breaking news
annamayya district Latest News
-
ఎస్ఎస్ ట్యాంకుల సామర్థ్యం పెంపు
సాక్షి, మదనపల్లె : వర్షాభావ పరిస్థితులతో మదనపల్లె పట్టణ ప్రజలు తాగునీటి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు చర్యలు చేపట్టామని కలెక్టర్ నిశాంత్కుమార్ గురువారం తెలిపారు. ఈ మేరకు జలవరులశాఖ అధికారులు సమ్మర్స్టోరేజీ ట్యాంకుల నీటి నిల్వ సామర్థ్యం పెంపునకు చర్యలు మొదలు పెట్టినట్టు తెలిపారు. చిప్పిలి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు నీటి సామర్థ్యం 30 ఎంసీఎఫ్టీలు కాగా దీన్ని 40 ఎంసీఎఫ్టీలకు, గుంటివారిపల్లి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు సామర్థ్యం 40 ఎంసీఎఫ్టీలు కాగా 50 ఎంసీఎఫ్టీలకు పెంచేలా పనులను చేస్తున్నట్టు తెలిపారు. ఈ రెండింటి ద్వారా 90 ఎంసీఎఫ్టీల నీటిని నిల్వ చేసుకుంటే పట్టణ ప్రజలకు వచ్చే జూన్ వరకు తొమ్మిది నెలల పాటు నీటి సమస్య ఉండదని తెలిపారు. ఎస్ఎస్ ట్యాంకుల్లో పూర్తి నీటి నిల్వ మట్టం కన్నా దిగువన ఉండటం వలన పూర్తి సామర్థ్యం వినియోగంలోకి రావడం లేదని, దీనికి వాటి లోతు పెంచేందుకు పూడిక తీసి అదనపు నీటిని నిల్వ చేసే విధంగా పనులు చేపట్టడం జరుగుతుందని తెలిపారు. ట్యాంకుల్లో వ్యర్థాలు వేయడం వల్ల సమస్యగా మారుతోందని, వీటిలో చెత్త, నిర్మాణ వ్యర్థాలను వేయకుండా ప్రజలు సహకరించాలని కలెక్టర్ కోరారు. ఇకపై నిర్మాణ వ్యర్థాలు, చెత్తను డంపింగ్ చేసే వాహనాలను సీజ్ చేసి, కఠిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ తెలిపారు.కలెక్టర్ నిశాంత్కుమార్ -
● వెన్నుపోటుకు అండగా నిలిస్తే.. లక్ష్మీదేవమ్మకే వెన్నుపోటు
భర్త ఉమాశంకర్రెడ్డి హత్యతో లక్ష్మీదేవమ్మ రాజకీయాల్లోకి వచ్చారు. 1985 ఎన్నికల్లో టీడీపీ అభ్యర్థిగా గెలిచి ఎమ్మెల్యే అయ్యారు. కానీ 1989 ఎన్నికల్లో ఇండిపెండెంట్ అభ్యర్థి కడప ప్రభాకర్రెడ్డి చేతిలో ఓడిపోయారు. 1994లో రెండోసారి ఎమ్మెల్యేగా గెలవడమే టీడీపీలో ఆమెకు చివరి ఎన్నికై ంది. 1995 ఆగస్టులో ఎన్టీఆర్కు వెన్నుపోటు పొడిచి చంద్రబాబు సీఎం అయిన సమయంలో లక్ష్మీదేవమ్మ ఎన్టీఆర్ను కాదని చంద్రబాబుకు అండగా నిలిచారు. ఆ తర్వాత చంద్రబాబు ఆమె రాజకీయ భవిష్యత్తును పూర్తిగా కాలరాశారు. తనకు అండగా నిలిచిన లక్ష్మీదేవమ్మ పోటీ చేయాల్సిన తంబళ్లపల్లె సీటును 1999, 2004 ఎన్నికల్లో పొత్తులో భాగంగా బీజేపీకి కేటాయించి ఆమెకు ద్రోహం చేశారు. తన రాజకీయ ఉనికి కోసం 2004 ఎన్నికల్లో ఇండిపెండెంట్గా పోటీ చేసి ఓడిపోవడంతో లక్ష్మీదేవమ్మ రాజకీయ ప్రస్థానానికి శాశ్వతంగా తెరపడింది. -
జిల్లా ఎకై ్సజ్ శాఖకు భారీ షాక్
● 35 ఏళ్ల చరిత్ర కలిగిన బీఎంపీ వింగ్ తొలగింపు ● ఉన్న పోస్టులను తిరుపతికి తరలిస్తూ ఉత్తర్వులుమదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా మదనపల్లె ఏర్పడిన తర్వాత కొత్త పోస్టులు, కొత్త కార్యాలయాలు వస్తాయని అందరూ ఆశించారు. కానీ ఇక్కడ జరుగుతున్నది అందుకు పూర్తి విరుద్ధం. ఉన్న పోస్టులనే తొలగిస్తూ ఎకై ్సజ్ శాఖ తీసుకున్న నిర్ణయం జిల్లా ప్రజలను, ఉద్యోగులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.ఎకై ్సజ్ శాఖలో గత 35 సంవత్సరాలుగా సమర్థవంతంగా పనిచేస్తున్న బార్డర్ మొబైల్ పెట్రోలింగ్ పార్టీ (బీఎంపీ) వింగ్ ను పూర్తిగా ఎత్తివేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ వింగ్ లోని పోస్టులను తిరుపతి జిల్లాలో వారికి ఇష్టం వచ్చిన చోట వాడుకునేలా అనుమతించడం కలకలం రేపుతోంది. అన్నమయ్య జిల్లా కర్ణాటక రాష్ట్ర సరిహద్దులో ఉంది. ఈ బార్డర్ ప్రాంతంలో గంజాయి, నాటుసారా, అక్రమ మద్యం రవాణా వంటి నేరాలు అధికంగా జరుగుతుంటాయి. వీటిని అరికట్టడంలో బీఎంపీ వింగ్ కీలక పాత్ర పోషిస్తోంది. అలాంటి కీలక వింగ్ ను తొలగిస్తే జిల్లాలో నేరాలు విచ్చలవిడిగా పెరిగే ప్రమాదం ఉంది. జిల్లా కేంద్రం ఏర్పడిన తర్వాత ఉన్న పోస్టులు పోవడం అంటే ఆ శాఖను, జిల్లాను బలహీనపరచడమే అవుతుందని ఉద్యోగ సంఘ నాయకులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా కేంద్రంలో ఇప్పటికే ఎలాంటి స్పెషల్ వింగ్స్ లేకపోవడం గమనార్హమని, ఈ నిర్ణయాన్ని వెంటనే ఉపసంహరించి బీఎంపీ వింగ్ ను కొనసాగించాలని వారు కోరుతున్నారు. -
● పునాది రాళ్లు..
● తంబళ్లపల్లె టీడీపీ అంటేనే హడల్ ● ఉమాశంకర్, లక్ష్మీదేవమ్మల బాటలోనే ప్రవీణ్, జయచంద్ర బలి ● వాడుకుని వదిలేయడం బాబు నైజం ● ప్రత్యామ్నాయం లేక మళ్లీ శంకర్కే పగ్గాలప్పగించిన వైనం సాక్షి, మదనపల్లె: తంబళ్లపల్లె నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ బాధ్యతలు చేపట్టిన నేతలకు, గెలిచిన ఎమ్మెల్యేలకు రాజకీయ భవిష్యత్తు ఉండదా? ఇక్కడి రాజకీయాలు ఆ పార్టీ నేతలకు అచ్చిరావా? లేక టీడీపీకి తంబళ్లపల్లె నియోజకవర్గం ఒక శాపమా? అన్న చర్చ సర్వత్రా వెల్లువెత్తుతోంది. తాజాగా మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ తిరిగి టీడీపీ ఇన్చార్జ్ బాధ్యతలను చేపట్టడంతో.. చంద్రబాబు చేతిలో ఆయన రాజకీయ భవిష్యత్తు భద్రమేనా? రాబోయే ఎన్నికల నాటికి మళ్లీ ఎలాంటి పరిణామాలు చోటుచేసుకుంటాయి? అన్న చర్చ మొదలైంది. ఇక్కడి టీడీపీ నేతలకు తంబళ్లపల్లె అచ్చిరాదని, అది ఒక సెంటిమెంట్గా మారిందని చెప్పడానికి ఆ పార్టీ ఆవిర్భావం నుండి మొన్న ములకలచెరువులో వెలుగుచూసిన నకిలీ మద్యం తయారీ కేసులో ఇరుక్కున్న మాజీ టీడీపీ ఇన్చార్జ్ జయచంద్రారెడ్డి వరకు ఎన్నో ఉదంతాలు ఉన్నాయి. టీడీపీలోకి ఎంట్రీ ఇవ్వడమంటే రాజకీయంగా ఆత్మహత్యాసదృశ్యమేనని తంబళ్లపల్లె రాజకీయ చరిత్రను ప్రత్యక్షంగా చూసిన విశ్లేషకులు స్పష్టం చేస్తున్నారు. తొలి ఎన్నికలోనే పరాజయం.. ఉమ్మడి చిత్తూరు జిల్లాలో 1983లో టీడీపీ ప్రభంజనం సృష్టించినప్పటికీ తంబళ్లపల్లెలో మాత్రం అది సాధ్యంకాలేదు. అప్పట్లో టీఎన్ కుటుంబానికి కాంగ్రెస్ టికెట్ ఇ వ్వకపోవడంతో టీఎన్.శ్రీనువాసులురెడ్డి ఇండిపెండెంట్ అభ్యర్థిగా బరిలోకి దిగారు. కాంగ్రెస్ నుండి ఆవుల మోహన్రెడ్డి, టీడీపీ తరఫున ఉమాశంకర్రెడ్డి పోటీ చేయగా.. ఇండిపెండెంట్ అభ్యర్థి చేతిలో టీడీపీ ఘోర పరాజయం పాలైంది. పార్టీకి తొలి ఎన్నికలోనే పరాజయం ఎదురైంది. జయచంద్రారెడ్డి శంకర్ యాదవ్ తల్లిదండ్రుల బాటలోనే రాజకేయంలోకి వచ్చిన ఏవీ.ప్రవీణ్కుమార్రెడ్డి సైతం ఐదేళ్లు ఆ పార్టీలో కొనసాగలేదు. 2009 ఎన్నికల్లో గెలిచినప్పటికీ చంద్రబాబు తెలంగాణ లేఖను వ్యతిరేకిస్తూ మూడున్నరేళ్లకే పార్టీని వీడి ప్రస్తుతం రాజకీయాలకే దూరమయ్యారు. నియోజకవర్గంలో పార్టీకి దిక్కులేక మాజీ ఎమ్మెల్యే శంకర్ యాదవ్ను రప్పించుకున్న అధిష్ఠానం.. ఆయనను అడుగడుగునా అవమానిస్తూ నట్టేట ముంచింది. 2014 ఎన్నికల్లో గెలిచిన శంకర్కు 2019లో ఎవరూ పోటీలేకున్నా చివరిక్షణం వరకు అభ్యర్థితత్వం ప్రకటించకుండా చుక్కలు చూపించారు. ఆ ఎన్నికల్లో ఓటమికంటే చంద్రబాబు చేసిన అవమానాన్ని జీర్ణించుకోలేకపోయారు. అయినప్పటికీ లోకేష్ పాదయాత్ర, పార్టీ కార్యక్రమాలు నిర్వహించినా ఆయన్ను కాదని జయచంద్రారెడ్డికి ఏకపక్షంగా టికెట్ ప్రకటించారు. దాంతో శంకర్ బెంగళూరుకే పరిమితమైపోయారు. మరోవైపు 2024 ఎన్నికలకు ముందు చేరి టికెట్ దక్కించుకున్న డి.జయచంద్రరెడ్డి ప్రస్థానం కూడా ములకలచెరువు నకిలీ మద్యం తయారీ కేసుతో ముగిసిపోయింది. ప్రధాన నిందితుడిగా కేసు నమోదు కావడంతో చంద్రబాబు ఆయనను పార్టీ నుంచి సస్పెండ్ చేశారు. పట్టుమని రెండేళ్లయినా పార్టీలో కొనసాగలేకపోయిన జయచంద్రారెడ్డి కథ ముగిసిపోవడంతో, ప్రత్యామ్నాయం లేక తిరిగి శంకర్కే పార్టీ ఇన్చార్జ్ పదవి ఇచ్చారు. -
జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల విజేతలు వీరే
మదనపల్లె సిటీ: అన్నమయ్య జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారాలు–2026కు ఎంపికై న 60 మంది ఉపాధ్యాయుల పూర్తి వివరాలను జిల్లా విద్యాశాఖ అధికారులు అధికారికంగా ప్రకటించారు. విభాగాల వారీగా ఎంపికై న విజేతల వివరాలు ఇలా ఉన్నాయి. ప్రధానోపాధ్యాయుల విభాగం (04 మంది) – ఎస్.మదన్మోహన్గుదిటి వెంకటేశ్వరషేక్ ఖలీల్బాషామూడే మోహన్నాయక్ స్కూల్ అసిస్టెంట్లు / పీజీటీల విభాగం (20 మంది) – పి.లక్ష్మి నరసింహశాస్త్రి, వై.నాగశేషారెడ్డి, కె.సుబ్బారెడ్డి, ఎం.వెంకటరమణ, సి.హర్షవర్ధన్రెడ్డి, ఎం.గీతారాణి, షేక్ షర్బుద్దీన్, వి.రబ్బానీ, వి.ప్రసన్నకుమార్, కె.సుబ్రమణ్యం, టి.లక్ష్మిరెడ్డి, సి.బాలాజీ, ఎం.కళావతి, జి.శివప్రసాద్, జి.చంద్రశేఖర్, బి.ఈశ్వరయ్య, ఎన్.రాధామణి, పి.మోహన్రావు, తిరువీధి మునిమనోహర్, ఎ.నటేశ్వరరావు. ఎస్జీటీల విభాగం (30 మంది) – ఎం.నాగేశ్వరనాయక్, షేక్ గౌహరిబేగం, పి.శారద, పి.వినోద, పి.వెంకటకళ్యాణి, పి.వెంకటరమణ, రాయల మల్లికార్జున, మలిశెట్టి ఉదయ్కిరణ్, కె.సుధాకర్, ఎ.రజని, ఎస్పి.సరిత, కె.సుభాషిణి, కె.విజయకుమార్, మూడే సరస్వతి, ఎం.శివగంగ, పి.సుజాత, ఎం.నవాజ్అలీఖాన్, సుబ్రమణ్యం, కె.వెంకటరమణ, భారతమ్మ, డి.ఆర్.నాగభూషణంనాయుడు, బి.శ్రీనివాసులు, ఈ.రమేష్బాబు, ఎ.శోభారాణి, ఎన్.అనిల్కుమార్, బి.హరిప్రసాద్, సి.సునిత, ఎస్.ముబారక్బాషా, ఎల్.రమాభార్గవి, బి.నర్సిరెడ్డి. స్కౌట్స్ అండ్ గైడ్స్ విభాగం (06 మంది) – బి.మోహన్బాబు, కె.లక్ష్మిరెడ్డి, బి.భూపతి, షేక్ షమాభాను, జి.లలితమ్మ, డి.హిమవతి. 60 మందితో కూడిన అధికారిక ఎంపిక జాబితా -
అత్తింటి వారి నుంచి ప్రాణరక్షణ కల్పించాలి
మదనపల్లె టౌన్ : భర్త, అత్తింటి వారి నుంచి ప్రాణరక్షణ కల్పించాలని బాధితురాలి కుటుంబీకులు గురువారం తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బి.కొత్తకోట మండలానికి చెందిన ఎస్.సోనియాకు పీటీఎం మండలానికి చెందిన షేక్ బాబా ఫక్రుద్దీన్ తో నాలుగేళ్ల క్రితం వివాహం జరిగింది. వీరికి 3 ఏళ్ల కుమారుడు ఉన్నాడు. రెండేళ్లుగా భర్త, అత్తమామలు వేధిస్తున్నారని సోనియా ఆరోపించింది. పెద్దల పంచాయితీల తర్వాత కూడా భర్త ప్రవర్తనలో మార్పు రాలేదని, తాజాగా ట్రిపుల్ తలాక్ నోటీసు పంపి ప్రాణహాని చేస్తామని బెదిరిస్తున్నారని కుటుంబీకులు తెలిపారు. భర్త ఫక్రుద్దీన్, మామ అజ్మత్, అత్త రాబియా, వారి కుటుంబ సభ్యులు ఆరిఫ్ బాషా, అహమ్మద్, షమీమ్, రాబియాలపై చర్యలు తీసుకొని రక్షణ కల్పించాలని కోరారు. -
● సత్తార్ ఫౌజీ
● 35 ఏళ్ల ఆదర్శ ఉర్దూ విద్యా సేవలకు దక్కిన గౌరవం ● బహుభాషా కవిగా, నాటక రచయితగా విశిష్ట గుర్తింపు కడప నగరానికి చెందిన ప్రముఖ ఉర్దూ ఉపాధ్యాయుడు ఎస్.అబ్దుల్ సత్తార్ ఫైజీ ఈ ఏడాది రాష్ట్రస్థాయి ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. 1989లో లక్కిరెడ్డిపల్లెలో ఎస్జీటీగా ప్రస్థానం ప్రారంభించి, సీకే దిన్నె, రాజంపేట, మైదుకూరులలో పనిచేసి, ప్రస్తుతం మూలవంక జెడ్పీ హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్ ఉర్దూగా సేవలందిస్తున్నారు. తరగతి గది బోధనతో పాటు సాహిత్య, నాటక, సామాజిక రంగాల్లో ఆయన అందించిన విశిష్ట సేవలకు గాను ఈ పురస్కారం దక్కింది. సాహిత్య, రచనా ప్రస్థానం సత్తార్ ఫైజీ 1996 నుండి 2026 వరకు నిరంతరాయంగా 12 ఉర్దూ, 4 తెలుగు పుస్తకాలను రచించారు. ఇందులో శ్రీసర్వరే కౌనైన్శ్రీ భక్తిగేయాలు, శ్రీషాహే ఉమ్మత్శ్రీ కవితలు, శ్రీధనక్శ్రీ బాలసాహిత్యం, శ్రీగుల్హాయే ఆఖీదత్శ్రీ గ్రంథాలు ప్రముఖమైనవి. బహుభాషా కవిగా 1,000కు పైగా కవిసమ్మేళనాల్లో పాల్గొని, 400 ఉర్దూ, 150 తెలుగు వ్యాసాలు రాశారు. 33 చారిత్రక, సాంఘిక హాస్య నాటకాలు రచించడంతో పాటు ఎస్సీఈఆర్టీ టెక్స్ట్బుక్ రైటర్గా, ఉపాధ్యాయ శిక్షణలో రీసోర్స్ పర్సన్గా వ్యవహరించారు. సామాజిక బాధ్యత – పురస్కారాలు జిల్లా రచయితల సంఘం గౌరవాధ్యక్షుడిగా, కడప బాలోత్సవం సలహాదారుగా, రాయలసీమ ఉర్దూ రైటర్స్ ఫెడరేషన్ ప్రధాన కార్యదర్శిగా వివిధ సంస్థల్లో కీలక బాధ్యతలు నిర్వర్తించారు. 35 ఏళ్ల సేవలో 200కు పైగా సన్మానాలు అందుకున్న ఆయనను మిర్జా గాలిబ్ అవార్డు (2003), జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు (2005), ఉర్దూ అకాడమీ లైఫ్టైమ్ అచీవ్మెంట్ అవార్డు, సితార–ఎ–ఉర్దూ అవార్డు (2023), నేషనల్ అల్లామా ఇక్బాల్ అవార్డు (2024), ఏపీ ఉర్దూ అకాడమీ బెస్ట్ ఎక్సలెన్స్ అవార్డు (2025) వంటి పలు ప్రతిష్టాత్మక పురస్కారాలు వరించాయి. -
ముగ్గురు టీచర్లకు రాష్ట్ర ఉత్తమ అవార్డులు
జిల్లావ్యాప్తంగా ఒక హెడ్మాస్టర్, ఇద్దరు స్కూల్ అసిస్టెంట్లు రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుకు ఎంపికయ్యారు. వీరిలో కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ ప్రధానోపాధ్యాయురాలు పి.నాగమణి, ప్రొద్దుటూరు ఎస్పీసీఎన్ ఎంపీఎల్ హైస్కూల్ స్కూల్ అసిసెంట్ జి.గంగాధరనాయుడు, సికెదిన్నె మండలం మూలవంక జెడ్పీ హైస్కూల్(ఉర్దూ) టీచర్ షేక్ అబ్థుల్ సత్తార్లున్నారు. వీరు ఈ నెల 5వ తేదీ ఉపాధ్యాయ దినోత్సవాన్ని పురష్కరించుకుని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు చేతుల మీదుగా విజయవాడలో ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులను అందుకోనున్నారు. – కడప ఎడ్యుకేషన్/ప్రొద్దుటూరు కల్చరల్● తెలుగు మాస్టారుకు దక్కిన గౌరవం ● దీక్షా యాప్లో 100కు పైగా వీడియో పాఠాలు ● చదివిన స్కూల్కే హెచ్ఎం ● ఎనిమిదేళ్ల సర్వీస్లో సెలవెరుగని హెచ్ఎం ● గంగాధర్ నాయకుడు ప్రొద్దుటూరు కల్చరల్: రామేశ్వరంలోని ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్ తెలుగు ఉపాధ్యాయుడు గంగాధర్ నాయుడు పాఠ్యాంశాలను బొమ్మల రూపంలో బోధిస్తే విద్యార్థులు ఎక్కువ కాలం గుర్తుంచుకుంటారనే భావనతో పాఠ్యాంశాలను వినూత్న చిత్రాలతో అర్థమయ్యేలా వివరిస్తూ గుర్తింపు పొందారు. దీక్షా యాప్లో వంద వీడియోలు.. యూట్యూబ్ బోధన తన డిజిటల్ బోధన రాష్ట్రంలోని విద్యార్థులందరికీ ఉపయోగపడాలనే ఆశయంతో యూట్యూబ్ ఛానల్ ద్వారా పాఠాలు చెప్తున్నారు. ప్రభుత్వ విద్యాశాఖకు చెందిన అధికారిక ‘దీక్షా’ యాప్లో వందకు పైగా వీడియోలను పొందుపరిచారు. 7, 10వ తరగతి పాఠ్యపుస్తకాల రచనలో సాంకేతిక నిపుణుడిగా వ్యవహరించి, బుక్స్లోని క్యూఆర్ కోడ్ను స్కాన్ చేయడంపై టీచర్లకు శిక్షణ ఇచ్చారు. జాతీయ స్థాయిలో గుర్తింపు.. వందకు వంద మార్కులు ఉపాధ్యాయ శిక్షణలో రాష్ట్ర, జిల్లా రీసోర్స్ పర్సన్గా, డీసీఈబీ మెటీరియల్ రూపకర్తగా గుర్తింపు తెచ్చుకున్న ఆయన, 2018లో ఢిల్లీలో జరిగిన ఐసీటీ సెమినార్లో ప్రదర్శన ఇచ్చారు. బోధనా నైపుణ్యంతో 2024–25లో వైవీఎస్ మున్సిపల్ గర్ల్స్ హైస్కూల్లో, 2025–26లో రామేశ్వరం ఎస్పీసీఎన్ మున్సిపల్ హైస్కూల్లో పదో తరగతి విద్యార్థులు తెలుగు సబ్జెక్టులో ఆరుగురు చొప్పున 100కు 100 మార్కులు సాధించారు. గత 26 ఏళ్లుగా ఉత్తమ ఫలితాల కోసం నిరంతరం కృషి చేస్తున్నానని, తనకు రాష్ట్ర స్థాయి అవార్డు రావడం సంతోషంగా ఉందని గంగాధర్ నాయుడు అన్నారు.● నాగమణి ఆమె ప్రధానోపాధ్యాయురాలిగా పదోన్నతి పొందిన ఎనిమిదేళ్ల సర్వీస్లో ఏనాడూ పాఠశాలకు సాధారణ సెలవు పెట్టలేదు. అంతటి నిబద్ధతతో పనిచేస్తూ, తాను చదివిన పాఠశాలకే హెచ్ఎంగా వచ్చి విద్యా ప్రమాణాలను పెంచిన కడప గాంధీనగర్ మున్సిపల్ కార్పొరేషన్ హైస్కూల్ హెచ్ఎం పెనువాడి నాగమణి ఈ ఏడాది ‘రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు’కు ఎంపికయ్యారు. ఆమె హయాంలో పదో తరగతి ఫలితాలు 61 శాతం నుండి 75 శాతానికి పెరగడమే కాక, బడిలో విద్యార్థుల సంఖ్య కూడా గణనీయంగా పెరిగింది. కడపకు చెందిన పెనువాడి నాగేశ్వరావు (హెడ్ కానిస్టేబుల్), సాలమ్మల కుమార్తె అయిన నాగమణి, కడప మున్సిపల్ హైస్కూల్లో పాఠశాల విద్యాభ్యాసం పూర్తి చేశారు. అనంతరం ఓపెన్ యూనివర్సిటీ ద్వారా డిగ్రీ, ఎంఏ పూర్తి చేసి, కడప రాజేశ్వరి కళాశాలలో బీఈడీ పట్టా పొందారు. ఆమె భర్త పుల్లయ్య సామాజిక వేత్త కాగా, పెద్ద కుమారుడు హర్షవర్ధన్ ఎంబీబీఎస్ పూర్తి చేశారు. రెండో కుమారుడు యశ్వంత్ బీటెక్ మూడోసంవత్సరం చదువుతున్నారు. ఉద్యోగ ప్రస్థానం: నాగమణి 2000 నవంబర్ 13న ఎస్జీటీగా కడప 16వ వార్డు ఎంసీహెచ్ఎస్లో ఉద్యోగంలో చేరి 12 ఏళ్లు పనిచేశారు. 2012 మే 17న స్కూల్ అసిస్టెంట్గా గాంధీనగర్ ము న్సిపల్ హైస్కూల్కు వెళ్లారు. ఆపై 2017 సెప్టెంబర్ 14న హెచ్ఎంగా పదోన్నతి పొంది, తాను చదివిన మున్సిపల్ హైస్కూల్ (మెయిన్)లోనే ఏడేళ్ల పాటు ఆదర్శవంతంగా సేవలు అందించారు. 2025 జూన్ 1వ తేదీన బదిలీపై ప్రస్తుత గాంధీనగర్ హైస్కూల్కు హెచ్ఎంగా వచ్చారు. -
హక్కుల సాధనకు ఉద్యోగుల ఆందోళన
సాక్షి, మదనపల్లె : తమకు ఆర్థిక ప్రయోజనాలు అందివ్వాలని డిమాండ్ చేస్తూ గురువారం ఏపీ జేఏసీ అమరావతి రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు జిల్లాలోని ప్రభుత్వ కార్యాలయాల్లో భోజన విరామ సమయంలో నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. సమస్యల పరిష్కారం కోసం చేపట్టిన ఉద్యమ కార్యాచరణలో భాగంగా స్థానిక కలెక్టరేట్, సబ్ కలెక్టర్ కార్యాలయాల ఎదుట ఉద్యోగులు తమ డిమాండ్లను నెరవేర్చాలని కోరుతూ ధర్నాలు నిర్వహించారు. నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన వ్యక్తం చేశారు. డీఆర్ఓ వెంకటేశుకు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగ సంఘాల నాయకులు మాట్లాడుతూ ఉద్యోగులు, పెన్షనర్లకు ప్రభుత్వం నుంచిరావాల్సిన ఆర్థిక ప్రయోజనాలు, పెండింగ్ బకాయిలు, పీఆర్సీ, డీఏలు, ఐఆర్, ఇతర హక్కులకు సంబంధించిన అంశాలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఉద్యోగులు, పెన్షనర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రభుత్వం గుర్తించి బకాయిలను వెంటనే మంజూరు చేయాలని కోరారు. ప్రభుత్వం మొండి వైఖరి వీడి ఉద్యోగ సంఘాల ప్రతినిధులతో చర్చలు జరిపి సానుకూల నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. ఉద్యమ కార్యాచరణలో భాగంగా చేయి చేయి కలుపుదాం– హ్యాండ్ టూ హ్యాండ్ కార్యక్రమాన్ని కూడా జిల్లాలో నిర్వహిస్తున్నట్లు నాయకులు తెలిపారు. ఈ కార్యక్రమం ద్వారా జిల్లా, డివిజన్ స్థాయి కార్యాలయాలను సందర్శిస్తూ ఉద్యోగులకు కరపత్రాలు పంపిణీ చేసి, ఉద్యమం చేపట్టడానికి గల కారణాలను వివరిస్తూ ఉద్యోగులను ఐక్య ఉద్యమానికి సంసిద్ధులను చేస్తున్నట్లు తెలిపారు. ఉద్యోగులందరూ విబేధాలు లేకుండా ఐక్యంగా ఉద్యమంలో పాల్గొనాలని పిలుపునిచ్చారు. ఇప్పటికే వివిధ ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్ సంఘాలను ఐక్య ఉద్యమంలో భాగస్వాములు కావాలని ఆహ్వానించినట్లు తెలిపారు. ఈ కార్యక్రమాలలో జిల్లా ఏపీ జేఏసీ చైర్మన్ పి.నరసింహ కుమార్, ఏపీ జేఏసీ జిల్లా కార్యదర్శి గోపి, ఏపీఆర్ఎస్ఏ జిల్లా కార్యదర్శి బాబ్జి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల సంఘం అధ్యక్షురాలు శ్రావణి, కలెక్టర్ కార్యాలయ ఉద్యోగుల సంఘ కార్యదర్శి వంశీ, పెన్షనర్స్ అసోసియేషన్ అధ్యక్షులు రామలింగారెడ్డి, మున్సిపల్, రెవెన్యూ, పంచాయతీరాజ్, జీఎస్డబ్ల్యూఎస్, అవుట్సోర్సింగ్ ఉద్యోగులు, అనుబంధ ఉద్యోగ సంఘాల ప్రతినిధులు, ఉద్యోగులు పాల్గొన్నారు.కలెక్టరేట్, సబ్ కలెక్టర్ కార్యాలయం ఎదుట ధర్నాలు -
● మూలస్తంభం ఉమాశంకర్రెడ్డి దారుణ హత్య
1983లో టీడీపీ ఆవిర్భావం అయ్యాక తంబళ్లపల్లె నియోజకవర్గంలో ఆ పార్టీకి గట్టి పునాదులు వేసింది ఏవీ.ఉమాశంకర్రెడ్డి. గూడుపల్లెకు చెందిన ఉన్నత విద్యావంతుడైన ఆయన.. ఆ తర్వాత ఎమ్మెల్సీగా, పార్టీకి తొలి జిల్లా అధ్యక్షునిగా బాధ్యతలు నిర్వహించారు. అప్పట్లో నియోజకవర్గంలో నక్సల్స్ అనుకూల, వ్యతిరేక సంఘాల మధ్య తీవ్ర ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. ఈ క్రమంలో ఒక సంఘానికి మద్దతుగా నిలిచిన ఉమాశంకర్రెడ్డి.. 1984 పార్లమెంటు ఎన్నికల ప్రచారంలో భాగంగా అన్నగారిపల్లె వద్ద తంబళ్లపల్లె నుంచి ములకలచెరువుకు వస్తుండగా దారుణ హత్యకు గురయ్యారు. ఎంతో రాజకీయ భవిష్యత్తు కలిగిన ఉమాశంకర్రెడ్డి రాజకీయ జీవితం టీడీపీలోకి వచ్చిన రెండేళ్లకే ఘోరంగా ముగిసిపోయింది. -
ప్రయాణికులకు మెరుగైన సేవలే లక్ష్యం
● త్వరలో కడప జోన్కు 200 విద్యుత్ బస్సులు ● కడప ఆర్టీసీ జోన్ ఈడీ ఆర్.ఆర్.కె.కిషోర్మదనపల్లె సిటీ : ఆర్టీసీ ప్రయాణికులకు మెరుగ్గా సేవలందించేలా చర్యలు చేపట్టినట్లు నూతనంగా పదవీ బాధ్యతలు చేపట్టిన కడప ఆర్టీసీ జోన్ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఆర్.ఆర్.కె.కిషోర్ అన్నారు. త్వరలో కడప జోన్కు 200 విద్యుత్బస్సులు రానున్నాయని పేర్కొన్నారు. రెండు నెలల్లో ఈ బస్సులు రోడ్డుపైకి రానున్నట్లు తెలిపారు. గురువారం సాయంత్రం మదనపల్లె ఆర్టీసీ–1, 2 డిపోలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్థానిక విలేకర్లతో మాట్లాడారు. అందుకు అవసరమైన ఛార్జింగ్ కేంద్రాలు, సబ్ స్టేషన్లు, సివిల్ పనులు శరవేగంగా జరుగుతున్నట్లు తెలిపారు. డిపోల్లో కండక్టర్ల, డ్రైవర్లు, ఇతర సిబ్బంది కొరత వాస్తవేమన్నారు. ప్రభుత్వం నుంచి అనుమతి వస్తే ఖాళీలు భర్తీ చేయడం జరుగుతుందన్నారు. మోడల్ డిపోలుగా తీర్చిదిద్దుతాం జిల్లా కేంద్రమైన మదనపల్లెను మోడల్ బస్స్టేషన్గా తీర్చిదిద్దుతామని ఈడీ తెలిపారు. ఇందు కోసం బస్స్టేషన్లో ప్రయాణికులకు ఆర్ఓ నీరు టాయిలెట్స్, ప్రయాణికులు కూర్చోవడానికి కుర్చీలు తదితర మౌళిక వసతులపై ప్రత్యేక దృష్టి పెట్టామన్నారు. ఇందులో భాగంగా డిపోలో టాయిలెట్స్ను సులభ్ కంపెనీకి అప్పగించామన్నారు. దీంతో శుభ్రత మెరుగుపడిందన్నారు. ప్రదానంగ సమయపాలన పాటించాలన్నారు. బస్సులు కండీషన్గా ఉంచుకోవాలన్నారు. సమన్వయంతో పని చేయాలి ఆర్టీసీ సిబ్బంది సమన్వయంతో పని చేయాలని ఈడీ అన్నారు. గేట్ మీటింగ్లో సిబ్బందితో మాట్లాడారు. ఆర్టీసీకి ఆదాయం పెంచాలన్నారు.ప్రయాణికులతో స్నేహపూర్వంగా మెలగాలన్నారు. సంస్థకు మంచి పేరు తీసుకురావాలన్నారు. ఐవిఆర్ఎస్ కాల్స్లో సంస్థ పనితీరు తెలుస్తుందన్నారు. సిబ్బంది పలు సమస్యలు ఈడీ దృష్టికి తెచ్చారు. సీ్త్ర శక్తి పథకం ద్వారా పలు ఇబ్బందులను తెలిపారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణా అధికారి శశిభూషణ్, డిప్యూటీ సీఎంఈ ఆర్ఎం నాయక్, ఈఈ పోతురాజు, వన్ డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి, ఎంఎఫ్ ఝాన్సీరాణి, యూనియన్ నాయకులు వినోద్, సీఎ బాబు, రెడ్డప్స, భయ్యారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
జాతీయస్థాయి యోగా పోటీలకు ఎంపిక
మదనపల్లె సిటీ : జాతీయ స్థాయి యోగా పోటీలకు మదనపల్లె నవచైతన్యభారతి పాఠశాల విద్యార్థులు ఎంపికై నట్లు కరస్పాండెంట్ గిరిజమ్మ, ప్రిన్సిపాల్ మానస పద్మనాభూని, యోగా గురువు అనితలక్ష్మి గురువారం తెలిపారు. గత నెల 29,30 తేదీల్లో విశాఖపట్టణంలో జరిగిన 52వ ఏపీ యోగసాన స్పోర్ట్స్ ఛాంఫియన్ షిప్ 2026 పోటీలు నిర్వహించారన్నారు. ఈ పోటీల్లో పాఠశాల నుంచి పది మంది విద్యార్థులు హాజరుకాగా అందులో 7వ తరగతి విద్యార్థినులు జీ.కీర్తిప్రియ, ఎస్.ఆఫీఫా, ఐదో తరగతి చదువుతున్న యాషిక, అనిషాలు రాష్ట్ర స్థాయిలో పతకాలు సాధించి జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై నట్లు తెలిపారు. త్వరలో వీరు రాజస్థాన్లో జరిగే జాతీయ స్థాయి పోటీల్లో ఆంద్రప్రదేశ్ తరపున పాల్గొంటారని తెలిపారు.అదశ్యమైన మహిళ హత్యకు గురైందా? మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలో అదృశ్యమైన మహిళ హత్యకు గురైందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి మదనపల్లె మండలం కొండమరిపల్లికి చెందిన లక్ష్మీదేవి కొద్దిరోజుల క్రితం అదశ్యమయ్యారు. ఆమె ఆచూకీ లభించకపోవడంతో కుటుంబ సభ్యులు మదనపల్లె తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఈ మేరకు సీఐ కళా వెంకటరమణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ క్రమంలో లక్ష్మిదేవిని ఓ రెస్టారెంట్ సమీపంలో హత్య చేశారన్న ఆరోపణలు తెరపైకి వచ్చాయి. దీంతో తాలూకా పోలీసులు అనుమానితులను అదుపులోకి తీసుకుని విచారిస్తున్నట్లు సమాచారం. ఈ ఘటనపై పోలీసులు అన్ని కోణాల్లో విచారణ చేపట్టారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. విద్యుదాఘాతంతో రైతు మృతిరామసముద్రం : మండల కేంద్రంలోని బలిజవీధికి చెందిన చింతల సురేంద్రబాబు అలియాస్ బాబు (52) విద్యుదాఘాతంతో మృతి చెందాడు. గురువారం భూసానికురపల్లి రహదారిలోని తన వ్యవసాయ భూమి వద్దకు వ్యవసాయ పనుల నిమిత్తం వెళ్లాడు. ఈ సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.పోలీసుల అదుపులో అనుమానితులు.. -
బాలికను వేధించిన కేసులో ఉపాధ్యాయునికి జైలు
ఒంటిమిట్ట(సిద్దవటం ) : ఒంటిమిట్ట మండలం లో ఉపాధ్యాయుడుగా పనిచేస్తున్న ఏవీ వెంకటసుబ్బారావు ఒక బాలికను లైంగికంగా వేధిస్తూ, డబ్బులు బహుమతులు ఇవ్వడం ద్వారా ఆమెను ప్రభావితం చేసి జూలై 2013 న ఆమెను బలవంతంగా తీసుకెళ్లిన కేసులో నిందితుడికి ఏడేళ్ల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా విధించినట్లు గురువారం కడప ఒకటో అదనపు జిల్లా, సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్.శాంతి తీర్పును వెలువరించారు. కడప భాగ్యనగర్ కాలనీకి చెందిన ఏవీ వెంకట సుబ్బారావు, ఒంటిమిట్ట మండలంలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్నారు. ఇతను బాలికను బలవంతంగా తీసుకెళ్లినట్లు బాలిక తల్లి అక్టోబర్ 2013న ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ లో ఇచ్చిన ఫిర్యాదు మేరకు అప్పటి ఎస్ఐ డీకే జావిద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టు ముందు హాజరు పరిచారు. అప్పటి ఎస్ఐ బి. పెద్ద ఓబన్న దర్యాప్తు పూర్తి చేసి కోర్టులో చార్జి సీటు దాఖలు చేశారు. ఈ కేసులో కడప ఒకటోఅదనపు జిల్లా మరియు సెషన్స్ కోర్టు న్యాయమూర్తి ఎన్. శాంతి విచారించి, ప్రాసిక్యూషన్ తరపున సమర్పించిన సాక్ష్యాధారాలను పరిశీలించారేఉ. నేరం నిరూపితమైనందున దోషిగా నిర్ధారించారు. సెక్షన్ 363 ఐపీసీ కింద 7 సంవత్సరాలు జైలు శిక్ష,రూ. 5000 జరిమానా, అలాగే సెక్షన్ న్366 ఐపీసీ కింద 10 సంవత్సరాల జైలు శిక్ష, రూ. 5000 జరిమానా విధించినట్లు కోర్టు తీర్పు వెలువరించింది. ఈ కేసులో సమర్థవంతంగా దర్యాప్తు చేసి కోర్టులో చార్జీ షీట్ దాఖలు చేసిన ఒంటిమిట్ట పోలీస్ స్టేషన్ అప్పటి ఎస్ఐ బి పెద్ద ఓబన్న, ప్రాసిక్యూషన్ తరపున వాదనలను వినిపించిన స్పెషల్ ఏపీపీ బొక్క సం శ్రీనివాసులు, గ్రేడ్ 1 శ్రీమతి ఎన్. ఖదిరుణ్, సాక్షులను సక్రమంగా కోర్టులో హాజరు పరిచి నిందితుడికి శిక్ష పడేలా కృషిచేసిన కోర్టు మానిటరింగ్ సెల్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్, హెడ్ కానిస్టేబుల్ వెంకటేశ్వర్లు, ఒంటిమిట్ట కోర్టు కానిస్టేబుల్ నాగేంద్ర రాజు, సుమంత్, అలాగే కేసును పర్యవేక్షించిన ప్రస్తుత ఒంటిమిట్ట సీఐ వెంకటేశ్వర్లు, ఎస్సై శ్రీనివాసులు, లను కడప జిల్లా ఎస్పీ షల్కే నచికేత్ విశ్వనాథ్ అభినందించారు. -
సర్ విచారణ వేగవంతం చేయండి
సాక్షి, మదనపల్లె : జిల్లాలో సర్ కార్యక్రమంలో భాగంగా ఓటర్ల విచారణ ప్రక్రియను వేగవంతంగా పూర్తి చేయాలని వైఎస్సార్సీపీ సమన్వయకర్త నిసార్ ఆహ్మద్ కోరారు. గురువారం కలెక్టరేట్లో జాయింట్ కలెక్టర్ శివ్నారాయణ్ శర్మ రాజకీయ పార్టీల నేతలతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జేసీ సర్ కార్యక్రమంపై వినతులను స్వీకరించారు. జిల్లాలో 1,31,085 మంది ఓటర్లకు నోటీసులు ఇవ్వగా, ఇంతవరకు 93,271 మంది ఓటర్లను విచారించినట్లు అధికారులు చెబుతున్నారని, మిగిలిన ఓటర్లను ఎప్పుడు విచారిస్తారని కోరారు. పీలేరు నియోజకవర్గంలో 36.21 శాతం, తంబళ్లపల్లె నియోజకవర్గంలో 34.16 శాతం, పుంగనూరు నియోజకవర్గంలో 30.24 శాతం, రాయచోటి నియోజకవర్గంలో 29.16 శాతం, మదనపల్లె నియోజకవర్గంలో 11.70 శాతం మంది ఓటర్ల విచారణ ఇంకా పూర్తి చేయాల్సి ఉందని జేసీ దృష్టికి తెచ్చారు. అర్హులకు ఓటు హక్కు కొనసాగే అవకాశం కల్పించి, అనర్హులు, డూప్లికేట్ నమోదులను నిబంధనల మేరకు చర్యలు తీసుకోవాలని కోరారు. అధికారులు పెండింగ్లో ఉన్న విచారణలను వేగవంతం చేసి, పారదర్శకంగా ప్రక్రియను పూర్తి చేయాలని విజ్ఞప్తి చేశారు. సమావేశంలో పార్టీ పట్టణ అధ్యక్షుడు జింకా వెంకటా చలపతి, మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శి విఎస్.రెడ్డి పాల్గొన్నారు. -
ఏపీ పోలీస్ స్పోర్ట్స్ మీట్ లో సత్తా
మదనపల్లె టౌన్ : ఆంధ్రప్రదేశ్ పోలీస్ శాఖ తొలిసారిగా నిర్వహించిన రాష్ట్రస్థాయి క్రీడా పోటీల్లో అన్నమయ్య జిల్లా మదనపల్లె శక్తి టీమ్ కు చెందిన శశికళ కళ ప్రతిభ కనబరిచి ఐదు పతకాలు సాధించింది. అమరావతి సమీపంలోని విఐటీ–ఏపీ యూనివర్సిటీలో గురువారం జరిగిన ఏపీ స్టేట్ పోలీస్ స్పోర్ట్స్ అండ్ గేమ్స్ మీట్ –2026 లో కర్నూలు రేంజ్ తరపున బరిలోకి దిగిన శశికళ, పలు విభాగాల్లో రాణించింది. రెండు స్వర్ణాలు, ఒక కాంస్యం వ్యక్తిగత విభాగాల్లో ఆధిపత్యం చాటింది. హ్యాండ్ రెజ్లింగ్ (ఆర్మ్ రెజ్లింగ్) లో బలమైన ప్రత్యర్థులను సునాయాసంగా ఓడించి స్వర్ణ పతకం కై వసం చేసుకుంది. అదే జోష్ తో బాక్సింగ్ రింగ్ లోకి దిగి పంచ్ ల మీద పంచ్ లు కురిపిస్తూ రెండో గోల్డ్ మెడల్ ను తన ఖాతాలో వేసుకుంది. మహిళా రెజ్లింగ్ విభాగంలోనూ అద్భుతంగా పోరాడి కాంస్య పతకం (3వ స్థానం) సాధించింది. జట్టు క్రీడల్లోనూ.. జట్టు క్రీడల్లో కూడా తన జట్టుకు వెన్నుదన్నుగా నిలిచింది. కర్నూలు రేంజ్ మహిళా బాస్కెట్ బాల్ జట్టు రాష్ట్రస్థాయిలో రన్నరప్ గా నిలవడంలో కీలక పాత్ర పోషించింది. అలాగే మహిళా హ్యాండ్ బాల్ జట్టు 3వ స్థానం సాధించడంలో తనవంతు కషి చేసింది. దీంతో ఒకే మీట్ లో 2 గోల్డ్, 1 సిల్వర్ టీమ్ మెడల్, 2 బ్రాంజ్ మెడల్స్ తో మొత్తం 5 పతకాలు సాధించింది. జిల్లా ఎస్పీ, ఇతర ఉన్నతాధికారులు శశికళకు అభినందనలు తెలిపారు. ఆమె విజయం జిల్లాలోని ఇతర మహిళా పోలీసులకు స్ఫూర్తిదాయకమని పేర్కొన్నారు.5 పతకాలు సాధించిన శక్తి టీమ్ శశికళ -
రోడ్డు ప్రమాదంలో యువకుడిని గాయాలు
రొంపిచెర్ల : ద్విచక్రవాహనం డివైడర్ను ఢీకొట్టడంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన అనంతపురం–చైన్నె జాతీయ రహదారిపై బుధవారం సాయంత్రం జరిగింది. రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లె పంచాయతీ చల్లావారిపల్లెకు చెందిన యశ్వంత్ రెడ్డి(17) ద్విచక్రవాహనంపై పీలేరుకు వెళ్లి పనులు ముగించుకుని తిరిగి చల్లావారిపల్లెకు వెళుతుండగా రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు సమీపంలోని మోడల్ స్కూల్ వద్ద వాహనం అదుపు తప్పి డివైడర్ను ఢీకొట్టారు. ప్రమాదంలో యువకుడి తలకు బలమైన గాయాలయ్యాయి. స్థానికులు వెంటనే 108కు సమాచారం అందించి పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించి వివరాలు తెలుసుకున్నారు.హత్య కేసులో నిందితుడు అరెస్ట్వీరబల్లి : వీరబల్లి మండలం ఓదివీడు కస్పాలో గత నెల 29న సయ్యద్ కాసింవలి అనే వ్యక్తి అదే గ్రామంలోని షేక్ షాహిదా ఇంట్లో హత్యకు గురయ్యాడు. పోలీసులు విచారణ చేపట్టి షేక్ హుస్సేన్బాషా, షేక్ నాగిన్ బాషా, షేక్ ఖాదర్వలీ హత్య చేసినట్లు గుర్తించారు. నిందితులలో ఒకరైన ఖాదరవలీని బుధవారం అరెస్టు చేసినట్లు ఎస్సై సుస్మిత తెలిపారు. మిగతా ఇద్దరు పరీరాలో ఉన్నారని వారిని కూడా త్వరలోనే అదుపులోకి తీసుకుంటామన్నారు. సుండుపల్లె సీఐ సురేష్ రెడ్డి, పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి గాయాలుపుంగనూరు : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గాయపడిన సంఘటన పుంగనూరులో బుధవారం చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు.. రహమ్మత్నగర్కు చెందిన మస్తాన్, ఇమ్రాన్ గుజిరీ వ్యాపారం చేసేవారు. వారు ఆటోలో ఇంటికి వస్తుండగా బాలాజీ థియేటర్ వద్ద వేగంగా వచ్చిన టాటా ఏస్ వాహనం ఢీకొంది. ప్రమాదంలో మస్తాన్, ఇమ్రాన్ తీవ్రంగా గాయపడ్డారు. బాధితులను ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండటంతో తిరుపతికి తరలించారు. గాయపడిన మస్తాన్, ఇమ్రాన్ -
కీచక ఉపాధ్యాయుడిపై చర్యలకు డిమాండ్
రాయచోటి టౌన్ : మహిళపై లైంగిక వేధింపులకు పాల్పడన కీచక ఉపాధ్యాయుడిపై విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకోవాలని పీడీఎస్యూ రాష్ట్ర ఉపాధ్యక్షులు అంకన్న డిమాండ్ చేశారు. బుధవారం రాయచోటిని ఓ ప్రైవేట్ పాఠశాలలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. సంబేపల్లె మండలం శెట్టిపల్లె హరిజనవాడ పాఠశాలలో పని చేస్తున్న ఉపాధ్యాయుడు కులశేఖర్రెడ్డి అదే గ్రామానికి చెందిన మహిళపై లైంగిక వేధింపులకు పాల్పపడ్డారని ఆరోపించారు. ఈ విషయంమై స్థానికులు బహిరంగంగా నిలదీశారని తెలిపారు. అయినా విద్యాశాఖ అధికారులు మాత్రం స్పందించకుండా శాఖ పరమైన చర్యలు తీసుకోవడం లేదని విమర్శించారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఆయనపై శాఖపరమైన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో నాయకులు రాజేష్, కుమార్, ఇర్షాద్ పాల్గొన్నారు. -
టీడీపీ నేత కనుసన్నల్లో జూదశాల
బద్వేలు అర్బన్ : సాంకేతిక పరిజ్ఞానాన్ని వక్రమార్గంలో ఉపయోగిస్తూ అమాయకులను మోసం చేస్తున్న ఒక ఘరానా హైటెక్ జూదశాల గుట్టును వైఎస్సార్ కడప జిల్లా బద్వేలు అర్బన్ పోలీసులు రట్టు చేశారు. అయితే బుధవారం పోలీసులు వెలుగులోకి తెచ్చిన ఈ తెలుగుగంగ కాలనీ రోడ్డులోని జూదగృహం వెనుక స్థానిక అధికార పార్టీ రాజకీయ హస్తం ఉండటం నియోజకవర్గంలో తీవ్ర కలకలం రేపుతోంది. ఈ కేసులో ప్రధాన నిందితుడైన పుంగనూరు శ్రీకాంత్ ఆ ప్రాంతానికి చెందిన ఒక ప్రముఖ టీడీపీ నాయకుడని, కొన్ని నెలల క్రితం వరకు సదరు పార్టీ ముఖ్యనేతకు అత్యంత ప్రధాన అనుచరుడిగా చలామణి అయ్యాడని తేలింది. అంతేకాకుండా ఇతను బద్వేలు అర్బన్ పోలీసుస్టేషన్లో రౌడీషీటర్గా కూడా నమోదై ఉన్నాడు. రాజకీయ అండతోనే అక్రమ సామ్రాజ్యం రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తనకు రాజకీయ అండదండలు మెండుగా ఉండటంతోనే శ్రీకాంత్ తన ఇంట్లో ఏకంగా అక్రమ జూదసామ్రాజ్యాన్ని సృష్టించినట్లు స్థానికంగా బలంగా ప్రచారం జరుగుతోంది. చుట్టుపక్కల జిల్లాల నుండి వచ్చే జూదరుల కోసం ఈ జూదశాలలో మందు, విందు వంటి అన్నీ సౌకర్యాలను అక్కడే అందుబాటులో ఉంచి.. ఒక మినీ క్లబ్ను తలపించేలా ఏర్పాట్లు చేసినట్లు విశ్వసనీయ సమాచారం. వైన్షాపుల నుండి పెద్ద ఎత్తున మద్యం, బీరు బాటిళ్లను కొనుగోలు చేసి అక్కడకు వచ్చే వారికి అధిక ధరలకు విక్రయిస్తూ అక్రమంగా సొమ్ము చేసుకుంటున్నట్లు పోలీసులు గుర్తించారు. కువైట్ డివైజ్లతో ఘరానా మోసం మైదుకూరు డీఎస్పీ జి.రాజేంద్రప్రసాద్ వెల్లడించిన వివరాల ప్రకారం.. నిందితులు కువైట్ నుండి ఆన్లైన్ ద్వారా ప్రత్యేకమైన ఎలక్ట్రానిక్ స్కానింగ్ డివైజ్లు, బ్లూటూత్ పరికరాలు, డిజిటల్ ఇయర్ఫోన్లు కొనుగోలు చేశారు. జూదం కోసం ప్రత్యేక కోడింగ్ ఉన్న పేకముక్కలను తెప్పించారు. ఆట ప్రారంభానికి ముందే పేకముక్కలను ఎలక్ట్రానిక్ స్కానింగ్ డివైజ్ ద్వారా స్కాన్ చేసి, ఆట సమయంలో ఏ పేకముక్క లోపల పడుతుందో, ఏది బయట పడుతుందో డిజిటల్ ఇయర్ఫోన్ల ద్వారా ముందే తెలుసుకునేవారు. ఇలా ’మంగతాయి’ జూదం ఆడడానికి వచ్చే అమాయకులను పక్కా ప్లాన్తో మోసం చేస్తూ లక్షలాది రూపాయలు దోచుకునేవారు. 9 మంది అరెస్ట్.. రూ.40,500 స్వాధీనం విశ్వసనీయ సమాచారంతో బద్వేలు అర్బన్ ఎస్ఐలు యు.వై.జయరాములు, ఎం.రంగారావు తమ సిబ్బందితో సదరు ఇంటిపై దాడి చేసి ప్రధాన నిందితుడు పుంగునూరు శ్రీకాంత్తో పాటు షేక్ అబీద్, నూతి శ్రీను, పాల వెంకటరమణ, నారుబోయిన సాంబయ్య, చిలుమూరు శివారెడ్డి, మాబు రసూల్, పుంగనూరు రామకృష్ణ, ఉండ్రా హరిలను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుండి రూ.40,500 నగదు, మూడు ఐఫోన్ మోడల్ స్కానింగ్ పరికరాలు, మూడు డిజిటల్ ఇయర్ ఫోన్లు, రెండు బ్లూటూత్ పరికరాలు, పేకముక్కలతో పాటు 35 మద్యం బాటిళ్లను స్వాధీనం చేసుకున్నారు. పక్కా సమాచారంతో ఈ ముఠాను పట్టుకున్న పోలీస్ సిబ్బందిని జిల్లా ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. మినీ క్లబ్ను తలపించేలా ఏర్పాట్లు కేసులో ప్రధాన నిందితుడు అర్బన్ పోలీస్ స్టేషన్ రౌడీషీటర్ పుంగనూరు శ్రీకాంత్ అధికార అండదండలతోనే గుట్టుచప్పుడు కాకుండా సాగుతున్న అక్రమ జూదగృహం ఎలక్ట్రానిక్ స్కానింగ్ డివైజ్లతో ఘరానా మోసం.. 9 మంది ముఠా సభ్యుల అరెస్ట్ -
నేటి నుంచి తాళ్లపాకలో పవిత్రోత్సవాలు
రాజంపేట: శ్రీ సిద్దేశ్వరస్వామి ఆలయంలో బుధవారం నుంచి పవిత్రోత్సవాలు తిరుమల తిరుపతి దేవస్ధానం నిర్వహిస్తోంది. మంగళవారం రాత్రి పవిత్రోత్సవాలకు అంకురార్పణ కార్యక్రమాలను నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, వాస్తుమండలపూజ, మేధిని పూజ, మృత్సంగ్రహణం, వేదికా అర్చన, యాగశాల పూజ, అగ్నిప్రతిష్ట, బలిహరణ, హరితతో పాటు పలు పూజకార్యక్రమాలు నిర్వహించారు. 3న గురువారం పరివార దేవతలకు గ్రంధి పవిత్ర సమర్పణతో పాటు వివిధ రకాల పూజలు, హోమాలు నిర్వహించనున్నారు. అదేరోజు సాయంత్రం పట్టుపవిత్ర సమర్పణ కార్యక్రమాలను నిర్వహించనున్నారు. 4న మహాపూర్ణహుతి, కలశ ఉద్వాసన, వ్రతాచరణ, మహానివేదనం తదితర పూజకార్యక్రమాలను నిర్వహిస్తారు. అదే రోజు సాయంత్రం గ్రామోత్సవం నిర్వహించనున్నారు. -
మరపురాని మహానేత వైఎస్సార్
● రాజన్న సేవలను స్మరించుకున్న జిల్లా ప్రజలు ● మదనపల్లెలో వైఎస్ఆర్ విగ్రహానికి ఎంపీ మిథున్ రెడ్డి నివాళి ● రాయచోటిలో వైఎస్ఆర్ విగ్రహాలకు జలాభిషేకం ● వాల్మీకిపురం, తంబళ్లపల్లెలో అన్నదానం సాక్షి, మదనపల్లె: దివంగత సీఎం వైఎస్.రాజశేఖర్ రెడ్డి మరపురాని మహానేత అని జిల్లా ప్రజలు, వైఎస్సార్సీపీ నేతలు స్మరించుకున్నారు. బుధవారం వైఎస్సార్ 17వ వర్ధంతిని పురస్కరించుకొని ఆయన విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. పలుచోట్ల అన్నదానాలు నిర్వహించారు. ఆయన పాలనలో జరిగిన అభివృద్ధిని గుర్తుకు తెచ్చుకున్నారు. వైఎస్సార్ మానవీయ నేత ప్రభుత్వ పాలనలో మానవీయతను ఆవిష్కరించిన మహానేత వైఎస్.రాజశేఖర్ రెడ్డి ప్రజల హృదయాల్లో చిరస్థాయిగా నిలిచిపోయారని వైఎస్సార్సీపీ లోక్సభ పక్షనేత, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నారు. వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఆయన మదనపల్లె తట్టివారిపల్లెలోని వైఎస్సార్ విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. జిల్లాలో సాగు, తాగునీటి కోసం ఆయన చేపట్టిన ప్రాజెక్టులు రైతాంగ జీవితాల్లో మార్పు తీసుకొచ్చాయన్నారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే దేశాయి తిప్పారెడ్డి, సమన్వయకర్త నిసార్ అహ్మద్, మహిళా విభాగం జిల్లా అధ్యక్షురాలు షమీం అస్లాం, పరిశీలకులు జింక చలపతి, మున్సిపల్ మాజీ చైర్మన్ వి.మనూజ పాల్గొన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. మూడు ప్రాజెక్టుల నీటితో జలాభిషేకం ● రాయచోటి నియోజకవర్గంలో వైఎస్సార్ నిర్మించిన వెలిగల్లు, శ్రీనివాసపురం, ఝరికోన రిజర్వాయర్ల నీటితో మాజీ ఎమ్మెల్యే, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ ఆధ్వర్యంలో చిన్నమండ్యంలో శ్రీనివాసపురం నీటితో, గాలివీడులో వెలిగల్లు నీటితో, శెట్టిపల్లిలో ఝరికోన నీటితో వైఎస్ఆర్ విగ్రహాలకు జలాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వైఎస్సార్ మూడు రిజర్వాయర్లు నిర్మించడం వల్ల రైతాంగానికి సాగునీరు, ప్రజలకు తాగునీటి సమస్య తీరిందని అన్నారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు వైఎస్ఆర్ విగ్రహాలకు పూలమాలలతో నివాళులర్పించారు. ● పీలేరు నియోజకవవర్గం వాల్మీకిపురంలో మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి వైఎస్సార్కు నివాళులర్పించారు. పేదలకు అన్నదానం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సంక్షేమం, అభివృద్దికి వైఎస్సార్ బాటలు వేశారని కొనియాడారు. నియోజవర్గంలోని గుర్రంకొండ, పీలేరు, కలికిరి, కలకడ, కెవిపల్లె మండలాల్లో కార్యక్రమాలు జరిగాయి. ● పుంగనూరులో రాజన్న విగ్రహానికి మాజీ ఎంపీ రెడ్డప్ప, మాజీ చైర్మన్ అలీమ్ బాషా, మైనార్టీ విభాగం రాయలసీమ ఇన్చార్జి ఫక్రుద్దీన్ షరీఫ్ పూలమాల వేసి నివాళులర్పించారు. నియోజకవర్గంలోని అన్ని మండలాల్లోనూ కార్యక్రమాలు నిర్వహించారు. ● తంబళ్లపల్లె నియోజకవర్గంలోని బి.కొత్తకోట, ములకలచెరువు, కురబలకోట, పీటీఎం, పెద్దమండ్యం, తంబళ్లపల్లె మండలాల్లో పార్టీ నేతలు, కార్యకర్తలు, ప్రజలు వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించారు. తంబళ్లపల్లెలో వైఎస్సార్సీపీ నాయకులు నల్లగుండ్ల మల్లికార్జునరెడ్డి ప్రజలకు బిరియాని ప్యాకెట్లు పంపిణీ చేశారు. ● మదనపల్లె నియోజకవర్గంలోని రామసముద్రం, మదనపల్లెరూరల్, నిమ్మనపల్లె మండలాల్లో వైఎస్సార్ విగ్రహాలకు నివాళులర్పించారు. -
జిల్లా సమగ్రాభివృద్ధికి కృషి చేయాలి
● క్షేత్రస్థాయిలో సమస్యలపై స్పందించండి ● ఎల్నినో అధిగమించేందుకు చర్యలు ● దిశ సమావేశంలో చైర్మన్, ఎంపీ మిథున్ రెడ్డి సాక్షి, మదనపల్లె: ప్రభుత్వ శాఖల అధికారులు సమన్వయంతో జిల్లా అభివృద్ధికి కృషి చేయాలని జిల్లా అభివృద్ధి సమన్వయ, పర్యవేక్షణ కమిటీ (దిశ) చైర్మన్, రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్ రెడ్డి అన్నారు. బుధవారం ఆయన అధ్యక్షతన స్థానిక కలెక్టరేట్లో కలెక్టర్ నిశాంత్ కుమార్, జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు, సీఈవో రవినాయుడుతో కలసి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎంపీ కేంద్ర ప్రభుత్వ పథకాలతో జిల్లాలో జరుగుతున్న కార్యక్రమాలు, వాటి పనితీరు, అధికారుల పర్యవేక్షణ, ప్రజలకు లభిస్తున్న ఫలితాలపై సమీక్షించారు. అధికారులు పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా మిథున్ రెడ్డికి వివిధ అంశాలను వివరించారు. వీటిని పరిశీలించిన మిథున్ రెడ్డి వివిధ అంశాలపై అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పథకాలు ప్రజలకు అందినప్పుడే పేదరిక నిర్మూలన, ఆర్థిక ప్రగతి సాధ్యమవుతుందన్న విషయాన్ని ప్రతి అధికారి గుర్తించాలన్నారు. పథకాల ద్వారా ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పు తేగలిగితే సమాజాభివృద్ధి సాధ్యమవుతుందన్నారు. దీనికోసం జిల్లా అధికారులు సమన్వయంతో వ్యవహరించాలని కోరారు. గత సంవత్సరాలతో పోలిస్తే ప్రస్తుత సంవత్సరంలో ఉపాధి పనిదినాలు తగ్గడానికి కారణాలను పరిశీలించి, పని దినాలను పెంచే విధంగా కార్యాచరణ చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్లో పెండింగ్లో ఉన్న తాగునీటి పనులు, బిల్లుల సమస్యను పరిష్కరించాలన్నారు. పీలేరు, ఇతర ప్రాంతాల్లో ఖాళీ ఇళ్ల ప్లాట్లను గుర్తించి ఆక్రమణలు, అనధికార లావాదేవీలకు అవకాశం లేకుండా పరిరక్షించాలని, రెవెన్యూ అధికారులు అర్హులైన లబ్ధిదారులకు స్థలాలు ఇచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ఎల్నినో ప్రభావం నెలకొందని, దీన్ని ఎదుర్కొనేందుకు ఎక్కడ నీటి సమస్య ఉన్న తక్షణమే స్పందించాలని అధికారులను సూచించారు. పాడి రైతులకు దాణా సరఫరా, పశువులకు గడ్డి, తాగునీటి సమస్యల పరిష్కారం జరగాలన్నారు. దీనికోసం తమ పరిధిలో సహకారం అందించేందుకు సిద్ధంగా ఉన్నామని పేర్కొన్నారు. జిల్లాలో కరువు పరిస్థితులతో మామిడి తోటలు ఎండిపోతున్నాయని వాటికి ట్యాంకర్లతో నీటిని అందించే విధంగా ప్రభుత్వానికి ప్రతిపాదన పంపాలని అధికారులను కోరారు. పరిష్కారంలో జాప్యం వద్దు: కలెక్టర్ ప్రజా ప్రతినిధులు తమ దృష్టికి తెచ్చే భూసేకరణ, బిల్లుల చెల్లింపులు, కొత్త అనుమతులు, సీఎస్ఆర్ నిధులు, రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల వద్ద పెండింగ్లో ఉన్న అంశాలను అధికారులు పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ ఆదేశించారు. శాఖల పనితీరుపై పర్యవేక్షణ ఉండాలని, అవినీతి, అక్రమాలకు అవకాశం ఇవ్వకూడదని స్పష్టం చేశారు. నిధుల దుర్వినియోగంపై కఠిన చర్యలుంటామని హెచ్చరించారు. దిశ సమావేశం అనంతరం ఆర్డీఎస్ఎస్ పథకం చైర్మన్గా ఎంపీ మిథున్రెడ్డి విద్యుత్ శాఖ సమావేశం నిర్వహించారు. పెండింగ్లో ఉన్న దరఖాస్తులు, వ్యవసాయ విద్యుత్ కనెక్షన్లు, ప్రధానమంత్రి సూర్యఘర్ పథకం అమలుపై సమీక్షించారు. ప్రజా ప్రతినిధుల నుంచి వచ్చే ప్రజా సమస్యలపై వినతులను అధికారులు సీరియస్గా పరిగణించి, నిర్ణీత సమయంలో చర్యలు తీసుకోవాలని ఎంపీ స్పష్టం చేశారు. తాగునీటికి నిధులు ఇస్తా దిశ సమావేశం అయ్యాక మిథున్ రెడ్డి మీడియాతో మాట్లాడుతూ జిల్లాలో దారుణమైన కరువు పరిస్థితులు నెలకొన్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. దీనికోసం సత్వరమే చర్యలు చేపట్టాల్సి ఉందని అన్నారు. ప్రభుత్వం పశువులకు గడ్డి, దాణా సరఫరా చేయాలని ప్రభుత్వాన్ని కోరారు. తాగునీటి సమస్యలు అధికమవుతున్న కారణంగా నీటి కోసం తన ఎంపీ నిధుల నుంచి మెజార్టీ నిధులతోపాటు సీఎస్ఆర్ నిధులను తెప్పించి తాగునీటి కోసం అందిస్తానని వివరించారు. -
మెరుగైన ఉపాధి అవకాశాలు
సదుం: వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో డిప్లొమా చేసిన విద్యార్థులకు మెరుగైన ఉపాధి అవకాశాలు ఉంటాయని ప్రిన్సిపల్ ఇందుమతి తెలిపారు. స్థానిక ఎస్వీ ప్రభుత్వ వెటర్నరీ పాలిటెక్నిక్ కాలేజీలో ప్రస్తుత బ్యాచ్ విద్యార్థుల వీడ్కోలు, నూతన విద్యార్థల స్వాగత కార్యక్రమం బుధవారం ఘనంగా నిర్వహించారు. డిప్లొమా చేసిన విద్యార్థులు ఇరవై ఏళ్ల వయస్సుకే ఉపాధి పొందవచ్చని ఆమె చెప్పారు. ముఖ్య అతిథిగా హాజరైన అసిస్టెంట్ వెటర్నరీ సర్జన్ అరుణ్ మాట్లాడుతూ గ్రామీణ ప్రాంత యువత కోసం ప్రవేశ పెట్టిన కోర్సులను సద్వినియోగం చేసుకోవాలన్నారు. అనంతరం క్రీడలలో ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు పంపిణీ చేశారు. సూపరింటెండెంట్ మునికృష్ణయ్య, సిబ్బంది పాల్గొన్నారు. ఖాళీల భర్తీకి దరఖాస్తుల ఆహ్వానంరాజంపేట: నవోదయ విద్యాలయంలో 2027–28 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ఖాళీగా ఉన్న సీట్లను భర్తీ చేయుటకు ప్రవేశ ప్రకటన విడుదల చేసినట్లు ప్రిన్సిపాల్ ఎస్.అబ్ధుల్ రహిమాన్ ఒక ప్రకటనలో తెలిపారు. ప్రభుత్వ లేదా ప్రభుత్వ గుర్తింపు పొందిన పాఠశాలల(అన్నమయ్య, వైఎస్సార్ కడప)కు 2026–27 విద్యసంవత్సరంలో 8 వతరగతి 11వ తరగతి చదువుతున్న విద్యార్ధుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. ప్రవేశపరీక్ష వచ్చే ఏడాది ఏప్రిల్ 10వ తేదీన నిర్వహిస్తామన్నారు. దరఖాస్తులను పంపుటకు ఈ నెల 30వ తేదీని గడువుగా నిర్ణయించామన్నారు. క్రీడాభారతి పరీక్షకు రిజిస్ట్రేషన్ చేసుకోవాలి మదనపల్లె సిటీ: క్రీడాభారతి అనే కేంద్ర సంస్థ క్రీడా జ్ఞాన పరీక్షను నిర్వహిస్తున్ననట్లు జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్బాబు తెలిపారు. ఈ పరీక్షను ప్రభుత్వ, ప్రైవేటు, కాలేజీ విద్యార్థులు రూ.20లతో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. రిజిస్ట్రేషన్ను సెప్టెంబర్ 4వతేదీలోగా పూర్తి చేసుకోవాలన్నారు. ఈ నెల 6వతేదీ ఆదివారం ఉదయం 5 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సెల్ఫోన్, కంప్యూటర్, లాప్టాప్, టాబ్లలో ఆన్లైన్లో పరీక్షలు రాయవచ్చునన్నారు. దక్షిణ మధ్య కేంద్రంలో మొదటి స్థానం సాధించిన విద్యార్థికి రూ.లక్ష, ద్వితీయ స్థానం పొందిన ఇద్దరికి రూ.50 వేలు, మూడవ స్థానం 5 మందికి రూ.25 వేలు, నాల్గవ స్థానం సాధించిన 11 మందికి రూ.11 వేలు అందజేస్తారన్నారు. మరిన్ని వివరాలకు 9885055402ను సంప్రదించాలని సూచించారు. -
ప్రజల గుండెల్లో వైఎస్ఆర్ది ఎన్నటికీ చెరగని స్థానం
వేంపల్లె : కోట్లాదిమంది తెలుగు ప్రజల గుండెల్లో దివంగత మాజీ ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖర్ రెడ్డిది ఎన్నటికీ చెరగని స్థానమని ఏపీసీసీ చీఫ్ వైఎస్ షర్మిలారెడ్డి అన్నారు. బుధవారం దివంగత నేత డాక్టర్ వైఎస్ఆర్ 17వ వర్ధంతి సందర్భంగా ఇడుపులపాయ వైఎస్ఆర్ ఘాట్ వద్ద తల్లి విజయమ్మ, కుటుంబ సభ్యులతో కలిసి ఘన నివాళులర్పించారు. అనంతరం అక్కడే ఉన్న వైఎస్ఆర్ విగ్రహానికి నమస్కరించుకున్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ డాక్టర్ వైఎస్ఆర్ ప్రవేశపెట్టిన విప్లవాత్మక సంక్షేమ పథకాలు నేటికీ చెరపని ముద్ర అని, దేశ చరిత్రలో సువర్ణ అక్షరాలతో లిఖించే అధ్యాయమని పేర్కొన్నారు. -
వైఎస్సార్సీపీతోనే క్రిస్టియన్ల అభివృద్ధి
సాక్షి, మదనపల్లె: రాష్ట్రంలో క్రిస్టియన్ మైనార్టీల అభివృద్ధి, సంక్షేమం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీతోనే సాధ్యమని ఆ పార్టీ క్రిస్టియన్ మైనారిటీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ అన్నారు. బుధవారం స్థానిక పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త నిసార్ అహ్మద్తో కలిసి జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. మైనారిటీ వర్గాల సంక్షేమం, విద్య, ఉపాధి, స్వయం ఉపాధి, సామాజిక భద్రత తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా చర్చించారు.ఈ సందర్భంగా జాన్ వెస్లీ మాట్లాడుతూ.. క్రిస్టియన్ మైనారిటీల సమస్యలను క్షేత్రస్థాయిలో తెలుసుకుని, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నట్లు తెలిపారు. దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి మైనారిటీల సంక్షేమానికి అగ్రతాంబూలం ఇచ్చారని కొనియాడారు. ఆయన చూపిన సంక్షేమ బాట, సామాజిక న్యాయం, మానవతా విలువలను వైఎస్ జగన్మోహన్రెడ్డి మరింత ముందుకు తీసుకెళ్తున్నారని స్పష్టం చేశారు. పేద క్రైస్తవ కుటుంబాల విద్యార్థులు, యువతకు అందాల్సిన ప్రభుత్వ సంక్షేమ పథకాలు పూర్తిస్థాయిలో చేరేలా పార్టీ నాయకులు, కార్యకర్తలు ప్రజల్లో అవగాహన కల్పించాలని పిలుపునిచ్చారు. పార్టీ సమన్వయకర్త నిసార్ అహ్మద్ మాట్లాడుతూ.. క్రైస్తవులు విద్యా, వైద్య రంగాలలో ఎనలేని సేవలు అందిస్తున్నారని, సమాజంలో వారికి ఒక ప్రత్యేక స్థానం ఉందన్నారు. జిల్లాలో క్రిస్టియన్ మైనారిటీలు ఎదుర్కొంటున్న సమస్యలను గుర్తించి, వాటిని సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, ప్రజా సమస్యలపై నిరంతరం పోరాటం చేయాలని కోరారు. జిల్లా క్రిస్టియన్ మైనారిటీ సెల్ అధ్యక్షుడు పాల్ చంద్రశేఖర్ మాట్లాడుతూ.. పార్టీని క్షేత్రస్థాయిలో మరింత బలోపేతం చేసి, క్రిస్టియన్ల సమస్యలను పార్టీ అగ్ర నాయకత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కారానికి కృషి చేస్తామన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డిని మళ్లీ ముఖ్యమంత్రిని చేసుకోవడమే లక్ష్యంగా పనిచేస్తామని వెల్లడించారు. జిల్లా కార్యదర్శి రాజేష్ మాట్లాడుతూ.. క్రిస్టియన్ మైనారిటీల సంక్షేమం కోసం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని భరోసా ఇచ్చారు. ఈ కార్యక్రమంలో మునిసిపల్ మాజీ వైస్ చైర్మన్ జింకా చలపతి, పార్టీ నాయకులు వీఎస్.రెడ్డి, ఎల్.రఘునాథ రెడ్డి, ఎస్.కె.ఇర్ఫాన్, షానవాజ్, ఆవుల మల్లికార్జునలతో పాటు క్రిస్టియన్ మైనారిటీ నాయకులు మయూర్, మేరీ, రిచర్డ్స్, విజయ్, అజయ్, నాగమణి, అమ్మాజాన్, శ్రీనివాసులు, ముజీబ్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా కార్యవర్గ సమావేశంలో రాష్ట్ర అధ్యక్షుడు జాన్ వెస్లీ -
సీటీఎంలో రూ.30 కోట్ల దేవాదాయ భూములు కబ్జా
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని సీటీఎంలో సుమారు రూ.30 కోట్ల విలువైన అరెకరాల దేవాదాయ భూములు కబ్జాకు గురైనట్లు దర్యాప్తులో నిర్ధారించినట్లు దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ తెలిపారు. బుధవారం ఆయన మదనపల్లెలో నిర్వహించిన మీడియా సమావేశంలో మాట్లాడాతూ.. శ్రీ ఆంజనేయ స్వామి మాన్యానికి చెందిన భూములను కబ్జా చేసి విక్రయించడంతో పాటు పూలు, పండ్ల తోటలు సాగు చేస్తూ విక్రయించి వ్యాపారాలు నిర్వహిస్తున్నారని, దేవుని భూమిలో అక్రమ నిర్మాణాలు చేపట్టినట్లు తెలిపారు. ఈ అంశంపై సాక్షి పత్రికలో వరుస కథనాలు ప్రచురించి వాస్తవాలను వెలుగులోకి తీసుకురావడంతో దేవాదాయ భూమిని కాపాడేందుకు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. తమ శాఖ పరిశీలనతో పాటు దర్యాప్తులోనూ సాక్షి కథనాల్లో పేర్కొన్న సర్వే నంబర్ల ఆధారంగా సుమారు రూ. 30 కోట్ల భూమి కబ్జా జరిగిందన్నారు. ఆ భూమి విస్తీర్ణం ఆరు ఎకరాలు ఉన్నట్లు గుర్తించి, కబ్జాకు గురైనట్లు నిర్ధారించామన్నారు. భూ కబ్జాదారులపై కఠిన చర్యలు తీసుకోవడంతో పాటు అక్రమ రిజిస్ట్రేషన్లు, పట్టాదారు పాస్పుస్తకాలను రద్దు చేయించి, దేవాదాయ భూములను తిరిగి స్వాధీనం చేసుకుంటామని విశ్వనాథ్ స్పష్టం చేశారు.నిర్ధారించిన జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ -
పట్టుకొన్నారు.... వదిలేశారు...!
● 10 ట్రాక్టర్లు, 3 జెసీబీలను వదిలేసిన అధికారులు ● ఇన్ని రోజులు లేని రూల్స్ ఇప్పుడు వచ్చాయా అంటున్న స్థానికులుచౌడేపల్లె : అనుమతులు లేకుండా చెరువుల్లోని మట్టిని తరలించడానికి వీల్లేదంటూ తహసీల్దార్ ఆదేశాల మేరకు రెవెన్యూ అధికారులు బుధవారం ఆమినిగుంట చెరువులోకి వెళ్లి డిప్యూటీ తహసీల్దార్ దొరస్వామి, ఆర్ఐ భరత్తో పాటు వీఆర్ఓ, వీఆఽర్ఏలు హడావుడి చేశారు. చెరువులోకి వెళ్లి వాహనాలను అడ్డుకొని 10 ట్రాక్టర్లను, 3 జెసీబీలను స్వాధీనం చేసుకొని తహసీల్దార్ కార్యాలయం వద్దకు తరలించేందుకు బయలుదేరారు. ఇంత వరకు బాగానే ఉన్నా.. తీరా వాహనాలు కార్యాలయం వద్దకు చేరకముందే దారి మధ్యలో నుంచే మళ్లించేశారు. ఇదంతా తెలిసినా తహసిల్దార్ పార్వతి చేసేదేమీ లేక పోలీసులను ఆశ్రయించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఈ ఘటనతో ఇన్నాళ్లు మట్టి దందా సాగినా పట్టించుకోని అధికారులు ఇప్పుడు నిద్రమెల్కొన్నారేమో, ఇన్నాళ్లు లేని రూల్స్ ఇప్పుడు వచ్చాయా...? మీ కథ చూస్తా అంత నిజాయితీగా రెవెన్యూ అధికారులు పనిచేస్తున్నారా..? అంటూ అధికార పార్టీకి చెందిన ఓ నాయకుడు ఆగ్రహం వ్యక్తం చేయడంతో ఆధికారులు గప్చుప్ అయ్యారు. చెరువు నుంచి స్వాధీనం చేఽసుకొని తీసుకొచ్చిన వాహనాలను వదిలేశారని సమాచారం. నాయకుడి ఆదేశాలతో అధికారులందరూ నోరెత్తకపోగా మిన్నకుండిపోయారు. అలాంటప్పుడు చెరువులోకి వెళ్లి రెవెన్యూ అధికారులు హడావుడి చేయాల్సిన అవసరమేముందని బహిరంగంగానే చర్చ నడుస్తోంది. అధికారులు నిజాయితీ పని చేస్తే ఇలా ఎందుకు జరుగుతుందని స్థానికుల నుంచి విమర్శలు వెలువెత్తాయి. అధికార బలం ఉంటే ఒక న్యాయం, సామాన్యులకు మరో న్యాయం ఏమిటని అధికారుల తీరుపై మండిపడుతున్నారు. అనుమతి లేనిదే మట్టి తరలించేందుకు వీల్లేదంటూ తహసీల్దార్ పార్వతి హెచ్చరికలు జారీ చేయడం గమనార్హం. -
కేబుల్ తీగల చోరీ
సదుం : బోరు కేబుల్ తీగలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేసిన సంఘటన మండలంలో మంగళవారం రాత్రి జరిగింది. బాధిత రైతుల కథనం మేరకు.. ఊటుపల్లె పంచాయతీ తుమ్మగుంటపల్లె సమీపంలోని పొలాల వద్ద రమణయ్య, కృష్ణయ్య, జనార్ధన, బసవయ్య, అశోక్, నాగలక్ష్మీ, రెడ్డెప్ప తదితరులకు చెందిన మోటర్ కేబుళ్లు చోరీకి గురయ్యాయి. వాటి విలువ సుమారు రూ. 20 వేలు ఉంటుందని తెలిపారు. పోలీసులకు ఫిర్యాదు చేయనున్నట్లు చెప్పారు. పాము కాటుతో రైతుకు అస్వస్థత మదనపల్లె టౌన్ : పొలం పనులు చేస్తుండగా రైతును పాము కాటేయడంతో తీవ్ర అస్వస్థతకు గురైన ఘటన కురబలకోట మండలంలో బుధవారం చోటు చేసుకుంది. మండలంలోని తుంగవారిపల్లికి చెందిన గోపాలు (65) ఉదయం పొలంలో పనులు చేస్తుండగా పాము కాటేసింది. దీంతో ఆయన కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు కుటుంబ సభ్యులకు సమాచారమిచ్చారు. 108 వాహనంలో మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అత్యవసర విభాగ వైద్యులు పరీక్షించి ప్రథమ చికిత్స అందించారు. ప్రస్తుతం ఆయన ప్రాణాపాయం నుంచి బయటపడి కోలుకుంటున్నట్లు వైద్యులు తెలిపారు. 8 మంది జూదరులు అరెస్టుమదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం కొండామారిపల్లి పంచాయతీ పరిధిలోని ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో లారీలో జూదమాడుతున్న వారిని తాలూకా పోలీసులు బుధవారం అరెస్టు చేశారు. సీఐ కళా వెంకటరమణ వివరాల ప్రకారం.. కొండామారిపల్లె సమీపంలోని బైపాస్ రోడ్డు ఆర్ కన్వెన్షన్ హాల్ సమీపంలో లారీలో జూదమాడుతున్నట్లు సమాచారం రావడంతో డీఎస్పీ బుచ్చి రాజు ఆదేశాలతో ఎస్ఐ విష్ణు నారాయణ, పోలీసు సిబ్బందితో కలిసి ఆకస్మిక దాడులు నిర్వహించామన్నారు. ఈ దాడుల్లో ఎనిమిది మందిని అదుపులోకి తీసుకుని, వారి నుంచి రూ.18 వేల నగదు స్వాధీనం చేసుకుని, లారీని సీజ్ చేశామని తెలిపారు. నిందితులపై కేసు నమోదు చేసి అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పెన్నానదిలో మృతదేహంప్రొద్దుటూరు క్రైం : ప్రొద్దుటూరు శివారులోని రామేశ్వరం గంగమ్మ ఆలయం వెనుక పెన్నానది నీటి కుంటలో గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని బుధవారం రూరల్ పోలీసులు గుర్తించారు. ఎస్ఐ శ్రీకాంత్ ఘటనా స్థలానికెళ్లి మృతదేహాన్ని పరిశీలించారు. మృతుడికి సుమారు 40 ఏళ్లు ఉంటాయని ఎస్ఐ తెలిపారు. అతను రెండు, మూడు రోజుల క్రితం నీటిలో పడి ఉండొచ్చని భావిస్తున్నారు. మృతుడికి సంబంధించిన వివరాల కోసం అన్వేషిస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
పైపులైన్ పనులను అడ్డుకున్న బీజేపీ నేతలు
చక్రాయపేట : కుప్పంకు తాగునీటి కోసం తవ్వుతున్న పైపులైన్ పనులను బుధవారం బీజేపీ నేతలు అడ్డుకున్నారు. రైతుల అనుమతి లేకుండా వారికి పరిహారం చెల్లించకుండా వారి పట్టా భూముల్లో ఎలా పనులు చేస్తారంటూ మండి పడ్డారు. కుప్పంకు తాగునీటి కోసం పైపులైను కోసం తవ్వుతున్న కాలువపై సాక్షిలో ‘కుప్పంకు తాగునీరట.. చట్టాలను ఒప్పుకోరట’ అనే కథనం వెలువడింది. దీనిపై బీజేపీ నేతలు స్పందించారు. బీజేపి కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కె.రామ చంద్రారెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అధికార ప్రతినిధి గాలి హరి ప్రసాద్లు ఆపార్టీ నాయకులు రైతులతో కలసి పనులు జరుగుతున్న ప్రాంతానికి చేరుకున్నారు. ఈసందర్భంగా భూసేకరణ చేయకుండా.. రైతులకు తెలియ కుండా దౌర్జన్యంగా పట్టా భూముల్లో ఎలా పైపులైన్ కోసం కాలువ తవ్వుతారని మండి పడ్డారు. అనంతరం వారు తహశీల్దారు విజయకుమారిని కలిసి వినతి పత్రం సమర్పించారు. అనంతరం వారు విలేకరులతో మాట్లాడుతూ సుమారు 85 శాతం మేర పనులు పూర్తయి అర్ధాంతరంగా ఆగిపోయిన మండలంలోని కాలేటి వాగు ప్రాజక్టు పనులు పూర్తి చేయక పోవడం దారుణమని చెప్పారు. కార్యక్రమంలో జిల్లా కిసాన్ మోర్చా ప్రధాన కార్యదర్శి పుష్పలత నాయక్, జిల్లా కార్యవర్గ సభ్యుడు రంగారెడ్డి, మండల కిసాన్ మోర్చా అధ్యక్షుడు దశరథ రాయల్, సీనియర్ నాయకులు లక్ష్మిరెడ్డి వేమారెడ్డి, రామ చంద్రా రెడ్డి, ఉమామహేశ్వరి, రైతులు పాల్గొన్నారు. -
ఓటర్లకు మరో అవకాశం
● కలెక్టర్ నిశాంత్ కుమార్ ● క్లెయిమ్లు, అభ్యంతరాలకు 10 వరకు గడువు పెంపు మదనపల్లె (కురబలకోట): ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ–2026లో భాగంగా క్లెయిమ్లు, అభ్యంతరాల దాఖలుకు గడువును సెప్టెంబరు 10 వరకు పొడిగించినట్లు అన్నమయ్య జిల్లా కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్కుమార్ తెలిపారు. కేంద్ర ఎన్నికల సంఘం ఆదేశాల మేరకు ప్రజలందరూ ఓటరు జాబితాలో తమ పేర్లను సరిచూసుకోవాలని ఆయన సూచించారు.అర్హులైన వారి పేర్లు జాబితాలో లేకపోయినా, వివరాల్లో ఏవైనా తప్పులున్నా.. వెంటనే సంబంధిత ఈఆర్ఓ, ఏఈఆర్ఓ లేదా బీఎల్ఓలను సంప్రదించి నిర్ణీత గడువులోగా దరఖాస్తులు సమర్పించాలన్నారు. ఈ క్లెయిమ్లు, అభ్యంతరాల పరిష్కారానికి అక్టోబరు 5 వరకు సమయం ఉంటుందని, అనంతరం అక్టోబరు 9న తుది ఓటర్ల జాబితాను ప్రచురించనున్నట్లు వెల్లడించారు. ఓటు హక్కు విషయంలో ఎలాంటి నిర్లక్ష్యం వహించకుండా, ఓటర్లు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కలెక్టర్ కోరారు. -
● మహా నివాళి
ఇడుపులపాయలో వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి అంజలి ఘటిస్తున్న వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డి, చిత్రంలో పార్టీ నేతలు కొరముట్ల, చెవిరెడ్డి తదితరులుసాక్షి, కడప : మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖర్రెడ్డి వర్ధంతి సందర్భంగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్సార్ ఘాట్కు చేరుకున్న వైఎస్ జగన్ వైఎస్సార్ సమాధి వద్ద పుష్పగుచ్ఛం ఉంచి అంజలి ఘటించారు. కొద్దిసేపు మౌనంగా కూర్చొని తండ్రిని స్మరించుకున్నారు. ఘాట్ ప్రాంగణంలో ఉన్న వైఎస్సార్ విగ్రహానికి పూలమాల వేసి నివాళులర్పించారు. అభిమానులతో పోటెత్తిన ఇడుపులపాయ ఇడుపులపాయ వైఎస్సార్ ఘాట్ ఏపీ, తెలంగాణ నుంచి వచ్చిన వైఎస్సార్ అభిమానులతో జనసంద్రమైంది. కాగా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు, ఏపీ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయలో అభిమానులు, పార్టీ నేతలతో కరచాలనం చేస్తూ కదిలారు. ఆప్యాయంగా పలుకరించారు. -
వైఎస్ఆర్... ఈ పేరు వింటే తెలుగు లోగిలి మురిసిపోతుంది.. ప్రజల గుండె గడపల్లో ఆత్మీయత ఉప్పొంగుతుంది.. మనసు మూలల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది.. ఆ పేరుకు నేనే మారుపేరంటూ ‘అభివృద్ధి’ గొప్పగా చెబుతుంది.. ఆయన చేసిన సంక్షేమానికి నేనే సాక్ష్యమంటూ ప్రతి ఊరూ సాక్షి సంతక
సాక్షి రాయచోటి : చెరగని చిరునవ్వు...తెలుగుదనం ఉట్టిపడే పంచెకట్టు... నడకలో రాజసం...నమ్ముకున్న వారిని ఆదరించే గుణం...మాట తప్పని మడమ తిప్పని నైజం...కార్మికులు, కర్షకుల కోసం పరితపించే గుణం... ఈ లక్షణాలన్నీ కలగలిపిన ఏకై క నాయకుడు డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి. ఉమ్మడి రాష్ట్ర సీఎంగా ఆయన చేసిన అభివృద్ధితో తెలుగు నేల పులకించిపోయింది. ప్రతి ఇంటా సంక్షేమం వెల్లివిరిసింది. వైఎస్సార్ హయాంలో మారిన జిల్లా స్వరూపం డాక్టర్ వైఎస్సార్ రాకతో రాయచోటి రూపురేఖలు మారాయి. కలలో కూడా నిర్మించలేమనుకున్న ఎన్నో పనులు పూర్తయ్యాయి. రహదారుల నిర్మాణం, విద్యాభివృద్ధికి కళాశాలలు మంజూరు, సాగునీటి ప్రాజెక్టులు, పక్కాగృహాలు ఇలా చెబుతూపోతే ప్రతి విభాగంలోనూ వైఎస్సార్ ముద్ర కనిపిస్తుంది. నాటి ముఖ్యమంత్రిగా వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో అనేక రంగాల్లో వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధికి ప్రత్యేకంగా కృషి చేశారు. రాయచోటి, పుంగనూరు, పీలేరు, తంబళ్లపల్లె, మదనపల్లె, రాజంపేట, రైల్వేకోడూరు ప్రాంతాల్లో అనేక అభివృద్ధి పనులు కనిపిస్తున్నాయి. వేసవిని దృష్టిలో పెట్టుకుని పీలేరులో సమ్మర్ స్టోరేజీ ట్యాంకు, జిల్లాలో లక్షకుపైగా ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణాలు, పేరెన్నికగన్న విద్యా సంస్థల ఏర్పాటు, వేలాదిమందికి రేషన్కార్డులతోపాటు పింఛన్లతో జిల్లాపై డాక్టర్ వైఎస్సార్ చెరగని ముద్ర వేశారు. జలయజ్ఞంలో పూర్తయిన తొలి ప్రాజెక్టుగా వెలిగల్లు వైఎస్సార్ హయంలో చేపట్టిన జలయజ్ఞంలో పూర్తయిన తొలి ప్రాజెక్టుగా వెలిగల్లు నిలిచింది. ముఖ్యమంత్రి హోదాలో 2008 డిసెంబరు 24వ తేదిన జాతికి అంకితం చేశారు. 4.64 టీఎంసీల సామర్థ్యంతో ఈ ప్రాజెక్టు కోసం రూ. 300 కోట్లను ప్రభుత్వం ఖర్చు చేసింది. ప్రాజెక్టు ద్వారా 24 వేల ఎకరాలకు సాగునీరు లక్ష్యం. ఇక బ్రిటీష్ కాలం నుంచి ప్రచారంలో ఉన్న ఝరికోన ప్రాజెక్టుకు వైఎస్సార్ ముఖ్యమంత్రి కాగానే రూపకల్పన దాల్చుకుంది. చిత్తూరు జిలా సరిహద్దు ప్రాంతంలోని ఝరికోన వద్ద ఈ ప్రాజెక్టును 60 కోట్ల రూపాయలతో నిర్మించారు. ఈ ప్రాజె క్టు ద్వారా 5 వేల ఎకరాలకు సాగునీటిని అందించనున్నారు. అలాగే పీలేరు నియోజకవర్గంలోని అడవిపల్లె రిజర్వాయర్ను 2.50 టీఎంసీల సామర్థ్యంతో చేపట్టారు. 5 మండలాలకు తాగు, సాగునీరే ధ్యేయంగా శ్రీనివాసపురం(నాగిరెడ్డి) రిజర్వాయర్ హంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంగా 308 కోట్ల రూపాయలతో 1.25 టిఎంసీల సామర్థ్యంతో చిన్నమండెం మండల కేంద్రం సమీపంలో నిర్మించారు. పీలేరు నియోజకవర్గం కేవీ పల్లె పరిధిలోని రెండు ప్రాజెక్టులు పూర్తి చేశారు. విద్యాపరంగా ఎంతో అభివృద్ధి రాయచోటిలో వైఎస్సార్ పాలన చేపట్టిన తర్వాత రూ. 150 కోట్ల రూపాయలతో రాయచోటిలో 5 మోడల్ పాఠశాలలను మంజూరు చేయడంతో పాటు వాటికి భవనాలను నిర్మించారు. రైల్వేకోడూరుకు సంబంధించి ప్రత్యేకంగా వైఎస్సార్ ఉద్యాన కళాశాల, ఓబులవారిపల్లెలో పాలిటెక్నిక్ కళాశాలను అందించారు. వైఎస్ఆర్ హయాంలోనే కోర్టు భవనాలకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. జిల్లాలో ఎన్నో బాలుర, బాలికల విద్యాలయాలు, కేజీబీవీలు నెలకొల్పి విద్యకు పెద్దపీట వేశారు. జిల్లా వ్యాప్తంగా సుమారు 80 వేల పైచిలుకు ఇందిరమ్మ ఇళ్ల నిర్మాణంతోపాటు రుణమాఫీ పేరుతో రూ. 200 కోట్లకు పైగా అందించి రైతులను రుణ విముక్తులను చేశారు. సొంత భూమిని దానం చేసి... దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి తన సొంత భూమిని కూడా పేద ప్రజలకు పంచి పెట్టి వారి గుండెల్లో దేవుడిగా నిలిచిపోయారు. అప్పటి ఉమ్మడి కడపజిల్లాలోని రైల్వేకోడూరు నియోజకవర్గం పెనగలూరులో 2007లో తన సొంత భూమి 304 ఎకరాలను 108 మంది ఎస్టీ కుటుంబాలకు అప్పటి ఎమ్మెల్యే ప్రభావతమ్మతో కలిసి స్వయంగా పంపిణీ చేశారు. ప్రస్తుతం ఆ భూముల్లో గిరిజనులు పంటలు పండించుకుంటూ...మామిడి పంటతో జీవనాధారం పొందుతున్నారు. వ్యవసాయ పరంగా రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్ పథకాలతో రైతుల్లో చెరగని ముద్ర వేసిన ఆరోగ్యశ్రీ, 108 పథకాల ద్వారా ప్రజల గుండెల్లో నిలిచిపోయారు. హంద్రీ–నీవాకు జీవంపోసిన వైఎస్ఆర్ 2004లో వైఎస్.రాజశేఖర్రెడ్డి ముఖ్యమంత్రి అయ్యాక హంద్రీనీవాప్రాజెక్టు పనులకు శ్రీకారం చుట్టారు. ఆయనవల్లే ఈ ప్రాజెక్టు మోక్షం కలిగి, ఏకకాలంలో ప్రాజెక్టు పనులు మొదలై ఉరకలెత్తాయి. వైఎస్ హయాంలో మొత్తం రూ.3,388.5కోట్ల బడ్జెట్ను కేటా యిస్తే రూ.4,295.1కోట్ల పనులు జరిగాయి. అంటే రూ.6,848 కోట్ల ప్రాజెక్టు విలువలో మిగిలిన పనులు రూ.2,552.9 కోట్లే. 2014లో టీడీపీ ప్రభుత్వం వచ్చాక పనులను రద్దు చేయడం, మిగులు పనులను అంచనాలను పెంచుకుని దోచుకున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొలువుదీరాక కృష్ణా జలాలను చిత్తూరు జిల్లాకు తరలించారు. అంతేగాక కుప్పానికి కృష్ణా జలాలను అందించిన ఘనత వైఎస్.జగన్దే.నీ రూపం వచ్చిపోయే ‘అల’కాదు.. తుడిచిపెట్టుకుపోవడానికి.. కళ్లు తెరిస్తే చెదిరిపోయే ‘కల’ కాదు మరచిపోవడానికి.. మా గుండె గుడిలో నీ రూపం శాశ్వతం... నీ నవ్వు.. జ్ఞాపకాలు నిత్యం పదిలం -
●నేడు ఇడుపులపాయకు మాజీ సీఎం వైఎస్ జగన్
● పార్టీ శ్రేణులకు మాజీ సీఎం వైఎస్ జగన్ ఉద్బోధ ● వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తున్న ప్రభుత్వ తీరుపై మండిపాటు ● తొలిరోజు పర్యటనలో జనంతో మమేకం ● నేడు వైఎస్సార్ ఘాట్ వద్ద నివాళి పులివెందుల : కూటమి సర్కార్ వ్యవస్థల్ని భ్రష్టు పట్టిస్తోందని.. అక్రమ కేసులతో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధించడమే పనిగా పెట్టుకుందని వైఎస్సార్ సీపీ అధినేత, మాజీ సీఎం వైఎస్ జగన్ మండిపడ్డారు. ధైర్యంగా ప్రభుత్వ కుట్రలను తిప్పికొట్టాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు. రోజులు ఎప్పుడూ ఇలానే ఉండవని.. మనకు మంచి రోజులు రానున్నాయని ధైర్యమిచ్చారు. మీ కాలర్ ఎగరేసే పరిస్థితి తీసుకొస్తామని భరోసా ఇచ్చారు. రెండు రోజుల పర్యటనలో భాగంగా మంగళవారం మధ్యాహ్నం పులివెందులలోని తన క్యాంపు కార్యాలయానికి చేరుకున్న వైఎస్ జగన్ ప్రజలతో మమేకమయ్యారు. ఈ సందర్భంగా వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన కార్యకర్తలు, నాయకులు, ప్రజలను పేరు పేరునా ఆప్యాయంగా పలకరించారు. వారి యోగక్షేమాలను తెలుసుకుంటూ సమస్యలను సావధానంగా ఆలకించారు. ఈ సందర్భంగా అక్రమ కేసులు బనాయిస్తున్నారని పలువురు కార్యకర్తలు వాపోయారు. అందుకు స్పందించిన వైఎస్ జగన్ ఈ ప్రభుత్వం పోలీసు వ్యవస్థనే కాక అన్ని వ్యవస్థలను భ్రష్టు పట్టిస్తోందన్నారు. అధికారంలోకి వస్తే ప్రజలకు మేలు చేయాలి కానీ, కీడు చేయకూడదన్నారు. తమ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు కులం, మతం,పార్టీలు చూడకుండా అర్హులైన ప్రతి ఒక్కరికి న్యాయం చేశామని పేర్కొన్నారు. కూటమి సర్కార్ ప్రజలకు మేలు చేయడం పక్కనపెట్టి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై కక్ష సాధింపు చర్యలు చేపట్టడమే పనిగా పెట్టుకుందని ధ్వజమెత్తారు. ప్రజాదర్బార్కు విశేష స్పందన మాజీ సీఎం వైఎస్ జగన్ నిర్వహించిన ప్రజాదర్బార్కు పెద్ద ఎత్తున ప్రజలు, యువత, పార్టీ శ్రేణులు తరలివచ్చారు. తమ సమస్యలను నేరుగా వివరించి వినతిపత్రాలు అందజేశారు. సంక్షేమ పథకాలు సక్రమంగా అందడం లేదని, కొత్త పింఛన్లు మంజూరు కావడం లేదని, ఫీజు రీయింబర్స్మెంట్ వంటి పథకాలు నిలిచిపోయాయని ప్రజలు తమ ఆవేదన వ్యక్తం చేశారు. ప్రజల సమస్యలను ఓపికగా విన్న మాజీ సీఎం వైఎస్ జగన్ వారికి ధైర్యం చెప్పారు. పేదలు, విద్యార్థులు, వృద్ధులు, అర్హులైన ప్రతి ఒక్కరికీ న్యాయం జరగాల్సిందేనని అన్నారు. తమ ప్రభుత్వం వస్తూనే అందరికీ న్యాయం జరుగుతుందని ప్రజలకు భరోసా ఇచ్చారు. దివ్యాంగుడితో ఆప్యాయంగా.. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని మంగళవారం మదనపల్లెకు చెందిన రెండు కాళ్లు లేని దివ్యాంగుడు నందు కలిశాడు. ఈ సందర్భంగా తన కోసం అంత దూరం నుంచి వచ్చిన నందును వైఎస్ జగన్ ఆప్యాయంగా పలకరిస్తూ యోగక్షేమాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా నందు జననేతతో ఫొటో తీసుకుని ఆనందం వ్యక్తం చేశాడు. వైఎస్ జగన్కు రాఖీలు కట్టిన అక్కాచెల్లెమ్మలు మంగళవారం భాకరాపురంలోని తన క్యాంపు కార్యాలయంలో ప్రజా దర్బార్లో ఉన్న మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని రాష్ట్ర, జిల్లా నలుమూలల నుంచి పలువురు అక్కాచెల్లెమ్మలు కలిశారు. ఈ సందర్భంగా వారు వైఎస్ జగన్మోహన్రెడ్డికి రాఖీలు కట్టారు. మహిళలందరిని ఆప్యాయంగా పలకరించిన జగన్ వారికి అండగా ఉంటానని భరోసా ఇచ్చారు. వైఎస్ జగన్ను కలిసిన నేతలు భాకరాపురంలోని క్యాంపు కార్యాలయంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని పలువురు నేతలు కలిశారు. ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి, ఎమ్మెల్సీలు రామసుబ్బారెడ్డి, ఎమ్మెల్యేలు డాక్టర్ సుధ, ఆకేపాటి అమరనాథరెడ్డి, మాజీ మంత్రి వెల్లంపల్లి శ్రీనివాస్, మాజీ ఎమ్మెల్యేలు రవీంద్రనాథరెడ్డి, రాచమల్లు శివప్రసాదరెడ్డి, గడికోట శ్రీకాంత్రెడ్డి, ఎస్బీ అంజద్ బాషా, అత్తార్ చాంద్ బాషా, కొరముట్ల శ్రీనివాసులు, కడప మాజీ మేయర్ సురేష్బాబు, కమలాపురం ఇన్ఛార్జి నరేన్ రామాంజుల్రెడ్డి, బద్వేలు వైఎస్సార్సీపీ అదనపు సమన్వయకర్త నల్లేరు విశ్వనాథరెడ్డి వైఎస్ మనోహర్రెడ్డి, చవ్వా దుశ్యంత్రెడ్డి, రెడ్యం వెంకటసుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాదరెడ్డి తదితరులు కలిసిన వారిలో ఉన్నారు. జగనన్నకు రాఖీ కడుతున్న అక్కచెల్లెమ్మలుదివ్యాంగుడి బాధను వింటున్న మాజీ సీఎందివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి 17వ వర్దంతి సందర్భంగా బుధవారం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఇడుపులపాయకు వెళ్లనున్నారు. ఉదయం 7.30గంటలకు పులివెందుల నుంచి రోడ్డు మార్గాన వైఎస్ జగన్ తన కుటుంబ సభ్యులతో కలిసి ఇడుపులపాయలోని వైఎస్ఆర్ ఘాట్ వద్దకు చేరుకుంటారు. అనంతరం కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలతో కలిసి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్ రెడ్డికి నివాళులర్పించనున్నారు. -
ఆరోగ్యశ్రీ ప్రదాత వైఎస్సార్...
పేద ప్రజలకు ఉచిత వైద్యం అందించాలనే ఉద్దేశంతో ఆరోగ్యశ్రీ పథకాన్ని వై.ఎస్. రాజశేఖర్రెడ్డి తీసుకొచ్చారు. ఆరోగ్యశ్రీతో ఎంతో మందికి శస్త్ర చికిత్స అందించి ప్రాణాలు కాపాడి ప్రజల గుండెల్లో చెరగని ముద్రగా నిలచిపోయారు. ఉచిత వైద్యం అంటేనే వైఎస్సార్ గుర్తుకు వస్తారు. – కాలనీ చిన్న, పీలేరు. జలయజ్ఞం పథకం తీసుకొచ్చిన వైఎస్సార్ రైతుల పక్షపాతిగా నిలిచారు. రైతుల సమస్యలు తెలుసుకున్న వైఎస్సార్ సాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో పంటలు సస్యశ్యామలం చేయాలను ఉద్దేశంతో జలయజ్ఞం తెచ్చారు. మన పాంతానికి సాగునీరు ఇవ్వాలని హంద్రీనీవా ప్రాజెక్టు తీసుకొచ్చారు. – సి.కె. యర్రమరెడ్డి, కేవీపల్లె. గాలివీడు మండల పరిధిలోని వెలిగల్లు ప్రాజెక్టు దివంగత వైఎస్ రాజశేఖరరెడ్డి పుణ్యమే. రైతులకు సాగు, ప్రజలకు తాగునీరు ఈ ప్రాజెక్టు ద్వారా లభిస్తోంది. అంతేకాకుండా ప్రాజెక్టు పరిధిలో ఎంతోమంది మత్స్యకారులకు ఉపాధి లభిస్తోంది. కుడి, ఎడమ కాలువల కింద రైతాంగం పంటల సాగు చేసి జీవిస్తున్నారు. మహనీయుడైన వైఎస్సార్ కలకాలం ప్రజల హృదయాల్లో శాశ్వతంగా నిలిచిపోయారు. – వెంకటయ్య, గాలివీడు మండలం -
క్రీడల్లో రాణించి జిల్లా కీర్తిని చాటాలి
– కలెక్టర్ నిశాంత్కుమార్ మదనపల్లె సిటీ: క్రీడల్లో రాణించి జిల్లా కీర్తిని చాటాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. మంగళవారం మదనపల్లె కలెక్టరేట్లో అమరావతి చాంపియన్షిప్–26లో రాష్ట్ర స్థాయి క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచిన జిల్లా క్రీడాకారులను అభినందించారు. బ్యాడ్మింటన్లో మోతుకూరి కళ్యాణి, కందుకూరి లక్ష్మి, సింధూర ద్వితీయ స్థానాల్లో నిలిచి రజత పతకాలు పొందారు. బాక్సింగ్లో సిరవేలు నిఖిల్దేవ్నాయుడు ద్వితీయస్థానం, అథ్లెటిక్స్లో జావెలిన్ త్రోలో సుంకు గంగాధర్ ద్వితీయ స్థానం సాధించారు భవిష్యత్తులో మరిన్ని విజయాలు సాధించి జిల్లాకు మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. డీఎస్డీఓ చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. నేడు దిశ సమావేశం సాక్షి, మదనపల్లె: జిల్లా సమన్వయ అభివృద్ది, పర్యవేక్షణ కమిటీ సమావేశం (దిశ) బుధవారం రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి అధ్యక్షతన మదనపల్లెలో జరగనుంది. స్థానిక కలెక్టరేట్లో ఉద యం 10 గంటలకు జరిగే ఈ సమావేశానికి కలెక్టర్, జిల్లా అధికారులు, మండల పరిషత్ అధ్యక్షులు హజరవుతారు. కేంద్రప్రభుత్వం అమలు చేస్తున్న పథకాలపై మిథున్రెడ్డి సమీక్ష నిర్వహిస్తారు. పథకాలు మంజూరు, వాటి నిధులు వినియోగం, పనుల తీరుపై సమీక్షిస్తారు. నిధుల వినియోగంలో జాప్యం, త్వరితగతిన పనులు సాగకపోవడం లేదా అమలులో సమస్యలను తెలుసుకుని వాటి పరిష్కారం కోసం చర్యలు తీసుకుంటారు. ఈ సమావేశానికి హజరుకావాలని జిల్లా ఎమ్మెల్యేలు, అధికారులకు సమాచారం పంపించారు. నైపుణ్యం పోర్టల్లో నమోదు కావాలి – జిల్లా ఉపాధి, నైపుణ్య అధికారి హెచ్. దొన్నప్ప మదనపల్లి (కురబలకోట): విద్యార్థులు, నిరుద్యోగ యువతకు నైపుణ్య శిక్షణతో పాటు ఉపాధి, ఉద్యోగ అవకాశాలను ఒకే వేదికపై అందించేందుకు రాష్ట్ర నైపుణ్యాభివృద్ది సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)ఆధ్వర్యంలో నైపుణ్యం పోర్టల్ను అందుబాటులోకి తీసుకొచ్చిందని అన్నమయ్య జిల్లా ఉపాధి, నైపుణ్య అధికారి హెచ్. దొన్నప్ప తెలిపారు. జిల్లాలోని ప్రతి విద్యార్థి, నిరుద్యోగ యువకులు తప్పనిసరిగా నైపుణ్యం పోర్టల్లో పేరు నమోదు చేసుకోవాలన్నారు. అభ్యర్థులు తమ విద్యార్హతలు, నైపు ణ్యాలు, అనుభవం, ధ్రువపత్రాలు, రెజ్యుమ్, కేరీర్ ప్రాధాన్యతలను నమోదు చేసుకోవడం ద్వారా నైపుణ్య శిక్షణలు, జాబ్ మేళాలు, రిక్రూట్ మెంట్ డ్రైవ్లు, ఉద్యోగ అవకాశాల సమాచారం పొందవచ్చన్నారు. జిల్లాలో ని విద్యార్థులు, యువత ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని ఆయన సూచించారు. మా డబ్బు కోసం ఉద్యమమే శరణ్యం – కలెక్టరేట్లో నల్లబ్యాడ్జీలతో నిరసన సాక్షి, మదనపల్లె: ఉద్యోగులకు ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలనే అమలు చేయాలని తాము ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నామని ఏపీజేఏసీ అమరావతి జిల్లా అధ్యక్షులు నరసింహకుమార్ అన్నారు. మంగళవారం స్థానిక కలెక్టరేట్లో విధులు నిర్వహిస్తున్న అధికారులు, ఉద్యోగులు నల్లబ్యాడ్జీలను ధరించి నిరసన వ్యక్తం చేశారు. వాట్సప్ డీపీగా సీఎం సార్ మా డబ్బు మాకు ఇవ్వండి అన్న స్లోగన్ను పెట్టుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర సదస్సులో నిర్ణయించిన ఉద్యమ షెడ్యూల్ ప్రకారం రెండవ రోజు జిల్లాలోని కార్యాలయాల్లో ఏపీ జేఏసీ అమరావతి సంబంధించిన ఉద్యోగులు నల్ల బ్యాడ్జీలతో హాజరై నిరసన వ్యక్తం చేశామన్నారు. కలెక్టరేట్లో అన్ని విభాగాల్లో నిరసనలు జరిపామన్నారు. 41,321 మంది ఉద్యోగుల రిటైర్డ్ అయ్యారని అన్నారు. తమ డిమాండ్లలో పీఆర్సీ కమీషన్ ఏర్పాటు చేయాలని, ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లోని ఐదు డీఏలను మంజూరు చేయాలని, సీపీఎస్, జీపీఎస్ విధానాలపై సమీక్షించాలని డిమాండ్ చేశారు. -
విద్యార్థిని ఆత్మహత్య
కేవీపల్లె : ఉరి వేసుకుని విద్యార్థిని ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని గ్యారంపల్లె పంచాయతీ కొత్తపల్లెలో చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. కొత్తపల్లెలో నివాసం ఉంటున్న రమణమ్మ కుమార్తె శాలిని (15) కొత్తపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో పదో తరగతి చదువుతోంది. మంగళవారం తెల్లవారుజామున ఇంటిలో ఉరి వేసుకుంది. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించే లోపు మృతి చెందింది. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. విద్యుత్ మోటారు వైరు చోరీ రొంపిచెర్ల : వ్యవసాయ పొలంలోని విద్యుత్ మోటారు వైరు చోరీకి గురైనట్లు బి.వి.కృష్ణారెడ్డి రొంపిచెర్ల పోలీసులకు మంగళవారం ఫిర్యాదు చేశారు. బాధితుడి కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీ పరిధి ప్రేమనగర్ సమీపంలోని మామిడి తోటలో బోరు వేసుకుని చెట్లను పెంచుకుంటున్నారు. సోమవారం రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు 150 మీటర్ల విద్యుత్ వైరు చోరీ చేశారు. దీని విలువ సుమారు రూ.33 వేలు ఉంటుంది. 20 రోజుల క్రితం కూడా విద్యుత్ వైరు చోరీకి గురైంది. ఈ విషయమై పోలీసులకు ఫిర్యాదు చేశామని బి.వి.కృష్ణారెడ్డి తెలిపారు. అలాగే మండలంలో అక్కడక్కడా విద్యుత్ వైర్లు చోరీకి గురి అవుతున్నాయని రైతులు పేర్కొన్నారు. పోలీసులు నిఘా పెంచాలని వారు కోరారు. ఢీకొన్న ఆర్టీసీ బస్సు, ఆటోయువకుడి మృతి సుండుపల్లె : వానరాచపల్లె బిడికి సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. సుండుపల్లె సానిపాయి మార్గంలో సుండుపల్లె నుంచి సానిపాయి వైపు వెళ్తున్న పీలేరు–రాజంపేట ఆర్టీసీ బస్సు, ప్రయాణికులతో ఎదురుగా వెళ్తున్న ఆటో ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో ఆటోలో ఉన్న బుక్కే ఆదికేశవ నాయక్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు 108 వాహనంలో రాయచోటి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించే క్రమంలో ఆదికేశవ నాయక్ (18) మృతి చెందినట్లు సమీప బంధువులు తెలిపారు. ఘటనపై పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. రోడ్డు ప్రమాదంలో నలుగురికి గాయాలుమదనపల్లె టౌన్ : మదనపల్లె– బెంగళూరు రోడ్డులోని సరిహద్దు చెక్ పోస్ట్ వద్ద మంగళవారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో నలుగురు యువకులు గాయపడి మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రిలో చేరారు. ఘటనపై తాలూకా పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని పొన్నేటి పాలెం పంచాయతీ చిప్పిలికి చెందిన రాజశేఖర్(25), భాను ప్రకాష్(24) భాను(26), నాని అలియాస్ రాహుల్(23) కర్ణాటకలోని రాయల్పాడుకు వెళ్లారు. అక్కడి నుంచి తిరిగి బైకుపై మదనపల్లికి బయలుదేరారు. మార్గంమధ్యంలో ముందు వెళుతున్న బొలెరో వాహనాన్ని అదుపు తప్పి ఢీకొని నలుగురూ గాయపడ్డారు. వారిని అదే బొలెరో వాహనంలో స్థానికులు చికిత్స కోసం స్థానిక జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు దర్యాప్తులో ఉంది. -
దాతలు దయతలిస్తే.. బతుకుతా..!
మైదుకూరు : ‘నాకు బతకాలని ఉంది.. అందరిలాగే రోజూ పాఠశాలకు వెళ్లాలని ఉంది.. స్నేహితులతో కలిసి ఆడుకోవాలని కూడా ఉంది.. అయితే నేను తలసేమియా అనే ప్రాణాంతక వ్యాధితో బాధపడుతున్నాను‘ ఇది వైఎస్సార్ కడప జిల్లా మైదుకూరు పట్టణ శివార్లలోని సర్వాయపల్లె రోడ్డుకు చెందిన షేక్ అబ్దుల్ మతీన్ అనే ఎనిమిదేళ్ల బాలుడి ఆవేదన. ప్రాణాంతక వ్యాధి కబళిస్తున్నా.. ఎప్పటికై నా దాతలు తనను ఆదుకోకపోతారా అని ఆ చిన్నారి చూస్తున్న ఎదురుచూపులు ప్రతీ ఒక్కరినీ కన్నీరు పెట్టిస్తున్నాయి. రెండేళ్లుగా నరకయాతన.. డ్రైవర్ తండ్రి తలరాత! మైదుకూరు సర్వాయపల్లె రోడ్డులో నివసించే షేక్ అమీర్ బాషా దంపతుల మూడో సంతానమైన మతీన్, పట్టణంలోని ఒక పాఠశాలలో రెండో తరగతి చదువుతున్నాడు. రెండేళ్ల కిందట తీవ్ర అనారోగ్యానికి గురై నీరసించిపోతుండటంతో కంగారుపడిన తల్లిదండ్రులు స్థానికంగా రక్తం ఎక్కించారు. ఆ రక్తం కాస్తా మెదడుకు చేరి ఇన్ఫెక్షన్ కావడంతో బెంగళూరులోని సెయింట్ జోసెఫ్ ఆస్పత్రిలో పరీక్షలు చేయించగా బాలుడికి ’తలసేమియా’ సోకినట్లు వైద్యులు తేల్చారు. వృత్తిరీత్యా డ్రైవర్గా పనిచేస్తున్న తండ్రి అమీర్ బాషా, కొడుకు ప్రాణాలను దక్కించుకోవడం కోసం అప్పులు సప్పులు చేసి రెండేళ్లుగా దాదాపు రూ.4లక్షల దాకా ఖర్చు చేశారు. బోన్ మ్యారో మార్పిడి ఒక్కటే మార్గం.. హైదరాబాద్లో ప్రిపరేషన్ చిన్నారి మతీన్కు ఈ ప్రాణాంతక వ్యాధి పూర్తిగా నయం కావాలంటే ’బోన్ మ్యారో ట్రాన్స్ప్లాంటేషన్’ శస్త్రచికిత్స చేయడం ఒక్కటే ఏకై క పరిష్కారమని వైద్యులు స్పష్టం చేశారు. ఈ శస్త్ర చికిత్స ఖర్చుల కొరకు ఏకంగా రూ. 15 లక్షలకు పైగా ఖర్చవుతుందని వైద్యులు తేల్చి చెప్పారు. అంతటి భారీ మొత్తాన్ని సమకూర్చుకునే స్తోమత లేక ఆ కన్నవారు కన్నీరుమున్నీరవుతున్నారు. ఈ చిన్నారి దీన పరిస్థితిపై గత ఏడాది ‘సాక్షి’ ప్రచురించిన కథనానికి స్పందించిన కొంతమంది దాతల సహకారంతో ప్రస్తుతం ఈ శస్త్రచికిత్స నిమిత్తం బాలుడిని హైదరాబాద్లోని బంజారాహిల్స్లో గల ’లోటస్ లిటిల్ స్టార్స్ చిల్డ్రన్స్ హాస్పిటల్’లో చేర్పించారు. ప్రస్తుతం చిన్నారి అక్కడ వైద్యుల పర్యవేక్షణలో, ఆపరేషన్ ముందస్తు ’ప్రిపరేషన్’ ప్రక్రియను పొందుతున్నాడు. దేవుడిలా అండగా నిలిచిన ‘కిన్నెర ట్రస్ట్’ ఈ క్లిష్ట పరిస్థితుల్లో మత్తీన్ కుటుంబానికి ‘కిన్నెర మెమోరియల్ ట్రస్ట్’ దేవుడిలా అండగా నిలిచింది. పేద పిల్లలకు ఉచితంగా బోన్ మ్యారో, ల్యుకేమియా చికిత్సలు అందించే తమ సేవా సంకల్పంలో భాగంగా ఈ ట్రస్ట్ బాలుడి ప్రాణ రక్షణ కోసం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని ప్రకటించింది. హైదరాబాద్లోని సౌమ్య హాస్పిటల్కు చెందిన ప్రముఖ క్యాన్సర్ వైద్య నిపుణులు (సర్జికల్ ఆంకాలజిస్ట్) డాక్టర్ సింహాద్రి చంద్రశేఖర్ రావు చేతుల మీదుగా ఈ రూ.3 లక్షల చెక్కును బాలుడి తండ్రి అమీర్ బాషాకు మంగళవారం అందజేశారు. తమ బిడ్డ ప్రాణాలు నిలబెట్టడానికి ఇంతటి ఉదారత చాటుకున్న కిన్నెర ట్రస్ట్ నిర్వాహకులకు, డాక్టర్ సింహాద్రికి ఆ తండ్రి కన్నీటి పర్యంతమై కృతజ్ఞతలు తెలిపారు. ఆపరేషన్ విజయవంతం కావడానికి ఇంకా పెద్ద ఎత్తున నిధులు అవసరమున్నందున, బిడ్డను కాపాడటానికి దాతలు ఉదారంగా స్పందించి సహాయం చేయాలని తల్లిదండ్రులు చేతులు జోడించి దీనంగా వేడుకుంటున్నారు పసి ప్రాణాన్ని కాపాడుకుందాం..మీ విరాళాలు పంపండి బాలుడి శస్త్రచికిత్సకు సహాయం చేసి ఆదుకోవాలనే సహృదయం గల దాతలు నేరుగా బాలుడి తల్లి బ్యాంక్ ఖాతాకు లేదా ఫోన్ నెంబర్కు విరాళాలు పంపవచ్చు బ్యాంక్ ఖాతాదారు పేరు: నూర్జహాన్ (బాలుడి తల్లి), బ్యాంక్ పేరు: యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, అకౌంట్ నంబర్: 104010100200315, ఐఎఫ్ఎస్ఈ కోడ్: UBIN0810401కు తమ విరాళాలు పంపగలరని మనవి చేస్తున్నారు. ఇంకా వివరాలు తెలసుకోదలచినవారు 8328262592 నంబరులో సంప్రదించవచ్చు. తలసేమియాతోమైదుకూరు బాలుడి పోరాటం బోన్ మ్యారో మార్పిడికి 15 లక్షల ఖర్చు ‘కిన్నెర ట్రస్ట్’ రూపంలో రూ.3 లక్షల తోడ్పాటు హైదరాబాద్ లోటస్ ఆస్పత్రిలోప్రిపరేషన్ చికిత్స చిన్నారి ప్రాణాలు నిలబెట్టేందుకు చేతులు చాచిన తల్లిదండ్రులు -
అద్దె ట్రాక్టర్ల మాయంపై విచారణ
సంబేపల్లె : ట్రాక్టర్లు అద్దెకు తీసుకున్న విషయంపై మంగళవారం సంబేపల్లె పోలీస్ స్టేషన్లో విచారణ నిర్వహించినట్లు రూరల్ సీఐ రోషన్ తెతిపారు. మండల పరిధిలోని జాండ్రిగారిపల్లెకు చెందిన బాబ్జితోపాటు ఇద్దరు, మోటకట్ల గ్రామంలోని ప్రతాప్రెడ్డితోపాటు మరొక రైతు దగ్గర నుంచి అనంతపురం 14 బెటాలియన్కు చెందిన చంద్రహాసన్, ప్రతాప్ ట్రాక్టర్లను అద్దెకు తీసుకొన్నారు. వారు ఇంత వరకు అద్దె ఇవ్వకుండా ట్రాక్టర్ల ఆచూకీ తెలియక పోవడంతో బాధితులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఇటీవలే సంబేపల్లె పోలీస్స్టేషన్లో కేసు నమోదు చేశారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు అనంతపురం 14 బెటాలియన్ డీఎస్పీ శివారెడ్డి మంగళవారం సంబేపల్లె పోలీస్స్టేషన్కు చేరుకుని బాధితుల నుంచి వివరాలు సేకరించారు. ఈ సందర్భంగా విచారణ చేపట్టారు. -
విడాకుల నోటీసుతో మనస్తాపం
మదనపల్లె టౌన్ : కుటుంబ కలహాలు, విడాకుల నోటీసు నేపథ్యంలో ఓ మహిళ తన మూడేళ్ల కుమారుడితో కలిసి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటన మదనపల్లెలో కలకలం రేపింది. పిటిఎం మండలం మల్లెల గ్రామానికి చెందిన సోనియాను భర్త బాబా ఫక్రుద్దీన్, అత్త రాబియాబి, మామ హజ్మత్ వేధింపులకు గురిచేశారని కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు. మసీదు ద్వారా తలాక్ విడాకుల నోటీసు రావడంతో ఆమె తీవ్ర మనస్తాపానికి గురైనట్లు చెబుతున్నారు. మదనపల్లె గరుడానగర్లోని తన చిన్నాన్న ఇంటికి వచ్చిన సోనియా సూసైడ్ నోట్ రాసి తన మూడేళ్ల కుమారుడు మహమ్మద్ కియాతో కలిసి పురుగుల నివారణ మందు తాగినట్లు సమాచారం. గమనించిన కుటుంబ సభ్యులు హుటాహుటిన ఇద్దరినీ మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ వైద్యులు చికిత్స అందిస్తున్నారు. ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపడితే పూర్తి వివరాలు వెలుగులోకి వస్తాయని కుటుంబ సభ్యులు కోరుతున్నారు.బిడ్డతో కలిసి మహిళ ఆత్మహత్యాయత్నం -
శక్తి యాప్ డౌన్లోడ్ చేసుకోండి
మదనపల్లె సిటీ : ప్రతి విద్యార్థిని శక్తియాప్ను డౌన్లోడ్ చేసుకోవాలని జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి అన్నారు. మంగళవారం స్థానిక ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో బేటీ బచావో–బేటీ పడావో కార్యక్రమం నిర్వహించారు. ఎస్పీ విద్యార్థులను ఉద్దేశించి మాట్లాడారు. బాల్య వివాహాలకు, మైనర్లపై అఘాయిత్యాలకు పాల్పడిన వారిపై కఠిన చర్యలు ఉంటాయన్నారు. బాల్యవివాహాల రద్దు చట్టం, పోక్సో చట్టం గురించి వివరించారు. బాలికలు ఆపద సమయంలో 1098, 181, 112 నంబర్లకు డయల్ చేయాలన్నారు. అనంతరం క్రీడల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఐసీడీఎస్ పీడీ హైమావతి, ప్రిన్సిపాల్ మోహన్కుమార్, సీఐలు మహమ్మద్రఫీ, సదాశివయ్య, ఫోర్డు డైరెక్టర్ జల్లా లలితమ్మ తదితరులు పాల్గొన్నారు. -
దేవుడి మాన్యం.. కబ్జా దుమారం
● పాత కమిటీని నిలదీసిన కొత్త పాలకవర్గం ● నిజాలు నిగ్గు తేల్చాల్సిన బాధ్యత అధికారులదేమదనపల్లి టౌన్ : అన్నమయ్య జిల్లాలో రూ.30 కోట్ల విలువైన దేవుడి మాన్యం భూముల కబ్జా వ్యవహారం సంచలనంగా మారింది. ‘కొట్టేసిన చెట్ల చాటున.. కోట్ల గుట్టు’ అంటూ సాక్షి దినపత్రికలో మంగళవారం వార్త ప్రచురితం కావడం పాఠకులకు తెలిసిందే. దేవదాయ శాఖకు చెందిన ఆలయ భూములు కబ్జాకు గురి కావడంతో ఆలయ పాత, ప్రస్తుత పాలకవర్గాల మధ్య వివాదం భగ్గుమంది. వివరాల్లోకి వెళితే.. మదనపల్లె మండలంలోని సీటీఎం ఆంజనేయస్వామి, శ్రీ నల వీరగంగా భావానీ ఆలయానికి చెందిన 7.50 ఎకరాల మాన్యం భూమిని గత పాలకవర్గ హయాంలోనే కబ్జా చేశారని విచారణలో తేలింది. అప్పటి పాలకవర్గంలోని టీడీపీ నాయకులు, సర్పంచ్ ప్రభాకర్రెడ్డి అనుమతి పత్రాలు ఇవ్వడంతోనే.. డాక రాజుగారి రాజప్ప పట్టాభి, కుమారుడు రెడ్డి రాంప్రసాద్, లీలావతమ్మ, రఘునాథ్లు కలిసి మిల్లు కార్మికుడు నారాయణస్వామికి ఆంజనేయస్వామికి చెందిన దేవదాయ శాఖ భూమిని రాసిచ్చి రిజిస్ట్రేషన్ చేసి సొమ్ము చేసుకున్నారని కమిటీ విచారణలో బయటపడింది. దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ సైతం దర్యాప్తులో భూములు కబ్జాకు గురయ్యాయని నిర్ధారించారు. ఆ తర్వాత ఆ భూమి పలువురి చేతులు మారి అమ్మకాలు, అక్రమ నిర్మాణాలు, తోటల పెంపకం జరిగిందని ప్రస్తుత చైర్మన్ ఆనంద పార్థసారథి.. పాత కమిటీని నిలదీయడంతో ఇరువర్గాల మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. దేవదాయ శాఖ అధికారుల నిర్లక్ష్యం వల్లే ఇదంతా జరిగిందని గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఎవరెవరు ఎంత భూమి కబ్జా చేసి అమ్మారో, అక్రమ కట్టడాలు ఎవరు చేపట్టారో తేల్చుతామని అధికారులు చెబుతున్నారు. జిల్లా కలెక్టర్, ఇతర శాఖల అధికారులు 30 కోట్ల దేవదాయ భూముల కబ్జాపై నిగ్గు తేల్చాల్సి ఉంది. -
విద్యుత్ షాక్తో ఏనుగు మృతి
పులిచెర్ల(కల్లూరు) : మండల పరిధి పాపిరెడ్డిగారిపల్లె సమీపంలోని మామిడి తోపులో ఏనుగు మృతి చెందిన సంఘటనను మంగళవారం గుర్తించారు. స్థానికులు చెప్పగా పారెస్టు అధికారులు అక్కడికి వెళ్లి పరిశీలించారు. 12 ఏనుగుల గుంపు రెండు రోజుల క్రితం ఈ ప్రాంతంలోకి వచ్చిందని స్థానికులు తెలిపారు. వాటిలో ఒక ఏనుగు విడిపోయి మామిడి తోపుల్లోకి ప్రవేశించింది. విద్యుత్ వైర్లు తగిలి అక్కడికక్కడే మృతి చెందింది. దానికి బుధవారం పోస్టుమార్టం చేస్తామని అటవీ శాఖ అధికారులు తెలిపారు. ఏనుగుల గుంపు సమీపంలోని మూలమడుగు వంకలోకి వెళ్లినట్లు సమాచారం ఉందని, అక్కడికి ఎవరూ వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. -
హత్యాయత్నం కేసులో ఇద్దరికి జైలు శిక్ష
మదనపల్లి టౌన్ : పొలం సరిహద్దు వివాదం నేపథ్యంలో భార్యాభర్తలపై కొడవలితో దాడి చేసి హత్యాయత్నానికి పాల్పడిన కేసులో ఇద్దరు నిందితులకు మదనపల్లి 7వ అదనపు జిల్లా కోర్టు మంగళవారం జైలు శిక్ష విధించింది. బి.కొత్తకోట మండలం బడికాయలపల్లి పంచాయతీ కొత్తఉడియం గ్రామానికి చెందిన మేకల కదిరప్ప, సుజాత దంపతులపై 2020 జూలై 19న అదే గ్రామానికి చెందిన ఎం.జయచంద్ర, ఎం.గోపాల్ కొడవలితో దాడి చేశారు. బాధితుల ఫిర్యాదుతో అప్పటి ఎస్సై బి.సునీల్ కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో కోర్టులో సాక్ష్యాధారాలను పరిశీలించిన న్యాయమూర్తి ఆర్.శ్రీలత నేరం రుజువు కావడంతో శిక్ష ఖరారు చేశారు. మొదటి నిందితుడు ఎం.జయచంద్ర (28)కు ఐదేళ్ల జైలు, రూ.11 వేలు, రెండో నిందితుడు ఎం.గోపాల్ (37)కు ఏడాది జైలు, రూ.9 వేలు జరిమానా విధించారు. తీర్పు అనంతరం ఇద్దరినీ కడప సెంట్రల్ జైలుకు తరలించారు. శిక్ష పడేలా కృషి చేసిన అధికారులను జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అభినందించారు. -
లారీని ఢీకొన్న తుఫాన్ వాహనం
కేవీపల్లె : ముందు వెళుతున్న లారీని తుఫాన్ వాహనం ఢీకొన్న ప్రమాదంలో ఓ వృద్ధుడు మృతి చెందగా, ఎనిమిది మంది స్వల్ప గాయాలతో బయటపడ్డ సంఘటన మండలంలోని మఠంపల్లె క్రాస్ వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. తెలంగాణా రాష్ట్ర మహబూబ్నగర్ జిల్లా అప్పంపల్లెకు చెందిన తొమ్మిది మంది తుఫాన్ వాహనంలో తిరుమలకు బయలుదేరారు. అయితే మంగళవారం తెల్లవారుజామున కలకడ – పీలేరు మార్గం మధ్యలో జాతీయ రహదారిలో ముందు వెళుతున్న లారీని తుఫాన్ వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో కె.చిన్నభాస్కర్రెడ్డి (63) అక్కడికక్కడే మృతి చెందగా మిగిలిన వారు స్వల్ప గాయాలతో బయటపడ్డారు. సంఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు చిన్నభాస్కర్రెడ్డి మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. యువకుడి ఆత్మహత్యాయత్నంమదనపల్లె టౌన్ : కుటుంబ సమస్యలతో యువకుడు ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ సంఘటన మంగళవారం చౌడేపల్లి మండలంలో జరిగింది. ఘటనపై జిల్లా ఆసుపత్రి అవుట్ పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. చౌడేపల్లి మండలం పెద్ద వీడుకు చెందిన భాను ప్రకాష్ (30) కుటుంబ సమస్యల కారణంగా పురుగుల నివారణ మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. గమనించిన తల్లిదండ్రులు బాధితుడిని వెంటనే చికిత్స కోసం మదనపల్లి జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఆస్పత్రి అత్యవసర విభాగం డాక్టర్లు పరీక్షించి మెరుగైన వైద్యం అందించడంతో ప్రాణాపాయం తప్పి కోలుకుంటూ ఉన్నాడు. చౌడేపల్లి పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.వృద్ధుడి మృతి -
వైద్యుల నిర్లక్ష్యంతో వ్యక్తి మృతిపై విచారణ
పీలేరు : స్థానిక ఎస్కేఆర్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటనపై అందిన ఫిర్యాదుతో డీఎంహెచ్వో శ్రీనివాసులు నేతృత్వంలో మంగళవారం విచారణ చేపట్టారు. గత నెల 26న కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచాయతీ జాండ్రపేటకు చెందిన కె.సురేంద్ర(42) కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైదం కోసం పీలేరు పట్టణంలోని ఎస్కేఆర్ హాస్పిటల్లో చేరాడు. 27వ తేదీ ఆయనకు ఆపరేషన్ చేయడానికి ముందు మత్తు మందు ఇచ్చారు. అయితే మత్తుమందు ఇచ్చిన కొద్ది సేపటికే అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సురేంద్ర పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ యాజమాన్యం హుటాహుటిన వారి అంబులెన్స్లోనే తిరుపతి స్విమ్స్కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సంఘటనపై పలు ప్రజా సంఘాల నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఎస్కేఆర్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో సురేంద్ర మృతి చెందాడని పేర్కొన్నారు. దీంతో కలెక్టర్ ఆదేశాల మేరకు మంగళవారం డీఎంహెచ్వో బృందం ఆస్పత్రి ఆపరేషన్ థియేటర్ను క్షుణ్ణంగా పరిశీలించి, ఆస్పత్రి సిబ్బందితో జరిగిన సంఘటనపై ఆరా తీశారు. ఈ సందర్భంగా డీఎంహెచ్వో విలేకరులతో మాట్లాడుతూ ఆస్పత్రి నిర్వహణలో కొన్ని లోపాలు ఉన్నట్లు ప్రాథమికంగా గుర్తించినట్లు తెలిపారు. స్విమ్స్ ఆస్పత్రి రిపోర్టు ఆధారంగా కలెక్టర్కు నివేదిక అందజేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో విచారణ బృందం డాక్టర్లు రమేష్బాబు, శశికుమార్రాజు, ఉదయ్కిరణ్, రాజశేఖర్, శ్రీధర్, రాజగోపాల్, చంద్రశేఖర్నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
ఖాళీ బిందెలతో నిరసన
పెద్దతిప్పసముద్రం: మండలంలోని కందుకూరు పంచాయతి అగ్రహారానికి చెందిన ప్రజలు సోమవారం తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానిక మండల పరిషత్ కార్యాలయం ఎదుట బైఠాయించి ఖాళీ బిందెలతో నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా మహిళలు మాట్లాడుతూ బోర్లలో నీరు అడుగంటడంతో తాము ఒక్కో బిందె నీటిని రెండున్నర రూపాయల చొప్పున కొనుగోలు చేయాల్సి వస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. నీటి సమస్యను పరిష్కరించాలని ఎంపీడీఓను డిమాండ్ చేశారు. తనతో పాటు స్పెషలాఫీసర్, ఆర్డబ్ల్యూఎస్ అధికారులు క్షేత్ర స్థాయిలో పర్యటించి నీటి సమస్య లేకుండా చేస్తామని ఎంపీడీఓ హామీ ఇవ్వడంతో మహిళలు శాంతించారు. -
ఈసారైనా నేతన్నకు సేవ అందేనా?!
● కూటమి పాలనలో గందరగోళంగా మారిన ‘నేతన్న సేవ’ పథకం ● వడపోత పేరిట కోత కోసేందుకు ‘సిక్స్ స్టెప్’ నిబంధనల ఉచ్చు ● మంత్రి ప్రకటనలు ఫ్లాప్.. వచ్చే నెలలోనే నిధులంటూ అధికారుల లీకులు మదనపల్లి (కురబలకోట): రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన ‘నేతన్న సేవ’ పథకం తొలి విడతలోనే చేనేత కార్మికులకు తీవ్ర నిరాశను మిగిల్చింది. అన్నమయ్య జిల్లాలో 5,069 మందిని అర్హులుగా గుర్తిస్తే.. కేవలం 3,869 మందికే లబ్ధి చేకూరింది. దీంతో వందలాది మంది చేనేత కార్మికుల నుంచి పెద్ద ఎత్తున నిరసనలు వ్యక్తమయ్యాయి. రంగంలోకి దిగిన యంత్రాంగం మగ్గాల వద్దకే వెళ్లి సమగ్ర సర్వే నిర్వహించడంతో.. మొదటి విడత లబ్ధి పొందని వారితో పాటు కొత్తగా జిల్లాలో 4,908 మంది మలి విడత కోసం భారీగా దరఖాస్తు చేసుకున్నారు. చేనేత గుండెల్లో ‘సిక్స్ స్టెప్’ గుబులు! మరోవైపు లబ్ధిదారుల సంఖ్యను తగ్గించేందుకు ‘సిక్స్ స్టెప్ వ్యాలిడేషన్’ పేరిట వడపోత సాగుతుండటం కార్మికులను భయాందోళనలకు గురిచేస్తోంది. గృహ విద్యుత్ వినియోగం, ఆదాయపు పన్ను, అర్బన్ హౌసింగ్, ఎక్కువ భూమి, ఫోర్ వీలర్ వంటి కారణాలతో నిజమైన నేతన్నలకే కోత కోసే అవకాశం ఉందని తెలుస్తోంది. ప్రభుత్వ డిజిటల్ డేటాలోని తప్పుల వల్ల నిజమైన చేనేత కార్మికుడికి అన్యాయం జరిగితే బాధ్యత ఎవరిదన్న ప్రశ్నకు సమాధానం కరువైంది. మంత్రి హామీలు ఫ్లాప్.. వచ్చే నెలలోనే సేవ ఈ నెలాఖరున మలి విడత కింత రూ.25 వేల చొప్పున నిధులు జమ చేస్తామని రాష్ట్ర చేనేత జౌళిశాఖ మంత్రి సవిత ప్రకటించినప్పటికీ, ఇప్పటివరకు లబ్ధిదారుల జాబితాపై స్పష్టత రాలేదు. దీంతో ఈ నెలలో నిధులు పడే అవకాశం లేదని, వచ్చే నెలలోనే జమ కానున్నాయని అధికారులు అంతర్గతంగా ఒప్పుకుంటున్నారు. అంగళ్లకు చెందిన చేనేత కార్మికుడు జి.కృష్ణారెడ్డి, మదనపల్లికి చెందిన కె.లక్ష్మీదేవిలు మాట్లాడుతూ.. 20 నుంచి 30 ఏళ్లుగా మగ్గం నేస్తున్నా తమకు సేవ అందలేదని, సచివాలయాల దగ్గరే కూర్చుని కంప్యూటర్ జాబితాలు ఖరారు చేస్తే నిజమైన నేతన్నలకు న్యాయం ఎలా జరుగుతుందని అధికారుల తీరును నిలదీశారు. ఈ మొత్తం వివాదంపై జిల్లా చేనేత జౌళి శాఖ అధికారి పవన్కుమార్రెడ్డిని వివరణ కోరగా.. అర్హత ఉండి తొలి విడతలో లబ్ధిపొందని చేనేత కార్మికులందరికీ మలి విడతలో నిధులు ఖచ్చితంగా జమ అవుతాయని, దీనిపై ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదని స్పష్టం చేశారు. -
●2011 పంచాయతీ పత్రం.. అప్పట్లోనే అడ్డగోలుగా ఆమోదం
మదనపల్లె టౌన్: A¯]l²-Ð]l$Ķæ$Å hÌêÏ MóS…{§ýlOÐðl$¯]l Ð]l$§ýl-¯]l-ç³ÌñæÏ Ð]l$…yýlÌS… _¯]l²-†ç³µ-çÜ-Ð]l¬{§ýl… (ïÜsîæ-G…) ÌZ §ólÐ]l#yìl Ð]l*¯éÅÌSMýS$ Æý‡„ýS׿ MýSÆý‡$-OÐðl…-¨. CMýSPyìl } ¯]lÌS-ÒÆý‡ VýS…V>-¿ýæÐé° AÐ]l$Ã-ÐéÇ, } ÒÆ>…f-¯ól-Ķæ$-ÝëÓÑ$ §ólÐ]l-Ý릯éÌSMýS$ ^ðl…¨¯]l ₹15 MørÏMýS$ Oò³V> ÑË$-OÐðl¯]l ¿¶æ*Ð]l¬-ÌS¯]l$ Mö…§ýlÆý‡$ MýS*rÑ$ Æ>f-MîSĶæ$ ¯éĶæ$-MýS$Ë$, BÌSĶæ$ MýSÑ$-sîæMìS ^ðl…¨¯]l Ð]lÅMýS$¢Ë$ MýS$Ð]l$ÃOMðSP MýS¯ól²Ô>-Æý‡…r* {V>Ð]l$çÜ$¢Ë$ Ð]l$…yìl-ç³-yýl$™èl$-¯é²Æý‡$. ™égêV> BÌSĶæ$ {´ë…VýS-׿…ÌZ° ç³^èla° ^ðlrϯ]l$ Ķæ$£ól-^èleV> ¯]lÇ-MìS-Ðól-Ķæ$yýl…, §ólÐé-§éĶæ$ Ô>Q ¿¶æ*Ñ$° B{MýSÑ$…_ Æ>{†MìS Æ>{™ól Æý‡çßæ§éÇ HÆ>µr$ ^ólĶæ$-yýl…™ø D ÑÐé§ýl… ¡{Ð]l Æý‡*ç³… §éÍ-a…-¨. సర్వే నంబర్ల సాక్షిగా దోపిడీకి స్కెచ్ గ్రామస్తులు బయటపెట్టిన అధికారిక భూ పత్రాలను పరిశీలిస్తే అక్రమార్కుల కబ్జా పర్వం స్పష్టంగా అర్థమవుతోంది. సర్వే నంబర్ 995/ఏ1 కు సంబంధించిన 0.49 ఎకరాల భూమి శ్రీ వీరాంజనేయస్వామి దేవస్థానానికి చెందినదిగా రికార్డుల్లో పక్కాగా నమోదై ఉంది. అదేవిధంగా 995/బి2 లో 1.03 ఎకరాలు, 995/బి3 లో 2.91 ఎకరాలు చొప్పున ఆలయ భూముల వివరాలు దేవాదాయ శాఖ పత్రాల్లో స్పష్టంగా ఉన్నాయి. కోట్లాది రూపాయల విలువైన ఈ సర్వే నంబర్లలోని భూములను తమ సొంత స్థలాలకు కలుపుకునేందుకు పచ్చ నేతలు స్కెచ్ వేశారు. అందుకోసమే దేవుడి స్థలంలో రోడ్డు వేస్తూ, అడ్డుగా ఉన్న చెట్లను నరికేశారని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. 8 రూ.30 కోట్ల భూమి కబ్జా.. అధికారుల మౌనం ఎందుకు ? స్థానికుల అంచనా ప్రకారం ఈ ప్రాంతంలోని దేవాదాయ భూముల విలువ సుమారు రూ.15కోట్లకు పైగానే ఉంటుందని చెబుతున్నారు. ఇంత విలువైన దేవస్థాన భూములపై ఆక్రమణ ఆరోపణలు వస్తున్నప్పటికీ సంబంధిత అధికారులు ఇప్పటివరకు పూర్తి స్థాయిలో స్పందించకపోవడంపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దేవుడి మాన్యం అంటే ఎవరి వ్యక్తిగత ఆస్తి కాదని, అది భక్తులు, ప్రజల విశ్వాసానికి సంబంధించిన ఆస్తి అని వారు స్పష్టం చేస్తున్నారు. ఒకసారి భూమిలో రోడ్డు వేసి హద్దులు మార్చుకుంటే భవిష్యత్తులో ఆ భూమిని తిరిగి దేవస్థానం ఆధీనంలోకి తీసుకురావడం మరింత క్లిష్టమవుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారుల ముందున్న ప్రశ్నలు.. స్పందించిన ఏసీ 995/ఏ1 భూమి ప్రస్తుతం ఎవరి ఆధీనంలో ఉంది, 2011 నాటి పంచాయతీ అనుమతి ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారనే ప్రశ్నలకు సమాధానాలు రావాల్సి ఉంది. దేవాదాయ శాఖ ఉన్నతాధికారులు వెంటనే ప్రత్యేక బృందాన్ని పంపి హద్దులు నిర్ణయించి, సర్వే రాళ్లు ఏర్పాటు చేయాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. ఈ విషయమై దేవాదాయ శాఖ జిల్లా అసిస్టెంట్ కమిషనర్ విశ్వనాథ్ను వివరణ కోరగా సమస్య ఇంతవరకు తన దృష్టికి రాలేదన్నారు. వెంటనే స్థలాన్ని పరిశీలించి, ఏమి కబ్జా జరిగింది.. ఎంత భూమిని ఎవరు కబ్జా చేశారు? అనే దానిపై అరా తీసి తదుపరి చర్యలకు ఉన్నతాధికారులకు నివేదిక పంపిస్తామని చెప్పారు. ఈ వ్యవహారంలో మరో కీలక అంశంగా 2011 ఫిబ్రవరి 5వ తేదీకి సంబంధించిన గ్రామ పంచాయతీ తీర్మాన పత్రం ముందుకు వచ్చింది. అందులో సర్వే నంబర్ 995/ఏ1కు సంబంధించిన భూమిపై నారాయణ పేరుతో పంచాయతీలో ఆమోదం/అనుమతి అప్పటి టీడీపీ సర్పంచి ప్రభాకర్ రెడ్డికి సంబంధించిన వివరాలు ఉన్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. సీటీఎం ఏళ్లపాటు టీడీపీకి కంచుకోటగా నిలిచింది. ప్రభాకర్ రెడ్డి, ఆయన తమ్ముడు ఏళ్ల తరబడి సర్పంచ్లుగా కొనసాగారు. వారి హయాంలోని మోసాలు జరిగాయి. అయితే దేవాదాయ శాఖకు చెందిన భూమిపై గ్రామ పంచాయతీకి ఎంతవరకు అధికారం ఉంది? ఆ భూమి దేవస్థానం పేరుతో ఉన్న సమయంలో వ్యక్తిగత వినియోగానికి అనుకూలంగా ఏదైనా అనుమతి ఇవ్వబడిందా? ఇచ్చి ఉంటే ఏ నిబంధనల ప్రకారం ఇచ్చారు? అనే ప్రశ్నలు ప్రస్తుతం తలెత్తుతున్నాయనీ, ఇక్కడే అసలు వివాదం మొదలవుతోందని గ్రామస్తులు అంటున్నారు. రికార్డుల్లో దేవస్థానానికి చెందిన భూమిగా నమోదై ఉన్న స్థలంపై ఇతరుల హక్కులు ఎలా ఏర్పడ్డాయి? పంచాయతీ అనుమతి ఉంటే దానికి దేవాదాయ శాఖ అనుమతి ఉందా? భూమి హద్దులు మార్చారా? లేక రహదారి పేరుతో దేవస్థాన భూమిని క్రమంగా సొంత స్థలాల్లో కలుపుకునే ప్రయత్నం జరుగుతోందా? అన్న విషయాలపై అధికారులు విచారణ చేయాలని వారు డిమాండ్ చేస్తున్నారు. సీటీఎంలో దేవుడి మాన్యం ‘కబ్జా’! రూ. 30కోట్లకు పైగా విలువైన భూములపై టీడీపీ నేతల కన్ను? పత్రాల్లో ఆలయ భూముల వివరాలు.. పంచాయతీ అనుమతులపై అనేక అనుమానాలు ఆలయ కమిటీ, స్థానికుల మధ్య విభేదాలు : సమగ్ర విచారణకు గ్రామస్తుల డిమాండ్ -
గ్రామాల్లో పోలీసుల ’పల్లె నిద్ర’
మదనపల్లి టౌన్ : రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో గ్రామాల్లో శాంతిభద్రతల పరిరక్షణకు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో జిల్లా వ్యాప్తంగా పోలీసులు ’పల్లె నిద్ర’ కార్యక్రమాన్ని చేపట్టారు. ఇందులో భాగంగా పోలీసు అధికారులు, సిబ్బంది రాత్రి వేళల్లో గ్రామాల్లోనే బస చేస్తూ ప్రజలతో మమేకమవుతున్నారు. మహిళల భద్రత, బాల్య వివాహాల నివారణ, సైబర్ నేరాల పట్ల అప్రమత్తత, దొంగతనాల నివారణ, డ్రగ్స్ నిర్మూలనపై విస్తృతంగా అవగాహన కల్పిస్తున్నారు. ఎన్నికల వేళ అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై నిఘా పెంచామని, ఎలాంటి అల్లర్లకు పాల్పడినా కఠిన చర్యలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. కొత్త వ్యక్తులు, అనుమానాస్పద కదలికలు కనిపిస్తే వెంటనే డయల్ 100 లేదా 112కు సమాచారం ఇవ్వాలని గ్రామస్తులకు తెలియజేశారు. -
బైక్, బస్సు ఢీ: విద్యార్థి మృతి
సదుం : తిరుపతి జిల్లాలో జరిగిన రోడ్డు ప్రమాదంలో మండలానికి చెందిన ఓ విద్యార్థి మృతి చెందాడు. స్థానికుల కథనం మేరకు.. చీకలచేనుకు చెందిన రాజేంద్ర కుమారుడు చరణ్ కుమార్ (20) తిరుపతిలోని ఓప్రైవేట్ కాలేజీలో డిగ్రీ ఫైనల్ ఇయర్ చదువుతున్నాడు. ఆదివారం రాత్రి స్నేహితుడితో కలసి బైక్పై వెళ్తుండగా చంద్రగిరి వద్ద బస్సు ఢీకొనడంతో చరణ్కుమార్ మృతి చెందాడు. మృతదేహానికి సోమవారం స్వగ్రామంలో అంత్యక్రియలు నిర్వహించారు. మోసం చేసిన దంపతుల అరెస్ట్ కేవీపల్లె : పలువురి వద్ద రూ. 22.20 లక్షలు మోసం చేసిన దంపతులను అరెస్ట్ చేసినట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. ఎస్ఐ కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని ఎంవీపల్లె పంచాయతీ శ్రీనాథపురం కాలనీకి చెందిన కురుబోతుల శంకరమ్మ, వెంకటరమణ దంపతులు అదే గ్రామానికి చెందిన పలువురిని నమ్మించి వివిధ కారణాలతో సుమారు రూ. 22.20 లక్షలు నగదు తీసుకున్నారు. అయితే తీసుకున్న నగదు తిరిగి ఇవ్వకుండా కాలయాపన చేయడంతో బాధితులు కేవీపల్లె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ఈ మేరకు కేసు దర్యాప్తు చేపట్టిన పోలీసులు సోమవారం నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్కు తరలించారు. నిత్యాన్నదానానికి విరాళంరాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కోసం రామాపురం మండలం చింతలవాండ్లపల్లె చింతల సుబ్బారెడ్డి, చింతల నారాయణ రెడ్డి కుటుంబ సభ్యులు రూ.1,00,116లు, తిరుపతికి చెందిన నాచన రవికమార్,పేర్ల రవిబాబు, శఖర్ బాబులు ఒక్కొక్కరు రూ.7,516లు చొప్పున అందజేశారు. సోమవారం ఆలయ కమిటీ చైర్మన్ తిరుమల మనోజ్ కుమార్, అసిస్టెంట్ కమిషనర్, ఈఓ డీవీ రమణారెడ్డిలకు విరాళం అందజేసినట్లు వారు తెలిపారు. దాతలను ఆలయ కమిటీ వారు సన్మానించారు. -
గుర్తు తెలియని వ్యక్తి మృతి
ప్రొద్దుటూరు క్రైం : పట్టణంలోని సాయికూటీర్ రోడ్డులో ఉన్న త్యాగరాజ రెడ్డి ఆస్పత్రి సమీపంలో సోమవారం సాయంత్రం గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సుమారు 60 ఏళ్ల వయసున్న వ్యక్తి ఫిట్స్ రావడంతో ఒక్క సారిగా కిందపడిపోయి మృతి చెందినట్లు స్థానికులు చెబుతున్నారు. త్రీటౌన్ పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. మృతుడి వివరాలు తెలుసుకునేందుకు చుట్టుపక్కల ప్రాంతాల్లో విచారించినప్పటికీ ఎలాంటి సమాచారం లభించలేదు. మృతుడి వద్ద గుర్తింపు కార్డులు లేదా ఇతర వివరాలు లభించలేదు. దీంతో మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వాస్పత్రిలోని మార్చురీలో భద్రపరిచారు. మృతుడి ఆచూకీ, కుటుంబ సభ్యుల వివరాలు తెలిసిన వారు త్రీటౌన్ పోలీస్స్టేషన్లో సంప్రదించాలని సీఐ రామాంజనేయుడు కోరారు. -
నేటి నుంచి మాజీ సీఎం వైఎస్ జగన్ పర్యటన
పులివెందుల : రాష్ట్ర మాజీ సీఎం, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి మంగళవారం నుంచి రెండు రోజులపాటు పులివెందుల నియోజకవర్గంలో పర్యటించనున్నారు. ఆయన పర్యటనకు సంబంధించిన వివరాలను పార్టీ వర్గాలు తెలిపాయి. సెప్టెంబర్ 1వ తేదీన మంగళవారం ఉదయం 10.30గంటలకు బెంగుళూరులోని తన నివాసం నుంచి బయలుదేరి జక్కూరు ఎయిర్డ్రోంకు 10.50గంటలకు చేరుకుంటారు. 11గంటలకు జక్కూరు ఎయిర్ డ్రోం నుంచి ప్రత్యేక విమానంలో బయలుదేరి 11.50గంటలకు పులివెందులలోని స్థానిక భాకరాపురంలో ఉన్న హెలీప్యాడ్ వద్దకు చేరుకుంటారు. అక్కడి నుంచి మధ్యాహ్నం 12.05గంటలకు తన క్యాంపు ఆఫీస్కు చేరుకుంటారు. అనంతరం సాయంత్రం 6గంటల వరకు తన క్యాంపు ఆఫీస్లో ప్రజలతో మమేకమవుతారు. 2వ రోజు పర్యటన ఇలా.. సెప్టెంబర్ 2వ తేదీన వైఎస్సార్ వర్ధంతి సందర్భంగా బుధవారం ఉదయం 7గంటలకు పులివెందులలోని తన నివాసం నుంచి రోడ్డు మార్గాన నేరుగా బయలుదేరి 7.45గంటలకు ఇడుపులపాయలోని వైఎస్సార్ ఘాట్కు చేరుకుంటారు. 8.30గంటలవరకు వైఎస్సార్ ఘాట్ వద్ద మహానేత వైఎస్సార్కు నివాళులర్పించడంతోపాటు ప్రత్యేక ప్రార్థనలు చేయనున్నారు. అనంతరం ఇడుపులపాయలోని హెలీప్యాడ్ వద్ద నుంచి హెలీక్టాపర్ ద్వారా బెంగుళూరుకు తిరుగు పయనమవుతారు. -
వెల్లువెత్తిన అర్జీలు !
● పీజీఆర్ఎస్ తీరుపై జనం అసహనం ● సమస్య పరిష్కారం దొరక్క మండిపాటు కురబలకోట: మదనపల్లి కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్కు జిల్లా నలుమూలల నుంచి వివిధ సమస్యలపై అర్జీలు వెల్లువలా వచ్చాయి. కలెక్టర్ నిశాంత్ కుమార్, జేసీ శివ్ నారాయణ శర్మ, సబ్ కలెక్టర్ చల్లా కళ్యాణి తదితరులు అర్జీలు స్వీకరించారు. 316 దాకా అర్జీలు వచ్చినట్లు వెల్లడించారు. సమస్య పరిష్కారమవుతుందన్న ఆశతో పీజీఆర్ఎస్ను ఆశ్రయిస్తున్న అర్జీదారులకు ఎదురు చూపులు తప్ప పెద్దగా పరిష్కారాలు కన్పించడం లేదని అసహనం వ్యక్తమవుతోంది. ఒక్కసారి లేదా రెండు మార్లు అర్జీ ఇస్తే సమస్య పరిష్కారం కావాలి.. అదే సమస్యపై మళ్లీ మళ్లీ అధికారుల చుట్టూ తిరగాల్సి రావడం పీజీఆర్ఎస్ నిర్వహణ లక్ష్యం ఏమిటనే ప్రశ్నలు వినిపిస్తున్నాయి. కాగా పీజీఆర్ఎస్ అర్జీలు, రెవెన్యూ క్లీనిక్ అర్జీలపై ప్రత్యేక దృష్టి సారించి సత్వరం పరిష్కరించాలని ఆయా శాఖల అధికారులను జిల్లా కలెక్టర్ ఆదేశించారు. అర్జీల్లో కొన్ని.. ● హంద్రీనీవా కాలువ ద్వారా కురబలకోట మండలంలోని అంగళ్లుకు తాగునీటి సరఫరాకు చర్యలు తీసుకోవాలని అలాగే తుంగావారిపల్లి, మల్లయ్యకొండకు రాకపోకలకు హంద్రీనీవా కాలువపై వంతెన నిర్మించాలని జిల్లా కలెక్టర్కు అర్జీ సమర్పించారు. ● పుంగనూరు మండలం నేటిగుంటవారిపల్లి పంచాయతీ ఆరంకుపల్లి, కంబవారిపల్లి, పీర్లవారి ఇండ్లు, దిగువకొండమీదపల్లి, ఆవులవారిపల్లి, ఏటిగడ్డ కమ్మపల్లి ఈ ఆరు పల్లెలకు రేషన్ షాపు 12 కిలోమీటర్ల దూరంలో ఉందని వీరికి సౌకర్యంగా దగ్గర్లో కొత్తగా రేషన్ షాపు మంజూరు చేయాలని ఆయా గ్రామాల ప్రజలు కోరారు. ● పెద్దల కాలం నుంచి సాగు చేసుకుంటున్న 1.92 ఎకరాల భూమి చుట్టూ కంచె వేశారని తగు విచారణ జరిపి తనకు న్యాయం చేయాలని కలకడ మండలం ముడియంవారిపల్లికి చెందిన షేక్ బాదుల్లా సాహేబ్ అర్జీ ఇచ్చారు. ● మదనపల్లి పట్టణం పుంగనూరు రోడ్డులో ఎంఎల్ఎల్ ఆసుపత్రి సమీపంలో 20 అడుగుల రోడ్డు స్థలాన్ని ఆక్రమించారని తగిన చర్యలు తీసుకుని ఆక్రమణలు తొలగించాలని స్థానికులు పీజీఆర్ఎస్లో ఫిర్యాదుచేశారు. ● మదనపల్లి మండలం తట్టివారిపల్లి పంచాయతీ దేవతానగర్లో లే అవుట్కు కేటాయించిన పంచాయతీ స్థలం 29 సెంట్లను ఒకరు ఆక్రమించి విక్రయించడానికి చేస్తున్న ప్రయత్నాలను అడ్డుకోవాలని స్థానికులు సోమవారం పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. వెంటనే తగు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. -
హోం వర్కు చేయలేదని విద్యార్థిని కొట్టిన టీచర్
రొంపిచెర్ల : హోం వర్కు చేయలేదని విద్యార్థిని టీచర్ కోట్టడంతో తల్లిదండ్రులు టీచర్ మీద దాడి చేసిన సంఘటన రొంపిచెర్లలో సోమవారం సాయంత్రం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల గ్రామ పంచాయతీలోని చిన్నమశీదువీధికి చెందిన రకీబ్ అలీ ఖాన్ రెండో కుమారుడు చౌహాన్ స్థానిక ఆకాష్ పాఠశాలలో ఐదోతరగతి చదువుతున్నాడు. సోమవారం ఉదయం విద్యార్థి హోం వర్కు చేయలేదని టీచర్ గోపి విద్యార్థి వీపుపై కట్టెతో కొట్టాడు. దీంతో ఎర్రగా వాతాలు పడ్డాయి. సాయంత్రం ఇంటికి వెళ్లి విషయాన్ని తల్లిదండ్రులకు చెప్పాడు. తల్లిదండ్రులు పాఠశాలకు వెళ్లి టీచర్పై దాడి చేసి కొట్టారు. అనంతరం రొంపిచెర్ల పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్ఐ మధుసూధన్ సంఘటన స్థలాన్ని పరిశీలించారు. అనంతరం పాఠశాల యాజమాన్యంతో మాట్లాడి విద్యార్థులను కోట్టే ఉపాధ్యాయులను పాఠశాలలో పెట్టుకోరాదని, వెంటనే టీచర్ను సస్పెండ్ చేయాలని అదేశించారు. దీంతో పాఠశాల యాజమాన్యం టీచర్ను పాఠశాల నుంచి తొలగించారు.పోలీసులకు ఫిర్యాదు చేసిన తల్లిదండ్రులు -
బ్యాంకు ఖాతాకు చేరిన సొమ్ము
చౌడేపల్లె : మండలంలోని స్వయం సహాయక మహిళా సంఘాల్లో అవినీతిఅక్రమాలపై ’సాక్షి’లో ప్రచురితమైన వరుస కథనాలపై జిల్లా కలెక్టర్ నిశాంత్కుమార్ ఆదేశాల మేరకు డీఆర్డీఏ పిడి నాగేశ్వరరావు స్పందించారు. పరికిదొన గ్రామంలోని గంగోత్రి మహిళా సంఘం సభ్యులను కలిసి అధికారుల విచారణ ప్రారంభం కావడంతో సోమవారం రూ:50 వేలు సొమ్ము గ్రామ సమాఖ్య ఖాతాకు జమ అయింది. మొత్తం రూ:1.50 లక్షల రుణం ఆ సంఘం లీడర్లు, సభ్యులకు తెలియకుండా ఫోర్జరీ సంతకాలతో బ్యాంకులో ఓ మహిళ వ్యక్తిగత బ్యాంకు ఖాతాకు సొమ్ము బదిలీ అయిన విషయం వెలుగులోకి రావడంతో సభ్యులు అధికారులను నిలదీసిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై ‘సాక్షి’లో రుణానికి అంత...ఇవ్వాల్సిందే అడిగినంత..?ఫోర్జరీ సంతకాలతో రుణాలు? శీర్షికతో కథనాలు ప్రచురితమైయ్యాయి. స్పందించిన వెలుగు శాఖ అధికారులు సోమవారం జిల్లా కలెక్టర్ కార్యాలయానికి రికార్డులతో హాజరు కావాలని ఆదేశించారు. ఏపీఎం సుబ్రమణ్యం, సీసీ సుగుణలతోపాటు సంఘ సభ్యులు హాజరయ్యారు. సంఘమిత్ర గైర్హాజరైయ్యారు.సంఘం రికార్డుల నిర్వహణ సక్రమంగా లేదని , పర్యవేక్షణ కొరవడడంతోనే సమస్యలు ఎదురువుతున్నాయని హెచ్చరిస్తూ ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. లీడర్ల ఫోర్జరీ సంతకాలతో డ్రాచేసిన రూ:1:50 లక్షల సొమ్ములో గ్రామసమాఖ్య బ్యాంకు ఖాతాకు రూ:50 వేలు జమ చేయడం గమనార్హం. మిగిలిన లక్షను నిర్ణీత గడువులోపు క్రమం తప్పకుండా చెల్లించాలని అధికారులను ఉన్నతాధికారులు ఆదేశించారు. ఇకనైనా ఇలాంటి ఘటనలు మండలంలో తలెత్తకుండా చర్యలు తీసుకోవాలని సభ్యులు కోరుతున్నారు. -
జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలి
● వైఎస్సార్ సీపీ రైతు విభాగం డిమాండ్ ● కలెక్టరేట్ ఎదుట నిరసన మదనపల్లి (కురబలకోట): రాయలసీమతో పాటు అ న్నమయ్య జిల్లా కరువు కాటకాలతో విలవిలలాడు తోందని వెంటనే జిల్లాను కరువు ప్రాంతంగా ప్రకటించాలని వైఎస్సార్ సీపీ మదనపల్లి నియోజక వర్గ రైతు విభాగం అధ్యక్షులు జన్నె రాజేంద్ర నాయుడు ఆధ్వర్యంలో ఆపార్టీ నాయకులు డిమాండ్ చేశారు. ముందుగా వారు కలెక్టరేట్ ముందు ధర్నా, నిరసన వ్యక్తం చేశారు. గతంలో అనంతపురం జిల్లా అంతటా ఎకరానికి రూ.5 వేల నుంచి రూ. 10 వేల వరకు పంట నష్టం కింద ఆర్థిక సాయం అందించారన్నారు. ఆ తరహాలో ఇక్కడ కూడా సాయం అందించి రైతాంగాన్ని ఆదుకోవాలని డిమాండ్ చేశారు. టమాట, వేరుశనగ పంట నష్టపరిహారం ఇవ్వాలని జిల్లా కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఎన్. విజయభాస్కర్ రెడ్డి, వలసపల్లి నాగరాజరెడ్డి, జనార్దన్ తదితరులు పాల్గొన్నారు. రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలి రాష్ట్రంలో రజకులను ఎస్సీ జాబితాలో చేర్చాలని కోరుతూ ఏపీ రజక ఎస్సీ సాధన కమిటీ పట్టణ రజక సంఘం నాయకులు ఎం. నాగరాజు ఆధ్వర్యంలో రమేష్బాబు, వెంకటలక్ష్మమ్మ, గురుమూర్తి, రెడ్డెప్ప, అన్నయ్య కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఎన్నికలకు ముందు కూడా చంద్రబాబు హామీ ఇచ్చారని మేనిఫెస్టోలో కూడా చేర్చారన్నారు. దేశంలో 18 రాష్ట్రాలు, మూడు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రజకులు ఎస్టీ జాబితాలో ఉన్నారని రాష్ట్రంలో కూడా వీరిని ఎస్సీ జాబితాలో చేర్చడానికి చర్యలు తీసుకోవాలన్నారు. ● తంబళ్లపల్లి మండలం ఎద్దులవేమన్నగారిపల్లి పరిధిలో దళితుల ఇళ్లకు కేటాయించిన భూములను అక్రమంగా ఆక్రమించుకున్న వారిపై తగు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తూ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో కలెక్టరేట్లో ధర్నా చేశారు. -
ఎట్టెట్టా.. ఇది స్పెషల్ టెట్టా?
మదనపల్లె సిటీ: ఉపాధ్యాయుల సుదీర్ఘ డిమాండ్ల నేపథ్యంలో ఇన్–సర్వీస్ టీచర్ల కోసం ‘స్పెషల్ టెట్’ నిర్వహిస్తామంటూ కూటమి ప్రభుత్వం ప్రకటించిన విధానంపై రాష్ట్రవ్యాప్తంగా ఉపాధ్యాయులలో తీవ్ర అసంతృప్తి, ఆందోళన వ్యక్తమవుతోంది. వాస్తవానికి ఈ నెల 5 నుంచి 16వ తేదీ వరకు ప్రభుత్వం అత్యంత హడావుడిగా సాధారణ టెట్ పరీక్షలను నిర్వహించింది. ఆ పరీక్షలకు సంబంధించిన కీ మరియు తుది ఫలితాలను ఇంకా విడుదల చేయకుండానే.. వాటిని పూర్తిగా గాలికి వదిలేసి, మళ్లీ ఇప్పుడు అకస్మాత్తుగా స్పెషల్ టెట్ నోటిఫికేషన్ను తెరపైకి తీసుకురావడంపై అయ్యవార్లు తీవ్రంగా మండిపడుతున్నారు. టీచర్లలో ప్రశ్నల వర్షం.. అవే సందేహాలు ప్రభుత్వం పాత పరీక్షల పని పూర్తి చేయకుండానే స్పెషల్ టెట్ పేరిట మరో నోటిఫికేషన్ విడుదల చేయడంతో ఉపాధ్యాయుల్లో సహజంగానే అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇప్పటికే టెట్ రాసిన ఇన్ సర్వీస్ టీచర్లు ఈ కొత్త టెట్కు దరఖాస్తు చేయాలా, మళ్లీ పరీక్ష ఫీజు చెల్లించాలా, లేక పాత టెట్ ఫలితాలు వచ్చే వరకు వేచి ఉండాలా, ఇలా అనేక రకాల సందేహాలను పలువురు వ్యక్తం చేస్తున్నారు. పైగా సాధారణ టెట్ మాదిరిగానే అర్హత మార్కులున్నాయి, టెట్ వెయిటేజీ, పరీక్ష విధానంలో కూడా ఎటువంటి మార్పులూ లేవు. మరోవైపు స్పెషల్ టెట్ నోటిఫికేషన్లో సైతం సాధారణ టెట్లో ఉన్న అంశాలే ఉండటంతో వారు అవాక్కవుతున్నారు. మళ్లీ నిరాశే.. అడిగినదొకటి అయ్యిందొక్కటి! ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ నోటిఫికేషన్ ఇన్ సర్వీస్ టీచర్లను తీవ్ర నిరాశకు గురి చేసింది. సాధారణ టెట్కు ప్రత్యేక టెట్కు మధ్య ఎటువంటి మినహాయింపులూ లేకపోవడంతో వారితో పాటు ఉపాధ్యాయ సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ఒకవైపు డీఏల పెండింగ్, మరోవైపు పీఆర్సీపై ఎటువంటి ప్రకటనా లేకపోవడంతో ఇప్పటికే మండిపడుతున్న ఉపాధ్యాయులు ప్రత్యేక టెట్లోనూ ఎటువంటి మినహాయింపులూ ఇవ్వకపోవడంతో కోపోద్రిక్తులవుతున్నారు. 2011కి ముందు ఉన్న ఉపాధ్యాయులు సైతం ఇప్పుడు టెట్ రాయాల్సిన పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఐదేళ్లు పైబడి సర్వీసు ఉన్న ఉపాధ్యాయులు 2028 ఆగష్టు 1వ తేదీ లోపు టెట్ ఉత్తీర్ణత కావాల్సి ఉంది. దీంతో ఉపాధ్యాయులు తలలు పట్టుకుంటున్నారు. జిల్లాలో 6 వేలకు పైగా టీచర్లకు తప్పని తిప్పలు OÐðlGÝëÞÆŠæ hÌêÏ-ÐéÅ-ç³¢…V> 9,633 Ð]l$…¨ E´ë-«§éÅĶæ¬Ë$ {´ë£ýlÑ$MýS, {´ë£ýl-Ñ$-Mø-¯]l²™èl, E¯]l²™èl ´ëuý‡-Ô>-ÌSÌZÏ ç³°-^ól-çÜ$¢-¯é²Æý‡$. ÒÇÌZ §é§éç³# 6 ÐólÌSMýS$-Oò³V> E´ë-«§éÅ-Ķæ¬Ë$ sñæsŒæ¯]l$ Æ>Ķæ*ÍÞ E…¨. G糚yø E§øÅVýS… Ý뫨…_¯]l E´ë«§éÅ-Ķæ¬Ë$ C糚yýl$ sñæsŒæ ´ë‹Ü M>Ðé-ÌS…sôæ Mö…™èl MýSv¯]l-OÐðl$¯]l ç³Ç-íܦ-™ól¯]l° ^ðl´ëµ-Í. D ç³È„ýS 150 Ð]l*Æý‡$P-ÌSMýS$ E…r$…-¨. C…§ýl$ÌZ AÆý‡á™èl Ý뫨…-^é-ÌS…sôæ KïÜ MóSr-WÇ ÐéÆý‡$ 60 Ô>™èl…, ½ïÜ MóSrWÇ 50 Ô>™èl…, GïÜÞ, GïÜt, í³òßæ-^ŒlïÜー MóSr-WÇ ÐéÆý‡$ 40 Ô>™èl… Ð]l*Æý‡$PË$ Ý뫨…-^é-Í. AƇ$$™ól sñæsŒæ õ³ç³ÆŠ‡ &1 ´ë‹Ü M>ÐéÌS…sôæ ™ðlË$VýS$, C…XÏ‹-Ù, VýS×ìæ-™èl…, O^ðlÌŒæz yðlÐðl-ÌS-‹³Ððl$…sŒæ, ç³Æ>Å-Ð]l-Æý‡×ê-°MìS çÜ…º…-«¨…-_¯]l A…Ô>-ÌS±² ^èl§ýl-ÐéÍÞ E…r$…-¨. AÌêVóS õ³ç³ÆŠ‡&2 MýS*yé A§ól ç³Ç-íܦ-†. ºÄñæ*Ìê-hMýSÌŒæ Oòܯ]l$Þ E´ë-«§éÅĶæ¬-ÌSMýS$ VýS×ìæ-™èl…, ™ðlË$VýS$ ç³…yìl-™èl$ÌSMýS$ ÝùçÙÌŒæ çÜtyîl‹Ü CÌê çÜ…º…«§ýl… Ìôæ° çÜ»ñæj-MýS$tË$ sñæsŒæÌZ ò³sìæt ´ë‹Ü M>Ðé-ÌS…sôæ GÌê A° E´ë-«§éÅ-Ķæ¬ÌZÏ B…§øâýæ¯]l ¯ðlÌS-Mö…-¨. CÐ]l±² ÌôæMýS$…yé òܵçÙÌŒæ sñæsŒæ MìS…§ýl {ç³™ólÅMýS…V> °Æý‡Ó-íßæ…-^éÌS° E´ë-«§éÅĶæ$ çÜ…çœ*Ë$ yìlÐ]l*…yŠæ ^ólçÜ$¢-¯é²Æ‡$$. ఆన్లైన్ వద్దు.. ఆఫ్లైనే ముద్దు! ఆన్లైన్ విధానంలోనే టెట్కు హాజరు కావాలని నోటిఫికేషన్లో పేర్కొనగా, దీనివల్ల వయసు పైబడిన ఉపాధ్యాయులు సాంకేతికంగా ఇబ్బందులు పడతారని, కాబట్టి ఆఫ్లైన్లోనే పరీక్ష నిర్వహించాలని, పరీక్షా విధానంలో మార్పులు తేవాలని ఉపాధ్యాయ సంఘాలు ముక్తకంఠంతో డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో యూటీఎఫ్ ఆందోళనకు పిలుపునిచ్చింది. ప్రభుత్వ ఉపాధ్యాయ వ్యతిరేక విధానాలను ఎండగట్టేందుకు సెప్టెంబర్ 3న ‘చలో విజయవాడ’ కార్యక్రమాన్ని కూడా తలపెట్టింది. ఈ మేరకు పలు ఉపాధ్యాయ సంఘాలు పెద్ద ఎత్తున కార్యాచరణకు సిద్ధమవుతున్నాయి. ఉపాధ్యాయుల ప్రధాన డిమాండ్లు ఇవే! ● విద్యాహక్కు చట్టం– 2009 సెక్షన్ 23(1)ను సవరించేలా కేంద్రంపై కూటమి ప్రభుత్వం ఒత్తిడి తేవాలి. ● తమకు టెట్ లేకుండా చేయాలి. ● సాధ్యం కాని పరిస్థితుల్లో ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్లో సామాజిక వర్గం, కేటగిరిలతో సంబంధం లేకుండా అందరికి సమానంగా 40 శాతం పాస్ మార్కులు ప్రకటించాలి. ● సీనియర్ టీచర్లకు కంప్యూటర్ పరిజ్ఞానం లేనందున ఆఫ్లైన్లో పరీక్ష నిర్వహించాలి. ● ఏ సబ్జెక్టు టీచర్కు అదే సబ్జెక్టులో మాత్రమే పరీక్ష నిర్వహించాలి. నూతన నోటిఫికేషన్పై ఇన్–సర్వీస్ టీచర్ల తీవ్ర ఆగ్రహం సిలబస్, అర్హత మార్కుల్లో ఎలాంటి మినహాయింపులు లేకపోవడంపై ఆందోళన సాధారణ టెట్ ఫలితాలు రాకుండానే మరో పరీక్ష నిర్వహణ ఏంటని ప్రశ్న సంబంధం లేని సబ్జెక్టులతో అగ్ని‘పరీక్ష’ మినహాయింపులు ఇవ్వాలని డిమాండ్ 3న ‘చలో విజయవాడ’కు యూటీఎఫ్ పిలుపుప్రభుత్వం మాట తప్పింది 30 సంవత్సరాలు సర్వీసు చేసిన సీనియర్ ఉపాధ్యాయులు ఆన్లైన్ విధానంలో టెట్కు అటెండ్ కాలేరనే విషయాన్ని ప్రభుత్వం దృష్టికి తీసుకువచ్చాం. ఆఫ్లైన్లోనే అని చెప్పి ఆన్లైన్లోనే టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం ద్వారా ప్రభుత్వం మాట తప్పింది. స్పెషల్ టెట్పై ఉద్యమ కార్యచరణ రూపొందిస్తున్నాం. – రెడ్డప్పరెడ్డి, వైఎస్సార్టీఎఫ్ జిల్లా అధ్యక్షులుఅసెంబ్లీలో తీర్మానం చేయాలి తమిళనాడు ప్రభుత్వం మాదిరిగా ఇన్ స ర్వీసు టీచర్లకు టెట్ లేకుండా అసెంబ్లీలో రాష్ట్ర ప్రభుత్వం తీర్మానం చేయాలి. కేంద్ర ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకురావాలి. స్పెషల్ టెట్ పేరుతో ఉపాధ్యాయును ప్రభుత్వం మోసగించింది. – హేమలత, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి -
ఎస్కేఆర్ ఆస్పత్రి ఘటనపై విచారణకు ఆదేశం
మదనపల్లి టౌన్: పీలేరులోని ఎస్కేఆర్ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటనపై సమగ్ర విచారణకు కలెక్టర్ ఆదేశించారు. ఈ ఘటనపై నిష్పక్షపాత విచారణ జరపాలని పలువురు నేతలు, పలు ప్రజా, విద్యార్థి సంఘాల నాయకులు కలెక్టర్కు వినతిపత్రం అందజేశారు. స్పందించిన కలెక్టర్ ఘటనపై విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని డీఎంహెచ్ఓను ఆదేశించారు. నిర్లక్ష్యం తేలితే చట్టపర చర్యలు తీసుకోవాలని ఆదేశించారు.స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డుల ప్రకటన మదనపల్లె సిటీ: జిల్లా విద్యాశాఖ, స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఎస్జీఎఫ్) ఆధ్వర్యంలో స్కూల్ ఆఫ్ స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులకు ఎంపికై న పాఠశాలల వివరాలను డీఈఓ సుబ్రమణ్యం, ఎస్జీఎఫ్ సెక్రటరీ నాగరాజు వెల్లడించారు. సోమవారం వారు మాట్లాడుతూ జిల్లాలో మదనపల్లె మండలం సీటీఎం జెడ్పీ ఉన్నత పాఠశాల 236 పాయింట్లతో మొదటి స్థానం దక్కించుకుందన్నారు. రెండవ స్థానం మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల 114 పాయింట్లు, కలకడ మండలం కోన జెడ్పీ ఉన్నత పాఠశాల మూడవ స్థానంలో 104 పాయింట్లతో రెండు, మూడు స్థానాల్లో నిలిచాయని పేర్కొన్నారు. నాల్గవ స్థానం కేజీబీవీ రామాపురం 90 పాయింట్లు, చౌడేపల్లె మండలం జెడ్పీ ఉన్నత పాఠశాల పుదిపట్ల ఐదవ స్థానంలో 52 పాయింట్లు దక్కించుకున్నట్లు తెలిపారు. స్పోర్ట్స్ ఎక్సలెన్స్ అవార్డులను ఈ నెల 5వతేదీన కలెక్టర్ చేతుల మీదుగా అందజేస్తామని వివరించారు. సీఎం సూపర్ ఆడిట్ పిటీషన్లకు సత్వర పరిష్కారం – జేసీ శివ్ నారాయణ శర్మ మదనపల్లి: సీఎం కార్యాలయ సూపర్ ఆడిట్ టీమ్ ద్వారా జిల్లాకు పంపిన పిటిషన్లను సత్వరం పరిష్కార మార్గాలు చూపుతున్నట్లు జేసీ శివ్ నారాయణ శర్మ తెలిపారు. సోమ వారం మదనపల్లి కలెక్టరేట్ కోర్టు హాల్లో సంబంధిత అధికారులు, అర్జీదారులతో కలసి 13 పిటీషన్లపై ఆయన స్వయంగా విచారించి పరిష్కార మార్గాలను చూపారు. ప్రతి పిటిషన్లో అధికారుల స్థాయిలో లోపాలు, పొరపాట్లు జరిగాయా అనే అంశాలను పరిశీలించి లోపాలుంటే వెంటనే సరిదిద్ది అర్జీదారులకు న్యాయం చేయాలన్నారు. తీసుకున్న నిర్ణయం సరైనదైతే సంబంధిత చట్టాలు, నిబంధనలను అర్జీదారులకు స్పష్టంగా తెలియజెప్పి సందేహాలు ఉంటే నివృత్తి చేయాలన్నారు. ఏపీ జేఏసీ అమరావతి ఉద్యమ బాట మదనపల్లి (కురబలకోట): ఏపీ జేసీసీ అమరావతి ఆధ్వర్యంలో ప్రభుత్వ ఉద్యోగుల హక్కులు, పెండింగ్ బకాయిల సాధన కోసం ఉద్యమ కార్యాచరణకు ఉద్యుక్తులయ్యారు. మదనపల్లి కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్ వేదికగా జేఏసీ అన్నమయ్య జిల్లా శాఖ ఆధ్వర్యంలో ఉద్యోగులు ఆందోళన చేపట్టారు. ప్రధాన డిమాండ్లను పరిష్కరించడానికి ప్రభు త్వ దృష్టికి తీసుకెళ్లాల్సిందిగా అనంతరం జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఏపీజేఏసీ అన్నమ య్య జిల్లా చైర్మన్ పి.నరసంహ కుమార్ మాట్లాడుతూ తమ డిమాండ్ల సాధనకు బొప్పరాజు వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో ఉద్యమాన్ని ఉధృతం చేస్తామన్నారు. ఈ నెల 26 వరకు రెండు దశల్లో ఉద్యమం చేస్తామని.. అప్పటికీ ప్రభుత్వం దిగి రాకపోతే మూడో దశ ఉద్యమాన్ని మరింత ఉధృతంగా నిర్వహిస్తామ ని హెచ్చరించారు. ప్రధాన కార్యదర్శి గోపి, ఏపీ ఆర్ఎస్ఏ మహిళా విభాగం జిల్లా చేర్పర్సన్ భార్గవి, ఏపీఆర్ఎస్ఏ సెక్రటరీ ఆర్ఎం బాజ్జి, మదనపల్లి ఏపీఆర్ఎస్ ఎ ప్రెసిడెంట్ సాగర్, అస్లం, వంశీ, గిరి,రాణి, బయ్యారెడ్డి, సాంబశివరెడ్డి తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఎంప్లాయిస్ అసోషియేషన్ కూడా వీరికి సంపూర్ణ మద్దతు ప్రకటించినట్లు నాయకులు ముని గోపాల కృష్ణ తెలిపారు. దళితమిత్ర సంఘ కార్యవర్గ ఎన్నిక కడప సెవెన్రోడ్స్ : దళితమిత్ర సంఘ అన్నమయ్య, తిరుపతి జిల్లాల కార్యవర్గ ఎన్నిక సోమవారం కడప నగరంలోని ఆ సంఘ కార్యాలయంలో నిర్వహించారు. సంఘ వ్యవస్థాపక అధ్యక్షుడు కై పు రామాంజనేయులు అధ్యక్షతన రెండు జిల్లాల సమావేశం నిర్వహించారు. అన్నమయ్య జిల్లా ఇన్ఛార్జిగా కరకోటి కిశోర్బాబు, తిరుపతి జిల్లా ఇన్ఛార్జిగా పూజారి ప్రశాంత్ను ఎన్నుకున్నారు. మునీంద్ర, చాట్ల వీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
సత్వరమే ఫిర్యాదుల పరిష్కారం
మదనపల్లె టౌన్ : మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి 71 ఫిర్యాదులు స్వీకరించారు. ఇందులో భూ వివాదాలు 30, ఆర్థిక వివాదాలు 10, ఘర్షణ, న్యూసెనన్స్ 10, కుటుంబ వివాదాలు 6, ఇతరాలు 5, పరిపాలనా పరమైనవి 3 ఉన్నాయి. భూకబ్జాలు, వడ్డీ వేధింపులపై కఠిన చర్యలు తీసుకోవాలని, ఫిర్యాదులను పరిశీలించి సత్వరమే వాటిని పరిష్కరించాలని పోలీసు అధికారులను ఆదేశించారు. పీజీఆర్ఎస్కు వచ్చిన అర్జీలలో కొన్ని.. ● తప్పుడు సర్వే నెంబరుతో భూమి విక్రయంపై మదనపల్లె మండలం, చిన్నతిప్పసముద్రం హరిజనవాడ డోర్ నంబర్ 1లో స్థిర నివాసం ఉంటున్న టి.యస్.చాంద్ బాషా ఎస్పీకి ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్ 1508లోని తన ఇంటిపై మేనత్త ఎస్. అమీనాబీతో మదనపల్లె కోర్టులో 554/2011 కేసు నడుస్తోందన్నారు. ఇదే సమయంలో అమీనాబీ కోర్టును తప్పుదోవపట్టించి సర్వే నంబర్ 355 బషినికొండగా మార్చి, నిమ్మనపల్లె రోడ్డులో నివసించే షేక్ వజీర్ బాషాకు రూ.6,82,000లకు డాక్యుమెంట్ నంబర్ 212023/2024 ద్వారా విక్రయించిందని ఆరోపించారు. వజీర్ బాషా తన భార్య అస్మత్ జాన్ పేరున 23097/2024గా మళ్లీ రిజిస్టర్ చేశాడని, సదరు దస్తావేజులు రద్దు చేసి సర్వే నంబర్ 1508 ప్రకారం న్యాయం చేయాలని కోరారు. ● మదనపల్లె లో మోసం చేసిన స్క్రబ్ఎక్స్ కంపెనీ మోసాలకు తాము బలైపోయామని హైదరాబాద్, తంబళ్లపల్లె, ములకలచెరువు, పెద్దమండెం, బి.కొత్తకోట ప్రాంతాలకు చెందిన 120 మంది స్క్రబ్ఎక్స్ బాధిత మహిళలు ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. ● సంబేపల్లె మండలం, దేపట్ల గుట్టపల్లెకు చెందిన నాగిరెడ్డి సోమవారం ఎస్పీకి వినతిపత్రం అందజేశారు. సర్వే నెం.82/2లో 1.67సెంట్ల భూమి ఉందని, పక్కనే ఉన్న సర్వే నెం.82/1లోని వారు తన పొలాన్ని ఆక్రమించి, బోరు వేస్తున్నారని ఆరోపించారు. లేకపోతే తన పొలాన్ని రిజిస్ట్రార్ ఉందని బోరు వేయామని బెదిరిస్తున్నారని, కబ్జాదారులను అడ్డుకుని తనకు న్యాయం చేయాలని కోరారు. సంబేపల్లె పోలీస్ స్టేషన్ లో ఫిర్యాదులో పేర్కొన్నారు అంకితభావంతో ప్రజలకు సేవచేయడం వరం మదనపల్లె టౌన్ : అంకితభావంతో 30 ఏళ్లు ప్రజలకు సేవచేయడం వరమని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. మదనపల్లె జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో సోమవారం పదవీ విరమణ పొందిన ముగ్గురు పోలీసు అధికారులను జిల్లా ఎస్పీ సత్కరించి, జ్ఞాపికలు అందజేశారు. సత్కారం పొందిన వారిలో హెడ్ క్వార్టర్స్ ఆర్ఎస్ఐ ఎస్.అల్లావుద్దీన్, సుండుపల్లె ఏఎస్ఐ ఎస్.వెంకటేశ్వర్లు, పీలేరు ఏఎస్ఐ జె.మల్లిఖార్జున ఉన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ వృత్తి పట్ల అంకితభావంతో, నిబద్ధతతో వారు అందించిన సేవలు అభినందనీయమని అన్నారు. కార్యక్రమంలో అదనపు ఎస్పీ (అడ్మిన్) ఎం.వెంకటాద్రి, ఎస్బి సీఐ యు.సదాశివయ్య, ఆర్ఐలు ఎం.రవికుమార్, కె.సురేష్ కుమార్ రెడ్డి, పోలీసు సిబ్బంది, పదవీ విరమణ పొందిన ఉద్యోగుల కుటుంబ సభ్యులు పాల్గొన్నారు.జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
● చెట్లు నరికివేతతో బయటపడిన వ్యవహారం
రెండు రోజుల క్రితం ఆలయ పరిసరాల్లో పెద్దఎత్తున చెట్లు నరికివేయడం, దేవస్థాన భూమిలో రోడ్డు ఏర్పాటు చేసినట్లు కనిపించడంతో అనుమానాలు మరింత బలపడ్డాయని గ్రామస్తులు చెబుతున్నారు. ఆలయానికి చెందిన స్థలంలో రహదారి నిర్మాణానికి ఎవరు అనుమతిచ్చారనే విషయం తేలాల్సి ఉందంటున్నారు. దేవాదాయ శాఖ అనుమతి లేకుండా దేవస్థాన భూమిలో చెట్లను నరికివేసినా, మట్టి తవ్వినా, రహదారి నిర్మించినా అది సాధారణ భూవివాదంగా చూడకూడదని పేర్కొన్నారు. దేవుడి ఆస్తుల పరిరక్షణకు ప్రత్యేక చట్టపరమైన బాధ్యత ఉన్నందున అధికారులు తక్షణమే జోక్యం చేసుకోవాలని కోరుతున్నారు. ఈ భూముల వ్యవహారంలో స్థానిక టీడీపీ నేత ప్రభాకర్రెడ్డి, నారాయణ తదితరుల పాత్రపై గ్రామస్తులు ఆరోపణలు చేస్తున్నారు. అయితే ఈ ఆరోపణలపై సంబంధిత నేతల అధికారిక వివరణ వెలువడాల్సి ఉంది. -
ఎస్ఎస్ ట్యాంకులకు కృష్ణా జలాలు
● చిప్పిలి, గుంటివారిపల్లిను పూర్తిగా నింపాలి ● సమీక్షలో కలెక్టర్ ఆదేశాలు సాక్షి, మదనపల్లె: మదనపల్లె పట్టణంలో తాగునీటి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపే చిప్పిలి, గుంటివారిపల్లె సమ్మర్స్టోరేజీ ట్యాంకులను కృష్ణా జలాలతో నింపాలని కలెక్టర్ నిశాంత్కుమార్ జలవనరులశాఖ అధికారులను ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో హంద్రీ–నీవా, వెలుగల్లు ప్రాజెక్టులు, ఇరిగేషన్, జలధార అధికారులతో కలెక్టర్ సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఈనెల రెండోవారంలో కృష్ణాజలాలు మదనపల్లెకు చేరే అవకాశం ఉండటంతో తాగునీటి అవసరాలకు ప్రాధాన్యత ఇవ్వా లని ఆదేశించారు. చిప్పిలి ట్యాంకు బండ్ను తాత్కాలికంగా ఎత్తు పెంచే చర్యలు చేపట్టి అధిక నీటిని నిల్వ చేయాలని సూచించారు. గుంటివారిపల్లి ట్యాంకును కూడా నింపాలని ఆదేశించారు. హంద్రీనీవా ప్రధాన కాలువ ద్వారా వెలుగల్లు రిజర్వాయర్కు 50 శాతం నింపేలా కృష్ణాజలాలు తరలించాలని కోరారు. వచ్చేనెల మొదటి వారంలో ఈ చర్యలు ప్రారంభించాలన్నారు. జలధార కార్యక్రమంలో చేపడుతున్న జలధార ఫేజ్–2 పనులను వేగవంతం చేయాలని ఆదేశించారు. మంజూరైన పనులను సెప్టెంబర్లోగా పూర్తి చేయాలన్నారు. ఎస్ఈ విఠల్ ప్రసాద్, వెలిగల్లు ఈఈ భరత్ కుమార్ రెడ్డి, మదనపల్లె ఇరిగేషన్ ఈఈ సురేష్బాబు, రిటైర్డ్ ఎస్ఈ వెంకట్రామయ్య, డీఈలు, ఏఈలు, జేఈలు పాల్గొన్నారు. -
ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలి
మదనపల్లె సిటీ: ఎస్సీ వర్గీకరణ కుట్రకు వ్యతిరేకంగా పోరాటాలు చేయాలని మాల మహానాడు జాతీయ అధ్యక్షుడు డాక్టర్ రత్నాకర్ పిలుపునిచ్చారు. ఆదివారం మదనపల్లె ప్రెస్క్లబ్లో ఎస్సీ వర్గీకరణ పేరిట దళితులపై కుట్రలు అనే అంశంపై విలేకర్ల సమావేశం నిర్వహించారు. దళితుల ఐక్యతను దెబ్బతీసేందుకు రాజకీయ పార్టీలు కుట్రలు పన్నుతున్నట్లు ఆరోపించారు. గతంలో మాలమహానాడు కేవలం రెండు తెలుగు రాష్ట్రాలకే పరిమితమై ఉండేదని, ఎస్సీ వర్గీకరణ అంశం దేశవ్యాప్త సమస్యగా మారడంతో సంస్థను రాక్స్ మాలమహానాడుగా విస్తరించినట్లు వివరించారు. ఉద్యమంలో భాగంగా తమిళనాడు,కర్ణాటక, కేరళ, ఒరిస్సా తదితర రాష్ట్రాల్లో పర్యటించినట్లు తెలిపారు. ఎస్సీ రిజర్వేషన్ల ద్వారా కేవలం ఒకటి,రెండు శాతం మందికి మాత్రమే లబ్ధి చేకూరుతుందని, మిగిలిన 99 శాతం మంది దళితులు నేటికీ పేదరికంలోనే మగ్గుతున్నారన్నారు. ఎస్సీ జాబితాలో ఉన్న 59 కులాలకు వర్గీకరణ పేరిట లబ్ధిని సమంగా పంచడం సాధ్యమా అని ప్రశ్నించారు. దళిత ప్రజాస్వామ్యవాదులు, సంఘ సంస్కర్తలు, ఈ వర్గీకరణ కుట్రను వ్యతిరేకించాలన్నారు. .సమావేశంలో నాయకులు ఎం.నరేష్, భాస్కర్,ఇ.రమణ, కనికెళ్ల నాని, ఎంపీ ఆనంద్, ఎం.మోహన్, డీకే నారాయణ, కె.వెంకటరమణ,లక్ష్మిపతి, కేశవ్ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
నెత్తురోడిన రహదారులు
ములకలచెరువు: పాలు సేకరించడానికి వెళ్తుండగా పాల ఆటో, ఎదురుగా వస్తున్న కారు ఢీ కొట్టుకోవడంతో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన ఆదివారం సాయంత్రం మండలంలో చోటుచేసుకుంది. స్థానికులు, పోలీసుల కథనం మేరకు... మండలంలోని పెద్దపాళ్యం పంచాయతీ మళిగివారిపల్లెకు చెందిన ఆటో డ్రైవర్ వెంకటేష్, తన స్నేహితుడైన రాజేష్తో కలిసి పాలు సేకరించడానికి ఆటోలో అదే పంచాయతీకి చెందిన గోళ్లవారిపల్లెకు బయల్దేరి వెళ్లారు. మార్గ మద్యం పెద్దపాళ్యం పెద్దేరు బ్రిడ్జి వద్దకు రాగానే సత్యసాయి జిల్లా కదిరి వైపు నుంచి మదనపల్లెకు పెళ్లి బృందంతో వెళ్తున్న కారు ఢీ కొన్నాయి. ఈ సంఘటనలో ఆటో బోల్తాకొట్టింది. ఆటోలోని ఇద్దరూ తీవ్రంగా గాయపడడంతో 108 సహాయంతో ములకలచెరువు పీహెచ్సీకి తరలింస్తుండగా మృతిచెందారు. సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకొని ఆటో, కారును ట్రాఫిక్ కు అంతరాయం కలగకుండా పక్కకు జరిపారు. మృతుల ఇద్దరికీ వివాహం కాలేదు. రాజేష్ ములకలచెరువులోని ఒక ప్రైవేటు కళాశాలలో డిగ్రీ చదువుతున్నాడు. మృతదేహాలను చూసిన కుటుంబ సభ్యులు భోరున విలపించారు. పోలీసులు కేసు నమోదు చేసి ధర్యాప్తు చేస్తున్నారు. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా.. మదనపల్లె టౌన్: శుభకార్యానికి వెళ్లి ఆనందంగా ఇంటికి తిరిగి వస్తున్న వారిని రోడ్డు ప్రమాదం విషాదంలోకి నెట్టింది. బంధువుల పెళ్లికి హాజరై తిరిగి వస్తుండగా జరిగిన ప్రమాదంలో ఓ వ్యక్తి అక్కడికక్కడే మృతి చెందగా, మరో మహిళ తీవ్రంగా గాయపడింది. అన్నమయ్య జిల్లా మదనపల్లె సమీపంలోని తట్టివారిపల్లి ఫ్లైఓవర్ వద్ద ఆదివారం ఉదయం ఈ ఘటన చోటుచేసుకుంది. మదనపల్లె మండలం కొత్తఇండ్లకు చెందిన శ్రీరాములు, నిమ్మనపల్లి మండలం బండ్లపైకి గ్రామానికి చెందిన వంకాయల లక్ష్మీదేవి శనివారం రాత్రి సీటీఎంలో జరిగిన బంధువుల వివాహానికి హాజరయ్యారు. ఆదివారం ఉదయం ముహూర్తం అనంతరం ఇద్దరూ ద్విచక్ర వాహనంలో మదనపల్లెకు బయలుదేరారు. మార్గమధ్యలో కర్ణాటక వైపు నుంచి వచ్చిన కారు వారి ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టింది. ప్రమాదంలో శ్రీరాములు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. తీవ్రంగా గాయపడిన లక్ష్మీదేవిని 108 సిబ్బంది మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు అత్యవసర చికిత్స అందించడంతో ఆమెకు ప్రాణాపాయం తప్పింది. కుటుంబ సభ్యుడి మృతి ఆ కుటుంబానికి విషాదాన్ని మిగిల్చింది. మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. ప్రయాణాల్లో రోడ్డు ప్రమాదాలు.. పలువురికి మృత్యుమార్గాలుగా మారాయి. జిల్లాలో ఆదివారం జరిగిన వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం పాలయ్యారు. ఈ విషాదకర సంఘటనలు ఆయా కుటుంబాల్లో తీవ్ర శోకాన్ని నింపాయి. వేర్వేరు ప్రమాదాల్లో ముగ్గురు దుర్మరణం -
ఏం తిని బతకాలి!
సామాన్యుడిపై మోయలేని భారం నిత్యావసర వస్తువుల ధరలు అనూహ్యంగా పెరగడం సామాన్యుడిపై తీవ్ర ఆర్థిక భారాన్ని మోపుతోంది. బియ్యం, పప్పులు, కూరగాయలు, నూనె, పాలు, చక్కెర ధరలు పెరిగితే ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాల నెలవారి బడ్జెట్పై నేరుగా ప్రభావం పడుతుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక నిత్యావసర వస్తువుల ధరలు ఆకాశాన్ని అంటుతున్నాయి. ధరలు నియంత్రించడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. – కే వెంకటేశ్వర్లు, గాలివీడు మండలం ఎట్లా బ్రతకాలో తెలియడం లేదు మేము కూలీనాలీ చేసుకుని బతికేవాళ్లం. ఆరు నెలల ముందు రూ. 1450 ఉన్న 25 కిలోల బియ్యం మూట ఈరోజు రూ. 1600కు పెరిగింది. కందిబేడలు రూ. 180 నుంచి 200, పామోలిన్ కిలో రూ. 170 నుంచి 190కు, చింతపండు రూ. 150 నుంచి 180కు, ఎర్రగడ్డలు రూ. 30 నుంచి 60కు, పచ్చిమిరప రూ. 50కు చేరుకున్నాయి. మాబోటి వాళ్లకు నెలంతా కష్టపడినా వచ్చే ఆదాయం కూరగాయలకు సరిపోవడం లేదు. ఇక మిగతా అవసరాలు ఎలా తీర్చుకోవాలో తలుచుకుంటే భయమేస్తోంది. – కై పు సుబ్బమ్మ, రామాంజనేయపురం, కడపకూటమి సర్కార్లో అన్ని పిరమే.. కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చాక అన్ని పిరమయ్యాయి. దీంతో సామాన్యులు, పేదవారు బతికాంటే అప్పులు చేసుకోక తప్పడం లేదు. పైగా రైతులు పండించే పంటలకు మాత్రం గిట్టుబాటు ధరలు లేవు. పెరిగిన ధరలతో అన్ని రకాల ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – ఎన్, వెంకట్ రెడ్డి, గోపనపల్లి, గాలివీడు మండలంధరల నియంత్రణకు చొరవ తీసుకోవాలి.. నిత్యావసర సరుకుల ధరల నియంత్రణకు ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. పెరిగిన ధరల కు అనుగుణంగా ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. ఇలా చేస్తేనే సామాన్యులు బతకగలరు. లేకుండా వారి జీవనం దుర్భరంగా మా రుతుంది. ఈ విషయంలో ప్రభుత్వం స్పందించి చర్యలు తీసుకోవాలి. – గాలిచంద్ర, ిసీపీఐ జిల్లా కార్యదర్శి -
రామలక్ష్మి పట్నాయక్ సేవలు స్ఫూర్తిదాయకం
కడప కోటిరెడ్డి సర్కిల్ : రామలక్ష్మి పట్నాయక్ సేవలు స్ఫూర్తిదాయకమని కర్నూలు, అనంతపురం డీఐజీలు కిరణ్, విజయలక్ష్మి, కాకినాడ డీఐజీ కొనియాడారు. ఆదివారం కడప నగరంలోని ముయూర గార్డెనియాలో కడప డిప్యూటీ ఇన్స్పెక్టర్ జనరల్ స్టాంప్స్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ (డీఐజీ) రామలక్ష్మి పట్నాయక్ ఉద్యోగ విరమణ సందర్భంగా పలువురు అధికారులు ఆమెను సత్కరించారు. అనంతరం వారు మాట్లాడుతూ రిజిస్ట్రేషన్ స్టాంప్ల శాఖలో 31 ఏళ్లు సుదీర్ఘ సేవా ప్రయాణం చేశారని పేర్కొన్నారు. అనంతరం అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లాల రిజిస్ట్రార్లు ఉమామహేశ్వరి, పీవీఎన్ బాబుతోపాటు కడప సబ్ రిజిస్టార్లు అబ్దుల్ సత్తార్, హరికృష్ణ, రూరల్ సబ్ రిజిస్ట్రార్లు నజీర్, రాజశేఖర్, రెండు జిల్లాల సబ్ రిజిస్ట్రార్లు. స్టాంప్ రైటర్లు సత్కరించారు. డాక్యుమెంట్ రైటర్స్ అసోసియేషన్ కడప జిల్లా అధ్యక్షుడు వేణుగోపాల్, యాకోబ్, శివ, గంగాధర్, సుబ్బరాయుడు పాల్గొన్నారు. -
బొలెరో ఢీకొని తండ్రి, కుమార్తెకు తీవ్ర గాయాలు
మదనపల్లె టౌన్: మదనపల్లె మండలంలో ఆదివారం జరిగిన రోడ్డు ప్రమాదంలో తండ్రి, కుమార్తె తీవ్రంగా గాయపడ్డారు. తాలూకా పోలీసుల కథనం మేరకు.. కొత్తవారిపల్లె పంచాయతీ దొబ్బిగానిపల్లికి చెందిన నాగరాజు, ఆయన కుమార్తె సుశీల ద్విచక్ర వాహనంలో సొంత పనిమీద మదనపల్లెకు వచ్చారు. తిరిగి స్వగ్రామానికి వెళ్తుండగా తట్టివారిపల్లి సమీపంలోని చెరువు కట్టపై బొలెరో వాహనం బైక్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగరాజు, సుశీల తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు వారిని మదనపల్లె జిల్లా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి చికిత్స అందించారు. నాగరాజు పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు తిరుపతి రుయా ఆసుపత్రికి తరలించారు. సుశీలను జిల్లా ఆసుపత్రిలోనే చేర్పించి చికిత్స అందిస్తున్నారు. తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ప్రమాదానికి కారణాలపై విచారణ చేస్తున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. బైకు అదుపుతప్పి కిందపడి.. మదనపల్లె టౌన్: బైకు అదుపుతప్పి కిందపడటంతో ఓ యువకుడు తీవ్రంగా గాయపడిన సంఘటన ఆదివారం పెద్దతిప్పసముద్రం మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్పోస్ట్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పీటీఎం మండలం కానుగమాకులపల్లెకు చెందిన రెడ్డప్ప కుమారుడు గణేష్ బైకుపై పీటీఎంకు బయలుదేరాడు. చెరువు మరవ వద్దకు చేరుకోగానే ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైకు అదుపుతప్పి కిందపడిపోయాడు. ఈ ప్రమాదంలో గణేష్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి 108కు సమాచారం అందించడంతో సిబ్బంది అక్కడికి చేరుకుని క్షతగాత్రుడిని బి.కొత్తకోట ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. వైద్యులు చికిత్స అందించిన అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి ఆసుపత్రికి రెఫర్ చేశారు. ఈ ఘటనపై పేటీఎం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
అప్పుల బాధతో మహిళా రైతు ఆత్మహత్యాయత్నం
మదనపల్లె టౌన్: అప్పుల బాధతో ఓ మహిళా రైతు ఎలుకల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన ఆదివారం మదనపల్లె మండలంలో చోటుచేసుకుంది. మదనపల్లె జిల్లా ఆసుపత్రి అవుట్పోస్ట్ పోలీసులు, కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల మేరకు.. మండలంలోని మాలెపాడు పంచాయతీ, ఎగువ దొనబయలకు చెందిన నారాయణస్వామి భార్య కళావతమ్మ (50) వ్యవసాయ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తోంది. ఇటీవల టమాటా, ఇతర కూరగాయల పంటల సాగు కోసం సుమారు రూ.5 లక్షల వరకు అప్పులు చేసింది. అయితే పంటలకు గిట్టుబాటు ధరలు లేకపోవడంతో పెట్టుబడులు సైతం తిరిగి రాక, చేసిన అప్పులు తీర్చే మార్గం కనిపించక తీవ్ర మనస్తాపానికి గురైంది. ఈ క్రమంలో జీవితంపై విరక్తి చెంది ఎలుకల మందు తాగింది. కుటుంబ సభ్యులు గమనించి వెంటనే ఆమెను మదనపల్లె జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ప్రస్తుతం కళావతమ్మ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది. తాలూకా పోలీసులు కేసు దర్యాప్తు చేపట్టారు. -
రోడ్డు ప్రమాదంలో యువకుడు దుర్మరణం
ప్రొద్దుటూరు క్రైం : వైఎస్సార్కడప జిల్లా మైదుకూరు రోడ్డులో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఖురేషి మహమ్మద్ అస్రార్ (19) అనే యువకుడు దుర్మరణం చెందాడు. ట్రాఫిక్ పోలీసులు తెలిపిన వివరాల మేరకు.. పట్టణంలోని తిరుమలనాయునిపేటకు చెందిన మహమ్మద్ అస్రార్ మటన్ షాపులో పని చేస్తున్నాడు. అతను తన బంధువైన ఖురేషి ముజాహిద్తో కలసి పొట్టేళ్లు కొనుగోలు చేసేందుకు శనివారం రాత్రి బైక్లో మైదుకూరులో నిర్వహిస్తున్న సంతకు బయలుదేరారు. ఖురేషి ముజాహిద్ బైక్ నడుపుతుండగా మహమ్మద్ అస్రార్ వెనుక కూర్చున్నాడు. ఈ క్రమంలో ప్రొద్దుటూరు ఆర్టీసి బస్టాండు వద్దకు వెళ్లగానే ఎదురుగా రోడ్డు దాటుకుంటున్న బాబాఫకృద్ధిన్, షేక్ అలీ ముర్తుజాలను వారి బైక్ ఢీ కొంది. దీంతో బైక్లో వెళ్తున్న మహమ్మద్ అస్రార్, ముజాహిద్లు ఎగిరి కింద పడిపోయారు. తీవ్రంగా గాయపడిన మహమ్మద్ అస్రార్ను చికిత్స నిమిత్తం జిల్లా ప్రభుత్వాసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ కొద్దిసేపటి తర్వాత మృతి చెందాడు. బైక్ నడుపుతున్న ఖురేషి ముజాహిద్తో పాటు నడుచుకుంటూ వెళ్తున్న బాబాఫకృద్ధిన్, షేక్ అలీ ముర్తుజాలు గాయపడ్డారు. బాబాఫకృద్ధిన్ ఆర్టీసి బస్టాండు ఎదురుగా ఉన్న లాడ్జీలో రూమ్ బాయ్గా పని చేస్తున్నాడు. గాయపడిన ముగ్గురూ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ట్రాఫిక్ పోలీసులు తెలిపారు. -
నందలూరు రైల్వేకేంద్రంలో ఆర్వోబీ!
● రైల్వేమంత్రి వైష్ణవ్ హామీ ● పరిశీలన చేయాలని అధికారులకు ఆదేశం ● ఫలించిన ఎంపీ మేడా కృషిరాజంపేట : జిల్లాలో రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో ఆర్వోబీ (రోడ్ ఓవర్ బ్రిడ్జి) నిర్మాణానికి రైల్వేమంత్రిత్వశాఖ అంగీకరించింది. ఈ మేరకు రాజ్యసభ సభ్యుడు మేడా రఘునాథరెడ్డికి రైల్వే మంత్రి అశ్వినివైష్ణవ్ లేఖ ద్వారా తెలియచేశారు. ఈ విషయాన్ని ఎంపీ ధ్రువీకరించారు. హైవే కనెక్టివిటీగా ఆర్వోబీ నిర్మాణం నందలూరు రైల్వేకేంద్రానికి కొద్దిదూరంలో పడమర దిశలో నాగిరెడ్డిపల్లె శివారులో కడప–రేణిగుంట గ్రీన్ఫీల్డ్ హైవే నిర్మాణం కొనసాగుతోంది. ఈ హైవే కనెకట్టివిగా నందలూరు రైల్వేపాత గేటు వద్ద ఆర్వోబీ నిర్మాణం ఆవశక్యతను ఎంపీ రైల్వేమంత్రిత్వ శాఖ దృష్టికి తీసుకెళ్లారు. కొన్నేళ్లుగా స్థానికులు ఎంపీకి ఆర్వోబీ నిర్మాణం గురించి విన్నవిస్తూ వస్తున్నారు. దీంతో ఎంపీ మేడా సంబంధిత మంత్రిత్వశాఖతో పలుసార్లు మాట్లాడారు. తాజాగా ఆయన కృషి ఫలించి ఆర్వోబీ నిర్మాణానికి మంత్రి వైష్ణవ్ హామీ ఇచ్చారు. నందలూరు రైల్వేకేంద్రంలో ఉన్న 111 పాతగేటు స్థానంలో ఆర్వోబి నిర్మాణం కోసం ఎంపీ మేడా రఘునాథరెడ్డి కృషి ఫలించడంపై నందలూరు ప్రాంతంలో హర్హాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి. హైవేకనెక్టివికి అనుకూలంగా లేని రెండు ఆర్యూబీలు ప్రస్తుతం ఉన్న రెండు ఆర్యూబీలో హైవే నుంచి రాకపోకలు సాగించడానికి వీలులేని పరిస్థితులు ఉన్నాయి. ఫలితంగా ఆర్వోబీ నిర్మాణం తప్పనిసరి. కాగా ఆర్వోబి నిర్మాణం కోసం ప్రస్తుతం ఉన్న ప్రాంతాన్నే ఎంచుకుంటారా... లేక గొల్లపల్లె దారిలో ఉన్న పాతక్యాబిన్ వద్ద భూసేకరణ చేసి ఆర్వోబీ నిర్మిస్తారా చూడాలి. రైల్వే అధికారుల పరిశీలన తర్వాత రైల్వే సర్వే ఆధారంగా ఆర్వోబీ నిర్మాణ స్ధలం నిర్ణయించనున్నారు. పర్యాటకులకు ఎంతో మేలు ఆర్వోబీ నిర్మాణం వల్ల హైవేలో వెళ్లే పర్యాటకులు, యాత్రీకులు, ప్రజలు నేరుగా నందలూరు సర్వీసురోడ్డు(ప్రస్తుత హైవే)లోకి వెళ్లేందుకు వీలుంటుంది. ఫలితంగా దక్షిణభారతదేశంలో అతి పెద్ద వైష్ణవ ఆలయంతోపాటు సమీపంలోని తాళ్లపాక, 108 అడుగుల అన్నమయ్య విగ్రహం, టీటీడీ శ్రీవారి ఆలయం, సీమలో తొలిసారిగా బయల్పడ్డ భౌద్ధరామాలును సందర్శించేందుకు సౌకర్యంగా ఉంటుంది. -
బోయకొండలో పోటెత్తిన భక్తులు
చౌడేపల్లె : మండలంలోని దిగువపల్లెలోని శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సెలవు దినం కావడంతోపాటు అధిక సంఖ్యలో విద్యార్థులు,యువత, ఉద్యోగస్తులు కుటుంబ సమేతంగా హాజరై మొక్కులు చెల్లించారు. ఆలయ అర్చకులు అమ్మవారిని సుందరంగా అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. క్యూలెన్లలో భక్తుల రద్దీతో తోపులాటలు జరిగాయి. కనీస వసతులు లేక వృద్దులు, చిన్న బిడ్డల తల్లులు ఇబ్బందులు పడాల్సి వచ్చింది. మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు మదనపల్లె సిటీ : తంబళ్లపల్లె సమీపంలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన మల్లయ్యకొండకు ప్రత్యేక బస్సులు నడపనున్నట్లు ఆర్టీసీ–1 డిపో మేనేజర్ మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. సోమవారం మదనపల్లె డిపో నుంచి ఉదయం 6.00, 6.30 గంటలకు ప్రత్యేక బస్సులు మల్లయ్యకొండకు నడుస్తాయన్నారు. తంబళ్లపల్లె రాగిమాను సర్కిల్ నుంచి సాయంత్రం వరకు షటిల్ సర్వీసులు నడుస్తాయన్నారు. భక్తులకు ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణించాలని కోరారు. నేడు ’డయల్ యువర్ సీఎండీ’కడప కార్పొరేషన్ : విద్యుత్ వినియోగదారుల సమస్యల పరిష్కారం కోసం ఆగష్టు 31వ తేదీన ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12:30 గంటల వరకు ’డయల్ యువర్ సీఎండీ’కార్యక్రమాన్ని ఏపీఎస్పీడీసీఎల్ నిర్వహించనుంది. ప్రతి సోమవారం నిర్వహించే డయల్ యువర్ సిఎండి కార్యక్రమం ద్వారా తిరుపతి, చిత్తూరు, నెల్లూరు, కడప, అన్నమయ్య, కర్నూలు, నంద్యాల, అనంతపురం, శ్రీసత్యసాయి జిల్లాల నుంచి వినియోగదారులు 8977716661కు కాల్ చేసి తమ విద్యుత్ సమస్యలను సీఎండీ దృష్టికి తీసుకురావచ్చు. సర్కిల్ స్థాయిలోనూ.. డయల్ యువర్ ఏపీఎస్పీడీసీఎల్ సిఎండి కార్యక్రమంతో పాటు సర్కిల్ స్థాయిలో కూడా ప్రతి సోమవారం ఉదయం 8:30 నుంచి 9:30 గంటల వరకు ’డయల్ యువర్ ఎస్ఈ’కార్యక్రమాన్ని నిర్వహించనున్నారు. జిల్లాస్థాయిలో తమ విద్యుత్ సమస్యలను సూపరింటెండింగ్ ఇంజనీర్ దృష్టికి తీసుకువచ్చేందుకు వీలుగా అన్నమయ్య జిల్లా వినియోగదారులు 94408 17449కు, కడప జిల్లా వినియోగదారులు 08562242457కు కాల్ చేయాలని సూచించారు. సీఎం సభకు బస్సులు.. ప్రయాణికులకు తిప్పలుకడప కోటిరెడ్డి సర్కిల్ : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు మార్కాపురం పర్యటన సందర్భంగా కడప రీజియన్ నుంచి 80 బస్సులను ఆర్టీసీ అధికారులు ఏర్పాటు చేశారు. ఆదివారం బస్సులన్నీ సీఎం సభకు వెళ్లడంతో కడప బస్టాండ్లో ప్రయాణికులు బస్సుల కోసం తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అరకొర బస్సులతో ప్రయాణికులు నిలబడి ప్రయాణం సాగించారు. ఒక్కో బస్సు వస్తే వంద నుంచి 120 వరకు ప్రయాణికులను ఎక్కించుకుని రద్దీగా వెళ్లాయి. కాగా కడప, ప్రొద్దుటూరు, పులివెందుల డిపోల నుంచి 15 బస్సుల చొప్పున, మైదుకూరు, బద్వేలు, జమ్మలమడుగు డిపోల నుంచి 10 బస్సుల చొప్పున, రాజంపేట డిపో నుంచి 8 బస్సుల చొప్పున పంపారు. పిల్లల వికాసమే బాలోత్సవ లక్ష్యంకడప ఎడ్యుకేషన్ : పిల్లల వికాసం, సృజనాత్మక శక్తిని వెలికి తీయడమే బాలోత్సవ లక్ష్యమని కడప బాలోత్సవం జిల్లా అధ్యక్షుడు నాగమునిరెడ్డి అన్నారు. కడప బాలోత్సవం – 4 ఆహ్వాన సంఘం సమావేశం ఆదివారం యస్. వి. ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పిల్లల్లో సామాజిక దృక్పథపు ఆలోచనలు కెత్తించేందుకు వారి శక్త యుక్తులను ప్రదర్శించేందుకు ఒక మంచి వేదికను తీసుకురావాలని చేసిన ప్రయత్న రూపమే ‘కడప బాలోత్సవం‘అని అన్నారు. యస్వీ ఇంజనీరింగ్ కళాశాల ప్రిన్సిపాల్ వీర సుదర్శన్ రెడ్డి మాట్లాడుతూ పిల్లలు జాతి నిర్మాతలని.. మనం భవిష్యత్ తరాల అభివృద్ధి కోసం, భవిష్యత్తు సమాజం బాగుకోసం, బాలోత్సవాలను బాధ్యతగా చేసేందుకు కృషి చేద్దామని పిలుపునిచ్చారు. రాజశేఖర్ రాహుల్ మాట్లాడుతూ పిల్లలు విద్యావనాల్లో వికసిత కుసుమల్ల పరిమళించాలన్నారు. పిల్లలకు విద్యతోపాటు విద్యాతర కార్యక్రమాలకు అవసరం అన్నారు. కడప బాలోత్సవం గౌరవ సలహాదారులు గుర్రాల గోపాల్ పాల్గొన్నారు. -
ఆర్టీసీ బస్సుకు తప్పిన ప్రమాదం
దువ్వూరు : మైదుకూరు నుంచి ఆళ్లగడ్డకు వెళ్లే ఆర్టీసీ దువ్వూరు మండల కేంద్రంలో ప్రయాణికులను ఎక్కించుకుని చాగలమర్రి వైపు వెళుతోంది. దువ్వూరు సమీపంలోని దేవాన్ష్, సీవీవీ కల్యాణ మండపాల వద్దకు రాగానే అక్కడ పెళ్లి వేడుకల్లో భాగంగా రోడ్డుపైన బాణసంచా ఒక్క సారిగా పేల్చారు. బాణసంచా పేల్చడంతో బైపాస్ నుండి దువ్వూరులోకి వెళుతున్న ద్విచక్ర వాహనదారులు భయపడి బైకులను కుడి వైపు తిప్పడంతో, ఎదురుగా వస్తున్న బస్సు డ్రైవర్ ద్విచక్రవాహనాదారులను తప్పించే ప్రయత్నంలో రోడ్డుకు ఎడమవైపు తిప్పాడు. ఈ క్రమంలో అప్పటికే రోడ్డు పక్కన తీసిన డ్రైనేజీ కాలువలో బస్సు ఒక వైపు వాలిపోయింది. ద్విచక్రవాహనదారులు రోడ్డుపైన పడటంతో స్వల్ప గాయాలతో బయటపడ్డారు. ఆర్టీసీ డ్రైవర్ సమయ స్ఫూర్తితో రోడ్డు పక్కకు బస్సు తిప్పడంతో డ్రైనేజీ కాలువకు తీసిన గుంతలో బస్సు చక్రాలు దిగాయి. ఈ ప్రమాద సమయంలో 60 మంది దాకా ప్రయాణిస్తున్నారు. ఈ ప్రమాదంలో ప్రయాణికులకు ఏమీ కాకపోవడంవతో బస్సు డ్రైవర్, కండక్టర్లు ఊపిరి పీల్చుకున్నారు. స్థానికంగా ఉన్న కల్యాణ మండపాల వద్ద పార్కింగ్ సదుపాయాలు లేకపోవడం వల్ల రోడ్డు పక్కనే ఎక్కడంటే అక్కడ అడ్డంగా పెళ్లికి వచ్చిన వాహనాలను నిలిపేస్తున్నారు. కొందరు పెళ్లిళ్లు జరుగుతున్న సమయంలో విచ్చల విడిగా బాణసంచా కాల్చడంతో ఇటువంటి ప్రమాదాలు జరుగుతున్నాయి. . అధికారులు స్పందించి కల్యాణ మండపాలు వద్ద ట్రాఫిక్ను నియంత్రించి ఇటువంటి ప్రమాదాలు జరగకుండా కఠిన చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
బడి వంటకు ధరల మంట
● ఆకాశన్నంటుతున్న నిత్యావసర సరుకుల ధరలు ● మూడు నెలలుగా అందని గౌరవ వేతనం, బిల్లులు ● అప్పులతో వంటావార్పునకు తప్పని కష్టాలు మదనపల్లె సిటీ : సామాన్య,మధ్య తరగతి ప్రజలతో పాటు పాఠశాలలకు కూడా ధరల సెగ తగులుతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విద్యాభివృద్ధికి పెద్దపీట వేసింది. మన బడి–నాడు నేడు ద్వారా పాఠశాలల రూపురేఖలను మార్చింది. దీంలో పాటు విద్యార్థులకు చక్కని పౌష్టికాహారాన్ని పెట్టేది. ఫలితంగా ప్రభుత్వ స్కూళ్లల్లో విద్యార్థుల చేరికలు పెరిగాయి. కూటమి ప్రభుత్వం వచ్చాక ఇది రివర్స్ అవుతోంది. అభివృద్ధి ఆగింది. ఇక ధరల పెరుగుల ఏజెన్సీ నిర్వాహకులకు వంట భారంగా మారింది. అప్పు చేసి పిల్లలకు భోజనం చేసి పెడుతున్నా బిల్లులు సకాలంలో చేయకపోవడంతో ఇబ్బందులు పడుతున్నారు. మెనూకు సంబంధించి ప్రాథమిక పాఠశాల విద్యార్థికి రూ.5.88లు, ఉన్నత పాఠశాలల విద్యార్థులకు రూ.8.57లు ఏజెన్సీ నిర్వాహకులకు ఇస్తున్నారు. నిత్యావసరాల ధరలు పెరిగినా ప్రస్తుతం ప్రభుత్వం ధరలు పెంచలేదు. మార్కెట్లో నిత్యావసర ధరలతో పాటు కూరగాయల ధరలు మండిపోతున్నాయి. మూడు నెలలుగా అందని గౌరవ వేతనం మధ్యాహ్న భోజనం తయారీ ఏజెన్సీ నిర్వాహకులకు నెలకు ఇస్తున్న రూ.3000 వేలు గౌరవ వేతనం మూడు నెలలుగా ఇవ్వలేదు. భోజన బిల్లులు మంజూరు చేయలేదు. దీంతో అప్పులు చేసి వంటావార్పు చేయాల్సి వస్తోంది. బిల్లులు ఆన్లైన్లో పెట్టామని సంబంధిత అధికారి తెలిపారు.జిల్లాలో పాఠశాలల వివరాలుప్రాథమిక పాఠశాలలు 1641ప్రాథమికోన్నత పాఠశాలలు 152వంట ఏజెన్సీలు 2,669ఉన్నత పాఠశాలలు 459విద్యార్థుల సంఖ్య 1,93,990 మంది -
తాగునీటి సమస్యపై నివేదిక కోరిన డీఈఓ
పెద్దతిప్పసముద్రం: మండలంలోని రంగసముద్రం హైస్కూల్లో తాగునీటి ఎద్దడి కారణంగా విధ్యార్థులు ఇళ్ల నుంచి బాటిళ్లతో నీళ్లు తెచ్చుకుంటున్నారు. ఈ విషయంపై ఆదివారం ‘సాక్షి’ లో వెలువడిన ‘మినీ ఫిల్టర్–మెగా నిర్లక్ష్యం’ కథనంపై జిల్లా విధ్యాశాఖ అధికారి డాక్టర్ కే.సుబ్రమణ్యం స్పందించారు. వాస్తవ పరిస్థితిపై సమగ్ర నివేదిక ఇవ్వాలని ఎంఈఓ నారాయణను ఆదేశించారు.ఆ హైస్కూల్లో దాతలు సమకూర్చిన వాటర్ ఫిల్టర్ మరమ్మతులకు గురైన విషయం వాస్తవమేనని, అయితే వాటర్ ఫిల్టర్కు వారంటీ ఉందని వారం రోజుల్లోగా ఏజెన్సీ వారు వచ్చి మరమ్మతులు చేపడతారని డీఈఓకు వివరించారు. తాత్కాలికంగా తాగునీటి ఇబ్బంది కలగకుండా పాఠశాల నిథులతో పిల్లల సౌకర్యార్థం వాటర్ క్యాన్లను సమకూర్చామన్నారు. ఫిల్టర్కు మరమత్తులు చేయించి త్వరలోనే నిరంతర తాగునీటి సౌకర్యం కల్పించేందుకు ప్రత్యేక చొరవ చూపుతామని ఎంఈఓతో పాటు హెచ్ఎం సరస్వతి డీఈఓకు నివేదిక పంపారు. దాడిలో గాయపడిన వ్యక్తి మృతిచెన్నూరు(వల్లూరు): చెన్నూరులో పక్క రాష్ట్రానికి చెందిన వ్యక్తి చేసిన దాడిలో గాయపడ్డ మహబూబ్ వలీ(40) అనే వ్యక్తి గురువారం మృతి చెందాడు. స్థానికులు, పోలీసులు తెలిపిన సమాచారం మేరకు చెన్నూరులోని ఓ టీ బంకులో సుమారు రెండు సంవత్సరాలుగా ఇతర రాష్ట్రానికి చెందిన ఒక వ్యక్తి పని చేసేవాడు. ఇతడు మానసిక అనారోగ్యంతో బాధపడుతున్న స్థానికుడైన మహబూబ్ వలీపై చెన్నూరులోని కొండపేటకు వెళ్లే బ్రిడ్జి కింద గురువారం ఆకస్మికంగా బండ రాయితో దాడి చేశాడు. ఈ దాడిలో మహబూబ్ వలీ తలకు తీవ్ర గాయాలయ్యాయి, గమనించిన స్థానికులు చికిత్స కోసం క్షతగాత్రుని 108 వాహనంలో కడప రిమ్స్కు తరలించారు.అక్కడ ప్రాధమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్య సేవల కోసం వైద్యుల సూచనల మేరకు తిరుపతి రుయాకు తరలించారు. పరిస్థితి విషమించడంతో బంధువులు ఇంటికి తీసుకుని రాగా ఆదివారం సాయంత్రం మృతి చెందాడు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రైతు కష్టాలనుపట్టించుకోని ‘కూటమి’ బ్రహ్మంగారిమఠం: రైతులకు కావాల్సిన నీరు అందించడంలో కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని వైఎస్సార్సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరి ప్రసాద్రెడ్డి తెలిపారు. ఆదివారం బ్రహ్మంసాగర్ను వైఎస్సార్సీపీ మండల రైతు సంఘం అధ్యక్షుడు అన్నపురెడ్డి నారాయణరెడ్డి తో కలసి పరిశీలించారు. అనంతరం విలేకరులతో మాట్లాడుతూ శ్రీశైలంలో రైతులకు కావాల్సిన నీరు అందుబాటులో ఉన్నా ప్రభుత్వం తాగునీటి సాకుతో నీరు విడుదలచేయడంలేదన్నారు. ఖరీఫ్ పంటకు నీరు వస్తుందని ఆశించిన రైతలకు నిరాశ మిగిలిందన్నారు. ఇప్పటికే జిల్లాలోని వైఎస్సార్సీపీ ఎమ్మెల్యేలు , ఎమ్మెల్సీలు మాజీ ఎమ్మెల్యేలు రైతుల పక్షాన పోతిరెడ్డిపాడు ను పరిశీలించినట్లు చెప్పారు.అయినా ప్రభుత్వంలో చలనం లేదన్నారు. బ్రహ్మంసాగర్లో ప్రస్తుతం 7 టీఎంసీ మాత్రమే నీరు ఉందన్నారు. అనంతరం బ్రహ్మంగారిని దర్శించుకున్నారు. ఈకార్యక్రమంలో మైదుకూరు నియోజకవర్గం విద్యార్థిసంఘం అధ్యక్షుడు బి.బాలకృష్ణారెడ్డి, జిల్లా వాలంటరీ విభాగం అధ్యక్షుడు నల్లపురెడ్డి ప్రశాత్రెడ్డి, మండల ఉపాధ్యక్షుడు ఎత్తపు సుబ్బారెడ్డి, మండల యూత్ అధ్యక్షుడు పసుపులేటి వెంకటేశ్, గ్రామ పంచాయతీల పార్టీ అధ్యక్షులు పుల్లలచెరువు రమేష్రెడ్డి, అబ్బిరెడ్డి, రాజేశ్వర్రెడ్డి, వేమిరెడ్డి నరసింహరెడ్డి, మల్లికార్జునరెడ్డి, తదితరులు పాల్గొన్నారు. -
రైతుల కన్నీటి కష్టాలు కన్పించవా..బాబు?
● సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రామానాయుడు మదనపల్లె(కురబలకోట): చంద్రబాబు ప్రభుత్వానికి రైతుల కష్టాలు కన్పించడం లేదని వారిని ఆదుకునేందుకు వెంటనే రాయలసీమను కరువు ప్రాంతంగా ప్రకటించి ఆదుకునేందుకు అవసరమైన సహాయక చర్యలు చేపట్టాలని సీపీఐ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఎ. రామానాయుడు డిమాండ్ చేశారు. ఆదివారం మదనపల్లె ఎస్టీయూ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు పూర్తయినా ప్రజా సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపడంలో విఫలమైందన్నారు.గ్రావెల్, ఇసుక అక్రమ రవాణా, సహజ వనరుల దోపిడీని అరికట్టడంలో అధికారులు కఠినంగా వ్యవహరించడం లేదన్నారు. వర్షాభావం వల్ల రైతాంగం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, కరువు సహాయక చర్యలు చేపట్టడంతోపాటు రైతుల బ్యాంకు రుణాలను మాఫీ చేయాలన్నారు. అంతేకాదు కొత్తగా రుణాలు అందజేయాలన్నారు. ఏళ్ల తరబడి ఇబ్బంది పడుతున్న 22–ఎ నిషేధిత జాబితా భూముల ఇబ్బందులను తొలగించి అర్హులకు సంపూర్ణ హక్కులు కల్పించాలన్నారు. రాయలసీమను హార్టికల్చర్ హబ్గా తీర్చిదిద్దుతానన్న చంద్రబాబు మాటలు ప్రకటనలకే పరిమితం కాకుండా ఆచరణలో చూపాలన్నారు. ప్రధానంగా సీమ ప్రాంతానికి జీవనాడులైన హంద్రీనీవా, గాలేరు–నగిరి ప్రాజెక్టులను వెంటనే పూర్తి గావించి ఈ ప్రాంత రైతాంగానికి సాగునీరు అందించాలన్నారు. వివిధ ప్రజా సమస్యలపై ప్రభుత్వం స్పందించకపోతే దశలవారిగా ఉద్యమాలను ఉదృతం చే స్తామని హెచ్చరించారు. టి. జనార్దన్, జి. మునిరత్నం, శివారెడ్డి, సాంబశివ, మురళి, నరేష్, రెడ్డి శేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
బ్రేకర్ల కథ ముగిసింది
మదనపల్లె (కురబలకోట): నిన్న మొన్నటి వరకు కొంత దూరం వెళితే స్పీడ్ బ్రేక్.. మళ్లీ వాహనం వేగం పెంచి వెళ్లేలోగా మరో స్పీడ్ బ్రేక్..!! ఇలా మదనపల్లి పట్టణ ప్రధాన రహదారుల్లో ఎక్కడ పడితే అక్కడ స్పీడ్ బ్రేకులతో వాహనదారులు, ప్రయాణికులు ఇబ్బందులు పడేవారు. రాత్రి వేళ అయితే సరిగ్గా కనపడక ప్రమాదాలబారిన పడేవారు. ఇబ్బందులు, అవస్థల నుం చి ఒక్కసారిగా నో జర్క్స్.. నో బ్రేక్స్ పట్టణం మారింది. ప్రయాణికులకు స్పీడ్ బ్రేకుల నుంచి విముక్తి లభించడంతో హాయిగా ఉన్నట్లు చెబుతున్నారు. ప్రధాన రహదారుల్లో ఉన్న స్పీడ్ బ్రేకులను ఎవ్వరూ ఊహించని విధంగా ఒక్కసారిగా తొలగించి బ్రేకప్ చెప్పారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో డీఎస్పీ బుచ్చి రాజు పర్యవేక్షణలో పట్టణ ట్రాఫిక్ ఫోలీస్ అధికారులు, ఆర్ అండ్బీ అధికారుల సంయుక్త పర్యవేక్షణలో రెండు రోజుల క్రితం అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలో వీటిని జేసీబీతో తొలగించినట్లు ట్రాఫిక్ సీఐ చాంద్ బాషా తెలిపారు. జిల్లాలో ఎక్కడా లేని విధంగా.. మదనపల్లె పట్టణంలో వేగ నియంత్రణ కోసం నాలుగేళ్ల క్రితం వివిధ ప్రధాన రహదారుల్లో 18 దాకా స్పీడ్ బ్రేక్లు వేశారు. అయితే జిల్లా కేంద్రం కావడం, ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడడం, రద్దీ ఎక్కువ కావడంతో ఈ స్పీడ్ బ్రేకుల వద్ద స్లోగా వెళ్లాల్సి రావడం కూడా ఒక్కోసారి సమస్యగా మారింది. నిత్యం పట్టణంలో వేలాది మంది వివిధ వాహనాల్లో రాకపోకలు సాగిస్తున్నారు. స్పీడు బ్రేకుల వద్ద ఇబ్బందులు పడాల్సి వచ్చేది. దీంతో కదిరి, పుంగనూరు, సీటీఎం రహదారిలో పట్టణంలో ఉన్న స్పీడ్ బ్రేకులను ఒకే రోజు రాత్రి వేళలో తొలగించారు. బెంగళూరు రోడ్డులో ఇదివరకే తొలగించారు. దీంతో మదనపల్లె పట్టణంలో ప్రధాన రహదారుల్లో స్పీడు బ్రేకులు శకం ముగిసినట్లయింది. అంతేకాదు వాటికి శాశ్వితంగా టాటా చెప్పినట్లయ్యింది. స్పీడు బ్రేకులు తొలగించడంతో హాయిగా రాకపోకలు సాగిస్తున్నట్లు పలువురు వ్యక్తం చేస్తున్నారు. కుదుపు కష్టాలకు గుడ్బై మదనపల్లెలో స్పీడ్ బ్రేకర్ల తొలగింపు -
ఓవర్ స్పీడు వద్దు బ్రో
పట్టణంలో ఇన్నేళ్లుగా ఉన్న స్పీడ్ బ్రేకర్లు లేకపోవడాన్ని ఆసరాగా తీసుకుని అతివేగం సరికాదు. ట్రాఫిక్ నిబంధనలు పాటించాలి. ప్రధాన కూడళ్లు, క్రాస్ రోడ్లు, పాఠశాలలు, ఆసుపత్రులు, జన సంచారం అధికంగా ఉన్న ప్రాంతాల్లో జాగ్రత్తగా రాకపోకలు సాగించాలి. అవసరమైన ప్రాంతాల్లో వేగ పరిమితి బోర్డులు, హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేస్తాం. స్పీడ్ బ్రేకర్లు లేని సాఫీ ప్రయాణంతో పాటు భధ్రత కూడా ముఖ్యమన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ గుర్తుంచుకోవాలి. –ఎ. చాంద్ బాషా, ట్రాఫిక్ సీఐ, మదనపల్లి పట్టణం -
విశ్వాసానికి ప్రతీక మరియతల్లి
కడప సిటీ : విశ్వాసానికి ప్రతీకగా మరియ తల్లి నిలుస్తోందని రెవరెండ్ ఫాదర్ప్రవీణ్ తెలిపారు. కడప నగరంలోని ఆరోగ్యమాత చర్చిలో ఆరోగ్యమాత తిరునాల మహోత్సవంలో భాగంగా రెండవరోజు ఆదివారం మరియతల్లి జన్మదిన వేడుకల సందర్భంగా తేరును అలకరించి పుణ్యక్షేత్ర ప్రాంగణంలో ప్రార్థనలతో విశ్వాసులు ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ తేరు, పీఠాన్ని బచ్చుంపల్లి విచారణ గాయక బృందం అలంకరించారు. తొలుత దివ్య బలిపూజను రెవరెండ్ ఫాదర్ బ్రిట్టో నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాదర్ ప్రవీణ్ మాట్లాడుతూ మన కష్టాలను, బాధలను ప్రభువు ముందు ఉంచి మన కోసం ప్రార్థించి మన వెంట నడిచే గొప్ప తల్లి మరియమాతగా వివరించారు. ఆమె చెప్పిన మాటలు మన జీవితానికి ఎంతో మార్గదర్శకమన్నారు. ప్రతిరోజు ప్రార్థించి మరియతల్లి ఆశీస్సులు పొందాలని ఆయన సందేశంలో వివరించారు. రెవరెండ్ ఫాదర్ ఎల్.ఆరోగ్య స్వామి, గురువులు, కన్యసీ్త్రలు, తిరునాల కమిటీ సభ్యులు, విశ్వాసులు పాల్గొన్నారు. -
ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్ష
మదనపల్లి (కురబలకోట) : జిల్లాలో ఆదివారం నాలుగు కేంద్రాల్లో జరిగిన నీట్ పీజీ–26 పరీక్ష ప్రశాంతంగా ముగిసింది. జిల్లాలోని మిట్స్ యూనివర్సిటీ, శ్రీసాయి, బిట్స్, ఆదిత్య ఇంజినీరింగ్ కళాశాల కేంద్రాల్లో జరిగిన ఈపరీక్షలు పకడ్బందీగా నిర్వహించారు. రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్, మదనపల్లి డీఎస్పీ బుచ్చిరాజు పర్యవేక్షించారు. డ్రోన్ల నిఘా, కట్టుదిట్టమైన ఏర్పాట్ల మధ్య ప్రశాంతంగా ఈ పరీక్ష నిర్వహించారు. జిల్లా వ్యాప్తంగా 747 మంది విద్యార్థులు హాజరు కావాల్సి ఉండగా 717 మంది పరీక్షలకు హాజరైనట్లు నిర్వహణ అధికారులు తెలిపారు. అంతకుముందు పిల్లలకు ఆల్ ది బెస్ట్ చెప్పి సెంటర్లలోకి పంపించిన తల్లిదండ్రులు.. వారు బయటికొచ్చే వరకు అక్కడే నిరీక్షించారు. పిల్లలు బయటికి రాగానే ‘బాగా రాశావా నాన్నా..’ అంటూ పలకరించే దృశ్యాలు కనిపించాయి. నాలుగు కేంద్రాల్లో 717 మంది హాజరు -
ట్రిపుల్ ఆర్.. టెర్రర్!
రాజకీయం.. రౌడీయిజం.. రాక్షసత్వం ● పరిహారం చెల్లించకుండానే కమలాపురం, అంబవరం ఆర్ఓబీ పనుల్లో కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం ● ప్రశ్నించిన నిర్వాసితులపై దాడులు, బెదిరింపులు ● పాపాఘ్నిలో యథేచ్ఛగా ఇసుక, గ్రావెల్ మట్టి కొల్లగొడుతున్న వైనం సాక్షి ప్రతినిధి, కడప: కమలాపురం నియోజకవర్గంలో రైల్వే ఓవర్ బ్రిడ్జ్ (ఆర్ఓబీ) నిర్మాణం అత్యవసరమైనప్పటికీ, అభివృద్ధి పేరిట సామాన్య నిర్వాసితుల పొట్టగొట్టి ఈ నిర్మాణాలు చేపట్టడం తీవ్ర ఆక్షేపణీయం. లక్షలాది రూపాయల విలువ చేసే తమ నికర ఆస్తులను, సొంత గూళ్లను త్యాగం చేస్తున్న భూ బాధితులకు కనీసం నష్టపరిహారం కూడా ఇవ్వకుండా పనులు చేపట్టడం అభ్యంతరకరం. శ్రీఇదేమి అన్యాయం?్ఙ అని అడిగితే అధికార పార్టీ తెలుగు తమ్ముళ్లు ఏకంగా దాడులకు తెగబడుతున్నారు. స్థానిక ఓ ప్రముఖ కూటమి ప్రజాప్రతినిధి అభయహస్తంతోనే కాంట్రాక్టర్లు, పచ్చ రౌడీలు ఇష్టారాజ్యంగా రెచ్చిపోతూ భూ నిర్వాసితులకు నిలువునా అన్యాయం చేస్తున్నారు. రూ.39 కోట్లతో ఆర్ఓబీ పనుల టెండర్.. అయినా అందని సొమ్ము నియోజకవర్గ కేంద్రమైన కమలాపురంలో రైల్వే క్రాసింగ్ నంబర్–134 వద్ద రూ.39 కోట్ల వ్యయంతో ఆర్ఓబీ నిర్మాణానికి లక్ష్మిప్రియ కన్స్ట్రక్షన్స్ సంస్థ టెండర్లను దక్కించుకుంది. భూములు, ఇళ్లు కోల్పోతున్న నిర్వాసితుల జాబితాతో కూడిన గెజిట్ నోటిఫికేషన్ జారీ అయినా బాధితులకు నష్టపరిహారం అందలేదు. బహిరంగ మార్కెట్ ధరలను పరిగణనలోకి తీసుకుని న్యాయం చేయాలని నిర్వాసితులు కోరుతుంటే.. అధికారులు, పాలకులు పట్టించుకోకుండా వారిపై దాడులకు తెగబడుతుండటం కమలాపురంలో తీవ్ర అశాంతికి దారితీస్తోంది. ఇంతకీ ఎవరీ ‘ట్రిపుల్ ఆర్’..? రైల్వే కాంట్రాక్టు దక్కించుకున్న సంస్థలు కేవలం కాగితాలకే పరిమితమై, క్షేత్రస్థాయిలో ‘ట్రిపుల్ ఆర్’ అనే సంస్థ తెరపైకి వచ్చి అడ్డగోలుగా పనులు చేపడుతోంది. ఈ సంస్థ పేరుతో ఉన్న టిప్పర్లే రాత్రింపగళ్లు పాపాఘ్ని నదిలో ఇసుకను అక్రమంగా తరలించుకుపోతున్నాయి. అంతేకాకుండా, చుట్టుపక్కల ప్రాంతాల్లో గ్రావెల్ మట్టిని యథేచ్ఛగా కొల్లగొడుతున్నా అధికారులు అటువైపు కన్నెత్తి చూడటం లేదు. స్థానిక ఓ ప్రముఖ కూటమి ప్రజాప్రతినిధికి ఈ సంస్థ నుండి భారీగా కమీషన్లు ముట్టజెప్పడం వల్లే, పచ్చ రౌడీలు కాంట్రాక్టర్కు వత్తాసు పలుకుతూ నిర్వాసితులపై దాడులకు తెగబడుతున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికై నా పాలకులు స్పందించి నిర్వాసితులకు పూర్తి నష్టపరిహారం ఇప్పించిన తర్వాతే పనులు చేపట్టాలని పరిశీలకులు, బాధితులు డిమాండ్ చేస్తున్నారు. కమలాపురంతో పాటు కొప్పర్తి పారిశ్రామికవాడ వెళ్లేందుకు అంబవరం వద్ద ఏర్పాటు చేస్తున్న ఆర్ఓబీ నిర్మాణాల్లోనూ కాంట్రాక్టు సంస్థ ఇష్టారాజ్యం సాగుతోంది. సర్వే నంబర్లు 1139/2, 1140/2, 1141/1, 1179/1బి పరిధిలో రైతులు తమ విలువైన పట్టా భూములను కోల్పోతున్నారు. భూసేకరణకు సంబంధించి గెజిట్ నంబర్ 03/2025ను అప్పటి కలెక్టర్ జారీ చేశారు. కొప్పర్తి పారిశ్రామికవాడ, హైవేకు సమీపంలో ఉన్నందున కనీసం ఎకరాకు రూ.1 కోటి చొప్పున నష్టపరిహారం ఇవ్వాలని రెవెన్యూ అధికారులను నిర్వాసితులు లిఖితపూర్వకంగా అభ్యర్థించారు. కాని రైతుల అభ్యర్థనలకు ఎలాంటి ప్రత్యుత్తరం రాకమునుపే కాంట్రాక్టర్ అడ్డగోలుగా పనులు మొదలుపెట్టాడు. నిర్వాసితులు గగ్గోలు పెడితే, తెలుగు తమ్ముళ్లు ఓ ప్రజాప్రతినిధి పేరు చెబుతూ భయపెట్టి బలవంతంగా పనులు ప్రారంభించారు. ఇదే పరిస్థితి కమలాపురంలో కూడా తలెత్తడంతో నిర్వాసితులు అన్యాయం చేయవద్దని వాపోయారు. అలా ప్రశ్నించినందుకు పచ్చమూకలు ఏకంగా సురేష్ అనే భూనిర్వాసితుడిపై దాడి చేస్తూ తెలుగుదేశం పార్టీ కార్యాలయానికి బలవంతంగా ఈడ్చుకెళ్లి బంధించిన దారుణ ఉదంతం కలకలం రేపింది. -
వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని..
● భర్తను అంతమొందించిన భార్య, స్నేహితులు ● హత్య కేసు నిందితుల అరెస్ట్రాయచోటి : గాలివీడు మండల పరిధిలోని బాలకృష్ణ హత్య కేసులో గుట్టు వీడింది. నిందితులు ఆయన భార్య, ఆమె స్నేహితులేనని తేలింది. వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్నాడని తన స్నేహితులతో కలిసి ఆమె అంతమొందించినట్లు విచారణలో వెల్లడైంది. ఈ హత్య కేసును చాకచక్యంగా ఛేదించి, నిందితులను అరెస్టు చేసినట్లు డీఎస్పీ ఎం.ఆర్.కృష్ణమోహన్ తెలిపారు. శనివారం సాయంత్రం రాయచోటి డీఎస్పీ కార్యాలయంలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే భర్త బాలకృష్ణను దారుణంగా హత్య చేసిన భార్య చిన్నక్క, ఆమెకు సహకరించిన సన్నిహితుడు కడప రఫీ, నవీన్లను గాలివీడు పోలీసులు పోలీసులు అరెస్ట్ చేశారన్నారు. ఎటువంటి ప్రాథమిక ఆధారాలు లేని ఈ కేసును జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాలతో తన పర్యవేక్షణలో దర్యాప్తు చేశారన్నారు. 100కు పైగా సీసీటీవీ కెమెరాల ఫుటేజ్లు, సాంకేతిక ఆధారాలతో పోలీసులు కేసును ఛేదించారన్నారు. కేసును ఛేదించిన సీఐ హెచ్.కృష్ణంరాజు నాయక్, ఎస్ఐ జె.నరసింహరెడ్డి, సీసీఎస్ ఏఎస్ఐ సర్దార్, కానిస్టేబుళ్లు మహేంద్ర నాయుడు, బర్కత్లను ఎల్ఆర్ పల్లి సర్కిల్ పోలీసు సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించినట్లు డీఎస్పీ పేర్కొన్నారు. -
ప్రకృతి ఒడిలో లెగసీ సందడి!
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలంలోని వెంకటమ్మ చెరువు పరిసర ప్రాంతాలలో శనివారం ‘లెగసీ’ సినిమా షూటింగ్ సందడి అత్యంత కోలాహలంగా ప్రారంభమైంది. ఇక్కడి ఎత్తయిన కొండలు, పచ్చని పంట పొలాలు, చెరువు అందాల నడుమ హీరో విశ్వక్సేన్, హీరోయిన్ ఏక్తా రాథోడ్లపై దర్శకుడు కీలక సన్నివేశాలను తెరకెక్కించారు. టాలీవుడ్ మాస్ కా దాస్ విశ్వక్సేన్ తమ ప్రాంతానికి వచ్చాడన్న సమాచారంతో, షూటింగ్ను కళ్లారా తిలకించేందుకు చుట్టుపక్కల గ్రామాల నుండి వందలాదిగా అభిమానులు, జనం లొకేషన్కు తరలివచ్చారు. చిత్రబృందమంతా బెంగళూరు రోడ్డులోని తాల్రెడ్డి గెస్ట్హౌస్లో బస చేయగా, ఈ నెల 20వ తేదీ వరకు మదనపల్లె పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రీకరణ నిరంతరాయంగా కొనసాగనుంది. -
కాపురానికి రాలేదని...
● భార్యను నరికి చంపిన కిరాతకుడు! ● పదేళ్ల జైలు శిక్ష తర్వాత బెయిల్పై వచ్చి ఘాతుకంమదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం కోళ్లబైలు బయ్యారెడ్డి కాలనీలో శనివారం పట్టపగలే ఓ మహిళ దారుణ హత్యకు గురైంది. తంబళ్లపల్లె మండలం ముద్దలదొడ్డి దిగువపల్లికి చెందిన కె.మధుకర్ రెడ్డి (48)కి, బి.కొత్తకోట మండలం కనికలతోపు కొత్తపల్లికి చెందిన దండామణి (38)తో 15 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. 19 ఏళ్ల క్రితం స్వగ్రామంలో జరిగిన బాంబు దాడి కేసుతో నేర ప్రపంచంలోకి అడుగుపెట్టిన మధుకర్రెడ్డిపై బెంగళూరులో ఏటీఎం చోరీ, పీలేరు, ధర్మవరంలో హత్యాయత్నం కేసులు ఉన్నాయి. కర్ణాటక పోలీసులకు చిక్కి పదేళ్లుగా జైలు శిక్ష అనుభవించిన ఇతను, ఈనెల ఆగస్టు 14న బెయిల్పై విడుదలై మదనపల్లె బాబు కాలనీలోని తన ఇంటికి వచ్చాడు. గతాన్ని మరిచిపోయి కలిసి జీవిద్దామని భార్యను కోరాడు. నిందితుడి పాత నేర ప్రవర్తనపై తీవ్ర భయం ఉండటంతో దండామణి అతనితో వెళ్లేందుకు నిరాకరించింది. కాపురానికి పంపాలని అత్త, బావమరిదిపై ఒత్తిడి తెచ్చి గొడవలు చేయడమే కాకుండా, ఇటీవల దండామణి సోదరుడు వీరభద్రారెడ్డిపై దాడి చేసి చేయి విరిచాడు. కాపురానికి పంపితే చంపేస్తాడనే భయంతో కుటుంబ సభ్యులు గ్రామ పెద్దలను ఆశ్రయించి పంచాయితీలు పెట్టినా వినలేదు. శనివారం ఇంట్లో ఎవరూ లేని సమయంలో చొరబడి, కాపురానికి ససేమిరా అన్నందుకు వెంట తెచ్చుకున్న మచ్చుకత్తితో సాయంత్రం 3 నుంచి 4 గంటల మధ్య దండామణి తల, మెడపై నరికి అతి కిరాతకంగా హత్య చేశాడు. పక్కనే ఉన్న తల్లి పద్మావతమ్మ వచ్చి చూసేసరికి బిడ్డ రక్తపు మడుగులో పడి ఉంది. ఆమె కేకలతో స్థానికులు చేరి తమ్ముడు వీరభద్రారెడ్డికి సమాచారం ఇచ్చారు. హత్య జరిగిన కాసేపటికే వీరభద్రారెడ్డికి మధుకర్రెడ్డి ఫోన్ చేసి.. ‘‘ఇంకా ఇద్దరు ఉన్నారు.. వారిని కూడా చంపి, నేనూ చనిపోతాను’’ అని సైకోలా హెచ్చరించాడు. ఘటనా స్థలానికి విచారణ కోసం వచ్చిన డీఎస్పీ బుచ్చిరాజుకు వీరభద్రారెడ్డి ఈ భయానక ఫోన్ రికార్డింగ్ను వినిపించాడు. దాంతో ఒక్కసారిగా అప్రమత్తమైన డీఎస్పీ.. నిందితుడు మరిన్ని దాడులకు తెగబడకముందే పట్టుకోవాలని ఆదేశించారు. నిందితుడు మధుకర్రెడ్డి పరారీలో ఉండటంతో అతని కోసం మూడు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలను ముమ్మరం చేసినట్లు డీఎస్పీ బుచ్చిరాజు తెలిపారు. మృతదేహాన్ని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తాలూకా సీఐ కళా వెంకటరమణ, ఎస్ఐ విష్ణు నారాయణ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
మల్చింగ్ పేపర్..
● మీటర్లలో కోత.. మైక్రాన్లలో మాయ.. ధరల్లో భారీ తేడాలతో వ్యాపారుల దందా ● నాసిరకం పేపర్తో పంటలకు దెబ్బ.. ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకుంటామన్న ఏవో మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లాలో పంటల సాగులో ఆధునిక పద్ధతులను అవలంబిస్తున్న రైతులకు మల్చింగ్ పేపర్ కొత్త సమస్యగా మారుతోందన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. కలుపు నివారణ, నేలలో తేమను కాపాడటం, నీటి వినియోగాన్ని తగ్గించడం, పంటల పెరుగుదలకు అనుకూల వాతావరణం కల్పించడం కోసం రైతులు మల్చింగ్ పేపర్ను వినియోగిస్తున్నారు. అయితే ఇదే అదునుగా కొందరు వ్యాపారులు నాణ్యత లేని మల్చింగ్ పేపర్ను రైతులకు అంటగడుతూ వారి జేబులకు చిల్లు పెడుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మైక్రాన్లలో మాయ.. నాణ్యతలో కోత! మల్చింగ్ పేపర్ కొనుగోలు సమయంలో దాని మందం (మైక్రాన్లు), వెడల్పు, పొడవు, నాణ్యత, వినియోగ కాలం వంటి వివరాలను రైతులు తప్పనిసరిగా పరిశీలించాల్సి ఉంటుంది. అయితే చాలామంది రైతులకు ఈ సాంకేతిక వివరాలపై పూర్తి అవగాహన లేకపోవడాన్ని కొందరు వ్యాపారులు తమకు అనుకూలంగా మార్చుకుంటున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అడిగిన మైక్రాన్ల కంటే తక్కువ మందం ఉన్న పేపర్ను సరఫరా చేయడం, రోల్లో ఉండాల్సిన పొడవు కంటే తక్కువగా ఇవ్వడం, నాసిరకం మెటీరియల్ను మంచి నాణ్యతగా చెప్పి విక్రయించడం వంటి అక్రమాలు జరుగుతున్నాయని రైతులు వాపోతున్నారు. మల్చింగ్ పేపర్ను సాధారణంగా రోళ్ల రూపంలో కొనుగోలు చేస్తారు. కానీ కొన్నిచోట్ల రోల్ బరువు ఆధారంగా ధర నిర్ణయిస్తూ, వాస్తవంగా రైతుకు అందాల్సిన పొడవు, మందం విషయంలో స్పష్టత లేకుండా విక్రయాలు జరుగుతున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. బయటకు చూస్తే రోల్ పెద్దగా కనిపించినా, పొలంలో పరచిన తర్వాత తక్కువ విస్తీర్ణానికే సరిపోవడంతో రైతులు అదనంగా మరో రోల్ కొనాల్సి వస్తోందని చెబుతున్నారు. తక్కువ ధర ఆశ చూపి.. నాసిరకం సరుకు! ధర తక్కువగా ఉందనే కారణంతో కొందరు రైతులు పేపర్ కొనుగోలు చేస్తే, కొద్దిరోజులకే అది చిరిగి పోవడం, ఎండకు తట్టుకోలేక పోవడం, గాలికి ఎగిరిపోవడం వంటి సమస్యలు ఎదురవు తున్నాయని రైతులు ఆరోపిస్తున్నారు. దీంతో మొదట చెల్లించిన డబ్బుతో పాటు తిరిగి పేపర్ కొనుగోలు, కూలీల ఖర్చు, పంట సంరక్షణ ఖర్చు పెరిగి రైతుపై అదనపు భారం పడుతోంది. కొందరు వ్యాపారులు రైతులకు సరైన బిల్లులు ఇవ్వకుండా మల్చింగ్ పేపర్ విక్రయిస్తున్నారు. బిల్లు లేకపోవడంతో నాసిరకం సరుకు విక్రయించినప్పుడు వ్యాపారిని ప్రశ్నించేందుకు రైతులకు ఆధారం లేకుండా పోతోంది. కంపెనీ పేరు, బ్యాచ్ నంబర్, మైక్రాన్ వివరాలు, పొడవు, వెడల్పు వంటి వివరాలు స్పష్టంగా లేని పేపర్ను కూడా మార్కెట్లో విక్రయిస్తున్నారు. ఒక్కో రైతుకు వేల రూపాయల భారం మల్చింగ్ పేపర్ కొనుగోలు కోసం రైతులు ఇప్పటికే పెద్ద మొత్తంలో పెట్టుబడి పెడుతున్నారు. నాణ్యత లేని పేపర్ కారణంగా ప్రతి దశలో అదనపు ఖర్చు పెరుగుతుండటంతో చివరకు చేతికి మిగిలేది తక్కువేనని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మల్చింగ్ పేపర్ విక్రయించే దుకాణాలు, సరఫరాదారులపై సంబంధిత అధికారులు నిఘా పెట్టాలని రైతులు కోరుతున్నారు. విక్రయించే పేపర్ నాణ్యత, మైక్రాన్, పొడవు, వెడల్పు, బిల్లులు, ధరలపై తనిఖీలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు. తక్కువ నాణ్యత కలిగిన పేపర్ను అధిక ధరలకు విక్రయించే వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. కొనుగోలు చేసే ముందు రైతులు తప్పనిసరిగా కంపెనీ పేరు, మైక్రాన్, పొడవు, వెడల్పు, ధర, బిల్లు వంటి వివరాలను పరిశీలించాలని నిపుణులు సూచిస్తున్నారు. బార్లపల్లె వద్ద పొలంలో మల్చింగ్ పేపర్తో సాగైన టమాటా మల్చింగ్ పేపర్ పరచి పంట సాగుకు సిద్ధంచేసిన ఓ రైతు అన్నదాతను ఆదుకోవాల్సిన వ్యవస్థలోనే ఇటువంటి మోసాలు జరగడంపై రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ విషయమై మదనపల్లె వ్యవసాయశాఖ ఏవో నవీన్ కుమార్రెడ్డిని వివరణ కోరగా.. రైతుల నుంచి అక్రమాలపై ఫిర్యాదులు అందితే సదరు వ్యాపారులపై కఠిన చర్యలు తీసుకుంటామని చెప్పారు. ఇప్పటికే నియోజకవర్గ పరిధిలోని మల్చింగ్ పేపర్లు విక్రయించే వ్యాపారులతో మీటింగ్ పెట్టి అధిక ధరలకు విక్రయించరాదని, నిబంధనలు ఉల్లంఘిస్తే ఊరుకోబోమని హెచ్చరించామని తెలిపారు. ఎవరైనా రైతులను నాణ్యత లేదా తూకం విషయంలో మోసం చేస్తుంటే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని ఆయన రైతులకు సూచించారు. -
ద్విచక్ర వాహనాల దొంగ అరెస్ట్
తంబళ్లపల్లి : పలు చోట ద్విచక్ర వాహనాలను చోరీ చేసిన దొంగను శనివారం తంబళ్లపల్లి పోలీసులు అరెస్టు చేశారు. సీఐ దస్తగిరి, ఎస్ఐ అనిల్కుమార్ కథనం మేరకు.. తంబళ్లపల్లి మండలం దాదంవడ్డిపల్లెకు చెందిన డి.రాజ్ కుమార్(25) తంబళ్లపల్లి, ముదివేడు, మదనపల్లి ప్రాంతాల్లో పలు ద్విచక్రవాహనాలు చోరీ చేశాడన్నారు. శనివారం తంబళ్లపల్లి మండలం కన్నెమడుగు గ్రామ మఠం క్రాస్ వద్ద నిందితున్ని అరెస్టు చేసినట్లు తెలిపారు. నిందితుడి నుంచి ఆరు టీవీఎస్ ఎక్స్ఎల్ బైకులను స్వాధీనం చేసుకున్నట్లు పేర్కొన్నారు. కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించినట్లు తెలిపారు. -
దరఖాస్తుల ఆహ్వానం
పీలేరు : జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్ ఐటీఐ కళాశాలల్లో 2026–27 విద్యా సంవత్సరం ప్రవేశానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీకి నాలుగో విడత దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు కన్వీనర్, పీలేరు ఐటీఐ కళాశాల ప్రిన్సిపాల్ పెళ్లూరు నారాయణ పేర్కొన్నారు. శనివారం ఆయన స్థానిక విలేకరులతో మాట్లాడుతూ ఈ నెల 31వ తేదీ లోపు అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని తెలిపారు. ఈ నెల 31న ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలలకు సంబంధించి అభ్యర్థులకు కౌన్సెలింగ్ ఉంటుందని, ఉదయం 10 గంటలకు అభ్యర్థులు ఒరిజినల్ ఎస్ఎస్సీ మార్కుల మెమో, టీసీ, స్టడీ సర్టిఫికెట్లు, కుల, ఆదాయ ధృవీకరణ పత్రాలతోపాటు జిరాక్స్ ప్రతులు తీసుకురావాలని పేర్కొన్నారు. జేఎన్వీలో వాన్ఇన్ ఇంటర్వ్యూలు మదనపల్లె సిటీ: మదనపల్లె సమీపంలోని వలసపల్లెవద్దనున్న జవహర్ నవోదయ విద్యాలయంలో(జేఎన్వీ) ఖాళీగా ఉన్న రెండు అధ్యాపక పోస్టులకు వాన్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తున్నట్లు విద్యాలయ ప్రిన్సిపాల్ ఎం.గీత తెలిపారు. 2026–27 విద్యా సంవత్సరానికి పీజీటీ–బయాలజీ, టీజీటీ ఆర్ట్ పోస్టులు ఖాళీగా ఉన్నాయన్నారు. అర్హత కలిగిన అభ్యర్థులు సెప్టెంబర్ 8న ఉదయం 11 గంటలకు విద్యాలయంలో జరిగే ఇంటర్యూలకు హాజరు కావాలన్నారు. అభ్యర్థులు ఒరిజనల్ ధృవీకరణపత్రాలతో పాటు జిరాక్స్ప్రతులు, రెండు పాస్పోర్టు సైజు ఫోటోలు తీసుకురావాలని తెలిపారు. 30న నీట్–పీజీ పరీక్ష మదనపల్లె టౌన్: ఈ నెల 30న అన్నమయ్య జిల్లాలో నిర్వహించనున్న నీట్–పీజీ పరీక్షకు భారీ బందోబస్తు ఏర్పాటు చేసినట్లు జిల్లా ఎస్పీ శ్రీ ధీరజ్ కునుబిల్లి ఐపీఎస్ తెలిపారు. మదనపల్లె లోని మిట్స్, ఆదిత్య, రాయచోటిలోని శ్రీ సాయి, భాస్కర్ ఇంజనీరింగ్ కళాశాల కేంద్రాల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు పరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. అభ్యర్థులను ఉదయం 8.30 గంటల తర్వాత కేంద్రాల్లోకి అనుమతించరన్నారు. పరీక్షా కేంద్రం సమీపంలోని జిరాక్స్ సెంటర్లను తప్పని సరిగా మూసివేయాలని ఆదేశించారు. పరీక్షా కేంద్రాల్లోకి మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ పరికరాలు నిషేధమన్నారు. పేపర్ లీక్ వదంతులు సష్టించినా, అక్రమాలకు పాల్పడినా కఠిన క్రిమినల్ చర్యలు తప్పవని ఎస్పీ హెచ్చరించారు. మదనపల్లె సిటీ: సర్–2026 ప్రక్రియ పూర్తయ్యే వరకు జిల్లాలో నియోజకవర్గ వారీగా హెల్ప్డెస్క్, కాల్ సెంటర్లు ఏర్పాట్లు చేసినట్లు కలెక్టర్, జిల్లా ఎన్నికల అధికారి నిశాంత్కుమార్ ఓ ప్రకటనలో పేర్కొన్నారు. రాయచోటి 9949369891, తంబళ్లపల్లె 8106078313, పీలేరు 6302066403, మదనపల్లె 08571–231181, పుంగనూరు 6305512318 నంబర్లు కేటాయించినట్లు తెలిపారు. కలెక్టరేట్ సర్–26 కాల్ సెంటర్ నంబర్ 08571–293001 కేటాయించినట్లు తెలిపారు. హెల్ప్డెస్క్, కాల్సెంటర్ ప్రతి రోజు ఉదయం 10 గంటల నుంచి సాయంత్రం 5 వరకు పని చేస్తుందని చెప్పారు. భూ సమస్యల పరిష్కారానికే రీ సర్వే గాలివీడు : భూ సమస్యల పరిష్కారానికి సర్వే కార్యక్రమం జరుగుతోందని జిల్లా సర్వే అసిస్టెంట్ డైరెక్టర్ శాంతారావు పేర్కొన్నారు. శనివారం ఆయన తలముడిపి గ్రామం మహంకాళి ఆలయ ప్రాంగణం నుంచి భూ రీ సర్వే ని ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లోని మిగులు భూములు, భూ సరిహద్దులు, రైతుల భూముల్లో హెచ్చుతగ్గులు తదితర అంశాలపై రైతులకు సర్వేలో న్యాయం జరుగుతుందన్నారు. అనంతరం కొర్లకుంట సరిహద్దులోని ఫారెస్ట్ రెవెన్యూ శాఖల మధ్య ఉన్న వివాదాస్పద భూములను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సర్వే డిప్యూటీ ఇన్స్పెక్టర్ సోమశేఖర్, మండల సర్వేయర్ సుబ్రహ్మణ్యం, విలేజ్ సర్వేయర్ వినోద్ కుమార్, వీఆర్ఓ వెంకటయ్య, సింగిల్ విండో అధ్యక్షుడు ప్రభాకర్ రెడ్డి, రైతులు రెడ్డప్పరెడ్డి, మహేశ్వర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. గడువు పొడిగింపు కడప ఎడ్యుకేషన్: వైవీయూ పీజీ డిప్లమా ఇన్ థియేటర్ ఆర్ట్స్ (పీజీడీటీఏ), కూచిపూడి నత్యం ,కర్ణాటక సంగీతం ,కీబోర్డ్ సర్టిఫికెట్ కోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువును సెప్టెంబర్ నెల 11వ తేదీ వరకు పొడిగించారు. ఈ విషయాన్ని విశ్వవిద్యాలయ డైరెక్టరేట్ ఆఫ్ అడ్మిషన్స్ సంచాలకులు ఆచార్య వి రామకృష్ణ తెలిపారు. మరిన్ని వివరాలకు 90325 95101 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
పోక్సో కేసులో ఉపాధ్యాయుడికి రిమాండ్
పీలేరు రూరల్ : పోక్సో కేసులో అరెస్ట్ అయిన ఉపాధ్యాయుడు ఎర్రయ్యను కోర్టుకు తరలించగా న్యాయమూర్తి.. నిందితుడికి 14 రోజులు రిమాండ్ విధించినట్లు పీలేరు అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు తెలిపారు. స్థానిక పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో సీఐ వివరాలు వెల్లడించారు. మండలంలోని చెన్నప్పగారిపల్లి ప్రాథమిక పాఠశాల ఉపాధ్యాయుడు ఎర్రయ్య.. ఇద్దరు చిన్నారులతో అసభ్యంగా ప్రవర్తించినట్లు తల్లిదండ్రులు ఫిర్యాదు చేయడంతో అతనిపై పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి అరెస్టు చేశారు. అతనిని కోర్టులో శనివారం హాజరు పరిచారు. సమావేశంలో ఎస్ఐలు లోకేష్, రమణ, సిబ్బంది పాల్గొన్నారు. కాగా ప్రాథమిక పాఠశాలలో చిన్నారుల పట్ల అసభ్యంగా ప్రవర్తించినందుకు గాను ఉపాధ్యాయుడు ఎర్రయ్యను విధుల నుంచి తొలగిస్తున్నట్లు పీలేరు ఎంఈఓ బాబు నాయక్ ఒక ప్రకటన విడుదల చేశారు. -
‘మినీ’ ఫిల్టర్.. ‘మెగా’ నిర్లక్ష్యం!
● పాఠశాలలో నిరుపయోగంగా వాటర్ ఫిల్టర్ ● తాగునీటి సమస్యతో విద్యార్థులకు ఇక్కట్లుపెద్దతిప్పసముద్రం : మండలంలోని రంగసముద్రం హైస్కూల్లో 159 మంది విద్యార్థులు ఉన్నారు. పదవ తరగతి పబ్లిక్ పరీక్షల్లో ఈ పాఠశాల నుంచి ప్రతి ఏడాది మండల, జిల్లా స్థాయిలో సత్తా చాటే విద్యార్థులు ఒకరిద్దరు ఉంటారు. పూర్వ విద్యార్థులు, దాతల సహకారంతో ఈ పాఠశాల ఎంతో అభివృద్ధి చెందింది. ఇందుకు అనుగుణంగా ఉపాధ్యాయులు కూడా పిల్లలకు నాణ్యమైన విద్యా బోధన అందిస్తున్నారు. అయితే మౌలిక వసతుల కొరత తీవ్రంగా వేధిస్తోంది. ప్రధానంగా హైస్కూల్ పిల్లల సౌకర్యార్థం పూర్వ విద్యార్థులు, దాతలు గతంలో మినీ వాటర్ ఫిల్టర్ను విరాళంగా అందజేశారు. కాలక్రమేణా అది మరమ్మతులకు గురైంది. ఈ ఏడాది విద్యా సంవత్సరం ఆరంభం నుంచి హైస్కూల్లో తాగునీటి సౌకర్యం లేకపోవడంతో.. విద్యార్థులందరూ వారి ఇళ్ల నుంచి బాటిళ్లతో నీళ్లు తెచ్చుకోవాల్సిన పరిస్థితి నెలకొంది. కూటమి ప్రభుత్వ పాలకులు మాత్రం ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేస్తున్నాము, ఒక్కో పాఠశాలకు రూ.లక్షల నిధులు వెచ్చించి పిల్లలకు మౌలిక వసతులు సమకూర్చామని ఢంకా బజాయిస్తున్నారే గానీ.. క్షేత్ర స్థాయిలో వసతులు ఇందుకు భిన్నంగా ఉంటున్నాయి. ఇక్కడే గాక మరి కొన్ని స్కూళ్లలో కూడా తాగునీటి సమస్య ఉందని పిల్లల తల్లిదండ్రులు పేర్కొంటున్నారు. కనీసం ఇప్పటికై నా విద్యా శాఖ ఉన్నతాధికారులు స్పందించి విద్యార్థుల సంఖ్యకు అనుగుణంగా మినీ వాటర్ ప్లాంట్లను ఏర్పాటు చేయాలని వారు కోరుతున్నారు. -
రోజుల తరబడి తిరుగుతున్నా
ఇటీవల మోటార్ సైకిల్ కొన్నా. దానికి ఫైనాన్స్ క్లియరెన్స్కు రోజుల తరబడి తిరుగుతున్నా కావడం లేదు. సర్వర్ సమస్య వస్తోంది. దీని కోసం పదేపదే కార్యాలయాల చుట్టూ తిరగాల్సి రావడం విచారకరం. వ్యయప్రయాసలకు గురి కావడంతో పాటు సమయం వృధా అవుతోంది. ఫైనాన్స్ సంస్థల్లో రుణం తీసుకున్నప్పుడు సర్వర్ పనిచేస్తుంది. రుణం తీర్చాక ఎందుకు పనిచేయదో అర్థం కావడం లేదు. – నూర్ మహమ్మద్, వాహనదారుడు, మదనపల్లి ఫైనాన్స్ సంస్థలకు రుణం చెల్లించి కూడా క్లియరెన్స్ కోసం తిరగాల్సి రావడం విడ్డూరంగా ఉంది. సర్వర్ మొరాయింపు వాహనదారులకు విసుగుతెప్పిస్తోంది. అత్యవసరంగా వాహనాలు అమ్మాల్సిన వారు, ఆర్సీలో ఫైనాన్స్ క్లియరెన్స్ చేసుకోవాల్సిన వారు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పది రోజులకుపైగా సర్వర్ సమస్య ఉన్నా అధికారులు ఏం చేస్తున్నట్లో. – చిటికి శివరామిరెడ్డి, వెహికల్స్ సెల్స్ రెప్రజెంటేటివ్, మదనపల్లి -
‘తెలుగు నేర్పబడును’.. బోర్డులు వెలిసెన్!
రాయచోటి టౌన్ : ‘ఇంగ్లిష్ గ్రామర్ నేర్పించబడును’ అనే రోజుల నుంచి.. తెలుగు భాషను నేర్పించబడునని బోర్డులు ఏర్పాటు చేసే స్థాయికి విద్యావ్యవస్థలు వచ్చాయి. అవును దాదాపుగా ముప్పై సంవత్సరాల క్రితం 10వ తరగతి పాస్ అయిన వారికి పరీక్షలు తప్పిన వారికి ఇంగ్లిష్ గ్రామర్ను నేర్పించబడునని టుటోరియిల్స్ వెలిసేటివి. అలాంటి వాటి స్థానంలో మేము తెలుగు భాషను నేర్పిస్తామని, తెలుగు నేర్పడం మా ప్రత్యేకత అని బోర్డులు ఏర్పాటు చేసే పరిస్థితి నెలకొంది. ఇంగ్లిష్ భాష అవసరమే. ఉన్నత చదువులు చదవాలన్నా.. మంచి ఉద్యోగాలకు వెళ్లాలన్నా ఇంగ్లిష్ బాష అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇంగ్లిష్ బాష మోజులో పడి ప్రాథమిక విద్య నుంచి ఇంగ్లిష్లోనే పాఠ్యాంశాలు బోధన రావడం వల్ల తెలుగు భాషకు గడ్డుకాలం వచ్చింది. ప్రధానంగా తల్లిదండ్రులు చాలా మంది తమ పిల్లలకు ఇంగ్లిష్ భాషే కావాలని పనికట్టుకొని ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో చేర్పిస్తున్నారు. తెలుగు బాషలో నేర్పుతున్న పాఠ్యాంశాలపై మోజు పూర్తిగా తగ్గిపోయింది. కనీసం ఇంటికి వచ్చిన తరువాత ఇంటిలో కూడా తెలుగు భాషను మాట్లాడనీయకుండా ఇంగ్లిష్లోనే మాట్లాడాలని పిల్లలపై వత్తిళ్లు తీసుకరావడం మరో విడ్డూరం. ఇంగ్లిష్లో మాట్లాడిన వారు మాత్రమే మేధావిగా చెప్పుకోడంతో పేద తల్లిదండ్రులు కూడా తమ పిల్లలను ఇంగ్లిష్లో చదివించాలని ఎన్ని కష్టాలు ఎదురైనా తమ సంపాదన అంతా పిల్లల ఇంగ్లిష్ చదువుల కోసమేనన్నట్లు వ్యవహరిస్తున్నారు. -
సర్కారు స్థలం.. ఆక్రమణ పర్వం
● నేషనల్ హైవే పక్కన కబ్జాకు గురవుతున్న భూములు ● ప్రేక్షక పాత్రలో రెవెన్యూ అధికారులురొంపిచెర్ల : మండల పరిధిలో జాతీయ రహదారి పక్కన ఉన్న ప్రభుత్వ భూములు ఆక్రమణకు గురవుతున్నా.. రెవెన్యూ అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపిస్తున్నారు. బండకిందపల్లె గ్రామ పంచాయతీలో రోడ్డు పక్కనే ఉన్న సర్వే నంబరు 36లో ప్రభుత్వ భూమి ఉంది. హైవే దగ్గర ఉన్న భూముల ధరలు రూ.కోట్లలో పలుకుతుండటంతో.. ప్రభుత్వ భూములు మాయం అవుతున్నాయి. ఇదే భూమిని గతంలో పీలేరుకు చెందిన ఒక బడా నాయకుడు ఆక్రమించుకుంటుండగా బండకిందపల్లె వీఆర్వో సురేంద్ర, రెవెన్యూ సిబ్బంది అడ్డుకున్నారు. అయితే ఆక్రమణదారుడు అధికారులను ఖాతారు చేయకుండా 36 సెంట్ల భూమిని ఆక్రమించి ఫెన్సింగ్ వేశారు. దీంతో ఆక్రమదారుడిపై రొంపిచెర్ల పోలీసుస్టేషన్లో క్రిమినల్ కేసు నమోదు చేయించారు. ఈ కేసులో నిందితుడిని ఇంత వరకు అరెస్టు చేయలేదు. అంతేకాక అతను కనీసం ఫెన్సింగ్ కూడా తొలగించలేదు. అలాగే తన ఆధీనంలో ఉంచుకున్నారు. ఈ విషయంపై రెవెన్యూ అధికారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదని స్థానిక ప్రజలు విమర్శిస్తున్నారు. జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తాం కమోళ్లపల్లె నుంచి రొంపిచెర్ల క్రాస్ రోడ్డు వరకు ప్రభుత్వ భూములను ఆక్రమించుకుంటున్నా.. రెవెన్యూ అధికారులు ప్రేక్షక పాత్ర వహిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. కమోళ్లపల్లె చెరువు కాలువను కూడా పూడ్చి వేసి ఆక్రమించారని రైతులు తెలిపారు. రెవెన్యూ సిబ్బంది ఆక్రమణదారులతో లాలూచీ పడి పట్టించుకోవడం లేదని ప్రజలు బహిరంగంగా విమర్శిస్తున్నారు. 24 గంటల్లో రెవెన్యూ అధికారులు చర్యలు తీసుకోకపోతే సోమవారం జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని గ్రామస్తులు తెలిపారు. ఈ విషయమై తహసీల్దార్ కిరణ్కుమార్ను వివరణ కోరగా.. సర్వేయర్ను పంపి చర్యలు తీసుకుంటామని తెలియజేశారు. -
బోధనా నైపుణ్యాలు పెంపొందించుకోవాలి
గుర్రంకొండ: ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టులపై బోధనా నైపుణ్యాలను పెంపొందించుకోవాలని కడప రీజినల్ జాయింట్ డైరెక్టర్ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ కె. శామ్యూల్ పేర్కొన్నారు. శనివారం స్థానిక తెలుగు జెడ్పీహైస్కూల్లో గుర్రంకొండ, వాల్మీకిపురం మండలాలకు చెందిన ఇంగ్లీషు, హిందీ సబ్జెక్టుల ఉపాధ్యాయిని, ఉపాధ్యాయులతో సమావేశం నిర్వహించారు. ఈసందర్భంగా ఆయన మాట్లాడుతూ ఉపాధ్యాయులు ప్రతినెలా నిర్వహించే కాంప్లెక్స్ సమావేశాలకు క్రమం తప్పకుండా హజరుకావాలన్నారు. ఇక్కడ శిక్షణ ఇచ్చే సీసీలు చెప్పే విషయాలను ఆలకించి వాటిని ఆచరించాలన్నారు.దీనివల్ల ఉపాధ్యాయులు తాము బోధించే సబ్జెక్టుల మీద పట్టుసాధించ వచ్చన్నారు.కార్యక్రమంలో ఎంఈవో సురేంద్రబాబు పాల్గొన్నారు. -
గుర్తుతెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి
రాయచోటి (చిన్నమండెం) : రాయచోటి– మదనపల్లి మార్గంలోని చిన్నమండెం మండలం వండాడి వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తిరుపతి జిల్లా రైల్వేకోడూరుకు చెందిన పత్తి సుధాకర్(40) దుర్మరణం చెందాడు. శనివారం తెల్లవారుజామున 5.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగినట్లు చిన్నమండెం పోలీసులు చెబుతున్నారు. ఉండాలి గ్రామ సమీపంలో ప్రధాన రహదారిపై రోడ్డు దాటుతున్న సమయంలో.. గుర్తుతెలియని వాహనం ఢీకొనడంతో తలభాగంతోపాటు శరీరమంతా నుజ్జునుజ్జుగా మారి గుర్తుపట్టలేని స్థితిలో అక్కడికక్కడే మృతి చెందాడు. మృతుడు తిరుపతి జిల్లా రైల్వేకోడూరు నియోజకవర్గం అంకమ్మనగర్కు చెందిన పత్తి సుధాకర్గా పోలీసులు గుర్తించారు. మెడికల్ రెప్గా పని చేస్తున్న సుధాకర్ అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండల కేంద్రంలోని బంధువుల ఇంటికి వెళ్లి తిరుగు ప్రయాణంలో ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు చెబుతున్నారు. అయితే సుధాకర్ గుర్రంకొండ నుంచి ఏ వాహనంలో అక్కడికి వచ్చారన్న సమాచారం లేదు. కొంత మంది మాత్రం నడుచుకుంటూ వెళుతున్న సందర్భంలోనే ఈ ప్రమాదం జరిగినట్లు చెబుతున్నారు. ప్రమాదం పై సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. ప్రమాదానికి కారణమైన వాహనం కోసం పోలీసులు ఆరా తీస్తున్నారు. ఈ ఘటనపై చిన్నమండెం పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు.మృతుడు రైల్వేకోడూరు వాసి -
వెబ్ డెవలెపర్కోర్సుపై శిక్షణ
రాయచోటి టౌన్ : నిరుద్యోగ యువతీ యువకులకు ఏపీఎస్ఎస్డీసీ వారి ఆధ్వర్యంలో వెబ్డెవలెపర్ కోర్పుపై శిక్షణ ఇవ్వనున్నట్లు రాయచోటి పాలిటెక్నికల్ ప్రిన్సిపల్ శివశంకర్ శనివారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఈ శిక్షణ తరగతులు సెప్టెంబర్ మొదటి వారంలో ప్రారంభించనున్నట్లు తెలిపారు. ఇంటర్ ఆపై కోర్సులు పూర్తి చేసిన విద్యార్థులు 18–30 సంవత్సరాల లోపు వయస్సున్న వారు అర్హులన్నారు. మరిన్ని వివరాలకు 9550104260 నంబర్లో సంప్రదించాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా పోలీసుల స్పెషల్ డ్రైవ్ మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు శుక్రవారం జిల్లా వ్యాప్తంగా అన్ని పోలీస్ స్టేషన్ల పరిధిలో పోలీసులు విస్తృతంగా వాహన తనిఖీలు చేపట్టారు. హెల్మెట్ ధరించకపోవడం, ట్రిపుల్ రైడింగ్, మైనర్లు వాహనాలు నడపడం, రాంగ్ రూట్ లో వెళ్లడం, అతివేగంగా వాహనాలు నడపడంతో పాటు డ్రైవింగ్ లైసెన్న్స్, ఇన్సూరెన్న్స్, ఆర్సీ వంటి సరైన పత్రాలు లేని వాహన దారులను గుర్తించి జరిమానాలు విధించారు. ప్రజల ప్రాణాలకు రక్షణ కల్పించడం, పటిష్టమైన రహదారి భద్రతను కల్పించడమే లక్ష్యంగా ఈ స్పెషల్ డ్రైవ్ ను ప్రతిరోజూ కొనసాగిస్తామని అధికారులు స్పష్టం చేశారు. వాహన దారులు అందరూ విధిగా ట్రాఫిక్ నియమాలు పాటించాలని, నిబంధనలు ఉల్లంఘిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. రహదారి భద్రతలో పోలీసులకు ప్రజలు సహకరించాలని ఎస్పీ కోరారు. రాజంపేట టౌన్: నైపుణ్యం పోర్టల్ ద్వారా విద్యార్థులు, నిరుద్యోగులు సులువుగా విద్య, ఉద్యోగ, ఉపాధి అవకాశాలను అందిపుచ్చుకోవచ్చని వైఎస్సార్ కడపజిల్లా ఉపాధికల్పనశాఖ అధికారి ఎస్.సురేష్కుమార్ తెలిపారు. పట్టణంలోని ప్రభుత్వ ఐటీఐలో నైపుణ్యం పోర్టల్పై శుక్రవారం విద్యార్థులకు అవగాహన కల్పించారు. ఈసందర్భంగా సురేష్కుమార్ మాట్లాడుతూ విద్యార్థులు తరగతిగదిలో నేర్చుకున్న నైపుణ్యాలను ప్రపంచానికి అందించడం ప్రారంభిస్తే ఆయా రంగాల్లో అనేక సేవలు అందిస్తారని, తద్వారా డబ్బులను కూడా సంపాదించుకోవచ్చన్నారు. జిల్లా నైపుణ్య అభివృద్ది అఽధికారి విజయ్వినీల్కుమార్రెడ్డి మాట్లాడుతూ యువత భయం వీడినప్పుడే ఏ రంగంలో అయినా రాణించగలరని తెలిపారు. ఇదిలావుంటే ఇటీవల ప్రభుత్వ ఐటీఐ విద్యార్థులకు నిర్వహించిన క్రీడా పోటీల్లో గెలుపొందిన విద్యార్థులకు జిల్లా ఉపాధికల్పన అధికారి చేతుల మీదుగా బహుమతులను ప్రదానం చేశారు. ఈకార్యక్రమంలో ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపల్ సి.రామ్మూర్తి, న్యాక్ ఏడీ రాకేష్, ప్రభుత్వ ఐటిఐ సూపరిండెంట్ ఆదిప్రసాద్, సీనియర్ అసిస్టెంట్ రాణి, ఏటీఓలు సుబ్బరాయుడు, గంగయ్య తదితరులు పాల్గొన్నారు. తొండూరు : దోమకాటువల్ల డెంగీ, మలేరియా, మెదడు వాపు వంటి ప్రాణాంతక వ్యాధులు ప్రబలే ప్రమాదం ఉందని జిల్లా అసిస్టెంట్ మలేరియా అధికారి రామ విజయారెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం వైఎస్సార్ కడప జిల్లా మల్లేల గ్రామంలో డ్రై డే కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరోగ్య సిబ్బంది ఇంటింటా ఫీవర్, లార్వా సర్వేలు చేపట్టారు. నీటి నిల్వలను పరిశీలించి లార్వా నిర్మూలన కోసం యాంటీ లార్వాల ఆపరేషన్ నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దోమ కాటుకు గురికాకుండా అప్రమత్తంగా ఉండాలన్నారు. మలేరియా సబ్ యూనిట్ ఆఫీసర్ సిద్ధయ్య, సీహెచ్ఓ సోమేశ్వరి, ఆరోగ్య, ఆశా కార్యకర్తలు సతీష్, అంజలి, జ్యోతి, సరళ, తదితరులు పాల్గొన్నారు. పులివెందుల రూరల్ : తమను రెగ్యులర్ చేయాలని కాంట్రాక్టు ఉద్యోగులు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. శుక్రవారం వైఎస్సార్ కడ ప జిల్లా పులివెందులలో ఉన్న ప్రభుత్వ సర్వజన ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులు విధులకు హాజరై నల్ల బ్యాడ్జీలు ధరించి ఆసుపత్రి వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా జేఏసీ సభ్యులు శివప్రసాద్, సుజిత, వీణ, రుకియా, సుభాషిణి, శిరీషలు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపు మేరకు పులివెందులలో నిరసన వ్యక్తం చేస్తున్నామన్నారు. కాంట్రాక్టు ఉద్యోగులకు 100% గ్రేస్ ఇవ్వాలన్నారు. సమస్యలు పరిష్కారమయ్యే వరకు పోరాటం చేస్తూనే ఉంటామన్నారు. -
కడపలో గంజాయి పట్టివేత
● ఐదుగురి అరెస్ట్కడప వైఎస్ఆర్ సర్కిల్ : కడప నగరంలోని మహావీర్ సర్కిల్ వద్ద అక్రమంగా గంజాయిని, అధిక ధరకు విక్రయిస్తున్న, కొనుగోలు చేస్తున్న ఐదుగురు వ్యక్తులను అరెస్ట్ చేసినట్లు కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఇన్స్పెక్టర్ బి.కృష్ణకుమార్ తెలిపారు. శుక్రవారం కడప నగరంలోని కడప ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ స్టేషన్లో ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆయన వివరాలు వెల్లడించారు. కడప నగరంలో మహావీర్ సర్కిల్ వద్ద గంజాయి విక్రయాలు, అమ్మకాలు సాగిస్తున్నట్లు తమకు సమాచారం రావడంతో నిఘా పెట్టి ఐదుగురు నిందితులను అరెస్ట్ చేసినట్లు తెలిపారు. అరెస్ట్ అయిన వారిలో పెండ్లిమర్రి మండలం మాచునూరు గ్రామానికి చెందిన ముటమల్ల గణేష్, కడప నగరం బాలాజీపేటకు చెందిన అనగొండి రాజేష్, కడప నగరం మాసాపేటకు చెందిన కడ దాసరి చైతన్య, నాగదాసరి విజయరాజు, బీకేఎం స్ట్రీట్కు చెందిన కిషోర్ అభినందన్ను అరెస్ట్ చేసి కేసు నమోదు చేసినట్లు పేర్కొన్నారు. వీరి వద్ద నుంచి 500 గ్రాముల ఎండు గంజాయిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఈ సమావేశంలో ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ సబ్ ఇన్స్పెక్టర్లు కె.నరసింహరావు, విజయ్ కుమార్, పూతలీ బాయి, హెడ్ కానిస్టేబుళ్లు రవి కుమార్, కృష్ణయ్య, మోహన్రెడ్డి పాల్గొన్నారు. -
ఎస్ఐఆర్–2026కు పటిష్ట ఏర్పాట్లు
మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్ –2026) కార్యక్రమాన్ని పకడ్బందీగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు జిల్లా కలెక్టర్ నిశాంత్ కుమార్ తెలిపారు. శుక్రవారం మదనపల్లె కలెక్టరేట్ లో ఆయన మాట్లాడుతూ.. జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో ప్రత్యేక ఓటర్ల సవరణ ప్రక్రియను పర్యవేక్షించేందుకు అధికారులను నియమించామన్నారు. ఎన్నికల సంఘం నిబంధనల ప్రకారం జిల్లాలోని అన్ని నియోజక వర్గాల్లో బూత్ స్థాయి అధికారుల (బిఎల్ఓ) ఆధ్వర్యంలో ఇంటింటి సర్వే నిర్వహించనున్నారు. ఒకే కేంద్రానికి చెందిన ఓటర్ల వివరాలను పరిశీలించి, అర్హులైన వారిని జాబితాలో చేర్చడంతో పాటు అనర్హులైన, మరణించిన లేదా ఇతర ప్రాంతాలకు తరలిపోయిన వారి వివరాలను గుర్తించనున్నారు. కాల్ సెంటర్ సేవలు ఉదయం 10 నుంచి సాయంత్రం 5 గంటల వరకు అందుబాటులో ఉంటాయని అధికారులు తెలిపారు. ఓటర్ల సందేహాలు, అభ్యంతరాల పరిష్కారానికి 08571–293001 నంబర్ను సంప్రదించవచ్చని పేర్కొన్నారు. సర్ –2026 ప్రక్రియకు సంబంధించి ఫిర్యాదులు, సందేహాలను ఎలక్టోరల్ రోల్ పరిశీలకుడి దష్టికి తీసుకెళ్లేందుకు 9193591939 నంబర్ కూడా ఇస్తున్నట్లు తెలిపారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
పీలేరు : రెండు కార్లతో సహా రూ.8.24 లక్షల విలువైన ఎర్రచందనం దుంగలు స్వాధీనం చేసుకున్నట్లు అటవీశాఖ అధికారి చంద్రశేఖర్ తెలిపారు. గురువారం రాత్రి అటవీ శాఖ అధికారులకు అందిన రహస్య సమాచారం మేరకు.. స్థానిక చిత్తూరు రోడ్డు మార్గంలో ఎంజేఆర్ కళాశాల సమీపంలో ప్రత్యేక నిఘా ఏర్పాటు చేశారు. శుక్రవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో అనుమానాస్పదంగా వచ్చిన రెండు కార్లను అటవీ సిబ్బంది ఆపేందుకు ప్రయత్నం చేశారు. అయితే ఆపకుండా పీలేరు వైపు వెళుతున్న కార్లను అటవీ సిబ్బంది వెంబడించడంతో.. రోడ్డు పక్కన ఆపి దుండగులు పరారయ్యారు. రెండు కార్లతోపాటు తమిళనాడు డ్రైవర్ కుమార్ను అదుపులోకి తీసుకున్నారు. కార్లను తనిఖీ చేయగా 185 కేజీల బరువు గల 6 ఎర్రచందనం దుంగలు ఉన్నట్లు గుర్తించి స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడిలో అటవీ శాఖ సిబ్బంది పాల్గొన్నారు. -
టిడ్కో ఇంటిలో చోరీ
● బంగారు నగలు, నగదు మాయం మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం తట్టివారిపల్లె సమీపంలోని టిడ్కో ఇళ్లు 6వ బ్లాక్ ఈ–3లో చోరీ జరిగింది. ఇంట్లో ఉన్న బంగారు జుంకీలు, కమ్మలు, రూ.20 వేల నగదు కనిపించలేదని బాధితురాలు అబ్బు చిన్నక్క తాలూకా పోలీసులకు ఫిర్యాదు చేశారు. బుధవారం అర్ధరాత్రి గుర్తుతెలియని దుండగులు ఇంట్లోకి ప్రవేశించి.. బీరువాలో ఉన్న నగలు, నగదు ఎత్తుకెళ్లారని బాధితురాలు తెలిపారు. ఈ ఘటనపై పక్కింట్లో అద్దెకు ఉంటున్న వారిపై అనుమానం ఉందని ఫిర్యాదులో పేర్కొన్నారు. పోయిన నగలు, నగదు ఇప్పించి, తనకు న్యాయం చేయాలని కోరారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రోడ్డు ప్రమాదంలో వృద్ధుడికి తీవ్ర గాయాలుమదనపల్లె టౌన్ : స్కూటర్ ఢీకొని వృద్ధుడు తీవ్రంగా గాయపడ్డ సంఘటన శుక్రవారం రాత్రి గుర్రంకొండలో జరిగింది. ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు.. గుర్రంకొండ టౌన్ పోలీస్స్టేషన్ ఎదురుగా కాపురం ఉంటున్న పగడాల నాగన్న (65) ఊరిలో జరుగుతున్న వారపు సంతకు వెళ్లాడు. చీకటి పడేదాకా సంత చూసుకొని తిరిగి ఇంటికి బయలుదేరి నడిచి వస్తుండగా.. మార్గమధ్యంలోని బస్టాండ్ వద్ద బైకు ఢీ కొట్టడంతో కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికుల సాయంతో కుటుంబ సభ్యులు 108లో మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్సల అనంతరం అక్కడి నుంచి రుయాకు తరలించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు గుర్రంకొండ పోలీసులు తెలిపారు. ఆటో ఢీకొని ద్విచక్ర వాహనదారుడి దుర్మరణంపుంగనూరు : అతివేగంగా వచ్చిన ఆటో ద్విచక్ర వాహనాన్ని ఢీకొనడంతో వ్యక్తి దుర్మరణం చెందిన సంఘటన గురువారం రాత్రి పట్టణంలోని యూఎన్ఆర్ సర్కిల్ వద్ద జరిగింది. పోలీసుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. మండలంలోని బైపల్లెకి చెందిన కె.సుధాకర్(35) పట్టణంలో పనులు ముగించుకుని బైక్పై ఇంటికి వెళ్తుండగా.. ఎదురుగా వచ్చిన ఆటో ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆయన అక్కడికక్కడే మృతి చెందాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం పోలీసులు ఆసుపత్రికి తరలించారు. వారు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నేడు, రేపు ప్రత్యేక శిబిరాలుకడప సెవెన్రోడ్స్ : ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ కార్యక్రమంలో భాగంగా శని, ఆదివారాల్లో ప్రత్యేక శిబిరాలను నిర్వహిస్తున్నారు. జిల్లాలోని అన్ని పోలింగ్ కేంద్రాల్లో ఉదయం నుంచి సాయంత్రం వరకు బూత్ లెవెల్ అధికారులతోపాటు రాజకీయ పార్టీలకు చెందిన బూత్ లెవెల్ ఏజెంట్లు అందుబాటులో ఉంటారు. 18 సంవత్సరాలు నిండిన వారు ఓటరుగా నమోదు చేసుకోవడానికి అవసరమైన ఫారం–6, అభ్యంతరాలకు సంబంధించి ఫారం–7, సవరణలు, మార్పులకు సంబంధించిన ఫారం–8లు అందుబాటులో ఉంటాయి. ప్రజలు ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కోరారు. జిల్లాలో 3,07,000 మంది మ్యాపింగ్ కానివారు, పేర్లు తప్పులు దొర్లిన వారు ఉన్నారు. వీరందరికీ అధికారులు ఇప్పటికే నోటీసులు జనరేట్ చేసి పంపించారు. ఇందులో 64 వేల మంది మ్యాపింగ్ కానివారు ఉండగా, 2,43,000 మంది తప్పులు దొర్లిన వారు ఉన్నారు. మొత్తం మీద ఇప్పటివరకు 1,16,000 మందికి హియరింగ్ నిర్వహించారు. సెప్టెంబరు 28వ తేదికి ఈ కార్యక్రమం ముగుస్తుంది. అక్టోబరు 3వ తేదీ ఓటర్లతుది జాబితా వెలువడనుంది. -
హెచ్ఐవీపై అవగాహన పెంచుకోవాలి
కురబలకోట: హెచ్ఐవీ, సిఫిలిస్, హెపటైటీస్ –బీ వంటి వ్యాధులపై సరైన అవగాహన కలిగి ఉండాలని, అపోహలకు తావివ్వకుండా ముందస్తు పరీక్షలు, తగిన జాగ్రత్తలు పాటించడం ద్వారా వ్యాధుల బారిన పడకుండా కాపాడుకోవచ్చని కడప, అన్నమయ్య జిల్లాల క్లస్టర్ మేనేజర్ వేంపల్లి భాస్కర్ అన్నారు. అంగళ్లులోని విశ్వం కళాశాలలో స్థానిక ఆర్ఆర్ఎస్ సంస్థ ఆధ్వర్వంలో శుక్రవారం జరిగిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ హెచ్ఐవీ వ్యాప్తి నియంత్రణపై విద్యార్థులకు అవగాహన అవసరమరని అన్నారు. హెచ్ఐవీతో జీవిస్తున్న వారిపట్ల వివక్ష సరికాదన్నారు.సిఫిలిస్తో పాటు ఇతర లైంగిక వ్యాధులను గుర్తిస్తే చికిత్స ద్వారా నియంత్రించవచ్చన్నారు. హెపటైటీస్–బి నుంచి రక్షణకు టీకాలు అందుబాటులో ఉన్నాయన్నారు. యువత ఆరోగ్యంపై నిర్లక్ష్యం వహించకుండా ఆరోగ్య పరీక్షలు చేయించుకోవాలన్నారు.వ్యాధి వచ్చిన తర్వాత బాధపడటం కన్నా ముందుగానే అవగాహనతో జాగ్రత్తలు తీసుకోవడం ఉత్తమమన్నారు.ప్రిన్సిపాల్ రఘునాథరెడ్డి, ఆర్ఆర్ఎస్ మేనేజర్ పురుషోత్తం, పల్లవి, సునీత తదితరులు పాల్గొన్నారు. -
నిత్యాన్నదానం కోసం రూ. లక్ష విరాళం
రాయచోటి టౌన్ : రాయచోటి శ్రీ భద్రకాళీ సమేత శ్రీ వీరభద్రస్వామి ఆలయంలో నిర్వహిస్తున్న నిత్యాన్నదానం కోసం అనంతపురం జిల్లా కేంద్రానికి చెందిన సాయి శంకర్ స్వామి రూ.లక్ష విరాళం అందించారు. శుక్రవారం ఆలయానికి వచ్చి ఆలయ పాలక మండలి అధ్యక్షులు తిరుమల మనోజ్కుమార్, ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ డీవీ రమణారెడ్డి ఆధ్వరంలో ఈ చెక్కును అందజేశారు. అలాగే ఓంకార్ బాబు స్వామి వారి నిత్యాన్నదాన కార్యక్రమానికి రూ.25 వేలు అందించారు. వీరికి ఆలయ సంప్రదాయం ప్రకారం స్వాగతం పలికి వీరి పేరున స్వామి వారికి, అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలు అందజేశారు. -
తీవ్ర సంక్షోభంలో రైతాంగం
కడప అగ్రికల్చర్: కూటమి ప్రభుత్వ పాలనలో రైతాంగం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి ఆరోపించారు. కడపలో జిల్లా పశుగణాభివృద్ధి సంస్థ చైర్మన్ రొండ మాధవరెడ్డి, చెన్నూరు ఎంపీపీ సురేష్బాబు, వల్లూరు జెడ్పీటీసీ సుబ్బయ్య తదితరులతో కలిసి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రసాద్రెడ్డి మాట్లాడుతూ, రాష్ట్రంలో త్రిబుల్ ఇంజన్, దేశంలో డబల్ ఇంజన్ సర్కార్ అని చెప్పుకుంటున్న పాలకులు రైతులను సంక్షోభంలోకి నెట్టేస్తున్నారని మండిపడ్డారు. గత మూడు నెలల్లో ఎరువుల ధరలు ఆకాశాన్నంటాయని, అవి కూడా సకాలంలో అందక రైతులు అల్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులకు రావాల్సిన పంట బీమా, పెట్టుబడి రాయితీ బకాయిలను ఇవ్వకుండా ప్రభుత్వం చెలగాటమాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. శ్రీశైలం ప్రాజెక్టులో 874 అడుగుల నీరున్నా రాయలసీమ ప్రాజెక్టులను నింపకుండా కూటమి సర్కార్ చోద్యం చూస్తోందని ధ్వజమెత్తారు. కేసీ కెనాల్కు నికర జలాలు ఉన్నా నీళ్లివ్వకుండా మీనమేషాలు లెక్కిస్తున్నారని, కానీ తెలంగాణ ప్రాజెక్టులకు మాత్రం నీటిని వదులుతున్నా పట్టించుకునే వారే కరువయ్యారని ఆరోపించారు. రాయలసీమ ఎత్తిపోతల పథకం, నీటి విడుదలపై ప్రభుత్వానికి మొదటి నుండి చిన్నచూపేనని విమర్శించారు. ఇప్పటికైనా కూటమి సర్కార్ స్పందించి రైతులను ఆదుకోవాలని కోరారు. ● హద్దు దాటితే ఒప్పుకోం ● అధికార పార్టీ నేతల మధ్య పోరు టాస్క్ఫోర్స్ : ఇసుక వ్యాపారం అధికార పార్టీ నాయకుల మధ్య చిచ్చుపెట్టింది. ఒక ప్రాంతంలోని అధికార ప్రతినిధులు మరో ప్రాంతంలో విక్రయిస్తే ఒప్పుకోమంటూ అడ్డుపడుతున్నట్లు తెలిసింది. అధికార బలంతో జిల్లా హద్దులు దాటి వస్తే సిస్తు రూపంలో దండన తప్పదని హెచ్చరిస్తున్నారు. శుక్రవారం హద్దులు దాటి వచ్చిన ఇసుక లారీలకు గాలివీడు పోలీసుల రూపంలో అడ్డుకట్ట వేసి అధిక లోడుతో వెళ్తున్నాయంటూ అపరాధ రుసుం కోసం ట్రాన్స్పోర్ట్ అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. వైఎస్ఆర్ కడప జిల్లా చక్రాయపేట మండలానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు.. ఆ మండల పరిధిలోని పాపాఘ్ని నది నుంచి ఇసుకను అన్నమయ్య జిల్లా పరిధిలో విక్రయించడానికి ప్రయత్నాలు చేశారు. కొద్ది రోజుల కిందట ఇదే విషయంపై స్థానిక నేతలు మీ జిల్లా హద్దులను దాటి మా జిల్లాలోకి ఇసుకను తరలించి విక్రయించరాదు అంటూ కడప జిల్లా నేతకు హెచ్చరికలు చేసినట్లు సమాచారం. స్థానిక నేతల మాటలను పట్టించుకోని ఆ జిల్లా నేత.. మాదీ అధికార పార్టీనే అంటూ శుక్రవారం టిప్పర్ల సాయంతో ఇసుకను గాలివీడు, మదనపల్లి ప్రాంతాలలో విక్రయానికి సిద్ధమైనట్లు సమాచారం. దీంతో ఆగ్రహించిన స్థానిక అధికార పార్టీ నేతలు పోలీసులను పురమాయించి వాహనాలను సీజ్ చేసి ట్రాన్స్పోర్టు అధికారులకు అప్పగించినట్లు తెలిసింది. ఈ విషయంపై అధికార పార్టీ నేతలు పార్టీ అధిష్టానం దృష్టికి విషయాన్ని తీసుకెళ్లినట్లు పార్టీ వర్గాల సమాచారం. ఇప్పటికే అధికార పార్టీ నేతలు స్థానికంగా లభిస్తున్న ఇసుక, మట్టి, ఎర్రచందనం, ఖరీదైన సంపదను విచ్చలవిడిగా దోచుకుపోతున్న విషయం అందరికీ తెలిసిందే. జూదరుల అరెస్ట్వేంపల్లె : వేంపల్లెలోని అలవలపాడు క్రాస్లోని నిమ్మతోటలో పేకాట స్థావరంపై సీఐ నరసింహులు, ఎస్ఐ తిరుపాల్ నాయక్ ఆధ్వర్యంలో పోలీసు సిబ్బంది శుక్రవారం దాడులు చేశారు. పేకాట ఆడుతున్న 10 మందిని అరెస్టు చేసి, వారి వద్ద నుంచి రూ.1.51 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. వారిపై కేసు నమోదు చేశారు. -
వెంకటాద్రి హాల్టింగ్పై త్వరలో నిర్ణయం
– సాక్షి కథనానికి స్పందించిన ఉన్నతాధికారులు రాజంపేట: జిల్లాలో రైల్వేపరంగా ప్రసిద్ధి చెందిన నందలూరు రైల్వేకేంద్రంలో వెంకటాద్రి హాల్టింగ్పై రైల్వే ఉన్నతాధికారులు దృష్టి సారించారు. వెంకటాద్రి హాల్టింగ్కు పొలిటికల్ బ్రేక్ శీర్షికతో ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి రైల్వే ఉన్నతాధికారులు స్పందించారు. రాజ్యసభ సభ్యుడు, రైల్వేప్లానింగ్ కమిటీ సభ్యులు మేడా రఘునాథరెడ్డితో శుక్రవారం రైల్వే ఉన్నతాధికారులు సంప్రందించారు. వెంకటాద్రి హాల్టింగ్ విషయంలో ఆలస్యమైన అంశంపై ఎంపీకి వివరించారు. ప్రధానంగా సౌత్సెంట్రల్ రైల్వే నుంచి ఏపీకి ఎస్సీవోఆర్ జోన్ ఏర్పడటం వల్ల వెంకటాద్రి సూపర్ఫాస్ట్ హాల్టింగ్ కల్పించే విషయంలో జాప్యం జరిగిన అంశాన్ని వివరించారు. రైల్వేబోర్డు ఉన్నతాధికారుల నిర్ణయం తీసుకొని త్వరలో హాల్టింగ్ తేదీని ఖరారు చేస్తామని ఎంపీకి తెలిపారు. రెండోవారంలో వెంకటాద్రికి హాల్టింగ్ కల్పించే దిశగా చర్యలు తీసుకుంటామని కూడా వివరించారు. ఆరునెలల పాటు వెంకటాద్రి హాల్టింగ్ పెండింగ్లో పడిన సంగతి అందరికి తెలిసిందే. త్వరలో హాల్టింగ్ను ప్రకటిస్తామని రైల్వే ఉన్నతాధికారులు హామీ ఇచ్చారు. -
పీకేఏం పోయే.. అన్నమయ్య వచ్చే !
సాక్షి, మదనపల్లె : నిన్నటిదాక పీకేఎం ఉడా పేరుతో కొనసాగిన పట్టణాభివృద్ధి సంస్థ కార్యాలయం పేరు మారిపోయింది. మదనపల్లెలోని ఆ కార్యాలయంపై ఉన్న పీకేఎం ఉడా బోర్డును తొలగించారు. దానిస్థానంలో కొత్తగా అన్నమయ్య పట్టణాభివృద్ధి సంస్థ పేరుతో బోర్డును ఏర్పాటు చేశారు. ఈ సంస్థకు వైస్ చైర్మన్గా జాయింట్ కలెక్టర్ కొనసాగుతారని ప్రభుత్వం స్పష్టం చేయగా, కొత్త చైర్మన్ను నియమించాల్సి ఉంది. దరఖాస్తుల ఆహ్వానం కడప ఎడ్యుకేషన్: కడప రిమ్స్ వద్ద ఉన్న ప్రభుత్వ ఐటీఐ మైనారిటీ కళాశాలలో 2026–27,28 విద్యా సంవత్సరానికి మిగిలి ఉన్న సీట్ల భర్తీకి ఆర్హత, ఆసక్తి ఉన్న అభ్యర్థుల నుంచి దరఖాస్తులను ఆహ్వానిస్తున్నట్లు ఐటీఐ కడప జిల్లా కన్వీనర్, ప్రిన్సిపాల్ జ్ఞానకుమార్ తెలిపారు. అభ్యర్థులు 10వ తరగతి పాస్, ఫెయిల్, ఇంటర్ పాస్, ఫెయిల్, ఆపై విద్యార్హతలు ఉన్న వారు కంప్యూటర్, మోకానిక్ మోటర్ వెహికల్, పిట్టర్, వెల్డర్ ట్రేడ్లకు దరఖాస్తు చేసుకోవచ్చని చెప్పారు. అభ్యర్థులు నేరుగా తమ 10వ తరగతి మార్కుల జాబితా, ఆధార్కార్డు, కుల ధృవీకరణ పత్రం, ఫొటో, టీసీ తీసుకుని ఐటీఐ వద్దకు వచ్చి ఆన్లైన్ ద్వారా దరఖాస్తును రిజిస్టర్ చేసుకోవచ్చన్నారు. దరఖాస్తు చేసుకున్న వారు తాము చేరదలచుకున్న ఐటీఐలను ఈ నెల 31 ఉదయం 10.30 గంటలకు హాజరై సీటు లభ్యతను బట్టి ఆడ్మిషన్ పొందవచ్చని జ్ఞానకుమార్ తెలిపారు. -
గుప్తనిధుల ముఠా గుట్టురట్టు
బద్వేలు అర్బన్ : బద్వేలు సమీపంలోని కొత్తచెరువు గ్రామ శివార్లలో గల లంకమల అభయారణ్యంలో గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపట్టిన ముఠా గుట్టును ఫారెస్టు అధికారులు, రూరల్ పోలీసులు రట్టు చేశారు. ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకోవడంతోపాటు ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు, తవ్వకాలకు ఉపయోగించిన సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. శుక్రవారం స్థానిక సిద్దవటం రోడ్డులోని ఫారెస్టు రేంజర్ కార్యాలయంలో నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఎఫ్ఆర్ఓ నయీమ్అలీ, రూరల్ సీఐ ఎన్.క్రిష్ణయ్య వివరాలు వెల్లడించారు. బద్వేలు ఫారెస్టు రేంజ్ పరిధిలోని కొత్తచెరువు గ్రామ సమీపంలో గల లంకమల అభయారణ్యంలోని నీలిబండసెల ప్రాంతంలో కొందరు గుర్తు తెలియని వ్యక్తులు గుప్తనిధుల కోసం తవ్వకాలు చేపడుతున్నారని వచ్చిన విశ్వసనీయ సమాచారం మేరకు.. అటవీశాఖ సిబ్బంది వెళ్లి దాడులు నిర్వహించారు. అభయారణ్యంలో తవ్వకాలు చేపడుతున్న కొందరు వ్యక్తులు అటవీశాఖ సిబ్బందిని చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. వారిని వెంబడించి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. అలాగే అటవీ ప్రాంతంలోకి ప్రవేశించేందుకు ఉపయోగించిన ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలతోపాటు తవ్వకాల కోసం తీసుకొచ్చిన గడ్డపారలు, పారలు, గోలాలు, సమ్మెటలు, రాగిచెంబును స్వాధీనం చేసుకుని నిందితులను ఫారెస్టు కార్యాలయానికి తరలించారు. అదుపులోకి తీసుకున్న వారు సిద్దవటం మండలం ఎస్.రాజంపేటకు చెందిన ఎం.మనోజ్కుమార్, తిరుపతికి చెందిన ఎన్.వెంకటాద్రి, రాయచోటికి చెందిన పి.శివకుమార్లుగా గుర్తించినట్లు వారు తెలిపారు. ఈ తవ్వకాలలో మరో ఆరుగురు పరారైనట్లు విచారణలో తేలిందని, వారిని కూడా త్వరలో అరెస్టు చేస్తామని తెలిపారు. సమావేశంలో డిప్యూటీ రేంజర్ సి.హెచ్.పెద్దయ్య, ఎఫ్బీఓలు సుంకయ్య, రాజేష్రెడ్డి, బాలచెన్నయ్య, ప్రొటెక్షన్ వాచర్లు పాల్గొన్నారు. ముగ్గురి అరెస్ట్ ఒక కారు, మూడు ద్విచక్ర వాహనాలు స్వాధీనం -
200 మందికి చీరల పంపిణీ
ఖాజీపేట : కడప పార్లమెంటు సభ్యులు వైఎస్ అవినాష్రెడ్డి జన్మదిన వేడుకల సందర్భంగా వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి రాచమల్లు రవిశంకర్రెడ్డి ఆధ్వర్యంలో 200 మంది మహిళలకు చీరలు పంపిణీ చేశారు. జిల్లాలోని మైదుకూరు నియోజకవర్గం ఖాజీపేట మండలం మల్లాయపల్లి గ్రామంలో ఈ కార్యక్రమం నిర్వహించారు. మొదట గ్రామ ప్రజలతో కలిసి భారీ కేక్ను కట్ చేసి వైఎస్ అవినాష్రెడ్డికి జన్మదిన శుభాకాంక్షలు తెలిపారు. అనంతరం రాచమల్లు రవిశంకర్రెడ్డి మాట్లాడుతూ నిస్వార్థ ప్రజా సేవకుడైన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి ఇలాంటి పుట్టిన రోజులు మరెన్నో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, గ్రామప్రజలు పాల్గొన్నారు. -
●9 వేల షాపులు.. తనిఖీలు ఎక్కడ?
● మందుల షాపులపై కొరవడిన నిఘా: ప్రజల ప్రాణాలతో చెలగాటం ● జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ స్టోర్ల నిర్వహణ ● ఫార్మాసిస్ట్లు లేకుండానే అనర్హుల ఇష్టారాజ్యం ● ప్రిస్క్రిప్షన్ లేకుండానే నిషిద్ధ మాత్రల విక్రయం ● ఆసుపత్రులకు అనుబంధంగా రెట్టింపు ధరల దోపిడీ ● తనిఖీలు రికార్డులకే పరిమితమన్న విమర్శలు ● జిల్లా కలెక్టర్ స్పందించి ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపట్టాలని ప్రజల డిమాండ్ మదనపల్లె టౌన్: ప్రజల ఆరోగ్యంతో నేరుగా ముడిపడి ఉన్న మందుల దుకాణాలపై అధికారుల నిఘా పూర్తిగా కొరవడింది. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా మెడికల్ స్టోర్ల నిర్వహణ యథేచ్ఛగా సాగుతున్నా.. డ్రగ్ కంట్రోల్ అధికారులు చూసీచూడనట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తనిఖీలు మొక్కుబడిగా సాగుతుండటంతో కొందరు మందుల షాపు నిర్వాహకులు ఇష్టా రాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను నిలువునా మోసం చేస్తూ వారి ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. నిబంధనలు గాలికి.. అర్హత లేని వారితోనే మందుల విక్రయాలు ఔషధ దుకాణం నిర్వహించాలంటే ఫార్మసిస్ట్ తప్పనిసరిగా ఉండాలి, లైసెన్స్ ప్రదర్శించాలి, స్టాక్ రిజిస్టర్, బిల్లులు, మందుల నిల్వకు ఉష్ణోగ్రత పాటించడం వంటి కఠిన నిబంధనలు ఉన్నాయి. కానీ మదనపల్లె, రాయచోటి, తంబళ్లపల్లె, పీలేరు నియోజకవర్గాల పరిధిలో చాలా చోట్ల ఈ నిబంధనలు కాగితాలకే పరిమితమయ్యాయి. ఫార్మసిస్ట్ పేరుతో లైసెన్స్ తీసుకుని, అసలు ఫార్మసిస్ట్ లేకుండానే అనర్హులు మందులు విక్రయిస్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. ఇది చట్టరీత్యా తీవ్ర నేరం. అర్హత లేని వ్యక్తి ఇచ్చే మందుల వల్ల రోగి ప్రాణాలకే ముప్పు వాటిల్లే ప్రమాదం ఉంది. ప్రిస్క్రిప్షన్ లేకుండానే మందులు విక్రయం వైద్యుడి ప్రిస్క్రిప్షన్ తప్పనిసరి అయిన షెడ్యూల్ హెచ్, హెచ్1 కింద వచ్చే యాంటీబయాటిక్స్, మత్తు మందులు, నిద్ర మాత్రలను కొన్ని దుకాణాల్లో యథేచ్ఛగా అమ్మేస్తున్నారు. ప్రిస్క్రిప్షన్ అడగకుండా ఇవ్వడం వల్ల యువత మత్తుకు బానిసయ్యే ప్రమాదం ఉందని, యాంటీబయాటిక్ రెసిస్టెన్స్ పెరిగి భవిష్యత్తులో మందులే పనిచేయని పరిస్థితి వస్తుందని వైద్యులు హెచ్చరిస్తున్నారు. కానీ దీనిపై అధికారుల నియంత్రణ శూన్యం. ఆసుపత్రులకు అనుబంధంగా దోపిడీఆసుపత్రులకు అనుబంధంగా రెట్టింపు రేట్లు డబ్బు తీసుకుని మందులు అమ్ముతున్నారు. ఈ దందా ఎక్కువగా ప్రైవేటు ఆసుపత్రులకు అనుబంధంగా నడుస్తున్న మెడికల్ స్టోర్లలో మరింత ఎక్కువగా ఉందనే ఆరోపణలు ఉన్నాయి. బయట రూ.100కే దొరికే మందును ఆసుపత్రి లోపలి షాపులో రూ.180 నుంచి రూ.200 వరకు విక్రయిస్తున్నారు. రోగి బయట కొనుక్కుంటే డాక్టర్లు ఒప్పుకోరనే భయంతో రెట్టింపు ధర పెట్టి కొనాల్సి వస్తోందని బాధితులు వాపోతున్నారు. జెనరిక్ మందులు రాస్తే చౌకగా వస్తాయని ప్రభుత్వం చెబుతున్నా, కమీషన్ల కోసం బ్రాండెడ్, కాస్ట్లీ మందులే రాస్తున్నారనే విమర్శలున్నాయి. అధికారుల తప్పిదం – మొక్కుబడి కేసులుఈ ఆరోపణలపై మదనపల్లె డ్రగ్ ఇన్స్పెక్టర్ ఖలందర్ను వివరణ కోరగా, నిబంధనల మేరకు తనిఖీలు చేస్తున్నామని, 64 కేసులు నమోదు చేశామని చెప్పడం గమనార్హం. 700 షాపుల్లో కేవలం 64 కేసులు మాత్రమే నమోదు చేయడంపై తీవ్ర విమర్శలు వస్తున్నాయి. అంటే మిగిలిన 90 శాతం దుకాణాలు పక్కాగా నిబంధనలు పాటిస్తున్నాయా అనే ప్రశ్న తలెత్తుతోంది. ఉల్లంఘనలపై లైసెన్స్ రద్దు, భారీ జరిమానా వంటి కఠిన చర్యలు తీసుకున్న దాఖలాలు లేవు. ప్రజల డిమాండ్ – ప్రత్యేక డ్రైవ్ చేపట్టాలిమందుల విషయంలో నిర్లక్ష్యం నేరుగా ప్రాణాలతో ముడిపడి ఉంది. కాబట్టి జిల్లా కలెక్టర్ జోక్యం చేసుకుని ప్రత్యేక తనిఖీ డ్రైవ్ చేపట్టాలని, ఫార్మసిస్ట్ లేని షాపుల లైసెన్సులు రద్దు చేయాలని, ప్రిస్క్రిప్షన్ లేకుండా మందులు అమ్మే వారిపై క్రిమినల్ కేసులు నమోదు చేయాలని, ఎంఆర్పీ కంటే ఎక్కువకు అమ్మే వారిపై చర్యలు తీసుకోవాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. లేకుంటే పేద ప్రజలు దోపిడీకి గురవుతూనే ఉంటారు. అన్నమయ్య జిల్లా వ్యాప్తంగా 10వేలకు పైగా ఔషధ దుకాణాలు ఉండగా, ఒక్క మదనపల్లె డ్రగ్ ఇన్స్పెక్టర్ పరిధిలోనే 700కి పైగా షాపులు ఉన్నాయి. ఇంత పెద్ద సంఖ్యలో ఉన్న దుకాణాలను పర్యవేక్షించడానికి తగినంత మంది సిబ్బంది లేకపోవడం, ఉన్న అధికారులు సైతం క్షేత్రస్థాయికి వెళ్లి తనిఖీలు చేయకపోవడంతో అక్రమార్కులకు అడ్డూఅదుపూ లేకుండా పోతోంది. తనిఖీలు చేసినా రికార్డులకే పరిమితమవుతున్నాయే తప్ప, గడువు తీరిన మందులు, నకిలీ మందుల నిల్వలు, ఉష్ణోగ్రత పాటించని విధానంపై దృష్టి పెట్టడం లేదు. -
పుత్తా.. తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదు
కమలాపురం : టీడీపీ నాయకుడు పుత్తా నరసింహారెడ్డి తాటాకు చప్పుళ్లకు భయపడేది లేదని, భయపెడితే వైఎస్సార్ సీపీ శ్రేణులు భయపడే రకం కాదని ఆ పార్టీ నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి ధ్వజమెత్తారు. శుక్రవారం వైఎస్సార్సీపీ నాయకుడు అంబటి సురేష్ను పుత్తా వర్గీయులు కిడ్నాప్ చేసి టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లి చితక్కొట్టారు. పట్టణంలోని పొట్టిశ్రీరాములు వీధిలో జరుగుతున్న కోదండ రామాలయ నిర్మాణ పనుల వద్ద ఉన్న సురేష్ను పుత్తా అనుచరులు బలవంతంగా, చొక్కా పట్టుకుని, లాక్కొని ఆటోలో వేసుకుని టీడీపీ కార్యాలయానికి తీసుకెళ్లారు. విషయం తెలుసుకున్న నరేన్ రామాంజులరెడ్డి అక్కడికి వెళ్లడంతో.. అంబటి సురేష్ను వదిలి పెట్టారు. అంబటి సురేష్ నివాసానికి నరేన్రెడ్డి చేరుకుని పరామర్శించారు. భయపడవద్దని, మీ వెంట పార్టీ, నేను, పార్టీ శ్రేణులు నిత్యం అండగా, అందుబాటులో ఉంటామని హామీ ఇచ్చారు. మీ శ్రేయస్సు కోసం దేనికై నా సిద్ధంగా ఉంటానని స్పష్టం చేశారు. అనంతరం నిర్వహించిన మీడియా సమావేశంలో నరేన్రెడ్డి మాట్లాడుతూ పుత్తా దౌర్జన్యాలను ప్రతిఘటించే రోజులు దగ్గర పడ్డాయని, ఎవరినైనా సరే ప్రతిఘటించి తీరుతామన్నారు. భయపెడితే ఓట్లు వస్తాయనుకోవడం మీ మూర్ఖత్వం అన్నారు. వయస్సులో పెద్దవారు... ఇలాంటి వారిని, అమాయకులను పట్టుకుని కొట్టడమా.. ఇది హాస్యాస్పదం... సరైనోళ్లతో తగలాలని పుత్తాకు హితవు పలికారు. ఇలాంటి దాడులు ప్రజలు గమనిస్తున్నారని, సరైన సమయంలో స్పందిస్తారన్నారు. ఆర్ఓబీ బాధితులు 130 మంది ఉంటే ఒక్కడిని పట్టుకుని ఈడ్చుకుంటూ, లాక్కెళ్లి, పార్టీ ఆఫీసుకు తీసుకెళ్లి దాడి చేయడం సిగ్గు చేటన్నారు. వైఎస్సార్సీపీలో అంబటి సురేష్ క్రీయాశీలకంగా ఉన్నారని, ఆయనను మాత్రమే టార్గెట్ చేశారని, అంత మందిలో ఆర్యవైశ్యుడైన సురేష్ ఒక్కరే దొరికాడా? అని ప్రశ్నించారు. ఆర్ఓబీ నిర్మాణంలో భాగంగా తమకు నష్ట పరిహారం ఇస్తే తాము మార్కింగ్ వరకు తొలగించుకుంటామంటే పట్టించుకోకుండా ఇలాంటి దాడులు చేసి భయభ్రాంతులకు గురి చేయడం సరికాదన్నారు. కాంట్రాక్టర్లకు ఇప్పటి వరకు ఇదే పనికి నాలుగు సార్లు ధరలు సవరణ చేశారని, దాని ప్రకారమే పరిహారం ఇచ్చి పనులు చేసుకోవాలని బాధితులు చెప్పడం తప్పా? అని ప్రశ్నించారు. సురేష్కు జరిగింది చాలా అవమానం అని, దీనిని తాను పూర్తిగా ఖండిస్తున్నానన్నారు. నన్ను టార్గెట్ చేసి దాడి బాధితుడు అంబటి సురేష్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో తాను చురుగ్గా పని చేస్తున్నాననే కోపంతో పుత్తా అనుచరులు తనపై దాడి చేశారన్నారు. రామాలయం దగ్గర ఉంటే మెడ పట్టుకుని ఆటోలో ఎక్కించుకుని ఈడ్చుకెళ్లారని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్ఓబీ బాధితులు 130 మంది ఉంటే నన్ను ఒక్కడినే పిలిచి దాడి చేయడం ఏమిటని ప్రశ్నించారు. వైఎస్సార్ సీపీ ఇన్చార్జ్ నరేన్రెడ్డి బాధితులను పరామర్శిస్తుంటే తాను వెంట ఉండటమే తప్పా? అని ప్రశ్నించారు. తనను అనవసరంగా చితక బాదారని వాపోయారు. పుత్తా అనుచరులు పార్టీ కార్యాలయంలో వేసి తనను చితక్కొట్టారన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నాయకులు ఉత్తమారెడ్డి, రాజుపాళెం సుబ్బారెడ్డి, సంబటూరు ప్రసాద్రెడ్డి, చెన్న కేశవరెడ్డి, ఆర్వీఎన్ఆర్, గఫార్, ఇస్మాయిల్, దేవదానం పాల్గొన్నారు. ఆర్ఓబీ భూ బాధితుడిని కొట్టడం దారుణం ప్రతిఘటించే రోజులు దగ్గర పడ్డాయి వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జ్ నరేన్ రామాంజులరెడ్డి -
యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలి
● జెన్ జీ ఉద్యమమే స్ఫూర్తి ● వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండి వినీత్ రెడ్డి ప్రొద్దుటూరు : యువత ప్రశ్నించే తత్వాన్ని అలవర్చుకోవాలని వైఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండి వినీత్ రెడ్డి కోరారు. వైఎస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరులోని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి, మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి క్యాంప్ కార్యాలయంలో శుక్రవారం ‘యూత్ మీట్’ నిర్వహించారు. కార్యక్రమానికి రాచమల్లు శివప్రసాదరెడ్డి అధ్యక్షత వహించారు. ఈ సందర్భంగా బండి వినీత్ రెడ్డి మాట్లాడుతూ రాబోయే తరం యువకులదేనన్నారు. అందుకు ఉదాహరణే ఇటీవల ఢిల్లీలో జరిగిన జెన్జీ ఉద్యమం అన్నారు. కూటమి ప్రభుత్వం నిరుద్యోగ భృతి రూ.3వేలు ఇస్తామని చెప్పి మోసం చేసిందన్నారు. ఫీజు రీయింబర్స్మెంట్ లాంటి హామీలను నెరవేర్చకుండా మోసం చేసిన విధానాన్ని యువత గుర్తించాలని తెలిపారు. భవిష్యత్తులో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఎంతో యువతకు ఉపయోగపడుతుందన్నారు. అందుకు సంబంధించిన విషయాలపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఏఐపై మరో మారు సమావేశం ఏర్పాటు చేసి ప్రణాళికలను వివరిస్తానన్నారు. ప్రొద్దుటూరు నుంచి మొదలైన ఈ కార్యక్రమం రాష్ట్ర వ్యాప్తంగా విస్తరింపజేసేందుకు యువత నడుం బిగించాలని కోరారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి రాచమల్లు శివప్రసాదరెడ్డి సోదరుడు కిరణ్కుమారరెడ్డి తనయుడు రాఘవేంద్రారెడ్డి మాట్లాడుతూ యువత చేతుల్లోనే దేశ భవిష్యత్తు ఉందన్నారు. ఎప్పటి నుంచో ఉన్న పార్టీలను కాదని తమిళనాడులో విజయ్ సీఎం కావడానికి ప్రధాన కారణం యువతే అన్నారు. జెన్జీ ఉద్యమం ప్రభావం వల్ల కేంద్ర మంత్రి సైతం రాజీనామా చేయాల్సి వచ్చిందన్నారు. యువతకు ప్రాధాన్యత యువతకు పార్టీలో అధిక ప్రాధాన్యత ఉంటుందని మాజీ ఎమ్మెల్యే రాచమల్లు శివప్రసాదరెడ్డి తెలిపారు. యువతకు సంబంధించిన నిరుద్యోగ భృతి, ఫీజు రీయింబర్స్మెంట్ పథకాల అమలు తీరును ప్రశ్నించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు. తన బావమరిది బంగారు మునిరెడ్డి ఏవిధంగా తనకు సహకరిస్తున్నారో అలాగే భవిష్యత్తులో రాఘవేంద్రారెడ్డికి వినీత్ రెడ్డి సహకారం అలానే ఉంటుందన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కల్లూరు నాగేంద్రారెడ్డి, దొరసానిపల్లె మాజీ ఉపసర్పంచ్ మార్తల లక్ష్మీనారాయణరెడ్డి, వైఎస్సార్సీపీ పట్టణాధ్యక్షుడు భూమిరెడ్డి వంశీధర్రెడ్డి, మండల కన్వీనర్ మార్తల ఓబుళరెడ్డి పాల్గొన్నారు. మాట్లాడుతున్న వెఎస్సార్సీపీ యువజన విభాగం రాష్ట్ర కార్యదర్శి బండి వినీత్ రెడ్డి, పాల్గొన్న యువత -
సెప్టెంబర్ 1న చలో ఢిల్లీ
కడప వైఎస్ఆర్ సర్కిల్: ఎన్నికల వాగ్దానాలకు తిలోదకాలు ఇచ్చి ప్రజా సమస్యలు పూర్తిగా పక్కకు నెట్టి, ఫెడరల్ స్ఫూర్తికి భిన్నంగా నిరంకుశ పాలన సాగిస్తున్న బీజేపీ విధానాలను నిరసిస్తూ సెప్టెంబర్ 1న ఢిల్లీ రామ్ లీలా మైదానంలో భారీ బహిరంగ సభను నిర్వహిస్తున్నట్లు సీపీఐ జిల్లా కార్యదర్శి చంద్ర పేర్కొన్నారు. శుక్రవారం కడప నుంచి సంపర్క్ క్రాంతి ఎక్స్ప్రెస్లో ఢిల్లీకి సీపీఐ నాయకులు బయలుదేరారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏడాదికి రెండు కోట్ల ఉద్యోగాలు, నల్లదనం వెలికితీత, జన్ధన్ యోజన, ధరల స్థిరీకరణ నిధి , సమగ్రాభివృద్ధి వంటి వాగ్దానాలు ఇచ్చి.. అధికారంలోకి వచ్చిందని, 12 సంవత్సరాలైనా వాటిని అమలు చేయడంలో బీజేపీ ప్రభుత్వం ఘోరంగా విఫలమైందన్నారు.ఈ కార్యక్రమంలో సీపీఐ నగర కార్యదర్శి ఎన్ వెంకట శివ, పి సుబ్బరాయుడు, ఎన్ విజయలక్ష్మి, కేసీ బాదుల్లా, ఎం వి సుబ్బారెడ్డి, పి చంద్రశేఖర్, శ్రీరాములు, బాలు, మస్తాన్, రవికుమార్, భాగ్యలక్ష్మి, మల్లికార్జున, నాగేశ్వరరావు, బుర్రి ఈశ్వరయ్య, లింగన్న, అరుణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మాటలతో గారడీ.. కోట్ల పేరిట బురిడీ
కడప అర్బన్: అంతర్జాతీయ స్థాయిలో పరిచయాలు, ఎగుమతులు–దిగుమతుల వ్యాపారంలో తిరుగులేదనే ఆర్భాట ప్రచారంతో కోట్లాది రూపాయల కుచ్చుటోపీ పెట్టిన కేటుగాడు పోలీసులకు చిక్కాడు. మోసానికి పాల్పడిన జేష్టాది సుమన్ దీపక్రాజ్ను వన్టౌన్ పోలీసులు అరెస్ట్ చేయడం కడప నగరంలో తీవ్ర కలకలం రేపుతోంది. అనంతపురం జిల్లా తాడిపత్రికి చెందిన సుమన్ ప్రస్తుతం హైదరాబాద్లో నివాసముంటున్నాడు. అంతర్జాతీయ వ్యాపారాలంటూ నమ్మబలికి.. నిందితుడు జేష్టాది సుమన్ గ్లోబల్ ట్రేడింగ్ ప్రైవేట్ లిమిటెడ్, ఎవర్ఫస్ట్ ఇంపీరియల్ గ్లోబల్ లాజిస్టిక్స్ ప్రైవేట్ లిమిటెడ్ వంటి సంస్థల పేర్లతో నకిలీ హడావుడి చేశాడు. వీటికి అంతర్జాతీయ ట్రేడింగ్ లైసెన్సులు ఉన్నాయని, విదేశాలకు ఆహార ఉత్పత్తులు ఎగుమతి చేస్తున్నామని, జాతీయస్థాయిలో ప్రముఖులతో పరిచయాలు ఉన్నాయని నమ్మించి పలువురి వద్ద లక్షల నుంచి కోట్ల రూపాయిల వరకు పెట్టుబడులు వసూలు చేశాడు. డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్..ఆర్బీఐ నాటకాలు కడప నగరంలోని వైద్యులు, వ్యాపారులను టార్గెట్ చేసి దాదాపు రూ.10 నుండి 15 కోట్ల వరకు వసూలు చేసినట్లు సమాచారం. తొలుత తక్కువ మొత్తంతో నమ్మకం కలిగించి, ఆపై భారీ పెట్టుబడులు పెట్టించేవాడు. బాధితులకు అనుమానం రాకుండా హైదరాబాద్, న్యూఢిల్లీలకు తీసుకెళ్లి.. విదేశాల నుంచి తనకు వచ్చిన డబ్బులు ఆర్బీఐలో ఇరుక్కుపోయాయంటూ నకిలీ బ్యాంక్ స్టేట్మెంట్లను చూపించేవాడు. ఆ డబ్బులు విడుదల కావాలంటే లక్షల్లో పన్నులు చెల్లించాలని నమ్మబలికించి బాధితుల చేతే తన ఖాతాలో సొమ్ము వేయించుకునేవాడు. బాధితుల దురాశే పెట్టుబడిగా.. ‘ఎక్కువ పెట్టుబడి.. ఎక్కువ లాభం’ అనే ఆశను ఆసరాగా చేసుకుని, పెట్టుబడులు పెరిగాక కాలయాపన చేసేవాడు. బాధితులు డబ్బులు అడిగినప్పుడు విదేశీ లావాదేవీల సాకు చూపేవాడు. చివరకు మోసపోయామని గ్రహించిన బాధితులు పోలీసులను ఆశ్రయించారు. అంతర్జాతీయ వ్యాపారాలంటూ ఎవరైనా పెట్టుబడులు కోరితే పూర్తిస్థాయిలో ధ్రువీకరించుకున్నాకే డబ్బులు ఇవ్వాలని పోలీసులు, నిపుణులు సూచిస్తున్నారు. 8 కేసుల్లో నిందితుడు.. కడప జైలుకు తరలింపు ఈ కేటుగాడిపై ఇప్పటికే వివిధ పోలీస్ స్టేషన్లలో 8 కేసులు నమోదయ్యాయి. ఈ ఘరానా మోసం కడపలో తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారం వెనుక మరెవరైనా ఉన్నారా? కోట్ల రూపాయలు ఎక్కడికి వెళ్లాయి? అనే కోణంలో దర్యాప్తు సాగుతోంది. నిందితుడు సుమన్ దీపక్ రాజ్ను కడప ఒన్టౌన్ సీఐ తిమ్మారెడ్డి, ఎస్ఐ అమర్నాథ్రెడ్డిలు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా, ప్రస్తుతం కడప కేంద్ర కారాగారంలో రిమాండ్లో ఉన్నాడు. ఎగుమతులు, దిగుమతుల పేరిట కడప నగరంలో ఘరానా మోసం డాక్టర్లు, వ్యాపారులే టార్గెట్ రూ.10 కోట్ల నుంచి 15 కోట్ల వరకు వసూలు ఆర్బీఐ నకిలీ పత్రాలతో నమ్మించిన కేటుగాడు -
గండి క్షేత్రం.. శ్రావణ శోభితం
చక్రాయపేట : గండి క్షేత్రం శ్రావణ మాస ఉత్సవాల శోభ సంతరించకుంది. వేడుకల్లో భాగంగా నేడు మూడో శనివారోత్సవం జరుగనుంది. ఉదయం 3 గంటలకే సుప్రభాత సేవ, ఉత్సవ మూర్తులకు అభిషేకం(ఏకాంతం), అలంకరణ, ఆరాధన, 5 గంటలకు మహామంగళ హారతి కార్యక్రమాలు నిర్వహించి అనంతరం భక్తులకు దర్శన వసతి కల్పించడం జరుగుతుందని ఆలయ ప్రధాన, ఉప ప్రధాన, ముఖ్య అర్చకులు కేసరి, రాజారమేష్, రాజగోపాలాచార్యులు తెలిపారు. మొదటి రెండు శనివారాల కంటే ఈ వారం భక్తుల సంఖ్య పెరిగే అవకాశం ఉండటంతో.. వారికి సరిపడా లడ్డూ, పులిహోర, ప్రసాదాలను సిద్ధం చేశామని ఆలయ సహాయ కమిషనర్ విశ్వనాథ్, చైర్మన్ వెంకటస్వామి తెలిపారు. రాత్రి బస చేసే భక్తుల కాలక్షేప నిమిత్తం సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసినట్లు వారు చెప్పారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు దాతలచే అన్నదాన కార్యక్రమం నిర్వహించేందుకు తగు చర్యలు చేపట్టినట్లు పేర్కొన్నారు. శుక్రవారం రాత్రికే భక్తులు పెద్ద ఎత్తున గండి చేరుకొని స్వామిని దర్శించుకున్నారు. పెద్ద ఎత్తున బందోబస్తు శ్రావణ మాసం మూడవ శనివారోత్సవం సందర్భంగా పెద్ద ఎత్తున పోలీసు బందోబస్తు ఏర్పాటు చేసినట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్ఐ శ్రీప్రియ తెలిపారు. పులివెందుల సీఐలు, ఎస్సైలు, పోలీసులు, హోం గార్డులు, మహిళా పోలీసులతో సుమారు 300 మందికి పైగా బందోబస్తులో పాల్గొంటారని వారు తెలిపారు. వాహనాలకు నో ఎంట్రీ భక్తుల రద్దీ దృష్టిలో ఉంచుకొని ఆంక్షలు విధించినట్లు ఆర్కే వ్యాలీ సీఐ శంకర్రెడ్డి, ఎస్సై శ్రీప్రియ తెలిపారు. వేంపల్లె వైపు నుంచి వచ్చే వాహనాలు ఇడుపుల పాయ క్రాస్ వద్ద, రాయచోటి, కదిరి వైపు నుంచి వచ్చే వాహనాలు అద్దాలమర్రి చెక్ పోస్టు వద్ద ఆపేస్తామని చెప్పారు. ఎట్టి పరిస్థితిలోనూ వాహనాలను గండిలోకి అనుమతించబోమని వారు తెలిపారు. అత్యవసర ప్రయాణాలు ఉన్న వారు ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకోవాలని చెప్పారు. భక్తుల రద్దీని బట్టి సాయంత్రం ఆంక్షలను సడలించడం జరుగుతుందని వివరించారు. నేడు మూడో శనివారోత్సవం వివిధ ప్రాంతాల నుంచి తరలిరానున్న భక్తులు -
పాత నేరస్తుల కదలికలపై నిఘా
కేవీపల్లె : స్థానిక సంస్థల ఎన్నికలు సమీస్తున్న నేపథ్యంలో పాత నేరస్తుల కలికలపై పోలీస్ శాఖ ప్రత్యేక నిఘా ఉంచుతున్నట్లు జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి అన్నారు. శుక్రవారం కేవీపల్లె పోలీస్స్టేషన్ను ఆయన సందర్శించారు. రికార్డులు పరిశీలించి, పెండింగ్ కేసులపై ఆరా తీశారు. అనంతరం ఎస్పీ మాట్లాడుతూ స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా పోలీస్ సిబ్బంది అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు కృషి చేయాలన్నారు. న్యాయం కోసం పోలీస్ స్టేషన్కు వచ్చే ప్రజల పట్ల మర్యాదపూర్వకంగా నడుచుకుని ఫ్రెండ్లీ పోలీస్ విధానం అమలు చేయాలని ఆదేశించారు. పెండింగ్ కేసులు త్వరితగతిన పరిష్కరించాలన్నారు. మహిళల భద్రతకు ప్రాధాన్యత ఇచ్చి, అందుకు తగిన చర్యలు తీసుకోవాలని సూచించారు. దొంగతనాలు నిర్మూలించడానికి, ప్రజలకు శాంతి భద్రతలు కల్పించడానికి రాత్రి గస్తీ ముమ్మరం చేయాలన్నారు. గ్రామ స్థాయిలో ప్రజలకు పోలీస్ శాఖ అందించే సేవలు వివరించడానికి, అసాంఘిక కార్యకలాపాల నిర్మూలనకు పల్లె నిద్ర కార్యక్రమాలు చేపట్టాలని ఆదేశించారు. ఈ కార్యక్రమంలో కలకడ సీఐ బి.లక్ష్మన్న, ఎస్ఐ వెంకటశివకుమార్, సిబ్బంది పాల్గొన్నారు. -
హిందీ ఉపాధ్యాయిని మాకొద్దు
● విద్యార్థుల ఆందోళన ● ఉపాధ్యాయులను సైతం లోపలికి వెళ్లనివ్వకుండా గేటుకు తాళంరాజంపేట టౌన్ : మేము స్కూల్కు వెళ్లాలంటే హిందీ ఉపాధ్యాయిని ప్రశాంతిని బదిలీ చేయాల్సిందేనని రాజంపేట మండలం గుండ్లూరు జెడ్పీ ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థులు తేల్చిచెప్పారు. హిందీ ఉపాధ్యాయిని ప్రశాంతిని బదిలీ చేయాలన్న డిమాండ్తో గురువారం స్కూల్ విద్యార్థులు వారి తల్లిదండ్రుల సహకారంతో పాఠశాల ప్రధాన గేటుకు తాళం వేసి ఆందోళనకు దిగారు. కాగా డిప్యూటీ ఈఓ నాగయ్య, ఎంఈఓ నారాయణరావు అదే సమయంలో పాఠశాల వద్దకు చేరుకున్నారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు ప్రశాంతిని గుండ్లూరు హైస్కూల్ నుంచి బదిలీ చేసేవరకు తమ పిల్లలను పాఠశాలకు పంపమనిచెప్పి, సమస్యను తెలియచేస్తున్న సమయంలోనే ప్రశాంతి స్కూల్కు రావడంతో ఆమెను విద్యార్థులు, వారి తల్లిదండ్రులు పాఠశాలకు రావద్దంటూ అడ్డుకున్నారు. దీంతో పరిస్థితి చేయి దాటిపోయేలా ఉండటంతో విషయాన్ని డిప్యూటీ ఈఓ ఫోన్ ద్వారా డీఈఓ షంషుద్దీన్ దృష్టికి తీసుకెళ్లారు. ప్రశాంతిని అక్కడి నుంచి వెళ్లిపోయి స్పెషల్ డ్యూటీకి అప్లై చేసుకోమని చెప్పాలని డీఈఓ ఫోన్లోనే డిప్యూటీ డీఈఓకు సూచించారు. దీంతో డిప్యూటీ ఈఓ డీఈఓ చెప్పిన విషయాన్ని ఆమెకు చెప్పడంతో ఆమె అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్లిపోయారు. అనంతరం నాగయ్య విద్యార్థుల తల్లిదండ్రులతో మాట్లాడుతూ సమస్యను డీఈఓ దృష్టికి తీసుకెళ్లానని, రెండు, మూడు రోజుల్లోనే పరిష్కరిస్తానని డీఈఓ చెప్పారన్నారు. అందువల్ల విద్యార్థుల చదువును దృష్టిలో ఉంచుకొని పాఠశాల సజావుగా జరిగేలా సహకరించాలని తల్లిదండ్రులను కోరారు. దీంతో విద్యార్థుల తల్లిదండ్రులు శాంతించి ఇకపై ప్రశాంతి గుండ్లూరు ఉన్నత పాఠశాలకు వస్తే ఒప్పుకోమని, ఎన్నిరోజులైనా పాఠశాల జరగనివ్వకుండా అడ్డుకుంటామని డిప్యూటీ ఈఓకు స్పష్టం చేశారు. అనంతరం తల్లిదండ్రులు పాఠశాల గేటుకు తాళం తీయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయులు తమ తరగతి గదులకు వెళ్లిపోయారు. -
● శ్రీశైలం నీటి తరలింపు ఆపాలి !
కడప సెవెన్రోడ్స్: విద్యుత్ ఉత్పాదన పేరిట శ్రీశైలం నీటిని దిగువకు తరలించడాన్ని వెంటనే ఆపాలని వెనుకబడిన ప్రాంతాల అభివృద్ధి వేదిక రాష్ట్ర అధ్యక్షుడు బి.నారాయణరెడ్డి డిమాండ్ చేశారు. హేతువాద సంఘం జిల్లా కార్యదర్శి సీఆర్వీ ప్రసాద్రావు అధ్యక్షతన గురువారం ప్రెస్క్లబ్లో నిర్వహించిన రౌండ్ టేబుల్ సమావేశంలో ఆయన మాట్లాడారు. కోస్తాలో సాధారణ వర్షపాతం, భూగర్భ జలాలు అధికంగా ఉంటాయని.. అక్కడ 40 శాతం లోటున్నా అది సీమ వార్షిక సగటు కంటే ఎక్కువేనన్నారు. ఎల్నినో వల్ల మున్ముందు వర్షాలు పడవని.. మార్చి, ఏప్రిల్ నాటికి తాగునీటి కష్టాలు తీవ్రమవుతాయని హెచ్చరించారు. పోతిరెడ్డిపాడు ద్వారా పూర్తిస్థాయిలో 44 వేల క్యూసెక్కుల నీరు రావాలంటే శ్రీశైలంలో 875 అడుగుల మట్టం నిర్వహించి, ఆపై వచ్చే నీటినే దిగువకు వదలాలన్నారు. ఎగువన అల్మట్టి, జూరాల వంటివి నిండిన తర్వాతే నీరిస్తుంటే, శ్రీశైలం నిండకముందే కిందికి వదలడం అన్యాయమన్నారు. గోదావరి నుంచి ఈ యేడు 800 టీఎంసీలు సముద్రం పాలయ్యాయని, పోలవరం పూర్తయి ఉంటే ఈ పరిస్థితి ఉండేది కాదన్నారు. అలాగే, బ్రహ్మంసాగర్ నుంచి లిఫ్ట్ ద్వారా కాకుండా గుర్రంగుంపు రిజర్వాయర్ నుంచి గ్రావిటీ ద్వారా కడప నగర దాహార్తిని తీర్చాలన్నారు. ఈ కార్యక్రమంలో ఆప్ జిల్లా అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాసులు, ఓబయ్య, ఆంజనేయులు, దేవర శ్రీకృష్ణ, పెంచలయ్య, ప్రభాకర్రెడ్డి, మధు, కిశోర్, పవన్, రసూల్ తదితరులు పాల్గొన్నారు. -
కండీషన్ తుస్సు..
● ఆర్టీసీ ప్రయాణం.. అడుగడుగునా నరకం ● బస్సు ఎక్కితే ‘సీటు’ లేదు.. రోడ్డెక్కితే ‘గమ్యం’ రాదు ● రవాణా ‘మంత్రి’ జిల్లాలోనే.. సామాన్యుడికి తిప్పలు ● ప్రభుత్వ రవాణా వ్యవస్థపై ప్రజల ఆగ్రహం సాక్షి, అన్నమయ్య: జిల్లాలో ఆర్టీసీ ప్రయాణం సామాన్యుడికి అష్టకష్టాలు తెచ్చిపెడుతోంది. సమాజంలో రోజురోజుకు జనాభా మరియు కుటుంబాల సంఖ్య విపరీతంగా పెరుగుతున్నప్పటికీ, దానికి అనుగుణంగా ప్రజా సౌకర్యాల కల్పనలో ప్రభుత్వం ప్రత్యేక చర్యలు చేపట్టడం లేదు. ప్రతినిత్యం పేద, మధ్యతరగతి ప్రజలు ప్రజా రవాణాగా భావించి వినియోగించే ఆర్టీసీ బస్సుల్లో రద్దీ నిత్యకృత్యంగా మారింది. ఏరోజు చూసినా బస్సులు ప్రయాణికులతో కిక్కిరిసిపోతుండటంతో కనీసం కూర్చోవడానికి సీట్లు దొరకని పరిస్థితి నెలకొంది. జిల్లాకు రావాల్సిన కొత్త బస్సులు రాకపోగా, ఉన్న పాత బస్సుల్లోనే ప్రయాణించే వారి సంఖ్య రెట్టింపు కావడంతో జనం అల్లాడిపోతున్నారు. ముఖ్యంగా ఉదయం, సాయంత్రం వేళల్లో నిత్యం ప్రయాణించే ఉద్యోగులు, విద్యార్థుల పరిస్థితి వర్ణనాతీతంగా మారింది. సీట్లు లేక సతమతం ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కేవలం 510కి పైగా బస్సులు మాత్రమే నడుస్తుండటంతో రద్దీ విపరీతంగా పెరిగిపోయింది. గ్రామీణ మరియు పట్టణ ప్రాంతాల్లోని సామాన్య ప్రజలకు ఎంతగానో ఉపయోగపడే పల్లె వెలుగు, ఎక్స్ప్రెస్, నాన్స్టాప్ బస్సుల సంఖ్యను భారీగా పెంచాల్సి ఉన్నా కూటమి ప్రభుత్వం ఆ దిశగా చర్యలు చేపట్టడం లేదు. సంస్థలో ఉన్న సూపర్ లగ్జరీ, డీలక్స్ బస్సులన్నీ విజయవాడ, హైదరాబాద్, బెంగళూరు, చైన్నె వంటి పెద్ద నగరాల సర్వీసులకే పరిమితం చేశారు. దీనివల్ల జిల్లా లోపల, పొరుగు జిల్లాల సరిహద్దు పట్టణాలకు నడిచే స్థానిక బస్సులన్నీ నిత్యం కిక్కిరిసిపోతున్నాయి. కేవలం మధ్యాహ్న సమయం మినహా, మిగతా వేళల్లో నిలబడి ప్రయాణం చేయడం నిత్యకృత్యంగా మారింది. కండీషన్ లేని పాత బస్సులు.. ఎక్కడపడితే అక్కడ బ్రేక్డౌన్లు ఆర్టీసీ పాత బస్సులు చాలా వరకు ఎక్కడపడితే అక్కడ మొరాయిస్తూ ప్రయాణికులను నడిరోడ్డుపై నిలబెడుతున్నాయి. ప్రధానంగా ప్రమాదకరమైన కడప–రాయచోటి ఘాట్ రోడ్డు మార్గంలోనూ ఇటీవల ఒకటి, రెండు బస్సులు ఆగిపోయాయి. అలాగే తంబళ్లపల్లె నియోజకవర్గ మార్గంలోనూ, పీలేరు నుంచి గ్రామీణ ప్రాంతాలకు వెళ్లే పల్లె వెలుగు బస్సులు ఇటీవల తరచూ సాంకేతిక లోపాలతో మొరాయిస్తుండటంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మధ్యలోనే బస్సు ఆగిపోవడంతో, ప్రయాణికులంతా రోడ్డుపై దిగి.. ఆ తర్వాత వచ్చే ఇతర బస్సుల్లోకి సర్దుబాటు కావలసి వస్తోంది. ఇప్పటికే కిక్కిరిసి వచ్చే బస్సుల్లోకి ఈ అదనపు ప్రయాణికులు కూడా తోడవుతుండటంతో అటు స్థలం లేక, ఇటు సమయం వృథా అయి ప్రయాణికులు నరకం చూస్తున్నారు. సొంత వాహనాల్లోనే దూర ప్రాంతాలకు పయనం బస్సులన్నీ ఎప్పుడు చూసినా రద్దీగా ఉండటం, సమయపాలన లేకపోవడంతో ఉద్యోగులు, ప్రయాణికులు విధిలేని పరిస్థితుల్లో అదనపు ఆర్థిక భారాన్ని మోస్తూ సొంత వాహనాలను సమకూర్చుకుని వెళుతున్నారు. విభిన్న రంగాల్లో పనిచేసే ఉద్యోగులు అటు తిరుపతి నుంచి పీలేరుకు, కొంతమంది మదనపల్లెకు.. మరికొంతమంది కడప నుంచి మదనపల్లె, రాయచోటి ప్రాంతాలకు ప్రతినిత్యం సొంత వాహనాల్లోనే వెళ్లే పరిస్థితి ఏర్పడింది. రాయచోటి నుంచి ఎక్కువ మంది మదనపల్లె వాహనాల్లో వస్తుండగా, పీలేరు నుంచి తిరుపతి, మదనపల్లె నుంచి బెంగళూరుకు సొంత వాహనాలు సమకూర్చుకుని వెళుతున్నారు. సొంత జిల్లా మంత్రి అయినా అందని కొత్త బస్సులు అన్నమయ్య జిల్లా పరిధిలో మదనపల్లె–1, మదనపల్లె–2 డిపోలతోపాటు రాయచోటి, పీలేరు, పుంగనూరు డిపోలు ఉన్నాయి. ఈ ఐదు డిపోల పరిధిలో లక్షలాది రూపాయల ఆదాయం వస్తున్నా అందుకు తగ్గట్టుగా కొత్త బస్సులు రాలేదు. గతంలో ఏదో ఒకటో, అరో వచ్చాయి తప్ప అనుకున్న మేర రాలేదు. జిల్లాకు సంబంధించి మదనపల్లె, రాయచోటికి ఎలక్ట్రిక్ బస్సులు పదుల సంఖ్యలో వస్తాయని ప్రచారం జరుగుతున్నా ఇప్పటికీ అతీగతీ లేదు. రాష్ట్ర రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్రెడ్డి ప్రాతినిద్యం వహించే సొంత జిల్లా నేపధ్యంలో భారీగా బస్సులు వస్తాయని ఆశిస్తున్నా నూతన బస్సుల రాక మాత్రం కనిపించడం లేదు. అధికారులు ఇప్పటికై నా స్పందించి జిల్లాకు తక్షణమే కొత్త బస్సులను కేటాయించాలని ప్రయాణికులు డిమాండ్ చేస్తున్నారు. మదనపల్లె బస్టాండులో బస్సుల కోసం నిరీక్షిస్తున్న ప్రయాణీకులు ప్రస్తుత పరిస్థితుల్లో ప్రయాణికులకు ఎదురుచూపులు తప్పడం లేదు. బస్సుల సమయపాలన సరిగ్గా లేకపోవడంతో పాటు తీవ్రమైన బస్సుల కొరత కారణంగా నిత్యం ప్రయాణికులు ఎదురుచూపులు చూడాల్సి వస్తోంది. ఒక బస్సు పూర్తిగా నిండిపోయి కనీసం నిలబడేందుకు కూడా స్థలం లేకపోవడంతో, ప్రయాణికులు తప్పనిసరి పరిస్థితుల్లో ఆ బస్సును వదిలేసి తదుపరి బస్సు కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. గతంలో ఆర్టీసీ ఆక్యుపెన్సీ రేషియో 66 శాతం ఉండగా, ప్రస్తుతం ప్రయాణికుల రద్దీ విపరీతంగా పెరిగి అది 85 శాతానికి మించి నమోదువుతోంది. ప్రయాణికుల శాతం పెరిగినా బస్సులు మాత్రం పెంచనందున గమ్యస్థానాలకు చేరాలంటే నిరీక్షణ అలవాటుగా మారింది. -
కట్టుబావి చెరువులో మట్టి దోపిడీ
మదనపల్లె టౌన్ : మదనపల్లె మండలం పెంచుపాడు పంచాయతీ పరిధిలోని కట్టుబావి చెరువులో మట్టి అక్రమంగా తవ్వకాలు జరుగుతున్నాయని గ్రామస్తులు ఆరోపించారు. గురువారం చెరువు పరిసరాల్లో జేసీబీ, ట్రాక్టర్లతో మట్టిని తవ్వి తరలిస్తుండడంతో స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. స్థానిక రైతు కే. నాగరాజు ఎలాంటి అనుమతులు లేకుండా చెరువులో నుంచి మట్టిని తవ్వి తరలిస్తున్నారని గ్రామస్తులు ఆరోపించారు. చెరువులో యంత్రాలతో పెద్ద ఎత్తున మట్టి తవ్వకాలు చేపడుతున్నప్పటికీ సంబంధిత అధికారులు పట్టించుకోవడం లేదని చెప్పారు. అనుమతులు లేకుండా మట్టి తరలిస్తుండటంతో చెరువు భద్రతకు, పర్యావరణానికి నష్టం వాటిల్లే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. చెరువుల నుంచి అక్రమంగా మట్టి తవ్వకాలు, తరలింపులకు పాల్పడుతున్న వారిపై అధికారులు తక్షణమే చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరారు. మండల స్థాయి అధికారులు కట్టుబావి చెరువును పరిశీలించి, మట్టి తవ్వకాలకు అనుమతులు ఉన్నాయా లేదా అన్నది నిర్ధారించాలని డిమాండ్ చేశారు. అనుమతులు లేకుండా తవ్వకాలు జరుగుతున్నట్లయితే సంబంధిత వ్యక్తులపై కఠిన చర్యలు తీసుకోవాలని, చెరువుల నుంచి జరుగుతున్న మట్టి దోపిడీకి అడ్డుకట్ట వేయాలని కోరారు. -
వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి
పీలేరు : ఓ ప్రయివేట్ ఆస్పత్రి వైద్యుల నిర్లక్ష్యంతో నిండు ప్రాణం బలి అయిన సంఘటన పీలేరు పట్టణంలో చోటు చేసుకుంది. మృతుని కుటుంబ సభ్యుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. కేవీపల్లె మండలం ఎంవీపల్లె పంచాయతీ జాండ్రపేటకు చెందిన కె.సురేంద్ర (42) కిడ్నీలో రాళ్లు ఉన్నాయని వైదం కోసం బుధవారం పీలేరు పట్టణంలోని ఎస్కేఆర్ హాస్పిటల్లో చేరాడు. గురువారం ఆయనకు ఆపరేషన్ చేయడానికి రూ. 35 వేలు తీసుకుని ఏర్పాట్లు చేశారు. ఆపరేషన్ చేసే ముందు మత్తు మందు ఇచ్చారు. అయితే మత్తుమందు ఇచ్చిన కొద్ది సేపటికే సురేంద్ర అపస్మారక స్థితిలోకి చేరుకున్నాడు. సురేంద్ర పరిస్థితి విషమంగా ఉందని హాస్పిటల్ యాజమాన్యం హుటాహుటిన వారి అంబులెన్స్లోనే తిరుపతి స్విమ్స్కు తరలించారు. అయితే అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. ఈ సందర్భంగా కుటుంబ సభ్యులు మాట్లాడుతూ ఎస్కేఆర్ హాస్పిటల్ వైద్యుల నిర్లక్ష్యంతో పీలేరులో సురేంద్ర మృతి చెందాడని, మృతదేహాన్ని హడావిడిగా తిరుపతికి పంపించారని ఆరోపించారు. ఆస్పత్రి యాజమాన్యంపై చర్యలు తీసుకుని బాధితకులకు న్యాయం చేయాలని సీపీఐ నాయకులు కందారపు మురళి, సుబ్రమణ్యం డిమాండ్ చేశారు. -
కోడి పందెం కేసులో 9 మందికి జైలు శిక్ష
మదనపల్లె టౌన్ : కోడి పందెం కేసులో తొమ్మిది మంది నిందితులకు మదనపల్లె స్పెషల్ జ్యుడీషియల్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ కోర్టు 7 రోజుల సాధారణ జైలు శిక్ష విధించింది. బి కొత్తకోట సీఐ గోపాల్ రెడ్డి తెలిపిన వివరాలు.. బి.కొత్తకోట పోలీస్ స్టేషన్ క్రైం నెం.120/2026, సెక్షన్ 9(2) ఏపీ గేమింగ్ యాక్ట్ కింద ఆగస్టు 11న బయప్పగారిపల్లె గ్రామం.. ఆవుల వంకపల్లె వద్ద పేకాట ఆడుతున్న తొమ్మిది మందిని అరెస్ట్ చేశామన్నారు. వారి నుంచి రూ.21,600 నగదు, 3 కోడి పుంజులు, 6 సెల్ ఫోన్లు, 5 ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకుని, ఏపీ గేమింగ్ యాక్ట్ కింద కేసు నమోదు చేసి అరెస్టు చేసినట్లు చెప్పారు. ఈ కేసులో గురువారం క్రైం నెం.2081/2026 కింద కోర్టులో హాజరుపరచగా, నేరం రుజువు కావడంతో జైలు శిక్ష విధించి మదనపల్లె సబ్ జైలుకు తరలించారు.శిక్ష పడిన వారిలో ఆవుల వంకపల్లికి చెందిన పుటేరి కుల్లాయప్ప, వేపురకోటకు చెందిన గుడ్లపల్లి చిన్నపరెడ్డి, గట్టుకు చెందిన శ్రీలింగం రెడ్డప్ప, శ్యాంసుందర్, రఘు, గంగాధర, శివ, హరినాథ్ రెడ్డి, బి.కొత్తకోటకు చెందిన గడిబండ శంకర్ ఉన్నారు. ఇకపై కోడి పందాలు, జూదం ఆడేవారికి కఠిన శిక్షలు తప్పవని ఇన్స్పెక్టర్ హెచ్చరించారు. -
స్కూటర్ ఢీకొని యువకుడికి..
మదనపల్లె టౌన్ : ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీకొన్న ఘటనలో ఓ యువకుడు తీవ్రంగా గాయపడ్డాడు. ఈ ప్రమాదం బుధవారం రాత్రి మదనపల్లెలో జరిగింది. టూ టౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పోస్టల్ అండ్ టెలికాం కాలనీకి చెందిన రమేష్ కుమారుడు భరత్(21) పని నిమిత్తం ఆర్టీసీ బస్టాండ్కు వెళ్లాడు. అక్కడ పిన్ని ముగించుకుని తిరిగి బైక్ లో ఇంటికి వస్తుండగా, జడ్పీ హైస్కూల్ వద్ద ఎదురుగా వచ్చిన మరో బైక్, భారత్ బైక్ ఎదురెదురు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో భరత్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు గమనించి వెంటనే అతడిని జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం చికిత్స పొందుతున్నాడు. ఘటనపై టూ టౌన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో హెరిటేజ్ ఉద్యోగి మృతి
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లా మదనపల్లె మండలం బసినికొండలోని మొలకలదిన్నె క్రాస్ వద్ద ఉన్న హెరిటేజ్ డెయిరీలో ల్యాబ్ ఇనన్చార్జిగా పనిచేస్తున్న ఓ వ్యక్తి అనుమానాస్పద స్థితిలో మృతిచెందాడు. చిత్తూరు జిల్లా ఐనవీడు గ్రామానికి చెందిన పి.పట్టాభి కుమారుడు పి.సుబ్రహ్మణ్యం(56) కొంతకాలంగా హెరిటేజ్ పాల డెయిరీలో ల్యాబ్ ఇన్చార్జిగా విధులు నిర్వహిస్తున్నారు. బుధవారం రాత్రి నైట్ డ్యూటీకి వచ్చిన ఆయన గురువారం ఉదయం 5.30 గంటల ప్రాంతంలో ల్యాబ్ నుంచి బయటకు వచ్చి డెయిరీ ఆవరణలో తిరుగుతున్నట్లు సీసీ కెమెరాల ఫుటేజీలో నమోదైందని పోలీసులు తెలిపారు. ఆ తర్వాత డెయిరీ ఆవరణలోనే అచేతనంగా పడి ఉండటాన్ని తోటి సిబ్బంది గుర్తించి వెంటనే మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు అప్పటికే సుబ్రహ్మణ్యం మృతి చెందినట్లు నిర్ధారించారు. ఆస్పత్రి ఔట్ పోస్ట్ పోలీసులు మృతదేహాన్ని మార్చురీకి తరలించారు. ఈ ఘటనపై మదనపల్లె తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
నేత్రదాన పక్షోత్సవాలను విజయవంతం చేద్దాం
– డీఎంహెచ్ఓ శ్రీనివాసులు పిలుపు మదనపల్లె టౌన్: నేత్రదాన పక్షోత్సవాలను విజయవంతం చేద్దామని జిల్లా డీఎంహెచ్ఓ డాక్టర్ వై. శ్రీనివాసులు పిలుపునిచ్చారు. ెసెప్టెంబర్ 8 వరకు జరిగే జాతీయ నేత్రదాన పక్షోత్సవాల్లో భాగంగా బుధవారం డీఎంహెచ్ఓ చాంబర్లో బ్యానర్లు, కరపత్రాలు, ప్లెడ్జ్ కార్డులను ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మరణించిన 6 గంటల్లోపు నేత్రాలు సేకరించాలని, ఏ వయసు వారైనా, షుగర్, బీపీ ఉన్నవారు కూడా దానం చేయవచ్చని, ఒకరి దానంతో ఇద్దరికి చూపు వస్తుందని వివరించారు. డీఐఓ డాక్టర్ ఉషశ్రీ, దేవేంద్ర, రఫీ, రహమత్ అలీఖాన్, ఆజాద్, విజయ, శోభ, సుధాకర్ రాజు, ఖలీల్ తదితరులు పాల్గొన్నారు. కౌన్సెలింగ్ ప్రారంభం కడప అర్బన్: కడప ప్రభుత్వ వైద్య కళాశాలలో 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించి ఎంబీబీఎస్ మొదటి సంవత్సరం తరగతుల ప్రవేశ ప్రక్రియ ప్రారంభమైంది. ఆల్ ఇండియా కోటా ద్వారా వచ్చిన 37 సీట్లకు అడ్మిషన్ల ప్రక్రియ మొదలుపెట్టామని కళాశాల ప్రిన్సిపల్ డాక్టర్ టి. జమున తెలిపారు. విద్యార్థుల ధృవపత్రాల పరిశీలన, కౌన్సెలింగ్ చేస్తున్నామని వెల్లడించారు. -
మాతా శిశు మరణాలు అరికట్టాలి
మదనపల్లె టౌన్: జిల్లాలో మాతా శిశు మరణాలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని డీఎంఅండ్హెచ్వో శ్రీనివాసులు ఆదేశించారు. గురువారం కార్యాలయంలో మాతా శిశు మరణాల నియంత్రణ కమిటీ సభ్యులు, డీఐవో డా.ఉషశ్రీతో సమీక్ష నిర్వహించారు. ఇప్పటివరకు నమోదైన మరణాలను క్షేత్రస్థాయిలో విశ్లేషించి నివారణ చర్యలపై ఆరా తీశారు గర్భిణులు, బాలింతలపై నిరంతర పర్యవేక్షణ ఉండాలని సూచించారు. పైలెట్ ప్రాజెక్టుగా టమాటా ప్రాసెసింగ్ యూనిట్ – డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు తంబళ్లపల్లె: తంబళ్లపల్లె నియోజకవర్గ కేంద్రంలో వెలుగు ఎఫ్బీఓ కార్యాలయంలో పైలెట్ ప్రాజెక్టుగా టమటా ప్రాసెసింగ్ యూనిట్ ఏర్పాటుకు చర్యలు చేపడుతున్నట్లు సెర్ఫ్ డీఆర్డీఏ పీడీ నాగేశ్వరరావు తెలిపారు. గురువారం ఎఫ్బీఓ సభ్యులతో నిర్వహించిన వెలుగు సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రాసెసింగ్ యూనిట్కు నిధులు సైతం విడుదలైనట్లు తెలిపారు. ఎఫ్బిఓ గోడౌన్లోనే యంత్రపరికరాలు అమర్చి విద్యుత్, నీటి సౌకర్యం కల్పించి మహిళలకు ఉపాధి కల్పిస్తామని వివరించారు. ప్రయోగాత్మకంగా చేపడుతున్న ఈ ప్రాసెసింగ్ యూనిట్ విజయవంతంగా నడిచేలా ఏ్ఫ్బీఏ సభ్యులు, వెలుగు సంఘాల సభ్యులు కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో ఎఫ్బిఓ అధ్యక్షుడు కృష్ణారెడ్డి, మండల సమాఖ్య అఽధ్యక్షురాలు రామలక్ష్మి, డీపీఎం గంగార్జున, రీసోర్సుపర్సన్ శ్రీనివాసులు, ఏపిఎం గంగాధర్, సీసీలు పాల్గొన్నారు. -
ఆడాలి.. గెలవాలి.. దేశానికి కీర్తి తేవాలి
కురబలకోట : విద్యతో పాటు యువత క్రీడల్లో రాణించాలని క్రీడా మైదానంలో అలవడే క్రమశిక్షణ పట్టుదల, నాయకత్వ లక్షణాలు జీవితంలో విజయానికి బలమైన పునాదిగా నిలుస్తాయని ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ పిలుపునిచ్చారు. అంగళ్లులోని మిట్స్ డీమ్డ్ యూనివర్సిటీలో అన్నమయ్య జిల్లా స్థాయిలో ఖేలో ఇండియా–ఖేల్కి బాత్ విత్ పీఎం మోదీ వర్చువల్ కార్యక్రమాన్ని గురువారం నిర్వహించారు. దేశంలో యువ క్రీడాకారుల్లో దాగి ఉన్న ప్రతిభను గుర్తించి వారికి సరైన శిక్షణ, వేదికలు, అవకాశాలు కల్పించడంలో ఖేలో ఇండియా కీలక పాత్ర పోషిస్తుందన్నారు. ప్రతిభకు పదును పెట్టి జాతీయ అంతర్జాతీయ క్రీడా వేదికలపై భారత కీర్తి పతాకాన్ని ఎగురవేయాలని ఆకాంక్షించారు. వికసిత్ భారత్ –47 లక్ష్య సాధనలో యువతే ప్రధాన చోదక శక్తి అని పీఎం స్పష్టం చేశారు. మై భారత్ వేదిక ద్వారా యువతకు విస్రృత అవకాశాలు కల్పిస్తూ వారిని దేశాభివృద్ధిలో భాగస్వామ్యులను చేయడం లక్ష్యమని వివరించారు. ప్రధాని సందేశం విద్యార్థుల్లో నూతన ఉత్సాహాన్ని నింపింది.మిట్స్లో ఖేలో ఇండియా..ఖేల్ కీ బాత్ -
వేర్వేరు ఘటనల్లో పలువురికి గాయాలు
మదనపల్లె టౌన్ : ఇంటి స్థలం వివాదంతో అన్నదమ్ముల మధ్య ఘర్షణ జరిగి ఇద్దరు గాయపడ్డారు. ఈ ఘటన గురువారం ఉదయం జరిగింది. మదనపల్లె తాలూకా పోలీసులకు అందిన ఫిర్యాదు మేరకు.. మండలంలోని రాయుని చెరువు ఒడ్డిపల్లెకు చెందిన రెడ్డెప్ప, అతని అన్న శంకరయ్యకు ఇంటి స్థలం విషయంలో వివాదం ఉంది. బుధవారం రాత్రి ఇదే విషయంలో మాటా మాటా పెరిగి ఇద్దరు కరల్రతో కొట్టుకున్నారు. గొడవను అడ్డుకున్న కుటుంబీకులు కూడా గాయపడ్డారు. కుటుంబ సభ్యులు గాయపడిన వారిని మదనపల్లె జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్నారు. ఇరువర్గాల ఫిర్యాదులపై స్థానిక తాలూకా పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
బైక్ ఢీకొని యువకుడికి..
మదనపల్లె టౌన్ : బైక్ ఢీకొని యువకుడు తీవ్రంగా గాయపడిన ఘటన గురువారం చౌడేపల్లి మండలంలో చోటుచేసుకుంది. బాధిత కుటుంబీకులు తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని గడ్డంవారిపల్లెకు చెందిన కిరణ్ కుమార్ (25) బైకులో చౌడేపల్లికి వెళ్లి తిరిగి స్వగ్రామానికి వస్తుండగా గడ్డంవారిపల్లె సమీపంలో ఎదురుగా వస్తున్న మరో బైక్ వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో కిరణ్ కుమార్ తీవ్రంగా గాయపడ్డాడు. కుటుంబీకులు అతన్ని చికిత్స నిమిత్తం మదనపల్లె ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు మృతి
రాయచోటి : చిన్నమండెం మండలం, దేవపట్ల క్రాస్ సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదం రెండు కుటుంబాల్లో తీరని విషాదం నింపింది. చిన్నమండెం మండలం బలిజపల్లికి చెందిన శీతక నాగార్జున (35), శీతక కొండారెడ్డి(55)లు బుధవారం బైక్పై వెళ్తుండగా ఎదురుగా వస్తున్న ఆటోను ఢీకొనడంతో ఈ ప్రమాదం జరిగినట్లు చిన్నమండెం పోలీసులు తెలిపారు. ప్రమాద సంఘటనలో అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరు రాయచోటి ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించే సమయంలో మృతి చెందాడు. మృతి చెందిన ఇద్దరికీ భార్య, పిల్లలు ఉన్నారు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు మృత్యువాత పడడంతో బలిజపల్లి గ్రామం ఒక్కసారిగా శోకసంద్రంలో మునిగిపోయింది. ఈ సంఘటనపై కేసు నమోదు చేసి విచారణ చేస్తున్నట్లు చిన్నమండెం పోలీసులు తెలిపారు. -
జిల్లా సీనియర్ పురుషుల ఫుట్బాల్ జట్టు ఎంపిక
మదనపల్లె సిటీ : జిల్లా సీనియర్ పురుషుల పుట్బాల్ జట్టు ఎంపికలు బుధవారం స్థానిక మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరంలో నిర్వహించారు. జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి 40 మందికి పైగా క్రీడాకారులు ఎంపికల్లో పాల్గొన్నారు. క్రీడాకారుల ప్రతిభ, ఆటతీరు, సామర్థ్యాన్ని పరిశీలించి 20 మందిని ఎంపిక చేశారు. ఎంపికై న జట్టు ఈనెల 28 నుంచి 31వతేదీ వరకు మైలవరంలో జరగనున్న అంతర్ జిల్లా ఛాంపియన్షిప్ పోటీల్లో జిల్లా తరపున ప్రాతినిథ్యం వహిస్తారని జిల్లా పుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. కార్యక్రమంలో సీనియర్ క్రీడాకారులు సుధాకర్, అబ్రహం, రతీష్, మోహన్, బాబు తదితరులు పాల్గొన్నారు. రియల్ ఎస్టేట్ వ్యాపారిపై దాడిమదనపల్లె టౌన్ : వ్యాపార లావాదేవీలకు సంబంధించి పాతవివాదాల నేపథ్యంలో రాజేష్ అనే వ్యక్తి తనపై దాడికి పాల్పడి, నగదు, సెల్ఫోన్న్ లాక్కెళ్లినట్లు బాధితుడు మునిరాజశేఖర్ బుధవారం మదనపల్లె టూ టౌన్న్ పోలీసులకు ఫిర్యాదు చేశాడు. మదనపల్లె మండలం, కొండామిరపల్లె పంచాయతీ పరిధిలో నివాసం ఉంటున్న తాను గతంలో తన బంధువు రాజేష్తో కలిసి రియల్ ఎస్టేట్ వ్యాపారం చేశానని.. 2021లో ఇద్దరి మధ్య మనస్పర్థలు రాగా విడిపోయి సొంతంగా వ్యాపారం చేసుకుంటున్నట్లు తెలిపారు. ఈ క్రమంలో సాయంత్రం సీటీఎం రోడ్డులో వెళ్తుండగా రాజేష్ తనను అడ్డగించి దాడి చేశాడని మునిరాజశేఖర్ ఆరోపించాడు. అంతేకాకుండా తన పర్సును చింపి అందులో ఉన్న నగదుతో పాటు సుమారు రూ.60 వేల విలువైన సెల్ఫోన్ను తీసుకెళ్లినట్లు బాధితుడు ఆరోపించాడు. దాడి చేసిన వ్యక్తిపై చట్టపరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని బాధితుడు కోరాడు. ఫిర్యాదుపై పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. ఇల్లు ధ్వంసం: ఇద్దరిపై కేసు మదనపల్లె టౌన్ : అక్రమంగా ఇంటిని ధ్వంసం చేసిన కేసులో పోలీసులు వేగంగా స్పందించారు. ఇంటి కూల్చి వేతకు ఉపయోగించిన జేసీబీ, ట్రాక్టర్ను సీజ్ చేసి ఇద్దరిపై కేసు నమోదు చేసినట్లు మదనపల్లె తాలూకా సీఐ కళా వెంకటరమణ తెలిపారు. మదనపల్లె మండలం సీటీఎం కు చెందిన చాంద్బాషాకు హరిజనవాడ వీధిలో రెండు కుంటల ఇల్లు వంశపారంపర్యంగా సంక్ర మించింది ఉంది. అయితే 2024లో బాధితుడి మేనత్త అమీనాబీ అదే ఆస్తికి నకిలీ పత్రాలు సృష్టించి నిమ్మనపల్లె రోడ్డుకు చెందిన వజీర్బాషా అనే వ్యక్తికి విక్రయించింది. అంతటితో ఆగకుండా జేసీబీ, ట్రాక్టర్లతో వెళ్లి చాంద్ బాషా ఇంటిని నేలమట్టం చేశారు. దీంతో బాధితుడు చాంద్ బాషా న్యాయస్థానాన్ని ఆశ్రయించాడు. కోర్టు జారీ చేసిన ఎండార్స్మెంట్ ఆదేశాల మేరకు మదనపల్లె తాలూకా పోలీసులు అమీనాబీ, నజీర్బాషాలపై చీటింగ్ కేసు నమోదు చేశారు. ఇంటి ధ్వంసానికి ఉపయోగించిన ఇసుకనూతుపల్లి కి చెందిన రెడ్డప్ప జేసీబీ, ట్రాక్టర్ను సీజ్ చేశారు. ఘటనపై పూర్తి విచారణ జరుపుతున్నట్లు సీఐ కళా వెంకటరమణ తెలిపారు. నకిలీ పత్రాల సృష్టిలో ఇంకెవరైనా ఉన్నారా అనే కోణంలో దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
ప్రవక్త మార్గం అనుసరణీయం
● మిలాద్ జులూస్లో మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా ● పాల్గొన్న నగర ప్రముఖులు, జనంకడప సిటీ : మహమ్మద్ ప్రవక్త (సొ.అ.వ) చూపిన మార్గం అనుసరణీయమని మాజీ డిప్యూటీ సీఎం ఎస్బీ అంజద్బాషా తెలిపారు. బుధవారం మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాదున్నబీ సందర్భంగా కడప నగరంలో ఆంధ్రప్రదేశ్ మర్కజి మిలాద్ జులూస్ కమిటీ ఆధ్వర్యంలో జులూస్ (ర్యాలీ) నిర్వహించారు. ఈ ర్యాలీ నగరంలోని అల్మాస్పేటవద్దగల ఇనాత్ ఖాన్ తాలిం నుంచి ప్రారంభమై ఆగాడి, మోచంపేట, మట్టి పెద్దపులి, చెన్నూరు బస్టాండ్, 1వ గాంధీ బొమ్మ సర్కిల్, పొట్టి శ్రీరాములు సర్కి ల్, 7 రోడ్లు మీదుగా ఎన్టీఆర్ కూడలి వరకు కొనసాగింది. ఈ సందర్భంగా ఎస్బీఅంజద్బాషా మాట్లాడుతూ మహమ్మద్ ప్రవక్త బోధనలు ఎప్పటికీ నిజాయితీగా ఉండాలని సూచిస్తాయన్నారు. సత్యం మనిషిని మంచి మార్గంలో నడిపిస్తుందని వివరించారు. ఈ ర్యాలీలో మత గురువు హజరత్ వలీవుల్లా సాహెబ్, హజరత్ మహమ్మద్ అలీ బాగ్దాదీ, నగర ముస్లిం ప్రముఖులు అమీర్బాబు, సలావుద్దీన్, మగ్బూల్బాషతోపాటు పెద్ద ఎత్తున ముస్లింలు పాల్గొన్నారు. రక్తదాన శిబిరానికి విశేష స్పందన మిలాదున్నబీ సందర్భంగా జూలూస్ అనంతరం గుంత బజార్ మసీదులో నిర్వహించిన రక్తదాన శిబిరానికి విశేష స్పందన లభించింది. ఈ శిబిరంలో దాదాపుగా వందమంది రక్తదానం చేసినట్లు కమిటీ సభ్యులు తెలిపారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మహమ్మద్ అలీ బాగ్దాది, ఖూన్కా రిష్టా చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షుడు తారీఖ్, అల్లా బకాష్, సలావుద్దీన్, అలీ షేర్ రాయల్ కరిముల్లా, జేకే యూత్ ఖాదర్బాషా తదితరులు పాల్గొన్నారు. -
బడి లెక్క తప్పింది
● ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాల్లో విద్యార్థుల తగ్గుదల ● ప్రైవేట్లోనూ ఇదే పరిస్థితి ● అంతుచిక్కని కారణాలుసాక్షి, మదనపల్లె : సాధారణంగా పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఏటా పెరుగుతూ ఉంటుంది. మొదటి తరగతి విద్యార్థులు వారు చదివే పాఠశాలలో అక్కడ ఉన్న తరగతి వరకు కొనసాగించడం జరుగుతుంది. లేదంటే మధ్యలో పాఠశాలలు మారడం లేదా ఇతరా ప్రాంతాలకు వెళ్లడం సాధారణం. అయితే దీనికి భిన్నంగా గత విద్యా సంవత్సరం విద్యార్థులు, ప్రస్తుత విద్యా సంవత్సరంలో ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య చూస్తే భారీగా తగ్గుదల కనిపిస్తోంది. దీనికి కారణాలేమిటో అంతుచిక్కడం లేదు. జిల్లాలో ఈ విద్యాసంవత్సరంలో 5,577 మంది విద్యార్థులు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లో తగ్గారు. ప్రభుత్వ బడుల్లో 4,097 మంది తగ్గారు జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో 2025 –26 ఏడాదికంటే 2026–27 ఏడాదిలో 4,097 మంది విద్యార్థులు తగ్గిపోయారు. జిల్లాలో ఎయిడెడ్ విభాగంలో రెండు హైస్కూళ్లు, రెండు ప్రాథమిక, మూడు ప్రాథమికోన్నత పాఠశాలలు ఉన్నాయి. ప్రభుత్వ పరిధిలో 279 హైస్కూళ్లు, 147 ప్రాథమిక పాఠశాలలు, 29 ప్రాథమికోన్నత పాఠశాలలో కలుపుకొని మొత్తం 1,785 స్కూళ్లు ఉన్నాయి. వీటి పరిధిలో గత విద్యా సంవత్సరంలో 1,07730 మంది విద్యార్థులు ఉన్నారు. ప్రస్తుత ఏడాదికి పరిశీలిస్తే 1,06,653 మంది విద్యార్థులు ఉన్నారు. ఈ అంకెలు పరిశీలిస్తే ప్రస్తుత విద్యా సంవత్సరంలో 4,097 మంది విద్యార్థులు తగ్గిపోయారు. ప్రైవేట్పై మోజు తగ్గిందా.. సాధారణంగా విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేటు పాఠశాలల్లో తమ పిల్లలను చేర్పించేందుకు ఆసక్తి చూపుతారు. దీంతో ప్రైవేట్ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగాలి. అయితే ఇక్కడ కూడా విద్యార్థుల సంఖ్య తగ్గిపోతోంది. జిల్లాలో 196 హైస్కూళ్లు, 121 ప్రాథమిక పాఠశాలలు, 115 ప్రాథమికోన్నత పాఠశాలలు ప్రైవేటు యాజమాన్యాల కింద నడుస్తున్నాయి. వీటిలో గత ఏడాది 89,582 మంది విద్యార్థులు ఉండగా, ప్రస్తుతం ఏడాదిలో 88,102 మంది విద్యార్థులు చదువుతున్నారు. అంటే ఈ ఏడాది 1,480 విద్యార్థుల సంఖ్య తగ్గింది. తగ్గడానికి కారణాలు ఏమిటి? ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య ఎందుకు తగ్గిపోయిందో కారణాలు తెలియడం లేదు. విద్యాశాఖ అధికారులు కూడా దీనిపై స్పష్టత ఇవ్వలేకపోతున్నారు. మీరంతా కుటుంబంతో కలిసి వలసలు వెళ్లారా లేక మధ్యలోనే చదువు ఆపేసి పనులకు వెళ్తున్నారా అన్న లెక్కలు లేవు. డ్రాపౌట్స్ అయితే వారిని గుర్తించి తిరిగి పాఠశాలల్లో చేర్పించాల్సి ఉంటుంది. అయితే ఒక తరగతి నుంచి మరో తరగతికి వెళ్లాల్సిన విద్యార్థులు.. కొన్ని తరగతుల్లో ఉన్న సంఖ్య కంటే పెరుగుదల కనిపిస్తుంది. ప్రధానంగా 5, 6, 7 తరగతుల్లోనే విద్యార్థుల సంఖ్య గణనీయంగా తగ్గడం విద్యాశాఖ గణాంకాలే స్పష్టంగా చెబుతున్నాయి. బి.కొత్తకోట, ములకలచెరువు, తంబళ్లపల్లె, మదనపల్లె, రామసముద్రం, కురబలకోట మండలాలు కర్ణాటక సరిహద్దులో ఉన్నాయి. ఇక్కడి కుటుంబాలకు కర్ణాటకకు వలసలు వెళ్లాయని అనుకున్నా వేలసంఖ్య వెళ్లిన దాఖలాలు లేవు. పదులసంఖ్యలో వెళ్లే పరిస్థితులు మాత్రమే ఉన్నాయి. 5,577 మంది విద్యార్థులు తగ్గేస్థాయిలో ఈ పరిస్థితి లేదు. అధ్యయనం అవసరం జిల్లాలో పాఠశాలల్లో ఉండాల్సిన విద్యార్థుల సంఖ్య తగ్గిపోవడంపై తక్షణమే అధ్యయనం చేయాల్సిన అవసరం కనిపిస్తోంది. వచ్చే ఏడాది ఈ సంఖ్య మరింత తగ్గే ప్రమాదం లేకపోలేదన్నది అన్నది అర్థమవుతోంది. పాఠశాల వారీగా తగ్గిన విద్యార్థుల సంఖ్యను గుర్తించి, ఆ విద్యార్థుల స్థితిగతులను తెలుసుకొని కారణాలను అన్వేషించాల్సిన అవసరం ఉంది. లేని పక్షంలో వేల సంఖ్యల విద్యార్థులు విద్యకు దూరం అయ్యే ప్రమాదం ఉంది. -
మానవ మహోపకారి హజరత్ మహమ్మద్
మదనపల్లె సిటీ : మానవ మహోపకారి ప్రవక్త హజరత్ మహమ్మద్ అని పలువురు ముస్లిం ఉలేమాలు పేర్కొన్నారు. ఇస్లాం చివరి ప్రవక్త హజరత్ మహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం జన్మదినాన్ని పురస్కరించుకుని మదనపల్లెలో బుధవారం ముస్లిం సోదరులు మీలాద్–ఉన్–నబీని భక్తిశ్రద్ధలతో జరుపుకున్నారు. పట్టణ పురవీధుల్లో సామూహిక ర్యాలీ నిర్వహించారు. మహాప్రవక్త హజరత్ మహ్మద్ మానవ మహోపకారి అని, ఆయన సూచించిన మార్గంలో నడిచి ఆదర్శవంత సమాజ నిర్మాణం నిర్మించాలని పిలుపునిచ్చారు. మీలాద్–ఉన్–నబీ సందర్భంగా మసీదులు, దర్గాలలో ప్రత్యేక ప్రార్థనలు జరిపారు. స్థానిక బడేమకాన్లో దర్గా ముతవల్లి మకాన్దార్ సయ్యద్ హాషిం ఆధ్వర్యంలో గత 12 రోజులుగా పుస్తకపఠనం చేపట్టి బుధవారం సాయంత్రం ముగింపు కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫాతెహా కార్యక్రమం నిర్వహించి పేదలకు అన్నదానం చేశారు. మీలాద్–ఉన్–నబీ వేడుకలలో భాగంగా మసీదులు, దర్గాల వద్ద ఆధ్యాత్మిక వాతావరణం నెలకొంది. పెద్దమండ్యం మండలంలో.. పెద్దమండ్యం : మండలంలోని ఎన్వోపల్లె పంచాయతీ కలిచెర్ల పాతూరులో మిలాద్ –ఉన్– నబి వేడుకలు బుధవారం జరిగాయి. ఈ సందర్బంగా పాతూరు కూడలి వద్ద జెండాను ఆవిష్కరించి, ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. జెండాను ఆవిష్కరించి గంధం, ఫాతేహా జరిపి ప్రసాదాలను పంచి పెట్టారు. పెద్దమండ్యం పాతూరు జెండామాను వద్ద, విద్యానగర్ కాలనీ, పాపేపల్లె, తురకపల్లె గ్రామాల్లో మిలాద్ –ఉన్– నబి వేడుకలు జరిగాయి. ఈ సందర్బంగా మైనార్టి సంఘం నాయకులు పెద్దమండ్యంలో అన్నదానం చేశారు. పెద్దతిప్పసముద్రం మండలంలో.. పెద్దతిప్పసముద్రం : మండలంలోని ముస్లిం సోదరులు బుధవారం మిలాద్–ఉన్ నబిని భక్తి శ్రద్ధలతో జరుపుకున్నారు. ఉదయం నుంచి ఉపవాస దీక్ష చేపట్టిన అనంతరం మసీదులకు వెళ్లి ప్రార్థనలు నిర్వహించారు. ప్రేమాభిమానాల వనంలో వికసించినదే ఇస్లాం అని వక్తలు పేర్కొన్నారు. మహమ్మద్ ప్రవక్త జీవిత చరిత్రను భక్తిగా పఠించి వాటి ఉపదేశాలను వివరించారు. -
వాహనం ఢీకొని చిన్నారి మృతి
సంబేపల్లె : మండల పరిధిలోని చిత్తూరు–కర్నూలు జాతీయరహదారిపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదదంలో నాగం దేవర్షణీ (8) అనే చిన్నారి మృతి చెందింది. పోలీసులు,స్థానికుల వివరాలమేరకు దేవపట్లకు చెందిన నాగం ఈశ్వరరెడ్డి, రమాదేవి దంపతులు ఫాస్ట్పుడ్ సెంటర్ పెట్టుకొని జీవనం సాగిస్తుండేవారు. ఈ క్రమంలోనే దంపతులు ఓ వివాహానికి వెళ్లి వచ్చారు. ఇంటి తాళాలు చిల్లర దుకాణంలో ఉన్నాయని కూతురు దేవర్షిణీకి చెప్పడంతో ఆ చిన్నారి అక్కడి వెళ్లి తాళాలు తీసుకొని వస్తుండగా రాయచోటి వైపు నుంచి గొర్రెల లోడుతో వస్తున్న వాహనం ఢీకొంది. దీంతో దేవర్షణి అక్కడికక్కడే మృతి చెందింది. కళ్ల ముందే కన్న కూతురు చనిపోతుంటే ఆ దంపతులు కన్నీరుమున్నీరుగా విలిపించారు. సంఘటనా స్థలానికి ఎస్ఐ రవికుమార్ చేరుకుని పరిశీలించారు. మృతురాలి తల్లి దండ్రుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. -
మా పాలన.. మేం కట్టం చలానా!
● కడపలో టీడీపీ నేతల అధికార దర్పం ● కార్పొరేషన్కు ఆదాయం గుండు సున్నాసాక్షి టాస్క్ఫోర్స్ : కడప శాసన సభ్యురాలు ఆర్. మాధవిరెడ్డి జన్మదినం సందర్భంగా కడప నగరపాలక సంస్థ పరిధిలో ఎక్కడ చూసినా శుభాకాంక్షలు తెలుపుతూ ఫ్లెక్సీలు, బ్యానర్లు వెలిశాయి. అయితే ఆమె అధికార పార్టీ ఎమ్మెల్యే కావడంతో ఏ ఒక్కరూ కార్పొరేషన్కు ఒక్క రూపాయి చెల్లించకుండా, అను మతి తీసుకోకుండా ఆ ఫ్లెక్సీలను ఊరంతా ఏర్పాటు చేశారు. నిబంధనలు పాటించి నగరపాలక సంస్థ అనుమతి పొంది, చలానాలను చెల్లించి ఉంటే కార్పొరేషన్కు ఆదాయం సమకూరేది.. కానీ అందరూ అధికార దర్పంతో ఎక్కడ పడితే అక్కడ ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారే తప్ప నగరపాలక సంస్థకు చిల్లిగవ్వ కూడా చెల్లించలేదు. ఇతర పార్టీల వారు ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తే ఆగమేఘాలపై అక్కడ వాలి పోయి వాటిని తొలగించే టౌన్ప్లానింగ్ అధికారు లు, సిబ్బంది.. ఈ ఫ్లెక్సీలపై ఉదాసీనంగా వ్యవహరించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి. టీడీపీ నేతలకు కార్పొరేషన్లోని ఇద్దరు ఉన్నతాధికారుల అండ పుష్కలంగా ఉండటం వల్లే ఇలా అనుమతి లేకుండా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారని విమర్శలు వినిపిస్తున్నాయి. రూల్స్.. గీల్స్ జాన్తానై సాధారణంగా ఎవరైనా నగరంలో ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే కార్పొరేషన్కు ఒక అర్జీ పెట్టుకోవాలి. ఏ సైజు ఫ్లెక్సీలు ఏ ప్రాంతంలో ఏర్పాటు చేస్తున్నారో అందులో తెలపాలి. అక్కడ రోడ్డుకు అడ్డంగా ఉన్నా, వాహనదారులకు ఇబ్బంది కలుగుతుందని భావించినా అధికా రులు అనుమతి ఇవ్వరు.. అలా ఏం లేకుంటే అనుమతి ఇస్తూ.. ఎంత చలానా అవుతుందో చెప్పి చెల్లించమంటారు. అలా చెల్లించిన తర్వాతే ఫ్లెక్సీలు ఏర్పాటు చేసుకోవాలి. ఆ చలానాకు సంబంధించిన రశీదును ఫ్లెక్సీపై ముద్రించాలి. కానీ అధికార పార్టీ నేతలు ఈ నిబంధనలేవీ పాటించడం లేదు. వారు ఎక్కడ ఏర్పాటు చేయాలనుకుంటే అక్కడ ఇష్టారీతిన ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారు. చాలా చోట్ల ఇవి రోడ్లకు అడ్డంగా ఉన్నాయి. చలానా చెల్లించిన ‘ఒకే ఒక్కడు’: ఆగష్టు 27న ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డి జన్మదినం కూడా ఉంది. ఈ సందర్భంగా వైఎస్సార్సీపీ నాయకులు ఫ్లెక్సీలు ఏర్పాటు చేయాలంటే నిబంధనల పేరు చెప్పి అనుమతి ఇవ్వకపోవడం వల్ల వారంతా సేవా కార్యక్రమాలు చేయాలని నిర్ణయించుకున్నారు. కాగా వైఎస్సార్సీపీ యువజన నాయకుడు రహీమ్ మాత్రమే ఐదు చోట్ల ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేందుకు చలానా చెల్లించి అనుమతి తీసుకున్నారు. -
స్పెషల్ టెట్ను నిరసిస్తూ బైక్ ర్యాలీ
మదనపల్లె సిటీ : ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు ప్రయోజనం లేని స్పెషల్ టెట్ విధానాన్ని నిరసిస్తూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో మదనపల్లెలో బుధవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శి ఎస్.జాబీర్ మాట్లాడుతూ ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు రాయితీలు లేని అర్హత మార్కులతో, ఆన్లైన్ విధానంతో పరీక్షలు నిర్వహించడానికి ప్రభుత్వం విడుదల చేసిన స్పెషల్ టెట్ వల్ల ప్రయోజనం లేదని ఆరోపించారు. ఇన్ సర్వీసు ఉపాధ్యాయులకు 40 శాతం అర్హత మార్కులతో,ఆఫ్లైన్ విధానంలో పరీక్షలు నిర్వహించాలన్నారు. ఉపాధ్యాయ సంఘాలు చేసిన విజ్ఞప్తిని ప్రభుత్వం ఏ మాత్రం పరిగణలోకి తీసుకోకుండా పాత విధానాన్నే కొనసాగిస్తూ స్పెషల్ టెట్ పేరుతో నోటిఫికేషన్ జారీ చేయడం సహేతుకమైన చర్య కాదన్నారు. ప్రభుత్వం స్పందించకపోతే సెప్టెంబర్ 3వతేదీన ఛలో విజయవాడ కార్యక్రమాన్ని నిర్వహించి ప్రభుత్వ వైఖరిని ఎండగడతామని తెలిపారు. యుటిఎఫ్ జిల్లా అధ్యక్షులు బి.చంద్రశేఖర్, ప్రధాన కార్యదర్శి కె.హేమలత, నాయకులు రవిప్రకాష్, విజయకుమార్, పురం రమణ, సహదేవయ్య, శ్రీనివాసులు, సుదాకర్ తదితరులు పాల్గొన్నారు. -
సార్.. పరీక్షలు రాయాలి బస్సు ఎక్కించుకోండి!
● ఆర్టీసీ సిబ్బందిని వేడుకొన్నా కనికరించని వైనం ● విద్యార్థులను దించేసి వెళ్లిపోయిన సిబ్బందిగుర్రంకొండ : సార్ ఉదయం 8 గంటలకు కళాశాలలో పరీక్షలు రాయాలి బస్సు ఎక్కించుకోండి ప్లీజ్ అని వేడుకొన్నా కనికరించకుండా.. విద్యార్థులను కిందకు దించేసి ఆర్టీసీ సిబ్బంది వెళ్లిపోయిన ఘటన మండల కేంద్రమైన గుర్రంకొండలో జరిగింది. బస్సంతా విద్యార్థులే ఎక్కారని, అందరికీ పాస్లు ఉన్నాయని, కావున మరో బస్సు ఎక్కాలని సిబ్బంది తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. మంగళవారం ఉదయం ఏడు గంటలకు గుర్రంకొండ నుంచి అంగళ్లు, మదనపల్లె పట్టణాల్లోని కళాశాలలకు వెళ్లడానికి విద్యార్థులు పెద్ద సంఖ్యలో స్థానిక బస్టాండుకు చేరుకొన్నారు. విద్యార్థులకు ఈ రోజు ఉదయం 8 గంటలకు కళాశాలలో పరీక్షలు ఉన్నాయి. అప్పుడే కడప డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు మదనపల్లె వెళ్లడానికి గానూ గుర్రంకొండ బస్టాండుకు చేరుకొంది. విద్యార్థులంతా హడావిడిగా బస్సు ఎక్కారు. అయితే కొద్ది దూరం వెళ్లిన తరువాత విద్యార్థులందర్ని బస్సు దిగి వెళ్లిపోవాల్సిందిగా ఆర్టీసీ సిబ్బంది కోరారు. మాకు పరీక్షలు ఉన్నాయి సార్ ప్లీజ్ 8 గంటలకు వెళ్లకపోతే పరిక్షలు రాయలేము అని వేడుకొన్నా ఆర్టీసీ సిబ్బంది కనికరించలేదు. అదంతా మాకు సంబంధం లేదు మీరంతా బస్సు దిగి వెళ్లిపోండి అంటూ దారి మధ్యలో విద్యార్థులను బస్సులోంచి దించేసి వెళ్లిపోయారు. దీంతో విద్యార్థులు ఆవేదన చెందుతూ మళ్లీ బస్టాండుకు చేరుకొన్నారు. అయితే మళ్లీ ఇంకో బస్సు వచ్చి వారు కళాశాలలకు వెళ్లే లోపే పరీక్షల సమయం మించిపోయింది. దీంతో విద్యార్థులు ఆర్టీసీ సిబ్బంది వ్యవహరించిన తీరుపై ఆవేదన చెందారు. జరిగిన సంఘటనపై విద్యార్థులు తమ తల్లిదండ్రులకు ఫోన్ల ద్వారా సమాచారం అందించారు. విద్యార్థుల తల్లిదండ్రులు బస్టాండుకు చేరుకొని జరిగిన సంఘటనపై కడప ఆర్టీసీ డిపో మేనేజర్కు ఫిర్యాదు చేశారు. ఈవిషయమై కడప ఆర్టీసీ డిపో మేనేజర్ నిరంజన్ను వివరణ కోరగా ఈ రోజు ఉదయం విద్యార్థుల పట్ల జరిగిన సంఘటన వాస్తవమన్నారు. ఇప్పటికే పలువురు విద్యార్థుల తల్లిదండ్రులు ఈవిషయమై తమకు ఫిర్యాదు చేశారన్నారు. విద్యార్థులను ఇబ్బంది పెట్టిన ఆర్టీసీ సిబ్బందిపై చర్యలు తీసుకొంటామన్నారు. -
కాంట్రాక్ట్ ఉద్యోగులను రెగ్యులర్ చేయాలి
పుంగనూరు : స్థానిక ఏరియా ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ఉద్యోగులుగా పని చేస్తున్న సిబ్బందిని తక్షణమే రెగ్యులర్ చేయాలని ఉద్యోగులు నల్లబ్యాడ్జీలతో నిరసన తెలిపారు. మంగళవారం ఆసుపత్రి ఎదుట నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రభుత్వ శాఖలలో ఏళ్లతరబడి తక్కువ వేతనంతో ఉద్యోగ భద్రత లేకుండా విధులు నిర్వహిస్తున్న కాంట్రాక్ట్ ఉద్యోగులందరినీ రెగ్యులర్ చేసి, సమాన పనికి సమాన వేతనం చట్టాన్ని అమలు చేయాలని డిమాండ్ చేశారు. ఈ విషయమై తక్షణమే స్పందించాలని, లేకపోతే ఆందోళనలు ఉధృతం చేస్తామని తెలిపారు. ఈ మేరకు మెడికల్ ఆఫీసర్ మధుసూదనాచారికి వినతిపత్రం అందజేశారు. అధికారుల తీరుపై డీఎస్వో ఆగ్రహంపెద్దతిప్పసముద్రం : మండల కేంద్రంలో వంట గ్యాస్ కోసం ప్రజలు నిత్యం రోడ్డెక్కి నిరసనలు, ధర్నాలు చేపడుతున్నా.. స్థానికంగా ఉండే రెవెన్యూ, సివిల్ సప్లయ్ అధికారులు ఎందుకు పట్టించుకోవడం లేదని జిల్లా సివిల్ సప్లయ్ (డీఎస్వో) అధికారిణి రెడ్డి చంద్రిక ఆగ్రహం వ్యక్తం చేశారు. జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు డీఎస్వో మంగళవారం సీఎస్డీటీ సుబ్బయ్యతో కలసి స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ కార్యాలయంలోని రికార్డులను తనిఖీ చేశారు. ఎక్కడా లేని విధంగా ఇక్కడే ఎందుకు గ్యాస్ కొరత ఏర్పడిందని సిబ్బందిని ప్రశ్నించారు. అనంతరం ఇక్కడ నెలకొన్న గ్యాస్ ఇబ్బందులపై ఆమె సేల్స్ అధికారి (ఎస్వో)ను ఫోన్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. తరువాత వినియోగదారుల నుంచి ఫిర్యాదులు స్వీకరించి గ్యాస్ గోడౌన్ను తనిఖీ చేసారు. అదే విధంగా నాలుగు నెలల క్రితం గ్యాస్ గోడౌన్ను విజిలెన్స్ అధికారులు చేపట్టిన ఆకస్మిక తనిఖీలో ఏం జరిగింది, తనిఖీ అధికారులు రూ.లక్షల్లో ఎందుకు జరిమానా విధించారు. నెలలో ఎన్ని సిలిండర్లు గోడౌన్కు వస్తున్నాయి, ఏజెన్సీ నిర్వాహకులు ఏం సమాధానం చెబుతున్నారు తదితర వివరాలను ఆమె అడిగి తెలుసుకున్నారు. ఏది ఏమైనా ఇకపై గ్యాస్ పంపిణీ సక్రమంగా జరిగేలా చొరవ చూపుతామని డీఎస్వో తెలిపారు. రోడ్డు ప్రమాదంలో డ్రైవర్కు గాయాలుమదనపల్లె టౌన్ : ఎదురుగా వస్తున్న వాహనానికి సైడ్ ఇవ్వబోయి బైకు అదుపుతప్పి పడి ఓ డ్రైవర్ కాళ్లు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. మంగళవారం పిటిఎం మండలంలో జరిగిన ఘటనపై బాధితుడి కుటుంబీకులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెద్దతిప్పసముద్రం మండలం కాట్నగళ్లుకు చెందిన టెంపో డ్రైవర్ విజయ్కృష్ణ(30) సొంత పనిమీద బైక్ లో పీటీఎంకు వెళ్ళాడు. పని ముగించుకుని తిరిగి ఇంటికి వస్తుండగా, మార్గమధ్యంలోని కాట్నగళ్లు వద్ద ఎదురుగా వస్తున్న వాహనాన్ని తప్పించే క్రమంలో అదుపు తప్పి పడి కాలు విరిగి తీవ్రంగా గాయపడ్డాడు. 108 సిబ్బంది సమాచారం అందుకుని వెంటనే బాధితున్ని మదనపల్లె జిల్లా ఆస్పత్రికి తరలించారు. అస్పత్రి అత్యవసర విభాగం వైద్యులు చికిత్స అందించి అక్కడి నుంచి తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. -
మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో హైడ్రామా
మదనపల్లె టౌన్ : అన్నమయ్య జిల్లాలోనే అత్యధిక ఆదాయం వచ్చే మదనపల్లి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై కడప ఏసీబీ అధికారులు రెండు రోజుల పాటు సోదాలు జరిపి చివరకు ‘కొండను తవ్వి ఎలుకను పట్టిన’ చందంగా ముగించారు. అవినీతి జరుగుతోందన్న ఫిర్యాదుతో సోమవారం సాయంత్రం ఏసీబీ డీఎస్పీ సీతారామరావు బృందం రహస్యంగా కార్యాలయానికి చేరుకుంది. లోపల ఉన్న సిబ్బంది, డాక్యుమెంట్ రైటర్లు, రిజిస్ట్రేషన్కు వచ్చిన ప్రజలను బయటకు వెళ్లనీయకుండా తలుపులు మూసి క్షుణ్ణంగా తనిఖీలు చేశారు. రికార్డులు, రిజిస్ట్రేషన్ పత్రాలు, బీరువాలు పరిశీలించి రాత్రి రూ.1.25 లక్షలు స్వాధీనం చేసుకున్నారు. మంగళవారం ఉదయం మళ్లీ తనిఖీలు కొనసాగించారు. చివరకు మధ్యాహ్నం విలేకరుల సమావేశంలో డీఎస్పీ వెల్లడించిన వివరాల ప్రకారం రూ.1.25 లక్షల్లో రూ.45 వేలు ప్రభుత్వ సొమ్ము కాగా, మిగిలిన రూ.82 వేలు మాత్రమే లెక్కలో లేని నగదుగా తేలిందన్నారు. లక్షల్లో దొరుకుతుందని భావించిన వారికి ఇది నిరాశ కలిగించింది. జిల్లా కేంద్రం కావడంతో మదనపల్లిలో రోజూ వందల సంఖ్యలో రిజిస్ట్రేషన్లు జరుగుతాయి, ప్రభుత్వానికి లక్షల్లో ఆదాయం వస్తుంది. ఇక్కడ పట్టుబడిన మొత్తం చాలా స్వల్పమని, ఇది ఉన్నతాధికారుల మర్యాదల కోసం ఉంచే డబ్బే అయి ఉండొచ్చని స్థానికులు అంటున్నారు. సబ్ రిజిస్ట్రార్ పేరు చెప్పి కొంత మంది ప్రైవేట్ డాక్యుమెంట్ రైటర్లే ఎక్కువ ఫీజు వసూలు చేస్తున్నారని, వారి వల్లే ఈ ఫిర్యాదు వెళ్లి ఉండొచ్చని ప్రచారం జరుగుతోంది. రిజిస్ట్రేషన్లు ఆగి పోవడంతో క్రయవిక్రయదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. రెండు రోజులు రిజిస్ట్రేషన్లు నిలిచిపోవడంతో సహనం కోల్పోయిన ప్రజలు ఏసీబీ అధికారులతో గొడవకు దిగారు. దీంతో పరిస్థితి చేయిదాటుతుందని గ్రహించిన ఏసీబీ అధికారులు సోదాలు ముగిశాయని, మధ్యాహ్నం హడావిడిగా ప్రెస్ మీట్ పెట్టి ఖాళీ చేతులతో వచ్చిన దారి పట్టుకుని వెళ్లిపోయారు. ఇప్పుడు ఏసీబీ అధికారులు ఉన్నతాధికారులకు ఇవ్వనున్న నివేదికపై సర్వత్రా ఉత్కంఠ నెలకొంది.ఏసీబీకి దొరికింది రూ.82 వేలే -
●పట్టుదలతో సాధించిన మిథున్ రెడ్డి
● మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయ భవన నిర్మాణాలకు కేంద్రం సిద్ధం ● డీపీఆర్, సర్వే, మట్టి పరీక్షలకు రూ.20 లక్షల మంజూరు ● భూమి మార్పు విషయంలో బాబు సర్కారు నిర్లక్ష్యం సాక్షి, మదనపల్లె: సీఎం చంద్రబాబునాయుడు ప్రజలకు మంచి చేయరు.. ఇతరులు చేస్తున్నా చూసి సహించలేరు.. ఆది నుంచి బాబు వైఖరి ఇదే. తాజాగా కేంద్రీయ విద్యాలయ నిర్మాణంలోనూ ఇది రుజువైంది. ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి కేంద్రంతో మాట్లాడి మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయాన్ని మంజూరు చేయించారు. అంతే.. చంద్రబాబు దీన్ని జీర్ణించుకోలేకపోయారు. మొన్నటివరకు కేంద్రీయ విద్యాలయ తరగతులను ప్రారంభించేందుకు మోకాలొడ్డిన చంద్రబాబు సర్కార్.. తాజాగా విద్యా సంస్థ భవన నిర్మాణాలకు కేటాయించిన భూమి విషయంలోనూ మీనమేషాలు లెక్కిస్తోంది. ఫలితంగా పక్కా భవనాల నిర్మాణానికి అడ్డంకిగా మారింది. కేటాయింపుతో సరి కేంద్రీయ విద్యాలయానికి పక్కా భవనాల మంజూరు కోసం మదనపల్లె రూరల్ మండలం వలసపల్లి గ్రామంలో జవహర్ నవోదయ విద్యాలయానికి సమీపంలో 6.09 ఎకరాల భూమిని కేటాయించారు. సర్వే నంబర్ 713/3 లో 0.40 ఎకరాలు, 713/4లో 2.42 ఎకరాలు, 496/2లో 3.02 ఎకరాలు, 496/3లో 0.25 ఎకరాలను కేటాయించారు. 2025 మే 5న అప్పటి కలెక్టర్ శ్రీధర్ భూమి అప్పగింతపై ఆదేశాలు ఇచ్చారు. కేవీ సంఘటన్ ఉన్నతాధికారులకు లేఖ అందజేశారు. ఆ తర్వాత చేపట్టాల్సిన చర్యలు ఆగిపోయాయి. రూ.10 కోట్లతో భవనాలు విద్యాలయానికి కేటాయించిన భూమిలో రూ.10 కోట్లతో పక్కా భవనాలను నిర్మించేందుకు కేంద్ర విద్యాశాఖ సిద్ధమైంది. దీనికోసం ఈ ఏడాది ఫిబ్రవరి 19న రూ.20 లక్షలు మంజూరు చేసింది. ఈ నిధులతో స్థల సర్వే, మట్టి పరీక్షలు, సమగ్ర ప్రాజెక్టు నివేదికను అందజేయాలని ఉత్తర్వు జారీ చేసింది. ఈ పనుల నిర్వహణ బాధ్యతలను కేంద్ర ప్రభుత్వ సంస్థ హిందుస్థాన్ స్టీల్ వర్క్ కన్స్ట్రక్షన్ లిమిటెడ్కు అప్పగించింది. ఈ చర్యలు ఇప్పటికే పూర్తయ్యాయి. భవనాల డిజైన్ కూడా సిద్ధం చేశారు. భూమిలో జి ప్లస్ టు భవనాలు, అందులో లిఫ్టు, మరో తొమ్మిది భవనాలను నిర్మిస్తారు. మ్యూటేషన్ చేస్తేనే పనులు కేంద్రీయ విద్యాలయానికి కేటాయించిన 6.09 ఎకరాల భూమిని సంస్థ పేరు మీద వెబ్ ల్యాండ్లో మ్యూటేషన్ చేయాలని కేవీ అధికారులు సబ్ కలెక్టర్కు లేఖ రాశారు. ఈ ఏడాది జూన్ 9న రాసిన ఈ లేఖకు ఇంతవరకు రెవెన్యూ అధికారుల నుంచి ఎలాంటి సమాధానం లేదు. విద్యాలయం పేరుతో కేటాయించిన భూమి వెబ్ ల్యాండ్ లో మ్యూటేషన్ చేస్తే తప్ప పనులు ప్రారంభమయ్యే అవకాశం లేదని కేవీ అధికారులు స్పష్టంగా చెబుతున్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటిదాకా చర్యలు తీసుకోకపోవడం నిర్మాణాలకు అడ్డంకిగా మారింది. ఎంపీకి పేరొస్తుందన్న కారణంతో రాష్ట్ర ప్రభుత్వం స్పందించడం లేదని విద్యావేత్తలు విమర్శిస్తున్నారు. రీ సర్వే అడ్డమట విద్యాలయానికి కేటాయించిన భూమిని కేవీ పేరుతో మ్యూటేషన్ చేయడానికి వలసపల్లి గ్రామంలో జరుగుతున్న రే సర్వే అడ్డంకిగా మారిందని రెవెన్యూ అధికారులు చెప్పారని విద్యాలయ అధికారులు చెప్తున్నారు. ప్రభుత్వం విద్యాలయం విషయంలో చిత్తశుద్ధి ప్రదర్శిస్తే సమస్య పరిష్కరించే అవకాశం ఉంటుంది. రాజకీయాలు పక్కనబెట్టి సత్వర చర్యలు తీసుకోవాలని ప్రజలు ప్రభుత్వాన్ని కోరుతున్నారు. -
మహమ్మద్ ప్రవక్త జీవితం.. ఆదర్శప్రాయం
కడప సిటీ : సర్వమానవాళికి ఆదర్శమూర్తిగా మహా ప్రవక్త మహమ్మద్ (సొ.అ.వ) నిలిచారని మత గురువులు తెలియజేస్తున్నారు. అలాంటి మహమ్మద్ ప్రవక్త జన్మదినం మిలాద్–ఉన్–నబీగా ముస్లింలు జరుపుకొంటారు. ఇస్లాం క్యాలెండర్ ప్రకారం మూడో నెల రబీ–అల్–అవ్వల్లో పౌర్ణమి ముందు రోజు మహమ్మద్ ప్రవక్త జన్మించినట్టు భావిస్తారు. అనంత కరుణామయుడైన అల్లాహ్ సర్వమానవాళి శ్రేయస్సు, శాంతిని నెలకొల్పడం కోసం ఆఖరి ప్రవక్తగా మహమ్మద్ను ఎన్నకున్నట్టు అంతిమ దైవ గ్రంథం పవిత్ర ఖురాన్ షరీఫ్లో పేర్కొన్నారు. విశ్వ ప్రవక్త మహమ్మద్ కేవలం ముస్లింల కోసం కాదని సర్వ కోటి జీవరాశులకు, ఈ విశ్వానికి ప్రవక్తగా అల్లాహ్ నియమించారని అందులో తెలిపారు. విశ్వ ప్రవక్త తాను స్వతహాగా ఏదీ తెలియజేయరు. తాను అల్లాహ్ ద్వారా ఏది వినేవారే, అదే తెలిపేవారు. దీనికి సాక్ష్యంగా అనేక దైవ గ్రంథాల్లో ముందుగానే వివరించారు. మరో సాక్ష్యం ఏమిటంటే మహమ్మద్ ప్రవక్త అక్షరాస్యత తెలియని వారు. ఇది అల్లాహ్ తఆలా మహిమ. పవిత్ర ఖురాన్ను దైవవాణి రూపంలో ప్రవక్తను అవతరింపజేసి తన శక్తిని సర్వ మానవాళికి తెలియజేశారు. అందుకే విశ్వ ప్రవక్త ప్రవచనాలు సర్వమానవాళి జీవన శైలికి హితోపదేశాలు అయ్యాయి. అల్లాహ్కు అత్యంత ప్రీతి పాత్రులైన మహమ్మద్ ప్రవక్త ఇస్లాం క్యాలెండర్లోని మూడో నెల రబీవుల్ అవ్వల్ 12వ తేదీ సోమవారం, హిందువుల క్యాలెండర్ విక్రమాదిత్య శకం 628 జ్యేష్టశుద్ధ 9వ తేదీ సోమవారం, 570 సంవత్సరం ఏప్రిల్ 20వ తేదీ గ్రెగేరియన్ క్యాలెండర్ (క్రిస్టియన్) ప్రకారం సౌదీ అరేబియాలోని మక్కా నగరంలో జన్మించారని తెలపబడి ఉంది. మక్కా పెద్ద అయిన అబ్దుల్ మత్తలబు కుమారుడు అబ్దుల్లా, అమీనాలకు జన్మించారు. మహమ్మద్ ప్రవక్త సోమవారం నాడు సూర్యోదయానికి, వేకువజామున మధ్య జన్మించినట్లు, ఆయన పుట్టకముందే తండ్రి మరణించగా, చిన్నతనంలోనే తల్లి కూడా కోల్పోయి అనాథగా పెరిగినట్లు మత గంథ్రాల ద్వారా తెలుస్తోంది. చిన్నతనం నుంచి ఎంతో నిజాయితీగా, మంచి నడతతో ఉండేవారని, అందరూ ఆయన్ను అల్ అమీన్ అని పిలిచేవారు. కాగా, ఆయనకు 40వ ఏట ప్రవక్త పదవి వరించిందని తెలపబడింది. ఏకోపాసన, మానవులంతా ఒక్కటేనని తారతమ్యాలు లేవని అంతా అల్లాహ్ దాసులేనని ఆయన ప్రబోధించారు. శాంతి, సహజీవనం, దానం, దైవభీతితో మెలగాలని బోధించారు. ప్రపంచ మంతటా ఆయన పుట్టిన రోజును పండుగలా చేసుకుంటారు. ఆయన జన్మదిన వేడుకలను ‘మిలాద్–ఉన్– నబీ’ అని అరబ్బీలో అంటారు. ప్రత్యేక ప్రార్థనలు ఇస్లాం సంప్రదాయం ప్రకారం పుట్టిన రోజు, పెళ్లి రోజులను వేడుకలుగా జరుపుకోకూడదు. కానీ భారతదేశంలో మాత్రం ప్రవక్త పుట్టిన రోజున ఆయనను స్మరించుకుంటూ ప్రార్థనలు నిర్వహిస్తారు. దేశంలోని ముస్లింలు తమ పండుగలను ఇస్లాం క్యాలెండర్ను అనుసరించే జరుపుకొంటారు. అయితే, ప్రత్యేక పండగలతోపాటు దర్గాలలోని మతపెద్దలు పుట్టిన రోజు లేదా వారి వర్ధంతిని ఘనంగా జరుపుకొనే ఆచారం ఉంది. ఈ రోజున ముస్లింలు ప్రత్యేకంగా ప్రార్థనలు నిర్వహించి, మత ప్రవక్త ముహమ్మద్ను స్మరించుకుని ఆయన చూపిన మార్గంలో నడుస్తామని సంకల్పం చేసుకుంటారు. రెండు జిల్లాల్లో.. ప్రవక్త జన్మదినం సందర్భంగా ప్రపంచం శాంతి సౌభాగ్యాలతో తులతూగాలని ప్రతి ముస్లిం ప్రార్థించడం గమనార్హం. మిలాద్ – ఉన్ – నబీ వైఎస్సార్ కడప, అన్నమయ్య జిల్లాల్లో బార్మీ నెలగా ప్రసిద్ధి చెందింది. ప్రవక్త జన్మదిన వేడుకల సందర్భంగా రాత్రిళ్లు ఆధ్యాత్మిక సభలు, నాతియాకలామ్ (ప్రవక్త కీర్తనలు) నిర్వహిస్తారు. వేకువ జామున నమాజ్ తర్వాత బార్మీ అన్నదాన కార్యక్రమాలు నిర్వహిస్తారు. ఈ జిల్లాల్లో ముస్లింలతోపాటు హిందువులు కూడా ఎంతో పవిత్రంగా బార్మీ అన్నదానాలు నిర్వహించడం ప్రత్యేకత. ఇది మత సామరస్యానికి నిదర్శనం. ఐకమత్యానికి ఈ రెండు జిల్లాలు ఆదర్శంగా నిలిచాయనడం అతిశయోక్తి కాదు. ప్రజల శ్రేయస్సు కాంక్షిస్తూ సమాజంలో శాంతి నెలకొల్పేందుకు కృషి చివరి ప్రవక్తగా భువిపైకి వచ్చినట్లు పవిత్ర గ్రంథం వెల్లడి నేడు అనంత కరుణామయుడి జన్మదినం మిలాదున్నబీ వివిధ సేవా కార్యక్రమాలు నిర్వహించేందుకు ఏర్పాట్లుప్రార్థనా మందిరాల వద్ద పటిష్ట బందోబస్తు మదనపల్లె టౌన్ : మిలాద్–ఉన్–నబీ పండుగ సందర్భంగా జిల్లాలోని ప్రార్థనా మందిరాలు, మసీదుల వద్ద పటిష్ట పోలీసు బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్లు ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. మంగళవారం ఎస్పీ మదనపల్లెలో ఒక ప్రకటన విడుదల చేశారు. ముస్లింలు పండుగను ప్రశాంత వాతావరణంలో భక్తిశ్రద్ధలతో జరుపుకోవాలని ఆకాంక్షించారు. ప్రార్థనా స్థలాల వద్ద ట్రాఫిక్ నియంత్రణ, శాంతిభద్రతల పరిరక్షణకు చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించినట్లు పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో ప్రజలు పోలీసులకు సహకరించాలని, ఎక్కడైనా అనుమానాస్పద పరిస్థితులు కనిపిస్తే వెంటనే డయల్ 100/112 కు సమాచారం ఇవ్వాలని ఎస్పీ కోరారు. -
ఎర్రచందనం దుంగల స్వాధీనం
లక్కిరెడ్డిపల్లి : ఎర్రచందనం అక్రమ రవాణాకు పాల్పడుతున్న ఐదుగురు వ్యక్తులను లక్కిరెడ్డిపల్లి పోలీసులు అరెస్టు చేసి వారి వద్ద నుంచి 112 కిలోల బరువు ఉన్న ఆరు ఎర్రచందనం దుంగలు, ఒక మారుతీ స్విప్ట్ కారును స్వాధీనం చేసుకున్నట్లు రాయచోటి డీఎస్పీ కృష్ణమోహన్ తెలిపారు. స్వాధీనం చేసుకున్న ఎర్రచందనం దుంగల విలువ దాదాపు రూ. 9 లక్షల, 72 వేలు ఉంటుందన్నారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆదేశాల మేరకు రాయచోటి ఎస్డీపీఓ ఎంఆర్ కృష్ణమోహన్ పర్యవేక్షణలో లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు నాయక్ సూచనలతో లక్కిరెడ్డిపల్లి ఎస్ఐ శోభ, సిబ్బంది దాడులు చేశారు. చిత్తూరు జిల్లా పెనుమూరు మండలం రామానందపురం గ్రామం గుంటిపల్లికి చెందిన దవర్ల దయతోపాటు, లక్కిరెడ్డిపల్లి కుర్నూతల, దేరంగుల రామాంజనేయులు, దక్షనపు రాజశేఖర్, లోకేశ్వర, నాగార్జునలను అదుపులోకి తీసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ లక్కిరెడ్డిపల్లి సర్కిల్ ఇన్స్పెక్టర్ కృష్ణంరాజు నాయక్ను, ఎస్ఐ శోభ, వారి సిబ్బందిని అభినందించారు.ఐదుగురి అరెస్ట్ -
167 పోస్టులు.. 710 దరఖాస్తులు
● నెల వేతనం రూ.10 వేలే ● ఉద్యోగం 8 నెలలే సాక్షి, మదనపల్లె: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలలో విద్యా వలంటీర్ పోస్టుల భర్తీకి విద్యాశాఖ అధికారులు చర్యలు తీసుకున్నారు. ఖాళీగా ఉన్న పాఠశాలలో విద్యార్థులకు చదువు చెప్పేందుకు అర్హులైన వారిని దరఖాస్తులు ఆహ్వానించారు. దరఖాస్తుల గడువు ముగియడంతో మంగళవారం స్థానిక జిల్లా విద్యాశాఖ అధికారి కార్యాలయంలో అందిన దరఖాస్తుల పరిశీలన చేపట్టారు. జిల్లాలో 45 స్కూల్ అసిస్టెంట్, 122 ఎస్జీటీ పోస్టులను విద్యా వలంటీర్లతో భర్తీ చేసేందుకు ప్రభుత్వం ఈ చర్యలు చేపట్టింది. ఇందులో స్కూల్ అసిస్టెంట్ పోస్టులకు 119, ఎస్జీటీ పోస్టులకు 591 దరఖాస్తులు వచ్చాయి. అర్హులైన వారిని అధికారులు ఎంపిక చేయనున్నారు. ఎంపికై న స్కూల్ అసిస్టెంట్ విద్యా వలంటీర్లకు నెలకు రూ.12,500, ఎస్టీటీ విద్యా వలంటీర్లకు నెలకు రూ.10వేల వేతనం చెల్లిస్తారు. ఉద్యోగం 8 నెలలే.. ఈ పోస్టులకు ఎంపికయ్యే అభ్యర్థులు పాఠశాలల్లో పనిచేయాల్సింది కేవలం 8 నెలల కాలానికే. ఈ ఏడాది సెప్టెంబర్ నుంచి వచ్చే ఏడాది ఏప్రిల్ వరకు పోస్టులు ఉంటాయి. ఆ తర్వాత ఈ పోస్టులు కొనసాగిస్తారో, తొలగిస్తారో తెలియదు. ఎంపికై న అభ్యర్థులు అతి కొద్ది వేతనంతో పనిచేయాల్సి వస్తుంది. షరతులు వర్తిస్తాయి ఏ పాఠశాలలో ఈ పోస్టు ఖాళీగా ఉందో ఆ పాఠశాల పరిధి గ్రామానికి చెందిన అభ్యర్థికి మాత్రమే అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆ గ్రామ పరిధికి చెందిన అభ్యర్థి లేకపోతే, ఆ మండలానికి చెందిన అభ్యర్థిని ఎంపిక చేస్తారు. -
ఈవీఎం గోడౌన్ల వద్ద నిరంతర నిఘా
రాయచోటి : ఈవీఎం గోడౌన్ల వద్ద నిరంతరం పటిష్టమైన నిఘా ఉండాలని కలెక్టర్ నిశాంత్ కుమార్ సంబంధిత అధికారులను ఆదేశించారు. ఎన్నికల కమీషన్ ఆదేశాల మేరకు మాసవారీ తనిఖీల్లో భాగంగా మంగళవారం రాయచోటి మార్కెట్ యార్డులో ఉన్న ఈవీఎం గోదామును రాజకీయ పార్టీ ప్రతినిధులతో కలిసి కలెక్టర్ తనిఖీ చేశారు. ఈవీఎం గోడౌన్లో అంతర్భాగాలను రాజకీయ పార్టీల సమక్షంలో గోదాము లోపల భద్రపరిచిన ఆయా ఈవీఎం యంత్రాల బియూలు, సీయూలు, వివిధ ప్యాట్లను అక్కడి భద్రతా చర్యలను కలెక్టర్ పరిశీలన చేశారు. అనంతరం వివిధ అంశాలలో రాజకీయ పార్టీ ప్రతినిధులు అడిగిన సందేహాలకు కలెక్టర్ సమాధానం ఇచ్చారు. రాయచోటి ఆర్డీఓ ఏ శ్రీనివాస్, ఎలక్షన్ విభాగం అధికారులు, వివిధ రాజకీయ పార్టీల ప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు ఫుట్బాల్ జట్ల ఎంపిక
మదనపల్లె సిటీ: జిల్లా సీనియర్ పురుషుల ఫుట్బాల్ జట్ల ఎంపిక బుధవారం నిర్వహించనున్నట్లు జిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్ తెలిపారు. మదనపల్లె సమీపంలోని ఆరోగ్యవరంలో సాయంత్రం 4 గంటలకు ఎంపిక జరుగుతుందన్నారు. క్రీడాకారులు ఆధార్ కార్డు జిరాక్సు, జనన ధృవీకరణపత్రం, రెండు ఫొటోలు తీసుకురావాలన్నారు. వివరాలకు 95020 74146 నంబరు సంప్రదించాలని సూచించారు. స్లాష్పై శిక్షణ మదనపల్లె సిటీ: స్థానిక జెడ్పీ ఉన్నత పాఠశాలలో మంగళవారం స్టేట్ లర్నింగ్ అచీవ్మెంట్ సర్వే (స్లాష్)పై ఎంఈఓలు, ఫీల్డ్ ఇన్వెస్టిగేటర్లకు శిక్షణ కార్యక్రమం జరిగింది. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పాల్గొన్న డీఈఓ సుబ్రమణ్యం మాట్లాడుతూ 5,7,9 తరగతి విద్యార్థులకు గణితం, ఇంగ్లిషు,తెలుగులపై పరీక్షలు నిర్వహించి విద్యార్థుల సామర్థ్యాలను తెలుసుకోవాలన్నారు. రీసోర్సుపర్సన్లు పలు విషయాలను వివరించారు. కార్యక్రమంలో సమగ్రశిక్ష ఏపీసీ డాక్టర్ అనురాధ, డీసీఈబీ సెక్రటరీ తాటిపర్తి గంగాధర్, ఏఎంఓ నాదిర్షావల్లి, ఎంఈఓలు రాజు, నటరాజరెడ్డి, కేశవరెడ్డి, విజయకుమారి, రెడ్డిశేఖర్, మునీంద్రనాయక్, బాలాజీ, ద్వారకనాథ్,హేమలత తదితరులు పాల్గొన్నారు. వ్యవసాయ పాలిటెక్నిక్ కళాశాలలో స్పాట్ అడ్మిషన్లు పుంగనూరు: పుంగనూరు సమీపంలోని అగస్తీగానిపల్లె సమీపంలో ఉన్న అచార్య ఎన్జీ రంగా వ్యవసాయపాలిటిక్నిక్ కళాశాలలో నేరుగా అడ్మిషన్లు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ కృష్ణారెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. పదో తరగతి, లేదా ఇంటర్మీడియట్ పాసైన విద్యార్థులు అర్హులన్నారు. పూర్తి వివరాలకు 9010402068ను సంప్రదించాలని కోరారు. నూతన ఎంపికవాల్మీకిపురం: విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ రాష్ట్ర కార్యదర్శిగా శంకరయ్య ఎంపికయ్యారు. ఆదివారం ఏలురులో జరిగిన రాష్ట్ర కార్యవర్గ ఎన్నికలు రాష్ట్ర అధ్యక్షుడు శాస్త్రి ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ కార్యవర్గ సమావేశంలో వాల్మీకిపురానికి చెందిన వలిగిరి శంకరయ్యను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. పలువురు విశ్రాంత ఉద్యోగులు ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా శంకరయ్య మాట్లాడుతూ విశ్రాంత ఉద్యోగుల సమస్యలపై రాజీలేని పోరాటం సాగిస్తామన్నారు. విశ్రాంత ఉద్యోగుల హక్కుల సాధనకు కృషి చేస్తామన్నారు. సీఎంఎస్ యాప్కు జాతీయ స్థాయి గుర్తింపు మదనపల్లె టౌన్: అన్నమయ్య జిల్లా పోలీస్ శాఖ రూపొందించిన కోర్టు మానిటరింగ్ సిస్ట మ్ (సిఎంఎస్) యాప్కు జాతీయ స్థాయిలో ప్రతిష్టాత్మక గుర్తింపు లభించింది. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ఆలోచనతో రూపొందించిన ఈ యాప్, కోర్టు సమన్లు, వారెంట్ల అమలు, సాక్షుల హాజరు పర్యవేక్షణను డిజిటలైజ్ చేసి పోలీసుల పనిభారాన్ని తగ్గించింది. దీనివల్ల కేసుల విచారణ వేగవంతమై, బాధితులకు త్వరగా న్యాయం అందుతోంది. ఈ విశేష సేవలను గుర్తించి రాజస్థాన్ లోని జైపూర్ లో ఇండియన్ ఎక్స్ప్రెస్ గ్రూప్ నిర్వహించిన టెక్నాలజీ సభా ఎక్సలెన్స్ అవార్డ్స్–2026లో ఎస్పీ అవార్డు అందుకున్నారు. ఈ గౌరవం జిల్లా పోలీసుల సమిష్టి కృషికి దక్కిన ఫలితమని ఎస్పీ అన్నారు. మిత్ర నోడల్ అధికారిగా మురళీ నాయక్ రాయచోటి : జిల్లాలో యువ ఆపద మిత్ర స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లాస్థాయి నోడల్ అధికారిగా అడ్వాన్స్డ్ స్కౌట్ మాస్టర్ మూడే మురళీ నాయక్ నియమితులయ్యారు. ఈ మేరకు స్కౌట్స్ అండ్ జిల్లా చీప్ కమీషనర్ సుబ్రమణ్యం ఆదేశాలు జారీ చేశారు. నియామక పత్రాన్ని మంగళవారం రాయచోటి లోని స్కౌట్ కార్యాలయంలో జిల్లా సెక్రటరీ నరసింహారెడ్డి మురళీనాయక్కు అందజేశారు. -
జిల్లాలో 21 బీఎస్ఎన్ఎల్ టవర్లు
● రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ ● ప్రిన్సిపల్ జీఎం ఏవి.శ్రీకుమార్ సాక్షి, మదనపల్లె: జిల్లాలోని మారుమూల ప్రాంతాల్లో బీఎస్ఎన్ఎల్ సేవలను విస్తృతం చేస్తున్నామని తిరుపతి టెలికం ప్రిన్సిపల్ జనరల్ మేనేజర్ ఏవి.శ్రీ కుమార్ వెల్లడించారు. మంగళవారం ఆయన డిప్యూటీ జనరల్ మేనేజర్ వెంకోబరావుతో కలిసి మదనపల్లె టెలికం కేంద్రాన్ని తనిఖీ చేశారు. ఇక్కడి అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదాయంతో సంబంధం లేకుండా జిల్లాలోని 21 మారుమూల గ్రామంలో సెల్ టవర్లను ఏర్పాటు చేస్తున్నట్లు చెప్పారు. డిజిటల్ భారత్ నిధి కార్యక్రమం కింద గుమ్మసముద్రం, అమిలేపల్లి, కత్తిరాయ చెరువు, అరమడకవాండ్లపల్లి, దిగువతాండ, ముడియంవారిపల్లి, చెన్నయ్యగారిపల్లి, బండ్లపై, బూర్లపల్లి, బూచిపల్లి, చెన్నారాయునిపల్లి, కాట్నగల్లు, సంపతికోట, దిగువపల్లె, బండమీదపల్లె, నెక్కంది,ఎలవ నెల్లూరు, బాలిరెడ్డిగారిపల్లె, జుంజురపెంట, బండ్రేవుల్లో టవర్లు ఏర్పాటు చేస్తామన్నారు. స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకొని సెప్టెంబర్ 12వ తేదీ వరకు ఒక రూపాయికే బీఎస్ఎన్ఎల్ సిమ్ మంజూరు చేస్తామన్నారు. నెలరోజుల టాక్ టైం, రెండు జీబీల ఇంటర్నెట్ ఉచితంగా ఇస్తామన్నారు. సమావేశంలో డిప్యూటీ జనరల్ మేనేజర్లు వెంకోబారావు, జయశంకర్, డీఈ రెడ్డి బాబు, టీఏసి మెంబర్ కరీముల్లా పాల్గొన్నారు. -
‘పల్లె నిద్ర’తో ప్రజల ముంగిట్లోకి పోలీసింగ్
ఎస్పీ ధీరజ్ కునుబిల్లిమదనపల్లె టౌన్: ప్రజలకు పోలీసు వ్యవస్థను మరింత చేరువ చేసి వారిలో భరోసా నింపడమే ‘పల్లె నిద్ర’ కార్యక్రమ ముఖ్య ఉద్దేశమని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. జిల్లా వ్యాప్తంగా పలు పోలీసు స్టేషన్ల పరిధిలోని గ్రామాల్లో సోమవారం రాత్రి పోలీసు అధికారులు, సిబ్బంది ‘పల్లె నిద్ర’ చేపట్టారు. ఈ సందర్భంగా పోలీసులు గ్రామస్థులతో సమావేశమై వారి సమస్యలు, రక్షణ అవసరాలు, శాంతిభద్రతల పరిస్థితులపై చర్చించారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల దృష్ట్యా శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా కట్టుదిట్టమైన చర్యలు చేపడుతున్నామన్నారు. గ్రామాల్లో అనుమానాస్పద వ్యక్తులు సంచరించినా, చట్టవ్యతిరేక కార్యకలాపాలు జరిగినా వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని కోరారు. -
గ్యాస్ కోసం సిలిండర్లతో ధర్నా
● గంటకు పైగా స్తంభించిన ట్రాఫిక్ ● పత్తా లేని సివిల్ సప్లయ్ అధికారులు ● ఎట్టకేలకు పోలీసుల చొరవతో గ్యాస్ పంపిణీపెద్దతిప్పసముద్రం : స్థానిక ఇండేన్ గ్యాస్ ఏజెన్సీ నిర్వాహకుల నిర్లక్ష్య వైఖరికి నిరసనగా మంగళవారం మద్దయ్యగారిపల్లి రోడ్డులో గ్యాస్ వినియోగదారులు ఖాళీ సిలిండర్లతో ధర్నాకు దిగారు. సుమారు గంటకు పైగా ప్రజలంతా సిలిండర్లతో బైఠాయించడంతో ట్రాఫిక్ తీవ్రంగా స్తంభించిపోయింది. గ్యాస్ బుకింగ్ చేసి ఓటీపీలు చెప్పినా.. సకాలంలో సిలిండర్లను ఇవ్వకపోవడంతోనే తాము ధర్నాకు దిగామని ప్రజలు తెలిపారు. ఏజెన్సీ నిర్వాహకుల తీరును ఎండగడుతూ తీవ్రంగా విమర్శించారు. చుట్టు పక్కల ఎక్కడా లేని విధంగా ఏజెన్సీ వాళ్లు ఇక్కడే గ్యాస్ కొరతను సృష్టిస్తున్నారని మండి పడ్డారు. సిలిండర్లను బ్లాక్ మార్కెట్కు తరలిస్తుండటంతోనే తమకు ఈ దౌర్భాగ్యం పట్టిందని పలువురు అనుమానం వ్యక్తం చేశారు. గ్యాస్ కొరతపై ప్రజలు ఎన్ని సార్లు రోడ్డెక్కినా సంబంధిత సివిల్ సప్లయ్ అధికారులు మాత్రం సామాన్య ప్రజల గోడు పట్టించుకోక పోవడంతోపాటు అటు వైపు కన్నెత్తి చూడక పోవడం వెనుక ఆంతర్యం ఏమిటని ప్రశ్నించారు. అనంతరం ప్రజలంతా మూకుమ్మడిగా ఏజెన్సీ నిర్వాహకులతో వాగ్వివాదానికి దిగారు. ఏజన్సీ వారు మాట్లాడుతూ గ్యాస్ బుకింగ్ చేసిన వారంతా ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని, తామే గ్రామాలకు వచ్చి సిలిండర్లు అందిస్తామని, తాము ఎక్కడా బ్లాక్లో అమ్మలేదని ప్రజలకు వివరించారు. మీరు సక్రమంగా గ్రామాలకు వస్తుంటే మేమంతా పనులన్నీ మానుకుని ఇక్కడకు ఎందుకు వస్తామని ప్రజలు సూటిగా ప్రశ్నించారు. ఎట్టకేలకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ఆందోళనకారులతో చర్చించారు. దూర ప్రాంతాలకు వెళ్లే ప్రయాణికులు, అత్యవసరంగా ఆసుపత్రులకు వెళ్లే రోగుల అవసరాలను గుర్తించాలని ప్రజలకు హితబోధ చేయగా ధర్నాను విరమించారు. అనంతరం పోలీసులే ఏజెన్సీ వారితో మాట్లాడి దగ్గరుండి గోడౌన్ వద్దే సిలిండర్లను అందించే చర్యలు చేపట్టారు. ఇదిలా ఉండగా గోడౌన్ వద్ద పరిస్థితి గందరగోళంగా మారడంతో క్యూలో నిలబడిన వారిలో ముగ్గురు వ్యక్తులు.. ఈ సిలిండర్ నాది అంటే కాదు మాది అంటూ వారి మధ్య వాగ్వివాదం చోటు చేసుకుంది. -
తాగునీటి కోసం ఆందోళన
పుంగనూరు : మండలంలోని ఓబిరెడ్డిపల్లె గ్రామంలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఆ గ్రామ మహిళలు మండల కార్యాలయం ఎదుట ధర్నా చేశారు. మంగళవారం మహిళలు ఎంపీడీవోకు వినతిపత్రం సమర్పించారు. గత మూడు నెలలుగా నీటి సమస్యతో బాధపడుతున్నా అధికారులు పట్టించుకోలేదని వాపోయారు. నీరు లేకపోవడంతో వ్యవసాయబోర్ల వద్ద డబ్బులతో నీటిని కొనుగోలు చేస్తున్నామని తెలిపారు. ఇకనైనా అధికారులు స్పందించాలని కోరారు. గజ్జెలవాండ్లపల్లిలో ట్యాంకర్తో సరఫరా పెద్దతిప్పసముద్రం : మండలంలోని తుమ్మరకుంట పంచాయతి గజ్జెలవాండ్లపల్లిలో గత నెల రోజులుగా తాగునీటి సమస్య నెలకొంది. గ్రామ పంచాయతీ అధికారులు తాగునీటి ఎద్దడి నివారణ చర్యలు చేపట్టక పోవడంతో ప్రజలంతా సోమవారం ఖాళీ బిందెలతో మండల పరిషత్ కార్యాలయం ఎదుట నిరసన వ్యక్తం చేసిన విషయం తెలిసిందే. ఈ నేపథ్యంలో సమస్యపై స్పందించిన ఎంపీడీవో చంద్రశేఖర్రెడ్డి, ఆర్డబ్ల్యూఎస్ జేఈ బాలచంద్రాచారి ట్యాంకర్లతో నీటిని సరఫరా చేస్తామని ప్రజలకు సూచించారు. ఈ తరుణంలో మంగళవారం ఆర్డబ్ల్యూఎస్ మెకానిక్ చంద్రశేఖర్ గ్రామానికి వెళ్లి ట్యాంకర్తో ప్రజలకు తాగునీరు అందేలా చర్యలు చేపట్టారు. -
బావిలో గుర్తు తెలియని ద్విచక్రవాహనం
గుర్రంకొండ : నీరు ఎండిపోయిన బావిలో గుర్తుతెలియని ద్విచక్రవాహనం బయటపడిన సంఘటన మండలంలోని సరిమడుగు పంచాయతీ నాగరాజపురం వద్ద జరిగింది. గ్రామానికి సమీపంలో రంగరాయపు బావి అనే పేరుతో పురాతన బావి ఉంది. బావిలో చాలా ఏళ్లుగా నీరు ఇంకిపోకుండా అలాగే ఉండేది. ఈ బావి నీటితో రైతులు వ్యవసాయం చేసేవారు. ప్రస్తుతం కరువు పరిస్థితి కారణంగా బావిలో నీరు ఇంకిపోయింది. అయితే ఆశ్చర్యకంగా బావిలో ఓ ద్విచక్రవాహనం బయటపడడం గమనార్హం. ఇటీవల వీబీరామ్జీ పనుల చేయడానికి వెళ్లిన కూలీలు బావిలో ద్విచక్రవాహనం ఉన్నట్లు గుర్తించారు. హీరో హోండా స్ప్లెండర్ ఫ్లస్ వాహనం బావిలో పడిఉన్న విషయం గ్రామస్తులకు సమాచారం అందించారు. గ్రామస్తులు పోలీసులకు సమాచారం ఇచ్చినట్లు పేర్కొన్నారు. అసలు బావిలోకి ఈ ద్విచక్రవాహనం ఎలా వచ్చి పడింది అనేది పలు అనుమానాలకు తావిస్తోంది. ఎవరైనా నేరం చేసి వాహనాన్ని ఇక్కడికి తీసుకొచ్చి పడేశారా లేక ఎర్రచందనం కేసుల్లో గానీ, చోరీలకు గానీ ఈ వాహనాన్ని వినియోగించి ఆధారాలు దొరక్కకుండాబావిలో పడేశారా అనే సందేహాలు గ్రామస్తులు వ్యక్తం చేస్తున్నారు. ఇలా బావిలో ద్విచక్రవాహనం బయటపడడం చర్చనీయాంశంగా మారింది. -
‘ఉపాధి’లో టీడీపీ వర్గ పోరు
● ఇద్దరు వాగ్వాదానికి దిగిన వైనం ● యంత్రాలతో పనులు ● కూలీల పొట్ట కొడుతున్న నేతలు ● కన్నెత్తి చూడని అధికారులుగాలివీడు : ఉపాధి పనుల కింద గ్రామీణ ప్రాంతాలలో ప్రతి కుటుంబంలో అర్హత కలిగిన ప్రతి ఒక్కరికి ప్రభుత్వం జాబు కార్డును మంజూరు చేసింది. ఎక్కడ కూడా వలస వెళ్లకూడదని.. కేంద్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా కూలీలకు ఉపాధి హామీ పనులు కల్పించింది. ఉపాధిలో ఉన్న నియమ నిబంధనలను గోరంత కూడా ఆచరణలోకి తీసుకురాకుండా అధికారం ఉందని టీడీపీ నాయకులు ఇష్టారాజ్యంగా చేపడుతున్నారు. మరోపక్క గ్రామాలలో వర్గ పోరు మొదలైంది. యంత్రాలతో పనులు చేయడంతో అధిక మొత్తంలో లాభాలు వస్తున్నాయని భావించి తెలుగు తమ్ముళ్లు కుమ్ములాటకు వెనుకాడటం లేదు. ఈ క్రమంలో కూలీల కోసం ఉపాధి హామీ వ్యవస్థ తీసుకొస్తే.. దీనిని చిన్నాభిన్నం చేసి కూలీలు కడుపు కొట్టి రాత్రిపూట యంత్రాలతో పనులను ప్రారంభించారు. మరోపక్క ఆ పనులను అధికారి పార్టీలోనే మరో వర్గం అడ్డుకుంది. ఈ తతంగమంతా గోరాన్చెరువు గ్రామంలో గత రెండు రోజుల నుంచి ఘర్షణ వాతావరణంలో జరుగుతోంది. ఒకరికి ఒకరు తగ్గకుండా ఎత్తుకు పైఎత్తులు వేసుకుంటూ నేనంటే నేనే చేయాలి అని తెలుగు తమ్ముళ్లు పోటీ పడుతున్నారు. ఈ క్రమంలో టీడీపీ నాయకుడు చెంచు వెంకట్రెడ్డి, గ్రామ ఫీల్డ్ అసిస్టెంట్ శ్రీకాంత్ ఉపాధి పనుల కోసం పూర్తి స్థాయిలో వాగ్వాదానికి కూడా దిగినట్లు సమాచారం. గ్రామస్తులు ఈ విషయాన్ని పోలీసులకు సమాచారం అందించడంతో పోలీసులు అక్కడికి చేరుకొని కాస్త అక్కడ వాతావరణం అదుపులోకి తీసుకుని వచ్చారు. ఇదే పద్ధతి కొనసాగితే మండల వ్యాప్తంగా ఉపాధి హామీ కూలీలకు దక్కకుండా బడా నాయకుల చేతిలోకి వెళ్లిపోతుందని మండలంలో చర్చనీయాంశంగా మారింది. జిల్లా ఉన్నతాధికారులు స్పందించి గాలివీడు మండలంలో జరుగుతున్న ఉపాధి హామీ పనితీరుపై నివేదికలు తెప్పించుకొని చర్యలు తీసుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. -
లైంగిక వేధింపుల కేసులో నిందితుడి అరెస్ట్
ములకలచెరువు : మండలానికి చెందిన ఒక వ్యక్తి ఇద్దరు బాలికలను లైంగిక వేధింపులకు గురి చేసిన సంఘటన తెలిసిందే. ఈ కేసులో నిందితుడైన మహబూబ్బాషా(55)ను సోమవారం అరెస్టు చేసినట్లు సీఐ దస్తగిరి తెలిపారు. సీఐ మాట్లాడుతూ నిందితుడు చౌడసముద్రం గుడి వద్ద ఉండగా అరెస్టు చేశామన్నారు. నిందితుడిని తంబళ్లపల్లె కోర్టులో హాజరుపరచగా జడ్జి రిమాండ్ విధించినట్లు సీఐ వెల్లడించారు. బాధిత కుటుంబానికి న్యాయం చేయాలి మదనపల్లె టౌన్ : లవ్ జిహాదీ కారణంగా ఆత్మహత్య చేసుకున్న నూకరాజు కుటుంబానికి న్యాయం చేయాలని భారతీయ జనతా పార్టీ జనతా వారధి ఆధ్వర్యంలో మదనపలె బీజేపీ నాయకులు మదనపల్లె ఎస్పీ ధీరజ్ కునుబిల్లికి సోమవారం ఫిర్యాదు చేశారు. కాకినాడలో ఇంటర్నేషనల్ స్కూల్లో రైఫిల్ షూటింగ్ శిక్షకుడిగా పని చేస్తున్న సాధిక్ ఖాన్ వల్లే ఈ ఘటన జరిగిందని, ఈ కేసులో వంచన, మోసం, దోపిడీ, హత్య కోణాలున్నాయని బీజేపీ జిల్లా అధ్యక్షులు, నేతలు ఆరోపించారు. నిందితుడిని కఠినంగా శిక్షించాలని, రాష్ట్ర సీఎం, హోం మంత్రి స్పందించాలని కోరారు. బాలిక అదృశ్యంపై ఫిర్యాదు మైదుకూరు : మైదుకూరులో బాలిక అదృశ్యంపై సోమవారం ఫిర్యాదు అందినట్లు పోలీసులు తెలిపారు. తన మనవరాలు పదో తరగతి పూర్తి చేసి ఇంట్లోనే ఉండేదని, సోమవారం మధ్యాహ్నం ఇంటి నుంచి వెళ్లిపోయిందని, బాలిక ఆచూకీ తెలియజేయాలని కోరుతూ బాలిక నాయనమ్మ ఫిర్యాదు చేసినట్టు పోలీసులు పేర్కొన్నారు. ఆ మేరకు కేసు నమోదు చేసి బాలిక ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు పోలీసులు తెలిపారు. చక్రాయపేట : ఎలాంటి బిల్లులు లేకుండా వేరుశనగ పప్పును తీసుకెళుతున్న లారీని విజిలెన్స్ సీఐ పట్టుకొని చక్రాయపేట పోలీసు స్టేషన్కు తరలించారు. యల్లటూరు నుంచి వేరుశనగ పప్పుతో కదిరి వైపు వెళుతున్న లారీని అద్దాలమర్రి క్రాస్ వద్ద విజిలెన్స్ సీఐ శ్రీనివాసుల రెడ్డి పట్టుకున్నారు. పప్పునకు సంబంధించి ఎలాంటి బిల్లులు లేకపోవడంతో కేసు నమోదు చేసి లారీని చక్రాయపేట స్టేషన్కు అప్పగించారు. ఈ విషయమై చక్రాయపేట ఎస్ఐ చంద్రశేఖర్ను అడగగా.. విజిలెన్స్ సీఐ పప్పు శనగ లారీ పట్టుకుని అప్పగించారని తెలిపారు. వ్యక్తి ఆత్మహత్య మైలవరం (జమ్మలమడుగు రూరల్) : గత కొంత కాలం నుంచి అనారోగ్యంతో బాధపడుతున్న ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన మైలవరం మండలంలో చోటు చేసుకొంది. ఎస్ఐ శ్యాం సుందర్రెడ్డి ఇచ్చిన వివరాలు ఇలా ఉన్నాయి. ప్రొద్దుటూరు వైఎంఆర్ కాలనీకి చెందిన దాసుగారి రాజా (64) గత 5 ఏళ్ల క్రితం బైపాస్ సర్జరీ చేయించుకున్నాడు. అంతే కాకుండా మానసిక పరిస్థితి బాగ లేకపోవడంతో పలుమార్లు ఇంటి నుంచి బయటికి వెళ్లేవాడు. సోమవారం కూడా అలాగే ఇంటి నుంచి బయటికి వెళ్లాడు. సాయంత్రం మైలవరం జలాశయంలోకి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. స్థానికులు చూసి పోలీసులకు సమాచారం అందించారు. వెంటనే అతన్ని బయటికి తీయగా అప్పటికే మృతి చెందాడు. ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరికి గాయాలు గుత్తి రూరల్ : ప్రైవేట్ బస్సు ఢీకొని ఇద్దరికి తీవ్ర గాయాలైన ఘటన మండలంలోని కొత్తపేట గ్రామ శివారులో 44వ నంబర్ జాతీయ రహదారిపై జరిగింది. పోలీసులు, బాధితులు తెలిపిన మేరకు.. వైఎస్సార్ కడప జిల్లాకు చెందిన రఘురామయ్య, నంద్యాల జిల్లా గోరుమానుపల్లికి చెందిన చెక్క శివయ్యలు సోమవారం వైఎస్సార్ కడప జిల్లాకు బైక్లో బయలుదేరారు. కొత్తపేట గ్రామ శివారులో వీరి బైక్ను ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు ఢీకొంది. దీంతో తీవ్రంగా గాయపడిన రఘురామయ్య, శివయ్యను స్థానికులు వెంటనే గుత్తి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. -
మదనపల్లి డీఎంహెచ్ఓగా శ్రీనివాసులు
మదనపల్లె టౌన్ : జిల్లా డీఎంహెచ్ఓగా శ్రీనివాసులు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. గతంలో మదనపల్లె డీఎంహెఓగా పనిచేస్తున్న డాక్టర్ లక్ష్మీనరసయ్య, మదనపల్లి గ్లోబల్ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రి వ్యవహారంపై సస్పెండైన విషయం తెలిసిందే. ఈ స్థానంలో కలెక్టర్ ఆదేశాలతో కడప జీజీహెచ్ ఆర్ఓగా పనిచేస్తున్న శ్రీనివాసులను ఫుల్ అడిషనల్ చార్జి డీఎంహెచ్ఓగా నియమించారు. ఇన్ సర్వీసు టీచర్లు దరఖాస్తు చేసుకోవాలిమదనపల్లె సిటీ : ఇన్ సర్వీసు టీచర్లు టెట్కు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ డాక్టర్ సుబ్రమణ్యం ఓ ప్రకటన విడుదల చేశారు. 2011కు ముందు ఉద్యోగంలో చేరిన వివిధ యాజమాన్యాల కింద పని చేస్తున్న ప్రభుత్వ టీచర్లు అక్టోబర్లో నిర్వహించే ఉపాధ్యాయ అర్హత పరీక్ష (టెట్)కు దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. ఆగస్టు 25 నుంచి సెప్టెంబర్ 24 వరకు దరఖాస్తులను ఆన్లైన్ ద్వారా సమర్పించుకోవాలని తెలిపారు. కలెక్టరేట్లో ప్రత్యేక బోర్డుల ఏర్పాటు మదనపల్లి (కురబలకోట) : పీజీఆర్ఎస్ ద్వారా అందిన సేవలపై ప్రజలు అభిప్రాయాలు తెలియజేయడానికి మదనపల్లి కలెక్టరేట్ క్యూ ఆర్ కోడ్ బోర్డులు ఏర్పాటు చేశారు. ఫిర్యాదులు, పరిష్కార విధానం, పీజీఆర్ఎస్ సమాచారం మొబైల్ ఫోన్తో క్యూ ఆర్ కోడ్ను స్కాన్ చేయడం ద్వారా తెలుసుకోవచ్చు. జిల్లా కేంద్రంలోనే కాకుండా మండల స్థాయి పీజీఆర్ఎస్ కేంద్రాల్లో ప్రవేశ ప్రాంతాల్లో ప్రజలకు స్పష్టంగా కనిపించేలా క్యూ ఆర్ కోడ్ ప్రముఖంగా ఏర్పాటు చేశారు. అర్జీల స్థితిగతులు తెలుసుకోడానికి కూడా టోల్ ఫ్రీ నెంబరు 1100కు ఫోన్ చేసి తెలుసుకోవచ్చు. -
కాగితపు అర్జీ వెనుక.. కనిపించని గాయాలెన్నో!
● పదే పదే అవే అర్జీలు ● సమస్య పరిష్కారంపై కాకుండా క్లోజ్ చేయడంపై అధికారుల దృష్టి ● ఆర్జీదారుల్లో పెల్లుబుకుతున్న అసంతృప్తిమదనపల్లి(కురబలకోట) : మదనపల్లి కలెక్టరేట్ లో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)కు అర్జీలు వెల్లువెత్తాయి. ఎప్పట్లాగే సమస్య పరిష్కారం కాని వారే మళ్లీ కలెక్టరేట్కు వచ్చారు. సమస్యకు పరిష్కారం లభిస్తుందనే ఆశతో దూరాభారాన్ని లెక్క చేయకుండా వస్తే ఫలితం ఉండడం లేదని అర్జీదారులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఈ వారం 217 అర్జీలు వచ్చినట్లు అధికారులు తెలిపారు. ● పీలేరు మండలం బండ్లవంకకు చెందిన లీలా వతమ్మ వితంతు ిపింఛన్ మంజూరు చేసి ఆదుకోవాలని కోరారు. భర్తను కోల్పోయిన తనకు పిల్లల కుటుంబ పోషణ భారమైందన్నారు. ● కురబలకోట మండలం ఎనుములవారిపల్లికి చెందిన ఎం. వెంకట్రమణ ప్రమాదవశాత్తు చింత చెట్టు పై నుండి పడి నడవలేని స్థితిలో ఉన్నానని వృద్ధ్దాప్యలేదా వికలాంగుల ఫించన్ ఇచ్చి ఆదుకోవాలని పీజీఆర్ఎస్లో అర్జీ ఇచ్చారు. అక్రమాల ప్రిన్సిపల్పై చర్యలు ఏవీ కురబలకోట మండలం ముదివేడు దగ్గరున్న కేజీబీవీ ప్రిన్సిపాల్ రూ.48 వేలు అక్రమంగా నిధులు డ్రా చేసి స్వాహా చేసినా చర్యలు తీసుకోవడంలో అధికారులు మీనమేషాలు లెక్కిస్తున్నారని ఆ స్కూల్ కమిటీ చైర్మన్ డి.రెడ్డెప్ప కలెక్టర్కు ఫిర్యా దు చేశారు. ఎలాంటి పనులు చేపట్టకుండా డబ్బు స్వాహా చేశారని.. దీనిపై ఆర్నెళ్లుగా అర్జీలు ఇస్తు న్నా పట్టించుకోకపోవడం లేదని ఆరోపించారు. -
ఆసన్నం.. విఘ్నేశ్వరుడి ఆగమనం!
● త్వరలో వినాయక చవితి వేడుకలు ప్రారంభం ● ఉత్సవాల ఏర్పాట్లు ఆరంభించిన కమిటీలు రాయచోటి అర్బన్ : పల్లె, పట్టణం అనే తేడా లేకుండా వాడవాడలా ఘనంగా జరుపుకొనే వేడుక వినాయక చవితి. అందుకే గణపయ్య పండుగ వస్తుందంటే అన్ని ప్రాంతాల్లో నెల రోజుల ముందు నుంచే యువకులు, ఉత్సవ కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు వేగవంతం చేస్తారు. సెప్టెంబర్ 14 నుంచి వినాయక చవితి వేడుకలు ప్రారంభం కానున్నాయి. మరో మూడు వారాలు మాత్రమే సమయం ఉండటంతో.. అనేక ప్రాంతాల్లోని ఉత్సవ కమిటీలు ఏర్పాట్లను మొదలు పెట్టారు. ఒకప్పుడు పెద్ద నగరాల్లోనే వైభవంగా జరిగే వేడుకలు.. ఇప్పుడు అన్ని ప్రాంతాల్లోనూ ఘనంగా జరుగుతున్నాయి. అందువల్ల విగ్రహాల తయారీ కళాకారులు.. గణనాథుడి విగ్రహాలను సర్వ హంగులతో సిద్ధం చేశారు. ఆకర్షణీయమైన రంగులపై ఆసక్తి నేటి యువత ఆకర్షణీయమైన రంగుల్లో ఉండే లంబోదరులను కొలువు దీర్చేందుకు ఇష్టపడుతున్నారు. అందువల్ల కళాకారులు ప్రతి ఏడాది కొత్త డిజైన్లలో విగ్రహాలను తయారు చేస్తున్నారు. ఈ ఏడాది కూడా సరికొత్త డిజైన్లలో విగ్రహాలను వ్యాపారులు అందుబాటులోకి తీసుకొచ్చారు. అలాగే పలు ఉత్సవ కమిటీ ప్రతినిధులు కంప్యూటర్లో గ్రాఫిక్స్ ద్వారా విగ్రహాన్ని రూపొందించి, ఆ తరువాత రంగులు వేయించుకుంటున్నారు. ఉత్సవ కమిటీల ఉత్సాహం వినాయక చవితి పండుగ సమీపిస్తుండటంతో ఉత్సవ కమిటీల్లో ఉత్సాహం ఉరకలేస్తుంది. ఇప్పటికే అనేక ఉత్సవ కమిటీల ప్రతినిధులు విగ్రహాలను బుక్ చేసే పనిలో నిమగ్నమయ్యారు. ఇక ఉత్సవాల నిర్వహణ కోసం వారి ప్రాంతాల్లో చందాలను వసూలు చేస్తున్నారు. అనేక ప్రాంతాల్లో రాత్రి వేళల్లో సాంస్కృతిక కార్యక్రమాల ఏర్పాటు కోసం అడ్వాన్స్లు ఇచ్చి కళాకారులను బుక్ చేసుకుంటున్నారు. మొదలైన విక్రయాలు రాయచోటి పట్టణంలోని పలు ప్రాంతాల్లో విగ్రహాలను అమ్ముతున్నారు. గతంలో కంటే ఈ ఏడాది ధరలు పెరిగాయి. రాయచోటిలో 8 అడుగుల విగ్రహాలు రూ.20 వేల నుంచి 25 వేలు, 10 అడుగుల విగ్రహాలు రూ.28 వేల నుంచి 30 వేలు, 11 అడుగుల విగ్రహాలు రూ.32 వేల నుంచి 40 వేల వరకు పలుకుతున్నాయి. గతేడాది జరిగిన ఉత్సవాల్లో లడ్డూను వేలంలో దక్కించుకున్న వారు కొందరు, కొత్తగా స్వామి వారి మీద మొక్కుబడి ఉన్నవారు కొందరు విగ్రహాలను కొనుగోలు చేస్తుండగా.. ఎక్కువ శాతం ఆనవాయితీగా వస్తున్న చందాల రూపంలో మరి కొందరు విగ్రహాలను కొనుగోలు చేస్తున్నారు. మరో వైపు ఆర్కెస్ట్రాలకు రూ.30 వేల నుంచి 60 వేలు వరకు డిమాండ్ నెలకొంది.


