breaking news
annamayya district Latest News
-
పడిగాపులు.. ప్రదక్షిణలు
● అవస్థల పీజీఆర్ఎస్ ● అర్జీలు కొండంత..పరిష్కారం గోరంత అర్జీదారుల్లో అసహనం మదనపల్లె(కురబలకోట): మదనపల్లె కలెక్టరేట్ పీజీఆర్ఎస్ సోమవారం వివిధ సమస్యలతో వచ్చిన అర్జీదారులతో కిటకిటలాడింది. జిల్లా నలుమూలల నుంచి వ్యయ ప్రయాసలకోర్చి అర్జీదారులు తమ సమస్యలను ఏకరువు పెట్టారు. వారం వారం వచ్చిన అర్జీలే మళ్లీ వస్తున్నాయి. ప్రతి సోమవారం అదే సీను పునరావృతం అవుతోందని బాదితులు నిరాశతో వెనుతిరుగుతున్నారు. పలువురు విసుగు, అసహనం వ్యక్తం చేశారు. మదనపల్లె పీజీఆర్ఎస్ చాలా మటుకు అవే అర్జీలు..అదే గోడు..అదే నిరీక్షణలా సాగుతుండడం పట్ల పలువురు విచారం వ్యక్తం చేస్తున్నారు. ఎక్కువగా భూ సమస్యల పరిష్కారం కోసం, ఫించన్లు కోరుతూ అర్జీలు వచ్చాయి. జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి, ఉన్నతాధికారులు వెంకటేష్, చంధ్రశేఖర్ రెడ్డి, శాంతరాజ్ ప్రజల నుండి అర్జీలు 324 అర్జీలను స్వీకరించారు. క్షేత్ర స్థాయిలో విచారణ జరిపి నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. పెద్ద చెరువుకు నీరు నింపాలి ఎందరికో జీవనాధారంగా ఉన్న కురబలకోట మండలం చింతమాకులపల్లి గ్రామం పరిధిలోని పెద్ద చెరువు (నార్లపల్లి చెరువు)కు 12 ఏళ్లుగా వర్షపు నీరు చేరక ఆయకట్టు రైతులు సాగునీటి కోసం అవస్థలు పడుతున్నామని ఆయకట్టు రైతులతో పాటు సిద్దల ఎల్లమ్మ పీజీఆర్ఎస్లో జాయింట్ కలెక్టర్కు అర్జీ ఇచ్చారు. చెరువుకు నీరు చేరేలా తగు చర్యలు తీసుకోవాలని కోరగా జాయింట్ కలెక్టర్ సత్వరమే తగిన చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. నల్లమాండ్లపల్లిలో దాహం.దాహం.. మదనపల్లె రూరల్ మండలం పోతబోలు గ్రామం నల్లమాండ్లపల్లిలో బోరు ఎండిపోవడంతో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని, అలాగే మూగజీవాలు కూడా తాగునీటికి అలమటించే పరిస్థితి నెలకొందని కొత్త బోరువేయాలని పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. తాగునీటి సమస్య పరిష్కరించాలని కలెక్టరేట్లో నిరసన నీళ్లు వదిలే లైన్మ్యాన్ లేక టిడ్కో కాలనీలో 20 రోజులుగా తాగు నీరు రావడం లేదని బాధితులు సోమవారం పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. సమస్య తీర్చాలని, అలాగే టిడ్కో ప్రాంతంలో కనీస వసతులు కల్పించాలని కోరారు. వెంటనే నీటి సమస్య పరిష్కరించాలని జేసీ ఆదేశించారు. -
24న మెగా పీటీఎం–3.1
మదనపల్లె సిటీ : జిల్లాలోని అన్ని ప్రభుత్వ పాఠశాలల్లో ఈనెల 24న మెగా పేరెంట్–టీచర్ మీటింగ్ (మెగా పీటీఎం 3.1) కార్యక్రమం నిర్వహించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ తెలిపారు. జిల్లాలోని 1785 ప్రభుత్వ, 7 ఎయిడెడ్ పాఠశాలల్లో జరుగుతుందన్నారు. సమావేశంలో విద్యార్థుల విద్యా ప్రగతి, హోలిస్టిక్ ప్రొగ్రెస్ కార్డు, లీప్యాప్ ద్వారా విద్యార్థుల అభ్యసన స్థాయి, ఫౌండేషన్ లిటరసీ దీక్షా యాప్ వినియోగం, పాఠశాలల్లో అమలవుతున్న వివిధ విద్యా సంస్కరణలపై తల్లిదండ్రులతో సమగ్ర అవగాహన కల్పించబడుతుందన్నారు. విద్యార్థుల తల్లిదండ్రులు తమ పిల్లలతో కలిసి మెగా పీటీఎం కార్యక్రమంలో పాల్గొనాలని కోరారు. పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు పీలేరు : జిల్లాలో పీలేరు పంచాయతీకి ఐఎస్ఓ గుర్తింపు లభించింది. సోమవారం కలెక్టర్ నిశాంత్కుమార్ మదనపల్లె కలెక్టరేట్ కార్యాలయంలో పీలేరు గ్రామ పంచాయతీ ఈవో రవీంద్రరెడ్డి, ప్రత్యేకాధికారి యుగంధర్లకు ఐఎస్ఓ సర్టిఫికెట్ అందజేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోనే ఐఎస్ఓ గుర్తింపు పొందిన తొలి పంచాయతీగా పీలేరు మేజర్ పంచాయతీ నిలిచిందని అభినందించారు. ఇకపై యాప్లోనే లావాదేవీలుసాక్షి, మదనపల్లె : స్వయం సహాయక సంఘాల సభ్యులకు మన డబ్బులు–మన లెక్కలు యాప్ వినియోగంపై మెప్మా ఆధ్వర్యంలో సోమవారం మదనపల్లెలో అవగాహన కార్యక్రమం నిర్వహించారు. జిల్లా టీఈఐబీ నాగరాజు, టీఈ సీయంయం మధుసూదన్ రెడ్డి మాట్లాడుతూ యాప్ ద్వారా సంఘ సభ్యులు తమ పొదుపులు, రుణాలు, చెల్లించిన, చెల్లించాల్సిన వాయిదాల వివరాలను సులభంగా తెలుసుకోవచ్చన్నారు. మెప్మా కార్యక్రమాలు, జీవనోపాధి అవకాశాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా యాప్ ద్వారా పొందవచ్చని తెలిపారు. యాప్లోని మొబైల్ బుక్ కీపింగ్ విధానాన్ని ఉపయోగించి సంఘాల ఆర్థిక లావాదేవీలన్నింటినీ తప్పనిసరిగా నమోదు చేయాలని సూచించారు. వచ్చే నవంబర్నాటికి స్వయం సహాయక సంఘాల సభ్యులందరూ తమ ఆర్థిక లెక్కలను యాప్లో స్వయంగా చూసుకునే స్థాయికి చేరేలా అవగాహన పెంచుకోవాలని కోరారు. ఈ శిక్షణలో సంఘ సభ్యులకు యాప్ వినియోగం, మొబైల్ బుక్ కీపింగ్, ఆర్థిక లావాదేవీల నమోదు తదితర అంశాలపై అవగాహాన కల్పించారు. సీఓలు అనిత, నాగేంద్ర, ఆర్పి పుష్ప, సంఘ సభ్యులు హాజరయ్యారు. ప్రభుత్వ భూముల పరిశీలన రామసముద్రం : జిల్లాలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అనువైన ప్రభుత్వ భూములను గుర్తించే ప్రక్రియలో భాగంగా కలెక్టర్ నిశాంత్ కుమార్ సోమవారం రామసముద్రం మండలంలోని చొక్కాండ్లపల్లి గ్రామ సమీపంలో ఉన్న 60 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత బీడు భూమిని పరిశీలించారు. మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి సర్వే నంబర్ 177లోని భూమిని సందర్శించి, హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అనుకూలతపై అధికారులతో సమీక్షించారు. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాల మేరకు మదనపల్లె నియోజకవర్గ పరిధిలోని అనువైన ప్రభుత్వ భూములను గుర్తిస్తున్నట్లు కలెక్టర్ వెల్లడించారు. ఈ సందర్భంగా భూమి విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి అనుసంధానం, సరిహద్దులు, నీటి వనరులు, విద్యుత్ సౌకర్యం, ఇతర మౌలిక సదుపాయాలపై రెవెన్యూ అధికారులను అడిగి తెలుసుకున్నారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటు ద్వారా ఉద్యాన పంటల సాగుకు ప్రోత్సాహం లభించడంతో పాటు, పంటల నిల్వ, ప్రాసెసింగ్, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్ సౌకర్యాలు మెరుగుపడే అవకాశం ఉందన్నారు. ఈ పరిశీలనలో తహసీల్దార్ అజారుద్దీన్, సర్వేయర్ నరేంద్ర, రెవెన్యూ శాఖ అధికారులు, సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
11 సార్లు అర్జీ ఇచ్చినా..
ఇతని పేరు పాలెం వెంకట్రమణ. ఎస్సీ సామాజిక వర్గానికి చెందిన ఇతను భూ సమస్య పరిష్కారం కోసం పీజీఆర్ఎస్లో 11 సార్లు అర్జీ ఇచ్చారు. అయినా సమస్య పరిష్కారం కాలేదని రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన చెందుతున్నారు.ఇతనికి తంబళ్లపల్లి మండలం రేణిమాకులపల్లిలో సర్వే నంబర్ 144/2లో ఎకరా 85 సెంట్ల డీకేటీ భూమి ఉంది. పట్టా కూడా ఉంది. ఇప్పటికీ ఇతని అనుభవంలోనే ఉంది.వన్బీ కోసం దరఖాస్తు చేయగా ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇదే భూమికి మరో ఫోర్జరీ పట్టా పొందిన వ్యక్తి వైపు రెవెన్యూ అధికారులు మొగ్గు చూపుతున్నారు. ఇది ఫోర్జరీ పట్టా అని అధికారుల విచారణలో వెల్లడైనా తనకు న్యాయం చేయడం లేదని వృద్ధుడు వాపోతున్నారు. మరోసారి పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. -
విద్యార్థులను ప్రోత్సహించేందుకే షైనింగ్ స్టార్స్
సాక్షి, మదనపల్లె : ప్రభుత్వ పాఠశాలల్లో చదువుతున్న విద్యార్థులను ప్రోత్సహించేందుకే షైనింగ్ స్టార్స్ కార్యక్రమం నిర్వహిస్తున్నామని జిల్లా ఇన్చార్జ్ మంత్రి బీసీ.జనార్దనరెడ్డి అన్నారు. సోమవారం ఆయన మదనపల్లెలో నిర్వహించిన కార్యక్రమానికి హాజరయ్యారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ఈ ఏడాది జిల్లాలో పదో తరగతిలో ప్రతిభ కనబరిచిన 157 మంది, ఇంటర్మీడియట్లో ప్రతిభ కనబరిచిన 31 మందిని ఎంపిక చేశామన్నారు. విద్యార్థులకు ఒక్కొక్కరికి రూ.20 వేల చొప్పున రూ.37.60 లక్షల నగదు ప్రోత్సాహకాన్ని అందించామన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాన్ని నిర్దేశించుకుని కలెక్టర్, డాక్టర్, ఇంజనీర్, ఐఏఎస్, ఐపీఎస్ ఉన్నత రంగాల్లో రాణించి రాష్ట్రానికి, దేశానికి పేరు తీసుకురావాలని కోరారు. తల్లిదండ్రులు పిల్లల విద్యపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని, సెల్ఫోన్ల వినియోగాన్ని నియంత్రించాలని విజ్ఞప్తి చేశారు. ప్రభుత్వ పాఠశాలల్లో నాణ్యమైన మధ్యాహ్న భోజనం అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామని, ఆహార నాణ్యతపై పర్యవేక్షించాలని అధికారులను ఆదేశించారు. కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎమ్మెల్యే షాజహాన్బాషా, డీఈఓ సుబ్రమణ్యం, ఏసీపీ అనురాధ పాల్గొన్నారు.జిల్లా ఇన్చార్జ్ మంత్రి జనార్దనరెడ్డి -
పెట్రోలు చల్లి ఇంటికి నిప్పు
● ప్రమాదం నుంచి బయటపడిన చిన్నారులు ● బోరు మోటారు దొంగతనం నెపంతో వివాదం పెద్దమండ్యం: బోరు మోటారు దొంగతనం జరిగిందనే నెపంతో వచ్చిన వివాదం ఓ ఇంటికి పెట్రోలు చల్లి నిప్పు పెట్టేవరకు వెళ్లింది. మాటలతో మొదలైన వివాదం చివరకు పెద్దదిగా మారింది. ఇంట్లో చిన్న పిల్లలు ఉన్న సమయంలో ఇంట్లోకి చొరబడిన ఇద్దరు పెట్రోలు చల్లి నిప్పు పెట్టడంతో మంటలు చెలరేగాయి. చిన్నారులు గట్టిగా కేకలు వేయడంతో అప్పుడే పొలం దగ్గరికి వెలుతున్న బాధితులైన తల్లి, కూతురు గ్రామస్తులు అక్కడికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆదివారం సాయంత్రం సంఘటన జరగ్గా, సోమవారం బాధితులు స్థానిక పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్య జిల్లా కోటకాడపల్లె పంచాయతీ యర్రసానివారిపల్లెకు చెందిన ఎం గంగులప్ప వ్యవసాయం చేసుకుని జీవనం సాగిస్తున్నాడు. ఇతనికి కుమారుడు మహేశ్వర, కుమార్తె ఉన్నారు. కుమారుడు బెంగళూరులో డ్రైవర్గా పనిచేసుకుంటూ భార్యతో కలిసి జీవనం సాగిస్తున్నారు. ఇతనికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. బెంగళూరులో ఉన్న కుమారుని వద్దకు రెండు నెలల కిందటే గంగులప్ప వెళ్లి అక్కడే వాచ్మెన్గా పని చేస్తున్నారు. అయితే ఇదే గ్రామంలోని తాటిమాకులపల్లెకు చెందిన శివయ్య కుటుంబ సభ్యులతో భూమి విషయమై వివాదం ఉంది. ఇదిలా ఉండగా శివయ్యకు చెందిన బోరు మోటరు చోరీ జరిగినట్లు ఇతని కుమారుడు మణికంఠ గంగులప్పపై అనుమానం వ్యక్తం చేస్తూ అల్లుడైన జయరాంను అడిగారు. ఈ విషయం బెంగళూరులో ఉన్న మామ గంగులప్ప, బామ్మర్ధి మహేశ్వరలకు అల్లుడు జయరాం తెలిపారు. దీంతో మహేశ్వర తన తల్లి రామాంజులమ్మ కు జరిగిన విషయమై శివయ్య కుటుంబ సభ్యులను అడగాలని కోరాడు. బెంగళూరులో ఉన్న నా భర్త మీ బోరు మోటారు ఎందుకు దొంగతనం చేశాడని శివయ్య కుటుంబ సభ్యులను రామాంజులమ్మ నిలదీసింది. దీంతో అక్కడ చిన్నపాటి గొడవ జరిగింది. ఈ విషయమై స్థానిక పోలీస్ స్టేషన్కు వెళ్లి శివయ్య కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేశారు. స్పందించిన పోలీసులు గంగులప్ప కుమారుడు మహేశ్వరకు ఫోన్ చేసి మాట్లాడారు. ఇద్దరం బెంగళూరులో ఉన్నామని, స్టేషన్కు వస్తామని పోలీసులకు సమాధానం ఇచ్చారు. కాగా స్టేషన్లో ఫిర్యాదు చేసి తిరిగి ఇంటికి వెలుతున్న శివయ్య భార్య, కుమారుడు ఇద్దరు పెట్రోల్ కొనుగోలు చేసుకొని వెళ్లి గంగులప్ప ఇంట్లోకి వెళ్లి పెట్రోలు చల్లి నిప్పు పెట్టారని బాధితులు ఆరోపిస్తున్నారు. ఇంట్లో ఉన్న మహేశ్వర, చెల్లెలు బిడ్డలు ఐదుగురు చిన్నారులు కేకలు వేయడంతో పొలం దగ్గరికి వెళుతున్న గంగులప్ప భార్య, కుమార్తె ఇద్దరు ఇంటి వద్దకు పరుగున వచ్చారు. గ్రామస్తులు అక్కడికి చేరుకుని చిన్నారులను మంటలనుండి రక్షించారు. మంటల్లో ఇంట్లో ఉన్న ధాన్యం పాక్షికంగా కాలిపోయాయి. గ్రామస్తులు మంటలను అదుపు చేయకుంటే చిన్నారులు, ఇంట్లో ఉన్న ధాన్యం, దుస్తులు సర్వం కోల్పోయే వాళ్లమని బాధితులు ఆవేదన వ్యక్తం చేశారు. జరిగిన సంఘటనపై బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని ఎస్ఐ హరిహరప్రసాద్ సిబ్బందితో వెళ్లి పరిశీలించారు. సమగ్ర విచారణ చేస్తున్నట్లు ఎస్ఐ చెప్పారు. -
48 గంటల్లోనే చోరీ కేసు ఛేదన
● పక్కా స్కెచ్తో దొంగతనం ● కటకటాల్లోకి ఇద్దరు నిందితులు లక్కిరెడ్డిపల్లి: అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలంలో జరిగిన గృహచోరీ కేసును పోలీసులు 48 గంటల్లోనే ఛేదించారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, ఐపీఎస్ ఆదేశాల మేరకు పక్కా వ్యూహంతో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి నిందితులను అరెస్టు చేశారు. సోమవారం లక్కిరెడ్డిపల్లి సర్కిల్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ వివరాలను వెల్లడించారు. బాధితులు కూరగాయల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ప్రతి గురువారం లక్కిరెడ్డిపల్లి మండలం, కోనంపేట సంతకు వెళ్లి అక్కడే రాత్రి బస చేసి మరుసటిరోజు ఇంటికి రావడం వారి దినచర్య. ఈ క్రమంలో ఈనెల 16న ఉదయం 8.30 గంటలకు సంతకు వెళ్లిన దంపతులు, 17వ తేదీ ఉదయం పది గంటలకు గాలివీడులోని తమ ఇంటికి చేరుకున్నారు. ఇంటి వెనుక తలుపులు, బీరువా తాళాలు పగులకొట్టి ఉండటాన్ని గమనించి షాక్కు గురయ్యారు. బీరువాలో భద్రపరిచిన కుటుంబ సభ్యులకు (కుమారుడు, కోడలు, మనువడు, మరదలు, అల్లుడు, భార్య) చెందిన సుమారు 210 గ్రాముల బంగారు ఆభరణాలు అపహరణకు గురైనట్లు గుర్తించారు. వెంటనే గాలివీడు పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితుల ఫిర్యాదు మేరకు గాలివీడు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. రాయచోటి సబ్ డివిజన్ పోలీస్ అధికారి ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సీఐ హెచ్ కృష్ణంరాజు నాయక్ రంగంలోకి దిగారు. సాంకేతిక పరిజ్ఞానం ఆధారంగా వేగంగా దర్యాప్తు పూర్తి చేసి సోమవారం ఉదయం గాలివీడు మండలం, పేరంపల్లి గ్రామం, రెడివారిపల్లి క్రాస్ రోడ్డు వద్ద నిందితులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 210 గ్రాముల బంగారు ఆభరణాలు, బైక్ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. -
మాటపడిపోయిన అభాగ్యురాలిని ఆదుకోవాలి
ఈమె పేరు అనూరాధ. మదనపల్లి పట్టణం అమ్మచెరువు మిట్ట. 15 ఏళ్లఽ క్రితం పక్షవాతంతో నోటి మాట పడిపోయింది. కాలు చెయ్యి కూడా కదపలేదు. మంచానికే పరిమితం. సొంత ఇళ్లు కూడా లేదు. వికలాంగుల ఫించన్ ఆరువేలు వస్తోంది. ఎలాంటి ఆధారం లేదు. బాడుగ ఇంటిలో కాపురం. ముగ్గురు పిల్లలు. భర్త కూలిపనులకు వెళతాడు. మంచానికే పరిమితమైన ఈమెకు ఆర్థిక భరొసా కల్పించడంతో పాటు పక్కా ఇంటిని మంజూరు చేయడం, రూ. 15 వేల డీఎంఅండ్హెచ్ఓ పింఛన్ ఇప్పించాలని మూడు చక్రాల బండిలో తెలిసినవారి సాయంతో వచ్చి జాయింట్ కలెక్టర్ను పీజీఆర్ఎస్లో కోరారు. -
జిల్లాలో స్తంభించిన రిజిస్ట్రేషన్లు
సాక్షి, మదనపల్లె : కూటమి ప్రభుత్వ ప్రైవేటీకరణ విధానాలను నిరసిస్తూ సోమవారం జిల్లా వ్యాప్తంగా ఉన్న 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ కార్యక్రమం చేపట్టారు. ఈనెల 31 వరకు ఈ నిరసన కార్యక్రమం కొనసాగించనున్నారు. తొలిరోజు దస్తావేజు లేఖరులు వారి కార్యాలయాల పరిధిలో నిరసనలు చేపట్టి ధర్నాలు నిర్వహించారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. దస్తావేజులపై ఆధారపడి జీవిస్తున్న తమ కుటుంబాలను రోడ్డుపాలు చేయొద్దంటూ నినదించారు. చంద్రబాబు సర్కార్ ప్రజల విలువైన ఆస్తులతో ముడిపడిన రిజిస్ట్రేషన్ల వ్యవహారాన్ని ప్రైవేటు వ్యక్తుల భాగస్వామ్యంతో వారికి అప్పగించేలా జీవో నెంబర్ 396 జారీ చేసింది. ఈ జీవో వల్ల ఇప్పుడు జిల్లాలో 150 మందికి పైగా దస్తావేజు లేఖలు తమ జీవనభృతిని కోల్పోనున్నారు. ప్రభుత్వం రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు నిర్ణయించింది. తొలుత జిల్లా కేంద్రాల్లో, ఆ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా వీటిని ఏర్పాటు చేసేందుకు సిద్ధమైంది. విలువైన ప్రజల ఆస్తులకు సంబంధించిన రిజిస్ట్రేషన్ల విషయంలో తమకు భాగస్వామ్యం కల్పించకపోవడంపై ఇప్పుడు పనిచేస్తున్న దస్తావేజు లేఖరులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రైవేటు వ్యక్తుల చేతుల్లో రిజిస్ట్రేషన్ల శాఖను పెడితే, వారు వివాదాస్పదంగా వ్యవహరించి సామాన్యుల ఆస్తులకు భంగం కలిగించే అవకాశాలు ఉంటాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఇలాంటి పరిస్థితుల్లో ప్రభుత్వం నిర్ణయించిన రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలను ఏర్పాటు చేయవద్దని, ఇప్పుడున్న యధాతధ పరిస్థితిని కొనసాగించాలని దస్తావేజు లేఖరులు ప్రభుత్వానికి డిమాండ్ చేస్తున్నారు. స్తంభించిన కార్యకలాపాలు దస్తావేజు లేఖరుల పెన్డౌన్ కార్యక్రమంతో సోమవారం జిల్లాలోని సబ్ రిజిస్ట్రేషన్ కార్యాలయాలు కార్యకలాపాలు పూర్తిగా స్తంభించిపోయాయి. జిల్లా కేంద్రంలోని మదనపల్లె, బి.కొత్తకోట, తంబళ్లపల్లె, పుంగనూరు, వాయల్పాడు, పీలేరు, కలికిరి, రాయచోటి, లక్కిరెడ్డిపల్లి, సుండుపల్లి, రాజంపేట, చిట్వేలి, పుల్లంపేట కార్యాలయాల పరిధిలోని దస్తావేజు లేఖరులు పెన్ డౌన్ నిర్వహించారు. దాంతో ప్రతిరోజు జరిగే 150 నుంచి 200 రిజిస్ట్రేషన్లు పూర్తిగా ఆగిపోయాయి. క్రయవిక్రయాలు జరుపుకునే ప్రజలు కూడా కార్యాలయాల వైపునకు రాలేదు. దాంతో నిత్యం కిటకిటలాడే సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు బోసిపోయాయి. దీనివల్ల సోమవారం ఒకరోజు తమ శాఖకు రూ.కోటి ఆదాయానికి నష్టం వాటిల్లిందని జిల్లా రిజిస్ట్రేషన్ల శాఖ అధికారి ఉమామహేశ్వరి చెప్పారు. బోసిపోయిన 13 కార్యాలయాలు ఆగిపోయిన 200 రిజిస్ట్రేషన్లు, రూ.కోటి ఆదాయం నష్టం జిల్లా వ్యాప్తంగా హెల్ప్ డెస్క్లు ఏర్పాటు ప్రజలే డాక్యుమెంట్లు చేసుకోవచ్చని అధికారుల సూచనహెల్ప్ డెస్కులు ఏర్పాటు దస్తావేజు లేఖరులు సమ్మె చేస్తుండడంతో రిజిస్ట్రేషన్లు జరుపుకునే ప్రక్రియకు ఎలాంటి ఇబ్బందులు ఉండవని జిల్లా రిజిస్ట్రేషన్ శాఖ అధికారి ఉమా మహేశ్వరి చెప్పారు. ఈ మేరకు జిల్లాలోని 13 సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో సోమవారం నుంచి హెల్ప్ డెస్క్ లను ఏర్పాటు చేశారు. ఒక్కో కార్యాలయంలో ఒక్కో ఉద్యోగిని నియమించారు. వీరు రిజిస్ట్రేషన్లకు వచ్చే ప్రజలకు సహాయ సహకారాలు అందిస్తారు. దస్తావేజులు తయారు చేసుకునే తీసుకువస్తే వాటిని స్లాట్ విధానంలో ఆమోదించి రిజిస్ట్రేషన్లు చేస్తారు. ప్రజలకు ఇబ్బందులు ఉండకూడదని వీటిని ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు. -
అర్జీలకు సత్వరమే పరిష్కారం
మదనపల్లె టౌన్: మదనపల్లె లో సోమవారం నిర్వహించిన ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’లో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజల నుంచి 72 అర్జీలు స్వీకరించారు. సమస్యల వీటిని పరిశీలించి సత్వరమే పరిష్కరించాలని సీఐ, ఎస్ఐలను ఆదేశించారు.వీటిలో భూవివాదాలు (39), ఆర్థిక లావాదేవీలు(15), కుటుంబ కలహాలు(6), మోసం(5), సైబర్(1), ఇతర సమస్యలు(6) ఉన్నాయి. నడవలేని స్థితిలో వచ్చిన బాధితుల వద్దకు ఎస్పీ స్వయంగా వెళ్లి ఫిర్యాదులు స్వీకరించారు. పోక్సో కేసులో అరెస్టు సదుం: బాలికను వేధించిన యువకుడిపై పోక్సో కేసు నమోదు చేసిన ట్లు సీఐ సాయిప్రసాద్ తెలిపారు. మండల కేంద్రంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన ఓ యువకుడు ఓ బాలికను ఈనెల 15న బలవంతంగా ఇంటి నుంచి తీసుకుని వచ్చి అత్యాచార యత్నం చేయపోయాడని బాలిక పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్టు చేశారు. పాముకాటుతో మహిళా రైతు మృతి మదనపల్లె టౌన్: వ్యవసాయ పనులు చేస్తుండగా పాముకాటుకు గురై మహిళా రైతు మృతి చెందిన విషాదకర సంఘటన బి.కొత్తకోట మండలంలో సోమవారం చోటుచేసుకుంది. మృతురాలి కుటుంబ సభ్యుల కథనం ప్రకారం.. మండలం లోని మోగసాలమర్రి గ్రామానికి చెందిన రైతు శంకర్ రెడ్డి భార్య, మహిళా రైతు శివమ్మ (53) రోజూ మాదిరిగానే వ్యవసాయ బోరు వద్దకు వెళ్లింది. ఉద్యాన పంటలో పనులు చేస్తుండగా విష సర్పం కాటేసింది. అస్వస్థతకు గురైన శివమ్మను కుటుంబ సభ్యులు మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆమె మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. లారీ బోల్తా : డ్రైవర్కు గాయాలు గాలివీడు : గాలివీడు మండలం నూడివీడి గ్రామం సమీపంలో సోమవారం లారీ బోల్తా పడింది. డ్రైవర్ వేగాన్ని అదుపు చేయలేక బోల్తా పడిందని స్థానికులు చెబుతున్నారు. డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి.పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. ట్రాఫిక్కు అంతరాయం లేకుండా చర్యలు చేపట్టారు. ఎరచ్రందనం దుంగలు స్వాధీనం తిరుపతి అన్నమయ్యసర్కిల్: అన్నమయ్య జిల్లా పీలేరు రోడ్డు మార్గంలో, గుడిపాల – రాణీపేట హైవేలో రెండోచోట్ల కారులో తరలిస్తున్న 18 ఎర్రచందనం దుంగలను టాస్క్ఫోర్స్ పోలీసులు సోమవారం స్వాధీనం చేసుకున్నారు. ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసి, వారు అక్రమ రవాణాకు ఉపయోగించిన వాహనాలను సీజ్ చేశారు. ఏఆర్ఎస్ఐ కె.మహేశ్వరనాయుడు బృందం స్థానిక అటవీ సిబ్బంది జగదీష్, ఆషాబీతో కలసి అన్నమయ్య జిల్లా కేవీ పల్లి–పీలేరు మార్గంలో పొంతల చెరువు క్రాస్ వద్ద వాహనాలు తనిఖీ చేపట్టారు. సోమవారం తెల్లవారుజామున ఒక కారు వేగంగా వస్తూ టాస్క్ఫోర్స్ బృందాన్ని గమనించి కారును ఆపి అందులోని వ్యక్తులు దిగి పారిపోయే ప్రయత్నం చేశారు. వారిని వెంబడించి ఇద్దరిని పట్టుకున్నారు. మరో వ్యక్తి పారిపోయాడు. అదుపులోకి తీసుకున్న వారు తమిళనాడు తిరుపత్తూరు, తిరువన్నామలై జిల్లాలకు చెందిన వారిగా గుర్తించారు. 11 ఎర్రచందనం దుంగలు, కారును తిరుపతి టాస్క్ఫోర్స్ పోలీసు స్టేషన్కు తరలించారు. రోడ్డుప్రమాదంలో వ్యక్తి మృతి రొంపిచెర్ల: గుర్తు తెలియని వాహనం ఢీకొని ఒకరు మృతి చెందిన సంఘటన అనంతపురం– చైన్నై జాతీయ రహదారిలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు సమీపంలో సోమవారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చిన్నగొట్టిగల్లు మండలం జంగావాండ్లపల్లె గ్రామ పంచాయతీ అప్పేపల్లెకు చెందిన ఎల్లయ్య(40) జాతీయ రహదారిలోని గంగా డాబా నుంచి రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు నడిచి వెళుతుండగా ఎదురుగా గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఎల్లయ్య అక్కడిక్కడే మృతి చెందారు. ఈ విషయాన్ని స్థానికులు రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటన స్థలానికి వెళ్లి వివరాలను అడిగి తెలుసుకున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. -
ఖరీఫ్ ఖతం
సాక్షి, మదనపల్లె : ఎల్నినో జిల్లా ఖరీఫ్ వ్యవసాయాన్ని నిలువునా ముంచేసింది. జిల్లాలో ఏ ఖరీఫ్లోనూ నెలకొనని పరిస్థితులు ఇప్పుడు నెలకొన్నాయి. సాధారణంగా వర్షాభావ పరిస్థితులు, కరువు వచ్చినా ఇంతటి దారుణమైన పరిస్థితులు ఎదురు కాలేదు. ఎల్నినో తెచ్చిన ఉపద్రవంతో తీవ్ర వర్షాభావ పరిస్థితులు ఖరీఫ్ రైతాంగాన్ని వెంటాడి వేధిస్తోంది. ఈ దారుణమైన వర్షాధార పరిస్థితిల మధ్య ఖరీఫ్ సీజన్ ముగిసిపోయింది. జూలై 15 తర్వాత పంటలు సాగుచేసిన దిగుబడి ఉండదు. ఇప్పుడు వర్షం లేకపోవడం వల్ల పంటలు సాగు అసాధ్యంగా మారింది. ఇకపై వర్షాలు కురిసినప్పటికీ ఖరీఫ్ పంటలు సాగు చేయడం ఏమాత్రం సాధ్యం కాదు. ఈ పరిస్థితుల మధ్య జిల్లాలో ఖరీఫ్ సీజన్ కు ఎల్ నినో ముగింపు పలికింది. దారుణమైన సాగు గతంలో వచ్చిన కఠినమైన కరువులోనూ ఇప్పటి సాగు పరిస్థితులు లేవు. సాగు విస్తీర్ణంలో కనీసం సగమైన పంటలు విత్తడం జరిగేది. ఇప్పుడా పరిస్థితి కనుచూపుమేర లేదు. జిల్లాలో 46,055 హెక్టార్లలో వేరుశనగ సహా అన్ని రకాల పంటలు సాగు అవుతాయని, అందుకు అనుగుణంగా వ్యవసాయ శాఖ ఖరీఫ్ ప్రణాళికను అమలు చేసింది. సాధారణంగా జూన్లోనే 70 శాతానికి పైగా సాగు పూర్తయ్యేది. మిగతాది జూలై నెలలో జరిగేది. ఖరీఫ్ లో ఇప్పటిదాకా పంటల సాగు చేసింది కేవలం 2,428 హెక్టార్లలోనే. మిగిలిన 43,627 హెక్టార్ల భూమి బీడుగానే మిగిలింది. సాగు చేస్తున్న విస్తీర్ణం 5.27 శాతమే. అన్ని రకాల పంటలు వీటిలో సాగు చేశారు. వేరుశనగ అధికం జిల్లాలో సాగు అయిన 2,428 హెక్టార్లలో వేరుశెనగ 1,647 హెక్టార్లలో సాగు చేశారు. మిగిలిన 781 హెక్టార్లలో ఇతర పంటలు సాగు చేశారు. అయితే వేరుశనగ సాగు కావాల్సిన 27,016 హెక్టార్లలో 25,369 హెక్టార్లలో సాగుకు నోచుకోలేదు. జిల్లాలో సాగుచేసిన వేరుశనగ పంటలో పెద్దమండ్యం మండలం మొదటి స్థానంలో నిలిచింది. ఈ మండలంలో 919 హెక్టార్లలో వేరుశనగ సాగు కావాల్సివుండగా 375 హెక్టార్లలో సాగై జిల్లాలోని మొదటి స్థానంలో నిలిచింది. దీనికి మించిన సాగు విస్తీర్ణం ఇతర ఏ మండలంలోనూ లేదు. బి.కొత్తకోట మండలంలో 1 ,115 హెక్టార్లకు గాను 105 హెక్టార్లలో, కంభం వారిపల్లె మండలంలో 1,842 హెక్టార్లకు గాను 180 హెక్టార్లలో, పీలేరు మండలంలో 1,312 హెక్టార్లకుగాను 200 హెక్టార్లలో వేరుశనగ సాగు చేశారు. జిల్లాలో అతి తక్కువగా రామసముద్రం మండలంలో 789 హెక్టార్లకుగాను కేవలం నాలుగు హెక్టార్ల హలోనే సాగు చేశారు. గుర్రంకొండ జీరో జిల్లాలోని 25 మండలాల్లో అరకొరగా పంటలు సాగు చేసినప్పటికీ.. గుర్రంకొండ మండలంలో మాత్రం ఒక్క సెంటు భూమి కూడా సాగు చేసినట్టు నమోదు కాలేదు. ఈ మండలంలో 954 హెక్టార్లలో పంటలు సాగు కావాలి. అందులో వేరుశనగ 506 హెక్టార్లలో సాగు చేయాల్సి ఉంది. అయితే ఈ మండలంలో ఏ పంట కూడా సాగుకు నోచుకోలేదు. ఈ ఖరీఫ్లో ఒక ఎకరా కూడా సాగు కానీ మండలంగా గుర్రంకొండ రికార్డులకు ఎక్కింది. 37 రోజులుగా చుక్క వర్షం లేదు జిల్లాలో ఖరీఫ్లో ఇంతటి సుదీర్ఘమైన రోజులు వర్షాభావ పరిస్థితులు నెలకొనడం చూస్తున్నాం. జూన్ 13న జిల్లాలో వర్షపాతం నమోదైంది. తర్వాత 14వ తేది నుంచి జూలై 20 వరకు జిల్లాలోని 25 మండలాల్లో ఎక్కడా చుక్కవర్షం కురవలేదు. మేఘాలు కనిపిస్తున్నా వర్షం కురిసింది లేదు. 37 రోజులుగా వర్షం /ాడలేదంటే పరిస్థితులు ఎలా ఉన్నాయో, మున్ముందు ఎలాంటి పరిస్థితులు రాబోతున్నాయో స్పష్టంగా తెలుస్తోంది.పంట చేతికొచ్చేలా లేదు వర్షాలు నమ్ముకుని మూడు ఎకరాల్లో వేరుశనగ సాగు చేశాను. ఎకరాకు రూ.20 వేలు చొప్పున రూ.60 వేలు పెట్టుబడి పెట్టాను. పంట వేశాక వర్షాలు కురవలేదు. ఇప్పుడు పంట వాడు మొఖం పట్టింది. వర్షం కురిసే పంట చేతికి వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. పంట నష్టపోతే ప్రభుత్వం ఆదుకోవాలి. – పెద్దరెడ్డప్ప, రైతు, తంబళ్లపల్లె మండలం జిల్లాలో సాధారణ సాగు 46,055 హెక్టార్లు సాగు చేసింది 2,428 హెక్టార్లు వేరుశనగ సాగు లక్ష్యం 27,016 హెక్టార్లు, సాగైంది 1,647 హెక్టారు -
మంత్రి కాన్వాయ్కి అడ్డొచ్చిన మహిళ
మదనపల్లె టౌన్: మతిస్థిమితం లేని ఓ మహిళ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి కాన్వాయ్కి అడ్డుగా రావడంతో స్వల్ప ఉద్రిక్తత చోటుచేసుకుంది. సోమవారం మదనపల్లెలో ఈ ఘటన జరిగింది. షైనింగ్ స్టార్ అవార్డుల ప్రదానోత్సవ కార్యక్రమానికి హాజరయ్యేందుకు రాష్ట్ర రోడ్లు, భవనాల శాఖ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మదనపల్లెకు వచ్చారు. ఆయన కాన్వాయ్ పట్టణంలోని ప్రధాన రహదారిపై వెళ్తుండగా, హఠాత్తుగా ఓ మహిళ కారుకు అడ్డంగా వచ్చి నిలుచుంది. అప్రమత్తమైన ఎస్కార్ట్ పోలీసులు, భద్రతా సిబ్బంది ఆ మహిళను జాగ్రత్తగా పక్కకు జరిపారు. ఎలాంటి అవాంఛనీయ ఘటన జరగకుండా కాన్వాయ్ని ముందుకు పంపించారు. మంత్రి కారుకు ఎలాంటి ఇబ్బంది కలగలేదు. -
విద్యుదాఘాతంతో బెంగాల్వాసి మృతి
సదుం: జీవనోపాధి కోసం పనులకు వచ్చిన కూలీ విద్యుదాఘాతంతో మృతి చెందాడు. పుంగనూరు రూరల్ సీఐ సాయిప్రసాద్ కథనం మేరకు..మండలంలో గత కొద్ది రోజులుగా గ్రామాలకు త్రీఫేజ్ సరఫరా చేసేలా నూతన విద్యుత్ లైన్లను ఏర్పాటు చేస్తున్నారు. ఇందు కోసం బెంగాల్కు చెందిన కొందరు కూలీపనులకు వచ్చారు. గొంగివారిపల్లె వద్ద పనులు చేపడుతుండగా అకస్మాత్తుగా విద్యుత్ సరఫరా కావడంతో తఫీజుల్ (26) షాక్కు గురయ్యాడు. అతన్ని తిరుపతికి తరలిస్తుండగా ఆదివారం రాత్రి మార్గమధ్యంలో మృతి చెందాడు. మహిళ అదృశ్యంమదనపల్లె టౌన్: మహిళ అదృశ్యంపై తాలూకా పోలీసులు కేసు నమోదు చేశారు. సీఐ కళా వెంకటరమణ కథనం మేరకు.. మదనపల్లె మండలం చిప్పిలికి చెందిన జంగాల దేవేంద్ర భార్య జంగాల సుకన్య బజారుకు వెళుతున్నానని చెప్పి నాలుగు రోజుల క్రితం వెళ్లి తిరిగి ఇంటికి రాలేదు. కుటుంబీకులు పలుచోట్ల గాలించినా ఆమె ఆచూకీ లభించలేదు. దీంతో తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పిల్లలు పుట్టలేదని ఆత్మహత్య రొంపిచెర్ల: పిల్లలు పుట్టలేదని మహిళ ఆత్మహత్య చేసుకున్న సంఘటన రొంపిచెర్ల గ్రామ పంచాయతీలో ఆదివారం రాత్రి చోటు చేసుకుంది. ఇందిరమ్మ కాలనికి చెందిన మల్లెల ముస్కాన్(26) అజంతుల్లాకు 8 ఏళ్ల కిందట వివాహం జరిగింది. అయితే వారికి పిల్లలు పుట్టలేదు. ఈ విషయమై మానసిక వేదనతో ఆదివారం రాత్రి ఇంట్లో భర్త లేని సమయలో ఫ్యాన్కు ఉరి వేసుకుంది. కుటుంబ సభ్యులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ మధుసూధన్ సోమవారం తెలిపారు. -
పాము కాటుతో వ్యక్తికి అస్వస్థత
మదనపల్లె టౌన్: పాము కాటుతో వ్యక్తి అస్వస్థతకు గురైన సంఘటన ఆదివారం మదనపల్లి మండలంలో జరిగింది. బాధితుడి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని వలసపల్లెకు చెందిన ఖాదరబాషా (40), స్కూటర్ మెకానిక్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో ఆదివారం తన వ్యవసాయ బోరు వద్దకు వెళ్లిన అతన్ని విష సర్పం కాటేసింది. కుటుంబ సభ్యులు గమనించి అతన్ని జిల్లా ఆస్పత్రికి తరలించారు.వైద్యులు చికిత్స అందించ డంతో కోలుకుంటూ ఉన్నాడు. అలాగే వేర్వేరు ప్రాంతాలకు చెందిన మరో నలుగురిని విష సర్పాలు కాటేయడంతో స్థానిక జిల్లా ఆసుపత్రికి వచ్చి చికిత్స పొందారు. సంబేపల్లె : మండల పరిధిలోని గున్నికుంట్ల పంచాయతీ లో పేకాట స్థావరంపై ఎస్ఐ రవికుమార్ తమ సిబ్బందితో ఆదివారం దాడులు నిర్వహించారు. 10మంది జూదరులను అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ. 50,180 నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ తెలిపారు.అరెస్ట్ చేసిన వారిని కోర్టులో హాజరుపరుస్తామని చెప్పారు. గుర్రంకొండ: రెడ్డెమ్మతల్లీ చల్లంగా చూడు తల్లీ అంటూ భక్తులు అమ్మవారికి పూజలు నిర్వహించారు. మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో ఆదివారం భక్తుల రద్దీ నెలకొంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును సేవించి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు.మొక్కులు తీరిన భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు.కర్ణాటక, తమిళనాడుతో పాటు రాయలసీమ జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు అమ్మవారి ఆలయానికి తరలివచ్చారు. మదనపల్లె టౌన్: ఇంట్లో ఉన్న బంగారు ఆభరణాలను తోబుట్టువు దొంగిలించుకుని వెళ్లిందని మనస్తాపం చెందిన ఓ యువకుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యా యత్నానికి పాల్పడ్డాడు. గుర్రంకొండ మండలంలో ఆదివారం సాయంత్రం ఈ ఘటన చోటుచేసుకుంది. బాధితుడు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు వివరాలు.. మండలంలోని రామాపురం పంచాయతీ, కొత్తపల్లికి చెందిన నరసింహులు కుమారుడు సంతోష్ కుమార్ (19). తల్లిదండ్రులు చనిపోవడంతో అతనికి పినతల్లి కుమార్తె విజయలక్ష్మి చేదోడు వాదోడుగా ఉంటోంది. ఈ క్రమంలో విజయలక్ష్మి సంతోష్ కుమార్కు చెందిన బంగారు ఆభరణాలను తీసుకుని వెళ్లిపోయింది. విషయం తెలుసుకున్న సంతోష్ తన అక్క విజయలక్ష్మిని నిలదీయగా, ఆమె అతడిని దూషించిందని తెలిపాడు. దీంతో మనస్తాపానికి గురైన సంతోష్ కుమార్ పురుగులమందు తాగాడు. గమనించిన స్థానికులు వెంటనే అతన్ని 108 అంబులెన్న్స్లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. బాధితుడి ఫిర్యాదు మేరకు గుర్రంకొండ పోలీసులు కేసు నమోదు చేసి విచారణ చేపట్టారు. -
ప్రశ్నిస్తే.. జైలుకు పంపుతారా..?
● ఇంత నీచమైన పరిపాలన ఎక్కడ లేదు ● ప్రతిపక్షాలను అణచివేసేందుకు కుట్ర ● మాజీ మంత్రి పెద్దిరెడ్డి ఆగ్రహంపుంగనూరు : రాష్ట్రంలో తెలుగుదేశం ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు, అక్రమాలను ప్రశ్నిస్తే కేసులు పెట్టి జైలుకు పంపుతారా...? బెయిల్పై వస్తే మరో కేసు అంటూ మరో స్టేషన్కు తీసుకెళ్తారా... ఇంత నీచమైన పరిపాలన ఎక్కడ లేదు....తెలుగుదేశం ప్రభుత్వం ప్రతిపక్ష పార్టీని అణచివేయాలని చూస్తోంది. దీనిని జరగనివ్వం . ప్రభుత్వ అరాచకాలకు ముగింపు వస్తుందని రాష్ట్ర మాజీ మంత్రి, పార్టీ రీజనల్ కోఆర్డినేటర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి మండిపడ్డారు. ఆదివారం సాయంత్రం అన్నమయ్య జిల్లా పుంగనూరులో జగన్ 2.0 యాప్ను విడుదల చేశారు. ఈ సందర్భంగా విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం చేసే అక్రమాలను ప్రశ్నించే వారిని చూసి సరిదిద్దుకోవడం పద్ధతి అన్నారు. కానీ ప్రభుత్వం ఇందుకు భిన్నంగా ప్రశ్ని స్తే కేసు పెడతాం.....నిలదీస్తే జైలుకు పంపుతాం....అన్న రీతిలో బెదిరింపులకు పాల్పడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. వైఎస్సార్ సీపీకి చెందిన ఇన్స్ట్రాగామ్, ఫేస్బుక్లను ప్రభుత్వం ఫ్రీజ్ చేసిందని, దీనిపై పార్టీ పోరాటం చేసి, తిరిగి ప్రారంభించడం జరిగిందన్నారు. టీడీపీ 2024లో అధికారంలోకి రాగానే ప్రతిపక్షాలను అణచివేసే కార్యక్రమాలను చంద్రబాబు నాయుడు యథేచ్చగా నిర్వహిస్తున్నారని ఆరోపించారు. ఈసమావేశంలో మాజీ ఎంపీ రెడ్డెప్ప, పార్టీ రాష్ట్ర కార్యదర్శులు నాగభూషణం, ఆవుల అమరేంద్ర, ఎంపిపి భాస్కర్రెడ్డి పాల్గొన్నారు. కార్యకర్తలను వేధిస్తే.. వైఎస్సార్సీపీ కార్యకర్తలను, నాయకులను, సామాన్య ప్రజలను టీడీపీ నాయకులు, కార్యకర్తలు వేధిస్తున్నారని, వాటిని జగన్ 2.0 యాప్లో సంక్షిప్తం చేయాలన్నారు. అలాగే పార్టీ కార్యకర్తలను వేధిస్తున్న పోలీసుల ఆగడాలను కూడా యాప్లో నమోదు చేయాలన్నారు. అలాగే పిన్నెల్లి రామకృష్ణారెడ్డి, ఆయన కుటుంబంపైన తప్పుడు హత్యాప్రయత్నం కేసులు నమోదు చేయడం, విజయవాడలో ఒక యువకుడిని చంపివేయడం లాంటి కేసులలో ప్రధాన కారకులైన పోలీసులను వదిలిపెట్టే ప్రసక్తే లేదన్నారు. మహిళలను వేధించే వారిని వదిలిపెట్టం తెలుగుదేశం ప్రభుత్వంలో మహిళలు పలు రకాల వేధింపులకు గురౌతున్నారని, అలాంటి వారికి వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని వైఎస్.జగన్మోహన్రెడ్డి తెలిపారని మాజీ మంత్రి పెద్దిరెడ్డి తెలిపారు. ఇలాంటి అసాంఘిక కార్యక్రమాలకు పాల్పడే వారిని వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన స్పష్టం చేశారు. -
ఆర్టీసీ బస్సును ఢీకొన్న లారీ
● ఐదుగురికి గాయాలు ముద్దనూరు: ముద్దనూరు–తాడిపత్రి జాతీయ రహదారిలో మండలంలోని చెన్నారెడ్డిపల్లె గ్రామ సమీపంలో ముందు వైపు వెళ్తున్న ఆర్టీసీ బస్సును వెనుక నుంచి వచ్చిన లారీ ఢీకొంది.ఈ ఘటనలో నలుగురికి స్వల్పగాయాలు కాగా మరొకరిని 108 వాహనంలో జమ్మలమడుగు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు.పోలీసుల సమాచారం మేరకు అనంతపురం జిల్లా రాయదుర్గంనుంచి కడపకు ప్రయాణిస్తున్న ఆర్టీసీ బస్సు చెన్నారెడ్డిపల్లె వద్దకు సమీపించగానే ముందువైపు గొర్రెలు రావడంతో బస్సును స్లో చేసాడు.ఇంతలో బస్సుకు వెనుకవైపు వస్తున్న లారీ బస్సును ఢీకొంది.దీంతో బస్సు వెనుకవైపు పాక్షికంగా దెబ్బతింది.బస్సులో సుమారు 67 మంది ప్రయాణికులున్నారు.ఈ ప్రమాదంలో నలుగురికి స్వల్పగాయాలవడంతో వారు స్థానిక ప్రాథమిక ఆరోగ్యకేంద్రంలో చికిత్సచేయించుకుని వెళ్లిపోయారు.కమలాపురానికి చెందిన వెంకట సుబ్బరాయుడును 108 వాహనంలో జమ్మలమడుగుకు తరలించారు.లారీ డ్రైవరుపై కేసు నమోదుచేసినట్లు పోలీసులు తెలిపారు. లారీ తాడిపత్రి నుంచి ఎర్రగుంట్లకు ప్రయాణిస్తున్నట్లు,లారీ డ్రైవరు పూర్తిగా మద్యం మత్తులో ఉన్నట్లు సమాచారం. బైక్ బోల్తా: దంపతులకు .. నిమ్మనపల్లె (మదనపల్లె టౌన్): బంధువుల ఇంటికి వెళ్లి తిరిగి వస్తుండగా అదుపుతప్పి ద్విచక్ర వాహనం బోల్తా పడిన ఘటనలో దంపతులకు తీవ్ర గాయాలయ్యాయి. నిమ్మనపల్లె మండలం, తవళం పంచాయతీ నల్లంవారిపల్లికి చెందిన రైతు సురేంద్ర వ్యవసాయం చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. ఆయనకు భార్య రెడ్డెమ్మ, కుమార్తె లావణ్య (9వ తరగతి), కుమారుడు వైష్ణవ్ (6వ తరగతి) ఉన్నారు. శనివారం సురేంద్ర తన భార్య రెడ్డెమ్మతో కలిసి వాయల్పాడు మండలం జరావారిపల్లిలోని బంధువుల ఇంటికి పని నిమిత్తం బైక్లో వెళ్లాడు. తిరిగి వస్తుండగా నిమ్మనపల్లె మండలం, కొండయ్యగారిపల్లి సమీపంలో బైక్ అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో సురేంద్ర తలకు, శరీర భాగాలకు తీవ్ర రక్త గాయాలయ్యాయి. రెడ్డెమ్మకు స్వల్ప గాయాలు అయ్యాయి. వెంటనే స్థానికులు ఇద్దరినీ నిమ్మనపల్లె ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. అక్కడ ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం సురేంద్రను మదనపల్లె జిల్లా ప్రభుత్వ వైద్యశాలకు తీసుకెళ్లారు. ప్రస్తుతం ఆయన పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డుదాటుతుండగా.. మదనపల్లె,: రోడ్డు దాటుతున్న తండ్రీకొడుకులను బైక్ ఢీకొన్న ఘటనలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. గుర్రంకొండ మండలం రామాపురానికి చెందిన శ్రీనివాసులు (70), ఆయన కుమారుడు వెంకటరమణ ఆదివారం బోరు పాయింట్ పెట్టడానికి నక్కలదిన్నె వద్దకు వచ్చారు.అక్కడ రోడ్డు దాటుతుండగా సాయికుమార్, అజయ్, నవీన్ అనే ముగ్గురు విద్యార్థులు ప్రయాణిస్తున్న ద్విచక్రవాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో తండ్రీకొడుకులు శ్రీనివాసులు, వెంకటరమణతో పాటు బైక్పై ఉన్న సాయికుమార్, అజయ్, నవీన్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు ఐదుగురిని 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం క్షతగాత్రులకు అత్యవసర విభాగంలో చికిత్స అందిస్తున్నారు. వీరిలో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని ఆటో యజమానికి.. మదనపల్లె టౌన్: ఆర్టీసీ బస్సు ఆటోను ఢీకొన్న ఘటనలో ఆటో యజమాని తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితుని కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. బి.కొత్తకోట మండలం, ఉలవలవారిపల్లెకు చెందిన ఆటో యజమాని విశ్వనాథ్ (48) కొత్తకోట నుంచి ప్రయాణికులను మండలంలోని గట్టుకు చేర్చాడు.తిరగి కొత్తకోటకు ఆటోలో వస్తుండగా, మొగసాల మర్రి సమీపంలో ఆర్టీసీ బస్సు ఆటోను బలంగా ఢీకొంది. ఈ ప్రమాదంలో విశ్వనాథ్కు కాలు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు స్పందించి 108 అంబులెన్స్లో మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆయనకు అక్కడ చికిత్స అందిస్తున్నారు. ఘటనపై బి.కొత్తకోట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆర్టీసీ బస్సు డ్రైవర్ నిర్లక్ష్యమే ప్రమాదానికి కారణమని బాధిత కుటుంబీకులు ఆరోపిస్తుండగా ఆటో డ్రైవర్ పూటుగామద్యం తాగి బస్సును ఢీకొట్టాడని పోలీసులు తెలిపారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: విషం తాగి వివాహిత ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం రాత్రి మదనపల్లె మండలంలో చోటు చేసుకుంది. బాధితురాలి కుటుంబీకుల కథనం మేరకు.. మండలంలోని కొత్తపల్లి పంచాయతీ, సంధి రెడ్డి పల్లెకు చెందిన భవన కార్మికుడు నాగార్జున భార్య శ్రావణి (30), భర్తతో గొడవపడి పంచాయతీని తాలూకా పోలీస్ స్టేషన్ వరకు తీసుకెళ్లింది. సీఐ కళా వెంకటరమణ భార్యా భర్తలకు కౌన్సెలింగ్ ఇచ్చి తిరిగి ఇంటికి పంపించాడు. ఇంతలో ఏం జరిగిందో ఏమో మనస్తాపానికి గురైన శ్రావణి ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. స్థానికులు గమనించి బాఽధిరాలిని స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించడంతో, డాక్టర్లు వైద్యం అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
వాల్మీకులను ఎస్టీ జాబితాలో చేర్చాలి
పుంగనూరు: వాల్మీకులను ఎస్టీల జాబితాలో చేర్చాలని రాష్ట్ర అధ్యక్షుడు పులిశ్రీనివాసులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక వాల్మీకి సర్కిల్లో ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వాల్మీకులతో సమావేశం నిర్వహించారు. అనంతరం పులిశ్రీనివాసులు మాట్లాడుతూ భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో వాల్మీకులను ఎస్సీ, ఎస్టీలుగా గుర్తించి , రిజర్వేషన్లు కల్పించారని తెలిపారు. మన రాష్ట్రంలో శ్రీకాకుళం, విజయనగరం, విశాఖపట్నం , తూర్పుగోదావరి, పశ్చిమగోదావరి జిల్లాల్లో వాల్మీకులు ఎస్టీలుగా కొనసాగుతున్నారని తెలిపారు. 8 జిల్లాల్లో మాత్రమే బీసీలుగా ఉన్నారని తెలిపారు. ప్రాంతీయ వ్యత్యాసాలు లేకుండా రాష్ట్రం మొత్తం ఎస్టీలుగా ఉండేలా తెలుగుదేశం ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేయాలని డిమాండ్ చేశారు. ఎన్నికల హామిలో కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీ మేరకు ఎస్టీలుగా గుర్తించాలని లేకపోతే వాల్మీకుల ఆగ్రహానికి కూటమి ప్రభుత్వం బలికాక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వాల్మీకి సంఘ నాయకులు శేఖర్, రామకృష్ణ, జయసింహ, ఉడుంశేఖర్, దొరస్వామి, వెంకట్రమణ, శంకర, రెడ్డెప్ప, గంగాధర్, నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘కొండ’ంత భక్తి
ప్రత్యేక అలంకరణలో అమ్మవారు చౌడేపల్లె: కోరిన కోర్కెలు తీర్చే బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాలనుంచి భక్తులు తరలివచ్చారు. ఉదయం 7 నుంచి సాయంత్రం 4 గంటల వరకు రద్దీ కొనసాగింది. ఆదివారం రోజు మాత్రమే సుమారు 50 వేల మందికి పైగా అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఆషాడమాసం అత్యంత శుభకరమైన నెలగా భావించి వేల సంఖ్యలో కర్ణాటక భక్తులు ఆలయానికి తరలిరావడం గమనార్హం. ఈ సఽంధర్భంగా అమ్మవారిని అర్చకులు సుందరంగా అలంకరణ చేసి దర్శన భాగ్యం కల్పించారు. కోర్కెలు ఫలించిన వారు మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనం కోసంగంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన గర్భాలయంనుంచి ఆలయం బయట గల గాలిగోపురం వరకు క్యూలైన్లు బారులు తీరాయి. దీనికారణంగా వయసు పైబడినవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. మొరాయించిన సర్వర్లు టికెట్లు జారీచేసే కౌంటర్ల వద్ద సర్వర్లు మొరాయించడంతో భక్తులకు ఇబ్బందులు తప్పలేదు. చివరికి మ్యాన్యువల్ టికెట్లు జారీచేసి భక్తులను దర్శనానికి పంపారు. రద్దీ రోజుల్లో టెక్నికల్ సమస్యలు లేకుండా ముందస్తు చర్యలు అధికారులు తీసుకోకపోవంపై పలు ఆరోపణలకు దారితీసింది. స్తంభించిన ట్రాఫిక్..... వేలాది వాహనాలు బోయకొండకు తరలిరావడంతో ట్రాఫిక్ సమస్య నెలకొంది. ఎక్కడి వాహనాలు అక్కడే ముందస్తుగా సీఐ సాయిప్రసాద్ ఆదేశాలమేరకు ఎస్ఐ చిన్నరెడ్డప్ప , సిబ్బంది పర్యవేక్షణ చేసినా తిప్పలు తప్పలేదు. బోయకొండ దేవస్థానం వద్ద ఆదివారం ఒక్కరోజు మాత్రమే విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ:18.87 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఒక్కరోజే 50 వేలమంది దర్శనం క్యూలైన్లలో గంటల తరబడి నిరీక్షణ -
అరణ్య రోదన!
అట్లూరు ప్రజల వేదన..అట్లూరు మండలం తూడూరు గ్రామానికి చెందిన పల్లె లక్ష్మమ్మకు రాత్రి 10గంటల సమయంలో గుండెల్లో తీవ్రమైన నొప్పి వచ్చింది. వెంటనే కుటుంబ సభ్యులు ఆమెను ఓ వాహనంలో ఎక్కించుకుని కడప ఆస్పత్రికి బయలుదేరారు. అట్లూరు– సిద్దవటం మార్గంలోని చెక్పోస్టు వద్దకు రాగానే చెక్పోస్టు సిబ్బంది అడ్డుకున్నారు. ఉన్నతాధికారుల అనుమతి లేనిదే ఈ టైంలో వెళ్లడానికి వీల్లేదన్నారు. అత్యవసర పరిస్థితి అని వేడుకున్నా పంపించే ప్రసక్తే లేదన్నారు. చేసేదిలేక ఉన్నతాధికారులను ఆశ్రయించారు. అనుమతి తీసుకోవడానికి సుమారు గంట పట్టింది.. ఆపై ఆస్పత్రికి చేరే లోపు లక్ష్మమ్మ ఊపిరాగింది. ఫారెస్టు చెక్పోస్టు వద్ద వృధా అయినా ఆ గంట సమయం ఆమె ప్రాణాలు మీదకు తెచ్చింది. లక్ష్మమ్మ కుటుంబానికి ఇప్పటికీ చెక్పోస్టు బాధ వెంటాడుతోంది. ఆ దారి వేదన.. ఇప్పటికీ అరణ్యరోదనే అయింది.సాక్షి ప్రతినిధి కడప : సిద్దవటం–అట్లూరు మార్గంలోని ఫారెస్ట్ చెక్పోస్టు సమస్య దశాబ్దాల కాలంగా వేధిస్తోంది. అట్లూరు, బద్వేల్ పరిసర ప్రాంతాల ప్రజల ప్రాణాలమీదకు తెస్తోంది.అర్ధరాత్రి అపరాత్రి ఆకస్మిక ప్రమాదాలు ముంచుకొస్తే ఆ మార్గంలో అనేక వ్యయ ప్రయాసాలకు గురి కావాల్సి వస్తోంది. 2013 నుంచి ఇప్పటివరకూ అనేక కుటుంబాలు ఆవేదన భరిస్తూనే ఉన్నారు. ● సిద్దవటం–అట్లూరు మధ్యలో 9కిలోమీటర్లు వన్యప్రాణులు సంచరిస్తున్న ప్రాంతంగా ఫారెస్టు యంత్రాంగం గుర్తించింది. అభయారణ్యంలో రాత్రి సమయాల్లో వన్య ప్రాణాలు సంచరిస్తూ రోడ్డు ప్రమాదాల బారిన పడి చనిపోతున్నాయని, ఈ పరిస్థితి నిరోధించాలనే ఉద్దేశంతో గెజిట్ నెంబర్ 05/2013 అమలు చేశారు. 2013 ఫిబ్రవరి 14 నుంచి అమల్లోకి వచ్చిన ఈ నిర్ణయంతో రాత్రి 9 దాటితే సిద్దవటం–అట్లూరు మార్గంలో రహదారి బంద్ చేస్తారు. వన్యప్రాణులను సంరక్షించాల్సిన బాధ్యత అందరిపై ఉంటోంది. కాకపోతే ప్రత్యామ్నాయ మార్గాలపై దృష్టి సారించకుండా ఏళ్ల తరబడి అదే పరిస్థితి కొనసాగడం విచారకరం. వివిధ పనుల నిమిత్తం జిల్లా కేంద్రమైన కడపకు వచ్చే అట్లూరు మండల ప్రజలు పని జరిగినా.. జరగకున్నా రాత్రి 9 కంటే ముందే ఆ చెక్పోస్టు దాటేలా చూసుకోవాలి. తీరిగ్గా పనులు ముగించుకొని బయలుదేరదామనుకుంటే కడప, ఖాజీపేట, బద్వేల్ మీదుగా చుట్టూ తిరిగి అట్లూరు చేరుకోవాల్సి వస్తోంది. ఎన్హెచ్–565లో అండర్పాస్ బ్రిడ్జిలు.. నెల్లూరు–వైఎస్సార్ జిల్లాలోని వెలుగొండను కలుపుతూ పెనుశిల లక్ష్మీనరసింహా స్వామి అభయారణ్యంగా గుర్తించారు. ఈమార్గంలో నేషనల్ హైవే–565గా గుర్తించారు. 8.5కిలోమీటర్లు అభయారణ్యం ప్రాంతం విస్తరించి ఉంది. నేషనల్హైవే రహదారికి ఏమాత్రం ఆటంకం లేకుండా, వన్యప్రాణుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు చేపట్టారు. 8.5 కిలోమీట ర్లు పొడవునా రోడ్డుకు ఇరువైపులా ఫెన్సింగ్ ఏర్పాటు చేయడం, మరో 5చోట్ల 10 అడుగుల వెడల్పు, 6 అడుగులు ఎత్తుతో అండర్పాస్ బ్రిడ్జిలు ఏర్పాటు చేశారు. వన్యప్రాణులు స్వేచ్ఛగా తిరిగేందుకు అన్నీ చర్యలు చేపట్టారు. అలాంటి ఆలోచనే సిద్దవటం–అట్లూరు మార్గంలో అమలు చేయాలని ప్రజలు కోరుతున్నారు. చీకట్లు పడితే సిద్దవటం–అట్లూరు మార్గంలో ప్రయాణాలు నిషిద్ధం రాత్రి వేళ మెడికల్ ఎమర్జెన్సీవస్తే చావే శరణ్యమా! నిబంధనల పేరిట ప్రజల ఆవేదనను పట్టించుకోని ఫారెస్ట్ అధికారులు -
అండర్–19 క్రికెట్ పోటీలు ప్రారంభం
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ సౌత్జోన్ అండర్–19 మెన్ మల్టీ డే నాలుగో విడత అంతర్ జిల్లాల మ్యాచ్లు ప్రారంభమయ్యాయి. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో చిత్తూరు–అనంతపురం జట్టు తలపడ్డాయి. తొలి రోజు టాస్ గెలిచిన చిత్తూరు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 90 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 355 పరుగులు చేసింది. జట్టులోని కృష్ణ ప్రసాద్ 111, ఎంహెచ్వి రెడ్డి 42 పరుగులు చేశారు. అనంతపురం జట్టులోని కిరణ్కుమార్ 4, సంజయ్కుమార్ 2 వికెట్లు తీశారు. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో..... అదే విధంగా కెఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరిగిన మ్యాచ్లో కడప–కర్నూలు జట్లు తలపడ్డాయి. టాస్ గెలిచిన కర్నూలు జట్టు బ్యాటింగ్ ఎంచుకుంది. 54.3 ఓవర్లలో 218 పరుగులకు ఆలౌట్ అయింది. జట్టులోని రోహిత్ గౌడ్ 55, విఖ్యాత్ 52 పరుగులు చేశారు. కడప జట్టులోని శివశంకర్ 4, వికెట్లు, నాగకుళ్ళాయప్ప 5 వికెట్లు తీశారు. అనంతరం తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 5 ఓవర్లకు తొలి వికెట్ కోల్పోయి 21 పరుగులు చేసింది. దీంతో తొలి రోజు ఆట ముగిసింది. -
గంజాయి రవాణా చేస్తున్న ముగ్గురు అరెస్టు
ఎర్రగుంట్ల : గంజాయిని రవాణా చేస్తున్న ముగ్గురు వ్యక్తులను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 150 గ్రాములు గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు ఎర్రగుంట్ల సీఐ విశ్వనాథరెడ్డి తెలిపారు. అదివారం ఇక్కడ ఆయన విలేకరులో మాట్లాడుతూ జిల్లా షెల్కే ఎస్పీ నచికేత్ విశ్వనాఽథ్ జమ్మలమడుగు డీఎస్పీ వెంకటేశ్వరరావు ఆదేశాల మేరకు ఎర్రగుంట్ల లోని వై జంక్షన్లో వాహనాలు తనిఖీ చేస్తుండుగా అక్రమంగా గంజాయి రవాణా చేస్తున్న ముగ్గరిని అరెస్టు చేశామన్నారు. అరెస్టు అయిన వారిలో ప్రొద్దుటూరుకు చెందిన ఎస్ జహీర్, గుంతకల్ పట్టణానికి చెందిన షేక్ మహ్మద్ తాహీర్, షేక్ ఆసిఫ్లు ఉన్నారన్నారు. వీరు గుంతకల్లులోని షికారి కాలనీ చెందిన కమల, మఽధుమతి, జీవా అనే వారి వద్ద నుంచి గంజాయి కొనుగోలు చేస్తున్నట్లు తెలిసిందన్నారు. వీరి వద్ద నుంచి 150 గ్రాముల గంజాయి, మూడు మొబైల్ ఫోన్లు, రూ.1900 నగదు స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు. గంజాయి సరఫరా చేసే నిందితులు ప్రస్తుతం పరారీలో ఉన్నారని, వారి కోసం గాలిస్తున్నామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఎస్ఐ రామాంజనేయులుతో పాటు సిబ్బంది పాల్గొన్నారు. చింతకొమ్మదిన్నె మండలంలో.. చింతకొమ్మదిన్నె: మండల పరిధిలోని రోడ్డు క్రిష్ణాపురంలోగల కేఎస్ఆర్.ఎం ఇంజినీరింగ్ కళాశాల బస్టాప్ వద్ద నిషేదిత గంజాయి విక్రయిస్తున్న అయిదుగురిని పోలీసులు అరెస్ట్ చేశారు.చింతకొమ్మదిన్నె సీఐ బాల మద్దిలేటి తెలిపిన వివరాల మేరకు కేఎస్ఆర్ఎం ఇంజినీరింగ్ కళాశాల బస్టాప్ వద్ద గంజాయి అమ్ముతున్నట్లు వచ్చిన సమాచారం మేరకు ఎస్ఐ శ్రీనివాసుల రెడ్డి సిబ్బందితో వెళ్లి ఐదుగురిని అదుపులోకి తీసుకున్నారు. వారిని విచారించగా రాజస్థాన్కు చెందిన, ప్రస్తుతం బద్వేలులో నివాసం ఉంటున్న పరమార్ గణపత్ సింగ్, పార్వతిపురం, విశాఖ ఏజెన్సీ ప్రాంతాలకు వెళ్లి గంజాయి తీసుకొచ్చి అతని స్నేహితులైన బద్వేలులోని రూపురాంపేటకు చెందిన చిన్నం శ్రీను, బద్వేలు కుమ్మరకొట్టాలుకు చెందిన షేక్ మస్తాన్ వల్లి, బద్వేలు మండలం బయనపల్లికి చెందిన మామిళ్ళ కార్తిక్, చెన్నూరు మండలానికి చెందిన మేసే దినేష్ల ద్వారా రోడ్డు క్రిష్ణాపురం, కొప్పర్తి గ్రామం ఇండస్ట్రియల్ ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్నట్లు విచారణలో తేలింది. ఐదుగురిని అరెస్ట్ చేసి వారి వద్ద నుంచి 1.396 కేజీల గంజాయి స్వాధీనం చేసుకున్నట్లు సీఐ తెలిపారు.నిందితులను కోర్టులో హాజరుపరచగా 14 రోజులు రిమాండ్ విధించడంతో కడప సెంట్రల్ జైలుకు తరలించారు. -
బాధితులకు వరం.. ఏఆర్టీ కేంద్రం
మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రి ప్రాంగణంలో నడుస్తున్న ఏఆర్టీ (యాంటీ రెట్రోవైరల్ థెరపీ) కేంద్రం హెచ్ఐవీ/ఎయిడ్స్ బాధితులకు సంజీవనిలా మారుతోంది. నేషనల్ ఎయిడ్స్ కంట్రోల్ ఆర్గనైజేషన్,డిపార్ట్మెంట్ ఆఫ్ ఎయిడ్స్ కంట్రోల్ జిల్లా పర్యవేక్షణలో పనిచేస్తున్న ఈ కేంద్రంలో బాధితులకు సమీకృత సలహాలు, చికిత్సలు ఉచితంగా అందుతున్నాయని వైద్యాధికారి హుమాయూన్ తెలిపారు. అందుబాటులో ఉన్న ఉచిత వైద్య సేవలు ఐసీటీసీ నిఘా : అనుమానితులకు అత్యంత గోప్యంగా రక్త పరీక్షలు నిర్వహించి, మానసిక ధైర్యాన్ని ఇచ్చేలా కౌన్సెలింగ్ అందిస్తారు. జీవితాంతం ఉచిత మందులు : ఇక్కడ హెచ్ఐవీ పాజిటివ్గా నిర్ధారణ అయిన వారికి జీవితాంతం అవసరమయ్యే యాంటీ రెట్రోవైరల్ మందులను ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. అధునాతన ల్యాబ్ పరీక్షలు : రోగులలో వ్యాధి నిరోధక శక్తిని, వైరస్ తీవ్రతను క్రమం తప్పకుండా పర్యవేక్షించేందుకు ల్యాబ్ టెక్నీషియన్ల ద్వారా సీడీ4, వైరల్ లోడ్ పరీక్షలు నిర్వహిస్తున్నారు. సురక్ష క్లినిక్ : ఆసుపత్రి ఆవరణలోనే సురక్ష క్లినిక్ ద్వారా లైంగికంగా సంక్రమించే సుఖ వ్యాధులకు కూడా ఉచిత పరీక్షలు, వైద్యం అందిస్తున్నారు. అవగాహనతోనే సుదీర్ఘ జీవనం : హెచ్ఐవీ అనేది అంటువ్యాధి కాదని.. బాధితులను తాకడం వల్ల, కలిసి భోజనం చేయడం వల్ల లేదా ఒకే బాత్రూమ్ ఉపయోగించడం వల్ల ఇది ఒకరి నుండి ఒకరికి వ్యాపించదని ప్రజలు గ్రహించాలని కేంద్రం సిబ్బంది పుల్లయ్య నాయుడు, సుబ్బారెడ్డి పేర్కొన్నారు. సకాలంలో వ్యాధి ని గుర్తించి, క్రమం తప్పకుండా ఏఆర్టీ మందులు వాడితే బాధితులు సాధారణ వ్యక్తుల లాగే సుదీర్ఘ కాలం జీవించవచ్చని స్పష్టం చేశారు. లైంగిక సుఖ వ్యాధులు లేదా హెచ్ఐవీపై ఏమాత్రం అనుమానం ఉన్నవారైనా ఎలాంటి భయం లేకుండా ఏఆర్టీ కేంద్రాన్ని సంప్రదించవచ్చని వైద్యాధికారులు తెలిపారు.ఉచితంగా ‘న్యాకో’ సేవలు, సురక్ష క్లినిక్ చికిత్సలు -
గొంతు కోసి యువకునిపై హత్యాయత్నం
మదనపల్లె టౌన్: మదనపల్లె పుంగనూరు రోడ్డు, బసినికొండ బైపాస్ రోడ్డు వద్ద ఆదివారం రాత్రి జరిగిన ఘర్షణలో ఓ యువకుడిపై ప్రత్యర్తులు కత్తితో గొంతుకోసి హత్యాయత్నాకి పాల్పడ్డారు. ఈ ఘటన కలకలం రేపింది.. తాలూకా పోలీసుల కథనం మేరకు ..పట్టణంలోని నక్కలదిన్నెకు చెందిన భాస్కర్ (35) భార్య బసినికొండలోని పుట్టినింటికి ఇటీవల వెళ్లిపోయిందన్నారు.భాస్కర్ బసినికొండకు వచ్చి, భార్యను కాపురానికి రావాలని గొడవ పడిన సంఘటనలు ఉన్నాయన్నారు. కాగా ఆదివారం రాత్రి నక్కలదిన్నెలో ఉన్న భాస్కర్కు బసినికొండలో ఉంటున్న రఫి, చిన్నా ఫోన్ చేసి మాట్లాడే పని ఉందని బైపాస్ రోడ్డుకు సమీపానికి రప్పించారు. అక్కడ భాస్కర్తో రఫి, చిన్నా మధ్య జరిగిన ఘర్షణ తారస్థాయికి చేరడంతో ఒకరిపై మరొకరు పరస్పర దాడులకు దిగి కొట్టుకున్నారు. ఈ క్రమంలో నిందితులు ముందుగానే వెంట తెచ్చుకున్న మచ్చు కత్తితో భాస్కర్ గొంతు కోసి అక్కడి నుంచి పారిపోయారని స్థానికులు ఆరోపించినట్లు పోలీసులు తెలిపారు. తీవ్ర రక్తస్రావం కావడంతో భాస్కర్ అపస్మారక స్థితికి చేరుకున్నాడు. స్థానికులు అతన్ని స్థానిక జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం అతని పరిస్థితి విషమంగా ఉందని వైద్యులు రుయారు రెఫర్ చేశారు. సమాచారం అందుకున్న తాలూకా పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పాత కక్షలే ఈ దాడికి కారణమా అన్న కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.హత్యా యత్నానికి పాల్పడిన యువకుల కోసం గాలిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
నిబద్ధతతో నిలిచే కార్యకర్తలే పార్టీకి బలం
రాయచోటి అర్బన్ : రాజకీయాల్లో కండువాలు మార్చుకోవడం , స్వార్థపరులు, జంప్ జిలానీలు పార్టీలు మారడం గొప్ప విషయం కాదని, అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం ఎంత అభివృద్ధి ,సంక్షేమం చేశామన్నదే రాజకీయాలకు అసలైన కొలమానమని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి పేర్కొన్నారు. ఆదివారం ఆయన పత్రికలకు విడుదల చేసిన ప్రకటనలో పలు అంశాలను వివరించారు. స్వార్థ ప్రయోజనాల కోసం పార్టీని వీడే వారితో వైఎస్సార్సీపీకి ఎలాంటి నష్టం ఉండదని , పార్టీని నమ్మి కష్టకాలంలో అండగా నిలిచిన వారే రేపటి నాయకులని అన్నారు. పార్టీ ఎంతో మందికి రాజకీయ జీవితాన్ని ఇచ్చిందని , అనేక కీలక పదవులు, సముచిత గౌరవాలు కల్పించిందని ఆయన గుర్తుచేశారు. గ్రామాలు , వార్డుల్లో యువతలో ప్రజా సేవ పట్ల ఆసక్తి ఉన్న వారిని , నిబద్ధతతో ప్రజజల కోసం పనిచేసే నాయకత్వాన్ని తయారు చేసి స్వార్థ రాజకీయాలు చేసే వారికి ప్రజలే గుణపాఠం చెబుతారని అన్నారు. గత స్థానిక ఎన్నికల్లో వైఎస్సార్సీపీ తరపున గెలిచిన వారికి కండువాలు కప్పి పార్టీలో చేర్చుకుంటున్నారంటే టీడీపీకి స్థానిక ఎన్నికల్లో వారే దిక్కు అయినట్లు కనిపిస్తోందని పేర్కొన్నారు. ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం బీసీల సాధికారత కోసం చరిత్రాత్మకంగా 57 బీసీ కార్పొరేషన్లను ఏర్పాటు చేసి డైరెక్టర్లు , వేలాది మందికి అవకాశాలు కల్పించిందని గుర్తుచేశారు. ఎన్నో సంవత్సరాలు ముఖ్యమంత్రిగా పని చేసిన చంద్రబాబు నాయుడుకు బీసీల కోసం 57 కార్పొరేషన్లు ఏర్పాటు చేయాలనే ఆలోచన కూడా రాలేదని విమర్శించారు. జగన్ హయాంలో వచ్చిన జీవోతోనే ఇప్పుడు కూడా బీసీ కార్పొరేషన్ల పదవులను భర్తీ చేశారన్నారు. రాయచోటి ప్రాంతంలో కూడా బడుగు, బలహీన వర్గాలకు జెడ్పీటీసీలు, ఎంపీపీలు, ఎంపీటీసీలు, సర్పంచ్లు, మున్సిపల్ చైర్మన్ కానీ, మార్కెట్ కమిటీ చైర్మన్లు రాష్ట్ర కార్పొరేషన్ల డైరెక్టర్లు వంటి అనేక పదవులు కల్పించామని తెలిపారు. వడ్డెర్లకు రాష్ట్ర స్థాయిలో రెండు డైరెక్టర్లు, పాల ఏకరి, మత్స్యకార , కురబ సామాజిక వర్గాలకు , మైనార్టీ సామాజిక వర్గాలకు కూడా రాష్ట్ర స్థాయి అవకాశాలు ఇచ్చామని గుర్తు చేశారు. మాట ఇచ్చినట్లుగానే మైనార్టీలకు ఎమ్మెల్సీతో పాటు డిప్యూటీ చైర్మన్ పదవిని కూడా వైఎస్సార్సీపీ కల్పించిందని పేర్కొన్నారు. ఓ దళిత మహిళకు శ్రీశైలం బోర్డు మెంబర్గా ఇచ్చిన ఘనత గత జగన్ ప్రభుత్వానిదే అని అన్నారు. ఈ విధంగా మీరు చేయగలుగుతారా అని ఆయన ప్రశ్నించారు. ● గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు తమ ఇళ్లపై దాడులు చేశారని , ఇళ్లలోపలికి వచ్చి మహిళలను సైతం అవమానించారని, ఆస్తులను ధ్వంసం చేశారని, వ్యక్తిగతంగా హించించారని చెప్పిన వారే ఈ రోజు అదే పార్టీలో చేరడం ప్రజలు గమనిస్తూ ఉన్నారని శ్రీకాంత్ రెడ్డి అన్నారు. ఏ రాజకీయ పార్టీ అయినా అధికారంలో ఉన్నప్పుడు ప్రజల కోసం చేసిన అభివృద్ధి , సంక్షేమం గురించి చెప్పుకోవాలే కానీ, కండువాలు మార్చాం...మాకు బలం పెరిగిందని చెప్పుకునేవారి విజ్ఞతకే వదిలేస్తున్నామన్నారు. ఎంత మందిని పార్టీలో చేర్చుకున్నామనేది రాజకీయ విజయానికి కొలమానం కాదని శ్రీకాంత్ రెడ్డి స్పష్టం చేశారు. – వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
నేడు ’డయల్ యువర్ సీఎండీ’
కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండి’ కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు మొబైల్ నంబరు: 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సిఎండి దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ డయల్ యువర్ ఎస్ఈ సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’ కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 9440817449 నంబర్కు వైఎస్సార్ జిల్లా వినియోగదారులు 08562242457 నంబర్లో సంప్రదించాలని అధికారులు పేర్కొన్నారు. రైతులకు అందుబాటులో ఎరువులుసాక్షి, మదనపల్లె : జిల్లాలో రైతులకు అవసరమైనంత ఎరువులు అందుబాటులో ఉన్నాయని జిల్లా వ్యవసాయశాఖ అధికారి శివనారాయణ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఏపీఎయిమ్స్ యాప్ ద్వారా ఎరువుల లభ్యత, పంపిణీ అత్యంత పారదర్శకంగా జరుగుతోందని తెలిపారు. జిల్లాలో 20,860 మెట్రిక్ టన్నుల నిల్వలు ఉన్నాయని వెల్లడించారు. ఇప్పటివరకు జిల్లాలో 23,015 మంది రైతులకు యాప్ ద్వారా 45,403 బస్తాల యూరియా, 4,445 బస్తాల డీఏపీ విక్రయించినట్టు తెలిపారు. మిగిలిన నిల్వలు ఆగస్టు చివరి వరకు జిల్లా అవసరాలకు సరిపోతాయని తెలిపారు. పక్కాగా ప్రశస్త్ 2.0 స్క్రీనింగ్మదనపల్లె సిటీ : జిల్లాలో ప్రత్యేక అవసరాల విద్యార్థులను ముందస్తుగా గుర్తించి, వారికి అవసరమైన విద్యా,వైద్య, పునరావాస సేవలను అందించేందుకు విద్యామంత్రిత్వ శాఖ ఆదేశాల మేరకు ప్రశస్త్ 2.0 స్క్రీనింగ్ కార్యక్రమాన్ని సమర్థవంతంగా అమలు చేయనున్నట్లు డీఈఓ సుబ్రమణ్యం సమగ్ర శిక్ష ఏపీసీ డాక్టర్ అనూరాధ తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, స్థానిక సంస్థలు, ఎయిడెడ్, ప్రైవేటు పాఠశాలల్లో 1వ తరగతి చదువతున్న విద్యార్థులందరికీ స్క్రీనింగ్ నిర్వహించనున్నట్లు పేర్కొన్నారు. జిల్లాలోని ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయులు జులై 31లోపు ప్రశస్త్ 2.0 యాప్లోని శిక్షణ వీడియోలను పూర్తిగా వీక్షించాలని, అలాగే ఆగస్టు 15లోపు యూడైస్ వివరాలను నవీకరించాలని సూచించారు. ఆగస్టు 15 నుంచి సెప్టెంబర్ 15 వరకు పార్ట్–1 స్క్రీనింగ్ , అనంతరం ప్రత్యేక ఉపాధ్యాయుల ద్వారా పార్ట్–2 స్క్రీనింగ్ చేపట్టి, గుర్తించిన ప్రతి విద్యారికి ఇండివిడ్యువల్ ఎడ్యుకేషన్ ప్లాన్ రూపొందించాలని తెలిపారు.నేడు షైనింగ్ స్టార్స్ అవార్డుల ప్రదానం మదనపల్లె సిటీ : జిల్లా వ్యాప్తంగా గతేడాది పదో తరగతి, ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు సోమవా రం షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. స్థానిక ఎన్జీఆర్ కళ్యాణ మండపంలో ఉదయం 10 గంటలకు జరిగే కార్యక్రమంలో జిల్లా ఇన్చార్జ్ మంత్రి జనార్థన్రెడ్డి, జిల్లా మంత్రి రాంప్రసాద్రెడ్డిలు విద్యార్థులకు అవార్డులు అందజేస్తారన్నారు. ఉత్తమ ఫలితాలు సాధించిన విద్యార్థులకు రూ.20 వేలు నగదు, పతకం, అందజేస్తారని పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా 188 ముంది విద్యార్థులను ఎంపిక చేశామని వివరించారు. మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ జిల్లా కార్యవర్గం ఏకగ్రీవం రాయచోటి: ఏపీఎన్జీఓస్ అసోసియేషన్ అనుబంధ సంఘం ‘తెలుగునాడు మెడికల్ అండ్ హెల్త్ ఎంప్లాయీస్ అసోసియేషన్’ అన్నమ య్య జిల్లా కార్యవర్గ కమిటీని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఆదివారం రాయచోటి ఎన్జీఓ హోమ్లో ఏపీ ఎన్జీఓస్ అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నిర్వహించిన సమావేశంలో అధ్యక్ష, కార్యవర్గ ఎన్నికలను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. అధ్యక్షులుగా రాజేంద్ర, సహాధ్యక్షులు పి రమణమ్మ, ఉపాధ్యక్షులుగా నీలిమ, సావిత్రి, అంజమ్మ, రఘునాథ్ నాయక్, పార్వతమ్మ, అమరను ఎన్నుకున్నారు. వీరితో పాటు ఇతర కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నికై నట్లు ప్రకటించారు. ఎన్జీఓ నాయకులు శివారెడ్డి, మహదేవ, రాజశేఖర్ రెడ్డి, ప్రతిభాకుమారి పాల్గొన్నారు. -
పశ్చిమ ప్రాంతం.. పచ్చదనం శూన్యం
ముంచేసిన ఎల్ నినో.. అడుగంటిన జలాలు గత ఏడాది కురిసిన వర్షాలతో పెరిగిన నీటిమట్టాలే ఇప్పటివరకు జిల్లాను కాపాడుతూ వచ్చాయి. అయితే ప్రస్తుత వర్షాభావం కారణంగా జిల్లా సగటు నీటిమట్టం ఏకంగా 12.32 మీటర్లకు పడిపోయింది. గత నాలుగేళ్ల గణాంకాలను పరిశీలిస్తే ఈ పతనం భీతి గొలిపుతోంది.సాక్షి, మదనపల్లె : అన్నమయ్య జిల్లా పశ్చిమ ప్రాంతాన్ని ఎల్ నినో భూతం కరవు కోరల్లోకి నెట్టేసింది. జూన్ నెలలో తీవ్ర వర్షాభావ పరిస్థితులు, జులైలో అసలు చినుకే రాలకపోవడంతో జిల్లావ్యాప్తంగా భూగర్భ జలాలు పాతాళానికి పడిపోయాయి. గత కొన్నేళ్లతో పోలిస్తే నీటిమట్టాలు అత్యంత ప్రమాదకర స్థాయికి దిగజారడంతో వ్యవసాయ బోర్లతో పాటు తాగునీటి పథకాలు సైతం ఆగిపోతున్నాయి. పరిస్థితి ఇలాగే కొనసాగితే ఆగస్టు నాటికి జిల్లా అంతటా అన్ని రంగాలు కుదేలు కావడం ఖాయంగా కనిపిస్తోంది. 14 మండలాల్లో పాతాళానికి గంగ.. రామసముద్రం టాప్! తాజా ప్రభుత్వ లెక్కల ప్రకారం జిల్లాలోని 14 మండలాల్లో జలమట్టాలు దారుణంగా పడిపోయాయి. నీటిమట్టం భారీగా దిగజారుతున్న మండలాల్లో రామసముద్రం ఏకంగా 25.39 మీటర్ల (సుమారు 83 అడుగులు) లోతుతో జిల్లాలోనే మొదటి స్థానంలో ఉంది. ఆ తర్వాతి స్థానాల్లో కలికిరి, నిమ్మనపల్లి, కలకడ, గుర్రంకొండ, గాలివీడు, పుంగనూరు, రాయచోటి, పెద్దతిప్పసముద్రం, ములకలచెరువు, తంబళ్లపల్లె, వాయల్పాడు, సంబేపల్లి, కురబలకోట మండలాలు ఉన్నాయి. అయితే, జిల్లాలో కొన్ని మండలాల్లో నీటిమట్టం ఇంకా పైనే ఉంది. చౌడేపల్లిలో 1.36 మీటర్లు, లక్కిరెడ్డిపల్లెలో 2.60 మీటర్లు, పెద్దమండ్యంలో 5.86 మీటర్ల లోతులోనే నీటి లభ్యత ఉంది. జిల్లా సగటు నీటిమట్టం 12.32 మీటర్లు రామసముద్రంలో 25.39 మీటర్ల లోతులో 14 మండలాల్లో పాతాళంలోకి జలం 2022లో 7.46, 2023లో 6.02 మీటర్లకే నీటి లభ్యత మున్ముందు మరింత దారుణ పరిస్థితులు 71 పల్లెల్లో ట్యాంకర్ల ద్వారా నీటి రవాణా! -
‘నీట్’లో మెరిసిన దీక్షిత
పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరుకు చెందిన శ్రీపురం లక్ష్మినారాయణ, కోమల దంపతుల కుమార్తె శ్రీపురం దీక్షిత నీట్ పరీక్షా ఫలితాల్లో సత్తా చాటింది విజయవాడలోని శ్రీ గోశాలైట్స్ మెడికల్ అకాడమీలో కోచింగ్ తీసుకున్న దీక్షిత శుక్రవారం వెలువడిన ఫలితాల్లో 642 మార్కులతో ఆల్ ఇండియా 2,080 ర్యాంకు సాధించింది. యు వతి తండ్రి చిల్లర దుకాణం నడుపుతుండగా తల్లి గృహిణిగా పని చేస్తోంది. భవిష్యత్తులో తాను డాక్టర్నై ప్రజలకు సేవ చేయడమే తన లక్ష్యమని దీక్షిత అభిప్రాయం వ్యక్తం చేసింది. ఏటీఎంలో చోరీకి విఫలయత్నం పుంగనూరు: పట్టణంలోని కొత్తయిండ్లలో గల హిటాచిమోటార్స్ ఏటీఎంలో శుక్రవారం రాత్రి దొంగలు పడ్డారు. ఏటీఎంను పగులగొట్టే ప్రయత్నం విఫలం కావడంతో ఎలాంటి నష్టం జరగలేదు. దొంగలు అక్కడి నుంచి పరారయ్యారు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో క్లూస్టీమ్ సంఘటన స్థలానికి వెళ్లి పరిశీలించారు. వేలిముద్రలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జాతీయ రహదారిపై ఉన్న ఏటిఎంలో దొంగలు పడటంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. టీచర్లు బోధనా సామర్థ్యాలు పెంచుకోవాలిపీలేరు రూరల్ : మారుతున్న కాలానికి అనుగుణంగా ఉపాధ్యాయులు సరికొత్త టెక్నాలజీతో బోధనా పద్ధతులను అలవర్చుకోవాలని జిల్లా పరీక్షల నిర్వహణ శాఖ కార్యదర్శి గంగాధరం పిలుపునిచ్చారు. శనివారం పీలేరు ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో పీలేరు డివిజన్ పరిధిలోని (పీలేరు, కలికిరి, కేవీపల్లె, కలకడ, సదుం, సోమల) మండలాల గణిత, భౌతిక, జీవ, సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయులకు నిర్వహించిన ఒక్కరోజు శిక్షణ తరగతులను ఆయన తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయ వృత్తిలో ఎదురయ్యే సవాళ్లను ఎదుర్కోవడానికి ఈ శిక్షణ ఎంతో ఉపయోగపడుతుందన్నారు. అనంతరం లిప్ యాప్, హోల్ వీల్ కార్డులు, విద్యార్థుల 100 రోజుల విద్యా కార్యక్రమంపై అవగాహన కల్పించారు. కార్యక్రమంలో ఎంఈఓలు బాబునాయక్, నాగార్జున, హెచ్ఎంలు ప్రేమరాణి, రేణుకాదేవి, రీసోర్స్ పర్సన్లు శ్రీనివాసులరెడ్డి, ఆంజనేయులు, గోవిందు తదితరులు పాల్గొన్నారు. హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు కసరత్తురామసముద్రం : మదనపల్లె నియోజకవర్గ పరిధిలో హార్టికల్చర్ హబ్ ఏర్పాటుకు అధికారులు కసరత్తు ముమ్మరం చేశారు. ఇందులో భాగంగా రామసముద్రం మండలంలోని చొక్కాండ్లపల్లి గ్రామ సమీపంలో, కర్ణాటక సరిహద్దులో గల సర్వే నంబర్ 177లోని 60 ఎకరాల ప్రభుత్వ పశువుల మేత బీడు భూమిని మదనపల్లె సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి శనివారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఈ స్థలం విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులు, రహదారి సౌకర్యాలు మరియు మౌలిక వసతులపై రెవెన్యూ అధికారులతో కలిసి ఆమె సమగ్ర సర్వే జరిపారు. ఈ స్థలానికి సంబంధించిన పూర్తి వివరాలతో కూడిన నివేదికను త్వరలోనే ప్రభుత్వానికి సమర్పించనున్నట్లు సబ్ కలెక్టర్ తెలిపారు. ఈ హబ్ ఏర్పాటు ద్వారా ఉద్యానవన పంటల నిల్వ, విలువ ఆధారిత ఉత్పత్తుల తయారీ, మార్కెటింగ్తో పాటు రైతులకు ఆధునిక సాంకేతికత, ఉపాధి అవకాశాలు పెరుగుతాయని అధికారులు పేర్కొన్నారు. కార్యక్రమంలో తహసీల్దార్ అజారుద్దీన్, ఆర్ఐ వసీమ్, సర్వేయర్ నరేంద్ర తదితరులు పాల్గొన్నారు. -
క్రికెట్ నీలాకాశంలో ‘ధ్రువ’తార
అతను ఓపిగ్గా సింగిల్, డబుల్స్ తీయగలడు.. జట్టుకు అవసరమైనప్పుడు బౌండరీలతో చెలరేగిపోగలడు.. అంతేనా కెప్టెన్గా జట్టును ముందుండి నడిపించగలడు.. అతనే ప్రొద్దుటూరు శ్రీరాములపేటకు చెందిన క్రికెటర్ ఎస్. ధ్రువకుమార్ రెడ్డి. ఇటీవల జరిగిన ఏపీఎల్లో తన బ్యాటింగ్తో శభాష్ అనిపించాడు.ప్రొద్దుటూరు కల్చరల్ : పట్టణంలోని శ్రీరాములపేటకు చెందిన ఎస్.ధ్రువకుమార్రెడ్డి క్రికెట్లో ఒపెనింగ్ రైట్హ్యాండ్ బ్యాట్స్మన్గా రాణిస్తూ తనకంటూ ప్రత్యేక గుర్తింపు తెచ్చుకున్నారు. ఈయన తండ్రి సిగినేని లక్ష్మిరెడ్డి హెడ్ కానిస్టేబుల్గా పనిచేస్తుండగా తల్లి శారదదేవి గృహిణి. చిన్నప్పటి నుంచి క్రికెట్పై ఉన్న ఆసక్తితో 2006లో యూత్క్రికెట్ క్లబ్లో చేరి సాధన ప్రారంభించాడు. శిక్షణలో అన తి కాలంలోనే కోచ్ల నుంచి మెళకువలు నేర్చుకుని ఫొర్లు, సిక్సర్లు కొడుతూ మంచి రైట్హ్యాండ్ బ్యాట్స్మన్గా పేరు పొందాడు. జిల్లా, రాష్ట్ర స్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొని ప్రతిభ కనబరిచాడు. అండర్–22 రాష్ట్రస్థాయి క్రికెట్ పోటీల్లో పాల్గొన్నాడు. సౌత్ ఇండియా అండర్–19 పోటీల్లో పాల్గొని తన బ్యాటింగ్తో అందరి మన్ననలు చూరగొన్నాడు. రంజీ, వన్ డే, 20–20, టెస్ట్ మ్యాచ్లలో ఆడాడు. ఐదేళ్లుగా ఆంధ్రా ప్రీమియర్లీగ్ క్రికెట్ పోటీల్లో ఆడుతున్నాడు. క్రికెట్ పోటీల్లో మంచి నైపుణ్యంతో బ్యాట్స్మన్గా రాణిస్తుండటంతో ధ్రువకుమార్రెడ్డిని రాయల్స్ ఆఫ్ రాయలసీమ మేనేజ్మెంట్ జట్టు కెప్టెన్గా బాధ్యతలు అప్పగించింది. వారి నమ్మకాన్ని వమ్ము చేయకుండా 5 మ్యాచ్లు ఆడి రాయల్స్ ఆఫ్ రాయలసీమ జట్టును విజయం సాధించడంలో ముందుండి నడిపించాడు. వైజాగ్ లయన్స్తో జరిగిన ఉత్కంఠభరిత పోరులో 218 పరుగుల భారీ లక్షసాధనలో ఒంటరి పోరాటం చేస్తూ కేవలం 31 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్సర్లతో 52 పరుగులు బాది కెప్టెన్ ఇన్నింగ్స్తో జట్టులో స్ఫూర్తి నింపాడు. కాగా ప్రస్తుతం ధ్రువ కుమార్రెడ్డి సికింద్రాబాద్ రైల్వేలో సీనియర్ క్లర్క్గా విధులు నిర్వహిస్తున్నాడు. -
71 పల్లెల్లో నీటి కష్టాలు.. రాయచోటిపై అధిక ప్రభావం
జిల్లాలో తాగునీటి సంక్షోభం ఏప్రిల్ నుంచే మొదలైంది. ప్రస్తుతం 71 పల్లెల్లో పరిస్థితి తీవ్రంగా మారడంతో గ్రామీణ నీటి సరఫరా విభాగం అధికారులు ట్యాంకర్లు, ప్రైవేట్ బోర్ల టైఅప్ ద్వారా నీటిని రవాణా చేస్తున్నారు. ఈ నెలాఖరు నాటికి ఈ మండలాల్లోని మరో 32 పల్లెల్లో నీటి సమస్య వస్తుందని అధికారులు అంచనా వేశారు. ఈ జల సంక్షోభ ప్రభావం రాయచోటి నియోజకవర్గంపై ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ భూగర్భజల మట్టం కొంత ఊరటనిచ్చినా, భౌగోళిక పరిస్థితుల వల్ల తాగునీటి సమస్యలు ఇక్కడే అధికంగా ఉన్నాయి. ఆగస్టులోనూ వర్షాలు కురవకపోతే జిల్లావ్యాప్తంగా సాగు, తాగునీటి రంగాలు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోవడం ఖాయం. -
కడప షెహర్ నుంచి ఆయా క్రికెట్కా షేర్!
నాన్న కుస్తీ పట్టులోని బలాన్ని తన ఒంటి నిండా నింపుకున్నాడు.. అన్న అందించిన ప్రోత్సాహాన్ని గుండెల్లో దాచుకున్నాడు.. వేదిక ఏదైనా.. జట్టు ఏదైనా.. బ్యాటు చేతబట్టి గ్రౌండులో దిగితే బంతి స్టాండ్లోకి వెళ్లాల్సిందే.. అతని ధనాధన్ ఇన్నింగ్స్కి జనం ఫిదా అవ్వాల్సిందే. అతనే కడప నగరానికి చెందిన క్రికెటర్ జహీర్ అబ్బాస్కడప వైఎస్సార్ సర్కిల్ : కడప నగరం అల్మాస్ పేటకు చెందిన జహీర్ అబ్బాస్ క్రికెట్లో సత్తా చాటుతున్నాడు. ఇటీవల జరిగిన ఏపీఎల్లో టోర్నీ ఆద్యంతం చక్కటి ఇన్నింగ్స్లతో అలరించాడు. వరుసగా రెండో ఏడాది సూపర్ స్ట్రైకర్ అవార్డు సొంతం చేసుకున్నాడు. కడపలోని వైఎస్ రాజారెడ్డి–ఏసీఏ స్టేడియంలో సొంత ప్రేక్షకుల మధ్య జరిగిన రెండు మ్యాచ్ల లో ధనాధన్ ఇన్నింగ్స్తో అందరినీ ఆశ్యర్యపరిచాడు. నాన్న బలం.. అన్న ప్రోత్సాహం అల్మాస్పేటకు చెందిన షేక్ అన్సర్, షేక్ గౌసియా బేగం దంపతుల కొడుకు జహీర్ అబ్బాస్. తండ్రి కుస్తీ పహిల్వాన్. తల్లి గృహిణి. వీరి ముగ్గురు కుమారుల్లో జహీర్ మూడో వాడు. తమ్ముడిలోని క్రికెట్ నైపుణ్యం చూసిన ఇద్దరన్నలు రవూఫ్, జాఫర్ మున్సిపల్ స్టేడియంలో క్రికెట్ కోచింగ్కు పంపించా రు. అక్కడి సీనియర్ కోచ్ ఖాజా మెలకువలు జహీర్ లోని నైపుణ్యాన్ని సానబెట్టాయి. అలాగే కడప క్రికెట్ అసోసియేషన్ అధికారుల, సిబ్బంది అండ తోడైంది. ఒక్కో మెట్టు ఎదుగుతూ.. కడప క్రికెట్ అసోసియేషన్లోని భరత్రెడ్డి, రెడ్డి ప్రసాద్ తదితరులు ఇచ్చిన ప్రోత్సాహంతో జహీర్ అబ్బాస్ వేగంగా ఒక్కో మెట్టు ఎదుగుతూ వచ్చా డు. తొలుత అండర్–16స్టేట్కు ఆడిన జహీర్, 2019–20లో అండర్–19 స్టేట్ జట్టుకు ప్రాతి నిధ్యం వహించాడు. ఇందులో 3 అర్థ సెంచరీలతో రాణించిన జహీర్ 200 స్ట్రైక్ రేట్ కలిగి ఉండడం విశేషం. ఆ ఏడాది అండర్ –19 ప్రపంచకప్ కోసం ఇండియన్ సెలెక్టర్ల నుంచి పిలుపునందుకున్న జహీర్ గ్వాలియర్లో ఎంపికలకు సైతం హాజరయ్యాడు. ఏపీఎల్తో వెలుగులోకి.. ఆంధ్రా ప్రీమియర్ లీగ్ జహీర్ అబ్బాస్లోని క్రికెట్ నైపుణ్యాన్ని ప్రపంచాన్ని పరిచయం చేసింది. ఇప్పటివరకు ఏపీఎల్ ఐదు సీజ న్లు జరగగా.. తొలి సీజన్ నుంచి ఆడుతున్న జహీర్ వివిధ జట్లకు ప్రాతినిథ్యం వహించాడు. తొలి సీజన్లోనే చాంపియన్ జట్టులో సభ్యుడుగా ఉండడం విశేషం. కాగా 2025లో సూపర్ స్ట్రైకర్ ఆప్ టోర్నీగా నిలిచిన జహీర్, తాజాగా జరిగిన ఐదో సీజన్లోనూ సూపర్ స్ట్రైకర్ అవార్డు కై వసం చేసుకున్నాడు. ఇప్పటివరకు అతి తక్కువ బంతుల్లో అర్థ సెంచరీ ఇతని పేరుమీదే ఉండడం విశేషం. టీం ఇండియాకు ఎంపికవడమే లక్ష్యం.. ఇండియన్ క్రికెట్ టీంకు ఎంపికవడమే తన ఆశయమని జహీర్ తెలిపాడు. ఇప్పటికే ఐపీఎల్లో ప్రధాన జట్లయిన చైన్నె, కేకేఆర్లు ట్రయల్స్ కోసం తన పేరును రిజిస్టర్ చేసుకున్నాయని.. ఈ ఏడాది అవకాశం వస్తుందని ఆశాభావం వ్యక్తం చేశాడు. -
‘సీమ’ జోనల్ పోటీల్లో విజేత రొంపిచెర్ల జట్టు
రొంపిచెర్ల: రాయలసీమ జోనల్ క్రికెట్ పోటీల్లో విన్నర్స్గా రొంపిచెర్ల ఫ్రెండ్స్ ఎలెవన్ జట్టు నిలిచింది. తిరుపతి జిల్లా చంద్రగిరిలో రాయలసీమ జోనల్ క్రికెట్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో వివిధ రాష్ట్రాలకు చెందిన 73 టీంలు పాల్గొన్నాయి. శుక్రవారం జరిగిన ఫైనల్లో రొంపిచెర్ల ఫ్రెండ్స్ ఎలెవన్, బబ్లు ఎలెవన్ జట్లు తలపడ్డాయి. బబ్లు ఎలెవన్ జట్టు 12.2 ఓవర్లలో 80 పరుగులకు అలౌటు అయింది. రొంపిచెర్ల జట్టు 8.4 ఓవర్లలో 84 పరుగులు చేసి విజయం సాధించింది. ఎస్.కె.అహ్మద్ 23 బంతుల్లో 3 సిక్స్లు, రెండు పోర్లతో 33 రన్స్ చేసి జట్టు గెలుపులో కీలక పాత్ర పోషించాడు. దీంతో విజేత జట్టుకు నగదు బహుమతిగా రూ.1.50 లక్షల చెక్ను ఆర్గనైజర్ బాలాజీ అందజేశారు. ఈ పోటీల్లో జట్టు సభ్యులు ఉమ మహేశ్వర్, గుర్రప్ప, హర్ష, మణి, ఎస్.కె. అహ్మద్ కిషోర్, బాలు, రాజు, పవన్, భార్గవ్,షమీ, దిలీప్, తిప్పాస్వామి, తదితరులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో యువకుడి బలవన్మరణం
పుంగనూరు : అప్పుల బాధతో ఓ యువకుడు బలవన్మరణం చెందిన సంఘటన పట్టణ సమీపంలోని నక్కబండలో గురువారం రాత్రి జరిగింది. వివరాలిలా ఉన్నాయి. డ్రైవర్గా పని చేస్తున్న రెడ్డిప్రసాద్(32) తన కుటుంబ అవసరాల నిమిత్తం అప్పులు చేశాడు. అప్పులు చెల్లించలేక పోవడంతో వడ్డీ వ్యాపారుల వేధింపులు తీవ్రం కావడం వల్ల రాత్రి ఇంటిలోనే ఉరివేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. కుటుంబ సభ్యులు కాపాడే ప్రయత్నం చేసినా ఫలితం లేకపోయింది. మృతుడికి భార్య, పిల్లలు ఉన్నారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టానికి తరలించి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్ : అర్ధరాత్రి ఇంట్లో ఒంటరిగా ఉన్న మహిళపై మూకుమ్మడిగా దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మదనపల్లె మండలం యనమలవారిపల్లె భాగ్యనగర్లో చోటు చేసుకుంది. బాధితురాలు తాలూకా పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదు మేరకు.. భాగ్యనగర్లో ఉంటున్న సూర్యకుమారి ఇంటి స్థలంలో వీఆర్ఏ వెంకటరమణ దౌర్జన్యంగా షెడ్డు వేయడానికి యత్నించడాన్ని ఆమె అడ్డుకుంది. దీంతో ఆగ్రహానికి గురైన వీఆర్ఏ, అతని కుటుంబ సభ్యులు అర్ధరాత్రి సూర్యకుమారిపై మూకుమ్మడిగా దాడి చేశారు. గాయపడిన బాధితురాలిని వెంటనే జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. బాధితురాలి ఫిర్యాదు మేరకు తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. మదనపల్లె టౌన్ : వైద్యం కోసం ఆసుపత్రికి బయలుదేరిన వృద్ధురాలిని బైక్ ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. పెద్దతిప్పసముద్రం మండలం బూసుపల్లికి చెందిన లక్ష్మమ్మ (72)కు ఆరోగ్యం బాగోలేదు. దీంతో కొడుకు మల్లికార్జున, మనవడు సురేష్ ఆమెను బైక్పై బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నారు. బైక్ బి.కొత్తకోటకు చేరుకోగానే ఎదురుగా వేగంగా వచ్చిన మరో బైక్ వీరి వాహనాన్ని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న లక్ష్మమ్మ కిందపడి తల, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. మనవడు సురేష్కు స్వల్ప గాయాలయ్యాయి. వెంటనే స్థానికులు, కుటుంబ సభ్యులు లక్ష్మమ్మను బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకాశమంతా మేఘాలు ముసురుకుంటున్నా.. ఎల్నినో రక్కసి ప్రభావంతో ఒక్క చినుకూ రాలడం లేదు. పొడి గాలుల ధాటికి భూమిలోని తేమ ఆవిరైపోతుండటంతో జిల్లాలో కరువు నీడలు కమ్ముకొస్తున్నాయి. ఖరీఫ్ సీజన్ సగానికి వస్తున్నా ఎగువన వర్షాల్లేక జిల్లావ్యాప్తంగా సాగు పూర్తిగా ప్రశ
సాక్షి, మదనపల్లె: జిల్లాలో ఎల్నినో ప్రభావం నుంచి రైతుల పంటల సాగును ప్రత్యామ్నాయం వైపు మళ్లించినట్టు ప్రకృతి వ్యవసాయ విభాగం అధికారులు చెబుతున్నప్పటికీ.. వాటి వాస్తవికతపై ఎన్నో అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఖరీఫ్ వర్షాలకు ముందే ప్రీ మాన్సూన్ డ్రై సూయింట్ (పీఎండీఎస్) కార్యక్రమాన్ని చేపట్టారు. నేషనల్ మిషన్ ఆఫ్ నేచురల్ ఫార్మింగ్ పథకం ద్వారా జిల్లాలో ప్రకృతి వ్యవసాయాన్ని చేపట్టారు. మూడు నెలలపాటు ఈ పంట సాగులో ఉండి, దిగుబడి ఇవ్వాలి. జిల్లాలో ఈ ప్రకృతి సేద్యాన్ని మార్చి నుంచి చేపట్టినట్టు అధికారులు చెబుతున్నారు. దీని ముఖ్యఉద్దేశ్యం ఏమంటే వర్షాలు కురిసేందుకు ముందే చిరుధాన్యాలు, పశువుల గడ్డి పెంపకం చేపడితే వర్షాలు కురిశాక ఆ పంటలను భూమిలోనే కలిపేస్తూ దుక్కులు దున్నుకునేలా దీనిని అమలు చేశారు. ప్రకృతి సేద్యానికి సంబంధించి అంకెలు బాగున్నప్పటికీ.. వాటి ఫలితాలు, ప్రయోజనం ఏమీ లేదని తెలుస్తోంది. జిల్లాలో ప్రకృతి వ్యవసాయ విభాగం కింద 450 మంది గౌరవ వేతనంతో కమ్యూనిటీ క్యాడర్లుగా పనిచేస్తున్నారు. ఏపీ రైతు సాధికార సంస్థ వీరికి నెలకు రూ.4,500 గౌరవ వేతనం ఇస్తోంది. ఇదీ లక్ష్యం జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉండటం, వర్షాభావ పరిస్థితులు తీవ్రమైన దృష్ట్యా వ్యవసాయ భూముల్లో చిరుధాన్యాల పంటలు, పశువుల గడ్డి పెంపకానికి ప్రకృతి వ్యవసాయ విభాగం చర్యలు చేపట్టింది. దీనివల్ల వర్షం ఎప్పుడు కురిస్తే అప్పుడు ఇవి మొలకెత్తి పంటలుగా ఉపయోగపడతాయని రైతులకు అవగాహన కల్పించారు. ఇవి మొలకెత్తాక దుక్కులు దున్ని భూమిలో కలిపి వేయడం వల్ల ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని అధికారులు వివరించారు. అయితే వర్షాలే కురవనప్పుడు వీటి సాగు ప్రశ్నార్థకంగా మారింది. 50వేల కిట్లు విక్రయం ప్రకృతి వ్యవసాయానికి సంబంధించి అధికారులు చెబుతున్న దాన్నిబట్టి.. బయో ఇన్పుట్ రిసోర్స్ సెంటర్ ద్వారా జిల్లాలో 26 కేంద్రాలు ఏర్పాటు చేశారు. దీనిద్వారా 20 నుంచి 25 రకాలు కలిగిన చిరుధాన్యాలు 15 కిలోల సంచి రూ.1,050, పది రకాలు కలిగిన వాటిని రూ.620 చొప్పున రైతులకు విక్రయించారు. ఇలా జిల్లా వ్యాప్తంగా 50 వేల కిట్లు రైతులు కొనుగోలు చేయగా వాటిని పొలాల్లో వేసినట్లు ప్రకృతి వ్యవసాయ అధికారులు లెక్కలు చెబుతున్నారు. ఈ కిట్లతో 50,154 ఎకరాల్లో పశువుల గడ్డి, చిరుధాన్యాల పంటలు సాగు చేశారని చెబుతున్నారు. ఈ స్థాయిలో చిరుధాన్యాల సేకరణ, పంపిణీ వ్యవహారాలు ఎలా ఉన్నప్పటికీ.. 50వేల ఎకరాల్లో వీటిని సాగు చేశారన్నది ప్రశ్నార్ధకంగా మారింది. ● జిల్లాలో ఈ ఖరీఫ్లో 46,055 హెక్టార్లలో (1,15,137 ఎకరాలు) పంటలు సాగు కావాల్సి ఉంది. అయితే వర్షాభావ పరిస్థితులు, ఎల్నినో ప్రభావం వల్ల జిల్లాలో ఇప్పటిదాకా కేవలం 1,970 (4,925 ఎకరాలు) హెక్టార్లకు మాత్రమే ఖరీఫ్ సాగు పరిమితమైంది. ఈ పరిస్థితుల్లో ఖరీఫ్కు ముందు ప్రారంభమైన ప్రీ మాన్సూన్ డ్రై సోయింగ్ (పీడీఎంఎస్) కార్యక్రమం ద్వారా చేపట్టిన ప్రకృతి సాగు 50,154 ఎకరాల్లో చేపట్టారంటే ఆశ్చర్యం వ్యక్తమవుతోంది. అధికారులు చెబుతున్న లెక్కలకు, జిల్లాలో కనిపిస్తున్న సాగుకు స్పష్టమైన తేడా తెలుస్తోంది. ● ప్రకృతి సేద్యం ద్వారా పంటలు సాగు చేయిస్తున్నామని చెబుతున్న అధికారులు నీటి ఆధారిత పశువుల గడ్డి దిగుబడి బాగుందంటున్నారు. వర్షాధారంతో వేసిన పశువుల గడ్డి విత్తనాలు ఆశించిన మేరకు ఎదగలేదని వారే అంగీకరిస్తున్నారు. అలాంటి పరిస్థితుల్లో పశువుల గడ్డి సాగుపై సత్ఫలితాలు లేదన్న విషయం స్పష్టం అవుతోంది. దాంతో ప్రకృతి సేద్యం అంకెల గారడీయేనా అనే అనుమానాలు కలుగుతున్నాయి. ● ప్రకృతి వ్యవసాయం సాగాలంటే కనీస వర్షపాతం ఉండాలి. జూన్ 14 నుంచి జూలై 17 వరకు జిల్లాలో చినుకు కురవలేదు. జూలైలో 90.5 మిల్లీమీటర్లు కురవాలి. ఒక్క మిల్లీమీటర్ వర్షం కూడా కురవలేదు. ఈ లెక్కన చూస్తే ప్రకృతి వ్యవసాయం పండేందుకు వర్షపాతం లేకుండా ఎలా సాధ్యమవుతుంది అన్నది ముఖ్యమైన అనుమానం. నీటి ఆధారంతో బోర్లకింద సాగుచేసిన పశువుల గడ్డి వర్షాధారంలో సాగుచేసిన పశువుల గడ్డి ప్రకృతి సేద్యం అంకెల్లో బాగు జిల్లాలో 50,154 ఎకరాల్లో సాగు చేసినట్లు లెక్క ఈ విస్తీర్ణం ఇప్పటి ఖరీఫ్ సాగు కంటే అత్యధికం అయితే గడ్డి మినహా కనిపించని పంటలునియోజకవర్గం రైతులు సాగు (ఎకరాల్లో) మదసపల్లె 6,239 6,605.22 పీలేరు 8,565 8,665.08 పుంగనూరు 5,342 4,530.18 రాయచోటి 19,622 22,539.65 తంబళ్లపల్లె 7,477 7,814.02 మొత్తం 47,245 50,154 జిల్లాలో ప్రకృతి వ్యవసాయం కింద చేపట్టిన సాగులో పశువుల గడ్డి అధికం. మొత్తం సాగులో 70శాతం నీటి ఆధారంతో, 30 శాతం వర్షాధారంతో పంటలు సాగు చేయించాం. రైతులకు దీనికి ఎలాంటి ప్రోత్సాహం అందించలేదు. వర్షాధార ప్రకృతి సేద్యంలో ఫలితాలు తక్కువే. విత్తనాలు మొక్కలైతే వాటిని భూమిలోనే దున్నేస్తారు. – వెంకటమోహన్, ప్రకృతి సాగు జిల్లా అధికారి -
టెన్త్ టాపర్లకు షైనింగ్ స్టార్ అవార్డులు
మదనపల్లె సిటీ: జిల్లా వ్యాప్తంగా గత విద్యా సంవత్సరం పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించిన 157 మందికి షైనింగ్ స్టార్ అవార్డులు ఇవ్వనున్నట్లు జిల్లా విద్యాశాఖ అధికా రి డాక్టర్ సుబ్రమణ్యం శుక్రవారం తెలిపారు. ఈ నెల 20వ తేదీ స్థానిక ఎన్జీఆర్ కల్యాణ మండపంలో జరిగే కార్యక్రమంలో వీరికి రూ.20 వేలు నగదు, పతకం అందజేస్తామన్నారు. ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలి రాయచోటి టౌన్ : ఓపెన్ స్కూల్ ప్రవేశాలను సద్వినియోగం చేసుకోవాలని జిల్లా ఓపెన్ స్కూల్ కో –ఆర్డినేటర్ కొండూరు శ్రీనివాస రాజు తెలిపారు. శుక్రవారం రాయచోటి డైట్ కళాశాలలో ఓపెన్ స్కూల్ 2026–2027 సంవత్సరం ప్రవేశాలకు సంబంధించిన కరపత్రాలను విడదల చేశారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ 14 సంవత్సరాలు పూర్తయి, చదవడానికి, రాయడానికి వచ్చిన వారు పదోతరగతిలో ప్రవేశానికి అర్హులని చెప్పారు. అలాగే 15 సంవత్సరాలు నిండిన వార ఇంటర్మీడియట్ చేరేందుకు అర్హులని తెలిపారు. వీరికి ఉచితంగా స్వయం అభ్యాస పాఠ్యసామగ్రి ఇంటికే పంపించనున్నట్లు చెప్పారు.ఎలాంటి అపరాధ రుసుం చెల్లించకుండా ఈ నెల 31లోగా ఏపీ ఆన్లైన్ ప్రవేశాలు పొందవచ్చని వివరించారు. ఈ కార్యక్రమంలో డైట్ ఇన్చార్జి ప్రిన్సిపల్ మడితాటి నరసింహారెడ్డి, డైట్ అధ్యాపకులు, విద్యార్థులు పాల్గొన్నారు. ఆశాజనకంగా టమాట ధరలు సాక్షి, మదనపల్లె: సీజన్ ముగుస్తున్నా టమోటా ధరలు ఆశాజనకంగా ఉండగా దిగుబడి కూడా భారీగా పెరిగింది. దీంతో పనులు కూడా తగ్గకుండా ఉన్నాయి. మదనపల్లి మార్కెట్లో శుక్రవారం 1,451 టన్నుల టమాట రాగా అత్యధికంగా కిలో ధర రూ.18 పలికింది. ఇదే మార్కెట్లో సోమవారం 1,210 టన్నుల టమాట అనగా అత్యధిక కిలో ధర రూ.19 పలికింది. మంగళవారం 1,190 టన్నుల టమాట రాగా అత్యధికంగా కిలో ధర రూ.23 పలికింది. బుధవారం 1,340 టన్నుల టమాట రాగా అత్యధిక కిలో ధర రూ.23 పలికింది. గురువారం 1,478 టన్నుల టమాట విక్రయానికి రాగా అత్యధిక కిలో ధర రూ.20 పలికింది. దీన్ని బట్టి చూస్తే ఈ నెలలో అత్యధిక ధర కిలో రూ.23 పలికితే, అత్యల్ప ధర రూ.18 పలికింది. టమోటా దిగుబడి ఇంకా పెరుగుతుండటంతో ధరలు ఇలాగే నిలకడగా ఉంటాయా లేదా అన్నది చూడాలి. కేసులు సత్వరమే పరిష్కరించాలి: డీఐజీ మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయాన్ని కర్నూలు రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ శుక్రవారం తనిఖీ చేశారు. శుక్రవారం మదనపల్లెకు విచ్చేసిన డీఐజీకి జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) వెంకటాద్రి పుష్పగుచ్ఛాలు అందజేసి స్వాగతం పలికారు. అనంతరం ఎస్పీ కార్యాలయ ప్రాంగణంలో జరుగుతున్న నూతన భవన నిర్మాణ పనులను డీఐజీ పరిశీలించారు. నిర్మాణ పనుల నాణ్యత, పురోగతిపై అధికారులను అడిగి తెలుసుకుని సంతప్తి వ్యక్తం చేశారు. అనంతరం కార్యాలయ రికార్డులు, పెండింగ్ కేసుల వివరాలను సమీక్షించి డీఐజీ.. కేసుల పరిష్కారంలో జాప్యం లేకుండా సత్వర చర్యలు చేపట్టాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పోలీస్ స్టేషన్లకు వచ్చే ఫిర్యాదుదారుల పట్ల మర్యాదగా వ్యవహరించాలని, ప్రజలకు నాణ్యమైన సేవలు అందించాలని సూచించారు. పిల్లలకు తప్పనిసరిగా టీకా వేయించాలి మదనపల్లె టౌన్: మీసిల్స్, రూబెల్లా (పొంగు, మూడు రోజుల తట్టు) వ్యాధుల నివారణకు నిర్వహిస్తున్న టీకాల ప్రత్యేక శిబిరాలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య, జిల్లా వ్యాధి నిరోధక టీకాల అధికారి డాక్టర్ ఉషశ్రీ పేర్కొన్నారు. శుక్రవారం మదనపల్లె డీఎంహెచ్ఓ కార్యాలయంలో ఏర్పాటు చేసిన సమావేశంలో వారు మాట్లాడుతూ.. 9 నెలల నుంచి 15 ఏళ్ల లోపు పిల్లలందరికీ మీసిల్స్–రూబెల్లా (ఎంఆర్) టీకా తప్పనిసరిగా వేయించాలన్నారు. గతంలో టీకా వేయించినా సరే, ప్రత్యేక శిబిరాల్లో మరో అదనపు డోసు ఇస్తున్నామని తెలిపారు. భారత ప్రభుత్వం 2026 డిసెంబర్ నాటికి దేశం నుంచి మీసిల్స్, రూబెల్లా వ్యాధులను పూర్తిగా నిర్మూలించాలనే లక్ష్యంతో పనిచేస్తోందని వారు పేర్కొన్నారు. ఈ లక్ష్యం సాధనకు తల్లిదండ్రులు సహకరించాలని కోరారు. కార్యక్రమంలో వైద్య సిబ్బంది, ఆశా వర్కర్లు, ఏఎన్ఎంలు పాల్గొన్నారు. -
21 నుంచి సౌమ్యనాథస్వామి బ్రహ్మోత్సవాలు
నందలూరు : సౌమ్యనాథస్వామి ఆలయం బ్రహ్మోత్సవాలకు ముస్తాబవుతుంది. జులై 21 నుంచి 31వ తేదీ వరకు తిరుమల తిరుపతి దేవస్థానం ఆధ్వర్యంలో బ్రహ్మోత్సవాలు నిర్వహించనున్నట్లు డిప్యూటీ ఈఓ ప్రశాంతి, ఆలయ ఇన్స్పెక్టర్ దిలీప్కుమార్లు శుక్రవారం తెలిపారు. 21వ తేదీ ఉదయం తిరుమంజనం, రాత్రికి అంకురార్పణ, 22న ఉదయం ధ్వజారోహణం, రాత్రి యాలివాహనం, 23న ఉదయం పల్లకీసేవ, రాత్రి హంస వాహనం, 24న ఉదయం పల్లకీసేవ, రాత్రి సింహవాహనం, 25న ఉదయం పల్లకీసేవ, రాత్రి హనుమంతవాహనం, 26న ఉదయం శేషవాహనం, రాత్రి గరుడ వాహనం, 27న ఉదయం సూర్యప్రభ, రాత్రి చంద్రప్రభ వాహనం, 28న ఉదయం కళ్యాణోత్సవం, రాత్రి గజవాహనం, 29న ఉదయం రథోత్సవం, రాత్రి అశ్వవాహనం, 30న ఉదయం చక్రస్నానం, రాత్రి ధ్వజారోహణం, 31న సాయంత్రం పుష్పయాగంతో బ్రహ్మోత్సవాలు ముగుస్తాయని తెలిపారు. బ్రహ్మోత్సవాల సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు సౌకర్యాలు కల్పించేందుకు అన్ని చర్యలు చేపట్టామని వారు తెలిపారు. -
సిద్ధార్థలో ఏఐసీటీఈ ఐడియా ల్యాబ్ ప్రారంభం
నారాయణవనం: మండలంలోని సిద్ధార్థ ఇన్టిట్యూట్ ఆఫ్ ఇంజినీరింగ్ అండ్ టెక్నాలజి కళాశాలలో ఏఐసిటిఇ ఏఐసీటీఇ ఐడియా ల్యాబ్ను శుక్రవారం తిరుపతి ఐఐటి డైరెక్టర్ ప్రొఫెసర్ సత్యనారాయణ ప్రారంభించారు. ఆడిటోరియంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లారుతూ ఐడియా ల్యాబ్లో సిఎస్సి మెషన్కటింగ్, త్రీడి ప్రింటింగ్, ఎలక్ట్రానిక్స్ ల్యాబ్, ఐఓటి ల్యాబ్లతో విద్యార్థులు తమ నైపుణ్యతను పెంచుకోవాలని అన్నారు. కేంద్రప్రభుత్వం ఇన్నోవేటివ్ టెక్నాలజికి అత్యంత ప్రాధాన్యతను ఇస్తోందనిఅన్నారు. యువ ఇంజనీర్లు స్టార్టప్లను, ఇంకుబేషన్ కార్యక్రమాలలో పాల్గొని మంచి ఎంటర్ప్రెన్యువర్లుగా ఎదగాలని అన్నారు. ఐడియా ల్యాబ్ కోఆర్డినేటర్ రత్నకమల మాట్లాడుతూ సాంకేతిక పరమైన ఐడియాల ట్రాన్స్ఫర్మేషన్, ఇన్నోవేషన్, ఇంప్లిమెంటేషన్, స్టార్టప్స్ అంశాలపై పరిజ్ఞానం పెంచుకోవచ్చునని అన్నారు. కళాశాల చైర్మన్ అశోకరాజు మాట్లాడుతూ ఇంజనీరింగ్ విద్యార్థులు అధునాతన సాంకేతిక విజ్ఞనానికి ఐడియాను, టెక్నాలజిని జోడించి అభివృద్ధి పరచడానికి ఐడియా ల్యాబ్ ఎంతగానో ఉపకరిస్తుందని అన్నారు. ప్రిన్సిపాళ్లు రమేష్ కుముద్, జనార్థనరాజు, కో కోఆర్డినేటర్ సునీల్ కుమార్ రెడ్డి, హెచ్వోడీలు. అధ్యాపకులు, విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు. -
వెలుగులోకి కొన్నే.. కనిపించనివి ఎన్నో..!
● కడపలో మొదలు.. రాష్ట్రమంతా కేసులు ● ప్రభుత్వానికి పట్టని కరోనా ప్రమాద సంకేతాలు కడప రూరల్ : వైఎస్సార్ జిల్లాలో జూలై మొదటి వారం నుంచి కరోనా కేసులు మొదలయ్యాయి. ఇప్పుడు రాష్ట్రమంతా పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి. అయితే ప్రభుత్వం చేపడుతున్న చర్యలు మాటల్లోనే అని, చేతల్లో కనిపించడం లేదనే అభిప్రాయం కలుగుతోంది. విస్తరిస్తున్న కోవిడ్ వైఎస్సార్ కడప జిల్లాలో 8 కేసులు వెలుగు చూశాయి. అందులో ఇద్దరు చికిత్స పొందుతూ చనిపోయారు. వల్లూరు మండలానికి చెందిన 66 ఏళ్ల వద్ధుడు మరణించాడు. ఆ వ్యక్తి కిడ్నీ వ్యాధిగ్రస్తుడని, డయాలసిస్ చికిత్స పొందుతూ తిరుపతిలో మరణించాడని వైద్య ఆరోగ్యశాఖ అధికారులు అంటున్నారు. కాగా రాష్ట్రవ్యాప్తంగా గురువారం సాయంత్రం నాటికి మొత్తం 14 కేసులకు పైగా వెలుగు చూశాయి. ఈ కేసులన్నీ గుంటూరు, విజయవాడ, విశాఖపట్నం, వెస్ట్, ఈస్ట్ గోదావరి జిల్లాల్లో నమోదయ్యాయి. ఇక్కడ పరిశీలించాల్సిన అంశం ఏమంటే 2020 మార్చి నెలలో రాష్ట్రం అంతా కేసులు వెలుగు చూశాయి. వైఎస్సార్ కడప జిల్లా మినహా రాయలసీమ జిల్లాల్లో పాజిటివ్ కేసులు విరివిగా నమోదయినాయి. కడపలో మాత్రం ఆ ఏడాది మార్చి 30న కేసులు నమోదు కావడం మొదలైంది. అంటే ఇక్కడ ఆలస్యంగా పాజిటివ్ కేసులు వచ్చాయి. కాగా ఈ కేసులకు సంబంధించి ఎలాంటి ట్రావెల్ హిస్టరీ లేదని అధికారులు ఒక అభిప్రాయానికి వచ్చారు. ఈ నేపథ్యంలోనే రాష్ట్రంలోని పలు జిల్లాల్లో పాజిటివ్ కేసులు నమోదు కావడం గమనార్హం. సమస్యగా మారిన నిర్ధారణ జలుబు, దగ్గు, జ్వరం తదితర లక్షణాలు కోవిడ్ను పోలి ఉంటాయి. ఈ లక్షణాలు సర్వసాధారణంగా చాలామందిలోనే కనిపిస్తాయి. అలాగని అందరినీ కరోనా కింద జమ కట్టలేం. నిర్ధారణ పరీక్షల ద్వారా పాజిటివ్ వస్తే కోవిడ్ గా పరిగణించడానికి ఆస్కారం ఉంటుంది. గతంలో కరోనా వచ్చినప్పుడు రాపిడ్ కిట్స్, ట్రూనాట్, ఆర్టిపీసీఆర్ ద్వారా నిర్ధారణ పరీక్షలు నిర్వహించేవారు. వీటిల్లో ఆర్టిపీసీఆర్ ద్వారా జరిపే పరీక్షలు మెరుగైనవని వైద్యుల అభిప్రాయం. అయితే ప్రాథమికంగా ఒక అంచనాకు రావడానికి రాపిడ్ కిట్స్, ట్రూ నాట్ పరీక్షలు ఉపయోగపరంగా ఉంటాయి. అయితే ఈ పరీక్ష పరికరాలు ఇంతవరకు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలకు చేరని పరిస్థితి నెలకొంది. అలాంటప్పుడు వ్యాధి నిర్ధారణ కాకముందే, కరోనాను ఎలా కనిపెట్టగలరనే ప్రశ్న తలెత్తుతోంది. సాధారణంగా వ్యాధులు చలికాలం, వానాకాలంలో వెలుగు చూస్తాయి. అయితే కరోనా కేసులు మాత్రం ఎండల్లో నమోదు కావడం విశేషం. కూటమి ప్రభుత్వం ప్రజల ఆరోగ్యంపై ఎలాంటి దృష్టి పెట్టకుండా, కరోనా మహమ్మారిపై కరుణ చూపుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. 2020లో లాగా కట్టుదిట్టమైన చర్యలు చేపట్టకపోయినా పర్వాలేదు. కరోనా విస్తరించకుండా.. ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకుంటే చాలని సగటు మనిషి అభిప్రాయపడుతున్నాడు. -
నీట్గా మెరిశారు
రిత్వికారెడ్డి చేతన్రెడ్డి షేక్ నూర్ ఉల్ హేస్సేన్ మోహిత్ రోహిత్మదనపల్లె సిటీ: వైద్య,విద్యలో ప్రవేశాలకు నిర్వహించిన నీట్(యూజీ) పునః పరీక్ష ఫలితాల్లో మదనపల్లెకు చెందిన విద్యార్థులు అద్భుత ప్రతిభ కనబరిచారు. మంచి ర్యాంకులు సాధించారు. సత్తా చాటిన రిత్వికారెడ్డి లక్ష్యాన్ని నిర్దేశించుకుని పట్టుదలతో శ్రమిస్తే విజయాన్ని ఎవరూ ఆపలేరని మదనపల్లెకు చెందిన రిత్వాకారెడ్డి నిరూపించారు. నీట్ ప్రవేశ ఫలితాల్లో 652 మార్కులు సాధించి ఆల్ ఇండియా 1311 ర్యాంకు సాధించింది. ఇంటర్మీడియట్ విజాయవాడలోని ప్రైవేటు కాలేజీలో చదివింది. రిత్వికరెడ్డి తల్లిదండ్రులు డాక్టర్ ఎస్.రామలింగారెడ్డి, సునీత. రామలింగారెడ్డి మదనపల్లెలోని ఆదిత్య ఇంజనీరింగ్ కాలేజీ డైరెక్టర్గా ఉన్నారు. నీట్ పరీక్షకు క్రమబద్దంగా సిద్దమై ప్రతి రోజూ ప్రణాళిక ప్రకారం చదవడం , మాక్ టెస్టులు రాయడం, పునశ్చరణకు ప్రాధాన్యం ఇవ్వడం, సమయాన్ని సమర్ధవంతంగా వినియోగించుకోవడంతో తన విజయానికి దోహదపడిందన్నారు. తల్లిదండ్రుల ప్రోత్సాహం, అధ్యాపకుల మార్గదర్శకం ఉపయోగపడినట్లు తెలిపారు. చేతన్రెడ్డి ప్రతిభ గ్రామీణ ప్రాంతమైన తంబళ్లపల్లెకు చెందిన సీతి చేతన్రెడ్డి నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో 591 మార్కులు సాధించి 13041 ర్యాంకు దక్కించుకున్నారు. తంబళ్లపల్లెకు చెందిన మెడికల్స్టోర్ యజమాని నారాయణరెడ్డి, పల్లవి తల్లిదండ్రులు. చిన్నప్పటి నుంచి మదనపల్లెలో విద్యాభ్యాసం చేశారు. ఇంటర్మీడియట్ తిరుపతిలోని ప్రైవేటు కాలేజీలో చదివారు. మొదటి ప్రయత్నంలో మంచి ర్యాంకు సాధించారు. కార్డియాలజిస్టు కావడమే తన ధ్యేయమన్నారు. నూర్కు ర్యాంకు నీట్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో మదనపల్లె పట్టణం ఇందిరానగర్కు చెందిన షేక్ మహమ్మద్ నూర్ ఉల్ హుస్సేన్ 665 మార్కులు సాధించి 663 ర్యాంకు దక్కించుకున్నారు. తల్లిదండ్రులు డాక్టర్ అలీ, తస్కిన్. తండ్రి దంత వైద్యులు కావడంతో చిన్నప్పటి నుంచి నూర్ను ప్రోత్సహించాడు. తండ్రి సహకారంతో విద్యలో రాణించాడు. మొదటి ప్రయత్నంలోనే 663 ర్యాంకు సాధించి అందరి మన్ననలు పొందారు. కార్డియాలజిస్టు కావడము తన లక్ష్యమన్నారు. మోహిత్కు 36 వేల ర్యాంకు పుంగనూరు: పట్టణంలోని బెస్తవీధికి చెందిన మంజుల కుమారుడు బి.మోహిత్ నీట్ ఫలితాలలో 36 వేల ర్యాంకు సాధించాడు. 750 మార్కులకు 550 మార్కులను సాధించాడు. అలాగే క్యాటగిరి కోటాలో 18 వేల ర్యాంకు సాధించాడు. మోహిత్ తండ్రి చిన్నతనంలోనే మృతి చెందాడు. తల్లి మంజుల పాలవ్యాపారం చేస్తూ కుమారుడిని చదివించింది. ఈసందర్భంగా స్నేహితులు మోహిత్కు అభినందనలు తెలిపారు. రోహిత్ సత్తా.. పీలేరు : నీట్ పరీక్షా ఫలితాల్లో పీలేరుకు చెందిన రోహిత్ అనే విద్యార్థి ఆల్ ఇండియా ర్యాంక్లో 316 సాధించి ప్రతిభను చాటాడు. పీలేరుకు చెందిన ఉపాధ్యాయులు పరమేశ్వర్రాజు, విజయలక్ష్మీ కుమారుడు రోహిత్ 720 మార్కులకు 680 మార్కులు సాధించి ఆల్ ఇండియా ర్యాంకు సొంతం చేసుకున్నాడు. ఈ సందర్భంగా రోహిత్ను పలువురు అభినందించారు. -
సైన్స్పై విద్యార్థులు ఆసక్తి పెంచుకోవాలి
మదనపల్లె సిటీ : విద్యార్థులు శాస్త్ర, సాంకేతిక రంగాల్లో రాణించాలని నవోదయ విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత అన్నారు. శుక్రవారం స్థానిక వలసపల్లి వద్దనున్న నవోదయ విద్యాలయంలో క్లస్టర్ స్థాయి విజ్ఞాన ప్రదర్శన కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ విద్యార్థి దశ నుంచి సైన్సు పట్ల ఆసక్తి పెంచుకోవాలన్నారు. ప్రభుత్వం నిర్వహించే ఎగ్జిబిట్లో పాల్గొని తమ ప్రతిభ చూపాలన్నారు. దీని కోసం కేంద్ర ప్రభుత్వం ప్రోత్సాహం ఇస్తున్నట్లు తెలిపారు. ప్రదర్శనలో స్థానిక నవోదయ విద్యాలయంతోపాటు కడప, కర్నూలు, నెల్లూరు, అనంతపురం, ప్రకాశం, మార్కాపురం, కారేకల్, పుదుచ్చేరికి చెందిన విద్యాలయాల నుంచి 59 మంది విద్యార్థులు పాల్గొన్నారు. కార్యక్రమంలో విద్యాలయ అధ్యాపకులు శైలజ,. శారదా, జగదీష్కుమార్, శ్రీనివాసమూర్తి, వెంకటేశులు, సుమతి, కౌన్సిలర్ శంకరప్ప, తదితరులు పాల్గొన్నారు. ఎగ్జిబిట్లో ప్రదర్శనలు సుస్థిర వ్యవసాయం, వ్యర్థపదార్థాల నిర్వహణ, ప్లాస్టిక్కు ప్రత్నామ్యాయం, గ్రీన్ ఎనర్జీ, అభివృద్ధి చెందుతున్న సాంకేతికతలు, వినోదాత్మక గణిత నమూనాలు, మంచి ఆరోగ్యం, పరిశుభ్రత, నీటి సంరక్షణ, నిర్వహణపై ఎగ్జిబిట్స్ ప్రదర్శించారు. శనివారం ముగింపులో విజేతలను ప్రకటిస్తామని ప్రిన్సిపాల్ గీత తెలిపారు. -
పేద.. ఆపై పెద్ద బాధ
● రమ్యశ్రీ ప్రాణాలు కాపాడాలని తల్లిదండ్రుల ఆవేదన ● ఊపిరితిత్తుల వ్యాధి ● చికిత్సకు రూ.50 లక్షలు ఖర్చు పుంగనూరు: సాధారణ రైతు కుటుంబంలో వెంకటరమణ, లక్ష్మీ దంపతులకు మూడో కుమారైగా జన్మించిన రమ్యశ్రీ సీఏ పూర్తి చేసుకుని బెంగళూరులో చార్టెడ్ అకౌంటెంట్ దగ్గర శిక్షణలో ఉండగా ఒక్కసారిగా ఆమెకు ప్రాణాంతమైన ఎల్ఏఎం ఊపిరితిత్తుల వ్యాధిసోకింది. ఆసుపత్రులకు తిరిగినా ఫలితం లేదని, ఊపిరితిత్తులు మార్చాలని వైద్యులు తెలపడంతో ఆమె భవిష్యత్తు కుదేలైంది. రూ.50 లక్షలు ఖర్చు.. రమ్యశ్రీకి ఊపిరితిత్తులు రెండు తీవ్రంగా దెబ్బతినడంతో వాటికి చికిత్స చేయించేందుకు చైన్నె అపోలో ఆసుపత్రిలో చేర్పించారు. డాక్టర్లు ఊపిరితిత్తుల మార్పిడికి రూ.50 లక్షలు ఖర్చు అవుతుందని తెలపడంతో ఆకుటుంబం కన్నీరుమున్నీరౌతోంది. అంత డబ్బు సమకూర్చలేని తల్లిదండ్రులు బిడ్డను పోగొట్టుకోలేక, చికిత్స అందించలేక దాతల సాయంకోసం ఎదురుచూస్తున్నారు. దాతలు ఆదుకుని , తమ బిడ్డ ప్రాణాలను కాపాడాలని ప్రాధేయపడుతున్నారు. దాతలు 7569298992 నంబర్ కు విరాళాలు అందించాలని కోరుతున్నారు. -
బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే ప్రాంతీయ సహకారం సాధ్యం
● దక్షిణాసియా అధ్యయన పర్యటన ఫలవంతం ● వాతావరణం, సాంకేతికత, నూతన ఆవిష్కరణలపై పరస్పర సహకారం ● ప్రతినిధుల బృంద ప్రతినిధి ఎంపీ మిథున్రెడ్డి సాక్షి, మదనపల్లె : బలమైన పార్లమెంటరీ వ్యవస్థతోనే దేశాల మధ్య ప్రాంతీయ సహకారం సాధ్యమవుతుందన్న అభిప్రాయంతో సింగపూర్, ఇండోనేషియాలో జరిగిన అధ్యయన పర్యటన తెలియజేసిందని వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి అన్నారు. ఈ నెల 12 నుంచి 16 వరకు ద్వారా విధాన రూపకల్పన నుండి ఆచరణ వరకు సింగపూర్, ఇండోనేషియా అనుసరిస్తున్న వినూత్న విధానాలను దక్షిణాసియా దేశాల పార్లమెంటేరియన్లు అధ్యయనం చేసే అవకాశం లభించిందని అన్నారు. పర్యటన ముగిసిన సందర్భంగా ఆయన శుక్రవారం మాట్లాడుతూ సింగపూర్, ఇండోనేషియాలో జరిగిన అధ్యయన పర్యటనలో బంగ్లాదేశ్, భూటాన్, భారతదేశం, నేపాల్, శ్రీలంక దేశాల పార్లమెంటేరియన్లతో కూడిన ఉన్నత స్థాయి ప్రతినిథుల బృందంలో మనదేశం తరపున తాను భాగస్వామి అయ్యానని చెప్పారు. సింగపూర్, ఇండోనేషియాలోని ప్రభుత్వ సంస్థలు, పరిశోధనా సంస్థలు, ఆర్థిక సంస్థలతో జరిగిన సమావేశాల ద్వారా వాతావరణ చర్యలు, ఇంధన పరివర్తన, స్థిరత్వం కోసం సాంకేతికత, విధాన ఆవిష్కరణలు, ప్రాంతీయ సహకారంపై పార్లమెంటరీ నాయకత్వాన్ని బలోపేతం చేయడమే లక్ష్యంగా అధ్యయన సమావేశాలు, చర్చలు జరిగాయన్నారు. ఈ చర్చల్లో ప్రాంతీయ సమైక్యత, సహకార విధాన రూపకల్పనలోని అనుభవాల నుండి పాఠాలు నేర్చుకోవడం ద్వారా, సాక్ష్యాధారిత విధానాలు, బలమైన పార్లమెంటరీ నెట్వర్క్లు మరియు దక్షిణాసియాను స్థిరమైన, తక్కువ–కార్బన్ మరియు సుస్థిర భవిష్యత్తు వైపు నడిపించే ఆచరణాత్మక పరిష్కారాలను ఈ అధ్యయన పర్యటన ప్రోత్సహిస్తుందన్న అభిప్రాయం వ్యక్తం చేశారు. సింగపూర్ సస్టైనబిలిటీ, ఎన్విరాన్మెంట్ మంత్రిత్వ శాఖ అధికారులు సింగపూర్ గ్రీన్ ప్లాన్–2050 నాటికి నెట్–జీరో సాధించే రోడ్మ్యాప్ గురించి తెలుసుకున్నట్టు వివరించారు. సస్టైనబుల్ సింగపూర్ గ్యాలరీ, వరద నివారణ కట్టడం, జలాశయం, పార్క్, గ్రీన్ రూఫ్గా ఉపయోగపడే మెరీనా బ్యారేజ్, దేశ వాతావరణ వ్యూహాన్ని ఎలా ప్రతిబింబిస్తుందో ప్రత్యక్షంగా పరిశీలించామన్నారు. సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్ హబ్ను సందర్శించి డీకార్బనైజేషన్, క్లీన్ ఎనర్జీ టెక్నాలజీలపై జరుగుతున్న అత్యాధునిక పరిశోధనలను ల్యాబ్ టూర్ల ద్వారా పరిశీలించామన్నారు. ఇన్స్టిట్యూట్ ఆఫ్ సౌత్ ఏషియన్ స్టడీస్లో జరిగిన చర్చ, రౌండ్ టేబుల్లో జరిగిన కీలక ప్రసంగాల్లో భాగమై మనదేశం తరపున ఆ వేదికపై అభిప్రాయాలను పంచుకున్నట్టు తెలిపారు. ఈ పర్యటన ఫలవంతమైందని, మనదేశం పొరుగు దేశాలతో కోరుకుంటున్న ప్రాంతీయ సహకారం, పరస్పర అవగాహన, మిత్రత్వం గురించి వేదికలపై ప్రసంగించడం జరిగిందని చెప్పారు. ఈ అధ్యయన పర్యటన దక్షిణాసియా దేశాల మధ్య స్నేహపూర్వక వాతావరం పెరిగిందన్నారు. -
పరేషాన్లో మీ‘సేవ’లు
మదనపల్లె (కురబలకోట): ప్రజలకు సత్వరం ప్రభుత్వ సేవలను అందించాలన్న ఉద్దేశంతో ఏర్పాటు చేసిన మీసేవ కేంద్రాలు జిల్లాలో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయి. సచివాలయాల పేరును కూటమి ప్రభుత్వం స్వర్ణ వార్డు–స్వర్ణ గ్రామంగా మార్చింది. వీటి లోగోలతో కొత్త ధ్రువీకరణ పత్రాలు సరఫరా చేయడంలో తీవ్ర జాప్యం నెలకొంది. నెలరోజులుగా రైతులు, విద్యార్థులు, ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. కులం, ఆదాయం, జనన, ఈడబ్ల్యూఎస్, జనన, మరణ, కుటుంబ సభ్యుల ధ్రువీకరణ వంటి అత్యవసర సర్టిఫికెట్లు లేక మీసేవ నిర్వాహకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. పోలీస్ సర్టిఫికెట్లు, వన్బీ, ఆడంగళ్లకు కూడా ఎక్కువగా రైతులు వీటిపై ఆధారపడతారు. ప్రింటింగ్ ధ్రువీకరణ పత్రాలు లేక అవస్థలు పడుతున్నారు. జిల్లాలో 89 మీసేవ కేంద్రాలు ఉన్నాయి. ప్రతి రోజు వివిధ ప్రాంతాల వారు వీటిని ఆశ్రయిస్తారు. వీరికి ఇవ్వడానికి ధ్రువీకరణ పత్రాలు లేకపోవడంతో మీసేవ కేంద్రాలు వెలవెలబోతున్నాయి. కొందరికి రెండు నెలలుగా, మరికొందరికి నెలరోజులుగా వీటిని ఇవ్వడం లేదని చెబుతున్నారు. ఇంత అధ్వాన పరిిస్థితి గతంలో ఎన్నడూ చూడలేదని మీ సేవ నిర్వాహకులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆర్థికంగా కూడా నష్టపోతున్నామని వీటి కోసం డబ్బులు చెల్లించినా ఇంత వరకు రాకపోవడంతో వినియోగదారులకు సమాధానం చెప్పలేకపోతున్నట్లు వ్యధ చెందుతున్నారు. సచివాలయాల్లో కూడా కొరతే... జిల్లాలోని గ్రామ, వార్డు సచివాలయాల్లో కూడా ధ్రువీకరణ పత్రాల కొరత వెంటాడుతోంది. అరకొరగానే వీటిని ఇస్తున్నట్లు చెబుతున్నారు. ఈ విషయమై జిల్లా మేనేజర్ నరేంద్రను విచారించగా జూన్ పది నుంచి పాత సర్టిఫికెట్లను వినియోగించరాదని ఆదేశాలు వచ్చాయన్నారు. దీంతో స్వర్ణ గ్రామ–స్వర్ణ వార్డు సచివాలయాల పేరిట కొత్తవి ప్రింట్ చేయడంలో కొంత జాప్యం జరిగిందన్నారు. ఇప్పటికే వీటిని కొందరికి పంపిణీ చేయడం జరిగిందని మిగిలిన వారికి కూడా త్వరలో అందజేస్తున్నట్లు తెలిపారు. సచివాలయాలనూ వెంటాడుతున్న కొరత కొత్త ధ్రువీకరణ పత్రాల కోసం ఎదురు చూపు -
లారీ యజమానిపై బీరు బాటిల్తో దాడి
మదనపల్లె టౌన్ : మద్యం మత్తులో లారీ యజమానిపై డ్రైవర్ బీరు బాటిల్తో దాడి చేసి గాయపరిచాడు. అర్ధరాత్రి మదనపల్లిలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు, పోలీసుల కథనం.. బసినికొండలో కాపురం ఉంటున్న విజయభాస్కర్ నాయుడు(42)కు లారీలు ఉన్నాయి. స్థానిక సాయిబాబా మందిరం సమీపంలోని షెడ్డు వద్ద లారీ ఉండగా అక్కడికి వెళ్లాడు. డ్రైవర్ అక్బర్తో కలసి మద్యం తాగాడు. ఇంతలో ఇద్దరి మధ్య చిన్న వివాదం తలెత్తి బీరు బాటిళ్లతో పరస్పరం దాడులు చేసుకున్నారు. ఈ ఘటనలో విజయభాస్కర్ నాయుడుకు తీవ్ర గాయాలు కాగా అక్బర్కు స్వల్ప గాయాలు అయినట్లు పోలీసులు తెలిపారు. బాధితులను జిల్లా ఆసుపత్రికి తరలించి, పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ● ఇద్దరికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : అర్ధరాత్రి కారు, ప్రైవేటు ట్రావెల్స్ బస్సు ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు ఎస్ఐ మధురామ చంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడకు చెందిన శ్యాం కుమార్ (23), కోడూరుకు చెందిన వెంకటరమణ(41) కారులో ముందు సీట్లో, ఇద్దరు మహిళలు, ఇద్దరు చిన్న పిల్లలు వెనుక సీట్లో కూర్చొని బెంగళూరుకు వెళ్తున్నారు. మార్గంమధ్యలోని కురబలకోట రైల్వే ఫ్లైఓవర్ వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న ట్రావెల్స్ వచ్చింది. ఈ రెండు వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయి, అందులో ప్రయాణిస్తున్న శ్యాంకుమార్, వెంకటరమణ తీవ్రంగా గాయపడ్డారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రులను కురబలకోట 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. బస్సులోని ప్రయాణికులకు స్వల్ప గాయాలయ్యాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
‘పదేళ్లలో రాష్ట్రమంతటా ప్రకృతి సేద్యం’
సాక్షి, మదనపల్లె: రాబోవు పదేళ్లలో రాష్ట్రంలోని ప్రతి గ్రామంలో ప్రకృతి సేద్యం విస్తరింపజేయడమే రైతు సాధికార సంస్థ లక్ష్యమని సంస్థ సీనియర్ అడ్వైజర్ మురళీ తెలిపారు. మదనపల్లె మండలంలోని అంకిశెట్టిపల్లి గ్రామంలో నిర్వహించిన కమ్యూనిటీ మేనేజ్మెంట్ సెంటర్ సందర్శన కార్యక్రమంలో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామ స్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని తక్కువ పెట్టుబడితో అధిక లాభాలు పొందే అవకాశం ఉందని పేర్కొన్నారు. రైతుల ఆదాయాన్ని పెంచడం, భూసారాన్ని పరిరక్షణ, పర్యావరణ సమతుల్యతను కాపాడడంలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. ప్రకృతి ఆధారిత సాగు పద్ధతులను అవలంబించడం ద్వారా ఆరోగ్యకరమైన ఉత్పత్తులతో పాటు ఖర్చులు తగ్గుతాయని వివరించారు.అనంతరం జిల్లా ప్రాజెక్టు నిర్వహణ విభాగం కార్యాలయంలో మెంటార్లు, రైతు శాస్త్రవేత్తలు, యువ రైతు సహాయకులు, ప్రకృతి వ్యవసాయ సహాయకులతో ప్రత్యేక సమావేశం నిర్వహించారు. కార్యక్రమంలో జిల్లా ప్రాజెక్టు మేనేజర్ వెంకట మోహన్, వ్యవసాయ శాఖ అధికారులు, పులివెందుల అకాడమీ ప్రతినిధులు, రైతు సాధికార సంస్థ సిబ్బంది, ప్రకృతి వ్యవసాయ క్షేత్రస్థాయి సిబ్బంది, రైతులు, మహిళా సంఘాల సభ్యులు పాల్గొన్నారు. -
వివాహిత ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: వివాహిత విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన శుక్రవారం బి.కొత్తకోట మండలంలో చోటుచేసుకుంది. బాధితురాలి కథనం మేరకు.. మండలంలోని వలసగుట్లపల్లికి చెందిన చంద్ర భార్య మమత (40) కొంతకాలంగా కుటుంబ కలహాలతో బాధపడుతోంది. ఈ క్రమంలో మనస్తాపం చెంది ఇంట్లో ఉన్న పురుగుమందు తాగింది. పిల్లలు వెంటనే 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న 108 సిబ్బంది మమతను మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు స్పందించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పింది. ప్రస్తుతం మమత ఆరోగ్య పరిస్థితి నిలకడగా ఉందని వైద్యులు తెలిపారు. ఘటనపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. కురబలకోట: ప్రపంచ వ్యాప్తంగా శరవేగంగా విస్తరిస్తున్న ఏఐ యుగంలో విద్యార్థులు ఉన్నతంగా రాణించాలన్నా జీవితంలో విజయం సాధించాలన్నా ఏఐ ఆధారిత నైపుణ్యాలను తప్పనిసరిగా అలవర్చుకోవాలని బెంగళూరులోని హెచ్ఆర్ఎఫ్వై కంపెనీ డైరెక్టర్ మనోజ్ కుమార్ సోడా వెల్లడించారు. అంగళ్లు మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో కళాశాల క్యాంపస్ నుంచి కార్పొరేట్ ప్రపంచానికి అంశంపై జరిగిన సమావేశంలో ఆయన ముఖ్య అతిధిగా మాట్లాడుతూ డిగ్రీతో పాటు కార్పొరేట్ స్కిల్స్ సాధించాలన్నారు. పరిశ్రమల్లో ఎదురయ్యే సవాళ్లను అవకాశాలుగా మలచుకుంటే ఉన్నత శిఖరాలను చేరుకోవచ్చన్నారు. విజయవంతమైన కేరీర్ నిర్మాణానికి కమ్యూనికేషన్ స్కిల్స్, నాయకత్వ లక్షణాలు, సమస్యలు పరిష్కరించే సామర్థ్యం అవసరమన్నారు. ప్రస్తుత డిజిటల్ యుగంలో ఏఐ ప్రతి రంగాన్ని ప్రభావితం చేస్తోందని మిట్స్ యూనివర్సిటీ అల్యూమిని రిలేషన్స్ ఆఫీసర్ జి. నాగశ్వేత అన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ఏఐ నేర్చుకోవడం ద్వారా జీవితంలో రాణింపునకు దోహదపడుతుందన్నారు. -
ప్రాణం కాపాడిన హెల్మెట్
● కారు ఢీకొని తీవ్ర గాయాలు పుంగనూరు : ఓ నిండు ప్రాణాన్ని హెల్మెట్ కాపాడింది. కానీ ప్రమాదంలో ఎడమ కాలు పాదం కోల్పోయాడు. ఈ సంఘటన శుక్రవారం మధ్యాహ్నం భగత్సింగ్కాలనీ మలుపు వద్ద జరిగింది. వివరాలిలా ఉన్నాయి. తమిళనాడుకు చెందిన చక్రనాథ్(30) ద్విచక్రవాహనంలో కోర్టుకు వెళ్లేందుకు మదనపల్లెకు బైపాస్లో వెళ్తుండగా.. ఎదురుగా అతివేగంగా వస్తున్న తమిళనాడుకు చెందిన కారు ఢీకొంది. ఈ సమయంలో చక్రనాథ్కు హెల్మెట్ ఉండటంతో తలకు ఎలాంటి దెబ్బలు తగలక ప్రాణపాయం నుంచి బయటపడ్డాడు. కానీ కాలు పాదం మాత్రం తెగిపడి పోయింది. ఈ సంఘటనను స్థానికులు గమనించి బాధితున్ని 108లో ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో బాధితున్ని మెరుగైన వైద్యం కోసం వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
తాళం వేసిన ఇంటికి కన్నం
గాలివీడు : గాలివీడులోని హైస్కూల్ దగ్గర ఉన్న పూసల కాలనీలో ఓ ఇంట్లో గురువారం రాత్రి దొంగలు పడ్డారు. బంగారు నగలు, నగదు దోచుకెళ్లారు. వివరాల్లోకి వెళితే.. చెప్పలి అలియాస్ కూరగాయల చంద్ర, రాణమ్మలు 40 ఏళ్ల నుంచి చిరు వ్యాపారాలు చేసుకుంటూ కుటుంబాన్ని పోషించుకుంటున్నారు. ఈ క్రమంలో కుమారుడు ఉద్యోగంలో స్థిరపడగా, రామచంద్ర సంతల్లో కూరగాయల వ్యాపారం చేస్తుంటాడు. వ్యాపారంలో సంపాదించినదే కాకుండా కుమారుడి వివాహానికి అత్త ఇచ్చిన బంగారు అంతా ఇంట్లో బీరువాలో భద్రపరచుకొని సంతలో వ్యాపారానికి వెళ్లారు. ఈ క్రమంలో గురువారం కోనంపేట సంతకు వెళ్లి తిరిగి రావడానికి బస్సు లేక కుమార్తె ఇంటికి వెళ్లారు. ఉదయం లేచి ఇంటికి వచ్చే సరికి తలుపులు, బీరువా పగులగొట్టి 30 తులాల బంగారు ఆభరణాలు, 50 వేల నగదు దోచుకెళ్లారు. సంఘటనను గమనించిన రామచంద్ర పోలీసులకు ఫిర్యాదు చేయగా లక్కిరెడ్డిపల్లి సీఐ, గాలివీడు ఎస్ఐ సిబ్బంది డాగ్ స్క్వాడ్తో వచ్చి పరిశీలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. 30 తులాల బంగారు, రూ.50 వేల అపహరణ -
దక్షిణాయనం ఆరంభం
● ప్రారంభమైన ఆషాఢమాసం ● తొలి ఏకాదశి, వ్యాసపౌర్ణమి పండుగలు మదనపల్లె సిటీ: ఆషాడమాసం ఈనెల 15వ తేదీ నుంచి ప్రారంభమైంది. ఆగస్టు 12వతేదీ వరకు కొనసాగుతుంది. ఈ మాసంలో అనేక విశిష్టతలు ఉన్నాయి. తొలి ఏకాదశి, గురుపౌర్ణమి(వ్యాస పౌర్ణమి), పూరీలో జగన్నాథయాత్ర ఈ మాసంలో నిర్వహిస్తారు. ఎటువంటి శుభకార్యాలు ఈ మాసంలో ఉండనందు వల్ల శూన్యమాసంగా పేర్కొంటారు. మాస విశేషాలు, ప్రాముఖ్యత పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలను ఆషాఢమాసంగా చెబుతారు. వర్షబుతువు కూడా ఈ మాసంలోనే ప్రారంభమవుతుంది. ఆషాఢంలో చేసే సముద్ర స్నానాలు ఎంతో ముక్తిదాయకాలుగా భావిస్తారు. పాదరక్షలు, గొడుగు, ఉప్పుదానం చేయడం మంచి ఫలితాలనిస్తుంది. ఈ మాసంలో వ్యవసాయ పనులు ప్రారంభమవుతాయి. ఇక పూర్వకాలం నుంచి ఆషాఢంలో కొత్త కోడలు పుట్టింటిలోనే ఉండాలి. అల్లుడు అత్తవారింటికి వెళ్లకూడదు అనే నియమం కూడా ఉంది.ఈ మాసంలోనే వారాహి ఉత్సవాలు ప్రారంభమవుతాయి. అమ్మవారికి ప్రత్యేక అలంకరణలతో పూజలు,అభిషేకాలు చేస్తారు. ఆషాఢంలోనే దక్షిణాయనం ప్రారంభమవుతుంది. కర్కాటకంలోని సూర్యుడు ప్రవేశించడంతో దక్షిణాయనం ఆరంభమవుతుంది. అంటే సూర్యుడు ఈ రాశిలో ప్రవేశించినప్పటి నుంచి తిరిగి మకరరాశిలో ప్రవేశించే వరకు దక్షిణాయనం అంటారు. ఆ ఆయనంలో సూర్యుడు భూమద్యరేఖకు దక్షిణంగా సంచిరిస్తాడు. దక్షిణాయనం పితృదేవతల ప్రీతికరమని కూడా చెబుతారు. గురుపౌర్ణమి త్రిమూర్తి స్వరూపుడైన గురువుని ఆరాధించే పర్వదినం ఈనెల 29తేదీన గురుపూర్ణిమ నిర్వహిస్తారు. దీనినే వ్యాసపూర్ణిమ అని అంటారు.ఆషాడ శుద్ధ పంచమి స్కంధ పంచమిగా చెప్తారు. సుబ్రమణ్యస్వామిని ఈ రోజు భక్తిశ్రద్ధలతో పూజిస్తారు. ఆషాఢషష్టిని కుమారషష్టి గా జరుపుకుంటారు. ఆషాడసప్తమిని భానుసప్తమిగా జరుపుకుంటారు. తొలి ఏకాదశి: ఈనెల 25న శనివారం తొలి ఏకాదశి వస్తుంది. ఉత్తరం నుంచి దక్షిణ దిశగా పయనిస్తున్న ప్రభాకరుడు మూడు నెలల తర్వాత మధ్యకు చేరుకుంటాడు. ఈ రోజున పగలు, రాత్రి,నిమిషం ,ఘడియ, విఘడియల తేడా లేకుండా సరిసమానంగా ఉంటాయి. ఆషాఢ శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి అని శయన ఏకాదశి అని అంటారు. ఈ రోజు చాతుర్మాస వ్రతం ఆరంభమవుతుంది. దీనినే మతీత్రయ ఏకాదశి అని అంటారు. ఆషాఢ శుద్ద ఏకాదశి నాడు విష్ణువు పాలకడలిపై యోగనిద్రలోని వెళ్లే సందర్భాన్ని తొలి ఏకాదశిగా పరిగణిస్తారు. పూర్వాషాడ నక్షత్రంలో కూడిన పౌర్ణమి ఉన్న నెలయే ఆషాఢమాసం.దీనిని శూన్యమాసమని అంటారు. హిందూ సంప్రదాయంలో ఈ మాసానికి విశిష్ట స్థానం ఉంది. శుభకార్యాల కంటే వ్రతాలు, దైవారాధన, ఆధ్యాత్మిక కార్యక్రమాలకు ఎక్కువ ప్రాధాన్యం ఇస్తారు. – ఆలూరి ఫణికుమార్శర్మ, వేదపండితులు,మదనపల్లె. -
వైఎస్సార్సీపీకి బీసీలను చేరువ చేయాలి
కడప కార్పొరేషన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి బీసీలను చేరువ చేయాలని ఆ పార్టీ రాష్ట్ర బీసీ విభాగం అధ్యక్షుడు రాచగొల్ల రమేష్ యాదవ్ అన్నారు. గురువారం విజయవాడలోని ఆ పార్టీ కేంద్ర కార్యాలయంలో మాజీ మంత్రి కోడాలి నాని, బీసీ విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ రమేష్ గౌడ్లతో కలిసి బీసీ విభాగంపై సమీక్ష నిర్వహించారు. ఈ సమావేశానికి వైఎస్సార్ కడప జిల్లా నుంచి బీసీ విభాగం జిల్లా అధ్యక్షుడు నేట్లపల్లి శివరామ్ హాజరయ్యారు. జిల్లాలో బీసీల యొక్క ప్రధాన సమస్యలు, కూటమి ప్రభుత్వంలో బీసీలకు రాజకీయ ప్రాధాన్యత, ఎన్నికల హామీలు, మొదలగు విషయాలు సమావేశంలో చర్చకు వచ్చాయి. రెండు సంవత్సరాల కాలంలో బీసీ విభాగం చేసిన కార్యక్రమాలు పరిశీలించారు. భవిష్యత్లో ఎలా ముందుకు వెళ్ళాలి, బీసీలను పార్టీకి చేరువ చేసేందుకు చేయాల్సిన కార్యాచరణ ప్రణాళికపై చర్చించారు. -
మిట్స్ ప్రొఫెసర్కు అరుదైన గుర్తింపు
కురబలకోట: మదనపల్లె సమీపంలోని అంగళ్లులోని మిట్స్ డీమ్ట్ యూనివర్సిటీ అసిస్టెంట్ ప్రొఫెసర్, అలుమ్ని రిలేషన్స్ ఆఫీసర్ డాక్టర్ గుత్తి నాగశ్వేత ఐఈఈఈ సీనియర్ మెంబర్ గ్రేడ్ సాధించి గౌరవాన్ని అందుకున్నట్లు వీసీ యువరాజ్ గురువారం తెలిపారు. ఇంజినీరింగ్, సాంకేతిక రంగాల్లో పదేళ్లకు పైగా అనుభవం, పరిశోధనల్లో చేసిన కృషి, సాంకేతిక సేవలు, నాయకత్వ లక్షణాలు, వృత్తి పరమైన నైపుణ్యాలును గుర్తిస్తూ ఈ అంతర్జాతీయ గుర్తింపు లభించిందన్నారు. డాక్టర్ గుత్తి నాగశ్వేత అనేక జాతీయ, అంతర్జాతీయ సదస్సులలో పరిశోధన పత్రాలను సమర్పించడమే కాకుండా విద్యార్థులలో పరిశోధన దృక్పథాన్ని పెంపొందించడంలోనూ కీలక పాత్ర పోషిస్తున్నారని తెలిపారు. చాన్స్లర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి, ప్రోచాన్స్లర్ నాదేళ్ల ద్వారకనాఽథ్, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ కీర్తి నాదేళ్ల, రిజిస్ట్రార్ డాక్టర్ డి.ప్రదీప్కుమార్, ఐఈఈఈ కోఆర్డినేటర్ సి.కుమార్ అధ్యాపకులు, సిబ్బంది నాగశ్వేతను అభినందించారు. -
ఉత్సాహంగా ఏసీఏ అండర్–19 మల్టీ డే మ్యాచ్లు
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఏసీఏ అండర్–19 మల్టీ డే మెన్ మ్యాచ్లు రెండవ రోజు ఉత్సాహంగా కొనసాగాయి. గురువారం వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో మ్యాచ్లో 78 పరుగుల ఓవర్ నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 65.3 ఓవర్లకు 221 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని సాత్విక్ 111 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో 105 (సెంచరీ) చేశాడు. కిరణ్కుమార్ 36 పరుగులు చేశాడు. కర్నూలు జట్టులోని మల్లికార్జున 5, జితేస్ వర్ధన్ 2, సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశారు. అనంతరం అనంతపురం జట్టు ఫాలోఆన్లో పడటంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించింది. దీంతో రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 57 ఓవర్లకు 6 వికెట్లు కోల్పోయి 203 పరుగులు చేసింది. ఆ జట్టులోని ఆదినారాయణ 62, సందీప్రెడ్డి 56 పరుగులు చేశారు. కర్నూలు జట్టులోని మల్లికార్జున అద్భుతంగా బౌలింగ్ చేసి 4 వికెట్లు తీశాడు. సాయి విఘ్నేష్ 2 వికెట్లు తీశాడు. అయితే కర్నూలు జట్టు బౌలర్ మల్లికార్జున తొలి ఇన్నింగ్స్లో 5 , రెండవ ఇన్నింగ్స్ 4 వికెట్లు తీయడం కొసమెరుపు. దీంతో అనంతపురం జట్టు 41 పరుగులు ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో.. అదే విధంగా కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో 20 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన నెల్లూరు జట్టు 83.1 ఓవర్లకు 270 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని లోకేష్ 98, సుశాంత్ 59 పరుగులు చేశారు. చిత్తూరు జట్టులోని యశ్వంత్ చక్కటి లైనఫ్తో బౌలింగ్ వేసి 4 వికెట్లు తీశాడు. జయంత్, తేజేష్ రెండేసి వికెట్లు తీశారు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన చిత్తూరు జట్టు 13 ఓవర్లకు 4 వికెట్లు నష్టానికి 78 పరుగులు చేసింది. ఆ జట్టులోని రోహిత్ 28 పరుగులు చేవాడు. నెల్లూరు జట్టులోని లోకేస్ 3 వికెట్లు తీశాడు. చిత్తూరు జట్టు 121 పరుగుల ముందజలో ఉంది. దీంతో రెండవ రోజు ఆట ముగిసింది. సాత్విక్, 105 పరుగులు యశ్వంత్, 4 వికెట్లు మల్లికార్జున, 5 వికెట్లు ఆదినారాయణ, 62 పరుగులు -
విధుల్లో నిర్లక్ష్యం వహిస్తే చర్యలు
బి.కొత్తకోట(పెద్దతిప్పసముద్రం): స్థానిక సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని గురువారం జిల్లా రిజిస్ట్రార్ ఉమా మహేశ్వరి అకస్మికంగా తనిఖీ చేశారు. కీలకమైన రికార్డులను పరిశీలించారు. సిబ్బంది పని తీరుపై ఆరా తీశారు. ప్రతి ఒక్కరూ అంకితభావంతో పని చేయాలని, విధుల్లో నిర్లక్ష్యం వహించినా, ప్రజలతో దురుసుగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. అనంతరం ఆమె కార్యాలయానికి వచ్చిన ప్రజలతో మమేకమై సిబ్బంది పని తీరు, సేవలు సంతృప్తికరంగా ఉన్నాయా, కాలయాపన చేస్తూ పనుల కోసం తిప్పుకుంటున్నారా అని అడిగి తెలుసుకున్నారు. ఈ నేపథ్యంలో సబ్ రిజిస్ట్రార్ అర్జీదారులతో దురుసుగా ప్రవర్తిస్తూ, లెక్కలేనితనంతో మాట్లాడుతున్నారని పలువురు జిల్లా రిజిస్ట్రార్కు ఫిర్యాదు చేశారు. -
ట్రాక్టర్ ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలోని అంగళ్లు భారత్ కల్యాణ మండపం వద్ద గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డారు.స్థానికుల కథనం ప్రకారం, వేగంగా వచ్చిన ఓ ట్రాక్టర్ అదుపుతప్పి ముందు వెళుతున్న మండలంలోని తెట్టు నాగలాపురానికి చెందిన గోపి(31), వెంకటరమణ(36) వెళుతున్న ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్పై ఉన్న ఇద్దరు వ్యక్తులు కిందపడి తీవ్ర గాయాలపాలయ్యారు. సమాచారం అందుకున్న కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని క్షతగాత్రులకు ప్రథమ చికిత్స అందించి, మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి గల కారణాలు, గాయపడిన వారి పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పుంగనూరు: బోయకొండ గంగమ్మను దర్శనం చేసుకుని ఇంటికి వెళ్తున్న భక్తుల ఆటోను ఆర్టీసీ బస్సు మండలంలోని కృష్ణాపురం వద్ద ఢీకొనడంతో ఐదుగురు గాయపడిన సంఘటన గురువారం సాయంత్రం జరిగింది. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెకు చెందిన ఐదుగురు ఆటోలో బోయకొండకు వెళ్లి తిరిగి వెళ్తుండగా కృష్ణాపురం సమీపంలో ఎదురుగా వస్తున్న ఆర్టీసీ బస్సు ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆటో బోల్తాపడి, అందులో ప్రయాణిస్తున్న సతీష్, కుమార్, మల్లికార్జున, చంద్ర, శ్రీరాములు తీవ్రంగా గాయపడ్డారు. వీరిలో సతీష్ పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. స్థానికులు గమనించి బాధితులను మదనపల్లె ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మదనపల్లె టౌన్: కురబలకోట మండలంలో గురువారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో సత్యసాయి జిల్లాకు చెందిన ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు.స్థానికుల కథనం ప్రకారం.. సత్య సాయి జిల్లా కదిరి నియోజకవర్గం లోని కొక్కంటి క్రాస్కు చెందిన సాయి కిరణ్ (28) బైక్పై సొంత పనిమీద మదనపల్లెకు బయలు దేరాడు. కురబలకోట మండలం, కంటేవారిపల్లి వద్దకు రాగానే, ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇచ్చే క్రమంలో అదుపు తప్పి కిందపడ్డాడు. ఈ ప్రమాదంలో తలకు బలమైన గాయమై తీవ్ర రక్తస్రావం అయింది. వెంటనే స్థానికులు 108కు సమాచారం అందించారు. కురబలకోట 108 సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడికి ప్రథమ చికిత్స అందించి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితుడి పరిస్థితి ఆందోళనకరంగా ఉన్నట్లు సమాచారం. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. స్కూటర్ ఢీకొని వృద్ధ రైతుకు...మదనపల్లె టౌన్: స్కూటర్ ఢీకొనడంతో ఓ వృద్ధ రైతు తీవ్రంగా గాయపడిన సంఘటన బుధవారం రాత్రి ములకలచెరువు మండలంలో చోటుచేసుకుంది. బాధిత రైతు కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని యేసువారిపల్లికి చెందిన రైతు రవణప్ప (65) సొంత పనిమీద తన బైకులో ములకలచెరువుకు బయలు దేరాడు. మార్గమధ్యంలోని చీకటిమనుపల్లి వద్దకు రాగానే, గుర్తుతెలియని స్కూటర్ వేగంగా వచ్చి బైకును ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవణప్ప కిందపడి తల, కాళ్లు, చేతులకు తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన స్థానికులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. కుటుంబీకులు ఘటనా స్థలానికి చేరుకుని, క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రమాదానికి కారణమైన స్కూటర్ డ్రైవర్ పరారైనట్లు సమాచారం. ఘటనపై ములకలచెరువు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పట్టపగలే భారీ చోరీ
– బంగారు నగలు అపహరణ గుర్రంకొండ: పట్టపగలే దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువాలో దాచి ఉంచిన 120 గ్రాముల బంగారు నగలను చోరీ చేసుకెళ్లిన సంఘటన మండలంలోని గుర్రంకొండ మేజర్ పంచాయతీ తలారివాండ్లపల్లెలో జగిరింది. గ్రామానికి చెందిన రాజన్న దంపతులు వ్యవసాయం చేసుకొంటూ జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి పక్కనే పొలాలు ఉండడంతో ఉదయం పొలం వద్దకు వెళ్లి మధ్యాహ్నం ఇంటికి చేరుకొంటారు. ఈనేపథ్యంలో గురువారం పొలం వద్దకు వెళ్లి వ్యవసాయ పనులు ముగించుకొని ఇంటికి చేరుకొన్నారు. తలుపు తాళాలు బద్దలు కొట్టిన దృశ్యాలు కనిపించాయి. ఇంట్లోకి వెళ్లి పరిశీలించారు. బీరువాతలుపులు తెరచి లాకర్ను బద్దలు కొట్టినట్లు గుర్తించారు. లాకర్లో ఉన్నబంగారునగలు కనిపించక పోవడంతో బాధితులు ఆందోళన చెందారు. గుర్తుతెలియని దుండగులు ఇంట్లో చొరబడి 120 గ్రాముల బంగారు నగలు చోరిచేసుకెళ్లినట్లు బాధితులు పేర్కొన్నారు. ఈ సంఘటనపై స్థానిక పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు వారు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. రొంపిచెర్ల: రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని జాండ్రవీధిలో నగదు, పట్టు చీరలు, బంగారు నగలు చోరీకి గురైనట్లు బాధితులు రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. వివరాలు ఇలా ఉన్నాయి. జాండ్రవీధికి చెందిన రామస్వామి, మునెమ్మ బుధవారం వ్యవసాయ పనుల కోసం స్వగ్రామం చెంచెంరెడ్డిగారిపల్లెకు వెళ్లారు. దీంతో ఇంట్లో ఎవరు లేరని తెలుసుకున్న దొంగలు బుధవారం రాత్రి ఇంటి తాళాలు పగలగొట్టి రూ.30 వేలు నగదు, నాలుగు గ్రాములు బంగారు నగలు, రూ.80 వేలు విలువ చేసే నాలుగు పట్టు చీరలు ఎత్తుకెళ్లారు. గురువారం సాయంత్రం ఇంటికి వచ్చిన దంపతులకు ఇంటి తాళాలు పగులగొట్టి ఉండటం గమనించారు.లోపలికి వెళ్లి చూడగా బీరువా పగల గొట్టి చోరీ చేశారని గుర్తించారు. అనంతరం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ మధుసూధన్ తెలిపారు. ఆర్టీసీ బస్సులో బంగారు గొలుసు చోరీ సదుం: మండలానికి చెందిన ఓ మహిళ బంగారు గొలుసు చోరీకి గురైంది. బాధితురాలి కథనం మేరకు..నడిగడ్డకు చెందిన సంపూర్ణమ్మ చంద్రగిరి బైపాస్ రోడ్డులో సదుం వచ్చేందుకు పుంగనూరుకు వెళ్లే ఏపీ03టీడీ8667 నంబరు గల ఆర్టీసీ బస్సు ఎక్కింది. రద్దీగా ఉండటంతో నిలుచుని ప్రయాణం చేసిన ఆమె మార్గ మధ్యంలో సీటు ఖాళీ కావడంతో కూర్చుంది. ఆమె పక్కన కూర్చున్న ఇద్దరు మహిళల్లో ఒకరు తనకు వాంతి అయ్యేలా ఉందని, జరగాలని చెప్పింది. సంపూర్ణమ్మ జరిగి కూర్చున్న కొద్ది సేపటికే వారిద్దరు బస్సు దిగారు. పాకాల సమీపంలో తన మెడలోని 28 గ్రాముల బంగారు బొట్టుగొలుసు కనిపించక పోవడంతో బస్సు ఆపాలని కండెక్టరును కోరింది. కానీ ఆమె బస్సు ఆపేందుకు నిరాకరించింది. మార్గమధ్యంలో ఏదో ఒక పోలీసు స్టేషన్ వద్ద ఆపాలని మొరపెట్టినా పట్టించుకోలేదని ఆమె కన్నీటి పర్యంతం అయింది. చివరకు సదుం పోలీసు స్టేషన్ వద్ద ఆపాలని కోరినా ఆపకుండా బస్టాండులో ఆపారని బాధితురాలు తెలిపింది. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పింది. -
నల్లని మేఘం తెల్లముఖం వేసింది.. జోడెద్దుల కాడి మూలనపడి మూలుగుతోంది.. పొలంలో పడాల్సిన విత్తనం సంచుల్లోనే ఉండిపోయింది..వెరసి నేలతల్లి బీడుగా మారింది.నింగీనేల కేసి చూస్తూ రైతు ముఖం నిలువునా వాడిపోయింది. ఖరీఫ్ ముంగిట దరువేయడానికి ‘కరువు’రాకాసిలా దూసుకొస్తోంద
సాక్షి, మదనపల్లె : ఖరీఫ్ పంటల సాగు పాతికేళ్ల చరిత్రలో ఎన్నడూ చూడని దుర్భిక్ష పరిస్థితి ప్రస్తుతం జిల్లా రైతాంగాన్ని వెంటాడుతోంది. ఎల్నినో రూపంలో తీవ్రమైన వర్షాభావ పరిస్థితులు ఏర్పడి, రైతులు కనీసం తమ ఇంటి అవసరాల కోసం అవసరమైన పంటలను కూడా సాగు చేయలేని పరిస్థితికి వచ్చారు. కూటమి ప్రభుత్వం రాక ముందు వరకు ఈ పరిస్థితి రైతులకు ఎదురు కాలేదు. 2024 ఖరీఫ్ నుంచి వరుసగా రైతులకు ఎదురు దెబ్బలు పడుతున్నాయి. పంటలు సాగు చేయలేని నిస్సహస్థితికి వచ్చారు. గత రెండేళ్ల ఖరీఫ్ లో కరువు పరిస్థితుల్లో వెంటాడితే, ఇప్పుడు ఎల్నినో వెంటాడింది. తీవ్రమైన కరువు, దుర్భిక్షాన్ని తీసుకొచ్చింది. ఖరీఫ్ ముగిసిందిసాధారణంగా ఖరీఫ్ పంటల సాగుకు జూలై 15 వరకు అనుకూలం. జూన్లో వర్షాలు కురవకపోతే జూలై వర్షాలపై ఆధారపడి పంటలు సాగవుతాయి. ఏప్రిల్ మూడో వారం నుంచి దుక్కులు దున్ని, మీ చివరి నాటికి పంటలు విత్తడం, జూలై నెలాఖరుకు అన్ని పంటల సాగు పూర్తి చేస్తారు. ప్రస్తుత ఖరీఫ్లో ఈ పరిస్థితి లేదు. జూన్లో వర్షపాతం 77.5 మిల్లీమీటర్లు కురవాల్సి ఉండగా 31.2 మిల్లీమీటర్ల లోటు నమోదైంది. జూలై వర్షపాతం ఒక మిల్లీమీటర్ కూడా కురవలేదు. ప్రధానంగా జూన్ 14 నుంచి (జూలై 16) వరకు జిల్లాలో చినుకు జాడలేదు. ఈ నెలలో 90.5 మిల్లీమీటర్ల వర్షపాతం కురవాల్సి ఉండగా రెండు వారాలైనా ఒక్క మిల్లీమీటర్ వర్షం కూడా పడలేదు. దీంతో తీవ్ర వర్షాభావం మధ్య ఖరీఫ్ కథ ముగిసిపోయింది. దారుణమై పంటల సాగుజిల్లాలో గత రెండు ఖరీఫ్లలో కరువు పరిస్థితుల్లో ఉన్నప్పటికీ అంతో ఎంతో పంటలు సాగయ్యాయి. ప్రస్తుత ఖరీఫ్లో మాత్రం పంటసాగన్న మాటే లేకుండా పోయింది. జిల్లాలో ఇప్పటి ఖరీఫ్లో 46,055 హెక్టార్లలో ప్రధాన పంటలు సాగుతాయని అంచనా వేశారు. గత ఖరీఫ్లతో పోలిస్తే ఈ విస్తీర్ణం తక్కువ. అయినప్పటికీ జూలై 11 నాటికి సాగైన విస్తీర్ణం కేవలం 4.28 శాతమే. అంటే కేవలం 1,970 హెక్టార్లలోనే పంటలు సాగు చేశారు. ఇందులో అత్యధిక పంట వేరుశనగ 27,015 హెక్టార్లలో సాగవ్వాల్సి ఉండగా 1,442 హెక్టార్లకే పరిమితమైంది. ఇలా అన్ని ప్రధాన పంటలు కొద్దిపాటి విస్తీర్ణంలోనే సాగయ్యాయి. అంచనా వేసిన సాధారణ విస్తీర్ణంలో 44,085 హెక్టార్ల భూమి బీడుగా మిగిలిపోయింది. ప్రత్యామ్నాయం లేనట్లేఓ మోస్తారు వర్షాలు కురిస్తే ప్రత్యామ్నాయ పంటలను సాగు చేసేందుకు అనువుగా ఉంటుంది. ప్రస్తుతం వర్షాభావ పరిస్థితులు తీవ్రంగా ఉండడం వల్ల ప్రత్యామ్నాయ పంటలు కూడా సాగు కాని పరిస్థితి నెలకొంది. సాధారణంగా జూలై తరువాత ప్రత్యామ్నాయ పంటగా ఉలవలను సాగు చేయాలని ప్రభుత్వం వాటిని పంపిణీ చేస్తుంది. అయితే ఆగస్టు వరకు వర్షాలే లేనప్పుడు ప్రత్యామ్నాయ పంటలు ఎలా సాగుతాయి అన్నది ప్రశ్న. ఇలాంటి పరిస్థితుల్లో పంటల సాగుపై ఆశలు పెట్టుకోవడం ఇబ్బందికరంగానే ఉంటుంది. ప్రత్యా మ్నాయ పంటలు కూడా సాగు చేయలేనంత దుర్భిక్ష పరిస్థితి ఈ ఖరీఫ్ లో నెలకొంది. జిల్లాలో 2024 ఖరీఫ్లో 19 మండలాలు, 2025 ఖరీఫ్లో 9 మండలాలను కూటమి ప్రభుత్వం కరువు మండలాలు ప్రకటించింది. అయితే ప్రస్తుతం జిల్లా అంతటా కరువు పరిస్థితులు నెలకొన్నాయి.● ఎల్నినో దెబ్బకు ఖరీఫ్ ఖతం ● 46,055 హెక్టార్లకు.. సాగైంది 1,970 హెక్టార్లలోనే ● ఖరీఫ్ చరిత్రలోనే దారుణమైన పరిస్థితి ● బీడుగా 44,985 హెక్టార్లురూ.7 లక్షలతో సాగు చేశా వర్షాలను నమ్ముకుని మూడున్నర ఎకరాల్లో రూ.7 లక్షలు ఖర్చు చేసి ఖరీఫ్లో టమాట సాగు చేస్తున్నా. సకాలంలో వర్షాలు కురిస్తే పంట, పంట దిగుబడి ఆశాజనకంగా ఉంటుంది. లేనిపక్షంలో పంటసాగుకు నీళ్లలేక ఎండిపోక తప్పదు. దేవుడిపై భారం వేసి పంటలవైపు చూసుకొంటున్నా. –సుధాకర్రెడ్డి, టమాట రైతు, తంబళ్లపల్లెపంట పోయినట్టే నెల క్రితం వర్షానికి రెండున్నర ఎకరాల్లో వేరుశనగ సాగు చేశా. విత్తనం వేసిన తర్వాత చినుకు జాడలేదు. కళ్లముందే పంట ఎండిపోయింది. ఇప్పుడు వర్షం కురిసినా పంట పండదు, దిగుబడి రాదు. పెట్టిన పెట్టుబడి, కష్టం నష్టపోవడం తప్ప మరో మార్గం లేదు. వర్షాలు కురిసి పంటలు సాగయ్యే పరిస్థితులు లేవు. ప్రభుత్వం పంట సాగు చేసిన రైతులకు పరిహారం చెల్లించాలి. –గౌతం కుమార్ రెడ్డి, చెన్నామర్రి రైతు, కురబలకోట -
అప్పాజోస్యులకు ‘గడియారం’ పురస్కారం
కడప సెవెన్రోడ్స్: చీరాలకు చెందిన ప్రముఖకవి, అజో–విభొ–కందాళం ఫౌండేషన్ నిర్వాహకులు, ప్రసిద్ధ కంప్యూటర్ శాస్త్రవేత్త ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ ‘మహాకవి’ డాక్టర్ గడియారం వేంకట శేషశాస్త్రి 45వ సాహిత్య పురస్కారానికి ఎంపికయినట్లు రచన సాహిత్య వేదిక కార్యదర్శి డాక్టర్ భూతపురి గోపాలకృష్ణశాస్త్రి ఒక ప్రకటనలో తెలిపారు. పురస్కార ప్రదాన సభ రచన సాహిత్య వేదిక, గడియారం కుటుంబీకుల సంయుక్త ఆధ్వర్యంలో సెప్టెంబరులో ప్రొద్దుటూరులో జరుగుతుందన్నారు. 1982 నుండి ప్రతి ఏటా ఒక ఉత్తమ కావ్యానికి బహూకరిస్తూ వస్తున్న ఈ అవార్డుకు 2025 సంవత్సరానికి ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణ రచించిన ‘పంచవటి’ (పంచభూత తారావళులు) అనే పద్యకృతి ఎంపికై నట్లు తెలిపారు. పురస్కార ప్రదాన సభలో ఆచార్య అప్పాజోస్యుల సత్యనారాయణకు అవార్డు, రూ.10,000 నగదు బహుమతి, ప్రశంసాపత్రం అందజేయనున్నట్లు తెలిపారు. -
నీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు చర్యలు
కడప సెవెన్రోడ్స్ : జిల్లాలో తాగునీటి ఎద్దడిని ఎదుర్కొనేందుకు అన్ని రకాల చర్యలు తీసుకోవాలని జిల్లా పరిషత్ చైర్మన్ ముత్యాల రామగోవిందరెడ్డి అధికారులను ఆదేశించారు. గురువారం నిర్వహించిన జెడ్పీ స్టాండింగ్ కమిటీల సమావేశంలో నీటి ఎద్దడిపై ఆయన సమీక్షించారు. ప్రజలకు తాగునీరు అందించేందుకు తొలుత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. జిల్లాలో వీరబల్లి, సుండుపల్లె, చక్రాయపేట మండలాల్లోని 40 గ్రామాల్లో తాగునీటి సమస్య ఉందని ఆర్డబ్ల్యూఎస్ ఎస్ఈ ఏడుకొండలు తెలిపారు. సుమారు 180 మీటర్ల లోతులో భూగర్భ జలం ఉందన్నారు. అందుకే బోర్ల లోతు పెంచుతున్నామన్నారు. దువ్వూరు మండలంలోని చింతకుంట చెరువు నింపగలిగితే పలు గ్రామాలకు తాగునీరు అందించవచ్చన్నారు. దీనిపై చైర్మన్ మాట్లాడుతూ తెలుగుగంగలో అంతర్భాగమైన ఎస్ఆర్–1లో నీరు లేదన్నారు. శ్రీశైలం, వెలుగోడు నుంచి నీరు వస్తేనే చెరువులు నింపగలుగుతామన్నారు. వరికుంట గ్రామంలో తాగునీరు సరఫరా చేయాలని కాశినాయన మండల జెడ్పీటీసీ సత్యంరెడ్డి కోరారు. తహసీల్దార్ కార్యాలయం పక్కన బోరు ఎండిపోయి తాగునీటికి ప్రజలు అవస్థలు పడుతున్నారని పెనగలూరు జెడ్పీటీసీ పెద్ద సుబ్బరాయుడు తెలిపారు. బక్కన్నగారిపల్లె బీసీ కాలనీలో తాగునీటి సమస్య తీవ్రంగా ఉందని వేంపల్లె జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి సభ దృష్టికి తీసుకొచ్చారు. దప్పేపల్లె దళితవాడ, ఎం.దళితవాడలో బోర్లు వేశాక నీళ్లు పడ్డాయని, ఇక మోటార్లు ఏర్పాటు చేయాలని లక్కిరెడ్డిపల్లె జెడ్పీటీసీ కోరారు. శెట్టిపల్లె తూర్పుపల్లెలో తాగునీటి సమస్యను పరిష్కరించేందుకు కొత్త బోరు ఏర్పాటు చేయాలని సంబేపల్లె జెడ్పీటీసీ కోరారు. ఆరుతడి పంటలు వేసుకోవాలి ఎల్నినో నేపధ్యంలో శ్రీశైలం నీటి విడుదల పరిస్థితి ఏంటని జెడ్పీ చైర్మన్ కేసీ కెనాల్ కడప జేఈని ప్రశ్నించారు. అందుకు జేఈ బదులిస్తూ జిల్లాలో 92 వేల ఎకరాల కేసీ ఆయకట్టు ఉందని పేర్కొన్నారు. శ్రీశైలం రిజర్వాయర్లో కేవలం 45 టీంఎసీలు ఉన్నాయని తెలిపారు. అందుకే రైతులను ఆరుతడి పంటలను సాగు చేసుకోవాలని సూచిస్తున్నామని పేర్కొన్నారు. ● ఖాజీపేట బైపాస్ వద్ద ఆర్అండ్బీ రోడ్డు చాలా అధ్వానంగా ఉందని, మరమ్మతులు నిర్వహించాలని పలుమార్లు కోరినా అధికారులు స్పందించకపోవడంపై జెడ్పీ కో ఆప్షన్ సభ్యుడు అచ్చుకట్ల కరీముల్లా తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ● చిలమకూరు–కోనాపురం మధ్య ఏడు కిలోమీటర్ల రహదారి మంజూరైందని, పనులు వెంటనే చేపట్టాలని ఎర్రగుంట్ల జెడ్పీటీసీ బాలయ్య కోరారు. సీతారాంపురం వెళ్లాలంటే ఘాట్రోడ్డులో ప్రయాణించాల్సి వస్తుందని, అందుకు తగ్గట్లు బస్సులు కండీషన్లో లేవని పోరుమామిళ్ల జెడ్పీటీసీ ముత్యాల ప్రసాద్ అన్నారు. ప్రమాదాలు సంభవించే అవకాశం ఉంటుందన్నారు. ● ప్రొద్దుటూరుకు బస్సుల సంఖ్య పెంచాలని కో ఆప్షన్ సభ్యులు కోరారు. కడప–వేంపల్లె మధ్య బస్సులు ఏర్పాటు చేయాలని జెడ్పీటీసీ రవికుమార్రెడ్డి కోరారు. ● గనులు భూగర్బశాఖపై జరిగిన చర్చలో చైర్మన్ మాట్లాడుతూ గత ఐదేళ్లుగా సుమారు రూ. 50 కోట్లు సెస్సు రూపంలో జెడ్పీకి రావాల్సి ఉందన్నారు. ఒక మండలంలోని ఒక గ్రామంలో ఎంతమంది చదువు నేర్చుకున్నారో పేర్లతోసహా తనకు ఇవ్వాలని వయోజన విద్య డీడీని చైర్మన్ ఆదేశించారు. పీఎంజీఎస్వై, నాబార్డు పనులకు బిల్లులు వస్తున్నాయా? అంటూ చైర్మన్ ఆరా తీశారు. ఉపాధి హామి, పీఎంజీఎస్వైలో నిధులు పుష్కలంగా ఉన్నాయని, వాటిని ఉపయోగించి రహదారుల నిర్మాణం చేపట్టాల్సిన అవసరం ఉందని జెడ్పీ సీఈఓ సుబ్రమణ్యం సూచించారు. ఈ కార్యక్రమంలో జిల్లా పరిషత్ ఉపాధ్యక్షులు బాలయ్య, పలువురు జెడ్పీటీసీలు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు.జెడ్పీ చైర్మన్ రామగోవిందరెడ్డి -
వైఎస్సార్సీపీలో నియామకాలు
సాక్షి, మదనపల్లె : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్.జగన్ మోహన్ రెడ్డి ఆదేశాలతో పార్టీ అనుబంధ విభాగాల పదవుల్లో జిల్లాకు చెందిన పలువురు నేతలను నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఒక ప్రకటన విడుదల చేసింది. అందులో మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శిగా లింగం వాణి (కోడూరు), రైతు విభాగం జిల్లా ఉపాధ్యక్షులుగా కాకులారం భాస్కర్ రెడ్డి (పీలేరు), రైతు విభాగం జిల్లా కార్యదర్శిగా కరిమిరెడ్డి నిరంజన్ రెడ్డి (రాయచోటి), ఎస్సీ సెల్ జిల్లా కార్యదర్శిగా కొప్పుల బాలాజీ (రాయచోటి), రజక విభాగం రాజంపేట నియోజకవర్గ అధ్యక్షుడిగా పెనగలూరు రాజా, చిన్నమండ్యం మండల కార్యదర్శిగా బెల్లం చక్రపాణి రెడ్డి నియమితులయ్యారు. ఏర్పాట్ల పరిశీలనమదనపల్లె టౌన్ : ముఖ్యమంత్రి నారా చంద్ర బాబు నాయుడు మదనపల్లె పర్యటన నేపథ్యంలో గురువారం కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్, ఎమ్మెల్యే షాజహాన్ బాషాతో కలిసి సభా ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా సీఎం పాల్గొనే బహిరంగ సభా వేదిక, కార్యకర్తల సమావేశ ప్రాంగణం, వాహ నాల పార్కింగ్ స్థలాలను పరిశీలించారు. అలా గే వెంకటమ్మ చెరువులో నిర్వహించనున్న ‘జలధార’ కార్యక్రమానికి సంబంధించిన పనుల పురోగతిని అధికారులు అడిగి తెలుసుకున్నారు. కాగా సీఎం పర్యటన ఎప్పుడనేది అధికారికంగా ఇంకా ఖరారు కాలేదు. జిల్లా సైన్సు అధికారిగా శ్రీధర్కుమార్మదనపల్లె సిటీ : జిల్లా సైన్సు అధికారిగా జి.శ్రీధర్కుమార్ను నియమించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. పెద్దమండ్యం మండలం గుర్రంవాండ్లదపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో భౌతిక శాస్త్ర ఉపాధ్యాయులుగా శ్రీధర్ పనిచేస్తున్నారు. గురువారం ఆయన డీఈఓను మర్యాదపూర్వకంగా కలిసి అభినందలు తెలియజేశారు. జిల్లాలోని అన్ని పాఠశాలల్లో సైన్సు అభివృద్ధికి తన వంతు కృషి చేస్తానని తెలిపారు. ఆకతాయిల కట్టడికి డ్రోన్ నిఘామదనపల్లె టౌన్ : విద్యాసంస్థల వద్ద విద్యార్థినులను వేధించే ఆకతాయిల ఆగడాలకు చెక్ పెట్టేందుకు పోలీసులు డ్రోన్ కెమెరాలతో నిఘా ముమ్మరం చేశారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా స్కూళ్లు, కళాశాలల వద్ద భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఇందులో భాగంగా మదనపల్లె పట్టణంలో ప్రతిరోజూ డ్రోన్ కెమెరాలతో ఆకాశ మార్గం నుంచి పటిష్టమైన నిఘా ఏర్పాటు చేశారు. డ్రోన్లతో పాటుగా మహిళల భద్రత కోసం ఏర్పాటు చేసిన ’శక్తి’పోలీస్ టీమ్స్ కూడా స్కూళ్లు, కళాశాలల వద్ద నిరంతరం గస్తీ తిరుగుతున్నాయి. ఆకతాయిలు ఎవరైనా విద్యార్థినులను వేధిస్తే కఠిన చర్యలు తప్పవని, వెంటనే డయల్–112 లేదా సమీప పోలీస్ స్టేషన్న్కు సమాచారం ఇవ్వాలని పోలీసులు సూచించారు. దరఖాస్తుల ఆహ్వానంమైదుకూరు : మైదుకూరు మండలం వనిపెంటలోని మహాత్మా జ్యోతిరావు పూలే బీసీ సంక్షేమ గురుకుల బాలికల కళాశాలలో గెస్ట్ ఫ్యాకల్టీగా పని చేసేందుకు ఆసక్తి ఉన్న వారు దరఖాస్తు చేసుకోవాలని కళాశాల ప్రిన్సిపల్ వి.నిర్మల ఒక ప్రకటనలో తెలిపారు. కళాశాల మ్యాథమెటిక్స్, ఫిజిక్స్ సబ్జెక్టులకు అధ్యాపకులుగా పనిచేయడానికి ఆసక్తి ఉన్న అభ్యర్థులు ఈనెల 22 లోపు దరఖాస్తు చేసుకోవాలని కోరారు. మరిన్ని వివరాల కోసం వనిపెంటలోని గురుకుల పాఠశాల, కళాశాలలో సంప్రదించాలని ప్రిన్సిపల్ తెలిపారు. గడుపు పొడిగింపు కడప అగ్రికల్చర్ : జిల్లాలో ఖరీఫ్ సీజన్కు సంబంధించి వాతావరణ ఆధారిత బీమా కింద ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 24 వరకు గడువు పొడించినట్లు జిల్లా వ్యవసాయ అధికారి మట్టా సుబ్రమణేశ్వరావు తెలిపారు. ప్రీమియం చెల్లింపునకు ఈ నెల 15తో ముగిసిన గడువును రైతుల విజ్ఞప్తి వరకు పొడిగించినట్లు వివరించారు. ఇందులో పత్తి, వేరుశనగ, అరటి, చీని పంటలకు సంబంధించిన ప్రీమియం చెల్లింపుకు అవకాశం ఉందని తెలిపారు. జిల్లాలోని రైతులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ఎన్సీసీతో క్రమశిక్షణ.. సేవాభావం
కడప ఎడ్యుకేషన్ : ఎన్సీసీ ద్వారా విద్యార్థుల్లో క్రమశిక్షణ, నాయకత్వ లక్షణాలు, దేశభక్తితోపాటు సేవాభావం పెంపొందుతాయని ఎన్సీసీ క్యాంపు కమాండెంట్ కల్నర్ ఎన్. సూర్యనారాయణమూర్తి తెలిపారు. కడప నగరంలోని తెలుగు గంగ కాలనీలో క్యాంప్ కమాండెంట్ కల్నల్ ఎన్. సూర్యనారాయణమూర్తి ఆధ్వర్యంలో సీఏటీసీ– 5 ఎన్సీసీ వార్షిక శిక్షణ శిబిరం గురువారం ఉత్సాహంగా కొనసాగింది. జూలై 15 నుంచి 24 వరకు పది రోజులపాటు జరుగుతున్న ఈ శిబిరంలో కడప, తిరుపతి, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు చెందిన సుమారు 600 మంది ఎన్సీసీ క్యాడెట్లు పాల్గొంటున్నారు. ఈ సందర్భంగా ఎన్. సూర్యనారాయణమూర్తి మాట్లాడుతూ నాలుగు జిల్లాల నుంచి టీఎస్సీ (తాల్ సైనిక్ క్యాంప్) రాష్ట్రస్థాయి ఎంపికలకు అర్హత సాధించిన క్యాడెట్లకు మ్యాప్ రీడింగ్, ఫైరింగ్ తదితర విభాగాల్లో ప్రత్యేక శిక్షణ అందిస్తున్నామని వివరించారు. అలాగే రిపబ్లిక్ డే క్యాంప్ (డీఆర్సీ) కోసం డ్రిల్, ఫైరింగ్, బెస్ట్ క్యాడెట్ తదితర విభాగాల్లో జరిగే ఎంపికలకు క్యాడెట్లను సన్నద్ధం చేసేలా ప్రత్యేక శిక్షణ ఇస్తున్నామని పేర్కొన్నారు. -
చుడా భూములను పరిశీలించిన జేసీ
పీలేరురూరల్ : స్థానిక ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్లోని చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ (చుడా) భూములను చిత్తూరు జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శరాజేంద్రన్ పరిశీలించారు. నాలుగేళ్ల క్రితం టౌన్షిప్ అభివృద్ధి కోసం గత ప్రభుత్వం ఏపీఐఐసీ ఇండస్ట్రీయల్ పార్క్కు 30 ఎకరాలు కేటాయించింది. అందులో లేఅవుట్ వేసి మధ్యతరహా ఆదాయం కల్గిన వారికి విక్రయించాలని అధికారులు ప్రణాళికలు రూపొందించారు. పలు కారణాలతో ఆ ప్రాజెక్టు కార్యరూపం దాల్చలేదు. ఈ నేపథ్యంలో గురువారం చిత్తూరు జేసీ పరిశీలించారు. ప్రభుత్వం నుంచి అందిన కేటాయింపులు, ఉత్తర్వులు, భూరికార్డులు, సరిహద్దు తదితర వివరాలపై ఆరా తీశారు. ఆర్ఐ మురగయ్య, సర్వేయర్ రెడ్డిశేఖర్, వీఆర్వోలు ఎల్లప్ప, సిద్ధయ్య, రమణ తదితరులు పాల్గొన్నారు. నీటి సమస్యపై కంట్రోల్ రూంసాక్షి, మదనపల్లె : మదనపల్లె పట్టణంలో నెలకొన్న తాగునీటి సమస్యపై మున్సిపల్ కార్యాలయంలో కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశామని కమిషనర్ కే.ప్రమీల గురువారం తెలిపారు. పట్టణ పరిధిలో ఏ ప్రాంతంలోనైనా నీటి సమస్య ఉత్పన్నమైనా, నీటి సరఫరా జరగకపోయినా తక్షణమే తమ దృష్టికి తీసుకురావాలని ప్రజలను కోరారు. నీటి సమస్యలపై ప్రజలు 08571–222280 నెంబర్ కు ఫోన్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. ఫిర్యాదు అందుకున్న తక్షణమే చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. -
కలగానే.. ఇంటర్ కళాశాల!
● జిల్లా కేంద్రంలో కానరాని ప్రభుత్వ బాలుర ఇంటర్ కాలేజీ ● దూరప్రాంతాలకు వెళుతున్న విద్యార్థులుమదనపల్లె సిటీ : జిల్లా కేంద్రమైన మదనపల్లెలో ఇంటర్మీడియట్ ప్రభుత్వ బాలుర కాలేజీ కలగానే మిగిలిపోయింది. స్థానికంగా ఇంటర్ కళాశాల లేకపోవడంతో పదో తరగతి పూర్తయిన విద్యార్థులు దూరప్రాంతాలకు వెళ్లాల్సిన దుస్థితి నెలకొంది. లేదా స్థానికంగా ప్రైవేటు కళాశాలల్లోనే చేరాల్సి వస్తోంది. విద్యా కేంద్రంగా పేరు పొందిన మదనపల్లెలో కో ఎడ్యుకేషన్ ప్రభుత్వ ఇంటర్ కాలేజీ లేకపోవడంపై విద్యావేత్తలు మండిపడుతున్నారు. ఇక్కడ ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీ ఉంది. ఈ కాలేజీలో అమ్మాయిలకు మాత్రమే ప్రవేశం ఉంటుంది. బీటీ కాలేజీలో మూతపడిన ఇంటర్కోర్సులు చారిత్రక నేపథ్యం ఉన్న బిసెంట్ థియోసాఫిక్ కాలేజీలో ఇంటర్ కోర్సులు ఎత్తివేశారు. కాలేజీలో గతంలో ఇంటర్మీయడ్ విభాగంలో బైపీసీ, ఎంపీసీ, ఎంఈసీ, సీఈసీ, హెచ్ఈసీ కోర్సులు నడిపారు. ఎంతో మంది పేద,మద్య తరగతి విద్యార్థులు కాలేజీలో అభ్యసించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ఎయిడెడ్ కాలేజీలు ప్రభుత్వంలో విలీనం చేయాలని లేకుంటే ప్రైవేటు సంస్థలే నిర్వహించాలని ఉత్తర్వులు జారీ చేయడంతో బీటీ కాలేజీ కొంత భాగాన్ని ప్రభుత్వపరం చేశారు. దీంతో బీటీ ప్రభుత్వ డిగ్రీ కాలేజీగా మారింది. ఫలితంగా ఐదేళ్లుగా కాలేజీలో ఇంటర్ విద్య మూతపడింది. దూర ప్రాంతాలకు వెళుతున్న విద్యార్థులు మదనపల్లె పరిసర ప్రాంతాల్లో పదో తరగతి చదువుకున్న విద్యార్థులు కొందరు తిరుపతి, విజయవాడకు వెళుతుంటే ,మరికొందరు స్థానికంగా ప్రైవేటు కాలేజీలో చేరుతున్నారు. వేలాది రూపాయలు ఖర్చు పెట్టి చదువుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని పేద, మధ్య తరగతి విద్యార్థులు వాపోతున్నారు. -
నకిలీనారుతో మోసపోయిన రైతు
చౌడేపల్లె: ఆరుగాలం కష్టపడి అప్పులు తెచ్చి పంట సాగుకు పెట్టుబడులు పెట్టి సాగుచేసిన రైతులకు నకిలీల బెడదతో పంట దిగుబడి రాక నష్టపోయిన ఘటన బుధవారం వెలుగులోకి వచ్చింది. వివరాలిలా ఉన్నాయి. అన్నమయ్యజిల్లా చౌడేపల్లె మండలం కాగతి పంచాయతీ యనమసామనపల్లెలో రైతు గంగరాజు గ్రామానికి సమీపంలోని కుందిలేనికుంట బండ కాడచేను సమీపంలో సుమారు ఐదు ఎకరాల్లో టమాటా సాగు చేయాలనుకున్నాడు. తమ గ్రామానికి సమీపంలోని యల్లంపల్లెవద్ద ఓ టమోటా నర్సరీ నుంచి జయహో రకం, నారు సుమారు 35 వేల టమాటా మొలకలను కొనుగోలు చేశాడు.ఐదు ఎకరాల్లో పంట సాగుకోసం అవసరమైన సేంద్రియ ఎరువులు, పెట్టుబడులకోసం సుమారు 12 లక్షలు ఖర్చుచేసి పంట సాగుచేశాడు. టమాటా మొలకలు నాటినప్పటినుంచి కోత దశకు వచ్చేవరకు సక్రమంగా మందులు పిచికారీ చేసినా పంట దిగుబడి ఆశించినంత స్థాయిలో రాలేదని రైతు తెలిపాడు. తమ పక్క పొలంలో మిగిలిన రైతులకు ఆశించిన స్థాయిలో దిగుబడితోపాటు కాయ సైజులు వచ్చాయన్నారు. ఐదుఎకరాల్లో సుమారు 2వేల టమాటా బాక్స్లు కాయలు కోతకు రావాల్సి ఉండగా కేవలం 500 బాక్స్లు మాత్రమే వచ్చాయని,వాటిల్లో కూడా కాయలు సైజు చిన్నవిగా రావడంతో మార్కెట్లో ధర పలకలేదని, దీంతో పొలంలోనే పడేస్తున్నామని రైతు ఆవేదన వ్యక్తం చేశాడు. ప్రస్తుతం మార్కెట్లో రూ. 250 నుంచి 270 వరకు ధర పలుకుతుంటే చిన్నసైజు కాయలు రూ.90 పలుకుతోందన్నారు., పంట దిగుబడి ఆశించిన స్థాయిలో ఉంటే సుమారు రూ.20 నుంచి రూ.30 లక్షలు ఆదాయం వచ్చేదన్నారు. ఇలాంటి ఘటనలే తమ గ్రామంలో చోటుచేసుకున్నాయి. కొందరు రైతులు నర్సరీ నిర్వాహకుడి ప్రశ్నించలేక మిన్నకుండిపోయారని ఆరోపణలున్నాయి. నర్సరీ నిర్వాహకుడిని రైతు ప్రశ్నించగా పొంతనలేని సమాధానం ఇస్తూ తప్పించుకొన్నాడని రైతు కన్నీటి పర్యంతమయ్యాడు. నకిలీ విత్తనాలతో మోసపోయామని గ్రహించిన రైతు మీడియాను ఆశ్రయించి తమ ఆవేదన తెలిపాడు. పత్తాలేని హార్టీకల్చర్ అధికారిణి.... మండలంలో ప్రతి మేటా 4వేలనుంచి 8 వేల ఎకరాల్లో టమాటా పంటను రైతులు సాగుచేస్తున్నారు. అయితే హార్టికల్చర్ శాఖ నుంచి ప్రభుత్వం అందించే రాయితీ విత్తనాలు, ఎరువులు, మల్చింగ్ వంటి సేవలు అందించే వారు లేరు. కనీసం సమాచారమిచ్చే వారు లేకపోయారు. హార్టికల్చర్ అఽధికారిణి ఎప్పుడూ అందుబాటులో ఉండరు. ఉన్నప్పటికీ ఎక్కడ ఉంటారో తెలియని పరిస్థితి. పర్యవేక్షణలేక మండలంలో ఇష్టానుసారంగా నర్సరీలు పుట్ట గొడుగుల్లా పుట్టుకొచ్చాయని రైతులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. నకిలీ విత్తనాలతో టమాటా పంట సాగు చేసినా ఆశించిన స్థాయిలో పంట దిగుబడిలేదు. కాయలన్నీ చిన్నసైజు గోలీలుగా ఉండడంతో మార్కెట్లో కొనుగోలుచేసేవారు కరువయ్యారు. సుమారు 12లక్షల పెట్టుబడి ఖర్చు పెట్టినా పైసా రాలేదు.. ఇలాగైతే అప్పులు ఎలా తీర్చాలి. ప్రభుత్వం ఆదుకోకుంటే ఆత్మహత్యే శరణ్యం. – గంగరాజు, బాధిత రైతు, యనమసామనపల్లె -
నాణ్యత పాటించకపోతే టెండర్లు రద్దు చేస్తాం
రాయచోటి టౌన్ : టెండర్ల ద్వారా దక్కించుకున్న పనుల్లో నాణ్యత పాటించకుంటే ఎలాంటి నోటీసులు ఇవ్వకుండా టెండర్లు రద్దు చేస్తామని రాయచోటి శ్రీ వీరభద్ర స్వామి పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్ కుమార్ హెచ్చరించారు. బుధవారం శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో పలు రకాల అభివృద్ధి పనులకు టెండర్లు నిర్వహించారు. స్వామి వారికి ఒక లడ్డూ, రెండు లడ్డూల బాక్స్లు, లడ్డూల కవర్లకు సంబంధించిన వాటికి టెండర్లు నిర్వహించారు. ఈ టెండర్లలో మొత్తం 32 మంది పాల్గొన్నారు. ఆలయ నిబంధనల ప్రకారం తక్కువ ధరలకు (ఎల్1) కోట్ చేసిన టెండర్లు ఖరారు చేస్తామని చెప్పారు. కవర్లు, బాక్స్లకు ఆలయం పేరు కూడా మద్రించాలని సూచించారు. అలాగే ఆలయంలో 42 సీసీ కెమెరాల స్థానంలో 5 ఎంపీ, 8 ఎంపీ ఐపీ కెమెరాలు, ఎన్వీఆర్, ఎస్ఎస్డీ హార్డ్ డిస్క్ల ఇన్స్టాలేషన్, అదనంగా మరో 16 సీసీ కెమెరాల ఏర్పాటుకు కూడా టెండర్లు నిర్వహించారు. వీటిలో కూడా తక్కువ కోట్ చేసిన వారికి ఈ టెండర్ అప్పగిస్తామని చెప్పారు. కార్యక్రమంలో దేవాదాయ, ధర్మాదాయశాఖ జూనియర్ అసిస్టెంట్ ఇంద్ర, పాలక మండలి సభ్యులు గిరి, ఇతరా సభ్యులు పాల్గొన్నారు. -
ముగ్గురు అంతర్రాష్ట్ర గంజాయి నిందితుల అరెస్ట్
● రూ.45 లక్షల విలువ చేసే 6 కిలోల గంజాయి, ఒక బైకు, ఐదు మొబైల్ ఫోన్లు స్వాధీనం ● పోర్టర్ యాప్ ద్వారా బుకింగ్స్.. బెంగళూరు కేంద్రంగా గంజాయి విక్రయం ● వివరాలను వెల్లడించిన ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి / రామాపురం : గంజాయి ఇతర మాదకద్రవ్యాల అక్రమరవాణా, వ్యాపారులపై మరింత కఠినచర్యలు చేపడతామని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తీవ్రంగా హెచ్చరించారు. రాయచోటి డివిజన్ పరిధిలోని రామాపురం ఫారెస్ట్ చెక్పోస్టు వద్ద అక్రమంగా తరలిస్తున్న రూ.45 లక్షల విలువ చేసే 6 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్న వివరాలను ఎస్పీ బుధవారం రాయచోటిలో మీడియాకు వివరించారు. అక్రమరవాణాలో భాగస్వాములైన ముగ్గురు అంతర్ రాష్ట్ర నిందితులను అరెస్టు చేసి వారి నుంచి తరలించడానికి సిద్ధంగా ఉంచిన ఆరు కిలోల గంజాయి, ఐదు సెల్ఫోన్లు, ఒక బైకును స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితుడి సమాచారం మేరకు వైజాగ్కు చెందిన బోడన్నా, రాయచోటికి చెందిన ఖాదర్బాషా, బీహార్కు చెందిన ప్రకాష్లు అక్రమరవాణాలో ప్రధాన పాత్రధారులుగా గుర్తించామన్నారు. వీరి ముగ్గురిని అరెస్టు చేశామన్నారు. వీరు వైజాగ్ నుంచి రాయచోటికి తరలిస్తూ స్థానికంగా విక్రయించడంతో పాటు గుజరాత్, బీహార్, బెంగళూరు ప్రాంతాలకు తరలించనున్నట్లు పోలీసు విచారణలో తేలిందన్నారు. యాప్ ద్వారా బుకింగ్స్ అక్రమ గంజాయి వ్యాపారులు అందుబాటులో ఉన్న ఆదునిక పరిజ్ఞానంతో వ్యాపారాన్ని విస్తరించారన్నారు. ఈ క్రమంలోనే పోర్టర్ యాప్ ద్వారా బుకింగ్స్ చేయడం, విక్రయాలను సాగిస్తున్నారని తెలిపారు. ముఖ్యంగా బెంగళూరు కేంద్రంగా గంజాయి విక్రయాలను అధికంగా కొనసాగిస్తున్నట్లు విచారణలో తేలిందన్నారు. గంజాయి, మాదకద్రవ్యాల సమాచారం ఉంటే ప్రజలు వెంటనే డయల్ 100/112 లేదా టోల్ఫ్రీ 1972కు కాల్ చేసి పోలీసులకు సహకరించాలని ఎస్సీ విజ్ఞప్తి చేశారు. గంజాయి ముఠాను అరెస్టు చేసిన పోలీసులు, అధికారులకు నగదు రివార్డును ఎస్పీ అందజేశారు. మీడియా సమావేశంలో రాయచోటి డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్, లక్కిరెడ్డిపల్లి సీఐ కృష్ణంరాజునాయక్, రామాపురం ఎస్ఐ కెబి శివకుమార్, సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. -
రూ.కోట్లు విలువ చేసే ఆస్తిపై పోలీసుల కన్ను
● అనంతపురం ఆస్తి పంచాయతీ.. అన్నమయ్య జిల్లాలో ... ● సంబేపల్లె పోలీస్ స్టేషన్ కేంద్రంగా సివిల్ పంచాయతీ సెటిల్ మెంట్స్. సాక్షి టాస్పోర్ట్స్ : శాంతి భద్రతల పరిరక్షణ, అసాంఘిక శక్తుల అరాచకాలను అనిచివేయడం, మాదకద్రవ్యాల విక్రయాలను నిలువరించడంతో పాటు ప్రజలకు రక్షణ కల్పించాల్సిన పోలీసులు పోలీస్ స్టేషన్లనే సెటిల్మెంట్ కేంద్రాలుగా మార్చి సివిల్ పంచాయతీలు చేస్తూ రూ.లక్షలు, కోట్ల ఆదాయాలను గడిస్తున్న వైనం చర్చనీయాంశంగా మారింది. కూటమి పాలనలో పోలీసులు వారి విధులను పక్కనబెట్టి అధికార పార్టీ నేతల అడుగులకు మడుగులు వత్తుతున్నారన్న విమర్శలు ఉన్నాయి. ప్రతి పక్షపార్టీలకు చెందిన వారిపై అధికార పార్టీ నేతలు ఆదేశించినదే తడువుగా అక్రమ కేలసు పెట్టి వారిని చిత్రహింసలకు గురిచేస్తున్నారన్నది బహిరంగ రహస్యం. ఇలాంటి పరిస్థితుల్లో రాయచోటి రూరల్ పోలీస్ స్టేషన్ పరిధిలో ఉన్న ట్రిపుల్, డబుల్ స్టార్ల అధికారులు స్టేషన్లనే కేంద్రాలుగా ఏర్పాటు చేసుకొని సివిల్ పంచాయతీలను కొనసాగిస్తున్నారన్న ఆరోపణలు సోషల్మీడియా, వాట్సాప్, దినపత్రికలలో హల్చల్ చేస్తున్నాయి. ఈ కోవలోనే అనంతపురం జిల్లా కేంద్రం నడిబొడ్డున కోట్ల రూపాయాల విలువచేసే ఆస్తి విషయమై జిల్లా రాయచోటి రూరల్ పోలీసులు చేసిన పంచాయితీ, కేసు నమోదు రూపంలో నడిపిన దందా ఇటు పోలీసు అటు ప్రజలలో విమర్శలకు తావిస్తోంది. ఈ పంచాయతీ తాము అనుకున్న రీతిలో దారికి రాకపోవడంతో రాయచోటి రూరల్ స్టేషన్ పరిధిలోని సంబేపల్లె పోలీస్ ఠాణాలో కేసు నమోదు చేసి తమదైన రీతిలో బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. తమ వద్దకు వచ్చిన వారికి అండగా రాయచోటి పోలీసులు చేసిన ప్రయత్నాలు ఫలించకపోవడంతో క్రిమినల్ కట్టు కథను అల్లి ప్రత్యర్థిపై కేసులు నమోదు చేసి బెదిరింపులకు దిగిన సంఘటన పోలీస్ వర్గాల్లో సంచలనం రేపుతోంది. వివరాలలోకి వెలితే... అనంతపురం పట్టణానికి చెందిన నిస్సార్అహమ్మద్ (డ్రైవర్) అనే వ్యక్తి తనకు వారసత్వంగా వచ్చిన రూ. కోట్ల (8.5సెంట్లు) ఆస్తిని వదిలి కూలీపనుల చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. నిస్సార్ అహమ్మద్ అమాయకత్వాన్ని పసిగట్టిన కడప జిల్లా ప్రొద్దుటూర్కు చెందిన షేక్ మహబూబ్లాల్ (ట్రాన్స్కో కార్యాలయంలో పోలీస్) ఆస్తిపై కన్నేశాడు. క్రమంగా అతనితో పరిచయం పెంచుకున్నాడు అన్ని రికార్ఢులు తయారు చేయించి ఆస్తిని విక్రయిస్తే మంచి డబ్బులు వస్తాయని నమ్మపలికాడు. ఫలితంగా తన పేరుపై 8,5 సెంట్ల ఆస్తిని సబ్ రిజిస్ట్రార్ కార్యాలయానికి తీసుకెళ్లి తన పేరున పవర్ ఆఫ్ పట్టాను చేయించుకున్నాడు. త్వరలోనే భూమిని అమ్మి కోట్లకు అధిపతిని చేస్తానని, దీంతో నీ కష్టాలు తీరుతాయని నమ్మపలికించాడు. పవర్ ఆఫ్ పట్టాను పొందిన పోలీసు మరొకరి పేరున రిజిస్ట్రేషన్ చేయించారు. స్థానికుల ద్వారా తనకు జరిగిన అన్యాయాన్ని తెలుసుకున్న నిస్సార్ అహ్మద్ పోలీస్ దగ్గరకు వెళ్లి కన్నీరు మున్నీరై విలపించారు. జరగుతున్న ఈ తతంగాన్ని గమనించిన ఒక మహిళ వీరిద్దరి నుంచి ఆస్తిని ఎలా కాజేయాలన్న విషయంపై ఆలోచించి నిషార్ అహమ్మద్ తో కలిసి రాయచోటి రూరల్ సీఐని ఆశ్రయించారు. ఈ పంచాయతీ చేస్తే కోట్ల రూపాయలు సమకూరుతుందన్న ఆశతో ఆయన తనకున్న మేధాశక్తిని, అధికారాన్ని ఉపయోగించారు. పవర్ ఆఫ్ పట్టాను పొందిన ప్రొద్దుటూరులోని పోలీసులు పిలిపించి అన్యాయంగా రాయించుకున్న ఆస్తిని తిరిగి రాసివ్వాలని లేక పోతే మీ పై చర్యలు కఠినంగా ఉంటాయని హెచ్చరించినట్లు సమాచారం. స్థానిక సీఐ బెదింపులకు లొంగని పోలీసు అక్కడి నుంచి వెల్లి పోయినట్లు సమాచారం. చేసిన పంచాయతీ ఫలించక పోదవడంతో సంబేపల్లె పోలీస్ స్టేషన్లో పోలీస్ మహబూబ్ లాల్ తో పాటు మరో 5 గురిపై ఈ నెల 7 వతేదిన సంబేపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఈ క్రమంలోనే మామిడికాయల లోడు కోసం సంబేపల్లె మండల పరిధిలోని శెట్టిపల్లి గ్రామం సమీపంలోకి మామిడికాయల లోడు కోసం లారీ డ్రైవర్గా నిస్సార్ వచ్చాడు. నిస్సార్ సంబేపల్లె మండల పరిధిలో ఉన్నారన్న విషయం తెలుసుకుని ప్రొద్దుటూరు పోలీసు తన అనుచరులైన మునాఫ్, ఇనాయత్, మహబూబ్లాల్, వహిదాబాను, మహమ్మద్ ఇంతియాజ్, ఎస్ఎంబి ఖాజాలు అక్కడికి వచ్చి భయపెట్టడంతో పాటు కత్తితో చంపుతామని బెదిరించినట్లు పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పొందుపరచారు. అలాగే వచ్చిన వారు తనను కొట్టడంతో కిందపడ్డానని కత్తి చూపించి నా మాటను కాదంటే చంపుతామని బెదిరించామని పేర్కొన్నారు. నాదగ్గర ఉన్న పవర్ ఆఫ్ పట్టా లాక్కొని వారి వెంట తెచ్చుకున్న 100 రూపాయల ఖాళీ డాక్యుమెంట్లపై సంతకాలు చేయించుకున్నారని పోలీసులు అల్లిన కథలో ఉంది. ఈ సంఘటన మే 30 వతేదీ జరగగా ఈ నెల7 వ తేదీన కేసు నమోదు చేయడంపై పలు అనుమానాలకు దారి తీస్తోంది. కేసు నమోదుపై తీవ్రంగా స్పందించిన ప్రొద్దుటూరు పోలీస్ రాయచోటి పోలీసులపై చిందులు వేయడంతో పాటు చట్టం తనకూ తెలుసునని తనకు వస్తున్న కోట్ల రూపాయలలో కొంత ఉన్నతాధికారులకు ఖర్చు చేస్తే నాకు ఏమి కాక పోగా మీ ఉద్యోగాలు పోతాయని తిరగబడినట్లు సమాచారం. దీంతో కథ అడ్డం తిరిగిందన్న భయం స్థానిక రాయచోటి రూరల్ పోలీసుల్లో పట్టుకొంది. గుట్టు చప్పుడు కాకుండా జరిగిన ఈ సంఘటన పోలీసులలోనే ఆనోటా..ఈ నోటా ..వ్యాపించి జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి వెళ్లినట్లు తెలియవచ్చింది. ఈ పంచాయతీ పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోకపోతే రానున్న రోజుల్లో పోలీస్స్టేషన్లు సివిల్ పంచాయతీలకు కేంద్రాలుగా మారతాయని నీతి, నిజాయతీ కలిగిన కొంత మంది పోలీసు అధికారులు వ్యాఖ్యానిసుం్తడటం విశేషం. సమస్య చేతులు దాటి ఉన్నతాధికారుల చేతుల్లోకి వెళ్లడంతో స్థానిక పోలీసు అధికారులు ఇరువర్గాలతో మాట్లాడి కేసును నీరు గార్చే ప్రయత్నం చేస్తున్నట్లు తెలియ వచ్చింది. రాయచోటి కేంద్రంగా జరుగుతున్న రూ.లక్షలు, కోట్ల రూపాయల సివిల్ సంచాయతీల దందా కారణంగా అనేక మంది నిజాయితీ, అసలైన వారు నష్టాలను, కష్టాలను భరించాల్సి వస్తోంది. ఉన్నత స్థాయి పోలీసు అధికారులు స్పందించి నిజాతీ గల అధికారి ద్వారా విచారణ జరిపిస్తే అసలు విషయాలు వెలుగులోకి వస్తాయని స్థానిక ప్రజలు కోరుకొంటున్నారు. ఈ విషయంపై రాయచోటి డీఎస్పీ క్రిష్ణమోహన్ను వివరణ కోరగా ఈ విషయం తనకు తెలియదని, విచారించి వారిపై తగుచర్యలు తీసుకుంటామని చెప్పారు. -
చెత్తశుద్ధి ఏదీ..!
● గుట్ట వెనుక వైపునకు తరలింపు ● రాత్రి పూట కాల్చివేత ● సంపద కేంద్రాలు ఉన్నా.. లేనట్లే! ● కొరవడిన పర్యవేక్షణ చౌడేపల్లెలో చెత్తసేకరణ కేంద్రానికి తరలించకుండా మరో చోటికి తరలించి చెత్తకు నిప్పు పెట్టిన దృశ్యం, బయట పడేసిన సూదులు, ఇంజెక్షన్లు చౌడేపల్లె : ‘స్వచ్ఛాంధ్ర... స్వర్ణాంధ్ర నినాదంతో సంపద సృష్టిస్తాం, చెత్తసేకరణ కేంద్రాల ద్వారా గ్రామపంచాయతీలకు అదనపు ఆదాయం తెప్పిస్తాం’ అని సీఎం చంద్రబాబునాయుడు చెప్పిన మాటలు ఉత్తిత్తే అని తేట తెల్లమౌతోంది. చెత్తసేకరణ క్షేత్ర స్థాయిలో అమలు కావడం లేదు. అధికారుల పర్యవేక్షణ లేకపోవడంతో ఇంటింటా చెత్తసేకరణ సక్రమంగా జరగడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో అయితే మరీ దారుణంగా తయారైంది. ఎక్కడా చెత్తసేకరణ కేంద్రాలను సక్ర మంగా వినియోగించడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. హరితరాయబారులు(గ్రీన్ అంబాసిడర్లు)తో కాలువలు శుభ్రపరచడం, ట్యాంకుల్లో క్లోరినేషన్ పను లు చేయించుకొని కాలం వెల్లదీస్తూ చెత్త సేకరణను గాలికి వదిలేశారని తెలుస్తోంది. మండలంలో 19 గ్రామ పంచాయతీలు ఉండగా ఆమినిగుంట, కొండయ్యగారిపల్లె గ్రామ పంచాయతీల్లో మినహా అన్ని చో ట్ల చెత్త సేకరణ కేంద్రాలు ఉండగా అలంకార ప్రా యంగా మారాయి. వీటిలో 54 మంది హరిత రాయబారులు పనులు చేస్తున్నట్లు అధికారులు తెలిపారు. చెత్తను తగలబెట్టేస్తున్నారు.. మండల కేంద్రంలోని చెడుగుట్లపల్లె మార్గంలో సుమారు రూ.15 లక్షల వ్యయంతో చెత్త సేకరణ కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. చెత్త సేకరణ కోసం అన్ని ఏర్పాట్లు, సౌకర్యాలున్నప్పటికీ అధికారుల పర్యవేక్షణ లోపంతో కార్మికులు చెత్తను పక్కనే గల గుట్ట వద్ద డంప్ చేస్తున్నారు. ఒక రోజుకు మూడు ట్రాక్టర్ల లోడ్ల చెత్తను సేకరించి అక్కడ పడేయడం జరుగుతోంది. చెత్త నుంచి ప్లాస్టిక్ బాటిళ్లు, కవర్లు తదితర వస్తువులను సేకరించకుండా వాటికి రాత్రి పూట నిప్పుపెట్టి కాల్చేస్తున్నారు. ఇలా తగలబెట్టడంతో సంపద కాలిపోగా పొగ కారణంగా వాతావరణం కాలుష్యం అవుతోంది. అలాగే వాడి పడేసిన సూదులు, ఇంజెక్షన్లు, ట్యాబ్లెట్స్ తదితర ఆసుపత్రుల్లోని వ్యర్థాలను పొలాల్లోనే పడేస్తున్నారు. బండపైనే కోళ్ల వ్యర్థాలు చుట్టూ పంట పొలాలు, గుట్టకు పక్కనే ఉన్న ఓ బండపై కోళ్ల వ్యర్థాలు పడేస్తుండడంతో ముక్కులు మూ సుకొని వెళ్లాల్సి వస్తోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పట్టణంలో వెలువడే చికెన్షాపుల వద్ద నుంచి వచ్చే కోళ్ల వ్యర్థాలను ఆరుబయట పడేస్తుండడంతో కుక్కలకు నిలయాలుగా మారాయి. అటు వైపు వెళ్తే ప్రజలు, జంతువులపై దాడులకు తెగబడుతున్నాయి. ఇకనైనా అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. చెత్తసేకరణ కేంద్రానికి చెత్తను తరలించేలా చర్యలు తీసుకొంటాం. వ్యర్థాలను, వాడిపడేసిన సూదులు, ఇతర వస్తువులు ఎక్కడపడితే అక్కడ పడేయకుండా చూస్తాం. చెత్తకు నిప్పు పెట్టకుండా సంపద తయారు చేయడానికి సిబ్బందితో కలిసి కృషి చేస్తాం. – శివయ్య, పీడీఓ, చౌడేపల్లె -
ఎండిన వేపచెట్ల తొలగింపు
పెద్దమండ్యం : మండ్యం హరిజనవాడ పాఠశాల ఆవరణలో ప్రమాదకరంగా ఉన్న ఎండిన వేపచెట్లను ఎట్టకేలకు అధికారులు తొలగించారు. ఈ పాఠశాలలో 1 నుండి 5వ తరగతి చదువుతున్న 15 మంది విద్యార్థులు విరామ సమయంలో అక్కడే ఆడుకుంటుంటారు. ఎండిన చెట్లతో పొంచి ఉన్న ముప్పుపై ‘అప్రమత్తత కరువు’ అనే శీర్షికన ‘సాక్షి’ దినపత్రికలో మంగళవారం కథనం ప్రచురితమైంది. ఈ కథనానికి ఉన్నతాధికారులు తక్షణమే స్పందించారు. వారి ఆదేశాల మేరకు ఎంఈవో మనోహర, ఉపాధ్యాయుడు నాగమునిరెడ్డిలు యుద్ధప్రాతిపదికన జేసీబీని రప్పించి ఆ ఎండిన వేపచెట్లను పూర్తిగా తొలగించారు. ప్రమాదం పొంచి ఉన్న చెట్లను తొలగించి తమ పిల్లలకు రక్షణ కల్పించడంపై విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు ‘సాక్షి’కి మరియు అధికారులకు కృతజ్ఞతలు తెలుపుతూ హర్షం వ్యక్తం చేశారు. దరఖాస్తు గడువు పెంపుమదనపల్లె సిటీ : జాతీయ స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాల దరఖాస్తు గడువు పొడిగించినట్లు డీఈఓ సుబ్రమణ్యం తెలిపారు. ఈనెల 17వతేదీ వరకు ఆన్లైన్లోదరఖాస్తు చేసుకునేందుకు అవకాశం కల్పించారన్నారు. ఫైనల్ సబ్ మిషన్కు ఈనెల 20వతేదీ వరకు సమయం ఉందన్నారు. జిల్లాలోని అర్హుౖలైన ఉపాధ్యాయులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకునేలా ఎంఈఓలు, హెచ్ఎంలు ప్రోత్సహించాలన్నారు. ప్రతి మండలం నుంచి కనీసం ఒక్కరైనా ఉపాధ్యాయులు నేషనల్ టీచర్ అవార్డులకు దరఖాస్తు చేసేలా ఎంఈవోలు ప్రత్యేక చొరవ చూపాలని సూచించారు. -
అదిగో బభ్రువు... ఇదిగో భల్లూకం!
దూరం నుంచి చూస్తే గుండె ఝల్లుమంటుంది.. పొదల చాటు నుంచి అచ్చం నిజమైన ఎలుగుబంటి నోరు తెరిచి గర్జిస్తున్నట్లు కనిపిస్తుంది! పక్కనే మరో పొదల్లోంచి క్రూరమైన చిరుతపులులు ఎప్పుడు మీదికి దూకుతాయో తెలియని వణుకు పుడుతుంది. కానీ, కాస్త ధైర్యం చేసి దగ్గరకు వెళ్లి నిశితంగా గమనిస్తే తప్ప తెలియదు.. అవి సజీవంగా కనిపించే జీవం లేని అద్భుతాలని!అన్నమయ్య జిల్లా బి.కొత్తకోట మండలంలోని ప్రసిద్ధ శీతల పర్యాటక క్షేత్రం హార్సిలీహిల్స్ పై ఉన్న అటవీశాఖ ప్రకృతి అధ్యయన కేంద్రంలోని వింతలు ఇవి. 1991లో ప్రారంభమైన ఈ కేంద్రం, మూడు దశాబ్దాలు దాటినా పర్యాటకులకు సరికొత్త అనుభూతిని పంచుతూనే ఉంది. ఇక్కడి అటవీశాఖ మ్యూజియంలో అడవికి సంబంధించిన ఎన్నో అరుదైన వస్తువులను సేకరించి ప్రదర్శనకు ఉంచారు. అన్నింటికంటే పర్యాటకులను ఆకర్షించేది మాత్రం ఇక్కడి జంతువుల చర్మాలతో అచ్చం నిజమైన రూపాలు ఇచ్చిన కృత్రిమ జంతు ప్రదర్శనలే. అడవిలో చనిపోయిన ఒక ఎలుగుబంటి చర్మాన్ని పక్కాగా సేకరించి, దానికి అచ్చం నిజమైన ఎలుగుబంటిలాంటి రూపాన్ని ఇచ్చారు. అది పొదల్లో దూరి చెట్టుపై ఉన్న తేనెపట్టు కోసం పైకి లేచినట్లుగా అమర్చిన తీరు అద్భుతం. దీని పక్కనే రెండు చిరుత పులుల చర్మాలతో వాటికి కూడా సజీవ రూపాలు ఇచ్చారు. అందులో ఒక చిరుత పొదల మాటున వేట కోసం పొంచి ఉన్నట్లు, మరొకటి బయట నిలబడినట్లు కళ్లకు కట్టినట్లు ఏర్పాటు చేశారు. వీకెండ్లలో వచ్చే చిన్నపిల్లలు ఇవి అచ్చం నిజమైన జంతువులేనని భావించి, వాటి వద్దకు వెళ్లేందుకు వణుకుతూ, జంకుతారు. పెద్దలు అవి బొమ్మలేనని నమ్మబలికిన తర్వాతే చిన్నారులు వాటి పక్కన నిలబడి ఫోటోలు దిగడానికి ఉత్సాహం చూపిస్తారు. – సాక్షి, మదనపల్లె. -
అప్పుల బాధతో చేనేత కార్మికుడి బలవన్మరణం
మదనపల్లె టౌన్ : అప్పుల బాధ తాళలేక ఓ చేనేత కార్మికుడు చెట్టుకు ఉరేసుకుని ఆత్మహత్య చేసుకున్న విషాద ఘటన మదనపల్లె మండలంలో మంగళవారం వెలుగులోకి వచ్చింది. పోలీసులు, మృతుడి కుటుంబీకుల కథనం ప్రకారం.. చిన్నమండ్యం మండలం చిన్న నర్సుపల్లికి చెందిన గాడిదల రెడ్డి రాజేంద్రప్రసాద్ (50) మదనపల్లె మండలం సీటీఎం రైల్వే గేటు వద్ద నివాసం ఉంటున్న రాజేశ్వరిని వివాహం చేసుకున్నారు. పెళ్లి తర్వాత అత్తగారింటికి వచ్చేసి కూలి మగ్గాలు నేస్తూ భార్య, ఇద్దరు పిల్లలను పోషించుకుంటున్నారు. ఏడాది క్రితం కూతురు రిషిత వివాహం ఘనంగా చేశారు. ఆ పెళ్లికి దాదాపు రూ.10 లక్షల వరకు అప్పు చేశారు. అప్పు తీర్చడం తనకు తలకు మించిన భారంగా మారింది. వడ్డీ వ్యాపారులు, రుణదాతలు రోజూ బాకీ చెల్లించాలని ఒత్తిడి చేయడంతో అప్పు తీర్చే మార్గం లేక తీవ్ర మనస్తాపానికి గురయ్యారు. ‘బతికినంత కాలం మగ్గాలు నేసినా కూతురి పెళ్లికి చేసిన అప్పులు తీర్చలేను. నేను చనిపోతే ఆ అప్పుల బాధ అయినా తీరుతుంది’ అని భావించాడో ఏమో నేతన్న... జీవితం గురించి ఏ మత్రం ఆలోచించకుండా తనవు చాలించాడు. వారం క్రితం ఇంటి నుంచి వెళ్లి.. భార్యకు, ఆరో తరగతి చదువుతున్న కుమారుడికి తెలియకుండా వారం క్రితం ఇంటి నుంచి బయటికి వెళ్లిపోయాడు. సీటీఎం క్రాస్ రోడ్డు సమీపంలోని నేతాజీ కాలనీ వెనుక ఉన్న చెట్ల పొదల్లో చెట్టుకు ఉరేసుకుని బలవన్మరణానికి పాల్పడ్డాడు. మంగళవారం ఉదయం కుళ్లిపోయి దుర్వాసన వస్తున్న మృతదేహాన్ని స్థానికులు గుర్తించి తాలూకా పోలీసులకు సమాచారం అందించారు. సీఐ కళా వెంకటరమణ ఆదేశాలతో ఎస్సై చంద్రమోహన్ సంఘటనా స్థలానికి చేరుకొని పంచనామా నిర్వహించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. ఈ వార్త విన్న భార్య రాజేశ్వరి భర్త మృతదేహం వద్దకు చేరుకొని గుండెలు బాదుకుంటూ రోదించిన తీరు అందరినీ కలచివేసింది. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సెలవు పెట్టి వచ్చారా..?
● ఉపాధ్యాయుల నిరసనపై జేసీ విచారణకు ఆదేశం : వచ్చిన వారంతా లీవ్ పెట్టారని తేల్చిన డీఈవో ● విమర్శలు పక్కన పెట్టి ప్రభుత్వానికి నివేదిక పంపడం వరకే జేసీ బాధ్యతని ఉపాధ్యాయుల స్పష్టీకరణ ఉపాధ్యాయ సమస్యలపై మంగళవారం మదనపల్లెలో ఫ్యాప్టో చేపట్టిన శాంతియుత నిరసనపై జిల్లా జాయింట్ కలెక్టర్ (జేసీ) శివ్ నారాయణ్ శర్మ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. వినతిపత్రం ఇవ్వడానికి వచ్చిన ఉపాధ్యాయులను ఉద్దేశించి.. ‘పాఠశాలలు వదిలి ఇంతమంది ఎందుకు వచ్చారు, అందరూ సెలవు పెట్టారా లేదా?‘ అని ప్రశ్నిస్తూ, దీనిపై తక్షణ విచారణ జరపాలని జిల్లా విద్యాశాఖాధికారి (డీఈఓ) సుబ్రహ్మణ్యంను ఆదేశించారు. జేసీ ఆదేశాలతో హుటాహుటిన కలెక్టరేట్కు చేరుకున్న డీఈఓతో ఫ్యాప్టో నేతలు మాట్లాడి తమ తీవ్ర అసంతృప్తిని వ్యక్తం చేశారు. తామిచ్చిన వినతిపత్రంలోని సమస్యల పరిష్కారం జేసీ పరిధిలో లేవని, దీనిని రాష్ట్ర ప్రభుత్వానికి పంపడం వరకే జేసీ బాధ్యతని నేతలు స్పష్టం చేశారు. కలెక్టరేట్లో వినతిపత్రాలు ఇవ్వడం దశాబ్దాలుగా వస్తున్న అనవాయితీ అని, ఆందోళనలో పాల్గొన్న ఉపాధ్యాయులంతా నిబంధనల ప్రకారం అధికారికంగా లీవ్ పెట్టే వచ్చారని, సెలవు పెట్టి తమ హక్కుల కోసం పోరాడటం ఎలా తప్పవుతుందని ప్రశ్నించారు. దీనిపై డీఈఓ సుబ్రహ్మణ్యం స్పందిస్తూ.. జేసీ సూచనల మేరకు తాము ఉపాధ్యాయుల హాజరుపై తక్షణ క్షేత్రస్థాయి విచారణ చేపట్టామని, ఆందోళనలో పాల్గొన్న వారంతా రికార్డుల ప్రకారం ముందే సెలవు పెట్టారని విచారణలో స్పష్టంగా తేలిందని వెల్లడించారు. ఇదే నివేదికను తాను జేసీ దృష్టికి తీసుకెళ్లినట్లు ఫ్యాప్టో నాయకులతో డీఈఓ స్పష్టం చేయడంతో వివాదం సద్దుమణిగింది. -
ట్రాఫిక్ ఆక్రమణలపై ఎస్పీ ఆగ్రహం
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మంగళవారం మదనపల్లె పట్టణంలో ఆకస్మికంగా పర్యటించారు. ట్రాఫిక్ పోలీసులతో కలసి ట్రాఫిక్ పరిస్థితులను స్వయంగా పరిశీలించారు. ఎస్పీ బీసెంట్ సర్కిల్ నుంచి సంఘం ఫంక్షన్ హాల్ వరకు కాలినడకన వెళ్తూ రోడ్లపై నెలకొన్న సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. రోడ్లకు ఇరువైపులా దుకాణదారులు చేపట్టిన ఆక్రమణలు, రోడ్డుపైనే తోపుడు బండ్లు ఏర్పాటు చేయడంతో ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతోందని ఎస్పీ గుర్తించారు. వెంటనే వాటిని తొలగించుకోవాలని వ్యాపారులకు హెచ్చరికలు జారీ చేశారు. నిబంధనలు ఉల్లంఘించి మళ్లీ ఆక్రమణలకు పాల్పడితే కఠిన చర్యలు తప్పవని స్పష్టం చేశారు. -
అజ్ఞాతంలోకి ‘తమ్ముళ్లు’
● దాడి కేసు నిందితుల కోసం మూడు ప్రత్యేక బృందాలతో పోలీసుల గాలింపు ● రొంపిచెర్ల క్రాస్ రోడ్డు వద్ద ఉయ్యాల రమణ పోలీసుల అదుపులోకి? ● జర్నలిస్టులపైనా ప్రతాపం.. రెండు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదురొంపిచెర్ల : తిరుపతి వేదికగా సాగిన దళిత నాయకుడిపై హత్యాయత్నం మరియు అరాచక ఘటనలపై తిరుపతి జిల్లా పోలీసులు ఉక్కుపాదం మోపుతున్నారు. తీవ్ర సంచలనం రేకెత్తించిన ఈ దాడి కేసులో ఎఫ్ఐఆర్ నమోదైన నిందితుల కోసం ఖాకీ బలగాలు శరవేగంగా గాలింపు చర్యలు చేపట్టాయి. పరారీలో ఉన్న నిందితులను పట్టుకునేందుకు జిల్లా పోలీసు యంత్రాంగం మూడు ప్రత్యేక బృందాలను రంగంలోకి దించింది. విశ్వసనీయ సమాచారం మేరకు.. సోమవారం రాత్రి రొంపిచెర్ల క్రాస్ రోడ్డు సమీపంలో ఈ కేసులో ఒకటో నిందితుడు (ఏ1), రాష్ట్ర కురబ సంఘం డైరెక్టర్ ఉయ్యాల రమణను పోలీసులు అదుపులోకి తీసుకుని రహస్య ప్రాంతంలో విచారిస్తున్నట్లు తెలుస్తోంది. మిగిలిన 11 మంది నిందితుల కోసం రొంపిచెర్ల మండలవ్యాప్తంగా పోలీసులు జల్లెడ పడుతున్నారు. జర్నలిస్టులపై దాడి.. రెండు కేసులు నమోదు తిరుపతి సమావేశంలో తెలుగుదేశం తమ్ముళ్ల అరాచకాలను, ముష్టియుద్ధాలను తమ వీడియో కెమెరాల్లో కవర్ చేస్తున్న పత్రిక, టీవీ జర్నలిస్టులపై కూడా చల్లా వర్గీయులు నిర్దాక్షిణ్యంగా ప్రతాపం చూపించారు. విధి నిర్వహణలో ఉన్న విలేకరులపై దాడి చేసి, సమాచార హక్కును కాలరాసేందుకు యత్నించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన పోలీసులు.. దళిత నేతపై హత్యాయత్నంతో పాటు, జర్నలిస్టులపై దాడి చేసినందుకు రెండు వేర్వేరు క్రిమినల్ కేసులు నమోదు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. తమ్ముళ్లలో భయాందోళన.. అంతా అండర్గ్రౌండ్ పోలీసులు నిందితుల వివరాలను అత్యంత రహస్యంగా ఉంచుతూ, ఎప్పుడు ఎవరిని అరెస్ట్ చేస్తారో తెలియకుండా రొంపిచెర్ల పరిసర ప్రాంతాలలో అర్ధరాత్రి వేళల్లో సైతం గాలింపులు జరుపుతుండటంతో నియోజకవర్గ తమ్ముళ్లలో వణుకు మొదలైంది. తిరుపతిలో జరిగిన తెలుగుదేశం పార్టీ సమావేశానికి హాజరైన ద్వితీయ శ్రేణి నాయకులు, చల్లా ప్రధాన అనుచరులు అందరూ ఒకరి తర్వాత ఒకరు ఫోన్లు స్విచ్ఛాఫ్ చేసుకుని సామూహికంగా అజ్ఞాతంలోకి (అండర్గ్రౌండ్) వెళ్లిపోయారు. ఎవరి ఇళ్లపై పోలీసులు ఎప్పుడు దాడి చేస్తారోననే తీవ్ర భయాందోళనలు ప్రస్తుతం పుంగనూరు తమ్ముళ్లలో నెలకొన్నాయి. -
ఎకై ్సజ్ కానిస్టేబుల్ మృతిపై ఎన్నో అనుమానాలు
● ప్రమాదమా.. హత్యా..? ● మోసగాళ్లపై కేసు పెట్టిన గంటల వ్యవధిలో మృతి ● గుర్తు తెలియని వాహనం ఢీకొట్టి వెళ్లిపోయిన వైనం ● ఈ ఘటనలో ఏమైనా కుట్ర ఉందా? పుంగనూరు : ఇల్లు కట్టుకోవాలనుకుని స్థలాన్ని కొనుగోలు చేశాడు. ఆ స్థలాన్ని ఇతరులకు కూడా అమ్మి మోసగించారని గుర్తించాడు. వెంటనే మదనపల్లె పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేయించి, డ్యూటీ కోసం చిత్తూరులోని బేవరేజస్ స్టోర్కు బయలుదేరిన దేవేంద్ర మార్గమధ్యంలో ఎలా చనిపోయాడు.. ఇది ప్రమాదమా.. లేదా హత్యానా అనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మోసగాళ్లపై కేసు పెట్టిన దేవేంద్ర గంటల వ్యవధిలో మృతి చెందడాన్ని కుటుంబ సభ్యులు జీర్ణించుకోలేకపోతున్నారు. పుంగనూరు వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో అక్కడికక్కడే దేవేంద్ర అనే ఎకై ్సజ్ కానిస్టేబుల్ దుర్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నాయి. మదనపల్లెలో నివాసం ఉన్న ఎకై ్సజ్ కానిస్టేబుల్ దేవేంద్ర(32) మదనపల్లె సమీపంలో ఇంటి స్థలాన్ని 2023లో కొనుగోలు చేశాడు. ఆ స్థలం ఇతరులకు కూడా విక్రయించి, తనను మోసం చేశారని దేవేంద్ర తాలూకా పోలీస్స్టేషన్లో సోమవారం ఫిర్యాదు చేశాడు. ఈ మేరకు తరిగొండ శ్రీనివాసులురెడ్డి, నారాయణరెడ్డి, సుధాకర్లపై పోలీసులు చీటింగ్ కేసు నమోదు చేశారు. ఈ తతంగం రాత్రి 11 గంటల వరకు జరిగింది. పోలీసుల వద్ద ఎఫ్ఐఆర్ కాపీ తీసుకుని అక్కడి నుంచి చిత్తూరు డ్యూటీకి బయలుదేరాడు. మార్గమధ్యంలో పుంగనూరు టోల్గేట్ వద్ద సుమారు 11:45 గంటల సమయంలో గుర్తు తెలియని వాహనం ఢీకొని అక్కడికక్కడే మృతి చెందాడు. విషయం తెలిసిన వెంటనే సీఐ సుబ్బరాయుడు ఆధ్వర్యంలో ఎస్ఐ అన్సర్బాషా సంఘటన స్థలాన్ని సందర్శించారు. మృతుడి భార్య భూమి కేసుకు సంబంధించిన వారిపై అనుమానం వ్యక్తం చేస్తూ ఫిర్యాదు చేశారు. ఆ కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నామని, పోస్టుమార్టం నివేదిక ఆధారంగా చర్యలు తీసుకుంటామని సీఐ తెలిపారు. కాగా గంటల వ్యవధిలో ఎకై ్సజ్ కానిస్టేబుల్ దేవేంద్ర మృతి పలు అనుమానాలకు దారి తీస్తోంది. వాహనం ఢీకొని వెళ్లిపోవడం వెనుక ఏదైనా కుట్ర దాగి ఉందా..? దేవేంద్ర ఏమైనా హత్యకు గురైయ్యాడా...? అనే విషయాలు పోలీసుల దర్యాప్తులో వెల్లడి కావాల్సి ఉంది. -
మదనపల్లెకు విమానాశ్రయం అవసరం
మదనపల్లె టౌన్ : ‘మదనపల్లె అభివృద్ధికి ప్రస్తుతం అత్యంత అవసరమైంది అంతర్జాతీయ విమానాశ్రయం’ అని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ సీనియర్ నేత డాక్టర్ చింతా మోహన్ అన్నారు. మంగళవారం మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రిని స్థానిక కాంగ్రెస్ నేతలతో కలిసి సందర్శించిన అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు కుప్పానికి విమానాశ్రయం తీసుకొచ్చి ఆ ప్రాంతాన్ని అభివృద్ధి చేసినట్లు, మదనపల్లెకు కూడా విమానాశ్రయం తీసుకొస్తే ఈ ప్రాంతం వేగంగా అభివృద్ధి చెందుతుందని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే మదనపల్లెకు తప్పకుండా ఎయిర్పోర్టు తీసుకొస్తామని హామీ ఇచ్చారు. ఆసుపత్రి సందర్శనపై స్పందిస్తూ, ‘ఇక్కడ వైద్య సేవలు ఫర్వాలేదు. కానీ ఈఎన్టీతోపాటు ఇతర స్పెషలిస్ట్ డాక్టర్ల కొరత ఉంది. వెంటనే నియామకాలు చేపట్టి రోగులకు మెరుగైన వైద్యం అందించాలి. రాజకీయ పార్టీల అడ్డంకుల వల్లే ఆసుపత్రి అభివృద్ధికి నోచుకోలేదు’ అని ఆరోపించారు. ‘సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి కాకపోయినా కనీసం మంచి మెడికల్ కాలేజీ, జనరల్ ఆసుపత్రి స్థాయికి అభివృద్ధి చేయాలి, ప్రస్తుతం క్యాజువాలిటీలో మెడికల్ ఆఫీసర్లు లేకపోవడంతో చిన్న కేసులను కూడా రెఫర్ చేస్తున్నారు. రోగులు చనిపోతారనే భయంతో సేఫ్ సైడ్ కోసం వాళ్లు రెఫరల్స్ చేస్తున్నారు’ అని పేర్కొన్నారు. గతంలో ఒక విదేశీ మహిళ మందులు లేని రోజుల్లోనే ఇక్కడ శానిటోరియం ఆసుపత్రి నెలకొల్పి మెరుగైన వైద్యం అందించారని గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ సీనియర్ నాయకులు రెడ్డి సాహెబ్, డా.యమల సుదర్శనం, నాగమణి తదితరులు పాల్గొన్నారు. కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ -
లైట్ వేస్తుండగా కరెంటు షాక్
– యువకుడికి తీవ్ర గాయాలు మదనపల్లె టౌన్ : బాత్రూంలో లైట్ వేస్తుండగా కరెంట్ షాక్కు గురై ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన మంగళవారం ఉదయం వాల్మీకిపురంలో చోటుచేసుకుంది. బాధితుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం.. తేరువీధిలో నివాసం ఉంటున్న లక్ష్మీప్రసాద్(23) ఉదయం బాత్రూంలో లైట్ వేసేందుకు ప్రయత్నించగా ఒక్కసారిగా కరెంట్ షాక్ కొట్టింది. దీంతో అతడు అక్కడికక్కడే కుప్పకూలిపోయాడు. గమనించిన కుటుంబ సభ్యులు వెంటనే బాధితున్ని వాల్మీకిపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తీసుకెళ్లారు. ప్రస్తుతం వైద్యులు చికిత్స అందిస్తున్నారు. టమాటాల ట్రాక్టర్ బోల్తా పుంగనూరు : పట్టణంలోని మినీ బైపాస్ రోడ్డులో మంగళవారం ఉదయం టమాటాలను తీసుకుని ట్రాక్టర్లో మార్కెట్యార్డుకు వెళ్తున్న ట్రాక్టర్ బోల్తా పడింది. అక్కడ ఉన్న మలుపులో ట్రాక్టర్ను డ్రైవర్ కంట్రోల్ చేయలేకపోవడంతో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. దీంతో టమాటాలు అన్నీ కింద పడిపోయాయి. అసలే ధరలు లేక విలవిలలాడుతున్న రైతుకు తీరని నష్టం కలిగింది. అదృష్టవశాత్తు ఆ ప్రాంతంలో ప్రజలు ఎవరు రాకపోవడంతో ప్రమాదం తప్పింది. బస్సు కింద పడి విద్యార్థిని మృతి పీలేరు రూరల్ : ఆర్టీసీ బస్సు కింద పడి ఓ విద్యార్థిని మృతి చెందిన సంఘటన పీలేరు పట్టణం పాతబస్టాండులో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. పీలేరు పట్టణంలోని అయ్యప్పరెడ్డి కాలనీలో నివాసముంటున్న ముక్తియార్ అహ్మద్ కుమార్తె హసిన్తాజ్(17) ఇంటర్మీడియట్ పూర్తి చేసి ఎంసెట్ కౌన్సెలింగ్కు సిద్ధంగా ఉంది. స్థానిక ఉర్దూ పాఠశాలలో ఉపాధ్యాయురాలిగా పని చేస్తున్న తల్లి రమీమున్నీషాను స్కూల్ సమయం అనంతరం తీసుకురావడానికి మంగళవారం సాయంత్రం ఇంటి నుంచి ద్విచక్రవాహనంలో బయలుదేరింది. పాతబస్టాండులో సదుం వెళ్తున్న ఆర్టీసీ బస్సు ప్రయాణికులను ఎక్కించుకుని బయలుదేరే సమయంలో.. బస్సు పక్కగా వచ్చిన హసిన్తాజ్ ద్విచక్రవాహనం అదుపుతప్పింది. ఈ ఘటనలో ఆమె కిందపడిపోయింది. అదే సమయంలో బస్సు ముందు చక్రం ఆమెకు తాకింది. హసిన్తాజ్ను చికిత్స నిమిత్తం స్థానిక ఏరియాఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. జమ్మలమడుగు రూరల్ : మండలంలోని మోరగుడి గ్రామానికి చెందిన దినకర్ మరో విద్యార్థి ప్రసాద్ స్నేహితులు. వీరు జమ్మలమడుగు పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. సోమవారం పాఠశాలకు వెలుతున్నామని చెప్పిన వీరు పాఠశాలకు వెళ్లకుండా సోమవారం సాయంత్రం కూడా ఇంటికి రాలేదు. దీంతో తల్లిదండ్రులు మంగళవారం పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. -
చల్లాచెదురు!
పుంగనూరు : పుంగనూరు నియోజకవర్గ అధికార పక్షంలో అంతర్గత కుమ్ములాటలు పతాక స్థాయికి చేరి రక్తపాతానికి దారితీశాయి. నియోజకవర్గంలో పట్టు కోల్పోతున్న ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డి (చల్లాబాబు) వర్గానికి తెలుగుదేశం పార్టీ అధిష్టానం మంగళవారం రాత్రి గట్టి ‘షాక్’ ఇచ్చింది. పార్టీని వీధిపాలు చేశారంటూ చల్లాబాబుపై అధిష్టానం తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తూ, ఆయన ముఖ్య అనుచరులను పార్టీ నుండి సస్పెండ్ చేసింది. మరోవైపు గ్రూపు రాజకీయాల నేపథ్యంలో సాగిన దాడులకు కారణమైన 12 మంది చల్లా అనుచరులపై పోలీసులు ఏకంగా ‘హత్యాయత్నం’ కేసులు నమోదు చేయడం నియోజకవర్గంలో కలకలం రేపింది. మంత్రుల ముందే కుమ్ములాట.. దళిత నేతపై దాడి పుంగనూరు నియోజకవర్గం ఇన్ఛార్జ్ చల్లా రామచంద్రారెడ్డిని మార్చాలని పట్టుబడుతూ ప్రముఖ వ్యాపారవేత్త మధుసూదన్నాయుడు, బోయకొండ మాజీ చైర్మన్ రమణారెడ్డి, కాపు సంఘ నాయకుడు సోమల సురేష్లు తిరుపతిలో రాష్ట్ర మంత్రుల సమక్షంలో తీవ్రస్థాయిలో పట్టుబట్టారు. తమ పదవి ఊడే ప్రమాదం పొంచివుందనే ఈ నిజాలను జీర్ణించుకోలేని చల్లా రామచంద్రారెడ్డి వర్గీయులు మంత్రుల ముందే రెచ్చిపోయారు. మధుసూదన్నాయుడు వర్గానికి చెందిన దళిత నాయకుడు ముల్లంగి రమణపై దారుణంగా హత్యాయత్నం చేసి, తీవ్రంగా గాయపరిచారు. ఈ ఘోర సంఘటనతో ఆగ్రహించిన అసమ్మతి వర్గం నాయకులు ఇన్ఛార్జ్ను మార్చేదాకా పోరాటం ఆపేది లేదని హెచ్చరిస్తూ మంత్రులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. పరిస్థితి పూర్తిగా అదుపు తప్పడం, నాయకులు ఎవరూ మంత్రుల మాట వినే పరిస్థితి లేకపోవడంతో చేసేదేం లేక సమావేశాన్ని వాయిదా వేసి అక్కడి నుంచి మంత్రులు లాఘవంగా జారుకున్నారు. ముల్లంగి రమణ ఫిర్యాదు.. 12 మందిపై హత్యాయత్నం కేసులు తిరుపతిలో దళితనాయకుడు ముల్లంగి రమణపై జరిగిన దారుణ హత్యాయత్నం ఘటనపై బాధితుడు ఇచ్చిన అధికారిక ఫిర్యాదు మేరకు తిరుచానూరు పోలీసులు అత్యంత పదునైన సెక్షన్ల కింద క్రిమినల్ కేసులు నమోదు చేశారు. ఎస్ఐ సుధాకర్ వెల్లడించిన వివరాల ప్రకారం.. ఎన్యుమరేషన్ గొడవల నేపథ్యంలో సాగిన ఈ ప్రాణాంతక దాడిపై ఎఫ్ఐఆర్ నంబరు: 222/226తో కొత్త చట్టం కింద హత్యాయత్నం కేసులు బనాయించారు. ఈ కేసులో ఒకటో నిందితుడిగా ఉయ్యాల రమణ, రెండో నిందితుడిగా నాగార్జుననాయుడు, మూడో నిందితుడిగా బండ్ల రమేష్, నాలుగో నిందితుడిగా హేమప్రకాష్రెడ్డిలతో పాటు గూడూరు హరి, అమరనాథరెడ్డి, మహమ్మద్ అక్రమ్, నీలం భాస్కర్, గురుస్వామి, చౌదరి, కార్తీక్, ప్రభాకర్ తదితర 12 మంది చల్లాబాబు ప్రధాన అనుచరులపై కేసులు నమోదు కావడం గమనార్హం. చల్లా శకం ముగింపు.. నియోజకవర్గంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండేళ్ల కాలంలోనే తెలుగుదేశం పార్టీ పూర్తిగా వీధిన పడిందని, చల్లాబాబే ఇందుకు కారణమని అధిష్టానం ఒక ముగింపునకు వచ్చింది. తిరుపతి వేదికగా సాగిన రక్తపాతంతో చల్లా రామచంద్రారెడ్డిని తక్షణమే మార్చేందుకు నారావారు సిద్ధమయ్యారు. పార్టీలో సాగుతున్న విచ్చలవిడి క్రమశిక్షణా రాహిత్యానికి శాశ్వతంగా చెక్ పెడుతూ.. వ్యాపారవేత్త మధుసూదన్నాయుడుకు పుంగనూరు ఇన్ఛార్జ్ బాధ్యతలు అప్పగించేందుకు మార్గం సుగమమైంది. పరిస్థితిని పర్యవేక్షించి రెండు వర్గాల నాయకులను విజయవాడ దర్బార్కు తీసుకురావాల్సిందిగా పీలేరు ఎమ్మెల్యే కిషోర్కుమార్రెడ్డికి బాధ్యతలు అప్పగించడంతో.. పుంగనూరు టీడీపీ ఇన్ఛార్జ్ పదవి నుండి చల్లా రామచంద్రారెడ్డిని శాశ్వతంగా తొలగించడానికి రంగం సిద్ధం చేసినట్లు స్పష్టమవుతోంది. ఈ ఆకస్మిక రాజకీయ పరిణామాలతో చల్లాబాబు వర్గం తీవ్ర నిరాశలో మునిగిపోగా.. అసమ్మతి వర్గంలో మాత్రం పండుగ వాతావరణం నెలకొంది. పుంగనూరు ఇన్ఛార్జ్గా ‘మధుసూదన్నాయుడు’? దళిత నేతపై చల్లా వర్గీయుల హత్యాయత్నం ఉయ్యాల రమణ సహా 12 మందిపై కేసు నమోదు మంత్రుల ముందే ముష్టియుద్ధాలు సీఎం చంద్రబాబు ఆదేశాలతో నలుగురు ముఖ్యులపై సస్పెన్షన్చంద్రబాబు సీరియస్.. నలుగురిపై సస్పెన్షన్ వేటు పుంగనూరులో చెలరేగిన ఈ తీవ్ర అంతర్గత ఘర్షణలు, దళిత నేతపై దాడిపై ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రత్యేకంగా ఆరా తీశారు. పార్టీ పరువు బజారున పడేలా ప్రవర్తించిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. సీఎం ఆదేశాలతో రంగంలోకి దిగిన రాజంపేట పార్లమెంటు అధ్యక్షుడు సుగవాసి ప్రసాద్బాబు.. దళిత నేతపై దాడికి కారణమైన చల్లాబాబు ముఖ్య అనుచరులు ఉయ్యాల రమణ, నూకల నాగార్జున, మహమ్మద్ అక్రమ్, చావడి షేక్ కరీముల్లాలు నలుగురిని పార్టీ నుండి సస్పెండ్ చేస్తూ అధికారిక ఉత్తర్వులు జారీ చేశారు. -
వేర్వేరు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు
రొంపిచెర్ల : జిల్లాలోని వేర్వేరు ప్రాంతాల్లో జరిగిన రోడ్డు ప్రమాదాల్లో నలుగురికి గాయాలు అయ్యాయి. రొంపిచెర్ల మండలంలో మంగళవారం బొలెరో వాహనం ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ ఫజులుపేటకు చెందిన లైన్మ్యాన్ రెడ్డెప్ప(60), మోహన్రెడ్డి (38) ద్విచక్ర వాహనంలో రొంపిచెర్ల నుంచి చిచ్చిలివారిపల్లెకు వెళ్తుండగా లంకిపల్లెవారిపల్లె సమీపంలో రొంపిచెర్ల వైపు వస్తున్న బొలెరో వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో వారిద్దరూ గాయపడ్డారు. వీరిని చికిత్స కోసం 108లో పీలేరు ఆస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ద్విచక్ర వాహనం ఢీకొని.. మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ రైతు తీవ్రంగా గాయపడ్డారు. ముదివేడు పోలీసుల కథనం ప్రకారం.. మదనపల్లె పట్టణం గాంధీపురానికి చెందిన రైతు వెంకటరమణ(60) బి.కొత్తకోట మండలం మొగసాల మర్రి వద్ద కొంత భూమిని లీజుకు తీసుకొని వ్యవసాయం చేస్తున్నారు. సోమవారం కూడా ఎప్పటిలాగే పొలం పనులు ముగించుకొని అర్ధరాత్రి ద్విచక్ర వాహనంపై స్వగ్రామానికి బయలుదేరారు. మార్గంమధ్యలో కురబలకోట మండలం అంగళ్లు బైపాస్ రోడ్డు వద్ద ఎదురుగా వేగంగా వస్తున్న మరో ద్విచక్ర వాహనం ఆయన బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ తలకు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి బాధితుడిని 108 అంబులెన్స్లో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వెంకటరమణ కోలుకుంటున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. రన్నింగ్ చేస్తూ వెళ్తుండగా.. చౌడేపల్లె : ఎలాగైనా సరే ఈ సారైనా రక్షణ శాఖలో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో తెల్లారక ముందే ఫిజికల్ ఫిట్నెస్లో భాగంగా రన్నింగ్ చేస్తూ వెళ్తున్న యువకుడిని గుర్తు తెలియనివాహనం ఢీకొన్న ఘటన మంగళవారం జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. పుదిపట్ల పంచాయతీ మిట్టూరుకు చెందిన నాగరాజ కుమారుడు పవన్కుమార్(23) డిగ్రీ వరకు చదివాడు. ఇటీవల రక్షణ శాఖలో పలు ఉద్యోగాల కోసం ప్రయత్నించారు. ఆర్మీ సెలెక్షన్కు వెళ్లాలనే ఆశయంతో మిట్టూరు నుంచి ప్రతి రోజూ చౌడేపల్లె మార్గం వైపు రన్నింగ్ చేస్తూ బిల్లేరు వద్దకు వచ్చేవాడు. ఈ క్రమంలో రోజూ వారీగా బిల్లేరు నుంచి తిరిగి రన్నింగ్ చేస్తూ వెళ్తున్న పవన్కుమార్ను వెనుక వైపు నుంచి ఓ గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. లేవలేని ిస్థితిలో పడి ఉన్న అతన్ని గమనించిన స్థానికులు 108 సహాయంతో పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్య సేవల కోసం తిరుపతికి తరలించినట్లు కుటుంబీకులు తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న వెంకటరమణ గాయపడిన రెడ్డెప్ప -
ఉద్యమించిన ఉపాధ్యాయులు
సాక్షి, మదనపల్లె : దీర్ఘకాలంగా పరిష్కారానికి నోచుకోని విద్యారంగ, ఆర్థికపరమైన సమస్యలపై అన్నమయ్య జిల్లా ఉపాధ్యాయ లోకం మంగళవారం ఉగ్రరూపం దాల్చింది. ప్రభుత్వ ఉదాసీన వైఖరి, నిర్లక్ష్యపూరిత ధోరణికి వ్యతిరేకంగా ఉపాధ్యాయులు భారీ ఎత్తున గళమెత్తారు. ‘ప్రభుత్వం మెడలు వంచైనా సరే మా న్యాయమైన డిమాండ్లు సాధించుకుంటాం‘ అంటూ ఉపాధ్యాయులు చేసిన నినాదాలతో మదనపల్లె పట్టణం హోరెత్తింది. ఏపీ ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య (ఫ్యాప్టో) పిలుపు మేరకు జిల్లా నలుమూలల నుంచి వేలాది మంది ఉపాధ్యాయులు మంగళవారం ఉదయమే మదనపల్లెకు తరలివచ్చారు. ఆందోళనలో భాగంగా ఉపాధ్యాయులంతా తొలుత మదనపల్లెలోని మిషన్ కాంపౌండ్ వద్దకు చేరుకుని ఒక్కసారిగా ప్రధాన రహదారిపై బైఠాయించి, చేతుల్లో ప్లకార్డులు పట్టి ప్రభుత్వానికి వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఉపాధ్యాయుల సమస్యల పరిష్కారంలో పాలక ప్రభుత్వానికి కనీస చిత్తశుద్ధి లేదని, కాలయాపన చేస్తూ ఇంకెంత సమయం వృథా చేస్తారని నిలదీశారు. మిషన్ కాంపౌండ్ వద్ద బైఠాయింపు అనంతరం ఉపాధ్యాయులు భారీ ప్రదర్శనగా అన్నమయ్య జిల్లా కలెక్టరేట్ వైపు దూసుకెళ్లి, కలెక్టరేట్ ముఖద్వారం ఎదుట గంటల తరబడి ధర్నా నిర్వహించి ముట్టడించారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో రాష్ట్ర, జిల్లా సంఘ నేతలు మాట్లాడుతూ ఉపాధ్యాయుల న్యాయమైన ఆర్థిక, వృత్తిపరమైన భద్రతను ప్రభుత్వం గాలికి వదిలేసిందని మండిపడ్డారు. తక్షణమే 12వ వేతన సవరణ సంఘాన్ని ఏర్పాటు చేయాలని, వేతన సవరణ జాప్యమైనందుకు గాను 30 శాతం మధ్యంతర భృతి ప్రకటించాలని, అలాగే పెండింగ్లో ఉన్న డీఏలు, పీఆర్సీ, సరెండర్ లీవ్ బకాయిలను తక్షణమే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. విద్యాహక్కు చట్టాన్ని తగిన విధంగా సవరించి, ప్రస్తుతం ఇన్–సర్వీస్లో కొనసాగుతున్న ఉపాధ్యాయులందరికీ నిబంధన నుండి శాశ్వత మినహాయింపు ఇవ్వాలని, సీపీఎస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని తక్షణమే పునరుద్ధరించాలని పట్టుబట్టారు. ఉపాధ్యాయులకు కేవలం బోధన మినహా ఇతర ప్రభుత్వ యాప్స్, బోధనేతర పనులు అప్పగించవద్దని, ప్రతి ఉన్నత పాఠశాలలో నాన్–టీచింగ్ స్టాఫ్, కంప్యూటర్ ఆపరేటర్ల నియామకం చేపట్టాలని కోరారు. ఏళ్ల తరబడి పెండింగ్లో ఉన్న వెయ్యికి పైబడిన కారుణ్య నియామకాలను వెంటనే భర్తీ చేయాలని, ఉపాధ్యాయుల సర్వీస్ రూల్స్ లోకల్ కేడర్గా పరిగణిస్తూ గెజిటెడ్ పోస్టులకు పదోన్నతులు కల్పించాలని డిమాండ్ చేశారు. హైస్కూల్ ప్లస్ పాఠశాలల్లో పూర్తిస్థాయి ఉపాధ్యాయులను నియమించాలని, వాటిని ఇంటర్ బోర్డుకు అప్పగించే కుట్రను విరమించుకోవాలన్నారు . ఎస్సీ, ఎస్టీలకు ఎలాంటి నిబంధనలు లేకుండా స్టడీ లీవ్ మంజూరు చేయాలని, పార్ట్ టైమ్ టీచర్ల రిటైర్మెంట్ వయస్సు 62 ఏళ్లకు పెంచి వారి సర్వీసును తక్షణమే రెగ్యులరైజ్ (క్రమబద్ధీకరణ) చేయాలని డిమాండ్ చేశారు. దీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న విద్యారంగ, ఆర్థికపరమైన సమస్యలపై ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చూపిస్తోందని, ఉపాధ్యాయుల సమస్యలపై ప్రభుత్వం తక్షణమే స్పందించి ఉపాధ్యాయ సంఘాలతో అధికారిక చర్చలు జరపని పక్షంలో.. రాబోయే రోజుల్లో రాష్ట్రవ్యాప్తంగా విధులను బహిష్కరించి ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని, సమ్మెకు సైతం వెనకాడబోమని ఫ్యాప్టో నాయకులు హెచ్చరించారు. టీచర్లు ధర్నా చేస్తుండటంపై పోలీసులు అభ్యంతరం వ్యక్తం చేశారు. కొంతసేపటి తర్వాత టీచర్ల ధర్నా విరమించి జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కార్యక్రమంలో రాష్ట్ర, జిల్లా నేతలు హేమలత, జాబీర్, పోకల మధుసూదన్, గఫార్ ఖాన్, కిరణ్ కుమార్, శివారెడ్డి, జగన్మోహన్ రెడ్డి వేణుగోపాల్ రెడ్డి, కడియాల మురళి, రాజారెడ్డి,జనార్దన్ రెడ్డి, మోహన్ కుమార్ రెడ్డి, అమర్నాథ్ రెడ్డి, సోమశేఖర్ రెడ్డి, కిషోర్ కుమార్ రెడ్డి, మోహన్ యాదవ్, సుధాకర్ నాయుడు, రవి ప్రకాష్, రమేష్, బాలాజీ, శ్రీనివాస్ రెడ్డి, భాస్కర్ రెడ్డి, విజయ్, సుధాకర్ నాయుడు, హరిబాబు, నరసింహులు, సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. 12వ వేతన సంఘం ఏర్పాటుకు డిమాండ్ మదనపల్లె మిషన్కాంపౌండ్లో బైఠాయింపు కలెక్టరేట్ ఎదుట ధర్నా -
మున్సిపల్ ఆఫీస్కు పరుగులు
అప్పట్లో ఆర్భాటంగా లేఖలు పంచిన చంద్రబాబు సర్కార్ ఆ టిడ్కో నిర్మాణాలను పూర్తి చేయకుండా ఏడేళ్లకు పైగా లబ్ధిదారులను ఇళ్ల కోసం ఎదురుచూసేలా చేసింది. 2019లో టీడీపీ అధికారం కోల్పోవడంతో పాటు అంతకుముందే పనులు చేపట్టకపోవడంతో లబ్ధిదారుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. ప్రస్తుతం మళ్లీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత.. పెండింగ్లో ఉన్న పోతబోలు టిడ్కో ఇళ్లను పూర్తి చేసి ఇస్తారని ఆశించిన పేదలకు చంద్రబాబు సర్కార్ కోలుకోలేని షాక్ ఇచ్చింది. ‘మీకు ఇచ్చేందుకు ఇక్కడ టిడ్కో ఇళ్లు లేవు.. మీరు కట్టిన పాత డిపాజిట్లు వెనక్కు తీసుకుని వెళ్లిపోండి‘ అంటూ మున్సిపల్ అధికారుల ద్వారా నిర్ధాక్షిణ్యంగా ఆదేశాలు జారీ చేయించింది. దాంతో ఆశలు వదులుకున్న పేదలు తాము కట్టిన డిపాజిట్ సొమ్మునైనా వెనక్కు తీసుకుందామని మదనపల్లె మున్సిపల్ కార్యాలయానికి తరలివస్తున్నారు. -
● గెరిశె..జ్ఞాపకాలు విరిసె !
నిండుగా విసిరిన కల్లాలు.. రాశులుగా పోసిన కనకధాన్యాలు.. ఉమ్మడి కుటుంబాల కోలాహలం.. ఒకప్పుడు రాయలసీమ పల్లెసీమల జీవన సంస్కృతికి ఇవే సజీవ సాక్ష్యాలు. ఆ సంపదకు, పల్లె లక్ష్మికి నిలయాలుగా నిలిచిన ‘ధాన్యపు గెరిశెలు’ (రాతి కోటార్లు) ప్రస్తుతం ప్రాభవం కోల్పోయి, కాల గర్భంలో కలిసిపోతూ కేవలం నాటి జ్ఞాపకాల చిహ్నాలుగా దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ బస్తాల వాడకం అమలులోకి వచ్చాక వీటి వినియోగం పూర్తిగా తగ్గిపోయింది. ఒక్కో పెద్ద గెరిశెలో సుమారు 100 బస్తాల ధాన్యాన్ని ఎలాంటి పురుగు పట్టకుండా దశాబ్దాల పాటు భద్రపరిచేవారు. అవసరమైనప్పుడు కింది భాగంలో ఉన్న చిన్న రంధ్రం ద్వారా కావలసినంత ధాన్యాన్ని తీసుకునేవారు. నాటి సిరిసంపదలకు నిలువెత్తు రూపాలుగా నిలిచిన ఇవి, నేడు నిరుపయోగంగా మారి దిష్టిబొమ్మల్లా మిగిలిపోవడంపై పాతతరం వారు గతాన్ని నెమరువేసుకుంటున్నారు. – గుర్రంకొండ -
మిట్స్లో ‘ఫ్యూచర్ స్కిల్స్’ ల్యాబ్లు
కురబలకోట: మదనపల్లె సమీపంలోని అంగళ్లు వద్ద గల మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ విద్యార్థులను ప్రపంచ స్థాయి టెక్నాలజీ నిపుణులుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా క్యాంపస్లో 20 అత్యాధునిక ‘సెంటర్ ఫర్ ఫ్యూచర్ స్కిల్స్’ ల్యాబ్లను ఏర్పాటు చేస్తున్నట్లు వర్సిటీ ఛాన్సలర్ డాక్టర్ నాదేళ్ల విజయభాస్కర్ చౌదరి తెలిపారు. న్యూఢిల్లీలో జరిగిన ప్రత్యేక కార్యక్రమంలో మిట్స్ యూనివర్సిటీ, జాతీయ నైపుణ్యాభివృద్ధి సంస్థ మధ్య ఈ మేరకు చరిత్రాత్మక అవగాహన ఒప్పందం కుదిరినట్లు ఆయన వెల్లడించారు. ప్రపంచవ్యాప్తంగా పరిశ్రమలు వేగంగా మారుతున్న నేపథ్యంలో విద్యార్థులకు కేవలం డిగ్రీలు ఇవ్వడమే కాకుండా గ్లోబల్ సంస్థల్లో పోటీపడే సామర్థ్యం కల్పించడమే తమ ఉద్దేశ్యమన్నారు. అందుకే మిట్స్లో ఆపిల్, మైక్రోసాఫ్ట్, ఐబీఎం, ఇంటెల్ ఏఐ, మెటా, ఆమెజాన్ వెబ్ సర్వీసెస్, మహీంద్ర ఈవీ, ష్నైడర్ ఎలక్ట్రిక్, ఏబీబీ, ఎన్విడియా, సిస్కో, ఎన్ఐఎస్ఎం, ఫాలో ఆల్టో తదితర ప్రపంచ ఖ్యాతి గడించిన సంస్థల సాంకేతిక వేదికలను అందుబాటులోకి తీసుకురానున్నట్లు వివరించారు. ఎన్ఎస్డీసీ వైస్ ప్రెసిడెంట్ వరుణ్ బత్రా, మిట్స్ ఎగ్జిక్యూటివ్ మెంబర్ రవికుమార్ పాల్గొన్నారు. -
వేర్వేరు ప్రమాదాల్లో 9 మందికి గాయాలు
మదనపల్లె టౌన్ : జిల్లాలో జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో 9 మందికి గాయాలు అయ్యాయి. కురబలకోట మండలంలో ఆదివారం ఉదయం కారు, ఆటో ఢీకొనడంతో ఆటో డ్రైవర్ సహా మరో ముగ్గురు ప్రయాణికులు తీవ్రంగా గాయపడ్డారు. పోలీసుల కథనం ప్రకారం.. నందిరెడ్డిగారిపల్లికి చెందిన షామీర్ (55) ఆటో నడుపుకొని కుటుంబాన్ని పోషిస్తున్నాడు. అదే గ్రామానికి చెందిన మహబున్నిషా(38)తోపాటు మరో ఇద్దరు ములకలచెరువులోని బంధువుల ఇంట్లో జరిగే పండుగకు హాజరయ్యేందుకు షామీర్ ఆటోలో బయలుదేరారు. ఆటో మార్గంమధ్యలోని కంటేవారిపల్లెకు చేరుకుంది. ఈ ఆటో, ఎదురుగా వస్తున్న కారు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటో డ్రైవర్ షామీర్, ప్రయాణికులు మహబున్నిషాతోపాటు మరో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. క్షతగాత్రులను 108 వాహనంలో మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. ప్రమాదంపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు పోలీసులు తెలిపారు. ట్రాక్టర్ ఢీకొని.. బంధువుల ఇంట్లో జరిగే పండుగకు బైక్పై వెళ్తున్న రైతును ట్రాక్టర్ ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డాడు. ఆదివారం ఉదయం గుర్రంకొండ మండలంలో ఈ ప్రమాదం జరిగింది. బాధితుడు తెలిపిన వివరాల ప్రకారం.. నంబుల పూలకుంట మండలం టి.ఎన్. పల్లెకు చెందిన రైతు వెంకటరమణ ఆచారి (60) నిమ్మనపల్లెలోని బంధువుల ఇంటికి పండుగ నిమిత్తం బైక్పై బయలు దేరాడు. మార్గమధ్యంలో గుర్రంకొండ వద్దకు రాగానే ఎదురుగా వచ్చిన ట్రాక్టర్, బైక్ను ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వెంకటరమణ ఆచారి కాళ్లు, చేతులు విరిగి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే స్పందించి క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కారును ఢీకొన్న టెంపో చౌడేపల్లె : మండల పరిధి సోమల నుంచి చౌడేపల్లె వైపు వస్తున్న కారును అదుపుతప్పి ఎదురుగా వస్తున్న టెంపో ఢీకొంది. ఈ ఘటనలో ఇద్దరికి స్వల్ప గాయాలయ్యాయి. అలాగే పక్షిరాజపురం వద్ద ఎదురెదురుగా వెళ్తున్న రెండు కార్లు ఢీకొన్నాయి. ఈ ఘటనలో ఇద్దరికి గాయాలవ్వగా.. రెండు ప్రమాదాల్లో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నాయి. గాయపడిన వారిని ప్రైవేటు వాహనం ద్వారా ఆసుపత్రులకు తరలించారు. కాగా గాయపడిన వారి వివరాలు తెలియరాలేదు. -
పెరిగిన టమాట ధర
సాక్షి, మదనపల్లె: మదనపల్లె మార్కెట్లో టమాట ధరలు స్వల్పంగా పెరుగుతున్నాయి. శనివారం మార్కెట్ కు 1,394 టన్నుల టమాట విక్రయానికి రాగా అత్యధిక ధర కిలో రూ.19 పలికింది. ఆదివారం 1,348 టన్నుల టమాట విక్రయానికి రాగా కిలో అత్యధిక ధర రూ.19 పలికి తగ్గకుండా, పెరగకుండా కొనసాగింది. 17 వరకు రైళ్లు రద్దు కడప కోటిరెడ్డి సర్కిల్: ముంబై డివిజన్లోని కర్జాత్ – లోనావ్లా ( ఎస్ఈ) సెక్షన్న్లో భారీగా కొండచరియలు విరిగిపడ్డాయి. ఖండాలా – మంకీహిల్ స్టేషన్ల మధ్య జరిగిన ఈ ఘటన కారణంగా ముంబై– చైన్నె (22157), చైన్నె– ముంబై (22158) వెళ్లే రైళ్లను ఈనెల 17వ తేదీ వరకు తాత్కాలికంగా నిలిపివేసినట్లు కడప చీఫ్ కమర్షియల్ ఇన్స్పెక్టర్ జనార్ధన్ తెలిపారు. డీసెట్లో కవిత స్టేట్ఫస్ట్ పుంగనూరు: మండలంలోని బి.కొత్తూరు గ్రామానికి చెందిన రెడ్డెప్ప కుమార్తె కవిత.. రాష్ట్రస్థాయి ఏపిడీసెట్ ప్రవేశ పరీక్షల్లో ఘనవిజయం సాధించింది. మొత్తం 100 మార్కులకు ఆమె 79 మార్కులు సాధించి, రాష్ట్రస్థాయిలోనే ప్రథమ ర్యాంకును కై వసం చేసుకుంది. తిరుపతి స్విమ్స్లో బీఎస్సీ నర్సింగ్ పూర్తి చేసిన కవిత, ఉపాధ్యాయ వృత్తిపై ఉన్న ప్రత్యేక మక్కువతో ఈ పరీక్ష రాసి టాపర్గా నిలిచింది. గ్రామీణ నేపథ్యం నుండి వచ్చి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన కవితను, ఆమె తల్లిదండ్రులను గ్రామస్తులు ఘనంగా అభినందించారు. టెన్త్ ‘బ్లూప్రింట్’, మోడల్ పేపర్లు విడుదల మదనపల్లె సిటీ: పదో తరగతి (టెన్త్) పబ్లిక్ పరీక్షలు రాసే విద్యార్థుల కోసం ప్రభుత్వ పరీక్షల విభాగం కీలక సమాచారాన్ని విడుదల చేసిందని అన్నమయ్య జిల్లా విద్యాశాఖ అధికారి డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. పబ్లిక్ పరీక్షలకు సంబంధించి సబ్జెక్టుల వారీ బ్లూప్రింట్, మోడల్ ప్రశ్నపత్రాలను అధికారిక వెబ్సైట్తో పాటు లీప్ యాప్లో అందుబాటులో ఉంచినట్లు ఆయన వెల్లడించారు. ప్రధానోపాధ్యాయులు, ఆయా సబ్జెక్టుల ఉపాధ్యాయులు అధికారిక వెబ్సైట్ నుంచి బ్లూప్రింట్, మోడల్ పేపర్లను వెంటనే డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. వాటిని విద్యార్థులకు అందుబాటులో ఉంచి, బోర్డు పరీక్షల ప్రిపరేషన్, ప్రాక్టీస్లో తగిన గైడెన్స్ చేయాలని సూచించారు. రాబోయే పబ్లిక్ పరీక్షల సరళి, మార్కుల కేటాయింపు, పరీక్షా విధానాన్ని క్షుణంగా అర్థం చేసుకోవడానికి విద్యార్థులు ఈ బ్లూప్రింట్, మోడల్ పేపర్లను క్షుణ్ణంగా పరిశీలించాలని కోరారు. థియేటర్లలో ‘సర్’ కడప సెవెన్రోడ్స్ : ప్రత్యేక ఓటరు జాబితా సవరణ (ఎస్ఐఆర్) కార్యక్రమంపై ప్రజల్లో విస్తృత అవగాహన కల్పించేందుకు జిల్లాలోని అన్ని సినిమా థియేటర్లలో ఈ నెల 14 వ తేదీ వరకు ప్రచార దృశ్యాలు, చిత్రాలను తప్పకుండా ప్రదర్శించాలని థియేటర్ యాజమాన్యాలు, అధికారులకు జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి ఆదేశాలు జారీ చేశారు. రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం ఆదేశాల మేరకు ఇప్పటికే జిల్లా సమాచార, పౌరసంబంధాల శాఖ ద్వారా థియేటర్ యాజమాన్యాలకు అవసరమైన సూచనలు జారీ చేసామని కలెక్టర్ తెలిపారు. అలాగే ఆయా మండలాల పరిధిలోని రెవెన్యూ అధికారులు కూడా సినిమా థియేటర్ యాజమాన్యాలకు సూచనలు అందించాలన్నారు. -
మహిళా క్రికెట్ పోటీల్లో అదరగొట్టిన ‘అనంతపురం’
వాల్మీకిపురం : మహిళా క్రికెట్ పోటీల్లో అనంతపురం జట్టు అదరగొట్టింది. స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో గత ఐదు రోజులుగా జరుగుతున్న సౌత్జోన్ ఉమెన్స్ అండర్ 19 వన్డే అంతర్ జిల్లా క్రికెట్ పోటీలు ముగిశాయి. ఈ పోటీల్లో అనంతపురం, చిత్తూరు, నెల్లూరు, కర్నూలు, కడప జిల్లాల క్రికెట్ టీంలు పాల్గొన్నాయి. టోర్నమెంట్ చాంపియన్స్గా అనంతపురం జట్టు, రన్నర్స్గా చిత్తూరు జట్టు నిలిచాయి. ఈ ముగింపు కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ప్రదీప్ ఫౌండేషన్ చైర్మన్ ప్రణీత్, ఆంధ్రక్రికెట్ అసోసియేషన్ జాయింట్ సెక్రటరీ విజయ్ చాంపియన్ జట్లకు ట్రోఫీలను అందించారు. ఈ కార్యక్రమంలో సీడీసీఏ ప్రెసిడెంట్ శ్రీనివాసమూర్తి, వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్కుమార్, సెక్రటరీ సతీష్ యాదవ్, ఉమ్మడి చిత్తూరు జిల్లా కోచ్ సునీల్ కుమార్, నాగలక్ష్మి, సాయిప్రభాకర్, ధనలక్ష్మి, మాధవి, శేఖర్, మౌనిక, రెడ్డిరాఘవేంద్ర, తదితరులు పాల్గొన్నారు.సౌత్జోన్ అండర్ 19 టోర్నమెంట్లో విజయం -
● క్షేత్రస్థాయిలో అన్నదాతల ఆవేదన
● రెండేళ్లుగా అందని రుణాలు ● ‘అన్నదాత సుఖీభవ’ అంతఃర్థానం ● నాడు వడ్డీ లేని రుణాలు.. నేడు వడ్డీల మీద చక్రవడ్డీలు ● రూ.70 వేల రుణానికి రూ.26 వేల వడ్డీ వసూలు ● సింగిల్ విండోల నోటీసుల కలకలం ● ఖరీఫ్ సాగు ప్రారంభమైనా ‘ససేమిరా’ అంటున్న బ్యాంకర్లు ● కార్డులపై తగ్గిన రైతుల ఆసక్తి గుర్రంకొండ: రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుండి కౌలురైతుల పరిస్థితి అగమ్యగోచరంగా మారింది. రెండేళ్లకు పైగా పంటల సాగు కోసం కౌలురైతులకు నయాపైసా రుణం కూడా మంజూరు కాకపోవడంతో వారు తీవ్ర ఆర్థిక ఇబ్బందుల్లో కొట్టుమిట్టాడుతున్నారు. ప్రభుత్వం ఎంతో ఆర్భాటంగా ప్రకటించిన ‘అన్నదాత సుఖీభవ’ పథకం కూడా రెండేళ్లు దాటినా వీరికి అందని ద్రాక్షగానే మిగిలిపోయింది. పాత రుణాలకు బలవంతపు వడ్డీ వసూలు గతంలో 2014–2017 మధ్య అప్పటి టీడీపీ ప్రభుత్వం జిల్లాలో కేవలం 452 మంది కౌలురైతులకు సింగిల్ విండోల ద్వారా వడ్డీ లేని రుణాలు ఇచ్చింది. అయితే, గత రెండేళ్లుగా పాత వడ్డీలు, వాటిపై చక్రవడ్డీలు, బారు వడ్డీలను కలిపి కౌలురైతులకు నోటీసులు జారీ చేయడం తీవ్ర కలకలం రేపుతోంది. రూ.లక్ష వరకు రుణం తీసుకున్న రైతులకు ఏకంగా రూ.40 వేల వడ్డీతో కలిపి అసలు, వడ్డీలు తక్షణమే కట్టాలని ముక్కుపిండి వసూలు చేస్తుండటంతో కౌలురైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. నాడు వైఎస్సార్సీపీ ‘అండ’.. నేడు కూటమి ‘మొండిచేయి’ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి ఏడాది ‘వెఎస్సార్ రైతుభరోసా’ కింద కౌలురైతులకు ఒకేసారి రూ.7,500 పెట్టుబడి సాయాన్ని అందించి ఆదుకున్నారు. నేరుగా కౌలురైతుల బ్యాంకు ఖాతాలకే పంట నష్టపరిహారాన్ని జమ చేయడంతో పాటు, రైతు భరోసా కేంద్రాల ద్వారా సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు అందించి సాగుకు చేయూతనిచ్చారు. కానీ ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో పంట రుణాలు రాక.. సబ్సిడీ ఎరువులు, విత్తనాలు కూడా దక్కకపోవడంతో కౌలురైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ససేమిరా అంటున్న బ్యాంకర్లు.. కార్డులపై తగ్గిన ఆసక్తి! ప్రస్తుతం ఖరీఫ్ సీజన్ ప్రారంభమై కౌలురైతులు పొలాలు దుక్కులు చేసుకుంటున్నా జిల్లాలో ఇంతవరకు ఒక్కరికి కూడా కొత్త రుణం అందలేదు. వ్యవసాయాధికారులు జారీ చేసిన సాగు వివరాల పత్రాలున్నా, ‘కేవలం సాగుచేసే పంటను ఆధారంగా చేసుకొని రుణాలు ఇవ్వలేం’ అంటూ బ్యాంకర్లు కరాఖండిగా తిరస్కరిస్తున్నారు. కూటమి ప్రభుత్వంలో ఎలాంటి సాయం అందకపోవడంతో కౌలురైతులు ఇప్పుడు గుర్తింపు కార్డులు తీసుకోవడానికి కూడా ఆసక్తి చూపించడం లేదు. ప్రస్తుత ఏడాది జిల్లా వ్యాప్తంగా కేవలం 6 వేల మందికి మాత్రమే అధికారులు అరకొరగా గుర్తింపు సర్టిఫికెట్లను జారీ చేశారు. గత రెండేళ్ల కూటమి ప్రభుత్వ మొత్తం పాలనలో కేవలం 15 వేల మంది కౌలురైతులకు మాత్రమే ఈ కార్డులు లభించాయి. అదే గత 2019–2024 వైఎస్సార్సీపీ ఐదేళ్ల పాలనలో జిల్లా వ్యాప్తంగా ఏకంగా 64,527 మందికి పైగా కౌలురైతులకు కార్డులు ఇచ్చి, రుణాలు ఇప్పించిన దాఖలాలు ఉన్నాయి. ప్రైవేట్ వడ్డీ వ్యాపారులే గతి ఓవైపు బ్యాంకులు రుణాలు ఇవ్వకపోవడంతో, గత్యంతరం లేక రైతులు ప్రైవేట్ వడ్డీ వ్యాపారులను ఆశ్రయించి, అధిక వడ్డీలకు అప్పులు తెచ్చి పెట్టుబడులు పెడుతున్నారు. పంట పండినా పండకపోయినా, పొలం కౌలుకు ఇచ్చిన యజమానికి మాత్రం ఒప్పందం ప్రకారం కౌలు డబ్బులు తప్పనిసరిగా చెల్లించాల్సిందే. దీంతో సాగును నమ్ముకుని గత కొన్నేళ్లుగా కేవలం నష్టాలనే చవిచూస్తూ అప్పుల ఊబిలో పూర్తిగా కూరుకుపోతున్నారు. ఇప్పటికై నా కూటమి ప్రభుత్వం యుద్ధప్రాతిపదికన స్పందించి, బలవంతపు వడ్డీ వసూళ్ల నోటీసులను తక్షణమే నిలిపివేయాలని, కౌలురైతులందరికీ తక్షణమే ఖరీఫ్ పంట రుణాలు ‘అన్నదాత సుఖీభవ’ సాయాన్ని విడుదల చేయాలని జిల్లా రైతాంగం డిమాండ్ చేస్తోంది. రమేశ్బాబు వెంకటరమణారెడ్డి రెడ్డిమోహన్ గుర్రంకొండకు చెందిన కౌలురైతు రెడ్డిమోహన్ మాట్లాడుతూ.. 2016లో వడ్డీ లేని రుణాలంటూ సింగిల్ విండో ద్వారా రూ.70 వేలు తీసుకుంటే, ఇప్పుడు ఒక్కసారిగా అన్ని సంవత్సరాల వడ్డీ కలిపి రూ.26 వేలు బలవంతంగా కట్టించుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. అలాగే, దిగువ బురుజుపల్లెకు చెందిన కౌలురైతు వెంకటరమణారెడ్డి మూడు ఎకరాల్లో బొప్పాయి సాగు చేస్తే వైరస్, నల్లమచ్చల వల్ల పంట దెబ్బతిని కిలో రూపాయికి కూడా ఎవరూ కొనకపోవడంతో పెట్టుబడి సైతం రాలేదని, పంట నష్టపోయినా ప్రభుత్వం నుండి రూపాయి పరిహారం అందలేదని వాపోయారు. జిల్లా కౌలురైతుల సంఘం కార్యదర్శి (టి.రాజంపల్లె) రమేశ్బాబు మాట్లాడుతూ.. గత రెండేళ్లుగా జిల్లాలో కౌలురైతులకు ‘అన్నదాత సుఖీభవ’ సాయం దక్కలేదని, సబ్సిడీపై విత్తనాలు, ఎరువులు ఇవ్వకపోగా బ్యాంకర్లు కూడా కౌలురైతులను బ్యాంకుల వైపు రానివ్వడం లేదని, ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. -
ఇద్దరు విద్యార్థుల మధ్య ఘర్షణ
● కత్తులతో పరస్పరం దాడి చేసుకున్న వైనం ● పాత కక్షల నేపథ్యంలో ఘటనమదనపల్లె టౌన్ : మదనపల్లె రామారావు కాలనీలో ఆదివారం ఇద్దరు డిగ్రీ విద్యార్థులు ఘర్షణకు దిగి కత్తులతో పరస్పరం పొడుచుకున్నారు. ఈ ఘటనలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు, టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ఆర్టీసీ బస్టాండ్ వద్ద ఉన్న ఒక కళాశాలలో డిగ్రీ చదువుతున్న స్థానిక రామారావు కాలనీకి చెందిన మోహిత్ నాక్(21), స్థానిక అనపగుట్టలో ఉండే షాజహాన్(21) మధ్య గతంలో చిన్నచిన్న గొడవలు జరిగి పాత కక్షలు పెంచుకున్నారు. ‘నన్ను చూశావు’ అనే విషయంపై ఇటీవల మళ్లీ వివాదం మొదలైంది. ‘నీ అంతు చూస్తా’ అంటూ ఒకరిపై ఒకరు సవాళ్లు విసురుకున్నారు. ఈ క్రమంలో ఆదివారం ఇరువురు రామారావు కాలనీలో ఒకచోట చేరి వాగ్వాదానికి దిగారు. మాటకుమాట పెరిగి పరస్పరం దాడులకు తెగబడ్డారు. ఇద్దరూ తమ వెంట తెచ్చుకున్న కత్తులతో ఒకరిపై ఒకరు దాడి చేసుకుని గాయపడ్డారు. గాంజా మత్తులోనే గొడవ పడ్డట్లు ప్రాథమికంగా తెలుస్తోంది. గాయపడిన విద్యార్థులను స్థానికులు, కుటుంబ సభ్యులు వెంటనే స్థానిక జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారికి చికిత్స అందిస్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. పూర్తి వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. -
కెంపేగౌడ ఆదర్శప్రాయుడు
– జస్టిస్ గోపాల్ గౌడ బి.కొత్తకోట: విజయనగర సామ్రాజ్య సామంతరాజు, బెంగళూరు మహానగర నిర్మాత నాడప్రభు కెంపేగౌడ అసాధారణ పోరాట పటిమ గల గొప్ప నాయకుడని సుప్రీంకోర్టు విశ్రాంత న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాల్ గౌడ కొనియాడారు. బి.కొత్తకోటలో మొరుసుకాపు రెడ్డి (వక్కలిగర) సంఘం ఆధ్వర్యంలో ఆదివారం నిర్వహించిన కెంపేగౌడ 517వ జయంతి వేడుకల ఆత్మీయ సభకు ఆయన ముఖ్య అతిథిగా హాజరై జ్యోతి ప్రజ్వలన చేశారు. ఈ సందర్భంగా జస్టిస్ గోపాల్ గౌడ మాట్లాడుతూ.. బెంగళూరు నగర అభివృద్ధికి కెంపేగౌడ చేసిన అపార కృషి, సేవలు చరిత్రలో వెలకట్టలేనివన్నారు. ఇదే తరుణంలో దేశానికి వెన్నెముక అయిన రైతాంగం తీవ్ర సంక్షోభంలో ఉన్నా, వారిని ఆదుకునే దిశగా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపకపోవడం అత్యంత బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. సభకు ముందుగా వక్కలిగర సంఘం నాయకుల ఆధ్వర్యంలో కెంపేగౌడ చిత్రపటాన్ని ప్రదర్శిస్తూ పురవీధుల్లో భారీ ఊరేగింపు నిర్వహించారు. పీటీఎం రోడ్డు నుంచి ప్రారంభమైన ఈ ప్రదర్శన దిగువ బస్టాండ్ మీదుగా బెంగళూరు రోడ్డు వరకు కొనసాగింది. సభలో పాల్గొన్న కర్నాటక శ్రీనివాసపురం ఎమ్మెల్యే జీకే వెంకటశివారెడ్డి మాట్లాడుతూ.. ఏడాది కాలంలోపు మొరుసు కాపుల సంఘం ఆధ్వర్యంలో బృహత్ సభ్యత్వ నమోదు కార్యక్రమానికి శ్రీకారం చుడతామని, ఈ అవకాశాన్ని ప్రతి ఒక్కరూ సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కర్నాటక వక్కలిగర సంఘం ప్రధాన కార్యదర్శి కోనపరెడ్డి మాట్లాడారు. ఈ నెల 17న వి.కోటలో నిర్వహించబోయే నాడప్రభు కెంపేగౌడ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి మొరుసు కాపు కుటుంబ సభ్యులందరూ తరలివచ్చి జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. -
నిద్రిస్తున్న భార్యాభర్తలపై దాడి
చౌడేపల్లె : నిద్రిస్తున్న భార్యాభర్తలపై ఓ వ్యక్తి అర్ధరాత్రి వేళ దాడి చేసి తీవ్రంగా గాయపరిచిన ఘటన మండలంలోని 29ఏ చింతమాకులపల్లెలో శనివారం రాత్రి జరిగింది. బాధితురాలి కుమార్తె రెడ్డెమ్మ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చిన్నరెడ్డప్ప, వెంకటలక్ష్మమ్మ దంపతులు నిద్రకు ఉపక్రమించారు. అర్ధరాత్రి వేళ అదే గ్రామానికి చెందిన మునిరాజ ఇంట్లోకి ప్రవేశించి వెంకటలక్ష్మమ్మ చెవి కమ్మలను లాక్కొనే ప్రయత్నం చేయడంతో ఆమె చెవి తెగిపోయింది. గట్టిగా అరవడంతో గమనించి పక్కనే ఉన్న ఆమె భర్త అడ్డుకొనేందుకు యత్నించగా.. అతని తలపై కర్రతో బలంగా కొట్టి గాయపరిచాడు. కేకలు వేయగా గ్రామస్తులు గుమికూడి మునిరాజను పట్టుకొని పోలీసులకు అప్పగించారు. తీవ్రంగా గాయపడిన చిన్నరెడ్డప్పను 108 వాహనం ద్వారా ఆసుపత్రికి తరలించారు. రెండు రోజుల్లో శ్రీధర్ మృతదేహం రాక కడప అర్బన్ : వియత్నాం బోటు ప్రమాదంలో దుర్మరణం చెందిన కడప ప్రముఖ వ్యాపారవేత్త ముడియం శ్రీధర్ (50) భౌతికకాయం మరో రెండు రోజుల్లో కడపకు చేరుకోనుంది. ఈ మేరకు వియత్నాంలోని భారత రాయబార కార్యాలయం, స్థానిక అధికారులు సమన్వయంతో స్వదేశానికి తరలించే అధికారిక దౌత్య ప్రక్రియలను ముమ్మరం చేశారు. ఆనందంగా గడపడానికి విదేశీ విహారయాత్రకు వెళ్లిన శ్రీధర్ ఊహించని ప్రమాదంలో ప్రాణాలు కోల్పోవడం కడప నగరాన్ని తీవ్ర శోకసముద్రంలో ముంచెత్తింది. శ్రీధర్తో పాటు అదే బోటులో ప్రయాణించి, అదృష్టవశాత్తూ ప్రాణాలతో బయటపడ్డ కడప ఎన్జీఓ కాలనీకి చెందిన నయీమ్ సోమవారం సాయంత్రానికే కడపకు చేరుకోనున్నారు. గత 2024 నవంబర్ 14న శ్రీధర్ సోదరుడు హరి అనారోగ్యంతో అకాల మరణం చెందారు. ఆ చేదు జ్ఞాపకం నుండి తేరుకోకముందే, కేవలం ఏడాదిన్నర వ్యవధిలోనే కుటుంబానికి పెద్ద దిక్కుగా ఉన్న శ్రీధర్ కూడా మరణించడంతో ఆయన తల్లిదండ్రులకు, కుటుంబ సభ్యులకు తీరని లోటు మిగిలింది. కడపలో సెల్ఫోన్ల వ్యాపార సామ్రాజ్యాన్ని విస్తరించి దాదాపు 50 మందికి పైగా కార్మికులకు శ్రీధర్ జీవనోపాధి కల్పించారు. కొండంత అండగా నిలిచిన యజమాని ఆకస్మిక మరణంతో ఆయా కార్మిక కుటుంబాల ఉపాధి ప్రశ్నార్థకంగా మారింది. స్నేహశీలి అయిన శ్రీధర్ మృతి పట్ల కడప వ్యాపార వర్గాలు తీవ్ర దిగ్భ్రాంతిని వ్యక్తం చేశాయి. ధర లేక పంటను వదిలేసిన రైతు సింహాద్రిపురం : గిట్టుబాటు ధర లేక మండలంలోని గురజాల గ్రామంలో ఆదివారం పొలంలోనే కలింగర పంటను రైతు వదిలేశాడు. వివరాలు.. వరుణ్ రెడ్డి గురిజాలలో ఐదు ఎకరాలు కౌలుకు తీసుకొని ఎకరాకు లక్ష రూపాయలతో ఐదు ఎకరాల్లో 75 రోజులకు దిగుబడి వచ్చే కలింగర పంటను సాగు చేశారు. దిగుబడి బాగా వచ్చిందని సంతోషపడ్డాడు. కేజీ తొమ్మిది రూపాయల చొప్పున 18 టన్నులు కాయలను కోశారు. కానీ రేటు పడిపోవడంతో కొనే నాథుడు లేడు. దీంతో విధి లేని పరిస్థితుల్లో పంటను వదిలేశారు. జనాలు కలింగర కాయలకు ఎగబడి కోసుకొని వెళ్లారు. ● చెవి కమ్మల చోరీకి యత్నం ● అడ్డుకోవడంతో కర్రతో కొట్టిన వైనం -
ఇరు వర్గాల పరస్పర దాడులు
మదనపల్లె టౌన్ : మొలకలచెరువు మండలం దేవలచెరువులో శనివారం అర్ధరాత్రి ఇరువర్గాల మధ్య ఘర్షణ చోటుచేసుకుంది. పరస్పరం దాడులు చేసు కోవడంతో నలుగురు గాయపడ్డారు. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం.. దేవలచెరువుకు చెందిన నాగరాజు, సుజాత దంపతులు, వారి కుమారుడు యోగేష్పై అదే ఊరికి చెందిన శివకుమార్ వర్గీయులు దాడి చేసి గాయపరిచారు. ఎదురు దాడిలో శివకుమార్ సైతం గాయపడ్డాడు. గాయపడిన బాధితులను కుటుంబ సభ్యులు వెంటనే మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం వారు చికిత్స పొందుతున్నారు. ఘటనపై పోలీసులకు సమాచారం అందడంతో కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఘర్షణకు గల కారణాలు తెలియాల్సి ఉంది. బీజేపీ సభ్యుడిపై బీరు బాటిళ్లతో దాడిమదనపల్లె టౌన్ : మదనపల్లెలో బీజేపీ క్రియాశీలక సభ్యుడిపై బీరు బాటిళ్లతో ప్రత్యర్థులు దాడి చేసిన సంఘటన ఆదివారం కలకలం రేపింది. బాధితుడి కథనం మేరకు.. పట్టణంలో నివాసం ఉంటున్న కోసూరి భవానీ ప్రసాద్ (48) బీజేపీలో క్రియాశీలక సభ్యుడిగా వ్యవహరిస్తున్నాడు. ఈ క్రమంలో ఓ సంఘానికి చెందిన పోస్టులను సోషల్ మీడియాలో కావాలనే అప్లోడ్ చేస్తున్నాడని అనుమానించి, స్థానిక నీరుగట్టువారిపల్లెలోని మార్కెట్ యార్డు సమీపంలో ఓ హోటల్ దగ్గర ఉన్న అతనిపై బీరు బాటిళ్లతో దాడి చేసి గాయపరిచారు. స్థానికు లు గమనించి బాధితుడిని జిల్లా ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతున్నాడు. వన్టౌన్ పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. మరిన్ని వివరాలను పోలీసులు వెల్లడించాల్సి ఉంది. ఆటో లాక్కెళ్లారని డ్రైవర్ ఆత్మహత్య మదనపల్లె టౌన్ : బాడుగ చెల్లించలేదని ఆటో యజమానులు ఆటోను లాక్కెళ్లడంతో మనస్తాపం చెందిన ఓ ఆటో డ్రైవర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్న ఘటన మదనపల్లెలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. సీటీఎం రోడ్ బాలాజీ నగర్లో నివాసం ఉంటున్న రెడ్డప్ప కుమారుడు హరి(30) బాడుగ ఆటో నడుపుకొంటూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. ఇటీవల తన తండ్రి రోడ్డు ప్రమాదంలో కాలు విరిగి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. తండ్రికి సపర్యలు చేస్తూ కుటుంబ భారాన్ని మోస్తున్న హరి, కొన్ని రోజులుగా ఆటో బాడుగ చెల్లించలేకపోయాడు. ఈ క్రమంలో శనివారం రాత్రి ఆటో యజమానులు వచ్చి ఆటోను తీసుకెళ్లిపోయారు. జీవనాధారమైన ఆటో లేకపోవడంతో తీవ్ర మనస్తాపానికి గురైన హరి ఆదివారం ఉదయం ఇంట్లో ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని జిల్లా ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. హరి మృతితో కుటుంబ సభ్యుల రోదనలు మిన్నంటాయి. -
అమ్మా.. గంగమ్మ ఆశీర్వదించమ్మా..
● బోయకొండలో పోటెత్తిన రద్దీ ● ఒక్క రోజే 25 వేల మంది భక్తులు దర్శనంచౌడేపల్లె : అమ్మా.. గంగమ్మ తల్లీ.. మమ్మల్ని కరుణించి ఆశీర్వదించమ్మా.. అంటూ భక్తులు బోయకొండ గంగమ్మకు ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించడానికి తరలివచ్చారు. వరుసగా సెలవులు రావడంతో బోయకొండ గంగమ్మ ఆలయానికి ఊహించని రీతిలో ఆదివారం భక్తుల రద్దీతో ఆలయం, పరిసర ప్రాంతాలు పోటెత్తాయి. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు, తెలంగాణ రాష్ట్రాల నుంచి సుమారు 25 వేల మంది భక్తులు అమ్మవారిని దర్శించుకొన్నట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. అమ్మవారి దర్శనం రోజుల్లో ఆదివారం అత్యంత ప్రీతికరమైన దినం కావడంతో కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి జంతుబలులు సమర్పించి ప్రత్యేక పూజలు చేయించి మొక్కులు చెల్లించారు. అమ్మవారి దర్శనం కోసం గంటల తరబడి క్యూలైన్లలో నిరీక్షించాల్సి వచ్చింది. ప్రధాన గర్భాలయం నుంచి ఆలయం బయట గల గాలిగోపురం వరకు భక్తులు క్యూలైన్లలో బారులు తీరారు. దీనికారణంగా వయసు పైబడినవారు, చిన్నపిల్లలు ఇబ్బందులు పడ్డారు. తాగునీటి కోసం ఇక్కట్లు పడ్డారు. అమ్మవారి దర్శనం అనంతరం ఈఓ పర్యవేక్షణలో అమ్మవారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. టికెట్ల ద్వారా రూ.14.50 లక్షల ఆదాయం బోయకొండ దేవస్థానం వద్ద ఆదివారం ఒక్కరోజు మాత్రమే విక్రయించిన వివిధ సేవా టికెట్ల ద్వారా రూ.14.50 లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. -
భారీగా గుట్కా, కూల్లిప్స్ సీజ్
● నిషేధిత పొగాకు ఉత్పత్తులపై దాడులు ● నిందితుడి అరెస్ట్మదనపల్లె టౌన్ : నిషేధిత గుట్కా, కూల్ లిప్స్, ఖైనీ అక్రమ వ్యాపారానికి ఓ ఘనుడు మదనపల్లెను అడ్డాగా మార్చేశాడు. ఏకంగా ట్రేడర్స్ పేరుతో బెంగళూరు బస్టాండు వద్ద గోడౌన్లు నెలకొల్పి యథేచ్ఛగా విక్రయాలు సాగిస్తూ.. యువతను పెడదోవ పట్టిస్తూ మత్తుకు బానిసలను చేస్తున్న నబీఖాన్ అలియాస్ ఇమ్రాన్ఖాన్ ఆట కట్టించారు వన్ టౌన్ పోలీసులు. తాను అడ్డాగా మార్చుకున్న అప్పారావుతోటలో పోలీసులు శనివారం మెరుపుదాడులు చేపట్టి.. 60 బస్తాల్లో ఉన్న రూ.32 లక్షల విలువైన గుట్కా, కూల్లిప్స్, ఖైనీ ప్యాకెట్లను స్వాధీనం చేసుకుని ట్రేడర్స్ యజమాని నబీఖాన్ను అరెస్ట్ చేశారు. దీనిపై సీఐ రాజారెడ్డి ఆదివారం మీడియాకు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు అడిషనల్ ఎస్పీ యం.వెంకటాద్రి పర్యవేక్షణలో వన్టౌన్ సీఐ కె.రాజారెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, రహీముల్లా వారి బృందం శనివారం అప్పారావుతోటలోని ఇమ్రాన్ ట్రేడర్స్పై ఆకస్మిక దాడులు నిర్వహించారు. అమ్మకానికి సిద్ధంగా 60 బస్తాల్లో నిల్వ ఉంచిన రూ.32,11,384 లక్షల విలువైన 26,760 కూల్లిప్స్, గుట్కా, చైనీ, ఖైనీ ప్యాకెట్లను సీజ్ చేశారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఉండాల్సిన స్పష్టమైన పిక్టోరియల్ హెల్త్ వార్నింగ్ లేకుండా వీటిని విక్రయిస్తున్నట్లు గుర్తించి, వెంటనే స్థానిక ఈశ్వరమ్మ కాలనీ, గింజల వీధికి చెందిన నిందితుడు కాల్వగడ్డ నబీఖాన్ అలియాస్ ఇమ్రాన్ఖాన్(48)ను పట్టుకున్నామని సీఐ తెలిపారు. విచారణలో ఇతను ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల వద్ద ఉన్న దుకాణాలకు ఈ నిషేధిత పొగాకు ఉత్పత్తులను సరఫరా చేస్తూ యువతకు విక్రయిస్తున్నట్లు తేలిందని పేర్కొన్నారు. నిందితుడిపై సిగరెట్స్ అండ్ అధర్ టొభాకోప్రొడక్ట్స్ యాక్ట్, 2003లోని సెక్షన్ 7, 8 రెడ్ విత్ 20తో పాటు బీయన్ఎస్ సెక్షన్ 318(4) కింద కేసు నమోదు చేసి అరెస్ట్ చేశామన్నారు. మదనపల్లెలో యువతను, పిల్లలను మత్తుకు బానిసలను చేసే వ్యాపారులపై కఠిన చర్యలు తప్పవని పోలీసులు ఈ సందర్భంగా హెచ్చరించారు. అక్రమ పొగాకు, కూల్ లిప్స్ ఉత్పత్తుల విక్రయాలపై సమాచారం ఉంటే వెంటనే డయల్ 100/112కు లేదా టోల్ ఫ్రీ నంబర్ 1972కు తెలపాలని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. ఈ దాడులు ఇంతటితో ఆగవని చెప్పారు. పట్టణ, రూరల్లో జరిగే విక్రయాలను అడ్డుకుని అమ్మేవారిని పట్టుకుని జైలుకు పంపుతామని తెలిపారు. -
గ్రామాల్లో పోలీసుల అవగాహన కార్యక్రమాలు
మదనపల్లె టౌన్ : మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ ఆదివారం పెంచుపాడు పంచాయతీలోని పలు గ్రామాల్లో విస్తృతంగా పర్యటించి ప్రజలకు అవగాహన కల్పించారు. బొంగువారిపల్లి, పనసమాను కుంట, గొల్లపల్లి, కట్టుబావి తదితర గ్రామాలను సందర్శించిన సీఐ.. గ్రామసభలు నిర్వహించి రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల భద్రత, గంజాయి వంటి మాదకద్రవ్యాల వల్ల కలిగే అనర్థాలపై ప్రజలకు వివరించారు. హెల్మెట్ ధరించడం, ట్రాఫిక్ నిబంధనలు పాటించడం, ఆన్లైన్ మోసాల పట్ల అప్రమత్తంగా ఉండటం, మహిళలు, చిన్నారులపై జరిగే నేరాలను వెంటనే పోలీసులకు తెలపాలని సూచించారు. ప్రజలకు ఏవైనా సమస్యలుంటే నేరుగా పోలీస్ స్టేషన్కు గానీ, తన ఫోన్ నంబర్కు గానీ సమాచారం ఇవ్వాలన్నారు. దళారులు, బ్రోకర్లను ఆశ్రయించి మోసపోవద్దని, మీ సమస్యలపై తాము వెంటనే స్పందిస్తామని హామీ ఇచ్చారు. గంజాయి వంటి మాదక ద్రవ్యాల విక్రయాలు, వినియోగంపై సమాచారం ఉంటే నిర్భయంగా తెలపాలని కోరారు. ఈ కార్యక్రమంలో స్థానిక పోలీసు సిబ్బంది, గ్రామ పెద్దలు, మహిళలు, యువకులు పాల్గొన్నారు.రోడ్డు భద్రత, సైబర్ నేరాలు, మహిళల రక్షణపై అవగాహన -
మనోహర విహారం
● మల్లయ్య వాహనం.. మహిమాన్విత శైవక్షేత్రమైన మల్లయ్యకొండ ప్రకృతి ఒడిలో ఎన్నో మూలికలు, అటవీ సంపదతో పాటు వన్యప్రాణులకు నిలయంగా విరాజిల్లుతోంది. అలాంటి పవిత్ర కొండల అటవీ సముదాయం నుండి వచ్చిన ఒక అందమైన జాతీయ పక్షి నెమలి, తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రానికి సమీపంలోని ఇట్నేనివారిపల్లె వద్ద గల హౌసింగ్ కాలనీలో ప్రత్యక్షమై అందరినీ కనువిందు చేసింది. సాధారణంగా దట్టమైన అడవుల్లో, పచ్చని లోయల్లో తిరిగే నెమళ్లు.. వాతావరణ మార్పుల వల్ల అటవీ ప్రాంతంలో ఆహారం, తాగునీరు లభించని తరుణంలో సమీపంలోని పంటపొలాలు, జనవాసాల్లోకి వస్తుంటాయని కాలనీవాసులు చెబుతున్నారు. ఇందులో భాగంగానే కొండ దిగి వచ్చిన ఓ నెమలి హౌసింగ్ కాలనీలోని నూతన ఇళ్ల పైకప్పు ప్రహరీలపైకి చేరి గంభీరంగా నిలబడింది. కొండపై వెలసిన మల్లికార్జున స్వామి వారి వాహనమే స్వయంగా తమ ఇళ్ల వద్దకు వచ్చిందా అన్నట్లుగా కాలనీవాసులు ఆ దృశ్యాన్ని భక్తిభావంతో తిలకించారు. కాసేపు సందడి చేసిన అనంతరం ఆ నెమలి ఎవరికీ దొరకకుండా తిరిగి సురక్షితంగా మల్లయ్యకొండ అడవుల్లోకి ఎగిరిపోవడంతో కాలనీవాసులు ఆనందం వ్యక్తం చేశారు. – తంబళ్లపల్లె -
హోరాహోరీగా ఫుట్బాల్ పోటీలు
మదనపల్లె సిటీ : ఏపీ జూనియర్ బాలుర ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు రెండో రోజు ఆదివారం హోరాహోరీగా జరిగాయి. సెమీఫైనల్స్కు కర్నూలు, వైజాగ్, అనంతపురం, ఏలూరు జట్లు చేరుకున్నాయి. స్థానిక వశిష్ట స్కూలులో అన్నమయ్య, చిత్తూరు జట్ల మధ్య జరిగిన పోటీల్లో 1–0 స్కోరుతో అన్నమయ్య జట్టు విజయం సాధించింది. కాకినాడ, తిరుపతి, విజయనగరం, తూర్పుగోదావరి జట్ల మధ్య జరిగిన మ్యాచ్లు డ్రాగా ముగిశాయి. ఇందులో మొదటి క్వార్టర్ ఫైనల్స్ కర్నూలు, విజయనగరం జట్ల మధ్య జరగ్గా కర్నూలు జట్టు 2–1 స్కొరుతో విజయనగరంపై విజయం సాధించి సెమీ ఫైనల్స్కు చేరుకుంది. రెండో క్వార్టర్ ఫైనల్స్లో నెల్లూరు, అనంతపురం జట్లు మధ్య మ్యాచ్ జరగ్గా అనంతపురం జట్టు 2–0 స్కోరుతో విజయం సాధించి సెమీస్కు చేరుకుంది. రెండో గ్రౌండ్ గ్రీన్వ్యాలీలో జరిగిన లీగ్ మ్యాచ్లలో గుంటూరు జట్టు 5–0 స్కోరుతో నంద్యాలపై విజయం సాధించింది. కృష్ణ, విశాఖ జట్ల మధ్య జరిగిన మ్యాచ్ 2–2తో డ్రాగా ముగిసింది. ఎన్టీఆర్, కోనసీమ జిల్లా జట్లు మధ్య జరిగిన మ్యాచ్లో ఎన్టీఆర్ జట్లు 3–1 తో విజయం సాధించింది. మూడో క్వార్టర్ ఫైనల్స్ వైజాగ్, ఎన్టీఆర్ జిల్లా జట్ల మధ్య జరగ్గా 4–0తో వైజాగ్ జట్టు విజయం సాధించి సెమీస్ చేరుకుంది. నాలుగో క్వార్టర్ ఫైనల్స్లో పల్నాడు, ఏలూరు జట్లు పోటీపడగా ఏలూరు 3–0 స్కోరుతో పల్నాడుపై విజయం సాధించి సెమీస్ చేరుకుంది. సోమవారం మొదటి సెమీఫైనల్ కర్నూలు, వైజాగ్, రెండో సెమీ ఫైనల్స్ అనంతపురం, ఏలూరు జట్ల మద్య జరుగుతుందని పుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మురళీధర్ తెలిపారు. కార్యక్రమంలో కోచ్లు రెడ్డప్ప, పవన్, రెఫరీహెడ్ శ్రీనివాస్, అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రకళ, కమలేష్, కోశాధికారి నరేష్బాబు, జాయింట్ సెక్రటరీ మహేంద్రనాయక్, మహేంద్ర, కిరణ్కుమార్, బాలాజీ, అంజనప్ప, క్రీడాకారులు పాల్గొన్నారు. -
చిట్టి వెన్నుపై కొండంత బరువు
● విద్యార్థులపై మోయలేని భారం ● అనారోగ్య సమస్యలు తలెత్తే ప్రమాదం ● నిబంధనలకు తూట్లు ● పట్టించుకోని విద్యాశాఖాధికారులుమదనపల్లె సిటీ : ఆడుతూ పాడుతూ చదువుకోవాల్సిన బాల్యంలో చిన్నారులు వయసుకు మించి భారం మోస్తున్నారు. ఫ్రీకేజీ, ఎల్కేజీల్లోనే బ్యాగు నిండా బండెడు పుస్తకాలతో వెన్ను దెబ్బతింటోంది. ఈ సంచులతో రెండు, మూడు అంతస్తుల భవంతులు ఎక్కేదెలా, దిగేదెలా అని తల్లిదండ్రులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లాలో 1,796 పాఠశాలలు ఉండగా 1,93,990 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రైవేటు పాఠశాలలు 467 ఉండగా 90 వేల మంది విద్యార్థులున్నారు. జాతీయ విద్యాప్రణాళిక–2005, స్కూలు బ్యాగ్–2020 విధానంలో పుస్తకాల సంచిపై స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. ప్రతి నెలా మూడో శనివారం పుస్తకాల సంచి లేని రోజు (నో బ్యాగ్ డే) అమలు చేయాలని పేర్కొన్నారు. ఎక్కడా దీనిని అమలు చేసిన దాఖలాలు లేవు. దీనిపై విద్యాశాఖ అధికారులు నిమ్మకునీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలలు దాదాపు రెండు, మూడు అంతస్తుల భవంతులే. వీటిపైకి 5 నుంచి 10 కిలోల పుస్తకాల సంచితో విద్యార్థులు మెట్లు ఎక్కడం వల్ల.. పలు మానసిక, శారీరక సమస్యలు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. మూడేళ్లకే బడికి పంపించేస్తున్నారు అభివృద్ధి చెందిన దేశాల్లో పిల్లలను పాఠశాలలకు పంపించాలంటే ఆరేళ్లు నిండే వరకు చూస్తారు. మన దగ్గర మాత్రం మూడేళ్లకే పుస్తకాల సంచిని భుజానికి ఇచ్చి పంపిస్తున్నారు. ప్రైవేటు పాఠశాలల్లో అవసరం లేకున్నా పిల్లలకు వివిధ రకాల పబ్లికేషన్స్ పుస్తకాలు అంటగడుతున్నారు. దీంతో చిన్నారులు బరువు పుస్తకాల సంచితో అవస్థలు పడుతున్నారు. -
● పబ్లిగ్గా.. పెద్ద చెరవు
కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కోట్లాది రూపాయల నిధులతో చెరువులను పునరుద్ధరిస్తుంటే.. చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో మాత్రం అధికారుల కళ్లముందే చెరువులను పూడ్చివేస్తూ అక్రమంగా కబ్జాలు చేస్తున్నా రెవెన్యూ యంత్రాంగం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తోందని ఆయకట్టు రైతులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రూ.40 లక్షల నిధులు వృథా రొంపిచెర్ల మండల పరిధిలోని బొమ్మయ్యగారిపల్లె గ్రామ పంచాయతీ పెద్ద చెరువు కట్టను ఇటీవలే సుమారు రూ. 40 లక్షల ఇరిగేషన్ నిధులతో బలోపేతం చేశారు. ఇందులో భాగంగా చెరువులో దట్టంగా పెరిగిన ముళ్ల కంపలను సైతం తొలగించి సాగునీటి నిల్వకు అనుకూలంగా మార్చారు. మట్టి తోలి.. రోడ్డు పక్కన ప్లాట్లు ఇంతవరకు బాగానే ఉన్నా.. కొందరు అక్రమార్కులు వినాయక నగర్ నుంచి పెద్ద చెరువు కట్ట వరకు ఉన్న రోడ్డు పక్కన చెరువు గర్భాన్ని అడ్డగోలుగా పూడ్చివేస్తున్నారు. రాత్రివేళల్లో లారీల ద్వారా మట్టిని తోలి, ఆ స్థలాన్ని చదును చేసి ఇళ్లను నిర్మించుకుంటున్నారు. రెవెన్యూ అధికారుల నిర్లక్ష్యం ఈ అక్రమ ఆక్రమణల తంతు గత కొన్ని సంవత్సరాలుగా బహిరంగంగా సాగుతున్నా.. స్థానిక రెవెన్యూ అధికారులు కనీసం అటువైపు కన్నెత్తి చూడటం లేదని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్ప టికై నా ఉన్నతాధికారులు స్పందించి, పెద్ద చెరు వు గర్భాన్ని పూడ్చకుండా కాపాడాలని సాగునీటి ఆయకట్టు రైతాంగం డిమాండ్ చేస్తోంది. – రొంపిచెర్ల -
భారీగా గుట్కా, కూల్లిప్స్ పట్టివేత
మదనపల్లె టౌన్ : మదనపల్లెలో భారీగా నిషేధిత పొగాకు ఉత్పత్తులను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి జిల్లా కేంద్రం మదనపల్లె పట్టణంలోని అప్పారావు తోటలో ఉన్న పలు గోడౌన్లపై శనివారం విస్తృతంగా దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో రూ.లక్షల విలువైన కూల్ లిప్స్, గుట్కా, పాన్ పరాగ్, ఖైనీ తదితర మత్తు ఇచ్చే ఇతర ప్యాకెట్లు పెద్ద ఎత్తున పట్టుకున్నారు. వాటిని స్వాధీనం చేసుకుని పోలీస్ స్టేషన్కు తరలించారు. కూల్ లిప్స్ పెద్ద ఎత్తున విక్రయిస్తున్న వారిలో నవీన్ మరికొందరు ఉన్నట్లు పోలీసులు నిర్ధారించారు. వారి దుకాణాలలోనే 60 బస్తాల కూల్ లిప్స్ పట్టుకున్నారు. వాటి విలువ సుమారు రూ.2 లక్షలకు పైగా ఉంటుందని పోలీసులు అంచనా వేస్తున్నారు. స్వాధీనం చేసుకున్న కూల్ లిప్స్, నిషేధిత గుట్కా, పాన్ పరాగ్లను లెక్కిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలను ప్రెస్ మీట్లో వెల్లడిస్తామని తెలిపారు. ఈ దాడులకు సంబంధించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. -
నవీన విద్యకు ..‘నవోదయం’
మదనపల్లె సిటీ : ప్రతిభ ఉండి కూడా ఆర్థిక స్థోమత లేక కార్పొరేట్ చదువులకు దూరమవుతున్న గ్రామీణ విద్యార్థులకు ఇదో సువర్ణావకాశం. కేంద్ర ప్రభుత్వ నిధులచే నడిచే ప్రతిష్టాత్మక పీఎంశ్రీ జవహర్ నవోదయ విద్యాలయం మదనపల్లె సమీపంలోని వలసపల్లెలో ఉంది. 20207–28 విద్యా సంవత్సరానికి 6వ తరగతిలో ప్రవేశాల కోసం దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని అర్హులైన విద్యార్థులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలి. ఉజ్వల భవిత నవోదయలో సీటు సాధించిన విద్యార్థులకు 6వ తరగతి నుంచి ప్లస్ టూ (12వ తరగతి) వరకు కేంద్ర ప్రభుత్వ సెంట్రల్ బోర్డు ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ సిలబస్లో పూర్తి ఉచిత విద్య అందుతుంది. కో– ఎడ్యుకేషన్ విధానం ఉన్న ఈ సంస్థలో బాల,బాలికలకు విడివిడిగా అత్యాధునిక వసతి సౌకర్యాలను కల్పిస్తారు. ఐఐటీ, ట్రిపుల్ ఐటీ వంటి జాతీయ స్థాయి విద్యా సంస్థల్లో సీట్లు సాధించేలా ఇక్కడ ప్రత్యేక శిక్షణ ఇవ్వడం విశేషం. అర్హతలు ఇవే : విద్యార్థులు ఉమ్మడి చిత్తూరు జిల్లా పరిధిలోని ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల్లో 2026–27 విద్యా సంవత్సరంలో 5వ తరగతి చదువుతూ ఉండాలి. అలాగే 3,4, తరగతులు కూడా ఇదే జిల్లాలో చదివి ఉండాలి. అలాగే విద్యార్థులు 1–5–2015 నుంచి 31–7–2017 మధ్య కాలంలో జన్మించిన వారై ఉండాలి. పల్లె పిల్లలకే పెద్ద పీట: విద్యాలయంలో 80 సీట్లలో 75 శాతం సీట్లను గ్రామీణ ప్రాంత పాఠశాలల విద్యార్థులకే కేటాయిస్తారు. ప్రభుత్వ నిబంధనల ప్రకారం ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగ విద్యార్థులకు రిజర్వేషన్లు వర్తిస్తాయి. మొత్తం సీట్లలో మూడో వంతు సీట్లను బాలికలకే ప్రత్యేకంగా కేటాయించారు. మదనపల్లె నవోదయలో 6వ తరగతికి ప్రవేశాలు ఉచితంగా కార్పొరేట్ స్థాయి విద్య ఈ నెల 31వ తేదీ చివరి గడువు నవోదయ విద్యాలయంలో 6వ తరగతి ప్రవేశానికి ఈ నెల 31వ తేదీలోపు దరఖాస్తు ఆన్లైన్లో చేసుకోవాలి. నవంబర్ 28న ప్రవేశ పరీక్ష నిర్వహిస్తారు. అర్హత, ఆసక్తి గల విద్యార్థులు httpr:/// nv-av-oda ya.gov.in వెబ్సైట్లోకి వెళ్లి దరఖాస్తులను ఆప్లోడ్ చేసుకోవాలి. – ఎం.గీత, ప్రిన్సిపాల్, నవోదయ విద్యాలయం, మదనపల్లె -
తెగిపడిన 33 కేవీ విద్యుత్ వైరు
కలికిరి : కలికిరిలో ఇందిరమ్మ కాలనీలోని 33 కేవీ లైను వైరు తెగి పడి పలు నివాసాలలో విద్యుత్ మీటర్లు, గృహోపకరణాలు కాలి బూడిదైన ఘటన శనివారం మధ్యాహ్నం చోటు చేసుకుంది. వివరాలు... కలికిరి 330 కేవీ సబ్ స్టేషన్ నుంచి కందూరు, వాల్మీకిపురానికి వెళ్లే 33 కేవీ విద్యుత్ లైను ఇందిరమ్మ కాలనీలోని నివాసాల మధ్యలో ఉంది. ఈ లైను ఇటీవల గాలులకు తెగి పడింది. దీంతో వైరును పూర్తి స్థాయిలో మార్చాల్సిన విద్యుత్ సిబ్బంది రెండు మూడు చోట్ల జాయింట్ చేసి పునరుద్ధరించారు. దీంతో శనివారం మరోసారి 33 కేవీ లైను వైరు తెగి నివాసాల మీద పడింది. దీంతో నివాసాలలోని విద్యుత్ మీటర్లతో సహా మూడంస్తుల బిల్డింగ్లో వైరింగ్, టీవీలు, ఫ్రిడ్జ్లు, ఫ్యాన్లు ఇతర గృహోపకరణాలు పూర్తిగా కాలిపోయాయి. ప్రమాద సమయంలో తెగిన విద్యుత్ లైన్ వైరు ఇంటి మీద రేకులపై పడటంతో ఇంటి వరకు మీటర్లు, గృహోపకరణాల నష్టం వాటిల్లింది. రోడ్డుపై, లేక వాహనాలపై పడింటే ప్రాణ నష్టం చోటు చేసుకుని వుండేదని కాలనీ వాసులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే పలుమార్లు ఫిర్యాదులు చేసినా ట్రాన్స్కో అధికారులు స్పందించడం లేదని స్థానికులు ఆరోపించారు. ప్రమాద ఘటన సమాచారంతో హుటాహుటిన అక్కడికి చేరుకున్న ట్రాన్స్కో సిబ్బంది మరమ్మత్తులు చేపట్టారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి 33కేవీ విద్యుత్ లైన్ను కాలనీ నుంచి తొలగించాలని స్థానికులు కోరారు. – కాలి బూడిదైన మీటర్లు, గృహోపకరణాలు – తప్పిన పెను ప్రమాదం -
ఢీకొన్న ట్రాక్టర్, మినీ ఐషర్ వాహనం
– ఇద్దరికి తీవ్ర గాయాలు ములకలచెరువు : ట్రాక్టర్, మినీ ఐచర్ వాహనం ఢీకొనడంతో ఇద్దరికి తీవ్రగాయాలైన సంఘటన శనివారం తెల్లవారుజామున మండలంలో చోటు చేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... చిత్తూరు నుంచి గుంతకల్లు సమీపంలోని కసాపురం శ్రీ ఆంజనేయస్వామి ఆలయానికి కొబ్బరికాయలతో వెళ్తున్న మినీ ఐచర్ వాహనం, ములకలచెరువు నుంచి మదనపల్లి వైపు ఖాళీ టమాట క్రేట్లతో వెళ్తున్న ట్రాక్టర్ బురకాయలకోట వద్ద ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఐచర్ డ్రైవర్ బాబు(45), అందులో ప్రయాణిస్తున్న ప్రభాకర్రెడ్డి(60)లకు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు, అటువైపు వెళ్లే ప్రయాణికులు.. పోలీసులు, 108 వాహనానికి సమాచారం అందించారు. వెంటనే చేరుకున్న పోలీసులు 108 సాయంతో బాధితులను మదనపల్లి ప్రభుత్వ హాస్పిటల్కు తరలించారు. ట్రాఫిక్ అంతరాయం లేకుండా వాహనాలను పక్కకు జరిపించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి దుర్మరణం
మదనపల్లె టౌన్ : కురబలకోట మండలంలోని కంటేవారిపల్లె సమీపంలో శుక్రవారం అర్ధరాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం చెందాడు. ఘటనపై ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు తెలిపిన వివరాల ప్రకారం.. బి.కొత్తకోట పాశం వీధికి చెందిన నరసింహులు కుమారుడు రాజేంద్ర(37) మదనపల్లెలో లారీ డ్రైవర్గా పని చేస్తుంటాడు. రోజూ మాదిరిగానే మదనపల్లెకు వచ్చి విధులు ముగించుకుని శుక్రవారం అర్ధరాత్రి బైకుపై తిరిగి ఇంటికి వెళుతుండగా, మార్గంమధ్యలోని కంటేవారిపల్లె సమీపంలో గుర్తుతెలియని వాహనం ఢీకొంది. రాజేంద్ర అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ముదివేడు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం కోసం మృతదేహాన్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం గాలిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. మృతుడికి భార్య రమాదేవి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. కుటుంబానికి ఆధారమైన భర్త మృతి చెందడంతో కుటుంబం వీధిన పడ్డట్లయిందని బంధువులు కన్నీరుమున్నీరుగా విలపించారు. ప్రభుత్వం బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని వారు విజ్ఞప్తి చేశారు. -
గుడికి వెళ్లే దారిలో మళ్లీ కోళ్ల వ్యర్థాలు
గుర్రంకొండ : గుర్రంకొండలోని శ్రీ సిద్ధేశ్వరస్వామి ఆలయంలో వెళ్లే దారిలో జాతీయ రహదారి 340 పక్కనే మళ్లీ కోళ్ల వ్యర్థాలను పడేస్తున్నారు. ఇక్కడ పంచాయతీ అధికారులు ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను ధ్వంసం చేసి కనిపించకుండా చేశారు. దీంతో పాదచారులు, భక్తులు దుర్గంధం భరించలేక ఇబ్బందులు పడుతున్నారు. గతంలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు రెండు నెలల క్రితం ఈ పరిసరాల్లో కంపు కొడుతున్న కోళ్ల వ్యర్థాలతో పాదచారులు, గుడికెళ్లే భక్తులు దుర్గంధం భరించలేక నానా ఇబ్బందులు పడ్డారు. సాక్షిలో ప్రచురితమైన వరుస కథనాలతో అధికారులు స్పందించి.. జేసీబీలతో కోళ్ల వ్యర్థాలను తొలగించి ఆ ప్రదేశంలో పంచాయతీ ఆధికారులు హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు, ఎంపీడీవో పరమేశ్వరరెడ్డి ఆదేశాల మేరకు పంచాయతీ ఈవో శ్రీహరి ఆధ్వర్యంలో జేసీబీలతో ఎన్హెచ్ 340 జాతీయ రహదారి పక్కనే పేరుకుపోయిన కోళ్ల వ్యర్థాలను జేసీబీ యంత్రాలతో తొలగించారు. వాటితోపాటు పరిసరాలను పరిశుభ్రం చేశారు. స్థానిక గాలివీడు క్రాస్ వద్ద, శ్రీ సిద్దేశ్వర స్వామి ఆలయానికి వెళ్లే దారిలో హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేశారు. కోళ్ల వ్యర్థాలను తొలగించిన ప్రదేశంలో మళ్లీ వ్యర్థాలను వేస్తే సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిబంధనల అతిక్రమణ మేరకు సంబంధిత చికెన్ దుకాణదారులపై చట్టపరంగా చర్యలు తీసుకోవడంతోపాటు రూ.10 వేల జరిమానా విధిస్తామన్నారు. ప్రార్థన స్థలాల పరిసరాల్లో వ్యర్థాలను వేసే వారిపై ప్రత్యేక నిఘా ఉంచుతామన్నారు. మళ్లీ మొదటకొచ్చిన కథ అధికారులు హెచ్చరికల బోర్డులు ఏర్పాటు చేసిన రెండు నెలల పాటు ఎలాంటి కోళ్లవ్యర్థాలు ఇక్కడ వేయలేదు. అయితే మళ్లీ గత వారం రోజులు యథావిధిగా కోళ్లవ్యర్థాలను ఇదే ప్రాంతంలో తీసుకొచ్చి పడేస్తుండడం గమనార్హం. జేసీబీలతో గతంలో పంచాయతీ అధికారులు శుభ్రం చేసిన ప్రాంతంలోనే మళ్లీ కోళ్ల వ్యర్థాలను పడేస్తుండడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. దీంతోపాటు పంచాయతీ అధికారులు అక్కడ ఏర్పాటు చేసిన హెచ్చరిక బోర్డులను సైతం ధ్వంసం చేయడం గమనార్హం. దీంతో ప్రతిరోజు గుడికెళ్లే భక్తులతోపాటు వాకింగ్కు వెళ్లే గ్రామస్తులు, పాదాచారులు ఈ మార్గంలో వెళ్లాలంటే ఆందోళన చెందుతున్నారు. అధికారులు స్పందించి తగు చర్యలు చేపట్టాలని గ్రామస్తులు కోరుతున్నారు. హెచ్చరిక బోర్డులు ధ్వంసం చేసిన వైనం ఎన్హెచ్ 340 జాతీయ రహదారి పక్కన, గుడికెళ్లే మార్గంలొ కోళ్ల వ్యర్థాలను పడేస్తున్న వారిపై చర్యలు తీసుకొంటాం. చికెన్ దుకాణ దారులతో సమావేశం నిర్వహించి చర్యలు ఉల్లంఘించే వారిపై చట్ట పరమైన చర్యలు తీసుకుంటాం. – రవీంద్రబాబు, ఎస్ఐ, గుర్రంకొండ -
క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు
అట్టహాసంగా ప్రారంభమైన ఏపీ పుట్బాల్ ఛాంపియన్ షిప్ పోటీలు మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణిస్తే ఉజ్వల భవిష్యత్తు ఉంటుందని బీజేపీ జిల్లా అధ్యక్షుడు పులి నరేంద్రకుమార్రెడ్డి అన్నారు. శనివారం మదనపల్లె సమీపంలోని గ్రీన్వ్యాలీ పాఠశాలలో ఏపీ జూనియర్ బాలుర పుట్బాల్ చాంపియన్ షిప్ పోటీలు అట్టహాసంగా ప్రారంభమయ్యాయి. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ పుట్బాల్ క్రీడలో మదనపల్లె పరిసర ప్రాంతాల్లో ఎంతో మంది క్రీడాకారులు జాతీయ, రాష్ట్ర స్థాయిలో ఆడి మంచి పేరు తెచ్చారన్నారు. క్రీడాకారులు గెలుపు, ఓటములు సమానంగా తీసుకోవాలన్నారు. పుట్బాల్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మురళీధర్ మాట్లాడుతూ ఈ రాష్ట్ర స్థాయి పోటీలకు 24 జట్లు.. 550 మంది క్రీడాకారులు పాల్గొంటున్నట్లు వెల్లడించారు. ఇందులో జెడ్పీహెచ్ఎస్, గ్రీన్వ్యాలీ, వశిష్ట, మిషన్కాంపౌండ్ మైదానాల్లో పోటీలు జరుగుతున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో గ్రీన్వ్యాలీ స్కూల్ డైరెక్టర్ రంగారెడ్డి, విష్ణుచైతన్య, పుట్బాల్ అసోసియేషన్ జిల్లా ఉపాధ్యక్షురాలు చంద్రకళ,జాన్ కమలేష్, అసోసియేషన్ కార్యదర్శి నరేష్బాబు, జాయింట్ సెక్రటరీ మహేంద్రనాయక్, కిరణ్కుమార్, మహేంద్ర, బాలాజీ, క్రీడాకారులు పాల్గొన్నారు. -
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్ : వ్యవసాయానికి చేసిన అప్పులు తీర్చలేక ఓ మహిళ రైతు మనస్తాపంతో జీవితంపై విరక్తి చెంది నిద్ర మాత్రలు మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. శనివారం కురబలకోట మండలంలో వెలుగు చూసిన ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. మండలంలోని అంగళ్లు పంచాయతీ పెద్ద కటపకు చెందిన శంకర భార్య లక్ష్మి(50) ఊరికి సమీపంలో కౌలుకు భూములు సాగు చేసి సుమారు 10 లక్షలకు పైగా అప్పులు చేసి పంటలను పండించింది. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు లేక అప్పులు తీర్చలేక పోయింది. దీంతో రుణ దాతల ఒత్తిళ్లు అధికం కావడంతో అప్పు తీర్చే మార్గం లేక ఇంట్లో ఉన్న నిద్ర మాత్రల మింగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. కుటుంబీకులు గమనించి బాధితురాలిని వెంటనే మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిక తరలించిగా డాక్టర్లు వైద్యం అందించారు. ఘటనపై ముదివేడు పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. చౌడేపల్లె : మండలంలోని చౌడేశ్వరిదేవి పెద్దచెర్వులో మేత మేస్తున్న గొర్రెల మందపై కుక్కల గుంపు ఒక్కసారిగా దాడికి తెగబడిన ఘటన శనివారం జరిగింది. పెద్దకొండామర్రి పంచాయతీ నాగిరెడ్డిపల్లె మునివెంకటరమణారెడ్డికి చెందిన గొర్రెలను మేత కోసం చెరువులోకి తోలుకెళ్లాడు. గొర్రెలు మేత మేస్తుండగా ఒక్కసారిగా సుమారు పది కుక్కలు గొర్రెల మందపై విజృంభించాయి. గొర్రెల అరుపులు విన్న అతను కేకలు వేసినప్పటికీ కుక్కలు అతనిపై తిరగడడంతో చుట్టు పక్కల వారు గమనించి ఘటనా స్థలానికి చేరుకొన్నారు. అప్పటికే రూ.16 వేల విలువ చేసే ఒక గొర్రె మృతి చెందగా మరో నాలుగు గొర్రెలకు తీవ్ర గాయాలయ్యాయి. ప్రభుత్వం తమను ఆదుకోవాలని బాధితుడు కోరారు. జంతువులు, మనుషులపై వీధి కుక్కలు విచక్షణా రహితంగా దాడులు చేస్తున్నాయని, అధికారులు స్పందించి చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరారు. సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో శివకుమార్ అనే వ్యక్తి గాయపడ్డ సంఘటన చోటు చేసుకొంది. శెట్టిపల్లె గ్రామం చిన్నజంగంపల్లెకు చెందిన శివకుమార్ ద్విచక్ర వాహనంలో రాయచోటి నుంచి స్వగ్రామానికి వెళుతుండగా అదుపు తప్పి పడిపోవడంతో తీవ్రంగా గాయపడినట్లు స్థానికులు తెలిపారు. బాధితుడిని 108 సాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
కళ్లాపికి మరొకరు బలి !
● జిల్లాలో 20కి చేరిన మరణాలు ● ప్రొద్దుటూరులోనే ఐదుగురు బలవన్మరణం ● ఫ్యాక్టరీలు మూతపడ్డా.. హోల్సేల్, రిటైల్ దుకాణాల్లో ఆగని అమ్మకాలు ప్రొద్దుటూరు క్రైమ్: వైఎస్సార్ జిల్లాలో కల్తీ కళ్లాపి (పేడ) రంగు పొడి మృత్యుఘంటికలు మోగిస్తూనే ఉంది. నకిలీ కెమికల్ తయారీ కేంద్రాలపై ఇటీవల జిల్లా యంత్రాంగం ఉక్కుపాదం మోపి ఐదు ఫ్యాక్టరీలను సీజ్ చేసిన కొన్ని రోజుల వ్యవధిలోనే, ప్రొద్దుటూరు వివేకానందనగర్కు చెందిన బత్తల సుమంత్ (33) కుటుంబ కలహాలు, కోర్టు వివాదాల వల్ల తీవ్ర మానసిక ఒత్తిడికి లోనై శనివారం తెల్లవారుజామున అదే రంగు ద్రావణం తాగి ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఏడాది జనవరి నుంచి ఇప్పటివరకు జిల్లాలో కళ్లాపి పౌడర్ తాగి 19 మంది చనిపోయినట్లు ఎస్పీ నచికేతన్ విశ్వనాథ్ ఇటీవల వెల్లడించగా, తాజా ఘటనతో జిల్లాలో మరణాల సంఖ్య ఏకంగా 20కి చేరింది. ప్రొద్దుటూరు పట్టణంలోనే ఈ బలవన్మరణాల సంఖ్య ఐదుకు పెరగడం తీవ్ర కలకలం రేపుతోంది.వాణిజ్య కేంద్రమైన ప్రొద్దుటూరులోని ఫ్యాక్టరీల ద్వారా రెండు తెలుగు రాష్ట్రాల మార్కెట్లకు పెద్ద ఎత్తున పేడరంగు పొడి సరఫరా అయింది. దీంతో ఇక్కడి హోల్సేల్, రిటైల్ దుకాణాల్లో వీటి నిల్వలు ఇంకా భారీగా ఉన్నాయి. అధికారులు కేవలం తయారీ కేంద్రాలను (ఫ్యాక్టరీలను) సీజ్ చేసి చేతులు దులుపుకున్నారే తప్ప.. మార్కెట్ లో ఉన్న నిల్వలను స్వాధీనం చేసుకోవడం, దుకాణాల్లో తనిఖీలు నిర్వహించడం లాంటి పటిష్టమైన చర్యలు చేపట్టలేదు. ఈ తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే కిరాణా షాపుల్లో వీటి విక్రయాలు ఇంకా యథేచ్ఛగా సాగుతున్నాయి. ఐదు రోజుల క్రితమే అధికారులు దాడులు చేసి, అనుమతుల్లేకుండా నడుస్తున్న పరిశ్రమల నుంచి పేడ రంగు పొడి తయారీలో వాడే వెయ్యి కిలోల ‘ఆరమైన్–ఓ’ అనే అత్యంత ప్రమాదకరమైన పారిశ్రామిక రసాయనాన్ని, మూడు వేల కిలోల కల్తీ పౌడర్ను సీజ్ చేసి కేసులు నమోదు చేశారు. -
చెరువులో పడి వృద్ధుడి మృతి
మదనపల్లె టౌన్ : బహిర్భూమికి వెళ్లిన వృద్ధుడు చెరువులో పడి మృతి చెందిన ఘటన మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. పోలీసులు, మృతుడి కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. వలసపల్లి గ్రామం మొలకల దిన్నెకు చెందిన ఉప్పుతోళ్ల వెంకటరమణ(68) మూడు రోజుల క్రితం బహిర్భూమికి గ్రామ సమీపంలోని చెరువు వద్దకు వెళ్లాడు. అక్కడి నుంచి తిరిగి ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పలుచోట్ల గాలించారు. ఆచూకీ లభించకపోవడంతో ఆందోళన చెందారు. ఈ క్రమంలో శనివారం ఉదయం చెరువు నీటిలో వెంకటరమణ మృతదేహం తేలియాడుతూ కనిపించడంతో గ్రామస్తులు కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. ఫిర్యాదు మేరకు తాలూకా సీఐ కళా వెంకటరమణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పరిశీలించారు. పంచనామా అనంతరం పోస్టుమార్టం నిమిత్తం మృతదేహాన్ని ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతుడి భార్య పదేళ్ల క్రితమే చనిపోగా, ఒక కుమారుడు పట్టణంలో ఉంటున్నాడు. పెన్షన్తో జీవనం సాగిస్తున్న వెంకటరమణ మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. మదనపల్లె టౌన్ : పెద్దమండెం మండలంలో శనివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు, మృతుని కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. సిద్దవరానికి చెందిన రవికుమార్ కుమారుడు కె.మంజునాథ్ (40) సొంత పనిపై బైకులో గుర్రంకొండకు వెళ్లాడు. పని ముగించుకుని తిరిగి వస్తుండగా మార్గంమధ్యలోని తురకపల్లి సమీపంలోని ఘాట్ రోడ్డులో ప్రమాదానికి గురై తీవ్రంగా గాయపడ్డాడు. కొన ఊపిరితో ఉన్న మంజునాథ్ను స్థానికుల సాయంతో హుటాహుటిన 108 అంబులెన్స్లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే మార్గంమధ్యలోనే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతదేహాన్ని చూసిన భార్య గుండెలవిసేలా విలపించింది. కుటుంబ సభ్యుల రోదనలు ఆస్పత్రి వద్ద మిన్నంటాయి. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యం
మదనపల్లె టౌన్: కుటుంబ ఆరోగ్యమే దేశ సౌభాగ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డాక్టర్ లక్ష్మీనరసయ్య అన్నారు. శనివారం ‘ప్రపంచ జనాభా దినోత్సవం’ సందర్భంగా మదనపల్లెలోని జిల్లా ఆస్పత్రి నుంచి నిర్వహించిన అవగాహన ర్యాలీని డీఎంహెచ్వో జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ జూలై 11వ తేదీ నుంచి 18వ తేదీ వరకు జనాభా దినోత్సవ వారోత్సవాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ‘పిల్లల మధ్య వ్యవధి పాటిద్దాం – ఆరోగ్య వంతమైన, సంతోషకరమైన కుటుంబాన్ని నిర్మిద్దాం’అనే నినాదంతో అవగాహన కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్ మహమ్మద్ రఫీ మాట్లాటారు. జిల్లా ఆస్పత్రి నుంచి అనిబిసెంట్ సర్కిల్ వరకు ర్యాలీ నిర్వహించి ప్రతిజ్ఞ చేయించారు. ఈ కార్యక్రమంలో 104 నోడల్ అధికారి డాక్టర్ శ్రీధర్, యూపీహెచ్సీ వైద్యులు ఫరాఖాన్, డాక్టర్ విష్ణువర్ధన్ రెడ్డి, ఎస్ఓ ఓబుల్ రెడ్డి, డిప్యూటీ హెల్త్ ఎడ్యుకేషన్ ఆఫీసర్లు పాల్గొన్నారు. ‘సర్’ ప్రక్రియ వేగవంతం ● డిజిటలైజేషన్కు మిగిలింది 1.84 లక్షల ఓటర్లే ● పెండింగ్లో పంపిణీ ఫారాలు 468 సాక్షి, మదనపల్లె: జిల్లాలో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్) ప్రక్రియ వేగం పుంజుకుంది. జిల్లాలో 12,32,439 మందికి ఓటర్ ఫారాలు పంపిణీ చేయాల్సి ఉండగా శనివారం సాయంత్రం నాలుగు గంటల వరకు 12,31,971 మందికి (99.96 శాతం) పంపిణీ చేశారు. వీటిలో 10,47,610 ఓటర్ (85 శాతం) ఫారాల డిజిటలైజేషన్ పూర్తి చేశారు. ఓటరు ఫారాలు ఇంకా 468 పంపీణీ చేయాల్సి ఉండగా, 1,84,829 ఫారాల డిజిటలైజేషన్ మిగిలి ఉంది. ఈనెల ఎనిమిదవ తేది నుంచి 11వ తేది మధ్యలో 3,85,758 ఫారాలు డిజిటలైజేషన్ అయ్యాయి. సర్ కార్యక్రమం ముగిసేందుకు ఇక మిగిలింది కేవలం మూడురోజులే కావడంతో అధికార యంత్రాంగ ఏ మేరకు పూర్తి చేస్తుందో చూడాలి. ఫారాల పంపిణీ విషయంలో మదనపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో వంద శాతం పూర్తి చేసినట్టు లెక్కలు చెబుతున్నాయి. ఫారాల డిజటలైజేషన్ విషయంలో రాయచోటి నియోజకవర్గం 87.47 శాతంతో ముందుంది, 83.09 శాతంతో పీలేరు నియోజకవర్గం వెనుకబడింది. ఫారాల పంపీణీలో నాలుగు మండలాలు మినహా మిగిలిన 21 మండలాల్లో వందశాతం పంపీణి పూర్తి చేశారు. -
ఆటోను ఢీకొన్న కారు
జమ్మలమడుగు రూరల్: జమ్మలమడుగు – ప్రొద్దుటూరు రహదారిలోని సలివెందుల గ్రామ సమీపంలో ఉన్న విద్యుత్ సబ్స్టేషన్ వద్ద శనివారం జమ్మలమడుగు నుంచి ప్రొద్దుటూరు వెళ్తున్న ఆటోను వెనుక నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో ఆటోలో ప్రయాణిస్తున్న దూదేకుల శీలన్న వీఆర్ఏ (65) అనే వ్యక్తి మృతి చెందగా అల్లుడు దూదేకుల రెడ్డప్ప తీవ్రంగా గాయపడ్డాడు. దూదేకుల శీలన్న నంద్యాల డివిజన్లోని అవుకు మండలం చెన్నంపల్లె గ్రామంలో వీఆర్ఏగా విధులు నిర్వహిస్తున్నాడు. స్థానికులు ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బీసీ కాలనీకి చెందిన రెడ్డప్ప పట్టణంలో కూగాయాలు వ్యాపారం చేసుకోని జీవించేవాడు. శనివారం ప్రొద్దుటూరుకు వెళ్లి కూరగాయాలు తీసుకుని వచ్చేందుకు ఆటోలో వెళుతండగా సొంత పనుల నిమిత్తం దూదేకుల శీలన్న రెడ్డప్పతో కలసి బయలుదేరాడు. సలివెందుల గ్రామానికి వెళ్లగానే వెనుక వైపు నుంచి వస్తున్న కారు ఢీకొంది. ఈ సంఘటనలో దూదేకుల శీలన్న మృతి చెందగా ఆటో నడుపుతున్న రెడ్డప్పకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే రెడ్డప్పను ప్రొద్దుటూరుకు తరలించారు. డాక్టర్లు ప్రాథమిక చికిత్స అనంతరం కర్నూలు తీసుకెళ్లాలని సూచించడంతో కుటుంబ సభ్యులు కర్నూల్కు తరలించారు. కారులో ప్రయాణిస్తున్న వారికి బెలూన్లు ఓపెన్ కావడంతో ప్రమాదం నుంచి బయటపడ్డారు. వ్యక్తి మృతి -
జిల్లాలో యూరియా కొరత లేదు
● అందుబాటులో అవసరమైన ఎరువులు ● జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణశర్మ మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో రైతులకు అవసరమైన మేరకు యూరియా, డీఏపీ ఎరువులు అందుబాటులో ఉన్నాయని, ఎలాంటి కొరత లేదని జిల్లా జాయింట్ కలెక్టర్ శివ్ నారాయణ శర్మ స్పష్టం చేశారు. శనివారం మదనపల్లె కలెక్టరేట్లో నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రభుత్వ ఆదేశాల మేరకు గత నెల 8వ తేదీ నుంచి ఈఎల్ఏఎంఎస్ 2.0 యాప్ ద్వారా జిల్లాలో యూరియా, డీఏపీ పంపిణీ జరుగుతోందన్నారు. ఈ వ్యవస్థ ఈ–క్రాప్ ద్వారా నమోదైన పంట వివరాలు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాసీ్త్రయ సిఫారసుల ఆధారంగా రైతులకు అవసరమైన ఎరువులను కేటాయిస్తోందని చెప్పారు. ఈ ఏడాది ఖరీఫ్ సీజన్కు అవసరమైన ఎరువుల ప్రణాళికను ముందుగానే సిద్ధం చేసినట్లు తెలిపారు. జూన్ 8 నుంచి ఏపీఏఐఎంఎస్ 2.0 ద్వారా యూరియా, డీఏపీ పంపిణీ ప్రారంభమైందని చెప్పారు. ఇప్పటి వరకు జిల్లాలో 16,056 మంది రైతులకు 1,389.24 మెట్రిక్ టన్నుల యూరియా, 172.60 మెట్రిక్ టన్నుల డీఏపీ పంపిణీ చేసినట్లు వెల్లడించారు. రైతులు యూరియా, డీఏపీ కొనుగోలు చేయడానికి ముందుగా ఈ–క్రాప్లో నమోదై ఉండాలని, ఏపీఏఎంఎస్ మాడ్యూల్లో గత రబీ 2025 నాటి ఈ–క్రాప్ వివరాలు ప్రతిబింబిస్తున్నాయని తెలిపారు. రైతులు తమ సమీప రైతు భరోసా కేంద్రాన్ని సంప్రదించి ధ్రువీకరణ పూర్తి చేసుకోవచ్చన్నారు. అదే విధంగా ఆర్ఎస్కేలు, ప్రైవేట్ రీటైల్ దుకాణాల ద్వారా ఎరువులు అందుబాటులో ఉన్నాయని వివరించారు. సమావేశంలో జేడీ తదితరులు పాల్గొన్నారు. -
పరిశోధనలో నాణ్యతకు పెద్దపీట
కురబలకోట: పరిశోధనలో నవ్యత, నాణ్యతకు ప్రాధాన్యత ఇస్తున్నట్లు అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీ వీసీ యువరాజ్, రిజిస్ట్రార్ డాక్టర్ ప్రదీప్కుమార్ తెలిపారు. ఈ విద్యా సంవత్సరానికి వివిధ విభాగాల్లో పీహెచ్డీ ప్రవేశాల కోసం ఈనెల 5న నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలను శుక్రవారం విడుదల చేశారు. వారు మాట్లాడుతూ మిట్స్ యూనివర్సిటీలో పీహెచ్డీ ప్రవేశాల పరీక్షలో 89 మంది అర్హత సాధించినట్లు తెలిపారు. పరిశోధన రంగాన్ని మరింత బలోపేతం చేయడమే లక్ష్యంగా యూనివర్సిటీ ముందుకు సాగుతోందన్నారు. పీఎం శ్రీ పాఠశాలల అమలు సక్రమంగా నిర్వహించాలి రామసముద్రం: పీఎం శ్రీ పాఠశాలల అమలు సక్రమంగా నిర్వహించాలని అన్నమయ్య జిల్లా సమగ్ర శిక్ష అకడమిక్ మానిటరింగ్ అధికారి టి. అబ్దుల్ నాదిర్షా వలి తెలిపారు. శుక్రవారం ఆయన రామసముద్రం మండలం చెంబకూరు జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలను సందర్శించారు. ఈ సందర్భంగా విద్యార్థులతో మాట్లాడి వారి అభ్యసన స్థాయిని తెలుసుకున్నారు. అనంతరం పాఠశాలలోని సైన్స్ ప్రయోగశాలలు, గ్రంథాలయం, డిజిటల్ మౌలిక వసతులు, ఇంటరాక్టివ్ ఫ్లాట్ ప్యానెల్స్ ద్వారా నిర్వహిస్తున్న బోధనను పరిశీలించారు. విద్యార్థుల సమగ్రాభివృద్ధికి సాంకేతికత ఆధారిత బోధనతో పాటు ప్రయోగాత్మక అభ్యాసానికి ప్రాధాన్యత ఇవ్వాలని పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయులు కె. రమేష్ బాబు, ఉపాధ్యాయులు, విద్యార్థులు పాల్గొన్నారు. నేడు జాతీయ లోక్ అదాలత్ కడప కోటిరెడ్డిసర్కిల్ : జాతీయ న్యాయ సేవాధికార సంస్థ, రాష్ట్ర న్యాయసేవాధికార సంస్థ ఆదేశానుసారం జిల్లా న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో శనివారం జిల్లా వ్యాప్తంగా అన్ని కోర్టుల్లో ఉదయం 10:30 నుంచి సాయంత్రం 5:00 గంటల వరకు ‘జాతీయ లోక్ అదాలత్’ నిర్వహించనున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమమూర్తి సి.యామిని తెలిపారు. శుక్రవారం ఆమె విలేకరులతో మాట్లాడుతూ ఇందుకుగాను జిల్లా వ్యాప్తంగా 29 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. కడపలో 8, ప్రొద్దుటూరు 5, రాజంపేట 3, రాయచోటి 3, బద్వేలు 2, సిద్ధవటం, మైదుకూరు, కమలాపురం, పులివెందుల, జమ్మలమడుగు, లక్కిరెడ్డిపల్లి, నందలూరు, రైల్వే కోడూరులో ఒక్కో బెంచీని ఏర్పాటు చేసినట్లు చెప్పారు.కక్షిదారులు జాతీయ లోక్ అదాలత్ లో తమ కేసులను రాజీ చేసుకుని సత్వర న్యాయం పొందవచ్చని ఆమె సూచించారు. దశలవారీగా బిల్లుల వసూళ్ల కేంద్రాల మూసివేత చిత్తూరు కార్పొరేషన్: డిస్కం పరిధిలో విద్యుత్ బిల్లుల వసూళ్ల కేంద్రాలను దశలవారీగా మూసివేయనున్నట్లు ట్రాన్స్కో సీఎండీ శివశంకర్ శుక్రవారం ప్రకటించారు. డిజిటల్ చెల్లింపుల పెంపు లక్ష్యంగా ఈ చర్యలకు తీసుకొనున్నట్లు పేర్కొన్నారు. వీటి ద్వారా విద్యుత్ బిల్లుల ఆన్లైన్ చెల్లింపులు మరింత పెరుగుతుందన్నారు. బిల్లులు కట్టడానికి క్యూలో వేచి చూసే పనిలేకుండా ఇక డిజిటల్ చెల్లింపులు చేస్తారన్నారు. డిస్కం పరిధిలోని చిత్తూరు, తిరుపతి, నెల్లూరు, అన్నమయ్య, కడప, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీ సత్యసాయి జిల్లాల్లో మొత్తం 61.32 లక్షల మంది విద్యుత్ వినియోగదారులు ఉన్నరన్నారు. బిల్లుల చెల్లింపుల ద్వారా ప్రతి నెల దాదాపు సంస్థకు రూ.520 కోట్ల వస్తోందన్నారు. ప్రస్తుతం 49.50 శాతం ఆన్లైన్ చెల్లింపులు జరుగుతోందన్నారు. వీటిని దశలవారీగా 100 శాతం పెంచడమే లక్ష్యమని తెలిపారు. -
విద్యుత్ స్తంభాన్ని ఢీకొన్న పాఠశాల బస్సు
● త్రుటిలో తప్పిన పెను ప్రమాదం లక్కిరెడ్డిపల్లి : మండల పరిధి నలందా నగర్లోని ఎంపీపీ సుదర్శన్రెడ్డి నివాసం సమీపంలో శుక్రవారం సాయంత్రం 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ప్రైవేటు పాఠశాల బస్సు ఢీకొంది. త్రుటిలో పెను ప్రమాదం తప్పడంతో అక్కడి వారు ఊపిరి పీల్చుకున్నారు. రోడ్డుపై ఉన్న 11 కేవీ విద్యుత్ స్తంభాన్ని ఓ ప్రైవేటు పాఠశాలకు చెందిన బస్సు రివర్స్ తీసుకునే సందర్భంలో.. డ్రైవర్ నిర్లక్ష్యంతో ఢీకొంది. దీంతో స్తంభం విరిగి ఒరిగిపోయింది. ఆ సమయంలో విద్యుత్ సరఫరా ఉండటం.. ఒక్కసారిగా సరఫరాలో అంతరాయం ఏర్పడటంతో ప్రమాదం తప్పింది. విద్యుత్ స్తంభాలకు పైన ఉన్న 11 కేవీ వైర్లు కాస్త గట్టిగా ఉండటంతో.. స్తంభం విరిగినా బస్సుపై పడకుండా వైర్ల మీద నిలవడంతో పెను ప్రమాదం నుంచి విద్యార్థులు, డ్రైవర్ బయటపడ్డారు. సమాచారం తెలుసుకున్న విద్యుత్ శాఖ ఏఈ హరినాథ్ సంఘటనా స్థలానికి చేరుకొని స్తంభాన్ని పునరుద్ధరించే పనిలో నిమగ్నమయ్యారు. ఏది ఏమైనా కాలం చెల్లిన కొన్ని స్కూళ్ల బస్సులలో విద్యార్థుల ప్రాణాలు సురక్షితమేనా అని పలువురు తల్లిదండ్రులు, స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
మదనపల్లెలో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు
మదనపల్లె టౌన్: మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రిలో శుక్రవారం అధికారులు ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేశారు. కడప జిల్లాలో కోవిడ్తో ఇద్దరు మతి చెందిన నేపథ్యంలో రాయచోటి, మదనపల్లె ఆసుపత్రుల్లో ఐసోలేషన్ వార్డులు ఏర్పాటు చేయలేదని శుక్రవారం ‘సాక్షి’లో కథనం ప్రచురితమైంది. స్పందించిన జిల్లా అధికారులు అప్రమత్తమయ్యారు. వెంటనే మదనపల్లె జిల్లా ఆస్పత్రిలో ఐసోలేషన్ వార్డును ఏర్పాటు చేసినట్లు డీఎంహెచ్వో డాక్టర్ లక్ష్మీ నరసయ్య తెలిపారు. కోవిడ్ బారిన పడిన బాధితులు అత్యవసర చికిత్సలు పొందేందుకు అన్ని ఏర్పాట్లు చేశామని ఆయన వివరించారు. సిబ్బందిని అప్రమత్తం చేసి మందులు, ఆక్సిజన్, ఇతర సౌకర్యాలు సిద్ధంగా ఉంచినట్లు పేర్కొన్నారు. -
రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ వద్దే వద్దు
కడప వైఎస్ఆర్ సర్కిల్ : రాష్ట్ర ప్రభుత్వం రిజిస్ట్రేషన్ శాఖను ప్రైవేటీకరణ చేస్తూ రాష్ట్ర వ్యాప్తంగా 24 జిల్లా కేంద్రాలలో రిజిస్ట్రేషన్ సేవా కేంద్రాలు ఏర్పాటు చేయాలని విడుదల చేసిన జీవో నంబర్ 396ను రద్దు చేయాలని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర దస్తావేజు లేఖరుల సంక్షేమ సంఘం రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ గుంటి వేణుగోపాల్ డిమాండ్ చేశారు. శుక్రవారం కలెక్టరేట్ ఎదుట జిల్లాలోని దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు ధర్నా చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం పట్ల రిజిస్ట్రేషన్ శాఖపై ఆధారపడి జీవనోపాధి పొందుతున్న దస్తావేజు లేఖరులు, స్టాంప్ వెండర్లు, డీటీపీ ఆపరేటర్లు, లేఖరుల సహాయకులు సుమారు మూడు లక్షల మంది జీవనోపాధి కోల్పోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఎన్నికల ముందు చంద్రబాబు సంపద సృష్టించి, ఆంధ్రప్రదేశ్ను అభివృద్ధి పథంలో నడిపించి, ప్రజానీకం ఆర్థిక ఎదుగుదలకు విశేష కృషి చేస్తానని చెప్పి.. అధికారంలోకి వచ్చిన తర్వాత రిజిస్ట్రేషన్ శాఖలో జీవనోపాధి పొందుతున్న డిగ్రీలు, ఎంఏలు, బీటెక్ చదివి నిరుద్యోగులుగా ఉన్న వారిని వీధుల పాలు చేయడం తగదని విమర్శించారు. రిజిస్ట్రేషన్ శాఖ ప్రైవేటీకరణ రిజిస్ట్రేషన్, సేవా కేంద్రాల ఏర్పాటు చేయాలని ఇచ్చిన జీవో నెంబరు 396ను తక్షణం రద్దు చేయాలన్నారు. ప్రజల ఆస్తులకు భద్రత కల్పించాలని, లేఖర్లకు, వెండర్లకు జీవనోపాధి కల్పించాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా అన్ని అఖిలపక్ష పార్టీలు, ప్రజా సంఘాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామన్నారు. ఈ కార్యక్రమంలో యూనియన్ రాష్ట్ర నాయకులు యు.సంజీవరాయుడు, బసవరాజు, శివ, జమాలుద్దీన్, జి.వేణుగోపాల్, కొండారెడ్డి, రామసుబ్బయ్య, ప్రసాదు, సుధీరు, రవిబాబు, సాయి, సుబ్బయ్య, కే ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
గాయపడిన వ్యక్తి మృతి
సదుం : ట్రాక్టరు ట్రాలీపై నుంచి జారిపడి గాయపడిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పోలీసులు శుక్రవారం తెలిపారు. మండలంలోని చెరుకువారిపల్లె పంచాయతీ నల్లరాల్లపల్లెకు చెందిన అశోక్(31) గత నెల 26న తన ట్రాక్టరుతో పొలం వద్దకు వెళ్లి ట్రాలీలో ఉన్న మామిడి కాయల ట్రేలు దించుతుండగా జారి పడి గాయపడ్డాడు. అతనిని కుటుంబ సభ్యులు తిరుపతి రుయాకు తరలించగా, చికిత్స పొందుతూ మృతి చెందాడు. వారి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కలికిరి : కలికిరి పట్టణ పరిధిలో బాలిక అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు సీఐ అనీల్కుమార్ తెలిపారు. వివరాలు... పట్టణంలో బీడీ కాలనీకి చెందిన బాబా సాహెబ్ కుమార్తె(16) గురువారం ఉదయం నుంచి కనిపించడం లేదని, చుట్టుపక్కల వారిని, బంధువులను విచారణ చేసినా ఆచూకీ తెలియకపోవడంతో బాలిక తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్లు సీఐ తెలిపారు. కలకడ : పర్యావరణ పరిరక్షణ అందరి బాధ్యత అని హెచ్పీసీఎల్ విజయపూడి–ధర్మపూరి పైప్లైన్ బూస్టర్ పాయింట్–కలకడ కేంద్రం చీఫ్ మేనేజర్ దుర్గాసాయిప్రసాద్ తెలిపారు. శుక్రవారం మండలంలోని ఎర్రకోటపల్లె పంచాయతీ పాపిరెడ్డిగారిపల్లె ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు వంద మొక్కలు వితరణ చేసి విద్యార్థులచే నాటించారు. వాటిని పరిరక్షించే బాధ్యత బావి భారత పౌరులుగా విద్యార్థులపై ఉందని ఆయన గుర్తు చేశారు. విద్యార్థులకు స్వచ్ఛత, పర్యావరణ పరిరక్షణ, పరిసరాల పరిశుభ్రతపై స్వచ్ఛతపక్వాడ కార్యక్రమంలో భాగంగా పోటీ పరీక్షలు నిర్వహించి ఉత్తమ ప్రతిభ కనపరిచిన వారికి ప్రోత్సాహక బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా చీఫ్ మేనేజర్ మాట్లాడుతూ గత ఏడాది కోన ప్రభుత్వ జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలకు అవసరమైన బల్లలు, కంప్యూటర్ వంటివి, ఈ ఏడాది బంగావాండ్లపల్లె ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు వాటర్ ట్యాంక్, మినిరల్ వాటర్ ప్లాంట్ వితరణ చేసిన విషయం గుర్తు చేశారు. ఈ కార్యక్రమంలో హెచ్పీసీఎల్ సిబ్బంది లక్ష్మీకాంత్, ఆ పాఠశాల ఉపాధ్యాయులు, విద్యార్థుల తల్లిదండ్రులు, గ్రామస్తులు పాల్గొన్నారు. రాయచోటి : రోడ్డు ప్రమాదంలో తీవ్రంగా గాయపడి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న ఇంజినీరింగ్ విద్యార్థి చాంద్ బాషా (21) మృతి చెందినట్లు పోలీసులు తెలిపారు. రాయచోటి పట్టణానికి చెందిన చాంద్ బాషా సాయి ఇంజినీరింగ్ కళాశాలలో ఇంజినీరింగ్ ద్వితీయ సంవత్సరం చదువుతుండే వాడు. గురువారం సాయంత్రం రాయచోటి రింగ్ రోడ్డు పరిధిలోని పాత ఎస్పీ కార్యాలయం సమీపంలో బైకు అదుపుతప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డాడు. బాధితుడిని మెరుగైన చికిత్స నిమిత్తం వేలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు పోలీసులకు సమాచారం అందించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
బురకాయలకోట–అంగళ్లు రోడ్డుకు కొత్త రూపం
మదనపల్లి (కురబలకోట): ఏళ్లుగా వాహనదారులను ఇబ్బందులకు గురి చేస్తున్న బురకాయలకోట–అంగళ్లు మీదుగా ఉన్న రహదారి మార్గం త్వరలో కొత్తరూపు సంతరించుకోనుంది. రెండేళ్ల క్రితం ఈ మార్గంలో బైపాస్ రోడ్డు వేశారు. అయితే ఊరిలో ద్వారా వెళ్లు రహదారులు అభివృద్ధికి నోచుకోలేదు. దీంతో రూ.10.86 కోట్ల వ్యయంతో ములకలచెరువు మండలం బురకాయల కోటతో పాటు అంగళ్లు మీదుగా విశ్వం బైపాస్ సర్కిల్ మార్గంలో ఉన్న బైపాస్ లింక్ రహదారిని అభివృద్ధి చేసేందుకు చర్యలు చేపట్టినట్లు హైవే డీఈ మధుసూధన్ తెలిపారు. టెండర్ ప్రక్రియ ఇప్పటికే పూర్తి కాగా త్వరలోనే పనులు ప్రారంభం కానున్నాయన్నారు. బురకాయలకోట, అంగళ్లు ఊరిలో ద్వారా వెళ్లే 8.07 కిలోమీటర్ల రహదారిని పూర్తి స్థాయిలో అభివృద్ధి చేయనున్నట్లు తెలిపారు. ఇందులో భాగంగా అంగళ్లు గోల్డన్వ్యాలీ దగ్గర నుంచి అంగళ్లు ఊరిలో మీదుగా విశ్వం సర్కిల్ వరకు ఉన్న 2.20 కిలోమీటర్ల రోడ్డును కూడా విస్తరించనున్నారు. రోడ్డుకు ఇరువైపులా మురికినీటి కాలువలు, విద్యుత్ లైట్లు, ఇంటర్ లాకింగ్ సిమెంట్ బ్లాక్స్లతో కాలి బాటలు (పేవర్ బ్లాక్స్) ఏర్పాటు చేయనున్నారు. దీంతో వర్షాకాలంలో నీరు నిలిచే సమస్యకు కూడా పరిష్కారం లభించనుంది. పాదచారులు సురక్షితంగా రాకపోకలకు అవకాశం కలుగుతుంది. అధికారులు గురు,శుక్రవారాల్లో అంగళ్లులో సర్వే నిర్వహించారు. ఆక్రమణలు గుర్తించారు. రోడ్డు హద్దు వరకు మార్కింగ్ వేశారు. ఆక్రమణలను తొలగించి అతి త్వరలో రహదారి నిర్మాణ పనులు ప్రారంభిస్తారని తెలిపారు. ఈ పనులు పూర్తయితే రద్దీగా ఉన్న బురకాయలకోట, అంగళ్లులో ప్రయాణం మరింత సౌకర్యవంతంగా మారగలదు. ముఖ్యంగా అంగళ్లులో మిట్స్, విశ్వం, గోల్డన్వ్యాలీ విద్యా సంస్థల విద్యార్థులు, అధ్యాపకులు ఇతర బాటసారులు, ప్రయాణికుల రాకపోకలకు ఎంతో సౌకర్యంగా ఉండగలదు. సర్వేలో కురబలకోట మండల సర్వేయర్ భువనేశ్వరి, అంగళ్లు సర్వేయర్ ఇందుమతి పాల్గొన్నారు. రూ.10.86 కోట్లతో అభివృద్ధి పనులు -
అదిగో పులి.. ఏఐ గిలి
పెద్దతిప్పసముద్రం : మండలంలోని రాపూరివాండ్లపల్లికి పడమటి వైపు ఉన్న వ్యవసాయ బీడు భూములు, పీటీఎం పరిసరాల్లోని బోడిగుట్ట వద్ద శుక్రవారం పులి సంచరించినట్లు తప్పుడు ప్రచారం జరిగింది. పులి సంచరించిన ఫొటోను సైతం సామాజిక మాధ్యమాల్లో పోస్ట్ చేయడంతో పలువురు పశు కాపరులు, దినసరి కూలీలు భయభ్రాంతులకు లోనయ్యారు. మరి కొందరు ఇదంతా వట్టి పుకార్లు అంటూ కొట్టి పడేశారు. ఇదిలా ఉండగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం అందుబాటులోకి వచ్చాక ఆర్టిఫిషియల్ ఇంటిలిజెన్స్ (ఏఐ) ద్వారా రూపొందించి వైరల్ చేసే ఫొటోల సంఖ్య సామాజిక మాధ్యమాల్లో రోజురోజుకూ విపరీతంగా పెరిగిపోతోంది. తద్వారా ఏది నిజమో, ఏది అబద్ధమో తేల్చుకోలేక ప్రజలు తికమక పడుతున్నారు. ఏది ఏమైనా అటవీ శాఖ అధికారులు స్పందించి సదరు గ్రామ పరిసరాల్లోని బీడు భూములను క్షుణ్ణంగా పరిశీలించి.. పులి సంచరించిన ప్రదేశాల్లో అడుగు జాడల ఆనవాళ్లు ఉన్నాయా, లేవా అని సమగ్రంగా ఆరా తీసి ప్రజల్లో ఉన్న భయాందోళనలు, అనుమానాలను నివృత్తి చేయాలని ఈ ప్రాంత వాసులు అభిప్రాయం వ్యక్తం చేశారు. ఈ తరుణంలో సామాజిక మాధ్యమాల ద్వారా పులి సంచార వార్త విషయం తెలుసుకున్న అటవీ శాఖ అధికారులు హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని సమగ్రంగా ఆరా తీశారు. పులి సంచారంపై వస్తున్న వదంతులన్నీ వట్టి పుకార్లేనని, ఏఐ ద్వారా ఫొటో క్రియేట్ చేసినట్లు నిర్ధారణకు వచ్చారు. ఈ పరిసర ప్రాంతాలకు చెందిన ముగ్గురు యువకులపై అనుమానం వ్యక్తం చేస్తూ అటవీ అధికారులు వారిని అదుపులోకి తీసుకుని జిల్లా కేంద్రంలో విచారణ చేపడుతున్నారు. పులి సంచారం అంటూ అసత్య ప్రచారం పోలీసుల అదుపులో ముగ్గురు ఏఐ ఫొటో క్రియేటర్లు -
మదనపల్లెలో అమానుష ఘటన
మదనపల్లె టౌన్ : ఆస్తి కోసం కన్నేసిన ఓ ప్రభుత్వ ఉద్యోగి.. వృద్ధుడిని పథకం ప్రకారం విష ప్రయోగంతో హతమార్చాడనే ఆరోపణలు శుక్రవారం పట్టణంలో కలకలం రేపాయి. మదనపల్లె ఘటనపై మృతుడి కుమార్తె శంకరమ్మ తెలిపిన వివరాలు.. పట్టణంలోని పోస్టల్ అండ్ టెలికం కాలనీలో నివాసం ఉంటున్న పూల వెంకటప్ప(68), లక్ష్మమ్మ దంపతులు నివసిస్తూ.. కుమారుడు ఆనంద్, కుమార్తె శంకరమ్మను పోషించు కునేవారు. ఇటీవల వెంకట రమణ భార్య లక్ష్మమ్మ, కుమారుడు ఆనంద్ ఒకరి తరవాత ఒకరు మృతి చెందడంతో వెంకటరమణ ఒంటరి అయ్యాడు. కుమార్తె శంకరమ్మ కూడా కురువంకలోనే కాపురం ఉంటోంది. అయితే ఆమె తండ్రి బాగోగులు చూడలేదని తెలిసింది. దీంతో ఆ వృద్ధుడికి పక్కింటికి చెందిన ప్రభుత్వ ఉద్యోగి రవి నాయక్ అన్నం నీళ్లు పెట్టిస్తూ సపర్యలు చేస్తున్నట్లు సమాచారం. ఈ క్రమంలోనే సుమారు రూ.50 లక్షల విలువ చేసే వృద్ధుడు వెంకటరమణ ఇంటిని గుట్టు చప్పుడు కాకుండా తన పేరున రావినాయక్ రాయించుకున్నట్లు మృతుడి కూతురు శంకరమ్మ ఆరోపణ చేస్తోంది. తమ తండ్రిని పథకం ప్రకారం స్లో పాయిజన్ ఇచ్చి హత మార్చారని ఆరోపించింది. తాలూకా పోలీసులకు ఫిర్యాదు దీనిపై మృతుడి కుమార్తె శంకరమ్మ తాలూకా సీఐ కళా వెంకట రమణకు ఫిర్యాదు చేశారు. రవి నాయక్నే తన తండ్రిని చంపేశాడని ఆరోపించింది. దీనిపై స్పందించిన సీఐ కళా వెంకటరమణ ఇరు వర్గాలను విచారణ చేశారు. వెంకటప్ప మృతిపై కేసు నమోదు చేయనున్నట్లు తెలిపారు. రవి నాయక్ వివరణ ఈ ఆరోపణలపై రవి నాయక్ మాట్లాడుతూ.. తాను వెంకటప్పను చంపలేదని, ఆయనకు అన్నం పెట్టి సపర్యలు చేసి సేవ చేసినందుకే ఇష్ట పూర్వకంగా వెంకటరమణే తన ఇంటిని తన పేరున రాసిచ్చారని తెలిపారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. పోస్టుమార్టం నివేదిక వచ్చిన తర్వాత అసలు విషయం బయట పడనుంది. ఘటనతో కాలనీలో తీవ్ర కలకలం నెలకొంది. ఆస్తి కోసం వృద్ధుడికి విషం పెట్టి హత్య చేశారని ఆరోపణ రూ.50 లక్షల ఇంటిని రాయించుకున్న ప్రభుత్వ ఉద్యోగిపై అనుమానం పోలీసులకు ఫిర్యాదు చేసిన మృతుడి కుమార్తె -
చోరీ కేసులో ఇద్దరికి జైలు శిక్ష
వేంపల్లె : వేంపల్లె టౌన్లో రెండు వేర్వేరు చోట్ల దొంగతనం చేసిన కేసుల్లో జయప్రకాశ్ రెడ్డి, దివాకర్కు జైలు శిక్ష విధించినట్లు సీఐ నరసింహులు తెలిపారు. వేంపల్లె నాయీ బ్రాహ్మణ వీధికి చెందిన మళ్లీ బోయిన రామకృష్ణ ఇంట్లో రాత్రిపూట దొంగతనం జరిగిన కేసులో బంగారు, వెండి ఆభరణాలు తీసుకెళ్లినట్లు బాధితుడు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా జయప్రకాష్రెడ్డి, దివాకర్ను పట్టుకొని బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేసి పులివెందుల కోర్టులో హాజరు పరచగా.. జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్.. ఏడాది జైలు శిక్షతోపాటు రూ.2 వేల జరిమానా విధించినట్లు చెప్పారు. అలాగే రెడ్డి నగర్ వీధిలో నర్రెడ్డి లక్ష్మీదేవి ఇంటిలో పగటిపూట జరిగిన దొంగతనం కేసులో బంగారు, వెండి ఆభరణాలు గుర్తు తెలియని వ్యక్తులు దొంగలించినట్లు సదరు వ్యక్తి వేంపల్లి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఫిర్యాదు మేరకు వేంపల్లి పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేసి దర్యాప్తు చేయగా.. నిందితులు జయప్రకాష్రెడ్డి, దివాకర్లను పట్టుకొని వారి వద్ద నుంచి బంగారు, వెండి ఆభరణాలు రికవరీ చేసి పులివెందుల కోర్టులో హాజరు పరచగా జ్యుడిషియల్ ఫస్ట్ క్లాస్ మేజిస్ట్రేట్.. ఇద్దరికి ఆరు నెలల జైలు శిక్ష, రూ.2 వేల జరిమానా విధించినట్లు సీఐ వెల్లడించారు. ఈ రెండు కేసులలో ప్రాసిక్యూషన్ తరఫున ఏపీపీ జి.మధుసూదన ఆచారి వాదనలు వినిపించారు. నిందితులకు శిక్ష పడేందుకు కృషి చేసిన సీఐ నరసింహులు, ఎస్ఐ తిరుపాల్ నాయక్, కానిస్టేబుల్ బాబా ఫక్రుద్దీన్లను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
అంగన్వాడీ.. ఆగ్రహ వేడి
సాక్షి, మదనపల్లె : ప్రభుత్వం తమ సమస్యలను కనీసం పట్టించుకోకుండా, పనిభారం మోపిందని, ఎన్నికల్లో ఇచ్చిన హమీలను అమలు చేయకుండా వెట్టిచాకీరి చేయించుకుంటోందని అంగన్వాడీ వర్కర్లు, హెల్పర్లు మండిపడ్డారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు అన్నం పెట్టి వారి ఆలనాపాలనా చూసే అంగన్ వాడీ వర్కర్లు, హెల్పర్లు రోడ్డెక్కారు. 50 ఏళ్లుగా సేవ చేస్తున్నా కనీస గౌరవం, గుర్తింపు లేదని, తమ న్యాయమైన డిమాండ్లు నెరవేర్చాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ శుక్రవారం వారు మదనపల్లెలో ఆందోళన కార్యక్రమాలు నిర్వహించారు. జిల్లాలోని అన్ని ప్రాంతాల నుంచి తరలివచ్చిన వీరు మదనపల్లెకు చేరుకోగా.. కలెక్టరేట్ ఎదుట ధర్నా నిర్వహించేందుకు అనుమతి ఇవ్వకపోవడంతో.. కలెక్టరేట్ సమీపంలోని మిషన్ కాంపౌండ్ వద్దకు చేరుకొని అక్కడే రెండు గంటలకుపైగా బైఠాయించారు. బ్యానర్, ప్లకార్డులను చేతబట్టి నినాదాలు చేశారు. సేవలను ప్రభుత్వం గుర్తించాలి, అందుకు తగిన ప్రతిఫలం ఇవ్వాలంటూ పిడికిళ్లు పైకెత్తి నినదించారు. అంగన్వాడీలపై ప్రభుత్వం చూపుతున్న నిర్లక్ష్యంపై మండిపడ్టారు. యాప్లు, సర్వేలు, ఇతర పనులను చేయించుకొంటున్న ప్రభుత్వం తమ సమస్యలపై ఎందుకు పట్టించుకోవడం లేదని నిలదీశారు. పలువురు సీఐటీయూ మహిళ నాయకులు, వర్కర్లు ప్రసంగించారు. మిషన్ కాంపౌండ్ నుంచి కలెక్టరేట్కు అంగన్వాడీలు ప్రదర్శనగా చేరుకున్నారు. ముఖద్వారం వద్ద భారీగా పోలీసులు మొహరించి.. వారిని లోపలికి వెళ్లేందుకు అనుమతించలేదు. అక్కడే కొంతసేపు ధర్నా నిర్వహించి ప్రభుత్వ నిర్లక్ష్యంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అనంతరం కొద్దిమందికి మాత్రమే కలెక్టరేట్లోకి వెళ్లేందుకు అనుమతి ఇవ్వడంతో సంఘ నాయకులు వెళ్లారు. జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్శర్మను కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్బంగా సమస్యలను ఆయనకు విన్నవించగా ప్రభుత్వ స్థాయిలోని సమస్యలు, డిమాండ్లను తాము తీర్చలేమని, జిల్లాస్థాయిలో తాము పరిష్కరించగలిగే సమస్యలపై చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. డిమాండ్లు నెరవేర్చాల్సిందే బైఠాయింపు, ధర్నా సందర్భంగా సీఐటీయూ మహిళా నాయకులు మాట్లాడుతూ అంగన్వాడీలకు రూ.26 వేల వేతనం ఇవ్వకుండా వెట్టిచాకిరి చేయించుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సర్వీసులో ఉండి చనిపోయిన వారికి, మధ్యలో విధులకు దూరమైన వారికి కూడా గ్రాట్యూటీ అమలు చేయాలని కోరుతున్నామన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లయినా అంగన్వాడీలకు ఇచ్చిన హామీ ప్రకారం వేతనాలు ఎందుకు పెంచలేదని ప్రశ్నించారు. అన్నమయ్య జిల్లాలో రాజకీయ జోక్యం వల్ల హెల్పర్లు ప్రమోషన్లు కోల్పోతున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. కొత్తగా ప్రమోషన్లకు ఐదేళ్ల సీనియారిటీ పెట్టారన్నారు. 1800 మినీ సెంటర్లు మెయిన్ సెంటర్లుగా అప్డేట్ చేయకపోగా, మినీ సెంటర్లను విలీనం చేసినా వారికి ఇంకా హెల్పర్ వేతనమే ఇస్తున్నారని అన్నారు. నవచేతన యాప్ వల్ల పనిభారం పెరిగిందని, దీన్ని తొలగించాలన్నారు. అంగన్వాడీలకు టీఏ బిల్లులు మంజూరు చేయాలన్నారు. బీఎల్ఓ డ్యూటీల నుంచి అంగన్వాడీలను మినహాయించాలని, వేతనంతో కూడిన మెడికల్ లీవులు, పెండింగ్లోని 164 సూపర్ వైజర్ పోస్టులను భర్తీ చేయాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమాల్లో నాయకురాళ్లు మధురవాణి, గంగాదేవి, గౌరీ, భాగ్యలక్ష్మి, లీలావతి, ఓబులమ్మ, అపర్ణ, శ్రీవాణి, విజయ, భూకై లేశ్వరీ, సత్యలక్ష్మి, రాధిక, శంకరమ్మ, వాణికుమారి పాల్గొన్నారు. మూతపడిన కేంద్రాలు జిల్లాలోని అంగన్వాడీ కేంద్రాల నుంచి వర్కర్లు, హెల్పర్లు అందరూ మదనపల్లెలో అందోళన కార్యక్రమంలో పాల్గొనేందుకు తరలిరావడంలో కేంద్రాలన్నీ మూతపడ్డాయి. ప్రతి కేంద్రం నుంచి హాజరు కావడంతో ఈ పరిస్థితి ఏర్పడింది. కేంద్రాలకు పిల్లలు రాలేదని తెలుస్తోంది. ఆందోళన కార్యక్రమం ముగిసిన తర్వాత వెనుదిరిగి వెళ్లారు. రెండువేల మంది దాకాఆందోళకు తరలిరావడంతో పట్టణంలో వివిధ ప్రాంతాలకు వెళ్లాల్సిన వర్కర్లు, హెల్పర్లతో రద్దీ నెలకొంది. కూటమి పాలనపై పెల్లుబికిన నిరసన ఇంకెన్నాళ్లు వెట్టిచాకిరి అంటూ మండిపాటు వేతనాల పెంపు, పీఎఫ్, పెన్షన్ ఇవ్వరా? కలెక్టరేట్ ఎదుట ధర్నాకు అనుమతి నిరాకరణ మదనపల్లె మిషన్ కాంపౌండ్లో బైఠాయింపు -
కరోనాను దాచారు.. ప్రమాదానికి దారి తెరిచారు..!
● జిల్లాలో 8కి చేరిన కేసులు ● అందులో ఇద్దరు మతి ● తెలియక సపర్యలు చేసినందుకు ఇద్దరికి పాజిటివ్ కడప రూరల్: కరోనా మహమ్మారి ఒకరి నుంచి మరొకరికి సోకే భయంకరమైన అంటు వ్యాధి. కోవిడ్ సోకిన వ్యక్తి తుమ్మినా.. దగ్గినా.. కరచాలనం చేసినా వెంటనే సంక్రమించే జబ్బు ఇది. అవగాహన, తక్షణ వైద్య పరీక్షలు, వైద్య చికిత్సల ద్వారానే ఈ వ్యాధి ఒకరి నుంచి మరొకరికి సంక్రమించకుండా నియంత్రించొచ్చు. అలాంటి కోవిడ్ పై యంత్రాంగం అప్రమత్తం చేయకుండా గోప్యతను పాటించడం పట్ల సర్వత్రా విమర్శలు చెలరేగుతున్నాయి. సాధారణ జబ్బు అని తోడుగా ఉన్నందుకు... జిల్లావ్యాప్తంగా ఇప్పటివరకు అధికారికంగా మొత్తం 8 కేసులు నమోదయ్యాయి. అందులో రాజంపేటకు చెందిన 52 ఏళ్ల వ్యక్తి సీఎంసీ రాయవేలూరులో చికిత్స పొందుతూ మరణించాడు. కడప నగరం మాసాపేటకు చెందిన 43 ఏళ్ల వ్యక్తి ఊపిరితిత్తులు దెబ్బతిని, తీవ్ర అనారోగ్యానికి గురయ్యారు. ఇతను కడప రిమ్స్కు చికిత్స కి వెళ్లగా, అనుమానంతో కోవిడ్ పరీక్షలు నిర్వహిస్తే అందులో పాజిటివ్ గా తేలింది. ఈ వ్యక్తి చికిత్స పొందుతూ మరణించాడు. వల్లూరు మండలంలో 66 ఏళ్ల వద్ధుడు హోమ్ ఐసోలేషన్ లో ఉన్నాడు. కడప నగరం ఆర్టీసీ కాలనీకి చెందిన 67 ఏళ్ల వద్ధుడు విషద్రావణం తాగడంతో అతన్ని చికిత్స కోసం కడప రిమ్స్ కు తీసుకెళ్లగా కరోనా పాజిటివ్ గా తేలింది. ఇతను కడప రిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు. కడప నగరం నకాష్ వీధికి చెందిన 70 ఏళ్ల వ్యక్తి కూడా కరోనాకు గురై, కడప రిమ్స్ లో వైద్యం పొందుతున్నాడు. ప్రధానంగా కడప మాసాపేటకు చెందిన వ్యక్తి కోవిడ్ కారణంగా మృతి చెందిన సంఘటనకు సంబంధించి, ఆయన కుమారుడు 20 ఏళ్ల యువకుడు, తన తండ్రికి వచ్చింది కరోనా అని తెలియక, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోకుండా, తండ్రికి తోడుగా ఉండి సేవలు చేయడంతో కోవిడ్ సోకింది. దీంతో యువకుడు చికిత్స పొందుతున్నాడు. అలాగే ఇలాంటి సంఘటన మరొకటి జరిగింది. కడప నగరం ఆర్టీసీ కాలనీకి చెందిన 67 ఏళ్ల వ్యక్తికి, తండ్రిగా ఆయన కుమార్తె 20 ఏళ్ల యువతి సేవలు చేసినందుకు కరోనాకు గురై చికిత్స పొందుతోంది. అదే జిల్లా యంత్రాంగం అప్రమత్తమై సమాచారం ఇచ్చి, అవగాహన కల్పించి ఉంటే ఆ ఇద్దరికీ కరోనా సోకేది కాదనేది స్పష్టంగా అర్థమవుతోంది. కరోనా వల్ల ప్రపంచం యావత్తు కుదేలైంది. ఎంతోమంది లక్షలు ఖర్చుపెట్టిన ప్రాణాలు మాత్రం దక్కలేదు. వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు కరోనా మహమ్మారి వచ్చింది. అయితే అప్పటి రాష్ట్ర ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి కరోనా కట్టడికి యుద్ధ ప్రాతిపదికన చర్యలు చేపట్టారు. పెద్ద ఎత్తున అవగాహన కార్యక్రమాలు చేపట్టారు. కోవిడ్ నియంత్రణ కోసం ప్రత్యేకంగా నిధులను కేటాయించారు.నాడు వలంటరీ వ్యవస్థ ఉండడంతో ఎక్కడికక్కడ యుద్ధ ప్రాతిపరిచిన చర్యలు చేపట్టారు. ఇప్పుడా పరిస్థితులు ఎక్కడా కనిపించడం లేదు. ‘కరోనా రాని.. మరి ఏదైనా జరగని.. ప్రజలు ఎలాగైనా పోనీ’అనే ధోరణిలో ప్రభుత్వం వ్యవహరిస్తోందనే ఆరోపణలు మిన్నంటాయి. కాగా ఇప్పటివరకు మొత్తం నమోదు అయినవి 8 కేసులేనా... ఇంకా ఏమైనా ఉన్నాయా అనే సందేహాలు కలుగుతున్నాయి. ప్రస్తుతం నమోదైన కేసులను జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారి డాక్టర్ రవిబాబు ధ్రువీకరించారు. -
వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలు
బద్వేలు అర్బన్/అట్లూరు : బద్వేలు పట్టణంలో శుక్రవారం జరిగిన రెండు వేర్వేరు ప్రమాదాల్లో ఆరుగురికి గాయాలయ్యాయి. ఇందుకు సంబంధించి వివరాల్లోకి వెళితే.. బద్వేలులోని సిద్దవటం రోడ్డులో అబ్బుసాహెబ్పేట క్రాస్ రోడ్డు వద్ద రెండు బైక్లు ఢీకొన్న ఘటనలో నలుగురికి గాయాలయ్యాయి. బయనపల్లె నుంచి బద్వేలుకు ద్విచక్ర వాహనంపై వెంకటసాయి, సతీష్ .. కడప నుంచి బద్వేలుకు ద్విచక్ర వాహనంలో అశోక్కుమార్, రాజేష్ వస్తున్నారు. ఎదురెదురుగా వస్తున్న ఈ రెండు బైక్లు రోడ్డుపై గుంతను తప్పించే క్రమంలో ఢీకొన్నాయి. ఈ ఘటనలో వారి నలుగురికి తీవ్ర గాయాలు కాగా అశోక్కుమార్ పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. కారు ఢీకొని.. బద్వేలులోని మైదుకూరు రోడ్డులో స్టేట్ బ్యాంక్ మెయిన్ బ్రాంచ్ వద్ద శుక్రవారం రాత్రి కారు ఢీకొన్న ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. సురేంద్రనగర్కు చెందిన బి.షరీఫ్, నందిపల్లెకు చెందిన జోషి ద్విచక్ర వాహనంలో వెళుతుండగా ఎదురుగా కారు వస్తుండటంతో తప్పించే క్రమంలో కారును ఢీకొన్నారు. దీంతో ఇరువురు కిందపడగా తీవ్ర గాయాలయ్యాయి. ఈ ఘటనలో షరీఫ్ పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కడప రిమ్స్కు తరలించారు. ● పోక్సో కేసు నమోదు చక్రాయపేట : మండలంలోని ఎర్రబోమ్మనపల్లె గ్రామం గడ్డంవారిపల్లె దళితవాడకు చెందిన చెప్పలి సుబ్రమణ్యం(30) అనే వ్యక్తిపై పోక్సో కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం సాయంత్రం వేప విత్తనాలు ఏరుకొస్తామని రా అని తన అన్న కుమార్తె(8)ను అతను తీసుకెళ్లి అఘాయిత్యానికి పాల్పడినట్లు చిన్నారి తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. బాలికను చికిత్స నిమిత్తం వైద్యశాలకు తీసుకెళ్లారు. సంఘటన స్థలానికి పులివెందుల డీఎస్పీ మురళీ నాయక్, ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐలు చంద్రశేఖర్, శ్రీప్రియ, పోలీసు సిబ్బంది, క్లూస్ టీం సభ్యులు వెళ్లి పరిశీలించారు. -
దళితనేత శ్రీచందు అక్రమ అరెస్టు తగదు
మదనపల్లె టౌన్ : దళితనేత, బహుజన సేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందును పోలీసులు అక్రమంగా అరెస్టు చేయడాన్ని ఖండిస్తున్నామని భారతీయ అంబేడ్కర్ సేన అధ్యక్షుడు శివప్రసాద్ తెలిపారు. మదనపల్లె ప్రెస్ క్లబ్లో గురువారం ఆయన మీడియాతో మాట్లాడుతూ.. అప్రకటిత ఎమర్జెన్సీ కొనసాగుతోందనడానికి ఇటీవల చోటు చేసుకుంటున్న కొన్ని సంఘటనలు నిదర్శనమన్నారు. 2005లో జరిగిన ఓ ఘటనలో శ్రీచందును ఇరికించి అక్రమంగా అరెస్ట్ చేసి, రిమాండ్కు తరలించడం తగదన్నారు. ఫిర్యాదుదారు మొహం కూడా చూడని, కనీసం ఫోన్లో కూడా మాట్లాడని దళిత నాయకుడిపై తప్పుడు కేసు నమోదు చేసిన స్టేషన్ హౌస్ ఆఫీసర్, ఇన్వెస్టిగేషన్ అధికారులపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. మదనపల్లిలోనే తిష్ట వేసిన తాలూకా సీఐ అవినీతి, సివిల్ సెటిల్మెంట్స్, అహంకారం, ఎస్సీ, ఎస్టీ బాధితులకు చేస్తున్న అన్యాయం, అవమానాలపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినందుకే శ్రీచందును అక్రమంగా అరెస్టు చేశారని ఆరోపించారు. ఉన్నతాధికారులు స్పందించి వెంటనే కేసు ఉపసంహరించుకోవాలని, లేనిపక్షంలో రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు. సమావేశంలో బాస్ నాయకులు ముత్యాల మోహన్, సీపీఐ నాయకులు శ్రీనివాసులు, గిరిజన సమఖ్య రాష్ట్ర నేత కోనేటి దివాకర్, ప్రభాకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పాము కాటుతో మహిళకు అస్వస్థత
మదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తున్న మహిళను పాము కాటేసింది. ఈ సంఘటనలో తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని కుటుంబీకులు గురువారం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఘటనపై బాధితురాలి కుటుంబీకులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని వలసపల్లి గ్రామం ఎరబల్లెకు చెందిన సురేంద్ర భార్య గంగులమ్మ(46) ఊరి సమీపంలోని వ్యవసాయ పొలంలో పాడి పశువులను మేపుకొంటూ ఉండగా విష సర్పం కాలిపై కాటేసింది. తీవ్ర అస్వస్థతకు గురైన బాధితురాలిని గమనించిన కుటుంబీకులు వెంటనే ఆమెను మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. డాక్టర్లు వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉంది. చోరీ కేసులో ఇద్దరి అరెస్ట్పుంగనూరు : గ్రామీణ ప్రాంతాల్లోని రైతులకు సంబంధించి రాగి కేబుల్ వైర్లను దొంగతనం చేసిన ఇద్దరిని అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.3 లక్షల విలువ చేసే 300 కేజిల రాగి కమ్మిని స్వాధీనం చేసుకున్నారు. గురువారం రాత్రి ఎస్ఐ అన్సర్బాషా తెలిపిన మేరకు వివరాలిలా ఉన్నాయి. పట్టణానికి చెందిన ఖలీల్, అనిల్ రాత్రి పూట కేబుల్ వైర్లు చోరీ చేసే వారు. దీనిపై రైతుల ఫిర్యాదు మేరకు ఇద్దరిని కర్ణాటక సరిహద్దుల్లో పట్టుకుని వారిపై కేసు నమోదు చేసి, అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. పేకాట స్థావరంపై దాడి మదనపల్లె టౌన్ : మదనపల్లె పట్టణం దేవళంవీధిలో నిర్వహిస్తున్న పేకాట స్థావరంపై వన్టౌన్ పోలీసులు దాడులు జరిపి ఎనిమిది మంది జూదరులను అరెస్టు చేశారు. ఎస్ఐ రహీముల్లా తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లె పట్టణంలోని దేవళం వీధిలో వెంటనే సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించామని ఎస్ఐ తెలిపారు. ఓ ఇంటి వరండాలో పేకాట ఆడుతున్న 8 మందిని పట్టుకుని.. వారి నుంచి రూ.15 వేల నగదు, 7 మొబైల్ ఫోన్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. అనంతరం నిందితులను పోలీస్ స్టేషన్కు తరలించి ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసుకుని అరెస్టు చేసినట్లు ఎస్ఐ తెలిపారు. గాయపడిన యువకుడి మృతి రామసముద్రం : రామసముద్రం మండలం మూగవాడి గ్రామ పంచాయతీ గొల్లపల్లెకి చెందిన హరీష్(25) పని నిమిత్తం ఎర్రప్పల్లె వెళ్తుండగా బుధవారం ద్విచక్ర వాహనం అదుపుతప్పి చెట్టుని ఢీకొని తీవ్రంగా గాయపడ్డ విషయం తెలిసిందే. విషయం తెలుసుకున్న అతని కుటుంబ సభ్యులు పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి, అక్కడి నుంచి మదనపల్లికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతి ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందినట్లు కుటుంబీకులు తెలిపారు. అనుమతిలేని లేఔట్లకు ప్లాన్లు వేయొద్దుసాక్షి, మదనపల్లె : పీకేఎం ఉడా పరిధిలో అనుమతి లేకుండా వేసిన ప్లాట్లు, లేఔట్లకు సంబంధించిన స్థలాలకు ప్లాన్లు వేసి అనుమతుల కోసం ప్రతిపాదించవద్దని పట్టణాభివృద్ధి సంస్థ పరిధిలోని లైసెన్స్ టెక్నికల్ పర్సన్స్ (ఎల్టీపీఎస్)ను చైర్మన్ బీఆర్.సురేష్బాబు స్పష్టంగా ఆదేశించారు. గురువారం స్థానిక సంస్థ కార్యాలయంలో ఎల్టీపీఎస్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ చట్ట నిబంధనలు పాటించకుండా లేఔట్లు వేసిన వారు ప్లాట్లు వేసి విక్రయిస్తున్నారని అన్నారు. వీరు చెల్లించాల్సిన రుసుములు, భూ అప్పగింత, ల్యాండ్ కన్వర్షన్ ఇవేమి లేకుండా నిబంధనలు పూర్తిగా ఉల్లంఘించి స్థలాల విక్రయాలు చేస్తున్నారని అన్నారు. దీనివల్ల స్థానిక సంస్థలకు, పట్టణాభివృద్ధి సంస్థకు రావాల్సిన ఆదాయం రాకుండా పోతోందని ఆందోళన వ్యక్తం చేశారు. సమావేశంలో కుప్పం, పలమనేరు, పుంగనూరు, మదనపల్లె, బి.కొత్తకోట మున్సిపాలిటీలకు చెందిన ఎల్టీపీఎస్లు, కార్యదర్శి పీఆర్.మనోహర్, ఏఓ చిట్టిబాబు, అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
కరోనా ఒకరి నుంచి మరొకరికి ప్రబలకుండా పాటించాల్సిన జాగ్రత్తలు..
1. వ్యక్తిగత పరిశుభ్రత చేతులను శుభ్రం చేసుకోవడం: రోజూ పలుమార్లు కనీసం 20 సెకన్ల పాటు చేతులను సబ్బు, నీటితో బాగా కడుక్కోవాలి. లేదా 60% పైగా ఆల్కహాల్ ఉన్న హ్యాండ్ శానిటైజర్ను ఉపయోగించాలి. ముఖాన్ని తాకవద్దు: చేతులను శుభ్రం చేసుకోకుండా కళ్లు, ముక్కు, నోటిని ఎట్టి పరిస్థితుల్లోనూ తాకకూడదు. దగ్గు, తుమ్ములు వచ్చినప్పుడు: దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు నోటికి, ముక్కుకు అడ్డంగా టిష్యూ పేపర్ను గానీ లేదా మోచేతిని గానీ అడ్డు పెట్టుకోవాలి. వాడిన టిష్యూలను వెంటనే చెత్తబుట్టలో పడేయాలి. 2. సామాజిక నిబంధనలు మాస్క్ ధరించడం: కిక్కిరిసిన ప్రదేశాలు, బహిరంగ స్థలాలు, ఆసుపత్రులకు వెళ్లేటప్పుడు ముక్కు, నోరు పూర్తిగా కవర్ అయ్యేలా కచ్చితంగా మాస్క్ ధరించాలి. భౌతిక దూరం: ఇతర వ్యక్తుల నుంచి కనీసం 6 అడుగుల (రెండు గజాల) భౌతిక దూరాన్ని పాటించడం అలవాటు చేసుకోవాలి. 4. లక్షణాలు ఉన్నప్పుడు చేయాల్సినవి స్వీయ నిర్బంధం: జ్వరం, దగ్గు, గొంతు నొప్పి, ఆయాసం లేదా వాసన/రుచి కోల్పోవడం వంటి లక్షణాలు కనిపిస్తే వెంటనే ఇతరుల నుంచి విడిగా (ఐసోలేషన్లో) ఉండాలి. వైద్య సంప్రదింపులు: కోవిడ్ లక్షణాలు ఉన్నట్లు అనుమానం వస్తే సొంత వైద్యం చేసుకోకుండా, తక్షణమే అర్హత కలిగిన వైద్యాధికారులను సంప్రదించి అవసరమైన పరీక్షలు చేయించుకోవాలి. -
కూటమి రెండేళ్ల పాలనలో రాష్ట్రం నిర్వీర్యం
రాయచోటి అర్బన్ : కూటమి ప్రభుత్వం తన రెండేళ్ల పాలనలో రాష్ట్రాన్ని పూర్తిగా నిర్వీర్యం చేసిందని, వీరు పాలకులా లేక నయవంచకులా అని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాయచోటి పట్టణం ఎస్ఎన్ కాలనీలోని వైఎస్సార్సీపీ కార్యాలయంలో గురువారం ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో మాట్లాడారు. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండు సంవత్సరాలు పూర్తయినా తాము ఏం చేశామని చెప్పుకోలేని దయనీయ పరిస్థితిలో ఉందని శ్రీకాంత్ రెడ్డి ఎద్దేవా చేశారు. తిరువూరు ఎమ్మెల్యే, పోలవరం జనసేన ఎమ్మెల్యేలు ప్రస్తుతం కూటమిలోనే కొనసాగుతూ.. రాష్ట్రంలో దారుణమైన పరిస్థితులు ఉన్నాయని, ఏ వ్యవస్థ కూడా సరిగా లేదని నిలదీస్తున్న విషయాన్ని ఆయన గుర్తుచేశారు. సర్పంచ్ స్థాయి నుంచి ముఖ్యమంత్రి, డిప్యూటీ సీఎం వరకు అందరూ కూడా ప్రజా సమస్యలపై ప్రశ్నించే వారిని అణచివేయాలనే ఏకై క ధోరణితో ముందుకు వెళ్తున్నారని, మీడియా, యూట్యూబ్ స్వేచ్ఛను కూడా హరిస్తున్నారని మండిపడ్డారు. కాగా, కూటమి ప్రభుత్వం గత రెండు సంవత్సరాలుగా ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో కాలేజీలు విద్యార్థుల సర్టిఫికేట్లను ఆపేశాయన్నారు. ఉద్యోగాలు వచ్చినా సర్టిఫికేట్లు తీసుకోవడానికి చాలా మంది తల్లిదండ్రులు బంగారం తాకట్టు పెట్టి ఫీజులు చెల్లిస్తున్నారని, కొందరు డబ్బులు లేక వచ్చిన ఉద్యోగాలనే వదులుకుంటున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నిరుద్యోగ భృతి ఇవ్వకపోగా.. అటు మహిళలను, ఇటు అన్నదాతలను కూడా మోసం చేశారన్నారు. ఆస్తులను పెంచుకోవాల్సిన ప్రభుత్వం వైఎస్ జగన్ హయాంలో నిర్మించిన రామాయపట్నం, మచిలీపట్నం, మూలపేట పోర్టులను కూటమి నేతలు తమ బినామీలకు ధారాదత్తం చేస్తున్నారని, ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్రలు పన్నుతున్నారని మండిపడ్డారు. పవన్కల్యాణ్ తీరు విస్మయం గతంలో సుగాలి ప్రీతి కేసుపై ఆవేదన వ్యక్తం చేసి, అధికారంలోకి వస్తే వారంలోనే న్యాయం చేస్తామన్న పవన్ కల్యాణ్.. ఇప్పుడు డిప్యూటీ సీఎం అయ్యాక సాక్ష్యాల మార్పిడి జరిగిందని మాట్లాడటంపై శ్రీకాంత్ రెడ్డి విస్మయం వ్యక్తం చేశారు. రాష్ట్రంలో జ్ఞానేశ్వర్, సుగాలి ప్రీతి, సాయికృష్ణ, క్రాంతి ఘటనల తరహాలోనే అరాచక పాలన సాగుతోందన్నారు.నాడు ‘ప్రాణం అడ్డుపెడతా’నని.. నేడు తప్పుడు కేసులు! నాయకుడనే వాడు అధికారంలో ఉన్నప్పుడు ఒకలా, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మరోలా మాట్లాడకూడదు అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడిని ఉద్దేశించి శ్రీకాంత్ రెడ్డి హితవు పలికారు. గతంలో లక్కిరెడ్డిపల్లెకు చెందిన గంగాధర్ అనే బాధితుడు తన భూమి సమస్యను చంద్రబాబుకు వివరించగా.. ‘నీ ప్రాణం కోసం అవసరమైతే నా ప్రాణం అడ్డుపెట్టి అయినా నిన్ను కాపాడతాను.. ఎస్పీ చేత కాళ్లు పట్టిస్తా‘ అని చంద్రబాబు హామీ ఇచ్చారు. ఆనాటి పాత వీడియో సాక్ష్యాలను శ్రీకాంత్ రెడ్డి విలేకరులకు చూపించారు. కానీ ఈ రోజు అదే గంగాధర్ తన సమస్యను చెప్పుకోవడానికి విజయవాడ వెళ్తే, అతనిపై దాడులు చేసి, అక్రమ కేసులు పెట్టించి వేధిస్తున్నారని ఆరోపించారు. గతంలో సదరు భూకబ్జా నేతను తీవ్రంగా విమర్శించిన చంద్రబాబు.. ఈ రోజు అదే నాయకుడికి పచ్చ కండువా కప్పి పార్టీలో చేర్చుకుని పునీతుడిని చేశారని ఎద్దేవా చేశారు. చివరకు లక్కిరెడ్డిపల్లె పోలీస్ స్టేషన్లో సీఐతో ప్రెస్మీట్ పెట్టించి, బాధితుడైన గంగాధర్దే తప్పు అని చెప్పించే దారుణమైన పరిస్థితికి దిగజారారని విమర్శించారు.వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, మాజీ ఎమ్మెల్యే గడికోట శ్రీకాంత్ రెడ్డి -
మహిళలు, చిన్నారుల రక్షణకు ప్రత్యేక చర్యలు
గుర్రంకొండ: సమాజంలో మహిళలు, చిన్నారుల రక్షణకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టాలని జిల్లాకలెక్టర్ నిశాంత్కుమార్, జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. గురువారం స్థానిక పోలీస్స్టేషన్లో సంయుక్తంగా ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. గతంలో పోలీస్స్టేషన్లో నమోదైన కేసులు వివరాల గురించి ఆరా తీశారు. ఈసందర్భంగా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసిన బాధిత మహిళలతో నేరుగా మాట్లాడారు. పోలీస్స్టేషన్లో పోలీసుల పనితీరు, వారి సేవల గురించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం వారు మాట్లాడుతూ మహిళలు చిన్నారుల రక్షణకు పోలీసులు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలన్నారు. పోక్సో, బాల్యవివాహాలపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. సదరు కేసుల్లో బాధితులకు న్యాయం అందించాలని ఆదేశించారు. మహిళా పోలీసులు అన్నివేళలా గ్రామాల్లో ప్రజలకు అందుబాటులో ఉంటూ సమస్యలను అధికారుల దృష్టికి తీసుకెళ్లాలన్నారు. గ్రామాల్లో గంజాయి బ్యాచ్లపై ప్రత్యేక నిఘా ఉంచాలన్నారు. బస్టాండుల్లో, విద్యాసంస్థల పరిసరాల్లో గంజాయిబ్యాచ్, అల్లరి మూకల కదలికపై దృష్టి సారించి కఠిన మైన చర్యలు చేపట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, సీఐ రాఘవరెడ్డి, ఎస్ఐ రవీంద్రలు పాల్గొన్నారు. జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో ఇంట్లో సామగ్రి దగ్ధం
తంబళ్లపల్లె : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి ఇంటిలో వస్తువులు పూర్తిగా కాలిపోయి రూ.5 లక్షల ఆస్తినష్టం జరిగిన సంఘటన మండలంలో జరిగింది. స్థానికుల కథనం మేరకు.. కోసువారిపల్లె పంచాయతీ పాపనచెరువుపల్లెకు చెందిన భాగ్యమ్మ కూలీ పనులతో జీవనం సాగిస్తుంది. ఆమె కూలీ పనులకు వెళ్లిన సమయంలో ఇంటిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ సంభవించి మంటలు చెలరేగి పొగలు వ్యాపించాయి. స్థానికులు గమనించి ఈ విషయాన్ని భాగ్యమ్మకు తెలియజేశారు. ఆమె హుటాహుటిన ఇంటికి చేరుకున్న సమయంలోనే మంటలు చెలరేగి ఇంటిలోని వస్తువులన్నీ కాలి బూడిదయ్యాయి. ములకలచెరువు ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వగా.. అగ్నిమాపక వాహనం వచ్చే సరికి పూర్తిగా కాలిపోయింది. ఇంటిలో దాచుకున్న రెండు లక్షల నగదు, పది గ్రాముల బంగారు, బట్టలు, ధాన్యం, వంటపాత్రలు, ఫ్రిజ్ పూర్తిగా కాలిపోయాయని బాధితురాలు భాగ్యమ్మ బోరున విలపించింది. సమాచారం అందుకున్న ఆర్ఐ ముద్దుకృష్ణ, వీఆర్ఓ రాజగోపాల్లు సంఘటన స్థలానికి చేరుకుని బాధితురాలిని పరామర్శించారు. జరిగిన నష్టాన్ని అంచనా వేసి ఉన్నతాధికారులకు పంపుతామన్నారు. ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి సూచన మేరకు వైఎస్సార్సీపీ నాయకులు కోటిరెడ్డి, పార్టీ కన్వీనర్ చౌడేశ్వర్లు పరామర్శించి రూ.10 వేల నగదు ఆర్థిక సహాయం అందించారు.రూ.5 లక్షల నష్టం -
కూటమి పాలనలో బీసీలకు రక్షణ కరువు
● మహేంద్ర కుటుంబానికి న్యాయం చేయాలి ● వైఎస్ఆర్సీపీ బీసీ నేతల డిమాండ్సాక్షి, మదనపల్లె : కూటమి పాలనలో బీసీలకు రక్షణ కరువైందని, అకారణంగా హత్యలకు గురవుతున్నారని వైఎస్ఆర్సీపీ నాయీ బ్రాహ్మణ విభాగం జిల్లా అధ్యక్షుడు బురుగుల సుబ్రహ్మణ్యం, మదనపల్లె బీసీసెల్ అధ్యక్షుడు ఆవుల విశ్వనాథ అన్నారు. గురువారం స్థానిక వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో వారు మాట్లాడుతూ ఒంగోలులో క్షురవృత్తితో జీవనం సాగిస్తున్న గుడివాడకు చెందిన గరిటపల్లి మహేంద్రను మద్యం మత్తులో నాగినేని రామారావు హత్య చేయడాన్ని తీవ్రంగా ఖండించారు. రాష్ట్రంలో విచ్చలవిడిగా మద్యం అమ్మకాలతో నేరాలు పెరుగుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. హత్య గురైన మహేంద్ర కుటుంబానికి ప్రభుత్వం రూ.25 లక్షల పరిహారం చెల్లించి, నిందితుడిని శిక్షించేందుకు ఫాస్ట్ ట్రాక్ కోర్టులో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. బీసీల రక్షణపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. మహేంద్ర హత్యతో తల్లి, భార్య, కొడుకు, ఇద్దరు కుమార్తెలు ఆధారం కోల్పోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వంలో బీసీలకు భరోసా ఉండేదన్నారు. సెలూన్లకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. నాయీ బ్రాహ్మణుల రక్షణ కోసం ప్రత్యేక రక్షణ చట్టం తీసుకురావాలని డిమాండ్ చేశారు. గత ప్రభుత్వం నాయీ బ్రాహ్మణులకు న్యాయం చేస్తే కూటమి పాలనలో కనీస సౌకర్యాలు లేవని పేర్కొన్నారు. సమావేశంలో భజంత్రీ శ్రీరాములు, భజంత్రీ మల్లికార్జున, ఆవుల వినోద్ కుమార్, మంజునాథ పాల్గొన్నారు. -
ఏనుగుల దాడులు.. రైతులు బెంబేలు
కేవీపల్లె : మండలంలోని జిల్లేళ్లమంద పంచాయతీలో పంట పొలాలపై ఏనుగుల గుంపు వరుస దాడులు చేస్తుండడంతో రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బుధవారం రాత్రి జిల్లేళ్లమంద పంచాయతీ రాగులవారిపల్లె సమీపంలో పంట పొలాలపై దాడి చేసి బీభత్సం సృష్టించాయి. గ్రామానికి చెందిన రైతులు రామకృష్ణారెడ్డి, నాగిరెడ్డికి చెందిన పొలాలపై దాడి చేశాయి. వ్యవసాయ బోరు, పైపులు ధ్వంసం చేశాయి. వరిపంటకు సిద్ధం చేసిన నారుమడిని పూర్తిగా తొక్కి పనికిరాకుండా చేశాయి. పగలు అటవీ ప్రాంతానికి వెళ్లడం... రాత్రి సమయంలో పంట పొలాలపై పడడం ఏనుగులకు షరా మామూలైంది. గత నెలలో పలువురు రైతులకు చెందిన మామిడి చెట్లు, కొబ్బరి, పనస చెట్లు ధ్వంసం చేశాయి. అనంతరం కొద్దిరోజులు సుండుపల్లె మండలంలో సంచరించాయి. వారం రోజులుగా తిరిగి కేవీపల్లె మండలంలోని వివిధ గ్రామాల్లో సంచరిస్తూ పంటలు ధ్వంసం చేస్తూ రైతులకు తీవ్ర నష్టం కల్గిస్తున్నాయి. రాత్రి సమయంలో ఏ రోజు ఎవరి పంటలపై దాడి చేస్తాయోనని రైతులు భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏనుగుల దాడులను శాశ్వతంగా అరికట్టడానికి అటవీప్రాంత సరిహద్దు గుండా ట్రెంచ్ తవ్వాలని రైతులు కోరుతున్నారు. -
కోరలు చాస్తున్న
● జిల్లాలో ముందస్తు అప్రమత్తత అవసరం ● మదనపల్లె, రాయచోటిలో కరువైన ప్రత్యేక వార్డులు ● పీలేరులో మాత్రమే ఏర్పాటు సాక్షి, అన్నమయ్య: నాలుగేళ్ల కిందట కరోనా మహమ్మారి సృష్టించిన బీభత్సాన్ని ప్రజలు ఇప్పుడిప్పుడే మరచి ప్రశాంతంగా జీవిస్తున్న తరుణంలో, మళ్లీ పాజిటివ్ కేసులు వెలుగుచూడటం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. పొరుగున ఉన్న వైఎస్సార్ కడప జిల్లాలో ఇద్దరు రోగులు దీర్ఘకాలిక వ్యాధులతో చికిత్స పొందుతూ, కరోనా పాజిటివ్తో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో అన్నమయ్య జిల్లా ప్రజలు ఒక్కసారిగా ఉలికిపాటుకు గురయ్యారు. వైరస్ ఇంకా సమాజం నుంచి పూర్తిగా తొలగిపోలేదా అనే మీమాంసలో పడిపోయిన తరుణంలో, కూటమి ప్రభుత్వంతో పాటు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ తక్షణమే అప్రమత్తం కావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. నాటి భీభత్సం.. నేటి నిర్లక్ష్యం గతంలో 2021–22లో కరోనా తీవ్రతతో ఆసుపత్రులు నిండిపోయి ఆక్సిజన్ సమస్య నెలకొన్న విపత్కర పరిస్థితుల్లో నాటి వైఎస్సార్సీపీ ప్రభుత్వం దీటుగా ఎదుర్కొని ప్రజలకు అండగా నిలబడింది. ఊరూరా క్వారంటైన్ కేంద్రాలు, ప్రత్యేక బెడ్లను సమకూర్చిన పరిస్థితులు చూశాం. 2022 తర్వాత కరోనా వేరియంట్ మారి అంతగా ప్రభావం చూపకపోవడంతో ప్రజలు ఊపిరి పీల్చుకున్నారు. అప్పటి నుంచి ఇప్పటివరకు జనం ధైర్యంగా ముందుకు సాగుతున్న స్థితిలో కడపలో కరోనా మరణాల కలకలం మళ్లీ తీవ్ర చర్చకు దారి తీసింది. విస్తరించకముందే మేల్కొనాలి కరోనా పూర్తిగా విస్తరించిన తర్వాత మేల్కొనడం కంటే ముందస్తుగా చర్యలు చేపట్టాలని పలువురు పేర్కొంటున్నారు. ఒక్కసారి పాజిటివ్ కేసులు కనిపించిన తర్వాత ప్రజలకు పూర్తి స్థాయిలో వైరస్ వ్యాపించకముందే ప్రత్యేక చర్యలను చేపట్టాలి. అయితే ఇప్పటివరకు జిల్లా కేంద్రమైన రాయచోటి మొదలుకొని మదనపల్లెలో కూడా ఎలాంటి ముందస్తు చర్యలు చేపట్టలేదు. పీలేరులో మాత్రం వార్డును ఏర్పాటు చేశారు. ఇదే తరహాలో జిల్లావ్యాప్తంగా క్వారంటైన్ వార్డులను సిద్ధం చేయాలని ప్రజలు కోరుతున్నారు. ప్రజలు కూడా జాగ్రత్తలు పాటించాలి వైఎస్సార్ కడపజిల్లాలో కరోనా పాజిటివ్ నేపథ్యంలో ప్రజలు కూడా కొంత అప్రమత్తంగా ఉండాలి. మాస్క్లు ధరించడంతోపాటు తగిన భౌతిక దూరాన్ని పాటించాల్సి ఉంది. పూర్తి స్థాయిలో అన్ని ప్రాంతాల్లో కరోనా లాంటి మహమ్మారి లేకపోయినా ప్రజలు మాత్రం అప్రమత్తంగా ఉండడం శ్రేయస్కరం. విపత్కర పరిస్థితులు తలెత్తినా ఎలాంటి ప్రమాదాలు లేకుండా ముందుకు సాగవచ్చు. ప్రస్తుతం అన్నమయ్య జిల్లాలో పరిస్థితి అదుపులోనే ఉందని, ఆందోళన చెందాల్సిన అవసరం లేదని వైద్య ఆరోగ్య శాఖ పేర్కొంటున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో కనీస ముందస్తు ఏర్పాట్లు లేకపోవడం గమనార్హం. పీలేరులో ఐసోలేషన్ వార్డు పీలేరు రూరల్ : స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రత్యేకంగా ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు సూపరింటెండెంట్ డాక్టర్ చంద్రశేఖర్ తెలిపారు. గురువారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ కడప జిల్లాలో కోవిడ్ కేసులు నమోదైన నేపథ్యంలో రోగుల సౌకర్యార్థం ప్రత్యేకంగా ఆరు పడకలతో ఐసోలేషన్ వార్డు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. ముందస్తు చర్యల్లో భాగంగా సీజనల్ వ్యాధులైన మలేరియా, టైఫాయిడ్, చికున్గున్యా, డెంగ్యూ, కోవిడ్ పేషెంట్లకు అనువుగా ఐసోలేషన్ వార్డు సిద్ధం చేసినట్లు తెలిపారు. కోవిడ్ నియంత్రణకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల అధికారిక మార్గదర్శకాలు టెస్ట్ – ట్రాక్ – ట్రీట్ విధానం : కరోనా లక్షణాలు (జ్వరం, పొడిదగ్గు, ఆయాసం, గొంతునొప్పి) కనిపించిన వెంటనే ఆలస్యం చేయకుండా కోవిడ్ పరీక్ష (RTPCR, Rapid Antigen) చేయించుకోవాలి. హోమ్ ఐసోలేషన్ నిబంధనలు : పాజిటివ్ వచ్చిన వారు ఇంట్లో ప్రత్యేక గదిలో కనీసం 7 రోజుల పాటు స్వీయ నిర్బంధంలో ఉండాలి. కుటుంబ సభ్యులతో కలవకూడదు. ప్రత్యేక శౌచాలయం, ప్లేట్లు మరియు దుస్తులు ఉపయోగించాలి. హై–రిస్క్ గ్రూపుల రక్షణ: వృద్ధులు (60 ఏళ్లు పైబడిన వారు), గర్భిణీలు, చిన్న పిల్లలు, మరియు కిడ్నీ, గుండె, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. వీలైనంత వరకు ఇంటికే పరిమితం కావాలి. ఆక్సిజన్ లెవెల్స్ పర్యవేక్షణ: ఐసోలేషన్లో ఉన్న రోగులు పల్స్ ఆక్సిమీటర్ ద్వారా రోజుకు 3–4 సార్లు ఆక్సిజన్ శాతాన్ని చెక్ చేసుకోవాలి. ఆక్సిజన్ లెవెల్స్ 94% కంటే తగ్గితే తక్షణమే ఆసుపత్రికి తరలించాలి. బూస్టర్ డోస్: వ్యాక్సిన్ రెండు డోసులు పూర్తయిన వారు ప్రభుత్వం సూచించిన నిబంధనల ప్రకారం ప్రికాషన్/బూస్టర్ డోసును ఖచ్చితంగా వేయించుకోవాలి. అత్యవసర కోవిడ్ హెల్ప్లైన్ నంబర్లు కరోనా సమాచారం, ఉచిత వైద్య సలహాలు, ల్యాబ్ పరీక్షలు మరియు ఆసుపత్రులలో బెడ్స్ లభ్యత తెలుసుకోవడానికి క్రింది నంబర్లను సంప్రదించవచ్చు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కోవిడ్ హెల్ప్లైన్: 104 (వైద్య సహాయం, ఉచిత సలహాలు) ఏపీ కోవిడ్ కంట్రోల్ రూమ్ నంబర్: 1902 కడప జిల్లా అగ్నిమాపక/అత్యవసర విభాగం: 101 (ఆసుపత్రుల అత్యవసర రవాణా సేవలకు) జాతీయ మానసిక ఆరోగ్య హెల్ప్లైన్: 080– 46110007 (కరోనా సమయంలో భయాందోళన లు, ఒత్తిడి తగ్గించుకోవడానికి ఉచిత కౌన్సిలింగ్) రోగనిరోధక శక్తిని పెంచే ఆహార జాగ్రత్తలు విటమిన్–సి ఆహారాలు: నిమ్మ, నారింజ, బత్తాయి, ఉసిరి మరియు జామ పండ్లు రోజూ తీసుకోవాలి. గోరువెచ్చని నీరు: రోజూ ఐదారు సార్లు గోరువెచ్చని నీటిని తాగడం వల్ల గొంతు ఇన్ఫెక్షన్ల తీవ్రత తగ్గుతుంది. సమతుల్య ఆహారం: ఆకుకూరలు, కోడిగుడ్లు, పప్పుధాన్యాలు మరియు మొలకెత్తిన గింజలతో కూడిన ప్రొటీన్ ఆహారాన్ని ఎక్కువగా తీసుకోవాలి. -
సరిహద్దులు దాటుతున్న బియ్యం
సాక్షి, మదనపల్లె : ప్రభుత్వం పౌరసరఫరాల శాఖ ద్వారా పంపిణీ చేస్తున్న బియ్యం పక్కదారి పడుతున్నాయి. మన రాష్ట్ర సరిహద్దులు దాటించి, పొరుగు రాష్ట్రానికి తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. మదనపల్లె నుంచి కర్ణాటకకు అక్రమంగా తరలిస్తున్న వాహనం బుధవారం రాత్రి పట్టుబడటంతో.. ఈ విషయం మరోసారి వెలుగులోకి వచ్చింది. దీనితో అక్రమ దంగా యథేచ్ఛగా కొనసాగుతున్న విషయం బట్టబయలైంది. జూన్ ఒకటిన సాక్షిలో ప్రచురితమైన ‘దర్జాగా రేషన్ దందా’ కథనం అక్షరాల నిజమని నిరూపితమైంది. బుధవారం రాత్రి బి.కొత్తకోట మండలంలో పట్టుబడిన బియ్యం మదనపల్లె నుంచి తరలిస్తున్నట్టు స్పష్టమైంది. బి.కొత్తకోట, మదనపల్లె, బురకాయలకోట చాలా కాలంగా రేషన్ బియ్యం అక్రమ తరలింపు కేంద్రాలుగా ఉన్నాయి. ఈ ప్రాంతంలో నిల్వ ఉంచిన రేషన్ బియ్యం పలుమార్లు అధికారుల దాడుల్లో పట్టుబడింది. ఈ నేపథ్యంలో తాజాగా పట్టుకున్న బియ్యం అక్రమ తరలింపు వెనక నిందితుడి నుంచి అధికారులు వివరాలు సేకరించారు. మదనపల్లెలోని చంద్రా కాలనీకి చెందిన ముదివేడు అంజన కుమార్(34) డ్రైవర్ వృత్తితో జీవిస్తున్నాడు. ఈ వృత్తితో వస్తున్న ఆదాయం సరిపోకపోవడంతో రేషన్ బియ్యాన్ని కర్ణాటకకు తరలించి విక్రయించుకుంటున్నాడు. ఇందులో భాగంగా బుధవారం అంజన కుమార్ మదనపల్లె పట్టణంలో ప్రజల నుంచి రేషన్ బియ్యాన్ని సేకరించాడు. కిలోకు రూ.18 చెల్లించి కొనుగోలు చేశాడు. అలా కొన్న 60 బస్తాల బియ్యం వాహనంతో కర్ణాటకలోని రాచెరువుకు బయలుదేరాడు. మార్గమధ్యంలో బి.కొత్తకోట మండలం కాండ్లమడుగు వద్ద తిరుపతి విజిలెన్స్ ఎస్ఐ వెంకటరమణ, సిఎస్డీటి సుబ్బయ్య, సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. ఈ దాడుల్లో అంజన కుమార్ తరలిస్తున్న వాహనంలో 2,890 కిలోల రేషన్ బియ్యం ఉన్నట్టు గుర్తించారు. దీని విలువ రూ.1,04,040గా నిర్ధారించారు. అంజన కుమార్ను అధికారులు విచారణ చేశారు. ఈ విచారణలో తాను కిలో రూ.18లకు రేషన్ బియ్యం సేకరించి కర్ణాటకలోని రాచెరువుకు చెందిన కోళ్ల ఫారం యజమానులకు కిలో రూ.25తో విక్రయిస్తున్నట్లు తెలిపారు. ఈ బియ్యం, వాహనాన్ని స్వాధీనం చేసుకున్న అధికారులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఏఎస్ఐ చిన్న బాలాజీ కేసు నమోదు చేశారు. స్వాధీనం చేసుకున్న బియ్యాన్ని బి.కొత్తకోట సరఫరాల గోడౌనుకు అప్పగించారు. వాహనాన్ని పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టారు. -
మామిడి చెట్ల నరికివేత
చౌడేపల్లె : తమ పొలంలో నాటిన మామిడి చెట్లను నరికివేస్తున్న వ్యక్తిని అడ్డుకోబోయిన మహిళపై హత్యాయత్నానికి పాల్పడిన ఘటన జరిగింది. బాధితురాలు రెడ్డెమ్మ గురువారం పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఆమె కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. దిగువపల్లె రెవెన్యూ పరిధిలోని దేవిరెడ్డిచెర్వు సమీపంలో గల గాడిదవానిగుట్ట ప్రాంతం వద్ద గల సర్వే నెంబర్లు 469/2ఏ, 466/2, 183/19లలో 6.69 ఎకరాల భూమిని కాగతి పంచాయతీ మర్రిమాకులపల్లెకు చెందిన బాబుసాబ్ నుంచి గాజులవారిపల్లెకు చెందిన భాస్కర్, రెడ్డెమ్మలు పదేళ్ల క్రితం కొనుగోలు చేశారు. రెవెన్యూ రికార్డుల్లో మార్పు చేసుకొన్నారు. మార్కెట్లో ఆ భూమికి విలువ పెరగడంతో మళ్లీ మరికొందరికి విక్రయించడానికి బాబుసాహెబ్ అడ్డుతిరిగి తమ భూమిని వదిలేయాలని, దౌర్జన్యానికి పాల్పడినట్లు బాధితురాలు తెలిపింది. పొలంలో నాటిన మామిడి చెట్లను బుధవారం నరికివేస్తుండగా.. గమనించి అక్కడికి వెళ్లింది. బాబూ సాహెబ్ను ఇది నీకు తగదని ప్రశ్నించగా తనపై హత్యాయత్నానికి ప్రయత్నించగా ప్రతిఘటించి కేకలు వేయగా అతను వెంట తెచ్చుకొన్న బైక్ను సైతం అక్కడే వదిలి పరారైనట్లు పోలీసులకు ఫిర్యాదు చేశారు.● ప్రశ్నించిన మహిళపై హత్యాయత్నం ● పోలీసులకు ఫిర్యాదు -
జిల్లాకు కొత్త అగ్నిమాపక వాహనాలు
సాక్షి, మదనపల్లె: జిల్లాలోని అగ్నిమాపక కేంద్రాలకు కొత్త వాహనాలు రానున్నట్లు జిల్లా విపత్తుల నిర్వహణ, అగ్నిమాపక అధికారి వి.ఆదినారాయణరెడ్డి తెలిపారు. లక్కిరెడ్డిపల్లెకు ఇప్పటికే కొత్త వాహనం రాగా, త్వరలోనే వాయల్పాడు, పుంగనూరులకు అందుబాటులోకి వస్తాయన్నారు. ములకలచెరువులో కొత్త భవన నిర్మాణం పూర్తి కావొస్తోందని, జిల్లాలో ఉన్న 40 మంది సిబ్బంది కొరతను ప్రభుత్వం భర్తీ చేయనుందని చెప్పారు. కాగా, బెంగళూరులో ఇండియన్ రైల్వే డిజాస్టర్ మేనేజ్మెంట్ ఆధ్వర్యంలో జరిగిన జాతీయ స్థాయి ఉన్నత శిక్షణా కార్యక్రమంలో జిల్లా నుంచి తాను పాల్గొన్నట్లు ఆయన వివరించారు. ఇస్రో, వాతావర ణ శాఖల ఉన్నతాధికారులు హాజరైన ఈ సదస్సులో రైలు ప్రమాదాలు, విపత్తుల సమయంలో సత్వర సహాయక చర్యలు చేపట్టడంపై అవగాహన కల్పించారని తెలిపారు. -
వరుస దొంగతనాలు.. హడలెత్తుతున్న ప్రజలు
● ఇద్దరు మహిళల మెడలో బంగారు గొలుసులు చోరీ ● ఓ ఫర్టిలైజర్ దుకాణంలో నగదు అపహరణ ● రంగంలోకి దిగిన పోలీసులుపెద్దతిప్పసముద్రం : మండలంలో రెండు రోజుల వ్యవధిలోనే గుర్తు తెలియని దొంగలు పట్టపగలే చాకచక్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. దొంగలు ద్విచక్ర వాహనాల్లో వచ్చి ఇళ్ల వద్ద ఒంటరిగా ఉన్న మహిళల మెడలో నుంచి బంగారు ఆభరణాలు లాక్కెళ్లి రెప్పపాటులో పరారై పోలీసులకు సవాల్ విసురుతున్నారు. ఈ నెల 8న మండలంలోని పులికల్లు పంచాయతీ బొంతలవారిపల్లి చెరువు కట్టపై వెళుతున్న ఓ మహిళ మెడలో నుంచి గుర్తు తెలియని వ్యక్తి రూ.లక్షల విలువ చేసే బంగారు బొట్టు చైనును అపహరించుకెళ్లాడు. అదే రోజు కాట్నగల్లు పంచాయతీ దూలంవారిపల్లిలో కూడా ఓ వ్యక్తి ద్విచక్ర వాహనంలో వచ్చి ఆరు బయటి నుంచి ఇంటి గేటు వైపు వెళుతున్న మరో మహిళ మెడలో నుంచి బంగారు చైను లాక్కెళ్లిపోయారు. ఈ ఘటనలతో మహిళలతో పాటు గ్రామస్తులు సైతం ఒక్కసారిగా షాక్కు గురయ్యారు. దీంతో మహిళలు ఒంటరిగా ఆరుబయట సంచరించేందుకే హడలెత్తిపోతున్నారు. ఇదిలా ఉండగా మండలంలోని మద్దయ్యగారిపల్లిలో అర్ధరాత్రి ఓ వ్యక్తి ఫర్టిలైజర్ దుకాణంలోని పైకప్పు రేకులను చాకచక్యంగా తొలగించి సీసీ కెమెరాల కంట పడకుండా ఉండేందుకు అక్కడే ఉన్న ఓ వస్త్రాన్ని ముఖానికి వేసుకుని దుకాణంలో ఉన్న రూ.62,500ల నగదును దోచుకెళ్లాడు. ఉదయం దుకాణం తెరచిన యజమాని దొంగతనం జరిగిందని గుర్తించి సీసీ ఫుటేజీలను క్షుణంగా పరిశీలించాడు. విషయం తెలుసుకున్న ములకలచెరువు సీఐ దస్తగిరి సిబ్బందితో కలసి ఘటనా స్థలానికి చేరుకున్నాడు. మద్దయ్యగారిపల్లి నుంచి పీటీఎం పరిసర ప్రాంతాల్లోని ప్రధాన రహదారుల్లో ఉన్న సీసీ ఫుటేజీలను క్షుణంగా పరిశీలిస్తున్నారు. అదే విధంగా వేలిముద్ర నిపుణులు చోరీ స్థలాన్ని క్షుణంగా పరిశీలించి వేలిముద్రలను సేకరించారు. ఈ కేసును పోలీసులు సవాల్గా తీసుకుని నిందితులను పట్టుకుని కేసును ఛేదించే దిశగా చర్యలు చేపడుతున్నారు. అదే విధంగా రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేసి అనుమానాస్పదంగా సంచరించే వ్యక్తులపై ప్రత్యేక నిఘా పెట్టాలని సీఐ పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. -
ఉచితంగా ఆర్టీ–పీసీఆర్ పరీక్షలు నిర్వహించే కేంద్రాలు
రాయచోటి పరిధి: రాయచోటి ప్రభుత్వ ఏరియా ఆసుపత్రి (జిల్లా ప్రధాన ఆసుపత్రి). మదనపల్లె పరిధి: మదనపల్లె జిల్లా సబ్–డివిజనల్ ఆసుపత్రి. రాజంపేట పరిధి: రాజంపేట ఏరియా ఆసుపత్రి, పీలేరు, పుంగనూరు సామాజిక ఆరోగ్య కేంద్రాలు. ముఖ్య గమనిక (రోగులకు సూచన): కరోనా అనుమానిత లక్షణాలు (తీవ్రమైన ఆయాసం, జ్వరం, గొంతు నొప్పి) ఉన్నవారు నేరుగా ఓపీ లైన్లలో నిలబడకుండా, ఆసుపత్రులలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ‘ఐసోలేషన్ / ఫ్లూ క్లినిక్’ డెస్క్ వద్దకు వెళ్లి తక్షణమే ఉచిత పరీక్ష చేయించుకోవచ్చు. -
కూటమి మనదే.. క్వారీఆన్ !
● సంబేపల్లె శెట్టిపల్లెలో ఎటువంటి అనుమతులు లేకుండా అడ్డగోలుగా గ్రానైట్ దోపిడీ ● ప్రభుత్వ భూమిని ఆక్రమించి భారీగా దిమ్మెల నిల్వ ● రాత్రివేళల్లో గుట్టుచప్పుడు కాకుండా సరిహద్దులు దాటుతోన్న ఖనిజ సంపద ● అధికారుల ‘నామమాత్రపు’ నిలుపుదలంతా కంటితుడుపు డ్రామానే సంబేపల్లె: ప్రకృతి వనరులను నాశనం చేస్తూ, ప్రభుత్వ నిబంధనలను అడ్డగోలుగా ఉల్లంఘిస్తూ సంబేపల్లె మండలంలో మైనింగ్ మాఫియా యథేచ్ఛగా రెచ్చిపోతోంది. ఎటువంటి అధికారిక అనుమతులు లేకుండా మట్టి, ఇసుక, గ్రానైట్ వంటి అత్యంత విలువైన ప్రకృతి సంపదను కొల్లగొడుతూ అక్రమార్కులు తమ జేబులు నింపుకుంటున్నారు. ఏ పార్టీ అధికారంలో ఉంటే ఆ పార్టీకి చెందిన స్థానిక ముఖ్య నేతలు, కొందరు అధికారుల అండదండలతో ఈ దందా శ్రీమూడు పువ్వులు ఆరు కాయలుశ్రీగా సాగుతోంది. 11.50 ఎకరాల్లో అక్రమ క్వారీ.. ప్రభుత్వ భూమి ఆక్రమణ! సంబేపల్లె మండల పరిధిలోని శెట్టిపల్లె రెవెన్యూ గ్రామం సర్వే నంబర్ 2451లోని దాదాపు 11.50 ఎకరాల విస్తీర్ణంలో ఈ అక్రమ గ్రానైట్ క్వారీ పనులు సాగుతున్నాయి. శెట్టిపల్లె వల్లబండపల్లె నుంచి ఝరికోన ప్రాజెక్టుకు వెళ్లే మార్గంలో ఈ దోపిడీ పర్వం నిరంతరాయంగా కొనసాగుతోంది. అంతటితో ఆగకుండా, పక్కనే ఉన్న సర్వే నెంబర్ 2828 లోని ప్రభుత్వ పట్టా భూమిని సైతం అక్రమార్కులు తమ ఆధీనంలోకి తీసుకున్నారు. క్వారీకి సంబంధించిన భారీ మైనింగ్ యంత్రాలు, పరికరాలు, మరియు తవ్వితీసిన విలువైన గ్రానైట్ బ్లాక్ దిమ్మెలను ఈ ప్రభుత్వ స్థలంలోనే యథేచ్ఛగా నిల్వ ఉంచారు. సాధారణంగా ఒక గ్రానైట్ క్వారీని ఏర్పాటు చేయాలంటే మొదట మైనింగ్ శాఖకు దరఖాస్తు చేసుకోవాలి. ఆ దరఖాస్తును రెవెన్యూ అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలించి నివేదిక ఇచ్చిన తర్వాతే మైనింగ్ శాఖ అనుమతులు మంజూరు చేయాలి. కానీ, ఇక్కడ ఎటువంటి అనుమతులు లేకుండానే కొండలను తవ్వేస్తున్నారు. గత కొన్ని మాసాలుగా రాత్రి సమయాల్లో పొక్లెయిన్లతో భారీగా గ్రానైట్ తవ్వకాలు జరుపుతూ, పగటిపూట అంతా సాధారణంగా ఉంచి, రాత్రి కాగానే గుట్టుచప్పుడు కాకుండా లారీల ద్వారా ఈ విలువైన గ్రానైట్ సంపదను ఇతర ప్రాంతాలకు, రాష్ట్ర సరిహద్దులు దాటించి కోట్లు కుమ్మేస్తున్నారు. కంటితుడుపుగా అధికారుల నిలుపుదల నాటకం ఈ అక్రమ ఖనిజాల రవాణాపై స్థానికంగా తీవ్ర నిరసనలు వ్యక్తమవడంతో, కొద్దిరోజుల కిందట మైనింగ్ అధికారులు క్వారీపై దాడులు నిర్వహించారు. ప్రస్తుతానికి క్వారీ పనులను నిలుపుదల చేసినట్లు అధికారులు రికార్డుల్లో పేర్కొన్నప్పటికీ, ఇది కేవలం కంటితుడుపు చర్యేనని విమర్శలు వస్తున్నాయి. మైనింగ్ మాఫియాపై కఠిన చర్యలు తీసుకోకుండా, తాత్కాలికంగా పనులు ఆపి సర్దుబాటు చేసేందుకే అధికారులు ప్రయత్నిస్తున్నారని స్పష్టమవుతోంది. ఇంత బహిరంగంగా కోట్లాది రూపాయల ప్రభుత్వ సంపద కొల్లగొట్టబడుతున్నా, మైనింగ్ మరియు రెవెన్యూ శాఖ అధికారులు తమకేమీ తెలియనట్లు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరించడంపై సర్వత్రా అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. శెట్టిపల్లె సమీపంలో అక్రమ మైనింగ్ చేస్తున్న ప్రాంతం అక్రమంగా తరలించెందుకు సిద్దంగా దిమ్మెలు రాయచోటి అర్బన్ : అక్రమ మైనింగ్పై కూటమి పెద్దలు సమాధానం చెప్పాలని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్రెడ్డి తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తూ నిలదీశారు. రాయచోటిలో గురువారం మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ వేల ఎకరాల పరిధిలో అక్రమ క్వారీయింగ్ సాగుతోందని ఆరోపించారు. ఈ అక్రమ తవ్వకాలపై తాము స్థానిక అధికారులను నిలదీయగా ‘ఇది పెద్దవాళ్ల విషయం.. నారా లోకేష్, సీఎం చంద్రబాబు నాయుడు గారి వ్యక్తిగత విషయం.. మేము జోక్యం చేసుకోలేం్ఙ అని అంటున్నారని శ్రీకాంత్రెడ్డి సంచలన నిజాన్ని బయటపెట్టారు. నిజంగానే పాలకుల పేర్లు చెప్పుకుని రాష్ట్ర సంపదను దోచుకుంటుంటే, దీనిపై కూటమి పెద్దలు తక్షణమే సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు. క్వారీ వద్ద ఏం జరుగుతుందో చూడటానికి, సీసీ కెమెరాలు ఏర్పాటు చేయడానికి వెళ్లిన వారిపై, ఫొటోలు తీయడానికి ప్రయత్నించిన వారిపై మైనింగ్ మాఫియా దాడులకు తెగబడుతోందని మండిపడ్డారు. కాగా, రాయచోటి పట్టణం చుట్టూ ప్రభుత్వ భూములను ఆక్రమించి అక్రమంగా లేఅవుట్లు వేసి క్రయవిక్రయాలు జరుపుతున్నట్లు తన దృష్టికి వచ్చిందని శ్రీకాంత్రెడ్డి తెలిపారు. రేపు వైఎస్సార్సీపీ ప్రభుత్వం వచ్చాక సమగ్ర విచారణ జరిపి నిబంధనల ప్రకారం స్థలాలు స్వాధీనం చేసుకుంటాం, కట్టడాలను కూల్చివేస్తామని గట్టిగా హెచ్చరించారు. ఈ విలేకరుల సమావేశంలో రాయచోటి మాజీ మున్సిపల్ చైర్మన్ ఫయాజ్ బాషా, వైఎస్సార్సీపీ మైనార్టీ విభాగం జిల్లా అధ్యక్షులు బేపారి మహమ్మద్ ఖాన్, పట్టణ కన్వీనర్ నవాజ్ జుల్ఫికర్ తదితర ముఖ్య నేతలు పాల్గొన్నారు. -
సెంచరీలతో చెలరేగిన కర్నూలు క్రీడాకారిణులు
● కడప జట్టుపై విజయం ● కొనసాగుతున్న ఉమెన్స్ అండర్ 19 వన్డే పోటీలువాల్మీకిపురం : స్థానిక జీవీఎస్సీఎస్ క్రీడా మైదానంలో సౌత్జోన్ ఉమెన్స్ అండర్ 19 వన్డే అంతర్ జిల్లాల క్రికెట్ పోటీల్లో భాగంగా గురువారం ఉదయం గ్రౌండ్ 2 క్రీడామైదానంలో కడప, కర్నూల్ జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచి బ్యాటింగ్ చేపట్టిన కర్నూలు జట్టు 50 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 350 పరుగులు చేసింది. అనంతరం 351 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన కడప జట్టు 50 ఓవర్లలో 8 వికెట్ల నష్టానికి 306 పరుగులు చేసి అపజయం పాలైంది. కర్నూలు జట్టుకు చెందిన సహస్ర రెడ్డి 101 బంతుల్లో 133 పరుగులు, రక్షిత 118 బంతుల్లో 132 పరుగులతో చెలరేగిపోవడంతో 350 స్కోర్ను కర్నూలు జట్టు సాధించడంతో.. కడప జట్టుపై 44 పరుగుల తేడాతో విజయం సులభతరమైంది. చిత్తూరు జట్టుపై అనంతపురం జయభేరి గ్రౌండ్ 1లో అనంతపురం, చిత్తూరు జట్లు తలపడ్డాయి. మొదట టాస్ గెలిచిన అనంతపురం జట్టు ఫీల్డింగ్ను ఎంచుకుంది. దీంతో బ్యాటింగ్కు దిగిన చిత్తూరు జట్టు 42.2 ఓవర్లలో 162 పరుగులు చేసి ఆలౌట్ అయింది. అనంతరం 163 పరుగుల లక్ష్యంతో బ్యాటింగ్కు దిగిన అనంతపురం జట్టు 43.4 ఓవర్లల్లో వికెట్లు నష్టపోకుండా లక్ష్యాన్ని ఛేదించి విజయాన్ని కై వసం చేసుకుంది. ఈ పోటీలను శ్రీనివాసమూర్తి, శ్రీధర్కుమార్, సునీల్ కుమార్, సతీష్ యాదవ్, నాగలక్ష్మి, సాయిప్రభాకర్, అనిత, ధనలక్ష్మి, మాధురి, శేఖర్, మౌనిక, రెడ్డిరాఘవేంద్ర తదితరులు పర్యవేక్షించారు. -
హోటల్ మేనేజ్ మెంట్ కోర్సులకు దరఖాస్తులు
సాక్షి, మదనపల్లె: కేంద్ర, రాష్ట్ర పర్యాటక శాఖలు సంయుక్తంగా తిరుపతిలో నిర్వహిస్తున్న స్టేట్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హోటల్ మేనేజ్ మెంట్ క్యాటరింగ్ టెక్నాలజీ, అప్లైడ్ న్యూట్రిషన్ కళాశాలలో 2026–27 ఏడాదికి హోటల్ మేనేజ్మెంట్ కోర్సులకు దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్టు అడ్మిషన్స్ ఇన్చార్జ్ శివరామకృష్ణ గురువారం తెలిపారు. ఈ కోర్సుల్లో చేరడానికి ఎలాంటి వయో పరిమితి లేదన్నారు. కోర్సులు పూర్తయిన తర్వాత రాష్ట్ర పర్యాటక శాఖ హోటళ్లు, ప్రముఖ ఫైవ్ స్టార్ హోటళ్లలో ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు పేర్కొన్నారు. పూర్తి వివరాలకు 9701343846, 9100558006, 9700440604 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఈనెల 20లోగా దరఖాస్తు చేసుకోవాల్సి ఉంటుందని తెలిపారు. 11 నుంచి రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీలు మదనపల్లె సిటీ: మదనపల్లెలో ఈనెల 11 నుంచి 13వతేదీ వరకు రాష్ట్ర స్థాయి జూనియర్ ఫుట్బాల్ ఛాంపియన్షిప్ పోటీలు నిర్వహిస్తున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. గురువారం ఆయన విలేకర్లకు వివరాలు వెల్లడించారు. మదనపల్లెలోని మిషన్కాంపౌండ్ మైదానం, గ్రీన్వ్యాలీ స్కూల్, వశిష్ట స్కూల్ మైదానాల్లో పోటీలు జరుగుతాయన్నారు. రాష్ట్రంలోని 26 జిల్లాల నుంచి జూనియర్ కేటగిరిలోని బాలురు ఇందులో పాల్గొంటారని తెలిపారు.సమావేశంలో ఫుట్బాల్ అసోసియేషన్ ఉపాధ్యక్షులు చంద్రకళ, జాన్ కమలేష్, కోశాధికారి నరేష్బాబు, జాయింట్ సెక్రటరీ మహేంద్రనాయక్, మహేంద్ర, బాలాజీ, ఇర్షాద్,కోచ్ మౌలాలి పాల్గొన్నారు. వీవీఎం పోస్టర్లు విడుదల మదనపల్లె సిటీ: పాఠశాల స్థాయి నుంచే విద్యార్థులలో శాసీ్త్రయ దృక్పథాన్ని, సైన్స్ పట్ల ఆసక్తిని పెంచేందుకు ‘విద్యార్థి విజ్ఞాన మంథన్ (వీవీఎం) 2026–27’ జాతీయ స్థాయి ప్రతిభా పరీక్ష నిర్వహిస్తున్నట్లు డీఈవో డాక్టర్ సుబ్రమణ్యం తెలిపారు. సైన్స్ ప్రతినిధులతో కలిసి ఆయన ఇందుకు సంబంధించిన పోస్టర్లను విడుదల చేశారు. ఎన్సీఈఆర్టీ, నేషనల్ కౌన్సిల్ ఆఫ్ సైన్స్ మ్యూజియం సంయుక్త భాగస్వామ్యంతో ‘విజ్ఞాన భారతి’ ఈ పరీక్షను నిర్వహిస్తోందన్నారు. ఇందులో ప్రతిభ చాటిన విద్యార్థులకు జాతీయ స్థాయిలో బహుమతులు లభిస్తాయని పేర్కొన్నారు. ఆన్లైన్ రిజిస్ట్రేషన్లకు సెప్టెంబర్ 30 వరకు గడువు ఉందని, సాంకేతిక సమస్యలు రాకుండా విద్యార్థులు ముందుగానే దరఖాస్తు చేసుకునేలా ఉపాధ్యాయులు చొరవ చూపాలని కోరారు. వివరాలకు www.vvm.org.in వెబ్సైట్ను చూడవచ్చన్నారు. మరిన్ని వివరాలకు 7702202288 నంబర్లో సంప్రదించవచ్చని తెలిపారు. బాధ్యతల స్వీకరణ కడప సిటీ: సమాచార పౌర సంబంధాల శాఖ వైఎస్ఆర్ కడప జిల్లా సహాయ సంచాలకులు (ఏడీ)గా ఎ.రమేష్ గురువారం బాధ్యతలను స్వీకరించారు. గతంలో ఒంగోలు డీపీఆర్వోగా విధులు నిర్వర్తించిన ఆయన, పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. ఈ సందర్భంగా ఏడీ రమేష్ మాట్లాడుతూ జిల్లా కలెక్టర్ సూచనల మేరకు జర్నలిస్టుల సంక్షేమానికి, ప్రభుత్వ అభివృద్ధి, సంక్షేమ పథకాలను మీడియా ద్వారా ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లడానికి కృషి చేస్తామన్నారు. సిబ్బంది అంతా కలిసికట్టుగా, స్నేహపూర్వక వాతావరణంలో కర్తవ్య నిబద్ధతతో ఉద్యోగ ధర్మాన్ని నిర్వర్తించాలని సూచించారు. ఉద్యానశాఖ అధికారిగా హరిప్రసాద్ కడప అగ్రికల్చర్: వైఎస్సార్ జిల్లా ఉద్యానశాఖ నూతన జిల్లా అధికారిగా ఎం.హరిప్రసాద్ గురువారం సాయంత్రం బాధ్యతలను స్వీకరించారు. గతంలో పశ్చిమ గోదావరి జిల్లా ఉద్యానశాఖ ఏడీఏగా పనిచేసిన ఆయన, పదోన్నతిపై ఇక్కడికి బదిలీ అయ్యారు. కడప కలెక్టరేట్లోని జిల్లా కార్యాలయంలో బాధ్యతలు చేపట్టిన అనంతరం ఆయన మాట్లాడారు. అందరి సమన్వయంతో జిల్లాలో ఉద్యాన పంటల సాగు, ప్రగతికి ప్రత్యేక కృషి చేస్తానని వివరించారు. బాధ్యతల స్వీకరణ అనంతరం జిల్లా కలెక్టర్ చెరకూరి శ్రీధర్ను ఆయన మర్యాదపూర్వకంగా కలుసుకుని, మొక్కను బహూకరించి అభినందనలు తెలిపారు. -
గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి గాయాలు
చౌడేపల్లె : గుర్తు తెలియని వాహనం ఢీకొని యువకుడికి తీవ్ర గాయాలైన సంఘటన చౌడేపల్లె –సోమల మార్గంలోని సింగిరిగుంట సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. మండలంలోని పెద్దకొండామర్రి పంచాయతీ కోటూరుకు చెందిన మల్కీసాబ్ కుమారుడు జబీవుల్లా(28) మేసీ్త్ర కూలీపనులు చేసేవాడు. ఈక్రమంలో ఇంటినుంచి స్కూటర్పై కూలీ పనికి వెళ్ళిన యువకుడు సింగిరిగుంట సమీపంలో రోడ్డు పక్కన రక్తపు మడుగులో అపస్మారక స్థితిలో పడిఉండగా ఆమార్గంలో వెళ్తున్న వాహనదారులు గుర్తించి పోలీసులకు, 108కు సమాచారం ఇచ్చారు. బైక్ను గుర్తు తెలియని వాహనం ఢీ కొనడంతో ప్రమాదం జరిగిందని అనుమానిస్తున్నారు. కాగా జబీవుల్లా తలకు తీవ్ర గాయం కావడంతోపాటు కుడి చెయ్యి విరిగిపోయిందని.. పరిస్థితి ఆందోళన కరంగా ఉందని వైద్యులు తెలిపారు. మెరుగైన వైద్యసేవల కోసం 108 వాహనంలో మదనపల్లెకు తరలించారు. -
యువకుడికి తీవ్ర గాయాలు
రామసముద్రం : రామసముద్రం మండల పరిధిలోని ఎర్రపల్లి సమీపంలో బుధవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడికి తీవ్ర గాయాలయ్యాయి. వివరాలిలా ఉన్నాయి. ఎం.గొల్లపల్లి గ్రామానికి చెందిన హరీష్ (25) ద్విచక్ర వాహనంలో వెళ్తుండగా మార్గమధ్యంలో వాహనం అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో హరీష్ తలకు తీవ్ర రక్త గాయం అయింది. గమనించిన స్థానికులు 108 అంబులెన్స్కు సమాచారం అందించారు. క్షతగాత్రుడిని అంబులెన్స్లో చికిత్స నిమిత్తం పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. లారీ ఢీ – ఒకరికి తీవ్ర గాయాలు సంబేపల్లె : చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిపై బుధవారం రాత్రి దేవపట్ల లో జరిగిన రోడ్డు ప్రమాదంలో మంగేనాయక్ అనే వ్యక్తి తీవ్రంగా గాయపడ్డ సంఘటన చోటు చేసుకొంది. స్థానికుల వివరాలమేరకు రెడ్డివారిపల్లె గ్రామం యర్రదిన్నెలబిడికి చెందిన మంగేనాయక్ కూలి పనులు చేసుకొంటు జీవనం సాగించేవాడు. ఈ క్రమంలోనే బుధవారం రాత్రి దేవపట్ల బస్టాపు వద్ద నడుచుకొంటూ రోడ్డు దాటుతుండగా రాయచోటి వైపు నుంచి పీలేరు వైపు వెళుతున్న లారీ ఢీ కొంది. ఈ ప్రమాదంలో గాయపడిన మంగేనాయక్ను 108 సహాయంతో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మూడు వాహనాలను ఢీకొట్టిన బొలెరో మదనపల్లె టౌన్ : స్పీడు మీద వెళుతున్న బొలెరో వాహనాన్ని వర్షంలో డ్రైవర్ బ్రేక్ కొట్టడంతో అదుపు తప్పి మూడు వాహనాలను ఢీకొట్టింది. ఈ సంఘటన బుధవారం సాయంత్రం మదనపల్లె బైపాస్ రోడ్డులో జరిగింది. ఘటనపై తాలూక ఎస్ఐ చంద్రమోహన్ తెలిపిన వివరాలు.. విజయవాడకు చెందిన శ్రీనివాసులు విజయవాడ నుంచి మదనపల్లెకు బొలెరోలో వస్తుండగా స్థానిక బైపాస్ రోడ్ వద్దకు రాగానే వర్షం కురిసింది. ముందు వెళుతున్న వాహనాన్ని ఓవర్ టేక్ చేయబోయి అదుపుతప్పి పక్కనే ఉన్న పోలీస్ వాహనంతో పాటు మరో రెండు కార్లను ఢీకొంది. ఈ ప్రమాదంలో బొలెరే మరో రెండు కార్లు పాక్షికంగా దెబ్బతిన్నట్లు తాలూక ఎస్ఐ తెలిపారు. మూడు వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నప్పటికీ ఎవరికీ గాయాలు కాలేదు. బీటెక్ విద్యార్థిని ఆత్మహత్యప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని సాయికుటీర్ రోడ్డులో శరణ్య (21) అనే బీటెక్ చదువుతున్న విద్యార్థిని ఉరేసుకొని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. శేఖర్, లక్ష్మీదేవి దంపతులు సున్నంబట్టివీధిలో పిండి మిషన్ నడుపుకుంటూ జీవనం సాగిస్తున్నారు. వారి కుమార్తె శరణ్య కర్నూల్లో బీటెక్ థర్డ్ ఇయర్ చదువుతోంది. ఇటీవల కాలేజీకి రెండు నెలలు సెలవులు ఇవ్వడంతో శరణ్య ఇంటికి వచ్చింది. ఈ క్రమంలో మంగళవారం తల్లిదండ్రులు పిండి మిషన్ వద్దకు వెళ్లి ఇంటికి వచ్చారు. గది తలుపులు వేసుకొని లోపల ఉన్న శరణ్యను పిలవగా పలలేదు. దీంతో ఆమెకు ఫోన్ చేసినా ఫోన్ లిఫ్ట్ చేయలేదు. పక్కనే ఉన్న కిటికిలో నుంచి చూడగా కుమార్తె ఫ్యాన్కు ఉరేసుకొని వేలాడుతోంది. వెంటనే తలుపులు పగులకొట్టి శరణ్యను ఆస్పత్రికి తీసుకెళ్లగా చనిపోయినట్లు వైద్యుడు నిర్ధారించాడు. తల్లి లక్ష్మీదేవి ఫిర్యాదు మేరకు బుధ వారం పోలీసులు కేసు నమోదు చేశారు. -
ఉల్లాసంగా.. ఉత్సాహంగా..
● కొనసాగుతున్న ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు ● 90 పరుగుల తేడాతో కడప జట్టు విజయంకడప వైఎస్ఆర్ సర్కిల్ : ఏసీఏ అండర్–19 మల్టీ మ్యాచ్లు రెండవ రోజు కొనసాగాయి. కేఓఆర్ఎం క్రికెట్ మైదానంలో జరుగుతున్న మ్యాచ్లో కడప జట్టు 90 పరుగుల తేడాతో రెండవ రోజే విజయం సాధించింది. బుధవారం రెండవ రోజు 361 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కడప జట్టు 64.2 ఓవర్లకు 392 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ధీరజ్కుమార్రెడ్డి 30 పరుగులు చేశాడు. అనంతపురం జట్టులోని టివి సాయి ప్రతాప్ 4 వికెట్లు తీశాడు. అనంతరం రెండవ ఇన్నింగ్స్ను ప్రారంభించిన అనంతపురం జట్టు 58.4 ఓవర్లకు 233 పరుగులకు ఆలౌట్ అయింది. ఆ జట్టులోని ఆది నారాయణ 63, నంద కిషోర్ 49 పరుగులు చేశారు. కడప జట్టులోని నాగ కుళ్ళాయప్ప 4 వికెట్లు తీశాడు. ధీరజ్కుమార్రెడ్డి 2, హార్దిక్ రెడ్డి 2 వికెట్లు తీశారు. దీంతో కడప జట్టు 90 పరుగుల తేడాతో విజయం సాధించింది. వైఎస్ఆర్ఆర్ ఏసీఏ క్రికెట్ స్టేడియంలో.. అదే విధంగా వైఎస్ఆర్ఆర్ స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రెండవ రోజు 14 పరుగుల ఓవర్నైట్ స్కోరుతో తొలి ఇన్నింగ్స్ను ప్రారంభించిన కర్నూలు జట్టు 91 ఓవర్లకు 9 వికెట్లు కోల్పోయి 360 పరుగులు చేసింది. ఆ జట్టులోని సాయి గణేష్ 134 పరుగులు, రితిక్ 68 పరుగులు చేశారు. నెల్లూరు జట్టులోని తేజసాయి 6 వికెట్లు తీశాడు. ఏకాసర్ 2 వికెట్లు తీశాడు. దీంతో కర్నూలు జట్టు 33 పరుగుల అధిక్యంతో ఉంది. దీంతో రెండవరోజు ఆట ముగిసింది. -
కళ్లాపి పౌడర్ తయారీ యూనిట్లపై దాడులు
కడప అర్బన్ / ప్రొద్దుటూరు క్రైం : జిల్లా పోలీసు శాఖ ఆధ్వర్యంలో వివిధ శాఖల సమన్వయంతో మంగళవారం సాయంత్రం ప్రొద్దుటూరు ప్రాంతంలో నిర్వహిస్తున్న కళ్లాపి పౌడర్ (సాధారణంగా ‘పేడ నీళ్ల పౌడర్‘గా పిలువబడే) తయారీ యూనిట్లపై దాడులు నిర్వహించినట్లు జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో మీడియా సమావేశంలో ఆయన దాడుల వివరాలు వెల్లడించారు. ప్రొద్దుటూరులోని శ్రీ సౌభాగ్య కుంకుమ ఇండస్ట్రీ గోడౌన్, కామధేను కుంకుమ ఇండస్ట్రీ, శ్రీ మహాలక్ష్మి కుంకుమ/పసుపు ఇండస్ట్రీ, చంద్రిక ట్రేడర్స్, శ్రీ దేవి–భూదేవి కళ్లాపి ఇండస్ట్రీ (ఎంఎస్ ట్రేడర్స్)లలో అధికారులు తనిఖీ నిర్వహించారన్నారు. ప్రొద్దుటూరు తహసీల్దార్ డి. ఉదయ భాస్కర్ రాజు, పర్యావరణ ఇంజనీర్ సుధా కురుబ, డిప్యూటీ చీఫ్ ఇన్స్పెక్టర్ ఆఫ్ ఫ్యాక్టరీస్ చిన్నారావు తదితరులు ఈ తనిఖీలలో పాల్గొన్నారన్నారు. కళ్లాపి పౌడర్ అనే ఈ విషపూరిత పదార్థం ఆత్మహత్యలు మరియు ప్రమాదవశాత్తు విషప్రయోగాలకు కారణమవుతోందన్నారు. ఈనెల 1వ తేదీన నుంచి 6వ తేదీ వరకు వైఎస్సార్ కడప జిల్లాలో కళ్లాపి పౌడర్ సేవించడం వల్ల మొత్తం 19 మంది ఆత్మహత్య చేసుకొని మృతి చెందారని... ఈ నేపథ్యంలో ఈనెల 7న ప్రొద్దుటూరు ప్రాంతంలోని కళ్లాపి పౌడర్ తయారీ యూనిట్లపై సంయుక్త తనిఖీలు నిర్వహించామన్నారు. దాడుల్లో వెయ్యి కిలోల ఆరమైన్ ఓ కెమికల్ బ్యాగులు, 3 వేల కిలోల కళ్లాపి పౌడర్ను అధికారులు సీజ్ చేశారు. సీజ్ చేసిన కెమికల్, కళ్లాపి పౌడర్ శ్యాంపిళ్లను పరీక్ష నిమిత్తం ల్యాబ్కు పంపించారు. -
ఒరిస్సా వాసి అనుమానాస్పదస్థితిలో మృతి
కలకడ : హోటల్లో పనిచేయడానికి కుమారుడితోపాటు ఒరిస్సా నుంచి ఆంధ్రప్రదేశ్లోని అన్నమయ్య జిల్లా కలకడ కు వచ్చి అనుమానాస్పదస్థితిలో వ్యక్తి మృతి చెందినట్లు కలకడ ఎస్ఐ రామాంజనేయులు తెలిపారు. పోలీసుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. హోటల్ లో సర్వర్ గా పనిచేయడానికి వచ్చిన ఒరిస్సా లోని కటల్ గ్రామానికి చెందిన కమల్ఖాన్ కుమారుడు ఇస్తియాక్ ఆలం (34) మంగళవారం రాత్రి కలకడ ఇందిరమ్మ కాలని సమీపంలోని హెచ్పిఆర్ డాబా లో అన్నం వడ్డించడానికి తనకుమారుడు వలితో కలిసి హాజరయ్యారు. హోటల్లో కూలికి పనిచేయడానికి కేవలం మూడురోజుల క్రితం వచ్చిన వ్యక్తి మంగళవారం రాత్రి నిద్రించినట్లు హోటల్ సిబ్బంది తెలిపారు. బుధవారం ఉదయం మృతిచెందినట్లు గుర్తించిన హోటల్ సిబ్బంది కలకడ పోలీసులకు సమాచారం అందించారు. కలకడ ఎస్ఐ రామాంజనేయులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. శవ పంచనామా నిమిత్తం ఇస్తియాక్ ఆలం మృతదేహాన్ని పీలేరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్ఐ తెలిపారు. -
హలో..! నేను మీకలెక్టర్ను
● ఓటర్ల పరిశీలన జరిగిందా. ● ఎస్ఐఆర్లో కలెక్టర్ నిశాంత్కుమార్ పుంగనూరు: హలో..నేను మీ కలెక్టర్ను మాట్లాడుతున్నా...బీఎల్వో మీ ఇంటికి వచ్చాడా....ఎన్యూమరేషన్ ఫారాలు ఇచ్చారా....సమస్యలు ఉన్నాయా అంటూ అన్నమయ్య జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ ఎస్ఐఆర్ గడువు ముగుస్తుండటంతో నూతన ఒరవడికి శ్రీకారం చుట్టారు. దీంతో ఎస్ఐఆర్ కార్యక్రమం నిర్వహిస్తున్న ఉద్యోగుల్లో వణుకు పుట్టించింది. పుంగనూరు నియోజకవర్గం సోమల మండలంలోని 146 , 148 పోలింగ్ కేంద్రాలను బధవారం కలెక్టర్ పరిశీలించి ఓటర్లతో నేరుగా మాట్లాడారు. ఓటర్లకు నేరుగా ఫోన్లు చేసి ఎన్యూమరేషన్పై వివరాలు సేకరించి, పలు సూచనలు చేశారు. పారదర్శకమైన ఓటర్ల జాబితాను తయారు చేయాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. తొలిసారిగా కలెక్టర్ ఇలాంటి కార్యక్రమం నిర్వహించడంపై ప్రజలు హర్షం వ్యక్తం చేశారు. అంగన్వాడీ తనిఖీ సోమల మండలంలోని వడ్డిపల్లె ,కొత్తపల్లె అంగన్వాడీ కేంద్రాలను జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ తనిఖీ చేశారు. మరమ్మతు పనులను పరిశీలించారు. మండలంలో 8 పనులు మంజూరైతే 6 పనులు మాత్రమే పూర్తి కావడంపై కలెక్టర్ అసంతృప్తి వ్యక్తం చేశారు. తక్షణమే పనులు పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. చిన్నారులకు పౌష్టికాహారాన్ని అందించాలన్నారు. సోమల మండలంలోని కందూరువంక ఆనకట్ట నిర్మాణానికి రూ.25 లక్షలు మంజూరు చేస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. రైతులతో సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో ఇరిగేషన్ఈఈ వెంకట్రామయ్య, డీఈఈ తదితరులు పాల్గొన్నారు. -
టీబీ నిర్మూలనకు అంకితభావంతో పనిచేయాలి
మదనపల్లె టౌన్ : టీబీ నిర్మూలన (టీబీఎంబీఏ 2.0)కు సిబ్బంది సమన్వయంతో పనిచేస్తేనే అది సాధ్యమని జిల్లా వైద్య ఆరోగ్య శాఖాధికారి డా.లక్ష్మినరసయ్య అన్నారు. బుధవారం మదనపల్లె డీఎంహెచ్వో కార్యాలయంలో అదనపు డీఎంహెచ్వో డా.రాధిక తో కలసి జిల్లాలోని టీబీ యూనిట్ల సిబ్బందితో సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. టీబీ కేసులను ప్రారంభ దశలోనే గుర్తించడం అత్యంత కీలకమన్నారు. గ్రామాలు, పట్టణాలు, పారిశ్రామిక, గిరిజన ప్రాంతాల్లో అధిక ప్రమాదం ఉన్న ప్రజలకు ప్రత్యేక అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని సూచించారు. ఆరోగ్య కార్యకర్తలు, ఏఎన్ఎంలు, ఆశా కార్యకర్తలు ఇంటింటికీ వెళ్లి రెండు వారాలకుపైగా దగ్గు, జ్వరం, బరువు తగ్గడం, రాత్రిపూట చెమటలు వంటి టీబీ లక్షణాలపై ప్రజలకు అవగాహన కల్పించి, లక్షణాలున్న వారిని వెంటనే పరీక్షలకు పంపించాలని ఆదేశించారు. చికిత్సలు మధ్యలో ఆపొద్దు టీబీ రోగులు మధ్యలో చికిత్సను నిలిపివేయకుండా ప్రతి రోగిని క్రమం తప్పకుండా పర్యవేక్షించి, డ్రాప్అవుట్స్ను పూర్తిగా నివారించాలని సూచించారు. చికిత్స పూర్తి చేయించడం ద్వారానే టీబీ నిర్మూలన సాధ్యమవుతుందని పేర్కొన్నారు. నిక్షయ్ పోర్టల్లో నమోదులు, ఫాలోఅప్ పరీక్షలు, కాంటాక్ట్ ట్రేసింగ్, గృహ సందర్శనల్లో నిర్లక్ష్యం వహించరాదని స్పష్టం చేశారు. టీబీఎంబీఏ 2.0 ప్రతిష్టాత్మకం అదనపు డీఎంహెచ్వో డా. రాధిక మాట్లాడుతూ.. టీబీఎంబీఏ 2.0 దేశ అత్యున్నత స్థాయిలో సమీక్షించ బడుతున్న ప్రతిష్టాత్మక కార్యక్రమమని తెలిపారు. హ్యాండ్హెల్డ్ ఎక్స్రే ద్వారా ప్రతి ఒక్కరికీ తప్పనిసరిగా ఛాతీ ఎక్స్రే నిర్వహించి, అనుమానితులను వెంటనే కఫ పరీక్షలు, నాట్ పరీక్షలకు పంపాలని సూచించారు. -
పద్యమై ప్రశ్నించి..తత్వమై కదిలించి..
మదనపల్లి (కురబలకోట) : శతాబ్దాలు గడిచినా వేమన పద్యం ప్రజల నోళ్లలో నానుతూనే ఉంది. వర్షంలో తడవని వారు వేమన పద్యం రాని తెలుగు వారు అరుదు. అంతలా ఆయన పద్యాలు జన బాహుల్యంలో ప్రాబల్యం పొందాయి. మదనపల్లి పట్టణం సీఎస్ఐ కమ్యూనిటీ హాల్లో భారతీయ అంబేద్కర్ సేన (బాస్) వ్యవస్థాపకులు పీటీఎం శివప్రసాద్ సౌజన్యంతో హైదరాబాదుకు చెందిన అభ్యుదయ ఆర్ట్స్ అకాడమీ సమర్పణలో ప్రజా కవి యోగి వేమన నాటక ప్రదర్శన జనాదరణ పొందింది. అకాడమీ ఇన్చార్జి జగ్గరాజు పర్యవేక్షణలో అద్భుతంగా ఆవిష్కరించారు. ఉప్పుకప్పురంబు ఒక్క పోలిక నుండు..అల్పుడెప్పుడు పల్కు ఆడంబరం గాను..తల్లిదండ్రుల మీద దయలేని పుత్రుండు వాడు పుట్టనేమి గిట్టనేమి.. చంపదగిన యట్టి శత్రువు తన చేత చిక్కినేని కీడు సేయరాదు పొసగ మేలు చేసి పొమ్మనుటే చాలు అనే పద్యాలు జన బాహుల్యంలో నేటికీ వినిపిస్తూనే ఉన్నాయి. ఈ కార్యక్రమంలో రోజా హోటల్స్ అధినేత కంభం పాటి నాగభూషణ్ రెడ్డి, పోతబోలు రెడ్డెప్ప, వెంకటేష్, విజయకుమార్, శ్రీ చందు, ముత్యాల మోహన్, శశిధర్, దివాకర్ తదితరులు పాల్గొన్నారు.ప్రేక్షకులను అలరించిన వినుర వేమ నాటకం -
ఎల్నినో..ఎదుర్కొనేలా..
● 28 వేలఎకరాల్లో పచ్చగడ్డి సాగు ● 330 టన్నుల గడ్డి విత్తనాలు పంపిణీకి సిద్ధం సాగులో ఉన్న పచ్చగడ్డి గడ్డికోత యంత్రాలు సాక్షి, మదనపల్లె: జిల్లాపై ఎల్నినో ప్రభావం తీవ్రంగా ఉండగా, వ్యవసాయంపై ఆధారపడిన జిల్లాలో పాడి కీలకమైంది. పాడిపై ఆధారపడి వేలాది కుటుంబాలు జీవనం సాగిస్తున్నాయి. ఈ పరిస్థితుల్లో వర్షాభావం వల్ల పశువులు, గేదెలు, గొర్రెలకు పశుగ్రాసం కొరత ఏర్పడనుంది. పశుగ్రాసం అందుబాటులోకి రాని పక్షంలో తీవ్రమైన పరిస్థితులకు దారి తీస్తుంది. దీనిపై అప్రమత్తమైన అధికారులు వచ్చే ఏడాదికి ఖరీఫ్ నాటికి పచ్చగడ్డి సమస్య రాకూడదన్న ఉద్దేశంతో ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు. 28 వేల ఎకరాల్లో సాగు 25 మండలాల్లో పచ్చగడ్డి సాగు చేసేందుకు 330 టన్నుల గడ్డి విత్తనాలు సిద్ధం చేస్తున్నారు. ఒక టన్ను గడ్డి విత్తనంతో 70 ఎకరాల్లో గడ్డి సాగు చేయవచ్చు. ఈ విత్తనాలతో 28,000 ఎకరాల్లో పచ్చగడ్డి సాగు చేయాలని నిర్ణయించారు. గడ్డి విత్తనాలను 75 శాతం రాయితీతో రైతులకు అందిస్తున్నారు. వీటిని విత్తితే 45 నుంచి 60 రోజుల్లో గడ్డి వస్తుంది. దీనికి పది రోజులకు ఒకసారి నీటిని అందించాలి. జిల్లాలో 100 శాతం రాయితీతో వార్షిక పశుగ్రాస క్షేత్రాలను ఏర్పాటు చేసేందుకు పశుసంవర్ధక శాఖ చర్యలు చేపట్టింది. ఉపాధి హామీ పథకం కింద వీటిని మంజూరు చేసేందుకు రైతులు సంబంధిత మండల ఏపీవోకు దరఖాస్తులు చేసుకోవాలి. తర్వాత మంజూరు లభిస్తుంది. గడ్డి కోత యంత్రాలు రైతులు పచ్చగడ్డినే కాకుండా వ్యవసాయ ఉప ఉత్పత్తులైన రాగులు, జొన్నలు, సద్దలు, అలసంద ఉలవలు, వేరుశనగ ఎండుకట్టెను గడ్డిగా వినియోగించినందుకు వీలుంటుంది. వీటిని కత్తిరించాలంటే గడ్డి కోత యంత్రాలు అవసరం. జిల్లాలో ఇప్పటికే 900 యంత్రాలు రైతులకు అందించారు. ఇంకా అవసరమైన రైతులకు పంపిణీ చేసేందుకు చర్యలు తీసుకుంటోంది. రోజుకు ఒక పశువుకు ఐదు కిలోల గడ్డి అవసరం. జిల్లాలో 2,87,713 పశువులు, 21,440 గేదెలు ఉన్నాయి. వీటితోపాటు గొర్రెలకు కూడా పశుగ్రాసం కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నారు. ఇప్పటికే 20 వేల ఎకరాల్లో జిల్లాలో ప్రస్తుతం 20 వేల ఎకరాల్లో పచ్చగడ్డి సాగవుతోందని పశుసంవర్ధక శాఖ లెక్కలు సిద్ధం చేసింది. ఇది ప్రభుత్వంతో సంబంధం లేకుండా రైతులే పండిస్తున్న పచ్చగడ్డి. 2024–25 లో రెండు వేల ఎకరాల్లో సాగవగా గత ఏడాది ఏడు వేల ఎకరాల్లో సాగైంది. ప్రస్తుతం అత్యధికంగా సాగులో ఉంది. ఈ ప్రణాళికతో జిల్లాలో ఎల్నినో ప్రభావం ఉన్నప్పటికి పచ్చగడికి సమస్య తలెత్తకుండా ఉండేలా ఈ చర్యలను పశుసంవర్దకశాఖ చేపట్టిందని జిల్లా అధికారి గుణశేఖర్ పిళ్లై తెలిపారు. -
ఆపరేషన్ మొబీ ట్రాక్
● జిల్లాలో రూ. 12.67 కోట్ల విలువైన మొబైల్స్ రికవరీ ● బాధితులకు మొబైల్ ఫోన్లు అప్పగింత ● జిల్లా ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్కడప అర్బన్ : ‘ఆపరేషన్ మొబి ట్రాక్‘ ద్వారా కడప జిల్లా సైబర్ క్రైమ్ టీం ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం, నెట్వర్క్ నిఘా, డేటా విశ్లేషణా పద్ధతులు ఉపయోగించి భారీ మొబైల్ ఫోన్ రికవరీ ఆపరేషన్న్లో సఫలమయ్యారు. కేంద్ర ప్రభుత్వ సీఈఐఆర్(సెంట్రల్ ఎక్విప్మెంట్ ఐడెంటిటీ రిజిష్టర్) పోర్టల్లో నమోదైన ఫిర్యాదుల ఆధారంగా, 9వ విడతలో భాగంగా రికవరీ చేసిన 610 మొబైల్ ఫోన్లను జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్ బాధితులకు అందజేశారు. వీటి విలువ సుమారు రూ. 1,22,00,000 ఉంటుందని ఎస్పీ అన్నారు. ఇప్పటి వరకు 9 విడతల్లో మొత్తం రూ.12,67,50,000 విలువైన 6487 మొబైల్ ఫోన్లు రికవరీ చేశామన్నారు. మొబైల్ రికవరీలో రాష్ట్రస్థాయిలోనే కడప జిల్లా అగ్రగామిగా నిలిచిందన్నారు. మొబైల్ ఫోన్ల రికవరీలో డిజిటల్ సాంకేతికతను సమర్థవంతంగా ఉపయోగించి ప్రతిభ కనబరిచిన సైబర్ క్రైమ్–ఇన్స్పెక్టర్ ఏ. మధు మల్లేశ్వర రెడ్డి, రికవరీ ప్రక్రియలో కీలక పాత్ర పోషించిన సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించి ప్రశంసా పత్రాలను అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ ఓ. ప్రకాష్ బాబు, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, స్పెషల్ బ్రాంచ్ ఇన్ స్పెక్టర్ టి.రెడ్డెప్ప తదితరులు పాల్గొన్నారు. -
మహిళపై దాడి కేసులో బహుజనసేన రాష్ట్ర అధ్యక్షుడు అరెస్ట్
మదనపల్లె టౌన్ : అప్పు లావాదేవీల వివాదంలో ఓ మహిళ ఇంటిపైకి వెళ్లి దాడి చేసి, బెదిరించి, ఖాళీ ప్రామిసరీ నోట్లపై సంతకాలు చేయించుకున్న కేసులో బహు జనసేన రాష్ట్ర అధ్యక్షుడు శ్రీచందు సహా మరో ముగ్గరిని బుధవారం అన్నమయ్య జిల్లా మదనపల్లె వన్ టౌన్ పోలీసులు అరెస్టు చేశారు. అరెస్టుకు సంబంధించి సీఐ రాజారెడ్డి మీడియాకు తెలిపిన వివరాలు.. పట్టణంలోని వివేకానంద నగర్, వినాయకుని ఆలయం వెనుకన నివాసముంటున్న కళావతి (44) పెద్ద కుమారుడు అనిల్ కుమార్ భవనాలకు బైండింగ్ పనులు చేస్తుంటాడు. చిన్న కుమారుడు వినోద్ కుమార్ ఎలక్ట్రికల్ ఆపరేటర్ గా పనిచేస్తాడు. ఈ క్రమంలో అనిల్ కుమార్ తన స్నేహితుడైన చీకిలగుట్టకు చెందిన నరేంద్ర వద్ద రూ.1లక్ష అప్పు తీసుకున్నాడు. ఆ అప్పులో రూ.70వేలు వడ్డీ లేకుండా తిరిగి చెల్లించాడు. అయితే మిగిలిన రూ.30వేల కోసం నరేంద్ర, అతని తల్లి రమణమ్మ, తండ్రి గంగులప్ప రామారావు కాలనీ, చీకిలగుట్టకు చెందిన చంద్రశేఖర్ అలియాస్ శ్రీచందు ప్రోద్బలంతో గత ఏడాది మార్చి 28న కళావతి ఇంటిపైకి వచ్చి వీరంతా మూకుమ్మడిగా దాడి చేశారన్నారు. అంతే కాకుండా ఎస్సీ, ఎస్టీ కేసులు పెడతామని దూషించి, చంపేస్తామని బెదిరింపులకు పాల్పడ్డారు. దీంతో బాధిత మహిళ మర్యాదకు భంగం కలిగించడమే కాకుండా తన కుమారుడిని రుణ గ్రహీతగా, అతని స్నేహితుడిని సాక్షిగా పెట్టి రెండు ఖాళీ ప్రామిసరీ నోట్లపై, రూ.1.85 లక్షలకు మరో ప్రామిసరీ నోటుపై బలవంతంగా సంతకాలు చేయించుకున్నారు. ఈ ఘటనపై బాధితురాలు పెట్టిన కేసులో నిందితులు పలక నరేంద్ర, పలక రమణమ్మ, పలక గంగులప్ప, బొంతలపల్లె చంద్రశేఖర్ అలియాస్ శ్రీచందులపై కేసు నమోదు చేశామన్నారు. ఈ కేసులో నిందితుడిగా ఉన్న శ్రీచందుతో పాటు పలక నరేంద్ర కుమార్ వద్ద ఐదు ఖాలీ బాండ్లను సీజ్ చేసి నలుగురిని అరెస్టు చేసి స్థానిక కోర్టులో హాజరచడంతో న్యాయమూర్తి 14 రోజులు రిమాండ్ విధించినట్లు సీఐ తెలిపారు.మరో ముగ్గురు కూడా.. -
మహానేత స్మృతుల్లో
● వైఎస్సార్ జయంతి వేడుకల్లో వైఎస్ కుటుంబ సభ్యులు ● ఇడుపులపాయలో వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి సాక్షి కడప/వేంపల్లె : మహానేత, దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి స్మృతుల్లో అభిమానులు మునిగిపోయారు. వైఎస్సార్ కాంగ్రెస్పార్టీ శ్రేణులు, నేతలు వైఎస్సార్ 77వ జయంతి సందర్భంగా స్మరించుకున్నారు.రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి వైఎస్సార్పై ఉన్న ప్రేమతో సమాధి ఘాట్ను సందర్శించేందుకు వచ్చిన జనంతో ఆ ప్రాంతం నిండిపోయింది. వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి తండ్రి సమాధి ఘాట్ వద్ద పుష్పగుచ్ఛాలు ఉంచి నివాళులర్పించడంతోపాటు మోకాళ్లపై కూర్చొని కాసేపు మౌనంగా నాన్నను స్మరించుకున్నారు. వైఎస్ జగన్తోపాటు తల్లి వైఎస్ విజయమ్మ, సతీమణి వైఎస్ భారతిరెడ్డి, చిన్నాన్న వైఎస్ సుధీకర్రెడ్డి, అత్తమ్మ డాక్టర్ ఈసీ సుగుణమ్మ, సోదరుడు, ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డితో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొన్న అనంతరం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఘాట్ వద్ద వైఎస్సార్ అమర్రహే అంటూ నినాదాలు చేస్తూ ప్రతి ఒక్కరూ వైఎస్సార్ను గుర్తు చేసుకున్నారు. వైఎస్ కుటుంబ సభ్యులతోపాటు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ప్రజాప్రతినిధులు అంజలి ఘటించారు. ● రాష్ట్ర మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రెండోరోజు పర్యటనలో భాగంగా ప్రజలతో కాసేపు గడిపారు. పులివెందులలోని భాకరాపురం వద్ద గల ఇంటి వద్ద వేచి ఉన్న జనాలతోనూ మాట్లాడారు. అనంతరం దారిలో కాన్వాయ్ నుంచే ప్రజలకు అభివాదం చేస్తూ ముందుకు కదిలారు. వైఎస్ జగన్కు వీడ్కోలు పలికిన నేతలు వైఎస్సార్ జిల్లా పర్యటనలో భాగంగా పులివెందులకు వచ్చిన మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన ముగించుకుని బుధవారం ఉదయం బెంగళూరుకు పయనమయ్యారు. మాజీ సీఎంకు పార్టీ నాయకులు, శ్రేణులు, ప్రజాప్రతినిధులు ఇడుపులపాయలోని హెలిప్యాడ్ వద్ద వీడ్కోలు పలికారు. వైఎస్ జగన్ను కలిసిన నేతలు వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని ఘాట్ వద్ద నివాళులర్పించిన అనంతరం పలువురు రాష్ట్ర,జిల్లా నేతలు కలిశారు. ప్రధానంగా రాజ్యసభ సభ్యులు ఆళ్ల అయోధ్యరామిరెడ్డి, తిరుపతి ఎంపీ గురుమూర్తి, అన్నమయ్య, వైఎస్సార్ జిల్లాల పార్టీ అధ్యక్షులు ఆకేపాటి అమరనాథరెడ్డి, పోచమరెడ్డి రవీంద్రనాథ్రెడ్డి, బద్వేలు, ఆలూరు ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, విరూపాక్షి, మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాష, మాజీ మంత్రులు ఉషశ్రీ చరణ్, కారుమూరి నాగేశ్వరరావు, ఎమ్మెల్సీ డీసీ గోవిందరెడ్డి, ఎంవీ రామచంద్రారెడ్డి, రమేష్ యాదవ్, మాజీ ఎమ్మెల్యేలు చెవిరెడ్డి భాస్కర్రెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, శెట్టిపల్లె రఘురామిరెడ్డి, రెడ్డెప్పగారి రమేష్కుమార్రెడ్డి, కొరముట్ల శ్రీనివాసులు, అత్తార్ చాంద్బాష, గుంటూరు మాజీ ఎంపీ మోదుగుల వేణుగోపాల్రెడ్డి, పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, కడప, కర్నూలు మాజీ మేయర్లు కె.సురేష్బాబు, బీవై రామయ్య, కమలాపురం, కదిరి ఇన్చార్జిలు నరేన్ రామాంజులరెడ్డి, మగ్బూల్బాష, పార్టీ రాష్ట్ర నాయకులు రెడ్యం వెంకట సుబ్బారెడ్డి, రాజోలి వీరారెడ్డి, సాయినాథ్శర్మ, గోసుల శివభరత్రెడ్డి, భరత్రెడ్డి, డాక్టర్ సొహయిల్ అహ్మద్ తదితరులు పార్టీ అధినేతను కలిశారు. వృద్ధురాలికి ఆప్యాయ పలకరింపు చిన్నారికి ఆశీర్వాదం


