మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత
కడప సెవెన్రోడ్స్ : ప్రపంచ మానవాళికి మాతృమూర్తి లూర్దుమాత అని నెల్లూరు పీఠం నూతన ఆధ్యాత్మిక సహ సారధి పిల్లి ఆంథోనిదాస్ తెలిపారు. కడప నగరంలోని మరియాపురంలో వెలసిన లూర్ధుమాత మహోత్సవాలు ఈ నెల 10,11 తేదీల్లో వైభవంగా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో సోమవారం పాత చర్చి ఆవరణలో ఆయన పతాకావిష్కరణ చేశారు. తొలుత బిషప్ను మరియాపురం పుర వీధుల గుండా ఊరేగింపు చేశారు. అనంతరం దివ్యబలి పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆధ్యాత్మిక సందేశమిచ్చారు. మానవుని ప్రతి పాపమునుంచి రక్షించ గల శక్తి ఏసుక్రీస్తుకు ఉందన్నారు. అలాంటి దేవునికి మానవులకు మధ్య వారధిగా లూర్దుమాత ఉందని చెప్పారు. నవదిన జపమాల కార్యక్రమాల్లో విశ్వాసులందరూ భక్తి శ్రద్ధలతో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో విచారణ గురువులు ఈరి మరియన్న , సహాయ గురువు జంపంగి సుధాకర్, వివిధ విచారణకు చెందిన ఫాదర్స్ సిప్రియన్,బి జ్వాన్నేష్, టి.ఫ్రాన్సిస్సేజేవియర్,లూర్ధురాజు,తిరుణాల కమిటీ చైర్మన్ గుంత మళ్ళ బాలయ్య ,ప్రధాన కార్యదర్శి వారాధి జోసెఫ్, ఎండీ అల్ఫోన్స్, నంది మండలం విజయరాజు, విశ్వాసులు, గ్రామ పెద్దలు పాల్గొన్నారు.


