breaking news
annamayya district Latest News
-
పోలి చెరువులోకి భారీగా వరద నీరు
రాజంపేట టౌన్: దిత్వా తుపాన్ కారణంగా ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాలకు అన్నమయ్య జిల్లా రాజంపేట వద్దనున్న పోలి చెరువులోకి వరద నీరు భారీగా వచ్చి చేరుతుంది. దీనికి తోడు బుధవారం రాత్రి నుంచి వేకువజాము వరకు రాజంపేటలో భారీ వర్షం కురిసింది. దీంతో దాదాపు 60 శాతం మేరకు చెరువులోకి నీళ్లు వచ్చినట్లు రైతులు చెబుతున్నారు. తుపాన్కు ముందు పోలి చెరువు ఎండిపోయే దశలో ఉండింది. ఒక్కసారిగా చెరువులోకి నీళ్లు వస్తుండటంతో రైతుల్లో ఆనందం వ్యక్తం అవుతుంది. మండలంలోని అతి పెద్ద చెరువు అయిన పోలి చెరువు నిండి అలుగు పొర్లితే దాదాపు రెండేళ్ల పాటు భూగర్భజలాలు సంవృద్ధిగా ఉంటాయని రైతులు పేర్కొంటున్నారు. మరో రెండు రోజులు ఎగువ ప్రాంతాల్లో ఓ మోస్తరు వర్షాలు కురిసినా పోలి చెరువు నిండే అవకాశాలు ఉన్నాయి. ప్రస్తుతం పోలి చెరువులో నీళ్లు వేణుగోపాల స్వామి ఆలయం ప్రహరీకి నాలుగు అడుగుల దూరంలో ఉన్నాయి. పోలి చెరువు నిండుకుండలా చూపరులను కనువిందు చేస్తోంది. -
వైభవంగా సీతారాముల పౌర్ణమి కల్యాణం
ఒంటిమిట్ట: ఆంధ్ర భద్రాద్రిగా విరజిల్లుతున్న ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో గురువారం పౌర్ణమి సందర్భంగా ఉదయం 10 గంటలకు సీతాసమేతుడైన శ్రీ కోదండ రాముడి కళ్యాణం వైభవంగా నిర్వహించారు. వర్షం కురుస్తుండటంతో ఆలయ రంగమండపంలోనే ప్రత్యేక కల్యాణ వేదిక ఏర్పాటు చేసి, అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ ఉత్సవ మూర్తులను వేర్వేరుగా కొలువుదీర్చారు. అనంతరం సీతారాములకు సుగంధద్రవ్యాలతో పాటు పాలు, పెరుగు, తేనె, నెయ్యి, కొబ్బరినీళ్లతో అభిషేకాలు నిర్వహించి, నూతన పట్టువస్త్రాలు ధరింపజేసి, తులసి గజమాలతో ప్రత్యేకంగా అలంకరించారు. అనంతరం కల్యాణ క్రతువును క్రమంగా నిర్వహించారు. స్వామి వారి కల్యాణాన్ని వీక్షించేందుకులు భక్తులు అధిక సంఖ్యలో హాజరయ్యారు. -
అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు దుర్మార్గం
రాజంపేట: పదకవితాపితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల జన్మస్థలం తాళ్లపాక నుంచి తిరుమలకు శేషాచలం అటవీమార్గంలో చేరుకున్న కాలిబాటపై టీడీపీ కూటమి ప్రభుత్వం ఆంక్షలు విధించడం దుర్మార్గపు చర్య అని వైఎస్సార్సీపీ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు, రాజంపేట శాసనసభ్యుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి అన్నారు. ఆకేపాటి ఎస్టేట్లో గురువారం రాజంపేట వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి ఆకేపాటి అనిల్కుమార్రెడ్డితో కలిసి మీడియా సమావేశం నిర్వహించారు. 22 ఏళ్లుగా అన్నమయ్య కాలిబాటలో... తాను 22 ఏళ్లుగా అన్నమయ్య కాలిబాటలో వేలాదిమందితో కలిసి తిరుమలకు చేరుకొని, శ్రీవారిని దర్శించుకునేవారమని ఆకేపాటి తెలిపారు. అన్నమాచార్యుడు శ్రీ వెంకటేశ్వరసామిపై వేలాది కీర్తనలు రచించి, ఆలపిస్తూ ఏడుకొండలు ఎక్కారన్నారు. అన్నమయ్య నడిచిన ఆ బాటలో గోవిందమాల ధరించిన వేలాదిమందితోలేటా తిరుమలకు మహాపాదయాత్రగా చేస్తున్నట్లు వివరించారు. తిరుమల మహాపాదయాత్రకు సిద్ధమయ్యే పరిస్ధితిలో.. ఈ ఏడు కూడా తిరుమల మహాపాదయాత్ర చేస్తున్నానని 40 రోజులు నుంచి తాను పోస్టర్లుతోపాటు విస్తృత ప్రచారం చేశానని, ఇన్ని రోజులు కాలిబాటలో వెళ్లకూడదనే అంశాన్ని అటవీశాఖ అధికారులు తీసుకురాలేదని తాజాగా రెండు, మూడు రోజుల ముందు కాలిబాటపై నిషేదాజ్ఞలు తీసుకురావడం ఏంటని అసహనం వ్యక్తంచేశారు. ఇది మంచి సంప్రదా యం కాదన్నారు. టీటీడీ జేఈవోను కలిసి తిరుమల మహాపాదయాత్రలో కొండకు చేరుకొనే గోవిందమాల ధరించిన పేదలకు దర్శనం కల్పించాలని విన్నవించానన్నారు. ఎన్నడూ ఆటంకాలు కలగలేదు ఇన్నేళ్ల కాలిబాట మహా పాదయాత్రలో ఎటువంటి ఆటంకాలు కలగలేదని ఆకేపాటి వెల్లడించారు. వయోభారం ఉన్న, అనారోగ్యంతో ఉన్న సరే ఏడుకొండలస్వామి తమకు అండగా ఉన్నారనే భావనలతో కాలిబాటలో నడిచి కొండకు చేరుకునేవారు తమ పాదయత్రలో ఉన్నారన్నారు. శ్రీ వెంకటేశ్వరస్వామిపై ఉన్న భక్తి తమలో ఎక్కడలేని శక్తి సామర్థ్యాలను కల్పిస్తుందన్నారు. ఆ శక్తితోనే అవలీలగా కొండకు ఎక్కుతామన్నారు. టీటీడీ ఉన్నతాధికారులు సహకారంతో పేదలందరికి స్వామి దర్శనం కల్పించేశక్తిని కలియుగదైవం తనకు ప్రసాదించారన్నారు. ఏ ప్రభుత్వాలు ఉన్నా కాలిబాటలో పాదయాత్ర చేశా.. ఏ ప్రభుత్వాలు ఉన్న తాను మాత్రం అనేకమంది పేదలతో కలిసి అన్నమయ్య కాలిబాటలో తిరుమల మహాపాదయాత్ర చేశానని గుర్తుచేశారు. తాను తిరుమలకు పాదయాత్ర చేస్తే అన్నమయ్య కాలిబాటలోనే వెళ్లి శ్రీవారిని దర్శించుకుంటానన్నారు. కాలిబాటలో పాదయాత్రకు ప్రభుత్వం అనుమతులు ఇవ్వకపోవడం శ్రీవారి భక్తులందరినీ బాధిస్తున్న అంశంగా పరిగణించాల్సి ఉంటుందన్నారు. తొలిసారిగా టీడీపీ కూటమి ప్రభుత్వం అన్నమయ్య కాలిబాటలో పాదయాత్రను అడ్డుకుందని వాపోయారు. ప్రభుత్వం అనుమతులు ఇచ్చే దాకా అన్నమయ్య కాలిబాట పాదయాత్ర తాత్కలికంగా వాయిదా వేస్తున్నట్లు, ఇప్పుడు విరమించుకుంటున్నట్లు వెల్లడించారు. అన్నమయ్య కాలిబాటను అభివృద్ధి చేయాలని జనసేన నేతగా చెప్పిన పవన్ కళ్యాణ్ ఇప్పు డు డిప్యూటీ సీఎంగా, అటవీశాఖ మంత్రిగా ఉన్న హయాంలో అదే అన్నమయ్య కాలిబాటలో శ్రీవారిభక్తులు వెళ్లరాదంటూ ఆంక్షలను విధించడం ఎంతవరకు సబబని ప్రశ్నించారు. అన్నమయ్య కాలిబాట అభివృద్ధి చేయాలని, ఆ దారిలో అమరనాఽథ్ రెడ్డి నడిచివెళుతున్నా రని పవన్ కళ్యాణ్ చేసిన ప్రసంగాన్ని మీడియా ఎదుట వినిపించారు. ఏ ప్రభుత్వం ఉన్నా పాదయాత్ర కొనసాగించాను 22 సార్లు అన్నమయ్య కాలిబాటలో వేలాదిమందితో వెళ్లా తిరుమలకు పాదయాత్ర చేస్తే అన్నమయ్య కాలిబాటలోనే వెళతా ప్రభుత్వం అనుమతులు ఇచ్చేదాకా పాదయాత్ర వాయిదా -
రాజంపేట డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపించాలి: కలెక్టర్
రాజంపేట: రాజంపేట డివిజన్ను అభివృద్ధి పథంలో నడిపించాలని కలెక్టర్ నిశాంత్కుమార్ పిలుపునిచ్చారు. గురువారం రాజంపేటరూరల్ పరిధిలోని బోయనపల్లెలోని సీఎల్ఆర్పీ భవనంలో నూతనంగా ఏర్పాటు చేసిన డివిజనల్ అఽభివృద్ధి కార్యాలయాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాలను మరింత అభివృద్ధి చేసేందుకు డీడీఓ కార్యాలయం ఎంతగానో దోహదపడుతుందన్నారు. కాగా అంతకుముందు డీడీఓల ప్రారంభోత్సవం డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ వర్చువల్ ద్వారా నిర్వహించారు. కార్యక్రమంలో సబ్కలెక్టర్ భావన, తహసీల్దారు పీరుమున్నీ, జనసేన పార్లమెంటరీ నియోజకవర్గ నేత యల్లటూరు శ్రీనివాసరాజు, టీడీపీ ఇన్చార్చి జగన్మోహన్రాజు, డీడీఓ నరసింహమూర్తి పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టికి పలు సమస్యలు పలువురు తమ సమస్యలపై కలెక్టర్కు వినతిపత్రాలను అందచేశారు. అందులో రాజంపేటను జిల్లా కేంద్రంగా చేయాలని, ఆదిశగా నివేదికను ప్రభుత్వానికి పంపాలని వినతిపత్రం అందచేశారు. -
జాతీయ జెంబోరీలో ప్రతిభ
రాయచోటి జగదాంబసెంటర్: ఉత్తరప్రదేశ్ రాష్ట్రం లక్నోలో గల నెల 22 నుంచి 29వ తేదీల వరకు నిర్వహించిన భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ 19వ జాతీయ జెంబోరీలో అన్నమయ్య జిల్లా స్కౌట్స్ అండ్ గైడ్స్ యూనిట్ లీడర్లు, విద్యార్థులు ప్రతిభ చాటారు. వీరిని గురువారం మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి, డీఈఓ సుబ్రమణ్యం అభినందించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జెంబోరీ ముగింపు కార్యక్రమంలో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము విద్యార్థులను అభినందించడం సంతోషకరమన్నారు. జిల్లా సెక్రటరీ ఎం.నరసింహారెడ్డి, అసిస్టెంట్ స్టేట్ ఆర్గనైజింగ్ కమిషనర్ లక్ష్మీకర్, స్కౌట్ మాస్టర్స్ నితిన్రెడ్డి, ప్రేమసాగర్, చినబాబు, ఖాదర్బాషా, గైడ్ కెప్టెన్లు నిర్మల, లక్ష్మి, తిరుమలదేవి, రేష్మ, వివిధ పాఠశాలల స్కౌట్స్ అండ్ గైడ్స్ విద్యార్థులు పాల్గొన్నారు. -
కోడూరును నిర్లక్ష్యం చేస్తే ఉద్యమిస్తాం
రైల్వేకోడూరు అర్బన్: ముఖ్యమంత్రి చంద్రబాబు రాజంపేట, రైల్వేకోడూరు నియోజకవర్గాలను చిన్నచూపు చూస్తున్నారని.. కోడూరును నిర్లక్ష్యం చేస్తే ఉద్యమం తప్పదని గురువారం వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ ఇన్చార్జ్ కొరముట్ల శ్రీనివాసులు హెచ్చరించారు. స్థానిక పార్టీ కార్యాలయంలో ఆయన మాట్లాడారు. సీఎం చంద్ర బాబు అధికారం చేపట్టిన నాటి నుంచి రాజంపేట, రైల్వేకోడూరుపై తీవ్ర నిర్లక్ష్యం వహిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా రాజంపేటలో వైఎస్సార్సీపీ గెలిచిందని కుట్రపూరితంగా జిల్లా విషయంలో ఇచ్చిన హామీలను పక్కన పెట్టారని తెలిపారు. కోడూరు ప్రజల తరపున రెండు ఆప్షన్లు ఇస్తున్నామని జిల్లాకు రాజంపేట కేంద్రంగా ప్రకటించాలని లేదా రైల్వే కోడూరుని తిరుపతిలో కలపాలని డిమాండ్ చేశారు. జిల్లాల విషయంలో చంద్రబాబు, కూటమి ప్రభుత్వ తీరును ఖండిస్తున్నామని తెలిపారు. త్వరలో నిరసనల కార్యాచరణ రూపొందిస్తామని వెల్లడించారు. మూడు నియోజకవర్గాలను జిల్లా చేయడం చంద్రబాబుకే చెల్లిందని విమర్శించారు. మూడేళ్ల క్రితం ఒప్పందం జరిగిన కంపెనీలను తాను తెచ్చినట్లు డప్పు కొట్టుకొంటున్నారని ఎద్దేవా చేశారు. మాజీమార్కెట్ చైర్మన్ సుబ్బరామరాజు, పట్టణకన్వీనర్ సీహెచ్రమేష్, మందలనాగేంద్ర, బుడుగుశివయ్య, నందాబాల, రౌఫ్, ఆంజనేయులు, కరీముల్లా, పుష్పలత, డీవీరమణ, రాజు, శంకరయ్య, రామకృష్ణ, పోతయ్య, రాజగోపాల్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కొరముట్ల శ్రీనివాసులు -
వైఎస్సార్సీపీ జీసీసీ కో– కన్వీనర్గా గోవిందు నాగరాజు
రాజంపేట: వైఎస్సార్సీపీ జీసీసీ (గల్ఫ్ కౌన్సిల్ ఆఫ్ కంట్రీస్ ) కో–కన్వీనర్గా రైల్వేకోడూరు నియోజకవర్గ పెనగలూరు మండలం చక్రంపేటకు చెందిన గోవిందనాగరాజు నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు వెలువడ్డాయి. కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ గల్ఫ్ కన్వీనర్గా బీహెచ్ ఇలియాస్ను మళ్లీ నియమిస్తూ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా ఇలియాస్ మాట్లాడుతూ తాను పార్టీకి చేసిన సేవలను గుర్తించి మరోసారి గల్ఫ్ కన్వీనర్గా నియమించిన మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి కృతజ్ఞతలు తెలిపారు. గల్ఫ్ కమిటీలో ఎలాంటి తారతమ్యాలు లేకుండా, అంకిత భావంతో కృషి చేసి పార్టీ అభ్యున్నతికి పాటుపడతానని తెలిపారు. 2015 నుంచి గల్ఫ్ కన్వీనర్గా పనిచేయడంలో సహకరిస్తున్న కువైట్, ఖతార్, యూఏఈ కమిటీ సభ్యులకు కృతజ్ఞతలు తెలిపారు. రాయచోటి: స్క్రబ్టైఫస్ వ్యాధిపై ఆందోళన అవసరం లేదని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి లక్ష్మీనరసయ్య గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. స్క్రబ్టైఫస్పై జరుగుతున్న ప్రచారంపై జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి స్పందించారు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లా పరిధిలో ఇప్పటికి 289 నమూనాలను సేకరించగా 39 మాత్రమే పాజిటివ్ కేసులు వచ్చాయని పేర్కొన్నారు. ఈ వ్యాధి తీవ్రమైంది కాదని ఇందుకు సంబంధించిన మందులు అందుబాటులో ఉన్నాయన్నారు. వ్యాధిని సకాలంలో గుర్తించి సరైన చికిత్స తీసుకుంటే పూర్తిగా నయం అవుతుందన్నారు. అధిక జ్వరం, అధిక నొప్పులు ఉంటే సమీపంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లి సకాలంలో చికిత్స తీసుకుంటే వ్యాధి నయం అవుతుందన్నారు. వైద్య సిబ్బంది ప్రతి గ్రామంలో పర్యటించి ఇంటింటికీ వెళ్లి ప్రజలకు అవగాహన కల్పించాలని ఆదేశించామని అందులో పేర్కొన్నారు. చింతకొమ్మదిన్నె: తుఫాను, వర్షాల హెచ్చరికల నేపథ్యంలో గురువారంబుగ్గవంక ప్రాజెక్ట్ నుంచి ఒక గేటు ద్వారా 150 క్యూసె క్కుల నీటిని దిగువకు వదిలినట్లు ప్రాజెక్టు అధికారులు తెలిపారు. ప్రాజెక్టులో ప్రస్తుతం 185.2మీటర్ల వద్ద నీటి నిల్వ ఉందని తెలిపారు. కడప కార్పొరేషన్: కడప నగరపాలక మేయర్ ఎన్నికకు నోటిఫికేషన్ విడుదలయ్యింది. ఈ మేరకు రాష్ట్ర ఎన్నికల కమిషనర్ నీలం సాహ్ని ఉత్తర్వులు జారీ చేశారు. ఈనెల 7లోపు కలెక్టర్ లేదా జాయింట్ కలెక్టర్ ఆధ్వర్యంలో కార్పొరేటర్లు, కో ఆప్షన్ సభ్యులు, ఎక్స్ అఫిషియోసభ్యులకు సమచారం ఇవ్వాలని, 11వ తేది ప్రత్యేక సమావేశం నిర్వహించి మేయర్ ఎన్నిక నిర్వహించాలని అందులో పేర్కొన్నారు. ఈ ఎన్నికకు దారితీసిన పరిస్థితులను ఒకసారి పరిశీలిస్తే... ● కడప ఎమ్మెల్యేగా ఎన్నికై న తనకు మేయర్తో సమానంగా వేదికపై కుర్చీ వేయలేదన్న ఏకై క కారణంతోనే ఈ ఎన్నిక వచ్చినట్లు అవగతమవుతుంది. అధికారాన్ని అడ్డం పెట్టుకొని కడప ఎమ్మెల్యే ఆర్. మాధవి, టీడీపీ జిల్లా అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఆడిన కుర్చీ ఆట వల్లే మూడు నెలల్లో పాలకవర్గం పదవీ కాలం ముగిసిపోతున్న తరుణంలో మేయర్ ఎన్నిక అనివార్యమైనట్లు తెలుస్తోంది. తనకు వేదికపై కుర్చీ వేయని వేయని వ్యక్తి మేయర్ స్థానంలో ఉండకూడదని...జీహెచ్ఎంసీ యాక్టులో ఉన్న ఒక నిబంధనను అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే మాధవి స్వయంగా ఫిర్యాదు చేసి మేయర్గా ఉన్న కె. సురేష్ బాబుపై అనర్హత వేటు వేయించారు. సురేష్బాబుకు అనర్హత ఉత్తర్వులు అందకముందే డిప్యూటీ మేయర్గా ఉన్న ముంతాజ్బేగంను ఇన్చార్జి మేయర్గా నియమించారు. మేయర్ పదవి బీసీ జనరల్కు కేటాయించడం..ముంతాజ్బేగం ఓసీ కావడంతో మేయర్ ఎన్నిక అనివార్యమైనట్లు తెలుస్తోంది. -
కిడ్నీ రాకెట్ కేసులో పార్థసారఽథి లొంగుబాటు
మదనపల్లె: రాష్ట్రంలో సంచలనం సృష్టించిన కిడ్నీ మార్పిడి రాకెట్ కేసులో కీలక నిందితుడు, ఏ–2 అయిన డాక్టర్ పార్థసారథిరెడ్డి కోసం పోలీసు బృందాలు తీవ్రంగా గాలిస్తుండగా అనూహ్యంగా గురువారం రాత్రి మదనపల్లి కోర్టులో లొంగిపోయాడు. ఈ సందర్భంగా ఆయన తరపున న్యాయవాది బెయిల్ ఇవ్వాల్సిందిగా పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై పీపీ కృష్ణారెడ్డి తీవ్రంగా వ్యతిరేకించారు. కిడ్నీ మార్పిడికి సంబంధించిన కేసు తీవ్రమైందని, బెయిల్ ఇవ్వరాదని వాదించారు. పోలీసులు అందించిన ఆధారాలతో కృష్ణారెడ్డి వాదనలు వినిపించారు. అనంతరం పార్థసారథిరెడ్డికి రిమాండ్ విధిస్తూ న్యాయమూర్తి ఆదేశాలు జారీ చేశారు. తర్వాత స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిలో వైద్య పరీక్షల అనంతరం ఆయన్ను స్థానిక సబ్ జైలుకు తరలించారు. -
పేదల ఆపిల్ సీతాఫలం. అమృతంలా తియ్యగా ఉండే ఈ పండు అంటే అందరికీ ప్రీతి. పిల్లల నుంచి పెద్దల వరకు, సామాన్యుల నుంచి సంపన్నుల దాకా ఇష్టంగా తింటారు. వర్షా కాలంలో లభించే వీటికి పోషకగనిగా పేరుంది. ఇవి అన్నమయ్య జిల్లాలో విస్తృతంగా పండుతున్నాయి. వీటికి మన రాష్ట్రంల
● జిల్లాలో విస్తృతంగా దిగుబడి ● బయటి ప్రాంతాలకూ ఎగుమతి ● సిరులు కురిపిస్తున్న పంట గుర్రంకొండ : అన్నమయ్య జిల్లా నుంచి కేరళతోపాటు తెలంగాణ, తమిళనాడు, కర్ణాటక రాష్ట్రాలకు సీతాఫలాలు ఎగుమతి చేస్తున్నారు. వీటి సేకరణ ఎందరో కూలీలకు జీవనోపాధి కల్పిస్తుంది. ఈ ఏడాది ముసురు వర్షాల కారణంగా ఈ పంట దిగుబడి 40 శాతానికి పడిపోయింది. దీంతో ధరలు అమాంతం పెరిగాయి. ప్రస్తుతం మార్కెట్లో కిలో రూ.100 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి. వేలాది మంది కూలీలకు జీవనోపాధి అన్నమయ్య జిల్లాలో ముఖ్యంగా పడమటి ప్రాంతమైన పీలేరు, మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు చెందిన వేలాది మంది కూలీలకు సీతాఫలాల సేకరణ జీవనోపాధి కల్పిస్తోంది. ప్రతి నిత్యం కూలీలు సీతాఫలాలను మదనపల్లె, రాయచోటి, గుర్రంకొండ, కండ్రిగ లాంటి ప్రాంతాలకు తీసుకొచ్చి విక్రయిస్తుంటారు. నవంబర్, డిసెంబర్ నెలల్లో చాలా మంది వీటిని సేకరించి జీవనం సాగిస్తుంటారు. ఆయా గ్రామాల సమీపంలోని కొండలు, గుట్టల్లో రోజంతా గాలించి సీతాఫలాలను కూలీలు సేకరిస్తుంటారు. పలువురు కూలీలు బృందంగా ఏర్పడి రెండు రోజుల పాటు సేకరించి ఆటోలలో క్రీట్ల ద్వారా సీతాఫల మండీలకు తీసుకొస్తున్నారు. కాగా పలువురు వ్యాపారులు గ్రామాలకే వచ్చి కూలీల దగ్గర నేరుగా కొనుగోలు చేసి బయటి ప్రాంతాలకు తీసుకెళుతున్నారు. దిగుబడి తగ్గడంతో పెరిగిన ధరలు ఈ ఏడాది సకాలంలో వర్షాలు కురవకపోవడంతోపాటు ఇటీవల చాలా రోజులు కురిసిన ముసురు వర్షాలకు గత ఏడాదితో పోల్చితే.. 40 శాతం దిగుబడి కూడా చేతికందడం లేదని రైతులు అంటున్నారు. దిగుబడి తగ్గిపోవడంతో మార్కెట్లో సీతాఫలాల ధరలు అమాంతం పెరిగాయి. గతేడాదితో పోల్చితే రెండింతలు ధర పెరగడం గమనార్హం. గత ఏడాది 25 కేజీల క్రీట్ ధర మార్కెట్లో రూ.250 నుంచి 350 వరకు పలికాయి. ప్రస్తుతం క్రీట్ ధర రూ.600 నుంచి రూ.700 వరకు పలుకుతుండటం గమనార్హం. ప్రస్తు తం పండ్ల దుకాణాల్లో డిమాండ్ను బట్టి కిలో ధర రూ.100 నుంచి రూ.130 వరకు పలుకుతున్నాయి. రోజుకు రూ.1000 మేరకు ఆదాయం సీతాఫలాల సేకరణతో కరువు కూలీలకు రోజుకు రూ.1000 మేరకు ఆదాయం సమకూరుతుంది. ఈ సీజన్లో కూలీలు రోజుకు కనీసం రెండు క్రీట్ల సీతాఫలాలు సేకరిస్తుంటారు. పల్లెల నుంచి వాటిని బుట్టలు, క్రీట్లలో తీసుకొచ్చి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన మండీలలో విక్రయిస్తుంటారు. రోజూ ఉదయమే పల్లెల నుంచి ఆటోలలో సీతాఫలాలు తీసుకొచ్చి పట్టణ ప్రాంతాలు, డాబాలు, ఎన్హెచ్ 340 రోడ్డు పక్కన పెట్టి విక్రయిస్తుంటారు. ప్రస్తుతం ఒక్కో బుట్ట(క్రీట్) రూ.600 నుంచి రూ.700 విక్రయిస్తుంటారు. ఖర్చులు పోను సగటున ఒక్కో కూలీ రూ. 1000 మేరకు సంపాదించుకుంటారు. ఉద్యానవన పంటగా.. పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాల్లోని పలు గ్రామాల్లో ఇప్పుడిప్పుడే సీతాఫలాల తోటలు ఉద్యానవన పంటలుగా పెంచుతుండటం విశేషం. గతంలో సీతాఫలాలు కొండలు, గుట్టలు, గుర్రంకొండ కోట, ఎల్లుట్ల, కోటకొండ, తంబళ్లపల్లె, కోసువారిపల్లె వంటి అటవీ ప్రాంతాల్లో ఎక్కడ పడితే అక్కడ విరిగిగా లభించేవి. పొలాల గట్లు, చేలగట్లుపైన కూడా ఈ చెట్లను రైతులు పెంచేవారు. ఇది కేవలం వర్షాధార పంటగా ఉండేది. ప్రస్తుతం పలువురు రైతులు మార్కెట్లో సీతాఫలాలకు ఉన్న డిమాండ్ను బట్టి ఉద్యానవన తోటలుగా పెంచుకొంటున్నారు. కొన్ని గ్రామాల్లో వీటి తోటల పెంపకం చేపట్టారు. దీంతో వ్యాపారులు నేరుగా తోటల వద్దకే వెళ్లి కొనుగోలు చేసి బయటి ప్రాంతాలకు ఎగుమతి చేసుకుంటున్నారు. మన ఫలాలకు భలే డిమాండ్ బయటి రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని పలు ప్రాంతాలు, పట్టణాల్లో.. అన్నమయ్య జిల్లాలోని సీతాఫలాలకు భలే డిమాండ్ ఉంది. కూలీల దగ్గర కొనుగోలు చేసిన సీతాఫలాలను స్థానిక వ్యాపారస్తులు బయటి రాష్ట్రాలతోపాటు మన రాష్ట్రంలోని విజయవాడ, గుంటూరు, కనిగిరి, నెల్లూరు, ఉదయగిరి, దర్శి, మార్కాపురం, నరసరావుపేట వంటి పట్టణాలకు ఎగుమతి చేస్తుంటారు. అక్కడి వ్యాపారులు కూడా గుర్రంకొండ వచ్చి కొనుగోలు చేసి తీసుకెళుతున్నారు. ముఖ్యంగా ఎన్హెచ్ 340 జాతీయ రహదారిపై పెట్రోలు బంకులు, డాబాలు, చిల్లర దుకాణాలు ఎక్కువగా నిర్వహిస్తున్నారు. రాత్రిళ్లు ఆర్టీసీ బస్సులు ఇక్కడ నిలిపి డాబాల్లో భోజనాలు చేస్తుంటారు. బెంగళూరు నుంచి కడప, ప్రొద్దుటూరు, కావలి, కనిగిరి, ఉదయగిరి, ఆత్మకూరు, దర్శి, మార్కాపురం, చీరాల, పొదిలి, గిద్దలూరు, రాజంపేటతోపాటు మరిన్ని బస్సు సర్వీసులు రాత్రివేళల్లో ఇక్కడ నిలుపుతుంటారు. దీంతో ప్రయాణికులూ ఇక్కడి సీతాఫలాలను ఇష్టపడి మరీ తీసుకెళుతుంటారు. గ్రేడ్ను బట్టి రేటు కూలీల దగ్గర కొనుగోలు చేసిన సీతాఫలాలను మండీల వ్యాపారులు గ్రేడ్ల వారీగా విభజిస్తారు. ప్రతి క్రీట్, బుట్టలోని సీతాఫలాలను ఏ,బీ,సీ గ్రేడ్లుగా విభజించడం జరుగుతుంది. గ్రేడ్లను బట్టి వంద సీతాఫలాలను ఏ గ్రేడ్ రూ.1200, బి గ్రేడ్ రూ. 950, సీ గ్రేడ్ రూ.700 వరకు విక్రయిస్తుంటారు. బయటి రాష్ట్రాలకు మాత్రం ఏ,బీ గ్రేడ్ సీతాఫలాలనే ఎగుమతి చేస్తుంటారు. జిల్లాలోన పలు పట్టణాలు, గ్రామాల నుంచి సీతాఫలాలు కేరళతోపాటు తమిళనాడు, తెలంగాణ, కర్ణాటక రాష్ట్రాలకు ఎగుమతి చేస్తుంటారు. బయటి రాష్ట్రాలకు చెందిన వ్యాపారులు వాహనాలను ఇక్కడికి తీసుకొచ్చి మండీలలో వ్యాపారుల దగ్గర సీతాఫలాలను కొనుగోలు చేసి వారి రాష్ట్రాలకు తరలిస్తున్నారు. మండీలలో ఒక్కో క్రీట్ రూ.600 నుంచి రూ.700 వరకు చెల్లించి బయటి రాష్ట్రాల వ్యాపారులు తమ రాష్ట్రాలకు తరలిస్తున్నారు. అక్కడ సీతాఫలాల పంట సరిగా లేక అధిక డిమాండ్ ఉండటం వల్ల.. ఒక్కో క్రీట్ రూ.1400 నుంచి రూ.1500 వరకు ధర పలుకుతుండటం విశేషం. సీతాఫలాల సేకరణతో మూడునెలల పాటు మాకు జీవనోపాధి లభిస్తుంది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది సీతాఫలాల దిగుబడి చాలా వరకు తగ్గిపోయింది. పొలాల గట్లు, కొండలు, గుట్టల్లో గాలించి వీటిని సేకరణ చేస్తాం. ఒక రోజంతా సేకరణకే సమయం సరిపోతుంది. మరుసటి రోజు పట్టణాలు, గ్రామాలకు తీసుకెళ్లి విక్రయిస్తుంటాం. – లక్ష్మీదేవి, ఎగువబోయపల్లె, గుర్రంకొండ ఈ సీజన్లో సగటున రోజుకు రెండు బుట్టల సీతాఫలాలు సేకరిస్తుంటాం. కాయల నాణ్యతను బట్టి ఒక బుట్ట కాయలు రూ.600 నుంచి రూ.700 వరకు కొనుగోలు చేస్తారు. ఖర్చులు పోను రోజుకు రూ.1000 వరకు సంపాదిస్తుంటాం. కాకపోతే ఈ ఏడాది సీతాఫలాల సేకరణ చాలా కష్టంగా మారింది. కాయలు పెద్దగా కాయలేదు. సీజన్ తొందరగా ముగిసిపోనుంది. – రామాంజులు, బురుజుపాళెం, గుర్రంకొండ -
ఆ పరిశ్రమ మాకు వద్దు బాబోయ్!
మైలవరం : ఏదైనా పరిశ్రమను ఒక ప్రాంతంలో ఏర్పాటు చేయాలనుకుంటే దాని గురించి ఆ గ్రామాల ప్రజలకు సమాచారం ఇచ్చి స్థానికంగా గ్రామ సభ నిర్వహించి పరిశ్రమ ద్వారా ఆ ప్రాంత ప్రజలకు ఎలాంటి ప్రయోజనం చేకూరుతుందో తెలియజేయాలి. పరిశ్రమపై ప్రజలకు ఉన్న అపోహలను తొలగించి వారి అంగీకారం మేరకే పరిశ్రమ ఏర్పాటు చేస్తారు. అయితే మైలవరం మండలం వద్దిరాల, దొడియం గ్రామ పంచాయతీల పరిధిలో ఏర్పాటు చేయబోయే సోలార్ పరిశ్రమపై కూటమి ప్రభుత్వం ఎందుకో ఈ పద్ధతిని పాటించలేదు. స్థానికులకు సమాచారం ఇవ్వకుండానే 1400 ఎకరాల ప్రభుత్వ భూమిని ఏకంగా ఒక కంపెనీకి ఏకపక్షంగా కట్టబెట్టి చివరగా గ్రామ పంచాయతీలో తీర్మానాలను ఆమోదింపజేయాలని పంచాయతీ కార్యదర్శులపై కత్తిపెట్టింది. విధిలేని పరిస్థితుల్లో ఆ ఇరువురు గ్రామ పంచాయతీ కార్యదర్శులు సోలార్ పరిశ్రమ ఏర్పాటుపై గ్రామ పంచాయతీలలో తీర్మానాలు ప్రవేశపెట్టారు. గ్రామ సభ నిర్వహించకుండానే తాము ఎలా తీర్మానం ఆమోదిస్తామని విజ్ఞులైన ఆ ప్రజా ప్రతినిధులు తీర్మానం తిరస్కరించి వెనక్కి పంపారు. తామేమి పరిశ్రమకు వ్యతిరేకం కాదని అయితే తమ ప్రాంతంలో ఏర్పాటు కాబోయే సోలార్ పరిశ్రమ వల్ల తమ గ్రామాల్లో ఎలాంటి ప్రయోజనాలు చేకూరుతాయో, ఎంత మంది స్థానికులకు ఉపాధి కల్పిస్తారో స్పష్టమైన హామీ ఇచ్చిన తర్వాతే పరిశ్రమ ఏర్పాటుకు ఆమోదం తెలుపుతామని కరాఖండిగా చెప్పి పంపారు. కొండంతా సోలార్ మయమే.. వద్దిరాల, దొడియం గ్రామాల మధ్యలో ఉన్న కొండ ప్రాంతం ఇక్కడి పల్లెల్లోని పేద ప్రజల జీవనానిక్ఙిశ్రీకొండంత అండగాశ్రీశ్రీ ఉండేది. అలాంటిది ఇప్పటికే కూటమి ప్రభుత్వం కొండల్లోని దాదాపు 4వేల ఎకరాల భూమిని మూడు సోలార్ కంపెనీలకు కట్టబెట్టింది. ఆయాన్, స్ట్రింగ్, అదాని కంపెనీలు తమకు కేటాయించిన భూముల చుట్టూ ముళ్ల కంచెవేసి దాదాపు 90 శాతం పనులు పూర్తి చేశాయి. ఇప్పడు కొండలో మిగిలి ఉన్న మరో 14 వందల ఎకరాల భూమిని అల్ట్రా సోలార్ కంపెనీకి కేటాయించారు. దీంతో ఈ ప్రాంత పేద ప్రజల జీవనోపాధికి గండి కొట్టడమే కాకుండా కొండంతా పూర్తి సోలార్ మయం కానుంది. ఇప్పటికై నా పశువుల మేత కోసం కొంత కొండ ప్రాంతాన్ని వదిలిపెట్టాలని ఇక్కడి ప్రజానీకం ముక్త కంఠంతో కోరుతున్నారు. సోలార్ పరిశ్రమ ఏర్పాటుపై తీర్మానం వ్యతిరేకించిన రెండు గ్రామ పంచాయతీలు పరిశ్రమ గురించి ప్రజలకు వివరించకుండానే తీర్మానం ఎలా ఆమోదిస్తామని నిలదీత గ్రామ సభ నిర్వహించి స్థానికులకు ఉపాధి కల్పిస్తామని హామీ ఇవ్వాలని డిమాండ్ ఇప్పటికే 1400 ఎకరాలు కేటాయించి చివరలో పంచాయతీ తీర్మానం కోరిన సర్కారు -
నేటి నుంచి ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : నేటి నుంచి ఏసీఏ అండర్–14 నాలుగో విడత మ్యాచ్లు జరుగుతాయని జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు భరత్రెడ్డి, కార్యదర్శి రెడ్డి ప్రసాద్ తెలిపారు. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో నార్త్ జోన్ విన్నర్స్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ నార్త్జోన్, కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో సౌత్జోన్ విన్నర్స్ వర్సెస్ సెంట్రల్ జోన్ విన్నర్స్, కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ వర్సెస్ రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ జట్లు తలపడతాయని తెలిపారు.కత్తిసాము పోటీలో ప్రతిభకడప వైఎస్ఆర్ సర్కిల్ : చెన్నూరు మండలం రామనపల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థి నాగ చైతన్య గట్కా(కత్తి సాము) ఎస్జీఎఫ్ అండర్ –19 బాల బాలికల విభాగంలో రాష్ట్ర స్థాయిలో మూడో స్థానంలో నిలిచి జాతీయ స్దాయికి ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయురాలు ఉమా మహేశ్వరి, ఫిజికల్ డైరెక్టర్ పోలంకి గణేష్ బాబు తెలిపారు. ఈ నెల 29,30 తేదీలలో కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన పోటీలలో ప్రతిభ కనబరిచాడు. -
అన్నమయ్య కాలిబాటపై ఆంక్షలు!
● 22 సార్లు పాదయాత్ర చేసిన ఆకేపాటి ● ఇప్పుడు కాలిబాటపై తెరపైకి నిషేధాజ్ఞలు ● నిషేధంపై వివరాలు వెల్లడించిన డీఎఫ్ఓ, ఎస్పీరాజంపేట : పద కవితా పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యులు నడిచి ఏడుకొండలపై వెలసిన శ్రీ వెంకటేశ్వరస్వామిని దర్శించుకున్న కాలిబాటపై ఆంక్షలను విధించారు. గత 22 ఏళ్లుగా ఎన్నడూ లేని రీతిలో ఈ సారి అటవీమార్గంలో వెళ్లకుండా నిషేధాజ్ఞలను తీసుకొచ్చారు. అటవీ మార్గంలోని కాలిబాటలో భక్తులు పయనించరాదని అటవీశాఖ తీసుకొచ్చిన ఆంక్షలు శ్రీవారి భక్తులను ఆందోళనకు గురిచేస్తున్నాయి. దీంతో ఉమ్మడి కడప జిల్లాలో అన్నమయ్య కాలిబాటలో పయనించే అంశం వివాదాస్పదంగా మారింది. 22 సార్లు అన్నమయ్య కాలిబాటలో ఆకేపాటి పాదయాత్ర ఇప్పటికే 22 సార్లు అన్నమయ్య కాలిబాటలో రాజంపేట శాసనసభ్యుడు, వైఎస్సార్సీపీ పార్లమెంటరీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాథ్రెడ్డి తిరుమల మహాపాదయాత్ర చేపట్టారు. వేలాదిమంది శ్రీవారి భక్తులతో ఆకేపాడులో ఆలయాల సముదాయాల నుంచి కుక్కలదొడ్డి వరకు వెళ్లి అక్కడి నుంచి శేషాచలం అటవీ ప్రాంతంలో అన్నమయ్య నడిచివెళ్లిన కాలిబాటలో శ్రీవారి సన్నిధికి చేరుకునేవారు.. 23వ సారి.. 23వ సారి తిరుమల మహాపాదయాత్రకు ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు ఆకేపాటి అమరనాఽథ్రెడ్డి సిద్ధమయ్యారు. ఈనెల 5న తిరుమల మహాపాదయాత్రను వేలాదిమంది భక్తులతో బయలుదేరే విధంగా కార్యక్రమం రూపొందించారు. ఈ పాదయాత్రపై గత కొద్దిరోజులుగా విస్తృత ప్రచారం కూడా చేశారు. అనేకమంది శ్రీవారిభక్తులు ఆకేపాటి వెంట కాలిబాటలో వెళ్లి శ్రీవారిని దర్శించుకోవాలని ఆశించారు. ఇప్పుడు కాలిబాటలో పయనంపై ఆంక్షలను అటవీశాఖ తీసుకురావడంతో ఈ అంశం ఆధ్యాత్మిక ప్రియులు, భక్తులను కలవరపాటుకు గురిచేస్తోంది. రోడ్డు మార్గంలోనే తిరుమలకు వెళ్లాలి.. జిల్లా అటవీశాఖాధికారి జగన్నాథ్సింగ్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిలు బుధవారం జిల్లా అటవీశాఖ కార్యాలయంలో మీడియా సమావేశంలో కుక్కలదొడ్డి నుంచి తిరుమలకు పాదయాత్రపై నిషేధం విధించినట్లుగా వెల్లడించారు. ఎవరైనా తిరుమలకు వెళ్లాలంటే రోడ్డు మార్గం ద్వారా వెళ్లాలని సూచించారు. చట్టాన్ని వ్యతిరేకించి లోపలికి వెళితే చట్టప్రకారం చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. భక్తులకు, ప్రజలకు ఇబ్బంది కలగకూడదనేది తమ ఉద్దేశమన్నారు. అడవిలో ఏనుగులు, వాటి పిల్లలు, చిరుతలు సంచరిస్తున్నాయన్నారు. వీటి వల్ల భక్తులకు ప్రాణాపాయం పొంచి ఉంటుందన్నారు. అడవిలో గత కొన్నిరోజులుగా కురుస్తున్న వర్షాలకు కుంటలు నిండాయన్నారు. వంకలు పొర్లుతున్నాయన్నారు. ఈ కారణాల దృష్ట్యా కాలిబాటలో తిరుమలకు వెళ్లే మార్గంలో నిషేధాజ్ఞలు విధించినట్లు తెలిపారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
రాజంపేట టౌన్ : మండలంలోని కారంపల్లె జెడ్పీ హైస్కూల్లో 8వ తరగతి చదువుతున్న వరదరాజు వర్షిత అనే విద్యార్థిని జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయురాలు డి.ఇందిర బుధవారం విలేకరులకు తెలిపారు. ఇటీవల కృష్ణాజిల్లా గన్నవరంలో జరిగిన రాష్ట్రసాయి రగ్బీ పోటీల్లో వర్షిత విశేష ప్రతిభ కనబరచడంతో క్రీడా అధికారులు జాతీయ స్థాయికి ఎంపిక చేసినట్లు ఆమె తెలిపారు. ఒడిస్సాలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో తమ పాఠశాల విద్యార్థిని పాల్గొంటుందన్నారు. జాతీయ స్థాయి పోటీల్లో కూడా వర్షిత రాణించాలని ఈ సందర్భంగా ఆమె ఆకాంక్షించారు. ఫిజికల్ డైరెక్టర్ పార్థసారధి క్రీడల్లో ఇస్తున్న తర్ఫీదు వల్లే విద్యార్థులు రాణిస్తున్నట్లు తెలిపారు. రోడ్డు పక్కన వృద్ధుడి మృతిమదనపల్లె రూరల్ : మండలంలోని రామసముద్రంరోడ్డు కొత్తపల్లె సమీపంలో రోడ్డుపక్కన ఓ వృద్ధుడు మృతి చెందిన ఘటన బుధవారం జరిగింది. ఉదయాన్నే రోడ్డుపక్కన ఓ వృద్ధుడు అపస్మారక స్థితిలో పడి ఉండటాన్ని గుర్తించిన స్థానికులు తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు మృతదేహాన్ని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అనంతరం విచారించగా, సీటీఎం పంచాయతీ నల్లగుట్టపల్లెకు చెందిన హనుమంతు(75)గా గుర్తించారు. మృతుడికి ఎవరూ లేకపోవడంతో భిక్షాటన కోసం కొత్తపల్లె వైపు వచ్చి రాత్రి వేళ చలికి తాళలేక మృతి చెంది ఉంటాడని భావిస్తున్నారు. రాజంపేట జిల్లా కేంద్రం కోసం ర్యాలీరాజంపేట : రాజంపేటను జిల్లా కేంద్రం చేయాలంటూ జేఏసీ ఆధ్వర్యంలో బుధవారం ర్యాలీ నిర్వహించారు. ప్రభుత్వవిప్, రైల్వేకోడూరు శాసనసభ్యుడు, అరవశ్రీధర్, జనసేన పార్లమెంటరీ నేత యల్లటూరు శ్రీనివాసరాజు, జనసేన నాయకుడు అతికారి వెంకటయ్య, జనసేన పార్టీ రాష్ట్ర కార్యదర్శి తాతంశెట్టి నాగేంద్ర, సాంస్కృతిక విభాగం ప్రతినిధి పంతగాని నరసింహప్రసాద్, పూల భాస్కర్, లక్ష్మీనారాయణ, సంఘసేవకుడు ఉద్దండం సుబ్రమణ్యం, మైనార్టీ నేతలు అబుబకర్, గుల్జార్బాషా, రాజంపేట ఐఎంఏ ప్రతినిధులు డాక్టర్ సుధాకర్, డాక్టర్ నవీన్, నాగిరెడ్డిపల్లె మేజర్ పంచాయతీ మాజీ సర్పంచ్ సమ్మెట శివప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. అనంతరం సబ్కలెక్టర్ భావనకు వినతిపత్రం అందజేశారు. ముందస్తు జాతీయ లోక్ అదాలత్ సమావేశం కడప అర్బన్ : జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ డాక్టర్ సి. యామిని ఆధ్వర్యంలో జిల్లా వ్యాప్తంగా మండల న్యాయ సేవా సమితి న్యాయమూర్తులతో వర్చువల్ పద్ధతిలో ఈనెల 13 తేదీన జరగబోయే జాతీయ లోక్ అదాలత్కు సంబంధించి బుధవారం ముందస్తు సమావేశం నిర్వహించారు. మండల న్యాయ సేవా సంస్థ న్యాయమూర్తులు జిల్లా న్యాయసేవాధికారసంస్థ సెక్రటరీ, జడ్జి ఎస్.బాబా ఫకృద్దీన్ పాల్గొన్నారు. -
పులివెందుల ప్రాంతానికి వైఎస్ కుటుంబం ఎనలేని సేవలు
పులివెందుల టౌన్ : పులివెందుల ప్రాంతానికి వైఎస్ కుటుంబం ఎనలేని సేవలు అందించి ప్రజల గుండెల్లో గూడు కట్టుకుందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి పేర్కొన్నారు. బుధవారం స్థానిక భాకరాపుంలోని విజేత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలలో నిర్వహించిన అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పులివెందుల ప్రాంతంలో వైఎస్ భారతిరెడ్డి మానసిక దివ్యాంగుల పట్ల ప్రత్యేక శ్రద్ధ తీసుకొనేందుకు విజేత విభిన్న ప్రతిభావంతుల పాఠశాలను ఏర్పాటు చేసి ఉచితంగా సేవలందించడం ఎంతో గొప్ప విషయమన్నారు. పేద విద్యార్థులు, దివ్యాంగులపట్ల వైఎస్ భారతిరెడ్డి ఔదార్యం విజేత స్కూలులో అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం విద్యార్థులకు బహుమతులను ప్రదానం చేసిన ఎస్వీ సతీష్కుమార్రెడ్డి -
ఆటోను ఢీకొన్న ఇన్నోవా
● పది మందికి గాయాలు ● మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదంమైదుకూరు : మైదుకూరు – ఖాజీపేట రహదారిలో కర్నూలు – చిత్తూరు జాతీయ రహదారిపై బుధవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో పది మంది వ్యవసాయ కూలీలు తీవ్రంగా గాయపడ్డారు. కడప వైపు నుంచి మైదుకూరుకు వస్తున్న ఇన్నోవా ముందువైపు వెళుతున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగింది. సంఘటనలో మున్సిపాలిటీ పరిధిలోని సరస్వతిపేటకు చెందిన పది మంది వ్యవసాయ కూలీలు గాయపడగా అందులో చెన్నం లక్షుమ్మ అనే మహిళ తీవ్ర గాయాలతో కోమాలోకి వెళ్లింది. ఆమెను కడప రిమ్స్కు, అక్కడి నుంచి తిరుపతికి తరలించారు. వివరాలు ఇలా ఉన్నాయి. సరస్వతి పేటకు చెందిన 12 మంది, ఖాజీపేట మండలం కుమ్మరికొట్టాలుకు చెందిన 10 మంది వ్యవసాయ కూలీలు బుధవారం చాపాడు మండలం వెదురూరు రాజుపాళెం గ్రామానికి వేరుశనగ పంట పీకేందుకు సరస్వతీపేటకు చెందిన చీపాటి రమణారెడ్డి అనే వ్యక్తికి చెందిన ఆటోలో వెళ్లారు. మధ్యాహ్నం పొలం వద్ద నుంచి భూమాయపల్లె మీదుగా వచ్చి ఆటోలో ఉన్న వారిలో 10 మందిని కుమ్మరికొట్టాలులో దించి ఆటో సరస్వతి పేటకు బయల్దేరింది. ఆటో గ్రామానికి పరుగు దూరంలో ఉండగా జాతీయ రహదారిపై వెనుక వైపు నుంచి ఇన్నోవా కారు ఢీకొంది. ఆటో పల్టీలు కొట్టి రహదారి పక్కన పడిపోయింది. ఆటోలో ఉన్న వ్యవసాయ కూలీలు తీవ్ర గాయాలతో హాహాకారాలు చేశారు. సంఘటనలో ఆటో డ్రైవర్ చీపాటి రమణారెడ్డి, చాగంరెడ్డి నాగలక్షుమ్మ, చెన్నం లక్షుమ్మ, మూలె ఓబుళమ్మ, మూలె నారాయణమ్మ, బొగ్గుల వీరమ్మ, చీపాటి లక్ష్మి, చాగంరెడ్డి వెంకటసుబ్బమ్మ, మందిరెడ్డి నారాయణమ్మ, చాగంరెడ్డి లక్షుమ్మ అనే వారు గాయపడ్డారు. వీరిలో తీవ్రంగా గాయపడిన చాగంరెడ్డి నాగలక్షుమ్మ, చెన్నం లక్ష్మమ్మ, మూల ఓబుళమ్మ అనే వారిని కడప రిమ్స్కు, మందిరెడ్డి నారాయణమ్మను ప్రొద్దుటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. స్వల్పంగా గాయపడిన వారిని మైదుకూరు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. మైదుకూరు వద్ద రోడ్డు ప్రమాదం జరిగి కళ్ల ముందే క్షతగాత్రులు రోడ్డు పక్కన పడిపోయి ఉండటంతో కడప వైపు నుంచి మైదుకూరుకు వస్తున్న మైదుకూరు అర్బన్ సీఐ కె.రమణారెడ్డి, మున్సిపల్ కమిషనర్ వై.రంగస్వామి వెంటనే స్పందించారు. సంఘటన స్థలానికి చేరుకున్న 108 అంబులెన్స్లోకి వారు ఎక్కించడంలో నిమగ్నమయ్యారు. -
● కేంద్ర మంత్రికి ఎంపీ మిథున్రెడ్డి విన్నపం..
మదనపల్లె : ఏ ప్రభుత్వమైనా పేద విద్యార్థులకు నా ణ్యమైన విద్యనందించాలి.. మెరుగైన వసతులు కల్పించాలి.. అయితే మన రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా వ్యవహరిస్తోంది. ఏకంగా కేంద్ర ప్రభుత్వమే కల్పించుకుని మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రారంభానికి సహకరించండి, భూమి కేటాయించండి అని చెబుతున్నా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. కుయుక్తులు పన్నుతూ కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి నోచుకోకుండా మోకాలడ్డుతోంది. దీంతో పేద విద్యార్థులు విద్యకు దూరం అవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరిపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. వైఎస్సార్సీపీ లోక్సభాపక్షనేత, రాజంపేట ఎంపీ పీవీ.మిథున్రెడ్డి తన నియోజకవర్గంలోని మదనపల్లెకు మంజూరు చేయించిన ప్రతిష్టాత్మక కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి నోచుకోకుండా అడ్డుపడుతోంది కూటమి ప్రభుత్వమే అని తెలుస్తోంది. ఈ కేంద్రీయ విద్యాలయంలో తరగతులు ప్రారంభమయ్యేలా చూడండి.. భూమి కేటాయించండి అని కేంద్ర ప్రభుత్వం చెబుతున్నా.. అందుకు కూటమి ప్రభుత్వం సుముఖతగా లేనట్టు కనిపిస్తోంది. పేద విద్యార్థుల భవిష్యత్తును తీర్చిద్దాలన్న లక్ష్యంతో సాధించిన ఈ విద్యాలయం మదనపల్లెకు మకుటంగా నిలుస్తుంది. అయితే రాజకీయ కారణాలతో తరగతుల ప్రారంభానికి చంద్రబాబు ప్రభుత్వం మొగ్గుచూపడం లేదు. భూ కేటాయింపునకు సంబంధించిన నివేదికలు ముందుకు కదలడం లేదు. ఫలితంగా తమకోసం సిద్ధం చేసిన భూమిని మాకు అప్పగించండి అంటూ కేంద్రీయ విద్యాలయం అన్నమయ్య జిల్లా కలెక్టర్కు నవంబర్ నెలలో లేఖ రాసింది. దీనిపైనా కదలిక లేకపోవడంతో బుధవారం ఎంపీ మిథున్రెడ్డి స్పందించారు. కేంద్ర విద్యాశాఖ మంత్రిని కలిసి ఇక్కడి పరిస్థితులను వివరించి వినతిపత్రం అందజేశారు. మేం సిద్ధం.. భూమి కేటాయించండి.. మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయం తరగతులు ప్రా రంభించడానికి సిద్ధంగా ఉన్నామని కేంద్రీయ విద్యాలయాల అదనపు కమిషనర్ అన్నమయ్య జిల్లా కలెక్టర్ కు నవంబర్ ఆరున పంపిన లేఖలో పేర్కొన్నారు. వలసపల్లె వద్ద సిద్ధం చేసిన భూమికి సంబంధించిన నిబంధనలు, అనుబంధ ఫారాలను ఇప్పటికే పంపా మని అందులో గుర్తుచేశారు. దీనిపై అవసరమైన చర్య లు తీసుకోవాలని తాము 1–9–2025, 18–9–2025 తేదీల్లో తమ కార్యాలయం నుంచి పంపిన లేఖలను పరిశీలించాలని సూచన చేశారు. 2026–27 విద్యా సంవత్సరం ప్రారంభానికి సమయం దగ్గరపడుతోందని, ఆలస్యం లేకుండా చర్యలు తీసుకోవాల్సి ఉన్నందున వీలైనంత త్వరగా భూమి కేటాయింపు చర్యలను పూర్తిచేయాలని లేఖలో విజ్ఞప్తి చేశారు. దీన్నిబట్టి చూస్తే కేంద్రీయ విద్యాలయం ప్రారంభానికి కేంద్రప్రభుత్వం సిద్ధంగా ఉన్నా కూటమి ప్రభుత్వం నుంచి సహకారం లేదని అర్థమవుతోంది. కలెక్టరేట్కు చేరిన నివేదిక.. కేంద్రీయ విద్యాలయానికి వలసపల్లె వద్ద 6.09 ఎకరాలను కేటాయించే నివేదికకు అక్టోబర్లో మదనపల్లె సబ్కలెక్టర్ కార్యాలయం నుంచి కలెక్టరేట్కు వెళ్లింది. అప్పటినుంచి ఈ నివేదిక అక్కడే ఉంది. దీనికి సంబంధించి తదుపరి చర్యలను చేపట్టాల్సి ఉన్నప్పటికీ, కేంద్రీయ విద్యాలయాల అదనపు కమిషనర్ లేఖలు రాసినప్పటికీ ఒక్క అడుగు ముందుకు పడలేదు. కలెక్టరేట్కు వెళ్లిన భూ కేటాయింపు ప్రతిపాదన నివేదిక అక్కడితోనే ఆగిపోయింది. ఫైల్ కలెక్టరేట్లో సంబంధిత విభాగంలో ఉండిపోయింది. అది ఎటూ కదలకుండా అక్కడే ఆగిపోయింది. దీనికి కారణం కూటమి ప్రభుత్వం దీనిపై ఆసక్తి చూపకపోవడమే అని విమర్శలు వస్తున్నాయి. కలెక్టరేట్లో ప్రతిపాదనలకు ఆమోదం తెలపకుండా మోకాలడ్డితే..వచ్చే ఏడాది కూడా తరగతులు ప్రారంభాన్ని అడ్డుకోవచ్చని ప్రయత్నిస్తున్నట్టు భావిస్తున్నారు. ఇప్పటికిప్పుడే కలెక్టరేట్లో ఫైల్కు కదలిక వచ్చి అన్ని చర్యలు పూర్తయితే..ఈ ఫైల్ సీసీఎల్ఏకు పంపాలి. అక్కడ కమిషనర్ ఆమోదం పొందాక చివరగా గెజిట్ ప్రకటనతో చర్యలు పూర్తవుతాయి. ఈ వ్యవహరం పూర్తిచేసేందుకు ప్రభుత్వం తక్షణమే చర్యలు చేపట్టి అనుమతులు ఇవ్వాల్సివుంది. అయితే ఇది జరిగేనా అన్నది తలెత్తుతున్న అనుమానం. కేంద్రీయ భూమి ఆక్రమణ.. ఈ ఏడాది మే 22న కేంద్రీయ విద్యాలయ డెప్యూటి కమిషనర్ మంజునాథ్, అసిస్టెంట్ కమిషనర్ అనురాధ మదనపల్లెలో విద్యాలయం కోసం సిద్ధం చేసిన భూమిని పరిశీలించారు. మదనపల్లె–పుంగనూరు రహదారిలో వలసపల్లె వద్ద సర్వే నంబర్లు 713/3, 713/4, 496/2, 496/3లో 6.09 ఎకరాల భూమిని సిద్ధం చేయగా పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పరిశీలన సమయంలో ఈ భూమిని ఆక్రమించి నిర్మాణాలు చేస్తుండటం గమనించి ఆగ్రహం వ్యక్తం చేస్తూ వెంటనే వీటిని తొలగించాలని సబ్ కలెక్టర్ మేఘస్వరూప్ ఆదేశించారు. తర్వాత రెవెన్యూ సిబ్బంది ఆక్రమ నిర్మాణాలను పరిశీలించారు. దీన్నిబట్టి చూస్తే కేంద్రీయ విద్యాలయానికి సిద్ధం చేసిన భూమిని కూడా వదలకుండా కూటమి ప్రభుత్వంలో ఆక్రమణలు చేశారు. అంటే విద్యాలయం ప్రారంభానికి ప్రభుత్వ సహకారం ఎలా ఉందో అర్థమవుతుంది. ప్రస్తుతం ఈ భూమిలో ఎలాంటి ఆక్రమణలు లేవని రెవెన్యూ అధికారులు తెలిపారు. నోరుమెదపని అధికార పక్షం.. ప్రతిపక్షంపై విరుచుకుపడే అధికార పక్షం నేతలు కేంద్రీయ విద్యాలయం విషయంలో నోరుమెదపకపోవడంపై విమర్శలు వ్యక్తం అవుతున్నాయి. మదనపల్లెకు మణిహారమైన కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి, భూ కేటాయింపుల కోసం కూటమిపార్టీలు కనీసం మాట్లాడకపోవడం చర్చనీయాంశమైంది. పేద విద్యార్థులకు ప్రతిష్టాత్మక విద్య అందించే విద్యాలయం కోసం ప్రభుత్వంపై ఒత్తిడి తేకపోవడం విచారకరమని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కేంద్రీయ విద్యాలయ తరగతుల కోసం సిద్ధం చేసిన మదనపల్లె ఎస్టీ హాస్టల్ భవనం వలసపల్లె వద్ద కేటాయించిన భూమిలో ఆక్రమణలు పరిశీలిస్తున్న రెవెన్యూ సిబ్బంది (ఫైల్) కేంద్రీయ విద్యాలయానికి మోకాలడ్డిన చంద్రబాబు ప్రభుత్వం భూమి కోసం నవంబర్ ఆరున కలెక్టర్కు కేంద్రం లేఖ 2026–27 విద్యా సంవత్సరం దగ్గరపడుతోందని ప్రస్తావన అప్పటికే భూ కేటాయింపు నివేదిక కలెక్టరేట్కు వెళ్లగా ఆగిపోయిన ఫైల్ కలెక్టరేట్లో క్లియర్ అయ్యాక సీసీఎల్ఏకి వెళ్లి ఆమోదం పొందాక గెజిట్ ప్రకటించాలి ఇదంతా ముందుకు సాగకుండా ఎక్కడి నివేదిక అక్కడే ఫలితంగానే మదనపల్లెకు కేంద్రీయ విద్య దూరం తాజాగా తరగతుల ప్రారంభానికి కేంద్రమంత్రిని కలిసి విన్నవించిన ఎంపీ మిథున్రెడ్డి మదనపల్లెలోని వలసపల్లెలో కేంద్రీయ విద్యాలయం తరగతుల ప్రారంభానికి తక్షణమే చర్యలు తీసుకోవాలని ఎంపీ పీవీ.మిథున్రెడ్డి కేంద్రవిద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్కు విన్నవించారు. బుధవారం పార్లమెంటులోని కార్యాలయంలో మంత్రిని కలిసిన మిథున్రెడ్డి ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. 6.09 ఎకరాల భూమిని రెవెన్యూ అధికారులు నివేదికలు సిద్ధం చేశారని, దీనికి సత్వరమే ఆమోదం తెలిపి భూ కేటాయింపు జరగడంతోపాటు తాత్కాలిక భవనాల్లో 2026–27 విద్యా సంవత్సరం నుంచి తరగతులు ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. పేద విద్యార్థులకు ఉచితంగా అందే ప్రతిష్టాత్మక విద్యను దూరం చేయుద్దంటూ కోరారు. విద్యా సంవత్సరం నష్టపోకుండా చూడాలని కోరారు. అలాగే మిథున్రెడ్డి జిల్లా కలెక్టర్కు కూడా లేఖ పంపారు. విద్యాలయానికి సంబంధించిన భూ కేటాయింపు చర్యలు పూర్తి చేయాలని విన్నవించారు. -
6న జెడ్పీ సర్వసభ్య సమావేశం
కడప సెవెన్రోడ్స్ : జిల్లా పరిషత్ సాధారణ సర్వసభ్య సమావేశం ఈనెల 6వ తేదీ ఉదయం 10 గంటలకు జెడ్పీ సమావేశ మందిరంలో జరుగుతుందని ఉప ముఖ్య కార్యనిర్వహణాధికారి సి.సుబ్రమణ్యం ఒక ప్రకటనలో తెలిపారు. సమావేశంలో వ్యవసాయం, ఉద్యానం, పట్టుపరిశ్రమ, వైద్య ఆరోగ్యం, డ్వామా, డీఆర్డీఏ, ఐసీడీఎస్, విద్యుత్, పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్, ఆర్అండ్బీ, జాతీయ రహదారులు, నీటిపారుదల, పశుసంవర్దకశాఖ, విద్య తదితర అంశాలపై చర్చ జరుగుతుందన్నారు. జిల్లా పరిషత్ సభ్యులు.. ఆయా శాఖల అధికారులు సమావేశానికి హాజరు కావాలని కోరారు. కడప ఎడ్యుకేషన్ : జిల్లావ్యాప్తంగా ఉన్న 152 జూనియర్ కళాశాలల్లో వికసిత్ ఆంధ్రప్రదేశ్ 2047 లక్ష్యంతో ఈ నెల 5వ తేదీన ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు మెగా పేరెంట్– టీచర్ సమావేశం నిర్వహించాలని ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి టీఎన్వీ వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంతో విద్యార్థులు, తల్లిదండ్రులు, ఉపాధ్యాయులతోపాటు వివిధ కళాశాల మధ్య బంధం పటిష్టం అవుతుందన్నారు. విధార్థులకు సమగ్ర ప్రగతి నివేదికలు (holistic progress cards) పంపిణీ చేస్తున్నట్టు తెలిపారు. విద్యార్థులు, తల్లిదండ్రులు, పూర్వ విద్యార్థులు పాల్గొని మెగా పేరెంట్ టీచర్ మీట్ను జయప్రదం చేయాలని ఆయన కోరారు. 8న అప్రెంటీస్ మేళా కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ఐటీఐ ఉత్తీర్ణులైన విద్యార్థులకు డిసెంబర్ 8న కడప నగరంలోని ప్రభుత్వ డీఎల్టీసీ ఐటీఐలో ఉదయం 10 గంటలకు అప్రేంటిస్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కన్వీనర్, ప్రభుత్వ మైనారిటీ ఐటీఐ ప్రధానాచార్యులు జ్ఞానకుమార్ తెలిపారు. అర్హత ఉన్న వారు 10వ తరగతి, ఐటీఐ మార్కుల జాబితా, ఐటీఐ ఎన్టీసి సర్టిఫికెట్, ఆధార్కార్డు, కుల ధ్రువీకరణ పత్రం, బ్యాంకు అకౌంట్ పుస్తకం, పాస్పోర్టు సైజు ఫోటోతోపాటు ఒక సెట్ జిరాక్స్ కాపీలతో హాజరు కావాలని సూచించారు. ఎంపికై న వారికి అప్రెంటిస్ శిక్షణలో భాగంగా నెలకు రూ. 8000 నుంచి రూ.10,000 స్టైఫండ్గా కంపెనీ వారు చెల్లిస్తారని తెలిపారు. కడప ఎడ్యుకేషన్ : కౌశల్– 2025 టాలెంట్ టెస్ట్ లో జిల్లా స్థాయిలో ప్రతిభ చాటి ముగ్గురు విద్యార్థినులు రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. గత నెలలో జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీ ల్లో కడపలోని చెమ్ముమియాపేట జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాలలో ఎనిమిదో తరగతి విద్యార్థిని తనిష్కా, తొమ్మిదో తరగతి విద్యార్థిని మమత కౌ శల్ టాలెంట్ టెస్ట్లో ప్రతిభ చాటారు. అలాగే తొ మ్మిదో తరగతి విద్యార్థిని ఎన్.బిందుశ్రీ పోస్టర్ మేకింగ్ పోటీల్లో సత్తాచాటింది. వీరంతా ఈనెల 27న తిరుపతిలో నిర్వహించే రాష్ట్ర స్థాయి పోటీ ల్లో పాల్గొంటారని ఇన్చార్జి హెచ్ఎం టి. ఉమాదే వి తెలిపారు. విద్యార్థినులకు పాఠశాల ఇన్చార్జి హెచ్ఎం టి. ఉమాదేవి, ఉపాధ్యాయులు రామ సుబ్బమ్మ, గాయత్రి అభినందనలు తెలిపారు. కడప ఎడ్యుకేషన్ : జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి కృషి చేస్తానని సమగ్రశిక్ష అడిషినల్ ప్రాజెక్టు కో ఆర్డినేటర్(ఏపీసీ) ప్రేమంత కుమార్ పేర్కొన్నారు. బుధవారం కడపలోని సమగ్రశిక్ష కార్యాలయంలో ఆయన బాధ్యతలు స్వీకరించారు.ఈ సందర్భంగా ఆయనకు సమగ్రశిక్షలోని సెక్టోరియల్, అసిస్టెంట్ సెక్టోరియల్ అధికారులు, కార్యాలయ సిబ్బంది శుభాకాంక్షలు తెలియజేశారు. యువతకు ఉద్యోగ కల్పనే లక్ష్యం రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ సాయి ఇంజనీరింగ్ కళాశాలలో మెప్మా –నిపుణుల ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించిన మెగా జాబ్ మేళాకు స్పందన లభించిందని రాష్ట్ర రవాణా, క్రీడల, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి అన్నారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుమారు 15 కంపెనీల ద్వారా ఇంటర్వ్యూలు చేపట్టి 170 మందిని ఉద్యోగాలకు ఎంపిక చేసి వారికి ఆఫర్ లెటర్ అందజేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో రాయచోటి మున్సిపల్ కమిషనర్ ఇ. రవి, జివి రమణ, మెప్మా సిబ్బంది పాల్గొన్నారు. -
జిల్లా ఫెన్సింగ్ అండర్–14 బాలబాలికల జట్ల ఎంపిక
గుర్రంకొండ : మండల కేంద్రమైన గుర్రంకొండలో జిల్లా అండర్–14 బాలికల ఫెన్సింగ్ జట్లను ఎంపిక చేశారు. బుధవారం స్థానిక తెలుగు జెడ్పీహైస్కూల్లో 69వ స్కూల్ గేమ్స్ జిల్లా ఫెన్సింగ్ అండర్–14 బాలబాలికల జట్ల సభ్యుల ఎంపిక పోటీలు నిర్వహించారు. జిల్లా స్కూల్ గేమ్స్ కార్యదర్శి బాబు, జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ల ఆధ్వర్యంలో పోటీలు జరిగాయి. జిల్లా బాలుర జట్టు ముషాహీద్రాజ్, సుల్తాన్, ముజకీర్, ముజ్మమీర్( తెలుగుజెడ్పీహైస్కూల్, గుర్రంకొండ), ఢిల్లీబాబు, పునీత్, జాన్లుక్ (జెడ్పీహైస్కూల్, కాణిపాకం), యశ్వంత్, కార్తికేయ, ఉమాశంకర్, సంజయ్(జెడ్పీహైస్కూల్, నరహరిపేట), ధర్మతేజ (జెడ్పీహైస్కూల్, మామండూరు) జిల్లా బాలికల జట్టు అర్చన, జ్యోత్స్న, జ్ఞానప్రసూన, సింధు (ఏపీ గురుకుల బాలికల పాఠశాల, గుర్రంకొండ), పల్లవి, ప్రసన్న (తెలుగుజెడ్పీహైస్కూల్, గుర్రంకొండ), నవ్యశ్రీ, శ్రావ్య (జెడ్పీహైస్కూల్, కాణిపాకం), దీపిక, తనూజ, ఆశాశ్రీ,రోస్లీన్, (జెడ్పీహైస్కూల్, నరహరిపేట) జిల్లా అండర్–14 ఫెన్సింగ్ (కత్తిసాము)కు ఎంపికై న జట్లు నెల్లూరులో నిర్వహించే రాష్ట్రస్థాయి ఫెన్సింగ్ పోటీల్లో మన జిల్లా తరపున పాల్గొంటారని ఖేలోఇండియా ఫెన్సింగ్ జిల్లా కోచ్ రవీంద్రనాథ్ తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంఈఓలు సుబ్రమణ్యం, హెడ్మాస్టర్ తఖీవుల్లా, పీడీలు రాఘవ, కార్తీక్, శ్రావణి, పద్మలత పాల్గొన్నారు. -
పంచ సూత్రాల అమలుతో వ్యవసాయం లాభసాటి
వీరబల్లి : పంచ సూత్రాల అమలుతో రైతులకు వ్యవసాయం లాభసాటి అవుతుందని, అధిక లాభాలు పొందవచ్చని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం ఉదయం వీరబల్లి మండల కేంద్రంలోని రైతు సేవా కేంద్రంలో రైతన్న మీకోసం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ రైతులతో పలు అంశాలపై చర్చించి వారి సమస్యలను, సలహాలను తెలుసుకొని అధికారులకు దిశా నిర్దేశం చేసి వీటికి సంబంధించిన ప్రణాళికలను తయారు చేసుకోవాలని సూచించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ రైతులకు వ్యవసాయం లాభసాటి కావాలనే ఉద్దేశ్యంతో రాష్ట్ర ప్రభుత్వం పంచసూత్రాల లక్ష్యంగా నీటి భద్రత, డిమాండ్ ఆధారిత పంటలు, అగ్రిటెక్, ఫుడ్ ప్రాసెసింగ్, ప్రభుత్వాల మద్దతు అందించే విధంగా కార్యక్రమాన్ని నిర్వహించనుందని కలెక్టర్ తెలిపారు. ఈ ప్రాంతంలో మామిడి రైతులు ఎక్కువగా ఉన్నందున కోల్డ్ స్టోరేజ్ ఏర్పాటు చేయాలని రైతులు కోరగా జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. రైతులు సంఘంగా ఏర్పడి కోల్డ్ స్టోరేజ్ నిర్మించుకునే విధంగా చూడాలని, ప్రభుత్వం ద్వారా సహకారం అందిస్తామన్నారు. బ్యాంకు అధికారులతో సమావేశంరాయచోటి : ప్రాధాన్యత రంగాలకు ఇచ్చే రుణాలపై బ్యాంకులు దృష్టి సారించాలని వ్యవసాయం, ఉద్యాన పంటలు, పశుసంవర్థక రుణాలను ఎక్కువగా మంజూరు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని వీడియో కాన్ఫిరెన్సు హాల్ లో లీడ్ డిస్ట్రిక్ట్ బ్యాంక్ ఎల్డీఎం ఆంజనేయులు ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ అధ్యక్షతన వివిధ బ్యాంకులు, వివిధ శాఖల జిల్లా అధికారులతో జిల్లాస్థాయి సమన్వయ కమిటీ సమావేశాన్ని నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
పెన్షనర్కు లోను పేరుతో బురిడీ
మదనపల్లె రూరల్ : ప్రభుత్వం పెన్షనర్లకు తిరిగి చెల్లించాల్సిన అవసరం లేని రూ.5లక్షల రుణం అందిస్తోందని, ఈరోజే చివరిరోజు. రూ.1 లక్ష 35 వేలు డిపాజిట్ చేస్తే సబ్ కలెక్టర్ ఆఫీసులో చెక్కు అందిస్తారని ఓ రిటైర్డ్ ఉద్యోగిని అపరిచితుడు మోసగించి లక్ష రూపాయలతో ఉడాయించిన ఘటన బుధవారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని ప్రశాంత్నగర్లో నివాసం ఉంటున్న శ్రీనివాసులు వైద్య ఆరోగ్యశాఖలో పనిచేసి 15 ఏళ్ల క్రితం రిటైర్డ్ అయ్యారు. గత నెలకు, ఈనెలకు సంబంధించి తన ఖాతాకు జమ అయిన పెన్షన్ మొత్తంలో వ్యత్యాసం ఉండటంతో ట్రెజరీ అధికారులను అడిగి తెలుసుకునేందుకు కార్యాలయం వద్దకు వచ్చాడు. అదే సమయానికి ఓ అపరిచితుడు కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద నిల్చుని, శ్రీనివాసులును పలకరించాడు. వచ్చిన కారణమేంటని అడిగి తెలుసుకుని, కార్యాలయంలో ఇంపార్టెంట్ మీటింగ్ జరుగుతోందని, మీ సమస్యను పరిష్కరించే ఉద్యోగి తానేనని, ప్రస్తుతం వివరాలు తనవద్ద ఇచ్చి వెళ్లాలని చెప్పాడు. తర్వాత పెన్షనర్లకు ప్రభుత్వం ఇస్తున్న రూ.5లక్షల లోనుకు దరఖాస్తు చేసుకున్నారా అని అడిగాడు. అలాంటిదేమీ తనకు తెలియదని, ఎప్పుడు, ఎలా దరఖాస్తు చేసుకోవాలని శ్రీనివాసులు అడిగారు. లోనుకు సంబంధించి ఇప్పటికే పెన్షనర్లకు నోటీసులు పంపామని, మీకు అందలేదా అని ప్రశ్నించాడు. ఈరోజే దరఖాస్తుకు చివరిరోజని, రూ.1లక్ష35వేలు డిపాజిట్ చెల్లిస్తే, మీ వివరాలను ఆన్లైన్ చేసి బాండు ఇస్తానని, దాన్ని తీసుకెళ్లి సబ్ కలెక్టరేట్లో అందజేస్తే రూ.5లక్షల చెక్కు ఇస్తారని నమ్మించాడు. అపరిచితుడిని ట్రెజరీ ఉద్యోగిగా నమ్మిన శ్రీనివాసులు, వెంటనే అల్లుడు మోహన్కు ఫోన్చేసి డబ్బులు తేవాల్సిందిగా కోరాడు. దీంతో మోహన్, రూ.లక్ష నగదు తీసుకుని వచ్చి శ్రీనివాసులుకు అందజేసి, మున్సిపాలిటీలో పని ఉందని చెప్పి వెళ్లిపోయాడు. శ్రీనివాసులు, ట్రెజరీ ఉద్యోగిగా నమ్మిన అపరిచితుడికి రూ.లక్ష అందజేశాడు. వెంటనే అతను ఆధార్, పాన్కార్డు జిరాక్స్ తీసుకువచ్చి ఇవ్వాల్సిందిగా కోరాడు. శ్రీనివాసులు జిరాక్స్ కోసం కార్యాలయ ఆవరణలోని షాపు వద్దకు వెళ్లగానే, మరోవైపు నుంచి అపరిచిత వ్యక్తి రూ.లక్ష నగదుతో దర్జాగా ఉడాయించాడు. జిరాక్స్ కాపీలు తీసుకువచ్చిన శ్రీనివాసులుకు అపరిచిత వ్యక్తి కనిపించకపోవడంతో కంగారుగా కార్యాలయంలోకి వెళ్లి విచారించాడు. పెన్షనర్లకు రూ.5లక్షల లోన్లు ఏమీ లేవని చెప్పడంతో తాను మోసపోయినట్లు గ్రహించాడు. వెంటనే అల్లుడు మోహన్కు ఫోన్చేసి పిలిపించి వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. శ్రీనివాసులును, అపరిచితుడు మోసగించిన వైనం మొత్తం తహసీల్దార్ కార్యాలయ సీసీ కెమెరాల్లో స్పష్టంగా రికార్డ్ అవడంతో, వన్టౌన్ పోలీసులు సీసీ ఫుటేజీలు పరిశీలించి, అపరిచిత వ్యక్తిని వెతికే పనిలో పడ్డారు.ట్రెజరీ ఉద్యోగినంటూ రిటైర్డ్ ఉద్యోగిని మోసగించిన వైనం -
వ్యక్తి అదృశ్యం
పీలేరు : పీలేరు పట్టణం తిరుపతి రోడ్డు కృష్ణానగర్కు చెందిన దేవులపల్లె భాస్కర్రెడ్డి (73) గత నెల 24న ఇంటి నుంచి వెళ్లి అదృశ్యమయ్యాడు. బంధువుల ఇళ్లవద్ద గాలించినా ఆచూకీ లభించలేదు. దీంతో కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సమాచారం ఇవ్వాలని కోరారు. విద్యాలక్ష్మీ పోర్టల్లో సులువుగా విద్యా రుణాలుకురబలకోట : విద్యా లక్ష్మీ పోర్టల్ ద్వారా సులువుగా విద్యా రుణాలు లభిస్తాయని స్థానిక ఎస్బీఐ బ్రాంచ్ మేనేజర్ రుస్తుం ఖాన్ అన్నారు. మంగళవారం అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో విద్యా రుణాలపై జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ రూ. 7.5 లక్షల వరకు ఎలాంటి గిరవు లేకుండా విద్యా రుణాలకు అవకాశం ఉందన్నారు. విద్యార్థులు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చదువును కొనసాగించవచ్చన్నారు. ట్రాక్టర్ ఢీకొని వ్యక్తికి తీవ్ర గాయాలుమదనపల్లె రూరల్ : ట్రాక్టర్ ఢీకొని వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన మంగళవారం ములకలచెరువు మండలంలో జరిగింది. సత్యసాయిజిల్లా తనకల్లు మండలం ఈతవడ్డు గ్రామానికి చెందిన వెంకటసుబ్బారెడ్డి కుమారుడు రమణారెడ్డి(50) వ్యక్తిగత పనులపై మరో వ్యక్తితో కలిసి ద్విచక్రవాహనంలో ములకలచెరువుకు వచ్చాడు. పనులు ముగించుకుని తిరిగి మదనపల్లెకు బయలుదేరుతుండగా, ట్రాక్టర్ రివర్స్లో వస్తూ బైక్ను ఢీకొంది. ప్రమాదంలో రమణారెడ్డి తీవ్రంగా గాయపడగా, గమనించిన స్థానికులు మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగంలో చికిత్స అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. పిలుగుంట్ర రాళ్ల గుట్ట ఆక్రమణగాలివీడు : గరుగుపల్లి గ్రామ పరిధిలోని పిలుగుంట్ర రాళ్లగుట్ట వద్ద ప్రభుత్వ భూమిని కొందరు బడాబాబులు ఆక్రమించే ప్రయత్నం చేస్తున్నారని స్థానిక రైతులు ఆరోపించారు. ఈ మేరకు మంగళవారం రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సర్వే నంబర్ 696లో 3.80 ఎకరాలు, సర్వే నంబర్ 697లో 5.44 ఎకరాల ప్రభుత్వ భూమిని దశాబ్దాలుగా పశువుల మేత కోసం వినియోగించుకుంటున్నామని రైతులు వెల్లడించారు. అయితే ఇటీవల కొందరు ఆర్థిక, అంగబలం కలిగిన ఆక్రమణదారులు ఆ భూమిపై కన్నేశారన్నారు. స్థలాన్ని చదును చేస్తూ తమ ఆధీనంలోకి తీసుకునేందుకు ప్రయత్నించారని రైతులు పేర్కొన్నారు. దీంతో స్థానిక రైతులు ఆక్రమణను వెంటనే అడ్డుకోవాలంటూ సంబంధిత అధికారులకు విజ్ఞప్తి చేశారు. -
చేతివృత్తిదారులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలి
బద్వేలు అర్బన్ : చేతివృత్తుల పరిరక్షణ, సామాజిక భద్రత, సంక్షేమమే లక్ష్యంగా చేతివృత్తిదారులు ఐక్య ఉద్యమాలకు సిద్ధం కావాలని చేతివృత్తిదారుల సమాఖ్య రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామాంజనేయులు పిలుపునిచ్చారు. మంగళవారం స్థానిక సీపీఐ కార్యాలయం జెవీ భవన్లో నిర్వహించిన చేతివృత్తిదారుల జిల్లా విస్తత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ ఎంతో వృత్తి నైపుణ్యంతో సమాజానికి సేవలందిస్తున్న చేతివృత్తిదారులు నేడు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అనుసరిస్తున్న ఆర్థిక పారిశ్రామిక విధానాల వలన దుర్భరమైన జీవితాలను గడుపుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేంద్రంలోని నరేంద్రమోదీ విశ్వకర్మయోజన పథకం పేరుతో, రాష్ట్రంలోని చంద్రబాబునాయుడు ప్రభుత్వం సూపర్సిక్స్ వాగ్ధానాల పేరుతో చేతివృత్తిదారులకు ఎన్నో హామీలు ఇచ్చినప్పటికీ అవి అమలు కావడం లేదని అన్నారు. సీపీఐ జిల్లా కార్యదర్శి గాలిచంద్ర మాట్లాడుతూ శ్రమజీవుల కష్టాన్ని గుర్తించకపోవడం దారుణమన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు నరహరిపురం హైస్కూల్ విద్యార్థులు
చాపాడు : కర్నూలు జిల్లా ఎమ్మిగనూరులో జరిగిన ఘట్కా మార్షల్ ఆర్ట్స్ రాష్ట్రస్థాయి పోటీల్లో మండలంలోని నరహరిపురం ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రతిభ కనబరిచినట్లు ప్రధానోపాధ్యాయుడు నరసింహ శాస్త్రి తెలిపారు. అండర్–17 విభాగంలో జ్ఞాన అక్షిత సాయి, శుభలక్ష్మిలు, అండర్–19 విభాగంలో ప్రణవి కాంస్య పతకం సాఽధించారని తెలిపారు. వీరిలో జ్ఞాన అక్షిత సాయి ఛత్తీస్ఘడ్ రాష్ట్రం రాయపూర్లో జరగబోయే జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ందని చెప్పారు. తమ పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయికి ఎంపిక కావడం పట్ల ప్రధానోపాధ్యాయుడు, పీడీ ప్రశాంతి, ఉపాధ్యాయులు హర్షం వ్యక్తం చేశారు. -
జాతీయస్థాయి పోటీలకు మట్లి పెద్దూరు విద్యార్థులు
వీరబల్లి : మండలంలోని మట్లి పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు జయన్న తెలిపారు. నవంబర్ 27వ తేదీ నుంచి 29వ తేదీ వరకు అహోబిలంలో జరిగిన అండర్–17 బేస్ బాల్ పోటీల్లో వి.హర్షవర్దన్ (పదోతరగతి ) విద్యార్థి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వి జయన్న తెలిపారు. అలాగే జగదీష్ అనే విద్యార్థి కూడా ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయికి ఎంపికై నట్లు తెలిపారు. ఎంపికై న విద్యార్థులు జనవరి నెలలో ఢిల్లీలో జరిగే జాతీయస్థాయి పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. 2025–26 విద్యా సంవత్సరంలో మొత్తం ఐదుగురు విద్యార్థులు జాతీయ స్థాయి సాఫ్ట్బాల్, బేస్ బాల్కు ఎంపిక కావడానికి ప్రత్యేక శిక్షణ ఇచ్చిన వ్యాయామ సంచాలకుడు ఎ.జగదీశ్వరయ్యను పాఠశాల ప్రధానోపాధ్యాయుడు, సిబ్బంది, పాఠశాల కమిటీ చైర్మన్ నాగేశ్వర అభినందించారు. -
మరో ట్రావెల్స్ బస్సుకు ప్రమాదం
● డివైడర్ను ఢీకొని పల్టీలు ● మహిళ మృతి, 10 మందికి గాయాలు ● బద్వేలు నుంచి బెంగళూరుకు వెళ్తున్న బస్సు ● కోలారు జిల్లాలో ఘటనశ్రీనివాసపురం/మదనపల్లె రూరల్ : నిత్యం ఏదో ఒకచోట ప్రైవేటు బస్సులు ప్రమాదాలకు గురవుతూ ప్రయాణికులకు దడ పుట్టిస్తున్నాయి. ట్రావెల్స్ స్లీపర్ కోచ్ బస్సు ప్రమాదంలో మహిళ చనిపోయిన ఘటన కర్ణాటక– ఏపీ సరిహద్దుల్లో కోలారు జిల్లా శ్రీనివాసపురం తాలూకాలోని మంచినీళ్లకోట గ్రామం వద్ద మంగళవారం తెల్లవారుజాము 3 గంటల సమయంలో జరిగింది. కడప జిల్లా ప్రొద్దుటూరుకు చెందిన అనిత (58) బద్వేలు నుంచి బెంగళూరుకు బయలుదేరిన హరిత ట్రావెల్స్ బస్సులో ఎక్కింది. బస్సు మంచినీళ్లకోట గ్రామం వద్ద రోడ్డు డివైడర్ను ఢీకొని బోల్తా పడింది. ఈ ప్రమాదంలో అనిత అనే ప్రయాణికురాలు అక్కడికక్కడే మరణించగా, 10 మందికిపైగా ప్రయాణికులకు గాయాలయ్యాయి. వారి ఆర్తనాదాలతో అక్కడ హృదయ విదారక వాతావరణం నెలకొంది. బాధితులను శ్రీనివాసపురం, మదనపల్లి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. కడపకు చెందిన ఫయాజ్(27), జునైద్(28), అట్లయ్య(26), అట్లూరు గ్రామానికి చెందిన నరసింహులు(29) మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి వచ్చి చికిత్స పొందారు. . ముగ్గురి పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. మృతదేహాన్ని స్థానిక ప్రభుత్వ ఆస్పత్రిలో ఉంచారు ప్రమాద సమయంలో బస్సులో 40 మంది ప్రయాణికులున్నారు. బస్సు ముందు భాగం బాగా ధ్వంసం కావడం ప్రమాద తీవ్రతకు అద్దం పడుతోంది. అదుపులో డ్రైవర్.. రాయల్పాడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. రోడ్డుకు అడ్డంగా పడి ఉన్న బస్సును జేసీబీతో తొలగించారు. బస్సు డ్రైవర్ను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. నిద్రమత్తు, నిర్లక్ష్యంగా నడపడమే కారణమని అనుమానాలున్నాయి. -
అక్రమ కేసులకు భయపడేది లేదు
ములకలచెరువు : వైఎస్సార్సీపీ వారిపై బనాయించే అక్రమ కేసులు నిలబడవని, వాటికి భయపడేది లేదని తంబళ్లపల్లె వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి అన్నారు. మంగళవారం తంబళ్లపల్లె కోర్టు బయట విలేరులతో మాట్లాడారు. టీడీపీ ప్రభుత్వంలో నకిలీ మద్యం దందా నడుస్తోందని నిలదీసిన జోగి రమేష్పై కేసులు పెట్టడం ఎంతవరకు సమంజసమని ప్రభుత్వాన్ని నిలదీశారు. నకిలీ మద్యం కేసును సీబీఐ విచారణకు ఇవ్వాలని వైఎస్సార్సీపీ కోరగా నిజాలు బయటపడతాయని భయపడిన చంద్రబాబు ప్రభుత్వం సిట్ వేసి కేసును నీరుగార్చిందన్నారు. వైఎస్సార్సీపీ ఎంపీలు, ఎమ్మెల్యేలు ఇలాంటి అక్రమ కేసులకు భయపడేది లేదని తేల్చిచెప్పారు. నకిలీ మద్యం కేసులో టీడీపీ వారిని తప్పించడానికే వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేష్, అతని తమ్ముడు జోగి రాములపై కేసులు పెట్టారన్నారు. నిందితుడు జనార్దన్రావుకు, జోగి రమేష్కు ఎలాంటి సంబంధాలు లేవని, నిందితుడితో జోగి రమేష్ పేరు ప్రభుత్వమే చెప్పించిందని ఆరోపించారు. రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు సొంత గడ్డ చంద్రగిరిలో ఎప్పుడైనా గెలుపొందారా అని ప్రశ్నించారు. అప్పట్లో దివంగత నేత వైఎస్ రాజశేఖర్రెడ్డి పుణ్యమా అని గెలిచావు అన్నారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి ఇచ్చే దమ్ముందా.. నకిలీ మద్యం నడిపింది టీడీపీ నాయకులైతే కేసును ఎత్తి చూపించిన వైఎస్సార్సీపీ మాజీ మంత్రి జోగి రమేష, అతని తమ్ముడు జోగి రాములను కేసులో చేర్చడం ప్రభుత్వం చేతగానితనమే అని మదనపల్లి వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. నకిలీ మద్యం కేసును సీబీఐకి అప్పగించే దమ్ము కూటమి ప్రభుత్వానికి ఉందా అంటూ సవాల్ విసిరారు. ఈ కేసులో నిందితులుగా ఉన్న టీడీపీ తంబళ్లపల్లె ఇన్చార్జి దాసరపల్లి జయచంద్రారెడ్డి, అతని బావమర్ది మంత్రి గిరిధర్రెడ్డి, పీఏ రాజేష్, వ్యక్తిగత అకౌంటెంట్ అనుబురాజులను తప్పించడానికే జోగి రమేష్లపై కేసులు పెట్టారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి చేతకాని ప్రభుత్వానికి ప్రజలే బుద్ధి చెబుతారన్నారు.తంబళ్లపల్లె ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి -
శుభకార్యాలకు విరామం
● ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యమి ● మూడు నెలల పాటు ముహూర్తాలు నిల్ ● వివాహ అనుబంధ రంగాలపై ఆర్థిక ప్రభావంబద్వేలు : ఇక నుంచి మూడు నెలల పాటు శుభ కార్యాలకు మంచి రోజులు లేవు. నవంబర్ 27 నుంచి ఫిబ్రవరి 17 వరకు శుక్ర మౌఢ్యం వల్ల పెళ్లిళ్లు తదితర కార్యక్రమాలకు విరామం ఏర్పడింది. పవిత్ర తిథులు.. మార్గశిర, మాఘ, ఫాల్గుణ మాసాల్లో శుభకార్యాలు అధికంగా జరుగుతాయి. ఈ సారి మార్గశిరంలో ఒకటి రెండు ముహూర్తాలు ఉండగా పుష్యమాసం శూన్యమాసం కావడంతో మాఘంలోనూ ఒక్క ముహూర్తం లేకపోవడం గమనార్హం. గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, సరస్వతి జన్మదినమైన వసంత పంచమి, మహామాఘగా కీర్తించబడే మాఘ పౌర్ణమి వంటి తిఽథులు ఈసారి మూఢంలో కలిసిపోయాయి. వివాహ అనుబంధ రంగాలపై ప్రభావం.. శుభకార్యాలు లేకపోతే దానికి అనుబంధంగా ఉండే అనేక రంగాలు కుదేలవుతాయి. వివాహ మండపాలు, ఫంక్షన్ హాళ్లు, వస్త్ర వ్యాపారాలు, బంగారు దుకాణాలు, స్వర్ణకారులు, క్యాటరింగ్, ఫొటో వీడియో గ్రాఫర్లు, పూల దుకాణాలు, లైటింగ్, డీజేలు, అద్దె వాహనాలు, బాజాభజంత్రీలు, తప్పెట్లు ఇలా వివాహ అనుబంధ రంగాలపై ఆధారపడి బతుకుతున్న వందలాది కుటుంబాలు నెలల కొద్దీ నష్టపోవాల్సి వస్తోంది. ఇక పౌరోహిత్యమే తమ జీవనోపాధిగా ఉన్న బ్రాహ్మణులు ఈ మూడు నెలల కాలం గడ్డు పరిస్థితులు అనుభవించాల్సి వస్తోంది. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళల ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు మహిళలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. పీటీయం మండలం ఎగువపల్లెకు చెందిన ఈశ్వరమ్మ(45) భర్త నరసింహులుతో కలిసి మదనపల్లె పట్టణం గౌతమీనగర్లో నివాసం ఉంటోంది. మంగళవారం పక్కింటివారితో గొడవ జరగడంతో వారు ఈశ్వరమ్మను నిందించడంతో పాటు దాడికి యత్నించారు. దీంతో మనస్తాపం చెందిన ఆమె ఇంటివద్ద విషపు గుళికలు మింగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. అదేవిధంగా పీటీయం మండలం మల్లెలకు చెందిన భవాని(27) కుటుంబ సమస్యలతో పురుగుల మందు తాగింది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబ సభ్యులు బాధితులను వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. జూదరుల అరెస్టునిమ్మనపల్లె : జూదం ఆడుతున్న ఆరుగురిని అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ తిప్పేస్వామి తెలిపారు. మంగళవారం మండలంలోని రెడ్డివారిపల్లె పంచాయతీ పిట్టావాండ్లపల్లె సమీపంలో జూదం నిర్వహిస్తున్నట్లు సమాచారం అందడంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. ఈ దాడిలో పేకాట ఆడుతున్న ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి మూడు మొబైల్ఫోన్లు, రూ.3,750 నగదు స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులపై కేసు నమోదుచేసి కోర్టుకు హాజరుపరిచామన్నారు. బి.కొత్తకోట : పేకాట జూదం ఆడుతున్న వారిని మంగళవారం అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. మండలంలోని శీతివారిపల్లె వద్ద నిర్వహించిన దాడుల్లో ఐదుగురిని అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.13 వేలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వివాహిత అదృశ్యం ప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరులోని ఈశ్వర్రెడ్డినగర్కు చెందిన సాయిరూప అనే వివాహిత కనిపించలేదని ఆమె భర్త వన్టౌన్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. పోలీసులు తెలిపిన వివరాల మేరకు..మధుసూదన్ స్థానిక హనుమాన్నగర్కు చెందిన సాయిరూపలు 8 ఏళ్ల క్రితం ప్రేమ వివాహం చేసుకున్నారు. ెపెళ్లయి 8 ఏళ్లయినా వారికి పిల్లలు పుట్టలేదు. ఆస్పత్రిలో చూపించగా ఆమెకు థైరాయిడ్ ఉందని వైద్యులు తెలిపారు. పెళ్లయి ఏళ్లు గడచినా పిల్లలు పుట్టలేదని సాయిరూప తరచూ బాధపడుతూ ఉండేది. ఈ క్రమంలో సోమవారం ఉదయం నుంచి ఆమె కనిపించలేదు. వారి ఇంటి బయట ఉన్న సీసీ కెమెరాలను పరిశీలించగా రాత్రి ఆమె బ్యాగు తీసుకొని ఇంటి నుంచి వెళ్లినట్లు కనిపిస్తోంది. దీంతో మధుసూదన్ పట్టణంలోను, బంధువుల ఊళ్లలో ఆమె కోసం గాలించినా ఆచూకి తెలియలేదు. ఈ మేరకు మంగళవారం పోలీసులకు ఫిర్యాదు చేశాడు. -
మద్యం కేసులో ఎకై ్సజ్ లింకులు !
మదనపల్లె : ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసు ఎకై ్సజ్ శాఖలో ప్రకంపనలు సృష్టిస్తోంది. మొన్నటి దాకా ప్రభుత్వ స్థాయిలో ప్రకంపనలతో రాష్ట్ర రాజకీయాలను ఉలికిపాటుకు గురి చేసింది. ప్రభుత్వమే రంగంలోకి దిగాల్సి వచ్చింది. ఈ నకిలీ మద్యం తయారీ వ్యవహారం ఇప్పుడు నిందితులకు సహకరించిన వారి చుట్టూ తిరుగుతోంది. ఎప్పుడు ఎవరిపై వేటుపడుతుందో తెలియక ఆందోళనకు గురవుతున్నారు. అయితే ఎకై ్సజ్ శాఖ సిబ్బంది ఇందుకు సహకరించిన కారణంగానే.. వారి పాత్ర బహిర్గతమవుతోందని తీసుకుంటున్న చర్యలను బట్టి స్పష్టంగా తెలుస్తోంది. అక్టోబర్ మూడో తేదీ జరిగిన దాడుల్లో ములకలచెరువులో నకిలీ మద్యం తయారీ ప్లాంట్ గుట్టు బహిర్గతమైంది. ఆ తర్వాత జరిగిన పరిణామాలతో గత ఎకై ్సజ్ సీఐ హిమబిందును తొలుత ఇక్కడి నుంచి బదిలీ చేయగా రెండో రోజుకే సస్పెండ్ చేశారు. ఈకేసులో ఇది మొదటి చర్యగా నిలిచింది. అడ్డంగా దొరికిన భాస్కర్ 2024 సెప్టెంబర్లో జరిగిన బదిలీల్లో కానిస్టేబుల్ భాస్కర్ ములకలచెరువు ఎకై ్సజ్ స్టేషన్ కు వచ్చాడు. మొదట నకిలీ మద్యం కేసులో సిబ్బంది పాత్రపై ఎలాంటి ఆధారాలు వెలుగు చూడలేదు. తాజాగా భాస్కర్ వ్యవహారంపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకొని సస్పెండ్ చేశారు. దీనికి ప్రధానంగా భాస్కర్.. ఈ కేసులో నిందితులైన వారితో ఫోన్లో మాట్లాడిన వివరాలను కాల్ రికార్డ్ డేటా ఆధారంగా గుర్తించారు. ఏ నిందితులతో.. ఎంతకాలంగా ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాడు అన్నది నిగ్గు తేల్చినట్టు తెలిసింది. ఇతని పాత్ర ఉందని గుర్తించి సస్పెండ్ చేయగా ఇతన్ని అధికారులు విచారణ చేయనున్నారు. నిందితులతో ఎందుకు ఫోన్ కాంటాక్ట్లో ఉన్నాడు, వారితో ఏ వ్యవహారాలు నడిపాడు, నకిలీ మద్యం తయారీ, సరఫరా, బెల్టు షాపులకు విక్రయాలు ఇతర అంశాలపై ఇప్పటికే విచారణ చేసినట్లు సమాచారం. ప్రస్తుతం సస్పెండ్ చేయడంతో ఇక ఇతన్ని విచారణ చేసి మరిన్ని వివరాలను రాబట్టే అవకాశం ఉందని ఎకై ్సజ్ శాఖ ఉన్నతాధికారులు చెప్పారు. విచారణ తర్వాత వెలుగులోకి వచ్చే విషయాల ఆధారంగా కేసులో నిందితునిగా చేర్చే అవకాశం ఉందని చెబుతున్నారు. ప్రధానంగా భాస్కర్ తనంతట తాను నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఉన్నాడా, లేక పై అధికారుల సూచన మేరకు చేశాడా, ఇది ఎంత కాలంగా జరిగింది, ఇంకా ఎవరెవరి పాత్ర ఉంది.. అన్న విభిన్న కోణాల్లో పూర్తి స్థాయిలో దర్యాప్తు జరిగే అవకాశం ఉందని తెలుస్తోంది. భాస్కర్ నిందితులతో ఫోన్ సంభాషణలు జరపకుండా ఉంటే ఇతని పేరు వెలుగులోకి వచ్చి ఉండేది కాదు. ముఖ్యంగా ఇప్పటికే అరెస్ట్ అయిన నిందితులను అధికారులు కస్టడీ విచారణలు చేశారు. ఈ విచారణలో నిందితులు భాస్కర్ పేరుని వెల్లడించి ఉంటారని అనుమానాలు ఉన్నాయి. కాల్ డేటా ఆధారంగా భాస్కర్ను సస్పెండ్ చేసే అవకాశం వచ్చిందని చెప్తున్నారు. భాస్కర్ను విచారణ చేశాక మరిన్ని ఆసక్తికర విషయాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉందని భావిస్తున్నారు. ఆ నలుగురిపైనా విచారణ జిల్లాలోని మదనపల్లి, చిత్తూరు జిల్లా పుంగనూరు ఎకై ్సజ్ స్టేషన్లో పని చేస్తున్న జి.మణి, ఎం.కిరణ్, ఎ.వినోద్ కుమార్, ఎం.నరేంద్రరెడ్డి నలుగురు కానిస్టేబుళ్లలను చిత్తూరు జిల్లాలోని వివిధ ప్రాంతాలకు అటాచ్ బదిలీలు ఇచ్చారు. ఇప్పుడు వీరి పాత్ర కూడా హాట్ టాపిక్గా మారింది. నకిలీ మద్యం సరఫరా, బెల్ట్ షాపులకు తరలించే వ్యవహారాల్లో వీరి పాత్ర ఉండొచ్చని అనుమానిస్తున్నారు. ఈ నలుగురిపై ఆరోపణ లు ఉన్నాయి.. విచారణలో ఉన్నారు.. కాబట్టి స్థానికంగా విధులు నిర్వహించకుండా ఇతర ప్రాంతాలకు అటాచ్ చేస్తూ బదిలీ ఇచ్చారని ఓ ఎకై ్సజ్ అధికారి చెప్పారు. దీన్ని బట్టి చూస్తే ఈ నలుగురికి నకిలీ మద్యం వ్యవహారంలో ప్రమేయం ఉండొచ్చు అన్న అనుమానాలు అయితే బలపడుతున్నాయి. ముఖ్యంగా నిందితుల విచారణ సమయంలో వీరి ప్రమేయాన్ని వెల్లడించారా అన్నది చర్చనీయాంశమైంది. ఇటీవల ఎక్సైజ్ కానిస్టేబుల్ అరెస్ట్ కర్ణాటక నుంచి అక్రమ మద్యం తరలింపు, బెల్టు షాపులకు విక్రయించిన వ్యవహారానికి సంబంధించి ఇటీవల ఓ ఎకై ్సజ్ కానిస్టేబుల్ను బి.కొత్తకోట పోలీసులు అరెస్టు చేశారు. ఇతన్ని సాంకేతిక ఆధారాలతో నిర్ధారించడం, అంతకుమునుపు ఓ నిందితుడు ఇచ్చిన వాంగ్మూలంపై కీలకమైన దర్యాప్తు చేశారు. అంతా నిజమని తేలాక తంబళ్లపల్లె మండలానికి చెందిన ఆ ఎకై ్సజ్ కానిస్టేబుల్ అరెస్ట్ అయ్యారు. ఇతనితోపాటు కొంత మంది ఎకై ్సజ్ కానిస్టేబుళ్లపై బెల్ట్ షాపుల మద్యం విక్రయాలతో సంబంధం ఉందన్న ఆరోపణలు వచ్చాయి. ఈ నేపథ్యంలో నకిలీ మద్యం తయారీ వ్యవహారంలో ఎకై ్సజ్ పోలీసుల పాత్ర వెలుగులోకి రావడం ఆ శాఖకు మచ్చ తెచ్చింది. నకిలీ మద్యాన్ని అరికట్టాల్సిన ఎకై ్సజ్ శాఖ సిబ్బంది దీనికి సహకరించినట్టు వెలుగులోకి రావడం చర్చనీయాంశమైంది. మొదట్లోనే సీఐ హిమబిందు సస్పెన్షన్ ఇప్పుడు కానిస్టేబుల్ భాస్కర్ విచారణ అయ్యాక.. వీలైతే కేసు పై అధికారులు చెబితే పాటించాడా.. స్వయంగా సహకరించాడా? ఆ నలుగురు కూడా భాగస్వామ్యం అయ్యారా? -
రిజిస్ట్రేషన్లపై ‘పచ్చ’ రైటర్ పెత్తనం
● టీడీపీ నేత, దస్తావేజు లేఖరి కుమ్మక్కు ● చక్కబెట్టిన అనేక అక్రమ రిజిస్ట్రేషన్లు ● ఏసీబీ దాడులను లెక్క చేయని వైనం రాజంపేట : అతను సబ్ రిజిస్ట్రేషన్ ఉద్యోగి కాదు.. అందులో పని చేసే అవుట్సోర్సింగ్ సిబ్బంది కాదు.. కేవలం స్థానిక టీడీపీ నేత అండ ఉన్న ఓ రైటర్.. ఆయనపై ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. వీరి కనుసన్నలో అక్రమ రిజిస్ట్రేషన్లకు తెర తీసినట్లుగా తెలుస్తోంది. ఈ రైటర్ మండలంలో రెవెన్యూ భూ అక్రమాల ఆరోపణల్లో కీలక పాత్ర పోషించిన ఓ మాజీ వీఆర్వో సంబంధీకుడు కావడంతో.. కొన్నేళ్లుగా రెవెన్యూ, రిజిస్ట్రేషన్ కార్యకలాపాల్లో కీలకపాత్ర పోషిస్తున్నారు. కొన్నేళ్లుగా.. ఈ రైటల్ కొన్నేళ్లుగా రాజంపేట సబ్ రిజిస్ట్రారు కార్యాలయాన్ని శాసిస్తూ వస్తున్నారనే విమర్శలు వెలువడుతున్నాయి. సబ్రిజిస్ట్రారు కార్యాలయం వద్ద ఎందరో రైటర్లు ఉన్నారు. వారంతా కూడా తమ హద్దు వరకే క్రయ, విక్రయ విషయాల్లో జోక్యం చేసుకుంటారు. ‘బా’గా బలిసిన రైటర్ ‘బా’గా బలసిన రైటర్ కావడంతో రిజిస్ట్రేషన్ వ్యవహారాల్లో అక్రమమైనా సరే నేరుగా ఆయన దగ్గరుండి రిజిస్ట్రేషన్ చేసే వరకు అన్ని చూసుకోవడంతో.. లక్షలకు లక్షలు సంపాదిస్తూ, అధికార పార్టీ అండతో చెలరేగిపోతున్నాడు. సబ్ రిజిస్ట్రారు కార్యాలయ సిబ్బందితో సహా తోటి రైటర్లు ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. సబ్రిజిస్ట్రారు కార్యాలయంలో చాలా మంది సిబ్బందితో మనీ మ్యాటర్ కొనసాగించి, వారి నుంచి అనేక విధాలుగా అక్రమ రిజిస్ట్రేషన్లు చేయించుకోవడంలో దిట్టగా నిలిచారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీబీ దాడులు జరిగినా..గత నెలలో రాజంపేట సబ్ రిజిస్ట్రారు కార్యాలయంపై ఏసీబీ అధికారులు దాడులు చేశారు. తెల్లవారే వరకు వారు విస్తృతంగా రిజిస్ట్రేషన్ల రికార్డులు తనిఖీ చేశారు. కొంత మంది రైటర్లను కూడా ఏసీబీ ట్రాప్ చేసింది. వారిని విచారణ చేసి వదిలేసింది. అదే ఇప్పుడు పెద్ద తప్పైందని పలువురు తమ భావనలు వ్యక్తం చేస్తున్నారు. ఎందుకంటే రైటర్ల వాహ తిరిగి కొనసాగడం ఇందుకు బలం చేకూరుస్తోంది. ఈ రైటర్ల బృందంలో ‘బా’గా బలసిన రైటర్.. తన సహకారంతో అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకున్న ఓ టీడీపీ నేత అండదండలతో మళ్లీ చెలరేగిపోతున్నారు. ఇందుకోసం వ్యూహాలు రూపొందించి కలెక్షన్లు చేపట్టారనే విమర్శలున్నాయి. కలెక్షన్లు ఎవరి కోసం..సబ్రిజిస్ట్రారు కార్యాలయం భవనం చుట్టుపక్కల ఉన్న రైటర్ల వద్ద ఓ రైటర్ లక్షలాది రూపాయలు వసూలు చేసినట్లుగా మీడియా గ్రూపులో వైరల్ అయింది. దీంతో రైటర్లు ఎవరిమటుకు వారు హైరానా పడ్డారు. ఒక్కొక్క డాక్యుమెంట్ రైటర్ వద్ద నుంచి రూ.5 వేలు వసూలు చేసినట్లు తెలిసింది. అయితే ఈ డబ్బులు ఎందుకు వసూలు చేశారు. ఎవరి కోసం చేశారన్నది ఇప్పుడు సబ్రిజిస్ట్రారు సిబ్బందిలో చర్చనీయాంశంగా మారింది. ధనం మూల ఇదం జగత్తు అన్న సామెతతో ముందుకువెళితే, అక్రమ రిజిస్ట్రేషన్లు చేసుకోవచ్చుననే భావనతో కార్యకలాపాలు చేపట్టేందుకు.. రైటర్లను ఒక తాటిపైకి తీసుకొచ్చే ప్రయత్నం మాజీ వీఆర్వో సంబంధీకుడైన రైటర్ చేశారని రైటర్ల వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
ఓబులవారిపల్లె : జాతీయ స్థాయి ఖోఖో పోటీలకు తమ కళాశాలకు చెందిన ఎస్.రామ్ శరణ్ ఎంపికై నట్లు ప్రిన్సిపాల్ మన్సూల్ అలీ తెలిపారు. ఆ విద్యార్థిని మంగళవారం ఉపాధ్యాయులు, తోటి విద్యార్థులు అభినందించారు. ఈ సందర్భంగా ప్రిన్సిపాల్ మాట్లాడుతూ రాష్ట్ర స్థాయిలో అనకాపల్లిలో నిర్వహించిన ఖోఖో పోటీలకు సంజీవపురం అంబేడ్కర్ గురుకుల పాఠశాల నుంచి ఇద్దరు విద్యార్థులు వెళ్లి పాల్గొన్నారని పేర్కొన్నారు. అందులో ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి పోటీలకు రామ్శరణ్ అర్హత సాధించాడని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఫిజికల్ డైరెక్టర్, కళాశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. -
వ్యవసాయ రంగాన్ని లాభసాటిగా మార్చాలి
రాయచోటి : వ్యవసాయ రంగాన్ని అభివృద్ధి, లాభసాటిగా మార్చేలా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. మంగళవారం జిల్లా కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జేసీ ఆదర్శ రాజేంద్రన్తో కలిసి వ్యవసాయ అనుబంధ శాఖల అధికారులతో వీడియో కాన్ఫరెన్సు ద్వారా కలెక్టర్ సమీక్షించారు. ఈ సమీక్షలో ప్రైమరీ సెక్టార్, జిల్లా వ్యవసాయ, జిల్లా ఉద్యానశాఖ, సిరి కల్చర్, ఏపీఎంఐపీ పీడీ, పశుసంవర్ధక, మత్స్య శాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, డీఆర్డీఏ, మార్క్ఫెడ్ డీఎం, ప్రైమరీ సెక్టార్ల అధికారులు, మండల వ్యవసాయ అధికారులు, విలేజ్ అగ్రికల్చర్, హార్టికల్చర్ అసిస్టెంట్లు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో జిల్లాలో 271 రైతు సేవా కేంద్రాలలో ఈ నెల 3న నిర్వహించే రైతన్న మీకోసం కార్యక్రమంలో వ్యవసాయ అనుబంధ శాఖల సిబ్బంది పాల్గొనాలని పేర్కొన్నారు. ఈ వర్క్షాప్లో రబీ, ఖరీప్ పంటల యాక్షన్ ప్లాన్, వివిధ రకాల అంశాలపై రైతులతో సలహాలు, సూచనలు తీసుకొని విజయవంతం చేయాలని తెలిపారు. రైతుల ఆదాయం పెంపు లక్ష్యంతో ప్రభుత్వం చేపడుతున్న పథకాలు, సాంకేతిక పద్ధతులు, ఆధునిక సాగు విధానాలు గ్రామ గ్రామానికి చేరేలా అవగాహన కార్యక్రమాలు అత్యంత అవసరమన్నారు. రైతులు ఆధునిక పద్ధతులను అనుసరించడం ద్వారా ఖర్చులు తగ్గించి, ఆదాయాన్ని పెంచుకునే అవకాశాలపై లోతుగా చర్చించి నివేదికలను తయారు చేసి ప్రభుత్వానికి పంపాలన్నారు. వీడియో కాన్ఫిరెన్స్లో జిల్లా వ్యవసాయశాఖ అధికారి జి.శివనారాయణ, ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, సిరికల్చర్ ఏపీఎంఐపీ, పశుసంవర్ధకశాఖ, మత్స్యశాఖ, సహకార శాఖ, మార్కెటింగ్, డీఆర్డీఏ మార్క్ఫెడ్ అధికారులు పాల్గొన్నారు. -
21న మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఈ నెల 21న తగరపు వలస, విశాఖపట్నంలో మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటేషన్ న్యూ ఆంధ్ర బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో జరుగుతుందని జిల్లా బాడీ బిల్డింగ్ అసోసియేషన్ ప్రెసిడెంట్ యం.తారీఖ్ అలీ, సెక్రటరీ అన్సర్ అలీ తెలిపారు. మంగళవారం నగరంలోని ఖూన్కా రిష్టా కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ మిస్టర్ ఆంధ్ర బాడీ బిల్డింగ్ కాంపిటీషన్కు ప్రతి ఒక్కరు రావాలని కోరారు. ఈ సమావేశంలో స్టేట్ బాడీ బిల్డింగ్ అసోసియేషన్ వర్కింగ్ ప్రెసిడెంట్ షేక్ న్యామతుల్లా,ట్రెజరర్ ఇంతియాజ్ ఖాన్,ఫిరోజ్ ఖాన్,రాజా, ఏజాస్ ఖాన్,మోయిన్,ముక్తియార్ ఉమర్,సలీం,ఆరిఫ్ తదితరులు పాల్గొన్నారు. -
పర్యాటక కేంద్రంగా గండికోట
● వైఎస్ఆర్ జిల్లా కలెక్టర్ శ్రీధర్ ● అభివృద్ధి పనుల పరిశీలన జమ్మలమడుగు : ప్రసిద్ధ గండికోటలో 79 కోట్ల రూపాయలతో జరుగుతున్న అభివృద్ధి పనులను కలెక్టర్ శ్రీధర్ చెరుకూరి పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జిల్లా పర్యాటక చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశం నలుదిక్కులా చాటేలా గండికోట ఉత్సవాలను నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. సాస్కి నిధుల ద్వారా గండికోట పర్యాటక కేంద్రాన్ని ప్రపంచ స్థాయిలో కీర్తిని ప్రతిబింభించేలా అభివృద్ధి చేస్తున్నామని తెలిపారు. పర్యాటక మంత్రిత్వ శాఖా ఆధ్వర్యంలో గండికోటను పర్యాటక కేంద్రంగా తీర్చిదిద్దుతామన్నారు. అదేవిధంగా గండికోట కొట్లాలపల్లి, గండికోట రిజర్వాయర్ అందాలను వీక్షించడంతోపాటు, గండికోట గాడ్జ్ పాయింట్, ఓబెరాయ్ హోటల్నిర్మించే ప్రాంతాలను ఆయన పరిశీలించారు. ఆర్డీఓ సాయిశ్రీ, సుబ్రమణ్యం, మాదన్న, రాజారత్నం, సురేష్కుమార్, భాస్కర్రెడ్డి, గోపీనాథ్ తదితరులు పాల్గొన్నారు. స్మార్టు కిచెన్ సెంటర్ తనిఖీ జమ్మలమడుగు పట్టణంలోని పతంగే రామన్నరావు ఉన్నతపాఠశాలలో ఏర్పాటు చేసిన స్మార్టు కిచెన్ సెంటర్ను కలెక్టర్ శ్రీధర్ తనిఖీ చేశారు. ఇక్కడి స్మార్టు కిచెన్ సెంటర్నుంచి జమ్మలమడుగు, మైలవరం, పెద్దముడియం మండలాల ప్రాంతాల్లోని పాఠశాలలకు మధ్యాహ్న భోజనం సరఫరా అవుతుంది. దీంతో మధ్యాహ్న భోజనం పథకం ఎలా అమలవుతుందో తనిఖీ చేశారు. అలాగే దేవగుడి గ్రామంలో నిర్మాణంలో ఉన్న స్మార్టు కిచెన్ సెంటర్ పనులనూ పరిశీలించారు. -
కౌశల్ పోటీల్లో ప్రతిభ
రాయచోటి జగదాంబసెంటర్ : భారతీయ విజ్ఞాన మండలి, ఆంధ్రప్రదేశ్, ఏపీసీఓఎస్టీ సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కౌశల్–2025 ప్రతిభా అన్వేషణ పోటీల్లో అన్నమయ్య జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలకు చెందిన 12 మంది విద్యార్థులు రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు కౌశల్ జిల్లా కోఆర్డినేటర్ మధుమతి, జిల్లా జాయింట్ కోఆర్డినేటర్ వెంకటరమణ మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా స్థాయిలో నిర్వహించిన ఆన్లైన్ పోటీలలో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు వారు పేర్కొన్నారు. 8వ తరగతిలో బి.రెడ్డిప్రసన్న (జెడ్పీహెచ్ఎస్ రెడ్డివారిపల్లి), కె.వెన్నెల (జెడ్పీహెచ్ఎస్ బీపీ రాచపల్లి), కె.గౌరీప్రియ (జెడ్పీహెచ్ఎస్ గట్టు), ఎం.గోపిక (ఎస్జేఎస్ఎం జెడ్పీహెచ్ఎస్ బోయనపల్లి), 9వ తరగతిలో పి.ప్రసన్న, జి.మునిచందు (ఎంజేపీఏపీ బీసీ వెల్ఫేర్ స్కూల్ ఫర్ గర్ల్స్, పీలేరు), ఎ.హర్షిత (జెడ్పీహెచ్ఎస్ బీపీ రాచపల్లి), సౌమ్య (జెడ్పీహెచ్ బాలికల, రాజంపేట), 10వ తరగతిలో ఎన్.సుష్మతేజ (జెడ్పీహెచ్ఎస్ మాసాపేట, రాయచోటి), ఎల్.అల్మాస్ (జెడ్పీహెచ్ఎస్ కురబలకోట), టి.భవ్యశ్రీ (ఎంజేపీఏపీబీసీడబ్ల్యూఆర్ స్కూల్ (గర్ల్స్) కలికిరి), వి.నిఖిత (జెడ్పీహెచ్ఎస్ గర్ల్స్ రాయచోటి)లు ఎంపికై నట్లు వివరించారు. అన్నమయ్య కాలిబాట మీదుగా ప్రయాణించరాదు రైల్వేకోడూరు : అన్నమయ్య కాలిబాట ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులకు రైల్వేకోడూరు మండలం కుక్కలదొడ్డి గ్రామం నుంచి అనుమతి నిరాకరిస్తున్నట్లు అన్నమయ్య జిల్లా అటవీశాఖ అధికారి ఆర్.జగన్నాథ సింగ్ తెలిపారు. ఆయన మంగళవారం మీడియాతో మాట్లాడారు. ఈ అటవీ మార్గంలో అడవి జంతువులైన ఏనుగుల గుంపు అధికంగా ఉందని, దానివల్ల ప్రజలకు ప్రమాదం ఉందని ఆయన పేర్కొన్నారు. గతంలో ఏనుగుల దాడిలో ముగ్గురు ప్రాణాలు కోల్పోయిన విషయాన్ని దృష్టిలో ఉంచుకొని ప్రజా శ్రేయస్సు కోసం ఈ మార్గం ద్వారా తిరుమలకు వెళ్లే భక్తులకు అనుమతి నిరాకరించడం జరిగిందని తెలిపారు. కావున భక్తులు రోడ్డు వెంట తిరుమలకు వెళ్లాలని సూచించారు. ఇండోర్ స్టేడియానికి భూమి కేటాయింపు రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంలో రాయచోటి – మదనపల్లె రోడ్డులో ఇండోర్ స్టేడియం కోసం మూడు ఎకరాల భూమి కేటాయించినట్లు రాష్ట్ర క్రీడల, యువజన, రవాణశాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన జిల్లా క్రీడాభివృద్ధి అధికారి జి.చంద్రశేఖర్తో చర్చించారు. అనంతరం వారు మాట్లాడుతూ క్రీడల అభివృద్ధి కోసం స్థానికంగా ఉన్న పరిమిత సదుపాయాలు, అవసరాలు, అభివృద్ధి ప్రతిపాదనలపై సమగ్రంగా చర్చించినట్లు తెలిపారు. డీఎస్ఏ క్రికెట్ గ్రౌండ్, ఇండోర్ సదుపాయాలు, రన్నింగ్ ట్రాక్, ఇతర క్రీడా ప్రాంగణాలను అభివృద్ధి పరిచేందుకు చర్యలు తీసుకుంటున్నట్లు చెప్పారు. అలాగే డీఎస్ఏలో ఖాళీగా ఉన్న కోచ్ పోస్టులు, కార్యాలయ సిబ్బంది, నిధుల కొరత వంటి అంశాలపై చర్చించినట్లు పేర్కొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్ : రాయచోటి పట్టణంలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో మెప్మా ఆధ్వర్యంలో బుధవారం నిర్వహించే మెగా జాబ్మేళాను నిరుద్యోగులు సద్వినియోగం చేసుకోవాలని రాష్ట్ర రవాణా, క్రీడా, యువజన శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. మంగళవారం రాయచోటిలోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన పోస్టర్లు ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మెప్మా ఆధ్వర్యంలో తొలిసారిగా మహిళా సంఘా ల సభ్యుల పిల్లల భవిష్యత్తును దృష్టిలో పెట్టుకు ని ప్రభుత్వం ఒక కుటుంబం.. ఒక పారిశ్రామికవేత్తగా తయారు చేయడంలో భాగంగా మెప్మా సంస్థ ‘నిపుణ’ సంస్థతో ఒప్పందం కుదుర్చుకున్నదని తెలిపారు. పలు కంపెనీల ప్రతినిధుల సమక్షంలో జాబ్మేళా నిర్వహించడం జరుగుతుందన్నారు. మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి, మెప్మా అధికారి అబ్బాస్ఆలీఖాన్, మెప్మా సిబ్బంది, పలువురు ప్రజాప్రతినిధులు పాల్గొన్నారు. -
వీడని వర్షం
సాక్షి రాయచోటి : ఈ ఏడాది ఎప్పుడు చూసినా అన్నమయ్య జిల్లాను వర్షాలు వెంటాడుతున్నాయి. అది కూడా మంచి సీజన్లో రైతులకు అవసరమైన సమయంలో అనుకుంటే కాదు.. పంటలను దెబ్బతీయడానికో.. రోడ్లు కోసుకుపోవడానికో.. విద్యుత్ స్తంభాలు పడిపోవడానికి తప్ప ఉపయోగపడటం లేదు. ఏదో ఒక తుపాను నేపథ్యంతో సుమారు నెల రోజులుగా మబ్బులు కమ్ముతూనే ఉన్నాయి. ముసురు తప్పుకోవడం లేదు. తుంపెర వర్షాలు ఆగడం లేదు. దీంతో జిల్లా ప్రజలు చలి ప్రభావంతో వణికిపోతున్నారు. దిత్వా తుపాను ప్రభావంతో మూడు రోజులుగా తుంపెర వర్షాలు వెంటాడుతున్నాయి. ఆకాశం మేఘావృతం జిల్లాలో దిత్వా తుపాను ప్రభావంతో ఆకాశం మేఘావృతమై కనిపిస్తోంది. సుమారు మూడు, నాలుగు రోజులుగా సూర్య భగవానుడి కాంతి కనిపించడం లేదు. ఉదయం నుంచి రాత్రి వరకు ఆకాశం పూర్తిగా నల్లమబ్బులతో కమ్ముకుని ఉండగా, చుట్టూ కొండ ప్రాంతాల్లో పొగమంచు అలుముకుంటోంది. ఆకాశం మేఘావృతమై ఉండటంతో భారీ వర్షం కురుస్తుందేమోనని ఆశించినా ఇప్పటి వరకు పడలేదు. చిరు వ్యాపారులకు ఇక్కట్లు అన్నమయ్య జిల్లాలో దిత్వా తుపానుతో తుంపెర వర్షం పడుతూనే ఉంది. జిల్లా కేంద్రమైన రాయచోటి మొదలుకొని మదనపల్లె, తంబళ్లపల్లె, పీలేరు, రైల్వేకోడూరు, రాజంపేటలలో తుంపెర వర్షం పడుతుండడంతో జనజీవనానికి ఇబ్బందిగా మారింది. కొద్దిసేపు తెరిపి ఇవ్వడం, మళ్లీ తుంపెర పడుతుండటంతో జనాలు గొడుగుల సాయంతో తిరుగుతూ కనిపించారు. రోడ్లు కూడా తుంపెర ధాటికి చిత్తడిగా మారాయి. మూడు, నాలుగు రోజులుగా తుంపెర వర్షం పడుతుండటంతో తోపుడు బండ్లు, ఫుట్పాత్లపై చిరు వ్యాపారాలు చేసుకునే వారికి తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. ‘ముసురు’ రైతుల్లో ఆందోళనజిల్లాలో తుపానుల నేపథ్యంలో ముసురు వాతావరణం కనిపిస్తోంది. ఇలా పొగమంచుతో కూడిన వాతావరణం పంటలను దెబ్బతీస్తోందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే గతంలో కురిసిన వర్షాలకు మామిడి లాంటి పంటలకు ఇప్పటికిప్పుడు పూత వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. మరోపక్క ఎక్కడైనా అరకొరగా వచ్చిన పూత కూడా ప్రస్తుత వాతావరణంతో రాలిపోతుందోనన్న ఆందోళన నెలకొంది. టమాట పంటకు సంబంధించి కూడా కాయలపై మచ్చలు ఏర్పడుతున్నాయి. అంతేకాకుండా పెసర, వరి, ధనియాలు తదితర పంటలకు కూడా ఇబ్బందికర పరిస్థితులు తలెత్తే అవకాశాలు ఉన్నాయి. ఇప్పటికే బొప్పాయికి సంబంధించి చాలా వరకు తోటల్లోనే కాయలు కుళ్లిపోతున్నాయి. ఏది ఏమైనా తుపాన్లు రైతన్నను తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. జిల్లా వ్యాప్తంగా కొనసాగుతున్న ‘దిత్వా’ ప్రభావం పలు ప్రాంతాల్లో తుంపెర్లతో కూడిన వాన వరుస తుపానులతో పంటలకు కష్టకాలం జనజీవనానికి తప్పని ఇబ్బందులు -
ప్రవాసాంధ్రుల సమస్యలను పట్టించుకోని ప్రభుత్వం
రాజంపేట : ప్రవాసాంధ్రుల సమస్యలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవడం లేదని, గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో జరిగినంత మేలు ఇప్పుడు జరగడం లేదని వైఎస్సార్సీపీ కువైట్ ప్రధాన సలహాదారుడు టి.దుర్గారెడ్డి విమర్శించారు. మంగళవారం వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని గల్ఫ్ కన్వీనర్ ఇలియాస్, ఎన్ఆర్ఐ గ్లోబల్ కన్వీనర్ సాంబశివారెడ్డి ఆధ్వర్యంలో ఆయన మర్యాద పూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఆయన ఇక్కడి విలేకరులతో మాట్లాడుతూ 2019 నుంచి 2024 వరకు వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఏపీఎన్ఆర్టీని బలోపేతం చేశారన్నారు. దాని ద్వారా అనేక విధాలుగా గల్ఫ్ బాధితులను ఆదుకున్నారన్నారు. రాజంపేట కేంద్రంగా ఏపీఎన్ఆర్టీ విభాగాన్ని ఏర్పాటు చేశారని గుర్తుచేశారు. ఇప్పుడున్న చంద్రబాబు ప్రభుత్వం ప్రవాసాంధ్రుల విషయంలో ప్రకటనలకే పరిమితమైందన్నారు. 2029లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రి చేసుకుంటేనే గల్ఫ్ బాధితులను ఆదుకునేందుకు మార్గం సుగమమవుతుందన్నారు. కార్యక్రమంలో గల్ఫ్ వైఎస్సార్సీపీ నాయకులు, తదితరులు పాల్గొన్నారు. -
హత్యాయత్నం కేసులో రెండేళ్ల జైలు
సిద్దవటం : సిద్దవటం పోలీస్ స్టేషన్ పరిధిలో 2018 సంవత్సరంలో జరిగిన హత్యా యత్నం కేసులో నిందితుడికి రెండేళ్ల సాధారణ జైలుశిక్ష, రూ.500 జరిమానా విధిస్తూ బద్వేలు ఏఎస్జే కోర్టు జడ్జి వైజే ప్రద్మశ్రీ మంగళవారం తీర్పు వెలువరించారు. సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్లో ఏఎస్ఐగా విధులు నిర్వహించే తిమ్మిరి సుదర్శన్ రోడ్సేఫ్టీ డ్యూటీలో భాగంగా భాకరాపేట సమీపంలోని కడప–తిరుపతి జాతీయ రహదారి వద్ద వాహనాలు తనిఖీ చేస్తున్నారు. మండలంలోని మిట్టపల్లి గ్రామానికి చెందిన కుమ్మితి సతీష్ అనే వ్యక్తి పీ 04 బీటీ 3032 అనే నంబర్ గల మోటార్ సైకిల్పై వస్తుండటం గమనించి 50 మీటర్ల దూరంలో వాహనాల తనిఖీ నిమిత్తం మోటారు సైకిల్ ఆపమని ఏఎస్ఐ కోరారు. కానీ అతను ద్విచక్రవాహనాన్ని ఆపకుండా తప్పించుకొని పోవాలనే ఉద్దేశంతో మోటార్సైకిల్ను అతివేగంగా, అజాగ్రత్తగా నడిపి ఏఎస్ఐను ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో ఏఎస్ఐ తిమ్మిరి సుదర్శన్ ఎడమ కాలు విరిగింది. ఈ మేరకు అప్పట్లో సిద్దవటం పోలీస్ స్టేషన్లో క్రైం నెంబర్ 137/2018, అండర్ సెక్షన్ 308, 332 ఐపీసీ కింద కేసు నమోదు చేసి విచారణ చేశారు. సదరు కేసును బద్వేలు ఏఎస్జే కోర్టు జడ్జి వైజే పద్మశ్రీ విచారణ జరిపారు. నిందితుడిపై నేర నిరూపణ కావడంతో ఈమేరకు శిక్ష విధించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ డీవీ శిరామకృష్ణ వాదనలు వినిపించి నేరస్తునికి శిక్ష పడేవిధంగా కృషి చేశారు. సాక్ష్యాధారాలతో నేరం రుజువు చేిసి శిక్ష పడేలా కృషి చేసిన పోలీస్ అధికారులు, సిబ్బంది, కోర్టు కానిస్టేబుళ్లు కిషోర్బాబు, మల్లికార్జునలను వైఎస్ఆర్ కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి
మదనపల్లె రూరల్ : ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన గోపాల్రెడ్డి కుమారుడు రవీంద్రరెడ్డి(40) బి.కొత్తకోట మండలం గొల్లపల్లెకు చెందిన భార్గవిని వివాహం చేసుకున్నాడు. కొంతకాలం తర్వాత అదే మండలంలోని ఎగువ భూంపల్లెకు చెందిన రూపను రెండో వివాహం చేసుకున్నాడు. ఆ తర్వాత అదే మండలానికి చెందిన వివాహిత రమణమ్మతో సహజీవనం చేశాడు. ఆమెతో కలిసి మదనపల్లెలో నివాసం ఉంటున్నాడు. ఈ క్రమంలో కుటుంబ బాధ్యతలు పట్టించుకోకుండా జులాయిగా తిరుగుతూ వ్యసనాలకు బానిస అయ్యాడు. ఈ క్రమంలో రమణమ్మ నగలు తీసుకెళ్లి ఖర్చు చేయడంతో ఆమె పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో మనస్తాపానికి గురైన రవీంద్రరెడ్డి సోమవారం ఈశ్వరమ్మకాలనీ రైస్మిల్లు వద్ద మద్యంలో పురుగుమందు కలుపుకుని తాగి ఆత్మహత్యకు యత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు సీఐ కళావెంకటరమణ తెలిపారు. మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించామన్నారు. మృతుడి తండ్రి గోపాల్రెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
పోలీసుల కుటుంబాలకు ఆరోగ్య భరోసా
రాయచోటి : అన్నమయ్య జిల్లా పోలీసులు, వారి కుటుంబ సభ్యుల ఆరోగ్య సంరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో నూతనంగా ఏర్పాటు చేసిన పోలీస్ యూనిట్ వెల్ఫేర్ ఆసుపత్రిని ఎస్పీ లాంఛనంగా ప్రారంభించారు. పోలీసు సంక్షేమమే జిల్లా పోలీసు శాఖకు ప్రథమ బాధ్యత అని స్పష్టం చేశారు. పోలీసులు వారి కుటుంబాలకు నాణ్యమైన, ఉచిత వైద్య సేవలు అందించడమే లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. అన్ని రకాల ప్రాథమిక వైద్య సదుపాయాలు, అవసరమైన మందులు ఉచితంగా అందుబాటులో ఉంటాయన్నారు. తరచుగా ఒత్తిడికి గురయ్యే సిబ్బందికి భవిష్యత్తులో మానసిక ఆరోగ్య కౌన్సిలింగ్ సేవలు కూడా అందించేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నట్లు తెలిపారు. ఆసుపత్రి ఏర్పాటుకు సహకరించిన డీఎంహెచ్ఓ, రాయచోటి ఏరియా హాస్పిటల్ సూపరింటెండెంట్ లక్ష్మీ ప్రసాద్కు ఎస్పీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. ప్రారంభంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, రాయచోటి ఏరియా ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ డి.లక్ష్మీ ప్రసాద్, డాక్టర్లు రామరాజు, రాధిక, అబ్దుల్ లతీఫ్, ఏఏఓ జె.త్రినాథసత్యం, పలువురు సీఐలు, ఆర్ఐలు, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు పాల్గొన్నారు. -
వాయిదా పడిన పరీక్షల తేదీ వెల్లడి
కడప అగ్రికల్చర్ : దిత్వా తుఫాను కారణంగా వాయిదా పడిన యోగివేమన విశ్వవిద్యాలయ డిగ్రీ, పీజీ పరీక్షల నూతన తేదీలను విశ్వవిద్యాలయ కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ప్రొఫెసర్ కేఎస్వీ కృష్ణారావు సోమవారం ప్రకటించారు. డిసెంబర్ 1వ తేదీన డిగ్రీ వారికి జరగాల్సిన పరీక్షను ఈ నెల 6వ తేదీ ఉదయం నిర్వహించనున్నామని పేర్కొన్నారు. పోస్ట్ గ్రాడ్యుయేషన్, ఇంటిగ్రేటెడ్ పీజీ విద్యార్థులకు ఈనెల 9వ తేదీ ఉదయం పరీక్ష ఉంటుందని తెలిపారు. విద్యార్థులు వారి వారి తేదీల్లో పరీక్షలకు హాజరుకావాలని సీఈ సూచించారు. వైభవంగా పల్లకీ సేవ రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామికి పల్లకీ సేవ వైభవంగా నిర్వహించారు. సోమవారం రాత్రి మూల విరాట్లకు అభిషేకాలు, పూజలు జరిపారు.రంగురంగుల పూలు, పట్టువస్త్రాలు, బంగారు ఆభరణాలతో అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ ప్రాంగణంలో, మాఢవీధుల్లో ఊరేగించారు. పల్లకీ సేవలో స్థానికులతో పాటు కన్నడ భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు అందజేశారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, అర్చకులు కృష్ణయ్య స్వామి, శంకరయ్య స్వామి, శేఖర్ స్వామి, రాచరాయయోగీ స్వామి పాల్గొన్నారు. ఎయిడ్స్పై అప్రమత్తత అవసరం రాయచోటి టౌన్ : ఎయిడ్స్ వ్యాధిపట్ల ప్రతి ఒక్కరూ అవగాహనతో సమాజాన్ని చైతన్యవంతం చేయాలని జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. సోమవారం రాయచోటి పట్టణంలో ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవాన్ని పురస్కరించుకొని వైద్యులు, వెద్యాధికారులతో కలసి ర్యాలీ నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎయిడ్స్ గురించి ప్రజలందరూ అవగాహన కలిగి, అప్రమత్తంగా ఉండాలన్నారు. అనుమానితులు తగిన పరీక్షలు చేయించుకుని ఏఆర్టీ మందులు వాడాలని సూచించారు అంతకు ముందు ఎయిడ్స్ డే సందర్భంగా డైట్ కళాశాలలో విద్యార్థులకు ముగ్గుల పోటీలు నిర్వహించారు. గెలుపొందిన వారికి బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో జిల్లా అదనపు వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి ఎల్, రాధిక, ప్రభుత్వ ఏరియా ఆస్పత్రి సూపరింటెండెంట్ లక్ష్మీప్రసాద్, సీఎస్ ప్రసాద్, డీఎండీవో రామచంద్రారెడ్డి, ప్రాజెక్టు డైరెక్టర్ చెన్నారెడ్డి, డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి ితదితరులు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ : ఓపెన్ టెన్త్, ఇంటర్ అడ్మిషన్లకు తత్కాల్ కింద దరఖాస్తుల గడువును పెంచారు. ఈ విషయాన్ని ఓపెన్ స్కూల్ ఇన్చార్జి పఠాన్ మహమ్మద్ ఖాన్ తెలిపారు. అభ్యర్థులు పూర్తి వివరాలకు 8121852786 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. బద్వేలు అర్బన్ : ఈ నెల 6, 7వ తేదీల్లో కడప నగరంలో జరగనున్న సీపీఐఎంఎల్ లిబరేషన్ 9వ రాష్ట్ర మహాసభలు జయప్రదం చేయాలని ఆ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి బందెల ఓబయ్య పేర్కొన్నారు. సోమవారం స్థానిక భగత్సింగ్నగర్లోని ఆ పార్టీ కార్యాలయంలో నిర్వహించిన నియోజకవర్గస్థాయి ముఖ్య కార్యకర్తల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత జిల్లా అభివృద్ధితోపాటు సీమ అభివృద్ధిని పూర్తిగా విస్మరించారని అన్నారు. అసలే వెనుకబడిన రాయలసీమ ప్రాంతంలో గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన నాలుగు మెడికల్ కళాశాలలను ప్రైవేటుపరం చేయడానికి చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవడం దారుణమన్నారు. 17 నెలల పాలనలో ప్రతిపక్ష పార్టీలపైన కక్షసాధింపు చర్యలు తీసుకోవడానికే సమయం కేటాయించారని అన్నారు. కడప నగరంలో జరుగుతున్న రాష్ట్ర మహాసభలను కడప, రాయలసీమ అభివృద్ధికి నిధులు కేటాయించాలనే ప్రధాన డిమాండ్తో అజెండా రూపొందించి భవిష్యత్ పోరాటాలకు శ్రీకారం చుడతామని తెలిపారు. -
నవీన విద్యకు దారి ‘నవోదయ’
డిసెంబర్ 13న ప్రవేశపరీక్షమదనపల్లె సిటీ : విలువలతో కూడిన విద్య, నైపుణ్యాల పెంపు, దేశభక్తి, సాంస్కృతిక కార్యక్రమాలకు పెట్టింది పేరు జవహర్ నవోదయ విద్యాలయం. ఇటీవల ఆరో తరగతి ప్రవేశాలకు మదనపల్లె సమీపంలోని వలసపల్లె జవహర్ నవోదయ విద్యాలయ, రాజంపేటలోని జవహర్ నవోదయ విద్యాలయాలకు(జెఎన్వీ) నోటిఫికేషన్ విడుదలైంది. మదనపల్లెలోని నవోదయ విద్యాలయానికి 4,300 .మంది దరఖాస్తు చేసుకున్నారు. జెఎన్వీ ఆధ్వర్యంలో ఆరో తరగతిలో ప్రవేశానికి ఉమ్మడి చిత్తూరుకు చెందిన 23 కేంద్రాల్లో డిసెంబర్ 13న ప్రవేశ పరీక్ష నిర్వహించనున్నారు. ఇందులో సీటు సాధించేందుకు కావాల్సిన మెలకువలను ఉపాధ్యాయులు తెలియజేస్తున్నారు. https://cbseitms.rcil.gov.in/nvs ద్వారా హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ప్రవేశాలు : జెన్వీలో ఆరో తరగతి పరీక్ష తేదీ : 13.12.2025 పరీక్షా కేంద్రాలు : 23 (ఉమ్మడి చిత్తూరు జిల్లా) రాసే విద్యార్థులు : 4,300 మంది సీట్ల సంఖ్య : 80 -
చెన్నకేశవా.. దర్శనమివ్వవా !
● తెరుచుకోని ఆలయ తలుపులు ● టెంపుల్ ఇన్స్పెక్టర్కు టీటీడీ మెమోరాజంపేట : తాళ్లపాక గ్రామంలో పదకవితాపితామహుడు అన్నమాచార్యులు ఆరాధించి, పూజించిన శ్రీ చెన్నకేశవస్వామి ఆలయ తలుపులు సోమవారం తెరుచుకోలేదు. స్వామి దర్శనానికి వచ్చిన భక్తులు గంటల తరబడి వేచి ఉండి చేసేదేమిలేక వెనుదిరిగారు.ఆలయ తలుపులు తెరవని సంఘటనపై గ్రామస్తులు తిరుమల తిరుపతి దేవస్థానం(టీటీడీ) ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశారు.దీంతో వారు స్పందించారు. టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీకి మెమో ఇచ్చారు. టీటీడీ విజిలెన్స్ ఏఎస్ఐని, టెంపుల్ ఇన్స్పెక్టర్ను హుటాహుటిన తాళ్లపాకలోని చెన్నకేశవస్వామి ఆలయానికి పంపించారు. మధ్యాహ్నం 12.30గంటలకు తాళాలు పగులగొట్టించి తలుపులు తెరిపించారు. అప్పటి వరకు స్వామివారికి పూజలు ఆగిపోయాయి. టెంపుల్ ఇన్స్పెక్టర్ బాలాజీ, సూపరిండెంట్ హనుమంతయ్య సక్రమంగా విధులకు హాజరుకావడంలేదని టీటీడీ డిప్యూటీ ఈవోకు గ్రామస్తులు ఫిర్యాదుచేశారు. ● ప్రతిరోజు ఉదయం, మధ్యాహ్నం , సాయంత్రం సమయంలో ఆలయానికి సీలు వేయాలంటే టెంపుల్ ఇన్స్పెక్టర్ తప్పనిసరిగా ఉండాలనే నిబంధన ఉంది. అవి ఇక్కడ అమలుకాలేదని గ్రామస్తులు ఆరోపించారు. అక్కడ పనిచేస్తున్న నాయీబ్రహ్మణులతో ఆలయానికి సీలు వేయించడం, మళ్లీ ఓపెన్ చేయడం జరుగుతోందని వాపోయారు. ● స్థానిక టెంపుల్ ఇన్స్పెక్టర్ అందుబాటులో లేరని తాళ్లపాక వాసులు ఆరోపిస్తున్నారు. ఒంటిమిట్టలో ఉంటున్నారని తెలుస్తోంది. గతంలో రెండుమార్లు ఆలయ తలుపలు తెరుచుకోలేదంటున్నారు. ఐదురోజుల కిందట టీటీడీ వారు అందజేసిన ఆవు కూడా కనిపించకుండా పోయిందన్నారు. భక్తులు తాగేందుకు మంచినీరు అందుబాటులో లేదని చెబుతున్నారు. -
‘దిత్వా’పై అప్రమత్తంగా ఉండాలి
కలకడ : దిత్వా తుపాను నేపథ్యంలో అప్రమత్తంగా ఉండాలని జిల్లాకలెక్టర్ నిశాంత్కుమార్ అన్నిశాఖల అధికారులను ఆదేశించారు.సోమవారం ఇక్కడ ఆయన మాట్లాడుతూ తుపాను ప్రభావం కారణంగా ఎదురయ్యే ఎలాంటి పరిణామాలనైనా సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు జిల్లాయంత్రాంగం సిద్ధంగా ఉండాలన్నారు.అనంతరం మండలంలోని చెరువులు, కుంటల్లోకి నీరుచేరిన శాతం గురించి ఆరా తీశారు. అర్హత కలిగిన లబ్ధిదారులకు పింఛన్ అందించే బాధ్యత సచివాలయ సిబ్బందిపై ఉందని అన్నారు. కలకడ మండలం, కె.బాటవారిపల్లె పంచాయతీలో పంపిణీ చేస్తున్న ఎన్టీఆర్ సామాజిక పింఛన్ పంపిణీని ఆకస్మికంగా తనిఖీ చేశారు.వికలాంగులు, వృద్ధులకు నెలవారీ పింఛన్ ఇంటివద్ద అందజేస్తున్నారా.! లేదా అని అడిగితెలుసుకున్నారు. కార్యక్రమంలో డీఎల్డీఓ లక్ష్మిపతి, ఎంపీడీఓ భానుప్రసాద్, పంచాయతీ కార్యదర్శి నందిని పాల్గొన్నారు. పరిశ్రమల అనుమతులను త్వరగా జారీ చేయాలి రాయచోటి : సింగిల్ డెస్క్ విధానం కింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహిక పారిశ్రామిక వేత్తల నుంచి అందిన దరఖాస్తులకు త్వరితగతిన అనుమతులు జారీ చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో జిల్లా పరిశ్రమల, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. చిన్న, మధ్య తరహా పరిశ్రమల ప్రోత్సాహానికి వివిధరాయితీల మంజూరు అంశాలపై సమీక్షించి దిశా నిర్దేశం చేశారు. గడిచిన 45 రోజుల కాలంలో వివిధ పరిశ్రమల స్థాపనకు అనుమతులు, రెన్యూవల్ను కోరుతూ మొత్తం 987 దరఖాస్తులు అందగా సింగిల్ డెస్క్ విధానంలో వాటిలో 961 పరిశ్రమలకు అనుమతులు మంజూరు అయ్యాయన్నారు. చిన్న తరహా, కుటీర పరిశ్రమలు ఏర్పాటు చేసుకునేందుకు అవగాహన వర్క్షాప్లను గుర్రంకొండ, వాయల్పాడు, మదనపల్లె ప్రాంతాలలో నిర్వహించినట్లు, మహిళలకు టైలరింగ్ తదితర విషయాల్లో అవగాహన కల్పించినట్లు జిల్లా పరిశ్రమల కేంద్రం జనరల్ మేనేజర్ కె కృష్ణ కిశోర్, జిల్లా కలెక్టర్ తెలిపారు. సమావేశంలో జిల్లా పరిశ్రమల కేంద్ర జనరల్ మేనేజర్ కె కృష్ణ కిశోర్, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, రాయచోటి మున్సిపల్ కమిషనర్ రవి తదితరులు పాల్గొన్నారు. అభివృధ్ధి పనులను త్వరితగతిన నాణ్యతతో పూర్తి చేయాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టరేట్లో మదనపల్లె, రాజంపేట సబ్ కలెక్టర్లు, రాయచోటి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీఓలు, ఎంఈఓలతో జేసీ ఆదర్శ రాజేంద్రన్తో కలిసి జిల్లా కలెక్టర్ వీడియో కాన్ఫనెన్స్ నిర్వహించారు. కలెక్టర్ నిశాంత్కుమార్ -
కడప కేంద్ర కారాగారంలో ‘అద్దె’గోలు వ్యవహారం !
● నివాససయోగ్యం కాని క్వార్టర్స్ను వినియోగించుకుంటున్న జైలు అధికారులు, సిబ్బంది ● నిబంధనలకు విరుద్ధంగా ఇంటి అద్దె అలవెన్సు పొందుతున్న వైనంసాక్షి, టాస్క్ఫోర్స్ : కడప కేంద్ర కారాగారం ఆవరణంలో అధికారులు, సిబ్బంది కోసం దాదాపు 15 ఏళ్ల క్రితం ప్రభుత్వం ‘క్వార్టర్స్’ను నిర్మించి ఇచ్చింది. వార్డర్స్, హెడ్వార్డర్స్ నివాసం ఉండేందుకు 30 క్వార్టర్స్, జైలర్లు, డిప్యూటీ జైలర్లు ఉండేందుకు 12 క్వార్టర్స్ను అందుబాటులోకి తీసుకు వచ్చారు. వీటిల్లో ఎక్కువ భాగం క్వార్టర్స్ బాగా దెబ్బతిన్నాయి. నిబంధనల మేరకు క్వార్టర్స్లో వుంటున్న వారికి వారి వేతనాలలో హెచ్ఆర్ఏ కింద ఇచ్చే డబ్బులను ఇవ్వరు. క్వార్టర్స్లో కాకుండా బయట అద్దెకున్న వారికి సాధారణంగా హెచ్ఆర్ఏ కింద ఇచ్చే 20 శాతం డబ్బులను వారికి వేతనాలతో పాటు ఇస్తారు. అయితే పూర్తిగా దెబ్బతిన్న క్వార్టర్స్గా తీర్మానించిన తరువాత కూడా కొందరు అధికారులకు, సిబ్బందికి అందులో నివాసం ఉండేలా అవకాశం కల్పిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా క్వార్టర్స్లో వుంటూనే హెచ్ఆర్ఏను పొందుతున్నవారి వివరాల్లోకి వెళితే.. కడప కేంద్ర కారాగారంలో విధులను నిర్వహిస్తున్న ముగ్గురు జైలర్లు, ప్రత్యేక మహిళాజైలు అధికారిణితో పాటు, ఓ జైలరు, ఇద్దరు కారాగార డిప్యూటీ జైలర్లు, మహిళా జైలు డిప్యూటీ జైలరుతో పాటు, 10 మంది హెడ్వార్డర్లు, వార్డర్లు వున్నారు. వీరు వారి వేతనంతో పాటు ఒక్కొక్కరు 15వేలు, 18 వేలు, 20 వేలు చొప్పున హెచ్ఆర్ఏను కూడా పొందుతున్నారు. ఏడాదిన్నర క్రిందటే క్వార్టర్స్ దెబ్బతిన్నాయని తీర్మానించిన వాటిల్లోనే ఎవరి అండదండలతో నివాసం ఉంటున్నారని కొందరు సిబ్బంది బహిరంగంగానే చర్చించుకుంటున్నారు. కడప కేంద్ర కారాగారం పర్యవేక్షణాధికారి, డీఐజీ, ఐజీకి ఈ వ్యవహారమంతా తెలిసే జరుగుతోందా? లేక తెలిసినా తమకు ఇష్టమైన వారే కావడంతో చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారా? అనే సందేహాలు తలెత్తుతున్నాయి. ఇటీవల కడప కేంద్ర కారాగారానికి తనిఖీకి వచ్చిన ఉన్నతాధికారులైన డీఐజీ, ఐజీ దృష్టికి వార్డర్లు ఈ వ్యవహారాన్ని తీసుకుని వెళ్లే ప్రయత్నం చేసినా తమను పట్టించుకోలేదని వారు పేర్కొంటున్నారు. ఓ అధికారికి ప్రధాన అనుచరుడిగా వ్యవహరిస్తున్న డిప్యూటీ జైలరు ఒక్కో వార్డరు నుంచి అక్రమంగా డబ్బులను వసూలు చేసి తమకు అనుకూలంగా వున్నవారికే దెబ్బతిన్న క్వార్టర్స్ను ఇప్పించినట్లు బలమైన ఆరోపణలు వున్నాయి. ఏదిఏమైనా ఈ విధానం వలన ప్రతినెలా రూ.3 లక్షల మేరకు ప్రభుత్వానికి నష్టం వాటిల్లుతోందని స్పష్టంగా తెలుస్తోంది. ఈ లెక్కన ఏడాదికి రూ. 36 లక్షల మేరకు నష్టం వస్తోంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ బాగోతానికి అడ్డుకట్ట వేస్తారో.. లేదో వేచి చూడాల్సిందే. -
అంతర్ జిల్లా హుండీ దొంగలు అరెస్టు
గుర్రంకొండ : చిత్తూరు, అన్నమయ్య జిల్లాలోని పలు పోలీస్ స్టేషన్ల పరిధిలోని దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడిన ముగ్గురు దొంగలను పోలీసులు అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి రూ. 78 వేలు విలువచేసే వస్తువులు, నగదు స్వాధీనం చేసుకున్నారు. పోలీసుల కథనం మేరకు మదనపల్లె మండలం కొత్తవారిపల్లె పంచాయతీ బూసేపల్లె గ్రామానికి చెందిన ఎదుర్ల బాలాజి(45), నిమ్మనపల్లె కస్పా కోళ్లఫారం కాలనీకి చెందిన ఎస్.బాలు(20), చిత్తూ రు జిల్లా పెద్దపంజాని మండలం రాయలపేట గ్రామానికి చెందిన కొరువు రమేష్(29) అనే వ్యక్తు లు గత కొంతకాలంగా రెండు జిల్లాల్లోని దేవాలయాల్లో హుండీల దొంగతనాలకు పాల్పడ్డారు. ఇటివల జిల్లాలోని వాయల్పాడు, రామాపురం, లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్ల పరిధిలో పలు దేవాలయాల్లో హుండీ దొంగతనాలకు పాల్పడ్డారు. అప్పట్లో వీరిపై ఆయా పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు మూడు కేసులు నమోదు చేశారు. ఈనేపథ్యంలో సోమవారం మండలంలోని అమిలేపల్లె క్రాస్ వద్ద అనుమానాస్పదంగా వీరు తిరుగుతుండగా వాల్మీకీపురం సీఐ రాఘవరెడ్డి, గుర్రంకొండ ఎస్ఐ బాలకృష్ణల ఆధ్వర్యంలోని పోలీసుల బృందం వారి అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి 250 గ్రాముల వెండి , 25 కేజీల కాపర్వైర్లు, రూ. 10వేలు మొత్తం రూ. 78 వేలు విలువ చేసే వస్తువులు, నగదు రికవరీ చేసినట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. -
బెల్టుషాపుపై పోలీసుల దాడి
గుర్రంకొండ : బెల్టుషాపులపై పోలీసులు దాడులు నిర్వహించి ఓ మద్యం విక్రేత నుంచి 32 మద్యం బాటిళ్లు స్వాధీనం చేసుకొన్న సంఘటన మండలంలోని టి.పసలవాండ్లపల్లె పంచాయతీ టి.గొల్లపల్లె క్రాస్లో జరిగింది. ఆదివారం రాత్రి స్థానిక ఓ డాబాలో మద్యం విక్రయిస్తున్నారనే సమాచారం అందుకొన్న పోలీసులు దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో ఓ దుకాణంలో అక్రమంగా నిల్వ ఉంచి విక్రయిస్తున్న 32 క్వార్టర్ బాటిళ్లను స్వాధీనం చేసుకొన్నట్లు ఎస్ఐ బాలకృష్ణ తెలిపారు. ఈ సంఘటనపై కేసు నమోదు చేసినట్లు ఆయన పేర్కొన్నారు. ఈ దాడిలో ఏఎస్ఐలు గజేంద్ర, బొజ్జానాయక్, సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో మహిళకు తీవ్ర గాయాలురైల్వేకోడూరు అర్బన్ : రోడ్డు దాటుతున్న మహిళను గుర్తు తెలియని కారు ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. మండలంలోని రాఘవరాజపురం వద్ద ప్రధాన రహదారిపై బంధువులు ఉన్నారని సోమవారం బాల్రెడ్డిపల్లికి చెందిన శిరిగిరి భాస్కర్ రెడ్డి భార్య గంగమ్మ రోడ్డు దాటే ప్రయత్నం చేసింది. ఇంతలో వేగంగా వచ్చిన గుర్తు తెలియని కారు ఆమెను ఢీకొనడంతో తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే బంధువులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉంది. ఈ మేరకు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కారు దగ్ధంకడప అర్బన్ : కడప నగరంలోని శంకరాపురంలో ఓ కారు విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో సోమవారం దగ్ధమైంది. సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక శాఖ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. దాదాపు రూ. 2..50 లక్షల రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని బాధితుడు ఫిర్యాదు చేసినట్లు కడప అగ్నిమాపక శాఖ జిల్లా సహాయ అధికారి యోగీశ్వర్ రెడ్డి తెలిపారు. పీజీ వైద్య విద్యార్థినికి గోల్డ్ మెడల్కడప అర్బన్ : డాక్టర్ ఎన్టీఆర్ యూనివర్సిటీ ఆఫ్ హెల్త్ సైన్సెస్ పీజీ పరీక్షల్లో కడప ప్రభుత్వ వైద్యకళాశాల (రిమ్స్) అనస్థీషియా విభాగానికి చెందిన పోస్ట్ గ్రాడ్యుయేట్ వైద్య విద్యార్థిని డాక్టర్ ఎం. సంధ్యారాణి అత్యధిక మార్కులు(637/800) సాధించారు. దీంతో ఆమె యూనివర్సిటీ గోల్డ్ మెడల్కు ఎంపికై నట్లు కడప మెడికల్ కాలేజీ ప్రిన్సిపల్ డాక్టర్ జమున తెలిపారు. డాక్టర్ ఎం.సంధ్యారాణిని ప్రిన్సిపాల్తో పాటు వైస్ ప్రిన్సిపాల్, మైక్రోబయాలజీ హెచ్ఓడీ డాక్టర్ నాగశ్రీలత, అనస్తీషియా డాక్టర్ సునీల్ చిరువెళ్ల, వైద్యులు, వైద్య విద్యార్థులు అభినందించారు. -
స్టాంపుల కొరత.. వినియోగదారుల వెత
పుల్లంపేట : మండలంలో రిజిస్ట్రేషన్ స్టాంపుల కొరతతో వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. దాదాపు నెల రోజులుగా స్టాంపులు లేకపోవడంతో రిజిస్ట్రేషన్లు ఆగిపోతున్నాయి. దీంతో ప్రభుత్వ ఆదాయానికి గండి పడుతోంది. రైల్వేకోడూరు, ఓబులవారిపల్లె, పుల్లంపేట మండలాల నుంచి ప్రతిరోజూ దాదాపు 20 నుంచి 30 రిజిస్ట్రేషన్లు జరిగేవి. మార్కెట్ వాల్యూలు సంబంధిత అధికారుల నుంచి తీసుకొని చలాన్లు చెల్లించి రిజిస్ట్రేషన్కు వెళితే తీరా స్టాంపులు లేకపోవడంతో వినియోగదారులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. రాజంపేట తదితర ప్రాంతాల్లో అధిక ధరలు చెల్లించి స్టాంపులు కొనుగోలు చేయలేక కేవలం అగ్రిమెంట్లకే పరిమితమవుతున్నారు. ఇదిలా ఉండగా కామన్ సర్వీస్ సెంటర్లలో గతంలో ఈ–స్టాంపులు విరివిగా లభించేవి. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కామన్ సర్వీస్ సెంటర్లకు ఈ–స్టాంపులు పంపిణీ చేసిన దాఖలాలు లేవని సర్వీస్ సెంటర్ నిర్వాహకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరీ ముఖ్యంగా విద్యార్థులు వివిధ సర్టిఫికెట్ల కోసం ఇబ్బందులు పడుతున్నారు. స్టాంపుల కొరతతో స్టాంపు రైటర్లకు పనిలేక ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సంబంధిత అధికారులు చర్యలు తీసుకొని స్టాంపులు సరఫరా చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
కడప విమానాశ్రయానికి ఉడాన్ స్కీం నిధులు
● రూ.606 కోట్ల వ్యయంతో నిర్మాణ పనులు ● రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డిరాజంపేట : కడప విమానాశ్రయంలో 2024–2025 ఉడాన్ స్కీం కింద దాదాపు రూ.606 కోట్ల వ్యయంతో అభివృద్ధి పనులు కొనసాగిస్తున్నట్లు పౌర విమానయాన శాఖ మంత్రి మురళీధర్ మోహల్ తను అడిగిన ప్రశ్నకు సమాధానం ఇచ్చారని రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. పార్లమెంటు శీతాకాల సమావేశం సందర్భంగా రాజ్యసభలో కడప విమానాశ్రయం అభివృద్ధిపై ప్రశ్నోత్తరాల సమయంలో చర్చకు తీసుకొచ్చారు. కడప విమానశ్రయానికి కనెక్టివిటీ పెంచాలని కోరామన్నారు. ర ముఖ్యంగా రాయలసీమ ప్రాంతం నుంచి గల్ఫ్ దేశాలకు జీవనోపాధి కోసం లక్షలాది మంది వెళుతున్నారని, వారి సౌకర్యం కోసం గల్ఫ్ విమానాల రాకపోకలను తీసుకురావాలన్నా రు. కడప నుంచి చైన్నె, విజయవాడ, హైదరాబాదుకు ఇండిగో ఎయిర్లైన్స్ ద్వారా కనెక్టివిటీ కొనసాగుతోందని తెలిపారన్నారు. కొత్తగా డొమెస్టిక్ టెర్మినల్ నిర్మాణం కొనసాగుతోందన్నారు. హైదరాబాదు, చైన్నె కనెక్టివిటీతో యుఏఈ, కువైట్ దేశాలకు రాకపోకలు కొనసాగించవచ్చని తెలిపారన్నారు. -
అండర్–14 జోనల్ మ్యాచ్లో సత్తా చాటిన బౌలర్లు
4 వికెట్లు తీసిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ బౌలర్ జత్విక్ 51 పరుగులు చేసిన సౌత్జోన్ విన్నర్స్ బ్యాట్స్మన్ రక్షణ్ సాయి 89 పరుగులు చేసిన సౌత్జోన్ విన్నర్స్ బ్యాట్స్మన్ ఎస్ఎండీ ఇజార్ 137 పరుగులు చేసిన నార్త్జోన్ విన్నర్స్ బ్యాట్స్మన్ సీహెచ్ అక్షిత్రెడ్డి 4 వికెట్లు తీసిన సెంట్రల్ జోన్ విన్నర్స్ బౌలర్ రామ్ కిరణ్ విన్నీ 5 వికెట్లు తీసిన రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ బౌలర్ దీక్షిత్ 88 పరుగులు చేసిన రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ బ్యాట్స్మన్ సాయి కృష్ణచైతన్యకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 మూడవ విడత జోనల్ మ్యాచ్లు సోమవారం ప్రారంభమయ్యాయి. తొలి రోజు వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్– సౌత్జోన్ విన్నర్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన సౌత్జోన్ విన్నర్స్ జట్టు 72 ఓవర్లకు 8 వికెట్లు కోల్పోయి 190 పరుగులు చేసింది. ఆ జట్టులోని మహ్మద్ ఇజార్ 89 పరుగులు, రక్షణ్ సాయి 51 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టులోని యూనైస్ 3 వికెట్లు, నాగ వెంకట జత్విక్ 4 వికెట్లు తీశారు. దీంతో సక్రమంగా వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ ఆపి వేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదేలాగే కేఎస్ఆర్ క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో నార్త్జోన్ విన్నర్స్–సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నార్త్జోన్ విన్నర్స్ జట్టు 90 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 272 పరుగులు చేసింది. ఆ జట్టులోని యాసిల్ విఘ్నేష్ 49 పరుగులు, పిహెచ్ అక్షిత్ రెడ్డి చక్కటి లైనప్తో బ్యాటింగ్ చేసి 237 బంతుల్లో 18 ఫోర్లతో 137 పరుగులు చేశాడు. సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టులోని రామ్ కిరణ్ విన్నీ 4 వికెట్లు, యాసిన్ సిద్దిఖ్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్– రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టు టాస్ గెలిచి ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ సౌత్జోన్ జట్టు 69.5 ఓవర్లకు 181 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాయికృష్ణ చైతన్య 88 పరుగులు, తాహీర్ 44 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టులోని నందన్ కృష్ణ సాయి 2 వికెట్లు, దీక్షిత్ అద్భుతంగా బౌలింగ్ చేసి 5 వికెట్లు, యోజిల్ 2 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 21 ఓవర్లకు 2 వికెట్లు కోల్పోయి 62 పరుగులు చేసింది. ఆ జట్టులోని ప్రజ్ఞాన్ పండిత్ 36 పరుగులు చేశారు. వెలుతురు లేకపోవడంతో మ్యాచ్ను నిలిపి వేశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
ఇద్దరి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. మండలంలోని సీటీఎం పంచాయతీ మిట్టపల్లెకు చెందిన రవీంద్రరెడ్డి(39)పై అతని భార్య తన నగలు మాయం చేశాడంటూ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడంతో మనస్తాపం చెందాడు. సోమవారం పట్టణంలోని ఈశ్వరమ్మకాలనీ సమీపంలోని రైస్మిల్లు వద్ద పురుగుమందు తాగాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా పట్టణంలోని బాలాజీ నగర్కు చెందిన సుభాష్(25) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఇంటివద్దే విష ద్రావణం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. అదుపు తప్పి లారీ బోల్తాపుల్లంపేట : స్థానిక బైపాస్ రోడ్డులో సోమవారం తెల్లవారుజామున అదుపుతప్పి లారీ బోల్తా పడింది. ఎర్రగుంట్ల నుండి చైన్నె వైపు సిమెంటు లోడుతో వెళుతున్న 16 టైర్ల లారీ బైపాస్లోని చెరువుకట్ట వద్దకు రాగానే వెనుక నుంచి అతి వేగంగా కారు వస్తుండడం, ఎదురుగా మరో లారీ రావడంతో కారును తప్పించబోయి లారీని పక్కకు తీయడంతో అదుపు తప్పి రోడ్డు పక్కనే బోల్తా పడింది. ఈ సంఘటనలో డ్రైవర్, క్లీనర్లకు ఎలాంటి ప్రమాదం జరగలేదు. -
అంతర్జాతీయ సైబర్ ముఠా గుట్టురట్టు
రాయచోటి : అన్నమయ్య జిల్లా మదనపల్లి కేంద్రంగా డిజిటల్ అరెస్ట్, ఫేక్ సీబీఐ, ఈడీ అధికారుల అవతారమెత్తి భారీ మోసాలకు పాల్పడుతున్న అంరత్జాతీయ సైబర్ నేరస్తుల ముఠాగుట్టును మదనపల్లె ఒన్టౌన్ పోలీసులు రట్టు చేశారు. సైబర్ నేర ముఠా కేసుకు సంబంధించి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సోమవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలోని సమావేశ మందిరంలో మీడియాకు వివరాలను వెల్లడించారు. మదనపల్లికి చెందిన 75 ఏళ్ల రిటైర్డ్ మేల్ నర్స్ రేపురి బెంజిమెన్ను లక్ష్యంగా చేసుకున్న ముఠా అతని పాన్కార్డ్ను వాడుకొని అకౌంట్స్ను ఓపెన్ చేశారు. ఢిల్లీలో మీ పేరు మీద సీబీఐ, ఈడీ కేసు నమోదైంది. మీ అకౌంటులో రూ.48 లక్షలు డబ్బులు పడ్డాయి అంటూ రిసిప్ట్ పంపారు. వెంటనే రూ.48 లక్షలు డబ్బులు రీఫండ్ చేయాలని చేయకపోతే మా వాళ్లు మీ పక్కనే ఉన్నారు. అరెస్ట్ చేసి ఢిల్లీకి తీసుకెళ్తారు.. అంటూ ఈ ఏడాది జులై 25వ తేదీన భయబ్రాంతులకు గురిచేసి డిజిటల్ అరెస్ట్ పేరుతో భయపెట్టి రూ.48 లక్షలు కాజేసినట్లు ఎస్పీ వివరించారు. ఈ కేసులో అన్ని కోణాల్లో విచారణ చేసిన పోలీసులు సోమవారం రాయచోటిలో నిర్వహించిన ప్రత్యేక ఆపరేషన్లో కీలక నిందితులుగా ఉన్న పఠాన్ ఇంతియాజ్ఖాన్, షేక్ అమీన్, షేక్ అర్షాద్లను పోలీసులు అరెస్టు చేశారన్నారు. స్వాధీనం చేసుకున్న వస్తువులు.. అరెస్టు చేసిన నిందితుల నుంచి రూ.32 లక్షలు నగదు, 25 ఏటీఎం కార్డులు, 3 మొబైల్ పోన్లు, 4 సిమ్కార్డులను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. అదనంగా ఖాతాల్లో ఉన్న రూ.7.65 లక్షలను ఫ్రీజ్ చేశామన్నారు. మోసం ఇలా.. నిందితులు కాంబోడియా–కువైట్ కేంద్రంగా ఈ అంతర్జాతీయ రాకెట్ను నడిపిస్తున్నట్లు విచారణలో బయటపడిందన్నారు. అమాయక ప్రజలకు వీడియో కాల్స్ చేసి ‘‘మీ పేరుపై డ్రగ్స్ కేసులు, ఫేక్ ఎఫ్ఐఆర్లు ఉన్నాయి’’ అని సీబీఐ, ఈడీ అధికారులమంటూ భయబ్రాంతులకు గురిచేస్తారన్నారు. ‘డిజిటల్ అరెస్ట్’ పేరుతో బాధితుల నుంచి భారీ మొత్తంలో డబ్బును వివిధ బ్యాంకు ఖాతాలకు బదిలీ చేయించుకుంటారు. డబ్బు పడిన వెంటనే ఏటీఎంల ద్వారా విత్డ్రా చేసి, సీడీఎం మెషీన్ల ద్వారా ఇతర ఖాతాలకు మళ్లిస్తూ, వాట్సాప్ సాక్ష్యాలను వెంటనే చెరిపివేస్తున్నట్లు ఎస్పీ వివరించారు. సాంకేతిక నిఘా ఆధారంగా మదనపల్లి డీఎస్పీ యస్.మహేంద్ర ఆధ్వర్యంలో 1వ పట్టణ సీఐ మహమ్మద్రఫీ, ఎస్ఐలు అన్సర్బాషా, శివకుమార్, పోలీ సు సిబ్బంది, సైబర్ సెల్ సిబ్బంది హవాలా ద్వారా డబ్బులు ఎలా బదిలీ చేస్తున్నారో గుర్తించి చాకచక్యంగా వ్యవహరించి ముగ్గురు నిందితులను పట్టుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన పోలీసు అధికారులను, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. అప్రమత్తంగా ఉండాలి.. ● సైబర్ నేరగాళ్లు ‘‘డిజిటల్ అరెస్ట్’’ అనే కొత్త తరహా మోసానికి పాల్పడుతున్నారని, ప్రజలు ఈ విషయంలో అత్యంత అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ హెచ్చరించారు. ముఖ్యంగా పదవీ విరమణ పొందిన ఉద్యోగులను, వృద్ధులను లక్ష్యంగా చేసుకుని నేరగాళ్లు డబ్బులు దోచుకుంటున్న విషయాన్ని గుర్తు చేశారు. ● సైబర్ నేరగాళ్లు తాము పోలీస్, సీబీఐ, ఈడీ, లేదా నార్కోటిక్స్ అధికారులమని ఫోన్ చేస్తారు. వీడియో కాల్లో యూనిఫాం ధరించి, వెనుక పోలీస్ స్టేషన్ సెటప్ లాంటివి సృష్టించి నమ్మేలా చేస్తారు. ● మీ ఆధార్కార్డు నకిలీ పాస్పోర్ట్ల కోసం వాడబడింది లేదా మీ బ్యాంక్ ఖాతాలో హవాలా డబ్బు ఉంది అని అబద్దాలు చెప్పి తీవ్ర భయబ్రాంతులకు గురిచేస్తారు. ● విచారణ పేరుతో మిమ్మల్ని వీడియో కాల్లోనే ఉంచి, ఇంటి నుండి బయటకు వెళ్లకూడదని, ఎవరితోనూ మాట్లాడకూడదని డిజిటల్ అరెస్ట్ చేశామని బెదిరిస్తారు. ● కేసు నుండి బయటపడాలంటే వెరిఫికేషన్ కోసం డబ్బు ట్రాన్స్ఫర్ చేయాలని ఒత్తిడి చేస్తారు. చట్టంలో ‘డిజిటల్ అరెస్ట్’ లేదు.. ● భారతీయ చట్టాల ప్రకారం ఏ దర్యాప్తు సంస్థ (పోలీస్, సీబీఐ, ఈడీ) వీడియో కాల్ ద్వారా అరెస్ట్ చేయరు. డిజిటల్ అరెస్ట్ అనేది పూర్తిగా బూటకం. ● ఏ ప్రభుత్వ విచారణ సంస్థ ఆన్లైన్లో డబ్బు ట్రాన్స్ఫర్ చేయమని, బ్యాంక్ వివరాలు ఇవ్వమని అడగదు. ● అపరిచితులు వీడియో కాల్స్ చేస్తే లిఫ్ట్ చేయకండి. మీ ఆధార్, ఓటీపీ, బ్యాంక్ పిన్ నంబర్లను ఎవరితోనూ పంచుకోవద్దు. ● మీరు దాచుకున్న పదవీ విరమణ సొమ్ముపైనే నేరగాళ్ల కన్ను పడింది. మీకు వచ్చే ఇలాంటి బెదిరింపు ఫోన్కాల్స్ పట్ల ఆందోళన చెందవద్దు. వారు మిమ్మల్ని ఎంత భయపెట్టినా వెంటనే ఫోన్ కట్ చేయండి. ● మీరు మోసపోయినట్లు అనుమానం వస్తే వెంటనే 1930 నంబర్కి కాల్ చేయండి లేదా వెబ్సైట్లో ఫిర్యాదు నమోదు చేయండి. దగ్గరలోని పోలీస్స్టేషన్ను సంప్రదించండి. అవగాహన పోస్టర్ల ఆవిష్కరణ.. సైబర్ నేరగాళ్లు కొత్త ఎత్తుగడలతో ప్రజలను మోసం చేస్తున్న ‘డిజిటల్ అరెస్ట్’ విధానంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అన్నమయ్య జిల్లా ఎస్పీ పిలుపునిచ్చారు. ఈ మేరకు ప్రజల్లో అవగాహన కల్పించేందుకు జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన ప్రత్యేక వాల్పోస్టర్లను సోమవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ఆవిష్కరించారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి, మదనపల్లి డీఎస్పీ ఎస్.మహేంద్ర, మదనపల్లి 1వ పట్టణ సీఐ మహమ్మద్రఫీ, సైబర్ సెల్ సీఐ మహమ్మద్ ఆలీ, ఎస్ఐలు, అన్సర్బాషా, శివకుమార్, పోలీసు సిబ్బంది, సైబర్ సెల్ సిబ్బంది పాల్గొన్నారు. డిజిటల్ అరెస్ట్ పేరుతో మోసాలకు పాల్పడుతున్న ముగ్గురు నిందితుల అరెస్టు సీబీఐ, ఈడీ అధికారులమంటూ వృద్ధుడి నుంచి రూ.48 లక్షలు కాజేసిన కేటుగాళ్లు నిందితుల నుంచి రూ.32 లక్షల నగదు, 25 ఏటీఎం కార్డులు స్వాధీనం మీడియాకు వివరాలు వెల్లడించిన జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
హోంగార్డు కుటుంబానికి చెక్కు అందజేత
రాయచోటి జగదాంబసెంటర్ : జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో విధులు నిర్వహిస్తున్న హోంగార్డు వై.పవన్కుమార్రెడ్డి అనారోగ్యంతో మృతి చెందడంతో తోటి సిబ్బంది ఒక రోజు డ్యూటీ అలవెన్స్ రూ.2.30 లక్షలు స్వచ్ఛందంగా విరాళంగా ఇచ్చారు. ఆ మొత్తాన్ని చెక్కు రూపంలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి బాధిత కుటుంబీకులకు సోమ వారం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ఎస్పీ మాట్లాడుతూ హోంగార్డు పవన్కుమార్రెడ్డి మర ణం తమకు వ్యక్తిగత నష్టం అన్నారు. ఇలాంటి సందర్భాల్లో సహచరులు కుటుంబానికి అండగా నిలవడం ఒక గొప్ప సంప్రదాయం అన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి, రిజర్వ్ ఇన్స్పెక్టర్ ఎం.పెద్దయ్య, ఆర్ఎస్ఐ శ్రీనివాసులు, ఏఆర్ఎస్ఐ బాలాజీ, మృతుడి కుటుంబ సభ్యులు, సహచర హోంగార్డులు పాల్గొన్నారు. -
బాలిక అదృశ్యం
ఒంటిమిట్ట : మండల పరిధిలోని మారయ్యగారిపల్లికి ఓ వివాహ వేడుకకు వచ్చిన బాలిక(16) గత నెల 28 నుంచి కనిపించడం లేదని సోమవారం ఒంటిమిట్ట పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసుల వివరాల మేరకు.. ఖాజీపేట మండలానికి చెందిన బాలిక ఒంటిమిట్టలో జరిగే ఓ వివాహానికి మారయ్యగారిపల్లెకు చెందిన తన మేనత్త ఇంటికి నెల రోజుల క్రితం వచ్చింది. గత నెల 28 వ తేది అర్థరాత్రి నుంచి ఆమె కనిపించకపోవడంతో అన్నిచోట్ల గాలించారు. ఆచూకీ లభ్యం కాకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశాడు. స్పందించిన పోలీసులు ఈమేరకు కేసు నమోదు చేశారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు వెంకటప్ప విద్యార్థి పులివెందుల టౌన్ : పులివెందుల పట్టణంలోని వెంకటప్ప మెమోరియల్ ఇంగ్లీషు మీడియం పాఠశాలలో 7వ తరగతి చదువుతున్న కుందనశ్రీ రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రిన్సిపల్ విజయభాస్కర్రెడ్డి తెలిపారు. గతనెల 22, 25 తేదీలలో తిరుపతి జిల్లా చంద్రగిరిలో జరిగిన జిల్లా స్థాయి హాకీపోటీలలో కుందనశ్రీ అద్భుత ప్రతిభ కనబరిచి రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికై ందన్నారు. మధ్యప్రదేశ్లోని గ్వాలియర్లో ఈనెల 22వ తేదీ నుంచి 27వ తేదీ వరకు జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటుందన్నారు. రాష్ట్రస్థాయి హాకీ పోటీలకు ఎంపికై న విద్యార్థిని పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థులు అభినందించారు. వైర్ల చోరీపై కేసు నమోదుఎర్రగుంట్ల : మండల పరిధిలోని ఇల్లూరు గ్రామంలో వ్యవసాయ పొలాల్లో ఉన్న విద్యుత్ కనెక్షన్లకు సంబంధించి వైర్లు చోరీ జరిగినట్లు గ్రామ రైతు మోపూరి పెద్దదస్తగిరిరెడ్డి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు కలమల్ల ఎస్ఐ సునీల్కుమార్రెడ్డి తెలిపారు. ఈ విద్యుత్ వైర్ల విలువ సుమారు రూ.15 వేలు ఉంటుందన్నారు. -
భూ స్వాధీనం అంటూ రెవెన్యూ అధికారుల హల్చల్.!
సంబేపల్లె : మండల పరిధిలోని దేవపట్ల గ్రామంలో ఇతరుల వద్ద నుంచి వైఎస్సార్సీపీ సానుభూతిపరులు కొనుగోలు చేసిన భూమి ప్రభుత్వ భూమి అని, దానిని స్వాధీనం చేసుకోవాలని జాయింట్ కలెక్టర్ ఆదేశాలు ఉన్నాయని రెవెన్యూ అధికారులు సోమవారం హల్చల్ చేశారు. మధ్యాహ్నం సంబంధిత భూమి వద్దకు సిబ్బందితో సహా చేరుకున్న సంబేపల్లె తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి భూమి చుట్టూ ఉన్న కంచెను జేసీబీ యంత్రాలతో తొలగించేందుకు సిద్ధమయ్యారు. అందుకోసం జేసీబీ యంత్రాలను రప్పించారు. సంఘటనా స్థలంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా రాయచోటి రూరల్ సీఐ వరప్రసాద్ ఆధ్వర్యంలో సంబేపల్లె, చిన్నమండెం, వీరబల్లి, సుండుపల్లె మండలాల ఎస్ఐలు బందోబస్తు నిర్వహించారు. తహసీల్దార్ సుబ్రమణ్యం రెడ్డి స్వాధీనం చేసుకోవాలని జేసీ ఆదేశించిన మేరకు ఆ భూమిలో స్వాధీన బోర్డులు ఏర్పాటు చేశారు. చివరకు సాయంత్రం 7 గంటల ప్రాంతంలో భూ యజమానులకు అనుకూలంగా హైకోర్టు స్టే రావడంతో అక్కడున్న రెవెన్యూ అధికారులు, పోలీసు సిబ్బంది వెనుదిరిగి వెళ్లారు. అయితే అధికారుల భూ స్వాధీనం వెనుక కూటమి నాయకుల ఒత్తిడి తీవ్రంగా ఉందనే విషయం మండలంలో చర్చనీయాంశంగా మారింది. -
చిట్వేలిలో 41 మిల్లిమీటర్ల వర్షం
రాయచోటి: బంగాళాఖాతంలో ఏర్పడిన దిత్వా తుపాను కారణంగా జిల్లాలో రెండు రోజులుగా తేలికపాటి జల్లులుతో కూడిన వర్షం కురుస్తోంది. ఆదివారం తెల్లవారు జామున నుంచి రాత్రి వరకు ఎడతెరిపి లేకుండా వర్షం పడుతోంది. జిల్లాలోని 30 మండలాల్లో వర్షం కురిసింది.కోడూరు నియోజకవర్గం చిట్వేలి మండలంలో 41 మిల్లీ మీటర్లు, కోడూరులో 34 పుల్లంపేటలో 31 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. వాతావరణ పరిస్థితుల దృష్ట్యా, జిల్లా వ్యాప్తంగా అధికారులను కలెక్టర్, ఎస్పీలు అప్రమత్తం చేశారు. సోమవారం భారీ వర్షాలు కురుస్తాయన్న సమాచారం మేరకు పాఠశాలలు, కళాశాలలకు సెలవు ప్రకటించారు. గత మూడు రోజులుగా జిల్లాలో చలి తీవ్రత పెరిగింది. చలిగాలులకు పిల్లలు వృద్ధులు గజగజ ణుకుతున్నారు. ఏకధాటిగా కురుస్తున్న వర్షపు జల్లుల కారణంగా ప్రజారవాణా స్తంభించి ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కడప కార్పొరేషన్: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం డిసెంబరు 1వతేదీన ఉదయం 10 గంటలకు నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సీఎం కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్ శివశంకర్ లోతేటి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సీఎండీ కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి, తమ విద్యుత్ సమస్యలను ’’సీఎండీ దృష్టికి తీసుకురావచ్చని తెలిపారు. ఈ అవకాశాన్ని విద్యుత్తు వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని ఆ ప్రకటనలో కోరారు. ’దిత్వా’ తుఫాను వేళ ఆప్రమత్తంగా ఉండండి ’దిత్వా’ తుఫాను కారణంగా ఏపీఎస్పీడీసీఎల్ పరిధిలోని 9 జిల్లాల్లో భారీ నుంచి అతిభారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్న నేపథ్యంలో విద్యుత్ అధికారులు, సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆ సంస్థ సీఎండీ శివశంకర్ లోతేటి సూచించారు. భారీ వర్షం కారణంగా విద్యుత్ సరఫరాలో అంతరాయం ఏర్పడితే, సరఫరా పునరుద్ధరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. వర్షం కురిసే సందర్భంలో విద్యుత్ వినియోగదారులు అప్రమత్తంగా ఉండాలని, విద్యుత్ లైన్లు తెగిపోవడం, స్తంభాలు కూలిపోవడం లాంటి సంఘటనలు జరిగినట్లయితే వెంటనే తమ సమీపంలోని విద్యుత్ శాఖ అధికారులకు గానీ సిబ్బందికి గానీ సమాచారం అందించాలని సూచించారు. విద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబరు: 1912 లేదా 1800 425 155333కు కాల్ చేసి సమాచారం అందించవచ్చని తెలియజేశారు. -
ఎన్ఎంఎంస్ నమూనా పరీక్షకు విశేష స్పందన
పులివెందుల : పట్టణంలోని అహోబిలాపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన ఎన్ఎంఎంఎస్ ప్రతిభా నమూనా పరీక్షకు విశేష స్పందన లభించింది. వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ సి.కె.వెంకటనాథరెడ్డి మార్గదర్శకత్వంలో పులివెందుల రీజియన్ ఆధ్వర్యంలో ఈ పరీక్ష నిర్వహించారు. ప్రతిభా నమూనా పరీక్షలు విద్యార్థుల నైపుణ్యాలకు కొలమానాలు అని పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పశ్చిమ రాయలసీమ ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి హాజరై మున్సిపల్ చైర్మన్ వరప్రసాద్, మార్కెట్ యార్డు మాజీ చైర్మన్ చిన్నప్పతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి చిత్ర పటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ బ్రోచర్ను ఆవిష్కరించి ప్రతిభా నమూనా పరీక్ష ప్రశ్నా పత్రాన్ని విడుదల చేసి పరీక్ష ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్సీ మాట్లాడుతూ వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ పులివెందుల రీజియన్ ఆధ్వర్యంలో నియోజకవర్గస్థాయి జాతీయ ఉపకార ప్రతిభా నమూనా పరీక్షలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ఈ పరీక్షకు 564 మంది విద్యార్థులు పరీక్షకు హాజరు కాగా, సీనియర్ ఉపాధ్యాయుడు గుజ్జుల కృష్ణారెడ్డి విజేతలను ప్రకటించారు. పులివెందుల బాలికల ఉన్నత పాఠశాల విద్యార్థిని ఎస్.హిమశ్రీ మొదటి బహుమతి సాధించి రూ.5 వేలు, చక్రాయపేట మండలం నాగులగుట్టపల్లె ఉన్నత పాఠశాల విద్యార్థులు జి.వరుణ్ తేజ్, జి.మైథిలి ద్వితీయ, తృతీయ స్థానాలలో నిలిచి రూ.3 వేలు, రూ.2 వేల నగదు బహుమతులు సాధించారు. మరో 20 మంది ప్రతిభావంతులైన విద్యార్థులు ప్రోత్సాహక బహుమతులు పొందారు. అనంతరం ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి రూ.15 వేలు, లింగాల ఎంఈఓ రూ.2,500, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు ఎస్.అమర్నాథరెడ్డి, రూ.2,500 నగదు ప్రోత్సాహకాలను ప్రకటించారు. కార్యక్రమంలో స్థానిక కౌన్సిలర్ పార్నపల్లె కిశోర్, ఎంఈఓలు చంద్రశేఖరరావు, రామానాయుడు, విశ్వనాథరెడ్డి, రామకృష్ణయ్య, రామచంద్రారెడ్డి, పాఠశాల హెడ్మాస్టర్ శ్రీనివాసరెడ్డి, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ నాయకులు సురేష్రెడ్డి, రఘునాథరెడ్డి, జగన్, వెంకటరెడ్డి, చలమారెడ్డి, మదార్, సుభాష్, పీఆర్టీయూ, ఎస్టీయూ, ఏపీటీఎఫ్ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు, హెడ్మాస్టర్లు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
మిద్దె పైనుంచి పడి గర్భిణి మృతి
వేంపల్లె : వేంపల్లెలోని పుల్లయ్యతోటకు చెందిన వల్లెపు దేవి(22)అనే గర్భిణి మిద్దైపె నుంచి కళ్లు తిరిగి ప్రమాదవశాత్తు కింద పడి మృతి చెందినట్లు భర్త పవన్ కళ్యాణ్ తెలిపారు. స్థానిక పుల్లయ్య తోటలోని రెండవ అంతస్తులో గర్భణి వల్లెపు దేవి, పవన్ కళ్యాణ్ నివాసముంటున్నారు. ఆదివారం దేవి కుమార్తె హేమదర్శిని మూడేళ్ల చిన్నారి మిద్దైపె నుంచి కిందికి దిగుతుండగా పైకి పాపను రావాలని పిలిచే సమయంలో దేవికి కళ్లు తిరిగి పైఅంతస్తు నుంచి కింద పడింది. దీంతో కుటుంబ సభ్యులు హుటాహుటినా ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. గర్భణి అయిన దేవి అప్పటికే మృతి చెందిందని వైద్యులు ధ్రువీకరించారు. గర్భిణి దేవికి 10 రోజుల్లో ప్రసవం జరగాల్సి ఉండగా.. ఈ ప్రమాద ఘటన జరగడంతో కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. -
యువకుడి ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : తల్లిదండ్రులు మందలించారని యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన ఆదివారం పుంగనూరు మండలంలో జరిగింది. కమ్మవారిపల్లె ఇరుకువారి ఇండ్లుకు చెందిన బుడ్డన్న కుమారుడు నరేష్(18) చదువు మానేసి ఇంటి వద్దే పనులు చేసుకుంటున్నాడు. ఆదివారం సక్రమంగా పనులు చేయడం లేదని తల్లిదండ్రులు నరేష్ను మందలించారు. దీంతో మనస్తాపం చెంది ఇంటి వద్ద పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. కారు ఢీకొని వృద్ధుడికి గాయాలు మదనపల్లె రూరల్ : గుర్తు తెలియని కారు ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడిన ఘటన ఆదివారం ములకలచెరువు మండలంలో జరిగింది. వేపూరికోట పంచాయతీ రెడ్డివారిపల్లెకు చెందిన కొండ్రెడ్డి(65) ద్విచక్రవాహనంలో గ్రామంలో నుంచి రోడ్డుపైకి రాగా, గుర్తు తెలియని కారు వేగంగా వచ్చి ఢీకొంది. ప్రమాదం జరిగిన వెంటనే కారు అక్కడి నుంచి వెళ్లిపోయింది. గమనించిన స్థానికులు ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన కొండ్రెడ్డిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ములకలచెరువు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. నడిరోడ్డుపై కారు దగ్ధంమదనపల్లె రూరల్ : నడిరోడ్డుపై అందరూ చూస్తుండగానే కారు దగ్ధమైన ఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. పట్టణంలోని నక్కలదిన్నెకు చెందిన ఎస్.రఘునాథ్, ఆదివారం ఉదయం ఏపీ–39, ఏఎన్4008 హ్యుందయ్ సాంత్రో కారులో నక్కలదిన్నె నుంచి నీరుగట్టువారిపల్లెకు వెళుతుండగా మార్గంమధ్యలోని కదిరిరోడ్డు రాయలసీమ చిల్డ్రన్స్ అకాడమీ వద్ద అకస్మాత్తుగా కారులో మంటలు చెలరేగాయి. దీంతో ఆందోళనకు గురై కారు దిగి బయటికి వచ్చేశారు. అందరూ చూస్తుండగానే కళ్ల ఎదుట కారు దగ్ధమైంది. గమనించిన స్థానికులు ఫైర్ సిబ్బందికి సమాచారం అందించడంతో వారు అక్కడికి చేరుకున్నారు. అయితే అప్పటికే కారు పూర్తిగా మంటల్లో కాలిపోయింది. అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. కారు ఇంజిన్ వద్ద పెట్రోల్ పైపు లీకేజీ కారణంగా మంటలు చెలరేగి ప్రమాదం జరిగిందని అగ్నిమాపకశాఖ అధికారులు ప్రాథమికంగా నిర్ధారించారు. ప్రమాదంలో రూ.4 లక్షల నష్టం వాటిల్లినట్లు కారు యజమాని రఘునాథ్ తెలిపారు. -
ఘనంగా గనుల భద్రత వారోత్సవాలు
కడప కోటిరెడ్డిసర్కిల్: మైన్స్ సేఫ్టీ వీక్ అండ్ ప్రొడక్టివ్ అసోసియేషన్ ఆధ్వర్యంలో 40వ గనుల భద్రతా వారోత్సవాలు మేడా రఘునాథ్ రెడ్డి కన్వెన్షన్ సెంటర్లో ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా హాజరైన డైరెక్టర్ ఆఫ్ మైండ్ సేఫ్టీ రఘుపతి పెద్దిరెడ్డి, కిషోర్కుమార్ డోకుపర్తి, ఎన్ మారుమూత్తు, వైస్ ప్రెసిడెంట్ శ్రీ రవి కృష్ణ అయ్యర్, గ్రూప్ హెచ్ఆర్ హెడ్ రమేష్ వీపీ, హెచ్ఆర్ ఎల్.సోమశేఖర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. ఇందులో వివిధ విభాగాల్లో నిడిజీవి లైవ్ స్టోన్ మైన్స్, ది ఇండియా సిమెంట్ లిమిటెడ్ గనుల భద్రతా విషయంలో మొదటి బహుమతి గెలుచుకుంది. -
నేడు పాఠశాలలు, కళాశాలలకు సెలవు
రాయచోటి: దిత్వా తుపాను నేపథ్యంలో ముందస్తు చర్యలలో భాగంగా జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలు, అంగన్వాడీ కేంద్రాలకు డిసెంబర్ 1న సెలవు ప్రకటించారు. ఈమేరకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. రాయచోటి: దిత్వా తుఫాను హెచ్చరికల దృష్ట్యా సోమవారం రాయచోటి కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించాల్సిన గ్రీవెన్సెల్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి వ్యయ ప్రయాసాలతో కలెక్టర్ కార్యాలయానికి రావద్దని ఆయన విజ్ఞప్తి చేశారు. ఎస్పీ ఆఫీసులో...దిత్వా తుపాను హెచ్చరికల దృష్ట్యా సోమవారం ఎస్పీ ఆఫీసులో నిర్వహించాల్సిన గ్రీవెన్ సెల్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. ఈ విషయాన్ని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అర్జీదారులు సుదూర ప్రాంతాల నుంచి ప్రయాసాలతో జిల్లా పోలీసు కార్యాలయానికి రావద్దని ఆయన తెలిపారు. ములకలచెరువు: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో అరెస్టయ్యి మదనపల్లి సబ్ జైల్లో రిమాండ్లో ఉన్న ఇద్దరి నిందితుల కస్టడీ కోసం తంబళ్లపల్లె కోర్టులో ఎకై ్సజ్ పోలీసులు శనివారం పిటిషన్ దాఖలు చేశారు. ఈ కేసులో ఎ–24గా ఉన్న జతిన్ , ఎ–25 గా ఉన్న సిబ్బుల కోసం పిటిషన్ దాఖలు చేయడంతో కోర్టు జడ్జి ఉమర్ ఫారూఖ్ వాయిదా వేశారు. అదేవిధంగా నకిలీ మద్యం కేసులో మరో ఇద్దరి నిందితులను ఎకై ్సజ్ పోలీసులు చేర్చారు. తమిళనాడు రాష్ట్రం కోయంబత్తూర్ కు చెందిన చెందిల్ (ఏ30)గా , హైదరాబాద్ కు చెందిన ప్రసాద్ (ఏ31)గా చేర్చారు. లక్కిరెడ్డిపల్లి: కోరిన కోర్కెలు తీర్చే కొంగుబంగారంగా విరాజిల్లుతున్న అనంతపురం గంగమ్మ ఆలయానికి ఆదివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. కార్తీకమాసం ముగిసిన నేపథ్యంలో భక్తులు గంగమ్మకు బోనాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. గంగమ్మా..కాపాడవమ్మా అని వేడుకున్నారు. పూజారులు చెల్లు వంశీయులు భక్తులకు అమ్మవారి దర్శనాన్ని కల్పించి తీర్థప్రసాదాలను అందజేశారు.చుట్టుపక్కల వారే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా భక్తులు తరలి వచ్చారు. ఈ కార్యక్రమంలో ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. రాజంపేట: ఆంధ్రప్రదేశ్ ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాష్ట్ర కార్యాలయంలో రాష్ట్ర అధ్యక్షునిగా బాధ్యతలు స్వీకరించినట్లు డాక్టర్ బాలరాజు ఆదివారం ఇక్కడి విలేకర్లకు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైద్యసిబ్బంది, ఆసుపత్రుల రక్షణ చట్టాన్ని కఠినతరం చేయాల్సిన ఆవశ్యకత ఉందన్నారు. ఆసుపత్రుల అనుమతులకు ఏకగవాక్ష విధానం ఉండాలన్నారు. ప్రభుత్వ ఆరోగ్య కార్యక్రమాలకు ఐఎంఏ సహకరిస్తుందన్నారు. ఎన్టీఆర్ వైద్యసేవ అందిస్తున్న ఆసుపత్రుల బకాయి లను వెంటనే విడుదల చేయాలన్నారు. ఐఎంఏ మాజీ అధ్యక్షుడు డాక్టర్ నందకిషోర్, ప్రెసి డెంట్ ఎలక్ట్ డాక్టర్ పీఎస్ శర్మ, ప్రధానకార్యదర్శి సుభాష్ చంద్రబోస్, ఆర్ధిక కార్యదర్శి డాక్టర్ తుమ్మల కార్తీక్ తదితరులు పాల్గొన్నారు. -
వెల్లివిరిసిన మతసామరస్యం
లక్కిరెడ్డిపల్లి : కులమతాలకు అతీతంగా అయ్యప్ప మాల ధరించిన భక్తులకు.. ముస్లింలు అన్నప్రసాదం ఏర్పాటు చేయడంతో మతసామరస్యం వెల్లివిరిసింది. మండల పరిధిలోని నామాలగుట్టపై వెలసిన అయ్యప్పస్వామి ఆలయంలో ఆదివారం మదీనా మసీదు కమిటీ సభ్యులు, ముస్లింలు.. అయ్యప్ప మాల ధరించిన భక్తులకు అన్నప్రసాదం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అయ్యప్ప మాలధారణ భక్తులు, ముస్లింలు కలిసిమెలిసి స్వామి వారి ప్రసాదాన్ని స్వీకరించారు. ఇలాగే ఎప్పుడూ హిందూ, ముస్లిం అని తేడా లేకుండా కులమతాలకు అతీతంగా ప్రతి ఒక్కరూ కలిసి మెలిసి జీవించాలని వారు కోరారు. అనంతరం నిర్మాణంలో ఉన్న అయ్యప్పస్వామి ఆలయాన్ని అయ్యప్ప భక్తులతో కలిసి ముస్లింలు సందర్శించారు. ఈ సందర్భంగా ముస్లింలు మాట్లాడుతూ తమవంతుగా అయ్యప్ప ఆలయ నిర్మాణానికి సహాయ సహకారాలు అందిస్తామన్నారు. ఈ కార్యక్రమంలో గురుస్వామి వెంకటేష్, గంగరాజు, ముస్లింలు, అయ్యప్ప మాలధారణ భక్తులు తదితరులు పాల్గొన్నారు.అయ్యప్ప భక్తులకు ముస్లింలు అన్నప్రసాదం ఏర్పాటు -
వైఎస్సార్సీపీ పాలనలో రాయచోటి.. అభివృద్ధిలో మేటి
● అభివృద్ధి జరగలేదని మాట్లాడటం అవివేకం ● 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా ఏర్పాటు చేసిన వైఎస్ జగన్ ● 3 నియోజకవర్గాలకు కుదించి బలహీన పరిచిన చంద్రబాబు ప్రభుత్వం ● అవినీతి, ఆక్రమణలు జరిగివుంటే రుజువు చేయండి ● వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డిరాయచోటి అర్బన్ : వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో రాయచోటిలో అభివృద్ధి శూన్యమని కొందరు మాట్లాడటం వారి అవివేకానికి నిదర్శనమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి అన్నారు. గత ప్రభుత్వంలో రాయచోటిలో అభివృద్ధి జరగలేదన్న రాష్ట్ర మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి విమర్శలపై శ్రీకాంత్రెడ్డి స్పందిస్తూ ఆదివారం పత్రికలకు ఒక ప్రకటన విడుదల చేశారు. అభివృద్ధే ధ్యేయంగా, ఈ ప్రాంత శ్రేయస్సే లక్ష్యంగా, పురోగతే ఊపిరిగా అధికారంలో ఉన్న ఐదేళ్లూ పని చేశామని ఆయన గుర్తుచేశారు. తాము చేసిన అభివృద్ధిని ఆధారాలతో సహా చూపుతామన్నారు. ప్రతి సారి భూ ఆక్రమణలపై మాట్లాడుతున్న వారు అధికారంలోకి వచ్చి 18 నెలలు అయ్యిందని, వారు చెప్పినట్లు వినే అధికారులు కూడా ఉన్నారని, వారితోనే విచారణ చేయించి రాజకీయ ఆరోపణలు కాకుండా రుజువులు చూపి వెంటనే స్వాధీనం చేసుకోవాలని సూచించారు. పేద ప్రజలకు మేలు జరగాలనే ఉద్దేశంతో అనేక చట్టాలను ప్రభుత్వం తీసుకువచ్చిందని, చుక్కల భూములు పారదర్శకంగా ఆ రైతులకే చెందాలని, 20 ఏళ్లు అనుభవం ఉన్న వాటిని వారికే అందించాలన్న ఉద్దేశంతో అసైన్మెంట్ పట్టాలు ఇచ్చేందుకు గతంలో మంచి నిర్ణయాలు తీసుకున్న విషయాలు గుర్తుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఎక్కడ వైఎస్సార్సీపీకి మంచిపేరు వస్తుందోనని కాలయాపన చేస్తున్నారని పేర్కొన్నారు. అలాగే రాయచోటికి రింగురోడ్డుతోపాటు పట్టణానికి శాశ్వత తాగునీటి సమస్యను తీర్చడానికి ఎంతో కృషి చేశామని తెలిపారు. రాయచోటిలో జరిగిన ప్రధాన అభివృద్ధి పనులు అన్నమయ్య జిల్లా ఏర్పాటు సమయంలో శాసీ్త్రయంగా జరగలేదని మాట్లాడిన వారే... అది భౌగోళికంగా ఉన్నందున జిల్లా కేంద్రం వచ్చిందని మాట్లాడారని పేర్కొన్నారు. అప్పుడు విమర్శలు చేసిన వారు ఇప్పుడు ద్వంద్వ వైఖరితో మాట్లాడుతూ గొప్పలు చెప్పుకుంటున్నారని మండిపడ్డారు. 6 నియోజకవర్గాలతో అన్నమయ్య జిల్లా చేసిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిది అయితే విభజించడమే లక్ష్యంగా పని చేసిన చంద్రబాబు ప్రభుత్వం.. కేవలం 3 నియోజకవర్గాలతో జిల్లాను చేయడం బాధాకరమన్నారు. దీనివల్ల రాయచోటి ప్రాధాన్యత చాలా వరకు తగ్గిపోయిందన్నారు. కలెక్టర్ బంగ్లా ఏర్పాటైనా, మీరు అనునిత్యం కూర్చుండే స్టేట్ గెస్ట్ హౌస్ మిగితా జిల్లాల కంటే ముందుగా అన్ని ప్రభుత్వ శాఖల కార్యాలయాల ఏర్పాటు చేసినట్లు తెలిపారు. యోగి వేమన యూనివర్సిటీకి 100 ఎకరాలు, కలెక్టర్ బంగ్లాకు 5 ఎకరాలు, జేసీ బంగ్లాకు 2 ఎకరాలు, ఎస్పీ బంగ్లాకు 1.5 ఎకరాలు, స్టేట్ గెస్ట్ హౌస్కు 2 ఎకరాలు, డీఎస్పీ కార్యాలయానికి ఒక ఎకరా, కేంద్రీయ విశ్వవిద్యాయం కోసం 5 ఎకరాలు, ట్రాఫిక్ పోలీస్స్టేషన్కు 0.50 ఎకరాలు, నగరవనానికి 80 ఎకరాలు, క్రికెట్ స్టేడియం కోసం 29 ఎకరాలు, శిల్పారామం కోసం 12 ఎకరాలు, జిల్లా పరిషత్ కార్యాలయం కోసం 10 ఎకరాలు, సెరికల్చర్ కార్యాలయంలో నిరుపయోగంగా ఉన్న స్థలాన్ని ప్రభుత్వ మహిళా డిగ్రీ కళాశాలకు కేటాయింపు, టీటీడీ కల్యాణ మండపం కోసం 1.5 ఎకరాలు, ఆర్టీసీ బస్టాండ్కు 0.33 ఎకరాల రెవెన్యూ భూమిని కేటాయించడం జరిగిందన్నారు. నారాయణరెడ్డిగారిపల్లె వద్ద జగనన్న కాలనీ కోసం 200 ఎకరాలు కేటాయించి 6 వేల మందికి పక్కా ఇళ్లు ఇచ్చామన్నారు. అలాగే నియోజకవర్గ వ్యాప్తంగా జగనన్న కాలనీలలో పేదలకు ఇళ్లు, వంద పడకల ఆసుపత్రి, రైతు బజార్, మున్సిపల్ సభాభవనం, అర్బన్ హెల్త్ సెంటర్లు, డైట్ మున్సిపల్ పార్కు, ఎంపీడీఓ కార్యాలయం, రహదారుల విస్తరణ వంటి వైఎస్ జగన్ హయాంలో జరిగిన అభివృద్ధి కార్యక్రమాలు రాయచోటిలో కనిపిస్తూనే ఉన్నాయని తెలిపారు. 950 పల్లెలకు తాగునీటిని అందించే లక్ష్యంతో జలజీవన్ మిషన్కు రూ.2700 కోట్ల నిధులు మంజూరు అయ్యింది కూడా వైఎస్సార్సీపీ హయాంలోనేనని పేర్కొన్నారు. అలాగే శిబ్యాల గ్రామపరిధిలో పరిశ్రమల కోసం 500 ఎకరాలు వైఎస్సార్సీపీ హయాంలో కేటాయిస్తే, ఇలాంటి వాటికి కూడా ఇప్పుడు కొత్తగా రిబ్బన్ కట్ చేయడం దారుణమన్నారు. ఈ 18 నెలల్లో చంద్రబాబు ప్రభుత్వం చేసింది కేవలం క్రిటికల్ కేర్ యూనిట్ ఒక్కటేనని తెలిపారు. ఇవన్నీ ఇలా ఉంటే అధికారం ఉంది కదా అని హేళన చేయడం, బూతు పదాలతో మాట్లాడటం సంస్కారం కాదని, అది మీ విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. కానీ తాము అధికారంలో ఉన్నప్పుడు విమర్శలు కాకుండా కేవలం అభివృద్ధి కోసం మాత్రమే తాపత్రయ పడి, ఆ విధంగానే రాయచోటలో ప్రగతి పనులు చేశామన్నారు. వైఎస్సార్సీపీ సోషియల్ మీడియాపై.. ప్రభుత్వ వైఫల్యాలను సామాన్యుడు ప్రశ్నిస్తే పోలీసులు జ్యోకం చేసుకుని బెదిరించడం, హింసించడం చూస్తుంటే ప్రజాస్వామ్యంలో ఉన్నామా లేదా అనిపిస్తోందని శ్రీకాంత్రెడ్డి ఆవేదన వ్యక్తం చేశారు. సోషియల్ మీడియాలో పోస్టులు పెడుతున్న వైఎస్సార్సీపీ కార్యకర్తలను స్టేషన్కు పిలిపించి కొట్టడం, హింసించడం సమంజసం కాదన్నారు. అన్యాయాలకు పాల్పడుతున్న అధికారులను తాము గుర్తుకు పెట్టుకుంటామని ఆయన పేర్కొన్నారు. -
బాధితులకు భరోసా!
మదనపల్లె సిటీ: తెలిసో తెలియకో చేసిన తప్పునకు ప్రాణాంతక వ్యాధి బారిన పడుతున్నారు. తమకు రోగం ఉందని అందరికీ తెలిస్తే ఏమి జరుగుతుందోనని ఆందోళన పడుతున్నారు హెచ్ఐవీ బాఽధితులు. వీరికి మనోధైర్యం కల్పిస్తూ అండగా నిలుస్తుంది ఏపీ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్. (ఏపీ శాక్స్). ఎయిడ్స్ బాధితులకు ఐసీటీసీ కేంద్రాల ద్వారా కౌన్సెలింగ్ ఇస్తూ వారికి భరోసా కల్పిస్తున్నారు. బాధితులకు ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు పంపిణీ చేస్తూ వారి జీవితకాలంను పెంచుతున్నారు.ఏపీ శాక్స్ ప్రత్యేక చర్యలతో హెచ్ఐవీ కేసులు తగ్గుముఖం పడుతున్నాయి. నేడు ప్రపంచ ఎయిడ్స్ దినోత్సవం సందర్భంగా కథనం.... ● ప్రస్తుతం హెచ్ఐవీ నియంత్రణకు జిల్లాలో ’దిశ’ ఆధ్వర్యంలో బాధితులకు అవగాహన కల్పిస్తూ అవసరమైన మందులు అందజేస్తూ వారి జీవితకాలాన్ని పొడిగించుకోవడానికి కృషి చేస్తోంది. పలు స్వచ్ఛంద సంస్థలు హెచ్ఐవీ నివారణకు కృిషి చేస్తున్నాయి. అయినా అవగాహన లోపం కారణంగా వ్యాధి సంక్రమిస్తోంది. సురక్షితం కాని అక్రమ సంబంధాలు, స్వలింగ సంపర్కులు, తదితరుల ద్వారా వ్యాధి విస్తరిస్తోంది. జిల్లాలో ఎక్కువగా మదనపల్లె, రాజంపేట, రాయచోటి, పీలేరు ప్రాంతాల్లో అధికంగా బాధితులు ఉన్నారు. ● ఇంటిగ్రేటెడ్ కౌన్సెలింగ్ కేంద్రాలు (ఐసీటీసీ) హెచ్ఐవీ బాధితులకు మనోధైర్యం కల్పిస్తున్నాయి. కేంద్రాల్లో అనుమానం ఉన్న వారికి ఉచితంగా హెచ్ఐవీ పరీక్షలు నిర్వహిస్తున్నారు. పాజిటివ్ కేసులకు కౌన్సెలింగ్ ఇవ్వడంతో పాటు భాగస్వామికి కూడా పరీక్షలు చేస్తున్నారు. వారికి జీవితకాలం పెంపు కోసం ఏఆర్టీ కేంద్రాల ద్వారా ఉచితంగా మందులు అందజేస్తున్నారు. పీపీటీసీ ద్వారా గర్భిణులకు సేవలు గర్భిణుల కోసం ప్రత్యేకంగా పీపీటీసీ కేంద్రాలు ఏర్పాటు చేశారు. వారికి హెచ్ఐవీ పరీక్షలు చేస్తారు. ఎవరికై నా పాజిటివ్ వస్తే వారికి ప్రత్యేకంగా కౌన్సెలింగ్ ఇచ్చి అండగా నిలుస్తారు. తల్లి నుంచి బిడ్డకు రాకుండా జాగ్రత్తలు తీసుకుంటారు. నెవరాపిన్ సిరప్ ఇవ్వడంతో పాటు ప్రత్యేక శ్రద్ధతో తల్లి నుంచి బిడ్డకు వ్యాధి సోకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఎంతో మంది పాజిటివ్ గర్భిణులకు పుట్టిన బిడ్డకు జబ్బు రాకుండా చర్యలు తీసుకున్నారు. జిల్లాలో ఐసీటీసీ కేంద్రాలు: మదనపల్లె, వాల్మీపురం, పీలేరు, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, రాయచోటి, లక్కిరెడ్డిపల్లె, రాజంపేట,రైల్వేకోడూరు ఏఆర్టీ కేంద్రంః మదనపల్లె ఎఫ్ఐసీటీసీలు: 64 లింక్ ఏఆర్టీ ప్లస్లు: రాయచోటి, రాజంపేట లింక్ ఏఆర్టీలు: పుంగనూరు, తంబళ్లపల్లె, బికొత్తకోట, వాల్మీకిపురం, లక్కిరెడ్డిపల్లె,రైల్వే కోడూరు బ్లడ్ బ్యాంకులు: 3 ఎన్జీఓలు: 4 జిల్లాలో ఎఆర్టీ మందులు వాడే వారి సంఖ్య: 4690 హెచ్ఐవి బాధితులకుఉచితంగా మందులు పంపిణీ మనోధైర్యం కల్పిస్తున్న కౌన్సెలింగ్ కేంద్రాలు తల్లి నుంచి బిడ్డకు రాకుండా సేవలు హెచ్ఐవీ పరీక్షలు చేయించుకోండి, సమాచారం తెలుసుకోండి... సురక్షితంగా ఉండండి అనేది ఈ ఏడాది నినాదాం. ప్రతి ఒక్క రూ పరీక్షలు చేసుకుని వారి పరిస్థితి తెలుసుకోవాలనేది లక్ష్యం. ప్రధానంగా యువ త, ట్రక్కర్స్, వలసజీవులు, వితంతువులు ఎక్కువగా ఈ వ్యాధిబారిన పడుతున్నారు. ఇందు కోసం పాజిటివ్ కేసులు నమోదు అయితే వారికి భాగస్వాములతో పాటు ఇండెక్స్ టెస్టింట్ను నిర్వహిస్తున్నారు. -
హిందువులు ఐకమత్యంగా ముందుకు సాగాలి
● అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానందస్వామి ● హిందూ సమ్మేళనం విజయవంతం ● భారీగా తరలివచ్చిన హిందువులుబ్రహ్మంగారిమఠం : సమాజ శ్రేయస్సు కోసం హిందువులు ఏకతాటిపై నడవాలని తోట్లపల్లె అచలానంద ఆశ్రమం పీఠాధిపతి శ్రీ విరజానందస్వామి పేర్కొన్నారు. ఆదివారం ప్రముఖ పుణ్యక్షేత్రమైన బ్రహ్మంగారిమఠంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమానికి బ్రహ్మంగారిమఠం మండలం నుంచి దాదాపు 3 వేల మంది హిందూ సోదరీ, సోదరులు తరలి వచ్చారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న విరజానందస్వామి మాట్లాడుతూ పురాణాలు, ఇతిహాసాలు, సంప్రదాయాల ప్రభావంతో సనాతన ధర్మం ప్రారంభమైందని, ఈ సనాతన ధర్మం ప్రతి రూపమే హిందూ సమ్మేళనం అన్నారు. ముఖ్యంగా సనాతన ధర్మం పాటించినప్పుడే సమాజం బాగుంటుందన్నారు. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి ఉన్న పుణ్యస్థలంలో హిందూ సమ్మేళనం ఏర్పాటు చేసిన నిర్వాహకులకు కృతజ్ఞతలు తెలిపారు. అనంతరం శ్రీఈశ్వరీదేవిమఠం మఠాధిపతి శ్రీ వీరకుమారస్వామి మాట్లాడుతూ భారత దేశ సమైక్యతకు ప్రతి రూపం హిందూ సమ్మేళనం అన్నారు. ప్రతి మనిషి వారి విధానాలు సక్రమంగా అలవర్చుకోవాలన్నారు. అప్పుడే సంప్రదాయం ఉంటుందన్నారు. సనాతన ధర్మం ప్రతి ఒక్కరూ పాటించాలన్నారు. అనంతరం ఆర్ఎస్ఎస్ ప్రాంత కార్యనిర్వాకులు యుగంధర్, రాష్ట్ర సేవాసమితి మండల కార్యనిర్వాకురాలు బయన బోయిన రమాదేవి మాట్లాడారు. హిందూ సమ్మేళనానికి సహకరించిన వారిని నిర్వాహకులు ఘనంగా సన్మానించారు. వారి సేవలను కొనియాడారు. ఈ కార్యక్రమంలో హిందూ సమ్మేళనం నిర్వాహకులు, ప్రజాప్రతినిధులు, మహిళలు, పిల్లలు, పుర ప్రజలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. -
నేత్రదానంతో ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగు
చింతకొమ్మదిన్నె : మండలంలోని నరసన్నగారిపల్లి గ్రామానికి చెందిన సందడి వీర ప్రతాప్రెడ్డి నేత్రదానం ఇద్దరి అంధుల జీవితాల్లో వెలుగులు నింపనుంది. వీరప్రతాప్రెడ్డి మృతితో ఆయన సతీమణి రత్నకుమారి, కుమారుడు జనార్దన్రెడ్డి, కోడలు రామసాయి అఖిల, కూతురు మీనాక్షి, అల్లుడు శివశంకర్ రెడ్డి, మనవరాలు వర్ణికలు నేత్రదానానికి అంగీకరించారు. ఈ మేరకు స్నేహా సేవాసమితి అధ్యక్షుడు మధుసూదన్రెడ్డి, స్నేహిత అమృతహస్తం సేవా సమితి నేత్ర సేకరణ కేంద్రం అధ్యక్షుడు రాజుకు సమాచారం ఇచ్చారు. టెక్నీషియన్ ప్రశాంత్, ఎల్వీ ప్రసాద్ నేత్రాలయం మేనేజర్ రెడ్డిబాబు మృతుడి స్వగృహానికి వెళ్లి మృతుడి కార్నియాలను సేకరించి ఎల్వీ ప్రసాద్ నేత్రాలయానికి పంపినట్లు రాజు తెలిపారు. ఈ సందర్భంగా స్నేహిత అమృత హస్తం సేవాసమితి అధ్యక్షులు రాజు మాట్లాడుతూ మనిషి మరణానంతరం మట్టిలో కలిసిపోయే నేత్రాలు దానం చేయదలచుకున్న వారు ఫోన్ నంబర్లు :9966509364 లేదా 9885339306లకు సమాచారం ఇచ్చి అంధత్వంతో బాధ పడుతున్న అంధులకు చూపు ఇచ్చే బృహత్కార్యానికి ప్రతి కుటుంబం ముందుకు రావాలన్నారు. మూగజీవాల తరలింపుపై కేసు ఎర్రగుంట్ల : ఎర్రగుంట్ల పట్టణ పోలీస్స్టేషన్ పరిధి నుంచి బయటి ప్రాంతాలకు మూగ జీవాలను తరలిస్తున్న వారిని పట్టుకుని నలుగురిపై కేసు నమోదు చేసినట్లు సీఐ విశ్వనాథ్రెడ్డి అదివారం తెలిపారు. మైదుకూరు నుంచి అనంతపురం, పుంగనూరుకు మూగజీవాలను రెండు కంటైనర్లలో తరలిస్తుండుగా పట్టుకున్నట్లు సీఐ పేర్కొన్నారు. వాటిలో ఎద్దులు, గేదెలు, దున్నపోతులు ఉన్నాయని, కానీ ఆవులు లేవన్నారు. సుమారు 82 జంతువులను తరలిస్తుండటంపై జంతు హింస నిరోధక చట్టం కింద నలుగురిపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. దాడి చేసిన వారిని శిక్షించాలి అట్లూరు : అయ్యప్పస్వామి భక్తుడిపై దాడి చేసిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేసి శిక్షించాలని అయ్యప్ప భక్తులు పేర్కొన్నారు. అట్లూరు క్రాస్ రోడ్డు సమీపాన అయ్యప్పస్వామి ఆలయం వెనుక వైపున ఉన్న స్థల విషయమై నవంబర్ 25న అయ్యప్ప మాలధారణలో ఉన్న నరసింహారెడ్డిపై రెడ్డిపల్లె గ్రామానికి చెందిన ఆంజనేయులు, ఆయన కుమారుడు శివ దాడి చేశారు. దాడికి పాల్పడిన వారిపై హత్యాయత్నం కేసు నమోదు చేయకుండా, వారిని కాపాడే ప్రయత్నం చేస్తున్నారని ఆదివారం అట్లూరు క్రాస్రోడ్డు కడప–బద్వేలు ప్రధాన రహదారిపై సుమారు 100 మంది అయ్యప్పస్వామి భక్తులు రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేశారు. -
● బొగ్గులు పరిశీలన
ఇనుపయుగ మానవుడు జాడ గుర్తించిన చోటనే బొగ్గులను గుర్తించారు.ఈ బొగ్గులు ఏ కాలం నాటివి అన్నదానిపై ప్రత్యేక పరిశీలన జరపాల్సి ఉందని పురావస్తుశాఖ అసిస్టెంట్ సూపరింటెండెంట్ డాక్టర్ ఏసుబాబు ఆదివారం చెప్పారు.ఇనుపయుగ మానవ కాలంలో నివాస ప్రాంతాలు లేవు. సంచార జాతులుగా ఉన్న వీళ్లు నీటి లభ్యత కలిగిన ప్రాంతాల్లో సంచరిస్తూ జీవించేవాళ్లు. వీరు ఆహారం కోసం జంతువులను వేటాడి వాటిని కాల్చుకుని తిని ఉండాలంటే ఈ బొగ్గులు అవే ఉండవని ఆయన అభిప్రాయాన్ని వ్యక్తంచేస్తున్నాడు ప్రత్యేక పరిశీలన, అధ్యయనం చేయాల్సి ఉందని చెప్పారు. మదనపల్లె: అన్నమయ్య జిల్లా సిద్దవటం అటవీ రేంజి పరిధిలోని శ్రీ లంకమల్లేశ్వర అభయారణ్యంలో వెలుగుచూసిన ఇనుపయుగ మానవుల నివాస ఆనవాళ్లపై పూర్తి స్థాయి అధ్యయనం మరుగునపడింది. కేవలం ఒకరోజు నిర్వహించిన సర్వేతోనే ఇది ఆగిపోవడం మూలంగా చరిత్రలో మానవుని సంస్కృతి, సంప్రదాయాలు, జీవన విధానం.. ఇలా ఎన్నో అంశాలను వెలికితీయడంతో నిర్లక్ష్యం కనిపిస్తోంది. ఈఏడాది మార్చి ఒకటిన ఇక్కడి ఆది మానవుని ఆనవాళ్లను గుర్తించి ప్రాముఖ్యత కలిగిన, చారిత్రిక ప్రదేశమని పేర్కొన్న పురావస్తుశాఖ తర్వాత దీని విషయాన్ని విస్మరించింది. లంకమల ఇప్పుడు యుగయుగాలకు చెందిన మానవుల మనుగడ జాడలపై చరిత్రకారుల్లో ఆసక్తి రేపుతోంది. ఎన్ని యుగాలైనా చెరిగిపోని చిత్రలేఖనం ద్వారా ఇనుప యుగపు ఆదిమానవులు ఆనవాళ్లు ఎన్నో కొత్త విషయాలకు, కొత్త అధ్యయనాలకు లంకమల అభయారణ్యం వేదిక ఉన్నప్పటికి లోతైన అధ్యయం లేకపోవడం నిరాశకు గురిచేస్తోంది. క్రీస్తుపూర్వం 2,500 సంవత్సరాల నుంచి క్రీస్తుశకం 2వ శతాబ్దం వరకు ఆది మానవులు లంకమలలోని రోళ్లబోడు బీటుకు చెందిన బండిగాని సెల ప్రాంతంలో నివసించినట్లు భారతీయ పురావస్తుశాఖ నిర్వహించిన పరిశీలన స్పష్టం చేసింది. లభ్యమైన జంతువులు, మనుషుల ఆకారంతో ఉన్న రేఖాగణిత చిత్రాల ఆధారంగా నాటి కాలాన్ని అంచనా వేశారు. ఎరుపు, తెలుపు, ఆకుపచ్చ రంగులో చిత్రాలను పురావస్తుశాఖ గుర్తించింది. అయితే తొలిసారిగా లంకమలలో నలుపు రంగ తో కలిగిన చిత్రాలు కనిపించడం వాటిని సహజసిద్ధంగా లభించే ముడిరంగులతో గీశా రని స్పష్టమైంది. నల్లరంగు చిత్రం విశేషం లంకమలలో వెలుగులోకి వచ్చిన ఇనుపయుగ మానవుడి ఆనవాళ్లలో నల్లరంగు చిత్రాలు పురావస్తుశాఖ అధికారులను ఆశ్చర్యానికి గురిచేశాయి. నల్లరంగు చిత్రాలు ఎక్కడ కూడా కనిపించినట్లు ఆధారాలు లేవని పురావస్తుశాఖ చెబుతోంది. ఇక్కడ నల్లరంగుతో మనిషి చిత్రం ఉండటం అప్పటి కాలానుగుణ పరిస్థితులపై అధ్యయనానికి సిద్ధం కావాల్సిన అవసరం ఉందని చెబుతున్నారు. యుగాల నాటి ఆది మానవుని ఆనవాళ్లు లభ్యమైనా.. ఒకరోజుతో ముగిసిన అధ్యయనం క్రీస్తు పూర్వం 2,500 సంవత్సరం నాటివిగా గుర్తింపు నివేదిక సిద్ధం చేసినా కదలిక లేదు ప్రపంచానికి సందేశం లంకమలలో గుర్తించిన ఆది మానవుని ఆనవాళ్లు సాధారణ విషయం కాదు. అక్కడ శోధిస్తే ఇంకెన్నో గుహలు, ఆధారాలు వెలుగుచూసే అవకాశం ఉంది. దీనికి సంబంధించి జరిపిన పరిశోధనపై పురావస్తుశాఖకు నివేదిక పంపాం. తదుపరి చర్యలు తీసుకోవాల్సి ఉంది. లంకమల ప్రపంచానికి కొత్త విషయాలు తెలిపే ప్రదేశంగా మారే అవకాశం లేకపోలేదు. –డాక్టర్ యేసుబాబు, పురావస్తుశాఖ అసిస్టెంట్ సూపరిండెంట్ బండిగాని సెల అభయారణ్యంలో బండలపై ఇనుపయుగ మానవులకు ఆనవాళ్లుగా నిర్ధారించే ఎరుపు రంగులో గీసిన చిత్రాల్లో తాబేలు, జింక. దుప్పి, లేదా కణితి బొమ్మలు ఎరుపురంగులో ఉన్నాయి. అలాగే తొలి చరిత్ర యుగపు ఆనవాళ్లుగా తెలుపురంగులో ఆవు, కుందేలు, చుక్కల్లో శివలింగ ఆకారం, గుర్రంపై స్వారీ చేస్తున్న వ్యక్తి, పక్కనే బరిసెతో వ్యక్తి చిత్రాలు ఉన్నాయి. గుర్రంపై రాజు, సైన్యం, ఖడ్గం వంటి ఆయుధాలు, ఆవులు, ఆవులు కాసే వారు ఇలా నాగరిక మానవుని జీవన ప్రమాణ అంశాలుగా నాటి ఆది మానవుల ఆహార, వ్యవహారాలు ప్రపంచానికి గుర్తుగా నాలుగు కాళ్ల అడవి జంతువులైన కణితి లేదా దుప్పి, నక్క, గేదె, ఆవు తదితర గుర్తులు ఉన్నాయి. మరోబండపైన యుద్ధం చేస్తున్నట్లుగా చేతుల్లో రాతి గుండులాంటి ఆయుధం, కుడిచేతిలో కర్ర లాంటి ఆయుధం పట్టుకున్నట్లు ఉన్నాయి. ఇద్దరి నడుముకు కత్తులు ధరించినట్లు ఉంది. చ ఎక్కలుగా శివలింగం పక్కనే ఊరేగింపుగా వెళ్తున్నట్టు. చేతిలో దీపాలు లాంటివి పెట్టుక ని ఉండొచ్చు. ఇలాంటి చిత్రలేఖన అనవాళ్లు రెండు యుగాలకు మధ్య సంబంధాలను సూచిస్తున్నట్టు పురావస్తుశాఖ ఇప్పటికే గుర్తించింది. -
12వ పీఆర్సీ కమిషన్ నియమించాలి
రాయచోటి : 12వ పీఆర్సీ కమిషన్ నియమించి, 30 శాతం ఐఆర్ ప్రకటించాలని యూటీఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు నక్కా వెంకటేశ్వర్లు, రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీరాజ డిమాండ్ చేశారు. రాయచోటిలో యూటీఎఫ్ జిల్లా కార్యాలయంలో జిల్లా ఆఫీసు బేరర్ల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో ఉద్యోగ ఉపాధ్యాయులకు 11వ పీఆర్సీ బకాయిలు, డీఏలు, సరెండర్ లీవులు తదితర ఆర్థిక పరంగా బాకీ పడిందన్నారు. బకాయిలు చెల్లించాలని ఉద్యమాలు చేసిన సందర్భంలో ప్రతిపక్షంలో ఉన్న నేటి పాలకులు.. తాము అధికారంలోకి వస్తే అవన్నీ చెల్లిస్తామని హామీ ఇచ్చి నేడు పట్టించుకోకపోవడం దుర్మార్గమని విమర్శించారు. టెట్, ఉపాధ్యాయ, విద్యారంగ సమస్య పరిష్కారం కోసం ఉద్యమ కార్యాచరణ రూపొందించామన్నారు. డిసెంబర్ 9,10వ తేదీలలో డివిజన్ కేంద్రంలో నిరసన ర్యాలీ, డిసెంబర్ 18న డీఈఓ కార్యాలయం ఎదుట ధర్నా, 2026 జనవరి 4న భీమవరంలో రాష్ట్రస్థాయి ర్యాలీ, జనవరి 29న ఢిల్లీ జంతర్ మంతర్ వద్ద ధర్నాలు ఉంటాయన్నారు. ఈ సమావేశంలో జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు హరిప్రసాద్, జాబీర్, జిల్లా గౌరవ అధ్యక్షుడు సుధాకర్ నాయుడు, జిల్లా సహాయ అధ్యక్షుడు శివారెడ్డి, మహిళా సహాధ్యక్షురాలు హేమలత, జిల్లా కోశాధికారి చంద్రశేఖర్, జిల్లా కార్యదర్శులు పి.వెంకట సుబ్బయ్య, వై.శ్రీధర్రెడ్డి, ఎ.అక్రంభాష, భాస్కర్రెడ్డి, ఆదినారాయణ, దావుద్దీన్, పురం వెంకటరమణ, జిల్లా ఆడిట్ కమిటీ కన్వీనర్ సురేంద్ర రెడ్డి, ప్రచురణల విభాగం కన్వీనర్ కె.విజయ కుమార్, రాష్ట్ర కౌన్సిలర్ శివారెడ్డి, కిఫాయత్ పాల్గొన్నారు. డిమాండ్లు : సర్వీసులో ఉన్న ఉపాధ్యాయులను టెట్ నుంచి మినహాయించాలి. జూన్లో బదిలీ అయిన ఉపాధ్యాయులను రిలీవ్ చేయాలి. ఎంటీఎస్ ఉపాధ్యాయుల పదవీ విరమణ వయసు 62 సంవత్సరాలకు పెంచాలి, అలాగే రెగ్యులర్ చేయాలి. వంద రోజుల ఎస్ఏస్సీ యాక్షన్ ప్లాన్లో సెలవు దినాలు మినహాయించాలి. సింగిల్ టీచర్ ప్రాథమిక పాఠశాలల్లో అకడమిక్ ఇన్స్ట్రక్టర్లను నియమించాలి. పీఎస్ హెచ్ఎం, క్లస్టర్ టీచర్స్ సమస్యలు పరిష్కరించాలి. పరీక్షల విధానంలో మార్పులు చేయాలి. రిటైర్ అయిన వారికి గ్రాట్యుటీ, కమ్యుటేషన్, లీవ్ ఎన్క్యాస్మెంట్ ఇతర బకాయిలు చెల్లించాలి. -
ఆధ్యాత్మిక ధామం.. పరిశుద్ధ మందిరం
కలసపాడు : సగిలేరు ఒడ్డున నూతనంగా నిర్మించిన తెలుగుగంగ అక్విడిక్ట్ కాలువ పక్కన.. ఠీవీగా నిలబడి ఉన్న ఆ నిర్మాణం ఎవరినైనా ఇట్టే ఆకట్టుకుంటుంది. దగ్గరికి వెళ్లి చూస్తే అక్కడి ప్రశాంతత వారిని లోనికి రమ్మని పిలుస్తుంది. లోపలికి వెళితే గుడి అందం ఔరా అనిపిస్తుంది. అపురూపమైన నిర్మాణశైలి మనసుకు హత్తుకుంటుంది. ఆధ్యాత్మికతతో మరో లోకంలోకి తీసుకెళుతుంది. ఒకసారి సందర్శిస్తే మళ్లీ రావాలనిపిస్తుంది. ఆ నిలయమే కలసపాడులోని పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం. 138వ ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధం కలసపాడు సగిలేరు ఒడ్డున పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం అందానికి, ఆధ్యాత్మికతకు నిలయంగా మారింది. చరిత్ర తెలుసుకుంటే ఔరా అనిపిస్తుంది. ఆలయంపై మరింత భక్తిని పెంచుతుంది. 137 ఏళ్లు పూర్తయిన ఆ అందం డిసెంబర్ 2వ తేదీ నాటికి 138వ ప్రతిష్టా మహోత్సవానికి సిద్ధమైంది. ఆధ్యాత్మిక నిలయం, చెక్కుచెదరని అందాన్ని సందర్శించేందుకు లక్షలాది మంది తరలివస్తారనడం అతిశయం కాదు. కలసపాడు చుట్టుపక్కల ప్రార్థనలు చేసుకునేందుకు సరైన ఆలయం లేదని భావించిన ఇంగ్లాండ్కు చెందిన రెవ.అర్ధర్ఇన్మన్ ఆధ్వర్యంలో 1884లో నిర్మాణం ప్రారంభించారు. మూడేళ్ల నిర్మాణ పనుల అనంతరం అద్భుతమైన ఆలయంగా తీర్చిదిద్దారు. 1887 డిసెంబర్ 3 నాటికి పూర్తయింది. ఈ సందర్భంగా ఏటా డిసెంబర్ 2, 3వ తేదీల్లో ప్రతిష్టా మహోత్సవాన్ని గుడి తిరునాలగా జరుపుతున్నారు. ఈ ఏడాది 138వ ప్రతిష్టా మహోత్సవం జరగనుంది. జిల్లా నుంచే కాక ఇతర జిల్లాల నుంచి లక్షలాది మంది భక్తులు ఉత్సవాలకు తరలి వస్తారు. ఆకట్టుకునే ఇటుకల నిర్మాణం ఆలయ నిర్మాణంలో వాడిన ఇటుకలు భక్తులను ఆకట్టుకుంటున్నాయి. స్థానికంగా దొరికే బంకమట్టితో ఇటుకలను తయారు చేశారు. వీటిని ఇసుక, సున్నం, బెల్లం, నీటికి లక్షల సంఖ్యలో కోడిగుడ్లను కలిపి గానుగ తిప్పి తయారు చేసిన గచ్చుతో నిర్మించారు. నునుపుదనం కోసం వేసే పైపూతలో కూడా గుడ్ల మిశ్రమాన్ని ఉపయోగించారు. ఆధునీకత ఉట్టిపడేలా టేకు, తాటి చెక్కలను వినియోగించారు. కేరళ పెంకులతో పైకప్పు నిర్మించారు. తలుపులు, కిటికీలు టేకుతో తయారు చేశారు. నిర్మాణదారుల పనితనంతో చూడగానే ఆకట్టుకునేలా పటిష్టంగా తయారైంది. లక్షల్లో తరలిరానున్న భక్తులు ఏటా గుడి తిరునాలకు లక్షల్లో భక్తులు తరలివస్తారు. జిల్లాలోని పలు ప్రాంతాల నుంచే కాక కర్నూలు, ప్రకాశం, నెల్లూరు, చిత్తూరు జిల్లాలతోపాటు దక్షిణాది రాష్ట్రాల నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో వస్తారు. ప్రధాన కార్యక్రమమైన భోగి పండుగకు కనీసం లక్ష మందికి పైగా భక్తులు హాజరవుతుంటారు. 3వ తేదీన ఉదయాన్నే భక్తులు తలనీలాలు సమర్పించి ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు చేసి మొక్కులు తీర్చుకుంటారు. చర్చిలో భారీగా కానుకలు సమర్పించుకుంటారు. రూట్ మ్యాప్ ఇది గుడి తిరునాలకు వచ్చే భక్తులు రైలులో అయితే ప్రకాశం జిల్లాలోని గిద్దలూరు నుంచి రావచ్చు. గిద్దలూరు నుంచి కలసపాడుకు 33 కిలోమీటర్ల బస్సు సౌకర్యం ఉంటుంది. కడప జిల్లా కేంద్రం వరకు రైలులో వచ్చి అక్కడి నుంచి 95 కిలోమీటర్ల దూరంలో ఉన్న కలసపాడుకు బస్సులో రావచ్చు. బస్సులో ప్రయాణికులు కడప జిల్లాలోని బద్వేలు, మైదుకూరు, పోరుమామిళ్ల మీదుగా చేరుకోవచ్చు. ప్రకాశం జిల్లాలోని మార్కాపురం, గిద్దలూరు మీదుగా బస్సులో కలసపాడుకు ప్రయాణించవచ్చు. నెల్లూరు జిల్లా నుంచి వచ్చే వారు ఉదయగిరి, బద్వేలు, పోరుమామిళ్ల మీదుగా కలసపాడుకు చేరుకోవచ్చు. కర్నూలు జిల్లా నుంచి వచ్చేవారు నంద్యాల, గిద్దలూరు నుంచి కలసపాడుకు చేరుకోవచ్చు. ప్రత్యేకతలు ఆలయంలో నిర్మించిన గంటగోపురం, బాప్టీజం తొట్టి ప్రత్యేకమైనవిగా చెప్పవచ్చు. చర్చిలోపల ముఖద్వారం వద్ద బాప్టీజం తొట్టి ఉంది. ఆలయంలోకి వచ్చే భక్తులు తొట్టిలోని నీటిని చల్లుకుని బాప్టీజం పొందుతారు. సుదూర ప్రాంతాల నుంచి తమ పిల్లలకు బాప్టీజం ఇప్పించేందుకు భక్తులు ప్రతిష్టా మహోత్సవాలకు తరలివస్తారు. గుడి వెలుపల ఏర్పాటు చేసిన గంటను మరో ప్రత్యేకతగా పేర్కొన్నవచ్చు. గడియారం లేని రోజుల్లో సమయాన్ని తెలిపేందుకు అక్కడి గంటను మోగించేవారు. 40 అడుగుల ఎత్తులో నిర్మించిన ఈ గంట ఆ నాటి నుంచి భక్తులను ఆకట్టుకుంటూనే ఉంది. ప్రతి సంవత్సరం వర్షం వచ్చినప్పుడు భక్తులు ఇబ్బందులు పడేవారు. దానిని దృష్టిలో ఉంచుకుని చర్చి కమిటీ సభ్యులు ఈ సంవత్సరం తిరునాలకు వచ్చే భక్తులకు వర్షం వచ్చినప్పుడు ఇబ్బంది లేకుండా జర్మన్ టెంట్లు ఏర్పాటు చేశారు. అలాగే మహిళలకు ప్రత్యేక స్నానపు గదులు నిర్మించారు. ఆకట్టుకుంటున్న పరిశుద్ధ పరిపేతురు పరిపౌలు ఆలయం 138 ఏళ్ల చరిత్ర సొంతం చెక్కు చెదరని అందం 2, 3వ తేదీల్లో గుడి తిరునాల -
ప్రమాదాల నివారణే ప్రామాణికం
రాయచోటి: ప్రమాదాల నివారణే ప్రామాణికంగా రాష్ట్ర ట్రాన్స్పోర్ట్ శాఖ అధికారులు తనిఖీలు చేపట్టారు.విద్యార్థుల బాగోగులను దృష్టిలో ఉంచుకొని చర్యలను చేపడుతున్నట్లు జిల్లా రవాణా అధికారి ప్రసాద్ చెబుతున్నారు.ప్రతి రోజు ఏదో ఒక జిల్లాలో నిత్యం స్కూలు బస్సు ప్రమాదాలు చోటు చేసుకుంటున్నాయి. ఈ నేపథ్యంలో విద్యా సంస్థల బస్సులను మరోమారు తనిఖీలు చేయాలని అధికారులు అదేశించడంతో రవాణా శాఖ అధికారులు నవంబర్ 28 నుంచి డిసెంబర్ 4 వరకు జిల్లాలో తనిఖీలు చేపడుతున్నారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా విద్యా సంస్థల బస్సులు దాదాపు 750 ఉన్నాయి. రెండు రోజుల పాటు జరిగిన తనిఖీల్లో 120 విద్యా సంస్థల బస్సులను తనిఖీలు చేయగా కొన్ని బస్సులకు సరైన పరికరాలు, పత్రాలు లేకపోవడంతో వాటిని మరమ్మతులు చేయించుకొని తిరిగి రవాణా శాఖ అధికారుల ద్వారా తనిఖీలు చేయించుకోవాలని విద్యా సంస్థల యాజమాన్యాలకు నోటీసులు ఇచ్చారు. పరిమితికి మించి విద్యార్థుల తరలింపు జిల్లాలోని ప్రైవేట్, కార్పొరేట్ విద్యా సంస్థ బస్సులో సీటింగ్ కెపాసిటి కంటే ఎక్కువ మంది విద్యార్థులు తరలిస్తున్నారు. బస్సులో ఇద్దరు విద్యార్థులు కూర్చొనే సీటులో ముగ్గురు లేక నలుగురిని కూర్చొపెడుతున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. వీటిపై రవాణా శాఖ అధికారులు దృష్టి సారించి ఉదయం, సాయంత్రం సమయాల్లో తనిఖీలు చేస్తే బాగుంటుదని విద్యార్థుల తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రతి విద్యా సంస్థ బస్సుకు స్పీడు గవర్నెన్స్ ఉండాలి 2019 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన వాహనానికి తప్పనిసరిగా ఫైర్ అలారం ఉండాలి 2020 తర్వాత రిజిస్ట్రేషన్ అయిన బస్సుకు డ్రైవర్ దగ్గర ఫైర్ పరికరాలు ఉండాలి ఎమర్జెన్సీ ఎగ్జిట్ డోర్లు ఉండాలి వాహనానికి సంబంధించిన ట్యాక్స్, పర్మిట్, ఇన్సూరెన్స్ ఉండాలి డ్రైవర్కు తప్పని సరిగా డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి విద్యార్థులను సీటింగ్ కెపాసిటీ ప్రకారం మాత్రమే కూర్చొబెట్టాలి విద్యా సంస్థల బస్సులపై ప్రత్యేక దృష్టిప్రతి స్కూల్ బస్సును తనిఖీ చేస్తాం జిల్లాలో ఉన్న ప్రతి విద్యా సంస్థ బస్సును కేటాయించిన తేదీకల్లా తనిఖీలు చేయించుకోవాలి. ప్రభుత్వం సూచించిన నిబంధనలు ఖచ్చితంగా ఉండాలి. తనిఖీలు చేయించుకోవాలని ఇప్పటికే విద్యా సంస్థల యాజమాన్యాలకు సమాచారం ఇచ్చాం. ప్రతి బస్సును క్షుణ్ణంగా తనిఖీ చేస్తాం. –ప్రసాద్, జిల్లా రవాణా శాఖ అధికారి -
వేమన సతీష్ మాటేమిటో?
సాక్షి ప్రతినిధి, కడప: చంద్రబాబు ప్రభుత్వ పనితీరుపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పథకాల అమల్లో తన..మన అంటూ ‘పచ్చ’పాతం చూపించే బాబు సర్కారు.. పార్టీ నేతలపైనా అదే పంథాను అనుసరిస్తోంది. మంచీ.. చెడు..న్యాయం.. ధర్మం కాకుండా ‘లెక్క’ల బేరీజులు వేసుకుంటూ మరీ నిర్ణయాలు తీసుకుంటోంది. ఓ మహిళ ఆరోపణలపై గిరిజన సంక్షేమశాఖ మంత్రి గుమ్మడి సంధ్యారాణి పీఏ సతీష్ వ్యవహారంలో సీఎంఓ ఆగమేఘాలపై స్పందించింది. కానీ, తమ పార్టీకే చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి చేసిన ఆరోపణలపై స్పందనే లేకుండా పోయింది.పైగా సదరు మహిళా నాయకురాలిపైనే పోలీసులు వే ధింపులు తీవ్రమయ్యాయి. లాభ నష్టాల బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం స్పందన ఉన్నట్లు ఈ ఘటన ఉదంతం స్పష్టం చేస్తోంది. ● తెలుగుదేశం పార్టీ నాయకుడు, ఎన్ఆర్ఐ వేమన సతీష్ తనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పిస్తామ ని నమ్మించి రూ.7కోట్లు తీసుకున్నారని అన్నమయ్య జిల్లా రైల్వేకోడూరుకు చెందిన టీడీపీ మహిళా నాయకురాలు సుధా మాధవి ఇటీవల ఆరోపించారు. ఈ మేరకు విజయవాడలో హైకోర్టు న్యాయవాది జడ శ్రమణ్కుమార్ అండతో మీడియా ముందుకు వచ్చి ఆవేదన వెళ్లబోసుకున్నారు. సుధా మాధవి కన్నీళ్లు టీడీపీ పెద్దల్ని కరిగించలేకపోయాయి. పైగా ఆమైపెనే ఒత్తిళ్లు వచ్చాయి. ‘వేమన సతీష్పై ఆరోపణలు చేస్తావా...’ అంటూ పోలీసు అధికారుల నుంచి వేధింపులు మొదలయ్యాయి. పార్టీ అధినేత చంద్రబాబుతో వేమన సతీష్ (ఫైల్కన్నీటి పర్యంతమైన సుధా మాధవి (ఫైల్) మంత్రి సంధ్యారాణి పీఏపై ఆగమేఘాలపై స్పందించిన సీఎంఓ టీడీపీ మహిళా నేత సుధా మాధవి ఆవేదనపై ఇంతవరకు స్పందన కరువు అధిష్టానాన్ని కరిగించలేని దళిత మహిళా నాయకురాలి కన్నీళ్లు గిరిజన సంక్షేమశాఖ మంత్రి పీఏ సతీష్ తనకు ఉద్యోగం ఇప్పిస్తామని డబ్బులు తీసుకున్నారని, వేధింపులకు గురి చేశారని తాజాగా ఓ మహిళ ఆరోపణలు చేసింది. దీనిపై స్పందించిన సీఎంఓ మంత్రి పీఏపై కేసు నమోదు చేసి విచారణ చేయాలని ఆదేశించింది. మరి.. అంతకు మించి ఆరోపణలు వచ్చిన టీడీపీ ఎన్ఆర్ఐ నాయకుడు వేమన సతీష్పై ఎందుకు చర్యలు చేపట్టలేదనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. అదే పార్టీకి చెందిన దళిత మహిళా నేత సుధా మాధవి ఆరోపణలపై సీఎంఓ నుంచి కనీస స్పందన కరువైంది. పైగా సుధా మాధవి సాక్ష్యాధారాలుగా ఉన్న వీడియోలు కూడా విడుదల చేశారు. అయినా పార్టీ నుంచి.. సీఎంఓ నుంచి ఆమెకు కనీస మద్దతు లభించలేదు. పైగా పోలీసుల నుంచి వేధింపులకు గురయ్యారు. ఈ ఉదంతాన్ని గమనిస్తే లాభ నష్టాలను బేరీజు వేసుకున్న తర్వాతే టీడీపీ అధిష్టానం చర్యలున్నట్లు విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ‘మనోడైతే ఓ న్యాయం, పేదోడైతే మరో న్యాయం’ అన్నట్లుగా చర్యలున్నాయని వారు వివరిస్తున్నారు. వేమన సతీష్కు టీడీపీ పెద్దల మద్దతు ఉండడంతోనే పోలీసు వ్యవస్థ సైతం అండగా నిలుస్తూ దళిత మహిళా నాయకురాలిపై నిరంకుశితంగా వ్యవహరించారని పరిశీలకులు అభిప్రాయపడుతున్నారు. -
● చెట్లపైనే మాగుతున్న కాయలు..
రాజంపేట: ఈ ఏడాది అరటికి గిట్టుబాటు ధర లేక రైతులు విలవిలలాడుతున్నారు. మూడేళ్ల క్రితం ఒక టన్ను అరటి రూ.25వేల వరఽకు ధర పలికితే, ఈ సారి అదే పరిణామం రూ1,000 కూడా ఉండటం లేదు.. పంట పడినా ఖర్చులు రావడంలేదని రైతులు వాపోతున్నారు. అన్నదాతలకు భరోసా నిలవాల్సిన చంద్రబాబు సర్కారు ఆ ఆలోచనే చేయడంలేదు.కనీసం మార్కెటింగ్ కల్పించే ప్రయత్నాలు జిల్లాలో మచ్చుకై నా కనిపించడంలేదని రైతులు వాపోతున్నారు. ఒక్క రాజంపేటలోనే పదివేల ఎకరాల్లో అరటి తోటలను సాగుచేస్తున్నారు. వినాయకచవతి సమయంలో గెల రూ.300 పలికింది. దసరా నాటికి రూ.230నుంచి రూ.250 మధ్య ధరలు కొనసాగాయి. మొదటి, రెండో, మూడో క్రాప్కోతకు సిద్ధంగా ఉంది. పడిపోయిన ఎగుమతులు రాజంపేట, రైల్వేకోడూరు నుంచి నిత్యం నాంధేడ్, మహారాష్ట్ర, ఢిల్లీ, తెలంగాణ రాష్ట్రాలకు పదుల సంఖ్యలో లారీల్లో లోడ్లు వెళ్లేవి. ప్రస్తుతం ధరలు పడిపోవడంతో లారీలు రైల్వేకోడూరులో పక్కనపెట్టేశారు. వైఎస్సార్సీపీ హయాంలో రూ.15 నుంచి 18 వేల వర కు ధరలు పలకగా ప్రస్తుతం టన్ను అరటి రూ.2 నుంచి 4వేలకు పడిపోవడం ఆందోళనకు గురిచేస్తోంది. కోనేవారు లేక చెట్లపైనే కాయలు మాగిపోతున్నాయి. ఉత్తరాదిరాష్ట్రాలలో డిమాండ్ లేక.. విదేశాలకు ఎగుమతి నిలిచిపోగా ఉత్తరాది రాష్ట్రాల్లో డిమాండ్ లేదని వ్యాపారులు చెబుతున్నట్లు రైతులు పేర్కొంటున్నారు. జిల్లాలో మామిడి రైతులు సీజన్లో ధరలు లేక అల్లాడిపోగా ప్రస్తుతం అరటి రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. కొందరు రైతులు అరటికాయలను ట్రాక్టర్, ఆటోల్లోనూ, బైకులో పెట్టుకొని వీధుల్లో తిరుగుతూ అమ్ముకుంటున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో అరటి రైతుకు స్వర్ణయుగమనే చెప్పాలి. నాణ్యమైన దిగుబడులు ఏటా ఫ్రూట్కేర్ యాక్టివిటీస్ను ప్రోత్సహించారు. సబ్సిడీపై కవర్లు ఇవ్వడమే కాదు...వసాయ క్షేత్రాల వద్దే ప్రీ ప్రాసెసింగ్ టెక్నిక్స్పై రైతులకు శిక్షణ ఇచ్చారు. దేశంలో ఎక్కడాలేని విధంగా అరటికి ప్రత్యేక మద్దతు ధర ప్రకటించారు. ధరలు పతనం కాకుండా ప్రతి ఏటా మార్కెట్కు పంట వచ్చే ముందు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తూ రైతులకు అండగా నిలిచారు. వ్యాపారులతో పాటు ఎగుమతిదారులతో రైతులను అనుసంధానం చేసి మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించారు. విదేశాలకు ఎగుమతుల కోసం ముంబైకి ఏటా కిసాన్ రైళ్లు నడిపారు.ఇతని పేరు మహేష్నాయుడు. ఒంటిమిట్ట మండలం చింతరాజపల్లె. తనకున్న రెండు ఎకరాల్లో అరటిసాగు చేశారు.ధర బాగుంటుందని ఆశించాడు.అయితే ధరలు ఆశించన విధంగా లేదు. కొనేందుకు వ్యాపారులు కూడా ముందుకురాలేదు. చేసేదేమిలేక తానే బైకుమీద అరటి కాయలు (పచ్చఅరటి) పెట్టుకొని ఒంటిమిట్ట, నందలూరు సమీప ప్రాంతాల్లో ఇంటింటికి వెళ్లి అమ్ముకుంటున్నాడు. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలని కోరుతున్నాడు. చెట్టుకే మాగుతున్న గెలలు కొనేందుకు ఆసక్తి చూపని వ్యాపారులు గిట్టుబాటుధర కల్పించడంలోప్రభుత్వం విఫలం ఆందోళనలో రైతులు గిట్టుబాటు ధర లేదు నాలుగు ఎకరాల్లో అరటి సాగు చేశాను. రూ.3 నుంచి రూ.4 లక్షలు ఖర్చు వస్తోంది. రూ.25 వేల వ్యాపారం జరుగుతుంది. ఈ ఏడాది రూ.2వేల కంటే ఎక్కువ రాలేదు. గిట్టుబాటు ధరలేదు. తోట ల్లోనే గెలలు మాగిపోతున్నాయి. ప్రభుత్వం గిట్టుబాటు ధర కల్పించాలి. –కుమార్రాజు, హస్తవరం, రాజంపేట రైతుల గోడు పట్టని ప్రభుత్వం ఈ ఏడాది అరటి రైతులకు ధర ల విషయంలో అన్యాయం జరిగింది. వేలాది మంది తో టల్లోనే కాయలను వదిలేశారు.ఈ ప్రభుత్వానికి రైతుల గోడు పట్టడం లేదు. వైఎస్ జగన్ హయాంలో అరటిరైతులకు మేలు జరిగేలా నిర్ణయాలు తీసుకున్నారు. – భాస్కర్రాజు, వైఎస్సార్సీపీ రూరల్ కన్వీనరు, రాజంపేట ఇప్పటి వరకు తక్కువమంది మాత్రమే పంట అమ్ముకున్నారు. డిసెంబరు వరకు దిగుబడులు ఎక్కువుగా వచ్చే అవకాశం ఉంది. మరోవైపు చెట్లపైనే కాయలు మగ్గిపోతుండటంతో చేసేదిలేక వచ్చిన ధరకు అమ్ముకోవాల్సివస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.ఎకరం అరటిసాగుకు రూ.80వేలకు పైగా ఖర్చయింది. పంట చేతికి వచ్చేసరికి ధరలు పడిపోవడంతో నష్టపోయామని రాజంపేట, రైల్వేకోడూరుకు చెందిన రైతులు వాపోతున్నారు. -
స్వర్ణ గ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యం
ఓబులవారిపల్లె: మండలంలోని అన్ని పంచాయతీలు స్వర్ణగ్రామ పంచాయతీలుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేయాలని డీపీఓ రాధమ్మ పేర్కొన్నారు. శనివారం స్థానిక ఎంపీడీఓ కార్యాలయంలో పంచాయతీ కార్యదర్శులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ గ్రామాల్లో సమస్యలను పరిష్కరించి స్వర్ణ గ్రామపంచాయతీలుగా తీర్చిదిద్దడానికి ప్రతి కార్యదర్శి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎంపీడీఓ విజయారావు, ఈఓపిఆర్డీ రామ్మోహన్ రెడ్డి, పంచాయతీ కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు. -
‘దిత్వా’పై అప్రమత్తంగా ఉండాలి
రాయచోటి: ’దిత్వా’ తుపాను హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు పోలీసుశాఖ సిద్ధంగా ఉంటుందని శనివారం తెలిపారు.అత్యవసర పరిస్థితుల్లో తక్షణ సహాయం కోసం ’డయల్ 112’ కు ఫోన్ చేయాలని వెల్లడించారు. రెవిన్యూ, విద్యుత్, మున్సిపల్, పంచాయతీ, అగ్నిమాపక దళం వంటి ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకుంటూ సహాయ చర్యలకు సిద్ధంగా ఉంటామన్నారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలని అధికారులను ఎస్పీ ఆదేశించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
ఒంటిమిట్టలో శాస్త్రోక్తంగా స్నపన తిరుమంజనం
ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయంలో శనివారం మూలవిరాట్ లకు స్నపన శాస్త్రోక్తంగా తిరుమంజనం నిర్వహించారు. పట్టువస్త్రాలు, బంగారు ఆభరాణాలు, తులసి గజమాలలతో సీతారామలక్ష్మణమూర్తులను సుందరంగా అలంకరించారు. అనంతరం స్నపన తిరుమంజనం నిర్వహించారు. శనివారం కావడంతో స్వామి వారి దర్శనానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. సిద్దవటం: తరగతి గదుల్లో ప్రాథమిక స్థాయి నుంచి ఇంటర్మీడియట్ వరకు విద్యార్థులు ఏ రకమైన పుస్తకాలు ఇష్టపడతారో అడిగి తెలుసుకొని సమగ్ర శిక్ష అభియాన్ ద్వారా వాటిని మంజూరు చేయించి వారానికి రెండు రోజులు లైబ్రరీ ఏర్పాటు చేస్తామని కడప జిల్లా విద్యాశాఖ అధికారి షంషుద్దీన్ తెలిపారు. సిద్దవటం జెడ్పీ హైస్కూల్లో శనివారం డీఈఓ మధ్యాహ్న భోజనం తనిఖీ చేశారు. ఫిజికల్ డైరెక్టర్ చంద్రావతి పాఠశాలకు రావడం లేదని విద్యార్థులు, ఉపాధ్యాయులు డీఈఓ దృష్టికి తీసుకెళ్లారు. విచారించి చర్యలు తీసుకుంటామని, ఎవరినైనా డిప్యుటేషన్ వేస్తామని ఆయన తెలిపారు. -
టిప్పర్ డ్రైవర్పై ఆకతాయిల దాడి
మదనపల్లె రూరల్ : జార్ఖండ్కు చెందిన టిప్పర్ డ్రైవర్పై మద్యం మత్తులో ఆకతాయిలు దాడికి పాల్పడిన ఘటన శనివారం రాత్రి మదనపల్లెలో జరిగింది. జార్ఖండ్కు చెందిన నూర్ ఆలం(27) పట్టణంలోని రెడ్డీస్కాలనీ యోగివేమన నగర్లో ఉంటూ టిప్పర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. సాయంత్రం నీరుగట్టువారిపల్లె వద్ద కూర్చుని హిందీలో తన కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతుండగా, పక్కనే మద్యం తాగుతున్న పల్లె క్రాస్కు చెందిన ఆకతాయిలు.. నూర్ ఆలం తమను తిడుతున్నాడని భావించి అకారణంగా అతడిపై దాడికి పాల్పడ్డారు. మద్యం మత్తులో విచక్షణా రహితంగా కొట్టడమే కాకుండా కాళ్లతో తన్నారు. దాడిలో టిప్పర్ డ్రైవర్కు నోటి నుంచి రక్తస్రావం కాగా అపస్మారక స్థితికి వెళ్లాడు. ఈ విషయాన్ని స్థానికులు టిప్పర్ యజమాని జేసీబీ మధుకు తెలపడంతో.. ఆయన వెంటనే బాధితుడిని జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. దాడిపై వన్టౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. గోరాన్ చెరువు వద్ద రోడ్డు ప్రమాదంగాలివీడు : మండలంలోని గోరాన్ చెరువు గ్రామం గొల్లపల్లి వద్ద శనివారం సాయంత్రం రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. ఆర్టీసీ డ్రైవర్ ఈశ్వరయ్య తన సొంత వాహనం కారు(షిఫ్ట్ డిజైర్)లో డ్యూటీ నిమిత్తం రాయచోటికి వెళుతుండగా గొల్లపల్లి వద్ద అదుపు తప్పి పక్కనే ఉన్న రాయిని ఢీకొన్నాడు. ఈ ఘటనలో కారులో ఒక్కడే ఉన్న ఈశ్వరయ్య ఎటువంటి గాయాలు లేకుండా సురక్షితంగా బయటపడ్డాడు. ఈ ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. గంజాయి ముఠాను శిక్షించండిమదనపల్లె : నెల్లూరులో గంజాయి, మాదకద్రవ్యాలకు వ్యతిరేకంగా ప్రజల్లో చైతన్యం తీసుకొస్తున్న కళాకారుడు పెంచలయ్యను హత్య చేసిన దుండగులను కఠినంగా శిక్షించాలని సీపీఎం జిల్లా కార్యదర్శి పి.శ్రీనివాసులు డిమాండ్ చేశారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ప్రజానాట్యమండలి కార్యదర్శిగా పెంచలయ్య గంజాయిపై కళారూపాల్లో వ్యతిరేకించడం జీర్ణించుకోలేని ముఠాలు.. బిడ్డలతో కలిసి బైక్పై వెళ్తుండగా దాడి చేసి హతమార్చడం దారుణమన్నారు. గంజాయి వ్యాపారులే ఈ ఘాతుకానికి పాల్పడ్డారని, వారిని గుర్తించి ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకుని శిక్షించాలని కోరారు. -
నీటి వృథాను అరికట్టి చెరువులు నింపాలి
జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్రామాపురం: నీటి వృథాను అరికట్టి సప్లై చానళ్ల ద్వారా చెరువులు నింపే ప్రక్రియను పూర్తి చేయాలని నీటిపారుదల, వెలిగల్లు ప్రాజెక్టు అధికారులకు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సూచించారు. శనివారం రామాపురం మండల పరిధిలో జరుగుతున్న సప్లై ఛానల్, ఇతర నీటి నిల్వ పనులను జిల్లా కలెక్టర్ పరిశీలించారు. మండల పరిధిలోని నల్లగుట్టపల్లి, బి.రాచపల్లి గ్రామ పరిధిలో రామరాజు వంక నుంచి బల్లిగుట్ట చెరువు సప్లై ఛానల్, రామరాజు వంక చెక్ డాం నిర్మాణం, రామరాజు వంక నుంచి ఓబుల్ రెడ్డి చెరువు, కసిరెడ్డి చెరువుకు, దిగువ చింతల వారి కుంట, చింతకుంట చెరువులకు నింపే సప్లై ఛానల్ పనులను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. పనులను నాణ్యతగా, త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. ఈ సందర్భంగా ఈనెల 30వ తేదీన పదవి విరమణ చెందుతున్న నీటిపారుదల శాఖ ఎస్ఈ వెంకటరామయ్యకు జిల్లా కలెక్టర్ పూల మొక్క అందించి శాలువాతో సన్మానించారు. కార్యక్రమంలో తహసీల్దార్ వెంటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు. -
ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురికి గాయాలు
మదనపల్లె రూరల్ : ఎదురెదురుగా వస్తున్న ద్విచక్రవాహనాలు ఢీకొని ముగ్గురు గాయపడిన ఘటన శనివారం బి.కొత్తకోట మండలంలో జరిగింది. మండలంలోని ఎర్రప్పగారిపల్లెకు చెందిన రెడ్డి నరసింహులు(43) మొరవపల్లెకు వెళుతుండగా, మార్గంమధ్యలో అదే గ్రామానికి చెందిన భూదేవి(36) ఆయనతోపాటు బైక్పై ఎక్కింది. మొరవపల్లె సమీపంలోని చెరువుకట్టపై గట్టు పంచాయతీ ఆకులవారిపల్లెకు చెందిన శంకర(46) మరో ద్విచక్రవాహనంలో ఎదురుగా వచ్చి ఢీకొనడంతో ముగ్గురు గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం వారిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి రెఫర్ చేశారు. అంగళ్లులో అక్రమ లేఔట్లుకురబలకోట : కురబలకోట మండలంలోని అంగళ్లు, కురబలకోట, నందిరెడ్డిగారిపల్లి గ్రామాల్లో విచ్చలవిడిగా అపార్టుమెంట్లు, లేఔట్లు వేస్తున్నారు. అధికారులు మాత్రం పట్టించకోవడం లేదు. అన్నమయ్య జిల్లాలోనే అంగళ్లుకు ఎడ్యుకేషన్ హబ్గా పేరుంది. ఈ ప్రాంత పరిసరాల్లో ప్లాట్లు పరిగెడుతున్నాయి. అపార్టుమెంట్లు వెలుస్తున్నాయి. అధికారులు పట్టించుకోకపోవడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరో వైపు పరిమితికి మించి అపార్టుమెంట్లు కడుతున్నారు. లే ఔట్ల పరిస్థితి కూడా ఇంతే. చాలా వాటికి అప్రూవల్ లేదు. అధికారులు మామూళ్లకు తలొగ్గి నియమ నిబంధనలను పట్టించుకోవడం లేదని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వారు ఉన్నా లేనట్లుగా ఉందని విమర్శిస్తున్నారు. అధికారుల స్వార్థంతో ప్రభుత్వ ఆదాయానికి భారీగా గండి పడుతోందని చెబుతున్నారు. అధికారులకు ముడుపులు ముడుతుండడమే వారి నిశబ్దానికి కారణంగా ప్రజలు చెబుతున్నారు. అక్రమ లేఔట్లు, అపార్టుమెంట్లు రాబోయే రోజుల్లో పెద్ద సమస్యలకు కారణం అవుతాయని భావిస్తున్నారు. అంగళ్లు విద్యా కేంద్రంగా వర్దిల్లుతున్న తరుణంలో ఇలాంటి అక్రమ కట్టడాల వల్ల సమస్యలకు దారితీస్తాయని నిపుణులు వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై అధికారులను అడగగా.. అక్రమ లే ఔట్లకు, అక్రమ నిర్మాణాలకు నోటీసులు జారీ చేసినట్లు తెలిపారు. అధికార పార్టీ నాయకుల ఘర్షణ ఒంటిమిట్ట : మండలంలోని ఓ మారుమూల గ్రామంలో అధికార పార్టీకి చెందిన రెండు కుటుంబాలు ఘర్షణ పడ్డాయి. స్థానికుల వివరాల మేరకు.. శుక్రవారం రాత్రి ఆ గ్రామంలో టీడీపీ పార్టీకి చెందిన రెండు కుటుంబాలు పాత కక్షలు మనసులో ఉంచుకొని ఘర్షణకు దిగారని తెలిసింది. ఈ ఘర్షణలో ఒక వర్గం వారు మరో వర్గంపైకి కర్రలు, రాళ్లతో దాడి చేయబోయినట్లు సమాచారం. ఈ ఘర్షణ శనివారం ఒంటిమిట్ట పోలీసు స్టేషన్ వరకు కూడా వచ్చినట్లు వినికిడి. అనంతరం ఒంటిమిట్ట మండలంలోని ఇద్దరు టీడీపీ నాయకులు జోక్యం చేసుకోని వారికి నచ్చచెప్పి పోలీసు స్టేషన్ నుంచి పంపించినట్లు చెబుతున్నారు. అయితే ఇక్కడ నచ్చచెప్పడానికి వచ్చిన ఇద్దరు టీడీపీ నాయకులు ఒకరు ఒక వర్గానికి, మరొకరు మరో వర్గానికి మద్దతు తెలిపనట్లు గుసగుసలు వినిపిస్తున్నాయి. రెవెన్యూ అధికారుల పేరుతో వసూళ్లుసుండుపల్లె : మండల పరిధిలోని అగ్రహారం గుట్ట, జగనన్న కాలనీలలో రెవెన్యూ అధికారుల పేర్లతో గవర్నమెంట్ ఇళ్లకు ఆన్లైన్ చేయాలని మండలంలోని ఓ వ్యక్తి వెయ్యి రూపాయలు వసూళ్లకు పాల్పడుతున్నట్లు గ్రామస్తులు బుధవారం ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి ప్రసాద్ అనే వ్యక్తి వసూళ్లకు పాల్పడినట్లు గుర్తించి తహసీల్దార్ మెహబూబ్చాంద్ ఫిర్యాదు మేరకు శనివారం ఎస్ఐ ముత్యాల శ్రీనివాసులు కేసు నమోదు చేశారు.వ్యక్తిపై కేసు నమోదు -
సంస్థాగతంగా కాంగ్రెస్ పటిష్టతకు కృషి
మదనపల్లె : కాంగ్రెస్ పార్టీని సంస్థాగతంగా పటిష్టం చేసేందుకు కృషి చేస్తున్నట్టు ఏఐసీసీ పరిశీలకుడు కె.మహేంద్రన్ అన్నారు. శనివారం మదనపల్లెలో ఆ పార్టీ నియోజకవర్గ సమావేశం జరిగింది. ఈ సందర్భంగా ఆయన పార్టీ స్థితిగతులను సమీక్షించారు. నియోజకవర్గ ఇన్చార్జి పవన్కుమార్రెడ్డి ఆధ్వర్యంలో సమావేశమైన మహేంద్రన్, ఏఐసీసీ కార్యదర్శి గణేష్కుమార్ యాదవ్, టీపీసీసీ ప్రధాన కార్యదర్శి రాకేష్, పార్టీ నాయకులు, కార్యకర్తలతో డీసీసీ అధ్యక్షుడి ఎన్నిక, వివిధ అంశాలపై చర్చించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ 2029లో ఎన్నికల్లో విజయమే లక్ష్యంగా ప్రతి కార్యకర్త పని చేయాలన్నారు. కాంగ్రెస్ పార్టీ లేని గ్రామం, రాష్ట్రం లేదన్నారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త చిత్తశుద్ధితో పని చేయాలని కోరారు. టీడీపీ, జనసేనలు బీజేపీ ఏజంట్లని అన్నారు. డీసీసీ అధ్యక్షుడి ఎన్నికను పారదర్శకంగా నిర్వహించేందుకే సంఘటన్ శ్రీజన్ అభియాన్ పేరుతో కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. క్షేత్రస్థాయిలో పార్టీని బలోపేతం చేసేందుకు శ్రేణులను సిద్ధం చేస్తున్నట్టు చెప్పారు. అంతకుముందు కాంగ్రెస్ పార్టీ శ్రేణులు ర్యాలీ నిర్వహించారు. ఈ కార్యక్రమాల్లో ఓబీసీ విభాగం చైర్మన్ ఆవుల ఆది, జిల్లా అధ్యక్షులు గాజుల భాస్కర్, మైనార్టీ విభాగం రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎస్కే బాషా, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు నిగార్ సుల్తానా, యువజన విభాగం జిల్లా అధ్యక్షులు కొండుపల్లి ఆనంద్, సీనియర్ నాయకులు రెడ్డిసాహెబ్, మీనాకుమారి, ముబారక్ఖాన్, ఈశ్వరమ్మ, ఖాదర్బాషా, శరత్కుమార్, గుల్షన్, నాగరాజు, భానుప్రకాష్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైల్వేస్టేషన్ సమీపంలో బెల్టుషాపులు తొలగించండి
రైల్వేకోడూరు : రైల్వేస్టేషన్ సమీపంలో ఉన్న రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద బెల్టుషాపులను తొలగించాలని డీఆర్సీసీయూ సభ్యుడు తల్లెం భరత్కుమార్రెడ్డి పేర్కొన్నారు. శనివారం ఉదయం రైల్వేకోడూరు రైల్వేస్టేషన్ను రేణిగుంట డివిజన్ అసిస్టెంట్ సెక్యూరిటీ కమిషనర్ రాజగోపాల్రెడ్డితో కలిసి ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైల్వే అండర్ బ్రిడ్జి వద్ద ఉన్న బెల్టుషాపు వల్ల విద్యార్థులు, మహిళలు, సామాన్య ప్రజానీకం అసౌకర్యానికి, భయభ్రాంతులకు గురవుతున్నారని తెలిపారు. కావున వెంటనే తొలగించేందుకు ఎకై ్సజ్, పోలీసు శాఖల అధికారులు చర్యలు తీసుకోవాలని అన్నారు. రైల్వేస్టేషన్ పరిధిలో మౌలిక సదుపాయాలు కల్పించాలని సంబంధిత అధికారులకు వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రేణిగుంట ఆర్పీఎఫ్ సబ్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్, నందలూరు సబ్ ఇన్స్పెక్టర్ ఆర్పీ త్రివేణి, నందలూరు ఏఎస్ఐ రాధాకృష్ణయ్య, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు రమేష్, గునిశెట్టి రమేష్, వైఎస్సార్సీపీ మహిళా నియోజకవర్గ అధ్యక్షురాలు నారాయణమ్మ తదితరులు పాల్గొన్నారు. -
తంబళ్లపల్లె అభివృద్ధికి నిధులు ఇవ్వండి
బి.కొత్తకోట : తంబళ్లపల్లె నియోజకవర్గ అభివృద్ధికి వెయ్యి కోట్లు మంజూరు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శనివారం బి.కొత్తకోటలో ఆ పార్టీ నియోజకవర్గ సమావేశంలో ఆయన మాట్లాడుతూ విద్య, వైద్య రంగాల్లో తంబళ్లపల్లె వెనుకబడిందన్నారు. టీడీపీ వర్గ విబేధాలతో అభివృద్ధి కుంటుబడిందన్నారు. ఇక్కడి ప్రజలు ఉపాధి కోసం వలసలు వెళ్తున్నారని, వారిని ఆదుకోవాలని పేర్కొన్నారు. మండలాల్లో పరిశ్రమలను నెలకొల్పి ఉపాధి అవకాశాలు కల్పించాలని కోరారు. గిరిజనులకు జనుపనార, వేరుశెనగ పరిశ్రమలు స్థాపించాలని అన్నారు. వైద్యం కోసం ఇప్పుడున్న సీహెచ్సీల అభివృద్ధికి, పీహెచ్సీల అప్గ్రేడ్కు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లె ప్రభుత్వ వైద్య కళాశాలను ప్రయివేటీకరించొద్దని కోరారు. సమావేశంలో జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, నియోజకవర్గ కార్యదర్శి మనోహర్రెడ్డి, నాయకులు అంజనప్ప, రఘునాథ్, అష్రఫల్లీ, నారాయణస్వామి, హరికుమార్, తంబయ్యశెట్టి, నిజాముద్దీన్, జవహర్బాబు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
గుర్రంకొండ: జాతీయ స్థాయి ఫెన్సింగ్(కత్తిసాము) పోటీలకు గుర్రంకొండ విద్యార్థినులు ఎంపికై నట్లు ఎపీ గురుకుల బాలికల పాఠశాల ప్రిన్సిపల్ సుమిత్ర తెలిపారు. స్థానిక గురుకుల పాఠశాలకు చెందిన నిఖిత,సెబర్, చందు, గాయత్రి, మానసలు ఇటీవల కాకినాడలో నిర్వహించిన రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ కనబరిచి వెండి పతకాలను సాధించారు. వీరు త్వరలో మహరాష్ట్రలోని శంభాజి జిల్లాలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారని ఆమె తెలిపారు. పతకాలు సాధించిన విద్యార్థినులను శనివారం సన్మానించారు.కార్యక్రమంలో ఖేలో ఇండియా ఫెన్సింగ్కోచ్ రవీంద్రనాథ్, సిబ్బంది పాల్గొన్నారు. రాయచోటి జగదాంబసెంటర్: లింగ నిర్ధారణ చట్ట వ్యతిరేకం అని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ కె.లక్ష్మీనరసయ్య పేర్కొన్నారు. శనివారం పీసీ పీఎన్డీటీ చట్టంపై జిల్లా స్థాయి సలహా సంఘ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా, మండల స్థాయి, గ్రామీణ ప్రాంతాల్లో కూడా ఆడపిల్లల సంరక్షణ గురించి విస్తృతంగా అవగాహవ కార్యక్రమాలు చేపట్టాలన్నారు. సమావేశంలో ప్రోగ్రాం ఆఫీసర్/ జిల్లా అడ్వైజరీ కమిటీ కన్వీనర్ పి.దేవ శిరోమణి, చిన్నపిల్లల వైద్యులు డాక్టర్ నిస్సార్, అడిషనల్ డీఎంహెచ్ఓ డాక్టర్ రాధిక, గైనకాలజిస్ట్ డాక్టర్ నీలోఫర్, స్వచ్ఛంధ సంస్థ సభ్యులు చెన్నారెడ్డి, నాగేశ్వరయ్య, ఐసీడీఎస్ సీడీపీఓ సుగుణ, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ రాజగోపాల్, వైద్య సిబ్బంది పాల్గొన్నారు. రాయచోటి టౌన్: నిబంధనలు పాటించకుండా తిప్పుతున్న విద్యాసంస్థల బస్సులపై కఠిన చర్యలు తప్పవని జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్ పేర్కొన్నారు. శనివారం రాష్ట్ర రవాణా కమిషనర్ ఆదేశాల మేరకు జిల్లాలో విద్యాసంస్థలకు చెందిన బస్సులను తనిఖీ చేసినట్లు తెలిపారు. మోటారు వాహన చట్టం 1988 నిబంధనలు పాటించాలని చెప్పారు. మొత్తం 75 బస్సులను తనిఖీ చేశారు. నిబంధనలు పాటించని వారికి నోటీసులు ఇచ్చారు. అనంతరం కార్యాలయాలనికి వచ్చిన డ్రైవర్లకు సూచనలు – సలహాలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఎంవీఐలు అనిల్ కుమార్ పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: పదో తరగతి పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించాలని జిల్లా సాంఘిక సంక్షేమ అధికారి సి.దామోదర్రెడ్డి అన్నారు. శనివారం నక్కలదిన్నెలోని ఎస్సీ బాలుర వసతి గృహాన్ని ఆకస్మికంగా తనిఖీ చేశారు. పదో తరగతి విద్యార్థులతో ప్రత్యేకంగా సమావేశం నిర్వహించారు. వంద రోజుల ప్రణాళికను తప్పకుండా అమలు చేయాలన్నారు. పదివ విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ చూపాలన్నారు. విద్యార్థులతో మాట్లాడి మెనూ ప్రకారం భోజనం అందుతోందా, బెడ్షీట్స్ అందాయా లేదా అని అడిగి తెలుసుకున్నారు. అనంతరం హాస్టల్లో రికార్డులు పరిశీలించారు. పట్టణంలోని జ్ఞానాంబిక డిగ్రీ కాలేజీ, వికాస్ డిగ్రీ కాలేజీలో ఫీజురీయింబర్స్మెంట్ దరఖాస్తులను పరిశీలించారు. ఆయన వెంట సాంఘిక సంక్షేమ సహాయ అధికారి గంగిరెడ్డి, హెచ్డబ్యూఓ కె.రామప్రసాద్ ఉన్నారు. -
ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్లకు త్వరితగతిన అనుమతులు
కలికిరి : కలికిరి సమీపంలోని ఏపీఐఐసీ లేఔట్లలో ఫుడ్ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే పారిశ్రామిక వేత్తలకు త్వరితగతిన అనుమతులు మంజూరు చేయనున్నట్లు రాష్ట్ర ఫుడ్ ప్రాసెసింగ్ ప్రిన్సిపల్ సెక్రటరీ చిరంజీవి చౌదరి అన్నారు. కలికిరి సమీపాన, వాల్మీకిపురం మండలం తాటిగుంటపల్లి గ్రామ పరిధిలోని ఏపీఐఐసీ లేఔట్లో వున్న చేగు ఫుడ్స్, ఎస్ఆర్కే ఫుడ్స్ యూనిట్లలో నూతనంగా ఏర్పాటు చేయడానికి, మరో ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ అనుమతులకు గాను శనివారం ఆయన చేగు ఫుడ్స్, ఎస్ఆర్కే ఫుడ్స్ కేంద్రాలను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఫుడ్ ప్రాసెసింగ్ యూనిట్ల ఏర్పాటుకు ముందుకు వచ్చే వారికి ప్రభుత్వం తరఫున అనుమతులు, రాయితీలు ఉంటాయన్నారు. ఔత్సాహికులు సద్వినియోగం చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో జిల్లా ఉద్యానశాఖ అధికారిణి సుభాషిణి, జిల్లా పరిశ్రమల అధికారి క్రిష్ణ కిశోర్, ఉద్యాన శాఖ పీలేరు హెచ్ఓ సుకుమార్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్ఆర్ జిల్లాలోనే సిద్దవటం కొనసాగించాలి
సిద్దవటం : అన్నమయ్య జిల్లాలో సిద్దవటం మండలాన్ని కలుపుతూ చంద్రబాబు ప్రభుత్వం గెజిట్ నోటిఫికేషన్ ఇవ్వడంపైన సిద్దవటం మండలంలోని ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తూ సిద్దవటం మండలం మాధవరం–1 గ్రామ పంచాయతీ బంగారుపేట శ్రీ గంగాభవానీ అమ్మవారి సన్నిధిలో 14 మందితో జేఏసీ ఏర్పాటు చేసి కార్యాచరణ రూపకల్పన చేశారు. జేఏసీ అధ్యక్షులుగా సొట్టు అమరనాథశర్మను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా పలువురు సభ్యులు మాట్లాడుతూ ప్రజలకు సౌకర్యాలు కల్పించాల్సిన ప్రభుత్వం ఇబ్బందులకు గురిచేయడం తగదని మండిపడ్డారు. సిద్దవటం మండలాన్ని రాయచోటిలో కలిపే నిర్ణయాన్ని వెనక్కు తీసుకోవాలని.. లేదంటే ఉద్యమాలు, రాస్తారోకోలు, రిలే నిరాహార దీక్షలు, మానవ హారాలు నిర్వహించే విధంగా పోరాటాలు ఉధృతం చేస్తామని తెలిపారు. చేరువలో ఉన్న కడపను కాదని రాయచోటిలో కలపడం ఏమిటని మండిపడ్డారు. సిద్దవటం మండలం కడపలోనే ఉండాలన్నారు. ఈ కార్యక్రమంలో విద్యావంతులు, చేనేత కార్మికులు, పత్రికా విలేకరులు, మేధావులు, స్వచ్ఛంధ సంస్థ సభ్యులు పాల్గొన్నారు. ఏకలవ్య గిరిజన సేవా సంఘం కార్యవర్గం ఎంపికమదనపల్లె రూరల్ : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం నూతన అధ్యక్షురాలుగా ఆవుల ధనలక్ష్మి నియమితులయ్యారు. శనివారం ఏపీ ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ జయప్ప, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ ఆనంద్కుమార్ నియామకానికి సంబంధించి ఉత్తర్వులు విడుదల చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ధనలక్ష్మి భర్త ఆవుల మల్లికార్జున గతంలో ఏకలవ్య గిరిజన పరిరక్షణ సేవా సంఘం రాష్ట్ర అధ్యక్షులుగా విశేష సేవలందించారన్నారు. కులస్తుల సమస్యలపై తక్షణమే స్పందించి, అన్ని విషయాల్లోనూ అండగా నిలిచారన్నారు. ప్రస్తుతం మల్లికార్జున, వైఎస్సార్ సీపీ ఎస్టీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా నియమితులైన నేపథ్యంలో ఆయన గిరిజన సేవా సంఘం అధ్యక్ష పదవికి రాజీనామా చేశారన్నారు. దీంతో ఆయన స్థానంలో ఆవుల ధనలక్ష్మిని రాష్ట్ర అధ్యక్షురాలిగా నియమించినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆవుల ధనలక్ష్మి మాట్లాడుతూ... ఎరుకుల కులస్తులకు నిత్యం అందుబాటులో ఉంటూ, ప్రభుత్వం నుంచి అందాల్సిన సంక్షేమ పథకాలు, కార్యక్రమాల మంజూరుకు తనవంతు కృషి చేస్తానన్నారు. రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్, బీసీల ఆశాజ్యోతి జ్యోతిబాపూలే స్ఫూర్తితో పని చేస్తానన్నారు. రాష్ట్రంలోని బంజారా, ఎరుకుల, యానాది, ఇతర ఎస్టీ కులాలను సమన్వయం చేసుకుని ముందుకెళతామన్నారు. బీసీ హాస్టళ్ల వార్డెన్ల రాష్ట్ర అధ్యక్షుడిగా మనోహర్రెడ్డిరాయచోటి టౌన్ : రాష్ట్ర సంక్షేమ హాస్టళ్ల (వపతి గృహాలు), వార్డెన్ల (అధికారుల) సంఘం రాష్ట్ర అధ్యక్షుడిగా రాయచోటి బీసీ హాస్టల్ వార్డెన్ ఎంఆర్ మనోహర్రెడ్డి ఎంపికయ్యారు. విజయవాడలోని ఎన్జీవో హోంలో రాష్ట్ర స్థాయి జనరల్ బాడీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో తనను ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారని మనోహర్రెడ్డి తెలిపారు. గతంలో కూడా ఒక మారు రాష్ట్ర అధ్యక్షులుగా పని చేశానని, ఆ సమయంలో రాష్ట్ర స్థాయి వార్డెన్ల సమస్యలతోపాటు విద్యార్థుల సమస్యలను పరిష్కరించడంలో తాను ఎంతో కృషి చేశానని చెప్పారు. ఆ నమ్మకంతోనే మళ్లీ ఏకగ్రీవంగా రాష్ట్ర అధ్యక్షులుగా ఎన్నుకున్నారని తెలిపారు. వారి నమ్మకానిన్న వమ్ము కానీయకుండా ఏ సమస్య వచ్చినా ముందుండి పరిష్కారానికి కృషి చేస్తానని చెప్పారు. -
అవిశ్వాస తీర్మానం ప్రవేశ పెట్టినందుకే అసత్య ఆరోపణలు
మదనపల్లె రూరల్ : కురవంక ఉపసర్పంచ్పై అవిశ్వాస తీర్మానం ప్రవేశపెట్టి, పదవి నుంచి తప్పించినందుకు అక్కసుతో సర్పంచ్ పసుపులేటి చలపతిపై, టీడీపీ నాయకురాలు బైగారి భారతి అసత్య ఆరోపణలు చేస్తున్నారని వార్డు మెంబర్లు గొంగడి కృష్ణమూర్తి, నాగరాజ తెలిపారు. శనివారం కురవంక గ్రామ సచివాలయం సమీపంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో వారు మాట్లాడారు. 2021 స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచ్ పసుపులేటి చలపతి ఇండిపెండెంట్ అభ్యర్థిగా పోటీ చేసి విజయం సాధించి, వార్డు మెంబర్లందరినీ గెలిపించుకున్నారన్నారు. విద్యావంతురాలు ఉపసర్పంచ్గా ఉంటే బాగుంటుందని, వార్డు మెంబర్లందరినీ ఒప్పించి బైగారి భారతికి సముచిత స్థానం కల్పించారన్నారు. మూడు నెలల క్రితం జరిగిన పంచాయతీ సమావేశంలో.. అభివృద్ధి, ఖర్చు చేసిన నిధులపై తీర్మానం సిద్ధం చేస్తే తాను సంతకం చేస్తానని చెప్పి తర్వాత అతీగతీ లేదన్నారు. పంచాయతీ అభివృద్ధికి సహకరించకపోగా, సమావేశాలకు హాజరుకాకపోవడంతో వార్డు మెంబర్లం అవిశ్వాస తీర్మానం నోటీసు పంపామన్నారు. దీన్ని జీర్ణించుకోలేని బైగారి భారతి.. సర్పంచ్ పసుపులేటి చలపతితో తనకు ప్రాణహాని ఉందని సామాజిక మాథ్యమాల్లో వ్యాఖ్యానించడం హాస్యాస్పదమన్నారు. పంచాయతీలో ఐదుగురు మహిళా వార్డు మెంబర్లు ఉన్నారని, ఏరోజు ఎలాంటి ఇబ్బందులు రాలేదన్నారు. కురవంక పంచాయతీలో కోట్లాది రూపాయల అభివృద్ధి జరిగిందని, మండలంలోని అన్ని పంచాయతీలకు ఆదర్శ పంచాయతీగా తీర్చిదిద్దడం జరిగిందన్నారు. గత టీడీపీ ప్రభుత్వంలో సర్పంచ్గా పని చేసిన పసుపులేటి మోహన్ అవినీతి గురించి పంచాయతీలోని ప్రజలందరికీ తెలుసన్నారు. కురవంక టీడీపీ ఇన్చార్జి పసుపులేటి వినోద్కుమార్, తన తండ్రి చేసిన అవినీతి, అమ్ముకున్న ప్రభుత్వ స్థలాలు, ప్రజల నుంచి చేసిన అక్రమ వసూళ్ల గురించి తెలుసుకుని, తర్వాత మాట్లాడాలన్నారు. బైగారి భారతి వారం రోజుల క్రితమే రాజీనామా చేశానని అబద్ధాలు చెప్పారని, అలాగైతే సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి అవిశ్వాస తీర్మానానికి ఎందుకు హాజరయ్యారని ప్రశ్నించారు. టీడీపీ నాయకురాలిగా బైగారి భారతి ఏం చేసుకున్నా తమకు సంబంధం లేదని, పంచాయతీ వార్డు మెంబర్గా ఉంటూ, అభివృద్ధిని అడ్డుకోవాలని చూస్తే మాత్రం ఊరుకునేది లేదని హెచ్చరించారు. ఇప్పటికై నా అసత్య ఆరోపణలు మానుకుని, పంచాయతీ అభివృద్ధికి సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వార్డు సభ్యులు అనిత, శ్రీనివాసులు, చంద్రిక, పంచాయతీ ప్రజలు పాల్గొన్నారు. -
ఆటల్లో ’విభిన్న’ ప్రతిభ
పీలేరు రూరల్: జిల్లా పారా ఒలింపిక్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం రాయచోటిలో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించారు. పీలేరు జెడ్పీ ప్రధాన హైస్కూల్కు చెందిన విభిన్న ప్రతిభావంతులు ఆటల్లో పాల్గొని, బహుమతులను కై వసం చేసుకున్నట్లు హెచ్ఎం డాక్టర్ నీలం జయపాల్ రెడ్డి తెలిపారు. ఆయిషా వంద మీటర్ల రన్నింగ్ రేస్, జ్ఞాన శేఖర్ షాట్పుట్, లాంగ్ జంప్లో రాణించారన్నారు. డీఈవో సుబ్రమణ్యం చేతుల మీదుగా బహుమతులను అందుకున్నట్లు తెలిపారు. అనంతరం వారిని ఉపాధ్యాయ బృందం అభినందించింది. ఉపాధ్యాయులు లలిత కుమారి, ప్యారూఖాన్, శ్రీరాములు, జయరాంనాయక్, భాస్కర్, హేమలత పాల్గొన్నారు. -
ముంచెత్తిన మంచు
మదనపల్లె: తుపును ప్రభావంతో మదనపల్లె, తంబళ్లపల్లె నియోజకవర్గాలను మంచు ముంచెత్తుతోంది. శుక్ర, శనివారాల్లో అయితే మంచులో రాకపోకలు సాగించడానికి అవస్థలు పడాల్సిన పరిస్థితి నెలకొంది. పగలు, రాత్రి తేడా లేకుండా మంచు వీడకపోవడంతో ప్రజల దైనందిన కార్యకలాపాలకు ఆటంకం కలుగుతోంది. చల్లటిగాలికి ప్రజలు వణుకుతున్నారు. రోడ్లపైకి వచ్చేందుకు జంకుతున్నారు. అయితే ప్రజారవాణా వ్యవస్థ ద్వారా రాకపోకలు తగ్గలేదు. బి.కొత్తకోట–మదనపల్లె, మదనపల్లె–ములకలచెరువు, తంబళ్లపల్లె మార్గాల్లో రద్దీ అధికంగానే ఉంది. మదనపల్లె పట్టణంలో జనం రద్దీ సాధారణంగానే ఉండగా చలి ఫలితం ప్రజలు వేడి కలిగించే దుస్తులతో దైనందిన కార్యకలాపాల్లో మునిగిపోయారు. హార్సిలీహిల్స్పై గజగజ బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై ఉష్ణోగ్రతలు పడిపోతున్నాయి. సముద్రమట్టానికి 4,141 అడగుల ఎత్తులోని హార్సిలీహిల్స్పై రాత్రి–పగలు దట్టమైన మంచు కమ్మేసింది. చలి విపరీతంగా పెరిగింది. చలిదెబ్బకు పర్యాటకులు గజగజ వణికిపోతున్నారు. దట్టమైన మంచుతో రోడ్లు కనిపించడం లేదు. ఘాట్రోడ్డుపై ప్రయాణించేందుకు పర్యాటకులు ఆందోళనకు చెందుతున్నారు. ప్రమాదాలు జరిగే ఆస్కారం ఉంటుందని సందర్శకులు హార్సిలీహిల్స్ పర్యటన వాయిదా వేసుకుంటున్నారు. రాత్రి తొమ్మిది గంటల నుంచి తెల్లవారుజాము ఏడు గంటల వరకు చలి విపరీతమైంది. దాంతో స్థానికులు, పర్యాటకులు ఇళ్లు, అతిథిగృహలనుంచి బయటకు వచ్చేందుకు జంకుతున్నారు. దీనితో రహదారులు, ప్రకృతి సందర్శనా ప్రాంతాలు బోసిపోతున్నాయి. వణికిస్తున్న చలి హార్సిలీహిల్స్పై పడిపోయిన ఉష్ణోగ్రతలు -
‘నువ్వుల’ సాగుకు ఇదే అదును
● డిసెంబర్ రెండో వారం వరకు అనుకూలం ● రైతులు త్వర పడాలంటున్న శాస్త్రవేత్తలు ● సాంకేతిక పద్ధతులతో అధిక దిగుబడికడప అగ్రికల్చర్ (వైఎస్ఆర్ జిల్లా) : జిల్లాలో నువ్వు పంటల సాగుకు ఇటీవల అదును ప్రారంభమైంది. ఈ రబీలో జిల్లా వ్యాప్తంగా 4,566 హెక్టార్లలో సాగవుతుందని అధికారులు ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేశారు. ఇప్పటికే చాలా వరకు సాగైంది. నువ్వుల పంట సాగుకు ఇప్పుడు అనుకూలమని శాస్త్రవేత్తలు, వ్యవసాయ అధికారులు సూచిస్తున్నారు. రైతన్నలు త్వరపడి సాగు చేసుకోవాలని పేర్కొంటున్నారు. ఈ అదునులో సాగు చేస్తే సగటున ఎకరాకు 600 కిలోల దిగుబడి ఇస్తుందని తెలిపారు. నువ్వులో నూనె 49–55 శాతం, ప్రోటీన్ 20–25 శాతం, అధిక పోషక విలువలు, ఔషధ గుణాలు ఉండటం వల్ల వివిధ రకాల వంటకాల్లో వాడుతున్నందున మార్కెట్లో మంచి ధర ఉంటుంది. కావున రైతులు డిసెంబర్ 2వ వారం వరకు సాగు చేసుకోవచ్చని వారు సూచించారు. సాగుకు అనువైన నేలలు నీరు నిలవని తేలిక, బరువు నేలలు శ్రేష్టం. ఆమ్ల, క్షార నేలలు కాకుండా ఉండాలి. సాగుకు నేల తయారీ.. నువ్వు పంటను సాగు చేసుకునే పొలాన్ని 2–4 సార్లు మెత్తగా దున్ని, 2 సార్లు గుంటకతో చదును చేసుకుని సాగు చేసుకోవాలి. విత్తనం, విత్తే పద్ధతి.. ఎకరాకు 2 కిలోల విత్తనం సరిపోతుంది. విత్తనానికి సమపాళ్లలో ఇసుక లేదా నూకలు కలిపి గొర్రెతో వరుసలలో విత్తుకోవాలి. విత్తన శుద్ధి కిలో విత్తనానికి 3 గ్రాముల కార్బెండజిమ్/మాంకోజెబ్తో విత్తన శుద్ధి చేసి విత్తడం వల్ల నేల నుంచి సంక్రమించే తెగుళ్లను 21 రోజుల వరకు నివారించవచ్చు. పంట తొలిదశలో రసం పీల్చే పురుగుల నుంచి రక్షణ కోసం ఇమిడాక్లోప్రిడ్ 70 డబ్ల్యూఎస్, 5గ్రా./కిలో విత్తనానికి కలిపి విత్తనశుద్ధి చేసుకోవాలి. విత్తే సమయం.. ప్రారంభ ఖరీఫ్లో మే రెండవ పక్షం, రబీ లేదా వేసవిలో నీటిపారుదల కింద డిసెంబర్ రెండవ పక్షం నుంచి జనవరి రెండవ పక్షం వరకు విత్తుకోవచ్చు. నువ్వు పంటను రబీ–వేసవికాలంలో సాగు చేసినపుడు అధిక దిగుబడి వస్తుంది. నువ్వు పంటలో అధిక దిగుబడులకు అవసరమైన ఉష్ణోగ్రత, సమానంగా విస్తరించిన వర్షపాతం అవసరం. ఉష్ణోగ్రత 25 డిగ్రీల –27 డిగ్రీల మధ్యలో ఉండే పక్షంలో మొలక శాతం, తొలిదశలో పెరుగుదల, పూత బాగా ఉంటాయి. ఉష్ణోగ్రత 20 డిగ్రీల కంటే తగ్గితే పెరుగుదల తగ్గుతుంది. అలాగే పూతదశలో 37 డిగ్రీల సెంటీగ్రేడ్ కంటే అధిక ఉష్ణోగ్రత ఉన్నట్లయితే ఫలదీకరణ జరగక గింజ కట్టదు. ఎరువుల వాడక విధానం ఖరీఫ్లో ఆఖరి దుక్కిలో ఎకరాకు 4 టన్నుల పశువుల ఎరువు, 16 కిలోల నత్రజని, 8 కిలోల పాస్ఫేట్, 8 కిలోల భాస్వరాన్నిచ్చే ఎరువులు వేసుకోవాలి. నత్రజని సగభాగం మొత్తం భాస్పరం, పొటాషినిచ్చే ఎరువులను ఆఖరి దుక్కిలో వేసి బాగా కలియదున్నాలి. మిగతా సగభాగం నత్రజని ఎరువులు విత్తిన నెల రోజులకు కలుపు తీసి వేయాలి. భాస్వరం ఎరువులు సింగిల్ సూపర్ పాస్ఫేట్ రూపంలో వాడినపుడు అధికంగా కాల్షియం, గంధకం లభించి దిగుబడి పెరుగుతుంది. నీటి యాజమాన్యం పద్ధతులు విత్తిన వెంటనే మొదటి తడి ఇవ్వాలి. పూత, కాయ అభివద్ధి, గింజకట్టే దశల్లో తడులు ఇవ్వాలి. విత్తిన తర్వాత 35–40 రోజుల నుంచి 55–60 రోజుల వరకు నీటి ఎద్దడి లేకుండా చూడాలి. నువ్వు పంటకు తేలికపాటి తడులు మాత్రమే ఇవ్వాలి. పంట నీటిముంపునకు గురి అయినట్టయితే మొక్కలు చనిపోయే అవకాశం ఉంది. కలుపు నివారణ, అంతర కృషి పెండిమిథాలిన్ 30 శాతం 4–5 మి.లీ./లీటరు నీటికి చొప్పున విత్తిన 48 గంటల్లోపు తడినేలపై పిచికారీ చేయాలి. విత్తిన తర్వాత వర్షం పడే సూచనలు ఉన్నట్లయితే పెండి మిథాలిన్ను పిచికారీ చేయకూడదు. పెండిమిథాలిన్ పిచికారీ చేసిన వెంటనే నీటి తడి పెట్టకూడదు లేదా ప్రీటిలాఫ్లోర్ 50 శాతం ఇ.సి. 2 మి.లీ./లీటరు నీటికి చొప్పున ఎకరాకు 400 లీ. మందును 200 లీటర్ల నీటిలో కలిపి విత్తిన మూడవ రోజు లోపు వెనక్కి నడుస్తూ పిచికారీ చేయాలి. మొక్కలు మొలచిన 15 రోజులకు అదనపు మొక్కలను తీసి వేయాలి.లాభదాయకమైన పంట నువ్వు పంట రైతులకు లాభదాయకమైన నూనె గింజల పంటగా నిలుస్తోంది. సమయానికి విత్తనం, నాణ్యమైన రకాలు, సరైన ఎరువుల వినియోగం, కలుపు నివారణ, నీటి యాజమాన్యం, పురుగు–రోగ నియంత్రణ పద్ధతులను అనుసరించడం ద్వారా పంట ఉత్పత్తి పెరిగి రైతు ఆదాయం గణనీయంగా పెంచుకోవచ్చు. ఆధునిక ఉత్పత్తి సాంకేతికతలను సమర్థంగా అమలు చేయడం వల్ల నువ్వు పంటలో దిగుబడి విప్లవం సాధ్యమవుతుంది. రైతులు వ్యవసాయ శాస్త్రవేత్తల మార్గదర్శకత్వంలో ఈ సాంకేతికతలను అనుసరించి సాగు చేస్తే, పంట నాణ్యత, దిగుబడి, మార్కెట్ లాభాలు మూడు కూడా పెరుగుతాయి. – డాక్టర్ ఎన్.కృష్ణప్రియ, కో ఆర్డినేటర్, ఏరువాక కేంద్రం, కడప -
రెచ్చిపోయిన మట్టిమాఫియా
రాయచోటి : మట్టి మాఫియా రెచ్చిపోయింది.మట్టికోసం తెలుగు తమ్ముళ్లు కత్తులు, రాడ్లతో బాహబాహీకి దిగారు. అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో మట్టి మాఫియా రెచ్చిపోతోందనడానికి శుక్రవారం సాయంత్రం రాయచోటి – గాలివీడు మార్గంలోని రింగ్ రోడ్డు వద్ద జరిగిన దాడి సంఘటన నిదర్శనంగా చెప్పుకోవచ్చు. మట్టి తరలింపులో తెలుగు తమ్ముళ్ల గ్రూపుల మధ్య తలెత్తిన వివాదం దాడులకు దారి తీసింది. దాడిలో తమ్ముడు పదిలం శివ శంకర్ కత్తిపోట్లకు గురై ఆసుపత్రిలో చికిత్స పొందుతుండగా, మరో తమ్ముడు చలమారెడ్డి స్వల్ప గాయాలతో బయట పడినట్లు సమాచారం. రాయచోటి రూరల్ మండల పరిధిలోని వరిగ గ్రామం శెట్టి వాండ్లపల్లి సమీపంలోని చౌడచెరువు నుంచి ప్రతిరోజు తెలుగు తమ్ముళ్లు పోటాపోటీగా మట్టిని తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. శుక్రవారం సాయంత్రం వసంత వెంకట చలమారెడ్డి, మరో వర్గానికి చెందిన పదిలం శివ శంకర్ ల మధ్య వివాదం తలెత్తింది. వీరిద్దరూ ఒకరిపై ఒకరు దాడి చేసుకున్నారు. చలమారెడ్డి తన చేతిలోని కత్తితో పదిలం శివను గాయపరిచినట్లు పోలీసులు తెలిపారు. శివకు రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు. శివ ఫిర్యాదు మేరకు చలమారెడ్డి పై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు రాయచోటి పోలీసులు తెలిపారు.● కత్తులు రాడ్లతో తమ్ముళ్ల దాడులు ● పదిలం శివ శంకర్కు కత్తిపోట్లు -
రాష్ట్ర కార్యవర్గంలో చోటు
కడప కోటిరెడ్డిసర్కిల్ : ఆంధ్రప్రదేశ్ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా భూమిరెడ్డి శ్రీనాథ్రెడ్డి ఎన్నికయ్యారు. విజయవాడలో జరిగిన కార్యవర్గ సమావేశంలో ఆయనను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఏపీయూడబ్ల్యూజే రాష్ట్ర అధ్యక్షులు సుబ్బారావు, ఐజేయూ సెక్రటరీ జనరల్ సోమసుందర్, ఏపీ ప్రెస్ అకాడమీ చైర్మన్ ఆలపాటి సురేష్ ఆధ్వర్యంలో రాష్ట్ర మహాసభతోపాటు నూతన కమిటీ ఎన్నిక జరిగింది. ఉమ్మడి వైఎస్సార్ జిల్లా నుంచి కే టీవీ ఎడిటర్గా ఉన్న భూమిరెడ్డి శ్రీనాథ్ను రాష్ట్ర కార్యదర్శిగా నియమించారు. ఈ సందర్భంగా శ్రీనాథ్రెడ్డి మాట్లాడుతూ ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపారు. రాష్ట్ర వ్యాప్తంగా ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ను బలోపేతం చేయడానికి శక్తివంచన లేకుండా కృషి చేస్తానని పేర్కొన్నారు. ప్రెస్ అకాడమీ సహకారంతో ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్టుల వృత్తి నైపుణ్య తరగతుల నిర్వహణకు ప్రయత్నం చేస్తానని వివరించారు. తన నియామకానికి సహకరించిన పూర్వ రాష్ట్ర కార్యదర్శి రామసుబ్బారెడ్డి, ఏపీయూ డబ్ల్యూజే జిల్లా అధ్యక్షులు బాలకృష్ణారెడ్డి, కార్యదర్శి శ్రీనివాసులు, రాష్ట్ర కార్యవర్గ సభ్యులు వెంకటరెడ్డితో పాటు ఇతర నాయకత్వానికి కృతజ్ఞతలు తెలిపారు. చైన్ స్నాచింగ్ సింహాద్రిపురం : మహిళ మెడలోని బంగారు గొలుసు లాక్కెళ్లిన ఘటన సింహాద్రిపురం మండలం కసనూరు గ్రామంలో శుక్రవారం చోటు చేసుకుంది. కసనూరు గ్రామానికి చెందిన కొమ్మా రజిత తన గేదెలను గ్రామ చివరలో ఉన్న పొలాల వద్దకు మేపుకోవడానికి వెళుతుండేది. ఈ నేపథ్యంలో శుక్రవారం కూడా ఆమె గేదెలను తన పొలాల వద్ద మేపుకొంటుండగా.. కసనూరు – ముసల్రెడ్డిపల్లె గ్రామానికి వెళ్లే రోడ్డు నుంచి ఇద్దరు వ్యక్తులు బైకుపై వచ్చారు. ఆమె వెనకవైపు బైకు నిలబెట్టి ఒక వ్యక్తి బంగారు గొలుసును తీసుకుని ముసల్రెడ్డిపల్లె రూట్ వైపు వెళ్లిపోయారు. తాళిబొట్టు, గొలుసు కలిపి మూడు తులాలపైగా ఉంటుందని బాధితురాలు భర్త కొమ్మా సాంబశివారెడ్డి పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారణ చేపడుతున్నారు. ఎలక్ట్రానిక్ మీడియా జర్నలిస్ట్ అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా శ్రీనాథ్రెడ్డి -
అధికారమే దన్ను.. ఈద్గా భూమిపై కన్ను
● రెండు ఎకరాలు యథేచ్ఛగా కబ్జా ● మైనార్టీల భూములు అన్యాక్రాంతం ● అక్రమంగా కంచె ఏర్పాటు ● పట్టించుకోని రెవెన్యూ అధికారులుసాక్షి టాస్క్ఫోర్స్ : రైల్వేకోడూరు మండల పరిధి మైసూరువారిపల్లి గ్రామ సమీపంలో ముస్లిం మైనార్టీలకు చెందిన ఈద్గా స్థలాన్ని.. అదే గ్రామానికి చెందిన జనసేన నాయకుడు దర్జాగా కబ్జా చేస్తున్నాడు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి.. రాష్ట్రంలో కూటమి పార్టీల నాయకులు ఇష్టారాజ్యంగా కబ్జాలకు పాల్పడుతున్నారు. ముస్లిం మైనార్టీలకు ఇచ్చిన భూమిని కూడా అన్యాక్రాంతం చేస్తున్నారు. జగనన్న హయాంలో ఈద్గాకు కేటాయింపు రైల్వేకోడూరు పట్టణంలోని ముస్లింలు.. దశాబ్దాలుగా ఈద్గా స్థలం లేక అగచాట్లు పడుతూ వచ్చారు. గత వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఉన్నప్పుడు.. ఈద్గా కోసం నాలుగు ఎకరాల స్థలాన్ని కేటాయించారు. ముస్లింలందరూ కలిసి అనేక సార్లు ఎంపీ మిథున్రెడ్డికి విన్నవించుకోగా మాజీ ఎమ్మెల్యే కొరముట్ల శ్రీనివాసులు సహకారంతో.. మైసూరువారిపల్లి సర్వే నంబర్ 2085/4లో ప్రభుత్వ భూమిని ఈద్గాకు రిజిస్ట్రేషన్ చేయించి ఇవ్వడం జరిగింది. పట్టణంలోని ముస్లింలు అందరూ పార్టీలకు అతీతంగా హర్షం వ్యక్తం చేశారు. ఈద్గా నిర్మాణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వ హయాంలో ఇచ్చిన ఈద్గా స్థలాన్ని ముస్లింలు చదును చేసుకొని ఈద్గా నిర్మాణం చేపట్టారు. ఈ ఏడాది రంజాన్, బక్రీద్ పండుగలను ఈద్గా ప్రాంతంలో రైల్వేకోడూరు పట్టణ ముస్లింలందరూ కలిసి జరుపుకొన్నారు. అక్కడ నమాజులు ఆచరించారు. అధికారులు అడ్డుకోవాలి ఈద్గా భూమిలో దాదాపు రెండు ఎకరాలకు గ్రామానికి చెందిన జనసేన పార్టీ నాయకుడు అక్రమంగా ముళ్ల కంచెను ఏర్పాటు చేయడం జరిగింది. ఆయన ఆక్రమించుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు. తెలుగుదే శం పార్టీ అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నాయకులకు అడ్డూ అదుపు లేకుండా పోయింది. కబ్జాలను అడ్డుకోవాల్సిన రెవెన్యూ అధికారులు ఏమీచేయలేక చేతులెత్తేశారు. ఇప్పటికై నా జిల్లా కలెక్టర్, ఉన్నత స్థాయి, రెవెన్యూ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలించి కబ్జాను అడ్డుకోవాలని రైల్వేకోడూరు పట్టణ ముస్లింలు కోరుతున్నారు. -
చోరీ కేసులో ఐదుగురి అరెస్ట్
కడప అర్బన్ : కడప నగరంలోని విశ్వం థియేటర్లో వున్న ఆప్లిఫియర్స్, మోటార్లు, కరెంటు వైర్లు, బ్యాటరీలు, దొంగతనాలకు పాల్పడిన ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కడప ఒన్టౌన్ సీఐ వి.చిన్నపెద్దయ్య అన్నారు. శుక్రవారం కడప ఒన్టౌన్ పోలీస్స్టేషన్లో నిర్వహించిన విలేకరుల సమావేశంలో సీఐ వివరాలు తెలియజేశారు. చోరీ కేసులో నిందితులుగా కడప నగరం కోటగడ్డ వీధికి చెందిన షేక్ తబ్రిష్, బిస్మిల్లానగర్కు చెందిన షేక్ ఉమర్, వైఎస్ఆర్ కాలనీకి చెందిన షేక్ సద్దాం హుసేన్, చిలకలబావి వీధికి చెందిన షేక్ ముర్ఫత్ఖాన్, రవీంద్రనగర్కు చెందిన షేక్ గౌస్పీర్లు వున్నారన్నారు. వీరంతా ముఠాగా ఏర్పడి కడప నగరంలోని మూతపడిన విశ్వం థియేటర్లోకి అక్రమంగా ప్రవేశించి సామగ్రిని దొంగలించారన్నారు. వీరిని గుర్రాలగడ్డ వీధి జెండాచెట్టు వద్ద అరెస్ట్ చేసినట్లు తెలిపారు. వీరి నుంచి రికవరీ చేసిన వస్తువులలో కరెంట్ వైర్లు కరిగించి తీయగా వచ్చిన కాపర్ వైరు, రెండు బ్యాటరీలు వాటి విలువ సుమారు రూ.70,000 వుంటుందన్నారు. కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప ఒన్టౌన్ సీఐ వి. చిన్నపెద్దయ్య, ఎస్ఐ ప్రతాప్రెడ్డి నిందితులను అరెస్ట్ చేశారు. ఈ కేసు ఛేదనలో కృషి చేసిన సీఐ, ఎస్ఐతోపాటు హెడ్ కానిస్టేబుల్ ఖాజా హుస్సేన్, కానిస్టేబుళ్లు బాల చంద్ర, ఎన్.చిన్న నారాయణరెడ్డి, ఎల్వీ ప్రసాద్లను డీఎస్పీ ఏ.వెంకటేశ్వర్లు అభినందించారు. డ్రోన్ కెమెరాలతో ప్రత్యేక నిఘా గంజాయి, అసాంఘిక కార్యకలాపాలు, బహిరంగ ప్రదేశాల్లో మద్యపానం సేవించే వారిపై కఠిన చర్యలకు పోలీస్ అధికారులు స్పెషల్ పార్టీ సిబ్బంది ద్వారా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తూ, డ్రోన్ కెమెరాల ద్వారా సాంకేతిక పరిజ్ఞానం వినియోగిస్తున్నారు. జిల్లా ఎస్.పి షెల్కే నచికేత్ విశ్వనాథ్ ఆదేశాల మేరకు కడప డి.ఎస్.పి ఎ.వెంకటేశ్వర్లు పర్యవేక్షణలో కడప వన్టౌన్ సి.ఐ చిన్నపెద్దయ్య ఆధ్వర్యంలో కడప నగరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలో గంజాయి సేవనం, బహిరంగ మద్యపానం, అసాంఘిక కార్యకలాపాలు జరిగే అనుమానిత ప్రాంతాల్లో పోలీస్ అధికారులు, కడప సబ్ డివిజన్ స్పెషల్ పార్టీ సిబ్బంది దాడులు నిర్వహిస్తున్నారు. అత్యాధునిక డ్రోన్ కెమెరాలతో పాటు పోలీస్ సిబ్బంది రంగంలోకి దిగి జల్లెడ పడుతూ దాడులు చేయిస్తూ నిందితులను గుర్తించే కార్యక్రమం చేపట్టారు. అనుమానిత ప్రాంతాల నుంచి పారిపోయిన నిందితులను డ్రోన్ కెమెరాల ద్వారా గుర్తించి వారిని పట్టుకుని కౌన్సెలింగ్ ఇచ్చి, వారిపై చట్టపరమైన చర్యలు తీసుకుంటున్నారు. శుక్రవారం నగరంలోని పాత రిమ్స్, పాత మునిసిపల్ కార్యాలయం పరిసర ప్రాంతాల్లో డ్రోన్ కెమెరాలతో నిఘా ఉంచడం ద్వారా అనుమానితులను గుర్తించే చర్యలు చేపట్టారు. కడప నగరంలోని అనుమానిత ప్రాంతాలను పోలీస్ శాఖ ఆధ్వర్యంలో జల్లెడ పట్టడం జరుగుతుందని కడప డి.ఎస్.పి వెంకటేశ్వర్లు తెలిపారు. -
ఉపసర్పంచ్పై నెగ్గిన అవిశ్వాస తీర్మానం
● సర్పంచ్ చలపతితో సహా 9 మంది వ్యతిరేకంగా ఓటు ● సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి సమక్షంలో ఆమోదంమదనపల్లె రూరల్ : కురవంక పంచాయతీ ఉపసర్పంచ్, టీడీపీ నాయకురాలు బైగారి భారతిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం నెగ్గింది. కురవంక గ్రామ సచివాలయంలో ఉదయం 11 గంటలకు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, డీఎల్పీఓ నాగరాజు సమక్షంలో గ్రామ సర్పంచ్ పసుపులేటి చలపతి అధ్యక్షతన ప్రత్యేక సమావేశం జరిగింది. గతంలో ఉపసర్పంచ్ బైగారి భారతిపై అవిశ్వాసం ప్రకటిస్తూ సర్పంచ్తోపాటు వార్డు సభ్యులు సబ్ కలెక్టర్ కార్యాలయంలో వినతిపత్రం ఇచ్చారు. ఈ మేరకు శుక్రవారం కురవంక గ్రామసచివాలయంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో.. ఉపసర్పంచ్ బైగారి భారతిపై పెట్టిన అవిశ్వాస తీర్మానం గురించి అధికారులు వార్డు సభ్యులకు వివరించారు. ఉపసర్పంచ్ బైగారి భారతి ప్రత్యేక సమావేశానికి హాజరు కాలేదు. వార్డు సభ్యులు కృష్ణమూర్తి, షాజహాన్బాషా, చంద్రకళ, గుల్జార్, అనిత, శ్రీనివాసులు, చంద్రిక, గులాబ్జాన్, నాగరాజ తదితరులు అవిశ్వాస తీర్మానానికి మద్దతు తెలుపుతూ చేతులు పైకి ఎత్తారు. మెజార్టీ సభ్యుల తీర్మానం మేరకు ఉపసర్పంచ్ బైగారి భారతిని పదవి నుంచి తొలగించినట్లు అధికారులు వెల్లడించారు. గ్రామసభ తీర్మానం అంశాలను జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్కు పంపించనున్నట్లు సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి తెలిపారు. కార్యక్రమంలో ఎంపీడీఓ తాజ్మస్రూర్, పంచాయతీ సెక్రటరీలు పవన్కుమార్, గిరిధర్నాయక్, సిబ్బంది పాల్గొన్నారు. -
ప్రారంభమైన ఏసీఏ అండర్–14 జోనల్ మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–14 రెండో విడత జోనల్ మ్యాచ్లు శుక్రవారం ప్రారంభం అయ్యాయి. తొలి రోజు కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో సౌత్జోన్ విన్నర్స్–రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సౌత్జోన్ విన్నర్స్ బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 48.2 ఓవర్లకు 123 పరుగులకు ఆలౌట్ అయింది. ప్రణవ్ గోవర్దన్ 48, కేవీఎస్ మణిదీప్ 14 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టులోని పి.దీక్షిత్ 3, సాత్విక్ 3, యోజిత్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టు 41 ఓవర్లకు 4 వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. ప్రజ్ఞాన్ పండిత్ 39, విఘ్నేష్ 34 పరుగులు చేశారు. సౌత్జోన్ విన్నర్స్ జట్టులోని రక్షన్ సాయి 2, తరుణ్కుమార్రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్టు 53 పరుగుల అధిక్యంలో ఉంది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో .. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో సెంట్రల్ జోన్ విన్నర్స్, రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో సెంట్రల్ జోన్ విన్నర్స్ జట్టు 79.3 ఓవర్లకు 235 పరుగులకు ఆలౌట్ అయింది. యాసిన్ సిద్దిఖ్ 91, రితిష్ 49 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టులోని యూనైస్ 4, సర్దార్ సమీర్ 2, తులసి రామ్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ జట్టు 8 ఓవర్లకు 19 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో.. కేఎస్ఆర్ఎం క్రికెట్ మైదానంలో రెస్ట్ ఆఫ్ సౌత్జోన్, రెస్ట్ ఆఫ్ నార్త్జోన్ జట్లు పోటీపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన రెస్ట్ ఆఫ్ సౌత్ జోన్ జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. తొలి ఇన్నింగ్స్లో 80.1 ఓవర్లకు 206 పరుగులకు ఆలౌట్ అయింది. సాయి కృష్ణ చైతన్య 41, యశ్వంత్ సూర్యతేజ్ 37 పరుగులు చేశారు. రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టులోని చాణ్యి పాయి 3, షణ్మఖ గణేష్ 3 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్కు దిగిన రెస్ట్ ఆఫ్ నార్త్ జోన్ జట్టు 9 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 12 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది.యాసిన్ సిద్దిఖ్, సెంట్రల్ జోన్ విన్నర్స్ (91 పరుగులు) యూనైస్, రెస్ట్ ఆఫ్ సెంట్రల్ జోన్ (4 వికెట్లు) -
విద్యార్థిని ఆత్మహత్యాయత్నంపై విచారణ
బి.కొత్తకోట : మండలంలోని శంకరాపురం జెడ్పీ హైస్కూల్లో శుక్రవారం సీఐ గోపాల్రెడ్డి, ఎంఈవో రెడ్డిశేఖర్ విచారణ చేశారు. 10వ తరగతి చదువుతున్న విద్యార్థిని జానకిరాణి గురువారం విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన విషయం తెలిసిందే. అపస్మారక స్థితిలో ఉన్న ఆ విద్యార్థినిని మెరుగైన వైద్యం కోసం తిరుపతికి తరలించారు. దీనిపై హైస్కూల్కు వచ్చిన సీఐ, ఎంఈవోలు హెచ్ఎం మునిస్వామి, టీచర్లు, విద్యార్థులను విచారణ చేశారు. విద్యార్థినిని తిట్టలేదని హెచ్ఎం, టీచర్లు చెప్పారు. దీనికి కొన్ని రోజులుగా జరిగిన కొన్ని ఘటనలు వారి దృష్టికి వచ్చాయి. అనంతరం పలువురి నుంచి స్టేట్మెంట్లను రికార్డు చేశారు. తిరుపతి ఎంఈవో ఆస్పత్రికి వెళ్లి చికిత్స పొందుతున్న జానకిరాణిని విచారణ చేశారు. విచారణలో హెచ్ఎం తనను తిట్టినందుకే ఆత్మహత్యాయత్నానికి పాల్పడినట్టు చెబుతోంది. దీనిపై ఇంకా విచారణ చేస్తున్నామని అధికారులు తెలిపారు. -
పోలేరమ్మ ఆలయ హుండీలో కానుకలు మాయం
బ్రహ్మంగారిమఠం : ప్రముఖ పుణ్యక్షేత్రం బ్రహ్మంగారిమఠంలోని శ్రీ పోతులూరు వీరబ్రహ్మేంద్రస్వామి మఠానికి అనుసంధానంగా ఉన్న కనుమ పోలేరమ్మ దేవస్థానం హుండీలో కానుకలు మాయమవుతున్నాయి. వరుసగా జరుగుతున్న సంఘటనలను చూస్తే.. ఈ విషయం వెల్లడవుతోంది. శుక్రవారం హుండీ కానుకలను లెక్కించడానికి మఠం మేనేజర్ ఆదేశాల మేరకు మఠం సిబ్బంది సీల్ వేసిన తాళానికి ఉన్న గుడ్డను తొలగించగా.. అప్పటికే తాళం తెరుచుకుని ఉంది. పైకి మాత్రం సీల్ వేసినట్లు ఉంది. భక్తులు సమర్పించుకున్న కానుకలు తరిగిపోయినట్లు ఈ విధానాన్ని చూస్తే స్పష్టంగా అర్థమవుతోంది. ఇప్పుడైనా కొంత నగదు మాత్రం కనిపించింది. గతంలో అయితే హుండీలో ఎలాంటి కానుకలు లేవు. అప్పట్లో మఠం నిర్వాహకులు పోలీసులకు ఫిర్యాదు చేసినా ఇంత వరకు చర్యలు లేవు. దీనిని అదునుగా చూసుకొని తాళం తీసి దోచుకుంటున్నట్లు అర్థమవుతోంది. మూడు నెలలకు ఒక సారి హుండీ ఆదాయం లెక్కిస్తారు. ప్రస్తుతం రూ.52 వేలు మాత్రమే ఉన్నాయి. శ్రీ వీరబ్రహ్మేంద్రస్వామి జయంత్యుత్సవాలు, దసరా, కార్తీక మాసం తదితర కార్యక్రమాలు జరిగినా.. అతి తక్కువగా ఉండటం పలు అనుమానాలకు తావిస్తోంది. మఠాధిపతి లేకపోవడంతో సిబ్బంది ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారాలపై భక్తుల మనోభావాలు దెబ్బతింటున్నాయని స్థానికులు పేర్కొంటున్నారు. -
బొలెరో ఢీకొని వ్యక్తి మృతి
కలకడ : బొలెరో వాహనం ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన గురువారం రాత్రి కొత్తపల్లె సమీపంలో జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కలకడ పంచాయతీ కొత్తపల్లెకు చెందిన ఇందల రాంబాబు కుమారుడు రవీంద్ర(21) చైన్నెలోని బంగారు దుకాణంలో కూలీగా పని చేస్తున్నాడు. చైన్నె నుంచి ఇంటికి వచ్చిన అతను కలకడ–గుర్రంకొండ రోడ్డులోని గ్రామంలో తన ద్విచక్రవాహనంపై వెళ్లడానికి అదే గ్రామానికి చెందిన రూపేష్తో కలిసి సిద్ధంగా ఉండగా.. గుర్రంకొండ వైపు నుంచి కలకడ వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డ రవీంద్ర, గాయపడ్డ రూపేష్ను పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి వైద్యుల సలహా మేరకు మెరుగైన చికిత్స కోసం తిరుపతికి తరలించారు. అక్కడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నా పరిస్థితి విషమించడంతో శుక్రవారం మృతి చెందాడు. గాయప్పడ్డ రూపేష్ తిరుపతిలోని ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ప్రమాదానికి కారణమైన బొలెరో డ్రైవర్పై కేసు నమోదు చేశారు. మృతుడి తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ షేక్ అబ్దుల్ ముజీర్ తెలిపారు. ఇంటికి వచ్చిన 24 గంటల్లోనే మృత్యు ఒడికి.. జీవనోపాధి నిమిత్తం చైన్నెలోని బంగారు దుకాణంలో కూలీ పని చేసే రవీంద్ర (21) ఇంటికి చేరుకున్న 24 గంటల్లోనే మృత్యు ఒడిలోకి చేరుకున్నాడు. కుటుంబానికి ఆసరాగా ఉన్న కుమారుడిని ప్రమాదం కబళించడంతో తల్లిదండ్రులు దుఃఖ సాగరంలో మునిగారు. -
వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రాంతాల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వాల్మీకిపురం మండలం చల్లావారిపల్లె పంచాయతీ వడ్డిపల్లెకు చెందిన డిగ్రీ చదువుతున్న యువతి(19) శుక్రవారం ఇంటి వద్ద పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. తల్లిదండ్రులు పెళ్లి సంబంధం చూడటంతో.. ఇష్టం లేక మనస్తాపం చెంది ఈ అఘాయిత్యానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అందించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో వారు తిరుపతికి రెఫర్ చేశారు. అదేవిధంగా గుర్రంకొండ మండలం ఎల్లుట్ల పంచాయతీ పసలవాండ్లపల్లెకు చెందిన ఓబుల్రెడ్డి కుమారుడు వెంకటరమణారెడ్డి పొలం దక్కదన్న మనస్తాపంతో పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. ఇటీవల రెవెన్యూ అధికారులు స్థానికుల ఫిర్యాదుతో భూమి సర్వే చేశారు. అందులో వెంకటరమణారెడ్డికి చెందిన 38 సెంట్ల పొలం ప్రభుత్వ భూమిగా తేల్చారు. దీంతో తనకు పొలం దక్కకుండా పోతుందని మనస్తాపం చెంది ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆయా ఘట నలపై సంబంధిత పోలీసులు విచారణ చేస్తున్నారు. -
జాతీయ స్థాయి పోటీలకు ఎంపిక
గుర్రంకొండ : జాతీయ స్థాయి ఫెన్సింగ్(కత్తిసాము) పోటీలకు గుర్రంకొండ విద్యార్థులు ఎంపికై నట్లు హెడ్మాస్టర్ తఖీవుల్లా తెలిపారు. స్థానిక తెలుగు జెడ్పీ హైస్కూల్కు చెందిన పి.హరినాథరెడ్డి, ప్రసన్నకుమార్ జిల్లా ఫెన్సింగ్ జట్టుకు ఎంపికై ఇటీవల కాకినాడలో జరిగిన రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నారు. ఆ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచారు. పి.హరినాథరెడ్డి రాష్ట్ర స్థాయి పోటీల్లో వెండి పతకం, ప్రసన్నకుమార్ జట్టు తరఫున బంగారు పతకం సాధించారు. ఈ ఇద్దరు విద్యార్థులు త్వరలో మహారాష్ట్రలో నిర్వహించనున్న జాతీయ స్థాయి పోటీలకు ఎంపికయ్యారు. వీరు మన రాష్ట్ర జట్టు తరఫున జాతీయ స్థాయి పోటీల్లో పాల్గొంటారు. కాగా ఇదే హైస్కూల్కు చెందిన దిలీప్కుమార్ రాష్ట్ర స్థాయి ఫెన్సింగ్ పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచి పతకం సాధించారు. వీరికి శుక్రవారం ఆ పాఠశాలలో నిర్వహించిన ఓ కార్యక్రమంలో అభినందనలు తెలిపారు. ఈ కార్యక్రమంలో ఖేలో ఇండియా ఫెన్సింగ్ కోచ్ రవీంద్రనాథ్, పీడీలు శ్రావణీ, రమేష్, ఉపాధ్యాయులు విశ్వేశ్వరరెడ్డి, పద్మలత, లక్ష్మీలు పాల్గొన్నారు. -
ట్రాన్స్కో అధికారులపై కేసు నమోదు
కలికిరి : 11 కేవీ విద్యుత్ లైన్ ప్రమాదం ఘటనకు సంబంధించి ట్రాన్స్కో అధికారులపై పోలీసులు కేసు నమోదు చేశారు. పోలీసులు, స్థానికుల కథనం మేరకు... మండలంలోని మర్రికుంటపల్లి కేంద్రంలో ఈ నెల 27న ఉదయం సిద్దయ్య గృహ ప్రవేశ కార్యక్రమం సందర్భంగా అదే గ్రామానికి చెందిన ఎ.నాగార్జున, పి.ఉదయ్కుమార్, యజమాని సిద్దయ్య ముగ్గురూ కలిసి 26న ఉదయం ఇంటి ముందు పందిరి వేస్తున్నారు. ఈ క్రమంలో ఇంటి ముందున్న 11 కేవీ విద్యుత్ వైరు తగిలి షాక్కు గురయ్యారు. ప్రమాదంలో నాగార్జున తీవ్ర గాయాలపాలుకాగా, ఉదయ్కుమార్, సిద్దయ్యలకు స్వల్ప గాయాలయ్యాయి. నాగార్జునను స్థానికులు కలికిరిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించి, అక్కడి నుంచి మెరుగైన వైద్య కోసం తిరుపతికి తరలించారు. నాగార్జున తండ్రి వీరభద్రయ్య తన కుమారుడు ప్రమాదానికి గురి కావడానికి ట్రాన్స్కో ఏఈ ముజీబుర్ రెహ్మాన్, లైన్మ్యాన్ గోపి నిర్లక్ష్యమే కారణమని పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు కేసు నమోదు చేసిన ఏఎస్ఐ మాబు సాహెబ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పీలేరు: స్థానిక ప్రభుత్వ జూనియర్ కళాశాలలో మ్యాథ్స్ అతిథి అధ్యాపకుని పోస్టుకు దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ సుధాకర్రెడ్డి తెలిపారు. ఎమ్మెస్సీ మ్యాథ్స్లో 50 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించిన వారు అర్హులని తెలిపారు. ఆసక్తిగల వారు డిసెంబర్ 1న ఉదయం 10 గంటలకు ఒరిజనల్ సర్టిఫికెట్లతో కశాశాలకు హాజరు కావాలని కోరారు. రాయచోటి: రానున్న మూడు రోజులు భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణశాఖ సూచన నేపథ్యంలో జిల్లా కలెక్టరేట్లో కంట్రోల్ రూమ్ 08561–293006 ఏర్పాటు చేసినట్లుగా జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ శుక్రవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. కంట్రోల్ రూమ్లో 24 గంటలు సిబ్బంది ఉండేలా ఏర్పాట్లు తెలిపారు. సహాయక చర్యల కోసం కంట్రోల్రూమ్ను సంప్రదించవచ్చని జిల్లా కలెక్టర్ పేర్కొన్నారు. రాయచోటి: జిల్లా సమగ్ర శిక్షా అదనపు ప్రాజెక్టు కో–ఆర్డినేటర్గా డాక్టర్ నున్నె అనురాధ శుక్రవారం బాధ్యతలు స్వీకరించారు. తిరుపతి పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం, విద్యా విభాగంలో అసిస్టెంట్ ప్రొఫెసర్గా పనిచేస్తూ అన్నమయ్య ఏపీసీగా నియమితులయ్యారు. జిల్లా విద్యాశాఖాధికారి డాక్టర్ సుబ్రమణ్యం అనురాధకు ఏపీసీగా బాధ్యతలు అప్పగించారు.అనంతరం సమగ్ర శిక్షా చైర్మన్ జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ను మర్యాదపూర్వకంగా కలిశారు. కార్యక్రమంలో సమగ్ర శిక్ష, జిల్లా విద్యాశాఖ కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు. రాయచోటి: ఏపీ స్టేట్ స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఆధ్వర్యంలో డిసెంబర్ 3వ తేదీన రాయచోటిలోని శ్రీ సాయి ఇంజినీరింగ్ కళాశాలలో మెగా జాబ్ మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం కలెక్టర్ కార్యాలయంలో కలెక్టర్తో కలిసి డీఆర్డీఏ అధికారులు జాబ్ మేళా పోస్టర్లను ఆవిష్కరించారు. ఈ ఉద్యోగ మేళాలో 25 కంపెనీలు పాల్గొంటున్నట్లు తెలిపారు. పూర్తి వివరాలకు 7901610271, 7901612076, 79016 10324 నెంబర్లల్లో సంప్రదించాలన్నారు. జాబ్ మేళా.మెప్మాపీ.కమ్ వెబ్సైట్, అలాగే సమీప మెప్మా కార్యాలయంలో, పురపాలక సంఘ కార్యాలయంలో సంప్రదించి రిజిస్ట్రేషన్ చేసుకోవచ్చన్నారు. కార్యక్రమంలో మెప్మా ప్రాజెక్టు డైరెక్టర్ లక్ష్మీదేవి, రాయచోటి, మదనపల్లె, రాజంపేట మెప్మా సిబ్బంది, జిల్లా ఐబీ స్పెషలిస్టు నాగరాజులు పాల్గొన్నారు. -
అండర్–14 హ్యాండ్ బాల్ పోటీలు ప్రారంభం
కలికిరి: స్కూల్ గేమ్స్ ఫెడరేషన్(ఎస్జీఎఫ్) క్రీడల్లో భాగంగా కలికిరి ప్రభుత్వ హైస్కూల్ క్రీడా మైదానంలో శుక్రవారం అండర్–14 హ్యాండ్ బాల్ రాష్ట్ర స్థాయి క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. మదనపల్లె డీవైఈఒ లోకేశ్వరరెడ్డి పోటీలను ప్రారంభించారు. రాష్ట్రంలోని 13 జిల్లాల నుంచి 600 మంది బాలురు, బాలికలు హాజరయ్యారు. బాలుర విభాగంలో చిత్తూరు, కృష్ణా జిల్లా జట్లు పోటీ పడగా చిత్తూరు జిల్లా జట్టు విజయం సాధించింది. బాలికల విభాగంలోనూ అనంతపురం జట్టుపై చిత్తూరు జిల్లా జట్టు గెలుపొందింది. కార్యక్రమంలో హ్యాండ్ బాల్ పోటీల రాష్ట్ర పరిశీలకులు వెంకటేశ్వరరావు, ఎంఈఒ–1 సురేష్, అన్నమయ్య జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి ఝాన్సి, పీడీలు శివరమేష్బాబు, ఉషారాణి, కరుణానిధి, చంద్రమౌళి, చిన్నప్ప, రెడ్డివరప్రసాద్, స్థానిక నాయకులు షాబుద్దీన్, గాయత్రిరెడ్డి, హెచ్ఎం నటరాజన్ పాల్గొన్నారు. -
శుభ కార్యాలకు విరామం!
మదనపల్లె సిటీ: పెళ్లికి అతి ముఖ్యమైనది ముహుర్తం. బలమైన ముహుర్తంలో వివాహం చేసుకుంటే నూరేళ్ల జీవితం సుఖమయం అవుతుందన్నది అందరి నమ్మకం. అందుకే వివాహ తంతులో ప్రతి కార్యక్రమానికి ముహుర్తాలు చూసుకుంటాం. అందుకు పురోహితులు, పండితుల చుట్టూ తిరుగుతాం. అలాంటి ముహుర్తాలకు శుక్రవారం నుంచి బ్రేక్ పడనుంది. ఈ నెల 30న ప్రారంభమయ్యే శుక్రమౌఢ్యమి (మూఢం) వచ్చే ఏడాది ఫిబ్రవరి 17న మాఘ బహుళ అమావాస్య వరకు కొనసాగనుంది. అప్పటి వరకు శుభ కార్యాలకు విరామం ఏర్పడుతుంది. ఇప్పటికే వివాహాలు కుదుర్చుకుని సిద్దంగా ఉన్న వారు మంచి ముహుర్తాల కోసం మూఢమి ముగిసే వరకు వేచి ఉండాల్సిందే. జిల్లాలో కల్యాణ మండపాల్లో పెళ్లి బాజాలు, సన్నాయి వాయిద్యాలు, పురోహితుల వేదమంత్రాలు 80 రోజుల పాటు వినిపించవు మాఘమాసమూ మూఢంలోనే... మాఘమాసం ఎప్పుడొస్తుందా అని వివాహాలు చేసుకునేవారు ఆశగా ఎదురు చూస్తారు. ఎందుకుంటే ఆ మాసంలో బలమైన ముహుర్తాలు ఉంటాయి. అయితే ఈసారి మాఘమాసం మూఢంలో కలవడంతో ఒక్క ముహుర్తం కూడా లేదు. అంతే కాదు..గృహ ప్రవేశాలకు అనుకూలమైన రథసప్తమి, వసంతపంచమి,మాఘ పౌర్ణమి వంటి ముఖ్యమైన తిథులు కూడా మూఢంలో కలిసిపోయాయి. వ్యాపారులకు గడ్డుకాలం శుభకార్యాలకు బ్రేక్పడనున్న ఈ 80 రోజులు వ్యాపారులకు గడ్డుకాలమనే చెప్పాలి. మదనపల్లెలో నీరుగట్టువారిపల్లెలో పట్టుచీరల వ్యాపారులు అధికంగా ఉన్నారు. పెళ్లిళ్ల సీజన్లో పట్టుచీరలకు మంచి డిమాండ్ ఉంటుంది. మౌడ్యమి చీరల వ్యాపారం పెద్దగా ఉండకపోవచ్చు. మండపాలు, ఫంక్షన్ హాల్స్, వస్త్రదుకాణాలు, స్వర్ణకారులు, నగల షాపుల యజమానులు, డెకరేషన్ , క్యాటరింగ్, ఫోటో, వీడియో గ్రాఫర్లు, టెంట్ హౌస్, పూల వ్యాపారులు, ట్రావెల్స్, లైటింగ్, డీజె బాక్సుల అద్దెకిచ్చేవారు ఇలా శుభకార్యాలపై ఆధారపడ్డ అన్ని రంగాల వారు ముఖ్యంగా పురోహితులు తీవ్రంగా నష్టపోనున్నారు. వచ్చే ఏడాది ఫిబ్రవరి 17 వరకు ముహుర్తాలు లేవు శుక్రమౌఢ్యమే కారణం ఒక గ్రహం సూర్య కిరణాల్లో కనుమరుగవడాన్ని జ్యోతిష్యశాస్త్రం ప్రకారం మూఢం అంటారు. గ్రహశక్తులు బలహీనమవడంతో శుక్రగ్రహం సూచించే ఫలితాలు అనుకూలంగా ఉండవు. శుభకార్యాలకు గురుడు ఎంత ప్రధాన కారకుడో,శుక్రుడు కూఆ అంతే ప్రభావం కలవాడు. శుక్రుడు బలహీనమైతే సంబఽంధాలు వివాహ జీవితం, ఆర్థిక స్థిరత్వం వంటి విషయాల్లో ప్రతికూలతలు ఏర్పడుతాయమని పండితులు చెబుతున్నారు. శుక్రమౌడ్యం ఉన్న కాలంలో శుభకార్యాలు జరుపుకోవడం శుభసూచికం కాదని అంటున్నారు. -
4న వాలీబాల్ ఎంపికల ట్రయల్స్
కడప కోటిరెడ్డిసర్కిల్: యోగి వేమన విశ్వవిద్యాలయం స్పోర్ట్స్ బోర్డు దక్షిణ భారత అంతర విశ్వవిద్యాలయాల వాలీబాల్ పోటీల్లో పాల్గొనే విశ్వవిద్యాలయ వాలీబాల్ మహిళలు, పురుషుల జట్ల కోసం డైరెక్ట్ సెలెక్షన్స్ ట్రయిల్స్ డిసెంబరు 4న ఉదయం 9.00 గంటలకు నిర్వహిస్తున్నామని విశ్వవిద్యాలయ క్రీడా బోర్డు కార్యదర్శి డాక్టర్ కొవ్వూరు రామసుబ్బారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. క్రీడాకారులు సంబంధిత సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు. ఎంపికలు విశ్వవిద్యాలయ క్రీడా ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. -
మాదకద్రవ్యాల నియంత్రణకు చర్యలు తీసుకోవాలి
రాయచోటి: జిల్లాలో మాదకద్రవ్యాలను పూర్తి స్థాయిలో అరికట్టేందుకు చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియోకాన్ఫరెన్స్ హాల్లో మాదకద్రవ్యాల జిల్లా స్థాయి కమిటీ సమావేశాన్ని రెవెన్యూ పోలీస్ శాఖ ఆధ్వర్యంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లితో కలిసి కలెక్టర్ నిర్వహించారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా వాటి వినియోగం వల్ల కలిగే అనర్థాలపై విస్తృత అవగాహన కల్పించాలని అధికారులను కలెక్టర్ ఆదేశించారు. జిల్లాలో మత్తుమందు విక్రయాలను కట్టడి చేసే విషయంలో భాగంగా జిల్లాలోని మెడికల్ షాపు యజమానులు డాక్టర్ ప్రిస్కిప్షన్ (చీటీ) లేకుండా నార్కోటిక్ మందులను విక్రయించవద్దన్నారు. బస్సు, రైల్వేస్టేషన్లలో పార్శిల్ సర్వీసుల ద్వారా ఎలాంటి మాదకద్రవ్యాల రవాణా జరగకుండా తరచూ పర్యవేక్షించాలన్నారు. కాలేజీ, పాఠశాల ప్రిన్సిపల్ ప్రధానోపాధ్యాయులు, విద్యార్థులతో ఈగల్ క్లబ్స్ల ద్వారా అవగాహన కార్యక్రమాలను ఏర్పాటు చేయాలని తెలిపారు. జిల్లా ఎస్పీ మాట్లాడుతూ యాంటీ డ్రగ్స్పై జిల్లాలో ఇప్పటి వరకు 2560 అవగాహన కార్యక్రమాలు నిర్వహించినట్లు తెలిపారు. 1940 గ్రామాలు, 620 పాఠశాలలు, కళాశాలలలో కార్యక్రమాలు నిర్వహించామన్నారు. డ్రగ్స్ వద్దు బ్రో కార్యక్రమంపై 60 గ్రామాలు, 155 స్కూల్స్, కాలేజీలలో అవగాహన కార్యక్రమాలు చేపట్టామన్నారు. 2 నెలల కాలంలో జిల్లాలో 7 గంజాయి కేసులు పెట్టామన్నారు. 63.515 కేజీలు సీజ్ చేసి 52 మంది నిందితులను గుర్తించామన్నారు. వారిలో 27 మందిని అరెస్టు చేశామన్నారు. పాఠశాల ప్రాంగణానికి 100 మీటర్ల దూరంలో ఆపరేషన్ సేఫ్ క్యాంపస్ జోన్ నిర్వహించనున్నట్లు చెప్పారు. అనంతరం డ్రగ్స్ గంజాయి నేరం.. డ్రగ్స్ వద్దు స్కిల్స్ ముద్దు.. డ్రగ్స్ వద్దు బ్రో, వివిధ రకాల పోస్టర్లను జిల్లా కలెక్టర్, ఎస్పీ తదితరులు ఆవిష్కరించారు. సమావేశంలో మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రాజంపేట సబ్ కలెక్టర్ భావన, రాయచోటి ఆర్డీఓ శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. ప్రత్యేక సవరణ–2026 కార్యక్రమంపై సమీక్ష జిల్లాలో ప్రత్యేక సవరణ–2026, కొత్త పోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులు తదితర అంశాలపై నియోజకవర్గాల ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులతో జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. శుక్రవారం కలెక్టరేట్లో కలెక్టర్ అధ్యక్షతన సమావేశాన్ని ఏర్పాటు చేశారు. అన్నమయ్య జిల్లా పోలింగ్ కేంద్రాల హేతుబద్దీకరణలో భాగంగా కొత్తపోలింగ్ కేంద్రాలు, పోలింగ్ కేంద్రాల మార్పులు, చేర్పులపై ఎన్నికల ప్రక్రియను బలోపేతం చేయడానికి అధికారులు, వివిధ రాజకీయ పార్టీలకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ దిశా నిర్దేశం చేశారు. స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్–2026 కార్యక్రమాన్ని భారత ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు 2026వ సంవత్సరం, జనవరి 1వ తేదీ నాటికి అర్హత తేదీగా తీసుకొని అన్ని నియోజకవర్గాల్లో ఓటరు జాబితాల నవీకరణ, పోలింగ్ స్టేషన్ల హేతుబద్దీకరణపై చర్యలు చేపట్టాలని ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
●సిద్దవటం, ఒంటిమిట్టలను అన్నమయ్యలో కలపొద్దు
సిద్దవటం: కడప జిల్లాతో అన్ని రకాల సామాజిక, రాజకీయ, వ్యాపార సంబంధాలు ఉన్న సిద్దవటం, ఒంటిమిట్ట మండలాలను అన్నమయ్య జిల్లాలో కలపొద్దని, కడపలోనే కొనసాగించాలని సిద్దవటం మండల వైఎస్సార్సీపీ నాయకులు డిమాండ్ చేశారు.శుక్రవారం ఇక్కడ వారు మాట్లాడుతూ 10–15 కిలోమీటర్ల దూరంలో ఉన్న కడపను కాదని 70 కిలోమీటర్ల దూరంలోని ఉన్న అన్నమయ్య జిల్లా కేంద్రం రాయచోటిలో కలపడం సరికాదన్నారు. ఈ మేరకు రాజ్యసభ సభ్యులు మేడా రఘునాథరెడ్డి ఆదేశాల మేరకు కడప జిల్లా కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి వినతిపత్రం సమర్పించామన్నారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా కార్యదర్శి ఏకుల రాజేశ్వరిరెడ్డి, మండల కన్వీనర్ నీలకంఠారెడ్డి, జెడ్పీటీసీ శ్రీకాంత్రెడ్డి, జిల్లా రైతు విభాగం కార్యదర్శి పల్లె సుబ్బరామిరెడ్డి, జిల్లా యూత్ కార్యదర్శి వావిళ్ల శ్రీనివాసులురెడ్డి, జిల్లా ఎస్సీ సెల్ కార్యదర్శి కోటపాటి పెంచలయ్య, మండల యూత్ కన్వీనర్ ఆలం క్రిష్ణచైతన్య, సోషల్ మీడియా అధ్యక్షుడు కుప్పం సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
క్రీడలతో మానసికోల్లాసం
రాయచోటి: క్రీడలతో మానసిక ఉల్లాసంతోపాటు మంచి ఆరోగ్యం చేకూరుతుందని జిల్లా విద్యాశాఖాధికారి కె సుబ్రమణ్యం అన్నారు. శుక్రవారం రాయచోటిలోని జెడ్పీ హైస్కూల్ క్రీడా ప్రాంగణంలో జిల్లా సమ్మిళిత విద్య సమన్వయ కర్త జనార్దన్ ఆధ్వర్యంలో నిర్వహించిన క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. డీఈఓ సుబ్రహ్మణ్యం పోటీలను ప్రారంభించారు. జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ సౌజన్యంతో 13 సంవత్సరాల నుంచి 20 సంవత్సరాల వరకు దివ్యాంగ పిల్లలకు క్రీడా పోటీలను నిర్వహించారు. ఈ పోటీలలో 30 మండలాల నుంచి 150 మంది దివ్యాంగ పిల్లలు పాల్గొన్నారు.ఈ సందర్భంగా పరుగుపందెం, షాట్పుట్, జావలిన్ త్రో, లాంగ్ జంప్ పోటీలు నిర్వహించారు. పోటీల్లో గెలుపొందిన వారికి ప్రథమ,ద్వితీయ స్థానిలకు మెడల్స్, సర్టిపికెట్లను అందజేశారు. కార్యక్రమంలో జిల్లా పారా ఒలింపిక్స్ అసోసియేషన్ చైర్మన్ శ్రీనివాసులు, కడప చైర్మన్ దామోదర్ రెడ్డి, రాష్ట్ర వ్యాయామ ఉపాధ్యాయుల సంఘం జిల్లా జనరల్ సెక్రటరీ కె వీరాంజనేయులు, జెడ్పీహెచ్ఎస్ ప్రధానోప్యాద్యాయులు చంద్రశేఖర్, త్రివేణి వ్యాయామ ఉపాధ్యాయులు నరసరాజు పాల్గొన్నారు. -
ఒక్క ముహుర్తం కూడా లేదు
శుక్రమౌఢ్యమి ఈనెల 30 నుంచి ప్రారంభం కానుంది. 28న ఉద యం వివాహాలకు ఒక ముహుర్తం మాత్రమే ఉంది. ఆ తరువాత నుంచి ఫిబ్రవరి 17 వరకు ఒక్క ముహుర్తం కూడా లేదు. ఈసారి మాఘ మాసం కూడా మూఢంలోనే కలిసిపోయింది. నిశ్చితార్థాలు, పెళ్లిళ్లు, గృహప్రవేశాలు,ఇతర శుభకార్యాలు జరుపుకునే వారు మూఢమి ముగిసే వరకు వేచి ఉండక తప్పదు. ఎందుకంటే ఈ 80 రోజుల్లో మంచి ముహూర్తాలు లేవు. –ఆలూరి ఫణికుమార్శర్మ, పురోహితులు, మదనపల్లె సంపాదన తగ్గిపోతుంది పెళ్లిళ్ల సీజన్ ఉంటే సంపాదన ఉంటుంది. ముహుర్తాలు ఉంటే పూలకు డిమాండ్ ఉంటుంది. ఈ సారి శుక్రమౌఢ్యమి 80 రోజులు రావడంతో చేతిలో పని తగ్గిపోతుంది. దీనిపై ఆధారపడిన వారంతా ఇబ్బందులు పడకతప్పదు. –ఎంబీఎస్ బాషా, పూలవ్యాపారి, మదనపల్లె -
ఎమ్మెల్యే సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరిక
పెద్దతిప్పసముద్రం : మండల కేంద్రానికి చెందిన టంగుటూరి చరణ్ అనే చేనేత కార్మికుడితో పాటు పలు కుటుంబాల వారు గురువారం తంబళ్లపల్లి ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథ్రెడ్డి సమక్షంలో వైఎస్సార్సీపీలో చేరారు. ఈ సందర్భంగా చరణ్ మాట్లాడుతూ గతంలో జగనన్న చేనేత కార్మిక కుటుంబాలను ఎన్నో విధాలుగా ఆర్థికంగా ఆదుకున్నాడని ఆయన ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాలకు ఆకర్షితులై తాము వైఎస్సార్సీపీలో చేరామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మహమూద్, జెడ్పీటీసీ శివన్న, మండల కన్వీనర్ కొట్టి మల్లికార్జున, బూత్ కమిటీ మండల కన్వీనర్ కల్లేగారి మంజునాథ్, మేకల చంద్ర, అయూబ్, సాదిక్, సుబ్బిరెడ్డి, ఓబులేసు,బాబు, సిద్దీక్, తదితరులు పాల్గొన్నారు. -
కూరపర్తి కోటకు పునర్ వైభవం
● తొలి పూజలందుకునే వేంకటేశ్వరస్వామి విగ్రహ ప్రతిష్టకు ఏర్పాట్లు పూర్తి ● హర్షం వ్యక్తం చేస్తున్న గ్రామస్తులుకలికిరి(వాల్మీకిపురం) : వాల్మీకిపురం మండల పరిధిలోని కూరపర్తి గ్రామంలో సుమారు 500 సంవత్సరాల నాటి కోట ఉంది. పూర్వ కాలంలో కూరపర్తి గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామస్తులు ఆపద సమయాలు, విపత్కర పరిస్థితుల్లో ఇక్కడే తలదాచుకుని శత్రువుల నుంచి రక్షణ పొందేవారని కథనం. కోట ఆవరణలోనే శ్రీ వేంకటేశ్వరస్వామిని ప్రతిష్టించి పూజలు చేసేవారని గ్రామస్తులు అంటున్నారు. ఈ ప్రాంగణంలో తాగునీటి కోసం చేతబావిని ఏర్పాటు చేసుకున్నారు. ఎక్కడా లేని విధంగా కూరపర్తి కోట 30 అడుగుల ఎత్తు, నాలుగు వైపులా పెద్ద బురుజులు ఉండటం ఈ కోట ప్రత్యేకతగా నిలిచింది. కాలానుగుణంగా కూరపర్తి, గంగాదొడ్డి గ్రామాలతో పాటు చుట్టుపక్కల గ్రామస్తులు గ్రామాల్లోగానీ, ఇంట్లో వివాహాది శుభకార్యాలు జరుపుకోవాలన్నా, వ్యవసాయ పనులు ప్రారంభించాలన్నా ముందుగా కోటలోని శ్రీ వేంకటేశ్వరస్వామికి మొదటి పూజలు చేసి తరువాత ప్రారంభించేవారు. ఇప్పటికీ గ్రామస్తులు సంప్రదాయం ప్రకారం ప్రతి శుభ కార్యక్రమానికి మొదట ఇక్కడ పూజలు చేయడం ఆనవాయితీగా పాటిస్తున్నారు. శిథిలావస్థకు చేరుకున్న కూరపర్తి కోట.. వందల సంవత్సరాల నాటి కోట కట్టడాలు క్రమక్రమంగా శిథిలావస్థకు చేరుకుంది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్ పులి చిట్టెమ్మ కోటను పునర్ నిర్మించాలని సంకల్పించారు. ఇందుకు గ్రామస్తులు తోడయ్యారు. ఉన్నత చదువులు చదివి, వివిధ హోదాలలో స్థిరపడిన గ్రామస్తులు కోట అభివృద్ధికి తోడ్పాటునందించారు. సుమారు రూ.20 లక్షల వ్యయంతో పునర్ నిర్మాణ పనులు పూర్తి కావచ్చాయి. దీంతో చరిత్ర కలిగిన కోట నూతనంగా దర్శనమిస్తుండటంతో గ్రామస్తులలో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. కోట ఉత్సవాలు ప్రారంభం.. గురువారం సాయంత్రం 6 గంటల నుంచి కోట ప్రాంగణంలో గణపతి పూజతో ఉత్సవాలు ప్రారంభమై, అఖండ దీప పూజ, గోపూజ, కలశ స్థాపన చేపట్టారు. 28న శుక్రవారం ఉదయం అంకురార్పణ, శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి మూల విగ్రహాలకు అభిషేకం, సాయంత్రం నవగ్రహ హోమాదులు, భక్తులకు తీర్థప్రసాదాల వినియోగం ఉంటుంది. 29న ఉదయం సుప్రభాతం, యంత్ర ప్రతిష్ట, విగ్రహ ప్రతిష్ట, కలశ పూజ, సుదర్శన హోమం, కుంభాభిషేకం, భక్తులకు అన్నదానం ఉంటుందని గ్రామస్తులు తెలిపారు.కోట పునర్ నిర్మాణం శుభపరిణామం పురాతన చరిత్ర కలిగిన కూరపర్తి కోట శిథిలావస్థకు చేరుకోవడంతో కోటలో వేంకటేశ్వరస్వామికి పూజలు చేయడానికి ఇబ్బందికరంగా ఉండేది. గ్రామస్తులందరి సహకారం, దైవానుగ్రహంతో కోట తిరిగి పూర్వ వైభవాన్ని సంతరించుకోవడం శుభపరిణామం. – పులి రమేష్ కుమార్ రెడ్డి, మాజీ ఎంపీటీసీ సభ్యుడు, కూరపర్తిభక్తుల ఆకాంక్ష నెరవేరింది.. కూరపర్తి గ్రామంతో పాటు చుట్టు పక్కల గ్రామాలకు ఒకప్పుడు అండగా నిలిచింది ఈ కోట. కోటలోని వేంకటేశ్వరస్వామి భక్తుల పాలిట వరం. అలాంటి చరిత్ర కలిగిన కోట తిరిగి కొత్తగా రూపు దాల్చడంతో భక్తుల ఆకాంక్షలు నెరవేరినట్లయింది. – యాలపల్లి రామచంద్ర, మాజీ సర్పంచ్, కూరపర్తి -
కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి కృషి
రాయచోటి అర్బన్ : కాంగ్రెస్ పార్టీ బలోపేతమే లక్ష్యంగా కార్యకర్తలు, నాయకులు కృషి చేయాలని ఏఐసీసీ అబ్జర్వర్ కె.మహేంద్రన్ పేర్కొన్నారు. గురువారం రాయచోటిలోని జిల్లా కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంంలో ఆయన మాట్లాడారు. ‘సంఘటన్ సృజన్ అభియాన్’ కార్యక్రమంలో భాగంగా పార్టీ సంస్థాగత నిర్మాణ కార్యక్రమాలు నిర్వహిస్తున్నామని తెలిపారు. సమావేశంలో ఏపీసీపీ అబ్జర్వర్ అశోక్ రత్నం, అన్నమయ్య జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు గాజుల భాస్కర్లతో భవిష్యత్ కార్యాచరణ గురించి చర్చించామని తెలిపారు. గ్రామీణ బ్యాంకులో మీ డబ్బు మీ హక్కు కార్యక్రమం రాయచోటి జగదాంబసెంటర్ : కేంద్ర ప్రభుత్వం, ఆర్థిక సేవల విభాగం సూచనల మేరకు మీ డబ్బు మీ హక్కు కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్ గ్రామీణ బ్యాంక్ రాయచోటి కార్యాలయంలో నిర్వహించారు. ఈ సందర్భంగా కరపత్రాలను ఆవిష్కరించారు. అనంతరం జిల్లా ఎల్డీఎం ఆంజనేయులు మాట్లాడుతూ బ్యాంకులలో గత 10 సంవత్సరాల వరకు లావాదేవీలు జరపకుండా ఉన్న ఖాతాలు పునరుద్ధరించుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమం శాఖ నిర్వాహక అధికారి సదాశివరెడ్డి, వివిధ బ్రాంచ్ మేనేజర్లు పాల్గొన్నారు. -
జార్ఖండ్వాసి ఆత్మహత్య
మదనపల్లె రూరల్ : జార్ఖండ్కు చెందిన యువకుడు ఉరి వేసుకుని మృతి చెందిన ఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. జార్ఖండ్ రాష్ట్రం హుస్సేనాబాద్ జిల్లా కంగార్పూర్ తాలూకా జమూలా గ్రామానికి చెందిన రామ్ప్రీత్ రాజ్వార్ కుమారుడు మోతీ రాజ్వార్(23) సెంట్రింగ్ పనులు చేసేవాడు. ఉపాధి కోసం కొంతకాలం క్రితం మదనపల్లెకు వచ్చాడు. మండలంలోని పోతబోలు పంచాయతీ కురవపల్లెకు సమీపంలో జరుగుతున్న పనులకు ప్రతిరోజు వెళ్లేవాడు. మరో జార్ఖండ్ యువకుడితో కలిసి స్థానికంగా నివసించేవాడు. ఈ క్రమంలో బుధవారం రాత్రి జార్ఖండ్లోని కుటుంబ సభ్యులతో ఫోన్లో మాట్లాడుతూ గొడవపడ్డాడు. గొడవ అనంతరం స్నేహితుడితో చెప్పకుండా బయటకు వెళ్లిపోయాడు. ఉదయం స్నేహితుడి కోసం వారు వెతకగా, శ్రీ వేద స్కూల్ సమీపంలోని ఓ చెట్టుకు ఉరివేసుకుని మృతి చెంది ఉండటాన్ని గమనించారు. వెంటనే తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న తాలూకా హెడ్కానిస్టేబుల్ శ్రీనివాసులు నాయక్ మృతదేహాన్ని కిందకు దింపి పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అతడితో పాటు పనిచేసే స్నేహితులను ఆత్మహత్యకు కారణాలను అడిగి విచారించారు. కాగా స్వగ్రామంలో మోతీ రాజ్వార్కు ప్రేమ వ్యవహారం ఉందని, వారి మధ్య తలెత్తిన విభేదాలతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటాడని ప్రాథమికంగా నిర్ధారించారు. గురువారం పోస్టుమార్టం అనంతరం మృతదేహాన్ని స్వగ్రామానికి తరలించారు. జార్ఖండ్వాసితో స్థానికంగా పనులు చేయిస్తున్న మేసీ్త్ర శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. యువతి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : కుటుంబ కలహాలతో ఓ యువతి ఉరివేసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన గురువారం పట్టణంలో జరిగింది. చంద్రాకాలనీలో కాపురం ఉంటున్న రూబియా(25) కుటుంబ సభ్యులతో గొడవపడి తీవ్ర మనస్తాపం చెందింది. దీంతో ఇంట్లో ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
రాజంపేట : కడప–రేణిగుంట జాతీయ రహదారిలో ఎర్రబల్లి వద్ద నందలూరు మండలం నాగిరెడ్డిపల్లె అర్బన్ పరిధిలోని తోటపాళెంకు చెందిన పొమ్మల కనకయ్య (20) రోడ్డు ప్రమాదంలో మృతి చెందినట్లు మన్నూరు సీఐ ప్రసాద్బాబు తెలిపారు. పల్స్ర్ వాహనంపై తన స్నేహితుడు తలారి జగదీశ్తో కలిసి బుధవారం అర్థరాత్రి సమయంలో రాజంపేట నుంచి నందలూరుకు వస్తున్న క్రమంలో అదుపుతప్పి సిగ్నల్ బోర్డును ఢీ కొనడంతో తీవ్రంగా గాయపడి మృతి చెందాడన్నారు. తోటి స్నేహితునికి స్వల్పగాయాలయ్యాయని తెలిపారు. ఈ ప్రమాదంపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నామన్నారు. కనకయ్య మృతితో తోటపాళెంలో విషాధ ఛాయలు అలుముకున్నాయి. ఆటో నుంచి కింద పడి..సంబేపల్లె : మండల పరిధిలోని శెట్టిపల్లె పంచాయతీలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శిరిపురి రుషేంద్ర (17) అనే యువకుడు మృతి చెందాడు. పోలీసుల వివరాల మేరకు.. శెట్టిపల్లె గ్రామం తాటికుంట దళితవాడకు చెందిన ఆంజనేయులు, రాజేశ్వరి దంపతుల కుమారుడు రుషేంద్ర బంధువుల పెళ్లి పనుల నిమిత్తం గుట్టపల్లె సమీపంలోని ఓ కల్యాణ మండపం నుంచి సొంత గ్రామానికి నాలుగు చక్రాల ఆటోలో వెళుతుండగా గ్రామ సమీపంలోకి రాగానే ప్రమాదవశాత్తు ఆటోలో నుంచి కింద పడ్డాడు. తలకు గాయం కావడంతో స్థానికుల సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు తెలిపారు. చేతికి అంది వచ్చిన కొడుకు మృతి చెందడంతో ఆ కుటుంబం కన్నీరు మున్నీరుగా విలపిస్తోంది. సంఘటన స్థలాన్ని ఎస్ఐ రవికుమార్ పరిశీలించి కేసు నమోదు చేశారు. కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలుపుల్లంపేట : భూ కబ్జాలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని మండల రెవెన్యూ ఇన్స్పెక్టర్ రాజశేఖర్ అన్నారు. యథేచ్ఛగా భూ కబ్జా శీర్షికన సాక్షిలో ప్రచురితమైన వార్తకు స్పందించిన ఆయన గురువారం సంబంధిత భూముల వద్దకు వెళ్లి పరిశీలించారు. భూ ఆక్రమణలకు పాల్పడితే చర్యలు తప్పవని హెచ్చరించారు. అనంతరం సర్వేయర్ ఓబయ్య, వీఆర్ఓ సురేష్లతో కలిసి సంబంధిత స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. నేరస్తుల కదలికలపై ప్రత్యేక నిఘాకడప అర్బన్ : త్వరలో స్థానిక సంస్థల ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో రౌడీ షీటర్లు, ట్రబుల్ మాంగర్లు, గతంలో ఎన్నికల నేరాలకు పాల్పడిన వారి కదలికలపై ప్రత్యేక నిఘా ఉంచాలని జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ పోలీస్ అధికారులను ఆదేశించారు. గురువారం జిల్లా పోలీస్ కార్యాలయంలో నేర సమీక్షా సమావేశం నిర్వహించారు. -
సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశుద్ధ్యంపై దృష్టి
రాయచోటి: సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలల్లో పారిశుధ్యంపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. గురువారం అమరావతి నుంచి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి విజయానంద్ రైతుల నుంచి ధాన్యం సేకరణ, ప్రజల నుంచి వివిధ అంశాలపై సేకరించిన ప్రజాభిప్రాయ సేకరణ, గ్రామ, వార్డు సచివాలయ వ్యవస్థ ద్వారా సిటిజన్ సర్వే, సంక్షేమ హాస్టళ్లలో పారిశుధ్యం తదితర అంశాలపై అన్ని జిల్లాల కలెక్టర్లతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ఈ సమావేశానికి రాయచోటి కలెక్టరేట్ నుంచి జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, సంయుక్త కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్లు హాజరయ్యారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ వివిధ శాఖల జిల్లా అధికారులకు ఆయా శాఖల అంశాలకు సంబంధించి తగిన సూచనలు జారీ చేశారు. సంక్షేమ హాస్టళ్లు, పాఠశాలలో కమ్యూనిటీ శానిటేషన్ సెంటర్ల నిర్మాణానికి చర్యలు చేపట్టాలని సాంఘిక సంక్షేమ, వెనుకబడిన తరగతుల సంక్షేమ, గిరిజన సంక్షేమ శాఖ అధికారులను ఆదేశించారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
మిథున్రెడ్డి పర్యటనపై పోలీస్ నిఘా
మదనపల్లె: మదనపల్లెలో గురువారం జరిగిన రాజంపేట పార్లమెంట్ సభ్యులు పీవీ.మిథున్రెడి పర్యటన అద్యంతం పోలీసు నిఘా నీడలో సాగింది. ఆయన మదనపల్లె తాలూకా పోలీస్స్టేషన్ పరిధిలోకి అడుగు పెట్టినప్పటి నుంచి తిరిగి వెళ్లే వరకు ఆంక్షలు, నిఘా పెట్టారు. మండలంలోని ఆరోగ్యవరం సమీపంలోని హైవేపై ఫ్లైఓవర్ వద్దకు మిథున్రెడ్డి చేరుకునే ముందు అక్కడ వేచి ఉన్న సమన్వయకర్త నిసార్ ఆహ్మద్ వద్దకు వచ్చిన తాలూకా సీఐ కళా వెంకటరమణ..పార్టీ పరంగా బైక్ ర్యాలీ, ప్రదర్శన నిర్వహించరాదని, దీనికి అనుమతి లేదంటూ చెప్పి వెళ్లారు. మిథున్రెడ్డికి వైఎస్సార్సీపీ శ్రేణులు, నేతలు స్వాగతం పలికిన ప్రాంతం వైఎస్.జగన్మోహన్రెడ్డి పాలనలో మంజూరైన నిర్మాణం చేపట్టిన మెడికల్ కళాశాల ఉంది. దాంతో మిథున్రెడ్డి ఆకస్మాత్తుగా పరిశీలన కోసం అక్కడికి వెళ్లే అవకాశం ఉంటే ముందుగానే నిలువరించేందుకు ఆ రహదారిపైన, అక్కడికి వెళ్లే రోడ్లవద్ద బందోబస్తు ఏర్పాటు చేశారు. అక్కడినుంచి మొదలైన పర్యటనపై పోలీసులు డ్రోన్తో నిఘా పెట్టి ఆయన వెంట కొనసాగించారు. రహదారులు, వాటికి అనుసంధానమైన రోడ్ల వద్ద, జాతీయ రహదారిపైనా పోలీసులను పెట్టారు. ఎంపీడీఓ కార్యాలయం చేరే వరకు పట్టణం, తాలూకా పరిధిలోకి సీఐలతోపాటు పొరుగు స్టేషన్లకు చెందిన సీఐలను, ఎస్ఐలు, పోలీసులను రప్పించి బందోబస్తు విధులు అప్పగించారు. వారంతా మిథున్రెడ్డి పర్యటన సాగిన అన్నిచోట్లా కనిపించారు. మదనపల్లె మండల పరిషత్ కార్యాలయం వెలుపల, లోపల బందోస్తు ఏర్పాటు చేయగా..కార్యాలయం లోపలికి వెళ్లే వారిపై ఆంక్షలు విధించారు. ఎంపీటీసీలు, సర్పంచులు, అధికారులు, కార్యాలయ సిబ్బందికి మాత్రమే లోపలికి అనుమతి ఇచ్చారు. మిథున్రెడ్డి కార్యాలయం చేరుకున్న తర్వాతనే సాధారణ ప్రజలను, నాయకులను లోపలికి పంపారు. తిరుగు ప్రయాణం దారి మళ్లింపు సమావేశం, పర్యటన ముగిశాక ఎంపీడీవో కార్యాలయం నుంచి మిథున్రెడ్డి సీటిఎంరోడ్డు మీదుగా దేవతానగర్కు వెళ్లాల్సి ఉంది. ఇదే దగ్గరదారి అయితే పోలీసులు దారిమళ్లించడంతో గాంధీరోడ్డు, నిమ్మనపల్లెరోడ్డు మీదుగా బైపాస్రోడ్డు నుంచి బైపాస్సర్కిల్ మీదుగా తిరిగి మదనపల్లైవెపుకు వచ్చి దేవతానగర్కు వెళ్లాల్సి వచ్చింది. దీనికోసం ఎక్కువ దూరం ప్రయాణించాల్సి వచ్చింది. వినతులు స్వీకరించి వివరాలు తెలుసుకుంటున్న ఎంపీ మిథున్రెడ్డి, ఎంపీ మిథున్రెడ్డి పర్యటనలో డ్రోన్ నిఘా పర్యటనంతా డ్రోన్తో చిత్రీకరణ మెడికల్ కళాశాల వద్ద బందోబస్తు మిథున్రెడ్డి మదనపల్లె పర్యటన సూపర్ సక్సెస్ ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి మదనపల్లె పర్యటన సూపర్ సక్సెస్ అయ్యింది. ప్రజా సమస్యలు తెలుసుకుని, వినతులు స్వీకరించడం కోసం ఎంపీడీఓ కార్యాలయానికి వచ్చిన ఆయనకు వైఎస్సార్సీపీ శ్రేణులు, ప్రజల నుంచి అడుగడు గునా ఘనస్వాగతం లభించింది. మహిళలు హరతులు పట్టగా నేతలు గజమాలలు, పూలమాలలతో సత్కరించారు. ఆరోగ్యవరం సమీపంలోని ప్లైఓవర్ నుంచి ఎంపీడీఓ కార్యాలయం వరకు కూడళ్ల వద్ద జనం బారులుతీరారు. బాణసంచా కాలుస్తూ, మేళ తాళాలతో స్వాగతం పలికారు. కార్యాలయంలో ప్రజలనుంచి వినతుల స్వీకరణపై ఫిర్యాదుదారుల్లో సంతృప్తి వ్యక్తమైంది. తమ సమస్యలను ఎంపీ ఒపిగ్గా విన్నారని, పరిష్కారానికి భరోసా ఇచ్చారని సంతోషం వ్యక్తం చేశారు. -
మైనారిటీల సామాజికాభివృద్ధి వైఎస్సార్సీపీతోనే సాధ్యం
కలికిరి(వాల్మీకిపురం) : మైనారిటీల సామాజికాభివృద్ధి వైఎస్సార్సీపీతో సాధ్యమవుతుందని రాష్ట్ర మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్నారు. వాల్మీకిపురం మైనార్టీ నాయకులు వాల్మీకిపురానికి విచ్చేసిన మాజీ మంత్రిని కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో మైనార్టీలకు పెద్దపీట వేసి సముచిత స్థానం కల్పించినట్లు చెప్పారు. రాష్ట్ర వ్యాప్తంగా మసీదులు, దర్గాలు, ఈద్గాలు తదితర మైనార్టీల ధార్మిక సంస్థల అభివృద్ధికి కృషి చేసినట్లు గుర్తుచేశారు. ఉర్దూ భాషను ద్వితీయ అధికార భాషగా గుర్తించి ఉత్తర్వులు జారీ చేసిన ఘనత గత జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వానికే దక్కిందన్నారు. క్షేత్ర స్థాయిలో వైఎస్సార్సీపీ బలోపేతానికి కృషి చేయాలని మాజీ మంత్రి పిలుపునిచ్చారు. కార్యక్రమంలో ఉర్దూ అకాడమీ మాజీ డైరెక్టర్ అబ్దుల్ కలీం, ఖాదర్ బాషా, షమీ, అమీన్ పీర్ తదితరులు పాల్గొన్నారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి -
బెదిరించి.. బుక్కయ్యాడు !
● పోలీస్ స్టేషన్కే ఫోన్చేసి ఆదేశాలు ● పోలీసుల అదుపులో నకిలీ సీఐభాకరాపేట : ‘‘హలో.. నాపేరు శివకుమార్. నేను తిరుపతిలోని రెడ్ శ్యాండల్ ఫోర్స్లో సీఐని. కేవీ పల్లె మండలం పెద్ద కమ్మపల్లెకు చెందిన మా బంధువుల అమ్మాయిని చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్ల పల్లెలో ఓ వ్యక్తితో వివాహం చేశాము. అతను వేరే మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని మా బంధువుల అమ్మాయిని వేధిస్తున్నాడు. దీంతో బాధితురాలు గొడవపడి తిరుపతిలోని తన తల్లివద్దకు వచ్చేసింది. రేపు మీ స్టేషన్కు బాధితురాలిని తీసుకొస్తాను. మీరు ఆ ఊరికెళ్లి మా బంధువుల అల్లుడితో సంబంధం పెట్టుకున్న మహిళను తీసుకుని రండి..’’ అంటూ భాకరాపేట పోలీస్ స్టేషనకు బుధవారం ఓ వ్యక్తి ఫోన్చేసి ఆర్డర్ వేశాడు. ఆ మేరకు గురువారం భాకరాపేట పోలీసులు అతను చెప్పిన మహిళను స్టేషన్కు తీసుకొచ్చారు. ఫోన్ చేసిన వ్యక్తి పోలీస్ యూనిఫాం వేసుకుని భాకరాపేట పోలీస్ స్టేషన్కు వచ్చాడు. యూనిఫాంకు భుజంపై మూడు స్టార్లు ఉన్నాయి. రాగానే స్టేషన్ హాల్లో ఉన్న కుర్చీలో కూర్చొని తన ఇష్టం వచ్చినట్లు మాట్లాడాడు. అతను మాట్లాడే తీరుపై పోలీసులకు అనుమానం వచ్చింది. అతని గురించి విచారణ చేపట్టారు. అతని పేరు శివయ్య అని, నకిలీ పోలీస్ అని తేలిపోయింది. మరిన్ని వివరాల కోసం పోలీసులు తిరుపతి, కేవీ పల్లె పోలీసులతో సంప్రదిస్తున్నారు. ఈ విషయమై భాకరాపేట ఎస్ఐ రాఘవేంద్రను వివరణ కోరగా అతనిపై తమకు ఫిర్యాదు అందిందని తెలిపారు. ఆ మేరకు దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
చరిత్రాత్మక కట్టడానికి పూర్వవైభవం అభినందనీయం
కలికిరి(వాల్మీకిపురం) : చరిత్రాత్మక కట్టడానికి పూర్వవైభవం తీసుకురావడం అభినందనీయమని రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి అన్నారు. వాల్మీకిపురం మండల పరిధిలోని కూరపర్తి పంచాయతీ కేంద్రంలో పునర్ నిర్మించిన పురాతన కోటను గురువారం పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డితో కలిసి ప్రారంభోత్సవంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పురాతన కట్టడాలు సాంప్రదాయాలకు నెలవుగా ఉండేవని, అలాంటి వాటి పట్ల గ్రామస్తులు ప్రత్యేక శ్రద్ధతో పునర్ నిర్మాణానికి పూనుకొని పూర్తి చేయడం గర్వకారణమన్నారు. కోట బురుజుపైన గల శ్రీదేవి, భూదేవి సమేత వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని సందర్శించి కోట చరిత్రను తెలుసుకున్నారు. కోటలో కలియతిరిగిన ఎంపీ కోట అభివృద్ధికి కృషి చేసిన స్థానిక సర్పంచ్ చిట్టెమ్మ, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ పులి శివకుమార్రెడ్డిలను అభినందించారు. కార్యక్రమంలో ఏపీ ఎండీసీ మాజీ డైరెక్టర్ హరీష్ రెడ్డి, వైఎస్సార్సీపీ యువ నాయకుడు చింతల సాయిక్రిష్ణారెడ్డి, జెడ్పీటీసీ సభ్యురాలు నిర్మల, నాయకులు నీళ్ల భాస్కర్, అబ్దుల్ కలీం, ఆనంద, సుధాకర్, చికెన్ మస్తాన్, సైఫుల్లా, షాహెద్, లక్ష్మీనారాయణరెడ్డి, మోహన్రెడ్డి, రెడ్డెప్పరెడ్డి, కూరపర్తి గ్రామస్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. రాజంపేట ఎంపీ మిథున్ రెడ్డి -
విచారణ పేరుతో పిలిచి చితకబాదాడు
మదనపల్లె రూరల్ : ప్రేమజంట విషయమై విచారణ చేసేందుకు పోలీస్ స్టేషన్కు రావాలని పిలిచి, అమ్మాయి ఆచూకీ తెలపాలని అబ్బాయి తండ్రిని కానిస్టేబుల్ చితకబాదిన ఘటన రామసముద్రంలో జరిగింది. పోలీస్ కానిస్టేబుల్ కొట్టిన దెబ్బలకు గాయాలపాలైన బాధితుడు మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న బాధితుడిని మాల మహానాడు నాయకులు పరామర్శించి ఘటనపై వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా మాల మహానాడు రాష్ట్ర అధ్యక్షుడు యమలా సుదర్శనం మాట్లాడుతూ.. రామసముద్రం మండలం చెంబకూరు పంచాయతీ మచ్చవారిపల్లెకు చెందిన వెంకటేష్ కుమారుడు మణి, అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని 15 రోజుల క్రితం తీసుకువెళ్లాడని అమ్మాయి కుటుంబ సభ్యులు రామసముద్రం పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారన్నారు. మదనపల్లె పట్టణం బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న అబ్బాయి తండ్రి వెంకటేష్ను, అమ్మాయి విషయంగా విచారణ చేసేందుకు కానిస్టేబుల్ భరత్, రామసముద్రం పోలీస్ స్టేషన్కు తీసుకెళ్లాడన్నారు. అమ్మాయి ఆచూకీ తెలపాల్సిందిగా వెంకటేష్ను చిత్రహింసలకు గురిచేసేవారన్నారు. అయితే రెండురోజులుగా వెంకటేష్, పోలీస్ స్టేషన్కు వెళ్లకపోవడంతో కానిస్టేబుల్ భరత్, కాళ్లు, చేతులపై లాఠీతో కొట్టి తీవ్రంగా గాయపరిచాడన్నారు. తప్పుచేసిన వ్యక్తులపై పోలీసులు కేసు నమోదుచేసి చర్యలు తీసుకోవాలే తప్ప, విచారణ పేరుతో స్టేషన్కు పిలిపించి, తీవ్రంగా కొట్టడం దారుణమని ఆవేదన వ్యక్తం చేశారు. వెంకటేష్ను తీవ్రంగా గాయపరిచిన కానిస్టేబుల్ భరత్ను విధుల నుంచి తొలగించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో మాల మహానాడు నాయకులు యమలా చంద్రయ్య, గుండా మనోహర్, మల్లెల మోహన్, లక్ష్మీపతి తదితరులు పాల్గొన్నారు.కానిస్టేబుల్పై కేసు నమోదు చేయాలని డిమాండ్ -
గడువు పొడిగింపు
రాయచోటి టౌన్ : సివిల్ సర్వీసెస్ పరీక్షలకు సన్నద్ధమవుతున్న అభ్యర్థులకు ఉచిత సర్వీసెస్ సెంటర్ ద్వారా కోచింగ్ ఇవ్వనున్నట్లు జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ, సాధికారిత అధికారి ఆర్ నాగేంద్ర రాజు గురువారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవడానికి డిసెంబర్ 3వ తేదీ వరకు పొడిగించినట్లు తెలిపారు. ఆసక్తి కలిగిన బీసీ, ఎస్సీ, ఎస్టీ కులాలకు చెందిన దరఖాస్తులు చేసుకోవాలని సూచించారు. వీరికి ఉచిత శిక్షణ, బోజనం, బస కల్పించనున్నట్లు తెలిపారు. డిసెంబర్ 7వ తేదీ స్క్రీనింగ్ నిర్వహించి అర్హత సాధించిన అభ్యర్థులకు డిసెంబర్ 14నుంచి విజయవాడలో శిక్షణ ఇస్తారన్నారు.మరిన్ని వివరాలకు 7989819470/ 96766 98175 నంబర్లలో సంప్రదించాలని పేర్కొన్నారు. రాయచోటి: రాయచోటిలో నూతనంగా నిర్మించబోతున్న ఆయుష్ ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలాన్ని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ పరిశీలించారు. గురువారం సాయంత్రం రాయచోటి–పీలేరు రోడ్డు సమీపంలో కేటాయించిన స్థలాన్ని స్థానిక రెవెన్యూ అధికారులతో కలిసి తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆసుపత్రి నిర్మాణానికి కేటాయించిన స్థలం, ఇతర అంశాలపై రెవెన్యూ సిబ్బందికి సూచనలు చేశారు. రాయచోటి: అటల్ ప్రయోగశాలలు విద్యార్థులకు ఎంతో ఉపయోగకరమని, వీటిని సక్రమంగా వినియోగించుకుంటే శాస్త్రవేత్తలు, వ్యవస్థాపకులుగా రూపొందుతారని అటల్ టింకరింగ్ పాఠశాలల వర్క్షాప్ను యునిసెఫ్ ప్రతినిధి సుదర్శన్ అన్నారు.రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న వర్స్షాప్ను గురువారం ఆయన తనిఖీ చేశారు. ఉపాధ్యాయులు రూపొందిస్తున్న ప్రాజెక్టులను పరిశీలించారు. అటల్ టింకరింక్ ప్రయోగశాలలో క్యాలెండర్ను అనుసరించి విద్యార్థులతో ప్రాజెక్టులు చేయించాలన్నారు. కేంద్ర ప్రభుత్వం అటల్ ఇన్నోవేషన్ మిషన్, రాష్ట్ర సమగ్ర శిక్ష, యునిసెఫ్ కార్యక్రమాలను సంయుక్తంగా నిర్వహిస్తున్నటు తెలిపారు. సమగ్ర శిక్ష అసిస్టెంట్ ఏఎంఓ అసదుల్లా, జిల్లా సైన్స్ అఽ ధికారి మార్ల ఓబుల్ రెడ్డి, రీసోర్స్ పర్సన్ ఆంజనేయులు, వే ణుగోపాల్ రెడ్డి, మహబూబ్ బాషా పాల్గొన్నారు. -
నాయకుడంటే.. ఓ భరోసా నాయకుడంటే... ఓ ధైర్యం నాయకుడిని చూస్తే.. ఉత్సాహం.. నాయకుడితో మాట కలిపితే.. ఉత్తేజం.. వైఎస్ జగన్ను కలిశాక కార్యకర్తల్లో కనిపించిన ఉత్సాహమిది.
జననేతకు గజమాలతో సత్కారంసాక్షి కడప: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం రెండో రోజు పర్యటన ఆద్యంతం జనసందోహం నడుమ సాగింది. పర్యటనలో భాగంగా అరటి తోటలను పరిశీలించారు. రైతుల దుస్థితిని ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి రైతులకు అండగా నిలిచారు. గిట్టుబాటు ధర కల్పించని చంద్రబాబు ప్రభుత్వ తీరుపై ధ్వజమెత్తారు. అలాగే పలువురు నేతలు, కార్యకర్తలను పరామర్శించారు. వధూవరులను ఆశీర్వదించారు. తన క్యాంప్ కార్యాలయంలో ప్రజలతో మమేకమయ్యారు. కోల్డ్ స్టోరేజ్ను అందుబాటులోకి తీసుకురాకపోవడంపై ఆగ్రహం పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని బ్రాహ్మణపల్లె సమీపంలోని రైతులు ఇల్లూరు శ్రీనివాసులరెడ్డి, ఇల్లూరు రామతులశమ్మ అరటి తోటను మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పరిశీలించారు. ఆయన వెంట ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, మున్సిపల్ ఇన్ఛార్జి వైఎస్ మనోహర్రెడ్డి ఉన్నారు. గిట్టుబాటు ధరల్లేక ..అడిగేనాథుడు కానరాక చెట్లమీదనే మాగిపోతున్న అరటి గెలలను పరిశీలించారు. అక్కడి రైతులతో మాట్లాడారు. అక్కడే ఉన్న వైఎస్సార్సీపీ జిల్లా రైతు నాయకుడు సంబటూరు ప్రసాద్రెడ్డితోపాటు బ్రాహ్మణపల్లె కౌన్సిలర్ మహేశ్వరరెడ్డి, రైతు శ్రీనివాసులరెడ్డి రైతుల దుస్థితిని వివరించారు. అరటిలో దిగుబడి ఉన్నా.. ధరలేదని, కేవలం టన్ను రూ.2వేలకు అడుగుతున్నారని వివరించారు. అది కూడా ప్రస్తుతం కొను గోలు చేసేవారేలేరని.. వ్యాపారులు తోటల వద్దకు రాకపోవడంతో కాయలు చెట్ల మీదనే మాగిపోతున్నాయని తెలిపారు. రైతుల దుస్థితి విని వైఎస్ జగన్ చలించిపోయారు. గిట్టుబాటు ధర కల్పించకుండా అన్యాయం చేస్తున్న చంద్రబాబు ప్రభుత్వాన్ని తూర్పారబట్టారు. వైఎస్సార్సీపీ హయాంలో గిట్టుబాటు ధరతోపాటు ధరల స్థిరీకరణ నిధి, పెట్టుబడి సాయం, ఉచిత పంటల భీమా, పంట నష్టపోయిన సందర్భంగా ఇన్ఫుట్ సబ్సిడీ ఎప్పటికప్పుడు అందిస్తూ వ్యవసాయాన్ని ఒక పండుగలా సాగిందని పేర్కొన్నారు. 2024 మార్చిలో బనానా కోల్డ్ స్టోరేజ్ను ప్రారంభించానని గుర్తు చేశారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన చంద్రబాబు సర్కార్ కరెంటు ఛార్జీలకు భయపడి వినియోగంలోకి తీసుకురావడంపై మండిపడ్డారు. వధూవరులకు ఆశీర్వాదం: పట్టణంలోని స్థానిక వాసవీ కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నాయకులు, బలిజ సంఘం సభ్యులు కొంగనపల్లె మురళీ, సుభద్ర దంపతుల కుమారుడి వివాహానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హాజరయ్యారు. వధూవరులు సాయి కిరణ్, వినీతను ఆశీర్వదించారు. మహేశ్వరరెడ్డి కుటుంబానికి పరామర్శ లింగాల మండల మాజీ సర్పంచ్ మహేశ్వరరెడ్డి ఇటీవల గుండెపోటుతో చనిపోయారు. ఈ నేపథ్యంలో బుధవారం గోపి విహార్ వీధిలోని వారి ఇంటికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వెళ్లి కుటుంబ సభ్యులను పరామర్శించారు.తొలుత మహేశ్వర రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. కన్నీటి పర్యంతమవుతున్న మహేశ్వరరెడ్డి భార్య నాగేశ్వరమ్మను ఓదార్చారు. పార్టీ ఎప్పుడు అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. అనంతరం సమీపంలోనే ఉన్న లింగాల మండల మాజీ ఉపాధ్యక్షుడు లోపట్నూతల వెంగల్రెడ్డి ఇంటికి వెళ్లి యోగక్షేమాలను అడిగి తెలుసుకున్నారు. వేల్పుల రామును పరామర్శించిన మాజీ సీఎం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం మధ్యాహ్నం వేల్పులలో వేముల మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి(వేల్పుల రాము)ని పరామర్శించారు. ఇటీవల జెడ్పీటీసీ ఉప ఎన్నికల నేపథ్యంలో టీడీపీ మూకలు వేల్పుల రాముపై దాడి చేసి తీవ్రంగా గాయపరచగా... ప్రస్తుతం ఆయన కోలుకున్నారు. ఈ నేపథ్యంలో ఆయన ఇంటికి వెళ్లి పరామర్శించారు. రాముతోపాటు ఆయన తల్లి, వేల్పుల మాజీ సర్పంచ్ లింగాల పార్వతమ్మ, సతీమణి, వైఎస్సార్సీపీ జిల్లా మహిళా అధ్యక్షురాలు లింగాల ఉషారాణిలతో కూడా వైఎస్ జగన్ మాట్లాడారు. జీతాలు రాక ఇబ్బందులు పడుతున్నాం.. వేల్పుల నుంచి వస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బెస్తవారిపల్లె వద్ద పలువురు హాస్టల్ ఉద్యోగులు కలిశారు. కొన్ని నెలలుగా తమకు జీతాలు రావడం లేదని దీంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వివరించారు. అనంతరం వైఎస్ జగన్కు వినతిపత్రం ఇచ్చారు. రోటరీపురానికి చెందిన బికారి అనే మహిళ తనకు పింఛన్ రాలేదని .. ఇబ్బందులు పడుతున్నానని వాపోయారు. క్యాంపు కార్యాలయం వద్ద జనసందోహం పులివెందులలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి రెండవ రోజు బిజీబిజీగా గడిపారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు వైఎస్ జగన్కు తమ సమస్యలు తెలిపారు. చంద్రబాబు ప్రభుత్వం సాగిస్తున్న దురాగతాలను వివరించారు. వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని బుధవారం పలువురు నేతలు కలిశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సతీష్కుమార్రెడ్డి, ఎమ్మెల్సీ గోవిందరెడ్డి, జిల్లా పరిషత్ చైర్ పర్సన్ గోవిందరెడ్డి, ఎస్ఈసీ మెంబర్ సాయినాథ శర్మ, జమ్మలమడుగు మాజీ ఎమ్మెల్యే డాక్టర్ సుధీర్రెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు వైఎస్ మనోహర్రెడ్డి, వైఎస్ మధురెడ్డి, వైఎస్సార్సీపీ మండల నాయకులు బలరామిరెడ్డి, వరప్రసాద్, చిన్నప్ప, వీర ప్రతాప్రెడ్డి, సాంబశివారెడ్డి, బయపురెడ్డి, అంబకపల్లె బాబురెడ్డి, మర కా శివకృష్ణారెడ్డి, సైదాపురం చంటి, సారెడ్డి చంద్రశేఖరరెడ్డి, రఘునాథరెడ్డి, రిషికేశవ తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. మహేశ్వర్ రెడ్డి చిత్రపటానికి పూలమాల వేసి నివాళి అర్పిస్తున్న మాజీ సీఎం వైఎస్ జగన్వైఎస్సార్ సీపీ నాయకుడు వేల్పుల రాము నివాసంలో ఆయన కుటుంబ సభ్యులతో మాట్లాడుతున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్, చిత్రంలో ఎంపీ అవినాష్ రెడ్డిపులివెందుల నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బెస్తవారిపల్లెకు చేరుకోగానే జన ప్రభంజనం మొదలైంది. వైఎస్సార్సీపీ వేము ల మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డిని పరామర్శించేందుకు వెళుతున్న వైఎస్ జగన్కు బెస్తవారిపల్లె నుంచే పార్టీ శ్రేణులు, ప్రజలు పెద్ద ఎత్తున బ్రహ్మరథం పట్టారు. పార్టీ శ్రేణులు, యువకులు బైకులతో ర్యాలీ నిర్వహించారు. అడుగడుగనా పూల వర్షం కురిపిస్తూ.. బాణా సంచా పేల్చుతూ హారతులు పట్టారు. అడుగడుగునా వైఎస్ జగన్పై పూలవర్షం కురిపించారు. మాజీ సీఎం వైఎస్ జగన్ వారందరినీ అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. గిట్టుబాటు ధర కల్పించని ప్రభుత్వ తీరుపై మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపాటు క్యాంపు కార్యాలయంలో వినతుల స్వీకరణ జననేత పర్యటనకుబ్రహ్మరథం పట్టిన జనం -
కదిలిన గ్రీన్ఫీల్డ్ హైవే!
రాజంపేట: శేషాచలం అటవీ ప్రాంతంలోపచ్చటి ప్రకృతి ఒడిలో ఆహ్లాదకరమైన ప్రయాణం కల్పించే కడప–రేణిగుంట గ్రీన్ఫీల్డ్ నేషన్ హైవే నిర్మాణానికి కదిలిక ప్రారంభమైంది. ఈమేరకు బుధవారం రాజంపేట–రాయచోటి రహదారిలోని కూచివారిపల్లె వద్ద నిర్మాణసంస్ధ పనులకు శ్రీకారం చుట్టింది. నిర్వాహకులు భూమి పూజ చేశారు. ఈ హైవే నిర్మాణానికి రూ.3,232 కోట్లు వ్యయం చేస్తున్న సంగతి తెలిసిందే. రాజంపేట నియోజకవర్గం, సిద్ధవటం మండలం భాకరాపేట వద్ద ఉన్న పెద్దపల్లి, రైల్వేకోడూరు నియోజకవర్గంలోని రైల్వేకోడూరు మండలంలోని శెట్టిగుంట వద్ద టోల్ప్లాజా నిర్మించనున్నారు. సోలాపూర్–కర్నూలు–చైన్నె జాతీయరహదారి(716)లో ఆంధ్రప్రదేశ్లో 329 కిలోమీటర్ల మేర విస్తరించారు. ఇందులో కడప –రేణిగుంట వరకు 122 కిలోమీటర్ల దూరం నాలుగు వరుసలుగా విస్తరించేలా ప్రాజెక్టు మంజూరైంది. అటవీశాఖ , పర్యావరణ అనుమతులు గత డిసెంబరులో వచ్చాయి. వైల్డ్లైఫ్(వన్యప్రాణి సంరక్షణ విభాగం) అనమతులు ఇస్తూ కేంద్రం ఇటీవల నిర్ణయం తీసుకున్న సంగతి విధితమే. 82 కి.మీ గ్రీన్ఫీల్డ్.. కడప–రేణిగుంట నేషనల్హైవేలో 82 కిలోమీటర్ల దూరం గ్రీన్ఫీల్డ్రోడ్గా పరిగణనలోకి తీసుకున్నారు. కడప, అన్నమయ్య, తిరుపతి జిల్లాల పరిధిలో 122 కిలోమీటర్ల హైవే కొనసాగుతుంది. కడప నుంచి భాకరాపేట వరకు ఇప్పుడున్న రెండు వరసల దారిని నాలుగు వరసలుగా మార్చుతారు. భాకరాపేట నుంచి రైల్వేకోడూరు అవతల శెట్టిగుంట వరకు 82 కిలోమీటర్ల మేర కొత్తగా గ్రీన్ఫీల్డ్ రహదారిని నిర్మితం చేయనున్నారు. శెట్టిగుంట నుంచి రేణిగుంట సమీపంలో ప్రస్తుతం ఉన్న హైవేను ఫోర్లైన్గా మార్చనున్నారు. రేణిగుంట వద్ద బైపాస్ 3,5 కిలోమీటర్లు నిర్మితం చేయనున్నారు. ఈ హైవే ప్రాజెక్టు రెండు ప్యాకేజీలుగా విభించారు. కడప నుంచి చిన్నఓరంపాడు వరకు 64 కిలో మీటర్లు, తొలి ప్యాకేజిగాను విభించారు. చిన్నఓరంపాడు నుంచి రేణిగుంట వరకు 58 కిలోమీటర్ల దూరాన్ని రెండ ప్యాకేజీ కిందికి తీసుకొచ్చారు. హైవే రాకతో తగ్గనున్న ట్రాఫిక్.. ప్రస్తుత కడప–రేణిగుంట హైవేలో రోజురోజుకు ట్రాఫిక్ పెరుగుతోంది. ఈ మార్గం మీదుగా తిరుపతి, చైన్నె, ముంబై, హైదరాబాద్ మధ్య రాకపోకలు సాగిస్తున్నాయి. నిత్యం 17వేలకు పైగా వాహనాలు హైవేపై పరుగులు తీస్తున్నాయి. ప్రస్తుతం ఉన్న ట్రాఫిక్కు ప్రస్తుతం ఉన్న హైవే కెపాసిటీ సరిపోవడంలేదు. నాలుగులైన్లరోడ్డు నిర్మాణంతో ట్రాఫిక్ తగ్గి, సర్వీసురోడ్డుగా మారునున్న రహదారిలో ప్రమాదాలు తగ్గుముఖం పడతాయి. గ్రీన్ఫీల్డ్ హైవే కొంత భాగం అటవీ ప్రాంతంలో వెళ్లాల్సి ఉంది. అందువల్ల ఒక నుంచి ఒకటిన్నర ఎత్తులో హైవే నిర్మాణం చేపట్టనున్నారు. వన్యప్రాణుల సంచరించేందుకు వీలుగా ఈ హైవే 5.5 కిలోమీటర్ల మేరకు 11 చోట్ల వంతెనలు నిర్మించనున్నారు. వంతెనలపై నుంచి వాహనాలు రాకపోకలు సాగించేలా.. కింది భాగంలో వన్యప్రాణులు తిరిగేలా సౌకర్యం కల్పించనున్నారు. కడప–రేణిగుంట ఎన్హెచ్ ఏర్పడిన తర్వాత తక్కువ వ్యవధిలో తిరుపతికి చేరుకునే పరిస్ధితులు ఆవిష్కృతమవుతాయి. -
అన్నమయ్య జిల్లాను యథాతథంగా ఉంచండి
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లాను అడ్డగోలుగా విభజించి, రాయచోటిపై రాజకీయ ప్రతాపం చూపుతున్నారని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను వివరించారు. గత జగన్ ప్రభుత్వం పార్లమెంట్ ప్రాతిపదికన జిల్లాలను ఏర్పాటు చేసి, పారదర్శకంగా 13 జిల్లాల నుంచి 26 జిల్లాలకు పెంచిందన్నారు. అప్పట్లో అడ్డగోలుగా జిల్లాల పునర్విభజన చేశారని గగ్గోలు పెట్టి విమర్శలు చేసిన వారే నేడు అప్పుడు ఏర్పాటు చేసిన జిల్లాలనే కుదించేసి, కొత్తగా 3 జిల్లాలను ఏర్పాటు చేస్తున్నారన్నారు. మదనపల్లెను 4 నియోజకవర్గాలతో జిల్లా కేంద్రం చేసి, రాయచోటి నుంచి మదనపల్లెను విభజించి ఏమి సాధించారన్నారు. మదనపల్లె లేని అన్నమయ్య జిల్లాను ఊహించడానికి బాధగా ఉందన్నారు. ఒక జిల్లా కేంద్రం ఆరు లేక ఏడు నియోజకవర్గాలతో 30 మండలాలకు పైగా ఉంటే అక్కడికి వచ్చే కలెక్టర్లు, ఎస్పీలు శ్రద్ధగా, బాధ్యతగా విధులు నిర్వహిస్తారన్నారు. రెండు, మూడు నియోజకవర్గాలతో జిల్లా కేంద్రం ఏర్పాటు చేసి ప్రజల మధ్య వైషమ్యాలు పెంచడం ఈ ప్రభుత్వం చేస్తున్న తప్పిదమన్నారు. ఎందుకంత వివక్ష.. కక్ష.. ఎన్నికల సమయంలో హిందూపురాన్ని జిల్లా కేంద్రం చేస్తామని చెప్పారే, సత్యసాయి జిల్లాను ఎందుకు విభజించలేదని ప్రశ్నించారు. మీకు అన్నమయ్య జిల్లాపైనే ఎందుకంత వివక్ష , కక్ష అని ఆయన నిలదీశారు. నాటి జిల్లాల పునర్విభజన కమిటీ సభ్యులు నీలం సాహ్ని, కృష్ణబాబు, జవహర్రెడ్డి తదితర సభ్యులందరి దగ్గరికి వెళ్లి ఈ నియోజకవర్గంలో ఖాళీ స్థలాలు, వెనుకబాటుతనాన్ని వివరించామని గుర్తు చేశారు. కొత్తగా ఏర్పడిన 13 జిల్లాల్లో ఏ జిల్లా కేంద్రానికి తీసిపోని విధంగా కార్యాలయాలన్నింటినీ ప్రభుత్వ భవనాల్లోనే ఏర్పాటు చేయించి, అతి స్వల్ప కాలంలోనే 75వ స్వాతంత్య్ర వేడుకలను ఘనంగా నిర్వహించడంతో ఇది ఎలా సాధ్యపడిందని అందరూ రాయచోటి వైపు చూసేలా కృషి చేశామన్నారు. ప్రభుత్వం పునరాలోచన చేసి అన్నమయ్య జిల్లాను యథాతథంగా కొనసాగించాలని ఆయన డిమాండ్ చేశారు. మదనపల్లె లేని అన్నమయ్య జిల్లాను ఊహించలేం రాయచోటిపై రాజకీయ ప్రతీకారం జిల్లా విభజన అన్యాయం ప్రజల మధ్య వైషమ్యాలు పెంచుతున్న చంద్రబాబు ప్రభుత్వం వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
కంటైనర్ లారీ.. కారు ఢీ
ములకలచెరువు : కంటైనర్ లారీ, కారు ఢీ కొన్న సంఘటనలో కారులో ప్రయాణిస్తున్న ఇద్దరు మృతి చెందారు. బుధవారం జరిగిన ఈ ప్రమాదానికి సంబంధించిన వివరాలు పోలీసులు, బాధితుల కుటుంబ సభ్యుల కథనం మేరకు.. సత్యసాయి జిల్లా తనకల్లు మండలం సాపిరెడ్డిగారిపల్లెకు చెందిన సీవీ వెంకటరమణ, సీవీ రాజశేఖర్లు కొన్నేళ్ల క్రితం నుంచి మదనపల్లెలోని ప్రశాంత్నగర్లో ఉంటున్నారు. బంధువుల పెళ్లి ఉండడంతో మంగళవారం రాత్రి కారులో సత్యసాయి జిల్లా తనకల్లు మండలం తవళం గ్రామానికి వచ్చారు. బుధవారం ఉదయం పెళ్లి చూసుకొని తిరిగి ఇంటికి కారులో వస్తుండగా ములకలచెరువు మండలం వేపూరికోట పంచాయతీ ఆవులవారిపల్లి క్రాస్వద్ద ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీ, వీరిద్దరూ ప్రయాణిస్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ ప్రమాదంలో ఇద్దరూ సంఘటన స్థలంలోనే దుర్మరణం చెందారు. సీవీ వెంకటరమణ(65) రిటైర్డ్ కండక్టర్ కాగా, సీవీ రాజశేఖర్ మగ్గాలు నేస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఇద్దరూ ఒకే కుటుంబానికి చెందిన వారు కావడంతో కుటుంబ సభ్యులు సంఘటన స్థలానికి చేరుకొని బోరున విలపించారు. సమాచారం అందుకున్న ఎస్ఐ నరసింహుడు, సిబ్బంది ప్రమాద స్థలాన్ని పరిశీలించారు. మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. ఇద్దరి దుర్మరణం -
హత్య కాదు.. ప్రమాదమే
కలికిరి : మండలంలోని సత్యాపురానికి చెందిన ముంగర వినీత్ కుమార్ రాజు(25) ఒంటి నిండా తీవ్రగాయాలతో ఈ నెల 14న అర్థరాత్రి అనుమానాస్పద స్థితిలో మృతి చెందాడు. మృతుని తల్లి ముంగర సుకన్య తన కుమారుడిని స్నేహితులే హత్య చేసి రోడ్డుపై పడేశారని ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు వినీత్కుమార్ రాజుది హత్య కాదు.. ప్రమాదమేనని విచారణలో తేల్చారు. బుధవారం పోలీసులు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. అబూబకర్ పెద్ద కుమార్తె పుట్టిన రోజు సందర్భంగా వినీత్కుమార్రాజు, కలికిరికి చెందిన నౌషాద్, అహ్మద్, టి.మాదిగపల్లికి చెందిన నరేష్లు ఈ నెల 14న రాత్రి 9.30 గంటలకు నౌషాద్ కారులో బయల్దేరి కలికిరిలో ఓ మద్యం దుకాణంలో మద్యం తీసుకున్నారు. కారులో తాగుతూ రాయచోటికి వెళ్లి తిరిగి కలికిరికి బయలుదేరారు. క్రాస్ రోడ్డులో అబూబకర్, అహ్మద్లను దింపిన నౌషాద్ సత్యాపురంలో వినీత్ను దింపి టి.మాదిగపల్లిలో నరేష్ను దింపాడు. అక్కడి నుంచి తిరిగి వచ్చేటప్పుడు సత్యాపురంలో ఎదురుగా వచ్చిన వినీత్కుమార్ రాజును ఢీకొట్టాడు. దీంతో తీవ్ర గాయాలతో అక్కడికక్కడే వినీత్కుమార్ చనిపోయాడు. నౌషాద్ జరిగిన ఘటనను ఎవ్వరికీ చెప్పకుండా సాక్ష్యాధారాలను తారుమారు చేసేందుకు ప్రయత్నించాడు. నిందితుల కాల్డేటా, వారు ఇచ్చిన వివరాల మేరకు వినీత్ హత్యకు గురి కాలేదని, ప్రమాదంలోనే మరణించినట్లు తెలిపారు. నలుగురు నిందితులను బుధవారం కలికిరి పాలిటెక్నిక్ వద్ద అరెస్టు చేసినట్లు కలికిరి ఇన్చార్జి సీఐ యుగంధర్ తెలిపారు. -
ఆవిష్కరణల రూపకర్తలుగా విద్యార్థులు
రాయచోటి : విద్యార్థుల్లో నైపుణ్యాలను పెంపొందింపజేసి ఆవిష్కరణల రూపకర్తలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం అటల్ పాఠశాలల ఉపాధ్యాయులకు పిలుపునిచ్చారు. రాయచోటి పట్టణం మాసాపేట జెడ్పీ ఉన్నత పాఠశాలలో బుధవారం ప్రారంభమైన అటల్ టింకరింగ్ పాఠశాలల మూడు రోజుల శిక్షణా కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. విద్యార్థులలోని నైపుణ్యాలను పెంపొందింప చేయడానికి ఉద్దేశించి అటల్ టింకరింగ్ ల్యాబ్లను స్థాపించారన్నారు. ప్రయోగశాలలోని పరికరాలను సక్రమంగా ఉపయోగిస్తే విద్యార్థులలో నైపుణ్య అభివృద్ధి జరుగుతుందన్నారు. తద్వారా విద్యార్థులు విభిన్న ఆలోచనలను కలిగి నూతన ఆవిష్కరణలను రూపొందిస్తారన్నారు. ఈ శిక్షణా కార్యక్రమంలో జిల్లా సైన్స్ అధికారి మార్ల ఓబుల్రెడ్డి, జిల్లా రీసోర్స్ సభ్యులు వేణుగోపాల్రెడ్డి, షర్ఫుద్దీన్, హేమంత్, వెంకటేశ్వర్లు, మనోహర్, అజయ్, సాయి, అటల్ పాఠశాలల ప్రధానోపాధ్యాయులు, ఇన్చార్జి ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
కార్మిక చట్టాలకు వ్యతిరేకంగా నిరసన
రాయచోటి అర్బన్ : దేశంలో కార్పొరేట్ల కోసమే కేంద్ర ప్రభుత్వం 29 కార్మిక చట్టాలను, 4 లేబర్ కోడ్లుగా మార్చిందని కార్మిక , రైతు సంఘాల నేతలు ఆరోపించారు. లేబర్ కోడ్స్కు వ్యతిరేకంగా బుధవారం అన్నమయ్య జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద కార్మిక సంఘాలతో కలిసి సీఐటీయూ, ఏఐటీయూసీ, రైతు, వ్యవసాయ కార్మిక సంఘాల నేతలు నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం లేబర్ కోడ్లను వెంటనే రద్దు చేయాలని సీపీఐ జిల్లా కార్యదర్శి మహేష్, సీపీఐ(ఎంఎల్) జిల్లా ప్రధాన కార్యదర్శి విశ్వనాఽథ్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి రామాంజులు, ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి సాంబశివ, రైతు, వ్యవసాయ, కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శులు రంగారెడ్డి, కృష్ణప్ప డిమాండ్ చేశారు. 2019లో వేతన కోడ్, 2020లో పారిశ్రామిక సంబంధాల కోడ్, సామాజిక భద్రత కోడ్, వృత్తి భద్రత, ఆరోగ్యం, పని పరిస్థితుల కోడ్లు పార్లమెంట్లో ఆమోదం పొందాయన్నారు. అయితే గత ఐదేళ్ల నుంచి వాటిని అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వానికి ధైర్యం లేకుండా పోయిందన్నారు. నూతనంగా వచ్చిన కార్మిక చట్టాలు కార్మికులను పీల్చి పిప్పిచేస్తాయని వారు తెలిపారు. ఇప్పటికై నా ఆ చట్టాలను రద్దు చేయకపోతే రాబోవు రోజుల్లో ప్రతిఘటన, పోరాటాలు అనివార్యం అవుతాయని హెచ్చరించారు. కార్యక్రమంలో రాయచోటి నియోజకవర్గ కార్యదర్శి సిద్దిగాళ్ల శ్రీనివాసులు, సీఐటీయూ జిల్లా కార్యదర్శి భాగ్యలక్ష్మి, చెన్నయ్య, అక్బర్, ముబారక్, వేణుగోపాల్ రెడ్డి, నరసింహులు, తిరుమల, దేవా, చలపతి నాయుడు, జానకీ, రాధా తదితరులు పాల్గొన్నారు. -
డిసెంబర్లో అరటి ధరలు పెరిగే అవకాశం
పుల్లంపేట/రైల్వేకోడూరు : డిసెంబర్ నెల చివరలో అరటి ధరలు పెరిగే అవకాశం ఉందని జిల్లా ఉద్యాన శాఖ అధికారి సుభాషిణి పేర్కొన్నారు. బుధవారం రైల్వేకోడూరు, పుల్లంపేట మండల పరిధిలోని బావికాడపల్లెలో సాగులో ఉన్న అరటి తోటలను ఆమె పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రస్తుతం 500 ఎకరాల్లో రెండో పిలక కోతకు వస్తుందని, డిసెంబర్ చివరి నాటికి 3000 ఎకరాల్లో పంట కోతకు వస్తుందని తెలిపారు. మహారాష్ట్రలో అరటిపంట కోతలు పూర్తయినందున వచ్చే నెలలో ధరలు పెరిగే అవకాశం ఉందన్నారు. రైతులు అధైర్య పడాల్సిన అవసరం లేదన్నారు. ధరలు పెంచే విషయమై ఉద్యాన శాఖ కమిషనర్ ఎగుమతిదారులు, ఢిల్లీ వ్యాపారులతో చర్చలు జరిపారని తెలిపారు. రైతులు గ్రూపులుగా ఏర్పడి నేరుగా మార్కెటింగ్ చేసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో రైల్వేకోడూరు, రాజంపేట, చిట్వేలి ఉద్యాన అధికారులు భాస్కర్, సునీల్, లోకేష్, ఉద్యాన సహాయకులు విష్ణు, రెడ్డిప్రవీణ్, రైతులు పాల్గొన్నారు. -
ఉరివేసుకుని యువతి ఆత్మహత్య
సిద్దవటం : మండలంలోని మాచుపల్లి గ్రామానికి చెందిన లావనూరు ఇషితరెడ్డి(18) అనే యువతి మంగళవారం సాయంత్రం ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకుందని ఏఎస్ఐ సుబ్బరామచంద్ర తెలిపారు. ఆయన తెలిపిన వివరాల మేరకు.. లావనూరు రామసుబ్బారెడ్డి, రాజేశ్వరిలకు కొడుకు, కూతురు ఉన్నారు. రామసుబ్బారెడ్డి కడపలో ఎలక్ట్రీషియన్గా పని చేస్తారు. రాజేశ్వరి షిరిడీ సాయి ఎలక్ట్రికల్స్లో పనిచేస్తారు. కొడుకు అఖిల్ చైతన్యరెడ్డి కడపలోని ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ మూడో సంవత్సరం చదువుతున్నాడు. కుమార్తె ఇషితరెడ్డి కడపలోని కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ సెకండియర్ చదువుతోంది. అయితే ఇషితారెడ్డి బుధవారం సాయంత్రం ఎవరూ లేని సమయంలో ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుంది. పోలీసులు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతికి గల కారణాలు తెలియాల్సి ఉంది. మృతురాలి తండ్రి రామసుబ్బారెడ్డి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. కుటుంబ సమస్యలతో..మదనపల్లె రూరల్ : కుటుంబ సమస్యలతో ఓ వ్యక్తి ఉరివేసుకుని ఆత్మహత్యకు యత్నించిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. మండలంలోని పొన్నేటిపాలెం పంచాయతీ ఎగువకురవంకకు చెందిన మునిరాజ(45) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది ఇంట్లోనే ఉరివేసుకుని ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకెళ్లారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం బాధితుడిని తిరుపతికి రెఫర్ చేశారు. గొంతు కోసుకుని.. మదనపల్లె రూరల్ : గొంతు కోసుకుని ఓ వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మంగళవారం రాత్రి జరిగింది. కర్నాటక రాయల్పాడుకు చెందిన భవన నిర్మాణ కార్మికుడు మురుగయ్య(30) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది పూటుగా మద్యం సేవించాడు. మద్యం మత్తులో గొంతు, చేతి నరాలు కోసుకుని ఆత్మహత్యకు ప్రయత్నించాడు. కుటుంబ సభ్యులు 108 అంబులెన్స్ వాహనంలో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. బావమరిదితో గొడవపడి..మదనపల్లె రూరల్ : నగదు విషయమై బావమరిదితో గొడవపడి బావ ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన చిత్తూరు జిల్లా పెద్ద పంజాణి మండలంలో జరిగింది. అప్పినపల్లెకు చెందిన గోపన్న కుమారుడు మంజునాథ(35) బుధవారం బావమరిది గంగరాజుతో నగదు విషయమై గొడవపడ్డాడు. ఈ విషయం కుటుంబ సభ్యులకు చెప్పాడు. అనంతరం మనస్తాపం చెంది ఇంటి వద్దే విష ద్రావణం మద్యంలో కలుపుకుని తాగాడు. పరిస్థితి విషమంగా ఉండటంతో వైద్యుల సూచన మేరకు తిరుపతికి తీసుకెళ్లారు. -
పౌరులకు దిక్సూచి రాజ్యాంగం
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న జిల్లా అదనపు ఎస్పీ వెంకటాద్రి, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ చిత్రపటానికి నివాళులు అర్పిస్తున్న జేసీ ఆదర్శ రాజేంద్రన్ రాయచోటి : దేశ పౌరులకు మార్గం చూపే దిక్సూచి లాంటిదే రాజ్యాంగమని, అందులోని పీఠికను ప్రతి ఒక్కరూ చదివి అర్థం చేసుకోవాలని జిల్లా సంయుక్త కలెక్టర్ ఆదర్శ రాజేంద్రన్ సూచించారు. బుధవారం రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి జిల్లా సంయుక్త కలెక్టర్, డీఆర్ఓ మధుసూదన్ రావులు జ్యోతి ప్రజ్వలన చేసి పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. వారు మాట్లాడుతూ యువత ప్రజాస్వామ్యంలో పాల్గొనడానికి రాజ్యాంగం తప్పనిసరిగా చదవాలని సూచించారు. రాజ్యాంగ విలువలు, ఆకాంక్షలకు రాజ్యాంగ పీఠిక నిదర్శనం అన్నారు. ఈ కార్యక్రమంలో కలెక్టరేట్లోని వివిధ సెక్షన్ల సూపరిటెండెంట్లు, సిబ్బంది, జిల్లా అధికారులు తదితరులు పాల్గొన్నారు. రాజ్యాంగం భారతీయుల ఆత్మ : అదనపు ఎస్పీ ప్రపంచంలోనే అతిపెద్ద ప్రజాస్వామ్య దేశమైన భారతదేశాన్ని ఒకతాటిపై నడిపిన ఘనత భారత రాజ్యాంగానికే దక్కుతుందని జిల్లా అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి అన్నారు. 76వ రాజ్యాంగ దినోత్సవాన్ని పురస్కరించుకొని బుధవారం జిల్లా పోలీసు కార్యాలయంలో ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు వేడుకలు నిర్వహించారు. రాజ్యాంగ నిర్మాత, భారతరత్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్ చిత్రపటానికి అదనపు ఎస్పీ పూలమాల వేసి ఘనంగా నివాళులు అర్పించారు. అనంతరం పోలీసు అధికారులు, సిబ్బంది కార్యాలయ సిబ్బందితో రాజ్యాంగ ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో ఆర్ఐలు వీజే రామకృష్ణ, ఎం. పెద్దయ్య, డీసీఆర్బీ సీఐ ఎం.తులసీరాం, ఎస్ఐలు, ఆర్ఎస్ఐలు, డీపీఓ సిబ్బంది, మహిళా పోలీసులు, హోంగార్డులు తదితరులు పాల్గొన్నారు. -
రాష్ట్ర స్థాయి బాస్కెట్ బాల్ విజేతలు అనంతపురం, కృష్ణా
ట్రోఫీ అందుకుంటున్న కృష్ణా బాలికల జట్టు ట్రోఫీ అందుకుంటున్న అనంతపురం బాలుర జట్టు మదనపల్లె సిటీ : రాష్ట్ర స్థాయి అండర్ 14 బాల,బాలికల బాస్కెట్ బాల్ పోటీల్లో బాలుర విభాగంలో అ నంతపురం జిల్లా జట్టు విజేతగా నిలిచింది. బాలికల జట్టులో కృష్ణాజిల్లా జట్టు విజయం సాధించింది. మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాలలో జరిగిన 69వ ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి పోటీలు బుధవా రం ముగిశాయి. బాలుర విభాగంలో ఫైనల్స్లో అనంతపురం, తూర్పు గోదావరి జట్లు పోటీపడగా అనంతపురం జిల్లా జట్టు విజయం సాధించింది. చిత్తూరు జిల్లా జట్టు తృతీయ స్థానంలో నిలిచింది. బాలికల విభాగంలో కృష్ణా, తూర్పుగోదావరి జట్లు ఫైనల్స్లో పోటీపడగా కృష్ణా జట్టు 29–15 పాయింట్లతో మొద టి స్థానం దక్కించుకుంది. తృతీయ స్థానంలో చిత్తూ రు జట్టు నిలిచింది. విజయం సాధించిన జట్లకు ఉమ్మ డి చిత్తూరు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు, జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి నాగరాజు ట్రోఫీలు, బహుమతులు అందజేశారు. ఈ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన క్రీడాకారులను రాష్ట్ర జట్టుకు ఎంపిక చేసినట్లు నాగరాజు తెలిపారు. కార్యక్రమంలో హెచ్ఎం చంద్రశేఖర్, ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేష్బాబు, పీడీలు రమేష్, మొయినుద్దీన్, ఆసిఫ్, రియాజ్, రాజేశ్వరి, లత, భారతి తదితరులు పాల్గొన్నారు. రాష్ట్ర స్థాయి అండర్ –14 బాలుర జట్టు: యోగేశ్వర్, నిఖిల్, సత్య( అనంతపురం), జశ్వంత్కుమార్, చరణ్(తూర్పు గోదావరి), దీపేష్, పుష్కర్( చిత్తూరు), డేనియల్ నాష్, రోహిత్(కృష్ణా) వేదాంతరెడ్డి(పశ్చిమ గోదావరి), నీల్జుబేను( (వైజాగ్), ధర్మేందర్(నెల్లూరు), మోక్షిత్( కర్నూలు), స్టాండ్బైలుగా పావన వెంకటదుర్గేష్( పశ్చిమ గోదావరి),షణ్ముఖ,(అనంతపురం), సింహాద్రి( తూర్పు గోదావరి), షణ్మఖ( గుంటూరు), మున్నా (కృష్ణా), భరత్ (చిత్తూరు) ఎంపికయ్యారు. అండర్–14 రాష్ట్ర స్థాయి బాలికల జట్టు: కావ్య,జెస్సీ(కృష్ణా), లాస్య, దివ్యశ్రీ (తూర్పు గోదావరి), నీలిషా, హరిత (చిత్తూరు), సాత్విక, సంజన (పశ్చిమ గోదావరి), కావ్య (గుంటూరు), హర్షిత( (కర్నూలు), నవ్య (వైజాగ్), లిఖిత( నెల్లూరు), స్టాండ్బైలుగా సిద్ర(అనంతపురం), రత్నదీపిక( తూర్పుగోదావరి),నీలిమ (కృష్ణా), కీర్తన శ్రీ (కర్నూలు), అక్షయ (గుంటూరు), లోహిత (వైజాగ్) ఎంపికయ్యారు. -
పంచసూత్రాల అమలుతో రైతుల ఆర్థికాభివృద్ధి
రాయచోటి జగదాంబసెంటర్/సంబేపల్లె: ప్రభుత్వం చేపట్టిన రైతన్న మీకోసం కార్యక్రమంలోని పంచ సూత్రాల అమలుతో రైతుల ఆర్థిక అభివృద్ధి సాధ్యమని జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు. బుధవారం రాయచోటి మండలం ఇందుకూరుపల్లి, సంబేపల్లె మండలం మోటకట్ల గ్రామం వంగిమళ్ళ వాండ్లపల్లెలో జరుగుతున్న పంచ సూత్రాల అవగాహన కార్యక్రమాన్ని కలెక్టర్ ఆకస్మిక తనిఖీ చేసి రైతులతో మాట్లాడారు. అనంతరం ఆయన మాట్లాడుతూ రైతన్న మీకోసం కార్యక్రమాన్ని వ్యవసాయ శాఖ అధికారులు, సిబ్బంది అమలు చేస్తున్నారా లేదా తృణధాన్యాలు పశువుల పెంపకం ఎరువుల వినియోగాన్ని తగ్గించడంపై అవగాహన కల్పిస్తున్నారా లేదా వంటి పలు ప్రశ్నలు అడిగి తెలుసుకున్నారు. జిల్లా కలెక్టర్ ప్రశ్నలకు స్పందించిన రైతులు తమకు పశువులు అందించగలిగితే తమకు ఉపయోగకరంగా ఉంటుందని తెలపగా దీనిపై వెంటనే చర్యలు చేపట్టాలని జిల్లా వ్యవసాయ శాఖ అధికారిని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జిల్లా వ్యవసాయ అధికారి శివ నారాయణ ఏడీఏ శ్రీలత ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్ ఎంపీడీవో వెంకటసుబ్బారెడ్డి డిప్యూటీ ఎంపీడీవో సునీల్ గ్రామ వ్యవసాయ సహాయకురాలు మహేశ్వరి రైతులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ -
పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలి
చిన్నమండెం : పాడి రైతులకు 50 శాతం రాయితీతో అందజేస్తున్న పశువుల దాణాను సద్వినియోగం చేసుకోవాలని పశుసంవర్థక శాఖ రాయచోటి ఉప సంచాలకుడు డాక్టర్ డి.మాలకొండయ్య తెలిపారు. చిన్నమండెం మండలం బోరెడ్డిగారిపల్లె, వండాడి గ్రామాల్లోని రైతు సేవా కేంద్రాల్లో రైతులకు పశువుల దాణాను అధికారులు పంపిణీ చేశారు. కార్యక్రమంలో మండల పశువైద్యాధికారి డాక్టర్ భాస్కర్, పశువైద్య సహాయకులు, పాడి రైతులు పాల్గొన్నారు. స్థలం వివాదం.. ముగ్గురిపై దాడి మదనపల్లె రూరల్ : స్థలం వివాదం కారణంగా ముగ్గురిపై దాడిచేసిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. చీకలబైలు పంచాయతీ మేడిపల్లెకు చెందిన మల్లప్ప(65)కు స్థానికంగా కొంత స్థలం ఉంది. ఆ స్థలంలో అదే గ్రామానికి చెందిన మరో వర్గంలోని వ్యక్తులు ఆక్రమించి మట్టి తోలారు. ఈ విషయమై మల్లప్ప, అతడి కుమారుడు నాగభూషణం(40) దొనబైలులో నివాసం ఉన్న కుమార్తె కళావతమ్మ(49)తో కలిసి ప్రశ్నించారు. తమ స్థలంలో ఎందుకు మట్టి తోలారంటూ నిలదీశారు. దీంతో అదే గ్రామానికి చెందిన మల్లికార్జున, కృష్ణమురారి, రాజేంద్ర, చిన్నప్ప, సుభద్ర కలిసి మల్లప్ప వర్గీయులపై దాడికి పాల్పడ్డారు. దాడిలో నాగభూషణంకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికుల సహాయంతో బాధితులు ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చేరి చికిత్స పొందారు. దాడి ఘటనపై తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. వరి పంటపై అడవి పందుల దాడి సుండుపల్లె : మండల పరిధిలోని భాగంపల్లి గ్రామానికి చెందిన రామాంజులురెడ్డి వరి పంటపై మంగళవారం రాత్రి అడవి పందులు దాడి చేశాయి. ఈ సందర్భంగా రైతు మాట్లాడుతూ రెండు ఎకరాలలో వరి పంటను సాగు చేశానని రూ.60 వేలు ఖర్చు చేశానని తెలిపాడు. పంట కోత దశలో ఉన్న క్రమంలో అడవి పందుల గుంపు పంటను ధ్వంసం చేసిందని ఆవేదన వ్యక్తం చేశాడు. సీజ్ చేసిన ఇసుక తరలింపు ములకలచెరువు : మండలంలోని సోంపల్లె పంచాయతీ జవకలకోట వద్ద గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో కాలువ పనుల కోసం డంప్ చేసిన ఇసుకను పలువురు కూటమి నాయకులు ట్రాక్టర్ల ద్వారా ఇళ్ల పనులకు తోలుకుంటూ జేబులు నింపుకుంటున్నారు. ఈ ఇసుకను అక్రమంగా తరలించారని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక కక్షగట్టి 265 ఏ సర్వే నంబరులో డంప్ చేసిన ఇసుకను సీజ్ చేసిన విషయం పాఠకులకు తెలిసిందే. ఈ ఇసుకను తరలించకుండా వైఎస్సార్సీపీ ప్రజాప్రతినిధులు హైకోర్టులో పిటీషన్ దాఖలు చేయడంతో కోర్టు స్టే విధించింది. అనంతరం ఇసుక రక్షణ బాధ్యతను రెవెన్యూ అధికారులకు అప్పగించారు. రెవెన్యూ అధికారులను సైతం లెక్క చేయకుండా కూటమి నాయకులు ఇష్టానుసారంగా ట్రాక్టర్లు ఏర్పాటు చేసి ఇసుకను తరలిస్తూ మంగళవారం పట్టుబడ్డారు. దీనిపై తహసీల్దార్ ప్రదీప్కు ఫిర్యాదు చేయగా సీజ్ చేసిన ఇసుకను తరలిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని ఆయన హెచ్చరించారు. -
రైతాంగ సమస్యల పరిష్కారానికి కృషి
సిద్దవటం: రైతాంగ సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేస్తోందని జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు చంద్రానాయక్ తెలిపారు. మండలంలోని కడపయపల్లి గ్రామం టక్కోలు రైతు సేవా కేంద్రం పరిధిలో మంగళవారం జరిగిన రైతన్నా మీ కోసం అనే కార్యక్రమాన్ని ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఈ కార్యక్రమం ఉద్దేశాలపై రైతులకు వివరించారు. మండల వ్యవసాయ అధికారి రమేష్రెడ్డి, వీఏఏ జైపాల్, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. విద్యార్థుల మధ్యాహ్న భోజనం కోసం సిద్దవటం జెడ్పీ హైస్కూల్ ఆవరణలో నిర్మిస్తున్న సెంట్రల్ కిచెన్ షెడ్ పనులను జిల్లా వ్యవసాయ సంయుక్త సంచాలకుడు చంద్రానాయక్ పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఎంపీడీఓ ఫణి రాజకుమారి, ఎంపీడీఓ కార్యాలయ ఏఓ సోమశేఖర్, వ్యవసాయాధికారి రమేష్రెడ్డి, పంచాయతీరాజ్ ఏఈ నాగరాజు, ఏఈఓ ప్రభాకర్ఎడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మాదకద్రవ్యాల ఉచ్చులో పడొద్దు
రాయచోటి టౌన్: యువత మాదక ద్రవ్యాల ఉచ్చులో పడి, జీవితాన్ని నాశనం చేసుకోవద్దని అన్నమయ్య జిల్లా యువజన సర్వీసుల శాఖ కమిషనర్ వీవీ సుబ్బరాయుడు తెలిపారు. రాయచోటి బాలికోన్నత పాఠశాలలో మంగళవారం మాదక ద్రవ్యాల దుర్వినియోగంపై అవగాహన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాదకద్రవ్యాల వాడకం దుర్వినియోగం అవుతోందని, దీని దుష్ఫలితం దేశంపై పడుతోందన్నారు. మారకద్రవ్యాలను ఉపయోగిస్తున్న కుటుంబాలలోని వ్యక్తులు సమాజం నుంచి అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. అనంతరం ఎకై ్సజ్ సీఐ గురుప్రసాద్ మాట్లాడుతూ మారక ద్రవ్యాల దుర్వినియోగంపై సమష్టిగా పోరాటం సాగించి అరికట్టాలని సూచించారు. ఈ కార్యక్రమంలో పాఠశాల హెచ్ఎం సైరా బాను, స్టెప్ సిబ్బంది వీవీ నారాయణ, ఉపాధ్యాయ సంఘం నాయకులు అబ్బవరం హరిబాబు, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. లేబర్ కోడ్లపై కార్మికులకు అవగాహన అవసరం – డీడీఎంఎస్ అధికారి కిషోర్ కుమార్ ఓబులవారిపల్లె : కేంద్ర ప్రభుత్వం కార్మిక చట్టాలపై తీసుకొచ్చిన నాలుగు లేబర్ కోడ్లపై కార్మికులకు అవగాహన అవసరమని నెల్లూరు డీడీఎంఎస్ అధికారి కిషోర్ కుమార్ అన్నారు. ఈవిషయంపై మంగళవారం మంగంపేట ఏపీఎండీసీ కార్యాలయ ప్రాంగణంలో శిక్షణ తరగతులు నిర్వహించారు. నాలుగు కోడ్ల గురించి కార్మికులకు వివరించారు. శిక్షణ తరగతుల కార్యక్రమంలో అన్ని కార్మిక సంఘాల నాయకులు, కార్మికులు, మహిళా ఉద్యోగులు పాల్గొన్నారు. -
మదనపల్లి ఎకై ్సజ్ కార్యాలయంలో కస్టడీ నిందితుల విచారణ
● గోప్యంగా విచారిస్తున్న ఏసీ చంద్రశేఖర్రెడ్డి ● జనార్దన్రావు కోసం పీటీ వారెంట్ దాఖలు ములకలచెరువు : రాష్ట్రంలో సంచలనం సృష్టించిన ములకలచెరువు నకిలీ మద్యం కేసుకు సంబంధించి మదనపల్లి సబ్జైల్లో శిక్ష అనుభవిస్తున్న ఆరుగురిని కస్టడీకి తీసుకొని మదనపల్లె ఎకై ్సజ్ కార్యాలయంలో అధికారులు విచారణ చేపట్టారు. మూడు రోజుల పాటు వీరిని కస్టడీకి కోర్టు అనుమతించింది. ముఖ్యంగా కట్టారాజు, బాలాజీల వాంగ్మూలం ఆధారంగానే ఈ కేసు మలుపుతిరుగుతోంది. కట్టారాజు జనార్దన్రావు ముఖ్య అనుచరుడు కాగా, బాలాజీ నకిలీ మద్యం తయారీకి స్పిరిట్, బాటల్ మూతలు సరఫరా చేశాడు. మంగళవారం కడప ఎన్ఫోర్స్మెంట్ ఏసీ చంద్రశేఖర్రెడ్డి వీరిని గోప్యంగా విచారిస్తున్నారు. వీరి నుంచి కీలక ఆధారాలు రాబట్టేందుకు తగిన చర్యలు తీసుకున్నారు. ఎటువంటి సమాచారం బయటకు రాకుండా పకడ్బందీగా విచారణ చేపడుతున్నారు. వీరిద్దరూ ఇబ్రహింపట్నం నకిలీ మద్యం కేసులో సైతం నిందితులుగా ఉన్నారు. మరో నలుగురి కోసం పీటీ వారెంట్ దాఖలు: ములకలచెరువు నకిలీ మద్యం కేసులో ఏ1 గా ఉన్న అద్దెపల్లి జనార్దన్రావుతో సహా మరో నలుగురిని ఇక్కడికి రప్పించడానికి ఎకై ్సజ్ అధికారులు తంబళ్లపల్లె కోర్టులో పీటీ వారెంట్ దాఖలు చేశారు. జనార్దన్రావు కనుసన్నలోనే ఇబ్రహింపట్నం, ములకలచెరువు నకిలీ మద్యం ప్లాంటు నడుస్తోంది. ఇతనితో పాటు జగన్మోహన్రావు, తిరుమలశెట్టి శ్రీనివాసురావు, తాండ్రా రమేష్బాబు, షేక్ అల్లాబక్షుల కోసం పీటీ వారెంట్ దాఖలు చేశారు. రెండు రోజుల్లో వీరి కోసం కోర్టు అనుమతి లభించనుందని అధికారులు చెబుతున్నారు. -
నాడు ధైర్యం.. నేడు దైన్యం!
ఈ రైతు పేరు రామచంద్రారెడ్డి. వేముల మండలం భూమయ్యగారిపల్లె. 14 ఎకరాలు అరటి పంట సాగు చేశాడు. ఎకరాకు రూ.1.20 లక్షల చొప్పున సుమారు రూ.16 లక్షలు పెట్టుబడి పెట్టాడు. సరాసరిగా ఎకరానికి రూ.5 లక్షలు చొప్పున ఆదాయం గడించాల్సి ఉంది. అరటి కోతకు వచ్చే సమయానికి మార్కెట్లో ధరలు పడిపోయాయి. టన్ను రూ.1500తో ఇస్తామన్నా వ్యాపారులు ఆసక్తి చూపడం లేదు. దీంతో 8 ఎకరాల్లో అరటితోటను తొలగించాడు. దాదాపు అరటి రైతులందరిదీ ఇదే పరిస్థితి.పంటలు నాడు వైఎస్ జగన్ నేడు చంద్రబాబు హయాంలో సర్కార్లో అరటి టన్ను రూ.25వేలు రూ.7వేలు పత్తి క్వింటా రూ.13వేలు రూ.6వేలు ఉల్లి క్వింటా రూ.3వేలు రూ.5వందలు చీనీ టన్ను రూ.70 వేలు రూ.12వేలు మామిడి టన్ను రూ.50 వేలు రూ.10వేలు (బేనీషా) సాక్షి ప్రతినిధి, కడప: వైఎస్సార్ కడప జిల్లాలో 20,231 ఎకరాల్లో అరటి సాగుచేశారు. అందులో ప్రధానంగా పులివెందుల, వేంపల్లె, వేముల, లింగాల, సింహాద్రిపురం, కాశినాయన, మైదకూరు మండలాల్లోనే సుమారు 16వేల ఎకరాల్లో సాగుచేశారు. మొదట్లో లింగాల, పులివెందుల, వేముల మండలాల్లో అత్యధికంగా సాగుచేస్తున్న అరటి సాగు జిల్లాలో క్రమేపీ పెరిగింది. అందుకు కారణం లేకపోలేదు. పెట్టుబడి పెట్టినా, గ్యారెంటీగా ఆదాయం వస్తుండడంతో అరటి సాగు చేసేందుకు రైతులు ఆసక్తి చూపారు. రెండు దశాబ్దాలుగా అరటి పంట వల్ల గణనీయమైన ఆదాయాన్ని రైతులు కళ్ల చూశారు. ఈమారు అరటి రైతుల అంచనాలు తలకిందులయ్యాయి. దిగుబడులున్నప్పటికీ, పంటను విక్రయించుకోలేని దుస్థితి రైతులకు దాపురించింది. విదేశాలకు ఎగుమతి లేదు. ఆ దిశగా చంద్రబాబు సర్కార్ చర్యల్లేవు. ఉత్తరాది రాష్ట్రాల్లో అపారంగా దిగుబడులు ఉండడం..అటు వైపు విక్రయించే పరిస్థితి లేకపోవడంతో అరటి రైతులు తీవ్ర నిరాశకు గురయ్యారు. ఈ క్రమంలో బుధవారం మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అరటి పంటను పరిశీలించనున్నారు. నిమ్మకు నీరెత్తినట్లుగా చంద్రబాబు సర్కార్... అరటి పంటపై నమ్మకం పెట్టుకున్న రైతుల పెట్టుబడులకు తగ్గ దిగుబడులు ఉన్నాయి. సరాసరిగా 20 నుంచి 25 టన్నుల దిగుబడి ఉంది. కాగా, మార్కెటింగ్ లేకపోవడంతోనే అసలు సమస్య ఏర్పడింది. వ్యాపారులు ఆసక్తి చూపకపోవడంతో అరటి రైతులకు దిక్కుతోచని పరిస్థితి నెలకొంది. సకాలంలో విక్రయించడం మినహా, నిల్వ చేసుకునేందుకు యోగ్యకరమైన పంట కాదు. పైగా అరటి ఆధారిత పరిశ్రమలు లేవు. ఇలాంటి పరిస్థితుల్లో రైతులకు భరోసాగా నిలవాల్సిన సీఎం చంద్రబాబు ప్రభుత్వం ఆ దిశగా కనీస ఆలోచనే చేయడం లేదు. నాటి ధీమా కరువు.. నాడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వం రైతుల పక్షపాతిగా నిలిచింది. ప్రతి పంటకు మద్దతు ధర లభించింది. అరటి టన్ను రూ.25వేలు తగ్గకుండా పలికింది. చీనీ టన్ను రూ.50 వేల నుంచి రూ.80 వేలు పలికిన సందర్భాలు లేకపోలేదు. మామిడి, ఉల్లి, ఇలా ఉద్యాన రైతులంతా ఠీవిగా ఉండేవారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా పంటలు నష్టపోతే పరిహారం నెలరోజుల్లోపే రైతుల ఖాతాల్లో జమ అయ్యేది. ఇప్పుడు ఆ పరిస్థితులు లేకపోగా రైతన్నా.. మీ కోసమంటూ మరో కొత్త ప్రచారానికి తెరతీశారనే విమర్శలున్నాయి.పులివెందుల: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం ఉదయం 8.45 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి బయలుదేరుతారు. బ్రాహ్మణపల్లె గ్రామ సమీపంలోని అరటి తోటలను పరిశీలించి రైతులతో మాట్లాడనున్నారు. అక్కడి నుంచి బయలుదేరి ఇటీవల మృతి చెందిన లింగాల మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి ఇంటికి చేరుకుంటారు. మాజీ సర్పంచ్ మహేష్రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 12.30 గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసానికి చేరుకుంటారు. 12.30 నుంచి 2 గంటల వరకు అక్కడ విశ్రాంతి తీసుకోనున్నారు. 2 గంటలకు భాకరాపురంలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన బయలుదేరి వేముల మండలం వేల్పుల గ్రామానికి చెందిన వైఎస్సార్సీపీ మండల పరిశీలకుడు లింగాల రామలింగారెడ్డి ఇంటికి చేరుకుంటారు. లింగాల రామలింగారెడ్డిని పరామర్శిస్తారు. అక్కడి బయలుదేరి 4 గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 4 గంటల నుంచి 7 గంటల వరకు తన క్యాంపు కార్యాలయంలో ప్రజలతో మమేకం కానున్నారు. 7 గంటలకు తన క్యాంపు కార్యాలయం నుంచి స్వగృహానికి బయలుదేరుతారు. 7.05 గంటలకు తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. అరటి రైతులది అరణ్య రోదన రెండు దశాబ్దాలుగాఎన్నడూ లేని దుస్థితి నిలువునా తోటలు దున్నేస్తున్నా పట్టించుకోని ప్రభుత్వం నేడు మాజీ సీఎంవైఎస్ జగన్మోహన్రెడ్డి అరటి పంటల పరిశీలన -
రూ.5 లక్షలు నష్టపోయా..
నాకున్న 3 ఎకరాల్లో అరటి సాగు చేశా. ఎకరాకు రూ.1.30 లక్షల మేర పెట్టుబడులు పెట్టా. తోటలో అరటి గెలలు కోతకు వచ్చిన సమయంలో ధరలు పడిపోయాయి. వ్యాపారులు తోటలవైపు కన్నెత్తి చూడలేదు. ధరల కోసం చూస్తే అరటి గెలలు మాగిపోతున్నాయి. ఎంతకో కొంతకు అరటి గెలలు కొట్టండి అంటే వ్యాపారులు ఆసక్తి చూపలేదు. దీంతో 3 ఎకరాల్లో అరటి తోటను తొలగించా. సాగులో రూ.5లక్షల మేర నష్టపోయా. అరటి ధరలు ఇంత దారుణంగా ఎప్పుడూ చూడలేదు. – గంగాధర, అరటి రైతు, వేముల 5 ఎకరాల్లో అరటి సాగు చేశా.. నాకున్న 5 ఎకరాల్లో అరటి సాగు చేశా. అరటి గెలల కొనుగోళ్లకు వ్యాపారులు మొగ్గు చూపడంలేదు. రూ.8లక్షల మేర పెట్టుబడి పెట్టా. ధరలు పడిపోవడంతోరూ.8లక్షలు నష్టపోతున్నా. – వెంకట నారాయణ, బచ్చయ్యగారిపల్లె -
యథేచ్ఛగా భూముల కబ్జా
పుల్లంపేట : మండలంలో భూ కబ్జాలు యథేచ్చగా కొనసాగుతున్నాయి. ప్రభుత్వ భూములైనా సరే ప్రైవేటు భూములైనా మాకు అడ్డేముందని టీడీపీ నాయకులు భూకబ్జాలకు పాల్పడుతున్నారు. ఓ వైపు రీసర్వే జరుగుతున్నప్పటికీ, ఆన్లైన్లో లబ్ధిదారుల పేర్లు ఉన్నప్పటికీ మాకేం సంబంధం లేదంటూ ఖాళీ భూమి కనిపిస్తే కబ్జా చేసేస్తున్నారు. మండల పరిధిలోని తిప్పాయపల్లె రెవెన్యూ గ్రామంలో 2014లో అప్పటి ప్రభుత్వం పేదల బతుకుదెరువు కోసం తలా రెండెకరాలు భూపంపిణీ చేసింది. ఇందుకు సంబంధించి అప్పట్లో పట్టాదారు పాసుపుస్తకాలు కూడా పంపిణీ చేశారు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రావడంతో పేదలకు పంపిణీ చేసిన భూములపై కూటమి నాయకుల కళ్ళు పడ్డాయి. అంతే మరో ఆలోచన లేకుండా జేసీబీ యంత్రాలను పొలంలోకి తెచ్చి దున్నేశారు. లబ్ధిదారులు మా భూముల్లో పనులు ఎందుకు చేస్తున్నారని ప్రశ్నిస్తే దిక్కున్న చోట చెప్పుకో పోండి అంటూ గెంటేస్తున్నారని బాధితులు వాపోతున్నారు. తిప్పాయపల్లె రెవెన్యూ గ్రామం సర్వేనెంబరు 1442–1లో ఎన్.సుజాత, 1443–4లో ఎన్.మల్లిక, 1444–1లో కె.పిచ్చమ్మ, 1444–7లో వై.గంగమ్మ, 1444–9లో టి.సుజాత, 1444–10లో కె.నరసమ్మలకు ఒక్కొక్కరికి రెండు ఎకరాల చొప్పున పంపిణీ చేయడం జరిగింది. ఆయా భూముల్లో లబ్ధిదారులు ఇప్పటికే బోరు కూడా వేసి డ్రిప్ పైపులు వేసి ఉన్నారు. కానీ ఆయా భూముల్లోకి వెళ్ళే పరిస్థితులు లేవంటూ లబ్ధిదారులు వాపోతున్నారు. రెవెన్యూ అధికారులకు ఫిర్యాదు చేయగా భూములు చూపారు గానీ కబ్జాదారులకు అడ్డుకట్టవేయలేకపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ విషయమై ఆర్ఐ రాజశేఖర్ను వివరణ కోరగా గతంలో ఓసారి ఫిర్యాదు చేయగా లబ్ధిదారులకు వారి భూములను చూపించామని తెలిపారు. -
● వైఎస్ జగన్ను కలిసిన పలువురు నేతలు..
మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం సాయంత్రం క్యాంపు కార్యాలయంలో పలువురు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కలిసి చర్చించారు. ప్రధానంగా కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితోపాటు మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, అన్నమయ్య జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి, బద్వేలు ఎమ్మెల్యే డాక్టర్ సుధ, రాయచోటి, రైల్వేకోడూరు, జమ్మలమడుగు, ప్రొద్దుటూరు మాజీ ఎమ్మెల్యేలు గడికోట శ్రీకాంత్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, డాక్టర్ సుధీర్రెడ్డి, రాచమల్లు శివప్రసాద్రెడ్డి, ఎమ్మెల్సీలు పొన్నపురెడ్డి రామసుబ్బారెడ్డి, రమేష్ యాదవ్, రామచంద్రారెడ్డి, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, కదిరి వైఎస్సార్సీపీ ఇన్చార్జి మగ్బూల్ బాషా, వైఎస్సార్సీపీ నేతలు రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, పూల శ్రీనివాసరెడ్డి, పులివెందుల మున్సిపల్ ఇన్చార్జి చవ్వా దుష్యంత్రెడ్డిలతోపాటు వైఎస్సార్సీపీ నేతలు కలిశారు. అలాగే విజయవాడ, నల్గొండ, శ్రీకాకుళం తదితర ప్రాంతాల నాయకులు కలిశారు. -
టైపిస్ట్ ప్రశాంత్ నాయక్ సస్పెన్షన్
– డిజిటల్ కీ దుర్వినియోగంపై ఎఫ్ఐఆర్ నమోదు రాయచోటి : సుండుపల్లి మండలంలో అక్రమంగా పొసెషన్ సర్టిఫికెట్లు జారీ చేసిన టైపిస్టు ప్రశాంత్ నాయక్ను జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ మంగళవారం సస్పెండ్ చేశారు. టైపిస్టు అక్రమంగా జారీ చేసిన 27 పొసెషన్ సర్టిఫికెట్లు, 04 రిజిస్ట్రేషన్లను రద్దు చేస్తూ కలెక్టర్ చర్యలు చేపట్టారు. సుండుపల్లి తహసీల్దార్ కార్యాలయంలో టైపి స్టుగా పనిచేస్తున్న ప్రశాంత్ నాయక్ తహసీల్దార్ అనుమతి లేకుండా డిజిటల్ కీ దుర్వినియోగానికి పాల్పడిన ఘటనను తహసీల్దార్ తన దృష్టికి తెచ్చినట్లు జిల్లా కలెక్టర్ తెలిపారు. తహసీల్దార్ సమాచారం మేరకు రాజంపేట సబ్ కలెక్టర్ను సభ్యురాలిగా వన్ మ్యాన్ కమిటీ ఏర్పాటు చేసి విచారణ చేపట్టామన్నారు. సబ్ కలెక్టర్ హెచ్ఎస్ భావన ఇచ్చిన నివేదిక ఆదారంగా టైపిస్టు ప్రశాంత్ నాయక్ డిజిటల్ దుర్వినియోగానికి పాల్పడినట్లు ధ్రువీకరించారన్నారు. వెంటనే అతడిని సస్పెండ్ చేసి అక్రమంగా జారీ చేసిన పొసెషన్ సర్టిఫికెట్లు రద్దు చేశామన్నారు. సుండుపల్లి తహసీల్దార్ మహబూబ్చాంద్ ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ వేగంగా జరుగుతోందన్నారు. నిమ్మనపల్లె : మండలంలోని గ్రామసచివాలయ ఉద్యోగి బహుదా ప్రాజెక్ట్లో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన మంగళవారం సాయంత్రం చోటు చేసుకుంది. విఠలం గ్రామ సచివాలయంలో విలేజ్ అగ్రికల్చరల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మహిళ (29) సాయంత్రం విధులు ముగిశాక, బహుదా ప్రాజెక్ట్ వద్దకు చేరుకుంది. మెయిన్ గేట్ ముందు ఉన్నటువంటి లోతైన ప్రదేశంలోకి దూకి ఆత్మహత్య చేసుకునేందుకు ప్రయత్నం చేసింది. గమనించిన మత్సకారుడు శ్రీధర్, స్థానికులు పరుగు, పరుగున వెళ్లి అడ్డుకున్నారు. నిమ్మనపల్లె పోలీసులకు సమాచారం అందించారు. ఎస్ఐ తిప్పేస్వామి ఆదేశాల మేరకు హెడ్కానిస్టేబుల్ నవయుగనాథ్ అక్కడకు చేరుకుని సచివాలయ ఉద్యోగిని పోలీస్స్టేషన్కు తీసుకువచ్చారు. తోటి సచివాలయ ఉద్యోగులకు, కుటుంబసభ్యులకు సమాచారం అందించారు. ప్రేమ విఫలమైందనే కారణంతో ఆత్మహత్యకు యత్నించినట్లు చెప్పడంతో, స్టేషన్లో కౌన్సెలింగ్ నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. తాగిన మత్తులో వీరంగం సృష్టించిన వ్యక్తి అరెస్టు రాయచోటి టౌన్ : తాగిన మత్తులో వీరంగం సృష్టించిన ఓ యువకుడిని రాయచోటి అర్బన్ పోలీసులు అరె స్టు చేసి కోర్టుకు హాజరు పెట్టారు. రాయచోటి అర్బన సీఐ బివి చలపతి కథనం మేరకు.. పాత రాయచోటికి చెందిన ఎం. కల్యాణ్ అనే యువకుడు శనివారం సంబేపల్లె మండలం నారాయణరెడ్డిగారిపల్లె వద్ద మద్యం తాగి రాయచోటికి వచ్చేందుకు ఆర్టీసీ బస్సులను ఆపే ప్రయత్నం చేశాడు. ఆయన ప్రవర్తన చూసిన డ్రైవర్లు బస్సు ఆపకుండా వచ్చేశారు. దీంతో చేసేది లేక ఆటో ఎక్కి అతడు రాయచోటికి చేరుకున్నాడు. తాను ఆపితే ఆపకుండా వస్తారంటూ కోపంతో మత్తులో ఆర్టీసీ బస్టాండ్ వైపు నుంచి బంగ్లా వైపు వస్తున్న బస్సులన్నింటినీ ఆపుతూ వీరగం సృష్టించారు. చేతిలో బీరు బాటిల్ (సగం పగిలిన) పట్టుకొని బెదిరించాడు. విషయం తెలుసుకున్న పోలీసులు అదుపులోకి తీసుకొని స్టేషన్కు తీసుకెళ్లి కేసు నమోదు చేసి మంగళవారం కోర్టుకు హాజరు పెట్టారు. -
ఎర్రచందనం జోలికి వస్తే ఎంతటి వారైనా ఉపేక్షించం
సిద్దవటం : ఎర్రచందనం జోలికి వస్తే ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని కర్నూలు రేంజ్ సీసీఎఫ్ కృష్ణమూర్తి హెచ్చరించారు. మంగళవారం మండల కేంద్రమైన సిద్దవటంలోని మట్లి రాజులకోటలోని మొదటి మండపం, రెండవ మండపం, డంకా నగర్, హజరత్ సయ్యద్ షా బిస్మిల్లా షా ఖాద్రి దర్గాను సందర్శించి ప్రార్థనలు చేశారు. అలాగే సొరంగమార్గం ద్వారా పెన్నానదిలోని అందాలను బయనాకురల్తో తిలకించారు. అలాగే సిద్దవటం రేంజ్లోని సాహెబ్ బాఇ బేస్ క్యాంప్ను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ డిప్యూటీ సీఎం పవన్కళ్యాణ్ లంకమల అభయారణ్యం పర్యటన నేపథ్యంలో ఇక్కడ పరిశీలించడం జరిగిందన్నారు. అటవీ భూములను అన్యాక్రాంతం చేస్తే కఠినచర్యలు తప్పవని, అలాంటి వారిపై కేసులు నమోదు చేసి చట్టపరమైన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ మేరకు ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు, డిప్యూటీ సీఎం ఆదేశాలు జారీ చేశారన్నారు. సిద్దవటంలో ఎకో టూరిజంను అభివృద్ధి చేస్తే నిరుద్యోగ యువతీ, యువకులకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు లభిస్తాయన్నారు. పెన్నానది హైలెవెల్ వంతెనపై లైటింగ్, పెన్నానదిలో పర్యాటక అందాలను తిలకించేందుకు, పర్యాటకులన ఆకర్షించేలా టెంట్ల ఏర్పాటు, కోటలో లైటింగ్ ఏర్పాటు చేస్తే పర్యాటకులు ఎక్కువ సంఖ్యలో సందర్శించి టూరిజం అభివృద్ధి చెందుతుందన్నారు. లంకమల అభయారణ్యంలోని సిద్దవటం రేంజ్లోని సాహెబ్ బావి బేస్ క్యాంపు, టైగర్ జోన్లను మరింత అభివృద్ధికి కృషి చేస్తామన్నారు. కార్యక్రమంలో కడప డీఎఫ్ఓ వినీత్కుమార్, సిద్దవటం రేంజర్ కళావతి, డిప్యూటీ రేంజర్ ఓబులేసు, ఫారెస్ట్ బీటు, అసిస్టెంట్ బీటు అధికారులు తదితరులు పాల్గొన్నారు. -
కిడ్నీ రాకెట్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్
మదనపల్లె రూరల్ : రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో పోలీసులు మరో ఇద్దరిని అరెస్ట్ చేశారు. మంగళవారం స్థానిక టూటౌన్ పోలీస్స్టేషన్లో నిందితుల అరెస్ట్కు సంబంధించి డీఎస్పీ మహేంద్ర మీడియాకు వివరాలు వెల్లడించారు. పట్టణంలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రిలో..అన్నమయ్యజిల్లా డీసీహెచ్ఎస్గా పనిచేస్తున్న కే.ఆంజనేయులు, బెంగళూరుకు చెందిన ఒక డాక్టర్ బృందంగా ఏర్పడి ఎలాంటి అధికారిక అనుమతులు లేకుండా, విశాఖకు చెందిన ఇద్దరు మహిళలకు నవంబర్ 9న కిడ్నీ ట్రాన్స్ప్లాంటేషన్ ఆపరేషన్లు నిర్వహించారు. ఇందులో ఒక ఆపరేషన్ విజయవంతం కాగా, రెండో ఆపరేషన్లో విశాఖపట్నానికి చెందిన యమున, సర్జరీ తర్వాత ఫిట్స్ వచ్చి 10వతేదీ ఉదయం మరణించింది. ఘటనపై యమున తల్లి సూరమ్మ ఫిర్యాదుమేరకు టూటౌన్ పోలీస్స్టేషన్లో క్రైమ్నెంబర్.179/2025, బీఎన్ఎస్, హ్యూమన్ ఆర్గాన్ ట్రాన్స్ప్లాంటేషన్ యాక్ట్–2011 సెక్షన్ల కింద కేసు నమోదుచేసి దర్యాప్తు ప్రారంభించారు. కేసులో ప్రధాన నిందితుడైన అన్నమయ్యజిల్లా డీసీహెచ్ఎస్, గ్లోబల్ ఆస్పత్రి నిర్వాహకులు కే.ఆంజనేయులు, మదనపల్లె, కదిరి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రి డయాలసిస్ టెక్నీషియన్స్ బాలరంగడు, మెహరాజ్, దళారులుగా వ్యవహరించిన పిల్లి పద్మ, సత్య, సూరిబాబులను అరెస్ట్చేసి రిమాండ్కు తరలించారు. వీరితో పాటుగా కిడ్నీ రాకెట్ కేసులో ఆపరేషన్ చేసేందుకు సహకరించి, పరారీలో ఉన్నటువంటి కడపకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లు సుమన్, కొండయ్యను అరెస్ట్ చేసి రిమాండ్కు పంపుతున్నట్లు తెలిపారు. దీంతో కిడ్నీ రాకెట్ కేసులో ఇప్పటివరకు పోలీసులు అరెస్ట్చేసిన నిందితుల సంఖ్య 8 కి చేరుకుంది. కిడ్నీ రాకెట్లో కీలకంగా వ్యవహరించిన ఏ–2 బెంగళూరు డాక్టర్గా పోలీసులు పేర్కొంటున్న వ్యక్తి...కడపకు చెందిన యూరాలజీ డాక్టర్ పార్థసారధిరెడ్డిగా పోలీసులు గుర్తించినట్లు, అతడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు తెలుస్తోంది. కార్యక్రమంలో టూటౌన్ సీఐ రాజారెడ్డి, ఎస్ఐ రహీముల్లా పాల్గొన్నారు. కడపకు చెందిన ఆపరేషన్ థియేటర్ అసిస్టెంట్లుగా గుర్తింపు -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
కేవీపల్లె : మండలంలో రూ. 7.20 లక్షల విలువైన ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసినట్లు కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె ఎస్ఐ చిన్నరెడ్డెప్ప తెలిపారు. మంగళవారం నిందితులను అరెస్ట్ చూపి వివరాలు వెల్లడించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మండలంలోని నూతనకాల్వ పంచాయతీ గుట్టలపై మార్గములో నల్లగుట్ట వద్ద ఎర్రచందనం దుంగలు అక్రమంగా తరలించడానికి సిద్ధం చేసినట్లు అందిన సమాచారంతో పోలీసులు దాడి చేశారు. అక్రమంగా తరలించడానికి సిద్ధంగా ఉన్న 144 కేజీల బరువుగల ఏడు ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకుని నిందితులను అరెస్ట్ చేశారు. నిందితుల్లో తిరుపతి జిల్లా యర్రవారిపాళెం మండలం యల్లమంద పంచాయతీ మద్దెలవారిపల్లెకు చెందిన పిల్లెల సురేంద్ర, దొమ్మయ్యగారిపల్లెకు చెందిన పత్తిపాటి త్యాగరాజు నాయుడు, బోయపల్లెకు చెందిన అంకెం రమణ ఉన్నారు. ఈ దాడిలో ఏఎస్ఐ వెంకటస్వామి, హెడ్ కానిస్టేబుల్ రెడ్డిమోహన్, కానిస్టేబుల్ పురుషోత్తం పాల్గొన్నారు. ముగ్గురు నిందితుల అరెస్ట్ -
రసవత్తరంగా రాష్ట్ర స్థాయి బాస్కెట్బాల్ పోటీలు
మదనపల్లె సిటీ : ఎస్జీఎఫ్ రాష్ట్ర స్థాయి అండర్–14 బాస్కెట్బాల్ బాల, బాలికల పోటీలు రసవత్తరంగా కొనసాగుతున్నాయి. మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో మంగళవారం రెండో రోజు వివిధ జిల్లాల నుంచి వచ్చి టీమ్లు పోటీల్లో పాల్గొన్నాయి. బాలికల క్వార్టర్ ఫైనల్స్లో నెల్లూరు–వెస్ట్ గోదావరి జిల్లా జట్లు తలపడగా వెస్ట్ గోదావరి జట్టు 22–0 స్కోరులో విజయం సాధించి సెమీఫైనల్స్కు చేరుకుంది. చిత్తూరు–కర్నూలు జిల్లా మద్య జరిగిన పోటీల్లో చిత్తూరు జట్టు 29–19 స్కోరుతో విజయం సాధించి సెమీ ఫైనల్స్కు చేరుకుంది. కృష్ణ–గుంటూరు జట్ల మధ్య జరిగిన పోటీలో కృష్ణ 39–25 తేడాతో గెలుపొంది సెమిఫైనల్స్కు చేరుకుంది. కార్యక్రమంలో ప్రభుత్వ అజ్జర్వర్ వర్మ, ఉమ్మడి చిత్తూరు జిల్లా ఎస్జీఎఫ్ కార్యదర్శి డాక్టర్ బాబు, ఎస్జీఎఫ్ జిల్లా కార్యదర్శులు నాగరాజు,ఝాన్సీరాణి, ప్రధానోపాధ్యాయుడు చంద్రశేఖర్, పీడీలు నరేష్, మెయినుద్దీన్, రియాజ్, ఆసిఫ్, భారతి, శివశంకర్, భద్రయ్య తదితరులు పాల్గొన్నారు. -
జాతీయ స్థాయి సాఫ్ట్బాల్ జట్టుకు మట్లి విద్యార్థులు
రాయచోటి టౌన్ : రాయచోటి డివిజన్ పరిధిలోని మట్లి పెద్దూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ముగ్గురు జాతీయ స్థాయి జట్టుకు ఎంపికై నట్లు ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయులు వి. జయన్న తెలిపారు. ఈ మేరకు జాతీయ జట్టుకు ఎంపికై న విద్యార్థులను మంగళవారం అభినందించారు. ఆయన మాట్లాడుతూ ఈ నెల 22వ తేదీ నుంచి 24 వరకు పులివెందులలోని రమణప్ప సత్రంలో నిర్వహించిన సాఫ్ట్బాల్ అండర్ –14 విభాగంలో బాలికల, బాలుర విభాగంలో నిర్వహించిన పోటీల్లో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు జాతీయ జట్టుకు ఎంపికయ్యారని తెలిపారు. ఎంపిక వారిలో కె. రెడ్డిగీత (9వ తరగతి), సి. హేమశ్రీ (8వ తరగతి), యు. సుబ్రహ్మణ్యం (9వ తరగతి) ఉన్నట్లు తెలిపారు. వీరు ముగ్గరు వచ్చే జనవరిలో ఢిల్లీలోని త్యాగరాజ స్టేడియంలో జరిగే జాతీయ స్థాయి పోటీలలో పాల్గొంటారని తెలిపారు. విద్యార్థులను జాతీయ స్థాయికి ఎదిగేందుకు కృషి చేసిన పీడీ ఏ. జగదీశ్వరయ్యను పాఠశాల కమిటీ చైర్మన్ పి. నాగేశ్వరావు, ఉపాధ్యాయులు అభినందిచారు. -
రేపు ఎంపీ మదనపల్లెకు రాక
ఎంపీడీఓ కార్యాలయంలో వినతుల స్వీకరణమదనపల్లె: రాజంపేట ఎంపీ, వైఎస్సార్సీపీ లోక్సభా పక్షనేత పీవీ మిథున్రెడ్డి గురువారం మదనపల్లెకు వస్తున్నారని ఆ పార్టీ మదనపల్లె సమన్వయకర్త నిసార్ అహ్మద్ అన్నారు. మంగళవారం వైఎస్సార్సీపీ కార్యాలయంలో నేతలతో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఎంపీ మిథున్రెడ్డి అధికారిక కార్యక్రమాల్లో పాల్గొంటారని చెప్పారు. ఉదయం 10:30 గంటలకు మండల పరిషత్ అభివృద్ధి అధికారి కార్యాలయం చేరుకుని, ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించి, వాటి పరిష్కారానికి కృషి చేస్తారని అన్నారు. అనంతరం అక్కడే రూరల్ మండలానికి చెందిన ప్రజాప్రతినిధులు, అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహిస్తారని చెప్పారు. సమావేశానికి ప్రజాప్రతినిధులు హాజరు కావాలని కోరారు. మిథున్రెడ్డి రాక సందర్భంగా ఘన స్వాగతం పలికేందుకు ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు. ఈ పర్యటనపై మున్సిపల్ చైర్మన్ వరపన మనూజ, వైస్ చైర్మన్ జింకా వెంకటాచలపతి, వైఎస్సార్సీపీ మదనపల్లె రూరల్, రామసముద్రం మండల అధ్యక్షులు దండు కరుణాకర్రెడ్డి, కేశవరెడ్డి, యువజన విభాగం నియోజకవర్గ అధ్యక్షులు హర్షవర్దన్రెడ్డి, వెలుగు చంద్ర తదితరులతో చర్చించారు. పీలేరు: రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి బుధవారం పీలేరు పట్టణంలో పర్యటిస్తారని వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ దండు జగన్మోహన్రెడ్డి తెలిపారు. బుధవారం ఉదయం 11 గంటలకు వివిధ ప్రైవేట్ కార్యక్రమాలకు ఎంపీ హాజరవుతారని, పార్టీ నాయకులు, కార్యకర్తలు జయప్రదం చేయాలని ఆయన కోరారు. -
నలుగురు చైన్ స్నాచర్ల అరెస్టు
● రూ.15 లక్షలు విలువ గల బంగారు ఆభరణాలు స్వాధీనం ● నిందితుల్లో సచివాలయం వెటర్నరీ అసిస్టెంట్రాయచోటి టౌన్ : అన్నమయ్య జిల్లా పోలీసులు నలుగురు చైన్ స్నాచర్లను అరెస్టు చేసి వారి వద్ద నుంచి సుమారు రూ.15 లక్షలు విలువ చేసే 140 గ్రాముల బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. సోమవారం జిల్లా పోలీస్ శాఖ కార్యాలయంలో అన్నమయ్య జిల్లా అడిషనల్ ఎస్పీ వెంకట్రాది వివరాలు తెలిపారు. గత కొన్ని రోజులుగా పాదచారులను లక్ష్యంగా చేసుకొని బంగారు నగలు దోచుకున్న సంఘటనలపై వచ్చిన ఫిర్యాదులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టామన్నారు. సోమవారం రాయచోటి పట్టణ పరిధిలో తనిఖీలు నిర్వహిస్తున్న సమయంలో బంగారు ఆభరణాలను విక్రయించేందుకు వెళుతున్న నలుగురిని అదుపులోకి తీసుకున్నామని తెలిపారు. వారిని విచారించగా చైన్ స్నాచింగ్కు పాల్పడినట్లు నిర్ధారణ అయిందన్నారు. నిందితుల్లో కేవీపల్లె మండలం తీతవగుంటపల్లెకు చెందిన కుంచపు పురుషోత్తం, పూజారి శంకరయ్య, బండి బాలాజీ, కలకడ మండలానికి చెందిన సచివాలయ ప్రభుత్వ వెటర్నరీ అసిస్టెంట్ కుంచపు మహేష్ బాబు ఉన్నారన్నారు. వీరు నలుగురు సంబేపల్లె, కలకడ, కలికిరి, పీలేరు, గుర్రంకొండ, పీలేరు, కేవీపల్లె మండల కేంద్రాల్లో ఒంటరి మహిళలను లక్ష్యంగా చేసుకొని బంగారు ఆభరణాలను దోచుకొనేవారన్నారు. వీరిపై పోలీసులు ప్రత్యేక నిఘా ఉంచి పట్టుకొన్నట్లు తెలిపారు. వీరి నుంచి రూ.15 లక్షలు విలువ గల 140 గ్రాముల బంగారు ఆభరణాలతో పాటు నాలుగు బైకులు, నాలుగు సెల్ ఫోన్లు, 15 చీరలు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. వీరిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరుస్తున్నట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డీఎస్పీ యంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ బి. లక్ష్మన్న, కేవీపల్లె ఎస్ఐ యం. చిన్నరెడ్డెప్ప, కలకడ ఎస్ఐ బి.రామాంజనేయులు పాల్గొన్నారు. -
గల్లంతైన విద్యార్థుల మృతదేహాలు లభ్యం
వల్లూరు(చెన్నూరు), కడప అర్బన్ : సరదాగా ఈత కోసం వెళ్లి కడప సమీపంలోని వాటర్ గండి ప్రాంతంలో ఆదివారం గల్లంతైన ఇద్దరు విద్యార్థుల మృతదేహాలు సోమవారం బయట పడ్డాయి. చెన్నూరు సీఐ క్రిష్ణారెడ్డి తెలిపిన సమాచారం మేరకు వివరాలిలా ఉన్నాయి. కడప నగరంలోని రామాంజనేయపురానికి చెందిన కసినేని నాగేశ్వర రావు కుమారుడు కసినేని నరేష్ (18), అశోక్ నగర్కు చెందిన వెంకట సుబ్బయ్య కుమారుడు గండం రోహిత్ (16) మరియాపురంలోని సెయింట్ జోసెఫ్ జూనియర్ కాలేజీలో ఇంటర్ మొదటి సంవత్సరం చదువుతున్నారు. వీరు ఆదివారం సెలవు దినం కావడంతో మరో ముగ్గురు స్నేహితులతో కలిసి సరదాగా ఈత కొట్టేందుకు వాటర్ గండి ప్రాంతంలో పెన్నా నది వద్దకు వెళ్లారు. అక్కడ అందరూ కలిసి సరదాగా ఈత కొట్టి సెల్ఫోన్లతో వీడియోలు, సెల్ఫీలు తీసుకోవడానికి ప్రయత్నించారు. ఈ క్రమంలో నరేష్, రోహిత్లు నీటి ప్రవాహంలో కొట్టుకుని పోతుండగా స్నేహితు ల్లో ఒకరైన అరుణ్ వారిని పట్టుకోవడానికి ప్రయత్నిస్తూ అతడు కూడా నీటి ప్రవాహంలో కొట్టుకొని పోసాగాడు. అదే సమయంలో అందుబాటులో వున్న అక్కడి దేవాలయ వాచ్మెన్ ఆంజి అరుణ్ను రక్షించారు. నరేష్, రోహిత్లు నీటిలో గల్లంతయ్యా రు. సమాచారం అందుకున్న చెన్నూరు పోలీసులు రాత్రి వరకు వారి కోసం గాలింపు చర్యలు చేపట్టినప్పటికీ ఫలితం లేదు. సోమవారం ఉదయం చెన్నూ రు సీఐ క్రిష్ణారెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు జాలర్లు, ఫైర్ సిబ్బందితో కలిసి గాలింపు చర్యలు చేపట్టారు. జాలర్లు ప్రమాదం జరిగిన ప్రాంతంలో ఇద్దరి మృతదేహాలను గుర్తించి బయటకు తీశారు. మృతదేహాలను చూసిన తల్లి దండ్రులు, బంధువులు తీవ్రంగా రోదించారు. అనంతరం పోలీసులు మృతదేహాలను కడప రిమ్స్ ఆసుపత్రికి తరలించి పోస్టుమార్టం అనంతరం వారి బంధువులకు అప్పగించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. కాగా నరేష్కు తల్లిదండ్రులతో బాటు ఒక అన్న, ఒక సోదరి వున్నారు. రోహిత్కు తల్లిదండ్రులతో బాటు ఒక చెల్లెలు వున్నారు. -
సమస్యల పరిష్కారంపై దృష్టి సారించాలి
రాయచోటి : ప్రజా సమస్యల పరిష్కారంపై అన్ని శాఖల అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. రాయచోటి కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాల్లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో భాగంగా జిల్లా నలుమూలల నుంచి వచ్చిన అర్జీదారుల నుంచి కలెక్టర్ అర్జీలను స్వీకరించారు. కలెక్టర్తోపాటు రాయచోటి అర్జీఓ శ్రీనివాస్, జీఎస్డబ్ల్యూ ఎస్ లక్ష్మీపతి, సర్వే ఏడీ భరత్ కుమార్ కార్యక్రమంలో పాల్గొన్నారు. అర్జీలను నాణ్యతగా పరిష్కరించాలని కలెక్టర్ ఆదేశించారు. డివిజన్, నియోజకవర్గ, మండలస్థాయి ప్రత్యేక అధికారులు వారికి కేటాయించిన మండలాలు, గ్రామాల్లో పర్యటించి అక్కడి సమస్యలను తెలుసుకొని వాటిని పరిష్కరించేందుకు కృషి చేయాలన్నారు. అర్జీదారులు తమ సమస్యల పరిష్కారానికి జిల్లా కలెక్టర్కు వివిధ రకాల అర్జీలు సమర్పించారు.ఈ కార్యక్రమంలో వివిధ శాఖల జిల్లా, మండలస్థాయి అధికారులు పాల్గొన్నారు. అభివృద్ధి పథకాలు అమలు చేయాలి అభివృద్ధి పథకాలను త్వరితగతిన నాణ్యతతో అమలు చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. సోమవారం కలెక్టర్ కార్యాలయంలోని వీడియో కాన్ఫరెన్సు హాల్ నుంచి మదనపల్లె, రాజంపేట సబ్ కలెక్టర్లు, రాయచోటి ఆర్డీఓలు, తహసీల్దార్లు, మున్సిపల్ కమిషనర్లు తదితరులతో కలెక్టర్ వీడియో కాన్ఫిరెన్సు నిర్వహించారు. సమావేశంలో వివిధ ప్రాధాన్యత ప్రాజెక్టులకు భూసేకరణ కేటాయింపు, పీజీఆర్ఎస్ పరిష్కారం తదితర అంశాలపై చర్చించారు. పథకాల అమలుకు సంబంధించి జ్లిలా, మండలస్థాయి అధికారులకు దిశా నిర్దేశం చేశారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్


