుంది. ఒక్క సహాయంం ఒక కుటుంబానికి ఆశను ఇవ్వగలదు. మనందరి చేయూతం ఆ తండ్రిని తన కుటుంబం చెంతకు చేర్చగల అవకాశం కావచ్చు. మనసున్న దాతలు తమకు తోచిన ఆర్థిక సహాయాన్ని నేరుగా ఆ కుటుంబానికి అందించి కనిపించని దేవుడికి ప్రతిరూపాలుగా నిలువవచ్చు. సహాయం చేయాలనుకునే వారు 9494852304 నంబర్కు ఫోన్పే లేదా గూగుల్పే ద్వారా నగదు పంపవచ్చు. లేదా స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, మాండూరు శాఖకు చెందిన అకౌంట్ నంబర్: 30754629889, ఐఎఫ్ఎస్సీ కోడ్: SBIN0010187 ద్వారా కూడా నేరుగా వారి బ్యాంక్ ఖాతాకు డబ్బులు బదిలీ చేసి యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలను కాపాడవచ్చు. -
● కుటుంబ పెద్దను కాపాడుకునేందుకు భూమినీ అమ్మేసినా లభించని ఊరట ● అప్పుల ఊబిలో నిరుపేద కుటుంబం : దాతల కోసం ఎదురుచూపు ● బెంగళూరులో చిన్న ఉద్యోగం చేస్తున్న యోగేశ్వర్ రెడ్డిని కాటేసిన అనారోగ్యం ● పడిపోతున్న తెల్ల రక్తకణాలతో ఆసుపత్రిలో మృత్యుపోరాటం ● ఇప్పటికే
మదనపల్లి టౌన్: రెక్కాడితే గాని డొక్కాడని ఆ నిరుపేద కుటుంబంలో అనూహ్యంగా సంభవించిన అనారోగ్యం కోలుకోలేని దెబ్బ తీసింది. ఉన్నంతలో సాధారణ జీవితం గడుపుతూ, రేపటి భవిష్యత్తు కోసం ఎన్నో కలలు కంటున్న ఆ పేద గూటిలో ప్రస్తుతం గుండెల్ని పిండేసే విషాదం అలుముకుంది. శ్రీ సత్యసాయి జిల్లా తలుపుల మండలం, వేపుమానుపేట గ్రామం, కొత్తపూల వాండ్లపల్లికి చెందిన యోగేశ్వర్ రెడ్డి తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రిలో మృత్యువుతో పోరాడుతుండటంతో ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడింది. ఆయన శరీరంలో తెల్ల రక్త కణాలు ఊహించని విధంగా, అత్యంత వేగంగా పడిపోతుండటంతో ప్రాణాలు గాల్లో దీపంగా మారాయి. ప్రస్తుతం కార్పొరేట్ ఆసుపత్రిలో వెంటిలేటర్పై ఆయనకు అత్యవసర వైద్య చికిత్స అందిస్తున్నారు. చిన్న ఉద్యోగం.. అంతలోనే ఆర్థిక సంక్షోభం యోగేశ్వర్ రెడ్డి బెంగళూరులో ఒక చిన్న ఉద్యోగం చేస్తూ తన కుటుంబాన్ని ఎంతో బాధ్యతాయుతంగా, కంటికి రెప్పలా పోషించేవారు. కుటుంబానికి ఏకై క జీవనాధారమైన వ్యక్తి ఇలా ఆసుపత్రి పాలుకావడంతో ఆ ఇల్లు తీవ్రమైన ఆర్థిక సంక్షోభంలోకి వెళ్ళిపోయింది. దిక్కుతోచని స్థితిలో ఉన్న భార్య, బంధువులు, మిత్రులు ఆస్పత్రి ఖర్చులు భరించలేక కన్నీరుమున్నీరవుతున్నారు. యోగేశ్వర్ రెడ్డి ప్రాణాలు నిలవాలంటే సుమారు రూ.50 లక్షలకు పైగా భారీ వ్యయంతో కూడిన అత్యవసర చికిత్స అవసరమని వైద్యులు తేల్చి చెప్పారు.ఉన్న భూమిని అమ్మేసినా దక్కని ప్రాణభిక్ష..భర్తను కాపాడుకునేందుకు ఆ ఇల్లాలు తన శక్తిమేరకు సర్వస్వం ఖర్చు పెట్టింది. తమకున్న ఒకే ఒక్క జీవనాధారమైన వ్యవసాయ భూమిని సైతం కన్నీటితో విక్రయించి, ఇప్పటివరకు రూ.25 లక్షలను వైద్య ఖర్చుల కోసం వినియోగించింది. ఉన్న ఆస్తిని అమ్ముకున్నా భర్తను ఇంకా ఇంటికి తెచ్చుకోలేకపోయామే అని ఆ భార్య పడుతున్న వేదన వర్ణనాతీతం. ఇప్పటికే సగం ఖర్చు భరించిన ఆ నిరుపేద కుటుంబం ఇప్పుడు రూపాయి కూడా పుట్టని దయనీయ స్థితిలో పడింది. ప్రస్తుతం ఆసుపత్రిలో చికిత్సను ఇలాగే కొనసాగించాలన్నా, ఆయనకు పూర్తిస్థాయి ప్రాణభిక్ష దక్కాలన్నా తక్షణమే అదనంగా మరో రూ.25 లక్షల ఆర్థిక సహాయం అత్యవసరంగా అవసరమవుతోంది. తండ్రి ప్రేమకు నోచుకోని పసిగుడ్డు ఆ పసిగుడ్డుకు ఇంకా ప్రపంచం అంటే ఏంటో కూడా తెలియదు. కేవలం 45 రోజుల వయసు మాత్రమే ఉన్న ఆ పసిబిడ్డ, తండ్రి ఒడిలో తలవాల్చి హాయిగా నిద్రించాల్సిన అపురూపమైన సమయం అది. కానీ, విధి ఆ చిన్నారిపై కనికరం చూపలేదు. పుట్టిన నలభై ఐదు రోజులకే.. కన్నతండ్రి ప్రాణాలతో కొట్టుమిట్టాడాల్సిన దయనీయ స్థితి ఎదురైంది. -
కేజీబీవీ టీచింగ్ పోస్టులకు సర్టిఫికెట్ల పరిశీలన
మదనపల్లె సిటీ : జిల్లాలోని కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న టీచింగ్ పోస్టులకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థుల ద్రువీకరణ పత్రాల పరిశీలన నిర్వహించినట్లు సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ డాక్టర నున్నా అనూరాధ తెలిపారు. సోమవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో కేజీబీవీల్లో ఖాళీగా ఉన్న 20 టీచింగ్ పోస్టుల భర్తీకి జూన్ నెలలో ఆన్లైన్ ద్వారా దరఖాస్తులు స్వీకరించినట్లు తెలిపారు. ఆన్లైన్లో నమోదు చేసిన మార్కుల అధారంగా పోస్టుల వారీగా మెరిట్ జాబితాను విడుదల చేసినట్లు తెలిపారు. పీఈటీ, సీఆర్టీ, పీజీటీ పోస్టులకు వేర్వేరు కౌంటర్లను ఏర్పాటు చేసి ద్రువపత్రాలను ఉపాధ్యాయులతో కూడిన ప్రత్యేక బృందాలతో పరిశీలన చేసినట్లు తెలిపారు. ధ్రువపత్రాల తుది పరిశీలన అనంతరం నోటిఫికేషన్లో పేర్కొన్న కేటగిరీల్లో మెరిట్లో మొదటి స్థానంలో నిలిచిన అభ్యర్థులకు నేరుగా నియామక పత్రాలు అందజేయనున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో జీసీడీవో సుమతి, అసిస్టెంట్ జీసీడీవో యశోద, సీఎంఓ కరుణాకర్, ప్రదానోపాధ్యాయులు శ్రీనివాసులు, రెడ్డప్పరెడ్డి, మోహన్, చంద్రకళ, లలతితమ్మ, ఆఫీసు అసిస్టెంట్ రెడ్డిశేఖర్ పాల్గొన్నారు. -
అగ్నిప్రమాదం .. రూ.2లక్షల నష్టం
మదనపల్లె టౌన్: మదనపల్లె పట్టణంలో వి ఎస్ఆర్ గ్రాండ్ లో నడుస్తున్న ఆంధ్ర స్పైస్ రెస్టారెంట్లో ఆదివారం అగ్నిప్రమాదం సంభవించింది. ఈ ప్రమాదంలో సుమారు రూ. రెండు లక్షల ఆస్తి నష్టం వాటిల్లింది. ప్రమాదానికి సంబంధించి అగ్నిమాపక అధికారి శివప్ప తెలిపిన వివరాలు. స్థానిక ఆర్టీసీ బస్టాండుకు సమీపంలో ఉన్న ఓ హోటల్లో అగ్ని ప్రమాదం జరిగినట్లు సమాచారం అందిన వెంటనే అగ్నిమాపక సిబ్బందితో సంఘటన స్థలానికి చేరుకున్నారు. రెస్టారెంట్ నుంచి దట్టమైన పొగలు, మంటలు వస్తుండడంతో గమనించి వెంటనే మంటలను అదుపులోకి తెచ్చి పూర్తిగా ఆర్పివేశారు. రెస్టారెంట్లోని కిచెన్న్లో గల చిమ్నీ వద్ద నుంచి ప్రమాదం మొదలైనట్లు ప్రాథమికంగా గుర్తించారు. ఈ ప్రమాదంలో సుమారు 2 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగినట్లు అంచనా. అగ్ని మాపక సిబ్బంది వెంటనే స్పందించడంతో పెద్ద ప్రమాదం తప్పిందని, ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని అధికారి స్పష్టం చేశారు.రెస్టారెంట్ యజమాని వి.సుధాకర్ రెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆదివాసీల హక్కుల కోసం పోరాటం
పుంగనూరు: కేంద్రరాష్ట్ర ప్రభుత్వాలు ఆదివాసీలకు ఇవ్వాల్సిన పథకాలను అందించడం లేదని , హక్కులను కాపాడుకునేందుకు పోరాటాలు సాగిస్తామని వైఎస్సార్సీపీ ఎస్టీసెల్ ప్రధాన కార్యదర్శి మునీంద్రనాయక్ తెలిపారు. ఆదివారం స్థానిక అంబేడ్కర్ సర్కిల్లో ఆదివాసీల దినోత్సవాన్ని గిరిజన మహిళలతో కలసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్షేత్రస్థాయిలో గిరిజనులకు సంక్షేమ పథకాలు అందడం లేదన్నారు. గిరిజనులను సంరక్షించుకునేందుకు వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామని అన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన నాయకులు ప్రభాకర్నాయక్, శ్రీరాములునాయక్, శ్రీనివాసులునాయక్, వాసునాయక్, రెడ్డెప్పనాయక్, బుడ్డన్ననాయక్, తిప్పానాయక్, నరసింహులునాయక్, రాజునాయక్, రవికుమార్నాయక్, శివశంకర్నాయక్, అంజినాయక్, శీన, దేవమ్మ, శారద, లీలావతి తదితరులు పాల్గొన్నారు. -
గుడులపైనే ‘గురి’
● రెచ్చిపోతున్న దొంగలు ● కొరవడిన నిఘా గుర్రంకొండ: పాపభీతి లేదు.. దైవద్రోహానికి వెనుకాడటం లేదు.. దేవుడి సొమ్ముకే కన్నం వేస్తూ దొంగలు రెచ్చిపోతున్నారు. భక్తుల హృదయాల్లో కొలువైన దైవసన్నిధిలో ఇప్పుడు భయం నీడలు అలుముకున్నాయి. తాళాలు పగలగొట్టడం, హుండీలు గుల్ల చేస్తున్నారు.దొంగల ముఠాలు రాత్రి వేళల్లో ఆలయాలను టార్గెట్ చేస్తున్నాయి. తాజాగా గుర్రంకొండ దళితవాడలోని శ్రీ పోలేరమ్మతల్లి ఆలయంలో ముగ్గురు దుండగులు అమ్మవారి త్రిశూలాన్ని ధ్వంసం చేశారు. ఇటీవల స్థానిక కొత్తపేట వీధీకి వెనుకవైపు చాపలబండ పరిసరాల్లొని శ్రీ బోయకొండ గంగమ్మతల్లి ఆలయంలోనూ అమ్మవారి త్రిశూలాన్ని ధ్వంసం చేశారు. ఇదే పరిసరాల్లోని ముచ్చుకోన గుట్ట దగ్గర పురాతన శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయంలో ప్రవేశించి స్వామివారి గంట, ఇతర వస్తువులను చోరీ చేసుకెళ్లారు. ఎల్లుట్ల కొండల్లోన పురాతన ఆలయంల్లోనూ స్వామివారి విగ్రహాలను దుండగులు ధ్వంసం చేశారు. మండలంలోని సంతాన దేవత శ్రీ చెర్లోపల్లె శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలోనూ దుండగులు ఆలయహుండీని పగులగొట్టి చోరికి పాల్పడ్డారు. వీటితో పాటు ఆరు దేవాలయాల్లో దుండుగులు విధ్వంసం సృష్టించి చోరీలకు పాల్పడ్డారు. గుప్తనిధుల కోసం తవ్వకాలు కొంతమంది దుండగులు గుప్తనిధులు ఉంటాయనే నమ్మకంతో మండలంలోని పలు గ్రామాల్లోని ఆలయాలు, అందులోనూ పురాతన ఆలయాలను లక్ష్యంగా ఎంచుకొంటున్నారు. గుర్రంకొండకు పరిసరాల్లో ఇండియన్ డాబా వెనుక భాగంలో గుట్టల నడుమ పురాతన శ్రీ ఆంజినేయస్వామి ఆలయం ఉంది. ఇక్కడ గుప్త నిధులు దాగి ఉంటాయని భావించి కొంతమంది స్థానికుల సహకారంతో దుండగులు రాత్రికిరాత్రే జేసీబీలతో తవ్వకాలు జరిపారు. ఎల్లుట్ల గ్రామానికి సమీపంలోని కొండలో ఉన్న పురాతన ఆలయంలోనూ తవ్వకాలు చేపట్టారు. మండలంలోని చెర్లోపల్లె శ్రీ రెడ్డెమ్మకొండ ఆలయ పరిసరాల్లోనూ గతంలో క్షద్రపూజలు నిర్వహించిన దుండగులు తవ్వకాలు జరిపారు. సంగసముద్రం పరిసరాల్లోని మహేంద్ర మర్రి ఆశ్రమ పరిసరాల్లోనూ పురాతన స్థలాల్లో విధ్వంసాలకు పాల్పడ్డారు. కొంతమంది గుప్తనిధుల కోసం, మరికొంతమంది క్షుద్రపూజలకోసం మరికొంతమంది తమ పైశాచిక ఆనంద కోసం ఆలయాల్లో ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు. గతంలో శ్రీ మంజునాథస్వామి ఆలయంలో దుండుగులు స్వామి వారి విగ్రహాలను ధ్వంసం చేసి మలమూత్రాలతో అపవిత్రం చేసి పైశాచిక ఆనందం పొందారు. గతనెల రోజులుగా గుర్రంకొండ పరిసరాల్లో దుండగులు త్రిశూలాలు పెకలించడం, గంటలు పగులగొట్టడం వంటి చర్యలకు దిగుతున్నారు. కాగా కొంతమంది డబ్బుకు ఆశపడి హుండీలు పగుల గొట్టడం, విలువైన వస్తువులు చోరీ చేసుకొని వెళుతున్నారు. కొరవడిన పోలీసుల నిఘా మండలంలో పురాతన ఆలయాల్లో ఇలాంటి దుశ్చర్యలు జరుగుతున్నా పోలీసుల నిఘా మాత్రం కొరవడిందని ప్రజలు చర్చించుకొంటున్నారు. సంఘటనలు జరినప్పుడు కేవలం కేసులతో సరిపెడుతున్నారనే విమర్శలున్నాయి. ఆలయాల్లో ఎందుకు ఇలాంటి చర్యలకు పాల్పడుతున్నారు, వారి ఉద్దేశమేమిటి, దుండగుల కదలికలపై నిఘా ఉంచితే వాస్తవాలు వెలుగుచుస్తాయని, పూర్తిస్థాయిలో విచారణ నిర్వహించి కఠిన చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
పట్టాలెక్కని డబ్లింగ్!
● సింగిల్లైన్కే పరిమితం ● డివిజన్లో నెరవేరని లక్ష్యంరాజంపేట : ఎర్రగుంట్ల–నంద్యాల రైలుమార్గం డబ్లింగ్కు నోచుకోలేదు. ఏళ్లతరబడి సింగల్ లైన్కే పరిమితమైంది. ప్రతిచోటా డబుల్లైన్లు వేయాలన్నది రైల్వేబోర్డు లక్ష్యం. గుంతకల్ రైల్వే డివిజన్లో ఆ దిశగా అడుగులు పడటం లేదనే విమర్శలున్నాయి. నిధులు కేటాయిస్తున్నా పనులు చేపట్డంలేదు. పైగా నిధులను వేరే పనులకు మళ్లిస్తున్నారు. దీనివల్ల సింగల్లైన్లో అధికారులు ఎక్కువ రైళ్లను నడపలేకున్నారు. ఫలితంగా అవసరమైన సమయా ల్లో తగినన్ని రైళ్లు అందుబాటులోకి రాక ప్రయాణికులు ఇబ్బందులు పడుతున్నారు. ఆ రెండుమార్గాల్లో.. ఎర్రగుంట్ల–నంద్యాల (123 కి.మీ), ధర్మవరం–పాకాల (228 కి.మీ)లో ఎన్నో ఏళ్లుగా డబుల్ లైన్ కల సాకారం కావడంలేదు. ఇందులో ధర్మవరం–పాకాల మధ్య డబ్లింగ్కు మూడేళ్ల క్రితం ప్రభుత్వం మొదటివిడత కింద రూ.4కోట్లు విడుదల చేసింది. ఈ అంశాన్ని కార్యాచరణ ప్రణాళికలోనూ పొందుపరిచింది. అధికారులు నిర్లక్ష్యంతో పనులు ప్రారంభానికి నోచుకోలేదు. దీంతో వ్యయం రెండింతలు పెరిగిపోయింది. ఈ రెండు మార్గాల్లో డబ్లింగ్ చేస్తే డివిజన్ సంపూర్ణ డబ్లింగ్ డివిజన్గా మారుతుంది. అంతేగాకుండా ఎక్కువ సంఖ్యలో రైళ్లను నడిపి తిరుపతికి వెళ్లే భక్తులకు వెసులుబాటు కల్పించవచ్చు. ఇటు సర్కారు ప్రాంతానికి మరింత కనెక్టిటివి పెరుగుతోంది. అలాగే రైతులు పండించిన కూరగాయలు, పండ్లు, ఇతర ఉత్పత్తులు పట్టణాలకు తరలించే సౌలభ్యం ఒనగూరుతుంది. గూడ్స్ల రవాణా, ప్ర యాణికుల రద్దీ పెరిగితే రెండవలైను మార్గం సుగ మం అవుతుందని రైల్వే వర్గాలు అంటున్నాయి. ఎర్రగుంట్ల–నంద్యాల సింగల్లైను ఇలా.. నంద్యాల–ఎర్రగుంట్ల రైలుమార్గం నంద్యాల జిల్లా, వైఎస్సార్ కడప జిల్లాకు అనుసంధానం చేసే సింగల్లైను. నల్లపాడు–నంద్యాలలో లైను కలుస్తుంది. ఇది గుంటూరు డివిజన్లో ఉన్న నంద్యాల రైల్వేస్టేషను ఎస్సీవోఆర్లో గుంతకల్డివిజన్ ద్వారా నిర్వహించబడుతోంది. -
తప్పిపోయిన పాప ఆచూకీ లభ్యం
కురబలకోట: అంగళ్లులో మూడేళ్ల చిన్నారి ఏడుపు..చుట్టూ చేరిన జనం. ఈ పాప ఎవరో ఏమిటో ఎవరైనా వదిలేసి వెళ్లారా.. ఏ తల్లి బిడ్డో తెలియక ఉత్కంఠతకు గురయ్యారు. ఈ సంఘటన మండలంలోని అంగళ్లులో ఆదివారం ఉదయం చోటుచేసుకుంది. గంట పాటు ఈ చిన్నారి ఎవరంటూ స్థానికులు పోలీసులు హైరానా పడ్డారు. చివరకు విషయం తెలిసిరావడంతో ఊపిరిపీల్చుకున్నారు. స్థానికుల కథనం మేరకు.హిందూపురానికి చెందిన కుటుంబం మండలంలోని అంగళ్లులోని బంధువుల ఇంటికి వచ్చారు.. వీరి చిన్నారి ఆడుకుంటూ ఇంటి నుంచి బయటకు వచ్చింది. ఇంట్లోవాళ్లు వంటావార్పులో ఉన్న సమయంలో ఇంటి దగ్గర ఉన్న జామ చెట్టు వద్ద తోటి పిల్లలతో ఉంటూ కొంత దూరం అనుకోకుండా వెళ్లిపోయింది. తర్వాత ఇంటిని గుర్తుపట్టలేక ఏడ్వడం ప్రారంభించింది. చిన్న వయస్సు ఆపై ఇంకా మాటలు రాకపోవడంతో స్థానికంగా ఉన్న వారు గమనించి చేరదీశారు. తర్వాత చిన్నారిని అంగళ్లు మసీదు వద్దకు తీసుకెళ్లి ఆరా తీశారు. అక్కడ చిన్నారిని ఎవ్వరూ గుర్తుపట్టక పోవడంతో స్థానికంగా ఉన్న ఔట్ పోలీస్ స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. పోలీసులు స్థానికంగా విచారణ చేపట్టసాగారు. ఇదిలా ఉండగా పాప కన్పించకపోవడంతో పోలీసుల సాయం కోసం తల్లిదండ్రులు కూడా వారికి ఎదురయ్యారు. పోలీసుల వద్ద ఉన్న పాపే మాపాప అని గుర్తించారు. ఎస్ఐ మధు రామచంద్రుడు ఆధ్వర్యంలో కానిస్టేబుల్ సుధాకర్ సమక్షంలో ఆ చిన్నారిని కుటుంబ సభ్యులకు అప్పగించడంతో అంత వరకు నెలకొన్న హడావుడి టెన్షన్ ఒక్కసారిగా వీడిపోయింది. -
నిలువునా కోతలే!
నేతన్న సేవలోనూ...● పరిశీలన పేరుతో అర్హులకు మొండిచేయి ● గగ్గోలు పెడుతున్న బాధితులుమదనపల్లి (కురబలకోట) : రాష్ట్ర ప్రభుత్వ ‘నేతన్న సేవ’ పథకం చేనేత కార్మికులకు తీవ్ర నిరాశను కలిగించింది. ఆర్థిక చేయూత అందిస్తామని గొప్పలు చెప్పి నిలువునా మోసం చేసింది. అర్హత ఉన్నా నిబంధనల కొర్రీలు పెట్టి అనర్హులుగా మార్చింది. రెండేళ్ల తర్వాత చేనేత కార్మికులకు ఆర్థిక సాయం అందించేందుకు కూటమి ప్రభుత్వం చేనేత దినోత్సవం రోజున నేతన్న సేవ పేరుతో పథకాన్ని అమలు చేసింది. నేతన్నల ఖాతాలో రూ. 25 వేలు చొప్పున జమ చేసింది. కాగా అన్నమయ్య జిల్లాలో 5069 మంది పేర్లతో ఆర్థిక సాయం కోసం ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపితే.. 3869 కుటుంబాలకు మాత్రమే లబ్ధి చేకూరింది. అధికారులు పంపిన ప్రతిపాదనల జాబితా కంటే ఇంకా ఆన్లైన్ చేయని వారు వేలాది మంది ఉన్నారు. తొలి జాబితాలోనే చాలా మంది పేర్లు కన్పించలేదు. దీంతో పేర్లు లేని వారు ఆయా సచివాలయాల్లో మరో సారి దరఖాస్తు చేశారు. ఫలితం లేక అర్హులు నిట్టూర్చారు. మోసం చేసిన కూటమి ప్రభుత్వ తీరును ఎండగడుతున్నారు. జిల్లాలో మదనపల్లిలో అత్యధికంగా 2756 మందికి లబ్ధి చేకూరింది. ఆతర్వాత తంబళ్లపల్లి నియోజక వర్గంలో 692 మందికి మాత్రమే లబ్ధి చేకూరింది. ఆఖరి స్థానంలో పుంగనూరులో 39మందికి మాత్రమే లబ్ధి చేకూరినట్లు అధికారిక లెక్కలు వెల్లడిస్తున్నాయి. సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్ ఆధారంగా లబ్ధిదారులను ఎంపిక చేసిన ప్రభుత్వం చాలా మంది అర్హులకు కోత కోసినట్లు తెలుస్తోంది. -
డీఎస్సీ అక్రమాలపై పోరు
సాక్షి, మదనపల్లె : డీఎస్సీ–2025 నియామకాల్లో అక్రమాలపై, అర్హులైన అభ్యర్థులకు జరిగిన తీవ్రమైన అన్యాయంపై వైఎస్సార్ సీపీ పోరుబాట పట్టింది. బాధితులకు అండగా ఉద్యమిస్తోంది. ఇప్పటికే వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్.జగన్ మోహన్ రెడ్డి బాధిత డీఎస్సీ అభ్యర్థుల పక్షాన ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. జరిగిన అన్యాయాన్ని సరిదిద్దాలని అర్హులైన అభ్యర్థులకు న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని నిలదీశారు. అయినప్పటికీ ప్రభుత్వం తప్పును సరిదిద్దుకోకపోగా, అభ్యర్థనను పెడచెవిన పెట్టింది. ఈ నేపథ్యంలో బాధిత డీఎస్సీ అభ్యర్థుల పక్షాన న్యాయం కోసం ఉద్యమించింది. రోజుల తరబడి రోడ్లపైకెక్కి నిరసన గళమెత్తింది. జిల్లా వ్యాప్తంగా బాధిత డిఎస్సీ అభ్యర్థులు, యువజనులు, విద్యార్థులు ఈ నిరసన కార్యక్రమాలకు బాసటగా నిలిచారు. వరుసగా నిరసన కార్యక్రమాలు పార్టీ పిలుపుమేరకు జిల్లాలో డీఎస్సీ అభ్యర్థుల పక్షాన వైఎస్ఆర్సీపీ నేతలు వివిధ పద్ధతుల్లో నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. జూలై 28న జిల్లా కేంద్రం మదనపల్లెలో ర్యాలీ నిర్వహించి కలెక్టరేట్ ఎదుట ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యేలు శ్రీకాంత్ రెడ్డి, రమేష్ కుమార్ రెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్ నిరసన ధర్నా నిర్వహించి డీఆర్ఓకు వినతిపత్రం సమర్పించారు. జూలై 31న మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్ జాయిన్ కలెక్టర్కు వినతిపత్రమిచ్చారు. తర్వాత ఈనెల 3, 4 తేదీల్లో నియోజకవర్గాల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు నిర్వహించి డీఎస్సీ అక్రమాలపై చర్చించి నిలదీశారు. 6, 7, 8 తేదీల్లో మూడు రోజులు నియోజకవర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు నిర్వహించి డీఎస్సీ అభ్యర్థులకు అండగా నిలిచారు. తక్షణమే న్యాయం చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. నేడు భారీ ర్యాలీలు డీఎస్సీ బాధిత అభ్యర్థులకు అండగా, వారికి జరిగిన అన్యాయంపై సీబీఐ విచారణ జరపాలని, మంత్రి లోకేశ్ రాజీనామా డిమాండ్ తో సోమవారం నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్సార్సీపీ భారీ ర్యాలీలు నిర్వహిస్తోంది. పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్ ఆధ్వర్యంలో రాజన్న విగ్రహం నుంచి బస్టాండ్, పోలీస్ స్టేషన్, ఎంబిటి రోడ్డు మీదుగా గూగుల్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించనున్నారు. అలాగే తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి ఆధ్వర్యంలో తంబళ్లపల్లె వైఎస్ఆర్ సర్కిల్ నుంచి రాగిమాను సర్కిల్ వరకు, రాయచోటి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో పట్టణంలోని పార్టీ కార్యాలయం నుంచి నేతాజీ సర్కిల్ వరకు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో కేవీ పల్లి మండలంలో, మదనపల్లెలో సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో ర్యాలీ జరుగుతుంది. లోకేష్ రాజీనామా చేయాల్సిందే.. సోమవారం జరిగే ర్యాలీల్లో యువజనులు, విద్యార్థులు, డీఎస్సీ బాధిత అభ్యర్థులు పెద్ద ఎత్తున పాల్గొనడానికి సిద్ధమవుతున్నారు. ఇందులో భాగంగా ర్యాలీల ద్వారా వైఎస్ఆర్సీపీ నేతలు అభ్యర్థులకు న్యాయం చేయాలని డిమాండ్ చేయనున్నారు. డీఎస్సీ అక్రమాలపై సీబీఐ విచారణ జరగాలని, లోకేశ్ మంత్రి పదవికి రాజీనామా విషయాలని గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. డీఎస్సీ–2025 అక్రమ నియామకాలపై.. నేడు నియోజకవర్గ కేంద్రాల్లో వైఎస్ఆర్సీపీ ర్యాలీలు పుంగనూరులో హాజరుకానున్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి ఇప్పటికే వివిధ దశల్లో కార్యక్రమాల నిర్వహణ -
బోయకొండలో భక్తజన సందడి
చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో భక్తజన సందడి నెలకొంది.ఆషాడమాసం చివరి ఆదివారం సందర్భంగా ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఒక ఆదివారంరోజు మాత్రమే సుమారు 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. అమ్మవారిని అర్చకులు సుందరంగా అలంకరణ చేసి దర్శనభాగ్యం కల్పించారు. కోర్కెలు ఫలించిన భక్తులు అమ్మవారికి మొక్కులు చెల్లించారు. దర్శనం కోసంగంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. దీంతో వయసు పైబడినవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. వేలాది వాహనాలు బోయకొండకు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది.మెట్ట ప్రాతంలో వాహనాలు మొరాయించడంతో వాహనదారులకు ఇక్కట్లు తప్పలేదు. బోయకొండ దేవస్థానం వద్ద ఆదివారం విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ:25.10 లక్షల ఆదాయం సమకూరినట్లు ఈఓ ఏకాంబరం తెలిపారు. – ఒక్కరోజే 50 వేలమంది దర్శనం – టికెట్ల ఆదాయం రూ:25.10లక్షలు -
దొంగను పట్టుకున్న గ్రామస్తులు
● స్తంభానికి కట్టేసి దేహశుద్ధి మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలో ఆవుల దొంగను గ్రామస్తులు పట్టుకుని పోలీసులకు అప్పగించిన ఘటన ఆదివారం రాత్రిచోటు చేసుకున్న ఘటనపై వివరాలు.. మండలంలోని వేంపల్లి పంచాయతీ, మునగమాకుల పల్లి గ్రామంలో ఈ ఘటన జరిగింది. గ్రామస్తుల కథనం ప్రకారం, ఓ దొంగ ఆవుల షెడ్డులోకి ప్రవేశించి ఆవులను పట్టుకుని బయటకు తరలిస్తుండగా యజమాని రవి గమనించాడు. వెంటనే అప్రమత్తమైన దొంగను పట్టుకుని, స్తంభానికి కట్టేశాడు. అనంతరం దేహశుద్ధి చేసి తాలూకా పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకున్న నిందితుడిని అదుపులోకి తీసుకున్నారు. ఇతనికి ఇతర దొంగతనాల్లో ప్రమేయం ఉందా అనే కోణంలో విచారిస్తున్నారు. ● టైర్పగిలి విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న వాహనం ● నలుగురికి గాయాలు చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ దర్శనార్థనం వచ్చి తిరుగుప్రయాణంలో భక్తులతో వెళ్తున్న ఈచర్ వాహనం టైర్ పగిలి విధ్యుత్ స్తంభాన్ని ఢీకొన్న ఘటన ఆదివారం అన్నిపల్లె సమీపంలోని బచ్చనికుంట వద్ద జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుంగనూరుకు చెందిన భక్తులు గంగమ్మ దర్శనార్థం బోయకొండకు వచ్చారు. దర్శనం అనంతరం విందు భోజనం ఏర్పాటుచేసుకొని బోయకొండ నుంచి కొలింపల్లె మీదుగా పుంగనూరుకు బయలు దేరారు. ఒక్కసారిగా వాహనం టైర్ పగలడంతో అదుపు తప్పి ఎదురుగా ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. ప్రమాదం సమయంలో విద్యుత్ సరఫరా లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. వాహనంలోని భక్తుల్లో నలుగురు గాయపడ్డారు. సమాచారం అందుకున్న ఎస్ఐ చిన్నరెడ్డెప్ప ఘటనా స్థలానికి చేరుకొని పరిశీలించారు. కేసు నమోదు చేసిన దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. వేంపల్లె : వేంపల్లెలోని స్థానిక ఇమామ్నగర్లోని ఓ ఇంట్లో విద్యుత్ షార్ట్ సర్కూట్తో వస్తువులన్నీ బూడిదైనట్లు బాధితురాలు వెంకటసుబ్బమ్మ వాపోయారు. వేంపల్లెలోని ఇమాంనగర్కు చెందిన వెంకటసుబ్బమ్మ ఇంట్లో ఆదివారం తెల్లవారుజామున విద్యుత్ షార్ట్ సర్కూట్ జరిగింది. అగ్ని మంటలు ఎగిసిపడడంతో పాటు పెద్ద శబ్దం రావడంతో నిద్రలో ఉన్న వెంకట సుబ్బమ్మ ఇంట్లో నుంచి బయటకు వచ్చారు. మంటలు చెలరేగడంతో ఇంట్లో ఉన్న ఫ్రిజ్, కూలర్, వాషింగ్ మిషన్తో పాటు విలువైన వస్తువులు పూర్తిగా అగ్నికి ఆహుతయ్యాయని బాధితురాలు ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.2లక్షల వరకు నష్టం వాటిల్లిందని తెలిపారు. -
రెడ్డెమ్మా.. చల్లంగా చూడమ్మా
గుర్రంకొండ : రెడ్డెమ్మా.. చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. కర్ణాటకా, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆలయానికి తరలివచ్చారు. రాయచోటి యువకుడికి ఢిల్లీ ఐఐటీ పీహెచ్డీ పట్టారాయచోటి : రాయచోటికి చెందిన జె.నిఖిల్కుమార్రెడ్డి ప్రతిష్టాత్మక ఐఐటీ ఢిల్లీ నుంచి పీహెచ్డీ పట్టా పొందారు. ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు జె.వెంకట్రామిరెడ్డి, నాగేశ్వరమ్మ దంపతుల కుమారుడు జె.నిఖిల్కుమార్రెడ్డి పట్టా పొంది రాయచోటి కీర్తిని జాతీయ స్థాయికి తీసుకెళ్లారు. ఈ కార్యక్రమానికి ప్రధా ని నరేంద్రమోదీ ముఖ్య అతిథిగా హాజరయ్యా రు. ‘దేశీయంగా సాంకేతిక ఆవిష్కరణలను పెంచడం పరిశోధకులకు గ్లోబల్ స్టాండర్డ్ కంప్యూటింగ్పవర్ను అందించడం’ అనే కీలకమైన అంశంపై చేసిన పరిశోధనకు గాను ఈ డాక్టరేట్ డిగ్రీని అందుకున్నారు. నేడు కలెక్టరేట్లో పీజీఆర్ఎస్సాక్షి, మదనపల్లె : స్థానిక కలెక్టరేట్లో సోమ వారం ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ప్రజలు ఉదయం 11 గంటల నుంచి తమ ఫిర్యాదులను అందజేయవచ్చని తెలిపారు. గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో కూడా ఫిర్యాదుల సేకరణ జరుగుతుందన్నారు. ఈ స్థాయిల్లో పరిష్కారంకాని ఫిర్యాదులను ప్రజలు కలెక్టరేట్ పీజీఆర్ఎస్కు అందించాలని సూచించారు. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే ప్రజలు ఇబ్బందులు పడకుండా ఆన్లైన్ ద్వారా కూడా ఫిర్యాదు చేయవచ్చని సూచించారు. నేడు విద్యుత్ సమస్యలపై ఫిర్యాదుల స్వీకరణసాక్షి, మదనపల్లె : జిల్లాలో విద్యుత్ వినియోగదారులు తాము ఎదుర్కొంటున్న సమస్యలపై సోమవారం నిర్వహిస్తున్న డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమం దృష్టికి తీసుకు రావాలని డిస్కం జిల్లా ఎస్ఈ ఆడేపూడి సోమశేఖర్ రెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. సమస్యల పరిష్కారం కోసం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమానికి వినియోగదారులు ఫోన్ ద్వారా తమ సమ స్యలను తెలియజేయాలని కోరారు. 94408 17449 నంబర్కు ఫోన్ చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొస్తే తక్షణమే పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని తెలిపారు. గిరిజన ప్రాంతాల అభివృద్ధికి ప్రాధాన్యం మదనపల్లి (కురబలకోట) : ఆదివాసీల సంస్కృతి, సాంప్రదాయాలు, హక్కుల పరిరక్షణపై ప్రజల్లో అవగాహన కల్పించడమే ప్రపంచ ఆదివాసీ దినోత్సవ ముఖ్య ఉద్దేశ్యమని ఇన్చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ శర్మ అన్నారు. ఆదివారం మదనపల్లి కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాల్లో ప్రపంచ ఆదివాసీ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాజ్యాంగం ఆదివాసీ హక్కులు, సంక్షేమానికి ప్రత్యేక రక్షణ కల్పించిందన్నారు. విద్య, వైద్య, రహదారులు, తాగునీరు, ఉపాది తదితర మౌళిక వసతుల అభివృద్దికి ప్రాధాన్యత ఇవ్వడం జరుగుతుందన్నారు. గిరిజనుల సమస్యలను ఎప్పటికప్పుడు గుర్తించి అధికారులు వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని సూచించారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడుతూ మ దనపల్లిలో ఆదివాసీ భవన్ నిర్మాణానికి కృషి చేస్తామన్నారు. డీఆర్ఓ వెంకటేష్, అదనపు ఎస్పీ వెంకటాఽద్రి, జిల్లా గిరిజన సంక్షేమ అధి కారి తేజస్విని, డీవీఎంసీ సభ్యులు శ్రీనివాసు లు, చంద్రశేఖర్, రామకృష్ణ, మునీంద్ర నాయ క్, ప్రిన్సిపల్ రంగనాయకులు పాల్గొన్నారు. -
రిమ్స్లో వైద్యుల నిర్లక్ష్యంతో మహిళ మృతి
● వార్డులో చేర్చుకునేందుకు ఆలస్యం చేశారని కుమారుడి ఆవేదన ● మృత్యువుతో పోరాడి మరణించిందని కుటుంబ సభ్యుల రోదనలు కడప అర్బన్ : వైఎస్ఆర్ కడప జిల్లా కడప నగర శివారులలో జిజిహెచ్ (రిమ్స్)లో రెండు రోజుల క్రితం ఆయాసంతో చేరిన సుజనమ్మ (55) వైద్యుల నిర్లక్ష్యంతో మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని పోరుమామిళ్ల మండలం పులివీడు గ్రామానికి చెందిన సుజనమ్మ, తన కుమారుడు శేషయ్య, కుటుంబ సభ్యుల సహాయంతో శుక్రవారం కడప రిమ్స్లో క్యాజువాలిటీలో చేరారు. ప్రాథమిక చికిత్స అనంతరం ఆమెను అదే రోజు రాత్రి మెడికల్ వార్డుకు షిఫ్ట్ చేశారు. అక్కడ వార్డులో అడ్మిట్ చేసుకునేందుకు స్టాఫ్ నర్స్ లేదని, వైద్య సిబ్బంది చేర్చుకోకపోవడంతో దాదాపు గంటన్నర పాటు కుటుంబ సభ్యులతో పాటు అక్కడే సుజనమ్మ వేచి ఉన్నారు. మరుసటి రోజు ఉదయం డాక్టర్ వచ్చి ఆమె పరిస్థితి బాగాలేదు చావు బతుకుల మధ్య ఉందని, తమకు సంబంధం లేదని చేతులు దులిపేసుకున్నారు. ఆమె బ్రతికున్నప్పుడే ఎక్కడికై నా తీసుకెళ్లండి అని చెబితే తాము దూరప్రాంతాలకు మెరుగైన చికిత్స కోసం తీసుకెళ్లే వారమని, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంతోనే తాము తల్లిని పోగొట్టుకున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. భవిష్యత్తులో ఇలాంటి పరిస్థితి ఎవరికి రాకుండా చూడాలని పోలీసులు ఇలాంటి సంఘటనలపై దృష్టి సారించి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆమె చనిపోయిన 24 గంటల తర్వాత ఆదివారం ఉదయం వరకు పోలీసుల చుట్టూ తిరిగి తిరిగి అంత్యక్రియల కోసం సుజనమ్మ మృతదేహాన్ని కుమారుడు శేషయ్య, కుటుంబ సభ్యులు తీసుకుని వెళ్లారు. -
రాజోలి.. ఖాళీ!
ఎండిన పాపాఘ్ని కర్ణాటక–ఆంధ్ర సరిహద్దులోని పెద్దతిప్పసముద్రం మండలం టి.సదుం పంచాయతీ మీదుగా ప్రవహించే పాపాఘ్ని నది ఎండుతోంది. అన్నమయ్య, సత్యసాయి, వైఎస్సార్ జిల్లాల్లో ప్రవహించే ఈ నదిలో ప్రవాహం కరువైంది. ఫలితంగా ఈ నదీ పరివాహక ప్రాంతంలో భూగర్భ జలాలు అడుగంటి పోతున్నాయి. వ్యవసాయ బోర్లలో నీటిమట్టం తగ్గి సాగు విస్తీర్ణం తగ్గిపోతోంది. –సాక్షి, మదనపల్లెఏ ‘నార’దిష్టి తగిలిందో ఏమోగానీ ఖరీఫ్ సీజనంతా నీటి చుక్క లేకుండానే గడిచిపోయింది. కరిమబ్బు హలధారితో దోబూచులాడింది.. ఆశగా ఎదురుచూసిన నేలతల్లికి సైతం నీటి తడి లేకుండా చేసింది.. అక్కడక్కడ చిరు జల్లులు మినహా వాన వెల్లువైంది లేదు.. ఏ ఒక్క నదిలోనూ ఝరి పారింది లేదు.. నల్లగా మబ్బు పట్టడం తప్పా చుక్క నీరు జారింది లేదు... ఇదిగో ఈ చిత్రమే సజీవ సాక్ష్యం. గతేడాది జూలైలోనే రాజోలి ఆనకట్ట నిండుకుండలా మారి పరవళ్లు తొక్కింది. నీటి సవ్వడులతో...కర్షకుల కన్నీళ్లు, కష్టాలను తుడిచింది. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో ఒక్కసారీ పదును వాన పడింది లేదు. ఫలితంగా ఇదిగో ఇలా చుక్క నీరు లేక రాజోలి ఆనకట్ట వెలవెలబోతోంది. కొందరు ఆయకట్టు రైతులు నీరు వస్తుందన్నా ఆశతో నారు పోశారు. వారి ఆశలపై వరుణుడు నీళ్లు చిలకరిస్తాడో.. కరుణించి దోసిళ్లతో కుమ్మరిస్తాడో కాలమే సమాధానం చెబుతుంది. – రాజుపాళెం -
జగనన్న ఇంటి స్థలాలు కబ్జా
పుంగనూరు: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో లక్షలాది రూపాయలు విలువ చేసే ఇంటి స్థలాలను కొనుగోలు చేసి, పేద మహిళలకు ఇచ్చి జగనన్న కాలనీలను అభివృద్ధి చేశారు. ఇందులో ముస్లిం మహిళలకు చెందిన ఇంటి స్థలాలను అర్ధరాత్రి పథకం ప్రకారం జేసీబీలతో పునాదులు తీసి కట్టడాలు ప్రారంభించడంతో మహిళలు ఆందోళనకు గురవుతున్నారు. నియంత్రించాల్సిన అధికారులు నిద్రమత్తులో ఉండటం విమర్శలకు దారితీస్తోంది. మండలంలోని రాగానిపల్లె గ్రామ దాఖల, పుంగనూరు బైపాస్రోడ్డులో ఉన్న ఆర్టీవో ఆఫీసు వద్ద మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రైవేట్ స్థలాలను కొనుగోలు చేసి , పట్టణంలోని పేద మహిళలకు ఇంటి పట్టాలు మంజూరు చేశారు. సర్వే నంబర్లు: 71, 73, 74లో గల స్థలాల్లో 537 మంది మహిళలకు పట్టాలు ఇచ్చి, గృహాలు మంజూరు చేశారు. చాలా మంది నిర్మాణాలు చేసే సమయంలో ప్రభుత్వం మారడం ముస్లింల పాలిట శాపంలా మారింది. నిర్మాణాలకు నిధులు లేకపోవడంతో అర్ధంతరంగా పనులు ఆగిపోయాయి. ఇలాంటి సమయంలో దీనిని ఆసరాగా చేసుకున్న చోట తెలుగుదేశం నాయకుడు, వారి అనుచరులు వీరికి మద్దతుగా ఆర్టీవో ఆఫీసులో ఒక ప్రైవేట్ ఏజెంట్ కుమ్మకై , రాత్రి సమయంలో జేసీబీలతో పునాదులు తీస్తున్నారు.ఉదయానికల్లా స్థలాల రూపురేఖలు మార్చేస్తున్నారు. ఈ విషయమై లబ్ధిదారులు అడిగితే రూరల్కు చెందిన మహిళల పేరుతో నకిలీ రికార్డులు సృష్టించి, పట్టణ లబ్ధిదారులను బెదిరిస్తున్నారని బాధితులు ఆరోపిస్తున్నారు. రూరల్కు చెందిన వారికి పట్టణాల్లో స్థలాలు ఇవ్వరాదన్న నిబంధనలు ఉన్నా అధికార బలంతో తప్పుడు రికార్డులు సృష్టిస్తున్నారని ఆరోపిస్తున్నారు. ఈ విషయమై కమిషనర్, తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా పట్టిపట్టనట్లు ఉండటంతో లబ్ధిదారులు ఆందోళనకు సిద్ధమవుతున్నారు. –అక్రమాలకు అధికార పార్టీ అండ –నిద్రమత్తులో అధికారులు -
అర్హులందరికీ ఇవ్వాలి
మగ్గం నడిస్తేనే పొట్ట నిండే కుటుంబాలు ఎన్నో ఉన్నాయి. నిఽబంధనల పేరుతో పొట్ట కొట్టడం దారుణం. ప్రతి నేతన్నకు నేతన్న సేవ ఇవ్వాలి. జగన్ ప్రభుత్వంలో అందరికీ ఇచ్చినట్లుగా ప్రతి చేనేత కార్మికుడికి ఆర్థిక సాయం వర్తింపజేయాలి. కష్ట పడి మగ్గం నేసే చేతులకు సాయంలో మొండిచేయి చూపడం విచారకరం. –భాస్కర్ రెడ్డి, చేనేత కార్మిక యూనియన్ నాయకులు 30 ఏళ్లుగా ఈ వృత్తిలోనే ఉన్నా.. వ్యవసాయం తర్వాత చేనేత వృత్తి ఎక్కువ మందికి ఉపాధి కల్పిస్తోంది. 30 ఏళ్లుగా చేనేత వృత్తినే నమ్ముకుని జీవిస్తున్నా. అయినా నేతన్న సేవ పథకం నిధులు ఖాతాలో జమ కాలేదు. అర్హత ఉన్నా ఎందుకు పక్కన పెట్టారో అర్థం కావడం లేదు. –కె.ప్రసాద్, చేనేత కార్మికుడు, అమ్మచెరువు మిట్ట, మదనపల్లి -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలో జరిగిన ఓ రోడ్డు ప్రమాదంలో బీహార్కు చెందిన ఇద్దరు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు..బీహార్ రాష్ట్రం, భగల్పూర్కు చెందిన దీపక్కుమార్ (21), సందీప్కుమార్(20) మరికొందరు వచ్చి కురబలకోట మండలం, అంగళ్లులో స్థిరపడ్డారు. అంగళ్లు, మదనపల్లె, గుర్రం కొండ తదితర ప్రాంతంలో ఇళ్లకు పెయింటింగ్ పనులు చేస్తున్నారు. ఈ క్రమంలో గుర్రంకొండలో ఓ ఇంటికి పెయింట్ పని ముగించుకుని రాత్రి ద్విచక్ర వాహనంపై అంగళ్లు వెళ్తుండగా డాబా హోటల్ వద్ద మరో బైక్ ఢీకొట్టింది. గాయపడిన వారిని 108లో వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు ప్రథమ చికిత్స అందించారు. దీంతో వారు ప్రాణాపాయం తప్పి కోలు కుంటున్నారు. గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూటర్ ఢీకొని బాలుడికి.. మదనపల్లె టౌన్: స్కూటర్ ఢీకొని బాలుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం కురబలకోట మండలంలో చోటుచేసుకుంది. ఘటనపై వివరాలు ఆసుపత్రి అవుట్ పోస్టు పోలీసుల కథనం ప్రకారం, కురబలకోట మండలం, అంగళ్లు పంచాయతీ తుమ్మచెట్లపల్లికి చెందిన మహేష్(16) స్నేహితునితో కలిసి బైక్పై అంగళ్లకు వస్తుండగా, మార్గమధ్యంలోని అంగళ్లు మసీదు వద్ద ఎదురుగా వస్తున్న మరో బైక్ వీరి ప్రయాణిస్తున్న వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో మహేష్కు కాళు విరిగి తీవ్ర గాయాలు అయ్యాయి. ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి గాయపడిన మహేష్ను మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పీలేరు రూరల్ : ఆగి ఉన్న ట్యాంకర్ను ద్విచక్రవాహనం ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన ఆదివారం చిత్తూరు రోడ్డు మార్గంలో చోటు చేసుకుంది. పీలేరు పట్టణానికి చెందిన దిలీప్రెడ్డి (21) తల్లి రమాదేవి (50) ద్విచక్రవాహనంలో ఇందిరమ్మ కాలనీలో బంధువుల ఇంటికి బయలుదేరారు. రిలయన్స్ పెట్రోల్బంకు వద్ద ఆగివున్న ట్యాంకర్ను వేగంగా వెళ్లి ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో తల్లి, కుమారుడు తీవ్రంగా గాయపడ్డారు. ఇద్దరిని చికిత్సనిమిత్తం 108 వాహనంలో స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కుటుంబసభ్యులు మందలించారని ఆత్మహత్య
మదనపల్లె టౌన్: ఇంటికి ఆలస్యంగా వస్తున్నాడని కుటుంబీకులు మందలించడంతో మనస్థాపం చెందిన ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ సంఘటన ఆదివారం ఉదయం మదనపల్లెలో వెలుగు చూసింది. మృతుడి కుటుంబీకులు, రెండవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. స్థానిక మోతి నగర్ లో కాపురం ఉంటున్న చాంద్ బాషా కుమారుడు పి.లతీఫ్ (25), కొత్తగా నిర్మించిన ఇళ్లకు గ్లాస్ వర్కర్ గా పని చేస్తాడు. విధుల్లో భాగంగా స్థానిక చంద్ర కాలనీలో ఇంటికి గ్లాస్ వర్క్ చేసేందుకు శనివారం రాత్రి వెళ్లాడు. పని ముగించుకుని రోజు అర్థ రాత్రి వేళ ఇంటికి వస్తున్నారని కుటుంబీకులు మందలించారని తెలిపారు. దీంతో చంద్ర కాలనీలో పనిచేస్తున్న ఇంటిలోనే తెల్లవారుజామున లతీఫ్ ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుని మృతి చెందాడన్నారు. సమాచారం అందుకున్న టూ టౌన్ పోలీసులు ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ మహమ్మద్ రఫి తెలిపారు. నందలూరు : పాటూరు గ్రామ పంచాయతీలోని ఎల్లమ్మ ఆలయంలోకి శనివారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు చొరబడి 9 గ్రాముల విలువైన మూడు బంగారు తాళిబొట్లను అపహరించినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ సంఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయగా సంఘటనా స్థలానికి ఎస్ఐ మల్లికార్జునరెడ్డి చేరుకుని పరిశీలించారు. ఈ సంఘటనపై దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
జమ కాలేదు
నేతన్న సేవ పడలేదు. వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎలాంటి టెన్షన్ లేకుండా ఐదేళ్లు నేతన్న నేస్తం నిధులు కరెక్టుగా పడ్డాయి. ఇప్పుడు నేతన్న సేవ నగదు జమ కాలేదు. కుటుంబ అవసరాలకు ఉపయోగపడుతుందని ఎంతగానో ఆశించా. 40 ఏళ్లుగా చేనేత కార్మికుడిగా ఉన్నా. అర్హత ఉన్న వారిని గుర్తించి లబ్ధి చేకూర్చాలి. – టి.ప్రతాప్, చేనేత కార్మికుడు, వినాయక చేనేతనగర్, కురబలకోట మండలం జగన్ హయాంలో ఠంచనుగా పడేది జగన్ ప్రభుత్వ హ యాంలో ఠంచనుగా నేతన్న నేస్తం పడేది. ఇప్పుడు కూటమి ప్ర భుత్వంలో అర్హులకు కూడా ఎగనామం పె ట్టారు. అర్హత ఉండి కూడా జమ కాలేదు. చేతి వృత్తుల్లో ఇంత కష్టమైన సూక్ష్మమైన పని లేదు. ఇలాంటి కష్టజీవులకు న్యాయం జరగలేదు. తలచుకుంటే బాధగా ఉంది. –బి.నారాయణ రెడ్డి, చేనేత కార్మికుడు -
అంజన్న ఉత్సవాలకు వేళాయె!
● గండి క్షేత్రంలో మొదలైన ఉత్సవ సందడి ● ఏర్పాట్లు చేపట్టిన ఆలయ వర్గాలుచక్రాయపేట : శ్రావణ మాసం వస్తోంది. ఈమాసం అంటే ఆంజనేయుడికి ఎంతో ప్రీతికరం.అలాగే ఆయన భక్తులకు కూడా ఈ మాసమంటే ఎంతో ఇష్టం. శ్రావణమాసం వచ్చిందంటే ఆంజనేయ స్వామి ఆలయాలు భక్తులతో కిటకిటలాడుతాయి. ఇక రాయలసీమ జిల్లాల్లోనే ప్రసిద్ధిగాంచిన గండి వీరాంజనేయ స్వామి ఆలయంలో శ్రావణంలో ఉత్సవాలు కన్నులపండువగా సాగుతాయి. ఇక్కడి వీరాంజనేయుడిని స్వయంగా శ్రీరామ చంద్రమూర్తి తన స్వహస్తాలతో చెక్కి ప్రతిష్టించారని ప్రతీతి. దీంతో భక్తులు ఇక్కడి స్వామికి ఎంతో భక్తి శ్రద్ధలతో పూజలు చేస్తారు. గండి అంటే.. గండిలో ఉన్న కొండలను శేషాచల కొండలు అంటారు. వీటి ఎత్తు రెండు వేల అడుగుల పైమాటే.ఇవి తిరుమల నుంచి గండి వరకు మధ్యలో ఎక్కడేగాని తెగకుండా ఉన్నాయట. అలాంటి ఈ శేషాచల కొండలను పాపాఘ్ని నది మద్యలో గండి పెట్టడంతో ఈ ప్రాంతానికి గండి అని పేరు వచ్చిందని తెలుస్తోంది. ఇక్కడ వెలసిన స్వామిని గండి వీరాంజనేయస్వామి అని పిలుస్తారు. దర్శనీయ స్థలాలు గండి క్షేత్రం సమీపంలో పలు దర్శనీయ స్థలాలు ఉన్నాయి. వాటిలో ఉమా మహేశ్వరాలయం, భూమానందాశ్రమం, నామాలగుండు, పావురాళ్ల గుట్ట, ప్రేమానందాశ్రమము, చౌడేశ్వరీదేవి ఆలయం, గవిమల్లేశ్వర స్వామి ఆలయం, కోదండ రామాలయం,వృషభాచలేశ్వర స్వామి(ఎద్దుల కొండ్రాయుడు) ఆలయం, గంగమ్మ దేవత ఆలయం, దివంగత మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతివనం ఉన్నాయి. ట్రిపుల్ ఐటీ, నెమళ్లపార్కు,లు దర్శనీయ స్థాలాలుగా ఉన్నాయి. పెరగనున్న భక్తుల సంఖ్య ఈ ఏడు శ్రావణ మాసంలో భక్తుల సంఖ్య గణనీయంగా పెరగనుంది. తరతరాలు మురిసి పోయేలా సంస్కృతి వెలిగేలా నూతన ఆలయం నవశోభతో అలరారుతోంది. మహానేత వైఎస్ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక గండిని టీటీడీలో విలీనం చేయించి ఎంతో అభివృద్ధి చేశారు. అనంతరం వచ్చిన పాలకులు గండిని పట్టించుకోలేదు. తర్వాత ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్ మోహన్ రెడ్డి బాధ్యతలు చేపట్టిన వెంటనే గండి ఆలయం అభివృద్ధికి సుమారు రూ.30 కోట్లు మంజూరు చేశారు. దీంతో ఆలయం సర్వాంగ సుందరంగా నిర్మితమైంది. నాలుగేళ్ల తర్వాత నూతన ఆలయంలో మూలవర్లు దర్శనం కలుగుతుండటంతో భక్తులు సంఖ్య పెరుగుతుందని ఆలయ వర్గాలు పేర్కొంటున్నాయి. -
సమష్టి కృషితో ఉత్సవాల నిర్వహణ
గండి ఆలయ అధికారి విశ్వనాథ్చక్రాయపేట : గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో ఈ నెల 15 నుంచి జరిగే శ్రావణ మాస ఉత్సవాలకు అన్ని శాఖల అధికారులు సహకారమందించాలని ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్ కోరారు. శనివారం గండి ఆలయ కార్యాలయంలో అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన పోలీసు విద్యుత్, వైద్యం, విద్యుత్, పారిశుధ్యం, ఆర్డబ్ల్యూఎస్, ఆర్టీసీ అధికారులతో మాట్లాడారు. ఉత్సవాలకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా విజయవంతంగా నిర్వహించేందుకు కృషి చేయాలని కోరారు. అంతకు ముందు కడపకు చెందిన మోహన్ అనే వ్యక్తికి రు.4.90,000 లకు పూల అలంకరణ టెండరు ఖరారు చేసినట్లు తెలిపారు. సెల్ ఫోన్లు భద్ర పరచుకొనే హక్కు విషయంలో సమంజసమైన ధర రానందున దేవస్థానం తరఫునే నిర్వహిస్తామని తెలిపారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ వెంకటస్వామి, పాలక మండలి సభ్యులు, ఆర్కే వ్యాలీ సీఐ శంకర్ రెడ్డి,ఎస్సై శ్రీప్రియ, చక్రాయపేట వైద్యాధికారిణి ఊర్మిళ పాల్గొన్నారు. -
ఆది హుకుం.. ఖాకీ జులుం!
● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి దీక్షను భగ్నం చేసిన పోలీసులు ● భర్తను అరెస్టు చేయగానే దీక్షలో కూర్చున్న ఎమ్మెల్సీ సతీమణి సాక్షి ప్రతినిధి, కడప : శాంతియుతంగా నిరసన చేపడుతున్నా ఆ ఎమ్మెల్యేకి నచ్చలేదు. వెంటనే నిరసన దీక్షను కట్టడి చేయాలని పోలీసులకు హుకూం జారీ చేశారు. అంతే.. జీ హుజూర్ అంటూ పోలీసులు నోటీసు జారీ చేశారు. అంతటితో ఆగక ప్రజాస్వామ్యబద్ధంగా కొనసాగిస్తున్న నిరసనపై ఉక్కుపాదం మోపారు. శనివారం జమ్మలమడుగులో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రజాస్వామ్యయుత దీక్షపై ఖాకీలు సాగించిన క్రౌర్యమిది. ప్రభుత్వ వైఫల్యాలు, అక్రమాలపై ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ఆద్వర్యంలో వైఎస్సార్ సీపీ శ్రేణులు ప్రజాస్వామ్యబద్ధంగా నిరసన చేస్తుంటే ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డికి నచ్చలేదు. వైఎస్సార్సీపీ దీక్ష భగ్నం చేయాలని పోలీసులకు ఆదేశాలు జారీ చేశారు. అంతే పోలీసులు స్వామి భక్తి చాటుకుని దీక్షను అడ్డుకోవడానికి యత్నించారు. పోలీసుల చర్యలను ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి ప్రతిఘటించారు. ‘ప్రజాస్వామ్యంలో ఉన్నామా నియంతృత్వంలో ఉన్నామా’ అంటూ తీవ్రస్థాయిలో మండిపడ్డారు. దీక్ష కొనసాగించి తీరతామని మహాత్మగాంఽధీ విగ్రహానికి పూలమాల వేసి నిరసనకు దిగారు. సీఐ నరేంద్రబాబు నేతృత్వంలో ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిని అరెస్టు చేసేందుకు పోలీసులు చేరుకోవడంతో వైఎస్సార్సీపీ శ్రేణులు ప్రతిఘటించాయి. దీంతో భారీగా తోపులాట చోటుచేసుకుంది. ఎట్టకేలకు పోలీసులు బలవంతంగా ఎమ్మెల్సీని కారులో ఎక్కించి తీసుకెళ్లారు. వెంటనే ఎమ్మెల్సీ సతీమణి పొన్నపురెడ్డి ఇందిరమ్మ నిరసన దీక్ష చేపట్టారు. ప్రజల కోసం పోరాడుతుంటే పోలీసులను పెట్టి అడ్డుకుంటారా? అని నిలదీశారు. మహిళ పోలీసులతో ఆమెను కూడా అక్రమంగా అరెస్టు చేశారు. -
ఉరకలేసిన ఉద్యమం!
సాక్షి, మదనపల్లె : డీఎస్సీ–2025 నియామక అక్రమాలపై వైఎస్సార్సీపి చేపట్టిన నిరాహార దీక్షలకు మూడో రోజు శనివారం మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే, రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి హాజరు కావడంతో ప్రజల నుంచి భారీ స్పందన లభించింది. జిల్లాలోని తంబళ్లపల్లె, పీలేరు, మదనపల్లె నియోజకవర్గాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్ ఆధ్వర్యంలో గురువారం నుంచి నిరాహార దీక్షలు కొనసాగుతున్న విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో ఇక్కడి నిరాహార దీక్షలకు పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డితో కలిసి హాజరయ్యారు. సందర్భంగా దీక్ష శిబిరాల వద్దకు ప్రజలు పోటెత్తారు. తంబళ్లపల్లె నియోజకవర్గం అంగళ్లు శిబిరం వద్దకు పెద్ద సంఖ్యలో యువతీ యువకులు, విద్యార్థులు, ప్రజలు స్వచ్ఛందంగా తరలివచ్చారు. వైఎస్ఆర్సీపీ శ్రేణులు, నాయకులతో కలిసి లోకేష్ దిగిపోవాలని పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఏళ్ల తరబడి కష్టపడి చదువుకున్న విద్యార్థులకు ద్రోహం చేశారంటూ మండిపడ్డారు. ఇచ్చిన హామీలు నెరవేర్చని చంద్రబాబు డీఎస్సీ ద్వారా నిరుద్యోగులు మోసపోతే ఇంతవరకు ఎందుకు చర్యలు తీసుకోలేదని ప్రశ్నించారు. అంగళ్లు దీక్షకు భారీ స్థాయిలో స్పందన లభించడంతో పోలీసులు జాతీయ రహదారిపై రాకపోకలను మళ్లించారు. కదిరి, కడప వైపు నుంచి వచ్చే వాహనాలను సీటీఎం రోడ్డుకు మళ్లించారు. మూడో రోజు.. ● అంగళ్లులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారనాథరెడ్డి, పార్టీ నేతలు, ప్రతినిధులు పాల్గొన్నారు. ● పీలేరులో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మైనార్టీ కమిషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్ పాల్గొన్నారు. ● మదనపల్లెలో సమన్వయకర్త నిసార్ అహ్మద్, మాజీ ఎమ్మెల్యే తిప్పారెడ్డి, పరిశీలకులు అనీషా రెడ్డి, జింకా చలపతి పాల్గొన్నారు. ● రాయచోటిలో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.రమేష్ కుమార్ రెడ్డి, రామాపురం జెడ్పీటీసీ నాగరాజు, పార్టీ విభాగాల జిల్లా అధ్యక్షులు కిషోర్ దాస్, బేపారి మహమ్మద్ ఖాన్, అంజనప్ప, మున్సిపల్ మాజీ చైర్మన్ ఫయాజ్ భాషా పాల్గొన్నారు. ● పుంగనూరులో మాజీ ఎంపీ రెడ్డప్ప, రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, పులిచెర్ల మండలం నేతలు విజయ భాస్కర్ రెడ్డి, రెడ్డిశ్వర రెడ్డి పాల్గొన్నారు. దీక్షలు సక్సెస్ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గురు, శుక్ర, శనివారాల్లో డీఎస్సీ అక్రమాలను నిలదీస్తూ, బాధ్యుడైన మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని, సీబీఐతో విచారణ జరపాలన్న డిమాండ్లపై వైఎస్సార్సీపీ నిర్వహించిన నిరాహార దీక్షలు విజయవంతం అయ్యాయి. దీక్షా శిబిరాలకు స్థానిక యువత, విద్యార్థులు, డీఎస్సీ అభ్యర్థులు హాజరై తమ మద్దతు తెలపడమేకాక దీక్షల్లో పాల్గొన్నారు. తమకు జరిగిన అన్యాయంపై అభ్యర్థులు ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్.జగన్ తమ తరపున ప్రభుత్వాన్ని నిలదీసి, ప్రశ్నించడంతో ప్రభుత్వంలో ఆందోళన మొదలైనట్టు పేర్కొన్నారు. తమకు న్యాయం జరిగేదాక అండగా ఉంటామని వైఎస్సార్సీపీ ప్రకటించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. లోకేష్ దిగిపోవాలని నినాదాలు తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు దీక్షలకు మాజీ మంత్రి పెద్దిరెడ్డి, జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి హాజరు జిల్లాలో కొనసాగిన మూడో రోజు దీక్షలు -
వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మదనపల్లె టౌన్ : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో ముగ్గురు గాయపడి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో చేరారు. పోలీసులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బి కొత్తకోటకు చెందిన ఖాదర్ బాషా ఇంటి ముందు నడిచి వెళుతుండగా గుర్తుతెలియని ద్విచక్ర వాహనం ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడిన అతన్ని కుటుంబీకులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అలాగే రంగసముద్రంలో కాపురం ఉంటున్న నాగార్జున(37) సొంత పనిమీద శుక్రవారం బి.కొత్తకోటకు వచ్చి తిరిగి బైక్పై ఇంటికి వెళుతుండగా, ఆటో బైకును ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని స్థానికుల సాయంతో 108 సిబ్బంది మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నారు. కేసు దర్యాప్తులో ఉందని బి.కొత్తకోట సీఐ గోపాల్రెడ్డి తెలిపారు. స్కూటర్ ఢీకొని.. స్కూటర్ ఢీకొని లారీ డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డ సంఘటన శనివారం కలకడ మండలంలో జరిగింది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. కలకడ మండలం నడిమిచెర్లకు చెందిన అజంతుల్లా కుమారుడు జాఫర్ బాషా(40) గుర్రంకొండకు చెందిన ఓ యజమాని దగ్గర లారీకి డ్రైవర్గా పని చేస్తున్నాడు. విధులకు వెళ్లేందుకు రోడ్డుపైకి వచ్చిన జాఫర్ను ద్విచక్ర వాహనం వేగంగా వచ్చి ఢీ కొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ బాధితున్ని స్థానికులు వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించి, కలకడ పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుడికి ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు వైద్య చికిత్సలు అందించి తిరుపతి రుయాకు వెళ్లాలని సూచించారు. కలకడ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గాయపడిన మహిళ మృతి
పుంగనూరు: మండలంలోని శాంతినగర్ సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన మీనా(32) చికిత్స పొందుతూ శనివారం మృతి చెందింది. ప్రమాదంలో ఓ మహిళ అక్కడిక్కడే మృతి చెందగా , మీనా తీవ్రంగా గాయపడిన విషయం విధితమే. మీనాను మెరుగైన చికిత్సకోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందింది. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోగొట్టుకున్న బంగారు ఆభరణాలు అప్పగింతరాయచోటి టౌన్ : తమ బంగారు ఆభరణాలు పోగొట్టుకున్నామని ఫిర్యాదు ఇచ్చిన వెంటనే రాయచోటి అర్బన్ పోలీసులు స్పందించి బాధితులకు అప్పగించారు. అర్బన్ సీఐ బీవీ చలపతి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం రాయచోటి పట్టణం కొత్తపల్లె కరిమియా వీధికి చెందిన షేక్ మెహరాజ్, ఆరిఫుల్లా.. ఆ వీధిలో వెళ్తున్న ఆటోను ఆపి అందులో ప్రయాణించారు. బజార్కు వెళ్లిన ఇద్దరు ఆటోలో ఆరు తులాలు (60 గ్రాముల) బంగారు ఆభరణాలు, 300 గ్రాముల వెండి ఆభరణాలను ఒక బ్యాగ్లో ఉంచి మర్చిపోయి దిగి వెళ్లిపోయారు. ఆ విషయం గుర్తు తెచ్చుకొనేలోపు ఆటో అక్కడి నుంచి వెళ్లిపోయింది. ఆందోళనతో పోలీస్ స్టేషన్కి వచ్చి ఫిర్యాదు చేశారు. సీఐ వెంటనే స్పందించి ఎస్ఐ విష్ణువర్ధన్తోపాటు మరి కొంత మంది సిబ్బందిని పురమాయించి సీసీ కెమెరాల ద్వారా గాలింపు చర్యలు చేపట్టారు. ఆటోను గుర్తించి డ్రైవర్ను అదుపులోకి తీసుకొని.. ఆటోను తనిఖీ చేయగా వీరి ఆభరణాలు కనిపించాయి. సుమారు రూ.10 లక్షల విలువైన బంగారు, వెండి ఆభరణాలను బాధితులకు అప్పగించడంతో వారు సంతోషంగా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. భూ రికార్డులు ట్యాంపరింగ్ చేసిన వీఆర్ఓపై కేసునిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : నిమ్మనపల్లె మండలంలోని రాచవేటివారిపల్లె పంచాయతీకి సంబంధించిన భూ రికార్డుల్లో ట్యాంపరింగ్ జరిగినట్లు గుర్తించి, నిమ్మనపల్లె తహసీల్దార్ తపస్విని ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై రామకృష్ణ కథనం మేరకు.. మండలంలోని రాచవీటివారిపల్లె పంచాయతీ వీఆర్ఓగా పని చేస్తున్న సోమశేఖర్ పంచాయతీకి సంబంధించిన ఏ–రిజిస్టర్ ట్యాంపరింగ్ చేసి నకళ్లు, సర్వే నంబర్లను తారుమారు చేసినట్లు తహసీల్దార్ దృష్టికి వచ్చిందన్నారు. దీంతో తహసీల్దార్ రికార్డులను పరిశీలించి పలు సర్వే నంబర్లు, వాటికి సంబంధించిన భూముల వివరాలు, పేర్లను మార్చేసినట్లు గుర్తించారు. అనంతరం వీఆర్ఓపై చర్యలు తీసుకోవాలని పోలీస్స్టేషన్లో తహసీల్దార్ ఇచ్చిన ఫిర్యాదుపై ఎస్సై రామకృష్ణ కేసు నమోదు చేసినట్లు మీడియాకు తెలిపారు. తహసీల్దార్ ఫిర్యాదుతో భూముల రికార్డుల ట్యాంపరింగ్పై కేసు నమోదు చేయడం జరిగిందన్నారు. రికార్డుల్లో మార్పులు ఎప్పుడు, ఎలా జరిగాయి? వాటి వెనుక ఎవరెవరి ప్రమేయం ఉంది? ఏయే సర్వే నంబర్లకు సంబంధించిన భూముల వివరాలను మార్చారు? అనే అంశాలపై దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. రికార్డులను పరిశీలించి, సంబంధిత వ్యక్తుల నుంచి వివరాలు సేకరించనున్నట్లు వివరించారు. దర్యాప్తులో వెలుగులోకి వచ్చే అంశాల ఆధారంగా తదుపరి చర్యలు తీసుకుంటామని ఎస్ఐ తెలిపారు. -
కత్తివారిపల్లిలో తాగునీటి వివాదం
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం కత్తివారిపల్లెలో తీవ్ర తాగునీటి సమస్య నెలకొంది. దీంతో నీళ్లకోసం గ్రామస్తులు రెండు వర్గాలుగా చీలిపోయి వివాదానికి తెరలేపారు. తాగు నీటి బోరులో నీళ్లు అడుగంటడంతోనే ఈ సమస్య తలెత్తిందని ప్రాథమిక విచారణలో తెలుస్తోంది. వివాదానికి సంబంధించి తాలూకా ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి కథనం మేరకు వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ కత్తివారిపల్లెలో సుమారు 150 కుటుంబాల ప్రజలు వ్యవసాయంతో జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి ఉన్న బోరులో కొంత కాలంగా నీళ్లు అడుగంటడంతో గ్రామానికి సరిపడ నీళ్లు రాక ప్రజలు కొంత కాలంగా తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అయితే గ్రామానికి వేసిన బోరు తగ్గులో ఉన్న దళితవాడ దగ్గర ఉండటంతో.. నీళ్లు మిట్టపై ఉన్న బీసీలు వంతుల ప్రకారం పట్టుకుంటూ వస్తున్నారు. చివరకు బోరు మోటారు వేయడం నిలిపివేయడంతో నీళ్లు లేని కారణంగా గ్రామంలోని బీసీలు, దళితుల మధ్య మనస్పర్థలు ఏర్పడ్డాయి. నీటిని సర్దుకునే క్రమంలో అగ్రవర్ణాల వారు స్టార్టర్లో ఫ్యూజులు పీకేసి నీరు రాకుండా చేశారని దళితులు అపార్థం చేసుకున్నారు. దీంతో వారు సీపీఎం నాయకులు శ్రీనివాసులును గ్రామానికి పిలిపించి.. దళితులకు మాత్రమే నీళ్లు రాకుండా చేస్తున్నారని ఆరోపించారు. విషయం తెలుసుకున్న పోలీసులు రంగ ప్రవేశం చేసి, గ్రామస్తులతో మాట్లాడి వివాదం తలెత్తకుండా సర్ది చెప్పారు. దీన్ని కొందరు వివక్షగా అభివర్ణించారు. కత్తివారిపల్లిలో సుమారు 80 దళిత కుటుంబాలకు తాగునీరు రాకుండా అదే ఊరికి చెందిన అగ్రవర్ణ కులస్తులు స్టార్టర్కు ఫ్యూజులను వారం క్రితం తొలగించారని సీపీఎం నాయకుడు శ్రీనివాసులు ఆరోపించారు. దీంతో గ్రామంలో ఉద్రిక్తత నెలకొందని, అధికారులు స్పందించకపోతే ఆందోళనలకు పూనుకుంటామని ఆయన హెచ్చరించారు. అయితే ఎస్ఐ రామక్రిష్ణారెడ్డి గ్రామంలో వివక్ష ఏమీ లేదని చెప్పుకొచ్చారు. బోరులో తాగునీరు అడుగంటడంతోనే సమస్య తలెత్తిందన్నారు. ఎంపీడీఓతో మాట్లాడి తాగు నీటి సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. తాగు నీటి సమస్య పరిష్కారానికి అన్ని రకాల చర్యలు తీసుకుంటామని చెప్పడంతో వివాదం సద్దుమణిగింది. రెండు వర్గాలుగా చీలిపోయిన గ్రామస్తులు వారం రోజులుగా అల్లాడుతున్న జనం -
రూ.20 లక్షల విలువైన కలప సీజ్
నిమ్మనపల్లె (మదనపల్లి టౌన్): అన్నమయ్య జిల్లాలో అక్రమంగా కలపను తరలిస్తున్న లారీని అటవీ శాఖ అధికారులు స్వాధీనం చేసుకుని, కలపను సీజ్ చేశారు. ఇందుకు సంబంధించి మదనపల్లి ఫారెస్ట్ రేంజ్ అధికారి సైదులు మీడియాకు తెలిపిన వివరాల మేరకు.. నియోజకవర్గంలోని నిమ్మనపల్లి మండలం దివిటివారిపల్లి గ్రామం వద్ద చెట్లను నరికి అక్రమంగా లారీలో తరలిస్తుండగా, సమాచారం అందుకున్న ఎఫ్బిఓ దీప లారీని అడ్డుకుని రికార్డులను పరిశీలించారు. అయితే లారీకి ఎలాంటి పర్మిట్లు, అనుమతులు లేకపోవడం, కటింగ్ ఆర్డర్ కూడా లేకుండానే కలపను అక్రమంగా నరికించి తరలిస్తున్న అభియోగాలపై అటవీ శాఖ అధికారులు లారీ డ్రైవర్, యజమాని హుసేన్ను అదుపులోకి తీసుకున్నారు. పట్టుబడ్డ కలప లారీని మదనపల్లె బసినికొండ లో ఉన్న నగరవనంకు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. స్టార్టర్లు,కేబుల్ వైర్లు చోరీపులివెందుల రూరల్ : పులివెందుల మండలం కనంపల్లె గ్రామంలో నరసింహులు అనే రైతు తోటలో రెండు రోజుల క్రితం స్టార్టర్లు, కేబుల్ వైర్లు చోరీకి గురయ్యాయి. నరసింహులు కనంపల్లె గ్రామ సమీపంలో భూమిని కౌలుకు తీసుకు ని పంటలు సాగు చేస్తున్నాడు. ఆ తోటలో గుర్తు తెలియని వ్యక్తులు ప్రవేశించి సుమారు రూ.22 వేల విలువ గల రెండు స్టార్లర్లు, కేబుల్ వైర్లను అపహరించుకపోయారని బాధితుడు ఆవేదన వ్యక్తం చేశాడు. శనివారం బాధిత రైతు సీఐ శ్రీ రామ్కు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమో దు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. నకిలీ ఏసీబీ అధికారి అరెస్ట్పులివెందుల రూరల్ : ఏసీబీ అధికారి అని చెప్పి ప్రజలను మోసం చేస్తున్న వ్యక్తిని అరెస్టు చేసినట్లు అర్బన్ సీఐ శ్రీరాం తెలిపారు. తెలంగాణ రాష్ట్రం కరీంనగర్ జిల్లా వనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డి అనే వ్యక్తి 2022 సెప్టెంబర్ నెలలో పులివెందుల భాకరాపురం చెందిన వీఆర్ఓ నుంచి రూ.40వేల డబ్బులు వసూలు చేయడం జరిగింది. ఈ విషయంలో అప్పట్లో పులివెందుల పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ నేపథ్యంలో కరీంనగర్ జిల్లా వనపర్తి గ్రామానికి చెందిన శ్రీనివాస్ రెడ్డిని పులివెందుల పోలీసులు అరెస్ట్ చేసి కోర్టుకు పంపామని సీఐ శ్రీరామ్ తెలిపారు. -
జూదరుల అరెస్ట్
గాలివీడు : మండలంలోని దానంరెడ్డిగారిపల్లె సమీపంలో శనివారం పేకాట స్థావరంపై పోలీసులు దాడి చేసి ఆరుగురిని అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి రూ.40300తోపాటు ఆరు సెల్ఫోన్లు, ఐదు బైకులు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ నరసింహారెడ్డి తెలిపారు. వ్యక్తిపై దాడిమదనపల్లె టౌన్ : భూమి ఒరిజినల్ పత్రాలను ఎత్తుకెళ్లినందుకు ఓ రియల్టర్ తన ప్రత్యర్థిపై పోలీసులకు ఫిర్యాదు చేసినందుకు దాడి చేసిన ఘటన శనివారం మదనపల్లిలో చోటు చేసుకుంది. బాధితుడు వన్ టౌన్ పోలీసులకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె మండలంలోని కొండామారిపల్లికి చెందిన రవీంద్ర(42) రియల్ ఎస్టేట్ వ్యాపారం చేస్తున్నాడు. ఈ క్రమంలో చిత్తూరు జిల్లా పూతలపట్టుకు చెందిన మాణిక్యంతో కలిసి పనులు చేసేవాడు. ఆ చనువుతో తన భూమిని అమ్మిస్తానని 2018లో 20 ఎకరాల భూమి ఒరిజినల్ పత్రాలను మాణిక్యం ఎత్తుకెళ్లాడని రవీంద్ర ఆరోపించాడు. పత్రాలు తిరిగి ఇవ్వాలని కోరినా ఇవ్వకపోవడంతో ఆయన పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులకు తనపైనే ఫిర్యాదు చేస్తావా అంటూ మాణిక్యం.. తనపై దాడి చేసినట్లు రవీంద్ర ఫిర్యాదులో పేర్కొన్నాడు. ఫిర్యాదు స్వీకరించిన 1టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు ప్రారంభించారు. భూ వివాదం, రియల్ ఎస్టేట్ లావాదేవీల కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గాయపడిన రవీంద్ర స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు.రైలు కింద పడి వ్యక్తి మృతిపీలేరు రూరల్ : రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణం మోడల్ కాలనీ సమీపంలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. శనివారం మోడల్ కాలనీ వద్ద రైల్వే ట్రాక్పై మృతదేహం పడి ఉండగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. మృతదేహాన్ని పరిశీలించి కేవీపల్లె మండలం గర్నిమిట్టకు చెందిన షాబుద్దీన్(45)గా గుర్తించారు. షాబుద్దీన్ బతుకుదెరువు కోసం గల్ఫ్ దేశాలకు వెళ్లి 15 ఏళ్లుగా అక్కడే ఉండి కుటుంబాన్ని పోషించాడు. గత కొన్నేళ్లుగా భార్యాబిడ్డలతో మనస్పర్థలు వచ్చి షాబుద్దీన్ ఒంటరిగా జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం పీలేరులోని తమ బంధువుల ఇంటి నుంచి వెళ్లిన షాబుద్దీన్ శనివారం ఉదయం రైల్వేట్రాక్ మృతదేహంగా కనిపించారు. రైల్వే పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. బైక్ను ఢీకొన్న టిప్పర్ఎర్రగుంట్ల : మండల పరిధిలోని పోట్లదుర్తి గ్రామ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మహీధర్ అనే విద్యార్థికి తీవ్ర గాయాలయ్యాయి.ఈ సంఘటన శనివారం చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు చాపాడు మండల పరిధిలోని వెదురూరురాజుపాలెం గ్రామానికి చెందిన మహీధర్ ప్రొద్దుటూరు నారాయణ కళాశాలలో ఇంటర్ చదువుతున్నాడు. పని నిమిత్తం బైక్లో ఎర్రగుంట్లకు వస్తుండగా పోట్లదుర్తి గ్రామ సమీపంలో టీప్పర్ ఢీకొనంది. ఈ ప్రమాదంలో మహీధర్కు తీవ్ర గాయలయ్యాయి. స్థానికులు విద్యార్థిని 108 వాహనంలో ప్రోద్దుటూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
ఉపాధి అవకాశాలు విస్తృతం..
తెలుగు రాష్ట్రాల్లో వైవీయూలో లలిత కళల బోధనలో అగ్రగామిగా ఉన్నాం. మా విభాగంలో కోర్స్ పూర్తి చేసిన వారికి ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉన్నాయి. కోర్స్ పూర్తవగానే కొలువులో చేరేలా విద్యార్థులకు తర్ఫీదు ఇస్తున్నాం. తల్లిదండ్రుల మీద ఆధారపకుండా చదువుకుంటూ అదనపు సమయాన్ని వినియోగించుకొని నెలకు కనీసం ఇరవై వేల రూపాయలు సంపాదించే అవకాశం ఉంది. ముఖ్యంగా పట్టణాల్లో ఎంతో గిరాకీ ఉన్న కోర్స్ ఇది. ప్రత్యేక ఆర్ట్ గ్యాలరీ మా విద్యార్థులకు ఒక గొప్ప అవకాశం. – డాక్టర్ కోట మృత్యుంజయ రావు, విభాగాధిపతి, లలితకళా విభాగం , వైవీయూ -
కుంచెం కళాపోషణతో.. జీవితం అందమైన చిత్రం!
మనిషి జీవితం ఉరుకుల పరుగులమయం.. కోర్సు ముగిశాక కొలువు కోసం ఆరాటం.. ‘కొలువు’దీరాక బతుకు పోరాటం.. ఈ సంఘర్షణలకు చెక్పెడుతూ బీఎఫ్ఏ కోర్సు విద్యార్థి ముంగిటకొచ్చి వాలింది. మనిషిలో కాసింత కళాపోషణ ఉంటే.. సృజనతో కుంచె కదిలిస్తే జీవితం అందమైన చిత్రమవుతుంది. కోర్సులో ప్రవేశానికి వైవీయూ రారమ్మని స్వాగతిస్తోంది.● నాలుగేళ్ల బీఎఫ్ఏ కోర్స్లో ప్రవేశానికి దరఖాస్తులు ●ఉపాధి అవకాశాలు పుష్కలం కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన యూనివర్సిటీలో లలిత కళల విద్యా (బ్యాచిలర్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) నాలుగు సంవత్సరాల కోర్సుకు ప్రవేశాల నోటిఫికేషన్ విడుదలైంది. ఈ కోర్సు పూర్తి చేసిన విద్యార్థులకు ప్రారంభంలోనే ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉంటాయి. పోస్ట్ గ్రాడ్యుయేషన్కి వెళ్ల్లకుండానే అధిక వేతనాలతో ఉద్యోగ అవకాశాలు తలుపుతడగాయి. ముఖ్యంగా ఈ కోర్సు విజయవంతంగా పూర్తి చేస్తే ప్రొఫెషనల్ చిత్రాకారుడిగా, ఇంటీరియర్ డిజైన్, పిల్లల బొమ్మల తయారీ,టీవీ, సినిమా రంగాలలో విస్త్తృత అవకాశాలు ఉన్నాయి. అంతేకాక కేంద్రీయ విద్యాలయా, నవోదయ స్కూళ్లలో అధ్యాపకుడిగా కొలువుదీరే అవకాశం ఉంది. ఇక విగ్రహాలు తయారీ, పార్క్ డిజైన్, మ్యూజియంలలో జాబ్లు ఉన్నాయి. గందరగోళంగా మారుతున్న నేటి సమాజంలో మానసిక సంతోషంతో పాటు మెరుగైన జీతం వచ్చే ఈ కోర్సుకు ఆదరణ పెరుగుతోంది. ఇంటర్ లేదా డిప్లమో పూర్తి చేసిన వారు ఈ నాలుగేళ్ల బీఎఫ్ఏ కోర్స్లో ప్రవేశానికి అర్హులు. ఈ నెల 11వ తేదీ లోపు దరఖాస్తులు చేసుకోవాలి. ఈ విభాగంలో జాయిన్ కావాలంటే, ఆసక్తి, అర్హత గల వారు ఓఏఎండీసీ వెబ్ సైటు, cets.apche.ap.gov.in లేదా www.yvu.edu.in లలో రిజిస్టర్ చేసుకోవచ్చు. ఇతర సమాచారం కోసం 9492345419 నంబర్ను సంప్రదించవచ్చు. -
నవోదయ గడువు పొడిగింపు
మదనపల్లె సిటీ : మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యా సంత్సరానికి 6వ తరగతిలో ప్రవేశం కోసం దరఖాస్తు చేసుకోవడానికి ఈనెల 10వతేదీ వరకు గడువు పెంచినట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత తెలిపారు. ప్రవేశ పరీక్ష నవంబర్ 11న జరుగుతుందన్నారు.ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని ప్రభుత్వ, ప్రభుత్వ అనుమతి పొందిన ప్రైవేటు పాఠశాలల్లో ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ప్రవేశ పరీక్ష రాసేందుకు అర్హులని పేర్కొన్నారు. 11 నుంచి జిల్లా స్థాయి క్రీడా పోటీలుబి.కొత్తకోట (పెద్దతిప్పసముద్రం) : అమరావతి చాంపియన్ షిప్ 2026 జిల్లా స్థాయి క్రీడా పోటీలు ఈ నెల 11 నుంచి జరుగుతాయని క్రీడాకారుల నియోజకవర్గ ఇన్చార్జి ఎస్ తాజ్బాషా (పీడీ) శనివారం పేర్కొన్నారు. గత నెలలో నియోజకవర్గ స్థాయిలో జరిగిన వివిధ క్రీడా పోటీల్లో పాల్గొని జిల్లాకు ఎంపికై న వారు అర్హులన్నారు. ఈ నెల 11న రాయచోటిలోని నేతాజీ గ్రౌండ్లో వాలీబాల్, కబడ్డీ, కోకో, బాక్సింగ్ పోటీలు, వాయల్పాడులోని సీఎస్ఆర్ అకాడమీలో బాస్కెట్బాల్, చెస్ పోటీలు, ఈ నెల 13న బీటీ కళాశాల మైదానంలో హాకీ, అథ్లెటిక్స్, యోగా, ఆర్చరీ, వెయిట్ లిఫ్టింగ్, మదనపల్లెలోని డీఎస్కే స్ఫోర్టిఫైలో బ్యాడ్మింటన్ పోటీలు రాష్ట్ర స్థాయి ఎంపిక కోసం జరుగుతాయన్నారు. నియోజకవర్గ స్థాయిలో ప్రతిభ కనబరిచి వారు జిల్లా స్థాయి పోటీల్లో పాల్గొంటారని పీడీ వెల్లడించారు. ఒంటిమిట్ట రామయ్యకు స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయంలో శనివారం సీతారామలక్ష్మణులకు శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ముందుగా అర్చకులు మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు తులసి గజమాలలతో స్వామి, అమ్మవార్లను అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. రెండవ శనివారం కావడంతో స్వామి వారిని దర్శనానికి రెండు తెలుగు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు విచ్చేశారు. ఘనంగా జిల్లా యోగా పోటీలుమదనపల్లె సిటీ : స్థానిక పీ అండ్ టీ కాలనీలోని నవ చైతన్య భారతి పాఠశాలలో శనివారం జిల్లా యోగా అసోసియేషన్ ఆధ్వర్యంలో జిల్లా స్థాయి యోగాసన పోటీలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి సుమారు 200 మంది బాల,బాలికలు వివిధ కేటగిరీల్లో పాల్గొన్నారు. అసోసియేషన్ అధ్యక్షుడు విష్ణు చైతన్య మాట్లాడుతూ యోగాతో మంచి శరీర ఆకృతిని, ఆరోగ్యాన్ని, జ్ఞానాన్ని పొందొచ్చని తెలిపారు.కార్యక్రమంలో పరిశీలకులు మనోహర్, వెంకటరమణ, అనిత, జలజలు విజేతలైన క్రీడాకారులను ఎంపిక చేశారు. వీరు త్వరలో విశాఖపట్టణంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. ఐఐసీటీ సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్గా ఎంపిక కడప ఎడ్యుకేషన్ : యోగివేమన యూనివర్సిటీ భౌతికశాస్త్ర విభాగం నుంచి ఇటీవల డాక్టరేట్ అందుకున్న పార్నపల్లి ముని మౌనిక ప్రఖ్యాత కౌన్సిల్ ఆఫ్ సైంటిఫిక్ అండ్ ఇండస్ట్రియల్ రీసెర్చ్ (సిఎస్ఐఆర్) ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ కెమికల్ టెక్నాలజీ (ఐఐసిటి), హైదరాబాద్లో సీనియర్ ప్రాజెక్ట్ అసోసియేట్గా ఎంపికయ్యారు. ఫిజిక్స్ ప్రొఫెసర్ ఎం.రాఘవేంద్ర పర్యవేక్షణలో ఈమె పరిశోధన పూర్తి చేశారు. మౌనిక ను వైవీయూ వీసీ ఆచార్య బెల్లంకొండ రాజశేఖర్ అభినందించారు. -
పీలేరులో వ్యక్తి దారుణ హత్య
పీలేరు రూరల్ : పీలేరులో ఓ వ్యక్తి దారుణ హత్యకు గురైన సంఘటన శనివారం తెల్లవారుజామున జరిగింది. డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు మార్గంలోని డిష్ కాలనీలో ఐదేళ్లుగా నివాసం ఉంటున్న ఎం.సుబ్రమణ్యం(45) పులిచెర్ల మండలం ఇ.రామిరెడ్డిగారిపల్లె పంచాయతీ చింతలవారిపల్లెలో చౌకదుకాణం డీలర్గా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. శనివారం ఉదయం మదనపల్లె – తిరుపతి నాలుగు లేన్ల జాతీయ రహదారిపై మృతదేహం పడి ఉండగా.. స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు.. మొదట రోడ్డు ప్రమాదంగా భావించారు. అయితే జాతీయ రహదారి నుంచి డిష్ కాలనీ వరకు పలు చోట్ల రక్తపు మరకలు ఉండటంతో.. హత్యగా భావించి డిష్ కాలనీకి చేరుకున్నారు. సుబ్రమణ్యం మృతిపై భార్య ఉమాదేవి(36), కుమారుడు లోహిత్ను పోలీసులు ప్రశ్నించగా.. పొంతన లేని సమాధానం చెప్పడంతో వారిద్దరినీ అదుపులోకి తీసుకున్నారు. సుబ్రమణ్యం తండ్రి కృష్ణయ్య పోలీస్ స్టేషన్కు చేరుకుని కుమారుడి మృతిపై పలు అనుమానాలు వ్యక్తం చేశాడు. తన కోడలు ఉమాదేవికి వివాహేతర సంబంధాలు ఉండడంతో తరచూ గొడవులు జరిగేవని, తన కుమారుడిని హత్య చేసి రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించారని, సుబ్రమణ్యం మృతికి ఉమాదేవి కారణమని ఫిర్యాదు చేశాడు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. సుబ్రమణ్యం మృతిపై పలు అనుమానాలు సుబ్రమణ్యంను హత్య చేసి సినీ ఫక్కీలో మృతదేహాన్ని జాతీయ రహదారి వద్దకు తీసుకెళ్లి.. రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించడం పీలేరు పట్టణంలో కలకలం రేపంది. పోలీసులు సుబ్రమణ్యం ఇంటి వద్దకు చేరుకోగా ఉమాదేవి చేతికి గాయమై ఉండడం గమనించి ప్రశ్నించగా.. చెట్టుకొమ్మ తగిలి గాయమైందని పొంతనలేని సమాధానం చెప్పారు. సుబ్రమణ్యంను హత్య చేసే క్రమంలో ఆమెకు గాయమై ఉంటుందని పోలీసులు అనుమానిస్తున్నారు. ఉమాదేవి వివాహేతర సంబంధానికి అడ్డుతొలగించుకోవడానికే సుబ్రమణ్యంను హత్య చేసినట్లు మృతుడి బంధువులు ఆరోపిస్తున్నారు. మృతదేహాన్ని రోడ్డుపైకి ఎవరూ తరలించారో, హత్యకు ఎంత మంది పాల్పడ్డారో పోలీసుల విచారణలో తెలియాల్సి ఉంది. ఇన్చార్జి సీఐ లక్ష్మణ్, ఎస్ఐ రహీమ్ కేసు దర్యాప్తు చేస్తున్నారు. సినీ ఫక్కీలో రోడ్డు ప్రమాదంగా చిత్రీకరించే యత్నం మృతదేహాన్ని జాతీయ రహదారిపై పడేసిన వైనం భార్య పాత్రపై అనుమానం -
కేంద్రానికి ఒక న్యాయం..రాష్ట్రానికో న్యాయమా!
● మాజీ మంత్రి పెద్దిరెడ్డి సాక్షి, మదనపల్లె: అక్రమాల విషయంలో బీజేపీ ద్వందనీతి ప్రదర్శిస్తూ కేంద్రానికి ఒక న్యాయం, రాష్ట్రానికి ఒక న్యాయంగా వ్యవహరించడం తగదని మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీని ప్రశ్నించారు. శనివారం అన్నమయ్యజిల్లా తంబళ్లపల్లె, మదనపల్లె, పీలేరు నియోజకవర్గాల్లో జరుగుతున్న నిరాహర దీక్షల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ నీట్ లీకేజీ గురించి ఆరోపణలు వస్తే బీజేపీ బాధ్యత తీసుకుని కేంద్రమంత్రిగా ఉన్న ధర్మేంద్ర ప్రధాన్ చేత రాజీనామా చేయించారన్నారు. రాష్ట్రంలో జరిగిన డీఎస్సీ నియామకాల్లో మంత్రి లోకేష్ను అయ్యా డబ్బు తీసుకుని సగం ఉద్యోగాలను అమ్ముకున్నావు దీనికి రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తుంటే అబ్బేబే నేను ఎందుకు చేస్తాను, నేనేం తప్పు చేయలేదని తప్పించుకుంటున్నారని అన్నారు. రాష్ట్రంలో కూటమిగా బీజేపీ అధికారంలో ఉంది, కూటమి ప్రభుత్వంలోని టిడిపి డీఎస్సీ నియామకాల్లో అక్రమాలకు పాల్బడుతుంటే బీజేపీ ఏం చేస్తోందని ప్రశ్నించారు. ఒకే అంశంపై బీజేపీ కేంద్రంలో మంత్రికి ఒక న్యాయం,రాష్ట్రంలో లోకేష్కు ఒక న్యాయంగా వ్యవరించడం సబబుగాలేదన్నారు. జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాధరెడ్డి మాట్లాడుతూ డీఎస్సీ పేరుతో అనర్హులకు ఉద్యోగాలు కట్టబెట్టి పేద అభ్యర్థులకు తీరని అన్యాయం చేశారని నిలదీశారు. ఈ అక్రమాలపై నిరుద్యోగ యువత తీవ్ర ఆగ్రహంతో ఉందన్నారు. నిరుద్యోగులకు 20 లక్షల ఉద్యోగాలన్నారు, ఇచ్చారా, నిరుద్యోగ భృతి రూ.3 వేలన్నారు, ఇచ్చారా, ఇలాంటి మోసాకారి హామీలతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు నిరుద్యోగుల అగ్రహానికి గురికాక తప్పదని హెచ్చరించారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగుల ‘ఆకలి కేకలు’
● మూడో నెల కావస్తున్నా అందని వేతనాలు పెద్దతిప్పసముద్రం: అసలే చాలీ, చాలని వేతనాలు. అవి కూడా ప్రతి నెలా సక్రమంగా మంజూరు కావు. నెలల తరబడి జీతాలను మంజూరు చేయకుండా కాలయాపన చేస్తే తమ జీవనం ఎలా గడుస్తుందని పలువురు చిరుద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సమగ్ర శిక్షా అభియాన్ (ఎస్ఎస్ఏ)లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న సిబ్బందికి జూన్, జూలై నెలకు సంబంధించి ఇంత వరకు జీతాలు అందలేదు. జీతాలు రానందున చిరుద్యోగుల ఇంటి అద్దెలు, నిత్యావసర సరుకులు, పిల్లల ఫీజులు, ఈఎంఐలు సకాలంలో చెల్లించలేని పరిస్థితి. ద్విచక్ర వాహనాల్లో ఇంధనం కోసం ప్రైవేట్ వ్యక్తుల వద్ద అప్పులు చేయాల్సిన పరిస్థితి ఏర్పడిందని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మూడో నెల కావస్తున్నా కూడా జీతాలు రాకుంటే పూట గడిచేది ఎలా అంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పెండింగ్లో ఉన్న రెండు నెలల జీతాలను ప్రభుత్వం వెంటనే విడుదల చేయాలని కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ నాయకులు పాలకులకు, అధికారులకు విన్నవించినా ఇంత వరకు అతీగతీ లేకుండా పోయిందని పలువురు అసంతప్తి వ్యక్తం చేస్తున్నారు. జీతాల మంజూరు విషయంపై సమగ్ర శిక్ష అధికారులను వివరణ కోరగా త్వరలోనే జమ అవుతాయని చెబుతున్నారు. జిల్లాలో కాంట్రాక్ట్ ఉద్యోగులు అన్నమయ్య జిల్లాలోని 25 మండలాల్లో కస్తూర్బా బాలికా విద్యాలయం, ఎంఈఓ కార్యాలయం, భవిత కేంద్రాల్లో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేసే వారు 262 మంది ఉన్నారు. వీరిలో ఉద్యోగ స్థాయిని బట్టి ఒక్కొక్కరికి కేవలం రూ.17 వేల నుంచి రూ.27 వేల వరకు జీతాలు మంజూరు అవుతాయి. వీరిలో జిల్లా వ్యాప్తంగా డేటా ఎంట్రీ ఆపరేటర్లు 25 మంది, మండల ఇన్ఫర్మేషన్ సిస్టం (ఎంఐఎస్) కోఆర్డినేటర్లు 22 మంది, ఎంఆర్సీకి అనుభంధంగా ఉన్న సీఆర్పీలు 130 మంది, మెసెంజర్లు 28 మంది, భవిత సెంటర్ టీచర్లు 57 మంది ఉన్నారు. -
ఇంటి స్థలం రక్షణ గోడ ధ్వంసం
● కబ్జాకు యత్నిస్తున్నారంటూ బాధితురాలు ఫిర్యాదు మదనపల్లె టౌన్ : మదనపల్లెలోని కురవంక ప్రాంతంలో ఇంటి స్థలం రక్షణ గోడను కిరాయి రౌడీలు ధ్వంసం చేయడంతో స్థానికంగా కలకలం రేగింది. శనివారం ఉదయం బాధితురాలు నాగిరెడ్డిగారి వాణి స్థానిక ఒకటవ పట్టణ పోలీస్ స్టేషన్లో చేసిన ఫిర్యాదులో ఆమె తెలిపిన ప్రకారం వివరాలు ఇలా ఉన్నాయి. కురవంకలో 2008లో తన కుమార్తె అనూష పేరిట ఇంటి స్థలాన్ని కొనుగోలు చేశామన్నారు. అనంతరం దాన్ని తన పేరున జీపీ చేయించి అనూషా అమెరికాకు వెళ్లారని తెలిపారు. ఆ భూమిపై కన్నేసిన కబ్జాదారులు కిరాయి గుండాలతో వచ్చి రక్షణ గోడను ధ్వంసం చేశారని ఆరోపించారు. అడ్డుకున్న తమపై దాడి చేసి గాయపరచి, చంపుతామని బెదిరించారని ఆవేదన వ్యక్తం చేశారు. వెంటనే అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని, భూమి ఆక్రమణకు గురికాకుండా చూడాలని ఫిర్యాదులో కోరారు. ఫిర్యాదు అందుకున్న వన్టౌన్ సీఐ రాజారెడ్డి పోలీసులను సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించి వివరాలు సేకరించాలని ఆదేశించారు. పోలీసులు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టాలని ఆదేశించినట్లు తెలిపారు. భూ వివాదం కోణంలో విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ ఘటనతో కురవంక ప్రాంతంలో కాస్త ఉద్రిక్తత నెలకొంది. -
హెచ్చరిక బోర్డు ఉన్నా కబ్జాకు బరి తెగింపు
కురబలకోట: హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసి ఆక్రమణలకు తావు లేదని స్పష్టం చేసినప్పటికీ యథేచ్ఛగా మరోసారి భూ కబ్జాకు బరితెగించారు. వివరాలలోకి వెళితే...కురబలకోట మండలం వినాయక చేనేతనగర్లో విలువైన మూడు ఎకరాల డీకేటీ స్థలం ఉంది. ఇది మదనపల్లె పట్టణానికి దగ్గరగా ఉండడంతో గతంలో కూడా కొందరు ఇక్కడ ఈ భూమిలో ప్రవేశించి ఆక్రమణకు యత్నించారు. అప్పట్లో రెవెన్యూ అదికారులు అడ్డుకుని హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. ఈ క్రమంలో మరోసారి మళ్లీ శుక్రవారం ఆక్రమణదారులు జేసీబీతో చదును చేయడం ప్రారంభించారు. గమనించిన స్థానికులు అప్రమత్తమై వెంటనే రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేశారు. తహసీల్దారు ఆదేశాలతో వీఆర్వో ఖాదర్ బాషా ఆక్రమణ స్థలానికి వెళ్లి పనులను నిలుపుదల చేయించారు. నిర్మాణాలను కూడా కూలదోయించారు. ఇందులో ఎవ్వరూ ప్రవేశించకుండా పకడ్బందీ చర్యలు చేపట్టినట్లు తహసీల్దారు ధనుంజయలు తెలిపారు. ప్రభుత్వస్థలాల కబ్జాకు పాల్పడితే క్రిమినల్ చర్యలు తప్పవని హెచ్చరించారు. -
చేనేతకు ఉద్యమ చరిత్ర
డీఆర్ఓ వెంకటేష్ సాక్షి, మదనపల్లె: చేనేతకు స్వాతంత్య్ర చరిత్ర ఉందని జిల్లా రెవెన్యూ అధికారి వెంకటేష్ అన్నారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్న సేవలో కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చేనేత రంగం భారత స్వాతంత్య్ర ఉద్యమంతో ముడిపడి ఉన్న గొప్ప వారసత్వమన్నారు. మహాత్మా గాంధీ పిలుపునిచ్చిన స్వదేశీ వస్త్రాలను ధరించండి–విదేశీ వస్త్రాలను బహిష్కరించండి నినాదం స్వాతంత్య్ర ఉద్యమంలో చేనేత రంగం కీలక పాత్ర పోషించిందని అన్నారు. ఎమ్మెల్యే షాజహాన్ బాషా మాట్లాడారు. అనంతరం జిల్లాలో 3,869 మంది లబ్ధిదారులకు నేతన్న సేవలో పథకం కింద రూ.9.67 కోట్ల ఆర్థిక సహాయం చెక్కును లబ్ధిదారులకు అందించారు. వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ శివరామ్, చేనేత శాఖ అధికారి పవన్ కుమార్, చేనేత సంఘ నాయకులు నీలకంఠ, సిద్ధప్ప,హరికృష్ణ, సత్యం పురుషోత్తం, నరసింహ, వివిధ మహిళా సంఘాల ప్రతినిధులు, చేనేత ,జౌళి శాఖ అధికారులు పాల్గొన్నారు. -
శ్రీ రెడ్డెమ్మతల్లికి సారె సమర్పణ
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లికి ఆషాఢమాస చీరెసారె సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. శుక్రవారం జిల్లా సమరసతా సేవా ఫౌండేషన్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున మహిళలు శ్రీ రెడ్డెమ్మకొండకు చేరుకొన్నారు. ప్రతి ఏటా ఈ సంస్థ ఆధ్వర్యంలో ఆషాఢమాసంలో అమ్మవారికి చీరెసారె సమర్పించడం ఆనవాయితీగా వస్తొంది. ఈనేపథ్యంలో స్థానిక దద్దాలవారిపల్లె నుంచి అమ్మవారి ఆలయం వరకు చెక్కభజనల నడుమ ఊరేగింపుగా చీరసారెను తీసుకొచ్చారు. మహిళలు వాటిని అమ్మవారికి సమర్పించి మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయప్రాంగణంలో ఏర్పాటు చేసిన సమావేశంలో పలువురు ఆధ్యాత్మిక గురువులు తమ ఉపదేశాలు, ఉపన్యాసాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయకమిటీ ఛైర్మన్ రాజన్న నాయడు, ఈవోమంజులు, జిల్లా సమరసతా సేవా ఫౌండేషన్ ప్రతినిధులు పాల్గోన్నారు. మాజీ ఎమ్మెల్యే కుటుంబాన్ని వేధిస్తే ఊరుకోంపుంగనూరు : రాష్ట్ర ప్రభుత్వం ముస్లిం మైనార్టీ నాయకులపై పథకం ప్రకారం అక్రమ కేసులు బనాయించి, అరెస్ట్ చేయడం, వేధించడం చేస్తే చూస్తూ ఊరుకోబోమని వైఎస్సార్సీపీ సీమ జిల్లాల మైనార్టీ సెల్ అధ్యక్షుడు ఫకృద్ధిన్ షరీఫ్, హజ్ కమిటీ మాజీ డైరెక్టర్ ఖాదర్ హెచ్చరించారు. శుక్రవారం విలేకరులతో వారు మాట్లాడారు. గుంటూరు మాజీ ఎమ్మెల్యే ముస్తఫా, ఆయన తనయుడు ముబషీర్లపై తప్పుడు కిడ్నాప్ కేసులు బనాయించి, నూజివీడు పోలీసులు అరెస్ట్ చేయడం బాధాకరమన్నారు. అక్రమ కేసులకు వైఎస్సార్సీపీ నాయకులు భయపడే ప్రసక్తే లేదని అన్నారు. ముస్తఫా కుటుంబానికి అండగా ఉంటామని తెలిపారు. ముస్తఫా కుటుంబంపై పెట్టిన తప్పుడు కేసులు ఉపసంహరించుకుని, తండ్రి, తనయులను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. లేకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ముస్లింలు ఆందోళనలు చేపడుతామని హెచ్చరించారు. -
సాంకేతికతతో చేనేత రంగానికి కొత్త ఊపు
కురబలకోట: భారతీయ చేనేత వారసత్వాన్ని పరిరక్షించడంతో పాటు ఆధునిక సాంకేతిక పరిజ్ణానాన్ని చేనేత రంగానికి అనుసంధానం చేసి కార్మికుల జీవనోపాధిని మెరుగుపర్చాలని అంగళ్లులోని మిట్స్ యూనివర్సిటీ ఇండస్ట్రీ రిలేషన్స్ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పీఎం, బాలాజీ కోరారు. చేనేత దినోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ దేశ సంస్కృతి, సంప్రదాయాలకు చేనేత కూడా ప్రతీకగా నిలచిందన్నారు. ఈ గొప్ప వారసత్వాన్ని భావితరాలకు అందించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. ముఖ్యంగా ఏఐ,డిజిటల్ సాంకేతికత వంటి అదునిక ఆవిష్కరణలను చేనేత రంగంలో వినియోగించడం ద్వారా ఉత్పత్తి, మార్కెటింగ్, విక్రయాల్లో విప్లవాత్మక మార్పులు తీసుకు రావచ్చన్నారు. యువ ఇంజినీర్లు డిజైన్, డిజిటల్ మార్కెటింగ్, మార్కెట్ విస్తరణ వంటి రంగాల్లో సాంకేతిక పరిష్కారాలు అందించి ప్రపంచ వ్యాప్తంగా గుర్తింపు తీసుకు రావాలని డాక్టర్ బీ. అనిత అన్నారు. -
వివాదంలో గ్రీన్ఫీల్డ్ హైవేబ్రిడ్జి !
● జగతికట్ట నుంచి కాకుండా... ఏటిలో.నిర్మాణం ● 200 మీటర్ల దూరం నుంచి బ్రిడ్జి పనులు ● ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో వరదనీటి ముప్పు రాజంపేట: నందలూరు చెయ్యేరు నదిపై హై లెవల్ వంతనె (బ్రిడ్జి) నిర్మాణం అంశం ఇప్పుడు వివాదంలో పడింది. జగతి కట్ట నుంచి కాకుండా పాతవంతెన ప్రకారం నిర్మాణం చేపట్టడం వల్ల ఈ పరిస్ధితి నెలకొంది.ఇలా నిర్మిస్తే భవిష్యత్తులో వరదనీటి ముప్పు వాటిల్లుతుందని స్ధానికులు వాపోతున్నారు. దారితప్పిన బ్రిడ్జి నిర్మాణం.. చెయ్యేరు నదిపై గ్రీన్ఫీల్డ్ హైవే బ్రిడ్జి నిర్మాణ పనులు చేపట్టారు. కట్టపై నుంచి కాకుండా 200 మీటర్ల దూరంలో నిర్మాణ పనులు చెయ్యేరు నదిలో చేపట్టారు.బ్రిడ్జి నిర్మాణ వ్యవహారంపై స్ధానికంగా అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. బ్రిడ్జి నిర్మాణంపై వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ సిద్ధవరం గోపిరెడ్డి ఆధ్వర్యంలో స్ధానిక నాయకులు నిర్మాణ ప్రాంతాన్ని పరిశీలించారు. వంతెన నిర్మాణం దారితప్పినట్లుగా ఆరోపించారు. -
అనంతపురం, కర్నూల్ జట్ల విజయం
వాల్మీకిపురం: స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో సౌత్జోన్ అండర్ –23 ఉమెన్స్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లా పోటీలు జరిగాయి. శుక్రవారం గ్రౌండ్ 1లో జరిగిన కడప, అనంతపురం మ్యాచ్ల్లో టాస్ గెలిచిన అనంతపురం జట్టు 50 ఓవర్లలో 7 వికెట్లు నష్టానికి 304 స్కోర్ చేసింది. అనంతరం బ్యాంటింగ్ చేపట్టిన కడప జట్టు 36 ఓవర్లలో 122 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో 144 పరుగుల తేడాతో అనంతపురం విజయం సాధించింది. అనంతపురం జట్టుకు చెందిన ఆర్షియానేహా 102 బంతుల్లో 96 పరుగులు చేసింది.హాన్సిరెడ్డి 75 పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో మూడు వికెట్లు తీసుకుంది. అలాగే నందిని 28పరుగులు చేయడంతో పాటు బౌలింగ్లో 4 వికెట్లు తీసుకుని జట్టు విజయంలో వీరు కీలకపాత్ర పోషించారు. గ్రౌండ్ 2లో చిత్తూరు, కర్నూలు జట్ల మధ్య జరిగిన మ్యాచ్లో టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ చేపట్టి 50 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 298 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 17.3 ఓవర్లలో 84 పరుగులు చేసి ఆలౌట్ అయింది. దీంతో కర్నూలు జట్టు 214 పరుగుల తేడాతో గెలుపొందింది. కర్నూలు జట్టుకు చెందిన బ్యాట్స్మెన్ శ్రీనవ్య 134 బంతుల్లో 107 పరుగులు చేసింది. అలాగే ఇదే జట్టుకు చెందిన ఫాజియా కేవలం 4 పరుగులు ఇచ్చి ఐదు వికెట్లు తీసుకొని జట్టు విజయానికి దోహదం చేసింది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, శ్రీధర్కుమార్, సతీష్యాదవ్, సునీల్కుమార్, అనిత, యామిని, మౌనిక, శేఖర్, మాధవి, తదితరులు పాల్గొన్నారు. -
బంగారు నగలు చోరీ
రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని గాండ్లవీధిలోని ఒక ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడి బంగారు నగలను దోచుకెళ్లారు. వివరాలు ఇలా ఉన్నాయి. గాండ్లవీధికి చెందిన జరీనా భర్త బాదుల్లా కువైట్లో జరిగిన రోడ్డు ప్రమాదంలో పది సంవత్సరాల క్రితం మృతి చెందాడు. దీంతో బతుకు దెరువు కోసం తన కుమారుడు మహమ్మద్తో కలిసి సంవత్సరం క్రితం కువైట్కు వెళ్లింది. కువైట్కు వెళ్లే సమయంలో బంగారు నగలను బ్యాంక్లో తాకట్టు పెట్టింది. తర్వాత మూడు నెలలకు కుమారుడు మహమ్మద్ ఇండియాకు వచ్చి బంగారు నగలను విడిపించి ఇంట్లో బీరువాలో పెట్టి తిరిగి కువైట్కు వెళ్లాడు. తర్వాత పీలేరులో ఉన్న కుమారై 15 రోజులకు ఒక సారీ పీలేరు నుంచి రొంపిచెర్లకు వచ్చి ఇళ్లు చూసుకుని వెళ్లేది. అయితే శుక్రవారం ఇంటి ముందర చెత్త తోయడానికి వచ్చిన అమ్మమ్మకు తలుపులు పగులగొట్టి ఇంట్లో చోరీ చేసినట్లు చూసి పక్కన ఉన్న వారికి సమాచారం ఇచ్చింది. దీంతో రిజ్వాన రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. 151 గ్రాముల బంగారు నగలను దొంగలు ఎత్తుకెళ్లినట్లు తెలిపారు. బంగారు నగల విలువ సుమారు రూ.25 లక్షలు ఉంటుందన్నారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. అనంతరం చిత్తూరులోని వేలిముద్రల నిపుణులను రొంపిచెర్లకు రప్పించి వేలిముద్రలను సేకరించారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూదన్ తెలిపారు. -
రోడ్డు ప్రమాదంలో విద్యార్థినికి తీవ్రగాయాలు
మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని తీవ్రంగా గాయపడిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. వివరాలు.. మండలంలోని కోటవారిపల్లెకు చెందిన గంగరాజు కుమార్తె హేమలత (14) మదనపల్లె కోటబడి మునిసిపల్ హైస్కూల్లో 9వ తరగతి చదువుతోంది. తన పినతండ్రి వెంట బైకులో మదనపల్లి లోనికోటబడి మున్సిపల్ హైస్కూల్ కు వస్తుండగా, బెంబకూరు రోడ్డు, గంగమ్మ గుడి మలుపు వద్ద బైకు అదుపుతప్పి పడి విద్యార్థిని హేమలత తీవ్రంగా గాయపడింది. స్థానికులు గమనించి బాధితురాలిని ప్రభుత్వాసుపత్రికి తరలించి చికిత్స అందించడంతో కోలుకుంటూ ఉంది. చెట్టు పై నుంచి పడి.. మదనపల్లె టౌన్: ఇంటి నిర్మాణానికి అడ్డంగా ఉన్న అళ్ళనేరేడు చెట్టు కొమ్మలు రంపంతో కత్తిరించే క్రమంలో అదుపుతప్పి కింద పడి ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడ్డాడు. శుక్రవారం మదనపల్లె కురవంకలో జరిగిన ఘటనపై వివరాలు.. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ, రంగారెడ్డి కాలనీలో కాపురం ఉంటున్న రమేష్(45) చెట్లు కోసేందుకు పట్టణంలోని ఎగువ కురవంకకు వెళ్లాడు. అల్ల నేరేడు చెట్టు ఎక్కి కొమ్మలు కోస్తుండగా, ప్రమాదవశాత్తు కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి బాధితుడిని జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్సలు అందించిన ఆసుపత్రి అత్యవసర విభాగం డాక్టర్లు అతని పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా పోలీసులు తెలిపారు. -
కూటమి పాలనలో విద్యావ్యవస్థ నిర్వీర్యం
రాయచోటి టౌన్ : కూటమి ప్రభుత్వం విద్యావ్యవస్థను నిర్వీర్యం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షులు జి. వలరాజు ఆరోపించారు. శుక్రవారం ఏఐఎస్ఎఫ్ 90 సంత్సరాలు పూర్తి చేసుకున్నసందర్భంగా తహసీల్దార్ కార్యాలయం సమీపంలో ఏఐఎస్ఎఫ్ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం పట్టణంలో ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యను కార్పోరేటీకరణ చేయడానికి సిద్ధమయ్యారని విమర్శించారు. రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరావు మాట్లాడుతూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ యువగళం పాద సమయంలో ఫీజు రీయింబర్స్మెంట్,స్కాలర్షీప్ బకాయిలు కేవలం వంద రోజుల్లోనే ఆయా కళాశాల అకౌంట్లలో జమ చేస్తామని చెప్పారన్నారు. రెండు సంవత్సరాలైనా బకాయిలు చెల్లించకుండా విద్యార్థుల జీవితాలతో ఆటలాడుకొంటున్నారని విమర్శించారు. ఉమ్మడి కడప జిల్లా అధ్యక్షుడు మహేష్ మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ వసతి గృహ విద్యార్థులకు కనీస మౌలిక వసతులు లేకపోవడంతో విద్యార్థులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారన్నారు. ప్రభుత్వం విద్యార్థులకు మెరుగైన వసతులు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి మాధవ్, సీపీఐ ఏరియా కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, ఏఐఎస్ఎఫ్ పట్టణ నాయకులు లోకేష్, నరేష్, సుబాన్,మల్లిఖార్జున, లక్ష్మీకర్, తదితరులు పాల్గొన్నారు. -
డిగ్రీ అడ్మిషన్లు ప్రారంభం
మదనపల్లె సిటీ: డిగ్రీ జనరల్ కోర్సులలో ప్రవేశానికి అడ్మిషన్లు ప్రారంభమయ్యాయని ప్రభుత్వ మహిళా డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ కె.బ్రహ్మాచారి తెలిపారు. బీఏ, బీకాం, బీఎస్సీ, బీబీఏ కోర్లుల్లో ఆన్లైన్లో ప్రవేశాల ప్రక్రియ ప్రారంభమైనట్లు తెలిపారు. ఇంటర్మీడియట్ లేదా తత్సమాన పరీక్షల్లో ఉత్తీర్ణులైన విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. కాలేజీలో అత్యుత్తమ బోధనతో పాటు ఆధునిక సౌకర్యాలు ఉన్నాయని వివరించారు. ప్రశాంతంగా టెట్ మదనపల్లె సిటీ: ఏపీ టెట్ పరీక్షలు మూడవ రోజు శుక్రవారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మదనపల్లె సమీపంలోని ఆదిత్య, అంగళ్లులోని మిట్స్, రాయచోటిలోని శ్రీసాయి, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజీలో టెట్ పరీక్షలు జరిగాయి. 650 మందికి 542 మంది పరీక్షలు రాశారు. మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో పరీక్షా కేంద్రాన్ని జిల్లా విద్యాశాఖ ఏడీ రవికుమార్,ఎంఈఓ ప్రభాకర్రెడ్డిలు తనిఖీ చేశారు. అభ్యర్థులకు కల్పించిన మౌళిక వసతులు, కంప్యూటర్ సిస్టమ్ లభ్యతను తనిఖీ చేశారు. హుండీ ఆదాయం లెక్కింపు రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీభద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలోని అన్ని ప్రధాన హుండీలను లెక్కించారు. శుక్రవారం దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాథ పర్యవేక్షణలో జరిగిన ఈ లెక్కింపులో మొత్తం రూ.31,76,546ల నగదుతో పాటు 20 గ్రాముల బంగారు, వెండి 1.922 కిలో ఉన్నట్లు వెల్లడించారు. ఈ మొత్తం నగదును డీసీసీ బ్యాంక్ ఖాతాలో జమచేసినట్లు ఆలయ పాలకమండలి అధ్యక్షుడు తిరుమల మనోజ్కుమార్, ఆలయ సహాయ కమిషనర్ , ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. అలాగే అన్నదానం కోసం వచ్చిన మొత్తాన్ని స్టేట్బ్యాంక్లో ఆలయ ఖాతాలో జమ చేసినట్లు తెలిపారు. మొత్తం 135 రోజులకు గాను ఈ హుండీల లెక్కింపు చేశారు. ఆలయ పాలక మండలి సభ్యులు కారంశెట్టి గిరి, ఓ. సుబ్రహ్మణ్యం, జి.నాగేశ్వర్లు,డీసీసీ బ్యాంక్ సిబ్బంది, ఏఎస్ఐ టి. చంద్రశేఖర్ ఇతర ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ముందస్తు ప్రణాళిక ముఖ్యం – జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటమోహన్ రాయచోటి (చిన్నమండెం) : వర్షాభావ పరిస్థితులు, అధిక ఉష్ణోగ్రతలు, తక్కువ వర్షపాతం వంటి ఎల్నినో ప్రభావాలను దృష్టిలో ఉంచుకుని రైతులు ముందస్తు ప్రణాళికతో పంటలసాగు చేపట్టాలని పీఎండీఎస్ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ బి.వెంకటమోహన్ సూచించారు. శుక్రవారం చిన్నమండెం మండలం వండాడి గ్రామంలో నిర్వహించిన రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ రైతులతో సమావేశమై ఎల్నినో ప్రభావం, దాని నివారణకు చేపట్టాల్సిన చర్యలు, ప్రకృతి వ్యవసాయ పద్ధతులపై అవగాహన కల్పించారు. బెట్టను తట్టుకునే అనప, బెండ, ఆముదం, అలసంద, కొర్రలు వంటి పంటలను సాగు చేయాలని సూచించారు. ఆర్ఎస్కే సిబ్బంది, మాస్టర్ ట్రైనర్ పద్మావతి, మండల టీం లీడర్ భూపాల్రెడ్డి, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది, ఎఫ్ఎంటీస్, ఐసీఆర్పీలు, రైతులు పాల్గొన్నారు. ‘మిల్లెట్స్తో.. స్వయం ఉపాధి’పై శిక్షణ కడప అగ్రికల్చర్: కడప కృషి విజ్ఞాన కేంద్రంలో శుక్రవారం నాబార్జు ప్రాజెక్టు కింద సెల్ఫ్ క్రాప్టెడ్ కెరీర్ విత్ మిల్లేట్స్ అంశంపై శిక్షణ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ శిక్షణలో భాగంగా మిల్లెట్స్ పరిచయం, వివిధ రకాల మిల్లెట్స్ వాటి సాగు పద్ధతులపై అవగాహన కల్పించారు. అలాగే అంగ్రూలో అభివృద్ధి చేసిన మిల్లెట్ రకాలు, బయోఫోర్టిఫైడ్ మిల్లెట్ రకాలపై ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అనంతరం మిల్లెట్స్తో తయారు చేసే సాంప్రదాయ ఆహార పదార్థాల తయారీలో ప్రాక్టికల్ హ్యాండ్స్–ఆన్ శిక్షణ అందించారు. ఈ కార్యక్రమంలో శాస్త్రవేత్తలు పాల్గొన్నారు. -
వ్యక్తి దారుణ హత్య
సంబేపల్లె : మండల పరిధిలోని రెడ్డివారిపల్లె పంచాయతీకి చెందిన పాటూరి ఈశ్వరయ్య(50) అనే వ్యక్తి గురువారం రాత్రి హత్యకు గురయ్యాడు. పోలీసుల కథనం మేరకు దేవపట్లగ్రామం గంగన్నగారి ఇండ్ల సమీపంలోని రీ సర్వే చేస్తున్న క్రమంలో గుట్టలో ఓ వ్యక్తి పడి ఉన్నారని పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే సంఘటన స్థలానికి ఎస్ రవికుమార్ చేరుకున్నాడు. మృతుని దగ్గ ఉన్న ఆధార్ కార్డు ఆధారంగా ఈశ్వయ్యగా పోలీసులు గుర్తించారు. ఇతను తరచూ మద్యం తాగేవాడని తెలిపారు. గురువారం రాత్రి ఈ్వశ్వరయ్యతో మద్యం తాగించి, బండరాయితో తలపై కొట్టి, వయర్తో హత్య చేసినట్లు సంఘట స్థలంలో ఉన్న ఆధారాలను బట్టి పోలీసులు తెలిపారు. మృతుడు ఒంటరిగానే జీవిస్తుండే వాడని తెలిపారు. సంఘటన స్థలాన్ని రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, ఇన్చార్జి సీఐ కృష్ణంరాజునాయక్ పరిశీలించారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై టీడీపీ గుండాల దాడి
వాల్మీకిపురం: అన్నమయ్య జిల్లా చింతపర్తికి చెందిన మాజీ సర్పంచ్ కుమారుడు, వైఎస్సార్సీపీ నాయకుడు నల్లంకి నాగేంద్ర బాబు ఐదు షెడ్లలో కోళ్లఫారం నడుపుకుంటున్నట్లు తెలిపారు. ఇందులో మూడు షెడ్లు ననిత అనే ఆమెకు లీజుకు ఇచ్చానని, అయితే గురువారం రాత్రి కోళ్లఫారం వద్దకు వెళ్లిన ననిత, ఆమె కుమారుడు యశ్వంత్, స్నేహితుడు గిరీష్, టీడీపీ చెందిన హర్షవర్థన్, తేజ పక్కన ఉన్న యజమాని కోళ్లఫారంలోకి ప్రవేశించి అక్కడ ఉన్న సంచులను దొంగతనంగా ఎత్తుకెళ్లేందుకు ప్రయత్నం చేశారన్నారు. ఈ విషయాన్ని గమనించిన అక్కడే ఉన్న కూలీ గులాబ్ దస్తగిర్, అతని భార్య ఇద్దరు అడ్డుపడి సంచులు ఎక్కడికి తీసుకెళ్తున్నారు.. ఎవరిని అడిగారు అని ప్రశ్నించగా.. టీడీపీ నాయకులము మమ్మల్నే అడుగుతావా అంటూ గులాబ్ దస్తగిర్పై దాడికి పాల్పడి, దౌర్జన్యంగా సంచులను ఎత్తుకెళ్లినట్లు నాగేంద్రబాబు తెలిపారు. విషయం తెలుసుకున్న కోళ్లఫారం యజమాని, వైఎస్సార్సీపీ నాయకుడు నల్లంకి నాగేంద్ర బాబు సంఘటనాస్థలానికి చేరుకొని మా కూలీపై ఎందుకు దాడి చేశారు అని అడగగా.. నాగేంద్ర బాబుపై కూడా దాడికి పాల్పడ్డారు. దీంతో గులాబ్ దస్తగిర్ను స్థానిక ప్రభుత్వాసుపత్రిలో చికిత్స చేయిస్తున్నారు. శుక్రవారం నల్లంకి నాగేంద్రబాబు స్థానిక పోలీసులు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కోళ్లఫారంలోకి వచ్చి యజమానిపై దౌర్జన్యం అడ్డుపడిన కూలీపై దాడి -
చెప్పేదే ధర.. చేసేదే చట్టం!
రాజంపేట : బియ్యం ధరలకు రెక్కొలచ్చాయి. నిత్యావసర సరుకలతో పోటీపడుతూ రోజురోజుకీ పెరుగుతూనే ఉన్నాయి. ఒకే సారి రూ.100 పెంచేయడంతో సామాన్యులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో పెద్దగా వర్షాలు కురువకపోవడంతో మరింత సమస్యగా మారింది. బియ్యం ధరలకు కళ్లెం వేసే పరిస్థితిలో కూటమి ప్రభుత్వం లేదు. దళారుల దగాను అడ్డుకోలేకపోతోందని సామాన్యులు పెదవి విరుస్తున్నారు. జిల్లాలో ఎక్కడైనా..ఏ ప్రాంతంలోనైనా వ్యాపారులు బియ్యం బస్తాల ధరలను అమాంతంగా పెంచేశారు. ఈ ఏడాది ఎల్నినో ప్రభావంతో వర్షాలు కురవడంలేదు. ఈ ప్రభావం ప్రస్తుత ఖరీఫ్పై పడింది. దీంతో వచ్చే ఏడాది పంట దిగుబడి తగ్గనుంది. రానున్న రోజుల్లో డిమాండ్ ఏర్పడి , ధరలు మరింత పెరిగే అవకాశం ఉందని సాకుతో వ్యాపారులు ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నారు. కూటమి ప్రభుత్వం,సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారని సామాన్యులు పెదవివిరుస్తున్నారు. నెలకో విధంగా.. ఈ ఏడాది మార్చి నెల నుంచి క్రమంతప్పకుండా ధరలు పెరుగుతూనే ఉన్నాయి. దాదాపు ప్రజలంతా స్టీమ్డ్ రైసును వినియోగిస్తున్నారు. నాలుగునెలతో పోలిస్తే 26 కేజీల బస్తాపై సుమారు రూ.400 పెరిగింది. మిల్లుల వద్ద సాధారణ రకం సుమారు 26 కిలోలు రూ.950కి లభిస్తోంది. సీఆర్ రకం రూ,1350, సాంబమసూరి రూ.1,550, బీపీటీ రూ.1600, హెంఎంటీ రూ.1750లకు విక్రయిస్తున్నారు. ఇతర జిల్లాల నుంచి దిగుమతి అవుతున్న బియ్యం ధరలు మరింత పెరిగాయి. ప్రధానంగా కర్నూలు, నెల్లూరు, మాచెర్ల కారంపూడి తదితర ప్రాంతాల నుంచి బియ్యం దిగుమతి అవుతోంది. కొత్తబియ్యమే దిక్కు.. సాధారణంగా ఎక్కువ మంది ప్రజలు పాత బియ్యానికి ప్రాధాన్యత ఇస్తారు. వీటి లభ్యత తగ్గిపోయింది.విధిలేని పరిస్థితిలో కొత్తబియ్యాన్ని ప్రజలు కొనుగోలు చేస్తున్నారు. దీంతో పాత, కొత్త బియ్యం ధరలను పెంచేస్తున్నారు. ధరల నియంత్రణలో కూటమి ప్రభుత్వం విఫలమైందని సామాన్యులు చెబుతున్నారు. అక్రమనిల్వలపై దాడులేవి.. బియ్యం వాపారాన్ని ప్రధానంగా ఇతర జిల్లాలకు చెందిన వ్యాపారులు నియంత్రిస్తున్నారని అభిప్రాయం మార్కెట్ వర్గాల్లో వ్యక్తమౌవుతోంది. ధాన్యాన్ని పెద్దమొత్తంలో సేకరించి జిల్లాలోని మిల్లులు, గోదాముల్లో నిల్వ ఉంచుతున్నారని మార్కెట్లో సరఫరా పరిమితం చేస్తూ ధరలనుక్రమంగా పెంచుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. దోచేస్తున్నారు... బియ్యం వ్యాపారులు, సిండికేటుగా ఏర్పడి దోచేస్తున్నారు.వారు చెప్పిందే ధరగా , చేసిందే చట్టంలా మారుతోంది.ఎక్కువ మంది పక్క జిల్లాల నుంచి దిగుమతి బియ్యాన్ని వినియోగస్తుండటంతోడిమాండ్ పెరిగింది. ఇదే అదునుగా చూసుకొని ధరలను పెంచేస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. బియ్యంపై ఆధారపడే వ్యాపారం బియ్యంపై ఆధారపడి జరిగే వ్యాపారంలో ధరల పెరగుల కనిపిస్తోంది. హోటళ్లలో భోజనాలు ధరలను కూడా పెరిగాయి. బియ్యంకు అనుబంధంగా ఉన్న వాటిపై ధరలను పెంచుకొని అమ్మకాలు చేస్తున్నారు. బియ్యం ధరల పెంపును సాకుగా చూపిస్తున్నారు. బియ్యం వ్యాపారుల సిండికేట్ సాకుగా ఎల్నినో,యుద్ధాలు నెలకో విధంగా ధరలు అడ్డగోలుగా జనం దగ్గర నుంచి దోచేస్తున్న వైనం -
వేలిముద్ర వేయించుకుని భూమి కాజేశారు
మదనపల్లె టౌన్: చదువురాని తన తల్లి దగ్గర వేలిముద్రలు వేయించుకుని తమ భూమిని కాజేయడమేకాకుండా ఆ భూమిలోకి తమను రానీయకుండా అడ్డుకుంటున్నారని ఓ బాధితురాలు చంటి బిడ్డలతో జిల్లా ఎస్పీ కార్యలయానికి వచ్చింది. తమకు జరుగుతున్న అన్యాయంపై గురువారం మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేసింది. బాధితుల కథనం మేరకు.. పుంగనూరు మండలం, చిన్ననల్లూరుపల్లెకు చెందిన కౌసల్య భూమిలో అదేగ్రామానికి చెందిన సుబ్బిరెడ్డి దౌర్జన్యంగా కట్టడాల కోసం తవ్వకాలు చేపట్టాడని బాధితురాలు తెలిపింది. దశాబ్దాల కిందట నుంచే సర్వే నంబర్ 248–6లో 43 సెంట్ల భూమి తమ ఆధీనంలో ఉందన్నారు. ఇటీవల తన తల్లి ధనలక్ష్మీ దగ్గర వేలిముద్రలు తీసుకొని, విక్రయించిందనే సాకుతో సుబ్బిరెడ్డి తమపై దౌన్జన్యాలకు పాల్పడుతున్నాడని పేర్కొంది. ఇటీ వల న్యాయస్థానాన్ని ఆశ్రయించడంతో తమకు ఇంజెక్షన్ ఆర్డరు కూడా ఇచ్చారని, అయినా అతను భూమిలోకి రావద్దని బెదిరిస్తున్నాడని, న్యాయం చేయాలని తల్లీ బిడ్డ కోరారు. -
కొనసాగుతున్న టెట్ పరీక్షలు
మదనపల్లె సిటీ : ఏపీ టెట్ పరీక్షలు రెండవ రోజు గురువారం జిల్లాలో ప్రశాంతంగా జరిగాయి. మదనపల్లె సమీపంలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీలో 89 మంది, మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో 88 మంది, సాయి ఇంజనీరింగ్ కాలేజీలో 134 మంది, భాస్కర్ ఇంజనీరింగ్ కాలేజీలో 85 మంది హాజరయ్యారు. మిట్స్ ఇంజనీరింగ్ కాలేజీలో జరిగిన టెట్ పరీక్ష కేంద్రాన్ని రాష్ట్ర విద్యాశాఖ పరిశీలకులు డాక్టర్ డి.మధుసూదనరావు పరిశీలించారు.అభ్యర్థులకు కల్పించిన మౌలిక వసతులు, కంప్యూటర్ సిస్టమ్ లభ్యతను తనిఖీ చేశారు. ఆయన వెంట డీఈఓ సుబ్రమణ్యం ఉన్నారు. ప్రభుత్వ భూములు గుర్తించాలిమదనపల్లె సిటీ : పీకేఎంయూడీఏ పరిధిలో ప్రభుత్వ భూములను గుర్తించాలని పీకేఎంయూడీఏ వైస్ చైర్మన్, జాయింట్ కలెక్టర్ శివనారాయణశర్మ అన్నారు. గురువారం స్థానిక పలమనేరు, కుప్పం, మదనపల్లె పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయంలో పట్టణ ప్రణాళిక, ఇంజనీరింగ్ శాఖల ప్రగతిపై సమీ క్షా సమావేశం జరిగింది. అభివృద్ధి పనులకు సంబంధించి పురోగతిపై ఇంజనీరింగ్ సిబ్బందితో సమీక్షించి పనులను త్వరగా పూర్తి చేయా లని ఆదేశించారు. పీకేఎంయూడీఏ సెక్రటరీ మనోహర్ తదితరులు పాల్గొన్నారు. వెలగనున్న హైవే లైట్లు కురబలకోట : మదనపల్లి– అంగళ్లు మార్గంలో హైవేపై పెండింగ్లో ఉన్న వీధి లైట్లు ఏర్పాటు చేస్తున్నట్లు మండల ట్రాన్స్కో ఏఈ శంకర్రెడ్డి తెలిపారు. రెండు రోజుల క్రితం సాక్షి దినపత్రికలో హైవేలో వెలగని లైట్లు అనే వార్త ప్రచురితమైన విషయం తెలిసిందే. దీంతో కాంట్రాక్టర్ నుంచి డిపాజిట్ కట్టించి వీటిని వేస్తున్నట్లు తెలిపారు. మండలంలోని సర్కారుతోపు నుంచి విశ్వం సర్కిల్ వరకు అదే విధంగా కడప క్రాస్, కాండ్లమడుగు క్రాస్ వరకు వీటిని వేయడానికి చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఇందుకు సంబంధించి పనులు చేపడుతున్నట్లు తెలిపారు. ఈ హైవేపై నిత్యం వేలాది మందితోపాటు పెద్ద ఎత్తున వాహనాలు రాకపోకలు సాగిస్తున్నాయి. దీంతో ఇన్నాళ్లు పెండింగ్లో ఉన్న హైవే పై వేధి లైట్లు వేయడానికి అధికారులు చర్యలు చేపట్టడంతో ప్రయాణీకులు, వాహనదారులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. -
పట్టువస్త్రాల సమర్పణ
సదుం: స్థానిక వళ్లీదేవసేన సమేత సుబ్రమణ్య స్వామి ఆలయంలో ఆడికృత్తిక ఉత్సవాలు జరుగుతున్నాయి. భరణి కావిళ్లను పురస్కరించుకుని పలువురు భక్తులు ఆలయాన్ని దర్శించారు. పుష్పకావిళ్లతో మొక్కులు చెల్లించారు. ప్రతిఏటా ఆడికృత్తిక ఉత్సవాలకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి దంపతులు స్వామివారికి పట్టువస్త్రాలను సమర్పించడం ఆనవాయితీ. ఇందులో భాగంగా గురువారం పట్టువస్త్రాలు సమర్పించారు. అర్చకులు వారికి పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థ ప్రసాదాలు అందజేశారు. కార్యక్రమంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, మాజీ ఎంపీపీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్ రెడ్డి, ఆలయ కమిటీ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు ప్రకాశ్ రెడ్డి, మండల కన్వీనర్ రెడ్డెప్ప రెడ్డి, వెంకటరమణారెడ్డి, మల్రెడ్డి, నారాయణరెడ్డి, బాబురెడ్డి, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. ఎర్రాతివారిపల్లె అయ్యప్పస్వామి ఆలయంలోని ఆంజనేయస్వామి నూతన వెండి కడియాలను ఎమ్మెల్యే పెద్దిరెడ్డి దంపతులు గురువారం అందించారు. కార్యక్రమంలో పెద్దిరెడ్డి ఇందిరమ్మ, కవితమ్మ, సుధీర్ రెడ్డి పాల్గొన్నారు.భట్టువారిపల్లె వద్ద తిరుమలకు పాదయాత్ర చేసే భక్తుల కోసం నూతన షెడ్ నిర్మిస్తున్నారు. పనులను ఎమ్మెల్యే పరీశీలించారు. -
మదనపల్లెను జిడ్డు కృష్ణమూర్తి జిల్లాగా ప్రకటించాలి
మదనపల్లె టౌన్ : మదనపల్లెను జిడ్డు కృష్ణమూర్తి జిల్లాగా మార్చాలి. అన్నమయ్యను కరువు జిల్లాగా ప్రకటించాలని సీపీఐ జాతీయ నాయకులు నారాయణ డిమాండ్ చేశారు. దేశవ్యాప్తంగా ఈ నెల 15వ తేదీ వరకు చేపట్టిన పాదయాత్ర గురువారం జిల్లా కేంద్రం మదనపల్లె, ఎన్టీఆర్ సర్కిల్ నుంచి ప్రారంభించారు. ఈ ర్యాలీ బెంగళూరు బస్టాండ్ మీదుగా చిత్తూరు బస్టాండ్ వరకు సాగింది. ఈ సందర్భంగా నారాయణ మాట్లాడుతూ.. దేశంలో నరేంద్ర మోదీ ప్రభుత్వం ఏర్పడి 12 సంవత్సరాలైన ఉద్యోగ, ఉపాధి కల్పించకపొగా, నిత్యావసరాలకు రేట్లు పెంచి సామాన్య ప్రజల నడ్డి విరుస్తున్నారని ఆరోపించారు. దేశంలో నిరుద్యోగులకు ఏడాదికి కోటి ఉద్యోగాలు ఇస్తానన్న మాట మరచి ఉన్న ఉద్యోగాలు తొలగించి ఇళ్లకు పంపిస్తున్నారని విమర్శలు గుప్పించారు. ప్రశ్నించడానికి పార్టీ పెట్టిన పవన్ కళ్యాణ్ మోదీకి భజన తప్పితే ప్రశ్నించడం లేదన్నారు. మదనపల్లెకు అన్నమయ్య పేరుపెట్టడం సబబు కాదని జిడ్డు కృష్ణమూర్తి పేరు పెట్టాలని డిమాండ్ చేశారు. సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఏ.రామానాయుడు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తవుతున్న ఇంత వరకు ఇచ్చిన హామీలు నెరవేర్చడంలో వైఫల్యం చెందిందన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడం దుర్మార్గమని ప్రభుత్వమే వైద్య విద్యను అందించాలని డిమాండ్ చేశారు. అన్నమయ్య జిల్లాను కరువు జిల్లాగా ప్రకటించాలన్నారు.బీటీ కళాశాలను యూనివర్సిటీగా మార్చాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో సీపీఐ జిల్లా కార్యదర్శి పి.మహేష్, తోపు కృష్ణప్ప, కార్యవర్గ సభ్యులు సాంబశివ, నియోజకవర్గ కార్యదర్శి కే.మురళి, నాయకులు రెడ్డిశేఖర్, నరేష్, ఏఐఎస్ఎఫ్ జిల్లా కార్యదర్శి కే.మాధవ్, ఏఐవైఎఫ్ జిల్లా అధ్యక్షులు విజయన్, డిహెచ్పిఎస్ జిల్లా కార్యదర్శి హరి, తిరుమల, దేవా, సురేష్, బాలు, భార్గవి, నవ్య, రెడ్డప్ప కార్యకర్తలు పాల్గొన్నారు.సీపీఐ జాతీయ నాయకులు నారాయణ -
ఖాకీ వనం.. అవినీతికి నిలయం!
● వీఆర్కు మరో కానిస్టేబుల్ ● ప్రైవేట్ వ్యక్తి కీలకపాత్ర సాక్షి టాస్క్ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా కలసపాడు పోలీసుస్టేషన్లో అవినీతి మితిమీరిపోయింది. జిల్లా సరిహద్దు స్టేషన్ కావడం, జిల్లా పోలీసు అధికారుల పర్యవేక్షణ కొరవవడంతో స్టేషన్ అధికారితో పాటు సిబ్బంది విచ్చలవిడిగా అవినీతికి పాల్పడుతున్నారు. స్టేషన్కు వచ్చిన చిన్నాచితక జనాలను కూడా వదలకుండా ప్రైవేట్ వ్యక్తిని ఏర్పాటు చేసుకుని ముక్కు పిండి వసూలు చేస్తున్నారు. పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ పలుమార్లు సిబ్బందిని, అధికారిని హెచ్చరించినా వారి ప్రవర్తనలో మార్పు రాకపోగా ఓ చిన్న కేసు విషయంలో రూ.లక్ష డిమాండ్ చేసి రూ.80 వేలు వసూలు చేసిన విషయం జిల్లాలో చర్చనీయాంశమైంది. ఈ నెల 2వ తేదీన జిల్లా సరిహద్దులోని నీలాపురం సమీపంలోని కంపచెట్లలో కలసపాడు మండలానికి చెందిన కొందరు పేకాట ఆడుతున్నట్లు పోలీసులకు సమాచారం అందింది. స్టేషన్ అధికారితో పాటు ఒకే సామాజిక వర్గానికి చెందిన సిబ్బంది పేకాట స్థావరంపై దాడి నిర్వహించి ఏడుగురిని అదుపులోకి తీసుకున్నారు. వీరిలో కలసపాడుకు చెందిన ఓ మాజీ ప్రజాప్రతినిధి బంధువు ఉండటంతో కొందరు అతన్ని తప్పించేందుకు పోలీసులను సంప్రదించారు. ఇదే అవకాశంగా భావించిన పోలీసులు రూ.లక్ష డిమాండ్ చేయగా రూ.80 వేలకు బేరం కుదిరినట్లు తెలిసింది. ఆ వ్యక్తి పేరు స్థానంలో మరొకరి పేరు చేర్చి ఈ నెల 2వ తేదీన కేసు నమోదు చేశారు. రూ.80 వేలలో రూ.20 వేలు ప్రైవేట్ వ్యక్తికి ఫోన్పే ద్వారా చెల్లించారు. మిగిలిన రూ.60 వేలు నగదును ఓ కానిస్టేబుల్కు అందజేశారు. ఈ విషయం 3వ తేదీన చర్చాంశనీయం కావడంతో పోరుమామిళ్ల సర్కిల్ ఇన్స్పెక్టర్ పోలీసు సిబ్బందిని మందలించారు. పోలీసులు హుటాహుటిన కలసపాడుకు చెందిన ఆ వ్యక్తి పేరును తిరిగి ఎఫ్ఐఆర్లో చేర్చి చేతులు దులుపుకున్నారు. స్టేషన్లో విషయం బయటికి చెప్పడానికి కారణం రాజ్కుమార్ అనే కానిస్టేబుల్ అని భావించి బుధవారం కడపలో రిపోర్టు చేసుకోవాలని ఆదేశించారు. పేకాటలో వసూలు చేసింది కొందరైతే మరో కానిస్టేబుల్ బలి కావడం జిల్లా పోలీసు వర్గాల్లో తీవ్ర చర్చాంశమైంది. కలసపాడు పోలీసుస్టేషన్లో ప్రైవేట్ వ్యక్తి గత కొంత కాలంగా కీలక పాత్ర పోషిస్తున్నాడు. పోలీసు అధికారితో పాటు సిబ్బందికి అనుకూలంగా ఉంటూ స్టేషన్కు వచ్చిన ప్రజలను వివిధ రూపాలుగా వేధించి వసూళ్లపర్వం మొదలుపెట్టాడు. పోలీసు ఉన్నతాధికారులు కలసపాడు పోలీసుస్టేషన్లో సమర్ధవంతమైన సిబ్బందిని నియమించాలని ప్రజలు కోరుతున్నారు. ఆ కానిస్టేబుల్ కీలకపాత్ర కలసపాడు పోలీసుస్టేషన్లో జరిగే అవినీతి, అక్రమాలలో కడప స్పెషల్ బ్రాంచ్కు చెందిన ఓ కానిస్టేబుల్ కీలకపాత్ర పోషిస్తున్నాడు. పాస్పోర్టు తనిఖీలు నిర్వహించి గ్రామాల్లో ఎప్పటికప్పుడు ఏం జరుగుతుందో ముందుగానే పసిగట్టి జిల్లా పోలీసు అధికారులకు సమాచారం అందించాల్సిన కానిస్టేబుల్ తమ విధిని మరించి అసాంఘీక కార్యకలాపాలకు పాల్పడే వారికి వెన్నుదన్నుగా ఉంటే అక్రమాలకు పాల్పడుతున్నారు. ఈ విషయం స్టేషన్ అధికారికి తెలిసినప్పటికీ స్పెషల్ బ్రాంచ్ కానిస్టేబుల్ను వెనకేసుకుని రావడం కలసపాడు ప్రాంతంలో చర్చాంశనీయమైంది. -
గ్యాస్ లీకేజీతో అగ్నిప్రమాదం
తంబళ్లపల్లె: గ్యాస్ సిలిండర్ లీకేజీ కావడంతో మంటలు చెలరేగిన ఘటనలో అక్కా తమ్ముడు సహా దంపతులు తీవ్రంగా గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలం గోపిదిన్నె గ్రామంలో గురువారం ఉదయం ఈ ఘటన చోటు చేసుకుంది. ఎస్ఐ అనిల్ కుమార్ తెలిపిన వివరాల ప్రకారం వివరాలు.. గోపిదిన్నెకు చెందిన ప్రకాష్, పవిత్ర అనే అక్కా తమ్ముళ్లు వంట గదిలో గ్యాస్ వాసన రావడంతో అప్రమత్తమయ్యారు. సిలిండర్ ఆఫ్ చేసేందుకు వెళ్లి తలుపు తెరవగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. అక్కా తమ్ముడు మంటల్లో చిక్కుకుని కాలిపోయారు. మంటలను ఆర్పేందుకు వెళ్లిన స్థానిక దంపతులు కూడా గాయపడ్డారు. వెంటనే 108 అంబులెన్స్ ద్వారా నలుగురిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ అత్యవసర విభాగం డాక్టర్లు ప్రథమ చికిత్స అందించారు. అక్కా తమ్ముడి పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రిఫర్ చేశారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై తెలిపారు. క్షతగాత్రులను పరామర్శించిన ఎమ్మెల్యే ద్వారకానాథ్రెడ్డి గ్యాస్ లీక్ అయి గాయపడిన బాధితులను, కుటుంబీకులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి రుయా ఆసుపత్రికి వెళ్లి క్షతగాత్రులను పరామర్శించి వారికి రూ. 10 వేలు ఆర్థిక సాయాన్ని అందజేశారు. అలాగే వైఎస్సార్సీపీ నాయకులు నల్లగుడ్ల మల్లికార్జున రెడ్డి బాధితులకు రూ. ఐదువేలు ఆర్థిక సాయం అందించారు. మంటల్లో చిక్కి అక్కా తమ్ముడు, దంపతులకు తీవ్ర గాయాలు గాయపడిన అక్కా తమ్ముడు -
నేతన్న నేస్తంతో ఆర్థిక ఉపశమనం
చేనేత వృత్తిలో ఉన్నవారికి గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకంతో ఆర్థిక ఉపశమనం కలిగించింది. కరోనా సమయంలో కూడా ఆర్థిక సహాయం అందించి ఆదుకుంది. కూటమి ప్రభుత్వం వచ్చాక చేనేతలపై శీతకన్ను వేసింది. ముడిపట్టు ధరలు పెరిగిపోయాయి. పాలకులు స్పందించకపోతే అందమైన చేనేత సంప్రదాయం కనుమరుగవుతుంది. – శీలం రమేష్, వైఎస్సార్సీపీ చేనేత విభాగం అధ్యక్షులు పథకంపై స్పష్టత లేదు నేతన్న భరోసా పథకంపై స్పష్టత లేదు. చేనేత కార్మికుల నుంచి ఆయా సచివాలయాల్లో దరఖాస్తులు తీసుకుంటున్నారు. వీరిలో ఎంతమంది అర్హత ఉందో,అనర్హులు ఎవరో చెప్పలేదు. చేనేత దినోత్సవం రోజు లబ్దిదారులకు సొమ్ము అందిస్తారనేది నమ్మకం లేదు. – సుధాకర్, చేనేత సమాఖ్య అధ్యక్షుడు -
ఊరూరా.. ఉద్యమ హోరు!
సాక్షి, మదనపల్లె : డీఎస్సీ–2025 నియామకాల్లో జరిగిన అక్రమాలపై సీబీఐ విచారణ చేయాలని.. దీనికి నైతిక బాధ్యత వహిస్తూ మంత్రి లోకేష్ రాజీనామా చేయాలని యువత డిమాండ్ చేసింది. ఈ మేరకు ఊరూరా ఉద్యమబాట పట్టింది. గురువారం వైఎస్సార్సీపీ జిల్లాలో చేపట్టిన నిరాహార దీక్షలకు మద్దతుగా విద్యార్థి, యువజనులు తరలివచ్చారు. అక్రమాలను ఇంకెన్నాళ్లు దాచి పెడ్తారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. తమ కష్టాన్ని మరొకరు దోచుకున్నారని ప్రశ్నిస్తే ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించారు. బాధిత డీఎస్సీ అభ్యర్థులకు అండగా, మద్దతుగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ పిలుపుమేరకు ఆ పార్టీ నేతలు నియోజకవర్గ స్థాయిలో చేపట్టిన తొలి రోజు నిరాహార దీక్షలు విజయవంతమయ్యాయి. తొలిరోజు ఇలా.. డీఎస్సీ అక్రమాలపై చర్యలను కోరుతూ జిల్లాలోని ఐదు నియోజకవర్గాల్లో గురువారం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నిరాహార దీక్షలను ప్రారంభించింది. తొలిరోజు నిరాహార దీక్ష విజయవంతంగా సాగింది. ర్యాలీలతో ఆయా నియోజకర్గ కేంద్రాల్లో నిరాహార దీక్షలు మొదలవగా పార్టీ శ్రేణులు హజరై ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. లోకేష్ రాజీనామా చేయాలి, సీబీఐ విచారణ జరపాలంటూ నినాదాలతో హోరెత్తించారు. ఈ దీక్షలు ఆదివారం వరకు నాలుగురోజులపాటు కొనసాగుతాయి. కాగా మదనపల్లెలో తొలుత చిత్తూరు బస్టాండ్లో దీక్షలు చేసేందుకు నిర్ణయించగా అనుమతి లేదని పోలీసులు నిరాకరించారు. దాంతో పార్టీ కార్యాలయం వద్ద దీక్షలు ప్రారంభించారు. ఈ దీక్షలకు సంఘాలు, విద్యార్థి, యువజనులు, ప్రజలు మద్దతు తెలిపారు. పుంగనూరు : పుంగనూరులో మాజీ మంత్రి, ఎమ్మెల్యే, రీజనల్ కో–ఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆధ్వర్యంలో ఎంబీటీ రోడ్డు నుంచి ఇందిరా సర్కిల్ వరకు ర్యాలీ జరిగింది. ఇందిరా సర్కిల్ వద్ద ఏర్పాటు చేసిన నిరాహార దీక్ష శిబిరాన్ని పెద్దిరెడ్డి ప్రారంభించి, స్థానిక నేతలతో కలిసి పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ లోకేష్ రాజీనామా చేసి నైతికత నిరూపించుకోవాలన్నారు. అక్రమాలపై సీబీఐ విచారణ జరిపి అక్రమాల నిగ్గు తేల్చాలని డిమాండ్ చేశారు. మాజీ ఎంపీ రెడ్డప్ప, రాయలసీమ మైనార్టీ విభాగం ఇంచార్జ్ ఫక్రుద్దీన్ షరీఫ్, ఎంపీపీ భాస్కర్ రెడ్డి, యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి కొత్తపల్లి చెంగారెడ్డి, విద్యార్థి విభాగం రాష్ట్ర కార్యదర్శి హేమంత్ కుమార్ రెడ్డి, వక్ఫ్ బోర్డు జిల్లా మాజీ అధ్యక్షులు అమ్ము పాల్గొన్నారు. రాయచోటి : రాయచోటిలో నేతాజీ సర్కిల్లో స్థానిక నేతలు నిరాహారదీక్ష ప్రారంభించారు. మాజీ ఎమ్మె ల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి ఆధ్వర్యంలో చేపట్టిన ఈ కార్యక్రమంలో మున్సిపల్ మాజీ చైర్మన్ ఫయాజ్ బాషా, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు కిషోర్ దాస్, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు రెడ్డి కుమార్, మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షుడు బేపారి మహమ్మద్ ఖాన్, ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు అంజనప్ప పాల్గొన్నారు. తంబళ్లపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గం బి.కొత్తకోటలో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాఽథరెడ్డి ఆధ్వర్యంలో దీక్షలు ప్రారంభమయ్యాయి. వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పాగొండ ఖలీల్, ఎంపీపీ మొహమూద్, మండల అధ్యక్షులు ఎన్.ప్రదీప్రెడ్డి పాల్గొనగా సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి మనోహర్రెడ్డి, నాయకులు మద్దతు తెలిపి దీక్షలో పాల్గొన్నారు.డీఎస్సీ స్కాంపై ‘దీక్షా’స్త్రం జిల్లాలో ప్రారంభమైన వైఎస్సార్సీపీ నిరాహార దీక్షలు తరలివచ్చిన విద్యార్థులు, యువకులు లోకేష్ రాజీనామా, సీబీఐ విచారణకు డిమాండ్ పుంగనూరు దీక్షలో పాల్గొన్న మాజీ మంత్రి పెద్దిరెడ్డి -
చోరీ నెపం, విధుల నుంచి తొలగింపు
గాలివీడు : తూముకుంట సోలార్లో ఇలియాస్ సోలార్ కంపెనీలో ఇంట్లో దొంగను ఈశ్వరుడు పట్టని వైనంగా మారింది. కంపెనీ ప్రముఖులు చోరీలకు పాల్పడి ఏమీ తెలియని గిరిజనులపై నెపం నెట్టి విధులు నుంచి తొలగించిన సంఘటన చోటు చేసుకుంది. ప్రకాష్నగర్కు చెందిన గిరిజనులు వలస వెళ్లకుండా చిన్న ఉద్యోగాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకునేవారు. ఈ క్రమంలో కంపెనీలోని పెద్దలు, అధికారులు చేతివాటం ప్రదర్శించి అక్కడ విలువైన వస్తువులు చోరీకి పాల్పడిన సంఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. వాస్తవాలను పక్కనపెట్టి చిరు ఉద్యోగం చేసుకుంటున్న తమపై నెపం నెట్టి ఉద్యోగాల నుంచి తొలగించడం ఏమిటని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. బుక్కే రామానాయక్, బుక్కే రూపేష్ నాయక్, మూడే లోకేష్ నాయక్, మూడే పవన్ కుమార్ నాయక్, బి రామాంజనేయులు తదితరులను విధులనుంచి తొలగించారని, కంపెనీలో బాధ్యత గల ప్రతి ఒక్కరిని పోలీసులు విచారిస్తే వాస్తవాలు వెలుగులోకి వస్తాయని తెలియజేస్తున్నారు. గిరిజనుల ఆవేదనఉద్యోగ బాధ్యతలు చిత్తశుద్ధితో నిర్వర్తిస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాళ్లం. ఎవరో చేసిన చోరీ సంఘటన మాపైన నెట్టి అన్యాయంగా విధుల నుంచి తొలగించారు. క్షేత్రస్థాయిలో విచారణ జరిపి మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. – రూపేష్ నాయక్, ప్రకాష్ నగర్ కాలనీ ఇలియాస్ కంపెనీలో హెచ్ఆర్ను పోలీసులు విచారిస్తే చోరీ విషయాలు బయటకు వస్తాయి. నీతి, నిజాయితీగా చిరు ఉద్యోగం చేసుకుంటున్నా మాపై చోరీ నెపం నెట్టడం బాధాకరం. సోలార్ అధికారులు వాస్తవాలను వెలుగులోకి తెచ్చేందుకు చర్యలు చేపట్టాలి. మమ్మల్ని తిరిగి విధుల్లోకి తీసుకోవాలి. – ఎం.లోకేష్ నాయక్, ప్రకాష్ నగర్ కాలనీ -
వివాదాస్పద భూమిలోకి చొరబడి దౌర్జన్యం
● కోర్టు ఇంజెక్షన్ ఉత్తర్వుల ధిక్కరణ ● అడ్డుకునేందుకు ప్రయత్నించిన భూయజమానులకు బెదిరింపులు మదనపల్లె టౌన్: వివాదాస్పద భూమిలోకి చొరబడి దౌర్జన్యం చేస్తూ, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ధిక్కరించి, భూ యజమానులను బెదిరిస్తున్నారని బాధితులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గురువారం బాధితులు గాలిపూర్ణానంద చౌదరి, గుండ్లూరి నారాయణ రెడ్డి తెలిపిన వివరాల మేరకు... మదనపల్లె మండలం, పొన్నూటిపాళ్యం రెవెన్యూ గ్రామపరిధిలోని సర్వే నంబర్.420–12కు సంబంధించి...ఏ లో 4.32 ఎకరాలు, బీ లో 3 ఎకరాలు మొత్తం కలిపి 7.32 ఎకరాలు 1975లో సబ్ డివిజన్న్ చేశారు. ఈ భూమిని 2013–14లో బాసాని రెడ్డిగోపాల్నాయుడు, కుటుంబసభ్యుల పేరుమీద 2.22 ఎకరాల భూమిని మొత్తం 8 డాక్యుమెంట్లలో ఒకే హద్దులు కనపరుస్తూ రిజిస్టర్ చేసుకున్నారన్నారు. మిగిలిన భూమిని హక్కుదారురాలైన కోనేటి సులోచన వద్ద 2023లో గాలిపూర్ణానంద చౌదరి, గుండ్లూరి నారాయణరెడ్డి తదితరులు రిజిస్టర్డ్ విక్రయపత్రం ద్వారా కొనుగోలు చేసి స్వాధీనంలో ఉంచుకున్నామని పేర్కొన్నారు. భూమికి రక్షణగా ప్రహరీ గోడ కూడా నిర్మించుకున్నట్లు తెలిపారు. అయితే ప్రహరీగోడ నిర్మాణసమయంలో గోపాల్నాయుడు, భూ విక్రయదారుడు మార్పూరి వెంకటేశులు...కోనేటి సులోచనకు తాము భూమి విక్రయించలేదని, అప్పటి డీఎస్పీ కేశప్పతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకుని, తమపై స్టాంప్స్ డిపార్ట్మెంట్ ఐజీకి ఫిర్యాదుచేశారన్నారు. దీంతో ఏపీ సీఐడీ అధికారులు కేసు విచారించి, డాక్యుమెంట్లోని,వేలిముద్రలు మార్పూరి వెంకటేశులుదేనని ధృవీకరించారన్నారు. అయితే తమ ప్రత్యర్థులు తమకున్న రాజకీయ పలుకుబడితో నివేదిక బయటకు రానీవకుండా ఏడాదిపాటు అడ్డుకున్నారన్నారు. 2024లో అప్పటి స్టాంప్స్ ఐజీ నివేదిక ఆధారంగా భూమిని రిజిస్టర్ చేసి, ఉద్దేశపూర్వకంగా చేయలేదని ఫిర్యాదుచేసినందుకు మార్పూరి వెంకటేశ్పై ప్రభుత్వం తరపున కేసు పెట్టాల్సిందిగా పులివెందుల, పాకాల సబ్ రిజిస్ట్రార్లను ఆదేశించారన్నారు. దీనిపై ఆయా ప్రాంతాల్లో కేసులు నమోదుచేశారన్నారు. తర్వాత ఈ భూమికి సంబంధించి మదనపల్లె ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి కోర్టులో ఓఎస్.నెం.354/2026 దాఖలు చేస్తే , తమ స్వాధీనంలో ఉన్న భూమిపై జోక్యం చేసుకోకుండా ప్రతివాదులను ఆదేశిస్తూ కోర్టు తాత్కాలిక ఇంజెక్షన్ మంజూరు చేసిందన్నారు. ఆ ఉత్తర్వులు ప్రస్తుతం అమల్లో ఉన్నప్పటికీ, ఏమాత్రం లెక్కచేయకుండా ప్రత్యర్థులు దౌర్జన్యానికి పాల్పడుతున్నట్లు తెలిపారన్నారు. గురువారం ఉదయం జేసీబీ వాహనాన్ని తీసుకువచ్చి బి.రెడ్డిగోపాల్ నాయుడు తదితరులు ప్రహరీగోడను కూల్చివేసి భూమిలోకి ప్రవేశించారన్నారు. తాము అడ్డుకునేందుకు ప్రయత్నించి, కోర్టు ఇంజెక్షన్ ఆర్డర్ ఉందని చెపుతున్నా పట్టించుకోకుండా బెదిరింపులకు పాల్పడ్డారని ఆరోపించారు. పోలీసు ఉన్నతాధికారులు ఈ విషయంలో జోక్యంచేసుకుని, చర్యలు తీసుకోవాలని కోరారు.ఈ విషయంపై తాలూకా పోలీస్స్టేషన్న్లో సీఐకు ఫిర్యాదుచేశామని, శుక్రవారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లిని కలిసి తమ వద్ద ఉన్న పత్రాలు, ఆధారాలతో సహా వివరించి న్యాయం కోరుతామన్నారు. -
ఆరుతడి పంటలే మేలు
రామసముద్రం : ఎల్నినో ప్రభావం, తీవ్ర వర్షాభావంతో రామసముద్రం మండలంలో పంటలు ఎండుముఖం పడుతుండటంపై వ్యవసాయ శాస్త్రవేత్తలు ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం కలికిరి వ్యవసాయ విజ్ఞాన కేంద్రం (కేవీకే) సీనియర్ శాస్త్రవేత్త, హెడ్ డాక్టర్ కె. మంజుల నేతృత్వంలోని బృంద సభ్యులు మండలంలోని కె.సి.పల్లి, మినికి, గుంతయంబాడి, వనగానిపల్లి గ్రామాల్లో పర్యటించి క్షేత్రస్థాయిలో పంటలను పరిశీలించారు. రైతులతో నేరుగా మాట్లాడి వారి సమస్యలను తెలుసుకుని, ప్రస్తుత పరిస్థితుల్లో అనుసరించాల్సిన సాగు విధానాలపై పలు సూచనలు చేశారు. బోరుబావుల కింద ఆరుతడి పంటలకు ప్రాధాన్యం ఇస్తూ, తోటల్లో మల్చింగ్ వాడకంతో నేలలో తేమ ఎక్కువకాలం నిల్వ ఉండి నేల సారం కూడా పెరుగుతుందన్నారు. పొలాల వద్ద గుంతలు, చిన్న కాలువలు ఏర్పాటు చేసి వర్షపు నీటిని నిల్వ చేసుకోవాలని, ప్రకృతి వైపరీత్యాల వల్ల కలిగే నష్టాల నుంచి రక్షణ పొందేందుకు రైతులు పంట బీమా చేయించుకోవాలని సూచించారు. శాస్త్రవేత్తలు ఠాగూర్, సహజదేవి, బి. సంతోష్ సోమశేఖర బాబు పాల్గొన్నారు. -
జూదరుల అరెస్టు
పెద్దతిప్పసముద్రం: మండలంలోని దూలంవారిపల్లి సమీపంలో పేకాట సాగుతోందని పలువురు గురువారం ఎస్ఐ పరమేష్ నాయక్కు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో ఎస్ఐ సిబ్బందితో కలసి పేకాట స్థావరంపై దాడులు నిర్వహించారు. 9 మందిని అరెస్టు చేశారు. వారి నుంచి రూ.6,600 నగదు, 9 సెల్ఫోన్లు, ఐదు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ వెల్లడించారు. రైలు కింద పడి వ్యక్తి మృతి పీలేరురూరల్ : రైలు కింద పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని దొడ్డిపల్లె పంచాయతీ ఫిరోజ్ ఫంక్షన్ హాల్ సమీపంలో చోటు చేసుకుంది. మండలంలోని తలపుల పంచాయతీ మేకలవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప (65) నాలుగు రోజుల క్రితం ఇంటి నుంచి వెళ్లి కనపడలేదు. గురువారం మధ్యాహం్న గుంతకల్లు – తిరుపతి ప్యాసింజర్ రైలు కింద మృతి చెందాడు. స్థానికులమేరకు రైల్వే అధికారులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గుర్తుతెలియని వాహనం ఢీ కొని కృష్ణజింక మృతి ములకలచెరువు: గుర్తుతెలియని వాహనం ఢీ కొనడంతో కృష్ణ జింక మృతిచెందిన సంఘటన గురువారం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, ఫారెస్టు భీటు అధికారి శ్రీనివాసులు కథనం మేరకు... మండలంలోని కదిరినాథునికోట క్రాస్ జాతీయ రహదారిపై జింకల మంద రోడ్డు దాటుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో జింక మృత్యువాతపడింది. అనంతరం అక్కడే ఉన్న కుక్కలు జింక కళేబరాన్ని పీక్కుతింటుండగా స్థానికులు గమనించి ఫారెస్టు అధికారులకు సమాచారం అందించారు. జింకను స్వాధీనం చేసుకున్న వారు సండ్రడవిలో ఖననం చేశారు. అట్రాసిటీ కేసుపై విచారణ రామసముద్రం: మండలంలోని ఎరపశెట్టిపల్లి గ్రామంలో ఇటీవల నమోదైన ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసుపై గురువారం డీఎస్పీ బుచ్చిబాబు విచారణ చేపట్టారు. కేసుకు సంబంధించిన బాధితులు, గ్రామస్తుల నుంచి వివరాలు సేకరించి, సంఘటన జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా డీఎస్పీ మాట్లాడుతూ, కేసును అన్ని కోణాల్లో నిష్పక్షపాతంగా విచారించి, వాస్తవాలను నిర్ధారించిన అనంతరం చట్టప్రకారం అవసరమైన చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
హత్య కేసులో నిందితుడు అరెస్ట్
వాల్మీకిపురం : హత్యకేసులో నిందితుడిని అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ రాఘవ రెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ మాట్లాడుతూ.. గత నెల 29వ తేదీ మండలంలోని చింతపర్తి సమీపంలో నివాసం ఉంటున్న లక్ష్మీదేవి హత్యకు గురైంది. ఈ విషయం గత నెల 31న వెలుగులోకి వచ్చింది. సంఘటనాస్థలంలో లభించిన వస్తువుల ఆధారంగా సీఐ కేసు దర్యాప్తు చేపట్టారు. కడప, నెల్లూరు జిల్లాలకు చెందిన దాదాపు 30 మంది బొగ్గు కాల్చే కార్మికులు చింతపర్తి సమీపంలోని ఓబులేశుని కొండ వద్ద బొగ్గు కాల్చుకొని జీవనం సాగిస్తున్నారు. ఇక్కడే నివాసం ఉంటున్న కూలీ మన్యం నాగరాజు (22) ఇక్కడే కూలీగా ఉన్న నల్లోల్లు లక్ష్మీదేవి (55)తో గత కొంతకాలంగా అక్రమ సంబంధం కొనసాగిస్తున్నాడు. వీరిద్దరు మద్యానికి బానిసయ్యారు. ఈ నేపథ్యంలో లక్ష్మీదేవి తరచూ నాగరాజును డబ్బులు ఇవ్వాలని, లేనిపక్షంలో అక్రమ సంబంధం విషయాన్ని బయటపెడతానని బెదిరించేది. దీంతో నాగరాజు లక్ష్మీదేవిపై కక్షపెంచుకొని ఎలాగైనా ఆమెను అంతం చేయాలని పథకం వేశాడు. ఈ క్రమంలో గత నెల 29న మద్యం తాగుదామని నమ్మించి ఆమెను ద్విచక్రవాహనంపై చింతపర్తి సమీపంలో ఎవ్వరూ లేని ప్రాంతానికి తీసుకెళ్లి అక్కడే ఉన్న బండరాయితో బాది చంపేసి, ద్విచక్రవాహనాన్ని అక్కడే వదిలేసి పారిపోయాడు. ఈ కేసుకు సంబంధించి నాగరాజును బుధవారం పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్కు పంపినట్లు సీఐ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్సై తిప్పేస్వామి, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీశైలం నీటితోనే ఎల్నినోకు చెక్
కడప సెవెన్రోడ్స్ : ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతుపవనాలు వర్షించలేదు. అధిక వర్షపాతలోటుతో జిల్లాలో తీవ్ర అనావృష్టి పరిస్థితులు నెలకొన్నాయి. రిజర్వాయర్లలో నీటిమట్టం రోజురోజుకు పడిపోతోంది. ఖరీఫ్ పంటల సాధారణ సాగు దారుణంగా పడిపోయింది. పలు గ్రామాల్లో తాగునీటికి కటకటలాడాల్సిన దుస్థితి దాపురించింది. భూగర్భ జలాలు వేగంగా అడుగంటుతుండడం ఆందోళన కలిగిస్తోంది. ఎల్నినో విసిరిన సవాలును సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రభుత్వం ఎలాంటి ముందస్తు చర్యలు చేటప్టకుండా కంటి తుడుపు చర్యలకే పరిమితమవుతోందన్న విమర్శలు వినిపిస్తున్నాయి. శ్రీశైలం జలాశయం నుంచి తాగు, సాగునీటిని విడుదల చేయడమే పరిష్కారమనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. వికటించిన నైరుతి ఎల్నినో ప్రభావంతో నైరుతి రుతు పవనాలు ముఖం చాటేశాయి. అక్కడక్కడా చిన్నపాటి వర్షం నమోదవడం మినహా ప్రయోజనం లేదు. జూన్లో సాధారణ వర్షపాతం 69,1 మిల్లీమీటర్లు నమోదు కావాల్సి ఉండగా, 47.9 మి.మీ. మాత్రమే నమోదు కావడంతో –30.7 శాతం లోటు ఏర్పడింది. జులైలో 96.5 మి.మీ. సాధారణ వర్షపాతానికి 21.6 మి.మీ. మాత్రమే నమోదై –77.6 శాతం లోటు ఏర్పడింది. మొత్తం మీద జూన్, జులై నెలల్లో జిల్లా సగటు వర్షపాతాన్ని పరిశీలిస్తే 165.6 మిల్లిమీటర్లకు 69.5 మి.మీ. మాత్రమే నమోదైంది. అంటే 58 శాతం వర్షపాత లోటు ఏర్పడింది. ఇది ఖరీఫ్ పంటల సాగుపై తీవ్ర ప్రభావం నెరిపింది. జిల్లాలో వేరుశనగ, జొన్న, మొక్కజొన్న, పత్తి, కంది, ఆముదం, కొర్ర, సజ్జ, పెసర, పొద్దుతిరుగుడు, మినుము, వరి తదితర పంటలు ఖరీఫ్లో సాగు చేస్తారు. సాధారణ సాగు విసీ్త్రర్ణం 76,496 హెక్టార్లు కాగా, 13,086 హెక్టార్లలోనే వివిధ పంటలు సాగయ్యాయి. అంటే మొత్తం సాధారణ సాగులో 17.1 శాతం మాత్రమే పంటలు వేశారు. తాగునీటికి కటకట! జిల్లాలోని చక్రాయపేట, లింగాల, వేముల, వేంపల్లె, వీరబల్లి, సుండుపల్లె, కాశినాయన, పోరుమామిళ్ల, మైలవరం మండలాల్లో భూగర్బ జలమట్టాలు గణనీయంగా తగ్గిపోయాయి. పలు గ్రామాల్లో తాగునీటి ఎద్దడి తీవ్రంగా ఉంది. మైలవరం, వీరబల్లి, చక్రాయపేట మండలాల్లోని పలు గ్రామాల్లో తాగునీటిని రవాణా చేస్తున్నారు. మిగతా మండలాల్లో వ్యవసాయ బోరుబావులను అద్దెకు తీసుకుని ప్రజలకు తాగునీరు అందిస్తున్నారు. కడప నగరానికి తాగునీరు అందించేందుకు మైలవరం నుంచి 200 క్యూసెక్కుల నీరు విడుదల చేశారు. వర్షభావ పరిస్థితులు ఇలాగే కొనసాగితే తాగునీటి సమస్య మరిన్ని మండలాలకు విస్తరిస్తుందని అధికారులు స్పష్టం చేస్తున్నారు. ఆందోళన కల్గిస్తున్న రిజర్వాయర్ల నీటిమట్టం జిల్లాలో తెలుగుగంగ, గాలేరు–నగరి, సీబీఆర్, కేసీ కెనాల్ కింద ప్రధానంగా నీటి పారుదల సౌకర్యం ఉంది. అయితే, వర్షాలు లేకపోవడంతో రిజర్వాయర్లలో నీటిమట్టం వేగంగా తగ్గిపోతుండడం ఆందోళన కలిగిస్తోంది. తెలుగుగంగలో అంతర్బాగమైన బ్రహ్మంసాగర్ రిజర్వాయర్లో 17.740 టీఎంసీలకుగాను 9.109 టీఎంసీల నీరు ఉంది. ప్రస్తుత లెవెల్ 672.169 అడుగులు ఉంది. ఫ్లడ్ కుషన్ 8.631 టీఎంసీ. ఇన్ఫ్లో లేదు. టీజీపీలో అంతర్బాగమైన ఎస్ఆర్–1లో 2.135 టీఎంసీకిగాను 0.672, ఎస్ఆర్–2లో 2.405కుగాను 0.893 టీఎంసీలు ఉన్నాయి. చిత్రావతి బ్యాలెన్సింగ్ రిజర్వాయర్లో 10.229 టీఎంసీలకుగాను 3.322 టీఎంసీలు ఉన్నాయి. గాలేరు–నగరిలో అంతర్బాగమైన గండికోట రిజర్వాయర్లో 26.850 టీఎంసీలకుగాను 15.813, మైలవరంలో 6.500కుగాను 2.427, పైడిపాలెంలో 6.000 టీఎంసీలకుగాను 3.171 టీఎంసీ, వామికొండలో 1.660 టీఎంసీలకుగాను 0.657 టీఎంసీలు, సర్వరాయసాగర్లో 1.060కుగాను 0.411 టీఎంసీలు ఉన్నాయి. గ్రాస్ కెపాసిటీ ప్రస్తుత లెవెల్ ప్రస్తుత స్టోరేజీ ఫ్లడ్కుషన్ ఇన్ఫ్లో (టీఎంసీలలో) (అడుగుల్లో) (టీఎంసీలలో) (టీఎంసీలు) (క్యూసెక్కుల్లో) 215 864.701 121.246 94.564 2,41,779 ఎల్నినో పరిస్థితులపై చర్చించి ఎదుర్కొనే చర్యలు చేపట్టేందుకు కలెక్టర్ డాక్టర్ శ్రీధర్చెరుకూరి అధ్యక్షతన గురువారం కలెక్టరేట్ పీజీఆర్ఎస్ హాలులో ఎమ్మెల్యేలు, ఇతర ప్రజాప్రతినిధులతో సమావేశాన్ని నిర్వహిస్తున్నారు. ఈ నేపథ్యంలో శ్రీశైలం నీటి విడుదల అంశాన్ని ప్రభుత్వ దృష్టికి తీసుకు వెళ్లేందుకు ఎమ్మెల్యేలు కృషి చేయాలని జిల్లా వాసులు కోరుతున్నారు. బుధవారం శ్రీశైలం జలాశయంలో నీటిమట్టం ఇలా ఉంది దారుణంగా పడిపోయిన పంటల సాగు పలు గ్రామాల్లో తాగునీటికి కటకట కంటి తుడుపు చర్యలతో సరిపెట్టాలని చూస్తున్న ప్రభుత్వం -
పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
మదనపల్లె సిటీ : పదో తరగతి విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రమణ్యం అన్నారు. బుధవారం స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో జిల్లాలోని ప్రభుత్వ,ప్రైవేట్,ఇతర యాజమాన్యాల పాఠశాల ప్రధానోపాధ్యాయులకు సమావేశం నిర్వహించారు. పదో తరగతి విద్యార్థులు అందరూ ఉత్తీర్ణత సాధించే విధంగా ఇప్పటి నుంచి సన్నద్ధం చేయాలన్నారు. సీ,డీ గ్రేడ్ ఉన్న విద్యార్థులను గుర్తించాలన్నారు. వారిపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. మధ్యాహ్నభోజన పథకం సక్రమంగా అమలయ్యే విధంగా చూడాలన్నారు. కార్యక్రమంలో డిసీఈబీ కార్యదర్వి గంగాధరం, జిల్లా సైన్సు అధికారి శ్రీధర్కుమార్, రాయచోటి డైట్ లెక్చరర్ నరసింహారెడ్డి, ప్రధానోపాధ్యయుల సంఘం అధ్యక్షులు రామకృష్ణ, మండలాల విద్యాశాఖ అఽధికారులు, ప్రధానోపాధ్యాయులు పాల్గొన్నారు. -
చిత్తూరు, నెల్లూరు జట్ల విజయం
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో గ్రౌండ్–1లో అనంతపురం క్రికెట్ జట్టు, చిత్తూరు జట్టు తలపడ్డాయి. బ్యాటింగ్ చేపట్టిన అనంతపురం జట్టు 50 ఓవర్లలో ఆరు వికెట్లకు 219 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 42.3 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేరుకుంది. చిత్తూరు స్టార్ బ్యాట్స్మెన్ శుభశ్రీ 126 బంతుల్లో 122 పరుగులు చేసింది. గ్రీష్మ 86 బంతుల్లో 58 పరుగులు చేసింది. అలాగే గ్రౌండ్ 2లో కడప, నెల్లూరు జిల్లాల జట్లు తలపడ్డాయి. నెల్లూరు జట్టు 50 ఓవర్లల్లో మూడు వికెట్లు కోల్పోయి 403 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్ చేపట్టిన కడప జట్టు 50 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 200 పరుగులు మాత్రమే చేసింది. నెల్లూరు జట్టుకు చెందిన జెస్సికా 103 బంతుల్లో 107 పరుగులు మహాలక్ష్మి 121 బంతుల్లో 167 పరుగులు చేయడంతో నెల్లూరు జట్టు 203 పరుగులు చేసి విజయాన్ని అందుకుంది. ఈ కార్యక్రమంలో శ్రీనివాసమూర్తి, శ్రీధర్కుమార్, సునీల్ కుమార్, సతీష్యాదవ్, అనిత, మౌనిక, యామిని, శేఖర్, మాధవి, తదితరులు పాల్గొన్నారు.167 పరుగులు చేసిన మహాలక్ష్మీ 107 పరుగులు చేసిన జెస్సికా -
లోకేష్ తీసిన డీఎస్సీ సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ
2025 డీఎస్సీ మంత్రి లోకేష్ తీసిన సస్పెన్స్ థ్రిల్లర్ మూవీ. ప్రారంభం నుంచి చివరి దాకా సస్పెన్స్పెట్టి కై ్లమాక్స్లో షాక్ ఇచ్చారు.దీంతో 600 మంది జీవితాలు నాశనమయ్యాయి. డీఎస్సీలో నాకు 70.6 మార్కులతో రెండో ర్యాంకు వచ్చింది. బీసీఈ కేటగిరిలో ఉద్యోగానికి ఎంపికై నట్టు ఆగస్టు 27న కాల్ లెటర్ వచ్చింది. వారంలో ఉద్యోగంలో జాయిన్ కావాలి అని శుభాకాంక్షలు తెలిపారు. రెండు వారాల తర్వాత రిజల్ట్ లిస్టులో పేరు లేదని అధికారులను కలిసి మొరపెట్టుకున్నా. 1:1 రేషియోలో అర్హులకే ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం నేను ఎంపికై నట్టు ఎందుకు చెప్పింది. నా పోస్టును ఎవరికో ఇచ్చి మెరిట్ను తొక్కేసి, రిజర్వేషన్కు ఉద్యోగం ఇచ్చారు. ఏడేళ్లు చిన్న బిడ్డ ఆలనా పాలనకు దూరమై చదివాను. స్పోర్ట్స్ కోటాలో ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్న ప్రభుత్వం..ఈ కోటాలో ఎంపికై న వ్యక్తి విద్యార్థులకు బయాలజీ బోధించగలరా, ఇలాంటి వారికి ఉద్యోగాలు ఇచ్చి పాఠశాలలకు పంపితే విద్యార్థుల భవిష్యత్తు ఏం కావాలి. – ఎస్.షర్మిల, తురకపల్లి (మదనపల్లె) -
పిచ్చికుక్క దాడిలో నలుగురికి తీవ్ర గాయలు
గుర్రంకొండ : పిచ్చికుక్క దాడిలో నలుగురికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని నడిమికండ్రిగలో జరిగింది. గత మంగళవారం రాత్రి గ్రామంలో ఆరుబయట పలువురు మంచాలు వేసుకొని నిద్రిస్తున్నారు. ఎక్కడి నుంచో వచ్చిన పిచ్చికుక్క ఒక్కసారిగా వీధుల్లో ఆరుబయట కూర్చొన్న, నిద్రిస్తున్న వారిపై దాడులు చేసి ఇష్టానుసారం కరిచింది. ఈ దాడుల్లొ గ్రామానికి చెందిన చిన్నరెడ్డెమ్మ(80), లక్ష్మీదేవి(55), వెంకటరమణ(60), రెడ్డెమ్మ(60)లకు తీవ్ర గాయాలయ్యాయి. వీరిలో చిన్నరెడ్డెమ్మకు కాలు, చేతిపైన, ముఖంపైన కరిచింది. బాధితురాలిని కుటుంబసభ్యులు గుర్రంకొండలొని ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స చేసిన అనంతరం పరిస్థితి విషమించడంతో మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తీసుకెళ్లారు. అక్కడి వైద్యుల సూచన మేరకు తిరుపతి స్విమ్స్ ఆస్పత్రికి తరలించారు. మిగిలిన ముగ్గురు మదనపల్లెలోని ఆస్పత్రుల్లో చికిత్స పొందుతున్నారు. గత వారం రోజులుగా పిచ్చికుక్క మూడు మార్లు దాడులు చేసినట్లు గ్రామస్తులు పేర్కొన్నారు. ఇప్పటికై నా సంబంధిత అధికారులు స్పందించి తగిన చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. -
అర్హున్ని కాదట
నేను ఎమ్మెస్సీ ఫిజిక్స్ చదివితే అర్హున్ని కాదట. ఇంటర్లో ఫిజిక్స్ చేసిన వాళ్లు అర్హత ఉందంటే ఇంతకంటే దగా డీఎస్సీ మరొకటి లేదు. అర్హతలపై కోర్టును ఆశ్రయిస్తే కేసు కొట్టేశారు. పరీక్ష రాశాక న్యాయం జరుగుతుందనుకుంటే నార్మలైజేషన్ వల్ల అన్యాయం జరుగుతుందని తెలిసినా ప్రభుత్వం ముందుకే వెళ్లింది. టెట్, డీఎస్సీలో ఎన్నేసీ మార్కులు వచ్చాయో చెప్పరు. రెండు కలిపి మార్కులు చెప్పి ర్యాంకులు ఇచ్చారు. ఇప్పటివరకు జరిగిన డీఎస్సీల్లో 80 పైగా మార్కులు వచ్చిన వారి సంఖ్య 40కి దాటలేదు. ఈ డీఎస్సీలో 400 మందికి 80 మార్కులు ఎలా దాటాయో. మనోవేదనతో నాకు గుండెపోటు వచ్చి రెండు స్టెంట్లు వేశారు. తూతూ మాత్రంగా డీఎస్సీ నిర్వహించి కావాల్సిన వారికి పోస్టులు ఇచ్చేశారు. అర్హతలేని వారికి టీచర్ పోస్టులు ఇచ్చి విద్యావ్యవస్థను ఏం చేయాలని చూస్తున్నారు. – ఎస్.బయ్యారెడ్డి, డీఎస్సీ అభ్యర్థి, తుంగవారిపల్లె, (కురబలకోట) -
అంజన్న ఉత్సవాలకు వేళాయె
● ఏర్పాట్లలో ఆలయ అధికారులు ● భక్తులకు ఇబ్బందులు కలగకుండా చర్యలుచక్రాయపేట : పవిత్ర పుణ్యక్షేత్రం గండిలో శ్రావణ మాస ఉత్సవాలకు సమయం ఆసన్నమైంది. ఏడాదికోసారి నెల రోజుల పాటు జరిగే ఉత్సవాల్లో అంజన్న వైభవం చూసేందుకు రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు తమిళనాడు, కర్ణాటకకు చెందిన భక్తులు అధిక సంఖ్యలో తరలివస్తారు. ఇప్పటి వరకు చిన్నగుడిలో అంజన్నను దర్శించుకున్న భక్తులు నేడు ఆలయాన్ని విస్తరించడంతో ఆలయంలోకి అడుగు పెట్టగానే సంస్కృతి ఉట్టిపడేలా, భక్తి భావం ఉప్పొంగేలా కనిపించే భక్తులకు అంజన్న మూలవిరాట్ దర్శనం కలగనుంది. ఈ ఏడాది భక్తుల రద్దీ అధికంగా ఉంటుందని భావించిన ఆలయ వర్గాలు అందుకు తగ్గట్లుగా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నారు. ఈ ఏడాది శ్రావణ మాసంలో నాలుగు శనివారాల పాటు ఉత్సవాలు జరగనున్నాయి. ఈ నెల 13న శ్రావణ మాసం మొదలవనుండటంతో 15న తొలి శనివారోత్సవం, 22న రెండు, 29న మూడు, సెప్టెంబరు 5న చివరి శనివారోత్సవం జరుగుతుంది. ఇందుకు సంబంధించిన ఏర్పాట్లను అధికారులు, పాలకమండలి సభ్యులు ముమ్మరంగా చేపట్టారు. ఇప్పటికే ఆలయ ప్రాంగణంలో చలువ పందిళ్ల ఏర్పాట్లకు శ్రీకారం చుట్టారు. అద్దాలమర్రి క్రాస్తో పాటు వేంపల్లెలోని ప్రధాన కూడళ్ల వద్ద స్వాగత ఆర్చీలు ఏర్పాట్లు చేస్తున్నారు. పోలీసు ఔట్పోస్టు. మెడికల్ క్యాంప్ ఏర్పాట్లకు సంబంధించి ఏర్పాట్లను మొదలు పెట్టారు. పాపాఘ్ని నదిలో నీరు లేనందున భక్తులు స్నానాలు చేసేందుకు స్నాన ఘట్టాలను ఏర్పాటు చేస్తున్నట్లు ఆలయ సహాయ కమిషనర్ సి.విశ్వనాథ్ తెలిపారు. నదిలో ఏపుగా పెరిగిన పిచ్చి మొక్కలు, జమ్మును యంత్రాలతో తొలగించినట్లు ఆయన తెలిపారు. స్వామి దర్శనానికి వెళ్లేందుకు ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. తాగునీటి వసతి కల్పిస్తున్నామన్నారు. విద్యుత్తు దీపాలంకరణ నిమిత్తం టెండర్లు కూడా పూర్తి చేశారు. భక్తులకు సరిపడా లడ్డూ, పులిహోర ప్రసాదాలను సిద్ధం చేయిస్తున్నారు. ఉత్సవాలను ఘనంగా నిర్వహించేందుకు ఆలయ పాలకవర్గం సమష్టి కృషితో ఏర్పాట్లను చేపట్టింది. పోలీసు, పారిశుద్ధ్య, వైద్యం, విద్యుత్, ఇంజనీరింగ్, రవాణా, అగ్నిమాపక శాఖ తదితర శాఖల అధికారులతో ససమన్వయ సమావేశం నిర్వహించి ఆ మేరకు తగిన ఏర్పాట్లను చేపట్టడమే కాకుండా అందరి సహకారం తీసుకుంటామని ఛైర్మన్ వెంకటస్వామి తెలిపారు. రాత్రి బస చేసే భక్తుల కోసం హరికథలు, సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. వీఐపీ పాసులు ఉండవు దేవదాయ శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు ఉత్సవాల సందర్భంగా స్వామి దర్శనాలకు వచ్చే భక్తులకు ఈ ఏడాది వీఐపీ పాసులు ఇవ్వబోమని ఆలయ అధికారి విశ్వనాథ్ తెలిపారు. ఈ విషయంపై భక్తులు, దాతలు సహకరించాలని కోరారు. -
ప్రకృతి వ్యవసాయ సాగును పెంచాలి
రాయచోటి (చిన్నమండెం) : ప్రకృతి వ్యవసాయాన్ని మరింత విస్తృతంగా రైతులకు చేరువ చేయడమే లక్ష్యంగా పనిచేయాలని అన్నమయ్య జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకటమోహన్ పేర్కొన్నారు. తక్కువ ఖర్చుతో అధిక దిగుబడులు సాధించేలా రైతులకు సూచనలు, సలహాలను అందజేయాలని ప్రకృతి వ్యవసాయ శాఖ క్షేత్రస్థాయి అధికారులకు సూచనలు చేశారు. బుధవారం చిన్నమండెం మండలంలోని వండాడి గ్రామంలో నిర్వహించిన క్షేత్రపర్యటనలో భాగంగా ప్రకృతి వ్యవసాయ కార్యక్రమాలను వారు పరిశీలించారు. రైతు రంజిత్ నాయక్ అమలు చేస్తున్న పీఎండీఎస్ క్షేత్రంలో సాగులో ఉన్న పంటలను పరిశీలించారు. పీఎండీఎస్ విధానం ద్వారా సాగు ఖర్చులు, నీటి వినియోగం, పంటల పెరుగుదల దిగుబడులపై రైతును వివరాలు అడిగి తెలుసుకున్నారు. తక్కువ నీటితో కూడా మెరుగైన దిగుబడులు సాధించేందుకు పీఎండీఎస్ విధానం రైతులకు ఎంతగానో ఉపయోగకరమని వారు రైతులకు వివరించారు. ఎల్నినో ప్రభావం కారణంగా వర్షపాతం తగ్గే అవకాశం ఉన్నందున రైతులు స్థానిక వాతావరణ పరిస్థితులకు అనుకూలమైన ఆరుతడి పంటల సాగును ప్రోత్సహించాలని సూచించారు. -
నా ఉద్యోగం వేరొకరికి
రాయచోటికి చెందిన నేను మెగా డీఎస్సీ 2025లో స్కూల్ అసిస్టెంట్(బయలాజికల్ సైన్న్స్, ఉర్దూమీడియం) పరీక్ష రాశాను. స్కూల్ అసిస్టెంట్ బయలాజికల్ సైన్న్స్ విభాగంలో రెండు పోస్టులు ఉండగా, రెండో పోస్టు ఈడబ్ల్యూఎస్కు రిజర్వ్ చేశారు. ఆ పోస్టుకు నేను అర్హుడిని. అయితే, నాకు ఇవ్వాల్సిన పోస్టును బీసీ–ఈ కేటగిరీకి చెందిన వనం మునవ్వర్ రసూల్కు ఇచ్చారు. ముస్లిం బీసీ షేక్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ రిజర్వేషన్కు అనర్హుడు. ఇతను గత నాలుగు డీఎస్సీల్లో తనను బీసీగా నమోదుచేసుకుని పరీక్షలకు హాజరయ్యాడు. 2025 డీఎస్సీలో తప్పుడు కులఽధ్రువీకరణ పత్రాలతో ఉద్యోగం పొంది మడితాడు జెడ్పీ ఉర్దూ ఉన్నతపాఠశాలలో పనిచేస్తున్నాడు. ఈ అక్రమ నియామకంపై అన్ని ఆధారాలతో గ్రీవెన్సెల్కు, ప్రజాప్రతినిధులు, మంత్రుల దృష్టికి తెచ్చినా స్పందన లేదు. మునవర్ రసూల్ సర్టిఫికెట్లు తప్పుడువని తహసీల్దార్తో రద్దు చేయించుకుని రా..అప్పుడు నీ ఉద్యోగం గురించి ఆలోచిస్తామని నిర్లక్ష్యంగా సమాధానం ఇచ్చారు. నాకు న్యాయం చేయాలి. – సయ్యద్ జమీల్, డీఎస్సీ అభ్యర్థి, రాయచోటి -
పాఠశాలల్లో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లు ఏర్పాటు చేయాలి
మదనపల్లె సిటీ : ప్రతి పాఠశాలలో స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్లును ఏర్పాటు చేయాలని డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం స్కౌట్స్ ప్రవేశాల పోస్టర్లను ఆవిష్కరించారు. బాలురకు స్కౌట్స్ యూనిట్, బాలికలకు గైడ్ యూనిట్ ఏర్పాటు చేయాలన్నారు. విద్యాశాఖ అకడమిక్ క్యాలెండర్లో పొందుపరిచిన క్యాలెండర్లో స్కౌట్స్ అండ్ గైడ్ కార్యక్రమాలు సమర్థవంతంగా అమలు చేయాలని ఆదేశించారు. మార్చ్పాస్ట్కు 64 మంది ఎంపిక స్వాతంత్య్ర దినోతవ్స వేడుకల సందర్భంగా మదనపల్లె పోలీసు పరేడ్ మైదానంలో నిర్వహించనున్న జిల్లా స్థాయి మార్చ్ పాస్ట్లో పాల్గొనే విద్యార్థుల ఎంపిక కార్యక్రమం కూడా నిర్వహించారు. 32 మంది స్కౌట్స్, 32 మంది గైడ్స్ ఎంపిక చేశారు. కార్యక్రమంలో జిల్లా సెక్రటరీ మడితాటి నరసింహారెడ్డి, అడ్వాన్స్డ్ స్కౌట్ మాస్టర్ నాగరాజు, మహమ్మద్ఖాన్, హర్షవర్ధన్రెడ్డి, ఎంఈఓ రెడ్డిశేఖర్, జిల్లా సైన్సు అధికారి శ్రీధర్ తదితరులు పాల్గొన్నారు. జైలు భరో, ధర్నా జయప్రదం చేయండి మదనపల్లె (కురబలకోట) : క్విట్ ఇండియా ఉద్యమ స్ఫూర్తితో ఈనెల 10న నిర్వహించే జైలు భరో కార్యక్రమం, ఆగస్టు 18న జిల్లా కలెక్టరేట్ల వద్ద చేపట్టే ధర్నాను జయప్రదం చేయాలని ఏఐటీయూసీ రాష్ట్ర కార్యదర్శి కేతారి రాధాకృష్ణ కోరారు. బుధవారం మదనపల్లెలో జరిగిన జిల్లా సమితి సమావేశంలో ఆయన మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం కార్మిక, రైతు వ్యతిరేక విధానాలు అవలంభిస్తోందన్నారు. వ్యవసాయ పంటలకు చట్టబద్ధమైన కనీస మద్దతు ధర హామీ, రైతులకు రుణమాఫీ, నాలుగు లేబర్ కోడ్ల రద్దు, ప్రభుత్వ రంగ సంస్థల ప్రైవేటీకరణ నిలిపివేత, నిరుద్యోగులకు ఉపాధి,కూలి రేట్లు పెంపు వంటి ప్రధాన డిమాండ్లతో ఉద్యమాలు చేపడుతున్నట్లు తెలిపారు.ఆగస్టు 6 నుండి 9 వరకు జిల్లా వ్యాప్తంగా బైక్ జాతాలు, ప్రచార కార్యక్రమాలు నిర్వహించి, ఈనెల 10న అన్ని నియోజక వర్గ కేంద్రాల్లో జరిగే జైలు భరో కార్యక్రమంలో రైతులు, కార్మికులు, యువత, మహిళలు పాల్గొనాలని కోరారు. నాయకులు టి.కృష్ణప్ప, సాంబశివ, సలీంబాషా, సరేష్కుమార్, వేణుగోపాల్రెడ్డి, నరసింహులు, దేవా, తిరుమల తదితరులు పాల్గొన్నారు. -
షార్ట్ సర్క్యూట్తో ఇళ్లు దగ్ధం
పీలేరురూరల్ : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇళ్లు దగ్ధమై సుమారు రూ. 6 లక్షలు ఆస్థినష్టం వాటిల్లిన సంఘటన బుధవారం పీలేరు పట్టణం బండ్లవంకలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. బండ్లవంక నడివీధిగంగమ్మ ఆలయం సమీపంలో నివాసం ఉంటున్న కె. గోవిందస్వామి ఇంటి కిందభాగంలో నివాసం ఉంటూ పై అంతస్తులో మెకానిక్ షాపు నిర్వహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు వ్యాపించి ఆరు ఎల్ఈడీ టీవీలు, పది ఫ్యాన్లు, వాషింగ్ మిషన్లు, గీసర్లు, బీరువా కాలిపోయాయి. వెంటనే అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలు అదుపు చేశారు. అప్పటికే వస్తువులు కాలిపోయాయి. జరిగిన నష్టాన్ని రెవెన్యూ సిబ్బంది బాధితుని ద్వారా తెలుసుకున్నారు. నిందితుడికి జైలు శిక్షకలికిరి : పాల ట్యాంకరు నిర్లక్ష్యంగా నడిపి వ్యక్తి మృతికి కారణమైన కేసులో పాల ట్యాంకరు డ్రైవరుకు జైలు శిక్షతో పాటు జరిమానా విధిస్తూ వాల్మీకిపురం జూనియర్ సివిల్ కోర్టు జడ్జి తీర్పునిచ్చారు. పోలీసుల కథనం మేరకు... 2018 లో కలికిరి క్రాస్ రోడ్డు నందు రాజస్థాన్కు చెందిన చైత్రపాల్కుమార్ సుందేష్(14) ద్విచక్రవాహనంలో వెళుతుండగా పాలట్యాంకర్ డ్రైవర్ తమిళనాడు రాష్ట్రం నమ్మక్కల్కు చెందిన ఎం.వూవరసన్(30) ఢీ కొట్టాడు. ప్రమాదంలో చైత్రపాల్కుమార్ సుందేష్ మృతి చెందాడు. అప్పట్లో కలికిరి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. కేసు పూర్వాపరాలను పరిశీలించిన వాల్మీకిపురం జడ్జి నిందితునికి ఏడాది జైలు శిక్ష, రూ.15వేలు జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ మేరకు కలికిరి పోలీసులు అతన్ని మదనపల్లి సబ్ జైలుకు తరలించారు. తక్కువ ధరకే బంగారం అంటూ మోసం జమ్మలమడుగు : తక్కువ ధరకే బంగారం వస్తోందని ఆశపడిన ఓ వ్యక్తి మోసపోయిన తర్వాత కుటుంబ సభ్యులతో కలిసి పోలీసులకు ఫిర్యాదు చేసిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. మండల పరిధిలోని మోరగుడిలో భార్యాభర్తలు అద్దె ఇంట్లో ఉంటూ జీవనం సాగించేవారు. ఈ నేపథ్యంలో మోరగుడిలోని సుబ్బరాయుడు అనే వ్యక్తికి చెందిన ఇంటిని బాడుగకు ఇవ్వాలని ఆయనను కోరారు. ఇంటికి మరమ్మతులు జరుగుతున్నాయని తర్వాత చూద్దాం అంటూ ఆయన చెప్పారు. దీంతో వారు తమ వద్ద బంగారు బిస్కెట్లు ఉన్నాయని, వాటిని తక్కువ ధరకే ఇస్తామని సుబ్బరాయుడును నమ్మబలికారు. ముందుగా బంగారం బిస్కెట్లను పగులగొట్టి అందులోని రెండు గ్రామాల బంగారం తీసి టెస్టింగ్ చేసుకోమని సుబ్బరాయుడుకు ఇచ్చారు. బంగారు దుకాణంలోకి వెళ్లిన ఆయన నిజమైన బంగారం అని తేల్చుకున్నారు. మొదట రెండు బిస్కెట్లకు రూ.12 లక్షలు డిమాండ్ చేయగా చివరకు రూ.4.30 లక్షలకు బేరం కుదుర్చుకుని ఏక మొత్తంగా డబ్బులు ఇచ్చారు. ఆ డబ్బులు తీసుకుని ఆ దంపతులు పరారయ్యారు. బిస్కట్లను తీసుకుని బంగారు దుకాణంలో చూపించగా అవి నకిలివని తెలడంతో బాధితుడు తన కుటుంబంతో కలిసి పోలీసుస్టేషన్లో ఫిర్యాదు చేశారు. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు పేర్కొన్నారు. -
నింద మోపారని ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : ఎలాంటి తప్పు చేయక పోయినా, అన్యాయంగా తనపై దొంగతనం నింద మోపారన్న బాధతో ఓ యువకుడు ఎలకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. బుధవారం పుంగనూరు మండలంలో జరిగిన ఘటనపై బాదితుని కుటుంబీకులు తెలిపిన వివారాలు.. మండలంలోని నేతిగుట్లపల్లి పంచాయితీ, దిగువ కొండమీద పల్లెకు చెందిన జానకిరామ్ కుమారుడు ఎన్. హరీష్ (27) బాడుగ ఆటో నడుపుకొని భార్యనాగరత్న, కుమారునితో పాటు తల్లి దండ్రులను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో తన భార్య నాగరత్న బంధువు ఒకరు హరీష్పై సిమెంట్ దొంగలించాడని నింద మోపడంతో గ్రామంలో హేళన చేస్తున్నారని, తలెత్తుకు తిరుగులేక తీవ్ర అవమానంగా భావించాడు. తాను ఎలాంటి తప్పు చేయకపోయినా దొంగతనం నింద మోపారని ఆవేదనకు లోనై, ఇంట్లో ఉన్న ఎలకల మందు తాగాడు. కుటుంబీకులు గమనించి వెంటనే బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పుంగనూరు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
తమ్మునిపై అన్న దాడి
మదనపల్లె టౌన్ : ఇంటి వివాదం తలెత్తి తమ్ముడిపై అన్న కరత్రో దాడి చేసిన సంఘటన బుధవారం కురబలకోట మండలంలో జరిగింది. ఘటనపై బాధితుడు ముదివేడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని నల్లగుట్లపల్లి కు చెందిన శంకర (44) ఇంటిని అన్న ఆక్రమించేందుకు ప్రయత్నించాడు. దీంతో ఇద్దరి మధ్య జరిగిన గొడవలో శంకర పై అన్న కరత్రో దాడి చేసి గాయపరిచాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పొలం వద్ద ఘర్షణ: వ్యక్తికి గాయాలు మదనపల్లె టౌన్ : పొలం వద్ద చోటుచేసుకున్న ఘర్షణలో ప్రత్యర్థులు ఓ వ్యక్తి పై కర్రలతో దాడి చేశారు. ఘటనపై బాధితుడు గుర్రంకొండ పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. గుర్రంకొండ మండలం, నడిమి కండ్రిగ పంచాయతీ, గరికుంటపల్లికి చెందిన బి . వెంకటేష్ (55) భూమిని అదే ఊరికి చెందిన ఓ వ్యక్తి బుధవారం కబ్జా చేయడానికి యత్నించడంతో వెంకటేష్ వెళ్లి అడ్డుకున్నాడు. దీంతో ప్రత్యర్థి వర్గంలోని ఓ వ్యక్తి కరత్రో వెంకటేష్ పై దాడి చేయడంతో తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. దాడికి పాల్పడ్డ వ్యక్తి వివరాలు ను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
రాయచోటిలో యూరియా దందా
● ప్రభుత్వ ధర బస్తా రూ. 270 ఉండగా రూ. 350 వరకు విక్రయం ● రైతుల ఫిర్యాదుపై స్పందించిన అగ్రికల్చర్ అధికారులు ● ఏపీ ఆగ్రోస్ రైతు సేవాకేంద్రం లైసెన్సు రద్దు, గోదామ్ సీజ్ రాయచోటి: వ్యవసాయ సాగుకు అవసరమైన ఎరువులు, మందుల విక్రయాలలో వ్యాపారుల దోపిడీ సాగుతోంది. ఫలితంగా ఆరుగాలం కష్టపడుతన్న రైతులకు ఎరువుల దుకాణాదారులు అధిక ధరలకు విక్రయిస్తున్నారు. వ్యవసాయ అధికారులు సైతం అధిక ధరలకు విక్రయిస్తున్న వారిపై కఠిన చర్యలు చేపట్టకపోవడంతో చెప్పిన ధరలకు కొనుగోలు చేయాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ప్రైవేటు వ్యాపారుల నుంచి రైతులకు విముక్తి కల్పించాలన్న ఉద్దేశంతో ప్రభుత్వం ఆగ్రోస్ సంస్థ ద్వారా డిపోలను ఏర్పాటు చేయించి తక్కువ ధరలతో ఎరువులను అందించాలనే ప్రయత్నాలకు డిపోల యజమానులు తూట్లు పొడుస్తున్నారు. అన్నమయ్య జిల్లా రాయచోటిలో యూరియా బ్లాక్ మార్కెట్ విక్రయాలు విక్రయిస్తూ దోపిడీ పర్వాన్ని కొనసాగిస్తున్నారు. ఆగ్రోస్ సేవా కేంద్రం, గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల ద్వారా బస్తా యూరియా రైతుకు రూ. 269.50కి అందాల్సి ఉంది. యూరియాను కొంతమంది వ్యాపారులు బ్లాక్ మార్కెట్లో రూ. 350 నుంచి రూ. 450 వరకు విక్రయిస్తున్నట్లు రైతులు ఆరోపిస్తున్నారు. పంటలు సాగు చేసి, యూరియాకోసం సచివాలయాల చుట్టూ తిరుగుతున్నా కేవలం ఒక ప్యాకెట్ మాత్రమే ఇస్తూ చేతులు దులుపుకుంటున్నారని వాపోతున్నారు. రాయచోటిలోని ఆగ్రోస్ రైతు డిపోలో ఒకబస్తా రూ. 350లకు విక్రయించడంపై అన్నదాతలు ప్రశ్నించారు. రైతుల మాటలను ఖాతరు చేయని డిపో యజమాని తమకు ఇష్టం వచ్చిన ధరలకు విక్రయిస్తూ నచ్చితే కొనండి లేదంటే పక్కన కొనుగోలు చేయాలని ఆగ్రహం వ్యక్తం చేసినట్లు మీడియాలో రికార్డు అయ్యింది. ఇదే విషయంపై వ్యవసాయసాఖ అధికారులకు రైతులు ఫిర్యాదు చేశారు. లైసెన్సు రద్దు, ఎరువులు సీజ్...... ఫిర్యాదుపై స్పందించిన వ్యవసాయశాఖ రాయచోటి డివిజనల్ అధికారి శ్రీలత రెడ్డి, స్థానిక ఏఓలు అధిక ధరల విక్రయాలపై బుధవారం విచారణ చేశారు. అధిక ధరలకు విక్రయిస్తున్నట్లు నిర్ధారణ కావడంతో 15 రోజులుపాటు గోదామును సీజ్ చేసి డీలర్ లైసెన్సు రద్దు చేశారు. గోదాంలో రూ. 50037 విలువచేసే 244.63 మెట్రిక్ టన్నుల ఎరువులను సీజ్ చేసినట్లు వ్యవసాయ అధికారులు తెలిపారు. నిరంతరం నిఘా ఉండాలి ఎరువుల విక్రయాలపై సంబంధిత శాఖ అధికారుల నిరంతరం నిఘా సాగాలని రైతులు కోరుతున్నారు. ఎరువులు దుకాణాదారులతో వ్యవసాయశాఖ అధికారులు కుమ్మకై అధిక ధరలకు విక్రయిస్తున్నా సకాలంలో స్పందించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా సంబంధిత జిల్లా వ్యవసాయశాఖ అధికారులు స్పందించి బ్లాక్ మార్కెట్ విక్రయాలను అరికట్టి ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు యూరియా అందేలా చూడాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. కూటమి ప్రభుత్వం రైతులకు అవసరమయ్యే యూరియా ఉందని ప్రకటనలు ఇస్తున్నా అవి ప్రకటనలు లాగే మిగిలిపోయాయని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
లారీ, కారు ఢీ..
● మరో నలుగురికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : లారీ కారును ఢీకొట్టిన ఘటనలో ఒ మహిళ అక్కడికక్కడే మృతి చెంది, మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. బుధవారం వేకువజామున అన్నమయ్య జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాద ఘటనపై పోలీసులు తెలిపిన వివరాలు.. అనంతపురానికి చెందిన అన్వర్ బాష (60) కొంతకాలంగా పక్షవాతంతో బాధపడుతున్నాడు. ఈ క్రమంలో అతనికి పలమనేరు మండలం, విరూపాక్షిపురంలో మందు పోయించుకుని రావడానికి కుటుంబ సభ్యులతో కారులో మంగళవారం రాత్రి 10 గంటలకు అనంతపురంలో బయలుదేరారు. కారులో అన్వర్బాష, అతని భార్య జుబేదా(42), కూతురు కౌసర్(20) అల్లుడు బబ్లు(24), ఇమ్రాన్ బాష (28) ఉన్నారు. కారు కురబలకోట మండలం, అంగళ్ళు విశ్వం కళాశాల వద్దకు రాగానే, వేగంగా వచ్చిన లారీ ఢీకొట్టి ఆగకుండా వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో అన్వర్ బాషా భార్య జుబేదా (42) అక్కడికక్కడే దుర్మరణం చెందింది. కారులో ఉన్న మరో నలుగురు తీవ్రంగా గాయపడ్డారు. వారిలో కౌసర్ (20) పరిస్థితి విషమంగా ఉంది.సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పరారీలో ఉన్న లారీ డ్రైవర్ కోసం గాలిస్తున్నారు. -
ఎరువుల దుకాణాల తనిఖీ
గుర్రంకొండ: మండలకేంద్రమైన గుర్రంకొండలో ఎరువుల దుకాణాల్లో కేంద్ర ఆడిట్ బృందం ఆకస్మిక తనిఖీలు నిర్వహించింది బుధవారం స్థానిక బస్టాండులోని ఎరువుల్లో దుకాణాల్లో కేంద్రబృందం సభ్యులు అశోక్మీనా, నవీన్, సోమయాజులులు రికార్డులను తనిఖీ చేశారు. దుకాణాల లైసెన్స్లు, స్టాక్ బోర్డు, స్టాకు వివరాల రిజిష్టర్లను పరిశీలించి వివరాలు ఆరా తీశారు. ఈసందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నిర్దేశించిన ధరలకే ఎరువులు విక్రయించాలన్నారు. దుకాణాల్లో ఎరువులను కొనుగోలు చేసే ప్రతి రైతుకు తప్పనిసరిగా బిల్లులు ఇవ్వాలన్నారు. లేని పక్షంల్లో దుకాణాల లైసెన్స్లు రద్దు చేస్తామని హెచ్చరించారు. ప్రతి దుకాణం ఎదుట ధరలను సూచించే బోర్డులను తప్పనిసరిగా రైతులకు అందుబాటులో ఉంచాలన్నారు. అనంతరం ఎరువుల దుకాణాలకు సంబందించిన గోడౌన్లను తనీఖీ చేశారు. అక్కడ స్టాకు ఉంచిన ఎరువుల బస్తాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో మదనపల్లె వ్యవసాయశాఖ ఏడీఏ మజీద్అహ్మాద్, టెక్నికల్ ఏవో నవంత్బాబు, ఏవో రత్నమ్మ తదితరులు పాల్గోన్నారు. రికార్డుల పరిశీలన ములకలచెరువు: స్థానిక మండల కేంద్రంలోని ప్రధానమంత్రి కిసాన్ సంవృద్ధి కేంద్రాలను కేంద్ర బృందం బుధవారం తనిఖీ చేశారు. ఈ సందర్బంగా రికార్డులు, ఎరువులను పరిశీలించారు. అనంతరం కేంద్ర బృందం మాట్లాడుతూ... కాలం చెల్లిన ఎరువులు రైతులకు విక్రయించరాదని ఆదేసించారు. కార్యక్రమంలో కేంద్ర బృందం అశోక్కుమార్, నవీన్, సోమయాజులు, మస్జిద్ అహ్మద్, ఏఓ శ్రవంతి తదితరులు ఉన్నారు. -
రోడ్డుప్రమాదంలో మహిళ మృతి
పుంగనూరు : ద్విచక్రవాహనంలో వెళ్తున్న ఓ మహిళ నడిచి వెళ్తున్న మరో మహిళను ఢీకొనడంతో వాహనం నడుపుతున్న మహిళ మృతిచెందిన సంఘటన బుధవారం మధ్యాహ్నం మండలంలోని శాంతినగర్ వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. ఈడిగపల్లెకి చెందిన సుబ్బరాం కుమారై లక్ష్మీ(37), తన అక్క కుమారుడు సురేంద్ర (21)తో కలసి ద్విచక్రవాహనంలో పుంగనూరులో పని నిమిత్తం వస్తూ శాంతినగర్ వద్దకు చేరుకున్నారు. ఆ సమయంలో ఆగ్రామానికి చెందిన మీనా(35) రోడ్డు పై వెళ్తుండగా వాహనం అదుపుతప్పి ఢీకొని పక్కన ఉన్న ఇంటిలోనికి దూరి గోడను ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో లక్ష్మీ తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే మృతి చెందింది. మీనాకు తీవ్రంగా, సురేంద్రకు స్వల్పగాయాలయ్యాయి.. ఇరువురిని స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. మీన పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తీసుకెళ్లారు. ఈ మేరకు ఎస్ఐ అన్సర్బాషా కేసు నమోదు చేశారు. -
మదనపల్లిలో చిరు జల్లులు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో వాతావరణం ఒక్కసారిగా మారింది. మంగళవారం సాయంత్రం మదనపల్లెలో చిరు జల్లులు పడ్డాయి. ఉదయం నుండి సాయంత్రం వరకు ఎండ కాసినప్పటికీ, సాయంత్రానికి వాతావరణంలో మార్పులు చోటు చేసుకుని వర్షం మొదలైంది. అకస్మాత్తుగా కురిసిన వర్షం కారణంగా వాహనదారులు, చిరు వ్యాపారులు కాస్త అవస్థలు పడ్డారు. గత రెండు రోజులుగా జిల్లాలో అక్కడక్కడ వర్షాలు కురుస్తున్నాయి. రాయచోటి నియోజకవర్గంలోని చిన్నమండెం, సంబేపల్లె, రాయచోటి, రామాపురంలో వర్షం కురిసింది. అలాగే పీలేరు నియోజకవర్గంలోని కలకడ, కేవిపల్లె, పీలేరు, కలికిరి, వాల్మీకిపురం, సదుం మండలాల్లో ఓ మోస్తారు వర్షం కురిసింది. రాబోయే రోజుల్లోనూ తేలికపాటి నుండి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు తెలిపారు. ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలను పశువులకు వేయించాలిరాయచోటి (చిన్నమండెం) : రైతులు పశువులకు ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాలను వేయించాలని జిల్లా పశు సంవర్థకశాఖాధికారి డాక్టర్ గుణశేఖర్ పిళ్లై అన్నారు. చిన్నమండెం మండల పరిధిలో జరుగుతున్న ముద్దచర్మ వ్యాధి నివారణ టీకాల పనితీరును మంగళవారం ఆయన పరిశీలించారు. దిగువగొట్టివేడు, చాకిబండ, మల్లూరు, చిన్నమండెం గ్రామాలలో క్షేత్రస్థాయిలో పరిశీలన చేసి పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఈ కార్యక్రమం ద్వారా ఈనెల 1వ తేది నుంచి 31వ తేది వరకు రైతు సేవా కేంద్రాల పరిధిలో పశువులకు ఉచితంగా టీకాలు వేస్తామన్నారు. పర్యటనలో భాగంగా చిన్నమండెం మండల కేంద్రంలో జరుగుతున్న నూతన పశువైద్యశాల నిర్మాణాన్ని పరిశీలించారు. ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోండి రాయచోటి టౌన్ : ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని ఆంధ్రప్రదేశ్ ఓపెన్ స్కూల్ సొసైటీ (ఏపీఓఎస్ఎస్) జిల్లా కో– ఆర్డినేటర్ కొండూరు శ్రీనివాస రాజు సూచించారు. మంగళవారం బాలికోన్నత పాఠశాల ఆవరణంలో ఓపెన్ స్కూల్ ప్రవేశాలపై అవగాహన కల్పించాలని కరపత్రాలను విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏదైనా కారణాల చేత బడిని మధ్యలో మానేసిన వారు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు. ఓపెన్ స్కూల్ పద్ధతి ద్వారా 10వ తరగతి, పదవ తరగతి పాస్ అయిన వారు ఇంటర్మీడియ్ కోర్సులో చేరేందుకు అర్హులని తెలిపారు. అలాగే ఈ ఓపెన్ పరీక్షలు తెలుగు, ఇంగ్లీష్, ఉర్దూ, ఒరియా భాషలలో ప్రవేశాలు ఉన్నా యని తెలిపారు. ఈ అవకాశాలను అర్హత కలిగిన వారు సద్వినియోగం చేసుకోవాలన్నారు. ఇస్రో శాస్త్రవేత్తగా సచివాలయ ఉద్యోగికలసపాడు : మండలంలోని శంఖవరం గ్రామానికి చెందిన సచివాలయ ఉద్యోగి సి.వి.రమేష్కుమార్ భారత అంతరిక్ష పరిశోధన సంస్థ (ఇస్రో) పరిధిలోని విక్రమ్ సారాభాయి స్పేస్ సెంటర్ (వీఎస్ఎస్సీ – తిరువనంతపురం)కు శాస్త్రవేత్తగా ఎంపికయ్యారు. మంగళవారం విడుదలైన ఫలితాల్లో ఆయన ఈ అరుదైన ఘనత సాధించారు. రమేష్కుమార్ గతంలో కలసపాడు మండలంలోని పిడుగుపల్లె, కలసపాడు సచివాలయాల్లో ఇంజినీరింగ్ అసిస్టెంట్గా విధులు నిర్వహించారు. రైతు కుటుంబంలో పుట్టి కఠిన శ్రమ, నిరంతర కృషితో ఇస్రోలో శాస్త్రవేత్త ఉద్యోగం సాధించడం తన జీవితంలో మరువలేని అనుభూతిని ఇచ్చిందని రమేష్కుమార్ ఆనందం వ్యక్తం చేశారు.పీఆర్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా కందుల కడప ఎడ్యుకేషన్ : ప్రోగ్రెసివ్ రికగ్నైజ్డ్ టీచర్ యూనియన్ (పీఆర్టీయూ) రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడిగా జిల్లాకు చెందిన సీనియన్ ఉపాధ్యాయులు కందుల వెంకటసుబ్బారెడ్డి నియమితులయ్యారు. ఈ మేరకు పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు మిట్టా క్రిష్ణయ్య, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గిరిప్రసాద్లు నియామక ఉత్తర్వులను జారీ చేశారు. ఈ సందర్భంగా కందుల వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ పీఆర్టీయూ బలోపేతానికి మరింత కృషి చేస్తానన్నారు. -
మదనపల్లెలో అత్యవసర చికిత్సా కేంద్రం
సాక్షి, మదనపల్లె : జాతీయ రహదారి సమీపంలో ఉన్న మదనపల్లె వద్ద అత్యాధునిక అత్యవసర చికిత్సా కేంద్రం (ట్రామా కేర్ సెంటర్) ఏర్పాటు కోసం తక్షణమే పక్కా ప్రతిపాదనలు సమర్పించాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారిని ఇంచార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ ఆదేశించారు. మంగళవారం నిర్వహించిన జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. జిల్లాలోని గ్రామీణ, జాతీయ, రాష్ట్ర రహదారులకు అనుసంధానమయ్యే అన్ని ప్రధాన కూడళ్లలో రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన చర్యలు చేపట్టాలన్నారు. రహదారులపై వేగ నిరోధకాలు, హెచ్చరిక బోర్డులు, రాత్రి వేళల్లో వీధి దీపాలు వంటి మౌలిక భద్రతా ఏర్పాట్లను తక్షణమే పూర్తి చేయాలని సూచించారు. జూన్, జూలైలలో పెరిగిన ముప్పు.. ఎస్పీ వెల్లడి! ఈ సమావేశంలో అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పవర్ పాయింట్ ప్రదర్శన ద్వారా రోడ్డు భద్రతకు సంబంధించి పోలీసు శాఖ క్షేత్రస్థాయిలో చేపడుతున్న చర్యలను సమగ్రంగా వివరించారు. ఈ ఏడాది జనవరి నుంచి మే వరకు గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో రోడ్డు ప్రమాదాలు 20 శాతం తగ్గినప్పటికీ.. జూన్, జూలై నెలల్లో ప్రమాదాల సంఖ్య మళ్లీ పెరిగిందని ఎస్పీ ఆందోళన వ్యక్తం చేశారు. వాహనాల అతివేగం, అడ్డగోలు ఓవర్టేకింగ్, భారీ వాహనాల రద్దీతో పాటు ముఖ్యంగా రాత్రి వేళల్లో తిరిగే ట్రాక్టర్లపై కాంతిని ప్రతిబింబించే పట్టీలు (రిఫ్లెక్టివ్ టేపులు), హెచ్చరిక లైట్లు లేకపోవడమే ఈ ప్రమాదాల పెరుగుదలకు ప్రధాన కారణమన్నారు. జాతీయ, రాష్ట్ర రహదారులపై తిరిగే ప్రతీ ట్రాక్టర్కు తప్పనిసరిగా రేడియం పట్టీలు, వెనుక లైట్లు ఏర్పాటు చేసేలా రవాణా శాఖ చర్యలు తీసుకోవాలన్నారు. ప్రమాదాలు ఎక్కువగా జరిగే బ్లాక్స్పాట్ల వద్ద శాశ్వత పరిష్కారాలు చేపట్టడంతో పాటు ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించేలా కఠిన తనిఖీలు నిర్వహించాలని పేర్కొన్నారు. సహాయకులను వేధించొద్దు! రహదారులపై ప్రమాదాలు జరిగినప్పుడు బాధితులను సకాలంలో ఆసుపత్రులకు తరలించి ప్రాణాలు కాపాడే మంచి సహాయకులను (గుడ్ సమారిటన్లను) పోలీసులు కానీ, కోర్టుల పేరిట ఇతరులు కానీ ఎలాంటి ఇబ్బందులు కలిగించరాదని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్పష్టం చేశారు. దీనికి సంబంధించిన ప్రభుత్వ మార్గదర్శకాలను జిల్లాలోని అన్ని ఆసుపత్రులు మరియు పోలీసు అధికారులు తప్పనిసరిగా అమలు చేయాలని సూచించారు. జిల్లావ్యాప్తంగా మొత్తం 236 ప్రమాద ప్రాంతాలను గుర్తించగా, వాటిలో ఇప్పటికే 108 చోట్ల వేగ నిరోధకాలు ఏర్పాటు చేసినట్లు, మిగిలిన 128 అత్యంత ప్రమాదకర ప్రాంతాల్లో పనులను యుద్ధప్రాతిపదికన పూర్తి చేయాలని ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశించారు. ఈ ఉన్నత స్థాయి సమీక్షా సమావేశంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి, జిల్లా రవాణా శాఖ అధికారి ప్రతాప్, ఆర్ అండ్ బి, జాతీయ రహదారుల విభాగం, వైద్యారోగ్య, మున్సిపల్ కమిషనర్లు, డీఎస్పీలు, స్టేషన్ అధికారులు పాల్గొన్నారు. ఇంచార్జ్ కలెక్టర్ ఆదేశం! గత ఏడాదితో పోలిస్తే జనవరి–మే మధ్య 20 శాతం తగ్గిన రోడ్డు ప్రమాదాలు జూన్, జూలైలలో పెరిగిన ఘోరాలు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పవర్ పాయింట్ ప్రదర్శన -
మామిడి తోటలపై గొడ్డలివేటు
సంబేపల్లె : అన్నమయ్య జిల్లాలో మామిడి సాగుకు తీవ్ర కష్టకాలం ముంచుకొచ్చింది. ప్రతి ఏటా ధరలు దారుణంగా పతనమవుతున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో పల్ప్ ఫ్యాక్టరీలు, ర్యాంపుల నిర్వాహకులు సిండికేట్గా మారి మామిడి రైతుల నోట్లో మట్టి కొడుతున్నారు. జిల్లావ్యాప్తంగా దాదాపు 30 వేల ఎకరాలలో సాగు చేసిన తోతాపురి రకం మామిడి ధరలు దారుణంగా పడిపోవడంతో.. కాయల కోత, కూలీలు, మందులు, రవాణా ఖర్చులకు కూడా డబ్బులు రాని దయనీయ స్థితి దాపురించింది. తోటల నిర్వహణ భారం కావడంతో దిక్కుతోచని స్థితిలో రైతన్నలు చేత గొడ్డలి పట్టి, జేసీబీల సహాయంతో చెట్లను నేలమట్టం చేస్తున్నారు.ఈ క్రమంలోనే సంబేపల్లె మండల పరిధిలోని నారాయణరెడ్డిపల్లె (బంగారువాండ్లపల్లె) సమీపంలో దాదాపు 13 ఎకరాల మామిడి తోటను పూర్తిగా నరికివేసి భూమిని చదును చేస్తున్నారు. కళ్లముందే పచ్చని తోట నేలమట్టం అవుతుంటే రైతులు పడుతున్న బాధ వర్ణనాతీతంగా మారింది. మామిడి సాగుతో అప్పులపాలు కావాల్సి వస్తోందని, అందుకే ప్రత్యామ్నాయ పంటల వైపు మొగ్గు చూపుతున్నామని కన్నీటిపర్యంతమవుతున్నారు. -
సరికొత్త సాగు సందడి!
సండ్రడివిలోములకలచెరువు : ప్రపంచంలోనే అత్యంత అరుదైన, ఖరీదైన లగ్జరీ కలప ‘ఎర్రచందనం’ శేషాచలం అడవుల సరిహద్దులు దాటి అన్నమయ్య జిల్లా పశ్చిమ ప్రాంత కరువు నేలలోనూ పచ్చగా వేళ్లూనుకుంటోంది. ములకలచెరువు మండలం, సండ్రడివి ప్రాంతంలో అటవీ శాఖ శాస్త్రవేత్తలు, అధికారులు అత్యంత ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ప్రయోగాత్మక ఎర్రచందనం సాగు ఊహించని రీతిలో ఘన విజయం సాధించింది. కరువు కోరల్లో చిక్కుకునే ఈ ప్రాంత వాతావరణం, నేలలు కూడా ఈ ఎర్రబంగారం పెంపకానికి వంద శాతం అనుకూలమని క్షేత్రస్థాయి ఫలితాలు నిరూపించాయి. ఎర్రచందనంతో పాటు ఔషధ వనం.. అన్నీ సురక్షితం సండ్రడివి అటవీ ప్రాంతంలో కేవలం ఎర్రచందనం మాత్రమే కాకుండా.. విభిన్న రకాల ప్రాణరక్షక ఔషధ మొక్కల పెంపకం కూడా అద్భుతంగా విజయవంతమైంది. 2015 సంవత్సరంలో ఇక్కడ 6వేల ఎర్రచందనం మొక్కలను నాటిన తరుణంలోనే, వాటితో పాటు పలురకాల విలువైన ఔషధ మొక్కల పెంపకాన్ని కూడా అటవీ శాఖ అధికారులు ప్రతిష్టాత్మకంగా ప్రారంభించారు. అధికారుల పర్యవేక్షణ, సిబ్బంది నిరంతర శ్రమతో ఇక్కడ నాటిన అలోవీర (కలబంద), అడవిగంధి, ఉసిరి, శ్రీగంధం, వేప, అల్లనేరేడు, వెలగ, తపసి, కుంకుడు మొక్కలన్నీ కరువు వాతావరణాన్ని తట్టుకుని ఏపుగా పెరిగి పెద్ద చెట్లుగా మారాయి. వనమూలికల సంరక్షణకు సండ్రడివి క్షేత్రం ఒక సరికొత్త ఆయుర్వేద కేంద్రంగా విరాజిల్లుతోంది. 500 ఎకరాలలో నీలగిరి వృక్షాల పండుగ ఈ అడవిలో పదకొండేళ్ల నాటి మొక్కలతో పాటు, 20 ఏళ్ల క్రితం నాటిన నీలగిరి చెట్లు ప్రస్తుతం ఆకాశాన్నంటేలా భారీ వృక్షాలుగా రూపాంతరం చెందాయి. అటవీ సముదాయం పరిధిలోని సుమారు 500కు పైగా ఎకరాల అత్యంత విస్తారమైన అటవీ భూములలో నాటిన ఈ నీలగిరి మొక్కలు కూడా అధికారుల కృషితో వంద శాతం బతికి దట్టమైన అడవిలా మారాయి. పదేళ్ల శ్రమ.. ట్యాంకర్లతో నీటి సరఫరా ములకలచెరువు మండలం సండ్రడివి ప్రాంతంలో నాటిన ఈ అటవీ సంపద సంరక్షణను సవాల్గా తీసుకున్న అటవీశాఖ అధికారులు, సిబ్బంది క్షేత్రస్థాయిలో నిరంతరం ప్రత్యేక శ్రద్ధ తీసుకున్నారు. పశ్చిమ కరువు ప్రాంతం కావడంతో కఠినమైన వేసవి కాలంలో ఈ మొక్కలు ఎండిపోకుండా ఉండేందుకు ప్రత్యేకంగా ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేశారు. వీటికి సమయానికి అవసరమైన ప్రకృతి సిద్ధమైన సేంద్రియ ఎరువులను వేసి అద్భుతంగా కాపాడారు. అధికారుల అకుంఠిత దీక్ష, కష్టానికి తగ్గట్టుగానే అటవీ శాఖ ఆశించిన విధంగా సాగు చేసిన ఆ 6వేల ఎర్రచందనం మొక్కలతో పాటు ఔషధ, నీలగిరి తోటలలో ఒక్కటి కూడా ఎండిపోకుండా ప్రతి ఒక్క మొక్కా క్షేమంగా బతికి బట్టకట్టింది. కందకాల ప్రయోగం.. ఇంకిన వర్షపు నీరు వృక్షాలు నాటిన ప్లాంటేషన్ క్షేత్రంలో అటవీ శాఖ అధికారులు అత్యంత వ్యూహాత్మకంగా చిన్న చిన్న కందకాలను తవ్వించారు. వర్షాకాలంలో కురిసే ప్రతి చినుకు వృధా కాకుండా ఈ కందకాలలో వర్షపు నీరు సమృద్ధిగా నిలిచిపోయేలా ఏర్పాట్లు చేశారు. ఈ కందకాల వల్ల భూమిలో తేమ శాతం ఎక్కువ కాలం నిలిచి ఉండటంతో, చాలా రోజుల వరకు చెట్లకు సహజ సిద్ధంగా నీరందుతూ వృక్షాల వేగవంతమైన ఎదుగుదలకు ఎంతో దోహదపడింది. భవిష్యత్తులో ఈ కరువు మండల పరిధిలో మరిన్ని ప్రాంతాల్లో సామాజిక అడవుల కింద ఎర్రచందనం, ఆయుర్వేద మొక్కల పెంపకాన్ని విస్తరింపజేస్తే అటవీ సంపద పెరగడమే కాకుండా ప్రభుత్వానికి భారీగా ఆదాయం సమకూరుతుందని పర్యావరణ ప్రేమికులు హర్షం వ్యక్తం చేస్తున్నారు. కరువు నేలలోనూ పచ్చగా వేళ్లూనుకున్న ఎర్రబంగారం, ఔషధ వనాలు 2015లో నాటిన 6వేల మొక్కలూ సురక్షితం అటవీ శాఖ ప్రయోగం సూపర్ హిట్ 500 ఎకరాలలో భారీ వృక్షాలుగా మారిన నీలగిరి తోటలతో సరికొత్త రికార్డుకంటికి రెప్పలా కాపాడుకున్నాం సండ్రడివిలో నాటిన ఎర్రచందనం మొక్కలను కంటికి రెప్పలాగా కాపాడుకున్నాం. మొదట మూడేళ్లు ప్రత్యేక శ్రద్ధ తీసుకొని ట్యాంకర్ల ద్వారా మొక్కలకు నీరు పట్టాం. ప్రస్తుతం చెట్లయ్యాయి. ఇక వర్షాధారంగా చెట్లు పెరుగుతున్నాయి. ఉన్నతాధికారుల దష్టికి తీసుకెళ్లి మరిన్ని మొక్కలు నాటేందుకు చర్యలు తీసుకుంటాం. – శ్రీనివాసులు, అటవీశాఖ అధికారి, బురకాయకోట సెక్షన్ -
ఎల్నినో దెబ్బకు ఎండిపోతున్న పంటలు
సాక్షి, మదనపల్లె : తీవ్రమైన ఎల్నినో వాతావరణ ప్రభావం వల్ల వర్షాలు లేక మదనపల్లె మండలంలో పంటలు దారుణంగా దెబ్బతిన్నాయని కృషి విజ్ఞాన కేంద్రం సీనియర్ సైంటిస్ట్, హెడ్ కె.మంజుల ఆందోళన వ్యక్తం చేశారు. మంగళవారం వ్యవసాయ పరిశోధన స్థానం, కేవీకే, అగ్రి పాలిటెక్నిక్ శాస్త్రవేత్తల బృందం మదనపల్లె మండలంలోని మిట్టపల్లి, జంగంపల్లి, కొత్తవారిపల్లి, దయ్యాలవారిపల్లి గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ఎండిపోతున్న పంటలను పరిశీలించింది. ఈ సందర్భంగా శాస్త్రవేత్తలు మాట్లాడుతూ.. తీవ్ర వర్షాభావం వల్ల వేరుశనగ పంట అస్సలు పెరగకుండా ఎండిపోయిందని, అంతర పంటలైన అలసంద, అనుములు కూడా వాడిపోయాయని గుర్తించారు. చివరకు బోర్ల కింద నీరు తగ్గిపోవడంతో సూపర్ నేపియర్, జొన్న లాంటి పశుగ్రాస పంటలు సైతం నిలువునా ఎండిపోతున్నాయన్నారు. ప్రస్తుత క్లిష్ట పరిస్థితుల్లో కొద్దిపాటి నీటి వసతి ఉన్న కూరగాయలు, పండ్ల తోటలు, పూల తోటల్లో పంట వ్యర్థాలు, ఎండి రాలిన ఆకులు, చిరుకొమ్మలతో నేలపై ’మల్చింగ్’ (కప్పి ఉంచడం) చేసుకోవాలని శాస్త్రవేత్తలు రైతులకు సూచించారు. రైతులంతా తప్పనిసరిగా పంట బీమా చేయించుకోవాలని కోరారు. ఈ పర్యటనలో ప్రిన్సిపల్ సైంటిస్ట్ శాంతి ప్రియ, డాక్టర్ పి.నాగమణి, శ్రీనివాసులు పాల్గొన్నారు.గ్రామాల్లో వ్యవసాయ శాస్త్రవేత్తల బృందం పరిశీలన -
దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు
మదనపల్లె టౌన్ : దివిసీమ గాంధీ మండలి వెంకటకృష్ణారావు అని అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి అన్నారు. మండలి జయంతి వేడుకలను అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఘనంగా నిర్వహించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు మదనపల్లె పోలీసులు ఆయన చిత్రపటానికి నివాళులర్పించి మాట్లాడారు. ఉన్నత పదవుల్లో ఉన్నా సామాన్యుడిలా జీవిస్తూ, 1977 తుఫాను సమయంలో కృష్ణారావు చేసిన నిస్వార్థ సేవలు చిరస్మర ణీయమని కొనియాడారు. కార్యక్రమంలో ఆర్ఐ (అడ్మిన్) యు.రంగనాథ్బాబు, ఆర్ఎస్ఐలు చంద్రశేఖర్, మగ్బుల్, కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో రోడ్డు ప్రమాదాలను అరికట్టేందుకు జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు తీసుకోనుంది. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లో జిల్లా రోడ్డు సేఫ్టీ కమిటీ(డీఆర్ఎస్సీ) ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం జరిగింది. ఈ సమావేశానికి జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణశర్మ, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అధ్యక్షత వహించారు. సమావేశాన్ని ఉద్దేశించి జేసీ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ విద్యాసంస్థలు, రద్దీ ప్రాంతాల వద్ద జీబ్రా క్రాసింగ్లు ఏర్పాటు చేయాలని తెలిపారు. జాతీయ రహదారులపై దుమ్ము, ధూళిని ఎప్పటికప్పుడు తొలగించాలన్నారు. రహదారులపై వీధి దీపాలు వెలిగేలా చూడాలని చెప్పారు. బ్లాక్ స్పాట్స్ గుర్తించి సంయుక్త తనిఖీలు చేసి తక్షణ భద్రతా చర్యలు చేపట్టాలని పేర్కొన్నారు. ప్రమాద బాధితులకు తక్షణ వైద్యం కోసం జిల్లాకు ప్రత్యేక ట్రామా కేర్ సెంటర్ ఏర్పాటు, రోడ్డు ప్రమాదాల్లో ప్రాణాలు కాపాడిన రహ్ వీర్లను ఆగస్టు 15 నాటికి గుర్తించి సత్కరించాలన్నారు. జాతీయ రహదారుల వెంబడి వాహనదారుల విశ్రాంతి కేంద్రాలు ఏర్పాటు చేయాలని సూచించారు. ట్రాఫిక్కు అడ్డంగా ఉన్న చెత్త కుండీలు, అడ్డంకులను వెంటనే తొలగించాలని తెలిపారు. వాహన తనిఖీలు పెంచాలి ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ వ్యవసాయ ట్రాక్టర్ల వెనుక రేడియం రిఫ్లెక్టర్లు అతికించాలన్నారు. రహదారిపైకి వచ్చే పశువుల మెడలకు రిఫ్లెక్టివ్ కాలర్ టేపులు ఉండేలా చూడాలని తెలిపారు. సాయంత్రం 6 నుండి రాత్రి 9 మధ్య ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నందున ఆ సమయంలో పోలీస్ నిఘా, వాహన తనిఖీలు పెంచాలని సూచించారు. అనధికార పార్కింగ్ ప్రాంతాల్లో నో పార్కింగ్ బోర్డులు ఏర్పాటు చేసి నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తీసుకోవాలని దేశించారు. మదనపల్లెలో అనవసర స్పీడ్ బ్రేకర్లను వెంటనే తొలగించాలని చెప్పారు. ఆటోల కోసం ప్రత్యేక స్టాండ్లు గుర్తించి ప్రత్యామ్నాయం ఏర్పాటు చేయాలని తెలిపారు. కార్యక్రమంలో మున్సిపల్ కమిషనర్ ప్రమీళ, రాయచోటి డీఎస్పీ ఎం.ఆర్ కృష్ణమోహన్, రవాణా, వైద్య, పంచాయతీరాజ్ అధికారులు, మదనపల్లె, రాయచోటి ట్రాఫిక్ సీఐలు పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఫుట్బాల్ టోర్నమెంట్
మదనపల్లె సిటీ : మదనపల్లె మండలం ఆరోగ్యవరంలో జెసోడియన్ ఫుట్బాల్ మైదానంలో నిర్వహిస్తున్న ఆడమ్ మెమోరియల్ సౌత్ ఇండియా ఫుట్ బాల్ టోర్నమెంటు మంగళవారం ప్రారంభమైంది. ఈ పోటీలను శానిటోరియం చర్చి పాస్టర్ అబ్రహంబాబు ప్రారంభించారు. మొదటి రోజు బీటీ కాలేజీ జట్టు, డీజే వారియర్స్ (కేరళ) జట్టుపై విజయం సాధించారు. రెండవ మ్యాచ్ గోల్డెన్ సిటీ(చైన్నె) జట్టు నల్లమండ్లపల్లె జట్టును ఓడించి తదుపరి దశకు అర్హత సాధించింది. ఈ పోటీలు 8వ తేదీ వరకు జరుగుతాయని నిర్వాహకులు జాంటీ, సుదర్శన్, న్యాషీ తెలిపారు. కార్యక్రమంలో రాజేష్, స్టాన్లీ, ప్రమోద్, పీడీ సుదాకర్ పాల్గొన్నారు. -
మార్చురీలో కుళ్లిపోతున్న మృతదేహాలు
– పురుగులు బయటికి వస్తున్నాయని స్థానికుల ఆందోళన మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంలోని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీ అధికారుల నిర్లక్ష్యంపై ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్చురీలో ఉన్న గుర్తు తెలియని రెండు మృతదేహాలు గత 10 రోజులుగా అలాగే ఉన్నాయని, వాటి నుంచి పురుగులు బయటకు వస్తూ తీవ్ర దుర్వాసన వస్తోందని స్థానికులు మంగళవారం ఉదయం ఆరోపించారు. బంధువులు ఎవరూ వచ్చి మృతదేహాలను తీసుకెళ్లకపోవడంతో అవి కుళ్లిపోయాయని, ఇప్పుడు శవాలను తొలిచే పురుగులు బయటకు వస్తున్నాయని స్థానికంగా కాపురముంటున్న ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. ఆస్పత్రి అధికారుల నిర్లక్ష్యం వల్లనే ఇలా మృతదేహాలు కుళ్లిపోయాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వెంటనే సంబంధిత అధికారులు స్పందించి మృతదేహాలను తరలించి, నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ ఘటనతో ఆస్పత్రి పరిసర ప్రాంతాల్లో దుర్వాసన వ్యాపించడంతో స్థానికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ విషయమై ఆస్పత్రి సూరింటెండెంట్ను వివరణ కోరేందుకు ఫోన్ చేయగా ఫోన్ లిఫ్ట్ చేయడం లేదు. కరాటే పోటీల్లో ప్రతిభ మదనపల్లె సిటీ : విజయవాడలో జరిగిన 23వ ఏపీ రాష్ట్ర కరాటే ఛాంపియన్షిప్ పోటీల్లో మదనపల్లె విద్యార్థులు ప్రతిభ కనబరిచారు. కటా, కుమితే, జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొని పతకాలు సాధించారు. ఇలాహ్ బంగారు పతకం, తహ రెండు కాంస్య పతకాలు, సాత్విక బంగారు, వెండి పతకాలు, లైకర్ వెండి, కాంస్య పతకాలు, సాధ్వి వెండి పతకం, నైతిక్ కాంస్య పతకం సాధించినట్లు కరాటే గ్రాండ్ మాస్టర్ ఇస్మాయిల్ తెలిపారు. వీరిని కరాటే మాస్టర్ ఖాదర్బాషా, ఉపాధ్యాయులు అభినందించారు. -
పెట్టుబడి కూడా రాలేదు
ఈ సంవత్సరం రూ. 2 లక్షలు అప్పు చేసి మామిడి తోటకు మందులు కొట్టాము. కానీ రేట్లు లేకపోవడంతో పెట్టుబడి రాకపోగా, రవాణా ఖర్చులు కూడా మా చేతి నుంచే పెట్టుకోవాల్సి వచ్చింది. ఇకపై ఈ పంటకు ఎంత పెట్టుబడి పెట్టినా లాభం లేదు. దీనికి తోడు వర్షాలు లేక ఉన్న చెట్లు ఎండిపోతున్నాయి. అందుకే దిక్కుతోచని స్థితిలో ఇప్పటికే నాకున్న మూడు ఎకరాలలోని మామిడి చెట్లను పూర్తిగా తొలగించేశాను. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం స్పందించి తీవ్రంగా నష్టపోయిన మామిడి రైతులను తక్షణమే ఆదుకోవాలి. – సుబ్రమణ్యం, బంగారువాండ్లపల్లె -
ఆగి ఉన్న లారీని ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : ఆగి ఉన్న లారీని ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడి అపస్మారక స్థితికి చేరుకున్నాడు. మంగళవారం రాత్రి గుర్రంకొండ వద్ద చోటు చేసుకున్న ఘటనపై ఎస్ఐ రవీంద్ర తెలిపిన వివరాలు.. చిన్నమండెం మండలం పడమటకొనకు చెందిన సురేష్ కుమారుడు రామ్మూర్తి నాయుడు(24), బైకుపై గుర్రంకొండకు వచ్చాడు. తిరిగి స్వగ్రామానికి వెళుతుండగా మార్గమధ్యంలోని గుర్రంకొండ దవలప్కాన్పల్లె వద్ద ఆగిపోయిన లారీని ఢీ కొట్టి తీవ్రంగా గాయపడి కోమాలోకి వెళ్ళాడు. స్థానికులు గమనించి బాధితున్ని వెంటనే మదనపల్లి జిల్లా ఆస్పత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. గ్యాస్ సిలిండర్లు మీద పడి.. మదనపల్లె టౌన్: టెంపోలో ఉన్న గ్యాస్ సిలిండర్లను కిందకు దింపే క్రమంలో అవి మీదపడి ఓ డెలివరీ బాయ్ తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం గుర్రంకొండలో జరిగిన ఘటనపై వివరాలు.. గుర్రంకొండ ఇండేన్ గ్యాస్లో పనిచేసే విజయ్కుమార్ కస్టమర్లకు గ్యాస్ సిలిండర్లను సరఫరా చేసే క్రమంలో టెంపోలో ఉన్న సిలిండర్లను కిందకు దించేటప్పుడు అవిమీద పడి కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మదనపల్లె టౌన్ : దొంగతనం కేసులో నిందితుడికి ఏడాది జైలు శిక్ష విధిస్తూ మదనపల్లె కోర్టు మంగళవారం తీర్పు వెలువరించింది. పుంగనూరు మండలం, చండ్రమాకులపల్లికి చెందిన పులి వెంకటరెడ్డి(33) తండ్రి చనిపోవడంతో ఆర్థిక ఇబ్బందుల కారణంగా దొంగతనాలు చేయడం అలవాటు చేసుకున్నాడు. మదనపల్లి మండలం, కొండమారిపల్లి పంచాయతీలోని టిట్కో ఇంట్లో జరిగిన చోరీ కేసులో తాలూకా పోలీసులు అతడిని అరెస్ట్ చేశారు. ఈ కేసును విచారించిన ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి కమ్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్ కోర్టు, నిందితుడిపై నేరం రుజువు కావడంతో ఒక సంవత్సరం జైలు శిక్ష విధించినట్లు సీఐ కళా వెంకటరమణ మీడియాకు తెలిపారు. కోర్టు తీర్పు అనంతరం నిందితుడిని మదనపల్లె సబ్ జైలుకు తరలించినట్లు తెలిపారు. బావిలో పడి వృద్ధుడి మృతి లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లిలోని శ్రీ వెంకటేశ్వర జూనియర్ కళాశాల సమీపంలో వంక బజారులో నివసిస్తున్న వెంకటయ్య(72) అనే వృద్ధుడు బావిలో పడి మృతి చెందినట్లు బంధువులు తెలిపారు. వెంకటయ్య రోజూ కూలీ పనులకు వెళ్లి సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చే వాడని, గత నెల 31వ తేదిన ఉదయం పనికి వెళ్లి సాయంత్రానికి ఇంటికి రాలేదని వారు పేర్కొన్నారు. ఆగస్టు 1వ తేదీన పెన్షన్ తీసుకోకపోవడంతో చుట్టుపక్కల గాలింపు చర్యలు చేపట్టగా కనిపించలేదని, మంగళవారం గొల్లపల్లి సమీపంలోని ఓ బావిలో పడి మృతి చెందినట్లు వివరించారు. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేయడంతో సంఘటనా స్థలానికి చేరుకొని వెంకటయ్య మృతదేహాన్ని బయటకు తీసి పోస్టుమార్టం నిర్వహించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని బంధువులకు అప్పచెప్పారు. మున్సిపల్ ఆర్ఐ తొలగింపు ప్రొద్దుటూరు : మున్సిపాలిటీలోని రెవెన్యూ విభాగంలో పని చేస్తున్న రెవెన్యూ ఇన్స్పెక్టర్ రమేష్ను రెవెన్యూ విధుల నుంచి తదుపరి విచారణ పూర్తయ్యే వరకు తాత్కాలికంగా తొలగించినట్లు మున్సిపల్ కమిషనర్ తూతిక శ్రీనివాస విశ్వనాథ్ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. రూ.20 లక్షలు తీసుకుని పూజా స్కూల్ ఆస్తిని బదలాయించినట్లు ఆర్ఐపై ఆరోపణలు రావడంతో విచారణకు ఆదేశించామని ఆయన పేర్కొన్నారు. ఇందుకు సంబంధించి విచారణ అధికారిని నియమించామని తెలిపారు. మున్సిపల్ కార్యాలయంలో ఎవరు అవినీతికి పాల్పడినా తనకు గానీ, నేరుగా ఏసీబీకి ఫిర్యాదు చేయవచ్చునని వివరించారు. -
ట్యాంక్పై నుంచి పడి సెక్యూరిటీ గార్డు మృతి
కడప అర్బన్ : కుటుంబ పోషణ కోసం వాచ్మెన్గా చేరిన ఓ వ్యక్తి విధి నిర్వహణలోనే ప్రమాదానికి గురై ప్రాణాలు కోల్పోయిన ఘటన కడపలో చోటుచేసుకుంది. ఖాజీపేట మండలం మిడుతూరు దళితవాడకు చెందిన గుండుగాళ్ల బాలుడు(40) కొద్ది కాలంగా కడపలో అరవింద్ నగర్లోని దుర్గా విల్లాస్ అపార్ట్మెంట్లో సెక్యూరిటీ గార్డుగా పని చేస్తున్నాడు. నెల రోజుల క్రితమే అక్కడ ఉద్యోగంలో చేరిన ఆయన, మంగళవారం అపార్ట్మెంట్లోని నీటి ట్యాంకును శుభ్రం చేసేందుకు పైకి ఎక్కాడు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు కాలు జారి కిందపడటంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు వెంటనే ఆస్పత్రికి తరలించినప్పటికీ, అప్పటికే బాలుడు మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడికి భార్య గంగాదేవి, ఇద్దరు కుమార్తెలు, ఇద్దరు కుమారులు ఉన్నారు. కుటుంబానికి ఏకై క ఆధారంగా ఉన్న బాలుడు ఆకస్మికంగా మృతి చెందడంతో భార్య, చిన్నారులు కన్నీరుమున్నీరవుతున్నారు. కుటుంబ పోషణ కోసం ఇంటి నుంచి దూరంగా వచ్చి ఉద్యోగంలో చేరిన నెల రోజుల్లోనే ఆయన మృత్యువాత పడడం అందరినీ కలచి వేసింది. సమాచారం అందుకున్న చిన్న చౌక్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పోస్టుమార్టం నిమిత్తం రిమ్స్ ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
11 నుంచి బాస్కెట్ బాల్ పోటీలు
వాల్మీకిపురం : అమరావతి క్రీడోత్సవాల్లో భాగంగా అన్నమయ్య జిల్లా స్థాయిలో ఈ నెల 11వ తేదీ నుంచి బాస్కెట్ బాల్ అండర్ 17, అండర్ 23 బాలబాలికల పోటీలను జిల్లా స్పోర్ట్స్ స్కూల్ గేమ్స్ ఆధ్వర్యంలో వాల్మీకిపురంలో నిర్వహించనున్నారు. ఈ నేపథ్యంలో మంగళవారం సీఎస్ఆర్ సంస్థల అధినేత, జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు చింతల శ్రీధర్రెడ్డిని విద్యాశాఖ అధికారులు మర్యాద పూర్వకంగా కలిసి జిల్లా స్థాయి బాస్కెట్ బాల్ టోర్నమెంట్, జిల్లా సెలెక్షన్స్ను నిర్వహించేందుకు సహాయ సహకారాలు అందించాలని కోరారు. ఈ సందర్భంగా ఆయన బాస్కెట్ బాల్ పోటీల నిర్వహణలో ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చూసుకోవాలని, తమ వంతుగా ఎటువంటి సహాయ సహకారాలైనా అందిస్తామని సూచించారు. ఈ కార్యక్రమంలో పీడీలు నాగరాజు, కిరణ్, రెడ్డి వరప్రసాద్, సీనియర్ బాస్కెట్ బాల్ క్రీడాకారుడు సాయిభార్గవ్ తదితరులు పాల్గొన్నారు. -
నెలలో వివాహం.. అంతలోనే విషాదం
బద్వేలు అర్బన్ : ఆ యువకుడికి మరో నెల రోజుల్లో వివాహం జరిపించాలని పెద్దలు నిర్ణయించారు. పెళ్లి పత్రికలు కూడా ముద్రించారు. అంతలోనే విధికి కన్ను కుట్టినట్లుంది. పెళ్లిపీటలు ఎక్కాల్సిన యువకుడు రోడ్డు ప్రమాదంలో దుర్మరణం చెందాడు. ఈ హృదయ విషాదకర ఘటన బద్వేలు పట్టణంలో మంగళవారం చోటు చేసుకుంది. మృతుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండల పరిధిలోని కొత్తచెరువు గ్రామానికి చెందిన మల్లేష్, లక్షుమ్మలకు యమ్మని శివశంకర్(25) ఏకై క కుమారుడు. కొన్నేళ్ల క్రితం మల్లేష్ మృతి చెందడంతో శివశంకర్ ఇంటి పెద్దదిక్కుగా వ్యవహరిస్తూ గోపవరం సమీపంలోని సెంచూరీ పానెల్స్ పరిశ్రమలో పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటుండే వాడు. రోజూ మాదిరే మంగళవారం తన ద్విచక్ర వాహనంలో డ్యూటీకి వెళ్లి సాయంత్రం తిరిగి ఇంటికి వెళుతున్న సమయంలో సిద్దవటం రోడ్డులోని అబ్బుసాహెబ్పేట క్రాస్రోడ్డు – బయనపల్లె సబ్స్టేషన్ నడుమ ఎదురుగా వస్తున్న ట్రాక్టర్ ఢీకొనడంతో తలకు తీవ్ర గాయాలై శివశంకర్ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికులు 108 సహాయంతో మృతదేహాన్ని ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెళ్లి కుమారుడిగా చూడాలనుకుంటే అప్పుడే నూరేళ్లు నిండాయా అంటూ శివశంకర్ కుటుంబ సభ్యులు విలపించిన తీరు అక్కడి వారిని కలచివేసింది. అర్బన్ పోలీసులు కేసు నమోదు చేశారు.రోడ్డు ప్రమాదంలో యువకుడి దుర్మరణం -
నకిలీ పాస్ పుస్తకాల కేసులో మరో ముగ్గురి అరెస్ట్
మదనపల్లె టౌన్ : నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు సృష్టించి కోట్ల రూపాయల విలువైన భూముల్లో మోసాలకు పాల్పడుతున్న ముఠాపై మదనపల్లె తాలూకా పోలీసులు కఠిన చర్యలు తీసుకున్నారు. ఈ కేసులో మండలంలోని మొలకలదిన్నెకు చెందిన ఉప్పుతోల్ల శేఖర్బాబు సహా మరో నలుగురిని పోలీసులు ఇప్పటికే అరెస్ట్ చేసిన సంగతి తెలిసిందే. మంగళవారం నకిలీ డాక్యుమెంట్లు తయారు చేసిన ముగ్గురు డాక్యుమెంట్ రైటర్లను అరెస్ట్ చేసినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ మీడియాకు తెలిపారు. సీఐ తెలిపిన వివరాల ప్రకారం.. మదనపల్లె మండలం బసినికొండ పంచాయతీ గంగన్నగారిపల్లె పరిధిలోని సుమారు రూ.5 కోట్ల విలువైన 2.52 ఎకరాల వ్యవసాయ భూమిని తక్కువ ధరకు ఇప్పిస్తామని మొలకలదిన్నెకు చెందిన ఉప్పుతోళ్ల శేఖర్ బాబు, గంగన్నగారిపల్లెకు చెందిన మరో నలుగురు బసినికొండకు చెందిన శోభారాణిని నమ్మించారన్నారు. ఆమె వద్ద రూ.14 లక్షలు తీసుకుని, అనంతరం నకిలీ పట్టాదారు పాస్ పుస్తకాలు, ఇతర తప్పుడు పత్రాలు అందజేసి మోసం చేయడంతో ఆ కేసులో ఉన్న డాక్యుమెంట్లు రైటర్లు ఎ6 మినహా సొసైటీ కలనీకి చెందిన ఏ7 నిందితుడు ఏనుగు హరిబాబు నాయుడు (65), ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఏ–8 మత్తెపు సుబ్రమణ్యం(72), పెద్దమండ్యం మండలం కలిచర్లకు చెందిన ఏ–9: సయ్యద్ మస్తాన్ (56)లను అరెస్టు చేశారు. జిల్లా ఎస్పీ దీరజ్ కునుబిల్లి ఆదేశాలతో ఈ అరెస్టులు జరిగాయని సీఐ తెలిపారు. మిగిలిన నిందితుల కోసం గాలిస్తున్నామని, భూ మోసాల్లో ఎవరైనా పాల్గొంటే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే..
● భర్తపై భార్య హత్యాయత్నం ● ముగ్గురు నిందితుల అరెస్ట్ గుర్రంకొండ : వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడనే భర్తపై.. భార్య మరో ఇద్దరితో కలసి అంతమెందించాలని ప్రయత్నించింది. ఈ కేసులో ముగ్గురు నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. వాల్మీకిపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ రవీంద్రబాబుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గుర్రంకొండ మండలం రామాపురం గ్రామానికి చెందిన టి.శ్రీనివాసులు కుమార్తె వనజకు కురబలకోట గ్రామానికి చెందిన తరిగొండ రఘనాథ్తో 22 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఒక కుమారుడు ఉన్నాడు. గత కొంత కాలంగా భార్య ప్రవర్తనపై అనుమానం కలిగి తీరు మార్చుకోవాలని భర్త పలుమార్లు హెచ్చరించారు. అయితే లెక్కచేయకుండా వనజ అలాగే ప్రవర్తించింది. దీంతో భార్యభర్తల మధ్య గొడవలు జరిగి వనజ పుట్టినిల్లు అయిన రామాపురానికి వచ్చేసింది. చనిపోయాడని.. పొదల్లో పడేసి.. గత నెల 30న రఘనాథ్ భార్య పిల్లలను తనతో తీసుకురావడానికి గానూ రామాపురం వెళ్లాడు. దీంతో తన వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని భావించిన వనజ(38).. ప్రియుడు కావలి రామ్మోహన్(50), తండ్రి టి.శ్రీనివాసులు(56)తో కలిసి ముందస్తు పథకం ప్రకారం రఘనాథ్ను ద్విచక్రవాహనంపై గుర్రంకొండకు సమీపంలో విద్యుత్ సబ్స్టేషన్ వద్దకు తీసుకెళ్లారు. అక్కడ కట్టెలు, రాళ్లతో విచక్షణా రహితంగా రఘనాథ్పై దాడి చేశారు. తీవ్ర గాయాల పాలైన రఘనాథ్ అపస్మారక స్థితికి చేరుకొన్నాడు. దీంతో అతడు మృతి చెంది ఉంటాడని భావించి సమీప పొదల్లో పడేసి వెళ్లిపోయారు. అటు వైపు వెళుతున్న కొందరు వ్యక్తులు అతన్ని గమనించి 108 వాహనం ద్వారా మదనపల్లె ప్రభుత్వాస్పత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గురిపై పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ నేపథ్యంలో నిందితులు మంగళవారం వాల్మీకిపురంలో ముందస్తు బెయిల్ కోసం న్యాయవాదిని కలిసేందుకు వెళుతుండగా పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అలాగే నేరానికి వినియోగించిన ద్విచక్రవాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిఽందితులను వాల్మీకిపురం కోర్టులో హాజరు పరిచినట్లు సీఐ, ఎస్ఐ తెలిపారు. -
అనంతపురం, నెల్లూరు జట్ల జయకేతనం
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్ జోన్ ఉమెన్స్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లా పోటీల్లో భాగంగా మంగళవారం రెండు వన్డే మ్యాచ్ల్లో అనంతపురం, నెల్లూరు జిల్లాల క్రికెట్ జట్లు జయకేతనం ఎగురవేశాయి. గ్రౌండ్ 1లో నెల్లూరు, చిత్తూరు టీంలు తలపడ్డాయి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు 47.4 ఓవర్లలో 252 పరుగులు చేసింది. అనంతరం నెల్లూరు జట్టు 49.2 ఓవర్లలో 5 వికెట్లు కోల్పోయి 253 పరుగులతో విజయాన్ని కై వసరం చేసుకుంది. ఇందులో నెల్లూరు జట్టుకు చెందిన సాయిలక్ష్మీ ఆల్రౌండర్గా 29 పరుగులు ఇచ్చి రెండు వికెట్లు, 70 బంతుల్లో 69 పరుగులు చేసింది. ఇదే జట్టుకు చెందిన ఆలాసహార్ సైతం 122 బంతుల్లో 84 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. గ్రౌండ్ 2లో కర్నూలు, అనంతపురం జిల్లా జట్లు తలపడ్డాయి. అనంతపురం జట్టు టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టి 49 ఓవర్లలో 296 పరుగులు చేసింది. అనంతరం కర్నూలు జట్టు 49 ఓవర్లలో 214 పరుగులు చేసి ఓటమిపాలైంది. దీంతో 82 పరుగుల తేడాతో అనంతపురం జట్టు జయకేతనం ఎగురవేసింది. అనంతపురానికి చెందిన బ్యాట్స్మెన్ మహిత 80 బంతుల్లో 74 పరుగులు చేయగా ఇదే జట్టుకు చెందిన బౌలర్ తరన్నుమ్ బేగం 65 పరుగులు ఇచ్చి కీలకమైన నాలుగు వికెట్లు తీసుకొని జట్టు విజయంలో కీలకపాత్ర పోషించింది. ఈ పోటీలను శ్రీనివాసమూర్తి, శ్రీధర్ కుమార్, సతీష్యాదవ్, సునీల్ కుమార్, తదితరులు పర్యవేక్షించారు. తరన్నుమ్ బేగం (4 వికెట్లు) మహిత (74 పరుగులు) -
జింక మృతి
రాయచోటి : మండల పరిధిలోని కొత్తపల్లి పంచాయతీ బంగారువాండ్లపల్లి సమీపంలో మృతి చెందిన జింకను జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్ పిళ్లై మంగళవారం పరిశీలించారు. గ్రామ సమీపంలోని మామిడి తోటల్లో సంచరిస్తున్న జింకపై కుక్కలు దాడి చేయడంతో మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. అటవీ శాఖ అధికారుల సమాచారం మేరకు చిన్నమండెం పశువైద్యాధికారులు జింక మృతదేహానికి పంచనామా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో చిన్నమండెం మండల పశువైద్యాధికారి డాక్టర్ గణేష్, పశు వైద్య సహాయకులు ఎ.సిద్దార్థ బాబు, పశు సంవర్థకశాఖ సిబ్బంది పాల్గొన్నారు. టిప్పర్ను ఢీకొన్న బొలెరో ములకలచెరువు : ములకలచెరు వు నుంచి నలుగురు విద్యార్థులతో వెళ్తున్న బొలెరో వాహనం టైరు పగిలి.. ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బొలెరో వాహనం డ్రైవర్కు తీవ్ర గాయా లు కాగా మిగిలిన నలుగురు విద్యార్థులకు ఎటువంటి ప్రమాదం జరగకుండా బయటపడ్డారు. ఈ సంఘటన మంగళవారం మండల కేంద్రంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... సత్యసాయి జిల్లా త నకల్లు మండలం నారేవాండ్లపల్లెకు చెందిన సో ముశేఖర్ తన బొలెరో వాహనంలో.. అదే గ్రామానికి చెందిన విద్యార్థులు శిరీషా, పల్లవి, రెడ్డిప్రసన్న, సులోచనతో ఇంటికి బయలుదేరారు. మండల సరిహద్దులోకి వెళ్లే సరికి బొలెరో టైరు పగిలి ఎదురుగా వస్తున్న టిప్పర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరో డ్రైవర్ సోముశేఖర్(25)కి తీవ్ర గాయాలయ్యాయి. స్థాని కులు గమనించి 108 సహాయంతో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కారు షెడ్లో అగ్నిప్రమాదం – రూ.7 లక్షల ఆస్తి నష్టం మదనపల్లె టౌన్ : పట్టణంలోని నిమ్మనపల్లి రోడ్డులో గల నౌషాద్ కార్ మెకానిక్ షెడ్లో సోమవారం అర్ధరాత్రి దాటిన తర్వాత 1 గంట సమయంలో అగ్నిప్రమాదం సంభవించింది. అగ్నిమాపక అధికారి శివప్ప మంగళవారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని నిమ్మనపల్లె రోడ్డు బసినికొండలో ఉన్న కార్ల షెడ్డులో.. ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం జరిగినట్లు సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక కేంద్రాధికారి, సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. వారు మంటలను ఆర్పి వేశారు. అయితే అప్పటికే కార్ ఇంజన్లు, స్పేర్ పార్ట్స్, ఒక కారు పాక్షికంగా, ఇతర సామగ్రి పూర్తిగా కాలిపోయాయి. షెడ్ యజమాని షేక్ నౌషాద్ మాట్లాడుతూ సుమారు రూ.7 లక్షల ఆస్తి నష్టం జరిగిందని తెలిపారు. ప్రమాదానికి గల కారణం తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆరు సెటిల్మెంట్లు!
మూడు నక్షత్రాలు..సాక్షి టాస్క్ఫోర్స్ : ఆయన భుజాలపై మూడు నక్షత్రాలు మోస్తున్న ఉన్నతాధికారి. నేషనల్ హైవే రహదారిలో జిల్లా కేంద్రానికి ప్రక్కనే ఉన్న అత్యంత సున్నితమైన మండలంలో బాధ్యతాయుతమైన సీటులో ఉన్నారు. నిబద్ధతతో పనిచేస్తూ అసాంఘిక శక్తుల పాలిట సింహస్వప్నంగా మారాల్సిన ఆ పోలీసు అధికారి.. వారితోనే చెట్టాపట్టాల్ వేసుకొని తిరుగుతుండటం గమనార్హం. ఉన్నతాధికారులు నిత్యం పర్యవేక్షించే కడప సబ్డివిజన్ పరిధిలోనే ఈ ‘ఖతర్నాక్’ అధికారి ఇష్టారాజ్యంగా వ్యవహరించడం విమర్శలకు తావిస్తోంది. తెలుగుతమ్ముళ్ల నీడలో బెట్టింగ్, మట్కాల జాతర సదరు మండల పరిధిలో గత కొంతకాలంగా క్రికెట్ బెట్టింగ్, జూదం, మట్కా వ్యవహారాలు విచ్చలవిడిగా ఈ త్రిబుల్ స్టార్ అధికారి కనుసన్నుల్లోనే నడుస్తోంది. బెట్టింగ్ రాయుళ్లంతా అధికార కూటమికి చెందిన ’తెలుగుతమ్ముళ్లు’ కావడంతో వారిపై ఎలాంటి చర్యలూ లేవు సరికదా, సదరు అధికారికి వారే సకల మర్యాదలు చేస్తున్నారు. ఇటీవల పొరుగు జిల్లా కేంద్రానికి వెళ్లేందుకు సదరు పోలీసు అధికారి ఏకంగా ఒక బెట్టింగ్ రాయుడి లగ్జరీ వాహనాన్ని వాడటం పోలీస్ వర్గాల్లో చర్చనీయాంశమైంది. ఇక్కడ స్వేచ్ఛగా తిరుగుతున్న సదరు బుకీలు ఇటీవల జిల్లా కేంద్రంలోని తాలుకా పోలీసులకు పట్టుబడటం ఇక్కడి అధికారి లాలూచీని తేటతెల్లం చేస్తోంది. పెన్నా ఇసుక దోపిడీపై పక్షం రోజుల ఒప్పందం పెన్నానది ఒడ్డున ఉన్న ఈ ప్రాంతం నుంచి సాగే ఇసుక అక్రమ రవాణా సదరు అధికారికి భారీ ఆదాయ వనరుగా మారింది. ఇసుక తరలించే వాహనాల నుంచి రోజువారీ కప్పం వసూలు చేస్తున్నారు. రెండు రోజుల క్రితమే 15 ట్రాక్టర్ల ఇసుక దందాకు సంబంధించి, ఒక్కో ట్రాక్టర్కు రూ.4 వేల చొప్పున పక్షం రోజులకు రూ.60 వేల ముడుపుల ఒప్పందం కుదిరింది. ఈ లావాదేవీలను ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు దగ్గరుండి నడిపిస్తూ, ’సందట్లో సడేమియా’ అన్నట్లుగా తాము కూడా కొంత సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలున్నాయి. ఇక నగదు లేని ఇసుక వ్యాపారుల కోసం లంచం డబ్బును నేరుగా తన జీపు డ్రైవర్ మొబైల్ నంబర్కు ’ఫోన్పే’ చేయిస్తుండటం గమనార్హం. ఎవరైనా నిరాకరిస్తే అక్రమ కేసులతో నరకం చూపిస్తున్నారు.కేసులు.. రాజీ సెటిల్మెంట్లే ప్రధాన దందా అసాంఘిక శక్తులతో చెట్టాపట్టాల్ వేసుకుని తిరుగుతున్న పోలీసు అధికారి కూటమి నాయకుల నీడలో క్రికెట్ బెట్టింగ్, మట్కాల జాతర కేసులు నమోదు చేయడం.. ఆపై రాజీ పేరిట దండుకోవడం నిత్యకృత్యం పెన్నా ఇసుక దోపిడీపై రెండు రోజుల క్రితమే ’పక్షం రోజుల’ ఒప్పందం లంచం డబ్బులు డ్రైవర్కు ‘ఫోన్పే’ లావాదేవీలు నడుపుతున్న ఇద్దరు హెడ్ కానిస్టేబుళ్లు ఉన్నతాధికారులు కట్టడి చేయాలని స్థానికుల డిమాండ్!స్టేషన్ మొత్తం తన హుకుం ప్రకారమే నడవాలంటూ ఈ అధికారి ఏకపక్ష చర్యలకు దిగుతున్నారు. కేసులు నమోదు చేయడం, ఆపై రాజీ ప్రయత్నాల పేరిట ఇరువర్గాల నుంచి దండుకోవడం ఇక్కడ నిత్యకృత్యమైంది. ఇటీవల ఒక అట్రాసిటీ కేసు నమోదు చేసి, అందులో ఉన్నతాధికారుల పేర్లు చెప్పి భారీగా వసూలు చేసినట్లు సమాచారం. ఆపై తానే లోక్అదాలత్లో కేసు పెట్టి కొట్టివేయిస్తానంటూ నిందితులకు హామీలు ఇస్తున్నారు. ఈ ఏకపక్ష వైఖరి వల్ల విపక్ష పార్టీల వారు న్యాయం కోసం స్టేషన్కు వెళ్లే పరిస్థితి కనిపించడం లేదు. అత్యంత సున్నితమైన ప్రాంతంలో ఉన్న ఆ త్రిబుల్స్టార్ అధికారి చట్టవ్యతిరేక చర్యలను ఉన్నతాధికారులు తక్షణమే కట్టడి చేయాలని పలువురు కోరుతున్నారు. -
ఆదాయానికి పాతర
ఇన్చార్జీల జాతర..సాక్షి, మదనపల్లె : జిల్లాలో వ్యవసాయ మార్కెటింగ్ శాఖ పాలన పూర్తిగా గాడి తప్పుతోంది. మార్కెట్ యార్డుల సమర్థవంతమైన నిర్వహణలో, రైతులకు అండగా నిలవడంలో కీలక పాత్ర పోషించాల్సిన కమిటీ కార్యదర్శుల పోస్టులు దశాబ్దాలుగా ఖాళీగా దర్శనమిస్తున్నాయి. ఏళ్ల తరబడి జిల్లాలోని ప్రధాన మార్కెట్లన్నీ ఇన్చార్జీల పాలనలోనే కొట్టుమిట్టాడుతున్నాయి. ఆసియాలోనే అతిపెద్ద టమోటా మార్కెట్గా పేరుగాంచిన మదనపల్లె యార్డుకు పూర్తిస్థాయి కార్యదర్శి లేకపోవడంతో మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ స్థాయి అధికారే ఇక్కడ అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్నారు. అటు పుంగనూరు మార్కెట్ కార్యదర్శిగా కూడా ఏడీ స్థాయి అధికారే ఇన్చార్జ్గా కొనసాగుతున్నారు. పూర్తిస్థాయి బాధ్యతలు లేకపోవడం, బదిలీ భయాలు, స్థానిక రాజకీయ ఒత్తిళ్లు పెరగడంతో ఇన్చార్జ్ అధికారులు నామమాత్రంగా విధులు నిర్వహిస్తూ చేతులెత్తేస్తున్నారు. మదనపల్లె అంటేనే హడల్! మార్కెటింగ్ శాఖలో మదనపల్లె పోస్టింగ్ అంటేనే అధికారులు హడలిపోతున్నారు. ఇక్కడి వ్యాపారుల సిండికేట్ దందా, అక్రమాలు, రాజకీయ జోక్యాన్ని తట్టుకో లేక ఏ అధికారీ ఇక్కడ రెగ్యులర్ బాధ్యతలు చేపట్టేందుకు ముందుకు రావడం లేదు. వ్యవసాయ ఉత్పత్తుల క్రయవిక్రయాల పర్యవేక్షణ, మార్కెట్లో ధరల పరిస్థితుల నియంత్రణ, రైతులకు అవసరమైన కనీస సౌకర్యాల కల్పనలో అధికారులు పూర్తిగా విఫలమవుతు న్నారు. పంట ఉత్పత్తులకు ధరలు పడిపోయినప్పుడు రైతులను ఆదుకోవడంలో, వ్యాపారుల చేతిలో అన్నదాతలు మోసపోకుండా చూడటంలో ఇన్చార్జ్ పాలన శాపంగా మారింది. ఏటా మార్కెట్ పరిధి పెరుగుతున్నా, పూర్తిస్థాయి పర్యవేక్షణ లేకపోవడంతో మార్కె ట్ యార్డుల ఆదాయానికి భారీగా గండిపడుతోంది. ఇన్చార్జీల జాతర.. ఉన్నతాధికారుల ’రివర్స్’ పాలన సాధారణంగా ఉన్నతాధికారులు అదే స్థాయిలోని పదవులు, లేదంటే ఆపై స్థాయి పోస్టులకు ఇన్చార్జిలుగా వ్యవహరించడం చూస్తూ ఉంటాం. కానీ మార్కెటింగ్ శాఖలో మాత్రం ఇందుకు పూర్తి భిన్నంగా ’రివర్స్’ పాలన సాగుతోంది. పుంగనూరు కమిటీకి ఇన్చార్జ్ కార్యదర్శిగా పనిచేస్తున్న గోపి మార్కెటింగ్ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్. ఈయన జిల్లాస్థాయి అధికారిగా సేవలు అందించాల్సి ఉండగా కేవలం ఒక మార్కెట్ కమిటీకే పరిమితం చేశారు. అన్నమయ్య జిల్లా అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న త్యాగరాజును ఇప్పుడు మదనపల్లె మార్కెట్ ఇన్చార్జి కార్యదర్శిగా నియమించారు. ఈయనకు జిల్లా బాధ్యతలతో పాటు మదనపల్లె కార్యదర్శి బాధ్యతలను కూడా అప్పగించారు. దాంతో ఆయన ఎక్కువ సమయం మదనపల్లె మార్కెట్లోనే ఉంటూ విధులు నిర్వహించాల్సి వస్తోంది. ఫలితంగా జిల్లా స్థాయిలో మార్కెట్ల పర్యవేక్షణ తీవ్రంగా దెబ్బతింటోంది. రాయచోటి మార్కెట్ కార్యదర్శి గత జూన్ నుంచి, కలికిరి మార్కెట్ కార్యదర్శి చాన్నాళ్లుగా ఇన్చార్జ్లుగా పనిచేస్తున్నారు. లక్కిరెడ్డిపల్లి మార్కెట్ కమిటీ, వాల్మీకిపురం మార్కెట్ యార్డ్ కార్యదర్శి పరిస్థితి కూడా ఇదే! 2024 నుంచి పీలేరు మార్కెట్ కమిటీ కార్యదర్శి ఇన్చార్జ్ పాలనలో ఉంది. జిల్లా మొత్తంలో కేవలం సోమల, బి.కొత్తకోట, ములకలచెరువు మార్కెట్లకు మాత్రమే రెగ్యులర్ కార్యదర్శులు కొనసాగుతున్నారు. ‘సాక్షి’ కథనంతో వెల్లడైన అసలు రంగు! మదనపల్లె మార్కెట్కు ఇన్చార్జ్ కార్యదర్శిగా ఎవరు వచ్చినా రాజకీయ ఒత్తిళ్లు తట్టుకోలేకపోతున్నారు. అధికార పార్టీ నేతలు చెప్పినట్లు వినకపోతే, వారు కేవలం ఇన్చార్జ్లు మాత్రమేనన్న చులకన భావంతో పైస్థాయి అధికారులపై ఒత్తిళ్లు తెచ్చి రాత్రికి రాత్రే బది లీలు చేయిస్తున్నారు. చాలా ఏళ్లుగా ఇదే తంతు కొనసాగుతుండటంతో, ఇన్చార్జ్ అధికారులు కూడా ‘ఉన్నన్ని రోజులు ఉండి వెళ్ళిపోతాం‘ అనే నిర్లిప్త ధోరణితో, అంటీముట్టనట్లు వ్యవహరిస్తున్నారు. ఇన్చార్జ్ పాలన వల్ల ఎలాంటి దారుణ పరిస్థితులు ఉంటాయనడానికి మార్కెట్లో తాజాగా చోటుచేసుకున్న టమాట ధరల పతనమే ఉదాహరణ. ప్రస్తుతం ఇన్చార్జ్ కార్యదర్శిగా వ్యవహరిస్తున్న ఏడీ త్యాగరాజు పర్యవేక్షణ లోపంపై ఇటీవల ’సాక్షి’ దినపత్రికలో ప్రచురితమైన టమాట ధరల పతనం కథనం సంచలనం సృష్టించింది. ఈ గ్రౌండ్ రిపోర్ట్పై ప్రభుత్వం తీవ్రస్థాయిలో స్పందించింది. ‘సాక్షిలో వార్త వచ్చేవరకు క్షేత్రస్థాయి పరిస్థితులు తమ దృష్టికి ఎందుకు తీసుకురాలేదు? మార్కె ట్లో ధరలు పడిపోవడానికి ఎందుకు అడ్డుకట్ట వేయలేదు?‘ అంటూ ఉన్నతాధికారులు సదరు ఇన్చార్జ్ అధికారిపై ఆగ్రహం వ్యక్తం చేస్తూ చివాట్లు పెట్టారు. ధరలు పతనమైనప్పుడు ముందస్తు చర్యలను ఎందుకు విస్మరించారని నిలదీశారు. ఈ ఒక్క సంఘటనే జిల్లాలో ఇన్చార్జీల పాలన ఎంత దారుణంగా ఉందో, వారు రాజకీయ ఒత్తిళ్లకు ఎలా బలి అవుతున్నారో తేటతెల్లం చేస్తోంది. ప్రభుత్వం జిల్లాలోని మార్కెట్ యార్డుల్లో రెగ్యులర్ కార్యదర్శులను నియమించాల్సిన అవసరం ఉంది. మార్కెట్ కమిటీలకు రెగ్యులర్ కార్యదర్శుల నియామకంపై సర్కార్ ఘోర నిర్లక్ష్యం ఆసియాలోనే అతిపెద్ద టమోటా యార్డు మదనపల్లెకు ఇన్చార్జీలే దిక్కు జిల్లా మొత్తంలో కేవలం మూడు చోట్లే పూర్తిస్థాయి అధికారులు -
హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డు పనులు మొదలు
సాక్షి, మదనపల్లె : బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుకు తారురోడ్డు పనులు మొదలయ్యాయి. ఘాట్రోడ్డు ప్రమాదకంగా మారడం, రోడ్డంతా దెబ్బతిని పర్యాటకులు ప్రమాదాలకు గురవుతుండటం, రహదారి పనులు ప్రారంభం కాకపోవడంపై ‘సాక్షి’ పలు కథనాలు ప్రచురించింది. దీనిపై స్పందించిన రహదారి భవనాలశాఖ అధికారులు కాంట్రాక్టర్తో పనులు చేయించేందుకు కృషి చేశారు. దాంతో రూ.4.5 కోట్ల వ్యయంతో తారురోడ్డు పనులు చురుగ్గా జరుగుతున్నాయి. నూతన రాష్ట్ర కమిటీ ఎన్నికకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏపీ ఆశా వర్కర్స్ యూనియన్ నూతన రాష్ట్ర కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నట్లు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గుంటి వేణుగోపాల్ తెలిపారు. సోమవారం కడప నగరంలోని హోచిమిన్ భవన్లో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. 11 మంది ఆఫీస్ బేరర్లు, 60 మంది సమితి సభ్యులతో కలిపి మొత్తం 71 మందితో ఈ రాష్ట్ర సమితి ఏర్పాటయింది. యూనియన్ రాష్ట్ర అధ్యక్షుడిగా గుంటి వేణుగోపాల్, ప్రధాన కార్యదర్శిగా ఎల్.శాంతి, వర్కింగ్ ప్రెసిడెంట్గా రమీజాబి (కర్నూలు), డిప్యూటీ జనరల్ సెక్రెటరీగా చాముండేశ్వరి (తిరుపతి), కోశాధికారిగా యు.మరియమ్మ (కడప) ఎన్నికయ్యారు. పీజీఆర్ఎస్ అర్జీలను సత్వరమే పరిష్కరించండి: ఎస్పీమదనపల్లె టౌన్ : ప్రజా సమస్యల పరిష్కార వేదికలో సోమవారం మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 62 ఫిర్యాదులను స్వీకరించారు. ఫిర్యాదులను సత్వరమే పరిష్కరించాలని సంబంధిత పోలీసులను ఆదేశించారు. పీజీఆర్ఎస్కు మొత్తం 62 ఫిర్యాదులు రాగా అధికంగా భూవివాదాలు 19, ఆర్థిక లావాదేవీలు 7, కుటుంబ కలహాలు 12, చీటింగ్ 4, న్యూసెన్న్స్ 3, ఇతర సమస్యలు 17 ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై తక్షణమే కఠిన చర్యలు తీసుకోవాలని సంబంధిత పోలీసు అధికారులను ఎస్పీ ఆదేశించారు. బాధితులకు సత్వర న్యాయం అందించాలని, సమస్యల పరిష్కారంలో అధికారుల నిర్లక్ష్యాన్ని ఏ మాత్రం ఉపేక్షించేది లేదని హెచ్చరించారు. -
కనుపాపకు బ్రెయిన్ క్యాన్సర్.. కన్నీటి సుడిగుండంలో పేద కుటుంబం!
రాజంపేట: రెక్కాడితే గాని డొక్కాడని ఆ పేద గూటిలో తొమ్మిదో తరగతి చదువుతున్న ఆ చిన్నారి.. అందరిలాగే నవ్వుతూ, ఆడుతూ భవిష్యత్తుపై ఎన్నో ఆశలు పెంచుకున్నాడు. కానీ, విధి ఆ కనుపాపపై కనికరం చూపలేదు. లక్షల్లో ఒకరికి వచ్చే అరుదైన, అత్యంత ప్రమాదకరమైన ‘బ్రెయిన్ క్యాన్సర్’ ఆ పసి ప్రాణాన్ని కబళిస్తోంది. రాజంపేట పట్టణం నూనివారిపల్లెకు చెందిన కొత్త ఎల్లమ్మ, రాజా దంపతుల రెండో కుమారుడు కె.పవన్ ప్రస్తుతం మృత్యువుతో పోరాడుతూ ప్రాణాలతో కొట్టుమిట్టాడుతున్నాడు. గడిచిన ఆరు నెలలుగా ఆ చిన్నారి శరీరంపై వరుసగా జరిగిన శస్త్రచికిత్సలు ఆ పేద తల్లిదండ్రుల గుండెలను పిండేస్తున్నాయి. మాట పడిపోయింది.. గాలి పీల్చడమూ నరకమే! క్యాన్సర్ మహమ్మారి తీవ్రత వల్ల పవన్కు కాళ్లు, చేతులు పూర్తిగా పడిపోయాయి. కనీసం నోరు తెరిచి అమ్మా అని పిలిచే భాగ్యానికి కూడా ఆ బాలుడు దూరమయ్యాడు. కంటిముందే కొడుకు జీవచ్ఛవంలా మారుతుంటే ఆ తల్లిదండ్రులు పడుతున్న వేదన వర్ణనాతీతం. కనీసం శ్వాస పీల్చుకోవడం కూడా కష్టంగా మారడంతో.. వైద్యులు గొంతు భాగంలో ఆపరేషన్ చేసి, అక్కడ అమర్చిన పైపు ద్వారా కృత్రిమంగా ఆక్సిజన్ అందిస్తున్నారు. ఆ పసి ప్రాణం నిలవాలంటే ప్రతిరోజూ ఏకంగా 26 మాత్రలు మింగాల్సి వస్తోంది. మనసున్న దాతలు సహకరించండి ప్రాణాపాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్న చిన్నారి పవన్ను కాపాడుకునేందుకు ఆర్థిక సహాయం అందజేయాలని ఆ బాలుడి తల్లిదండ్రులు వేడుకుంటున్నారు. సహాయం చేయదలచిన వారు ఫోన్పే / గూగుల్పే నంబరు: 8886350998 (బ్యాంక్ ఖాతాదారు పేరు: కె.ఎల్లమ్మ, అకౌంట్ నంబరు: 602010016830975, ఐఎఫ్ఎస్సీ కోడ్: UBIN0 CG7999, బ్యాంక్ పేరు: ఏపీజీబీ, పొందలూరు శాఖ)కు డబ్బు పంపించాలని కోరుతున్నారు. ఆరునెలలుగా నరకయాతన కాళ్లు, చేతులు పడిపోయి చిన్నారి విలవిల గొంతుకు ఆపరేషన్ చేసి ఆక్సిజన్ సరఫరా రోజుకు 26 మాత్రలు మింగాల్సిన దుస్థితి మందులకూ డబ్బుల్లేక దాతల సాయం కోసం ఎదురుచూపు -
ఎంపీ పీవీ మిథున్రెడ్డి నిరంతర కృషి
రైల్వేకోడూరు స్టేషన్ను అప్గ్రేడ్ చేయాలని, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలంటూ స్థానిక ప్రజల నుంచి వచ్చిన వినతులపై రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి తక్షణమే స్పందించారు. ఆయన స్వయంగా రంగంలోకి దిగి రైల్వే ఉన్నతాధికారులకు వరుస లేఖలు రాయడంతో పాటు నిరంతరం పర్యవేక్షించారు. ఎంపీ చొరవకు గుంతకల్ రైల్వే డీఆర్ఎం సానుకూలంగా స్పందించి ఉన్నతాధికారుల బృందాన్ని క్షేత్రస్థాయి పరిశీలనకు పంపారు. ఎంపీ ప్రతిపాదనలన్నింటికీ రైల్వే బోర్డు ఆమోదం తెలపడంతో పాటు, రూ.1.50 కోట్ల నిధులు మంజూరయ్యేలా మిథున్రెడ్డి చేసిన కృషి క్షేత్రస్థాయిలో సత్ఫలితాలనిచ్చింది. -
ఆటంకాలు లేకుండా టెట్ నిర్వహణ
సాక్షి, మదనపల్లె : ఈనెల 5 నుంచి 16వ తేదీ వరకు జిల్లాలో నిర్వహించనున్న ఏపీటెట్ ఆన్లైన్ పరీక్షలకు ఆటంకాలు లేకుండా పారదర్శకంగా, పకడ్బందీగా నిర్వహించాలని ఇన్న్చార్జి జిల్లా కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ అధికారులను ఆదేశించారు. పరీక్షల ఏర్పాట్లపై జరిగిన సమీక్షలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో మదనపల్లెలో రెండు, రాయచోటిలో రెండు కేంద్రాలు ఏర్పాటు చేయగా 5,470 మంది అభ్యర్థులు పరీక్షలకు హాజరుకానున్నట్లు తెలిపారు. ప్రతి కేంద్రంలో తగిన సంఖ్యలో కంప్యూటర్లు, నిరంతర విద్యుత్ సరఫరా కోసం పవర్ బ్యాకప్, ఇంటర్నెట్ కనెక్టివిటీ, సీసీ కెమెరాలు, బయోమెట్రిక్ సౌకర్యాలు అందుబాటులో ఉంచాలని ఆదేశించారు. అభ్యర్థుల రాకపోకలకు రవాణా సౌకర్యాలు కల్పించాలని, వైద్య బృందాలు, అంబులెన్స్ సేవలు సిద్ధంగా ఉంచాలన్నారు. అదనపు ఎస్పీ వెంకటాద్రి, జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ కె.సుబ్రహ్మణ్యం, జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి నరసయ్య, ఇతర అధికారులు పాల్గొన్నారు. యువత భాగస్వామ్యం కావాలి జిల్లాలో అర్హులైన యువతను ’మై భారత్’ పోర్టల్లో నమోదు చేయించేలా అన్ని ప్రభుత్వ శాఖలు సమన్వయంతో పనిచేయాలని ఇన్చార్జ్ జిల్లా కలెక్టర్ శివ నారాయణ్ శర్మ ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో మై భారత్ కేంద్రం–యువ అంశంపై జిల్లా సలహా మండలి సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈ పోర్టల్ ద్వారా యువతకు ప్రభుత్వ పథకాలు, స్వచ్ఛంద సేవలు, నైపుణ్యాభివృద్ధి, నాయకత్వ వికాసం మరియు జాతీయ స్థాయి కార్యక్రమాల్లో పాల్గొనే గొప్ప అవకాశాలు లభిస్తాయన్నారు. ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు విద్యా, యువజన, నైపుణ్యాభివృద్ధి, గ్రామీణాభివృద్ధి శాఖలు సమన్వయంతో ప్రత్యేక డ్రైవ్లు నిర్వహించాలని సూచించారు. సమావేశంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్ఓ వెంకటేష్, కేఆర్సీసీ ఎస్డీసీ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా యువజన అధికారి దీపక్ జేమ్స్, మరియు సలహా మండలి సభ్యులు పాల్గొన్నారు.ఇన్చార్జ్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ -
ఎల్లమ్మా.. దీవించమ్మా !
● శ్రీ కలికిరి ఎల్లమ్మ సర్వదర్శనానికి పోటెత్తిన భక్తజనం ● రమణీయంగా విద్యుత్ చాందినీ బండ్ల ప్రదక్షిణలు ● రాత్రి లంకాదహనం ● మూకాంబికా దేవి రూపంలో దివ్య విహారం కలికిరి: ‘కోరిన కోర్కెలు తీర్చే మా చల్లని తల్లీ.. ఎల్లమ్మా దీవించమ్మా’ అంటూ భక్తకోటి కీర్తనలతో కలికిరి పుణ్యక్షేత్రం ఆధ్యాత్మిక జైత్రయాత్రను తలపించింది. ప్రసిద్ధ శ్రీ కలికిరి ఎల్లమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా మూడవ రోజైన సోమవారం క్షేత్రమంతా భక్తుల జనసందోహంతో కిక్కిరిసిపోయింది. ఉదయం నుంచే అమ్మవారు భక్తుల కోర్కెలు తీర్చే కల్పవల్లిగా, విశేష అలంకరణలో భక్తులకు దివ్యదర్శనమిచ్చారు. నయనానందకరం.. చాందినీ బండ్ల ప్రదక్షిణలు జాతరలో అత్యంత ప్రధాన ఘట్టమైన చాందినీ బండ్ల ఊరేగింపు ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం తెల్లవారుజాము వరకు వైభవంగా సాగింది. కలికిరి మండలంతో పాటు చుట్టుపక్కల ప్రాంతాల నుంచి తరలివచ్చిన చాందినీ బండ్లు వినూత్న హంగులు, రంగురంగుల విద్యుత్ దీపాలంకరణలతో దేదీప్యమానంగా వెలిగిపోతూ ఆలయ ప్రదక్షిణలు చేశాయి. చాందినీ బండ్ల ముందు భక్తులు లయబద్ధంగా చేసిన పిల్లనగ్రోవి వాయిద్యాలు, కోలాటాలు, సాంప్రదాయ చెక్క భజనలు భక్తజనాన్ని మైమరపించాయి. జాతర మహోత్సవానికి వచ్చే భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా నిర్వాహకులు ఆలయం వద్ద బారికేడ్లు, ప్రత్యేక క్యూలైన్లను ఏర్పాటు చేశారు. అలాగే రాత్రి 7.30 గంటలకు ఆలయ ఆవరణలో భక్తిశ్రద్ధలతో ఏర్పాటు చేసిన ‘లంకాదహనం’ ఘట్టం భక్తులను విశేషంగా అలరించింది. మూకాంబికగా పుష్పపల్లకీ సేవ.. పురవీధుల్లో దివ్య విహారం సోమవారం రాత్రి అమ్మవారు జగన్మాత ‘శ్రీ మూకాంబికా దేవి’ అవతారంలో నయనమనోహరంగా అలంకరించిన పుష్పపల్లకీపై అధిష్టించి, భక్తకోటి నడుమ పురవీధులలో దివ్య విహారం చేశారు. ఆలయం నుంచి వైభవంగా ప్రారంభమైన ఈ పుష్పపల్లకీ వాహన సేవ ఆర్ఎస్ రోడ్డు, బ్రాహ్మణ వీధి, మెయిన్ రోడ్డు, రైల్వే బ్రిడ్జి వరకు సాగి.. తిరిగి ఆలయానికి చేరుకుంది. పురవీధుల్లో అమ్మవారు విహరిస్తున్న వేళ ఇంటింటి వద్ద భక్తులు కర్పూర హారతులు ఇస్తూ, కొబ్బరికాయలు, ఫలహారాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. జగన్మాత కరుణాకటాక్షాల కోసం భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. ఈ దివ్య మహోత్సవంలో ఆలయ ధర్మకర్త రెడ్డివారి అశోక్కుమార్ రెడ్డి, ఆలయ నిర్వాహకులు మధుసూదన్రెడ్డి, సురేంద్రరెడ్డి, వెంకటరెడ్డి, యోగేష్రెడ్డి, భక్తులు పాల్గొన్నారు. -
కేబుల్ వైర్ల దొంగల అరెస్ట్
పెద్దమండ్యం : వ్యవసాయబోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీలకు పాల్పడుతున్న ముగ్గురిని సోమవారం అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ తెలిపారు. మండలంలోని కోటకాడపల్లె పంచాయతీ తాటిమాకులపల్లె, పెద్దమండ్యం పంచాయతీ బిక్కావాండ్లపల్లె, చెరువుకిందపల్లెలకు సమీపంలోని వ్యవసాయబోర్ల వద్ద కేబుల్ వైర్లు చోరీ జరిగిన విషయం తెలిసిందే. వ్యవసాయబోర్లకు సమీపంలో బిక్కావాండ్లపల్లె వద్ద ఉన్న ఆంజనేయస్వామి ఆలయంలో ఆంప్లిఫైర్లు, రెండు మైకులు, హుండీ చోరీ జరిగాయి. ఈ మేరకు రైతులు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. ఈ క్రమంలో పోలీస్ ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు సోమవారం వాహనాల తనిఖీ చేపడుతుండగా ద్విచక్రవాహనంలో వెళుతున్న ముగ్గురిని అదుపులోకి తీసుకున్నట్లు తెలిపారు. వీరు మదనపల్లె మండలం బికె పల్లె కాలనీకి చెందిన ఆవుల రాజు (30), కావడి బాలరాజు (25), కోనేటి వెంకటేశు (43)గా గుర్తించినట్లు తెలిపారు. వీరి నుంచి కేబుల్ వైరు, ఆంప్లిఫైర్, రెండు మైక్లు, ఖాళీ హుండీని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. 19 వ్యవసాయబోర్ల వద్ద వీరు కేబుల్ వైరు చోరీ చేసినట్లు విచారణలో తేలినట్లు చెప్పారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వివరించారు. వ్యవసాయ బోర్లు, పొలాల వద్ద అనుమానితులు ఎవరైనా కనబడితే వెంటనే రైతులు స్థానిక పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
మైనర్ బాలికకు ప్రసవం
● పసికందు మాయం ● కర్నాటకలో పోక్సో కేసు నమోదు ● ఆర్ఎంపీ ఈశ్వరమ్మ అరెస్ట్ ● 2 లక్షలు ఇచ్చి బాధితులను బెదిరించిన వైనం ● మెడికల్ ఆఫీసర్ పాత్రపై దర్యాప్తు పుంగనూరు: వైద్యవృత్తిని దిగజార్చి, మైనర్ బాలికకు రహస్యంగా ప్రసవం చేసి పసికందును మాయం చేసిన హేయమైన సంఘటన పుంగనూరులో ఆలస్యంగా వెలుగుచూసింది. బెంగళూరు సుబ్రమణ్యపుర పోలీస్స్టేషన్ పరిధికి చెందిన ఓ మైనర్ బాలికను ఆమె అక్క కొడుకు మాయమాటలతో లోబరుచుకుని గర్భవతిని చేశాడు. కుటుంబ పరువు పోతుందనే భయంతో తల్లిదండ్రులు గత నెల 2న ఆమెను పుంగనూరుకు తీసుకువచ్చారు. ఇక్కడి ఆర్ఎంపీ ఈశ్వరమ్మ సాయంతో ఒక ప్రభుత్వ వైద్యాధికారికి చెందిన స్కానింగ్, సర్జికల్ సెంటర్లో వ్యాపారం కుదుర్చుకున్నారు. ఆపై బాలికను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి గుట్టుచప్పుడు కాకుండా ప్రసవం చేసినట్లు ఆరోపణలు ఉన్నాయి. అనంతరం గత నెల 5న సదరు వైద్యుడు, ఆర్ఎంపీ కలిసి బాధితులకు బలవంతంగా రూ.2 లక్షలు ఇచ్చి, విషయం బయటపెడితే కేసు పెడతామని బెదిరించి పసికందును లాక్కుని వారిని పంపించేశారు. బెంగళూరు వెళ్లిన బాలికకు గత నెల 7న తీవ్ర కడుపునొప్పి రావడంతో అక్కడి ఆసుపత్రికి తరలించారు. ప్రసవ వివరాలు తెలుసుకున్న వైద్యులు పోలీసులకు సమాచారం అందించారు. దీంతో సుబ్రమణ్యపుర పోలీసులు క్రైమ్ నంబరు: 179/2026గా పోక్సో చట్టం కింద కేసు నమోదు చేశారు. దర్యాప్తులో భాగంగా పుంగనూరుకు వచ్చిన కర్ణాటక పోలీసులు సోమవారం రాత్రి ఆర్ఎంపీ ఈశ్వరమ్మను అదుపులోకి తీసుకుని బెంగళూరుకు తరలించారు. వైద్యాధికారి ప్రైవేట్ ఆసుపత్రి, సర్జికల్ సెంటర్ను పరిశీలించారు. చట్టప్రకారం మైనర్లకు ప్రసవం చేసినప్పుడు పోలీసులకు సమాచారం ఇవ్వాల్సి ఉండగా, కాసులకు కక్కుర్తి పడి నిబంధనలు ఉల్లంఘించినట్లు తేలింది. నిందితులు ఆ పసికందును భారీ లాభాలకు ఒక వ్యక్తికి విక్రయించినట్లు సమాచారం అందడంతో, ప్రస్తుతం ఫోన్ స్విచ్ఛాఫ్ చేసుకుని పరారైన సదరు కొనుగోలుదారుడి కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ కేసుతో సంబంధమున్న వైద్యాధికారితో పాటు అందరిపై కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు స్పష్టం చేశారు. -
సమస్యలు తీరవు.. అర్జీలు మారవు
మదనపల్లి (కురబలకోట) : ఎంత బాగా పప్పు చేసినా అందులో ఉప్పు లేకపోతే రుచి ఉండదు. అలాగే ఎంత ఘనంగా పీజీఆర్ఎస్ నిర్వహించినా ఆశించిన స్థాయిలో ప్రజల సమస్యలు పరిష్కారం కాకపోతే ఫలితం ఉండదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. అంతేకాదు పీజీఆర్ఎస్కు సార్థకత కూడా ఉండదు. ప్రజల సమస్యల పరిష్కారానికి ప్రతి సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వందలాది మంది ఆశతో వస్తున్నా ఆశించిన స్థాయిలో సమస్యలు పరిష్కారం కాకపోవడంతో అర్జీదారులు ఉసూరుమంటున్నారు. పీజీఆర్ఎస్ అర్జీలకు చిరునామాగా మారిందన్న విమర్శలు వస్తున్నాయి. అదే సమయంలో పరిష్కారాలు కూడా ప్రశ్నార్థకంగా మారాయి. అర్జీలు మారవు. సమస్యలు తీరవన్నట్లుగా సాగుతోంది. ఉన్నతాధికారులు కిందిస్థాయి అధికారులకు ఆదేశించడం వారు ఒత్తిడి ఉన్నవి మాత్రం పట్టించుకోవడం మిగిలిన వాటిని క్షేత్ర స్థాయిలో చర్యలు పూర్తయినట్లు నమోదు చేస్తూ చేతులు దులుపుకొంటున్నారని అసహనం వ్యక్తం అవుతోంది. సకాలంలో పరిష్కారం కాక పీజీఆర్ఎస్ అంటే పెదవి విరుస్తున్నారు. అదే సమస్యతో మళ్లీ అర్జీ పట్టుకుని రావాల్సిన పరిస్థితి నెలకొందని నిట్టూరుస్తున్నారు. దీంతో పీజీఆర్ఎస్ అంటే ప్రజలకు పరేషాన్ సర్వీస్ సెంటర్గా మారిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువు అర్జీలు వీటిపైనే భూ వివాదాలు, రెవెన్యూ సమస్యలు, ఆక్రమణలు, ఫెన్షన్లు, సంక్షేమ పథకాలు, తాగునీరు, రోడ్లు వంటి సమస్యలపై పరిష్కారం కోరుతూ అర్జీలు వస్తున్నాయి. సోమవారం 348 మంది వివిధ సమస్యలపై అర్జీలు ఇచ్చారు. జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు ఆర్జీలు స్వీకరించారు. నిర్దేశిత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అదికారులను ఆదేశించారు. నేతన్నలందరికీ రూ. 25 వేలు ఇవ్వాలి రాష్ట్ర ప్రభుత్వం ప్రతి చేనేత కుటుంబానికి నేతన్న సేవ కింద రూ.25 వేలు అందేలా చర్యలు తీసుకోవాలని జాతీయ చేనేత ఐక్య వేదిక సంఘం నాయకులు పీజీఆర్ఎస్లో ఇన్చార్జి జిల్లా కలెక్టర్కు వినతి పత్రం ఇచ్చారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో నేతన్న నేస్తం కింద జిల్లాలో ఏడు వేల మందికి పైగా లబ్దిపొందారన్నారు. ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం ఉన్నవారికి మాత్రమే అమలు పరుస్తున్నట్లు ఉత్తర్వులు వచ్చాయన్నారు. దీని వల్ల చేనేత కార్మికులు తీవ్రంగా నష్టపోతారన్నారు. అందరికీ నేతన్న సేవ అందేలా చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. ఆర్టీసీ సమస్యలను పరిష్కరించాలి ఏపీఎస్ ఆర్టీసీ ఉద్యోగులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను పరిష్కరించాలని ఆ సంఘం జేఏసీ పీజీఆర్ఎస్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ శివ్ నారాయణ శర్మకు వినతి పత్రం సమర్పించారు. సీ్త్ర శక్తి పథకం కింద గతంలో కన్నా 15 లక్షల మంది ప్రయాణికులు పెరిగినా ఒక్క బస్సు కూడా అదనంగా పెంచకుండా సిబ్బందిని కూడా నియమించకున్నా విధులు నిర్వహిస్తున్నామన్నారు. కొత్తగా ప్రవేశ పెడుతున్న ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీ ద్వారానే నిర్వహించేలా చూడాలన్నారు. రానున్న కృష్ణా గోదావరి పుష్కరాలకు అదనంగా కొత్త బస్సులు కొనుగోలు చేయాలని కోరారు. ప్రైవేటీకరణ అపోహలను తొలగించాలన్నారు. 03 టిబిపి 41సి : ఆర్టీసీ ఉద్యోగుల సమస్యలు పరిష్కరించాలని జేఏసీ ఆధ్వర్యంలో నిరసన -
భూమి విక్రయం పేరుతో మోసగించారని ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : భూమి విక్రయిస్తామని చెప్పి డబ్బులు తీసుకుని, మోసం చేసిన ఘటన వెలుగులోకి వచ్చింది. చిత్తూరు జిల్లా తవణంపల్లె మండలం పట్నం గ్రామానికి చెందిన రాజమాణిక్యం సోమవారం మదనపల్లె జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేశారు. కురబలకోట మండలం సర్కారుతోపునకు చెందిన రవీంద్ర 2025 సంవత్సరంలో తనకు భూమి విక్రయిస్తానని చెప్పి రూ.3.70 లక్షల నగదు తీసుకున్నాడని తెలిపారు. ఇప్పటి వరకు భూమి ఇవ్వలేదు, డబ్బు కూడా తిరిగి ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. రవీంద్రను డబ్బు అడిగినందుకు అతడి అనుచరుడు సత్యారెడ్డి తనపై దాడి చేశారని కన్నీటి పర్యంతమయ్యాడు. తన ద్విచక్రవాహనాన్ని కూడా రవీంద్ర లాక్కున్నారని ఆరోపించారు. ఇప్పుడు తన అనుచరులతో కలిసి చంపుతామని బెదిరిస్తున్నారని ఫిర్యాదులో పేర్కొన్నారు. తనకు న్యాయం చేసి రక్షణ కల్పించాలని బాధితుడు ఎస్పీని కోరారు. ఫిర్యాదు అందుకున్న ఎస్పీ ముదివేడు పోలీసులతో మాట్లాడి రవీంద్రపై తక్షణమే చర్యలు చేపట్టాలని ఆదేశించారు. నేటి నుంచి సౌత్ జోన్ ఫుట్బాల్ టోర్నీమదనపల్లె టౌన్ : మదనపల్లె ఆరోగ్యవరంలో ఆడమ్ మెమోరియల్ సౌత్ జోన్ ఇండియా ఫుట్బాల్ టోర్నమెంట్ ఆగస్టు 4 నుండి 8వ తేదీ వరకు నిర్వహించనున్నట్లు నిర్వాహకులు జాంటీ, సుదర్శన్, నాషీ, రాజేష్ తెలిపారు. సోమవారం వారు వివరాలు వెల్లడిస్తూ ఈ ప్రతిష్టాత్మక టోర్నమెంట్లో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాల నుంచి మొత్తం 16 ప్రముఖ జట్లు పాల్గొంటున్నాయన్నారు. లీగ్, నాకౌట్ విధానంలో మ్యాచ్లు జరుగుతాయని, ఆగస్టు 8వ తేదీ సాయంత్రం 5 గంటలకు ఫైనల్ మ్యాచ్ నిర్వహిస్తామని చెప్పారు. జెడ్పీ కారుణ్య నియామకాల అక్రమాలపై కేసు కడప అర్బన్:కడప జిల్లా పరిషత్ కార్యాలయంలో కారుణ్య నియామకాల పేరుతో నిబంధనలకు విరుద్ధంగా 15 మందికి అక్రమంగా ఉద్యోగాలు ఇప్పించిన వ్యవహారంపై కేసు నమోదైంది. జెడ్పీ సీఈవో సుబ్రహ్మణ్యం ఇచ్చిన ఫిర్యాదు మేరకు ప్రధాన నిందితుడు మస్తాన్ వల్లీతో పాటు మరో నిందితుడు శ్రీనివాస్ రెడ్డిపై సోమవారం కేసు నమోదు చేసినట్లు కడప వన్ టౌన్ సీఐ తిమ్మారెడ్డి తెలిపారు. అక్రమంగా ఉద్యోగాలు పొందిన 15 మందిలో ఇద్దరు ప్రస్తుతం జెడ్పీ సీఈవో కార్యాలయంలోనే పనిచేస్తున్నట్లు గుర్తించామన్నారు. ఈ కుంభకోణంపై సమగ్రంగా దర్యాప్తు చేస్తున్నామని, భవిష్యత్తులో ఈ వ్యవహారంతో సంబంధమున్న మరికొంతమందిని విచారించి బాధ్యులైన అందరిపై చట్టపరంగా కఠిన చర్యలు తీసుకుంటామని సీఐ పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి మృతి మైదుకూరు : మైదుకూరు మండలం శివపురం సమీపంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన ప్రొద్దుటూరుకు చెందిన షేక్ మహబూబ్ బాషా(50) చికిత్స పొందుతూ మృతి చెందాడు. బళ్లారి– కృష్ణపట్నం జాతీయ రహదారి బైపాస్పై పొట్టేలు అడ్డం రావడంతో బైక్పై నుంచి కిందపడిన విషయం తెలిసిందే. సంఘటనపై మృతుడి బావమరిది గోపవరం మండలం కాలువపల్లెకు చెందిన షేక్ ఖాజావలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్టు సోమవారం పోలీసులు తెలిపారు. -
కాలువులు, పైపులైన్ వేయకుండా రోడ్డు పనులా..?
మురికినీటి కాలువలు, పైపులైన్ పనులు చేపట్టాకే సదుం కాలేజీ మార్గంలో రోడ్డుపనులు చేపట్టేలా చర్యలు తీసుకోవాలని సదుం జడ్పీటీసీ సభ్యులు సోమశేఖర్ రెడ్డితో పాటు స్థానికులు పీజీఆర్ఎస్లో జిల్లా ఇన్చార్జి కలెక్టర్ను కోరారు. కాలేజీ రోడ్డుకు ఇరువైపులా 400కు పైగా కుటుంబాలు నివసిస్తున్నాయన్నారు. ఈ మార్గంలో గుడి, బడి, జగనన్న కాలనీ, హాస్టల్, సీఎల్ఆర్సీ కార్యాలయం, వెలుగు, వ్యవసాయ, పాలిటెక్నిక్, ఆసుపత్రితో పాటు వివిధ ప్రభుత్వ కార్యాలయాలు కూడా ఉన్నాయన్నారు. ఇలాంటి ప్రాముఖ్యత కలిగిన రోడ్డుకు మురికినీటి కాలువలు, పైపులైన్ వేయకుండా రోడ్డు పనులు సాగిస్తే ఆతర్వాత మురికినీరు రోడ్డుపైకి వచ్చే అవకాశం ఉందన్నారు. దీనిపై తగు చర్యలు తీసుకునేలా అధికారులను ఆదేశించాలని కోరారు. -
మంటలు వ్యాపించి తల్లీకుమార్తెలకు గాయాలు
మదనపల్లె టౌన్: గ్యాస్ లీకై మంటలు చెలరేగడంతో తల్లి, కుమార్తె తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం ఉదయం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ కొత్తఇండ్లలో ఉంటున్న జ్యోతి సోమవారం (26) తన కుమార్తె లహరి (08) ని స్కూల్కు పంపేందుకు సిద్ధం చేస్తుండగా గీజర్కు అమర్చిన గ్యాస్ సిలిండర్ను ఆన్ చేయగానే ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. ప్రమాదంలో తల్లీబిడ్డలు మంటల్లో చిక్కుకున్నారు. వారి కేకలు విన్న స్థానికులు వెంటనే మంటలను అదుపు చేశారు. బాధితులను వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గీజర్లు, గ్యాస్ సిలిండర్లు ఉపయోగించే సమయంలో లీకేజీ ఉందో లేదో పరిశీలించి, జాగ్రత్తలు పాటించాలని అధికారులు సూచించారు. గంజాయి విక్రేత అరెస్టు రాయచోటి టౌన్ : రాయచోటి పట్టణంలోని మదనపల్లె రోడ్డులో గంజాయి విక్రయిస్తున్న బిబబిహార్లోని మాధేపూరా జిల్లా అభిరంపురా తులసీపూర్ టోల చౌసా గ్రామానికి చెందిన హార్మోద్ కుమార్ను పోలీసులు అరెస్టు చేశారు. సోమవారం అర్బన్ సీఐ బీవీ చలపతి మాట్లాడుతూ.. రాయచోటిలో గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్ఐ విష్ణువర్థన్, సిబ్బందితో వెళ్లి నిందితుడిని అదుపులోకి తీసుకొని 1.100 కిలలో గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. జీవనోపాధికి రాయచోటికి వచ్చి కూలీలకు గంజాయి అమ్మి అక్రమంగా డబ్బులు సంపాదనకు అలవాటు పడ్డాడని వివరించారు. కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలియచేశారు. చికిత్స పొందుతున్న జ్యోతి, లహరి -
పారిశుద్ధ్య కార్మికురాలిపై లైంగిక దాడికి యత్నం
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో సోమవారం మధ్యాహ్నం ఒంటరి మహిళపై ఓ యువకుడు లైంగిక దాడికి యత్నించాడు. ఒకటో పట్టణ పోలీసుల వివరాల ప్రకారం.. పట్టణంలోని అమ్మినేని వీధికి చెందిన మహిళ (22) జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో కాంట్రాక్టు ప్రాతిపదికన పారిశుద్ధ్య కార్మికురాలిగా విధులు నిర్వహిస్తున్నారు. విధులు ముగించుకుని మధ్యాహ్నం ఇంటికి వెళుతుండగా స్థానికంగా ఉన్న ఓ హోటల్ యజమాని కుమారుడు ఆమెను వెంబడించాడు. ఆమె ఇంట్లోకి వెళ్లగానే అతను కూడా వెళ్లి అఘాయిత్యానికి యత్నించాడు. ఆమె కేకలు పెట్టడంతో స్థానికులు అక్కడికి చేరుకుని బాధితురాలిని కాపాడారు. నిందితుడిని పట్టుకుని పోలీసులకు అప్పగించారు. బాధితురాలు 1వ పట్టణ పోలీస్స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేశారు. తనపై జరిగిన అఘాయిత్యానికి సంబంధించి చర్యలు తీసుకోవాలని కోరింది. పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. ఈ విషయమై సీఐ రాజారెడ్డిని వివరణ కోరగా.. విచారించి చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఆలయంలో చోరీ పీలేరు : మండలంలోని తలపుల పంచాయతీ శ్రీ ఉలవల గంగమ్మ ఆలయంలో చోరీ జరిగిన సంఘటన ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. దుండగులు ఆలయ గేటు తాళాలు పగులగొట్టి చోరీకి పాల్పడినట్లు స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు, వేలిముద్ర నిపుణులు ఆలయాన్ని పరిశీలించి వివరాలు సేకరించారు. రెండు ముక్కుపుడకలతో పాటు 25 గ్రాముల బంగారం చోరీ జరిగినట్లు నిర్వాహకులు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. ద్విచక్రవాహనం అదుపుతప్పి వ్యక్తికి తీవ్రగాయాలు ములకలచెరువు : ద్విచక్రవాహనం అదుపుతప్పి కిందపడటంతో ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం మండలంలో చోటు చేసుకుంది. మండలంలోని బురకాయలకోట పంచాయతీ నల్లగుట్లపల్లెకు చెందిన రఘునాథ్ వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో పానీపూరి బండి నిర్వహిస్తున్నాడు. సోమవారం పులివెందుల నుంచి బురకాయలకోటకు ద్విచక్రవాహనంపై బయలుదేరాడు. బురకాయలకోట విద్యుత్తు సబ్స్టేషన్ వద్దకు రాగానే ద్విచక్రవాహనం అదుపుతప్పి రొడ్డు పక్కన గుంతలోకి దూసుకెళ్లింది. స్థానికులు 108 వాహనానికి సమాచారం అందించారు. వాహనం సంఘటనా స్థలానికి చేరుకొని బాధితుడికి చికిత్స అందించారు. అనంతరం బాధితుడి వద్ద ఉన్న రూ.60 వేల నగదును వారి కుటుంబ సభ్యులకు సిబ్బంది మధుసూదన్రెడ్డి, శబరి అందించి నిజాయితీని చాటుకున్నారు. -
‘ఆకుపచ్చని’ ఆశలపై దళారీల నీలినీడలు
● ఆకుకూరల సాగు ● శ్రమ ఎక్కువ.. ఫలితం తక్కువ! ● రైతులే చిరువ్యాపారులుగా మారుతున్న వైనంరాయచోటి టౌన్: మనం తినే రోజువారీ ఆహారంలో ఆకుకూరల ప్రాధాన్యత విపరీతంగా పెరిగింది. మంచి ఆరోగ్యం కోసం, రక్తహీనత వంటి సమస్యల నుంచి బయటపడాలన్నా మాంసానికి బదులుగా ఎక్కువగా ఆకుకూరలు తినాలని వైద్యులు సూచిస్తున్నారు. దీంతో మార్కెట్లో చిర్రాకు, గోంగూర, పాలకూర, కొత్తిమీర, పుదీనా, మెంతాకు, బచ్చలకూర, చుక్కాకు వంటి వివిధ రకాల ఆకుకూరలకు అంతకంతకూ డిమాండ్ పెరుగుతోంది. రైతులు బోరుబావుల కింద ఉన్న కొద్దిపాటి భూమిలోనే ఆకుకూరలు సాగు చేస్తున్నారు. రాయచోటి నియోజకవర్గంలోని చెన్నముక్కపల్లె, నక్కవాండ్లపల్లె, ఎగువ అబ్బవరం తదితర గ్రామా ల్లో ఇది ప్రధాన జీవనాధారంగా మారింది. అయితే, పండించిన పంటను మార్కెటింగ్ చేసుకునే క్రమంలో రైతుల కష్టాలు రెట్టింపవుతున్నాయి. దళారులు, మధ్యవర్తులను నమ్ముకోలేక రైతులే నేరుగా మార్కెట్లకు వెళ్లి అమ్ముకోవాల్సి వస్తోంది. అన్నమయ్య జిల్లావ్యాప్తంగా ప్రస్తుతం సుమారు 2 వేల ఎకరాలలో ఆకుకూరల సాగు జరుగుతోంది. జిల్లాలో ఎక్కువగా రామసముద్రం, గుర్రంకొండ, మదనపల్లె, చిన్నమండెం, రాయచోటి ప్రాంతాలలో రైతులు ఈ పంటలను ఎక్కువగా సాగు చేస్తున్నారు. కర్నాటక బార్డర్లో కూడా వీటి సాగు బాగుంది. అయితే మన ప్రాంతంలో పండించే ఆకుకూరలు ఇతర ప్రాంతాలకు ఎగుమతి చేసి మార్కెటింగ్ చేసేంత భారీ స్థాయిలో పండటం లేదు. మన ప్రాంత అవసరాలకే ఇవి సరిపోతున్నాయి. కర్ణాటకలో ఉండే వాతావరణ ప్రభావం వల్ల అక్కడి ఆకుకూరల్లో నాణ్యత ఎక్కువగా ఉండటంతో బార్డర్ ఏరియాలో వీటికి మంచి డిమాండ్ ఉంటోంది. – సుభాషిణి, అన్నమయ్య జిల్లా ఉద్యానశాఖ అధికారిణి -
నాటి ధర్మపీఠం.. నేడు చారిత్రక పాఠం!
చిత్రంలో కనిపిస్తున్నది బ్రిటిష్ కాలం నాటి నందలూరు ఫస్ట్క్లాస్ మున్సిఫ్కోర్టుకు చెందిన చారిత్రక న్యాయపీఠం. నాణ్యమైన టేకు చెక్కతో తయారైన ఈ కుర్చీపై బ్రిటిష్ ప్రభుత్వ అధికారిక చిహ్నమైన ‘విక్టోరియా మహారాణి కిరీటం‘ గుర్తు నేటికీ స్పష్టంగా ఉంది. నాడు ఉమ్మడి జిల్లాలోని దాదాపు 30 మండలాల ప్రజలకు న్యాయం అందించిన ఈ పీఠంపై తెల్లదొరలతో పాటు, దేశ విభజన క్రమంలో పాకిస్తాన్కు తరలివెళ్ళిన ఒక ప్రముఖ న్యాయమూర్తి కూడా కూర్చుని కీలక తీర్పులు ఇచ్చేవారు. రవాణా సౌకర్యాలు లేని ఆ రోజుల్లో కక్షిదారులు గూడుబండ్లు కట్టుకుని, ముందు రోజే వచ్చి కోర్టు షెడ్ల కింద రాత్రిళ్ళు బస చేసేవారు. 2003లో ఈ కోర్టు శతాబ్ది ఉత్సవాలు జరిగాయి. 2000 లో ప్రభుత్వం నిర్వహించిన వేలంలో నాగిరెడ్డిపల్లె మసీదు కమిటి మాజీ అధ్యక్షులు షౌకత్అలీ లోడి ఈ కుర్చీని దక్కించుకోగా, అది నేటికీ ఆయన వద్దే భద్రంగా ఉంది. – రాజంపేట -
మీరు సూపర్.. సర్!
నందలూరు జూనియర్ సివిల్ జడ్జి కోర్టు లోక్ అదాలత్ సభ్యుడైన ఫైజుల్లాఖాన్ లోడి పాత రికార్డులను పదిలంగా దాచి భవిష్యత్తుకు ఎలా ఉపయోగపడతాయో నిరూపించారు. చరిత్రను, పాత జ్ఞాపకాలను ప్రేమించే ఆయన నాటి తరం రికార్డులను భద్రపరిచి అందరి చేత ‘భేష్’ అనిపించుకుంటున్నారు. రాష్ట్ర ఎన్నికల సంఘం చేపట్టిన ‘సర్’ కార్యక్రమం కింద ప్రస్తుతం ఉన్న ఓట్లను 2002 నాటి పాత రికార్డులతో ‘మ్యాపింగ్’ చేయాల్సి వచ్చింది. దీంతో పాత ఓటర్ల జాబితా కోసం జిల్లావ్యాప్తంగా జనం ఆఫీసుల చుట్టూ తిరిగినా రికార్డుల జాడ దొరకక అల్లాడిపోయారు. ఈ తరుణంలో ఫైజుల్లాఖాన్ లోడి జనానికి ఆపద్బాంధవుడిగా మారారు. ఆయన 2002 నాటి జాబితానే కాకుండా, ఏకంగా 1959 నాటి ఓటర్ల జాబితాను భద్రంగా దాచారు. తాత ముత్తాతల వివరాలున్న ఈ లిస్టు ఇప్పుడు ఓట్ల మ్యాపింగ్కు అమూల్యమైన నిధిలా ఉపయోగపడుతోంది. – రాజంపేట -
బోయకొండకు పోటెత్తిన భక్తజనం
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రం బోయకొండ ఆదివారం భక్తులతో కిటికిటలాడింది. వేకువజామునే ఆలయ అర్చకులు అమ్మవారిని సుప్రభాత సేవతో మేల్కొలిపి, పంచామృతాలతో అభిషేకించారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది. ఆదివారం సుమారు 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆషాడమాసంలో కర్ణాటక భక్తులు అమ్మవారిని అత్యంత శుభకరమైన నెలగా భావించి వేల సంఖ్యలో తరలిరావడం గమనార్హం. ఈ సఽందర్భంగా అమ్మవారిని ఆలయ అర్చకులు సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. స్తంభించిన ట్రాఫిక్ వేలాది వాహనాలు బోయకొండకు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే ముందస్తుగా సీఐ సాయిప్రసాద్ ఆదేశాలమేరకు ఎస్ఐ చిన్నరెడ్డప్ప, సిబ్బంది పర్యవేక్షించినా తిప్పలు తప్పలేదు. కొండపైకి వెళ్లే మార్గంలో ట్రాఫిక్ స్తంభించడంతో వాహనదారులు, భక్తులు అవస్థలు పడ్డారు. వివిధ సేవా టికెట్ల ద్వారా రూ. 24.10 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. వేలాది మందితో కిటకిటలాడిన ఆలయ పరిసరాలు క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ ఆలయ ఆదాయం రూ. 24.10 లక్షలు -
ప్లాస్టిక్ డబ్బాల్లో.. పీచు మురిపెం!
స్కూళ్లు తెరిచారంటే చాలు.. రోడ్లపై పిల్లలు పీచు మిఠాయి తింటూ సందడి చేయడం సాధారణమే. అయితే మైదుకూరులో శనివారం రాజస్థాన్కు చెందిన గబ్బర్ సింగ్ అనే యువకుడు సరికొత్త ప్యాకింగ్తో పీచు మిఠాయిలు అమ్ముతూ అందరి దృష్టిని ఆకర్షించాడు. సాధారణంగా పీచు మిఠాయిని పుల్లకు చుట్టి లేదా పాలిథిన్ కవర్లలో అమ్ముతుంటారు. కానీ, అలా అమ్మితే గాలికి దుమ్ము చేరడం లేదా మిఠాయి కరిగిపోవడం జరుగుతుందని గబ్బర్ సింగ్ తెలిపాడు. అందుకే ఒక్కొక్కటి రూ.4 చొప్పున ప్లాస్టిక్ డబ్బాలను కొనుగోలు చేసి, వాటిలో నీలం, ఎరుపు, ఆకుపచ్చ, ఆరెంజ్, పసుపు, తెలుపు వర్ణాల పీచు మిఠాయిలను నింపి విక్రయిస్తున్నాడు. ఈ రంగురంగుల సరికొత్త ప్యాకింగ్ పిల్లలను ఇట్టే ఆకర్షిస్తోంది. ఈ వినూత్న వ్యాపార శైలి స్థానికంగా ప్రత్యేకంగా నిలిచింది. – మైదుకూరు -
తెలుగు నాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవ
మదనపల్లె టౌన్: తెలుగు నాటక రంగ పితామహుడు బళ్లారి రాఘవకు మదనపల్లెలో ఆదివారం పోలీసు శాఖ ఘన నివాళి అర్పించింది. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో బళ్ళారి రాఘవ జయంతిని పురస్కరించుకుని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు, జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో బళ్ళారి రాఘవ జయంతి వేడుకలు జరిగాయి. ఈ కార్యక్రమంలో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన)యం.వెంకటాద్రి పాల్గొని బళ్ళారి రాఘవ చిత్రపటానికి పూలమాలలు వేసి, పుష్పగుచ్ఛాలతో అంజలి ఘటించారు. ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ.. బళ్ళారి రాఘవ కేవలం ఒక నాటక కళాకారుడు మాత్రమే కాదని, తన కళ ద్వారా సమాజంలో నెలకొన్న దురాచారాలను ప్రశ్నించిన గొప్ప సంస్కర్త అని కొనియాడారు. ఆయన ప్రదర్శనలు కేవలం వినోదానికి మాత్రమే పరిమితం కాకుండా, ప్రజల్లో ఆలోచనలు రేకెత్తించి, నైతిక విలువలను పెంపొందించేలా ఉండేవని గుర్తుచేశారు. న్యాయం, ధర్మం, మానవత్వం వంటి ఉన్నత విలువలను తన జీవితాంతం పాటించిన బళ్ళారి రాఘవ జీవితం యువతకు ఎంతో ఆదర్శప్రాయమని అదనపు ఎస్పీ పేర్కొన్నారు. జిల్లాలోని యువ కళాకారులందరూ ఆయనను స్ఫూర్తిగా తీసుకుని, తెలుగు సంస్కతిని, కళలను ప్రపంచవ్యాప్తంగా చాటి చెప్పాలని ఆకాంక్షించారు. ప్రతి ఒక్కరూ ఒక బాధ్యతాయుతమైన పౌరుడిగా తమ కర్తవ్యాన్ని నిర్వర్తిస్తూ, సమాజానికి మేలు చేయడమే ఆయనకు మనం అర్పించే నిజమైన నివాళి అని ఆయన పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో రిజర్వ్ ఇన్స్పెక్టర్ యు. రంగనాథ్ బాబు ఆర్ఎస్ఐ లు శ్రీనివాస్, రవి, చంద్రశేఖర్ మరియు ఇతర పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. -
జాతీయ జట్టులో రాణించాలి
వాల్మీకిపురం : జాతీయ జట్టులో రాణించే విధంగా మహిళా క్రీడాకారిణులు నైపుణ్యాలను పెంచుకోవాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రహ్మణ్యం అన్నారు. ఆదివారం స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఆంధ్రక్రికెట్ అసోసియేషన్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్జోన్ అండర్ 23 ఉమెన్స్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లా పోటీలను ఆయన సందర్శించి, క్రీడాకారులను పరిచయం చేసుకున్నారు. ఈ సందర్భంగా వన్డే టోర్నమెంట్కు హాజరైన చిత్తూరు, కడప, నెల్లూరు, అనంతపురం జిల్లా మహిళా క్రికెటర్లను ఉద్ధేశించి డిఈవో మాట్లాడుతూ చదువుతో పాటు యువత క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందన్నారు. మహిళలు సైతం తమ నైపుణ్యాలను పెంచుకుంటే రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు ప్రఖ్యాతలు తీసుకురావచ్చునన్నారు. కార్యక్రమంలో హెడ్కోచ్ సునీల్, సీడీసీఏ ఉపాధ్యక్షులు శ్రీధర్, సీడీసీఏ అధ్యక్షుడు శ్రీనివాస మూర్తి, సెక్రటరీ సతీష్యాదవ్, సునీల్, హర్ష, కిషోర్, గోపి, భాస్కర్రెడ్డి, మనోజ్, మౌళి, నాగరాజు, నరేష్, మురళీ, పవన్, భరత్, తదితరులు పాల్గొన్నారు. వ్యక్తి దుర్మరణం మదనపల్లె టౌన్: బి.కొత్తకోట మండల కేంద్రంలో శనివారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకరు అక్కడికక్కడే మృతి చెందారు. పోలీసుల కథనం మేరకు.. అనంతపురం జిల్లా తలుపుల గ్రామం సిద్దగురుపల్లికి చెందిన వీరాంజనేయులు(33) భార్య మల్లీశ్వరితో కలిసి బి.కొత్తకోటలో నివసిస్తూ, స్థానిక పాల డైరీలో పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి ఆయన బైక్పై పిటీఎం రోడ్డులో వెళ్తుండగా ప్రమాదానికి గురై అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీరాంజనేయులు అకాల మృతితో ఆ కుటుంబంలో తీవ్ర విషాదం నెలకొంది. -
రమ్యశ్రీ చికిత్సకు విరాళాల జోరు!
పుంగనూరు : ఊపిరితిత్తుల వ్యాధితో ప్రాణాపాయ స్థితిలో ఉన్న పేద సీఏ విద్యార్థిని రమ్యశ్రీని కాపాడుకునేందుకు దాతృత్వం పోటెత్తుతోంది. ఆమె వైద్య ఖర్చుల దీనగాథపై గత నెల 18న ’సాక్షి’ పత్రికలో ప్రచురితమైన ‘పేద... ఆపై పెద్దబాధ‘ అనే ప్రత్యేక కథనానికి అద్భుతమైన స్పందన లభిస్తోంది. రమ్యశ్రీ ఊపిరితిత్తుల మార్పిడి ఆపరేషన్కు రూ.50 లక్షలు అవసరం కాగా.. ’సాక్షి’ కథనం చూసి స్పందించిన దాతలు ఇప్పటివరకు రూ.24 లక్షల ఆర్థిక సాయాన్ని అందించారు. రూ.10 లక్షల భారీ విరాళం రమ్యశ్రీని ఆదుకునేందుకు తిరుపతి బాలాజీ కాలనీలోని ’ఇన్స్టిట్యూట్ ఆఫ్ చార్టర్డ్ అకౌంటెంట్స్ ఆఫ్ ఇండియా’ కళాశాల చైర్మన్ సీఏ మన్నెం సింహాద్రి ముందుకు వచ్చారు. ఆయన తన అకాడమీ తరఫున ఏకంగా రూ.10 లక్షల భారీ విరాళాన్ని పుంగనూరులో రమ్యశ్రీ తల్లిదండ్రులు వెంకట్రమణ, లక్ష్మీ దంపతులకు స్వయంగా అందజేశారు. అలాగే పెద్దపంజాణి మండలం రేషన్ డీలర్లు సైతం తమ వంతుగా రూ.25 వేల ఆర్థిక సాయాన్ని బాధిత కుటుంబానికి అప్పగించారు. స్నేహితుల అండ.. ’సాక్షి’కి కృతజ్ఞతలు సాధారణ రైతు కుటుంబంలో పుట్టి, ఎంతో కష్టపడి సీఏ చదువుతున్న రమ్యశ్రీ అకాల వ్యాధి బారిన పడటంతో ఆమె స్నేహితులు రాజారెడ్డి, ఆవుల హరిప్రసాద్ కూడా రంగంలోకి దిగారు. సోషల్ మీడియా ద్వారా విరాళాల సేకరణను వేగవంతం చేశారు. తమ బిడ్డ ప్రాణాలు కాపాడేందుకు అండగా నిలిచిన దాతలకు, సమస్యను ప్రపంచానికి చాటిచెప్పిన ’సాక్షి’ పత్రికకు రమ్యశ్రీ తల్లిదండ్రులు కన్నీటి పర్యంతమవుతూ కృతజ్ఞతలు తెలిపారు. విద్యార్థిని ఊపిరితిత్తుల మార్పిడికి రూ.10 లక్షలు ఇచ్చిన తిరుపతి సీఏ అకాడమీ ఇప్పటివరకు రూ.24 లక్షలు జమ.. దాతలకు తల్లిదండ్రుల కృతజ్ఞతలు -
మదనపల్లె ప్రైమరీ స్కూల్లో అన్యమత బోధనల కలకలం
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని ఓ ప్రైమరీ స్కూల్లో చిన్న పిల్లలకు అన్యమత బోధనలు చేస్తున్నారన్న ఆరోపణలతో స్థానికంగా కలకలం రేగింది. మదనపల్లె ఎస్బిఐ కాలనీ ఉన్న ఓ ప్రైవేటు పాఠశాలలో విద్యార్థులకు అన్యమత ప్రచారాలు, మతపరమైన బోధనలు చేస్తుండటం ఆదివారం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. పాఠశాలలో చిన్నపిల్లలకు మత బోధనలు చేస్తున్నాడని స్థానికులు గుర్తించి, మతబోధనలు వీడియోలలో చిత్రీకరించారు. విషయం తెలుసుకున్న తల్లిదండ్రులు స్కూల్ వద్దకు చేరుకుని, స్కూల్ యాజమాన్యంతో గొడవకు దిగారు. విద్యాలయాలు జ్ఞానాన్ని పంచే దేవాలయాలుగా ఉండాలి తప్ప మత ప్రచార కేంద్రాలుగా మారకూడదని, పసిపిల్లల మనస్సులలో ఇటువంటి విత్తనాలు నాటడం విద్యాశాఖ నిబంధనలకు విరుద్ధమని పేర్కొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారితో పాటు మండల విద్యాశాఖాధికారుల పట్టింపులేని తనంతోనే ఇలాంటి సంఘటనలు పునరావృతం అవుతున్నాయని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. డిఈఓ, ఎంఈఓలు తక్షణమే స్పందించి, జరిగిన సంఘటనపై సమగ్ర విచారణ జరిపి కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ప్రస్తుతం ఈ ఆరోపణలపై విద్యాశాఖ అధికారుల నుంచి అధికారిక స్పందన రావాల్సి ఉంది. నిబంధనల ప్రకారం పాఠశాలల్లో మతపరమైన బోధనలకు అవకాశం లేదు. విచారణలో వాస్తవాలు తేలిన తర్వాతే తదుపరి చర్యలు ఉంటాయని విద్యాశాఖ వర్గాలు తెలిపాయి. పాఠశాల యాజమాన్యంపై తల్లిదండ్రుల ఆగ్రహం -
వెలుగులోకి శాసనం
గాలివీడు : గాలివీడు మండలం నూలివీడులో రెండవ వెంకటపతి రాయల కాలం నాటి ఒక ఆసక్తికరమైన చెరువు శాసనం లభించింది. నూలివీడు గ్రామం వెలుపల పొలాల్లో ఒక పెద్ద బండరాయిపై ఈ శాసనం చెక్కబడి ఉంది. ఇది తెలుగు లిపిలో రాయబడింది. ఈ శాసనంలో క్రీ.శ. 1605, నవంబర్ 15 అని ఉంది. ఈ శాసనం పెనుగొండ రాజ్యంలోని మర్జేవాడ–సీమలో, నూలివీడు సమీపంలో ఉన్న మెరుగుల చెరువు పునరుద్ధరణ పనులు, దానికి ఒక కలుప (ఆనకట్ట) నిర్మాణం, అలాగే దశవంద భూముల దానం గురించి తెలియజేస్తోంది. మహామండలేశ్వర కదిరి నరసింహ రాజు ఆ ప్రాంతాన్ని పరిపాలిస్తున్నప్పుడు, రామదుర్గ వెంకటపతి నాయ మరియు కదిరి నాదనాయ ఈ చెరువు అడుగు భాగం నుండి నిర్మించి, రెడ్డి మరియు కరణాల ఆధ్వర్యంలో నిర్మించి, భూమి శిస్తులో 1/10 వంతు వసూలు చేసి నీటిపారుదల సౌకర్యాలు కల్పించాలని ఇందులో ఉంది. దశవంద – మాన్య అనగా చెరువుల నిర్వహణ, వాటి నిర్మాణం మరియు నీటిపారుదల సౌకర్యాల కోసం కేటాయించిన భూమి లేదా శిస్తు (ఉత్పత్తిలో 1/10వ వంతు) అని అర్థం. -
మిల్లర్ల సిండి కే వాళ్లు చెప్పిందే రే
బద్వేలు : అంతర్జాతీయ యుద్ధాలు, ప్రకృతి విపత్తులు సామాన్యుడి కడుపు కొడుతుంటే.. బియ్యం మాఫియా, బడా మిల్లర్లకు మాత్రం కాసుల వర్షం కురిపిస్తున్నాయి. ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లాలో బియ్యం మాయగాళ్లు సిండికేట్గా మారి రేట్లను ఇష్టారీతిగా పెంచేస్తూ పేదవాడి నడ్డి విరుస్తున్నారు. అటు పశ్చిమాసియా యుద్ధాన్ని, ఇటు ఎల్నినో కరువు పరిస్థితులను బూచిగా చూపిస్తూ జిల్లా వ్యాప్తంగా క్వింటా ధరలను ఆమాంతం పెంచేసి కోట్లకు కోట్లు పోగేసుకుంటున్నారు. ఆ పదిమందే బడా వ్యాపారులు.. 30 లక్షల క్వింటాల నిల్వలు! జిల్లాలో ప్రధానంగా ఆరుగురు బడా రైస్ మిల్లర్లు, కొందరు వ్యాపారులు కలిసి ఇక్కడి బియ్యం, ధాన్యం వ్యాపారాన్ని పూర్తిగా శాసిస్తున్నారు. పోరుమామిళ్ల, బద్వేలు, మైదుకూరు, ప్రొద్దుటూరు, కడప, రాజంపేట ప్రాంతాలకు చెందిన వీరు.. ఎక్కడికక్కడ ముందే ధాన్యాన్ని కొనేసి తమ భారీ మిల్లులు, గోదాముల్లో దాచేస్తున్నారు. ప్రస్తుతం వీరి వద్ద 30 లక్షల క్వింటాళ్లకు పైగా ధాన్యం, బియ్యం నిల్వలు ఉన్నట్లు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించి, కొద్దికొద్దిగా సరుకును బయటకు వదులుతూ ధరలు పెంచుతున్నారు. పెరిగిన బియ్యం ధరలతో జనాన్ని అల్లాడిస్తూ కేవలం ఆ పదిమందే కోట్లు కూడబెట్టుకుంటున్నట్లు స్పష్టమవుతోంది. రెండు నెలల్లో రూ.10 కోట్లు పిండేశారు! గత రెండు నెలల వ్యవధిలోనే బియ్యం ధరలను క్వింటాకు ఏకంగా రూ.2,000లకు పైగా పెంచేసిన మాఫియా, జనం సొమ్ము రూ.10 కోట్లకు పైగా పిండేసింది. రెండు నెలల కిందట క్వింటా రూ.4,800–5,100 ఉండగా, ఇప్పుడు ఏకంగా రూ.6,700–7,000కు పెంచేశారు. రిటైల్ మార్కెట్లో నెల రోజుల కిందట రూ.1,200 ఉన్న 25/26 కిలోల సన్న బియ్యం బస్తా (టిక్కీ) ధర నేడు ఏకంగా రూ. 1,800లకు చేరింది. రాయచోటిలోని శరవణ బిగ్బజార్ మాల్లో పది కేజీల బియ్యం ధరను ఏకంగా రూ. 749లకు అమ్ముతున్నారంటే దోపిడీ ఏ స్థాయిలో ఉందో అర్థం చేసుకోవచ్చు. ఇక్కడితో ఆగకుండా వచ్చే నెలలో క్వింటాకు మరో రూ.700లు పెంచి, ఇంకో రూ.10 నుంచి రూ.12 కోట్లు గుంజేందుకు అప్పుడే పన్నాగం పన్నారు. రైతులకు టోకరా.. కూటమి సర్కార్ కొమ్ముకాపు! జిల్లాలోని మిల్లర్లు ఖరీఫ్, రబీ సీజన్లలో సిండికేట్గా మారిపోయి ధరలను పూర్తిగా నియంత్రించారు. వర్షాల భయంతో ఉన్న రైతుల నుంచి కర్నూల్ సోనా, జిలకర మసూర, ఎన్డీఎల్ సన్న రకాల ధాన్యం (75 కిలోల బస్తా)ను ప్రభుత్వం ప్రకటించిన మద్దతు ధర రూ.1,770కే కొనుగోలు చేశారు. తీరా రైతుల దగ్గర ధాన్యం అయిపోగానే, అదే బస్తా ధరను మిల్లర్లు రూ.2,200 వరకు పెంచేశారు. రైతుల వద్ద కొనుగోలు చేసిన ధర ప్రకారం కిలో సన్న రకం బియ్యం రూ.35–40 ఉండాలి. కానీ రిటైల్ మార్కెట్లో ఏకంగా రూ.65 నుంచి రూ.75 వరకు విక్రయిస్తున్నారు. పడకేసిన పౌరసరఫరాల, ఎన్ఫోర్స్మెంట్ శాఖలు! ధరలను నియంత్రించాల్సిన పౌరసరఫరాల శాఖ, విజిలెన్స్, ఎన్ఫోర్స్మెంట్ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు గుడ్లప్పగించి చూస్తున్నారే తప్ప బియ్యం మాఫియాపై చర్యలు తీసుకోవడం లేదు. గతంలో బియ్యం ధరలు పెరిగితే సన్నరకాల బియ్యాన్ని ప్రత్యేక కౌంటర్ల ద్వారా విక్రయించడంతో పాటు అక్రమ నిల్వలు ఉన్న మిల్లర్లపై తక్షణ చర్యలు తీసుకునేవారు. కానీ కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక పాలకులే మిల్లర్లకు, బడా వ్యాపారులకు కొమ్ముకాస్తుండటంతో వారి ఇష్టారాజ్యమైందని, బ్లాక్ మార్కెట్ యథేచ్ఛగా సాగుతోందని ప్రజలు మండిపడుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి పెరిగిన బియ్యం ధరలు తగ్గించి సామాన్యుల కడుపు నింపాలని జనం కోరుతున్నారు. కూటమి ప్రభుత్వ అండతో మిల్లర్ల అడ్డగోలు దోపిడీ ఎల్నినో, యుద్ధం పేరుతో ధరల అడ్డగోలు పెంపు 30 లక్షల క్వింటాళ్ల సన్న బియ్యం నిల్వలు బ్లాక్ మార్కెట్లో కృత్రిమ కొరత సృష్టించిన బియ్యం మాఫియా రెండు నెలల్లోనే రూ.10 కోట్లు స్వాహా వచ్చే నెలలో మరో దోపిడీకి పౌరసరఫరాల శాఖ నీడలోనే పక్కా పన్నాగం -
తేరుపై ఎల్లమ్మ చిద్విలాసం!
కలికిరి: కలికిరి గ్రామదేవత శ్రీ ఎల్లమ్మ జాతర మహోత్సవాల్లో భాగంగా రెండో రోజైన ఆదివారం అమ్మవారు పుష్పాలంకృత తేరుపై (రథం) పురవీధుల్లో విహరిస్తూ భక్తులను కటాక్షించారు. ఆర్ఎస్ రోడ్డు, మెయిన్ బజారు మీదుగా సాగిన రథోత్సవంలో భక్తులు కర్పూర హారతులతో మొక్కులు తీర్చుకున్నారు. అమ్మవారికి బోనాలు మధ్యాహ్నం నుంచి చుట్టుపక్కల గ్రామాల మహిళలు సంప్రదాయ వాయిద్యాలు, బళ్ళారి డ్రమ్స్ నడుమ ఊరేగింపుగా వచ్చి అమ్మవారికి దీపాలు, బోనాలు, చీర, సారె సమర్పించారు. ఆదివారం అర్ధరాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు చాందినీ బండ్ల ప్రదర్శన, అనంతరం బలిదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. మూడో రోజైన సోమవారం ఎల్లమ్మ సర్వదర్శనం, రాత్రి 8 గంటలకు లంకాదహనం, అనంతరం పుష్పపల్లకీ వాహనంపై అమ్మవారి ఊరేగింపు జరగనున్నాయి. ఉత్సవాల్లో ఆలయ ధర్మకర్త ఆశోక్కుమార్ రెడ్డి, నిర్వాహకులు పాల్గొన్నారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ పర్యవేక్షణలో కలికిరి సీఐ అనీల్కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు భారీ బందోబస్తు చేపట్టారు. -
తాళ్లపాకలో ఘనంగా ధ్వజావరోహణం
తాళ్లపాక శ్రీ చెన్నకేశవస్వామికి చక్రస్నానం చేస్తున్న అర్చకులుతాళ్లపాక శ్రీ సిద్దేశ్వరాలయంలో ధ్వజావరోహణం చేస్తున్న అర్చకులురాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్య జన్మస్థస్థలిలో శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయాల్లో తిరుపతి తిరుమల దేవస్థానం చేపట్టిన వార్షిక బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం ధ్వజావరోహణ కార్యక్రమంను ఘనంగా నిర్వహించారు. కాగా సోమవారం పుష్పయాగం కార్యక్రమం నిర్వహించనున్నారు. ఇది ఇలా ఉండగా శ్రీ కామాక్షి సమేత శ్రీ సిద్దేశ్వరాలయంలో త్రిశూలస్నానం, శ్రీదేవి, భూదేవిలతో శ్రీ లక్ష్మీ చెన్నకేశవస్వామి ఆలయంలో చక్రస్నానం నిర్వహించారు. టీటీడీ డిప్యూటీ ఈవో ప్రశాంతి పర్యవేక్షణలో తాళ్లపాక బ్రహ్మోత్సవాలకు వైభవంగా నిర్వహించారు. కార్యక్రమంలో తాళ్లపాక ఆలయాల ఇన్స్పెక్టర్ బాలాజీ, అన్నమయ్య శ్రీవారి ఆలయం ఇన్స్పెక్టర్ వినోద్, అర్చకులు సుదర్శన్, శ్రీ సిద్దేశ్వరాలయం ప్రధాన అర్చకులు భక్తవత్సలం, శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ ప్రధాన అర్చకులు నరేష్, మాజీ సర్పంచ్ శ్యామనబోయిన గౌరీ శంకర్, టీటీడీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
15 రోజులవుతున్నా కానరాని ఆచూకీ
పెద్దమండ్యం: మండలంలోని వెలిగల్లు పంచాయతీ పాపదాతగారిపల్లెకు చెందిన ఇరగమ్మ అదృశ్యమై 15 రోజులు అవుతున్నా ఆమె ఆచూకీ తెలియరాలేదు. అదృశ్యంపై కేసు నమోదు చేసిన పోలీసులకు ఆచూకీ కనుక్కోవడం సవాల్గా మారింది. పాపదాతగారిపల్లెకు చెందిన కొంకల రెడ్డెప్పరెడ్డి రెండో భార్య ఇరగమ్మ (53) తల్లితో కలిసి నివసిస్తోంది. అదే పల్లెలో ఉన్న భర్త ఇంటి దగ్గరికి వెళ్లి వస్తూ ఉండేది. ఆర్థికంగా బాగానే ఉన్న ఇరగమ్మ గ్రామ పరిధిలోనే కాకుండా ఇతర ప్రాంతాలలో ఉన్న పలువురు వ్యాపారస్థులు, రైతులకు డబ్బులు వడ్డీకి ఇచ్చేదని సమాచారం. పెద్ద మొత్తంలోనే ఈమెకు ఆర్థిక లావాదేవీలు ఉన్నట్లు తెలిసింది. ఇంటి నుంచి గ్రామానికి సమీపంలో ఉన్న ఓ పల్లెకు వెళుతున్నట్లు చెప్పారని భర్త పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రామిషరీ నోట్ రాయించుకొనేందుకు పల్లెకు వెళ్లి అదృశ్యమైందని తెలిసింది. ఆర్థిక లావాదేల నేపథ్యంలో ఆమెను ఎవరైనా ఏమైనా చేశారా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఇరగమ్మ ఆచూకీ కోసం ప్రత్యేకంగా ఒక బృందాన్ని ఏర్పాటు చేసినట్లు పోలీసులు చెబుతున్నారు. మదనపల్లె టౌన్ : అన్న కుటుంబంపై తమ్ముడు కరల్రతో దాడికి పాల్పడి ముగ్గరిని గాయపరిచాడు. ఆదివారం సాయంత్రం మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితులు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై వివరాలు.. మండలంలోని వలసపల్లె పంచాయతీ గుట్టకిందపల్లికు చెందిన గంగులప్పకు, కృష్ణమూర్తికి ఉమ్మడిగా పూర్వీకుల ఆస్తి ఐదు ఎకరాలు ఉంది. ఇటీవల ఆ భూమిని అన్నదమ్ములు భాగపరిష్కారం చేసుకున్నారు. గంగులప్ప గతంలో వేసిన బోరును, పంటల సాగుకోసం తమ్ముడు కృష్ణమూర్తి మరమ్మతు చేయిస్తుండగా గంగులప్ప అడ్డుకున్నాడు. దీంతో అన్నదమ్ముల మధ్య గొడవ తలెత్తి పరస్పర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో గంగులప్ప అతని కుమారుడు శివ, కోడలు భాగ్యలక్ష్మి గాయపడ్డారు. ఎదురుదాడిలో కృష్ణమూర్తి కూడా స్వల్పంగా గాయపడ్డాడు. బాధితులను కుటుంబీకులు స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించగా డాక్టర్లు వైద్యం అందించడంతో కోలుకుంటూ ఉన్నారు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా పోలీసులు తెలిపారు. -
కూలీలను పెడితే చేతికి ఏమీ రాదు
ఆకుకూరల కోతకు బయటి కూలీలను పెడితే.. ఆకుకూరలు అమ్మగా వచ్చిన కాస్త డబ్బులను వారికే కూలి కింద ఇచ్చేయాలి. అప్పుడు మా చేతికి ఏమీ మిగలదు. అందుకే తెల్లవారుజాము నుంచే మా కుటుంబమే పొలానికి వచ్చి మధ్యాహ్నం వరకు ఆకుకూరలు కోసి, కట్టలు కట్టి సొంతంగా అమ్ముతాము. అంత కష్టపడ్డా అక్కడ దక్కేది తక్కువే. – మేకల లక్ష్మిదేవి, కుమ్మరపల్లె ఆటోలకే సగం పోతోంది రైతుల దగ్గర నుంచి ఆకుకూరలు సేకరించుకుని, వాటిని సంతలకు తీసుకెళితే అక్కడ ‘గేట్ ఫీజు’ పేరు చెప్పి రూ.300 వసూలు చేస్తున్నా రు. ఆటో ఛార్జీలు మరో రూ.300 ఖర్చు అవుతోంది. ఒక ఆకుకూర కట్ట అమ్మితే మాకు వచ్చేది కేవలం రూ.3 నుంచి రూ.5 మాత్రమే. రోజువారీ కూలి రూ.300 నుండి రూ.500 కూడా చేతికి రావడం లేదు. – లక్ష్మిదేవి, చిరువ్యాపారి -
బొలెరో ఢీకొని మహిళకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : ఆటో కోసం రోడ్డు పక్కన నిలిచి ఉన్న మహిళను బొలెరో ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడింది. ఆదివారం రాత్రి మదనపల్లి మండలంలో జరిగిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పుంగనూరు మండలం చండ్రమాకులపల్లికి చెందిన పార్వతమ్మ సొంత పనిపై మదనపల్లెకు వచ్చింది. పని ముగించుకుని వలసపల్లి నవోదయ ఆర్చి వద్ద దిగి ఆటో కోసం వేచి ఉండగా బొలెరో ఢీకొట్టి వెళ్లిపోయింది. ప్రమాదంలో కాళ్లు రెండు విరిగి తీవ్రంగా గాయపడ్డ బాధితురాలని 108 సిబ్బంది చికిత్స కోసం స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని డాక్టర్ల సలహా పై వెంటనే తిరుపతి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తులో ఉందని తాలూకా సిఐ కళా వెంకటరమణ తెలిపారు. మదనపల్లె టౌన్ : ఆటో ఢీకొని తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లిలో చోటు చేసుకుంది. తంబళ్లపల్లె మండలం కోసివారిపల్లి పంచాయతీ దిగువ ముట్రవారిపల్లికి చెందిన రామలింగారెడ్డి తన కుమార్తె అములును బెంగుళూరులో వదిలేందుకు మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్కు బైకులో బయలుదేరాడు. మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట వద్దకు రాగానే ఆటో వెనక నుంచి వచ్చి బైక్ను ఢీ కొట్టింది. రామలింగారెడ్డి, అతని కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని జిల్లా ఆసుపత్రికి తరలించి ప్రధమ చికిత్స అనంతరం రామలింగారెడ్డిని తిరుపతికి రెఫర్ చేశారు. మదనపల్లె టౌన్ : వేర్వేరు కారణాలతో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం చోటు చేసుకుంది. పట్టణంలోని చంద్రాకాలనీకి చెందిన అనిత (27)ను కుటుంబ విషయమై అత్త మందలించడంతో మనస్తాపానికి గురైన ఆమె నిద్రమాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. కుటుంబ సభ్యులు ఆమెను ఆసుపత్రికి తరలించారు. ఫ రామారావుకాలనీకి చెందిన విష్ణుప్రియ (21) కుటుంబ సమస్యలతో ఆదివారం ఇంట్లో ఉన్న నెయిల్ పాలిష్ తాగి ఆత్మహత్యకు యత్నించింది. కుటుంబ సభ్యులు ఆమెను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. రెండోపట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. పీలేరు రూరల్ : మండలంలోని కాకులారంపల్లె పంచాయతీ చిన్నగాండ్లపల్లెలో చింతచెట్ల నరికివేతపై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని బాధితుడు జి.వి. రమణ అన్నారు. ఆదివారం ఆయన స్థానికి విలేకరులతో మాట్లాడుతూ చిన్నగాండ్లపల్లెలో తమకు చెందిన చింత చెట్లను అదే గ్రామానికి చెందిన వారు ఉద్దేశపూర్వకంగా నరికివేయడం జరిగిందని తెలిపారు. చింతచెట్లను నరకడంతో పాటు కుల వివక్షత చూపినట్లు గత నెల 31న పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామన్నారు. ఫిర్యాదు చేసి రెండు రోజులైనా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా పోలీస్ ఉన్నతాధికారులు స్పందించి తాము ఇచ్చి ఫిర్యాదుపై ఎఫ్ఐఆర్ నమోదు చేసి న్యాయం చేయాలని కోరారు. -
కొత్త పింఛన్లకు మోక్షమెప్పుడో..?
పులివెందుల రూరల్ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినప్పటికీ అర్హులకు కొత్త పింఛన్లకు మోక్షం కలగడం లేదు. వృద్ధాప్య, వితంతు, వికలాంగ పింఛన్ల కోసం దరఖాస్తులు చేసుకునేందుకు అర్హులైన వారు గ్రామీణ ప్రాంతాలతో పాటు పట్టణంలోని సచివాలయాల చుట్టూ ప్రదక్షిణలు చేస్తున్నారు. కొత్త పింఛన్లు ఇంకా ఇవ్వడంలేదని అధికారులు చెబుతుండటంతో నిరాశతో వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. రేషన్కార్డుల పరిస్థితి కూడా అలాగే ఉంది. గతంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ హయాంలో పింఛన్లు, రేషన్ కార్డులు దరఖాస్తుల పక్రియ నిరంతరంగా కొనసాగేది. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లవుతున్నా ప్రభుత్వ వెబ్సైట్ తెరవకుండా కాలయాపన చేస్తున్నారు. కొత్త పింఛన్ల కోసం అర్హులు, కొత్తగా రేషన్ కార్డులు దరఖాస్తు చేసుకుని కూటమి ప్రభుత్వం ఎప్పుడు ప్రకటిస్తుందా అని ఎదురుచూస్తున్నారు. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లవుతున్నా ఇంకా వెబ్సైట్ ఓపెన్ కాకపోవడంతో కొత్త పింఛన్ల మంజూరు కోసం అర్హులందరూ ఎదురుచూస్తున్నారు. 50 ఏళ్లకే పింఛన్ ఎక్కడ సారూ : కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే ఎస్సీ ఎస్టీ, బీసీలకు 50 ఏళ్లకే పింఛన్ ఇస్తామని మేనిఫెస్టోలో హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తవుతున్నా ఎస్సీ, ఎస్టీ, బీసీలకు పింఛన్ ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సైట్ ఎప్పుడు ఓపెన్ అవుతుందో 60 ఏళ్లు పైబడిన వారికి, ఒంటరి మహిళలకు, వితంతు పింఛన్ల కోసం దరఖాస్తు చేసుకోవాని ప్రభుత్వం చెప్పింది. దీంతో పింఛన్లకు అర్హులైన వారు దరఖాస్తులు తీసుకుని సచివాలయాలకు పరుగులు పెట్టారు. సిబ్బంది మాత్రం ప్రభుత్వం నుంచి ఆదేశాలు రాలేదని, పింఛన్ల సైట్ ఓపెన్ కావడంలేదని చెబుతుండటంతో నిరాశగా వెనుతిరిగి వెళ్లిపోతున్నారు. జగనన్న ప్రభుత్వంలో నిరంతర ప్రక్రియ : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు వలంటరీ వ్యవస్థను ఏర్పాటు చేసి ఇంటివద్దకే వచ్చి అర్హులను గుర్తించి వారికి దరఖాస్తు చేసి పింఛన్లు, రేషన్కార్డులు ఇచ్చే సౌకర్యం అందుబాటులో ఉండేది. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత కొత్త పింఛన్లు, రేషన్కార్డులకు దరఖాస్తుకు అవకాశాలు ఇవ్వకపోవడంతో అర్హులైన ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కూటమి ప్రభుత్వంలో తెరుచుకోని వెబ్సైట్ సచివాలయాల చుట్టూ అర్హుల ప్రదక్షిణలు -
ఆలోచించు.. ఆవిష్కరించు
● బాల శాస్త్రవేత్తలకు ఇన్స్పైర్ ఆహ్వానం ● నామినేషన్ల ప్రక్రియ ప్రారంభంమదనపల్లె సిటీ : దేశంలో శాస్త్రవేత్తల కొరత నేపథ్యంలో బాల్యం నుంచే పిల్లల్లో సైన్స్పై ఆసక్తిని పెంపొందించి శాస్త్రవేత్తలుగా తీర్చిదద్దాలనే లక్ష్యంతో ఇన్స్పైర్ మనక్ను కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తోంది. నవీన ఆలోచనలు, ఆవిష్కరణలను ప్రోత్సహిస్తోంది. సమాజాన్ని ప్రభావితం చేసే ఆవిష్కరణలతో ప్రతిభ చాటిన విద్యార్థులు నేరుగా రాష్ట్రపతి, ప్రధానమంత్రిని కలిసే అవకావం కల్పిస్తోంది.ఇన్స్పైర్ మనక్ అవార్డు 2026–27కి సమయం ఆసన్నమైంది. భావి శాస్త్రవేత్తలు తమ చిట్టి మెదళ్లకు పని చెప్పాల్సిన తరుణం వచ్చింది. రాష్ట్రపతి భవన్కు రాజమార్గం ఇన్స్పైర్ మనక్లో ప్రతిభ కనబరిచి, సమాజాన్ని ప్రభావితం చేసే అత్యుత్తమ ఆవిష్కరణలు రూపొందించే విద్యార్థులకు రాష్ట్రపతి, ప్రధానమంత్రిని స్వయంగా కలిసి తమ ప్రాజెక్టులను ప్రదర్శించే అరుదైన అవకాశం లభిస్తుంది. అలాగే జాతీయ సాంకేతిక ప్రదర్శనరల్లో పాల్గొనే వెసులుబాటు కూడా దక్కుతుంది. అర్హులు వీరే 10–17 ఏళ్ల మధ్య వయసు కలిగి ప్రస్తుతం 6 నుంచి 10వ తరగతి చదువుతున్న ప్రభుత్వ, ప్రైవేట్, గురుకుల, ఏపీ మోడల్ స్కూళ్లు, కేజీబీవీల విద్యార్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రతి పాఠశాల నుంచి గైడ్టీచర్తో కలిసి విద్యార్థులు పాల్గొనే అవకాశం ఉంటుంది. దరఖాస్తు ఇలా.. ఔత్సాహిక విద్యార్థులు తమ పాఠశాల సైన్స్ ఉపాధ్యాయుడి సహాయంతో www. inrpireawaardrd& rt. gov. in వెబ్సైట్లోకి వెళ్లి రిజిస్ట్రేషన్ ఆప్షన్ ఎంచుకోవాలి. పాఠశాలకు సంబంధించిన వివరాలు నమోదు చేసి సేవ్ చేయాలి. ఆ దరఖాస్తు జిల్లా ఆథారిటీకి వెళుతుంది. అక్కడ ఆమోదం తర్వాత విద్యార్థి మెయిల్కు యూజర్ ఐడీతో కూడిన లింక్ వస్తుంది. విద్యార్థి సమాచారంతో పాటు బ్యాంకు ఖాతా, ఆధార్ నంబర్ నమోదు చేయాలి. విద్యార్థి ప్రదర్శించాలని అనుకుంటున్న ప్రాజెక్టు వివరాలను సంక్షిప్తంగా వెబ్సైట్లో నమోదు చేస్తే దరఖాస్తు ప్రక్రియ పూర్తవుతుంది. ఆన్లైన్లోదరఖాస్తులు సమర్పించేందుకు సెప్టెంబర్ 15వతేదీ వరకు గడువుఉంది. 2023–24లో 294 మంది విద్యార్థుల నుంచి 20 మంది, 2024–25 సంవత్సరానికి 238 మంది పోటీపడగా 19 మంది రాష్ట్ర స్థాయి ఇన్స్పైర్ మనాక్కు ఎంపికయ్యారు. ప్రోత్సాహకాలు విద్యార్థులు ఆన్లైన్లో పంపించే ప్రాజెక్టుల వివరాలు డిపార్టుమెంట్ ఆఫ్ సైన్సు,టెక్నాలజీ, కేంద్ర మంతిత్వశాఖ ప్రతినిధులు పరిశీలిస్తారు. ఎంపికై న ప్రాజెక్టు ప్రయోగం కోసం విద్యార్థి ఖాతాలో రూ.10వేలు జమ చేస్తారు.రాష్ట్రస్థాయి ప్రదర్శనకు ఎంపికై తే రూ.25 వేలు, జాతీయ స్థాయికి వెళితే రూ.40వేల నుంచి 60 వేల వరకు అందజేస్తారు. జాతీయ స్థాయిలో ప్రతిభావంతులకు రాష్ట్రపతి చేతుల మీదుగా అవార్డు ప్రదానం చేస్తారు.నవీన ఆవిష్కరణపై పేటెంట్తో పాటు ఐఐటీ, ఎయిమ్స్ వంటి ప్రవేశాల్లో రిజర్వేషన్ కల్పిస్తారు.ప్రతి పాఠశాల నుంచి నామినేషన్ తప్పనిసరి విద్యార్థుల్లో దాగి ఉన్న సృజనాత్మకతను వెలికితీసేందుకు ఇన్స్పైర్ మనక్ ఒక అద్భుతమైన వేదిక. ప్రతి ప్రభుత్వ, ఎయిడెడ్, ప్రైవేట్ పాఠశాలల హెచ్ఎంలు, ఉపాధ్యాయులు నమోదుపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి. గ్రామీణ ప్రాంత విద్యార్థుల్లో సైతం అద్భుతమైన ఆలోచనలు ఉంటాయి. వాటిని గుర్తించి ఆన్లైన్ పోర్టల్లో నమోదు చేయించాలి. జిల్లాను రాష్ట్రంలోనే ముందంజలో నిలిపేలా పని చేయాలి. డాక్టర్ సుబ్రమణ్యం, డిఈఓ -
సౌత్ జోన్ అండర్ 23 ఉమెన్స్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లా పోటీలు
వాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడామైదానంలో ఆంధ్ర క్రికెట్, చిత్తూరు జిల్లా క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న సౌత్జోన్ అండర్ 23 ఉమెన్స్ వన్డే క్రికెట్ అంతర్ జిల్లాల పోటీలను శనివారం ప్రారంభించారు. శనివారం గ్రౌండ్ 1లో కర్నూల్ టీం, నెల్లూరు అండర్ 23 ఉమెన్స్ క్రికెట్ టీంలు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న నెల్లూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో ఆరు వికెట్లు నష్టపోయి 312 పరుగులు చేసింది. అనంతరం 313 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కర్నూల్ జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 9 వికెట్లు నష్టపోయి 283 పరుగులు మాత్రమే చేసి ఓడిపోయింది. దీంతో 29 పరుగుల తేడాతో నెల్లూరు జట్టు విజయదుందుభి మోగించింది. నెల్లూరు జట్టుకు చెందిన స్వాత్విక రెడ్డి 85 బంతుల్లో 77 పరుగులు, ఆలాసహార్ 58 బంతుల్లో 48 పరుగులు, సాయిలక్ష్మీ 35 బంతుల్లో 47 పరుగులు చేసి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. నెల్లూరు జట్టు బౌలర్లు శారద, రేష్మ కర్నూలు జట్టుకు 47 పరుగులు ఇచ్చి రెండు కీలకమైన వికెట్లు అందుకున్నారు.గ్రౌండ్ 2లో చిత్తూరు, కడప జిల్లా జట్టు తలపడ్డాయి. తొలత టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న చిత్తూరు జట్టు నిర్ణీత 50 ఓవర్లలో 342 పరుగుల భారీ స్కోర్ చేసి ప్రత్యర్థి జట్టుకు సవాల్ విసిరింది. అనంతరం 348 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్ దిగిన కడప జిల్లా జట్టు 46 ఓవర్లలోనే 180 పరుగులు మాత్రమే చేసి ఆలౌటైంది. దీంతో చిత్తూరు జిల్లా జట్టు 162 పరుగులతో భారీ విజయం అందుకుంది. చిత్తూరు జిల్లా జట్టుకు చెందిన గ్రీష్మ 64 బంతుల్లో 64 పరుగులు, ప్రణితయాదవ్ 57 బంతుల్లో 62 పరుగులు నాటౌట్, రుష్మిత 44 బంతుల్లో 34 పరుగులు నాటౌట్తో ఆడి జట్టు విజయంలో కీలకపాత్ర పోషించారు. అసోసియేషన్ అధ్యక్షులు శ్రీనివాసమూర్తి, ఉపాధ్యక్షుడు శ్రీధర్ కుమార్, సెక్రటరీ సతీష్యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా చీఫ్ కోచ్ సునీల్కుమార్, కోచ్లు అనిత, మౌనిక, యామిని, శేఖర్, మాధవి, రాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు. ఉద్యోగం పేరిట మోసం: రూ. 7.30 లక్షలు స్వాహా ఒంటిమిట్ట : బీటెక్ చదివిన యువతికి ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మించి రూ.7,30,000 నగదు వసూలు చేసి మోసగించిన దంపతులపై ఒంటిమిట్ట పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్ఐ శ్రీనివాసులు తెలిపిన వివరాల మేరకు.. ఒంటిమిట్ట సమీప గ్రామానికి చెందిన ఓ యువతి ఉద్యోగం కోసం తన బయోడేటాను ఆన్లైన్లో ఉంచింది. దీనిని ఆసరాగా చేసుకున్న వైజాగ్కు చెందిన భార్యాభర్తలు సురేష్, కావ్య ఆమెకు ఉద్యోగం ఇప్పిస్తామని నమ్మబలికారు. ఈ ఏడాది జనవరి నుంచి విడతలవారీగా రూ.7.30 లక్షలు తీసుకున్నారు. ఉద్యోగం గురించి అడిగితే సమాధానం చెప్పకపోగా, కట్టిన డబ్బులు తిరిగి ఇవ్వమంటే చంపేస్తామని బెదిరించారు. బాధిత యువతి ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. హోటల్కని వెళ్లిన వ్యక్తి అదృశ్యం శంషాబాద్ రూరల్ : ఇంటి యజమానితో కలిసి భోజనం తేవడానికి హోటల్కు వెళ్లిన ఓ వ్యక్తి అదృశ్యమయ్యాడు. శంషాబాద్ ఇన్స్పెక్టర్ వై.సురేందర్రెడ్డి కథనం ప్రకారం.. ఏపీలోని కడప వాసి పలగిరి రాజమోహన్రెడ్డి(29) భార్య దామిని, కొడుకుతో కలిసి ముచ్చింతల్లో కొంత కాలంగా అద్దెకు ఉంటున్నారు. దామిని జిమ్స్ ఆస్పత్రిలో వైద్య విద్య అభ్యసిస్తోంది. జూలై 31న రాత్రి ఇంటి యజమాని శివప్రసాద్తో కలిసి రాజమోహన్రెడ్డి తన కారులో భోజనం తేవడానికి పాల్మాకులలోని ఓ హోటల్కు వెళ్లి తిరిగి వచ్చారు. భోజనం పార్సిల్ను ఇంట్లో ఇవ్వడానికి వెళ్లగా రాజమోహన్ బయట నిలబడి ఉన్నారు. శివప్రసాద్ తిరిగి వచ్చి చూసేసరికి అతడు కనిపించలేదు. అన్నిచోట్ల వెతికినా ఆచూకీ తెలియకపోవడంతో శనివారం దామిని పోలీసులకు ఫిర్యాదు చేసింది. బ్లేడుతో దాడి కేసులో ఇద్దరు అరెస్ట్వేంపల్లె : వేంపల్లెలోని రాజీవ్ కాలనీలో జరిగిన బ్లేడుతో దాడి కేసులో సాయికిరణ్, ఆంజనేయులును అరెస్టు చేసినట్లు సీఐ నరసింహులు తెలిపారు. కూలీ పనికి రానందుకు మేసీ్త్రలు వెంకటరమణ, నరసింహులు గత నెల 30వ తేదీన తమ డబ్బులు తిరిగి ఇవ్వాలని ఇంటి దగ్గరికి వెళ్లగా.. ఇరివురి మధ్య ఘర్షణ చోటు చేసుకున్న విషయం అందరికీ తెలిసిందే. ఈ దాడిలో సాయి కిరణ్, ఆంజనేయులు బ్లేడుతో దాడి చేయడంతో వెంకటరమణ, నరసింహులుకు తీవ్ర గాయాలయ్యాయి. ఈ విషయంపై పోలీసులు దర్యాప్తు చేసి సాయికిరణ్, ఆంజనేయులును అరెస్టు చేసి శనివారం పులివెందుల కోర్టుకు హాజరు పరిచినట్లు సీఐ తెలిపారు. -
నకిలీ పాసుపుస్తకాల కేసులో ఐదుగురు అరెస్ట్
మదనవల్లె టౌన్ : మదనపల్లె మండలంలో నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలు సృష్టించి, తక్కువ ధరకే రూ. 5 కోట్ల భూమి విక్రయం పేరుతో రూ.14 లక్షలకు టోకరా వేసిన ఐదుగురిని అరెస్టు చేసినట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఈ కేసులో అరెస్టయిన నిందితుల వివరాలను ఎస్పీ శనివారం పోలీస్ ప్రధాన కార్యాలయంలో మీడియాకు వెల్లడించారు. మదనవల్లె మండలం బసినికొండ పంచాయతీ, డ్రైవర్ కాలనీకి చెందిన పొన్నంరెడ్డి శోభారాణి, ఆమె భర్త వుల్లారెడ్డికి గంగన్నగారిపల్లె వరిధిలో 2.52 ఎకరాల వ్యవసాయ భూమి తమదేనని, తక్కువ ధరకే విక్రయిస్తామని మొలకదిన్నెకు చెందిన ఉప్పుతోళ్ల శేఖర్ బాబు, గంగన్నగారివల్లెకు చెందిన గడియారం మురళి, ఎర్రప్ప, మణి, రెడ్డెప్ప నమ్మబలికారన్నారు. ఈ కేసులో బాధితులు 2025 సెప్టెంబర్ 1న రూ.13 లక్షలు శేఖర్కు చెల్లించి మదనవల్లె సబ్రిజిస్ట్రార్ కార్యాలయంలో విక్రయ ఒప్పందం చేసుకున్నారు. అనంతరం పట్టాదారు పాసు పుస్తకాలు ఇప్పిస్తామని మరో రూ.లక్ష తీసుకున్న నిందితులు తహసీల్దార్ సంతకాన్ని ఫోర్జరీ చేసి నకిలీ పట్టాదారు పాసు పుస్తకాలను బాధితులకు అందజేసినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ తర్వాత అవి నకిలీవని తేలడంతో బాధితులు శేఖర్ను నిలదీయగా, ఆ భూమిని అప్పటికే ఇతరులకు విక్రయించినట్లు నిందితులు అంగీకరించి, రూ.13 లక్షలను తిరిగి చెల్లిస్తామని 2026 ఏప్రిల్ 10న ఒప్పంద వత్రం రాసిచ్చినా ఇప్పటి వరకు డబ్బు తిరిగి ఇవ్వలేదన్నారు. బాధితురాలు శోభారాణి తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు నకిలీ వత్రాలు సృష్టించి మొత్తం రూ.14 లక్షలు మోసం చేసిన కేసులో ఐదుగురిపై తాలూకా సిఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు అనంతరం నిందితులను అరెస్టు చేసినట్లు తెలిపారు. నకిలీ పాస్ పుస్తకాలు సృష్టించి ప్రజలను మోసం చేస్తుంటే నేరుగా తమను సంప్రదించాలని ఎస్పీ సూచించారు. నకిలీ సీళ్లను సంబంధిత అధికారుల అనుమతి లేకుండా ఎవరైనా తయారు చేస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశంలో రిజినల్ ఎస్పీ వెంకటాద్రి, డి.ఎస్.పి బుచ్చిరాజు, సీఐ, సిబ్బంది పాల్గొన్నారు.తక్కువ ధరకే రూ.5 కోట్ల భూమంటూ రూ.14 లక్షలకు టోకరా -
కలుషిత నీరు తాగి నలుగురు విద్యార్థినులకు అస్వస్థత
కేవీపల్లె : కలుషిత నీరు తాగి నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురైన సంఘటన మండలంలోని చిన్నకమ్మపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో చోటు చేసుకుంది. శనివారం చిన్నకమ్మపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఓ బాటిల్లోని నీరు తాగిన పదో తరగతికి చెందిన నలుగురు విద్యార్థినులు అస్వస్థతకు గురయ్యారు. విషయం తెలుసుకున్న హెచ్ఎం రహంతుల్లా సమాచారాన్ని విద్యార్థినుల తల్లిదండ్రులకు తెలియజేశారు. నలుగురు విద్యార్థినులను చికిత్స నిమిత్తం మహల్ ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. చికిత్స అనంతరం కోలుకోవడంతో తిరిగి చిన్నకమ్మపల్లెకు చేరుకున్నారు. విద్యార్థినులు పెనుప్రమాదం నుంచి బయటపడటంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. విషయం తెలుసుకున్న ఎంఈవో రెడ్డిబాషా హుటాహుటిన మహల్ పీహెచ్సీకి చేరుకుని విద్యార్థినుల పరిస్థితిపై ఆరా తీశారు. అనంతరం పాఠశాలలో విచారణ జరిపారు. కొందరు విద్యార్థులు ఓ వాటర్ బాటిల్లో ఉద్దేశపూర్వకంగా ఏదో కలిపినట్లు ప్రాథమికంగా తెలిసిందని ఎంఈవో తెలిపారు. జరిగిన సంఘటనపై డీఈవోకు నివేదిక సమర్పించినట్లు చెప్పారు. -
మిట్స్తో కాంగో డేనియల్ అకాడమీ ఒప్పందం
కురబలకోట : మదనపల్లి సమీపంలోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ కాంగోకు చెందిన డేనియల్ అకాడమీ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీతో అవగాహన ఒప్పందం కుదుర్చుకున్నట్లు రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ ఒప్పందం ద్వారా బోధన, ఫలితాల ఆధారిత సిలబస్ రూపకల్పన, కోర్సు మెటీరియల్ అభివృద్ధి, అధ్యాపకుల శిక్షణ, అకడమిక్ మెంటరింగ్ వంటి సేవలను మిట్స్ అందించనుందని తెలిపారు. అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఒప్పందం ఉన్నట్లు వివరించారు. యువతి అదృశ్యంపై కేసు నమోదుపుంగనూరు : మండలంలోని కంటేపల్లికి చెందిన 19 ఏళ్ల బాలిక అదృశ్యమైంది. శనివారం బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు హెడ్కానిస్టేబుల్ గణేష్ కేసు నమోదు చేశారు. బీఎస్సీ చదువుతున్న విద్యార్థిని మూడు రోజుల కిందట కళాశాలకు వెళ్లి తిరిగి రాకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. అప్పుల బాధతో రైతు ఆత్మహత్యాయత్నం మదనపల్లె టౌన్ : అప్పుల బాధతో ఓ రైతు విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం బి.కొత్తకోట మండలం కుర్రోళ్లపల్లెలో చోటు చేసుకుంది. బాధితుడి భార్య రత్నమ్మ వివరాల ప్రకారం.. బి కొత్తకోట మండలంలోని కుర్రోళ్లపల్లెకు చెందిన శంకరప్ప (51) వ్యవసాయం చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. పాడి ఆవులు, వ్యవసాయం కోసం చేసిన అప్పులు సుమారు రూ.5 లక్షల వరకు పేరుకుపోయాయి. రుణదాతల ఒత్తిళ్లు అధికంకావడంతో జీవితంపై విరక్తితో చెంది వ్యవసాయ పొలంలొనే విషం తాగాడు. సాయంత్రం వరకు భర్త ఇంటికి రాలేదని భార్య రత్నమ్మ పొలం వద్దకు వెళ్లి చూడగా, భర్త అప్పటికే విషం తాగేసి ఉండటం చూసి వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై కొత్తకోట పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ప్రమాద సంఘటనపై కేసుమైదుకూరు : మైదుకూరు మండలం టి.కొత్తపల్లె వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాద సంఘటనపై కేసు నమోదు చేసినట్టు పోలీసులు శనివారం తెలిపారు. తిప్పిరెడ్డిపల్లెకు చెందిన కశెట్టి సుబ్బరాయుడు తన మనవడు యాపరాల శివతో కలిసి మోటార్ బైక్పై వెళుతూ రోడ్డు ప్రమాదానికి గురైన విషయం తెలిసిందే. ఈ సంఘటనపై సుబ్బరాయుడు అల్లుడు యాపరాల సుబ్బారావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. -
ఎద్దుల గంటలు మోగాల్సిన చేలల్లో.. మౌనం ఆవహించింది... పచ్చగా నవ్వాల్సిన పొలాల్లో.. దుఃఖం రాజ్యమేలుతోంది.. చినుకు రాలుతుందేమోనని ఆశగా చూసిన నేల కల చెదిరింది.. కరి మబ్బులు జడిపట్టి కురుస్తాయేమోనని.. నింగికేసి చూసిన రైతు గుండె నిలువునా కరిగింది.. ‘ఎల్నినో’ పడ
● నీడలా వెంటాడుతున్న ఎల్ నినో ● వర్షాలు ఎప్పుడు కురుస్తాయో తెలియని పరిస్థితి ● జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 8.28 శాతమే సాక్షి, మదనపల్లె: అన్నమయ్య జిల్లాపై కరువు మేఘాలు ముంచుకొస్తున్నాయి. గతంలో ఎన్నడూలేని దుర్భర పరిస్థితులు ఎల్నినో రూపంలో వెంటాడుతున్నాయి. మేలో ఓ మోస్తారు వర్షాలు కురవగా జూన్లో సగం, జూలైలో సగటు పూర్తి వర్షపాత లోటు నమోదైంది. దీని ఫలితంగా జిల్లా అంతటా పంటలతో పచ్చగా కళకళలాడాల్సిన పొలాలను బీళ్లుగా మార్చాయి. కరువుకు నిదర్శనంగా పోలాలు బీళ్లతో, పెట్టిన పంటలు ఎండుతూ రైతు కళ్లలో దైన్యం కనిపిస్తోంది. వర్షాధార పంటపై ఆధారపడిన జిల్లా కావడంతో భవిష్యత్తు పరిస్థితులు తీవ్ర ఆందోళనకు గురి చేస్తున్నాయి. ఖరీఫ్లో జిల్లాలో 46,055 హెక్టార్లలో పంటలు సాగు కావాల్సి ఉండగా..జూలై 30 నాటికి కేవలం 8.28 శాతం విస్తీర్ణంలో 3,814 హెక్టార్లకే పరిమితమైంది. 42,241 హెక్టార్లు బీళ్లుగా మిగిలాయి. సాగైనా పంటల్లో పెద్దమండ్యం మండలం 380 హెక్టార్ల విస్తీర్ణంతో మొదటి స్థానంలో ఉంది. జిల్లాలో అత్యధికంగా బి.కొత్తకోటలో 316, గాలివీడులో 284, కేవీ పల్లిలో 459, లక్కిరెడ్డిపల్లెలో 126, పెద్దతిప్పసముద్రంలో 201, పీలేరులో 371, రామసముద్రంలో 208 హెక్టార్లు పంటలు సాగయ్యాయి. వందలోపు హెక్టార్లలో 10 మండలాల్లో సాగయ్యాయి. అతి తక్కువగా గుర్రంకొండ లో 12, చిన్నమండ్యంలో 26, రాయచోటిలో 43 హెక్టార్లలో పంటలు సాగు చేశారు. ● ఇంకా విత్తనం ప్రారంభం కాని పంటలు (సున్నా శాతం) బాజ్రా, కొర్ర, సామలు, మినుము, పత్తి, ఆవాలు, నువ్వులు, సోయాబీన్, పొగాకు, ఇతర చిరుధాన్యాలు. ● జిల్లా ఆర్థిక వ్యవస్థకు కీలకమైన వేరుశనగ, వరి రెండూ 10 శాతం లోపే ఉన్నాయి. 48 రోజులు చినుకు లేదు జూలైలో 90.5 మిల్లీమీటర్ల సగటు వర్షపాతం కురవాల్సి ఉండగా ఒక్క మిల్లీమీటర్ వర్షం కూడా కురవలేదు. జూన్లో 35 మిల్లీమీటర్ల లోటు వర్షపాతం నమోదైంది. జూన్ 14వ తేదీ నుంచి జూలై 31 వరకు వర్షం మాటే లేదు. ఇక ఖరీఫ్లో పంటలసాగు పూర్తిగా పడకేసినట్టే. ఆగస్టులో కూడా వర్షాలు కురిసే అవకాశాలపై వ్యవసాయశాఖ స్పష్టంగా చెప్పలేకపోతోంది. దీంతో జిల్లాలో వ్యవసాయం పూర్తిగా కనుమరుగయ్యే ప్రమాదం ఏర్పడింది. ఇప్పటికే విత్తన పంటలు చేతికొస్తాయన్న ఆశ ఏమాత్రం లేదు. పెట్టిన పంటలు, పెట్టుబడి పూర్తిగా కోల్పోవాల్సిన పరిస్థితులు కళ్లముందు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పంట సాగు వివరాలు ఇలా... పంట రకం సాగు (హెక్టార్లలో) వరి 737 మొక్కజొన్న 313 రాగి 118 కంది 126 వేరుశనగ 2317 పశుగ్రాసం 96 అనుములు 67 జిల్లా సాగుభూమి స్థితి సాధారణం విస్తీర్ణం: 46,055 హెక్టార్లు విత్తినది : 3,814 హెక్టార్లు ఇంకా 91.72 శాతం భూమి మిగిలి ఉంది -
ఏకమై మల్లయ్యకొండలను రక్షించుకుందాం!
● భక్తుల మనోభావాలు చంద్రబాబుకు పట్టడం లేదు ● ఖనిజదోపిడీ కోసం విధ్వంసం సృష్టిస్తారా ● ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సాక్షి, మదనపల్లె/ తంబళ్లపల్లె: ఖనిజ సంపద దోపిడీ కోసం చంద్రబాబు సర్కార్ మల్లయ్యకొండల్లో చేపట్టిన మైనింగ్ నుంచి కొండలను రక్షించుకుందామని తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి భక్తులు, ప్రజలకు పిలుపునిచ్చారు. శనివారం ఆయన పెద్దమండ్యం సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కడప సుధాహరరెడ్డి, తంబళ్లపల్లె నియోజకవర్గానికి చెందిన భక్తులు, ప్రజలతో కలిసి సాధుకొండ అధిరోహణ కార్యక్రమాన్ని ప్రారంభించారు. తంబళ్లపల్లె మండలం బోరెడ్డివారికోట వద్ద ప్రారంభించి భక్తులతో కలిసి పాదయాత్ర నిర్వహించారు. అనంతరం భక్తులు అధిరోహణ కార్యక్రమం నిర్వహించారు. మల్లయ్యకొండల్లో ఖనిజ దోపిడీ కోసం పవిత్ర కొండల్లో విధ్వంసం సృష్టించేందుకు చంద్రబాబు మైనింగ్ అనుమతులు ఇచ్చారని ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి అన్నారు. ప్రకృతి అందాలకు, పురాతన ఆలయాలతో ఆధ్యాత్మిక నిలయమైన కొండలను అందరం ఏకమై కాపాడుకుందామని అన్నారు. భక్తుల అభిప్రాయాలు, వారి మనోభావాలను పరిగణలోకి తీసుకోకుండా చంద్రబాబు ఏకపక్షంగా ఉత్తర్వులు జారీ చేశారని విమర్శించారు. జగనన్న పాలనలో మల్లయ్య కొండ ఎంత అభివృద్ధి జరిగిందో భక్తులు కల్లారా చూస్తున్నారని అన్నారు. జగనన్న పాలనలో మైనింగ్ అన్నమాట లేకుండా భక్తుల మనోభావాలకు పెద్దపీట వేసిందని గుర్తు చేశారు. ఇప్పుడు ప్రభుత్వం దోపిడీ కోసం ఇలాంటి చర్యలకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. చంద్రబాబు సర్కార్ జారీ చేసిన మూడు మైనింగ్ ఉత్తర్వులను రద్దుచేసి, భవిష్యత్తులో మైనింగ్ ప్రస్తావన లేకుండా మల్లయ్య కొండలను నో మైనింగ్ జోన్ ప్రాంతంగా ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఈ చర్య ద్వారా చంద్రబాబు తన చిత్తశుద్ధిని నిరూపించుకోవాలని కోరారు. పర్యావరణ విధ్వంసమే మైనింగ్ తో చంద్రబాబు పర్యావరణ విధ్వంసానికి సిద్ధమయ్యారని సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కడప సుధాహరరెడ్డి విమర్శించారు. మైనింగ్ వల్ల గ్రామాలు ఖాళీ అవుతాయని, ఆరోగ్యంపై తీవ్ర ప్రభావం చూపుతుందని, వ్యవసాయం నాశనమవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి విధ్వంసం సృష్టించే మైనింగ్ చర్యలను అడ్డుకునేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ప్రభుత్వం జారీ చేసిన మూడు జీవోలను వెంటనే రద్దు చేయాలని డిమాండ్ చేశారు. అఖండ జ్యోతి వెలిగించి.. డమరుకం మోగిస్తూ సాధుకొండపైకి చేరుకున్న భక్తులు శనివారం రాత్రి అక్కడే బస చేశారు. ఈ సందర్భంగా సాధు మల్లేశ్వరస్వామి ఆలయం ఎదుట ఉన్న ధ్వజస్తంభంపై అఖండ జ్యోతిని వెలిగించారు. ఆలయం ఎదుట ధూపం వేసి హర హర మహాదేవ శంభో శంకర అని భక్తి పరవశంతో ఉచ్చరిస్తూ, డమరుకం మోగించారు. దేవుడా మైనింగ్ విధ్వంసం నుంచి నీ కొండలను నీవే కాపాడుకో అంటూ వేడుకున్నారు. వర్షాభావంతో ప్రజలు, రైతులు అల్లాడిపోతున్నారు నీ కృపతో పుష్కలంగా వర్షాలు కురిపించు అంటూ ప్రార్థించారు. బండరాళ్లపైనే నిద్ర తంబళ్లపల్లె, పెద్దమండ్యం మండలాల నుంచి సాధుకొండపైకి చేరిన భక్తులు శనివారం రాత్రి చిమ్మ చీకట్లో, బండరాళ్లపైనే సేద తీరుతూ నిద్రించారు. నీళ్లు, భోజనం భక్తులకు వడ్డించారు. పురాతన మహిమాన్విత సాధుమల్లేశ్వర స్వామి సన్నిధిలో భక్తులు మైనింగ్ వద్దంటూ పూజలు చేశారు. వీరితోపాటు 84 ఏళ్ల వయసులో చలాకీగా కొండెక్కిన సింగిల్ విండో మాజీ చైర్మన్, వైఎస్సార్ సీపీ నేత కడప సుధాహర రెడ్డి కోసం కొండపై భక్తులు ప్రత్యేకంగా టెంట్ ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాల్లో దేవరింటి రామకృష్ణారెడ్డి (పెదబాబు), దేవరింటి రవిశంకర్రెడ్డి (చినబాబు), కోటిరెడ్డి, రాజశేఖర్రెడ్డి, భాస్కర్రెడ్డి, కిశోర్కుమార్రెడ్డి, చౌడేశ్వర, చంద్రశేఖర్, కరీముల్లా, పద్మనాభరెడ్డి, చంద్రశే ఖర్, మల్లికార్జున, వేమారెడ్డి, రామశంకర్రెడ్డి, సురేంద్రనాధ్, రవిచంద్రారెడ్డి, కాలువపల్లె మధుసూదనరెడ్డి, రామ్మూర్తి, ప్రభాకర్రెడ్డి, గొర్ల మల్రెడ్డి, సుధాకర్రెడ్డి, భద్ర, రఘ, భక్తులు, ప్రజలు పాల్గొన్నారు. భక్తులతో కలిసి పాదయాత్ర చేస్తున్న ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాధరెడ్డి, సాధుకొండపైకి వెళ్తున్న భక్తులు -
చేతికి గింజ కూడా రాదు
నాలుగు ఎకరాల్లో వేరుశేనగ సాగు చేశా. విత్తనాలు, ఎరువులు, కూలీల ఖర్చులకు ఒకటిన్నర లక్ష ఖర్చయింది. వర్షాలు లేక చేతికి గింజ కూడా దక్కదు. పశువుల మేతకు కూడా దక్కని దయనీయ పరిస్థితి ఇప్పుడొచ్చింది. టమాటాకు ధరలేక పంట పోయింది. రైతులకు దెబ్బ మీద దెబ్బ పడుతోంది. తీవ్ర నష్టాలను భరించాల్సిన పరిస్థితి నెలకొంది. ప్రభుత్వం వెంటనే నష్టపరిహారం చెల్లించాలి. – కేశవరెడ్డి, వేరుశెనగ రైతు, ములకలచెరువు రూ.6 లక్షలు ఖర్చుపెట్టి మూడు ఎకరాల్లో టమాటా సాగు చేశా. పంట వేసిన తొలి రోజుల్లో ధర పలికింది. అప్పట్లకే బోరులో నీళ్లు తగ్గిపోయాయి. రీబోరు కూడా వేయించా. కొన్నాళ్లు నీళ్లు వచ్చి మళ్లీ నిలిచిపోయాయి. కళ్లముందే పచ్చని పంట వాడి ఎండిపోయింది. పెట్టిన పెట్టుబడిలో సగం కూడా రాలేదు. నష్టాలను భరించాల్సి వస్తోంది. ప్రభుత్వం నష్టపరిహారం చెల్లించాలి. – శివరామిరెడ్డి, టమాట రైతు, తంబళ్లపల్లి -
ట్రిపుల్ ఐటీలో నాలుగో విడత కౌన్సెలింగ్ పూర్తి
వేంపల్లె: ఇడుపులపాయ ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీలో నాలుగో విడత అడ్మిషన్ల కౌన్సెలింగ్ శనివారం విజయవంతంగా పూర్తయినట్లు క్యాంపస్ డైరెక్టర్ ప్రొఫెసర్ విజయ్ ప్రకాష్ తెలిపారు. ట్రిపుల్ ఐటీ క్యాంపస్లోని సెంట్రల్ లైబ్రరీలో మిగిలిపోయిన సీట్ల భర్తీ కోసం ఈ కౌన్సెలింగ్ నిర్వహించారు. ఆర్కే వ్యాలీ ట్రిపుల్ ఐటీ పరిధిలోని ఖాళీలకు 13 మంది, ఒంగోలు ట్రిపుల్ ఐటీ పరిధికి 142 మంది విద్యార్థులను కౌన్సెలింగ్కు పిలిచారు. వీరిలో ఆర్కే వ్యాలీకి సంబంధించి పిలిచిన 13 మంది విద్యార్థులూ హాజరై అడ్మిషన్లు పొందారు. ఒంగోలు ట్రిపుల్ ఐటీకి సంబంధించిన సీట్ల భర్తీ ప్రక్రియ ఇంకా కొనసాగుతోంది. ఆర్కే వ్యాలీలో అడ్మిషన్లు పొందిన విద్యార్థులకు వెనువెంటనే తరగతి గదులు, వసతి గృహాలను కేటాయించామని, వారు అప్పుడే క్లాసులకు కూడా హాజరవుతున్నారని డైరెక్టర్ వివరించారు. ఈ కార్యక్రమంలో ట్రిపుల్ ఐటీ పరిపాలనాధికారి డాక్టర్ పెనుకొండ రవికుమార్, డీన్ అకడమిక్స్ డి.రమేష్ కై లాష్, డీన్ స్టూడెంట్ వెల్ఫేర్ డాక్టర్ జి.వెంకటేష్, పీఆర్ఓ డాక్టర్ తిరుపతిరెడ్డి, అధ్యాపకులు, సిబ్బంది పాల్గొన్నారు. -
అభివృద్ధి ప్రణాళికలో జిల్లా కీలకం కావాలి
సాక్షి, మదనపల్లె: తిరుపతి ఆర్థిక ప్రాంత అభివృద్ధి ప్రణాళికలో అన్నమయ్య జిల్లా కీలకం అయ్యేలా కార్యాచరణ ప్రణాళికలను రూపొందించాలని పరిశ్రమలు, వాణిజ్యం (గనులు) శాఖ ముఖ్య కార్యదర్శి, తిరుపతి ఎకనామిక్ రీజన్ సీఈవో ముఖేష్ కుమార్ మీనా జిల్లా అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మతో కలిసి సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మీనా మాట్లాడుతూ స్వర్ణ ఆంధ్ర–2047 విజన్ అమలులో భాగంగా రాష్ట్రాన్ని విశాఖపట్నం, అమరావతి, తిరుపతి అనే మూడు ఆర్థిక ప్రాంతాలుగా ప్రభుత్వం విభజించిందని తెలిపారు. తిరుపతి ఆర్థిక ప్రాంతంలో తొమ్మిది జిల్లాలు ఉన్నాయని, అందులో అన్నమయ్య జిల్లా ఒకటన్నారు. 2047 నాటికి ఈ ప్రాంతాన్ని 0.9 ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా అభివృద్ధి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. భౌగోళికంగా జిల్లా బెంగళూరు, తిరుపతి నగరాలకు సమీపంలో అభివృద్ధి అవకాశాలు ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో పరిశ్రమలు, వ్యవసాయ ఆధారిత విలువవృద్ధి, పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, పర్యాటకం, పునరుత్పాదక ఇంధన రంగం, విద్యా–నైపుణ్యాభివృద్ధి రంగాల్లో ఉన్న అవకాశాలను గుర్తించి, వాటిని దీర్ఘకాలిక అభివృద్ధి ప్రణాళికల్లో చేర్చాలని సూచించారు. పరిశ్రమల స్థాపనకు అవసరమైన నీటి లభ్యత, విద్యుత్ సరఫరా, మౌలిక సదుపాయాల కల్పన వంటి అంశాలపై సమగ్ర ప్రణాళికతో ముందుకు వెళ్లాలని సూచించారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ మాట్లాడుతూ విజన్కు అనుగుణంగా జిల్లాను అన్ని రంగాల్లో వేగంగా అభివృద్ధి దిశగా తీసుకెళ్తున్నామని వివరించారు. శాఖల ద్వారా నియోజకవర్గాల వారీగా అమలు చేస్తున్న కార్యక్రమాలు, జిల్లాలో ఉన్న వనరులు, పెట్టుబడి అవకాశాలు, సామర్థ్యంపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. అక్రమ మద్యం నిర్మూలనకు చర్యలు చేపట్టండి మదనపల్లె టౌన్: జిల్లాలో అక్రమ మద్యం నిర్మూలన, బహిరంగ మద్యపాన నియంత్రణ, ఇతర రాష్ట్రాల నుంచి అక్రమంగా మద్యం రవాణాను అరికట్టేందుకు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, రెవెన్యూ (ఎకై ్సజ్), పరిశ్రమలు, వాణిజ్యం గనులశాఖ టిఈఆర్ విభాగం సీఈఓ ముఖేష్ కుమార్ మీనా అధికారులను ఆదేశించారు. శుక్రవారం మదనపల్లె జిల్లా కలెక్టరేట్లో జిల్లా ఎకై ్సజ్ శాఖ,మైనింగ్ శాఖ పనితీరుపై నిర్వహించిన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. జిల్లాలో ఐడీ లిక్కర్ కు సంబంధించిన నేరాలను గణనీయంగా తగ్గించేలా ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని సూచించారు. -
డీఎస్సీ అక్రమాలను నిగ్గు తేల్చాల్సిందే !
● సీబీఐతో విచారణ జరపాలి ● మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి సాక్షి, మదనపల్లె: అవినీతి, అక్రమాలు, నిరుద్యోగ అభ్యర్థులకు జరిగిన అన్యాయంపై నిజాలు నిగ్గు తేల్చేందుకు డీఎస్సీ–2026పై విచారణకు ఆదేశించాల్సిందేనని మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ పిలుపుమేరకు శుక్రవారం డీఎస్సీ అక్రమాలపై జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్ రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్లతో కలిసి కలెక్టరేట్ వచ్చారు. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మకు డీఎస్పీ అక్రమాలపై తీసుకోవాల్సిన చర్యలపై వినతిపత్రం అందజేశారు. తర్వాత ఆయనతో సమావేశమై డీఎస్సీ అక్రమాలు, వాటిపై జరగాల్సిన విచారణకు సంబంధించి వివరించారు. ఈ విషయమై చర్యలు తీసుకోవాలని కోరగా, ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తామని జాయింట్ కలెక్టర్ వారికి వివరించారు. అనంతరం పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మీడియాతో పలు విషయాలపై మాట్లాడారు. వాళ్లు పరీక్ష రాశారా లేదా 16 వేల పోస్టులతో నిర్వహించిన డీఎస్సీలో క్రీడా విభాగం కోటా కింద 450 మందికి ఉద్యోగాలు ఇచ్చామని చెబుతున్నారు, వీరు పరీక్షలు రాశారా, ఎలా ఎంపిక అయ్యారు అన్నది తెలియడం లేదు. ఈ విషయమై తమపార్టీ తరపున పోరాటాలు చేస్తుంటే ప్రభుత్వం అక్రమాలను కప్పిపుచ్చేందుకే ప్రయత్నిస్తోంది. సీబీఐ ద్వారా విచారణ జరిపి అక్రమాలను నిగ్గు తేల్చాలని కోరుతుంటే తప్పించుకుంటోందని అన్నారు. గత ప్రభుత్వంలో జగనన్న 1.25 లక్షల మంది యువతకు సచివాలయ ఉద్యోగాలు ఇస్తే ఒక చిన్న తప్పిదం లేకుండా పరీక్షల నిర్వహణ, నియామక ప్రక్రియ సాజావుగా సాగిందన్నారు. ఇప్పుడు కేవలం 16 వేల పోస్టులను పారదర్శకంగా భర్తీ చేయలేకపోయారని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు. ఇంగ్లీషు విద్య దూరం చేశారు జగనన్న పాలనలో ప్రతి పేద విద్యార్థి ఇంగ్లీషు మీడియం చదివి ఉన్నత స్థానాలకు చేరాలని ఉన్నత ఆశయంతో ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం ప్రారంభిస్తే కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులపై కక్షతో వేధిస్తోందని అన్నారు. తమ బిడ్డలు తప్ప పేదలు ఇంగ్లీషు విద్య చదవకూడదని పాఠశాలల్లో ఇంగ్లీషు మీడియం ఎత్తివేశారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆంగ్ల విద్య మీ బిడ్డలు చదివితే చాలని అనుకున్నారా అని కూటమి పాలకులను ఆయన ప్రశ్నించారు. వైద్యం ప్రైవేట్ పరం చేస్తారా దేశంలో, ఈ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి చేయని విధంగా జగనన్న ఏకకాలంలో 17 మెడికల్ కళాశాలను మంజూరు చేశారు. వీటి ద్వారా నిరుపేదలకు ఉచితంగా కార్పొరేట్ వైద్యం అందించాలని లక్ష్యంగా పెట్టుకున్నారు. అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం వైద్య కళాశాలలపై కాలకూట విషం కక్కుతోంది. వాటిని ప్రైవేట్ పరం చేయాలని నిరంతరం ప్రయత్నిస్తోంది. పేదల కోసం వైఎస్సార్సీపీ అడ్డుకుంటున్నప్పటికీ చంద్రబాబు ప్రైవేటీకరణ ప్రయత్నాలను ఆపడం లేదని అన్నారు. వీటి అసంపూర్తి పనులను తక్షణమే పూర్తి చేసి కళాశాలలను ప్రారంభించాలని పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ప్రభుత్వాన్ని కోరారు. 50 వేల ఉద్యోగాలు ఊడాయి జగనన్న పాలనలో ఎంఎస్ఎంఈలకు మహర్దశ కల్పించారు. వాటికి ప్రోత్సాహకాలు అందించారు. కూటమి ప్రభుత్వం రాకతో రాష్ట్రంలో 2,400 ఎంఎస్ఎంఈలు మూతపడ్డాయి. దీని ఫలితంగా 50 వేల మంది ఉద్యోగాలు కోల్పోయి వీధిన పడ్డారు. వారి జీవన భృతి కోల్పోయేలా చంద్రబాబు సర్కార్ పని చేసిందని విమర్శించారు. నిరుద్యోగులు, యువతకు 20 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు ఇప్పుడు 16 వేల అక్రమ నియామకాల డీఎస్సీ పోస్టులు ఇచ్చారని విమర్శించారు. కనీసం నిరుద్యోగ భృతి కూడా ఇవ్వడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రశ్నిస్తే పోలీసు పాలన ప్రభుత్వ పనితీరు, అవినీతి అక్రమాలను ఎవరు ప్రశ్నించిన పోలీసు పాలన రుచి చూపిస్తున్నారని ఆయన అన్నారు. ప్రశ్నించిన వారిపై కేసులు పెట్టి వేధిస్తున్నారని అన్నారు. ఇది ప్రభుత్వ పాలనగా లేదని పోలీసుల ద్వారా చంద్రబాబు పాలన సాగిస్తున్నారని విమర్శించారు. ఫలితంగా రాష్ట్రంలో కష్టతరమైన పరిస్థితులు నెలకొంటున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో పార్టీ పరిశీలకులు అనీషారెడ్డి, జింకా వెంకటా చలపతి, బాబ్జాన్, ఉదయకుమార్, సీనియర్ నాయకులు శ్రీనాథ్రెడ్డి, మున్సిపల్ మాజీ చైర్మన్ మనూజ, మాజీ వైస్ చైర్మన్ బిఏ.నూర్ ఆజం, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు శివప్రసాద్రెడ్డి, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మిద్దింటి కిశోర్, సంయుక్త కార్యదర్శి కిశోర్కుమార్రెడ్డి, మస్తాన్ఖాన్, హేమంత్, నాగరాజరెడ్డి, ఎస్ఏ.కరీముల్లా, మంజుల, శారదరెడ్డి, సుగుణ, కాలువపల్లె మధుసూదనరెడ్డి, ఇర్ఫాన్, శ్రీనివాసులు, ప్రసాద్, ఖాజా, ధనలక్ష్మి, నాగమణీ పాల్గొన్నారు. -
వైఎస్ ఆనందరెడ్డికి అంతిమ వీడ్కోలు
నివాళులర్పించిన మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కుటుంబ సభ్యులుపులివెందుల : వైఎస్ కుటుంబానికి అత్యంత ఆప్తుడిగా, దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డితో సుదీర్ఘకాలం అడుగులో అడుగువేసి నడిచిన వైఎస్ ఆనందరెడ్డి ఇకలేరనే వార్త తీవ్ర విషాదాన్ని నింపింది. ఆయన భౌతికకాయానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, తల్లి వైఎస్ విజయమ్మలు శుక్రవారం నివాళులర్పించారు. పుష్పాంజలి ఘటించి, కుటుంబ సభ్యులను పరామర్శించిన జగన్.. ఆనందరెడ్డి సేవలను స్మరించుకుంటూ ఆయన మరణం వైఎస్ కుటుంబానికి, పార్టీకి తీరని లోటని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్ ఆనంద్రెడ్డి భౌతిక కాయానికి వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రవీంద్రనాథరెడ్డి, బద్వేలు, రాజంపేట ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమరనాథరెడ్డి, ఎమ్మెల్సీలు రామచంద్రారెడ్డి, రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, డీసీ గోవిందరెడ్డి, టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, ఆర్టీసీ మాజీ చైర్మన్ దుగ్గాయపల్లె మల్లికార్జునరెడ్డి, అంబటి మురళి, పులివెందుల నియోజకవర్గంలోని వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు నివాళులర్పించారు. వైఎస్ ఆనంద్ రెడ్డి అంత్యక్రియలు శుక్రవారం సాయంత్రం జరిగాయి. ఆనందరెడ్డి భౌతిక కాయాన్ని వైఎస్సార్సీపీ నాయకులు, పార్టీ అభిమానులు సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు ఆనంద రెడ్డితో తమకు ఉన్న అనుబంధాలను గుర్తుకు తెచ్చుకున్నారు. పులివెందులలోని డిగ్రీ కాలేజీ రోడ్డులో గల వైఎస్ఆర్ సమాధుల తోటలో వైఎస్ కుటుంబీకుల సమక్షంలో ఆనందరెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. నివాళులర్పిస్తున్న వైఎస్ విజయమ్మ, వైఎస్ భారతిరెడ్డి నివాళులర్పిస్తున్న పి.రవీంద్రనాథ్రెడ్డి, అంజద్బాష, ఆకేపాటి అమర్నాథరెడ్డి, డాక్టర్ సుధ, డీసీ గోవిందరెడ్డి, రామసుబ్బారెడ్డి, రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్ -
శ్రీరెడ్డెమ్మతల్లికి వెండి వస్తువులు బహూకరణ
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయానికి రాయచోటికి చెందిన చింతం అభీషేక్, తేజస్విని దంపతులు వెండివస్తువులను బహూకరించారు. శుక్రవారం దాతలకు ఆలయ సంప్రదాయల ప్రకారం అర్చకులు, సిబ్బంది స్వాగతం పలికి అమ్మవారికి ప్రత్యేక పూజలు చేయించారు. అమ్మవారి శేషవస్త్రంతో వారిని సన్మానించారు. దాతలు ఒక కేజి బరువు గల వెండిజ్వాలా కిరీటం, శఠారీ, ప్రసాదం గిన్నె, కర్ణకవచాలను ఈవో మంజులకు అందజేశారు. అమ్మవారి సేవలకు వీటిని వినియోగించనున్నట్లు ఈవో పేర్కొన్నారు. నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యం పీలేరు : వినియోగదారులకు నాణ్యమైన విద్యుత్ సరఫరా చేయడమే లక్ష్యమని ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ శివశంకర్ అన్నారు. శుక్రవారం పీలేరు 33/11 కేవీ సబ్స్టేషన్ను సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ విద్యుత్ సరఫరా వ్యవస్థను మరింత బలోపేతం చేయడం తోపాటు వినియోగదారులకు నాణ్యమైన సేవలు అందించేందుకు చేపడుతున్న ఆర్డీఎస్ఎస్ పనులు వేగవంతం చేయాలని సిబ్బందిని ఆదేశించారు. విద్యుత్ బిల్లులు డిజిటల్ చెల్లింపులపై ప్రత్యేక దృష్టి సారించి వినియోగదారులకు అవగాహన కల్పించాలన్నారు. ఈ కార్యక్రమంలో పీలేరు ఈఈ వై. చంద్రశేఖర్రెడ్డి, అధికారులు శ్రీనివాసులురెడ్డి, అమీర్బాషా, శివయ్య తదితరులు పాల్గొన్నారు. -
కుష్టువ్యాధి రహిత సమాజానికి కృషి
కేవీపల్లె : కుష్టువ్యాధి రహిత సమాజ నిర్మాణానికి కృషి చేస్తామని జిల్లా లెప్రసీ అధికారిణి రాధిక అన్నారు. గురువారం మండలంలోని గ్యారంపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రాన్ని ఆమె ఆకస్మికంగా తనిఖీ చేశారు. లెప్రసీ కార్యక్రమాలకు సంబంధించి రికార్డులు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ కుష్టు వ్యాధి లక్షణాలు, వ్యాధి నిర్ధారణ, తీసుకోవాల్సిన చర్యలు, ప్రభుత్వ సేవలపై క్షేత్ర స్థాయిలో ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించారు. పీహెచ్సీ పరిధిలో లెప్రసీ కార్యక్రమాల అమలు, రోగులకు అందుతున్న సేవలు, పీహెచ్సీలో మందుల నిల్వ గూర్చి ఆరా తీశారు. వైద్యాధికారి డాక్టర్ హరి, పీహెచ్ఎన్ కృష్ణవేణి పాల్గొన్నారు. ఐఐటీకి నిరుపేద విద్యార్థిని బి.కొత్తకోట(పెద్దతిప్పసముద్రం): మండలంలోని సూరపువారిపల్లికి చెందిన టి.నవదీపిక అనే నిరుపేద యువతి ఐఐటీ వారణాసికి ఎంపికై ంది. యువతి తండ్రి రమేష్ రెవెన్యూ గ్రామ సహాయకుడిగా (వీఆర్ఏ) పని చేస్తుండగా, తల్లి ఆదిలక్ష్మి దినసరి కూలి పనులు చేస్తుంది. సదరు యువతి నామాలపల్లిలోని ప్రభుత్వ పాఠశాలలో ప్రాథమిక విద్య, మదనపల్లి గురుకులంలో హైస్కూల్ వరకు, విజయవాడలోని గురుకులంలో ఇంటర్ పూర్తి చేసింది. ఈ నేపథ్యంలో నవదీపికను ఉపాధ్యాయులు భాస్కర్రెడ్డి, జయచంద్రారెడ్డి, రెడ్డెప్పలు అభినందించారు. రెడ్డెమ్మకొండలో వరుణ యాగం గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మ కొండ ఆలయంలో వర్షాలు కురువాల కోరుకొంటూ ఆలయ పాలకమండలి సభ్యులు, అధికారులు వరుణ యాగం నిర్వహించారు. గురువారం ఉదయాన్నే ఆలయ మండపంలో శ్రీ మహాగణపతి పూజ నిర్వహించారు. మహాకలశస్థాపన కావించి శత కలశాభిషేకం నిర్వహించారు. వేదపండితుల మంత్రోచ్ఛారణల మధ్య వైభవంగా యాగం నిర్వహించారు. ఆలయ పరిసరాల్లోని అమ్మవారి పుష్కరణిలో ఉన్న మండపం వద్ద కలశాలను ఉంచి వరుణ జపం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. శతకలశాభిషేకం, మహపుర్ణాహుతి ఘనంగా నిర్వహించారు. అనంతరం ఆలయంలో భజన కళాకారులచేత పలు సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయకమిటీ ఛైర్మెన్ రాజన్న నా యుడు, ఆలయ ఈవో మంజుల పాల్గొన్నారు. నెట్వర్క్ ఆసుపత్రులున్నా రెఫర్ ఎందుకు చేస్తున్నారు మదనపల్లె టౌన్: జిల్లాలో రూ.111 కోట్ల నిధులు మంజూరైనప్పటికీ రోగులను ఇతర జిల్లాలకు రెఫర్ చేయడం, నిబంధనలకు విరుద్ధంగా సిజేరియన్లు కొనసాగించడంపై జిల్లా ఎన్టీఆర్ వైద్యసేవ కో–ఆర్డినేటర్ డాక్టర్ లోకవర్ధన్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. గురువారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన ఆయన రికార్డులను పరిశీలించి వైద్యులు, సూపరింటెండెంట్లను నిలదీశారు. జిల్లావ్యాప్తంగా 21 నెట్వర్క్ ఆసుపత్రులు ఉన్నాయని..ఇకపై అనవసర సిజేరియన్లు, ఇతర జిల్లాలకు రెఫర్లు చేయడం పునరావృతమైతే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. ఆసుపత్రి పరిస్థితిపై ఉన్నతాధికారులకు నివేదిక ఇస్తామన్నారు. ఇసుక డంప్ సాక్షి టాస్స్ఫోర్స్: పుంగనూరు నియోజకవర్గం సదుం మండల కేంద్రంలో వెటర్నరీ ఆసుపత్రి సమీపంలో చాలా రోజులుగా ఇసుకను డంప్ చే సి ఉంచారు. ట్రాక్టర్ల ద్వారా పగటి వేళల్లో ఇసు కను తెచ్చి రాత్రి పూట టిప్పర్ల ద్వారా అక్రమంగా ఇసుకను తరలిస్తున్నట్లు ఆరోపణలు వినిపిస్తున్నాయి. అధికారులు చర్యలు తీసుకుని అక్రమ రవాణా అరికట్టాలని పలువురు కోరుతున్నారు.


