breaking news
annamayya district Latest News
-
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
రాయచోటి: ప్రజల నుంచి సమస్యలను స్వీకరించి వాటిని పరిష్కరించేందుకు ఈనెల 21వ తేదిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటితోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. అర్జీదారులు తమ అర్జీలను సంబంధిత గ్రామ, మండల, డివిజన్లలో అధికారులకు ఇవ్వాలని ఆయన సూచించారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని తెలిపారు. జేఎన్టీయూ హాస్టల్ పరిశీలన కలికిరి: కలికిరి జేఎన్టీయూ ఇంజినీరింగ్ కళాశాల బాలికల హాస్టల్లో శనివారం ఉదయం విద్యార్థినుల అల్పాహారంలో బల్లి పడి ఘటనకు సంబంధించి స్పందించిన మండలంలోని మేడికుర్తి పీహెచ్సీ వైద్య సిబ్బంది ఆదివారం కళాశాలకు చేరుకుని బాలికల మెస్ను తనిఖీ చేశారు. అయితే బాలికల ప్లేటులో మాత్రమే బల్లి పడిందని, సాంబారులో పడలేదని మెస్ నిర్వాహకులు వారికి తెలిపారు. మెస్ గదులు, పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకోవాలని, ఎలాంటి అపరిశుభ్రతకు తావులేకుండా నిర్వహించాలని నిర్వాహకులను ఆదేశించారు. కార్యక్రమంలో హెల్త్ సూపర్వైజర్ సుధాకర్, హెచ్ఎ షఫీ, సిబ్బంది జగన్మోహన్, మాధవి, హాస్టల్ వార్డెన్ తదితరులు పాల్గొన్నారు. విద్యార్థులు పోటీతత్వాన్ని అలవరుచుకోవాలి రాజంపేట టౌన్: విద్యార్థులు ఆరోగ్యకరమైన పోటీతత్వాన్ని అలవరుచుకుంటే చదువులో రాణించగలరని ప్రేమ్చంద్ హిందీభవన్ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు ఎస్.సర్తాజ్ హుస్సేన్ తెలిపారు. ఈనెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్చంద్ జయంతిని పురస్కరించుకొని ఆదివారం స్థానిక బీవీఎన్ పాఠశాలలో విద్యార్థులకు ప్రేమ్చంద్కి జీవని అనే అంశంపై వ్యాసరచన పోటీలు నిర్వహించారు. ఈసందర్భంగా సర్తాజ్ హుస్సేన్ మాట్లాడారు. ప్రతి విద్యార్థి పోటీ పరీక్షల్లో పాల్గొనాలన్నారు. అప్పుడే తమలోని ప్రతిభ ఏమిటన్నది తెలుస్తుందన్నారు. వ్యాసరచన పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు ఈనెల 31వ తేదీ ప్రేమ్చంద్ జయంతి రోజున బహుమతులను ప్రధానం చేయనున్నట్లు తెలిపారు. ఈకార్యక్రమంలో హిందీ ఉపాధ్యాయులు చాంద్బాషా, రాజశేఖర్, సైరాభాను తదితరులు పాల్గొన్నారు. -
బాబు దుర్మార్గానికి పరాకాష్ట
కుట్రలు పన్ని ఎంపీ పెద్దిరెడ్డి మిథున్ రెడ్డిని అరెస్ట్ చేయించడం చంద్రబాబు నాయుడు దుర్మార్గానికి పరాకాష్ట. చంద్రబాబు నాయుడు వ్యవస్థలన్నింటినీ నాశనం చేస్తూ రాష్ట్రాన్ని అధోగతి పాలుచేస్తున్నాడు. రాష్ట్రంలో ఎప్పుడూ లేని విధంగా చంద్రబాబునాయుడు విష సంస్కృతికి తెరతీశాడు. ఇది ప్రజాస్వామ్యానికి ఏమాత్రం సరైనది కాదు. ఎంపీ గా ఉన్న మిథున్ రెడ్డికి మద్యం వ్యాపారంతో ఎలాంటి సంబంధం లేదు., అలాంటిది మద్యం స్కాం పేరిట అరెస్ట్ చేయడం రాజకీయ అరెస్ట్ అన్న విషయం తేటతెల్లం అవుతోంది. –ఆకేపాటి అమరనాథరెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు -
అక్రమ అరెస్టులు భయపెట్టలేవు
కూటమి ప్రభుత్వం వైయస్సార్సీపి నేత లను టార్గెట్ చేస్తూ పెడుతున్న అక్రమ కేసులు, అరెస్టులు భయపెట్టలేవు. నిగర్వి, ప్రజా సేవకుడైన మిథున్రెడ్డిపై లిక్కర్ స్కాం పేరుతో నిరాధారణమైన కేసులను బనాయించి అరెస్టు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నాం. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రమేష్కుమార్ రెడ్డి పైన కూడా రాజకీయ ఆరోపణలను పరిగణలోకి తీసుకొని లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్లో తప్పుడు కేసు నమోదైంది. పోలీసులు వెంటనే రమేష్రెడ్డిని అదుపులోకి తీసుకొని రాయచోటి నుంచి మదనపల్లికి తరలించడం రాజకీయ కక్షలో భాగమే. –శ్రీకాంత్ రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
లక్కిరెడ్డిపల్లెలో టెన్షన్..టెన్షన్..
లక్కిరెడ్డిపల్లి: లక్కిరెడ్డిపల్లి మండల కేంద్రంలో ఆదివారం సాయంత్రం టెన్షన్ వాతావరణం నెలకొంది. ఒక్కసారిగా టీడీపీ, వైఎస్సార్పీ శ్రేణులు మోహరించడంతో ఎప్పుడు ఏమి జరుగుతుందోనన్న భయం నెలకొంది. సీఎం చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే సమాచారంతో మంత్రి అనుచరులు రమేష్రెడ్డి ఇంటి పైన దాడికి వస్తున్నట్లు నియోజకవర్గ వ్యాప్తంగా సమాచారం వ్యాపించింది. దీంతో రామాపురం, లక్కిరెడ్డిపల్లె, గాలివీడు రాయచోటి మండలాల్లోని వైఎస్సార్సీపీ నాయకులు కార్యకర్తలు పెద్ద ఎత్తున లక్కిరెడ్డిపల్లి చేరుకున్నారు. ఇదే క్రమంలో మంత్రి సోదరుడు, స్థానిక టీడీపీ నేతలు రావిచెట్టు వైపు నుంచి భారీ వాహన కాన్వాయ్ తో చేరుకున్నారు. ఇరు వర్గాల మోహరించారన్న సమాచారాన్ని అందుకున్న పోలీసులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. సీఎం చంద్రబాబు, రవాణాశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డిపై రాజకీయ విమర్శలు చేశారనే నెపంతో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, హిందూపురం పార్లమెంట్ పరిశీలకులు మాజీ ఎమ్మెల్యే రెడ్డప్పగారి రమేష్ కుమార్ రెడ్డిపై లక్కిరెడ్డిపల్లె టీడీపీ నాయకుడు మదన్ మోహన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆదివారం కేసు నమోదు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి సీఐ వెంకట కొండారెడ్డి తెలియజేశారు. పోలీసుల వివరాల మేరకు చంద్రబాబు షూరిటీ మోసం గ్యారెంటీ అనే కార్యక్రమంలో భాగంగా చిన్నమండెం మండలంలో నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి రాంప్రసాద్ రెడ్డిలపై తప్పుగా మాట్లాడటంపై టీడీపీ నాయకులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. రమేష్ రెడ్డిపై అక్రమ కేసు బనాయించడంపై పలువురు వైఎస్సార్సీపీ నేతలు ఆగ్రహం వ్యక్తం చేశారు. రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగా కేసులు నమోదు చేయడం, భయబ్రాంతాలకు గురి చేయడం బాధాకరమని అన్నారు. మాజీ ఎమ్మెల్యే రమేష్ కుమార్ రెడ్డి ఇంటిపై టీడీపీ కార్యకర్తల దాడి ప్రచారంతో మోహరించిన ఇరువర్గాలు పోలీసుల అలర్ట్ -
ఉజ్వల భవితకు నవోదయం
మదనపల్లె సిటీ: ప్రతిభావంతులైన పేద విద్యార్థులకు ఉచిత భోజనం,వసతితో అత్యుత్తమ విద్యనందిస్తున్న జవహర నవోదయ విద్యాలయాల్లో అడ్మిష్లకు అవకాశం కల్పించారు. జిల్లాలో మదనపల్లె సమీపంలోని వలసల్లెవద్ద జవహర్ నవోదయ విద్యాలయ, రాజంపేటలోని నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ఈ పాఠశాలల్లో ప్రవేశానికి అర్హత సాధిస్తే 6 వ తరగతి నుంచి 12వ తరగతి వరకు ఉచితంగా విద్యాభ్యాసం కొనసాగించవచ్చు. విద్యార్థి జీవితంలో పాఠశాల విద్య చాలా కీలకమైంది. పట్టణ, గ్రామీణ ప్రాంత విద్యార్థులకు నవీన విద్యను అందించాలన్న ఉద్దేశంతో జవహర్ నవోదయ విద్యాలయాలను నెలకొల్పారు. 2026–27 విద్యా సంవత్సరానికి ఆరో తరగతిలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. ఈనెల 29వతేదీతో గడువు ముగియనుంది. అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. దరఖాస్తులు ఇలా... ● జవహర్ నవోదయ విద్యాలయాలకు విద్యార్థులు www.cbseitems.rcl.gov.in/nvs అనే వెబ్సైట్లో దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకునే విద్యార్థులు మదనపల్లె నవోదయకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట నవోదయకు ఉమ్మడి కడప జిల్లాకు చెందిన వారై ఉండాలి. ● ప్రవేశపరీక్ష రాయబోయే విద్యార్థి ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలలో ఐదో తరగతి చదువుతూ ఉండాలి. ● మదనపల్లె నవోదయ పాఠశాలకు ఉమ్మడి చిత్తూరు జిల్లా, రాజంపేట నవోదయ పాఠశాలకు ఉమ్మడి కడప జిల్లా ప్రాతిపదికన అడ్మిషన్లను పరిగణలోకి తీసుకుంటారు. ఇవీ సౌకర్యాలు: సువిశాలమైన పాఠశాల ప్రాంగణం, శాశ్వత తరగతి గదులు, డిజిటల్ పాఠాలకు ప్రత్యేక ఏర్పాట్లు, ఆధునాతన కంప్యూటర్ ల్యాబ్, బాల,బాలికలకు విడివిడిగా వసతి గృహాలు, ఉదయం యోగా, వ్యాయామం సాధన, కూచిపూడి, యోగా, చిత్రలేఖనం, సంగీతం, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస స్కౌట్స్ అండ్ గైడ్స్ ,పలు క్రీడల్లో శిక్షణ ఇస్తారు. పాఠ్యాంశాలతో పాటూ విజ్ఞానాన్ని పెంపొందించే ఎన్నో పుస్తకాలతో కూడిన గ్రంథాలయం, పూర్తిగా సీసీ కెమెరాల పర్యవేక్షణ ఉంటుంది. పరీక్ష ఇలా.... పరీక్ష రకం ప్రశ్నల మార్కులు సమయం సంఖ్య (నిమిషాలు) రిజర్వేషన్లు ఇలా... ఎస్సీలకు 15 శాతం ఎస్టీలకు 7.5 శాతం దివ్యాంగులు 3 శాతం బాలికలు 33 శాతం దరఖాస్తులకు అవకాశం ఈనెల 29న చివరి గడువు సద్వినియోగం చేసుకోవాలంటున్న అధికారులు మేథాశక్తి 40 50 60 అంకగణితం 20 25 30 భాషా పరీక్ష 20 25 30 ప్రతిభ ఽఆధారంగానే ప్రవేశాలు నవోదయ పాఠశాలలో అడ్మిషన్లు పూర్తిగా ప్రతిభ ఆధారంగానే జరుగుతాయి. ఎలాంటి సిఫార్సులకు తావుండదు. తల్లిదండ్రులు, విద్యార్థులు అపోహలకు లోనవ్వకుండా అప్రమత్తతతో ఉండాలి. పరీక్ష విధానం, ఎంపిక ప్రక్రియ మొత్తం పాదర్శకంగా ఉంటుంది. ప్రవేశం పొందే విద్యార్థులు 6వ తరగతి నుంచి 12వతరగతి వరకు ఎలాంటి ఖర్చు లేకుండా విద్యాభ్యాసం సాగించవచ్చు. దరఖాస్తులు గడువులోగా పూర్తి చేసి సద్వినియోగం చేసుకోవాలి. –గీత, ప్రిన్సిపాల్, జవహర్ నవోదయ విద్యాలయ, మదనపల్లె -
జర్నలిజం కోర్సులో నేరుగా ప్రవేశాలు
కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లమో కోర్సులలో ప్రవేశానికి ఈ నెల 21 నుంచి 31 తేదీ వరకు నేరుగా ప్రవేశాల కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్లు యోగి వేమన విశ్వవిద్యాలయం ప్రవేశాల సంచాలకులు డాక్టర్ టి. లక్షీప్రసాద్ తెలిపారు.జర్నలిజం శాఖ ఆధ్వర్వంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ పబ్లిక్ రిలేషన్ (పీజీడీపీఆర్), పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ తెలుగు జర్నలిజం (పీజీడీటీజే), ఫైన్ ఆర్ట్స్ శాఖ ఆధ్వర్యంలో పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిప్లమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ కోర్సులకు ప్రవేశాల కౌన్సెలింగ్ జరగనుందని తెలిపారు. పీజీ డిప్లొమా కోర్సులలో ప్రవేశానికి ఏదేని డిగ్రీ ఉత్తర్ణీత సాధించినవారు అర్హులని చెప్పారు. కౌన్సిలింగ్’కు అభ్యర్థులు అన్ని రకాల అర్హత పత్రాలతో నేరుగా విశ్వవిద్యాలయంలో హాజరు కావాలని సూచించారు. వివరాలకు యోగి వేమన విశ్వవిద్యాలయం www.yvu. edu.in ను సందర్శించాలని ఆయన సూచించారు. -
కొనసాగుతున్న మున్సిపల్ కార్మికుల సమ్మె
రాజంపేట : తమ సమస్యలు రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించడంలేదంటూ మున్సిపాలిటి కార్మికులు చేపట్టిన నిరసన ఆదివారం ఐదవ రోజుకు చేరింది. ఈ సందర్భంగా నిరసనకారులు మాట్లాడుతూ టీడీపీ అధికారంలోకి వస్తే తమ తలరాతలు మారుతాయని ఆశించామన్నారు. ఇప్పుడు ఆ ప్రభుత్వం నిట్టనిలువునా తమ పొట్టలు కొడుతోందన్నారు. సీఐటీయూ జిల్లా నేత చిట్వేలి రవికుమార్, కార్మిక నేతలు పీవీరమణ, లక్ష్మీదేవి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రాయచోటి టౌన్ : రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఎదుట జరిగిన నిరసనలో సీఐటియూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఏ. రామాంజనేయులు మాట్లాడుతూ ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు తమకు అమలు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు బీవీ రమణ, జిల్లా కోశాధికారి సి. రాంబాబు తదితరులు పాల్గొన్నారు. వడ్డీ రహిత రుణాలే అమానత్ బ్యాంక్ లక్ష్యం కడప వైఎస్ఆర్ సర్కిల్ : నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేయడమే అమానత్ బ్యాంక్ ముఖ్య ఉద్దేశమని ఆల్ ఇండియా ఇస్లామిక్ ఫైనాన్స్ కార్యదర్శి జనాబ్ అబ్దుల్ రఖీబ్ తెలిపారు. ఆదివారం కడప నగరంలో అమానత్ మ్యూచువల్ కోఆపరేటివ్ క్రెడిట్ సొసైటీ మూడో వార్షికోత్సవం జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సమాజంలో ఉన్న నిరుపేదలకు వడ్డీ రహిత రుణాలు అందజేసి వారు ఆర్థికంగా కుదుటపడేందుకు, వ్యాపారాలు వృద్ధి చేసుకునేందుకు ఈ బ్యాంకు కృషి చేస్తుందన్నారు. 2019లో నాటి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దృష్టికి ఇస్లామిక్ బ్యాంక్ ఆవశ్యకతను తీసుకెళ్లామన్నారు. ఆయన స్పందించి ఆనాటి మేనిఫెస్టోలో ఇస్లామిక్ బ్యాంకు ఏర్పాటు చేసేందుకు అంగీకారం తెలిపారన్నారు. ప్రస్తుతం టీడీపీ ప్రభుత్వమే అధికారంలో ఉండటంతో ఇస్లామిక్ బ్యాంక్ ఏర్పాటు విషయాన్ని ఆలోచించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ముతీకుర్రహ్మాన్, సంఘ సేవకులు సల్లావుద్దీన్, కడప ఇస్లామిక్ సొసైటీ అధ్యక్షుడు డాక్టర్ ముక్తార్ అహ్మద్ తదితరులు పాల్గొన్నారు. -
జిల్లా ఎస్పీతో ప్రాణాలకు ముప్పు
మదనపల్లె రూరల్ : బుద్ధ విగ్రహాన్ని ధ్వంసం చేసి, తలను వేరుచేసిన ఉన్మాదుల్ని పట్టుకోవడంలో ఘోరంగా విఫలమైన జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు, కేసును తప్పుదోవ పట్టించేందుకు తమపై తీవ్ర వేధింపులకు పాల్పడుతున్నారని భారతీయ అంబేద్కర్ సేన(బాస్) వ్యవస్థాపక అధ్యక్షుడు పీటీయం.శివప్రసాద్ ఆవేదన వ్యక్తం చేశారు. గుండె జబ్బుతో బాధపడుతూ, చికిత్స పొందుతున్న తనపై తప్పుడు కేసులు బనాయించి, తీవ్ర మనోవేదనకు గురిచేస్తున్నారని, ఎస్పీ వేధింపులతో తన ప్రాణానికి హాని కలిగే అవకాశం ఉందని, అదే జరిగితే దానికి ఆయనే పూర్తి బాధ్యత వహించాల్సి ఉంటుందన్నారు. బుద్ధ విగ్రహం ధ్వంసం జరిగి 20 రోజులవుతున్నా, ఇప్పటికీ ఉన్మాదులను పట్టుకోకపోగా, నిరసన తెలుపుతున్న దళిత నేతలపై తప్పుడు కేసులు నమోదు చేస్తున్నారన్నారు. శనివారం రాత్రి పోలీసులు తమ ఇంటికి వచ్చి, తలుపునకు మూడు నోటీసులు అతికించి వెళ్లారన్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఈ విషయంలో జోక్యం చేసుకుని బుద్ధ విగ్రహం ధ్వంసం చేసిన ఉన్మాదులను పట్టుకుని కఠినంగా శిక్షించాలన్నారు. దళితుడైన తనను తీవ్ర వేధింపులకు, అవమానాలకు గురిచేస్తూ, ప్రాణాపాయ స్థితిలోకి వెళ్లేలా చేసిన జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడుపై కేసు నమోదుకు ఆదేశించాలని విజ్ఞప్తి చేశారు. బాస్ వ్యవస్థాపకుడు పీటీయం.శివప్రసాద్ -
రాష్ట్రంలో అరాచకపాలన రాజ్యమేలుతోంది
వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి కడప కార్పొరేషన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి అరాచకపాలన సాగుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం కార్యదర్శి ఏకుల రాజేశ్వరి రెడ్డి విమర్శించారు. ఆదివారం వైఎస్సార్ జిల్లా కేంద్రం కడపలో విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై తప్పుడు కేసులు పెట్టడమే పరమావధిగా పెట్టుకొని ఈ ప్రభుత్వం పాలన సాగిస్తోందన్నారు. ప్రతిపక్ష నేతలపై తప్పుడు కేసులు నమోదు చేసి జైలుకు పంపి ఆనందించడం వారికి పరిపాటిగా మారిందన్నారు. లేని మద్యం కేసును సృష్టించి, తప్పుడు విచారణలు చేస్తూ రాజంపేట పార్లమెంట్ సభ్యుడు మిథున్రెడ్డిని అరెస్ట్ చేయడం దారుణమన్నారు. ఇలా విపక్ష నేతలపై కేసులు పెట్టుకుంటూ పోతే దానికి అంతే ఉండదన్నారు. రాబోవు రోజుల్లో వారు కూడా ఇదే పరిస్థితిని ఎదుర్కోక తప్పదన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వానికి అత్యధిక మెజార్టీతో గెలిపిస్తే వారు ప్రజా సేవ చేయకుండా, సంక్షేమ పథకాలు అమలు చేయకుండా ప్రతిపక్ష పార్టీలపై తప్పుడు కేసులతో వేధించడం అన్యాయమన్నారు. ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చకపోవడంతో ప్రజల్లో వ్యతిరేకత వస్తోందన్నారు. దాన్నుంచి ప్రజల దృష్టి మరల్చేందుకు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ వేధింపులు భరించలేక, వారు చెప్పినట్లు అక్రమాలు చేయలేక నిజాయితీ కలిగిన ఐఏఎస్, ఐపీఎస్ అధికారులు స్వచ్ఛందంగా రిటైర్మెంట్ ప్రకటించడం ప్రభుత్వ వైఫల్యానికి నిదర్శనమన్నారు. అక్రమ అరెస్ట్లతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను భయపెట్టలేరన్నారు. ఈ ప్రభుత్వానికి ప్రజలే తగిన గుణపాఠం చెబుతారని హెచ్చరించారు. -
స్టాపింగ్ కోసం నిరీక్షణ !
ఓబులవారిపల్లె : మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ రైళ్లు స్టాపింగ్ ఎత్తివేసి దాదాపు ఐదు నెలలు అయింది. రైల్వే అధికారులు కాని నాయకులు కాని స్టాపింగ్ పునరుద్ధరించేందుకు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గ్రామాల ప్రజలు విమర్శిస్తున్నారు. బ్రిటీష్ కాలం నాటి రైల్వే చరిత్ర కలిగిన ఓబులవారిపల్లె రైల్వే పరంగా జంక్షన్ కాక ముందు నుంచి దశాబ్దాలుగా పలు ఎక్స్ప్రెస్ రైళ్లకు ఇక్కడ స్టాపింగ్ ఉండేది. ఇక్కడి నుండి చె విలువైన కలపను చైన్నెకి రవాణా చేస్తుండేవారు. అప్పట్లో ఎలకంటి సుబ్బయ్య శ్రేష్టి అనే సామాన్య వ్యక్తి రైల్వేశాఖ అధికారులతో పోరాడి పలు ఎక్స్ప్రెస్ రైళ్ల నిలుపుదల చేయించారు. అప్పటి నుంని నిరంతరాయంగా రాయలసీమ, జయంతి జనతా ఎక్స్ప్రెస్ రైళ్లు ఇక్కడ ఆగేవి. కాలక్రమేణా వెంకటాద్రి, రాయలసీమ, హరిప్రియ ఎక్స్ప్రెస్లు ఆగేవి. టీడీపీ రైల్వేకోడూరు ఇన్చార్జి, రైల్వేకొడూరు ఎమ్మెల్యే, జనసేన పార్టీ, బీజేపీ జాతీయ స్థాయి నాయకులు మండల కేంద్రానికి చెందిన వారే. అయినా ఐదు నెలలుగా ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ తొలగించినా వారు ఏమీ పట్టించుకోవడం లేదని ప్రజలు విమర్శిస్తున్నారు. పట్టించుకోని రైల్వే శాఖ.. మండలం నుంచి చిట్వేలి, రాపూరు, వెంకటాచలం మీదుగా రైలుమార్గం ఏర్పాటు చేయడంతో ఓబులవారిపల్లె జంక్షన్ అయింది. రైల్వేపరంగా అభివృద్ధి చెందుతుందని నియోజకవర్గ ప్రజలు ఎంతో ఆశతో ఎదురు చూశారు. అభివృద్ధి మాట దేవుడెరుగు ఉన్న ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ కూడా ఎత్తివేయడంపై ప్రజలు మండిపడుతున్నారు. ఈ మార్గంలో నంద్యాల మీదుగా గుంటూరుకు, రేణిగుంట మీదుగా కన్యాకుమారి, చైన్నె, విశాఖపట్టణానికి రైళ్లు నిత్యం ప్రయాణిస్తున్నాయి. అయితే చాలా ఎక్స్ప్రెస్ రైళ్లు రేణిగుంట, కడపలో గంటల తరబడి నిలబడుతున్నాయి. అలాంటి ఎక్స్ప్రెస్లకు రెండు నిమిషాల పాటు ఓబులవారిపల్లెలో హాల్టింగ్ కల్పిస్తే రైల్వే శాఖకు ఎలాంటి నష్టం ఉండదు. కడప నుండి హరిప్రియ ఎక్స్ప్రెస్ ఉదయం 4.45 నిమిషాలకు బయలుదేరి నందలూరుకు 5.10కి చేరుకుంటుంది. అక్కడ 20 నిమిషాల పాటు ఉంటుంది. రేణిగుంట నుండి తిరుమల ఎక్స్ప్రెస్ ఆపై గుంతకల్లుకు వెళ్లే రైలు రేణిగుంటలో 4.58కి బయలుదేరి కడపకు 7 గంటలకు చేరుకుంటుంది. అక్కడ 45 నిమిషాలు హాల్టింగ్ అనంతరం గుంతకల్లుకు బయలుదేరుతుంది. అదేవిధంగా గుంటూరు ఎక్స్ప్రెస్ రెండు రైళ్లు నంద్యాల రైల్వేస్టేషన్లో గంటకు పైగా ప్రతి రోజు నిలబడుతున్నాయి. ఇలా ఇంకా చాలా ఎక్స్ప్రెస్లు ఉన్నాయి. వాటికి రెండు నిమిషాలు హాల్టింగ్ కల్పిస్తే రైల్వేశాఖకు నష్టం లేదకపోగా ఇంకా ఆదాయం పెరుగుతుందని స్థానికులు పేర్కొంటున్నారు. ఓబులవారిపల్లె జంక్షన్గా మారి ఐదేళ్లయినా కనీసం బోర్డులో కూడా జంక్షన్ అని పేరు మార్చలేదంటే అధికారులు ఎంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారో అర్థమవుతోంది. ప్రయాణికుల అగచాట్లు మండలంలో ప్రపంచ ప్రఖ్యాతిగాంచిన మంగంపేట బైరెటీస్ గనులు ఉన్నాయి. ఇక్కడి నుంచి ఖనిజం విదేశాలకు ఎగుమతులు జరుగుతుంటాయి. ఏపీఎండీసీ మంగంపేట కార్యాలయంతో పాటు దాదాపు 150 పల్వరైజింగ్ మిల్లులు, చిన్న పరిశ్రమలు ఉన్నాయి. చాలామంది వ్యాపారులు రాకపోకలు సాగిస్తుంటారు. అంతే కాకుండా బొప్పాయి, అరటి, తమలపాకు, మామిడి తదితర పంటలను రైతులు సాగుబడి చేస్తుంటారు. వారు చైన్నె, ముంబై తదితర నగరాలకు నిత్యం వెళ్లాల్సి ఉంటుంది. నగరాలలో చదువుల కోనం, ఉద్యోగులు తమ విధుల కోసం రాకపోకలు సాగిస్తుంటారు. ఎక్స్ప్రెస్ రైళ్ల స్టాపింగ్ తొలగించడంతో వారంతా రైల్వేకోడూరు, రాజంపేటకు వెళ్లాల్సి వస్తోంది. ఇప్పటికై నా నియోజకవర్గంలోని వివిధ పార్టీల నాయకులు స్పందించి మండల కేంద్రంలో ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ సౌకర్యం కల్పించాలని ప్రజలు కోరుతున్నారు. ఓబులవారిపల్లె జంక్షన్పై రైల్వేశాఖ శీతకన్ను ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ ఎత్తేయడంతో అవస్థలు జాతీయ స్థాయి నాయకులున్నా ఫలితం శూన్యం ఎంపీ చొరవతో గతంలో స్టాపింగ్ కోవిడ్ అనంతరం స్టాపింగ్లు ఎత్తి వేశారు. రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి చొరవతో రైల్వే మంత్రిని కలిసి రెండు సార్లు ఎక్స్ప్రెస్ రైళ్లకు స్టాపింగ్ కల్పించారు. ఈ విషయంపై ఎంపీ ఇప్పుడు కూడా దిల్లీలో రైల్వే శాఖ అధికారులకు వినతిపత్రం అందజేశారు. బీజేపీ నాయకులు, రైల్వేశాఖ అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. – తల్లెం భరత్ కుమార్రెడ్డి, డీఆర్యూసీసీ మెంబర్, ఓబులవారిపల్లె. ఎక్స్ప్రెస్లకు స్టాపింగ్ కల్పించాలి ఐదు నెలలుగా ఎక్స్ప్రెస్ రైళ్లు నిలబడటం లేదు. దీంతో చాలా ఇబ్బందిగా ఉంది. ఆసుపత్రులకు తిరుపతికి, హైదరాబాదుకు వెళ్లలన్నా రైళ్లు చాలా అనుకూలంగా ఉండేవి. దూర ప్రాంతాలకు బస్సుల్లో ప్రయాణాలు సాగించలేము. ఇప్పటికై నా నాయకులు స్పందించాలి. – ఆర్. వెంకటేష్, రైతు, వై.కోట, ఓబులవారిపల్లె. -
మా పార్టీ వారే నాపై దాడి చేశారు
రాయచోటి : తెలుగుదేశం పార్టీకి చెందిన మా వాళ్లే తన పైన దాడి చేసి తీవ్రంగా గాయపరచారంటూ టీడీపీ బీసీ నేత రెడ్డి వరప్రసాద్ తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. రాయచోటి పట్టణం, కొత్తపేటలోని వినాయక వీధి సమీపంలోని సంజీవిని మెడికల్ స్టోర్లో ఉన్న రెడ్డి వరప్రసాద్ తనపై కొంతమంది తెలుగుదేశం పార్టీవారు ఆదివారం సాయంత్రం దాడికి తెగబడినట్లు మీడియా ముందు తెలిపారు. మెడికల్ స్టోర్లో ఉన్న తనను చితకబాది అక్కడున్న వీడియో పుటేజ్లను రికార్డింగ్ హార్డ్ డిస్క్ను తీసుకెళ్లిపోయారన్నారు. తాను 30 సంవత్సరాలుగా టీడీపీ కోసం పనిచేస్తున్నానని, స్థానికంగా ఉన్న నాయకులు టీడీపీ అధికారంలోకి వచ్చాక పక్క పార్టీ వారి దగ్గర డబ్బులు తీసుకొని పనులు కేటాయించడంపై తాను ప్రశ్నించానన్నారు. తాను ఒక బీసీ కులానికి చెందిన వ్యక్తినని, ఎస్సీ మహిళను వివాహం చేసుకొని మెడికల్ స్టోర్ నడుపుకుంటూ పార్టీ కోసం పనిచేస్తున్నానన్నారు. తమ పార్టీకి చెందిన కొంతమంది పనిగట్టుకొని తనపై సోషల్ మీడియా వేదికగా పోస్టులు పెట్టడం, బెదిరించడం చేశారన్నారు. తీవ్రంగా గాయపరిచిన వారిపై పోలీసులు కేసు నమోదు చేసి తనకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేశారు. తీవ్రంగా గాయపడిన రెడ్డి వరప్రసాద్కు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. టీడీపీ బీసీ నేత రెడ్డి వరప్రసాద్ -
సిమెంట్ రోడ్డు ధ్వంసం చేసిన ఘటనలో టీడీపీ నాయకులపై కేసు
చాపాడు : మండల పరిధిలోని తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లే సిమెంట్ రోడ్డు ధ్వంసం ఘటనపై పడమర అనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నాయకులైన నందిమండలం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు బాల సుబ్బారెడ్డి పై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్న పెద్దయ్య తెలిపారు. తిప్పిరెడ్డిపల్లె దళితవాడకు వెళ్లేదారిలో ఐదేళ్ల క్రితం ప్రభుత్వ నిధులతో సిమెంట్ రోడ్డు నిర్మించారని, ఈ స్థలం తమదని శనివారం మల్లికార్జునరెడ్డి, ఆయన సోదరుడు రోడ్డును తొలగించడంపై అక్కడి దళితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైంది – ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి కడప ఎడ్యుకేషన్ : వృత్తులో కెల్లా నర్సింగ్ వృత్తి ఎంతో పవిత్రమైందని ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి పేర్కొన్నారు. ఆదివారం కడప సాయికృప నర్సింగ్ కళాశాలలో జ్యోతి ప్రజ్వలన, ప్రమాణ స్వీకార కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్సీ మాట్లాడుతూ కరోనా సమయంలో డాక్టర్లు, నర్సులు చేసిన సేవలు వెలకట్టలేనివని కొనియాడారు. సాయిబాబా విద్యాసంస్థల సీఈఓ ఎంవీ శ్రీదేవి మాట్లాడుతూ విద్యార్థులు ఒక లక్ష్యం పెట్టుకుని చదవాలని కోరారు. ప్రజలకు సేవచేయడానికి నర్సింగ్ వృత్తి దోహదపడుతుందన్నారు. కళాశాల ప్రిన్సిపాల్ విద్యావతి మాట్లాడుతూ సాయికృప నర్సింగ్ కళాశాలలో అనేక రాష్ట్రాలకు చెందిన విద్యార్థులు చదువుకుంటున్నారన్నారు. అనంతరం ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో లయన్ నర్సింగ్ సూపరింటెండెంట్లు రమణమ్మ, కాంతమ్మతోపాటు విద్యార్థులు పాల్గొన్నారు. చింతచెట్లు అక్రమంగా నరికివేత గుర్రంకొండ : మండలంలోని టి.రాచపల్లె పంచాయతీలో చింతచెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారు. గత కొన్ని రోజులుగా గ్రామంలోని టి.రాచపల్లె కస్పా, ఎగువ బురుజుపల్లె, దిగువ బురుజుపల్లె గ్రామాల్లో 25 చింతచెట్లను అక్రమంగా నరికివేశారు. తమిళనాడుకు చెందిన కొంతమంది వ్యాపారులు ప్రభుత్వ భూముల్లోనూ, దేవుడి మాన్యం భూములు, వంక పోరంబోకు భూముల్లో అక్రమంగా చింతచెట్లను నరికి వేసి వారి రాష్ట్రాలకు లారీల్లో తరలించుకుపోతున్నారు. రెవెన్యూ, అటవీశాఖకు చెందిన అధికారుల అనుమతి లేకుండా ఇష్టానుసారం చెట్లను నరికివేసి తరలించేస్తున్నారు. చింతచెట్ల నరికివేతపై రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేసినట్లు గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై ఆర్ఐ సదాశివను వివరణ కోరగా గ్రామస్తులు ఫిర్యాదు చేసిన విషయం వాస్తవమన్నారు. వీఆర్ఓను పంపించి ఉన్న కట్టెలను తరలించకుండా సీజ్ చేశామన్నారు. అక్రమార్కులపై కేసులు నమోదు చేస్తామన్నారు. కొండయ్యగారిపల్లెలో చోరీ నిమ్మనపల్లె : మండలంలోని కొండయ్యగారిపల్లెలో చోరీ జరిగింది. గుర్తుతెలియని వ్యక్తులు సుమారు 50 గ్రాముల బంగారు ఆభరణాలు చోరీ చేశారు. ఘటనపై బాధితుడు పురుషోత్తం రెడ్డి ఆదివారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పురుషోత్తం రెడ్డి కుటుంబంతో పాటు వ్యక్తిగత పనులపై బయట ప్రాంతానికి వెళ్లాడు. శనివారం రాత్రి ఇంటికి తిరిగి రాగా తలుపులు పగలగొట్టి ఉండడంతో, లోపలికి వెళ్లి పరిశీలించారు. బీరువాను గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేసి అందులోని 49 గ్రాముల బరువు గల బంగారు చైన్ అపహరించుకుని వెళ్లినట్లు గుర్తించారు. చైన్ విలువ సుమారు రూ.1.5 లక్షలు ఉంటుందని ఫిర్యాదులో పేర్కొన్నారు. రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ ఆదివారం బాధితుని ఇంటికి వెళ్లి చోరీకి సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు. ఇంటిని పరిశీలించారు. బాధితుని ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ఎస్ఐ తిప్పేస్వామి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మహిళ మెడలో గొలుసు లాక్కెళ్లారు ఒంటిమిట్ట : మండలంలో మంటపంపల్లి గ్రామంలోని కడప–చైన్నె జాతీయ రహదారిౖపై ఈనెల 18న శుక్రవారం సాయంత్రం మహిళ మెడలోని గొలుసును గుర్తు తెలియని దుండగులు లాక్కెళ్లారు. ఆదివారం బాధితురాలి ఫిర్యాదు మేరకు ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. మహాత్మాగాంధీ జ్యోతీబాయి పూలే గురుకుల పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తున్న మంటపంపల్లెకు చెందిన చింతల రాజ్యలక్ష్మీ(42) మంటపంపల్లె జాతీయ రహదారిౖ పక్కనే ఉన్న సెల్ టవర్ వద్దకు రాగానే గుర్తు తెలియని దుండగులు ద్విచక్రవాహనంపై వచ్చి ఆమె మెడలోని 30.5 గ్రాముల బంగారు గొలుసును లాక్కెళ్లారు. ఈ ఘటనలో గాయపడిన ఆమె నందలూరు ప్రభుత్వ అసుపత్రిలో చికిత్స పొంది, ఆదివారం ఒంటిమిట్ట పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి విచారిస్తున్నారు. -
వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనలో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పురిటి బిడ్డ చనిపోయాడని.. పెద్దమండ్యం మండలం శివపురం గ్రామానికి చెందిన ప్రభుదేవా భార్య డి.లతమ్మ (25)కు ముగ్గురు సంతానం ఉన్నారు. అయితే ఇటీవల కాన్పులో ఆమెకు ఇద్దరు మగ పిల్లలు కవలలుగా జన్మించారు. అందులో ఒక బిడ్డ అనారోగ్యం పాలై మృతి చెందాడు. ఈ విషయాన్ని జీర్ణించుకోలేని లతమ్మ మనస్తాపం చెంది ఆదివారం ఇంటివద్ద పురుగు మందు తాగింది. గమనించిన కుటుంబ సభ్యులు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. భార్య కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోయిందని.. భార్య తనపై కేసు పెట్టి పుట్టింటికి వెళ్లిపోవడాన్ని భరించలేక భర్త ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కురబలకోట మండలం తిట్టు పంచాయతీ లక్కినేనిపల్లెకు చెందిన అమర్నాథ్ కుమారుడు జగన్నాథ్ (35) భార్య సుజాత కుటుంబ సమస్యలతో భర్తతో గొడవపడి పుట్టింటికి వెళ్లిపోయింది. భర్త, అత్తింటి వేధింపులపై పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. దీన్ని అవమానంగా భావించిన జగన్నాథ్ ఆదివారం ఇంటి వద్ద పురుగు మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. ఆయా ఘటనలపై సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
ఫోన్లో మాట్లాడొద్దంటే విద్యార్థి అదృశ్యం
బి.కొత్తకోట : డిగ్రీ చదువుతున్న కుమార్తె ఫోన్లో మాట్లాడటం చూసిన తండ్రి మందలించాడని అదృశ్యమైన ఉదంతం బి.కొత్తకోటలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలు. స్థానిక బీసీ కాలనీకి చెందిన వెంకటాద్రి కుమార్తె మేఘన (19) డిగ్రీ రెండో ఏడాది చదువుతోంది. శనివారం సాయంత్రం కళాశాల నుంచి ఇంటికి వచ్చిన మేఘన ఫోన్లో మాట్లాడుతుండగా వెంకటాద్రి మందలించాడు. దీనికి మనస్థాపం చెందిన మేఘన ఇంటినుంచి వెళ్లిపోయింది. కుటుంబీకులు పలుచోట్ల ఆచూకీ కోసం వెతికినా ఫలితం లేకపోయింది. దీంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆటో బోల్తా పడి ఇద్దరికి గాయాలు మదనపల్లె రూరల్ : ఆటో బోల్తా పడి ఇద్దరు గాయపడిన సంఘటన ఆదివారం చౌడేపల్లి మండలంలో జరిగింది. సోమల మండలం నెల్లిమందకు చెందిన గంగులప్ప కుమారుడు మునిరాజ (27), తన మరదలు రెడ్డి ఈశ్వరి (18)తో కలసి ఆటోలో పొట్టేలు వేసుకుని బోయకొండలో మొక్కు చెల్లించుకునేందుకు బయలుదేరారు. ఆటో బోయకొండ సమీపంలోకి రాగానే లోపల ఉన్న పొట్టేలు హఠాత్తుగా బయటకు దూకింది. దానిని అదుపు చేసేందుకు ప్రయత్నించిన మునిరాజ, ఆటో డ్రైవింగ్పై అదుపు తప్పడంతో వాహనం బోల్తా పడి, ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను 108 వాహనంలో మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చెరువులో జారి పడి గొర్రెల కాపరి మృతి పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరు వ్యాసరాయ చెరువులో ఓ గొర్రెల కాపరి ఆదివారం ప్రమాదవశాత్తు జారి పడి మృతి చెందాడు. కమ్మచెరువు పంచాయతీ మొరుసుపల్లికి చెందిన చిన్నకోట్ల మారప్ప (62) తన గొర్రెలను శుభ్రం చేసేందుకు చెరువులోకి వెళ్లగా ప్రమాదవశాత్తు జారి చెరువులో గల్లంతయ్యాడు. తోటి కాపరులు విషయాన్ని ఫోన్ ద్వారా పోలీసులకు సమాచారం అందించారు. పీటీఎం ఎస్ఐ హరిహర ప్రసాద్, ములకలచెరువు ఫైర్ సిబ్బంది హుటాహుటిన చెరువు వద్దకు చేరుకుని శవం కోసం తీవ్రంగా గాలింపు చర్యలు చేపట్టారు. గతంలో గుర్తు తెలియని వ్యక్తులు చేపల కోసం వదలిన వలలో ముళ్ల చెట్టు వద్ద శవం చిక్కుకున్నట్లు ఫైర్ సిబ్బంది గుర్తించారు. చెరువులోని ముళ్లచెట్టుకు తాడు వేసి శవాన్ని వెలికి తీశారు. -
రాజకీయ కక్షతోనే..
టీడీపీ నేతలు కుట్రలు, కుతంత్రాలతో ఎన్ని కేసులు పెట్టుకున్నా వైఎస్సార్సీపీ నేత, రాజంపేట ఎంపి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి కడిగిన ముత్యంలా బయటకు వస్తారు. ప్రజా వ్యతిరేకత నుంచి బయటపడేందుకు కూటమి ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీ నేతలపైన తప్పుడు కేసులు పెడుతోంది. మిథున్ రెడ్డిని, ఆయన తండ్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు రాజకీయ కక్షతోనే తప్పుడు కేసులు పెట్టారు. ఆధారాలు లేని తప్పుడు కేసులు న్యాయస్థానాల ముందు నిలబడవు. – కె మహిత, రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ రెడ్ బుక్ రాజ్యాంగంతో అక్రమ కేసులు రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి...రెడ్ బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ వైఎస్సార్సీపీ నాయకులపై అక్రమ కేసులు బనాయిస్తోంది. యాక్టివ్ గా ఉన్న నాయకులపై ఒక పథకం ప్రకారం గోబెల్స్ ప్రచారం చేస్తూ... కట్టుకథలు అల్లుతూ తప్పుడు కేసులు పెడుతున్నారు. ప్రజాస్వామ్యంలో నియంతృత్వ పోకడలు ప్రమాదకరం. కూటమి నాయకులు పెట్టిన తప్పుడు కేసులు కోర్టులో నిలబడేవి కావు.. వాటిని ఎదుర్కునేందుకు సిద్ధంగా ఉన్నాం. –దేశాయ్ తిప్పారెడ్డి, మాజీ ఎమ్మెల్యే రాజకీయంగా ఎదుర్కోలేకనే.. పెద్దిరెడ్డి కుటుంబాన్ని రాజకీయంగా ఎదుర్కొనే దమ్ము, ఽధైర్యం లేక తప్పుడు కేసులతో అరెస్ట్చేసి కూటమి ప్రభుత్వం రాక్షస ఆనందం పొందుతోంది. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కన పెట్టి, రెడ్ బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ ప్రజా ప్రతినిధులు, నాయకులు, కార్యకర్తలను అణిచివేతకు గురి చేస్తున్నారు. నేడు అది తారాస్థాయికి చేరుకుంది. ఆవేదన వ్యక్తం చేశారు. లేని లిక్కర్ స్కాంలో ఎంపీ మిథున్ రెడ్డి పైన అక్రమ కేసు పెట్టారని, ఇది కోర్టులో చెల్లుబాటు కాదని తెలిసి పైశాచిక ఆనందం కోసం అక్రమ అరెస్టు చేశారు.న్యాయ పోరాటం చేస్తూ, కూటమి ప్రభుత్వం చేస్తున్న అక్రమ అరెస్టులపై ప్రజలకు తెలియజేస్తాం. –నిస్సార్ అహ్మద్, వైఎస్సార్సీపీ మదనపల్లె సమన్వయకర్త -
ప్రవర్తన మార్చుకోలేదని భార్యను కడతేర్చాడు
చాపాడు : ప్రవర్తన బాగా లేకపోవడంతో పద్ధతి మా ర్చుకోవాలని రెండేళ్లుగా భర్త చెబుతూ వస్తున్నాడు .. భార్య వివాహేతర సంబంధంపై పలుమార్లు పోలీసు స్టేషన్లో పంచాయితీలు జరిగాయి. అయినా ఆమెలో మార్పు రాకపోవడంతో భార్యను హతమార్చి శవాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి మైదుకూరు – పోరుమామిళ్ల మధ్య గల ఎద్దడుగు కనుమలో పడేసిన ఘటన శనివారం మండలంలోని చియ్యపాడులో జరిగింది. పోలీసులు, స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చాపాడు మండలం చియ్యపాడు గ్రామానికి చెందిన నల్లబోతుల సుజాత(40)ను ఆమె భర్త నల్లబోతుల గోపాల్ ఈ నెల 17న గొంతు నులిమి హత్య చేశాడు. ప్రైవేటు ట్రావెల్స్ బస్సు డ్రైవర్గా ఉంటున్న గోపాల్ తన అక్క పార్వతమ్మ కూతురు అయిన సుజాతను 20 ఏళ్ల క్రితం వివాహం చేసుకున్నాడు. గత రెండేళ్ల క్రితం నుంచి తన ఇంటి నిర్మాణం చేస్తున్న చియ్యపాడు దళితవాడకు చెందిన బేల్దారి బాబుతో సుజాతకు పరిచయం ఏర్పడి అది వివాహేతర సంబంధంగా మారింది. ఈ విషయం తెలుసుకున్న భర్త గోపాల్ పలు సార్లు భార్య సునీతను పద్ధతి మార్చుకోవాలని హెచ్చరించాడు. అయినప్పటికీ వివాహేతర సంబంధం కొనసాగుతోంది. ఈ పంచాయితీ పలు సార్లు చాపాడు పోలీసు స్టేషన్కు సైతం వచ్చింది. ఇదే విషయంలో బాబుపై కేసు నమోదు చేసి రిమాండ్కు కూడా తరలించారు. అయినప్పటికీ సుజాత, బాబు వివాహేతర సంబంధం కొనసాగుతుండడంతో ఈ నెల 17న రాత్రి గోపాల్, సుజాత గొడవ పడ్డారు. తన మాట వినలేదనే కారణంతో రాత్రి 11 గంటల ప్రాంతంలో గోపాల్ తన భార్యను గొంతు నులిమి చంపేశాడు. ఈ విషయం బయటికి పొక్కకుండా సుజాత శవాన్ని గోపాల్ గోనే సంచిలో కట్టుకుని తన బైక్లో మైదుకూరు – పోరుమామిళ్ల రహదారి మధ్యలో గల ఎద్దడుగు కనుమలోని ఓ ముళ్లపొద గుంతలో పడేశాడు. గ్రామంలోనే ఉన్న సుజాత తల్లి పార్వతమ్మ తన కూతురు కన్పించలేదని పోలీసుకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు రూరల్ సీఐ శివశంకర్, ఎస్ఐ చిన్న పెద్దయ్య ఈ ఘటనపై గోపాల్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టగా స్వయంగా తానే సుజాతను హత్య చేసినట్లు ఒప్పుకున్నాడు. ఎద్దడుగు కనుమలో పడేసిన శవం వద్దకెళ్లి డీఎస్పీ రాజేంద్రప్రసాద్, రూరల్ సీఐ, ఎస్ఐ పరిశీలించారు. సుజాత మృతదేహం కుళ్లిపోవడంతో బయటికి తీసేందుకు వీలు కాక అక్కడే పంచానామా నిర్వహించారు. పార్వతమ్మ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రూరల్ సీఐ తెలిపారు. మృతదేహాన్ని గోనె సంచిలో తీసుకెళ్లి ఎద్దడుగు కనుమలో పడేశాడు పోలీసుల అదుపులో భర్త గోపాల్ -
సమస్యలు పరిష్కరించేవరకు పనులు జరగనివ్వం
వేముల : తమ సమస్యలు పరిష్కరించేవరకు టెయిలింగ్ పాండ్ వద్ద ఎలాంటి పనులు జరగనివ్వమని.. సమస్యలపై స్పష్టత ఇచ్చాకే పనులు చేసుకోవాలని కె.కె.కొట్టాల గ్రామస్తులు యురేనియం అధికారులకు సూచించారు. శనివారం ప్రొక్లెయిన్ల సహాయంతో పనులు చేపట్టేందుకు యురేనియం అధికారులు ప్రయత్నించారు. ఈ విషయం తెలుసుకున్న కె.కె.కొట్టాల గ్రామస్తులు టెయిలింగ్ పాండ్ వద్దకు చేరుకుని పనులు చేయవద్దని నిరసనకు దిగారు. దీంతో యురేనియం అధికారులు బాధితులతో చర్చించినా వారు అంగీకరించలేదు. కాగా యురేనియం ముడి పదార్థాన్ని శుద్ధి చేయగా, వచ్చే వ్యర్థాలను కె.కె.కొట్టాల సమీపంలోని టెయిలింగ్ పాండ్కు తరలిస్తున్నారు. అయితే టెయిలింగ్ పాండ్ వ్యర్థాలతో నిండే స్థాయికి చేరుకుంది. దీంతో యురేనియం అధికారులు రోజుకు 3వేల టన్నుల ముడి పదార్థాన్ని శుద్ధి చేయాల్సి ఉన్నా.. టెయిలింగ్ పాండ్ తొందరగా నిండిపోయే ప్రమాదం ఉండటంతో ప్రస్తుతం రోజుకు 1500 టన్నులు మాత్రమే ముడి పదార్థాన్ని శుద్ధి చేస్తున్నారు. ఈ లెక్కన ముడి పదార్థాన్ని శుద్ధి చేసిన నాలుగైదు నెలల్లో టెయిలింగ్ పాండ్ నిండుతుందని యురేనియం అధికారులు చెబుతున్నారు. అంతేకాక ఈ లోపు భారీ వర్షాలు కురిస్తే టెయిలింగ్ పాండ్ వర్షపు నీటితో పొర్లిపొయే ప్రమాదం ఉంది. దీంతో యురేనియం అధికారులు ప్రొక్లెయిన్ సహాయంతో టెయిలింగ్ పాండ్ వద్ద మట్టిని పోసే పనులను చేయాలని నిర్ణయించారు. దీంతో ప్రొక్లెయిన్లను సిద్ధంగా ఉంచుకుని పనులు ప్రారంభించేందుకు సిద్ధమయ్యారు. ఈ లోపు ఈ సమాచారం కె.కె.కొట్టాల గ్రామస్తులకు తెలియడంతో గ్రామస్తులు టెయిలింగ్ పాండ్ వద్దకు చేరుకున్నారు. తమ సమస్యలను పరిష్కరించకుండా పనులు చేయడానికి వీల్లేదనడంతో నిరసనకు దిగారు. యురేనియం వ్యర్థాలతో ఇప్పటికే తీవ్రంగా నష్టపోయామని వాపోయారు. యురేనియం వ్యర్థాలు దుమ్ము, ధూళి గాలి ద్వారా గ్రామం వైపు రావడంతో తీవ్ర అనారోగ్యానికి గురవుతున్నామని వాదించారు. కిడ్నీ వ్యాధులు, గర్భస్రావాలు, చర్మ వ్యాధులు, క్యాన్సర్ వంటి వ్యాధులు సోకుతున్నాయని యురేనియం అధికారులకు విన్నవించారు. టెయిలింగ్ పాండ్ పనులు జరగాలంటే తమ సమస్యలను పరిష్కరించాల్సిందేనని పట్టుబట్టారు. రాత్రికి రాత్రే ప్రొక్లెయిన్లను టెయిలింగ్ లోనికి పంపి పనులు చేపట్టడంపై గ్రామస్తులు యురేనియం అధికారులను నిలదీశారు. ఇళ్లు, పొలాలు తీసుకుని పరిహారంతోపాటు ఉద్యోగావకాశాలు కల్పించాలని తర్వాతనే పనులు చేసుకోవాలని గ్రామస్తులు తేల్చి చెప్పారు. యురేనియం అధికారులు నవీన్కుమార్రెడ్డి, టెయిలింగ్ పాండ్ ఇన్ఛార్జి నాగరాజులు గ్రామస్తులతో చర్చించారు. మీ సమస్యలకు పరిష్కారం చూపుతామని ఎలాంటి ఆందోళన చెందవద్దని గ్రామస్తులకు నచ్చజెప్పారు. మీ ప్రకారమే అన్ని జరుగుతాయని, అయితే ఇందుకు సమయం కావాలని, అప్పటివరకు పనులు చేసుకునేందుకు సహకరించాలని గ్రామస్తులకు సూచించారు. ఇందుకు గ్రామస్తులు తమ సమస్యలపై హామీ ఇచ్చిన తర్వాతనే పనులు చేసుకోవాలని, అంతవరకు టెయిలింగ్ పాండ్లో పనులు చేపట్టవద్దని, పనులు చేస్తే ధర్నాకు వెనుకాడమని హెచ్చరించారు. దీంతో టెయిలింగ్ పాండ్ వద్ద పనులు నిలిచిపోయాయి. టెయిలింగ్ పాండ్ వద్ద పనులు నిలిపివేయాలని గామస్తుల నిరసన యురేనియం అధికారులు చర్చించినా పట్టువీడని బాధితులు నిలిచిపోయిన పనులు -
దళితుల రోడ్డును ధ్వంసం చేశాడు
చాపాడు : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఐదేళ్ల క్రితం.. 30 ఏళ్లుగా సిమెంట్ రోడ్డుకు నోచుకోని మండలంలోని తిప్పిరెడ్డిపల్లె ఎస్సీ కాలనీ(దళితవాడ)కి మెయిన్ రోడ్డు నుంచి 2019–20లో 14వ ఆర్థిక సంఘం, ఉపాధి హామీ పథకం కింద రూ.4లక్షలతో ప్రభుత్వం సిమెంట్ రోడ్డు నిర్మించింది. ఆ సమయంలో రోడ్డు నిర్మాణం చేపట్టే స్థలం తమదని మండలంలోని అనంతపురం గ్రామానికి చెందిన టీడీపీ నేత నందిమండలం మల్లికార్జునరెడ్డి అడ్డుపడ్డాడు. ఎస్సీ కాలనీ లే అవుట్లో దారి స్థలం ఇదేనని అధికారులు తేల్చడంతో సిమెంట్ రోడ్డు నిర్మాణం చేపట్టారు. అప్పటి నుంచి ఐదేళ్ల పాటు ఈ రోడ్డు నిర్మాణంపై ఎలాంటి సమస్యలు తలెత్తలేదు. టీడీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాది తర్వాత టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి శనివారం ఉదయం తన అనుచరులతో వచ్చి జేసీబీతో 40 కుటుంబాల వారు నివసిస్తున్న దళితవాడకు వెళ్లే సిమెంట్ రోడ్డు పూర్తిగా తొలగించి ధ్వంసం చేయించాడు. ఈ సమయంలో దళితవాడకు చెందిన వారందరూ ఉపాధి హామీ పనులకు వెళ్లగా అక్కడ ఉండే కొంత మంది రోడ్డు తొలగింపును అడ్డుకునేందుకు ప్రయత్నించగా తమను బెదిరించారని తెలిపారు. ఈ విషయం తెలుసుకున్న దళితులందరూ ఇంటికి రాగా అప్పటికే వారి ఇళ్లకు వెళ్లే రోడ్డు పూర్తిగా ధ్వంసం అయి ఉంది. దీంతో ఫోన్ల ద్వారా అధికారుల దృష్టికి తీసుకెళ్లగా పంచాయతీ కార్యదర్శి మల్లేశ్వరి సంఘటన స్థలాన్ని పరిశీలించి దళితులను విచారించారు. ఈ రోడ్డును టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి తొలగించినట్లు వారు ఎంపీడీఓ వీరకిషోర్కు తెలిపారు. ఈ క్రమంలో విషయం తెలుసుకున్న ఎస్ఐ చిన్న పెద్దయ్య సంఘటనా స్థలం వద్దకు చేరుకుని రోడ్డు తొలగింపును పరిశీలించారు. ఈ చర్యను అడ్డుకోబోగా అనంతపురం, ఓబాయపల్లె, నక్కలదిన్నె గ్రామాలకు చెందిన టీడీపీ వర్గీయులు చంపుతామని బెదిరించి భయాందోళనకు గురి చేసినట్లు వారు ఎస్ఐ దృష్టికి తీసుకువచ్చారు. రోడ్డు తొలగింపు ఘటన కారకులపై చర్యలు తీసుకోవాలని స్థానిక దళితులు ఎస్ఐ చిన్న పెద్దయ్య, డిప్యూటీ తహసీల్దారు కృష్ణారెడ్డికి రాతపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఈ స్థలంపై తనకు హక్కు ఉందని కోర్టులో దీనిపై కేసు నడుస్తోందని స్టే కూడా ఉందని మల్లికార్జునరెడ్డి చెబుతున్నాడు. ఎంపీడీఓ ఏమన్నారంటే.. తిప్పిరెడ్డిపల్లె దళితవాడకెళ్లే రోడ్డును టీడీపీ నేత తొలగించడంపై ఎంపీడీఓ వీర కిషోర్ను వివరణ కోరగా.. ప్రభుత్వ నిధులతో వేసిన రోడ్డును తొలగించడం చట్టరీత్యా నేరమన్నారు. రోడ్డు తొలగింపు, స్థల సమస్యపై రెవెన్యూ అధికారులతో కలసి సమగ్ర విచారణ చేపట్టి తదుపరి చర్యలు తీసుకుంటామని చెప్పారు. చాపాడు మండలం తిప్పిరెడ్డిపల్లెలో టీడీపీ నేత దుశ్చర్య టీడీపీ నేత మల్లికార్జునరెడ్డికి ఎలాంటి సంబంధం లేదు : దళితులు 30 ఏళ్ల క్రితం ఊరి బయట ఉన్న తాము ఇళ్లు నిర్మించుకునేందుకు పామిడి బుడ్డయ్య కుమారుడు వీరయ్య నుంచి ఇంటింటికి చందాలు వేసుకుని 70 సెంట్ల స్థలం కొనుగోలు చేశామని దళితులు చెబుతున్నారు. ఈ క్రమంలో తమ కాలనీ పెద్ద మనిషి గయన్నతో పాటు మరికొందరు పెద్ద మనుషుల నిర్ణయంతో ఊర్లో పెద్ద మనిషిగా ఉన్న నందిమండలం వీరారెడ్డి పేరుతో స్థలం రాయించుకున్నామన్నారు. అప్పటి నుంచి వీరారెడ్డి పేరు మీదనే స్థల పత్రాలు ఉన్నాయన్నారు. వీరారెడ్డి తమ్ముడి కుమారుడు అయిన పడమర అనంతపురం గ్రామంలో ఉన్న టీడీపీ నేత మల్లికార్జునరెడ్డి ఈ స్థలం తమ పెదనాన్నదని తనకు హక్కు ఉందని వస్తున్నాడని, గతంలో అధికారులు చెప్పినా వినకుండా ఇప్పుడు ఇలా దౌర్జన్యంగా రోడ్డును తొలగించాడని దళితులు వాపోతున్నారు. -
టీడీపీలో భగ్గుమన్న విభేదాలు
తొండూరు : అధికార టీడీపీలో వర్గ విభేదాలు మరోసారి భగ్గుమన్నాయి. పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. గతంలో తొండూరు మండలం ఇనగలూరు గ్రామంలో అధికార పార్టీకి చెందిన దస్తగిరిరెడ్డి (బాబురెడ్డి), అదే పార్టీకి చెందిన బాల ఓబుళరెడ్డిల మధ్య ఉపాధి హామీలో చీనీ బిల్లుల విషయమై ఇరువర్గాలు ఘర్షణ పడ్డారు. ఈ నేపథ్యంలో దస్తగిరిరెడ్డి తమకు బిల్లులు రాకుండా అడ్డుకున్నారని బాల ఓబుళరెడ్డి వర్గీయులు ఈ ఏడాది జనవరి మాసంలో దస్తగిరిరెడ్డిపై దాడి చేశారు. దీంతో అప్పటి నుంచి బాల ఓబుళరెడ్డి వర్గీయులు జైలు నుంచి వచ్చిన తర్వాత ఇనగలూరు గ్రామానికి వెళ్లకుండా బయట తిరిగేవారు. నెల రోజుల క్రితం పోలీసులు ఇరు వర్గాల వారికి కౌన్సిలింగ్ ఇచ్చి ఎలాంటి ఘర్షణలకు దిగకుండా అందరూ ఐకమత్యంగా ఉండాలని సూచించారు. దీంతో బాల ఓబుళరెడ్డి వర్గీయులు ఇనగలూరు గ్రామంలోకి వెళ్లి పనులు చేసుకుంటుండేవారు. శనివారం బాల ఓబుళరెడ్డి కుమారులు సమరసింహారెడ్డి, హరికిశోర్రెడ్డిలు ద్విచక్రవాహనంపై ఇనగలూరు నుండి పులివెందులకు వస్తుండగా సైదాపురం బస్టాప్ దాటగానే వెనుకవైపు నుంచి దస్తగిరిరెడ్డితోపాటు మరికొంతమంది కారులో వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొట్టి సమర సింహారెడ్డి, హరికిశోర్రెడ్డిలపై రాడ్లతో దాడి చేశారు. దీంతో వారి తలకు బలమైన రక్తపు గాయాలతోపాటు కాలు విరిగినట్లు తెలిసింది. దాడి జరిగే సమయంలో కొంతమంది స్థానికులు వచ్చి గాయపడిన వారిని 108 వాహనంలో పులివెందుల ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న సమరసింహారెడ్డి, హరికిశోర్రెడ్డిలను పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, సీఐ వెంకటరమణలు దాడి జరిగిన సంఘటన గురించి ఆరా తీశారు. అక్కడి వైద్యులు చికిత్స అందించి పరిస్థితి విషమంగా ఉండటంతో కడపకు రెఫర్ చేశారు. ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ సంఘటనపై పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, ఎస్ఐ ఘన మద్దిలేటిలు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్రవాహనంపై వెళుతుండగా కారుతో ఢీకొట్టి రాడ్లతో దాడి చేసిన వైనం ఇద్దరికి తీవ్ర గాయాలు.. పరిస్థితి విషమం కడపలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలింపు -
బైక్ అదుపుతప్పి ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపుతప్పి ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన గంగులప్ప కుమారుడు వలిగేశ్వర్(27) డిష్ యాంటెన్నా పనులు చేస్తూ ఉంటాడు. ఈ క్రమంలో శనివారం స్నేహితుడైన ప్రకాష్(25)తో కలిసి ద్విచక్రవాహనంలో పనుల నిమిత్తం పుంగనూరు వెళ్లాడు. పుంగనూరు సమీపంలో వాహనానికి కుక్క అడ్డురావడంతో అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, చికిత్స కోసం మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రామసముద్రం మండలంలో.. రామసముద్రం : ద్విచక్ర వాహనం అదుపుతప్పి పడిపోయి ఇద్దరికి తీవ్ర గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో శనివారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పలమనేరు దగ్గర ఏడూరుకు చెందిన ఆసిఫ్, కుమార్ లు రామసముద్రం నుంచి పుంగనూరు వైపు వెళ్తుండగా మినికి వద్ద ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయారు. ఈ ప్రమాదంలో కుమార్ కు ముక్కు దగ్గర, ఆసిఫ్ కు చేతిపైన తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు 108 వాహనానికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ప్రసాద్, వెంకటరమణ సంఘటన స్థలానికి చేరుకున్నారు. తీవ్రంగా గాయపడిన వారిని చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
బాలిక హత్య కేసులో పోలీసుల తాత్సారం
జమ్మలమడుగు : గండికోటలో మైనర్ బాలికను హత్యచేసిన నిందితులెవరో పోలీసులకు తెలిసినా వివరాలను వెల్లడించడంలో ఎందుకు తాత్సారం చేస్తున్నారని విప్లవ రచయితల సంఘం నాయకురాలు వరలక్ష్మి ప్రశ్నించారు. శనివారం ప్రజా సంఘాల నాయకులతో కలిసి ఆమె ఎర్రగుంట్ల మండలం హనుమనగుత్తిలో బాధితురాలి తల్లిదండ్రులతో, బాలికను బైకుపై తీసుకెళ్లిన లోకేష్ తల్లితో మాట్లాడారు. అనంతరం డీఎస్పీ వెంకటేశ్వర్లును కలసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మైనర్ బాలిక హత్య జరిగిందని తెలిసిన వెంటనే లోకేష్ను పోలీసులు అదుపులోనికి తీసుకున్నారన్నారు. ఐదురోజులు గడిచినా ఇంతవరకు అతన్ని కోర్టు ముందు హాజరు పరచలేదన్నారు. నిందితులను గుర్తించేందుకు విచారణ చేస్తున్నామంటూ పోలీసులు కాలయాపన చేస్తున్నారనే విషయం స్పష్టమవుతోందన్నారు. నిందితుల వివరాలు ఎందుకు దాచిపెడుతున్నారో తమకు అర్థం కావడం లేదన్నారు. సంఘటన స్థలాన్ని కూడా తాము పరిశీలించామని, ఆ ప్రాంతం పూర్తిగా అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారిపోయిందన్నారు. గండికోటలో టోల్గేట్ పెట్టి డబ్బులు వసూలు చేస్తున్నారే తప్ప ఎక్కడా సెక్యూరిటి గాని సీసీ కెమెరాలు గాని లేవన్నారు. ఈ ప్రాంతానికి విదేశీ పర్యాటకులు సైతం ఎక్కువ సంఖ్యలో వస్తుంటారని, ఇలాంటి సంఘటనలు జరిగితే విదేశాల్లో సైతం మన పరువు పోతుందన్నారు. ఈ ప్రాంతంలో సెక్యూరిటీ పెంచి, పర్యాటకులకు భద్రత కల్పించాలని కోరారు. ఈ కార్యక్రమంలో పౌరహక్కుల సంఘం నాయకులు, న్యాయవాదులు, మహిళా సంఘాలు, సీపీఎం ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
అదుపు తప్పిన చైతన్య స్కూల్ బస్సు
రాయచోటి టౌన్ : రాయచోటిలోని శ్రీ చైతన్య పాఠశాలకు చెందిన బస్సు అదుపు తప్పి ఒక వైపు ఒరిగిపోయింది. దీంతో పెను ప్రమాదం తప్పిందని స్థానికులు అంటున్నారు. శనివారం రాయచోటికి చెందిన శ్రీ చైతన్య స్కూల్ బస్సు సుండుపల్లె నుంచి రాయచోటికి వస్తుండగా శిబ్యాల గ్రామం అనుంపల్లె సమీపంలో బస్సు బ్రేక్లు పని చేయకపోవడంతో ఒక్కసారిగా సైడు కాలువ వైపు ఒరిగిపోయింది. అక్కడ మరో చిన్న కాలువ ఉండటంతో అందులో ముందు వైపు టైర్ ఇరుక్కుపోవడంతో ఆగిపోయింది. ఈ కాలువ లేకుంటే సైడ్ కాలువలో పడి చిన్నారులకు గాయాలయ్యేవి. ఎవరికీ ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. ఆవు–ఎద్దులను ఢీకొన్న కారు సిద్దవటం : మండలంలోని చాముండేశ్వరీపేట గ్రామం సెయింట్ ఆంథోనీ హైస్కూల్ సమీపంలో శనివారం ఆవు–ఎద్దులను కారు ఢీకొన్న ప్రమాదంలో ఆవు, ఎద్దు అక్కడికక్కడే మృతి చెందాయి. కడప– చైన్నె జాతీయ రహదారిలో ఈ ప్రమాదం జరిగింది. మేతకు రైల్వే ట్రాక్ అవతలికి వెళ్లి తిరిగి నేకనాపురం గ్రామానికి వెళ్లేందుకు ఆవు, ఎద్దు రోడ్డు దాటుతుండగా కడప నుంచి రాజంపేట వైపు వెళుతున్న కారు వేగంగా వచ్చి ఆవు, ఎద్దులను ఢీకొంది. ఈ ప్రమాదంలో నేకనాపురం గ్రామ పాడి రైతులు సుబ్బారెడ్డి, రవీంద్రారెడ్డిలకు చెందిన ఆవు, ఎద్దు మృతి చెందాయి. సంఘటనా స్థలానికి చేరుకున్న ఎస్ఐ మహమ్మద్రఫీ కారు డ్రైవర్ అబ్దుల్లాను విచారించారు. గొంతు కోసుకుని ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : గొంతు కోసుకుని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శనివారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. రంగసముద్రం పంచాయతీ కుర్రావాండ్లపల్లెకు చెందిన నరేష్బాబు అలియాస్ భూషణ(27) స్థానికంగా డ్రైవర్గా పనిచేస్తున్నాడు. శనివారం పూటుగా మద్యం తాగి వ్యక్తిగత సమస్యలతో మనస్తాపం చెంది బ్లేడుతో గొంతు కోసుకుని ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించగా, మెరుగైన చికిత్స కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. బి.కొత్తకోట పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
వరుస ఫిర్యాదులపై జిల్లా రిజిస్ట్రార్ విచారణ
కలికిరి : కలికిరి సబ్ రిజిస్ట్రార్పై ఇటీవల వరుస ఫిర్యాదులు అందడంపై స్పందించిన ఉమ్మడి చిత్తూరు జిల్లా రిజిస్ట్రార్ ఏ.వి.ఆర్. మూర్తి శనివారం స్థానిక రిజిస్ట్రార్ కార్యాలయాన్ని తనిఖీ చేశారు. సబ్ రిజిస్ట్రార్ పార్థసారధిపై కొందరు డాక్యుమెంటు రైటర్లే వరుసగా పీజీఆర్ఎస్, రిజిస్ట్రేషన్, స్టాంపుల శాఖ ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు. ఇప్పటికే తనపై వచ్చిన ఆరోపణలపై ఉన్నతాధికారులకు సబ్ రిజిస్ట్రార్ వివరణ ఇచ్చుకున్నారు. మరోసారి నేరుగా జిల్టా రిజిస్ట్రార్ విచ్చేసి ఫిర్యాదుదారులను విచారించారు. అయితే ప్రజలు, రైతులు కాకుండా డాక్యుమెంటు రైటర్లే ఫిర్యాదులు చేస్తుండటంపై విస్మయం వ్యక్తం చేసిన ఆయన సబ్ రిజిస్ట్రారు సమక్షంలోనే వారిని విచారించారు. సబ్ రిజిస్ట్రార్పై వచ్చిన ఆరోపణలపై అక్కడికక్కడే వివరణ అడిగారు. సుమారు రెండు గంటల పాటు విచారించిన ఆయన ఫిర్యాదులో వచ్చిన ప్రతి అంశాన్ని పరిశీలించారు. సమయాభావం వల్ల మరోమారు విచారణ చేస్తామన్నారు. -
పోక్సో కేసులో యువకుడి అరెస్టు
పెద్దమండ్యం : పోక్సో కేసులో యువకుడిని శనివారం అరెస్టు చేసినట్లు ములకలచెరువు సీఐ లక్ష్మన్న తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. వెలిగల్లు గ్రామం గురికివాండ్లపల్లెకు చెందిన బాలిక (15) పదో తరగతి చదువుతోంది. ఈ నెల 6వ తేదీన ఇంటి వద్ద బాలిక ఉండగా గాలివీడుకు చెందిన మల్లెల రామక్రిష్ణ అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటనపై బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోక్సో కేసు నమోదు చేసినట్లు తెలిపారు. వెలిగల్లు సచివాలయం వద్ద ఉండగా నిందితుడిని అరెస్ట్ చేసి తిరుపతి జువైనల్ కోర్టుకు తరలించినట్లు సీఐ తెలిపారు. నీటి కుంటలో పడి వ్యక్తి మృతి కురబలకోట : ప్రమాదవశాత్తు నీటి కుంటలో పడి వ్యక్తి మృతి చెందిన సంఘటన శనివారం కురబలకోట మండలంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు..తెట్టు గ్రామం మండ్యం వారిపల్లె వద్ద ఇటుకల బట్టీలో మదనపల్లెకు చెందిన అలీ (42) అనే వ్యక్తి పని చేస్తున్నాడు. ఇతను సమీపంలో ఉన్న నీటి కుంటలో పడి మృతి చెంది ఉండగా స్థానికులు కనుగొన్నారు. ఇతనికి వాయువు కన్పిస్తుంది. ఆరోగ్యం కూడా బాగాలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ క్రమంలో ప్రమాదవశాత్తు నీటికుంటలో పడి మృతి చెంది ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహాన్ని మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి కేసు దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
వ్యాధులు సంఖ్య
జనవరి 1 నుంచి జూన్ 23 వరకు నమోదైన వ్యాధుల వివరాలు పల్లె.. పట్టణం అనే తేడా లేదు.. చిన్నా పెద్దా తారతమ్యం అసలే లేదు.. గడపకొకరు అనారోగ్యంతో బాధపడుతున్నారు. జ్వరమో.. ఒళ్లునొప్పులో.. జలుబో దగ్గో.. ఇలా ఏదో ఒక లక్షణంతో ఇబ్బందులు పడుతున్నారు. దీనికి తోడు కలుషిత నీటితో.. దోమల దాడులతో వైరల్ ఫీవర్.. ప్రజలపై యుద్ధం చేస్తున్నాయి. ఫలితంగా ఆస్పత్రులు జ్వరబాధితులతో కిటకిటలాడుతున్నాయి. పలుచోట్ల సరైన మందు బిళ్లలు లేక.. పరీక్ష చేసే మిషన్లు లేక ప్రజలు అల్లాడుతున్నారు. ఇంత జరుగుతున్నా ప్రభుత్వం చర్యలు తీసుకోకపోవడం విచారకరం. – నెట్వర్క్ మలేరియా 03 డెంగ్యూ 76 చికున్గున్యా 6 డయేరియా 1,276 టైఫాయిడ్ 261 కడప రూరల్ (వైఎస్ఆర్ జిల్లా): ప్రజలపై జ్వరాలు విజృంభిస్తున్నాయి. వేసవి వెళ్లక ముందే వానలు కురవడం..వాతావరణంలో పెను మార్పులు రావడంతో జ్వరాలు చుట్టుముట్టాయి. దీనికి కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణం తోడైంది. ఫలితంగా విష జ్వరాలు దాడి చేస్తున్నాయి. మరో వైపు వైఎస్ఆర్ జిల్లా వ్యాప్తంగా ప్రభుత్వ వైద్యానికి సమస్యల జబ్బు పట్టింది. దీంతో సక్రమంగా వైద్య సేవలు అందకపోవడం ప్రజలకు శాపంగా మారింది. ● కమలాపురంలోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో మౌళిక సదుపాయాలు పడకేశాయి. ఇక్కడ రోగులకు వైద్య పరీక్షలు నిర్వహించే కీలకమైన ఎక్స్ రే సౌకర్యం లేదు. ఆఖరికి ఈసీజీ సదుపాయం కూడా లేదు. ఈ రెండు రకాల పరీక్షలకు రోగులు కడపకు వస్తున్నారు. ఉచితంగా అందాల్సిన వైద్య సేవలకు డబ్బులు ఖర్చు చేస్తున్నారు. ఆ ఆసుపత్రిలో నీటి సౌకర్యం లేకపోవడం దారుణం. ● ప్రొద్దుటూరు పట్టణ ఆరోగ్య కేంద్రాల్లో చక్కెర వ్యాధిని నియంత్రించే ఇన్సులిన్ ఇంజక్షన్లకు కొరత ఏర్పడింది. ప్రధానంగా ఇక్కడ ఉన్న జిల్లా ఆసుపత్రికి ఒక రోజుకు 800 నుంచి 1000 వరకు ఔట్ పేషెంట్స్ వస్తారు. అందులో దాదాపు 200 మంది వరకు జ్వరాలతో బాధపడే వారే ఉన్నారు. ● జమ్మలమడుగులోని కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో వైద్యులు సమయపాలన పాటించడం లేదు ఒక డ్యూటీ డాక్టర్ మాత్రం అందుబాటులో ఉంటారు. మిగతా వారు ఎప్పుడొస్తారో..ఎప్పుడు వెళ్తారో తెలియని పరిస్థితి నెలకొంది. ఫేషియల్ అటెండెన్స్ మాత్రం వేసి, వెళ్లిపోతుంటారు. పులివెందుల ప్రభుత్వ సర్వ జన ఆసుపత్రి గురించి ఎంత చెప్పినా తక్కువే. సకల వైద్య సౌకర్యాలతో ప్రజలకు కార్పొరేట్ వైద్య సేవలు అందించాల్సిన ఆసుపత్రి నిర్వీర్యంగా మారింది. ఇలా ప్రభుత్వ ఆసుపత్రులు పలు ఆరోపణలు ఎదుర్కొంటున్నాయి. అధికారిక లెక్కల కంటే వ్యాధిగ్రస్తుల సంఖ్య ఎక్కువ ఇప్పుడిప్పుడే వ్యాధుల తీవ్రత పెరిగిపోతోంది. కలుషిత నీరు, అపరిశుభ్రత వాతావరణం తదితర కారణాల వల్ల వైరల్ ఫీవర్స్, టైఫాయిడ్ జ్వరాలు సంక్రమిస్తున్నాయి. జాగ్రత్తలు పాటించి, సరైన మందులు వాడితే ఒక వారంలో జ్వరం తగ్గుముఖం పడుతుంది. అలాగే డయేరియా కేసులు కూడా నమోదవుతున్నాయి. వివిధ రకాల వ్యాధులతో గ్రామీణ, పట్టణ ప్రాంత ప్రజలతో ప్రభుత్వ ఆసుపత్రులతో పాటు ప్రైవేట్ ఆసుపత్రులు కిటకిటలాడుతున్నాయి. ప్రభుత్వ ఆసుపత్రుల విశ్వాసం కోల్పోవడంతో చాలా మంది ప్రైవేట్ ఆసుపత్రులను ఆశ్రయించి ఆర్ధికంగా చితికి పోతున్నారు. వ్యాధుల సంఖ్య అధికారిక లెక్కల కంటే అనధికారికంగా అధిక సంఖ్యలో ఉన్నట్లుగా వైద్యులు చెపుతున్నారు. వైద్య రంగంపై పాలకులకు చిన్న చూపు వైస్సార్సీపీ పాలనలో వైద్య రంగం విలసిల్లింది. ప్రభుత్వ ఆసుపత్రులు ఆధునిక సౌకర్యాలతో ఉండేవి. ఏ వ్యాధి వచ్చినా సత్వర వైద్య సేవలు లభించేవి. ఇప్పుడు టీడీపీ కూటమి పాలనలో ఆ రంగాలన్నీ కుదేలయ్యాయి. పాలకులు వైద్య రంగంపై చిన్న చూపు చూస్తోందనే ఆరోపణలు పెద్ద ఎత్తున వినిపిస్తున్నాయి. మందులకు కొరత జిల్లాలో కడప నగరంలో ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (పెద్దాసుపత్రి), ప్రొద్దుటురులో జిల్లా ఆసుపత్రి, పులివెందులలో సర్వజన ఆసుపత్రి, వైద్య విధాన పరిషత్లో పోరుమామిళ్ల, మైదుకూరు, చెన్నూరు, బద్వేల్, సిద్దవటం, కమలాపురం, వేంపల్లెలో కలిపి మొత్తం 7 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు ఉన్నాయి. ఈ ఆసుపత్రిల్లో దాదాపుగా అన్ని వ్యాధులకు వైద్య సేవలు అందించాలి. ఏదైనా పెద్ద జబ్బు, సమస్యతో కూడకున్నదైతే కడప రిమ్స్లో వైద్యం చేయాలి. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ పరిధిలో 51 ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు, 24 పట్టణ ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. ఒక ఆసుపత్రిలో 172 రకాల మందులను అందుబాటులో ఉంచాలి, 60 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. అలాగే విలేజ్ హెల్త్ క్లినిక్లు 342 ఉన్నాయి. ఒక క్లినిక్ ద్వారా 108 రకాల మందులు, 14 రకాల వైద్య పరీక్షలు నిర్వహించాలి. చాలా వరకు ఆసుపత్రుల్లో మందులకు కొరత ఏర్పడింది. జ్వరం, జలుబు, దగ్గుకు మందులకు కొరత ఉంది అలాగే చక్కెర వ్యాధిని నియంత్రించే ఇన్సూలిన్ ఇంజక్షన్లు అందుబాటులో లేవు. కొన్ని ఆసుపత్రులు ప్రక్కన ఉన్న ఆసుపత్రుల నుంచి లేని మందులను తెచ్చుకొని రోగులకు ఇస్తున్నారు. ఏమని అడిగితే...సెంట్రల్ డ్రగ్స్ స్టోర్ నుంచి మందులు రావాల్సి ఉందని వైద్య సిబ్బంది చెపుతున్నారు. విజృంభిస్తున్న వైరల్ ఫీవర్స్,టైఫాయిడ్,డయేరియా ప్రభుత్వ ఆస్పత్రుల్లో మందుల కొరత ఆఖరికి జలుబు, దగ్గు మందులూ కరువే.. ప్రజలకు అందని ప్రభుత్వ వైద్యం -
● ఈ బృందం ఏమి చెబుతుందో..
అన్నమయ్య జలాశయాన్ని నిపుణుల బృందం ఈ నెల 13న పరిశీలించింది. ఈ బృందం ప్రధానంగా జలాశయం ప్రస్తుత స్థితి గతులపై అంచనా వేసింది. అన్నమయ్య జలాశయంను నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. ఈ బృందంలో... ప్రధానంగా జలాశయం ప్రస్తుత స్ధితి గతులపై బృందం అంచనా వేసింది. ఈ బృందంలో డిజైన్ ఎక్స్ఫర్ట్గా పీపీఏ చీఫ్ ఇంజినీర్ రమేష్కుమార్, హైడ్రో మెకానికల్ ఎక్స్ఫర్ట్గా రిటైర్డ్ చీఫ్ ఇంజినీర్ కె.సత్యనారాయణ, జియాలిజిస్టుగా జీఎస్ఐ డైరెక్టర్ జనరల్(రిటైర్డ్) ఎం.రాజు, డిజైన్ అప్రూవింగ్ అథారిటీగా సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్, డబ్ల్యూఆర్డీ చీఫ్ ఇంజినీరు, హైడ్రాలజి ఎక్స్ఫర్ట్గా విజయవాడకు చెందిన హైడ్రాలజి చీఫ్ ఇంజినీరు, కన్వీనర్గా కడప డబ్ల్యూఆర్డీ చీప్ ఇంజినీర్ ఉన్నారు. రాష్ట్ర ప్రభుత్వం అన్నమయ్య జలాశయం డిజైన్ చేసేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించింది. అన్నమయ్య జలాశయం పునఃనిర్మాణానికి సంబంధించి డిజైన్, నిర్మాణం, పునరుద్ధరణ చర్యలు తదితర అంశాలపై టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ దృష్టి సారించింది. ఈ బృందం ఏమి చెబుతుందో అనే అంశంపై ఆసక్తి నెలకొంది. -
పోతన సాహితీ పీఠం అధ్యక్షుడికి ఆహ్వానం
ఒంటిమిట్ట: అమెరికన్ యూనివర్సిటీ డాక్టరేట్ ప్రధాన వేడుకలకు ఒంటిమిట్ట పోతన సాహితీ పీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ని విశ్వవిద్యాలయం వారు శనివారం ఆహ్వానించారు. వివిధ రంగాల్లో ప్రతిభ కనపరచిన వారికి గౌరవ డాక్టరేట్, జీవిత సాఫల్య పురస్కారాలను పాండిచ్చేరిలో ఈనెల 27న అందజేయనున్నారని ఒంటిమిట్ట పోతన సాహితీ పీఠం అధ్యక్షుడు పసుపులేటి శంకర్ తెలిపారు. కోదండ రామయ్యకు స్నపన తిరుమంజనం ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం స్వామి వారికి వేద పండితుల మంత్రోచ్చారణలు, మంగళవాయిద్యాల నడుమ స్నపన తిరుమంజన కార్యక్రమం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఆలయ టీటీడీ అధికారుల ఆధ్వర్యంలో సుప్రభాత సమయాన శ్రీరామచంద్రమూర్తికి పట్టు వస్త్రాలు, పుష్పాలు, ఫలాలు, అభిషేక సామగ్రి సమర్పించారు. గర్భాలయంలో సీతారామలక్ష్మణ మూర్తులకు అభిషేకాలు చేసి, పట్టువస్త్రాలు, పుష్పమాలికలు, ఆభరణాలతో ముస్తాబు చేశారు. అనంతరం ఆలయ పండితులు వేద పారాయణం, సహస్త్ర నామార్చన, కుంకుమార్చన, మంగళహారతులతో విశేష పూజలు నిర్వహించారు. జేఎన్టీయూ హాస్టల్ సాంబారులో బల్లి కలికిరి: జేఎన్టీయూ బాలికల వసతి గృహం హాస్టల్లో శనివారం ఉదయం విద్యార్థినులు తింటున్న ఇడ్లీ, సాంబార్లో బల్లి ప్రత్యక్షమైంది. దీంతో విద్యార్థినులు ఒక్క సారిగా ఆందోళనకు గురయ్యారు. సమాచారం తెలుసుకున్న ప్రిన్సిపాల్ వెంకటేశ్వర్లు అక్కడికి వచ్చారు. బల్లి విద్యార్థిని ప్లేటులో మాత్రమే పడిందని ఆయన తెలిపారు. అర్ధగంట తరువాత విద్యార్థినులకు టిఫిన్ ఏర్పాటు చేయించారు. పరిసరాల పరిశుభ్రత పాటించక పోవడంతోనే ఈ ఘటన చోటు చేసుకుందని హాస్టల్ నిర్వాహకులపై ప్రిన్సిపాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. మరోమారు ఇలాంటివి జరగకుండా జాగ్రత్త పడాలని పేర్కొన్నారు. ఇది వరకే పలుమార్లు హాస్టల్ నిర్వహణపై ఫిర్యాదు చేసినా ఎవరూ పట్టించుకోలేదని విద్యార్థినులు ప్రిన్సిపాల్ దృష్టికి తీసుకువచ్చారు. సంక్షేమ వసతి గృహాలపై ప్రత్యేక దృష్టి రాయచోటి: సంక్షేమ వసతి గృహాలపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఛామకూరి శ్రీధర్ ఆదేశించారు. శనివారం సాయంత్రం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుంచి జిల్లా సాంఘిక వెనుకబడిన తరగతుల గిరిజన, మైనార్టీ సంక్షేమ శాఖ అధికారులు, నియోజకవర్గాల, మండలాల ప్రత్యేక అధికారులతో జిల్లాలోని సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో ఉన్న వసతులు తదితర అంశాల తనిఖీపై సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలోని 156 సంక్షేమ హాస్టళ్లు, 2176 సంక్షేమ పాఠశాలలను నియోజకవర్గ, మండల ప్రత్యేక అధికారులు తనిఖీ చేయాలని ఆదేశించారు. నీటి వసతి, మరుగుదొడ్లు, భోజనం తయారీ విధానం తదితర అంశాలపై దృష్టి సారించాలన్నారు. ఇప్పటికే తనిఖీ చేసిన హాస్టళ్లు, పాఠశాలలపై నివేదికలను సంబంధిత సంక్షేమ శాఖ అధికారులకు అందజేయాలన్నారు. కొన్ని హాస్టళ్లు, పాఠశాలల్లో ఆర్ఓ ప్లాంట్లు పని చేయకపోతే పునరుద్ధరించాలన్నారు. ఈ సమావేశంలో జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, వివిధ శాఖల జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీ మిథున్రెడ్డి అరెస్ట్ అక్రమం
రాయచోటి: రాజకీయ కుట్రలతో వైఎస్సార్సీపీ నేతలపై పెడుతున్న కేసులు.. ప్రజాస్వామ్య విలువలకు ముప్పు అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. శనివారం రాయచోటి పట్టణం వైఎస్సార్సీపీ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిపై నమోదు చేసిన అక్రమ కేసులను ఖండించారు. అంబేడ్కర్ రాజ్యాంగాన్ని పక్కనపెట్టి రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తూ.. వారికి నచ్చని వారిపై పథకం ప్రకారం కేసులు పెట్టుకుంటూ వస్తున్నారన్నారు. అందులో భాగంగా రాజంపేట పార్లమెంటు సభ్యులు మిథున్రెడ్డిని అరెస్ట్ చేశారని విమర్శించారు. ఎన్నికలు అయిన మరుసటిరోజు నుంచే వేటాడుతున్నట్టుగా.. రాజకీయ పరమైనటువంటి కేసులు పెడుతున్నారని పేర్కొన్నారు. వ్యక్తిగతంగా పెద్దిరెడ్డి కుటుంబాన్ని టార్గెట్ చేశారని, రాజకీయంగా ఎదుర్కోలేక అధికారాన్ని అడ్డుపెట్టుకొని తప్పుడు కేసులు పెట్టారని పేర్కొన్నారు. వాటిని రుజువు చేయలేక అభాసు పాలవుతారని ఎద్దేవా చేశారు. మదనపల్లి ఆర్డీఓ ఆఫీసు అగ్ని ప్రమాదంలో పెద్దిరెడ్డి హస్తం ఉందని ఆరోపించారని, దాన్ని నిరూపణ చేయని విషయాన్ని ప్రజలు గమనిస్తున్నారన్నారు. చంద్రబాబు కేసులను విచారణ చేయించాలి చంద్రబాబు నాయుడు ఎన్నో కేసులలో స్టేలు తెచ్చుకున్నారన్నారు. స్కిల్ డెవలప్మెంట్ కేసు, లిక్కర్ కేసు, 2014 నుంచి 2019 వరకు చంద్రబాబు చేసిన అవినీతిపైన కేసులున్నాయన్నారు. చంద్రబాబు నిజంగా సచ్చిలుడి అయితే తనపై వచ్చిన కేసులపై సిట్టింగ్ జడ్జితో విచారణ చేయించుకోవాలని సూచించారు. గతంలో కూడా తమ పార్టీ వారిపై తప్పుడు కేసులు పెట్టారని, ఏమీ నిరూపణ చేయలేకపోయారన్నారు. రాజంపేట నుంచి మూడుసార్లు అత్యధిక మెజార్టీతో ఎంపీగా ఎన్నికై నటువంటి పెద్దిరెడ్డి మిథున్రెడ్డిని.. ప్రజల వద్దకు వెళ్లనీయకూడదన్న ఉద్దేశంతో ఏడాది నుంచి వ్యక్తిగతంగా టార్గెట్ చేశారన్నారు. మిథున్కు మద్దతుగా నిలుస్తాం ఎంపీ మిథున్రెడ్డిని రాజకీయ కుంట్రలో భాగంగా లిక్కర్ కేసులో ఇరికించారన్నారు. ప్రజల్లో విలువ, ఆదరణను దెబ్బతీయాన్న ఉద్దేశంతో తప్పుడు కేసులో ఇరికించారని పేర్కొన్నారు. ఈ కుట్రలకు మిథురెడ్డి భయపడే వ్యక్తి కాదన్నారు. మిథున్రెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిలు ప్రజలు, పార్టీని నమ్ముకున్న వ్యక్తులన్నారు. వారికి తాము అన్ని రకాలుగా సంఘీభావంగా ఉంటామన్నారు. ఈ సమావేశంలో మాజీ ఎంపీపీ పోలు సుబ్బారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు పల్లపు రమేష్, సర్పంచ్ దండు నాగభూషణ్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
రాజకీయ కుట్రతోనే కక్ష సాధింపు
మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు రాయచోటి: ఎంపీ మిధున్రెడ్డి అక్రమ అరెస్టు ప్రజాస్వామ్యానికి చీకటి రోజని మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు. ఎంపీ మిథున్రెడ్డి అక్రమ అరెస్టును ఆయన తీవ్రంగా ఖండించారు. ఈ కేసు పూర్తిగా రాజకీయ కక్షతో పెట్టిన కేసు అని విమర్శించారు. మిథున్రెడ్డిని అరెస్ట్ చేసి ఆనంద పడుతున్నారేమో కానీ... ఇది నిలబడే కేసు కాదన్నారు. కూటమి కుట్రలో భాగంగానే మిథున్రెడ్డిని అరెస్టు చేశారన్నారు. నారా లోకేష్ రెడ్బుక్ రాజ్యాంగంలో భాగంగానే వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడుతున్నారని ఆరోపించారు. అధికారంలోకి రావడానికి కూటమి ఎన్నో తప్పుడు వాగ్దానాలు చేసిందని, ఆ వాగ్దానాలను నిలబెట్టుకోలేకపోయిందన్నారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రావడంతో తప్పుడు కేసులు పెట్టడం మొదలు పెట్టారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చి 14 నెలలు గడుస్తున్నా.. ఇంత వరకు ఏ ఒక్క సంక్షేమ కార్యక్రమం పైన దృష్టి పెట్టకుండా ప్రతిపక్ష పార్టీ నాయకులను వేధించమే పనిగా పెట్టుకున్నారన్నారు. తప్పుడు కేసులు, అరెస్టులకు భయపడేది లేదని ప్రభుత్వాన్ని హెచ్చరించారు. లిక్కర్ కేసు.. అంకెల ఆట.. లిక్కర్ కేసులో మొదటగా రూ.50 వేల కోట్ల అవినీతి జరిగిందని పేర్కొన్నారన్నారు. తరువాత రూ.30 వేల కోట్లు, మూడోసారి రూ.18 వేల కోట్లు అవినీతి జరిగిపోయిందన్నారు. తూచ్ మరలా రూ.3 వేల కోట్లు కాదు కాదని ఇప్పుడేమా రూ.2 వేల కోట్లు అవినీతి జరిగిందంటూ నోటికొచ్చినట్లు మాట్లాడుతున్నారన్నారు. లిక్కర్ కేసులో ఎటువంటి సంబంధం లేని కృష్ణమోహన్రెడ్డి, ధనుంజయరెడ్డిలను పన్నాగం ప్రకారం కేసులో ఇరికించి భయాందోళనలకు గురి చేశారన్నారు. ప్రజల్లో వైఎస్సార్సీపీ ఖ్యాతి దెబ్బతీసే కుట్రపూరిత వ్యవహారంలో భాగంగానే నేడు రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిపై కేసులు నమోదు చేశారన్నారు. -
● సీడబ్ల్యూసీ చెంతలో..
ఇప్పటికే సీడబ్ల్యూసీ చెంతకు రెండు డిజైన్లు చేరుకున్నాయి. గతంలో జలవనరుల శాఖ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ చీఫ్ ఇంజినీర్ శ్రీనివాస్యాదవ్, కడప ఎస్ఈ శ్రీనివాస్, రాజంపేట ఈఈ రవికిరణ్లు సీడబ్ల్యూసీ, పూణెలో సెంట్రల్ వాటర్ రిసోర్స్స్ పవర్ స్టేషన్లకు వెళ్లి పరిశీలించి వచ్చారు. డ్యాం రక్షణ దృష్ట్యా ఏ డిజైన్ అనుకూలంగా ఉంటుందో అనేది త్వరలోనే సీడబ్ల్యూసీ వెల్లడించనున్నది. నదీ గర్భంలో ఇసుక 40 మీటర్ల మేర లోతు వరకు ఉండటంతో.. రెండు డిజైన్లలో ఏ డిజైన్కు సీడబ్ల్యూసీ మొగ్గుచూపుతుందో వేచి చూడాల్సిందే. కాంక్రీట్ డ్యాం వరకు తీసుకుంటే 21 గేట్లు వస్తాయి, కొత్తగా తెరపైకి వచ్చిన డిజైన్ రాక్ఫిల్ డ్యాం అయితే, అదనంగా స్పిల్వే నిర్మించి 9 గేట్లను ఏర్పాటు చేసే దిశగా డిజైన్లు రూపొందించారు. -
స్వచ్ఛందంగా యువకుల రక్తదానం
కడప ఎడ్యుకేషన్ : కడప బాలాజీ నగర్లోని నెహ్రూ కేంద్ర యూత్ హాస్టల్ నందు యువకులు స్వచ్ఛందంగా రక్తదానం చేశారని స్టెప్ సీఈవో సాయి గ్రేస్, పైడి కాల్వ విజయ్కుమార్, ఖూన్కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్అలీ తెలిపారు. స్వచ్ఛంద సేవా సంస్థలు , ఖూన్ కా రిష్టా చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో శుక్రవారం రక్తదాన శిబిరం నిర్వహించారు. ఈ సందర్భంగా స్టెప్ సీఈఓ సాయిగ్రేస్ మాట్లాడుతూ జిల్లాలోని స్వచ్ఛంద సేవా సంస్థలు ఐక్యమతంగా రక్తదాన శిబిరాలు నిర్వహించడం అభినందనీయమని కొనియాడారు. బ్లడ్ బ్యాంక్ నందు రక్త నిల్వలు తక్కువ ఉన్నాయని, 18 ఏళ్లు నిండిన యువతీ, యువకులు ప్రతి మూడు నెలలకోకసారి రక్తదానం చేయుటకు ముందుకు రావాలన్నారు. దీంతో పాత కణాలు పోయి కొత్త కణాలు వచ్చి ఆరోగ్యంగా ఉంటామని తెలియజేశారు.. ఖూన్ కా రిష్టా చైర్మన్ యం.తారీఖ్అలీ మాట్లాడుతూ రక్తదాన శిబిరాల్లో ఇప్పటివరకు 315 మంది స్వచ్ఛందంగా రక్తదానం చేశారని తెలిపారు. ఈ కార్యక్రమంలో జూటురు విజయ్ కుమార్, వి.శివశంకర్, పట్టుపోగుల సుబ్బారావు, ప్రేమ్కుమార్, తదితరులు పాల్గొన్నారు. స్టెప్ సీఈఓ సాయి గ్రేస్ -
11 మంది గంజాయి విక్రేతల అరెస్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగర శివారులో గంజాయి విక్రయిస్తున్న 11 మందిని అరెస్టు చేసినట్లు జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆసిస్టెంట్ కమిషనర్ చంద్రశేఖర్రెడ్డి పేర్కొన్నారు. నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో విలేకరులతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ చింతకొమ్మదిన్నె చెరువు వద్ద గంజాయి విక్రయిస్తున్నట్లు సమాచారంతో తనిఖీలు చేసి చింతకొమ్మదిన్నెకు చెందిన కవ్వాజి పవన్కుమార్, మద్దెల వెంకట రమణ, ఖాజీపేట మండలం కొమ్మలూరు గ్రామానికి చెందిన రాజోలు చంద్రశేఖర్రెడ్డి, కడప నగరం అక్కాయపల్లెకు చెందిన షేక్ ఇంతియాజ్, చింతకొమ్మదిన్నె మండలం కృష్ణాపురానికి చెందిన కె.వెంకటసాయి, చప్పిడి దేవేంద్ర కలిసి బద్వేల్ ప్రాంతానికి చెందిన వ్యక్తి వద్ద కిలో గంజాయి రూ.15 వేలుకు కొనుగోలు చేశారన్నారు. వాటిని చిన్న 10 గ్రాముల ప్యాకెట్గా చేసి రూ.500కు కళాశాలలు, సర్కిల్ల్లో అమ్మేవారన్నారు. టాస్క్ఫోర్స్ ఇన్స్పెక్టర్ విశ్వనాథరెడ్డి, ఎస్ఐ నరసింహ, సిబ్బంది దాడి చేసి మొత్తం ఆరుగురిని అరెస్ట్ చేశారన్నారు. వారి నుంచి రెండు కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. ఇందిరానగర్లో..... ఇందిరానగర్లో కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ కృష్ణకుమార్ ఎస్ఐ మహేంద్ర సిబ్బంది దాడి చేసి గంజాయి విక్రయిస్తున్న ఐదుగురిని అరెస్ట్ చేశారు. చింతకొమ్మదిన్నె గ్రామానికి చెందిన తొండూరి అపెనుకొండ అలియాస్ బాబీ, కడప నగరం రాజీవ్ నగర్కు చెందిన గొడుగు అజీజ్ నుంచి కొని అక్కాయపల్లెకు చెందిన దేరంగుల పవన్ కళ్యాణ్, చెమ్ముమియ్యాపేటకు చెందిన ఓర్సు నరసింహ, పుట్లంపల్లెకు చెందిన పొడుతూరు గౌస్ మోహిద్దీన్ అమ్మకాలు సాగించేవారన్నారు. గంజాయి అమ్మకాలపై నిరంతరం తమ సిబ్బందితో నిఘా ఉంచామన్నారు. ప్రధాన నిందితుడు బద్వేలు ప్రాంతానికి చెందిన వ్యక్తి పరారీలో ఉన్నాడని త్వరలోనే అరెస్ట్ చేస్తామన్నారు. విద్యార్థులు, మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని కోరారు. నాలుగు కిలోల గంజాయి, ఏడు ద్విచక్ర వాహనాలు, ఆటో స్వాధీనం -
వీరభద్రస్వామికి కిలో వెండి వితరణ
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి వారికి భక్తులు కిలో వెండిని వితరణగా అందజేశారు. శుక్రవారం కర్నాటక రాష్ట్రం గుల్బర్గా జిల్లాకు చెందిన గురుమూర్తయ్య, చతురాచారి మట్లతో పాటు వారి కుటుంబ సభ్యులు స్వామి వారికి కిలో వెండిని సమర్పించారని ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి తెలిపారు. . దీనికి సంబంధించి ఆలయ అధికారులు రశీదును అందజేశారు. వీరి పేరున అర్చకులు స్వామి వారికి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు అభిషేకాలు నిర్వహించారు. తీర్థప్రాసాదాలు అందజేశారు. విరబూసిన బ్రహ్మకమలాలు రామసముద్రం: రామసముద్రం మండల కేంద్రంలోని బయన్న ఇంటి ఆవరణలో బ్రహ్మకమలం పుష్పాలు గురువారం రాత్రి విరబూశాయి. వారి ఇంటి పెరట్లో ఉన్న బ్రహ్మ కమలం చెట్టుకు సుమారు 15 పుష్పాలు పూశాయి. చుట్టుపక్కల ప్రాంతాలల ప్రజలు వీటిని చూసేందుకు అధిక సంఖ్యలో తరలివచ్చారు. ప్రతి ఏటా పుష్పాలు పూస్తాయని కుటుంబీకులు తెలిపారు. జిల్లాలో వర్షం రాయచోటి: జిల్లా వ్యాప్తంగా గురువారం రాత్రి వర్షపు జల్లులు పడ్డాయి. ఖరీఫ్ సీజన్ దాటిపోతున్న సమయంలో కురిసిన వర్షం వల్ల ఎలాంటి లాభం లేదని రైతులు మదనపడుతున్నారు. వేరుశనగ, కంది లాంటి వర్షాధార పంటలు ప్రస్తుతం సాగుచేస్తే తెలుళ్ల కారణంగా భారీగా నష్టాలు వస్తాయని చెబుతున్నారు. గురువారం రాత్రి కురిసిన వర్షాలకు వాతావరణం చల్లబడింది. శుక్రవారం సాయంత్రం కూడా జిల్లా వ్యాప్తంగా అక్కడక్కడ వర్షాలు కురిశాయి. వర్షపాతం వివరాలు ఇలా ఉన్నాయి. టి సుండుపల్లిలో 86.4 మిల్లీమీటర్లు, కేవీ పల్లిలో 85.2, నందలూరులో 67, పీలేరులో 66, వీరబల్లిలో 59.2, పెనగలూరులో 33.8, మదనపల్లెలో 32.6, ఓబులవారిపల్లిలో 30.6, చిట్వేలిలో 24.8, పుల్లంపేటలో 22.8, కోడూరులో 20.4, రాజంపేటలో 19, రామసముద్రంలో 17.2, రామాపురంలో 13, కలికిరిలో 12.4, సంబేపల్లిలో 12.4, పెద్దమండెంలో 10.8, రాయచోటిలో 10 మిల్లీమీటర్ల వంతున వర్షపాతం నమోదైంది. డెయిరీ స్థలంలో బోర్డుల ఏర్పాటుపై సర్వే మదనపల్లె రూరల్: అమూల్ డెయిరీ స్థలంలో ప్రైవేట్ వెంచర్కు చెందిన వ్యక్తులు రియల్ ఎస్టేట్కు సంబంధించి ప్రచార బోర్డులు ఏర్పాటుచేశారని ‘సాక్షి’శుక్రవారం ప్రచురితమైన కథనంపై రెవెన్యూ అధికారులు స్పందించారు. మండల తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఆదేశాలతో... ఆర్ఐ బాలసుబ్రహ్మణ్యం, సర్వేయర్ సుబ్రహ్మణ్యం, వీఆర్వో, పంచాయతీ సెక్రటరీ తదితరులు సంబంధిత స్థలంలో జాయింట్ సర్వే నిర్వహించారు. రెవెన్యూ రికార్డుల్లో నేషనల్ హైవే ఎంతవరకు ఉందో, అంతవరకు కొలతలు వేసి హద్దులను మార్కింగ్ చేశారు. అడ్వర్టైజ్మెంట్ బోర్డులు ఆర్అండ్బీ స్థలంలో ఉన్నట్లు నిర్ధారించారు. బోర్డులు ఏర్పాటుచేసిన వ్యక్తులకు నోటీసులు జారీచేసి, పంచాయతీకి పన్ను కట్టించుకోవాల్సిందిగా కార్యదర్శికి సూచించారు. అయితే..రియల్టర్లు డెయిరీకి, బెంగళూరు ప్రధాన రహదారికి మధ్య తమకు చెందిన 7 సెంట్ల స్థలం ఉందని, అందులోనే బోర్డులు ఏర్పాటుచేసుకున్నామని తెలిపారు. -
ఈ కందిపప్పు మాకొద్దు
వెనక్కు పంపించేస్తున్న అంగన్వాడీ కార్యకర్తలు బద్వేలు అర్బన్ : చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు నాణ్యతలేని కందిపప్పు సరఫరా అవుతోంది. నాసిరకంగా ఉన్న ఈ కందిపప్పు మాకొద్దు అని అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి పంపేయడం ఇందుకు అద్దం పడుతోంది. బద్వేల్ ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని బద్వేల్ మున్సిపాలిటీ, బద్వేల్ రూరల్, గోపవరం, బి.కోడూరు, అట్లూరు మండలాల్లో 180 అంగన్వాడీ కేంద్రాలున్నాయి. వాటిలో కొన్నింటికి ఇటీవల సరఫరా చేసిన కందిపప్పు పురుగులతో బూజుపట్టి ఉంది. దీంతో చిన్నారుల తల్లిదండ్రులు, గర్భిణులు, బాలింతలు తీసుకునేందుకు నిరాకరించారు. చేసేది లేక అంగన్వాడీ కార్యకర్తలు ఎంఎల్ఎస్ పాయింట్లో తిరిగి ఇచ్చేస్తున్నారు. నాసిరకం కందిపప్పు పంపిణీ చేయడంతో సమస్యలు ఎదురైతే మేము ఇబ్బంది పడాల్సి వస్తుందని అంగన్వాడీ కార్యకర్తలు వాపోతున్నారు. 36 క్వింటాళ్ల నాసిరకం కందిపప్పు వచ్చింది ఇటీవల ఎంఎల్ఎస్ పాయింట్కు వచ్చిన 36 క్వింటాళ్ళ కందిపప్పు నాసిరకంగా ఉంది. ఆగస్టు వరకు గడువు ఉన్నా.. కొంతమేర బూజు పట్టి ఉండడం చూసి జిల్లా ఉన్నతాధికారులకు విషయం విన్నవించాను. తక్షణమే కందిపప్పును వెనక్కి పంపించాలని ఆదేశాలిచ్చారు. అంగన్వాడీ కార్యకర్తలు వెనక్కి తెస్తున్న కందిపప్పు స్థానంలో మంచి కందిపప్పు అందిస్తున్నాం. – అలీఖాన్, ఎంఎల్ఎస్ పాయింట్ ఇన్చార్జి -
నిరక్షరాస్యులకు వయోజన విద్య అందించాలి
రాయచోటి: అక్షర ఆంధ్ర కార్యక్రమం ద్వారా నిరక్షరాస్యులకు వయోజన విద్యను అందించి 2029 నాటికి జిల్లాను నూరుశాతం అక్షరాస్యత కలిగిన జిల్లాగా మార్చడమే ధ్యేయమని కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లో అక్షర ఆంధ్ర, ఉల్లాస్ కార్యక్రమాలపై జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని కలెక్టర్ అధ్యక్షతన నిర్వహించారు. అక్షర ఆంధ్ర, ఉల్లాస్ కార్యక్రమాలపై వివిధ అంశాలను కలెక్టర్కు విద్యాశాఖ డిప్యూటీ డైరెక్టర్ సుబ్బారెడ్డి వివరించారు. 2024–25లో 13767 మంది ఈ కార్యక్రమంలో వయోజన విద్య తీసుకున్నారని, దాదాపు 91 శాతం మంది పరీక్షలను విజయవంతంగా పూర్తి చేశారన్నారు. 2025–26 సంవత్సరానికి జిల్లాలో 85605 మంది నిరక్షరాస్యులను అక్షరాస్యులుగా చేసే లక్ష్యంతో కార్యక్రమాన్ని రూపొందించినట్లు తెలిపారు. వయోజనులు చదవడం, రాయడమే కాకుండా డిజిటల్ అక్షరాస్యతపై కూడా దృష్టి పెట్టబోతున్నామని కలెక్టర్ అన్నారు. కార్యక్రమానికి సంబంధించిన పాఠ్యప్రణాళిక పర్యవేక్షణ సిస్టమ్లను టీసీఎస్ సంస్థ ఎటువంటి లాభాపేక్ష లేకుండా ఉచితంగా ప్రభుత్వానికి అందించిందన్నారు. అనంతరం కలెక్టర్ కమిటీలోని వివిధ సభ్యులకు వివిధ సూచనలు చేశారు. గ్రామాల్లో విద్యను అభ్యసించబోయే వారిని గుర్తించడానికి గ్రామ సహాయకులను ఎంపిక చేయాలని, ఎంపిక చేసిన గ్రామ సహాయకులకు తగిన శిక్షణ ఇవ్వాలని డీఆర్డీఏ పీడీకి కలెక్టర్ సూచించారు. విద్యనభ్యసించే వారికి తరగతులను ఏర్పాటు చేసేందుకు అంగన్ వాడీ కేంద్రాలను ఇచ్చేందుకు చర్యలు తీసుకోవాలని ఐసీడీఎస్ పీడీకి సూచించారు. మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధిహామీ పథకంలో పాల్గొనే పురుషులను ఈ కార్యక్రమంలో పాలు పంచుకునేలా చేసి అక్షరాస్యతను పెంచాలని డ్వామా పీడిని ఆదేశించారు. సమావేశంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
కర్తవ్యం మరిచి కాసుల వేట
సాక్షి టాస్క్ఫోర్స్: పవిత్రమపుణ్యక్షేత్రమైన శ్రీ కోదండరామస్వామి కొలువై ఉన్న ఒంటిమిట్ట (ఏకశిలానగరం)లో ఖాకీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ.. బాధితులను ఇబ్బందులకు గురి చేస్తున్నారనే అపవాదును మూటగట్టుకున్నారు. ఖాకీ రాజ్యం నడుస్తోందని,రాజ్యాంగపరంగా ఐపీసీ సెక్షన్లు అమలు కావడంలేదనే ఆరోపణలు బహిరంగంగానే వినిపిస్తున్నాయి. ఈ ఠాణా నిర్వహణ అస్తవ్యస్తంగా తయారైందన్న విమర్శలున్నాయి.న్యాయం మాట అటుంచితే స్టేషన్కు వెళ్లాలంటే జనం భయపడుతున్నారనే టాక్ నడుస్తోంది. ఎస్ఐ లేకపోవడంతో ఎవరికివారే ఎస్ఐలుగా వ్యవహరించి, అందినకాడికి జేబులు నింపుకుంటున్నారనే ఆరోపణలు వెలువడుతున్నాయి. అక్రమ మాఫియాకు అగ్రతాంబూలం లభిస్తోంది. అంటే సామాన్య ప్రజలకు న్యాయం దూరమైందనే వాదనలు ఉన్నాయి. చట్ట విరుద్ధమైన పనులు జరిగితేనే తమ జేబులు నిండుతాయనే ధోరణిలో ఖాకీలు లోపాయకారి ఒప్పందాలు చేసుకుంటున్నట్లు బహిరంగంగానే విమర్శలు వినిపిస్తున్నాయి. శాఖపరమైన నిఘా వ్యవస్థలు పడకేశాయని, అందువల్ల జిల్లా బాస్కు సరైన రీతిలో ఠాణా వ్యవహారం తెలిసినట్లు లేదనే ఆరోపణలున్నాయి. స్టేషన్ గడప తొక్కాలంటే.. అక్రమంగా, అన్యాయమైన కేసులు, అధికార పార్టీలకు కొమ్ము కాయడం, బాధితుల పట్ల అసభ్య ప్రవర్తన, అక్రమ పనులు చేసే మాఫియాల వద్ద నుంచి నెల సరి మామూళ్ల జోష్ నడుస్తోందని విశ్వసనీయంగా తెలిసింది. న్యాయం కోసం ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ గడప తొక్కాలంటే జనం భయపడుతున్నారు. న్యాయం చేయండి అంటు వెళ్లిన వారిపై ఎక్కడ తప్పుడు కేసులు పెడతారోనని అటుగా కన్నెత్తి చూడటంలేదు. ఇటీవల జరిగిన సంఘటనలు.. ● 2025 జులై 5వ తేదీన ఒంటిమిట్ట మండలంలోని రాచపల్లికి చెందిన లాలయ్య తన భార్య వివాహేతర సంబంధం పెట్టుకున్న విషయంలో స్థానిక పోలీసు స్టేషన్ ని ఆశ్రయించాడు. అక్కడ పనిచేస్తున్న సిబ్బంది అసభ్యపదజాలంతో అవమానంగా మాట్లాడారని మనస్థాపంతో రైలు కింద పడ్డాడు. జులై 6న ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ ఎదుట లాలయ్య మృతదేహంతో బంధువులు, గ్రామస్తులు నిరసన చేసిన ఘటన రాష్ట్ర వ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ● మండలంలో టీడీపీ వర్గాలు ఆదిపత్య పోరుతో ఒంటిమిట్ట చెరువు మట్టి అక్రమంగా రవాణా చేసే విషయంలో ఓ వర్గం వారు అనుమతి లేని టిప్పర్లను ఉపయోగించడంతో టిప్పర్లను సీఐ బాబు పట్టుకున్నారు. కాని కేసు నమోదు చేయకుండా విడిచిపెట్టడంతో ఇరు వర్గాల మద్య ఘర్షణకు దారి తీసింది. తరువాత పోలీసుల పద్దతిలో ఇరు వర్గాలకు బుద్ధి చెప్పారు. ఈ విషయంలో ఖాకీల నిర్లక్ష్యం బహిర్గతమైంది. ● జులై 10వ తేదీ రాత్రి 8:30 గంటల సమయంలో స్థానిక హరిత హోటల్కు భోజనానికి వచ్చిన కడపకు చెందిన సయద్ గుద్బుద్ధీన్ అనే వ్యక్తి అక్కడ ఘర్షణ పడుతున్న ఇద్దరిని విడదీయబోతే, అప్పుడే వచ్చిన ఒంటిమిట్ట పోలీసు కానిస్టేబుళ్లను చూసి గొడవ పడుతున్న వారు పారిపోయారు. సర్ది చెప్పబోయిన వ్యక్తి సయద్ గుద్బుదిన్ను ఆ సమయంలో ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించి, బాస్ ఆదేశాల మేరకు కానిస్టేబుళ్లు అతన్ని ఒంటిమిట్ట పోలీసు స్టేషన్కు తీసుకెళ్లారు. అతని వద్ద ఉన్న రూ. 1,22, 500 లాక్కున్నారని, తెల్లపేపర్పై సంతకం పెట్టమంటే పెట్టలేదని తనపై పోలీసు పద్ధతిలో థర్డ్ డిగ్రీ అమలు చేశారని కడప రిమ్స్లో బాధితుడు రోదించిన సంగతి తెలిసిందే. ● జులై 11వ తేదీ ఒంటిమిట్ట ఎస్సీ కాలనీలో ఇంటి ఎదురుగా ఉన్న ఓ వివాహిత వద్దకు చదువుకున్న యువకుడు వెళ్లి లైంగిక వేధింపులకు గురి చేశాడని.. ఎలాంటి సాక్ష్యాలు లేకుండా బాధితురాలు ఫిర్యాదు చేయడంతో అతనిపై 356– ఎ సెక్షన్ ప్రకారం కేసు నమోదు చేసి, స్టేషన్ బేయిల్ అడిగితే ఇవ్వకుండా అక్రమ మాఫియా మామూళ్ల మత్తులో నాలుగు రోజుల పాటు ఒంటిమిట్ట పోలీసు స్టేషన్లోనే ఉంచుకుని, ఎలాంటి నేర చరిత్ర లేని యువకుడి జీవితాన్ని నాశనం చేసే విధంగా స్థానిక రెవెన్యూ కార్యాలయంలో తహసీల్దార్ ఎదుట హాజరు పరచారు. ఉద్దేశ పూర్వకంగా బైండోవర్ కేసు నమోదు చేశారు. ఈ ఘటన అధికార అహంకారానికి నిదర్శనంగా నిలుస్తోంది. మూడునెలలుగా ఎస్ఐ లేడు ఈ ఠాణాలో ఎస్ఐ(సబ్ ఇన్స్పెక్టర్) లేక 3 నెలలు గడుస్తోంది. ఇప్పటివరకు ఎస్ఐను నియమించకపోవడానికి అనేక కారణాలు వినిపిస్తున్నాయి. అంతా ఒక ఉన్నతాఽధికారే చూసుకుంటున్నారు. రెండు నెలల నుంచి ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ రాష్ట్ర స్థాయిలో రచ్చకెక్కింది. దీంతో పోలీసుస్టేషన్ తీరుతెన్నులపై ఉన్నతస్థాయికి ప్రజల నుంచి ఫిర్యాదులు వెళుతున్నాయి. రాష్ట్ర, జిల్లా, మండల స్థాయిలో పోలీసుస్టేషన్ అపకీర్తిని మూటకట్టుకుంది. ఒంటిమిట్ట ఠాణాలో ఖాకీల ఇష్టారాజ్యం అక్రమ మాఫియాకే అగ్రతాంబూలం పడకేసిన నిఘా వ్యవస్థలు... ఠాణా గడప తొక్కాలంటే జనంలో భయం -
విద్యుత్ షాక్తో వ్యక్తి మృతి
సుండుపల్లె : విద్యుత్ షాక్తో చందు(19) అనే వ్యక్తి మృతిచెందిన సంఘటన శుక్రవారం మండల కేంద్రంలోని అగ్రహారంలో చోటుచేసుకుంది. వివరాలలోకి వెళ్లితే.. అగ్రహారం నుంచి ఎంపీడీఓ కార్యాలయానికి వెళ్లే రహదారిలో పఠాన్ సైఫుల్లాఖాన్ కొత్త ఇంటిని నిర్మిస్తున్నారు. రాయచోటి పట్టణం ఏజీ గార్డెన్ కాలనీకి చెందిన చందు ఇంటికి కాంక్రీట్ మిక్సింగ్ పనికి వచ్చి లిఫ్ట్కు కట్టెలు కడుతున్నారు. ఈ సమయంలో తడితో ఉండే తాడుకు ప్రమాదవశాత్తూ పక్కనే ఉన్న 11కెవీ కరెంటు వైర్లు తగిలి షాక్కు గురయ్యాడు. మిద్దైపె నుండి కిందపడి కొన ఊపిరితో ఉన్న క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఐచర్ వాహనంలో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. డాక్టర్ పరిశీలించి అప్పటికే చందు చనిపోయినట్లు నిర్ధారించారు. మతుడి తండ్రి జగన్నాథంబాషా ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. 13 ఇసుక ట్రాక్టర్ల పట్టివేత వీరబల్లి : మాండవ్య నది నుంచి అక్రమంగా ఇసుక తరలిస్తున్న 13 ట్రాక్టర్లను తహసీల్దారు ఖాజాబీ శుక్రవారం పట్టుకుని స్థానిక పోలీస్ స్టేషన్లో అప్పగించారు. ఆమె మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా ఇతర ప్రాంతాలకు ఇసుక ట్రాక్టర్లలో తరలిస్తున్నారని తెలిపారు. ఇసుక తరలింపుతో బోర్లలో నీరు ఇంకిపోతోందని స్థానికులు తెలిపారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని కూలీ మృతి మదనపల్లె రూరల్ : గుర్తుతెలియని వాహనం ఢీకొని కూలీ మృతిచెందిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె పట్టణంలో జరిగింది. స్థానిక కనకదాస నగర్కు చెందిన మల్లయ్యనాయుడు కుమారుడు జి.వెంకటరమణనాయుడు(50) నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్లో కూలీగా పనిచేస్తున్నాడు. గురువారం పనుల అనంతరం కాలినడకన ఇంటికి వెళ్తుండగా భవానీనగర్ క్రాస్ నూర్ హోటల్ వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. తీవ్ర గాయాలైన అతడిని ఆస్పత్రికి తరలించగా.. పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. మృతుడికి భార్య కళావతి, కుమారులు మణికంఠ, సాయికుమార్, కుమార్తె ప్రసన్న లక్ష్మి ఉన్నారు. మణికంఠ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు టూటౌన్ సీఐ రామచంద్ర తెలిపారు. -
ఆటోమొబైల్ దుకాణం తనిఖీ
రాయచోటి జగదాంబసెంటర్ : కడప రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ అధికారి శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రాయచోటి–చిత్తూరు రోడ్డులోని రాందేవ్ ఆటోమొబైల్స్ షాపును విజిలెన్స్ అధికారులు శుక్రవారం ఆకస్మికంగా తనిఖీ చేశారు. దుకాణంలో కొనుగోలు చేసే వస్తువులపై ఎంఆర్పీ ధరలు లేవని, జీఎస్టీ లైసెన్సు లేకుండా వ్యాపారాన్ని నిర్వహిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. రాజధాని ఆటో మొబైల్స్, రాందేవ్ ఆటోమొబైల్స్ పేర్లతో వేర్వేరుగా యజమాని వ్యాపార కార్యకలాపాలు కొనసాగిస్తున్నట్లు తనిఖీ అధికారులు గుర్తించారు. ఈ షాపులో సేల్ బిల్స్ ఇవ్వడంలేదని గుర్తించి దుకాణాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. ఈ తనికీల్లో ఎం.శివన్న, గీతావాణి, బాబుమోజెస్, రామకృష్ణ, సిబ్బంది పాల్గొన్నారు. వేర్వేరు ప్రమాదాల్లో ఎనిమిది మందికి గాయాలు మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఎనిమిది మంది తీవ్రంగా గాయపడి మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మదనపల్లె మండలం సీటీఎం పంచాయతీ వంక వడ్డిపల్లెకు చెందిన ఈశ్వరయ్య(65), అతడి భార్య సుందరమ్మ(60) గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు వచ్చారు. గ్రామంలో గొడవ విషయమై తాలూకా పోలీస్ స్టేషన్లో ఫిర్యాదుచేసి స్వగ్రామానికి వెళ్తున్నారు. కొత్తవారిపల్లె సమీపంలో ఎదురుగా వచ్చిన మరో ద్విచక్ర వాహనం వీరిని ఢీకొంది. ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. అదే విధంగా పీలేరుకు చెందిన తరుణ్(20), అష్రఫ్(22), నిఖిల్(21), బాలాజీ(23), ప్రేమ్కుమార్(22) వ్యక్తిగత పనులపై గురువారం కారులో మదనపల్లెకు వచ్చారు. పనులు ముగించుకుని శుక్రవారం తెల్లవారుజామున తిరిగి పీలేరుకు బయలుదేరారు. బైపాస్ దారిలో వెళుతుండగా కొత్తవారిపల్లె సమీపంలో వాహనం అదుపుతప్పి డివైడర్ను ఢీకొంది. ప్రమాదంలో ఐదుగురు గాయపడగా స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదే విధంగా బి.కొత్తకోటకు చెందిన హేమకుమార్ గురువారం రాత్రి ద్విచక్ర వాహనంలో బెంగళూరుకు వెళ్తున్నారు. గౌనిపల్లె సమీపంలో గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108లో బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. -
విద్యుత్తు స్తంభాన్ని ఢీకొని ఇద్దరు దుర్మరణం
ముద్దనూరు : ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలోని గంగాదేవిపల్లె సమీపంలో శుక్రవారం వేగంగా వస్తున్న లారీ రహదారి ప్రక్కనే వున్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ కమల్ సాహెబ్(64), క్లీనరు ఫకృద్దీన్(45) అక్కడికక్కడే దుర్మరణం చెందారు. ఎస్ఐ మైనుద్దీన్ సమాచారం మేరకు.. బళ్లారి నుంచి ఇనుప పైపుల లోడుతో లారీ చైన్నెకు వస్తోంది. శుక్రవారం తెల్లవారుజామున గంగాదేవిపల్లె సమీపంలోకి రాగానే వేగం అదుపుతప్పి లారీ రహదారి ప్రక్కనే ఉన్న విద్యుత్ స్తంభాన్ని ఢీకొని బోల్తా పడింది. లారీలో ఉన్న డ్రైవరు, క్లీనరుపై ఇనున పైపులు పడిపోయాయి. దీంతో ఇరువురు క్యాబిన్లో ఇరుక్కపోయి చనిపోయారు. సమచారం తెలుసుకున్న పోలీసులు సంఘటనాస్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. మృతిచెందిన వారు బళ్లా రి వాసులుగా గుర్తించామని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
రూ.20 లక్షల విలువైన ఎర్రచందనం స్వాధీనం
ఏడుగురు నిందితుల అరెస్ట్పీలేరు : రూ.20 లక్షల విలువైన ఎర్ర చందనం స్వాధీ నం చేసుకుని ఏడుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు పీలేరు డీఎఫ్వో గురుప్రభాకర్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. ఎర్రచందనం అక్రమంగా తరలిస్తున్నట్లు సమాచారం అందడంతో శుక్రవారం తెల్లవారుజాము నుంచి కల్లూరు నాలుగు రోడ్ల కూడలిలో వాహనాలను తనిఖీ చేశారు. అనుమానాస్పదంగా వచ్చిన మారుతి సుజుకీ వాహనాన్ని తనిఖీ చేయగా 13 ఎర్రచందనం దుంగలున్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. వాహనంతోపాటు ఎర్రచందనం స్వాధీనం చేసుకుని తమిళనాడుకు చెందిన నిందితులను అరెస్ట్ చేశారు. అరెస్ట్ అయిన వారిలో ఏలుమలై, సెంథిల్, అన్బలగన్, రామన్, అన్నాదొరై, కుప్పుస్వామి, మణి ఉన్నట్లు డీఎఫ్వో వివరించారు. ఈ దాడిలో ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ చంద్రశేఖర్, సిబ్బంది ప్రకాష్కుమార్, ప్రతాప్, రెడ్డిప్రసాద్, నందీశ్వరయ్య పాల్గొన్నారు. -
పాత పింఛన్ అమలు చేయాలని నిరసన
కడప ఎడ్యుకేషన్ : తమకు పాత పెన్షన్ విధానం అమలుచేయాలని డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం నాయకులు ఉపాధ్యాయ సంఘాల సమన్వయ వేదిక రాష్ట్ర గౌరవాధ్యక్షుడు ఒంటేరు శ్రీనివాసులరెడ్డి, ఎన్జీఓ జిల్లా అధ్యక్షుడు శ్రీనివాసులు, ఎస్టీయూ రాష్ట్ర కార్యదర్శి మల్లు రఘనాథరెడ్డి డిమాండ్ చేశారు. కడప కలెక్టరేట్ వద్ద డీఎస్సీ 2003 ఉపాధ్యాయ ఫోరం జిల్లా కన్వీనర్ గుజ్జల తిరుపాల అధ్యక్షతన ఉపాధ్యాయులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మెమో నెంబర్ 57ను అమలు చేసి పాత పెన్షన్ పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర అదనపు ప్రధాన కార్యదర్శి వెంకటజనార్దనరెడ్డి, ఎన్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు కొండూరు జనార్దన్రాజు, పీఎస్టీయూ రాష్ట్ర అధ్యక్షుడు లెక్కల జమాల్రెడ్డి, ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి, యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి లక్ష్మిరాజా, ఎస్ఎల్డీఏ రాష్ట్ర అధ్యక్షుడు అంకాల్ కొండయ్య మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన మెమో నెంబర్ ప్రకారం అర్హులైన వారందరికీ పాత పెన్షన్ వర్తింపచేయాలన్నారు. ఈ కార్యక్రమంలో ఫోరం కన్వీనర్లు సుధాకర్, చాంద్బాషా, రాచమల్లు ప్రసాద్రెడ్డి, సునీత, రవీంద్రనాథ్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
పక్కాగృహాల నిర్మాణం వేగవంతం చేయాలి
పెద్దమండ్యం: లే అవుట్లలో పక్కాగృహాల నిర్మాణం పనులను వేగవంతం చేయాలని జిల్లా సాంఘిక సంక్షేమశాఖ డిప్యూటీ డైరక్టర్ ఎస్. కృష్ణ అన్నారు. మండలంలోని తురకపల్లెకు శుక్రవారం విచ్చేశారు. శిద్దవరంలో కస్తూర్భా విద్యాలయం, కలిచెర్లలో బీసీ హాస్టల్, పెద్దమండ్యంలో 1, 2 అంగన్వాడీ కేంద్రాలు, మోడల్ పాఠశాల, వసతి గృహం, ప్రాథమిక పాఠశాల, లేఅవుట్లో పక్కాగృహాల నిర్మాణం, పీహెచ్సీని ఆయన తనిఖీ చేశారు. లే అవుట్లో మంజూరైన పక్కాగృహాలు ఎన్ని, గృహాల నిర్మాణం పనులు ఎలా జరుగుతున్నాయని సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు. పక్కాగృహాల నిర్మాణాలు వేగవంతం చేయాలని ఆదేశించారు. పీహెచ్సీకి వచ్చే రోగుల సంఖ్య, అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు. ఆసుపత్రికి వచ్చే రోగులకు మెరుగైన వైద్య సేవలు అందించాలని అన్నారు. ప్రాథమిక పాఠశాలలో విద్యార్థులతో కలిసి మధ్యాహ్న భోజనం చేశారు. పాఠశాలలో సౌకర్యాపై విద్యార్థులతో మాట్లాడారు. అంగన్వాడీ కేంద్రాల్లో చిన్నారులకు అందిస్తున్న పౌష్టికాహారం గురించి అడిగి తెలుసుకున్నారు. కలిచెర్లలో బీసీ హాస్టల్ను తనిఖీ చేశారు. హాస్టల్ ఉన్న విద్యార్థుల సంఖ్య, ఉన్న వసతులపై ఆరా తీశారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీవో శ్రీధర్రావు, ఏఈ అక్రమ్, పంచాయతీ కార్యదర్శులు పాల్గొన్నారు. -
ఎరువులను అధిక ధరకు విక్రయిస్తే చర్యలు
మదనపల్లె రూరల్: ఎరువులను అధిక ధరలకు విక్రయించినా, కృత్రిమ కొరత సృష్టించినా కఠినచర్యలు తప్పవని విజిలెన్స్, వ్యవసాయశాఖ అధికారులు హెచ్చరించారు. శుక్రవారం మదనపల్లె మండలంలోని ఐమాక్స్ ఫెర్టిలైజర్స్ అండ్ కెమికల్స్ ప్రైవేట్ లిమిటెడ్, శ్రీ భావనా ఆగ్రో ఏజెన్సీస్, రైతుమిత్ర, ప్రసాద్ ఆగ్రోనీడ్స్, కిసాన్ అగ్రిమార్ట్ దుకాణాల్లో స్పెషల్ స్క్వాడ్ బృందం ఆకస్మికంగా తనిఖీలు చేపట్టింది. స్టాక్ రిజిస్టర్లు, నిల్వలను అధికారులు పరిశీలించారు. ఈ సందర్భంగా.. స్పెషల్ స్క్వాడ్ తనిఖీ బృందంలోని కల్యాణదుర్గం ఏడీఏ యల్లప్ప, తిరుపతి విజిలెన్స్ సీఐ చంద్రశేఖర్ మాట్లాడుతూ, ప్రభుత్వ నిబంధనల మేరకు ఎరువులు విక్రయించాలన్నారు. నిబంధనలు పాటించకపోతే చర్యలు తప్పవన్నారు. యూరియా బస్తాలను ఎంఆర్పీకే విక్రయించాలని, అందరికీ అందుబాటులో తగినన్ని యూరియా బస్తాలు ఉంచాలన్నారు. అనుమతిలేని దుకాణాల్లో ఎరువులు, పురుగుమందులు అమ్మితే చట్టప్రకారం శిక్షలు అమలుచేస్తామన్నారు. తనిఖీల్లో భాగంగా కిసాన్ అగ్రిమార్ట్లో అనుమతులు లేని 1లక్ష 14వేల రూపాయల విలువైన పురుగుమందులు సీజ్ చేశామన్నారు. తనిఖీల్లో మండల వ్యవసాయాధికారి నవీన్, సిబ్బంది పాల్గొన్నారు. -
పాఠశాలలో స్కౌట్ యూనిట్ తప్పనిసరి
రాయచోటి: ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో స్కౌట్ యూనిట్ను తప్పనిసరిగా ఏర్పాటు చేయాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్యణ్యం సూచించారు. రాయచోటి పట్టణం, గాలివీడు మార్గంలోని అర్బన్ కళాశాలలో శుక్రవారం భారత స్కౌట్స్ అండ్ గైడ్స్లోని 250 మంది యూనిట్ లీడర్లకు ఒక్కరోజు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థుల్లో దేశభక్తి, క్రమశిక్షణ, సేవాభావం, నాయకత్వ లక్షణాలను పెంపొందించడానికి స్కౌట్ శిక్షణ దోహదపడుతుందన్నారు. పీఎంశ్రీ పాఠశాలల నుంచి అవగాహన సమావేశానికి గైర్హాజరైన వారికి షోకాజ్ నోటీసులు జారీ చేస్తామన్నారు. ఓపెన్ స్కూల్ జిల్లా కో–ఆర్డినేటర్ కొండూరు శ్రీనివాసరాజు మాట్లాడుతూ స్కౌట్లో ప్రవేశం పొందడం వల్ల విద్యార్థులకు దేహదారుఢ్యంతోపాటు విద్య, ఉద్యోగ అవకాశాలలో రిజర్వేషన్ సౌకర్యం లభిస్తుందన్నారు. అర్బన్ కళాశాల కరస్పాండెంట్ మదన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ స్కౌట్స్ అండ్ గైడ్స్ వల్ల నిజాయితీ, సుగుణ శీలత లాంటి ఉత్తమ పౌరసత్వ లక్షణాలు విద్యార్థులలో పెంపొందుతాయన్నారు. స్కౌట్ జిల్లా కార్యదర్శి మడితాటి నరసింహారెడ్డి అకాడమిక్ క్యాలెండర్ ప్రకారం పాఠశాలల్లో నిర్వహించాల్సిన స్కౌట్ కార్యకలాపాలు గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమీషనర్ లక్ష్మీకర్, అసిస్టెంట్ సెక్రటరీ భాస్కర్ రెడ్డి, అడ్వాన్స్ స్కౌట్ మాస్టర్స్ మహమ్మద్ ఖాన్, సుజాత, స్కౌట్ కమ్యునిటీ డెవలప్మెంట్ సభ్యులు లక్ష్మీరెడ్డి తదితరులు పాల్గొన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్యణ్యం -
ఉపాధ్యాయుల వేతన సమస్యలను పరిష్కరించాలి
కడప ఎడ్యుకేషన్ : జిల్లా వ్యాప్తంగా ఉపాధ్యాయుల వేతన సమస్యలను వెంటనే పరిష్కరించాలని ఏపీటీఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు శ్యాంసుందర్రెడ్డి కోరారు. జిల్లా ఖజానా శాఖ ఉప సంచాలకులు వెంకటేశ్వర్లును శుక్రవారం ఆయన కలిసి వినతిపత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జూన్లో టీచర్ల బదిలీలు జరగ్గా.. రీఅపోర్షన్లో భాగంగా నూతన పాఠశాలలలో చేరిన ఉపాధ్యాయులకు వెంటనే పొజిషన్ ఐడీలను కేటాయించాలన్నారు. జూన్ నెల నుంచి వేతనం చెల్లించడానికి అవసరమైన చర్యలు తీసుకోవాలని కోరారు. 24 ఏళ్లు పూర్తయిన టీచర్లకు ఆటోమేటిక్ అడ్వాన్స్మెంట్ స్కేల్ మంజూరు చేయడంలో జాప్యం లేకుండా చూడాలని, పదవీవిరమణ చెందిన టీచర్లకు పెన్షన్ మంజూరు పత్రాలు పంపడంలో జాప్యం చేయవద్దని డిమాండ్ చేశారు. సరెండర్ లీవు బిల్లులను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షుడు ఖాదర్బాషా, అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు హరిబాబు, జిల్లా కౌన్సిలర్లు రామచంద్రారెడ్డి, రామసుధాకర్రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 క్రికెట్ మ్యాచ్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు రెండో రోజున ఉత్సాహంగా సాగాయి. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో నెల్లూరు– అనంతపురం జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. 93 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన అనంతపురం జట్టు 60.2 ఓవర్లలో 203 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని టి.కిరణ్కుమార్ 66, సాత్విక్ 23 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని నేత్రానంద నాలుగు, విక్రాంత్రెడ్డి 2, రిత్విక్ రెండు వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 61 ఓవర్లలో ఆరు వికెట్ల నష్టానికి 225 పరుగులు చేసింది. ఆ జట్టులోని గురు మోహన్ 66 పరుగులు, రిషికుమార్రెడ్డి 57 పరుగులు, చేశారు. అనంతపురం జట్టులోని దేవాన్ష్ 3 వికెట్లు తీశాడు. దీంతో నెల్లూరు జట్టు 246 పరుగుల అధిక్యంలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. వైఎస్ఆర్ఆర్ ఏసీసీ స్టేడియంలో...... వైఎస్సార్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో కడప– కర్నూలు జట్ల మధ్య మ్యాచ్ కొనసాగింది. రెండో రోజు శుక్రవారం 54 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో మ్యాచ్ ప్రారంభించిన కడప జట్టు 51.2 ఓవర్లలో 114 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సీఎండీ పైజాన్ 40, కశ్వప్రెడ్డి 23 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని వై.రిత్విక్ కల్యాణ్ ఐదు, సాయి విఘ్నేష్ 2, వివేక్ 2 వికెట్లు తీశారు. అనంతరం రెండో ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 57.5 ఓవర్లలో 140 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రోహిత్ గౌడ్ 51 పరుగులు, హరిహరన్ 22 పరుగులు చేశారు. కడప జట్టులోని జయ ప్రణవ్ శ్రాస్తి 3 వికెట్లు, చెన్న కేశవ 2 వికెట్లు, గైబు 2 వికెట్లు తీశారు. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. -
మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదు
సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య కడప వైఎస్ఆర్ సర్కిల్ : దేశాన్ని ప్రగతి పథాన నడిపించడంలో కేంద్ర ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని, మోదీ, చంద్రబాబుతో రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యులు జి.ఈశ్వరయ్య అన్నారు. కడప నగరంలోని విశ్వేశ్వరయ్య ఇంజినీరింగ్ భవన్లో సీపీఐ కడప నగర సమితి ఏడో మహా సభలు శుక్రవారం నిర్వహించారు. ముందుగా కడప నగర పాలక సంస్థ కార్యాలయం నుంచి సంధ్య సర్కిల్, ఎర్రముక్కపల్లి సర్కిల్, గాంధీనగర్ మున్సిపల్ హైస్కూల్ మీదుగా విశ్వేశ్వరయ్య మందిరం వరకూ ర్యాలీగా వస్తూ నినాదాలు చేశారు. ఈ సందర్భంగా ఈశ్వరయ్య మాట్లాడుతూ 2014 ఎన్నికల్లో ప్రజలకిచ్చిన హామీలు మోదీ ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. అదానీ, అంబానీ వంటి కార్పొరేట్ శక్తులకు దేశ సంపద దోచిపెడుతున్నారని ఆరోపించారు. మత విద్వేషాలు రెచ్చగొట్టి లౌకిక రాజ్యాంగాన్ని మార్చాలని కుట్ర చేయడం, మనుస్మతి విధానాలతో పాలన చేస్తున్నారని దుయ్యబట్టారు. మోదీ, బాబు డబుల్ ఇంజిన్ సర్కార్ రాష్ట్రాన్ని అప్పులపాలు చేస్తున్నాయని, చంద్రబాబు 21 సార్లు దిల్లీకి వెళ్లి రూ.3600 కోట్లు అప్పు తెచ్చారన్నారు. పెండింగ్లో ప్రాజెక్టులను ప్రక్కన పెట్టి బసకచర్ల నిర్మాణం అంశాన్ని తెరమీదకు తీసుకురావడాన్ని తప్పుబట్టారు. అంతర్జాతీయ విమానాశ్రయం కోసం మరో 40 వేల ఎకరాల భూ సేకరణ, మెట్రో రైలు అంటూ అరచేతిలో వైకుంఠం చూపిస్తున్నారని విమర్శించారు. జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ రాష్ట్రంలో మద్యం, ఇసుక దోపిడీ యథేచ్ఛగా జరుగుతున్నాయని, మద్యం అమ్మగా వచ్చిన డబ్బుతో సంక్షేమ పథకాలు అమలు చేయడాన్ని ఆయన తప్పుబట్టారు. సూపర్ సిక్స్ పథకాల అమలులో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు ఎన్.వెంకటశివ, ఎల్.నాగసుబ్బారెడ్డి, పి.చంద్రశేఖర్, జి.వేణుగోపాల్, విజయలక్ష్మి, నాగార్జునరెడ్డి, చెంచయ్య మల్లికార్జున, మనోహర్రెడ్డి, లింగన్న పాల్గొన్నారు. -
అమూల్ డెయిరీ స్థలంలో రియల్ ఎస్టేట్ బోర్డులు
మదనపల్లె రూరల్ : కడప–బెంగళూరు హైవేలోని మదనపల్లె అమూల్ డెయిరీ స్థలంలో ఓ రియల్టర్ తన వెంచర్కు సంబంధించిన బోర్డులు శాశ్వతంగా ఏర్పాటుచేశాడు. ప్రభుత్వ డెయిరీకి చెందిన స్థలంలో ప్రైవేట్ వ్యక్తులు రియల్ఎస్టేట్ బోర్డులు ఏర్పాటుచేయడంపై సిబ్బంది తహసీల్దారు కిషోర్కుమార్రెడ్డికి ఫిర్యాదు చేసినప్పటికీ, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. దీంతో రోడ్డుపై వెళుతున్న వారు అమూల్ డెయిరీని రియల్ఎస్టేట్ వ్యాపారులకు అమ్మి వేసిందా అనే అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలోని బెంగళూరు ప్రధాన రహదారికి ఆనుకుని నక్కలదిన్నె సమీపంలోని సర్వే నెం.42/1బీ, 43/1బీలో నాలుగెకరాల భూమిని 1977లో కేంద్ర ప్రభుత్వం డెయిరీ స్కీమ్లో భాగంగా స్థానిక రైతుల నుంచి కొనుగోలు చేసింది. కొనుగోలు పత్రాల్లో డెయిరీ సరిహద్దుల్లో ఉత్తరం వైపు మదనపల్లె–బెంగళూరు రోడ్డు, తూర్పున ఎద్దుల బండిబాట, మిగిలిన రెండు పక్కల తుమ్మలకాలువగా పేర్కొన్నారు. స్థలం కొనుగోలు చేసిన నాటి నుంచి నేటి వరకూ ఏపీ డెయిరీ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలోనే ఉంది. ప్రస్తుతం అమూల్ డెయిరీకి లీజు ప్రాతిపదికన ఇవ్వడం జరిగింది. డెయిరీకి ఆనుకుని పక్కన ఉన్న పొలాలను రైతుల నుంచి బెంగళూరుకు చెందిన ఓ రియల్టర్ కొనుగోలు చేశారు కేకే న్యూ సిటీ పేరుతో వెంచర్ ఏర్పాటుచేస్తున్నారు. ఇందులో జిల్లాకు చెందిన ఓ మంత్రికి, స్థానికంగా కొందరు టీడీపీ నాయకులకు వాటాలు ఉన్నాయి. భూములు కొనుగోలు చేసిన మొదట్లో స్థానిక రైతుల నుంచి అభ్యంతరాలు వ్యక్తమవడం, కోర్టు కేసులతో కొన్నాళ్లు పనులు నిలిపివేశారు. ఇటీవల మళ్లీ పనులు వేగంగా జరగడం, వెంచర్కు సంబంధించిన పెద్ద హోర్డింగ్లు, ఫ్లెక్సీలు, సైన్ బోర్డులు...మెయిన్ ఎంట్రన్స్లో ఏర్పాటు చేయడమే కాకుండా, పక్కనే ఉన్నటువంటి అమూల్ డెయిరీకి చెందిన స్థలంలోనూ హైవే రహదారికి ఆనుకుని, భూమిలో డ్రిల్లింగ్ చేసి మరీ శాశ్వత ప్రాతిపదికన మెస్ బోర్డులు ఏర్పాటుచేశారు. దీనిపై డెయిరీ సిబ్బంది అభ్యంతరం వ్యక్తం చేస్తే వారిని బెదిరింపులకు గురిచేశారు. దీంతో వారు చేసేదిలేక, తమ స్థలాన్ని కాపాడాల్సిందిగా మండల తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డికి ఫిర్యాదుచేయడంతో పాటు ఏపీ డెయిరీ ఎండీకి లేఖ రాశారు. జిల్లా కలెక్టర్ దృష్టికి విషయాన్ని తీసుకెళ్లారు. అమూల్ డెయిరీ స్థలంలో హోర్డింగ్లు ఏర్పాటుచేసుకున్న రియల్టర్, అంతటితో ఆగకుండా ఏకంగా డెయిరీ కాంపౌండ్కు ఆనుకుని ప్రతినెలా డెయిరీకి అద్దె చెల్లిస్తున్న క్యాంటీన్ను ఖాళీ చేయాలని, స్థలం తమదేనని బెదిరింపులకు పాల్పడుతున్నారు. అధికార పార్టీకి చెందిన వ్యక్తులు కావడంతో అధికారులు చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారు. పరిస్థితి ఇలాగే కొనసాగితే...భవిష్యత్తులో డెయిరీని రియల్టర్ తమ వెంచర్లోదేనని చెప్పి అమ్మేస్తాడంటూ స్థానికులు మాట్లాడుకుంటున్నారు.చూసీ చూడనట్లు వ్యవహరిస్తున్న రెవెన్యూ అధికారులు -
రుణదాతల ఒత్తిడి..ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : రుణదాతల ఒత్తిడి భరించలేక ఇద్దరు వ్యక్తులు వేర్వేరు ఘటనల్లో ఆత్మహత్యాయత్నానికి పాల్పడి గురువారం ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని పెంచుపాడు పంచాయతీ పాశంవారిపల్లెకు చెందిన వెంకటరమణ కుమారుడు కే.సురేష్(34) ఆటో డ్రైవర్గా పనిచేస్తున్నాడు. స్థానికుడు జయన్న వద్ద రూ.2 లక్షలు కుటుంబ అవసరాల కోసం అప్పు తీసుకున్నాడు. 100కి రూ.25 వడ్డీతో కొంత కాలం చెల్లించాడు. ఇదే క్రమంలో జయన్న మరికొంత నగదు సురేష్ పూచీకత్తుతో మరింతమందికి వారం, నెల కంతులకు ఇచ్చాడు. వారు తిరిగి చెల్లించక పోవడంతో ఆ డబ్బుతో కలిపి మొత్తంగా రూ.10 లక్షలు బాకీ ఉందని తక్షణమే చెల్లించాలని సురేష్పై అప్పిచ్చిన జయన్న ఒత్తిడి చేశాడు. దీంతో సురేష్ తన ఇంటిలోని ఆవులు అమ్మి రూ.లక్ష, వరి పంట దిగుబడి, తన ఆటో విక్రయించి రూ.1.5 లక్షలు విడతల వారీగా చెల్లించాడు. జీవనాధారం లేక కూలి పనులకు వెళుతున్నాడు. అయినా అప్పు చెల్లించాలని ఒత్తిడి చేయడంతో భరించలేక కుటుంబాన్ని వదలి ఉపాధి కోసం బెంగళూరుకు వెళ్లిపోయాడు. అయితే జయన్న తాలూకా పోలీసులను ఆశ్రయించి సురేష్పై ఫిర్యాదు చేశాడు. పోలీసులు అతడి కుటుంబసభ్యులను విచారించి, సురేష్ను రప్పించాలని కోరడంతో బుధవారం రాత్రి ఇంటికి వచ్చాడు. అప్పు చెల్లించాలన్న ఒత్తిడి భరించలేక, వలసపల్లె పంచాయతీ బోయకొండ క్రాస్ వద్ద పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదేవిధంగా పట్టణంలోని వాల్మీకివీధికి చెందిన నరసింహులు కుమారుడు బాబు(55) స్థానికంగా అల్ల నేరేడు మండీ నిర్వహిస్తున్నాడు. ఈ క్రమంలో వ్యాపార అవసరాల కోసం నాలుగేళ్ల క్రితం స్థానికులైన జయమ్మ, అరుణ వద్ద రూ.7లక్షలు అప్పు తీసుకున్నాడు. అప్పు చెల్లింపులో భాగంగా ఇప్పటివరకూ దాదాపు రూ.12.5 లక్షలు తిరిగి చెల్లించాడు. అయితే ఇప్పటికీ రూ.7లక్షలు అసలుతో పాటు వడ్డీ చెల్లించాలని రుణదాతలు కొద్దిరోజులుగా తీవ్రంగా ఒత్తిడి చేశారు. ఇదే క్రమంలో గురువారం సాయంత్రం అల్లనేరేడు మండీ వద్దకు జయమ్మ, అరుణ, ఆమె భర్త మోక్షిత్రెడ్డి వెళ్లి అప్పు చెల్లించాలని నిలదీశారు. గొడవ చేశారు. దీన్ని అవమానంగా భావించిన బాబు పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఆయా ఘటనల్లో బాధితులను కుటుంబసభ్యులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం బాబు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. -
పంజం సుకుమార్రెడ్డికి ప్రముఖుల నివాళి
రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు మండల వెస్సార్సీపీ సీనియర్ నాయకులు, మాజీ వ్యవసాయ సలహా మండలి చైర్మన్, పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి పంజం సుకుమార్రెడ్డి (64) దశ దినకర్మల కార్యక్రమంలో ప్రముఖులు పాల్గొన్నారు. టీటీడీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ సీనియర్ రాష్ట్ర నాయకులు భూమన కరుణాకర్రెడ్డి, సాక్షి ఎడిటర్ రక్కాసి ధనుంజయరెడ్డి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు గురువారం పంజం చిత్ర పటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వైఎస్సార్ కుటుంబం వెంట నడుస్తూ పార్టీ పతిష్ఠతకు ఎంతో కృషి చేసారని వారు తెలిపారు. ఆయన లేని లోటు తీర్చలేనిదని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో మాజీ స్కిల్ డెవలప్మెంట్ చైర్మన్ కొండూరు అజయ్రెడ్డి, రామిరెడ్డి ధ్వజారెడ్డి, పంజం సందీప్రెడ్డి, సాయికిషోర్రెడ్డి, చెవుశ్రీనివాసులురెడ్డి, తోటశివసాయి, సీహెచ్రమేష్, మందలనాగేంద్ర, రంగారెడ్డి, నందాబాలా తదితరులు పాల్గొన్నారు. -
బాలికల వసతి గృహం తనిఖీ
మదనపల్లె రూరల్ : పట్టణంలోని బీసీ లేడీస్ హాస్టల్ను గురువారం సాయంత్రం జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. హాస్టల్ మొత్తం కలియదిరిగి, విద్యార్థులకు అందుతున్న వసతులను, సౌకర్యాలను పరిశీలించారు. అనంతరం విద్యార్థుల సమస్యలు తన దృష్టికి తేవాల్సిందిగా సూచించారు. హాస్టల్లో ఆర్వో ప్లాంటు లేకపోవడంతో పరిశుభ్రమైన తాగునీటిని తాగలేకపోతున్నామని, చన్నీళ్లతో స్నానం చేయడం కష్టంగా ఉందని, సోలార్ వాటర్ హీటర్స్ ఏర్పాటుచేయాలని కోరారు. హాస్టల్ కిటికీలకు మెస్ లేకపోవడంతో దోమల బెడద అధికంగా ఉందన్నారు. అనంతరం విద్యార్థినులతో కలిసి, ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్, సీఐ భీమలింగ భోజనం చేశారు. మధుసూదన్ మాట్లాడుతూ...జిల్లా కలెక్టర్ శ్రీధర్ చామకూరి ఆదేశాల మేరకు...మదనపల్లె పర్యటనలో భాగంగా బీసీ హాస్టల్ను తనిఖీచేసినట్లు చెప్పారు. కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ హేమావతి పాల్గొన్నారు. -
ఎకై ్సజ్ వాహనాల వేలంలో రూ.8లక్షల ఆదాయం
మదనపల్లె రూరల్ : సారా తరలిస్తూ ఎకై ్సజ్ నేరాల్లో పట్టుబడిన వాహనాలకు నిర్వహించిన వేలంపాటల్లో ప్రభుత్వానికి రూ.8,77,200 అదాయం లభించిందని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. మదనపల్లె ఎకై ్సజ్ పోలీస్స్టేషన్ ఆవరణలో సీఐ భీమలింగ ఆధ్వర్యంలో గురువారం నిర్వహించిన వాహనాల వేలం పాటలకు 52మంది ధరావతు చెల్లించి పాల్గొన్నారు. మొత్తం 67 వాహనాలకు ప్రభుత్వం రూ.7,33,600 అప్సెట్ ధరగా నిర్ణయిస్తే... రూ.8,77,200కు పాడుకున్నారన్నారు. జీఎస్టీ కింద రూ.1లక్ష 57వేల 896 రూపాయలు వాహనాలు వేలం పాడుకున్న వారి నుంచి వసూలు చేశామన్నారు. ఎకై ్సజ్ ఎస్ఐ జబీవుల్లా, సిబ్బంది అలీ తదితరులు పాల్గొన్నారు. -
గడ్డివామి కింద పడి ఇద్దరు మృతి
రామసముద్రం : రామసముద్రం మండలం నారిగానిపల్లి సమీపంలోని కర్ణాటక సరిహద్దులో గడ్డివామి కింద పడి ఇద్దరు మృతిచెందిన సంఘటన బుధ వారం రాత్రి చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నా యి. నారిగానిపల్లికి చెందిన శ్రీరాములురెడ్డి(72), కర్ణాటక రాష్ట్రం వెళ్లి రాత్రి వస్తుండగా వర్షం ప్రారంభం కావడంతో ఆల్చేపల్లి సమీపంలో ఓ గడ్డివామి కిందకు వెళ్లి తలదాచుకున్నాడు. కర్ణాటక రాష్ట్రం చెన్నయ్యగారిపల్లికి చెందిన శంకర్రెడ్డి(55), గంగాపురానికి చెందిన రవి కూడా తలదాచుకున్నారు. అయితే ప్రమాదవశాత్తూ గడ్డివామి కుప్పకూలడంతో శ్రీరాములురెడ్డి, శంకర్రెడ్డి వామి కిందపడి అక్కడిక్కడే మృతిచెందారు. అక్కడే ఉన్న రవి ప్రమాదం నుంచి తప్పించుకుని వెళ్లి గ్రామస్థులకు సమాచారం ఇచ్చాడు. సంఘటన స్థలానికి చేరుకొన్న గ్రామస్తులు కూలిన గడ్డివామిని తొలగించి మృతదేహాలను బయటకు తీశారు. అనంతరం మృతదేహాలను గ్రామాలకు తరలించి పూడ్చివేశారు. వారి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.ప్రమాదవశాత్తు గడ్డివామి కింద పడి ఇద్దరు మృతి -
ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్ ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–16 మల్టీ డే మ్యాచ్లు గురువారం ప్రారంభమయ్యాయి. కడప వైఎస్సార్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో తొలి రోజున కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలుచుకున్న కడప జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కర్నూలు జట్టు 65.3 ఓవర్లలో 157 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని రుత్విక్ కల్యాణ్ 40 పరుగులు, రోహిత్ గౌడ్ 35 పరుగులు చేశారు. కడప జట్టులోని చెన్నకేశవ అద్భుతంగా చక్కటి లైనప్తో బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశాడు. అదే విధంగా జయప్రణవ శాస్త్రి 2, క్యాశప్రెడ్డి 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన కడప జట్టు 24 ఓవర్లలో 3 వికెట్లు కోల్పోయి 54 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మరో మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాంటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన నెల్లూరు జట్టు 59.5 ఓవర్లకు 224 పరుగులు చేసి ఆలౌట్ అయింది. ఆ జట్టులోని అలెన్ లియో 61 పరుగులు, సుశాంత్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని టి.కిరణ్కుమార్ అద్భుతంగా బౌలింగ్ చేసి ఐదు వికెట్లు తీశారు. సంజయ్ 2, దేవాన్ష్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ ప్రారంభించిన అనంతపురం జట్టు 34 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 93 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాత్విక్ 23 పరుగులు చేశాడు దీంతో తొలి రోజు ఆట ముగిసింది. బోగాధమ్మ ఆలయంలో చోరీకమలాపురం : మండలంలోని పందిళ్లపల్లె శివారులో ఇటీవల పునర్నిర్మించిన బోగాధమ్మ ఆలయంలో గుర్తుతెలియని దుండగులు బుధవారం రాత్రి చోరీకి పాల్పడ్డారు. ఆలయం తాళం పగులగొట్టి హుండీని రంపంతో కోసి అందులో నగదు చోరీ చేశారు. ఆలయం బయట పడేశారు. పోలీసులకు ఫిర్యాదు చేస్తామని గ్రామస్థులు తెలిపారు. -
అటల్ ల్యాబ్ల బలోపేతమే లక్ష్యం
రాయచోటి : అటల్ టింకరింగ్ ల్యాబ్ల బలోపేతమే తమ లక్ష్యమని జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్రెడ్డి తెలిపారు. విజయవాడ మేరీస్ స్టెల్లా కళాశాలలో జరిగే వర్క్షాప్కు ఆయనతోపాటు రీసోర్స్ పర్సన్లు శెట్టెం ఆంజనేయులు, షర్పుద్దీన్, వెంకటేశ్వర్లు, హేమంత్కుమార్, మనోహర్ హాజరయ్యారు. ఓబుల్రెడ్డి మాట్లాడుతూ పర్సన్స్కు శిక్షణ కార్యక్రమంలో డిజైన్ థింకింగ్, ఏఐ టూల్స్, ఎలక్ట్రానిక్స్, రాస్పు బెర్రీరై, సోలార్ పవర్ రోబోటిక్స్ కోడింగ్, అటల్ డాష్బోర్డు అంశాలపై శిక్షణ ఇస్తున్నారని తెలిపారు. శిక్షణ అనంతరం అటల్ ల్యాబ్లలో విద్యార్థుల నైపుణ్యాభివృద్ధికి మార్గదర్శకత్వం వహించాల్సి ఉంటుందని పేర్కొన్నారు. -
అంకెలు రాస్తే..డబ్బులా..!!
కురబలకోట : అంకెలు రాస్తే.. డబ్బులా.. ఇదేమిటబ్బా.. ఆ రాతలను ఏం చేసుకుంటారు..ఇది వినడానికే ఆశ్చర్యంగా ఉంది. ఇలాంటి కొత్త తరహా మోసాలే ఇపుడు బయటపడుతున్నాయి. డేటా ఎంట్రీ, వర్క్ ఫ్రమ్ హోం పేర్లతో అన్నమయ్య జిల్లాలోని అంగళ్లులో ఎలైట్ క్రూవ్స్ డేటా సొల్యూషన్స్ మోసాలపై బుధవారం వందలాది మహిళలు ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగుచూసింది. ఇప్పటికే 600 మంది బాధితులను వివిధ ప్రాంతాల్లో బ్రాంచీలు ఏర్పాటుచేసి పేర్లు, చిరునామా మార్చి మోసం చేసినట్లు పోలీసుల విచారణలో వెల్లడవుతోంది. న్యాయం కోసం అంగళ్లు ఓపీ స్టేషన్ ఎదుట మహిళలు నిరసన చేపట్టిన నేపథ్యంలో ప్రధాన నిందితుడు వినోద్కుమార్ కోసం పోలీసులు వేట ప్రారంభించారు. ప్రత్యేక టీమ్ ఏర్పాటుచేసి అతడి కోసం గాలిస్తున్నట్లు రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ గురువారం తెలిపారు. మోసం చేసిన డబ్బుతో ఆస్తులు కొని ఉంటే ఆర్ఆర్ యాక్టు కింద స్వాధీనం చేసుకోవడం జరుగుతుందన్నారు. వివిధ ప్రాంతాల్లో మూడు వేల మంది దాకా బాధితులు ఉండవచ్చని సిబ్బంది చెబుతున్నారన్నారు. రూ.3 వేల చొప్పున చెల్లించి ఈ సభ్యత్వం తీసుకున్నారని, ఆ నెలలో ఎన్ని పేపర్లలో అంకెలు రాస్తే అంత డబ్బు ఇస్తామని నిర్వాహకులు చెప్పినట్లు వివరించారు. కొత్త వారిని జాయిన్ చేయిస్తే రూ.వెయ్యి నగదు ప్రోత్సాహం ఉండడంతో పోటీలు పడీ మరీ ఇందులో చేర్పించారని తెలిపారు. ఎక్కువగా మదనపల్లె పరిసర ప్రాంతాలకు చెందిన వారు బాధితులుగా ఉన్నారు. అంకెలు రాసిన ఫారాలను నిర్వాహకులు వేర్ హౌస్లను పంపేవారని సమాచారం. ఎలైట్ క్రూవ్స్ డేటాపై సమగ్ర విచారణ పరారీలో ఉన్న నిర్వాహకుడి కోసం వేట -
విద్యుత్తు ట్రాన్స్ఫార్మర్లో మంటలు
గాలివీడు : విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో ప్రజలు ఆందోళనకు గురయ్యారు. మండలంలోని గాలివీడు నాలుగు రోడ్ల కూడలిలో 108 కార్యాలయం వద్ద గురువారం 63 కేబీఏ విద్యుత్ ట్రానన్స్ఫార్మర్లో న్యూట్రల్ ప్లగ్ వైర్లు తెగిపడ్డాయి. ఆయిల్ లీకేజీ కారణంగా ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. స్థానికులు విద్యుత్ అధికారులకు సమాచారం ఇవ్వడంతో అధికారులు పవర్ కట్చేసి మంటలను అదుపులోకి తీసుకొచ్చారు. పెద్ద ప్రమాదమే తప్పిందంటూ స్థానికులు ఊపిరిపీల్చుకున్నారు. వినూత్న నిరసనరాజంపేట : పట్టణంలోని మున్సిపల్ కార్మికులు గురువారం మోకాళ్లపై కూర్చుని నిరసన తెలిపారు. ఈ కార్యక్రమంలో సీఐటీయూ జిల్లా నేత చిట్వేలి రవికుమార్, పీవీరమణ, లక్ష్మీదేవి, ప్రసాద్, సుధీర్, సాలమ్మ, వెంకటరమణ, రవిశంకర్ తదితరులు పాల్గొన్నారు. ప్రబలిన విష జ్వరాలుసిద్దవటం : మండలంలో విష జ్వరాలు ప్రబలుతున్నాయి. పల్లెల్లో అపరిశుభ్రత, నీరు కలుషితం కావడమే ఇందుకు కారణం. మండలంలోని సిద్ధవటం, జ్యోతి, వంతాటిపల్లె, బెటాలియన్ ప్రాంతాల్లో పలువురు విష జ్వరాల బారిన పడ్డారు. కొందరు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో గురువారం వైద్య సేవలకోసం తరలిరాగా, మరింత మంది కడపలోని ప్రైవేటు ఆసుపత్రులకు చికిత్స కోసం వెళ్లారు. మురుగు కాల్వలు, తాగునీటి ట్యాంకులు శుభ్రం చేయడం లేదని, అధికారుల నిర్లక్ష్యంతోనే జ్వరాలు వ్యాప్తి చెందుతున్నాయని స్థానికులు తెలిపారు. ఇప్పటికై నా వైద్య సిబ్బంది పర్యటించి రోగులకు సేవలందించాలని కోరుతున్నారు. విద్యుత్ షాక్తో వృద్ధుడు మృతినందలూరు : మండలంలోని ఎగువ కుమ్మరపల్లె గ్రామంలో గురువారం సాయంత్రం మారం సుబ్రహ్మణ్యం(64) విద్యుత్ షాక్తో గురువారం మృతిచెందారు. మృతుడి కుమారుడు మారం శంకరయ్య వివరాల మేరకు.. తన తండ్రి సాయంత్రం ఆరు గంటల సమయంలో బహిర్భూమికి వెళ్లి ఓ పొలం నీటి తొట్టె వద్ద విద్యుత్ వైరు తగిలి షాక్కు గురయ్యారు. ఈ మేరకు స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్లి పరిశీలించి కేసు నమోదు చేసుకున్నారు. -
అందని సాయం
సాక్షి, రాయచోటి: ఖరీఫ్ కష్టకాలం కనిపిస్తోంది.. పంటలు వేసేందుకు పరిస్థితులు అనుకూలంగా లేవు... కరువు ఛాయలు కళ్లెదుటే కనిపిస్తున్నాయి..జులై 15 దాటినా పంట సాగు కాని పరిస్థితి చూస్తే కళ్లెదుటే ఖరీఫ్ కథ ముగిసేలా ఉంది. గత ఏడాది జిల్లాలో ఈ వర్షాధారం కింద సుమారు లక్ష ఎకరాలకు పైగా సాగు కావాలని వ్యవసాయ శాఖ సాధారణ లక్ష్యంగా నిర్ణయిస్తున్నా.. అనుకున్న మేర సాగు కనిపించడం లేదు.. గతేడాది లాగే ఈ సారి కూడా ఖరీఫ్ ఆశాజనకంగా కనిపించడం లేదు.జిల్లాలో ఖరీఫ్ సాగుకు సంబంధించి వేరుశనగ, కంది, వరి, ఉలవలు ఇలా అనేక రకాల పంటలను వర్షాధారం కింద సాగు చేస్తారు. జూన్ మొదటి నుంచి జులై 15 లోపు వర్షాధారం కింద మంచి అదునుగా భావిస్తారు. అయితే ఈ సారి ఇప్పటికి పదునైన వర్షం లేకపోగా అరకొర వర్షాలకు అంతంత మాత్రంగా పదుల సంఖ్యలో సాగైన పంట కూడా ఎండిపోతోంది. వేరుశనగకై తే జులై 15లోపు మంచి అదునును వ్యవసాయ శాఖ అధికారులు కూడా చెబుతున్నారు. ఇప్పటికీ అదును జాడ లేకపోవడంతో ఇక తరువాత వర్షాలు పడినా లేటు అదును కింద సాగు చేయాల్సిందే. అయితే ఇప్పటికప్పుడు వర్షాల జాడ కూడా కనిపించకపోవడం ఖరీఫ్ రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. వర్షం కోసం ఎదురుచూపులు జిల్లాలో ఖరీఫ్లో రైతులు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. గత ఏడాది కూడా అనుకున్న మేర వర్షాలు లేక పంటలు నిలువునా ఎండిపోయాయి. ఈసారి కూడా వర్షపు జాడ కనపడకపోవడంతో మరో మారు కరువు ఛాయలు కనిపిస్తున్నాయి. ప్రతిసారి ప్రకతి కనిపించకపోవడంతో అన్నదాత ఆందోళన చెందుతున్నాడు. ఇప్పటి వరకు వేరుశనగ, వరి, కంది తక్కువ ఎకరాలలో సాగయ్యాయి. ఈ ఖరీఫ్లో అన్నదాతలు వర్షం కోసం ఎదురుచూస్తున్నారు. వర్షపాతం వివరాలు 2024 జూన్లో 160.6 మిల్లీమీటర్లు, జూలైలో 47.5, ఆగస్టు 99.7 మిల్లీమీటర్ల వర్షపాతం నమైదైంది. 2025 జూన్లో 75.1 మిల్లీమీటర్ల వర్షం కురవాల్సి ఉండగా 24.8 మి.మీ కురిసింది. జూలైలో 90.5 మిల్లీమీటర్ల వర్షం కురువాలి.అయితే 2.3 మిల్లీమీటర్లు మాత్రమే కురసింది. కందులు సాధారణ సాగు: 2,404 హెక్టార్లు ఇప్పటి వరకు సాగైంది: 89హెక్టార్లు వరి సాధారణ సాగు: 11,432 హెక్టార్లు సాగైంది: 537హెక్టార్లు వేరుశనగ సాగు అంచనా: 38,013 హెక్టార్లు సాగైన వేరుశనగ: 1,840 హెక్టార్లు మొక్కజొన్న సాధారణ సాగు: 1,911 హెక్టార్లు సాగైంది: 543 హెకార్టు జులై 15 దాటినా కనిపించని వర్షాలు ఖరీఫ్ సీజన్లో విత్తనసాగుకు సన్నద్ధమైన రైతులు వర్షం కోసం అన్నదాతలఎదురుచూపు జిల్లాలో ఖరీఫ్ పంటలకు సంబంధించి పెట్టుబడి సాయం కింద గతంలో వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మే నెలలోనే రైతులకు రైతు భరోసా నిధులను అందించేది. తద్వారా పంటలు సాగు చేసేందుకు సులువుగా ఉండేది. ఎంతో కొంత పెట్టుబడి సొమ్ములు ఉండటంతో పంటలను సాగు చేసేవారు. అయితే 2024లో కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినా ఇప్పటి వరకు అన్నదాత సుఖీభవ నిధులు విడుదల చేయలేదు. ఒకవైపు ఖరీఫ్.. వర్షం లేక మట్టి కొట్టుకుపోతుండగా మరోవైపు అన్నదాత సుఖీభవ నిధులు కూడా ప్రభుత్వం అందించకపోవడంతో రైతన్నలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కష్టకాలంలో ఉన్న రైతన్నను ఆదుకోవాల్సిన ప్రభుత్వం కనీసం ఇప్పటి వరకు నిధులు విడుదల చేయకపోవడంతో పెదవి విరుస్తున్నారు. వేరుశనగ విత్తే పరిస్థితి లేదు.. వరుణ దేవుడు కరుణించక వేరుశనగ విత్తే పరిస్థితి కనిపించడం లేదు. మే నెలలో కురిసిన వర్షానికి దుక్కులు చేసి పెట్టుకున్నా.జూన్నుంచి ఇప్పటి వరకు చినుకు జాడ లేదు. కంది సాగయ్యే పరిస్థితులు లేవు. –పాలేపల్లె మోహన్ రెడ్డి(రైతు), మర్రిచెట్టు, లక్కిరెడ్డిపల్లె మండలం అదునుదాటుతున్నా.. ఖరీఫ్ సీజన్ ప్రారంభమై నెల రోజులైంది. అదును దాటుతున్నా అనుకున్న మేర వర్షం పడలేదు. ఇప్పటికే దుక్కులు దున్నాం. వర్షం కోసం ఎదురుచూస్తున్నాం. చినుకులు రాలితే విత్తనాలు వేయడానికి సిద్ధంగా ఉన్నాం. –నాగేశ్వర, రైతు,మల్లూరు,చిన్నమండెం మండలం వర్షం కోసం ఎదురుచూపు నాకు 2 ఎకరాల పొలం ఉంది. మొదట వేరుశనగ అనుకున్నా.. అదును దాటిపోయింది కాబట్టి ప్ర త్యామ్నాయ పంటలు సాగు చే యాలన్న ఆలోచనలోఉన్నాం. ఎప్పుడెప్పుడు వర్షం పడుతుందా అని ఎదురుచూస్తున్నాం. – గయాజ్బాషా, రైతు, గుర్రంకొండ మండలం -
పడిగాపులు
రాయచోటి టౌన్: ఆఫీసర్ ఎవరైనా బదిలీపై వెళితే.. అప్పటికే అక్కడ విధులు నిర్వహిస్తున్న అధికారి బాధ్యతలు అప్పగిస్తారు. ఇది సాధారణం...అది ఏ శాఖ అయినా జరిగేది ఇదే...అదేమి విచిత్రమో.. ఈ ప్రభుత్వంలో బదిలీపై వచ్చిన అధికారి కార్యాలయానికి వచ్చినా చార్జి అప్పగించేవారు లేక పడిగాపులు కాయాల్సిన పరిస్థితి. ఇదంతా ఎక్కడో జరగలేదు. అన్నమయ్య జిల్లా రాయచోటి వీరభద్ర స్వామి ఆలయంలో చోటు చేసుకొంది. శ్రీకాళహస్తి ఆలయ అసిస్టెంట్ కమిషనర్గా విధులు నిర్వహిస్తున్న కస్తూరి రాయచోటి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో బాధ్యతలు చేపట్టేందుకు గురువారం వచ్చారు. అయితే ఇక్కడ విధులు నిర్వహిస్తున్న ఈవో రమణారెడ్డి ఆలయంలో లేకపోవడంతో ఆయన రాక కోసం వేచి చూడాల్సిన పరిస్థితి నెలకొంది. ఈమె గతంలో దేవుడి కడప, బోయకొండమ్మ, కాణిపాక ఆలయాల్లో పని చేశారు. ఇప్పుడు రాయచోటి శ్రీ వీరభధ్రస్వామి ఆలయానికి అసిస్టెంట్ కమిషనర్ హోదాలో వచ్చారు. బాధ్యతలు అప్పగించాల్సిన అధికారి లేకపోవడంతో ఎక్కడికి పోవాలో తెలియక, ఏమీ చేయాలో దిక్కుతోచక ఆలయంలో నిరీక్షిస్తూ ఉండాల్సి వచ్చిందని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. -
వినూత్న ప్రయోగం
రాష్ట్ర కమ్యూనిటీ నాచురల్ ఫార్మింగ్(ఏపీసీఎన్ఎఫ్) ఆధ్వర్యంలో వాల్మీకిపురం మండలంలోని అయ్యవారిపల్లిలో డ్రై వరి సాగును ఏపీసీఎన్ఎఫ్ జిల్లా ప్రాజెక్టు డైరెక్టరు వెంకటమోహన్ ప్రారంభించారు. అయ్యవారిపల్లికి చెందిన ఏపీసీఎన్ఎఫ్ క్లస్టర్ ఇన్చార్జి స్వాతి పొలంలో 20 సెంట్ల విస్తీర్ణంలో డ్రైవరి, అందులోనే మిశ్రమ పంటలుగా టమాటా, మిరప, ఉల్లి, బంతిపూలు, మొక్కజొన్న, ఆముదం, ముల్లంగి, బీర, కాకర, కీర, పాలకుర, సొరకాయ, దనియాలు, మెంతులు, అలసంద వంటి 21 రకాల విత్తనాలను నాటారు. ఈ సందర్భంగా పీడీ మాట్లాడుతూ డ్రై వరి పద్ధతి ద్వారా తక్కువ నీటితో ఎక్కువ పంట దిగుబడి సాధించవచ్చన్నారు. నాలుగు అడుగులు వెడల్పుతో బెడ్లు, ఒక్క అడుగు వెడల్పుతో కాలువలు ఏర్పాటు చేయడంతో అంతరపంటలు సాగు చేసుకోవడానికి వీలుంటుదని తెలిపారు. డ్రైవరి సాగుతో భూమిలో తేమ నిల్వ ఉండటంతో పాటు జీవసారం పెరుగుతుందని, వ్యవసాయ ఖర్చులు తగ్గి ఆరోగ్యకరమైన ఆహార ఉత్పత్తులు పొందవచ్చని చెప్పారు. ఐసీఆర్పీఎస్ ప్రతినిధులు పంటల మిశ్రమం, బయో మల్చింగ్, ప్రకృతి వ్యవసాయ సూత్రాలపై రైతులకు అవగాహన కల్పించారు. కార్యక్రమంలో మాస్టర్ ట్రైనర్ సుబ్బరామయ్య,హెచ్ఎన్ఎఫ్ సాహితి పాల్గొన్నారు. –కలికిరి(వాల్మీరిపురం) -
దగాకోర్ కటింగ్
నాణ్యత ధ్రువీకరణ లేకుండానే బిల్లుల చెల్లింపు! ఏప్రిల్ నుంచి పుంగనూరు, కుప్పం ఉపకాలువల్లో కాంక్రీట్ లైనింగ్ పనులు జరుగుతున్నాయి. పీబీసీ పనులపై మూడు నెలల్లో నాణ్యతపై కోర్ కటింగ్ తీయని అధికారులు గత వారంలో 200కి పైగా కోర్ కటింగ్లు తీశారని తెలిసింది. ఇంకా కొన్నిచోట్ల కటింగ్లు తీయాల్సి ఉందని సిబ్బంది చెబుతున్నారు. గతనెలలో కుప్పం పనులకు సంబంధించి 264 చోట్ల కోర్ కటింగ్ చేసి నాణ్యత పరిశీలన కోసం తిరుపతిలోని ఎన్ఏబీఎల్కు తరలించారు. వీటి నాణ్యత గ్రేడ్–15 అని వస్తేనే ఒప్పందం మేరకు పనులు సాగుతున్నట్టు లెక్క అని ప్రాజెక్టుకు చెందిన ఓ అధికారి చెప్పారు. ఇంతవరకు ఈ పనులకు సంబంధించి నాణ్యత ధ్రువీకరణ ఇంకా ఇవ్వలేదని క్వాలిటీ కంట్రోల్ అధికారి ఒకరు వెల్లడించారు. అంటే నాణ్యత ధ్రువీకరణ లేకుండానే అధికారులు గుడ్డిగా బిల్లులు చెల్లించారని స్పష్టం అవుతోంది. ● హంద్రీ–నీవా రెండో దశ లైనింగ్ పనుల్లో మరో లోపం ● రూ.162 కోట్లు ఇచ్చేశాక తీరిగ్గా నాణ్యత పరీక్షలకు కోర్ కటింగ్ ● పుంగనూరు, కుప్పం ఉపకాలువ లైనింగ్ పనుల్లో ఇష్టారాజ్యానికి నిదర్శనం ● నాణ్యత పరీక్షల తర్వాతే బిల్లులు ఇవ్వాలన్న నిబంధనకు తూట్లు మదనపల్లె: హంద్రీ–నీవా ప్రాజెక్టు రెండోదశలో భాగంగా పుంగనూరు (పీబీసీ), కుప్పం ఉప కాలువల్లో జరిగిన కాంక్రీటు లైనింగ్ పనుల్లో అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకొస్తున్నాయి. తాజాగా నాణ్యత పరీక్షలు చేయకుండానే బిల్లులు చెల్లించేసిన వైనం బట్టబయలైది. సాధారణంగా పనులు చేశాక వాటి కోర్ కటింగ్లు తీసి ల్యాబ్లో పరీక్షలు నిర్వహించాకే బిల్లులు చెల్లించాల్సి ఉంటుంది. అయితే పీబీసీ పనుల్లో ఈ నిబంధనకు నీళ్లొదిలినట్టు తెలుస్తోంది. కాంట్రాక్టు సంస్థకు రూ.కోట్ల బిల్లులు చెల్లించేశాక తీరిగ్గా కోర్ కటింగ్ చేపట్టి వాటి నాణ్యతను పరీక్షించే చర్యలను అధికారులు చేపట్టడం అందరినీ విస్మయానికి గురిచేస్తోంది. అన్నమయ్య జిల్లా పెద్దతిప్పసముద్రం మండలంలోని కిలోమీటర్ 74 నుంచి చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలంలోని 207.800 కిలోమీటర్ వరకు పుంగనూరు ఉపకాలువ (పీబీసీ) పనులు రూ.480 కోట్లతో (అందులో పనికి రూ.366 కోట్లు), చిత్తూరుజిల్లా పెద్దపంజాణి మండలం నుంచి కుప్పం వరకు రూ.169 కోట్లతో 90 కిలోమీటర్ల కుప్పం ఉపకాలువలో లైనింగ్ పనులు చేపట్టిన విషయం తెలిసిందే. రూ.162 కోట్లు చెల్లించేశారు పుంగనూరు ఉపకాలువ పనులు ఇద్దరు ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల పర్యవేక్షణలో సాగుతున్నాయి. 117 కిలోమీటర్ల మేర కాలువ పనులకు సంబంధించి రూ.71 కోట్ల బిల్లులను చెల్లించేశారు. కుప్పం ఉపకాలువకు సంబంధించి ఒక ఈఈ పర్యవేక్షణలో పనులు చేస్తుండగా 90 కిలో మీటర్ల మేర లైనింగ్ పనికి సంబంధించి రూ.91 కోట్ల బిల్లులు చెల్లించారని ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ఈ బిల్లులను చెల్లించాలంటే ముందుగా కోర్ కటింగ్ జరిగి, అందులో నాలుగు ఇంచుల మందంతో కాంక్రీటు వేశారా లేదా, అందులో నాణ్యత ఉందా లేదా పరీక్షించాలి. అయితే ఇది చేయకుండా కాంట్రాక్టు సంస్థ ఏర్పాటు చేసిన క్యూబుల్లో నాణ్యత పరీక్షలు సొంతంగా నిర్వహించుకుని బిల్లులను చెల్లించినట్టు తెలుస్తోంది. బిల్లులు చెల్లించాక ఇప్పుడు కోర్ కటింగ్లు తీయడంపై అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. -
రోగులతో స్నేహంగా మెలగాలి
కురబలకోట: జిల్లాలో ప్రభుత్వ ఆసుపత్రులకు వచ్చే రోగుల పట్ల సిబ్బంది మర్యాద పూర్వకంగా, స్నేహంగా మెలగాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ పేర్కొన్నారు. గురువారం కురబలకోట ప్రభుత్వ ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఆసుపత్రి నిర్వహణ, పరిశుభ్రత, రోగులకు అందుతున్న సేవలు, మందుల పరిస్థితి, సిబ్బంది కొరత, ఓపీ వివరాలు, రక్త పరీక్షలు, సిబ్బంది పనితీరు తదితర వాటిపై డాక్టర్ చక్రవర్తిని అడిగి తెలుసుకున్నారు. ఆసుపత్రి పరిసరాలు పరిశుభ్రంగా ఉండాలన్నారు. అవసరమైన మందులు ఎప్పుడూ అందుబాటులో ఉండేలా చూసుకోవాలన్నారు. ఆరోగ్య కేంద్రంలోని సిబ్బంది స్నేహ పూర్వకంగా మెలిగారా లేదా వంటి అంశాలపై ముఖ్యమంత్రి కార్యాలయం ప్రజల నుంచి అభిప్రాయాలను సేకరిస్తోందన్నారు. సేవా దృక్పథంతో విధులు నిర్వహించాలన్నారు. నిర్దేశించిన లక్ష్యాల మేరకు పీహెచ్సీలు పనిచేయాలన్నారు. 15 రోజులకోసారి తహసీల్దార్, ఎంపీడీఓ పీహెచ్సీలను తనిఖీ చేయాలన్నారు. సమస్యలు ఉంటే పరిష్కరించాలన్నారు. అనంతరం ఆయన కురబలకోటలోని సంపద సృష్టి (డంపింగ్ యార్డు) కేంద్రాన్ని పరిశీంచారు. ఈ కార్యక్రమంలో తహసీల్దారు ధనుంజయలు, ఎంపీడీఓ గంగయ్య తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు చర్యలు రాయచోటి: జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు అవసరమైన భూమి కేటాయింపు చేపట్టాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అధికారులను ఆదేశించారు. గురువారం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ అన్ని జిల్లాల కలెక్టర్లతో పి–4 పాజిటివ్ పీపుల్ పర్సెప్షన్, ఎంఎస్ఎంఈ పార్కులు, ప్రధాన మంత్రి ఆదర్శ గ్రామ యోజన, స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర తదితర అంశాలపై సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్ నుంచి జిల్లా కలెక్టర్ శ్రీధర్, జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ పి–4 కార్యక్రమంలో ఆగస్టు 15 నాటికి 15 లక్షల బంగారు కుటుంబాలను మార్గదర్శకాలతో మ్యాప్ చేసే ప్రక్రియ జరుగుతోందన్నారు. జిల్లాలో గుర్తించిన బంగారు కుటుంబాలను మార్గదర్శలతో మ్యాప్ చేసే ప్రక్రియను త్వరగా పూర్తిచేయాలన్నారు. జిల్లాలోని ఆరు నియోజకవర్గాల్లో ఆరు ఎంఎస్ఎంఈ పార్కుల ఏర్పాటుకు భూమి అవసరమైన నియోజకవర్గాల్లో భూమి కేటాయింపు జరగాలని తెలిపారు. ప్రపంచ బ్యాంకు చేయూతతో నిర్వహిస్తున్న ర్యాంప్ ప్రాజెక్టులో పెండింగ్ పనులను వెంటనే పూర్తి చేయాలన్నారు. ప్రధానమంత్రి ఆదర్శ గ్రామ యోజన కార్యక్రమంలో పెండింగ్ ప్రాజెక్టులపై చర్యలు తీసుకోవాలని సాంఘిక సంక్షేమ శాఖ అధికారిని ఆదేశించారు. ప్రతి నెల మూడో శనివారం జరిగే స్వర్ణాంధ్ర– స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా ఈనెల మూడో శనివారం ప్లాస్టిక్ కాలుష్యాన్ని అంతం చేయడం అనే ఇతివృత్తంతో కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామని, దీనికి అధికారులు అందరూ సిద్ధంగా ఉండాలన్నారు. సమావేశంలో జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, డీఆర్ఓ మధుసూదనరావు తదితరులు పాల్గొన్నారు. వైద్య సిబ్బంది సేవా దృక్పథంతోవిధులు నిర్వహించాలి జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ -
నాలుగు ఏఎంసీలకు చైర్మన్ల నియామకం
సాక్షి రాయచోటి: అన్నమయ్య జిల్లాతో పాటు వైఎస్ఆర్ కడప జిల్లాలోని పలు మార్కెట్ యార్డ్ కమిటీలకు కూటమి సర్కార్ చైర్మన్ లను నియమించింది.. మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని జనసేన పార్టీకి కేటాయించగా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్ పదవిని బీజేపీకి కేటాయించారు.. వైఎస్ఆర్ కడప జిల్లా బద్వేలు మార్కెట్ యార్డ్ చైర్మన్గా పి.విజయలక్ష్మి( బీజేపీ) , అన్నమయ్య జిల్లా రాయచోటి మార్కెట్ యార్డ్ చైర్మన్గా బోడిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి (టీడీపీ), అదే నియోజకవర్గంలో ఉన్న లక్కిరెడ్డిపల్లి మార్కెట్ యార్డ్ చైర్మన్గా ఎస్ ఎండి షఫీ, మదనపల్లె మార్కెట్ యార్డ్ చైర్మన్గా జంగాల శ్రీనివాస్( జనసేన)ను నియమించారు.. అందుకు సంబంధించి కూటమి ప్రభుత్వం పదవులకు సంబంధించి పేర్లు ప్రకటించింది.. అధికారికంగా ఆదేశాలు రావాల్సి ఉంది గెస్ట్ ఫ్యాకల్టీ పోస్టుకు దరఖాస్తు చేసుకోండి రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని ఉర్దూ జూనియర్ కళాశాలలో ఖాళీగా ఉన్న ఎకనామిక్స్ అధ్యాపక పోస్టుకు గెస్ట్ఫ్యాకెల్టీగా పనిచేసుకునేందుకు ఈనెల 21వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలని ఆ కళాశాల ప్రిన్సిపాల్ ఎస్.సునీల్ బర్నబాస్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు 50 శాతం మార్కులతో ఎంఏ (ఎకనామిక్స్) ఉత్తీర్ణులై, డిగ్రీలో ఉర్దూ మీడియం చదివిన వారు లేక డిగ్రీలో ఉర్దూ లాంగ్వేజ్ సబ్జెక్టు చదివి ఉండాలన్నారు. ఆసక్తికలిగి, అర్హులైన వారు ఈనెల 21వ తేదీలోపు తమ దరఖాస్తును కళాశాలలోని కార్యాలయ పనివేళల్లో అందచేయాలన్నారు.ఈనెల 23వ తేదీ ఇంటర్వ్యూ ఉంటుందన్నారు. అభ్యర్థులు తమ వెంట విద్యార్హతకు సంబంధించి ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తీసుకురావాలన్నారు. రాష్ట్రంలోని ఏ ప్రాంతంలో ని వారైనా దరఖాస్తు చేసుకోవచ్చని పేర్కొన్నారు. బాలిక హత్యపై స్పందించిన కమిషన్ కడప కోటిరెడ్డి సర్కిల్: గండికోటలో హత్యకు గురైన ఇంటర్ విద్యార్థిని సంఘటనపై ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర బాలల హక్కుల పరిరక్షణ కమిషన్ స్పందించింది. ప్రొద్దుటూరులోని ఓ ప్రైవేట్ కళాశాలలో చదువుతున్న వైష్ణవి ఇంటి నుంచి బయలుదేరి, ఆ తర్వాతకు హత్యకు గురైందని పత్రికల్లో వార్తలు ప్రచురితం కావడంతో కమిషన్ సుమోటోగా స్వీకరించింది. ఇంటర్ విద్యార్థిని చనిపోవడం బాధాకరమని, వారి తల్లిదండ్రులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నామని పేర్కొంది. ఎన్ని గంటలకు వెళ్లింది, ఎక్కడి నుంచి వెళ్లింది, సంఘటన జరగడానికి కారణాలు తదితరాలపై సమగ్ర విచారణ చేసి నివేదిక సమర్పించాలని జిల్లా పోలీసు అధికారులు, సంబంధిత అధికారులను కమిషన్ ఆదేశించింది. రేపటి నుంచి తపాలా సేవలకు అంతరాయం రాజంపేట టౌన్: తపాలా కార్యాలయంలో ఈనెల 19 నుంచి 22వ తేదీ వరకు అన్ని రకాల సేవలు సేవలను తాత్కాలికంగా నిలిపివేస్తున్నట్లు రాజంపేట హెడ్ పోస్టుమాస్టర్ షేక్ హబీబుల్లా తెలిపారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించేందుకు తపాలాశాఖను ఆధునికీకరిస్తున్నారన్నారు. ఈకారణంగా డేటా ట్రాన్స్ఫర్, సాంకేతిక మరమ్మతు పనులు చేపట్టనున్నట్లు తెలిపారు. ఈకారణంగా నాలుగు రోజుల పాటు తపాలా కార్యాలయాల్లో ఎలాంటి లావాదేవీలు ఉండవన్నారు. సాంకేతిక మరమ్మతులు పూర్తయితే 2.0 సాంకేతికత అందుబాటులోకి వస్తుందని, ఫలితంగా ఖాతాదారులకు అన్ని రకాల సేవలు వేగవంతం అవుతాయన్నారు. దీనివల్ల ఖాతాదారులకు మెరుగైన సేవలు అందుతాయన్నారు. సెల్ఫోన్ ద్వారానే ఆర్థిక, బీమా, బ్యాకింగ్ తదితర సేవలు అతి తక్కువ సమయంలో పూర్తవుతాయని తెలిపారు. పాఠశాలల ఆకస్మిక తనిఖీ సుండుపల్లె: మండల పరిధిలోని వెంగమరాజుపల్లె, గుల్లవాండ్లపల్లె, సుండుపల్లె మండల పరిషత్ ప్రాథమిక..ఆదర్శ పాఠశాలలను గురువారం జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ఆకస్మికంగా తనిఖీ చేశారు. పాఠశాలల పరిసరాలను పరిశీలించారు.అనంతరం మాట్లాడుతూ విద్యార్థుల్లో భాషా నైపుణ్య అభివృద్ధి లక్ష్యంగా బోధన సాగించాలని, నూతన మార్పులకు అనుగుణంగా పిల్లల్లో సామర్థ్యాలను పెంపొందేలా ఉపాధ్యాయులు కృషి చేయాలని చెప్పారు.సుండుపల్లె ఎంపీపీఎస్లో ఉపాధ్యాయుల కొరత ఉందని జిల్లా విద్యాశాఖాధికారి దృష్టికి ఉపాధ్యాయుడు రవీంద్రనాథ్రెడ్డి తీసుకెళ్లగా ఒకరిని కేటాయించారు. అనంతరం పిల్లల వర్క్ బుక్కులను డీఈఓ పరిశీలించారు. కార్యక్రమంలో ఎంఈఓలు వెంకటేష్నాయక్, రవీంద్రనాయక్ పాల్గొన్నారు. -
వ్యక్తి అదృశ్యం
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కాయలవాండ్లపల్లికి చెందిన పెద్దపాళ్యం రామచంద్ర కుమారుడు పి.రాజశేఖర్(44) అదృశ్యమైనట్లు తల్లి క్రిష్ణమ్మ తెలిపారు. ఈ నెల 9వ తేదీన తిరుమల వెంకటేశ్వర స్వామి దర్శనం కోసమని ఇంటి నుంచి బయలు దేరాడని, ఇంతవరకూ ఇంటికి రాలేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. గాలించినా ప్రయోజనం లేకపోవడంతో బుధవారం స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేసినట్లు ఆమె పేర్కొంది. గిరిజన కుటుంబాలను ఆదుకుంటాం రైల్వేకోడూరు అర్బన్ : మండలంలోని శెట్టిగుంట ఎస్టీకాలనీలో ప్రమాదంలో మృతి చెందిన అన్ని కుటుంబాలను ఆదుకుంటామని గిరిజన సంక్షేమ శాఖ అధికారిణి తేజశ్వని పేర్కొన్నారు. గ్రామంలో బుధవారం ఆమె పర్యటించి గిరిజనుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అలాగే మృతిచెందిన ప్రతి కుటుంబాన్ని సందర్శించి వారికి భరోసా కల్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వం నుంచి రావాల్సిన నష్టపరిహారం అందేలా కృషి చేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గిరిజన సంక్షేమశాఖ అధ్యక్షులు శివశంకర్, తదితరులు పాల్గొన్నారు. ద్విచక్ర వాహనదారులపై కేసు నమోదు సిద్దవటం : మద్యం తాగి నడుపుతున్న ద్విచక్ర వాహనదారులపై బుధవారం కేసులు నమోదు చేశామని ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. సిద్దవటం పోలీస్స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ కడప–చైన్నె ప్రధాన రహదారిలోని భాకరాపేట చెక్ పోస్టు వద్ద సోమవారం రాత్రి తనిఖీ చేస్తుండగా మద్యం తాగి ద్విచక్ర వాహనంలో వస్తున్న శివ, తుమ్మల ప్రవీణ్కుమార్ల పట్టుబడడంతో కేసులు నమోదు చేశామని ఎస్ఐ తెలిపారు. పోక్సో కేసు నమోదు పెద్దమండ్యం : మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడిన యువకునిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ ఎం.వెంకటేశ్వర్లు తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని వెలిగల్లు పంచాయతీ గురికివాండ్లపల్లెకు చెందిన యువతి కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తోంది. ఆమె కుమార్తె (15) పాపదాతగారిపల్లెలోని ఉన్నత పాఠశాలలో పదవతరగతి చదువుతోంది. ఈ క్రమంలో ఈ నెల 6న ఇంటి వద్ద బాలిక ఉండగా గాలివీడుకు చెందిన మల్లెల రామక్రిష్ణ (19) మైనర్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. సంఘటనపై మంగళవారం రాత్రి బాలిక తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : అనారోగ్యంతో వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం ములకలచెరువు మండలంలో జరిగింది. ములకలచెరువు రాజా నగర్కు చెందిన గంగన్న కుమారుడు నరసింహులు(60) గత కొంతకాలంగా షుగర్, బీపీతోపాటు, కడుపునొప్పితో బాధ పడుతున్నాడు. వ్యాధి నివారణకు చికిత్స తీసుకున్నా ఫలితం కనిపించకపోవడంతో మనస్తాపం చెందాడు. బుధవారం ఇంటి వద్దే సూపర్ వాస్మాల్ తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. గమనించిన కుటుంబసభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
వాహన డ్రైవర్ల మధ్య ఘర్షణ
మదనపల్లె రూరల్ : తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్ల మధ్య జరిగిన ఘర్షణలో వాహనం అద్దాలు ధ్వంసమైన ఘటన బుధవారం సాయంత్రం జరిగింది. ములకలచెరువు మండలం బురకాయలకోటకు చెందిన శ్రీనివాసులు(37) తల్లీబిడ్డ ఎక్స్ప్రెస్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. బుధవారం పురిటిబిడ్డ, తల్లిని తరిగొండలో దింపేసి వాహనాన్ని జిల్లా ఆస్పత్రిలో నిలిపేందుకు రాగా, క్యాంటీన్ సమీపంలో మరో డ్రైవర్ పృథ్వీరాజ్ ఉన్నాడు. శ్రీనివాసులు వాహనం తన పక్కగా వెళ్లనివ్వడంతో మద్యం మత్తులో ఉన్న పృథ్వీరాజ్, శ్రీనివాసులును దూషించాడు. వాహనంలోకి ప్రవేశించి వాహనం పార్కింగ్ చేసే ప్రదేశం వరకూ వెళ్లాడు. అక్కడ శ్రీనివాసులును వాహనంలో నుంచి కిందకు దించి రాయితో విచక్షణా రహితంగా కొట్టాడు. ఆస్పత్రికి వెళ్లిన శ్రీనివాసులు చికిత్స పొందుతుండగా, పృథ్వీరాజ్ మరోసారి కత్తెర తీసుకుని పొడిచేందుకు ప్రయత్నించాడు. అక్కడ ఉన్న సిబ్బంది అప్రమత్తమై అతడిని బలవంతంగా ఆస్పత్రి బయటకు పంపించారు. అక్కడి నుంచి వెళ్లిన పృథ్వీరాజ్, శ్రీనివాసులుపై ద్వేషంతో అతడు నడుపుతున్న వాహనం అద్దాలను పగలగొట్టాడు. ఈ ఘర్షణలో పృథ్వీరాజ్ సైతం గాయపడ్డాడు. ఘటనపై బాధితుడు శ్రీనివాసులు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేశాడు. పోలీసులు ఆస్పత్రికి చేరుకుని విచారించారు. -
హెచ్పీసీఎల్ ప్లాంట్ సిబ్బందికి అవగాహన
సిద్దవటం : పరిశ్రమలకు బాంబు బెదిరింపులు వచ్చినపుడు సిబ్బంది అప్రమత్తంగా వ్యవహరించాలని కడప ఏఆర్ అడిషనల్ ఎస్పీ రమణయ్య సూచించారు. మండలంలోని భాకరాపేట సమీపంలోని హిందూస్తాన్ పెట్రోలియం కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్పీసీఎల్) ప్లాంట్ సిబ్బందికి బుధవారం అవగాహన కల్పించి.. మాక్డ్రిల్ నిర్వహించారు. ఈ సందర్భంగా అడిషనల్ ఎప్పీ రమణయ్య మాట్లాడుతూ అత్యవసర పరిస్థితుల సమయంలో ఉద్యోగుల అప్రమత్తత పెంచేందుకు ఈ మాక్డ్రిల్ ఉపయోగ పడుతుందన్నారు. భద్రతా ప్రమాణాలు, చర్యలపై అవగాహన కల్పించడంతో మాక్ డ్రిల్ సమయంలో ప్లాంట్ నుంచి సురక్షితంగా ఖాళీ చేయించగలిగామన్నారు. పరిసర భద్రతా బాంబు స్క్వాడ్ సమన్వయంతో సిబ్బంది, భద్రతా బృందాలు చక్కగా పనిచేశాయని అధికారులు అభినందించారు. ఈ మాక్ డ్రిల్ ఏఆర్ డీఎస్పీ శ్రీనివాసరావు, కడప పరిశ్రమల శాఖ భద్రతాధికారి సతీష్, బాంబ్ డిస్పోజల్ స్క్వాడ్ ఇన్చార్జి శివరాముడు, సిబ్బంది పాల్గొన్నారు. -
● కొత్తవారిని జాయిన్ చేస్తే వెయ్యి!
కురబలకోట: డేటా ఎంట్రీ ఫారంలో ఒకటి రెండ్లు సంఖ్యలు రాస్తే డబ్బులిస్తామని నమ్మబలికి మహిళలకు రూ. 2 కోట్లకు పైగా మోసగించిన సంఘటన కురబలకోట మండలంలోని అంగళ్లులో బుధవారం వెలుగుచూసింది. జిల్లాలోని వివిధ మండలాల్లో కలకలాన్ని సృష్టించింది. బాధితులు, రూరల్ సీఐ సత్యనారాయణ కథనం మేరకు...అంగళ్లు కదిరి రోడ్డులో మూడు నెలల కిందట ఎలైట్ క్రూవ్స్ డేటా సొల్యూషన్స్ పేరుతో బెంగళూరుకు చెందిన వినోద్కుమార్ అద్దె భవనంలో ఓ కార్యాలయం ఏర్పాటు చేశారు. అంగళ్లు గ్రామానికి చెందిన ఆరుగురు మహిళలు, ఇద్దరు పురుషులను తాత్కాలిక ఉద్యోగులుగా నియమించారు. వీరికి రోజుకు రూ. 350 చొప్పన ఇచ్చేలా ఒప్పందం చేసుకున్నాడు. వీరు పార్ట్ టైమ్ కింద డేటా ఎంట్రీకి వచ్చే మహిళలను రిజిస్ట్రేషన్ చేయడం, డబ్బులు వసూలు చేయడం లాంటి పనులు చేసేవారు. డేటా ఫారాలపై వారు చెప్పిన సంఖ్యల్లో ఒకటి రెండ్లు రాయాలి. మహిళలు తొలుత రూ. మూడు వేల చొప్పున చెల్లిస్తే వారికి వంద డేటా ఫారాలు ఇస్తారు. రాయాల్సిన సంఖ్యలను చెబుతారు. వీటిని ఎలాంటి తప్పులు,దిద్దుబాట్లు లేకుండా రాస్తే రూ. ఐదు వేలు ఇస్తారు. వంద మంది డేటా ఫారాలు తీసుకుంటే వీరిలో ఏ కొద్దిమందికో డబ్బులు ఇచ్చి మిగిలిన వారికి డబ్బులు ఇవ్వకుండా తప్పులున్నాయనో..కొట్టివేతలు ఉన్నాయన్న సాకుతో వెనక్కి పంపేవారు. మూడు వేలు కడితే.. నంబర్లు రాస్తే రూ. 5000 ఇస్తారన్నది పరిసర ప్రాంతాల్లో వ్యాపించడంతో రోజుకు వంద నుండి 150 మంది దాకా రిజిస్ట్రేషన్ చేసేవారు. ఒక్క అంగళ్లులోనే కాకుండా కురబలకోట, ముదివేడు, పీలేరు, మదనపల్లె, రాయచోటి, కలకడ, కలికిరి, వాల్మీకిపురం, చౌడేపల్లె, పుంగనూరు, గుర్రంకొండ, నిమ్మనపల్లెతోపాటు వివిధ ప్రాంతాల మహిళలు ఎక్కువగా ఉన్నారు. కొంత మందికి మాత్రమే డబ్బులు ఇచ్చి చాలా మందికి ఇవ్వకుండా మోసం చేస్తుండడంతో విధిలేని పరిస్థితిలో బుధవారం బాదితులు ముదివేడు పోలీసులను ఆశ్రయించారు. జరుగుతున్న మోసాన్ని వెల్లడించారు. అంతేకాదు గంటల వ్యవధిలో జిల్లాలోని వివిధ ప్రాంతాల నుండి వందల మంది బాధిత మహిళలు అంగళ్లులోని ఓపీ స్టేషన్కు చేరుకుని నిరసన వ్యక్తం చేశారు. రోడ్డుపై ఽకొంత సేపు ధర్నా రాస్తారోకో నిర్వహించారు. పోలీసులు విషయం తెలియడంతో ఈ సంస్థ కార్యాలయంపై దాడులు నిర్వహించారు. రికార్డులను స్వాధీనం చేసుకున్నారు. అందులో పనిచేసే 8 మంది ఉద్యోగులను అదుపులోకి తీసుకున్నారు. విచారణ చేపట్టారు. మహిళల నుండి వచ్చిన డబ్బులను క్యూర్ కోడ్ ద్వారా బెంగళూరులోని వినోద్కమార్కు పంపేవారమని చెబుతున్నారు. ఇతనికి అన్నమయ్య జిల్లాలో వివిధ ప్రాంతాల్లో ఇలాంటి బ్రాంచ్లు ఉన్నట్లు వెల్లడవుతోంది. త్వరలో మదనపల్లె కూడా కొత్త బ్రాంచ్ ఏర్పాటు చేయాలని సంకల్పించిన తరుణంలో ఇది బయటపడడంతో అంతా అవాక్కవుతున్నారు. ఈ కొత్త మోసం అన్నమయ్య జిల్లాలో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తోంది. ఒకటి రెండ్లు రాస్తే డబ్బులట..!! మహిళలను మోసగించి రూ. 2 కోట్ల వంచన పోలీసులను ఆశ్రయించిన వందలాది మంది బాధితులు అంగళ్లులో ధర్నా, రాస్తారోకోఎవరైనా కొత్త వారిని జాయిన్ చేస్తే వారికి రూ.వెయ్యి చొప్పున నగదు ప్రోత్సాహం ఇచ్చేవారు. వారికి కూడా వంద డేటా ఎంట్రీ ఫారాలు ఇచ్చి సంఖ్యలు రాసుకుని రావాలని చెప్పేవారు. ఇలా వెయ్యికి ఆశపడి పలువురు మహిళలు తెలిసిన వారితో పాటు ఇరుగుపొరుగు వారిని అధిక సంఖ్యలో చేర్చారు. బాధితుల్లో ఎక్కువ మంది ముస్లిం మైనారిటీ మహిళలు ఉండడం గమనార్హం. -
కబ్జా కోరల్లో వక్ఫ్ భూములు
గుర్రంకొండ: గుర్రంకొండతోపాటు మండలంలో ని పలు గ్రామాల్లో సుమారు రూ.300 కోట్లు విలువచేసే వక్ప్బోర్డుభూములు కబ్జాకు గురయ్యాయి. ఒక్క గుర్రంకొండ పట్టణంలోనే రూ. 200 కోట్ల విలువచేసే వక్ఫ్ స్థలాలు అన్యాక్రాంతమయ్యాయి. కడప–బెంగుళూరు జాతీయరహదారికి ఇరువైపు లా పట్టణంలో విలువైన వక్ఫ్బోర్డు స్థలాలు ఉన్నా యి. ఏళ్ల తరబడి వీటి ఆలనాపాలనా పట్టించుకొనే అధికారులు లేకపోవడంతో విలువైన స్థలాలు కబ్జా కు గురయ్యాయి. పట్టణంలో అధికశాతం మంది మైనార్టీలు నివసిస్తున్నారు. అయితే వీరికి ఏమా త్రం వక్ఫ్ స్థలాలు ఉపయోగపడడంలేదు. కొంతమంది కబ్జాకోరులు ఇష్టానుసారం వీటిని ఆక్రమించుకొని దర్జాగా అనుభవిస్తున్నారు. కనీసం మైనార్టీ లకు అవసరమైన షాదీమహల్, ఉర్దూ ఐటీఐ వంటి ప్రభుత్వసంస్థల నిర్మాణానికి అవసరమైన స్థలాలు కూడా లభ్యం కాని పరిస్థితి నెలకొడం దారుణమని మైనార్టీలు చర్చించుకుంటున్నారు. శిలాఫలకంలో భధ్రంగా ఉన్న షాదీమహల్ గుర్రంకొండలలో వందల ఎకరాల వక్ఫ్ భూములున్నా మైనార్టీలకు అవసరమైన భవనాలు, షాదీమహల్ నిర్మించేందుకు కావాల్సిన స్థలాలకు మాత్రం కొరత ఏర్పడింది. 11 ఏళ్లకిందట షాదీమహల్నిర్మాణానికి మంజూరైన రూ.50లక్షల నిధులు వినియోగించక నిర్వీర్యమతువుతున్నాయి. జిల్లాలో మొదటిసారిగా గుర్రంకొండకు మైనార్టీ ఐటీఐ మంజూరురైంది. ఇందుకోసం అప్పట్లో ప్రభుత్వం రూ. 10 కోట్లు నిధులు మంజూరు చేసింది. గత 11ఏళ్లుగా షాదిమహల్ నిర్మాణం శిలాఫలకంలో భధ్రంగా ఉంది. మైనార్టీల ఐటీఐకి మాత్రం స్థల అన్వేషణలో అధికారులు ఉన్నారు. మూడు సార్లు నిధుల మంజూరు 1999లో ఇక్కడ షాదీ మహల్ మంజూరైంది. అప్పట్లో షాదీమహల్ అభివృద్ధి కమిటి ఏర్పాటు చేసి రూ. 5లక్షలు నిధులు మంజూరు చేశారు. గ్రామంలోని వక్ఫ్ బోర్డు స్థలంలో ఐదు సెంట్ల స్థలం కేటాయించారు. అని వార్యకారణాలతో నిర్మాణం జరగలేదు. 2004లో మళ్లీ రెండో సారి మంజూరైంది. అప్పట్లో రూ.10 లక్షలు నిధులు మంజూరయ్యాయి. మళ్లీ స్థలం ఎంపిక సమస్య మారడంతో నిలిచిపోయింది. గ్రామంలో విలువైన మైనార్టీల భూములున్నా షాదీమహల్కు అవసరమైన స్థలం లేక పోవడం గమనార్హం. మళ్లీ 2013లో అప్పటి సీఎం నల్లారి కిరణ్కుమార్రెడ్డి షాదీ మహల్ మంజూరుచేసి నిర్మాణానికి అవసరమైన రూ. 50 లక్షల నిధులు మంజూరు చేశారు. అదే ఏడాది మేనెల 27న నిర్మాణానికి శంకుస్థాపన కూడా చేశారు. అయినా నిర్మాణ పనులు ప్రారంభం కాలేదు. ఇప్పటికీ మూడు సార్లు నిధులు మంజూరై వెనక్కు వెళ్లిపోయాయి. జిల్లాలో ఎక్కడా లేని విధంగా గుర్రంకొండలో మా త్రమే మైనార్టీ ఐటీఐ మంజూరైంది. ఇందుకు అవ సరమైన స్థలాన్ని రెవెన్యూ అధికారులు పరిశీలించి ప్రతిపాదనలు పంపాలని జిల్లా కలెక్టర్ ఆదేశాలు జారీ చేశారు. గతంలో ప్రభుత్వం రూ. 10 కోట్ల ని ధులను కేటాయించింది. కళాశాల ఏర్పాటు కోసం 10 ఎకరాల స్థలం అవసరం అవుతుంది. గుర్రంకొండ పరిసరాల్లోని ప్రభుత్వ భూములను సర్వేచే సి ప్రతి పాదనలు పంపించాలంటూ అప్పట్లో జిల్లా కలెక్టర్ స్థానిక రెవెన్యూ అధికారులకు ఆదేశాలు జా రీ చేశారు. గ్రామంలో మైనార్టీలకు చెందిన వివిధ రకాల వందలాది ఎకరాల భూములున్నా అందులో పట్టుమని 10 ఎకరాల స్థలం లభించలేదు. దీంతో చేసేదిలేక రెవెన్యూ అధికారులు చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామంలోని గుట్టల్లో 5.06 ఎకరాల స్థలాన్ని సర్వేచేసి ఉన్నతాధికారులకు ప్రతిపాదనలు పంపారు. అయితే ప్రభుత్వ నిబంధనల మేరకు ఇంకా ఐదు ఎకరాల స్థలం అవసరం అవుతుంది. గ్రామంలో వందలకోట్లు కోట్లు విలువ చేసే మైనార్టీల భూములున్నా వారికి అవసరమైన ప్రభుత్వ భవన నిర్మాణాలకు కావాల్సిన స్థలాలు మాత్రం దొరక్క పోవడం గమనార్హం. కలెక్టర్ దృష్టికి తీసుకెళతాం గుర్రంకొండలో షాదీమహల్, మైనార్టీల ఐటీఐ నిర్మాణాలకు అవసరమైన స్థలాల సమస్యను జిల్లా కలెక్టర్ దృష్టికి తీసుకెళతాం. త్వరలో అన్యాక్రాంతమైన వక్ప్బోర్డు భూములన్నింటిపై పూర్తి స్థాయిలో విచారణ జరుపుతాం. – వసీమ్ అక్రమ్, వక్ఫ్బోర్డు ఇన్స్పెక్టర్, అన్నమయ్య జిల్లాస్థలం కోసం అన్వేషణ రూ. 300 కోట్ల భూములు అన్యాక్రాంతం పట్టించుకోని అధికారులు -
ఘనంగా సద్గురు దర్గా స్వామి జయంతి
రామాపురం (రాయచోటి జగదాంబసెంటర్): రామాపురం మండలం నీలకంఠ్రావుపేట గ్రామంలోని సాయి నగర్లో వెలసిన శ్రీ సద్గురు దర్గా స్వామీజీ 95వ జయంతిని బుధవారం నిర్వాహకులు వైభవంగా నిర్వహించారు. పరిపూర్ణతరుడు, పరబ్రహ్మ స్వరూపుడు, పరమాత్ముడు, దత్త స్వరూపుడు అయిన సమర్థ దర్గా స్వామీజీ జయంతి వేడుకలకు పలు ప్రాంతాల నుండి పెద్ద ఎత్తున భక్తులు పాల్గొన్నారు. సద్గురువు అయినటువంటి దర్గా స్వామీజీ ఆశీస్సులను వారు పొందారు. సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు కడప కోటిరెడ్డి సర్కిల్: ప్రయాణికుల రద్దీ దృష్ట్యా సికింద్రాబాద్ – తిరుపతి మధ్య ప్రత్యేక రైలు నడుపుతున్నారని కడప రైల్వే కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్థన్ తెలిపారు. 07009 నంబరుగల రైలు ప్రతి గురువారం సికింద్రాబాద్లో ఈనెల 31, ఆగస్ట్ 7, 14, 21, 28వ తేదీల్లో, 07010 నంబరు గల రైలు తిరుపతి నుంచి సికింద్రాబాద్కు ప్రతి శుక్రవారం ఆగస్ట్ 1, 8, 15, 22, 29వ తేదీల్లో నడుస్తుందన్నారు. సికింద్రాబాద్లో ప్రతి గురువారం రాత్రి 10గంటలకు బయలుదేరి కాచిగూడ, షాద్ నగర్, జడ్చర్ల, మహబూబ్ నగర్, కర్నూలు సిటీ, డోన్, గుత్తి, తాడిపత్రి, ఎర్రగుంట్ల మీదుగా కడపకు ఉదయం 7.05గంటలకు చేరుకుని, రాజంపేట, రేణిగుంట మీదుగా తిరుపతికి ఉదయం 10.30గంటలకు చేరుకుంటుందన్నారు. అలాగే ప్రతి శుక్రవారం తిరుపతిలో సాయంత్రం 4.40గంటలకు బయలుదేరి ఇదే మార్గంలో సికింద్రాబాద్కు ఉదయం 6.45గంటలకు చేరుతుందని ఆయన తెలిపారు. -
టీడీపీ కుట్రలు భగ్నం
మండల వైస్ ఎంపీపీ వైఎస్సార్సీపీదే సంబేపల్లె: సంబేపల్లె మండల పరిషత్ ఉపాధ్యక్షుడు–1 పదవి కోసం టీడీపీ చేసిన కుట్రలు భగ్నమయ్యాయి. సంఖ్యాబలం లేకపోయినా వైస్ ఎంపీపీ ఎన్నికల్లో రాజకీయ కుట్రకు తెరలేపింది. వైఎస్సార్పీకి చెందిన ఎంపీటీసీలను మభ్యపెట్టి, భయపెట్టి స్థానాన్ని కై వసం చేసుకునే ప్రయత్నం చేసిన అధికార పార్టీ విఫలమైంది. వైఎస్సార్సీపీ గుర్తుతో గెలిచిన ఎంపీటీసీలు పార్టీ నిర్ణయానికి కట్టుబడి అధిష్టానం సూచించిన అభ్యర్థిని గెలిపించుకున్నారు. ఇటీవల వైస్ ఎంపీపీ రాజీనామ చేయంతో ఆ స్థానం ఖాళీ ఏర్పడింది. బుధవారం డీఎల్డీఓ లక్ష్మీపతి అధ్యక్షతన పోలీసు బందోబస్తు నడుమ ఎన్నిక నిర్వహించారు. ఆరుగురు సభ్యులు హాజరయ్యారు. నాగిరెడ్డిగారిపల్లె ఎంపీటీసీ జి. రమాదేవి ప్రతిపాదన మేరకు గున్నికుంట్ల ఎంపీటీసీ కె.శ్రీధర్రెడ్డి పోటీలో నిలిచారు.దుద్యాల ఎంపీటీసీ ఎం. భాగ్యమ్మ, నారాయణరెడ్డిపల్లె ఎంపీటీసీ డి రాజకుమారి, రౌతుకుంట ఎంపీటీసీ చిన్న భద్రయ్య, శెట్టిపల్లె యం.సీతమ్మలు బలపరిచారు. ఎన్నికల్లో ఎవరూ పోటీ చేయకపోవండతో ఏకగ్రీవంగా మండల ఉపాధ్యక్షుడిగా కేతంరెడ్డి శ్రీధర్రెడ్డి ఎన్నికై నట్లు ఎన్నికల అధికారులు డిక్లరేషన్ పత్రాన్ని అందజేశారు. -
వాడిని ఊరికే వదల కూడదు
ముందు మూడు వేలు చెల్లించి వంద డేటా ఫారాలను అతి కష్టం మీద రాయాలి. వేళ్లు నొప్పి పుట్టేవి...ఆపై తప్పులు లేకుండా ఏకాగ్రతతో రాయడం వల్ల కళ్లు కూడా మసకబారేవి. ఇంటివద్ద ఖాలీగా ఉంటున్నాం. ఏదో ఒకపని పార్ట్ టైమ్గా చేయడం ద్వారా కొంత ఆదాయం వస్తుందని ఆశపడి ఈపని చేస్తే మహిళలన్న జాలి కూడా లేకుండా నిర్వాహకుడు మోసం చేశాడు. ఇలాంటి వాడిని ఊరికే వదలకూడదు. –తులసి, నీరుగట్టువారిపల్లె, మదనపల్లె వంద ఫారాలు రాస్తే రూ. 5 వేలు అన్నారు ముందుగా రూ.3 వేలు చెల్లిస్తే నిర్వాహకులు రిజిస్ట్రేషన్ చేసుకుని వంద డేటా ఎంట్రీ ఫారాలు ఇస్తా రు. వీటికి రెండు వైపులా వారిచ్చిన సంఖ్యలు రాయాలి. వాటిని తెచ్చి అన్ని కరెక్టుగా ఉంటే రూ.5 వేలు ఇస్తారు. ఇలా కొందరికి మాత్రమే ఇచ్చారు. బాధితులంతా సామాన్య, మధ్యతరగతి వారే. మాకు న్యాయం చేయాలి. –సబిహా, బాధితురాలు, మదనపల్లె బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం జిల్లాలోని వివిధ ప్రాంతాల వారే కాకుండా కర్నాటకలోని రాయల్పాడు ప్రాంతం వారు కూడా బాధితులుగా ఉన్నారు. ఇంతగా మహిళలుమోసం పోవడం విచిత్రంగా ఉంది. బుధవారం ఒక్క రోజే 200 మందికి పైగా బాధితులు వచ్చారు. ఫిర్యాదులు తీసుకున్నాం. ఎలైవ్ క్రూవ్స్ డేటా నిర్వాహకులు బెంగళూరు వాసి. ఇతనిపై కేసు నమోదు చేశాం. ఇతని కోసం ప్రత్యేక టీమ్ను ఏర్పాటు చేశాం. ఇంకా బాధితులు ఉంటే ఫిర్యాదు చేయవచ్చు. బాధితులకు న్యాయం జరిగేలా చూస్తాం. –సత్యనారాయణ, రూరల్ సర్కిల్ సీఐ, మదనపల్లె -
ఓ పట్టాన ప్రకటించరే!
మదనపల్లె సిటీ: డిగ్రీ అడ్మిషన్లపై కూటమి ప్రభుత్వం ఎటూ తేల్చనంటోంది. ఇంటర్మీడియట్ ఫలితాలొచ్చి రెండు నెలలవుతున్నా డిగ్రీ అడ్మిషన్ల నోటిఫికేషన్ ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. భవిష్యత్తులో డిగ్రీ పట్టా అందుకోవాల్సిన విద్యార్థులు కోర్సుల్లో ప్రవేశానికి ఎదురు చూస్తు న్నారు. జులై మొదటి వారానికి డిగ్రీ ప్రవేశాలు పూర్తయి తరగతులు మొదలుకావాలి. సగం రోజు లు పూర్తికావొస్తున్నా ఎస్వీ యూనివర్సిటీ నుంచి కౌన్సెలింగ్ ప్రకటన వెలువడ లేదు. ఓ వైపు ఇంజినీరింగ్ ప్రవేశాలకు ఏర్పాట్లు జరుగుతుండగా, డిగ్రీ ప్రవేశాలపై ఇంత వరకు ఎలాంటి కదలిక లేకపోవడం గమనార్హం. ఏ కోర్సులో చేరాలి .. అందుబాటులో ఉన్న డిగ్రీ కళాశాలలో కోరుకున్న సీటు దక్కుతుందో లేదోనని విద్యార్థులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో తొమ్మిది ప్రభుత్వ, 30కిపైగా ప్రైవేటు డిగ్రీ కాలేజీలు ఉన్నాయి. ఇందులో సుమారు 10 వేల వరకు సీట్లు అందుబాటులో ఉన్నాయి. గత ఏడాది ఆన్లైన్ విధానంలో కౌన్సెలింగ్ నిర్వహించి డిగ్రీ ప్రవేశాలు పూర్తి చేశారు. ఈ ఏడాది ఆన్లైన్లో చేయాలా. నేరుగా చేయాలనే దానిపై కొంత కాలంగా తర్జనభర్జన పడుతున్నారు. మరో వైపు డిగ్రీలో సబ్జెక్టుకు సంబంధించి సింగిల్ మేజరా.. డబుల్ మేజరా అనే దానిపైనే చర్చ నడుస్తోంది. ఈ రెండింటిపై ఇంత వరకు ఉన్నత విద్యామండలి నుంచి స్పష్టత రాలేదు. ఈ ప్రభావం డిగ్రీ ప్రవేశాలపై కూడా ఉంది. కౌన్సెలింగ్ ప్రకటన ఎప్పుడు వస్తుందా.. అని నిరీక్షిస్తున్నారు. ఇంజినీరింగ్ వంటి కోర్సుల్లో చేరేందుకు ఆర్థిక స్థోమత లేని పేద విద్యార్థులకు డిగ్రీనే ఆధారం. ఓ వైపు కళాశాలకు వెళుతూనే సాయంత్రం సమయంలో ట్యూషన్లు వంటివి చెప్పుకుంటూ పార్ట్టైమ్ ఉద్యోగాలు చేస్తూ చదివే వారు ఉన్నారు. ముఖ్యంగా అమ్మాయిలు తాము నివాసం ఉన్న ప్రాంతంలోని డిగ్రీ కాలేజీలో సీటు దక్కుతుందో లేదోనని ఆందోళన చెందుతున్నారు. ఇలాంటి వారంతా ఇంత తక్కువ సమయంలో కౌన్సెలింగ్ ప్రకటన వెలువడితే డిగ్రీలో ఏ సబ్జెక్టు ఎంపిక చేసుకోవాలి.. కళాశాల ఉండే ప్రాంతంలో వసతి సౌకర్యం ఎలా అన్న దానిపై ఆందోళన చెందుతున్నారు. ● అడ్మిషన్ల ప్రక్రియ ప్రకటనలో జరుగుతున్న జాప్యాన్ని ప్రైవేటు కాలేజీలో తమకు అనుకూలంగా మార్చుకున్నాయి. ఇంటర్ ఫలితాలు వచ్చిన వెంటనే విద్యార్థులను చేర్చుకోవడంతో పాటు మార్కుల జాబితాను,టీసీ,ఇతర సర్టిఫికెట్లను ప్రైవేటు కాలేజీలు సేకరిస్తున్నాయి. ఆన్లైన్ లేదా ఆఫ్లైన్ అడ్మిషన్ల ప్రక్రియ ప్రారంభమైన వెంటనే ఇప్పటికే చేరిన వారిని దరఖాస్తు చేయించి తమ కాలేజీలను ఆప్షన్లుగా ఎంచుకునే విధంగా ఏర్పాట్లు చేసుకున్నాయి. సమయం లేదు మిత్రమా? ఆన్లైన్ లేదా ఆఫ్లైన్లో అడ్మిషన్ల ప్రక్రియ నిర్వహించినా అది నెలకుపైగా సాగుతుంది. గతంలో రెండు నెలల సమయం వరకు షెడ్యూలు ఇచ్చి విద్యార్థుఽలకు ఇబ్బందులు లేకుండా ప్రక్రియ నిర్వహించేవారు. కూటమి ప్రభుత్వం ఇప్పటి వరకు షెడ్యూలే ఇవ్వకపోవడం విమర్శలకు తావిస్తోంది. తొలి విడతలో మిగిలిన సీట్లను భర్తీ చేసేందుకు మరో రెండు విడతలు ప్రక్రియ నిర్వహించాలి ఇదంతా జరిగి క్లాసులు ప్రారంభమయ్యే సరికి ఆగస్టు నెల వచ్చేస్తుందని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నారు. ఆఫ్లైన్ కోసమే ఆలస్యమా? డిగ్రీ విద్యార్థులకు అడ్మిషన్ల ప్రక్రియను సలభతరం చేసేందుకు గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం 2022–23లో ఆన్లైన్ విధానాన్ని ప్రవేశపెట్టింది. ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా సులువుగా ఆన్లైన్ విధానంలో అడ్మిషన్లు పొందేవారు. కూటమి ప్రభుత్వం ఆన్లైన్ విధానాన్ని రద్దు చేసి తిరిగి ఆఫ్లైన్లో అడ్మిషన్లు చేపట్టేందుకు కుట్ర పన్నుతున్నట్లు తెలుస్తోంది. ఇందు కోసమే ఆడ్మిషన్లలు ప్రక్రియ ఇంకా ప్రారంభించలేదని విద్యార్థి సంఘ నాయకులు ఆరోపిస్తున్నాయి. డిగ్రీ ప్రవేశాలకు విద్యార్థుల ఎదురు చూపులు ఎస్వీయూ పరిధిలోప్రారంభం కాని కౌన్సెలింగ్ -
ఐచర్ వాహనం ఢీకొని ఒకరికి గాయాలు
మదనపల్లె రూరల్ : ఐచర్ వాహనం ఢీకొని ఓ వ్యక్తి గాయపడిన సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని తురకపల్లెకు చెందిన సయ్యద్సాహెబ్(54) నమాజుకు వెళ్లేందుకు ద్విచక్ర వాహనంలో వెళ్తున్నారు. మార్గ మధ్యంలో పీలేరు నుంచి బెంగళూరు వెళుతున్న ఐచర్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో సయ్యద్సాబ్ తీవ్రంగా గాయపడగా మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. బాధితుడి కుమారుడు ఖాదర్సాహెబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు. స్కూటర్లు ఢీకొని.. రాయచోటి టౌన్ : రెండు స్కూటర్లు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. ట్రాఫిక్ సీఐ కథనం మేరకు..పట్టణానికి చెందిన ఖాదర్ బాషా రాయచోటి నుంచి రాయవరం వెళ్లుతున్నాడు. అదే సమయంలో రెడ్డెయ్య రాజు టీవీఎస్పై రాయచోటికి వస్తున్నాడు. రాయచోటి – సుండుపల్లె రోడ్డులోని గంగోత్రి(గురుకుల పాఠశాల సమీపంలో)గంగోత్రి వాటర్ ఫ్లాంట్ వద్దకు రాగానే రెండు స్కూటర్లు ఢీకొన్నాయి. ఇద్దరికీ తీవ్ర గాయాలవడంతో కడప ఆస్పత్రికి పంపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
దాత సాయంతో ఠాణాకు మెరుగులు
పెనగలూరు : పెనగలూరు పోలీస్ స్టేషన్ మరమ్మతులకు కొత్తపల్లి గ్రామానికి చెందిన తలమంచి గిరీష్రెడ్డి రూ.10 లక్షలు వితరణచేశారు. 988లో నిర్మించిన పెనగలూరు పోలీసు స్టేషన్ భవనాలకు ఇప్పటివరకూ ఎలాంటి మరమ్మతులు చేయలేదు. ఎస్ఐకు కేటాయించిన గది కూడా శిథిలావస్థకు చేరుకుంది. 37 సంవత్సరాల స్టేషన్ను ఎస్ఐ రవిప్రకాష్రెడ్డి చొరవ తీసుకుని రీ మోడలింగ్ చేయిస్తున్నారు. దాతల సహకారం కోరడంతో గిరీష్రెడ్డి ముందుకు వచ్చి రూ.10 లక్షలు అందజేశారు. దీంతో నూతన విద్యుత్తు లైన్లు, దీపాలు వేయించారు. మరుగుదొడ్డి గదికి మరమ్మతు లు చేయించారు. కంప్యూటర్ రూమ్లో టేబుల్, స్టేషన్ గది ఎదుట టైల్స్, ఉత్తరం వైపున సిమెంట్ ఫ్లోరింగ్, రిజిష్టర్లు పెట్టుకునేందుకు షెల్ఫ్ ఏర్పాటు చే యించారు. ఈ సందర్భంగా గిరీష్రెడ్డిని పోలీసులు బుధవారం ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో సిబ్బంది, కొత్తపల్లి యూత్ సభ్యులు పాల్గొన్నారు. -
నకిలీ పత్రాలతో నిరుద్యోగులకు వల
రాయచోటి : నకిలీ కంపెనీలు చూపి ఉద్యోగాలిస్తామంటూ నిరుద్యోగ యువతకు మోసగాళ్లు వల వేస్తున్నారని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడు ఓ ప్రకటనలో సూచించారు. నకిలీ కంపెనీలు, ఫేక్ నోటిఫికేషన్లు, జాతీయ, అంతర్జాతీయ ఉద్యోగావకాశాల పేరిట మోసగాళ్లు డబ్బు వసూలు చేస్తున్నారన్నారు. ఎక్కువమంది యువత అధిక ఆదాయం ఆశతో మోసానికి గరవుతున్నారన్నారు. యూపీఎస్సీ, ఎస్ఎస్సీ, ఏపీపిఎస్సీ వంటి సంస్థల పేరుతో ఫేక్ అపాయింట్మెంట్ లెటర్లు సృష్టిస్తున్నట్లు తెలిపారు. ఒక్కసారి ఫీజు చెల్లిస్తే ఉద్యోగం ఖాయం అనే నకిలీ వెబ్సైట్లు, డొమెయిన్ ఉపయోగించడం, ఐటీ ఇతర దేశాల్లో ఉద్యోగాలున్నాయని నమ్మబలకడం చేస్తున్నారని తెలిపారు. ప్రాసెసింగ్ ఫీజు, వీసా చార్జీలు పేరిట పెద్దమొత్తంలో డబ్బులు వసూళ్లు చేస్తారన్నారు. ఇంటర్వ్యూ లేకుండా నేరుగా ఆఫర్ లెటర్ పంపించే విషయంపై అప్రమత్తంగా ఉండాలని, జాబ్ అప్లికేషన్ పేరిట వ్యక్తిగత డేటా తీసుకొని అక్రమాలకు ఉపయోగిస్తారని పేర్కొన్నారు. బ్యాంక్ డీటెయిల్స్, ఓటీపీలు, ఆథార్ కార్డు, పాన్ కార్డు సమాచారం తీసుకుంటారు జాగ్రత్తగా ఉండాలన్నారు. అధికారిక వెబ్సైట్లలో పరిశీలించాలని, వ్యక్తిగత సమాచారం, బ్యాంక్ డీటెయిల్స్ ఎవరికీ పంపించరాదన్నారు. ఎవరికై నా సమస్య తలెత్తితే సైబర్ హెల్ప్లైన్ 1930, సైబర్ క్రైమ్ పోర్టల్ సైబర్క్రైమ్. జీఓవి.ఇన్, అత్యవసర సమాచారం కోసం మీ సమీప పోలీస్ స్టేషన్ లేదా సైబర్ క్రైమ్ సెల్ను సంప్రదించాలన్నారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు -
హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
సిద్దవటం : ప్రభుత్వ ఉద్యోగిపై హత్యాయత్నం, ప్రభుత్వ ఆస్తిని నష్టం కలిగించిన కేసులో రాజోలి మల్లికార్జున, ఆయన తల్లి రాజోలి రత్నమ్మలకు రెండున్నర సంవత్సరాల జైలు శిక్ష, ఒక్కొక్కరికీ రూ. 1000 జరిమానా విధిస్తూ బద్వేల్ సీనియర్ సివిల్ జడ్జి పద్మశ్రీ బుధవారం తీర్పు వెలువరించినట్లు సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ తెలిపారు. స్థానిక పోలీస్ స్టేషన్లో ఎస్ఐ మాట్లాడుతూ సిద్దవటం కోర్టు జూనియర్ అసిస్టెంట్గా విధులు నిర్వహిస్తున్న గుమ్మల్ల రామక్రిష్ణారెడ్డి సిద్దవటం జడ్జి జిల్లా జడ్జి కాన్ఫరెన్స్కు వెళ్లారు. 2018 డిశంబర్, 29న ముద్దాయిలు అయిన మల్లికార్జున ఆయన తల్లి రాజోలి రత్నమ్మలను పిలిచి జడ్జి కడపకు వెళ్లడంతో కేసు వాయిదా వేస్తున్నామని రికార్డ్ అసిస్టెంట్, తదితరులు చెప్పారన్నారు. దీంతో కోర్టు హాలులోనే గట్టిగా కేకలు వేసి కోర్టు మర్యాదకు భంగం కలిగించేలా మల్లికార్జున, రత్నమ్మ ప్రవర్తించారని, కోర్టు కానిస్టేబుల్ అడ్డు రాగా కాలర్ పట్టుకొని పిడిగుద్దులు గుద్దారని తెలిపారు. కానిస్టేబుల్ను గాయపరచడమేగాక, సిబ్బందిని బూతులు తిట్టి కోర్టులో కుర్చీలు, బల్లలను పగుల కొట్టడం జరిగిందన్నారు. అప్పటి సిద్దవటం ఎస్ఐ అరుణ్రెడ్డి దీనిపై కేసు నమోదు చేసి విచారణ చేశారన్నారు. నేరం రుజువు కావడంతో నిందితులు ఇద్దరికీ శిక్ష విధించారన్నారు. సాక్షాధారులను సకాలంలో ప్రవేశపెట్టి నేరం ఋజువు చేసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీసు అధికారులను, సిబ్బందిని జిల్లా ఎస్పీ ఈజి అశోక్కుమార్ అభినందించినట్లు ఎస్ఐ తెలిపారు. -
కృష్ణచైతన్య ఫార్మసీ కళాశాలలో విచారణ
మదనపల్లె రూరల్ : మండలంలోని రామాచార్లపల్లె కృష్ణ చైతన్య ఫార్మసీ కళాశాలలో సోషల్ వెల్ఫేర్ డిప్యూటీ డైరెక్టర్ ఎస్.కృష్ణ బుధవారం విచారణ చేపట్టారు. సర్టిఫికేట్లు ఇప్పించాలంటూ సబ్ కలెక్టర్ కార్యాలయంలోని పీజీఆర్ఎస్లో విద్యార్థులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో, కళాశాల డైరెక్టర్లు, అధ్యాపకులు, విద్యార్థులను వేర్వేరుగా ఆయన విచారించారు. కళాశాలకు చెందిన ఎడ్యుకేషనల్ సొసైటీలోని ఓ వర్గానికి చెందిన సెక్రటరి, ప్రిన్సిపల్ శశివర్ధన్రెడ్డి, డైరెక్టర్లు శ్యామలమ్మ, గోవర్ధన్రెడ్డి, ఎర్రంరెడ్డి, విష్ణువర్ధన్రెడ్డి, అమరావతిని విచారించారు. వారు మాట్లాడుతూ....ఫీజు రీయింబర్స్మెంట్కు సంబంధించి ప్రభుత్వం రెండు కంతులు విడుదల చేసినా తమ కళాశాల విద్యార్థులకు జమ కాలేదన్నారు. మరో వర్గానికి చెందిన డైరెక్టర్లు అడ్డుపడుతుండడంతో సమస్యలు తలెత్తుతున్నాయన్నారు. అధ్యాపకులకు వేతనాలు అందించడం కష్టంగా ఉందని, రీయంబర్స్మెంట్ విడుదల ఆలస్యం కావడంతో యాజమాన్యం ఒత్తిడి తెస్తోందని, అప్పులు చేసి ఫీజులు చెల్లించాల్సి వస్తోందని విద్యార్థులు వాపోయారు. విచారణ అనంతరం సోషల్ వెల్ఫేర్ డీడీ కృష్ణ మాట్లాడుతూ నివేదికను ఉన్నతాధికారులకు పంపుతామని, ఎలాంటి పరిస్థితుల్లోనూ విద్యార్థులు నష్టపోకూడదని యాజమాన్యానికి సూచించారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జ్ ఏఎస్డబ్ల్యూఓ గంగిరెడ్డి, వార్డెన్ రాంప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏకపక్షంగా సోషల్ వెల్ఫేర్ డీడీ విచారణ మదనపల్లె రూరల్ : కృష్ణ చైతన్య ఫార్మసీ కళాశాలలో జిల్లా సోషల్ వెల్ఫేర్ డీడీ ఏకపక్షంగా విచారణ చేశారని కరస్పాండెంట్ రామ్మోహన్రెడ్డి పేర్కొన్నారు. కళాశాల గేటు వద్ద డైరెక్టర్లు మల్లికార్జునరెడ్డి, శశికుమార్రెడ్డి, గోపాల్రెడ్డిలతో కలిసి ఆయన నిరసన తెలిపారు. ఈ సందర్భంగా కరస్పాండెంట్ రామ్మోహన్రెడ్డి మాట్లాడుతూ...కొత్తగా సొసైటీ ఏర్పాటుచేసుకుని కళాశాలను నిర్వహించామన్నారు. ఈ విషయమై హైకోర్టులో కేసు వేస్తే తీర్పు తనకు అనుకూలంగా వచ్చిందన్నారు. అయితే, రెండు నెలల క్రితం ఓ వర్గం కళాశాలను దౌర్జన్యంగా ఆక్రమించుకుని నిర్వహిస్తోందన్నారు. ఈ విషయాన్ని తాము సోషల్ వెల్ఫేర్ డీడీకి తెలిపేందుకు వస్తే, గేట్లు మూసివేసి లోనికి రానివ్వకుండా దౌర్జన్యం చేస్తున్నారన్నారు. కళాశాల నిర్వహణకు సంబంధించి కోర్టులో కేసు నడుస్తున్నప్పటికీ, సోషల్ వెల్ఫేర్ డీడీ విచారణకు రావడం హైకోర్టు ఉత్తర్వులను ఉల్లంఘించడమేనన్నారు. ఏకపక్ష ధోరణితో ఓ వర్గాన్ని మాత్రమే విచారించడం వల్ల విద్యార్థులు తీవ్రంగా నష్టపోతారన్నారు. ఫార్మసీ కళాశాల విద్యార్థులకు ఎలాంటి నష్టం వాటిల్లినా తాము ఊరుకునేది లేదని, బాధ్యులపై చట్టపరంగా చర్యలు తీసుకుంటామన్నారు. -
సమస్యలను పరిష్కరించడంలో ప్రభుత్వం విఫలం
బద్వేలు అర్బన్ : మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించడంలో కూటమి ప్రభు త్వం విఫలమైందని సీఐటీయూ జిల్లా కా ర్యదర్శి కె.శ్రీనివాసులు, మున్సిపల్ వర్క ర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కె.నాగేంంద్రబాబు అన్నారు. మున్సిపల్ ఉద్యోగ, కార్మికులు బుధవారం మున్సిపల్ కార్యాలయం ఎదుట ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మా ట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టి ఏడాది పూర్తయినప్పటికీ ఇంజినీరింగ్ కార్మికుల నైపుణ్యం ఆధారంగా వేతనాలు చెల్లించలేదన్నారు. గతంలో సమ్మె నేపథ్యంలో ప్రభుత్వం అంగీకరించిన ఒప్పందాలకు జీవోలు జారీ చేయకపోవడం సరికాదన్నారు. ఆప్కాస్ సంస్థను సైతం రద్దు చేసి ప్రైవేట్ ఏజెన్సీలను ప్రోత్సహించాలనుకోవడం దారుణమన్నారు. 60 సంవత్సరాలు నిండిన కార్మికులను బలవంతంగా పదవీ విరమణ చేయించడం మంచిది కాదన్నారు. బద్వేల్ మున్సిపాలిటీలో చనిపోయిన కార్మికుల కుటుంబాలకు ఎక్స్గ్రేషియా, మట్టి ఖర్చు డబ్బులు చెల్లించకపోవడం బాధాకరమని అన్నారు. సమస్య పరిష్కరించని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలకు చేపడతామని హెచ్చరించారు. అనంతరం మున్సిపల్ కమిషనర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో సీఐటీయూ పట్టణ నాయకులు నాగార్జున, వెంకటరమణ, డి.హరి, డి.నాగేంద్రబాబు, దేవమ్మ, చంద్రశేఖర్, నాగరాజు, విజయ్ తదితరులు పాల్గొన్నారు. -
మాటలు వద్దు.. పరిహారం ఇవ్వండి
రైల్వేకోడూరు అర్బన్ : పుల్లంపేట మండలం రెడ్డిపల్లి చెరువుకట్ట వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతిచెందిన గిరిజన కూలీలకు ఎక్స్గ్రేషియా ప్రకటించకుండా మాటలు చెబితే సరిపోతుందా అని జిల్లా సీఐటీయూ అధ్యక్షుడు సిహెచ్.చంద్రశేఖర్ ప్రశ్నించారు. మృతి చెందిన కూలీల కుటుంబాలను బుధవారం ఆయన పరార్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మృతిచెంది నాలుగు రోజులైనప్పటికీ ఇంతవరకు రాష్ట్ర ప్రభుత్వం ఎక్స్ గ్రేషియా ప్రకటించలేదన్నారు. గిరిజనులు, యానాదుల పట్ల వివక్షత చూపుతున్నారని విమర్శించారు. ఈ నెల 21న కోడూరు ఎంఆర్ఓ కార్యాలయం వద్ద నిరసన చేపట్టనున్నట్లు పేర్కొన్నారు. ఇన్చార్జ్ మంత్రి జనార్దన్ రెడ్డి, నియోజకవర్గ కూటమి నాయకులు పరామర్శించినప్పటికీ ఏ ఒక్కరూ గిరిజనులను ఆదుకునే ప్రయత్నం చేయలేదన్నారు. మృతి చెందిన కుటుంబాలకు తక్షణమే రూ.25 లక్షల ఎక్స్ గ్రేషియా, గాయపడిన వారికి రూ. 10 లక్షలు ప్రకటించాలని వారు డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో నాయకులు తదితరులు పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఒకరు మృతి
చిన్నమండెం : కడప–బెంగళూరు జాతీయ రహదారిలోని బెస్తపల్లె క్రాస్ సమీపంలో ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో ఉసిరికాయల వీరాంజనేయులు(40) మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పోలీసుల కథన మేరకు.. మండల పరిధిలోని కేశాపురానికి చెందిన వీరాంజనేయులు, శ్రీనివాసులు తమ సొంత పనుల నిమిత్తం చిన్నమండెంకు వచ్చి వెళ్తుండగా ఈ ప్రమాదం జరిగిందన్నారు. వీరాంజనేయులు అక్కడికక్కడే మృతిచెందగా గాయపడిన శ్రీనివాసులును 108 సాయంతో రాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు తెలిపారు. వారిరువురూ ఇటీవలే కువైట్ నుంచి రాగా.. మళ్లీ తిరిగి అక్కడికి వెళ్లాల్సి ఉంది. మృతుడు వీరాంజ నేయులు భార్య కువైట్లో ఉండగా వారికి ఇద్దరు కుమార్తెలు, కుమారుడు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చిన్నమండెం పోలీసులు తెలిపారు. ఆకులవారిపల్లెలో కోడి పందాలు – పోలీసుల దాడుల్లో నలుగురు అరెస్ట్ బి.కొత్తకోట : మండలంలోని ఆకులవారిపల్లె చెరువులో బుధవారం భారీ స్థాయిలో కోడి పందాలు నిర్వహిస్తుండగా పోలీసులు దాడులు నిర్వహించారు. బి.కొత్తకోట, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె మండలాల నుంచి వచ్చిన వారితో పెద్దమొత్తంలో కోడి పందేలు నిర్వహిస్తున్నారని పోలీసులకు సమాచారం అందింది. దీంతో అందుబాటులో ఉన్న సిబ్బందితో హెడ్కానిస్టేబుల్ బి.విశ్వనాథరెడ్డి దాడులు నిర్వహించారు. ఈ విషయాన్ని పసిగట్టిన కొడిపందెం రాయుళ్లు పరుగులు తీశారు. ఒక కోడి, ఏడు బైక్లు, రూ.700 నగదు స్వాధీనం చేసుకున్నారు. కటారి అంజి(50), రామరాజుపల్లె శ్రీనివాసులురెడ్డి(45), చిప్పలమడుగు మోహన(43), తుపాకుల వెంకటరమణ(38)లను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామని విశ్వనాథరెడ్డి తెలిపారు. సిబ్బంది తక్కువ సంఖ్యలో ఉండటంతో నలుగురిని పట్టుకోగలిగామని మిగిలిన వాళ్లు కోళ్లు, డబ్బుతో పరారయ్యారని తెలిపారు. జర్నలిస్ట్ ఆరోగ్య బీమా పొడిగింపు కడప సెవెన్ రోడ్స్ : రాష్ట్ర ప్రభుత్వం వర్కింగ్ జర్నలిస్టుల ఆరోగ్య బీమా గడువు 2025–26 ఆర్థిక సంవత్సరానికి పొడిగించిందని ఇన్ఛార్జి కలెక్టర్ అదితిసింగ్ ఓ ప్రకటనలో తెలిపారు. జర్నలిస్టులు, వారిపై ఆధారపడిన కుటుంబ సభ్యులకు ఏదైనా అనుకోని అనారోగ్యం సంభవించిన ప్రతిసారీ రూ.2 లక్షల విలువ చేసే వైద్య సేవలు అందుతాయన్నారు. ఏడాది కాలంలో ఎన్నిసార్లైనా పరిమితులు లేకుండా ఈ సదుపాయాన్ని అందిస్తారని తెలిపారు. అక్రిడిటేషన్ పొందిన జర్నలిస్టులందరూ ఈ సదుపాయాన్ని వినియో గించుకోవాలన్నారు. వచ్చే ఏడాది మార్చి 31 వరకు హెల్త్ స్కీం ద్వారా లబ్ధి పొందవచ్చన్నారు. -
మున్సిపల్ కార్మికుల అర్ధనగ్న ప్రదర్శన
రాజంపేట : తమ సమస్యలు పరిష్కరించాలని కోరుతూ రాజంపేట మున్సిపల్ కార్మికులు బుధవారం అర్ధనగ్నంగా నిరసన తెలిపారు. ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సందర్భంగా సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు చిట్వేలి రవికుమార్ మాట్లాడుతూ జీవో నెంబర్–36 ప్రకారం వేతనాలు పెంచాలని కేటగిరీ నిర్ణయంలో పొరపాట్లు సరిదిద్దాలని డిమాండ్ చేశారు. షరతులు లేకుండా ఇంజినీరింగ్, కార్మికులకు సంక్షేమ పథకాలు వర్తింప చేయాలన్నారు. వయోపరిమితి 62ఏళ్లకు పెంచాలని, గ్రాట్యూటీ చెల్లించాలని కోరారు. చట్టబద్ధమైన సెలవులు ఇవ్వాలని, 20 రోజులుగా ఆందోళన చేస్తున్నా.. కూటమి ప్రభుత్వానికి చీమకుట్టినట్లైనా లేదన్నారు. ఏపీ ఎన్జీవో జెఎసీ కన్వీనర్ ఎస్వీ.రమణ, అధ్యక్షుడు హరిప్రసాద్ వీరికి సంఘీభావం తెలిపారు. పీవీరమణ, లక్ష్మీదేవి, ప్రసాద్, ఓబయ్య పాల్గొన్నారు. -
బాధిత కుటుంబాలకు అండగా నిలబడాలి
రాజంపేట: రెడ్డిపల్లె చెరువుకట్టపై జరిగిన లారీ బోల్తా ప్రమాద దుర్ఘటనలో మృతుల కుటుంబాలకు ప్రభుత్వం అండగా నిలబడాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని రాజంపేట ఎంపీ పీవీ మిథున్రెడ్డి అన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఽడ సంతాపాన్ని తెలియచేస్తున్నామన్నారు. శెట్టిగుంట గ్రామంలో కూలీనాలీ చేసుకుని జీవించే పేదలు మృతి చెందడం బాధాకరమన్నారు. శెట్టిగుంటకు చెందిన గిరిజన ప్రమాద బాధితుల కుటుంబాలు మళ్లీ ఆర్థికంగా నిలదొక్కుకునేలా ప్రభుత్వం మానవత్వంతో సాయం చేయాలన్నారు. గతంలో ఇలాంటి ప్రమాదాలలో మృతిచెందిన వారికి ఏ విధంగా ప్రభుత్వాలు ఆర్థికసాయం చేశారో అదే విధంగా ఇప్పటి ప్రభుత్వం స్పందించి ఆదుకోవాలన్నారు. -
మిట్స్ కళాశాలకు ప్రమోషన్
కురబలకోట: మదనపల్లె సమీపంలో అంగళ్లు దగ్గరున్న మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల డీమ్డ్ యూనివర్సిటీ (విశ్వ విద్యాలయం)గా ఆవిష్కృతమైంది. ఈ మేరకు న్యూడిల్లీలోని యూజీసీ మంగళవారం ప్రకటించింది. ఈఘనత సాధనతో మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల యాజమాన్యం, విద్యార్థులు, అధ్యాపకులు, పాలక వర్గ సభ్యులు, కళాశాల శ్రేణులతో పాటు జిల్లా వాసులు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. ఇదొక సరికొత్త నూతన ప్రస్తానమే కాకుండా నూతన అధ్యాయానికి నాంది అని విద్యా వేత్తలు అభిప్రాయపడుతున్నారు. 1998లో స్థాపితమైన ఈ కళాశాల అంచెలంచెలుగా ఎదిగి రెండు దశాబ్దాలుగా అనేక రికార్డులు సృష్టించింది. పరి శోధన, విజ్ఞాన ప్రదర్శనలు, పారిశ్రామిక సహకా రాల్లో విశేషంగా రాణించింది. మరెన్నో గుర్తింపులు పొందింది. ఎన్బీఏ, న్యాక్ వంటి సంస్థల నుండి ప్రత్యేక గుర్తింపు పొందింది. వీటన్నింటిని పరిగణలోకి తీసుకుని కేంద్ర ప్రభుత్వం యూజీసీ నుండి డీమ్డ్ హోదా లభించింది. దీంతో ఈ కళాశాల ఉన్న తంబళ్లపల్లె నియోజక వర్గానికే కాకుండా పక్కనున్న మదనపల్లె నియోజక వర్గంకు కూడా ఇది తల మానికంగా మారింది. ఇన్నేళ్లు యూనివర్సిటీ అంటే తిరుపతి, అనంతపురం లేదా పక్కనున్న కర్నాటక, చైన్నె లోని యూనివర్సిటీలకు ఉన్నత చదువులకు వెళ్లాల్సి వచ్చేది. ఇప్పుడు మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల యూనివర్సిటీ కావడంతో ఉన్నత చదువులు దగ్గరయ్యాయి. ఈ సందర్భంగా కళాశాలలో అధ్యాపకులు, విద్యార్థులు, సిబ్బంది ఆనందోత్సాలతో సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ ఏడాది నుండే అడ్మిషన్లకు కేంద్ర విద్యా మంత్రిత్వ శాఖ అనుమతిస్తూ నోటిఫికేషన్ కూడా విడుదల చేసింది. సీమకే గర్వకారణంఇది అన్నమయ్య జిల్లా విద్యా క్షేత్రంలో మరో ఘన విజయం. మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల డీమ్డ్ యూనివర్సిటీగా గుర్తింపు పొందడం కళాశాలకే కాకుండా సీమ ప్రాంతంలోనే ఏకై క కేంద్రీయ డీమ్డ్ యూనివర్సిటీ కావడం గర్వకారణం. – డాక్టర్ విజయ భాస్కర్ఽచౌదరి, కరస్పాండెంట్, మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల, మదనపల్లె డీమ్డ్ యూనివర్సిటీగా మిట్స్ ఇంజినీరింగ్ కళాశాల అంతటా హర్షాతిరేకం అన్నమయ్య జిల్లాకు మకుటాయమానం రాయలసీమలోనే ఏకై క కేంద్ర డీమ్డ్ యూనివర్సిటీగా రికార్డు ఈ ఏడాది నుండే అడ్మిషన్లు -
పంచాయతీ పురోగతిపై శిక్షణ
రాయచోటి జగదాంబసెంటర్: జిల్లాలోని ఎంపీడీఓలకు, పంచాయతీ కార్యదర్శులకు రాయ చోటి పట్టణంలోని ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ పురోగతి సూచిక 2.ఓపై మంగళవారం శిక్షణా కార్యక్రమం నిర్వహించినట్లు డీఎల్డీఓ లక్ష్మీపతి, డీపీఓ రాధమ్మ, డ్వామా పీడీ వెంకటరత్నం తెలిపారు. వీరికి పీఆర్ డీఈ దయాకర్రెడ్డి, డీఏఓ శివనారాయణ, డీఈఓ సుబ్రమణ్యం, డీఆర్డీఏ పీడీ సత్యనారాయణలు శిక్షణ ఇచ్చారు. పంచాయతీ పురోగతి సూచిక 2.ఓ ఫైనాన్షియల్ ఇయర్ 2023–24లో భాగంగా 2025–26 ఫైనాన్షియల్ ఇయర్కి గాను, పంచాయతీ పురోగతి ప్రణాళికలను తయారు చేయుటపై శిక్షణను ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని ఎంపీడీఓలు, పంచాయతీ కార్యదర్శులు, డిజిటల్ అసిస్టెంట్లు, కడప, చిత్తూరు డీపీఆర్సి సిబ్బంది పాల్గొన్నారు. చెన్నేపల్లి పాఠశాల సందర్శన అట్లూరు: అట్లూరు మండలం చెన్నేపల్లి ప్రాథ మిక పాఠశాలను మంగళవారం డీఈఓ షంషుద్దీన్ తనిఖీ చేశారు. పాఠశాల విద్యార్థులతో సమస్యల గురించి అడిగి తెలుసుకున్నారు. డీఈఓ వచ్చిన విషయం తెలుసుకున్న చెన్నేపల్లి కాలనీ వాసులు అక్కడకు చేరుకున్నారు. ‘అయ్యా మా పాఠశాలలోని 3,4,5 తరగతుల విధ్యార్థులను ఎస్ వెంకటాపురం పాఠశాలకు తరలించాలని ఉపాధ్యాయులు అంటున్నారు. అలా జరిగితే మాపిల్లలను మేం పంపియ్యం.. 5వ తరగతి వరకూ మా కాలనీలోనే చదువు చెప్పాలి’ అని విన్నవించారు. స్పందించిన డీఈఓ ఈ సమస్య గురించి విధ్యాశాఖ జాయింట్ డైరెక్టరుకు పంపించామని.. అక్కడ నుంచి ఉత్తర్వులు అందే వరకూ ఈ పాఠశాలను ఇక్కడే కొనసాగుతుందని కాలనీ వాసులకు హామీ ఇచ్చారు. -
కృత్రిమ మేథపై నైపుణ్యం సాధించాలి
రాయచోటి: నేటి ప్రపంచంలో పాఠశాల స్థాయిలోనే విద్యార్థులు కృత్రిమ మేథ నైపుణ్యాన్ని గడించాల్సిన అవసరం ఉందని జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ కె సుబ్రమణ్యం పేర్కొన్నారు. ప్రపంచ యువత నైపుణ్యాల దినోత్సవం సందర్భంగా సమగ్ర శిక్ష ఆధ్వర్యంలో స్థానిక ప్రభుత్వ డైట్ ఉన్నత పాఠశాలలో మంగళవారం ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. డైట్ పాఠశాలలో 9,10వ తరగతి విద్యార్థులకు ఎలక్ట్రానిక్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలలో అంతర్జాతీయ ప్రమాణాలతో కూడిన వృత్తి విద్య శిక్షణ అందుబాటులో ఉందన్నారు. ఇందుకోసం ప్రభుత్వం నిష్ణాతులైన ట్రైనర్లను అందుబాటులోకి తెచ్చిందన్నారు. పాఠ్యాంశాలకు అదనంగా చిన్నప్పటి నుండి వృత్తి విద్యా నైపుణ్యాలు పెంపొందించడం ద్వారా జీవితంలో త్వరగా స్థిరపడవచ్చన్నారు. నైపుణ్య దినోత్సవాన్ని పురస్కరించుకొని మై ట్రేడ్, మై డ్రీమ్ పేరుతో విద్యార్థులకు డ్రాయింగ్ పోటీలు, కేస్ స్టడీస్ విద్యార్థులు రూపొందించిన ప్రాజెక్టులతో ఏర్పాటు చేసిన కెరీర్ పాత్ చార్ట్స్ అందరినీ ఆకట్టుకుంటున్నాయన్నారు. ఈ కార్యక్రమంలో పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు నిర్మలాదేవి, సమగ్ర శిక్ష సిఎంఓ కరుణాకర్, ఏపీఓ చంద్రశేఖర్, జిల్లా ఒకేషనల్ కో–ఆర్డినేటర్ యోగేష్ కుమార్ రెడ్డి, పాఠశాల ఒకేషనల్ ట్రైనర్లు మహబూబ్ బాష, రామాంజనేయులు, సాయి ఇంజనీరింగ్ కళాశాల అధ్యాపకులు పాల్గొన్నారు. -
ఉపాఽధిలో ‘తమ్ముళ్ల’ దోపిడీ!
సాక్షి టాస్క్పోర్స్: గ్రామీణ ప్రాంతాల్లో వలసల నివారణే లక్ష్యంగా కేంద్ర ప్రభుత్వం 2005లో తీసుకొచ్చిన మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం నిధులను కూలీలకు అందకుండా తెలుగు తమ్ముళ్లు దోపిడీకి పూనుకుంటున్న సంఘటనలు రాయచోటి ప్రాంతంలో వెలుగు చూస్తున్నాయి. కరువు కాటకాలకు నిలయమైన ఈ ప్రాంతంలో అరకొరగా జరుగుతున్న ఉపాధి పనులు చేసుకుని పూట గడుపుకుందామనుకుంటున్న కూలీలకు నిరాశే ఎదురవుతోంది. ఫారమ్పాండ్స్, ఫిష్ ఫాండ్స్ పనులను అధికారులపై ఒత్తిడి తెచ్చి తెలుగు తమ్ముళ్లు ఆయా పనులను జేసీబీ యంత్రాలతో కానిచ్చేసి సొమ్ము చేసుకుంటున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అందులో భాగంగానే రాయచోటి మండలం మాధవరం గ్రామంలోని కొండ ప్రాంతాలలో మంజూరైన ఫారమ్పాండ్స్, ఫిష్పాండ్స్ పనులను ఉపాధి కూలీలతో కాకుండా , జేసీబీ యంత్రాలతో చేస్తున్న విషయాన్ని స్థానిక కూలీలు పసిగట్టి సెల్ఫోన్లలో వీడియో చిత్రీకరించారు. ఇటీవల కాలంలో సంబంధిత అధికారులు ఈ విధంగా పనులను కూలీలతో కాకుండా యంత్రాలతో చేయించడం వల్ల సమస్యలు తలెత్తుతాయని వారికి చెప్పినప్పటికి ఎటువంటి మార్పు రాలేదని అధికారులు తలలు పట్టుకుంటున్నట్లు స్థానికుల్లో చర్చ జరుగుతోంది. రాయచోటి మండలానికి 260 ఫారమ్ పాండ్స్ మంజూరు : రాయచోటి మండలంలోని వివిధ గ్రామాలలో ఉపాధి కూలీలకు పనులు కల్పించేందుకు , తద్వారా రైతుల పొలాలలో నీటి నిల్వ చేయడం వల్ల భవిష్యత్ లో భూగర్భ జలాలు పెంపొందించే ఉద్దేశ్యంతో సుమారు 260 ఫారమ్ ఫాండ్స్ మంజూరైనట్లు రాయచోటి ఉపాధి ఏపీవో రమేష్ పేర్కొన్నారు. అందులో భాగంగా ప్రస్తుతం 220 వరకు పనులు ప్రారంభమైనట్లు తెలిపారు. ఫారమ్ పాండ్స్ తోపాటు , ఫిష్ పాండ్స్ , ఇతర ఉపాఽధి హామీ పథకంలోని పనులన్నీ కూలీలతోనే చేయించాలనే నిబంధనలు ఉన్నాయి. అయితే కొందరు తెలుగు తమ్ముళ్లు అధికారులపై ఒత్తిడి తీసుకొచ్చి ,కూలీలతో చేయించాల్సిన పనులను కూడా జేసీబీ యంత్రాలతో చేయిస్తుండటం గమనార్హం . ఈ విధంగా జేసీబీ యంత్రాలతో ఉపాధి పనులు చేయించడం వల్ల ఒక్కో ఫారమ్ పాండ్ కు కొలతల ఆధారంగా రూ.60 నుంచి రూ.70వేల వరకు చెల్లిస్తున్నారు. ఈ విధంగా సగానికి పైగానే యంత్రాలతో పనులు చే యిస్తూ కోటి నుంచి రెండు కోట్ల రూపాయల వరకు ఉపాధి కూలీల సొమ్మును కొల్లగొడుతున్నట్లు తెలుస్తోంది. ఏపీఓ రమేష్ వివరణ: జేసీబీ యంత్రాలతో ఉపాధి పనులు చేస్తున్న విషయంపై రాయచోటి మండల ఉపాధి ఏపీఓ రమేష్ను వివరణ కోరగా.. గతంలో కూలీలు పనులు చేసిన చోటనే యంత్రాలతో పనులు చేస్తున్న విషయం తమ దృష్టికి రాగా వెంటనే ఆపేయాలని, అటువంటివి చేయకూడదని చెప్పామని తెలిపారు. ఉపాధి పనులన్నీ కూడా కూలీలతోనే చేయించే విధంగా చర్చలు తీసుకున్నట్లు పేర్కొన్నారు. జేసీబీ , ఇతర యంత్రాలతో పనులను ఎటువంటి పరిస్థితుల్లో ప్రోత్సహించకూడదని ఫీల్డ్స్థాయి అధికారులకు కూడా తెలిపామన్నారు. ఎవరైనా అటువంటి చర్యలకు పాల్పడితే విచారణ చేసి తగిన చర్యలు తీసుకుంటామన్నారు. జేసీబీ యంత్రాలతో పనులు కూలీలకు దూరంగా ఫారమ్ పాండ్స్, ఫిష్ పాండ్స్ పనులు అధికారులపై తెలుగు తమ్ముళ్ల ఒత్తిళ్లు -
అధికారులకు ప్రొటోకాల్ పట్టదా !
మదనపల్లె : తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఉపముఖ్యమంత్రి పవన్కల్యాణ్ను జిల్లా అధికారులు తీవ్రంగా అవమానించారు. ప్రొటోకాల్ నిబంధనలను పాటించాల్సిన అధికారులు.. వాటిని పక్కనపెట్టి ప్రజాప్రతినిధి కాని వ్యక్తికి అత్యంత ప్రాధాన్యత ఇచ్చి ఉప ముఖ్యమంత్రికి గౌరవం లేకుండా చేశారు. ఏదైనా అభివృద్ధి కార్యక్రమం జరిగి, వాటికి ప్రారంభోత్సవం చేస్తే జిల్లా అధికారులు ప్రొటోకాల్ ప్రకారం శిలాఫలకాల్లో పేర్లు అచ్చు వేయిస్తారు. అయితే సోమవారం తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లో జరిగిన అభివృద్ధి పనుల కార్యక్రమాలకు జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి హాజరై ప్రారంభోత్సవాలు చేశారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి.. బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లో సిమెంటు రోడ్లు, సచివాలయ భవనం, రైతు భరోసా కేంద్రం, ప్రభుత్వ జూనియర్ కళాశాల భవనం తదితర వాటికి ప్రారంభోత్సవాలు జరిగాయి. ఈ ప్రారంభోత్సవాల కోసం శిలాఫలకాలను ఏర్పాటు చేశారు. ఇందులో అన్నింటిపైన ప్రారంభకులుగా జిల్లా ఇన్చార్జి మంత్రి బీసీ జనార్దన్రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్రెడ్డి పేర్లు పెట్టారు. మూడో పేరుగా డి.జయచంద్రారెడ్డి, ఇన్చార్జ్, తంబళ్లపల్లె నియోజకవర్గం అని పేరు పెట్టారు. ఇతను గత ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి ఓడిపోయారు. ప్రస్తుతం ప్రొటోకాల్ పదవిలో లేరు. కనీసం ఎందులోనూ ప్రజాప్రతినిధి కారు. అయినప్పటికీ జిల్లా అధికారులు ప్రొటోకాల్ నిబంధనను పక్కనపెట్టి మూడో పేరుగా వేయించారు. అందులోనూ జయచంద్రారెడ్టి నిలువెత్తు ఫొటోను అన్ని శిలాఫలకాల్లోనూ వేయించారు. అధికారిక ప్రభుత్వ కార్యక్రమంలో ఈ పేరు వేయకూడదన్న విషయం తెలిసినా.. వేసిన అధికారులు మరో తీవ్రమైన తప్పు చేశారు. ఈ పేరుకింద ఉపముఖ్యమంత్రి పవన్కళ్యాణ్ పేరు పెట్టారు. అంటే అధికారులకు ఉప ముఖ్యమంత్రి పదవికి ఎంతటి గౌరవం ఇచ్చారో, ఏ మేరకు గుర్తించారో స్పష్టంగా తెలుస్తోంది. కొన్ని శిలాఫలకాల్లో ఇలా చేయగా.. కొన్నింటిలో ఉపముఖ్యమంత్రి పేరుకింద మంత్రి లోకేష్ పేరు పెట్టారు. అసలు ప్రజాప్రతినిధి కాని జయచంద్రారెడ్డి ప్రభుత్వ అధికారిక కార్యక్రమానికి ప్రారంభకులు ఎలా అవుతారో.. ప్రొటోకాల్ నిబంధనలు పాటించాల్సిన జిల్లా అధికారులకు తెలియదా అన్నది చర్చనీయాంశమైంది. ప్రారంభకులు ఎవరైనా దాని కింద ప్రాధాన్యతగా స్థానిక ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి పేర్లు పెట్టాలి. దీన్ని కూడా విస్మరించారు. ఈ శిలాఫలకాలను ప్రారంభించిన మంత్రి జనార్దన్రెడ్డి దీనిపై ఎలాంటి అభ్యంతరం వ్యక్తం చేయకుండానే పర్యటన ముగించుకుని వెళ్లిపోయారు. ఎమ్మెల్యే, ఎంపీ అతిథులా నియోజకవర్గంలో ఏ అభివృద్ధి పని చేపట్టినా, ప్రారంభించినా స్థానిక ఎమ్మెల్యే, ఎంపీకి మొదటి ప్రాధాన్యత దక్కాలి. వీటికి వీళ్లను కచ్చితంగా అధికారులు ఆహ్వానించి వారి ద్వారానే అమలు చేయాలి. ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధుల విషయంలో అధికారులు ఆచితూచి వ్యవహరించాల్సిన బాధ్యత వారిపై ఉంది. ముఖ్యంగా అధికారిక కార్యక్రమాల విషయంలో జాగ్రత్త అవసరం. అయితే తంబళ్లపల్లె నయోజకవర్గంలో ఇష్టారీతిన ప్రొటోకాల్ నిబంధనలు ఉల్లంఘిస్తున్న అధికారులను జిల్లా అధికారులు చూసీచూడనట్టు వ్యవహరిస్తున్నట్టు కనిపిస్తోంది. దీనితో తమకేమికాదులే అన్న నిర్లక్ష్యంతో స్థానిక అధికారులు వ్యవహరిస్తున్నారు. దీనిఫలితమే సోమవారం బి.కొత్తకోట, కురబలకోట మండలాల్లో జరిగిన అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు. ఈ ప్రారంభోత్సవాలకు మంత్రులు, ఆపై ప్రభుత్వ స్థాయిలో ఉన్న వారితో ప్రారంభోత్సవాలు చేయించొచ్చు. అయితే స్థానిక ఎమ్మెల్యే కూడా ప్రారంభోత్సకుల్లో ఉంటారు. సోమవారం జరిగిన ప్రారంభోత్సవ శిలాఫలకాల్లో ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి అతిథులట. స్థానిక ప్రజాప్రతినిధులు అతిథులు ఎలా అవుతారో కనీసం శిలాఫలం వేసే సమయంలో అధికారులు దీనిపై ఎందుకు పట్టించుకోలేదో వారికే తెలియాలి. వారి ఆధ్వర్యంలో జరగాల్సిన కార్యక్రమాలను వారినే.. అతిథులు చేసిన అధికారులు రెడ్బుక్ రాజ్యంగం మేరకు కొత్త ప్రొటోకాల్ నిబంధనలు అమలు చేస్తున్నట్టుంది. టీడీపీ నాయకుడి నిలువెత్తు ఫొటో వేసిన అధికారులు ఎమ్మెల్యే, ఎంపీల ఫొటోలను ఎక్కడా వేయలేదు. దీన్నిబట్టి చూస్తే అధికారులు ప్రొటోకాల్తో తమకేం పని, అంతా మా ఇష్టం అన్నట్టుగా ఉంది వారి వ్యవహారశైలి. ఏడాదిగా తంబళ్లపల్లె నియోజకవర్గంలో ప్రొటోకాల్ ఎక్కడా కనిపించడం లేదు. అధికారులు పాటించడం లేదు. దీనికి జిల్లా అధికారులు సీరియస్గా తీసుకోవడం లేదనా లేక అధికార పార్టీ నేతల మద్దతు ఉందనా? దీనిపై జిల్లా అధికారులు ఎలా స్పందిస్తారు, దీనికి ఎవరు బాధ్యులు అవుతారు, ఎవరిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారో చూడాలి. ఎమ్మెల్యే ఆదర్శం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బి.కొత్తకోట మండలంలోని గుట్టపాళ్యంలో అభివృద్ధి పనుల శిలాఫలకాన్ని ఆవిష్కరించేందుకు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి హాజరయ్యారు. ప్రారంభానికి ముందు శిలాఫలకం చూసి ప్రోటోకాల్ మేరకు ఉండాల్సిన పేర్లు లేవంటూ ఆవిష్కరించలేదు. ప్రొటోకాల్ విషయంలో ఇలా వ్యవహరించాలి. తంబళ్లపల్లెలో ఉప ముఖ్యమంత్రికి తీవ్ర అవమానం శిలాఫలకాల్లో ప్రజాప్రతినిధి కాని వ్యక్తి పేరు కింద పవన్ పేరు అభ్యంతరం చెప్పకుండా ప్రారంభించిన మంత్రి జనార్దన్రెడ్డి స్థానిక ఎమ్మెల్యే, ఎంపీ అతిథులా..? -
బాధిత కుటుంబాలను ఉపాధి చూపాలి
కడప–రేణిగుంట జాతీయరహదారిలోని పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువుకట్టపై జరిగిన లారీ బోల్తా ప్రమాద బాధిత కుటుంబాలను అన్ని విధాలుగా ఆదుకోవాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాఽథ్రెడ్డి అన్నారు. జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు. శెట్టిగుంటకు చెందిన గిరిజనుల కుటుంబాలకు ప్రభుత్వం పెద్దఎత్తున ఆర్థిక సహాయంతో పాటు ఆ కుటుంబాలకు ఉపాధి మార్గాలను చూపించాలన్నారు. ఆ బాధ్యత కూటమి ప్రభుత్వంపై ఉందన్నారు. శెట్టిగుంట గిరిజన కుటుంబాలకు అండగా నిలబడాల్సిన ప్రభుత్వం చర్యలు తీసుకోవాలన్నారు. మృతుల కుటుంబాలకు తమ ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తున్నానన్నారు. -
హుండీ ఆదాయం రూ.5.23 లక్షలు
తంబళ్లపల్లె: మల్లయ్యకొండపై వెలసిన శ్రీభ్రమరాంబిక సమేత మల్లికార్జునస్వామి ఆలయంలో మంగళవారం ఈఓ మునిరాజ, కొండ కిట్టల ఆధ్వర్యంలో హుండీ ఆదాయం లెక్కించారు. నాలుగు మాసాలుగా భక్తులు హుండీ ద్వారా చెల్లించిన కానుకలు లెక్కించారు. రూ.5,23,275 ఆదాయం వచ్చినట్లు ఈఓ తెలిపారు. కార్యక్రమంలో పూజారులు ఈశ్వరప్ప, మల్లికార్జున తదితరులు పాల్గొన్నారు. నేడు దర్గా స్వామి జయంతి రామాపురం (రాయ చోటి జగదాంబసెంటర్): రామాపురం మండలం నీలకంఠ్రావుపేట సమీపంలోని దర్బార్ సాయినగర్లోని సాయి విద్యామందిర్లో ఈ నెల 16న సమర్థ సద్గురు శ్రీశ్రీశ్రీ దర్గా స్వామీజీ 95వ జయంతి వేడుకలు చేపడు తున్నట్లు నిర్వాహకులు తెలిపారు. జయంతి ఉత్సవాలకు భక్తులు విరివిగా పాల్గొనాలని కోరారు. ఈ సందర్భంగా పలు కార్యక్రమాలను చేపడుతున్నట్లు వారు తెలియజేశారు. 20న జిల్లాస్థాయి హిందీ వ్యాసరచన పోటీలు రాజంపేట టౌన్: రాజంపేట పట్టణంలోని నూనెవారిపల్లెలో ఉన్న బీవీఎన్ పాఠశాలలో ఈనెల 20వ తేదీ ఉమ్మడి వైఎస్సార్జిల్లా స్థాయిలో ప్రేమ్చంద్ హిందీ భవన్ సొసైటీ ఆధ్వర్యంలో హిందీ వ్యాసరచన పోటీలను నిర్వహించనున్నట్లు ఆ సొసైటీ వ్యవస్థాపక అధ్యక్షుడు సయ్యద్ సర్తాజ్ హుస్సేన్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 31వ తేదీ ప్రముఖ హిందీ నవలాకారుడు ప్రేమ్చంద్ 146వ జయంతిని పురస్కరించుకొని ‘ప్రేమ్చంద్కి జీవని’ అనే అంశంపై పోటీలను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఉమ్మడి వైఎస్సార్జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 9, 10వ తరగతి చదివే విద్యార్థులు పోటీల్లో పాల్గొనేందుకు అర్హులన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చూపిన వారికి ప్రేమ్చంద్ జయంతి రోజున బహుమతులు ప్రదానం చేయనున్నట్లు తెలిపారు. ఆసక్తిగల విద్యార్థులు 6303701314 నంబర్కు ఫోన్ చేసి తమపేర్లను నమోదు చేసుకోవాలన్నారు. పేర్లు నమోదు చేసుకోక పోయినా పోటీ పరీక్ష రోజు నేరుగా కూడా వ్యాసరచన పోటీలో పాల్గొనవచ్చని తెలిపారు. ఓపెన్ ఇంటర్కు దరఖాస్తులు కడప ఎడ్యుకేషన్: కడప ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలలో ఓపెన్ ఇంటర్– 2025–26 విద్యా సంవత్సరానికి దరఖాస్తు చేసుకోవచ్చని ప్రిన్సిపాల్ సూర్యారావు తెలిపారు. ఓపెన్ ఇంటర్ ద్వారా రెండేళ్ల కోర్సును ఒకే సంవత్సరంలో పూర్తి చేసుకోవచ్చని తెలిపారు. ఆసక్తి గల అభ్యర్థులు ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చని తెలిపారు. ఒక వేళ ఆన్లైన్లో నమోదు చేయలేనిచో ప్రభుత్వ బాలికల జూనియర్ కళాశాలకు వచ్చి దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. గడువు పొడగింపు రాజంపేట టౌన్: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐలలో ప్రవేశానికి ఆన్లైన్లో రిజిస్ట్రేషన్ చేసుకునేందుకు ఈనెల 20వ తేదీ వరకు గడుపు పొడిగించినట్లు పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ సి.రామ్మూర్తి ఒక ప్రకటనలో తెలిపారు. టెన్త్ ఉత్తీర్ణులై, ఆసక్తిగల అభ్యర్థులు www.iti.ap.gov.in వెబ్సైట్లో రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ చేయించుకున్న అనంతరం అభ్యర్థులు తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఐటిఐలలో సర్టిఫికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తారని తెలిపారు. ఈనెల 23, 25వ తేదీల్లో ప్రభుత్వ ఐటిఐలలో సీట్ల భర్తీకి, 26, 27వ తేదీల్లో ప్రైవేట్ ఐటీఐలలో సీట్ల భర్తీకి కౌన్సెలింగ్ ఉంటుందని తెలిపారు. ఏ ఐటీఐలో ప్రవేశం కోసం రిజిస్ట్రేషన్ చేయించుకుంటే ఆ ఐటీఐలోనే కౌన్సెలింగ్్ ఉంటుందన్నారు. అభ్యర్థులు టెన్త్ మార్కులిస్టు, టిసి, ఆధార్కార్డు, రిజర్వేషన్ సౌకర్యం ఉన్న అభ్యర్థులు కులధృవీకరణ పత్రం వంటివి ఒరిజినల్, జిరాక్స్ కాపీలను తమ వెంట తీసుకురావాలన్నారు. అలాగే మెయిల్ ఐడి కూడా ఉండాలని తెలిపారు. -
ప్రభుత్వ భూముల్లో ఆక్రమణలు తొలగించండి
జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్గుర్రంకొండ : ప్రభుత్వ భూముల ఆక్రమణలను వెంటనే తొలగించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం మండలంలోని అరిగెలవారిపల్లెలో ఆయన పర్యటించారు. ఇటీవల గ్రామానికి చెందిన కొంత మంది దారి సమస్య, ప్రభుత్వ భూముల ఆక్రమణలపై స్పందన కార్యాక్రమంలో ఫిర్యాదు చేశారు. ఈ నేపథ్యంలో జిల్లా కలెక్టర్ గ్రామానికి చేరుకొని ప్రభుత్వ స్థలాలను పరిశీలించారు. సర్వే నెంబరు 26/2లో మేతబీడు పోరంబోకు భూములు 10.30 ఎకరాలు ఉన్నట్లు రెవెన్యూ రికార్డుల్లో గుర్తించారు. రికార్డుల ప్రకారం భూములు ఉన్నా.. వాస్తవంగా సదరు భూములు ఆక్రమించుకొని పలువురు ఇళ్ల నిర్మాణాలు, కంచెలు వేసుకున్నట్లు గుర్తించారు. ఆక్రమణదారులు స్థలాలు ఆక్రమించుకోవడమే కాకుండా.. ఆవతలివైపు ఇళ్లకు వెళ్లే దారులను కూడా కబ్జా చేసి గ్రామస్తులను ఇబ్బందులకు గురి చేస్తున్నట్లు ఫిర్యాదులు చేశారు. ప్రభుత్వ భూముల్లో ఇళ్లు నిర్మించకొన్న వారిని సర్వే చేసి మూడు సెంట్ల స్థలం మాత్రమే ఉంచి మిగిలిన స్థలాన్ని స్వాధీనం చేసుకోవాలని రెవెవెన్యూ అధికారులను ఆదేశించారు. మిగతా భూముల్లో కంచెలు వేసి ఉన్న స్థలాలను స్వాఽధీనం చేసుకొని కంచెలను తొలగించాలన్నారు. కబ్జాకు గురైన దారి స్థలాలను సర్వే చేసి మొత్తం మేతబీడు పోరంబోకు స్థలం చుట్టూ కంచె ఏర్పాటు చేసి హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ లక్ష్మీప్రసన్న, వీఆర్వో నారాయణ, గ్రామస్తులు పాల్గొన్నారు. రోగులకు మెరుగైన సేవలు అందించాలి ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ చామకూరి శ్రీధర్ అన్నారు. మంగళవారం స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో ఆయన ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా సిబ్బంది రిజిష్టరు, మందుల రిజిష్టర్, ఆస్పత్రి రికార్డులను పరిశీలించారు. ఆస్పత్రుల్లో రోగులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరాతీశారు. ఆస్పత్రుల్లో అందుబాటులో ఉన్న వసతులపై వివరాలు అడిగి తెలుసుకొన్నారు. ఆస్పత్రిలో సిబ్బంది కొరత ఉందని, కొన్ని పోస్టులు భర్తీ చేయాల్సి ఉందని ఆస్పత్రి వైద్యులు చైతన్య కలెక్టర్ దృష్టికి తీసుకొచ్చారు. ఖాళీలపై ప్రతిపాదనలు పంపించాలని కలెక్టర్ సూచించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రభుత్వాస్పత్రుల్లో రోగులకు సిబ్బంది అన్ని వేళలా అందుబాటులో ఉండి మెరుగైన వైద్యసేవలు అందించాలన్నారు. ఉద్యోగులు, సిబ్బంది సమయ పాలన పాటించాలన్నారు. ఈ కార్యక్రమంలో వైద్యాధికారి చైతన్య, సీహెచ్వో సీతారామయ్య, సిబ్బంది పాల్గొన్నారు. -
వైవీయూలో బ్యాచిలర్ డిగ్రీ కోర్సులు
కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయంలో 2025– 26 విద్యా సంవత్సరానికి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తున్నట్లు విశ్వవిద్యాలయ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ, ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ వెల్లడించారు. మంగళవారం వైవీయూలోని ప్రిన్సిపల్ చాంబర్లో పలువురు డీన్లతో కలిసి వారు విలేకర్లతో మాట్లాడారు. జాతీయ విద్యా విధానం(ఎన్ఈపీ)– 2020ని ప్రతిష్టాత్మకంగా అమలు చేయడంలో భాగంగా బీఎస్సీ(హానర్స్) ఫిజిక్స్, కెమిస్ట్రీ, కంప్యూటర్స్ కోర్సులు, ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ బయోటెక్నాలజీ అండ్ బయో ఇన్ఫర్మేటిక్, ఎర్త్ సైన్స్ కోర్సులలో త్వరలో ప్రవేశాలు కల్పిస్తున్నామని తెలిపారు. బీఎస్సీ(ఆనర్స్) ఫిజిక్స్ సబ్జెక్టుతోపాటు కంప్యూటర్ సైన్స్, నానో–సైన్స్, కంప్యూటేషనల్ ఫిజిక్స్, డేటా సైన్స్, ఫిజిక్స్, టెక్నాలజీలను విద్యార్థులు ఎంపిక చేసుకొని చదివే అవకాశం ఉందన్నారు. బీఎస్సీ (ఆనర్స్) రసాయన శాస్త్రం మేజర్ సబ్జెక్టుగా తీసుకోవడంతోపాటు అప్లికేషన్ కెమికల్ సైన్స్, కంప్యూటేషనల్ కెమిస్ట్రీ, మెటీరియల్ సైన్స్ చదవచ్చన్నారు. బీకాం (ఆనర్స్) కంప్యూటర్ సైన్స్ ప్రధాన అంశంగా కలిగి ఉందన్నారు. బిజినెస్ కామర్స్ కంప్యూటర్ సైన్స్ ఫైనాన్షియల్ టెక్నాలజీ ఇన్ఫర్మేషన్ సిస్టం మేనేజ్మెంట్ వంటి అంశాలలో బలమైన పునాది వేసే అవకాశం విద్యార్థికి లభిస్తుందన్నారు. నాలుగేళ్ల హానర్స్ కోర్స్ ఉత్తమ మార్కులతో పూర్తి చేస్తే నేరుగా రీసెర్చ్లో ప్రవేశించే అవకాశం ఉందన్నారు. విద్యార్థి వైవీయూలో ప్రవేశం పొందడం ద్వారా ప్రభుత్వ ఫీజు రీయింబర్స్మెంట్ పథకాలను పొందుతారన్నారు. ఆధునిక హాస్టళ్లలో సౌకర్యవంతమైన, సురక్షితమైన అభ్యాస వాతావరణం లభిస్తుందన్నారు. ఈ సమావేశంలో పూర్వ ప్రధానాచార్యులు, ప్రొఫెసర్ ఎస్. రఘునాథరెడ్డి, డీన్ ఫర్ అకడమిక్ అఫైర్స్ చంద్ర ఓబులరెడ్డి, డీవోయే డైరెక్టర్ టి లక్ష్మి ప్రసాద్, ప్లేస్మెంట్ సెల్ డైరెక్టర్ ఆచార్య విజయభారతి తదితరులు పాల్గొన్నారు. -
దృఢత్వానికి ప్రతీక భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్
పీలేరు రూరల్ : నమ్మకానికి, దృఢత్వానికి ప్రతీక భారతి ఆల్ట్రాఫాస్ట్ సిమెంట్ అని ఆ సంస్థ టెక్నికల్ మేనేజర్ సి.ఛాయాపతి తెలిపారు. బుధవారం పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు మార్గంలో డీలర్లు, భవన నిర్మాణ కార్మికులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జర్మనీ టెక్నాలజీ, రోబోటిక్ క్వాలిటీ కంట్రోల్ ఇంజినీరింగ్ నిపుణుల పర్యవేక్షణలో అత్యుత్తమ నాణ్యతా ప్రమాణాల భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ను ఉత్పత్తి చేస్తున్నట్లు వెల్లడించారు. టెంపర్ ఫ్రూప్ బస్తాలతో మార్కెట్లోకి వస్తుండడంతో తూకం తగ్గే అవకాశం ఉండదన్నారు. సిమెంట్ రంగంలో భారతి సిమెంట్ అగ్రగామిగా నిలిచిందని తెలిపారు. భారతి సిమెంట్కు సంబంధించి నాణ్యతా ప్రమాణాలు, విశిష్టత తదితర అంశాలపై అవగాహన కల్పించారు. భారతి ఆల్ట్రా ఫాస్ట్ సిమెంట్ తయారవుతున్న విధానం, భవన నిర్మాణ కార్మికులు పాటించాల్సిన జాగ్రత్తలు గూర్చి వివరించారు. వినియోగదారుల సౌలభ్యం కోసం భారతి సిమెంట్ ప్రతి చోటా అందుబాటులో ఉండేలా డీలర్లను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. అనంతరం తాపీ మేసీ్త్రలకు రూ.లక్ష ప్రమాద భీమా పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో డీలర్లు సిమెంట్ మోహన్రెడ్డి, ఇనాయతుల్లా, కార్మికులు పాల్గొన్నారు. -
ప్రేమ విఫలమై యువకుడు ఆత్మహత్య
రాజంపేట : పట్టణంలోని మన్నూరుకు చెందిన జయపాల్ నాయక్(19) సోమవారం ప్రేమ విఫలమై ఆత్మహత్య చేసుకున్నాడు. గతంలో అతను అనంతపురం జిల్లా వజ్రకరూరు మండలం వెంకటపల్లె తండాలో నివాసం ఉండే వాడు. ప్రేమించిన యువతి ఫోన్లో మాట్లాడకపోవడంతో కలత చెంది ఆత్మహత్యకు పాల్పడినట్లుగా సంబంధీకులు పోలీసులకు తెలిపారు. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం చోరీ పీలేరు : ద్విచక్రవాహనం చోరీకి గురైన సంఘట న సోమవారం రాత్రి పీలేరు పట్టణంలో చోటు చే సుకుంది. రొంపిచెర్లకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ వెంకటేష్ ద్విచక్రవాహనంలో పీలేరు పట్టణం చెన్నారెడ్డివీధికి చెందిన తన స్నేహితుని ఇంటికి వచ్చాడు. తన ద్విచక్రవా హనాన్ని స్నేహితుని ఇంటి ముందు పార్కింగ్ చే శాడు. మంగళవారం ఉదయం ద్విచక్రవాహనం కనిపించక పోవడంతో చోరికి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశారు. చెన్నారెడ్డి వీధికి చెందిన మరో ద్విచక్రవాహనాన్ని దొంగలు కొద్ది దూరం తీసుకెళ్లి స్టార్ట్ కాకపోవడంతో వదిలి వెళ్లారు. గంజాయి విక్రేతల అరెస్ట్ రాజంపేట : మండలంలోని బోయనపల్లె పాత ఎంవీఐ కార్యాలయం వద్ద సోమవారం గంజాయి విక్రయదారులు తోడేటి శేఖర్ (బోయనపల్లె), దార ఈశ్వరయ్య (చీనివారిపల్లె, చింతరాజుపల్లె, ఒంటిమిట్ట)లను అబ్కారీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద 2 కేజీల 150 గ్రాముల ఎండు గంజాయిని, రెండు బైకులను స్వాధీనం చేసుకున్నారు. కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్, ఎన్ఫోర్స్మెంట్ వింగ్ అధికారి జహీర్ అహమ్మద్ ఆధ్వర్యంలో దాడులు నిర్వహించారు. నిందితులను రాజంపేట అబ్కారీ శాఖకు అప్పగించారు. వృద్ధురాలి మృతి కేసులో ఇద్దరు అరెస్ట్ పెద్దమండ్యం : మనవడి దాడిలో గాయపడిన అవ్వ మృతి చెందిన సంఘటనలో ఇద్దరిని అరెస్ట్ చేసినట్లు ములకలచెరువు సీఐ లక్ష్మన్న మంగళవారం తెలిపారు. సీఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని దిగువపల్లెకు చెందిన ఆర్. లక్ష్మయ్య భార్య నల్లమ్మకు నలుగురు కుమారులు ఉన్నారు. తల్లి పోషణను నలుగురు కుమారులు నెలకు ఒకరు చొప్పున చూసుకునేలా నిర్ణయించుకున్నారు. ఈ క్రమంలో మూడవ కుమారుడు ఆర్.చంద్రశేఖర నాయుడు వంతు రాగా అతని ఇంటికి వెళ్లింది. ఈ విషయమై భర్త చంద్రశేఖరనాయుడు, భార్య భాగ్యమ్మలు గొడవపడ్డారు. భర్తతో గొడవ పడిన విషయాన్ని రాయచోటిలో డిగ్రీ మొదటి సంవత్సరం చదువుతున్న కుమారుడు ఆర్.నాగేంద్ర నాయుడుకు తల్లి భాగ్యమ్మ ఫోన్ ద్వారా తెలిపింది. ఇంటికి వచ్చిన అతను అవ్వ నల్లమ్మపై ఇటుకరాయితో దాడి చేశాడు. గాయపడిన నల్లమ్మ తిరుపతి రూయాలో చికిత్స పొందుతూ మృతి చెందింది. సంఘటనపై మరో మనమడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఎం వెంకటేశ్వర్లు, సిబ్బంది పీజీ ఖాన్, క్రిషమూర్తి, సిద్దు, శ్రీనివాసులు నాయక్లు పాల్గొన్నారు. -
అడవి జంతువులను వేటాడిన వ్యక్తి అరెస్ట్
సిద్దవటం : సిద్దవటం రేంజి పరిధి అట్లూరు మండలం చలంగారిపల్లి గ్రామ సమీపం లోని పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యంలో అడవి జంతువులను వేటాడిన వ్యక్తిని అరెస్ట్ చేశారు. సిద్దవటం అటవీ శాఖ కార్యాలయంలో రేంజర్ కళావతి మంగళవారం మీడియాకు వివరాలు వెల్లడించారు. సోమవారం రాత్రి అటవీశాఖ అధికారులు సిబ్బందితో కలిసి పెనుశిల లక్ష్మీనరసింహ అభయారణ్యంలో కూంబింగ్ నిర్వహించారు. అక్కడ అడవి జంతువు అయిన కొండ గొర్రెను ముగ్గురు వ్యక్తులు నాటు తుపాకీతో వేటాడి చంపి మాంసాన్ని పెద్ద మొత్తంలో విక్రయించడానికి పక్కన పెట్టి, కొంత మాంసాన్ని అడవిలో వండుకొని తింటుండగా వెళ్లి దాడులు చేశారు. గోపవరం మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన బుడమకుంట రమణయ్యను అదుపులోకి తీసుకున్నారు. మరో ఇద్దరు పారిపోయారు. వారిలో అట్లూరు మండలం చలంగారిపల్లె గ్రామానికి చెందిన గుమ్మల వెంకటసుబ్బయ్య, గుమ్మల శ్రీను ఉన్నారని రేంజర్ తెలిపారు. వారి కోసం తమ సిబ్బంది గాలింపు చర్యలు చేపడుతున్నారని చెప్పారు. రమణయ్యను అరెస్టు చేసి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ ఆపరేషన్లో ఆరు అడవి జంతువుల కాళ్లు (కొండ గొర్రెలు), వండిన మాంసం, కత్తులు, టార్చిలైట్, ఒక ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ రేంజర్ ఓబులేస్, బీటు అధికారులు, అసిస్టెంటు బీటు అధికారులు, బేస్ క్యాంపు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
భార్య మందలించిందని భర్త ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలు, వివాహేతర సంబంధం కారణంగా భార్యాభర్తల మధ్య ఏర్పడిన వివాదంలో, భార్య మందలించడంతో మనస్తాపం చెందిన భర్త ఆత్మహత్యకు పాల్పడిన సంఘటన మంగళవారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. తంబళ్లపల్లె మండలం రామాపురానికి చెందిన చిన్న వెంకటరమణ కుమారుడు చౌడప్ప (30)కు బి కొత్తకోట మండలం చవటకుంటకు చెందిన కనకలక్ష్మితో ఆరు సంవత్సరాల క్రితం వివాహమైంది. వీరికి దేవాన్ష్ కుమారుడు ఉన్నాడు. చౌడప్ప భార్య కుమారుడితో కలిసి బీ కొత్తకోట మండలం గొళ్లపల్లి పంచాయతీ కనికల తోపు వద్ద ఉంటూ, స్థానికంగా వాటర్ క్యాన్ల వాహనానికి డ్రైవర్గా పని చేస్తున్నాడు. గత కొంతకాలంగా మద్యానికి బానిస అయ్యాడు. అంతేకాకుండా మరో మహిళతో చాటింగ్ చేస్తూ, ఆన్లైన్ ద్వారా డబ్బులు పంపుతుండడంతో, భార్య కనకలక్ష్మి తరచూ గొడవపడేది. ఇదే విషయమై సోమవారం భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. కనకలక్ష్మి భర్తను తీవ్రంగా మందలించింది. అనంతరం ఆమె రోజువారి కూలీ పనులకు వెళ్లిపోయింది. దీంతో మనస్తాపం చెందిన చౌడప్ప పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సమాచారం తెలుసుకున్న భార్య స్థానికుల సాయంతో బాధితుడిని మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించింది. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండడంతో మెరుగైన వైద్యం కోసం స్థానికంగా ప్రైవేటు ఆసుపత్రికి తీసుకువెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ పరిస్థితి విషమించి చౌడప్ప మృతి చెందాడు. దీంతో సమాచారం అందుకున్న ఔట్ పోస్ట్ సిబ్బంది మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రి మార్చురీ గదికి తరలించారు. బి కొత్తకోట పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
ముగిసిన తాళ్లపాక బ్రహ్మోత్సవాలు
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు స్వయంగా అర్చించి, పూజించిన శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి వార్ల ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు మంగళవారం సాయంత్రం ముగిసాయి. తిరుమల తిరుపతి దేవస్థానం, హిందూ ధర్మప్రచారపరిషత్, అన్నమాచార్య ప్రాజెక్టులు సంయుక్తంగా పది రోజుల పాటు ఈ ఉత్సవాలు నిర్వహించాయి. కాగా బ్రహ్మోత్సవాల ముగింపు రోజు శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామికి ఘనంగా పుష్పయాగం నిర్వహించారు. కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, గ్రామస్తులు ఉద్దండం సుబ్రమణ్యం, ఆలయ ఇన్స్పెక్టర్ బాలాజీతోపాటు గ్రామానికి చెందిన మహిళలు పెద్ద ఎత్తున పుష్పయాగంలో పాల్గొన్నారు. -
వైభవంగా పుష్పయాగం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత స్వామివారికి పుష్పయాగం వైభవంగా జరిగింది. చామంతి, గన్నేరు, మల్లెలు, రుక్షి, కనకాంబరాలు, రోజా, సంపంగి, తామర, కలువ, మొగలిరేకులు వంటి వివిధ రకాల పుష్పాలు, తులసి, మరువం, ధవనం వంటి ఆకులతో స్వామి, అమ్మవార్లకు యాగం నిర్వహించారు. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామిలు విశేష పూజలు నిర్వహించారు. భక్తులు స్వామి వారిని దర్శించుకుని తమ మొక్కులను తీర్చుకున్నారు. ఈ కార్యక్రమంలో సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం పాల్గొన్నారు. ముగిసిన సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు -
అమ్మా... ఎందుకు ఏడుస్తున్నావు!
ఈ ఫొటోలో వీల్చైర్లో కూర్చొన్న మహిళ పేరు విజయలక్ష్మి . మామిడి పండ్లు లోడింగ్ చేసేందుకు భార్య,భర్త వెళుతూ చిన్నపిల్లలైన గంగోత్రి, చెంచితలను కూడా తీసుకెళ్లారు. అనుకోని ప్రమాదం ఎదురు కావడంతో విజయలక్ష్మి తన పిల్లలు ఇద్దరినీ గట్టిగా పట్టుకుని పడిపోయింది. దీంతో పిల్లలకు చిన్నపాటి గాయాలయ్యాయి. ప్రమాదంలో భర్త శ్రీనివాసులు మృతి చెందాడన్న వార్త జీర్ణించుకోలేకపోతోంది. విజయలక్ష్మికి గాయాలు కావడంతో నడవలేని స్థితిలో ఉంది. మరోవైపు విజయలక్ష్మి తండ్రి వెంకటయ్యకు కూడా చేయి విరగడంతో ఎదురుగా కూర్చొని విలపిస్తున్నాడు. ఏమీ తెలియన చిన్నారులు మాత్రం నాన్న లేరన్న విషయం తెలియక అమ్మా ఎందుకు ఏడుస్తున్నావు అంటూ వారు కూడా ఏడుస్తున్నారు. రాజంపేట ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద సోమవారం కనిపించిన ఈ దృశ్యం చూపరులను కంటతడి పెట్టించింది. -
గ్యాంగ్ల దాడులు.. ప్రజలు బెంబేలు
రాయచోటి : ప్రశాంతంగా ఉన్న రాయచోటి పట్టణంలో.. ఇటీవల గ్యాంగుల దాడులు, ప్రతిదాడులతో పట్టణ ప్రజలను బెంబేలెత్తిస్తున్నారు. పీకలదాకా మద్యం తాగి మత్తులో చేస్తున్న దాడులు ప్రజల ప్రాణాల మీదకు తెస్తున్నాయి. కూటమి అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పట్టణంలో బోనమల ఖాదర్వల్లి గ్యాంగ్, సున్నా గ్యాంగ్, కొత్తపల్లి గ్యాంగ్, కొత్తపేట రామాపురం గ్యాంగ్, పాతరాయచోటి గ్యాంగ్ ఇలా బ్యాచ్లుగా ఏర్పడి.. వీరంగం సృష్టిస్తున్నారు. గ్యాంగులుగా ఏర్పడి విచ్చలవిడిగా దాడులకు తెగబడుతున్నా చర్యలు తీసుకోవాల్సిన పోలీసులు.. అధికార పార్టీ నాయకుల ఒత్తిడితో మిన్నకుండి పోతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. రాయచోటి అర్బన్ సీఐ బీవీ చలపతికి శాఖాపరంగా మంచి పేరుంది. కూటమి పాలన వచ్చిన తర్వాత పట్టణంలో గ్యాంగుల దాడులు, అల్లరి మూకల అలజడి అధికం కావడంతో.. జిల్లా ఎస్పీ నేరుగా కర్నూలు జిల్లాలో పని చేస్తున్న బీవీ చలపతిని రాయచోటి అర్బన్ సీఐగా నియమించారు. సీఐ బాధ్యతలు చేపట్టిన తొలి రోజుల్లో ప్రశాంతత నెలకొంటుందని భావించిన ప్రజలకు.. అధికార పార్టీ ఆధిపత్యం ముందు అంతో ఇంతో కఠినంగా ఉండే అర్బన్ సీఐ కూడా గ్యాంగులను నిలువరించలేని పరిస్థితిలో ఉన్నట్లు విశ్వసనీయ సమాచారం. మైనార్టీ నేతపై కత్తులతో దాడి కూటమి పాలన ప్రారంభమైనప్పటి నుంచి రాయచోటి పట్టణ పరిధిలో వరుస దాడులు జరుగుతున్నా వారిపైన కేసులు మాత్రం నమోదు కావడం లేదు. గత నెల 23న చిత్తూరు రింగ్ రోడ్డు, ఈ నెల 3న కొత్తపేటలోని ఆంధ్రప్రగతి గ్రామీణ బ్యాంకు సమీపంలో, 4వ తేదీన కొత్తపేట రామాపురం పరిధిలోని నాలుగు కులాయిల వద్ద, 9వ తేదీన ట్రంక్ రోడ్డు మీద ఓ మైనార్టీ నేతపై కత్తులతో దాడులు చేసి వీరంగం సృష్టించారు. ఈ దాడులన్నీ బోమనల ఖాదర్వల్లి గ్యాంగ్ చేసినట్లుగా పోలీసులు చెబుతున్నారు. మిగిలిన బ్యాచ్లు ప్రతి రోజూ ఏదో ఒక ప్రాంతంలో పీకల దాకా మద్యం తాగి దాడులకు తెగబడుతున్నారు. పట్టణంలో సాగుతున్న వరుస దాడులతో పలువురికి గాయాలు అవుతున్నాయి. అనేక వాహనాలు దగ్ధమవుతున్నాయి. వీరిపై స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు చేసినా కేసులు నమోదు చేయలేని స్థితిలో పోలీసులు ఉండటం గమనార్హం. వీధిరౌడీల్లా వ్యవహరిస్తున్న వీరి తీరుతో మహిళలు తీవ్రంగా ఇబ్బందులు పడుతున్నారు. దాడులు, అల్లర్లపై వారించిన స్థానికులపై కత్తులు, రాడ్లు, ఫింగర్ గ్రిప్ కత్తులతో దాడులు చేసి గాయపరుస్తున్నారు. మైనార్టీ నేత బాషాపై బోనమల అనుచరుల దాడులు ఆందోళనను రేకెత్తిస్తున్నాయి. ప్రశాంతత వైపు అడుగు లేస్తుంది అనుకున్న రాయచోటిలో దాడులు, ప్రతిదాడులతో.. గ్యాంగుల అలజడులు పట్టణ ప్రజలను ఆందోళన కలిగిస్తున్నాయి. అధికారమే అండగా రెచ్చిపోతున్న గ్యాంగులకు అధికార పార్టీ నాయకులు వత్తాసు పలకడంతో మరింత రెచ్చిపోతున్నారు. రాయచోటిలో మొదలైన హింసాకాండ చేతుల్లో రాడ్లు, కత్తులు, ఫింగర్ గ్రిప్ కత్తులతో హల్చల్ మద్యం తాగి వీధుల్లో భయభ్రాంతులు సృష్టిస్తున్న వైనం అధికార పార్టీ నేతల ఒత్తిడితో మిన్నకుండిన పోలీసులు -
మృతుల కుటుంబాలకు పరిహారమేది !
రాజంపేట : ప్రమాదం జరిగి 12 గంటలవుతున్న లారీ బోల్తా మృతుల కుటుంబాలకు పరిహారం ప్రకటించకపోవడం కూటమి ప్రభుత్వ నిరంకుశపాలనకు నిదర్శనమని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే , వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికారప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. రాజంపేట ప్రాంతీయవైద్యశాలలో చికిత్స పొందుతున్న వారిని కొరముట్ల పరామర్శించారు. అధికారులు, నామమాత్రంగా వచ్చి వెళ్లారన్నారు. నష్టపరిహారం ప్రకటించకుండా ప్రభుత్వం దృష్టికి తీసుకెళతామని చెప్పడం ఎంతవరకు సబబు అని ప్రశ్నించారు. గతంలో ఇదే తరహాలో ప్రమాదం జరిగితే అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 24 గంటలు గడవకముందే బాధితులకు రూ.10లక్షలు ప్రకటించారన్నారు. ఇలాంటి ప్రమాదాలను దృష్టిలో ఉంచుకొని ఎంపీ పీవీ మిథున్రెడ్డి, నేను అనేకసార్లు ఢిల్లీకి వెళ్లి కేంద్రమంత్రి గడ్కరీని కలిసి రూ.2,300కోట్లు కడప–రేణిగుంట వరకు గ్రీన్ ఎక్స్ప్రెస్ హైవేని మంజూరు చేయించామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది అవుతున్న ఇంతవరకు హై వే పనులు మొదలుకాలేదన్నారు. రైల్వేకోడూరు వైస్ఎంపీపీ ధ్వజారెడ్డి, సాయికిషోర్రెడ్డి, చెవ్వు శ్రీనివాసులరెడ్డి,జిల్లా యువజ న విభాగం అధ్యక్షుడు శివారెడ్డి, జెడ్పీటీసీ ర త్న మ్మ, మాజీ జడ్పీటీసీ రాజేశ్వరమ్మ పాల్గొన్నారు. క్షతగాత్రులను బీజేపీ జిల్లా అధ్యక్షుడు సాయిలోకేష్,జనసేన పార్లమెంటరీ ఇన్చార్జి శ్రీనివాసరాజు, సీపీఎం నేతలు చంద్రశేఖర్, రవికుమార్ పరామర్శించారు. రాజంపేట ఏరియా హాస్పిటల్లో మృతదేహాలకు పోస్టుమార్టరం పూర్తి చేశారు. వారి బంధువులకు అప్పగించారు.ప్రాణాలతో బయటపడిన చిన్నారులను ప్రతి ఒక్కరూ పరామర్శిస్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
కార్మికుల సమ్మెతో కారుచీకట్లు
రాయచోటి : మున్సిపల్ ఇంజినీర్ల సమ్మెతో రాయచోటి మున్సిపాలిటీ పురవీధులన్నీ చీకటిమయమయ్యాయి. తమ డిమాండ్ల పట్ల రాష్ట్ర ప్రభుత్వం అవలంబిస్తున్న నిర్లక్ష్య వైఖరిని నిరసిస్తూ శనివారం రాత్రి నుంచి మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికులు సమ్మెలోకి వెళ్లారు. దీంతో రెండురోజులుగా పట్టణంలో వీధిలైట్లు వెలగలేదు. జాతీయ రహదారితోపాటు పట్టణంలోని ప్రధాన వీధుల్లో వీధిలైట్ల వెలుగులు లేకపోవడంతో ప్రజలు భయంతో ప్రయాణాన్ని సాగిస్తున్నారు. అలాగే తాగునీటి సరఫరా రాకపోవడంతో నీటి పాట్లు మొదలయ్యాయి. వెలిగల్లు, అన్నమయ్య ప్రాజెక్టుల నుంచి పంపింగ్ ద్వారా పట్టణానికి నీరు అందిస్తున్నారు. సంబంధిత ఇంజనీర్లు కూడా సమ్మెలో ఉండటంతో వాటిని నిర్వహణ ప్రైవేట్ వ్యక్తులకు సాధ్యం కాలేదు. దీంతో రెండు రోజులుగా పట్టణానికి నీటి సరఫరా ఆగిపోయింది. నీటికోసం ధర్నా.... రాయచోటి మున్సిపాల్టీ పరిధిలో మాసాపేట, ఇందిరమ్మ కాలనీలలో నెలకొన్న తాగునీటి ఎద్దడిని పరిష్కరించాలని ఆ ప్రాంతాల ప్రజలు సోమవారం జిల్లా కలెక్టర్ ఎదుట ధర్నా నిర్వహించారు. స్థానికంగా ఉన్న బోరులో సరిపడా నీరు రావడం లేదని కాలనీ ప్రజలు తెలియజేశారు. సదరు నీటి సమస్యలను పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ను కలిసి వినతి చేశారు. మున్సిపల్ ఇంజినీర్ కార్మికులు సమ్మెలకు వెళ్లడంతో ప్రైవేట్ వ్యక్తుల ద్వారా నీటి సరఫరా అందించే చర్యలు తీసుకుంటున్నట్లు మున్సిపల్ కమిషనర్ వాసు బాబు తెలిపారు. అలాగే రాత్రి వేళల్లో వీధిలైట్లు వెలుగుల పునరుద్దరణ కూడా చేపడతామని చెప్పారు. సమస్యలను పరిష్కరించాలి రాయచోటి : రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ ఇంజినీరింగ్ కార్మికుల వేతనాలపెంపు, సంక్షేమ పథకాల అమలు వంటి సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలని సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎం రామాంజులు డిమాండ్ చేశారు. రాయచోటి మున్సిపల్ కార్యాలయం ఆవరణలో న్యాయ సమ్మతమైన సమస్యలపై సోమవారం రెండోరోజు నిర్వధిక సమ్మెను ఇంజినీరింగ్ కార్మికులు చేపట్టారు. ఈ సందర్భంగా నల్ల రిబ్బన్లను ధరించారు. దీక్షా శిబిరంలో వంటా వార్పుతో నిరసన చేశారు. సమ్మె వల్ల నీటి సరఫరా, వీధి దీపాలు, డ్రైనేజీ ఇతర అత్యవసర పౌర సర్వీసులకు పలు పట్టణాలు, నగరాల్లో అంతరాయం ఏర్పడినట్లు రామాంజులు పేర్కొన్నారు.కార్మికుల సమస్యను పరిష్కరించడంలో మున్సిపల్ మంత్రి, ప్రభుత్వం ప్రేక్షక పాత్ర వహించడం సరికాదన్నారు. తక్షణమే జోక్యం చేసుకొని కార్మీకుల న్యాయ సమ్మతమైన సమస్యలను పరిష్కరించాలన్నారు. మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బీవీ రమణ మాట్లాడారు. దీక్షలో వైఎస్సార్సీపీ కౌన్సిలర్లు ఫయాజ్, సలీమ్లు పాల్గొని మద్దతు ప్రకటించారు. కార్యక్రమంలో ఇంజనీరింగ్ సిబ్బంది అక్బర్, శంకరయ్య, ఈశ్వర్ రెడ్డి, మల్లికార్జున, రమణ, రమేష్, రమాదేవి, వెంకటలక్ష్మీ, మౌనిక, దేవా, కృష్ణారెడ్డి, బ్రహ్మయ్య, శానిటేషన్ వర్కర్స్ చెన్నయ్య, ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. నిలిచిన నీటి సరఫరా ఆందోళనలో పట్టణ ప్రజలు -
ఘనంగా చక్ర, త్రిశూల స్నానం
రాజంపేట : తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా అన్నమాచార్య ధాన్యమందిరం ఆవరణంలోని కళ్యాణవేదికపై శ్రీ సిద్దేశ్వరస్వామికి త్రిశూలస్నానం, శ్రీ చెన్నకేశవస్వామికి చక్రస్నానం కార్యక్రమాలను నిర్వహించారు. ముందుగా ఉత్సవ మూర్తులకు అభిషేకాలు , ప్రత్యేకపూజలు జరిపారు. టీటీడీ ఆధ్వర్యంలో భక్తులకు ప్రసాదాలను పంపిణీ చేశారు. అంతకముందు వసంతోత్సవాలు నిర్వహించారు. సాయంత్రం శ్రీ సిద్దేశ్వరస్వామి, శ్రీ చెన్నకేశవస్వామి ఆలయంలో ధ్వజావరోహణ కార్యక్రమం నిర్వహించారు. తాళ్లపాక చెరువులో వెలుగులోకి ప్రాచీన శివలింగం రాజంపేట : పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాక చెరువులో నేరుడుగడ్డగా పిలిచే ప్రాంతంలో ప్రాచీన శివలింగం వెలుగులోకి వచ్చింది. సోమవారం చెరువు అభివృద్ధి పనుల్లో భాగంగా వెయ్యేళ్ల చరిత్ర కలిగిన సుమారు ఆరు అడుగుల ఎత్తు కలిగిన శివలింగం బయటపడింది. అదే విధంగా పురాతనమైన రోలు వెలుగుచూసింది. దీంతో గ్రామస్తులు, రాజంపేట పరిసర ప్రాంతాల ప్రజలు తండోపతడాలుగా తాళ్లపాక చెరువు వద్దకు చేరుకున్నారు. శివలింగానికి అభిషేకాలు, పూజలు చేశారు. శ్రీ సిద్దేశ్వరాలయం ప్రధాన అర్చకులు భక్తవత్సలం స్వామి పూజలు నిర్వహించారు. తాళ్లపాక చెరువులో వెలుగులోకి వచ్చిన పురానత శివలింగంపై బీజెపీ రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు పోతుగుంట రమేష్నాయుడు, రిటైర్డ్ పాలిటెక్నికల్ ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం మాట్లాడుతూ ఇక్కడతవ్వకాలు చేపడితే చరిత్ర బయపడుతుందన్నారు. తాళ్లపాక చెరువు అభివృద్ధిలో భాగంగా శివాలయం కూడా నిర్మితం చేసే విధంగా టీటీడీ యోచించాలన్నారు. -
జిల్లా ఇన్చార్జి హౌసింగ్ పీడీ సస్పెన్షన్
రాయచోటి : అన్నమయ్య, చిత్తూరు జిల్లాల ఇన్చార్జి హౌసింగ్ పీడీలు సాంబశివయ్య, గోపాల్నాయక్లను రాష్ట్ర ప్రభుత్వం సోమవారం సస్పెండ్ చేసింది. అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న అనగాని శ్రీహరి బదిలీ కాకుండా ఉండేందుకు లంచం అడిగిన కారణంగా.. రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక కార్యదర్శి అజయ్జైన్ అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ సాంబశివయ్య, గోపాల్నాయక్లను సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ప్రస్తుతం చిత్తూరు జిల్లా హౌసింగ్ ఇన్చార్జి పీడీగా ఉన్న గోపాల్నాయక్ గతంలో అన్నమయ్య జిల్లా పీలేరులో హౌసింగ్ శాఖ డీఈగా పని చేసే వారు. ఏపీ ప్రభుత్వం కాండక్ట్ రూల్స్–1991 ప్రకారం సస్పెన్షన్ చేసినట్లుగా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. ఆ సమయంలో అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ కార్యాలయంలో ఔట్సోర్సింగ్ సిబ్బందిగా పని చేస్తున్న అనగాని శ్రీహరి బదిలీ కాకుండా ఉండేందుకు లంచం అడిగిన కారణంగా.. అన్నమయ్య జిల్లా పీడీ హౌసింగ్ గోపాల్నాయక్ను సోమవారం సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వీరితోపాటు పీడీ కార్యాలయంలో కంప్యూటర్ ఆపరేటర్లుగా పని చేస్తున్న ఆర్.గురుప్రసాద్, ఆర్.సుధాకర్, రఫీక్లను కూడా సస్పెండ్ చేశారు. ఇన్చార్జి పీడీలు ఇద్దరూ పై అధికారుల నుంచి అనుమతి లేనిదే అన్నమయ్య, చిత్తూరు జిల్లా కేంద్రాలను విడిచి వెళ్లరాదని కూడా ఆ ఉత్తర్వులలో పేర్కొన్నారు. అన్నమయ్య జిల్లా హౌసింగ్ పీడీ సాంబశివయ్య ఇప్పటికే నకిలీ కుల సర్టిఫికెట్తో ఉద్యోగం పొందారన్న విషయంపై.. అందిన ఫిర్యాదు మేరకు ఉన్నతాధికారులు విచారణ చేస్తున్న విషయం తెలిసిందే. -
గ్రామకంఠం భూమి కబ్జా
పుల్లంపేట : మండల పరిధిలోని రామక్కపల్లిలో సత్యమ్మ దేవతకు చెందిన గ్రామ కంఠం భూమి కబ్జా చేస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ మేరకు వారు సోమవారం డిప్యూటీ తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారికి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా గ్రామస్తులు మాట్లాడుతూ గ్రామకంఠం భూమికి తమ విన్నపాల మేరకు గ్రామ రెవెన్యూ అధికారులు అనేక సార్లు సర్వే చేసి హద్దులు నిర్ణయించారని తెలిపారు. అయినా ఆకేపాటి రామచంద్రారెడ్డి తన బంధు వర్గానికి చెందిన ఉన్నతాధికారుల బలం ఉందని.. పదేపదే రెవెన్యూ అధికారులను సైతం లెక్క చేయకుండా కొలతలు కొలిచి నాటిన హద్దు రాళ్లను జేసీబీ సాయంతో తొలగించి పొలం దున్నడం జరిగిందని పేర్కొన్నారు. అలాగే గ్రామస్తులు పురాతన బావిని వెలికి తీసినప్పటికీ ఎటువంటి సమాచారం అందించకుండా గ్రామకంఠంలో ఉన్న బావిని దౌర్జన్యంగా పూడ్చివేయడం జరిగిందన్నారు. పంచాయతీ నిధులతో ఏర్పాటు చేసిన సిమెంట్ రోడ్డును సైతం పగులకొట్టి సిమెంటు రోడ్డుపై పెన్సింగ్ నిర్మించారన్నారు. ఈ విషయాలపై ఆకేపాటి రామచంద్రారెడ్డిని సంప్రదిస్తే గ్రామస్తులను దుర్భాషలాడుతూ, దౌర్జన్యానికి దిగుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కావున రెవెన్యూ అధికారులు స్పందించి సదరు వ్యక్తిపై వెంటనే చట్టపరమైన చర్యలు తీసుకొని, గ్రామకంఠం భూమిని కాపాడాలని కోరారు. ఇందుకు స్పందించిన డిప్యూటీ తహసీల్దార్, మండల అభివృద్ధి అధికారి గ్రామస్తులకు న్యాయం చేస్తామని తెలియజేవారు. డెంగీ జ్వరంతో అంగన్వాడీ టీచర్ మృతిసుండుపల్లె : డెంగీ జ్వరంతో అంగన్వాడీ టీచర్ మృతి చెందిన సంఘటన మండల పరిధిలోని జి.రెడ్డివారిపల్లె గ్రామ పంచాయతీ కొరిమివాండ్లపల్లెలో చోటు చేసుకుంది. బాధిత కుటుంబ సభ్యులు తెలిపిన మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. ఉమ్మడిశెట్టి లక్ష్మీప్రసన్న(35) కొరివివాండ్లపల్లెలో అంగన్వాడీ టీచర్గా విధులు నిర్వహిస్తుండే వారు. ఆమెకు వారం క్రితం జ్వరం వచ్చింది. సుండుపల్లె, పీలేరులలోని ఆసుపత్రులలో చికిత్స పొందింది. రక్తపరీక్షలలో డెంగీ జ్వరం అని తేలడంతో మెరుగైన చికిత్స కోసం తిరుపతి స్విమ్స్కు వెళ్లారు. అక్కడ చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో సోమవారం మరణించింది. దీంతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. దుర్గలమ్మ ఊరేగింపులో ఘర్షణరామసముద్రం : రామసముద్రం మండల కేంద్రంలో ఆదివారం జరిగిన దుర్గలమ్మ అమ్మవారి ఊరేగింపులో ఘర్షణ చోటుచేసుకుంది. ఈ ఘర్షణలో ఒకరికి తీవ్ర గాయాలు కాగా మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఎస్ఐ రమేష్బాబు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. బీసీ కాలనీకి చెందిన ధనుష్ అమ్మవారి ఊరేగింపులో డ్యాన్స్ వేస్తుండగా.. ఎగువ పెట్రోల్ బంక్ వద్ద దిగువపాళెంకు చెందిన జగన్తోపాటు మరో ఇద్దరు ధనుష్పై బ్లేడ్తో దాడి చేశారు. ఈ దాడిలో ధనుష్ చెవుపైన, మెడ, వీపుపై రక్త గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు గాయపడిన ధనుష్ను రామసముద్రం ప్రభుత్వ ఆసుపత్రిలో ప్రాథమిక చికిత్స అనంతరం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు ముగ్గరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పేర్కొన్నారు.కాపాడాలని అధికారులకు గ్రామస్తుల ఫిర్యాదుఒకరికి తీవ్ర గాయాలు -
అంజన్న మూలవిరాట్ దర్శనమే లక్ష్యం
చక్రాయపేట : శిలాఫలకాల్లో పేర్లు వేయుంచు కోవాలన్నది మా ఉద్దేశం కాదని, భక్తులకు వీరాంజనేయ స్వామి మూలవిరాట్ దర్శనం కల్పించాలన్నదే ముఖ్యమని గండి ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ టీడీపీ నేతలకు సూచించారు. గండిలో ఆలయ పాలకమండలి సభ్యులతో కలిసి సోమవారం ఏర్పా టు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. వేంపల్లె మండల టీడీపీ ఇన్చార్జి రఘునాథరెడ్డి గండి ఆలయాన్ని శనివారం పరిశీలించి విలేకరుల సమావేశంలో తమపై పలు ఆరోపణలు చేశాడన్నారు. ఆలయం పనులు సుమారు 95 శాతం పూర్తయ్యాయని, పునఃప్రతిష్ట చేసి భక్తులకు శ్రావణ మాసం నాటికి మూల విరాట్ దర్శనం కల్పించాలని గవర్నర్, ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, దేవ దాయ శాఖమంత్రి, కమిషనర్, బీజేపీ, కాంగ్రెస్, నేతలతోపాటు ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి విజ్ఞప్తి చేశానని చెప్పారు. తమ విన్నపాలకు స్పందించి విచారణ నిమిత్తం ఆర్జేసీ, కలెక్టర్, డిప్యూటీ కమిషనర్లు గండికి వచ్చి శ్రావణ మాసం నాటికి పునఃప్రతిష్ట జరిపించాలని ఆదేశించారని చెప్పారు. ఆగిన పనులు తమ విన్నపాలతోనే ఊపందుకున్నాయని చెప్పారు. తాము కూటమి ప్రభుత్వంపై ఎలాంటి ఆరోపణలు చేయలేదన్నారు. పునః ప్రతిష్టకు సంబంధించి కనీసం 6 అడుగుల ప్రాకారం, దీప స్తంభం ఉండాలని, బలిపీఠం కావాలని అధికారులు చెప్పారని తెలిపారు. వారు చెప్పినట్లు ప్రాకారం 6 అడుగులు, దీపస్తంభం ఉందని, బలిపీఠం ఒక్కటే లేదని చెప్పారు. నాలుగేళ్లుగా భక్తులకు మూల విరాట్ దర్శనం లేదని ఇప్పుడైనా ఆ అవకాశం కల్పించాలని తాపత్రయ పడుతున్నామని చెప్పారు. కార్యక్రమంలో పాలకమండలి సభ్యుడు బోరెడ్డి వెంకటరామిరెడ్డి, మాజీ బోర్డు సభ్యుడు బ్రహ్మానందరెడ్డి తదితరులు పాల్గొన్నారు. శ్రావణమాసంలో కల్పించేందుకు ఏర్పాట్లు ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ -
క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుంది : మంత్రి
మృతులు చెంచమ్మ(54), చిట్టమ్మ(30), వి. శ్రీను(28), గజ్జలగంగమ్మ(33), గజ్జలదుర్గయ్య(37), ముని చంద్ర(26), రాధమ్మ (31), జానీ (15), సుబ్బరత్నమ్మ (31) (ఫైల్) సాక్షి రాయచోటి/రైల్వేకోడూరు అర్బన్ : అమాయక గిరిజనులు...పొట్టకూటి కోసం.. రోజువారి కూలీ కోసం ఊరుగాని ఊరొచ్చారు. ఎంతోకొంత సంపాదించుకోవచ్చని ఆశపడ్డారు. ఆ ఆశలపై విధి చిన్నచూపు చూసింది. ప్రమాదమై దూసుకొచ్చి విషాదగీతిక రాసింది. రాజంపేట–రైల్వేకోడూరు మధ్యలోని పుల్లంపేట మండలం రెడ్డివారిపల్లె చెరువుకట్టపై జరిగిన ప్రమాదం ఆయా కుటుంబాల్లో తీరని శోకాన్ని మిగిల్చింది. జీవితానికి సరిపడా చేదు జ్ఞాపకాల్ని మిగిల్చింది. వారి వేదన...అరణ్య రోదన అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట యానాదుల కాలనీలో బాధిత కూలీల కుటుంబాల రోదన అరణ్య వేదనగా మారింది. ఓ వైపు ప్రమాదంలో గాయపడి ఆస్పత్రిలో చికిత్స పొందుతూనే...తెల్లవారిన అనంతరం మృతదేహాల వద్దకు వారు వచ్చారు. ప్రమాదంలో మృతి చెందిన వారంతా బంధువులే. ఒకరునొకరు వరుసకు సోదరుడు, బావమరిది, చిన్నమ్మ, భర్త ఇలా... ఒకరినొకరితో బంధుత్వాలు కలిగి ఉన్నారు. అంతా ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో వారి బంధువుల ఆవేదన వర్ణణాతీతంగా మారింది. రాజంపేటలోని ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీ వద్ద వివరాల కోసం సమాచారం అడుగుతున్నా చెప్పలేని పరిస్థితుల్లో ఉండిపోయారు. కాలనీలో కన్నీటి ఘోష రైల్వేకోడూరు పరిధిలోని యానాదుల కాలనీలో కన్నీటి ఘోష కనిపిస్తోంది. కాలనీకి చెందిన 9 మంది మృతి చెందడం, మరో 13 మందికి గాయాలు కావడంతో ఆ ప్రాంతమంతా తల్లడిల్లిపోయింది. కొద్దిసేపట్లో గమ్య స్థానానికి చేరుకుంటారని అనుకుంటున్న తరుణంలోనే ఇలా ఒక్కసారిగా ఉపద్రవం ముంచుకొచ్చిందంటూ తలుచుకుని కన్నీటిపర్యంతమవుతున్నారు. పొట్టకూటికోసం వచ్చి.... అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరు పరిధిలోని శెట్టిగుంట ఎస్టీ కాలనీలోకి కొంతమంది యానాదులు పనుల కోసం వలస వచ్చారు. ప్రధానంగా వెంకటగిరి, రేణిగుంట పరిధిలోని రెండు గ్రామాలకు చెందిన సుమారు 20–30 కుటుంబాలు పనుల కోసం వచ్చాయి. పొట్టకూటికోసం ఎక్కడో దూర ప్రాంతాల నుంచి పనుల కోసం వలసవచ్చి రోడ్డు ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయారు. బాధిత కుటుంబాలను ఆదుకోవాలి రోడ్డు ప్రమాద ఘటనలో గాయపడిన వారిని రైల్వేకోడూరు మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు, ఇతరవైఎస్సార్ సీపీ నాయకులు పరామర్శించారు. మార్చురీ వద్ద మృతదేహాలను సందర్శించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఆయా కుటుంబాలకు ప్రగాడ సానుభూతి తెలియజేశారు. ఇంత పెద్ద ఘటన జరగడం బాధాకరమని, వెంటనే ప్రభుత్వం బాధిత కుటుంబాలను ఆదుకునేందుకు పరిహారం ప్రకటించాలని డిమాండ్ చేశారు. ఇంతవరకు ప్రభుత్వం పరిహారం ప్రకటించకపోవడంపై మండిపడ్డారు. వెంటనే ఆదుకునే దిశగా చర్యలు చేపట్టాలని కోరారు. అతివేగమే ప్రాణం తీసిందా రెడ్డిపల్లి వద్ద జరిగిన ప్రమాదంలో డ్రైవర్ నిర్లక్ష్యం, అతి వేగం ప్రాణం తీసిందని తెలుస్తోంది. దీనికి తోడు కూలీలను తీసుకెళ్లే మేసీ్త్ర, వ్యాపారులు పని చేయించుకొని వారిని వదిలేశారు. వారి తిరుగు ప్రయాణానికి ఏర్పాట్లు చేయకుండా రాత్రి వేలలో నిబంధనలకు విరుద్ధంగా అంత మందిని లోడ్ పైన ఎక్కించి ప్రయాణం చేయించడంపై బాధితుల బంధువులు మండిపడుతున్నారు. అనాథలైన పిల్లలు గజ్జల గంగమ్మ, దుర్గయ్యలు ప్రమాదంలో మృతి చెందడంతో వారిపిల్లలు సునీతమ్మ, రాజీ, గంగయ్యలు అనాథలయ్యారు. మృతదేహాలవద్ద వారి తాత పిల్లలను ఓదార్చలేక పోయాడు. ఒకే చోట అంత్యక్రియలు ఆఊరికి ఎప్పుడూ లేనంత కష్టం వచ్చింది. ఒకేమారు నలుగురు మృతి చెందడం మృతదేహాలను ఖననం చేయడానికి గుంతలు తీయడానికి సమయం సరిపోలేదు. దీంతో జేసీబీతో గుంతలు తవ్వి ఖననం చేశారు. మృతుల కుటుంబాలను ఆదుకోవాలి రాజంపేట : పుల్లంపేట మండలంలోని రెడ్డిపల్లె చెరువుకట్టపై ఆదివారం రాత్రి జరిగిన రోడ్డుప్రమాంలో ప్రాణాలు కోల్పోయిన కుటుంబాలను ప్రభుత్వం ఆర్థికంగా ఆదుకోవాలని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి పేర్కొన్నారు. సోమవారం ఆయన మాట్లాడుతూ రెక్కాడితేకాని డొక్కాడని కుటుంబాలకు ఇలా జరగడం చాలా బాధకరమన్నారు. మృతుల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలియచేస్తునన్నారు. హాస్పిటల్ చికిత్స పొందుతున్న త్వరగా కోలుకోనే విధంగా వైద్య సేవలందించాల న్నారు. కన్నీటిలో శెట్టిగుంట ఎస్టీ కాలనీ ఎవరిని కదిపినా కన్నీరే రాజంపేట హాస్పిటల్లో పూర్తయిన పోస్టుమార్టం రాజంపేట : రెడ్డిపల్లె చెరువుపై ఆదివారం లారీబోల్తా సంఘటనలో క్షతగాత్రులకు ప్రభుత్వం అండగా ఉంటుందని జిల్లా ఇన్చార్జి మంత్రి జనార్ధన్రెడ్డి అన్నారు. రాజంపేట ప్రాంతీయవైద్యశాలలో ఉన్న క్షతగాత్రులను కలెక్టర్ శ్రీధర్ చామకూరితో కలిసి పరామర్శించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జరిగిన ప్రమాదసంఘటనపై సీఎంతో మాట్లాడనన్నారు. సీఎం సూచన మేరకు క్షతగాత్రులను పరామర్శించామన్నారు. బాధితు కుటుంబాలను ఏవిధంగా ఆదుకోవాలనే విషయం ప్రభుత్వానికి నివేదిక ఇచ్చి నిర్ణయం తీసుకుంటామన్నారు. కలెక్టరు శ్రీధర్ చామకూరి మాట్లాడుతూ జరిగిన సంఘటన దురదృష్టకరమన్నారు.రైల్వేకోడూరు టీడీపీ ఇన్చార్జి ముక్కారూపానందరెడ్డి, టీడీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమరి జగన్మోహన్రాజు తదితరులు పాల్గొన్నారు. -
మంత్రి మండిపల్లిపై సోషల్ మీడియా పోస్టింగులు
రాయచోటి : రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డిపై ఫేస్బుక్లో అభ్యంతకరమైన కామెంట్ పెట్టారంటూ తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లాకు చెందిన ఎరమాల అన్వేష్ రెడ్డి(29)ని అరెస్ట్ చేసినట్లు అన్నమయ్య జిల్లా రాయచోటి అర్బన్ సీఐ వెంకటచలపతి వెల్లడించారు. ఈ నెల 12న మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నేత పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డిపై రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి చేసిన వ్యాఖ్యలకు ప్రతిగా సోషల్ మీడియా వేదికగా అభ్యంతకరమైన కామెంట్స్ పోస్ట్ చేయడంపై మంత్రి పీఏ రామచంద్ర ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశామన్నారు. ఇతనితోపాటు ఎవరైనా ఉన్నారా అనే కోణంలో కూడా విచారణ జరుపుతున్నామని పేర్కొన్నారు. అదుపులోకి తీసుకున్న అన్వేష్ రెడ్డి పై కేసు నమోదు చేసి సోమవారం కోర్టుకు హాజరు పరిచామన్నారు. కోర్టు అన్వేష్ రెడ్డికి బెయిల్ మంజూరు చేసింది. తెలంగాణ రాష్ట్రం ఖమ్మం జిల్లా కల్లూరు మండలానికి చెందిన అన్వేష్రెడ్డి ప్రస్తుతం హైదరాబాద్లో నివాసం ఉంటున్నారు. వైఎస్సార్సీపీ అభిమాని అని తెలిసింది.ఖమ్మం జిల్లా వాసి అరెస్ట్.. బెయిల్పై విడుదల -
చేనేతలకు ఇచ్చిన హామీలు నెరవేర్చాలి
రాయచోటి : ఎన్నికల సమయంలో కూటమి ఇచ్చిన హామీ మేరకు రాష్ట్రంలోని చేనేతలను అన్ని విధాలుగా ఆదుకోవాలని చేనేత సంఘం నాయకులు డిమాండ్ చేశారు. సోమవారం అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్, చేనేత జౌళిశాఖ అసిస్టెంట్ డైరెక్టర్ పవన్కుమార్రెడ్డిలను వారు కలిసి వినతిపత్రం అందజేశారు. కూటమి అధికారంలోకి రావడానికి చేనేతలపై వరాల జల్లు కురిపించి ఓట్లు దండుకొని 14 నెలలు గడిచినా ఇంత వరకు చింతాకంత సాయం కూడా చేయలేదన్నారు. చేనేతలకు 100 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇస్తామని చెప్పిన హామీని నెరవేర్చలేదన్నారు. జగనన్న ప్రభుత్వంలో చేనేతలకు ఏడాదికి 24 వేల రూపాయలు ఇచ్చే వారన్నారు. ప్రభుత్వం వెంటనే స్పందించి చేనేతలకు ఏడాదికి రూ. 30 వేలు ఇవ్వాలని, జీఎస్టీ పూర్తిగా రద్దు చేయాలన్నారు. 200 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించాలన్నారు. 45 ఏళ్లకే పింఛన్, ఆరోగ్యశ్రీ బీమా కల్పించాలని పేర్కొన్నారు. ముద్ర రుణాలు బ్యాంకుకు లింక్ చేయకుండా.. డైరెక్ట్గా అందించాలన్నారు. అలాగే మరో 5 లక్షల వరకు జీరో వడ్డీతో రుణాలు అందించాలని కోరారు. ప్రతి ప్రభుత్వ, ప్రైవేటు ఉద్యోగస్తులు అందరూ చేనేత వస్త్రాలను ధరించేలా ఆదేశాలు ఇవ్వాలని కోరారు. అలాగే ప్రభుత్వ స్కూల్లో ఇస్తున్న స్కూల్ యూనిఫామ్ చేనేత వస్త్రాలతో తయారు చేసినవి ఇవ్వాలని విన్నవించారు. గృహాలు మంజూరు చేసి రాష్ట్ర ఆప్కో చైర్మన్ డైరెక్టర్లను త్వరగా భర్తీ చేయాలని పేర్కొన్నారు. కార్యక్రమంలో చేనేత జిల్లా అధ్యక్షులు శీలం రమేష్, చేనేత రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోడం నాగభూషణం, వైఎస్సార్సీసీపీ రాష్ట్ర బీసీ సెల్ అధికార ప్రతినిధి సిబ్యాల విజయ భాస్కర్, తంబళ్లపల్లి నియోజకవర్గ చేనేత అధ్యక్షులు జి.వెంకటేశ్వర్రెడ్డి, చేనేత నాయకులు అనంత మునిశేఖర్, వీరబల్లి మండల చేనేత అధ్యక్షులు మోడం మదనమోహన్, గుండ్లపల్లి శ్రీనివాసులు, సిబ్యాల బాలాజీ, పురం శివయ్య, పలువురు చేనేత నాయకులు పాల్గొన్నారు. ఏడాదైనా అమలు చేయని కూటమి ప్రభుత్వం జేసీపీ బీసీ నేతలు డిమాండ్ -
సిద్దవటంలో పిచ్చికుక్క స్వైరవిహారం
సిద్దవటం : సిద్దవటంలోని దిగువపేటలో సోమవారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ఐదుగురిని కాటువేసింది. దిగువపేట గాంధీవీధిలో ఉదయం 6 ఏళ్ల బాలుడు కోటపాటి నందక్రిష్ణ దారిన వస్తుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి కాటువేసింది. అలాగే అదే వీఽధికి చెందిన బత్తల బాలగురవయ్య, బాలింత పాలెం వసంత, బేల్దారు వీధికి చెందిన 5 ఏళ్ల బాలిక ఫాతిమా, దిగువపేట బజారు వీధిలో మరొకరిపై పిచ్చికుక్క దాడి చేసి కాటువేసింది. కుక్క కాటుకు గురైన వారు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రికి వచ్చి వ్యాక్సిన్, ఇన్జెక్షన్లను వేయించుకున్నారు. సిద్దవటంలో కుక్కలు, ఆవులను పెంచుకునే వారు ఇంటి వద్ద కట్టేసుకొని పెంచుకోవాలని, గ్రామంపై వదిలేస్తే కఠినమైన చర్యలు తీసుకుంటామని ఎస్ఐ మహమ్మద్రఫీ హెచ్చరించి సోమవారం సిద్దవటం గ్రామ పంచాయతీలో చాటింపు వేయించారు.ఒకే రోజు ఐదుగురిపై దాడి -
బాధ్యతగా సమస్యలను పరిష్కరించాలి
జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా వచ్చే సమస్యలను బాధ్యతగా పరిష్కరించాలని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ అధికారులను ఆదేశించారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో సోమవారం జేసి అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ముఖ్యమంత్రి కార్యాలయం కూడా ఫిర్యాదు పరిష్కారంపై నేరుగా పర్యవేక్షిస్తోందని జేసీ తెలిపారు. అధికారులు ఫిర్యాదులను నూరుశాతం పరిష్కరించాలన్నారు. పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకోవాలని తెలిపారు. వినతులు.. వాల్మీకిపురం మండలానికి చెందిన అంజప్ప తన కుడికాలును అనారోగ్య కారణాల రీత్యా పూర్తిగా తీసివేశారని, తనకు త్రిచక్ర వాహనాన్ని ఇప్పించాలని జేసీకి విన్నవించుకున్నారు. నందలూరు మండలానికి చెందిన సాంబశివ నాయుడు తన కుమార్తెకు వివాహమైందని,ఆమె పేరును తన హౌస్ హోల్డ్ మ్యాపింగ్ నుంచి వేరు చేయాలని విన్నవించుకున్నారు. రాయచోటిలో నివసిస్తున్న చాంద్బాషా తనకు 75 సంవత్సరాల వయస్సు అని, ఎటువంటి పని చేయలేని పరిస్థితులలో ఉన్నానని, వృద్దాప్య పింఛన్ ఇప్పించాలని జిల్లా జాయింట్ కలెక్టర్కు వినతి చేసుకున్నారు. కార్యక్రమంలో డిఆర్ఓ మధుసూదన్ రావు, ఆర్డీఓ శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
కుప్పానికి నీళ్లు తీసుకెళ్తే.. మా పరిస్థితి ఏంటి?
కురబలకోట : హంద్రీనీవా కాలువ ద్వారా కుప్పానికి మాత్రమే నీళ్లు తీసుకెళితే పరీవాహక ప్రాంత రైతులు, చెరువుల పరిస్థితి ఏమిటని జిల్లాలోని వివిధ మండలాల గ్రామాల రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. సోమవారం తుంగావారిపల్లె పరిసర గ్రామాల రైతులు హంద్రీనీవా కాలువ పనుల వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ పాలనలో హంద్రీనీవా నీటి ద్వారా పరీవాహక ప్రాంత చెరువులను నింపడం జరిగిందన్నారు. తద్వారా పంటలు రావడంతో పాటు భూ గర్భజలాలు పెరిగాయన్నారు. బోర్లలో నీటి మట్టం తగ్గకుండా సంరక్షణ జరిగిందన్నారు. ఇప్పుడు హంద్రీనీవా కాలువకు ఎక్కడా చెరువులకు నీళ్లు వెళ్లడానికి వీలు లేకుండా ప్లాస్టింగ్ పనులు చేపట్టడం వల్ల రైతాంగం తీవ్రంగా నష్టపోతుందన్నారు. కాలువ చుట్టుపక్కల ఉన్న చెరువులు, పొలాలకు నీళ్లు చేరకపోతే వ్యవసాయం నాశనం అవుతుందన్నారు. చెరువులకు అనుసంధానానికి వీలుగా నీటి గేట్లు ఏర్పాటు చేయకపోవడం వల్ల కేవలం కుప్పానికి మాత్రమే నీళ్లు వెళతాయన్నారు. చెరువులున్న పరీవాహక ప్రాంతాల వారు తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందన్నారు. ‘హంద్రీనీవా కాలువ నీళ్లు మాకూ కావాలి.. కుప్పానికి మాత్రమే పంపితే మేమెలా బతకాలి.. చంద్రబాబు’ అంటూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. రాయలసీమకు నీళ్లు అందించాలన్న ఉద్దేశానికి గండికొడుతున్నారన్నారు. ఉదాహరణకు మండలంలోని తుంగావారిపల్లెకి ఎగువున ఉన్న మల్లేశ్వర చెరువు దిగువున ఉన్న రామక్క చెరువు ఆ తర్వాత రంగమ్మ చెరువుకు చుక్క నీరు కూడా వెళ్లే అవకాశం లేదన్నారు. దీనివల్ల అన్ని విధాలా రైతులు నష్టపోతారన్నారు. ఈ విషయమై జిల్లాకు చెందిన రాష్ట్ర మంత్రికి, జిల్లా ఉన్నతాధికారులకు కూడా వినతి పత్రం ఇచ్చినా పట్టించుకోవడం లేదని రైతు నాయకుడు తుంగావరిపల్లె శంకర్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. హంద్రీనీవా కాలువను పరిసర ప్రాంత చెరువులకు అనుసంధానం చేయాలని రైతులు డిమాండ్ చేశా రు. కుప్పానికి మాత్రమే నీళ్లు తీసుకెళ్లి కాలువ పరీవాహక ప్రాంతాలను ఎండబెట్టాలని చూస్తే రైతుల ఆగ్రహం చవిచూడక తప్పదని హెచ్చరించారు. చెరువులకు అనుసంధానం లేకుండా పనులు ఎలా చేస్తారు? హంద్రీ నీవా పనులపై రైతన్నల ఆగ్రహం -
ఒంటిమిట్టలో పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట కోదండరామస్వామి ఆలయంలో భక్తులకు పూర్తిస్థాయిలో అన్నప్రసాద వితరణకు చర్యలు చేపట్టాలని టీటీడీ ఈఓ శ్యామలరావు అధికారులను ఆదేశించారు. టీటీడీ పరిపాలనా భవనంలోని కార్యనిర్వహణాధికారి ఛాంబర్లో జేఈఓ వి.వీరబ్రహ్మంతో కలిసి సోమవారం అధికారులతో ఈఓ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ ఒంటిమిట్టలో ఏప్రిల్ 11వ తేదీన జరిగిన కోదండరామస్వామి కల్యాణోత్సవంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తిరుమల తరహాలో ఒంటిమిట్టలో భక్తులకు అన్న ప్రసాదాలు పంపిణీ చేయాలని ఆదేశించిన నేపథ్యంలో ఆలయం వద్ద తాత్కాలికంగా జర్మన్ షెడ్లు ఏర్పాటు చేసి ఆగస్టు నుంచి అన్న ప్రసాదాలు పూర్తిస్థాయిలో ఏర్పాటు చేసేందుకు ఇంజినీరింగ్, అన్న ప్రసాదాల విభాగం అధికారులు సమన్వయం చేసుకోవాలని సూచించారు.కార్యక్రమంలో ఎఫ్ఏ అండ్ సిఏఓ బాలాజీ, సిఈ టివి సత్యనారాయణ, ఎస్ఈలు జగదీశ్వర్ రెడ్డి, మనోహరం, అన్నప్రసాదం, డిప్యూటీ ఈఓ రాజేంద్ర కుమార్ తదితరులు పాల్గొన్నారు. టీటీడీ ఈఓ జె శ్యామలరావు -
ఇదేం ప్రయాణం.. ప్రాణాలకే ప్రమాదం
ముదివేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అటవీ మార్గంలో ఆదివారం ఐదుగురు యువకులు ఒకే బైక్పై ఓవర్ స్పీడుగా వెళ్లడం ఆశ్చర్యాన్ని కల్గించింది. వీరి రైడింగ్ భయ భ్రాంతులకు గురి చేసింది. వంద కిలోమీటర్ల వేగంతో.. సౌండ్ చేస్తూ.. ఆపై గోల చేస్తూ వెళ్లారు. బైక్ ఏమాత్రం అదుపు తప్పినా.. వారి ప్రాణాలకే ప్రమాదమనే సంగతిని వారు మరిచిపోయారు. ఇది అన్నమయ్య జిల్లాలో వైరల్గానే కాకుండా హల్ చల్గా మారింది. ఈ విషయమై ఎస్ఐ దిలీప్కుమార్ను వివరణ అడగగా.. వీరి కోసం అన్వేషిస్తున్నట్లు తెలిపారు. తగు చర్యలు తీసుకుంటామన్నారు. బైక్ను స్వాధీనం చేసుకుంటామన్నారు. – కురబలకోట -
చక్రస్నానం..సర్వపాపహరణం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు అంగరంగ వైభవంగా జరగుతున్నాయి. ఇందులో చివరిఘ్టమైన చక్రస్నానం ఆదివారం వైభవంగా నిర్వహిచారు. ఆదివారం ఉదయం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథడికి గ్రామోత్సవం.. వసంతోత్సవాల నడుమ జరిగింది. ఆలయంలో ఉత్సవమూర్తులకు గంధం, పాలు, తేనె, నెయ్యి వివిధ రకాల ఫలాలతో అభిషేకం భక్తిశ్రద్ధలతో జరిపారు. అనంతరం పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామిలు ఉత్సవమూర్తులకు కోనేటిలో చక్రస్నానం నిర్వహించారు. చక్రస్నానం అనేది బ్రహ్మోత్సవాల్లో ప్రధానమైనది. కోనేటిలో స్వామి స్నానం ఆచరించిన తర్వాత ముగినిన వారి పాపాలు తొలగుతాయని, మోక్షం లభిస్తుందని పండితులు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ డిప్యూటీ ఈఓ ప్రశాంతి, సూపరింటెండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, భక్తులు పాల్గొన్నారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం రాత్రి శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథ స్వామి వారికి పుష్పయాగం నిర్వహించనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. ఘనంగా సౌమ్యనాథడికి చక్రస్నానం -
అశ్వవాహనంపై చెన్నకేశవస్వామి
రాజంపేట : తాళ్లపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం అశ్వవాహనంపై శ్రీ చెన్నకేశవస్వామి దర్శనిమిచ్చారు. అలాగే శ్రీ సిద్దేశ్వరస్వామికి పల్లకీసేవ నిర్వహించారు. గ్రామ వీధుల్లో భక్తులు స్వామివార్లకు కాయకర్పూరం సమర్పించుకున్నారు. పార్వేటి ఉత్సవం ఘనంగా నిర్వహించారు. నేడు ధ్వజావరోహణం శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ సిద్దేశ్వరస్వామికి బ్రహ్మోత్సవాలకు సోమవారం ధ్వజావరోహణం కార్యక్రమం నిర్వహించనున్నారు. సిద్దేశ్వరునికి త్రిశూలస్నానం, శ్రీ చెన్నకేశవస్వామికి చక్రస్నాన కార్యక్రమం నిర్వహించనున్నారు. అపరకాశి.. తాళ్లపాక అపరకాశి తాళ్లపాక అని హిందూ ధర్మప్రచార పరిషత్ ధర్మాచార్యులు గంగనపల్లె వెంకటరమణ అన్నారు. తాళ్లపాక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం సాయంత్రం తాళ్లపాక స్థలపురాణం, అన్నమాచార్యుల జీవితం అనే అంశంపై ఆధ్యాత్మిక ఉపన్యాసం చేశారు. జిల్లా ప్రోగ్రాం గోపిబాబు పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో ధార్మిక ఉపన్యాసకులు కందిమల్లు రాజారెడ్డి అన్నమయ్య జీవిచరిత్ర విశేషాలపై ప్రసంగించారు. -
సెయింట్ లూయిస్లో ఘనంగా వైఎస్సార్ జయంతి
రాజంపేట : యూఎస్ఏలోని సెయింట్ లూయిస్లో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి జయంతి వేడుకలను శనివారం రాత్రి వైఎస్సార్సీపీ యువనేత చిల్లా కిరణ్ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్ పాలనలో ప్రజలకు అందిన సంక్షేమ పథకాలు, ఆయన తీసుకున్న నిర్ణయాలు, ఆయన మాటల్లోని మానవతాస్ఫూర్తి గురించి కార్యక్రమంలో పాల్గొన్న అభిమానులు మాట్లాడారు. వారి జీవితాల్లో వైఎస్సార్ ప్రభావం గురించి, వ్యక్తిగత అనుభవాలను హృద్యంగా పంచుకున్నారు. గతంలో 2007లో వైఎస్సార్ సెయింట్ లూయిస్ పర్యటనలో ఇదే కన్వెన్షన్ హాల్లో పబ్లిక్ మీటింగ్లో మాట్లాడారని ప్రవాసాంధ్రులు గుర్తు చేసుకున్నారు. అదే వేదికపై ఆయన జ్ఞాపకాలను పురస్కరించుకొని ఈ కార్యక్రమం జరగడం ప్రత్యేక ఆకర్షణగా నిలిచింది. ఈ వేడుకల్లో జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా పాల్గొన్న వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆలూరు సాంబశివారెడ్డి, కడప మోహన్రెడ్డి తమ మధుర జ్ఞాపకాలను, వైఎస్సార్ జీవితంలో చిరస్మరణీయ ఘట్టాలను పంచుకున్నారు. వైఎస్సార్ జయంతి సభ వీక్ ఎండ్స్లో చేయాల్సి వచ్చిందన్నారు. చికాగో, మెంఫిస్, కాన్సాస్ వంటి నగరాల నుంచి వచ్చిన వైఎస్సార్సీపీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారన్నారు. సభలో కన్వీనర్ సుబ్బారెడ్డి, పమ్మి, సందీప్, రాఘవరెడ్డి, నవీన్, గూడువల్లి, మహేష్, గోపాల్, తాటిపర్తి, ఆర్కే తదితరులు పాల్గొన్నారు.2007లో వైఎస్సార్ మాట్లాడిన పబ్లిక్ మీటింగ్ వేదికపైనే వేడుకలు -
చెరిపితే చెరిగేది కాదు.. జగనన్న మార్కు..
రాయచోటి : రాష్ట్ర రాజకీయాల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డి మార్కు.. చెరిపితే, చెరిగిపోయేది కాదని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు మొయిళ్ల గౌరీ రెడ్డి అన్నారు. ఆదివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో సొంతంగా ఒక్క పథకాన్ని కూడా చంద్రబాబు నాయుడు తీసుకురాలేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి తెచ్చిన అమ్మఒడిని తన కుమారుడు లోకేష్ ఖాతాలో వేసుకోవడం సిగ్గుచేటన్నారు. పేరెంట్స్ మీటింగ్లో సీఎం హోదాలో చంద్రబాబు మొత్తం అబద్ధాలు చెప్పారని విమర్శించారు. అమ్మఒడి పథకం ఎవరు తెచ్చారన్నది రాష్ట్రంలో చిన్నపిల్లలను అడిగినా చెబుతారన్నారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఏమాత్రం తడబడకుండా అబద్ధాలు ఆడగలరన్నారు. మోసపూరిత హామీలతో అధికారంలోకి రావటం బాబుకు వెన్నతో పెట్టిన విద్య అన్నారు. నాలుగు సార్లు ముఖ్యమంత్రిగా పని చేసినా ఏ నాడు విద్యావ్యవస్థపై దృష్టి పెట్టకపోగా.. సత్యమే పలకవలెనని నేర్పించే పాఠశాలలకు వెళ్లి పచ్చి అబద్ధాలు మాట్లాడారన్నారు. సొమ్ము ఒకరిది సోకు మరొకరిది అన్న రీతిలో చంద్రబాబు ప్రవర్తన ఉందన్నారు. 2017లో వైఎస్సార్సీపీ ప్లీనరీలో చెప్పిన మాట ప్రకారం తొలి ఏడాదిలోనే అమ్మఒడి ద్వారా తల్లులకు డబ్బులు అందించిన ఘనత జనగన్నకు దక్కుతుందన్నారు. అయితే ఏడాది డబ్బులను అనేక మంది తల్లులకు ఎగ్గొట్టిన ఘనత చంద్రబాబుదన్నారు. మనబడి, నాడు నేడు పేరుతో అన్ని ప్రభుత్వ పాఠశాలలను ప్రైవేటు పాఠశాలలకు దీటుగా అభివృద్ధి చేసింది కూడా జగన్ ప్రభుత్వంలోనే అన్నారు. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లిషు మీడియం, డిజిటల్ విద్యా రంగాన్ని ప్రారంభించింది జగనన్న అన్న విషయం రాష్ట్ర ప్రజలకు తెలుసు అన్నారు. కూటమి ప్రభుత్వంలో ఇచ్చిన నాణ్యత లేని బ్యాగ్, నాసిరకం భోజనంపై తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని పేర్కొన్నారు. జగనన్న గోరు ముద్ద పథకాన్ని కూటమి ప్రభుత్వం ఘోరమైన ముద్దగా మార్చిందని విద్యార్థులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. జగనన్న పథకాలను ప్రజలు జీవితకాలం మరచిపోరని ఆమె వివరించారు. 40 ఏళ్ల రాజకీయ జీవితంలో బాబు ఒక్క పథకాన్నైనా తెచ్చారా? రాష్ట్ర మహిళా విభాగం జోనల్ అధ్యక్షురాలు గౌరీరెడ్డి -
మున్సిపల్ వాటర్, విద్యుత్ సిబ్బంది సమ్మె బాట
రాయచోటి టౌన్ : గత కొన్ని రోజులుగా నిరసన కార్యక్రమాలు నిర్వహించిన మున్సిపల్, విద్యుత్ శాఖ (ఇంజినీరింగ్)ల సిబ్బంది శనివారం అర్ధరాత్రి నుంచి సమ్మె బాట పట్టారు. మున్సిపల్ కార్యాలయ ఆవరణలో సమ్మెబాట కార్యక్రమం ప్రారంభించారు. మొదటి రోజు సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రామాంజులు సమ్మెలో పాల్గొన్న వారికి పూలమాల వేసి దీక్షలు ప్రారంభించారు. అలాగే మున్సిపల్ యూనియన్ జిల్లా అధ్యక్షులు బీవీ రమణతో కలసి ఆటో ప్రచారాన్ని జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం విలేకర్లతో మాట్లాడుతూ గత నెల రోజులుగా తమ సమస్యలను పరిష్కరించాలని, జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచాలని, షరతులు లేకుండా సంక్షేమ పథకాలు అమలు చేయాలని, పని ముట్లు ఇవ్వాలని, రక్షణ పరికరాలు అందివ్వాలని రాష్ట్ర మున్సిపల్ శాఖ మంత్రి నారాయణ దృష్టికి తీసుకెళ్లినా పరిష్కార మార్గం చూపలేదన్నారు. అందుకే సమ్మె బాట పట్టామని తెలిపారు. మెప్మా ఆర్పీలకు, ట్రైబల్ టీచర్స్, గెస్ట్ టీచర్స్కు జీతాలు పెంచారు కానీ 2005 నాటి నుంచి నేటి వరకు దాదాపు 20 సంవత్సరాలు పూర్తి కావస్తోందని, కేవలం రూ.15 వేలు వస్తోందని వీటిలో కటింగ్లు పోను రూ.13 వేలు మాత్రమే చేతికి వస్తోందన్నారు. ఇక వెలిగల్లు ప్రాజెక్టు పంప్ హౌస్లో పని చేస్తున్న ఆరుగురికి 14 నెలలుగా జీతాలు ఇవ్వలేదని, దీనిపై కోర్టు జీతాలు ఇవ్వాలని ఆదేశాలు ఇచ్చినప్పటికీ.. పెడచెవిన పట్టారని ఆరోపించారు. ఏడు సంవత్సరాల నుంచి ఇంజనీరింగ్ సిబ్బంది జీతాల పెంపునకు నోచుకోలేదన్నారు. జీవో నంబర్ 36 ప్రకారం జీతాలు పెంచేదాకా నిరవధిక సమ్మెను కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఇంజినీరింగ్ సిబ్బంది అక్బర్, శంకరయ్య, ఈశ్వరరెడ్డి, మల్లిఖార్జున, రమణ, రమేష్, రమాదేవి, వెంకటలక్ష్మి, మౌనిక, దేవా, కృష్ణారెడ్డి, బ్రహ్మయ్య తదితరులు పాల్గొన్నారు. -
మద్యం తాగవద్దన్నందుకు ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : మద్యం తాగవద్దన్నందుకు మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. సీటీఎం పంచాయతీ పడమటవీధికి చెందిన రాజయ్య(62) కూలీ పనులు చేస్తూ జీవించేవాడు. కొంత కాలంగా మద్యానికి తీవ్రంగా బానిసై ప్రతి రోజు ఇంటికి మద్యం తాగి వచ్చేవాడు. ఈ క్రమంలో ఆదివారం మరోసారి ఉదయాన్నే మద్యం తాగి రావడంతో.. భార్య రాజమ్మ భర్తతో గొడవపడి మద్యం తాగవద్దంటూ మందలించింది. దీంతో మనస్తాపం చెందిన రాజయ్య ఇంటికి సమీపంలోనే ముష్టిచెక్క తిని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్సలు అందిస్తుండగా, పరిస్థితి విషమించి మృతి చెందాడు. దీంతో మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. -
కన్నీటి వీడ్కోలు
పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి..త్వరలో పెళ్లి పీటలు ఎక్కాల్సిన వారికి.. కన్నీటి వీడ్కోలు పలికారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో బావమరదలు మృతి చెందిన విషయం తెలిసిందే. వారి మృతదేహాలకు ఆదివారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ ప్రాంతంలో ఆర్తనాదాలు మిన్నంటాయి. ‘మీ పెళ్లి చేసి మురిసిపోదామనుకుంటే.. ఇలా జరిగిందేమిటి!’.. దేవుడా అంటూ కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. బంధుమిత్రులు, శ్రేయోభిలాషులు విషాద వదనంలో మునిగిపోయారు.ఓబులవారిపల్లె : చిన్ననాటి నుంచి కలిసి పెరిగారు. యుక్త వయస్సు రాగానే ప్రేమించుకొని పెద్దలను ఒప్పించి వివాహానికి సిద్ధమయ్యారు. రెండు నెలల్లో పెళ్లి.. అంతలోనే మృత్యుఒడికి చేరుకున్నారు. మరణంలోనూ వారు ఒకరికొకరు తోడుగా వెళ్లిపోయారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మృతి చెందిన ఇద్దరి విషాద గాథ ఇది. వివరాల్లోకి వెళ్తే.. మండల కేంద్రంలోని వైకోట రోడ్డు సమీపంలో నివాసం ఉంటున్న రిటైర్డ్ కండక్టర్ వనమాల శ్రీనివాసులు, వనమాల ప్రభావతికి ఇద్దరు కుమారులు, ఒక కుమార్తె ఉన్నారు. పెద్దకుమారుడు అజయ్ కృష్ణ, చిన్న కుమారుడు సాయి కృష్ణ. పెద్ద కుమారుడు అజయ్ చిట్వేలి గ్రామానికి చెందిన సాతుపాడి నాగయ్య నాల్గవ కుమార్తె మాధవిని వివాహం చేసుకున్నాడు. మాధవి తల్లిదండ్రులు ఇద్దరూ అప్పటికే చనిపోయి ఉండటంతో.. తన చిన్న చెల్లెలు అనితను చిన్నప్పుడే తనతోపాటు అత్తగారింటికి తీసుకొచ్చింది. అనిత ఇక్కడే హైస్కూల్లో చదివి పుల్లంపేటలో ఇంటర్మీడియెట్ పూర్తి చేసింది. నవమాల శ్రీనివాసులు రెండవ కుమారుడు సాయి కృష్ణ డిగ్రీ వరకు చదివాడు. చిప్పన్పటి నుంచి సాయి కృష్ణ, అనిత ఇద్దరూ కలిసి పెరగడంతో వారి మధ్య ప్రేమ చిగురించింది. పెద్దలు మొదట్లో ఒప్పుకోకపోయినా.. తర్వాత ఒప్పించి వివాహం చేసుకునేందుకు సిద్ధమయ్యారు. ఇంకా రెండు నెలలకు అనిత మైనార్టీ తీరిన తరువాత వివాహం చేద్దామని పెద్దలు నిర్ణయించుకొని అన్ని సిద్ధం చేసుకున్నారు. కబళించిన రోడ్డు ప్రమాదం ఈ క్రమంలో విధి వీరి జీవితాలతో ఆడుకుంది. సాయికృష్ణ (24)కు రైల్వేకోడూరు ప్రైవేటు ఫైనాన్స్ కంపెనీలో ఇటీవల ఉద్యోగం వచ్చింది. చేరేందుకు స్కూటీపై శనివారం రైల్వేకోడూరుకు వెళ్లాడు. అక్కడ ఉండేవారు తిరుపతికి వెళ్లాలని చెప్పడంతో తిరుపతికి వెళ్లాడు. ఇంటి వద్ద ఉన్న మరదలు అనిత నంద్యాల డెమో రైలులో తిరుపతికి వెళ్లింది. ఇద్దరు కలిసి తిరుపతిలో ఉంటున్న అజయ్ కృష్ణతో మాట్లాడారు. సాయంత్రం అనిత, సాయికృష్ణ స్కూటీపై తిరుపతి నుంచి ఇంటికి బయలు దేరారు. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట సమీపానికి రాగానే.. వేగంగా ఎదురుగా వచ్చిన గుర్తు తెలియని లారీ ఢీకొంది. ఇద్దరిపై నుంచి లారీ వెళ్లడంతో వారు అక్కడికక్కడే మృతి చెందారు. మృతదేహాలు రోడ్డుపై చెల్లాచెదురుగా పడ్డాయి. ఓబులవారిపల్లిలోని ఆస్పత్రిలో ఆదివారం ఉదయం మృతదేహాలకు పోస్టు మార్టం నిర్వహించారు. అనంతరం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. అందరితో కలిసి మె లిసి మంచి వాడు అన్న పేరు ఉన్న సాయికృష్ణ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నా యి. బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా రోదించారు. మృతదేహాలను సర్పంచ్ ఎన్పీ జయపాల్రెడ్డి సందర్శించి నివాళులు అర్పించారు. బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. రైల్వేకోడూరు రోడ్డు ప్రమాద మృతులకు ఘన నివాళి రెండు నెలల్లో వివాహం.. అంతలోనే మృత్యు ఒడికి మరణంలోనూ ఒక్కటై.. శోక సముద్రంలో కుటుంబ సభ్యులు, బంధుమిత్రులు -
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట : ఆంధ్రా భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్టలోని శ్రీ కోదండరామస్వామి ఆలయంలో పౌర్ణమి పర్వదినాన్ని పురస్కరించుకొని శ్రీ సీతారాముల కల్యాణోత్సవం ఆదివారం అత్యంత వైభవంగా జరిగింది. ఆలయ ప్రాంగణంలో ప్రత్యేక వేదికపై సీతారాముల ఉత్సవ మూర్తులను కొలువుదీర్చి బంగారు ఆభరణాలు, వర్ణమైన పుష్పమాలతో అలంకరించారు. ముందుగా అర్చకులు విశ్వసేన పూజ, కలశ ప్రతిష్ట, కలశపూజ, వాసుదేవ పుణ్యాహ వచనం, కుంకుమపూజ, యజ్ఞోపవీత ధారణ, మధుపర్కం పట్టు వస్త్ర సమర్పణ, కన్యాదానం, మాంగల్యపూజ, మాంగల్యధారణ, అక్షతరూపణ, మాలమార్పిడి, వారణమయి మహానివేదనం, కర్పూర హారతి కార్యక్రమాలు నిర్వహించారు. ఒంటిమిట్ట సమీప ప్రాంతాల నుంచే కాకుండా జిల్లా నలుమూలల నుంచి భక్తులు విచ్చేసి శ్రీ సీతారాముల కల్యాణోత్సవాన్ని కనులారా వీక్షించారు. భక్తులు స్వామివారిని దర్శించుకొని తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ కార్యక్రమంలో ఆలయ టీటీడీ సూపరింటెండెంట్ హనుమంతయ్య, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్, ఒంటిమిట్ట మండల ప్రత్యేక అధికారి బ్రహ్మయ్య, ఒంటిమిట్ట ఇన్చార్జి ఎంపీపీ లక్ష్మీదేవి దంపతులు, అర్చకులు, టీటీడీ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. -
అన్నమయ్య జలాశయం పరిశీలన
రాజంపేట : అన్నమయ్య జలాశయాన్ని నిపుణుల బృందం ఆదివారం పరిశీలించింది. ప్రధానంగా జలాశయం ప్రస్తుత స్ధితి గతులపై అంచనా వేసింది. ఈ బృందంలో డిజైన్ ఎక్స్ఫర్ట్గా పీపీఏ చీప్ ఇంజనీర్ రమేష్కుమార్, హైడ్రో మెకానికల్ ఎక్స్ఫర్ట్గా రిటైర్డ్ చీప్ ఇంజనీర్ కే.సత్యనారాయణ, జియాలిజిస్టుగా జీఎస్ఐ డైరక్టర్ జనరల్(రిటైర్డ్) ఎం.రాజు, డిజైన్ అప్రూవింగ్ అథారిటి గా సెంట్రల్ డిజైన్ ఆర్గనై జేషన్, డబ్ల్యూఆర్డీ చీఫ్ ఇంజినీర్, హైడ్రాలజీ ఎక్స్ఫర్ట్గా విజయవాడకు చెందిన హైడ్రాలజీ ఛీప్ ఇంజినీర్, కన్వీనర్గా కడప డబ్ల్యూఆడీ చీఫ్ ఇంజినీర్లు ఉన్నారు. ప్రభుత్వం అన్నమయ్య జలాశయం డిజైన్ చేసేందుకు సాంకేతిక నిపుణుల బృందాన్ని పంపించింది. జలాశయం పునర్నిర్మాణానికి సంబంధించి డిజైన్, నిర్మాణం తదితర అంశాలపై టెక్నికల్ అడ్వయిజరీ కమిటీ దృష్టి సారించింది. కార్యక్రమంలో అన్నమయ్య జలాశయం అధికారులు పాల్గొన్నారు. -
కూలిన బతుకులు
రెక్కాడితే డొక్కాడని బతుకులు వారివి..రోజూ కూలిపనికి వెళ్తేనే నాలుగు వేళ్లూ నోట్లోకి వెళతాయి. వారి కుటుంబ జీవనం గడుస్తుంది. అలాంటి వారిపై విధి చిన్నచూపు చూసింది.రోడ్డుప్రమాద రూపంలో తొమ్మిదిమందిని బలి తీసుకుంది. పలువురిని ఆసుపత్రిపాలు చేసింది.వారిని నమ్ముకున్న కుటుంబాలను తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేసింది. ‘ఎంతపని చేశావు దేవుడా’ అంటూ వారు గుండెలవిసేలా రోదించారు. ఇంటి పెద్దదిక్కును కోల్పోయామంటూ కన్నీరుమున్నీరుగా విలపిస్తున్నారు. సాక్షి రాయచోటి/ ఓబులవారిపల్లె/ పుల్లంపేట/ రాజంపేట : రాజంపేట ఇసుకపల్లి గ్రామం నుంచి మామిడికాయలు తీసుకు వెళ్తున్న ఐచర్ వాహనం రెడ్డిపల్లి చెరువు కట్టపై బోల్తా కొట్టడంతో 9 మంది కూలీలు మృతిచెందారు. స్థానికుల కథనం మేరకు శెట్టిగుంట ఎస్టీ కాలనీ గ్రామానికి చెందిన దాదాపు 22 మంది కూలీలు ఆదివారం ఐచర్ వాహనంలో మామిడికాయలు కోతకు రాజంపేట మండలంలోని మందరం వెళ్లారు. సాయంత్రం మామిడికాయలు లోడ్ చేసుకొని తిరుగు ప్రయాణంలో లారీపై ఎక్కి కూర్చున్నారు. లారీ రెడ్డి పల్లి చెరువు కట్ట సమీపానికి రాగానే ఎదురుగా వెళుతున్న వాహనాన్ని అధిగమించబోయి అదుపు చేయలేక బోల్తా పడింది. ఈ ఘటనలో 8 మంది మృతి చెందారు.మరొకరు మార్గమధ్యలో మృతి చెందారు. 13మంది గాయపడ్డారు. బోల్తా పడిన లారీని అతి కష్టం మీద క్రేన్ సాయంతో పోలీసులు పక్కకు తీశారు.గాయపడిన వారిని రాజంపేట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఎన్ వెంకటేశు, జి.పోలమ్మ, పి. రామయ్య, జి.శ్రీనివాసులు, పి.వెంకటేశు, వి.విజయలక్ష్మి, వి.గంగోత్రి ఉన్నారు.వీరికి చికిత్స అందజేస్తున్నట్లు ఆసుపత్రి సూపరింటెంటెంట్ డాక్టర్ పీవీఎన్ రాజు తెలిపారు.మృతుల్లో ఐదుగురు మహిళలు, నలుగురు పురుషులు ఉన్నారు. మృతి చెందిన వారు : గజ్జల దుర్గయ్య, సుబ్బరత్నమ్మ, గజ్జల వెంకటేశు,గజ్జల శీను, చిట్టెమ్మ, గజ్జల లక్ష్మీదేవి,రాధ, గజ్జల రమణ, వెంకట సుబ్బమ్మ. శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం శెట్టిగుంట ఎస్టీ కాలనీలో విషాదం అలుముకుంది. కూలికిపోయీన వారిపై విధి చిన్నచూపు చూడటంతో ఒకేసారి ఇంతమంది చనిపోవడం ఈ ప్రాంతంలో ఇదే ప్రథమం.కూలి కోసం పగలంతా కష్టపడి రాత్రికి ఇంటికి వస్తున్నవారిపై అనుకోని ప్రమాదం ప్రాణాలను తీసింది. ఇందులో 9మంది చనిపోవడంతోపాటు పలువురు గాయపడటంతో కాలనీతోపాటు చుట్టుపక్కల ప్రాంతాల్లో విషాదం అలుముకుంది.పెద్ద ప్రమాదం నుంచి బయటపడ్డ చిన్నారులుఊహించని ప్రమాదంతో కూలీలు అల్లకల్లోలమయ్యారు. ఆదివారం కావడం. అందునా ఇంటి దగ్గర ఉంటే ఆలనాపాలనా ఎవరు చూస్తారో తెలియక తమతో పాటు పిల్లలను వెంట తీసుకెళ్లారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు మామిడి కాయలను లారీలో లోడ్ చేసుకొని వస్తున్న సమయంలో పుల్లంపేట మండలం రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద ప్రమాదం సంభవించింది. లారీపైన కూర్చొని ప్రయాణిస్తున్న వారిలో తొమ్మిది మంది మృత్యువాత పడగా మరో 13 మందికి గాయాలయ్యాయి. అయితే క్యాబిన్ లోపల ఉన్న ఇద్దరు చిన్నారులు గంగోత్రి,చంచిత ప్రమాదం నుంచి స్వల్ప గాయాలతో బయటపడ్డారు. లారీ బోల్తా పడటంతో చిన్నారులు బోరున విలపించారు. పెద్ద ప్రమాదంలో చిన్నారులు బయటపడటం దేవుడి దయేనంటూ పలువురు పేర్కొంటున్నారు. రెడ్డిపల్లె చెరువు కట్ట వద్ద లారీ బోల్తా 9 మంది కూలీల మృతి 13మందికి గాయాలు మృతుల కుటుంబాలకు తీరని శోకం -
మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు
మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని మల్లయ్యకొండకు సోమవారం ప్రత్యేక బస్సు సర్వీసులు నడపనున్నట్టు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఉదయం 5.30 గంటలకు, 6.30 గంటలకు మదనపల్లె డిపో నుంచి బయలుదేరి మల్లయ్యకొండకు చేరుతుందన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి మల్లయ్యకొండకు సాయంత్రం వరకు షటిల్ సర్వీసు నడుస్తుందన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. గంగమ్మా..కాపాడవమ్మా.. లక్కిరెడ్డిపల్లె : గంగమ్మ దేవతా కరుణించి కాపాడు తల్లీ అంటూ అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీ అనంతపురం గంగమ్మ దేవతకు భ క్తులు ఆదివారంప్రత్యేక పూజలు నిర్వహించా రు. అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి రా వ డంతో క్యూ లైన్ల ద్వారా అమ్మవారి దర్శనం కల్పించారు. మొక్కులు ఉన్న భక్తులు అమ్మవారికి బోణాలు సమర్పించి, తలనీలాలు అర్పించారు. హార్సిలీహిల్స్తో ‘కోట’కు అనుబంధం బి.కొత్తకోట : విలక్షణ నటుడు కోట శ్రీనివాసరావుకు మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ తో అనుబంధం ఉంది. సూపర్ స్టార్ కృష్ణ నటించిన ఎన్కౌంటర్ సినిమా షూటింగ్ ఇక్కడ జరగ్గా ఆ సినిమాలో మంత్రి మహాంకాళీ పాత్రలో నటించిన కోట కీలకమైన సన్నివేశాల చిత్రీకరణకు హార్సిలీ హిల్స్ వచ్చారు. కొన్ని రోజులు ఇక్కడ విడిది చేసి షూటింగ్ లో పాల్గొన్నారు. ఆ తర్వాత పోలీస్ రిపోర్ట్ సినిమా షూటింగ్కు వచ్చారు. ఈ షూటింగ్ సందర్భంగా ఆయనతో ఫొటోలు దిగేందుకు ఆసక్తి చూపినవారు మీడియాతో కోట శ్రీనివాసరావు సరదాగా జోకులు వేయడాన్ని గుర్తు చేసుకుంటున్నారు. -
హక్కుల సాధనకు సమష్టి పోరాటం
ఒంటిమిట్ట : హక్కుల సాధనకు సమష్టి పోరాటం చేయాలని నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర గౌరవ అధ్యక్షులు బాబన్ తెలిపారు. ఆదివారం ఒంటిమిట్ట మండలంలోని హరిత కల్యాణ మండపంలో సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు గగ్గుటూరు రాజా, జిల్లా అధ్యక్షులు సుంకేశుల బాషా అధ్యక్షతన నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా రాచపల్లికి చెందిన సుబాన్ ప్రారంభోపన్యాసం చేశారు. అనంతరం నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘ రాష్ట్ర గౌరవ అధ్యక్షులు డాక్టర్ బాబన్ మాట్లాడుతూ చంద్రబాబు నాయుడు 2024 సార్వత్రిక ఎన్నికల ప్రచారంలో భాగంగా విడుదల చేసిన మేనిఫెస్టోలో దూదేకులకు రూ.100 కోట్లతో కూడిన నూర్ బాషా కార్పొరేషన్ ఏర్పాటు, హైకోర్టులో ఉన్న 4.5 శాతం రిజర్వేషన్ ఏర్పాటుకు కృషి చేస్తానని ఇచ్చిన హామీలను అమలు చేయాలని డిమాండ్ చేశారు. దూదేకులు తమ పిల్లల టీసీల్లో ఇండియన్ ఇస్లామ్ పేరుతో సర్టిఫికెట్లు తీసుకోవాలని తెలిపారు. నూర్ బాషా దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర అధ్యక్షులు పీర్ మహమ్మద్ మాట్లాడుతూ దూదేకులు సామాజికంగా, ఆర్థికంగా, రాజకీయంగా ఎదగాలని తెలిపారు. నూర్ బాషా –దూదేకుల సంక్షేమ సంఘం రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు మస్తానమ్మ, దూదేకుల సంఘం నాయకులు ప్రొద్దుటూరుకు చెందిన నాగూర్, కడప బుజ్జి, రిటైర్డ్ ఎంపీఓ కులాయప్ప మాట్లాడారు. అనంతరం జిల్లా యువజన అధ్యక్షులుగా కడప నగరానికి చెందిన నరసింహ కుమార్, ఒంటిమిట్ట మండల అధ్యక్షులు ఇస్మాయిల్, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో రాష్ట్రంలోని అన్నమయ్య, కర్నూలు, నెల్లూరు, ప్రకాశం, తిరుపతి, నంద్యాల, గుంటూరు, విజయవాడ తదితర జిల్లాలకు చెందిన దూదేకుల సంక్షేమ సంఘం నాయకులు, కడప జిల్లాకు చెందిన సంఘం నాయకులు, రిటైర్డ్ ఎస్ఐ కుళాయప్ప, రిటైర్డ్ ప్రిన్సిపాల్ మస్తాన్, రాచపల్లి మాజీ సర్పంచ్ సుబ్బరాయుడు, పగడాల దస్తగిరి, గగ్గుటూరి మౌలాలి, మస్తాన్, బాబయ్యతోపాటు వందలాది మంది సభ్యులు పాల్గొన్నారు. -
రైలులో నుంచి పడి వృద్ధుడికి గాయాలు
మదనపల్లె రూరల్ : రైలులో నుంచి ప్రమాదవశాత్తు పడి వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. కర్ణాటకలోని కోలారుజిల్లా బాగేపల్లె తాలూకా బోపనపల్లె క్రాస్ కాలనీకి చెందిన చిన్నవెంకటనరసప్ప కుమారుడు టి.కదిరప్ప (65) నెలరోజుల క్రితం ఇంటి నుంచి వచ్చేసి భిక్షాటన చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి తిరుపతి నుంచి గుంతకల్లు వెళ్లే ప్యాసింజర్ రైలులో ప్రయాణిస్తుండగా, బాత్రూమ్ వెళ్లేందుకు ప్రయత్నిస్తూ.. రైలు డోరు వైపు వెళ్లడంతో కురబలకోట బ్రిడ్జి వద్ద జారి కిందకు పడ్డాడు. ప్రమాదంలో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. సమాచారం అందుకున్న రైల్వేహెడ్కానిస్టేబుల్ మహబూబ్బాషా నిందితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సలు అందిస్తున్నారు. కేసు విచారణ చేస్తున్నట్లు తెలిపారు. కడప పాఠశాలకు రాష్ట్ర స్థాయి గుర్తింపుకడప ఎడ్యుకేషన్ : కడప నగర పాలక సంస్థ పరిధిలోని సాయిపేట 8వ వార్డు ఆదర్శ ప్రాథమిక పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించింది. ఈ నెల 10వ తేదీన నిర్వహించిన మెగా పేరెంట్స్ టీచర్స్ (మెగా పీటీఎం 2.0) సమావేశంలో విద్యార్థులు, తల్లిదండ్రులకు సంబంధించిన ఫొటో ఫ్రేమ్ రూపకల్పనలో పాఠశాల ఉపాధ్యాయులు రూపొందించిన చిత్రానికి రాష్ట్రస్థాయిలో అగ్రస్థానం లభించింది. దీనికి సంబంధించి సమగ్ర శిక్ష అభియాన్ రాష్ట్ర పోర్టల్లో ముఖచిత్రంగా ఏర్పాటు చేశారు. దీంతోపాటు రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పాఠశాల ఫొటో చిత్రాన్ని తన స్టేటస్తోపాటు సామాజిక మాధ్యమాల్లో ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశారు. ఈ సందర్భంగా జిల్లాకు చెందిన పాఠశాలకు రాష్ట్ర స్థాయిలో ప్రత్యేక గుర్తింపు లభించడం పట్ల జిల్లా విద్యాశాఖ అధికారులు, సమగ్ర శిక్ష అభియాన్ అధికారులు హర్షం వ్యక్తం చేశారు. పాఠశాల ప్రధానోపాధ్యాయులు దాది నాగరాజుతోపాటు ఉపాధ్యాయ బృందానికి అభినందనలు తెలిపారు. రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికకడప వైఎస్ఆర్ సర్కిల్ : జిల్లా స్థాయి బ్యాడ్మింటన్ ఎంపికల్లో కడప జిల్లాకు చెందిన పూర్వజ రెడ్డి అండర్–15, 17 విభాగాలలో సింగిల్స్ విజేతగా నిలిచి సత్తాను చాటినట్లు జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ సభ్యులు జిలానీబాషా తెలిపారు. ఆదివారం నగరంలోని డీఎస్సీ ఇండోర్ స్టేడియంలో జిల్లా స్థాయి సబ్ జూనియర్ బ్యాడ్మింటన్ ఎంపికలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అండర్–15 బాలుర విభాగంలో ప్రొద్దుటూరుకు చెందిన క్రీడాకారులు రాణించి మొత్తం జిల్లా జట్టులోని స్థానాలను కై వసం చేసుకున్నారన్నారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 15 మంది క్రీడాకారులు ఇందులో పాల్గొన్నారన్నారు. అండర్–15, 17 విభాగాలలో జరిగిన ఈ ఎంపికలో బాలబాలికలకు విడివిడిగా సింగిల్స్, డబుల్స్లో పోటీలను నిర్వహించి జిల్లా జట్టును ఎంపిక చేశారు. ఎంపికై న క్రీడాకారులకు జిల్లా అసోసియేషన్ సభ్యులు గంగాధర్, నాగరాజు డాక్టర్ ప్రతాప్ రెడ్డి, విశ్వనాథరెడ్డి జ్ఞాపికలను అందజేశారు. పోటీలకు ఎంపికై న క్రీడాకారులు వీరే.. అండర్ 15 బాలురు జట్టు – డి.ఈశ్వర్ ప్రసాద్రెడ్డి, చంద్రకిషోర్, ిపీబీజీ వర్షిత్ (ప్రొద్దుటూరు). అండర్ 15 బాలికల జట్టు – ఎల్.పూర్వజరెడ్డి, బి.హరిణి, రితిక, కావ్య (కడప). అండర్ 17 బాలుర జట్టు – వేద వ్యాస్ వర్మ, ఎల్ సుప్రీత్రెడ్డి (కడప) సి.విశ్వతేజ (ప్రొద్దుటూరు). అండర్ 17 బాలికల జట్టు–రమ్యశ్రీ (ప్రొద్దుటూరు) ఎల్.పూర్వజ, కావ్య, రితిక (కడప). -
16న కౌన్సెలింగ్
మదనపల్లె : వైఎస్సార్ కడప, అన్నమయ్యజిల్లాల్లోని 24 అంబేడ్కర్ గురుకుల, విద్యాలయాల్లో 6, 7, 8, 9 తరగతుల ప్రవేశానికి ప్రవేశ పరీక్ష రాసి సీట్లు లభించని విద్యార్థులకు ఈనెల 16న కౌన్సెలింగ్ నిర్వహిస్తున్నట్టు అంబేడ్కర్ గురుకుల విద్యాలయాల సమన్వయకర్త ఎ.ఉదయశ్రీ శనివారం తెలిపారు. కడప చిన్నచౌక్లోని గురుకుల వి ద్యాలయంలో వచ్చే బుధవారం విద్యార్థులు కౌ న్సెలింగ్కు హజరై సీట్లు పొందొచ్చని తెలిపారు. ఆలయాలకు ధర్మకర్తల నియామకానికి దరఖాస్తులు మదనపల్లె : జిల్లాలోని ప్రముఖ ఆలయాలకు ధర్మకర్తల మండలి నియామకం కోసం ప్రభుత్వం నోటిఫికేషన్ జారీ చేసింది. ఈ మేరకు అర్హత కలిగిన వారు 20 రోజుల్లోపు దరఖాస్తులు చేసుకోవాల్సి ఉంటుందని జిల్లా దేవాదాయ అధికారి విశ్వనాథ్ శనివారం తెలిపారు. జిల్లాలోని మదనపల్లె మండలం బసినికొండకు చెందిన కనుమలో గంగమ్మ, నిమ్మనపల్లె మండలం తవళంలోని నేలమల్లేశ్వరస్వామి ఆలయం, పీలేరు మండలం దొడ్డిపల్లెకి చెందిన చెన్నకేశవస్వామి ఆలయం, పీలేరుకు చెందిన రౌద్రాల అంకాలమ్మ ఆలయం, రాజంపేట మండలం హత్యారాల గ్రామంలోని కామాక్షి ప్రతేశ్వరస్వామి ఆలయం, రైల్వేకోడూరులోని భుజంగేశ్వర స్వామి ఆలయం, కురబలకోట మండలం తెట్టులోని సంతాన వేణుగోపాలస్వామి ఆలయంకు దర్మకర్తల మండలిని నియమిస్తారు. దీనికోసం అసక్తి కలిగి, అర్హులైన వారు ఈనెల 29లోపు సెక్షన్ 17 (3) ప్రకారం సూచించిన ప్రొఫార్మాలో దరఖాస్తులను జిల్లా దేవదాయశాఖ అధికారికి పంపాలని విశ్వనాథ్ కోరారు. ధర్మవరం నుంచి చర్లపల్లికి వీక్లీ స్పెషల్ ట్రైన్ కలికిరి : ప్రయాణికుల రద్దీ దృష్ట్యా ఽచర్లపల్లి నుంచి ధర్మవరం వరకు వీక్లీ స్పెషల్ రైలును ఈ నెల 13వ తేదీ నుంచి ఆగస్టు 25 వరకు తిరగనుంది. ప్రతి ఆదివారం చర్లపల్లిలో రాత్రి 7.55 గంటలకు బయలుదేరే ఈ స్పెషల్ రైలు పగిడిపల్లి, నల్గొండ, మిర్యాలగూడ, నడికుడి జంక్షన్, సత్తెనపల్లి, గుంటూరు, తెనాలి, బాపట్ల, ఒంగోలు, నె ల్లూరు, గూడూరు, తిరుపతి మీదుగా పాకాలకు మరుసటి రోజు ఉదయం 10.05 గంటలకు, పీలేరుకు 10.45 గంటలకు, కలికిరికి 11.05 గంటలకు, మదనపల్లె రోడ్కు 11.30 గంటలకు, కదిరికి మధ్యాహ్నం 12.35 గంటలకు, ధర్మవరానికి 3 గంటలకు చేరుకుంటుంది. తిరిగి సోమవారం 4.30 గంటలకు ధర్మవరంలో బయలుదేరి కలికిరి 7 గంటలకు, పాకాలకు 8 గంటలకు, తిరుపతికి రాత్రి 9 గంటలకు మరుసటి రోజు మంగళవారం ఉదయం 11 గంటలకు చర్లపల్లి స్టేషన్కు చేరుకుంటుంది. ఈ నెల 13, 20, 27, ఆగస్టు 3, 10, 17, 24 తేదీల్లో చర్లపల్లిలోనూ, ఈ నెల 14, 21, 28, ఆగస్టు 4, 11, 18, 25 తేదీల్లో ధర్మవరంలోనూ ఈ రైలు బయల్దేరుతుంది. ఉప్పల హారికపై దాడి హేయమైన చర్య రాయచోటి : రాష్ట్రంలో కూటమి పాలకులు మహిళలపై దాడులు చేయడం వారి నిరంకుశత్వ పాలనకు అద్దం పడుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగం జనరల్ సెక్రటరీ మహిత అన్నారు. శనివారం ఆమె మాట్లాడుతూ కృష్ణాజిల్లా గుడివాడలో జిల్లా పరిషత్ చైర్మన్ ఉప్పల హారిక పై టీడీపీ గూండాలు దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన సంఘటనపై ప్రభుత్వం సిగ్గుతో తలదించుకోవాలన్నారు. కూ టమి పాలనలో రాష్ట్రంలో మహిళలకు రక్షణ కరువైందన్నారు.ఓ ప్రజా ప్రతినిధిగా ఉన్న మహిళను నోటితో చెప్పలేని విధంగా అసభ్య పదజాలంతో దూషించడం దుర్మార్గమన్నారు. మహిళా హోం మంత్రి ఉన్న రాష్ట్రంలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది. ఈ ప్రభత్వానికి రానున్న రోజుల్లో ప్రజలు బుద్ధి చెబుతారని పేర్కొన్నారు. -
ధర్మప్రచారంలో అధర్మం !
రాజంపేట : తిరుమల తిరుపతిదేవస్ధానం ధర్మప్రచారపరిషత్(డీపీపీ) ధార్మిక ప్రచారం కోసం కృషిచేయాలి. అయితే ఇటీవల ఈ వ్యవస్థ సక్రమంగా పనిచేయడంలేదని విమర్శలు ఉన్నాయి. పర్యవేక్షణ డొల్లగా ఉందనే భావన ఉంది. ధర్మప్రచారపరిషత్ ముసుగులో ఆదాయ వనరులను అన్వేషించుకుంటున్నారు. పరోక్షంగా శ్రీవారి సొమ్ముకు ఎసరు పెడుతున్నారనే అపవాదును మూటకట్టుకుంది. డీపీపీ లక్ష్యం నీరుగారుతోందన్న విమర్శలున్నాయి. హిందూధర్మాని విస్తృతంగా ప్రచారం చేయాల్సిన డీపీపీ పక్కదారిలో నడుస్తోందన్న అపవాదు ఉంది. ఇదే అంశం ఇప్పుడు ఆధ్యాత్మికవేత్తలలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ ఆధీనంలో.. జిల్లాలో టీటీడీ ఆధీనంలో ఉన్న ఒంటిమిట్ట, నందలూరు, తాళ్లపాకతోపాటు ఇతర ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ధార్మిక కార్యక్రమాలు, భజనలు లాంటివి ధర్మప్రచారపరిషత్ కనుసన్నల్లో జరుగుతన్న సంగతి తెలిసిందే. అయితే ఈ కార్యక్రమాల గురించి పెద్దగా ప్రచారం ఉండదు. ఇందులో భక్తులతో పాటు స్ధానిక కళాకారులు కూడా పాల్గొనే పరిస్థితులు ఉండవన్న వాదన వినిపిస్తోంది. ఉదాహరణకు నందలూరులోని సౌమ్యనాథాలయం, తాళ్లపాక శ్రీ సిద్దేశ్వర ఆలయం, శ్రీ చెన్నకేశవ ఆలయాల్లో వార్షిక బ్రహ్మోత్సవాలు జరుగుతున్నాయి. ఇక్కడి కార్యక్రమాలు ధర్మప్రచారపరిషత్ నేతృత్వంలో జరుగుతున్నాయి. ధార్మిక ఉపన్యాసాలు, కోలాటలు, చెక్కభజనలు తదితర అధ్యాత్మిక కార్యక్రమాలు ఏర్పాటుచేశారు.ఇందులో జిల్లాకు సంబంధించి కళాకారులు, భాగవతులకు అవకాశం ఇవ్వకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. సంబంధిత అధికారి కార్యక్రమాలల్లో కనిపించరు. అంతా తిరుపతి నుంచి నడిపిస్తుంటారు.ఽ ఒంటిమిట్టలో జరిగే కార్యక్రమానికి గుండుసూది ప్యాకెట్ తిరుపతి నుంచి తెచ్చినట్లుగా బిల్లులు పెట్టుకోవడం గమనార్హం. ధర్మప్రచారపరిషత్ కార్యక్రమాల్లో నిర్వహణ లోపాయికారిగా జరుగుతోందని, ఉన్నవారితోనే సైక్లింగ్ చేస్తూ, కొత్తవారు, స్థానికులను తీసుకోవడంలేదనే విమర్శలున్నాయి. ● లక్షలాది రూపాయల జీతాలు తీసుకొనే ప్రభుత్వ ఉద్యోగులతో లోపాయికారి ఒప్పందాలు చేసుకొని కొనసాగిస్తున్నారు. జిల్లాలో ధార్మిక జీవనం చేస్తున్న వారిని ధర్మప్రచారపరిషత్ తీసుకోకపోవడం అనుమానాలకు తావిస్తోంది. ఒకే వ్యక్తి మూడుచోట్ల ధార్మికపనోస్యాలు చేస్తున్నారు. గత రెండేళ్లుగా కొంతమందిని ధర్మప్రచారపరిషత్ పెట్టుకొని నడిపిస్తోంది. రెండేళ్లలో రికార్డులు పరిశీలిస్తే అసలు విషయం వెలుగులోకి వస్తుంది. స్ధానికేతరులతో.. జిల్లాలో ప్రముఖ ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు స్థానికేతర కళాకారులను తీసుకొచ్చి ధార్మిక కార్యక్రమాలను నిర్వహిస్తున్నారని, దీని వెనుక ఆంతర్యం ఏమిటో తెలియడంలేదని స్థానిక కళాకారులు వాపోతున్నారు. తమకు అవకాశం ఇవ్వాలని జిల్లాకు చెందిన భాగవతులు, కళాకారులు డీపీపీ అధికారులను కోరినా తిరుపతికి జిల్లాకు చెందిన ప్యానల్ సభ్యులు ఉన్నారని చెప్పారని కొందరు పెదవి విరుస్తున్నారు. తిరుపతితోపాటు ఇతర ప్రాంతాల నుంచి లోపాయికారి ఒప్పందాలతో జిల్లాలోని ఆలయాల్లో జరిగే ఉత్సవాలకు స్థానికేతరులను తీసుకొస్తున్నారు. ఇదంతా ఒక పక్కా ప్లాన్ జరుగుతుంటోంది. కొరవడిన పర్యవేక్షణ ధర్మప్రచారపరిషత్ నిర్వహణకు సంబంధించి సరైన పర్యవేక్షణ లేకపోవడంవల్లే శ్రీవారి సొమ్ము పక్క దోవ పడుతోందని, కొందరి ఉద్యోగుల జేబుల్లోకి వెళుతోందని ఆరోపణలు వెలువడుతున్నాయి.టీటీడీ విజిలెన్స్ విభాగం రెండేళ్ల రికార్డులు పరిశీలిస్తే అసలు వ్యవహారం వెలుగులోకి వస్తుందని అధ్యాత్మికవేత్తలు, స్థానిక కళాకారులు చెబుతున్నారు. ● ధర్మప్రచారపరిషత్ కార్యక్రమాలను స్థానికంగా ప్రచారం చేసేందుకు కరపత్రాలు ముద్రించి , గ్రామాల్లో పంపిణీ చేయాలి. ఽప్రతి ఆలయాల్లో జరిగే ఉత్సవాలు, ధార్మికోపన్యాసాలు, అధ్మాతిక ప్రవచనాలు, భజనలకు గురించి ప్రచారం కొరవడింది. కరపత్రాలను ముద్రించి ప్రచారం చేసినట్లుగా లెక్కలు చూపుతుండటం గమనార్హం. ప్రోగ్రాం అసిస్టెంట్ ఎమంటున్నారంటే.. ధర్మ ప్రచారపరిషత్ కార్యక్రమాల్లో స్థానిక కళాకారులకు అవకాశం కల్పిస్తున్నామని డీపీపీ కడప, అన్నమయ్య జిల్లాల ప్రొగ్రాం అసిస్టెంట్ గోపిబాబు తెలిపారు. డీపీపీ తనదైన రీతిలో కార్యక్రమాలు చేసుకుంటూ పోతోందని, వస్తున్న ఆరోపణలు అవాస్తమని పేర్కొన్నారు. స్థానికంగా చాలామంది కళాకారులను అడిగామని, వారు రాకపోవడానికి అనేక కారణాలు చెప్పారని వివరించారు. రంగంలోకి స్థానికేతర కళాకారులు లోపాయికారి ఒప్పందాలతో ప్రోగ్రాంల నిర్వహణ నీరుగాతున్న డీపీపీ లక్ష్యం -
●కూటమిపై తీరుపై అనుమానాలు
మదనపల్లె : చరిత్రాత్మక మదనపల్లె బీసెంట్ థియోసాఫికల్ కళాశాలను తన్నుకుపోయేందుకు టీడీపీ గద్దలు వాలుతున్నాయి. తిమ్మిని బమ్మిని చేసైనా కళాశాలను దక్కించుకుని అందులో ప్రైవేటు సామ్రాజ్యం నెలకొల్పే ప్రయత్నాలు సాగుతున్నట్టు తెలుస్తుండగా, ఈ విషయంపై టీడీపీ వర్గాల్లో ప్రచారం సాగుతోంది. దీనికి తగ్గట్టు తాజా పరిస్థితులు గందరగోళంగా ఉండగా, ఈ ప్రచార నేపథ్యంలో బీటీ కళాశాలను తిరిగి ఎయిడెడ్ కళాశాలగా మారుస్తారా లేక ప్రభుత్వ నిర్వహణలో అభివృద్ధి చేస్తారా అని విద్యార్థి సంఘాలు అనుమానాలు వ్యక్తం చేస్తున్నాయి. దీనిపై స్పష్టత లేనప్పటికి కళాశాల ప్రైవేటు చేతుల్లోకి వెళ్లిపోతుందా అన్న ఆందోళన సర్వత్రా నెలకొంది. మిథున్రెడ్డితో న్యాయం వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో బీటీ కళాశాలకు పూర్వ వైభవం తీసుకురావాలని నిర్ణయించింది. విద్యార్థి సంఘాల ఆందోళనలకు స్పందించిన రాజంపేట ఎంపీ మిథున్రెడ్డి కళాశాల చారిత్రిక నేపథ్యం, అభివృద్ధి చేయాల్సిన ఆవశ్యకతను గుర్తించి కళాశాల ప్రభుత్వపరం అయ్యేలా కృషి చేయగా ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయ్యింది. అప్పటినుంచి బిసెంట్ సెంటినరీ ట్రస్టు (బీసీటీ) పరిధిలోని డిగ్రీ కళాశాల ప్రభుత్వ కళాశాలగా మారిపోయింది. దీంతో కళాశాల అభివృద్ధికి వివిధ చర్యలు చేపట్టింది. టీచింగ్, నాన్ టీచింగ్ సిబ్బంది నియామకం చేపట్టడమే కాక ఎంపీ మిథున్రెడ్డి కృషితో బీటీ కళాశాలను అనిబిసెంట్ విశ్వవిద్యాలయంగా మారుస్తూ ఉత్తర్వు జారీ చేసింది. ఇలా కళాశాల అభ్యున్నతికి, భవిష్యత్ ప్రణాళికలను వైఎస్సార్సీపీ ప్రభుత్వం కృషి చేసింది. లీజు పేరిట టీడీపీ కన్ను కళాశాల అభివృద్ధిని ఏ మాత్రం పట్టించుకోని కూటమి ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేస్తోంది. దీన్ని ఆసరాగా చేసుకుని ఈ కళాశాల యాజమాన్యానికి చెందిన టీడీపీ వ్యక్తి ఒకరు, అక్కడే పని చేస్తున్న మరో టీడీపీ వర్గీయుడు ఈ కళాశాలను దక్కించుకునే యత్నాలు ముమ్మరం చేసినట్టు విద్యా వర్గాల్లో ప్రచారం సాగుతోంది. ముందుగా బీసీటీ సభ్యులైతే దీనిని చేజిక్కించుకోవడం సులువని భావించి చైన్నెలో ఉంటున్న కొందరు సభ్యులతో సఖ్యతగా ఉంటూ అందులో సభ్యత్వం తీసుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఇదే విషయాన్ని ఆ ఇద్దరిలో ఒకరు తాము బీసీటీలో సభ్యులమయ్యామంటూ ప్రచారం చేసుకుంటున్నారని పలువురు చెప్పారు. ఈ కళాశాలను 99 ఏళ్ల లీజు పేరిట దక్కించుకుని అందులో కోట్ల విలువైన భూములు, కోట్ల విలువైన ఆస్తులను తమ ఆధీనంలోకి తీసుకుని విద్యా సంస్థలను అందులో ప్రారంభించాలన్న ఆలోచనతో ఉన్నట్టు ప్రచారం జరుగుతోంది. కళాశాల నిర్వహణలో అనుభవం కలిగిన ఆ వ్యక్తులు మదనపల్లె పట్టణ నడిబొడ్డున వందల కోట్ల విలువైన బీసీటి ఆస్తులు, కళాశాలను ఎలాగైనా దక్కించుకునే ప్రయత్నాల్లో ఉన్నట్టు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పట్టించుకోని ట్రస్టు బీటీ కళాశాల స్థితి గుతులు, అభివృద్ధి, చేపట్టాల్సిన చర్యలపై ట్రస్టు సభ్యులు పట్టించుకోవడం లేదు. ఇక్కడ పర్యటించి ఏమి జరుగుతోందో పరిశీలించి నిర్ణయాలు తీసుకుంటారు. సభ్యులుగా ప్రభుత్వ స్థాయిలో ఉద్యోగ విరమణ చేసిన ఉన్నతస్థాయి వ్యక్తులు ఉన్నారు. వీరు పట్టించుకుంటే కళాశాల పరిస్థితుల్లో మార్పు వస్తుంది. అయితే ఆశాజనకమైన వాతావరణం కనిపించడం లేదు. ఈ పరిస్థితుల్లో ట్రస్టు ద్వారా ఆస్తులు, కళాశాలను లీజు పేరిట దక్కించుకునేందుకు ప్రయత్నాలు సాగుతున్నట్టు చెబుతున్నారు. స్పందించని కార్యదర్శి బీసెంట్ సెంటినరీ ట్రస్టులో ఇద్దరు టీడీపీ వర్గీయులకు సభ్యులుగా అవకాశం కల్పించారన్న ప్రచారంపై ట్రస్టు కార్యదర్శి సుధాకర్ దృష్టికి తీసుకెళ్లేందుకు పలుమార్లు ప్రయత్నించగా ఆయన స్పందించలేదు. అలాగే ట్రస్టు సభ్యులైనట్టు ప్రచారం జరుగుతున్న వారిలో ఒకరి వివరణ కోసం ఫోన్లో ప్రయత్నించగా అందుబాటులోకి రాలేదు. బీసీటీలో సభ్యులుగా ఇద్దరు టీడీపీ వర్గీయులు చేరారని ప్రచారం 99 ఏళ్ల లీజు పేరిట వందల కోట్ల విలువైన ఆస్తులు దక్కించుకునేందుకు యత్నాలు? కళాశాల వ్యవహారాలపై దృష్టి పెట్టని ట్రస్టు సభ్యులు గాలికి వదిలేసిన కూటమి ప్రభుత్వం కళాశాల అభివృద్ధి విషయంలో కూటమి ప్రభుత్వం చూపిస్తున్న నిర్లక్ష్యం అనుమానాలకు ఊతమిస్తోంది. ఏడాది దాటినా కళాశాల స్థితగుతులపై పట్టించుకోకపోవడంతో తెర వెనుక టీడీపీ వర్గీయులకు కట్టబెట్టే వ్యూహం ఉందన్న అనుమానాలు బలపడుతున్నాయి. డిగ్రీ కళాశాల ప్రభుత్వం ఆధీనంలోకి వచ్చాక ఇక్కడి విద్యార్థుల సంఖ్య, ప్రస్తుత విద్యార్థుల సంఖ్య చూస్తేనే కూటమి ప్రభుత్వం ఎంతటి నిర్లక్ష్యం ప్రదర్శిస్తోందో స్పష్టం అవుతుంది. -
ప్రశ్నార్థకంగా హైవే కనెక్టివిటీ!
రాజంపేట : శేషాచలం అటవీ ప్రాంతంలో పచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం సాగించే గ్రీన్హైవే( కడప–రేణిగుంట నేషనల్ హైవే నుంచి అప్రోచ్రోడ్స్ నిర్మితం) ప్రశ్నార్థకంగా మారింది. తాజాగా కేంద్ర ప్రభుత్వం నుంచి హైవే నిర్మాణానికి అడ్డంకిగా ఉన్న వైల్డ్లైఫ్ అనుమతులు రావడంతో త్వరలోనే నిర్మాణ పనులు జరుగుతాయని భావిస్తున్నారు. రూ.4వేల కోట్ల వ్యయంతో రాయలసీమ జిల్లాలకు ముఖ్య రహదారిగా ప్రాచుర్యం పొందిన రహదారి అందుబాటులో తీసుకురావాలని కేంద్రం యోచిస్తోంది. ప్రధాన పుణ్య క్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరు, తాళ్లపాకకు కనెక్టివిటీ అప్రోచ్రోడ్స్పై క్లారిటీ రాలేదన్న ఆందోళన ఇక్కడి ప్రాంతీయుల్లో నెలకొంది. ఒంటిమిట్ట, నందలూరుకు వెళ్లేదెలా.. కడప–రేణిగుంట నేషనల్ హైవేలో సుప్రసిద్ధ పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్ట, నందలూరుకు యాత్రికులు, భక్తులు, పర్యాటకులు వెళ్లేదేలా అన్న సందేహాలు పుట్టుకొచ్చాయి. రాష్ట్ర అధికారిక రామాలయం ఒంటిమిట్టలో ఉంది. అలాగే దక్షిణ భారతదేశంలో ప్రసిద్ధి చెందిన వైష్ణవ ఆలయం సౌమ్యనాథాలయం నందలూరులో ఉంది. ఈ రెండు కేంద్రాలకు ప్రత్యేకంగా సర్వీసు రోడ్డును తీసుకురావాలని, అవసరమైతే భూసేకరణ చేసైనా నిర్మించాలనే డిమాండ్ తెరపైకి వచ్చింది. ఈ విషయంలో నందలూరు, ఒంటిమిట్ట వాసులు ఆందోళన చేయడానికి సన్నద్ధమవుతున్నారు. ● మేజర్ పంచాయతీ కేంద్రమైన నాగిరెడ్డిపల్లె శివార్లలో నుంచి నిర్మితం కానున్న కడప–రేణిగుంట హైవే నుంచి నందలూరు బస్టాండు కేంద్రానికి కనెక్టివిటీని కోరుతున్నారు. ● ఒంటిమిట్టకు రాములోరి కల్యాణ మండపం సమీపం నుంచి ఇస్తే పుణ్యక్షేత్రాల సందర్శనకు అనుకూలంగా ఉంటుందని యాత్రికులు కోరుతున్నారు. ● ఒంటిమిట్ట, నందలూరు మండల కేంద్రాలకు సంబంధం లేని ఏరియాలో సుదూర ప్రాంతంలో అప్రోచ్రోడ్డు ఇవ్వడం వల్ల ఉపయోగం లేదని పేర్కొంటున్నారు. ● అలాగే పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాక–నందలూరు కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది. దక్షిణ భారతీయులకు.. మహారాష్ట్ర, ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, కర్ణాటక, తెలంగాణ రాష్ట్రాల నుంచి నిత్యం వేలాదిమంది ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన తిరుపతి, చైన్నె నగరాలకు వెళ్లే వారు ఈ హైవేలో అధికంగా పయనిస్తారు. అలాంటి పరిస్థితుల్లో ఒంటిమిట్ట, నందలూరుకు నేరుగా కనెక్టివిటీ లేకపోవడం అసౌకర్యం కలిగిస్తుంది. ప్రస్తుతం ఉన్న రోడ్డు సర్వీసు (కడప–రేణిగుంట పాతరోడ్డు) రోడ్డుగా మారుతుంది. ఈ దారిలో దూరప్రాంతాలకు చెందిన హైవేలోనే తిరుపతి, చైన్నె తదితర ప్రాంతాలకు వెళ్లనున్నారు. పైగా త్వరితగతిన గమ్యానికి చేరుకునే వీలు కలుగుతుంది. హైవేలో పయనించనున్నారు. ఎంపీల దృష్టికి పుణ్యక్షేత్రాల కనెక్టివిటీ.. జిల్లాలో ప్రసిద్ధి చెందిన పుణ్యక్షేత్రాలైన నందలూరు, ఒంటిమిట్ట కేంద్రాలకు ఎన్హెచ్ నుంచి కనెక్టివిటీ రోడ్ (సర్వీసురోడ్డు) అవసరమని రాజంపేట లోక్సభ సభ్యుడు పీవీ మిథున్రెడ్డి, రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నాలు జరుగుతున్నాయి. వివిధ ప్రాంతాల నుంచి తిరుపతికి వెళ్లే యాత్రికులు ఒంటిమిట్ట రామయ్య, సౌమ్యనాథుని దర్శించుకోవడం ఇటీవల అధికమైంది. అంతేగాకుండా రాయలసీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలున్నాయి. పర్యాటకపరంగా ప్రాచుర్యం పొందిన ఒంటిమిట్ట, నందలూరుకు ఎన్హెచ్ నుంచి ప్రత్యేకంగా సర్వీసురోడ్డు నిర్మితం చేయించేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఒంటిమిట్ట, నందలూరుకు నేరుగా అనుసంధానం కోసం డిమాండ్ సౌమ్యనాథాలయం, ఒంటిమిట్ట, తాళ్లపాకలను గుర్తించాలి అప్రోచ్రోడ్డు వల్ల యాత్రికుల రాకపోలకు సౌకర్యంహైవే నుంచి ఒంటిమిట్టలోకి కనెక్టివిటీ రోడ్డు వేయాలి త్వరలో నిర్మితం కానున్న గ్రీన్హైవే( కడప–రేణిగుంట నేషనల్హైవే) నుంచి పుణ్యక్షేత్రాలైన ఒంటిమిట్టకు సర్వీసురోడ్డు నిర్మితం చేయాలి. ఇప్పటి వరకు ఆ ప్రతిపాదనలు లేవన్న ఆందోళన ఒంటిమిట్ట ప్రాంతీయులను కలచి వేస్తోంది. ఎక్కడో అటవీ ప్రాంతంలో అప్రోచ్రోడ్డు నిర్మితం చేయడం వల్ల ఉపయోగంలేదు. రామయ్య కోవెలకు అనుకూలంగా అప్రోచ్రోడ్డు నిర్మించాల్సిన అవసరం ఉంది. – ఇరగంరెడ్డి సుబ్బారెడ్డి, జెడ్పీ మాజీ వైస్చైర్మన్, ఒంటిమిట్టనందలూరుకు నేరుగా కనెక్టివిటీ అవసరం పుణ్యక్షేత్రాలుగా భాసిల్లుతున్న ఒంటిమిట్ట, నందలూరుకు త్వరలో నిర్మితం కానున్న గ్రీన్హైవే నుంచి నేరుగా కనెక్టివిటీ అవసరం ఉంది. అప్రోచ్రోడ్డు లింక్ నాగిరెడ్డిపల్లె నుంచి నందలూరు బస్టాండుకు ఉండాలి. ఎక్కడో మండలానికి దూరంగా కనెక్టివిటీ అక్కర్లేదు. అన్ని రాష్ట్రాల నుంచి భక్తుల సంఖ్య పెరిగింది. సౌమ్యనాథాలయం, సీమలో తొలిసారిగా బయల్పడిన బౌద్ధారామాలు, సమీపంలోని అన్నమయ్య జన్మస్థలి తాళ్లపాక ఉన్నాయనే నేషనల్ హైవే అధికారులు గుర్తించాలి. –మేడా విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ, నందలూరు -
తాళ్లపాకను సందర్శించిన టీటీడీ అధికారులు
తాళ్లపాక(రాజంపేట) : పదకవితాపితామహుడు అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకను టీటీడీ అధికారులు శనివారం సందర్శించారు. తాళ్లపాకను అభివృద్ధి చేసేందుకు కార్యాచరణ ప్రణాళికను రూపొందించడానికి ముందుగా టీటీడీ అధికారులు విలేజ్ విజిట్ నిర్వహించారు.టీటీడీ ఇంజినీరింగ్ ఎస్ఈ మనోహర్, డిప్యూటీ ఎగ్జిక్యూటివ్ ఇంజినీరు నాగరాజు,నీటిపారుదలశాఖ ఎస్ఈ వెంకట్రామయ్యతో పాటు ఆర్అండ్బీ, పంచాయతీరాజ్కు చెందిన అధికారులు ఉన్నారు. కాగా ఈనెల7న టీటీడీ ఈవో శ్యామలరావును, బోర్డు సభ్యుడు భానుప్రకాశ్రెడ్డి నేతృత్వంలో గ్రామస్తులు కలిసి తాళ్లపాక అభివృద్ధికి సంబంధించి పలు అంశాలపై వినతులు సమర్పించారు. ఈ నేపథ్యంలో ఇక్కడికి వచ్చిన అధికారులు తాళ్లపాక రోడ్డును పరిశీలించారు. తాళ్లపాకు చెరువు కట్టపై ఉన్న రోడ్డుపై కవుల విగ్రహాలను ట్యాంక్బండ్ తరహాలో ఏర్పాటు చేయడానికి ప్రణాళిక రూపొందించారు. తాళ్లపాక చెరువులో శివలింగాన్ని, అన్నమయ్య పదకవితలు రాస్తున్నట్లుగా విగ్రహం ఏర్పాటుకు, చెరువును సుందరంగా తీర్చిదిద్దేందుకు అంచనాలు రూపొందించారు. ధ్యానమందిరం, నూతన కల్యాణమండపం పునరుద్ధరణ చేయాలని గ్రామస్తులు అధికారులను కోరారు. మరుగుదొడ్లు తొలగించి, వేరే ప్రదేశంలో నిర్మించాలన్నారు. ఈ ప్రతిపాదనలకు ఎస్టిమేట్లు వేసేందుకు టీటీడీ అధికారులు సానుకూలంగా స్పందించారు. బీజెపీ రాష్ట్ర కార్యదర్శి నాగోతు రమేష్నాయుడు, కార్యవర్గసభ్యుడు పోతుగుంట రమేష్నాయుడు, మాజీ సర్పంచ్ తనయుడు ఉద్దండం సుబ్రమణ్యం, గ్రామస్తులు జువ్వాది మోహనరావు, సుదర్శన్, తాళ్లపాక ఆలయాల ఇన్స్పెక్టర్ బాలాజీ పాల్గొన్నారు. -
అదృశ్యమైన విద్యార్థి ఆచూకీ లభ్యం
పీలేరురూరల్ : పీలేరు పట్టణం బండ్లవంకలో నివాసం ఉంటున్న రాజశేఖర్, సునీత కుమార్తె జోష్ణవి (13) ఈ నెల 6వ తేదీ అదృశ్యమైన సంఘటన విదితమే. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. శుక్రవారం జోష్ణవి తిరుమలలో ఉన్నట్లు గుర్తించిన అక్కడి పోలీసుల నుంచి సమాచారం అందింది. పీలేరు సీఐ యుగంధర్, ఎస్ఐ లోకేష్ ఆధ్వర్యంలో పోలీసులు తిరుమలకు వెళ్లి జోష్ణవిని తీసుకొచ్చి శనివారం తల్లిదండ్రులకు అప్పగించారు. అదృశ్యమైన జోష్ణవి సురక్షితంగా తిరిగిరావడంతో తల్లిదండ్రులు, బంధువులు ఊపిరి పీల్చుకున్నారు. పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ నాయకుడిపై దాడి లక్కిరెడ్డిపల్లి : మండలంలోని పందిళ్లపల్లి గ్రామం, దిన్నెపల్లికి చెందిన మాజీ ఫీల్డ్ అసిస్టెంట్, వైఎస్సార్సీపీ నాయకుడు లక్ష్మిరెడ్డిపై దాడి జరిగింది. తన పొలంలో ఉన్న బావి లో శనివారం సాయంత్రం మోటారును అమర్చుకుంటుండగా అదే గ్రామానికి చెందిన టీడీపీ నాయకుడు గంగిరెడ్డి తన అనుచరులతో కలిసి ఇనుపరాడ్లతో దాడి చేసి గాయపరిచారు. గాయపడిన లక్ష్మిరెడ్డిని బంధువులు లక్కిరెడ్డిపల్లి ప్రభు త్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఈ మేరకు లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. బాలిక అదృశ్యం రైల్వేకోడూరు అర్బన్ : రైల్వేకోడూరు పట్టణంలోని చందనా థియేటర్ వద్ద నివాసం ఉంటున్న రజియా కుమార్తె రేష్మా (12) శనివారం అదృశ్యమైనట్లు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. హెచ్ఎంఎం హైస్కూల్లో తొమ్మిదో తరగతి చదువుతున్న రేష్మా గత మూడు రోజుల నుంచి కనిపించకపోవడంతో తల్లిదండ్రులు చుట్టు పక్కల బంధువులు, తెలిసిన వారిని విచారించారు. ఫలితం లేకపోవడంతో స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. యువకుడి ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : తల్లి మందలించిందని, మనస్తాపంతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బుగ్గకాలువకు చెందిన అంజిమోహన, భారతి దంపతుల కుమారుడు తేజ్కుమార్(27) స్థానికంగా పండ్ల వ్యాపారం చేస్తుంటాడు. కుటుంబ సమస్యల కారణంగా తల్లి మందలించడంతో మనస్తాపం చెంది ఇంటివద్దే పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
పోలీసుల అదుపులో రాయచోటి వాసులు !
రాజంపేట : సోషల్ మీడియాలో టీడీపీ రాజంపేట పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్రాజుపై ఆయన పరువుకు భంగం కలిగించేలా వీడియోను పోస్టు చేశారని రాజంపేటకు చెందిన టీఎన్ఎస్ఎఫ్ నేత శివకుమార్ పట్టణ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శుక్రవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి రాయచోటికి చెందిన రామచంద్ర, రామకృష్ణ, సూరిలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. కాగా టీడీపీ ఇన్చార్జి రేసులో చమర్తి కూడా ఉన్న నేపథ్యంలో ఇప్పుడు తెరపైకి వచ్చిన సోషల్ మీడియా పోస్టు పెట్టడానికి కారణమనే భావన తెలుగు తమ్ముళ్లలో చర్చనీయాంశంగా మారింది. టీడీపీ వర్గాల్లో దుమారం రేపిన వీడియో... పోలీసుల అదుపులో ఉన్న వారు విడుదల చేసినట్లుగా చెబుతున్న వీడియో టీడీపీ వర్గాల్లో దుమారం రేపింది. టీడీపీలో చమర్తి వ్యతిరేక వర్గానికి చెందిన వారే వీడియో వైరల్ చేశారనే భావనలో చమర్తి వర్గీయులు ఉన్నారు. రాయచోటికి చెందిన వారి వెనుక ఉన్న నేత ఎవరు అనే దిశగా పోలీసులు విచారణ చేస్తున్నారు. ఈ విషయంపై పట్టణ సీఐ రాజాను వివరణ కోరగా సోషల్ మీడియాలో చమర్తి జగన్మోహనరాజుపై వీడియో విడుదల చేసిన వారిని విచారిస్తున్నామని వెల్లడించారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి ఓబులవారిపల్లె ; చిన్న ఓరంపాడులోని నాయుడు డాబా వద్ద జాతీయ రహదారిపై శనివారం మధ్యాహ్నం ఇన్నోవా కారు ఢీ కొనడంతో సోమశిల శ్రీనివాసులు (55) అనే వ్యక్తి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చెన్నూరు పడమటి వీధి గ్రామానికి చెందిన సోమశిల శ్రీనివాసులు మండలంలోని చిన్న ఓరంపాడు గ్రామంలో నివాసం ఉంటున్నాడు. ఇక్కడ తమలపాకు తోటల్లో కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ప్రతిరోజూ లాగే తోటలో పని ముగించుకొని మధ్యాహ్నం భోజనం కోసం నాయుడు డాబా వద్దకు జాతీయ రహదారిపై వస్తుండగా వేగంగా ఇన్నోవా కారు ఢీ కొంది. దీంతో శ్రీనివాసులు తలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ మహేష్ నాయుడు సిబ్బందితో కలిసి ప్రమాద స్థలానికి చేరుకొని 108 వాహనంలో శ్రీనివాసులును రైల్వేకోడూరుకు తరలించారు. మార్గమధ్యంలో శ్రీనివాసులు మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. భార్య జీవనోపాధి కోసం గల్ఫ్ దేశానికి వెళ్లింది. ఇద్దరు కుమారులు స్వగ్రామంలో ఉన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. వక్ఫ్బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదంప్రొద్దుటూరు : మండల పరిధిలోని టీచర్స్ కాలనీ వెనుక ఉన్న వక్ఫ్బోర్డు స్థలంలో భారీ అగ్ని ప్రమాదం సంభవించింది. ఆ స్థలంలో ఉన్న టైర్లతోపాటు ప్లాస్టిక్ వ్యర్థాలకు నిప్పు అంటుకోవడంతో దట్టమైన పొగలు లేచాయి. -
న్యాయ వ్యవస్థలో మీ పాత్ర కీలకం
రాయచోటి : న్యాయ వ్యవస్థలో మీరు పోషిస్తున్న పాత్ర అత్యంత కీలకమైందని, కోర్టు కార్యకలాపాలు సజావుగా సాగడానికి, కోర్టుల గౌరవాన్ని నిలబెట్టడానికి మీ కృషి ప్రశంసనీయమని జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి అన్నారు. శనివారం రాయచోటిలోని అన్నమయ్య జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో రాష్ట్ర డీజీపీ హరీష్ కుమార్ గుప్తా, జిల్లా ఎస్పీ వి.విద్యాసాగర్ నాయుడుల ఆదేశాల మేరకు జిల్లాలోని కోర్టు కానిస్టేబుళ్లు, హెడ్ కానిస్టేబుళ్లు, లైజనింగ్ ఆఫీసర్లు, జిల్లా లీగల్ లైజన్ యూనిట్ సభ్యులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కోర్టుకు హాజరయ్యే ప్రజలు, న్యాయవాదులు, న్యాయమూర్తులతో నేరుగా వ్యవహరిస్తారన్నారు. ఈ క్రమంలో మీరు ప్రదర్శించే నిబద్ధత, నిజాయితీ, వృత్తి నైపుణ్యం చాలా ముఖ్యమైనవన్నారు. కేసుల విచారణకు అవసరమైన పత్రాలను సమర్పించడం నుంచి సాక్షులను కోర్టుకు హాజరుపరచడం వరకు మీరు చేసే ప్రతి పనిలో కచ్చితత్వం, సమయపాలన పాటించాలని సూచించారు. కోర్టు అధికారులు, న్యాయవాదులతో సమర్థవంతమైన సమన్వయం చేసుకోవడం ద్వారా కేసుల పురోగతికి సహాయపడాలని కోరారు. సాక్షులు ఎలాంటి ఇబ్బందులు లేకుండా వాంగ్మూలం ఇచ్చే వాతావరణం కల్పించాలన్నారు. కోర్టు ప్రాంగణం, వెలుపల బాధ్యతాయుతంగా వ్యవహరించి పోలీసు శాఖకు మంచి పేరు తీసుకురావాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా డీసీఆర్బీ ఇన్స్పెక్టర్ ఎం.తులసీరాం, డిస్ట్రిక్ట్ లీగల్ లైజన్ యూనిట్ ఇన్స్పెక్టర్ ఆదినారాయణ రెడ్డి, ఎస్ఐ రవికుమార్, జిల్లా వ్యాప్తంగా కోర్టు విధులు నిర్వహిస్తున్న పోలీసులు పాల్గొన్నారు.రాత్రి రెక్కీ.. పగలు నొక్కి..రాయచోటి టౌన్ : తాళాలు వేసిన ఇళ్లను లక్ష్యంగా చేసుకుని చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్టు చేసినట్లు అడిషనల్ ఎస్పీ వెంకటాద్రి తెలిపారు. శనివారం రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్లో విలేకరుల సమావేశంలో మాట్లాడారు. ఆయన కథనం మేరకు.. తిరుపతి జిల్లా గూడూరు, గాంధీనగర్కు చెందిన రంగనాథం కిరణ్ బేకరీలో పనిచేసేవాడు. అక్కడ వచ్చే ఆదాయం చాలకపోవడంతో దొంగతనాలకు అలవాటుపడ్డాడు. తొలుత బస్టాండ్ ఆవరణంలో చిన్న చిన్న జేబుదొంగతనాలు చేసేవాడు. అక్కడ కూడా పెద్ద మొత్తంలో డబ్బులు రాకపోవడంతో ఇళ్లలో చోరీలు చేయడం మొదలు పెట్టాడు. చోరీ చేసే ముందు రెండు,మూడు రోజులు ఆ ప్రాంతంలో రాత్రి వేళల్లో రెక్కీ నిర్వహిస్తాడు. ఇంటిలో ఎవరూ లేరని నిర్ధారించుకున్న తరువాత పగటి పూటే చోరీలు చేసేవాడు. ఈ క్రమంలో అన్నమయ్య జిల్లాలోని చిట్వేలిలో రెండు కేసులు, రైల్వేకోడూరులో ఒకటి, వీరబల్లిలో మూడు కేసులతో పాటు ఇతర జిల్లాల్లో 56 కేసులు ఇతనిపై నమోదయ్యాయి. ఈ నేపథ్యంలో వీరబల్లిలో జరిగిన ఒక చోరీ సంఘటనలో నిఘా పెట్టిన పోలీసులకు శనివారం వీరబల్లి మండలం ఓదివీడు రోడ్డు వద్ద నిందితుడు కనిపిండంతో రూరల్ సీఐ వరప్రసాద్, సీసీఎస్ ఇన్స్పెక్టర్లు యం. చంద్రశేఖర్, ఎస్ఐలు కృష్ణారెడ్డి, వీరబల్లి ఎస్ఐ నరసింహారెడ్డిలు అదుపులోకి తీసుకున్నారు. నిందితుడి నుంచి 102 గ్రాముల బంగారు ఆభరణాలు, రూ.75,000 నగదు స్వాధీనం చేసుకున్నారు. వీటి విలువ రూ.10,75,000లుగా గుర్తించినట్లు తెలిపారు. నిందితుడిపై కేసు నమోదు చేసి రిమాండ్కు తరలిస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. సమావేశంలో డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, ఎస్ఐలు కృష్ణారెడ్డి, నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు.కోర్టు విధులు నిర్వర్తిస్తున్న సిబ్బందితో జిల్లా అదనపు ఎస్పీ చోరీ కేసులో నిందితుడి అరెస్టు 102 గ్రాముల బంగారు, రూ.75 వేలు నగదు స్వాధీనం -
పాల కొండలు అటవీ ప్రాంతంలో కూంబింగ్
సిద్దవటం : పాలకొండలు అటవీ ప్రాంతంలోని సమ స్యాత్మక ప్రదేశాల్లో కూంబింగ్ నిర్వహించినట్లు కడప రేంజర్ ప్రసాద్ తెలిపారు. సిద్దవటం మండలంలోని రాజీవ్ స్మృతి వనంలో శనివారం ఆయన మాట్లాడుతూ కడప డీఎఫ్ఓ వినీత్కుమార్ ఆదేశాల మేరకు కడప ఫారెస్టు రేంజ్ పరిధిలోని పాలకొండలు అటవీ ప్రాంతమైన భాకరాపేట ఫారెస్టు బీటులో అనుమానిత అటవీ ప్రాంతాల్లో ఎర్రచందనం తరలి పోకుండా కూంబింగ్ నిర్వహించామన్నారు. భాకరాపేట, మిట్టపల్లి, నేకపాపురం మాచుపల్లె, మూలపల్లె తదితర గ్రామాల్లో కొత్త వ్యక్తులు ఎవరైనా అనుమానితులుగా కనబడితే సమాచారం ఇవ్వాలని కోరారు. ఈ సమావేశంలో ఫారెస్టు సెక్షన్ ఆఫీసర్ శ్రీనివాసులు, సిబ్బంది కిషోర్కుమార్, ఇందిర, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. -
రమణీయం..రథోత్సవం
నందలూరు : నందలూరు శ్రీ సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శనివారం మధ్యాహ్నం స్వామివారి రథోత్సవం రమణీయంగా సాగింది. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శ్రీదేవి భూదేవి సమేత శ్రీ సౌమ్యనాథస్వామిని రథంపై కొలువుదీర్చి ముందుకు కదిలించారు.భక్తులు అధిక సంఖ్యలో తరలివచ్చారు. రథాన్ని లాగేందుకు పోటీపడ్డారు. గోవింద నామస్మరణలతో మాడవీధులు మార్మోగాయి. శనివారం రాత్రి అశ్వవాహనంపై సౌమ్యనాథ స్వామి పురవీధుల్లో విహరించారు. భక్తులు కాయ, కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, ఎస్ఐ మల్లికార్జునరెడ్డి ఆధ్వర్యంలో బందోబస్తు ఏర్పాటు చేశారు. రథోత్సవానికి వచ్చిన భక్తులకు రీజెన్సీ నలంద విద్యాసంస్థల అధినేత జీఎన్ నాయుడు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో సౌమ్యనాథ సేవ ట్రస్టు అధ్యక్షుడు ఎద్దుల సుబ్బరాయుడు, కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, ఎద్దుల విజయసాగర్, ఆలయ సూపరిండెంట్ హనుమంతప్ప, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్ కుమార్, విజిలెన్స్ అధికారి శేషాచలం, రీజెన్సీ నలంద స్కూల్ వైస్ ప్రిన్సిపల్ దశరథరామయ్య, ప్రిన్సిపల్ సుబ్బరాయుడు పాల్గొన్నారు. నేడు చక్రస్నానం : బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్ తెలిపారు. వైభవంగా సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు అధిక సంఖ్యలో తరలివచ్చిన భక్తులు -
వైభవంగా చెన్నకేశవస్వామి రథోత్సవం
రాజంపేట : తాళ్లపాక బ్రహ్మోత్సవాలలో భాగంగా శ్రీ చెన్నకేశవస్వామికి శనివారం రాత్రి రథోత్సవం వైభవంగా నిర్వహించారు. ముందుగా శ్రీదేవి, భూదేవి, శ్రీ చెన్నకేశవస్వామి ఉత్సవమూర్తులను సుందరంగా అలంకరించారు. రథం వేదికపై ఆసీనులు చేశారు. ఇందులో భాగంగా ప్రత్యేకపూజలు నిర్వహించారు. అలాగే ఉదయం శ్రీ సిద్దేశ్వరస్వామి అమ్మవార్లకు పల్లకీ సేవ నిర్వహించారు. కాగా ఆదివారం శ్రీ సిద్దేశ్వరస్వామికి పార్వేటి ఉత్సవం నిర్వహించనున్నారు. శ్రీ చెన్నకేశవస్వామి అశ్వవాహనంపై భక్తులకు దర్శనమివ్వనున్నారు. రథోత్సవ కార్యక్రమంలో సర్పంచ్ గౌరీశంకర్, తాళ్లపాక ఇన్స్పెక్టర్ బాలాజీ, టీటీడీ సిబ్బంది, గ్రామస్తులు పాల్గొన్నారు. పిచ్చి కుక్క దాడిలో ముగ్గురికి గాయాలుసిద్దవటం : మండల కేంద్రమైన సిద్దవటం ఎగువపేటలో శనివారం పిచ్చికుక్క స్వైర విహారం చేసి ముగ్గురికి కాటు వేసింది. ఎగువపేట మఠంవీధిలో శనివారం సాయంత్రం తొమ్మిదేళ్ల బాలుడు ఆడుకుంటుండగా ఒక్కసారిగా కుక్క వచ్చి కరిచింది. అలాగే పోలీసు లైన్ సమీపంలో ఆరేళ్ల బాలుడిని, మెయిన్ బజారులో తేజా అనే యువకుడిని కూడా కరిచింది. కుక్క కాటుకు గురైన వారు సిద్దవటం ప్రభుత్వ ఆసుపత్రిలో వ్యాక్సిన్, ఇంజక్షన్ వేయించుకున్నారు. గ్రామ పంచాయతీ అధికారులు స్పందించి పిచ్చి కుక్కను పట్టుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
మున్సిపల్ వర్కర్లకు సంక్షేమ పథకాలేవీ?
రాయచోటి టౌన్ : మున్సిపల్ వర్కర్లకు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని కూటమి నేతలు ఇచ్చిన మాట నిలబెట్టుకోవాలని ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఏపీ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ జిల్లా కో కన్వీనర్ నేలపాటి శ్రీనివాసులు డిమాండ్ చేశారు. జిల్లా కలెక్టరేట్ ఎదురుగా శుక్రవారం నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ అధికారంలోకి రాక ముందు కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ వర్కర్స్, ఆప్కాస్ వర్కర్స్కు సంక్షేమ పథకాలు అమలు చేస్తామని చంద్రబాబు హామీ ఇచ్చారన్నారు. తక్షణమే తల్లికి వందనం పథకాన్ని అమలు చేయాలని, టౌన్ ఫ్లానింగ్ సిబ్బందికి రూ.24,500లకు వేతనం పెంచాలని కోరారు. జీవో నంబర్ 36 ప్రకారం వేతనం ఇవ్వాలని, కార్మికులకు ఆరు నెలల డీఏ, గ్రాట్యూటీ విడుదల చేయాలని సూచించారు. కార్యక్రమంలో దేవా, తిరుమల, చలపతినాయుడు, శేషాద్రిబాబు, కేశవరావు, వెంకటేష్, రాధ, చంద్ర, నరసింహులు, మల్లిఖార్జున తదితరులు పాల్గొన్నారు. -
పోక్సో కేసులో నిందితుడికి జైలుశిక్ష
మదనపల్లె రూరల్ : పోక్సో కేసులో నిందితుడికి మూడేళ్ల జైలుశిక్ష, రూ.5 వేల జరిమానా విధిస్తూ చిత్తూరు పోక్సో కోర్టు జడ్జి ఎం.శంకరరావు శుక్రవారం తీర్పు ఇచ్చినట్లు వన్టౌన్ సీఐ ఎరిషావలి తెలిపారు. పట్టణంలోని సుభాష్ రోడ్డుకు చెందిన టి.చంద్రశేఖర్, వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని బాలికల హైస్కూల్ వద్ద 2017 మార్చి, 3న స్కూల్కు వెళ్లే విద్యార్థినులతో అసభ్యకరంగా ప్రవర్తించడంతో అప్పటి హెచ్ఎం పద్మజ ఫిర్యాదు మేరకు, ఎస్ఐ మనోహర్ పోక్సో కేసు నమోదు చేశారన్నారు. కోర్టు విచారణ అనంతరం శుక్రవారం చిత్తూరు పోక్సో కోర్టులో నిందితుడు చంద్రశేఖర్కు మూడేళ్ల జైలు శిక్ష, రూ..5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి శంకరరావు తీర్పునిచ్చారన్నారు. నిందితుడికి శిక్ష పడేలా చూసినందుకు వన్టౌన్ సీఐ ఎరీషావలి, చిత్తూరు కోర్టు లైజనింగ్ ఆఫీసర్ టీసీ.సాయిసుధాకర్, కోర్టు కానిస్టేబుల్ ఖాదర్వలిలను డీఎస్పీ మహేంద్ర అభినందించారు. చీటింగ్ కేసులో నిందితురాలిని అరెస్ట్మదనపల్లె రూరల్: చీటింగ్ కేసులో నిందితురాలైన యువతిని కేరళ పోలీసులు శుక్రవారం మదనపల్లెలో వన్టౌన్ పోలీసుల సాయంతో అరెస్ట్ చేశారు. అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు నిందితురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని బెంగళూరు రోడ్డు నక్కలదిన్నెలో ఉంటున్న సాయిబాబా కుమార్తె రోహిణి(25) 2023లో కేరళ ముక్కల్ పోలీస్స్టేషన్ పరిధిలో ఆర్థిక నేరానికి పాల్పడింది. ఈ ఘటనకు సంబంధించి అక్కడ పోలీస్స్టేషన్లో కేసు నమోదు కాగా, ఏ–1గా ఉన్న రోహిణి, మదనపల్లెలో తలదాచుకుంది. కేసు దర్యాప్తులో భాగంగా ఆమె మదనపల్లెలో ఉన్నట్లు నిర్ధారించుకున్న కేరళ పోలీసులు ఇక్కడకు చేరుకుని వన్టౌన్ పోలీసుల సాయంయంతో అమెను అరెస్ట్ చేసేందుకు ప్రయత్నించారు. అయితే ఆమె, అరెస్ట్ నుంచి తప్పించుకునేందుకు డెటాల్ తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. కుటుంబ సభ్యుల సాయంతో పోలీసులు ఆమెను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం ఆమెను అదుపులోకి తీసుకుని కేరళకు తరలించారు. టీడీపీ నాయకుడిపై ఫిర్యాదు రాజంపేట: టీడీపీ క్రియాశీలక కార్యకర్త సుండుపల్లె మండలం తిమ్మసముద్రానికి చెందిన జైష్టం వరుణ్పై టీడీపీ నేత చప్పిడి మహేష్నాయుడు, అతని అనుచరవర్గం దాడి చేసినట్లు సుండుపల్లె ఎస్ఐ తెలిపారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలి వున్నాయి. మడితాడులో టీడీపీ సంస్ధాగత ఎన్నికల క్రమంలో వరుణ్ అక్కడే ఉన్నారు. అక్కడి నుంచి కారులో వెళుతుండగా మహేష్నాయుడు అనుచరవర్గం తనపై దాడి చేశారని, విచక్షణా రహితంగా కట్టెలతో,ఇనుపరాడ్లతో దాడిచేయగా, ప్రాణాలు కాపాడుకునేందుకు పరుగు తీశానని వరుణ్ తెలిపారు. తనపై దౌర్జన్యంగా వ్యవహరించి చంపేస్తామని, తమకు హత్య కేసులు కొత్తేమీకాదని బెదిరించారన్నారు. మహేష్నాయుడుతోపాటు రెడ్డిచెర్ల అశోక్, కోటకొండ చందు, షేక్ జుబేర్,మనోజ్నాయుడు, సంతోష్, నానీ, అశోక్నాయుడు, నీకిల్పై పోలీసులకు ఫిర్యాదు చేశామన్నారు. టీడీపీ సంస్ధాగత ఎన్నికల్లో మహేష్నాయుడు పెత్తనంపై ప్రశ్నించడంతోనే వరుణపైకి దాడికి కారణమని టీడీపీ వర్గాలు భావిస్తున్నాయి. -
కమనీయం.. కల్యాణోత్సవం
రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలి తాళ్లపాకలో శుక్రవారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి కళ్యాణోత్సవాలను వేర్వేరుగా వైభవంగా నిర్వహించారు. అన్నమాచార్య ధాన్య మందిరం ఆవరణలోని కళ్యాణ వేదికపై ముందుగా సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను అలంకరించి కొలువుదీర్చారు. ఒకే వేదికపై శివ, కేశవుల కళ్యాణం జరుగుతుండడంతో రాజంపేట పరిసర ప్రాంతాల నుంచి భక్తులు పెద్ద ఎత్తున తరలివచ్చారు. కళ్యాణోత్సవానికి హాజరైన వారికి టీటీడీ అన్నప్రసాదం పంపిణీ చేసింది. సర్పంచి గౌరీ శంకర్, ఉద్దండం సుబ్రహ్మణ్యం, అదృష్టదీపుడు, టీటీడీ అధికారులు, టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. నేడు రథోత్సవం : బ్రహ్మోత్సవాలలో భాగంగా శనివారం సిద్ధేశ్వరస్వామి, చెన్నకేశవస్వామి రథోత్సవం నిర్వహించనున్నారు. ఇందుకోసం తితిదే ఏర్పాట్లు చేసింది. మూడేళ్ల జైలు శిక్ష రాయచోటి టౌన్: హత్యాయత్నం కేసులో షేక్.అజాజ్(అలియాస్ పాపా)కు రాయచోటి అదనపు జిల్లా సీనియర్ జడ్జి ప్రసూన మూడేళ్ల జైలుశిక్ష, రూ.10,000ల జరిమానా విధించినట్లు రాయచోటి అర్బన్ పోలీసులు తెలిపారు. అర్బన్ సీఐ బివి.చలపతి కథనం మేరకు..05 జనవరి, 2022న రాయచోటి పట్టణంలోని రెడ్డిస్ కాలనీలో ( కుమ్మరమిట్ట) బేతల్ కాలనీ వద్ద షేక్. హమీద్ రహిమాన్ అనే వ్యక్తి అదే ప్రాంతానికి చెందిన షేక్.అజాజ్ (అలియాస్ పాపా)ను చాకుతో పొడిచాడు. అప్పటి ఎస్ఐ మహమ్మద్రఫీ కేసు నమోదు చేసి కోర్టులో ఛార్జిషీట్ దాఖలు చేశారు. శుక్రవారం కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి ప్రసూనా నిందితుడు నేరానికి పాల్పపడ్డాడని భావించి ఐపీసీ307 ప్రకారం మూడేళ్లు జైలు శిక్ష విధించడంతో పాటు రూ.10,000లు జరిమానా కూడా విధించారని తెలిపారు. -
వాటా కోసం.. తమ్ముళ్ల కుమ్ములాట
ఓబులవారిపల్లె : టెండర్ ద్వారా పనులు దక్కించుకున్న సంస్థకు ఖనిజం సరఫరా చేసే విషయంలో వాటా కోసం తమ్ముళ్ల మధ్య కుమ్ములాట మొదలైంది. 25 శాతం వాటా తమకే ఇవ్వాలంటూ స్థానిక టీడీపీ నాయకులు భీష్మించడంతో వాదోపవాదాలు జరిగాయి. బేరసారాలు బెడిసికొట్టడంతో టెండర్ దక్కించుకున్న కంపెనీ చివరికి సరఫరా నిలిపివేసింది. వివరాల్లోకి వెళ్తే.. మంగంపేట ఏపీఎండీసీ గనుల నుంచి 60 లక్షల మెట్రిక్ టన్నుల ఏపీ ఎండీసీ నుంచి ఖనిజాన్ని కొనేందుకు బల్క్ టెండర్ ద్వారా ఎంప్రదా కంపెనీ దక్కించుకుంది. ఎపీఎండీసీ కంపెనీ ఖనిజాన్ని తరలించాల్సి ఉంది. దీనిపై కూటమి నాయకుల కన్ను పడింది. పెద్ద ఎత్తున తామే ఖనిజం తీయిస్తామని గతంలో ఒప్పందం చేసుకున్నారు. రోజూ దాదాపు నాలుగు లక్షల మెట్రిక్ టన్నుల మేర సరఫరా చేస్తున్నారు. అయితే ఇటీవల స్థానిక టీడీపీ నాయకుడు 25 శాతం ఖనిజం తీసేందుకు తమ యంత్రాలకు అవకాశం ఇవ్వాలని పటుబట్టారు. అంతకుముందు తరలిస్తున్న కూటమి నాయకులు దీనికి ఒప్పుకోకపోగా.. వాగ్వాదాం జరగడంతో వివాదం ముదిరింది. దీంతో దీనిపై శుక్రవారం ఉదయం నుంచి కూటమి నాయకుల మధ్య చర్చలు జరిగాయి. బేరసారాలు కుదరక పోవడంతో చివరకు ఏపీఎండీసీ నుంచి ఎమ్ప్రదా కంపెనీకి బైరెటీస్ ఖనిజం సరఫరా నిలిపివేశారు. ఏపీఎండీసీ గనుల నుంచి స్థానిక నిర్వాసిత కుటుంబీకులు, ఇల్లు కోల్పోయిన వారంతా లక్షల రూపాయలు అప్పుచేసి యంత్రాలు కొనుగోలు చేశారు. 51 ఇటాచీలు పెట్టి ఖనిజం తీస్తూ జీవనం సాగిస్తున్నారు. కూటమి నాయకులు తమకే వాటా కావాలనడంతో వీరి మధ్య వివాదం వారి జీవన స్థితిగతులకు అంటకంగా మారింది. కంపెనీకి ఖనిజం రవాణా చేసేలా చూ డాలని యంత్రాల యజమానులు కోరుతున్నారు. సీఎండీ గ్రేడ్ ఖనిజం సరఫరాలో బెడిసిన ఒప్పందం తమకే 25 శాతం ఇవ్వాలని స్థానిక టీడీపీ నేతల పట్టు -
చంద్రబాబు మాట.. అబద్ధాల మూట
పీలేరు : రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు మాట... అబద్ధాల మూట అని మరోసారి రుజువైందని మాజీ ఎమ్మెల్యే చింతలరామచంద్రారెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు అకేపాటి అమరనాథ్రెడ్డి, అన్నారు. స్థానిక ఎంఎం.కల్యాణమండపంలో బాబు షూరిటీ.. మోసం గ్యారంటీ అంశంపై వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది పూర్తయినా ఏ ఒక్క పంటకు గిట్టుబాటు ధరలే కలిం్పంచలేదన్నారు. మామిడి రైతుల పరిస్థితి మరీ దారుణంగా తయారైందని, గత ప్రభుత్వంలో రూ.16 నుంచి రూ.18 వరకూ గిట్టుబాటు కల్పించడం జరిగిందన్నారు. ప్రస్తుతం కిలో రూ.2కు కూడా కొనలేని పరిస్థితి ఉందన్నారు. కాయలు తోటల్లోనే వదిలేసి రైతులు పూర్తిగా నష్టపోయారని తెలిపారు. చికెన్ వ్యాపారుల నుంచి కిలోకు రూ.10 చొప్పున వసూలు చేస్తున్న ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. ప్రభుత్వ వైఫల్యాలు ప్రశ్నిస్తే అక్రమ కేసులు పెట్టడం, అరెస్ట్ చేయడం, పోలీసులను అడ్డుపెట్టుకుని రెడ్బుక్ రాజ్యాంగాన్ని నడుపుతున్నారని ఆరోపించారు. వైసీపీ కార్యకర్తలను ఇబ్బందులకు గురి చేస్తున్న ఏ ఒక్కరినీ వదలిపెట్టబోమన్నారు. అనంతరం వైఎస్సార్సీపీలో జిల్లా, నియోజకవర్గం, మండల స్థాయి పదవులు పొందిన నాయకులకు నియామక పత్రాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ పరిశీలకులు అనీషారెడ్డి, మైనారిటీ కమీషన్ ఛైర్మన్ ఇక్బాల్అహ్మద్, పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శి నరసింహారెడ్డి, సుగవాసి సుబ్రమణ్యం, హరీష్రెడ్డి, హరిప్రసాద్రెడ్డి, ఆగా మోహిద్దీన్, కన్వీనర్లు దండు జగన్మోహన్రెడ్డి, రమేష్రెడ్డి, కమలాకర్రెడ్డి, ముక్తియార్, శివారెడ్డి, వెంకటరమణారెడ్డి, సర్పంచ్ హబీబ్బాషా. చక్రధర్, ఆనంద్ పాల్గొన్నారు.కడప మేయర్ సురేష్బాబు, చింతల రామచంద్రారెడ్డి -
రోడ్డు ప్రమాదంలో జింక మృతి
రాయచోటి : రామాపురం మండలం పాలనగారిపల్లి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో జింక మృతిచెందింది. శుక్రవారం ఉదయం రాయచోటి నుంచి ద్విచక్ర వాహనంలో కొంద రు కడపకు వెళ్తున్నారు. పాలన్నగారిపల్లి సమీపంలో చెట్లపొందల నుంచి జింక రోడ్డుమీదకు రావడంతో ఢీకొన్నారు. ప్రమాదంలో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న దంపతులు గాయాలపాల య్యారు. గాయపడిన జింక కూడా మృతి చెందినట్లు అటవీబీట్ అధికారి భరణీధర్ తెలిపారు. వృద్ధురాలికి ఆశ్రయంమదనపల్లె రూరల్ : రోడ్డుపై ఉన్న వృద్ధురాలిని పోలీసులు అనాథ ఆశ్రమానికి చేర్చి దాతృత్వం చాటారు. పట్టణంలోని సీటీఎం రోడ్డు ఎస్టేట్లో సుమారు 65 ఏళ్ల వయస్సు కలిగిన వృద్ధురాలు రోడ్డు పక్కన దిక్కుతోచని స్థితిలో ఉంది. స్థానికులు వివరాలు ఆరాతీయగా తన పేరు జయమ్మ, ప్యారంపల్లె గ్రామమని, తనకు నలుగురు కుమార్తెలున్నారని తెలిపారు. తనను పోషించలేక ఎస్టేట్లో వదిలి వెళ్లినట్లు తెలిపింది. స్థానికులు 112 కు కాల్చేసి సమాచారం అందిస్తే టూటౌన్ ఏఎస్ఐ వై.వి.రమణ ఘటనాస్థలానికి వెళ్లి వృద్ధురాలిని ఆనంద వృద్ధాశ్రమంలో చేర్చారు. జయమ్మ సంబంధీకుల ఆచూకీ తెలిసేంతవరకూ ఆశ్రమంలో ఉంచుకుని ఆలనాపాలన చూడాల్సిందిగా కోరారు. వృద్ధురాలికి సంబంధించిన వ్యక్తులు ఎవరైనా ఉంటే..9133006333, 9441169202, 9182276316 ఫోన్ నెంబర్లలో సంప్రదించాల్సిందిగా సూచించారు. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నంమదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి ప్రభుత్వ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. మండలంలోని అంకిశెట్టిపల్లెకు చెందిన కుమార్రెడ్డి కుమారుడు లోకేష్రెడ్డి(23)ని తల్లిదండ్రులు మందలించారని పురుగు మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. అదే విధంగా పోతబోలుకు చెందిన సాగర్రెడ్డి భార్య కృష్ణవేణి(27) అనారోగ్య కారణాలతో మనస్తాపం చెంది పురుగుమందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. పట్టణంలోని వీవర్స్ కాలనీలో నివాసం ఉంటున్న రెడ్డెప్ప భార్య ఎం.రాణి(32) రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించింది. ఆయా ఘటనల్లో బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
కర్నాటక మద్యం స్వాధీనం
మదనపల్లె రూరల్ : ఎకై ్సజ్ బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది గురువారం రాత్రి నిర్వహించిన తనిఖీల్లో 12.96 లీటర్ల ఎన్డీపీఎల్ కర్నాటక మద్యం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్ట్ చేసి టూవీలర్ సీజ్ చేసినట్లు సీఐ సత్య శ్రీనివాస్ తెలిపారు. మీడియాతో శుక్రవారం ఆయన మాట్లాడుతూ... కర్నాటక సరిహద్దు చీకలబైలు చెక్పోస్ట్కు సమీపంలో బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ సిబ్బంది తనిఖీలు నిర్వహిస్తుండగా, కురబలకోట మండలం తుంగావారిపల్లెకు చెందిన మూలి రమేష్(27), కర్నాటకకు చెందిన బెంగళూరు మాల్ట్ విస్కీ(90ఎం.ఎల్) 96 టెట్రా ప్యాకెట్లు, సుజుకీ ఆక్సెస్ వాహనంలో తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. అతడి నుంచి రూ.3,840 విలువ చేసే మద్యాన్ని స్వాధీనం చేసుకుని, టూవీలర్ను సీజ్ చేశామన్నారు. అలాగే అదే గ్రామానికి చెందిన పెద్దిగాని సోమశేఖర్(28), కర్నాటకకు చెందిన హైవార్డ్స్ ఛీర్స్ విస్కీ(90ఎం.ఎల్) 48 టెట్రా ప్యాకెట్లను తరలిస్తుండగా పట్టుకున్నామన్నారు. రెండు కేసుల్లోనూ ఇద్దరిని అరెస్ట్చేసి ఎకై ్సజ్ ఎస్హెచ్ఓకు అప్పగించామన్నారు. 18న చలో ఢిల్లీబద్వేలు అర్బన్ : కడపలో ఉక్కు పరిశ్రమ హామీ అమలు కోరుతూ డీవైఎఫ్ఐ ఆధ్వర్యంలో ఈ నెల 18న చలో ఢిల్లీ కార్యక్రమం నిర్వహించనున్నట్లు డీవైఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు ఎం.చిన్ని పేర్కొన్నారు. -
కూటమి మోసాలను ప్రజా కోర్టులో నిలబెడదాం
బి.కొత్తకోట/కురబలకోట : రాష్ట్ర సీఎం చంద్రబాబునాయుడు మోసపూరిత వాద్ధానాలతో రాష్ట్రంలోని అన్ని వర్గాల ప్రజలను నిలువునా దగా చేశారని, బాబు నయవంచన గురించి ఇంటింటా వివరించాలని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి, తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. బి.కొత్తకోట పీఎన్ఆర్ కళ్యాణ మండపంలో నియోజకవర్గస్థాయి సమావేశం శుక్రవారం నిర్వహించారు. చంద్రబాబు మోసాలపై క్యూఆర్ కోడ్ను నాయకులు ఆవిష్కరించారు. తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి తంబళ్లపల్లెకు జగన్ ప్రభుత్వంలో మంజూరైన కోట్లాది రూపాయల నీటి పథకాలు, ముదివేడు రిజర్వాయర్ తదితర పథకాలను కూటమి ప్రభుత్వం నిలిపివేసిందన్నారు. వెనుక బడిన తంబళ్లపల్లెను తాము ప్రగతి పథంలో నిలిపామన్నారు. జగన్ పర్యటనల సందర్భంగా జన స్పందన చూసి కూటమి అధినాయకులు అదిరిపోతున్నారని ఆరోపించారు. అన్ని వర్గాలను చంద్రబాబు మోసం చేశాడని, ఏవర్గం సంతృప్తికరంగా లేదన్నారు. జగన్ ప్రభుత్వంలో పార్టీలకతీతంగా అభివృద్ది, సంక్షేమ పథకాలు అమలు జరిగాయని, చంద్రబాబు పాలనలో మోసం గ్యారంటీ అని విమర్శించారు. అనంతరం ముఖ్య అతిథి ఆకేపాటి అమరనాథరెడ్డి, కడప మేయర్ సురేష్బాబు, కొత్తగా చేరిన పార్టీ నేత సుగవాసి బాలసుబ్రహ్మణ్యం మాట్లాడారు. ఈ కార్యక్రమంలో నాయకులు బైసాని చంద్రశేఖర్ రెడ్డి, ప్రదీప్రెడ్డి, పూర్ణ చంద్రిక, రమేష్, ఎంజి భూదేవి, నారాయణరెడ్డి, భాస్కర్ నాయుడు, అనిత చక్రవర్తి, బలరామిరెడ్డి, చౌడేశ్వర, మహమ్మద్, శివన్న, కళ్యాణ్,రెడ్డి హరి, తదితరులతో పాటు నియోజక వర్గంలోని వివిధ మండలాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి -
అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదాం
మదనపల్లె రూరల్ : ప్రజలకు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని అసమర్థ ప్రభుత్వాన్ని ఇంటికి సాగనంపుదామని వైఎస్సార్ సీపీ అన్నమయ్యజిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి పేర్కొన్నారు. మదనపల్లెలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశం శుక్రవారం జరిగింది. ఆకేపాటి అమరనాథరెడ్డి మాట్లాడుతూ...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ప్రతి కుటుంబానికి లక్షల రూపాయల మేలు కలిగిందన్నారు. జగన్మోహన్రెడ్డి సంక్షేమ పథకాలన్నింటినీ అమలుచేస్తామని చంద్రబాబు ఎన్నికల సమయంలో హామీ ఇచ్చి.. అధికారంలోకి వచ్చిన తర్వాత ఒక్కటీ నెరవేర్చలేదన్నారు. జగన్మోహన్రెడ్డి ఒత్తిడితో అరకొరగా తల్లికి వందనం అమలు చేశారన్నారు. మేనిఫెస్టో హామీల గురించి ప్రశ్నిస్తే నాలుక మందం అంటూ చంద్రబాబు బెదిరింపులకు పాల్పడుతున్నారన్నారు. జిల్లాలో వైఎస్సార్ సీపీ బలంగా ఉందని, కార్యకర్తలే పార్టీకి వెన్నెముక అన్నారు. ప్రతి గడపకు వెళ్లి జగన్, చంద్రబాబు మధ్య తేడా వివరించాలని సూచించారు. చిన్న మనస్పర్థలు పక్కనపెట్టి అందరూ కలిసికట్టుగా పార్టీ బలోపేతానికి పనిచేయాలన్నారు. మాజీ ఎమ్మెల్యే డాక్టర్.దేశాయ్ తిప్పారెడ్డి మాట్లాడుతూ..చంద్రబాబు మోసానికి బ్రాండ్ అంబాసిడర్ అన్నారు. రెడ్బుక్ రాజ్యాంగం పేరుతో వైఎస్సార్ సీపీ కార్యకర్తలను ఇబ్బంది పెట్టడమే లక్ష్యంగా ప్రభుత్వం పనిచేస్తోందన్నారు. నిసార్ అహ్మద్ మాట్లాడుతూ..జగనన్న హయాంలో ప్రజలు సుభిక్షంగా ఉండేవారని, బటన్ నొక్కితే ప్రజలకు డబ్బులు వచ్చేవన్నారు. చంద్రబాబు పాలనలో అవి లేకపోగా, ఆయన చేసిన మోసాలు ఒకొక్కటే ప్రజలకు తెలిసి వస్తున్నాయన్నారు.రాబోయే మున్సిపల్, సర్పంచ్ ఎన్నికల్లో మదనపల్లె నియోజకవర్గంలో వైఎస్సార్ సీపీ జెండా ఎగురవేసి పార్టీకి పూర్వవైభవం తీసుకువద్దామన్నారు. అనంతరం కడప మేయర్ సురేష్బాబు, పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి. సుగవాసి బాలసుబ్రహ్మణ్యం, అనీషారెడ్డి మాట్లాడారు. అనంతరం బాబు ష్యూరిటీ–మోసం గ్యారంటీ పోస్టర్, క్యూఆర్ కోడ్లను వారు ఆవిష్కరించారు. కార్యక్రమంలో మున్సిపల్ చైర్ పర్సన్ మనూజారెడ్డి, షమీం అస్లాం, జెడ్పీటీసీలు ఉదయ్కుమార్, సీహెచ్.రామచంద్రారెడ్డి, ఆర్ఐ.రమణారెడ్డి, వెలుగుచంద్ర, వెంకటరమణారెడ్డి, మండల కన్వీనర్ దండుకరుణాకర్రెడ్డి, కేశవరెడ్డి, కొమ్మేపల్లె శ్రీనివాసులురెడ్డి, మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ఆజం, లియాఖత్అలీ, ఎస్.ఏ.కరీముల్లా, ఎన్ఆర్ఐ దండుశేఖర్రెడ్డి, శివప్రసాద్, హర్షవర్ధన్రెడ్డి, ఇర్ఫాన్, బి.రేవతి, మేరీ, శీలంరమేష్, మునిశేఖర్, బండపల్లి వెంకటరమణ, పోతబోలునాగరాజ, ఈశ్వరయ్య, శరత్రెడ్డి, జన్నే రాజేంద్రనాయుడు, ఆర్టీఏ నూర్ తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్ సీపీ అన్నమయ్యజిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథ్రెడ్డి -
ఎస్పీపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలి
మదనపల్లె రూరల్ : మండలంలోని అంకిశెట్టిపల్లె బుద్ధ విహార్లో విగ్రహం ధ్వంసం, తల తొలగించిన ఘటనకు సంబఽంధించి తప్పుడు కేసులు నమోదు చేయించిన ఎస్పీ విద్యాసాగర్నాయుడుపై అట్రాసిటీ కేసు నమోదు చేయాలని బీఎస్పీ రాష్ట్ర అధ్యక్షుడు బందెల గౌతమ్కుమార్ డిమాండ్ చేశారు. శుక్రవారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. గౌతమ బుద్ధుడి విగ్రహాన్ని ధ్వంసం చేసిన ఉన్మాద ఘటనపై, తాలూకా సీఐ కళా వెంకటరమణ నిర్వాహకుల ఫిర్యాదు స్వీకరించకుండా కేసు నీరుగార్చేందుకు ప్రయత్నిస్తున్న నేపథ్యంలో బుద్ధ అంబేడ్కర్ సమాజ్ ఫౌండర్ పిటీఎం శివప్రసాద్, బౌద్ధులు శాంతియుతంగా దమ్మ దీక్ష చేశారన్నారు. దీనిపై ఎస్పీ అప్రజాస్వామికంగా వ్యవహరించి, నిందితులను అరెస్ట్ చేయకుండా శాంతియుతంగా దీక్ష చేస్తున్న వారిని అరెస్ట్ చేసేందుకు పోలీసులను పంపడాన్ని ఆయన తప్పుపట్టారు. ఎస్పీ విద్యాసాగర్ నాయుడు ఆదేశాలతో పోలీసులు శివప్రసాద్పై అక్రమ కేసులు నమోదు చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో ప్రజా సంఘాల నాయకులు చందు, కృష్ణప్ప, సాంబశివ, సహదేవ్, బాలాజీ, రమణ, శ్రీనాథ్, శివ,చంద్ర, ప్రశాంత్, మహేశ్, అరుణ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
రాజంపేట టౌన్ : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐల్లో చేరేందుకు ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 15వ తేదీలోపు ఆన్లైన్లో రిజిస్టేషన్ చేసుకోవాలని ప్రభుత్వ పారిశ్రామిక శిక్షణా సంస్థ జిల్లా కన్వీనర్ సిహెచ్.రామ్మూర్తి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో మూడు ప్రభుత్వ, పన్నెండు ప్రైవేట్ ఐటీఐల్లో వివిధ ట్రేడ్లకు సంబంధించి సీట్లు ఖాళీగా ఉన్నాయని తెలిపారు. ఆసక్తిగల అభ్యర్థులు www.iti.ap.gov.in వెబ్సైట్లో రిజిస్టేషన్ చేసుకోవాలన్నారు. రిజిస్టేషన్ చేయించుకున్న అనంతరం తమకు అందుబాటులో ఉన్న ప్రభుత్వ ఐటీఐల్లో సర్టిపికెట్లను వెరిఫికేషన్ చేయించుకోవాలన్నారు. వెరిఫికేషన్ చేయించుకున్న వారు మాత్రమే మెరిట్ జాబితాలోకి వస్తారని తెలిపారు. అభ్యర్థులు ఏ ఐటీఐలో ప్రవేశం కోసం రిజిస్టేషన్ చేసుకుని ఉంటారో అక్కడే ఈనెల 21వ తేదీ వారికి కౌన్సెలింగ్ ఉంటుందని పేర్కొన్నారు. రైళ్లలో ఆకస్మిక తనిఖీలు రాజంపేట : జిల్లాలో నడిచే పలు రైళ్లలో శుక్రవారం పోలీసులు, రైల్వేపోలీసులు సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. జిల్లా ఎస్పీ విద్యాసాగర్నాయుడు ఆదేశాల మేరకు తనిఖీలు జరిగాయి. చైన్నె–ముంబై మధ్య నడిచే సూపర్ఫాస్ట్ రైళ్ల బోగీలను క్షుణ్ణంగా పరిశీలించారు. గంజాయి,మత్తు పదార్థాల నిర్మూలన, అక్రమరవాణా అరికట్టేందుకు తనిఖీలు చేపట్టారు. డ్రగ్స్పై సమాచారం ఉంటే టోల్ ఫ్రీ నంబర్ 1972కు, 112కు ఫోన్ చేయాలని పోలీసులు తెలిపారు. సమాచారం ఇచ్చిన వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లాలోని మదనపల్లె మండలం వలసపల్లి గ్రామం, రాజంపేట మండలం నరమరాజుపల్లి గ్రామాల్లో ఉన్న శ్రీ జవహర్ నవోదయ విద్యాలయాల్లో 6వ తరగతిలో ప్రవేశం కోసం డిసెంబర్ 13వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. ఈవిషయాన్ని జిల్లా విద్యాశాఖాధికారి కె.సుబ్రమణ్యం శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలో ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన 2025–26 విద్యా సంవత్సరం ఐదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఆన్లైన్లో ఈ నెల 29వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవాలన్నారు. సమాచార హక్కు కమిషనర్కు ఫిర్యాదు రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంపై సమాచార హక్కు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు బాలపోగు సంపత్ కుమార్ తెలిపారు. శుక్రవారం రాయచోటిలో సమాచార హక్కు కమిషనర్కు ఫిర్యాదు చేసిన పత్రాలను పత్రికలకు అందజేశారు. సమాచారం కోసం జిల్లా ఎస్పీ కార్యాలయంలో రైట్ ఇన్ఫర్మేషన్ యాక్టు 2005 ప్రకారం సమాచారం ఇవ్వాలని కోరామన్నారు. తాము అడిగిన సమాచారం ఇవ్వకపోవడంతో సమాచార హక్కు కమిషనర్కు ఫిర్యాదు చేసినట్లు పేర్కొన్నారు. ప్రతి ఒక్కరికీ రూ.307 రావాలి రాయచోటి టౌన్ : జాతీయ ఉపాధి హామీ పనుల్లో ప్రతి కూలికి కనీసం రూ.307లు వచ్చే విధంగా చూడాలని డ్వామా పీడీ వెంకటరత్నం ఉపాధి హామీ సిబ్బందికి సూచించారు. శుక్రవారం రాయచోటి రూరల్ పరిధిలోని వరిగపాపిరెడ్డి గారిపల్లెలో జాతీయ ఉపాధి హామీ పథకంలో భాగంగా కుంటలో పూడిక తీత, మామిడి మొక్కల పెంపకం పనులను ఆయన పరిశీలించారు. ఈసందర్భంగా మాట్లాడుతూ కూలీలకు కనీస వసతులు కల్పించాలని చెప్పారు. ప్రతి గ్రామ పంచాయతీలో కనీసం 50 ఎకరాల్లో మొక్కల పెంపకం జరిగే విధంగా చూడాలని తెలిపారు.అనంతర కూలీల మస్టర్ను పరిశీలించారు. ఏపీవో రమేష్, టీఏ శ్రీనివాసులు పాల్గొన్నారు. పీజీ పరీక్షలు ప్రారంభం కడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం క్యాంపస్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ కళాశాల అనుబంధ పీజీ కళాశాలల రెండో సెమిస్టర్ రెగ్యులర్ విద్యార్థులకు పరీక్షలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. వైవీయూ రిజిస్ట్రార్ ఆచార్య పుత్తా పద్మ , కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావుతో కలసి పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఇందులో భాగంగా వైవీయూపీజీ కళాశాల కేంద్రాన్ని వారు పరిశీలించారు. జిల్లా వ్యాప్తంగా 653 మంది పరీక్షలకు హాజరు కాగా 21 మంది గైర్హాజరైనట్లు వారు తెలిపారు. -
ఆరోగ్యకరమైన కుటుంబం శ్రేయస్కరం
రాయచోటి టౌన్ : ఆరోగ్యకరమైన కుటుంబం సమాజానికి శ్రేయస్కరమని డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. శుక్రవారం ప్రపంచ జనాభా దినోత్సవం సందర్భంగా వైద్యులు, వైద్య సిబ్బందితో కలసి ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పెళ్లికి కావాల్సిన వయస్సు మహిళలకు 18, పురుషులకు 21 సంవత్సాలు నిండి ఉండాలని చెప్పారు.ప్రణాళికబద్ధమైన మాతృత్వం కోసం గర్భధారణల మధ్య ఆరోగ్యకరమైన సమయం, అంతరం ఉండాలని తెలిపారు.కార్యక్రమంలో డీపీహెచ్ఎన్వో ఇన్చార్జి బలరామరాజు, డిఫ్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ, ఆర్ఎంవో కిరణ్, డీపీఎంఓ రియాజ్ బేగ్, డీఎన్ఎంవో విష్ణువర్థన్ రెడ్డి,యుపీహెచ్సీ వైద్యులు ఎస్ఓ ఓబుల్ రెడ్డి, డీఎస్ఓ కరీముల్లా, రాజగోపాల్, పర్యవేక్షకులు శ్రీనివాసులు, వెంకటేశ్వరరెడ్డి, ఏఎన్ఓంలు, ఆశాకార్యకర్తలు పాల్గొన్నారు. -
కమనీయం..సౌమ్యనాథుడి కల్యాణం
నందలూరు : సౌమ్యనాథుని బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఏడోరోజు శుక్రవారం స్వామివారి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. కల్యాణాన్ని తిలకించేందుకు వచ్చిన భక్తులతో ఆలయం కిటకిటలాడింది. ఆలయ ప్రాంగణంలో వివిధ రకాల పుష్పాలతో కల్యా వేదికను అలంకరించారు. పాంచరాత్ర ఆగమ పండితులు రఘునందన్, పవన్కుమార్, మనోజ్కుమార్, సునీల్కుమార్, సాయిస్వామిలు శ్రీదేవి, భూదేవి సమేత సౌమ్యనాథస్వామికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఉత్పవమూర్తులను ముస్తాబు చేసి మేళతాళాల మధ్య కల్యాణ వేదికపై కొలువుదీర్చారు.అనంతరం కల్యాణాన్ని కన్నులపండువగా నిర్వహించారు. వేదపండితులు, ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో మాంగల్యధారణ, ముత్యాల తలంబ్రాలు క్రతువులను నిర్వహించారు. భక్తుల హరి నామస్మరణలతో ఆలయం భక్తిపారవశ్యంతో నిండిపోయింది. కల్యాణోత్సవం అనంతరం శ్రీదేవి భూదేవి సమేత సౌమ్యనాథస్వామిని ఆలయం చుట్టూ పల్లకీలో ఊరేగించారు. శుక్రవారం రాత్రి గజవాహనంపై స్వామివారు మాడవీధులలో ఊరేగుతూ భక్తులకు దర్శనమిచ్చారు. భక్తులు కాయ కర్పూరం సమర్పించి మొక్కులను తీర్చుకున్నారు. శనివారం ఉదయం రథోత్సవం నిర్వహించేందుకు టీటీడీ అధికారులు ఏర్పాట్లు చేశారు. అన్నదానం : కల్యాణోత్సవానికి వచ్చిన భక్తులకు ప్రముఖ పారిశ్రామికవేత్త, టీడీపీ నాయకుడు సోమలరాజు చంద్రశేఖర్రాజు ఆధ్వర్యంలో అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు.కల్యాణం సందర్భంగా ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా రాజంపేట రూరల్ సీఐ బివి రమణ ఆధ్వర్యంలో ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేశారు. స్వర్ణాంధ్ర సంస్థ అధ్యక్షుడు వేపగుంట శ్యామ్రాజ్ ఆధ్వర్యంలో స్కౌట్ సభ్యులు భక్తులకు సేవలు అందించారు. మారుమోగిన హరినామస్మరణ