annamayya district Latest News
-
నేటి నుంచి వైఎస్ జగన్ జిల్లా పర్యటన
● 21వ తేదీ మధ్యాహ్నం పులివెందులకు చేరుకోనున్న మాజీ సీఎం వైఎస్ జగన్ ● క్యాంపు కార్యాలయంలో ప్రజాదర్బార్ నిర్వహణ ● 22న ఇప్పట్లలో వైఎస్సార్సీపీ నాయకుడు సుధాకర్రెడ్డి కుటుంబ సభ్యులకు పరామర్శ ● 23న తిరుగుపయనంపులివెందుల: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 21వ తేదీనుంచి మూడు రోజులపాటు వైఎస్సార్ కడప జిల్లాలో పర్యటించనున్నారు. ఈ నెల 21వ తేదీన మంగళవారం మధ్యాహ్నం 2.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బెంగుళూరు ఎయిర్డ్రోంకు బయలుదేరుతారు. అక్కడి నుంచి 3గంటలకు హెలీకాప్టర్ ద్వారా బయలుదేరి 3.40గంటలకు పులివెందులలోని భాకరాపురం హెలీప్యాడ్కు చేరుకుంటారు. అక్కడి నుంచి 4గంటలకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. 4 నుంచి రాత్రి 7గంటల వరకు పులివెందులలోని తన క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. ● 22వ తేదీ బుధవారం ఉదయం 9 గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన లింగాల మండలం ఇప్పట్ల గ్రామంలోని వైఎస్సార్సీపీ నేత దివంగత సుధాకర్రెడ్డి ఇంటికి బయలుదేరుతారు. 9.45గంటలకు సుధాకర్రెడ్డి ఇంటికి చేరుకుని ఆయన కుటుంబ సభ్యులను పరామర్శిస్తారు. 10.15గంటలకు అక్కడ నుంచి బయలుదేరి 11గంటలకు పులివెందులలోని భాకరాపురంలో ఉన్న క్యాంపు కార్యాలయానికి చేరుకుంటారు. 11 గంటల నుంచి రాత్రి 6.25గంటల వరకు తన క్యాంప్ ఆఫీస్లో ప్రజా దర్బార్ నిర్వహిస్తారు. అనంతరం తన నివాసానికి చేరుకుని రాత్రికి అక్కడే బస చేస్తారు. ● 23వ తేదీ గురువారం ఉదయం 8గంటలకు పులివెందుల భాకరాపురంలోని తన నివాసం నుంచి హెలీప్యాడ్కు రోడ్డు మార్గాన వైఎస్జగన్ బయలుదేరుతారు. అనంతరం అక్కడి నుంచి హెలీకాఫ్టర్ ద్వారా బెంగళూరుకు తిరగుపయనమవుతారు. -
రిజిస్ట్రేషన్లు 117 స్లాట్లకు పెంపు
మదనపల్లె: మదనపల్లె సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయంలో ప్రజలకు అందుతున్న స్లాట్ సేవల సంఖ్య పెరిగిందని స్థానిక సబ్ రిజిస్ట్రార్ గురుస్వామి నాయుడు సోమవారం తెలిపారు. దస్తావేజుల రిజిస్ట్రేషన్ సంఖ్య ఇప్పటిదాకా రోజుకు 78 స్లాట్లుగా ఉండగా మంగళవారం నుంచి దీనిసంఖ్య 117కు పెంచినట్లు చెప్పారు. ప్రజలు ఈ సేవలను సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. అప్రమత్తతే ప్రాణాలకు రక్షణ కవచం – జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ రెడ్డి కురబలకోట: అగ్ని ప్రమాదాల వంటి అత్యవసర పరిస్థితుల్లో అప్రమత్తతే ప్రాణాలకు రక్షణ కవచమని జిల్లా అగ్నిమాపక అధికారి ఆదినారాయణ రెడ్డి అన్నారు. సోమవారం అంగళ్లు దగ్గరున్న విశ్వం కళాశాలలో అగ్ని మాపక వారోత్సవాలలో భాగంగా అగ్ని ప్రమాదాలు సంభవించినప్పుడు ఎలా స్పందించాలి..తీసుకోవాల్సిన జాగ్రత్తలు, ప్రాణాలతో ఎలా బయటపడాలో విద్యార్థులు, అధ్యాపకులకు సిబ్బంది అవగాహన కల్పించారు. ఎక్కడైనా ప్రమాదాలు ఎదురైతే వెంటనే 101 నెంబరుకు సమాచారం ఇవ్వాలన్నారు. మదనపల్లి అగ్ని మాపక అధికారి శివప్ప తదితరులు పాల్గొన్నారు. ఏసీబీ సోదాలు రాయచోటి : రాయచోటిలో సోమవారం ఏసీబీ అధికారులు బీసీ సంక్షేమ సహాయ అధికారి బాలాజీ ఇంట్లో సోదాలు నిర్వహించారు. అనంతపురం జిల్లా కదిరిలో బీసీ సంక్షేమ సహాయ అధికారిగా బాలాజీ పనిచేస్తున్నారు. రెండు నెలల కిందట విధి నిర్వహణలో ఉంటూ లంచం తీసుకుంటూ ఏసీబీ అధికారులకు పట్టుబడిన విషయం తెలిసిందే. అప్పట్లోనే కదిరితో పాటు రాయచోటిలోని ఆయన స్వగృహంలో ఏసీబీ అధికారులు సోదాలు చేసి కేసులు నమోదు చేశారు. ఈ పరిస్థితుల్లో ఏసీబీ అధికారులకు అందిన సమాచారం మేరకు సోమవారం తిరిగి సోదాలు చేసినట్టు తెలిసింది. ఈ సోదాలలో పలు భూమి రికార్డులు, బంగారు నగలు, డబ్బులు భారీగా పట్టుబడినట్లు సమాచారం. అన్నమయ్య జిల్లా రాయచోటిలోని ఆయన ఇంటితోపాటు వారి బంధువుల ఇళ్లలో కూడా ఈ సోదాలు నిర్వహించినట్లు సమాచారం. ఏఐ..ప్రపంచాన్ని శాసిస్తుంది కురబలకోట: ప్రపంచాన్ని ప్రభావితం చేసే శక్తిగా ఏఐ నిలవబోతోందని బెంగళూరులోని క్లౌడ్ సెక్ కంపెనీ సీనియర్ సాఫ్ట్వేర్ డెవలపర్ జయంత్ శర్మ అన్నారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో సోమవారం జరిగిన ప్రాజెక్ట్ ఎక్స్పో ఆన్ ఏఐ కార్యక్రమంలో ముఖ్య అతిథిగా ఆయన మాట్లాడుతూ ఏఐ, మెషిన్ లర్నింగ్, డేటా సైన్స్, ఇంటర్నెట్ ఆఫ్ ధింగ్స్ వంటి ఆధునిక సాంకేతిక పరిజ్ణానాలు భవిష్యత్ ప్రపంచాన్ని మార్చే శక్తిగా నిలుస్తాయన్నారు. విద్యార్థులు సిద్దాంత జ్ఞానంతో పాటు వాస్తవ ప్రపంచ సమస్యలకు వినూత్న పరిష్కారాలను అందించే దిశగా ముందుకు సాగాలన్నారు.పరిశ్రమలకు అనుగుణంగా ప్రాజెక్టులను అభివృద్ధి చేస్తే ఉద్యోగావకాశాలు సాధ్యమవుతాయన్నారు. ఘనంగా చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్ కడప ఎడ్యుకేషన్: కడప నగరం రహమతుల్లా వీధిలో వెలసి ఉన్న చారిత్రాత్మకమైన చాంద్ ఫిరా గుంబద్ దర్గా నషాన్ ఉత్సవాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా దర్గా ముతవల్లి అమిరురన్నిసా ఇంటి నుండి గంధం కళాశాన్ని తీసుకువచ్చి దర్గాలో గంధాన్ని సమర్పించారు. అలాగే దర్గా ఆవరణంలో ఉన్న జెండా ను అలంకరించి, తీర్థ ప్రసాదాలను పంపిణీ చేశారు. వచ్చే నెల మే 3వ తేదీ గంధం, 4వ తేదీ ఉరుసు, 5వ తేదీ తహలీల్ ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నామని దర్గా ముతవల్లి అమిరున్నిసా తెలిపారు. మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్ బాష, రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షుడు అమీర్ బాబు, వైఎస్ఆర్సీపీ నాయకులు పాల్గొన్నారు. -
ఘనంగా అక్షయ తదియ
వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరిలో ని శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల బ్రహ్మోత్సవాల లో భాగంగా సోమవారం అక్షయ తదియ ఉత్సవాలు ఘనంగా జరిగాయి. వివిధ ప్రాంతాల నుంచి తరలివచ్చిన భక్తులు పెన్నా నదిలో స్నానాలు ఆచరించారు. అ నంతరం ఉత్సవాల్లో పాల్గొని స్వామి వార్ల ను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులు తలనీలాలను సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు చెన్నకేశవ స్వామి ఎదుట తడి బట్టలతో సాష్టాంగ ప్రదక్షిణలు చేసి మొక్కులు తీర్చుకున్నారు. ఇక్కడ పితృ దేవతలకు పిండ ప్రదానం చేస్తే కాశీలో చేసినంత పుణ్యం లభిస్తుందనే ప్రగా ఢ విశ్వాసంతో అనేక మంది భక్తులు బ్రాహ్మణుల ఆధ్వర్యంలో తమ పితృదేవతలకు పిండ ప్రదానం చేశారు. వైభవంగా చెన్న కేఽశవుని పూలంగి సేవ శ్రీ చెన్నకేశవ స్వామికి పూలంగి సేవను అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామి వారిని వివిధ రకాల పుష్పాలతో అలంకరించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధేశ్వర ఆలయంలో అర్చకుల ఆధ్వర్యంలో రుద్రాభిషేకం నిర్వహించారు. అనంతరం శ్రీ చక్ర సహిత కామాక్షీ అమ్మవారికి పూజలు నిర్వహించారు. ఇష్ట వాహనాలపై హరిహరులు రాత్రి శ్రీ చెన్నకేశవ స్వామి తనకు అత్యంత ప్రీతి పాత్రమైన గరుడ వాహనంపై భక్తుల కు దర్శనమిచ్చారు. గ్రామంలోని శ్రీ కామా క్షీ వైద్యనాఽథేశ్వర స్వాములు నంది వాహనంపై భక్తులను కరుణించారు. నేడు కల్యాణోత్సవాలు బ్రహ్మోత్సవాల సందర్భంగా మంగళవారం ఉదయం 10 గంటలకు శ్రీ కామాక్షీ వైద్యనాఽథ స్వాములకు కల్యాణ మహోత్సవం జరుగుతుంది. రాత్రి 7 నుంచి శ్రీలక్ష్మీ చెన్న కేశవ స్వామికి శ్రీదేవి, భూదేవిలతో కళ్యాణోత్స వం జరుగుతుంది. రాత్రి గజవాహన సేవ జరుగుతుంది. -
సాంకేతిక విద్యతో బంగరు భవిత
● జిల్లా వ్యాప్తంగా 3,628 మంది దరఖాస్తు ● 25న పాలిసెట్ ప్రవేశ పరీక్ష మదనపల్లె సిటీ: పదో తరగతి విద్యార్హతతో సాంకేతిక విద్యకు పునాది వేసే పాలిసెట్ ప్రవేశపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఈ పరీక్ష ద్వారా రాష్ట్రంలోని అన్ని పాలిటెక్నిక్ కళాశాల్లో ప్రవేశాలు లభిస్తాయి. ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు ప్రైవేటు సెక్టార్లోను పాలిటెక్నిక్ వారికే పెద్దపీట వేస్తున్నారు. తక్కువ సమయం,తక్కువ ఖర్చుతో ఉద్యోగ, ఉపాధిని సులభంగా పొందే వెసులుబాటు పాలిటెక్నిక్ డిప్లోమా కోర్సుల ద్వారా ఉంటుందని నిపుణులు వెల్లడిస్తున్నారు. ఈ క్రమంలో యువత పాలిటెక్నిక్ ఆసక్తి చూపిస్తోంది. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా 21,526 .మంది పదవ తరగతి పరీక్షలు రాశారు. జిల్లా వ్యాప్తంగా 3,628 మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈనెల 25వతేదీన ప్రవేశ పరీక్ష జరుగుతుంది. ఇందు కోసం మదనపల్లెలో 5, రాయచోటిలో 4, , కలికిరిలో 2 పీలేరులలో 2 పరీక్ష సెంటర్లు ఏర్పాటు చేశారు. హాల్టిక్కెట్లు అభ్యర్థులు డైన్లోడ్ చేసుకోవచ్చు. గ్రామీణ విద్యార్థులకు ఉపయుక్తం గ్రామీణ పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఇంజనీరింగ్ వంటి అత్యున్నత సాంకేతిక చదువులను అందుకోవాలంటే తక్కువ ఖర్చుతో కూడుకున్న పని. వీరికి తక్కువ ఖర్చుతో ప్రాథమికంగా సాంకేతిక విద్య లభిస్తే దానిని పునాధిగా చేసుకుని భావి జీవితానికి బాటలు వేసుకునే అవకాశం లభిస్తుంది. దీనికి పాలిటెక్నిక్ కోర్సులు వేదికగా నిలుస్తున్నాయి. జిల్లాలో కళాశాలలు, కోర్సుల వివరాలు పాలిటెక్నిక్ కోర్సులను ప్రభుత్వ, ప్రైవేటు కళాశాలలు అందిస్తున్నాయి. ఆయా కళాశాలల్లో ఎలక్ట్రానిక్ అండ్ కమ్యూనికేషన్, కంప్యూటర్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్, మెకానికల్, సివిల్, ఇన్సఫర్మేషన్ టెక్నాలజీ(ఐటీ) తదితర కోర్సులు అందుబాటులో ఉన్నాయి. జిల్లాలో మదనపల్లె, రాయచోటి, కలికిరి, పీలేరులో ప్రభుత్వ పాలిటెక్నిక్ కాలేజీలు ఉండగా మదనపల్లె సమీపంలోని అంగళ్లులో గోల్డన్వ్యాలీ ఇంజనీరింగ్ కాలేజీ, పీలేరు ఎంజెఆర్ ఇంజనీరింగ్ కాలేజీలలో పాలిటెక్నిక్ కోర్సులు ఉన్నాయి. ఈ కోర్సుల కాలవ్యవధి మూడేళ్లు. దీనిలో భాగంగా ఆరు నెలల పాటు పారిశ్రామిక శిక్షణ ఉంటుంది. విద్యార్థులు నైపుణ్యం పెంపొందించుకునే శిక్షణ సైతం ఇస్తారు. చక్కటి ఉపాధి డిప్లోమా కోర్సులతో చక్కటి ఉపాధి లభిస్తుంది. జీవితంలో త్వరగా స్థిరపడటానికి పాలిటెక్నిక్ సరైన మార్గం. విద్యార్థులకు ఇదో మంచి అవకాశం. డిప్లోమా కోర్సులు పూర్తి చేసిన వెంటనే ఉద్యోగం, ఉపాధి పొందవచ్చు. ఉన్నత చదువులకు సైతం ఉపయోగపడుతుంది. – జె.రాజేంద్రప్రసాద్, పాలిసెట్ కన్వీనర్, జీఎంఆర్ పాలిటెక్నిక్ కాలేజీ ప్రిన్సిపాల్,మదనపల్లె. -
చిరు కూలీలపై ప్రభుత్వాలు చిన్న చూపు చూస్తున్నాయి.. ఒకటా రెండా నెలల తరబడి వేతనాలు ఎగ్గొట్టి పొట్టకొడుతున్నాయి.. వారమంతా చెమటచిందించినా కూలి డబ్బు అందక సపరివారమంతా పస్తులుండే దుస్థితి నెలకొంది.. కూలి డబ్బులు రాక కడుపు‘కూలి’పోతున్నా పట్టించుకునే దిక్కులేకపోవ
● ఉపాధి కూలీలకు నెలల తరబడి అందని వేతనాలు ● జిల్లాలో రూ.21 కోట్లు పెండింగ్ ● ప్రత్యామ్నాయ పనులవైపు దృష్టిసారించిన కూలీలు ● ఉపాధి పథకంపై నీలి నీడలు మదనపల్లె: ఉపాధి హామీ పథకానికి గ్రహణం పట్టింది. ఒకప్పుడు వేల మంది కూలీలతో కళకళలాడిన ఈ పథకం నేడు వందలాదిమందితోనే నెట్టుకొస్తోంది. తమకు పనులు చూపించండని అధికారులను వేడుకున్న దశ నుంచి.. ‘రా..రమ్మని’ పిలుస్తున్నా రాని పరిస్థితి నెలకొంది. దీనికి కారణం కూలి డబ్బులు సరిగా చెల్లించకపోవడమే. ‘చెమడోచ్చి పనులు చేస్తున్నా సమయానికి వేతనం ఇవ్వకుంటే పనులు ఎలా చేసేది సారూ’ అంటూ కూలీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ‘అప్పుల ఉపాధి మాకొద్దం’టూ ముఖాన్నే చెబుతున్నారు. 25వేలకు పడిపోయిన కూలీలు జిల్లాలో 1.41 లక్షల జాబ్కార్డులు ఉండగా కూలీకి వస్తున్న వారిసంఖ్య భారీగా తగ్గిపోతోంది. సోమవారం జిల్లా వ్యాప్తంగా 25 మండలాల్లో 25,570 మంది కూలీలు మాత్రమే ఉపాధి పనులకు హాజరయ్యారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంఖ్య తక్కువే. ఈరోజు జరిగిన ఉపాధి కూలి పనుల్లో జిల్లాలోని రామాపురం మండలంలో 2,657 ఉంది కూలీలు పనికి వచ్చారు. జిల్లాలో అత్యధిక కూలీల సంఖ్య నమోదయింది ఇక్కడే. ఆ తర్వాత లక్కిరెడ్డిపల్లిలో 2,416, గాలివీడులో 2,347, సంబేపల్లిలో 2,185, రాయచోటిలో 1,697, చిన్నమండెంలో 1,993, ములకలచెరువులో 1,601, తంబళ్లపల్లెలో 1,050 మంది ఉపాధి కూలీలు పనులకు హాజరు నమోదు చేసుకున్నారు. జిల్లా వ్యాప్తంగా కూలీల పనుల్లో రామాపురం మండలం మొదటి స్థానంలో ఉంది. మదనపల్లె, నిమ్మనపల్లె, సదుం, కంభంవారిపల్లె, చౌడేపల్లె మండలాల్లో తక్కువ మంది కూలీలు పనులకు వచ్చారు. రూ.21 కోట్లు పెండింగ్ ఉపాధి హామీ పథకం పనులకు వచ్చేవారంతా పూట గడవని కూలీలే. పని చేస్తే గాని కడుపు నిండదు. ఉపాధి హామీ పథకం పనులు నమ్ముకుని వేల సంఖ్యలో కూలీలు ఉన్నారు. మండుటెండను సైతం లెక్కచేయకుండా పనులకు వస్తున్నారు. ఇంత కష్టపడుతున్నా వేతనాలు పెండింగ్లో పెట్టడంతో పూట గడవడం కష్టమైంది. జిల్లాలోని 25 మండలాల వారికి రూ.20,91,36,111 కూలీ సొమ్ము పెండింగ్లో ఉంది. ఈ సొమ్ము ప్రతివారం కూలీల ఖాతాలకు ప్రభుత్వం జమ చేయాల్సి ఉంటుంది. డిసెంబర్ 12 నుంచి ఈరోజు వరకు కూలీల సొమ్ము జమ కాలేదు. దాంతో కూలీలు ఇల్లు గడవడం కష్టమై తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మరోవైపు కొందరు కూలీలు చేసేదిలేక ఇతర పనులకు వెళ్తున్నారు. టమాట కూలీ పనులకు, పోలం పనులు లాంటి పనికి వెళ్తే కూలీ సొమ్ము ఆరోజే అందుతుంది, దాంతోపాటు శ్రమ కూడా తక్కువ. ఎక్కువసేపు ఎండలో ఉండి పని చేయాల్సిన అవసరం లేదు. దాంతో కూలీలు ఎక్కువగా ఉపాధి హామీ పనులకంటే ఇతర పనులు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో కూలీలకు వేతనాల పంట పండింది. ఏ రోజు ఇబ్బంది లేకుండా వేతనాలు చెల్లించడంతో పాటు నిత్యం పనులు కల్పించేది. ఇప్పుడా పరిస్థితి కనిపించడం లేదు. గత ఏడాదిలో 6 నెలలపాటు కూలిసొమ్ము చెల్లించని ప్రభుత్వం, ఇప్పుడు గత డిసెంబర్ 12 నుంచి ఈరోజు దాకా వేతనాల చెల్లింపులు ఆగిపోయాయి. ఇలాగైతే మేము ఎలా బతకాలి అంటూ కూలీలు ప్రశ్నిస్తున్నారు. తమకు ఉపాధి పనులు వద్దంటూ ప్రత్యామ్నాయ పనులకు మళ్లుతున్నారు. మండలం రూ.లక్షల్లో పనిచేసిన కూలీలు బి.కొత్తకోట రూ.40.20 633 చిన్నమండ్యం రూ.138.34 1,993 చౌడేపల్లి రూ.71.26 341 గాలివీడు రూ.98.52 2,347 గుర్రంకొండ రూ.53.55 591 కలకడ రూ.66.95 841 కలికిరి రూ.69.39 613 కంభంవారిపల్లె రూ.41.80 186 కురబలకోట రూ.48.23 504 లక్కిరెడ్డిపల్లె రూ.97.87 2,416 మదనపల్లె రూ.41.63 298 ములకలచెరువు రూ.83.61 1,601 నిమ్మనపల్లి రూ.33.79 263 పెద్దమండ్యం రూ.64.15 901 పెద్దతిప్పసముద్రం రూ.53.97 652 పీలేరు రూ.108.18 700 పుంగనూరు రూ.91.47 541 రామాపురం రూ.254.71 2,657 రామసముద్రం రూ.59.60 694 రాయచోటి రూ.65.57 1,697 సంబేపల్లి రూ.124.93 2,185 సదుం రూ.51.18 153 సోమల రూ.131.94 867 తంబళ్లపల్లె రూ.74.79 1,050 వాయల్పాడు రూ.125.73 846 -
● అమ్మ కావాలి..!
వాల్మీకిపురం : అంకుల్ అమ్మకు ఏమైంది.. అమ్మ కావాలి.. అంటూ చిన్నారి లోక్షిత రోధిస్తున్న తీరు స్థానికులకు కంటతడి పెట్టించింది. ఆదివారం హత్యకు గురైన మౌనిక మృతదేహానికి సోమవారం పోస్టుమార్టం నిర్వహించి, కుటుంబ సభ్యులకు అప్పగించారు. బెంగళూరు నుంచి మృతురాలి కుమారుడు కౌసిక్ (7), లోక్షిత (5) ఆసుపత్రికి చేరుకున్నారు. తన అమ్మను చూడాలని గంటల తరబడి ఆసుపత్రి ప్రాంగణంలో లోక్షిత పడిన తపన, ఆరాటాన్ని చూసి బంధువులు కన్నీరుమున్నీరయ్యారు.పాపను ఓదార్చడం ఎవరి తరం కాలేదు. గంటల తరబడి ఏడుస్తూ తన అమ్మ కోసం పరితపించిపోయింది. మృతురాలి బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక ఎస్ఐ తిప్పేస్వామి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
జల్సాల కోసం బైక్ల చోరీ
మదనపల్లెటౌన్ : జల్సాలకు అలవాటుపడి బైక్ల చోరీలకు పాల్పడుతున్న నిందితుడిని అరెస్ట్ చేసి, పది బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. లక్కిరెడ్డిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ కుప్పం మల్లికార్జున(40) రాయలసీమ జిల్లాల్లో బైక్ దొంగతనాలకు పాల్పడుతూ పోలీసులకు సవాల్గా మారాడు. ఇతనికోసం గాలిస్తుండగా పట్టుబడ్డాడు. అతని నుంచి రూ.4.61 లక్షల విలువైన పది బైక్లను స్వాధీనం చేసుకున్నట్టు తెలిపారు. సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ కార్యాలయంలో డీఎస్పీ పావనితో కలిసి మీడియా సమావేశంలో ఎస్పీ వివరాలను వెల్లడించారు. బస్టాండ్లు, ఆసుపత్రులే లక్ష్యం జల్సాలు, పేకాట వ్యసనాలకు బానిసైన మల్లికార్జున సులువుగా డబ్బు సంపాదించాలని 2022 నుంచి కడప, కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల్లో బైక్ల చోరీలకు పాల్పడుతున్నాడు. ఆర్టీసీ బస్టాండ్లు, ఆసుపత్రులు, సచివాలయాల వద్ద నిలిపి ఉంచిన బైక్ల తాళాలు విరగ్గొట్టి దొంగలించాక వాటిని లక్కిరెడ్డిపల్లె పరిసరాల్లో దాచి, ఆ తర్వాత మదనపల్లెలోని వైఎస్సార్ కాలనీ, బైపాస్రోడ్డులోని పాడుబడిన గదిలో పెట్టాక బెంగళూరులో అమ్మేందుకు ప్రణాళిక వేస్తుండగా మల్లికార్జున పోలీసులకు చిక్కాడని తెలిపారు. ఆదివారం సాయంత్రం స్థానిక చౌడేశ్వరి గుడివద్ద పోలీసులు వాహన తనిఖీ చేస్తుండగా బైక్పై వస్తున్న మల్లికార్జున పోలీసులను చూసి పారిపోయేందుకు యత్నించగా పట్టుకున్నారు. తర్వాత నిందితున్ని విచారించి అతని వద్ద ఉన్న బైక్తో పాటు, దాచిన తొమ్మిది బైక్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారని తెలిపారు. మదనపల్లె టూటౌన్, మదనపల్లె రూరల్, పుంగనూరు, తిరుపతి ఈస్ట్, కదిరి టౌన్ తదితర పోలీస్ స్టేషన్ల పరిధిలో నమోదైన కేసులకు సంబంధించిన బైక్లుగా గుర్తించినట్టు చెప్పారు. నిందితున్ని అరెస్ట్ చేయడంలో డీఎస్పీ బి.పావని పర్యవేక్షణలో టూటౌన్ సీఐ ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్ఐ వి. నాగేశ్వరరావు కృషి చేశారని తెలిపారు. నిందితుడిని అరెస్ట్ చేసిన టూటౌన్ సీఐ రఫీ, ఎస్ఐ నాగేశ్వరరావుతో పాటు కానిస్టేబుళ్లను ఎస్పీ ప్రశంసించారు. సమావేశంలో అదనపు ఎస్పీ (పరిపాలనఎం.వెంకటాద్రి, డిఎస్పీ బి.పావని, 2 వ పట్టణ సీఐ. ఎస్.మహమ్మద్ రఫీ, ఎస్బి సీఐ పి.రాజా రమేష్, 2 వ పట్టణ ఎస్ఐ లు వి.నాగేశ్వర రావు, బి .రామాంజనేయులు పాల్గొన్నారు.నిందితుడు అరెస్ట్, పది బైక్లు స్వాధీనం -
పాముకాటుతో మహిళకు అస్వస్థత
మదనపల్లె టౌన్ : కూలి పనులకు వెళ్లిన మహిళను విషసర్పం కాటేసిన సంఘటన సోమవారం తంబళ్లపల్లె మండలంలో జరిగింది. విష్ణుపల్లికి చెందిన మల్లికార్జున భార్య దేవమ్మ(45) బోరెడ్డికోటలో పోలంలో టమాటాలు కోయడానికి కూలికి వెళ్లింది. టమాటాలు కోస్తుండగా కాలిపై పాము కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని స్థానికులు తంబళ్లపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించగా అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటోంది. మద్యం తాగొద్దన్నందుకు హోంగార్డుపై దాడిప్రొద్దుటూరు క్రైం : అర్ధరాత్రి సమయంలో వీధుల్లో మద్యం తాగొద్దని చెప్పినందుకు ఓ వ్యక్తి హోంగార్డుపై దాడి చేసిన ఘటన ప్రొద్దుటూరులో చోటు చేసుకుంది. వన్టౌన్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు గాంధీరోడ్డులోని మౌలానాఆజాద్వీధి–4లో ఆదివారం అర్దరాత్రి సమయంలో కొందరు వ్యక్తులు మద్యం సేవిస్తున్నారు. అదే సమయంలో హోంగార్డు అక్కడికి వెళ్లడంతో కొందరు వ్యక్తులు పారిపోగా సుందరాచార్యుల వీధికి చెందిన తాహిర్బాషా అనే యువకుడు అక్కడే ఉండి హోంగార్డు పట్ల దురుసుగా ప్రవర్తించాడు. బహిరంగ ప్రదేశంలో మద్యం సేవించరాదని, పైగా అర్దరాత్రి సమయంలో తాగడం తప్పని చెబుతుండగా నాకు చెప్పడానికి నువ్వు ఎవరంటూ తాహిర్బాషా తన చేతిలో ఉన్న బీరు సీసాతో హోంగార్డును కొట్టడంతో తలకు వాపు, మెడపై గాయమైంది. హోంగార్డు రఫి ఫిర్యాదు మేరకు తాహిర్బాషాపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ పోలీసులు తెలిపారు. యువతి అదృశ్యంపై కేసునమోదుముద్దనూరు : మండలంలోని వేల్పుచెర్ల గ్రామానికి చెందిన రజిత అనే 19సంవత్సరాల యువతి అదృశ్యమైనట్లు పోలీసులు సోమవారం రాత్రి కేసు నమోదు చేశారు. ఎస్ఐ మధుసూదన్రెడ్డి సమాచారం మేరకు వేల్పుచెర్ల గ్రామానికి చెందిన రజిత ప్రైవేట్ నర్సుగా పనిచేస్తోంది.ఆదివారం రాత్రి ఇంటిలో భోజనంచేసి పడుకుంది.సోమవారం తెల్లవారుజామున ఆమె ఇంటిలో కనిపించలేదు.చుట్టుపక్కలవారిని విచారించారు.ఆమె ఆచూకి లభించకపోవడంతో రజిత తండ్రి ప్రసాద్ పోలీసులకు ఫిర్యాదుచేశారు.ఈ మేరకు అదృశ్యం కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. రోడ్డు ప్రమాదంలో కానిస్టేబుల్ దుర్మరణంరాజంపేట : చిట్వేలి పోలీసుసేష్టన్లో విధులు నిర్వర్తించేందుకు కానిస్టేబుల్ కే.సుధాకర్రాజు (56) రాజంపేట నుంచి బయలుదేరిన క్రమంలో సోమవారం పోలిచెరువు వద్ద డివైడర్ను ఢీ కొని మృతి చెందారు. దీంతో రాజంపేట సబ్బ్డివిజన్ పోలీసువర్గాల్లో విషాధచాయలు అలుముకున్నాయి. సుధాకర్రాజు గతంలో రాజంపేట, మన్నూరు పోలీసుస్టేషన్లో పనిచేశారు. విధి నిర్వహణలో సుధాకర్రాజు క్రమశిక్షణతో పనిచేసేవారని తోటి కానిస్టేబుళ్లు గుర్తుచేసుకున్నారు. మృతదేహాన్ని రాజంపేట ప్రాంతీయవైద్యశాలకు తరలించారు. పోస్టుమార్టరం నిర్వహించి, సంబంధీకులకు అప్పగించారు. సుధాకర్రాజుకు భార్య, ఇద్దరు కుమారులు ఉన్నారు. వీరు రాజంపేట పట్టణంలో నివాసం ఉంటున్నారు. ఏపీఎస్పీ కానిస్టేబుల్ నుంచి ఏ ఆర్, అక్కడి నుంచి సివిల్ కానిస్టేబుల్గా ప్రస్తుతం చిట్వేలిలో పనిచేస్తున్నారు. పిచ్చికుక్కదాడిలో చిన్నారికి గాయాలుముద్దనూరు : మండలంలోని యామవరం గ్రామంలో పిచ్చికుక్క గత రెండు రోజులనుంచి దాడులు చేస్తోంది.సోమవారం 4 ఏళ్ల చిన్నారిని కరిచింది. చిన్నారికి తీవ్ర గాయాలయ్యాయి. మరో ఇద్దరిని కరిచినట్లు స్థానికులు తెలిపారు. ,గ్రామంలో 4 గేదెలు పిచ్చికుక్క దాడిలో గాయపడ్డాయని చెప్పారు. -
కారు ఢీకొని మోటార్ సైక్లిస్టుకు గాయాలు
చంద్రగిరి : కారు ఢీకొని మోటార్ సైక్లిస్టు తీవ్రంగా గాయపడిన సంఘటన సోమవారం భాకరాపేట్ ఘాట్లో చోటుచేసుకుంది. పోలీసుల కథనం.. అన్నమయ్య జిల్లా వీరబల్లి మండలం పెద్దవీడు గ్రామానికి చెందిన నాగయ్య వ్యక్తిగత పనుల నిమిత్తం బైక్లో తిరుపతికి వస్తుండగా వెనుకనే వచ్చిన కారు నాగయ్యను ఢీకొని ఆగకుండా వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో నాగయ్య తలకు, చేతికి తీవ్ర గాయాలయ్యాయి. అదే మార్గంలో వస్తున్న వాహనదారులు ఇది గమనించి సమాచారం ఇవ్వడంతో భాకరాపేట 108 సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స చేసి తిరుపతి రుయాకు తరలించారు. ప్రస్తుతం అతడి పరిస్థితి నిలకడగా ఉందని వైద్యాధికారులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ప్రజా అర్జీలను సత్వరమే పరిష్కరించండి
జేసీ శివ్నారాయణశర్మమదనపల్లెఅర్బన్: ప్రజా అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరమే పరిష్కరించాలని జాయింట్ కలెక్టర్ శివ్నారాయణశర్మ సిబ్బందిని ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో పాల్గొని ప్రజల నుంచి అర్జీలను స్వీకరించారు. ఈ సందర్భంగా జేసీ మాట్లాడుతూ అర్జీలను వేగవంతంగా, నాణ్యతగా పరిష్కరించాలన్నారు. ఎలాంటి పెండింగ్ లేకుండా అర్జీలను త్వరితగతిన పరిష్కరించాలని సూచించారు. అలాగే గ్రీవెన్స్పై ఎప్పటికప్పుడు మానిటర్ చేయాలన్నారు. కాగా గ్రీవెన్స్సెల్లో మొత్తం 371 అర్జీలను స్వీకరించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో సబ్కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్రెడ్డి, ఆర్డీవో శ్రీనివాస్, ఏడీ భరత్కుమార్, సిబ్బంది పాల్గొన్నారు. అర్జీల వివరాలు.. ● గ్రామానికి మంజూరైన పంచాయతీ భవన నిర్మాణానికి పట్టణానికి వలస వెళ్లిన చలపతి, సాంబశివ సోదరులు అడ్డుపడుతున్నారని తంబళ్లపల్లె మండలం పంచాలమర్రి గ్రామస్తులు జేసీకి అర్జీ అందజేశారు. ఈ విషయంలో ఎంపీడీవో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, దాంతో ఆక్రమణదారులు అడ్డుపడుతున్నట్లు వివరించారు. ● స్మార్ట్ కిచెన్ విధానాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేస్తూ ఏపీ మధ్యాహ్న భోజన పథకం వర్కర్స్ యూనియన్ నాయకులు జేసీకి అర్జీ సమర్పించారు మధ్యా హ్న భోజన పథకాన్ని కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తే కార్మికులు ఉపాధి కోల్పోతారని పేర్కొన్నారు. -
దస్తగిరి హత్య కేసులో హైటెక్ కుట్ర..!
సాక్షి, అమరావతి :కడపలోని రిమ్స్ ఆవరణలో జరిగిన హత్య కేసులో హైటెక్ కుట్రలు చోటు చేసుకుంటున్నాయి. పోలీసు శాఖలోనే ఉన్నత స్థాయి అధికారుల మెప్పు కోసం కొందరు పోలీసులు వైఎస్సార్సీపీ నాయకులను టార్గెట్ చేస్తూ అడుగులు వేస్తున్నారు. వ్యక్తిగత గొడవల నేపథ్యంతో పాటు గంజాయి మత్తులో చేసిన హత్య విషయంలోనూ ఏదో ఒక రకంగా ఇరికించాలనే ప్రయత్నాలు కనిపిస్తున్నాయి. అన్ని రకాలుగా దస్తగిరి హత్య విషయంలో హైటెక్ కుట్రను మరిపిస్తున్నారు.రిమ్స్ ఆవరణలో ఉన్న దస్తగిరిని మట్టుబెట్టిన కేసులో దర్యా ప్తు పక్కదారి పడుతుందనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. పచ్చ పత్రికలు, మీడియాకు లీకులిస్తూ అందుకు అనుగుణంగా ఇన్వెస్టిగేషన్ను ముందుకు తీసుకెళ్తూ వైఎస్సార్సీపీ నేతలను టార్గెట్ చేయడంపై విస్మయం వ్యక్తమవుతోంది. రిమాండ్ రిపోర్ట్లో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావన కడపలో ఈ నెల 6వ తేదీన జరిగిన దస్తగిరి హత్య కేసులో పోలీసులు పక్షపాతంగా వెళ్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఎందుకంటే ఆది నుంచి కూడా ఎవరికీ తెలియకుండా నిందితుల వివరాలు బయటపడకుండా పోలీసులు అనుసరిస్తున్న వైఖరిపై చర్చ సాగుతోంది. దస్తగిరి హత్య కేసులో అన్ని విధాలుగా విచారణ చేస్తున్నామంటూనే పోలీసులు వైఎస్సార్సీపీ నేతల పేర్లు నిందితుల ద్వారా తెప్పించారని గుసగుసలు వినిపిస్తున్నాయి. ఎందుకంటే మొదటి నుంచి కూడా దస్తగిరితో పాటు మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఇతర నేతలందరూ కలిసిమెలసి ఉంటున్నారు. రిమాండ్ రిపోర్ట్లో వారు చెప్పినట్లు కాల్ రికార్డులు ఉన్నాయని కేసులో 13వ నిందితుడుగా నిత్యానందరెడ్డిని చేర్చారు. ముందుగా గంజాయి బ్యాచ్తో పాటు వ్యక్తిగత కారణాలతో హత్య జరిగిందని సోషల్ మీడియాతో పాటు ఇతర ప్రచార మాధ్యమాలు ఘోషించాయి. తరువాత క్రమంలో రాజకీయ ఒత్తిడులో లేక ఇతర కారణాలేవో తెలియదు కానీ దర్యాప్తులో పోలీసులు రూటు మార్చడంపై విమర్శలు వస్తున్నాయి. మాజీ సీఎం జగన్ వస్తారని.. ఈ నెల మొదటి వారంలో హత్యకు గురైన దస్తగిరి కుటుంబాన్ని పరామర్శించడానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి వస్తారని సోషల్ మీడియాలో ప్రచా రం జరుగుతున్న నేపథ్యంలో పోలీసులు అలర్ట్ అ య్యారు. దీంతో కేసులో వేగంపెంచారు. దస్తగిరి హత్య విషయంలో ఎక్కడ ప్రభుత్వాన్ని నేతలు, పోలీసులను టార్గెట్ చేస్తారన్న ఆలోచనతో ఆగమేఘాల మీద విచారణ సాగిస్తున్నారు. అయితే ఇందులో ఫోన్ కాల్ రికార్డులు ఇతర వ్యవహారాల పరిస్థితులను చూపిస్తూ వైఎస్సార్సీపీపై నెపం నెట్టేందుకు సిద్ధమయ్యారు. డొల్లతనం బయటపడకుండా దర్యాప్తు డైవర్ట్ ఈ నెల 6వ తేదీన అలంఖాన్పల్లెలో గొడవ జరిగిన తరువాత రిమ్స్ ఆవరణలో దస్తగిరిని కొంత మంది విచక్షణారహితంగా కత్తులతో పొడిచి హతమార్చిన ఘటన సంచలనం రేకెత్తించింది. అయితే అంతకు ముందు దాడులు జరిగిన నేపథ్యంలో నాకు రక్షణ కల్పించాలని దస్తగిరి పోలీసులకు మొరపెట్టుకున్నా ఎవరూ స్పందించలేదని సర్వత్రా చర్చ సాగుతోంది. అలంఖాన్పల్లె నుంచి రిమ్స్కు పోయేలోపే తనకు ఇబ్బందులు ఎదురవుతాయని చెప్పుకున్నా పోలీసులు పట్టించుకోలేదు. ఈ నేపథ్యంలో రిమ్స్కు వెళ్తున్న దస్తగిరిపై దాడులు జరగడం చనిపోవడం కనిపించింది. ఈ నేపథ్యంలో దస్తగిరిని పొట్టన పెట్టుకున్న నిందితుల వివరాలు తేల్చాల్సిన పోలీసులు రాజకీయ డ్రామాలకు తెరతీయడంపై విమర్శలు చెలరేగుతున్నాయి. అసలు ఏం జరుగుతోందో తెలియదు కానీ పోలీసులు డైవర్షన్ డ్రామాలతో హత్య కేసు దర్యాప్తులో అలా పక్కదారి వెళ్తుంది. ఏది ఏమైనా వైఎస్ఆర్సీపీ కీలక నేత, మాజీ డిప్యూటీ మేజర్ నిత్యానందరెడ్డి టార్గెట్గా కేసు విచారణ జరుగుతున్నదని జగమెరిగిన సత్యం. టార్గెట్ నిత్యానందరెడ్డి...?: వైఎస్సార్ కడప జిల్లాలో జరిగిన దస్తగిరి హత్య కేసుకు సంబంధించి మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి చుట్టూ పోలీసులు వలపన్నుతున్నారు. ఆది నుంచి నిందితులతో పాటు చనిపోయిన వ్యక్తి అందరూ కలిసిమెలసి తిరుగుతున్నారు. అయితే అనేక కారణాలు వ్యక్తిగత పరిస్థితులు ఇతర కారణాలు ఏవైనా దస్తగిరి హత్య నేపథ్యంలో వైఎస్సార్సీపీ నేతలను ఇరికించే ప్రయత్నం సాగుతోందని పార్టీ నాయకులు తీవ్రంగా స్పందిస్తున్నారు. అయితే వ్యక్తిగత పరిచయాలు గతంలో... దిగిన ఫొటోలు.. ఇతర కాల్ డేటా ఆధారం చేసుకుని మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డిని కేసులో ఇరికించే ప్రక్రియ షురూ అయింది. పోలీసులు అధికార పార్టీ, పోలీసు ఉన్నతాధికారుల మెప్పు కోసం మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి లక్ష్యంగా ముందుకు వెళ్లడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రిమాండ్ రిపోర్టులో వైఎస్సార్సీపీ నేతల ప్రస్తావన మాజీ సీఎం వైఎస్ జగన్ పరామర్శకు వస్తాడని సోషల్ మీడియాలో ప్రచారం పోలీసుల డొల్లతనం బహిర్గతం అవుతుందని దర్యాప్తు డైవర్ట్ పాత పరిచయాలు, ఫొటోల ఆధారంగా కేసు చుట్టే యత్నంనిత్యానందరెడ్డి ఇంటిని చుట్టుముట్టిన పోలీసులుకడప టాస్క్ఫోర్సు : కడప నగర శివార్లలోని మాజీ డిప్యూటి మేయర్ బండి నిత్యానందరెడ్డి అక్రమ అరెస్టుకు రంగం సిద్ధమైంది. ఈ మేరకు సోమవారం రాత్రి 9 గంటల ప్రాంతంలో ఏడు వాహనాల్లో స్పెషల్ పోలీసులు ఇంటిపై దాడి చేసి సోదాలు చేసినట్లు తెలిసింది. వాహనాల్లో పోలీసులు ఒక్కసారిగా వచ్చి ఇంటిమీద దాడి చేయడంతో కుటుంబసభ్యులు భయాందోళనకు గురైనట్లు తెలిసింది. పోలీసులు స్థలాలకు సంబంధించిన డాక్యుమెంట్స్కోసం ఇళ్లంతా శోధించినట్లు తెలిసింది. ఆర్థరాత్రి వరకు పోలీసులు అక్కడే తిష్ట వేశారు. -
రైతులను మోసం చేసిన వ్యాపారిపై ఫిర్యాదు
మదనపల్లె టౌన్ : రైతులకు ఓ వ్యాపారి లక్షల్లో మోసం చేయడంతో మోసపోయామని తమకు న్యాయం చేయమని కోరుతూ సోమవారం మదనపల్లెలో జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. కష్టపడి పండించిన పంటకు రావాల్సిన సుమారు రూ. 14.61లక్షల బకాయిలు చెల్లించ కుండా వేధింపులకు గురిచేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. ఈ మేరకు బాధితులు సీపీఎం జిల్లా కార్యదర్శి శ్రీనివాసులుతో కలిసి ఫిర్యాదు చేశారు. బాధితులు తెలిపిన వివరాలు. పెద్దతిప్పసముద్రం మండలం, రాపూరివారిపల్లికి చెందిన రైతు పి.శ్రీనివాసులు రెడ్డి, పి.ఆది నారాయణ రెడ్డి, పి.అర్జున్ రెడ్డి, శీనా, మురళి, పి.సహదేవరెడ్డి, టి.భాస్కర, టి.కుబేర మొక్కజొన్న సాగుచేసిన దిగుబడిని విజయవాడకు చెందిన పి.నవీద్ ఖాన్ గత డిసెంబర్, జనవరిలో నాలుగు విడతలుగా కొనుగోలు చేశారన్నారు. మొత్తం రూ 25,61,755ల విలువ చేసే మొక్కజొన్న కొనుగోలు చేసిన పి.నవీద్ ఖాన్ రూ.11 లక్షలు మాత్రమే చెల్లించి మిగిలిన రూ.14,61,755 లను ఇవ్వకుండా కాలయాపన చేస్తున్నాడని చెప్పారు. తిరిగి తమనే బెదిరిస్తున్నట్లు పేర్కొన్నారు. అప్పులు తెచ్చి పెట్టుబడి పెట్టిన రైతులవద్ద ప్రభుత్వం పంట కొనుగోలు చెయ్యక పోవడం వల్లనే ఈ దుస్థితి ఏర్పడిందన్నారు. పోలీసు అధికారులు, ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని కోరారు. -
విచారణకు హాజరైన వైఎస్సార్సీపీ నాయకులు
కడప కార్పొరేషన్ : ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ ఈనెల 9వ తేదీ వైఎస్సార్సీపీ నాయకులు గుంటి నాగేంద్ర, డాక్టర్ నాగార్జునరెడ్డిలు చేసిన నిరసనపై వన్టౌన్ పోలీసులు కేసు నమోదు చేశారు. ఈ మేరకు సోమవారం మధ్యాహ్నం వారు విచారణకు హాజరయ్యారు. కొత్త పలుకు అనే కార్యక్రమంలో భాగంగా ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ ఇటీవల వైఎస్సార్సీపీ నాయకులను ఉద్దేశించి అభ్యంతరకరమైన వ్యాఖ్యలు చేశారు. వైఎస్ జగన్ చెబితే వారు తమ భార్యలను చెల్లెళ్లుగా భావించి ఇతరులకు సంబంధాలు చూసి పెళ్లి చేసే వెన్నెముక లేనివారని వ్యాఖ్యానించారు. దీనిపై రాష్ట్ర వ్యాప్తంగా వైఎస్సార్సీపీ శ్రేణులు ఆందోళన కార్యక్రమాలు నిర్వహించాయి. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదులు చేశారు. ఈ క్రమంలోనే వైఎస్సార్సీపీ యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, జిల్లా వైద్య విభాగం అధ్యక్షుడు ఎన్. నాగార్జునరెడ్డి తదితరులు ఈనెల 9వ తేదీ రాధాకృష్ణ చిత్రపటానికి చెప్పుల దండ వేసి నిరసన వ్యక్తం చేశారు. దీనిపై ఆ పత్రిక బ్రాంచి మేనేజర్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు వన్టౌన్ పోలీసులు ఈనెల 17వ తేదీ వారిపై పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేశారు. ఆ కేసులో సోమవారం వారు పోలీసుల ఎదుట హాజరయ్యారు. కేసులో నమోదు చేసినవన్నీ బెయిలబుల్ సెక్షన్లే కావడంతో పోలీసులు వారిని సొంత పూచీకత్తుపై విడుదల చేశారు. వారి వెంట వైఎస్సార్టీయూసీ రాష్ట్ర అధికార ప్రతినిధి సుదర్శన్, వైఎస్సార్సీపీ ఎస్సీ విభాగం నగర అధ్యక్షుడు కంచుపాటి బాబు, చల్లా పవన్, సతీష్ తదితరులు ఉన్నారు. -
ఏం తినాలి
ఈనెల ఒకటి నుంచి ఉపాధి పనులు చేశాను. కూలి పనులనే ఆధారంగా జీవిస్తున్నాం. చేసిన పనులకు ఇంతవరకు బిల్లు రాలేదు. ఇలా అయితే పూట గడవడం కూడా కష్టంగా ఉంటోంది. ప్రతివారం అందాల్సిన కూలి సొమ్ము అందలేదు. వేతనాలు ఇవ్వకుండా పనులు చేసేది ఎలా. – శ్రీనివాసులు, ఉపాధికూలీ, ఉప్పరవాండ్లపల్లి ఉపాధి కూలీ పనులు చేసినా వే తనాలు అందలేదు. ఎప్పడిస్తా రో తెలియడం లేదు. ఖాతాల కు జమ చేయాల్సిన సొమ్ము అందక ఇబ్బందులు పడుతున్నాం. కూలి డబ్బుతోనే జీవనం సాగించాలి. ఉపాధి కూలీని నమ్ముకుని పను లు చేస్తే ఇలా చెల్లింపులో జాప్యం చేస్తే కుటుంబాన్ని ఎలా పోషించుకోవాలి. – చిన్న ఉత్తన్న, తంబళ్లపల్లె ఉపాధి హామీ పథకం పనులు చేయడం కష్టంగా మారింది. రోజుకు వచ్చే కూలి రూ.307. బిల్లులు కూడా సకాలంలో రావడం లేదు. దానివల్ల టమాట పంటలో కూలి పనులకు వెళ్తున్నాం. పనులకు రోజుకు రూ.540 కూలివస్తుంది. సొమ్ము ఆరోజే చెల్లిస్తారు. దానివల్ల మేం ఉపాధి హామీ పనులకు వెళ్లడం తగ్గించి, పొలాల్లో పనులకే వెళ్తున్నాం. – సరోజమ్మ, ఎరజ్రేనువారిపల్లి, కురబలకోట ఉపాధి హామీ పథకం ప్రారంభం నుంచి పనులకు వెళ్తున్నా. కొత్తగా నిబంధనల భారం ఎక్కువైంది. చేస్తున్న పనులకు గిట్టుబాటు కావడం లేదు. కుటుంబాలు గడవడం కోసం చేస్తున్న పనికి సకాలంలో బిల్లులు పడటం లేదు. అయినప్పటికి తప్పనిసరి పరిస్థితిలో పనులకు వెళ్తున్నాం. – కోళ్ల వెంకటశివారెడ్డి, బండపల్లి, కురబలకోట -
సంబరాలకు డబ్బుంది.. రైతులను ఆదుకోవటానికి లేవా
● అమరావతి పేరుతో దోచుకుంటున్నారు ● ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్రంలో రైతులు పంటలు బాగా పండించుకున్నారు. గిట్టుబాటు ధరలు వస్తాయని అశించారు.అయితే మార్కెట్లో ఆశించిన స్థాయిలో మద్దతు ధరలు లేక నష్టపోతున్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కోరితే తమ వద్ద డబ్బులు లేవంటూ అమరావతి పేరుతో ఊరురా సంబరాలు చేయడం కోసం ఖర్చు పెడుతోందని ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం జమ్మలమడుగులోని పార్టీ కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడారు. ఈ ఏడాది రాష్ట్రంలో మొక్క పొగాకు పంటలు వేసి నష్టపోయిన రైతులు చాలా మంది మొక్కజొన్న వైపు మొగ్గు చూపారు. ఎకరాకు దిగుబడి 35 క్వింటాళ్ల నుంచి 40క్వింటాళ్ల వరకు వచ్చింది. ఈ పంటకు ప్రభుత్వం మద్దతు ధర కింద రూ. 2400 ప్రకటించింది. అయితే ఎక్కడ కూడా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కోనుగోలు చేయడంలేదు. దీంతో రైతులు అప్పుల పాలవుతున్నారు. ప్రభుత్వం కొనుగోలు చేయకపోవడంతో ప్రైవేట్ వ్యాపారుల వద్దకు వెళ్లి రైతులు అమ్మకాలను కొనసాగిస్తుంటే వారు క్వింటాకు కేవలం 1700 రూపాయలు చెప్పి తరుగులు తీయడంతో క్వింటాకు రైతులకు 1600 రూపాయలు మాత్రమే ధర పలుకుతుంది. దీంతో ఎకరాకు రూ. 25వేల నుంచి రూ.30వేలు నష్టపోవాల్సి వస్తోందన్నారు. శనగ పంటను రాయలసీమతో పాటు ఉత్తరాంధ్ర ప్రాంతాల్లో రైతులు సాగుచేశారు.ఈ ఏడాది ఎకరాకు 13 క్వింటాళ్ల వరకు దిగుబడి వచ్చింది. ప్రభుత్వం మద్దతు ధర కింద రూ.5875 ప్రకటించింది.అయితే శనగ కొనుగోలు కేంద్రాల్లో శనగలు కొనుగోలు చేయడంలేదు. కొనుగోలు చేస్తున్నా కాంట్రాక్టర్లు చిలక్కొట్టుడు కొడుతుండటంతో రైతులు ఆసక్తి చూపడంలేదు. మార్కెట్లో వ్యాపారుల వద్ద రూ. 4900కే శనగలు అమ్ముకుంటున్నారు. శనగ రైతు ప్రతి క్వింటాకు 900 నుంచి 1000 నష్టపోతున్నారని ఎమ్మెల్సీ పేర్కొన్నారు. రైతులను అదుకోవడంలో రాష్ట్ర ప్రభుత్వం విఫలమైందన్నారు. మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలకోసం కేంద్రానికి లేఖలు పంపామని, ఇప్పటి వరకు ఎటువంటి అనుమతులు రాలేదని నిర్లక్ష్యంగా సమాధానం చెబుతున్నారన్నారు. అమరావతి పేరుతో లక్షల కోట్లు రూపాయలు దొచుకోవడం కోసం ఆగమేఘాలమీద అమరావతి బిల్లును కేంద్రానికి పంపించి, రాజ్యాంగ సవరణ చేసి ప్రత్యేక చట్టం తెచ్చామని కూటమి నాయకులు చెబుతున్నారు. దోచుకోవడంలో ఉన్న శ్రద్ధ రైతులను ఆదుకోవడంలో ఎందుకు లేదన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం వచ్చిన రెండేళ్ల కాలంలో 3.56 లక్షల కోట్ల రూపాయలు అప్పులు చేశారు. ఆ డబ్బులను సంక్షేమ పథకాలకు ఖర్చుపెట్టారా అంటే ఆదీలేదు అని అన్నారు.గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ జగన్మోహన్రెడ్డి రైతుల సంక్షేమం కోసం ప్రత్యేక నిధిని ఏర్పాటు చేసి పంటలకు మద్దతు ధర ఇచ్చి కొనుగోలు చేసిందన్నారు. ఇన్పుట్ సబ్సిడీతోపాటు ఇన్సూరెన్స్లు ఇచ్చి రైతులను ఆదుకుందని తెలిపారు.ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం మద్దతు ధరతో రైతులు పండించిన పంటలను వెంటనే కొనుగోలు చేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, జిల్లాప్రధానకార్యదర్శి రమణారెడ్డి, రైతు విభాగ నాయకుడు విశ్వనాథ్రెడ్డి, జిల్లా మున్సిపల్ విభాగ అధ్యక్షుడు హృషికేశవరెడ్డి, విష్ణువర్థన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
● శిథిలావస్థలో బ్రిటిష్ బంగ్లా
మదనపల్లె నీటిపారుదలశాఖకు గొప్ప చరిత్ర ఉంది. బ్రిటీషుపాలకులు మదనపల్లె కేంద్రంగా ఈఈ కార్యాలయం ప్రారంభించారు. దీని పరిధిలో ఉమ్మడిచిత్తూరు, కడప, అనంతపురం, కర్ణాటకలోని బళ్లారి జిల్లాలు ఉండేవి. ఇక్కడ పనిచేసే ఎగ్జిక్యూటివ్ ఇంజినీర్ల కోసం నివాస బంగ్లాను (ప్రస్తుత హెచ్ఎన్ఎస్ఎస్ కార్యాలయం ఎదుట) నిర్మించారు. బ్రిటీషుపాలకుల రాజసం ఉట్టిపడేలా బంగ్లాను నిర్మించగా ఓ వెలుగు వెలిగింది. అప్పట్లో ఎకరాల విస్తీర్ణం ఈ బంగ్లా పరిధిలో ఉండేది. మధ్యలో ఈ భవనం ఉండేది. 2000 తర్వాత ఈ బంగ్లాలో ఈఈలు నివాసం లేకపోవడంతో ప్రస్తుతం శిథిలావస్థకు చేరుకుంది. దీనికి సంబంధించిన భూమిని రెవెన్యూ అధికారులు ప్రభుత్వశాఖలకు కేటాయించడంతో నీటిపారుదలశాఖ భూమి హరించుకుపోయింది. –మదనపల్లె -
మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి
ఒంటిమిట్ట: చంద్రబాబు పాలనలో రాష్ట్ర వ్యాప్తంగా దళితులపై దాడులు తీవ్రమయ్యాయి. వైఎస్సార్ కడప జిల్లా ఒంటిమిట్టలోని హరిజన వాడకు చెందిన ఈరి హర్షవర్ధన్ అలియాస్ నాని (23) అనే దళిత యువకునిపై శనివారం రాత్రి టీడీపీ అగ్రకుల మూకలు విచక్షణా రహితంగా దాడి చేశాయి. బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు ప్రకారం ఈ నెల 5వ తేదీ పుష్పయాగం రోజు రాత్రి జైంట్ వీల్ వద్ద ఒంటిమిట్ట హరిజన వాడ యువకులకు– గంగపేరూరు గ్రామ పంచాయతీ పరిధిలోని చిన్న కొత్తపల్లి గ్రామ యువకులకు మధ్య ఘర్షణ జరిగింది. చిన్నకొత్తపల్లికి చెందిన యువకులు దానిని అక్కడితో వదిలి పెట్టలేదు. గొడవతో ఎలాంటి సంబంధం లేని హరిత హోటల్లో సర్వర్గా పని చేస్తున్న హర్షవర్ధన్కు చిన్నకొత్తపల్లికి చెందిన కట్టా మల్లికార్జున అనే వ్యక్తి ఫోన్ చేసి ‘హోటల్ రూమ్ బుక్ చేసుకున్నాము. రూమ్ సర్వీస్ చేయాలి’ అంటూ పిలిచాడు. హోటల్ వద్దకు వెళ్లగానే హర్షవర్ధన్పై మల్లికార్జున, పలుకూరి కిరణ్, హేమంత్, కట్టా వేణు, కట్టా కిశోర్, కట్టా బాలకృష్ణ మూకుమ్మడిగా దాడి చేశారు. ‘మన జోలికే వస్తారా.. వీడిని చంపేయండి.. తరువాత అంతా మన టీడీపీ నాయకులు చూసుకుంటారు’ అంటూ కుల దూషణ చేస్తూ ముఖంపై రక్తం వచ్చేలా పిడి గుద్దులు గుద్దారు. నడుముపై క్రికెట్ బ్యాట్తో విచక్షణా రహితంగా దాడి చేశారు. దీంతో నడవలేని పరిస్థితిలో ఉన్న హర్షవర్ధన్ను స్థాని కులు, బంధువులు వైద్యం కోసం స్థానిక పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు 108 సహాయంతో తరలించారు. పోలీస్స్టేషన్ ఎదుట ఆందోళనతో కేసు నమోదు విషయం తెలుసుకున్న ఒంటిమిట్ట హరిజనవాడ, అరుంధతి వాడ ప్రజలు ఆదివారం బాధితుడితో కలిసి ఒంటిమిట్ట పోలీసుస్టేషన్ వద్దకు చేరుకున్నారు. తమకు న్యాయం జరిగే వరకు కదిలే ప్రసక్తే లేదని భీష్మించారు . స్టేషన్ బయట ఉన్న జాతీయ రహదారిపై వాహనాలను నిలిపి వేసి, నిరసన తెలిపారు. ఎస్ఐ శ్రీనివాసులు ఎస్సీ, ఎస్టీ యాక్ట్, హత్యాయత్నం కింద కేసు నమోదు చేయడంతో ఆందోళనకారులు శాంతించారు. కాగా, ప్రశాంతంగా ఉండే ఒంటిమిట్ట మండలంలో చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రౌడీయిజం పురుడు పోసుకుందని ప్రజలు విమర్శిస్తున్నారు. హర్షవర్ధన్పై దాడి చేసిన వారే గతంలో చెంచుగారిపల్లి వద్ద ఉన్న చిల్లర అంగడిని కూడా పెట్రోల్ పోసి దహనం చేసినట్లు విమర్శలు ఉన్నాయి. దళితునిపై టీడీపీ రౌడీ మూకలవిచక్షణారహిత దాడి వైఎస్సార్ కడప జిల్లా,ఒంటిమిట్టలో దారుణం -
నగల దుకాణంలో అగ్ని ప్రమాదం
రాయచోటి : విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కారణంగా రాయచోటి పట్టణంలోని సలీంగోల్డ్ కవరింగ్ షాప్లో అగ్ని ప్రమాదం జరిగింది. ఈ ఘటనలో షాపు దగ్ధమైంది. ఆదివారం ఉదయం షాపు ప్రారంభంలో భాగంగా విద్యుత్ లైట్లు వేయగానే షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయని, ఈ ప్రమాదంలో రూ. 5 లక్షల మేర ఆస్తినష్టం జరిగినట్లు యజమాని తెలిపారు. ఏసీ వైర్ నుంచి ఒక్కసారిగా మంటలు చెలరేగి పక్కనే ఉన్న పీఓపీకి అంటుకుందన్నారు. దీంతో ప్రమాదం సంభవించిందన్నారు.ఈ విషయ్నాని రాయచోటి అగ్నిమాపక కార్యాలయానికి తెలియజేయగా వెంటనే అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేసే ప్రయత్నం చేశారు. వారి ప్రయత్నం ఆలస్యం అవుతుండటంతో లక్కిరెడ్డిపల్లి అగ్నిమాపక వాహనాన్ని రప్పించి మంటలను అదుపులోకి తెచ్చారు. షాపులో ఉన్న గిల్ట్ గోల్డ్, ఆర్నమెంట్స్ కొన్ని పూర్తిగా, మరికొన్ని పాక్షికంగా కాలిపోయాయి. అలాగే ఏసీ, టేబుల్స్ మంటల్లో కాలిపోయాయి. -
మూడేళ్లయినా ప్రారంభం కాలేదు
ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ పూర్తయి దాదాపు మూడేళ్లయినా ఇంతవరకు ప్రారంభం కాాలేదు. గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వ హయాంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా క్రీడాకారుల భవిష్యత్ కోసం ఈ పిచ్ నిర్మాణానికి శ్రీకారం చుట్టారు. హాకీని మట్టిపై ఆడటం వల్ల తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. గ్రౌండ్లో ఆడుతుంటే వాకర్స్కు మాకు నిత్యం గొడవలు జరుగుతున్నాయి. జిల్లా నుంచి ఇంటర్నేషనల్ హాకీ టీం ఆడాలంటే ఈ పిచ్లు ఎంతో అవసరం. ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ను ప్రారంభించాలని పలుమార్లు కలెక్టర్, కమిషనర్, డీఎస్డీవోకు విన్నవించినా పట్టించుకోవడం లేదు. –జితేష్, క్రీడాకారుడు.కడప -
కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు
కడప క్రీడాకారులపై కూటమి ప్రభుత్వం కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతోంది. కడపతో పాటు రాయలసీమ ప్రాంతానికి చెందిన క్రీడాకారులు ఎర్రమట్టిపై హాకీ ప్రాక్టిస్ చేసి ఇంటర్నేషన్లో ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్పై ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడతారు. దీనిని దృష్టిలో పెట్టుకొని గత వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం కడప డీఎస్ఏ క్రీడా మైదానంలో దాదాపు రూ.8. కోట్లతో ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ నిర్మించింది. మాజీ డిప్యూటీ సీఎం అంజద్ బాషా, మాజీ మేయర్ సురేష్బాబు, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి చొరవ చూపారు. కూటమి ప్రభుత్వం రాజకీయ వివక్షతతో ప్రారంభించకపోవడం బాధాకరం. –దేవిరెడ్డి ఆదిత్య, జిల్లా అధ్యక్షుడు, వైఎస్సార్సీపీ యువజన విభాగం -
ఈ పాపం ఎవరిది?
● గోపాలపురంలో తీరని వేదన ● తండ్రి, బిడ్డకు అంత్యక్రియలుకురబలకోట : కురబలకోట మండలం అంగళ్లు గ్రామం గోపాలపురానికి (కొండకింద) చెందిన గాండ్లపెంట రెడ్డి ప్రసాద్రెడ్డి (33) అతని నాలుగు నెలల కుమార్తె ప్రియాన్సిత ఆకస్మిక మృతి పలువురిని కలచి వేస్తోంది. నిష్కారణంగా ప్రాణాలు పోయాయని వాపోతున్నారు. శనివారం రాత్రి అమ్మ చెరువు మిట్ట వద్ద బైక్పై వస్తున్న వీరిని భారీ లారీ ఢీకొన్న సంఘటనలో వీరిద్దరు మృతి చెందిన విషయం తెలిసిందే. వీరితో పాటు బైక్ వెనుక కూర్చున్న రెడ్డి ప్రసాద్ రెడ్డి భార్య జ్యోతి (30) తీవ్ర గాయాలకు గురై ప్రాణాలతో బయటపడ్డారు. అనారోగ్యంతో ఉన్న చిన్నారి ప్రియాన్సితను మదనపల్లె ఆసుపత్రిలో చూపించి స్వగ్రామానికి తిరిగి వస్తుండగా రాత్రి ఎనిమిదిన్నర గంటల ప్రాంతంలో ఈ దుర్గటన జరిగింది. రెడ్డి ప్రసాద్ రెడ్డి ఒక్కడే ఆ కుటుంబానికి ఆధారం. తల్లి సరస్వతమ్మ వృద్ధురాలు. తండ్రి ఇతను చిన్నప్పుడే చనిపోయారు. రెడ్డి ప్రసాద్ఽ రెడ్డికి ఇద్దరు ఆడపిల్లలు. అంగళ్లులోని రాయచోటి రోడ్డులో పైపుల షాపు నిర్వహిహిస్తూ జీవనం సాగిస్తున్నాడు. ఈ క్రమంలో లారీ రూపంలో మృత్యువు ఇతన్ని కబలించింది. ఆదివారం మధ్యాహ్నం స్వగ్రామం గోపాలపురంలో అంత్యక్రియలు నిర్వహించారు. ముక్కుపచ్చలారని చిన్నారిని చూసి చెమ్మగిల్లని కన్నులు లేవు. కాగా ఈ ప్రమాదానికి కారకులెవరు అనేది వెంటాడుతోంది. ముదివేడు పోలీసులు అమ్మ చెరువు మిట్ట వద్ద ప్రమాదాల నియంత్రణకు బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో ఇక్కడ మెల్లగా వెళ్లాల్సి ఉంటుంది. అయితే శనివారం రాత్రి వచ్చిన భారీ లారీ ముందున్న బారికేడ్లును దూరం నుంచి డ్రైవర్ గమనించాడు. నిదానంగా వెళ్లాలన్న కారణంగా లారీని పక్కకు తిప్పాడు. అదే సమయంలో భార్యా బిడ్డలతో రోడ్డు పక్కగా వెళుతున్న రెడ్డి ప్రసాద్ రెడ్డి బైక్ను లారీ వేగంగా డీకొట్టింది. ఈ ఘటనలో రెడ్డి ప్రసాద్ రెడ్డి తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతి చెందారు. తర్వాత చిన్నారి ప్రియాన్సిత మృతి చెందింది. భార్య జ్యోతి వెనుక కూర్చుని ఉన్నప్పటికీ లారీ ఢీకొన్నప్పుడు రోడ్డు పక్కకు పడిపోవడంతో తీవ్రంగా గాయపడింది. కుటుంబీకులు ఆమెను బెంగళూరులోని ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. అక్కడ ఆమె కోటుకుంటున్నట్లు బంధువులు తెలిపారు. సంఘటన స్థలం డౌన్ కాబట్టి లారీ డ్రైవర్ వేగంగా ఆపై నిర్లక్ష్యంగా తోలడమా, పోలీసులు బారికేడ్లు ఏర్పాటు చేయడం ఈ ప్రమాదానికి కారణమా..ఈ పాపం ఎవరిదన్న ప్రశ్న పలువురిని వెంటాడుతోంది. ఇంటి ముందు కూర్చొని కన్నీరు పెట్టుకున్న వృద్ధ తల్లి, ఒకే సారి భర్త బిడ్డను కోల్పోయి విషాదంలో మునిగిపోయిన జ్యోతి.. ఈ దృశ్యాలను చూసిన వారు చలించిపోతున్నారు. ఇదివరకు ఇదే తరహాలో సీటీఎంకు చెందిన రియల్టర్ కూడా ఇక్కడ చనిపోయాడని స్థానికులు చెబుతున్నారు. -
వైభవంగా చెన్నకేశవుని చందనోత్సవం
వల్లూరు: పుష్పగిరిలోని శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి, శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వాముల బ్రహ్మోత్సవాలలో భాగంగా ఆదివారం కొండపై గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో శ్రీ చెన్న కేశవ స్వామి మూల విరాట్కు చందనోత్సవ కార్యక్రమాన్ని అంగరంగ వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన ఆరాధన అనంతరం స్వామి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం చందనంతో ప్రత్యేకంగా అలంకరించారు. చందన భూషితుడై నయనానందకరంగా వున్న స్వామి వారి దివ్య రూపాన్ని చూసి భక్తులు భక్తి పారవశ్యంలో మునిగిపోయారు. ● పుష్పగిరి గ్రామంలోని శ్రీ కామాక్షీ వైధ్యనాథేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి అభిషేకాలు నిర్వహించారు. శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవి అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. శ్రీ కామాక్షీ వైద్యనాధ స్వామి రాత్రి మయూర వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హనుమంత వాహనంపై కొలువు దీరి భక్తులకు దర్శనమిచ్చారు. పుష్పగిరిలో నేడు అక్ష తదియ ఉత్సవాలు బ్రహ్మోత్సవాలలో భాగంగా సోమవారం అతి ముఖ్యమైన అక్షయ తదియ తిరుణాల ఉత్సవాలు ఘనంగా జరుగనున్నాయి. ఈ ఉత్సవాలకు రాష్ట్రం నలుమూలల నుంచి భక్తులు అధిక సంఖ్యలో హాజరు కానున్నారు. ఉదయం చెన్న కేశవునికి పూలంగి సేవ జరుగుతుంది. రాత్రి జరిగే వైద్యనాథుడి నందివాహన సేవకు, శ్రీ చెన్న కేశవుని గరుడ వాహన సేవకు విశేష సంఖ్యలో భక్తులు హాజరై మొక్కులు తీర్చుకుంటారు. చందనోత్సవ అలంకారభూషితుడైన చెన్నకేశవ స్వామి -
మట్టిలో ఆడాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం
డీఎస్ఏ క్రీడా మైదానంలో మట్టిలో హాకీ ప్రాక్టీస్ చేయాలంటే తీవ్ర ఇబ్బందులు పడుతున్నాం. జిల్లా క్రీడాకారుల సంక్షేమం కోసం ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ కావాలని గత వైఎస్ఆర్ సీపీ హయాంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని క్రీడాకారులం అందరం అడిగిన వెంటనే రాష్ట్రంలో ఎక్కడా లేకున్నా కడపలో ఈ పిచ్ నిర్మాణానికి సహకరించారు. పూర్తయి మూడేళ్లయినా ప్రారంభం కాలేదు. మైదానం బయట ఆడుతుంటే వాకర్స్ మమ్మల్ని తిడుతూ గొడవలకు దిగుతున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పదించి ఆస్ట్రానాట్ టర్ఫ్ పిచ్ను ప్రారంభించాలి. –ప్రదీప్, హాకీ స్టేట్ ప్లేయర్ -
అయినా రాస్తున్నారు
బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ పైకి వచ్చే యువకులు ఇక్కడ నిర్మాణాలపై పేర్లు రాస్తూ కళ తప్పేలా చేస్తున్నారు. వ్యూ పాయింట్లపై ఇప్పటికే బొగ్గు, ఆకులతో పేర్లు గుర్తులతో ఖరాబు చేశారు. ఇక్కడే గవర్నర్ బంగ్లా గోడలపై కూడా ఇలాగే రాస్తారని హెచ్చరిక బోర్డు పెట్టారు. రాస్తే రూ.5 వేలు జరిమానా అని కూడా పేర్కొన్నారు. అయినప్పటికీ గవర్నర్ బంగ్లా గోడలను కూడా వదలకుండా ఇలా పిచ్చి రాతలతో నింపేశారు. దాంతో కోడలు అందం కోల్పోతున్నాయి. దీనిపై అధికారులు ఎన్ని చర్యలు తీసుకున్నా యువకుల్లో మార్పు రావడం లేదు. –బి.కొత్తకోట -
● హా..‘కీ’ తెరవండి సార్...
కూటమి నేతలు కడప క్రీడాకారులతో ఆటాడుకుంటున్నారు. ‘పూర్తయిన టర్ఫ్ పిచ్ గ్రౌండ్కు తాళం వేశారు.. కీ ఓపెన్ చేయండి సార్’ అంటూ పలువురు ఆటగాళ్లు క్రీడా శాఖ మంత్రి మండిపల్లికి విన్నవించారు... కనిపించిన అధికారులను అడిగారు.. కడప ఎమ్మెల్యేని వేడుకున్నారు.. ఎవరికీ మనసు రాలేదు.. జాతీయ క్రీడపై, క్రీడాకారులపై కాస్తయినా కనికరం చూపలేదు.. అధికారంలో ఉన్న వీళ్లు ఒక్క రూపాయి ఖర్చు చేయాల్సిన అవసరం లేదు.. హాకీ కోర్టుకి వేసిన తాళం తీస్తే చాలు.. అది చేయడానికి వీరికి చేతులు రావడం లేదు.. సందర్భం వస్తే వేదికలపై గొప్ప ఉపన్యాసాలు, విన్యాసాలు చేసే కూటమి నేతలకు, అధికారులకు క్రీడాకారులకు మేలు చేయాలనే తలంపు లేకపోవడం విచారకరమని పలువురు వాపోతున్నారు. -
కిడ్నీ రాకెట్ కేసులో మరో నిందితుడు అరెస్ట్
మదనపల్లె టౌన్ : సంచలనం రేకెత్తించిన అన్నమయ్య జిల్లా మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ఆదివారం ఏ–20 నిందితుడిని స్థానిక 2వ పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ పావని తెలిపిన వివరాల మేరకు.. మదనపల్లె ఎస్బీఐ కాలనీలోని గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆస్సత్రిలో విజయవాడకు చెందిన సాడి జమున(29) కిడ్నీ తొలగించే క్రమంలో వైద్యం వికటించి ఆమె మత్యువాత పడిన సంగతి తెలిసిందే. ఈ కేసులో మదనపల్లె జిల్లా ఆస్పత్రి డయాలసిస్ టెక్నీషియన్ బాలు అలియాస్ బాలరంగడు, కాకర్లసత్య, పిల్లి పద్మ, సూరి బాబుతో పాటు కిడ్నీ తొలగించిన డాక్టర్లు ఆంజనేయులు, పార్థసారథిరెడ్డితో కలిపి మొత్తం 26 మందిపై కేసు నమోదు చేయగా అందులో 11మందిని అరెస్టు చేశారు. ఆదివారం 20వ నిందితుడిగా ఉన్న కడపకు చెందిన గ్లోబల్ ఆస్పత్రి ఓటీ అసిస్టెంట్ నవీన్ (28)ను అరెస్ట్ చేసి వైద్య పరీక్షల అనంతరం రిమాండ్కు తరలించారు. -
అంకిశెట్టిపల్లెలో ఇరువర్గాల ఘర్షణ
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం, అంకిశెట్టిపల్లెకు చెందిన సుమన్ అదే ఊరికి చెందిన అభిలాష్ ను ఆదివారం బైక్తో పొరపాటున ఢీకొన్నాడు. స్థానికంగా ఉన్న యువకులు గమనించి సుమన్ను చితక బాదారు. వెంటనే అతను ఇంటికి వచ్చి కత్తి తీసుకుని వెళ్లి, తనపై దాడిచేసిన బాబు, సుధాకర్, సోమశేఖర్లను పొడిచాడు. దీంతో ఇరువర్గాల మధ్య ఘర్షణ జరిగి గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. కత్తితో దాడి చేసిన సుమన్ ను పట్టుకుని స్తంభానికి కట్టేసి కొట్టారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు, అంకి శెట్టిపల్లికి చేరుకుని సుమన్ను విడిపించి వెంటనే జిల్లా ఆసుపత్రికి తరలించారు. అలాగే సుమన్ చేతిలో కత్తిపోట్లకు గురైన బాధితులు కూడా జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. -
చల్లని కొండ.. మండుతున్న ఎండ
● హార్సిలీ హిల్స్లో చల్లదనం మాయం! ● 37 డిగ్రీలకు చేరిన ఉష్ణోగ్రత ● కొండకు వచ్చేందుకు భయపడుతున్న పర్యాటకులుబి.కొత్తకోట : రాష్ట్రంలో ఏకై క వేసవి విడిది కేంద్రం బి కొత్తకోట మండలంలోని హార్సిలీ హిల్స్. మండుటెండలో అత్యంత చల్లగా, హాయిగొలిపే హార్సిలీ హిల్స్ అంటే అందరికీ ఇష్టం. ఇక్కడ సేద తీరేందుకు, చల్లటి వాతావరణ అనుభూతి పొందేందుకు సామాన్యుల నుంచి ధనికుల వరకు ఆసక్తి చూపుతుంటారు. అయితే ప్రస్తుతం ఇది నిప్పుల కొండగా మారిపోయింది. ఇక్కడికి రావాలంటేనే పర్యాటకులు భయపడే పరిస్థితి వచ్చేసింది. చల్లని కొండపై ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగి మండిపోతోంది. 37 డిగ్రీల ఉష్ణోగ్రత హార్సిలీహిల్స్ పై సాధారణంగా ఉష్ణోగ్రతలు అతి తక్కువగా ఉంటాయి. వేసవిలో అయితే 15 నుంచి 24 డిగ్రీల దాకా పెరుగుతాయి. 30 డిగ్రీల ఉష్ణోగ్రత పెరిగిన సందర్భాలు అరుదు. అయితే కొన్నేళ్లుగా ఇక్కడి వాతావరణ సమతుల్యత దెబ్బతింది. పర్యావరణంలో పెను మార్పులు చోటు చేసుకున్నాయి. దీని ఫలితంగా ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరుగుతూ పోతున్నాయి. శని,ఆదివారాల్లో ఎన్నడూ లేనంతగా 37 డిగ్రీలకు పెరిగింది. ఈ ఉష్ణోగ్రత సాధారణ మైదాన ప్రాంతంలోనే ఉంటోంది. సముద్ర మట్టానికి 4,141 అడుగుల ఎత్తులోని హార్సిలీహిల్స్ పైన ఇదే ఉష్ణోగ్రత ఉంటే ఇక తేడా ఏముందని పర్యాటకులు చెబుతున్నారు. మంగళవారం ఇదే కొండపై ఉష్ణోగ్రత 34 డిగ్రీలు నమోదైంది. మూడు రోజుల తేడాలో మూడు డిగ్రీలు పెరిగి 37కు చేరుకుంది. ఎడాపెడా నిర్మాణాలు ఇప్పుడున్న హార్సిలీహిల్స్ నివాస ప్రాంతం ఒకప్పుడు రిజర్వ్ ఫారెస్ట్. 103 ఎకరాలను అటవీశాఖ రెవెన్యూ శాఖకు బదలాయించింది. 20 ఏళ్ల కాలంలో పర్యావరణం దెబ్బతినే విధంగా కాంక్రీట్ నిర్మాణాలు ఎడాపెడా కొనసాగుతున్నాయి. అవి ప్రభుత్వ శాఖల నిర్మాణాలే కాక, అత్యధికంగా అక్రమ నిర్మాణాలు పెరిగిపోయాయి. అందులో వాణిజ్య కార్యకలాపాలు విసృతంగా సాగుతున్నాయి. పదేళ్ల క్రితం శాటిలైట్ చిత్రాలు, ఇప్పటి శాటిలైట్ చిత్రాలను ఉన్నతాధికారులు పరిశీలిస్తే కొండపై అక్రమ నిర్మాణాలు ఎంత భారీ స్థాయిలో జరిగాయో నిర్ధారణ అవుతుంది. మరోవైపు ఇష్టారాజ్యంగా ప్లాస్టిక్ వినియోగం, వాటిని ఎక్కడపడితే అక్కడ పారబోస్తున్నారు. దీంతో పారిశుద్ధ్యం అధ్వానంగా మారింది. దోమల ఉత్పత్తికి కారణమవుతోంది. ఇలాంటి కారణాలతో ఉష్ణోగ్రతలు అత్యధికంగా పెరిగిపోతున్నాయి. ఫలితంగా హార్సిలీహిల్స్కు ఉన్న పేరు చెదిరిపోతోంది. భవిష్యత్తులో ఉష్ణోగ్రతలు మరింత పెరిగిపోయి సందర్శకుల రాక పూర్తిగా ఆగిపోయే ప్రమాదం లేకపోలేదు. మారిన పరిస్థితులు హార్సిలీహిల్స్పై నడుస్తుంటే మేఘాలు తాకి పలకరించేవి. చల్లటి గాలులు వీచేవి. ఎంతటి వేసవి అయినా ఉష్ణోగ్రత ఉండేది కాదు, ఎండ అనిపించేది కాదు. ఇప్పుడా పరిస్థితి లేదు. మేఘాలు కొండను తాకడం లేదు. చల్లటి గాలులు వీయడం లేదు. ఉక్కపోత, వేడి పర్యాటకులను చెమటలు తెప్పిస్తున్నాయి. దీంతోపాటు దోమలు అధికమయ్యాయి. పర్యావరణం దెబ్బతినిందనేందుకు ఇదే ఉదాహరణ. ఆహ్లాదకరమైన వాతావరణం ఆస్వాదించే అవకాశం లేకుండా పోయింది. కేవలం హార్సిలీహిల్స్ అన్న పేరు మినహాయిస్తే సాధారణ ప్రాంతానికి కొండపై ఉన్న ప్రాంతానికి తేడా లేకుండా పోయింది. ఫలితంగా సందర్శకులు ఇక్కడికి రావాలంటే ఆసక్తి చూపడం లేదు. ఇప్పుడు వస్తున్న సందర్శకులు అత్యధికులు పొరుగు రాష్ట్రాల నుంచి వస్తున్న వారే. -
తిట్టాడనే దివ్యాంగుడిని చంపేశారు
మదనపల్లె టౌన్ : ఆటో డ్రైవర్ను తిట్టాడన్న కోపంతోనే దివ్యాంగుడైన శంకర్ను ఆటోడ్రైవర్లు హత్య చేశారని డీఎస్పీ పావని వెల్లడించారు. మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ (45)ను హత్య చేసిన నిందితుల అరెస్టు వివరాలను స్థానిక తాలూకా పోలీస్ స్టేషన్లో ఆదివారం ఆమె మీడియా సమావేశంలో వెల్లడించారు. ఈ నెల 11న రాత్రి స్థానిక సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లి చెరువు కట్టపై, కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్ దారుణ హత్యకు గురయ్యాడని అన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన సీఐ కళా వెంకటరమణ, హత్యకు పాల్పడిన నిందితుల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఈ నెల 11న రాత్రి శంకర్ ఎస్టేట్ వద్దకు ఓ పెళ్లికి వెళ్లి ఇంటికి వచ్చేందుకు ఆటోలో ఎక్కాడు. ఆ సమయంలో బాడుగ రెట్టింపు అడగడంతో తాను దివ్యంగుడునని ఇచ్చేది రూ.వంద అని వారితో గొడవపడి తిట్టాడు. దీంతో ఆటో డ్రైవర్ అతనితో పాటు ఉన్న మరో యువకుడు కలసి దివ్యాంగుడైన శంకర్ను తట్టివారిపల్లి చెరువు కట్టపైకి తీసుకెళ్లి బండరాళ్లతో కొట్టి నీటితోటిలో పడేసి హత్య చేశారు. మరుసటి రోజు హత్య విషయం వెలుగులోకి రావడంతో సీఐ కళా వెంకటరమణ ఘటన స్థలాన్ని పరిశీలించారు. కేసు నమోదు అనంతరం దర్యాప్తు చేశారని చెప్పారు. ఆరోజు రాత్రి శంకర్ను ఎస్టేట్ వద్ద ఆటోలో తీసుకెళ్లినట్లు నిర్ధారించి, రామారావు కాలనీకి చెందిన ఆటో డ్రైవర్ షేక్ షాదిక్(25), వినయ్ కాంత్( 25) ఇసుకనూతిపల్లి వేణుగోపాలస్వామి గుడి వద్ద ఉండగా ఆదివారం అరెస్ట్ చేసి విచారించారు. శంకర్ను హత్య చేసింది తామేనని అంగీకరించారని, ఆటో ఎక్కి తమతో గొడవ పడడంతో తీసుకెళ్లి చెరువు కట్టపై బండరాతితో కొట్టి హత్య చేసినట్లు నేరం అంగీకరించగా నిందితుల్ని అరెస్టు చేశామన్నారు.హత్య కేసులో ఇద్దరు ఆటోడ్రైవర్లు అరెస్ట్ -
సందడిగా పూర్వ విద్యార్థుల స్వర్ణోత్సవం
సదుం : అన్నమయ్య జిల్లా సదుం మండల కేంద్రంలోని జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో 1976–77 సంవత్సరం పదోతరగతి బ్యాచ్ విద్యార్థులు ఆదివారం స్వర్ణోత్సవ వేడుకలు నిర్వహించారు. 50 ఏళ్లు పూర్తవుతున్న సందర్భంగా పలు ప్రాంతాల్లో స్థిరపడినవారు పాఠశాలకు చేరుకున్నారు. ఆనాటి సంగతులను గుర్తు చేసుకుంటూ ఆహ్లాదంగా గడిపారు. ఆటపాటలతో సందడి చేశారు. తమకు విద్యా బుద్ధులు నేర్పిన గురువులను సన్మానించారు. వారి ఆశీర్వాదం తీసుకున్నారు. పలువురు పూర్వ విద్యార్థుల సహకారంతో రూ. 6 లక్షల వ్యయంతో నూతనంగా నిర్మించిన సభాప్రాంగణానికి ప్రారంభోత్సవం చేశారు. అనంతరం అందరూ కలిసి ముచ్చట్లు చెప్పుకుంటూ భోజనం చేశారు. కార్యక్రమంలో హెచ్ఎం సుబ్రమణ్యం, రిటైర్డ్ హెచ్ఎం జయకుమార్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
నేడు డయల్ యువర్ ఎస్ఈ
మదనపల్లె: విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 8.30 నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్ జిల్లా ఎస్ఈ సోమశేఖర్రెడ్డి ఆదివారం తెలిపారు. జిల్లాకు చెందిన వినియోగదారులు 9440817449 నంబర్కు ఫోన్చేసి విద్యుత్ సమస్యలను తమ దృష్టికి తీసుకొచ్చి పరిష్కరించుకోవాలని కోరారు. అవకాశాన్ని విద్యుత్ వినియోగదారులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. మదనపల్లె: ప్రజల నుంచి వారి సమస్యలను స్వీకరించి, పరిష్కరించేందుకు సోమవారం ఉదయం 10 గంటల నుంచి ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పబ్లిక్ గ్రీవెన్స్ రిడ్రెస్సల్ సిస్టం) కార్యక్రమాన్ని కలెక్టరేట్తోపాటు గ్రామ, మండల, డివిజన్ స్థాయిలో నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ప్రజలు అందించిన ఫిర్యాదులపై వాటి నమోదు, వాటి తాజాస్థితిపై సమాచారాన్ని తెలుసుకునేందుకు 1100 నెంబర్ను సంప్రదించవచ్చని తెలిపారు. మండల, డివిజన్ స్థాయిలో సమస్యలు పరిష్కారం కాని అర్జీదారులే జిల్లా కేంద్రంలో జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి రావాలని కోరారు. గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు,అభిషేకాలు నిర్వహించారు. అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కుబడులు చెల్లించుకున్నారు. పలువురు భక్తులు ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. మదనపల్లె: జలధార–జలహారతి కార్యక్రమంపై సీఎం చంద్రబాబు ఆదివారం టెలీకాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన జలధార కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ను నోడల్ అధికారిగా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఈ సందర్భంగా చంద్రబాబు మాట్లా డుతూ జలధార కార్యక్రమానికి మండల, పట్టణాల నోడల్ ఆఫీసర్లు కీలకంగా వ్యవహరించాలన్నారు. నీటి సంరక్షణ–నీటి భద్రత విషయంలో అన్నమయ్య జిల్లా మోడల్ను రాష్ట్ర వ్యాప్తంగా అమలు కావాలని కోరారు. భారీ వర్షాలు పడినా నీటి ముంపు లేకుండా ఉండేలా కాల్వలను, చెరువుల మరమ్మతులు చేయించాలని,వర్షాకాలంలో చెరువులన్నీ నింపేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. కడప వైఎస్ఆర్ సర్కిల్: నగరంలోని జయనగర్ కాలనీ జడ్పీ గర్ల్స్ హై స్కూల్లో ఈ నెల 22న జిల్లాస్థాయి బాస్కెట్బాల్ ఎంపికలను నిర్వహించనున్నట్లు జిల్లా బాస్కెట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సహదేవరెడ్డి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ ఎంపికలకు హాజరయ్యే క్రీడాకారులు 2008 జనవరి 1 తర్వాత జన్మించిన వారై ఉండాలని పేర్కొన్నారు. క్రీడాకారులు తమ ఒరిజినల్ ఆధార్ కార్డుతో హాజరుకావాలన్నారు. జిల్లా స్దాయికి ఎంపికై న క్రీడాకారులు మే 1 నుంచి 4 వరకు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనాల్సి ఉంటుందని వివరించారు. నందలూరు: శ్రీ సౌమ్యనాధ సేవా ట్రస్ట్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించడానికి సమాయత్తమైందని ట్రస్ట్ ఫౌండర్ ఛైర్మన్ యద్దల సుబ్బరాయుడు తెలిపారు. ట్రస్ట్ ఫిక్స్డ్ డిపాజిట్లు 2026 సంవత్సరం మార్చి 31వ తేదీకి వివిధ బ్యాంకుల్లో రూ.2,51,38,720 చేరుకున్నాయని పేర్కొన్నారు. ఆదివారం సేవ ట్రస్ట్ లో ట్రస్టు సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సుబ్బరాయుడు మాట్లాడుతూ 2025– 26 మార్చి నాటికి అన్నదాన పథకానికి అయిన జమా ఖర్చులు పరిశీలించామని తెలిపారు. ఈ వేసవి కాలంలో మంచినీటి వసతి భక్తులకు కల్పించాలని సూచించారు. ఈ సమావేశంలో ట్రస్ట్ కోశాధికారి చక్రాల రామసుబ్బన్న, కార్యదర్శి కె.శైలేంద్రనాథ్, గంటా వాసుదేవయ్య, పల్లె సుబ్రమణ్యం, జంగంశెట్టి వెంకటసుబ్బయ్య, మోడపోతుల రాము, లంకాయగారి సుబ్బరామయ్య, సర్దార్ తదితరులు పాల్గొన్నారు. -
అనుమానం పెనూభూతమై
వాల్మీకిపురం : భార్యపై అనుమానంతో భర్తే కాలయముడయ్యాడు. ముఖంపై పిడిగుద్దులు గుద్దడంతో భార్య మౌనిక (27) అక్కడిక్కడే మృతి చెందింది. ఈ సంఘటన వాల్మీకిపురం పట్టణం తోటవీధిలో ఆదివారం రాత్రి చోటు చేసుకొంది. వివరాలు.. తోటవీధికి చెందిన జగదీష్ తన భార్య మౌనికపై గత కొంతకాలంగా అనుమానం పెంచుకున్నాడు. ఇద్దరి మధ్య గొడవలు జరుగుతుండడంతో రెండు నెలల క్రితం బతుకుదెరువు కోసం బెంగళూరుకు వెళ్లారు. ఆదివారం తిరిగి సొంతూరైన వాల్మీకిపురం వచ్చారు. వచ్చిన గంట వ్యవధిలోనే ఇద్దరి మధ్య మాటల యుద్ధం పెరగడంతో కోపంతో ఊగిపోయిన జగదీష్ మౌనికపై పిడిగుద్దులు గుద్దడంతో అక్కడిక్కడే మృతి చెందింది. భార్య మృతి చెందిన విషయాన్ని గమనించిన జగదీష్ నేరుగా పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. సీఐ రాఘవ రెడ్డి, ఎస్ఐ తిప్పేస్వామి సంఘటనాస్థలానికి చేరుకొని మృతదేహాన్ని పరిశీలించారు. మౌనిక మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మౌనికకు కుమారుడు కౌసిక్(7), కుమార్తె లోక్షిత (5) ఉన్నారు. బలిజలు ఐక్యతతో ముందుకు సాగాలివాల్మీకిపురం : బలిజలందరూ ఐక్యతతో కలసి ముందుకు సాగాలని జాతీయ కాపు సంఘం ప్రచార కార్యదర్శి గోపి రాయల్ అన్నారు. ఆదివారం స్థానిక విలేకరులతో మాట్లాడుతూ మన హక్కులను మనమే సాధించుకోవాలన్నారు. చట్ట సభల్లో బలిజలకు రిజర్వేషన్ కల్పించి, కాపు కార్పొరేషన్లో నిధులు మంజూరు చేసి ఆర్థికంగా ఆదుకోవాలన్నారు. ఈ కార్యక్రమంలో కోసూరి చంద్రమౌళి, శ్రీధర్రాయల్, రామచంద్ర, మోహన్రామ్, సుబ్రమణ్యం, పివి నారాయణ, బొక్కసం ఆనంద, శ్రీనివాసులు, తదితరులు పాల్గొన్నారు. 30న అన్నమయ్య కీర్తనలపై పోటీలు కడప సెవెన్రోడ్స్ : తెలుగు పదకవిత పితామహుడు తాళ్లపాక అన్నమాచార్యుల 618వ జయంతి మే 2వ తేది కడప నగరం హౌసింగ్బోర్డు కాలనీలోని శ్రీ కోదండ రామాలయంలో నిర్వహిస్తున్నామని ఆలయ సేవా సమితి అధ్యక్షులు దేసు వెంకటరెడ్డి తెలిపారు. ఈ నేపధ్యంలో ఈనెల 30వ తేదీ ఉదయం 9.30 గంటలకు శ్రీ కోదండ రామాలయంలో అన్నమాచార్య కీర్తనలపై పోటీలు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీల్లో పాల్గొనదలిచిన వారు ఈనెల 28వ తేదీ రాత్రి 7 గంటల్లోపు 94407 25110 లేదా 80960 34302 నంబర్లకు ఫోన్ చేసి తమ పేర్లు నమోదు చేసుకోవాలని సూచించారు. మే 2వ తేదీ ఉదయం 9 గంటలకు అన్నమాచార్యుల జయంతిని పురస్కరించుకుని మాడవీధులలో నగర సంకీర్తన కార్యక్రమం ఉంటుందన్నారు. 10.30 గంటలకు శ్రీ అన్నమాచార్యుల సప్తగిరి సంకీర్తనల గోష్టిగానం నిర్వహిస్తామన్నారు. మధ్యాహ్నం 12 గంటలకు సంకీర్తన పోటీలో విజేతలైన వారికి బహుమతి ప్రదానం ఉంటుందని తెలిపారు. యువకునిపై కత్తితో దాడిచింతకొమ్మదిన్నె : కొలుములపల్లె పంచాయతీలోని మద్దిమడుగు గ్రామ సమీపంలో గల వ్యవసాయ బావి వద్ద సయ్యద్ ఇమ్రాన్ అనే యువకుడిపై కత్తితో దాడి చేయడంతో గాయపడినట్లు చింతకొమ్మదిన్నె పోలీసులు తెలిపారు. ఈ మేరకు నిందితులుగా సయ్యద్ దాదాపీర్, దస్తగిరిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు పేర్కొన్నారు. గాయపడిన వ్యక్తి రిమ్స్ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు.భర్త చేతిలో భార్య హత్య -
డ్రైవింగ్ లైసెన్స్ కోసం వచ్చి.. మృత్యుఒడికి
● బైక్ను ఢీకొన్న కారు ● కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ వద్ద ప్రమాదం ప్రమాదానికి కారణమైన కారు నుజ్జునుజ్జు అయిన బైక్ మదనపల్లె టౌన్ : డ్రైవింగ్ లైసెన్స్ కోసం బైకులో మదనపల్లెకు వచ్చి వెళుతుండగా కారు మృత్యువు రూపంలో ఓ యుకుడి ప్రాణాలను కబళించింది. ఈ విషాదకర సంఘటన శుక్రవారం కురబలకోట మండలంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి ముదివేడు ఎస్ఐ మధురామచంద్రడు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె మండలం బలకవారిపల్లె పంచాయతీ బూదలవారిపల్లెకు చెందిన రాజు కుమారుడు సీలింగు చిన్నప్ప(34) డ్రైవింగ్తోపాటు చిన్న చిన్న కూలీ పనులు చేస్తూ భార్య శిరీషా, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పోలీసులు తరచూ వాహనాలు తనిఖీ చేస్తూ.. డ్రైవింగ్ లైసెన్సు లేదని ఫైన్లు వేస్తుండటంతో భయపడి ఇటీవల డ్రైవింగ్ లైసెన్సుకుఽ దరఖాస్తు చేసుకున్నాడు. ఎంవీఐ వద్దకు డ్రైవింగ్ టెస్టుకు హాజరయ్యేందుకు మదనపల్లెకు వెళుతున్నట్లు ఇంట్లో చెప్పి వచ్చాడు. మదనపల్లెలో పని పూర్తి కాగానే తిరిగి ఇంటికి తన బైక్పై వెళుతుండగా, మార్గంమధ్యలోని కురబలకోట మండలం రైల్వే ప్లైఓవర్ బ్రిడ్జి వద్ద కారు మృత్యువు రూపంలో వచ్చి.. చిన్నప్ప బైకును ఢీకొనడంతో తీవ్రంగా గాయపడి అక్కడిక్కడే ప్రాణాలు విడిచాడు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని మృతదేహానికి పంచనామా నిర్వహించారు. పోస్టుమార్టం కోసం మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి రలించారు. చిన్నప్ప మరణ వార్త తెలియగానే ఆస్పత్రికి చేరుకున్న తల్లిదండ్రులు, భార్య, పిల్లలు మతదేహాన్ని చూసి కన్నీరుమున్నీరుగా విలపించడం చూపరుల హృదయాలను తీవ్రంగా కలచివేసింది. -
ఉపాధి పథకంతో వలసలు నివారించాలి
మదనపల్లె: ఉపాధి హామీ పథకం ద్వారా వలసలను నివారించడంతోపాటు ఉపాధి హామీ చట్టాన్ని పాత పద్ధతుల్లోనే కొనసాగించాలని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆ సంఘం జిల్లా మొదటి మహాసభలు మదనపల్లెలో శుక్రవారం ప్రారంభమయ్యాయి. మహాసభకు మండం సుధీర్ కుమార్ అధ్యక్షత వహించగా వి.వెంకటేశ్వర్లు, రాష్ట్ర ఉపాధ్యక్షులు పి.శ్రీనివాసులు హాజరై మాట్లాడారు. దేశంలో కోటి ఇరవై లక్షల కుటుంబాలు వ్యవసాయ కార్మికులుగా జీవనం కొనసాగిస్తున్నారని, వీరంతా భూమిలేని నిరుపేదలేనని అన్నారు. 20 ఏళ్లుగా వ్యవసాయ కూలీలకు ఆసరాగా, భరోసాగా ఉన్న గ్రామీణ ఉపాధి హామీ పథకం చట్టాన్ని పాత పద్ధతుల్లోని కొనసాగించాలని డిమాండ్ చేశారు. వి బీ జి రాంజీ చట్టాన్ని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఉపాధి హామీ గల్లంతయ్యే ప్రమాదం పొంచి ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా ల్యాండ్ సీలింగ్ చట్టం అమలవుతున్నప్పటికీ దేశంలో భూస్వాముల సంఖ్య గణనీయంగా పెరుగుతోందని, పాలకవర్గాలే భూస్వాములుగా ఉన్నారన్నారు. వెంటనే ల్యాండ్ సీలింగ్ చట్టాన్ని పటిష్టంగా అమలుపరిచి మిగులు భూములను పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. అందుకోసం వ్యవసాయ కార్మిక సంఘం శక్తివంచన లేకుండా కృషి చేస్తోందని అన్నారు. మహాసభలకు సిఐటియు జిల్లా అధ్యక్షులు హరి శర్మ సంఘీభావం ప్రకటించి, మాట్లాడుతూ వ్యవసాయ కార్మికులకు తమ మద్దతు సహాయ సహకారాలు నిరంతరం ఉంటాయని ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం అన్నమయ్య జిల్లా మొదటి మహాసభలకు జిల్లా నలుమూలల నుంచి వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
అరటి.. సంరక్షణ మేటి
జిల్లాలో వరి తరువాత హార్టికల్చర్లో అరటి ఎక్కువగా పండిస్తారు. వేసవిలో ఉష్ణోగ్రతలు 40 నుంచి 44 డిగ్రీల వరకు ఉంటుండటంతో రైతులు అరటి పంటను నాటేందుకు జంకుతున్నారు. మెలకువలు తెలిసిన కొందరు పొలంలో ఎండ వేడిమి బారిన పడకుండా న్యూస్ పేపర్లను మొక్కలపై ఉంచి డ్రిప్ ద్వారా నీటిని అందిస్తున్నారు. ఈ పద్ధతిలో మొక్క ఎండకుండా పెరిగి పంట సాగుకు వస్తుంది. చెన్నూరు –ఖాజీపేట మధ్యలో ఇలా సంరక్షణతో పంట పండిస్తున్న దృశ్యాలు అబ్బుర పరుస్తున్నాయి. – ఫొటో గ్రాఫర్, సాక్షి, కడప -
మహిళల ఆర్థికాభివృద్ధికి కృషి చేయాలి
పెద్దమండ్యం : మహిళల ఆర్థికాభివృద్ధికి సమాఖ్య సభ్యులు, సంఘమిత్రలు, ఈ నారీలు కృషి చేయాలని జిల్లా డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు అన్నారు. స్థానిక వెలుగు మండల సమాఖ్య కార్యాలయంలో శుక్రవారం సంఘమిత్రలు, ఈ నారీలకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వార్షిక ఆర్థిక రుణ ప్రణాళిక సమగ్రంగా తయారు చేయాలని సూచించారు. సభ్యులకు అవసరమయ్యే సమయంలోనే రుణ సదుపాయం అందించాలన్నారు. సభ్యుల కోరిక మేరకు సూక్ష్మ ఆర్థిక ప్రణాళిక రూపొందించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం ధర్మరాజు, ఏపీఎం నరసింహులు, మండల సమాఖ్య అధ్యక్షులు, కార్యదర్శులు, సీసీలు, సంఘమిత్రలు పాల్గొన్నారు. కురబల అభివృద్ధికి నిరంతర కృషి మదనపల్లె : కురబల అభ్యున్నతి, సంక్షేమానికి నిరంతరం కృషి చేస్తామని కురబల సంఘ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ బెల్లెరెడ్డి ప్రసాద్, ఉపాధ్యక్షులు లక్ష్మన్న పేర్కొన్నారు. శుక్రవారం అనిబిసెంట్ ప్రెస్ క్లబ్లో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ రాష్ట్రంలో కురబలు అన్ని రంగాల్లో ప్రగతి సాధిస్తున్నారని, ఇది శుభపరిణామమని అన్నారు. కురబల శ్రేయస్సు కోసం నూతనంగా ఎన్నికై న రాష్ట్ర కమిటీ సమర్థవంతంగా పని చేస్తుందన్నారు. మదనపల్లె నియోజకవర్గంలోని కురబలకు అన్ని విధాలుగా అండగా ఉంటామని హామీ ఇచ్చారు. రాజకీయాల్లో ఎదగాలని ఆశించే వారికి అవసరమైన సహకారం, మార్గదర్శకత్వం అందిస్తామని తెలిపారు. విద్యలో ప్రతిభ కనబరుస్తున్న కురబ విద్యార్థులను ప్రోత్సహిస్తూ బహుమతులు అందజేస్తామని అన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శులు కాంతారావు, రఘునాథ్, డివిజన్ అధ్యక్షులు కప్పల శ్రీరాములు, జనరల్ సెక్రటరీ సదాశివ, సలహాదారు రెడ్డప్ప, అడ్వకేట్ మనోహర్ పాల్గొన్నారు. -
క్రీడా శిక్షణ.. భవితకు నిచ్చెన
● అకాడమీలో ప్రవేశాలకు ఎంపికలు ● ఈ నెల 26 నుంచి ప్రారంభం ● ఉత్తర్వులు జారీ చేసిన శాప్ కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్రంలోని వివిధ జిల్లాల్లో క్రీడా అకాడమీల పునః ప్రారంభానికి రాష్ట్ర క్రీడ ప్రాధికార సంస్థ(శాప్) గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. ఇందులో భాగంగా తిరుపతి, విశాఖపట్నం, కాకినాడ జిల్లాలలో స్పోర్ట్స్ అకాడమీలు తిరిగి ప్రారంభించనుంది. 2026 –27 సంవత్సరంలో ప్రవేశాలకు సంబంధించి ఈనెల 26 నుంచి మే 6 వరకు రాష్ట్ర స్థాయిలో ఎంపికలను చేపట్టనుంది. ఈ మూడు అకాడమీల్లో మొత్తం 12 క్రీడాంశాలలో శిక్షణ ఇవ్వనున్నారు. వాటిలో అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్, సైక్లింగ్, వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్, హాకీ, ఖోఖో, జూడో, బ్యాడ్మింటన్, బాక్సింగ్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ విభాగాల్లో ఎంపికై న బాల బాలికలకు శిక్షణ అందనుంది. ఆరు విభాగాల్లో.. తిరుపతి క్రీడా అకాడమీలో అత్యధికంగా ఆరు విభాగాల్లో (జూడో, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్, వెయిట్ లిఫ్టింగ్, లాన్ టెన్నిస్) రెసిడెన్షియల్ కోచింగ్ బాలురు బాలికలకు వేరువేరుగా ఇవ్వనున్నారు. జూడో, బ్యాడ్మింటన్, రైఫిల్ షూటింగ్, లాన్ టెన్నిస్ ఒక్కో విభాగం నుంచి పది మంది బాలురు, పది మంది బాలికలను తీసుకోనున్నారు. బాక్సింగ్ వెయిట్ లిఫ్టింగ్లో ఒక్కో విభాగం నుంచి 15 మంది బాలురకు శిక్షణ అందించనున్నారు. మూడు క్రీడాంశాల్లో... విశాఖపట్నంలోని స్పోర్ట్స్ అకాడమీలో మూడు క్రీడాంశాల(అథ్లెటిక్స్, వాటర్ స్పోర్ట్స్ ,సైక్లింగ్)లో బాలురకు రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఒక్కో క్రీడ నుంచి 15 మంది బాలురను ఎంపిక చేయనున్నారు. మే 4న అథ్లెటిక్స్, మే 5న సైక్లింగ్, మే 6న వాటర్ స్పోర్ట్స్ విభాగాలకు సంబంధించి విశాఖపట్నం కొమ్మాదిలో ఎంపికలు చేపట్టనున్నారు. బాలికలకు మాత్రమే... కాకినాడలోని క్రీడా అకాడమీలో బాలికలకు మాత్రమే నాలుగు క్రీడాంశాల (వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్, హాకీ, ఖోఖో)లో రెసిడెన్షియల్ శిక్షణ ఇవ్వనున్నారు. ఈనెల 29న వెయిట్ లిఫ్టింగ్, జిమ్నాస్టిక్స్ 30న హాకీ, ఖోఖో విభాగాల్లో బాలికలకు కాకినాడ డీఎస్ఏ లో ఎంపికలు చేపట్టనున్నారు. అర్హతలివే... ● దరఖాస్తు చేసుకునేందుకు 15 నుంచి 19 ఏళ్ల లోపు వయసున్న క్రీడాకారులు మాత్రమే అర్హులు. ● క్రీడాకారులు 1–1–2008 నుంచి 1–1–2011 మధ్య జన్మించిన వారై ఉండాలి. ● జనన ధ్రువీకరణ పత్రం, ఆధార్ కార్డు, చదువుతున్న పాఠశాల/ కళాశాల నుంచి సర్టిఫికెట్ క్రీడా ప్రతిభ సర్టిఫికెట్ (రాష్ట్ర స్థాయి/ జాతీయ స్థాయి ఉంటే) మెడికల్ ఫిట్నెస్ సర్టిఫికెట్, 10 పాస్పోర్ట్ సైజ్ ఫొటోలు తీసుకెళ్లాలి. ● ఎంపికల సమయంలో క్రీడా దుస్తులు, కిట్టు తప్పనిసరి. ● ఎంపికై న వారికి షాప్ క్రీడా అకాడమీలో వసతి భోజనం, శిక్షణ సౌకర్యాలు అందించనున్నారు. ● అర్హత గల క్రీడాకారులు స్పోర్ట్స్ ఏపీ.జిఓవి.ఇన్ వెబ్సైట్లో దరఖాస్తు చేసుకోవాలి. -
వైభవం.. బ్రహ్మోత్సవం
వల్లూరు: పుష్పగిరి బ్రహ్మోత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి శ్రీ కామాక్షీ వైద్యనాథేశ్వర స్వామి సింహ వాహనంపై, శ్రీ చెన్న కేశవ స్వామి హంస వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం శ్రీ వైద్యనాధ్యస్వామికి అర్చకులు రుద్రాభిషేకం నిర్వహించారు. శ్రీ కామాక్షీ అమ్మవారికి, శ్రీ చక్రానికి కుంకుమార్చన చేశారు. రాత్రి మంగళ వాయిద్యాలమధ్య స్వామి వారి గ్రామోత్సవాన్ని పుష్పగిరి మాడ వీధుల్లో నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వామి ఆలయంలో ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో స్వామివారికి అభిషేకాలను, తోమాల సేవను నిర్వ హించారు.సాయంత్రం వివిధ హోమాలు జరిపారు. రాత్రి హంస వాహనం అధిష్టించిన చెన్నకేశవ స్వామి వారిని కొండపై నుంచి పెన్నా నది మీదుగా గ్రామంలోకి తీసుకొచ్చి పుష్పగిరి గ్రామ మాడ వీధుల్లో మంగళ వాయిద్యాలతో గ్రామోత్సవాన్ని నిర్వహించారు.● సింహ వాహనంపై వైద్యనాఽథేశ్వరుడు ● హంస వాహంపై చెన్న కేశవుడు మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో ఐటీడీఏ ఏర్పాటు, గిరిజనుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని ఎస్టీ కమిషన్ సభ్యులు పి.వెంకటప్ప అన్నారు. శుక్రవారం స్థానిక సీఎస్ఆర్ ఫంక్షన్ హాల్, కలెక్టరేట్లో జరిగిన సమావేశాల్లో ఆయన మాట్లాడుతూ మదనపల్లెలో ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్ మంజూరు చేయడానికి చర్యలు తీసుకుంటామన్నారు. గిరిజనుల అటవీ హక్కుల భూములకు సంబంధించిన ఆర్ఓఆర్ పట్టాల సమస్యలను ఫారెస్ట్ అధికారులతో చర్చించి పరిష్కరిస్తామని, గిరిజన కాలనీల్లో తాగునీరు, విద్య, వైద్యం, పింఛన్లు, విద్యుత్, గృహ వసతి సదుపాయాల కల్పనపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. గిరిజనుల కోసం ప్రతి కాలనీలో ప్రత్యేక ఆధార్ నమోదు శిబిరాలు ఏర్పాటు చేసి సమస్య పరిష్కరించాలని ఆదేశించారు. ఎస్టీ అట్రాసిటీ కేసులపై ఎఫ్ఐఆర్ నమోదు, పరిహారం చెల్లింపుల ప్రక్రియలను పూర్తి చేయాలని పోలీసు, రెవెన్యూ శాఖలకు సూచించారు. 41 అట్రాసిటీ కేసుల్లో 39 కేసులకు రూ.24.66 లక్షల పరిహారం చెల్లించినట్టు అధికారులు తెలిపారు. ఈ సందర్భంగా గిరిజన సంఘాల నాయకులు మాట్లాడుతూ రాయలసీమలో ఐటీడీఏ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉందని, రాజంపేట, రాయచోటి, మదనపల్లె ప్రాంతాల్లో ఎరుకుల, యానాది, సుగాలి, లంబాడి గిరిజనులు అధికంగా నివసిస్తున్నారని తెలిపారు. వారి జీవన పరిస్థితుల మెరుగుదలకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలని కోరారు కార్యక్రమాల్లో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, జిల్లా గిరిజన సంక్షేమ శాఖ అధికారి కె. తేజస్విని, గిరిజన సంఘాల నాయకులు కోనేటి దివాకర్, కావడి రవీంద్ర, శ్రీనివాస వర్మ, సాకే ముసలయ్య, కిరణ్ బాబు, బొజ్జప్ప, సులోచన, మున్నా నాయక్, విశ్వనాథ నాయక్, శ్రీనివాస శర్మ, జీవీ రమణ, కోనయ్య, లక్ష్మణ నాయక్, గంగరాజు నాయక్, నాగు నాయక్, వెంకటరమణ, వసంతమ్మ పాల్గొన్నారు. మండలాల్లో ఓటర్ల వివరాలు మండలం పురుషులు మహిళలు ఇతరులు చిన్నమండ్యం 13,213 13,789 5 గాలివీడు 20,072 20,580 1 లక్కిరెడ్డిపల్లె 13,320 13,589 – రామాపురం 13,105 13,767 1 రాయచోటి 13,519 13,650 2 సంబేపల్లి 14,455 14,959 – గుర్రంకొండ 17,415 17,668 2 కలకడ 13,896 14,137 – కలికిరి 19,833 21,054 7 కేవిపల్లె 15,993 15,956 1 పీలేరు 30,588 32,559 10 సదుం 13,777 14,235 1 సోమల 17,072 17,627 – వాల్మీకిపురం 17,775 19,015 1 బి.కొత్తకోట 13,537 14,045 – చౌడేపల్లె 17,537 18,068 – కురబలకోట 17,292 18,095 1 మదనపల్లె 41,551 43,633 39 ములకలచెరువు 18,578 19.477 – నిమ్మనపల్లె 12,836 13,362 2 పెద్దమండ్యం 13,879 14,013 5 పెద్దతిప్పసముద్రం 20,591 20,991 1 పుంగనూరు 21,233 22,002 – రామసముద్రం 19,692 20,022 – తంబళ్లపల్లె 16,011 16,537 2 చేర్పులు మార్పులు: ప్రస్తుతం ప్రచురించిన ఓటరు జాబితాలో పొరపాట్లకు, చేర్పులు మార్పులకు అవకాశం ఇచ్చారు. జాబితా పరిశీలించి తప్పులుంటే వాటిని సరిచేసుకునేందుకు, అలాగే ఓటు లేకపోతే నమోదు చేసుకునేందుకు నియోజకవర్గ ఎన్నికల అధికారికి వినతి సమర్పించాల్సి ఉంటుంది. పరిశీలించాక వాటిపై చర్యలు తీసుకుంటారు. -
అక్రమ మద్యంపై నిఘా పెంచండి
మదనపల్లె: జిల్లాలో అక్రమ మద్యంపై నిఘా పెంచాలని, మత్తు పదార్థాల విక్రయాలు, దిగుమతిపై కఠినచర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లో ఎకై ్సజ్, ఆదాయపన్నుశాఖలతో సమీక్షాసమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ చీప్ లిక్కర్, సారాను పూర్తిగా అరికట్టాలన్నారు. మద్యం దుకాణాలు, బార్లలో సీసీటీవీల పనితీరును పర్యవేక్షించి అవకతవకలు జరగకుండా చూడాలని చెప్పారు. కర్ణాటక, తమిళనాడు నుంచి అక్రమ మద్యం రవాణాను అరికట్టేందుకు గట్టి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. సారా తయారీదార్లకు కౌన్సెలింగ్ ఇచ్చి మాన్పించేలా కృషి చేయాలన్నారు. నీటి పనుల్లో నాణ్యత ఉండాలి జిల్లాలో చేపట్టిన జలధార–జలహారతి 100 రోజుల కార్యాచరణను పక్కా ప్రణాళికతో అమలు చేసి పనులను నాణ్యతతో పూర్తి చేయాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో జిల్లా అధికారులతో నిర్వహించిన సమావేశంలో సాధించిన ప్రగతిని సమీక్షించి చేపట్టాల్సిన చర్యలపై దిశానిర్దేశం చేశారు. జిల్లాలోని మండలాల వారీగా జలధార–జలహారతి కార్యక్రమాల అమలు ప్రగతిని పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ప్రత్యేక అధికారులు వివరించగా, పనులలో లోపాలను గుర్తించి సరిదిద్దాలని కలెక్టర్ సూచించారు. సమావేశంలో జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ్ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, ఎస్ఈ విఠల్ ప్రసాద్, లక్ష్మీపతి, ఆర్డీవో శ్రీనివాస్, వివిధశాఖల జిల్లా అధికారులు పాల్గొన్నారు. కలెక్టర్ నిశాంత్ కుమార్ -
జగనన్న కాలనీలో నీటి కోసం ఘర్షణ
– 11 మందిపై కేసు నమోదు పుంగనూరు : జగనన్న కాలనీ, టిడ్కో గృహాల వద్ద మంచినీటి సమస్య, పారిశుద్ధ్య కార్యక్రమాలు అధ్వాన్నంగా ఉందని, అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోని కారణంగా నీటి కోసం రెండు కుటుంబాల వారు ఘర్షణ పడ్డారు. శుక్రవారం జరిగిన ఈ సంఘటనపై 11 మందిపై కేసు నమోదు చేసినట్లు హెడ్కానిస్టేబుల్ వెంకటేష్ తెలిపారు. వివరాలిలా ఉన్నాయి. పట్టణంలోని గూడూరుపల్లె సమీపంలో జగనన్న కాలనీలో సుమారు 700 కుటుంబాలు నివాసం ఉన్నాయి. దీని పక్కనే ఉన్న టిడ్కో గృహాల్లో 1136 కుటుంబాలు నివాసం ఉన్నారు. వీరికి సరిపడ మంచినీరు సరఫరా చేయడంలో అధికారులు గత ఆరు నెలలుగా నిర్లక్ష్యం చేయడంతో ప్రజలు ధర్నాలు, రాస్తారోకోలు కూడా చేశారు. కానీ మార్పు రాలేదు. ఇలా ఉండగా మంచినీటి కోసం ముబారక్, నజియ కుటుంబం వారు మురళీకృష్ణ, లావణ్యతో ఘర్షణ పడ్డారు. ఈ ఘర్షణ గాలివాన లాగా తీవ్రమైంది. ముబారక్, నజియ కలసి తమకు అనుకూలమైన బయటి వ్యక్తులను పిలిపించి మురళీకృష్ణ, లావణ్య కుటుంబంపై దాడి చేసి గాయపరిచారు. బాధితుల ఫిర్యాదు మేరకు ముబారక్, నజియతోపాటు మరో 9 మందిపైన కేసులు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెడ్కానిస్టేబుల్ తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించి, జగనన్న కాలనీ, టిడ్కో గృహాలకు సరిపడ మంచినీరు అందిస్తారా... లేదా అన్నది వేచి చూడాల్సి ఉంది. రోడ్డుపై మందుబాబు హల్చల్ మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణంలో ఓ మందు బాబు శుక్రవారం రోడ్డుపై హల్చల్ చేశాడు. స్థానిక రవి సినిమా థియోటర్కు వెళ్లే మార్గంలో ఓ వ్యక్తి పూటుగా మద్యం తాగి రోడ్డుపై వాహనాలకు అడ్డంగా పడుకున్నాడు. దీంతో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడింది. అంతే కాదు.. పొరపాటున ఎవరైనా మందు బాబును చూడకుండా వాహనాలను ఏమరపాటుగా నడిపితే, ఆ వాహనం కింద పడి అతడు తన ప్రాణాలను పోగొట్టుకోవాల్సిన పరిస్థితి ఏర్పడుతుంది. రోడ్డుకు అడ్డంగా పడుకున్న వ్యక్తిని తప్పించడానికి పలువురు ప్రయత్నించినా, మందుబాబు వినలేదు. దీంతో అటుగా వచ్చిపోయే వాహనదారులు కొంత సేపు అపసోపాలు పడ్డారు. పొలాల్లోకి దూసుకెళ్లిన ఆర్టీసీ బస్సు – త్రుటిలో తప్పిన ప్రమాదం మదనపల్లె టౌన్ : ఆర్టీసీ బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకెళ్లిన సంఘటన శుక్రవారం మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాలు.. మదనపల్లె వన్ డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు రోజూ మాదిరిగానే రామసముద్రం రోడ్డులో రోజుకు ఆరు సార్లు మదనపల్లె – రామసముద్రానికి తిరుగుతుంది. ఈ క్రమంలో నైట్ హాల్ట్ చెంబకూరులో ఉండి శుక్రవారం వేకువజామున 5 గంటలకు మదనపల్లెకు బయలుదేరింది. మార్గంమధ్యలోని మదనపల్లె మండలం పెంచుపాడు సమీపంలోని రెక్కమాను వద్దకు రాగానే బస్సు అదుపు తప్పి పొలాల్లోకి దూసుకు వెళ్లింది. ఆ సమయంలో బస్సులో ప్రయాణిస్తున్న 40 మందికి ఎలాంటి గాయాలు కాలేదు. దీంతో త్రుటిలో ప్రాణా పాయం తప్పిందని స్థానికులు, అధికారులు ఊపిరి పీల్చుకున్నారు. బస్సు పొలాల్లోకి దూసుకెళ్లిన వార్త తెలియగానే ఆర్టీసీ అధికారులు ఘటనా స్థలం వద్దకు చేరుకుని జేసీబీ సాయంతో బస్ను వెలికితీసి డిపోకు తరలించారు. -
ఆమెదే ఆధిపత్యం
మదనపల్లె: అన్నమయ్య జిల్లాలో స్థానిక సంస్థలైన గ్రామపంచాయతీల్లో నూతన ఓటర్ల జాబితాను జిల్లా యంత్రాంగం ప్రచురించింది. శుక్రవారం జిల్లాలోని గ్రామపంచాయతీ కేంద్రాలు, సచివాలయంలో ఓటర్ర్ జాబితాలను పెట్టారు. గ్రామ పంచాయతీలు, వాటి పరిధిలోని వార్డుల్లో ఓటర్ల సంఖ్యను సూచించే ప్రక్రియకు సంబంధించి అన్ని చర్యలు పూర్తి చేశారు. జాబితా ప్రచరణకు ముందు ఓటర్ల మ్యాపింగ్ పూర్తి చేశారు. పూర్తిస్థాయిలో చర్యలు ముగియడంతో జాబితా బహిరంగపరిచారు. ఈ ఓటర్ జాబితా మేరకు జిల్లాలో మహిళా ఓటర్లే అత్యధికంగా ఉన్నారు. మూడు డివిజన్ల పరిధిలోనూ మహిళా ఓటర్లదే పై చేయిగా ఉంది. ఇతరులైన ట్రాన్స్జెండర్లలో మదనపల్లెలో అధికంగా ఉన్నారు. ఓటరు మహారాణి జిల్లాలో 411 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. అందులో 4230 వార్డులు ఉన్నాయి. వీటి పరిధిలోని ఓటర్ల సంఖ్య 9,09,602 మంది అయితే, వీరిలో అత్యధిక ఓట్లు మహిళలవే ఉన్నాయి. పురుష ఓటర్లు 4,46,691 మంది, మహిళా ఓటర్లు 4,62,830 మంది ఉన్నారు. పురుషుల కంటే మహిళా ఓటర్లు 16,139 మంది అధికం. ఈ సంఖ్య ఒక ప్రాంతంలోనే లేదు. అన్నిచోట్లా కనిపిస్తోంది. కేవీ పల్లెలోనే పురుషుల ఆధిక్యం జిల్లాలో 25 మండలాలు ఉండగా కొత్త ఓటర్ల జాబితా మేరకు పురుష ఓటర్ల ఆధిపత్యం కేవలం ఒక్క మండలానికి మాత్రమే పరిమిత మైంది. పీలేరు నియోజకవర్గంలోని కేవీపల్లె మండలం మినహాయిస్తే మిగిలిన 24 మండలాల్లో మహిళా ఓటర్ల అధికంగా ఉన్నారు. దీన్నిబట్టి చూస్తే జిల్లా వ్యాప్తంగా అన్ని మండలాల్లోనూ మహిళలే కీలకంగా మారారు. ట్రాన్స్జెండర్లలో మదనపల్లె జిల్లాలో ట్రాన్న్స్జెండర్ల ఓటర్ల సంఖ్య 81గా గుర్తించారు. అందులో మదనపల్లెలో అత్యధికంగా 39 మంది ఉన్నారు. మిగతా మండలాల్లో ఒకటి నుంచి పది మంది దాకా ఉన్నారు. లక్కిరెడ్డిపల్లి, సంబేపల్లె, కలకడ, సోమల, బి.కొత్తకోట, చౌడేపల్లి, ములకలచెరువు, పుంగనూరు, రామసముద్రం మండలాల్లో ఒక్కరు కూడా లేరు. ● జిల్లా గ్రామపంచాయతీలో మహిళా ఓటర్లదే పైచేయి కావడంతో భవిష్యత్తు రాజకీయాల్లో కీలకపాత్ర పోషించనున్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో అతివలకు ప్రాధాన్యత దక్కే పరిస్థితులు స్పష్టంగా కనిపిస్తున్నాయి. వార్డు మెంబర్, సర్పంచు, ఎంపీటీసీ,జెడ్పీటీసీ ఎన్నికల్లో మహిళలు రాజకీయ పార్టీల నుంచి అధిక వాటాను దక్కించుకునే అవకాశం కనిపిస్తోంది. మహిళలకు అవకాశం ఇవ్వడంలో వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరఫున గత సీఎం వైఎస్ జగన్ మోహన్ రెడ్డి మహిళా పక్షపాతిగా ముద్రపడ్డారు. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా అతివలకు 50 శాతం దాకా స్థానిక సంస్థలు, నామినేటెడ్ పదవుల్లో అవకాశం ఇచ్చారు. అభివృద్ధి పనుల్లోనూ ప్రాధాన్యత ఇచ్చి గౌరవించారు. గత ఐదేళ్లలో స్థానిక పాలనలో మహిళలకు గౌరవం దక్కింది. డివిజన్ల వారీగా ఓటర్లు డివిజన్ పురుషులు మహిళలు ఇతరులు మొత్తం స్థానికంలో మహిళదే పైచేయి జిల్లాలో గ్రామ పంచాయతీలఓటర్ల జాబితా ప్రచురణ మొత్తం ఓటర్లు 9,09,692 మంది మహిళలు 4,62,830 మంది ఒక్క మండలంలోనేపురుషుల ఆధిక్యం మదనపల్లె 2,12,658 2,20,245 50 4,32,953 పీలేరు 1,46,349 1,52,251 22 2,98,622 రాయచోటి 87,684 90,334 9 1,78,027 -
చట్టానికి విరుద్ధంగా వ్యవహరిస్తే చర్యలు
మదనపల్లె టౌన్ : చట్టం ముందు అందరూ సమానులే.. చట్టానికి విరుద్ధంగా వ్యవహరించే అధికారులపై చర్యలు తప్పవని రాష్ట్ర ఎస్సీ కమిషన్ సభ్యులు డాక్టర్ శ్రీపతిబాబు హెచ్చరించారు. ఇటీవల మండలంలోని వేంపల్లెలో జరిగిన జాతరలో దళితులు డప్పు వాయించరాదని కళాకారులపై తాలూకా ఎస్ఐ రామకృష్ణారెడ్డి దాడి చేయడం జరిగిందని, బాధితులు ఎస్సీ కమిషన్కు ఫిర్యాదు చేశారు. స్పందించిన ఎస్సీ కమిషన్ సుమోటోగా తీసుకుని రాష్ట్ర ఎస్సీ కమిషన్ త్రీమెన్ కమిటీ సభ్యులు డాక్టర్ శ్రీపతిబాబు, మేకల బిక్షం, పి.గౌతం రాజ్ శుక్రవారం మదనపల్లె మండలం వేంపల్లె గ్రామంలో పర్యటించారు. బాధితులు, గ్రామస్తులను విచారణ చేశారు. బాధితుల నుంచి రాత మూ లకంగా వాగ్మూలం తీసుకున్నారు. అనంతరం తాలూ కా ఎస్ఐ. రామకృష్ణారెడ్డి, సీఐ కళా వెంకరమణను విచారించారు. అనంతరం త్రీమెన్ కమిటీ సభ్యులు మాట్లాడుతూ.. ఈ నెల 12 రాత్రి చెన్నకేశవస్వామి జాతరలో డప్పు వాయిస్తుండగా రెండు వర్గాల వారు ఆధిపత్యం ప్రదర్శించారన్నారు. ఆ సమయంలో ఎస్ఐ డప్పు కళాకారులను అడ్డుకుని వారికి సపోర్టు చేయడమే కాకుండా దళితులపై దాడికి తెగబడినట్లు విచారణలో తేలిందన్నారు. ఎవరైనా చట్టానికి లోబడి పని చేయాలే గానీ చట్టాన్ని చేతల్లోకి తీసుకోరాదన్నా రు. ఎస్సీ, ఎస్టీలకు తోడ్పాటు అందించి, అసమానతలు, కుల వివక్షతకు తావు లేకుండా పని చేయాలని సూచించారు. ఎస్సీ, ఎస్టీ ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. విచారణ అనంతరం సిద్ధం చేసిన నివేదికను రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ జవహర్కు అందజేస్తామన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ అధికారి దామోదర్రెడ్డి, జిల్లా విజిలెన్స్ అండ్ మానిటరింగ్ కమిటీ సభ్యులు పాలకుంట శ్రీనివాసులు, ఆర్ఐ బాలసుబ్రమణ్యం, ఏఎస్డబ్ల్యూఓ క్రష్ణయ్యలు పాల్గొన్నారు. -
మావిగన్.. మంచి విజన్
మావిగన్పై ప్రజల్లో విస్తృత చర్చ జరుగుతోంది. సామాజిక మాధ్యమాల్లో టీడీపీ ఎంత విషప్రచారం చేసినా.. వాస్తవాలను వైఎస్సార్సీపీ ప్రజలకు వివరిస్తుండటంతో ప్రజలు చంద్రబాబు కుటిల ప్రయత్నాలను అర్థం చేసుకుంటున్నారు. వైఎస్సార్సీపీ కడప జిల్లా అధికార ప్రతినిధి పొట్టిపాటి జయచంద్రారెడ్డి ఆధ్వర్యంలో మావిగన్ ప్రయోజనాలను తెలుపుతూ కడపలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. వాటిని ప్రజలు ఆసక్తిగా గమనిస్తున్నారు. ‘మావిగన్.. రాష్ట్రానికి మంచి విజన్’ అంటూ వారు పేర్కొంటుండటం విశేషం. – కడప కార్పొరేషన్ -
● ఎన్నడూ లేని సంస్కృతి
పోలీసుశాఖ క్రమశిక్షణకు నిదర్శనం. పోలీసు, రైటర్, హెడ్కానిస్టేబుల్, ఏఎస్ఐ, ఎస్ఐ, సీఐ, డీఎస్పీ, ఏఏస్పీ, ఎస్పీ ఇలా అంచెలంచెలుగా ఒకరిపై ఒకరు గౌరవభావంతో వారి ఆదేశాలను అమలు పరుస్తూ శాంతిభద్రతలు పరిరక్షణలో నిమగ్నమయ్యేవారు. విధులపై నిర్లక్ష్యం ప్రదర్శించడం లేదా వైఫల్యం చెందడం ఈక్రమంలో ఎస్పీ సీరియస్ అయితే తప్పా, సీఐలకు ట్రాన్సుఫర్లు వచ్చేవి కావు. ఇప్పుడు ఇలాంటి పరిస్థితి లేదు. నేరుగా రేంజ్ అధికారులు పోస్టింగ్స్ ఇస్తుండడం, ఆ పోస్టింగ్స్ కూడా నిలకడగా లేకపోవడంతో పోలీసుశాఖలో క్రమశిక్షణ లోపించింది. ఎస్పీతో నిమిత్తం లేకుండా నేరుగా డీఐజీ స్థాయి అధికారితో సత్సంబంధాలుంటే చాలు అనే దిశగా సీఐలు అడుగులు వేస్తున్నారు. ఈక్రమంలోనే శాంతిభద్రతల డొల్లతనం తెరపైకి వస్తోందని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా ప్రజాస్వామ్యబద్ధంగా ప్రజల ఆస్తి, మాన, ప్రాణాల రక్షణ కోసం పనిచేసేందుకు అనువుగా బదిలీలు చేస్తూ పోలీసు అధికారుల్లో ఆత్మస్థైర్యం దెబ్బతినకుండా చూడాలని పలువురు కోరుతున్నారు. -
దాడి కేసులో నిందితుల అరెస్ట్కు హైకోర్టు ఆదేశం
సాక్షి టాస్క్ఫోర్స్: అన్నమయ్య జిల్లా పీలేరులో రెండు నెలల క్రితం టీడీపీ నాయకులు పట్టపగలు ముగ్గురిపై విచక్షణారహితంగా దాడి చేసి గాయపరచిన కేసులో నిందితులను ఈ నెల 29వ తేదీలోపు అరెస్ట్ చేయాలని హైకోర్టు పోలీసులను ఆదేశించింది. వివరాలిలా ఉన్నాయి. 2026 ఫిబ్రవరి 14న పీలేరు పట్టణానికి చెందిన ఎస్. బోదేషావలి (50) కుమారుడు ఎస్. జాకీర్ హుస్సేన్ (32) శనివారం తమ కుటుంబానికి స్థానిక తిరుపతి రోడ్డు మార్గంలోని సర్వే నెంబరు 1/4లో ఉన్న భూమి వద్దకు వెళ్లాడు. వారికి చెందిన 1.20 ఎకరాల భూమిలో టీడీపీ నాయకుడు మౌలా, అతని అనుచరులు ప్లాట్లు వేసి విక్రయిస్తాన్నారని ప్రశ్నించాడు. భూ వివాదంలో ఇరువర్గాల వారు ఘర్షణపడ్డారు. ఈ సందర్భంగా మాలా అనచరులు జాకీర్ హుస్సేన్పై దాడి చేశారు. దీంతో జాకీర్హుస్సేన్ టోల్ఫ్రీ నంబర్ 112కు కాల్ చేశాడు. దీంతో స్థానిక పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని ఇరువర్గాలను వేరుచేశారు. దాడిలో గాయపడిన జాకీర్ హుస్సేన్ స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి ఫిర్యాదు తీసుకోవాల్సిందిగా కోరాడు. అయితే పోలీస్ అధికారులు ముందు ఆస్పత్రికి వెళ్లి వైద్యం చేపించుకోవాలని సూచించారు. దీంతో బాధితుడు తన తండ్రి బోదేషావలి, భావమరిది ఎస్. సయ్యద్ బాషా (29)తో కలసి ఆస్పత్రికి బయలుదేరాడు. అయితే స్థానిక సాయిబాబా గుడి సమీపంలో అడ్డగించి బోదేషావలి, సయ్యద్బాషాపై నడిరోడ్డుపై విచక్షణారహితంగా దాడి చేశారు. టీడీపీ నాయకుల దాడిలో గాయపడిన ముగ్గురు చికిత్సమిత్తం స్థానికి ప్రభుత్వాస్పత్రికి చేరారు. బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. హైకోర్టును ఆశ్రయించిన బాధితులు... తమపై హత్యాయత్నం జరిగితే పోలీసులు నామమాత్రపు కేసులతో సరిపెట్టారని తమకు న్యాయం చేయా లని బాధితులు హైకోర్టును ఆశ్రయించారు. బాధితుల ఫిర్యాదు పరిశీలించిన కోర్టు నిందితులపై తక్షణ చర్యలు తీసుకుని ఈ నెల 29 లోపు కోర్టుకు సమాధానం చెప్పాలని పీలేరు పోలీసులను ఆదేశించింది. -
రాయలసీమను తడిగుడ్డతో గొంతుకోస్తున్నారు
కడప కార్పొరేషన్: చంద్రబాబు సర్కార్ రాయలసీమను తడిగుడ్డతో గొంతు కోసేందుకు సిద్ధపడిందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి మండిపడ్డారు. గురువారం కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షులు పి. రవీంద్రనాథ్రెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డిలతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కొంత మంది రాయలసీమ ద్రోహులు అవగాహన లేకుండా తమ పాపాలను కప్పిపుచ్చుకునేందుకు తమపై బురదజల్లుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమకు వైఎస్సార్, వైఎస్ జగన్ ఏమీ చేయలేదని పయ్యావుల కేశవ్, భూమిరెడ్డి రాంగోపాల్రెడ్డిలాంటి వారు మాట్లాడటం దారుణమన్నారు. వారు బుద్ధిఉండే మాట్లాడుతున్నారా లేక ఈ ప్రాంత వాసులను గొంతు కోసేందుకు సిద్ధపడ్డారా అనిపిస్తోందన్నారు. సీమలోని ప్రతి ప్రాజెక్టు వైఎస్సార్ పుణ్యమే రాయలసీమలో ఉన్న ప్రతిఒక్క ప్రాజెక్టు వైఎస్ రాజశేఖర్ రెడ్డి పుణ్యమే అని అన్నారు. పోతిరెడ్డిపాడు, గాలేరు– నగరి, హంద్రీ– నీవా, వెలిగల్లు ప్రాజెక్టులను జలయజ్ఞంలో భాగంగా వైఎస్సార్ నిర్మించారని గుర్తు చేశారు. ఏ ప్రాజెక్టు పేరు చెప్పినా వైఎస్సార్ స్ఫురణకు వస్తారని, భవిష్యత్ తరాలు ఆయన్ను చిరకాలం గుర్తుంచుకుంటాయన్నారు. ఎన్టీఆర్ ఆ ప్రాజెక్టులకు పేరన్నా పెట్టాడు కానీ...పార్టీ లాక్కున్న చంద్రబాబు మాత్రం ఒక్క ప్రాజెక్టు కూడా కట్టలేదన్నారు. వ్యవసాయం దండగ, ప్రాజెక్టులు కడితే భవిష్యత్లో అవి గుదిబండగా మారుతాయని చెప్పిన చంద్రబాబు...ఇప్పుడు తన వందిమాగదులతో ఇష్టానుసారంగా మాట్లాడిస్తున్నారని మండిపడ్డారు. హంద్రీ–నీవా సామర్థ్యాన్ని 40 టీఎంసీల నుంచి 5 టీఎంసీలకు కుదించిన ద్రోహి చంద్రబాబేనన్నారు. వీళ్లకు రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే అర్హతే లేదన్నారు. 1995–2004 వరకు సీఎంగా పనిచేసిన చంద్రబాబు ఏ ప్రాజెక్టులోనూ తట్టెడు మట్టి తీయకుండా రాయలసీమ గొంతుకోశారన్నారు. చంద్రబాబు తన హయాంలో ప్రాజెక్టులు కట్టి ఉంటే నికరజాలాలు వచ్చేవన్నారు. 20 టీఎంసీల సామర్థ్యమున్న గండికోటను 3 టీఎంసీలు చాలు అన్న ఘనుడు చంద్రబాబు అన్నారు. వైయస్సార్ సీఎం అయ్యాక మిగులు జలాలతో ప్రాజెక్టులు కడుతున్నామని చెప్పి, ఆ ప్రాజెక్టులను పూర్తి చేశారన్నారు. వెలిగల్లును ఏడాదిలోనే పూర్తి చేశారన్నారు. గండికోటలో 27 టీఎంసీలు నిల్వ ఉంచిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డిదన్నారు. రాయలసీమ ప్రయోజనాలను కాపాడేందుకు వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ లిఫ్ట్ చేపడితే... తన వ్యాపారాల కోసం చంద్రబాబు తెలంగాణ ముఖ్యమంత్రికి తాకట్టు పెట్టారని దుయ్యబట్టారు. సీమలోని రిజర్వాయర్లు అన్నింటిలో నీళ్ళు ఉన్నాయంటే అది వైఎస్ఆర్, వైఎస్ జగన్ల వల్లేనని తెలిపారు. సీమ ప్రాజెక్టులకు 42వేల కోట్లు ఖర్చు చేస్తామని ఆర్థిక మంత్రి అంటున్నారని, ఏ ప్రాజెక్టుకు ఎంతెంత ఖర్చు చేస్తారో చెప్పాలని సవాల్ విసిరారు. వైఎస్ జగన్ చేపట్టిన ప్రాజెక్టులను కొనసాగించలేని మీరు 42 వేల కోట్లు ఖర్చు చేస్తారంటే నమ్మాలా అని ప్రశ్నించారు. రాయలసీమకు మీరు గతంలో ఏం చేశారు...ఈ రెండేళ్లలో ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. కర్నూలుకు వచ్చిన హై కోర్టు, లా యూనివర్సిటీ అన్నీ తరలించారని, అనంతపురంలోని ఎయిమ్స్ను, కొప్పర్తిలోని టెక్నాలజీ సెంటర్ను, అమరావతికి తరలించారన్నారు. రాయలసీమకు ఏమీ చేయకుండా అమరావతి పేరుతో తెచ్చే అప్పులను తమపై రుద్దుతున్నారని మండిపడ్డారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు కారిడార్ను అభివృద్ధి చేయమంటే వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారన్నారు. చిత్తశుద్ధి ఉంటే రాయలసీమలో ప్రాజెక్టులను పూర్తి చేసి మాట్లాడాలన్నారు. రాయలసీమ లిఫ్ట్ ను ఏడాదిలోగా పూర్తి చేయకపోతే..ఉద్యమం ఎలా ఉంటుందో రుచిచూస్తారని హెచ్చరించారు. హై కోర్టు, లా యూనివర్సిటీ కూడా రాయలసీమలోనే ఏర్పాటు చేయాలన్నారు. చైన్నెకి తాగునీరు ఇవ్వడానికే రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం చేపట్టారని మాట్లాడటం అవగాహన రాహిత్యమన్నారు. అలాగైతే తెలుగు గంగ కూడా అందుకోసమే చేపట్టారని, వాటి వల్ల ఈ ప్రాంతానికి జరిగే ఉపయోగాలను తెలుసుకోవాలని హితవు పలికారు. వైఎస్సార్సీపీ కడప జిల్లా అధ్యక్షుడు పి. రవీంద్రనాథ్రెడ్డి మాట్లాడుతూ రాయలసీమ ప్రాజెక్టుల గురించి మాట్లాడే ముందు టీడీపీ నేతలు రాజీనామా చేసి రాయలసీమ లిఫ్ట్ ఉద్యమంలోకి రావాలని కోరారు. చంద్రబాబు సీమలోనే కాదు...అన్ని ప్రాంతాల్లో సాగునీటి ప్రాజెక్టులకు అన్యాయం చేశాడన్నారు. సమావేశంలో మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్, మాజీ డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు దాసరి శివప్రసాద్, షఫీ, సీహెచ్ వినోద్ కుమార్, బాలస్వామిరెడ్డి, మియ్యా, ఫయాజ్, నిరంజన్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి -
నియామకం
మదనపల్లె: మదనపల్లె కేంద్రంగా పని చేస్తున్న పీకేఎం ఉడా కార్యాలయ పరిపాలనా అధికారిగా వి.చిట్టిబాబు నియమితులయ్యారు. గురువారం ప్రభుత్వం చేసిన బదిలీల్లో భాగంగా తిరుపతి మున్సిపల్ కార్పొరేషన్ రెవెన్యూ ఆఫీసర్గా పనిచేస్తున్న చిట్టిబాబును ఇక్కడికి బదిలీ చేశారు.మదనపల్లె సిటీ: సీబీఎస్ఈ పదో తరగతి పరీక్ష ఫలితాల్లో మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయ విద్యార్థులందరూ ఉత్తీర్ణులయ్యారు. 75 మంది పరీక్షలు రాయగా అందరూ ఉత్తమ శ్రేణిలో పాసయ్యారు. గురువారం విద్యాలయంలో పరీక్ష ఫలితాలను ప్రిన్సిపల్ ఎం.గీత తెలియజేశారు. బండి ప్రవీణ్కుమార్ 500 మార్కులకు 485 మార్కులు సాధించి టాపర్గా నిలిచాడు. కె.కెం.జిజ్ఞాస్, ఈ.తేజశ్రీలు 475, మోక్షితగౌడ్ 472 మార్కులు, గురుగోవర్ధన్ 471 మార్కులు సాధించారు. విద్యార్థులను వైస్ ప్రిన్సిపల్ శ్రీవిద్య, సీనియర్ టీచర్లు అభినందించారు. పీలేరురూరల్: జిల్లాకు నూతనంగా 43 బస్సు లు రానున్నట్లు కడప ఆర్టీసీ ఈడీ ఎస్.టి.పి. రాఘవకుమార్ అన్నారు. గురువారం పీలేరు ఆర్టీసీ బస్టాండ్ను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పీలేరు డిపోకు కూడా 8 కొత్త సర్వీసులు వస్తున్నట్లు తెలిపారు. పీలేరు బస్టాండ్ పరిధిలో రూ. 32 లక్షలతో చేపట్టిన నూతన మరుగుదొడ్ల నిర్మాణాన్ని పరిశీలించారు. అలాగే రూ. 8.5 లక్షలతో డ్రైనేజ్ కాలువ నిర్మాణ పనులను పరిశీలించారు. ఈ సందర్భంగా ఈడీ మాట్లాడుతూ డిపో పరిధిలో ఖాళీగా ఉన్న స్థలాలను బాడుగకు ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నామని చెప్పారు. అనంతరం ఆర్టీసీ బస్టాండ్లో మొక్క లు నాటారు. ఆర్ఎం పి. రాము, డీఎం ఎస్ఎండి రోషన్, ఈఈ పోతురాజు, సీఐ పాల్గొన్నారు. నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): ప్రభుత్వాస్పత్రి లో ప్రసవాల సంఖ్యను పెంచాలని డీఎంహెచ్ఓ డాక్టర్ లక్ష్మీనరసయ్య ఆస్పత్రిలోని వైద్య సిబ్బందిని ఆదేశించారు. గురువారం నిమ్మనపల్లె పీహెచ్సీని ఆయన ఆకస్మికంగా తనిఖీచేశారు. ఆస్పత్రిలో కాన్పుల గది, మందులు, మాత్రలు ఇచ్చే గదులను పరిశీలించారు. అలాగే ల్యాబోలేటరి, రోగులకు ఏర్పాటు చేసిన మంచాలను పరిశుభ్రంగా ఉన్నాయా లేవా అని చూశారు. అనంతరం వైద్య సిబ్బందితో మాట్లాడుతూ మండలంలోని నలుమూలల నుంచి వచ్చే గర్భిణీలకు ఇక్కడే ప్రసవాలు చేయాలని ఆదేశించారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వడదెబ్బ, సీజనల్ వ్యాధుల పట్ల ప్రజలను చైతన్యం చేయాలని సూచించారు. డీఎంహెచ్ఓ వెంట డాక్టర్తో పాటు, వైద్య సిబ్బంది ఉన్నారు. -
జనసంద్రమైన ఇజ్తెమా ప్రాంగణం
కలికిరి: కలికిరి సమీపంలోని మదనపల్లె– తిరుపతి జాతీయ రహదారి టేకలకోన వద్ద రెండు రోజులుగా జరిగిన రాయచోటి జిలేకా మైదానీ ఇజ్తెమా గురువారం రాత్రి దువా ప్రార్థనలతో ముగిసింది. గురువారం తెల్లవారు జాము నుంచి భక్తులు ఇజ్తెమా ప్రాంగణానికి తరలివచ్చారు. ఫజర్ నమాత్ తర్వాత ముస్లిం ఆధ్మాత్మిక వేత్తలు, మత గురువులు ఉదయం నుంచి రాత్రి వరకు ప్రసంగాలు కొనసాగించారు. ధార్మిక సభా ప్రాంగణం వేలాది మంది భక్తులతో కిటకిటలాడింది. పవిత్ర ఖురాన్లోని అంశాలను వివరిస్తూ ప్రతి ఒక్కరూ దైవ మార్గంలో నడవాలని అన్నారు. దైవ ప్రార్ధనలతో మానవ జన్మకు సార్ధకత చేకూరేలా నడుచుకోవాలని, ప్రతి నిత్యం అల్తాహ్ను ప్రార్థించాలని సూచించారు. ఇజ్తెమా ముగింపు నేపథ్యంలో చివరగా మత గురువులు చేసిన దువా ద్వారా భక్తులు పాపాలను క్షమించాలని వేడుకున్నారు. ఇజ్తెమాకు వివిధ ప్రాంతాల నుంచి విచ్చేసిన ముస్లింలు గురువారం సాయంత్రం నుంచి గమ్య స్థానాలకు తిరుగు ప్రయాణమయ్యారు. ఎలాంటి సమస్యలు తలెత్తకుండా నిర్వాహకులు, వలంటీర్లు, పోలీసులు పటిష్ట ఏర్పాట్లును చేపట్టారు. -
శాస్త్రోక్తంగా బ్రహ్మోత్సవాల ధ్వజారోహణం
వల్లూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన పుష్పగిరి బ్రహ్మోత్సవాల్లో భాగంగా శ్రీ కామాక్షీ వైద్యనాఽథేశ్వర స్వామి, శ్రీ లక్ష్మీ చెన్న కేశవ స్వాముల ఆలయాల్లో గురువారం వేద పండితుల ఆధ్వర్యంలో ధ్వజారోహణం కార్యక్రమాన్ని శాస్త్రోక్తంగా నిర్వహించారు. వైధ్యనాఽథేశ్వర స్వామి ఆలయంలో ఉదయం గణపతి పూజ నిర్వహించారు. వైద్యనాధునికి రుద్రాభిషేకం, శ్రీ చక్ర సహిత కామాక్షీ దేవికి కుంకుమార్చన చేశారు. రాత్రి ధ్వజారోహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. రాత్రి హంస వాహనంపై స్వామి వారు దర్శనమిచ్చారు. అనంతరం దివిటీల వెలుగులు, మంగళ వాయిద్యాల మధ్య గ్రామోత్సవం నిర్వహించారు. ● కొండపైన గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి ఆలయంలో తెల్లవారుజామున సుప్రభాత సేవ జరిగింది. అనంతరం ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో విశ్వక్సేన పూజను నిర్వహించారు. అనంతరం రాత్రి ధ్వజారోహణ చేశారు. అనంతరం కొండపై నుంచి స్వామి వారిని తిరుచ్చి వాహనంలో గ్రామోత్సవాన్ని నిర్వహించారు. -
ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచండి
మదనపల్లె టౌన్: ఎర్రచందనం స్మగ్లర్ల వేటలో వేగం పెంచాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పోలీస్ అధికారులను ఆదేశించారు. బుధవారం మదనపల్లె పోలీస్ ప్రధాన కార్యాలయంలో అడిషనల్ ఎస్పీ వెంకటాద్రితో కలిసి ఎస్పీ ఎర్రచందనం అక్రమ రవాణాను అరికట్టేందుకు తీసుకోవాల్సిన చర్యలు, ముందస్తు ప్రణాళికలు, కేసుల పురోగతిపై ఆయా పోలీస్ స్టేషన్ల సీఐ, ఎస్ఐలకు దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. ఎర్రచందనం కేసుల్లో నిందితులను అరెస్టు చేయడమే కాకుండా వారికి శిక్షలు పడేలా సాక్ష్యాధారాలను సేకరించాలని సూచించారు. అలాగే చార్జ్ షీట్లు గడువులోగా దాఖలు చేయాలన్నారు. ఎర్రచందనం కేసుల్లో ఉన్న వారి కదిలికలపైనిఘా ఉంచాలనిసూచించారు. సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను పట్టుకోవలన్నారు. స్మగ్లింగ్ చేసే ప్రధాన మార్గాలను, చెక్ పోస్లును ఆకస్మికంగా తనిఖీలు చేయాలని చెప్పారు. నేరస్తులను పట్టుకోవడంతో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
చెరువుల అభివృద్ధికి చర్యలు
జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ చౌడేపల్లె: జలధార కార్యక్రమం ద్వారా చెరువుల అభివృద్ధికి చర్యలు చేపడతామని కలెక్టర్ నిశాంత్కుమార్ పేర్కొన్నారు.బుధవారం చౌడేపల్లె మండలంలో వివిధ శాఖల అధికారులతో కలిసి పర్యటించారు. జలధార కార్యక్రమంతో భూగర్భజలాలు పెంపొందుతాయన్నారు. దిగువపల్లె పంచాయతీలోని శెట్టికుంట, కాగతి పంచాయతీ పరిధిలోని కాగతి చెరువులను కలెక్టర్ పరిశీలించారు. చెరువుల పరిస్థితి, ఆయకట్టు గురించి ఆరా తీశారు. జలధార కార్యక్రమంలో భాగంగా చెరువులకు అనుసంధానంగా ఉన్న ఫీడరు కాలువలు, సఫ్లై ఛానల్ పనులు చేపట్టడానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. ఉపాధిహామీ పథకం ద్వారా అవసరమైన ప్రదేశాల్లో సఫ్లై ఛానల్ పనులు చేపట్టాలన్నారు. మండలంలో పలుచోట్ల చెరువులు ఆక్రమణకు గురయ్యాయని, దర్జాగా ఆక్రమించుకొని పంటలు సాగుచేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని రైతులు కలెక్టర్ దృష్టికి తెచ్చారు. వెంటనే విచారించి చర్యలు చేపట్టాలని కోరారు. కొలింపల్లె వద్ద గోర్లకుంట, కాగతి చెర్వులకు వచ్చే వర్షపునీటి కాలువలు ఆక్రమణలకు గురైయ్యాయని వర్షాకాలంలో వరదనీరు ఇళ్లలోకి చేరుతుందని గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఉపాధిపథకం ద్వారా మాదం వారిపల్లె సమీపంలో చేపట్టిన సఫ్లై ఛానల్ పనులు పరిశీలించి పలు సూచనలు చేశారు. కార్యక్రమలో ఎంపీడీఓ లీలామాధవి, తహసీల్దార్ పార్వతి, డీటీ దొరస్వామి,డిప్యూటీ ఎంపీడీఓ గఫూర్, ఏఈలు చందన, నాగరాజ, ఏఓ మోహన్,జెఈ కోదండపాణి,మండల సర్వేయర్ సుఽరేంధ్ర నాయక్ , పంచాయతీ కార్యదర్శి పవన్కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
ఇజితిమా ధార్మిక సభ ప్రారంభం
కలికిరి: మదనపల్లి జాతీయ రహదారి కలికిరి సమీపం టేకలకోన వద్ద ఏపీఐఐసీ ప్రాంగణంలో రాయచోటి జిలేకా మైదానీ ఇజితిమా ధార్మిక సభలు బుధవారం ప్రారంభమయ్యాయి. రెండు రోజుల పాటు జరుగనున్న కార్యక్రమంలో మొదటి రోజున అన్నమయ్య జిల్లాతో పాటు ఉమ్మడి చిత్తూరు, కడప జిల్లాల్లోని పలు ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు, మతపెద్దలు హాజరయ్యారు. కార్యక్రమానికి దూరం ప్రాంతాల నుంచి విచ్చేసే వారికి ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా పోలీసులు, స్వచ్ఛంద వలంటీర్లు చర్యలు చేపట్టారు. సభా ప్రాంగణంలో ముస్లిం సోదరులు ప్రార్ధనలు, సాయంత్రం దువా నిర్వహించారు. గురువారం జరిగే ధార్మిక సభలో ముస్లిం మత పెద్దలు ప్రసంగించనున్నారు. -
రగులుతున్న తమ్ముళ్లు!
మదనపల్లె: టీడీపీ జాతీయ, రాష్ట్ర కమిటీలకు ఎంపిక చేసిన నేతల జాబితాను బుధవారం విడుదల చేశారు. ఈ ప్రధాన కమిటీల జాబితాలో అన్నమయ్య జిల్లాకు తీరని అన్యాయం జరిగిందని తమ్ముళ్లు రగిలిపోతున్నారు. ఇంతకాలం భుజాలు అరిగిపోయేలా పార్టీని మోసినందుకు ఇదా గుర్తింపు అంటూ మండిపడుతున్నారు. ఒకరికి ఒక పదవికే దిక్కు లేకపోతే మదనపల్లెలో ఇద్దరికీ రెండు పదవులు ఇవ్వడంపై తమ్ముళ్లు సోషల్ మీడియాలో విమర్శిస్తున్నారు. మదనపల్లె, పీలేరు, తంబళ్లపల్లె నియోజకవర్గాలకు ఒక్కోపదవి ఇవ్వగా, పీలేరు, తంబళ్లపల్లెలో ఇప్పటికే కొనసాగుతున్న పదవుల్లోనే వారిని కొనసాగించారు. కొత్తవారికి అవకాశం లేకపోగా వారికి ప్రమోషన్ కూడా దక్కలేదు. రాయచోటి, పుంగనూరు నియోజవర్గాలను పూర్తిగా విస్మరించడం, మైనార్టీలకు గత కమిటిలో స్థానం కల్పించగా ఇప్పుడు విస్మరించడంపై ఆ వర్గంలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. నల్లారి తొలగింపు గత టీడీపీ జాతీయ కమిటీలో ప్రస్తుత పీలేరు ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. ఆయనతో పాటు రాష్ట్ర అధికార ప్రతినిధిగా మద్దిపట్ల సూర్యప్రకాష్ పదవి పొందారు. ఇప్పుడు ప్రకటించిన కమిటీలో కిషోర్ను ఆ పదవి నుంచి తప్పించారు. పలమనేరు ఎమ్మెల్యే అమరనాథ్రెడ్డికి కమిటీలో చోటు కల్పించారు. మదిపట్లకు అదే పోస్టులో తిరిగి కొనసాగిస్తూ స్థానం కల్పించారు. కిషోర్ను పార్టీ పదవి తప్పించడం చర్చనీయాంశమైంది. ఆయన ఎమ్మెల్యే పదవిలో ఉన్నారు కాబట్టి పార్టీ పదవి ఇవ్వలేదని చెబుతున్నప్పటికీ జాతీయ, రాష్ట్ర కమిటీలో ఎమ్మెల్యేలకు చోటు కల్పించారు. అలాంటప్పుడు కిషోర్కు ఎందుకు పదవి ఇవ్వలేదని చర్చించుకుంటున్నారు. పార్టీ నిర్ణయాలను ఆయన ప్రశ్నిస్తున్నందుకే ఇలా చేశారా అని క్యాడర్లో చర్చ సాగుతోంది. ప్రత్యామ్నాయం లేని తంబళ్లపల్లె తంబళ్లపల్లె నియోజకవర్గం నుంచి కొత్తవారికి ఛాన్స్ దక్కలేదు. కొన్నేళ్లుగా రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పదవిలో కొనసాగుతున్న గిరిజశ్రీ (పర్వీన్ తాజ్)కు పార్టీ అదే పదవిలో కొనసాగిస్తూ స్థానం కల్పించింది పార్టీని నమ్ముకుని పనిచేస్తున్న ఆమెకు సముచిత స్థానం ఇవ్వాలని ఎప్పటినుంచో కోరుతున్నారు. కనీసం పార్టీ పదవిలో ప్రమోషన్ కూడా ఇవ్వకుండా ఒకే పదవిలో కొనసాగిస్తున్నారు. ఈమెకు మినహ నియోజకవర్గ నుంచి వేరే ఎవరికీ అవకాశం దక్కలేదు. ఇప్పటికే ఆమె పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్గా ఉన్నారు. దిక్కులేని పుంగనూరు పార్టీ కమిటీల్లో పుంగనూరు నియోజకవర్గం నుంచి ఒక్కరికి అవకాశం లేదు. గతంలో వెంకటరమణరాజుకు పార్టీలో స్థానం దక్కేది. ఇప్పుడు ఎవరికి కూడా అవకాశం ఇవ్వలేదు. నియోజకవర్గంలో పార్టీకి బలమైన నేతలు ఉన్నారని చెప్పుకునే పార్టీ కమిటీల్లో ఇప్పుడు ఒక్కరికై నా స్థానం కల్పించకపోవడం వెనక కారణమేమిటి అన్నదానిపై అర్థంకాక తర్జనభజన పడుతున్నారు. ఈ నియోజకవర్గాన్ని పార్టీ గుర్తించినట్టు లేదని తమ్ముళ్లు మధనపడుతున్నారు. రాయచోటి నుంచి మైనార్టీలకు ఇచ్చిన అవకాశాన్ని ప్రస్తుత కమిటీలో మొండి చేయి చూపించారు. గత కమిటీలో సుగువాసి ప్రసాద్ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శిగా, గాజుల ఖాదర్బాషాకు రాష్ట్ర ఉపాధ్యక్షుడిగా అవకాశం ఇచ్చారు. ప్రస్తుత కమిటీలో ఇద్దరికి అవకాశం లేనప్పటికీ ప్రసాద్ ప్రస్తుతం రాజంపేట జిల్లా అధ్యక్షునిగా ఉన్నారు. రాయచోటిలో టీడీపీకి మైనార్టీలు, బీసీలు అండగా ఉన్నప్పటికీ వారికి తిరిగి అవకాశం కల్పించలేదు. ఖాదర్బాషా ఓ వివాదాస్పద వ్యవహారంతో ఆయన్ను పార్టీ పక్కన పెట్టినప్పటికీ ప్రత్యామ్నాయంగా అదే సామాజిక వర్గానికి చెందిన నేతకు పదవి ఎందుకు ఇవ్వలేదని పార్టీలో చర్చనీయాంశమైంది. జిల్లా నుంచి మైనార్టీలకు పార్టీ కమిటీల్లో స్థానం కల్పించలేదు. దాంతో మైనార్టీల్లో తీవ్ర అసంతృప్తి వ్యక్తం అవుతోంది. మదనపల్లె టీడీపీని ఆదినుంచి మోసిన కుటుంబాలకు అధిష్టానం షాక్ ఇచ్చింది. ప్రకటించిన కమిటీలో మాజీ కౌన్సిలర్ పి.తులసికి అవకాశం ఇవ్వడంపై అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే ఆమె భర్తకు కార్పొరేషన్ డైరెక్టర్ పదవి ఇచ్చారని,తిరిగి అదే కుటుంబానికి పార్టీ పదవి ఇవ్వడం ఏమిటని పార్టీ నేతలే సోషల్ మీడియాలో ప్రశ్నిస్తున్నారు.జిల్లా ప్రధాన కార్యదర్శిగా పఠాన్ ఖాదర్ఖాన్ను నియమించిన పార్టీ, తిరిగి ఉర్దూ అకాడమీ వైస్ చైర్మన్గా నామినేటెడ్ పదవి ఇచ్చారని ప్రశ్నిస్తున్నారు. ప్రస్తుత కమిటీలో తులసికి రాష్ట్ర కార్యదర్శి పదవి ఇచ్చారు. టీడీపీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్న నేతలను విస్మరించడంపై ఆగ్రహం వ్యక్తవుతోంది. పార్టీలో క్రియాశీలకం పనిచేస్తున్న క్యాడర్ అసంతృప్తి వ్యక్తం చేయడంతో పాటు సోషల్ మీడియాలో విమర్శలు చేస్తున్నారు. ఒక కుటుంబానికి ఎన్ని పదవులు ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. బలమైన పార్టీ నేతలను పక్కనపెట్టడంపై ఇన్నాళ్లు పార్టీని మోసినందుకు దక్కిన గౌరవం ఇదేనా అని మధనపడుతున్నారు. మాజీ ఎమ్మెల్యేలు, అధిష్టానంతో సన్నిహితం కలిగిన నేతలు, సీనియర్లను విస్మరించడంపై క్యాడర్లో అసంతృప్తి వ్యక్తమవుతోంది. నల్లారి తొలగింపు రాయచోటి, పుంగనూరులోజెండా మోసిన నేతలే లేరా జిల్లాలోని టీడీపీ మైనార్టీలకు అన్యాయం మదనపల్లెలో సీనియర్లను పక్కన పెట్టారు తంబళ్లపల్లెలో అదే స్థితి -
ఇళ్లలో నుంచి వెళ్లి పొమ్మంటున్నారు
గుర్రంకొండ: ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో ఇళ్లు కట్టుకొని నివాసముంటున్న తమను ఉన్న పళంగా ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని మండలంలోని శెట్టివారిపల్లె పంచాయతీ బోడిగుట్టకు చెందిన దళితులు ఆవేదన చెందుతున్నారు. ఈవియషమై సంబంధిత అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదంటూ దళితులు ఆరోపిస్తున్నారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక దళితవాడకు చెందిన పలువురు దళితులకు 50 ఏళ్ల క్రితం ఇళ్ల స్థలాలు కేటాయించారు. అప్పట్లో గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తుల దగ్గర ప్రభుత్వం భూమి కొనుగోలు చేసి దళితులకు దశలవారీగా ఇళ్లు కట్టుకోవడానికి పట్టాలు ఇచ్చారు. ఎగువ, దిగువ దళితవాడల్లో కలిపి 70 మంది దళితులకు ఇళ్లపట్టాలను రెవెన్యూ అధికారులు మంజూరు చేశారు. వీరికి ప్రభుత్వం ఇళ్లను కూడా మంజూరు చేయడంతో అష్టకష్టాలు పడి హౌసింగ్ స్కీమ్ కింద ఇళ్లు నిర్మించుకొన్నారు. అంతాసాఫీగా జరిగిపోతున్న సమయంలో ప్రస్తుతం కొంతమంది రంగ ప్రవేశం చేసి ఈప్రభుత్వ స్థలాలన్నీ మాకే చెందుతాయని వెంటనే ఇళ్లు ఖాళీ చేసి వెళ్లిపోవాలంటూ హుకుం జారీ చేస్తున్నారని దళితులు పేర్కొన్నారు. ఇటీవల ఇళ్ల ముందుభాగంలో ఏర్పాటు చేసుకొన్న పశువుల పాకలను కూడా తొలగించాల్సిందిగా దౌర్జన్యానికి పాల్పడ్డారని వారు ఆవేదన చెందుతున్నారు. ఏళ్ల తరబడి నివాసముంటున్న తాము ఎక్కడికి వెళ్లాలంటూ దళితులు ప్రశ్నిస్తున్నారు. ఈవిషయమై ఇటీవల జిల్లా కలెక్టర్ను కలిసి తమ సమస్యపై వినతి పత్రాలు సమర్పించారు. దీంతో పాటు స్థానిక రెవెన్యూ, పోలీస్అధికారుల దృష్టికి తమ సమస్యను తీసుకెళ్లారు. అయినా వారు వెనక్కి తగ్గకుండా ఇళ్లను ఖాళీ చేసి వెళ్లిపోవాల్సిందేనని హుకుం జారీ చేసి వెళ్లారని దళితులు పేర్కొన్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. బోడిగుట్టలో ప్రభుత్వస్థలాల్లో ఇళ్లు కట్టుకున్న దళితుల ఆవేదన -
ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు మాయం
కొన్ని రోజులకే మాయంగుర్రంకొండ: కబ్జాలకు గురవుతున్న కోట్లాది రూపాయలు విలువచేసే ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు పలుచోట్ల మాయం అవుతున్నాయి. గతంలో సదరు భూముల్ని కబ్జా చేసిన ఆక్రమణదారులే హెచ్చరిక బోర్డులను రాత్రికి రాత్రే యథేచ్ఛగా తొలగించేస్తున్నారు. దీంతో మళ్లీ రూ. 7కోట్లు విలువచేసే ప్రభుత్వభూముల కబ్జాకు ఆక్రమణ దారులు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అన్యాక్రాంతమవుతున్న కోట్లాది రూపాయలు విలువ చేసే ప్రభుత్వ భూముల్లో రెవెన్యూ అధికారులు తూతూ మంత్రంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేసి చేతులు దులుపుకుంటున్నారనే విమర్శలు ఉన్నాయి. ఇంత జరుగుతున్నా రెవెన్యూ ఉన్నత అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేక పోవడం గమనార్హం. చిట్టిబోయనపల్లెలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు గుర్రంకొండ పట్టణానికి సమీపంలోని చిట్టిబోయనపల్లె రెవెన్యూ గ్రామం పక్కనే ఎన్హెచ్ 340 జాతీయ రహదారి పక్కనే కోట్లాది రూపాయలు విలువచేసే ఫ్రభుత్వభూములు ఆక్రమణ లకు గురికాకుండా రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. ఈ పరిసరాల్లోని సర్వేనెంబరు 87/8లో రెండు ఎకరాల భూమికి సంబంధించి ఇంతవరకు ఎవరికీ పట్టా ఇవ్వలేదు. ఈ ప్రాంతంలో భూముల విలువ అమాంతం పెరిగిపోయింది. ఎకరం భూమి రూ.2 కోట్లు వరకు విలువ పెరిగింది. దీంతో కొంతమంది కబ్జాదారుల కన్ను ఈ భూమిపై పడింది. గుట్టుచప్పుడు కాకుండా ఈ భూమిని సొంతం చేసుకోవడానికి విశ్వప్రయత్నాలు చేశారు. రెవెన్యూ అధికారులు సదరు భూమిని కబ్జాకోరుల నుంచి కాపాడుకోవడానికి సర్వే పనులు చేపట్టారు. జేసీబీతో సరిహద్దుల వద్ద కందకాలు తవ్విస్తుండగా వాటిని కొంతమంది కూటమినేతలు అడ్డుకొని రెవెన్యూ అధికారులను అక్కడి నుంచి పంపించి వేసిన సంఘటనలు చోటు చేసుకొన్నాయి. కొన్నాళ్లుగా గుంభనంగా ఉన్న కబ్జాదారులు మళ్లీ తమకబ్జా ప్రయత్నాలు తిరిగి ప్రారంభించారు. ఈనేపథ్యంలో ఇటీవల రెవెన్యూ అధికారులు సదరు స్థలంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. సర్వేనెంబరు 87/8లో ఎవరికి కూడా పట్టాలు ఇవ్వలేదని ఇందులో ఎవరైనా ప్రవేశించినా, ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినా చట్టపరంగా చర్యలు తప్పవని హెచ్చరిస్తూ బోర్డులు ఏర్పాటు చేశారు. మురాద్బీవంక వద్ద బోర్డు ఏర్పాటు: మండలంలోని ఖండ్రిగ గ్రామంలో ప్రభుత్వస్థలంలో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేశారు. గ్రామ పరిధిలోని 503–8లో వంక పోరంబోకు స్థలాన్ని కొంతమంది ఆక్రమించుకొని చదును చేసుకున్నారు. మురాద్బీ కుంటకు వర్షపునీరు చేరే ఈ వంకను ఆనవాళ్లు లేకుండా చేసి కొంతమంది ఆక్రమించేశారు. జేసీబీలతో వంకను ధ్వంసం చేసి ప్లాట్లు విక్రయించడానికి సిద్ధం చేసుకొన్నారు. దీంతో గ్రామస్తులు తహసీల్దార్ కు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాల మేరకు వీఆర్వోలు, సర్వేయర్లు రెండునెలల క్రితం వంకస్థలాన్ని సర్వేచేశారు. రూ.2 కోట్లు విలువచేసే మొత్తం 50 సెంట్ల మేరకు ఆక్రమణకు గురైనట్లు రెవెన్యూ అధికారుల విచారణలో తేల్చారు. ఈనేపథ్యంలో రెవెన్యూ అధికారులు మురాద్బీ వంక వద్ద ఆక్రమణకు గురైన ప్రభుత్వ స్థలంలో హెచ్చరిక బోర్డు నాటించారు. ఈ స్థలం ప్రభుత్వానికి చెందినదని ఇక్కడ ఎవరైనా ప్రవేశిస్తే చట్టపరంగా చర్యలు తీసుకొంటామని అధికారులు హెచ్చరించారు. గుర్రంకొండలో మూడు చోట్ల బోర్డులు ఏర్పాటు గుర్రంకొండ పట్టణంలో గతంలో మూడు చోట్ల రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. స్థానిక పోలీస్స్టేషన్కు ఎదురుగా ఉన్న ప్రభుత్వ స్థలంను గతంలో కొంతమంది కబ్జాదారులు ఆక్రమించుకోగా రెవెన్యూ ఆధికారులు అడ్డుకొని ఆక్రమణలను తొలగించి హెచ్చరిక బోర్డును ఏర్పాటు చేశారు. పట్టణంలోని తూముకుంటకు వెళ్లే దారిలో రెండు ప్రదేశాల్లో ఉన్న విలువైన ప్రభుత్వ భూములను కొంతమంది ఆక్రమించుకొనేందుకు యత్నించారు. వారి ప్రయత్నాలను అడ్డుకొని అప్పట్లో రెవెన్యూ అధికారులు హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేశారు. మళ్లీ మొదలైన కబ్జా యత్నాలూ: ప్రభుత్వ హెచ్చరిక బోర్డులు నాటిన తరువాత గుంభనంగా ఉన్న కబ్జాదారులు మళ్లీ కబ్జా చేసే ప్రయత్నాలు మొదలు పెట్టారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రయత్నాలు ముమ్మరం చేశారు. బోర్డులు నాటిన భూముల్లో ఉన్న వేపచెట్లతో పాటు ఇతర చెట్లను మెల్లమెల్లగా నరికి వేశారు. ఇప్పటికే కొన్ని చెట్లను నేలకూల్చి తరలించేసి భూమిని చదును చేసే ప్రయత్నాలు ప్రారంభించారు. సదరు భూమిలో చదును చేసే పనుల్లో భాగంగా బయట ప్రాంతాల నుంచి మట్టిని పెద్ద ఎత్తున తీసుకొచ్చారు. మురాద్బీ వంక చాలా వరకు చదునుచేశారు. వంక రూపురేఖలు మార్చేసి ప్లాట్లు వేసి విక్రయించడానికి సిద్ధం చేశారు. దీంతో ఇక్కడ వంక ఉన్న ఆనవాళ్లు కనుమరుగు అయ్యాయి. ఇప్పటికే మట్టికుప్పలు భూమిలో దర్శనమిస్తుండడం గమనార్హం. రెవెన్యూ అధికారుల ఉదాసీనతను ఆసరాగా చేసుకొని రోజురోజుకు భూమి ఆక్రమణ పనులు మెల్లగా మొదలు పెడుతుండడం గమనార్హం. మురాద్బీ వంక వద్ద హెచ్చరిక బోర్డు నాటిన అధికారులు కబ్జాకు గురైన ప్రభుత్వ భూముల్లో హెచ్చరిక బోర్డులు నాటుతున్న అధికారులుగుర్రంకొండ పట్టణంలో ప్రభుత్వభూమిలో హెచ్చరిక బోర్డు ఏర్పాటు చేసిన రెవెన్యూ అధికారులు ప్రస్తుతం సదరు భూమిలో హెచ్చరిక బోర్డు మాయమైన దృశ్యం అక్రమంగా బోర్డులు తొలగించిన కబ్జాదారులు మళ్లీ మొదలైన రూ.7కోట్ల భూముల కబ్జాయత్నాలు తూతూ మంత్రంగా హెచ్చరిక బోర్డులు ఏర్పాటు పట్టించుకోని రెవెన్యూ అధికారులు మండలంలోని గుర్రంకొండ, చిట్టిబోయనపల్లె, ఖండ్రిగ గ్రామాల్లో గతంలో రెవెన్యూ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులు మాయయ్యాయి. అన్నిచోట్ల బోర్డులను ఆక్రమణ దారులు తొలగించేశారు. అసలు అక్కడ హెచ్చరిక బోర్డులు ఉన్నట్లు ఆనవాళ్లు లేకుండా చేసేశారు. దీంతో రూ.7 కోట్లు విలువ చేసే ప్రభుత్వ స్థలాలు మళ్లీ కబ్జా చేసే ప్రయత్నాలను ఆక్రమణ దారులు ముమ్మరం చేశారు. సదరు స్థలాలు తమ సొంత స్థలాలుగా మార్చేసి మార్కెట్లో విక్రయించడానికి రంగం సిద్ధం చేసుకొంటున్నారు. కొన్ని బోర్డులు తొలగించి సదరు ప్రభుత్వస్థలాల్లో ఇప్పటికే అక్రమంగా నిర్మాణాలు కూడా చేపట్టడం గమనార్హం. ఇంత తతంగం జరుగుతున్నా రెవెన్యూ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యహరిస్తున్నారని ప్రజలు విమర్శిస్తున్నారు. అసలు రెవెన్యూ అధికారులు అలాంటప్పుడు ప్రభుత్వ స్థలాల్లో హెచ్చరిక బోర్డులు నాటడం ఎందుకని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. -
మద్యం బాటిళ్ల పట్టివేత
ములకలచెరువు: కారులో అక్రమంగా మద్యం తరలిస్తున్న ఒక వ్యక్తిని అరెస్టుచేసి మద్యం స్వాధీనం చేసుకొని నిందితుడిని రిమాండ్కు తరలించిన సంఘటన బుధవారం మండలంలో చోటు చేసుకుంది. ఎస్ఐ ఉమామహేశ్వర్రెడ్డి కథనం మేరకు... తన సిబ్బందితో బురకాయలకోట సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా పీటీయంకు చెందిన నాగరాజురెడ్డి తన కారులో మద్దినాయనిపల్లెకు మద్యం తరలిస్తుండగా పట్టుబడినట్లు చెప్పారు. కారు, మద్యం స్వాధీనం చేసుకొని ములకలచెరువు పోలీసు స్టేషన్లో అరెస్టు చూపించారు. 558 మద్యం బాటళ్లు, 60 బీర్లు సీజ్ చేసినట్లు ఎస్ఐ వివరించారు. అప్పు ఇవ్వలేదని యువకుడిపై దాడి గాలివీడు: మండలంలోని నూలివీడు గ్రామంలో అప్పు ఇవ్వలేదనే కారణంతో ఒక యువకుడిపై దాడి జరిగిన ఘటన వెలుగుచూసింది. గ్రామానికి చెందిన అశోక్పై అదే గ్రామానికి చెందిన మ రో ఇద్దరు దాడి చేసినట్లు సమాచారం.వివరాల ప్రకారం, నిందితులు అశోక్ను రూ.10 వేలు అప్పు ఇవ్వాలని కోరగా, అతను నిరాకరించడంతో కోపోద్రిక్తులై దాడికి పాల్పడ్డారు. ఈ ఘటనపై బాధితుడు ఫిర్యాదు చేయగా, పోలీసులు కేసు నమోదు చేశారు.ఈ విషయాన్ని హెడ్ కానిస్టేబుల్ ఈశ్వర్ నాయక్ తెలిపారు. కేసు దర్యాప్తు కొనసాగుతోందని పోలీసులు పేర్కొన్నారు. ఎగువగొట్టివీడు వద్ద బైక్ ప్రమాదం గాలివీడు: మండలంలోని ఎగువగొట్టివీడు వద్ద బుధవారం ద్విచక్ర వాహనం ప్రమాదానికి గురైంది. స్థానికుల కథనం మేరకు తూముకుంట గ్రామానికి చెందిన అమర్నాథ రెడ్డి, వరప్రసాద్ రెడ్డిలు బైక్పై ప్రయాణిస్తుండగా, గొట్టివీడు వద్దకు రాగానే వేగంగా వచ్చిన ద్విచక్రవాహనం అదుపు తప్పి రోడ్డు ప్రక్కనే ఉన్న కాలువ గోతిలో పడిపోయింది. ఈ ప్రమాదాన్ని గమనించిన స్థానికులు వెంటనే స్పందించి 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న అంబులెన్స్ సిబ్బంది గాయపడిన వారిని రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఈ ప్రమాదంలో ఇద్దరికీ గాయాలు అవగా, ఒకరి పరిస్థితి విషమంగా వుంది. వారి ఆరోగ్య పరిస్థితిపై పూర్తి వివరాలు తెలియాల్సి వుంది. -
రోడ్డు ప్రమాదంలో మెకానిక్ మృతి
మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో మెకానిక్ మృత్యువాత పడ్డ విషాదకర ఘటన బుధవారం నిమ్మనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి మృతుని కుటుంబీకులు, నిమ్మనపల్లె పోలీసులు తెలిపిన వివరాలు.. నిమ్మనపల్లెకు చెందిన షామీర్ ఖాన్ (45) కందూరు రోడ్డులో మెకానిక్ పనిచేస్తుంటాడు. ఈ క్రమంలో ఉదయం బైకులో సొంత పనిమీద మదనపల్లె రోడ్డులో వెళుతుండగా, మార్గ మధ్యలోని పోలీస్ స్టేషన్ సమీపంలో టైరు పేలి బైకు అదుపు తప్పి కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయాలు కావడంతో అపస్మారకస్థితికి చేరుకున్నాడు. కుటుంబీకులు సమాచారం అందుకుని బాధితున్ని చికిత్స కోసం హుటా హుటిన మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అనంతరం అతని పరిస్థితి విషమంగా ఉందని డాక్టర్లు చెప్పంతో బెంగుళూరుకు తరలించారు. అక్కడ ఓ ప్రయివేట్ ఆస్పత్రిలో చేర్పించేలోపు మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. పులిచెర్ల (కల్లూరు): పులిచెర్ల మండలం కల్లూరు ఘాట్ రోడ్డులో బుధవారం తెల్లవారు జామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ మృతి చెందింది. డ్రైవర్, మరొకరు గాయపడ్డారు. పోలీసుల కథనం మేరకు వివరాలు....ప్రొద్దుటూరు నుంచి తమిళనాడు లోని వేలూరు సీఎంసీ హాస్పిటల్లో చికిత్స కోసం సరస్వతి (50) అనే మహిళ తన కుమారుని తో కలిసి కారులో బయలు దేరింది. మార్గమధ్యలో బుధవారం తెల్ల వారుజామున కల్లూరు ఘాట్ రోడ్డులో కారు అదుపు తప్పి బోల్తాపడింది. దీంతో కారులో ప్రయాణిస్తున్న సరస్వతి తీవ్రంగా గాయపడింది. 108లో చికిత్స నిమిత్తం పీలేరు హాస్పిటల్కు తరలించగా అక్కడ చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. మిగిలిన ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు కల్లూరు ఎస్ఐ వెంకటేశ్వర్లు తెలిపారు. -
స్వయం ఉపాధితో మహిళలు ముందుకు రావాలి
కురబలకోట: గ్రామీణ మహిళలు స్వయం సహాయక సంఘాల ద్వారా స్వయం ఉపాధి అవకాశాలను వినియోగించుకుని ఆర్థికంగా అభివృద్ది చెందాలని జీవనోపాధుల (లైవ్లీ హుడ్స్)రాష్ట్ర సెర్ప్ డెరెక్టర్ పద్మావతి సూచించారు. బుధవారం ఆమె మండలంలోని చెన్నామర్రి మిట్ట వద్ద నున్న చింత పండు ప్రాసెసింగ్ యూనిట్ను సందర్శించారు. యూనిట్లో ఉత్పత్తి పనులు ప్రారంభానికి అవసరమైన వాటిని గుర్తించారు. కురబలకోట వెలుగు కార్యాలయంలో జరిగిన సమావేశంలో మాట్లాడారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ సంఘాల ద్వారా మహిళలు పొదుపు అలవాటుగా మార్చుకుని ఇష్టం ఆపై అనుభవం ఉన్న వ్యాపారాలను ప్రారంభించాలన్నారు. ఇందుకు సంఘాలు ఇతర ఆర్థిక సంస్థల ద్వారా రుణాలు, శిక్షణ కార్యక్రమాలను వినియోగించుకుని కుటుంబ ఆదాయం పెంచుకోవాలన్నారు. ‘చింత’యూనిట్లో త్వరలో ప్రాసెసింగ్ పనులు సౌత్ ఇండియాలోనే మొదటి యూనిట్గా పరిగణిస్తున్న కురబలకోట చింతపండు యూనిట్లో త్వరలో ఉత్పత్తి పనులు ప్రారంభించడానికి సన్నాహాలు చేస్తున్నామన్నామని ఆమె ఈ సందర్భంగా తెలిపారు. టెక్నికల్ సిబ్బంది, ఇతర సాంకేతిక అవసరాలను గుర్తించామన్నారు. ఇన్నాళ్లు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలో ఈ యూనిట్ ఉండేదన్నారు. దీనిని పూర్తిగా ఉన్నతాధికారుల ఆదేశాలతో అన్నమయ్య జిల్లా పరిధిలోకి తీసుకొచ్చినట్లు చెప్పారు.సెర్ఫ్ అడిషినల్ డైరెక్టర్ మహిత, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ శ్రీనివాసులు, డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
సీటీఎంలో మేసీ్త్ర దారుణ హత్య
● బండ రాళ్లతో కొట్టి చంపేశారు ● వారం కూడా తిరగకనే మదనపల్లెలో మర్డర్ ● వరుస హత్యలతో భయాందోళన చెందుతున్న ప్రజలు మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలోని సీటీఎం రోడ్డు, తట్టివారిపల్లె చెరువు కట్టపై ఆదివారం కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్(45) దారుణ హత్యకు గురైన ఘటన మరువకనే సీటీఎం దళితవాడకు చెందిన మేసీ్త్ర మురళి బుధవారం తన ఊరికి సమీపంలోని కంకర ఫ్యాక్టరీ వద్ద దారుణ హత్యకు గురయ్యాడు. ఈ ఘటన తీవ్ర కలకలం రేపుతోంది. మేసీ్త్ర హత్య కేసుకు సంబంధించి తాలూక సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండలంలోని సీటీఎం దళితవాడలో కాపురం ఉంటున్న మద్దన్న కుమారుడు పలక మురళి (40) భవన నిర్మాణ మేసీ్త్రగా పని చేస్తూ తన భార్య మంజుల, ముగ్గురు పిల్లలను పోషించు కునేవాడు. రెండు రోజుల క్రితం మురళి తన భార్య మంజులతో గొడవ పడినట్లు తెలసింది. గొడవ దేనికి జరిగింది అన్నది తెలియ రాలేదు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం తన తమ్ముడు రవి దగ్గర మురళి రూ.20 రూపాయలు తీసుకుని వెళ్లాడు. అయితే సాయంత్రం నుంచి మురళి ఫోన్ స్విచ్ఆఫ్ రావడం, పలుచోట్ల గాలించినా ఆచూకీ లభించ లేదు. దీంతో రవి ఆందోళన చెందాడు. మురళితో కలసి కంకర ఫ్యాక్టరీ వైపు వెళ్లిన ఓ వ్యక్తి ని అనుమానించాడు. అతను కూడా కనిపించక పోడంతో కుటుంబీకులు కంకర ఫ్యాక్టరీ సమీపంలో బుధవారం గాలించగా, మేసీ్త్ర మురళి దారుణంగా హత్యకు గురైనట్లు గుర్తించారు. సంఘటన స్థలంలో ఖాళీ బీరు బాటిళ్లు పడిఉన్నాయి. మురళీని చంపే ముందు హంతకులు కలసి మద్యం తాగి ఉండవచ్చునని అనుమానిస్తున్నారు. మురళీ శరీరానికి నిప్పు పెట్టి కాల్చిన ఆనవాళ్లు గుర్తించారు. ముందుగా బండ రాళ్లతో మురళి తల పగులగొట్టి.. ఆ తర్వాత కాల్చినట్లు గుర్తించారు. ఈ హత్య ఉదంతంపై తాలూక పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే పోలీసులు హత్య జరగిన ప్రాంతానికి చేరుకుని పంచనామా అనంతరం, పోసు మార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించి హత్య కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కాగా వారం రోజుల వ్యవధిలోనే మదనపల్లెలో రెండు దారుణ హత్యలు జరగడంతో పోలీసుల వైఫల్యం కనిపిస్తోంది. -
రోడ్డు ప్రమాదంలో టైలర్కు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో టైలర్ తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని వలసపల్లె పంచాయతీ, నవోదయ కాలనీలో కాపురం ఉంటున్న టిఎస్. మహబూబ్ బాషా(50) టైలర్ పని చేస్తూ భార్య పిల్లలను పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో పట్టణానికి వెళ్లి దారాలు, ఇతర సామగ్రి తీసుకు రావాలని రోడ్డుపైకి వచ్చాడు. ఆటో కోసం వేచి ఉండగా ఓ స్కూటర్ వేగంగా వచ్చి టైలర్ ను ఢీకొట్టి వెళ్లి పోయింది. ఈ ప్రమాదంలో కాళ్లు చేతులు విరిగి తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు చికిత్స నిమిత్తం హుటా హుటిన జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్స అనంతరం టైలర్ ను రుయాకు తీసుకు వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై తాలూక పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
జాతీయ రహదారికి తూట్లు.. ప్రజలకు ఇక్కట్లు
● పోటాపోటీగా ప్రైవేటు టెలికాం సంస్థలు తవ్వకాలు ● నెల వ్యవధిలో రెండు మార్లు వేర్వేరుగా.. ● ధ్వంసం అవుతున్న కల్వర్టులు ● చోద్యం చూస్తున్న అధికారులు గుర్రంకొండ : జిల్లాలో ఎన్హెచ్ 340 జాతీయ రహదారిపై తవ్వకాలను రెండు ప్రయివేట్ టెలికామ్ సంస్థలు పోటీపడి మరీ నిర్వహిస్తున్నారు. నెలరోజుల వ్యవధిలోనే రెండు సంస్థలు వేర్వేరుగా తవ్వకాలు జరిపాయి. దీంతో ఎన్హెచ్ 340 జాతీయ రహదారి ధ్వంసం అవుతూ రూపురేఖలను కోల్పోతోంది. నెల రోజుల్లో రెండు మార్లు.. జిల్లాలో రూ.350 కోట్లతో అంగళ్లు నుంచి రాయచోటి వరకు ఎన్హెచ్ 340 జాతీయ రహదారిని ఏర్పాటు చేశారు. అయితే రహదారి పనులు పూర్తి చేసుకొన్న నాలుగేళ్ల నుంచి ఇప్పటికే పలుమార్లు పలు ప్రయివేట్ సంస్థలు, కొంతమంది వ్యక్తులు, సెల్ఫోన్ కంపెనీలకు చెందిన వారు యథేచ్ఛగా రహదారిపై తవ్వకాలు జరిపారు. అయితే తాజాగా రెండు ప్రముఖ టెలికామ్ సంస్థలు జాతీయ రహదారిపై తవ్వకాలు జరపుతున్నారు. నెలరోజుల కింద ఓ కంపెనీ వారు ఇష్టానుసారం రోడ్డును తవ్వేసి గుల్ల చేసి వారి పనులు పూర్తి చేసుకొని వెళ్లిపోయారు. తాజాగా మరో కంపెనీ వారు ప్రస్తుతం రాత్రింబవళ్లు జాతీయ రహదారిపై తవ్వకాలు జరుపుతున్నారు. గ్రామాల్లో ఎవరి అనుమతి లేకుండా రోడ్డుపైనా, పక్కన జేసీబీలతో తవ్వకాలు జరుపుతూనే ఉన్నారు. నెలరోజుల వ్యవధిలో రెండు టెలికామ్ సంస్థలు పోటీ పడీ మరీ తవ్వకాలు జరపడం గమనార్హం. దీంతో జాతీయ రహదారి దెబ్బతిని రూపరేఖలు మారిపోతోంది. ఇలాంటి పలుకుబడి ఉన్న వ్యక్తులకు, సంస్థలకు తవ్వకాలు జరుపుకొనేందుకు దరఖాస్తు చేసుకొనేదే ఆలస్యం.. వెంటనే అధికారులు ఆఘమేఘాలపై అనుమతులు ఇచ్చేస్తున్నారు. రైతులకు ముందస్తు సమాచారం ఏదీ? ఎన్హెచ్ 340 జాతీయ రహదారి పొడవునా రోడ్డు పక్కనున్న పొలాల వద్ద ప్రయివేట్ టెలికామ్ సంస్థలు ఇష్టానుసారం తవ్వకాలు జరిపేస్తున్నాయి. అయితే తమ పొలాల వద్ద తవ్వకాలు జరిపే సమయంలో తమకు ముందస్తు సమాచారం ఇవ్వరా అంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. ఇప్పటికే ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలకు గిట్టుబాటు లేక తీవ్రంగా నష్టపోయిన దిగాలు చెందుతున్న రైతులకు పొలాల వద్ద తమ అనుమతి లేకుండా ఇష్టానుసారం నిర్వహిస్తున్న తవ్వకాలతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. నెలరోజులుగా పొలాల వద్ద మూడు మార్లు తవ్వకాలు జరిపారని రైతులు అంటున్నారు. కొత్తగా ఏర్పాటు చేస్తున్న విద్యుత్ లైన్ కోసం ఇప్పటికే ట్రాన్స్కో అధికారులు తవ్వకాలు జరిపారు. కాగా నెలరోజుల వ్యవధిలో రెండు ప్రయివేట్ టెలికామ్ సంస్థలు కేబుళ్ల ఏర్పాటు కోసం రెండుమార్లు తవ్వకాలు జరిపారు. జేసీబీలతో ఇష్టానుసారం పొలాల వద్ద తవ్వకాలు నిర్వహిస్తూ ఇదేమిటని ప్రశ్నించే రైతులకు మీకు సమాధానం చెప్పాల్సిన పనిలేదంటూ నిర్లక్ష్యంగా సమాధానమిస్తున్నారు. తమ పొలాల వద్ద పనులు చేసే సమయంలో ముందుగా సమాచారం ఇవ్వరా ఆని రైతులు ప్రశ్నిస్తున్నారు. పొలాల కంచెలను, పైపులైన్లను జేసీబీలతో ఇష్టానుసారం ధ్వంసం చేసుకొంటూ పనులు నిర్వహించుకొంటుండటం గమనార్హం. పొలాల వద్ద పెద్ద పెద్ద సిమెంటు తొట్టెలను భూమిలోపల ఏర్పాటు చేసుకొంటున్నారు. రైతుల మాత్రం తమ కళ్ల ఎదుటే ఈ తతంగం అంతా జరుగుతున్నా ఏమీ చేయలేని నిస్సహాయ స్థితిలో ఉన్నారు. రైతులకేనా నిబంధనలు? ప్రభుత్వం అమలు చేస్తున్న నిబంధనలు కేవలం రైతులకు మాత్రమే వరిస్తాయా అని రైతులు ప్రశ్నిస్తున్నారు. గతంలో సాధారణ రహదారిగా ఉన్నప్పుడు అప్పటి ఆర్అండ్బీ అధికారుల అనుమతితో రైతులు రోడ్డుకు అవతలి వైపు ఉన్న పొలాలకు రోడ్డు నాలుగు ఇంచుల వెడల్పుతో తవ్వుకొని పైపులైన్లు ఏర్పాటు చేసుకొన్నారు. ఎన్హెచ్ 340 జాతీయ రహదారిగా మార్చినప్పుడు అధికారులు ఇష్టానుసారం జేసీబీలతో పైపులైన్లు ధ్వంసం చేసి రోడ్డు నిర్మాణ పనులు చేపట్టారు. ఆ తరువాత రైతులు అవతలి వైపు పొలాలకు పైపులైను ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి కోరగా.. అధికారులు ససేమిరా అంగీకరించక పోవడం గమనార్హం. జాతీయ రహదారి కోట్లాది రూపాయలతో నిర్మించామని, ఏళ్ల తరబడి మన్నిక రావాలని, ఇలా పైపులైన్ల కోసం తవ్వకాలు జరిపితే రోడ్డు నాణ్యత దెబ్బతింటుందని అధికారులు వేదాలు వల్లించినట్లుగా రైతులను బుకాయిస్తు సమాధానాలిచ్చారు. అదే సమయంలో ప్రయివేట్ వ్యక్తులకు, కొన్ని ప్రయివేట్ సంస్థలకు మాత్రం రోడ్డు మీద తవ్వకాలు జరుపుకొనేందుకు విచ్చలవిడిగా అనుమతులు ఇదే అధికారులు ఇస్తుండడం గమనార్హం. రైతులు పొరపాటున చిన్న పైపు రోడ్డుపై ఏర్పాటు చేస్తే అదేదో పెద్ద నేరం చేసినట్లుగా ఆగమేఘాలపై అక్కడ వాలి రైతులను సదరు అధికారులు అడ్డుకొన్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. ప్రయివేట్ సంస్థలు పైపులైన్లు ఏర్పాటు చేసుకొనేందుకు అనుమతి ఇచ్చే ఎన్హెచ్ 340 అధికారులు వ్యవసాయం కోసం పైపులైన్లు ఏర్పాటు చేసుకొనేందుకు ఎందుకు అనుమతి ఇవ్వరంటూ రైతులు ప్రశ్నిస్తున్నారు. రోడ్డు తవ్వకాల జరిపేందుకు ప్రయివేట్ సంస్థలకు వర్తించే నిబంధనలు, అనుమతులు రైతులకు ఎందుకు వర్తించవని గ్రామస్తులు చర్చించుకొంటున్నారు. రైతుల విషయంలో ఇప్పటికై నా సంబంధిత అధికారులు ఆత్మపరిశీలన చేసుకోవాలని రైతులు కోరుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కరువు నెల రోజుల వ్యవధిలో ఇష్టానుసారంగా రోడ్లపై తవ్వకాలు జరుపుతూ ఎన్హెచ్ 340 జాతీయ రహదారి రూపురేఖలను మార్చేస్తున్నారు. అయితే సంబంధిత అధికారులు మాత్రం ఇటువైపు కన్నెత్తి చూడడం లేదని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. జాతీయ రహదారిపై తవ్వకాలు జరిపే సమయంలో సంబంధిత అధికారుల పర్యవేక్షణ తప్పనిసరిగా ఉండాల్సి ఉంటుంది. అయితే అధికారులు పనులు జరిగే ప్రదేశాల్లో ఎక్కడా కనిపించడం లేదు. గ్రామాల్లో పనులు చేసే సమయంలో పంచాయతీరాజ్ అధికారులు, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు పర్యవేక్షణ కొరవడడంతో ఇష్టానుసారంగా తవ్వకాలు జరుపుతున్నారు. రోడ్డుకు ఇరువైపులా ఉన్న డ్రైనేజీలు, కల్వర్టులు, తాగునీటి పైపులైన్లను జేసీబీలతో ఇష్టానుసారంగా ధ్వంసం చేస్తున్నారు. అయితే అధికారులు మాత్రం కళ్లుండి చూడలేని స్థితిలో ఉన్నారు. ప్రయివేట్ టెలికామ్ సంస్థలు మాత్రం తమకు నచ్చిన విధంగా పనులు చేసుకొంటూ వెళ్లిపోతున్నారు. గ్రామాల్లో రోడ్డుకు ఇరువైపులా ఎక్కడ చూసినా తవ్వకాలు, తేలిపోయిన కంకర, తూతూమంత్రంగా పూడ్చిన గోతులు దర్శనమిస్తున్నాయి. దీంతో జాతీయ రహదారి కాస్తా గ్రామీణ రహదారిగా మారిపోతోంది. ఇంత జరుగుతున్నా అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యహరిస్తుండడం పట్ల విమర్శలు వ్యక్తమవుతున్నాయి. -
టీ 20 మ్యాచ్ విజేత అనంతపురం జట్టు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ సౌత్జోన్ మెన్ టీ20 మ్యాచ్లు ఎంతో ఉత్సాహంగా ముగిశాయి. ఈ టీ20 మ్యాచ్లో అనంతపురం జట్టు 12 పాయింట్లతో ప్రథమ స్థానంలో నిలవగా, కడప 8 పాయింట్లతో రెండవ స్థానంలో నిలిచింది. మంగళవారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్లో కడప–చిత్తూరు జట్లు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన చిత్తూరు జట్టు ఫీల్డింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ను ప్రారంభించిన కడప జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 3 వికెట్ల నష్టానికి 234 పరుగులు చేసింది. ఆ జట్టులోని వంశీకృష్ణ అద్భుతంగా బ్యాటింగ్ చేసి 53 బంతుల్లో 2 ఫోర్లు, 12 సిక్సర్లతో 107 పరుగులు చేశాడు. జహీర్ అబ్బాస్ 85 పరుగులు చేశాడు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ 1, సూర్య చరణ్ 1, దీపన్ సాయినాథ్ 1 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన చిత్తూరు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 218 పరుగులు చేసింది. ఆ జట్టులోని తేజరెడ్డి 49, జివి చరణ్జిత్ 55 పరుగులు చేశారు. కడప జట్టులోని ఆరిస్ బాషా 3 వికెట్లు తీసుకున్నాడు. దీంతో కడప జట్టు 16 పరుగుల తేడాతో విజయం సాధించింది. నెల్లూరుపై అనంతపురం జట్టు విజయం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యాహ్నం జరిగిన మ్యాచ్లో నెల్లూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. ముందుగా టాస్ గెలిచిన నెల్లూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు నిర్ణీత 19.3 ఓవర్లకు 168 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని తోఫిత్ యాదవ్ 48, సాకేత్రామ్ 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని మల్లికార్జున అద్భుతంగా చక్కటి లైనప్తో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. వినయ్కుమార్ 2, ప్రమోద్కుమార్ 2 వికెట్లు తీసుకున్నారు. అనంతరం బ్యాటింగ్ను ప్రారంభించిన అనంతపురం జట్టు నిర్ణీత 12.3 ఓవర్లకు 3 వికెట్లు కోల్పోయి 172 పరుగులు చేసింది. నెల్లూరు జట్టులోని సాకేత్రామ్ 3 వికెట్లు తీశాడు. దీంతో అనంతపురం జట్టు 7 వికెట్ల తేడాతో విజయం సాధించింది. ఈ టీ20 మ్యాచ్ల్లో అనంతపురం జట్టు 15 పాయింట్లతో ముందంజలో ఉండగా , కడప 12 పాయింట్లతో రెండవ స్థానం, నెల్లూరు జట్టు 8 పాయింట్లతో మూడవ స్థానం, చిత్తూరు జట్టు 4 పాయింట్లతో నాల్గవ స్థానం సాధించింది. కాగా కర్నూలు జట్టు సున్నా పాయింట్లతో చివరి స్థానంలో నిలిచింది. టి.వంశీకృష్ణ, 107 పరుగులు (కడప) మల్లికార్జున, 4 వికెట్లు (అనంతపురం) జహీర్ అబ్బాస్, 85 పరుగులు (కడప) ఆరిఫ్ బాషా, 3 వికెట్లు (కడప) -
సూరీడు ‘ఎండ’ప్రచండమై విజృంభిస్తున్నాడు.. ఎర్రగా మారి నిప్పుల వాన కురిపిస్తున్నాడు.. ఏప్రిల్ రెండోవారంలోనే తన విశ్వరూపాన్ని చూపిస్తూ భగభగమండుతున్నాడు.. సూర్య తాపానికి జనం ‘ఉక్క’రిబిక్కిరవుతున్నారు... ఉదయం 11 దాటిందంటే చాలు జనాలు లేక రోడ్లు రోడ్లు కర్ఫ్యూన
మదనపల్లె: ఒక వైపు ఎండ తీవ్రత.. మరోవైపు ఉక్కపోత.. వెరసి జనం విలవిల్లాడుతున్నారు. జిల్లాలో వారం రోజుల నుంచి గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. దీనికి తోడు వడగాడ్పులు ‘ఉక్క’రిబిక్కిరి చేస్తున్నాయి. గతంలో ఎన్నడు లేని విధంగా ఏప్రిల్ రెండవ వారంలోనే జిల్లాలో ఉష్ణోగ్రత 40 డిగ్రీలకు చేరింది. ఫలితంగా జనం ఉక్కిరి బిక్కిరి అవుతున్నారు. దీంతోపాటు రాత్రి(కనిష్ట) ఉష్ణోగ్రతలు కూడా క్రమేపీ పెరగుతున్నాయి. అటు పగలు, ఇటు రేయి ఉక్కపోతతో జనాలు నిద్రలు లేని రాత్రుల గడుపుతున్నారు. రానున్న రోజుల్లో 45 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదయ్యే ప్రమాదం ఉందని.. జాగ్రత్తలు తీసుకోవాలని వాతావరణ నిపుణులు హెచ్చరిస్తున్నారు. తీసుకోవాల్సిన జాగ్రత్తలు... ● బయటకు వెళ్లేటప్పుడు ఎండ తీవ్రతన తప్పించుకునేందుకు తప్పనిసరిగా గొడుగు లేదా టోపీ వాడాలి ● తెలుపురంగు, పలచటి వస్త్రాలతోపాటు లూజుగా ఉన్న దుస్తులనే దరించాలి ● ఉదయం 11 గంటల నుంచి సాయంత్ర 4 గంటల మధ్య అవసరమైతే తప్ప ఆరుబయట తిరగకూడదు ● వీలైనని సార్లు నీరు తాగడం చేయాలి. అలాగే ఎండలో తిరిగే సమయంలో కొబ్బరినీరు, మజ్జిగ, పండ్ల రసాలు వంటి ఎక్కువగా తీసుకోవాలి. అలాగే నీటిలో నిమ్మరసం, కాస్తంత ఉప్పు కలిపిన ద్రావాణాన్ని కూడా అప్పడప్పుడు తీసుకుంటే మంచిది. ● దూరప్రాంతాలకు ప్రయాణం చేసే వారు ఉదయం 10 గంటలలోపు గమ్యాలను చేరుకునేలా ప్లాన్ చేసుకోవాలి. అలాగే సాయంత్ర 4 గంటల తరువాత ప్రయాణం చేయాలి. ● ఎండలో బయటకు వెళ్లినప్పుడు తల తిరగడం, వికారంగా వంటి లక్షణాలు కనిపిస్తే తక్షణం వైద్యులను సంప్రదించి తగిన సూచనలు, సలహాలను పాటించడంతోపాటు జాగ్రత్తలు తీసుకోవాలి. పెరిగిన విద్యుత్తు వినియోగం... జిల్లాలో ఎండల తీవ్రత పెరగడంతో విద్యుత్తు వినియోగం కూడా భారీగా పెరిగింది. ఎండల తీవ్రతకు తట్టుకోలేక 24 గంటలను ఫ్యాన్లు తిరగాల్సి వస్తుంది. వీటితోపాటు కూలర్లు, ఏసీల వాడకం కూడా పెరిగింది. బయట తిరిగే జనాలు ఎండ నుంచి తప్పించుకునేందుకు టోపీలను, చిన్నపాటి గోడుగులను కొనుగోలు చేస్తున్నారు. వీటితోపాటు ఎత్తైన భవనాల్లో ఉండేవాళ్లు కూల్ పెయింట్లను వేయించుకుంటున్నారు. ఠారెత్తిస్తున్న ఎండలు ...ఉక్కతో ఉక్కిరిబిక్కిరవుతున్న జనం ఏప్రిల్ రెండో వారంలోనే42 డిగ్రీలు దాటిన ఉష్ణోగ్రతలు వేడి తీవ్రతకు అల్లాడుతున్న ప్రజానీకం రాబోవు రోజుల్లో మరింత తీవ్రరూపం జాగ్రత్తలు తప్పవంటున్న నిపుణులు -
● వెలగని విద్యుద్దీపాలు
ఎన్హెచ్ 340 జాతీయ రహదారి నిర్మాణ పనుల్లో భాగంగా కోట్లాది రూపాయలు ఖర్చుచేసి ఏర్పాటు చేసిన విద్యుద్దీపాలు తవ్వకాలు పుణ్యమా అని వెలగడం లేదు. జాతీయ రహదారికి ఇరువైపులా పెద్ద ఎత్తున ఎల్ఈడీ విద్యుద్దీపాలు ఏర్పాటు చేశారు. వీటకి విద్యుత్లైన్ల ఏర్పాటు అంతా భూగర్భంలోనే ఉంది. నెల రోజుల వ్యవధిలో ప్రయివేట్ టెలికామ్ సంస్థలు జరిపిన తవ్వకాల్లో విద్యుత్ కేబుళ్లు దెబ్బతిని పలుచోట్ల తెగిపోయాయి. దీంతో నెలల తరబడి విద్యుద్దీపాలు వెలగడంలేదు. జాతీయ రహదారిపై నిత్యం వాహనాల రాకపోకల రద్దీ ఎక్కువగా ఉంటుంది. రాత్రిళ్లు దీపాలు వెలగక పోవడంతో రహదారి మొత్తం అంధకారంగా మారుతోంది. దీంతో చీకట్లో వాహనాల రాకపోకలకు తీవ్ర అంతరాయం కలుగుతోంది. -
అందినకాడికి దోచుకున్నారు!
సాక్షి ప్రతినిధి, కడప: కడప నగరంలోని వివాదాస్పద విజయదుర్గ కాలనీ వెంచర్ అనుమతులపై విచారణ వేగవంతమైంది. సుమారు రెండు దశాబ్దాల క్రితం వేసిన ఈ వెంచర్ వల్ల కేసీ కెనాల్, రహదారి స్థలం అన్యాక్రాంతమైంది. చుట్టుపక్కల భూములతో కలిపి చదును చేసినట్లు తీవ్ర ఆరోపణ ఉంది. నిబంధనలను కేసీ కాలువలో తొక్కుతూ.. ఎంచక్కా కమీషన్లు తీసుకుంటూ అడ్డగోలుగా పర్మిషన్ ఇచ్చిన అధికారులు ఇన్నాళ్ల తర్వాత సంజాయిషీ ఇచ్చేందుకు జేసీ ఎదుట హాజరుకావడం చర్చనీయాంశంగా మారింది. జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిధిమీనా ప్రశ్నలకు సదరు అధికారులు ఉక్కిరిబిక్కిరి కావాల్సి వచ్చింది. తేలుకుట్టిన దొంగల్లా మిన్నకుండి పోయే దుస్థితి వచ్చింది. టౌన్ ఫ్లానింగ్ అధికారుల అక్రమార్జన కారణంగా తిలా పాపం తలా పిడికెడు అన్నట్లుగా కార్పొరేషన్ యంత్రాంగం క్యూ కట్టాల్సి వచ్చింది. ● రెండు దశాబ్దాల క్రితం విజయదుర్గ కాలనీ వెంచర్ వేశారు. అప్పట్లో రైతుల భూములతో పాటు ఆ భూములకు ఉన్న కాలువలు, కాలువకు ఇరువైపులా ఉన్న దారి దాదాపు 2.5 ఎకరాలు అన్యాక్రాంతమైందని అప్పట్లో ఆరోపణలు వచ్చాయి. పత్రికల్లో కథనాలు సైతం వెలుగుచూశాయి. ఆమేరకు అడపదడపా ఉన్నతస్థాయిలో పలువురు ఫిర్యాదులు కూడా చేశారు. ఫిర్యాదులు వచ్చిన ప్రతిసారి సదరు అధికారులు వెంచర్ యజమానులకు అనుకూలంగా రిపోర్టులు ఇస్తూ వ్యవహారాన్ని తొక్కిపెట్టేవారు. అప్పట్లో కార్పొరేషన్ అధికారుల పాలిట విజయదుర్గ వెంచర్ కామధేనువుగా మారిందనే విమర్శలు ఉన్నాయి. విజయదుర్గా వెంచర్లో అక్రమాలు ... ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం వ్యవహారం విచారణ చేయాల్సిందిగా జాయింట్ కలెక్టర్ డాక్టర్ నిఽధిమీనాకు ప్రభుత్వ ఆదేశాలు జారీ అయ్యాయి. ఆమేరకు ఫైల్ను పరిశీలించిన జాయింట్ కలెక్టర్ అప్పట్లో పనిచేసిన కమిషనర్లు ఆలీంబాషా, శ్యాంసన్, ఓబులేసు, చంద్రమౌళీశ్వరరెడ్డిలను ఇటీవల పిలిపించారు. వారితో పాటు అప్పట్లో తహశీల్దార్గా పనిచేసిన రవిశంకర్రెడ్డి, టౌన్ ఫ్లానింగ్ అధికారులు కృష్ణ సింగ్, శారదమ్మలను సైతం పిలిపించి అడ్డగోలు అనుమతుల వ్యవహారంలో ఎవరెవరి ప్రమేయం ఎంత ఉందంటూ అధికారుల వివరణను జాయింట్ కలెక్టర్ తెలుసుకునే ప్రయత్నం చేశారు. దాంతో ఒక్కమారుగా అధికారులంతా అవాక్కయ్యారు. మరీ ముఖ్యంగా టౌన్ ఫ్లానింగ్ అధికారులు తేలుకుట్టిన దొంగలా ఉండిపోవాల్సి వచ్చిందని తెలుస్తోంది. నదులు, కాలువల పొరంబోకు స్థలం అన్యాక్రాంతం వ్యవహారంపై కోర్టు తీర్పులు తీవ్రంగా ఉన్న నేపధ్యంలో ముందు పనిచేసిన అధికారుంతా బిక్కమొహం వేసినట్లు తెలుస్తోంది. వివరణ ఇచ్చేందుకు ఈనెల 30 వరకూ గడువు కావాలంటూ ఆయా అధికారులు జాయింట్ కలెక్టర్ను కోరినట్లు సమాచారం. ఆ మేరకు ఇదివరకూ కడపలో పనిచేసిన కమిషనర్లు ఆ నలుగురు అధికారులు మరోమారు కడపకు రావాల్సి ఉంది. రెండు దశాబ్దాలుగా నానుతూ వస్తున్న ఈ విజయదుర్గ వెంచర్ వ్యహారం జాయింట్ కలెక్టర్ నిధిమీనా నేతృత్వంలోనైనా ఒ కొలిక్కి వస్తుందేమో చూడాలి. విజయదుర్గ కాలనీ వెంచర్అనుమతుల ఆరోపణలపై కూపీలాగుతున్నారు! ఇదివరకూ పనిచేసినకమిషనర్లకు తాఖీదులు జేసీ ఎదుట విచారణకు హాజరు సంజాయిషీ కోసం ఈనెల 30 వరకుగడువు కోరిన కమిషనర్లు తేలుకుట్టిన దొంగల్లా టౌన్ ప్లానింగ్ యంత్రాంగం -
ఎలుకల మందు తాగి యువకుడి ఆత్మహత్య
నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : మద్యం మత్తులో ఓ యువకుడు ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మంగళవారం నిమ్మనపల్లె మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి మృతుడి కుటుంబీకులు, నిమ్మనపల్లె పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని రాచవీటివారిపల్లె పంచాయతీ గుండ్లబురుజుకు చెందిన శివయ్య, విజయమ్మ దంపతుల కుమారుడు కుమార్ ఆచారి (20) మంగళవారం ఉదయం మద్యం మత్తులో ఇంట్లో ఉన్న ఎలుకల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితుడిని హుటా హుటిన మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించారు. పరిస్థితి విషమించడంతో డాక్టర్లు వెంటనే తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబీకులు 108 వాహనంలో రుయా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గంమధ్యలోని చిన్నగొట్టిగల్లు వద్దకు వెళ్లగానే మృతి చెందాడు. ఏడాది క్రితం భర్త చనిపోడం ఇంటికి పెద్ద దిక్కుగా ఉంటాడు అనుకున్న పెద్ద కొడుకు జులాయిగా తిరుగుతూ.. చెడు వ్యసనాలకు బానిసయ్యాడు. ఈ క్రమంలో తరచూ మద్యం తాగటం అలవాటు పడి, ఇలా అర్ధాంతరంగా చనిపోయి కడుపుకోత మిగల్చడంతో తల్లీ శోకసంద్రంలో మునిగిపోయింది. ఆత్మహత్యపై నిమ్మనపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో ఓ వివాహిత క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. మంగళవారం బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకున్న ఘటనపై మదనపల్లె జిల్లా ఆస్పత్రి ఔట్పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని జరప్పల్లికి చెందిన రెడ్డెప్ప భార్య చైత్ర(26) కుటుంబ సమస్యలతో ఇంట్లో ఉన్న క్రిమి సంహారక మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి చైత్రను వెంటనే బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు ప్రథమ చికిత్సలు అందించారు. అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కుటుంబీకులు బాధితురాలిని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్సల అనంతరం ఆమె పరిస్థితి ఆందోళనకరంగా ఉందని తిరుపతికి వెళ్లాలంటూ రెఫర్ చేశారు. డాక్టర్ల సలహా మేరకు చైత్రను బయటి ఆస్పత్రికి తీసుకు వెళ్లారు. బి.కొత్తకోట పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. అన్నదమ్ములపై కర్రలతో దాడి మదనపల్లె టౌన్ : ఇంటి నిర్మాణం అడ్డుకొని అన్నదమ్ములపై ప్రత్యర్థులు కర్రలు, రాళ్లతో మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ములకలచెరువు మండలంలో జరిగింది. మంగళవారం బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. సోంపాళ్యంకు చెందిన అన్నదమ్ములు ఊరికి ఆనుకుని ఉన్న ప్రభుత్వ స్థలంలో పునాది వేసి ఇంటి నిర్మాణానికి పూనుకున్నారు. అదే సమయంలో అక్కడికి తన అనుచరులతో వచ్చిన మారయ్య ఆ స్థలం తమదంటూ గొడవకు దిగాడు. గొడవ తారా స్థాయికి చేరింది. అప్పటికే వెంట తెచ్చుకున్న కర్రలు, రాళ్లతో మారయ్య తన అనుచరులు అన్నదమ్ములు కుమార్, అనీల్ పై విచక్షణా రహితంగా దాడి చేసి చితక బాదారు. వారికి గాయాలు కావడంతో కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం వారిని ఆస్పత్రిలోనే చేర్పించి వైద్యం అందిస్తున్నారు. ఘర్షణ సమాచారంపై ములకలచెరువు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
భానుడి భగభగ!
జిల్లాలో భానుడి ప్రతాపానికి జనం బెంబేలెత్తిపోతున్నారు. ఏప్రిల్ రెండో వారమే ఇలాగుంటే ఈ నెలాఖరును తట్టుకోగలమా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం రద్దీగా ఉండే ప్రాంతాలు, పట్టణాలే కాక, పల్లెల్లోనూ జనం వ్యవసాయ పనులు, పనుల నిమిత్తం మండల కేంద్రాలు, పట్టణాలకు వెళ్లేందుకు సాహసించడం లేదు. దాంతో రద్దీ తగ్గగా రహదారులు, వీధుల్లోనూ జన సంచారం భారీగా తగ్గిపోయింది. జిల్లా కేంద్రం మదనపల్లె చల్లని ప్రాంతం. ఇక్కడ కూడా ఉష్ణోగ్రతలు పెరిగాయి. మదనపల్లె సహా నియోజకవర్గ కేంద్రాలు తంబళ్లపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి పట్టణాల్లో ఎండల ప్రభావం కనిపిస్తోంది. మంగళవారం నెలకొన్న ఉష్ణోగ్రతలు 36 నుంచి 39 వరకు నమోదవ్వగా, పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై 34 డిగ్రీలు నమోదుకావడం ఆశ్చర్యానికి గురిచేస్తోంది. మండుతున్న హార్సిలీహిల్స్ సముద్రమట్టానికి 4,141 అడుగుల ఎత్తులో ఉండి మండుటెండలోనూ చల్లటి ఆహ్లదకరనమైన వాతావరణం కలిగే ఆంధ్రాఊటీ హార్సిలీహిల్స్ సైతం మండిపోతోంది. కొండపై ఎంతటి ఎండలోనూ 24 డిగ్రీల సెల్సియస్కు మించదు. అలాంటి మంగళవారం 34 డిగ్రీలకు చేరింది. ఇంతటి ఎండలు ఎప్పుడులేవని పర్యాటకులు, స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఉష్ణోగ్రతలతో ఆంధ్రాఊటీ పేరు చెదిరిపోయే ప్రమాదం కనిపిస్తోంది. హార్సిలీహిల్స్పైనా ఎండలు ఉంటే ఇక ప్రత్యేకత అంటూ లేకుండాపోతుంది. దీనికి ప్రధాన కారణంగా చుట్టూ దట్టమైన అటవీప్రాంతం కలిగిన కొండను కాంక్రీటు వనంగా మార్చేస్తున్నారు. అనధికార కట్టడాలు మితిమిరిపోతున్నా అధికార యంత్రాంగం రాజకీయ ఒత్తిళ్లతో నిస్సహాయంగా మారింది. పదేళ్లుగా పర్యావరణం ఊహించని విధంగా మారడానికి నిర్మా ణాలు, పారిశుద్ధ్యం, వ్యర్థాలు, ప్లాస్టిక్ వినియోగం. వీటిని నియంత్రించాల్సిన అధికార యంత్రాంగం తమకు సంబంధం లేనట్టుగా వ్యవహరిస్తోంది. -
సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి వేధింపులు
రొంపిచెర్ల : సివిల్ కేసును రొంపిచెర్ల పోలీసులు క్రిమినల్ కేసుగా మార్చి వేధిస్తున్నారని రొంపిచెర్ల గ్రామానికి చెందిన రైతు మొగల్ సూల్తాన్ బేగ్, గహీదుల్లా బేగ్ జిల్లా ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు మంగళవారం తెలిపారు. బాధితుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మయ్యగారిపల్లె గ్రామపంచాయతీలోని సర్వే నంబరు 564లో బండిబాట (10 అడుగులు)పై తమకు సర్వ హక్కులు ఉన్నాయని అన్నారు. అయితే యాకుబ్సాబ్ కుమారుడు మహ్మద్రఫీ తమకు బండి బాట లేదని 2021లో అభ్యంతరం చెప్పారని పేర్కొన్నారు. దీంతో తహసీల్దార్కు తమ రికార్డులు చూపించగా, ప్లాన్లో 10 అడుగులు బండి బాట ఉందని తేల్చి చెప్పారని తెలిపారు. అయితే మహ్మద్రఫీ రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేయడంతో తమపై సివిల్ కేసును క్రిమినల్ కేసుగా మార్చి వేసి అప్పుటి ఎస్ఐ వెంకటేశ్వర్లు తప్పుడు కేసు బనాయించాడని తెలిపారు. ఇదేమని అడిగితే మమ్మద్రఫీ చెప్పినట్లు వింటేనే కేసును మూసి వేస్తామని ఎస్ఐ బెదిరించారని తెలిపారు. మీ భూమిని వదిలి వేయాలని, లేకపోతే మహ్మద్ రఫికి రూ.10 లక్షలు ఇవ్వాలని బెదిరించారని విలపించారు. నాలుగు సంవత్సరాలుగా పోలీసు స్టేషన్ చుట్టూ తిరుగుతున్నా ఎవరూ పట్టించుకోవడం లేదని అన్నారు. ఇప్పుటికై నా న్యాయం చేయాలని ఎస్పీని కోరారు. దీంతో ఎస్పీ బాధితుడికి న్యాయం చేయాలని కల్లూరు సీఐ జయరాం నాయక్, రొంపిచెర్ల ఎస్ఐ మధుసూధన్ను ఆదేశించారు. వారం రోజులలో న్యాయం చేస్తామని పోలీసులు హామీ ఇచ్చారని బాధితులు తెలిపారు. రొంపిచెర్ల పోలీసులపై ఎస్పీకి ఫిర్యాదు -
ఫలితం ఎలాగైనా రానీ...ప్రయత్నం కొనసాగనీ!
మదనపల్లె సిటీ: మార్కులు, ర్యాంకుల కన్నా జీవితం ఎంతో ముఖ్యమైనది. పరీక్షల్లో ఫెయిలైతే ఇంకోసారి రాసేందుకు అవకాశం ఉంటుంది. కుంగుబాటుకు గురై తొందర పాటు నిర్ణయాలు తీసుకుంటే విలువైన జీవితానికి ఇంకో సప్లిమెంటరీ ఉండదు. అందుకే ఫలితం ఎలా వచ్చినా ప్రయత్నం అనే ప్రయాణాన్ని కొనసాగిస్తే మున్ముందు ఎన్నో మంచి మైలురాళ్లు కనిపిస్తాయి. వాటిని చేరుకుంటే చక్కటి భవిష్యత్తు ఉంటుంది. ఇంటర్మీడియట్ ఫలితాలు బుధవారం విడుదల అవుతున్న నేపథ్యంలో వ్యక్తిత్వ వికాస నిపుణులు చాముండేశ్వరి విద్యార్థులకు, తల్లిదండ్రులకు పలు సూచనలు చేశారు. ప్రియమైన విద్యార్థులకు... విజయం అనేది ఒక మార్కు షీట్లోనే ఉండదు. పట్టుదల, నమ్మకంలో ఉంటుంది. ఈ రోజు వచ్చిన ఫలితం మీ శ్రమకు ఒక అంచనా మాత్రమే. మార్కులు తగ్గినా, ఫెయిలైనా మీకు ప్రతిభ లేనట్లు కాదు. మీ భవిష్యత్తును అది ఏ మాత్రమూ ప్రభావితం చేయదు. ఒక ఫలితం మీ విలువను నిర్ణయించదు. మీ ప్రయత్నమే మీకు అసలైన గుర్తింపు. జీవి తం ఒక పరీక్ష కాదు. పరీక్షలు జీవితంలో ఒక చిన్న భాగం మాత్రమే. ఈ రోజుటి ఫలితాన్ని బట్టి మీరు ఏ మాత్రం కుంగిపోవద్దు. స్నేహితులతో తల్లిదండ్రు లతో మాట్లాడండి. సానుకూలంగా ఉండండి. మరో ప్రయత్నంతో మంచి ఫలితం తప్పకుండా వస్తుంది. గౌరవనీయులైన తల్లిదండ్రులకు... ఈ రోజు మీ ఒక్క చూపు. ఒక్క మాట. మీ పిల్లల మనసులో జీవితాంతం నిలుస్తుంది. వారిని హత్తుకొని ఫలితం ఎలా వచ్చినా ఫర్వాలేదని ముందే చెప్పండి. ఒకవేళ ఆశించిన ఫలితం రాకుంటే వారు కొంచెం బాధలో ఉంటారు. మార్కులే మీకు గౌరవమని భావించకండి. ఇతరులతో పోలుస్తూ మీ వాళ్లను తక్కువ చేయొద్దు. వారి ఆనందమే మీకు నిజమైన సంపద. వాళ్లను బాధపెట్టకండి. అండగా నిలవండి. ఏం ఫర్వాలేదు మేమున్నామనే భరోసా ఇవ్వండి. మీ ఆత్మీయత, మీరిచ్చే ఽధైర్యం వారి జీవితాన్ని మార్చగలదు. నేడు ఇంటర్మీడియట్ ఫలితాలు -
బహుముఖ ప్రజ్ఞాశాలి అంబేడ్కర్
కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె: భారతరత్న డాక్టర్ బాబాసాహెబ్ అంబేడ్కర్ బహుముఖ ప్రజ్ఞాశాలి అని కలెక్టర్ నిశాంత్ కుమార్ అన్నారు. అంబేడ్కర్ 135వ జయంతి సందర్భంగా మంగళవారం స్థానిక ఓ కళ్యాణ మండపంలో జిల్లా సాంఘిక సంక్షేమశాఖ ఆధ్వర్యంలో ఆయన చిత్రపటానికి నివాళులర్పించి వేడుకలను నిర్వహించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ అంబేడ్కర్ ఆలోచనలు, సిద్ధాంతాలు సమాజంలో ప్రతి వర్గానికి మార్గదర్శకమని అన్నారు. సమానత్వం, న్యాయం, స్వేచ్ఛ, సౌభ్రాతృత్వం, విలువల ఆచరణకు ఆయన చేసిన కృషి చిరస్మరణీయమని కొనియాడారు. ఎమ్మెల్యే షాజహాన్బాషా మాట్లా డారు. కార్యక్రమంలో ఇంచార్జ్ డీఆర్వో చంద్రశేఖర్ రెడ్డి, సాంఘిక సంక్షేమ అధికారి దామోదర్ రెడ్డి, డిఆర్డిఏ పిడి నాగేశ్వరరావు, సివిల్ సప్లై కార్పొరేషన్ డైరెక్టర్ ఎస్ఎం.పర్వీన్ తాజ్, భావన, మార్కెట్ కమిటీ చైర్మన్ జి.శివరాం, రాష్ట్ర మాల మహానాడు ప్రెసిడెంట్ వై.సుదర్శనం, డివిఎంసి మెంబర్లు పి.శ్రీనివాసులు, చంద్రశేఖర్, ఎస్. రామకృష్ణ, జి.వెంకటరమణ, బాస్ వ్యవస్థాపకులు పీటీఎం.శివప్రసాద్, ఎమ్మార్పీఎస్ నరేంద్రబాబు, శ్రీచందు, ఎస్సీ ఎస్టీ నాయకులు బొజ్జప్ప, దివాకర్, పోతపోలు రెడ్డప్ప, పి.వెంకటరమణ, దళిత సంఘర్షణ సంస్థ చిన్నప్ప, బి.రమణ వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
పనుల్లో జాప్యం నిజమే
– సాక్షి కథనంపై టూరిజం డీవీఎం మదనపల్లె : ఈనెల 13న సాక్షిలో ప్రచురితమైన ‘పని లేని పర్యాటకశాఖ’ కథనంపై టూరిజం తిరుపతి డివిజనల్ మేనేజర్ శ్రీనివాసులు స్పందించారు. ఈ మేరకు ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. అందులో సాక్షి కథనం వాస్తవాలకు విరుద్ధంగా ఉందని చెబుతూనే, అందులో పేర్కొన్న అంశాలన్నీ నిజాలేనని స్పష్టంగా అంగీకరించారు. సాక్షిలో పేర్కొన్నట్టుగానే ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని నగరి, పలమనేరు, కుప్పం యూనిట్లను ప్రయివేటుకు అప్పగించడం జరిగిందని తెలిపారు. బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ యూనిట్లో అతిథి గృహల అభివృద్ధికి, ఆధునికీకరణకు రూ.10 కోట్లతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం పనులు చేపట్టగా పనులు దక్కించుకున్న కాంట్రాక్టర్ నిర్ణీత గడువులో పూర్తి చేయకపోవడంతో ప్రస్తుతం పనులు పెండింగ్లో ఉన్నట్టు ఆయన పేర్కొన్నారు. దాంతో సాక్షిలో రాసిన కథనం నిజమేనని ఆయన ఆ ప్రకటనలో పేర్కొన్నారు. స్కూటర్ ఢీకొని వృద్ధుడికి గాయాలు మదనపల్లె టౌన్ : స్కూటర్ ఢీకొని వృద్ధుడు గాయపడిన సంఘటన మంగళవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. రోడ్డు ప్రమాదానికి సంబంధించి బాధితుని కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ బండకిందపల్లెకు చెందిన రైతు వెంకటరమణ(65) సొంత పనిమీద మదనపల్లెకు వచ్చాడు. స్థానిక చిత్తూరు బస్టాండులో బస్సు దిగి రోడ్డు పక్కన అంగడి వద్దకు నడిచి వెళుతుండగా ఓ స్కూటరిస్టు వచ్చి ఢీకొట్టి వెళ్లి పోయాడు. ఈ ప్రమాదంలో గాయపడిన బాధితున్ని అదే సమయంలో అక్కడికి వచ్చిన ఓ కారు యజమాని జిల్లా ఆస్పత్రికి తరలించాడు. దీంతో వృద్ధుడు ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై ఒకటో పట్టణ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఏటీఎంలలో నగదు నిల్
మదనపల్లె సిటీ: జిల్లా కేంద్రంలో మదనపల్లెలో ఏటీఎంలలో నగదు నిల్వలు నిండుకున్నాయి. ముఖ్యంగా ఎస్బీఐ ఏటీఎంలు చాలా వరకు మూసివేశారు. మార్చి 31 నుంచి మదనపల్లె పట్టణంలో ఈ పరిస్థితి ఉందని ఖాతాదారులు వాపోతున్నారు. క్యాష్ డిపాజిట్ మెషిన్లు కూడా సక్రమంగా పని చేయడం లేదనే విమర్శలున్నాయి. ఎస్బీఐ అధికారులు చర్యలు చేపట్టి నగదు కష్టాలకు పరిష్కారం చూపాలని వినియోగదారులు కోరుతున్నారు. మదనపల్లె: అభివృద్ధి పనుల విషయంలో త్వరితగతిన పూర్తి చేయడంతోపాటు ప్రణాళికాబద్దంగా ముందుకు వెళ్లాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ జిల్లా ఏపీ ఈడబ్ల్యూఐడీసీ ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ కరీముల్లాఖాన్కు సూచించారు. తమ శాఖ పరిధిలో జరుగుతున్న పలు అభివృద్ధి పనులను ఈఈ కలెక్టర్కు వివరించారు. గ్యారం పల్లె రెసిడెన్షియల్ స్కూల్ కు సంబంధించిన పనులను శాఖద్వారా చేపట్టాలని కోరుతూ కలెక్టర్ పరిపాలన మంజూరు ఉత్తర్వును అందజేశారు. ఈ కార్యక్రమంలో మదనపల్లి డిఈఈ సుధాకర్ పాల్గొన్నారు. కడప సెవెన్రోడ్స్: సర్వే సెటిల్మెంట్ ల్యాండ్ రికార్డ్స్ కార్యాలయంలో అసిస్టెంట్ డైరెక్టర్గా పనిచేస్తున్న వేణును డిప్యూటేషన్పై జిల్లా సర్వే అండ్ ల్యాండ్ రికార్డ్స్ అధికారిగా ప్రభుత్వం నియమించింది. ఈ మేరకు మంగళవారం ఆయన బాధ్యతలు చేపట్టారు. అనంతరం వేణు కలెక్టర్ను మర్యాదపూర్వకంగా కలిసి మొక్కను అందజేశారు. మదనపల్లె సిటీ: శాప్ ఆధ్వర్యంలో ఈనెల 23 నుంచి లీగ్ టోర్నమెంట్లు నిర్వహిస్తున్నట్లు డీఎస్డీఓ చంద్రశేఖర్ తెలిపారు. 23వతేదీ పుట్బాల్ అండర్–15 అండర్–21 బాల,బాలికల జిల్లా స్థాయి ఎంపికలు జరుగుతాయన్నారు. మదనపల్లె పట్టణం జెడ్పీ ఉన్నత పాఠశాల ఆవరణలో ఉదయం 8 గంటల నుంచి ఎంపికలు జరుగుతాయని పేర్కొన్నారు. ఎంపికై నవారు ఈనెల 28 నుంచి 30వతేదీ వరకు అనంతపురంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. బాక్సింగ్ బాల,బాలికలు అండర్–15, 19 జిల్లా స్థాయి ఎంపికలు ఈనెల 24వతేదీ మదనపల్లె బీటీ కాలేజీలో ఉదయం 8 గంటలకు జరుగుతుందన్నారు. జిల్లా పరిధిలోని పాఠశాలలు, కాలేజీలు, క్రీడా అకాడమీలకు చెందిన అర్హత కలిగిన క్రీడాకారులు ఈ ఎంపికల్లో పాల్గొనాలని కోరారు. పాల్గొనేవారు తప్పనిసరిగా వయస్సు ధ్రువీకరణ పత్రం, అధార్ ,క్రీడా దుస్తులు తీసుకురావాలన్నారు. మరిన్ని వివరాలకు ఆన్లైన్ రిజిస్ట్రేషన్ 86399 57054, మస్తాన్ సీనియర్ అసిస్టెంట్ 73869 01200, చంద్రశేఖర్ డీఎస్డీఓ 91547 31106ను సంప్రదించాలని సూచించారు. మదనపల్లె టౌన్: మదనపల్లె అగ్నిమాపక కేంద్రంలో మంగళవారం జాతీయ అగ్ని మాపక వారోత్సవాలు ప్రారంభం అయ్యాయి. కార్యక్రమానికి అన్నమయ్య జిల్లా అగ్ని మాపక అధికారి ఆదినారాయణ రెడ్డి ముఖ్యఅతిథిగా హాజరై అగ్ని ప్రమాదాల నివారణపై తీసుకోవాల్సిన జాగ్రత్తలను చూపించే పోస్టర్లను మదనపల్లె అగ్నిమాపక అధికారి శివన్నతో కలసి ఆవిష్కరించారు. అనంతరం అగ్ని మాపక సిబ్బంది అగ్ని ప్రమాదాల వివారణ సమయంలోనూ ఉపయోగించే వివిధ పరికరాల గురించి ప్రదర్శన ద్వారా క్లుప్తంగా విద్యార్థులకు వివరించారు. ఏప్రిల్ 14 నుంచి 20 వరకు అగ్ని ప్రమాదాల నివారణ చర్యలపై వగాహన కల్పిస్తూ ప్రజల్ని చేతన్యపరచడం జరుగుతుందని అగ్ని మాపక అధికారి శివప్ప తెలిపారు. -
సమరయోధుడి కుమారులకు ప్రొసీడింగ్స్ పత్రాలు
రామసముద్రం : రామసముద్రంకు చెందిన స్వాతంత్య్ర సమరయోధుడు శ్రీనివాసరావుకు ఎలవనెల్లూరు పంచాయతీ దాసార్లపల్లి వద్ద 6.6 ఎకరాల ప్రభుత్వ భూమిని 1997లో కేటాయించారు. సర్వే నంబరు 100,100/1అ, 100/2లో 6.6 ఎకరాల భూమిని కేటాయించారు. అయితే 2002లో అప్పటి రెవెన్యూ అధికారులు రద్దు చేయగా, దానిపై శ్రీనివాసరావు కుమారులు అప్పీలుకు వెళ్లారు. దీంతో విచారణ చేసిన ఉన్నతాధికారులు స్వాతంత్య్ర సమరయోధులకు ఇచ్చిన భూమిని సెటిల్మెంట్ చేస్తూ ఆయన కుమారులు వెంకట రమణారావు, సీతారామయ్య, బాపూజీకు హక్కు కల్పిస్తూ తహసీల్దార్ అజారుద్దీన్ను ఆదేశించారు. దీంతో తహశీల్దార్ శ్రీనివాసరావు కుమారులకు ఆ భూమిపై హక్కు కల్పిస్తూ ప్రొసీడింగ్స్ను అందజేశారు. దారి ఆక్రమణపై ఫిర్యాదు కేవీపల్లె : మండలంలోని కేవీపల్లె పంచాయతీ గంగువారిపల్లెలో పొలాలకు వెళ్తున్న దారి ఆక్రమణపై అదే గ్రామానికి చెందిన ఎన్.వెంకటరమణారెడ్డితోపాటు గ్రామస్తులు రెవెన్యూ, పోలీస్ అధికారులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు వివరాలు.. సర్వే నంబరు 180లో పొరంబోకు స్థలం గుండా పొలాలకు దారి ఉందని గ్రామస్తులు తెలిపారు. అయితే అదే గ్రామానికి చెందిన ఓ రైతు ముళ్లకూసాలు నాటి ఆ స్థలాన్ని ఆక్రమించుకోవడంతో దారి సమస్య ఏర్పడిందని పరిష్కరించాలని కోరారు. పోలీస్, రెవెన్యూ సిబ్బంది క్షేత్ర స్థాయిలో పరిశీలించి ఇరు వర్గాలకు ఒప్పించే ప్రయత్నం చేసినా ప్రయోజనం లేకపోయింది. ఈ విషయంపై తహసీల్దార్ నరేంద్రకుమార్ను వివరణ కోరగా మరోసారి క్షేత్ర స్థాయిలో పరిశీలించి గ్రామస్తులకు కౌన్సెలింగ్ ఇచ్చి సమస్యను శాశ్వత ప్రాతిపదికన పరిష్కరిస్తామని తెలిపారు. స్వామివారి నిత్యాన్నదానానికి విరాళం మోపిదేవి : కృష్ణా జిల్లాలోని మోపిదేవి మండల కేంద్రంలో వెలసిన శ్రీవల్లీదేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి దేవస్థానంలో నిర్వహించే నిత్యాన్నదాన పథకానికి కడప వాస్తవ్యులు కె.వేణుగోపాలరెడ్డి, విశాలాక్ష్మి దంపతులు రూ.50,116 విరాళంగా మంగళవారం సమర్పించారు. ముందుగా వారు తొలుత స్వామివార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు నిర్వహించారు. -
బాధితులకు సత్వర న్యాయం చేయండి
మదనపల్లె టౌన్ : బాధితులకు సత్వర న్యాయం చేయాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశించారు. సోమవారం మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమానికి జిల్లా ఎస్పీ హాజరై ఫిర్యాదుదారుల నుంచి నేరుగా అర్జీలు స్వీరించారు. తంబళ్లపల్లె నియోజకవర్గం పిటిఎం మండలం మల్లెలకు చెందిన సాఫ్ట్వేర్ ఇంజినీర్ విశ్వనాథ్ ఆన్లైన్ ట్రేడింగ్ పేరుతో రూ.4.5 లక్షలకు సైబర్ నేరగాళ్లు మోసం చేయడంతో తన బాధను ఎస్పీకి వివరించి న్యాయం చేయాలని కోరారు. ఇదే కాకుండా ఇంకా భూ వివాదాలు, భార్యాభర్తల మధ్య గొడవలు, నకిలీ పత్రాలతో మోసాలు, అధిక వడ్డీలతో వేధించడం, ప్రేమ పేరుతో మోసాలు, మైనర్లను పెళ్లిళ్లు చేసుకోవడం వంటి ఇతరత్రా సమస్యలను ప్రజలు ఎస్పీ దృష్టికి తీసుకువచ్చారు. సానుకూలంగా స్పందించిన ఎస్పీ వెంటనే సంబంధిత ప్రాంత పోలీస్ అధికారులకు ఫోన్ చేసి బాధితులకు సత్వరమే న్యాయం చేయాలని ఆదేశించారు. సమస్యలపై ఆలస్యం చేయరాదని సూచించారు. చట్టపరమైన చర్యలు తీసుకున్న వెంటనే, ఆ వివరాలతో కూడిన నివేదికలను జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయానికి అందజేయాలని ఎస్పీ ఆదేశించారు. ప్రయివేట్ సంస్థపై ఫిర్యాదు మదనపల్లె పట్టణంలో ఉన్న టీవీఎఫ్ ప్రయివేటు ఫైనాన్స్ సంస్థ వేధింపులపై బాధి తురాలు సోమవారం స్థానిక జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి ఫిర్యాదు చేసింది. పట్టణానికి చెందిన అంజలీ టీవీఎఫ్ ప్రయివేట్ ఫైనాన్స్లో రూ.40 వేలు రుణంగా తీసుకుంది. ఆ అప్పును సకాలంలో చెల్లిస్తున్నా వడ్డీ అసలు ఇకే సారి కట్టాలని వేధిస్తుండడంతో బాధను తాళలేక బాధితురాలు పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. తనను ఆదుకోవాలని కోరింది. ఇళ్ల స్థలాలు లాకున్నారు.. పెద్దమండ్యం మండలం బండ్రేవుకు చెందిన బషీర్ బాషా తన ఇంటి స్థలం అదే ఊరికి చెందిన ఖాదర్ బాషా లాక్కొన్నాడని పీజీఆర్ఎస్లో ఎస్పీకి ఫిర్యాదు చేశాడు. -
అర్జీలకు సత్వరమే పరిష్కారం
మదనపల్లె టౌన్: పీజీఆర్ఎస్ అర్జీలకు సత్వరమే పరిష్కారం చూపాలని జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో ప్రజా సమస్యల పసరిష్కార వేదిక కార్యక్రమం జరిగింది. జిల్లాలోని ఆయా మండలాల నుంచి ప్రజలు మొత్తం 392 అర్జీలను కలెక్టర్కు సమర్పించారు.వాటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని సూచించారు. సమస్యల పరిష్కారంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ప్రజల నుంచి అందిన అర్జీల్లో కొన్ని.. ● మదనపల్లె పట్టణం, నీరుగట్టువారిపల్లెలోని రామిరెడ్డి లేఔట్కు చెందిన లక్ష్మిదేవి తన భర్త మరణించి రెండేళ్లు అయిందని, కుటుంబం గడవటం కష్టంగా మారింది. పీఆర్ఎస్లో కలెక్టర్కు అర్జీ అందజేసింది. తనకు పెన్షన్ ఇప్పించండయ్యా అంటూ విజ్ఞప్తి చేసింది. ● భర్త, పిల్లలు మరణించడంతో నలుగురు మనవ ళ్లను పోషించుకుంటూ కాలం వెలదీస్తున్న తనకు కొత్త రేషన్ కార్డు మంజూరు చేయాలి. తన మన వ ళ్లను రోషన్ కార్డులో చేర్చాలని కురబబల కోట మండలం, తెట్టు పూజారివారిపల్లెకు చెందిన గు ర్రాల వెంకటటలక్ష్మీ కలెక్టర్ కు అర్జీ అందజేసింది. ● తంబళ్లపల్లెకు చెందిన ఎల్లప్పకు కాలు లేదు. నడవ లేని తనకు పింఛన్ ఇప్పించాలని అధికారుల చుట్టూ తిరుగుతున్నా ఇవ్వడం లేదు. కలెక్టర్ స్పందించి పింఛన్ వచ్చేలా చూడాలని వేడుకున్నాడు. ● మదనపల్లె మెప్మా ఆర్పిలకు పనికి తగ్గ వేతనం చెల్లించాలని డిమాండ్ చేస్తూ సోమవారం కలెక్టరేట్ ఎదుట ఆర్పీలు నిరసన తెలిపారు. 2007 నుంచి 70 మంది రూ.8 వేల జీతంతోనే సేవలు అందిస్తున్నామన్నారు. ప్రభుత్వం తమ కస్టాన్ని గుర్తించి, పనికి తగ్గ వేతం రూ.24 వేలు చెల్లించాలని వారు డిమాండ్ చేశారు. వెబ్ ల్యాండ్ సమస్యలకు చెక్ అన్నమయ్య జిల్లాలో దీర్ఘకాలంగా పెడింగ్లో ఉన్న వెబ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. ఏళ్లుగా పరిష్కరారం కాని రైతుల వెబ్ ల్యాండ్ సమస్యలను పరిష్కరించి సోమవారం సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ ఇద్దరు రైతులకు మదనపల్లె కలెక్టరేట్లో వన్–బి పత్రాలను స్వయంగా అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. పాత రికార్డులను పరిశీలించి గత కొన్నేళ్లుగా సర్వే నెంబర్ల సవరణలు, కొత్త సర్వే నెంబర్ల చేర్పులు, అడంగల్ వివరాలను సరిదిద్దడం, వంటి సమస్యలతో కార్యాలయాల చుట్టూ తిరుగుతున్న రైతులకు ఊరట ఇప్పుడు లభించిందన్నారు. భూ రికార్డులను సరిగా ఉంచడంతో రైతులకు అత్యంత కీలకమైన పంట రుణాలు, భూ లావాదేవీలు, ప్రభుత్వ పథకాల లబ్ధి వంటి వాటికి ఉపయోగ పడతాయన్నారు. మిగిలిన ధరఖాస్తులను కూడా వేగవంతంగా పరిష్కరిస్తామని తెలిపారు. రెవిన్యూ శాఖ అధికారులు బాధ్యతతో పనిచేసి ప్రజలకు పారదర్శకంగా సేవలు అందించాలని కలెక్టర్ సూచించారు. ఈ కార్యక్రమంలో సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, రెవెన్యూ అధికారులు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ -
కేజీబీవీల్లో ప్రవేశాలకు గడువు పెంపు
మదనపల్లె సిటీ: గ్రామీణ ప్రాంతాల్లోని పేద, అనాథ, డ్రాపౌట్, వెనుకబడిన తరగతుల బాలికలకు ఉచితంగా విద్య అందించాలనే ఉద్దేశంతో కస్తూర్బాగాంధీ విద్యాలయాలను(కేజీబీవీ) ప్రభుత్వం ఏర్పాటు చేసింది. వీటిల్లో 6వ తరగతి నుంచి ఇంటర్ వరకు చదువుకునే అవకాశం ఉంది. జిల్లాలో 17 కేజీబీవీల్లో 6వ తరగతిలో 680 సీట్లు, ఇంటర్ మొదటి సంవత్సరంలో ప్రవేశానికి 680 ఖాళీ సీట్ల కోసం బాలికలు అధికంగా పోటీ పడుతున్నారు. 6వ తరగతిలో ఇప్పటివరకు 1252 మంది నుంచి ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరంలో 1348 మంది నుంచి దరఖాస్తులు అందాయి. జిల్లాలోని కేజీబీవీల్లో 2026–27 విద్యా సంవత్సరానికి దరఖాస్తు ప్రక్రియ ఈనెల 10వతేదీతో ముగిసింది. ఈ క్రమంలో తల్లిదండ్రులు, విద్యార్థుల అభ్యర్థన మేరకు దరఖాస్తు చేసుకునేందుకు ఈనెల 20వతేదీ వరకు గడువు పొడిగించారు. ఈ మేరకు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. జిల్లాలో 17 కేజీబీవీలు ఉన్నాయి. ఇందులో ఒక్కో కేజీబీవీల్లో 40 సీట్లు చొప్పున 680 సీట్లు ఇంటర్ మొదటి సంవత్సరంలో 40 సీట్ల చొప్పున 680 సీట్లు ఉన్నాయి. ఎంపిక ప్రక్రియ, పర్యవేక్షణ ఇలా... అడ్మిషన్లకు విద్యార్థులు (ఏపీకేజీబీవీ.ఏపీ.సీఎఫ్ఎస్ఎస్.ఇన్)వెబ్ౖసైట్ ద్వారా మాత్రమే దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది. ఎంపికై న విద్యార్థులకు వారి రిజిస్టర్ మొబైల్ నంబర్లకు ఎస్ఎంఎస్ ద్వారా సమాచారం పంపుతారు. ఎంపిక జాబితాను సంబంధిత పాఠశాలల నోటీసు బోర్డులలో ప్రదర్శిస్తారు. పారదర్శకంగా ఎంపిక జిల్లాలోని కేజీవీవీల్లో అడిషన్లకు ఎక్కువగా దరఖాస్తులు వస్తున్నాయి. ఈ క్రమంలో ఎస్సీడీ ఆదేశాల మేరకు ఈనెల 20వతేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు గడువు పెంచారు.ఎంపిక ప్రక్రియ పారదర్శకంగా ఉంటుంది. అర్హులైన బాలికలు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలి. – డాక్టర్ ఎన్.అనురాధ, ఏపీసీ, సమగ్రశిక్ష శాఖ -
విషతుల్య మేత తిని 40 గొర్రెల మృతి
గాలివీడు : మండల పరిధి నూలివీడు గ్రామంలోని టౌన్ సచివాలయం సమీపంలో పాడి రైతు ఆదినారాయణ చెందిన 40 గొర్రెలు మృతి చెందినట్లు డిప్యూటీ డైరెక్టర్ డాక్టర్ మాలకొండయ్య, అసిస్టెంట్ డైరెక్టర్ శివారెడ్డి తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సోమవారం విషతుల్యమైన మేత తినడం వల్ల గొర్రెలు మృత్యువాత పడినట్లు వారు స్పష్టం చేశారు. అనంతరం మృతి చెందిన గొర్రెల నమూనాలను పరీక్షల నిమిత్తం ల్యాబ్కు పంపినట్లు తెలిపారు. పొలాల వద్ద మేపు కోసం పశువులను తరలించే సమయంలో తగిన జాగ్రత్తలు పాటించాలన్నారు. ఇంత పెద్ద ఎత్తున గొర్రెలు చనిపోవడం బాధాకరమంటూ విచారం వ్యక్తం చేశారు. మాజీ సర్పంచ్ ఉమాపతిరెడ్డి గొర్రెల రైతును పరామర్శించి, ప్రభుత్వం ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో స్థానిక పశువైద్యుడు నాగరాజు, ఎల్ఎస్ఏలు సురేష్, ఆకాష్ తేజ, ఖాజా తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగుడు శంకర్ది హత్యే
మదనపల్లె టౌన్ : మదనపల్లె సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె చెరువు కట్టపై అనుమానాస్పద స్థిలో మృతి చెందిన దివ్యాంగుడు శంకర్ ది హత్యేనని తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. సోమవారం సీఐ మాట్లాడుతూ కొత్తపల్లె పంచాయతీ కొత్త ఇండ్లకు చెందిన దివ్యాంగుడు శంకర్(45) ఆదివారం స్థానిక తట్టివారిపల్లె చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి నీటి తొట్టి వద్ద అనుమానాస్పద స్థితిలో చనిపోయి ఉండటం తెలిసిందే అన్నారు. ఆదివారం ఉదయం స్థానికులు గుర్తించి సమాచారం అందించగా వెంటనే వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి, పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం స్థానిక జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించామన్నారు. అయితే మృతుడి తల్లి రత్న ఇచ్చిన ఫిర్యాదులో ఆటో డ్రైవర్ సాదిక్, వినయ్ కాంత్లు తన బిడ్డను సిటిఎం రోడ్డులోని ఓ కల్యాణ మండపం వద్దకు తీసుకెళ్లి వారే చంపేసి ఉంటారని పేర్కొనడంతో ఇద్దరిపై హత్య కేసు నమోదు చేశామని చెప్పారు. అంతే కాకుండా డాక్టర్లు పోస్టుమార్టం నిర్వహించి శంకర్ ఒంటిపై బలమైన గాయాలు ఉన్నాయని, బలంగా కొట్టడంతో తలకు దెబ్బతగిలి ప్రాణాలు కోల్పోయాడని నివేదిక ఇవ్వడం జరిగిందన్నారు. దీంతో దివ్యాంగుడు శంకర్ ది అనుమానాస్పద మృతి కేసును హత్య కేసుగా మార్చడం జరిగిందన్నారు. త్వరలోనే నిందితులను పట్టుకుంటామని సీఐ చెప్పారు. -
ఇళ్లు ఇవ్వకపోతే అద్దెలు కట్టండి
● టిడ్కో గృహాలు ఎప్పుడు ఇస్తారు? ● సీపీఐ రాష్ట్ర కార్యదర్శి ఈశ్వరయ్యమదనపల్లె : కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు పేదలకు ఇళ్లు మంజూరు చేయాలని, లేనిపక్షంలో వారు ఉంటున్న అద్దె ఇళ్లకు అద్దె చెల్లించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి జి.ఈశ్వరయ్య డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టరేట్ ఎదుట సీపీఐ జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి పేదలకు 31 లక్షల ఇళ్ల స్థలాలు ఇస్తే, తాము అధికారంలోకి వస్తే పట్టణాల్లో రెండు, గ్రామాల్లో మూడు సెంట్లు ఇచ్చి ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలు ఇస్తానని చంద్రబాబు చెప్పి మోసం చేశారన్నారు. సీపీఐ ఆధ్వర్యంలో లక్షల దరఖాస్తులు ఇళ్ల స్థలాల కోసం ఇస్తే ఇంత వరకు ప్రభుత్వం స్పందించలేదన్నారు. 6.50 లక్షల పింఛన్లు తొలగించి కొత్త పింఛన్లు ఒకటీ ఇవ్వలేదన్నారు. తీసుకుంటున్న వాళ్లు చనిపోతే కానీ.. కొత్త పింఛన్లు ఇవ్వరా అని ప్రశ్నించారు. విద్యుత్ ట్రూ ఆఫ్ చార్జీలు పెంచి కరెంట్ బిల్లులు బాదుతున్నారని అన్నారు. టిడ్కో ఇళ్లను లబ్ధిదారులకు ఎప్పుడు అప్పగిస్తారని నిలదీశారు. మంత్రి నారాయణ మాటలు నిలబెట్టుకోవాలన్నారు. చంద్రబాబు, లోకేష్, పవన్ కల్యాణ్లు విమానాల్లో తిరుగుతూ ఖజానా కొల్లగొడుతున్నారని విమర్శించారు. వచ్చే ఎన్నికల్లో కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు సాగనంపుతారని అన్నారు. రాష్ట్ర కార్యవర్గ సభ్యుడు రామానాయుడు మాట్లాడుతూ జిల్లాలో పేదలు రెండేళ్లుగా ఇళ్ల స్థలాల కోసం దరఖాస్తులు చేసుకున్నా, వాటిని పట్టించుకునే దిక్కు లేదన్నారు. ఎన్ని సార్లు దరఖాస్తు చేసుకున్నా ఎవరికీ పట్టడం లేదన్నారు. బి.కొత్తకోట మున్సిపాలిటీ పరిధిలో 1,050 మందికి ఎన్నికల ముందు పట్టాలు ఇచ్చినా స్థలాలు చూపలేదన్నారు. ఆన్లైన్లో కొత్త దరఖాస్తులు స్వీకరించడం లేదని అన్నారు. ములకలచెరువు మండలం గూడుపల్లి పంచాయతీలో 200 ఎకరాల సోత్రియం భూములను భూస్వాముల నుంచి రెవెన్యూ యంత్రాంగం కాపాడి పేదలకు పంపిణీ చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి మహేష్, యువజన సమాఖ్య రాష్ట్ర అధ్యక్షుడు సంతోష్ కుమార్, జిల్లా సహాయ కార్యదర్శి కృష్ణప్ప, జిల్లా కార్యవర్గ సభ్యులు మనోహర్రెడ్డి, సాంబశివ, సిద్ధిగల శ్రీనివాసులు, సుమిత్రమ్మ, టీఎల్ వెంకటేష్, కోటేశ్వరరావు, రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి ఒంగిమల్ల రంగారెడ్డి, సలీం బాషా, జక్కల వెంకటేష్, హరికుమార్, తరుణ్, రెడ్డి శేఖర్, నరేష్, సూరి, తిరుమల, దేవా, రఘునాథ్, అంజనప్ప, జగన్బాబు, అంజి, ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ప్రజల మనిషి ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి
● ఆయన వ్యక్తిత్వం మహోన్నతం ● మైదుకూరు మాజీ శాసనసభ్యుడు రఘురామిరెడ్డికడప ఎడ్యుకేషన్ : జిల్లాలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండి, వారి కోసం పని చేసే నాయకుడిగా ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి పేరు పొందారని మైదుకూరు మాజీ శాసనసభ్యుడు శెట్టిపల్లె రఘురామిరెడ్డి తెలిపారు. సోమవారం ప్రొద్దుటూరులోని తమ స్వగృహంలో వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ సాంస్కృతిక విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డాక్టర్ తవ్వా వెంకటయ్య రాసి, వ్యాఖ్యానించి, రూపొందించిన డిజిటల్ డాక్యుమెంటరీని రఘురామిరెడ్డి ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉన్నత వ్యక్తిత్వం కలిగిన వైఎస్ అవినాష్రెడ్డిపై కొందరు రాజకీయ స్వార్థం, వ్యక్తిగత ప్రయోజనాలు, తమ ప్రాబల్యం పెంచుకోవడం కోసం అసత్య ఆరోపణలు చేస్తున్నారని అన్నారు. అటువంటి వారికి వెంకటయ్య రూపొందించిన డాక్యుమెంటరీ కనువిప్పు కలిగిస్తుందన్నారు. వైవీయూ పాలక మండలి సభ్యుడు, జిల్లా రచయిత సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జునరెడ్డి మాట్లాడుతూ తన శిష్యుడు తవ్వా వెంకటయ్య వైఎస్ కుటుంబం పైన అపారమైన అభిమానం ఉన్నవాడని, గత ఎన్నికల సమయంలో అవినాష్రెడ్డి పైన పాట రాసి, తానే స్వయంగా గానం చేశారని అన్నారు. ప్రస్తుతం కొందరు పనిగట్టుకుని దుష్ప్రచారం చేస్తున్న తరుణంలో.. వారి నోళ్లు మూయించడానికి వైఎస్ అవినాష్రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో కళ్లకు కట్టినట్టు డాక్యుమెంటరీ రూపొందించి, వ్యాఖ్యానించారన్నారు. వైఎస్ జగన్ అడుగుజాడల్లో.. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి మాట్లాడుతూ ఎప్పుడూ ఎవరికి కీడు చేయకుండా ప్రజలకు ఏ అవసరం వచ్చినా అందుబాటులో ఉండి తన అన్న జగన్మోహన్రెడ్డి అడుగుజాడల్లో నడిచే గొప్ప ప్రజా నాయకుడు అవినాష్రెడ్డి అని పేర్కొన్నారు. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మున్సిపల్ జిల్లా అధ్యక్షుడు వల్లంబాయి హృషికేశవరెడ్డి మాట్లాడుతూ భూమికి ఎంత సహనం, ఓర్పు ఉందో అవినాష్రెడ్డికి అంతటి ఓర్పు, సహనం ఉన్నాయని అన్నారు. అవినాష్రెడ్డి వ్యక్తిత్వం గురించి కడప జిల్లాలో ప్రతి ఒక్కరికీ తెలుసు కానీ ఆయన అక్కలైన సునీతమ్మ, షర్మిలమ్మకు తెలియకపోవడం శోచనీయం అన్నారు. తవ్వా రూపొందించిన వీడియో ద్వారా అయినా వాళ్లు ఆయన వ్యక్తిత్వాన్ని అర్థం చేసుకోవాలని కోరారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ జిల్లా ప్రధాన కార్యదర్శి రాఘవరెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి కడప జిల్లాలో ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు చేపడుతున్న వైఎస్ అవినాష్రెడ్డి తనకు మొట్టమొదట రాజకీయాలు పరిచయం చేశాడని, ఆయన వ్యక్తిత్వం మహోన్నతమైందన్నారు. అనంతరం వారు డాక్యుమెంటరీ రూపకర్త తవ్వా వెంకటయ్యను ఘనంగా సత్కరించారు. ఈ కార్యక్రమంలో సాహితీవేత్త జింకా సుబ్రహ్మణ్యం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఐటీ వింగ్ కార్యదర్శి నారాయణరెడ్డి, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నాయకులు నాగేశ్వర్ రెడ్డి, తవ్వారుపల్లె మాజీ సర్పంచ్ అమరేశ్వర్రెడ్డి, మైదుకూరు నాయకులు శ్రీనివాస్రెడ్డి, రాజశేఖరరెడ్డి, మైదుకూరు మాజీ మార్కెట్ యార్డ్ చైర్మన్ రవి, సుబ్బరాయుడు యాదవ్, మైలవరం మండల కన్వీనర్ మహేశ్వరరెడ్డి, సుబ్బారావు, ముద్దనూరు మండల నాయకులు శివప్రసాద్, ప్రొద్దుటూరు పార్టీ అభిమానులు రాజేష్, ఆల్ప్రైడ్, ఓబులేసు, మోషా తదితరులు పాల్గొన్నారు. -
●50 శాతం తగ్గిన దిగుబడి
● వేరుశనగ రైతుకు భారీ నష్టం ● మూడు నెలలుగా సగానికి పడిపోయిన ధరలు ● సిండికేట్గా మారిన వ్యాపారులు గుర్రంకొండ: జిల్లాలో రబీసీజన్లో వేరుశనగ పంట సాగు చేసిన రైతులు భారీగా నష్టపోయారు. గత ఏడాదితో పోల్చితే ఈ సంవత్సరం 50శాతం మాత్రమే దిగుబడి వచ్చింది. దీనికి తోడు గత మూడు నెలలుగా మార్కెట్లో ధరలు సగానికిపైగా తగ్గిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలోని వేరుశనగ వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి ఇష్టానుసారంగా ధరల్లో కోతలు విధిస్తున్నారనే విమర్శలున్నాయి. అయితే బయట ప్రాంతాల్లో దిగుబడులు వస్తుండడంతో జిల్లాలో ధరలు తగ్గుతున్నాయని వ్యాపార వర్గాలు అంటున్నాయి. ఆరుగాలం కష్టపడి పంట సాగు చేసిన రైతులకు మాత్రం ప్రస్తుతం నిరాశే మిగిలింది. జిల్లాలో రబీసీజన్ల్లో సాధారణ సాగు విస్తీర్ణం 5324 ఎకరాలు ఉండగా ఈ సీజన్లో 1234 ఎకరాల్లో మాత్రమే రైతులు పంట సాగు చేపట్టారు. జలవనరులు, నీటి వసతి పుష్కలంగా ఉన్న పొలాల్లో మాత్రమే రబీసీజన్లో వేరుశనగ సాగు చేపడుతుంటారు. గత ఏడాది 2147 ఎకరాల్లో సాగు చేపట్టగా ఈ సంవత్సరం 1234 ఎకరాల్లో మాత్రమే పంట సాగు చేపట్టడం గమనార్హం. ఎకరం పొలంలో వేరుశనగ పంట సాగు చేపట్టడానికి రైతు ఆర్థిక పరిస్థితిని బట్టి రూ. 70 వేల నుంచి రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. దుక్కుల దగ్గర నుంచి విత్తనాలు, ఎరువులు, డ్రిప్ పరికరాలు, పైప్లైన్లు, పంట అదునుకొచ్చాక కోత కూలీలు, కాయలను మార్కెట్కు తరలించే వరకు రూ. 80 వేల వరకు ఖర్చు వస్తుంది. ఎకరం పంట నూర్పిడికి రూ. 15 వేలు.. ప్రస్తుతం ఎకరం పొలంలో వేరుశనగ పంట నూర్పిళ్ల కు కోతల దగ్గర నుంచి యంత్రాలతో కాయలు వేరు చేసే వరకు రూ.15 వేలు వరకు ఖర్చు వస్తోంది. మొ దట పొలంలో చెట్లను పీకీ కుప్పలు వేయాలంటే కూలీలకు రూ.6200, తర్వాత పంట నూర్పిడి చేయాలంటే గంటకు యంత్రానికి రూ. 2200 అద్దె చెల్లించాల్సి ఉంటుంది. ఎకరం పొలంలో సాగైన దిగుబడికి సుమారు నాలుగు గంటల పాటు యంత్రాలు పనిచేయాల్సి ఉంటుంది. దీంతో ఎకరానికి యంత్రాలకు అయ్యే ఖర్చు రూ. 8800 వరకు వస్తోంది. సిండికేట్ ఎఫెక్ట్తో ధరల్లో భారీ కోతలు ఓవైపు సగానికి పైగా పంట దిగుబడి తగ్గిపోయి రైతులు నష్టాల్లో ఉంటే మార్కెట్లో మూడునెలలుగా ధరల్లో భారీ కోతలు విధిస్తుండడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. జిల్లాలోని వ్యాపారులు, దళారులు సిండికేట్గా మారి నట్టేట ముంచున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. ఈ ఏడాది మార్కెట్లో వేరుశనగ బస్తా ధర ఫిబ్రవరిలో రూ. 5 వేల వరకు పలికింది. అయితే పంట కోతలు సీజన్ పుంజుకోవడంతో ధరల్లో భారీగా కోతలు విధించడం దారుణమని రైతులు అంటున్నారు. ప్రస్తుతం 3100లోపే ధరలు పలుకు తుండడం గమనార్హం. దీంతో మూడునెలల క్రితం ఉన్న ధరలతో పోల్చితే ఒక బస్తాపై రూ.1900 నుంచి రూ.2100 వరకు రైతులు నష్టపోతున్నారు. బయట ప్రాంతాల్లో మొదలైన దిగుబడులే కారణమా? జిల్లాలో వేరుశనగ ధరలు పతనమవడానికి బయట ప్రాంతాల్లో ఇప్పుడిప్పుడే మొదలైన పంట దిగుబడులే కారణమని వ్యాపార వర్గాలు అంటున్నాయి. జిల్లాలో ఫిబ్రవరిలో దిగుబడులు ప్రారంభమైన సమయంలో బయట ప్రాంతాల్లో అసలే దిగుబడులు రాలేదని, అందువల్లే ఆనెలలో బస్తా ధర రూ. 5 వేలు వరకు పలికినట్లు వారు చెబుతున్నారు. ప్రస్తుతం అన్నమయ్యతో పాటు తిరుపతి, చిత్తూరు, వైఎస్సార్, పుట్టపర్తి, అనంతపురం జిల్లాల్లో వేరుశనగ పంట దిగుబడులు ప్రారంభభమయ్యాయి. వాటి ప్రభావంతో ధరలు తగ్గుతున్నాయని వ్యాపారులు అంటున్నారు. రైతుల వాదన మరో విధంగా ఉంది.. ఫిబ్రవరిలో పంటదిగుబడులు కొద్దిగా రావడం, మార్కెట్లో వేరుశనగకు డిమాండ్ ఉండడంతో వ్యాపారులు బస్తా ధర రూ. 5 వేలు పెట్టి కొనుగోలు చేశారని అంటున్నారు. ప్రస్తుతం జిల్లాలో పంటకోతలు ఊపందుకున్నాయి. దిగుబడులు ఎక్కువగా వచ్చాయి. దీంతో వ్యాపారులు సిండికేట్గా మారి ధరలను ఇష్టానుసారం తగ్గించేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. జిల్లాలో రబీలో వేరు శనగ సాగు విస్తీర్ణం రూ.70 వేలు ఎకరం పంటసాగుకు అయ్యే ఖర్చుజిల్లాలో ఈ ఏడాది వేరుశనగ పంట దిగుబడి సగానికి పడిపోయింది. గత సంవత్సరంతో పోల్చితే 50 శాతం దిగుబడి మాత్రమే రైతుకు అందింది. . గత ఏడాది ఒక చెట్టుకు సుమారు 30 నుంచి 40 కాయల వరకు దిగుబడి వస్తే.. ప్రస్తుతం ఒక చెట్టుకు 15 నుంచి 20 కాయల దిగుబడి మాత్రమే రావడంతో రైతులకు నష్టం వాటిల్లింది. సాధారణంగా ఎకరం పంట సాగు చేస్తే 40 బస్తాల కాయల దిగుబడి రావాల్సి ఉంది. ప్రస్తుతం 18 నుంచి 20 బస్తాల లోపే పంట దిగుబడి రావడం గమనార్హం. దీంతో రైతులు తీవ్రంగా నష్టపోయారు. నెల ధరలు (43 కేజీల బస్తా) ఫిబ్రవరి రూ. 5000 మార్చి రూ.4100 ఏప్రిల్ రూ.3000 8421234 5324 ఎకరాలు ప్రస్తుతం మార్కెట్లో వేరుశనగ పంటకు గిట్టుబాటు ధరలు లభించడం లేదు. మూడునెలల కిందట మార్కెట్లో ఒక బస్తా ధర రూ. 5 వేలకు పైగా పలికింది. పంట దిగుబడులు చేతికొచ్చాక ఇప్పుడు బస్తా రూ. 3 వేలే అంటున్నారు. మార్కెట్లో ధరలు ఇష్టానుసారంగా తగ్గించేయడం ఎంతవరకు సమంజసం. కాయకష్టం చేసి సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధరల కల్పించాలి. – వెంకటస్వామి, గుర్రంకొండ. నేను ఎకరం పొలంలో వేరుశనగ సాగు చేశాను. ప్రస్తుతం కోతలు, పంట నూర్పిడి పనులు పూర్తయ్యాయి. తీరా లెక్కిస్తే ఎకరానికి 20 బస్తాల లోపే దిగుబడి వచ్చింది. గత ఏడాది ఎకరం పంటకు సుమారు 40 బస్తాలు వచ్చాయి. ఈ సంవత్సరం దిగుబడి తగ్గిపోయింది. దీంతో పంట సాగుకు పెట్టిన పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదు. – నాగార్జున, తలారివాండ్లపల్లె రూ.8.63 కోట్లు -
కోదండరామాలయం ప్రభుత్వ ఆధీనంలోకి చర్యలు
పుంగనూరు : పట్టణంలోని నాగపాళెంలో వెలసిన శ్రీ కళ్యాణ కోదండరామస్వామి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను దేవదాయశాఖ పరిధిలోకి తీసుకునేందుకు చర్యలు తీసుకుంటామని జిల్లా దేవదాయశాఖాధికారి విశ్వనాథ్ తెలిపారు. సోమవారం ఆయన స్థానిక గ్రూపు టెంపుల్స్ కార్యనిర్వాహణాధికారి రమణ, దేవస్థాన సిబ్బందితో కలసి ఆలయాన్ని, ఆలయ ఆస్తులను పరిశీలించారు. త్వరలోనే ఆలయాన్ని దేవదాయ శాఖ పరిధిలోకి చేర్చుకునేందుకు చర్యలు తీసుకుంటామని తెలిపారు. ఈ కార్యక్రమంలో స్థానిక భక్తులు పాల్గొన్నారు. -
సబ్స్టేషన్లో షిఫ్ట్ స్కాం !
● కూటమి ప్రభుత్వంలో అమ్మకానికి ఆపరేటర్ పోస్టులు ● ముఖ్యనేతల సిఫార్సులతో సబ్స్టేషన్లోకి ఎంట్రీ ● నకిలీపత్రాల కుంభకోణం వ్యవహారంతో జారుకున్న వైనం రాజంపేట: ఎపీఎస్పీడీసీఎల్ రాజంపేట డివిజన్ పరిధిలోని కడపజిల్లా, తిరుపతి జిల్లా రైల్వేకోడూరు పరిధిలో సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల స్కాం బట్టబయలైంది. కూటమి ప్రభుత్వంలో సబ్స్టేషన్లలో ఆపరేటర్ పోస్టులు అమ్మకానికి పెట్టారు. ఎపీఎస్పీడీసీఎల్ ఉన్నతస్థాయినుంచి ఒత్తిడి పెట్టి తమకు అనుకూలమైన వారికి ఆపరేటర్ పోస్టులలో భర్తీ చేయించుకున్నారు. అర్హతకు సంబంధించిన పత్రాలను పరిశీలించకుండా డివిజన్ స్థాయి ఉన్నతాధికారి ఒకరు ఏ విధంగా జాయిన్ చేసుకున్నారనే అనుమానాలు తలెత్తాయి. 38 మంది షిఫ్ట్ ఆపరేటర్ల పత్రాల విచారణకు ప్రత్యేకంగా ఎస్పీని నియమించినట్లు చెప్పుకుంటున్నారు. అన్నమయ్య జిల్లాలో రాజంపేట డివిజన్ ఉన్నప్పుడు సబ్స్టేషన్ షిఫ్ట్ ఆపరేటర్ పోస్టుల్లో భారీగా అవకతవకలు జరిగాయనే ఆరోపణలు ఉన్నాయి. డివిజన్లోని రెండు నియోజకవర్గాల ముఖ్యనేతలకు షిఫ్ట్ ఆపరేటర్ నియామకంలో భాగంగా ఒక్కో పోస్టుకు రూ.3లక్షల నుంచి రూ.8లక్షల వరకు వసూలు చేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. అర్హులైన అభ్యర్ధులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని విమర్శలు వచ్చాయి. రైల్వేకోడూరు ముఖ్యనేత బామ్మర్ది కనుసన్నల్లో షిఫ్ట్ ఆపరేటర్ల పోస్టుల నియామకం జరిగిందనే ఆరోపణలు వెలువడ్డాయి. నకిలీపత్రాలతో.. కూటమి ప్రభుత్వంలో నకిలీపత్రాలతో తమకు అనుకూలమైన వారిని సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్ కుర్చీల్లో కూర్చొబెట్టారనే అపవాదు మూటకట్టకుంది. వీరిలో ఎక్కువగా నకిలీ ధ్రువీకరణపత్రాలతో ఉన్నారనే విషయం ఇటీవల ఎపీ ఎస్పీడీసీఎల్ చేసిన విచారణలో వెల్లడైంది.ఇలాంటి వారు ముందస్తు సమాచారంతో తమ పోస్టులకు గుడ్బై చెప్పి వెళ్లిపోయారు. పత్రాలను సంబంధిత విద్యాసంస్థలు వెరిఫైకి వెళ్లిన నేపథ్యంలో నకిలీ పత్రాల వ్యవహారం బహిర్గతమైంది. సబ్స్టేషన్లలో షిఫ్ట్ ఆపరేటర్ల నియామకం అవినీతితో కూడుకున్నదన్న సమాచారం ట్రాన్స్కో వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. రైల్వేకోడూరు నియోజకవర్గంలో చిట్వేలి మండలం కందులవారిపల్లె సబ్స్టేషన్లో చేరిన నలుగురు, నకిలీపత్రాలతో చేరిన వారు విచారణ సమాచారంతో ఆ పోస్టుల నుంచి అపాయిట్మెంట్ ముందే వెనుదిరిగారు. రైల్వేకోడూరు (ఒకప్పుడు అన్నమయ్య జిల్లా )పెనగలూరు, రాజంపేట, నందలూరులో కొంతమంది షిప్ట్ ఆపరేటర్లపై కూడా దృష్టి సారించారు. ఇందులో కొన్ని సబ్స్టేషన్లలో ఉన్న వారు సర్దుబాటు కూడా చేసుకున్నట్లు తెలిసింది. విచారణ నుంచి తప్పించుకున్నారనే ఆరోపణలు వెలువడ్డాయి. అయితే అధికారికంగా కడప జిల్లాలో 38 అనర్హత కలిగిన షిఫ్ట్ ఆపరేటర్లు ఉన్నట్లు గుర్తించారు. ఈ మేరకు చీఫ్ మేనేజర్ రామచంద్రరావు విడుదల చేసిన ఉత్తర్వుల్లో స్పష్టంచేశారు. తీగలాగితే డొంక కదిలినట్లుగా అన్ని సబ్స్టేషన్లలో ఏళ్లతరబడి పనిచేస్తున్న వారి విద్యార్హత పత్రాలను పరిశీలించనున్నట్లు ఎపీఎస్పీడీసీఎల్లో ప్రచారం జరుగుతోంది. ఎపీఎస్పీడీసీఎల్ సబ్స్టేషన్ తిరుపతిలోని ఎపీఎస్పీడీఎల్ సీఎండీ కార్యాలయం రాజంపేట డివిజన్లోని రైల్వేకోడూరు, రాజంపేట పరిధిలోనే కాకుండా జిల్లాలోని ఇతర సబ్స్టేషన్లలో ఖాళీ అయిన షిఫ్ట్ ఆపరేటర్ పోస్టులపై టీడీపీ నేతల కన్నుపడింది. 2014లో టీడీపీ ప్రభుత్వంలో షిఫ్ట్ ఆపరేటర్లుగా చేరిన వారిని తొలగించి, ఇప్పుడు తమకు అనుకూలమైన వారిని నియమించాలని ఎపీఎస్పీడీసీఎల్ డివిజన్న్ స్ధాయి అధికారులపై ఒత్తిడి తెస్తున్నారు. బదిలీ చేయాలని ముఖ్యనేత ప్రయత్నిస్తే పచ్చ కాంట్రాక్టర్ అడ్డపడటం చూస్తుంటే ఏ మేరకు లావాదేవీలు కొనసాగుతున్నాయో అవగతమవుతుందని పలువురు సిబ్బంది చెబుతున్నారు. డివిజన్ స్ధాయి అధికారి ఓ టీడీపీ నేత పచ్చ కాంట్రాక్టర్తో సఖ్యతగా ఉంటూ ఇద్దరు తమకు జేబులు నింపే వ్యవహారాలను చక్కబెట్టుకున్నారని ఆరోపణలు వెలువడుతున్నాయి.ఈ విషయం గురించి ఏపీఎస్పీసీఎల్ రాజంపేట డివిజనల్ ఇంజినీర్ రాజశేఖర్రెడ్డిని వివరణ కోరగా అనర్హత కలిగిన, నకిలీ ధ్రువీకరణపత్రాలతో పనిచేసే షిఫ్ట్ ఆపరేటర్లు డివిజన్ పరిధిలో లేరన్నారు. కడప జిల్లాలో రాజంపేట, పాత అన్నమయ్య జిల్లాలోని రైల్వేకోడూరులో నకిలీపత్రాలతో చేరిన షిఫ్ట్ ఆపరేటర్లు లేరని వెల్లడించారు. -
రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు
మదనపల్లె సిటీ: రాష్ట్ర క్రీడా అకాడమీలో ప్రవేశాలకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ తెలిపారు. ఏప్రిల్ 26 నుంచి ఎంపికలు జరుగుతాయన్నారు. శాప్ ఆధ్వర్యంలో 2026–27 సంవత్సరానికి రాష్ట్ర వ్యాప్తంగా వివిధ క్రీడా అకాడమీల్లో ప్రవేశాలకు అర్హులైన క్రీడాకారుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. వాలీబాల్ కబడ్డీ, అథ్లెటిక్స్ వంటి క్రీడల్లో ఎంపికలు జరుగుతాయన్నారు. ఇందులో పాల్గొనే క్రీడాకారులు 15 నుంచి 19 సంవత్సరాల మధ్య వయస్సు కలిగి ఉండాలని, 1.1.2008 నుంచి 1.1.2011 మధ్య జన్మించి ఉండాలన్నారు. రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొన్నవారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. క్రీడాకారులు https:// sports.ap.gov.in వెబ్సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలన్నారు. మదనపల్లె ఆర్ఓకు స్టేషన్ బెయిల్ బి.కొత్తకోట: మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ) జీవి. పల్లవికి స్టేషన్ బెయిలు ఇచ్చామని స్థానిక సీఐ గోపాల్ రెడ్డి సోమవారం చెప్పారు. హైకోర్టులో నడుస్తున్న ఓ కేసుకు సంబంధించి పల్లవి ఆన్ లైన్ విచారణకు హాజరు కాకపోవడంతో న్యాయమూర్తి బెయిలబుల్ వారెంట్ జారీ చేశారు. దాంతో పల్లవి పోలీస్ స్టేషన్లకు వచ్చి సొంత పూచికత్తు సమర్పించగా బెయిల్ ఇచ్చినట్టు సిఐ చెప్పారు. ఈనెల 30న హైకోర్టులో జరిగే విచారణకు తప్పనిసరిగా హాజరవుతానని ఈ మేరకు ఆమె అఫిడవిట్ ఇచ్చారని సిఐ చెప్పారు. హైకోర్టుకు హాజరు కాకపోతే చర్యలు తీసుకుంటామని ఈ మేరకు ఆర్ఓకు స్పష్టం చేసినట్లు సీఐ తెలిపారు. రేపటి నుంచి ఇజితిమా ధార్మిక సభలు కలికిరి: కలికిరి సమీపం మదనపల్లి–తిరుపతి జాతీయ రహదారి టేకలకోన వద్ద ఈ నెల 15, 16 తేదీల్లో రాయచోటి జిలేకా మైదానీ ఇజితిమా ధార్మిక కార్యక్రమం జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు. ఈ సభలకు సంబంధించి అన్నమయ్య జిల్లాతో పాటు పరిసర జిల్లాల్లో జమాత్ సభ్యులు సుమారు రెండు మాసాలుగా ప్రచారాలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి జిల్లా నుంచే కాకుండా ఇతర ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున ముస్లింలు హాజరు కానున్నారు.దీంతో ఏపీఐఐసీ స్థలంలో మైదానాన్ని చదును చేసి తగిన ఏర్పాట్లు చేస్తున్నారు. దాదాపు లక్ష మందికి పైగా ముస్లిం సోదరులు హాజరవ్వనున్నట్లు సమాచారం. కాగా ఈ ధార్మిక సభలకు ఉన్నత స్థాయి ఇస్లాం బోధకులు, మత గురువులు హాజరై ధార్మిక ఉపన్యాసాలు చేయనున్నట్లు నిర్వాహకులు పేర్కొన్నారు. గురువారం రాత్రి దువా ప్రార్థనలతో ఇజితిమా కార్యక్రమం ముగియనుంది. ఎయిడ్స్ నియంత్రణలో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు మదనపల్లె టౌన్: ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాల్లో సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని అడిషనల్ డిఎంహెచ్ఓ డాక్టర్ రాధిక హెచ్చరించారు. సోమవారం మదనపల్లె అర్బన్హెల్త్ సెంటర్ లో ఐసీటీసి, ల్యాబ్ టెక్నీషియన్లతో పాటు ఐసీటీసీ కౌన్సిలర్లు, ఏఆర్టీ డాక్టర్ తో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమానికి హాజరైన అడిషనల్ డీఎంహెచ్ఓ మాట్లాడుతూ.. మిషన్ ఎయిడ్స్ సురక్షా కార్యక్రమంలో భాగంగా జిల్లాలో ఎయిడ్స్ నియంత్రణ కార్యక్రమాలను సమర్థ వంతంగా అమలు చేయాలని సూచించారు. ముఖ్యంగా పరీక్షలు, కౌన్సెలింగ్, మందుల సరఫరాలో నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు. క్లస్టర్ ఇన్చార్జి భాస్కర్ మాట్లాడుతూ ప్రైవేట్ ఆస్పత్రులలో కూడా ప్రభుత్వ మార్గదర్శకాలను పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఐసీటీసీ సిబ్బంది పాల్గొన్నారు. దరఖాస్తుల ఆహ్వానం కడప కోటిరెడ్డిసర్కిల్ : కడప–తిరుపతి మధ్య తి రుగుతున్న ఏసీ ఎలక్ట్రికల్ బస్సును నడిపేందుకు అర్హులైన డ్రైవర్ల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తిరుపతి ఏపీఎస్ ఆర్టీసీ అధికారులు తె లియజేశారు. ఆసక్తి, అర్హులైన వారు తమ ఆధార్, హెవీ డ్రైవింగ్ లైసెన్స్ (18 నెలలు పూర్తయి ఉండాలి), ఆర్టీవో క్లియరెన్స్, 8వ తరగతి ఉత్తీర్ణులైన సర్టిఫికెట్, మూడు పాస్పోర్టు సైజ్ ఫో టోలతో తిరుపతిలోని అలిపిరి డిపోకు రావాలని తెలిపారు. ఇతర వివరాలకు 73828 74600, 99598 53427 నంబర్లలో సంప్రదించాలన్నారు. -
మావిగన్–అమరావతిపై ప్రజలు ఆలోచించాలి
● ఏది మేలో నిర్ణయం తీసుకోవాలి ● ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డిజమ్మలమడుగు : రాష్ట్ర రాజధానిగా మావిగన్–అమరావతిలలో ఏది మేలో ప్రజలు ఆలోచించి, సరైన నిర్ణయం తీసుకోవాలని ఎమ్మెల్సీ రామసుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక ఎమ్మెల్సీ కార్యాలయంలో ఆయన విలేకరుల సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కృష్ణా నది ప్రాంతంలో అమరావతి నిర్మాణం జరగుతోందని, ఏటా రాజధానిలోకి వరద నీరు వచ్చి చేరుతుండటంతో, ఆ నీటిని ఎత్తిపోయటానికి ప్రతి ఏడాది 600 కోట్ల రూపాయలు వ్యయం చేస్తున్నారని విమర్శించారు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ పేరుతో ప్రతిపాదించిన ప్రాంతంలో అన్ని సౌకర్యాలు ఉన్నాయని అన్నారు. విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం ప్రాంతాల్లో జాతీయ రహదారులతోపాటు గన్నవరం ఎయిర్ పోర్టులు ఉన్నాయని, ఇలాంటి ప్రాంతంలో నిర్మిస్తే మనకు ఒక రాజధాని త్వరగా ఏర్పడుతుందన్నారు. ఉమ్మడి రాష్ట్ర విభజన జరిగి 12 ఏళ్లు అవుతోందని, ఇంత వరకు రాజధాని కూడా లేని పరిస్థితి ఉందన్నారు. రాజధానిని కొత్తగా ఏర్పాటు చేయాలంటూ.. లక్షల కోట్ల అవసరం అని కూటమి ప్రభుత్వం చెబుతోందన్నారు. అంత డబ్బులు అప్పులు తీసుకుని వచ్చి రాజధాని నిర్మాణం చేపడితే, తీర్చడం ఎలా సాధ్యం అవుతుందన్నారు. అప్పుల మీద అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేపడితే భవిష్యత్తులో ఇతర ప్రాంతాలు ఎలా అభివృద్ధి చెందుతాయని అన్నారు. అమరావతిలో పెట్టే ఖర్చులో, 20 శాతం పెడితే మావిగన్ ప్రాంతంలో రాజధాని నిర్మాణం అవుతుందని పేర్కొన్నారు. ఏబీఎన్ వార్తలు సరికావు వైఎస్ జగన్మోహన్రెడ్డి మావిగన్ను సూచన చేస్తే.. దానిపై చర్చించాల్సింది పోయి మీడియా ద్వారా జగన్మోహన్రెడ్డిపై అసత్య ప్రచారం చేయడం తగదన్నారు. ఏబీఎన్ ఆంధ్రజ్యోతి రాధాకృష్ణ మరింత దిగజారి కార్యకర్తలు, నాయకుల మనోభావాలు దెబ్బతినే విధంగా మహిళలపై అసభ్యకర వ్యాఖ్యలతో వార్తలు ప్రసారం చేయడం దారుణమన్నారు. ప్రజలు ఒక్క సారి ఆలోచించాలని, మావిగన్ వల్ల రాష్ట్ర ప్రజలకు ఉపయోగం ఉంటుందా, లేదా అమరావతి లక్షల కోట్లు రూపాయలు అప్పులు తెచ్చి నిర్మించుకోవడం కరెక్టా అని సూచించారు. బాధ్యతాయుమైన జాతీయ పార్టీలో ఉన్న వైఎస్ షర్మిల.. వైఎస్ జగన్మోహన్రెడ్డిపై గొడ్డలి అంటూ వెటకారంగా మాట్లాడటం సరైంది కాదన్నారు. నిజంగా షర్మిల జాతీయ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలి స్థానంలో ఉండి మావిగన్పై ఒక కమిటీని ఏర్పాటు చేయించి, ఏది మంచిదో తెలుసుకోవాలని తెలిపారు. కేవలం చంద్రబాబు మాయలో పడి వారి ప్రాపగండం కోసం పాకులాడటం తగదన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్ఆర్సీపీ అధికార ప్రతినిధి కొమెర్ల మోహన్రెడ్డి, వద్దిరాల రామాంజనేయుల యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
తల్లీకుమారులపై మూకుమ్మడి దాడి
మదనపల్లె టౌన్ : తల్లీకుమారులపై ప్రత్యర్థులు మూకుమ్మడిగా దాడి చేసిన సంఘటన ములకలచెరువు మండలంలో చోటు చేసుకుంది. ఇందుకు సంబంధించి బాధితుల కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు.. ములకలచెరువు మండలం వేపూరి కోటకు చెందిన దంపతులు రవణమ్మ, చెంగల్రాయుడుల కుమారుడు శంకరప్ప తన ఇంటి నిర్మాణం కోసం పునాది రాళ్లను ఇంటి ముందు తోలుకున్నాడు. ఈ క్రమంలో గ్రామానికి చెందిన తన ప్రత్యర్థులు గుడికి వెళ్లే దారిలో రాళ్లను అడ్డంగా తోలాడనే సాకుతో శంకరప్పపై గొడవకు దిగారు. కొడుకుతో గొడవ పడుతుండటం గమనించిన రవణమ్మ వెళ్లి అడ్డుకుంది. దీంతో రెచ్చిపోయిన వెంకటరమణ, రామచంద్ర, ఓబులప్ప, అప్పళ్ల, కిట్ట, రవి, ఆది తదితరులు రవణమ్మ ఇంటి పైకి వచ్చి గేట్లు విరచి తల్లీబిడ్డలపై మూకుమ్మడిగా దాడికి పాల్పడ్డారు. ప్రత్యర్థుల దాడిలో గాయపడిన బాధితులను కుటుంబీకులు వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్సలు అందించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
ఉత్సాహంగా టీ20 మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్: టీ20 మ్యాచ్లు ఉత్సాహంగా జరిగాయి.ఆదివారం జరిగిన మ్యాచ్ల్లో అనంతపురం, కడప జట్లు విజయం సాధించాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం జరిగిన మ్యాచ్లో చిత్తూరు–అనంతపురం జట్లు తలపడ్డా యి. టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంకుంది. 20 ఓవర్లలో 8 వికెట్లు నష్టానికి 157 పరుగులు చేసింది. ఆ జట్టులోని పృధ్వీరాజ్ 42, ధరణికుమార్ నాయుడు 45 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని దీపక్ 2, ప్రమోద్కుమార్ 2, ఎస్ఎండీ కమిల్ 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ చేసిన అనంతపురం జట్టు నిర్ణీత 19.4 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 159 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ రోన్ 74, విజయ్కుమార్ 38 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని శ్రీకాంత్ 5 వికెట్లు తీశాడు. గిరిష్ కుమార్ రెడ్డి 2, దీపన్ సాయినాఽథ్ 2 వికెట్లు తీసుకున్నారు. దీంతో అనంతపురం జట్టు 1 వికెట్ తేడాతో విజయం సాధించింది. ● వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మధ్యా హ్నం జరిగిన మ్యాచ్లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కడప జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 20 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి 266 పరుగులు చేసింది. ఆ జట్టులోని ధృవకుమార్రెడ్డి 53 బంతుల్లో 12 ఫోర్లు, 10 సిక్సర్లతో 129 పరుగులు చేశాడు. జయవర్దన్ 58, ధనుష్ 45 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని ఎస్కె కమరుద్దీన్ 2, ఆంజనేయులు 2 వికెట్లు తీశారు. అనంతరం బ్యాటింగ్ ప్రారంభించిన కర్నూలు జట్టు నిర్ణీత 20 ఓవర్లకు 5 వికెట్ల నష్టానికి 265 పరుగులు చేసింది. ఆ జట్టులోని గిరినాఽథ్ 11 ఫోర్లు, 9 సిక్సర్లతో 121 పరుగులు చేశాడు. కరణ్ షిండే 84 పరుగులు చేశాడు,కడప జట్టులోని సుదర్శన్ 2, ఆరిష్ భాష 1, మహ్మద్ రఫీ 1 తీశారు. దీంతో కడప జట్టు 1 పరుగు తేడాతో విజయం సాధించింది.అనంతపురం, కడప జట్ల విజయం -
మిద్దె పైనుంచి పడి భవన నిర్మాణ కార్మికుడు మృతి
మదనపల్లె టౌన్ : మిద్దె పైనుంచి పడి భవన కార్మికుడు మృతి చెందిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. స్థానిక తాలూకా పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని పొన్నేటి పాళ్యం పంచాయతీ, బెంగళూరు రోడ్డులోని చిప్పిలికి చెందిన వీరభద్ర (55) భవన కార్మికుడిగా పనిచేస్తున్నాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి మిద్దైపెన పడుకోవడానికి వెళ్లి ప్రమాదవశాత్తు కింద పడ్డాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని కుటుంబీకులు స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. అయినా అతని ఆరోగ్యం కుదుటపడక పోవడంతో అక్కడి నుంచి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కుటుంబ సభ్యులు బాధితున్ని తిరుపతి రుయాకు తరలించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతునికి భార్య పిల్లలు ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. నేడు వైఎస్ అవినాష్ రెడ్డిపై డాక్యుమెంటరీ ఆవిష్కరణకడప ఎడ్యుకేషన్ : వైఎస్ అవినాష్రెడ్డి పై షర్మిల చేసిన అనుచిత వ్యాఖ్యలను ఖండిస్తూ డాక్టర్ తవ్వా వెంకటయ్య డాక్యుమెంటరీ రూపొందించారు. ఏడు నిమిషాలు నిడివిగల డాక్యుమెంటరీని సోమవారం మాజీ శాసనసభ్యులు శెట్టిపల్లె రఘురామి రెడ్డి ఆవిష్కరించనున్నారు. ఈ సందర్భంగా తవ్వా వెంకటయ్య మాట్లాడుతూ వర్తమాన రాజకీయ నేతలలో వైఎస్ అవినాష్ రెడ్డి వ్యక్తిత్వం ఎంత ఉన్నతమైందో బయట ప్రపంచానికి తెలియ చెప్పడానికి దీనిని రూపొందించామన్నారు. షర్మిల కేవలం తన రాజకీయ స్వార్థం కోసమే ఆయన వ్యక్తిత్వ హననానికి పాల్పడుతున్నారని చెప్పారు. ‘నిజం గుమ్మం దాటే లోపు అబద్ధం ఊరంతా చుట్టేసి వస్తుంది‘అన్నట్లు వైఎస్ అవినాష్రెడ్డి కడప జిల్లా ప్రజలకు గత ఒకటిన్నర దశాబ్ద కాలంగా చేస్తున్న అభివృద్ధి సంక్షేమం గురించి తెలిసేలోపు ఆయన గురించి అబద్ధాలు, అసత్యాలు ప్రచారం చేస్తున్నారని.. వీటిని ఖండిస్తూ ఆయన గురించి వాస్తవాన్ని ఈ డాక్యుమెంటరీ ద్వారా ఆవిష్కరించబోతున్నట్లు తవ్వా చెప్పారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా శెట్టిపల్లె రఘురామి రెడ్డి, గౌరవ అతిధిగా ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, ఆత్మీయ అతిథిగా మున్సిపల్ విభాగం జిల్లా అధ్యక్షులు వల్లంబాయి హృషికేశవరెడ్డి, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైదుకూరు నియోజకవర్గం నాయకులు పాల్గొంటారని చెప్పారు. ఆర్టీపీపీలో లైనర్ల ప్లేట్లు చోరీఎర్రగుంట్ల : డాక్టర్ ఎంవీఆర్ రాయలసీమ థర్మల్ పవర్ ప్రాజెక్టులోని కోల్ ప్లాంట్లో ఉన్న లైనర్ ప్లేట్లు (ఇనుప ప్లేట్లు) చోరీకి గురయ్యాయి.వీటిని స్టేజీ–1లోని విద్యుత్ ఉత్పత్తిలో వినియోగిస్తారు. కోల్ప్లాంట్లో పనిచేస్తున్న ముద్దనూరుకు చెందిన సురేష్ అనే కాంట్రాక్టు కార్మికుడు అదివారం తెల్లవారుజామున మూడు లైనర్ ప్లేట్లను దొంగతనం చేసి స్కూటీలో తీసుకెళుతుండగా ఆర్టీపీపీ విజిలెన్స్ సీఐ నారాయణ యాదవ్ తన సిబ్బందితో కలసి పట్టుకొన్నారు. స్కూటీని, ఇనుపప్లేట్లను కలమల్ల పోలీస్స్టేషన్కు అప్పగించారు. కలమల్ల ఎస్ఐ మాట్లాడుతు విజిలెన్స్ అధికారులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. గుర్తు తెలియని మృతదేహంకడప అర్బన్ : కడపలోని ప్రభుత్వ సర్వజన ఆసుపత్రి (రిమ్స్)లో గతనెల 24వ తేదీన గుర్తు తెలియని మహిళ (36) అనారోగ్యంతో వైద్యసేవలకు వచ్చింది. ఈనెల 10వ తేదీన మృతి చెందింది. ఆచూకీ తెలిసిన వారు సంప్రదించాలని రిమ్స్ అధికారులు ఆదివారం ఒక ప్రకటనలో తెలియజేశారు. -
నేడు డయల్ యువర్ సీఎండీ
మదనపల్లె: జిల్లాలోని విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 నుంచి మధ్యాహ్నం 12:30 వరకు డయల్ యువర్ సీఎండీ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనున్నట్లు సీఎండీ పేర్కొన్నారు. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి విద్యుత్ వినియోగదారులు 8977716661కు ఫోన్చేసి సమస్యలను తెలిపితే పరిష్కరిస్తామని తెలిపారు. మదనపల్లెలో జిల్లా కేంద్రం మదనపల్లెలో డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సర్కిల్ స్థాయిలో సోమవారం ఉదయం 8:30 గంటల నుంచి 9:30 గంటల వరకు డయల్ యువర్ ఎస్ఈ కార్యక్రమాన్ని నిర్వహించనున్నామని ఎస్ఈ సోమశేఖర్రెడ్డి తెలిపారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను 9440817449 నంబర్కు తెలియజేసి పరిష్కారం పొందాలని కోరారు. జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపిక మదనపల్లె సిటీ : పట్టణంలోని బీటీ కాలేజీ హాకీ గ్రౌండ్లో ఆదివారం అన్నమయ్య జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు సెలక్షన్ ట్రయల్స్ నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి మొత్తం 32 మంది క్రీడాకారిణులు పాల్గొన్నట్లు జిల్లా హాకీ అసోసియేషన్ కార్యదర్శి శివప్రసాద్ తెలిపారు.ఈ సెలక్షన్ ట్రయల్స్లో ప్రతిభ కనబరిచిన 18 మందిని ఎంపిక చేసి,ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట్రస్థాయి హాకీ పోటీలలో అన్నమయ్య జిల్లా తరఫున పాల్గొంటారని తెలిపారు. జిల్లా జాయింట్ సెక్రటరీ జలజ, ట్రెజరర్ ప్రసాద్ రెడ్డి, జనరల్ సెక్రటరీ బి.శివప్రసాద్, డీఎస్డీఓ చంద్ర శేఖర్ ఆధ్వర్యంలో ఎంపికలు నిర్వహించారు. కార్యక్రమంలో నేషనల్ అంపైర్లు పవన్,దిలీప్,సీనియర్ హాకీ క్రీడాకారులు,వ్యాయామ విద్యా సహాయకులు నరేష్ బాబు,గౌస్ తదితరులు పాల్గొన్నారు. మదనపల్లె ఆర్ఓకు అరెస్ట్ వారెంట్ సాక్షి, అమరావతి: అన్నమయ్యజిల్లా బి.కొత్తకోట మున్సిపల్ కమిషనర్గా పనిచేసి ప్రస్తుతం మదనపల్లె మున్సిపల్ రెవెన్యూ ఆఫీసర్ (ఆర్ఓ) జీవి.పల్లవి అరెస్ట్కు హైకోర్టు ఈనెల 2న ఉత్తర్వు జారీ చేసింది. ఆమెను అరెస్ట్ చేసి ఈనెల 30న న్యాయస్థానం ముందు హజరుపర్చాలని జిల్లా ఎస్పీని ఆదేశించింది. మున్సిపాలిటీలో ఒక వ్యక్తి ప్లాన్ అప్రూవల్ లేకుండా ఇంటి నిర్మాణం చేపట్టారని, అక్రమంగా జరుగుతున్న ఈ పనిని కమిషనర్ అడ్డుకోలేదని, విధుల నిర్వహణలో నిర్లక్ష్యం చూపారని పేర్కొంటూ రెడ్డెప్ప అనే వ్యక్తి హైకోర్టును ఆశ్రయించారు. ఈ కేసు నడుస్తుండగా విచారణ కోసం పల్లవిని ఆన్లైన్లో హజరుకావాలని తెలియజేసినప్పటికి హజరుకాలేదని కోర్టు దృష్టికి వచ్చింది. దీన్ని కోర్టు ధిక్కారంగా భావిస్తూ ఆమెకు బెయిలబుల్ వారంట్ను జారీ చేయాలని న్యాయస్థానం ఆదేశించింది. ఈనెల 30 జరిగే తదుపరి విచారణ రోజు ఆమె కోర్టు ఎదుట హజరుకావాలని ఆదేశించింది. ఈ వారెంట్ను అమలు చేయాలని జిల్లా ఎస్పీకి కోర్టు ఆదేశాలను పంపారు. ఒకవేళ అరెస్ట్చేస్తే రూ.10వేల బాండు, ఇద్దరి పూచికత్తుపై బెయిల్ ఇవ్వాలని న్యాయస్థానం సూచించింది. అలాగే ఈనెల 30న జరిగే కేసు వాయిదాకు హజరవుతానని, ఆ తర్వాత కూడా కోర్టు ఆదేశించే వరకు హజరువుతానని ఆమె ప్రమాణపత్రం ఇవ్వాలని ఆదేశాల్లో న్యాయస్థానం పేర్కొంది. వెలుగు అక్రమాలపై విచారణ బి.కొత్తకోట: స్థానిక వెలుగు కార్యాలయంలో జరిగిన అక్రమాలపై విచారణ లోతుగా జరుగుతున్నట్టు తెలిసింది. ఏడాదిన్నర కాలంగా ఇక్కడ నెలకొన్న పరిస్థితులు, ఫర్నిచర్ మాయం కావడం, మంజూరు చేసిన రుణాలు రికవరీ కాకపోవడం, సీ్త్రనిధి రుణాలకు సంబంధించి కొన్ని గ్రామాల నుంచి నిధులు రికవరీ కాకపోవడం, ఓ గ్రామంలో రుణాలు ఇచ్చినా పైసా వసూలు చేయకపోవడంపై డీఆర్డీఏ ఉన్నతాధికారులు దృష్టి సారించారు. రుణాల రికవరీ సంబంధించి ఇప్పటికే విచారణలో అధికారులు నివేదికలో సిద్ధం చేసినట్లు తెలిసింది. ఆ నివేదికలపై ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడానికి కారణం ఏమిటి అన్న కోణంలో విచారణ చేస్తున్నట్టు తెలిసింది. ప్రధానంగా కార్యాలయంలోని కుర్చీలు, ఫర్నిచర్ మాయం కావడానికి ఏపీఎంను బాధ్యుని చేసి రూ.54 వేలు రికవరీ చేసినట్లు అధికారులు తెలిపారు. కోటావూరు డెయిరీ పేరుతో ఖర్చు చేసిన నిధుల వివరాలు, బి.కొత్తకోట డెయిరీకి సంబంధించిన నిధుల వ్యయంపైనా విచారణ జరగనున్నట్టు చెబుతున్నారు. ఈ పరిస్థితుల్లో ఆర్థిక లావాదేవిలకు సంబంధించి అక్రమాలు జరిగి ఉండే అవకాశం ఉందని దానిపై లోతుగా విచారించేందుకు అధికారులు సిద్ధమయ్యారు. -
తాళం వేసిన ఇంట్లోచోరీ
ములకలచెరువు : తాళం వేసిన ఇంట్లో చోరీ జరిగిన సంఘటన శనివారం రాత్రి మండల కేంద్రంలో చోటుచేసుకుంది. బాధితుడు, పోలీసుల కథనం మేరకు.. మండలంలోని కాలువపల్లెకు చెందిన సురేష్ స్థానికంగా ఉన్న వినాయక్నగర్లోని ఒక అద్దె ఇంట్లో ఉంటున్నాడు. శనివారం సాయంత్రం కుటుంబ సభ్యులతో కలిసి కాలువపల్లెకు వెళ్లారు. గమనించిన దుండగులు గేటు పగలగొట్టి ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి అందులోని రూ. 85 వేల నగదు, 35 గ్రాముల బంగారు ఆభరణాలు, 150 గ్రాముల వెండి దొంగలించారు. ఆదివారం ఉదయం ఇంటి యజమాని గమనించి బాధితుడికి సమాచారం అందించారు. అదేవిధంగా పక్కనే ఉన్న రమణ ఇంటిలోకి జొరబడేందుకు దొంగలు ప్రయత్నించారు. కానీ ఇంట్లో మనుషులను చూసి వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. బాధితుడి ఫిర్యాదు మేరకు కేసునమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వివరించారు. -
ఇరు వర్గాల మధ్య ఘర్షణ
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలంలోని గుడిసివారిపల్లెలో ఆదివారం రెండు వర్గాల మద్య ఘర్షణ జరిగింది. ఈ ఘటనలోఅన్నా చెల్లెలు కత్తిపోట్లకు గురైయ్యారు. బాధితులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదుపై సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. మండంలోని కొత్తవారిపల్లె పంచాయతీ, గుడిసివారిపల్లెకు చెందిన ఏ.పవన్ కుమార్(30), అతని చెల్లెలు ఏ.భవాని (25) లకు అదే ఊరికి చెందిన అన్నదమ్ములు నవీన్. అనూప్ వర్గానికి పాత గొడవలు ఉన్నాయి. ఆదివారం ఇరు వర్గాలు మాటామాట పెంచుకుని దూషణలకు దిగారు. ఈ గొడవ తారా స్థాయికి చేరి ఒకరిపై మరొకరు కర్రలు, కత్తులతో పర్సపర దాడులు చేసుకున్నారు. ఈ దాడుల్లో అన్నా చెల్లెలు పవన్ కుమార్, భవాని కత్తి పోట్లకు గురికాగా పవన్కుమార్ తల్లి అంజమ్మ, మేన మామ రెడ్డెప్ప లపై ప్రత్యర్థులు నవీన్, అనూప్ లు కర్రలు, కత్తులతో దాడులు చేశారని తెలిపారు. గాయపడిన వారిని స్థానికులు వెంటనే జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి పవన్ కుమార్, అతని చెల్లెలును తిరుపతికి రెఫర్ చేశారు. కాగా గ్రామంలో ఉద్రిక్తత నెలకొంది. నవీన్ బైక్ను పవన్ కుమార్ వర్గీయులు తగల బెట్టడంతో మంటల్లో కాలి పోయింది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.అన్నా చెల్లెలుకు కత్తి పోట్లు -
కార్మికుల సమస్యలపై పోరాటం
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటాలు చేస్తామని సీఐటీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీహెచ్ నర్సింగరావు పేర్కొన్నారు. ఆదివారం కడపలోని పాత రిమ్స్లో సీఐటీయూ 10వ జిల్లా మహాసభలను నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ .ఒకపక్క ప్రభుత్వంతోనూ మరోపక్క యాజమాన్యంతోను పోరాటం చేయడంలో సీఐటీయూ కీలక పాత్ర పోషిస్తోందని తెలిపారు.ప్రభుత్వాలు కార్మిక వర్గంపై దాడి చేయడం దుర్మార్గమని అన్నారు. కార్మికులకు సరైన వేతనాలు ప్రభుత్వం ఇవ్వలేదని ఆరోపించారు. అధికారం రాకముందు ప్రస్తుత ఉన్నటువంటి పాలకులు కార్మిక వర్గానికి హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత వాటికి వ్యతిరేకంగా చేయడం దారుణమని ఘాటుగా విమర్శించారు. సీఐటీయూ 17 వ రాష్ట్ర మహాసభలు నంద్యాలలో 17, 18, 19 తేదీల్లో జరుగుతున్నాయని తెలిపారు. మొదటి రోజు జరిగే మహాసభలకు కడప జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో కార్మికులు పాల్గొనాలని పిలుపునిచ్చారు. -
పనిలేని పర్యాటకశాఖ
● జిల్లా పరిధిలో హార్సిలీహిల్స్ ఒక్కటే యూనిట్ ● ఇది తిరుపతి డీవీఎం పరిధిలోకి వస్తుంది ● ఇక్కడి జిల్లా అధికారులకు పనిలేదుమదనపల్లె : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఓ వెలుగు వెలిగిన పర్యాటకశాఖకు ఇప్పుడు పని లేకుండా పోతోంది. అంతేకాదు ఉనికి కోల్పోయే పరిస్థితికి వచ్చింది. రూ.కోట్లాది ఆదాయంతో కళకళలాడిన టూరిజం యూనిట్లు ఇప్పుడు వెలవెలబోతున్నాయి. పర్యాటకశాఖపై కూటమి ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేకపోవడంతో ఆ శాఖ మనుగడ కోల్పోయే పరిస్థితికి వచ్చింది. భవిష్యత్తులో ఇంకెలాంటి పరిస్థితులు దాపురిస్తాయోనని అధికారులు, శాఖను నమ్ముకుని జీవిస్తున్న సిబ్బంది ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాకు ఒక్కటే అన్నమయ్య జిల్లాలో పర్యాటక ప్రాంతాలు లేవు. ఉన్న ప్రాంతాలను పర్యాటకశాఖ పరిధిలోకి తీసుకొని అభివృద్ధి చేయాలన్న ధ్యాస ప్రభుత్వానికి ఏమాత్రం లేదు. దీంతో జిల్లా స్థాయిలో ఉన్న పర్యాటకశాఖకు ఏమాత్రం పని లేకుండా పోయింది. జిల్లాలో ఉన్న ఏకై క పర్యాటక ప్రాంతం హార్సిలీహిల్స్. ఇది బి.కొత్తకోట మండల పరిధిలోకి వస్తుంది. పాలనాపరంగా తిరుపతి పర్యాటకశాఖ డివిజన్ పరిధిలో ఉంది. అన్నమయ్య జిల్లాకు ఒక పర్యాటక అధికారిని, ఒక జూనియర్ అసిస్టెంట్ను నియమించగా వీరికి ఒక కార్యాలయాన్ని కూడా కేటాయించారు. అధికారి ఉన్నారన్న మాటేకాని చేతికి పనిలేదు. జిల్లా అధికారి పరిధిలో పర్యాటక ప్రాంతాలు లేవు. పీలేరు, బోయకొండ కొన్నిచోట్ల పర్యాటకశాఖ అతిథి గృహాలు నిర్మించాలని ప్రయత్నాలు చేస్తోంది కానీ ఇంతవరకు వాటి మంజూరు జరగలేదు. దీంతో అధికారులతో పని లేక కార్యాలయంలో ఖాళీగా కూర్చోవాల్సి వస్తోంది. ప్రైవేటుకు అప్పగింత ఉమ్మడి చిత్తూరు జిల్లాకు తిరుపతి కేంద్రంగా పనిచేస్తుంది. ఇక్కడి నుంచి డివిజనల్ అధికారి టూరిజం యూనిట్లను పర్యవేక్షిస్తూ ఉంటారు. అయితే ప్రభుత్వం ఈ అధికారి పరిధిలోని ముఖ్యమైన టూరిజం యూనిట్లను ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ (ఓ అండ్ ఎం) పేరుతో ప్రైవేట్ వ్యక్తులకు అప్పగించింది. చిత్తూరు జిల్లాలోని కుప్పం, పలమనేరు, నగరి టూరిజం యూనిట్లు, తిరుపతిలోని అలిపిరి హోటల్ను ఓ అండ్ ఎం పద్ధతిలో ప్రైవేట్ వాళ్లకు ఇచ్చేశారు. ఇప్పుడు పర్యాటకశాఖ పర్యవేక్షణలో ఇవి లేవు. అలాగే తిరుమల తిరుపతి దేవస్థానం తరఫున టూరిజంకు కేటాయిస్తున్న దర్శనం టికెట్లను రద్దు చేయడంతో భారీ నష్టం వాటిల్లుతోంది. దర్శనం టికెట్ల ఆధారంగా టూరిజం రవాణా శాఖ కోట్లాది ఆదాయం అర్జించేది. కూటమి ప్రభుత్వం వచ్చాక దర్శనం టికెట్లు రద్దు చేయడంతో రవాణ యూనిట్ దారుణంగా దెబ్బతింది. రూ.కోట్ల నష్టం రావడమే గాక నమ్ముకున్న కార్మికులకు ఉపాధి కష్టతరమైంది. తిరుమలలో టూరిజంకు కేటాయించిన అతిథి గృహాలను టీటీడీ స్వాధీనం చేసుకుంది. దాంతో డివిజన్ కార్యాలయానికి పని భారం తగ్గిపోయింది. ఉన్నవి ఇవే తిరుపతి డివిజన్ పరిధిలో ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలోని హార్సిలీ హిల్స్, తిరుపతి జిల్లాలోని శ్రీకాళహస్తి, చిత్తూరు జిల్లాలోని పులిగుండు, కై లాసనాథకోన యూనిట్లు మాత్రమే నడుస్తున్నాయి. ఇందులో హార్సిలీహిల్స్, శ్రీకాళహస్తి మాత్రమే ఆదాయంలో ముందున్నాయి. మిగిలిన మూడు యూనిట్ల ఆదాయం అంతంత మాత్రమే. దీంతో పర్యాటక శాఖ పూర్వ వైభవం కోల్పోయి కళ తప్పింది. హార్సిలీహిల్స్పై నిర్లక్ష్యం అన్నమయ్య జిల్లాలో ఉన్నది ఒకే ఒక పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్. దీని అభివృద్ధి పట్ల ప్రభుత్వం చిత్తశుద్ధి చూపడం లేదు. వస్తున్న ఆదాయం తీసుకోవడమే తప్ప అభివృద్ధి కోసం తిరిగి నిధులు ఇవ్వడం లేదు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అతిథిగృహాల ఆధునికీకరణకు రూ.10 కోట్లతో పనులు చేపట్టారు. కూటమి ప్రభుత్వం రాగానే పనులపై నిర్లక్ష్యం చూపడమే గాక తీవ్ర జాప్యం చేసింది. దాని ఫలితంగా పర్యాటక శాఖకు భారీ నష్టం వాటిల్లింది. ఈ పరిస్థితుల్లో ఇక్కడి నుంచి వస్తున్న రూ.కోట్ల ఆదాయం ప్రభుత్వ ఖజానాకు చేరుతోంది. వేతనాలు, ఖర్చుకు తప్ప అభివృద్ధికి, సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం నిధులు ఇవ్వకపోగా, కనీసం పట్టించుకోవడం లేదు. ఫలితంగా హార్సిలీహిల్స్ యూనిట్ కూడా కళతప్పే పరిస్థితి కనిపిస్తోంది. -
కారు ఢీకొని ముగ్గురికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్ : కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన ఆదివారం మదనపల్లెలో జరిగింది. ఘటనపై బాధితులు, వన్ టౌన్ పోలీసులు తెలిపిన వివరాలు.. మండలంలోని మాలేపాడు పంచాయతీ. ఆవులపల్లెకు చెందిన వెంకటేష్, గంగరాజు, శివలు బైక్లో స్థానిక టమాటా మార్కెట్యార్డు వద్ద ఉన్న కుటుంబ సభ్యుల వద్దకు వెళుతుండగా ఎన్టీఆర్ సర్కిల్ వద్ద కారు ఢీకొని ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. వీరిని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అనంతరం గంగరాజుకు కాలు విరగడంతో తిరుపతికి రెఫర్ చేశారు. కాగా ప్రమాదానికి కారణమైన కారు నిలపకుండా వెళ్లిపోయినట్లు బాధితులు తెలిపారు. వన్ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారు ఢీకొని.. పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో యువకునికి తీవ్రగాయాలైన సంఘటన మండలంలోని మొరవవడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు పట్టణం నాగిరెడ్డి కాలనీకి చెందిన వాసిఫ్ (30) ద్విచక్రవాహనంలో తలపులకు బయలుదేరాడు. ముందు వెలుతున్న ఆటోను ఓవర్టేక్ చేయబోయి తలపుల నుంచి పీలేరు వైపు ఎదురుగా వచ్చిన కారును ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో వాసిఫ్కు తీవ్ర గాయాలయ్యాయి. చికిత్సనిమిత్తం ఆయన్ను పీలేరు ప్రభుత్వాస్పత్రికి తరించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరో ప్రమాదంలో.. మదనపల్లె టౌన్ : రోడ్డు ప్రమాదంలో యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. ప్రమాదానికి సంబంధించి పోలీసులు తెలిపిన వివరాలు.. వినుకొండకు చెందిన తిరుపాల్ కుమారుడు తిరుమల దావీదురాజు(26) బైకులో సొంతపనిపై మదనపల్లె మీదుగా పుంగనూరు రోడ్డులో వెళుతుండగా స్థానిక తట్టి వారిపల్లె బైపాస్ రోడ్డులో హైవే రోడ్డు పనులు గమనించ కుండా వేగంగా వెళ్లాడు. ఎదురుగా వస్తున్న వాహనాన్ని ఢీకొన్నాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్నిస్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో కోలుకుంటున్నాడు. -
రెడ్డెమ్మా..చల్లంగా చూడవమ్మా
గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడవమ్మా అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయానికి ఆదివారం ఉదయం నుంచే భక్తుల రాక మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు కోనేట్లో పవిత్ర స్నానమాచరించారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన వారు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు.హిందువులతో పాటు ముస్లింలు అమ్మవారి ఆలయానికి తరలివచ్చి పూజలు నిర్వహించారు. -
కీర్తన హత్య కేసులో నిందితులను కఠినంగా శిక్షించాలి
ఖాజీపేట : మండలంలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన దారుణ హత్యపై ఆదివారం ప్రజా సంఘాల నాయకులు నిజనిర్ధారణ నిర్వహించారు. కీర్తన హత్యకేసులో నిందితులను కఠినంగా శిక్షించాలని ప్రజాసంఘాల నాయకులు డిమాండ్ చేశారు. అనంతరం బాలిక తల్లిదండ్రులు, బంధువులు, చుట్టపక్కల వారితో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. వారు మాట్లాడుతూ కీర్తన ఒంటరిగా ఉన్న సమయంలో నిందితుడు ఇంట్లోకి వెళ్లి దాడి చేసి గొంతు కోసి చంపాడని మృతురాలి తల్లిదండ్రులు తెలిపారన్నారు. ఏడాది ముందు నిందితుడు కీర్తనను ప్రేమించమని బలవంతం చేశాడు. బాలిక తండ్రి, సోదరులు వెంకటేష్ను హెచ్చరించారన్నారు. వెంకటేష్, ప్రవీణ్కుమార్ తమ్ముడు తనపై దాడి చేశారని కీర్తన చెప్పినట్లు కుటుంబ సభ్యులు తెలిపారన్నారు. ఇద్దరిపై ఫిర్యాదు చేస్తే కేవలం వెంకటేష్పై పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేశారన్నారు. మృతురాలి ఇంటి దగ్గర కెనరా బ్యాంక్ సీసీ టీవీ పుటేజీని కొందరి ఒత్తిడి మేరకు తొలగించారన్నారు. నిందితుడు పోలీసుల నుంచి తప్పించుకుని పారిపోవడానికి ప్రయత్నించాడని, ఇద్దరు పోలీసులపై రాళ్లతో దాడి చేశాడని, అతన్ని ఆపడానికి జరిపిన కాల్పులలో కాలికి బుల్లెట్ గాయమైందని పోలీసులు తెలిపారన్నారు. కానీ పోలీసుల కస్టడీలో ఉన్న నిందితుడు ఎలా దాడి చేయగలిగాడని ప్రశ్నించారు. వైద్యులు ఇచ్చిన నివేదికలో ఫ్రాక్చర్ అనే మాట వినిపిస్తోందని, బుల్లెట్ లభ్యమైనట్లు తెలియలేదన్నారు. కీర్తన అంత్యక్రియలు జరిగిన కొన్ని గంటలకే నిందితుడి తల్లి మీడియాతో తన కుమారుడు ఎలాంటి తప్పు చేయలేదని చెప్పారన్నారు., కీర్తన, వెంకటేష్ల ప్రేమ వ్యవహారం తనకు తెలియదని, ఘటన జరిగిన రోజు తన కుమారుడు ఇంటికి వచ్చి ప్రేమ విషయంలో కీర్తన తనను మోసం చేసిందని తెలిపాడన్నారు. ఈ విషయం అడగడానికి వెళితే కత్తితో గొంతు కోసుకుంటానని బెదిరించిందని, పెనుగులాటలో గొంతు కోసుకుందని చెప్పాడని ఆమె తెలిపారు. దీనిని బట్టి నిందితుడిని రక్షించే ప్రయత్నం ప్రారంభమైనట్లు తెలుస్తోందని ప్రజాసంఘాల నాయకులు పేర్కొన్నారు. ప్రభుత్వం మృతురాలి కుటుంబానికి అన్ని విధాలా అండగా ఉండాలని, వారికి అవసరమైన సహాయ సహకరాలు అందించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ పౌరహక్కుల సంఘం జిల్లా అధ్యక్షుడు సురేష్, ఐద్వా జిల్లా కార్యదర్శి ముంతాజ్, చైతన్య మహిళా సంఘం జిల్లా కన్వీనర్ పద్మ, కమిటీ సభ్యురాలు అనిత, జేవీవీ సమత అధ్యక్షురాలు అరుణ, రాయలసీమ మహిళా శక్తి కార్యదర్శి వడ్ల లక్ష్మీదేవి, సీపీఎం మండల ఇన్చార్జి రాజశేఖర్, సాగర్, వెంకీ తదితరులు పాల్గొన్నారు.నిజనిర్ధారణ కమిటీ సభ్యులు -
●2021 నుంచి ఆసంపూర్తిగా...
కడప అగ్రికల్చర్: నెలల తరబడి వేలకు వేలు ఖర్చు చేసి కంటికి రెప్పలా పంటలను కాపాడుకుని మంచి దిగుబడులు సాధిస్తే వాటిని మద్దతు ధరకు అమ్ముకునేందుకు మార్కెట్ యార్డుకు తెచ్చుకుంటే ఇక్కడ సరైన వసతులు లేక రైతులు అవస్థలు పడాల్సి వస్తోంది. రాయలసీమలోనే ఏకై క పసుపు యార్డు కడప వ్యవసాయ మార్కెట్లో ఉంది. ఇక్కడికి కడపజిల్లా నలు మూలల నుంచే కాకుండా కర్నూలు, అనంతపురం, చిత్తూరు జిల్లాల నుంచి కూడా రైతులు పసుపు, వేరుశనగ కాయలు తెచ్చి అమ్ముకుంటారు. అయితే మార్కెట్యార్డులో సరైన మౌలిక వసతులు లేక రైతులు ఇబ్బందులు పడాల్సి వస్తోంది. మార్కెట్యార్డులోని షెడ్లతోపాటు ఆరుబయట ఉత్పత్తులను రాసులు పోసుకుని అమ్ముకోవాల్సిన పరిస్థితి నెలకొంది. ఈ సమయంలో ఉన్నట్లుండి అకాల వర్షాలు పడితే దిగుబడులు వర్షార్పణం అయితే నష్టపోవాల్సి వస్తుందని రైతుల ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. మరుగుదొడ్లు లేక.. మార్కెట్యార్డుకు సీజన్లో పసుపు, వేరుశనగ దిగుబడులను అమ్ముకునేందుకు రైతులు అధిక సంఖ్యలో వస్తారు. వీరితోపాటు మార్కెట్యార్డులో వ్యాపారులు, హమాలీలు, మహిళా కూలీలు ఇలా చాలామంది ఉంటారు. కానీ ఇక్కడ వసతులు సరిగా లేవు. ఒక్క మరుగుదొడ్డి లేక అవస్థలు పడాల్సి వస్తోంది. అలాగే మంచినీటికి సంబంధించి ఒకే ఆర్వో ప్లాంట్ ఉంది. అంతమంది ఉన్న మార్కెట్యార్డులో ఒక్క ఆర్వో ప్లాంట్ ఉంటే ఎలా పరిపోతుందని రైతులు ప్రశ్నిస్తున్నారు. దీంతోపాటు మార్కెట్యార్డుకు వచ్చే రైతులు విశ్రాంతి తీసుకునేందుకు గతంలో భవనాన్ని ఏర్పాటు చేశారు. అది శిథిలావస్థకు చేరుకుంది. దీంతో దీనిని ఎవరూ వినియోగిండం లేదు. మార్కెట్యార్డుకు వచ్చే రైతులు చెట్ల కింద, భవనాల పంచన బస్తాలపైన విశ్రాంతి తీసుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. రూ. 38 కోట్ల వ్యాపార లావాదేవీలు... ఈ ఏడాది ఫిబ్రవరి 6 నుంచి కడప మార్డులో పసుపు కొనుగోలు ప్రారంభించారు. మొదట్లో క్వింటా పసుపు ఫింగర్, బల్ప్ ధర రూ. 13500 ధర పలికింది. పశ్చిమాసియా యుద్ధం కారణంగా క్వింటా రూ. 11 వేల నుంచి రూ. 11500 వరకు ధర పడిపోయింది. ప్రస్తుతం పసుపు ఽనాణ్యతను బట్టి దర పెరిగి ఫింగర్ కనిష్ట ధర క్వింటాల్ రూ. 11196 నుంచి గరిష్ట ధర రూ. 13,262 పలుకుతోంది. అలాగే బల్ప్ రకం కనిష్ట ధర క్వింటాల్ 8800 నుంచి గరిష్ట ధర 12388 వరకు పలుకుతోంది. అయితే మార్కెట్ యార్డు ప్రారంభం నుంచి ఏప్రిల్ 8వ తేదీ వరకు వైఎస్సార్జిల్లాతోపాటు ఇతర జిల్లాల నుంచి రైతులు తీసుకొచ్చిన పసుపుకు సంబంధించి 38,307 క్వింటాళ్ల విక్రయాలు జరిగాయి. దాదాపు 38 కోట్ల రూపాయల వ్యాపార లావాదేవీలు జరిగాయి. దీంతో కడప మార్కెట్యార్డుకు సెస్ రూపంలో 38 లక్షలు రూపాయలు వచ్చింది. కానీ మౌలిక వసతులు మాత్రం కరువయ్యాయి. తమ గురించి పట్టించునే వారే కరువయ్యారని పలువురు రైతులు ఆవేదనను వ్యక్తం చేస్తున్నారు. పలుమార్లు జెడ్పీ సమావేశంలో... కడప పసుపుమార్డులోని మౌలిక వసతుల గురించి జిల్లా పరిషత్తు కో ఆప్షన్ సభ్యులు అచ్చుకట్ల కరీముల్లా పలుమార్లు జెడ్పీ సమావేశంలో అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని ఆందోళన వ్యక్తం చేశారు. ఇటీవల జరిగిన సమావేశంలో కూడా సంబంధిత సమస్యను కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు. కలెక్టర్ సానుకూలంగా స్పందించారని, సమస్యలు పరిష్కరిస్తామని హామీ ఇచ్చారని అచ్చుకట్ల కరీముల్లా చెప్పారు. కడప మార్కెట్ యార్డ్లో వసతులు కరువు సేద తీరాలంటే చెట్లు, పసుపు బస్తాలే గతి ఆగిపోయిన జంబో షెడ్ నిర్మాణం ఆరు బయటే పసుపు, వేరుశనగ విక్రయాలు కడప మార్కెట్యార్డుకు 2021లో రూ. 84 లక్షలతో జంబో షెడ్డు మంజూరు చేసింది. దీనిని కాంట్రాక్టర్ కొంత నిర్మాణం చేపట్టి తర్వాత పనులు చేయకుండా వదిలేశారు.ఫలితంగా కడప మార్కెట్యార్డుకు రైతులు పసుపు, వేరుశన కాయలను అమ్మకాల కోసం తీసుకుని వస్తే ఆరుబయట, రోడ్లుపై పోసి అమ్ముకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో అన్నదాతలు అందోళన చెందుతున్నారు. కడప పసుపుమార్కెట్ యార్డులో రైతులకు సరైన మౌలిక వసతులు లేవు. కొద్దిసేపు సేద తీరుదామంటే నిలువ నీడలేదు. ఎండసెగకు సంచులపైనే కూర్చోవాల్సి వస్తుంది. అధికారులు స్పందించి వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. – సుదర్శన్, రైతు, చిట్వేల్ మార్కెట్యార్డుకు పసుపు తీనుకుని వచ్చాను. కొద్దిసేపు విశ్రాంతి తీసుకుందామంటే సరైన వసతి లేదు. దీంతో బస్తాలౖపైనే పడుకోవాల్సి వస్తోంది. అధికారులు స్పందించి మౌలిక వసతుల కల్పనకు చర్యలు తీసుకోవాలి. కల్పించాలి. – క్రిష్ణయ్య, చింతమరాసుపల్లె, ఒంటిమిట్ట మండలం, మార్కెట్యార్డులో మరుగుదొడ్లు లేవు. దీంతో పసుపు, వేరుశనగ కాయలను తీసుకొచ్చే రైతులు మలమూత్ర విసర్జనకు ఇబ్బంది పడాల్సి వస్తోంది.వెంటనే మరుగుదొడ్లు నిర్మించాలి. అధికారులు స్పందించి మార్కెట్ యార్డులో వసతులు కల్పించాలి. – మునిస్వామి, రైతు -
రంగస్వామి మృతదేహం కుటుంబ సభ్యులకు అప్పగింత
ప్రొద్దుటూరు క్రైం : ఆత్మహత్య చేసుకున్న ఆవుల రంగస్వామి మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం ఆదివారం మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమీల కుటుంబ సభ్యులు రాకపోవడంతో ఆమె మృతదేహానికి పోస్టుమార్టం జరగలేదు. కుటుంబ సభ్యుల రాక కోసం పోలీసులు ఎదురు చూస్తున్నారు. కర్నూలు జిల్లాకు చెందిన రంగస్వామి, ప్రమీల అనే వివాహిత కొన్ని రోజులుగా ప్రొద్దుటూరు మండలంలోని లింగాపురం గ్రామంలో ఓ ఇంటిని బాడుగకు తీసుకొని సహజీవనం చేస్తున్న విషయం తెలిసిందే. ఈ విషయం కుటుంబ సభ్యులకు తెలియడంతో ఇరువురూ శనివారం ఉరేసుకొని ఆత్మహత్య చేసుకున్నారు. ఈ ఘటన జరిగిన వెంటనే రూరల్ పోలీసులు ఇరువురి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. శనివారం రాత్రి పొద్దుపోయిన తర్వాత రంగస్వామి కుటుంబ సభ్యులు ప్రొద్దుటూరుకు వచ్చారు. వారు రాగానే మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. రంగస్వామి తండ్రి రామాంజనేయులు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. వీళ్లిద్దరూ సహజీనం చేస్తున్న విషయం ఇన్ని రోజులుగా తమకు తెలియదని, ఇటీవలే తెలిసినట్లు ఆయన పోలీసులకు తెలిపాడు. పోస్టుమార్టం అనంతరం రూరల్ పోలీసులు రంగస్వామి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. ప్రమీల మృతదేహం కోసం రాని కుటుంబ సభ్యులు ప్రమీల మృతి చెందిన విషయాన్ని పోలీసులు కుటుంబ సభ్యులకు తెలిపినా వాళ్లు ఎవ్వరూ ప్రొద్దుటూరుకు రాలేదు. ఆదివారం కూడా రూరల్ పోలీసులు పలుమార్లు ఆమె కుటుంబ సభ్యులతో మాట్లాడినా వాళ్లు రావడానికి సుముఖంగా లేనట్లు తెలుస్తోంది. దీంతో ప్రమీల మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించలేదు. మృతదేహాన్ని ఆస్పత్రిలో ని మార్చురీలో భద్రపరిచారు. సోమవారం ఆమె కుటుంబ సభ్యులు రాకుంటే పోస్టుమార్టం నిర్వహించి ప్రొద్దుటూరులోనే ప్రమీల మృతదేహానికి అంత్యక్రియలు నిర్వహించే అవకాశం ఉంది. ప్రమీల ఇద్దరు కుమారులు ముత్తు అలియాస్ రంగస్వామి, ప్రకాష్లను పోలీసులు కడపలోని చైల్ట్ వెల్ఫేర్ కమిటీకి అప్పగించారు. -
దివ్యాంగుడు అనుమానస్పద మృతి
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో ఓ దివ్యాంగుడు ఆదివారం అనుమానస్పద స్థితిలో మృతి చెందాడు. ఇందుకు సంబంధించి తాలూకా పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలం, కొత్తపల్లె పంచాయతీ, రంగారెడ్డి కాలనీ (కొత్త ఇండ్లు)కి చెందిన ఎల్.లక్ష్మినారాయణ కుమారుడు దివ్యాంగుడు ఎల్.శంకర్ (49) సిటిఎం రోడ్డులోని తట్టివారిపల్లె చెరువు కట్టపై ఉన్న గంగమ్మ గుడి నీళ్ల తొట్టిలో పడి చనిపోయి ఉండటాన్ని స్థానికులు గుర్తించారు. వెంటనే పోలీసులకు సమాచారం అందించడంతో వారు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టు మార్టం కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. శంకర్ స్థానికంగా ఉన్న ఓ ప్లాస్టిక్ కవర్ల ఫ్యాక్టరీలో పనిచేస్తున్నాడు. భార్య సునీత అలియాస్ భారతి భర్తతో మనస్పర్థల కారణంగా గత కొన్నేళ్లుగా దూరంగా ఉంటోందని శంకర్ తల్లి రత్నమ్మ తెలిపింది. తనతో పాటు మనవళ్లు పవన్, కార్తీక్ లను శంకర్ పోషించుకుంటూ ఉన్నాడని చెప్పింది. అయితే శనివారం రాత్రి సీటీఎం రోడ్డులోని ఓ కల్యాణ మండపంలో జరుగుతున్న బంధువుల పెళ్లికి వెళ్లాని చెప్పి, తన దగ్గర రూ.200 డబ్బు తీసుకుని రాత్రి వెళ్లిన తన కుమారుడు ఆదివారం ఉదయం తట్టివారిపల్లె చెరువు కట్టపై చనిపోయి ఉన్నాడని పోలీసులు ఫోన్ చేసినట్లు తెలుపుతూ రత్నమ్మ విలపించింది. తలకు, శరీరంపైన బలమైన రక్త గాయాలు ఉండటం పలు అనుమానాలకు తావిస్తోందని, చంపేసి ఆత్మహత్యగా చిత్రీక రించారని మృతుని తల్లి ఆరోపించడంతో ఎవరైనా పథకం ప్రకారం శంకర్ను కొట్టి చంపేసి నీళ్ల తొట్టిలో పడేసి వెళ్లారా..? అన్న అనుమానాలు తలెత్తుతున్నాయి. ఈశ్వర్ మృతిపై అనుమానం ఉందని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా శంకర్ది హత్య లేక మరే ఇతర కారణాలతో మృతి చెందాడా అన్నది తెలియజేస్తామని పోలీసులు తెలిపారు.కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అప్పుల బాధతో రైతు ఆత్మహత్య
ఒంటిమిట్ట : మండలపరిధిలోని పెద్దకొత్తపల్లిలో శనివారం పలుకూరు మురళి(47) అనే రైతు అప్పుల బాధ తాళలేక విషద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. పోలీసుల వివరాల మేరకు...మురళి తనకున్న భూమితో పాటు ఇతరులకు చెందిన భూములు కౌలుకు తీసుకుని పంటలు పండిస్తున్నాడు. ఈ సంవత్సరం కూడా 10 ఎకరాల్లో చామంతి సాగుచేశాడు. పూలకు గిట్టుబాటు ధరలేక నష్టం వచ్చింది. అప్పుల భారం పెరిగింది. దీంతో ఏమి చేయాలో దిక్కుతోచక పొలంలోనే విషద్రావణం తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు మురళిని 108 సహాయంతో కడప రిమ్స్కు తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం కడపలోని ఓ ప్రైవేట్ అసుపత్రికి తీసుకెళ్లారు.అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు చెప్పారు. మృతునికి భార్య లక్ష్మీ, నలుగురు సంతానం ఉన్నారు. మృతుని భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
అయోమయం.. అటవీ పాలన !
● మూడుజిల్లాల్లో రాజంపేట ఫారెస్టు ● తేలని జిల్లాల అటవీ విభజన వ్యవహారం ● పత్తాలేని రీ ఆర్గనైజేషన్ కమిటీ ● ఆందోళనలో అటవీ సిబ్బంది రాజంపేట: అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించిన రాయలసీమలోని ఎర్రచందనానికి నిలయమైన రాజంపేట అటవీ డివిజన్ మూడు జిల్లాల పరిధిలో విస్తరించి ఉంది. దీంతో పాలనలో సందిగ్ధత నెలకొందన్న వాదన అటవీశాఖలోనే వినిపిస్తోంది. మూడు జిల్లాల్లో రాజంపేట అటవీ ప్రాంతం విస్తరించిన నేపథ్యంలో ఎవరి జిల్లా పాలన వారే చేయాలా..లేక ఇతర జిల్లాకు చెందిన పాలన రాజంపేటలోనే చేయాలా అన్న సందేహాలు తలెత్తుతున్నాయి. సమస్యను రాష్ట్ర ఉన్నతాధికారుల దృష్టి కి తీసుకెళ్లలేని పరిస్ధితిలో ఉన్నారని తెలుస్తోంది. తేల్చని కూటమి ప్రభుత్వం... అటవీపాలన విడ్డూరంగా తయారైందన్న విమర్శలున్నాయి. జిల్లా సరిహద్దులకు సంబంధించి కూడా రాష్ట్ర అటవీశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించలేదు. రాజంపేట, మార్కాపురం లాంటి ప్రాంతాల్లో పాలనకు సంబంధించి సమస్యలు తలెత్తున్నాయి. కొత్త జిల్లాల ఏర్పాటు నేపథ్యంలో రీ ఆర్గనైజేషన్ కమిటీని కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసినట్లు అటవీవర్గాలు చెపుతున్నాయి. ఆ కమిటీ పత్తాలేకుండా పోయింది. అటవీశాఖ మంత్రి.. డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ కూడా అటవీపాలనపై పట్టుకోల్పోతున్నారనే విమర్శలు అటవీవర్గాల నుంచి వినిపిస్తున్నాయి. అటవీసిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన కొత్త జిల్లాల స్వరూపం మారిన నేపథ్యంలో రాజంపేట అటవీ డివిజన్ సిబ్బందిలో ప్రాంతీయ ఆందోళన నెలకొంది. ప్రస్తుతం పనిచేస్తున్న సిబ్బంది తమ విధులను మూడుజిల్లాలో అందిస్తున్నారు. ఏ జిల్లా పరిధిలో ఉంటే అక్కడేఊ జిల్లా అటవీశాఖాధికారి పర్యవేక్షణలో పాలన జరుగుతుంది. కానీ ఇప్పుడు ఆ పరిస్ధితులు కనిపించడంలేదు. తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాల పరిధిలో రాజంపేట ఫారెస్టు డివిజన్ ప్రాంతం ఉంది. రాజంపేట అటవీ డివిజన్ కడప జిల్లాలో ఉంది. డివిజన్కు చెందిన రేంజ్లు తిరుపతి, అన్నమయ్య, కడప జిల్లాలో ఉన్నాయి. కడపలో అన్నమయ్య అటవీ జిల్లా కార్యాలయం.. అన్నమయ్య జిల్లా (మదనపల్లె)అటవీ కార్యాలయం వైఎస్సార్ కడప జిల్లాలో ఉంది. ఇక్కడి నుంచి పాలన కొనసాగుతోంది. అయితే ఈ కార్యాలయం జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఏర్పాటుకావాల్సి ఉంది. అక్కడి నుంచే జిల్లా అటవీపాలన కొనసాగించాల్సి ఉంటుందని అటవీ వర్గాలే అంటున్నాయి. ఇక్కడి అటవీ పాలన కడప డీఎఫ్ఓ పర్యవేక్షించాల్సి ఉంటుంది. కానీ అలా ఇప్పుడు జరగడంలేదని అటవీ వర్గాలు అంటున్నాయి. రేంజ్ ఇక్కడ...జిల్లా అక్కడ... రాజంపేట డివిజన్ పరిధిలో రేంజ్లు ఇక్కడ ఉన్నాయి. జిల్లా వేరుగా ఉంది. రైల్వేకోడూరు నియోజకవర్గం తిరుపతి జిల్లాలోకి వెళ్లిపోయింది. దీని పరిధిలో ఉన్న చిట్వేలి రేంజ్, రైల్వేకోడూరు సబ్డీఎఫ్ఓ, బాలపల్లె రేంజ్లు ఒకప్పుడు రాజంపేట ఫారెస్టు డివిజన్లో కొనసాగాయి. ఇప్పుడు ఈరేంజ్ తిరుపతి జిల్లా పరిధిలో ఉన్నాయి. ప్రస్తుతం అన్నమయ్య అటవీజిల్లాలో కొనసాగుతోంది. తిరుపతి డీఎప్ఓ కంట్రోల్లోకి ఈ రేంజ్లు వెళ్లాల్సి ఉంటుందని అటవీ వర్గాలు చెబుతున్నాయి. ఏ జిల్లాకు ..ఆ జిల్లా రేంజ్లను అప్పగిస్తే గందరగోళ పరిస్థితులు ఉండవని సిబ్బంది అంటున్నారు. జిల్లా పరిధి రేంజ్లు అన్నమయ్య పీలేరు, రాయచోటి, మదనపల్లె కడప రాజంపేట, సానిపాయి తిరుపతి చిట్వేలి, కోడూరు, బాలపల్లె 1966 నుంచి రాజంపేట ఫారెస్టు డివిజన్ కొనసాగింది. ముందుగా కడప జిల్లాలోనే ఉండేది. తిరిగి కడప జిల్లాలోకి వెళ్లింది. అయితే కొత్త జిల్లాల ఏర్పాటు క్రమంలో అన్నమయ్య జిల్లాలోకి రాజంపేట ఫారెస్టు డివిజన్ చేరింది. మళ్లీ ఇప్పుడు జిల్లాల విభజన క్రమంలో రాజంపేట ఫారెస్టు డివిజన్ కడపలోకి వెళ్లాల్సి ఉంటుంది. అయితే అన్నమయ్య జిల్లా అటవీ పాలన ఇక్కడి నుంచి కొనసాగుతోంది. ఇప్పటి వరకు ఐఎఫ్ఎస్ల రాజ్యం కొనసాగింది. డీఎఫ్ఓ కార్యాలయం సబ్డీఎఫ్ఓ కార్యాలయంగా మారనుందని సంకేతాలు వస్తున్నాయి. -
అటల్ ల్యాబ్లను ఆవిష్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలి
రాయచోటి : అటల్ టింకరింగ్ ల్యాబ్లను క్రియాత్మక ఆవిష్కరణ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని జిల్లా విద్యాశాఖాధికారి సుబ్రమణ్యం ప్రధానోపాధ్యాయులకు సూచించారు. రాయచోటిలోని మాసాపేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తున్న అటల్ బూట్ క్యాంపును డీఈఓ శనివారం సందర్శించారు. అక్కడ విలేకరులతో మాట్లాడుతూ అటల్ ల్యాబ్లలోని మౌలిక సదుపాయాలను ఉపయోగించుకొని విద్యార్థులతో నిరంతరం ప్రయోగాలు చేయించి నైపుణ్యాభివృద్ధిని పెంపొందించాలని, తద్వారా నైపుణ్యాలు కల్గిన విద్యార్థులను అన్వేషణలవైపు నడిపించవచ్చని సూచించారు. జిల్లాలోని 24 అటల్ ల్యాబ్లలో సుమారు వెయ్యి మంది విద్యార్థులకు మూడురోజులపాటు ప్రత్యక్షానుభవన కార్యాశాలను నిర్వహించినట్లు తెలిపారు. అనంతరం ఆయన విద్యార్థులు తయారు చేసిన ప్రాజెక్టులను పరిశీలించారు. ప్రతిభ కనబరిచిన నలభై మంది విద్యార్థులకు ప్రశంసాపత్రాలను ప్రదానం చేశారు. కార్యక్రమంలో జిల్లా సైన్స్అధికారి మార్ల ఓబుల్ రెడ్డి, స్పోర్ట్స్ కార్యదర్శి వీరాంజనేయులు, ఏపీఓ రవీంద్ర, పాఠశాల ఇన్చార్జి ప్రధానోపాధ్యాయురాలు శ్రీదేవి, అటల్ డీఆర్పీ సెట్టెం ఆంజనేయులు, మెంటార్ అంకిత తదితరులు పాల్గొన్నారు. డీఈఓ సుబ్రమణ్యం -
విప్లవాత్మక సంఘ సంస్కర్త పూలే
మదనపల్లె: సమాజంలో అణగారిన వర్గాల అభ్యున్నతి, అభివృద్ధి కోసం విప్లవాత్మక సంస్కరణలు, సమాజంలో మార్పు తేవడం కోసం జీవితాన్ని త్యాగం చేసిన మహానీయుడు జ్యోతిరావుపూలే అని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. శనివారం కలెక్టరేట్లో బీసీ సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో పూలే జయంతిని నిర్వహించారు. పూలే చిత్రపటానికి కలెక్టర్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, ఇన్చార్జి డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి, పౌరసరఫరాల కార్పొరేషన్ డైరెక్టర్ పర్వీన్తాజ్, అధికారులు నివాళులు అర్పించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో కలెక్టర్ మాట్లాడుతూ అణగారిన వర్గాల అభ్యున్నతి కోసం సామాజిక అసమానతలను రూపుమాపేందుకు జీవితాన్ని ధారపోసిన పూలే అడుగుజాడలే స్ఫూర్తిగా పయనిద్దామని పిలుపునిచ్చారు. 1848లో దేశంలో తొలి బాలికల పాఠశాలను స్థాపించడం ద్వారా మహిళా విద్యకు నాంది పలికారని అన్నారు. మహిళా విద్యపై అపోహలు, భయాలను తట్టుకుని ముందుకు సాగడం ఆయన పట్టుదలకు నిదర్శనమన్నారు. బీసీ సంక్షేమ శాఖ అధికారి తేజస్విని, జంగం కార్పొరేషన్ చైర్మన్ చంద్రశేఖర్, శాలివాహన కార్పొరేషన్ డైరెక్టర్ భావన, పాలఏకరి చైర్మన్ నాగేశ్వర్ నాయుడు, బీసీ సంఘం నాయకులు బోడెం రాజశేఖర్, గంగులప్ప, సుబ్రహ్మణ్యం పాల్గొన్నారు. -
ఎస్సీ, ఎస్టీ కుటుంబాలకు ‘సౌర’ వెలుగు
చిన్నమండెం : ఎస్సీ, ఎస్టీ కుటుంబాల ఇళ్లకు ఉచితంగా సౌర విద్యుత్ వెలుగులను కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి పేర్కొన్నారు. శనివారం రాయచోటి నియోజకవర్గం చిన్నమండెం మండలం దేవగుడిపల్లె గ్రామంలోని బాపూజీనగర్లో ఎస్సీ, ఎస్టీ విద్యుత్ వినియోగదారుల గృహాలకు పీఎం సూర్యఘర్ పథకం కింద అమర్చిన 2 కిలోవాట్ సామర్థ్యం గల సోలార్ రూఫ్టాప్ యూనిట్లను వారు ప్రారంభించారు. ఈ సందర్భంగా 36 మంది లబ్ధిదారుల గృహాలపై ఏర్పాటు చేసిన సౌర విద్యుత్ యూనిట్లను ప్రారంభించారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ పీఎం సూర్యఘర్ పథకం గ్రామీణ ప్రజల జీవితాల్లో ఆర్థికం భారం తగ్గిస్తూ శాశ్వత విద్యుత్ పరిష్కారాన్ని అందిస్తోందని తెలిపారు. ఈ అవకాశాన్ని అర్హులైన ప్రతి కుటుంబం వినియోగించుకోవాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో స్థానిక ప్రజాప్రతినిధులు, అధికారులు, గ్రామస్తులు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. జిల్లా జలధార ప్రాజెక్టు దేశానికే ఆదర్శం అన్నమయ్య జిల్లాలో అమలు చేసిన ‘జలధార’ ప్రాజెక్టు దేశానికే ఆదర్శంగా నిలిచిందని మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి తెలిపారు. అతి తక్కువ సమయంలో జిల్లా వ్యాప్తంగా సమర్థవంతంగా జలధార ప్రాజెక్టు అమలు పరిచి అద్భుతమైన ఫలితాలు రావడానికి కృషి చేసిన కలెక్టర్ నిశాంత్కుమార్ను మంత్రి మండిపల్లి ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లాలో బేసిన్ ఆధారిత నీటి సంరక్షణ విధానాన్ని అనుసరించి నదీ పరివాహక ప్రాంతాలను గుర్తించి, మిగులు లోటు ప్రాంతాలకు మళ్లించే చర్యలు తీసుకోవడం జరిగిందన్నారు. 49 ఉప పరివాహక ప్రాంతాల గుర్తింపు, 532 కాస్కేడ్స్ ద్వారా 3082 చెరువుల అనుసంధానం, 962 ఎండిపోయిన చెరువుల పునరుద్ధరణ, ఉపాధి హామీ పథకం ద్వారా విస్తృత పనులు తదితర చర్యల వల్ల వృథాగా పోయే నీటిని సమర్థంగా వినియోగంలోకి తీసుకురాగాలిగారన్నారు. జలధార జలహారతి ప్రాజెక్టు అధ్యయనం చేయడానికి కేంద్రం నుంచి కూడా ఒక బృందం త్వరలో జిల్లాకు రానున్నట్లు మంత్రికి కలెక్టర్ వివరించారు. -
గంజాయి ముఠా గుట్టురట్టు
● నలుగురు నిందితుల అరెస్ట్ ● రూ.లక్ష విలువైన గంజాయి స్వాధీనంమదనపల్లె టౌన్ : మదనపల్లె పరిధిలో గంజాయి సరఫరా చేస్తున్న ముఠా గుట్టును తాలూకా పోలీసులు రట్టు చేశారు. ఉల్లిగడ్డల లోడు ముసుగులో భారీ ఎత్తున గంజాయిని తరలిస్తున్న పాత కేసులో నిందితులుగా ఉండి పరారీలో ఉన్న నలుగురు నిందితులను శనివారం పోలీసులు అరెస్ట్ చేశా రు. వారి వద్ద నుంచి రూ.లక్ష విలువైన నాలుగు కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా అదనపు ఎస్పీ (పరిపాలన) ఎం.వెంకటాద్రి మీడియా సమావేశంలో వివరాలు వెల్లడించారు. తనిఖీల్లో దొరికిపోయారు.. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అదనపు ఎస్పీ ఎం.వెంకటాద్రి (మదనపల్లి సబ్ డివిజన్ ఇన్చార్జి) పర్యవేక్షణలో మదనపల్లె తాలూకా సీఐ కె.కళావెంకటరమణ తన సిబ్బందితో కలిసి శనివారం ఉదయం బసినికొండ పంచాయతీ పరిధిలోని కనుమలో గంగమ్మ గుడి వద్ద వాహనాల తనిఖీ చేపట్టారు. ఈ క్రమంలో పుంగనూరు వైపు నుంచి వచ్చిన ఆర్టీసీ బస్సు దిగి, అనుమానాస్పదంగా నల్లటి కవర్లతో పారిపోవడానికి ప్రయత్నిస్తున్న ఇద్దరి వ్యక్తులతోపాటు మరో ఇద్దరు మహిళలను పోలీసులు చాకచక్యంగా అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారణ చేయడంతో ఇటీవల స్థానిక సిటిఎం రోడ్డు, ఎరగాని మిట్టపై ఎర్రగడ్డల మాటున 179 కిలోల గంజాయిని తరలిస్తూ పోలీసులను చూసి పారిపోయిన కేసులో పరారీలో ఉన్న నిందితులుగా నిర్ధారించారు. మదనపల్లి తాలూకా పోలీస్స్టేషన్లో గతంలో నమోదైన 179 కేజీల గంజాయి స్మగ్లింగ్ కేసులో వీరంతా పరారీలో ఉన్నట్లు గుర్తించారు. పట్టుబడిన వారిలో శ్రీ సత్యసాయి జిల్లా తనకల్లు మండలానికి చెందిన మల్లెల మహేష్, మల్లెల అమరావతితోపాటు, పుంగనూరు పట్టణానికి చెందిన మల్లెల రాజమ్మ, మల్లెల చంటి ఉన్నారు. వారి నుంచి నాలుగు కేజీల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. గతంలో చంద్రా కాలనీకి చెందిన వదినా మరిది నాగరాజు, సుగుణలను రిమాండ్కు తరలించామని అదనపు ఎస్పీ తెలిపారు. ఈ కేసులో ప్రధానంగా గంజాయి విక్రయించిన మరో నిందితుడి కోసం గాలింపు ముమ్మరం చేసినట్లు పేర్కొన్నారు. యువత భవిష్యత్తును చిదిమేస్తే కఠిన చర్యలు ఈ సందర్భంగా అదనపు ఎస్పీ మాట్లాడుతూ జిల్లాలో గంజాయి సాగు, రవాణా, విక్రయాల మీద ఉక్కుపాదం మోపుతున్నామన్నారు. ముఖ్యంగా యువతను మత్తుకు బానిసలుగా మారుస్తున్న ముఠాలపై ప్రత్యేక నిఘా ఉంచామన్నారు. గంజాయి విక్రేతలపై పీడీ యాక్ట్ వంటి కఠిన చట్టాలను ప్రయోగిస్తామని హెచ్చరించారు. డ్రగ్స్ రహిత జిల్లాగా మార్చేందుకు ప్రజలు కూడా పోలీసులకు సహకరించాలన్నారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచారం అందించాలని కోరారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనబరచిన మదనపల్లె తాలూకా సీఐ, పోలీస్ స్టేషన్ సిబ్బందిని ఏఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
మూల విరాట్ నర్మదా నది నుంచి..
నందీశ్వరాలయంలో ప్రతిష్ఠించిన మూల విరాట్ శివలింగానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇది మొలచిన విగ్రహం కాదు. మధ్యప్రదేశ్లోని నర్మద నదిలో స్వయంభుగా వెలిసిన శివలింగాన్ని గజ ఈతగాళ్లతో వెలికి తీసి తెప్పించారు. ఈ విగ్రహానికి రూ.4 లక్షలకు పైగా వెచ్చించారు. ఇందులో ప్రత్యేకత ఏమిటంటే.. సాలేగ్రామ్ విగ్రహం కావడంతోపాటు స్వయంభుగా వెలిసినట్లు తెలుస్తోంది. మధ్యలో ఎరుపు రంగు ఉండి మిగతాదంతా తెల్ల రంగుతో ఉండటం విశేషం. మాములుగా శివలింగం అంటేనే నలుపు రంగులో ఉండటం సహజం. నర్మద నది శివలింగాలకు పుట్టినిల్లని ప్రతీతి. మిగతా వినాయకుడు, పార్వతీదేవి విగ్రహాలను టీటీడీ నుంచి తెప్పించారు. ప్రధాన ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేసిన నంది విగ్రహం ఆళ్లగడ్డలో తయారు చేయించారు. -
మదనపల్లెలో తమిళనాడు వాసి బలవన్మరణం
మదనపల్లె టౌన్ : హోటల్లో టీ మాస్టర్గా పని చేస్తున్న తమిళనాడుకు చెందిన వ్యక్తి మదనపల్లెలో బలవన్మరణం చెందాడు. శనివారం వెలుగు చూసిన విషాదకర ఘటనపై మృతుడి కుటుంబీకులు, రెండవ పట్టణ పోలీసులు తెలిపిన వివరాలు.. తమిళనాడు రాష్ట్రం గుడియాతంకు చెందిన గోవిందం హరిబాబు (52) గత 20 ఏళ్ల క్రితం కుటుంబీకులతో కలసి బతుకు దెరువు నిమిత్తం మదనపల్లెకు వలస వచ్చాడు. ఆయనకు భార్య మంజుల, కుమార్తె గాయత్రి, కుమారుడు కిషోర్ ఉన్నారు. పట్టణంలోని రామారావు కాలనీలో ఓ అద్దె ఇంట్లో ఉంటూ.. స్థానిక కోట వీధిలో ఉన్న ఓ టీ హోటల్లో టీ– మాస్టర్గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. ఈ క్రమంలో 15 రోజుల క్రితం పలమనేరులో ఉన్న తన కూతురు గాయత్రి ప్రసవించడంతో హరిబాబు భార్య మంజుల కూతురు చెంతకు వెళ్లింది. కొడుకు కిషోర్ బెంగుళూరు లోని ఓ కంపెనీలో పని చేస్తుండగా, హరిబాబు ఇంట్లో ఒక్కడే ఉంటున్నాడు. ఇంతలో హరిబాబుకు ఏం కష్టం వచ్చిందో ఏమో..? జీవితంపై విరక్తి చెంది తను ఉంటున్న ఇంట్లోనే ఫ్యానుకు తాడుతో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. తెల్లవారిన తర్వాత ఇరుగు పొరుగు వారు గమనించి స్థానిక టూ టౌన్ పోలీసులకు, మృతుడి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లెకు వచ్చి మృతదేహాన్ని పరిశీలించి కన్నీరుమున్నీరుగా విలపించారు. మృతదేహాన్ని పరిశీలించిన పోలీసులు పంచనామా చేపట్టి, ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీకి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కుదుటపడని పాలన
స్థానిక బెంగళూరు రోడ్డులోని పట్టు పరిశ్రమ శాఖ భవనంలో సహకార శాఖది విచిత్ర పరిస్థితి. జిల్లా సహకార శాఖకు, జిల్లా సహకార శాఖ ఆడిట్ కార్యాలయం ఒక గదిలో ఏర్పాటు చేశారు. గది మధ్యలో రికార్డులను అడ్డుగా ఉంచి కుడివైపు ఆడిట్ శాఖ, ఎడమవైపు సహకార శాఖ జిల్లా అధికారులు విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా కార్యాలయాల పరిస్థితి ఎలా ఉందో చెప్పడానికి సహకార శాఖ పరిస్థితి అద్దం పడుతోంది. మదనపల్లె: మదనపల్లె జిల్లా కేంద్రంగా ఏర్పడి వందరోజులైంది. అయితే అధికారులకు మాత్రం కార్యాలయాల ఏర్పాటుకు వంద అవస్థలు పడ్డారు. ఇంకా పడుతూనే ఉన్నారు. దీనికి ప్రభుత్వం ముందుచూపులేకపోవడం, జిల్లా కేంద్రం రాయచోటినుంచి మదనపల్లెకు తరలించే విషయంలో కనీస సన్నద్ధతకు అవకాశం ఇవ్వకపోవడమే కారణం. వైఎస్సార్సీపీ ప్రభుత్వం లో కొత్త జిల్లాలు ఏర్పాటు విషయంలో ప్రణాళిక బద్ధంగా వ్యవహరించింది. కొత్త జిల్లాలను 2022 ఏప్రిల్ 4నుంచి మనుగడలోకి వస్తాయని ముందుగానే ప్రకటించింది. ప్రభుత్వ వ్యవస్థలు జిల్లా కేంద్రాల ఏర్పాటుకు సంబంధించి ప్రణాళిక బద్ధంగా చర్యలు తీసుకొని ఏర్పాటు చేశారు. అయితే కూటమి ప్రభుత్వం మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే నిర్ణయం హఠాత్తుగా తీసుకుని ఇప్పటికీ ఇబ్బందులకు గురి చేస్తూనే ఉంది. జిల్లా కేంద్రం పాలన మొదలై 100 రోజులు గడిచిన ఇంకా కార్యాలయాలు కుదురుకోలేదు. అస్తవ్యస్త పరిస్థితుల మధ్య పనిచేస్తున్నాయి. ఇంకా పూర్తిస్థాయి కార్యాలయాలు రాయచోటి నుంచి తరలి రాలేదు. ఒకరోజులో పాలన కేంద్రం మార్పు 2025 డిసెంబర్ 30న అన్నమయ్య జిల్లాకు మదనపల్లెను జిల్లా కేంద్రం చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వు జారీ చేసింది. అప్పటిదాకా రాయచోటి కేంద్రంగా పనిచేస్తున్న జిల్లా కేంద్రం మదనపల్లెకు మారాల్సి వచ్చింది. ఉత్తర్వు జారీ అయిన మరుసటి రోజు అంటే డిసెంబర్ 31న జిల్లా కేంద్రం మనుగడలోకి రాగా కలెక్టర్ కలెక్టరేట్ను ప్రారంభించారు. అదేరోజు నుంచి జిల్లా పాలన మొదలైంది. తర్వాత ఇక్కడికి రాయచోటిలోని జిల్లా కార్యాలయాల తరలింపు ప్రక్రియ మొదలైంది. జిల్లాస్థాయి కార్యాలయాల ఏర్పాటుకు కావాల్సినంత, అవసరమైనస్థాయి కలిగిన కార్యాలయాలు అందుబాటులో లేకపోవడంతో అధికారులు స్థిమితంగా కూర్చుంటున్నది లేదు. సిద్ధం కాకనే ప్రకటన మదనపల్లెను జిల్లా కేంద్రం చేసే విషయం గత ఏడాది డిసెంబర్ లో ఒక్కసారిగా వెలుగులోకి వచ్చింది. అంతకుముందు మదనపల్లె పేరుతోనే జిల్లా ఉంటుందని ప్రచారం జరిగింది. అయితే రాజకీయ సమీకరణలను దృష్టిలో ఉంచుకొని ప్రభుత్వం అన్నమయ్య జిల్లాను మూడు ముక్కలు చేసింది. పుంగనూరును అన్నమయ్య జిల్లాలో కలిపి మదనపల్లెను జిల్లా కేంద్రం చేసింది. కాస్త గడువు ఇచ్చాక లేదంటే జిల్లా అధికారులు మదనపల్లె తరలేందుకు మానసికంగా సిద్ధమయ్యే సమయం కూడా ఇవ్వకుండా ప్రభుత్వం డిసెంబర్ 30న జీవో జారీ చేసింది. దీంతో జిల్లా అధికార యంత్రాంగంలో హడావిడి మొదలైంది. ఆయా జిల్లా శాఖల అధికారులు మదనపల్లెలో ఎక్కడ కార్యాలయం ఏర్పాటు చేసుకోవాలో దిక్కుతోచగా రాయచోటి కేంద్రంగా పనిచేస్తూనే మదనపల్లెలో కార్యాలయం ఏర్పాటు కోసం పరుగులు తీశారు. బీటీ కళాశాల భవనాల్లోనే.. మదనపల్లెలో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేసేందుకు కావాల్సిన వసతులు, సౌకర్యాలతో పాటు ప్రభుత్వ భవనాలు లేవు. అధికారులు ఎంత ప్రయత్నించినా, వేట సాగించినా సౌకర్యవంతమైన భవనాలు కనిపించలేదు. దీంతో ప్రభుత్వ ఆదేశాలతో సత్వరమే కార్యాలయాలు ఏర్పాటు చేయాల్సి ఉన్నందున బీటి కళాశాల ట్రస్టుకు చెందిన వసతి గృహాలు, పట్టు పరిశ్రమశాఖ, సిఎల్ఆర్సీసి భవనాలు, సెరికల్చర్ రీలర్స్ ట్రైనింగ్ సెంటర్, బీటీ కళాశాల మహిళా హస్టల్, ఇలా అందుబాటులో ఉన్న భవనాల్లో జిల్లా కార్యాలయాలకు గదులు కేటాయించారు. బీఈడీ కళాశాల భవనాలు, బీటీ కళాశాల ఆవరణలోని భవనాలను అధికార యంత్రాంగం స్వాధీనం చేసుకుంది. వాటిలోనే వీలైన మేరకు కార్యాలయాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. కూర్చునే సౌకర్యం లేకున్నా.. మదనపల్లెలో జిల్లా కార్యాలయాల పరిస్థితి ఎలా ఉందంటే సౌకర్యవంతంగా నలుగురు కూర్చునే పరిస్థితి లేదు. కిందిస్థాయి ఉద్యోగికి కేటాయించే చిన్నగది లాంటి గదే జిల్లా కార్యాలయాలుగా మారాయి. అందులోనే డెస్క్టాప్లు, జిల్లా అధికారి టేబుల్, కుర్చీ, కార్యాలయానికొచ్చే వారికి కుర్చీలు, ఇలా అన్ని ఒక చిన్నగదిలోనే సమకూర్చుకుని విధులు నిర్వహించాల్సిన పరిస్థితి నెలకొంది. దేవదాయ శాఖ, జిల్లా క్రీడల శాఖ, పర్యాటకశాఖ, మెప్మా, ఇలాంటి కార్యాలయాలకు ఒక గదిలోనే కేటాయించారు. ఈ కార్యాలయాల పరిస్థితి ఎలా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. బీటీ కళాశాల వసతి గృహంలో, పట్టు పరిశ్రమ శాఖ భవనంలో ఎక్కువ జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేశారు. ఒక చిన్న గదిలో జిల్లాకు సంబంధించిన రికార్డులు, పనిచేసే సిబ్బంది, అధికారులకు ఏమాత్రం సరిపోదు. ఈ కార్యాలయాలకు వాష్రూమ్లు లేవు. ఇది ఉద్యోగులకు తీవ్ర ఇబ్బందులకు గురిచేస్తోంది. మదనపల్లె జిల్లా కేంద్రానికి వంద రోజులు ఇప్పటికీ కుదురుకోని కార్యాలయాలు ఒక గదిలో రెండు జిల్లా ఆఫీసులు బోర్డులు తప్ప ప్రారంభంకాని వైనం జిల్లా కేంద్రం మదనపల్లెలో కలెక్టర్, జాయింట్ కలెక్టర్, డీఆర్ఓ, డీఆర్డీఏ, డ్వామా, సీపీఓ, డీపీఓ తదితర ముఖ్య ప్రభుత్వశాఖల అధికారులు ప్రభుత్వ ఉత్తర్వు జారీ అయిన వెంటనే ఇక్కడినుంచి పాలన మొదలు పెట్టారు. మొట్టమొదట కలెక్టర్ నిశాంత్కుమార్ జిల్లా కేంద్రం అమలులోకి వచ్చిన డిసెంబర్ 31 నుంచి మదనపల్లె కేంద్రంగానే పాలన సాగిస్తున్నారు. పూర్తిస్థాయి పాలన కలెక్టరేట్ నుంచి సాగిస్తూ ప్రభుత్వశాఖలతో సమన్వయం చేస్తున్నారు. ఆయా శాఖలతో సమీక్షలు, సమావేశాలను నిత్యం నిర్వహిస్తూనే క్షేత్రస్థాయిలో పర్యటనలు, తనిఖీలు చేస్తున్నారు. అయితే పలుశాఖల జిల్లా అధికారుల పాలన ఇంకా కుదుటపడలేదు. కొన్నిజిల్లాశాఖలు ఇంకా రాయచోటిలో కొనసాగుతుండటంతో అధికారులు అక్కడికి రాకపోకలు సాగిస్తున్నారు. ఇంకా తరలిరావాల్సిన కార్యాలయాలు పూర్తిస్థాయిలో తరలించి ఇక్కడి కార్యాలయాల నుంచే పాలన సాగిస్తే..అప్పటికి పూర్తిస్థాయిలో జిల్లా పాలన మొదలవుతుంది. -
అడ్డొచ్చిన కుక్క.. అదుపు తప్పిన బైక్
మదనపల్లె టౌన్ : కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి పడి బోరు మెకానిక్ తీవ్రంగా గాయపడిన సంఘటన శనివారం మదనపల్లె మండలంలో వెలుగు చూసింది. ఇందుకు సంబంధించి బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని కోటవారిపల్లె పంచాయతీ బండకాడపల్లెకు చెందిన నాగరాజు(24) మదనపల్లెలోని ఓ బోర్ మెకానిక్ దుకాణలో మెకానిక్గా పని చేస్తున్నాడు. రోజూ విధులకు మదనపల్లెకు బైకులో వచ్చి పోయేవాడు. రోజూ మాదిరిగానే శుక్రవారం మదనపల్లెకు వచ్చిన నాగరాజు విధులు ముగించుకుని రాత్రి 11 గంటల సమయంలో బండకాడపల్లెకు బైకుపై వెళుతుండగా, మార్గంమధ్యలోని నాయునివారిపల్లె మలుపు వద్ద కుక్క అడ్డు రావడంతో బైకు అదుపు తప్పి కింద పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సమాచారంతో కుటుంబీకులు బాధితున్ని వెంటనే మదనపల్లె ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చి చికిత్సలు అందించడంతో కోలుకుంటూ ఉన్నాడు. -
మనస్తాపంతో యువతి ఆత్మహత్య
మైలవరం : మండల పరిధిలోని వేపరాల గ్రామానికి చెందిన ఉమ్మడి శెట్టి జయవాణి(29) మనస్తాపం చెంది ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. వివరాల్లోకి వెళితే.. వేపరాల గ్రామం కొత్త కొట్టాలలో జయరాముడు, లక్ష్మీదేవిలకు ఇద్దరు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ఇటీవల కాలంలో కుటుంబ సమస్యలు ఎక్కువ కావడంతో జయవాణి శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఈ సంఘటనను గమనించిన తండ్రి జయరాముడు వెంటనే ఆమెను జమ్మలమడుగులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఉపాధిలో అవినీతి కంపు
● రూ.17.70 లక్షలు అవినీతి జరిగినట్లు ప్రజావేదికలో వెల్లడి ● ఇద్దరు టెక్నికల్ అసిస్టెంట్లు, కంప్యూటర్ ఆపరేటర్పై క్రమశిక్షణ చర్యలు గాలివీడు: మండలంలో జాతీయ ఉపాధి హామీ పనుల్లో భారీగా అక్రమాలు జరిగాయి. రూ.17.70 లక్షల నిధులను ఉపాధి హామీ సిబ్బంది పక్కదారి పట్టించినట్లు ఆడిట్ టీమ్ నిర్ధారించింది.స్థానిక మండల ప్రజాపరిషత్ కార్యాలయం ఆవరణలో శనివారం డ్వామా పీడీ వెంకటరత్నం అధ్యక్షతన సామాజిక తనిఖీ ప్రజావేదిక నిర్వహించారు. ఈ సందర్భంగా సామాజిక తనిఖీ బృదం 17 గ్రామ పంచాయతీల్లో 2024 ఏప్రిల్ 1 నుంచి 2025 మార్చి 31 వరకు జరిగిన పనులకు సంబంధించి జరిగిన అక్రమాలను ప్రజావేదికలో వెల్లడించింది. గ్రామాల వారిగా అరవీడు (రూ.56857), గోరాన్ చెరువు (రూ.195507), గరుగుపల్లి (రూ.95503), తలముడిపి(రూ.68743), తూముకుంట(రూ.46420), పూలింకుంట(రూ.226450), గుండ్లచెరువు(రూ.458891), నూలివీడు(రూ.3902), గాలివీడు (రూ.1000),పేరంపల్లి (రూ.9229), కొర్లకుంట(రూ.186956), సీసీ పల్లె(రూ.34844), గోపనపల్లె (రూ.6077),పందికుంట (రూ.254188), బొరెడ్డిగారిపల్లి (రూ.112840), ఎగువగొట్టివీడు(రూ.12051)అవినీతి జరిగినట్లు నిర్ధారించారు.ప్రధానంగా కూలీల సంతకాల్లో వ్యత్యాసాలు ,పనుల కొలతల్లో తేడాలు బయటపడ్డాయి. నిబంధనలకు తూట్లు పొడిచి అడ్డగోలుగా చెల్లింపులు జరిపారు. ఉపాధి హామీ పథకంలో రూ.17,29,774 అవినీతి జరగ్గా, పీఆర్ ఇంజినీరింగ్ విభాగంలో 40,289 అవినీతి జరిగినట్లుగా నిర్ధారించారు. మొత్తం రూ.17,70,063 కాగా అందులో రూ.55,000 రికవరీ జరిగిందన్నారు.ఈ వ్యవహారంలో టెక్నికల్ అసిస్టెంట్లు రత్నకుమార్, ఖాదర్ భాషా, కంప్యూటర్ ఆపరేటర్ మణి కుమార్ పై క్రమశిక్షణ చర్యల్లో భాగంగా షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లుగా అధికారులు స్పష్టం చేశారు. ఈకార్యక్రమంలో ఏపీడీ మధుబాబు, ఎస్ఆర్పీ సూర్య తదితరులు పాల్గొన్నారు. -
ఆవేదన.. ఆందోళన
ఓ వైపు బిడ్డ చనిపోయిందన్న ఆవేదన.. మరోవైపు కిరాతకుడిని ఎన్కౌంటర్ చేయాలని ఆందోళన వెరసి ఖాజీపేట ఉద్రిక్తంగా మారింది. తమకు కడుపుకోత మిగిల్చిన ఉన్మాదిని ఉరితీసేవరకు తమ శోకం తీరదంటూ తల్లిదండ్రులు కన్నీటిపర్యంతమయ్యారు. ఆందోళన చేస్తున్న మహిళలకు సర్దిచెబుతున్న పోలీసులు ఖాజీపేట బస్టాండ్ వద్ద ధర్నా చేస్తున్న స్థానికులుఖాజీపేట : ప్రేమోన్మాదిని ఎన్కౌంటర్ చేయాలని.. బాలికకు న్యాయం జరిగే వరకు పోరాటం ఆగదని రామకీర్తన కుటుంబ సభ్యులు, బంధువులు శనివారం నిరసనకు దిగారు. అంత్యక్రియలు చేసేది లేదంటూ ధర్నా చేపట్టారు. వివరాలు.. ఖాజీపేట మేజర్ పంచాయతీలోని అగ్రహారం గ్రామంలో రామకీర్తన (16) అనే బాలికను ఆంజనేయ కొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ శుక్రవారం ఉదయం ఇంటిలోనే అతి కిరాతకంగా గొంతు కోసి చంపాడు. ఈ కేసు విషయంలో బాలిక తండ్రి శ్రీనివాసులు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. శనివారం శవ పరీక్షలు పూర్తి చేసి రామకీర్తన మృతదేహాన్ని స్వగ్రామం అగ్రహారానికి అంత్యక్రియలు చేసేందుకు తీసుకొచ్చారు. అయితే అంత్యక్రియలు చేస్తే తమ కుమార్తెకు న్యాయం జరగదని రామకీర్తన తల్లిదండ్రులు, బంధువులు భావించారు. అందరూ ఖాజీపేట బస్టాండ్ కూడలికి చేరుకుని ధర్నాకు దిగారు. మధ్యాహ్నం 2 నుంచి సాయంత్రం 6 వరకూ ధర్నా చేశారు. మైదుకూరు డీఎస్సీ వెంకటేశ్వర్లు, కడప దిశా డీఎస్పీ బాలస్వామిరెడ్డి బాలిక బంధువులతో మాట్లాడే ప్రయత్నం చేశారు. నిందితుడికి చట్టప్రకారం శిక్షపడేలా చేస్తాం.. ఇందులో ఎవరి భాగస్వామ్యం ఉన్నా వదిలేది లేదని సర్దిచెప్పే ప్రయత్నం చేశారు. అయితే హత్య చేసిన వ్యక్తితోపాటు ఇందులో ఇతరులు కూడా ఉన్నారని, వారి పేర్లు కూడా కేసులో నమోదు చేయాలని బాలిక బంధువులు కోరారు. వారి విజ్ఞప్తి మేరకు తిరిగి ఫిర్యాదు తీసుకుని పేర్లు నమోదు చేసేందుకు హామీ ఇచ్చారు. పోలీసులు ఇచ్చిన హామీ మేరకు ధర్నా విరమించారు. భారీ పోలీసు బందోబస్తు శుక్రవారం జరిగిన సంఘటనను దృష్టిలో ఉంచుకుని పోలీసులు అగ్రహారంలో ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశారు. ఇద్దరు డీఎస్పీలు, నలుగురు సీఐలు, ప్రత్యేక పోలీసు బలగాలను ఏర్పాటు చేశారు. ఎక్కడా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చర్యలు చేపట్టారు. రామకీర్తన అంత్యక్రియలు ఆదివారం జరుగుతాయని బంధువులు తెలిపారు. బాలిక తల్లిదండ్రులకు పరామర్శ అతి కిరాతకంగా హత్యకు గురైన రామకీర్తనకు న్యాయం చేయాలని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి రెడ్యం వెంకటసుబ్బారెడ్డి పేర్కొన్నారు. మృతి విషయం తెలుసుకుని బాలికకు నివాళి అర్పించారు. తల్లిదండ్రులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ హంతకుడికి ఊరిశిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు.ప్రేమోన్మాదిని ఎన్కౌంటర్ చేయాలి అప్పుడే బాలికకు న్యాయం జరుగుతుంది బాలిక బంధువుల ధర్నా నేడు అంత్యక్రియలు కడప కార్పొరేషన్: రాష్ట్రంలో శాంతిభద్రతలు పూర్తిగా క్షీణించాయని, పోలీసు వ్యవస్థ మొద్దు నిద్ర పోతోందని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా విమర్శించారు. శనివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఖాజీపేటలో బాలికను పాశవికంగా హత్య చేయడం దారుణమన్నారు. ఆడపిల్లలు బయటికి వెళ్తే సురక్షితంగా ఇంటికి వస్తారా లేదా అనే అనుమానం కలుగుతోందన్నారు. పోలీసు వ్యవస్థపై ప్రజలకు నమ్మకం సన్నగిల్లుతోందన్నారు. కూటమి సర్కార్ వచ్చాక ఏపీని మద్యాంధ్ర ప్రదేశ్ మార్చేసిందని, డ్రగ్స్, గంజాయి విచ్చలవిడిగా దొరుకుతున్నాయన్నారు. దీనివల్లే నేరాలు పెరుగుతున్నాయన్నారు. మొన్న ఆలంఖాన్పల్లెలో దస్తగిరిని హత్య చేశారని, దీనిపై లోతైన విచారణ జరపాలన్నారు. ఈ హత్యల వెనుక ఉన్న వారిని వెలికి తీసి శిక్షపడేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
అద్భుతం.. నందీశ్వరాలయం
● నందిపల్లెలో రూ.7 కోట్లతో నిర్మాణం ● వైఎస్ జగన్, వైఎస్ అవినాష్రెడ్డి సహకారం ● మారం శ్రీకాంత్రెడ్డి రూ.3 కోట్లకు పైగా వ్యయం ● నేడు మండల పూజకడప సిటీ/వేంపల్లె : ఆ యువకుడు లండన్కు చెందిన సాఫ్ట్వేర్ కంపెనీలో విధులు నిర్వర్తిస్తున్నాడు. ఆయన భార్య లక్ష్మీదేవి కూడా లండన్ కంపెనీలోనే ఇంటి దగ్గరి నుంచే (వర్క్ ఫ్రం హోమ్) విధులు నిర్వర్తిస్తూ ఆలయ నిర్మాణానికి సిద్ధమయ్యారు. తన తల్లి నందిపల్లె గ్రామ సర్పంచ్ (ప్రస్తుతం మాజీ సర్పంచ్)గా ఉన్న మారం సులోచన, ఆయన భార్య లక్ష్మీదేవి అతనికి చేదోడు వాదోడుగా ఉండి ఆలయ నిర్మాణానికి సహకరించారు. రూ.35 లక్షలుగా అనుకున్న ఆలయ నిర్మాణం చివరకు రూ.7 కోట్లకు పైగా వెచ్చించి పూర్తి చేశారు. దాదాపు మూడు సంవత్సరాలకుపైగా సమయం పట్టింది. వేంపల్లె సమీపంలో పులివెందుల రోడ్డులో నందిపల్లె గ్రామ పరిసరాల్లో నాలుగు ఎకరాల విస్తీర్ణంలో ఉంది. ప్రాచీన కళ ఉట్టిపడేలా.. విజయనగర సామ్రాజ్యం కాలం నాటి గుడి నిర్మాణాలతో పోల్చకుండా.. ఆ తర్వాత నిర్మించిన ఆలయాల్లో దక్షిణ భారతదేశంలోనే నందిపల్లె నందీశ్వరాలయం పేరు గాంచింది. ఎక్కడా కూడా సిమెంటు, ఇటుక వాడకుండానే గుడి నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రాచీణ కళ ఆలయ పరిసర ప్రాంతాల్లో వెల్లివిరుస్తోంది. 43 వేల టన్నుల గ్రానైట్ రాళ్లు ఈ ఆలయ నిర్మాణానికి 43 వేల టన్నుల గ్రానైట్ రాయి (బ్లాక్ పెరల్)ని వాడారు. కోటప్పకొండలోని వీరభద్ర క్వారీ నుంచి 100 లారీలకు పైగా 43 వేల టన్నుల గ్రానైట్ రాయిని తీసుకొచ్చి నిర్మాణానికి ఉపయోగించారు. తమిళనాడుకు చెందిన ముత్తుకుమార్ నేతృత్వంలో ఆలయ నిర్మాణం జరిగింది. చదరపు అడుగు రూ. 400 రేటు పడగా, మొత్తం రూ.3.50 కోట్లు గ్రానైట్ రాళ్లకు ఖర్చు చేశారు. విగ్రహ ప్రతిష్ఠకు హాజరైన మాజీ సీఎం ఈ నందీశ్వరాలయ నిర్మాణానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి సహకారం అందించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వారు దాదాపు 1.40 కోట్ల రూపాయలను ఆలయ నిర్మాణానికి అందించారు. ఈ ఏడాది ఫిబ్రవరి 23 నుంచి 26వ తేదీ వరకు నందీశ్వరాలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు నిర్వాహకులు, గ్రామస్తులు ఘనంగా నిర్వహించారు. ఫిబ్రవరి 25వ తేదీన ఇక్కడ నిర్వహించిన యజ్ఞంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి, కడప ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డిలు భక్తజన సందోహం మధ్య పాల్గొన్నారు. విశేష పూజలు నిర్వహించారు. వీరితోపాటు మాజీ ఎమ్మెల్యేలు, మాజీ మంత్రులు కూడా పాల్గొన్నారు. ప్రతిష్ఠ చేసిన కంచి కామకోటి పీఠాధిపతి విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమంలో భాగంగా ఫిబ్రవరి 26వ తేదీన 70వ కంచికామకోటి పీఠాధిపతి విజయేంద్ర సరస్వతి పాల్గొన్నారు. ఆయన ఆధ్వర్యంలో ఆయన సూచనల మేరకు విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలను ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్రెడ్డి నిర్వహించారు. మండల పూజకు సర్వం సిద్ధం ఆలయ విగ్రహ ప్రతిష్ఠ కార్యక్రమాలు జరిగి నేటికి (ఆదివారం) 48 రోజులు అనగా మండలం పూర్తి కావడంతో అందుకు సంబంఽధించిన పూజలకు సర్వం సిద్ధం చేశారు. కొత్తగా శంకరాచార్యుల విగ్రహాన్ని కూడా ప్రతిష్ఠించనున్నారు. రుద్రాభిషేకం, జలాభిషేకం, పంచామృతాభిషేకం తదితర పూజాధికాలు పక్కన తాత్కాలికంగా నిర్మించిన యజ్ఞశాలలో నిర్వహించనున్నారు. ఇంకా యాగశాల, పార్కు, కల్యాణ మండపం, రెయిలింగ్ తదితర నిర్మాణాలు చేపట్టాల్సి ఉందని ఆలయ చైర్మన్ మారం శ్రీకాంత్రెడ్డి తెలిపారు. -
కత్తితో పొడిచి యువకుడి హత్య
● ఘటనకు దారి తీసిన దాయాదుల మధ్య గొడవ ● సంఘటన స్థలాన్ని పరిశీలించిన పోలీసులు రాజుపాళెం : మండల పరిధి పర్లపాడు గ్రామంలోని ఎస్సీ కాలనీలో శుక్రవారం రాత్రి బంగి మహేష్ అలియాస్ పండు (23) అనే యువకుడు కత్తిపోట్లతో హత్యకు గురయ్యాడు. అదే గ్రామంలోని ఎస్సీ కాలనీకి చెందిన వరుసకు దాయాదులైన మరో యువకుడితో జరిగిన చిన్నపాటి ఘర్షణ కారణంగా చినికి చినికి గాలి వానలాగా మారడంతో హత్యకు దారి తీసింది. వివరాల్లోకి వెళితే... మధ్యాహ్న సమయంలో మహేష్ ఎందుకు అంత స్పీడ్గా వెళ్తున్నావని చరణ్ను వారించినట్లు తెలిసింది. ఈ విషయమై అక్కడ ఇరువురి మధ్య కొద్దిసేపు వాగ్వాదం జరిగింది. అయితే ఇదే విషయమై రాత్రి రెండు కుటుంబాలకు చెందిన వాళ్లు గొడవ పడ్డారు. ఈ క్రమంలో మహేష్ను చరణ్ కత్తితో పొడిచి హత్య చేసినట్లు తెలిసింది. అయితే మహేష్ను చికిత్స నిమిత్తం ప్రొద్దుటూరు ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు అక్కడి వైద్యులు తెలిపారు. సంఘటనా స్థలాన్ని ప్రొద్దుటూరు రూరల్ సీఐ నాగభూషణం, ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డిలు శుక్రవారం రాత్రి పరిశీలించారు. హత్యకు గల కారణాలను అడిగి తెలుసుకున్నారు. మృతుడికి తల్లిదండ్రులతోపాటు అన్న కూడా ఉన్నారు. మృతుడు వృత్తి రీత్యా డ్రైవరుగా పని చేస్తున్నాడు. హత్య జరిగిందని తెలియడంతో ఒక్కసారిగా గ్రామం ఉలిక్కిపడింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
తమ్ముడిపై అన్న దాడి
మదనపల్లె టౌన్ : ఆస్తిలో వాటా అడిగిన తమ్ముడిపై అన్న కత్తితో దాడి చేసిన సంఘటన గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగింది. బాధితుడు తాలుకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. పొన్నేటి పాళ్యం పంచాయతీ చిప్పిలికి చెందిన నాగిరెడ్డి(46)కి తన తల్లిదండ్రులకు వారసత్వంగా సంక్రమించిన వ్యవసాయ భూమిలో వాటా రావాల్సి ఉంది. ఈ క్రమంలో రాత్రి నాగిరెడ్డి తన అన్న చెన్నకేశవరెడ్డి ఇంటికి వెళ్లి ఆస్తిలో వాటా పంచాలని నిలదీశాడు. ఈ విషయమై ఇద్దరూ గొడవ పడ్డారు. మాటకుమాట పెరగడంతో ఆగ్రహంతో రెచ్చిపోయిన చెన్నకేశవరెడ్డి ఇంట్లో ఉన్న కత్తి తీసుకొచ్చి తమ్ముడిపై దాడి చేసి తీవ్రంగా గాయపరచాడు. కుటుంబీకులు సమాచారం తెలుసుకుని వెళ్లి.. బాధితుడిని వెంటనే స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. ఘటనపై తాలుకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
కురబలకోట ఎంపీపీ తనయుడికి గాయాలు
కురబలకోట : కురబలకోట ఎంపీపీ ఎంజీ భూదేవి కుమారుడు ఎంజీ అభిషేక్ (20) రోడ్డు ప్రమాదంలో గాయపడ్డారు. ఇతను అంగళ్లులోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ చదువుతున్నారు. మండలంలోని విశ్వం కళాశాల సమీపంలో బైక్పై వెళుతుండగా గురువారం కారు ఢీకొంది. ఈ సంఘటనలో అభిషేక్కు గాయాలు కాగా మదనపల్లిలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. చెట్టుపై నుంచి పడి.. నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్) : చింత కాయలు కోయడానికి వెళ్లిన రైతు చెట్టుపై నుంచి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. నిమ్మనపల్లె మండలంలో శుక్రవారం జరిగిన ఘటనపై జల్లా ఆస్పత్రి ఔట్ పోస్టు పోలీసులు, బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. నిమ్మనపల్లె మండలం గారబురుజుకు చెందిన రైతు ఖలీల్ (58) ఊరి సమీపంలోని తన చింత చెట్టెక్కి కాయలు కోస్తుండగా, కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు గమనించి బాధితున్ని వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం రుయాకు వెళ్లాలని రెఫర్ చేశారు. రోడ్డు ప్రమాదంలో రైతుకు తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : నీళ్ల ట్యాంకర్ను తప్పించబోయిన ఓ రైతు రోడ్డు పక్కనున్న గుంతలో పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం రాత్రి మదనపల్లె మండలంలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. పెంచుపాడు పంచాయతీ కట్టుబావి గొల్లపల్లెకు చెందిన రైతు గుణశేఖర్ (40) సొంత పని మీద మదనపల్లెకు బైకులో వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి అదే రోజు రాత్రి స్వగ్రామానికి బైకుపై వస్తుండగా, మార్గంమధ్యలోని బంగోళ్లపల్లె దగ్గర ఎదురుగా వస్తున్న నీళ్ల ట్యాంకర్కు సైడు ఇవ్వబోయి బైకు అదుపుతప్పి రోడ్డు పక్కనే ఉన్న గుంతలో పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితున్ని ట్యాంకర్ డ్రైవర్, స్థానికులు గుర్తించి వెంటనే జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి ప్రథమ చికిత్సలు అందించి, వెంటనే తిరుపతి రుయాకు వెళ్లాని రెఫర్ చేశారు. కేసు దర్యాప్తులో ఉందని తాలుకా పోలీసులు తెలిపారు. -
అటవీ శాఖ ఉన్నా.. వన్యప్రాణుల రక్షణ సున్నా
● దప్పిక తీర్చుకునేందుకు వచ్చి మృత్యువాత పడుతున్న జింకలు ● అటవీ ప్రాంతాల్లో కనీస సౌకర్యాలు కరువు మృతి చెందిన జింక (ఫైల్) గాయపడిన జింక పిల్ల (ఫైల్) కందుకూరు సమీపంలో ఏర్పాటు చేసిన సూచిక బోర్డు పెద్దతిప్పసముద్రం : ఉమ్మడి చిత్తూరు జిల్లాలోని కర్ణాటక రాష్ట్రం, శ్రీ సత్యసాయి జిల్లాలకు సరిహద్దులో వున్న పెద్దతిప్పసముద్రం, బి.కొత్తకోట, ములకలచెరువు మండలాలలో సంచరిస్తున్న వివిధ రకాల జింకలు వాహనాల్లో వెళ్లే వారికి కనువిందు చేస్తున్నాయి. ఒక వైపు మండుతున్న ఎండలు, మరో వైపు తగలబడుతున్న అటవీ ప్రాంతాల తద్వారా వన్య ప్రాణులు తల దాచుకునేందుకు కూడా సౌకర్యాలు లేవు. ఆఖరికి మూగజీవాలు అటవీ ప్రాంతాల నుంచి జనావాసాల్లోకి వచ్చి దప్పిక తీర్చుకుంటున్నాయి. మరి కొన్ని చోట్ల రైతుల వ్యవసాయ పొలాల వద్దకు వచ్చి గుళికల మందు కలిపిన నీళ్లు తాగి, ఇంకొన్ని రోడ్డు దాటే క్రమంలో ప్రమాదవశాత్తు తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే చనిపోతున్నాయి. దీంతో రోజురోజుకు వన్యప్రాణులు కనుమరుగు అవుతున్నాయి. అటవీ శాఖ అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ప్రజల్లో ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. జింకలు చనిపోతే అటవీ అధికారులు రావడం, సమీప అడవుల్లో ఖననం చేసి చేతులు దులుపుకొని వెళుతున్నారే గానీ మూగ జీవాలకు అటవీ ప్రాంతాల్లో మంచినీటి సౌకర్యం కల్పించడంలో తీవ్రంగా విఫలమయ్యారనే విమర్శలు వస్తున్నాయి. ఈ మండలాల్లో ఒకప్పుడు లెక్కకు మించి వున్న జింకల గుంపులు నేడు చేతి వేళ్ల మీద లెక్కించాల్సి వస్తోంది. అటవీ శాఖ వున్నా కూడా వన్య ప్రాణుల రక్షణ నామమాత్రమే. పలు చోట్ల అత్యధికంగా నివసిస్తున్న జింకలు అటవీ ప్రాంతం లేకున్నా గుట్టలనే ఆసరాగాగా చేసుకుని గడుపుతున్నాయి. జింకలను కాపాడి వాటి సంతతిని పెంపొందించే విషయంలో అధికారులు చూసి చూడనట్లు వ్యవహరిస్తున్నారన్న ఆరోపణలు ప్రజల్లో వెల్లువెత్తుతున్నాయి. ఉదాహరణకు పీటీఎం మండలంలోని కందుకూరు, సంపతికోట, మద్దయ్యగారిపల్లి, పులికల్లు, బూచిపల్లి, పట్టెంవాండ్లపల్లి, బూర్లపల్లి, ములకలచెరువు మండలంలో సోంపాళ్యం, కదిరినాయునికోట, గూడుపల్లి, బత్తలాపురం ప్రాంతాలలో జింకలు నిత్యం సంచరిస్తుంటాయి. కనీసం ఇప్పటికై నా అటవీ అధికారులు వన్యప్రాణుల దాహార్తి కోసం నీటి తొట్టెలు ఏర్పాటు చేయాలని ప్రజలు కోరుతున్నారు. -
మదనపల్లె నూతన డీఎస్పీగా పావని
మదనపల్లె టౌన్: మదనపల్లె నూతన డీఎస్పీగా పావనిని నియమిస్తూ డీజీపీ గురువారం రాత్రి ఉత్తర్వులు జారీ చేశారు. గతంలో మదనపల్లె డీఎస్పీగా మహేంద్ర విధులు నిర్వర్తించేవారు. ఆయన సెలవులో వెళ్లడంతో ఆయనస్థానంలో కృష్టా జల్లా గన్నవరం ఎస్డీపీఓగా పనిచేస్తున్న పావనిని మదనపల్లెకు బదిలీ చేశారు. పుంగనూరు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద ఉన్న హజ్రత్జాన్ పాక్షావలిబాబా, ఫకీర్షావలిబాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి గంధంతో ప్రారంభించారు. మూడు రోజుల పాటు జరిగే ఉరుసు కోసం దర్గాను విద్యుత్ దీపాలతో అలంకరించారు.ఫకీర్ల వాయిద్యాలతో దర్గాలో దువ్వా చేశారు. శని, ఆదివారాలలో ముంబైకి చెందిన అఫ్రిన్సుల్తానా, మైసూర్కు చెందిన సలీంరిష్టి, గుజరాత్కు చెందిన ఆసిఫ్అజ్మీర్, ఇంతేజుర్రిష్టిలతో ఉరుసు , ఖవ్వాలి పాటల పోటీలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేపట్టారు. ఉరుసుకు వచ్చే వేలాది మంది భక్తులకు ప్రతి రోజు దర్గా వద్ద అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. ఉరుసులో కులమతాలకతీతంగా హిందూముస్లింలు పాల్గొనడం గమనార్హం. కడప వైఎస్ఆర్ సర్కిల్: ఈ నెల 26 నుంచి ఆంధ్ర ప్రదేశ్ క్రీడా ప్రాధికార సంస్థ 2026–27 విద్యా సంవత్సరానికి విశాఖపట్నం, కాకినాడ, తిరుపతి జిల్లాల్లో రాష్ట్ర క్రీడా అకాడమీల పున:స్థాపన ప్రక్రియ ప్రారంభించిస్తున్నట్లు డీఎస్డీఓ గౌస్ బాషా తెలిపారు. శుక్రవారం కడపలోని డీఎస్ఏ క్రీడామైదానంలో విలేకరుతో ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో క్రీడాకారుల అభివద్ధికి పటిష్టమైన వ్యవస్థను ఏర్పాటు చేయడం,నాణ్యమైన శిక్షణ వసతులు కల్పించడం దిశగా ప్రభుత్వం ముందడుగు వేస్తోందన్నారు. 15 సంవత్సరాలు పైబడిన, 19 సంవత్సరాల లోపు వయసుగల క్రీడాకారులు (2008 జనవరి1 నుంచి 2011 జనవరి 1 జన్మించినవారు ) క్రీడాకారుల ప్రవేశానికి అర్హులని తెలిపారు. సిద్దవటం: రెండు దశల్లో 2027 జనాభా లెక్కల సేకరణ కార్యక్రమం ఉంటుందని జిల్లా సెన్సెస్ ఇన్చార్జి మోహన్ రమణ తెలిపారు. సిద్దవటం జెడ్పీ హైస్కూల్లో 2027 సెన్సెస్ కార్యక్రమంపై ఎన్యూమరేటర్లు, సూపర్వైజర్లకు శుక్రవారం శిక్షణా కార్యక్రమం జరిగింది. ఈ కార్యక్రమాన్ని మోహన్ రమణ, చీఫ్ ప్లానింగ్ అధికారి హజరతయ్యలు తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఏఎస్ఓ శివప్రసాద్ మాట్లా డుతూ సెన్సెస్ మొదటి దశ ఆంధ్రప్రదేశ్లో మే 1 నుంచి 30 వరకు ఉంటుందన్నారు. జన గణన రెండో దశ 2027 జనవరి, ఫిబ్రవరి నెలల్లో జరుగుతుందన్నారు. ఎవరికి వారే స్వీయ గణన ఏప్రిల్ 16 నుంచి 30వ తేదీ వరకు చేసుకోవచ్చన్నారు. ప్రొద్దుటూరు: మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మావిగన్ను రాజధానిగా ప్రతిపాదన చేసినప్పటి నుంచి ప్రకంపనలు మొదలయ్యాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి అన్నారు. శుక్రవారం ప్రొద్దుటూరులోని తన క్యాంప్ కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడారు. అటు టీడీపీలోనూ, ఇటు జనసేన పార్టీలోనూ, పచ్చ మీడియాకు, కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు షర్మిలకు ఇలా .. వారందరి హృదయాల్లో ప్రకంపనలే వీస్తున్నాయని తెలిపారు. రాజధాని అమరావతి నిర్మాణం సాధ్యం కాదని చెప్పడంతోపాటు రాజధాని నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరమవుతుందని, కేవలం రూ.20 వేల కోట్లతో విజయవాడ, గుంటూరు, మచిలీపట్నం పరిధిలో మావిగన్ను నిర్మించవచ్చని జగన్ సూచించారన్నారు. రాష్ట్రానికి ఇది గ్రోత్ ఇంజిన్గా పని చేస్తుందని జగన్ తెలిపారన్నారు. ఈ ప్రతిపాదనను పచ్చ మీడియా, కూటమి ప్రభుత్వం ఏమాత్రం అంగీకరించే పరిస్థితుల్లో లేవన్నారు. కొత్తగా కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర అధ్యక్షురాలు షర్మిల మావిగన్ ప్రతిపాదన చేసి జగన్ జోకర్ అయ్యారని విమర్శించారన్నారు. జగన్ జోకర్ కాదని, మంచిని సూచించే మెంటర్ అని స్పష్టం చేశారు. ఏనాడో శివరామకృష్ణన్ కమిటీ అమరావతి నిర్మాణం ఏమాత్రం ఆచరణ సాధ్యం కాదని తెలిపిందన్నారు. ఇక్కడ రాజధానిని నిర్మిస్తే భూకంపాల ప్రమాదం ఉంటుందని, వరదలతో ఇబ్బందులు ఎదురవుతాయని, పునాదులు నిర్మించడానికి వీలు కాదని చెప్పడం జరిగిందన్నారు. మూడు కారులు పండే పొలాలను నాశనం చేస్తున్నారని తెలిపారు. ఈ పరిస్థితుల కారణంగా అమరావతిలో రాజధానిని నిర్మించడం సాధ్యం కాదని చెప్పడం జరిగిందన్నారు. ఇక్కడ రాజధాని నిర్మాణం చేపడితే అందరికీ నష్టం వస్తుందన్నారు. -
జలధార ప్రాజెక్ట్ విజయవంతం చేయాలి
అధికారులతో సమీక్షలో కలెక్టర్ నిశాంత్ కుమార్ మదనపల్లె: వంద రోజుల జలధార ప్రాజెక్టును జిల్లాలో అధికార యంత్రాంగం విజయవంతం చేయాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులను కోరారు. శుక్రవారం కలెక్టరేట్లోని పీజీఆర్ఎస్ హాలులో వందరోజుల కార్యాచరణ ప్రణాళిక అమలకు తీసుకోవాల్సిన చర్యలపై జల వనరులశాఖ, డ్వామా, భూగర్భ జలాలు, సబ్ కలెక్టర్, ఆర్డీవోలు, మండల ప్రత్యేక అధికారులు, ఎంపీడీవోలు, ఏపీడీలు, ఇంజినీరింగ్, ఫీల్డ్ అసిస్టెంట్లతగో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన జిల్లాలో జలధారకు ముందు పరిస్థితులు, తర్వాత వచ్చిన ఫలితాలు, ప్రస్తుతం తీసుకోవాల్సిన చర్యల గురించి కలెక్టర్ పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. జిల్లాలో ప్రతి మండలంలో భూగర్భ జలాలు 6 నుంచి 3 మీటర్ల స్థాయికి చేరుకోవడమే అంతిమ లక్ష్యంగా నిర్ణయించామన్నారు. ఇందుకు అధికారులు సమన్వయంతో పనిచేస్తేనే ఫలితాలోస్తాయన్నారు. జాయింట్ కలెక్టర్ శివ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఇన్చార్జి డిఆర్ఓ చంద్రశేఖర్ రెడ్డి, హెచ్ఎన్ఎస్ఎస్ ఎస్ఈ విఠల్ ప్రసాద్, డ్వామా పిడి వెంకటరత్నం, జిఎస్డబ్ల్యూఎస్ అధికారి లక్ష్మీపతి, ఆర్డీవో శ్రీనివాస్ పాల్గొన్నారు. జిల్లాలో 8వ పోషణ పక్వాడ కార్యక్రమాల ద్వారా ఈ నెల 23 వరకు అంగన్వాడీ కేంద్రాలు, గ్రామ స్థాయిలో పౌష్టికాహారం లోపంపై అవగాహన కల్పించాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శుక్రవారం తన చాంబర్లో ఐసీడీఎస్ శాఖ పోషణ పక్వాడ ప్రచార పోస్టర్లను అధికారులతో కలిసి ఆయన ఆవిష్కరించారు. కలెక్టర్ మాట్లాడుతూ పిల్లల జననం నుంచి రెండు సంవత్సరాల దశలోనే మెదడు అభివృద్ధిలో 80 శాతం పూర్తవుతుందని తెలిపారు. ఈ సమయంలో సరైన పోషకాహారం, సంరక్షణ చాలా అవసరమని అన్నారు. కార్యక్రమంలో డీడబ్ల్యూసీడబ్ల్యూ ఈఓ కె.హైమావతి, పోషణ అభియాన్ జిల్లా కోఆర్డినేటర్, డిస్ట్రిక్ట్ ప్రాజెక్ట్ అసిస్టెంట్, డిస్ట్రిక్ట్ చైల్డ్ ప్రొటెక్షన్ ఆఫీసర్, సీడీపీఓలు పాల్గొన్నారు. -
పంచాయతీ కార్మికుల హక్కుల సాధనకు పోరాటం
మదనపల్లె : గ్రామ పంచాయతీల్లో పారిశుద్ధ్య కార్మికులు వెట్టిచాకిరీ చేస్తున్నారని, వారికి దక్కాల్సిన హక్కులను సాధించుకునేందుకు పోరాటాలకు సిద్ధం కావాలని ఏపీ గ్రామపంచాయతీ కార్మికుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు డి.వెంకట్రామయ్య, సీఐటీయూ జిల్లా కోశాధికారి టి.హరిశర్మ అన్నారు. శుక్రవారం స్థానిక ఎన్జీఓ హోంలో గ్రామ పంచాయతీ వర్కర్స్ అండ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా రెండవ మహాసభ జరిగింది. వారు ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో పంచాయతీ కార్మికులకు నిధులు ఇవ్వకపోవడం దుర్మార్గమన్నారు. గ్రామ పంచాయతీల్లో పని చేసే కార్మికులందరికీ రాష్ట్ర వ్యాప్తంగా ఒకే వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. పంచాయతీల నిధులతో కాకుండా ప్రభుత్వమే ట్రెజరీ వేతనాలు చెల్లించాలన్నారు. మున్సిపల్ కార్మికుల తరహాలో రూ.21 వేల వేతనం ఇవ్వాలన్నారు. పీఎఫ్, ఈఎస్ఐ, ప్రమాద బీమా సౌకర్యం, మృతి చెందిన కార్మికుల అంతిమ సంస్కారాలకు రూ.20 వేలు చెల్లించాలని కోరారు. పనిముట్లు, బట్టలు, కొబ్బరి నూనె, సబ్బులు ఇప్పించాలని డిమాండ్ చేశారు. సమస్యలపై మంత్రి పవన్కళ్యాణ్ స్పందించకుంటే పోరాటాలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. జిల్లా కార్యదర్శి ఎస్.సురేంద్రబాబు గత మూడు సంవత్సరాల నుంచి సంఘం చేపట్టిన కార్యకలాపాలు, నిర్మాణ నివేదికను ప్రవేశపెట్టారు. ఈ నివేదికపై పలువురు ప్రతినిధులు చర్చలు జరిపి వివరించారు. ఈ కార్యక్రమంలో జిల్లాలోని పంచాయతీ కార్మికులు, గ్రీన్ అంబాసిడర్లు పాల్గొన్నారు. జిల్లా కమిటీ ఎన్నిక ఏపీ గ్రామపంచాయతీ ఎంప్లాయీస్ అండ్ వర్కర్స్ యూనియన్ అన్నమయ్య జిల్లా నూతన కమిటీని ఏకగ్రీవంగా మహాసభ ఎన్నుకుంది. అధ్యక్షులుగా బి.వి.రమణ (పీలేరు), ప్రధాన కార్యదర్శిగా ఎస్.సురేంద్రబాబు (పిటియం), కోశాధికారిగా విజయకుమార్ (కలకడ), వర్కింగ్ ప్రెసిడెంట్గా డి.గోపాల్ (మదనపల్లి) వీరితోపాటు ఆరుగురు ఆఫీస్ బేరర్లు, 11 మంది కమిటీ సభ్యులను మహాసభ ఎన్నుకుంది. -
బడాయి బాబు పాలనలో రక్షణ మృగ్యం!
సాక్షి ప్రతినిధి, కడప: సీఎం చంద్రబాబు ప్రభుత్వంలో మహిళల భద్రత ప్రశ్నార్థకంగా మారింది. క్రమం తప్పకుండా హత్యలు, అత్యాచారాలు తెరపైకి వస్తున్నాయి. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో బాలికను అత్యాచారం ఆపై హత్య ఉదంతం మరుకముందే.. పుంగనూరులో ముస్లిం కుటుంబానికి చెందిన మరో బాలికను హత్య చేసి చెరువులో పడేశారు. ఆపై మదనపల్లెలో స్వర్ణకుమారి అనే మహిళ హత్యోదంతం తెరపైకి వచ్చింది. అంతలోనే బద్వేల్లో ప్రేమ పేరుతో మైనర్ బాలిక (విద్యార్థిని) భయానక హత్య వెలుగు చూసింది. పర్యాటక ప్రాంతమైన గండికోటలో గత ఏడాది జూలై 14న మరో మైనర్ బాలిక హత్య చోటుచేసుకుంది. తర్వాత మదనపల్లె సమీపంలోని నీరుగట్టువారిపల్లెకు చెందిన ఏడేళ్ల చిన్నారి హత్యోదంతం ఫిబ్రవరి16న చోటుచేసుకుంది. తాజాగా ఖాజీపేట అగ్రహారంలో మైనర్ బాలికను ఉన్మాది గొంతు కోసి హత్య చేశారు. సీఎం చంద్రబాబు బడాయి పాలనలో యువతులు, మహిళలు సమిధలవుతున్నారు. ● ఖాజీపేటలో ఇంటర్మీడియట్ పూర్తి చేసిన ఓ మైనర్ బాలిక హత్య శుక్రవారం వెలుగు చూసింది. గ్రామస్తులు నిందితున్ని అప్పగించాలంటూ బాధిత కుటుంబం పక్షాన ఖాజీపేట వద్ద జాతీయ రహాదారిపై బైఠాయించారు. నిరాటకంగా ఆందోళన కొనసాగించారు. పోలీసు అధికారుల విన్నపంతో శాంతించారు. రాష్ట్రంలో శ్రీకాకుళం నుంచి అనంతపురం వరకు మహిళలకు రక్షణ మృగ్యమవుతోంది. వేధింపులు తట్టుకోలేక నలుగురు ఆత్మహత్యలు చేసుకున్నట్లు క్రైమ్ రికార్డు వెల్లడిస్తోంది. నంద్యాల జిల్లా ముచ్చుమర్రిలో మైనర్ బాలిక అత్యాచారం, హత్య, పుంగనూరులో ముస్లిం బాలిక హత్య, పీఠాపురంలో యువతిపై అత్యాచారం, హిందూపురంలో అత్తా, కోడళ్లుపై సామూహిక అత్యాచారం ఇలా వరస ఘటనలు తెరపైకి వస్తున్న ప్రభుత్వంలో సత్వర చర్యలు లోపించడంతోనే క్రమం తప్పకుండా ఘటనలు ఉత్పన్నమవుతున్నాయని విశ్లేషకులు వెల్లడిస్తున్నారు. ఐదు రోజుల్లో నాలుగు సంచలన హత్యలు... వైఎస్సార్ కడప జిల్లాలో ఐదురోజుల వ్యవధిలో నాలుగు సంచలన హత్యలు వెలుగు చూశాయి. ఘర్షణ నేపథ్యంలో కుటుంబ సభ్యుల్ని చికిత్సలకు రిమ్స్కు తీసుకెళ్లిన ఆలంఖాన్పల్లెకు చెందిన పెద్ద దస్తగిరిని(53) వేటాడి, వెంటాడి రిమ్స్లో సోమవారం వేకువజామున హత్య చేశారు. ఈ హత్య మరువక ముందే బుధవారం రాత్రి వల్లూరు బస్టాప్ వద్ద వెంకటసుబ్యయ్య(45) అనే వ్యక్తిని కిరాతకంగా హత్య చేశారు. శుక్రవారం మధ్యాహ్నం మైనర్బాలికను గొంతు కోసి హత్య చేసిన ఉదంతం ఖాజీపేటలో వెలుగు చూసింది. రాజుపాలెం మండలం పర్లపాడు గ్రామంలో మహేష్ అనే యువకుడ్ని చరణ్ కత్తితో గొంతులో పొడిచి హత్యచేశాడు. ఈ హత్యోదంతాలు పరిశీలిస్తే పోలీసుల ప్రతిష్ట మంటగలుస్తోంది. శాంతి భద్రతలు కాపాడాల్సిన వ్యవస్థలో అవినీతి తాండవం చేస్తుండడమే కారణమని పరిశీలకులు ఆరోపిస్తున్నారు. కొల్కిరాని మైనర్ బాలిక హత్య కేసు... గండికోట మైనర్ బాలిక హత్య కేసు దర్యాప్తులో పోలీసు అధికారుల క్షేత్రస్థాయి కృషి నీరుగారిపోయింది. ఇప్పటీకీ కేసు కొల్కిరాలేదు. అప్పటి ఎస్పీ అశోక్కుమార్తో పాటు ప్రస్తుత ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ పర్యవేక్షించినా ఎలాంటి ప్రయోజనం లేదు. పలు రకాలుగా విశ్లేషణ చేశారు. సీసీ పుటేజీల ఆధారంగా అనుమానితులను విచారించారు. టవర్ లోకేషన్ ద్వారా ఫోన్కాల్స్ విశ్లేషణ చేశారు. అనేక సాంకేతిక వ్యవహారాలు పొందుపర్చి దర్యాప్తు చేసినా ఫలితం లేదు. దీనిని బట్టి పోలీసు వ్యవస్థ ఎలాంటి దుస్థితిలో ఉందో ఇట్టే అర్థం చేసుకోవచ్చునని విశ్లేషకులు వాపోతున్నారు. హత్యకు గురైన పెద్ద దస్తగిరి (ఫైల్)హత్యకు గురైన వెంకట సుబ్బయ్య పోలీసుశాఖలో కొంతమంది అధికారులపై నిత్యం అవినీతి ఆరోపణలు వస్తున్నాయి. మరికొంతమంది అధికారులు చట్టాన్ని విస్మ రించి, ఏకపక్ష చర్యలే ఏకై క అజెండాగా పనిచేస్తున్నారు. ఇంకొంతమంది వ్యక్తిగత ప్రయోజనాలు ఆశించి తదనుగుణంగా చర్యలకు దిగుతున్నారు. పోలీసుశాఖలో అంతర్గతంగా అనేక ఆనైతిక చర్యలు తెరపైకి వస్తున్నాయి. గతంలో కడప టూటౌన్, జమ్మలమడుగు సీఐలుగా పనిచేసిన అధికారులపై లైంగిక వేధింపుల ఆరోపణలు వచ్చాయి. మరోవైపు పులివెందుల రూరల్ సీఐ వెంకటరమణ, సింహాద్రిపురం ఎస్ఐ అనిల్కుమార్లు రూ.1.5లక్షలు లంచం తీసుకుంటుండడగా రెడ్హ్యాండెడ్గా పట్టుబడ్డారు. ఇలాంటి ఇరోపణలు తెరపైకి రాగానే ప్రక్షాళన దిశగా ప్రత్యేక చర్యలు చేపట్టిన దాఖలాలు లేవని పలువురు వాపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల నేపథ్యంలో పోలీసుశాఖ పట్ల సామాన్యులకు గౌరవం లోపించి అసాంఘిక శక్తులు అవతరిస్తున్నట్లు పలువురు వెల్లడిస్తున్నారు. ఇప్పటికై నా ‘కన్పించని నాలుగో సింహం’ప్రజల మాన, ప్రాణ, ఆస్తి రక్షణకు చర్యలు చేపట్టాలని ప్రజాస్వామ్యవాదులు కోరుతున్నారు. మొన్న దస్తగిరి, నిన్న వెంకటసుబ్బయ్య, నేడు మైనర్ బాలిక హత్య వరుస హత్యలతోమసకబారుతున్న పోలీస్ ప్రతిష్ట ప్రక్షాళన దిశగాఅడుగులు వేయని యంత్రాంగం ఉన్నత న్యాయస్థానం తప్పుబట్టినామార్పు శూన్యం లంచావతారాలుగా డబుల్,ట్రిపుల్ స్టార్ అధికారులు రెడ్ బుక్ పాలనతో రాష్ట్రంలో అటవిక రాజ్యం కొనసాగుతోందని మహిళాలోకం ఆరోపిస్తోంది. మహిళలపై సామూహిక అత్యాచారాలు, చిన్నారుల హత్యోదంతాలు అందుకు నిదర్శనంగా చెప్పుకొస్తున్నారు. దిశ యాప్ కొనసాగి ఉంటే బద్వేల్ విద్యార్థిని దస్తగిరమ్మకు రక్షణ లభించేదని పలువురు అప్పట్లో ఆరోపించారు. మద్యం వ్యాపారం పట్ల ఉన్న ఆసక్తి యువతులు, మహిళలలు మాన ప్రాణాలు రక్షించడంలో కన్పించడం లేదని పలువురు వాపోతున్నారు. పైగా ఏకపక్ష చర్యలతో పోలీసుశాఖ అభాసుపాలవుతోంది. ప్రత్యేకించి పోలీసు అధికారులు చట్టానికి లోబడి విధులు నిర్వర్తించడం కంటే కొంతమంది అధికారులు అధికారంలో ఉన్న నేతల మొప్పు కోసం పనిచేసేందుకే ఇష్టపడుతున్నారు. ఈక్రమంలో అక్రమ కేసులు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలో హైకోర్టు లాంటి అత్యున్నత న్యాయ స్థానం తప్పుబట్టినా అలాంటి పోలీసు అధికారుల తీరులో మార్పు లభించలేదని పలువురు వెల్లడిస్తున్నారు. -
వడదెబ్బతో వ్యక్తి మృతి
లక్కిరెడ్డిపల్లి : అన్నమయ్య జిల్లా చౌటపల్లి గ్రామానికి చెందిన రామాంజనేయులు (36) అనే వ్యక్తి శుక్రవారం వడదెబ్బతో మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. బంధువులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అనంతపురం గొల్లపల్లికి చెందిన గంగాదేవితో రామాంజులుకు వివాహమైంది. మూడు సంవత్సరాలు ఇద్దరు కలిసి ఉండి తరువాత విడిపోవడంతో రామాంజులు మద్యానికి బానిసయ్యాడు. రాయచోటి–కడప జాతీయ రహదారి టోల్గేట్ వద్ద అంబులెన్సులో పని చేస్తూ జీవనం సాగించేవాడు. శుక్రవారం డ్యూటీ దిగాడు. మధ్యాహ్నం గుగ్గుళ్ల గుట్టవద్దకు వెళ్లి మద్యం తాగాడు. అక్కడే అపస్మారక స్థితిలో పడిపోయాడు. ప్రేమకుమార్ అనే వ్యక్తి వచ్చి నీ కుమారుడు అపస్మారక స్థితిలో పడిపోయి ఉన్నాడని చెప్పాడు. వెంటనే అక్కడికి వెళ్లి 108లో లక్కిరెడ్డిపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యుడు నిర్ధారించారు. ఎండవేడికి తట్టుకోలేక..నోరు ఆరిపోయి వడదెబ్బ వల్ల మృతి చెందినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. కేసు నమోదు చేసినట్లు లక్కిరెడ్డిపల్లి పోలీసులు తెలిపారు. -
భర్తపై భార్య ఇనుప రాడ్డుతో దాడి
మదనపల్లె టౌన్ : తన భర్త మరో మహిళతో వివాహేతర సంబంధాన్ని కొనసాగిస్తున్నాడన్న అనుమానంతో గొడవపడి, ఇనుప రాడ్డుతో దాడి చేసి తీవ్రంగా గాయపరచింది. మదనపల్లె పట్టణంలో శుక్రవారం చోటుచేసుకున్న ఘటనపై బాధితుడు తెలిపిన వివరాలు.. స్థానిక శ్రీవారి నగర్లో కాపురం ఉంటున్న పట్టుదారం తీసే రెడ్డి బాబు (48) అదే ప్రాంతానికి చెందిన మరో మహిళతో వివాహేతర సంబంధం కొనసాగిస్తున్నాడని తన భార్య ధనలక్ష్మి అనుమానం పెంచుకుంది. దీంతో భర్తతో తరచూ గొడవ పడుతోంది. ఈ విషయమై రెడ్డి బాబు తన బావ మరుదులకు తన భార్య రాద్ధాంతం చేస్తోందని చెప్పాడు. దీంతో ఆగ్రహించిన ధనలక్ష్మి చేసిన ఘన కార్యంపై ఇంటో వాళ్లకు చెబుతావా అంటూ నిలదీసి గొడవపడింది. ఆవేశంతో ఇంట్లో ఉన్న ఇనుప రాడ్డుతో భర్త తలపై మోదడంతో అతను తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో బాధితుడు వెంటనే జిల్లా ఆస్పత్రికి చేరుకుని వైద్య చికిత్సలు పొంతున్నాడు. ఘటనపై రెండవ పట్టణ పోలీసులు విచారణ చేస్తున్నారు. -
కూటమి ప్రభుత్వంలో మహిళలకు రక్షణ లేదు
ఖాజీపేట: మైనర్ బాలిక హత్యతో జిల్లా ఉలిక్కి పడింది. ఖాజీపేట చరిత్రలో ఎప్పుడూ ఇలాంటి సంఘటన జరగలేదు. శుక్రవారం అగ్రహారం గ్రామంలోని మైనర్ బాలిక ఇంటిలోకి ఆంజనేయకొట్టాలుకు చెందిన వ్యక్తి వెళ్లి పట్టపగలు హత్య చేయడం సంచలనంగా మారింది. వివరాలు.. ఖాజీపేట మేజర్ పంచాయతీలోని అగ్రహారం గ్రామంలో ఇళ్లూరు శ్రీనివాసులు, నాగమణిలకు ముగ్గురు సంతానం. అందులో రెండో సంతానం రామకీర్తన(16) ఖాజీపేటలోని మోడల్ స్కూల్లో చదువుతూ ఇంటర్ ద్వితీయ సంవత్సరం పరీక్షలు రాసింది. బాలికను ఆంజనేయకొట్టాలు గ్రామానికి చెందిన ఆవుల వెంకటేష్ (19) రెండు సంవత్సరాల నుంచి ప్రేమ పేరుతో వేధించే వాడు. మీ కూతురు ఇతరులతో ఫోన్లో మాట్లాడుతోందంటూ తండ్రికి పలుమార్లు ఫిర్యాదు చేశాడు. ‘మా కూతురు సంగతి మేం చూసుకుంటాం.. నీవు జోక్యం చేసుకోవద్ద’ని పలుమార్లు బాలిక తండ్రి శ్రీనివాసులు నిందితునికి వార్నింగ్ కూడా ఇచ్చాడు. ఈనెల 10వ తేదీ ఉదయం వెంకటేష్ బాలికతో ఫోన్లో మాట్లాడే ప్రయత్నం చేశాడు. అయితే అందుకు స్పందించక పోవడంతో ఆవేశంతో ఇంటికి వెళ్లి కొడవలితో గొంతు కోసి హత్య చేసి పరారయ్యాడు. రక్తపు మడుగులో కూతురును చూసి చలించిన తండ్రి మైదుకూరుకు వెళ్లిన బాలిక తండ్రి, సోదరుడు 11 గంటలకు ఇంటికి చేరుకున్నారు. రెండవ గదిలో రక్తపు మడుగులో ఉన్న కూతురుని చూసి తండ్రి చలించిపోయాడు. అప్పటికీ కుమార్తె మాట్లాడుతుండటంతో కాపాడుకునేందుకు ప్రయత్నం చేశాడు. గొంతు నుంచి రక్తస్రావం జరగకుండా టవల్ను చుట్టి కూతురిని చేతుల్లో ఎత్తుకుని చికిత్స నిమిత్తం ఆటోలో కడపకు తీసుకెళ్లే ప్రయత్నం చేశాడు. ఇంతలో హైవేపైకి రాగానే 108 వాహనం రావడంతో అందులో కడప రిమ్స్కు తీసుకెళ్లారు. అప్పటికే బాలిక మృతి చెందడంతో తండ్రి, అన్న బోరున విలపించారు. హత్యోదంతంలో ఒక్కడే ఉన్నట్లు అధికారులతోపాటు అందరూ భావించారు. అయితే బాలిక తండ్రి శ్రీనివాసులు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో ఆవుల వెంకటేష్ తోపాటు తన కూతురు మరొకరి పేరు తనకు చెప్పిందని పేర్కొన్నాడు. అతను ఎవరూ అనేది పోలీసుల విచారణలో తేలాల్సి ఉంది. అయితే ఆ వ్యక్తి ఎవరో తమకు తెలియదని బాలిక తల్లిదండ్రులు అంటున్నారు. తమ కూతురు చెప్పిందని, అందుకే ఫిర్యాదులో చేర్చినట్లు పోలీసులకు చెప్పారు. బాలికకు న్యాయం జరగాలని కోరుతూ గ్రామస్తులు ధర్నా చేశారు. హంతకుడికి ఉరిశిక్ష పడేలా చేయాలని డిమాండ్ చేశారు. మూడు గంటల పాటు వాహనాలు నిలిచిపోయాయి. ఫిర్యాదు స్వీకరించడంలో ఆలస్యం ఫిర్యాదు స్వీకరించడంలో పోలీసులు తీవ్ర జాప్యం చేశారు. పోస్టుమార్టం జరిగే ప్రదేశానికి బాలిక తండ్రితోపాటు పలువురు బంధువులు వెళ్లారు. వారితో ఫిర్యాదు తీసుకుని ఉంటే సరిపోయేది. కానీ అలా చేయక పోవడంతో ఫిర్యాదు సాయంత్రం తీసుకోవాల్సి వచ్చింది. దీంతో బాలిక మృతదేహానికి పోస్టుమార్టం శనివారం జరగనుంది. ● మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి ఖాజీపేట: కూటమి పాలనలో మహిళలకు రక్షణ లేకుండా పోయింది.. కూటమి పాలనలో ఆంధ్రప్రదేశ్ హత్యాంధ్రప్రదేశ్గా మారిందని మాజీ ఎమ్మెల్యే రఘురామిరెడ్డి పేర్కొన్నారు. అగ్రహారంలో మైనర్ బాలిక హత్యను తీవ్రంగా ఖండించారు. మదనపల్లె హత్య మరువక ముందే ఖాజీపేటలో బాలిక హత్యకు గురి కావడం తీవ్రంగా కలచి వేందన్నారు. హత్యకు కారకుడై ఆవుల వెంకటేషకు కఠిన శిక్ష పడేలా పోలీసులు చర్యలు తీసుకోవాలని కోరారు. అప్పుడే బాధిత కుంటుంబాలకు న్యాయం జరుగుతుందన్నారు. కూటమి ప్రభత్వం అధికారంలోకి వచ్చాక ఎక్కడ చూసినా గంజాయి, మధ్యం ఏరులై పారుతోందని అన్నారు. మహిళ హోంమంత్రిగా ఉన్నా మహిళలపైనే హత్యలు జరుగుతుంటే ఏం చేస్తున్నారని సూటిగా ప్రశ్నంచారు. ప్రేమోన్మాదం వెర్రితలలు వేసి యమపాశమవుతోంది. తల్లిదండ్రులు పెట్టుకున్న ఆశల గొంతు కోస్తోంది. ఇష్టం లేకున్నా వెంటపడి ఉసురు తీస్తోంది. ఆడబిడ్డ కాలు బయటపెడితే తిరిగి వచ్చే వరకు ఆ అమ్మానాన్నలు గుండెలు గుప్పిట్లో పెట్టుకుని ఎదురుచూడాల్సిన దౌర్భాగ్య పరిస్థితి ఏర్పడింది. శుక్రవారం ఖాజీపేటలో ఓ యువకుడు అత్యంత పాశవికంగా ఓ యువతిని కొడవలితో గొంతు కోసిన ఘటనతో జిల్లా ఉలిక్కిపడింది. ఘాతుకానికి పాల్పడిన యువకుడు ఉలిక్కిపడిన జిల్లా వెల్లువెత్తిన నిరసన కడప అర్బన్: ఖాజీపేట మండలంలోని అగ్రహారం గ్రామంలో బాలికను హత్య చేసిన నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని కీర్తన తల్లిదండ్రులకు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ భరోసా ఇచ్చారు. శుక్రవారం సాయంత్రం కడపలో బాలిక తల్లిదండ్రులు ఎస్పీ కలిశారు. తమకు న్యాయం చేయాలని విన్నవించారు. ఈ సందర్భంగా ఎస్పీ, బాలిక తల్లిదండ్రులను ఓదార్చారు. నిందితుడికి కఠిన శిక్ష పడేలా చర్యలు తీసుకుంటామని బాధితులకు హామీ ఇచ్చారు. -
తాగునీరు అందించండి.. మహాప్రభో !
● నీరు పుష్కలంగా ఉన్నా ఉపయోగం సున్నా ● శుభ్రం చేయని కాలువలు ● లబోదిబోమంటున్న స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేస్తున్న స్థానికులు వాల్మీకిపురం : తాగునీరు సక్రమంగా సరఫరా కాకపోవడంతో ఇబ్బందులకు గురవుతున్నట్లు పట్టణంలోని కోనేటివీధి, కొత్త ఇందిరమ్మ కాలనీకి చెందిన మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వర్షాలు బాగా కురిసి చెరువులు, వాగులు, వంకల్లో నీరు పుష్కలంగా ఉన్నా.. బోర్లలో నీరు ఉన్నా గ్రామస్తులకు అందించడంలో అధికార యంత్రాంగం విఫలమైందని స్థానికులు మండిపడుతున్నారు. అధికారులకు మొరపెట్టుకున్నా ఉపయోగం లేదని, తాగునీరు అందించడంలో అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కాలువలు శుభ్రం చేయడం లేదని, దోమలు పెరిగి ఇబ్బందులకు గురవుతున్నట్లు తెలిపారు. దీంతో శుక్రవారం స్థానికులు ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. కోనేటివీధిలో నెల రోజులుగా నీరు సరఫరా కావడం లేదని, కొత్త ఇందిరమ్మ కాలనీలో వారానికి ఒక రోజు నీరు వస్తున్నట్లు వారు తెలిపారు. పన్నులు వసూలు చేయడంలో ఉన్న శ్రద్ధ తాగునీరు సరఫరా చేయడంలో చూపకపోవడం దారుణమన్నారు. కొన్ని చోట్ల పైప్లైన్ దెబ్బతినడం, బోర్లకు మోటార్లు లేకపోవడం తదితర కారణాలతో నీరు సరఫరా చేయడం లేదని ఆరోపించారు. ఇప్పటికై నా అధికారులు చర్యలు తీసుకొని, తాగునీటి సమస్యను పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ కార్యక్రమంలో స్థానికులు కదీరున్నిసా, మాబుజాన్, క్రిష్ణవేణమ్మ, మస్తాన్బి, నూర్జహాన్, హస్మత్, శబమ్, అనసూయమ్మ, ఫర్తాజ్, ఈశ్వరమ్మ, సిరాజున్నిసా, తదితరులు పాల్గొన్నారు. కొత్త ఇందిరమ్మ కాలనీలో శుభ్రం చేయని కాలువ పట్టణంలో కాలువలు శుభ్రం చేయడం లేదు. దీంతో రోడ్లపై మురుగునీరు ప్రవహిస్తున్నాయి. దీంతో దోమలు పెరుగుతున్నాయి. రాత్రి సమయాల్లో నిద్రపట్టడం లేదు. దీంతో ప్రజలు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. చెత్త సేకరణ కూడా చేయడం లేదు. అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలి. – రవిశంకర్, కోనేటివీధి, వాల్మీకిపురం గత నెల రోజులుగా తాగు నీరు వదలడం లేదు. దీంతో మేము చాలా ఇబ్బందులు పడుతున్నాము. మహిళలకు ఇబ్బంది లేకుండా తాగునీరు ఇప్పించండి. ఎండలు ఎక్కువ అవుతున్నాయి. తాగు నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకోవాలి. – మస్తాన్ బీ, కోనేటివీధి, వాల్మీకిపురం -
చైన్ స్నాచింగ్
సదుం : వృద్ధురాలి మెడలో గుర్తు తెలియని వ్యక్తి బంగారు చైన్ చోరీ చేసిన సంఘటన సదుం మండలంలో శుక్రవారం జరిగింది. బాధితురాలి కథనం మేరకు.. దిగువ జాండ్రపేటలో వంతెన వద్ద రెడ్డెమ్మ నివసిస్తోంది. ఆమె మధ్యాహ్నం నిద్రిస్తుండగా ఎవరో తలుపు తట్టడంతో లేచి తీసింది. బురఖా ధరించిన వ్యక్తి మొహంపై కారం కొట్టి మెడలో ఉన్న 25 గ్రాముల బంగారు చైన్ లాక్కొని వెళ్లాడు. స్థానికుల సమాచారంతో పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని విచారణ చేశారు. పాము కాటుతో మహిళకు అస్వస్థత మదనపల్లె టౌన్ : పూలు కోస్తుండగా విష సర్పం కాటేసి మహిళ తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటన శుక్రవారం మదనపల్లె పట్టణంలో జరిగింది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు వివరాలు.. పట్టణంలోని సిటిఎం రోడ్ ఎస్టేట్లో కాపురం ఉంటున్న ఆదెప్ప భార్య అంజమ్మ(36) తన ఇంటి సమీపంలో ఉన్న పూల చెట్టులో పూలు కోయడానికి వెళ్లింది. పూలు కోస్తుండగా చేతిపై ఏదో కరచినట్లు అయింది. రక్తం కారుతుండటంతో.. వెంటనే ఆమెను స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు పరీక్షించి పాము కరిచిందని గుర్తించారు. ప్రథమ చికిత్సలు అందించి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చాపాడు : మైదుకూరు –ప్రొద్దుటూరు జాతీయ రహదారిలోని చాపాడు మండలం నాగులపల్లె గ్రామ సమీపంలో ప్రొద్దుటూరు వైపు వెళ్లే దారిలో శుక్రవారం రాత్రి 10 గంటల ప్రాంతంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని ఓ వ్యక్తి దుర్మరణం చెందాడు. నాగులపల్లె సమీపంలోని రైస్ మిల్లు ఎదురుగా ప్రొద్దుటూరు వైపు వెళుతున్న 50 ఏళ్ల వయసున్న గుర్తు తెలియని వ్యక్తిని వాహనం ఢీకొనగా.. అక్కడికక్కడే మృతి చెందినట్లు చాపాడు పోలీసులు తెలియజేశారు. మృతుడి ఒంటిపై తెల్లటి చొక్కా, ఎర్రటి లుంగీ ధరించి ఉన్నట్లు పోలీసులు గుర్తించారు. ఈ ఘటనపై విచారణ చేపట్టినట్లు వారు తెలియజేశారు. మృతుడి ఆచూకీ గుర్తించేందుకు వారు చర్యలు చేపట్టారు. జమ్మలమడుగు : మైలవరం మండలంలోని దొమ్మరనంద్యాల గ్రామానికి చెందిన పల్లా బాలుగ్రం అనే న్యాయవాది కనిపించడం లేదంటూ ఆయన భార్య సుదర్శనదేవి మైలవరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఈ నెల 6వ తేదీ ఇంటి నుంచి వెళ్లి అతను తిరిగి రాలేదు. బంధువులను విచారణ చేసినా ఆచూకీ లభ్యం కాకపోవడంతో ఫిర్యాదు చేసినట్లు ఆమె తెలిపింది. సమగ్ర విచారణ చేపడుతున్నామని మైలవరం ఎస్ఐ శ్యాంసుందర్రెడ్డి తెలిపారు. -
మూడు పాఠశాలల బస్సులు దగ్ధం
కమలాపురం : మండల పరిధిలోని కోగటం గ్రామంలో గురువారం అర్ధరాత్రి మూడు ప్రైవేటు పాఠశాలలకు చెందిన మూడు బస్సులు అగ్నికి ఆహుతయ్యాయి. వివరాల్లోకి వెళితే.. పలు ప్రైవేటు పాఠశాలలకు పాఠశాలల యాజమాన్యాలు ఏర్పాటు చేసిన బస్సుల ద్వారా ప్రతి రోజూ మండల పరిధిలోని పలు గ్రామాల నుంచి విద్యార్థులను తరలిస్తారు. పాఠశాల ముగిసిన తరువాత తిరిగి వారిని వారి గ్రామాలకు చేరుస్తారు. అనంతరం బస్సులను కోగటం గ్రామం వద్ద వున్న ఖాళీ ప్రదేశంలో వుంచి డ్రైవర్లు మాత్రం ఇంటికి వెళ్లి మరుసటి రోజు ఉదయం యథావిధిగా విద్యార్థులను పాఠశాలలకు తరలిస్తుంటారు. ఈ క్రమంలో గురువారం విద్యార్థులను గమ్య స్థానాలకు చేర్చిన డ్రైవర్లు వివిధ ప్రైవేటు పాఠశాలకు చెందిన ఐదు బస్సులను కోగటం వద్ద ఉంచి తమ ఇళ్లకు వెళ్లారు. అర్ధరాత్రి సమయంలో బస్సులు మంటలకు కాలిపోతూ ఉండడాన్ని స్థానికులు గమనించారు. వారు ఇచ్చిన సమాచారం అందుకున్న కమలాపురం అగ్నిమాపక, పోలీసు శాఖ వారు హుటాహుటిన సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను ఆర్పారు. అప్పటికే మూడు బస్సులు ఆహుతి కాగా వాటి పక్కనే వున్న మరో రెండు బస్సులను పూర్తిగా కాపాడారు. దగ్ధమైన బస్సులు ప్రొద్దుటూరులోని గీతాంజలి స్కూల్, ఐడియల్ పబ్లిక్ స్కూల్, గోపీ కృష్ణ మాంటిస్సోరి విద్యా సంస్థలకు చెందినవిగా గుర్తించారు. వీటి విలువ సుమారు రూ.43 లక్షల మేర వుంటుందని పాఠశాల యాజమన్యాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు అగ్నిమాపక శాఖ అఽధికారి జనార్దన్రెడ్డి తెలిపారు. కాగా ఈ సంఘటనకు కారణాలు తెలియరాలేదు. ఎవరైనా ఆకతాయిలు నిప్పు పెట్టడం వల్ల ప్రమాదం జరిగిందా లేక బస్సులో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ వల్ల గానీ మరే ఇతర కారణంతో ప్రమాదం జరిగిందో పోలీసుల విచారణలో తెలియాల్సి వుంది. -
పోలీసుల అదుపులో నిందితుడు
బాలికను హత్య చేసిన ఆవుల వెంకటేష్ వెంటనే ఆంజనేయ కొట్టాలుకు వెళ్లాడు. హత్య చేసే సమయంలో వేసుకున్న దుస్తులు తీసేసి పారిపోవడానికి సిద్ధమవుతుండగా పోలీసులు అతన్ని ఆదుపులోకి తీసుకున్నారు. హత్య సమయంలో ఉపయోగించిన ఆయుధంతోపాటు మరి కొన్ని క్లూస్ స్వాధీనం చేసుకున్నట్లు తెలుస్తోంది. అయితే బాలిక బంధువులు, తల్లిదండ్రులు స్టేషన్కు వస్తారని ముందుగానే గుర్తించి నిందితుడిని మరో స్టేషన్కు తరలించి విచారణ జరుపుతున్నారు. విచారణలో తానే హత్య చేసినట్లు నిందితుడు ఒప్పుకున్నట్లు తెలుస్తోంది. -
9 మందిపై వేధింపుల కేసు నమోదు
మదనపల్లె టౌన్: భార్యను అదనపు కట్నం కోసం వేధింపులకు గురిచేస్తున్న భర్తతో పాటు ఆమె కుటుంబీకులు మరో ఎనిమిది మందిపై పోలీసులు వరకట్న వేధింపుల కేసు నమోదుచేశారు. ఇందుకు సంబంధించి తాలూకా సిఐ కళా వెంకరమణ గురువారం తెలిపిన వివరాలు.. మదనపల్లె మండలంలోని మదనపల్లె కొత్తపల్లె పంచాయతీ, కొత్త ఇండ్లకు చెందిన ఫాతిమాను ఆమె భర్త అబ్దుల్ అబూ బకర్ అదనపు కట్నం వేధింపులకు గురిచేస్తున్నాడని ఫిర్యాదు చేసింది. విచారణ చేపట్టి అబ్దు అబూబకర్ తో పాటు మరో ఎనిమిది మందిపై కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. బైక్ల ఢీ: యువకుడికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్: రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. గురువారం తాలూక పోలీసులు తెలిపిన వివరాలు.. చౌడేపల్లె మండలం, బోయకొండకు చెందిన కళ్యాణ్ (24) బుధవారం సాయంత్రం ద్విచక్ర వాహనంలో సొంత పని మీద మదనపల్లెకు వచ్చాడు. పని ముగించుకుని తిరిగి అదేరోజు రాత్రి స్వగ్రామానికి బయలేదేరాడు. పుంగనూరు రోడ్డు, బసినికొండ ఆర్చి వద్దకు వెళ్లగానే ఎదురుగా వచ్చిన మరో బైక్ కళ్యాణ్ ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనాన్ని వేగంగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన బాధితున్ని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు బాధితుడికి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా పోలీసులు తెలిపారు. రొంపిచెర్ల: అనంతపురం–చైన్నె జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో గురువారం కారు ఢీకొని ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. ఎస్ఐ మధుసూధన్ కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో రోడ్డు దాటుతున్న ఇటుకల బట్టీలో కూలీగా పని చేస్తున్న పీలేరు మండలం అరుమానిపల్లెకు చెందిన విశ్వనాఽథ్(45)ను పీలేరు నుంచి వేగంగా వచ్చిన కారు (ఏపీ03 ఎఎక్స్ 3375) ఢీకొంది. ఈ ప్రమాదంలో అతని తల, ఎడమ కాలుకు తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు పోలీసులకు సమాచారం ఇవ్వడంతో ఎసై మధుసూధన్ సంఘటన స్థలాన్ని సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కారు పీలేరు చెందిన రూకేష్కు చెందినగా గుర్తించారు. క్షతగాత్రుడిని పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ డాక్టర్లు ప్రథమ చికిత్స చేసి మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. మదనపల్లె టౌన్: రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడిన సంఘటన గురువారం కురబలకోట మండలంలో జరిగింది. బాధితుల కుటుంబీకులు తెలిపిన వివరాలు.. తంబళ్లపల్లె నియోజక వర్గంలోని పెద్దతిప్పసముద్రానికి చెందిన రైతు బాబూలాల్ (60) అదే ఊరికి చెందిన నూర్ అహమ్మద్ తో కలసి తన బైకులో సొంత పనిమీద మదనపల్లెకు బయలు దేరారు. కురబలకోట మండలం, సర్కారుతోపు వద్దకు రాగానే బైకు అదుపు తప్పి, రోడ్డు పక్కన ఉన్న సేఫ్టీవాల్ ను ఢీకొని ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. గాయపడిన వారిని స్థానికులు జిల్లా ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి బాబులాల్ ను మెరుగైన వైద్యం కోసం తిరుపతికి వెళ్లాలని రెఫర్ చేశారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
టిన్నర్ తాగి రెండేళ్ల చిన్నారికి అస్వస్థత
మదనపల్లె టౌన్: తాగే నీళ్లు అనుకుని రెండేళ్ల చిన్నారి టిన్నర్ తాగి తీవ్ర అస్వస్థతకు గురైంది. గురువారం కురబలకోట మండలంలో చోటుచేసుకున్న ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. అంగళ్లు కు చెందిన లక్ష్మి కుమార్తె లిఖిత ప్రియ(2) ఇంట్లో ఆడుకుంటూ టిన్నర్ బాటిల్ కనిపించడంతో నీళ్లు అనుకుని పొరబటున తాగేసింది. చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురికావడంతో తల్లిదండ్రులు గమనించి వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకు వచ్చారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి చికిత్స అందించారు. చిన్నారి ఆరోగ్యం కుదుట పటంతో తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. ఉరివేసుకొని టీచర్ ఆత్మహత్య లక్కిరెడ్డిపల్లి: మండలంలోని కోనంపేట గ్రామానికి చెందిన ఎలుగోటి రామకృష్ణ (55) అనే వ్యక్తి మనస్థాపానికి గురై గురువారం ఉదయం ఇంటిలో ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకున్నట్లు లక్కిరెడ్డిపల్లి పోలీసులు తెలిపారు. బంధువులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మృతుడు రామకృష్ణ ఓ ప్రైవేటు స్కూల్లో టీచర్గా పనిచేస్తుండేవాడు. ఇటీవల పాఠశాలలో పని చేయడం మానేసి ఇంటివద్దే ఉండేవారన్నారు. ప్రతిరోజూ పొలం వద్దకు వెళ్లి పొలం పనులు చూసుకునేవడాడు. తన ఆరోగ్య పరిస్థిత సరిగా లేకపోవడంతో చికిత్స పొందుతున్నాడు. గురువారం ఇంటికి వచ్చి ఉదయం ఫ్యాన్కు ఉరివేసుకొని ఆత్మహత్యచేసుకున్నట్లు బంధువులు తెలిపారని పోలీసులు తెలియజేశారు. కుటుంబ సమస్యలతో వ్యక్తి.. జమ్మలమడుగు రూరల్: పట్టణంలోని దిగువపట్నం కాలనీకి చెందిన డేరంగుల సుధాకర్ (40) అనే వ్యక్తి బుధవారం రాత్రి ఫ్యాన్కు ఉరి వేసుకొని అత్మహత్య చేసుకున్నాడు. ఎస్ఐ రామకృష్ణ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. దిగువపట్నం కాలనీకి చెందిన సుధాకర్ ట్రాక్టర్ డ్రైవరుగా ఉంటూ జీవనం సాగిస్తున్నాడు. ఇటీవల కుటుంబ సమస్యలు అధికమయ్యాయి. దీంతో బుధవారం రాత్రి భోజనం చేసిన తరువాత ఇంట్లో ఎవరూ లేని సమయంలో ఉరి వేసుకుని అత్మహత్య చేసుకున్నాడు. ఇతనికి భార్య, ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. తాళ్లప్రొద్దుటూరులో చోరీ కొండాపురం: మండల పరిధి తాళ్లప్రొద్దుటూరులోని శివాలయం వీధిలో నివాసం ఉంటున్న షేక్ అమీర్బాష ఇంటిలో గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసినట్లు ఎస్ఐ మంజునాథ గురువారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు తాళ్లప్రొద్దుటూరుకు చెందిన షేక్. అమీర్బాష ఓ వివాహానికి వెళ్లాడు. బుధవారం రాత్రి ఇంటిలో ఎవరూ లేరు ఈ సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు ఇంటిలోకి ప్రవేశించి తులం చెంపచారీలు ,రూ. లక్ష నగదు దొంగలించినట్లు ఎస్ఐ తెలిపారు. కేసునమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. -
రోడ్డున పడిన టమాటా
గుర్రంకొండ: ఒకప్పుడు దొంగల బారి నుండి టమాటాలను కాపాడుకొనేందుకు రైతులు రాత్రిళ్లు పొలాల వద్దనే జాగారం చేసేవాళ్లు. కష్టాలుపడి తోటల వద్ద నుంచి మార్కెట్కు తరలించేవారు. నేడు మార్కెట్లో టమాటా ధరలు రోజు రోజుకు పతనం అవుతుండడంతో ఏం చేయాలో దిక్కుతోచని రైతులు కాయలు కోయకుండా తోటల్లో వదిలేస్తున్నారు. మరికొంతమంది అతి తక్కువ ధరలకు జ్యూస్ ఫ్యాక్టరీలకు తరలించేస్తున్నారు. మార్కెట్కు తరలిస్తే కమీషన్లు, రవాణా చార్జీల భారానికి భయపడి మార్కెట్యార్డు పరిసరాల్లో రోడ్లపైనే క్రీట్లు దించేస్తున్నారు. జ్యూస్ ఫ్యాక్టరికి తరలించేవారు వాటిని రోడ్లపైనే రాత్రింబవళ్లు ఉంచేసి తరువాత తీరుబడిగా తీసుకెళుతున్నారు. ఒకప్పుడు దొంగలు రాత్రిళ్లు తోటల వద్దకు వెళ్లి టమాటాలను ఎత్తుకెళ్లగా.. నేడు రోడ్లపైనే రాత్రింబవళ్లు ఎక్కడపడితే అక్కడ వదిలేసినా తీసుకెళ్లే వారు కరువయ్యారు. రోడ్లపైనే క్రీట్లు టమాటా ధరలు పతనమవడంతో టమాటాలను క్రీట్లలో నింపి వ్యాపారులు రోజుల తరబడి రోడ్లపైనే ఏక్కడ పడితే అక్కడ వదిలేస్తున్నారు. అయితే కళ్లుముందు టమాటాలు కనిపిస్తున్నా వాటిని ఎవరూ తాకడం లేదు. మండలకేంద్రంలో మార్కెట్యార్డుకు నాలుగు మండలాలకు చెందిన రైతులు టమాటాలను తీసుకొస్తుంటారు. ఆయా మండలాల పరిధిలో 2140 ఎకరాల్లో ఇప్పటికే పంట సాగు చేశారు. దిగుబడులు పుష్కలంగా వస్తున్నాయి. అయితే మార్కెట్లో ధరలు అశించినంతగా లేక పోవడం గమనార్హం ప్రస్తుతం 25కేజీల టామాటా క్రీట్ ఽ(బాక్సు) ధర రూ. 150 నుంచి రూ. 180 లోపే పలుకుతోంది. దీంతో రైతులకు పంటసాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి రాకపోగా మార్కెట్కు తరలించే ఖర్చులు కూడా రాకపోవడంతో తీవ్రంగా నష్టపోతున్నారు. దీంతో పలువురు రైతులు జ్యూస్ఫ్యాక్టరీలకు తరలించే వ్యాపారులకు తోటల వద్దనే కాయలు విక్రయిస్తున్నారు. వ్యాపారులు సరాసరి 25కేజీల క్రీట్ రూ. 70 నుంచి రూ.80కు టమాటాలను కొనుగోలు చేసి తోటల వద్దనే లోడింగ్ చేసి అక్కడి నుంచి వాహనాల్లో జ్యూస్ఫ్యాక్టరీలకు తరలించేస్తున్నారు. గతంలో తోటలవద్ద కాపాలా: గతంలో టమాటా ధరలు ఆకాశానంటున్న తరుణంలో దొంగల బారి నుంచి కాయలను కాపాడుకొనేందకు రైతులు రాత్రిళ్లు తోటల వద్దనే కాపాలాగా పడుకొనేవారు. గతంలో క్రీట్ ధర రూ.2500 నుంచి రూ. 3500 వరకు ధరలు పలికాయి. మార్కెట్లో ధరలు ఎక్కువగా ఉన్న కాలమంతా రైతులు కష్టాలు పడి కాయల్ని తోటల వద్ద కాపాడుకొన్న సంఘటనలు చోటు చేసుకొన్నాయి. అయితే అందుకు భిన్నంగా నేడు రోడ్లపైనే వదిలేస్తున్నా దొంగలు కాదుకదా కనీసం సాధారణ ప్రజల కూడా వాటవైపు కన్నెత్తిచూడడం లేదు. టమాటా రైతుల దుస్థితికి ఇదొక నిదర్శనంగా చెప్పుకోవచ్చు. ధరల పతనంతో రహదారి పక్కనే వదిలేస్తున్న రైతులు -
ప్రతి మహిళా సభ్యురాలికి సీ్త్రనిధి రుణం
తంబళ్లపల్లె: వెలుగు మహిళా సంఘాలలోని ప్రతి మహిళా సభ్యురాలికి సీ్త్ర నిధి రుణం పంపిణీ చేయాలని సీ్త్ర నిధి కడప జోనల్ మేనేజర్ వెంకటప్రసాద్ సూచించారు. గురువారం ఆయన వెలుగు కార్యాలయంలో సమీక్షా సమావేశం నిర్వహించారు. సీ్త్ర నిధి రుణాల పంపిణీలో జిల్లా మొదటి స్థానంలో నిలిచిందని రికవరీలో మూడోస్థానంలో ఉందన్నారు. రాష్ట్రంలో సీ్త్ర నిధి రుణాల పంపిణీ 12వేల కోట్లు లక్ష్యం కాగా జిల్లాలో 508 కోట్లు లక్ష్యమన్నారు. రుణాలు పొందిన మహిళా సభ్యులు డిజిటల్ పేమెంట్ క్యూఆర్ కోడ్ ద్వారా చెల్లిస్తారన్నారు. ఎక్కడ అవకతవకలు అవినీతికి చోటు ఉండదన్నారు. కార్యక్రమంలో ఏజీఎం సంతోష్కుమార్, ఏపిఎం గంగాధర్, సీ్త్ర నిధి మేనేజర్ అమరావతి, సీసీలు ఆదిలక్ష్మి, నరసింహులు, రమణ పాల్గొన్నారు. -
న్యాయవాది హత్యకు పాతకక్షలే కారణం
● ఐదుగురు నిందితులు అరెస్టు ● పరారీలో మరొకరు.. ట్రాక్టర్లు, బైకులు స్వాధీనం ● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి రాయచోటి : న్యాయవాది హత్య కేసులో ఐదుగురు నిందితులను అరెస్టు చేసినట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. గ్రామంలో ఆధిపత్యపోరు, పాత కక్షల కారణంగా పథకం ప్రకారం న్యాయవాది పూజారి ఎల్లయ్యను హత్య చేసినట్లు ఎస్పీ వెల్లడించారు. గురువారం రాయచోటిలోని పాస్పోర్టు కార్యాలయంలో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కేసు వివరాలను ఎస్పీ మీడియాకు వివరించారు. కేవీపల్లె మండలం, పాత వడ్డిపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది పి ఎల్లయ్యకు అదే గ్రామానికి చెందిన నిందితులకు మధ్య గత కొంతకాలంగా ఆధిపత్యపోరు నడుస్తోందన్నారు. ఎల్లయ్య తన హోదానుఅడ్డుపెట్టుకొని తమను తక్కువచేసి చూస్తున్నాడని, పాత కేసుల ప్రస్తావన తెస్తూ గ్రామస్తులు ముందు అవమానిస్తున్నాడని నిందితులు కక్షపెంచుకున్నట్లు విచారణలో తేలిందన్నారు. ఈనెల 6వ తేదిన ఎల్లయ్య ఇంటిముందు ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు విషయంలో జరిగిన ఘర్షణ హత్యకు దారి తీసిందన్నారు. పథకం ప్రకారం దాడి... హత్యచేయాలనే ఉద్దేశంతో నిందితులు కడప–పీలేరు రహదారిలోని మఠంపల్లి క్రాస్ వద్ద సమావేశమై స్కెచ్ వేశారని ఎస్పీ తెలిపారు. పథకం ప్రకారం ఎల్లయ్య ఇంటికి వెళ్లే దారికి అడ్డంగా ట్రాక్టర్లను నిలిపి దిగ్భంధనం చేసినట్లు వివరించారు రాత్రి 11 గంటల సమయంలో ఇంటిపై దాడి చేసి అడ్డువచ్చిన ఎల్లయ్యను, తల్లిదండ్రులను బయటకు లాగి కొట్టారన్నారు. అనంతరం ఎల్లయ్యను పట్టుకొని కదలకుండా చేతులు, కాళ్లు నొక్కిపెట్టి పెద్ద బండరాళ్లతో తలపై బలంగా మోది ప్రాణాలు తీసినట్లు ఎస్పీ వివరించారు. దాడిలో తీవ్రంగా గాయపడిన యల్లయ్య తల్లిదండ్రులు ప్రస్తుతం తిరుపతిలో చికిత్స పొందుతున్నట్లు తెలిపారు. అరెస్టు వివరాలు... రాయచోటి డిఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో కలకడ సీఐ లక్ష్మన్న బృందం గురువారం ఉదయం గడి క్రాస్ బస్టాప్ వద్ద నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు ఎస్పీ తెలిపారు. కుంచెపు శ్రీనివాసులు (39), కుంచెపు మోహన్ బాబు (27), కుంచెపు పురుషోత్తం (28), పూజారి శంకరయ్య (26), బండి శివ (35)లను అరెస్టు చేయగా మరో నిందితుడు కుంచెపు నాగేశ్వర్ పరారీలో ఉన్నట్లు వివరించారు. హత్యకు ఉపయోగించిన రెండు బండరాళ్లు, ఐదు కట్టెలు, రెండు బైక్లు, రెండు ట్రాక్టర్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. కేసును త్వరితగతిన ఛేదించి నిందితులను పట్టుకున్న రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, కలకడ సీఐ లక్ష్మన్న, కేవీపల్లె ఎస్ఐ శివకుమార్, కలకడ ఎస్ఐ రామాంజనేయులు, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. వ్యక్తిగత కక్షలతో దాడులకు పాల్పడే వారికి స్థానం లేదని, చట్టాన్ని చేతుల్లోకి తీసుకుంటే ఎంతటి వారినైనా వదిలిపెట్టబోమని ఎస్పీ ఈ సందర్భంగా హెచ్చరించారు. -
బైక్, ఇన్నోవా ఢీ: ఇద్దరు దుర్మరణం
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో గురువారం సాయంత్రం రోడ్డు ప్రమాదం జరిగింది. కారు బైకును ఢీకొనడంతో ఇద్దరు అక్కడి అక్కడే ప్రాణాలు కోల్పోగా, మరో ముగ్గురు యువకులు తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపిన వివరాలు.. కొత్తవారిపల్లె పంచాయతీ, పూలవాండ్లపల్లెకు చెందిన శేషాద్రి రమణ(36), సీటీఎం ఇండియన్ బ్యాంకులో అటెండర్గా పనిచేస్తున్నాడు. విధులు ముగించుకుని స్కూటీలో పూలవాండ్లపల్లెకు వెళుతుండగా, కంకర ఫ్యాక్టరీ వద్ద గుర్రంకొండకు వెళ్లి తిరిగి మదనపల్లెకు వస్తున్న ఇన్నోవా కారు వేగంగా వచ్చి ఢీకొని అక్కడి నుంచి రోడ్డు పక్కన ఉన్న చెట్టును ఢీకొంది. ఈ ప్రమాదంలో స్కూటరిస్టు శేషాద్రిరమణతో పాటు కారులోని ఈశ్వరమ్మ కాలనీకి చెందిన ఇషాక్ (13) అనే బాలుడు చనిపోయాడు. కారులో ఇరుక్కుపోయిన మదనపల్లె దేవతా నగర్కు చెందిన జావీద్ (22), ముజీబ్ నగర్కు చెందిన అస్లాం (19), ముబారక్(27) లు తీవ్రంగా గాయపడ్డారు. వారిని స్థానికులు వెలికితీసి మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. జావీద్, అస్లాంల పరిస్థితి విషమంగా ఉంది. కుటుంబీకులు వీరిని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. మరో ముగ్గురు యువకులకు తీవ్రగాయాలు మృతిచెందిన శేషాద్రి రమణ, ఇషాక్ -
హుండీ ఆదాయం లెక్కింపు
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి హుండీ ద్వారా రూ.16,20,150ల ఆదాయం సమకూరింది. గురువారం స్థానిక ఆలయంలో టీటీడీ సూపరింటెండెంట్ మునిబాల ఆధ్వర్యంలో హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈకార్యక్రమంలో టీటీడీ ఇన్స్పెక్టర్ కృష్ణమూర్తి, టీటీడీ విజిలెన్స్అధికారి మల్లికార్జున, సిబ్బంది నాగరాజ, ఆలయఅర్చకులు గోపాలాబట్టర్, కృష్ణ, రాజు, గోకుల్, వరదరాజ స్వాములు పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: జిల్లా జూనియర్ బాలికల హాకీ జట్టు ఎంపికలు ఈనెల 12వతేదీ మదనపల్లె బీటీ కాలేజీ మైదానంలో నిర్వహిస్తున్నట్లు హాకీ అన్నమయ్య జిల్లా జనరల్ సెక్రటరీ బి.శివప్రసాద్ తెలిపారు. క్రీడాకారులు ఉదయం 8 గంటలకు హాజరు కావాలన్నారు. క్రీడాకారులు జనన సర్టిఫికెట్, ఆధార్కార్డు, 10వ తరగతి మార్కుల జాబితా, స్టడీ సర్టిఫికెట్, తప్పనిసరిగా తీసుకురావాలన్నారు. ఎంపికై న జట్టు ఏప్రిల్ 16 నుంచి 18 వరకు చిత్తూరులో జరిగే రాష్ట స్థాయి పోటీల్లో పాల్గొంటారన్నారు. మరిన్ని వివరాలకు 98800 92188 నంబర్లో సంప్రదించాలన్నారు. మదనపల్లె సిటీ: మదనపల్లెలోని కేంద్రీయ విద్యాలయం(కేవీకే(లో గురువారం 1వ తరగతి నుంచి 5వ తరగతి వరకు ప్రవేశాలకు ఎంపికలు జరిగాయి. ప్రిన్సిపల్ వెంకటేశ్వర్లు, ఇన్చార్జ్ డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి, ఉపాధ్యాయులు మల్లికార్జున, సురేంద్రనాయక్, పేరెంట్స్ కమిటీ నుంచి రెడ్డప్ప, చాణక్య,ఆసిఫా సమక్షంలో ఎంపిక ప్రక్రియ జరిగింది. ఇందులో 200 సీట్లు లాటరీ పద్ధతి ద్వారా ఎంపిక చేశారు. పుంగనూరు: పుంగనూరు సమీపంలోని చీమనపల్లె వద్ద వెలసిన హజ్రత్జాన్పాక్షావలి బాబా, ఫకీర్షావలి బాబా వారి ఉరుసు శుక్రవారం రాత్రి నుంచి ప్రారంభం కానుంది. మూ డు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పోటీలు నిర్వహించనున్నట్లు కమిటీ అధ్యక్షుడు అష్రఫ్ తెలిపారు. గురువారం దర్గాను విద్యుత్ దీపాలతో అత్యంత సుందరంగా అలంకరించారు. 11, 12వ తేదీలలో ముంబైకి చెందిన అఫ్రిన్సుల్తాన, మైసూర్కు చెందిన సలీంరిష్టి, గుజరాత్కు చెందిన ఆసిఫ్అజ్మీర్, ఇంతేజుర్రిష్టి లచే రెండు రోజుల పాటు ఉరుసు, ఖవ్వాలి పోటీలు జరుగుతాయని వివరించారు. బయట ప్రాంతాలకు చెందిన వందలాది మంది ముస్లింలు ఉరుసు మహోత్సవంలో పాల్గొనేందుకు దర్గా ప్రాంతం చేరుకుంటున్నారు. మదనపల్లె: ఇళ్లు, ఆస్తుల గణన కార్యక్రమంలో గణకులు, సూపర్వైజర్లు పక్కాగా వ్యవహరించాలని ఇన్చార్జ్ డీఆర్ఓ చంద్రశేఖర్రెడ్డి కోరారు. గురువారం స్థానిక జెడ్పీ హైస్కూల్లో గణకులు, సూపర్వైజర్లకు శిక్షణ తరగతులు నిర్వహించారు. ఈ సందర్భంగా వారినుద్దేశించి ఆయన మాట్లాడుతూ సూపర్వైజర్లు, ఎన్యుమరేటర్లు గణన పనులపై సమగ్ర అవగాహన కల్పించారు. మొబైల్ యాప్ వినియోగంపై పరిజ్ఞానం కల్పించారు. ప్రతి గణన బ్లాక్ లోని కుటుంబాలు, గృహాలు, వాటి వివరాల ను క్రమబద్ధంగా నమోదు చేసే విధానంపై దృష్టి సారించాలని సూచించారు. భవనాలకు సంఖ్యలు కేటాయించడం, మ్యాపింగ్ చేయడం, సంబంధిత వివరాలను యాప్లో నమోదు చేయడం వంటి అంశాలు వివరించారు. ఈ శిక్షణ గణన ప్రక్రియను వేగవంతం చేసి, ఖచ్చితమైన సమాచారం సేకరణకు దోహదపడుతుందని ఆయన అన్నారు. జిల్లా గణన అధికారి విష్ణుప్రియ, కమీషనర్ కే.ప్రమీల, జిల్లా అధికారి లక్ష్మీపతి పాల్గొన్నారు. -
మార్కెట్లో 15 కేజీల క్రేట్లు తప్పనిసరి
కురబలకోట: జిల్లాలోని అన్ని టమాటా మార్కెట్లు, మండీలలో 15 కేజీల టమాటా క్రేట్లనే అమలు చేయాలని అలాగే జాక్ పాట్ విధానాన్ని పూర్తిగా నిలిపివేయాలని అన్నమయ్య జిల్లా వ్యవసాయ మార్కెటింగ్ శాఖ ఏడీ టి.త్యాగరాజు సూచించారు. గురువారం అంగళ్లు మార్కెట్ కమిటీ కార్యాలయంలో నిర్వహించిన టమాటా మండీల నిర్వాహకులతో సమావేశంలో మాట్లాడారు. అన్నమయ్య జిల్లాలోని మదనపల్లి, ములకలచెరువు, కలకడ, గుర్రంకొండ, చింతపర్తి మార్కెట్లలో ఇప్పటికే 15 కేజీల క్రేట్ల విధానాన్ని పాటిస్తున్నారన్నారు. ఇదివరలో వినియోగించిన 30 కేజీల పెద్ద క్రేట్ల వల్ల రైతులకు నష్టం వాటిల్లేదని దానిని నియంత్రించాలన్న ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టిందన్నారు. చిన్న క్రేట్లు మోయడానికి రైతులు, కూలీలకు సులభతరంగా ఉంటాయన్నారు. కాయలు నలగకుండా నాణ్యతగా ఉంటాయన్నారు. ఇక నుంచి అంగళ్లు మార్కెట్లో కూడా చిన్న క్రేట్ల విధానాన్ని విధిగా పాటించాలన్నారు. నిబంధనలు ఉల్లంఘిస్తే లైసెన్స్ రద్దు చేస్తామని హెచ్చరించారు. పెద్ద క్రేట్ల నష్టం ఎలా..? చిన్న క్రేట్ల విధానం వల్ల తమ వద్ద ఏళ్లుగా ఉన్న పెద్ద క్రేట్లను ఏం చేయాలని అంగళ్లు మండీల నిర్వాహ కులు అధికారులను ప్రశ్నించారు. ఏడాది క్రితమే చెప్పి ఉండాల్సి ఉందన్నారు. ఈ నష్టం ఎవరు భరిస్తారన్నారు. చిన్న క్రేట్ల అమలుకై గడువు ఇవ్వాలని అధికారుల దృష్టికి తీసుకు వచ్చారు. అంగళ్లు, మదనపల్లి, ములకలచెరువు మార్కెట్ కమిటీల కార్యదర్శులు వి. మదన్మోహన్ రెడ్డి, జగదీష్, నవీన్కుమార్ రెడ్డితో పాటు మండీల నిర్వాహకులు సాయప్పీర్, శ్రీనివాసులరెడ్డి, చంద్రమోహన్ రెడ్డి, ఆదినారాయణ, రైతులు అమరనాథరెడ్డి, శ్రీనివాసులు పాల్గొన్నారు. జాక్ పాట్ నిర్వహిస్తే లైసెన్స్ రద్దు అన్నమయ్య జిల్లా ఏడీ త్యాగరాజు -
సంపు పనుల పరిశీలన
పెద్దమండ్యం: వాటర్గ్రిడ్ ప్రాజెక్టు ద్వారా చేపడుతున్న సంప్ పనులను మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి గురువారం పరిశీలించారు. మండలంలోని కలిచెర్ల పంచాయతీ పోలేరమ్మ గుడికి సమీపంలో వాటర్గ్రిడ్ సంప్ పనులను ఇటీవల చేపట్టారు. అక్కడ జరుగుతున్న పనులను సబ్ కలెక్టర్ పరిశీలించారు. గండికోట రిజర్వాయర్ నుంచి తాగునీటిని అందించేందుకు 2,370 కోట్లతో పనులు చేపడుతున్నట్లు సబ్ కలెక్టర్కు అధికారులు వివరించారు. సంప్ నిర్మాణం, సామర్థ్యం గురించి ఆమె అధికారులను అడిగి తెలుసుకొన్నారు. అనంతరం ఎన్వోపల్లె గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. ప్రజలకు వాట్సప్ గవర్నెన్స్ ద్వారానే సేవలను అందించాలని ఆమె అధికారులకు సూచించారు. ఈ సందర్భంగా అక్కడున్న సిబ్బందిని శాఖల వారీగా అందిస్తున్న సేవలపై ఆరా తీశారు. సచివాలయ సిబ్బంది ఫేషియల్ హాజరు విధానాన్ని తప్పనిసరిగా పాటించాలన్నారు. తహసీల్దార్ తేజస్వి, ఎంపీడీఓ శ్రీధర్రావు, ఆర్డబ్ల్యుఎస్ డీఈ చంద్రశేఖరరెడ్డి, డిప్యూటీ ఎంపీడీఓ నాగరాజునాయక్, విఆర్వో ఆంజినేయులు నాయక్, పంచాయతీ కార్యదర్శి పాల్గొన్నారు. కడప కార్పొరేషన్: వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి, మాజీ మేయర్ పాకా సురేష్ కుమార్ కలిశారు. గురువారం విజయవాడ తాడేపల్లిలోని కేంద్ర కార్యాలయంలో ఆయన్ను కలిసి జిల్లాలోని వివిధ అంశాలను ఆయన దృష్టికి తెచ్చారు. -
ఆరోగ్యానికి సెగ!
కడప రూరల్: సూర్యుడు ‘చుర్రు’మంటున్నాడు.. మాడు పగిలేలా భగభగమంటున్నాడు. ఇటీవల కాలంలో వాతావ‘రణం’ రణరంగంగా మారింది. దీంతో ప్రజల ఆరోగ్య వ్యవస్థ దెబ్బతింటోంది. ఇప్పటికే జిల్లాలో 42–43 డిగ్రీల గరిష్ణ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. రానున్నరోజుల్లో 48 డిగ్రీలకు పైగా గరిష్ట ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని వాతావర ణ శాఖ అంచనా. ఈ నేపధ్యంలో వడదెబ్బ తగలకుండా..ఆరోగ్య జాగ్రత్తలు పాటించాడం శ్రేయస్కరం. జాగ్రత్తలతోనే అడ్డుకట్ట... ఎండ తీవ్రత వల్ల శరీర ఉష్ణోగ్రత కూడా పెరుగుతుంది. దీంతో మెదడు మీద తీవ్ర ప్రభావం పడుతుంది. దీనివల్ల మెదడులో ఉష్ణోగ్రతను నియంత్రించే కేంద్రం (హైపో ధలామన్) దెబ్బతింటుంది. ఫలితంగా సదరు వ్యక్తి వడదెబ్బకు గురవుతాడు. దీనినే ‘హీట్ స్ట్రోక్’ లేదా ‘సన్ స్ట్రోక్’ అంటారు. ఈ దశ ప్రమాదకరం, ప్రాణాంతకం. లక్షణాలు..కారణాలు.. ● చెమట పట్టకపోవడం, శరీర ఉష్ణోగ్రత పెరగడం ● వణుకు పుట్టడం. మగత నిద్ర లేదా కలవరింత. ● ఫిట్స్ లేదా పాక్షికంగా అపస్మారక స్థితి కలగడం. ● శరీరంలో ఎక్కువ వేడి ఉత్పత్తి కావడం. శరీరం ఉష్ణాన్ని కోల్పోవడం జరుగుతుంది. శరీరంలో కలిగే మార్పులు... ● వేడి వలన చెమట పట్టి శరీరంలోని లవణాలు (సోడియం క్లోరైడ్) తగ్గిపోతుంది. లేదా శరీరంలోని నీటి నిష్పత్తి తగ్గితుంది. ● ఉష్ణోగ్రత ఉన్న ప్రదేశాల్లో శ్రమతో కూడిన పని చేస్తున్నప్పుడు ప్రతి గంటకు 3–4 లీటర్ల నీటిని చెమట రూపంలో శరీరం కోల్పోతుంది. అధికంగా అనారోగ్యానికి గురయ్యేవారు .. ● 65 ఏళ్ల వయస్సు పై బడిన వారు. ● గర్భిణీలు, పాలిచ్చే తల్లులు, పసిపిల్లలు ● అనారోగ్యంతో బాధపడుతున్న వారుఎండ ఎరుపు రంగు పూసుకుంది.. ఉదయం ఏడింటికే సుర్రుమంటోంది. సాయంత్రం చీకటిపడేదాకా తాపం ఆగనంటోంది. ఇంకేముంది భానుడి సెగ ప్రజల ఆరోగ్యంపై ప్రభావం చూపిస్తోంది. మండుటెండల కారణంగా వడ‘దెబ్బ’ పొంచి ఉంది. ఇప్పటికే చాలాచోట్ల వడదెబ్బలు నమోదవుతున్నాయి.. ఎండల నేపథ్యంలో జాగ్రత్తలు తీసుకోవాలని వైద్యులు సూచిస్తున్నారు. అనూహ్యంగా మారిన వాతావరణం ఇప్పటికే 42–43 గరిష్ట ఉష్ణోగ్రతలు.. పొంచిఉన్న వడ‘దెబ్బ’..ఆరోగ్యంపై పెను ప్రభావం -
కిడ్నీలపై డీహైడ్రేషన్ ప్రభావం
వేసవి కాలంలో ప్రతి ఒక్కరూ ఆరోగ్య పరిరక్షణకు జాగ్రత్తలు పాటించాలి. ప్రధానంగా డీహైడ్రేషన్ కారణంగా కిడ్నీలో రాళ్లు ఏర్పడుతాయి. ఇన్ఫెక్షన్లు రావ డానికి ఆస్కారం ఉంటుంది. ఈ సీజన్లో కిడ్నీలను కాపాడుకోవాలంటే ఒక రోజుకు 2.5 లీటర్ల నుంచి 3 లీటర్ల నీరు తాగాలి. ఎండలో ఎక్కువగా తిరిగేవారు ఇంకా ఎక్కువ నీరు తాగితే మంచిది. ఆహారంలో తాజా పండ్లు, కూరగాయలు, ఫైబర్ ఎక్కువుగా ఉండే పదార్ధాలు ఉండేలా చూడాలి, తీసుకునే ఆహరంలో ఉప్పును తగ్గించాలి. – డాక్టర్ ఎన్ దినేష్కుమార్రెడ్డి, మూత్రపిండాల వైద్య నిపుణులు, కడప. -
● రాధాకృష్ణ క్షమాపణ చెప్పాలి
సాక్షి నెట్వర్క్: వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణ చేసిన వ్యాఖ్యలపై ఆ పార్టీ శ్రేణులు మండిపడ్డాయి. రాధాకృష్ణ ‘చెత్త’పలుకులు మానుకుని మహిళలకు బేషరతుగా క్షమాపణలు చెప్పాలని నాయకులు డిమాండ్ చేశారు. రాధాకృష్ణ వ్యాఖ్యలు నిరసిస్తూ వైఎస్సార్ జిల్లా వ్యాప్తంగా అన్ని స్టేషన్లలో ఆయనపై ఫిర్యాదులు ఇచ్చారు. రాజంపేటలో ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి ఆధ్వర్యంలో పార్టీ నేతలు సీఐకి ఫిర్యాదు చేశారు. బద్వేల్ అర్బన్ పోలీస్స్టేషన్లో ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎమ్మెల్యే డాక్టర్ దాసరి సుధ ఆధ్వర్యంలో ఆ పార్టీ నాయకులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. కడపలోని జిల్లా పార్టీ కార్యాలయంలో ఆంధ్రజ్యోతి ఎండీ రాధాకృష్ణను చిత్రపటానికి చెప్పుల దండ వేసి వినూత్న నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ వైద్య విభాగం జిల్లా అధ్యక్షుడు డా. నాగార్జునరెడ్డి మాట్లాడుతూ ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పిన అబద్దాలన్నీ టీడీపీ నాయకులు విన్నారు కాబట్టి వారంతా వెన్నెముక లేనివారేనని అనుకోవాలా...అని అన్నారు. కమలాపురంలో నియోజకవర్గ ఇన్చార్జి నరేన్ రామాంజులరెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ విద్యాసాగర్కు ఫిర్యాదు చేశారు. మైదుకూరులో మాజీ ఎమ్మెల్యే శెట్టిపల్లె రఘురామిరెడ్డి ఆధ్వర్యంలో అర్బన్ పోలీస్స్టేషన్ సీఐ రమణారెడ్డికి ఫిర్యాదు చేశారు. -
బాబోయ్.. కరెంటు కోతలు
రాయచోటి: విద్యుత్ కోతలు ప్రజలకు పట్టపగలే చుక్కలు చూపిస్తున్నాయి. అధికారుల నిర్లక్ష్యమో లేక ప్రభుత్వం పెట్టిన కోతలో తెలియదుకానీ రాయచోటిలో బుధవారం నుంచి మొదలైన విద్యుత్ కోతలు రాత్రి 11 గంటల వరకు జనాలను ఉక్కిరిబిక్కిరి చేసి చెమటలు పట్టించాయి. నిమిషాల వ్యవధిలోనే సరఫరాలో ఏర్పడిన అంతరాయాలు జనాలను రోడ్డుపై పరుగులు తీయించాయి. అసలే సూర్యుడి ప్ర‘తాపా’నికి ఉడికిపోతుంటే దీనికితోడు విద్యుత్ కోతలు భయపెట్టిస్తున్నాయి. నాణ్యమైన నిరంతరాయంగా విద్యుత్ను అందిస్తా మని కూటమి ప్రభు త్వం చెబుతున్న మాటలు స్థానికంగా జరుగుతున్న విద్యుత్ సరఫరా కోతలకు పొంతన లేకుండా పోతోంది. ఇళ్లల్లో నుంచి బయటకు రాని వృద్దులు, అనారోగ్య ప్రజలు, ప్రభుత్వ కార్యాలయాలలో పనిచేస్తున్న ఉద్యోగులు ఉడికిపోతున్నారు. 24 గంటలు మెరుగైన విద్యుత్ను అందిస్తున్నామని ప్రలోభాలు పలుకుతుంటే రాయచోటిలో మాత్రం అందుకు భిన్నంగా సరఫరా అవుతోంది. ఓ వైపు కొత్తపేట, జగదాంబ సెంటర్, కొత్తపల్లి, ఎస్ఎన్ కాలనీ తదితర ప్రాంతాలలో లోఓల్టేజీ సమస్యతో గంటకు పది సార్లకుపైగా సరఫరాలో అంతరాయాలు కనిపించాయి. మూల్యాంకనకు తప్పలేదు.... అన్నమయ్య జిల్లా పరిధిలోని పదోతరగతి పరీక్ష ప్రశ్నపత్రాల దిద్దు బాటు కూ కరెంటు కష్టాలు తప్ప లేదు. రాయచోటిలో నాలుగు రోజుల నుంచి జరుగుతున్న మూ ల్యాంకన కేంద్రంలో విద్యుత్ సరఫరాలో నెలకొంటున్న అంతరాయం అక్కడి ఉపాధ్యాయులకు చెమటలు పట్టిస్తున్నాయి. 19 గదులలో జరుగుతున్న మూల్యాంకనానికి సరఫరాలో అంతరాయం అడుగడుగునా కనిపించింది. విద్యుత్ సరఫరాలో అంతరాయం ఉండటంతో ఆన్లైన్ అప్లోడుకు సర్వర్ సమస్యగా మారింది. దీంతో మూల్యాంకనానికి వచ్చిన ఉపాధ్యాయులు అష్టకష్టాలు పడాల్సి వచ్చింది. విద్యుత్ సమస్య పరిష్కారంలో స్థానిక సిబ్బంది సహకారం లేకపోవడంతో జిల్లా విద్యాశాఖ అధికారి సుబ్రమణ్యం సమస్యను ఎస్ఈ దృష్టికి తీసుకెళ్లారు. ఆయన తక్షణం రాయచోటి ట్రాన్స్కో ఈఈను ఆదేశించారు. ఎస్ఈ ఆదేశాలతో స్థానిక ట్రాన్స్కో అధికారులు మూల్యాంకన కేంద్రానికి వెళ్లి అక్కడ నెలకొన్న సమస్యను చక్కబెట్టారు. స్థానికంగా ఏర్పడుతున్న చిన్న చిన్న సమస్యలను క్షేత్రస్థాయిలోని సిబ్బంది, ఆపై స్థాయి అధికారులు సకాలంలో స్పందించకపోవడంతో కరెంటు కష్టాలు అధికమవుతున్నట్లు సమాచారం. ఈ విషయంపై రాయచోటి ట్రాన్స్కో ఈఈ లివింగ్ స్టన్ డేవిడ్ను వివరణ కోరగా 11కేవీ లైన్ తెగి ట్రాన్సుఫారమర్ మీద పడటంతో సరఫరాలో సమస్యలు తలెత్తాయన్నారు. సాంకేతికంగా నెలకొన్న సమస్యను సిబ్బంది సకాలంలో గుర్తించకపోవడంతో బుధవారం సరఫరాలో అంతరాయాలు నెలకొన్నాయన్నారు. మూల్యాంకన కేంద్రం, పట్టణంలో నెలకొన్న సమస్యలను పరిష్కరించామని మున్ముందు కూడా సత్వర పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఈఈ తెలిపారు. అప్రకటిత విద్యుత్ కోతలతో ప్రజలకు అవస్థ పది మూల్యాంకన కేంద్రానికి తప్పని తిప్పలు రాయచోటిలో మొదలైన విద్యుత్ కష్టాలు -
హత్యకేసులో నలుగురు అరెస్ట్
చౌడేపల్లె: అగ్నిసాక్షిగా వివాహం చేసుకున్న భర్త ఉండగా పరాయిమగాడి మోజులో పడి ఈనెల 5న బోయకొండ సమీపంలోని పక్షిరాజపురం వద్ద రాళ్లు, కట్టెలతో కొట్టి గాంఽధీని హతమార్చిన ఘటనలో నలుగురిని పోలీసులు గురువారం అరెస్టు చేశారు.సర్కిల్ కార్యాలయంలో సీఐ సాయిప్రసాద్, ఎస్ఐ చిన్నరెడ్డెప్పలు విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు. తమిళనాడు రాష్ట్రం వేలూరు జిల్లా గుడియాత్తం తాలూకా కోసవంపుధూర్ఇరులర్ కాలనీకి చెందిన జి. గాంధీ(37) అతని భార్య రాసాతితో కలిసి ఊటూరు వద్ద గల ఓ కోళ్లఫాంలో కూలీపనులకోసం వచ్చారు. రాసాతి బోయకొండ ఆర్ఆర్కాలనీకి చెందిన నరసింహులు మధ్య వివాహేతర సంబంధం ఏర్పడింది.ఈక్రమంలో భార్యను భర్త పలుమార్లు హెచ్చరించినా మార్పురాలేదు. రాసాతి ప్రియుడితో సహజీవనం చేస్తుండేంది. స్వగ్రామానికి వెళ్ళిపోయిన గాంధీ పదిరోజులక్రితం ఆర్ఆర్కాలనీకి వచ్చాడు.తన వెంట రమ్మని రాసాతిని బతిమలాడారు. ప్రియుడి మోజులో ఉన్న రాసాతి ఆమె ప్రియుడు నరసింహులు,అతని తమ్ముళ్లు లక్ష్మిపతి,నాగరాజఅలియాస్ నాగులు కలిసి పథకం ప్రకారం మద్యం తాపించి గాంధీను రాళ్లు, కట్టెలతో కొట్టి చంపేశారు. మృతుడి కుమారుడు సందీప్ అంగన్వాడీ టీచర్కు జరిగిన ఘటనను వెల్లడించడంతో హత్య ఉదంతం బయటపడింది. మృతుడి సోదరుడు సురేష్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదుచేసి దర్యాప్తు చేపట్టారు. నలుగురిని అరెస్ట్చేసి రిమాండుకు తరలించినట్లు సీఐ పేర్కొన్నారు. అనాథగా మిగిలిన చిన్నారి గాంధీ హత్య విషయం బయటకు రావడానికి మృతుడి కుమారుడు సందీప్ కీలకమయ్యాడు. ఈ కేసులో రాసాతి ప్రియుడి మోజులో పడి నేరంలో భాగస్వామి కావడంతో కటకటలాపాలైంది. చివరికి ఐదేళ్ల సందీప్ అనాథగా మిగలడం కంట తడి పెట్టించింది. -
విద్యార్థిని మృతిపై అధికారుల విచారణ
పెద్దమండ్యం: మండలంలోని ముసలికుంటలో విద్యార్థిని మృతిపై గురువారం అధికారులు విచారణ నిర్వహించారు. కేజీబీవీలో 7 వతరగతి చదువుతున్న విద్యార్థిని మల్లీశ్వరి (13) జ్వరంతో బాధపడుతూ బుధవారం మృతిచెందిన విషయం తెలిసిందే. ఎంఈవో మనోహర, సబ్యూనిట్ అధికారి శ్రీనివాసులు నాయక్లు కెజిబివిలో విచారణ నిర్వహించారు. విద్యార్థిని జ్వరంతో ఎన్ని రోజులుగా బాదపడుతోంది..ఎక్కడైనా విద్యార్థినికి చికిత్సలు చేయించారా ఆనే విషయాలపై విచారణ చేశారు. అలాగే జ్వరంతో ఇంకా ఎవరైనా బాధపడుతున్నారా అని అడిగి తెలుసుకున్నారు. పాఠశాలలో వైద్యశిబిరం నిర్వహించి విద్యార్థినులకు చికిత్స అందించారు. కాగా జ్వరంతో బాధపడుతున్న నలుగురు విద్యార్థినులను బుధవారం వారి ఇళ్లకు పంపించినట్లు సమాచారం. ఇదిలా ఉండగా తన బిడ్డ మృతిపై సమగ్ర విచారణ నిర్వహించి నిర్లక్ష్యంగా వ్యవహరించిన వారిపై చర్యలు తీసుకోవాలని మృతురాలి తల్లిదండ్రులు స్థానిక పోలీసులకు, తహసీల్దార్ తేజస్వికి ఫిర్యాదు చేశారు. జ్వరంతో బాధపడుతున్న తన బిడ్డను చావు బతుకుల మధ్య ఉన్న సమయంలో తమకు సమాచారం ఇచ్చారని వారు ఆవేదన వ్యక్తం చేశారు. జ్వరం బారిన పడిన వెంటనే తమకు సమాచారం ఇచ్చింటే తన బిడ్డను కాపాడుకొనేవాళ్లమని వారు కన్నీటి పర్వంతమయ్యారు. ఈ కార్యక్రమంలో డాక్టర్ హరివర్మ, ఆరోగ్య సిబ్బంది పాల్గొన్నారు. -
వినూత్న ఆలోచన..పంటకు రక్షణ
● పంటలను కాపాడుకొనేందుకు పొలాల్లో విద్యుత్ కాంతులు ● అడవిజంతువుల బెడదతో తప్పని పాట్లు లైట్ల కోసం ఏర్పాటు చేసిన స్తంభాలు తలారివాండ్లపల్లెలో వేరుశనగ పొలం వద్ద రాత్రిళ్లు వెలుగుతున్న విద్యుత్ లైట్లు గుర్రంకొండ: ఆరుగాలం కష్టపడి సాగు చేసిన పంటలను అడవి జంతుల బారినుంచి కాపాడుకొనేందుకు రైతులు విన్నూత్నప్రయోగాలు చేపట్టారు. పొలం చూట్టూ రాత్రిళ్లు విద్యుత్లైట్లను, మరికొన్ని చోట్ల పొలాల్లో ఎఫ్ఎమ్ రెడియోలు, స్పీకర్లను ఏర్పాటు చేస్తున్నారు. మరికొంతమంది రాత్రిళ్లు పొలం చుట్టూ ఆక్కడక్కడ కట్టెలతో మంటలు ఏర్పాటు చేసుకొంటున్నారు. పలుచోట్ల రైతులు చేపట్టిన పద్ధతులు మంచి ఫలితాలను ఇస్తున్నాయి. ప్రస్తుతం రబీసీజన్లో రైతులు పలు గ్రామాల్లో వేరుశనగ సాగు చేశారు. అక్కడక్కడ అడవిజంతువుల బెడదను ఎదుర్కోవాల్సి వస్తోంది. దీంతో ఈ ఏడాది రైతులు వీటి బారినుంచి పంటను కాపాడుకొనేందకు కొత్త ఆలోచనలకు శ్రీకారం చుట్టారు. వేరుశనగ పంట చుట్టూ , మధ్యలో స్తంభాలు అమర్చి విద్యుత్ లైట్లు ఏర్పాటు చేశారు. రాత్రిళ్లు విద్యుత్ కాంతులతో పొలం మొత్తం వెలుతురు ఉండడంతో అడవి జంతువులు అటువైపు వెళ్లడం లేదని రైతుల చెబుతన్నారు. పంటలకు కాపలాగా ఎఫ్ఎమ్రేడియోలు.. కొంతమంది రైతులు కర్బూజాతో పాటు మరికొన్ని పంటల వద్ద ఎఫ్ఎమ్ రేడియోలను ఏర్పాటు చేశారు. ఓ చెట్టుకుగానీ, ప్రత్యేకంగా ఏర్పాటు చేసుకొన్న పందిళ్ల వద్ద ముందుగా ఎఫ్ఎమ్ రేడియోలను ఏర్పాటు చేసి, దానిని రెండు స్పీకర్లకు కనెక్షన్ ఇస్తున్నారు. ఇవి కరెంటు సౌకర్యం లేకున్నా రాత్రిళ్లు పనిచేయడానికిగాను బ్యాటరీలను అమర్చారు. సాయంకాలం పొలం పనులు ముగించుకొని ఇంటికి వెళ్లే సమయంలో ఎఫ్ఎమ్ రెడియోలను ఆన్ చేసి వెళుతున్నారు.రాత్రిళ్లు ఎఫ్ఎమ్ రెడియోలలో వచ్చే కార్యక్రమాలతో పొలమంతా శబ్దాలు వస్తుంటాయి. దీంతో జనసంచారం ఉంటుందని అడవి జంతువులు పంటల పొలాలవైపు వెళ్లాలంటే భయాందోళన చెందుతున్నాయి. దీంతో రాత్రిళ్లు పంటకు కాపాలా కాసే బాధ నుంచి రైతులు ఉపశనమనం పొందుతున్నారు. వేరుశేనగ పంటను కాపాడుకొనేందుకు రాత్రిళ్లు పొలాల చుట్టూ అక్కడక్కడ కట్టెలను కుప్పగా పోసి మంటలను ఏర్పాటు చేస్తున్నారు. సుమారు ఆరు గంటల పాటు కట్టెలు రగులుతూనే ఉండేలా ఏర్పాటు చేస్తున్నారు దీంతో పొలాల వద్ద జనసంచారం ఉంటుందని భావించి అడవి జంతులు పొలాల వైపు రావడం లేదని రైతులు అంటున్నారు. మరికొంతమంది రైతులు పొలాల్లో అక్కడక్కడ కట్టెలను నాటి పాలథిన్షీట్లు. దారాలు కట్టెలకు కడుతున్నారు. ఖాళీ గాజుసీసాలను కూడా వాటికి జతచేసి ఒక వరుస క్రమంలో అమర్చుతున్నారు. పగలు, రాత్రిళ్లు అని తేడా లేకుండా అవి గాలివీచినపుపడుల్లా చప్పుళ్లు చేస్తుండడంతో జంతువులు అటువైపు రావడం లేదు. గాలిసన్నగా వీచినా రాసుకొంటుండడంతో పెద్ద శబ్దాలు వస్తున్నాయి. ఉన్న కాస్త పంటనైనా కాపాడుకోవడానికి ఇలా కష్టాలు పడాల్సి వస్తోందని రైతులు చెబుతున్నారు. -
భారీగా సెల్ఫోన్ల రికవరీ
కడప అర్బన్: ‘ఆపరేషన్ మొబిట్రాక్’ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్న్లో సఫలమయ్యారు.సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిస్టర్ (సీఈఐఆర్) పోర్టల్ ద్వారా వచ్చిన ఫిర్యాదుల ఆధారంగా, మొత్తం 505 మొబైల్ ఫోన్లు రికవరీ చేశారు. వీటి విలువ సుమారు రూ. 70 లక్షలు. ఇప్పటి వరకు 8 విడతల్లో మొత్తం రూ.11,76,00,000/– విలువైన 5877 మొబైల్ ఫోన్లు రికవరీ చేసినట్లు వైఎస్సార్కడప జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలియజేశారు. వైఎస్ఆర్ జిల్లాలో మొబైల్ ఫోన్లు పోగొట్టుకున్న బాధితులు సీఈఐఆర్ పోర్టల్ ద్వారా ఫిర్యాదు చేయడం వల్ల ఐఏంఈఐ ఆధారిత ట్రాకింగ్ , డేటా అనలిటిక్స్ పద్ధతుల ద్వారా ఫోన్లు త్వరితగతిన రికవరీ చేశారు. మొబైల్ రికవరీ విషయంలో రాష్ట్ర స్థాయిలో కాకినాడ జిల్లా మంచి ప్రగతి సాధించినట్లు ఎస్పీ తెలిపారు. పోలీసుల సూచనలు: ● సైబర్ మోసాల నుండి రక్షణ కోసం, అపరిచిత వీడియో కాల్స్ లేదా ఫిషింగ్ కాల్స్ / ఇమెయిల్స్కు ప్రతిస్పందించ వద్దు. ● సైబర్ నేరగాళ్ల మోసాలకు గురైతే వెంటనే సైబర్ క్రైమ్ హెల్ప్ లైన్ నంబర్ 1930 లేదా సమీపంలో గల పోలీస్ స్టేషన్ సంప్రదించాలి లేదా ఎన్సీఆర్పీ వెబ్సైట్లో ఫిర్యాధు చేయండి. ● మొబైల్ మిస్ అయినప్పుడు (లేదా) దొంగతనం జరిగినప్పుడు బ్యాంకు ఖాతాలను తక్షణమే బ్లాక్ చేయించాలి. సిమ్ కార్డ్ నెంబర్ను ఆలస్యం చేయకుండా డిసేబుల్ చేయించుకోవాలి. ● గూగుల్పే, ఫోన్పే వంటి యాప్లకు, అప్లికేషన్లను 2–ఫ్యాక్టర్ ఆథెంటికేషన్ లేదా బయోమెట్రిక్ సెక్యూరిటీ వినియోగించాలి. ● మొబైల్ పోయిన తక్షణమే గూగుల్ / ఆపిల్ ఐడీ, బ్యాంకింగ్ యాప్స్, వాట్సాప్, మెయిల్, సోషల్ మీడియా వంటి వాటి పాస్వర్డ్లు మార్చాలి. ● ఆండ్రాయిడ్ ఫోన్లకు, ఫైండ్ మై డివైస్, ఐఫోన్లకు, ఫైండ్ మై ఐ ఫోన్ (ఐ క్లౌడ్) ద్వారా ఫోన్న్ను ట్రాక్ చేయడం, రింగ్ చేయడం, లాక్ చేయడం, లేదా డేటా డిలీట్ చేయడం చేయొచ్చు. సీఈఐఆర్.జీవోవి.ఐఎన్ పోర్టల్ ద్వారా పోయిన మొబైల్ ఫోన్ వివరాలతో ఫిర్యాదు చేయవచ్చు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనేటప్పుడు జాగ్రత్త.. ఫోన్ బిల్లు, సెల్ ఫోన్ బాక్స్, ఫోన్ అమ్మే వ్యక్తి గురించి పరిశీలించాలి. అపరిచితుల నుంచి ఫోన్లు కొనుగోలు చేయడం ద్వారా సైబర్ నేరాలకు గురయ్యే ప్రమాదం ఉంది. జిల్లా లో సైబర్ క్రైమ్ బృందం ఆధ్వర్యంలో మొబైల్ ఫోన్ల రికవరీకి సంబంధించిన డిజిటల్ ఫోరెన్సిక్స్ ఆధారిత సాంకేతికతను ఉపయోగించడంతో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్, సైబర్ క్రైమ్ టీం ఇన్స్పెక్టర్ ఏ. మధు మల్లేశ్వర రెడ్డి, సంబంధిత సిబ్బందిని అభినందించారు. సమావేశంలో జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ , అడిషనల్ ఎసీప కె. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పి ఎన్. సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్స్పెక్టర్ యు. సదాశివయ్య పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్య
బద్వేలు అర్బన్ : స్థానిక ఎన్జీవో కాలనీలో బుధవారం ఓ వివాహిత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. ఎన్జీవో కాలనీలో నివసిస్తున్న ఊసుపల్లిఅమ్ములు (23)కు 8 సంవత్సరాల క్రితం బాబు అనే వ్యక్తితో వివాహమైంది. బాబు బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగిస్తుండేవాడు. బుధవారం బాబు పనికి వెళ్లి మధ్యాహ్నం ఇంటికి వచ్చి నిద్రపోతుండగా రేకుల ఇంటిలోని పైపునకు అమ్ములు ఉరి వేసుకుంది. సుమారు 6 గంటల సమయంలో బాబు నిద్ర లేచి చూసే సరికి అమ్ములు ఉరితాడుకు వేలాడుతూ కనిపించింది. దీంతో అర్బన్ పోలీసులకు సమాచారమివ్వగా అర్బన్ ఎస్ఐ ఘటన స్థలాన్ని పరిశీలించి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా ఇరువురికి వేరొకరితో అక్రమ సంబంధాలు ఉండటంతో భార్యభర్తలు తరచూ గొడవ పడుతుండేవారని తెలిసింది. కుక్క దాడి – 20మందికి గాయాలు కడప కోటిరెడ్డిసర్కిల్: కడప నగరం మారుతినగర్ ప్రాంతంలో బుధవారం ఓ కుక్క స్వైర విహారం చేసింది.20 మంది తీవ్రంగా గాయపడ్డారు. రోడ్డుపై నడుచుకుంటూ, ద్విచక్ర వాహనంలో వెళుతున్న వారిని కరవడంతో ప్రజలు బెంబేలెత్తిపోయారు. బాధితులు సమీపంలోని ఆస్పత్రులకు వెళ్లి వైద్య సేవలు పొందారు. గత కొన్ని రోజులుగా ఈ ప్రాంతంలో శునకాలు సంచరిస్తూ ప్రజలను ఇబ్బందులకు గురి చేస్తున్నాయని స్థానికులు చెబుతున్నారు.మున్సిపల్ కార్పొరేషన్ అధికారులు సత్వరమే స్పందిచి కుక్కలను పట్టుకోవాలని, నివాస ప్రాంతాలకు దూరంగా తరలించాలని కోరుతున్నారు. దాడిఘటనలో 8మందిపై కేసు కొండాపురం: మండలం పరిధిలోని కొండాపురం గ్రామంలోని శాంతినగర్ లో నివాసం ఉంటున్న కంబాల నాగేష్ కుటుంబ సభ్యులపై రమేష్ అతని అనుచరులు దాడి చేసిన ఘటన మంగళవారం రాత్రి చోటు చేసుకొంది. ఈ ఘటనపై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు కొండాపురం ఎస్ఐ జయరాజులు బుధవారం తెలిపారు. ఎస్ఐ వివరాల మేరకు శాంతినగర్కు చెందిన కంబాల నాగేష్కు అతని బంధువు రమేష్కు పాత కక్షలు ఉండేవి.ఈ కారణంతో గురువారం రాత్రి నాగేష్ కుటుంబ సభ్యులపై రమేష్ అతని అనుచరులు కలసి దాడి చేశారు. నాగేష్కు అతనికుమారుడు, తల్లికి సోదరుడు లకు గాయాలయ్యాయి. ఈఘటన పై 8 మందిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. మల్లయ్యకొండ అగ్నికి ఆహుతి తంబళ్లపల్లె: తంబళ్లపల్లెకు సమీపంలోని ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండ అటవీసముదాయం అగ్నికి ఆహుతవుతోంది. మంగళవారం సాయంత్రం ఆకతాయిలు అడవికి నిప్పు పెట్టడంతో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. అడవిలో బోద, గడ్డి ఏపుగా పెరిగి ఉండటంతో మంటలు ఎగిసిపడ్డాయి. వందల ఎకరాల్లో అడవి కాలిపోయింది. విలువైన ఔషధమొక్కలు, వన్యప్రాణులు, వృక్షసంపద అగ్నికి ఆహుౖతైంది. అగ్నికీలలు ఉవ్తెతన ఎగిసిపడంతో అటవీసిబ్బంది మంటలు అర్పడానికి వీలుకాలేదు. -
ఆలయ రూములు కూల్చివేత
పుంగనూరు: పట్టణ సమీపంలోని గూడూరుపల్లె వద్ద వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయానికి చెందిన లక్షలాది రూపాయలు విలువ చేసే మూడు అంగడి రూములను కొందరు మంగళవారం రాత్రి జేసీబీలతో కూల్చివేశారు. బుధవారం స్థానిక ప్రజలు గమనించి ఆందోళన చేపట్టారు. 30 సంవత్సరాల క్రితం ఆలయానికి దాతలు ఇచ్చిన అంగడి రూముల స్థలానికి విలువ రావడంతో కొంత మంది దీనిపై కన్నేసి అర్ధరాత్రి కూల్చివేసి ఆస్థలాన్ని కబ్జా చేసేందుకు ప్రయత్నిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై అధికారులు వెంటనే చర్యలు తీసుకోవాలని, రూములు కూల్చివేసిన వారిపై కేసులు నమోదు చేయాలని , ఆలయ ఆస్తులను కాపాడాలని డిమాండ్ చేశారు. లేకపోతే ఆందోళన తీవ్రం చేస్తామని గ్రామస్తులు హెచ్చరించారు. -
ప్రతి కూలీకి పని కల్పించండి
ములకలచెరువు: ఉపాధిహామీ పథకంలోని ప్రతి కూలీకి పని కల్పించాలని డ్వామా పీడీ వెంకటరత్నం సిబ్బందికి ఆదేసించారు. బుధవారం ఆయన సిబ్బందితో కలిసి పాతములకలచెరువులోని ఫీడర్ చానల్ వర్క్ను పరిశీలించి కూలీలతో మాట్లాడారు. జాబ్కార్డు కలిగిన ప్రతిఒక్కరూ పనిని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. అనంతరం సీఎల్ఆర్సీ భవనంలో తంబళ్లపల్లె నియోజకవర్గంలోని ఉపాధిహామీ సిబ్బందితో పనులపై సమీక్షించారు. ములకలచెరువు క్లస్టర్ పరిధిలోని ఆరు మండలాల్లో 10895 మంది కూలీలు పనులకు హాజరుకావాల్సివుండగా 3963 మంది మాత్రమే హాజరవుతున్నట్లు అసంతృప్తి వ్యక్తం చేశారు. సిబ్బంది పనితీరు మార్చుకోవాలని లేకుంటే క్రమశిక్షణ చర్యలు తప్పవని హెచ్చరించారు. 100 శాతం కూలీలు పనులకు హాజరయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని, 26 రకాల పనులు కులీలకు కల్పించాలని అన్నారు. ఈ కార్యక్రమంలో ఏపీడీ చందన, ఏపీఓలు, సిబ్బంది పాల్గొన్నారు.డ్వామా పీడీ వెంకటరత్నం -
ఓవైపు పసికందు.. మరోవైపు ఊరకుక్కలు
చెట్టుకింద ఒంటరిగా ఉన్న చిన్నారి చిన్నారిపై దాడి చేయడానికి చూస్తున్న ఊరకుక్కల గుంపు గుర్రంకొండ: ఓవైపు నెలల పసికందు చెట్టుకింది కూర్చుని ఉన్నాడు...ఇదే సమయంలో అటువైపు వెళుతున్న ఊర కుక్కల గుంపుకు చిన్నారి ఒంటరిగా కనిపించింది. దాడి చేసేందుకు సిద్దమవుతుండగా గమించిన కొంతమంది వాటిని తరిమి వేయడంతో చిన్నారికి ప్రాణపాయం తప్పింది. ఈ సంఘటన అన్నమయ్య జిల్లా గుర్రంకొండ పట్టణ శివార్లలో బుధవారం జరిగింది. చూట్టు ఎవరూ లేరు. నెలలు కూడా నిండని ఓ పసికందు మాత్రం చెట్టుకింద మండుటెండలో ఒంటిరిగా ఆడుకొంటోంది. చిన్నారి పక్కనే ఓ వాటర్ బాటిల్, పాలసీసా ఉన్నాయి. పెద్దగా జనసంచారం లేని ప్రాంతం కావడంతో అసలు ఆపాప అక్కడ ఎందుకు ఉంది. ఎవరు వదిలిపెట్టి వెళ్లారో అంతుచిక్కని ప్రశ్నగా మిగిలింది. ఇంతలోనే రక్తం రుచి మరిగిన ఊరకుక్కల గుంపు అటువైపు వెళుతోంది. వాటి చూపు ఒంటరి చిన్నారిపై పడింది. అక్కడే కొద్ది దూరంలొ మాటు వేశాయి. అదును చూసి దాడి చేయడానికి సిద్ధమవుతుండగా అదృష్టం కొద్ది అప్పుడే అటువైళుతున్న ఓ వ్యక్తి కంట ఈ దృశ్యం పడింది. అనుమానం కలిగి ఊరకుక్కల గుంపును చెదరగొట్టాడు. కొద్దిసేపు ఈ చిన్నారి ఎవరనే విషయం వాకబు చేశాడు. విధి విచిత్రం ఏ గూడు లేని ఓ నిరుపేద కుటుంబానికి చెందిన చిన్నారిగా గుర్తించాడు. పట్టణంలో కవర్లు ఏరుకొనే కుటుంబం ఉదయాన్నే కవర్లు ఏరుకోవడానికి వెళుతూ మండుటెండకు తాళలేదని నెలలు నిండని చిన్నారిని పట్టణ శివార్లలోని ఓ చెట్టుకింద వదిలిపెట్టి వెళ్లారు. ఈ చిన్నారికి తోడుకు మరో ఇద్దరు చిన్నారులను ఉంచి వెళ్లారు. తోడుగా ఉన్న మిగిలిన ఇద్దరు ఆడుకొంటూ ఎటో వెళ్లిపోయారు. దీంతో చిన్నారి చెట్టు కింద ఒంటరిగా మిగిలిపోవడంతో ఈ సంఘటన నెలకొంది. సమయానికి స్పందించడంతో ప్రాణపాయం తప్పింది. త్రుటిలో తప్పిన ప్రాణపాయం


