breaking news
annamayya district Latest News
-
ఎంత కష్టం.. ఎంత నష్టం
గుర్రంకొండ: ఇటీవల కురిసిన వర్షాలకు జిల్లాలోని టమాటా తోటలు భారీగా దెబ్బతిన్నాయి. వర్షాల కారణంగా నల్లమచ్చలు, గజ్జిరోగాలతో పంట దిగుబడి తగ్గిపోయింది. ధరలు ఇప్పుడిప్పుడే పుంజుకొంటున్నా రోగాలతో తోటలు దెబ్బతిని రైతులు భారీగా నష్టపోయారు. వందక్రీట్ల టమటా కోతల్లో సుమారు 35 నుంచి50 క్రీట్ల వరకు రోగాలబారిన పడినకాయలే ఉంటున్నాయి. మార్కెట్లో ప్రస్తుతం 25కేజీల టమాటా క్రీట్ ధర రూ. 550 పలుకుతుండగా రోగాల బారిన పడిన టమాటాలను మార్కెట్లో కొనే వారు లేక పలువురు రైతులు కాయలు కోయకుండా తోటలు వదిలేస్తున్నారు. జిల్లావ్యాప్తంగా 7560 ఎకరాల్లో టమాటా పంట దెబ్బతింది. ధరలు పుంజుకొంటున్నా దిగుబడి ఏది? ప్రస్తుతం మార్కెట్లో టమాటా ధరలు పుంజుకొంటున్నాయి. వారం రోజుల కిందటవరకు 25కేజీల క్రీట్ ధర రూ. 300 లోపు ఉండగా ప్రస్తుతం రూ.550 వరకు ధరలు పలుకుతున్నాయి. అయితే ధరలు పుంజుకొంటున్నా పంట దిగుబడి మాత్రం రోగాలు, వైరస్ల కారణంగా సగానికిపైగా తగ్గిపోయింది. దీంతో రైతులు ఆందొళన చెందుతున్నారు. టమాటాపై ఒకమచ్చ మాత్రమే ఉన్న కాయలు 25కేజీల క్రీట్ ధర కేవలం రూ. 50 నుంచి రూ.80 లోఫు మాత్రమే ధరలు పలుకుతున్నాయి. మచ్చల సంఖ్య ఎక్కువగా ఉంటే వ్యాపారులు కొనడానికి నిరాకరిస్తున్నారు. దీంతో చేసేదిలేక రైతులు రొడ్డుపక్కన పారోబోసి వెళ్లిపోతున్నారు.ప్రస్తుతం నల్లమచ్చలు, గజ్జిరోగాలున్న టమాటా తోటల్లో కాయలు ఎకరానికి 240 నుంచి 280 క్రీట్లు వస్తున్నాయి. 35 నుంచి50 శాతం మేరకు మచ్చలున్న టమాటాలే: వర్షాల కారణంగా మంచి కాపుమీదున్న టమాటా తోటల్లో 35 నుంచి 50 శాతం మేరకు కాయలు దెబ్బతిన్నాయి. కోత సమయంలో వంద క్రీట్లకు 35 నుంచి 50 క్రీట్లు నల్లమచ్చలున్న టమాటాలే ఉండడం గమనార్హాం. వీటిని మామూలు టమాటాల నుంచి వేరు చేసి మార్కెట్కు తర లించాలంటే తలప్రాణం తోకకు వస్తోందని రైతులు వాపోతున్నారు. కొన్ని మండలాల్లో 50 శాతం నుంచి 75 శాతం మేరకు నల్లమచ్చలు రావడంతో పంటను కాపాడుకోవడం భారంగా మారింది. 7560 ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు: వర్షాల కారణంగా జిల్లా వ్యాప్తంగా 7560 ఎకరాల్లో టమాటా పంటలు దెబ్బతిన్నాయి. కొన్ని ప్రాంతాల్లో కాయల రూపురేఖలు మారిపోయాయి. ఓ వైపు నల్లమచ్చలు, మరోవైపు రంధ్రాలున్న కాయలు ఎక్కువగా వస్తున్నాయి. ఈ రకం కాయలకు మార్కెట్లో డిమాండ్ లేకపోవడంతో చేసేదిలేక పలువురు రైతులు తోటలవద్దనే పారబోస్తున్నారు. మరికొంతమంది పశుగ్రాసంగా వినియోగిస్తున్నారు. లక్షలాది రూపాయలు ఖర్చుచేసినా ఫలితం లేదని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సాగు చేసిన పంట ఎకరాల్లో: 18532 దెబ్బతిన్నపంట ఎకరాల్ల్లో: 7560 అమ్ముడుబోని టమాటాలను రోడ్డుపక్కన పారబోసిన రైతులు పొలాల వద్ద పశుగ్రాసంగా మారిన టమాటాలు వర్షాలకు దెబ్బతిన్న టమాటా నల్లమచ్చలు,గజ్జి రోగాలతోతగ్గిన పంట దిగుబడి పలుచోట్ల కాయలు కోయకుండాతోటల్లో వదిలేసిన రైతులు -
అప్రజాస్వామికం
పత్రికలు ప్రజాస్వామ్యానికి మూలస్తంభం లాంటివి. ప్రభుత్వ వైఫ ల్యాలను ఎత్తిచూపుతున్నారనే కక్షతో ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడటం సరికాదు. సాక్షి ఎడిటర్ ధునుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమకేసులు పెట్టడం అప్రజాస్వామికం. తక్షణమే వీటిని రద్దుచేయాలి. –రామిరెడ్డి ధ్వజారెడ్డి, వైస్ఎంపీపీ, రైల్వేకోడూరు బెదిరింపులు మానుకోవాలి కూటమి ప్రభుత్వం మీడియా పట్ల బెదిరింపు ధోరణి మానుకోవాలి. ప్రభుత్వ అక్రమాలను ప్రజలకు మీడియా ద్వారా చేరవేస్తున్నందుకు కక్షకట్టి సాక్షి ఎడిటర్,పై కేసు లు పెట్టడం సరికాదు. భవిష్యత్తు లో మూల్యం చెల్లించుకుంటారు. – శ్రీనివాసులు, సీనియర్ రిపోర్టర్, ఎస్సీ ఫైనాన్స్ కమిషన్ మాజీ డైరెక్టర్ కూటమిది కక్షసాధింపు ప్రభుత్వ విధానాల్లోని లోపాలను ఎత్తిచూపుతున్న పత్రికలపై ప్రభుత్వం కక్ష సాధింపు చర్య లకు దిగడం సిగ్గుచేటు.ఇది వాస్తవాలను సమాధి చేయాలనే దుష్ట పన్నాగం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమంగా బనాయించిన కేసులను రద్దు చేయాలి. –చిన్ననాగిరెడ్డి, ఉప సర్పంచ్, చాకిబండ పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు సరికాదు పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేయడమంటే ప్రజాస్వామ్య స్ఫూర్తికే ప్ర మా దం. ఇటువంటి చర్యల ను ప్రజలు హర్షించరు. స్రాక్షి కార్యాలయంపై దాడులు, ఎడిటర్పై కేసులు నమోదు చేయడం.. పత్రికా స్వేచ్ఛను దెబ్బతీసే విధంగా ప్రభుత్వం వ్యవహరిస్తున్న తీరును వెంటనే మార్చుకోవాలి. – యర్రపురెడ్డి విశ్వనాథరెడ్డి, మండల సర్వీసెస్ కమిటీ మాజీ సభ్యులు, సుండుపల్లె -
ఏపీ అంటే అమరావతి, పోలవరమా?
వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కె.సురేష్బాబు రాజంపేట రూరల్ : ఏపీ అంటే అమరావతి, పోలవరం అనే విధంగా సీఎం చంద్రబాబు పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్లో ఆదివారం మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను నిరసిస్తూ రూరల్ పరిధిలో కోటీ సంతకాల సేకరణ కార్యక్రమాన్ని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనీల్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించారు. ముఖ్య అతిథులుగా వైఎస్సార్సీపీ జిల్లా పరిశీలకులు కొత్తమద్ది సురేష్బాబు, జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి పాల్గొని మండల పరిధిలోని నాయకులు, కార్యకర్తలకు కోటి సంతకాల సేకరణపై దిశా నిర్దేశం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ ఎన్నికల సమయంలో సూపర్ సిక్స్ పథకాలతోపాటు జననేత వైఎస్ జగన్మోహన్రెడ్డి అందజేస్తున్న పథకాలన్నింటిని అమలు చేస్తామని కూటమి నాయకులు ప్రజలను మభ్య పెట్టారన్నారు. సూపర్ సిక్స్ పథకాలు అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం అపసోపాలు పడుతోందని ఎద్దేవా చేశారు. తమ సామాజిక వర్గానికి మేలు చేసేందుకు అమరావతికి వేల కోట్ల నిధులు వెచ్చిస్తున్నారని మండిపడ్డారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రవేశ పెట్టిన పథకాలను అమలు చేయక పోగా.. నిర్వీర్యం చేసేందుకు కంకణం కట్టుకున్నారని దుయ్యబట్టారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయనీయబోమని అన్నారు. బడుగు బలహీన వర్గాలకు ఆశా దీపంగా నిలుస్తున్న మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేయటం సరికాదన్నారు. దీనిని ప్రతి ఒక్కరూ వ్యతిరేకించి సంతకాలు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. రేపటి మన బిడ్డల భవిష్యత్ కోసం మనం వైఎస్సార్సీపీకి అండగా నిలవాలన్నారు. ఈ సమావేశంలో అధిక సంఖ్యలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
నష్టపోయాం
వర్షాలతో టమాటా పంటకు నల్లమచ్చలు, గజ్జిరోగాలు సోకి తోటలు దెబ్బతిన్నాయి. వైరస్లు, రోగాల కారణగా ఎకరం పంటకు సుమారు 800 క్రీట్ల దిగుబడి రాగా ఇందులో సగానికిపైగా అంటే 300నుంచి 400క్రీట్ల వరకు నల్లమచ్చలున్న టమాటాలు వస్తున్నాయి. చెట్టుకాండం నుంచి ఆకులు, కాయలతో సహా నల్లమచ్చలు ఏర్పడ్డాయి. దీంతో తీవ్రంగా నష్టపోయాం. – రెడ్డిమోహన్, గుర్రంకొండ కొనేవారు లేరు మార్కెట్లో నల్లమచ్చలు, గజ్జి రోగం సోకిన టమాటాలను కొనేవారు కరువయ్యారు. నాణ్యమైన టమాటాలు ఒక క్రీట్ ధర రూ.550వరకు పలుకుతున్నాయి. అయితే నల్లమచ్చలున్న కాయలు ఒక క్రీట్ ధర రూ.70లోపే ఉంటోంది. దీంతో ఒకక్రీట్కు రూ.500 వరకు రైతులు నష్టపోతున్నారు. టమాటా తోటల్లొ రోగాల నివారణ కోసం ఎకరానికి రూ. 60 వేలు వరకు మందుల కొసం ఖర్చు చేయాల్సి వస్తోంది. –మల్లయ్య, మొరంపల్లె -
దీపావళి ప్రతి ఇంటా కాంతులు నింపాలి
రాజంపేట టౌన్/రాయచోటి అర్బన్: దీపా వళి ప్రతి ఇంటా కొత్త కాంతులు నింపాలని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి పేర్కొన్నారు. జిల్లా ప్రజలకు ఆయన పండుగ శుభాకాంక్షలను తెలిపారు. దీపావళి అంటే చీకటిపై కాంతి, చెడుపై మంచి, అజ్ఞానంపై జ్ఞానం సాధించిన విజయంగా పేర్కొన్నారు. ఈ పండుగను ప్రజలందరూ ఆనందంగా, జాగ్రత్తగా జరుపుకోవాలని సూచించారు. రాయచోటి: ఈనెల 20న నిర్వహించనున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని తాత్కాలికంగా రద్దు చేశారు. రాయచోటి కేంద్రంగా కలెక్టరేట్ , ఎస్పీ కార్యాలయాల్లో సోమవారం జరగబోయే ఈ కార్యక్రమాన్ని దీపావళి పండుగ నేపథ్యంలో తాత్కాలికంగా రద్దు చేస్తున్నట్లు ఆదివారం వేర్వేరుగా అందజేసిన ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు ఈ విషయాన్ని గమనించి స్పందన ఫిర్యాదులను సమర్పించేందుకు రావద్దని ప్రకటనలో పేర్కొన్నారు. పీబీసీలోకి కృష్ణా జలాలు బి.కొత్తకోట: మండలంలోని గుండ్లపల్లె వద్ద హంద్రీ–నీవా పుంగనూరు ఉప కాలువ (పీబీసీ)కు గత బుధవారం గండిపడి తెగిపోయిన విషయం తెలిసిందే. దీనికారణంగా నీటి తరలింపు నిలిపివేశారు. కాలువకు మరమ్మతులు పూర్తి చేయడంతో సత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె రిజర్వాయర్ నుంచి ఆదివారం తెల్లవారుజాము 1.30 గంటలకు కృష్ణా జలాలను విడుదల చేశారు. తొలుత 200 క్యూసెక్కులు వదిలిన అధికారులు కొన్నిగంటల తర్వాత 275 క్యూసెక్కులకు పెంచారు. గండిపడిన కాలువ మరమ్మతులు పూర్తిచేసినా మళ్లీ అక్కడ గండిపడకుండా ఉండేందుకు అధికారులు జాగ్రత్తలు తీసుకుంటున్నారు. -
ఎకై ్సజ్ సురక్ష యాప్పై అవగాహన అవసరం
రాజంపేట : ఎకై ్సజ్ సురక్ష యాప్పై అవగాహన కలిగి ఉండాలని జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ జి.మధుసూదన్ తెలిపారు. రాజంపేటలో పలు మద్యంషాపులను ఆయన ఆదివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా ఉన్న 122 మద్యంషాపులు, 11 బార్లను క్షుణ్ణంగా తనిఖీలు చేశామన్నారు. ప్రతి షాపులో ప్రభుత్వం సరఫరా చేసిన మద్యం మాత్రమే ఉందన్నారు. నకిలీ మద్యం ఎక్కడా లేదన్నారు. నకిలీ మద్యం అమ్మితే ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా ఇట్టే పసిగట్టవచ్చునన్నారు. ఒక వేళ ఎక్కడైనా మద్యం అమ్మిన బాటిల్ కన్సూమర్ పోర్టల్లో వివరాలు రాకపోయినా, మద్యం బాటిల్ అనుమానాస్పదంగా ఉన్న వెంటనే స్థానిక ఎకై ్సజ్ అధికారులు, జిల్లా ఎకై ్సజ్ సూపరింటెండెంట్ (7981216391)ను సంప్రందించాలన్నారు. వాట్సాప్లో ఆ బాటిల్ ఫొటో పంపిన తక్షణమే చర్యలు తీసుకుంటామన్నారు. శనివారం జిల్లా వ్యాప్తంగా 1,11,628 మద్యం సీసాలను స్కాన్ చేసి అమ్మడం జరిగిందన్నారు. కార్యక్రమంలో రాజంపేట ఎకై ్సజ్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మల్లిక, ఎస్ఐ సుధాకర్ తదితరులు పాల్గొన్నారు. ట్రాక్టర్, స్కూటర్ ఢీకొని ముగ్గురికి గాయాలు పీలేరు రూరల్ : ట్రాక్టర్ – స్కూటర్ ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలైన సంఘటన మండలంలోని మొరవ వడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. రొంపిచెర్ల మండలం పెద్దమల్లెల పంచాయతీ పెళ్లికణం గూడెంకు చెందిన పి.జ్యోతి భానుకుమార్ (23), పి.హరీష్ (21), ఎన్.జ్యోతికుమార్ (19) టపాసులు కొనుగోలు చేయడానికి ద్విచక్రవాహనంలో పీలేరుకు బయలుదేరారు. మొరవవడ్డిపల్లె వద్ద స్కూటర్, ఎదురుగా వచ్చిన ట్రాక్టర్ ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వారిని చికిత్స నిమిత్తం పీలేరులోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. యువకుడికి గాయాలు గాలివీడు : మండలంలోని నక్కలవాండ్లపల్లి వద్ద ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆసీఫ్(33) అనే వ్యక్తికి గాయాలయ్యాయి. గ్రామస్తుల కథనం మేరకు.. మండలంలోని నూలివీడు గ్రామం నక్కలవాండ్లపల్లి చెరువు మలుపు వద్ద ట్రాక్టర్ ద్విచక్రవాహనాన్ని ఢీకొనడంతో పార్సిల్ కొరియర్ బాయ్ ఆసీఫ్ ఎడమ కాలు విరిగినట్లు సమాచారం. వెంటనే స్థానికుల సమాచారం మేరకు ప్రైవేటు వాహనంలో రాయచోటికి తరలించారు. తర్వాత మెరుగైన వైద్యం కోసం కడప తరలించారని బంధువులు తెలిపారు. -
మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను అడ్డుకుందాం
– మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి కలికిరి(వాల్మీకిపురం)/కలకడ : పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేయడానికే చంద్రబాబు కుట్ర పన్నారని, అందుకే వైద్య కళాశాలలను ప్రైవేటు పరం చేస్తున్నారని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు, పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి ఆరోపించారు. పీలేరు నియోజకవర్గ పరిధిలోని వాల్మీకిపురం మండలం నగిరిమడుగు, కలకడ మండలంలోని కలకడ పంచాయతీ, కోన గ్రామ పంచాయతీలలో ఆదివారం కోటి సంతకాల సేకరణపై రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సామాన్యులకు మెరుగైన వైద్య సదుపాయాలు, అందరికీ అందుబాటులోకి వైద్య విద్యను తీసుకురావడానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎంతో కృషి చేసి రాష్ట్రానికి 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. వీటిలో దాదా పు పది కళాశాలలు నిర్మాణాలు పూర్తి చేసుకున్నాయన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడ్డాక వీటికి అప్పనంగా ప్రైవేటు వ్యక్తులకు అప్పంగించేందుకు ప్రయత్నిస్తున్నారని విమర్శించారు. ప్రైవేటీకరణను అడ్డుకోవడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం తలపెట్టారన్నారు. డైవర్షన్ రాజకీయాలు కూటమి ప్రభుత్వానికి ప్రజల నుంచి వ్యతిరేక సెగలు తగులుతుండటంతో సీఎం చంద్రబాబు రోజుకొక రకం డైవర్షన్ పాలిటిక్స్ తెరపైకి తెస్తున్నారని మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి విమర్శించారు. జరగని లిక్కర్ స్కామ్లో రాజంపేట ఎంపీ మిథున్రెడ్డిని అక్రమంగా జైలులో నిర్భందించారని గుర్తు చేశారు. ఎంపీ బెయిల్పై విడుదలైనా కూడా ఎంపీ, ఆయన కుటుంబ సభ్యులపై కూటమి ప్రభుత్వం ఏదో రకంగా వేధింపులు కొనసాగిస్తుండటం దుర్మార్గపు చర్యలకు అద్దం పడుతోందని పేర్కొన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమాలు, కుట్రలు, దౌర్జన్యాలను పార్టీ నాయకులు, కార్యకర్తలు విస్తృతంగా ప్రజల్లోకి తీసుకెళ్లాలని పిలుపునిచ్చారు. అనంతరం ప్రజలతో సంతకాలు సేకరించారు. వాల్మీకిపురం కార్యక్రమంలో పార్టీ బీసీ సెల్ నియోజకవర్గ అధ్యక్షులు నీళ్ళ భాస్కర్, సీనియర్ నాయకులు చింతల ఆనందరెడ్డి, మండల కన్వీనర్ పులి శివకుమార్రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, సర్పంచ్ రజని, ఎంపీటీసీ రెడ్డెప్ప, పీఎస్ వెంకటరమణారెడ్డి, వెంకటరెడ్డి, సురేంద్రరెడ్డి, సురేష్కుమార్రెడ్డి, రమేష్, విశ్వనాథ, ఈశ్వర్రెడ్డి, కలకడ మండలంలో కన్వీనర్ కమలాకర్రెడ్డి, కోన సర్పంచ్ జల్లా రాజగోపాల్రెడ్డి, షావత్ అల్లీ ఖాన్, శ్రీనివాసులురెడ్డి, లక్ష్మిరెడ్డి, రవికుమార్, జిలానీ బాషా, మస్తాన్ అహ్మద్, అంజన్కుమార్, జీవి కిశోర్, వెంకట్రమణారెడ్డి, ప్రకాష్రెడ్డి, మధుసూదన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పెన్నాలో గల్లంతైన వ్యక్తి మృతదేహం లభ్యం
సిద్దవటం : పెన్నా నదిలో గల్లంతైన వ్యక్తి మృతదేహం ఆదివారం లభ్యమైంది. సిద్దవటం మండలంలోని వంతాటిపల్లి ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యల నందు(36) గ్రామ సమీపంలోని పెన్నా వద్దకు తన పెంపుడు కుక్కతో శనివారం మధ్యాహ్నం వెళ్లారు. నదిలో చేపలు ఎగురుతుండటంతో.. వాటి కోసం కుక్క అందులోకి దూకింది. కుక్కను రక్షించేందుకు పెన్నా నీటిలో దిగి సుడిగుండంలో చిక్కుకొని గల్లంతైన విషయం తెలిసిందే. ఒంటిమిట్ట సీఐ బాబు ఆధ్వర్యంలో గజ ఈతగాళ్లు, కడప రెస్క్యూ టీమ్ వారు శనివారం సాయంత్రం వరకు గాలింపు చర్యలు చేపట్టారు. మరలా ఆదివారం ఉదయం గాలింపు చర్యలు చేపట్టగా సిద్దవటం మండలం ఎస్.రాజంపేట గ్రామ సమీపంలోని పెన్నా నదిలో నందు మృతదేహం లభ్యమైంది. మృతుడికి భార్య పూజ, మూడేళ్ల కుమార్తె ఉంది. భార్య 8 నెలల నిండు గర్భిణి. కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. మృతదేహాన్ని శవ పరీక్ష నిమిత్తం కడప రిమ్స్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. ఝరికోనలో పడి వ్యక్తి మృతి కలకడ : ఝరికోన ప్రాంతంలో ఆహ్లాదంగా గడపడానికి కుటుంబంతో వచ్చిన ఓ వ్యక్తి ప్రమాదవశాత్తు ఝరికోనలో పడి మృతి చెందిన ఘటన ఆదివారం మండలంలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు... సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన అజమతుల్లా(30) తన కుటుంబ సభ్యులతో ఝరిగడ్డ ప్రాంతానికి కుటుంబంతో కలిసి వెళ్లాడు. అక్కడ ప్రమాదవశాత్తు జారి కాలువలో పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే 108 వాహనానికి సమాచారమిచ్చారు. సంఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది అజమతుల్లాను కలకడ పీహెచ్సీకి తరలించారు. మెరుగైన చికిత్స నిమిత్తం మహల్ సీహెచ్సీకి తరలించగా పరీక్షించిన వైద్యులు.. అజమతుల్లా మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
ప్రజల మన్ననలు పొందిన నాయకుడు బ్రహ్మయ్య
బ్రహ్మయ్య విగ్రహం, ఉద్దండం ఘాట్ వద్ద నివాళులర్పిస్తున్న ఎమ్మెల్యే ఆకేపాటి, చొప్పా గంగిరెడ్డి రాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు జన్మస్థలి తాళ్లపాకలో సర్పంచిగా పని చేసి అక్కడి ప్రజల మన్ననలు పొందిన ఉద్దండం బ్రహ్మయ్య సేవలను రాజకీయ పార్టీలకు అతీతంగా పలువురు నేతలు కొనియాడారు. ఆదివారం తాళ్లపాకలో ప్రభుత్వ పాలిటెక్నికల్ కళాశాల మాజీ ప్రిన్సిపాల్ ఉద్దండం సుబ్రమణ్యం ఆధ్వర్యంలో తాళ్లపాకలో ఏర్పాటు చేసిన మాజీ సర్పంచి ఉద్దండం బ్రహ్మయ్య విగ్రహాష్కరణ ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాఽథ్రెడ్డి.. బ్రహ్మయ్య సమాధి వద్ద నివాళులు అర్పించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ సర్పంచిగా తాళ్లపాక గ్రామాభివృద్ధికి విశేష కృషి చేశారని గుర్తుచేశారు. అన్నమాచార్య యూనవర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ తమ ప్రాంత అభివృద్ధికి రాజకీయాలకు అతీతంగా పని చేసిన వ్యక్తి ఉద్దండం బ్రహ్మయ్య అన్నారు. తాళ్లపాకను అభివృద్ధి చేయాలని అనేక మార్లు టీటీడీ ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్లారన్నారు. ఈయనతోపాటు సోదరుడు చొప్పా అనిల్రెడ్డి తదితర వైఎస్సార్సీపీ నాయకులు పాల్గొన్నారు. అనంతరం విగ్రహావిష్కరణ సభలో శ్రీశైలం దేవస్థానం చైర్మన్ పోతుగుంట రమేష్నాయుడు, మాజీ ఎమ్మెల్సీ బత్యాల చెంగల్రాయుడు, జనసేన నేత అతికారికృష్ణ, క్షత్రియ కార్పొరేషన్ డైరెక్టరు అద్దెపల్లె ప్రతాప్రాజు, టీడీపీ ఇన్చార్జి చమర్తి జగన్మోహన్రాజు, మోదుగల కళావతమ్మ, ఇంజినీరింగ్ కళాశాల అధినేత పెంచలయ్య, న్యాయవాది సురేష్రాజు, అదృష్ణదీపుడు, మోహనరావు, గణేషు, గీతాంజలి విద్యా సంస్థల అధినేత ఎస్వీరమణ, మైనార్టీ నేత గుల్జార్బాషా, రాజంపేట టీడీపీ అధ్యక్షుడు మేడికొండు రవికుమార్నాయుడు, మాజీ ఎంపీపీ పారా సుబ్బానాయుడు, ప్రముఖ వైద్యుడు సుధాకర్, టీడీపీ నాయకుడు ఇడమడకల కుమార్, తాళ్లపాక గ్రామస్తులు పాల్గొన్నారు. -
ప్రమాదంలో బొమ్మిరెడ్డి చెరువు
బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం బండారువారిపల్లె పంచాయతీలోని బొమ్మిరెడ్డిచెరువు ప్రమాదస్థితిలో ఉండటంతో మూడు గ్రామాల ప్రజల్లో భయాందోళనలు నెలకొన్నాయి. ఆదివారం రాత్రి ప్రజలు కట్టపైకి చేరుకుని ఏం జరుగుతుందో అని ఆందోళన చెందారు. దీనికి సంబంధించి వివరాలు. మండలంలోని కనికలతోపు సమీపంలో ముంబై–చైన్నె జాతీయ రహదారిపైనే బొమ్మిరెడ్డి చెరువు ఉంది. ఇటీవల కురిసిన వర్షాలకు చెరువు నిండిపోయి ప్రవహిస్తోంది. రెండురోజులుగా కురిసిన భారీ వర్షానికి హర్సిలీహిల్స్, పక్కనే ఉన్న కొండలు, గుట్టల్లో కురిసిన వర్షంనీళ్లు చెరువులోకి చేరడంతో ప్రమాదకర స్థాయిలో నిండింది. మొరవ వెళ్తున్నప్పటికి నీటి మట్టం తగ్గడం లేదు. ఈ పరిస్థితుల్లో కట్ట బలహీపడింది. కట్టపై పగుళ్లు రావడమే కాకుండా మట్టి కుంగుతోంది. కట్టపైన తారురోడ్డుకు పగుళ్లు వచ్చాయి. దీంతో చెరువుకట్ట ప్రమాదస్థితికి చేరడంతో గ్రామస్తులు తీవ్ర భయాందోళనలు వ్యక్తం చేస్తున్నారు. దురదృష్టవశాత్తు కట్ట తెగితే..దీనికి సమీపంలోని కనికలతోపు, ఉమాశంకర్కాలనీ, తుమ్మనంగుట్ట, మద్దూరివారిపల్లె కాలనీకి ప్రమాదం వాటిల్లుతుంది. ఇళ్లు మునిగిపోయే పరిస్థితి ఉందని ఆందోళన చెందుతున్నారు. ఈ విషయాన్ని గ్రామస్తులు అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. కట్ట బలహీనపడి పగుళ్లు, కుంగుతున్న కట్ట -
కూటమి కుట్రలను ప్రజలకు వివరిద్దాం
గాలివీడు : కూటమి ప్రభుత్వం కుట్రలను ప్రజలకు వివరిద్దామని వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి పిలుపునిచ్చారు. ఆదివారం బోరెడ్డిపల్లె, నూలివీడు పంచాయతీల్లో ఆయన పర్యటించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం చేస్తున్న కుట్రలను ప్రతి ఇంటా తెలియజేసి.. వైఎస్సార్ సీపీ తిరిగి అధికారంలోకి రావాల్సిన అవసరాన్ని తెలియజేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని తిరిగి ముఖ్యమంత్రిని చేసుకోవాల్సిన విషయాన్ని ప్రజలకు వివరిస్తామన్నారు. అనంతరం నక్కలవాండ్లపల్లెలో మల్లేశ్వరస్వామి దేవస్థానానికి మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్రెడ్డి కృషితో వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మంజూరైన నిధులకు సంబంధించిన పనులను ఆయన పరిశీలించి ముఖ ద్వారానికి టెంకాయ కొట్టారు. బోరెడ్డిగారిపల్లెలో వైఎస్సార్సీపీ మైనార్టీ కార్యకర్త ఖలందర్బాషా ఇంటిలో జరిగిన వివాహ వేడుకలో పాల్గొని వధూవరులను ఆశీర్వదించి మాట్లాడారు. రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయాలని కుట్రలను కోటి సంతకాల కార్యక్రమం ద్వారా తిప్పికొట్టాలని సూచించారు. పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించాలనే లక్ష్యంగా అప్పటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకంగా 17 వైద్య కళాశాలల నిర్మాణాలకు శ్రీకారం చుట్టిందని తెలిపారు. వాటిని ప్రైవేటీకరణ చేసి పేద విద్యార్థులకు వైద్య విద్యను దూరం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కుట్రలు చేస్తోందన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సభ్యలు గడ్డం చంద్రప్రకాశ్రెడ్డి, సర్పంచ్ నారాయణ, మాజీ సర్పంచ్ వెంకట నారాయణరెడ్డి, మైనార్టీ అధ్యక్షులు మన్సూర్, నాయకులు మహబూబ్బాషా, భానుమూర్తిరెడ్డి, అర్చకులు జల్లా మల్రెడ్డి, వల్లపు నాగేష్, రామాంజులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర లీగల్ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ జల్లా సుదర్శన్రెడ్డి -
బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం స్ఫూర్తిదాయకం
ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డికడప సెవెన్రోడ్స్ : మహాదాత బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం అందరికీ స్ఫూర్తిదాయకమని రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి అన్నారు. ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కుమ్మరి దస్తగిరి రచించిన బుడ్డా వెంగళరెడ్డి జీవిత చరిత్ర పుస్తక పరిచయ కార్యక్రమం రాయలసీమ టూరిజం అండ్ కల్చరల్ సొసైటీ కార్యదర్శి కొండూరు జనార్దన్రాజు ఆధ్వర్యంలో ఆదివారం కడప హౌసింగ్బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి మాట్లాడుతూ డొక్కల కరువులో తిండి లేక వేలాది మంది రాయలసీమ ప్రజలు మృత్యువాత పడ్డారని పేర్కొన్నారు. అలాంటి సమయంలో బుడ్డా వెంగళరెడ్డి కొన్ని వేల మందికి కొన్ని నెలల పాటు అంబలి పోసి ప్రాణాలు కాపాడారన్నారు. ఆయన దాతృత్వం, సేవల గురించి భావితరాలకు తెలియజెప్పాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. కడపలో ఆయన విగ్రహ ఏర్పాటుకు అందరూ ముందుకు రావాలని, తనవంతు సహకారం అందిస్తానని హామీ ఇచ్చారు. పాఠ్యాంశాల్లో చేర్చాలి ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి మాట్లాడుతూ బుడ్డా వెంగళరెడ్డి దాతృత్వం, ఆయన చరిత్ర గురించి పాఠ్యాంశాల్లో చేర్చాల్సిన అవసరం ఎంతో ఉందని అన్నారు. అలాగే ప్రభుత్వ పథకాలకు ఆయన పేరు పెట్టాలన్నారు. ఇందువల్ల భావి తరాలు ఆయన గురించి తెలుసుకుని స్ఫూర్తి పొందేందుకు వీలుంటుందన్నారు. ఈ విషయాన్ని తాను రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి తీసుకెళతానని తెలిపారు. వర్సిటీలు పరిశోధనలు జరపాలి రాయలసీమ కార్మిక కర్షక సమితి అధ్యక్షులు సీహెచ్ చంద్రశేఖర్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమకు చెందిన బుడ్డా వెంగళరెడ్డి, ఉయ్యాలవాడ నరసింహారెడ్డిలతోపాటు ఎందరో మహానీయుల సేవలు, త్యాగాలను వెలుగులోకి తీసుకు వచ్చేందుకు విశ్వవిద్యాలయాలు పరిశోధనలు చేపట్టాలని అన్నారు. వారి జీవితం, సేవల గురించి ప్రభుత్వం కూడా విస్తృత ప్రచారం చేయాల్సిన అవసరం ఉందన్నారు. నందన, డొక్కల, ధాతు వంటి భయానక కరువుల్లో రాయలసీమ ప్రజలు అనుభవించిన ఆవేదన, కన్నీళ్లు, అవమానాలు లాంటి అంశాల గురించి బ్రిటీషు గెజిటీర్లు, చరిత్ర పుస్తకాల్లో లేవన్నారు. ఆ విషయాలను చరిత్ర పరిశోధకులు వెలుగులోకి తీసుకు రాగలిగితే రాయలసీమ యువత ఈ ప్రాంత అభివృద్ధి కోసం పెద్ద ఎత్తున ముందుకు వచ్చే అవకాశం ఉంటుందన్నారు. ఘనంగా సన్మానం పుస్తక రచయిత దస్తగిరి, బుడ్డా వెంగళరెడ్డి ఐదవ తరం వారసులు బుడ్డా విష్ణువర్దన్రెడ్డి, ఉయ్యాలవాడ గ్రామానికి చెందిన కవి కర్నాటి రామకృష్ణారెడ్డి, పుస్తక సమీక్షకులు జీవీ సాయిప్రసాద్, రెడ్డి సేవా సమితి జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీ పద్మప్రియ చంద్రారెడ్డి, యూ ట్యూబర్ దండా ప్రసాద్లను నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమంలో శ్రీ కోదండ రామాలయ ధర్మకర్త దేసు వెంకటరెడ్డి, కడప నగర డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు మోపూరి బాలకృష్ణారెడ్డి, ఇంటాక్ జాతీయ గవర్నింగ్ కౌన్సిల్ సభ్యులు లయన్ కె.చిన్నపరెడ్డి, లయన్స్ క్లబ్ ఆఫ్ కడప అన్నమయ్య జిల్లా అధ్యక్షులు డాక్టర్ ఆర్.రంగనాథరెడ్డి, నగర ప్రముఖులు పోతుల వెంకట్రామిరెడ్డి, వైఎస్సార్ సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, మానవత సంస్థ ప్రతినిధులు డాక్టర్ రామాంజులరెడ్డి, ఆచార్య సాంబశివారెడ్డి, సుబ్బరాయుడు తదితరులు పాల్గొన్నారు. మాట్లాడుతున్న ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథరెడ్డి కార్యక్రమంలో పాల్గొన్న సాహితీ ప్రియులు -
టపాసుల మోతే!
రాయచోటి : దీపావళి వేడుకలకు జిల్లా వ్యాప్తంగా విక్రయ కేంద్రాలను సిద్ధం చేశారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా టపాసుల విక్రయ కేంద్రాల నిర్వహణకు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశానుసారం అగ్నిమాపక శాఖ జిల్లా అధికారి అనిల్కుమార్ ఆధ్వర్యంలో ఏర్పాట్లపై పర్యవేక్షణ చేస్తున్నారు. రెవెన్యూ, పోలీసు, విద్యుత్ శాఖల సమన్వయంతో జిల్లాలోని శాశ్వత టపాసుల విక్రయ కేంద్రాలతో పాటు పండుగ సందర్భంగా తాత్కాలిక విక్రయ కేంద్రాల అనుమతుల విషయంపై నిర్ణయాలను తీసుకున్నారు. ఇప్పటికే అన్నమయ్య జిల్లాలో 42 శాశ్వత లైసెన్సుదారులకు గాను ఈ ఏడాది 33 షాపులకు అనుమతులు పొందారు. దీనితో పాటు రాయచోటి, మదనపల్లి, రాజంపేట, పీలేరు, కోడూరు, తంబళ్లపల్లి నియోజకవర్గాల్లో తాత్కాలిక షాపుల ఏర్పాటు కోసం 252 ఆన్లైన్ దరఖాస్తులు అందాయి. ఈ విక్రయకేంద్రాలను నివాస కేంద్రాలకు, పాఠశాలలకు, ఇతర ప్రమాదాలకు దూరంగా విశాలమైన ప్రదేశాలలో విక్రయ కేంద్రాలను ఏర్పాటు చేస్తున్నట్లు అగ్నిమాపక అధికారి అనిల్కుమార్ తెలిపారు. వన్ మెన్ కమిటీ.. బాణసంచా అమ్మకాలకు తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాల కోసం ప్రభుత్వం కొత్త నిబంధనలను రూపొందించింది. గతంలో రెవెన్యూ అధికారులు దుకాణాల ఏర్పాటుకు అనుమతి ఇచ్చేవారు. ఈ ఏడాది వన్మెన్ కమిటీ అంటే రెవెన్యూ, పోలీస్, ఫైర్, విద్యుత్ శాఖల సమన్వయంతో తాత్కాలిక విక్రయ కేంద్రాలకు అనుమతితో ఎన్ఓసీ ఇవ్వాల్సి ఉంటుంది. దరఖాస్తు చేసుకున్న వ్యాపారులు దుకాణాలను ఏర్పాటు చేసుకున్న తర్వాత క్షేత్రస్థాయిలో ఉండే అగ్నిమాపక శాఖ అధికారులు పరిశీలన చేసి నివేదిక అందిస్తారు. నిబంధనలు ఏం చెబుతున్నాయి.. ● అగ్నిమాపక శాఖ నిబంధనల ప్రకారం జనావాసాల్లో ఎట్టి పరిస్థితుల్లో టపాసుల విక్రయాలు, దుకాణాలు ఉండరాదు. గోదాములు సైతం ఏర్పాటు చేసేందుకు అనుమతి ఉండదు ● నివాస సముదాయాలకు కనీసం 50 మీటర్ల దూరంలో దుకాణాలు ఉండాలి. ● తాత్కాలికంగా ఏర్పాటు చేసే దుకాణాలు సైతం 3 మీటర్ల దూరంలో ఉండాల్సి ఉంటుంది. ● దుకాణాల దగ్గర సిగరెట్, బీడీ తాగరాదు. ● ప్రతి దుకాణం వద్ద ప్రత్యేకంగా నీటిసౌకర్యం, అగ్ని నిరోధక పరికరాలు అందుబాటులో ఉంచుకోవాలి. ● జనావాసాల మధ్య తాత్కాలిక దుకాణాలు ఏర్పాటు చేసే చోట తప్పనిసరిగా అగ్నిమాపక శాఖ ఎన్ఓసీ ఉండి తీరాలి. ప్రమాద బోర్డులు ఏర్పాటు చేయడంతో పాటు ధూమపానం నిషేధిత స్థలంగా ప్రకటించాలి. ● అగ్నిప్రమాదం జరిగితే వెంటనే అంటుకునే తడికలు, ప్లాస్టిక్ కవర్లతో దుకాణాలు ఏర్పాటు చేయరాదు. ప్రత్యేకంగా తయారు చేసిన జింక్, జీఐ రేకులతో మాత్రమే వీటిని ఏర్పాటు చేయాలి. ముఖ్యంగా షెడ్లలో హౌస్ కీపింగ్, చుట్టుపక్కల ప్రదేశాలు శుభ్రంగా ఉండాలి. ● ఏదైనా ప్రమాదం జరిగితే వెంటనే అక్కడికి అగ్నిమాపక వాహనం వచ్చి చుట్టూ తిరిగే విధంగా స్థలం ఇచ్చి షెడ్లను నిర్మాణం చేసుకోవాలి. ● ఒక దుకాణానికి మరో దుకాణానికి కచ్చితంగా 3 మీటర్ల దూరం ఉండాలి. వాటితో పాటు బాణసంచా కొనుగోలు చేయడానికి వచ్చే వారి కోసం ప్రత్యేకంగా దారులు ఏర్పాటు చేయాలి. ● విద్యుత్ వైరింగ్ చేసుకునే సమయంలో ఎలాంటి అతుకులు లేని వైర్ ఉపయోగించాలి. ఒక్కో సందర్భంలో వీటి నుంచి మంటలు వచ్చే అవకాశం ఉంటుంది. ఈ నేపథ్యంలో విద్యుత్ వైరింగ్ను జాగ్రత్తగా చూసుకోవాలి. ● రేకులతో కూడిన్ షెడ్లు వేస్తేనే అనుమతి ఇస్తారు. ప్రతి దుకాణంలో రెండు మంటలను ఆర్పే పరికరాలు, 200 లీటర్ల రెండు డ్రమ్ములు, 4 నీటి బకెట్లు, రెండు ఇసుక బకెట్లను అందుబాటులో ఉంచుకోవాలి. ● బాణసంచా దుకాణాల సమీపంలో ఎలాంటి పరిస్థితిలోనూ పొగ తాగరాదని ప్రత్యేకంగా బోర్డులు ఏర్పాటు చేయాలి. ● తాత్కాలికంగా ఏర్పాటు చేసుకునే దుకాణాలకు దూరంగా వాహనాలను పార్కింగ్ చేసేలా చూడాలి. తాత్కాలిక బాణసంచా దుకాణాలకు ఆన్లైన్లో దరఖాస్తులు అన్నమమయ్య జిల్లాలో ఇప్పటికే 252 లైసెన్సులు జారీ పాత లైసెన్సులు.. తాత్కాలికం.. 252 రూ. కోట్లలో టపాసుల వ్యాపారం నిబంధనలు తప్పనిసరి అంటున్న అధికారులు -
అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక
నిమ్మనపల్లె: మండలంలోని రెడ్డివారిపల్లె మోడల్స్కూల్లో శనివారం జిల్లా అండర్–19 కబడ్డీ జట్ల ఎంపిక నిర్వహించినట్లు స్కూల్గేమ్స్ కార్యదర్శి డాక్టర్.ఎస్.బాబు, నాగరాజ తెలిపారు. జిల్లాలోని 30 మండలాల నుంచి వచ్చిన 150 మంది క్రీడాకారులు ఎంపిక పోటీల్లో పాల్గొన్నారన్నారు. ఎంపీడీఓ రమేష్బాబు, ఎంఈఓ నారాయణ, పద్మావతి ముఖ్యఅతిథులుగా హాజరై పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ...విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లోనూ ప్రతిభ చూపాలన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న క్రీడాకారులు త్వరలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. డిప్యూటీ ఎంపీడీఓ బాలరాజు, క్రీడాభారతి పీడీఎస్ అసోసియేషన్ ప్రెసిడెంట్ నరేష్బాబు, సెలక్షన్ కమిటీ సభ్యులు శారద, మోహన్, అన్సర్బాషా, ఇందిర, మణి తదితరులు పాల్గొన్నారు. కడప: కడపలోని ప్రభుత్వ వైద్య కళాశాల (రిమ్స్)లో చిన్న పిల్లల విభాగం (పీడియాట్రిక్స్)లో పీజీ సీట్ల సంఖ్య ఏడుకు చేరింది. ఎన్ఎంసీ ఇటీవల 4 పీజీ సీట్లు మంజూరు చేసింది. గతంలో 3 పీజీ సీట్లు ఉండేవి. సీట్ల పెంపు కోసం హెచ్ఓడీతోపాటు వైద్యులు కృషి చేశారని జీఎంసీ ప్రిన్సిపాల్ డాక్టర్ జమున తెలిపారు. శనివారం ప్రిన్సిపాల్ తమ చాంబర్లో పీడియాట్రిక్ విభాగం హెచ్ఓడీ డాక్టర్ వై. వంశీధర్, వైద్యులు అనిల్ కిరణ్, పద్మినీ ప్రియా, బి.కె.నిరంజన్తోపాటు చిన్నపిల్లల విభాగం వైద్య సిబ్బంది పాల్గొన్నారు. -
తండ్రీకొడుకుల కుట్రలను గడపగడపకు తెలియజేయాలి
రాజంపేట టౌన్: మెడికల్ కళాశాలలను తన అనుచరులకు కట్టపెట్టి తద్వారా జేబులు నింపుకునేందుకు చంద్రబాబునాయుడు, నారాలోకేష్ పన్నుతున్న కుట్రలను గడప గడపకు తెలియచేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు. మాజీ సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి పిలుపు మేరకు ప్రైవేట్ కళాశాలల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ తలపెట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని శనివారం మున్సిపాలిటీ పరిధిలో నిర్వహించారు. ఈసందర్భంగా పట్టణంలోని పార్టీ కార్యాలయంలో మున్సిపాలిటిలోని వివిధ వార్డులకు చెందిన కౌన్సిలర్లకు కోటి సంతకాల సేకరణ పత్రాలను ఎమ్మెల్యే అందచేశారు. అనంతరం అమరనాథరెడ్డి విలేకరులతో మాట్లాడారు. మెడికల్ కళాశాలలు ప్రైవేటీకరణ అయితే ముఖ్యంగా పేదలకు నాణ్యమైన వైద్యం అందని ద్రాక్షలా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే ఆయా కళాశాలల యాజమాన్యాలు ఒక్కో మెడికల్ సీటుకు డొనేషన్ల రూపంలో భారీ మెత్తంలో తీసుకుటాయన్నారు. అందువల్ల పేద విద్యార్థులు డాక్టర్ కావాలన్న కల కలలాగనే మిగిలిపోతుందన్నారు. పేద, మధ్య తరగతి ప్రజలు ఇబ్బందులు పడతారని వైఎస్.జగన్ ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు కృషి చేస్తున్నారన్నారు. అందులో భాగంగా ప్రజల అభిప్రాయాన్ని కూడా సేకరించేందుకు కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి పిలుపునిచ్చారని తెలిపారు. ఈకార్యక్రమాన్ని జిల్లాలోని వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు విజయవంతం చేయాలన్నారు. ప్రజల అభివప్రాయాలను జగన్ గవర్నర్ దృష్టికి తీసుకు వెళ్ళి ప్రైవేటీకరణను అడ్డుకునే ప్రయత్నం చేస్తారన్నారు. వైఎస్సార్ సీపీ సీనియర్ నాయకులు పోలా వెంకటరమణారెడ్డి, కృష్ణారావుయాదవ్, వడ్డే రమణ, డీలర్ సుబ్బరామిరెడ్డి, రక్కాసి శ్రీవాణి, మిర్యాల సురేఖ, ఖాజా మొహిద్దీన్, సనిశెట్టి నవీన్కుమార్, సూరి, నాసిర్, నామ్నగర్ శివ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి -
పెద్ద దర్గా ఉరుసుకు విస్తృత ఏర్పాట్లు
కడప సెవెన్రోడ్స్: నవంబర్ 4 నుంచి 10వ తేదీ వరకు జరగనున్న ‘అమీన్ పీర్ దర్గా‘ ఉరుసు ఉత్సవాలను కులమతాలకు అతీతంగా ఘనంగా నిర్వహించేందుకు విస్తృత ఏర్పాట్లు చేయాలని వైఎస్సార్ కడప జిల్లా కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి అధికారులను ఆదేశించారు. శనివారం స్థానిక కలెక్టరేట్లో అమీన్పీర్ దర్గా ఉత్సవాల నిర్వహణ, ముందస్తు ఏర్పాట్లపై కలెక్టర్ అధ్యక్షతన సమావేశం జరిగింది. జేసీ అదితి సింగ్, జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్, డీఆర్వో విశ్వేశ్వరనాయుడు, ఇతర అధికారులు, ఉరుసు ఉత్సవ కమిటీ సభ్యులు హాజరయ్యారు. ఈ సందర్బంగా కలెక్టర్ మాట్లాడుతూ ప్రపంచవ్యాప్త ప్రాముఖ్యం కలిగిన అమీన్ పీర్ దర్గా ఉత్సవాలను కడప నగర ఫెస్టివల్గా, మత సామరస్యాన్ని ప్రతిబింబించేలా స్టాండర్డ్ నిబంధనలను పాటిస్తూ ఘనంగా నిర్వహించాలని అధికారులను ఆదేశించారు.15 రోజుల ముందుగానే ముందస్తు ప్రణాళికతో అన్ని రకాల ఉత్సవ ఏర్పాట్లు పూర్తి చేయాలన్నారు. అమీన్ పీర్ దర్గా (పెద్ద దర్గా) కమిటీ సభ్యులు, జిల్లా యంత్రాంగం, అన్ని శాఖల అధికారులు, దర్గా నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, స్వచ్ఛంద సంస్థల ప్రతినిధుల సమన్వయంతో ఉత్సవాలను విజయవంతం చేయాలన్నారు. ఉరుసు ముందస్తు ఏర్పాట్లకు సంబంధించి వివిధ శాఖలకు జిల్లా కలెక్టర్ విధులు కేటాయించారు. మున్సిపల్ అధికారులు: ప్రధానంగా పారిశుద్ధ్య సిబ్బందిని ఏర్పాటు చేసి భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ప్రత్యేక శానిటేషన్ కార్యక్రమలను చేపట్టాలన్నారు. మున్సిపల్ శాఖ ఆధ్వర్యంలో పరిశుభ్రత ఏర్పాట్లను చూడాలన్నారు. మొబైల్ టాయిలెట్స్, సురక్షితమైన తాగునీరు, హై మాస్ లైట్లను ఏర్పాటు చేయాలన్నారు. ప్రధాన కూడళ్లను అందంగా విద్యుత్ లైట్లతో అలంకరించాలని సూచించారు. పోలీస్ శాఖ: పోలీస్ శాఖ కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లను చేయాలని, ఎక్కడా ఎలాంటి సంఘటనలకు తావివ్వకుండా గట్టి భద్రతా సిబ్బందిని ఏర్పాటు చేసుకోవాలన్నారు. పెద్ద సంఖ్యలో భక్తులతోపాటు ప్రముఖులు, అత్యంత ప్రముఖులు రానున్న నేపథ్యంలో అంచనాతో అన్ని రకాల ఏర్పాట్లకు ప్రణాళిక సిద్ధం చేయాలన్నారు. ట్రాఫిక్, పార్కింగ్ వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. రెవెన్యూ శాఖ: పెద్ద సంఖ్యలో భక్తులు రానున్న నేపథ్యంలో.. ఎక్కువగా గుమికుడే ప్రాంతాలలో బారికేడ్స్ను ఏర్పాటు చేయాలన్నారు. దర్గా నుంచి అంబులెన్స్ ద్వారా హాస్పిటల్స్ వెళ్లడానికి గ్రీన్ ఛానల్ దారిని ఏర్పాటు చేయాలన్నారు. వీఐపీ ప్రొటోకాల్, ప్రముఖులకు ప్రజాప్రతినిధులకు దర్గా ఆహ్వానాలు వంటి అంశాలను చూసుకోవాలని డీఆర్ఓను ఆదేశించారు. వైద్య ఆరోగ్య శాఖ: వైద్య ఆరోగ్య శాఖ ద్వారా అధిక సంఖ్యలో వైద్య సిబ్బందిని వైద్యాధికారులను నియమించి ప్రత్యేక వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. 108 అంబులెన్స్ తదితర వాహనాలతోపాటు అత్యవసర మందులు కూడా అందుబాటులో ఉంచాలన్నారు. పర్యాటక శాఖ: నగరంలోని ఆర్టీసీ బస్టాండు, రైల్వేస్టేషన్, ఎయిర్ఫోర్ట్ ప్రాంతాలలో పెద్ద దర్గా, ఇతర దేవాలయాల టెంపుల్ టూరిజం క్యాంపెయిన్ చేపట్టాలని పర్యాటక అధికారులకు సూచించారు. ఏపీఎస్ఆర్టీసీ: ప్రధాన ప్రాంతాలైన ఆర్టీసీ బస్టాండ్, రైల్వేస్టేషన్ తదితరాల నుంచి అమీన్ పీర్ పెద్ద దర్గా ప్రాంతానికి షటిల్, బస్సులు నడపాలని ఆర్టీసీ అధికారులను ఆదేశించారు. మన జిల్లా నుంచే కాకుండా ఇతర రాయలసీమ జిల్లాలు, హైదరాబాద్, విజయవాడ వంటి ప్రాంతాల నుంచి ప్రత్యేక బస్సులు నడపాలని సూచించారు. అలాగే ఉరుసు ప్రధాన రోజున దర్గా నుంచి వాటర్ గండి వరకు రవాణా సౌకర్యాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. విద్యుత్ శాఖ: ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు తావు లేకుండా పవర్ మేనేజ్మెంట్ చేయాలన్నారు. షార్ట్ సర్క్యూట్లు సంభవించకుండా విద్యుత్ శాఖ అధికారులు జాగ్రత్తలు పాటించాలన్నారు. సమాచార శాఖ: పెద్ద దర్గా ఉరుసు ఉత్సవాలకు అత్యంత ప్రాచుర్యం వచ్చే విధంగా, భక్తుల్లో అవగాహన పెంచేందుకు అడ్వర్టైజ్మెంట్ క్యాంపెయిన్లు నిర్వహించాలన్నారు. అలాగే జిల్లాలోని చారిత్రక నేపథ్యం కలిగిన ఒంటిమిట్ట, దేవుని కడప దేవాలయాలపై టెంపుల్ టూరిజం పై అవగాహన పెంచే విధంగా పర్యాటక అధికారులతో కలిసి ప్రణాళిక చేయాలని సూచించారు. అగ్నిమాపక శాఖ: ఎలాంటి అగ్నిప్రమాదాలు జరగకుండా అప్రమత్తంగా వ్యవహరించాలని అగ్నిమాపక శాఖ అధికారులను ఆదేశించారు. ఉర్సు పరిసర ప్రాంతాల్లో మినీ వ్యాన్లు, ఫైర్ ఇంజన్ను అందుబాటులో ఉంచుకోవాలన్నారు. అమీన్ పీర్ దర్గా ప్రధాన ఉరుసు మహోత్సవం రోజు అన్ని పాఠశాలలకు సెలవు ప్రకటించాలని ఆదేశించారు. గతంలో పెద్ద దర్గా ఉర్సు నేపథ్యంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగిందన్నారు. ఈ ఏడాది మల్టీ డిస్ప్లేనరీ కంట్రోల్ రూమ్ కొనసాగుతుందని, ఇందులో ఏడు శాఖలకు చెందిన అధికారులు విధులు నిర్వహించాలని ఆదేశించారు. కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: కడప అమీన్ పీర్ దర్గా ఉరుసు ఉత్సవాలకు రావాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడును ఆహ్వానించారు. అమీన్ పీర్ దర్గా పీఠాధిపతి హజ్రత్ కేఎస్ఎస్ అరిఫుల్లా హుస్సేనీ సాహెబ్.. సీఎంను కలిసి ఆహ్వానం అందించారు. జాతీయ స్థాయిలో పేరొందిన ఈ ఉరుసు మహో త్సవాలు నవంబరు 5వ తేదీ నుంచి 10వ తేదీ వరకు జరుగుతున్నాయని, ఈ మహోత్సవాలకు తప్పనిసరిగా హాజరు కావాలని ముఖ్యమంత్రిని కోరారు. ఈ సందర్భంగా ఉరుసు ఉత్సవ ఏర్పాట్లు ఏ విధంగా జరుగుతున్నాయని సీఎం వారిని అడిగి తెలుసుకున్నారు. ముఖ్యమంత్రిని కలిసిన వారిలో అమీన్ పీర్ దర్గా మేనేజర్ మొహమ్మద్ అలీఖాన్, బాఖీ ఉల్లాఖాన్ తదితరులు ఉన్నారు. -
నవోదయలో ప్రవేశానికి గడువు పెంపు
రాజంపేట: జవహర్ నవోదయ విద్యాలయం(రాజంపేట మండలం నారమరాజుపల్లె)లో 2026–27 సంవత్సరానికి 11 వతరగతిలో ప్రవేశానికి మరోసారి గడువును పెంపుదల చేస్తూ నిర్ణయం తీసుకున్నట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. దరఖాస్తు చేసుకోవడానికి అన్నమయ్య, కడప జిల్లాకు చెందిన విద్యార్ధులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు డబ్ల్యూడబ్ల్యూడబ్ల్యూ.ఎన్ఏవీవోడీఏవైఏ.జీవోఎన్ వె వెబ్సైట్ను సందర్శించాలన్నారు. చివరి తేది 23–10–2025 అని వెల్లడించారు. ● 2026–27 సంవత్సరానికి సంబంధించి 9వ తరగతిలో ప్రవేశానికి కూడా గడువును పెంచినట్లు ప్రిన్సిపాల్ గంగాధరన్ తెలిపారు. 23.10. 2025 వరకు గడువు ఉందని వెల్లడించారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణ మూర్తులను అందంగా అలంకరించారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనాన్ని నిర్వహించారు. స్వామి వారిని అధిక సంఖ్యలో భక్తులు దర్శించుకున్నారు. గాలివీడు: మొక్కలు నాటడం ద్వారా స్వచ్ఛమైన గాలి, పర్యావరణ పరిరక్షణ సాధ్యమవుతుందని పర్యావరణ మండల ప్రత్యేక అధికారి.. ఉపాధిహామీ పీడీ వెంకటరత్నం అన్నారు.శనివారం స్వర్ణాంధ్ర స్వచ్ఛాంద్ర కార్యక్రమంలో భాగంగా ‘స్వచ్ఛమైన గాలి– ఆరోగ్యకరమైన జీవనం‘అనే అంశంపై జిల్లా ప్రజా పరిషత్ హైస్కూల్, ఎస్ డబ్ల్యూపీసీ సెంటర్లో మొక్కలు నాటే కార్యక్రమం,సైకిల్ ర్యాలీ నిర్వహించారు.అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతీ ఒక్కరూ విరివిగా మొక్కలు నాటి పరిరక్షించాలని తెలిపారు.కార్యక్రమంలో మండల పరిషత్ అభివద్ధి అధికారి శకె.చంద్ర మౌలీశ్వర్ తదితరులు పాల్గొన్నారు. -
కలంపై కూటమి కక్ష
నిజాలను నిర్భయంగా రాస్తున్న పత్రికలపై, విలేకరులపై కూటమి సర్కార్ కక్షగట్టింది. అక్రమ కేసులతో వేధిస్తోంది.పత్రికా కార్యాలయాల్లో సోదాలు, సంపాదకుల ఇళ్లలో తనిఖీల పేరుతో పత్రికా స్వేచ్ఛను హరిస్తోంది.అక్రమ కేసులు బనాయిస్తూ ప్రజాస్వామ్యాన్ని అపహాస్యం చేస్తోంది. మీడియాపై అంక్షలు విఽధించడం తగదని పలువురు ప్రజాస్వామ్యవాదులు, పార్టీల నాయకులు అభిప్రాయపడతున్నారు. పత్రికలపై కేసులు రాజ్యాంగ విరుద్ధం రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర మీడియాది. ప్రజాస్వామ్యం ప్రకారం తమ భావజాలాన్ని వ్యక్తం చేసే హక్కును రాజ్యాంగం మనకు కల్పించింది. తప్పుంటే రాజ్యాంగం ప్రకారం తిప్పకొట్టే అవకాశం ఉంది.అందుకు భిన్నంగా పత్రికల గొంతు నొక్కడం ఎరు చేసినా ఖండీనీయం. సాక్షి ఎడిటర్, జర్నలిస్టులపై కేసులు పెట్టడం, వేధించడం సమర్థనీయం కాదు. –మర్రి రవికుమార్, వైస్చైర్మన్, రాజంపేట మున్సిపాలిటీ, తగిన మూల్యం చెల్లించుకుంటారు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డి, పాత్రికేయులపై అక్రమ కేసులు బనాయించడం అన్యాయం. నోటీసుల పేరుతో ఇళ్ల వద్దకు, సాక్షి కార్యాలయాల వద్దకు వెళ్లి పోలీసులు హంగామా సృష్టించడం అప్రజాస్వామికం. ప్రజల వాణిని వినిపించే మీడియా గొంతునొక్కే ప్రయత్నం చేయడం సరికాదు. ఇలాంటి చర్యలకు తగిన మూల్యం చెల్లించుకోక తప్పదు. – సయ్యద్ ముస్తాక్ మండల కన్వీనర్, పుల్లంపేట ఉద్దేశ పూర్వకంగానే సాక్షిపై కుట్ర ఉద్దేశ పూర్వకంగానే ప్రభుత్వం సాక్షి పత్రికపై కుట్రపూరితంగా వ్యవహరిస్తోంది. కూటమి ప్రభుత్వం చేస్తున్న తప్పులను వెలుగులోకి తేవడం నేరం కాదు. తప్పులను ఎత్తిచూపే హక్కు పత్రికలకు ఉంది. స్వయంగా పోలీసు ఉన్నతాధికారులు సాక్షి కార్యాలయానికి వెళ్లడం, సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిని ప్రశ్నించడం విడ్డూరంగా ఉంది. రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వ చర్యల పట్ల జర్నలిస్టులు విస్తుపోతున్నారు. – పోరెడ్డి నరసింహారెడ్డి, వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షుడు, ప్రొద్దుటూరు బెదిరింపులు మానుకోవాలి రాష్ట్రంలో భావ ప్రకటన స్వేచ్ఛ లేకుండా పోతుంది. ప్రభు త్వ వైఫల్యాలను వెలుగులోకి తీసుకొస్తూ వార్తలు రాసే పాత్రికేయులపై అక్రమ కేసులు పెట్టి కలానికి సంకెళ్లు వేయాలనుకోవడం అవివేకం. సాక్షి మీడియాపై కక్షపూరితంగా వ్యవహరించడం విచారకరం. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టడం కాదు సహేతుకం కాదు. ప్రభుత్వం జర్నలిస్టులను బెదించే ధోరణికి స్వస్తి చెప్పాలి – త్రినాథ్, రాజంపేట వ్యవసాయ మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్, నందలూరు -
విద్యార్థుల సమస్యలపై బస్సు జాతా
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు నిర్వహిస్తున్న బస్సు జాతాను విజయవంతం చేయాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు కోటేశ్వరరావు కోరారు. శనివారం రాయచోటి పట్టణంలోని ఒక ప్రైవేట్ కళాశాలలో పోస్టర్లను విడుదల చేశారు. ఈ ఈ బస్సు జాతా ఈనెల 22వ తేదీ నుంచి నవంబర్ 12వ తేదీ వరకు సాగుతుందన్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకు చెల్లించాల్సిన బకాయిలు రూ.6400 కోట్లు పెండింగ్లో ఉన్నాయన్నారు. అలాగే రాష్ట్ర వ్యాప్తంగా సుమారు 4500 ప్రభుత్వ పాఠశాలలు మూతపడ్డాయని వెంటనే వాటిని పునః ప్రారంభించాలని డిమాండ్ చేశారు.ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థలలో ఫీజుల దోపిడీని అరికట్టి ఫీజు నియంత్రించాలని కోరారు. ప్రభుత్వ ఎస్పీ, ఎస్టీ, బీసీ హాస్టళ్లలో పెరిగిన ధరలకు అనుగుణంగా కాస్మోటిక్ చార్జీలు పెంచాలని, ప్రతి మండలానికి ఒక డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలని, ప్రభుత్వ జూనియర్, డిగ్రీ కళాశాలలో విద్యార్థి సంఘాల ఎన్నికలు నిర్వహించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నారాయణ, ధనకుమార్, రఘుపతి, రెడ్డికుమార్, వంశీ, ఆశిక్ తదితరులు పాల్గొన్నారు. -
ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్ల అరెస్టు
నందలూరు : మండలంలోని మదనమోహనపురం క్రాస్ సమీపంలో ఐదుగురు ఎర్రచందనం స్మగ్లర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ మల్లికార్జునరెడ్డి పేర్కొన్నారు. ఈ సందర్భంగా శనివారం ఎస్ఐ మాట్లాడుతూ రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, నందలూరు సిబ్బంది, అన్నమయ్య ఆర్ఎస్ టాస్క్ఫోర్స్ సిబ్బంది కలిసి ఈ నెల 17వ తేదీన మధ్యాహ్నం 3 గంటలకు మండలంలోని ఎంఎం పురం క్రాస్ రోడ్డు సమీపంలో ఆవుల రవికుమార్, పొత్తపి పెంచలయ్య, బండారు సందీప్, కానపర్తి వంశీకృష్ణ, ఇమిడి నాగరాజు అనే వ్యక్తులను అదుపులోకి తీసుకున్నామన్నారు. వారు అక్రమంగా తరలించేందుకు సిద్ధంగా ఉంచిన 20 ఎర్రచందనం దుంగలను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వాటి బరువు సుమారు 512.9 కేజీలు, వాటి విలువ సుమారు రూ.6.85 లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసుకు సంబంధించి ఇంకా కొంతమంది నిందితులు పరారీలో ఉన్నారన్నారు. నిందితులపై కేసు నమోదు చేసి తిరుపతి కోర్టులో హాజరు పరిచామన్నారు. ఈ కేసులో ప్రతిభ కనపరిచిన రాజంపేట రూరల్ సీఐ బీవీ రమణ, స్థానిక ఎస్ఐ మల్లికార్జునరెడ్డి, పోలీసు సిబ్బందిని, అన్నమయ్య జిల్లా ఆర్ఎస్ టాస్క్ఫోర్స్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ధీరజ్ అభినందించారు.20 దుంగలు స్వాధీనం -
కుక్కల దాడిలో 50 గొర్రెలు మృతి
బి.కొత్తకోట : బి.కొత్తకోటకు సమీపంలోని బాలసానివారిపల్లెలో శనివారం సాయంత్రం వీధి కుక్కలు దాడి చేసి విచక్షణారహితంగా కొరకడంతో 50 గొర్రెలు మృతి చెందాయి. బాలసానివారిపల్లెకు చెందిన ఎం.బాబు గొర్రెల పెంపకంతో జీవిస్తున్నాడు. శనివారం వర్షం కురవడంతో గొర్రెలను గ్రామంలోనే గొర్రెలదొడ్డిలో వదిలి ఇంటికి వెళ్లాడు. సాయంత్రం ఆరు గంటల సమయంలో ఎక్కడినుంచో వచ్చిన వీధి కుక్కలు గొర్రెలదొడ్డిలోకి దూరి గొర్రెలపై దాడి చేశాయి. దీంతో 50 గొర్రెలు మృతి చెందగా రూ.3 లక్షల నష్టం వాటిల్లింది. మూడు నెలల క్రితం ఇలాగే బాబుకు చెందిన 11 గొర్రెలను కుక్కలు కొరికి చంపేయగా రూ.లక్ష నష్టం జరిగింది. ఇప్పుడు మళ్లీ 50 గొర్రెలు చనిపోవడంతో తనకు దిక్కేది అంటూ ఆవేదన చెందుతున్నాడు. కాగా బాలసానివారిపల్లె సమీపంలోని కమ్మోరుపల్లెలో మూడు రోజుల క్రితం కుక్కలు దాడి చేయడంతో హరి అనే వ్యక్తికి చెందిన 12 గొర్రెలు మృతి చెందాయి. దీంతో బాధితునికి రూ.1.20 లక్షల నష్టం వాటిల్లింది. వీధి కుక్కలను అదుపుచేసి గొర్రెలను కాపాడాలని రైతులు అధికారులను కోరుతున్నారు. -
పరిమి శ్రీరామనాథ్కు గడియారం సాహిత్య పురస్కారం
కడప సెవెన్రోడ్స్ : హెదరాబాదుకు చెందిన యువకవి, సాఫ్ట్వేర్ ఇంజినీర్ పరిమి శ్రీరామనాథ్ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 44వ సాహిత్య పురస్కారానికి ఎంపికై నట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో ఈనెల 26వ తేది సాయంత్రం 5:30 గంటలకు ప్రొద్దుటూరులోని అరవిందాశ్రమంలో నిర్వహిస్తున్నామన్నారు. 1982 నుంచి ప్రతి ఏటా రాష్ట్ర స్థాయిలో ఎంపికై న కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి పరిమి శ్రీరామనాథ్ రచించిన ‘జీవాతువు’ అనే కావ్యం ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో శ్రీరామనాథ్కు కవి సన్మానం, అవార్డుకు గాను రూ.10,000 నగదు బహుమతి, పురస్కారపత్రం, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. యువకుడి ఆత్మహత్య చక్రాయపేట : మండలంలోని గండి కొవ్వూరు గ్రామం ఓబుళనాయునిపల్లెలో గండికోట జగదీష్(18) అనే యువకుడు తమ ఇంటిలోనే ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. మృతుడి బంధువుల ఫిర్యాదు మేరకు ఎస్ఐ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జగదీష్ తల్లిదండ్రులు జనార్దన, పావని జీవనోపాధి నిమిత్తం కువైట్లో ఉన్నారు. లక్కిరెడ్డిపల్లెలోని అమ్మమ్మ ఇంటివద్ద జగదీష్ ఉండేవారు. తనకు బుల్లెట్ బైకు కొనివ్వమని ఫోన్ చేసి వత్తిడి తేవడంతో తండ్రి మందలించాడని మనస్థాపానికి గురై లక్కిరెడ్డిపల్లె నుంచి ఓబుళనాయునిపల్లెలో ఉన్న ఇంటికు వచ్చాడు. శుక్రవారం అర్థరాత్రి సమయంలో ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నాడు. జగదీష్ ఫోన్ పనిచేయక పోవడంతో పాటు అలిగి వచ్చాడని అతని అమ్మమ్మ శనివారం ఓబుళనాయునిపల్లెలోని ఇంటి వద్దకు వచ్చి తలుపు తీయగా జగదీష్ ఉరివేసుకుని ఉండటాన్ని గమనించింది. గట్టిగా కేకలు వేయడంతో ఇరుగు పొరుగు వారు వచ్చి సమాచారాన్ని పోలీసులకు చేరవేశారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం వేంపల్లె ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా మద్యం అమ్మకాలు కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఉమ్మడి కడప జిల్లాలో కల్తీ మద్యానికి చెక్ పెట్టేందుకు ప్రభుత్వం ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను ప్రవేశ పెట్టిందని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ డిప్యూటీ కమిషనర్ జయరాజు పేర్కొన్నారు. శనివారం జిల్లాలోని కడప నగరం, బద్వేలు, సిద్దవటం పరిధిలోని మద్యం దుకాణాల్లోని అమ్మకాలను పరిశీలించారు. ఆయన మాట్లాడుతూ మద్యం కొనుగోలు చేసే వ్యక్తి ఏపీ ఎకై ్సజ్ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకోవడం ద్వారా స్కాన్ చేయగానే మద్యం తయారీ, ధర, తయారు చేసిన కంపెనీ, ఏ మద్యం దుకాణంలో విక్రయించారు అనే వివరాలు పొందవచ్చన్నారు. -
ప్రమాదంలో వ్యక్తికి తీవ్ర గాయాలు
ఓబులవారిపల్లె: చిన్నఓరంపాడు జాతీయ రహదారిపై శుక్రవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తి మోటార్ బైక్పై నుంచి కిందపడటంతో తీవ్ర గాయాలయ్యాయి. పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. గాయపడిన వ్యక్తి వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. పెన్నానదిలో యువకుడి గల్లంతుసిద్దవటం : మండలంలోని వంతాటిపల్లి గ్రామం ఎస్సీ కాలనీకి చెందిన పెయ్యల నంద (36) అనే యువకుడు శనివారం పెన్నానదిలో గల్లంతయ్యాడు. వంతాటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న పెన్నానది వద్దకు చేపలు పట్టేందుకు వెళ్లి ప్రమాదవశాత్తూ పెన్నానది నీటిలో పడిపోయాడు. సమాచారం తెలుసుకున్న సిద్ధవటం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని గల్లంతైన యువకుడి కోసం గాలింపు చర్యలు చేపట్టారు. బైకులు ఢీకొని గాయాలుచింతకొమ్మదిన్నె : మండలంలోని ఊటుకూరు వద్ద జాతీయ రహదారిపై శనివారం సాయంత్రం రెండు బైకులు ఢీకొనడంతో యల్లటూరు ప్రదీప్ అనే యువకుడికి గాయాలయ్యాయి. కాలు విరగడంతో ప్రదీప్ను స్థానికులు చికిత్స నిమిత్తం రిమ్స్కు తరలించారు. -
లక్ష మద్యం బాటిళ్ల స్కానింగ్
మదనపల్లె రూరల్ : జిల్లాలో ప్రతిరోజు మద్యం దుకాణాల్లో లక్షకు పైగా మద్యం బాటిళ్లను స్కానింగ్ చేసి విక్రయిస్తున్నట్లు ఎకై ్సజ్ సూపరింటెండెంట్ మధుసూదన్ తెలిపారు. శనివారం పట్టణంలోని పలు మద్యం దుకాణాలు, బార్లలో ఎకై ్సజ్ సూపరింటెండెంట్ తనిఖీ చేశారు. షాపులో మద్యం బాటిల్ను స్వయంగా స్కాన్ చేసి అందులోని వివరాలను వినియోగదారుడికి చూపించి విక్రయించారు. ఈ సందర్భంగా ఈఎస్ మధుసూదన్ మాట్లాడుతూ.. ఈనెల 16 నుంచి జిల్లాలోని 122 మద్యం దుకాణాలు, 11 బార్లలో మద్యం బాటిళ్లను స్కాన్ చేశాకే విక్రయిస్తున్నట్లు తెలిపారు. రోజుకు సుమారుగా రూ.1.62 కోట్ల మద్యం వ్యాపారం జరుగుతోందన్నారు. ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా కల్తీ మద్యం విక్రయాలు జరగడం లేదన్నారు. స్కాన్ విధానంపై మద్యం వినియోగదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారన్నారు. మద్యం షాపు పర్మిట్ రూముల్లో కిచెన్లు, రెస్టారెంట్లు నిర్వహించరాదన్నారు. మద్యం దుకాణాలు, బార్లు సమయపాలన పాటించాలన్నారు. ప్రభుత్వ నిబంధనలు అతిక్రమించిన వారిపై చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో మదనపల్లె ఎకై ్సజ్ సీఐ భీమలింగ, హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇంజినీరింగ్ విద్యార్థి మృతి
రాజంపేట : రాజంపేట–రాయచోటి రోడ్డులోని పాలకేంద్రం వద్ద శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో అన్నమాచార్య ఇంజినీరింగ్ కళాశాల విద్యార్థి కొనిరెడ్డి మహేంద్రరెడ్డి మృతి చెందాడు. నగరవనం నుంచి బైకులో వస్తూ పాలకేంద్రానికి ఎడమవైపు ఉన్న ఎంజీఆర్ ఐరన్ హోర్డింగ్ను బలంగా ఢీ కొట్టాడు. బైకు రైడర్ మహేంద్రకు రక్తగాయాలు కావడంతో అక్కడికక్కడే మృతి చెందాడు. వెనుక కూర్చున్న స్నేహితునికి స్వల్ప గాయాలు అయ్యాయి. సీఐ నాగార్జున మాట్లాడుతూ రాజంపేట పరిసర ప్రాంతాలకు చెందిన విద్యార్థులు హెల్మెట్ ధరించాలన్నారు. అజాగ్రత్త, నిర్లక్ష్యం, అతివేగంగా బైకులను నడపటం ప్రమాదకరమన్నారు. ఒక్కసారి విద్యార్థులు తమ కుటుంబం, తల్లిదండ్రులను గుర్తుంచుకొని, బైకులు జాగ్రత్తగా నడపాలన్నారు. ఈ ప్రమాదంపై పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. గాయపడిన విద్యార్థిని సీఐ నాగార్జున, ఎస్ఐలు పరామర్శించి, వివరాలు అడిగి తెలుసుకున్నారు. మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘ కార్యవర్గ ఎన్నిక నోటిఫికేషన్ విడుదల రాయచోటి జగదాంబసెంటర్ : మదనపల్లె పట్టణంలోని మదనపల్లె సహకార గృహ నిర్మాణ సంఘం లిమిటెడ్కు నూతన కార్యవర్గ సభ్యులను ఎన్నుకొనేందుకు నోటిఫికేషన్ను ఈ నెల 18వ తేదీన విడుదల చేసినట్లు ఎన్నికల అధికారి, అసిస్టెంట్ రిజిస్ట్రార్ కె.రాజశేఖర్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. 22న నామినేషన్ల స్వీకరణ, 23న నామినేషన్ల పరిశీలన, 24న నామినేషన్ల ఉపసంహరణ, 24న నామినేషన్ల తుది జాబితా సాయంత్రం 5 గంటల తరువాత ప్రకటన, 29న పోలింగ్ ఉదయం 7 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటలకు మదనపల్లెలోని రామాలయం వీధి సొసైటీ కాలనీలో గల నెహ్రూ మున్సిపల్ ప్రైమరీ, హైస్కూల్లో ఉంటుందన్నారు. ఈ నెల 30న అధ్యక్షుడు, కార్యవర్గ సభ్యుల ఎన్నిక ఉంటుందని ఆ ప్రకటనలో వివరించారు. ఆక్రమణకు యత్నించిన వ్యక్తులపై కేసులు నమోదు మదనపల్లె రూరల్ : ప్రభుత్వ భూముల ఆక్రమణకు యత్నించిన వ్యక్తులపై తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసులు నమోదు చేసినట్లు తాలూకా సీఐ కళావెంకటరమణ తెలిపారు. మండలంలోని కోళ్లబైలు పంచాయతీ సర్వే నెంబర్.599/4లోని ప్రభుత్వ స్థలం స్వరూప స్వభావాలు మార్చి చదును చేసేందుకు ప్రయత్నించిన పట్టణంలోని నీరుగట్టువారిపల్లె గజ్జలకుంటకు చెందిన కె.శ్రీనివాసులు, భాస్కర్పై కేసు నమోదు చేశామన్నారు. అదే విధంగా కోళ్లబైలు పంచాయతీ సర్వేనెంబర్.598/3, 599/2 లోని ప్రభుత్వ స్థలాన్ని రాయచోటి కృష్ణాపురానికి చెందిన వలిపి సిద్ధయ్య, నీరుగట్టువారిపల్లె గజ్జలకుంటకు చెందిన నాగమల్లు.. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరించి, ప్రభుత్వ స్థలాన్ని చదునుచేసి ఆక్రమించేందుకు ప్రయత్నించారన్నారు. తహసీల్దార్ కిషోర్కుమార్రెడ్డి ఫిర్యాదు మేరకు నలుగురు నిందితులపై రెండు వేర్వేరు కేసులు నమోదు చేసినట్లు సీఐ తెలిపారు. బాలికపై మేనమామ వేధింపులు కై కలూరు : మేనమామ వేధించడంతో పాటు తల్లి, అమ్మమ్మ, తాత చిత్రహింసలకు గురిచేశారని 9వ తరగతికి చెందిన బాలిక బావురుమంది. నరకం నుంచి బయటపడ్డానని గాయాలను చూపించింది. ఈ ఘటన ఏలూరు జిల్లా కై కలూరు మండలం చటాకాయికి చెందిన బాలికపై వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు సమీప అగ్రహారంలో జరగ్గా ఆలస్యంగా వెలుగు చూసింది. శనివారం ఆమెను తండ్రి కై కలూరు ప్రభుత్వాస్పత్రికి తీసుకువచ్చాడు. పోలీసులకు ఆమె వివరాలు వెల్లడించింది. బాధితురాలు, ఆమె తండ్రి తెలిపిన వివరాల ప్రకారం.. చటాకాయికి చెందిన జయమంగళ కుమార అభిమన్యుడుకి ఏలూరు మండలం శ్రీపర్రుకు చెందిన కామాక్షితో 2009లో వివాహమైంది. వీరికి 2012లో అమ్మాయి జన్మించింది. అనంతరం ఇద్దరి మధ్య విభేదాలు రావడంతో విడాకులు తీసుకున్నారు. అప్పటినుంచి కుమార్తె తండ్రి వద్ద ఉంటోంది. కామాక్షి మరో వ్యక్తిని వివాహం చేసుకోగా.. అభిమన్యుడు మరో మహిళను వివాహం చేసుకున్నాడు. మొదటి భార్య కుమార్తె (14) తండ్రి వద్దే ఉంటూ భుజబలపట్నంలో 9వ తరగతి చదువుతోంది. దసరా పండక్కి తీసుకెళ్లి:తండ్రి లేని సమయంలో కామాక్షి, ఆమె తల్లి చటాకాయలో ఉంటున్న బాలిక వద్దకు వచ్చి దసరా పండగకు దుస్తులు కొంటామని ప్రత్తికోళ్లలంక, అక్కడ నుంచి కామాక్షి సోదరుడు ఉమాశంకర్, తల్లిదండ్రులు నాగులమ్మ, వెంకటరమణ ఉంటున్న కడప జిల్లా బద్వేలుకు తీసుకువెళ్లారు. బాలికను అక్కడే ఉండాలని బలవంతం చేయడంతో ఆమె నిరాకరించి తండ్రి వద్దకు వెళతానని చెప్పింది. దీంతో తన తల్లి కామాక్షి ఇష్టానుసారం తనను కొట్టిందని బాలిక వాపోయింది. మేనమామ ఉమాశంకర్ తనతో అసభ్యంగా ప్రవర్తించాడని పోలీసులకు చెప్పింది. బద్వేలులో బాలిక పరిస్థితిని చూసిన ఓ వ్యక్తి తండ్రి అభిమన్యుడికి ఫోన్ చేయగా అక్కడికి వెళ్లి శుక్రవారం రాత్రి చటకాయకు తీసుకువచ్చారు. -
విద్యుత్ కాంట్రాక్టు ఉద్యోగుల ర్యాలీ
రాయచోటి అర్బన్ : తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ రాయచోటిలో విద్యుత్తు కాంట్రాక్టు ఉద్యోగులు శుక్రవారం నిరసన ర్యాలీ చేపట్టారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి రామాంజులు వారికి మద్ధతునిచ్చి మాట్లాడుతూ విద్యుత్ రంగంలో జరిగే చర్చలు కార్మికులు, ఉద్యోగులకు అనుకూలంగా లేకపోతే నిరసనను సమ్మె దిశగా తీసుకెళ్లి మద్దతు ప్రకటించామన్నారు. ప్రతి సబ్ స్టేషన్లో విధులకు కొత్త కార్మికులు వస్తే వారిని అడ్డుకుంటామని తెలిపారు. యూఈసీడబ్లూయూ కార్యదర్శి శ్రీనివాసరెడ్డి మాట్లాడుతూ విద్యుత్ సంస్థలో పనిచేస్తున్న కాంట్రాక్టు, ఔట్ సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి రెగ్యులర్ చేయాలని, జేఎల్ఎంలకు సర్వీస్ రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరారు. ఉద్యోగులకు పెన్షన్ భిక్ష కాదని, మంజూరులో కాలయాపన చేయడం తగదని అన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు సుబ్రహ్మణ్యం, సభ్యులు రామనుజన్రెడ్డి, ఈశ్వరయ్య, గజేంద్రవర్మ, శివయ్య, ప్రభాకర్రెడ్డి, భాస్కర్, రవీంద్రారెడ్డి, జోష్ణ శృతి, రాధిక, అర్చన, సింధు, భానుమతి తదితరులు పాల్గొన్నారు. -
ఎంపీహెఈవో నూతన కార్యవర్గం
రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా ఎంపీహెచ్ఈవో(మల్టీ పర్పపస్ హెల్త్ ఎక్స్టెక్షన్ ఆఫీసర్స్ అసోషియేషన్) నూతన కార్యవర్గాన్ని శుక్రవారం ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాయచోటి ఎన్జీవో హోంలో నిర్వహించిన కార్యక్రమంలో సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.శివయ్య, ఎన్నికల అధికారి ఎం.నరసింహులు, టి.విద్యాసాగర్ ఆధ్వర్యంలో అన్నమయ్య జిల్లా అధ్యక్షుడిగా జి.జయరామయ్య, జిల్లా ప్రధాన కార్యదర్శగా వి.రమణ నాయక్, జిల్లా కోశాధికారిగా ఎస్.ముజీబ్బాషా, ఉపాధ్యక్షులుగా కె.లక్ష్మినారాయణ, బి.రామచంద్ర, జిల్లా జాయింట్ సెక్రటరీగా బీవీ.రమణయ్య, జిల్లా ఆర్గనైజింగ్ సెక్రటరీగా శివారెడ్డిలను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా జయరామయ్య మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా 1100 మంది గెజిటేడ్, నాన్ గెజిటేడ్ హోదాలో ఉన్న వారు సంఘంలో ఉన్నారని చెప్పారు. అసోసియేషన్ క్యాడర్కు గెజిట్ కల్పించాలని, సీహెచ్సీ బేసిక్తో సమానంగా ఎంపీహెచ్ఈవో బేసిక్ ఉండాలని డిమాండ్ చేశారు. ఎంపీహెచ్ఈవో క్యాడర్ను మండల హెల్త్ ఆపీసర్గా మార్చాలని, అబాలిష్ అయిన ఎంపీహెచ్ఈవో పోస్టులను సర్దుబాటు చేయాలని డిమాండ్ చేశారు. ఈ ఎన్నికల వ్యవహరించారు.జి.జయరామయ్య వి.రమణనాయక్ ఎస్.ముజీబ్బాషా -
ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ సీజ్
మైదుకూరు : ఛాతీనొప్పితో వచ్చిన మహిళకు చేసిన వైద్యం వికటించి మృతి చెందడానికి కారణమైన ఆర్ఎంపీ క్లినిక్, ల్యాబ్ను వైద్య శాఖ అధికారులు శుక్రవారం సీజ్ చేశారు. మైదుకూరు పట్టణంలోని కడప రోడ్డుకు చెందిన ఓ మహిళ గురువారం మధ్యాహ్నం ఛాతీనొప్పితో బాధపడుతూ అదే రోడ్డులోని మెడికల్ షాప్ నిర్వాహకుడు వద్దకు వెళ్లారు. ఆయన చేసిన వైద్యం వికటించడంతో మహిళ మృతిచెందిన విషయంపై సాక్షి దినపత్రికలో వార్త ప్రచురితం కావడంతో డిప్యూటీ డీఎంహెచ్ఓ డాక్టర్ మల్లేష్, జిల్లా డెమో ఆఫీసర్ భారతి, వైద్యాధికారులు ఎంవీఆర్ మెడికల్ స్టోర్ను తనిఖీ చేశారు. షాప్ నిర్వాహకుడు అనుమతులు లేకుండా ఆర్ఎంపీగా క్లినిక్, ల్యాబ్ను నిబంధనలకు విరుద్ధంగా నిర్వహిస్తున్నట్లు తెలుసుకున్నారు. అనంతరం డీఎంహెచ్ఓ నాగరాజు ఆదేశాలతో మెడికల్ షాప్, క్లినిక్ను సీజ్ చేసి డ్రగ్ కంట్రోల్ విభాగం అధికారులకు ఫిర్యాదు చేశామని డెమో అధికారి భారతి తెలిపారు. ఈ తనిఖీల్లో మెడికల్ ఆఫీసర్ ఎస్.అయేషా, డిస్ట్రిక్ట్ లీగల్ కన్సల్టెంట్ ఎం.పాలేశ్వరరావు, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు ఎం.మరియాకుమారి, ఆర్.వెంగళరెడ్డి, టి.జయప్రకాష్, కె.వీరాంజనేయులు, డి.వెంకటేశ్వర్లు, ఏఎన్ఎం యశోద పాల్గొన్నారు. విద్యుత్ షాక్తో యువకుడు మృతి జమ్మలమడుగు రూరల్: మండలానికి చెందిన వల్లెపు రాంబాబు (40) శుక్రవారం సాయంత్రం విద్యుత్ షాక్కు గురై మృతి చెందారు. కుటుంబ సభ్యుల వివరాల మేరకు.. మండలంలోని భీమరాయుని కొట్టాల గ్రామానికి చెందిన వల్లెపు రాంబాబు కూలి పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. శుక్రవారం సాయంత్రం సెల్ ఫోన్ ఛార్జింగ్ పెట్టి వెళ్లాడు. తిరిగి వచ్చి ఫోన్ తీసే క్రమంలో ప్లగ్ ఊడి వచ్చింది. దీంతో విద్యుత్ షాక్కు గురై మృతి చెందినట్లు భార్య వల్లెపు రూపావతి తెలిపారు. మృతుడికి భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నట్లు తెలిపారు. తీగలు తగిలి గేదెలు.. వల్లూరు : మండలంలోని భాకరాపురం గ్రామంలో విద్యుత్ తీగలు తగిలి రెండు గేదెలు మృతిచెందినట్లు బాధిత రైతు తెలిపారు. గురువారం రాత్రి కురిసిన గాలి వానకు బాకరాపురం సమీపంలోని పొలాల్లో విద్యుత్ లైన్లు తెగి నేలమీద పడ్డాయి. శుక్రవారం ఉదయం పది గంటల సమయంలో గ్రామానికి చెందిన టి.నాగేశ్వర్రెడ్డి తన గేదెలను మేపడానికి పొలానికి తీసుకువెళ్లాడు. పొలంలో తెగి పడిన తీగలు రెండు గేదెలకు తగలడంతో విద్యుత్ షాక్కు గురై అక్కడికక్కడే మృతిచెందాయి. మిగిలిన గేదెలను పక్కకు తోలడంతో అవి సురక్షితంగా బయటపడ్డాయి. సుమారు లక్షన్నర రూపాయల విలువ చేస్తుందన్నారు. పరిహార ం ఇచ్చిఆదుకోవాలని రైతు కోరారు. -
శాసీ్త్రయతపై విద్యార్థులకు అవగాహన
రాయచోటి టౌన్ : శాసీ్త్రయ దృక్పథంపై విద్యార్థులకు అవగాహన కల్పించేందుకు సదస్సు ఉపయోగ పడుతుందని డీవైఈవో నాగయ్య పేర్కొన్నారు. పట్టణంలోని రాయచోటి డైట్ కళాశాలలో జిల్లా సైన్స్ అధికారి మార్లఓబుల్రెడ్డి ఆధ్వర్యంలో జిల్లాస్థాయి సైన్స్ సెమినార్ నిర్వహించారు. ఉత్తమ ప్రదర్శన కనబరచిన విద్యార్థులకు ప్రశంసాపత్రాలు, మెమొంటోలను డీవైఈఓ అందజేశారు. ఆయన మాట్లాడుతూ క్వాంటం యుగం ప్రారంభం.. బలాలు, బలహీనతలు అంశాలపై విద్యార్థులకు అవగాహన కల్పిస్తున్నట్లు తెలిపారు. సెమినార్లో ప్రెజెంటేషన్, వైవా, అప్టిట్యూడ్ టెస్టుల ద్వారా పరీక్షించి ప్రతిభ కనబరిచిన సంబేపల్లె మోడల్ స్కూల్ విద్యార్థి బొజ్జ విశ్వానందరెడ్డి, వాల్మీకిపురం జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన షామీన్ తాజ్లను రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేశామన్నారు. శనివారం విజయవాడలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో వారు పాల్గొంటారని తెలిపారు. ఈ కార్యక్రమంలో కరుణాకర్, రెడ్డెయ్య, శ్రీనివాసరాజు, మడితాటి నరసింహారెడ్డి, దిలీప్కుమార్, రవిశంకర్రెడ్డి, శివలక్ష్మి, రంజిత, హేమంత్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆర్డీఎస్ఎస్తో 24 గంటల విద్యుత్ సరఫరా
మైదుకూరు : గ్రామీణ ప్రాంతాలకు ఆర్టీఎస్ఎస్ (రివేంపుడ్ డిస్ట్రిబ్యూషన్ సెక్టార్ స్కీం)తో 24 గంటల విద్యుత్ సరఫరా చేయవచ్చని ఏపీఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ అన్నారు. మైదుకూరు మున్సిపాలిటీ పరిధిలోని రాయప్పగారిపల్లె వద్ద జరుగుతున్న ఆర్డీఎస్ఎస్ పనులను గురువారం ఆయన పరిశీలించారు. లోతేటి శివశంకర్ మాట్లాడుతూ ఆర్డీఎస్ఎస్ పనులను వేగవంతం చేయాలని సూచించారు. అనంతరం రాయప్పగారిపల్లెలో మౌలిక సదుపాయాల అభివృద్ధి పనులను పరిశీలించి అన్ని జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పర్యావరణ అనుకూల, గ్రామీణాభివృద్ధి కేంద్రీకృత దృక్పథాన్ని ప్రతిబింబించే కార్యక్రమాలను ఏపీఎస్పీడీసీఎల్ విజయవంతంగా కొనసాగిస్తోందని పేర్కొన్నారు. దువ్వూరు : పీఎం–కుసుం ఫీడర్ సోలార్ విద్యుద్దీకరణ పనులనుఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ శుక్రవారం పరిశీలించారు. దువ్వూరు జగనన్న కాలనీ వద్ద ఐదు మెగావాట్ల సామర్థ్యంతో జరుగుతున్న పనులను ఆయన పరిశీలించారు. విద్యుదుత్పత్తికి అవసరమైన స్థల సేకరణ, మట్టి పరీక్ష అంశాలపై అధికారులతో సమీక్షించారు. రైతులకు నాణ్యమైన, నిరంతర ఉచిత విద్యుత్ అందించడమే లక్ష్యమని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎస్ఈ రమణ, ఈఈలు లక్ష్మీపతి, నాగరాజు, డీఈఈలు శ్రీకాంత్, శివభాస్కర్, ఏఈలు రాజ్కుమార్, రామభద్రయ్య, హరి పాల్గొన్నారు.ఏపీ ఎస్పీడీసీఎల్ సీఎండీ లోతేటి శివశంకర్ -
తవ్వేశారు.. బిల్లు చేసుకుని పూడ్చేశారు
● ఫారంపాండ్ పేరుతో తెలుగు తమ్ముళ్ల అక్రమార్జన ● వాటర్షెడ్లో రూ.లక్షల ప్రజాధనం దుర్వినియోగంపెద్దతిప్పసముద్రం : కూటమి ప్రభుత్వంలో తెలుగు తమ్ముళ్లు అధికారులను కను సైగలతో శాసిస్తూ లక్షల రూపాయల ప్రజా ధనం దోచేస్తున్నారు. సొంత భూములు కలిగిన రైతులకు సమాచారం ఇవ్వకుండా బినామీ పేర్లతో రైతుల పొలాల్లో ఫారంపాండ్ పనులు చేపట్టి బిల్లులు చేసుకున్నాక గుట్టుచప్పుడు కాకుండా పూడ్చేస్తున్నారు. మండలంలోని సంపతికోట పంచాయతీ కొత్తపల్లికి చెందిన పి.రామలక్ష్మమ్మ పేరిట ఎలాంటి వ్యవసాయ భూములు లేవని సమాచారం. అయితే అదే పంచాయతికి చెందిన వల్లీసాబ్కు బోడిగుట్ట సమీపంలో ఖాతా నంబర్ 820లో అసైన్మెంట్ భూమి ఉంది. ఆయన కుటుంబీకులు బెంగళూరులో ఉంటూ నెలకోసారి స్వగ్రామానికి వచ్చి వెళ్తున్నారు. ఈ నేపథ్యంలో కూటమి నాయకులు వల్లీసాబ్ పొలంలో వాటర్షెడ్ ద్వారా మూడు నెలల కిందట ఫారంపాండ్ నిర్మించి బిల్లులు చేసుకోవాలని తలపెట్టారు. అనుకున్న వెంటనే పని గుర్తింపు సంఖ్య 20083లో రూ.1.85 లక్షల అంచనాతో పనులు పూర్తి చేశారు. భూమే లేని పి.రామలక్ష్మమ్మ పేరిట వల్లీసాబ్ పొలంలో చేసిన పనులకు బిల్లులు చేసుకున్నారు. వారం రోజుల కిందట వల్లీసాబ్ వచ్చి తన పొలం వద్ద ఫారంపాండ్ పనులు చూసి అవాక్కయ్యాడు. తనకు కనీస సమాచారం ఇవ్వకుండా పనులెలా చేపట్టారని కూటమి నాయకులను గట్టిగా నిలదీశాడు. ఇక చేసేది లేక తెలుగు తమ్ముళ్లు మూడు రోజుల కిందట జేసీబీ యంత్రాన్ని రప్పించి ఫారంఫాడ్ను గుట్టుగా పూడ్చేశారు. లక్షల రూపాయల నిధులు దుర్వినియోగం అయ్యాయి. నిధులను రికవరీ చేయాలి వాటర్షెడ్ ద్వారా ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేయాలి. ఫారంపాండ్ పనికి మంజూరు చేసిన ప్రజాధనాన్ని అధికారులు రికవరీ చేయాలి. కమిటీల ఆమోదం లేకుండా అధికారులను బెదిరించి బిల్లులు చేసుకోవడం పద్ధతి కాదు. సెంటు భూమి కూడా లేని బినామీల పేరిట బిల్లులు చేసుకోవడం సబబుకాదు. రైతులు, కమిటీలు, అధికారుల ఆమోదంతో ప్రజలకు ఉపయోగకరమైన పనులు చేపట్టాలి. –రఘునాథ్రెడ్డి, వాటర్షెడ్ ఛైర్మన్, సంపతికోట -
విద్యుత్ కార్మికులను విస్మరిస్తే సహించం
రాజంపేట రూరల్ : జిల్లాలో పని చేస్తున్న విద్యుత్తు ఉద్వోగులు, కాంట్రాక్ట్, ఔట్సోర్సింగ్ కార్మికులను విస్మరిస్తే సహించబోమని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.చంద్రశేఖర్, జిల్లా సహాయకార్యదర్శి చిట్వేలి రవికుమార్ హెచ్చరించారు. స్థానిక విద్యుత్ కార్యాలయం ఎదుట రాజంపేట విద్యుత్ స్ట్రగుల్ కమిటీ ఆద్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. వారు మాట్లాడుతూ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ కార్మికులను సంస్థలో విలీనం చేసి.. రెగ్యులర్ చేయాలన్నారు. వన్ ఇండస్ట్రీ వన్ సర్వీస్ రెగ్యులేషన్స్ అమలు చేయాలని, గ్రేడ్ 2 కార్మికులకు న్యాయం చేసే వరకూ పాత పెన్షన్ పద్ధతి పునరుద్ధరించాలన్నారు. నగదు రహిత అపరిమిత మెడికల్ పాలసీని, గ్రేడ్–2 జేఎల్ఎంలకు ఏపీఎస్ఈబీ సర్వీస్ రెగ్యులేషన్స్ వర్తింపజేయాలని కోరారు. కాంట్రాక్టు కార్మికులకు కోటి రూపాయల ఇన్సూరెన్స్ ఇవ్వాలని, దళారీ వ్యవస్థ లేకుండా కార్మికులకు నేరుగా వేతనాలు చెల్లించాలని తెలిపారు. తమ సమస్యలను పరిష్కరించే వరకూ ఉద్యమాలు కొనసాగిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో యుఈఈయూ జిల్లా కార్యదర్శి ఈ.శ్రీహరి, కిరణ్కుమార్, పి.బాలకృష్ణ, డి.సుధాకర్, సురేంద్ర, ఎరికలరెడ్డి, నాగబాలాజి, తదితరులు పాల్గొన్నారు.సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు సీహెచ్.చంద్రశేఖర్ -
చెరువులో పడి ఒకరు మృతి
రాయచోటి టౌన్ : రాయచోటి రూరల్ మండలం శిబ్యాల పరిధిలోని కానుగ చెరువులో పడి పఠాన్మున్నా (40) శుక్రవారం మృతిచెందాడు. స్థానికుల కథనం మేరకు.. శిబ్యాల గ్రామం (చెరువుకు దగ్గరగా ఉన్న ఊరు)లోని తన ఇంటి నుంచి గేదెలను మేపేందుకు పఠామున్నా వెళ్లాడు. రాత్రి అయినా ఇంటికి రాలేదు. ఆయన భార్య పోలీసులకు ఫిర్యాదు చేయడంతో విచారణ సాగించారు. పశువులు మేపేందుకు వెళ్లిన ఆధారాలు ఉండటం, తరువాత ఇంటికి రాకపోవడంతో ఏదైనా ప్రమాదం జరిగి ఉంటుందని భావించి అగ్నిమాపక అధికారులకు సమాచారం ఇచ్చారు. వారి సాయంతో చెరువులో గాలించి మృతదేహాన్ని గుర్తించారు. గేదెలు మేస్తూ చెరువులోకి వెళ్లినట్లు ఆధారాలు లభించాయి. మున్నా కూడా నీటి మడుగులో నుంచి గేదెలను బయటకు తోలేందుకు వెళ్లి అక్కడ లోతైన గుంటలో పడి మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం రాయచోటి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
ఎర్రచందనం కేసులో ఇద్దరికి జైలుశిక్ష
ములకలచెరువు/తిరుపతి లీగల్ : ఎర్రచందనం దుంగల అక్రమ రవాణా కేసులో ఇద్దరికి ఐదేళ్ల జైలు శిక్ష, మూడు లక్షల రూపాయల జరిమానా విధిస్తూ తిరుపతి రాష్ట్ర ఎర్రచందనం కేసుల విచారణ సెషన్స్ జడ్జి నరసింహమూర్తి శుక్రవారం తీర్పుచెప్పారు. కోర్టు లైజనింగ్ ఆఫీసర్ కె.శ్రీనివాసులు, హెడ్ కానిస్టేబుల్ ఆర్.గణేష్ తెలిపిన వివరాల మేరకు.. 2019 డిసెంబర్, 5న ములకలచెరువు పోలీసులకు వచ్చిన సమాచారంతో మదనపల్లె–కదిరి రోడ్డు తంబేపల్లి క్రాస్ వద్ద వాహనాలను తనిఖీ చేశారు. మదనపల్లె నుంచి ఓ టాటా సుమో వాహనం అతివేగంగా వస్తూ పోలీసులలను చూసి ఆగింది. ఆ వాహనంలోని ఇద్దరు కర్ణాటక, కోలార్ జిల్లా బంగారుపేట తాలూకా, దొడ్డూరుకు చెందిన నారాయణప్ప శివకుమార్, బంగారు పేట తాలూకా కురబర హళ్లికి చెందిన సుబ్రహ్మణ్యం, మంజునాథ్ పారిపోవడానికి ప్రయత్నించారు. పోలీసులు వారిని వెంబడించి ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. టాటా సుమో వాహనాన్ని తనిఖీ చేశారు. అందులో ఉన్న 162 కిలోల ఐదు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరిచారు. నేరం రుజువు కావడంతో న్యాయమూర్తి ఇద్దరికీ శిక్ష విధిస్తూ తీర్పు చెప్పారు. -
అనాథ శవానికి అంత్యక్రియలు
మదనపల్లె సిటీ : మానవత్వం పరిమళించింది. పొట్టకూటి కోసం వచ్చిన బీహార్ రాష్ట్రానికి చెందిన ఇద్దరు కూలీలు పీటీఎం మండలం కందుకూరులో విద్యుత్తు షాక్తో మృతిచెందారు. మృతదేహాలను స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీలో ఉంచారు. కుటుంబీకులు, రక్తసంబంధీకులు ఎవరూ రాకపోవడంతో హెల్పింగ్ మైండ్స్ సభ్యులకు సమాచారం ఇచ్చారు. హిందూ సంప్రదాయబద్ధంగా ఇద్దరికీ స్థానిక శ్మశాన వాటిలో వారు దహన సంస్కరణలు చేశారు. కార్యక్రమంలో హెల్పింగ్మైండ్స్ వ్యవస్థాపకులు అబూబకర్సిద్దిక్, సభ్యులు ఆనంద్, సమీర్, నవీన్, సుబ్బు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీలో చేరికవీరబల్లి్: మండలంలోని వంగిమల్ల గ్రామామంలో పది కుటుంబాల టీడీపీ కార్యకర్తలు శుక్రవారం వైఎస్సార్సీపీలో చేరారు. మండల కేంద్రంలోని వైఎస్సార్సీపీ రాష్ట్ర ఎగ్జిక్యూటివ్ కౌన్సిల్ సభ్యుడు విజయభాస్కర్రెడ్డి ఆధ్వర్యంలో పెదివేటి వేరునాగయ్య, చెన్నయ్య, బాలయ్య, అలీ, బాబు, అశోఆక్ కుమార్ తదితరులు టీడీపీ నుంచి వైఎస్సార్సీపీలో చేరారు. వారు మాట్లాడుతూ టీడీపీలో ప్రజలకు ఏమి న్యాయం జరగలేదని, గత జగనన్న పరిపాలనలో జరిగిన సంక్షేమం, ఆర్థికాభివృద్ది దృష్టిలో పెట్టుకుని పార్టీలో చేరామని తెలిపారు. అనంతరం విజయభాస్కర్రెడ్డి, ఎంపీపీ రాజేంద్రనాథ్రెడ్డిలను రాజంపేట వైఎస్సార్సీపీ నాయకులు మదన్రెడ్డి, తదితరులు ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో రెడ్డప్పరెడ్డి, తారకేశ్వర్రెడ్డి, సురేంద్రనాథ్రెడ్డి, కృష్ణారెడ్డి, రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు. మహిళపై దాడిమైదుకూరు : పట్టణంలోని అరుంధతీ నగర్కు చెందిన మహిళ గద్దె సుజాతపై దాడి చేసిన ముగ్గురు వ్యక్తులపై పోలీసుల కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఈ నెల 11న సుజాత భర్త రవికి, బొచ్చెనపల్లె పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుకు మధ్య వాగ్వాదం జరిగింది. అది మనసులో పెట్టుకొని ఈ నెల 14న సుజాతపై ముగ్గురు దాడి చేసి గాయపరిచి అవమానపరిచారు. చికిత్స కోసం ప్రొద్దుటూరు ఆస్పత్రిలో చేరిన బాధితురాలు అక్కడ అవుట్ పోస్టులో ఫిర్యాదు చేసింది. ఆ మేరకు పాలకొండయ్య, రాజేష్, పెద్ద ఓబులేసుపై ఎస్ఐ సుబ్బారావు కేసు నమోదు చేశారు. ఝరికోనలో మృతదేహంకలకడ : మండలంలోని ఝరికోనలో గుర్తుతెలియని మృత దేహం ఉందని స్థానికులు సమాచారం ఇవ్వడంతో ఎస్ఐ రామాంజ నేయులు శుక్రవారం పరిశీలించారు. సుమారు 45 ఏళ్ల వయస్సున్న వ్యక్తి రెండు రోజుల కిందట నీటిలో పడి ఉండవచ్చునని తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు సమాచారం ఇవ్వాలన్నారు -
యథేచ్ఛగా ఇసుక అక్రమ రవాణా
● ప్రతి రోజు వంద టన్నులకుపైగా ఇసుక తరలింపు ● మండల స్థాయి టీడీపీ నాయకుడి అండతో రవాణాసాక్షి టాస్క్ఫోర్స్ : మండలస్థాయి టీడీపీ నేత అండతో ఇసుక అక్రమ రవాణా యథేచ్ఛగా సాగుతోంది. చక్రాయపేట మండలం మారెళ్ల మడక సమీపంలో ప్రభుత్వం ఇసుక రీచ్ ఏర్పాటు చేసింది. ఇటీవల కురిసిన వర్షాలకు రీచ్లో భారీగా వర్షపునీరు చేరింది. ఈ పరిణామం చక్రాయపేట మండల టీడీపీ నాయకుడికి వరంగా మారింది. అద్దాలమర్రి చెక్ పోస్టు సమీపంలో అమ్మవారి గుడి వద్ద పెద్ద ఎత్తున ఇసుక అందుబాటులో ఉండడం గమనించి దానిపై ఆ నాయకుడు కన్నేశారు. అనుకున్నదే తడవుగా ఆ ప్రాంతంలో హిటాచీ ఏర్పాటుచేసి నిత్యం వంద టన్నులకు పైగా ఇసుక తరలించేస్తున్నారు. నిత్యం ఇది కనిపిస్తున్నా.. ఇటు పోలీసులు, అటు రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదు. టన్నుల వారీగా వచ్చే ఆదాయంలో వాటాల రూపంలో అందరికీ చేరుతోందనే ఆరోపణలున్నాయి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అమ్మవారి ఆలయం నిర్మించి అక్కడి వరకూ సీసీ రహదారి నిర్మించింది. ఈ ఆలయ సమీపంలోనే తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. -
సోమశిలలో పుష్పరాజ్లు
రాజంపేట: సోమశిల బ్యాక్వాటర్ ప్రాంతాలు పుష్పాలకు నిలయంగా మారాయి. తాజాగా పోలీసులు పట్టుకున్న స్మగ్లర్లు నందలూరు మండలానికి చెందిన వారిగా గుర్తించారు. ఈ ఏడాది మే 12న ఎర్రచందనం స్మగ్లింగ్లో తగ్గేదేలా శీర్షికతో సాక్షిలో కథనం ప్రచురితమైంది. ఇప్పుడు ఈ కథనం నిజమనడానికి పోలీసుల అదుపులో ఉన్న పుష్పరాజ్లే నిదర్శనమని సోమశిల ముంపువాసులు చెబుతున్నారు. తీగలాగితే.. తీగలాగితే డొంక కదిలినట్లు చిత్తూరు జిల్లా పరిధిలో టాస్క్ఫోర్స్ పోలీసులకు పట్టుబడిన ఓ స్మగ్లర్ ఇచ్చిన సమాచారం మేరకు నందలూరులోని కొమ్మూరు, కోనాపురం, ఈదరపల్లె, నందలూరు , చాపలవారిపల్లె, చుక్కాయపల్లె, చింతకాయలపల్లె తదితర గ్రామాలకు చెందిన కొంతమంది ముఠాలుగా ఏర్పడి ఎర్రచందనం స్మగ్లింగ్ పాల్పడుతున్నారు. వీరిని పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేస్తున్నట్లు సమాచారం. ఇందులో టీడీపీకి చెందిన ఓ స్థానిక సంస్ధ ప్రజాప్రతినిధితోపాటు ఆపార్టీ సానుభూతి పరులు ఉన్నారని తెలుస్తోంది. స్మగ్లర్ల ఫోన్ల ద్వారా ఎవరెవరికి సంబంధాలు ఉన్నాయనే కోణంలో విచారణ జరుగుతోంది. ఒక సామాజిక వర్గానికి చెందిన వారే స్మగ్లర్లుగా ఉన్నారనే సమాచారంతో, ఆ సామాజిక వర్గానికి చెందిన కొందరు పెదవి విరుస్తున్నారు. ● రాజంపేట మండలం బోయనపల్లెకు చెందిన ఓ స్మగ్లర్ను కూడా పోలీసులు పట్టుకున్నారు. అతనికి దాదాపు రూ.3కోట్ల పైగా ఆస్తి ఉంది. ఈ విధంగా నందలూరు మండలంలోని ముంపుగ్రామాలకు చెందిన వారు ఎర్రచందనంతో రూ. కోట్లు సంపాదించి, ఇతర ప్రాంతాల్లో రియల్ఎస్టేట్, ఇళ్లు, భూములును కొనుగోలు చేసి, స్థానికంగా మాసిపోయిన పంచలు, చొక్కాలతో కనిపిస్తున్నారు. తిరుపతి, రేణిగుంటల్లో.. ఎర్రచందనం స్మగ్లింగ్తో ముంపుగ్రామాలకు చెందిన కొందరు తిరుపతి, రేణిగుంట తదితర ప్రాంతాల్లో భూములు కొనుగోలు చేసినట్లు, విలాసవంతమైన జీవితాలను గుడుపుతుండటం గమనార్హం. నందలూరులో ఎర్రచందంన స్మగ్లర్ల తాకిడి అధికం కావడానికి సోమశిల బ్యాక్వాటర్ కారణంగా చెప్పవచ్చు. ఎర్రచందనం స్మగ్లింగ్కు పాల్పడే కీ పర్సన్ కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు. గుట్టుచప్పుడుగా..బ్యాక్వాటర్లో.. సోమశిల బ్యాక్వాటర్లో ఎర్రచందనం స్మగ్లింగ్ గుట్టుచప్పుడుగా కొనసాగుతోంది. అటవీశాఖ డీఎఫ్ఓగా శ్రీనివాసులరెడ్డి ఉన్నపుడు బ్యాక్వాటర్లో దాచిపెట్టిన ఎర్రదుంగలడంప్ను స్వాధీనం చేసుకున్నారు. అప్పట్లో ప్రత్యేక దృష్టి సారించి అడ్డుకట్టవేశారు. ఇప్పుడు ఆ పరిస్థితులు కనిపించడంలేదు. సోమశిల ముంపు గ్రామాలతోపాటు సమీప గ్రామాలకు చెందిన కొందరితో స్మగ్లింగ్ మళ్లీ యథేచ్ఛగా సాగుతోంది. అక్రమరవాణాకు అడ్డుకట్ట వేసే దిశగా అటవీశాఖ చర్యలు తీసుకోవడంలేదనే విమర్శలున్నాయి. చేపలవేట ముసుగులో... సోమశిల బ్యాక్వాటర్లో చేపల వేట ముసుగులో ఎర్రచందనం స్మగ్లింగ్ జరుగుతోంది. ముంపు గ్రామాలకు చెందిన ఇద్దరిని ఇటీవల ఇతర ప్రాంతంలో పట్టుకొని కేసు కూడా నమోదు చేసినట్లు తెలుస్తోంది. అటవీ చెక్పోస్టులు ఉన్నా.. నామమాత్రమే అన్న విమర్శలు వెలువడుతున్నాయి. ఈజీమనీ కోసం.. ఈజీ మనీ కోసం కోనాపురం, కొమ్మూరు, చాపలవారిపల్లె, చుక్కాయపల్లె, ఈదరపల్లె, నందలూరు, చింతకాయపల్లె తదితర గ్రామాల యువకులు ఎర్రచందనం స్మగ్లింగ్కు అలవాటుపడుతున్నారు. జనజీవనం లేని ముంపు గ్రామాల్లో అర్ధరాత్రి వేళలో వాహనాల రాకపోకలు కొనసాగుతున్నాయి. నేరుగా బ్యాక్వాటర్ ఉన్న ప్రాంతాల వద్దకు చేరుకొని, అక్కడి నుంచి అక్రమరవాణా మొదలవుతుంది. అటవీశాఖ పట్టించుకోకపోవడం వల్లనే ఇటీవల ఎర్రచందనం స్మగ్లర్లు అధికమయ్యారు. పల్లాగట్టు ప్రాంతం 20 కిలోమీటర్ల మేర విస్తరించి ఉంది. వెలుగులోకి రాని ఈ ఐలాండ్లో చట్టవ్యతిరేక కార్యకలపాలు జరుగుతున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఎర్రచందనం స్మగ్లర్లు పల్లాగట్టును తమకు అనుకూలంగా మార్చుకున్నారనే ఆరోపణలున్నాయి. గుండ్లమాడతోపాటు సోమశిల వెనుకజలాల వెంబడి ఉన్న అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి అక్రమరవాణాకు బ్యాక్వాటర్ను అడ్డాగా వాడుకుంటున్నారు. రోడ్డు మార్గం లేకపోవడంతో బ్యాక్వాటర్ ద్వారానే బాలెలో తరలించి పొత్తపి ద్వారా ఓబలికి తరలిస్తున్నారు. నందలూరులో ఎర్రచందనం స్మగ్లర్లు యథేచ్ఛగా దుంగల అక్రమరవాణా చిత్తూరులో పట్టుబడిన స్మగ్లర్.. తీగ లాగితే కదిలిన డొంక పోలీసులు అదుపులో కొందరు,మరికొందరి కోసం గాలింపు అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలు నరికి వాటిని జనసంచారం లేని ముంపు గ్రామాల శివార్లకు చేర్చి, అక్కడి నుంచి అనుమానం రాకుండా అనుకున్న గమ్యాలకు తరలించేస్తున్నారు. గుట్టుచప్పుడుగా సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ వ్యవహారం గురించి ముంపుగ్రామాల్లో ఏ ఒక్కరిని కదిలించినా చెబుతారు. పల్లాగట్టు, గుండ్లమడలోని అటవీ ప్రాంతంలో ఎర్రచందనం దుంగలను నరికి వాటిని నాటుబోట్లలో గట్టుకు చేర్చి అక్రమంగా మెయిన్రోడ్డుకు ఎక్కిస్తున్నారు. -
● రైల్వేకోడూరులో..
రెల్వేకోడూరు అర్బన్: ప్రభుత్వం చేసే తప్పిదాలను ప్రజలకు తెలియ చేస్తున్న సాక్షి మీడియాపై కూటమి ప్రభుత్వం అనవసర కేసులు పెడుతూ ఎడిటర్ను విచారణల పేరుతో వేధించడం ప్రత్రికాస్వేచ్ఛను కాలరాయడమేనని జర్నలిస్టులు పేర్కొన్నారు. ఇలాంటి సంస్కృతిని విరమించుకోవాలని కోరుతూ స్థానిక తాహసీల్దార్ అమర్నాథ్కు వినతి పత్రం అందించారు.కార్యక్రమంలో పాత్రికేయులు మల్లికార్జున శర్మ, మౌలా, విజయ్, శంకర్రెడ్డి, గంగాద్రి, స్థానికులు రత్తయ్య, చైతన్య తదితరులు పాల్గొన్నారు. -
పరిశ్రమల ఏర్పాటుకు త్వరగా అనుమతులు ఇవ్వాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ రాయచోటి: సింగిల్ డెస్క్ విధానంలో క్రింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని జిల్లా కలెక్ట్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్షరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. సింగిల్ డెస్క్ విధానం కింద గడిచిన త్రైమాసికంలో అందిన దరఖాస్తుల పరిష్కారం చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధ రాయితీల మంజూరు అంశాలపై కలెక్టర్ సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె. కృష్ణ కిషోర్, డిఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, రాయచోటి మున్సిపల్ కమీషనర్ రవి, జడ్పీఎం ఏపీఐఐసీ రమణమూర్తి, జిల్లా రవాణా శాఖ అధికారి, విద్యుత్ శాఖ అధికారి, డయా ఇండస్ట్రియల్ అసోసియేషన్ ప్రతినిధి రాజశేఖర్, టెక్కి అసోసియేషన్ ప్రతినిధి రామమూర్తి నాయక్ పాల్గొన్నారు. ● సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమపై అన్నమయ్య షాపింగ్ పెస్టివల్ను కలెక్టర్ నిశాంత్ కుమార్ ప్రారంభించారు. శుక్రవారం రాయచోటిలోని జూనియర్ కలాశాల గ్రౌండ్లో జేసీ ఆదర్శ రాజేంద్రన్, ఆర్డీఓ శ్రీనివాస్తో కలిసి షాపింగ్ ఫెస్టివల్ ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ కార్యక్రమంపై ఏర్పాటు చేసిన స్టాళ్లు, ఫుడ్ కోర్టులను సందర్శించారు. జిల్లాలోని వివిధ పాఠశాలల విద్యార్థులు నిర్వహించిన సాంస్కృతిక కార్యక్రమాలు అందరినీ అలరించాయి. కార్యక్రమంలో డీఆర్డీఏ పీడీ సత్యనారాయణ, రాయచోటి తహసీల్దార్ నరసింహ కుమార్, వాణిజ్య పన్నుల శాఖ అధికారిణి సుమతి, టూరిజం శాఖ అధికారి నాగభూషణం తదితరులు పాల్గొన్నారు. -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
పత్రికా స్వేచ్ఛను కాలరాయాలని చూడటం ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టులాంటిది. పత్రికలో వచ్చిన కథనాల్లో ఏమైనా అభ్యంతరాలు ఉంటే న్యాయబద్ధంగా ఎదుర్కోవాలే తప్ప ఇలా వ్యవహరించడం సరికాదు. ప్రభుత్వ చర్యల్ని ఖండిస్తున్నాం. సాక్షి మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపాలి. –జీవీ ప్రసాద్, విద్యావేత్త, మదనపల్లె మూల్యం చెల్లించుకుంటారు పత్రికా స్వేచ్ఛ రాజ్యాంగం కల్పించిన హక్కు. సాక్షి కార్యాలయంపై దాడులు, ఎడిటర్పే కేసులు అప్రజాస్వామికం. వీటికి తగిన మూల్యం చెల్లించుకోవాల్సి ఉంటుంది.తక్షణమే సాక్షి మీడియా ప్రతినిధులపై వేధింపులు ఆపాలి. – ముద్దా బాబుల్ రెడ్డి, మండలాధ్యక్షుడు పత్రికా స్వేచ్ఛను హరించడమే సాక్షి ఎడిటర్ ధనుంజయ రెడ్డిపై కక్ష గట్టి పోలీసుల సాయంతో వరుసగా కేసులు నమోదు చేయడం ఆక్షేపణీయం.పభుత్వ వైఫల్యాలపై సాక్షిలో కథనాలు ప్రచురించారని పత్రికా కార్యాలయాలపై దాడులు చేయడమేమిటి?..ఇది అనాగరికం. ప్రభుత్వం ఇప్పటికై న తన తప్పును తెలుసుకుని వ్యవహరించాలి. – మూరి శంకర్ రెడ్డి, పంచాయతీ రాజ్ వింగ్ అధ్యక్షుడు అప్రజాస్వామికం భారత రాజ్యాంగ వ్యవస్థకు తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తుంది. పత్రిక స్వేచ్ఛను అణిచివేసేందుకు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి ఒత్తిడికి గురి చేస్తోంది. ఇది అప్రజాస్వామికం. ప్రజాస్వామ్యవాదులంతా ఈ చర్యలను ఖండిస్తున్నారు. –వత్తలూరు సాయికిషోర్ రెడ్డి,వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్, ఓబులవారిపల్లి -
ముగిసిన వర్క్షాప్
రాయచోటి: జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలను వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యయవసాయంలో మార్పులు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక చేసినట్లు జిల్లా వ్యవసాయాధికారి జి శివనారాయణ తెలిపారు. ఇందులో భాగంగా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై జిల్లా, మండలస్థాయిలో నిర్వహించిన రెండురోజుల వర్క్ షాప్ గురువారం ముగిసింది. వర్క్షాప్లో జిల్లా, మండలస్థాయి, ప్రైమరీ సెక్టార్ అధికారుల భాగస్వామ్యంతో వార్షిక కార్యాచరణ ప్రణాళిక సిద్ధం చేసినట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమాన్ని ఢిల్లీకి చెందిన వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ టీమ్ సభ్యులు బాలాజీ త్రిపాఠి, సుదేష్ణ సేన్, జ్యోతి, రైతు సాధికార సమితి రాష్ట్ర కార్యాలయం నుంచి ఎన్వై శాస్త్రి, సౌమ్య కొల్లా, డీపీఎం వెంకటమోహన్, వరల్డ్ పుడ్ ప్రోగ్రామ్ ఎస్పీఎం డాక్టర్ నరసింహారెడ్డి, చందనల సమన్వయంతో నిర్వహించారు. రాయచోటి జగదాంబసెంటర్: ప్రభుత్వ ఆదేశాలు, సూచనల మేరకు రీసర్వే పక్కాగా నిర్వహించాలని ప్రాజెక్ట్ డిప్యూటీ డైరెక్టర్ పీవీ జయరాజ్ పేర్కొన్నారు. గురువారం జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రీసర్వేపై రాయచోటిలో అధికారులతో ఆయన సమీక్షించారు. ప్రతి రైతుకు జీటీ నోటీసులను అందజేసి వారి సమక్షంలో భూమిని ఆధునిక టెక్నాలజీ రోవర్ ద్వారా సర్వే చేయాలని సూచించారు. అనంతరం రైతులకు రీసర్వే ద్వారా కలిగే లాభాలను వివరించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 18న జిల్లా స్కేటింగ్ ఎంపికలు నిర్వహించనున్నట్లు జిల్లా ది రోలర్ స్కేటింగ్ అసోసి యేషన్ కార్యదర్శి ఇస్రా యిల్ గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలు యోగి వేమన యూనివర్శిటీ, డీఎస్ఏ స్టేడియంలో జరుగుతాయన్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులు 37వ అంతర్ జిల్లాల రోలర్ స్కేటింగ్ పోటీలు నవంబర్ 1 నుంచి 5 వరకు కాకినాడలో జరిగే పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని పేర్కొన్నారు. చక్రాయపేట: గండి వీరాంజనేయ స్వామి సన్నిధిలో గురువారం నిర్వహించిన టెండర్లలో కొన్నింటికి ఆమోదించి మరి కొన్నింటిని వాయిదా వేసినట్లు ఆలయ సహాయ కమీషనర్ వెంకటసుబ్బయ్య తెలిపారు. టెండర్లలో ప్రధానమైన కొబ్బరికాయల విక్రయ హక్కుకు సంబంధించి పోటీదారులు ధరావత్తు మొత్తం చెల్లించినప్పటికీ పాట పాడేందుకు నిరాసక్తత కనబరిచారు.దీంతో కొబ్బరి కాయల టెండరును వాయిదా వేసినట్లు ప్రకటించారు.సప్లయర్స్ డెకరేషన్ సామాన్లు,విద్యుత్ ఫ్లంబింగ్ ఆమాగ్రి సరఫరా,స్టేషనరీ,అరటి ఆకుల,మామిడి తోరణములు, వస్త్రాల సరఫరా,తదితరాలను ఆమోదం తెలిపినట్లు చెప్పారు.పూలమాలల సరఫరా,పాదరక్షలు భద్రపరచు హక్కు,ని రుపయోగ సామగ్రి కొనుగోలు తదితరాలను వాయిదా వేశామని వివరించారు. కడప దేవదాయ శాఖ తనిఖీదారుడు శివయ్య,ఆలయ చైర్మన్ కావలి కృష్ణతేజ,మాజీ చైర్మన్లు కావలి వీరభాస్కరుడు,వెంకటస్వామి పాల్గొన్నారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: ప్రధానమంత్రి కౌశల్ వికాస్ యోజనలో భాగంగా జిల్లాలో గల యువకులకు నైపుణ్యాలతో కూడిన డ్రైవింగ్ స్కిల్స్ అభివృద్ధి చేయడంలో భాగంగా కేంద్ర ప్రభుత్వం ఆర్థిక సహాయంతో డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్లను ఏర్పాటు చేయడానికి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఇన్చార్జ్ జిల్లా ఉప రవాణా శాఖ కమిషనర్ వీర్రాజు పేర్కొన్నారు. గురువారం నగర శివార్లలోని ఊటుకూరు జిల్లా ఉప రవాణాశాఖ కమిషనర్ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఇందులో భాగంగా ప్రతి 10 లక్షల జనాభాకు ఒక డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ చొప్పున శాంక్షన్ చేయడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. డ్రైవింగ్ ట్రైనింగ్ సెంటర్ ఏర్పాటు చేయడానికి ఆసక్తి కల అభ్యర్థులు ఈ నెల 23 సాయంత్రం 5 లోపు వారి ఆసక్తి పత్రాలను, డీపీఆర్ కాపీలను, ఇతర అటాచ్మెంట్లను జిల్లా ఉప రవాణా కమిషనర్ కార్యాలయము, వైయస్సార్ కడప జిల్లా లో సబ్మిట్ చేయాలని కోరారు. ఆసక్తి గల సంస్థలు పూర్తి వివరాలు కోసం కేంద్ర రహదారులు , రవాణా శాఖ వెబ్సైట్లో నుండి పూర్తి వివరాలు పొందవచ్చన్నారు. -
మానవ తప్పిదమే
● హెచ్ఎన్ఎస్ఎస్కు ప్రత్యేక సబ్స్టేషన్ ఉండగా విద్యుత్ సరఫరా ఎందుకు ఆగింది ● ట్రిప్ కావడానికి కారణాలేమిటి? ● హంద్రీ–నీవా అధికారులు నీటితరలింపునకే పరిమితమై, వ్యవస్థలను నిర్లక్ష్యం చేశారా బి.కొత్తకోట: బి.కొత్తకోట మండలం తరిగోడు ఎత్తిపోతల పథకం సమీపంలో పుంగనూరు ఉపకాలువపై 110.950 కిలో మీటర్ (గుండ్లపల్లె) వద్ద గండిపడి తెగిపోవడానికి మానవ నిర్లక్ష్యం ఉందని పలు అంశాలు స్పష్టం చేస్తున్నాయి. శ్రీసత్యసాయిజిల్లా కదిరి సమీపంలోని చెర్లోపల్లె జలాశయం నుంచి కృష్ణా జలాలను కుప్పానికి తరలిస్తున్నారు. ఈ కాలువసాగే మార్గంలో మండలంలోని తరిగోడు సమీపంలోని గుండ్లపల్లె వద్ద బుధవారం ఉదయం కాలువ తెగిపోయింది. దీనికి కారణం మంగళవారం రాత్రి మెరుపులతో తరిగోడు ఎత్తిపోతల పథకానికి విద్యుత్ సరఫరా చేసే లైన్ దెబ్బతిని సరఫరా ఆగిందని అంటున్నారు. అయితే అసలు ఏమి జరిగింది, కాలువ తెగకుండా లేదా తెంపాల్సి వస్తే ఎలాంటి చర్యలు తీసుకోవాలి.. ఒక చోట ఎత్తిపోతల పథకం ఆగితే పైనున్న పథకాలు ఆటోమెటిక్గా ఆగిపోవాలి. ఇందులో ఏది జరగలేదు. ఎందుకన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. అనుమానాలెన్నో.. విద్యుత్ సరఫరాలో అంతరాయంవల్ల తరిగోడు ఎత్తిపోతల పథకం పనిచేయలేదని హంద్రీ–నీవా ప్రాజెక్టు అధికారులు అంటున్నారు. ఆ సమస్య ఎందువల్ల వచ్చిందో స్పష్టత లేదు. విద్యుత్ సరఫరా లైన్లో అంతరాయం కలగడానికి సరఫరా ఓవర్లోడ్, తీగలపై చెట్ల కొమ్మలు పడటం, ఇన్స్లేటర్ పగిలిపోవడం లాంటి కారణాలు ఉంటాయి. ఇక్కడ అధికారులు పిడుగుపడిందని, దానివల్లే ఇన్స్లేటర్లు దెబ్బతిన్నట్టు అధికారులు చెబుతున్నారు. అయితే పిడుగు పడటం తమకు తెలియదని సమీప గ్రామస్తులు చెబుతున్నారు. దీంతో లైన్ ఎలా దెబ్బతింది, నిర్వహణ సక్రమంగా లేదా, సమస్యను ముందే గుర్తించలేదా అన్న ప్రశ్నలు తలెత్తుతుండగా, ఎత్తిపోతల పథకం వద్ద ట్రాన్స్ఫార్మర్కు కూడా సాంకేతిక సమస్య ఉన్నట్టు చెబుతున్నారు. ఇది కూడా కారణమా అన్న అనుమానాలు కలుగుతున్నాయి. తెగినచోటే తెగింది ఇప్పుడు కాలువతెగిన చోటనే గతంలోనూ కాలువ తెగిందని అధికారులే స్పష్టం చేస్తున్నారు. తరిగోడు పథకం ఆగిన తర్వాత ఇప్పుడు కాలువ తెగిన పైప్రాంతంలో తెంపి నీటిని మళ్లించాలని ప్రయత్నం చేశారు. అయితే ఇప్పటికే ఒకసారి తెగిన చోటనే కాలువ మళ్లీ తెగిపోయి గండిపడింది. దీన్ని పరిశీలిస్తే ప్రాజెక్టు అధికారులు కాలువలోకి నీళ్లు వదలకముందు కాలువ పటిష్టతపై సన్నద్ధం కావాలి. అయితే అలాంటి చర్యలు చేపట్టినట్టు కనిపించడం లేదు. దానిఫలితమే కాలువకు తెగి గండిపడినట్టు స్పష్టం అవుతోంది. నివాసప్రాంతాలు లేనిచోట కాలువ తెగడంతో ప్రమాదం తప్పింది. ఎస్కేప్ సిస్టం లేదు ఎగువనుంచి కాలువలో నీటి ప్రవాహం ఆగనప్పుడు కాలువ పక్కన చెరువు లేదా వాగులు ఉన్న ప్రాంతాన్ని ఎంచుకుని అక్కడ కాలువను తెంపి నీటిని మళ్లించాలి. అయితే ప్రస్తుతం కాలువ తెగినచోటనే చెరువు ఉండటంతో నీళ్లు అందులోకి ప్రవహించి నిండాక మరో చెరువులోకి వెళ్లే అవకాశం ఉంది. ప్రతి పంపింగ్ స్టేషన్ (ఎత్తిపోతలు)కి ముందు దగ్గరలో ఉన్న వంకలు, వాగులు, చెరువులను కలిపే విధంగా ఒక ఎస్కేప్ స్ట్రక్చర్ (అధికంగా వచ్చే నీళ్లను వంకలకు మళ్లించే సేఫ్టీ వ్యవస్థ) నిర్మించుకోవాల్సి ఉంటుంది. కానీ ఇది కాలువ మొత్తానికి ఎక్కడా అనుసరించలేదు. దానికి గుండ్లపల్లె వద్ద తెగి గండిన కాలువే నిదర్శనం. గుండ్లపల్లె వద్ద తెగి గండి పడి కాలువ నుంచి బయటకు ప్రవహిస్తున్న నీళ్లు గండి పూడ్చేందుకు మొదలైన పనులు ఒకే లైన్ లో కాలువమీద పంపులు ఉన్నప్పుడు మధ్యలో ఏదైనా పంప్ స్టేషన్ (ఎత్తిపోతలు) ఆగిపోయి మిగతావి పని చేస్తుంటే నీరు వస్తూనే ఉంటుంది.. అలాంటి ఇబ్బంది వచ్చినప్పుడు, ఏ మోటార్ చెడిపోయినా ఆ పంపు స్టేషన్ స్టాండ్బైగా ఉన్న వేరే పంపు స్టార్ట్ అవుతుంది. ఇదిలేదు. సిరిస్లో ఉన్న పంపులకు సూపర్వైజరీ కంట్రోల్ అండ్ డేటా ఆక్విజేషన్ (స్కడ) ఎలక్ట్రో మెకానిల్ టెండర్లోనే సాధారణంగా పొందుపరిచి ఉంటారు. అలాంటి వ్యవస్థ ఉంటే (తరిగోడు ఎత్తిపోతల పథకం సమీపంలోని గుండ్లపల్లె వద్ద కాలువ తెగిపోయి గండిపడటం) ఇంతటి పరిస్థితి ఉత్పన్నమయ్యేది కాదు. ఈ విషయంలో మెకానికల్ పనుల ఒప్పందాలను అధికారులు పరిశీలించాల్సి అవసరం ఉంది. స్కడ వ్యవస్థ సెన్సార్లు, పంపులు, వాల్వ్లు వంటి పరికరాల నుండి వాస్తవ డేటాను సేకరించి కంప్యూటర్కు పంపుతాయి. ఇందులో హార్డ్వేర్, సాఫ్ట్వేర్ నెట్వర్క్లు, మానవ, యంత్ర అనుసంధానత కలిగి ఉంటాయి. ఇవి అందించే సమాచార వ్యవస్థతో ఆపరేటర్లు ఈ సమాచారాన్ని విశ్లేషించి, ప్రమాదాలను నియంత్రించడానికి నిర్ణయాలు తీసుకుంటారు, ఉదాహరణకు..పంపులను ఆన్ లేదా ఆఫ్ చేయడం వంటివి. ఎస్కేప్, స్కడ లేవు హంద్రీ–నీవా ప్రాజెక్టుకు సంబంధించి ఎస్కేప్, స్కడ అమలు చేయలేదు. వీటి అవసరం ఇప్పుడు గుర్తించాం. దీనికి సంబంధించిన చర్యలను చేపడతాం. తరిగోడు వద్ద కాలువ తెగిన చోట గతంలోనూ తెగిందని గుర్తించాం. కాలువలో నీళ్లు పూర్తిస్థాయికి చేరి పోర్లుతున్న సమయంలో పైనున్న కాలువను తెగ్గోట్టేందుకు ప్రయత్నించాం. ఈలోగా గండిపడింది. –విఠల్ప్రసాద్, ఎస్ఈ, హంద్రీ–నీవా ప్రాజెక్టు -
కారు ఢీకొని ఇద్దరికి గాయాలు
కలకడ : ద్విచక్ర వాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులకు తీవ్ర గాయాలైన సంఘటన గురువారం మండలంలోని కోన గ్రామంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. నంద్యాల జిల్లా అహోబిలానికి చెందిన మల్లికార్జున, నెల్లూరు జిల్లా రాపూరుకు చెందిన బుజ్జయ్య కోన గ్రామం వద్ద బొగ్గులు కాల్చుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారు ద్విచక్ర వాహనంలో కోన గ్రామం బస్టాండు వద్దకు వెళ్తుండగా కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఒకరికి కాలు విరగగా, మరొకరికి తలకు రక్త గాయమైంది. క్షతగాత్రులను 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కలకడ పోలీసులు కేసు నమోదు చేశారు. -
మోసంపై డీఎస్పీకి ఫిర్యాదు
మదనపల్లె:స్థానిక చీకలగుట్టకు చెందిన దంపతులు తనవద్ద డబ్బు, ఆభరణాలను తీసుకుని తిరిగి ఇవ్వకుండా మోసం చేసిన ఉదంతంపై గురువారం హిజ్రా స్వాతి డీఎస్పీ మహేంద్రను కలిసి ఫిర్యాదు చేసింది. ఆ దంపతులనుంచి ఎదురైన పరిస్థితులను బుధవారం మీడియా సమావేశంలో వెల్లడించిన స్వాతి వాటికి సంబంధించిన వివరాలు, డబ్బు తీసుకున్న వాటికి ఆధారాలు, ఆభరణాల వివరాలను వివరించగా చర్యలు తీసుకుంటామని డీఎస్పీ హామీ ఇచ్చారని స్వాతి తెలిపింది. దీనిపై మదనపల్లె రెండో పట్టణ సీఐ రాజారెడ్డిని విచారణకు డీఎస్పీ ఆదేశించారని తెలిపింది. ఎంపీడీఓ కార్యాలయం ఆకస్మిక తనిఖీలక్కిరెడ్డిపల్లి : జెడ్పీ సీఈఓ ఓబులమ్మ గురువారం లక్కిరెడ్డిపల్లి ఎంపీడీఓ కార్యాలయాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా కార్యాలయంలో సిబ్బంది పనితీరుపై ఆరా తీయడంతోపాటు రికార్డులను పరిశీలించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శులు పారిశుద్ధ్యంపై దృష్టి సారించేలా గ్రామస్థాయిలో ఎప్పటికప్పుడు గ్రీన్ అంబాసిడర్లను ఏర్పాటు చేసుకోవాలన్నారు. పంచాయతీ కార్యదర్శులు గ్రామాలలో అందుబాటులో ఉంటూ సర్పంచ్లతో కలిసి సమన్వయంతో పనిచేస్తూ అభివృద్ధికి పాటుపడాలన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ రెడ్డయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఉత్తమ ఎన్ఎస్ఎస్ వలంటీర్గా శ్రీవాణి రాజంపేట టౌన్ : రాజంపేట ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో బీఎస్సీ తృతీయ సంవత్సరం చదువుతున్న డి.శ్రీవాణి యోగివేమన యూనివర్సిటీ స్థాయిలో ఉత్తమ ఎన్ఎస్ఎస్ వలంటీర్గా ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ బి.పురుషోత్తం, ఎన్ఎస్ఎస్ ప్రోగ్రాం ఆఫీసర్ ఎల్.రాజమోహన్రెడ్డి గురువారం ఇక్కడి విలేకరులకు తెలిపారు. యోగివేమన యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో వాణిశ్రీకి యూనివర్సిటీ వైస్ చాన్సలర్, ప్రొఫెసర్ బి.రాజశేఖర్, రిజిస్ట్రార్ ప్రొఫెసర్ పి.పద్మ, ఎన్ఎస్ఎస్ కో–ఆర్డినేటర్ ఎన్.వెంకటరామిరెడ్డి ప్రశంసా పత్రాలు అందజేసి సత్కరించినట్లు తెలిపారు. శ్రీవాణి ఆరోగ్యం, పరిశుభ్రత, ప్లాస్టిక్ వల్ల కలిగే అనర్థాలు, మొక్కలు నాటడం వల్ల కలిగే ప్రయోజనాలు తదితర అంశాలపై ప్రజల్లో చైతన్యం కల్పించారన్నారు. -
అభివృద్ధి మరచిన ప్రభుత్వం
రాయచోటి టౌన్ : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అభివృద్ధిని విస్మరించిందని సీపీఐఎంఎల్ లిబరేషన్ కేంద్ర పోలిట్ బ్యూరో సభ్యుడు వి. శంకర్ విమర్శించారు. గురువారం రాయచోటి ఎన్జీఓ హోంలో సీపీఐ (ఎంఎల్) లిబరేషన్ అన్నమయ్య జిల్లా కార్యదర్శి మావులూరి విశ్వనాథ అధ్యక్షతన రాయలసీమ ముఖ్య కారకర్తల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగించే పనిలో ఉన్నారని ఆరోపించారు. రాష్ట్ర కార్యదర్శి డి. బంగార్రాజు మాట్లాడుతూ రాష్ట్రంలో కార్పొరేట్, మతతత్వ మనువాద శక్తులను అరికట్టకపోతే ప్రజలు తీవ్రంగా నష్టపోతారన్నారు. డిసెంబర్ 6,7 తేదీలలో కడపలో నిర్వహించే రాష్ట్ర మహాసభలను విజయవంతం చేయాలని రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు ఉదయ్ కిరణ్ పిలుపునిచ్చారు. ఈ కార్యక్రమంలో జిల్లా కమిటీ సభ్యులు సిగి చెన్నయ్య, రఘునాథ నాయుడు, సుజాత, లవకుమార్ పాల్గొన్నారు. -
జీఎస్టీ 2.0తో ప్రజలకు లబ్ధి
రాయచోటి: ఒకదేశం–ఒక పన్ను అనే సిద్ధాంతంతో కేంద్ర ప్రభుత్వం 2017లో జీఎస్టీని ప్రవేశపెట్టిన తర్వాత ఇప్పుడు అమల్లోకి వస్తున్న జీఎస్టీ 2.0 దేశంలోని అతి పెద్ద ఆర్థిక సంస్కరణల్లో ఒకటని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఆధ్వర్యంలో గురువారం రాయచోటిలోని శివాలయం సర్కిల్ నుంచి నేతాజీ సర్కిల్ (బంగ్లా) వరకు అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ ర్యాలీని కలెక్టర్ నిశాంత్ కుమార్ జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ ప్రజలకు జీఎస్టీ 2.0 వల్ల కలిగే లబ్ధి గురించి అవగాహన కల్పించడమే లక్ష్యమని తెలిపారు. దీని ద్వారా 99 శాతం వస్తువులపై పన్ను రేట్లు తగ్గి ప్రజలకు లాభం చేకూరుతుందని వివరించారు. టీడీపీ నాయకుడు మండిపల్లి లక్ష్మీ ప్రసాద్ రెడ్డి, డీటీఓ ప్రసాద్, మున్సిపల్ కమిషనర్ రవి, అసిస్టెంట్ కమిషనర్ ఎస్ సౌమ్య పాల్గొన్నారు. ● విద్య, వైద్య, శిశు సంక్షేమ శాఖల సమన్వయంతో సత్ఫలితాలి సాధించాలని, జిల్లాను ముందుకు తీసుకువెళ్లాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. రాయచోటిలోని కన్వెన్షన్ హాల్లో పోషణ అభియాన్ కార్యక్రమంలో భాగంగా 8వ రాష్ట్రీయ పోషణ మాసం కార్యక్రమాన్ని ‘‘ఆరోగ్యవంతమైన మహిళా – శక్తివంతమైన కుటుంబానికి బలమైన పునాది’’ అనే అంశంపై జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖల ఆధ్వర్యంలో నిర్వహించిన మాసోత్సవాలు ముగిశాయి. ఈ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని మాట్లాడారు. పిల్లల్లో ఊబకాయం, మనం తినే ఆహారంలో కార్బొహైడ్రేట్స్ ఎక్కువగా ఉండటం వల్ల ఏ విధంగా ఆరోగ్య సమస్యలు రావచ్చు దీని గురించి ఈ ఇయర్ థీమ్ పెట్టినట్లు వివరించారు. జిల్లా సిబ్బంది, అంగన్వాడీ కార్యకర్తలకు కలెక్టర్ మెమెంటోలను అందించారు. అనంతరం పౌష్టికాహారం స్టాల్స్ను సందర్శించారు. కార్యక్రమంలో జిల్లా సీ్త్ర, శిశు సంక్షేమ శాఖ పీడీ హైమావతి, నగరపాలక సంస్థ కమిషనర్ రవి, ప్రభుత్వాసుపత్రి గైనకాలజిస్ట్ కోటేశ్వరమ్మ, జీసీడీఓ మాధవి తదితరులు పాల్గొన్నారు. -
20 రోజుల క్రితం అదృశ్యమై.. కాలువలో శవమై..
మదనపల్లె రూరల్ : మెడికల్ షాపు యజమాని శ్రీకాంత్(58) అదృశ్యం కేసు మిస్టరీ వీడింది. 20 రోజుల తర్వాత పుంగనూరు మండలం ఈడిగపల్లె సమీపంలోని యాతాళంవంక వద్ద హంద్రీ నీవా కాలువలో గురువారం శ్రీకాంత్ మృతదేహం లభ్యమైంది. హంద్రీనీవా కాలువలో గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం తేలియాడుతుండటం గమనించిన స్థానికులు పుంగనూరు పోలీసులకు సమాచారం అందించారు. వారు అక్కడకు చేరుకుని మృతదేహాన్ని కాలువలో నుంచి బయటకు తీశారు. గుర్తుతెలియని వ్యక్తి మృతదేహం లభ్యంపై పోలీసులు మదనపల్లె పోలీస్ స్టేషన్లకు సమాచారం అందించారు. దీంతో వన్టౌన్ పోలీస్ స్టేషన్లో సెప్టెంబర్ 27న మిస్సింగ్ కేసుగా నమోదైన శ్రీకాంత్ బంధువులకు పోలీసులు సమాచారం అందించారు. వారు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహం శ్రీకాంత్దేనని నిర్ధారించారు. మృతదేహాన్ని తరలించేందుకు వీలు లేకపోవడంతో దొరికిన చోటే పోస్టుమార్టం నిర్వహించారు. పట్టణంలోని చిత్తూరు బస్టాండ్లో గాయత్రి మెడికల్ షాపు నిర్వహిస్తూ రోజా ప్లాట్స్లో నివాసం ఉంటున్న శ్రీకాంత్, రాయచోటికి వెళ్లి వస్తానని భార్య గాయత్రితో చెప్పి సెప్టెంబర్ 26న ఇంటి నుంచి బయలుదేరాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు అతని ఆచూకీ కోసం గాలించారు. అయితే మరుసటిరోజు మండలంలోని చిప్పిలి సమీపంలోని హంద్రీనీవా కాలువ ఒడ్డున శ్రీకాంత్కు సంబంధించి స్కూటీ వాహనం, సెల్ఫోన్ లభించాయి. దీంతో పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది హంద్రీ నీవా కాలువలో గాలించారు. ఎలాంటి ఫలితం లేకపోవడంతో, వన్టౌన్ పోలీసులు మిస్సింగ్ కేసు నమోదుచేసి విచారణ కొనసాగించారు. కుటుంబ సభ్యులు శ్రీకాంత్ వాహనం వదిలేసి, ఎక్కడికై నా వెళ్లి ఉంటాడని భావించారు. అయితే 20 రోజుల తర్వాత పట్టణానికి 15 కిలోమీటర్ల దూరంలో శ్రీకాంత్ శవమై కనిపించడంతో కుటుంబ సభ్యులు విషాదంలో మునిగిపోయారు. శ్రీకాంత్ను హత్యచేశారా... లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అన్నది పోలీసుల దర్యాప్తులో వెల్లడికావాల్సి ఉంది. కాగా శ్రీకాంత్ మృతదేహానికి కాలి చెప్పులు కూడా అలాగే ఉండటంతో పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కుటుంబ సభ్యులు, స్నేహితుల ద్వారా పోలీసులు వాస్తవాలను సేకరించే పనిలో నిమగ్నమయ్యారు. శవం లభ్యమైన ప్రాంతం పుంగనూరు పోలీస్ స్టేషన్ పరిధిలో ఉండటంతో వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వీడిన మెడికల్ షాపు యజమాని అదృశ్యం మిస్టరీ 20 రోజుల తర్వాత హంద్రీ నీవా కాలువలో శవం లభ్యం హత్యా.. ఆత్మహత్యా అనే కోణంలో దర్యాప్తు -
ఖాతాదారులకు మెరుగైన సేవలకే తొలి ప్రాధాన్యత
రాజంపేట టౌన్ : ఖాతాదారులకు మెరుగైన సేవలు అందించడమే తమ తొలి ప్రాధాన్యత అని యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కడప రీజియన్ హెడ్ అడపాల లక్ష్మీతులసి తెలిపారు. పట్టణంలోని అమ్మవారిశాల వద్ద ఉన్న యూనియన్ బ్యాంక్ను ఆర్ఎస్రోడ్డులోని చేజెర్ల కాంప్లెక్స్లోకి గురువారం మార్పు చేసిన సందర్భంగా ప్రారంభోత్సవ కార్యక్రమాన్ని నిర్వహించారు. మున్సిపల్ కమిషనర్ శ్రీనివాసులు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడుతూ అన్ని రకాల సాంకేతిక సేవలు ఖాతాదారులకు అందుబాటులోకి తీసుకొచ్చామన్నారు. తిరుపతి రీజియన్ హెడ్ శ్రీనివాసకుమార్ మాట్లాడుతూ ఖాతాదారులు సైబర్ నేరాల పట్ల చాలా అప్రమత్తంగా ఉండాలన్నారు. రకరకాల లింక్లు సెల్ఫోన్కు వస్తుంటాయని అయితే కొత్తవారు పంపే లింక్లను ఎట్టిపరిస్థితుల్లో ఓపెన్ చేయవద్దని సూచించారు. కార్యక్రమంలో బ్యాంకు అధికారులు మొగితీశ్వర, వంశీకృష్ణ, ధనుంజయ, అబ్దుల్ లతీఫ్ తదితరులు పాల్గొన్నారు.యూనియన్ బ్యాంక్ రీజినల్ మేనేజర్ లక్ష్మీతులసి -
ఆత్మహత్యలను ఆపి.. ప్రాణాలు నిలిపి..
● ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో నిలిచిన రెండు నిండు ప్రాణాలు ● శభాష్ పోలీస్ అంటూ ప్రశంసలుఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల రైల్వే పోలీసుల చొరవతో ఇద్దరి నిండు ప్రాణాలు నిలిచాయి. కుటుంబ కలహాలతో మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని రైలు పట్టాలపైకి రాగా రైల్వే పోలీసులు గమనించి వారిని కాపాడి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గురువారం ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్లో జరిగిన ఈ సంఘటనలకు సంబంధించిన వివరాలిలా.. వేంపల్లికి చెందిన సుందరి సుమంజలి అనే మహిళ కుటుంబ కలహాల కారణంగా మనస్థాపానికి గురై ఆత్మహత్య చేసుకోవాలని ఎర్రగుంట్ల రైల్వే స్టేషన్కు వచ్చింది. రైలు పట్టాలపై పడుకొని ఉండటాన్ని ఎర్రగుంట్ల రైల్వే కానిస్టేబుళ్లు డి.వీరనారాయణ, శ్రీనివాసరావులు గమనించారు. వెంటనే రైల్వే ట్రాక్పై ఉన్న సుందరి సుమంజలిని కాపాడారు. తర్వాత రైల్వే పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చి వివరాలు సేకరించారు. ఆమె భర్తను పిలిపించి ఇద్దరికి కౌన్సెలింగ్ ఇచ్చారు. పిల్లలతో సంతోషంగా జీవించాలని నచ్చజెప్పి ఇంటికి పంపించారు. మద్యం మత్తులో.. ప్రొద్దుటూరుకు చెందిన రామాంజనేయులు అనే వ్యక్తి ఇంటిలో గొడవ పడి అతిగా మద్యం తాగి ఎర్రగుంట్లకు వచ్చాడు. రైలు కింద పడి చనిపోవాలని రైలు పట్టాలపై పడుకున్నాడు. అదే సమయంలో డ్యూటీలో ఉన్న కానిస్టేబుళ్లు డి. వీరనారాయణ, రామాంజనేయరెడ్డిలు వెంటనే స్పందించి పట్టాలపై ఉన్న రామాంజనేయులును కాపాడి పోలీస్ స్టేషన్కు తీసుకుని వచ్చారు. తర్వాత అతని కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. వారిని పిలిపించి కౌన్సెలింగ్ నిర్వహించి అప్పగించారు. ఈ రెండు సంఘటనల్లోనూ రైల్వే పోలీసులు చూపిన చొరవను చూసిన వారు శభాష్ పోలీస్ అంటూ ప్రశంసించారు. -
● తప్పని అగచాట్లు
బస్సులు పూర్తి స్థాయిలో లేకపోవడంతో ఎప్పుడో ఒకటి రాగానే ప్రయాణికులు బస్సుల కోసంపరుగులు పెడుతూ సీట్ల కోసం ఎగబడ్డారు. దసరా, సంక్రాంతి పండుగల సమయంలో బస్సుల్లో సీట్ల కోసం ఎలాంటి అగచాట్లు పడతారో అలాంటి పరిస్థితి కనిపించింది. అయితే కనీసం ముందస్తుగా బస్సులు ఉండవన్న సమాచారాన్ని ఆర్టీసీ అధికారులు ఇచ్చి ఉంటే ప్రయాణాన్ని వాయిదా వేసుకునే వారమని పలువురు లబోదిబోమంటున్నారు. మదనపల్లె, రాయచోటి, రాజంపేట, పీలేరు బస్టాండ్లలో వచ్చిన బస్సులు పూర్తిగా రద్దీగా ఉండడంతో వెళ్లలేక పలువురు తమ ప్రయాణాలు వాయిదా వేసుకున్నారు. జిల్లాలో మదనపల్లె–1, 2తోపాటు పీలేరు, రాజంపేట, రాయచోటి డిపోల నుంచి ప్రధాని సభకు భారీగా బస్సులు వెళ్లగా మిగిలిన కొన్ని బస్సులను ప్రయాణీకులకు కేటాయించారు. అయితే దూర ప్రాంతానికి సంబంధించి రాత్రి పూట సర్వీసులైన బెంగుళూరు, హైదరాబాదు చైన్నె, విజయవాడ తదితర వాటిని యదావిధిగా నడిపారు. ఏది ఏమైనా కూటమి సర్కార్ పెద్ద ఎత్తున ప్రతిష్టాత్మకంగా తీసుకుని చేపట్టిన ప్రతి కార్యక్రమం సందర్భంగా ప్రయాణికులకు తిప్పలు తప్పడం లేదు. -
మెడికల్ కాలేజీలను ప్రైవేట్పరం కానివ్వం
రాజంపేట రూరల్: వైఎస్ జగన్మోహన్రెడ్డి నెలకొల్పిన ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం కానివ్వమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి పేర్కొన్నారు.గురువారం మండల పరిధిలోని శేషమాంబపురం పంచాయతీలోని బాలిరెడ్డిగారీపల్లి గ్రామంలో రచ్చబండ, ‘కోటి సంతకాల సేకరణ’కార్యక్రమం నిర్వహించారు.ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్మోహన్రెడ్డి విద్య, వైద్యంపై ప్రత్యేక దృష్టి సారించి రాష్ట్రానికి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలు మంజూరు చేయించారన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చాక అందులో 10 కాలేజీలను ప్రైవేటు పరం చేయాలని నిర్ణయించడం దారుణమన్నారు. ఇవి ప్రైవేట్పరమైతే వారు లాభాలు దృష్టిలో ఉంచుకొని పనిచేస్తారని, దీనివల్ల పేద, మధ్య తరగతి ప్రజలు నాణ్యమైన వైద్యాన్ని హక్కుగా పొందే అవకాశాన్ని కోల్పోతారన్నారు. కూటమి ప్రభుత్వం ప్రైవేట్ పరం చేసిన మెడికల్ కళాశాలలను వైఎస్సార్సీసీ అధికారంలోకి రాగానే ప్రభుత్వ ఆధీనంలోకి తీసుకొని ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించేలా చర్యలు తీసుకుంటామని తెలిపారు. వైఎస్ జగన్ మెడికల్ కళాశాలలను తీసుకొచ్చారన్న అక్కసుతో సీఎం చంద్రబాబు వాటిని ప్రైవేట్కు అప్పగించాలనుకోవడం దుర్మార్గమన్నారు. రాష్ట్ర వ్యాప్తంగా కోటి సంతకాలు సేకరించి గవర్నర్కు పంపి కూటమి ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించుకునేలా ఒత్తిడి తెస్తామన్నారు. గ్రామ సర్పంచ్ సుబ్బరాయుడు, వైఎస్సార్సీపీ నాయకులు శ్రీహరి, రమణ, శ్రీను, రెడ్డెయ్య, సుబ్బరాజు, భా స్కర్, సుబ్బన్న, ప్రేమ్ జితేంద్ర వర్మ పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
విద్యార్థుల్లో నైపుణ్యాలు పెంపొందించాలి
రాజంపేట: విద్యార్థులకు ప్రస్తుత పరిశ్రమల అవసరాలకు అనుగుణంగా నైపుణ్యాలను అందించాలని అన్నమాచార్య యూనివర్సిటీ ప్రో చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి అన్నారు. గురువారం ఏయూలో స్థిరత్వం వైపు మెకానికల్ ఇంజినీరింగ్లో ఉద్భవిస్తున్న సాంకేతికలు, అనే అంశంపై జాతీయస్ధాయి ఆన్లైన్ ఫ్యాకల్టీ డెవలప్మెంట్ (ఎఫ్డీసీ) పోస్టర్ను చొప్పా అభిషేక్రెడ్డి విడుదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎఫ్డీసీ ద్వారా బోధకుల శక్తి నిల్వ వ్యవస్థలు,సీఎఫ్డీ విశ్లేషణ, బయోపదార్ధాలు, యంత్ర అధ్యయనం తదితర అంశాలను నేర్చుకోనున్నారన్నారు. ఆధునిక పరిజ్ఞానం ద్వారా అధ్యాపకు లుతమ బోధనలో సాంకేతికతను సమన్వయం చేసుకోవాలన్నారు. ఏయూ వీసీ డాక్టర్ సాయిబాబరెడ్డి, ప్రిన్సిపాల్ నారాయణ, ఏయూ అడ్మిషన్ల డీన్ బి.జయరామిరెడ్డి, సమన్వయకర్తలు దేవరాజ్నాయక్, అజయ్కుమార్రెడ్డిలు పాల్గొన్నారు. ఎఫ్డీపీ కార్యక్రమం నవంబరు3 నుంచి 8 వరకు ఆన్లైన్ రూపంలో నిర్వహించనున్నారు. -
పత్రికా స్వేచ్ఛపై కాల కూటమి
ప్రజల గొంతుగా నిలిచి ప్రశ్నిస్తే ప్రభుత్వానికి నచ్చదు..’ సాక్షి’పై చంద్రబాబు సర్కార్ కక్షసాధింపుగా వ్యవహరిస్తోంది. సాక్షి ఎడిటర్ ధనంజయరెడ్డితోపాటు పలువురు ప్రాతికేయులపై అక్రమంగా కేసులు పెట్టి వేధిస్తోంది. పత్రిక స్వేచ్ఛకు సంకెళ్లు వేయడంపై సీనియర్ జర్నలిస్టులు, వివిధ సంఘాల నేతలు ఖండిస్తున్నారు. ప్రశ్నించే గొంతుకలను నొక్కేసే యత్నం విమర్శనాత్మకమైన, స్వతంత్రమైన, పరిశోధనాత్మకమైన పత్రికా స్వాతంత్య్రం ఏ ప్రజాస్వామిక రాజ్యానికికై నా జీవనాడి వంటిది అని నోబెల్ శాంతి బహుమతి గ్రహీత, దక్షిణాఫ్రికా విముక్తి ప్రధాత నెల్సన్ మండేల అభిప్రాయం. కానీ ఆంధ్రప్రదేశ్లో ప్రశ్నించే గొంతుకల పట్ల, ప్రత్యేకించి సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసు కేసులు బనాయించి రాష్ట్ర ప్రభుత్వం కక్ష గట్టి వ్యవహారిస్తోంది. వీటిని పరిశీలిస్తే రాష్ట్రంలో మీడియా స్వేచ్ఛ ఉందా అనే అనుమానం సహజంగానే తలెత్తుతుంది. ఇది కేవలం సాక్షి సమస్య కాదు. ఈరోజు ఇది సాక్షికి సమస్య కావచ్చు. పాత్రికేయులు, ప్రజాస్వామిక వాదులు మేల్కొకోకపోతే ఇది రేపు అందరికీ సమస్యగా పరిణమిస్తుంది. – ఎ.రఘునాథరెడ్డి, కో ఆర్డినేటర్, రాయలసీమ ఆకాంక్షల పౌర వేదిక, కడప ఎడిటర్పై వేధింపులు తగదు సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై పోలీసుల వేధింపులు తగదు. పత్రికల్లో సమాజంలో జరుగుతున్న వివిధ అంశాలను ప్రచురిస్తుంటారు. దానిపై ప్రభుత్వానికి అభ్యంతరాలుంటే వివరణ ఇవ్వాలి తప్ప కేసులు బనాయించి బెదిరించాలని చూడడం సరికాదు. సీఎం చంద్రబాబు అనుసరిస్తున్న ధోరణులు హిట్లర్, ముస్సోలిని లాంటి నియంతల పోకడలను తలపిస్తున్నాయి. పత్రికల గొంతుకను నొక్కా లని చూస్తున్న ప్రభుత్వ వైఖరిని ఖండించడం ద్వారా ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉంది. – మోపూరి బాలకృష్ణారెడ్డి, జిల్లా అధ్యక్షులు ఏపీయూడబ్ల్యుజే, ఆక్షేపణీయం రాజ్యాంగ పరిరక్షణలో కీలకపాత్ర మీడియాది. ప్రజా సమస్యలపై స్పందిస్తున్న ’సాక్షి’పై కక్ష పెంచుకొని ఆ పత్రిక ఎడిటర్, జర్నలిస్టులను తీవ్రంగా ఇబ్బంది పెట్టడం సరికాదు. సోదాల పేరుతో జర్నలిస్టులను భయభ్రాంతులకు గురి చేయడం మంచి పద్ధతి కాదు. ఇది ఆక్షేపణీయం. – యమలా సుదర్శనం, మాలమహానాడు రాష్ట్ర అధ్యక్షులుబరితెగింపు పత్రికలను వేధించేందుకు కూటమి ప్రభుత్వం బరితెగించింది. సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై అక్రమ కేసులు నమోదుచేయడంసరికాదు. ప్రజాస్వామ్య ముసుగులో ని యంత పాలన సాగిస్తారా. ప్రజల తిరుగుబాటు తో నియంతలు వారు ఏలిన దేశాలనే వదిలి వె ళ్లారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటివి ప్రజలు హ ర్షించరు. ఇప్పటికై నా పాలకులు తీరు మార్చుకోవాలి. – అక్కులప్ప, ఐజేయూ జాతీయ కౌన్సిల్ సభ్యులు -
వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురికి గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డుప్రమాదాల్లో ముగ్గురు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు. తంబళ్లపల్లె మండలం బురదలోళ్లపల్లెకు చెందిన కట్టప్ప కుమారుడు రామాంజులు(22) గ్రామాలకు వెళ్లి గ్యాస్స్టవ్లు రిపేరీ చేస్తూ జీవిస్తుంటాడు. గురువారం ద్విచక్రవాహనంలో తంబళ్లపల్లెకు వెళుతుండగా, అదే మండలం సిద్ధారెడ్డిగారిపల్లెకు చెందిన శివకుమార్(32) ద్విచక్రవాహనంలో ఎదురుగా వస్తూ రామాంజులు బైక్ను ఢీకొన్నాడు. ప్రమాదంలో ఇద్దరు తీవ్రంగా గాయపడగా, స్థానికులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం రామాంజులు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అదేవిధంగా శానిటోరియం తురకపల్లెకు చెందిన గౌసియా(45) స్థానిక దర్గాలో ఉరుసు ఉత్సవం జరుగుతుండగా, బుధవారం రాత్రి అక్కడకు వెళ్లేందుకు రోడ్డు దాటుతోంది. ఈ క్రమంలో అటుగా వేగంగా వచ్చిన కారు ఆమెను ఢీకొంది. ప్రమాదంలో గౌసియా తీవ్రంగా గాయపడగా, స్థానికులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖలో.. ఆదాయం ఢమాల్!
రాయచోటి అర్బన్ : గత రెండేళ్లతో పోల్చుకుంటే రిజిస్ట్రేషన్ అండ్ స్టాంప్స్ శాఖలో ఈ ఏడాది ఆదాయం లక్ష్యానికి చాలా దూరంలో నిలిచిపోయింది. స్థిరాస్తి ఆదాయ లక్ష్య సాధనలో వెనుకబాటుకు ప్రధాన కారణం ప్రభుత్వ నిర్ణయాలు, అధికారుల నిర్లక్ష్యాలే కారణంగా తెలుస్తోంది. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.258.17 కోట్లు లక్ష్యంగా నిర్ణయించారు. అయితే 2025 అక్టోబబర్ 14వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలోని 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కేవలం రూ.97.19 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. ఇదిలా ఉంటే 2023–24 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ. 241.91 కోట్లు కాగా, 2023–24లో వచ్చిన ఆదాయం రూ.183.35 కోట్లుగా ఉంది. అలాగే 2024–25 ఆర్థిక సంవత్సరంలో నిర్దేశించిన లక్ష్యం రూ. 205.76 కోట్లు ఉండగా, 2024–25లో రూ.167. 83 కోట్లు ఆదాయం వచ్చింది. ఈ విధంగా ఉన్న ఆదాయాన్ని పరిశీలిస్తే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలతోనే స్థిరాస్తి ఆదాయం పూర్తిగా పడిపోయినట్లు తెలుస్తోంది. ఆదాయం తగ్గడానికి ప్రభుత్వ విధానాలే కారణం.. జిల్లాలో రియల్ ఎస్టేట్ వ్యాపారం ప్రభుత్వ విధానాలతో పూర్తిగా కుప్పకూలిపోయింది. కూటమి ప్రభుత్వం ఆధికారంలోకి వచ్చిన తరువాత ప్రీ హోల్డ్ అసైన్మెంట్ భూముల రిజిస్ట్రేషన్ను ఆపేసింది. దీనికి తోడు రీసర్వేపై ఉత్కంఠ, భూముల మ్యుటేషన్లలో గందరగోళం నెలకొంది. దీంతో రియల్ ఎస్టేట్ వ్యాపారులు కొత్త వెంచర్లను వేయడానికి వెనకడుగు వేస్తున్నారు. మరో వైపు రిజిస్ట్రేషన్ ఫీజులను భారీగా పెంచడంతో వ్యాపారులపై, పెట్టుబడిదారులపై అధిక భారం పడింది. దీంతో క్రయ విక్రయాలకు వ్యాపారులు ఏ మాత్రం ఆసక్తి చూపడం లేదు. ఫలితంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రిజిస్ట్రేషన్లు సగానికి పైగా పడిపోయాయి. జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో భారీగా తగ్గిన ఆదాయం... అన్నమయ్య జిల్లాలో 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఉన్నాయి. అందులో మదనపల్లె , రాయచోటి, రాజంపేట, పీలేరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు ఆదాయం రాబడిలో ప్రధానమైనవి. కలికిరి, తంబళ్లపల్లె, వాయల్పాడు, బి.కొత్తకోట, చిట్వేలి, లక్కిరెడ్డిపల్లె, పుల్లంపేట, టి.సుండుపల్లె ఓ మోస్తరుగా రిజిస్ట్రేషన్లు జరిగే కార్యాలయాలు కావడం విశేషం. అయితే జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలలో కూడా నిర్దేశించిన ఆదాయంలో సగం కూడా రాబడి రాకపోవడం గమనార్హం. 2025–26 ఆర్థిక సంవత్సరంలో రూ.258.17 కోట్లు లక్ష్యంగా నిర్ణయించగా, 2025 అక్టోబబర్ 14వ తేదీ వరకు అన్నమయ్య జిల్లాలోని 12 సబ్ రిజిస్టర్ కార్యాలయాల నుంచి కేవలం రూ.97.19 కోట్లు మాత్రమే రాబడి వచ్చింది. ఈ ఏడాది లక్ష్యం రూ.258.17 కోట్లు , అక్టోబర్ 14వరకు వసూలు రూ.97.19 కోట్లే రియల్ ఎస్టేట్ ప్రభావంతోనే భారీగా తగ్గిన ఆదాయం రిజిస్ట్రేషన్ చార్జీలు పెంచిన కూటమి ప్రభుత్వం లక్ష్య సాధనలో వెనుకబడిన జిల్లాలోని 12 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు -
లారీని ఢీ కొన్న కంటైనర్
ఓబులవారిపల్లె : మండలంలోని అమృతవారిపల్లి జాతీయ రహదారి వద్ద గురువారం తెల్లవారుజామున ఎదురుగా వస్తున్న లారీని కంటైనర్ లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో లారీ ముందుభాగం దెబ్బతినడంతో డ్రైవర్ క్యాబిన్లో ఇరుక్కుపోయాడు. ఎస్ఐ పి.మహేష్ నాయుడు తన సిబ్బందితో ప్రమాద స్థలానికి చేరుకొని క్రేన్ సహాయంతో లారీలో ఇరుక్కుపోయి ఉన్న డ్రైవర్ను బయటకు తీశారు. అనంతరం 108 వాహనంలో రైల్వేకోడూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. హైదరాబాదు నుంచి చైన్నెకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా ఎదురుగా వస్తున్న మరో లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం జరిగింది. డ్రైవర్ విజయ్ కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ పి.మహేష్ నాయుడు తెలిపారు. -
అరుదైన శస్త్ర చికిత్స
రాయచోటి టౌన్న్: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో థైరాయిడ్కు అరుదైన శస్త్ర చికిత్స చేసి పెద్ద సైజు గడ్డను తొలగించారు. రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిలో గురువారం ఆర్ఎంఓ డాక్టర్ డేవిడ్ సుకుమార్ విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. రాయచోటి పట్టణానికి చెందిన శారదమ్మ (65) థైరాయిడ్ జబ్బుతో సుమారు నాలుగేళ్లుగా బాధపడుతోంది. నెల రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో ఆసుపత్రికి వచ్చింది. డాక్టర్ శైలేష్, డాక్టర్ లక్ష్మీప్రసాద్ చర్చించి ఆమెకు వైద్య పరీక్షలు చేయించారు. గొంతులో సుమారు 10 సెంటీమీటర్ల వ్యాసార్థంతో గడ్డ ఉన్నట్లు గుర్తించారు. వెంటనే ఈఎన్టీ డాక్టర్ నరసింహ సహకారంతో అనస్థియా డాక్టర్లు డాక్టర్ వెంకట శివ, డాక్టర్ అనిల్, డాక్టర్ బండారు కిరణ్ కుమార్లు సుమారు రెండున్న గంటల పాటు శ్రమించి శస్త్ర చికిత్స చేసి గొంతులో ఉన్న గడ్డను తొలగించారు. -
ఒంటరి జీవితంపై విరక్తితో మహిళ ఆత్మహత్య
ప్రొద్దుటూరు క్రైం : ఒంటరి జీవితం గడపలేక షేక్ ఆబిదా (42) అనే మహిళ బుధవారం ఒంటికి నిప్పంటించుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. సుందరాచార్యుల వీధికి చెందిన ఆబిదాకు రాజుపాళెం మండలం గోపల్లె గ్రామానికి చెందిన వ్యక్తితో వివాహమైంది. వారికి ఇమాంఖాసీం అనే కుమారుడు ఉన్నాడు. తరచు మనస్పర్థలు రావడంతో భార్యా భర్తలు ఏడేళ్ల క్రితం విడిపోయారు. కుమారుడు ఇమాంఖాసీం రెండేళ్ల క్రితం పురుగుల మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ క్రమంలో ఆమె ప్రొద్దుటూరులోని సుందరాచార్యుల వీధిలో ఒక ఇల్లు అద్దెకు తీసుకొని ఒంటరిగా ఉంటోంది. ప్రభుత్వం నుంచి పింఛన్ వస్తుండటంతో ఆ డబ్బుతోనే జీవనం సాగించేది. కుమారుడు మృతి చెందడం, భర్త దూరం కావడం.. ఈ రెండు ఘటనలు ఆమెను మానసికంగా కుంగదీశాయి. దీంతో ఒంటరితనాన్ని భరించలేని ఆమె ఒంటిపై కిరోసిన్ పోసుకొని నిప్పంటించుకుంది. ఇంట్లో నుంచి పొగలు రావడంతో స్థానికులు గమనించి ఆమె బంధువులకు సమాచారం అందించారు. తల్లి, బంధువులు వచ్చేలోపే శరీరం పూర్తిగా కాలిపోయి ఆబిదా మృతి చెందింది. ఆబిదా తల్లి మెహరున్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్ఐ సంజీవరెడ్డి తెలిపారు. -
కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం
మహిళ, ముగ్గురు పిల్లలను కాపాడిన పోలీసులు జమ్మలమడుగు రూరల్/మైలవరం : కుటుంబ సమస్యలతో తన ముగ్గురు పిల్లలు, తాను కలసి మైలవరం జలాశయంలో దూకి ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించిన మహిళను పోలీసులు కాపాడిన సంఘటన మైలవరం మండలంలో జరిగింది. ఏఎస్ఐ లక్ష్మీరెడ్డి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. జమ్మలమడుగు పట్టణంలోని భాగ్యనగర్ కాలనీకి చెందిన మహేశ్వరిని తల్లిదండ్రులు నొస్సం గ్రామానికి చెందిన వెంకట శివకు ఇచ్చి 10 సంవత్సరాల క్రితం వివాహం చేశారు. వెంకట శివ పట్టణంలోని ప్రైవేట్ ఫైనాన్స్లో (డబ్బులు వసూలు చేయడం)లో విధులు నిర్వహిస్తున్నాడు. వీరికి 8, 5, 2 సంవత్సరాల ఇద్దరు కూతుళ్లు, ఒక కుమారుడు ఉన్నారు. వీరు నంద్యాల జిల్లా, సంజామల మండలం నొస్సం గ్రామంలో కాపురం ఉంటున్నారు. భార్యాభర్తల మధ్య సమస్యలు రావడంతో జీవితంపై విరక్తి చెంది మైలవరం జలాశయంలో ముగ్గురు పిల్లలతో కలసి ఆత్మహత్య చేసుకోవడానికి ఆమె జలాశయం కట్టమీదకు చేరుకుంది. గమనించిన మైలవరం అటో డ్రైవర్ కుమార్ వెంటనే పోలీసులకు సమాచారం అందించాడు. దీంతో రియాజ్, రమేష్, హృదయ్ అనే సిబ్బంది జలాశయం వద్దకు చేరుకుని మహిళను పోలీస్ స్టేషన్కు పిలుచుకొని వచ్చి కుటుంబ సభ్యులకు సమాచారం ఇచ్చారు. అనంతరం భార్యాభర్తలకు ఏఎస్ఐ లక్ష్మీరెడ్డి, సిబ్బంది కౌన్సెలింగ్ ఇచ్చి పంపించి వేశారు. -
అబ్దుల్ కలామ్కు వైఎస్సార్సీపీ నాయకుల నివాళి
రాయచోటి అర్బన్ : రాష్ట్రపతిగా, క్షిపణి శాస్త్రవేత్తగా భారతదేశానికి విశిష్ట సేవలందించిన భారతరత్న ఏపీజే అబ్దుల్ కలామ్ జయంతి సందర్భంగా బుధవారం ఆయన విగ్రహానికి వైఎస్సార్సీపీ నాయకులు పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం అఽధ్యక్షుడు బేపారి మహమ్మద్ మాట్లాడుతూ కడు పేదరికంలో జన్మించినా పట్టుదలతో తాను కోరుకున్న జీవితాన్ని సాధించి, దేశానికి విజ్ఞానసంపదను అందించారని కొనియాడారు. ప్రతి విద్యార్థి అయన అడుగుజాడల్లో నడిచి రాణించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు శ్యామ్ కుమార్, షబ్బీర్ అహమ్మద్, అమీర్ ఖాన్, అజ్మతుల్లా, గౌస్ బేగ్, షేక్ మహమ్మద్, సమీర్ , పఠాన్, వసీం అహమ్మద్, ముబారక్, షౌకత్, ఫజీల్, అనీష్, సుబేల్, తౌఫిక్, జమీర్ అహమ్మద్ పాల్గొన్నారు. ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–19 బాల బాలికల జట్లు ఎంపిక మదనపల్లె సిటీ : ఉమ్మడి చిత్తూరు జిల్లా అండర్–19 బాల,బాలికల బాస్కెట్బాల్, హాకీ, హ్యాండ్బాల్, నెట్బాల్ జట్లను బుధవారం మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎంపిక చేశారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచి క్రీడాకారులు హాజరయ్యారు. ఎంపిక కార్యక్రమాన్ని ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్ ప్రారంభించారు. ఎంపికై న జట్లు రాష్ట్ర స్థాయిలో జరిగే పోటీల్లో పాల్గొంటారని ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు, సెలక్షన్ కమిటీ సభ్యులు రెడ్డి శ్రీనివాస్, నరేష్, ఆసిఫ్, రియాజ్ పీడీలు ఉమాదేవి, ఉష, హరి, వేణు, యూసఫ్ తదితరులు పాల్గొన్నారు. అండర్–19 హాకీ బాలికల జట్టు అండర్–19 వాలీబాల్ బాల బాలికల జట్టు -
అక్రమ రవాణాకు అడ్డుకట్టేది.!
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె, సరిమడుగు పంచాయతీల పరిధిలో కొంతమంది వ్యక్తులు అక్రమంగా చెట్లను నరికి వేసి లారీల్లో బయట రాష్ట్రాలకు తరలించుకుపోతున్నారు. వృక్ష సంపదను తరలిస్తున్న లారీలను అటవీ, రెవెన్యూ అధికారులు నిలిపి మామూళ్లు వసూలు చేసుకొని వదిలేస్తున్నారు. మండలంలోని బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు మకాం వేసి ఇష్టానుసారం చెట్లను నరికేసి తరలించుకుపోతుండడం గమనార్హం. రెండు గ్రామాల పరిసరాల్లోని కొండలు, గుట్టల తో పాటు పొలాల్లో పెద్ద ఎత్తున కలప చెట్లు ఉన్నాయి. వీటిపై అక్రమార్కుల కన్ను పడింది. స్థానికంగా ఉంటున్న కొంతమంది అక్రమార్కులు బయట రాష్ట్రాల వ్యాపారులతో బేరాలు కుదుర్చుకొని చెట్లను అక్రమంగా నరికి వేస్తున్నారు. కన్నుపడిందే తడవుగా చెట్లను అక్రమంగా నరికివేసి ట్రాక్టర్ల ద్వారా గ్రామాల్లో కొన్ని చోట్ల డంపింగ్ చేస్తున్నారు. ఆ తరువాత లారీల్లో అక్రమంగా నరికేసిన చెట్లను లోడింగ్ చెసి బయట రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. గత పదిహేను రోజులుగా ఈ తంతు యథేచ్ఛగా సాగుతున్నా సంబంధిత అధికారులు పట్టించుకున్న పాపాన పోలేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. కొంతమంది బయట రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు ఇక్కడే మకాం వేసి ఇష్టానుసారం కలపచెట్లను నరికి వేసి అక్కడే కుప్పలుగా వేస్తున్నారు. వీటిలో నల్లతుమ్మచెట్లతో పాటు సండ్ర, వేప, చింతచెట్లు ఇతర కంప జాతులకు చెందిన వృక్షాలు ఉండడం గమనార్హం. వీటికి ఫ్యాక్టరీలు, ఇతర బొగ్గుల వినియోగం కోసం గత కొంతకాలంగా పదులకొద్ది వాహనాల్లో అక్రమార్కులు తరలించుకుపోతున్నారని గ్రామస్తులు పేర్కొన్నారు. ఎంతో విలువైన వృక్ష సంపదను నాశనం చేస్తున్నా అధికారులు పట్టించుకోలేదని గ్రామస్తులు ఆవేదన చెందుతున్నారు. అఽధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాల్సి ఉంది. మామూళ్ల మత్తులో జోగుతున్న ఆధికారులు.. గత పదిహేను రోజులుగా పదుల సంఖ్యలో చెట్లను అక్రమంగా నరికేస్తున్నా అటవీ, రెవెన్యూ అధికారులు మామూళ్లు మత్తులో జోగుతున్నారనే విమర్శలున్నాయి. ప్రభుత్వ భూముల్లో చెట్లను నరకడం చట్టరీత్యా నేరం. పట్టాభూముల్లో చెట్లను నరికి వేయాలన్నా రెవెన్యూ అధికారుల అనుమతి తప్పనిసరిగా ఉండాలి. అయితే ఇవేవి అక్రమార్కులు పాటించడం లేదు. చివరకు ప్రభుత్వ భూముల్లో చెట్లను కూడా అక్రమార్కులు నరికివేస్తున్నా పట్టించుకునే దిక్కులేదు. కొంతమంది రెవెన్యూ, అటవీశాఖ అధికారులు బయట రాష్ట్రాలకు కలపతో వెళుతున్న లారీలను ఆపి మామూళ్లను వసూలు చేసుకొని పంపించి వేస్తున్నారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు కలప అక్రమ రవాణాకు అడ్డుకట్ట వేసేందుకు చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. గుర్రంకొండ మండలం సూరప్పగారిపల్లె సమీపంలో బయట రాష్ట్రాలకు తరలించేందుకు సిద్ధంగా ఉంచిన కలపలారీ గుర్రంకొండ మండలం సుబ్బిరెడ్డిగారిపల్లె– గుండ్లగుట్టతాండా మధ్యలో డంపింగ్ చేసిన కట్టెలను లారీల్లోకి లోడింగ్ చేస్తున్న కూలీలు చెట్లు నరికి అక్రమంగా లారీల్లో తరలింపు వాహనాల వద్ద మామూళ్లు వసూలు చేస్తున్న సిబ్బంది గుర్రంకొండలో మకాం వేసిన బయటి రాష్ట్రాల వ్యాపారులు -
టీడీపీ సమావేశంలో రచ్చ
– ఓ ప్రజాప్రతినిధిపై చేయిచేసుకున్న వైనం సాక్షి టాస్క్ఫోర్స్ : రాజంపేట ఆర్ఎస్రోడ్డులోని ఏబీ చంద్రారెడ్డి గార్డెన్స్లో బుధవారం నందలూరు, ఒంటిమిట్ట మండలాల కమిటీ నియామకాల సమావేశం నిర్వహించారు. సమావేశానికి పరిశీలకుడు వచ్చారు. ఈ సమావేశంలో ఒంటిమిట్ట మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధిపై దాడి జరిగినట్లుగా ఆ పార్టీ వర్గాల్లో విస్తృత ప్రచారం జరిగింది. అదే మండలానికి చెందిన బీసీ నేత ఒకరు ఇటీవల జరిగిన ఎన్నికల్లో గెలుపొందిన ఓ ప్రజాప్రతినిధిపై ఇన్చార్జి, పరిశీలకుని సమక్షంలోనే చేయిచేసుకున్నట్లుగా ఆ పార్టీ వర్గాలు చర్చించుకుంటున్నాయి. ప్రధానంగా ఒంటిమిట్టకు సంబంధించి ఉన్న మండల కమిటీనే ఉండాలని ఒక వర్గం వారు ప్రతిపాదించారు. ఈ ప్రతిపాదనను మరో వర్గం వారు వ్యతిరేకించారు. ఈ నేపథ్యంలో రెండు వర్గాలు కలిసి ఒంటిమిట్ట మండలానికి చెందిన ఓ ప్రజాప్రతినిధి పై దాడి చేసినట్లుగా తెలుస్తోంది. మొత్తానికి ఒంటమిట్టి మండల కమిటీ నియామకం విషయం రసాభాసగా మారడం గమనార్హం. వాటర్షెడ్ పనుల పరిశీలన సుండుపల్లె : మండల పరిధిలోని సుండుపల్లె–2 గ్రామ పంచాయతీలోని సామిసేనిగడ్డ సమీపంలో చెక్డ్యాంలను విజయవాడ పంచాయతీరాజ్ డెవలప్మెంట్ శాఖ అధికారులు, జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ వెంకటరత్నం బుధవారం పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు డైరెక్టర్ మాట్లాడుతూ రాష్ట్రంలో 7 మండలాలను ఉత్తమ మండలాలుగా గుర్తించారని అందులో సుండుపల్లెకు మూడవ స్థానం రావడం అభినందనీయమన్నారు. అవార్డు కింద మండలానికి రూ.20 లక్షల అదనపు పనులను కేటాయించినట్లు తెలిపారు. అలాగే మహాత్మాగాంధీ జాతీయ ఉపాధి హామీ పథకం జాబ్కార్డుదారులకు త్వరగా ఈకేవైసీ ప్రక్రియను పూర్తి చేయాలని అధికారులకు సూచించారు. ఈ కార్యక్రమంలో ప్రాజెక్టు అధికారి అశోక్రెడ్డి, ఏపీఓ మాలిక్బాషా, సంబంధిత అధికారులు, రైతులు పాల్గొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్ : లైసెన్సుదారులు తమ మద్యం దుకాణాలలో రీటైల్ పోర్టల్ ద్వారా స్కాన్ అయిన మద్యం సీసాలను మాత్రమే అమ్మాలని జిల్లా ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఆఫీసర్ మధుసూదన్ తెలిపారు. రాయచోటి పట్టణంలో బుధవారం పలు మద్యం షాపుల యజమానులకు, నౌకరనామదారులకు ఎకై ్సజ్ సురక్ష యాప్ ద్వారా స్కాన్ చేసిన మద్యం బాటిళ్లను అమ్మే ప్రక్రియను ప్రత్యక్షంగా గమనించి సూచనలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ఎకై ్సజ్ సురక్ష యాప్ను డౌన్లోడ్ చేసుకొని వారు కొన్న మద్యం సరైనదో కాదో తెలుసుకోవాలని సూచించారు. ఏ వినియోగదారుడైనా ఈ యాప్ ద్వారా తాము కొన్న మద్యం బాటిల్ ప్రభుత్వం సరఫరా చేసినది కాదని తెలిసిన వెంటనే జిల్లా ఎకై ్సజ్ అధికారికి కానీ సమీపంలో ఉన్న ఎకై ్సజ్ శాఖ అధికారి లేదా సిబ్బందికి తెలియజేస్తే వెంటనే చర్యలు తీసుకుంటామన్నారు. నకిలీ మద్యంపై 79481216391 నంబర్కు సమాచారం ఇస్తే వారి పేర్లు గోప్యంగా ఉంచుతామన్నారు. వెట్టిచాకిరీ భరించలేక కార్మికురాలి ఆత్మహత్యాయత్నం మదనపల్లె : ఆరేళ్లుగా తమ నుంచి వెట్టిచాకిరీ చేసుకుంటున్న మగ్గాల నిర్వాహకుడి వేధింపులు తాళలేక చేనేత కార్మికురాలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన బుధవారం రాత్రి కురబలకోట మండలంలో జరిగింది. బాధితురాలు, ఆమె కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. రాయచోటి మండలం పెద్ద కోడివాండ్లపల్లెకు చెందిన దంపతులు ఆర్.రాజశేఖర్, నాగవేణి(32)లు చేనేత మగ్గం పనులతో బతుకుదెరువు సాగించాలని ఆరేళ్ల క్రితం కురబలకోట మండలంలోని చేనేత నగర్కు వచ్చి స్థిరపడ్డారు. అక్కడ లోకేశ్వర్ రెడ్డి అనే మగ్గాల నిర్వాహకుడి వద్ద పనికి కుదిరారు. ఆరేళ్ల క్రితం అతని నుంచి రూ.1.60 లక్షలు అడ్వాన్స్ తీసుకున్నారు. తర్వాత పని చేస్తూనే వారికి వచ్చే కూలీ సోమ్మును జమ చేస్తూ వస్తున్నారు. అయితే అడ్వాన్స్ తీరలేదంటూ చెప్పడంతో తాము వేరేచోట పనికి వెళ్లి మిగిలిన అప్పు తీరుస్తామని దంపతులు అతనితో చెప్పుకున్నారు. దీనికి అంగీకరించని యజమాని తన వద్దనే పని చేయాలని పేర్కొన్నాడు. తమతో పని చేయించుకోవడమే కాకుండా చీటీలు కూడా నడుపుతూ వాటికి కూలీ సోమ్మును జమ వేసుకుంటున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. కష్టపడుతున్నా కూలీ కూడా చేతికి రాకపోవడంతో ఇంటికి బాడుగ కట్టుకోలేక, పిల్లల్ని చదివించలేక ఇబ్బందులు పడుతూ వస్తున్నామని చెప్పారు. ఈ పరిస్థితుల్లో నాగవేణి ఇంటిలో ఉరి వేసుకొని ఆత్మహత్యయత్నానికి పాల్పడింది. పిల్లలు చూసి కేకలు వేయడంతో స్థానికులు, కుటుంబీకులు మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రి తరలించారు. పరీక్షించిన వైద్యులు చికిత్సలు అందిస్తున్నారు. తమను మగ్గాల యజమాని నుంచి విముక్తిని కల్పించాలని కుటుంబీకులు కోరుతున్నారు. -
లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలు పైలెట్ ప్రాజెక్టుకు ఎంపిక
రాయచోటి: వాతావరణ మార్పులకు అనుగుణంగా వ్యవసాయంలో మార్పులు.. పైలెట్ ప్రాజెక్టుకు జిల్లాలోని లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలు ఎంపిక కావడం సంతోషకరమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. రైతులు వాతావరణ మార్పులు వల్ల కలిగే ప్రభావాలకు సన్నద్ధంగా ఉండి ముందస్తు చర్యలు తీసుకోవాలని సూచించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ ఆధ్వర్యంలో యునైటెడ్ నేషన్స్ వరల్డ్ ఫుడ్ ప్రోగ్రామ్ రెండు రోజుల జిల్లాస్థాయి వర్క్షాప్లో భాగంగా గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల ఉపాధి మార్గాల కార్యక్రమంలో పాల్గొన్నారు. ఇండియాలో ఒడిశా, తమిళనాడు, ఆంధ్రప్రదేశ్ మూడు రాష్ట్రాల్లో పైలెట్ ప్రోగ్రామ్గా ఎంపిక కావడం.. అందులో రాష్ట్రంలో అన్నమయ్య జిల్లాలోని వెనుకబడిన మండలాలుగా ఉన్న లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం ఎంపిక కావడం ఆనందించ దగ్గ విషయమన్నారు. ప్రపంచ వ్యాప్తంగా వాతావరణంలో మార్పులు రావడం పెద్ద సమస్యగా మారిందన్నారు. వర్షాలు కురిసే కాలంలో తక్కువగా ఉండటం, పంటలు పండే సమయంలో వర్షాలు రాకుండా ఆగిపోవడం, అలాగే చేతికి వచ్చే సమయంలో అకాల వర్షాలతో పంట నష్టం జరుగుతోందన్నారు. ఇలా వ్యవసాయ రంగం పూర్తిగా దెబ్బతింటోందన్నారు. లక్కిరెడ్డిపల్లి, చిన్నమండెం మండలాలలో రైతుల జీవనాధార కార్యక్రమాలు, పంట పద్దతులు, వాతావరణ పరిస్థితులు తదితర అంశాలపై సమగ్ర అధ్యయనం చేసి శిక్షణా కార్యక్రమాలు నిర్వహించనున్నట్లు తెలిపారు. రైతులు, అధికారులు కలిసి ఒక సమగ్ర యాక్షన్ ప్లాన్ రూపొందించి ఈ ప్రాజెక్టు ద్వారా గరిష్ట ప్రయోజనం పొందేలా కృషి చేయాలని కలెక్టర్ పిలుపునిచ్చారు. జాతీయ ప్రాజెక్టు కో–ఆర్డినేటర్ బాలాజీ త్రిపాఠి మాట్లాడుతూ ఈ పథకం మనదేశంలో మూడు రాష్ట్రాల్లో అమలవుతోందని, ఆంధ్రప్రదేశ్లో జిల్లాలోని చిన్నమండెం, లక్కిరెడ్డిపల్లి మండలాలలోని ఇరవై గ్రామాలలో రైతుల జీవన విధానం, మార్పులకు దోహదమవుతుందని తెలిపారు. అనంతరం ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి జిల్లా వ్యవసాయ అధికారి జి శివనారాయణ మాట్లాడుతూ అన్నమయ్య జిల్లాలో వర్షాభావ పరిస్థితుల వల్ల రైతాంగం వరుస కరువులను చవిచూడాల్సిన పరిస్థితి వస్తోందని,, వీటిని ప్రత్యామ్నాయంగా ఈ పథకం ద్వారా గ్రామస్థాయిలోని సన్నకారు రైతులకు ఉపయోగపడే విధంగా రూపకల్పన చేయాలని సూచించారు. ప్రకృతి వ్యవసాయ రైతు సాధికార సంస్థప్రతినిధి సౌమ్య జిల్లా ప్రకృతి వ్యవసాయాధికారి బి వెంకట మోహన్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, జిల్లా పిషరీస్ డిపార్టుమెంట్ అధికారి సుష్మిత తదితరులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
ఎడిటర్ పట్ల వేధింపులు తగదు
సాక్షి ఎడిటర్ ఆర్.ధనుంజయరెడ్డిని పోలీసులు వేధించడం తగదు. నోటీసులు ఇవ్వాలి తప్ప కార్యాలయాల వద్దకు వెళ్లి హంగామా చేయడం మంచిది పద్ధతి కాదు. ఏదైనా ఉంటే న్యాయపరంగా తేల్చుకోవాలి. కేసులు నమోదు చేసి వేధించడం, అరెస్టులు చేయడం ప్రజాస్వామ్యానికి గొడ్డలి పెట్టు. జర్నలిస్టులు తప్పు చేస్తే లీగల్గా నోటీసులు ఇచ్చి న్యాయస్థానంలో పోరాడాలే తప్ప ఇలా చేయడం కరెక్టు కాదు. – సి.వెంకటరెడ్డి, ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర కార్యవర్గ సభ్యులు, కడప -
పోలీసులు న్యాయం చేయాలి
మదనపల్లె : తనకు జరిగిన అన్యాయంపై పోలీసులే న్యాయం చేయాలని లేని పక్షంలో అత్మహత్యే శరణ్యమని హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. బుధవారం స్థానిక ప్రెస్క్లబ్లో జరిగిన మీడియా సమావేశంలో ఆమె మాట్లాడుతూ స్థానిక చీకలగుట్టలో ఉంటున్న దంపతులు దమరేశ్వర్, స్వర్ణలత తన దగ్గర నుంచి డబ్బు తీసుకుని ఇవ్వకుండా వేధిస్తున్నారని వాపోయింది. తనను నమ్మించి రూ.45 లక్షల నగదు, ఇంటికి సంబంధించిన డాక్యుమెంట్లు, బిడ్డల కోసం కొన్న బంగారు ఆభరణాలను తీసుకున్నారని, వాటిని తిరిగి చెల్లించాలని కోరుతుంటే బెదిరిస్తున్నారని పేర్కొంది. సీటీఎం రోడ్డులో తనపై దాడికి ప్రయత్నించారని కన్నీటిపర్యంతమైంది. ఒంటరిగా ఉన్న తనను ఏమైనా చేస్తారని భయాందోళన వ్యక్తం చేసింది. ఈ విషయాన్ని పోలీసుల దృష్టికి తీసుకెళ్లానని, పైసాపైసా కూడబెట్టిన డబ్బును, బిడ్డల కోసం కొన్న బంగారు ఆభరణాలను తిరిగి ఇప్పించకుంటే తనకు చావే శరణ్యమని ఆవేదన వ్యక్తం చేసింది. -
డ్రాపౌట్లను అరికట్టాలి
గాలివీడు : విద్యార్థుల హాజరుపై దృష్టి పెట్టి డ్రాపౌట్లను అరికట్టాలని సమగ్రశిక్ష ప్రత్యామ్నాయ స్కూల్ కోఆర్డినేటర్ ఉలవల వెంకట్రామయ్య సూచించారు. బుధవారం మండలంలోని పలు పాఠశాలలను ఆయన సందర్శించారు. అనంతరం విద్యార్థుల హాజరు రిజిస్టర్లు పరిశీలించి దీర్ఘకాలంగా గైర్హాజరైన, తరచుగా గైర్హాజరయ్యే విద్యార్థులను గుర్తించారు. అనంతరం ఆయన ఎఫ్ ఏ–2 పరీక్షల నిర్వహణ, మధ్యాహ్న భోజన పథకం అమలు అంశాలను సమీక్షించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గైర్హాజరు విద్యార్థుల కోసం ప్రత్యేక రిజిస్టర్ నిర్వహించి తల్లిదండ్రుల ద్వారా విద్యార్థి తిరిగి పాఠశాలకు వచ్చేలా చర్యలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో మండల విద్యా అధికారులు నాగరాజు, శ్రీనివాసులు, ప్రధానోపాధ్యాయులు జాఫర్ బాషా, కృష్ణానాయక్, రమణారెడ్డి, వెంకటయ్య, సీఆర్పీలు సాంబశివ, భరత్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
పొట్టకూటి కోసం వచ్చి.. అనంత లోకాలకు..
● విద్యుత్ షాక్తో ఇద్దరు బీహార్ కార్మికుల మృతి ● మృతుల కుటుంబాలను ఆదుకోవాలని ఏఐటీయూసీ నాయకుల డిమాండ్ పెద్దతిప్పసముద్రం : పొట్టకూటి కోసం బీహార్ నుంచి వచ్చిన ఇద్దరు కార్మికులు బుధవారం కరంటు షాక్తో మృతి చెందిన సంఘటన మండలంలోని కందుకూరులో జరిగింది. వివరాల్లోకి వెళితే ములకలచెరువు మండలం బిల్లూరివాండ్లపల్లికి చెందిన ఆవుల రాజశేఖర్ అలియాస్ రాజు అనే వ్యక్తి కందుకూరులోని వడ్డిపల్లి రోడ్డులో బాలక్రిష్ణ అనే వ్యక్తికి చెందిన ఖాళీ స్థలాన్ని లీజుకు తీసుకుని సిమెంటు ఇటుక తయారీ కేంద్రం నిర్వహిస్తున్నాడు. ఈ ఇటుకల తయారీ కేంద్రాన్ని సద్దాం అనే వ్యక్తి చూసుకునేవాడు. ఈ నేపథ్యంలో బీహార్కు చెందిన గుడ్డు షహాని (27). ఇంద్రసన్ సహానీ (42)లు గత నాలుగు నెలలుగా ఇక్కడ కార్మికులుగా పని చేసేవారు. ఈ తరుణంలో ఎప్పటి లాగానే కార్మికులిద్దరూ బుధవారం ఉదయం ఇటుకల తయారీ యంత్రాన్ని ఆన్ చేయగా యంత్రానికి అమర్చిన మోటారు వైండింగ్ స్లివ్ తెగి ఇనుప యంత్రానికి విద్యుత్ సరఫరా కావడంతో బీహార్కు చెందిన కార్మికులిద్దరూ యంత్రానికే అతుక్కుని తనువు చాలించినట్లు డిస్కం ఏఈ గిరిధర్ ధ్రువీకరించారు. సమాచారం అందుకున్న ఇన్చార్జి సీఐ గోపాల్రెడ్డి, ఇన్చార్జి ఎస్ఐ నరసింహుడు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆర్ఐ హుసేన్, వీఆర్వో రమణ సమక్షంలో పోలీసులు శవ పంచనామా నిర్వహించి మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లి జిల్లా ఆసుపత్రికి తరలించారు. కరెంటు షాక్కు బలైన కార్మికుల మృతదేహాలను ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, ఉప కార్యదర్శి సలీంబాషా, నియోజకవర్గ అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి, బాలక్రిష్ణలు సందర్శించారు. ఇటుకల తయారీ కేంద్రం నిర్వాహకుడి నిర్లక్ష్యం వల్లే ఇద్దరు కార్మికులు బలయ్యారని ఆరోపించారు. ఈ ఘటనపై పోలీసులు, కార్మిక శాఖ అధికారులు సమగ్రంగా విచారణ చేపట్టి మృతుల కుటుంబీకులను అన్ని విధాలా ఆదుకుని పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. -
పడకేసిన వైద్యం
రాయచోటి/ఓబులవారిపల్లె: కూటమి ప్రభుత్వ హయాంలో వైద్యానికి సుస్తీ చేసింది.రెండేళ్ల క్రితం వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ఉన్నతంగా వెలిగిన ప్రభుత్వ రంగ వైద్యం ఇప్పుడు దీనావస్థలో ఉంది. ఆరోగ్యంగా ఉన్న వైద్యాన్ని అనారోగ్యం పాలు చేసి మంచం పట్టేలా చేయడంలో కూటమి సర్కార్ సఫలీకృతమైంది. సమస్యల పరిష్కారానికి గత నెల 26వ తేదీ నుంచి దశల వారీగా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్స్ అసోషియేషన్ (ఏపీ పీహెచ్సీ డీఏ) ఆధ్వర్యంలో చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. 2024 సెప్టెంబర్లో కూడా వైద్యులు సమ్మె చేశారు. ప్రభుత్వం చర్చలకు ఆహ్వనించి, సమస్యలను పరిష్కరిస్తామని హమీ ఇచ్చింది. ఏడాది దాటినా హామీలు అమలుకాకపోవడంతో మరోమారు వైద్యులు ఆందోళన బాట పట్టారు.జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం కరువైంది.ప్రభుత్వం సరైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంటల్, స్కిన్, ఆర్తో, కంటి వైద్య నిపుణులను అక్కడక్కడా ఏర్పాటుచేసిన ఫలితాలు కనిపించలేదు.చాలాచోట్ల నర్సులు, సిబ్బంది అందిస్తున్న వైద్యంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. బుధవారం ఓబులవారిపల్లె మండలం ముక్కావారిపల్లి ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో వైద్యాధికారి రాకపోవడంతో రోగులు చాలాసేపు వేచి ఉండాల్సి వచ్చింది. ప్రస్తుతం సీజనల్ వ్యాధులు వ్యాప్తి చెందుతున్న కారణంగా ప్రజలు రోగాల బారిన పడి ప్రభుత్వ వైద్య, ఆరోగ్య కేంద్రాలకు వెళ్తున్నారు. అక్కడ వైద్య సేవలు అందకపోవడంతో ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి ప్రభుత్వ వైద్యాధికారుల సమస్యలు పరిష్కరించాలని ప్రజలు కోరుతున్నారు. కొనసాగుతున్న పీహెచ్సీ వైద్యుల సమ్మె వైద్యం అందక గ్రామీణులకు అవస్థలు -
ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు
రాష్ట్ర ప్రభుత్వం కక్షసాధింపు ధోరణిలో సాక్షి ఎడిటర్ ధనుంజయరెడ్డిపై కేసులు పెట్టి వేధించడం తగదు. ఇలాంటి ఘటన ప్రజాస్వామ్యానికి గొడ్డలిపెట్టు లాంటిది. అలాగే జిల్లాలో కూడా సాక్షి జర్నలిస్టులపై పదేపదే పోలీసులు కేసులు పెట్టి ఏదో ఒకరకంగా వేధించాలనుకోవడం మంచి పద్ధతి కాదు. ఇలాంటి పరిస్థితి ఉత్పన్నమైతే భవిష్యత్తులో ఉద్యమ కార్యచరణ రూపొందిస్తాం. – పి.రామసుబ్బారెడ్డి, రాష్ట్ర నాయకుడు, ఆంధ్రప్రదేశ్ యూనియన్ ఆఫ్ వర్కింగ్ జర్నలిస్ట్స్ -
ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో నిందితుడికి జైలుశిక్ష
కేవీపల్లె : ఎర్రచందనం అక్రమ రవాణా కేసులో ఓ నిందితుడికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధిస్తూ తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టు న్యాయమూర్తి ఎ.నరసింహమూర్తి తీర్పనిచ్చారని ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. 2018లో ఎర్రచందనం అక్రమంగా తరలిస్తుండగా అప్పటి కేవీపల్లె ఎస్ఐ కెబి.శివకుమార్ ఐదుగురు నిందితులను పట్టుకుని వివిధ సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఈ కేసుకు సంబంధించి సమగ్ర దర్యాప్తు చేపట్టి నివేదికను తిరుపతి ఆర్ఎస్ఎస్ ఏడీజే కోర్టుకు సమర్పించారు. కేసును పరిశీలించిన న్యాయమూర్తి ఎ1 ముద్దాయిగా ఉన్న కలకడ మండలం ముడియంవారిపల్లెకు చెందిన గడ్డం రవికి ఐదేళ్ల కఠిన కారాగార శిక్ష, రూ.3 లక్షల జరిమానా విధించినట్లు తెలిపారు. జరిమానా చెల్లించని పక్షంలో ఆరు నెలల సాధారణ జైలు శిక్ష అనుభవించాల్సి ఉంటుందని తెలిపారు. ముద్దాయికి శిక్ష పడేలా కృషి చేసిన రాయచోటి డీఎస్పీ ఎంఆర్.కృష్ణమోహన్, స్పెషల్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఎ.అమరనారాయణ, అప్పటి ఎస్ఐ కెబి.శివకుమార్, ప్రస్తుత ఎస్ఐ చిన్నరెడ్డెప్ప, సీఐ లక్ష్మన్న, కానిస్టేబుళ్లు కె.ఆదినారాయణ, కె. శ్రీనివాసులలకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. -
అటవీ భూముల ఆక్రమణను అడ్డుకున్న జనం
మదనపల్లె రూరల్ : మండలంలోని చీకలబైలు పంచాయతీ దొనబైలు మార్గంలో అటవీ భూములను ఆక్రమించి దర్గా నిర్మాణానికి యత్నించిన ఘటనపై కేసు నమోదుచేసినట్లు తాలూకా ఎస్ఐ చంద్రమోహన్ తెలిపారు. మదనపల్లె మండలం ఈశ్వరమ్మ కాలనీ, కర్నాటక ముళబాగిలుకు చెందిన వ్యక్తులు సోమవారం దర్గా నిర్మాణం పేరుతో అటవీ ప్రాంతంలో పనులు ప్రారంభించడంతో స్థానిక గ్రామాల ప్రజలు అడ్డుకున్నారు. అర్ధరాత్రి వరకు తీవ్ర ఉద్రిక్త పరిస్థితి తలెత్తింది. ఫారెస్ట్, పోలీస్ అధికారులు అక్కడకు చేరుకుని ఆక్రమణలు తొలగించి పరిస్థితి చక్కదిద్దారు. వీఆర్వో విశ్వనాథ్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై బయట వ్యక్తులకు సహకరించిన చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు, దేవళం వీధికి చెందిన మహమ్మద్ ఖాదిర్, అతడి భార్య సల్మాతోపాటు మరికొందరిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలు సుండుపల్లె : మండలంలోని భాగంపల్లి సమీపంలో మంగళవారం ఉదయం రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొన్నాయి. ఈ సంఘటనలో భార్య, భర్తలు షేక్రహజాన్ (60), షేక్ గఫూర్ (65) తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో వారినిరాయచోటి ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స చేసి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలో మంగళవారం సాయంత్రం బైకు ఢీకొని ఇద్దరికి గాయాలయ్యాయి. స్థానికుల వివరాల మేరకు..ఎర్రగుంట్లకు చెందిన జేసీబీ ఆపరేటర్ వన్నూరు స్వామి(48) రాజంపేటలో పనులు ముగించుకుని తిరిగి పల్సర్ బైక్పై ఇంటికి వెళ్తున్నారు. ఒంటిమిట్ట కోదండ రామాలయం వెనుక వైపు ఉన్న కడప–చైన్నె జాతీయ రహదారిపైకి రాగానే రోడ్డు దాటుతున్న ఒంటిమిట్టకు చెందిన మునికృష్ణ(35)ని ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో వన్నూర్స్వామికి స్వల్ప గాయాలవగా, మునికృష్ణకు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని ప్రైవేటు వాహనంలో కడప రిమ్స్కు తరలించారు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. ఎస్సీ ఎస్టీ కేసు నమోదు కడపఅర్బన్ : కడప నగరం శంకరాపురంలో కులం పేరుతో దూషించిన వ్యక్తిపై ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేసినట్లు చిన్న చౌక్ సీఐ ఓబులేసు తెలిపారు. సీఐ వివరాల మేరకు.. శంకరాపురానికి చెందిన విజయకుమార్ సమీపంలో నివాసమున్న అక్కిశెట్టి వెంకట్ మంగళవారం చిన్న విషయమై గొడవపడ్డారు. దీంతో ఆవేశంతో విజయ్ కుమార్ను కులం పేరుతో దూషిస్తూ వెంకట్ దాడి చేసినట్లు బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమో దు చేసి విచారిస్తున్నామని సీఐ తెలిపారు. గాయపడిన ముని కృష్ణ, వన్నూర్స్వామి -
రుషి వాటికలో డీఎంహెచ్ఓ విచారణ
బి.కొత్తకోట : మండలంలోని రుషి వాటిక వేదవ్యాస పాఠశాలలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య మంగళవారం విచారణ జరిపారు. అక్కడ చదువుకొంటున్న లక్కిరెడ్డిపల్లె మండలానికి చెందిన విద్యార్థి శేషాద్రిరెడ్డి కుడి కంటికి గాయమై చూపు కోల్పోయిన విషయం తెలిసిందే. దీనిపై పోలీసు కేసు నమోదైంది. ఇందులో భాగంగా కలెక్టర్ ఆదేశాలతో లక్ష్మీనరసయ్య ఆచార్యులు, విద్యార్థులు, ఉపాధ్యాయులను విచారించారు. గాయపడిన విద్యార్థికి ఘటన జరిగిన సమయంలో అందించిన వైద్య సాయంపై ఆరా తీశారు. రుషివాటికలో ఉన్న అత్యవసర వైద్య సదుపాయాలు, భద్రతా చర్యలను పరిశీలించారు. ఈ ఘటనలు జరిగినప్పుడు తీసుకోవాల్సిన చర్యలను సిబ్బందికి వివరించారు. ఆయన మాట్లాడుతూ ఈ విచారణ నివేదికను కలెక్టర్కు అందించనున్నట్లు చెప్పారు. గాయపడిన విద్యార్థికి అవసరమైన వైద్య సాయం అందిస్తామని చెప్పారు. ప్రోగ్రామ్ ఆఫీసర్ శ్రీధర్, టీబీ సూపర్వైజర్ ప్రభాకర్, ఆరోగ్య సిబ్బంది విజయలక్ష్మి, రెడ్డెమ్మ, ప్రమీల పాల్గొన్నారు. -
ఒంటరి వృద్ధురాలికి చేయూత
కడప అర్బన్ : నలుగురు కుమారులు ఉన్నా.. ఒంటరిగా జీవనం సాగిస్తున్న ఓ వృద్ధురాలికి చేయూత అందించేలా కడప జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబాఫక్రుద్దీన్ చొరవ చూపారు. ఆమె కుమారులకు కౌన్సిలింగ్ ఇచ్చి.. ఆసరా కల్పించాలే చేశారు. కడప తారకరామా నగర్లో నివాసముంటున్న బుసల లక్ష్మమ్మకు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. పెద్ద కుమారుడు బుసల రమణ కడపలో బేల్దారి పని చేస్తుండగా, ద్వితీయ, తృతీయ కుమారులు బుసల చిన్నప్ప, బుసల చంద్ర ఆటో నడుపుతున్నారు. నాలుగో కుమారుడు బుసల శ్రీనివాసులు కలకడలో టైల్స్ పని చేసుకుంటున్నారు. కుమార్తె బుసల రమణమ్మ కడపలో నివాసం ఉంటోంది. నలుగురు కుమారులు ఉన్నా.. ఆమె ఒంటరిగా జీవిస్తోందనే విషయం జడ్జి బాబాఫక్రుద్దీన్ దృష్టికి రావడంతో ఆయన స్పందించి లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులను ఇంటికి పంపారు. అక్కడికి వెళ్లిన న్యాయవాదులు ఆమెకు సాయం చేస్తామని తెలిపారు. అనంతరం జడ్జి ఎస్.బాబా ఫక్రుద్దీన్ లక్ష్మమ్మ కుమారులు, కుమార్తెలను పిలిపించి కౌన్సిలింగ్ ఇచ్చారు. వయో వృద్ధుల చట్టంపై వారికి అవగాహన కల్పించారు. పెద్ద కుమారుడు బుసల రమణ రూ.1500, ద్వితీయ, తృతీయ కుమారులు చిన్నప్ప, చంద్రలు ఒక్కొక్కరూ రూ.1500 ఇచ్చేలా ఒప్పందం కుదిర్చారు. ఆమె కుమారుల వద్దే ఉండేలా చూడాలని చెప్పారు. అనంతరం ఏవైనా సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవ అధికార సంస్థను సంప్రదించాలని వృద్ధురాలికి సూచించారు. ఈ కార్యక్రమంలో అసిస్టెంట్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులు మనోహర్, రవితేజ సీనియర్ సిటిజన్ అయిన బుసల లక్ష్మమ్మ కుమారులు, కుమార్తె పాల్గొన్నారు. జడ్జి బాబా ఫక్రుద్దీన్ చొరవతో కదిలిన కుమారులు -
వరకట్నం వేధింపులతో వివాహిత ఆత్మహత్యాయత్నం
ఆస్పత్రిలో కుటుంబసభ్యుల ఘర్షణమదనపల్లె రూరల్ : వరకట్నం వేధింపులకు ఓ వివాహిత ఆత్మహత్యాయత్నానికి పాల్పడగా, జిల్లా ఆస్పత్రి ఆవరణలో ఇరు కుటుంబాల సభ్యులు ఘర్షణకు దిగిన ఘటన మంగళవారం మదనపల్లెలో జరిగింది. బాధితుల వివరాల మేరకు.. పట్టణంలోని మోతీనగర్కు చెందిన వసీంకు రామసముద్రానికి చెందిన హీనా కౌసర్(23)ను ఇచ్చి రెండేళ్ల క్రితం వివాహం జరిపించారు. వీరికి ఏడాది వయసున్న కుమారుడు ఉన్నాడు. పెళ్లి అయిన నెల రోజుల నుంచే అత్తింటివారు అదనపు కట్నం కోసం తరచూ వేధించడం, కొట్టడం, తిట్టడం చేసే వారు. ఈ క్రమంలో మంగళవారం అదనపు కట్నం విషయమై మరోసారి భార్యాభర్తల మధ్య గొడవ జరిగింది. తీవ్ర మనస్తాపానికి గురైన హీనాకౌసర్ ఇంట్లో ఉన్న ఎలుకల మందు తిని ఆత్మహత్యాయత్నం చేసింది. విషయం తెలుసుకున్న ఆమె సోదరుడు మహమ్మద్ ఇర్ఫాన్, మదనపల్లెకు చేరుకుని హీనా కౌసర్ను ఆస్పత్రికి తీసుకెళ్లేందుకు ప్రయత్నించాడు. భర్త వసీం అడ్డుకోవడంతో ఘర్షణ తలెత్తింది. మహమ్మద్ ఇర్ఫాన్పై వసీం కుటుంబసభ్యులు దాడికి దిగారు. అనంతరం హీనా కౌసర్ను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు తిరుపతికి రెఫర్ చేశారు. ఆమెను 108 అంబులెన్స్ వాహనంలో ఎక్కిస్తుండగా, హీనా కౌసర్ కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకున్నారు. అక్కడే ఉన్న వసీం కుటుంబ సభ్యులతో గొడవపడి కొట్టుకున్నారు. దీంతో టూటౌన్ పోలీసులు అక్కడికి చేరుకుని బాధితురాలిని తిరుపతికి పంపించి, కుటుంబ సభ్యులను పంపేశారు. -
ప్రైవేట్ ఉద్యోగి ఇంటి ఎదుట హిజ్రా నిరసన
మదనపల్లె రూరల్ : ఆర్థిక లావాదేవీల్లో భాగంగా లక్షల రూపాయల నగదుతో పాటు బంగారు నగలు, విలువైన ఆస్తి పత్రాలు తీసుకుని ఓ ప్రైవేట్ ఉద్యోగి, అతడి భార్య తనను నిలువునా మోసం చేశారని, అడిగితే ఇవ్వకపోగా..తనను చంపేస్తామని బెదిరిస్తున్నారని హిజ్రా స్వాతి ఆవేదన వ్యక్తం చేసింది. పట్టణంలోని ముజీబ్ నగర్లోని ప్రైవేట్ ఉద్యోగి ఇంటి ఎదుట మంగళవారం సాయంత్రం హిజ్రా బైఠాయించి నిరసనకు దిగింది. బాధితురాలి వివరాల మేరకు...పట్టణంలోని చీకలిగుట్ట గౌతమీ నగర్లో భర్త దుర్గాప్రసాద్తో కలిసి చీటీలు వేసుకుని హిజ్రా స్వాతి జీవనం సాగిస్తోంది. ఐదేళ్ల క్రితం తన స్నేహితురాలు చంద్రకళ..ముజీబ్ నగర్కు చెందిన ప్రైవేట్ కాలేజీ క్యాషియర్, వడ్డీ వ్యాపారి ఢమరేశ్వర్, అతడి భార్య స్వర్ణలత వద్ద రూ.30 లక్షలు అప్పు తీసుకోగా హిజ్రా స్వాతి పూచీ పడింది. అనంతరం చంద్రకళ వడ్డీ, అసలు కట్టలేక ఐపీ పెట్టి వెళ్లిపోయింది. స్నేహితురాలు చంద్రకళకు పూచీ పడిన స్వాతిని అప్పు చెల్లించాల్సిందిగా ఢమరేశ్వర్ దంపతులు ఒత్తిడిచేశారు. ఈ క్రమంలో తన కష్టార్జితంతో పాటు, ఇతరుల నుంచి పెద్ద మొత్తంలో అప్పుచేసి, విడతల వారీగా ఫోన్ పే ద్వారా రూ.34లక్షలు, అకౌంట్ ద్వారా రూ.8లక్షలు, నగదు రూపేణా రూ.23లక్షల90వేలు, 600 గ్రాముల బంగారు ఇచ్చినట్లు స్వాతి తెలిపారు. వ్వడం జరిగిందన్నారు. స్నేహితురాలు చేసిన అప్పును వడ్డీతో సహా చెల్లించినప్పటికీ, తాను వారికి ఇచ్చిన నగదు, బంగారు, ఆస్తి పత్రాలను తిరిగి ఇవ్వాలని అడిగితే.. ఇవ్వకపోగా, వేధింపులకు గురిచేశారన్నారు. టూటౌన్ పోలీసులను ఆశ్రయిస్తే,..పోలీసుల ఎదుట ఇచ్చేస్తామని అంగీకరించి అనంతరం మొండికేశారన్నారు. అంగబలం, ఆర్థిక బలాన్ని ఉపయోగించి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కాకుండా చేశారని, నగదు, డబ్బులు అడిగితే...రెండు రోజుల క్రితం ఎస్టేట్ సమీపంలో తనపై ఢమరేశ్వర్, అతడి భార్య స్వర్ణలత దాడికి పాల్పడ్డారన్నారు. దాడి విషయం టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసి, సీసీ ఫుటేజీ ఆధారాలను అందించినా పోలీసులు చర్యలు తీసుకోలేదన్నారు. విధిలేని పరిస్థితుల్లో తనకు అప్పులిచ్చిన వారి నుంచి ఒత్తిడి అధికమవడంతో ఢమరేశ్వర్ ఇంటి ఎదుట బైఠాయించినట్లు తెలిపింది. పోలీసులు తనకు న్యాయం చేయాలని కోరింది. -
ఆడ బిడ్డలను కాపాడుకుందాం
రాయచోటి టౌన్ : సీ్త్ర లేనిదే సృష్టి లేదు.. అందుకే ఆడ బిడ్డలను కాపాడుకుందామని సీ్త్ర సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్ హైమావతి పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణంలో మంగళవారం అంతర్జాతీయ బాలికల దినోత్సవం నిర్వహించారు. విద్యార్థులతో కలిసి ర్యాలీగా వచ్చి బంగ్లా సర్కిల్ వద్ద మానవహారం నిర్వహించారు. ఈ సందర్భంగా హైమావతి మాట్లాడుతూ ఆడబిడ్డల చదువు ...ఇంటికే వెలుగును ఇస్తుందన్నారు. సీ్త్ర విద్యావంతురాలు అయితే ఆ ఇంటి ఆర్థిక పరిస్థితులేగాక అన్ని రంగాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. బాల్య వివాహాలను నిర్మూలించాలని, ఆడబిడ్డలు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రోత్సహించాలని సూచించారు. బ్రూణహత్యలు నియంత్రించి ఆడ శిశువులను కాపాడుకొనే బాధ్యత అందరిపై ఉందని చెప్పారు. అంతకు ముందు బాలికోన్నత పాఠశాలలో విద్యార్థులకు పోటీ పరీక్షలు నిర్వహించి ప్రతిభ చాటిన వారికి ప్రోత్సాహాక బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో నాగేశ్వరావు, సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
టమాటా రైతులకు అన్యాయం
రాయచోటి టౌన్ : టమాటా మండీ వ్యాపారులను రైతులకు అన్యాయం చేస్తున్నారని, వారిపై చర్యలు తీసుకోవాలని రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి వంగిమళ్ల రంగారెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటి సీపీఐ జల్లా కార్యాలయంలో విలేకరులతో మంగళవారం ఆయన మాట్లాడుతూ గుర్రకొండ మార్కెట్కు టమాటా దిగుబడులు తీసుకెళ్లితే వంద బాక్సులకు 20 బాక్స్లు జాక్పాట్ అంటూ పక్కకు తీసేస్తున్నారన్నారు. డబ్బులు చెల్లించకుండా మిగిలిన 80 బాక్స్లకు వేలం పాడి డబ్బులు ఇస్తున్నారని ఆరోపించారు. ఫిర్యాదు చేస్తే తమ టమాటా దిగుబడులు కొనరేమోనని రైతులు భయపడుతున్నారని తెలిపారు. ఉన్నతాధికారులు దృష్టి సారించి మండి వ్యాపారులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నాయకులు హరినాథ నాయుడు, అంజాద్ ఆలీఖాన్, నవీన్కుమార్ రెడ్డి, షబ్బీర్ బాషా, భాస్కర్, తదితరులు పాల్గొన్నారు. నాణ్యమైన భోజనం అందించాలి పుల్లంపేట : విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రహ్మణ్యం అన్నారు. మండలంలోని ఆదర్శ, కస్తూర్భా, బాలికల పాఠశాలలను మంగళవారం ఆయన ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వివిధ సబ్జెక్టులకు సంబంధించి ప్రశ్నలు వేసి విద్యార్థుల నుంచి సమాధానాలు రాబట్టారు. ప్రయోగాలు ద్వారా బోధన చేయడంతో విద్యార్థులకు విషయం క్షుణ్ణంగా అవగతమవుతుందన్నారు. అనంతరం విద్యార్థులకు కెరీర్ గైడ్లైన్ను వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు చక్రధర్ రాజు, నాగ తిరుమలరావు, అధ్యాపకులు పాల్గొన్నారు. -
వ్యాపారిపై టీడీపీ నాయకుడి దాడి
మదనపల్లె రూరల్ : స్థలం వివాదంలో ఓ వ్యాపారిపై టీడీపీ నాయకుడు, మున్సిపల్ మాజీ చైర్మన్ కొడవలి శివప్రసాద్, దౌర్జన్యం చేసి దాడికి పాల్పడిన ఘటన మంగళవారం మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుడు మోహనమురళీ వివరాల మేరకు... అంకిశెట్టిపల్లె పంచాయతీ సురభీ కాలనీకి చెందిన మోహన మురళీ, బెంగళూరు రోడ్డులోని హంద్రీనీవా కాలువ సమీపంలో 1997లో 19 సెంట్ల స్థలం కొనుగోలు చేశాడు. మదనపల్లె మున్సిపల్ మాజీ చైర్మన్, టీడీపీ నాయకుడు కొడవలి శివ ప్రసాద్కు స్థలం పక్కనే భూమి ఉంది. మంగళవారం మోహన్మురళీ తన స్థలంలో షెడ్ నిర్మాణానికి పనులు చేసుకుంటుండగా, కొడవలి శివప్రసాద్, అతడి బావ మరిది, డ్రైవర్తోపాటు అక్కడికి వచ్చారు. పనులు చేయవద్దని మోహన మురళీని అడ్డుకున్నారు. అయితే, తన వద్ద పూర్తిస్థాయిలో సరైన రికార్డులు ఉన్నాయని, పనులు ఎందుకు అడ్డుకుంటున్నారని మోహన మురళీ ప్రశ్నించాడు. అవసరమైతే స్థలం సర్వే చేసి హద్దులు నిర్ణయించాలని, తన స్థలం ఉంటేనే తనకు వదిలేయాలని కోరాడు. అయినా వారు వినకుండా వాగ్వాదానికి దిగడంతో ఘర్షణ తలెత్తింది. ఆవేశానికి లోనైన కొడవలి శివప్రసాద్, అతడి బావమరిది, వాహన డ్రైవర్లు ముగ్గురు మోహన మురళీపై దాడికి పాల్పడ్డారు. దౌర్జన్యం చేయడంతోపాటు చంపేస్తామని బెదిరించారు. దాడిలో గాయపడ్డ మోహన్ మురళీ ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి చేరుకుని చికిత్స పొందాడు. ఘటనపై తాలూకా పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసి న్యాయం చేయాల్సిందిగా కోరాడు. స్థలం వివాదంలో మున్సిపల్ మాజీ చైర్మన్ దౌర్జన్యం -
ప్రధాని సభకు ఆహ్వానం
కడప కోటిరెడ్డిసర్కిల్: కర్నూలు జిల్లా ఓర్వకల్లు మండలం నన్నూరు గ్రామంలో ఈనెల 16న ప్రధాని నరేంద్రమోదీ, ముఖ్యమంత్రి చంద్రబాబు సభకు పరిశ్రమల యజమానులు హాజరుకావాలని జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం చాంద్బాషా ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటలకు జరిగే సూపర్ జీఎస్టీ–సూపర్ సేవింగ్స్ సభకు జిల్లాలోని సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల యజమానులు, పారిశ్రామికవేత్తలు, పరిశ్రమల సంఘ సభ్యులు హాజరు కావాలని ఆయన కోరారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ప్రధాని నరేంద్రమోదీ కర్నూలు జిల్లా పర్యటన నేపధ్యంలో ఆయన నిర్వహించే సభకు రాయలసీమ జిల్లాల నుంచి 3300 ఆర్టీసీ బస్సులు నడపనున్నారు. తిరుపతి నుంచి 320, చిత్తూరు 280, అన్నమయ్య 225, వైఎస్సార్ 340, నంద్యాల 310, కర్నూలు 225, అనంతపురం 225, శ్రీ సత్యసాయి జిల్లా నుంచి 260 బస్సులు వెళ్లేలా ప్రణాళికలు రూపొందించారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఈనెల 16న గురువారం ప్రత్యేక విద్యుత్ అదాలత్ నిర్వహిస్తున్నట్లు కడప డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ హరిసేవ్యా నాయక్ ఒక ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం 11 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకూ నిర్వహించే ఈ కార్యక్రమంలో విశ్రాంత న్యాయమూర్తి వి. శ్రీనివాస ఆంజనేయమూర్తి, సభ్యులు జి. మధుకుమార్, ఏ. శ్రీనివాస బాబు, విజయలక్ష్మి పాల్గొని వినియోగదారుల దీర్ఘకాలిక సమస్యలను పరిష్కరిస్తారన్నారు. వినియోగదారులకు ఇంకా ఏవైనా సమస్యలు ఉంటే ఈ ప్రత్యేక ఆదాలత్కు హాజరై పరిష్కరించుకోవాలని సూచించారు. -
ఒప్పందంలో ఏ తప్పు దాగుందో!
సాక్షి,టాస్క్ ఫోర్స్: కడప ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో రోగుల వైద్యం కోసం ఉపయోగించే ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా కాంట్రాక్ట్ వ్యవహారంలో అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. తోచిన రీతిలో అగ్రిమెంట్లు చేసుకుంటూ నిబంధనలకు నీళ్లొదులుతున్నారు. వివరాల్లోకి వెళితే.. జిల్లాలోని ఎర్రగుంట్లకు చెందిన వారాశి సంస్థకు 2015 నుంచి 2020 వరకు రిమ్స్కు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు ప్రభుత్వం కాంట్రాక్ట్ ఇచ్చింది. అనంతరం మూడేళ్లు, ఆపై ఒక్కో ఏడాది పొడిగిస్తూ 2025 వరకు ఒప్పందం కొనసాగించారు. ఈ క్రమంలోనే ఈ ఏడాది జూలై 22న వారాశి సంస్థకే మరో ఏడాది రెన్యూవల్ చేస్తూ కలెక్టర్ ఉత్తర్వులు జారీ చేశారు. దీని ప్రకారం 2026 వరకు సదరు సంస్థకు ఒప్పందం ఉంది. తెరవెనుక ఏ మతలబు జరిగిందో.. ఏ రాజకీయ ఒత్తిడి ఎక్కువైందో గానీ రెన్యూవల్ ఉత్తర్వులు జారీ చేసిన 4 రోజులకే అంటే జూలై 26నే వారాశి సంస్థతో కుదుర్చుకున్న అగ్రిమెంట్ను రద్దు చేశారు. అదే నెల 30న కర్నూలుకు చెందిన శ్రీ భారత్ ఫార్మా సంస్థతో ఆక్సిజన్ సరఫరా కోసం కొత్త అగ్రిమెంట్ కుదుర్చుకున్నారు. నిజానికి శ్రీ భారత్ ఫార్మా కంపెనీకి 2018లోనే పదేళ్లపాటు రాష్ట్రవ్యాప్తంగా పలు ప్రభుత్వ ఆసుపత్రులకు ఆక్సిజన్ సరఫరా చేసేందుకు టెండర్లు పిలవకుండానే అగ్రిమెంట్ చేశారు. అందులో భాగంగానే 2021లోనే రిమ్స్కూ ఆక్సిజన్ సరఫరా చేయాలని శ్రీ భారత్ సంస్థను అధికారులు కోరారు. అప్పట్లో సిలిండర్ల సరఫరా చేయలేయమని శ్రీ భారత్ సంస్థ చేతులెత్తేసింది. దీంతో వారాశికే ప్రభుత్వం ఆక్సిజన్ సిలిండర్ల కాంట్రాక్ట్ను పొడిగించింది. మళ్లీ శ్రీ భారత్ ఫార్మాకే... తాజాగా రిమ్స్కు ఆక్సిజన్ సరఫరా చేసే కాంట్రాక్ట్ను శ్రీ భారత్ ఫార్మా వారికి కట్టబెట్టారు. కాగా ఆక్సిజన్ సిలిండర్ల సరఫరా సక్రమంగా చేయకపోవడం వల్ల 23 మంది ప్రాణాలు కోల్పోయారని తిరుపతిలో రుయా హాస్పిటల్ అధికారులు శ్రీ భారత్ ఫార్మాపై ఫిర్యాదు చేశారు. 2021 జూలై 23న ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పట్లో అలిపిరి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. అలాంటి సంస్థకే కడప రిమ్స్ అధికారులు ఆక్సిజన్ సరఫరా కాంట్రాక్ట్ను కట్టబెట్టడాన్ని పరిశీలకులు తప్పుబడుతున్నారు. కాంట్రాక్ట్ మధ్యలో 2020 నుంచి 2025 వరకు ఐదేళ్లపాటు సరఫరా చేయలేని సంస్థకు కాంట్రాక్టు ఇవ్వడం ఎంతవరకు సమంజసమని పరిశీలకులు ప్రశ్నిస్తున్నారు. పైగా దక్షిణ భారతదేశంలోనే ఎక్కువ రేటుతో ఆక్సిజన్ను సరఫరా చేసే ఏకై క సంస్థ శ్రీ భారత్ ఫార్మా కంపెనీ కావడం గమనార్హం. మరోవైపు శ్రీ భారత్ ఫార్మా కంపెనీ ఏజెన్సీ విధానాలపై, కర్నూలు అనంతపురం జీజీహెచ్లలో జరుగుతున్న అవకతవకలపై ఇప్పటికే విజిలెన్స్ కమిటీతో విచారణ చేయా లని మంత్రి టీజీ భరత్ డిమాండ్ చేయడం గమనార్హం. అవినీతి ఆరోపణలు, కేసులు నమోదైన సంస్థకు, ఎక్కువ ధరకు మరోసారి రెన్యువల్ చేయడం వెనక మతలబు దాగి ఉందని పలువురు ఆరోపిస్తున్నారు. కడప రిమ్స్ లో’ ఆక్సిజన్ సరఫరా’కాంట్రాక్ట్ వ్యవహారంలో ’గోల్ మాల్ ’! అధికార దర్పంతో అగ్రిమెంట్ రద్దుచేసి.. ఆపై మరో సంస్థకు కట్టబెట్టిన వైనం అగ్రిమెంట్ దక్కించుకున్న ఏజెన్సీపై పలు ఆరోపణలు, కేసులు నమోదు -
కబ్జాకు గురైన భూముల పరిశీలన
ఓబులవారిపల్లె : బాలిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలోని ప్రభుత్వ భూములను తహసీల్దార్ యామినిరెడ్డి మంగళవారం పరిశీలించారు. బాలిరెడ్డిపల్లి రెవెన్యూ గ్రామ పరిధిలోని సర్వేనెంబర్లు 1293, 1294/1, 1295/1, 2,3,4,5లలో దాదాపు వంద ఎకరాల ప్రభుత్వ భూమి కబ్జాకు గురైందని సీపీఐ నాయకులు పలుమార్లు తహసీల్దార్ యామినీ రెడ్డికి ఫిర్యాదు చేశారు. స్పందించిన తహసీల్దార్ మంగళవారం బాలిరెడ్డిపల్లి రెవెన్యూ పరిధిలో భూములు, వై.కోట 1155 సర్వే నెంబర్లు దాదాపు 222 ఎకరాల ప్రభుత్వ భూమిని ఆమె పరిశీలించారు. పూర్తిస్థాయిలో రికార్డులు పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదికలు అందిస్తామని తహసీల్దార్ పేర్కొన్నారు. బీకేఎన్యూ అన్నమయ్య జిల్లా అధ్యక్షులు పండుగోల మణి మాట్లాడుతూ 15 రోజులలోగా భూ కబ్జాలను అరికట్టి దళిత గిరిజనులకు పంపిణీ చేయాలని లేనిపక్షంలో భూ పోరాటం చేస్తామన్నారు. కార్యక్రమంలో ఎస్ఐ మహేష్, ఆర్ఐ మల్లికార్జున రెడ్డి, సర్వేయర్ నాగలక్ష్మి, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి జ్యోతి చిన్నయ్య, మండల కార్యదర్శి చింతలపూడి నాగమ్మ, నియోజకవర్గ కార్యదర్శి ఎం.జయరామయ్య, మండల కార్యదర్శి మల్లిక, వెంకటరమణ, గోపాల్ పాల్గొన్నారు. -
పైసా వసూల్
ఓబులవారిపల్లె: ఏపీఎండీసీ లక్ష్యం నీరుగారుతోంది. ఉచిత విద్య కోసం స్థాపించిన పాఠశాలలో.. ఫీజులు వసూలు చేస్తుండటంతో ఆ సంస్థ ప్రతిష్ట మసకబారుతోంది. ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన మంగంపేట బైరెటీస్ గనుల విస్తరణలో భూములు, ఇళ్లు కోల్పోయిన నిర్వాసితులు, ఏపీఎండీసీలో పని చే స్తున్న ఉద్యోగుల పిల్లలకు ఉచిత విద్య అందించా లని సంకల్పించింది. ఇందుకోసం ఏపీఎండీసీ సీఎస్ఆర్ నిధులతో మంగంపేటలో ఉన్నత పాఠశాల ఏర్పాటు చేసింది. నిర్వహణకు గాను ఏటా 2.5 కోట్ల రూపాయలు చెల్లిస్తోంది. ఉపాధ్యాయులు, ఇతర ఆఫీసు ఖర్చులకు ప్రతి నెల 22 లక్షల రూపాయలు ఇస్తోంది. అయితే పాఠశాల నిర్వాహకులు విద్యార్థుల నుంచి ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. దీంతో ఉచితం కాస్తా ఖరీదుగా మారింది. దీనిపై ఏపీఎండీసీ యాజమాన్యం కూడా స్పష్టమైన ప్రకటన చేయకపోవడంతో.. విద్యార్థుల తల్లిదండ్రులు అయోమయంలో పడ్డారు. రూ.3 వేల ఫీజు పెంపు ప్రతి విద్యార్థి నుంచి ఏటా ఫీజుల రూపంలో డబ్బులు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది రూ.3 వేలు పెంచి వసూలు చేస్తున్నారు. ఇవ్వలేని వారిపై ఉపాధ్యాయుల ద్వారా ఒత్తిడి తీసుకువస్తున్నారు. గతేడాది 6వ తరగతి విద్యార్థికి రూ.9,500 ఫీజు ఉండగా.. ఈ ఏడాది రూ.12500 చెల్లించాలని డిమాండ్ చేస్తున్నారు. వ్యాన్ ఫీజు అని టీచర్లు చెబుతున్నారు. పాఠశాలలో 1150 మంది విద్యార్థులు ఉండగా.. వారి నుంచి మొత్తం రూ. 34 లక్షల 50 వేలు వసూలు చేస్తున్నారు. అన్నింటికి ఏపీఎండీసీ నిధులు ఇస్తుంటే.. నిర్వాహకులు డబ్బులు వసూలు చేయడం ఏమిటని విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశ్నిస్తున్నారు. విచారణ చేసి నిగ్గు తేల్చాలి బస్సులు, డ్రైవర్లు, నాన్టీచింగ్ స్టాఫ్ జీతాలు, మధ్యాహ్న భోజనం తదితరాలకు ఏపీఎండీసీ ప్రతి నెల రూ.22 లక్షలు చొప్పున ఏడాదికి 2.5 కోట్ల రూపాయలు యాజమాన్యానికి చెల్లిస్తోంది. ‘ఈ మొత్తాన్ని వారు ఎక్కడ ఖర్చు చేస్తున్నారు. తప్పుడు లెక్కలతో స్వాహా చేస్తున్నారు’ అని స్థానిక ప్రజలు ఆరోపిస్తున్నారు. మళ్లీ విద్యార్థుల నుంచి డబ్బు వసూలు చేసి, ఎక్కడికి పంపిస్తున్నారని వారు ప్రశ్నిస్తున్నారు. ఇంటర్, డిగ్రీ చేసిన వారిని ఉపాధ్యాయులుగా నియమించి, తక్కువ జీతాలు చెల్లిస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయంటున్నారు. పూర్తి స్థాయిలో విచారణ చేసి.. నిజాలు వెలుగులోకి తీసుకురావాలని కోరుతున్నారు. హెడ్ ఆఫీస్ ఆదేశాల మేరకే పెంపు ఏపీఎండీసీ హెడ్ ఆఫీసు నుంచి సర్కులర్ రావడంతో ఫీజులు పెంచడం జరిగింది. ఈ విషయాన్ని పెరేంట్స్ మీటింగ్లో చెప్పాం. రూ.2 వేలు స్కూల్కు, వెయ్యి రూపాయలు బస్సుకు మొత్తం రూ.3 వేలు పెంచాం. పాఠశాల ప్రారంభమై ఎనిమిదేళ్లు అయిన సందర్భంగా యాజమాన్యం ఫీజులు పెంచింది. – రేవతి, హెడ్ టీచర్, ఏపీఎండీసీ పాఠశాల ఉచితంగా విద్య అందించాలి గనుల విస్తరణలో ఇళ్లు, భూములు కోల్పోయిన నిర్వాసితుల పిల్లలకు ఏపీఎండీసీ పాఠశాలలో ఉచితంగా విద్య అందించాలి. ఫీజులు ఎందుకు వసూలు చేస్తున్నారు. ఈ ఏడాది మళ్లీ ఫీజులు పెంచారు. ప్రైవేటు పాఠశాలలు, దీనికి తేడా లేకుండా పోతోంది. ఇలా అయితే నిర్వాసితులు పిల్లలను చదివించడం కష్టం అవుతుంది. –హరిబాబు, ఏపీటీసీ మంగంపేట ఓబులవారిపల్లె ఉచిత విద్య కోసం పాఠశాల స్థాపన ఫీజు పెంపు పేరిట వసూళ్లు -
దీపం.. విభిన్న రూపం!
రాజంపేట టౌన్ : మరో వారం రోజుల్లో వెలుగులు వెదజల్లే దీపావళి పండుగ రానుంది. ఒకప్పుడు దీపావళి అనగానే అందరికి ఠక్కున గుర్తుకు వచ్చేది టపాసులు మాత్రమే. ఇంకా చెప్పాలంటే దీపావళి పండుగకు నెలరోజుల ముందు నుంచే చిన్న పిల్లలు చిన్నచిన్న టపాసులు కొనుగోలు చేసి కాల్చుతుండేవారు. అందువల్ల నె నెల రోజుల పాటు ఎక్కడో ఒక చోట టపాసుల శబ్దం వినిస్తూ ఉండేది. అయితే ఇప్పుడు కాలానుగుణంగా వచ్చిన మార్పుల వల్ల ప్రజల ఆలోచనా విధానం మారింది. దీనికి తోడు టపాసులు కాల్చడం వల్ల శబ్ద కాలుష్యంతో పాటు పర్యావరణానికి ముప్పు వాటిల్లుతుందన్న భావన ప్రజల్లో వ్యక్తమవుతోంది. ఈ కారణంగా ప్రజలు టపాసులను కాల్చడం చాలా వరకు తగ్గించారనే చెప్పాలి. కేవలం దీపావళి రోజు మాత్రమే పిల్లల ఆనందం కోసం ప్రజలు టపాసులు కాల్చుతున్నారు. పర్యావరణ ప్రేమికులతో పాటు అనేక మంది విద్యావంతులు దీపావళి పండుగ రోజు కూడా టపాసులకు దూరంగా ఉంటున్నారంటే అతిశయోక్తి కాదనే చెప్పాలి. దీపాలతోనే దివాళీ.. టపాసులు కాల్చడం వల్ల కలిగే అనర్థాల గురించి తెలిసిన వారు దీపాలతోనే దివాళీ వేడుకలను జరుపుకుంటున్నారు. ఇక మహిళలు దీపాలకు అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నారు. అందువల్ల వ్యాపారులు సంస్కృతి, సంప్రదాయాలు ప్రతిబింబించేలా ఆధునికతను, సాంకేతికతను కలబోస్తూ నేటి తరానికి నచ్చే రీతిలో అనేక డిజైన్లలో ఈ ఏడాది కూడా దీపాలను అందుబాటులోకి తీసుకొచ్చారు. పండుగ సమీపిస్తుండటంతో ఉమ్మడి కడప జిల్లా వ్యాప్తంగా దివ్వెల విక్రయ దుకాణాలు ఒక్కొక్కటిగా వెలుస్తున్నాయి. స్టేటస్కు తగ్గట్లుగా.. ప్రస్తుతం ఆధునికత కొత్త పుంతలు తొక్కుతోంది. అందువల్ల నూతనంగా ఇళ్లు నిర్మించుకున్న వారు, పాత ఇళ్లను రీమోడల్ చేసుకున్నవారు వారి ఆర్థిక స్థోమతను బట్టి ఇళ్లను సర్వాంగ సుందరంగా తీర్చుదిద్దుకుంటున్నారు. దీపావళి సందర్భంగా ఇంటి ముంగిట ఏర్పాటు చేసే దీపాలను తమ స్టేటస్కు తగ్గట్లు ఉండేలా ఆకర్షణీయమైన వాటిని కొనుగోలు చేసేందుకు ఆసక్తి చూపుతున్నారు. వ్యాపారులు కూడా ప్రజల అభిరుచికి అనుగుణంగా దీపాలను అందుబాటులో ఉంచారు. దీంతో మహిళలు తమ ఇంటి ముంగిట ఆకర్షణీయంగా ఉండే ప్రమిదలలో దీపాలను వెలిగించేందుకు మక్కువ చూపుతున్నారు. ఈ కారణంగా కొంత మంది కాస్త ఖరీదైనా సరే ఆకర్షణీయంగా ఉండే వైరెటీ దీపాలను కొనుగోలు చేసేందుకు ఇష్టపడుతున్నట్లు వ్యాపారులు చెబుతున్నారు. ఒకప్పుడు మట్టిదీపాలు మాత్రమే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు మట్టి ప్రమిదలతో పాటు వివిధ రకాల మోడల్స్లో పింగాణి దీపాలు అందుబాటులో ఉన్నాయి. ఒక్కొక్క దీపం రూ.5 నుంచి రూ.200 వరకు ధర పలుకుతుంది. దీనికితోడు దీపావళి రోజు లక్ష్మీపూజ ఎంతో ప్రత్యేకమైనది. అందువల్ల వ్యాపారులు లక్ష్మీదేవి ప్రతిమలను కూడా అందుబాటులో ఉంచారు. దీపావళికి దివ్వెలు సిద్ధం ఆకట్టుకుంటున్న ప్రమిదలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా దివ్వెల విక్రయాల దుకాణాలుఆకర్షణీయమైన దివ్వెలతో మరింత శోభ.. ఒకప్పుడు చిన్న మట్టి ప్రమిదలే అందుబాటులో ఉండేవి. అయితే ఇప్పుడు వివిధ మోడల్స్లో ఎంతో ఆకర్షణీయంగా ఉండే దివ్వెలు అందుబాటులోకి వచ్చాయి. ఇంటి ముంగిట ఆకర్షణీయమైన డిజైన్లలో ఉండే దివ్వెల్లో దీపాలను వెలిగిస్తే ఇళ్లు మరింత ఆకర్షణీయంగా మెరిసిపోతాయి. – జి.మోహనవల్లీ, లెక్చరర్, ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాల, మదనపల్లెహరిత దీపావళిని జరుపుకోవాలి.. దీపావళి సందర్భంగా టపాసులు కాల్చడం వల్ల పర్యావరణం దెబ్బతింటుంది. అందువల్ల దీపావళి పండుగను దివ్వెలు వెలిగించి జరుపుకుంటే పర్యావరణానికి ఎంతో శ్రేయస్కరం. ప్రతి ఒక్కరు హరిత దీపావళిని జరుపుకోవాలి. టపాసులు కాల్చడం ద్వారా వచ్చే అధిక శబ్దాల కారణంగా కర్ణభేరి దెబ్బతిని వినికిడి లోపం వస్తుంది. అలాగే గుండెకు సంబంధించిన జబ్బులు ఉన్న వారికి గుండెపోటు కూడా వచ్చే ప్రమాదం ఉంది. – జి.చక్రధర్రాజు, నేషనల్ గ్రీన్కోర్ రీజనల్ కో–ఆర్డినేటర్ -
డివైడర్ను ఢీకొని యువకుడి మృతి
మదనపల్లె రూరల్ : బైక్ను వేగంగా నడుపుతూ, వాహనాన్ని అదుపుచేయలేక, డివైడర్ను ఢీకొని యువకుడు మృతి చెందిన ఘటన ఆదివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. కోళ్లబైలు పంచాయతీ ఇందిరమ్మకాలనీలో నివాసం ఉంటున్న పవన్కుమార్, పల్లవి దంపతుల కుమారుడు మల్లెపూల అజయ్దేవా(19) స్థానికంగా ఫ్లిఫ్కార్ట్లో డెలివరీ బాయ్గా పనిచేస్తున్నాడు. ఆదివారం రాత్రి 10 గంటల సమయంలో డెలివరీ అమౌంట్ను ఆఫీసులో చెల్లించి వస్తానని చెప్పి ఏపీ–40 హెచ్ఎం–5403 యమహా–ఆర్ 15 బైక్లో బయలుదేరి వెళ్లాడు. అమ్మచెరువుమిట్ట ఆంజనేయస్వామి గుడి సమీపంలోని మలుపు వద్ద రోడ్డుపై మట్టి ఉండటంతో బైక్ జారి అదుపుతప్పి డివైడర్ను వేగంగా ఢీకొన్నాడు. ప్రమాదంలో తలకు, శరీరంపై తీవ్ర గాయాలు కావడంతో అపస్మారకస్థితికి వెళ్లాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తుండగా పరిస్థితి విషమించి మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. మృతుడి తండ్రి పవన్కుమార్ ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ మహమ్మద్ రఫీ తెలిపారు. -
రహదారికి అడ్డంగా ప్రహరీ
● రాజంపేటలో టీడీపీ నేతల దౌర్జన్యం ● ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఫిర్యాదురాజంపేట రూరల్ : తమ ప్రభుత్వం అధికారంలో ఉందని.. తాము ఏ దారుణానికై నా ఒడిగడతామనే రీతిలో పలువురు కూటమి నేతలు వ్యవహరిస్తున్నారు. అందుకు నిదర్శనమే ఈ సంఘటన. రాజంపేట పట్టణంలోని కృష్ణానగర్లో నివాస గృహాలకు అడ్డంగా ప్రహరీ నిర్మించి వారికి ఇంట్లోకి వెళ్లేందుకు దారి లేకుండా చేశారు. దీనిపై స్థానికులు సోమవారం సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో ఏఓ బి. శ్రీధర్రావుకు ఫిర్యాదు చేశారు. వివరాలిలా.. 40 ఏళ్ల క్రితం వంకన సావిత్రమ్మ వద్ద సర్వే నెంబర్ 640లో గుణకల సుబ్బరాయుడు సతీమణి రామలక్ష్మితో పాటు మరో 10 మంది కలిసి దాదాపు 2 ఎకరాల స్థలం కొనుగోలు చేశారు. నాడు రాకపోకలకు గాను స్థలం వదులుకొని గృహాలను నిర్మించుకున్నారు. 1999లో గుణకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో రహదారి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే అది తమ స్థలం అని గుత్తా చెంగయ్యనాయుడు రహదారిని నిర్మిస్తున్న కాంట్రాక్టర్ మీద పిటీషన్ వేశారు. ఓఎస్ నెంబర్ 1999 జూలై 30న నందలూరు జడ్జి రహదారి నిర్మాణానికి అనుమతులు ఇచ్చినట్లు గుణకల సుబ్బరాయుడు తెలిపారు. అప్పటి నుంచి రహదారి నిర్మాణం చేపట్టినప్పుడల్లా గుత్తా చెంగయ్యనాయుడు కుటుంబీకులు అడ్డగిస్తూనే వస్తున్నారు. గతంలో పనిచేసిన తహసీల్దార్లు గుణ భూషణ్రెడ్డి, చంద్రశేఖర్రెడ్డిలు రహదారి నిర్మాణం చేసుకోవచ్చని అనుమతులు ఇచ్చినట్లు సుబ్బరాయుడు పేర్కొన్నారు. అలాగే అప్పటి రాజంపేట సబ్ కలెక్టర్ పద్మజ కూడా దగ్గరుండి రహదారి స్థలానికి కొలతలు వేయించి హద్దులు చూపుతూ నెంబర్ రాళ్లను నాటించారు. అయితే వాటిని గుత్తా కుటుంబీకులు వారం క్రితం పట్టపగలు జేసీబీతో తొలగించి తీసుకెళ్లినట్లు స్థానికులు తెలుపుతున్నారు. దీనిపై రెండు వారాల క్రితం గుణకల సుబ్బరాయుడు ఆధ్వర్యంలో స్థానికులు సబ్ కలెక్టర్ భావనను కలిసి తమ సమస్యను వివరించారు. దీంతో ఆమె చలానా కడితే మీ రెండు ఎకరాల స్థలానికి హద్దులు చూపిస్తానని తెలిపారు. అయితే సబ్ కలెక్టర్ సెలవులో వెళ్లిన విషయం పసిగట్టిన ఓ ఎన్ఆర్ఐ టీడీపీ నేత చకచకా చక్రం తిప్పి అటు రెవెన్యూ అధికారులు, ఇటు పోలీస్ యంత్రాంగంతో మంత్రాంగం నడిపి ప్రహరీ నిర్మాణానికి ఎలాంటి అడ్డంకులు లేకుండా చేశారు. తమ ఇళ్లకు వెళ్లేందుకు దారి లేకుండా దౌర్జన్యంగా ప్రహరీ నిర్మించిన వారిపై చర్యలు తీసుకుని తమకు రహదారి ఏర్పాటు చేయాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు సోమవారం ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కృష్ణా నగర్ వాసులు ఫిర్యాదు చేశారు. -
మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ స్థాయి పురస్కారం
రామాపురం : ప్రకృతి వ్యవసాయంలో విశేష విజయాలు నమోదు చేసుకున్న రామాపురం మండలం నల్లగుట్టపల్లెకు చెందిన మహిళా రైతు సూరం శ్రీదేవికి జాతీయ పురస్కారం లభించింది.దీనదయాల్ అంత్యోదయ యోజన–నేషనల్ రూరల్ హుడ్స్ మిషన్ ఆధ్వర్యంలో దిల్లీలో ఇటీవల నిర్వహించిన కార్యక్రమంలో ప్రధాని నరేంద్రమోదీ చేతుల మీదుగా ఆమె ఈ పురస్కారం అందుకున్నారు. ప్రకృతి వ్యవసాయం విభాగం జిల్లా ప్రాజెక్టు డైరెక్టర్ శ్రీనివాస్ కుమార్, వెంకట మోహన్, పలువురు గ్రామీణ అభివృద్ధి అధికారులు శ్రీదేవిని అభినందించారు. సోమవారం రామాపురం ఆర్బీకేలో జరిగిన అభినందన సభలో మార్కెట్ కమిటీ చైర్మన్ షఫీ నాయక్, మాజీ చైర్మన్ రమేష్ రెడ్డిలు శ్రీదేవిని సన్మానించారు. మండల వ్యవసాయ అధికారి నాగమణి, ప్రకృతి వ్యవసాయ మండల మాస్టర్ ట్రైనర్ మధుకర్, మోడల్ మేకర్ సదాశివరెడ్డి, సూరం వెంకటరామిరెడ్డి, సుధాకర్, కదిరినిషా పాల్గొన్నారు. -
అడవిలో తమ్ముళ్ల మట్టిదందా
సాక్షి టాస్క్ ఫోర్స్ : కూటమి నాయకుల అక్రమాలు, ఆగడాలకు అంతులేకుండా పోతోంది. కొండలు గుట్టలు చదును చేసి సొమ్ము చేసుకున్న తెలుగు తమ్ముళ్లు... తాజాగా అడవుల్లోని మట్టిని కూడా తవ్వేస్తున్నారు. రాజంపేట మండల పరిధిలోని కోనరాజు పల్లి పంచాయతీ అడవి ప్రాంతంలో అనుమతి లేకుండా మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు ఒక జెసీబీని అటవీశాఖ అధికారులు పట్టుకున్నారు. అడవిలో తవ్వకాల వెనుక అసలు సంగతి ఏంటంటే..... తలసాని కుంటలో పంట పొలాలకు వేసుకునేందుకు మట్టిని తవ్వేందుకు ఇరిగేషన్ అధికారులు అనుమతులు ఇచ్చారు. దీన్ని సాకుగా చూపి అనుమతులు ఇచ్చిన చోటు కాకుండా అడవిలో తవ్వకాలు జరిపారు. దీంతో గ్రామస్తులు ఫారెస్ట్ అధికారులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న సిబ్బంది అటవీ ప్రాంతంలోని మట్టిని తవ్వినట్లు నిర్ధారించుకున్నారు. మట్టిని తరలిస్తున్న రెండు టిప్పర్లు, జేసీబీ సీజ్ చేశారు. విషయాన్ని కడపలోని ఎఫ్ఆర్ఓ సుబ్బయ్య దృష్టికి తీసుకెళ్లారు. మట్టిని తరలిస్తున్న వ్యక్తులు కూటమి నాయకులు కావడంతో, రాజంపేట అధికార పార్టీకి చెందిన ముఖ్య నేత నుంచి వాహనాలు వదిలేయాల్సిందిగా ఫారెస్ట్ అధికారులపై ఒత్తిడి వచ్చింది. దీంతో పట్టుకున్న వాహనాలకు 40 వేల జరిమానా విధించి విడిచిపెట్టారు. అనుమతులు లేకుండా మట్టి తవ్వకాలు జరిపిన తమ్ముళ్లపై చర్యలు తీసుకోకుండా వాహనాలకు జరిమానా విధించి వదిలేయడంపై ప్రజలు గుసగుసలాడుకుంటున్నారు. -
అటవీభూమిలో నిర్మాణం అడ్డగింత
మదనపల్లె రూరల్ : అటవీ భూమిలో కొందరు వ్యక్తులు దర్గా నిర్మిస్తున్నామంటూ పనులు ప్రారంభించడంతో సోమవారం రాత్రి మదనపల్లె మండలం చీకలబైలులో ఉద్రిక్తత నెలకొంది. ఫారెస్టు, పోలీసు అధికారులు సంఘటనా స్థలానికి చేరుకుని అక్రమ నిర్మాణాలను అడ్డుకుని పరిస్థితి అదుపులోకి తెచ్చారు. మదనపల్లె మండలం చీకలబైలు గ్రామం, దొనబైలు దారిలోని పులిమానువంకవద్దనున్న అటవీభూముల్లో బండవద్దకు పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీ, కర్ణాటక రాష్ట్రం ముల్బాగల్కు చెందిన కొంత మంది మహిళలు, పది మంది పురుషులతో వాహనంలో అక్కడికి చేరుకున్నారు. పూజలుచేసి దర్గా నిర్మాణానికి పనులు ప్రారంభించారు. అయితే స్థానికులు పూజలు చేసుకుంటున్నారని భావించారు. అక్కడికి వెళ్లిన ఓ మహిళతో వారు ఇక నుంచి మీరు ఇక్కడ దుస్తులు ఉతకరాదని, ఈ ప్రదేశంలో దర్గా నిర్మాణం చేస్తున్నామంటూ చెప్పారు. ఈ విషయం తెలుసుకున్న ఎగువపల్లె, చీకలబైలు, జమ్మికుంటపల్లె, దిగువపల్లె ప్రజలు చీకటి పడుతుండగా అక్కడికి పెద్ద ఎత్తున చేరుకున్నారు. పనులను అడ్డుకునేందుకు ప్రయత్నించారు. అయితే తమకు దర్గా నిర్మాణానికి అనుమతులు ఉన్నాయంటూ చెప్పడంతో తీవ్ర ఉద్రిక్తత ఏర్పడింది. దీంతో స్థానికులు ఫారెస్టు ,తాలూకా పోలీసులకు సమాచారం తెలియజేశారు. ఫారెస్టు రేంజర్ జయప్రసాదరావు, ఫారెస్టు బీట్ ఆఫీసర్ ఉమాదేవి , తాలూకా ఎస్.ఐ చంద్రమోహన్, సిబ్బందితో కలిసి సంఘటన స్థలానికి చేరుకున్నారు. నిర్మాణ సామగ్రిని, దర్గా నిర్మాణపనులుకు వచ్చి వ్యక్తులను, వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. గుమికూడిన స్థానికులను అక్కడి నుంచి పంపివేశారు. సాయంత్రం నుంచి రాత్రి 9.30 గంటల వరకు పోలీసులు అక్కడే పహారా కాశారు. చీకలబైలుకు చెందిన శ్రీనివాసులు, నాగమ్మ అనే వ్యక్తులకు సంబంధించి ఆరోగ్యం మెరుగుపడటానికి పూజలు చేసే పేరుతో ఇక్కడికి వచ్చినట్లు స్థానికులు తెలిపారు. ఈ విషయమై చుట్టుపక్కల గ్రామస్తులు మంగళవారం ఉదయం మరోసారి సమావేశం కానుననట్లు తెలుస్తోంది. -
నేతన్నకు ఉత్తుత్తి విద్యుత్!
మదనపల్లె సిటీ: నేత కార్మికులకు ఉచిత విద్యుత్ జీఓ ఇచ్చి ఆరు నెలలు గడిచింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేనేతమగ్గాలు, పవర్లూమ్స్కు మంచి రోజులు వస్తాయని ఆశించారు. ప్రభుత్వం కొలువుదీరి ఏడాదిన్నర కావస్తున్నా విద్యుత్ బాదుడు కొనసాగుతూనే ఉంది. కంటి తుడువుగా జీవో ఇచ్చి చేతులు దులుపుకోవడంతో నేతన్నలు మండిపడుతున్నారు. ● ఉచిత విద్యుత్ జీఓతో తమ కుటుంబాలకు కొంతైనా ఆర్థికభారం తగ్గుతుందనుకున్న నేతన్న జీవితాల్లో నిరాశే మిగిలింది. వ్యవసాయం తర్వాత చేనేతరంగం అతి పెద్ద ఉపాధిరంగం. ఇంతటి ప్రాముఖ్యత కలిగిన ఈ రంగం ప్రస్తుతం దయనీయ పరిస్థితి ఎదుర్కొంటోంది. జిల్లా వ్యాప్తంగా 20 వేల కుటుంబాలు చేనేత రంగంపై ఆధారపడి ఉన్నాయి. మదనపల్లె (నీరుగట్టువారిపల్లె)లో సుమారు 12 వేల కుటుంబాలు ఉన్నాయి. ఇక్కడ ఎనిమిది వేలకుపైగా చేతి మగ్గాలు, మూడు వేలకుపైగా పవర్లూమ్స్ ఉన్నాయి. కలకడ, తంబళ్లపల్లె, నిమ్మనపల్లె, వాల్మీకిపురం, కురబలకోట, బి.కొత్తకోట, పుల్లంపేట, చిన్నమండ్యం, గాలివీడు,సుండుపల్లి, రాజంపేట, వీరబల్లి మండలాల్లో చేనేత కుటుంబాలు ఉన్నాయి. ఈ ప్రాంతంలో చేనేత మగ్గాల ధ్వని వినిపించడం తగ్గిపోతోంది. ఇందుకు వివిధ సుంకాల పేరిట పెరిగిన విద్యుత్ చార్జీలే ప్రధాన కారణం. గత మార్చి 26వ తేదీన ప్రభుత్వం విడుదల చేసిన ఉచిత విద్యుత్ జీవో నంబర్ 44 ఆరు నెలలు పూర్తయినా అమలు కాకపోవడంతో నేతన్నలు ఆందోళన చెందుతున్నారు. జాతీయ చేనేత దినోత్సవం రోజున కూటమి ప్రభుత్వం ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. అయినప్పటికీ ఇది అమలు కావడం లేదు జీవో అమలులో నిర్లక్ష్యం అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వంపై ఉచిత విద్యుత్ హామీని నెరవేర్చాలంటూ వైఎస్సార్సీపీ నాయకులు ఒత్తిడి తీసుకువచ్చారు.దీంతో దిగివచ్చిన ప్రభుత్వం ఈ ఏడాది మార్చి 28వతేదీన జీవో –44 విడుదల చేసింది. వాస్తవ సంఖ్య, చేతి మగ్గాలు, పవర్లూమ్స్ యూనిట్ల సంఖ్యను గణనీయంగా తగ్గించి జీవోను విడుదల చేసింది. చేనేత కుటుంబాలకు నెలకు రూ.200 యూనిట్లు, పవర్ లూమ్స్ యూనిట్లకు నెలకు 500 యూనిట్ల ఉచిత విద్యుత్ అందించనున్నట్లు జీవోలో స్పష్టం చేశారు. అయితే ఆగస్టు 7 న జాతీయ చేనేత దినోత్సవం రోజున ఉచిత విద్యుత్ పథకం అమలు చేస్తున్నట్లు ప్రకటించారు. ఇప్పటికీ అమలుకు నోచుకోకపోవడం గమనార్హం. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం నేతన్న నేస్తం పథకం ద్వారా మగ్గం కలిగిన ప్రతి నేతన్నకు ఏడాదికి రూ.24 వేలు ఆర్థిక సహాయం అందించింది.జిల్లాలో 2021లో రూ.14,00, 88,000, 2022లో రూ.14,68,32,000, 2023లో రూ.16,64,88,000 నేతన్న నేస్తం కింద అందించారు. జీవో నంబర్ 44ను వెంటనే అమలు చేయాలి. రాష్ట్ర బడ్జెట్ నుంచి 10 శాతం 3,000 కోట్లు కేటాయించాలి నేతన్న నేస్తం పథకాన్ని అమలు చేయాలి. నూలు,సిల్క్లకు 50 శాతం రాయితీ ఇవ్వాలి చేనేత కుటుంబాలకు రూ.5 లక్షల వరకు వడ్డీ లేని రుణాలు ఇవ్వాలి గృహం, వర్క్షెడ్ పథకాన్ని అమలు చేయాలి. జీవిత బీమా సంస్థ, కేంద్ర,రాష్ట్ర ప్ర భుత్వాలు సంయుక్తంగా అమలు చే సిన బీమా పథకాన్ని కొనసాగించాలి. ఆత్మహత్యలు చేసుకున్న చేనేత కార్మికులకు రూ.7లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలి. ఉచిత విద్యుత్ హామీప్రకటనలకే పరిమితం అమలుపై మీనమేషాలులెక్కిస్తున్న కూటమి ప్రభుత్వం జీవో ఇచ్చారు.. మరిచిపోయారు ఉచిత విద్యుత్ పేరిట జీఓ ఇచ్చి అమలు చేయకపోవడం దారుణం. పెరిగిన విద్యుత్ చార్జీలు చెల్లించలేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. మార్చి నెలలో జీఓ ఇచ్చారు. ఆగస్టులో అమలు చేస్తామని చెప్పారు. అక్టోబర్ వచ్చినా బిల్లులు చేతికిస్తున్నారు. –జీ.సుధాకర్, నేత కార్మికుడు, నీరుగట్టువారిపల్లె(మదనపల్లె) ఉచిత విద్యుత్ పథకం అమలు చేయాలి చేనేత కార్మికులకు ఉచిత విద్యుత్ పథకం వెంటనే అమలు చేయాలి. ఆగస్టునెల నుంచి అమలు చేస్తామని ప్రకటించారు. బిల్లులు మాత్రం ఇస్తున్నారు. దీనిపై చేనేత కార్మిక సంఘాలతో కలిసి ఆందోళనలు చేస్తాం. ప్రభుత్వం వెంటనే దీనిని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలి. –శీలం రమేష్, వైఎస్సార్పీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షులు -
ఒకే పాఠశాలలో టీచర్లుగా చేరిన అక్కాచెల్లెలు
మదనపల్లె సిటీ : డీఎస్సీలో ఎంపికై న అక్కాచెల్లెలు ఒకే పాఠశాలలో చేరిన అరుదైన సంఘటన ఇది. ములకలచెరువు మండలం బత్తాలాపురానికి చెందిన చంద్రమోహన్, సత్యవతి కుమార్తెలు జల్లా శ్రీలత, జల్లా హేమలతలు మెగా డీఎస్సీ రాశారు. ప్రతిభ కనబరిచి ఇద్దరు ఎంపికయ్యారు. కౌన్సెలింగ్లో మదనపల్లె హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాలను ఎంపిక చేసుకున్నారు. సోమవారం వీరిద్దరు పాఠశాలలో ఎస్ఏలుగా విధుల్లో చేరారు. వీరికి పాఠశాల హెచ్ఎం,ఉపాధ్యాయులు, యూటీఎఫ్ నాయకులు ఎగివింటి సుధాకర్, బెల్లం సుధాకర్, జయరాం, బార్గవి,శోభారాణి తదితరులు స్వాగతం పలికారు. బాధితులకు న్యాయం చేయాలి రాయచోటి : ప్రజల సమస్యలను తక్షణమే పరిష్కరించడంలో అధికారులు ఏ మాత్రం అలస త్వం వహించకుండా చట్టపరిధిలో బాధితులకు సత్వర న్యాయం అందించాలని జిల్లా అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి పేర్కొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమానికి ప్రజల నుంచి స్పందన లభించింది. అదనపు ఎస్పీ వచ్చిన ఫిర్యాదుదారులతో నేరుగా మాట్లాడారు. వారి నుంచి అర్జీలను స్వీకరించారు.సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. భూరీసర్వేపై అవగాహన కల్పించాలి సిద్దవటం : భూ రీసర్వే పట్ల ప్రజలకు అవగాహన కల్పించాలని విజయవాడ సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ డిప్యూటీ డైరెక్టర్ టి.శ్రీనివాసులురెడ్డి తెలిపారు.సోమవారం సిద్దవటం మండలంలోని కనుములోపల్లిలోని సర్వే నంబర్ 29, 30, 31లోని 12.05 ఎకరాల భూమిలో సర్వేయర్లు చేపట్టిన రీసర్వేను పరిశీలించారు. సంబంధిత రైతులు ప్రసాద్రెడ్డి, గౌస్బాషాలతో మాట్లాడారు. సర్వే సిబ్బంది రైతులకు నోటీసులు అందిస్తున్నారా అని అడిగి తెలుసుకున్నారు. కార్యక్రమంలో జిల్లా సర్వే ల్యాండ్ అధికారి ఎ.మురళీకృష్ణ, డిప్యూటీ ఇన్స్పెక్టర్ ఆఫ్ సర్వే శ్రీలత, పోరభాకర్, మండల సర్వేయర్ సోమశేఖర్, సచివాలయ సర్వేయర్లు హరినాథ్, గురుసాయి, రవితేజ, కారుణ్య తదితరులు పాల్గొన్నారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి భక్తి శ్రద్దలతో పల్లకీ సేవ నిర్వహించారు. సోమవారం రాత్రి స్వామి, అమ్మవారి మూల వి రాట్లకు ప్రధాన అర్చకులు శంకరయ్యస్వామి, కృష్ణయ్యస్వామి, శేఖర్ స్వాములు పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులను రంగు రంగుల పూలు, పట్టు వస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాఢవీధులలో, ఆలయ ప్రాంగణంలో ఊరేగించారు. ఆలయ ఈవో డివి రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించాలి: కలెక్టర్ రాయచోటి : ప్రజా సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో కలెక్టర్ అధ్యక్షతన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం నిర్వహించారు. ఇప్పటికే పెండింగ్లో ఉన్న బియాండ్ ఎస్ఎల్ఏ దరఖాస్తులపై వెంటనే చర్యలు తీసుకొని పరిష్కరించాలని కలెక్టర్ సూచించారు. జిల్లా నలుమూలల నుంచి తరలివచ్చిన బాధితులు కలెక్టర్, జేసీ, డీఆర్ఓలకు సమస్యలపై వినతిపత్రాలు సమర్పించారు. సమస్యలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులకు ఎండార్స్ చేస్తూ ఆదేశాలు జారీ చేశారు. అనంతరం జిల్లా రెవెన్యూ అధికారి మధుసూదనరావు, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, ఏడీ సర్వే భరత్ కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
108లో మహిళ ప్రసవం
నిమ్మనపల్లె : 108 వాహనంలో ఓ మహిళ పండంటి మగబిడ్డకు జన్మనిచ్చిన ఘటన ఆదివారం జరిగింది. మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ సోమానుపల్లెకు చెందిన గణేష్ భార్య వాణి(23) మూడో కాన్పులో భాగంగా ఆదివారం ఉదయం పురిటినొప్పులు అధికం కావడంతో కుటుంబసభ్యులు 108కు సమాచారం అందించారు. నిమ్మనపల్లె 108 అంబులెన్స్ వాహనంలో ఈఎంటీ రెడ్డి జశ్వంత్ పైలట్ సద్దాంతో కలిసి వారి ఇంటి వద్దకు చేరుకున్నారు. ఆమెను అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువస్తుండగా, మార్గంమధ్యలోని వశిష్ట స్కూల్ వద్ద 108లోనే పండంటి మగబిడ్డకు జన్మనిచ్చింది. తల్లీ బిడ్డ క్షేమంగా ఉన్నారు. ప్రసవానంతర చికిత్సల కోసం వారిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చేర్పించినట్లు ఈఎంటీ రెడ్డిజశ్వంత్ తెలిపారు. లోవోల్టేజీ సమస్య లేకుండా చర్యలు రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి నియోజకవర్గంలో లోవోల్టేజీ సమస్య లేకుండా తగు చర్యలు తీసుకుంటామని రాష్ట్ర రవాణా, క్రీడ, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం రాయచోటి పట్టణం చిత్తూరు రోడ్డులో గల విద్యుత్ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా నూతన సర్కిల్ ఆఫీస్ను ఆయన ప్రారంభించారు. మంత్రి మండిపల్లికి విద్యుత్ ఉద్యోగులు దుశ్శాలువా కప్పి, పుష్పగుచ్ఛం అందజేసి స్వాగతం పలికారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఏపీఐఐసీ డైరెక్టర్ కొండారెడ్డి భాస్కర్, విద్యుత్ శాఖ ఉద్యోగులు పాల్గొన్నారు. -
ప్రాణం తీసిన నిద్రమత్తు
ఆళ్లగడ్డ(నంద్యాల జిల్లా) : అతి వేగం, అపై నిద్రమత్తు ఒకరిని బలితీసుకుంది. కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై ఆళ్లగడ్డ పట్టణ పరిధిలోని గూబగుండం మెట్ట సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. ఆళ్లగడ్డ పట్టణ ఎస్ఐ జయన్న తెలిపిన వివరాల మేరకు.. వైఎస్సార్ జిల్లా కమలాపురానికి చెందిన పిచ్చిరెడ్డి తిరుపతిలోని ఓ కారు షో రూంలో సేల్స్ మేనేజర్గా పని చేస్తున్నాడు. హైదరాబాద్కు చెందిన ఓ వ్యక్తి కొత్త కారును కొనుగోలు చేయడంతో పిచ్చిరెడ్డి ఆ కారును డెలివరీ ఇచ్చేందుకు శనివారం అర్ధరాత్రి తర్వాత బయలుదేరాడు. మార్గంమధ్యలో కడప దగ్గర నంద్యాలకు వెళ్లేందుకు నజీర్ హుస్సేన్, శ్రీను అనే ఇద్దరు ప్రయాణికులను ఎక్కించుకున్నాడు. ఈ క్రమంలో ఆళ్లగడ్డ పట్టణ శివారులోని గూబగుండం మెట్ట సమీపంలోకి వచ్చే సరికి.. కారు నడుపుతున్న పిచ్చిరెడ్డి నిద్రమత్తులోకి జారుకోవడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనున్న చెట్టును ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో కారు ముందు సీటులో కూర్చున్న నజీర్హుస్సేన్ అక్కడికక్కడే మృతి చెందగా పిచ్చిరెడ్డి, శ్రీను తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని నంద్యాల వైద్యశాలకు తరలించారు. మృతి చెందిన నజీర్ హుస్సేన్ కడప వాసిగా గుర్తించినట్లు ఎస్ఐ తెలిపారు.రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం -
చారిత్రక బావి.. అభివృద్ధి చర్యలేవి?
ఆంధ్ర భద్రాద్రిగా విరాజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయం ఎంతో చారిత్రకత కలిగి, విశిష్టత ఉన్న దేవాలయం. త్రేతా యుగంలో మృకుండు మహర్షి, శృంగి మహర్షి శ్రీరాముడిని ప్రార్థించడంతో దుష్ట శిక్షణ కోసం.. సీతాలక్ష్మణ సమేతుడై అంబుల పొంది, పిడిబాకు, కోదండం పట్టుకుని ఆ ప్రాంతానికి వచ్చి యాగ రక్షణ చేశారని పురాణం చెబుతుంది. అందుకు ప్రతిగా ఆ మహర్షులు సీతారామలక్ష్మణుల విగ్రహాలను ఏకశిలగా చెక్కించారని, ఆ తరువాత జాంబవంతుడు ప్రాణప్రతిష్ఠ చేశారని ప్రజల విశ్వాసం. ఇక్కడ శ్రీరాముడు కొలువై ఉన్నారని ఎన్నో సందర్భాల్లో రుజువు అయింది. అలాంటిదే ఇమాంబేగ్ బావి కూడా. ఒంటిమిట్ట : కడపను పాలించిన అబ్దుల్ నబీఖాన్ ప్రతినిధిగా క్రీ.శ 1640లో ఇమాంబేగ్ పని చేశారు. ఈయన సిద్దవటం కోటకు వెళ్తూ, ఎండ తీవ్రంగా ఉండటంతో ఒంటిమిట్ట చెరువు సమీపానికి రాగానే.. తన గుర్రానికి చెరువు నీళ్లు తాగించి, తాను కూడా ఒంటిమిట్ట రామాలయం వసారాలలో సేదతీరాడు. ఆ సమయంలో అక్కడున్న వారు దేవుడు ఉన్నాడు, లేడని వాదోపవాదాలు చేసుకుంటున్నా రు. అది విన్న ఇమాంబేగ్ దేవస్థానం వాకిలి మూసిన తరువాత బయట నుంచి శ్రీరామచంద్రుని మహిమను స్వయంగా పరీక్షించాలని నిర్ణయించుకున్నాడు. అప్పుడు అక్కడ వాదోపవాదాలు చేస్తున్న వారితో ఇలా అన్నాడు. మీ దేవుడు పిలిచినా పలుకునా? అని ప్రశ్నించారు. దీనికి త్రికరణ శుద్ధిగా పిలిస్తే.. తప్పక పలుకునని వారు సమాధానమిచ్చారు. అప్పడు ఇమాంబేగ్ ఏకాంతంగా తలుపుల దగ్గరకు పోయి ఓ రామ! అని ఇస్లాంలో.. ● పరిత్యకుడైన సైతాన్ ప్రలోభముల నుంచి నన్ను రక్షించుము. ● పరమానుగ్రహ శోభితుడును ● ప్రభూ! వరమానుగ్రహ శోభితుడును, సర్వదయాయుడనై భగవంతుని నామంతో జగత్ ప్రభువును కరుణానుగ్రహ మూర్తియు న్యాయ నిర్ణయ దినస్వామియు అగు భగవంతుని స్తుతింతును. నిన్నే మేము పూజింతుము. నిన్నే మేము సాయం కొరకు అర్థింతుము, మాకు రుజు మార్గమును చూపుము అని ఓ రామా! ఓ రఘురామా! ఏకశిలానగరదామా! కోదండ రామా! అని మూడు సార్లు పిలిచాడు. మూడవ సారి అతనికి దివ్య మధురముగా ‘‘ఓఓఓ’’ అనే సమాధానం వినిపించింది. అది విన్న ఇమాంబేగ్ సంతోషంతో మోకరిల్లి అనంద భరితుడై వినయంగా శ్రీస్వామి వారి రూపాన్ని దర్శించి, ఆలయానికి ఆగ్నేయ దిశన బావిని తవ్వించారు. అభిషేకానికి నీరు సరఫరా అప్పటి నుంచి ఇప్పటి వరకు ప్రతి శుక్రవారం ముస్లింలు స్వామిని దర్శిస్తూ వారి కోరికలు సఫలీకృతం చేసుకుంటున్నారు. అంతే కాదు ఏకశిలపై వెలసిన సీతారామలక్ష్మణులకు ఆ బావి నుంచి అభిషేకానికి నీళ్లు కూడా సరఫరా అయ్యేవి. కులమతాలకు అతీతంగా, స్వామి సాక్షాత్కారానికి గుర్తుగా నిర్మించిన అంతటి చరిత్ర కలిగిన ఇమాంబేగ్ బావిని మరుగునపడేశారు. క్రమేణ ఆ బావి పూర్తిగా పూడిపోతోంది. లభించని పురావస్తుశాఖ అనుమతి ఇమాంబేగ్ బావి ఒంటిమిట్ట రామాలయ చరిత్రలో ఉంది కానీ, భక్తుల సందర్శనానికి నోచుకోలేదు. ఇమాంబేగ్ బావి పునరుద్ధరణ చేయడానికి పురావస్తుశాఖ అనుమతులు లేక పోవడమే కారణమని ఒకపక్క టీటీడీ వారు చెబుతున్నారు. తిరుమల తిరుపతి దేవస్థానం వారు తలచుకుంటే పురావస్తు శాఖ వారితో కలిసి ఎన్నో చారిత్రక దేవాలయాలను పునరుద్ధరణ చేసిన ఘనత ఉంది. కానీ ఒంటిమిట్టలో భక్తులు సందర్శించి, తెలుసుకోవాల్సిన ఇమాంబేగ్ బావిని, దాని చరిత్రను ఎందుకు కల్పించలేదో అర్థం కావడం లేదని స్థానికులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ఇమాంబేగ్ బావిని పునరుద్ధరించి భక్తులకు అందుబాటులో ఉంచాలని కోరుతున్నారు. ఈ మధ్య కాలంలో ఒంటిమిట్ట రామాలయానికి భక్తుల తాకిడి పెంచి, అభివృద్ధి కోసం బృహత్తర ప్రణాళిక రూపొందించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, టీటీడీ వారు ప్రత్యేక బృందాన్ని ఏర్పాటు చేశారు. వీరి ద్వారానైనా రామాలయ చారిత్రక గుర్తులకు పూర్వ వైభవం వస్తుందో లేదో వేచి చూడాలి. ఒంటిమిట్టలో మరుగునపడ్డ ఇమాంబేగ్ బావి స్వామి సాక్షాత్కారానికి గుర్తు ముస్లింలు సైతం పూజించేందుకు ఇదే కారణం పునరుద్ధరించాలని కోరుతున్న భక్తులు -
డివైడర్ను ఢీకొన్న బైక్.. ఇద్దరికి గాయాలు
మదనపల్లె రూరల్ : బైక్ అదుపు తప్పి ఇద్దరు కర్ణాటక వాసులు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. కర్ణాటక హవేరి ప్రాంతానికి చెందిన మల్లికార్జున(33), కనకపురకు చెందిన ముత్తురాజ్(32) ఎలక్ట్రానిక్ సిటిలో డీమార్ట్లో పని చేస్తుంటారు. ఇద్దరూ కలిసి శనివారం ద్విచక్రవాహనంలో తిరుమల స్వామివారి దర్శనానికి వెళ్లారు. ఆదివారం ఉదయం తిరుమల నుంచి బెంగళూరుకు బైక్లో తిరుగుప్రయాణం అయ్యారు. మార్గంమధ్యలో తిరుపతి–మదనపల్లె హైవేలోని పాలెంకొండ సమీపంలో బైక్ అదుపుతప్పి రోడ్డు డివైడర్ను ఢీకొని తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం ముత్తురాజ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. ఉరి వేసుకుని మహిళ ఆత్మహత్యపీలేరు రూరల్ : ఉరివేసుకుని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన ఆదివారం పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా వున్నాయి. పీలేరు పట్టణం బోయపాలెం వీధిలో కాపురం ఉంటున్న నాసిర్ భార్య ఖైరున్నీసా (48) అనారోగ్యంతో కొంత కాలంగా బాధపడుతోంది. ఈ క్రమంలో ఆదివారం ఇంటిలో ఎవరూ లేని సమయంలో చీరతో ఫ్యానుకు ఉరివేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు ఆమెను హుటాహుటిన చికిత్స నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి దుర్మరణం కలికిరి(వాల్మీకిపురం) : రోడ్డు ప్రమాదంలో ఓ వ్యక్తి దుర్మరణం చెందిన ఘటన శనివారం రాత్రి వాల్మీకిపురం మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మదనపల్లి పట్టణం ఈశ్వరమ్మకాలనీకి చెందిన నాగయ్యగారి మణికంఠ(27) తన ద్విచక్రవాహనంలో తిరుపతికి వెళ్లి మదనపల్లికి తిరుగు పయనమయ్యారు. మార్గంమధ్యలో వాల్మీకిపురం మండలం చింతలవారిపల్లి వద్ద తిరుపతి–మదనపల్లి జాతీయ రహదారిపై బైక్, ముందు వెళుతున్న వాటర్ టాక్టరు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో మణికంఠ అక్కడికక్కడే మృతి చెందాడు. స్థానికుల సమాచారంతో సంఘటనా స్థలానికి చేరుకున్న వాల్మీకిపురం పోలీసులు మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
నేడు కొత్త వీసీ బాధ్యతల స్వీకరణ
కడప ఎడ్యుకేషన్: యోగి వేమన విశ్వవిద్యాలయం వైస్ చాన్స్లర్గా బెల్లంకొండ రాజ శేఖర్ సోమవారం బాధ్యతలు స్వీకరించనున్నారు. ఆయన నాగార్జున విశ్వవిద్యాలయం నుంచి సివిల్ ఇంజనీరింగ్లో బీటెక్., బిజినెస్ అడ్మినిస్ట్రేషన్ ఉస్మానియా విశ్వవిద్యాలయం నుంచి, సైకాలజీ శ్రీ వెంకటేశ్వర విశ్వవిద్యాలయం నుంచి, డేటా సైన్స్, ఇంజినీరింగ్ బిట్స్ పిలాని నుంచి నాలుగు మాస్టర్స్ డిగ్రీలు పొందారు. 1999లో హైదరాబాద్ విశ్వవిద్యాలయంలో ఉద్యోగ బాధ్యతలు స్వీకరించారు. అప్పటి నుంచి స్కూల్ ఆఫ్ మేనేజ్మెంట్ స్టడీస్లో విశిష్ట సేవలందించారు. తాజాగా వైవీయూ వీసీగా నియమితులయ్యారు. ఈ మేరకు నూతన వీసీకి స్వాగతం పలుకుతూ వైవీయూ అధికారులు ఏర్పాట్లు చేశారు. -
నేడు విధుల్లోకి కొత్త ఉపాధ్యాయులు
రాయచోటి: ఉపాధ్యాయ పోటీ పరీక్షల్లో వందల మందిని దాటుకొని బోధనను వృత్తిగా చేపట్టనున్న నూతన ఉపాధ్యాయులు సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలను చేపట్టనున్నారు. జిల్లాలో 542 మంది కొత్త టీచర్లు బాధ్యతలను చేపట్టనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం తెలిపారు. వీరికి వారం రోజులపాటు ప్రభుత్వ నిబంధనల మేరకు శిక్షణను కూడా పూర్తి చేశామన్నారు. సోమవారం వారికి కేటాయించిన పాఠశాలల్లో బాధ్యతలు చేపట్టేలా అన్ని చర్యలు తీసుకున్నట్లు డీఈఓ చెప్పారు. జిల్లాలోని 30 మండలాల్లో చిట్వేలి మండలానికి అత్యధికంగా 55 మంది నియామకం కాగా నిమ్మనపల్లెలో ఒకరు, రాయచోటిలో ఇద్దరు వంతున నియామకమయ్యారు. మండలాల వారీగా కేటాయించిన టీచర్ల వివరాలు.. చిట్వేలి 55. ఓబులవారిపల్లి 51, గాలివీడు 43, టి సుండుపల్లి 39, పెద్దతిప్ప సముద్రం 37. పెనగలూరు 34. పెద్దమండెం 27, తంబళ్లపల్లి 25, నందలూరు 21, కోడూరు 20, మదనపల్లి 20, లక్కిరెడ్డిపల్లి 19, పుల్లంపేట 19, వీరబల్లి 19. బి కొత్తకోట 14, రాజంపేట 11, చిన్నమండెం 10, కలకడ 10, ములకల చెరువు 10, కెవిపల్లి 9. సంబేపల్లి 9, రామసముద్రం 8, గుర్రంకొండ 7. పీలేరు 7. కలికిరి 6. కురబలకోట 3, రామాపురం 3, వాయల్పాడు 3. రాయచోటి 2, నిమ్మనపల్లి ఒకరు వంతున 542 మంది సోమవారం ఉపాధ్యాయ వృత్తిని చేపట్టనున్నారు. సోమవారం బాధ్యతలు చేపట్టనున్న ఉపాధ్యాయులకు డీఈఓ సుబ్రమణ్యం అభినందనలు తెలిపారు. మంచి బోధనను అందించి విద్యార్థులను ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దాలని కోరారు. -
టైరు పంక్చర్.. కారు బోల్తా
పులివెందుల : మండలంలోని గొందిపల్లె గ్రామ సమీపంలో ఆదివారం సాయంత్రం 6 గంటల ప్రాంతంలో కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో ఇద్దరికి గాయాలయ్యాయి. పులివెందుల వైఎస్సార్ సీపీ పట్టణ అధ్యక్షుడు హాల్ గంగాధర్రెడ్డి సోదరుడు గంగిరెడ్డితో కలిసి సొంత పని మీద కడపకు వెళ్లారు. అక్కడ పని ముగించుకొని పులివెందులకు వస్తుండగా మార్గంమధ్యలో వేముల సమీపంలోని గొందిపల్లె గ్రామ సమీపంలో కారు టైరు పంక్చర్ కావడంతో అదుపుతప్పి బోల్తా పడింది. ఈ సంఘటనలో హాల్ గంగాధర్రెడ్డి, గంగిరెడ్డికి గాయాలయ్యాయి. చికిత్స నిమత్తం వీరిని పులివెందులకు తరలించారు. పరామర్శించిన వైఎస్ మనోహర్రెడ్డి కారు ప్రమాదంలో గాయపడిన హాల్ గంగాధర్రెడ్డి, సోదరుడు గంగిరెడ్డిలను పులివెందుల ఒక ప్రయి వేటు ఆసుపత్రికి తరలించారు. ఈ విషయం తెలుసుకున్న మున్సిపల్ ఇన్చార్జి వైఎస్ మనోహర్రెడ్డి ఆసుపత్రికి చేరుకొని వారిని పరామర్శించారు. కార్యక్రమంలో నూరుబాషా సంఘ నాయకులు రసూల్, కౌన్సిలర్ కోడి రమణ, ఖాదర్, పురుషోత్తం, కోఆప్షన్ చంద్రమౌళి, వైఎస్సార్సీపీ నాయకులు పద్మనాభరెడ్డి, హరి, కుళ్లాయప్ప పాల్గొన్నారు.ఇద్దరికి గాయాలు -
పునరుద్ధరిస్తాం
ఇమాంబేగ్ బావిని ఎప్పటి నుంచో పునరుద్ధరించాలని చూస్తున్నాం. దీనికి సంబంధించి అనుమతుల కోసం పురావస్తు శాఖ వారి దృష్టికి ఎన్నో సార్లు తీసుకువెళ్లడం జరిగింది. కానీ పురావస్తు శాఖ నుంచి ఎలాంటి అనుమతులు రాకపోవడంతో భక్తులకు తెలియాల్సిన ఇమాంబేగ్ బావి చరిత్ర మరుగునపడింది. పురావస్తు శాఖ అనుమతిస్తే కొన్ని రోజుల్లోనే ఇమాంబేగ్ బావిని పునరుద్ధరిస్తాం. – అమర్నాథ్రెడ్డి, టీటీడీ సివిల్ విభాగం ఏఈ, ఒంటిమిట్టచరిత్ర అనవాళ్లు కాపాడండి ఒంటిమిట్ట రామాలయంలో శ్రీరాముడు ఉన్నారనే సత్యాన్ని చూసిన ఇమాంబేగ్ దానికి గుర్తుగా నిర్మించిన బావినే ఇమాంబేగ్ బావి అని పిలుచుకుంటున్నాం. స్వామి ఇక్కడ సాక్షాత్తుగా ఉన్నాడనే సత్యానికి నిదర్శనంగా ఈ బావిని చూపిస్తారు. అలాంటి ఆలయ చారిత్రక అనవాళ్లను కలిగిన ఇమాంబేగ్ బావిని పునరుద్ధరించి భక్తులకు దాని చరిత్ర తెలిసే విధంగా టీటీడీ చర్యలు చేపట్టాలి. – నారాయణరెడ్డి, శ్రీకోదండ రామాలయం, మాజీ చైర్మన్, ఒంటిమిట్ట -
గంగమ్మకు బోనాలు
మండలంలోని అనంతపురం గ్రామంలో వెలసిన శ్రీశ్రీ అనంతపురం గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. పూజారులు చెల్లు గంగయ్య సురేంద్ర కుటుంబ సభ్యులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించారు. కుంకుమార్చన జరిపారు. భక్తులు బోనాలు సమర్పించారు. గంగమ్మా.చల్లంగా చూడమ్మా అని వేడుకున్నారు.కొందరు తలనీలాలు అర్పించారు. ఆలయ ప్రత్యేకాధికారి శ్రీనివాసులు వారి సిబ్బందితో ఏర్పాట్లు పర్యవేక్షించారు. ఇతర జిల్లాల నుంచి వచ్చిన వారి అమ్మవారి విశిష్టతను పూజారులు వివరించారు. అలాగే మద్దిరేవుల గ్రామం, వంకగడ్డ రాచపల్లి సమీపంలో వెలసిన శ్రీశ్రీ మారెమ్మ దేవత అమ్మవారి ఆలయంలోనూ ప్రత్యేక పూజలు నిర్వహించారు. –లక్కిరెడ్డిపల్లి -
సీనియర్ సిటిజెన్స్కు మంత్రిత్వ శాఖ ఏర్పాటు చేయాలి
మదనపల్లె సిటీ : సీనియర్ సిటిజెన్స్ కోసం ప్రత్యేక మంత్రిత్వ శాఖను ఏర్పాటు చేయాలని ఆల్ ఇండియా సీనియర్ సిటిజెన్స్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ వీరారావ్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఆదివారం స్థానిక జీఆర్టీ ఉన్నత పాఠశాలలో ఏపీ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ సమావేశం జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా వీరారావ్ మాట్లాడుతూ వృద్ధులపై జరుగుతున్న దాడులపై ఆందోళన వ్యక్తం చేశారు. తల్లిదండ్రులు పిల్లలకు ఆస్తులు రాసే సమయంలో తమను సక్రమంగా చూసుకుంటేనే ఆస్తి చెందేలా వీలునామా రాయాలన్నారు. దీంతో తల్లిదండ్రులను పిల్లలు సక్రమంగా చూసుకుంటారన్నారు. ఆస్తి కోసం తల్లిదండ్రులపై జరిగే దాడులు, హత్యలు నివారించాలన్నారు. రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రత్యేక కమిషన్ ఏర్పాటు చేయాలన్నారు. 2007 చట్టం సక్రమంగా అమలు చేయాలన్నారు. అనంతరం రాష్ట్ర స్థాయి అవార్డు పొందిన సీనియర్ సిటిజెన్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు మునిగోపాలకృష్ణ, ధనలక్ష్మి, వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి, ఆనంద వృద్ధాశ్రమం ఆనంద్, రిటైర్డ్ ఎయిర్ఫోర్సు ఆఫీసర్ పరాంధామగౌడ్లను ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో కార్యదర్శి ఎన్.వి.నాయుడు, గౌరవ అధ్యక్షులు వై.ఎస్.మునిరత్నమయ్య, ఉపాధ్యక్షులు జగన్మోహన్, కోశాధికారి ఉస్మాన్సాహెబ్, తిరుపతిరావు నాగరాజు, ప్రొఫెసర్ శ్రీనివాసులు, మహిళా ప్రతినిధి సరస్వతి తదితరులు పాల్గొన్నారు. -
అనుమతి లేకుండా సిజేరియన్ ఆపరేషన్లు
వేంపల్లె : స్థానిక కడప రోడ్డులో ఉన్న అరుణ హాస్పిటల్లో అనుమతులు లేకుండా అక్కడున్న(డీహెచ్ఎంహెచ్) వైద్యుడు విజయ్కుమార్ గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుండగా పట్టుబడినట్లు సీఐ నరసింహులు తెలిపారు. ఆదివారం డిప్యూటీ డీఎంహెచ్ ఖాజా మొహినిద్దీన్ ఫిర్యాదు మేరకు వైద్యులు విజయ్కుమార్పై నాన్బెయిలబుల్ కేసు నమోదు చేసినట్లు చెప్పారు. గత నెలలో ఎటువంటి అనుమతులు లేకుండా గర్భిణులకు ఆపరేషన్లు చేస్తున్నట్లు ఫిర్యాదు రావడంతో.. ఆ హాస్పిటల్ డిప్యూటీ డీఎంహెచ్ఓ తనిఖీలు నిర్వహించి సీజ్ చేశారన్నారు. అయినా కూడా హాస్పిటల్ వైద్యులు, వైద్య ఉన్నతాధికారులను లెక్క చేయకుండా సీజ్ చేసిన ల్యాబ్ను ఓపెన్ చేసి.. మరలా యథావిధిగా శనివారం రాత్రి ఇద్దరు గర్భిణులకు సిజేరియన్ ఆపరేషన్లు చేస్తుండగా డిప్యూటీ డీఎంహెచ్ఓ ఖాజా మోహినిద్దీన్ తనిఖీ నిర్వహించి రెడ్ హ్యాండెడ్ గా పట్టుకున్నారని చెప్పారు. ఈ విషయాన్ని ఉన్నతాధికారులకు తెలియజేసి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. పులివెందుల డీఎస్పీ మురళి నాయక్, సీఐ నరసింహులు విచారణ చేసి వైద్యునిపై కేసు నమోదు చేశామని వివరించారు. బెల్టు షాపులపై దాడి లింగాల : మండలంలోని గ్రామాల్లో ఎస్సై అనిల్ కుమార్ బెల్ట్ షాపులపై ఆదివారం దాడులు నిర్వహించారు. చిన్న కుడాల, మురారి చింతల, వెలిదండ్ల, దిగువపల్లి, లింగాల గ్రామాల్లో బెల్ట్ షాపులు ఏర్పాటు చేసి అధిక ధరకు అమ్ముతున్న వారిపై దాడులు చేశారు. 47 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకుని నలుగురిని అరెస్టు చేశామని ఎస్సై తెలిపారు. మండలంలో అక్రమ అమ్మకాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని ఆయన హెచ్చరించారు. దాడుల్లో లింగాల పోలీసులు పాల్గొన్నారు. గుర్తుతెలియని మహిళ మృతి కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–కనుమలోపల్లె రైల్వే మార్గంలో కన్యాకుమారి ఎక్స్ప్రెస్ రైలు కిందపడి గుర్తు తెలియని మహిళ మృతి చెందిందని రైల్వే పోలీసులు తెలిపారు. వారి కథనం మేరకు... మృతురాలికి 50 ఏళ్ల వయసు ఉంటుంది. ఆమె ఆచూకీ లభించకపోవడంతో మృతదేహాన్ని కడప రిమ్స్ మార్చురీలో భద్రపరిచారు. మృతురాలి వద్ద ప్లాస్టిక్ సంచిలో ఖాళీ ప్లాస్టిక్ బాటిళ్లు ఉన్నాయని, ఆ మేరకు ఈమె ప్లాస్టిక్ బాటిళ్లు ఏరుకుని జీవనం సాగించేదని తెలియవచ్చిందన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు రైల్వే పోలీసులు తెలిపారు.వైద్యుడిపై నాన్ బెయిలబుల్ కేసు నమోదు -
ఆరోగ్యం కోసం రోజూ నడుద్దాం
మదనపల్లె రూరల్ : ‘ఆరోగ్యమే మహాభాగ్యం. మెరుగైన ఆరోగ్యం పొందాలంటే ప్రతి ఒక్కరూ తమ దినచర్యలో నడకను అలవాటు చేసుకోవాలి. అప్పుడే అద్భుతమైన ప్రయోజనాలు పొందగలం’ అంటూ డీఎస్పీ కె.మహేంద్ర తెలిపారు. ప్రతిరోజు కేసులు, ఇన్వెస్టిగేషన్, డ్యూటీల పేరుతో క్షణం తీరిక లేకుండా గడిపే పోలీసులు శారీరక ఆరోగ్యం, మానసిక ప్రశాంతత కోసం కొత్తగా ఏదైనా చేద్దామని తలచారు. తలచిందే తడవు, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అనుమతితో, డీఎస్పీ మహేంద్ర సారథ్యంలో.. మదనపల్లె మండలం వేంపల్లె మల్లయ్యకొండకు వెళ్లాలని నిర్ణయించుకున్నారు. ఆదివారం వేకువజామున ఒక్కొక్కరుగా పోలీసు సిబ్బంది మల్లయ్యకొండ కిందకు చేరుకున్నారు. అందరూ కలిసికట్టుగా కొండ ఎక్కేందుకు బయలుదేరారు. కొండ ఎక్కే క్రమంలో చుట్టూ ప్రకృతి అందాలను చూడటంతోపాటు అప్పుడే ఉదయిస్తున్న సూర్యుడి లేలేత కిరణాలను చూస్తూ, పిల్లగాలుల శబ్దాలను ఆలకిస్తూ మైమరచిపోయారు. కొండ ఎక్కడంలో అలసిన ఖాకీలు ఓ చోట సేద తీరేందుకు నిలిస్తే... డీఎస్పీ మాట్లాడుతూ పోలీసు విధులు కఠినమైనవని, ఆరోగ్యం కాపాడుకోవడం అంటే, కుటుంబం, సమాజం కోసం బలంగా నిలవడం, శారీరకంగా, మానసికంగా బలంగా ఉండటమని ఉత్సాహాన్ని నింపారు. దీంతో రెట్టింపైన ఉత్సాహంతో సిబ్బంది ముందుకు సాగి మల్లయ్యకొండకు చేరుకున్నారు. కొండపై నుంచి మదనపల్లె పట్టణ దృశ్యాలను తమ సెల్పోన్లలో బంధించి, సెల్ఫీలు తీసుకుని కాసేపు సరదాగా గడిపారు. ట్రెక్కింగ్లోని అనుభవాలను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబల్లికి తెలిపితే.. ఆయన పోలీస్ సిబ్బంది ప్రయత్నాన్ని హర్షించడమే కాకుండా, ఆదివారం ఆరోగ్యం కోసం పోలీసులు వేసిన అడుగు.. ఐక్యతకు సంకేతం కావాలని, పోలీసు కుటుంబంలో కొత్త ఉత్సాహాన్ని నింపాలంటూ సందేశం పంపారు. మల్లయ్యకొండకు ట్రెక్కింగ్ చేసిన వారిలో సీఐలు కళావెంకటరమణ, రమేష్, ఎస్ఐలు అన్సర్బాషా, చంద్రమోహన్, తిప్పేస్వామి ఉన్నారు.డీఎస్పీ కె.మహేంద్ర -
సిట్తో సరిపెట్టేస్తారా?
మదనపల్లె: జిల్లాలోని ములకలచెరువుతో పాటు రాష్ట్రవ్యాప్తంగా నకిలీ మద్యం తయారీ, విక్రయాలపై, అందులో ప్రమేయం ఉన్న టీడీపీ నేతలపై సీబీఐ ద్వారా సమగ్ర విచారణ జరిపి నిజాలు నిగ్గు తేల్చాలని వైఎఎస్సార్సీపీ డిమాండ్ చేస్తుంటే.. ప్రభుత్వం ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్)తో సరి పెట్టేసింది. ఈ దర్యాప్తు రైట్ అవుతుందా లేదా అన్నది మున్ముందు చూడాలి. ములకలచెరువు నకిలీ మద్యం తయారీపై సిట్ దర్యాప్తు చేస్తుందని సీఎం చంద్రబాబు ఆదివారం ప్రకటించారు. ఇప్పటిదాకా ఎకై ్సజ్ పోలీసులు కేసు నమోదు చేసి, నిందితులను గుర్తించి అరెస్టుల ప్రక్రియ ప్రారంభించారు. రిమాండ్ రిపోర్టులను కూడా నివేదించారు. ప్రధానంగా టీడీపీ నేతల ప్రమేయంపై ఇప్పటిదాకా ప్రభుత్వం స్పష్టత ఇవ్వలేదు. ఆరోపణలపై తంబళ్లపల్లె టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి, పీటీఎం టీడీపీ నేత కట్టా సురేంద్ర నాయుడులను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. వీరిలో సురేంద్ర నాయుడు పై తొలుత కేసు నమోదు చేయగా, తర్వాత అరెస్టు అయిన వారి వాంగ్మూలం ఆధారంగా జయచంద్రారెడ్డి, మరికొందరిపై కేసు నమోదు చేశారు. అంతటితో చర్యలు ఆగిపోయాయి. నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో కీలక నేతలు, ముఖ్య నాయకులు ఎవరో ఇంతవరకు ఎకై ్సజ్ అధికారులు కూడా ప్రకటించలేదు. ఒకరి వెనుక ఒకరుగా అరెస్టు అవుతున్న నిందితులు ఇచ్చిన వాంగ్మూలాల ఆధారంగా కొత్తగా నిందితులను చేర్చుతూ దర్యాప్తు సాగిస్తున్నారు. ఈ కేసులో నిందితుల అరెస్టు ప్రక్రియనే పూర్తి కాలేదు. నకిలీ మద్యం తయారీ, వాటి సరఫరా గురించి మాత్రమే దర్యాప్తులో గుర్తించారు. నిజానికి ఈ నకిలీ మద్యం ఎవరెవరికి చేర్చారు.. ఏయే మద్యం దుకాణాలకు వెళ్లింది..ఎంత పరిమాణంలో తయారైంది అన్న వివరాలపై దర్యాప్తు అడుగు కూడా ముందుకు పడలేదని తెలుస్తోంది. ఈ నేపథ్యంలో సీఎం చంద్రబాబు నాయుడు సిట్ ఏర్పాటు చేయడంతో స్పష్టత వస్తుందా లేదా అన్నది చూడాలి. ● నకిలీమద్యం తయారీ ప్లాంట్ వ్యవహారం, తరలింపు, విక్రయాల్లో విజయవాడకు చెందిన అద్దేపల్లె జనార్దనరావుతో స్థానిక టీటీపీ నేతలంతా జత కట్టినట్టు స్పష్టం అవుతోంది. ఈ కేసులో అరెస్టయిన ఏ–1 జనార్దనరావు రిమాండ్ రిపోర్ట్లో పలు విషయాలు..టీడీపీ నేతలతో ఎంత గట్టి అనుబంధం ఉందో స్పష్టం చేసింది. మిత్రుడు జయచంద్రారెడ్డి గెలుపు కోసం ఆయనకు మద్దతుగా వెళ్లినట్టు పేర్కొన్నాడు. అక్కడ టీడీపీ నేతలతో పరిచయాలు, మద్యం వ్యాపారంలో నష్టాలు, లాభాల కోసం నకిలీ మద్యం తయారు..ఇలా అన్నింటికి టీడీపీ నేతలు కలసికట్టుగా జట్టుకట్టినట్టు నివేదికలే స్పష్టం చేస్తున్నాయి. ● ములకలచెరువులో నకిలీమద్యం తయారీ మొదలైంది కూటమి పాలనలోనే అని నిందితుల రిమాండ్ రిపోర్టుల్లో స్పష్టంగా ఉంది. కొత్త మద్యం విధానం అమలులోకి రావడం, షాపులు దక్కించుకున్న జయచంద్రారెడ్డి పీఏ రాజేష్, పీటీఎం మండల టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడులకు మద్యం వ్యాపారంలో అనుభవం లేక నష్టపోయామని చెప్పి వాటి నిర్వహణ చూడాలని తనను కోరినట్టు జనార్దనరావు రిమాండ్ రిపోర్ట్లో ఉంది. ఇంతకు ముందు ఈ షాపు నిర్వాహకులను స్థానిక టీడీపీ నేత పాలగిరి సిద్దా ద్వారా వారు తనకు పరిచయమైనట్టు జనార్దనరావు వెల్లడించడం స్థానికంగా చర్చనీయాంశమైంది. ప్రారంభం నుంచి తంబళ్లపల్లె నియోజకవర్గంలోని మద్యం దుకాణాలు అధికసంఖ్యలో టీడీపీ నేతలు, వారి మద్దతుదారులకే దక్కాయి. ● అసెంబ్లీ ఎన్నికల ప్రచారం సాగుతున్న సమయంలో ములకలచెరువు సమీపంలో మదనపల్లె రోడ్డులోని ఓ టీడీపీ నేత లాడ్జిలో విజయవాడ నుంచి మనుషులు డబ్బుతో వచ్చారని, పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరుతూ గత ఏడాది మే 9న వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనకు దిగాయి. ఆ సమయంలో లాడ్జిలో ఉన్నది జనార్దనరావు విజయవాడనుంచి రప్పించిన మనుషులే అని ఇప్పుడు స్థానికంగా చర్చించుకొంటున్నారు. జనార్దనరావు రిమాండ్ రిపోర్ట్లోనే మిత్రుడు జయచంద్రారెడ్డికి మద్దతు ఇవ్వడానికి వెళ్లినట్టు పేర్కొన్నారు. ● ములకలచెరువు నకిలీమద్యం కేసులో ఏ–2 కట్టారాజు నుంచి స్వాధీనం చేసుకున్న డైరీ అంశం మళ్లీ తెరపైకి వస్తోంది. మద్యంషాపులు, బెల్టుషాపులకు తరలించిన నకిలీమద్యం వివరాలు అందులో ఉండే అవకాశం ఉందని భావిస్తున్నారు. రాజు అరెస్ట్ రిమాండ్ రిపోర్ట్లో జనార్దనరావు సూచన మేరకు.. జయచంద్రారెడ్డి, అతని బావమరిది మంత్రి గిరిధర్రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్కు చెందిన రవి, టీడీపీ నేత కట్టా సురేంద్రనాయుడు, పీఏ రాజేష్లతో నకిలీమద్యం అమ్మకాలు ప్రారంభించినట్టు పేర్కొన్నారు. అంటే డైరీలో ఇంకా ముఖ్యమైన విషయాలు ఉండి ఉంటాయన్న అభిప్రాయం వ్యక్తం అవుతోంది. ములకలచెరువు నకిలీమద్యం కేసులో ఇప్పటికి నిందితుల సంఖ్య 23. ఈ కేసులో 14 మందిని అరెస్ట్ చేశారు. మిగిలి వారి కోసం పోలీసులు గాలింపు చేపట్టారు.కాగా ఆరెస్ట్ అయిన నిందితులను తమ కస్టడీకి ఇవ్వాలని కోరుతూ ఎకై ్సజ్ పోలీసులు తంబళ్లపల్లె కోర్టును ఆశ్రయించగా సోమవారం నిర్ణయం వెలువడనుంది. కేసులో ఏ–1 జనార్దనరావు ఏ–2 కట్టా రాజుకు ఫోన్ చేసి నకిలీమద్యం తయారీకి సంబంధించి చర్చించి, ప్లాంట్ ఏర్పాటులో ఎవరెవరి పాత్ర ఉందో రిమాండ్ రిపోర్ట్లో కట్టారాజు చెప్పినట్టు ఎకై ్సజ్ పోలీసులు స్పష్టంగా పేర్కొన్నారు. కొడాలి శ్రీనివాసరావు పేరిట మూతపడిన డాబాను లీజుకు తీసుకున్నాక కాంపౌండ్ గోడను 10 అడుగులకు పెంచారు. త్వరలోనే నకిలీ మద్యం అమ్మకాలు ప్రారంభించాలని జయచంద్రారెడ్డి, గిరిధర్రెడ్డి, బెంగళూరుకు చెందిన బాలాజీ, హైదరాబాద్కు చెందిన నకిరేకంటి రవి, ఆంధ్రావైన్స్ లైసెన్స్దారు కట్టా సురేంద్రనాయుడు, రాక్స్టార్ లైసెన్స్దారు టి.రాజేష్ ప్రణాళిక వేశారు. బాలాజీ వాటర్ప్లాంట్, ఎస్ఎస్ ట్యాంకు, ఎలక్ట్రికల్ మోటారు, స్పిరిట్ డబ్బాలను షెడ్డుకు తీసుకొచ్చాడు. జనార్దనరావు, రవిలు లేబుళ్లు, పెట్ బాటిళ్లు, క్యాప్లు, హీల్స్ను తీసుకొచ్చారు. మూడు సీలింగ్ మిషన్లలో రెండింటిని జనార్దనరావు తన వాహనంలో రెండుసార్లు తీసుకొచ్చారు. తమిళనాడు కృష్ణగిరి ప్రాంతంలో డాబాల్లో పనిచేస్తున్న నలుగురిని బాలాజీ సహయంతో జనార్దనరావు తీసుకొచ్చారు. జనార్దన రావు బార్లో పనిచేస్తున్న సయ్యద్ హాజీ ద్వారా ఒడిశా నుంచి ఇద్దరిని రప్పించి నకిలీమద్యం తయారీని ప్రారంభించి ప్రజలకు తాపించి వారి ఆరోగ్యంతో చెలగాటం అడారు. నకిలీ మద్యం కేసులోవెలుగులోకి వస్తున్న ఒక్కొక్కరు అసెంబ్లీ ఎన్నికల్లో ములకలచెరువులోటీడీపీనేత లాడ్జిలో జనార్దనరావు మకాం డైరీలో ఇంకేముందోనని ఉత్కంఠ -
ఇద్దరిపై కేసు నమోదు
కేవీపల్లె : మైనర్ బాలిక ప్రసవించిన ఘటనపై ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు.. మండలంలోని బసన్నగారిపల్లెకు చెందిన మైనర్ బాలిక(16) తండ్రి అనారోగ్యంతో ఉన్నాడు. తల్లి జీవనోపాధి కోసం కువైట్కు వెళ్లింది. అదే గ్రామానికి చెందిన వరుసకు అన్న అయిన నాగేంద్ర అలియాస్ నాని ఒంటరిగా ఉన్న మైనర్ బాలికను లోబరచుకుని లైంగిక దాడికి పాల్పడాడు. దీంతో ఆమె గర్భం దాల్చింది. ఈ నెల 7న పురిటి నొప్పులు రావడంతో పీలేరులోని మాధవి అస్పత్రికి తరలించారు. 8న బాలికకు కాన్పు చేయడంతో మగ బిడ్డకు జన్మనిచ్చింది. విషయం తెలుసుకున్న ఐసీడీఎస్ అధికారులు శుక్రవారం బిడ్డను స్వాధీనం చేసుకుని రాయచోటి శిశు సంక్షేమ శాఖ కార్యాలయానికి తరలించారు. ఐసీడీఎస్ సీడీపీవో రాజమ్మ ఫిర్యాదు మేరకు లైంగిక దాడికి పాల్పడిన నాగేంద్రపైనా, పోలీసులు, ఐసీడీఎస్ అధికారులకు సమాచారం ఇవ్వకుండా కాన్పు చేసిన డాక్టర్ మాధవిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి సంబేపల్లె : మండలంలోని దేవపట్ల కస్పాలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తిక్కం క్రిష్ణారెడ్డి (65) మృతి చెందిన సంఘటన శనివారం చోటుచేసుకొంది. పోలీసుల వివరాల మేరకు.. కట్టుగుత్తపల్లెకు చెందిన క్రిష్ణారెడ్డి స్కూటర్లో సొంత పనుల నిమిత్తం దేవపట్లకు వెళ్లి తిరిగి వస్తున్నారు. చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై ఆవులవాండ్లపల్లె క్రాస్ వద్ద కలకడ వైపు నుంచి ద్విచక్ర వాహనం వస్తోంది. ఇరు వాహనాలు ఢీకొనడంతో క్రిష్ణారెడ్డికి గాయాలయ్యాయి. తిరుపతి ఆసుపత్రికి తరలించగా చికిత్స పోందుతూ మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. ఇంటి యజమాని చనిపోవడంతో కుటుంబీకులు కన్నీరు మున్నీరయ్యారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దిగువగొట్టివీడులో చోరీ చిన్నమండెం : చిన్నమండెం మండలం దిగువగొట్టివీడు గ్రామంలో పట్టపగలే చోరీ జరిగిన సంఘటన శనివారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు.. దిగువగొట్టివీడుకు చెందిన వేణుగోపాల్ నాయు డు పొలం పనులకు వెళ్లాడు. ఇదే అదునుగా భావించిన దొంగలు శనివారం మధ్యాహ్నం ఇంట్లో చొరబడి చోరీ చేశారు. విషయం తెలుసుకుని బాధితుడు వేణుగోపాల్నాయుడు హుటాహుటిన ఇంటికి చేరుకుని పరిశీలించారు. రూ.50 వేల నగదు, తులం బంగారు చోరీకి గురైందని గుర్తించారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించి విచారణ చేస్తున్నారు. ఇసుక ట్రాక్టర్ ఢీకొని ఒకరికి గాయాలు సుండుపల్లె : మండలంలోని మిట్టబిడికి కాలనీలో శనివారం మధ్యా హ్నం జరిగిన ప్రమాదంలో ఒకరికి గాయాలయ్యాయి. వివరాలలోకి వెళ్లితే.. నాగేశ్వర నాయ క్ గొర్రెలు మేపుతుండగా వెనుక వైపు నుంచి వచ్చిన ఇసుక ట్రాక్టర్ అతన్ని ఢీకొంది. నాగేశ్వరనాయక్ తీవ్రంగా గాయపడడంతో ఆస్పత్రికి తరలించారు. డాబా హోటల్పైకి దూసుకెళ్లిన బొలెరో గుర్రంకొండ : డాబా హోటల్పైకి వేగంగా వెళుతున్న ఓ బొలెరో వాహనం దూసుకెళ్లిన సంఘటన మండలంలోని గుర్రంకొండలో శనివారం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. స్థానిక మార్కెట్ యార్డు సర్కిల్లో పెద్ద ఎత్తున డాబాహోటళ్లు నిర్వహించుకొంటూ పలువురు జీవనం సాగిస్తున్నారు. గత శుక్రవారం రాత్రి మదనపల్లె నుంచి బయలుదేరిన ఓ బొలెరో వాహనం వేగం డ్రైవర్ అదుపు చేయలేక ఓ డాబా హోటల్పైకి దూసుకెళ్లాడు. డాబా పక్కనే ఉన్న పెద్దమండ్యం మండలానికి చెందిన మరో బొలెరో వాహనం, ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో నిలబడిపోయింది. రాత్రి వేళ డాబా మూసి ఉండడతో పెద్ద ప్రాణాపాయం తప్పింది. సంఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
నకిలీ మద్యం కేసు సీబీఐకి అప్పగించాలి
రాయచోటి అర్బన్ : నకిలీ మద్యం కేసు సీబీఐకి అప్పగించాలని, కూటమి నేతల కల్తీ లిక్కర్ కుటీర పరిశ్రమలపై నిజాలు నిగ్గుతేల్చాలని వెఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి డిమాండ్ చేశారు. రాయచోటిలోని తన కార్యాలయంలో విలేకరులతో ఆయన మాట్లాడుతూ నకిలీ మద్యంతో జగన్ ప్రభుత్వం హయాంలో ఏదో జరిగిపోయిందని ఆరోపించిన చంద్రబాబు చివరకు నిరూపణ చేయలేకపోయారన్నారు. ఆధారాలు లేకుండా ఎంపీ మిథున్రెడ్డి, సీనియర్ అధికారులు ధనుంజయరెడ్డి, కృష్టమోహన్రెడ్డిలను అక్రమంగా నిర్భందించారన్నారు. కూటమి నాయకులు మాత్రం కల్తీ మద్యం తయారు చేస్తూ, ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నారన్నారు. ప్రాణాంతకమైన స్పిరిట్తో కల్తీ మద్యం తయారు సి మహిళ పసుపుకుంకాలతో ఆటలాడుకుంటున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. నెలకు రూ.40 నుంచి రూ.50 కోట్ల ప్రజాధనం కొల్లగొడుతున్నారన్నారు. కల్తీ మద్యం తయారీలో చంద్రబాబు, లోకేష్, ఇతర నాయకుల పాత్రపై సీబీఐచే విచారణ చేయించి నిజాలు నిగ్గుతేల్చాలన్నారు. 16 నెలల పాలనలో వైఎస్.జగన్ ప్రజలకు చేసిన మేలు, తెచ్చిన అప్పులపై కూడా చర్చించాల్సిన అవసరం ఉందని తెలిపారు. 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరించేందుకు పూనుకున్న కూటమి సర్కార్పై కోటి సంతకాల సేకరణ చేపడుతున్నామని, ప్రైవేటీకరణ ఆపేంత వరకూ పోరాటం ఆపేదిలేదన్నారు. -
అక్రమార్కులు భారీగా వృక్షాలను కూల్చేసి గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు, మహా రాష్ట్రాలకు అక్రమంగా తలించుకుపోతున్నారు. టీడీపీ నేతల అండ పుష్కలంగా ఉండడంతో ఇష్టానుసారంగా రెచ్చిపోతున్నారు. ఓ వైపు ప్రభుత్వం మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలని ప్రచారం చేస్తు
● తమిళనాడు, మహారాష్ట్రాలకు తరలిపోతున్న కలప ● టీడీపీ నేతల అండతో నేలకొరుగుతున్న చెట్లు గుర్రంకొండ : ఎక్కడపడితే అక్కడ యథేచ్చగా చెట్లు నరికివేస్తున్నారు. చెట్ల సంరక్షణ చూసే అటవీ, రెవెన్యూ అధికారులు పూర్తిగా విఫలమయ్యారు. గ్రామాల్లో అన్ని రకాల చెట్లు, వనాలు పురాతనమైనవి. శతాబ్దాల క్రితం నాటిన చెట్లపై వ్యాపారులు దృష్టిసారిస్తున్నారు. పట్టాలున్న పొలాల్లో గాక పోరంబోకు స్ధలాల్లోని మొక్కలను అక్రమంగా నరికివేస్తున్నారు. ఇంటి వస్తువులు తయారుచేసే కలపతోపాటు ఇటుక బట్టీలు కాల్చడంలోనూ వినియోగించుకొంటున్నారు. చివరకు దేవుడి మాన్యం, వంక పోరంబోకు, చెరువుపోరంబోకు స్థలాల్లోని పురాతన చెట్లను వదలడం లేదు. లక్షలాది రుపాయల విలువచేసే చెట్లను నరికి సొమ్ము చేసుకొంటున్నారు. తరలిపోతున్న వృక్షసంపద జిల్లాలోని వ్యాపారులే కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర నుంచి వ్యాపారులు ఇక్కడికి వచ్చి చింతచెట్లతోపాటు సంద్ర, కంప ఇతర వృక్ష సంపదను కొల్లగొడుతున్నారు. బయట రాష్ట్రాల నుంచి కూలీలను జిల్లాకు తలరించి రేయింబవళ్లు చెట్లు నరికి బయట రాష్ట్రాలకు తరలించేస్తున్నారు. ఇందులో వందల ఏళ్లు గల చెట్లు ఉన్నాయి. తోటలు, పొలాల గట్లు, ఊరి మధ్యలో, రచ్చబండల మధ్య ఉన్న చెట్లను నరికి వేయడంతొ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఒక్కో చెట్టు నుంచి చవ్చే కలప సుమారు రూ:20 వేల నుంచి రూ: 40వేల వరకు ధర పలుకుతోందని అంచనా. ఇంటి వస్తువుల తయారీకి ఉపయోగపడే చెట్లు లక్షలాది రుపాయలు ధర పలుకుతున్నాయి. స్థానిక వ్యాపారులు ఇతర రాష్ట్రాల వారితో కుమ్మకై ్క ఇష్టానుసారం తరలించేస్తున్నారు. అక్రమార్కులకు టీడీపీనేతల అండ బయట రాష్ట్రాల నుంచి ఇక్కడికి వచ్చి ఇష్టానుసారంగా చెట్లను నరికి వేస్తున్న అక్రమార్కులకు కొంతమంది టీడీపీ నేతలు అండగా నిలుస్తున్నారు. ఇటీవల చెర్లోపల్లె, కృష్ణాపురం, ప్రస్తుతం గుర్రంకొండ పట్టణ సమీపంలో భారీగా వృక్ష సంపదను నరికి డంపింగ్ చేశారు. రాత్రిళ్లు గుట్టుచప్పుడు కాకుండా తమిళనాడు, మహారాష్ట్ర తరలించడం.. తనిఖీ చేసిన అధికారులకు టీడీపీ నేతలనుంచి ఫోన్లు రావడంతో వెనుదిరిగి వచ్చేసున్నారు. ఇటీవల కృష్టాపురం దగ్గర తమిళనాడు రాష్ట్రానికి చెందిన అక్రమార్కులు భారీగా చెట్లను నరికి లారీల్లో లోడింగ్ చేశారు. సమాచారం అందుకొన్న రెవెన్యూ అధికారులు హుటాహుటిన వెళ్లి చర్యలకు ఉపక్రమించగా టీడీపీ నేతల ఫోన్లు రావడంతో చేసేదిలేక వెనుదిరిగి వచ్చేశారు. ఇలా పలు ప్రాంతాల్లో టీడీపీ నేతల అండతో కొందరు ఇష్టానుసారంగా వృక్షసంపద కొల్లగొడుతున్నారు. మాకు కాదు.. మీకే సంబంధం అక్రమార్కులపై చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత మాది కాదు... మీదంటూ అటవీ, రెవెన్యూ శాఖల అధికారులు ఒకరిపై ఒకరి నిందలు వేసుకొంటూ కాలం వెళ్లదీస్తున్నారు. చెట్లను నరికి వేయడానికి ముందుగా రెవెన్యూ అధికారుల అనుమతి తీసుకోవాలి. ఆ తర్వాత నరికివేసిన చెట్లను ఏ ప్రాంతానికై నా తరలించాలంటే అటవీశాఖ అధికారుల అనుమతి తప్పనిసరి. చెట్లను కోసేయడానికి ఎలాంటి అఽనుమతులు తీసుకోకుండా లారీలు, ట్రాక్టర్ల ద్వారా వృక్ష సంపద తరలించారు. కొయ్యమిల్లులతోపాటు బయట రాష్ట్రాలకు తీసుకుతున్నా చోద్యం చూస్తూ అధికారులు కాలం వెళ్లదీస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. కలప తరలించే వారిపై చర్యలు తీసుకోవాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. గుర్రంకొండ సమీపంలో నరికి తరలించేందుకు సిద్ధం చేసిన కలప ఎగువ హరిజనవాడలో కూల్చివేసిన వందేళ్ల చెట్టు చెట్లను అక్రమంగా నరికివేసే వారిపై చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. అనుమతి లేకుండా ఎవరైనా వ్యాపారులు చెట్లను నరికివేసి తరలిస్తే కేసులు నమోదు చేస్తాం. చెట్లు నరికివేతపై ప్రజలు తమకు సమాచారం అందించి సహకరించాలి. – సదాశివప్పనాయుడు, ఎంఆర్ఐ, గుర్రంకొండ రెవెన్యూ అధికారులు చెట్లను నరికి వేయడానికి అనుమతిచ్చినా.. అటవీ శాఖ అనుమతి లేనిదే బయట ప్రాంతాలకు తరలించరాదు. ప్రతి వాహనం నరికి కలప ఎక్కడికి, ఎందుకు తీసుకు వెళుతున్నారనే సమాచారం ఇవ్వాలి. మా అనుమతి తప్పనిసరిగా తీసుకోవాలి. లేనిపక్షంలో కేసులు నమోదు చేస్తాం. – రామ్మోహన్, ఫారెస్ట్బీట్ ఆఫీసర్, గుర్రంకొండ -
టెట్.. టెన్షన్
రాజంపేట టౌన్: పిల్లలకు పాఠాలు బోధించి పరీక్షలు నిర్వహించే గురువులకే ఇప్పుడు పరీక్ష పాస్ కావాల్సిన పరిస్థితి ఏర్పడింది. ఉద్యోగంలో చేరిన ఉపాధ్యాయులంతా తాజాగా టీచర్ ఎలిజిబులిటీ టెస్ట్ (టెట్) రాయాల్సిందేనని తాజాగా సుప్రీం కోర్టు ఆదేశాలు జారీ చేసింది. పైగా రెండేళ్లలోపు పాస్ కావాల్సిందేనని నిబంధనతో గురువులు ఆందోళన చెందుతున్నారు. సీనియర్ టీచర్స్లో కలవరం మరింత ఎక్కువైంది. విద్యాహక్కు చట్టం 2010 ప్రకారం ఉపాధ్యాయ పోస్టుల నియామకానికి టెట్ ఉత్తీర్ణత తప్పనిసరి. అందువల్ల 2010 నుంచి ఉపాధ్యాయ పోస్టులు పొందిన వారంతా టెట్ ఉత్తీర్ణత సాధించినవారే. అయితే 2010వ సంవత్సరంకంటే ముందు కేవలం డీఎస్సీలో మాత్రమే ప్రతిభ చూపి ఉపాధ్యాయ పోస్టులు పొందారు. 2010 కంటే ముందు ఉపాధ్యాయ పోస్టులు సాధించిన వారు జిల్లాలో వేల సంఖ్యలోనే ఉన్నారు.ఇదిలావుంటే ఐదు సంవత్సరాలలోపు పదవీ విరమణ పొందే వారు మినహా మిగతా వారు 2027 ఆగస్టు 31వ తేదీలోపు టెట్ ఉతీర్ణత సాధించాలని సుప్రీంకోర్టు తీర్పు ఇచ్చింది. ఒకవేళ ఆలోగా టెట్లో ఉత్తీర్ణత సాధించకుంటే ఉద్యోగం వదులుకోవాలని తీర్పులో వెల్లడించింది. దీంతో వేలాది మంది ఉపాధ్యాయులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. ● ప్రస్తుతం ఉపాధ్యాయులపై బోధనేతర పనులు ఎక్కువయ్యాయి. కుటుంబ బాధ్యతలు ఉంటాయి. దీంతో టెట్కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఉండదని టీచర్లు ఆందోళన చెందుతున్నారు. పునరాలోచించాలి 2010 కంటే ముందు ఉపాధ్యాయ పోస్టు పొందిన వారు టెట్ ఉత్తీర్ణత సాధించాలని ఇచ్చిన తీర్పుపై పునరాలోచించాలి.రెండు, మూడు దశాబ్దాలుగా పనిచేసే ఉపాధ్యాయులు వృత్తిపరంగా ఎప్పటికప్పుడు అనేక శిక్షణలు పొందుతున్నారు. అందులో భాగంగా ఇన్సర్వీస్, రెసిడెన్షియల్, ఆన్లైన్ వంటి శిక్షణలు పొందారు. అందువల్ల టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న నిబంధన సరి కాదు. –వై.సుబ్రమణ్యంరాజు, ఎస్టీయూ రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు మానవీయ కోణంలో పరిశీలించాలి టెట్ ఉత్తీర్ణ సాధించాలన్న తీర్పును అత్యున్నత న్యాయస్థానం మానవీయ కోణంలో పరిశీలించాలి. ఎందుకంటే చాలా మంది ఉపాధ్యాయులకు కుటుంబానికి సంబంధించిన బాధ్యతలు కూడా ఎక్కువగా ఉన్నాయి. కొందరు తమ తల్లిదండ్రుల ఆరోగ్యం వంటి వాటిని చూసుకోవాల్సిన పరిస్థితులు ఉన్నాయి. అందువల్ల టెట్కు ప్రిపేర్ అయ్యేందుకు సమయం ఉండదు. వీటిని సుప్రీం కోర్టు పరిగణలోకి తీసుకోవాలి. –హేమ, పీఎస్హెచ్, భువనగిరిపల్లె, రాజంపేట మండలం రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి ఇర్సర్వీస్ ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణత సాధించాలన్న సుప్రీంకోర్టు తీర్పుపై రాష్ట్ర ప్రభుత్వం స్పష్టత ఇవ్వాలి. త్వరలోనే టెట్ పరీక్ష నిర్వహణకు నోటిఫికేషన్ విడుదలయ్యే అవకాశం ఉంది. అందువల్ల ప్రభుత్వం ఇన్సర్వీస్ ఉపాధ్యాయులకు టెట్ పరీక్ష ఉత్తీర్ణత నుంచి మినహాయింపు ఇచ్చే విధంగా జీఓ జారీ చేయాలి. –బిళ్ళా హరిప్రసాద్, యూటిఎఫ్ జిల్లా అధ్యక్షుడు సుప్రీంకోర్టు తీర్పు వల్ల ప్రభుత్వ పాఠశాలల్లో బోధన కుంటుపడే ప్రమాదం ఉందని విద్యావంతులు, మేధావులు అంటున్నారు. రెండేళ్లల్లో టెట్ ఉత్తీర్ణత సాధించక పోతే ఉద్యోగం వదులుకోవాల్సి ఉండటంతో ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణతపైనే దృష్టిసారిస్తారు. పాఠశాలలోనే ప్రిపేర్ అయ్యే అవకాశం లేకపోలేదు. అందువల్ల బోధన కుంటుపడే అవకాశం ఉంటుంది. ఇప్పటికే ప్రభుత్వం విద్యారంగంలో తీసుకొచ్చిన సంస్కరణల వల్ల రాష్ట్రంలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య లక్షల్లో తగ్గింది. అయితే ఉపాధ్యాయులు టెట్ ఉత్తీర్ణతపైనే దృషిసారిస్తే బోధన మరింత కుంటుపడి తద్వారా ప్రభుత్వ పాఠశాలల ఉనికికే ప్రమాదం ఉంటుందని విద్యావంతులు, మేధావులు అంటున్నారు. టీచర్లను కలవరపెడుతున్న సుప్రీంకోర్టు తీర్పు రెండేళ్లలో టెట్ పాస్ కాకపోతే పదోన్నతులు కరువే తీర్పుపై పునరాలోచించాలంటున్న ఉపాధ్యాయులు -
గాలివీడులో కుండపోత వర్షం
గుంతలమయైన రోడ్డులో వస్తున్న పాదచారులు వెలిగల్లు జలాశయానికి జలకళ గాలివీడు : వరుణుడు ఉగ్రరూపం దాల్చడంతో గాలివీడు మండలంలో శుక్రవారం రాత్రి కుండపోత వర్షం కురిసింది. 108.4 మిల్లీ మీటర్లుగా నమోదైందని ఏఎస్ఓ శ్రీదుర్గ తెలిపారు. ఈ వర్షానికి చెరువులు, వాగులు, వంకలు పొంగి పొర్లి ప్రవహించాయి. వెలిగల్లు జలాశయానికి వదర ప్రవాహం పెరగడంతో 3.027 నీటిమట్టం టీఎంసీలకు చేరుకుందని డీఈ శిరీష్కుమార్ తెలిపారు. జలాశయం పూర్తిస్థాయి సామర్థ్యం 4.64 టీఎంసీలు కాగా, ప్రస్తుతం 3.11 టీఎంసీలకు చేరింది. మండలంలోని గోరాన్ చెరువు నుండి వడిశలంకపల్లి వరకూ వరద నీరు పెరగడంతో పెద్ద చెరువుకు నీరు చేరింది. ఎల్లంపల్లి కుషావతి రిజర్వాయర్ నుంచి నడింపల్లి మీదుగా వచ్చే ప్రవాహంతో చిన్నేరు ఉద్ధృతంగా ప్రవహిస్తోంది. రాకపోకలకు అంతరాయం తంబళ్లపల్లె: వర్షాలకు మండలంలోని ములకలచెరువు రోడ్డు నుంచి గోపిదిన్నెకు వెళ్లే రోడ్డు చిన్నేరు మొరవనీటితో కొట్టుకుపోయింది. కోతకు గురికావడంతో వాహనాలు, పాదచారుల రాకపోకలకు అంతరాయం కలిగింది. వేపలపల్లె, అనగలవారిపల్లె, దిగువపల్లె, దిన్నెమీదపల్లె, మెరుసుపల్లి బురుజు ,కె.బి.తాండా, రాగిమానుదిన్నె నుంచి ప్రజలు నిత్యం తంబళ్లపల్లెకు ఈ రోడ్డు మార్గంలోనే రావాల్సి వుంది. గతంలో ఇక్కడ ద్విచక్ర వాహనం బోల్తాపడి చిన్నారి నీటిలో కొట్టుకుపోయి మృతి చెందిన సంఘటన చేసుకుంది. ప్రస్తుతం రోడ్డు కోతకు గురికావడంతో వాహనదారులు ప్రమాదాల బారిన పడుతున్నారు. కల్వర్టు ఏర్పాటు చేయాలని అధికారుల దృష్టికి తీసుకెళ్లినా పట్టించుకోవడం లేదని ప్రజలు వాపోతున్నారు. -
వైద్యుల నిర్లక్ష్యం.. పురిటి బిడ్డ మృతి
మదనపల్లె రూరల్ : గర్భం దాల్చి ప్రసవానికి వస్తే.. వైద్య సిబ్బంది తోచిన విధంగా కాన్పు చేయడంతో పురిటి బిడ్డ మృతి చెందిన ఘటన మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రిలో శనివారం జరిగింది. బాధితుల వివరాల మేరకు.. చిత్తూరు జిల్లా పుంగనూరు నియోజకవర్గం చౌడేపల్లె కుమ్మరవీధికి చెందిన మేసీ్త్ర ప్రసాద్ తన భార్య కవిత(35)కు పురిటినొప్పులు రావడంతో ప్రైవేట్ వాహనంలో శుక్రవారం రాత్రి ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకువచ్చారు. డ్యూటీ డాక్టర్లు అందుబాటులో లేకపోవడంతో నర్సింగ్ సిబ్బంది కవితను పరీక్షించి అడ్మిట్ చేసుకున్నారు. తల్లీ, బిడ్డ క్షేమంగా ఉన్నారని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని చెప్పారు. ఉదయం ఐదు గంటల సమయంలో నొప్పులు అధికమవడంతో కవితను కాన్పు గదికి తీసుకెళ్లారు. పది గంటల వరకు సిబ్బంది చికిత్స చేసి ఆడబిడ్డను బయటకు తీశారు. పుట్టిన బిడ్డలో చలనం లేక పోవడంతో వైద్యులకు సమాచారం అందించారు. అప్పుడు వచ్చిన వైద్యుడు బిడ్డను పరీక్షించి మృతి చెందినట్లు నిర్ధారించి కుటుంబ సభ్యులకు తెలిపారు. ఏళ్ల తర్వాత గర్భం దాల్చడం, బిడ్డ 3.6 కిలోల బరువు ఉండడంతో మృతి చెందిందని పేర్కొన్నారు. హైరిస్క్ గర్భవతి అడ్మిషన్లో ఉన్నా వైద్యులు ఒకసారీ పరీక్షించలేదని, వారు అందుబాటులో ఉండి చికిత్స అందించి ఉంటే బిడ్డ దక్కేదని కుటుంబ సభ్యులు విలపించారు. డ్యూటీ డాక్టర్లు విధుల్లో లేకపోవడం వల్లే తమ బిడ్డ మరణించిందని, వైద్యుల నిర్లక్ష్యంపై పోలీసులకు ఫిర్యాదు చేసి న్యాయంచేయాలని బాధితులు కోరారు. విచారించి బాధ్యులపై చర్యలు తీసుకుంటాంపురిటి బిడ్డ మృతి, వైద్యుల నిర్లక్ష్యంపై బాధితురాలి కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. ఆస్పత్రికి వచ్చినపుడు తల్లి గర్భంలోని బిడ్డ పరిస్థితి బాగా ఉండడంతో నార్మల్ డెలివరీ అవుతుందని భావించి వైద్య సిబ్బంది ప్రయత్నించారు. బిడ్డ అధిక బరువు ఉండడం, ఉమ్ము నీరు తాగడం, చాలా ఏళ్ల తర్వాత రెండో కాన్పు రావడ వంటి కారణాలతో బిడ్డ మృతి చెందినట్లు సిబ్బంది తెలిపారు. విచారించి చర్యలు తీసుకుంటాం. – షుకూర్, ఆర్ఎంఓ, జిల్లా ఆస్పత్రి, మదనపల్లి టూటౌన్ పోలీస్స్టేషన్లో బాధితుల ఫిర్యాదుఆస్పత్రికి వచ్చిన కవిత, మృతి చెందిన పురిటిబిడ్డ -
పేద విద్యార్థులకు వైద్య విద్య దూరం
రైల్వేకోడూరు అర్బన్ : రాష్ట్రంలో పేద విద్యార్థులకు వైద్య విద్య దూరమవుతోందని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు అన్నారు. మెడికల్ కాలేజీల ప్రవేటీకరణను వ్యతిరేకిస్తూ రచ్చబండ నిర్వహించి చంద్రబాబు తప్పిదాలను శనివారం ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా కొరముట్ల మాట్లాడుతూ పేదలకు వైద్యం అందాలనే ఉన్నత లక్ష్యంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ వైద్య కళాశాలలు నిర్మించారన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే ముఖ్యమంత్రి చంద్రబాబు వాటిని దోపిడీదారులకు తాకట్టు పెడుతున్నాడని ఆరోపించారు. పేద ప్రజలకు చంద్రబాబు చేసిందేమీ లేదని, అప్పులు తెచ్చి కార్పొరేట్లకు దోచిపెట్టే కార్యక్రమాలు చేస్తున్నారని విమర్శించారు. ముందుచూపుతో పేదలకోసం జగనన్న చేసిన అభివృద్ధి సంక్షేమాన్ని ధ్వంసం చేసే కార్యక్రమాలను మాత్రమే చేపడుతున్నారని ఆరోపించారు. రాజకీయ కక్షలను ప్రేరేపిస్తూ వైఎస్సార్సీపీ కార్యకర్తలను వేధిస్తున్నారని, అక్రమాలు, దౌర్జన్యాలు, అంటూ కేసులు పెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని పే ర్కొన్నారు. బాబు మోసపు పాలనను ప్రజలు గుర్తించి చైతన్య వంతులవుతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ ముద్దాబాబుల్రెడ్డి, వైస్ ఎంపీపీ రామిరెడ్డిధ్వజారెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, సీహెచ్.రమేష్, సుబ్బరామరాజు, చంద్రశేఖర్, మందలనాగేంద్ర, శివయ్య, సద్ధయ్య, మహేష్ రెడ్డి, నారాయణమ్మ, రమేష్, కృష్ణారెడ్డి, నందాబాల, ఆనంద్, రాజారెడ్డి, సుకుమార్, పవన్, గౌసియా, సుబ్రహ్మణ్యంరాజు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
సెగ్మెంట్.. సంపద!
కడప నగర వ్యూరాజంపేట: ఉమ్మడి కడపలో జిల్లాలో ధనిక నియోజకవర్గాలను గుర్తించారు. డైరెక్టర్ ఆఫ్ ఎకనామిక్స్, స్టాటిస్టిక్స్ వెలువరించిన సమాచారం మేరకు పులివెందుల ప్రథమ, బద్వేలు పదోస్థానంలో ఉంది. నియోజకవర్గాల అభివృద్ధి, పాడిపంటలు, పరిశ్రమలు లాంటి వాటిని భేరీజు చేసుకొని ఏ నియో జకవర్గం ధనికమో తేల్చారు. బద్వేలు.. 10వ స్ధానంలో ఉన్న బద్వేలు నియోజకవర్గం సంపద రూ. 2746 కోట్లు. పాడిపరిశ్రమంలో జిల్లాలో రెండో స్థానంలో ఉంది. ఫిషింగ్ సెక్టారులో జిల్లాలో మొదటి స్థానంలోఉంది. మిగిలిన అన్ని రంగాల్లో వెనుకబడి ఉంది. ప్రొద్దుటూరు.. తొమ్మిదో స్థానంలో ఉన్న ప్రొద్దుటూరు నియోజకవర్గం సంపద రూ.2778 కోట్లుగా ఉంది. వ్యవసాయ, పరిశ్రమల సెక్టారులో వెనుకబడి ఉంది. బంగారు, టెక్స్టైల్స్ వ్యాపారంతో ఈ నియోజకవర్గం అభివృద్ధి చెందింది. రైల్వేకోడూరు.. 8 స్థానంలో ఉన్న రైల్వేకోడూరు నియోజకవర్గం సంపద రూ3292కోట్లుగా ఉంది. మంగంపేట బైరెటీస్, ఉద్యాన వనంతో అభివృద్ధి చెందింది. మిగిలిన రంగాల్లో అభివృద్ధి చెందాలి. కమలాపురం.. 7వ స్థానంలో ఉంది. ఈ నియోజకవర్గ సంపద 3358 కోట్లు ఉంది. చిన్నపాటి ఆటోమొబైల్, ఇండ్రస్టీగా అభివృద్ధి చెందింది. మైదుకూరు. 6 వస్థానంలో ఉంది. ఈ నియోజకవర్గ సంపద రూ, 3430 కోట్లుగా ఉంది. వ్యవసాయరంగంలో రెండోస్ధానంలో ఉంది, వేరుశనగ అధిక విస్తీర్ణంలో సాగవుతుంది. రాజంపేట.. 5వ స్థానంలో ఉన్న రాజంపేట నియోజకవర్గ సంపద 3629 కోట్లుగా ఉంది. లైమ్స్టోన్, క్వారీ ఎక్కువగా జరుగుతుంది. అప్పుడప్పుడు కరవు వల్ల రైతులు నష్టపోతున్నారు. కడప.. 4వ స్థానంలో ఉన్న కడప నియోజకవర్గ సంపద రూ. 3718 కోట్లు. మ్యానుఫ్యాక్చరింగ్ పరిశ్రమలు బాగా అభివృద్ధి చెందాయి. రాయచోటి.. 3వ స్థానంలో ఉన్న రాయచోటి నియోజకవర్గ సంపద రూ. 4145 కోట్లు. ఈ ప్రాంతం రియల్ఎస్టేట్, నిర్మాణ రంగంలో అభివృద్ధి చెందింది. జమ్మలమడుగు.. 2 స్థానంలో ఉన్న జమ్మలమడుగు నియోజకవర్గం సంపద రూ.4906 కోట్లు, సిమెంట్ ఫ్యాక్టరీలు ఉన్నాయి. పరిశ్రమల రంగంలో బాగా ఉంది. జగన్నపాలనలో నియోజకవర్గాల అభివృద్ది.. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో ఉమ్మడి కడప జిల్లాలోని అన్ని నియోజకవర్గాలు అభివృద్ధి పథంలో నడిచాయి.ఇప్పుడు కూటమి పాలనలో నియోజకవర్గాల అభివృద్ధి గురించి పట్టించుకోలేదనే అపవాదు ను మూటకట్టుకుందని పరిశీలకులు భావిస్తున్నారు. నియోజకవర్గం సంపద (రూలలో)పులివెందుల నియోజకవర్గ సంపద రూ. 5573 కోట్లు. వ్యవసాయరంగంలో ప్రథమ స్థానంలో ఉంది. తుమ్మలపల్లె యురేనియం ప్రపంచంలో ఉన్న అతిపెద్ద యురేనియం మైన్స్లో ఒకటిగా ప్రథమస్ధానంలో పులివెందుల పదో స్ధానంలో బద్వేలు.. జగనన్న పాలనలోనియోజకవర్గాల అభివృద్ధి పులివెందుల 5573 జమ్మలమడుగు 4906 రాయచోటి 4145 కడప 3718 రాజంపేట 3629 మైదుకూరు 3430 కమలాపురం 3358 రైల్వేకోడూరు 3292 ప్రొద్దుటూరు 2778 బద్వేలు 2746 -
ఈతకు వెళ్లి వ్యవసాయ విద్యార్థి మృతి
మహానంది : ఈత సరదా ఓ విద్యార్థి ప్రాణం బలిగొంది. మహానంది సమీపంలోని ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ కళాశాలకు చెందిన ఓ విద్యార్థి పాలేరు వాగులో నీట మునిగి మృతి చెందాడు. మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, స్థానికులు తెలిపిన వివరాల మేరకు...అన్నమయ్య జిల్లా కంభంవారిపల్లె మండలం జిల్లెలమంద సమీపంలోని పెద్దతాండకు చెందిన బి.జనార్ధన్నాయక్ (21) మహానంది సమీపంలోని వ్యవసాయ కళాశాలలో మూడో సంవత్సవరం చదువుతున్నాడు. ఈ క్రమంలో శనివారం కళాశాల సమీపంలోని పాలేరువాగు వద్దకు తోటి విద్యార్ధులతో కలిసి వెళ్లాడు. అక్కడ కొంత మంది దుస్తులను శుభ్రం చేసుకోవడంతో పాటు ఈతకు దిగారు. ఈ క్రమంలో ఐదారుగురు ఈతకు దిగగా సరిగా ఈత రాని జనార్ధన్ నాయక్ వాగులోకి దిగాడు. కొద్ది సేపటికి పక్కనే ఉన్న అతను కనిపించకపోవడంతో మిగిలిన విద్యార్థులు అన్వేషించగా అక్కడే లోతు ఉన్న గుంతలో అపస్మారక స్థితిలో కనిపించాడు. బయటికి తీసి ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం నంద్యాల ప్రభుత్వాస్పత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. విషయం తెలుసుకున్న మహానంది ఎస్ఐ రామ్మోహన్రెడ్డి, పోలీసులు, కళాశాల ప్రిన్సిపాల్ తదితరులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. విద్యార్థి తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి విచారణ చేపడుతున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
డిసెంబరు 23న అంతర్జాతీయ సదస్సు
రాజంపేట: ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై చర్చ, ఆవిష్కరణలను ప్రోత్సహించడమే లక్ష్యంగా డిసెంబరు 23వ తేదీ నుంచి 24వ తేదీ వరకు అంతర్జాతీయ సదస్సు నిర్వహించనున్నట్లు అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి తెలిపారు. ఏయూ వీసీ చాంబర్లో సదస్సుకు సంబంధించిన బ్రోచర్లను శనివారం ఆయన విడుదల చేశారు. ఆయన మాట్లాడుతూ భవిష్యత్తులో అంతర్జాతీయ స్థాయి పరిశోధనల్లో ఏయూ మరింత ముందంజలో నిలుస్తుందని, నేటి యుగం డేటా ఆధారంగా ముందుకు సాగుతుందని తెలిపారు. ఏయూ వీసీ డా.సాయిబాబారెడ్డి మాట్లాడుతూ డేటాసైన్స్, ఆర్టిఫిషయల్ ఇంటెలిజెన్స్, మెషిన్ లెర్నింగ్ రంగాలు నేటి సాంకేతిక ప్రపంచానికి నడిపించే శక్తులుగా మారాయన్నారు. ఆధునిక సాంకేతిక రంగాలపై ప్రపంచ వ్యాప్తంగా ఉన్న శాస్త్రవేత్తలు, పరిశోధకులు, విద్యార్ధులు తమ పరిశోధనాపత్రాలను సమర్పించనున్నారని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎఐటీఎస్ వైస్ ఛ:ర్మన్ చొప్పాఎల్లారెడ్డి, ప్రిన్సిపల్ డా.నారాయణ, డిప్యూటీ డైరెక్టర్ ఆడ్మిషన్స్ డా.జయరామిరెడ్డి, ప్రోగ్రాం చైర్ డా.చిన్నబాబు, కన్వీనర్ నాగరాజు, పబ్లికేషన్ చైర్స్ డా.పహీముద్దీన్, డా.వెంకటేష్, ఆర్గనైజింగ్ సెక్రటరీ డా.షేక్ కరీముల్లా పాల్గొన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ అధినేత చొప్పా గంగిరెడ్డి -
పల్లె వైద్యం.. పరిస్థితి దైన్యం
రాయచోటి: పల్లె వైద్యం కుంటుపడింది. సమస్యల పరిష్కారానికి పీహెచ్సీల వైద్యులు చేపట్టిన సమ్మె 15వ రోజుకు చేరుకుంది. జ్వరాలతో ఆస్పత్రికి వచ్చే రోగులకు సరైన వైద్యం కరువైంది.ప్రభుత్వం సరైన ప్రత్యామ్నాయ చర్యలు చేపట్టలేదన్న ఆరోపణలు ఉన్నాయి. ప్రభుత్వ ఆదేశాల మేరకు డెంటల్, స్కిన్, ఆర్తో, కంటి వైద్య నిపుణులను అక్కడక్కడా ఏర్పాటుచేసిన ఫలితాలు కనిపించలేదు. చాలామంది వైద్యులు సెలవులపై వెళ్లినట్లు సమాచారం. దీంతో ఆసుపత్రికి వచ్చిన వారు అక్కడున్న నర్సులు, సిబ్బంది అందిస్తున్న వైద్యంతో సరిపెట్టుకోవాల్సి వస్తోంది. జిల్లాలో 30 మండలాల్లో 51 పీహెచ్సీలు ఉన్నాయి. ఒక పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు, ముగ్గురు నర్సులతో పాటు మిగతా సిబ్బంది ఉంటారు. ఇప్పుడు వైద్యులు లేకపోవడంతో పేషెంట్స్ను చూసే బాధ్యత నర్సులపై పడింది. కొన్ని వ్యాధులకు వైద్య పరీక్షలు నిర్వహించి, ఆ నివేదిక ద్వారా మందులు ఇవ్వాలి. ఈ పనులను నర్సులు చేయలేరు. దీంతో వ్యాధిగ్రస్తులు తీవ్ర ఇబ్బందులు పడనున్నారు. డాక్టర్లు లేరని తెలుసుకున్న స్థానికులు వైద్యం కోసం పట్టణాల్లోని ప్రైవేట్ ఆసుపత్రులకు వెళుతున్నారు. మరికొందరు సమీపంలోని ఆర్ఎంపీలను ఆశ్రయిస్తున్నారు. ● వైద్యుల ఇన్ సర్వీసు పీజీ కోటాను పునరుద్ధరించాలి, కచ్చితమైన పని గంటలను నిర్దేశించాలని కోరుతూ వైద్యులు సమ్మె చేస్తున్నారు. అయితే ప్రభుత్వం సమ్మెను విఫలం చేయాలన్న ఉద్దేశంతో ప్రత్యామ్నాయంగా సర్వజన ఆస్పత్రి.. తదితర ప్రభుత్వ విభాగాల నుంచి కొంతమంది వైద్యులను పీహెచ్సీలకు పంపింది. అయితే స్థానిక వైద్యులు సమ్మెలో ఉన్న కారణంగా పల్లెవాసులకు వైద్య సేవలు అందడం గగనంగా మారింది. ప్రభుత్వ మొండి వైఖరి పట్ల గ్రామీణులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యలను పరిష్కరించి సమ్మె విరమణకు చర్యలు చేపట్టాలని కోరుతున్నారు. సమస్యలు పరిష్కరించాలి వైద్యుల న్యాయపరమైన సమస్యలను ప్రభుత్వం పరిష్కరించాలి. ఇకపై ప్రభుత్వ ఆదేశాల మేరకు ప్రైమరీ ఆరోగ్య కేంద్రాలకు వస్తున్న వైద్యుల మద్దతును కూడా కోరతాం. న్యాయపరమైన డిమాండ్లను ప్రభుత్వం పరిష్కరించే వరకు ఉద్యమాన్ని కొనసాగిస్తాం. –రమేష్ బాబు, జిల్లా ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్ డాక్టర్స్ అసోసియేషన్ అధ్యక్షుడు 15వ రోజుకు చేరిన వైద్యుల సమ్మె.. వైద్యం అందక గ్రామీణలకు అవస్థలు -
13 నుంచి తిరుపతిలో రెసిడెన్సియల్ శిక్షణ
కడప అగ్రికల్చర్: వైఎస్సార్ కడపజిల్లా రైతు సాధికారత సంస్థ వారి ఆధ్వర్యంలో నేషనల్ మిషన్ ఫర్ న్యాచురల్ ఫామింగ్(ఎన్ఎంఎన్ఎఫ్) పోగ్రాం ద్వారా బయో రీసోర్సు సెంటర్పై ఈ నెల 13వ తేదీ నుంచి నాలుగు రోజులపాటు ఉచితంగా శిక్షణ ఇవ్వననున్నారు. ఈ విషయాన్ని జిల్లా ప్రకృతి సేద్యం ప్రాజెక్టు మేనేజర్ ప్రవీణ్కుమార్ తెలిపారు. తిరుపతిలో రెసిడెన్సియల్ శిక్షణా కేంద్రంలో శిక్షణకు ఆసక్తి గలిగిన రైతులు 9849900965 నెంబర్కు కాల్ చేసి పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో రెండోశనివారం సీతారామలక్ష్మణ మూర్తులకు స్నపన తిరుమంజనం శాస్త్రోక్తంగా నిర్వహించారు. ముందుగా మూల విరాట్కు పంచామృతాభిషేకం జరిపారు. టీటీడీ అధికారులు తీసుకొచ్చిన నూతన పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సుందరంగా అలంకరించారు. సీతారామలక్ష్మణులకు ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. రెండో శనివారం కావడంతో స్వామివారి దర్శనానికి భక్తులు పొటెత్తారు. రాయచోటి: ప్రధాన మంత్రి ధన ధాన్య కృషి యోజన కార్యక్రమంలో జిల్లాలోని రైతుల ఆదాయం రెట్టింపు చేయడమే లక్ష్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. ప్రధాన మంత్రి నరేంద్రమోదీ శనివారం ఉదయం దేశవ్యాప్తంగా వంద జిల్లాలో పీఎం ధన ధాన్య కృషి యోజన కార్యక్రమాన్ని ప్రారంభించారు. కార్యక్రమం ప్రారంభం అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ వ్యవసాయ ఉత్పాదకత పెంచడం, ఎక్కువ భూమిని సాగులోకి తీసుకురావడం, పంటల రుణాలను రైతులకు చేరవేయడమే లక్ష్యంగా ఈ పథకం అమలవుతుందన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం, పాడి పరిశ్రమ ఇతర అనుబంధ రంగాలు అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో జిల్లా ఇన్న్చార్జి వ్యవసాయాధికారి మజీద్ అహ్మద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి సుభాషిణి, పీడీ ఏపీఎంఐపీ లక్ష్మీ ప్రసన్న, జిల్లా పశు సంవర్ధకశాఖ అధికారి గుణశేఖర్ పిళ్లై, నాబార్డు అధికారి విజయ విహారం, ఎల్డీఎం ఆంజేయులు, జిల్లా సహకార శాఖ అధికారి గురు ప్రకాష్, మత్స్యశాఖ అధికారి సుశ్మిత, జిల్లా సాగునీటి శాఖ అధికారి సాయిరాం తదితరులు పాల్గొన్నారు. -
నూతన కమిటీ ఏర్పాటు
సిద్దవటం: మండలంలోని వంతాటిపల్లి గ్రామం సమీపంలోని లంకమల అడవుల్లో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి ఆలయం నూతన ధర్మకర్తల మండలిని కమిషనర్ దేవాదాయ శాఖ విజయవాడ వారు నియమిస్తూ ఉత్తర్వులను జారీ చేశారు. ఈమేరకు ఆలయ కార్యనిర్వహణాధికారి ఏ.శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ ఛైర్మన్గా జంగిటి రాజేంద్రప్రసాద్యాదవ్, సభ్యులుగా పి.మల్లీశ్వరి, పి.వసంత, బి.వెంకటసుబ్బయ్య, వి.కృష్ణయ్య, ఆర్.పార్వతమ్మ, సి.వెంకటసుబ్బయ్య, కె.రాజేశ్వరి, జె.శివారెడ్డి, కె.రూప నియమితులైనట్లు ఆయన తెలిపారు. రాయచోటి: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే జీఎస్టీ తగ్గింపును ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శుక్రవారం రాయచోటిలోని పంక్షన్హాల్లో జిల్లా వాణిజ్య పన్నులశాఖ, పరిశ్రమల శాఖల ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఎలక్ట్రానిక్ వస్తువులను జీఎస్టీ తగ్గింపుపై సూపర్ జీఎస్టీ సూపర్ సేవింగ్స్ అవగాహన, ఎగ్జిబిషన్ కార్యక్రమాలను జిల్లా కలెక్టర్ సందర్శించారు. జీఎస్టీ తగ్గింపు వల్ల ఎలక్ట్రానిక్ వస్తువులైన ఫ్రిజ్, మైక్రోవేవ్ ఓవెన్ టీవీలు, వాషింగ్ మెషిన్లు వంటి ఎలక్ట్రానిక్ వస్తువులు తక్కువ ధరకే ప్రజలకు అందుబాటులో ఉంటాయని ఈ సౌకర్యాన్ని ప్రజలు వినియోగించుకోవాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్, వాణిజ్య పన్నులశాఖ, పరిశ్రమల శాఖ అధికారులు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: న్యూఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి మొదటి పారా యోగసనా స్పోర్ట్స్’ ఛాంపియన్షిప్–2025లో స్థానిక వెలుగు ప్రత్యేక పాఠశాల విద్యార్థిని జి.మధులత అండర్–17 బాలికల విభాగంలో ప్రతిభ కనబరించింది.ద్వితీయ స్థానం దక్కించుకుని సిల్వర్ మెడల్ కై వసం చేసుకుంది. శుక్రవారం పాఠశాలలో అభినందన సభ ఏర్పాటు చేశారు. యోగసన భారత్ పోటీలు మొరార్జీ దేశాయ్ నేషనల్ ఇన్సిట్యూట్ ఆఫ్ యోగా ప్రాంగణంలో పోటీలు నిర్వహించారు. వివిధ రాష్ట్రాల నుంచి దివ్యాంగులు పాల్గొన్నారు. వెలుగు కన్వీనర్ భాగ్యలక్ష్మి మాట్లాడుతూ దివ్యాంగురాలైన మధులత యోగా మాస్టర్ అనిత వద్ద శిక్షణ తీసుకున్నట్లు పట్టుదలతో జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నట్లు తెలిపారు. కార్యక్రమంలో వెలుగు సెక్రటరీ ఉదయమోహన్రెడ్డి, ప్రిన్సిపాల్ లీనాకుమారి తదితరులు పాల్గొన్నారు. -
● సంఖ్య పెరిగే ఛాన్స్
నకిలీమద్యం తయారీ కేసులో నిందితుల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. ఈనెల మూడున 12 మందిపై నమోదుచేయగా విచారణలో మరో ఇద్దరిని నిందితులు చేశారు. వీరికి తోడు మరో ఏడుగురిని చేర్చగా మళ్లీ మరో ఇద్దరిని చేర్చడంతో ఇప్పటికి ఈ కేసులో నిందితుల సంఖ్య 23కు చేరింది. కేసు దర్యాప్తు ముగింపు కు వచ్చేలోగా నిందితుల సంఖ్య పెరగొచ్చని భావిస్తున్నారు. కాగా అరెస్ట్ చేయాల్సిన నిందితుల కోసం ఎకై ్సజ్ పోలీసు బృందాలు ఆంధ్రా–కర్ణాటకల్లోని వివిధ ప్రాంతాల్లో గాలింపు చర్యలు చేపట్టారు. -
‘పీఎం ధనధాన్య కృషి యోజన’జిల్లాకు ఒకవరం
రాయచోటి: ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమం జిల్లాకు వరం కానుందని 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ పేర్కొన్నారు. శుక్రవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో కలెక్టర్ నిశాంత్ కుమార్తో కలిసి అక్టోబర్ 11న ప్రధాన మంత్రి నరేంద్రమోదీ ప్రారంభించే ప్రధాన మంత్రి ధనధాన్య కృషి యోజన కార్యక్రమంపై వివిధ శాఖల అధికారులతో సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఏపీలో నాలుగు జిల్లాలను ఇందులో భాగస్వామ్యం చేసినట్లు, జిల్లాకు చోటు లభించడం అతిపెద్ద వరమని లంక దినకర్ అన్నారు. ఈ పథకం ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరం నుంచి ఆరేళ్లపాటు ఏటా రూ. 24 వేల కోట్లు కేటాయిస్తారన్నారు. వ్యవసాయంలో తక్కువ ఉత్పాదకత, క్లిష్టతర వ్యవసాయ పరిస్థితులు, సగటున తక్కువ వ్యవసాయ రుణాలు తీసుకునే పరిస్థితులు ఉండే జిల్లాను ఆకాంక్షిత వ్యవసాయ జిల్లాగా తీసుకోవాలని కేంద్ర ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. వ్యవసాయ ఉత్పాదకత పెంపు, వాతావరణ పరిస్థితులకు అనుకూలంగా పంటల మార్పు, సానుకూల వ్యవసాయ పద్దతులను అనుకరించేలా చేయడం, పంచాయతీ, బ్లాక్ స్థాయిలో పంటకోత, అంతర పంట నిల్వకు అవసరమైన చర్యలు, నీటి వనరుల లభ్యతను పెంచడం, స్వల్ప, దీర్ఘకాలిక రుణాల లభ్యత అనే ఐదు లక్ష్యాలతో ఈ పథకం అమలవుతుందన్నారు. జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రధాన మంత్రి ధనధ్యాన కృషి యోజన కార్యక్రమానికి జిల్లా ఎంపిక కావడం సంతోషకరమన్నారు. ఈ కార్యక్రమం ద్వారా వ్యవసాయం, పాడి పరిశ్రమ, ఉద్యానవనం, ఇతర అనుబంధ రంగాలు జిల్లాలో అభివృద్ధి చెందుతాయని ఆకాంక్షించారు. ● 20 పాయింట్ల కార్యక్రమం చైర్మన్ లంక దినకర్ -
వెంటిలేటర్పై పేదల ఆరోగ్యం
రాయచోటి: ‘ఎన్టీఆర్ వైద్యసేవ’ (ఆరోగ్యశ్రీ) పథకం అస్తవ్యసగా మారింది. ఈ పథకంలో భాగంగా కార్పొరేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పేదలకు ఉచితంగా వైద్య సేవలు అందించడమే ప్రధాన ఉద్దేశం. అయితే ప్రభుత్వం ఈ నెట్ వర్క్ ఆసుపత్రులకు సకాలంలో బిల్లులు చెల్లించకపోవడంతో పెండింగ్ బిల్లులు రూ.కోట్లల్లో పేరుకుపో యాయి. దీంతో ఆసుపత్రుల యాజమాన్యాలు ‘బకాయిలు చెల్లిస్తే గాని తాము కోలుకోలేము..పేదలకు ఉచిత వైద్యం అందించలేము’ అని చెప్పాయి. ● ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లో గడిచిన సెప్టెంబర్ నెలలో ఉచిత ఓపీ సేవలను నిలిపేసి తమ నిరసనను తెలిపారు. తాజాగా శుక్రవారం నుంచి పూర్తిగా అన్ని వైద్యసేవలను నిలుపుదల చేశారు. ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల యాజమాన్యాలు గత్యంతరం లేక సంపూర్ణంగా వైద్యసేవలను బంద్ చేశారు. గుండె, న్యూరో తదితర పెద్ద జబ్బులకు ప్రైవేట్ నెట్వర్క్ ఆసుపత్రుల్లోనే వైద్యసేవలు లభిస్తాయి. ఇప్పుడు పూర్తిగా వైద్యసేవలను నిలుపుదల చేయడంతో పేదల బాధలు వర్ణనాతీతంగా మారాయి. ● సూచనలు, సలహాలు ఇవ్వడానికి నెట్వర్క్ ఆసుపత్రుల్లో వైద్యమిత్రల డెస్క్ ఉంటుంది. ఇక్కడికి యథాలాపంగా వచ్చే రోగులకు వైద్యమిత్రల బంద్ జరుగుతోంది. వైద్యసేవలు అందుబాటులో లేవు. మీరంతా రాయచోటి, మదనపల్లె రాజంపేట, పీలేరు పట్టణాల్లోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి లేదా ఇతర ప్రభుత్వాసుపత్రులకు వెళ్లండని సలహా ఇస్తున్నారు. దీంతో పెద్ద జబ్బు అయితే కడప రిమ్స్, తిరుపతి, మదనపల్లె జిల్లా ఆసుపత్రితో పాటు ఇతర ప్రభుత్వాసుపత్రులకు వెళ్తున్నారు. చిన్న సమస్య అయితే ప్రైవేట్ ఆసుపత్రికి వెళ్తున్నారు. ఇక్కడ డాక్టర్ ఫీజు వంద రూపాయల నుంచి రూ.300 పైగా చెల్లిస్తున్నారు. వైద్య పరీక్షలకు ఎంత లేదన్నా రూ.300 నుంచి రూ.2 వేల వరకు ఖర్చు చేస్తున్నారు. అదే స్కానింగ్కు అయితే రూ.7 వేల వరకు చెల్లించాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిలాలో డెంగీ, టైఫాయిడ్ జ్వరాలు ఎక్కువగా ఉన్నాయి. ఇలాంటి తరుణంలో వైద్యసేవల బంద్తో చాలా ఇబ్బందులు పడుతున్నారు. ప్రైవేట్ నెట్ వర్క్ ఆసుపత్రుల్లో పూర్తిగా నిలిచిన వైద్య సేవలు ‘ఎన్టీఆర్ వైద్య సేవ’లపై ‘పచ్చ’ నీడలు -
మాదక ద్రవ్యాల నియంత్రణకు పటిష్ట చర్యలు
రాయచోటి: జిల్లాలో మాదక ద్రవ్యాలను పూర్తిస్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో మాదక ద్రవ్యాల జిల్లాస్థాయి కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునిబిల్లితో కలిసి కలెక్టర్ సమావేశాన్ని నిర్వహించారు. యువత మాదక ద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎస్పీ మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్పై జిల్లాలో ఇప్పటి వరకు గ్రామాల్లో డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంపై అవగాహన కార్యక్రమాలను చేపట్టినట్లు తెలిపారు. జనవరి 1 నుంచి అక్టోబర్ 10 వరకు 8 గంజాయి కేసులు పెట్టి 51.05 కేజీలు సీజ్ చేసినట్లు చెప్పారు. 38 మంది నిందితులను గుర్తించి వారిలో 33 మందిని అదుపులోకి తీసుకున్నామన్నారు. అనంతరం డ్రగ్స్, గంజాయి నేరం, డ్రగ్స్ వద్దు స్కిల్ ముద్దు, డ్రగ్స్ వద్దు బ్రో, పోస్టర్లను జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు. ● ఎస్సీ, ఎస్టీలకు అన్యాయం జరగకుండా జిల్లాలో సామాజిక రుగ్మతలను సమూలంగా తొలగించడమే లక్ష్యంగా పారదర్శకంగా విధులు నిర్వర్తించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులలో బాధితులకు న్యాయంతోపాటు త్వరితగతిన కేసులను పరిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీకి సంబంధించిన కేసులకు సంబంధించి ఎక్కడ అన్యాయం జరగకుండా పోలీసుశాఖ తరపున చర్యలు తీసుకుంటామన్నారు. -
హెడ్ ఫోస్టాపీసు ఎదుట ధర్నా
మదనపల్లె సిటీ : స్థానిక బెంగళూరురోడ్డులోని హెడ్ ఫోస్టాపీసు ఎదుట శుక్రవారం ఆలిండియా పోస్టల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు ధర్నా చేశారు. కేంద్ర ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలు భాగంగా తపాల ఉద్యమ జాతీయ నాయకుడు మహదేవయ్యను ఉద్యోగంలోకి తొలగించినందుకు నిరసన కార్యక్రమం నిర్వహించారు. యూనియన్ నాయకులు ప్రభాకర్రెడ్డి మాట్లాడుతూ కమలేష్ చంద్ర కమిటీ ఇచ్చిన సానుకూల సిఫార్సులను అమలు చేయని కారణంగా క్రామేడ్ మహదేవయ్య ఆధ్వర్యంలో 2023 డిసెంబర్లో నిరవధిక సమ్మె చేశామన్నారు. ఆనాడు సమ్మెకు నాయకత్వం వహించినందుకు చార్జిషీట్ ఇచ్చి ఈనెల 8వతేదీన ఉద్యోగం నుంచి తొలగించారన్నారు. మహదేవయ్యను తిరిగి విధుల్లోకి చేర్చుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో భాస్కర్, సర్దార్, విజయకుమార్, రామమూర్తి, రాజేంద్రప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. సౌత్ ఇండియా లెవెల్ క్యారమ్స్ పోటీలు ప్రారంభం నందలూరు : నందలూరు రైల్వే కేంద్రంలోని రైల్వే ఇన్స్టిట్యూట్లో యంగ్ మెన్స్ క్యారమ్స్ అసోసియేషన్ వారి ఆధ్వర్యంలో సౌత్ ఇండియా లెవెల్ క్యారమ్స్ పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. ఈ పోటీలను ఎంపీపీ మేడా విజయభాస్కర్రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సౌత్ ఇండియా జోన్ లెవెల్లో నందలూరులో టోర్నమెంట్ జరపడం ఎంతో సంతోషం అన్నారు. క్రీడాకారులకు, కళాకారులకు మేడా కుటుంబం ఎప్పుడూ తోడుగా ఉంటుందని అన్నారు. మూడు రోజుల పాటు జరిగే పోటీలలో కర్ణాటక, తమిళనాడు, కేరళ రాష్ట్రాలకు చెందిన క్రీడాకారులు పాల్గొనడం విశేషం. క్రీడాకారులకు మూడు రోజుల పాటు భోజన సదుపాయాన్ని కల్పిస్తున్నారు. కార్యక్రమంలో యంగ్ మెన్స్ క్యారమ్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ బిఎన్ శంకర్, సభ్యులు ఆర్ముగం విశ్వనాథ్, పల్లె గ్రీస్మంత్రెడ్డి, వేపగుంట శ్యామ్రాజ్, నాగభూషణం, శివకోటి, గురుప్రసాద్, జంగంశెట్టి హరిప్రసాద్, ముమ్మడిశెట్టి సుధాకర్, మండల జేసీఎస్ కన్వీనర్ కలీముల్లాఖాన్, మాజీ ఏజీపీ శమీవుల్లాఖాన్, ఆనాల మధుయాదవ్ తదితరులు పాల్గొన్నారు. సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలి – జిల్లా మహిళా సోషల్ కౌన్సిలర్ ఫిమా అంజుమ్ రాయచోటి అర్బన్ : బాలికలకు సమాజంలో ఆకస్మికంగా ఎదురయ్యే సమస్యలను ధైర్యంగా ఎదుర్కోవాలని జిల్లా మహిళా సోషల్ కౌన్సిలర్ ఫిమా అంజుమ్, పారా లీగల్ సభ్యులు చంద్రకళ పేర్కొన్నారు. శనివారం పట్టణంలోని శ్రీ షిర్డిసాయి మహిళా డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన అవగాహన సదస్సులో వారు మాట్లాడారు. మహిళల పట్ల జరిగే అన్యాయాలు, అక్రమాలను ఏ విధంగా ఎదుర్కొవాలో తెలిపారు. మహిళా సాధికారిత , ఉమెన్ ఎంప్లాయ్మెంట్ గురించి తెలిపారు. జిల్లా కేంద్రంలో కేంద్ర ప్రభుత్వం ఆధారంగా ఏర్పాటు చేసిన వన్ స్టాప్ సెంటర్ సర్వీస్, మహిళా, శిశు సంక్షేమ శాఖ డిపార్ట్ మెంట్ ద్వారా బాలికలకు, మహిళలకు రక్షణ కల్పిస్తున్నట్లు తెలిపారు. పని చేస్తున్న ప్రదేశంలో సమస్యలు, లైంగిక వేధింపులు ఉన్నప్పుడు వాటిని ఎలా ఎదుర్కొవాలో తెలియజేశారు. పెళ్లి తరువాత ఎదురయ్యే మానసిక, శారీరక సమస్యలను ఎలా పరిష్కరించుకోవాలో వివరించారు. -
సంబేపల్లెలో చోరీ
సంబేపల్లె : మండల కేంద్రంలోని జాతీయ రహదారి పక్కన నివాసం ఉంటున్న చింతం రంగారెడ్డికి చెందిన ఇంట్లో గురువారం రాత్రి పన్నెండు గ్రాముల బంగారం చోరీ అయినట్లు పోలీసులు తెలిపారు. రంగారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి బెంగళూరుకు వెళ్ళడంతో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటి తాళాలు పగులకొట్టి ఇంటిలోకి ప్రవేశించి పది గ్రాముల గొలుసు, రెండు గ్రాముల ఉంగరాలు దొంగలించుకు పోయినట్లు పోలీసులు తెలిపారు. ఎస్ఐ రవికుమార్ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. బాధితుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు పెద్దతిప్పసముద్రం : తాగునీటి విషయంలో ఓ వ్యక్తిని కట్టెతో దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ హరిహరప్రసాద్ శుక్రవారం పేర్కొన్నారు. ఎస్ఐ కథనం మేరకు మండలంలోని రాపూరివాండ్లపల్లి పంచాయతీ నాగన్నకోటకు చెందిన తండ్రీ, కొడుకులైన మల్లికార్జున, చరణ్, మధులు కలసి అదే గ్రామానికి చెందిన గండికోట వెంకటేష్పై దాడి చేసి గాయపరిచారన్నారు. బాధితుడి భార్య సరస్వతి ఫిర్యాదు మేరకు దాడికి పాల్పడిన వారిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. వేడినీళ్లు మీద పడి బాలుడికి తీవ్రగాయాలు మదనపల్లె రూరల్ : వేడినీళ్లు మీద పడి బాలుడు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం ములకలచెరువు మండలంలో జరిగింది. వేపూరికోటకు చెందిన నాగరాజ, సుహాసిని దంపతుల కుమారుడు పృథ్వీ(5) ఇంట్లో ఆడుకుంటుండగా, స్టవ్పై అన్నం వండేందుకు ఉంచిన వేడినీళ్లు ప్రమాదవశాత్తు శరీరం మీద పడ్డాయి. దీంతో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబసభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి చికిత్సలు చేయించారు. రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి..మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనాలు ఎదురెదురుగా ఢీకొని ముగ్గురు తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని వేంపల్లె పంచాయతీ జంగాలపల్లెకు చెందిన నారాయణ(50) శుక్రవారం సాయంత్రం పట్టణంలోని ఓ కాలేజీలో చదువుతున్న తన కుమార్తె భావన(20)ను బైక్లో ఎక్కించుకుని ఇంటికి వస్తుండగా, చిప్పిలి సమీపంలో బెంగళూరు నుంచి రాయచోటికి వెళుతున్న సాఫ్ట్వేర్ ఉద్యోగి మల్లిక (28) వేగంగా వచ్చి ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. ప్రమాదంలో ముగ్గురు తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు బాధితులను ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
మదనపల్లె జిల్లా కాబోతోందా...?
– నూతన భవన నిర్మాణాలకు స్థలం చదును మదనపల్లె రూరల్ : మదనపల్లె జిల్లా కేంద్రంగా చేయాలంటూ గత కొంత కాలంగా అన్ని వైపుల నుంచి డిమాండ్లు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో జిల్లా కాబోతున్నట్లు సంకేతాలు అందుతున్నాయి. అందులో భాగంగా మదనపల్లెలో నూతన ఎస్పీ క్యాంపు కార్యాలయం, డీఎస్పీ కార్యాలయ భవన నిర్మాణాలకు ప్రభుత్వం నుంచి అనుమతులు అందాయి. శుక్రవారం స్థానిక డీఎస్పీ మహేంద్ర ఆదేశాలతో తాలూకా పోలీసుస్టేషన్ వద్ద ఉన్న ఖాళీ స్థలాన్ని వన్టౌన్ సీఐ మహమ్మద్రఫీ పర్యవేక్షణలో ఎస్ఐలు శివకుమార్, అన్సర్బాషా చదును చేయించారు. రెండు రోజుల్లో జిల్లా ఎస్పీ ధీరజ్కనుబిల్లి నూతన భవన నిర్మాణాలకు భూమి పూజ చేయనున్నట్లు తెలుస్తోంది. శుక్రవారం రోజంతా పోలీసు అధికారులు స్థలం చదును చేయించే కార్యక్రమంలో నిమగ్నమయ్యారు. ఈ విషయమై డీఎస్పీ మహేంద్రను అడుగగా జిల్లా ఎస్పీ క్యాంపు కార్యాలయం, డీఎస్పీ నూతన కార్యాలయ భవన నిర్మాణాలకు అనుమతులు వచ్చిన విషయం వాస్తవమేనన్నారు. త్వరలోనే నిర్మాణ కార్యక్రమాలు ప్రారంభమవుతాయన్నారు. గ్లోబల్ ఇంటర్న్షిప్ విజయవంతం – ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి రాజంపేట : జర్మనీ ఆటోసాల్ వింటర్ స్కూల్ గ్లోబల్ ఇంటర్న్షిప్ విజయవంతం కావడం అభినందనీయమని అన్నమాచార్య యూనవర్సిటీ చాన్స్లర్ చొప్పా గంగిరెడ్డి కొనియాడారు. శుక్రవారం ఆటోసాల్ వింటర్స్కూల్ గ్లోబల్ ఇంటర్న్షిప్ విజయవంతం కావడానికి కారణమైన వారిని అభినందించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ బీటెక్ విద్యార్ధి జగదీష్ సెప్టెంబరు 14 నుంచి 28 వరకు జర్మనీలో నిర్వహించిన గ్లోబల్ ఇంటర్న్షిప్ విజయవంతం చేయడం జరిగిందన్నారు. ఏయూ ప్రో–చాన్స్లర్ చొప్పా అభిషేక్రెడ్డి ప్రోత్సాహంతో స్పాన్సర్ చేశారన్నారు. కార్యక్రమాన్ని ఆర్ డీ డీన్ డా.శివరామిరెడ్డి సమన్వయం చేయగా, అసిస్టెంట్ ప్రొఫెసర్ వై.పవన్కుమార్రెడ్డి మద్దతు అందించారన్నారు. యూరోపియన్ ఆటోమొబైల్ పరిశ్రమ నిర్మాణం, పరిశోధన అవకాశాలు, స్మార్ట్ మాన్యుఫాక్చరింగ్, ఇండ్రస్టీ 4.0 సాంకేతికలపై విస్తృతమైన అవగాహనను విద్యార్థిఽ జగదీశ్ పొందారన్నారు. ఏఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వీసీ సాయిబాబరెడ్డి, ప్రిన్సిపాల్ నారాయణ పాల్గొన్నారు. అమరావతికి ఆశావాహుల పరుగులు బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి జయచంద్రారెడ్డిని నకిలీమద్యం కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న కారణంగా ఆయన్ను పార్టీ అధిష్టానం సస్పెన్షన్ చేసిన విషయం తెలిసిందే. దీనితో ఇన్చార్జి పదవిని ఆశిస్తున్న టీడీపీ నేతలు మూడురోజులుగా అమరావతికి క్యూ కడుతున్నారు. నియోజకవర్గానికి చెందిన సీనియర్ నాయకులు ఏం జరుగుతుందో తెలుసుకునేందుకు అక్కడే మకాం పెట్టారు. స్థానికంగా ఒకరిద్దరు నేతలు ఇన్చార్జ్ పదవిని ఆశిస్తూ అధిష్టానం వద్దకు వెళ్లి తమ ప్రయత్నాలు సాగిస్తున్నారు. -
చేయి కోసుకుని బావిలో దూకి ఆత్మహత్యాయత్నం
● బాధితుడిని కాపాడిన ఏఆర్ కానిస్టేబుల్ ● సకాలంలో స్పందించినందుకు ఎస్పీ ప్రశంస మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో భార్యతో గొడవపడి ఓ వ్యక్తి చేతి నరాలు కోసుకుని బావిలో దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. సకాలంలో స్పందించిన ఏఆర్ కానిస్టేబుల్ బాధితుడిని కాపాడి ఆస్పత్రికి తరలించాడు. శుక్రవారం మదనపల్లెలో జరిగిన ఘటనకు సంబంధించి వివరాలిలా...కర్ణాటక రాష్ట్రం బెంగళూరుకు చెందిన కృష్ణమాచారి కుమారుడు చెంగాచారి(33) తన భార్య శశి, కుమారుడితో కలిసి గురువారం మదనపల్లె పట్టణం ఎస్టేట్లో ఉంటున్న తన సోదరి ఇంటికి వచ్చాడు. స్థానికంగా ఆలయానికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నాడు. అయితే, శుక్రవారం ఉదయం కుటుంబ సమస్యల కారణంగా చెంగాచారి భార్య శశితో గొడవపడ్డాడు. ఆమె దూషించడంతో మనస్తాపం చెంది ఇంటి నుంచి బయటకు వచ్చి పట్టణంలోని బెంగళూరు రోడ్డు మడికయ్యల శివాలయం వద్దకు చేరుకుని అక్కడే చేతి నరాలు కోసుకున్నాడు. కబరస్థాన్ పక్కన ఉన్న కోడిగుడ్డు బావిలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. బావిలోకి దూకే క్రమంలో లోపల ఉన్న చెట్టు కొమ్మలకు తగులుకుని వేలాడుతూ, ప్రాణభయంతో కేకలు వేశాడు. అయితే అదే సమయానికి మదనపల్లె రూరల్ సర్కిల్ సీఐ సత్యనారాయణ వాహన డ్రైవర్గా పనిచేస్తున్న ఏఆర్ కానిస్టేబుల్ ఎస్.అమరనాథ్, పిల్లలను స్కూల్కు తీసుకువెళ్లేందుకు అటువైపు వచ్చాడు. చెంగాచారి పెడుతున్న కేకలు విని అటువైపు వెళ్లి బావిలో వ్యక్తి ఉండటాన్ని గుర్తించాడు. వెంటనే ఓ తాడు తీసుకువచ్చి మరొకరి సాయంతో బావిలోకి దిగి చెంగాచారిని బయటకు తీసుకువచ్చాడు. తన వాహనంలో జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చి చేర్పించాడు. దీంతో బాధితుడికి ప్రాణాపాయం తప్పింది. విషయం జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దృష్టికి వెళ్లడంతో ఆయన ఏఆర్ కానిస్టేబుల్ అమరనాథ్ను అభినందించారు. విధి నిర్వహణలో నిబద్ధత చూపినందుకు ప్రశంసించారు. పోలీసు రివార్డుకు సిఫారసు చేశారు. -
నీటికోసం రోడ్డెక్కిన మహిళలు
బి.కొత్తకోట : స్థానిక బాబాటాకీస్ ప్రాంతానికి చెందిన మహిళలు 40 రోజులుగా తమకు తాగునీటి సరఫరా అందడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తూ శుక్రవారం బీరంగిరోడ్డుపై ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తూ నీళ్ల కోసం పడుతున్న ఇబ్బందులపై ఏకరువు పెట్టారు. రో డ్డుకు అడ్డంగా తాడుకట్టి రాకపోకలను అడ్డుకున్నారు. సమస్యను పరిష్కారించాలనీ, నీటిని సరఫరా చేయాల ని అధికారులను విన్నవించినా చర్యలు తీసుకోలేదని మహిళలు పేర్కొన్నారు. నీళ్ల కోసం పడుతున్న ఇబ్బందులను పట్టించుకొని సమస్యను పరిష్కరించాల్సిన అధికారులు ఎందుకు నిర్లక్ష్యం చేస్తున్నారని నిలదీశారు. రెండురోజుల్లో సమస్య పరిష్కరిస్తామని కమిషనర్ ప్రమీల హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
విధి నిర్వహణకు శారీరక దారుఢ్యం ముఖ్యం
● ఏఆర్ సిబ్బంది సంక్షేమానికి కృషి ● ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి : పోలీసు సిబ్బంది విధి నిర్వహణకు మంచి ఆరోగ్యంతో కూడిన శారీరక దారుఢ్యం చాలా ముఖ్యమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. శుక్రవారం రాయచోటిలోని జిల్లా పోలీసుల ఫేరెడ్ మైదానంలో ఆర్మడ్ రిజర్వ్ (ఏఆర్) సిబ్బంది నుంచి విక్లీ పెరేడ్లో భాగంగా ఎస్పీ గౌరవ వందనం స్వీకరించారు. పోలీసు శాఖలో అంతర్గత క్రమశిక్షణతోపాటు సిబ్బంది సంక్షేమానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తున్నామని ఎస్పీ స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన పోలీసు దర్బార్లో ఆరోగ్య పరిరక్షణ (ఫిజికల్ ఫిట్నెస్), సంక్షేమం, వృత్తి నైపుణ్యం అంశాలపై దృష్టి సారించి కీలక ఆదేశాలు, స ఊచనలు జారీ చేశారు. ఆరోగ్యంపై సిబ్బంది ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. యోగా, ధ్యానం, వ్యాయామం ద్వారా సంపూర్ణ ఆరోగ్యవంతులుగా ఉంటూ మరింత ఉత్సాహంతో విధులను సమర్థవంతంగా నిర్వహించాలని కోరారు. సిబ్బందిలో మానసిక ఉల్లాసం, ఉత్సాహాన్ని పెంచడానికి క్రీడలు, సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తామని తెలిపారు. వృత్తి నైపుణ్యాన్ని పెంపొందించుకునేందుకు వివిధ అంశాలపై నిపుణులతో రిఫ్రెషర్ కోర్సులు నిర్వహిస్తామని వివరించారు. ఏఆర్ సిబ్బంది సమస్యలను నేరుగా తమ దృష్టికి తీసుకువస్తే వాటిని పరిశీలించి పరిష్కారం చూపుతామని ఎస్పీ హామి ఇచ్చారు. విరామ సమయాన్ని సద్వినియోగం చేసుకుని తప్పనిసరిగా కుటుంబ సభ్యులతో గడపాలని సిబ్బందికి సూచింరరాఉ. దర్భార్ అనంతరం సిబ్బంది సమస్యలను ఎస్పీ అడిగి తెలుసుకొని వాటి పరిష్కారంపై సంబంధిత అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం వెంకటాద్రి, ఆర్ఐ ఎం పెద్దయ్య, ఆర్ఎస్ఐలు, ఇతర ఏఆర్ సిబ్బంది పాల్గొన్నారు. -
దళితులకు అన్యాయం చేస్తుంటే చంద్రబాబు, పవన్కల్యాణ్ స్పందించరా?
మదనపల్లె : కురబలకోట మండలంలో దళితుల భూములను టీడీపీ నేతలు కొల్లగొడుతుంటే సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ ఎందుకు స్పందించడం లేదని వైఎస్సార్సీపీ మహిళా నేతలు ప్రశ్నించారు. మదనపల్లెలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో కురబలకోట ఎంపీపీ ఎం.జి.భూదేవి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం మండల అధ్యక్షురాలు నక్కా రమాదేవి, నాయకురాలు రెడ్డి కుమారి మాట్లాడారు. మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, టీడీపీ తంబళ్లపల్లె మాజీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి దళితుల భూములను లాక్కుంటున్నారని చెప్పారు. కడపక్రాస్లో హైవే పక్కన రూ.20 కోట్లు విలువ చేసే భూమిని మంత్రి మండిపల్లి బంధువు, అనుచరుడు ఆవుల సురేంద్రరెడ్డి, టీడీపీ తంబళ్లపల్లి నియోజకవర్గ మాజీ ఇన్చార్జి జయచంద్రారెడ్డి పీఏ టి.రాజేష్ పేరిట కొనుగోలు చేశారని తెలిపారు. ఈ భూమిని చదును చేసి ప్లాట్లు వేసి అమ్మేసే ప్రయత్నం చేస్తున్నారన్నారు. కార్యాలయాల్లో సామాన్యుల పనులు జరిగే పరిస్థితులు లేవని చెప్పారు. అలాంటిది దళితుల భూమికి గత కలెక్టర్ ఎన్వోసీ ఎలా ఇచ్చారని ప్రశ్నించారు. ములకలచెరువు నకిలీ మద్యం కేసు ఇప్పటికే రాష్ట్రంలో అలజడి సృష్టిస్తోందన్నారు. టీడీపీ నేతల నకిలీ మద్యం, భూదందాలపై సమగ్ర విచారణ జరపాలని కోరారు. జయచంద్రారెడ్డి భూకబ్జాలు, నకిలీ మద్యం తయారీ, ఇసుక దందాలు చేయడమేగాక ప్రభుత్వభూమిని ఆక్రమించి స్టోన్క్రషర్ ఏర్పాటు చేశారని వారు చెప్పారు. ఈ సమావేశంలో అంగళ్లు మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ డి.ఆర్.ఉమాపతిరెడ్డి, ఎంపీటీసీ సభ్యుడు ఎం.ఆనందరెడ్డి, వసంతరెడ్డి పాల్గొన్నారు. నిలదీసిన వైఎస్సార్సీపీ మహిళా నేతలు -
కదిరి మహిళ..మదనపల్లెలో అదృశ్యం
మదనపల్లె రూరల్ : సత్యసాయి జిల్లా కదిరికి చెందిన మహిళ మదనపల్లెలోని బంధువు ఇంటికి వచ్చి అదృశ్యం కావడంపై ఆమె సోదరుడు శుక్రవారం వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. కదిరి మండలం సున్నపుగుట్ట తండాకు చెందిన బాలాజీనాయక్ భార్య వి.భాగ్యమ్మ (35) తిరుపతిలో ఉన్న తమ్ముడు భాస్కర్ నాయక్ వద్దకు వెళ్లి అక్కడ ఆస్పత్రిలో చికిత్స తీసుకుంది. సెప్టెంబర్ 24న మదనపల్లె పట్టణం బుగ్గకాలువలో నివాసం ఉంటున్న దూరపు బంధువు పూర్ణ ఇంటికి వచ్చింది. కొద్దిరోజులుగా అక్కడే వారితో పాటు ఉంటోంది. అయితే ఈనెల ఏడోతేదీ సాయంత్రం 5 గంటల సమయంలో భాగ్యమ్మ తమ్ముడు భాస్కర్నాయక్కు ఫోన్చేసి తనను మదనపల్లె ఆర్టీసీ బస్టాండు వద్ద పూర్ణ, ఆటోడ్రైవర్ రెడ్డి కొడుతున్నారని చెప్పింది. అనంతరం మరోసారి రాత్రి 10గంటల సమయంలో ఫోన్చేసి వారి ఇంటికి వచ్చి మరోసారి తనను కొట్టారని, తప్పించుకుని వెళ్లేందుకు ప్రయత్నించగా ఇంటికి తీసుకెళ్లి బంధించారని చెప్పింది. అనంతరం ఆమె ఫోన్ స్విచ్ఆఫ్ అయింది. దీంతో భాస్కర్నాయక్, బంధువైన పూర్ణకు 8వతేదీ ఫోన్చేయగా భాగ్యమ్మ అప్పుడే వెళ్లిపోయిందని, తమ వద్ద లేదని సమాధానం ఇచ్చింది. రెండురోజుల పాటు భాగ్యమ్మ ఆచూకీ కోసం వెతికిన సోదరుడు భాస్కర్నాయక్ శుక్రవారం వన్టౌన్ పోలీస్ష్టేషన్కు చేరుకుని తన అక్క అదృశ్యంపై ఫిర్యాదు చేశాడు. వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదుచేసిన సోదరుడు -
టీచర్ల పోరుబాట
మదనపల్లె సిటీ: కూటమి ప్రభుత్వ అస్తవ్యస్త విధానాలతో విద్యావ్యవస్థ గాడితప్పుతోంది. ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కంచకపోగా వారిపై బోధనేతర పనుల భారాన్ని మోపుతూ బోధనకు దూరం చేస్తోంది. ఫలితంగా విద్యార్థులకు చదువు దూరమవుతోంది. కూటమి అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర కావస్తున్నా ఏ ఒక్క సమస్యను పరిష్కరించకపోగా తమపై పనిభారం మోపుతున్నారంటూ టీచర్లు తీవ్ర అగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సమస్యల పరిష్కారం కోసం అంచలంచలుగా పోరుబాట బట్టారు. ● కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలను అమలు చేయడంలో విఫలమైందని ఉద్యోగ, ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. అడ్డగోలు నిర్ణయాలతో ఉపాధ్యాయుల మీద మరింత ఒత్తిడి పెంచింది. విద్యార్థులకు చదువులు చెప్పకుండా ఇతర పనులు అప్పగించడంతో సక్రమంగా విధులు నిర్వహించలేకపోతున్నారు. దీంతో ఉపాధ్యాయుల్లో తీవ్రమైన అసంతృప్తి నెలకొంది. చంద్రబాబు తన ప్రచార యావతో యోగాంధ్ర కార్యక్రమాన్ని చేపట్టి ఉపాధ్యాయులను స్కూళ్లను దూరం చేశారు. టీచర్స్ సమావేశాల పేరుతో దాదాపు రెండు వారాల పాటు ఉపాధ్యాయలు పాఠాలకు దూరమయ్యారు. దీనికితోడు రకరకాల శిక్షణ పేరుతో బడులకు వెళ్లలేకపోయారు. ఫలితంగా విద్యార్థులు సైతం చదువులకు దూరమయ్యారు. కూటమి ప్రభుత్వం ఆంక్షలతో కొంత కాలం మౌనం వహించిన ఉపాధ్యాయ సంఘాలు పోరుబాట పట్టాయి. ఫ్యాఫ్టో పేరుతో శుక్రవారం నుంచి భోధనేతర పనులు,విద్యాశక్తి కార్యక్రమాలను బహిష్కరించారు. ఉపాధ్యాయులు డిమాండ్లు ఇవీ: ● ఏకీకృత సర్వీసు రూల్స్ పరిష్కరించి 72,73,74 జీవోలు అమలు చేయాలి. ● పంచాయతీరాజ్లో పెండింగ్లో ఉన్న కారణ్య నియామకాలు తక్షణమే చేపట్టి, కలెక్టర్ పూల్ ద్వారా వెంటనే పోస్టింగులు ఇవ్వాలి. ● సీపీఎస్ విధానాన్ని వెంటనే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలి. ● ఉపాధ్యాయులకు బోధన తప్ప బోధనేతర కార్యక్రమాలు లేకుండా చేయాలి. ● విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికం అని చెబుతూ బలవంతంగా అమలు చేయడాన్ని విడనాడాలి. ● అసెస్మెంట్ పుస్తకాలను పునః సమీక్షించాలి. ● హైస్కూల్ ప్లస్లలో వెంటనే ఉపాధ్యాయ నియమాలు చేపట్టి, హైస్కూల్ ప్లస్ పాఠశాలలను యథాతథంగా కొనసాగించాలి ● 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలి. ● 30 శాతం మధ్యంతర భృతిని (ఐఆర్) వెంటనే ప్రకటించాలి. ● రిటైర్ అయిన వారికి గ్రాట్యూటీ, కమ్యూటేషన్, లీవ్ ఎన్క్యాష్మెంట్ వంటి బకాయకిలను రిటైర్ అయిన మరుసటి రోజునే చెల్లించాలి. ● సూపర్ న్యూమరీ పోస్టునుల సృష్టించి గ్రేడ్–2 పండిట్లు, పీఈటీలకు పదోన్నతులు కల్పించాలి. ● మున్సిపల్ ఉపాధ్యాయులకు జీపీఎఫ్ సౌకర్యం కల్పించాలి. ● ఈహెచ్ఎస్/ మెడికల్ రీయింబర్స్ంట్ బిల్లుల విషయంలో నిత్యం ఉత్పన్నమవుతున్న సమస్యలను పరిష్కిరంచాలి. ● మండల విద్యాశాఖ అధికారులు బదిలీలు తక్షణమే చేపట్టాలి ● 2008,1998 ఎంటీఎస్ ఉపాధ్యాయులను రెగ్యులర్ చేసి పదవీ విరమణ వయస్సు 62 ఏళ్లకు పెంచాలి. ● బదిలీ అయి సబ్స్టిట్యూట్ లేక రిలీవ్ కాని ఉపాధ్యాయులను రిలీవ్ చేయడానికి చర్యలు తీసుకోవాలి. కూటమి ప్రభుత్వం హామీలు నెరవేర్చకపోవడంతో ఆగ్రహం అసెస్మెంట్ బుక్ను పునఃసమీక్షించాలంటూ డిమాండ్ సీపీఎస్ రద్దు చేసి పాత పెన్షన విధానం కొనసాగించాలని పట్టు బోధనేతర పనుతో పాఠాలకుదూరమవుతున్న ఉపాధ్యాయులుసమస్యల సాధనకు పోరాడతాం సమస్యల సాధనకు పోరాడతాం. ఫ్యాఫ్టో ఆద్వర్యంలో జిల్లా వ్యాప్తంగా శుక్రవారం నుంచి బోధనేతర పనులు,విద్యాశక్తి పనలు నిలిపివేశాం. ఉపాధ్యాయులకు బోదనేత పనులు కేటాయించకుండా చర్యలు తీసుకోవాలి.ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం ఉపాధ్యాయుల సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలి. –పురం వెంకటరమణ, యూటీఎఫ్ జిల్లా కార్యదర్శి ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధ్యాయులకు కొత్త సమస్యలు వచ్చిపడ్డాయి. విద్యార్థులకు చదువు చెప్పడం కంటే కూడా బోధనేతర పనులతోనే తలముకలయ్యేలా ప్రభుత్వం ఒత్తిడి చేస్తుంది. పెండింగ్లోఉన్న ఏకీకృత సర్వీసు నిబంధనలను పట్టించుకోవడం లేదు. –రెడ్డప్పరెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షులు -
కూటమి అరాచకాలను అరికడదాం
రైల్వేకోడూరు: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కూటమి ప్రభుత్వం చేస్తున్న ఆగడాలని అడ్డుకుందామని రైల్వేకోడూరు మాజీ శాసనసభ్యులు కొరముట్ల శ్రీనివాసులు పేర్కొన్నారు.శుక్రవారం తిమ్మిశెట్టిపల్లి అరుంధతివాడలో వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి సంబంధించిన పోస్టర్ను గ్రామస్తులతో కలిసి ఆవిష్కరించి రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కొరముట్ల శ్రీనివాసులు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ప్రజలకు ఇచ్చిన హామీలు అమలు చేయలేదని, దోచుకోవడం పరిపాటిగా మారిందన్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలు తీసుకొస్తే అందులో ఏడు కళాశాలల నిర్మాణం పూర్తి చేసి పనులు నిర్మాణ దశలో ఉండగానే కమీషన్లకు కక్కుర్తిపడి వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు అనుకూలంగా నిర్ణయం తీసుకోవడంతో వాటికి వ్యతిరేకంగా ప్రజా అభిప్రాయ సేకరణ పేరుతో ముందుకు వచ్చామన్నారు. 45 రోజులపాటు జరిగే ఈ కార్యక్రమానికి ప్రతి ఒక్కరూ సంతకాలు చేసి తమ అభిప్రాయాలను తెలియజేయాలని తెలిపారు.ఈ కార్యక్రమంలో కోడూరు ఎంపీపీ ధ్వజారెడ్డి, పుల్లంపేట మండల కన్వీనర్ ముస్తాక్, పుల్లంపేట ఎంపీపీ ముద్దా బాబుల్ రెడ్డి, చిట్వేలి మండల కన్వీనర్ చెవ్వు శ్రీనివాసులు రెడ్డి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకులు విజయ్ కుమార్ రెడ్డి, పంజం వేణుగోపాల్ రెడ్డి, గుత్తి హరినాథ్ రెడ్డి, వెంకటరెడ్డి, రాయలసీమ జోన్ బూత్ కమిటీ అధ్యక్షులు భరత్ కుమార్ రెడ్డి, జెడ్పీటీసీ రత్నమ్మ, మాజీ మార్కెట్ యార్డు చైర్మన్ సుబ్బరామరాజు, స్టేట్ ఎగ్జిక్యూటీవ్ మెంబర్ నందా బాల, సీహెచ్ రమేష్, నాగేంద్ర, ధనుంజయ నాయుడు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు -
కూటమి నేతలకు తొత్తులుగా విజిలెన్స్ అధికారులు
లక్కిరెడ్డిపల్లి : కూటమి నేతల ఒత్తిళ్లకు తలొగ్గి వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన రేషన్ డీలర్లపై కడప విజిలెన్సు అధికారులు 6ఏ కేసులు నమోదు చేస్తున్నారని, సంబంధిత డీలర్లను పరుషపదజాలంతో విజిలెన్సు సీఐ నారాయణరావు బూతులు మాట్లాడుతూ దౌర్జన్యానికి పాల్పడుతున్నారని పలువురు డీలర్లు వాపోతున్నారు. గురువారం మండలంలోని దిన్నెపాడు గ్రామం, నరసింహరాజుగారిపల్లికి చెందిన చౌక దుకాణం 1136007 రేషన్ షాపు తనిఖీకి వచ్చిన విజిలెన్సు సీఐ నారాయణరావు తనిఖీల్లో ఎలాంటి వ్యత్యాసం లేకున్నా తనకు ఇష్టం వచ్చినట్లు కేసు రాశారని సంబంధిత డీలర్ నాగరాజు వాపోయారు. ముందస్తు ప్రణాళిక ప్రకారం దుకాణంలో డీలర్ అందుబాటులో లేని విషయాన్ని గుర్తించిన గ్రామంలోని కొందరు కూటమి నేతలు రేషన్ దుకాణం ఇంటి పైన వెలుతురు కోసం ఏర్పాటు చేసుకున్న రంధ్రం ద్వారా కొంతమేర బియ్యాన్ని కిందకు పోశారని.. ఆ తర్వాత గ్రామానికి కూతవేటు దూరంలో అందుబాటులో ఉన్న విజిలెన్సు వారికి సమాచారాన్ని అందజేసి హుటాహుటిన రేషన్ దుకాణంలోకి చొరబడి తాళాలు తెరిపించి ఉన్న స్టాకును సీఐ స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. ఇంటిపైన ఉన్న రంధ్రం నుంచి కూటమి పార్టీకి చెందిన కొందరు రేషన్ దుకాణంలోకి కొంతమేర బియ్యాన్ని పోసిన విషయాన్ని విజిలెన్సు సీఐ నారాయణరావుతోపాటు సంబంధిత తహసీల్దార్ క్రాంతి కుమార్, ఆర్ఐ రాజేష్, సిబ్బందికి ప్రత్యక్షంగా చూపించినప్పటికీ అవన్నీ సంబంధం లేదు స్టాక్ ఉన్నంత మేరకే తాము లెక్కించి కేసు నమోదు చేస్తామని చెప్పారని వారు వాపోయారు. అక్కడ నిల్వ ఉన్న ఏడు క్వింటాళ్ల, 90 కేజీల బియ్యానికి ఎలాంటి అధికారిక అనుమతి లేకపోయినా తెలుగుదేశం పార్టీకి చెందిన వ్యక్తి ఇంటికి సరుకును అప్పగించి వెళ్లినట్లు డీలరు నాగరాజు తెలిపారు. అనంతరం దప్పేపల్లి గ్రామం, గొల్లపల్లిలోని చౌక దుకాణం 1136016కు చెందిన బాలే పెద్ద ఓబులేశు దుకాణాన్ని తనిఖీ చేసి ఎలాంటి వ్యత్యాసం లేకపోయినా ఆథరైజేషన్ లేదనే నెపంతో 6ఏ కేసు నమోదు చేసినట్లు వారు తెలిపారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో ఏ ఒక్క డీలర్కు కూడా నాలుగేళ్లుగా ఆథరైజేషన్ లేదనే విషయం సంబంధిత డీలర్ ఓబులేశు విజిలెన్సు సీఐ ఎదుట ప్రస్తావించగా వినకపోవడంతో చేసేదేమీలేక మిన్నకుండిపోయామన్నారు. ఇదే మండలంలో గత నెలలో తనిఖీకి వచ్చిన విజిలెన్స్ సీఐ నారాయణరావు వరుసగా మూడు రేషన్ దుకాణాలు తనిఖీ చేసి డీలర్లపై నోరుపారేసుకున్నారన్నారు. హైకోర్టు ఉత్తర్వులు ఉన్నా కూడా తప్పుడు కేసులు బనాయిస్తూ కూటమి నేతలకు రెవెన్యూ సిబ్బంది పర్మినెంటు రేషన్ డీలర్ల సరుకును అప్పగించడంపై పలువురు మండిపడుతున్నారు. రాజకీయ నాయకుల ఒత్తిళ్లకు తొత్తులుగా మారిన విజిలెన్సు సీఐ నారాయణరావు, రెవెన్యూ సిబ్బందిపై జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్లకు ఫిర్యాదు చేస్తామని పలువురు డీలర్లు పేర్కొంటున్నారు. కోర్టు ఉత్తర్వులను లెక్క చేయకుండా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల షాపులపై 6ఏ కేసులు నమోదు ఎలాంటి ఆథరైజేషన్ లేకుండానే టీడీపీ నేతల ఇళ్లల్లో సరుకును అప్పగించిన రెవెన్యూ సిబ్బందిఆథరైజేషన్ లేదని 6ఏ కేసు రాశారు.. నా రేషన్ షాప్ తనిఖీకి వచ్చిన విజిలెన్సు సీఐ నారాయణరావు ఎలాంటి వ్యత్యాసాలు లేకపోయినా కేవలం ఆథరైజేషన్ లేదనే కారణం చూపిస్తూ 6ఏ కేసు నమోదు చేశారు. లక్కిరెడ్డిపల్లి మండలంలో ఒక్క షాపునకు కూడా నాలుగేళ్లుగా ఆథరైజేషన్ లేదనే విషయం రెవెన్యూ అధికారులకు తెలిసినా పరిగణనలోకి తీసుకోలేదు. తెలుగుదేశం వారికి తొత్తులుగా మారి ఉద్యోగం చేస్తూ ఏ తప్పు లేకపోయినా కేసులు నమోదు చేస్తున్నారు. బాలేపెద్ద ఓబులేశు, గొల్లపల్లి, దప్పేపల్లి గ్రామం, లక్కిరెడ్డిపల్లి మండలంరేషన్ షాప్ మిద్దైపె నుంచి బియ్యం పోశారు.. మేము ఇంటివద్దలేని సమయంలో మా పల్లెలోని కొందరు తెలుగుదేశం పార్టీకి చెందిన వారు మా మిద్దైపె ఉన్న గవాచీ ద్వారా కొంత బియ్యాన్ని గుమ్మరించారు. ఐదు నిమిషాలలోపే విజిలెన్సు సీఐ నారాయణ రావు తన బృందంతో వచ్చి స్టాకును స్వాధీనం చేసుకున్నారు. గవాచి ద్వారా పోసిన బియ్యాన్ని విజిలెన్సు అధికారులతోపాటు రెవెన్యూ సిబ్బందికి చూపించినా కూడా వినకుండా 70 కేజీలు అదనంగా ఉన్నట్లు చూపిస్తూ నా షాపుపై 6ఏ కేసు నమోదు చేశారు. నాగరాజు, నరసింహరాజుగారిపల్లి, ప్రభుత్వ చౌకదుకాణం డీలర్, లక్కిరెడ్డిపల్లి మండలం -
నిమ్మతోట బాధితులకు అండగా ఉంటాం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని కొనరాజుపల్లిలో ఈనెల 7వ తేదీ వైఎస్సార్సీపీ సానుభూతిపరులైన అప్పిరెడ్డి రాజశేఖర్రెడ్డి, అప్పిరెడ్డి సుబ్బారెడ్డి నిమ్మతోటను టీటీడీ మూకలు దున్నేసిన ఘటనపై గురువారం మండల కేంద్రమైన ఒంటిమిట్టలో ఎంపీ మేడా రఘునాథ్రెడ్డి దృష్టికి తీసుకెళ్లారు. వారి సమస్యను విన్న ఎంపీ రఘునాథ్రెడ్డి మాట్లాడుతూ..రాష్ట్రంలో రెడ్ బుక్ రాజ్యాంగం అంటూ అమాయకులైన వైఎస్సార్సీపీ సానుభూతిపరులను కూటమి నాయకులు లక్ష్యంగా చేసుకున్నారన్నారు. అధికారంలో కూటమి ప్రభుత్వం ఉందని, ఏమి చేసినా మమ్మల్ని ఎవ్వడు ఏమీ చేయలేడనే అహంకారంతో టీడీపీ మూకలు రెచ్చిపోతున్నాయన్నారు. అందులో భాగమే అప్పిరెడ్డి రాజశేఖర్రెడ్డి నిమ్మతోట దున్నేయడం అన్నారు. ఇలాంటి వారికి చట్టప్రకారం శిక్ష పడేలా చేస్తాం అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్పొరేషన్ మాజీ డైరెక్టర్ ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, వైఎస్సార్సీపీ ఒంటిమిట్ట మండల అధ్యక్షుడు టక్కోలు శివారెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మేకపాటి నందకిశోర్రెడ్డి, శ్రీనివాసులరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
భార్యను చంపిన కేసులో ఏడేళ్ల జైలు
రాయచోటి టౌన్ : భార్యను చంపిన కేసులో భర్తకు ఏడేళ్ల జైలుతో పాటు రూ.1,70,000లు జరిమానా విధిస్తూ జిల్లా 7వ అదనపు న్యాయమూర్తి జి. ఎస్ రమేష్ కుమార్ తీర్పు చెప్పారు. రాయచోటి సబ్ డివిజన్ పోలీసుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె, కొండవాండ్లపల్లె గ్రామానికి చెందిన సావిత్రిని లక్కిరెడ్డిపల్లె మండలం వడ్డెపల్లె దిన్నెపల్లెకు చెందిన రౌతు బాబుకు ఇచ్చి వివాహం చేశారు. వివాహమైన కొద్ది సంవత్సరాలకే తమ కుమార్తెను అల్లుడు చంపాడని మృతురాలి తండ్రి 2021 సంవత్సరం సెప్టెంబర్ 9వ తేదీ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై గురువారం కోర్టులో వాదనలు విన్న న్యాయమూర్తి సెక్షన్ 498(ఏ), 304 (బి), 3అండ్4 డీపీ యాక్టు ప్రకారం దోషిగా నిర్ధారిస్తూ ఏడేళ్ల జైలు జీవితంతో పాటు రూ.1,70,000లు జరిమానా విధిస్తూ తీర్పు చెప్పారు. ఈ కేసును పర్యవేక్షించిన డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, సీఐ టీవీ కొండారెడ్డి, ఎస్ఐ డి. రవీంద్రబాబులను జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి అభినందించారు. -
ఇంటి తాళాలు పగలగొట్టి కబ్జాకు యత్నం
మదనపల్లె రూరల్ : కోర్టు కేసులో ఉన్న ఓ ఇంటి తాళాలు పగలగొట్టి, కబ్జాకు యత్నించిన ఘటన బుధవారం రాత్రి పట్టణంలో జరిగింది. పట్టణంలోని నిమ్మనపల్లె సర్కిల్ సుబ్బారెడ్డి లేఅవుట్లో ఇంటినెంబర్.17/185ఈ–2–3కు సంబంధించి, మదనపల్లె సెకండ్ ఏడీజే కోర్టులో 2011 నుంచి చలపతి, ప్రతివాదులైన దేవప్రకాష్, రవికుమార్ మధ్య కేసు నడుస్తోంది. ఇదే ఇంటిని తాను కొనుగోలు చేశానని, స్వాధీనం చేయాల్సిందిగా పట్టణానికి చెందిన జరీనా అనే మహిళ చలపతి, దేవప్రకాష్, రవికుమార్, గంగరాజులపై 2024లో మరో కేసు వేసింది. ఇల్లు 17 ఏళ్లుగా దేవప్రకాష్, రవికుమార్ స్వాధీన అనుభవంలో ఉంది. ఇంట్లో 8 ఏళ్లుగా అద్దెకు ఉంటున్న గంగరాజు, సొంత ఇల్లు నిర్మించుకుని, ఈనెల 2వ తేదీ ఇల్లు ఖాళీ చేసి, తాళాలను యజమాని దేవప్రకాష్కు అప్పగించారు. ఇల్లు ఖాళీ అయిన విషయం తెలుసుకున్న జరీనా మనుషులు.. వారికి సంబంధం లేకపోయినా ఇంటిని తమకు అప్పగించాలని, లేకుంటే కూల్చేస్తామని దేవప్రకాష్ను బెదిరించారు. తర్వాత రెండురోజుల అనంతరం మరోసారి బుధవారం రాత్రి 8.30 గంటలకు, దౌర్జన్యంగా ఇంటికి వేసిన తాళం పగలగొట్టి కబ్జాకు యత్నించారు. విషయం తెలుసుకున్న బాధితుడు దేవప్రకాష్..112 నెంబర్కు ఫోన్చేస్తే.. వన్టౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఇంటి తాళాలు పగలగొట్టిన యువకులు తయీజ్, రూపేష్, సైఫ్ పేర్లు నమోదు చేసుకుని, తాళాలు వేసి స్టేషన్కు రావాల్సిందిగా ఆదేశించారు. గురు వారం బాఽధితులు వన్టౌన్ పోలీస్ స్టేషన్కు చేరుకుని దౌర్జన్యానికి సంబంధించి ఫిర్యాదు చేశా రు. సీఐ మహమ్మద్ రఫీ ఈ విషయమై మాట్లాడుతూ.. ఆస్తి వివాదం కోర్టులో నడుస్తుండగా తాళా లు పగలగొట్టడం నేరమని, అంశం కోర్టు పరిధిలో ఉన్నందున ఉన్నతాధికారుల ఆదేశాలతో లీగల్ ఒపీనియన్ తీసుకుని చర్యలు తీసుకుంటామన్నారు. -
వృద్ధురాలి మెడలో బంగారు గొలుసు లాక్కెళ్లారు
గుర్రంకొండ : ఒంటరిగా ఉన్న వృద్ధురాలి మెడలో దుండగులు బంగారు గొలుసు లాక్కెళ్లిన సంఘటన మండలంలోని నడిమికండ్రిగ గ్రామంలో జరిగింది. గ్రామానికి చెందిన గల్లా నాగరత్నమ్మ(73) భర్త రామయ్య పదేళ్ల క్రితం మృతి చెందాడు. దీంతో నాగరత్నమ్మ అదే గ్రామంలోని తన కుమార్తె ఇంట్లో నివాసముంటోంది. ప్రతిరోజు గ్రామానికి సమీపంలోని శ్రీనివాస డాబా పక్కనే ఉన్న పాత ఇంట్లో పాడిఆవులకు నీరుతోడి పశుగ్రాసం వేసి గ్రామంలోకి వచ్చేది. ఈ నేపథ్యంలో బుధవారం సాయంత్రం పాత ఇంటివద్ద పాడిఆవులకు నీరు పెడుతుండగా గుర్తుతెలియని దుండగులు ద్విచక్రవాహనంలో అక్కడికి చేరుకొన్నారు. దాహంగా ఉందని మంచినీళ్లు కావాలని ఆమెను అడిగారు. నాగరత్నమ్మ నీళ్లు తేవడానికి ఇంట్లోకి వెళుతుండగా వెనుకవైపు నుంచి దుండగులు ఆమె మెడలో బంగారు గొలుసు లాక్కొని ద్విచక్రవాహనంపై వేగంగా వెళ్లిపోయారు. దీంతో మహిళ పెద్ద ఎత్తున కేకలు వేయగా గ్రామస్తులు అక్కడికి చేరుకుని వారి జాడకోసం గాలించారు. అయితే అప్పటికే దుండగులు గ్రామం వదిలి పరారయ్యారు. చోరీకి గురైన 30 గ్రాముల బంగారు గొలుసు విలువ రూ. 3 లక్షల వరకు ఉంటుందని అంచనా వేశారు. జరిగిన సంఘటనపై బాధితురాలు గురువారం స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ రఘరామ్ తెలిపారు. -
ఆర్టీసీ ఎండీతో జిల్లా ఎస్పీ భేటీ
మదనపల్లె రూరల్ : అన్నమయ్యజిల్లాకు విచ్చేసిన ఆర్టీసీ ఎండీ, మాజీ డీజీపీ ద్వారకా తిరుమలరావును, గురువారం ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. పట్టణంలోని బైపాస్రోడ్డు వెన్నెల గార్డెన్స్లో భేటీ అయిన వారు ప్రజారవాణా భద్రత, శాంతి భద్రతల పరిరక్షణ తదితర అంశాలపై చర్చించారు. అనంతరం ఆర్టీసీ ఎండీ ద్వారకా తిరుమలరావు మాట్లాడుతూ పోలీస్శాఖ సహకారంతో బస్సులు, బస్స్టేషన్లలో భద్రతను మరింత పెంచుతామని, ప్రజలు ఆర్టీసీ సేవలను వినియోగించుకోవాలన్నారు. వన్టౌన్ పోలీస్ స్టేషన్ తనిఖీ.. మదనపల్లె పర్యటనలో భాగంగా జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పట్టణంలోని వన్టౌన్ పోలీస్స్టేషన్ను తనిఖీచేశారు. రికార్డులను పరిశీలించి, పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. సిబ్బందికి పలు సూచనలు, ఆదేశాలు జారీచేశారు. కార్యక్రమంలో డీఎస్పీ కె.మహేంద్ర, సీఐ మహమ్మద్ రఫీ, ఎస్ఐ అన్సర్బాషా, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. ఆర్టీసీ ఆదాయం పెరుగుదలలో కార్మికుల భాగస్వామ్యంరాజంపేట : ఆర్టీసీ ఆదాయం పెరుగుదలలో కార్మికుల భాగస్వామ్యం తప్పనిసరి అని ఆర్టీసీ ఎండీ సీహెచ్ ద్వారక తిరుమలరావు అన్నారు. గురువారం రాజంపేట డిపోలో ఉత్తమ ఉద్యోగుల అభినందన సభలో ఆయన పాల్గొని ప్రసంగించారు. ఆర్టీసీ ఆదాయానికి కార్మికులు కృషి చేయాలన్నారు. ఆర్టీసీ కార్మిక సంక్షేమానికి తన వంతుగా కృషిచేస్తానన్నారు. ఆర్టీసీ బస్టాండులో ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. ప్రయాణికులతో స్నేహభావంతో మెలగాలన్నారు. సంయమనం పాటించాలన్నారు. కార్యక్రమంలో ఆర్టీసీ ఈడీలు అప్పలరాజు, చంద్రశేఖర్, డీపీటీఓ రాము, రాజంపేట ఏఎస్పీ మనోజ్రాంనాథ్ హెగ్డే, డిపో అధికారి దాసరి కృష్ణమూర్తి, ఆర్టీసీ వివిధ విభాగాల అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.ఎండీ సీహెచ్ ద్వారక తిరుమలరావు -
దళితుడి భూమిపై కన్ను
ములకలచెరువు : దళితుల భూమి అక్రమంగా తెలుగుదేశం పార్టీ మాజీ నేత జయచంద్రారెడ్డి బామ్మర్ది గిరిధర్ రెడ్డి ఆక్రమించుకున్నాడని దళితుడు మల్లప్ప ఆరోపించాడు. వివరాలు...మండలంలోని పాత ములకలచెరువుకు చెందిన మల్లప్ప భూమికు సర్వే నెంబర్ 197 లో 8 ఎకరాల 54 సెంట్లకుగాను 1/4 వంతు మల్లప్ప తండ్రి రామప్పకు వర్తిస్తుంది. ఎస్సీ వర్గానికి చెందిన వీరి భూమిని తంబళ్లపల్లె తెలుగుదేశం పార్టీ బహిష్కృత నేత, కల్తీ లిక్కర్ కేసులో ఆరోపణలు ఎదుర్కొంటున్న జయచంద్రా రెడ్డికి స్వయానా మేనల్లుడైన గిరిధర్ రెడ్డి దౌర్జన్యంగా ఆక్రమించుకొని అధికారుల అండ దండలతో దొంగ పట్టా సృష్టించుకున్నాడని తెలిపాడు. దీనిపై పలుమార్లు స్థానిక తహసీల్దారు కార్యాలయంలో వినతిపత్రం అందజేసినా పట్టించుకోలేదన్నారు. తనకు న్యాయం చేయాలని వేడుకుంటున్నాడు. -
స్థలం కోసం ఇరువర్గాల ఘర్షణ
సిద్దవటం : స్థల వివాదం విషయంలో ఘర్షణ వాతావరణం ఏర్పడి ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకోవడంతో ఇరువర్గాలకు చెందిన వ్యక్తులకు గాయాలయ్యాయి. సిద్దవటం మండలంలోని మాధవరం–1 గ్రామం రోడ్ నెంబర్ 1 పెద్దపల్లి రెవెన్యూ సర్వే నెంబర్ 87/2లో 20 సెంట్ల స్థలంలో మాధవరం గ్రామానికి చెందిన విజయ్ అనే వ్యక్తి గురువారం గృహ నిర్మాణం పనులు చేపట్టారు. అయితే ఆ స్థలం తనదని గాలి సుబ్రమణ్యం మరికొంత మంది నిర్మాణ పనులకు అడ్డు తగిలారు. దీంతో ఇరువర్గాలు ఒకరిపై ఒకరు రాళ్లు విసురుకున్నారు. ఈ ఘర్షణలో విజయ్ అనే వ్యక్తి తలకు బలమైన గాయాలు తగలడంతో కడప రిమ్స్కు తరలించారు. పోలీసులు, వీఆర్ఓ రేణుక సంఘటన స్థలానికి చేరుకుని గృహ నిర్మాణ పనులు నిలుపుదల చేయించారు. ఎస్ఐ మహమ్మద్రఫీ ఆధ్వర్యంలో పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. విద్యార్థికి తీవ్ర గాయాలు మదనపల్లె రూరల్ : బాత్రూమ్లో జారిపడి విద్యార్థి తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చిత్తూరు జిల్లా చౌడేపల్లె మండలంలో జరిగింది. దుర్గసముద్రం పంచాయతీ బుటకపల్లెకు చెందిన మల్లికార్జున, గంగాదేవి దంపతుల కుమారుడు ప్రదీప్(9) స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలలో మూడో తరగతి చదువుతున్నాడు. ఉదయం విరామ సమయంలో బాత్రూమ్కు వెళ్లాడు. అదే సమయంలో బయట గుడివద్ద మేళతాళాల శబ్దం రావడంతో ఊరేగింపు చూసేందుకు బాత్రూమ్లోని గోడకు అమర్చిన పలకలపై ఎక్కి చూసేందుకు ప్రయత్నించాడు. ఈ క్రమంలో గోడ పలక విరిగిపోవడంతో జారి కిందపడ్డాడు. కిందపడే సమయంలో పలకకు అమర్చిన టైల్స్ మొన పదునుగా ఉండటంతో కడుపులో గుచ్చుకుని తీవ్రంగా గాయపడ్డాడు. పొట్ట పేగులు సైతం బయటకు వచ్చాయి. దీంతో కుటుంబ సభ్యులు బాలుడిని హుటాహుటిన మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. -
అలుపెరుగని పోరాట యోధుడు కాన్షీరాం
మదనపల్లె రూరల్ : భారతదేశ రాజకీయ వ్యవస్థలో పెను భూకంపాన్ని సృష్టించి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక సమానత్వానికి పునాది వేసిన పోరాట యోధుడు కాన్షీరాం అని విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే) పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం.శివప్రసాద్ అన్నారు. గురువారం కాన్షీరాం 19వ వర్ధంతి సందర్భంగా స్థానిక బాస్, వీసీకే కార్యాలయంలో సంస్మరణ కార్యక్రమం నిర్వహించారు. కాన్షీరామ్ చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. పీడిత జనుల విముక్తి కోసం డాక్టర్.బీఆర్.అంబేద్కర్ తుదిశ్వాస వరకు కృషిచేస్తే, ఆయన వారసత్వాన్ని అందిపుచ్చుకుని అంబేద్కర్ ఆశయాల సాధన కోసం జీవితకాలం పోరాడిన మహనీయుడు కాన్షీరాం అన్నారు. కార్యక్రమంలో వీసీకే, బాస్ నాయకులు నీరుగట్టి రమణ, చాట్ల బయన్న, వై.గంగాధర్, సొన్నికంటి రెడ్డెప్ప, క్రాంతి, రవిశంకర్, విద్యార్థి నాయకులు పృథ్వీరాజ్, చరణ్ తదితరులు పాల్గొన్నారు. బహుజన యువసేన ఆధ్వర్యంలో.. బహుజన యువసేన రాష్ట్ర అధ్యక్షుడు పునీత్కుమార్ ఆధ్వర్యంలో స్థానిక ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని అంబేద్కర్ సర్కిల్ వద్ద కాన్షీరాం చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో బీవైఎస్ నాయకులు పాల్గొన్నారు. -
వైద్యం ప్రజల హక్కు
● అమలు బాధ్యత ప్రభుత్వానిదే ● మెడికల్ కళాశాల పరిరక్షణకు ప్రజా ఉద్యమంమదనపల్లె : మెరుగైన వైద్య సేవలు పొందడం ప్రజల ప్రాథమిక హక్కు, దాన్ని అమలు చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే అని మాజీ శాసన మండలి సభ్యుడు డాక్టర్ యం.గేయానంద్ అన్నారు. ప్రభు త్వ రంగంలోనే వైద్య విద్య, ప్రజారోగ్యం కొనసాగాలని కోరుతూ జనవిజ్ఞాన వేదిక, ప్రజారోగ్య వేదిక, భారత విద్యార్థి ఫెడరేషన్ సంయుక్త నిర్వహణలో మదనపల్లె పట్టణంలో ఒక ప్రైవేటు ఫంక్షన్ హాలులో గురువారం సమావేశం జరిగింది. గేయానంద్ మాట్లాడుతూ ఆరోగ్య రంగంలో పీపీపీ అమలు చేయడం ప్రమాదకరమన్నారు. ప్రభుత్వం తన బాధ్యతగా ఆరోగ్య వ్యవస్థను పటిష్టం చేయాల్సిన అవసరం ఉందన్నారు. రాష్ట్రంలో 10 వైద్య కళాశాలలను పీపీపీ ద్వారా ప్రైవేట్కు అప్పగించడం ప్రజావ్యతిరేక చర్య అన్నారు. ఈ విధానం వల్ల ఏటా ఎస్సీ, ఎస్టీ, బీసీ విద్యార్థులు వెయ్యి సీట్లు కోల్పోతారని ఆందోళన వ్యక్తం చేశారు. ప్రజా ఆరోగ్యవేదిక అధ్యక్షుడు ఎంవి రమణయ్య మాట్లాడుతూ ఆస్పత్రులు కూడా ప్రైవేటీకరణ అవుతాయన్నారు. అనంతరం ప్రభుత్వ ఆస్పత్రులను బలోపేతం చేయాలని కోరుతూ ఈ నెల 27న మదనపల్లి సబ్ కలెక్టర్ కార్యాలయం ముట్టడి చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు ప్రవేశపెట్టిన తీర్మానానికి సదస్సు ఆమోదం తెలిపింది. వీసీకే పార్టీ రాష్ట్ర నాయకుడు పీటీఎం శివ ప్రసాద్ మాట్లాడుతూ ప్రభుత్వ వైద్య కళాశాలలకు అనుబంధంగా ఏర్పా టు చేసే 300 పడకల ఆస్పత్రితోనే పేద రోగులకు వైద్యసేవలు అందుతాయన్నారు. బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీ చందు, కాంగ్రెస్ పార్టీ నాయకుడు రెడ్డి సాహెబ్, జనవిజ్ఞాన వేదిక నాయకుడు టి.హరీంద్రనాథ్ శర్మ మాట్లాడారు. కార్యక్రమంలో కవి పోతబోలు రెడ్డెప్ప, సీఐటీయూ నాయకుడు ప్రభాకర్ రెడ్డి, ఎస్ఎఫ్ఐ నాయకులు ఆఫ్రిద్, షామీర్, ఐద్వా నాయకులు భాగ్యమ్మ, రెడ్డి ప్రసన్న, అంగన్వాడీ యూనియన్ నాయకులు రాజేశ్వరి, మధురవాణి, ఆశా కార్యకర్తల సంఘం నాయకులు మల్లీశ్వరి, శంకరమ్మ తదితరులు పాల్గొన్నారు. -
దోచుకోవడమే లక్ష్యంగా పాలన
● కూటమి ప్రభుత్వంపై వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్టినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ధ్వజం ● రచ్చబండకు కార్యకర్తలు సిద్ధం కావాలి ● గ్రామస్ధాయి నుంచి పార్టీ బలోపేతానికి కృషి చేయాలి రాజంపేట : రాష్ట్రంలో దోచుకోవడమే లక్ష్యంగా కూటమి పాలన కొనసాగుతోందని వైఎస్సార్సీపీ రీజనల్ కో–ఆర్టినేటర్, శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి విమర్శించారు.గురువారం రాజంపేట మండలం ఆకేపాడు ప్రాంతం పరిధిలో ఉన్న ఆకేపాటి ఎస్టేట్లో వైఎస్సార్సీపీ జిల్లా స్థాయి వి స్తృత సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధికారంలోకి వచ్చాక కార్యకర్తల ద్వారానే పాలన కొనసాగుతుందని భరోసా ఇచ్చారు. గ్రామకమిటీ స్ధాయి నుంచి వైఎస్సార్సీపీ బలోపేతం దిశగా వైఎస్సార్సీపీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అడుగులు వేస్తున్నారన్నారు. ఇందులో భాగంగానే గ్రామ,మండల, జిల్లా స్ధాయి కమిటీల నియామకం పూర్తిచేసి, బలోపేతం దిశగా అన్ని చర్యలు తీసుకుంటామన్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ సైన్యాన్ని సిద్ధం చేస్తున్నామన్నారు. రాజంపేట పార్లమెంటరీ పరిధిలోని అన్ని నియోజకవర్గాలల్లో పార్టీ కమిటీలను పూర్తి చేసి, ముందంజలో ఉందన్నారు. ఎల్లో మీడియా అబద్ధాలు ప్రచారం చేస్తోందని, అవి నమ్మే పరిస్థితిలో ప్రజలు లేరన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి కుటుంబానికి సాయం అందించేందుకు 2లక్షల 59వేల కోట్లు వ్యయం చేసినట్లు గుర్తుచేశారు. రాష్ట్రంలో ఇప్పుడు అవినీతి ప్రభుత్వం రాజ్యమేలుతోందన్నారు. కల్తీమద్యం వ్యవహారాన్ని కప్పిపుచ్చుకునేందుకు, వైఎస్సార్సీపీకి అంటగట్టేందుకు ఎల్లోమీడియా అష్టకష్టాలు పడుతోందని, అయితే కల్తీమద్యం టీడీపిదేనని ప్రజలందరూ బహిరంగంగానే అంటున్నారని అన్నారు. కల్తీమద్యం కేసుకు కీలక సూత్రధారి సార్వత్రిక ఎన్నికల్లో పార్టీకి రూ.50కోట్లు, టికెట్కు రూ.50కోట్లు ఇచ్చుకొని పోటీ చేశారని, అటువంటి వ్యక్తితో వైఎస్సార్సీపీకి మరక అంటించేలా రాసేందుకు ఎల్లోమీడియాకు సిగ్గుండాలని దుయ్యబట్టారు. రాష్ట్రమంతటా మద్యం అక్రమడంప్లు బయటపడుతున్నాయన్నారు.. ముఖ్యమంత్రి, ఆయన తనయుడికి తెలియకుండా అక్రమమద్యం వ్యహారం నడవలేదని ప్రజలు గుర్తించారన్నారు. దిగజారుడు ప్రభుత్వాన్ని సీఎం చంద్రబాబు నడిపిస్తున్నాడని విమర్శించారు. సమావేశం ప్రారంభంలో ఎమ్మెల్యే ఆకేపాటి మనవడు ఆకేపాటి హేమరాఘవరెడ్డి స్వాగతం ప్రసంగం అందరినీ ఆకట్టుకుంది. సమావేశంలో మున్సిపల్ చైర్మన్ పోలాశ్రీనివాసులరెడ్డి, ఫయాజ్బాషా, వనజారెడ్డి, ఎంపీపీలు మేడా భాస్కరరెడ్డి, గాలివీటి రాజేంద్రనాథరెడ్డి, వైఎస్సార్సీపీనేతలు గాలివీటి భాస్కర్రెడ్డి,గాలివీటి వీరనాగిరెడ్డి, చొప్పాఎల్లారెడ్డి, టక్కోలు శివారెడ్డి,తల్లెంభరత్రెడ్డి,ఆవుల విష్ణువర్ధన్రెడ్డి, విజయకుమారెడ్డి, ఉదయకుమార్రెడ్డి, పాలగిరిసుధాకర్రెడ్డి, నడివీధిసుధాకర్, యధుభూషణరెడ్డి, శిబ్యాలవిజయభాస్కర్, భాస్కర్రాజు, రామనాథం, దాసరి పెంచలయ్య,పొత్తపి చంద్ర, గాలివీటి ప్రవీణ్రెడ్డి, సుగవాసిశ్యామ్, వైఎస్సార్సీపీ మహిళ వివిధ స్ధాయి నేతలు ఏకులరాజేశ్వరీరెడ్డి, షమీమ్అస్లాం, బీరంగ రేవతి, మహితా, అజంతమ్మ, మల్లీశ్వరి, అజంతమ్మ, ఎంపీపీ రమణమ్మయాదవ్,మిరియాలసురేఖ,మైనార్టీ నేతలు హరున్బాషా, రియాజ్ అహమ్మద్, ముస్తాక్, కలీం, డీసీఎంఎస్ మాజీ చై ర్మ న్ దండుగోపి, రాజంపేట, ఒంటిమిట్ట, సుండుప ల్లె, వీరబల్లి, సిద్ధవటం మండలాలకు చెందిన వివిధ కమిటీల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. జగనన్న విజన్... జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథరెడ్డి అధ్యక్షతన నిర్వహించిన సమావేశంలో జగనన్న విజన్ను వీడియో వైవా ద్వారా నిర్వహక ప్రతినిధి ప్రభాకర్రెడ్డి నిర్వహించారు. పార్టీ కమిటీ నిర్మాణంతోపాటు బలోపేత దిశగా చేపట్టాల్సిన నియమ నిబంధనలు పార్టీ క్యాడర్కు వివరించారు. సమావేశానికి హాజరైన నాయకులు, కార్యకర్తలు, మాట్లాడుతున్నపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి.చిత్రంలో ఆకేపాటి అమరనాథరెడ్డి, సురేష్బాబు తదితరులు 16 నెలలో అవినీతి, అక్రమాలు, అక్రమకేసుల తప్ప మరొకటి లేదు. ప్రజావ్యతిరేక నిర్ణయాలతో పరిపాలన సాగుతోంది.ఇప్పుడు పతనం అంచులో టీడీపీ ప్రభు త్వం కొనసాగుతోంది. కల్తీమద్యంతో ప్ర జల ప్రాణాలతో చెలగాటం ఆడుతున్నా రు. ప్రభుత్వ మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ,మహిళపై అఘాయిత్యాలు లాంటి సంఘటనలతో సీఎం సిగ్గుతో తలదించుకోవాలి. – చింతలరామచంద్రారెడ్డి, మాజీ ఎమ్మెల్యే, పీలేరు వైఎస్సార్సీపీ నాయకులపై తప్పుడు కేసులు పెడితే తిప్పికొట్టేందుకు సిద్ధంగా ఉన్నాం. అక్టోబరులో అమెరికాకు ఐకాస సమావేశానికి వెళ్లే బృందంలో ఎంపీ మిధున్రెడ్డిని ప్రధాని మోదీ ఎంపిక చేయడం గర్వకారణం. మిథున్రెడ్డిపై తప్పుడు కేసులు పెట్టినా కడిగిన ముత్యంలా బయటికివచ్చారు. అందరి భాగస్వామంతో పార్టీ పటిష్టతకు కృషిచేయాలి. – కొరముట్ల శ్రీనివాసులు, మాజీ ఎమ్మెల్యే, రైల్వేకోడూరు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల్లోకి తీసుకెళ్లాలి. కూటమి వైఫల్యాలపై శంఖానాదం పూరించాలి. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలి.క్షేత్రస్ధాయిలో పార్టీ బలోపేతం చేసే దిశగా అడగులు వేయాల్సి ఉంది. పుంగనూరు నియోజకవర్గంలో 14వేలమందితో పార్టీ కమిటీల నియామకం పూర్తిచేయడం అభినందనీయం. – గడికోట శ్రీకాంత్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి కూటమి పాలనలో అవినీతి, అక్రమాలు రాజ్యమేలుతున్నాయి. తప్పుడుకేసులు, తప్పుడు నిర్ణయాలతో ప్రజలను నిలువునా మోసం చేస్తున్నారు.ఇప్పుడు రాష్ట్రంలో సుపరిపాలనకాదు, అక్రమమద్యం మత్తులో పాలన కొనసాగుతోంది.కార్యకర్తలు సైన్యంలా పార్టీ బలోపేతానికి కృషిచేయాలి – సురేష్బాబు, జిల్లా పరిశీలకులు, వైఎస్సార్సీపీ వైఎస్సార్సీపీ పటిష్టంగా ఉంది. గ్రామస్ధాయి నుంచి రూ.18లక్షల సైన్యం రెడీ అవుతోంది. రాబోయే ఎన్నికల్లో పార్టీ విజయం కోసం కలిసికట్టుగా కృషి చేయాలి. కూటమి ప్రభుత్వ బెదింపులకు భయపడే వారు వైఎస్సార్సీపీలో లేరని తెలసుకోవాలి. – రెడ్డప్పగారి రమేష్రెడ్డి, రాష్ట్ర అధికారప్రతినిధి, అవినీతి, అక్రమాలు టీడీపీ ప్రభుత్వం నిలయంగా మారింది. కల్తీ మద్యం రాష్ట్రమంతటా కంపు కొడుతోంది. కూటమి ప్రభుత్వం ప్రజల్లో అభాసుపాలైంది.అవినీతి ప్రభుత్వాన్ని గద్దె దించేందుకు నడుం బిగించక తప్పదు. – సుగవాసి బాలసుబ్రమణ్యం, వైఎస్సార్సీపీ కేంద్రకమిటీ సభ్యుడు -
పార్టీ పటిష్టతకు కృషిచేయాలి
వైఎస్సార్సీపీని పటి ష్టం చేసేందుకు కార్యకర్తలు కృషి చేయాలి. వైఎస్ జగన్ ఆదేశం మేరకు డిసెంబరులో పు పార్టీకి సంబంధించి అన్ని ప్రక్రియలు పూర్తిచేయాలి. 2029 ఎన్నికల్లో వైఎస్సార్సీపీ మళ్లీ అధికారంలోకి రావాలంటే కార్యకర్తలే ప్రధానభూమిక పోషించాలి. – మేడా రఘునాథరెడ్డి, ఎంపీ, రాజ్యసభ జిల్లాలో వైఎస్సార్సీపీ బలోపేతమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నాం. అన్ని స్ధాయి కమిటీలను పూర్తి చేశాం. వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు జిల్లాస్థాయి విస్తృత సమావేశం నిర్వహించాం. ప్రజావ్యతిరేక నిర్ణయాలను ఎప్పటికప్పుడు ఎండగట్టే విధంగా పార్టీని సంసిద్ధం చేస్తున్నాము. 2029లో మళ్లీ సీఎంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి దిశగా ఇప్పటి నుంచి పార్టీ క్యాడర్ సమాయత్తంకావాలి – ఆకేపాటి అమరనాధ్రెడ్డి, జిల్లా అధ్యక్షుడు,ఎమ్మెల్యే సీఎం చంద్రబాబు నాయుడు డైవర్షన్ పాలిటిక్స్లో దిట్ట.ఇందులో సందేహం లేదు. సరైన సమయంలో ఓటు అనే ఆయుధంతో సమాధానం చెప్పేందుకు ప్రజలు ఎదురుచూస్తున్నారు. రాష్ట్రంలో నిరుద్యోగులకు ఉపాధి కల్పించే పరిశ్రమలు కాదు, మద్యం పరిశ్రమలు వెలుస్తున్నాయి.రాష్ట్రమంతటా నకిలీమద్యం సరఫరా అవుతోంది. నకిలీ మద్యం స్కాంపై విచారణ జరపాలి. సంపద సృష్టిస్తామని చెపుతూ తమ సంపదను పెంచుకుంటున్నారు. రచ్చబండ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వైఎస్సార్సీపీ సైన్యం సిద్ధం కావాలి. – నిసార్ అహమ్మద్, ఇన్చార్జి, మదనపల్లె -
నేటి నుంచి బోధనేతర పనులు బహిష్కరణ
రాయచోటి : రాష్ట్ర ప్రభుత్వం, విద్యాశాఖలు విద్యారంగంలో అవలంబిస్తున్న ప్రయోగాలను, తిరోగమన విధానాలను వ్యతిరేకిస్తూ పాఠశాలల్లో ఈనెల 10వ తేదీ నుంచి బోధనేతర కార్యక్రమాలను బహిష్కరించనున్నారు. ఈ మేరకు ఫ్యాప్టో నిర్ణయం తీసుకుంది. ఈ నెల 7వ తేదీ విజయవాడలో జరిగిన ఫ్యాప్టో రాష్ట్రకార్యవర్గంలో తీసుకున్న నిర్ణయాన్ని శుక్రవారం నుంచి అమలుకు శ్రీకారం చుడుతున్నారు.ఈమేరకు గురువారం ఉపాధ్యాయులు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు వినతిపత్రం అందజేశారు.బోధనేతర కార్యక్రమాలు వల్ల బోధనా సమయం హరించుకుపోతోందని, ఉపాధ్యాయులకు బోధనపై ఆసక్తి తగ్గిపోయేలా చేస్తోందని పేర్కొన్నారు. కావున ఉపాధ్యాయులను బోధనకే పరిమితం చేయాలని ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జాబిర్, జనరల్ సెక్రటరీ గఫార్ ఖాన్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. విద్యార్థుల హాజరు, మధ్యాహ్న భోజన పథకానికి సంబంధించిన పనులు మాత్రమే ఉపాధ్యాయులు చేపడతారన్నారు. మూల్యాంకనానికి సంబంధించి పరీక్షల నిర్వహణ తప్ప బోధనేతర పనులను, అనవసరమైన గూగుల్ షీట్స్ నింపడం, విద్యాశక్తి, జీఎస్టీ 2.0 లాంటి సీజనల్ ప్రచార కార్యక్రమాలను చేపట్టబోమని తెలియజేశారు. కార్యక్రమంలో ఫ్యాప్టో కో–చైర్మన్లు శివారెడ్డి, సిబాతుర్రహ్మాన్, పి మహమ్మద్ ఇలియాస్, కోశాధికారి జాఫరుద్దీన్, డిప్యూటీ జనరల్ సెక్రటరీ హరిబాబు, ఫ్యాప్టో నాయకులు సురేంద్రరెడ్డి, టి శివారెడ్డి, రెడ్డయ్య, దావుద్దీన్, అంజద్బాషా శంకర్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
సాగుకు వేళాయె..రాయితీ విత్తనం రాకపాయె
గుర్రంకొండ : జిల్లాలో ఉలవ పంట సాగుకు అదను దాటుతుండడంతో రైతులు ప్రభుత్వం సరఫరా చేసే సబ్సీడీ ఉలవల కోసం ఎదురుచూస్తున్నారు. సాధారణంగా సెప్టెంబర్, అక్టోబర్ నెలలు ఉలవ పంట సాగుకు అనుకూలం. గత ఏడాది ప్రభుత్వం సబ్సిడీ ఉలవలను సెప్టెంబర్నెలలోనే పంపిణీ చేసింది. ఈ సంవత్సరం ఇంతవరకు అందకపోవడంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. జిల్లాలో వర్షాధారమైన ప్రత్యామ్నాయ పంటల సాగుకు రైతులు సన్నద్ధమవుతున్నారు.ముఖ్యంగా ఉలవపంట సాగుకు ఇదేఅదను కావడంతో ప్రభుత్వం పంపిణీ చేసే ఉలవల కోసం ఎదురుచూస్తున్నారు. జిల్లాలో 17256 ఎకరాల విస్తీర్ణంలో ఉలవ పంట సాగుకు రైతులు సన్నాహాలు చేసుకొంటున్నారు. జిల్లాలో ఖరీఫ్సీజన్ వేరుశగపంట సాగు గడవు ముగిసింది. సాధారణంగా వర్షాలు సమృద్ధిగా కురిసే జూన్, జులై, ఆగష్టు నెలల్లో మాత్రమే వేరుశనగ సాగుకు అనుకూలం. ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవలేదు. దీంతో వేరుశనగ సాగు అనుకున్న విధంగా సాగలేదు. జిల్లాలో సగటున నుంచి 24 శాతం మంది రైతులు మాత్రమే ఈసీజన్లో వేరుశగ సాగు చేశారు. గడువు ముగిసి పోవడంతో మిగిలిన రైతులు ప్రత్యామ్నాయ పంటలు, అందులోనూ ఉలవపంట సాగుకు సన్నద్ధమవుతున్నారు. ఉలవ పంట సెప్టెంబరు నుంచి అక్టోబర్ 30 వరకు సాగు చేసుకోవడానికి ఆనుకూలంగా ఉంటుంది. జిల్లాలోని నాలుగు నియోజకవర్గాల్లో వేరుశన పోను మిగిలిన 17256 ఎకరాల్లో రైతులు ఉలవ సాగు చేసుకోవడానికి ఏర్పాట్లు చేసుకొంటున్నారు. సకాలంలో వర్షాలు కురిస్తే ఉలవ పంట సాగు చేసుకోవచ్చని రైతులు అంటున్నారు. అన్నదాతకు అవసరమైన ఉలవల స్టాకు కోసం అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు. ప్రభుత్వం నుంచి స్టాకు రాగానే పంపిణీ చేయడానికి సన్నద్ధమవుతున్నారు. గతేడాది సెప్టెంబర్లోనే పంపిణీ సాధారణంగా జిల్లాలోని రైతులు వేరుశనగ పంట సీజన్ ముగియగానే ఉలవ సాగు చేయడానికి ఏర్పాట్లు చేసుకొంటారు. సాగును సెప్టెంబర్నెలలోనే ప్రారంభించడం ఆనవాయితీ. గత ఏడాది రైతుల అవసరాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం సెప్టెంబర్ మొదటి వారంలోనే జిల్లాలోని రైతుసేవాకేంద్రాల ద్వారా సబ్సీడీపై ఉలవలను పంపిణీ చేశారు. ఈ సంవత్సరం ఇంతవరకు ఇవ్వలేదు. రైతులు ప్రతిరోజు గ్రామాల్లోని రైతు సేవాకేంద్రాల్లో వ్యవసాయ సిబ్బంది వద్దకు వెళ్లి వాకబు చేస్తున్నారు. అయితే సబ్సిడీ ఉలవల పంపిణీపై వారికే సరైన అవగాహన లేకపోవడం రైతులకు సమాధానం చెప్పలేక సతమతమవుతున్నారు. ఉలవల కోసం రైతుల ఎదురుచూపులు ప్రత్యామ్నాయ పంటల సాగుకు సన్నద్ధం ! జిల్లాలో17256 ఎకరాల్లో ఉలవ సాగు నియోజకవర్గం సాగు విస్తీర్ణం పేరు (ఎకరాల్లో) 1) పీలేరు 4520 2)తంబళ్లపల్లె 4635 3) మదనపల్లె 3850 4) రాయచోటి 4251 -
పొగాకు రహిత సమాజాన్ని నిర్మిద్దాం
రాయచోటి జగదాంబసెంటర్ : పొగాకు రహిత సమాజాన్ని నిర్మించి ఆరోగ్య ఆంధ్రప్రదేశ్ ఏర్పడేందుకు ప్రతి ఒక్కరూ పాటుపడాలని జాతీయ పొగాకు నియంత్రణ ప్రోగ్రాం ఆఫీసర్ శ్రీవాణి కోరారు. గురువారం రాయచోటిలోని డైట్ కేంద్రంలో జిల్లా వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పొగాకు వ్యతిరేక అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా శ్రీవాణి మాట్లాడుతూ సిగరెట్టు, ఇతర పొగాకు సంబంధిత ఉత్పత్తుల వినియోగం వల్ల కలిగే దుష్ప్రభావాల గురించి విద్యార్థులకు వివరించారు. ప్రజలందరూ మంచి ఆహారపు అలవాట్లను అలవరచుకోవాలని, పొగాకు, వాటి ఉత్పత్తులకు దూరంగా ఉండాలని తెలిపారు. సమావేశంలో పాల్గొన్న వారిచేత పొగాకు వినియోగానికి వ్యతిరేకంగా ప్రతిజ్ఞ చేయించారు. కార్యక్రమంలో డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపల్ ఎం.నర్సింహారెడ్డి, గర్ల్ చైల్డ్ డెవలప్మెంట్ ఆఫీసర్ సుమతి, జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్రెడ్డి, అధ్యాపకులు శివభాస్కర్, వెంకటసుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
దరఖాస్తుల ఆహ్వానం
రాయచోటి జగదాంబసెంటర్ : అర్హులైన నిరుద్యోగ మైనార్టీ యువతకు హోం కేర్ నర్స్ ఉద్యోగాల కోసం ఓవర్సీస్ మెన్ పవర్ కంపెనీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ వారి ద్వారా ఖతర్ దోహాలో ఉద్యోగ అవకాశాలు కల్పించనున్నారు. ఈ విషయాన్ని అన్నమయ్య, వైఎస్ఆర్ కడప జిల్లా ఏపీ స్టేట్ మైనార్టీ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ కార్యనిర్వాహక సంచాలకులు షేక్ హిదాయతుల్లా గురువారం ఒక ప్రకటనలో తెలిపారు. బీఎస్సీ (నర్సింగ్), జీఎన్ఎం (నర్సింగ్) అర్హత కలిగి 21–40 సంవత్సరాలు కలిగిన సీ్త్ర, పురుష అభ్యర్థులు 2 సంవత్సరాలు అనుభవం కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల వారు ఈ నెల 12వ తేదీన విజయవాడలో జరిగే ఇంటర్వ్యూలకు హాజరుకావాలని తెలిపారు. మరిన్ని వివరాలకు 08562–241137, 9290448452, 9515835805 నెంబర్లలో సంప్రదించాలని కోరారు. ఆలయ భూముల ఆక్రమణలపై చర్యలు సుండుపల్లె : మండల పరిధిలో ఆలయ భూములు ఆక్రమణకు గురైతే స్వాధీనం చేసుకోవడానికి చర్యలు చేపడుతున్నట్లు దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాఽథం తెలిపారు. సుండుపల్లెకు సమీపంలో రెవెన్యూ ఆర్ఎస్ఆర్, దేవదాయ శాఖ రికార్డుల ప్రకారం 2127 సర్వే నంబర్లో సుండుపల్లెమ్మ దేవతకు చెందిన ఆక్రమణలకు గురైన 4.40 ఎకరాల మాన్యం భూములను గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఇప్పటి వరకు జిల్లాలో 59 మందికి నోటీసులు జారీ చేశామని పేర్కొన్నారు. ఆలయాల అభివృద్ధికి కృషి దేవాలయాల అభివృద్ధికి కృషి చేస్తానని దేవదాయ శాఖ జిల్లా అధికారి విశ్వనాథం తెలిపారు. గురువారం మండలంలోని పలు ఆలయాలను పరిశీలించారు. ఇక్కడ జరుగుతున్న పూజలు, దూప దీప నైవేద్యాల గురించి అర్చకులను అడిగి తెలుసుకున్నారు.జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో ఆలయాల అభివృద్ధిపై దృష్టి సారిస్తామని తెలిపారు. రాయచోటి : ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం సాయంత్రం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ పలు అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ నిశాంత్ కుమార్, సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్లు హాజరయ్యారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ మూడంచెల గ్రామ వార్డు సచివాలయ వ్యవస్థ ఏర్పాటుపై చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సీజనల్ వ్యాధులపట్ల అప్రమత్తంగా ఉండాలని జిల్లా వైద్య,ఆరోగ్యశాఖ అధికారికి సూచించారు. డీఆర్ఓ మధుసూదన్ రావు పాల్గొన్నారు. -
విద్యార్థిపై దాడి సంఘటనపై విచారణ
లక్కిరెడ్డిపల్లి : ఫీజు చెల్లించలేదని బి.కొత్తకోట రిషీవాటిక గురుకులం విద్యార్థి శేషాద్రిరెడ్డిపై రాయితీ దాడి చేసిన సంఘటనపై ఉన్నతాధికారులు బుధవారం విచారణ నిర్వహించారు. సాక్షిలో ప్రచురితమైన విద్యార్థిపై దాడి....ఘటనపై వారు స్పందించారు. అన్నమయ్య జిల్లా డీఎంఅండ్హెచ్ఓ లక్ష్మీ నరసయ్య చేరుకుని విద్యార్థికి వైద్య పరీక్షలు జరిపారు. అనంతరం మీడియా సమావేశంలో శేషాద్రిరెడ్డి తల్లిదండ్రులు మాట్లాడుతూ తమ కుమారుడిపై బోధనేతర సిబ్బంది వెంకటేష్ దాడి చేసి నెల రోజులవుతున్నా పోలీసులు ఎలాంటి చర్యలు తీసుకోలేదని ఆవేదన వ్యక్తం చేశారు. తమ కుమారుడి కుడి కన్ను పూర్తిగా దెబ్బతిందని, పోలీసులు పాఠశాల యాజమాన్యానికి వత్తాసు పలుకుతున్నారని ఆరోపించారు. అన్యాయంపై ప్రశ్నిస్తుంటే తమను చంపేస్తామని బెదిరిస్తున్నారని వాపోయారు. శేషాద్రి రెడ్డి కేసును జిల్లా యంత్రాంగం నీరుగారుస్తోందని కన్నీటి పర్మంతమయ్యారు. వెంకటేష్ను అరెస్టు చేసే వరకూ న్యాయ పోరాటాన్ని కొనసాగిస్తామన్నారు. మదనపల్లి పోలీసులు తమను కోర్టుకు హాజరుకావాలని నోటీసులు జారీ చేశారన్నారు. -
ప్రతిభకు కౌశల్ !
మదనపల్లె సిటీ : ప్రభుత్వ పాఠశాలల్లోని ప్రతిభావంతులను ప్రోత్సహించడానికి ‘కౌశల్’2025 పోటీలు దోహదపడుతాయి. ప్రభుత్వ పాఠశాలల విద్యార్థుల నుంచి కౌశల్–2025 పేరిట రాష్ట్ర స్థాయి సైన్స్ ప్రతిభ అన్వేషణ పోటీల్లో పాల్గొనేందుకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నారు. భారతీయ విజ్ఞాన మండలి, ఏపీ సైన్స్ సిటీ, ఏపీ స్టేట్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ అండ్ టెక్నాలజీ సంస్థలు సంయుక్త ఆధ్వర్యంలో ఏటా ఈ పోటీలలను నిర్వహిస్తున్నారు. క్విజ్ పోటీలకు 8,9,10 తరగతుల నుంచి ఒక్కో తరగతికి ముగ్గురు, రెండు నిమిషాల వ్యవధితో కూడిన రీల్స్/ షార్ట్స్ పోటీలకు,పదో తరగతి నుంచి ఇద్దరు, పోస్టర్ తయారీ–1 పోటీలకు 9వ, పోస్టర్–2కు 8వ తరగతి నుంచి ఇద్దరు చొప్పున పాల్గొనాలి. ప్రతిభ కనబరిచిన వారిని ఆయా విభాగాలకు 20 మంది చొప్పున జిల్లా స్థాయికి ఎంపిక చేస్తారు. అక్కడ ప్రథమ, ద్వితీయ స్థానాల్లో నిలిచిన వారిని రాష్ట్ర స్థాయికి ఎంపిక చేస్తారు. విజేతలను జిల్లా రాష్ట్ర స్థాయిల్లో నగదు బహుమతులతో పాటు ప్రశంసాపత్రం, జ్ఞాపికలు అందజేస్తారు. ఆసక్తిగల విద్యార్థులు పాఠశాల సమన్వయకర్త ద్వారా అక్టోబర్ 24వతేదీలోపు www.bvmap.org వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని కౌశల్–2025 డివిజన్ సమన్వయకర్త భాస్కరన్ తెలిపారు. ఈ ప్రభుత్వ యాజమాన్య పాఠశాలల్లో 8,9,10 తరగతుల విద్యార్థులు అర్హులు. కౌశల్ పోటీలకు 8,9,10 తరగతుల సిలబస్ నుంచి గణితం, ఫిజిక్స్, నేచురల్ సైన్సులపై ఉంటుంది. క్విజ్ పోటీల్లో... రాష్ట్ర స్థాయిలో ప్రథమ బహుమతిగా రూ.15వేలు, ద్వితీయ బహుమతిగా రూ.12 వేలు, తృతీయ బహుమతిగా రూ.9 వేలు, ప్రోత్సాహక బహుమతిగా రూ.6 వేలు అందజేస్తారు. జిల్లా స్థాయిలో మొదటి మూడు స్థానాలకు రూ.4,500, రూ.3,000, రూ.1,500 నగదు ఇస్తారు. పోస్టర్ ప్రజంటేషన్లో... రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన విజేతలకు వరుసగా రూ.5 వేలు, రూ. 3 వేలు, రూ.2 వేలు చొప్పున అందజేస్తారు. కన్సోలేషన కింద రూ.1500 చొప్పున అందజేస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ రూ.1500, ద్వితీయ రూ.1000 ఇస్తారు. వైజ్ఞానిక లఘ చిత్ర పోటీల్లో ... వైజ్ఞానిక లఘచిత్ర పోటీల్లో కేవలం 10వ తరగతి విద్యార్థులే పాల్గొనాలి. లఘచిత్రం నిడివి రెండు నిమిషాలు ఉండాలి. రాష్ట్ర స్థాయిలో మొదటి మూడు స్థానాల్లో నిలిచిన వారికి రూ.5 వేలు, రూ.3 వేలు, రూ.2వేలు చొప్పున అందజేస్తారు. ప్రోత్సాహక బహుమతికి కింద రూ.1500 ఇస్తారు. జిల్లా స్థాయిలో ప్రథమ రూ.1500, ద్వితీయ రూ.వెయ్యి చొప్పున నగదు బహుమతి అందజేస్తారు. పరీక్షల తేదీలు: పాఠశాల స్థాయిలో నవంబర్ 1,3,4 తేదీల్లో, జిల్లా స్థాయిలో ఆన్లైన్ విధానంలో పరీక్షలు ఉంటాయి కౌశల్ –2025 పోటీల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి విద్యార్థులు పాల్గొనేలా ప్రధానోపాధ్యాలు ప్రోత్సహించాలి. పిల్లల్లో దాగిన ప్రతిభను వెలికి తీసేందుకు ఈ పోటీలు దోహదపడతాయి. విద్యార్థులు తమ పేర్లు నమోదు చేసుకునేలా ఎంఈఓలు, హెచ్ఎంలు కృషి చేయాలి. – భాస్కరన్, కౌశల్ డివిజన్ సమన్వయకర్త. ఆన్లైన్ పరీక్ష తేదీలుపాఠశాల స్థాయి : నవంబర్ 1,3,4 తేదీలు జిల్లా స్థాయి : 8,9 తరగతులకు నవంబర్ 27న, పదో తరగతికి నవంబర్ 28 రాష్ట్రస్థాయి : డిసెంబర్ 27 -
ప్రజల భద్రతే.. మా ప్రథమ కర్తవ్యం
రాయచోటి : జిల్లా ప్రజల భద్రతే మా ప్రథమ కర్తవ్యం అని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఓ ప్రకటనలో పేర్కొన్నారు. ప్రజల సహకారమే నేరాలను అరికట్టేందుకు అసలు బలమని ఎస్పీ తెలిపారు. చిన్నారుల భద్రతపై తల్లిదండ్రులు అప్రమత్తంగా ఉండాలని, చెరువులు, నీటి కుంటలు, బోర్లు వంటి ప్రమాదకర ప్రదేశాలకు వెళ్లనీయ వద్దని హెచ్చరించారు. సైబర్ క్రైమ్, సోషల్ మీడియా మోసాలపై జాగ్రత్తగా ఉండాలని, పేకాట, కోడి పందేలు, గంజాయి, అక్రమ మద్యం, నాటుసారా విక్రయాలకు పాల్పడితే కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. రౌడీ షీటర్లు, నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘా కొనసాగుతుందని, ఎక్కడైనా గొడవలకు పాల్పడితే కేసులు నమోదు చేస్తామని తెలిపారు. గ్రామాలలో అనుమానాస్పద వ్యక్తులు కనబడితే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
బస్సు డ్రైవర్పై ప్రయాణికుల దాడి
రైల్వేకోడూరు అర్బన్ : బస్సు డ్రైవర్పై ప్రయాణికులు దాడి చేయడంతో గాయాలయ్యాయి. రైల్వేకోడూరు మండలం శెట్టిగుంట వద్ద ప్రయాణికులు బస్సుకోసం వేచి యున్నారు. రాజంపేట డిపో ఆర్టీసీ బస్సు తిరుపతికి వెళ్తుండగా.. ప్రయాణికులు బస్సు ఆపారు. డ్రైవర్ బాషా ఆపకుండా పోవడంతో కొందరు యువకులు బస్సును వెంబడించి డ్రైవర్, కండెక్టర్లపై దాడి చేసి గాయపరిచినట్లు తెలిసింది. ఇంకా కేసు నమోదు కాలేదు. బాలిక హత్య కేసులో అనుమానితులకు పాలిగ్రాఫ్ టెస్ట్జమ్మలమడుగు రూరల్ : గండికోటలో మైనర్ బాలిక హత్య కేసులో అనుమానితులైన కొండయ్య, సురేంద్ర, బాలిక స్నేహితుడు లోకెష్లను పాలిగ్రాఫ్ టెస్ట్ కోసం సిఐ నరేష్బాబు ఈ నెల 5న విజయవాడకు తీసుకెళ్లారు. గత మూడు రోజులుగా అనుమానితులకు పాలిగ్రాఫ్ పరీక్ష చేస్తున్నట్లు సమాచారం. ఈ నెల 10వతేదీన కోర్ట్ అనుమతి ఉండడంతో హత్య కేసు చిక్కుముడి వీడనుంది. గండికోటలో మైనర్ బాలిక హత్య జూలై 14న జరిగింది. 85 రోజులు అయినా నిందితులు ఎవరినీ పోలీస్ అధికారులు గుర్తించలేదు. సాంకేతిక సాయంతో గుర్తించాలని అగష్టు 26న జమ్మలమడుగు కోర్టులో నిందితులను హాజరుపరచారు. జడ్జి అంగీకరించడంతో ముగ్గురిని విజయవాడకు తీసుకెళ్లారు.