breaking news
annamayya district Latest News
-
కోడిపందెం స్థావరంపై దాడి
కడప అర్బన్ : కడప నగరం చిన్న చౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఉక్కాయపల్లె సమీపంలోని కంపచెట్లలో నిర్వహిస్తున్న కోడి పందాల స్థావరంపై పోలీసులు దాడులు నిర్వహించారు. ఆదివారం సాయంత్రం కోడిపందాలు ఆడుతున్నట్లు సమాచారం రావడంతో చిన్న చౌక్ సీఐ ఓబులేసు రాజరాజేశ్వర్రెడ్డి ఆధ్వర్యంలో సిబ్బందితో కలిసి దాడులు నిర్వహించారు. 20 మంది యువకులను అదుపులోకి తీసుకొని వారి వద్ద నుంచి రూ.15,500 నగదు, నాలుగు కోళ్లను స్వాధీనం చేసుకున్నారు.బంగారు చైన్ అప్పగింతకడప అర్బన్ : కడప సిటీ చిన్నచౌక్ పోలీస్స్టేషన్ పరిధిలో ఈనెల 13న బీడి కాలనీకి చెందిన శీలం నాగయ్య తన మోటార్ సైకిల్లో ప్రయాణిస్తూ సుమారు రూ.4.5 లక్షల విలువ గల (30.210 గ్రాములు) బంగారు చైన్ ఉన్న బ్యాగ్ను దారి మధ్యలో పోగొట్టుకున్నారు. ఆయన వెంటనే చిన్నచౌక్ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా సీఐ ఎ.ఓబులేసు, ఎస్ఐ ఎన్.రాజరాజేశ్వరరెడ్డి తక్షణమే స్పందించి సీసీ కెమెరాల ఆధారంగా విచారణ చేపట్టారు. బ్యాగ్ ఒక వ్యక్తికి దొరికినట్లు గుర్తించి, అతని నుంచి బంగారు చైన్ ఉన్న బ్యాగ్ను స్వాధీనం చేసుకొని ఆదివారం బాధితుడు శీలం నాగయ్యకు తమ పోలీస్స్టేషన్లో అప్పగించారు. ఈ ఆపరేషన్లో చిన్నచౌక్ సీఐ, ఎస్ఐతోపాటు, పోలీస్ సిబ్బంది పి.ఖాదర్ హుస్సేన్, ఎస్.ప్రదీప్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
బస్సులో సీట్లు ఖాళీ లేవు ప్లీజ్..!
గుర్రంకొండ : ‘బస్సులో సీట్లు ఖాళీగా లేవు ప్లీజ్ వేరే బస్సులు ఎక్కండి.’ ఇదీ ఆర్టీసీ బస్సుల్లో ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా ఆర్టీసీ సిబ్బంది ఇస్తున్న సలహాలు. దీంతో ఉచిత ప్రయాణమైనా తగినన్ని బస్సు సర్వీసులు లేక పోవడంతో మహిళలకు ఆర్టీసీ బస్సుల్లో ఇబ్బందులు తప్పడం లేదు. సంక్రాంతి పండుగ ముగియడంతో పల్లెల నుంచి జనం పట్టణాలవైపు బాట పట్టారు. దీంతో ఆదివారం గుర్రంకొండ బస్టాండు ప్రయాణికులతో కిటకిటలాడింది. నాలుగు మండలాలకు మధ్యలో గుర్రంకొండ పట్టణం ఉండడంతో వందలాది మంది ప్రయాణికులు ఇక్కడి నుంచి రాకపోకలు సాగిస్తుంటారు. ఈ నేపథ్యంలో ఆదివారం సంక్రాంతి పండుగ ముంగించుకొని తిరుగు ప్రయాణాలు చేపట్టడంతో పెద్ద ఎత్తున మహిళలు, ప్రయాణికులు బస్టాండుకు చేరుకొన్నారు. వివిధ మార్గాల్లో ప్రయాణించడానికి గానూ ఆర్టీసీ బస్సుల కోసం వేచి చూడసాగారు. అయితే ఏ బస్సు వచ్చినా సీట్లు లేవు అంటూ ఎక్కించుకోలేదు. దీంతో మహిళలు ఆర్టీసీ సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. గంటల తరబడి బస్టాండులో బస్సుల కోసం వేచి చూస్తున్నా ఒక్క బస్సులో కూడా ఎక్కించుకోకపోవడంతొ ఆవేదన వ్యక్తం చేశారు. రోడ్లపై బస్సుల కోసం వేచి చూసి విసిగి వేశారి పోయారు. తాము అత్యవసర పనిమీద వెళుతున్నాము సీట్లు లేకపోయినా నిలబడి వెళాతము అని బతిమిలాడుకొన్నా ఆర్టీసీ సిబ్బంది ససేమిరా అంగీకరించక పోవడం విమర్శలకు దారితీస్తోంది. దీంతో ఉచిత ప్రయాణం అని బోర్డులు పెట్టనేల, మాకు ఈ కష్టాలు రానేల అంటూ మహిళలు ఉసూరుమని వెళ్లిపోయారు. కాగా కొంతమంది ప్రయివేట్ వాహనాలను ఆశ్రయించి గమ్యస్థానాలకు వెళ్లిపోయారు.ఆర్టీసీ బస్సుల్లో తప్పని పాట్లు -
బ్రహ్మోత్సవ శోభ
తిరుమల తొలిగడపకుకడప రాయుడు కప్పురపు రాయుడయ్యాడు. బ్రహ్మాండ నాయకుడు బ్రహ్మోత్సవ కళను సంతరించుకున్నాడు. పరిసరాలన్నింటికీ కొత్త పరిమళాలను సంతరించి పెట్టాడు. జిల్లాకే తలమానికంగా నిలిచే తిరుమల వాసుని ప్రతిరూపంగా కడప గడపను దివ్యంగా వెలిగిస్తూ ఉత్సవ శోభను కల్పించాడు. నేటి నుంచి పది రోజులపాటు రోజుకో వాహనంపై సూర్యప్రభ తేజంతో వెలిగిపోనున్నాడు. ఆ మహా మంగళమూర్తి బ్రహ్మోత్సవాలు ఒళ్లంతా కళ్లు చేసుకుని చూసినా తనవి తీరదని భక్తులు ఆనంద పరవశులయ్యారు. కడప సెవెన్రోడ్స్: కడప రాయుడు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ సందర్భంగా ఆలయ అర్చకులు మయూరం కృష్ణమోహన్తోపాటు మరికొందరు వేద పండితులు దీక్షా తిరుమంజనం కార్యక్రమాన్ని నిర్వహించారు. తొలుత విశ్వక్సేనునికి పూజ చేసి పుణ్యాహవాచనం నిర్వహించారు. సాయంత్రం అంకురార్పణలో భాగంగా రక్షా కంకణధారణ నిర్వహించారు. అనంతరం పల్లకీలో ఊరేగింపుగా పుష్కరిణి వద్దకు టీటీడీ ఇన్స్పెక్టర్ ఈశ్వర్రెడ్డిల ఆధ్వర్యంలో తరలి వెళ్లారు. అర్చకులు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి మృత్సంగ్రహణం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆ పుట్ట మట్టిని పల్లకీలో ఊరేగింపుగా ఆలయానికి చేర్చి అంకురార్పణ చేశారు. ప్రత్యేక విద్వాంసుల నాదస్వర, మంగళ వాయిద్యాల విన్యాసాలు ఉత్సవాలకు భక్తులను ఆహ్వానించాయి. ఆహ్లాదకర వాతావరణంలో నిర్వహించిన అంకురార్పణ కార్యక్రమాన్ని తిలకించేందుకు విశేష సంఖ్యలో భక్తులు హాజరయ్యారు. టీటీడీ నుంచి వచ్చిన అధికారులు కార్యక్రమాలను స్వయంగా పర్యవేక్షిచారు. ఈ సందర్బంగా టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు బ్రహ్మోత్సవాలలో భక్తిభావాన్ని పెంచడంలో భాగంగా అన్నమాచార్యుల కీర్తనలను ఆలపించి ఆకట్టుకున్నారు. అనంతరం సేనాధిపతి ఉత్సవం నిర్వహించారు. రాత్రి హరికథా కాలాక్షేపం జరిగింది. బ్రహ్మోత్సవాల్లో భాగంగా సోమవారం ఉదయం 10 నుంచి 10.30 గంటల్లోపుగా తిరుచ్చి, ధ్వజారోహణ కార్యక్రమాలను నిర్వహిస్తారు. సాయంత్రం 6 గంటల నుంచి అమ్మవారి సన్నిధిలో ఊంజల సేవ నిర్వహిస్తారు. ఇదే సమయంలో టీటీడీ అన్నమాచార్య ప్రాజెక్టు కళాకారులు స్వామిపై కీర్తనలు ఆలపించనున్నారు. రాత్రి 8 నుంచి 9.00 వరకు చంద్రప్రభ వాహనంపై స్వామిని కొలువుదీర్చనున్నారు. ఆ తర్వాత స్వామి మహిమల గురించి కళాకారులు హరికథ ద్వారా వివరిస్తారు. భక్తిశ్రద్దలతో అంకురార్పణ -
భక్తులతో కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె: ప్రముఖ పుణ్యక్షేత్రంగా విరజిల్లుతున్న బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. గంగమ్మా.. ఆశీర్వదించమ్మా అంటూ పూజలు చేశారు. ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు అమ్మవారి దర్శనం కోసం తరలి వచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేకంగా అలంకరించి దర్శనభాగ్యం కల్పించారు. కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో సిబ్బంది ఉచిత ప్రసాదాలను పంపిణీ చేశారు. పోలీసులు ఎలాంటి అవాంఛనీయసంఘటనలు జరగకుండా చర్యలు తీసుకొన్నారు. -
బద్వేలు టీడీపీలో విభేదాలు బట్టబయలు
● ఎన్టీఆర్ వర్ధంతి సాక్షిగా వర్గపోరు బహిర్గతం ● వేర్వేరుగా కార్యక్రమాల నిర్వహణసాక్షి టాస్క్ఫోర్స్ : బద్వేలు నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీలో మరోసారి వర్గ విభేదాలు బహిర్గతమయ్యాయి. మొన్న సంక్రాంతి సంబరాల పేరుతో అట్లూరు మండలంలో వేరువేరుగా పోటాపోటీగా క్రికెట్ పోటీలు నిర్వహించిన బద్వేలు నియోజకవర్గ టీడీపీ ఇన్చార్జి రితీష్రెడ్డి, డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డిలు.. ఆ ఘటన మరువక ముందే ఆదివారం ఎన్టీఆర్ వర్ధంతి కార్యక్రమాలు రెండు వర్గాలుగా విడిపోయి నిర్వహించడంతో ఆ అంశం చర్చనీయాంశంగా మారింది. కొనసాగుతున్న ఆధిపత్యపోరు బద్వేలు నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొంత కాలంగా ఆధిపత్య పోరు కొనసాగుతోంది. నియోజకవర్గంలోని ఏడు మండలాలతోపాటు మున్సిపాలిటీలో నాయకులు రెండు వర్గాలుగా విడిపోయి ఓ వర్గం రితీష్రెడ్డి చెంత, మరో వర్గం సూర్యనారాయణరెడ్డి చెంత చేరాయి. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర కార్యాలయం నుంచి బద్వేలు నియోజకవర్గ ఇన్చార్జి ఎంపికపై చేపట్టిన ఐవీఆర్ఎస్ కాల్ వ్యవహారంతో అప్పటి వరకు చాపకింద నీరులా కొనసాగుతున్న ఆధిపత్య పోరు బహిర్గతమైంది. ఈ క్రమంలో సూర్యనారాయణరెడ్డికి పార్టీ అధిష్టానం డీసీసీ బ్యాంకు చైర్మన్ పదవిని కట్టబెట్టింది. దీంతో రితీష్రెడ్డికి వ్యతిరేకంగా ఉన్న నియోజకవర్గంలోని పలువురు ద్వితీయశ్రేణి టీడీపీ నేతలు సూర్యనారాయణరెడ్డి చెంతకు చేరారు. సూర్యనారాయణరెడ్డి సైతం అంతర్గతంగా రితీష్రెడ్డి వ్యతిరేక వర్గంతో మద్దతు కూడగట్టుకుంటున్నట్లు సమాచారం. పోటాపోటీగా కార్యక్రమాలు ఇటీవల సంక్రాంతి సందర్భంగా అట్లూరు మండలంలో పోటాపోటీగా వేరువేరుగా క్రికెట్ పోటీలు నిర్వహించిన రితీష్రెడ్డి, సూర్యనారాయణరెడ్డిలు తాజాగా ఎన్టీఆర్ వర్ధంతిని సైతం వేరువేరుగా నిర్వహించారు. తొలుత డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి తన అనుచరవర్గంతో నెల్లూరు రోడ్డులోని ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించగా అనంతరం రితీష్రెడ్డి, విజయమ్మలు తమ అనుచరులతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ప్రస్తుతం నియోజకవర్గ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న వర్గ విభేదాలు ఎంత దూరం వెళతాయో అనే చర్చ నడుస్తోంది. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా అర్బన్ సీఐ లింగప్ప, ఎస్ఐ సత్యనారాయణ తమ సిబ్బందితో బందోబస్తు ఏర్పాటు చేశారు. -
ప్రక్రియ ప్రారంభించాలి
బీటీ కళాశాలను విశ్వవిద్యాలయంగా మార్చే ప్రక్రియను ప్రభుత్వం వెంటనే ప్రారంభించాలి. బీటీసీ ట్రస్టు ఆస్తులను ప్రభుత్వానికి బదలాయించేందుకు సిద్ధంగా ఉంది. యూజీసీ గుర్తింపు కోసం ప్రతిపాదనలు పంపాలి. గత ప్రభుత్వంలో జీవో ఇచ్చింది. మిగతా చర్యలు పూర్తిచేయాలి. –జి.రామదాసు, మాజీ చైర్మన్, బిటి కళాశాల బైపాస్ రోడ్డు కావాలి మదనపల్లెలో ట్రాఫిక్ సమస్య పరిష్కారానికి బైపాస్ రోడ్డు అత్యవసరం. రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి నివేదించి నిధులు తెప్పించాలి. వెంటనే బైపాస్ రోడ్డు నిర్మాణం చేపట్టకుంటే ఇబ్బందులు తప్పవు. జిల్లా కేంద్రం కావడంతో రద్దీ ఎక్కువగా పెరిగింది. –బి.రవికుమార్, మదనపల్లె పీపీపీ వద్దు మదనపల్లె వైద్య కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నడపాలి. గత ప్రభుత్వ నిర్ణయాన్ని అమలు చేయాలి. పీపీపీ వద్దు. ఇప్పటికే రూ.80కోట్లు వెచ్చించి భవనాలు నిర్మించారు. తక్షణమే ప్రభుత్వ ఆధ్వర్యంలో కళాశాల ప్రారంభించి వైద్యులు, సిబ్బందిని నియమించాలి. పేదలకు మెరుగైన వైద్యం అందించాలి. –అనిల్ కుమార్ రెడ్డి, జిల్లా అధ్యక్షుడు, వైఎస్ఆర్సీపీ వైద్య విభాగం నాణ్యమైన విద్య మదనపల్లెలో కేంద్రీయ విద్యాలయ ప్రారంభానికి చర్యలు చేపట్టాలి. అప్పుడే పేద విద్యార్థులకు నాణ్యమైన, ఉన్నతమైన విద్య అందుతుంది. ప్రభుత్వం వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతుల ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలి. –బి.ఈశ్వరయ్య, ఏపీఎస్ఈఆర్సీ మాజీ సభ్యులు -
వైభవం..పల్లకీ ఉత్సవం
రాయచోటి టౌన్: రాయచోటి శ్రీ భధ్రకాళీ సమేతుడికి అమావాస్య పూజల్లో భాగంగా పల్లకీ సేవ నిర్వహించారు. ఆదివారం రాత్రి స్వామి, అమ్మవార్లకు అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అందంగా అలంకరించి పల్లకీలో కొలువుదీర్చారు. ఆలయ మాడవీధులలో ప్రాంగణంలో ఊరేగించారు. అర్చకులు వీరికి తీర్థప్రసాదాలు పంపిణీ చేశారు.ఆలయ ఈవో డీవీ రమణారెడ్డి, భక్తులు పాల్గొన్నారు. బి.కొత్తకోట: పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్పై ఆదివారం సందర్శకుల సందడి నెలకొంది. సంక్రాంతి సెలవులు ముగియడంతో సందర్శకులతో కొండ కిటకిటలాడింది. కర్ణాటక, తమిళనాడుకు చెందిన పర్యాటకులు అధికసంఖ్యలో తరలివచ్చారు. అతిథిగృహాలకు డిమాండ్ పెరిగింది.సందర్శకులు జంతు ప్రదర్శనశాల, మొసళ్ల పార్కు, ప్రకృతి అధ్యయన కేంద్రాలను తిలకిస్తూ సేద తీరారు. అత్యధిక గాలితో ప్రకృతికి పెట్టింది పేరైన గాలిబండపై సందర్శకులు చల్లటిగాలి, ఆహ్లాదరకరమైన వాతావరణం ఆస్వాదించారు. కడప అగ్రికల్చర్: కడప, అన్నమయ్య, చిత్తూరు జిల్లాలకు సంబంధించి 2620 మెట్రిక్ టన్నుల ఎరువులు మంజూరైనట్లు జిల్లా వ్యవసాయ అధికారి బుక్కే చంద్రా నాయక్ తెలిపారు. ఇందులో 2320 మెట్రిక్ టన్నుల యూరియా మరో 300 మెట్రిక్ టన్నుల మ్యూరేట్ ఆఫ్ పోటాష్లు జిల్లా కేంద్రానికి చేరుకున్నాయి. ఇందులో వైఎస్సార్జిల్లాకు సంబంధించి 1660 మెట్రిక్ టన్నుల యూరియాను కేటాయించారు. ఇందులో 1060 మెట్రిక్ టన్నులను ప్రైవేటు డీలర్లకు కేటాయించగా మరో 600 మెట్రిక్ టన్నులను మార్కెఫెడ్కు కేటాయించారు. అన్నమయ్య జిల్లాకు సంబంధించి 200 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 100 మెట్రిక్ టన్నులు ప్రైవేటు డీలర్లకు మరో 100 మెట్రిక్ టన్నులు మార్క్ఫెడ్కు కేటాయించారు. చిత్తూరు జిల్లాకు 460 మెట్రిక్ టన్నులు కేటాయించగా ఇందులో 460 టన్నులను మార్క్ఫెడ్కు కేటాయించారు. -
వ్యక్తిని కాపాడిన యువకుడు
బి.కొత్తకోట : మండలంలోని డేగానిపల్లెకు చెందిన దివ్యాంగుడిని ఓ యువకుడు కాపాడిన ఘటన ఆదివారం సాయంత్రం జరిగింది. దివ్యాంగుడైన ఆంజనేయులు మూడు చక్రాల బండిలో వెళ్తూ ఇందిరమ్మ కాలనీకి సమీపంలో వెళ్తున్న హంద్రీనీవా కాలువలోకి జారిపడ్డాడు. నీటి ప్రవాహంలో కొట్టుకుపోతుండగా స్థానిక యువకులు గుర్తించి కాలువలోకి దిగి కాపాడారు. వాహనం ఢీకొని తీవ్ర గాయాలు మదనపల్లె : మండలంలో ఆదివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో కారు డ్రైవర్ తీవ్రంగా గాయపడ్డాడు. ఆస్పత్రి అవుట్ పోస్టు పోలీసులు తెలిపిన వివరాలు. యనమలవారిపల్లికి చెందిన జి.మోహన్ (47) బైకుపై ఆరోగ్యవరం వద్ద వెళుతుండగా గుర్తుతెలియని వాహనం ఢీ కొట్టి వెళ్లిపోయింది. మోహన్ రెండు కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. బాధితున్ని స్థానిక జిల్లా ఆస్పత్రికి తరలించారు. జూదరుల అరెస్ట్ పుంగనూరు : సంక్రాంతి పండుగ సందర్భంగా మండలంలోని సుగాలిమిట్ట వద్ద పేకాట ఆడుతున్న నలుగురు వ్యక్తులను అరెస్ట్ చేసి, వారి వద్ద నుంచి రూ.33 వేలు నగదు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కేవీ రమణ తెలిపారు. ఆదివారం ముందస్తు సమాచారం మేరకు పోలీసులు వలపన్ని, జూదరులను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి నగదుతో పాటు నాలుగు ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నారు. -
సాక్షి విలేకరిపై దాడికి యత్నం
రాయచోటి : అన్నమయ్య జిల్లా లక్కిరెడ్డిపల్లి మండలం సాక్షి రిపోర్టర్ ముప్పాల లక్ష్మీ నరసింహరాజుపై గుర్తు తెలియని వ్యక్తులు దాడికి ప్రయత్నించారు.ఈ సంఘటనపై ఆదివారం లక్కిరెడ్డిపల్లి పోలీస్ స్టేషన్లో స్థానిక మీడియా మిత్రులతో కలిసి రిపోర్టర్ రాజు ఎస్ఐకు ఫిర్యాదు చేశారు. వివరాలు.. శనివారం(17వ తేదీ) లక్కిరెడ్డిపల్లి లో పని ముగించుకుని రాత్రి 9 గంటల సమయంలో రాయచోటికి వెళుతుండగా మద్దిరేవుల క్రాస్ రోడ్డు వద్ద నల్లటి స్కార్పియో వాహనంలో గుర్తుతెలియని వ్యక్తులు తన వాహనాన్ని వెంబడించినట్లు గుర్తించినట్లు రాజు తెలిపారు. సమీపంలోనే ఏకిలపల్లి గ్రామ రోడ్డుకు ద్విచక్ర వాహనాన్ని మళ్లించి అతివేగంగా గ్రామంలోకి చేరుకున్నానన్నారు. వాహనం వెంబడించి కేకలు వేసుకుంటూ గ్రామం వరకు రావడంతో వారికి కనిపించకుండా తప్పించుకునే ప్రయత్నం చేశానన్నారు. వెంటనే కుటుంబ సభ్యులకు సమాచారం అందించినట్లు ఫిర్యాదులో పేర్కొన్నారు. గతంలో కూడా రెండు పర్యాయాలు తనపై దాడికి ప్రయత్నాలు చేశారన్నారు. తనకు గుర్తుతెలియని వ్యక్తుల వల్ల ప్రాణహాని ఉంది. సిసి పుటేజ్లు పరిశీలించి, విచారించి, వారిని గుర్తించి వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నరసింహరాజు ఫిర్యాదు ద్వారా ఎస్ఐని కోరారు. సాక్షి రిపోర్టర్పై జరిగిన దాడియత్నాన్ని స్థానిక మీడియా మిత్రులు తీవ్రంగా ఖండించారు. దాడిచేసిన వారిని గుర్తించి, వారిపై కేసులు నమోదు చేయాలన్నారు. నీతి నిజాయితీతో వార్తలు రాస్తున్న రిపోర్టర్లకు మద్దతుగా నిలవాలని వారు డిమాండ్ చేశారు. -
మదనపల్లె ఇప్పుడు జిల్లా కేంద్రమైంది.ఈ స్థాయికి తగ్గట్టు అభివృద్ధి హంగులు అద్దితేనే ప్రత్యేకత సంతరించుకుంటుంది. ఇందుకోసం ప్రభుత్వం ప్రత్యేక ప్రణాళికంటూ ఒక ప్రకటన కూడా చేయలేదు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వంలో ప్రభుత్వ వైద్య కళాశాల, కేంద్రీయ విద్యాల
మదనపల్లె: నిన్నటిదాకా మదనపల్లె విద్య,వైద్యంపై కక్షకట్టి నిర్లక్ష్యం చేసిన చంద్రబాబు ప్రభుత్వం ఇక అభివృద్ధి వైపు దృష్టి పెట్టాల్సిన అవసరం ఏర్పడింది. అన్నమయ్యజిల్లాకు మదనపల్లె కేంద్రం కాడవంతో రాజకీయాలు ఆపి..ప్రగతికి బాటలు వేయాలని, వైఎస్సార్సీపీ హయాంలో మంజూరయ్యాయని భేషజాలకు వెళ్లకుండా చిత్తశుద్ధి చూపాలని ప్రజలు కోరుతున్నారు.అలా చేయడం ద్వారా వైఎస్సార్సీపీ పాలనలో రాజంపేట ఎంపీ పీవీ.మిథున్రెడ్డి మంజూరు చేయించిన అభివృద్ధి పనులు మదనపల్లెకు మకుటంగా నిలుస్తాయంటున్నారు. పట్టణ జనాభా పెరగడంతోపాటే, రాకపొకలు సాగించే ప్రజలు నిత్యం వేలల్లో ఉండటంతో మదనపల్లెను అభివృద్ధిలో ముందువరసలో నిలపాల్సిన బాధ్యత ప్రభుత్వంపైనే ఉందని చెబుతున్నారు. ఎంపీ మిథున్రెడ్డి కృషితో మంజూరైన వైద్యకళాశాల, కేంద్రీయ విద్యాలయం, అనిబిసెంట్ విశ్వవిద్యాలయం ముందుకు సాగాల్సి ఉంది. మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ సమస్య పూర్తిగా నివారించే బైపాస్రోడ్డు కోసం చంద్రబాబు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని పట్టణ ప్రజలు విన్నవిస్తున్నారు. వైద్య కళాశాల ప్రభుత్వమే నడపాలి శానిటోరియం వద్ద మదనపల్లెకు 95 ఎకరాల్లో వైద్యకళాశాలను మంజూరు చేసి రూ.475 కోట్లతో వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో పనులు చేపట్టారు. చంద్రబాబు ప్రభుత్వం రాకతో జరిగిన రూ.80 కోట్ల పనులు ఆపేసి పీపీపీ కింద ప్రైవేట్కు ఇచ్చేందుకు టెండర్లు నిర్వహిస్తే ఒక్కటి దాఖలు కాలేదు. సంస్థలు టెండర్లు వేయకపోవడం ప్రజల నిర్ణయాన్ని అంగీకరించినట్టే. ఇప్పటికై నా ప్రభుత్వం వైద్యకళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. అసంపూర్తి పనులను పూర్తి చేయించి పేద విద్యార్థులకు సీట్లు దక్కి వైద్య విద్య అభ్యసించేలా, పేదలకు కార్పోరేట్ వైద్యసేవలు అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని మదనపల్లె ప్రజలు కోరుకుంటున్నారు. కేంద్రీయ విద్య అందించండి మదనపల్లెకు కేంద్రీయ విద్యాలయం మంజూరుకు ఎంపీ మిథున్రెడ్డి కృషి చేశారు. ప్రస్తుత విద్యా సంవత్సరమే తరగతులు ప్రారంభం కావాల్సి ఉండగా చంద్రబాబు ప్రభుత్వం శ్రద్ధ చూపలేదు. దీనిపై తాజాగా కేంద్రీయ విద్యాలయ అధికారులు మదనపల్లెలో తమకు కేటాయించిన భూమిని అప్పగిస్తే వచ్చే విద్యా సంవత్సరం నుంచి తరగతులను ప్రారంభించేందుకు సిద్ధంగా ఉన్నామని కలెక్టర్, ప్రభుత్వానికి లేఖలు రాసినా ఇంకా చలనం లేదు. మదనపల్లె పేద విద్యార్థులకు కేంద్రీయ విద్య వద్దని ప్రభుత్వం అనుకుంటోందా అన్న అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. పరిశ్రమల ఏర్పాటు పేరుతో చవగ్గా భూములు కేటాయిస్తున్న ప్రభుత్వం కేంద్రీయ విద్యాలయం కోసం సిద్దంచేసిన 6.09 ఎకరాల భూమిని ఎందుకు అప్పగించడం లేదో ఇప్పటికి మదనపల్లె ప్రజలకు అర్థంకాని ప్రశ్నగా మిగిలిపోయింది. ఇప్పటికై నా ఈ విద్యాలయం ఎంత అవసరమో గుర్తించి చర్యలు తీసుకుంటే విద్యాపరంగా ఇది మకుటంగా నిలుస్తుంది. ప్రస్తుతానికి విశ్వవిద్యాలయంలేని జిల్లా అన్నమయ్య. జిల్లా కేంద్రమైన మదనపల్లెలో అనిబిసెంట్ విశ్వవిద్యాలయాన్ని ఎంపీ మిథున్రెడ్డి మంజూరు చేయించారు. చంద్రబాబు ప్రభుత్వం దీనిపై చర్యలు చేపట్టాల్సి ఉన్నా ఇంతవరకు ఒక్క అడుగు ముందుకు పడలేదు. మదనపల్లెలో విద్యాపరంగా ప్రైవేట్ కళాశాలలదే పైచేయి. ప్రభుత్వపరంగా విద్యార్థులకు కళాశాలల కొరత ఉంది. అలాగే విశ్వవిద్యాలయం ఏర్పాటు అవసరం ఉంది.అనిబిసెంట్ విశ్వవిద్యాలయం ఏర్పాటుకు అవసరమైన మౌలిక వసతులు, భూమి, భవనాలు బీటీ కళాశాలలో సిద్ధంగా ఉన్నాయి. వీటిని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ప్రభుత్వానికి ఆర్థిక భారం తప్పుతుంది. విశ్వవిద్యాలయం చేస్తామంటూ స్థానిక ఎమ్మెల్యే కూడా పలువేదికలపైన హామీలు ఇచ్చారు. కాని కదలిక ఏమాత్రం లేదు. రోజురోజుకు విస్తరిస్తున్న మదనపల్లె పట్టణానికి బైపాస్రోడ్డు అత్యవసరమైంది. ఈ విషయమై ఎంపీ మిథున్రెడ్డి చొరవ తీసుకున్నారు. అన్నమయ్య సర్కిల్ నుంచి బెంగళూరురోడ్డుకు, అక్కడినుంచి పలమనేరు హైవేరోడ్డు వరకు బైపాస్రోడ్డు నిర్మించాలని కేంద్ర ఉపరితల రవాణాశాఖ మంత్రి నితిన్ గడ్కరికి మిథున్రెడ్డి విన్నవించి వినతి అందించారు. కేంద్రంలోనూ కూటమి ప్రభుత్వమే ఉండటంతో ప్రభుత్వం స్పందించి కేంద్రం నుంచి నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ ఎంపీ మిథున్రెడ్డి చూపుతున్న చొరవను స్థానికులు కొనియాడుతున్నారు. జిల్లా కేంద్రంగా మదనపల్లెను చేయడంతోనే ప్రభుత్వం చేతులు దులుపుకోకుండా అభివృద్ధికి ప్రాధాన్యత ఇవ్వాలని ప్రజలు కోరుతున్నారు. విశ్వవిద్యాలయం, వైద్య కళాశాల, కేంద్రీయ విద్యాలయంపై తక్షణమే చర్య లు ప్రారంభిస్తే ప్రయోజకరమని, మదనపల్లెను ఇవి అగ్రస్థానంలో నిలుపుతాయని అంటున్నారు. మదనపల్లె వైద్య కళాశాలనుప్రభుత్వమే నడపాలి కేంద్రీయ విద్యాలయానికిభూమి అప్పగించాలి విశ్వవిద్యాలయానికి నాంది పలకాలి ఇవన్నీ వైఎస్సార్సీపీప్రభుత్వంలోనే వచ్చాయి కార్యరూపం దాల్చితేనేజిల్లా కేంద్రం అభివృద్ధి -
పెన్నాలోకి దూకి ఆత్మహత్యాయత్నం
సిద్దవటం : పెన్నా నదిలోకి దూకి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. మండల కేంద్రమైన సిద్దవటం హైలెవెల్ వంతెన పైనుంచి ఆదివారం సాయంత్రం కడప నగరంలోని ఎర్రముక్కపల్లి గ్రామానికి చెందిన శిరీష అనే మహిళ పెన్నానదిలోకి దూకి ఆత్మహత్యకు ప్రయత్నించింది. నదిలో నీటిమట్టం తక్కువగా ఉండటంతో బ్రాహ్మణవీధి సమీపంలో సురక్షితంగా ప్రాణాలతో బయటపడింది. ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన మహిళ మాట్లాడుతూ వివాహమై 15 సంవత్సరాలు అయిందని తనకు బిడ్డలు పుట్టలేదని ప్రాణం మీద విరక్తి చెంది ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డానని తెలిపారు. సిద్దవటం ఎస్ఐ మహమ్మద్రఫీ ఆధ్వర్యంలో స్థానిక పోలీసులు ఆ మహిళను విచారణ చేసి వారి బంధువులకు అప్పగించారు. -
సౌమ్యనాథా.. కరుణించు స్వామీ!
● 11వ శతాబ్దంలో ఆలయ నిర్మాణం ● ఎన్నో ఏళ్లుగా జరగని మహాసంప్రోక్షణ ● టీటీడీ దృష్టి సారించాలిదక్షిణ భారతదేశంలో అతి పెద్ద వైష్ణవ ఆలయం నందలూరులోని సౌమ్యనాథాలయం. ఈ ఆలయం 11వ శతాబ్దంలో నిర్మితమైన క్రమంలో అలనాటి చోళరాజులు కాలంలో సంప్రోక్షణ జరిగింది. ఆ తర్వాత సంప్రోక్షణ జరగలేదని చరిత్రకారులు చెపుతున్న మాట. రాజంపేట : నందలూరులో 11వ శతాబ్దంలో చోళరాజులు నిర్మించిన సౌమ్యనాథాలయం ఎంతో ప్రసిద్ధి చెందింది. అభయహస్తం భంగిమలో ఆరు అడుగుల ఒక పెద్ద, నిర్మలమైన విష్ణు విగ్రహం ప్రతిష్టించారు. దేవతలు కట్టిన ఆలయంగా పేరు ప్రఖ్యాతలు పొందింది. ఎర్రని రాతితో నిర్మించారు. స్వామివారి పాదాలను ప్రకాశింప చేసే సూర్యకిరణాలు శాంతికి ప్రతీక. చోళులు నిర్మించిన ఒక ప్రత్యేక నిర్మాణ అద్భుతం. భక్తులను, నిర్మాణ ఔత్సాహికులను ఆకర్షిస్తుంది. 2022లో టీటీడీలోకి విలీనం ఈ ఆలయం కేంద్ర పురావస్తు శాఖ ఆధీనంలో ఉంది. అయితే దేవదాయ శాఖ ఆలయ నిర్వహణను కొనసాగిస్తూ వచ్చింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో తిరుమల తిరుపతి దేవస్థానంలోకి విలీనం చేశారు. 2022 నవంబరు 20న అధికారికంగా టీటీడీ నిర్వహణలోకి ఆలయం చేరింది. 9 శతాబ్దాలకు పైగా కూడా.. ఆలయ పునఃనిర్మాణ తర్వాత, కొన్నేళ్లకు ఒకసారి, ఏదైనా అరిష్టం తొలిగించడానికి మహాససంప్రోక్షణ చేపట్టాలని వేదపండితులు చెబుతున్నారు. దీనివల్ల వైభవం పెరుగుతుంది. దీనిలో అనేక యజ్ఞాలు, పూజలు ఉంటాయి. సంప్రోక్షణ అనేది హిందూ ధర్మంలో అత్యంత పవిత్రమైన కర్మలలో ఒకటిగా వేదపండితులు పేర్కొంటారు. తిరుమల శ్రీవారి ఆలయంలో 12 ఏళ్లకు ఒకసారి అష్టబంధన బాలాలయ మహాసంప్రోక్షణ నిర్వహిస్తుంటారు. కానీ నందలూరు సౌమ్యనాథాలయంలో 9 శతాబ్దాలు అయినా మహాసంప్రోక్షణ చేయకపోవడమే ప్రశ్నార్థకరంగా మారింది. ఈ అంశంపై తిరుమల తిరుపతి దేవస్ధానం కూడా ఆలోచించాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని చరిత్రకారులు అభిప్రాయ పడుతున్నారు. సంప్రోక్షణ అంటే.. సంప్రోక్షణ అంటే దేవాలయాలు, విగ్రహాలు, పవిత్ర వస్తువులు శుద్ధి చేయడానికి, పున ఃప్రతిష్టించడానికి చేసే ఒక ముఖ్యమైన వైదిక కర్మ, దీన్ని మహాసంప్రోక్షణం అని కూడా అంటారు. ఇందులో మంత్రాలు, యజ్ఞాలు, పవిత్ర జలాలతో అభిషేకం చేస్తారు. ముఖ్యంగా తిరుమల వంటి పెద్ద దేవాలయాల్లో నిర్వహిస్తారు. ఇది దేవాలయానికి కొత్త శక్తిని ప్రసాదిస్తుందని నమ్ముతారు. ఇదే ఇప్పుడు అతిపెద్ద వైష్ణవ దేవాలయంలో చేయాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని ఆధ్యాత్మిక వేత్తలు తమ మనోభావాలను వ్యక్తం చేస్తున్నారు. ఆలయంలోని ఆళ్వారులు ఏమయ్యారు.. సౌమ్యనాథాలయంలో వైష్ణవ ఆరాధకులుగా భావిస్తున్న 12 మంది ఆళ్వారుల విగ్రహాలు ఏమయ్యాయన్నది.. అంతుపట్టని ప్రశ్నగా మిగిలిపోయింది. ఆలయంలో పడమర వైపు రాతిపీఠంపై 12 మంది ఆళ్వారులు రాత్రి విగ్రహాలు ఉండేవి. అవి ఇప్పుడు కనిపించడం లేదు. పైయిగయ్ ఆళ్వార్, భరత్ ఆళ్వార్, పేయి ఆళ్వార్, తొండరడిపడి ఆళ్వార్, తిరుపాన్ ఆళ్వార్, తిరుమలై ఆళ్వార్, కూడల్ ఆళ్వార్ తదితర ఆళ్వారులు అనే నామదేయంతో అప్పట్లో ప్రాచుర్యం పొందారు. వీరిలో కులశేఖర్ ఆళ్వార్ ముకుందమనే గ్రంథం రచన చేశారు. ఈ ఆళ్వారులు తమిళ, మళయాల ప్రాంతానికి చెందినవారు. ఆళ్వారు పుట్టిన రోజు నాడు వైష్ణవి ఆలయాల్లో ప్రత్యేక పూజలు జరుగుతాయి. విష్ణుమూర్తి నేరుగా దర్శనం పూర్వం ఆళ్వారు హయాంలో విష్ణుమూర్తి నేరుగా దర్శనిమిచ్చేవారని చరిత్ర చెపుతున్న విశ్వాసం. అట్టి ప్రాధాన్యత కలిగిన ఈ ఆళ్వారులకు తగిన ప్రాచుర్య ఆదరణ లేకపోవడంతో కాలగర్భంలో కలిసిపోయారు. పురాతన చరిత్ర కలిగిన సౌమ్యనాథాలయంలో 12 మంది ఆళ్వారుల విగ్రహాల్లో పది విగ్రహాలు చెక్కు చెదిరిపోయాయి. వీటిని కేంద్రపురావస్తుశాఖ స్వాధీనం చేసుకున్నట్లు మూడు దశాబ్దాల కిందట జరిగిందని స్థానికులు చెపుతున్నారు. వీటిని ప్రతిష్టించడం అటు కేంద్రపురావస్తు శాఖ మరిచిపోయింది. అతిపెద్ద వైష్ణవ ఆలయంలో ఆళ్వారుల విగ్రహామూర్తులు ఉండటం విశేషం. అటువంటి విశేషం ఇప్పుడు కనుమరుగైంది. తిరుమల తిరుపతి దేవస్థానం ఆళ్వారుల విగ్రహాలను పునఃప్రతిష్టించేలా చర్యలు తీసుకోవాల్సిన ఆవశ్యకత ఎంతైనా ఉందని వైష్ణవభక్తులు కోరుతున్నారు.మహాసంప్రోక్షణ చేయాలి తిరుమల తిరుపతి దేవస్థానం నందలూరు సౌమ్యనాథాలయానికి మహాసంప్రోక్షణ చేయాలి. దాదాపు 9 శతాబ్దాలకు పైగా అంటే ఆలయ నిర్మిత ప్రారభంలో మహాసంప్రోక్షణ జరిగి వుంటుంది. అప్పటి నుంచి ఇప్పటి వరకు మహాసంప్రోక్షణ జరగలేదు. ఒంటిమిట్ట రామాలయం తరహాలోనే సౌమ్యనాథాలయంలో కూడా మహాసంప్రోక్షణ చేయాల్సిన బాధ్యత టీటీడీపై ఉంది. ఆ దిశగా టీటీడీ ఈవో అనిల్కుమార్ సింఘాల్ ఆలోచన చేయాలి. – విద్వాన్ గానుగపెంట హనుమంతురావు, శ్రీ సౌమ్యనాథ దివ్వధామం గ్రంథ రచయిత, కడప మరింత శోభ నందలూరు సౌమ్యనాథాలయం మహాసంప్రోక్షణతో మరింత శోభ సంతరించుకుంటుంది. ఈ ఆలయానికి ఇప్పటి వరకు మహాసంప్రోక్షణ జరగలేదు. శతాబ్దాల కిందట ఆలయ నిర్మాణంలో భాగంగా మహాసంప్రోక్షణ జరిగివుండవచ్చు. ఇప్పటి వరకు ఆలయానికి మహాసంప్రోక్షణ జరగలేదనే అంశం భక్తులలో చర్చనీయాంశంగా మారింది. టీటీడీ ఈ విషయంపై ప్రత్యేక దృష్టి సారించాలి. అలాగే కనుమరుగైన ఆళ్వారు విగ్రహాలను పునఃరుద్ధరించాలి. – పోతుగుంట రమేష్నాయుడు, చైర్మన్, శ్రీశైలం దేవస్ధానం -
పుష్పగిరిలో అరుదైన కుడ్యశిల్పం
కడప ఎడ్యుకేషన్ : వల్లూరు మండలం పుష్పగిరిలోని శ్రీలక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ గోడపై యుద్ధాలలో వీరులు కవచం ధరించక పోతే ప్రమాదం తప్పదని తెలిపే కుడ్యశిల్పం సూక్ష్మతి సూక్ష్మమైనదని, అరుదైనదని రచయిత చరిత్రకారుడు బొమ్మిశెట్టి రమేష్ ఆదివారం మీడియాతో తెలిపారు. యోధులు తమ శరీర భాగాలను రక్షించుకోవడానికి ఇనుము, ఉక్కు వంటి లోహాలతో చేసిన రక్షణ దుస్తులను ధరించే వారని ఆయన పేర్కొన్నారు. ద్విచక్ర వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోతే ప్రమాదమని ప్రస్తుతం బాగా ప్రాచుర్యంలోకి తెస్తున్నారని, కొన్ని వందల ఏళ్ల కిందటే ఈ విషయాన్ని శిల్పులు తమ శిల్పకళా నైపుణ్యం ద్వారా ప్రాచుర్యం కల్పించాలని చెప్పారు. ఈ కుడ్య శిల్పంలో ఎడమవైపు ఇద్దరు యుద్ధ వీరులు ఉన్నారని తెలిపారు. ఒక వీరుడు తన కుడి చేతిలో ఖడ్గాన్ని పట్టుకొని నేల మీద ఉంచినట్లుగా, ఎడమ చేతితో మరొక వీరుడి కేశాలను పట్టుకున్నట్లుగా, తన కాళ్లను వంచినట్లుగా చిత్రీకరించారన్నారు. చెవులలో పెద్ద కుండలాలు, ఎడమ చేతిలో కేయూరం ఉందని చెప్పారు. రెండవ యుద్ధ వీరుడు తన కుడి చేతిలో ఉన్న ఖడ్గాన్ని మొదటి యుద్ధ వీరుడి పార్శ్వ ఉదరంలో పొడిచినట్లుగా శిల్పీకరించారని వివరించారు. చేతులలో కేయూరాలు, మురుగులు, యజ్ఞోపవీతం, కంటి, శేరు, చెవులకు పెద్ద కుండలాలు, తల కుడి వైపునకు కొద్దిగా ఉంచినట్లుగా, ఎడమ చేతిని పైకి ఎత్తినట్లుగా ఆనాటి శిల్పులు అద్భుతంగా చెక్కారని తెలిపారు. ఈ వీరులకు పక్కగా కుడివైపు ఒక యుద్ధ సైనికుడు ఉన్నారన్నారు. ఈ సైనికుడు సమపాద స్థానంలో నిలుచుని తన దేహాన్ని మొత్తం కవచంతో కప్పినట్లుగా ఉందని తెలిపారు. కవచంలో నిలువు, అడ్డు గీతలు వాటి మధ్యలో వలయాలను ఉంచారన్నారు. కుడి చేతిని తన ఎదవైపు ఉంచి ఒక ఖడ్గాన్ని భుజం వైపునకు పెట్టుకున్నట్లుగా ఆనాటి శిల్పులు అచ్చేరువు పొందేట్లు చిత్రీకరించారని చెప్పారు. చెవులలో పెద్ద కుండలాలు, తలపై చిన్నపాటి శిరస్త్రాణం ధరించినట్లు ఉందని వివరించారు. -
ప్రాణం మీదికి తెచ్చిన గాలిపటం సరదా
● రెండస్తుల మిద్దైపె నుంచి పడి చిన్నారికి తీవ్ర గాయాలు ● 108 సిబ్బంది సకాలంలో స్పందించడంతో తప్పిన ప్రాణాపాయంకలికిరి : గాలిపటం సరదా ఓ చిన్నారిని ప్రాణాపాయంలోకి నెట్టిన దుర్ఘటన కలికిరి మండలంలో ఆదివారం సాయంత్రం చోటు చేసుకుంది. వివరాలు ఇలా ఉన్నాయి. మండలంలోని గుట్టపాళెం గ్రామం గుట్టపాళెం కస్పాలో మీర్జాఫర్, సలీమా కుమారుడు ఎస్కే జుబేల్(12).. సంక్రాంతి సందర్భంగా ఆదివారం గాలిపటం ఎగురవేయడానికని రెండస్తుల మిద్దైపెకెక్కాడు. గాలిపటం ఎగురవేస్తుండగా ప్రమాదవశాత్తు మిద్దైపెనుంచి కిందపడిపోయాడు. తీవ్ర గాయాలయ్యాయి. గమనించిన తల్లిదండ్రలు 108 వాహనికి సమాచారం ఇవ్వడంతో సిబ్బంది ఈఎంటీ చంద్రబాబు, పైలెట్ సీటీఎం రమణ సకాలంలో స్పందించి చిన్నారి జుబేల్కు ప్రథమ చికిత్స అందిస్తూ 1.10 గంటల్లోనే తిరుపతి స్విమ్స్ ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు సకాలంలో తీసుకురావడంతో చిన్నారికి ప్రాణాపాయం తప్పిందని చెప్పారు. దీంతో చిన్నారి తల్లిదండ్రులు 108 సిబ్బందికి కృతజ్ఞతలు తెలిపారు. ప్రస్తుతం చిన్నారి ఆసుపత్రిలో కోలుకుంటున్నట్లు సమాచారం. -
గడ్డివామి దగ్ధం
ములకలచెరువు : అగ్ని ప్రమాదంలో గడ్డివామి దగ్ధమైన సంఘటన ఆదివారం మండలంలో చోటుచేసుకుంది. బాధితుడి కథనం మేరకు... మండలంలోని మద్దినాయునిపల్లి పంచాయతీ ఎండపల్లెలో డి.ఆదెప్పకు చెందిన గడ్డివామికి గుర్తుతెలియని వ్యక్తులు నిప్పుపెట్టారు. దీనితో పెద్ద ఎత్తున మంటలు ఎగసిపడడంతో స్థానికులు గమనించి బాధితుడికి సమాచారం అందించి మంటలు ఆర్పేందుకు ప్రయత్నించారు. కానీ మంటలకు వరిగడ్డి వామి సగం వరకు కాలి బూడిదయ్యింది. ప్రమాదంలో సుమారుగా 14 ట్రాక్టర్ లోడుల వరిగడ్డి కాలిపోయిందని బాధితుడు వాపోయాడు. టమాటా లారీ బోల్తాపుంగనూరు : పుంగనూరు సమీపంలోని ముంబై జాతీయ రహదారిపై టమాటా లారీ బోల్తా పడిన సంఘటన ఆదివారం జరిగింది. టమాటాల లోడ్డుతో మొలకలచెరువు నుంచి చైన్నెకి వెళ్తున్న లారీ పుంగనూరు సమీపంలోని లక్కుంట వద్దకు రాగానే అదుపుతప్పి బోల్తా పడింది. దీంతో టమాటాలు జాతీయ రహదారిపై పడి సుమారు రూ.2 లక్షల మేరకు నష్టం వాటిల్లింది. ఈ ప్రమాదంలో డ్రైవర్కు స్వల్ప గాయాలయ్యాయి. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. వేడి నీళ్లు పడి చిన్నారికి గాయాలుమదనపల్లె రూరల్ : బకెట్లోని వేడినీళ్లు మీద పడి చిన్నారి గాయపడిన ఘటన ఆదివారం మదనపల్లె మండలంలో జరిగింది. వలసపల్లె పంచాయతీ నవోదయ కాలనీకి చెందిన షబీవుల్లా, మహబూబ్జాన్ దంపతుల కుమారుడు మహమ్మద్ జియాన్(4)ను ప్రతి రోజు స్నానం చేయించేటప్పుడు గోరువెచ్చటి వేడినీటి పాత్రలో కొంతసేపు కూర్చోబెట్టడం అలవాటు చేశారు. ఈ క్రమంలో మహబూబ్జాన్ ఆదివారం ఉదయం మామూలు స్నానానికి నీళ్లు వేడి చేసి బకెట్లో పోసి పెట్టి, మరో గదిలో పని చేసుకుంటుండగా, పక్కనే ఆడుకుంటున్న జియాన్ అలవాటు ప్రకారం తనకు పెట్టిన వేడినీళ్లు అనుకుని పొరపాటుగా వేడినీళ్ల బకెట్లో కూర్చున్నాడు. దీంతో బాలుడి వెనుకభాగం పాక్షికంగా కాలి చర్మం ఊడిపోయింది. దీంతో బాలుడు కేకలు వేయడంతో గమనించిన తల్లిదండ్రులు హుటాహుటిన ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అధికభాగం చర్మం కాలిపోవడంతో ప్రాథమిక చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తల్లిదండ్రులు ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకెళ్లారు. రోల్ఆఫ్పీఎస్ హెచ్ఎం ఉత్తర్వులు రద్దు చేయాలికడప ఎడ్యుకేషన్ : పీఎస్ హెచ్ఎంల అధికారాలకు అనువుగా లేని రోల్ ఆఫ్ పీఎస్ హెచ్ఎం ఉత్తర్వులను రద్దు చేయాలని ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం రాష్ట్ర అధ్యక్షుడు సీవీ ప్రసాద్ డిమాండ్ చేశారు. కడపలోని సీఐటీయూ కార్యాలయంలో ఆదివారం ఏపీ పీఎస్ హెచ్ఎం ఫోరం రాయలసీమ జిల్లాల ప్రతినిధుల సమావేశం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏపీపీఎస్ హెచ్ఎం ఫోరం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షులు సూర్యనారాయణ (సత్య సాయి జిల్లా), రంగారెడ్డి (అనంతపురం జిల్లా), రాష్ట్ర కార్యదర్శులు శ్రీనివాసులు (తిరుపతి జిల్లా), చిట్టిబాబు (చిత్తూరు జిల్లా), కడప జిల్లా శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు సుబ్బారెడ్డి, శ్యాంసుందర్, తిరుపతి, సత్య సాయి జిల్లాల ఫోరం అధ్యక్షులు వెంకట రమణయ్య, షరీఫ్, రాష్ట్ర ఉపాధ్యక్షులు సురేష్, నాగూర్, కడప జిల్లా అసోసియేట్ అధ్యక్షులు ఆదిల్ బాషా, సురేందర్రెడ్డి, వెంకట రమేష్ పాల్గొన్నారు. -
భక్తజనానికి సంబరం!
కడప సెవెన్రోడ్స్: తిరుమలేశుడి సన్నిధికి ఆయన క్షేత్రమే తొలిగడప. ఇక్కడ మొక్కులు చెల్లిస్తే తిరుమల వెంకన్నకు చెందుతాయని భక్తుల్లో గొప్ప నమ్మకం. జిల్లా ప్రజలు ఆయనను తమ ఆరాధ్య దైవంగా తరతరాలుగా సేవిస్తున్నారు. ఈ ఆలయానికి అనేక చారిత్రక విశేషాలు ఉన్నాయి. జిల్లాలో జరిగే అతి పెద్ద తిరునాల ఉత్సవంగా ఈ బ్రహ్మోత్సవాలకు పేరుంది. మరి ఇంతటి ఘనచరిత కలిగిన స్వామికి బ్రహ్మోత్సవాలంటే ఊరంతా ఉత్సాహంగా ఉండడం సహజమే కదా! ● ఆదివారం నుంచి ఈ నెల 28వ తేదీ వరకు దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు జరగనున్నాయి. శ్రీ లక్ష్మీ వెంకటేశ్వరుడిగా, కడప రాయుడిగా భక్తులచే కొనియాడబడే ఆయన బ్రహ్మోత్సవాలంటే జిల్లా వాసుల్లో ఎనలేని ఉత్సాహం ఉంటుంది. వారం రోజులపాటు ప్రతిరోజు ఓ అలంకారంలో తమ ఇష్టదైవాన్ని చూసుకోవాలని ఆశ పడతారు. మరీ ముఖ్యంగా కల్యాణోత్సవం నాడు కళ్లింతలుగా చేసుకుని స్వామి, అమ్మవార్లను మనసారా దర్శించుకుంటారు. రథోత్సవం నాడు స్వామి సాక్షాత్తు ఆకాశం నుంచే దర్శనమిస్తున్నాడని భావిస్తూ రథంపైనున్న స్వామికి రెండు చేతులెత్తి గోవిందనామ స్మరణలు చేస్తూ దర్శించుకుంటారు. నేటి నుంచి ఉత్సవాలు తిరుమలకు తొలిగడపగా భక్తులు భావించే దేవునికడప శ్రీ లక్ష్మి వెంకటేశ్వరస్వామి ఆలయ వార్షిక బ్రహ్మోత్సవాలు ఆదివారం సాయంత్రం అంకురార్పణతో శాస్త్రోక్తంగా ప్రారంభం కానున్నాయి. ఈ వారం రోజులపాటు విశేష పూజోత్సవాల నిర్వహణకోసం స్థానిక అర్చక బృందం సిద్దమైంది. ఇప్పటికే ఆలయాన్నంతా కన్నుల పండువగా అలంకరించారు. రంగురంగుల ముగ్గులు తీర్చారు. ఆలయంతోపాటు దేవునికడప గ్రామమంతా విద్యుద్దీపాలను అలంకరించారు. ఇటు కృష్ణాసర్కిల్ వరకు రోడ్డుకు ఇరువైపుల సీరియల్ సెట్లు అలంకరించి ఆలయం నుంచి మైక్ సెట్లను ఏర్పాటు చేశారు. ఆలయంలో జరుగుతున్న పూజోత్సవాల గురించి వీటి ద్వారా నగర వాసులకు నేరుగా ప్రసారం అయ్యే అవకాశం కల్పించారు. భక్తుల సౌకర్యం కోసం ఈ సంవత్సరం దేవునికడప తిరునాలను టీటీడీ అధికారులు ఘనంగా నిర్వహించేందుకు సిద్దమయ్యారు. జేఈఓ వీరబ్రహ్మం శనివారం ఉదయం ఆలయాన్ని సందర్శించి ఉత్సవాల నిర్వహణపై అవసరమైన సూచనలు చేశారు. బ్రహ్మోత్సవాల నేపధ్యంలో దేవునికడప గ్రామమంతా ఉత్సవ శోభతో కళకళలాడుతోంది. ఉత్సవాల సందర్భంగా రథోత్సవం నాడు స్వామి వారిని కొలువుదీర్చేందుకు తేరును కూడా అందంగా ముస్తాబు చేసి సిద్ధం చేశారు. ఉత్సవ పూజలు నిర్వహించేందుకు అర్చక బృందం సన్నాహాలు చేస్తోంది. -
గణతంత్ర వేడుకలకు కడప కళాకారిణి
కడప సెవెన్రోడ్స్: ఢిల్లీలోని ఎర్రకోటలో ఈనెల 26వ తేది జరిగే గణతంత్ర దిన వేడుకల్లో భాగంగా నిర్వహించనున్న సాంస్కృతిక కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం కడప కూచిపూడి కళాకారిణి మూలి పల్లవికి దక్కింది. ఆంధ్ర రాష్ట్రం నుంచి 30 మంది కూచిపూడి కళాకారులను భారత సాంస్కృతిక శాఖ ఎంపిక చేయగా, అందులో వైఎస్సార్ కడపజిల్లా నుంచి పల్లవి ఎంపికయ్యారు. కడప నగరం శంకరాపురానికి చెందిన ఆమె భారత సాంస్కృతికశాఖ ఆహ్వానం మేరకు ఢిల్లీకి చేరుకుని భారత వ్యవసాయ పరిశోధన సంస్థ, సంగీత నాటక అకాడమి కేంద్రాల్లో ప్రత్యేక సాధన చేస్తున్నారు. తిరుపతి సిటీ: స్థానిక వరదరాజ నగర్లోని విశ్వం టాలెంట్ స్కూల్ ప్రాంగణంలో విశ్వం సైనిక్, నవోదయ ప్రవేశ పరీక్షల– 2026 బ్రోచర్ను ఎమ్మెల్సీ రామచంద్రరెడ్డి, విశ్వం విద్యా సంస్థల అధినేత డాక్టర్ విశ్వనాథరెడ్డి, అకడమిక్ డైరెక్టర్ ఎన్.విశ్వచందన్ రెడ్డి, ఎన్.విశ్వశ్రీ ఆవిష్కరించారు. శనివారం పాఠశాలలో జరిగిన ఈ కార్యక్రమంలో ఎమ్మెల్సీ మాట్లాడుతూ 2025 సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్ష ఫలితాల్లో రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకుతోపాటు 63 సీట్లు, అలాగే నవోదయ విద్యాలయ ప్రవేశ పరీక్షల్లో 69 సీట్లు సాధించి విశ్వం విద్యాసంస్థ రికార్డు సృష్టించడం గర్వించదగ్గ విషయమన్నారు. గత 35 ఏళ్లుగా సైనిక్, నవోదయ స్కూల్ వంటి జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాష్ట్ర, జాతీయ స్థాయిలో అగ్ర ర్యాంకులు సాధిస్తూ విద్యార్థులను తీర్చిదిద్దడంలో విశ్వం విద్యా సంస్థలు ప్రత్యేక గుర్తింపు పొందాయని కొనియాడారు. అనంతరం డాక్టర్ ఎన్ విశ్వనాథరెడ్డి మాట్లాడుతూ సైనిక్ స్కూల్ ప్రవేశ పరీక్షల్లో 46 రాష్ట్ర స్థాయి ప్రథమ ర్యాంకులతోపాటు మొత్తం 967 సీట్లు సాధించడం శిక్షణ రంగంలో ఒక అరుదైన రికార్డు అని పేర్కొన్నారు. సైనిక్, నవోదయ, మిలిటరీ స్కూల్ ప్రవేశ పరీక్షలపై మరింత సమాచారం కోసం 86888 88802, 93999 76999 ఫోన్ నంబర్లను సంప్రదించాలని సూచించారు. పెద్దతిప్పసముద్రం: ప్రతి సోమవారం ప్రజల నుంచి వచ్చే పీజీఆర్ఎస్ ఫిర్యాదులపై అధికారులు అలసత్వం వీడాలని.. ఫిర్యాదుదారులను నిత్యం కార్యాలయాల చుట్టూ తిప్పుకోకుండా సకాలంలో సమస్యలు పరిష్కరించి రైతాంగ ప్రజల మన్ననలు పొందాలని కలెక్టర్ నిశాంత్కుమార్ అధికారులకు సూచించారు. శనివారం కలెక్టర్ మండలంలోని కాట్నగల్లు గ్రామ సచివాలయాన్ని తనిఖీ చేశారు. సచివాలయంలోని హాజరు పట్టిక, వీఆర్వోకు సంబంధించిన రిజిస్టర్ను తనిఖీ చేశారు. రీసర్వేకు సంబంధించిన రికార్డులను క్షుణ్ణంగా పరిశీలించారు. పెండింగ్లో ఉన్న పీజీఆర్ఎస్ ఫిర్యాదులను చూసి అధికారులను ప్రశ్నించారు. ఈ సందర్బంగా కలెక్టర్ అధికారులనుద్దేశించి మాట్లాడుతూ సచివాలయం ద్వారా అందుతున్న ప్రభుత్వ సేవలపై ప్రజలకు అవగాహన కల్పించాలన్నారు. అనంతరం ప్రజల నుంచి ఫిర్యాదులను అందుకున్నారు. తమ గ్రామంలో అంబేడ్కర్ భవన్, కమిటీ హాల్ మంజూరు చేయాలని దళితులు కలెక్టర్కు విన్నవించారు. తహశీల్దార్ శ్రీరాములు నాయక్, డీటీ విద్యాసాగర్, ఎంపీడీఓ ప్రతాప్రెడ్డి ఉన్నారు. -
మేకలవారి ఇంట.. ఉద్యోగాల పంట
పీలేరు : రొంపిచెర్ల మండలం పెద్దగొట్టిగల్లు పంచాయతీ మేకలవారిపల్లె, కొండారెడ్డిగారిపల్లెలో మేకలవారి కుటుంబంలో సుమారు 50 మంది వివిధ ఉద్యోగాలు కలిగి ఉన్నారు. శనివారం స్థానిక ఎస్వీఎస్ఎస్ కల్యాణ మండపంలో మేకల వారి కుటుంబ సభ్యుల ఆత్మీయ సమా వేశం నిర్వహించారు. మేకలవారి కుటుంబ సభ్యుల్లో ట్రాన్స్కో, బీఎస్ఎన్ఎల్, సాఫ్ట్వేర్ ఉద్యోగులు, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, టీచర్లుగా, పోలీసులుగా ఉద్యోగం చేస్తున్నారు. కష్టసుఖాల్లో అందరూ పాలుపంచుకునే విధంగా ఈ ఆత్మీయ సమావేశం ఏర్పాటు చేసినట్లు నిర్వాహకులు తెలిపారు. -
శతాధిక విశ్రాంత హెచ్ఎం మృతి
పుంగనూరు : శతాధిక సంవత్సరాలు పూర్తి చేసుకున్న బోర్డు స్కూల్ విశ్రాంత హెచ్ఎం డీడీ బ్లెస్సింగ్స్(101) అనారోగ్యంతో శనివారం వేకువజామున మృతి చెందారు. విషయం తెలిసిన వెంటనే రాష్ట్ర మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు. శతాధిక సంవత్సరాలు పూర్తి చేసుకుని వేలాది మందికి విద్యనేర్పిన ఉపాధ్యాయురాలు మృతి చెందడం కలచివేసిందన్నారు. కాగా పట్టణంలోని చర్చి వీధిలో నివాసం ఉన్న ఆమె గత రెండు రోజుల క్రితం అనారోగ్యానికి గురయ్యారు. కుటుంబ సభ్యులు ఆమెను వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తరలించారు. ఆమె చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈమెకు కుమార్తెలు, అల్లుళ్లు, మనవళ్లు, మనవరాళ్లు ఉన్నారు. ఆమె శిష్యబృందం పలువురు హాజరై భౌతికకాయానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఆమె అంత్యక్రియలు సాయంత్రం కన్నీటి వీడ్కోలుతో నిర్వహించారు. ఆమె మృతి పట్ల మాజీ ఎంపీ రెడ్డెప్ప, మున్సిపల్ చైర్మన్ అలీమ్బాషా, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి కొండవీటి నాగభూషణం, ఎంపీపీ అక్కిసాని భాస్కర్రెడ్డి, జిల్లా వక్ఫ్బోర్డు మాజీ చైర్మన్ అమ్ముతోపాటు పలువురు క్రైస్తవ మతపెద్దలు సంతాపం తెలిపారు. ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరికి గాయాలురొంపిచెర్ల : రెండు ద్విచక్ర వాహనాలు ఢీకొని ఒకరు తీవ్రంగా గాయ పడిన సంఘటన రొంపిచెర్ల తహసీల్దార్ కార్యాలయం ఎదుట శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. చెంచెంరెడ్డిగారిపల్లె గ్రామ పంచాయతీ లంకిపల్లెవారిపల్లెకు చెందిన శివయ్య(32) ద్విచక్ర వాహనంలో రొంపిచెర్లకు వెళ్లి తిరిగి స్వగ్రామం లంకిపల్లెవారిపల్లెకు పయనమయ్యాడు. రొంపిచెర్లకు చెందిన గిరి చెంచెంరెడ్డిగారిపల్లెకు పని మీద వెళ్లి తిరిగి రొంపిచెర్లకు వెళ్తున్నారు. ఈ క్రమంలో వీరిద్దరి వాహనాలు ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో శివయ్య కుడి కాలు విరిగింది. దీంతో స్థానికులు 108కు సమాచారం ఇవ్వడంతో చికిత్స కోసం అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అక్కడ పరీక్ష చేసి మెరుగైన చికిత్స కోసం తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. శివయ్య భార్య స్వరూప ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నాట్లు ఎస్ఐ మధుసూథన్ తెలిపారు. లారీ ఢీకొని..మదనపల్లె రూరల్ : లారీ ఢీకొని ఓ వ్యక్తి తీవ్రంగా గాయపడిన ఘటన శనివారం మదనపల్లెలో జరిగింది. బాబూకాలనీకి చెందిన డ్రైవర్ శంకరయ్య(65) వ్యక్తిగత పనులపై నీరుగట్టువారిపల్లె టమాటా మార్కెట్ వద్దకు వెళ్లాడు. తిరిగి ఇంటికి వచ్చేందుకు ద్విచక్రవాహనంలో మార్కెట్యార్డులో నుంచి బయటకు వచ్చి రోడ్డు దాటుతుండగా, వేగంగా వచ్చిన లారీ ఢీకొంది. గమనించిన స్థానికులు బాధితుడిని ఆస్పత్రికి తరలించారు. వన్టౌన్ పోలీసులు విచారణ చేస్తున్నారు.మాజీ మంత్రి పెద్దిరెడ్డి సంతాపం -
గెనుసుగడ్డల సాగు .. మిగిలింది బెంగే
● పది రోజుల్లో సగానికిపైగా పడిపోయిన ధరలు ● సాగు పెట్టుబడి వచ్చేది కూడా అనుమానమే ● ముఖం చాటేస్తున్న వ్యాపారులుగుర్రంకొండ : ఈ ఏడాది గెనుసుగడ్డల(చిలకడ దుంప) సాగు రైతులకు బెంగే మిగిలింది. టమాటా, కూరగాయాలు, పూల సాగుతో నష్టపోయిన రైతులకు ప్రస్తుతం గెనుసుగడ్డల సాగు నష్టాలను మిగిల్చింది. జిల్లాలో ఈ ఏడాది గెనిసిగడ్డల సాగు విస్తారంగా చేపట్టారు. పది రోజుల క్రితం కిలో గడ్డలు రూ.17 వరకు ధరలు పలికాయి. అయితే ఒక్కసారిగా ధరలు పతనమై ప్రస్తుతం మార్కెట్లో కిలో గెనిసిగడ్డలు ధర కిలో రూ. 8.30 వరకు పలుకుతున్నాయి. ఈ ఏడాది పంట సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా వచ్చేది అనుమానంగా మారింది. దీంతో రైతులు లబోదిబోమంటున్నారు. జిల్లాలో 1850 ఎకరాల్లో సాగు జిల్లాలోని పడమటి ప్రాంతాల రైతులు 1850 ఎకరాల్లో ఈ ఏడాది గెనుసుగడ్డల సాగు చేపట్టారు. గెనుసుగడ్డల సాగుకు రబీ సీజన్ అనుకూలం. పంటను సాగు చేసి ప్రస్తుతం కోతలు కోస్తున్నారు. సాధారణంగా అక్టోబర్ నుంచి జనవరి వరకు గడ్డలసాగు ఉంటుంది. దుక్కుల దగ్గర నుంచి తీగెల నాటడం, ఎరువులు, కూలీలు, పంట చేతికొచ్చే వరకు మొత్తం సాగు ఖర్చు రూ.80 వేల వరకు ఉంటుంది. చీడపీడలు, రసాయనిక ఎరువుల వాడకం ఖర్చులు తక్కువగా ఉంటాయి. కూలీల అవసరం ఎక్కువగా ఉండదు. మొదట గెనుసుగడ్డల తీగెలు నాటే సమయంలోనూ, ఆ తరువాత పంట అదనుకొచ్చిన తరువాత గడ్డల పొలంలో నుంచి గడ్డలు తవ్వి బయటకు తీసేందుకు మాత్రమే కూలీల అవసరం ఉంటుంది. సాగుకు పెట్టుబడి ఖర్చు తక్కువగా ఉన్న పంట ఇదే కావడం గమనార్హం. ఈ ఏడాది దిగుబడి అంతంత మాత్రమే ఈ ఏడాది గెనుసుగడ్డల సాగు దిగుబడి అంతంత మాత్రంగానే ఉంది. ఎకరం పంటకు సాధారణంగా 11 నుంచి 13 టన్నుల వరకు దిగుబడి వస్తుంది. వాతావరణ పరిస్థితులు అనుకూలించకపోవడంతోపాటు అకాల వర్షాల కారణంగా పంట దిగుబడి బాగా తగ్గిపోయింది. వీటితోపాటు వైరస్లు సోకడంతో పలు మండలాల్లో దిగుబడి అంతంత మాత్రంగానే వచ్చింది. సగటున 6.70 నుంచి 8 టన్నుల వరకే దిగుబడి రావడం గమనార్హం. వీటిని గోనెసంచుల్లో నింపి మార్కెట్లకు తరలిస్తుంటారు. ఒక గోనెసంచిలో 65 కిలోల గెనుసుగడ్డల నింపుతారు. ఎకరానికి ప్రస్తుతం 103 నుంచి 135 గోనెసంచుల వరకు గడ్డల దిగుబడి వచ్చిది. గతంలో అయితే ఎకరానికి 160 నుంచి 200 గోనె సంచుల గడ్డల దిగుబడి వచ్చేది. గత ఏడాదితో పోల్చితే ఈ ఏడాది 25 నుంచి 35 శాతం మేరకు పంట దిగుబడి తగ్గిపోయింది. ప్రస్తుతం కిలో ధర రూ.7.50 నుంచి రూ.8.30 పది రోజుల వ్యవధిలోనే మార్కెట్లో గెనుసుగడ్డల ధరలు సగానికి పడిపోవడంతో రైతులు లబోదిబోమంటున్నారు. పది రోజుల కిందట మార్కెట్లో కిలో గడ్డల ధర రూ.16 నుంచి రూ.17 వరకు పలికాయి. మొదటి రకం గడ్డలు కిలో ధర రూ.17, రెండవ రకం రూ.15, మూడవ రకం కిలో రూ.13 వరకు ఽమార్కెట్లో ధర పలికాయి. అయితే మార్కెట్లో గెనిసి గడ్డల ధరలు ఒక్క సారిగా కుప్పకూలిపోయాయి. ప్రస్తుతం కిలో గడ్డల ధర రూ.8.30 లోపే ఉండటం గమనార్హం. ఈ లెక్కన ఎకరాకు రూ.56 వేల నుంచి రూ.70 వేల వరకు ఆదాయం వస్తుంది. దీంతో పంట సాగు, పెట్టుబడి ఖర్చు లెక్కిస్తే రైతుకు నష్టాలే మిగిలుతున్నాయి. వీటికితోడు మార్కెట్కు తరలించడానికి అయ్యే రవాణా ఖర్చు, కమీషన్లు లెక్కిస్తే రైతులు భారీగానే నష్టపోతున్నారు. అడ్వాన్స్లు ఇచ్చినా.. ప్రస్తుతం గెనుసుగడ్డల ధరలు పతనం కావడంతో వ్యాపారులు ముఖం చాటేస్తున్నారని రైతులు ఆరోపిస్తున్నారు. మార్కెట్లో గడ్డల ధరలు ఆశాజనకంగా ఉంటే వ్యాపారులు రైతుల పొలాల వద్దకు వచ్చి ముందుగా అడ్వాన్స్లు చెల్లిస్తారు. ఎకరానికి రూ.10 వేల నుంచి రూ.15 వేల వరకు వ్యాపారులు అడ్వా న్స్లు చెల్లిస్తుంటారు. పది రోజుల క్రితం వరకు జిల్లాలో ఇదే తంతు కొనసాగింది. ప్రస్తుతం సగానికిపైగా ధరలు తగ్గిపోవడంతో మార్కెట్లో గడ్డలకు డిమాండ్ తగ్గిపోయింది. దీంతో వ్యాపారులు అడ్వా న్స్లు చెల్లించినా గడ్డల కొనుగోలు పొలాల వైపు రాలేదని రైతులు అంటున్నారు. కొంత మంది రైతు లు రోజుల తరబడి వ్యాపారులను అడుక్కొంటూ బలవంతంగా గడ్డలు కట్టబెడుతుండడం గమనార్హం. పది రోజుల క్రితం కుదుర్చుకొన్న ధరలు కాకుండా ప్రస్తుతం మార్కెట్లో ఉన్న ధరల కంటే కూడా తక్కువకే రైతులు వ్యాపారులకు ఇచ్చేస్తున్నారు. మరి కొంత మంది రైతులు వ్యాపారులు రాకపోవడంతో తామే స్వయంగా బెంగుళూరు మార్కెట్కు గడ్డలను తీసుకెళ్లాల్సిన పరిస్థితి నెలకొంది. బయటి రాష్ట్రాలకు తరలుతున్న గడ్డలు జిల్లాలోని పడమటి ప్రాంతాల్లో సాగు అయ్యే గెనుసుగడ్డలు బయటి రాష్ట్రాలకు ఎగుమతి చేస్తున్నారు. ప్రస్తుతం గెనుసుగడ్డలను బెంగళూరు, తమిళనాడు, మహారాష్ట్ర, ఢిల్లీ మార్కెట్లకు తరలిస్తున్నారు. మన రాష్ట్రంలో కడప, తిరుపతి, గుంటూరు, విజయవాడ పట్టణాల్లోని మార్కెట్లకు తరలిస్తుంటారు. బయటి రాష్ట్రాల నుంచి కొంత మంది వ్యాపారులు ఇక్కడికి వచ్చి పొలాల దగ్గరే గెసిగడ్డలను రైతుల నుంచి కొనుగోలు చేసి తరలిస్తుంటారు. గ్రీసు తయారీలో వినియోగం ఇక్కడ సాగు చేసే గెనుసుగడ్డలను ఉత్తరాది రాష్ట్రాల్లో గ్రీసు తయారీలో ఎక్కువగా వినియోగిస్తుంటారు. బయటి రాష్ట్రాల్లోని మార్కెట్లలో గెనిసిగడ్డలను తినడానికి వినియోగంచడంతోపాటు గ్రీసు తయారీకిగానూ ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు. అన్ని రకాల వాహనాలకు అవసరమైన అన్ని రకాల గ్రీసు తయారీలో వీటిని వినియోగిస్తుండడం గమనార్హం. దీంతో పలు రాష్ట్రాలకు చెందిన ఫ్యాక్టరీ యాజమానులు వ్యాపారుల ద్వారా గెనిసిగడ్డలను కొనుగోలు చేసి ఫ్యాక్టరీలకు తరలిస్తుంటారు.నష్టాలే మిగిలాయి ఈ ఏడాది గెనుసుగడ్డల సాగుతో మాకు నష్టాలే మిగిలాయి. ఎకరం పొలంలో గెనుసుగడ్డల పంట సాగు చేశాను. ఎకరానికికంతా కలిపి 103 సంచుల దిగుబడి వచ్చింది. చిన్నసైజు గడ్డలను వ్యాపారులు వద్దనడంతో పక్కనే పారబోశాము. మార్కెట్లో ఇప్పుడున్న ధరలు చూస్తే బాధగా ఉంది. గత నెలలో ధరలు బాగుండేవి. ఇప్పుడు ఒక్కసారిగా ధరలు పడిపోవడంతో దారుణంగా నష్టపోతున్నాము. కనీసం పంట సాగుకు ఖర్చు చేసిన పెట్టుబడి కూడా వచ్చే పరిస్థితి కనిపించడం లేదు. –అన్నయ్య, రైతు, సంగసముద్రంవ్యాపారులు రావడం లేదు గెనుసుగడ్డలు కొనడానికి వ్యాపారులు రావడం లేదు. పది రోజుల కిందట అడ్వాన్స్లు ఇచ్చినా ఇప్పుడు గడ్డలను తీసుకెళ్లడానికి ఇష్టపడడం లేదు. ఎన్నోమార్లు బతిమిలాడితేగానీ వ్యాపారులు వచ్చి గడ్డలను మార్కెట్కు తీసుకెళ్లడం లేదు. పది రోజులు ముందు కుదుర్చుకొన్న ధరల కంటే చాలా తక్కువకే గడ్డలను వ్యాపారులకు ఇవ్వాల్సిన పరిస్థితి నెలకొంది. ఇదేమిటని ప్రశ్నిస్తే వ్యాపారులు గడ్డలు కొనడానికి రావడం లేదు. – మల్లికార్జున, రైతు, కొత్తపల్లె -
విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో గుడిసె దగ్ధం
చౌడేపల్లె : విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో పూరి గుడిసె దగ్ధమైన సంఘటన మండలంలోని కాగతి పంచాయతీ పలగార్లపల్లెలో శుక్రవారం అర్ధరాత్రి జరిగింది. బాధితురాలి కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామానికి చెందిన రెడ్డెమ్మ పూరి గుడిసెలో నివసిస్తోంది. కుటుంబంలోని ఓ వ్యక్తికి చెందిన ల్యాప్టాప్కు చార్జింగ్ పెట్టారు. కాసేపటి తరువాత విద్యుత్ వైర్ల షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగి పూరిగుడిసెకు నిప్పంటుకుంది. ఆ సమయానికి ఇంటిలో ఎవరూ లేకపోవడంతో పెనుప్రమాదం తప్పింది. ఇంటిలోని సామగ్రితోపాటు ల్యాప్టాప్ అగ్నికి కాలి ధ్వంసమైంది. ఈ ఘటనలో సుమారు లక్ష మేరకు ఆస్తి నష్టం వాటిల్లినట్లు బాధితురాలు తెలిపింది. ప్రభుత్వం ఆదుకోవాలని బాధితురాలు కోరారు. గుర్తు తెలియని వృద్ధుడు మృతిరాయచోటి టౌన్ : రాయచోటి పట్టణ శివార్లలో గుర్తు తెలియని వృద్ధుడు మృతి చెందినట్లు అర్బన్ సీఐ బీవీ చలపతి తెలిపారు. ఆయన కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. శనివారం సాయంత్రం రాయచోటి పట్టణ సమీపంలోని గున్నికుంట్ల రోడ్డుకు దగ్గరగా ఇనాత్ఖాన్ చెరువు సమీపంలో కంపచెట్ల మధ్యలో గర్తు తెలియని వ్యక్తి మృతి చెందినట్లు స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. వెంటనే తన సిబ్బందితో కలసి సంఘటనా స్థలానికి వెళ్లి మృతుడిని పరిశీలించారు. మృతుడికి సుమారు 65–70 సంవత్సరాల మధ్య వయసు ఉండవచ్చుని అంచనా వేస్తున్నారు. సంఘటన స్థలాన్ని బట్టి రెండు రోజుల క్రితమే మృతి చెందినట్లుగా అనుమానిస్తున్నారు. ఉన్న ఆధారం ప్రకారం ఎవరైనా ఆచూకీ చెప్పాలని కోరారు. సెల్ నంబర్ 9121100559/9121100560/9121100561లకు ఫోన్ చేయవల్సిందిగా సూచించారు. డ్రైనేజీలో పడి వృద్ధుడికి గాయాలురొంపిచెర్ల : డ్రైనేజీ కాలువలో పడి వృద్ధుడికి తీవ్ర గాయాలైన సంఘటన చైన్నై–అనంతపురం హైవేలోని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులో శనివారం రాత్రి జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. రొంపిచెర్ల మండలం బోడిపాటివారిపల్లె గ్రామ పంచాయతీ మెడసానివారిపల్లెకు చెందిన దొరస్వామి నాయుడు(70) పని మీద తిరుపతికి వెళ్లి తిరిగి రొంపిచెర్ల క్రాస్ రోడ్డులోని బస్స్టాప్ వద్ద బస్సు దిగాడు. హైవేలో అండర్ పాస్ దాటుకుని రొంపిచెర్లకు వెళ్లుతూ విద్యుత్ దీపాలు వెలగక పోవడంతో రోడ్డు పక్కన ఉన్న డ్రైనేజీ కాలువలో పడ్డారు. దీంతో చూట్టు పక్కల వారు చూసి కాలువ నుంచి బయటకు తీశారు. తీవ్రంగా గాయ పడిన దొరస్వామి నాయుడును 108లో చికిత్స కోసం అన్నమయ్య జిల్లా పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. నేషనల్ హైవేలో విద్యుత్ లైట్లు వెలగడం లేదని, దీంతో నిత్యం ప్రమాదాలు జరుగుతున్న అధికారులు పట్టించుకోవడం లేదని ప్రజలు ఆరోపించారు. అధికారులు వెంటనే తగు చర్యలు తీసుకుని రొంపిచెర్ల క్రాస్ రోడ్డులోని హైవేలో విద్యుత్ దీపాలను ఏర్పాటు చేయాలని వారు కోరారు. పీలేరు రూరల్ : అనుమానాస్పద స్థితిలో యువకుడు మృతి చెందిన సంఘటన పీలేరు మండలం బోడుమల్లువారిపల్లె పంచాయతీ గాండ్లపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలా వున్నాయి. శుక్రవారం సాయంత్రం గాండ్లపల్లె దళితవాడ సమీపంలోని కాటంరాజు వద్ద సంక్రాంతి కనుమ పండుగ నిర్వాహించారు. ఈ ప్రాంతంలో గుర్తుతెలియని యువకుడు అనుమానాస్పద స్థితిలో మృతి చెంది ఉండడాన్ని శనివారం ఉదయం స్థానికులు గుర్తించి పోలీసులకు సమాచారం ఇచ్చారు. పోలీసులు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. మృతుడు ఎవరైంది ఎలాంటి ఆధారాలు లేవని ఎస్ఐ ఎస్.రహీమ్ తెలిపారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం స్థానిక ఏరియా ఆస్పత్రికి తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. -
కిడ్నీ రాకెట్ కేసు ప్రధాన నిందితుడికి అస్వస్థత
మదనపల్లె రూరల్ : రాష్ట్ర వ్యాప్తంగా సంచలనం సృష్టించిన మదనపల్లె కిడ్నీ రాకెట్ కేసులో ప్రధాన నిందితుడు, అన్నమయ్య జిల్లా మాజీ డీసీహెచ్ఎస్ డాక్టర్ ఆంజనేయులు అస్వస్థతకు గురయ్యారు. మదనపల్లె సబ్జైలులో రిమాండ్ ఖైదీగా ఉన్న ఆయనకు శనివారం ఉదయం మైల్డ్ స్ట్రోక్ రావడంతో హుటాహుటిన జైలు అధికారులు స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రిలో ఈసీజీ, ఇతర పరీక్షలు నిర్వహించి వైద్య చికిత్సలు అందించారు. సాయంత్రం పరిస్థితి సమీక్షించిన వైద్యులు నిందితుడు డాక్టర్ ఆంజనేయులుకు మెరుగైన వైద్యం అవసరమని నిర్ధారించి తిరుపతి రుయా ఆస్పత్రికి రెఫర్ చేశారు. దీంతో ఆయనను జైలు అధికారులు భద్రత నడుమ తిరుపతికి తరలించారు. -
రోడ్డు ప్రమాదంలో వృద్ధుడి దుర్మరణం
చౌడేపల్లె : చౌడేపల్లె– తిరుపతి ప్రధాన రహదారిలోని సింగిరిగుంట సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధుడు దుర్మరణం చెందిన ఘటన శుక్రవారం రాత్రి జరిగింది. ఎస్ఐ నాగేశ్వరరావు కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. సింగిరిగుంట సమీపంలో రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడని అందిన సమాచారం మేరకు పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని, తీవ్రంగా గాయపడిన అతన్ని పుంగనూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అప్పటికే అతను మృతి చెందాడు. మృతుడి జేబులో గల బస్ టికెట్టుతోపాటు ఇతర ఆధారాలతో పరికిదొనకు చెందిన శ్రీనివాసులు(52)గా గుర్తించి సమాచారమిచ్చారు. మృతుడి భార్య ఓబులమ్మ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ తెలిపారు. -
వాట్సాప్ స్టేటస్లో పునుగు పిల్లి
మదనపల్లె: శ్రీవారి సేవలో ఉపయోగించే సుగంధ ద్రవ్యాన్ని ఇచ్చే పునుగు పిల్లిని బోనులో ఉంచి ఆ వీడియోను స్టేటస్ గా పెట్టిన విషయం శనివారం వెలుగుచూసింది. ఇది అటవీ శాఖలో కలకలం రేపగా ఆచూకీ కోసం తీవ్ర ప్రయత్నాలు చేస్తున్నారు. వాట్సాప్ స్టేటస్ లో పెట్టిన వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా ప్రాథమికంగా విచారణ చేశారు. ఆ నెంబర్ కురబలకోట మండలం అంగడిల్లుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. ఇలా పెట్టిన వ్యక్తి ఎవరు, పునుగుపల్లి ఎక్కడి నుంచి వచ్చింది. దాన్ని బోనులో ఎందుకు బంధించారు అన్న వివరాలు తెలియలేదు. అతి తక్కువ సంఖ్యలో ఉన్న పునుగుపిల్లికి శ్రీవారి సేవలో ప్రాధాన్యత ఉంది. ఇప్పుడు ఈ పునుగుపిల్లి ఎక్కడ ఉంది అన్నది కూడా నిర్ధారణ కాలేదు. కురబలకోట అటవీశాఖ సిబ్బంది ఆచూకీ కోసం ప్రయత్నాలు చేశారు. ఇందులో భాగంగా అంగడిల్లుకు చెందిన వ్యక్తిగా గుర్తించారు. అతని ఆచూకీ కోసం ఆరా తీయగా గ్రామంలో లేడని తెలుసుకున్నారు. దీంతో ఆదివారం పూర్తిస్థాయిలో విచారించాలని ప్రయత్నిస్తున్నారు. ఏడాది క్రితం పునుగుపల్లి బి.కొత్తకోట మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీ హిల్స్ పై వెలుగు చూసింది. ఇప్పుడు వెలుగులోకి వచ్చిన పునుగుపిల్లి ఎక్కడి నుంచి వచ్చింది అన్నది తేలాల్సి ఉంది. బోనులో బంధించిన వీడియో నంబర్ ఆధారంగా అంగడిల్లు వ్యక్తిగా గుర్తింపు -
హంద్రీ నీవా కాలువలో పడి పెయింటర్ మృతి
కురబలకోట : ప్రమాదవశాత్తు జరిగిన సంఘటనతో ఓ కార్మికుడి జీవితం అకాలంగా ముగిసింది. ముదివేడు పోలీసుల కథనం మేరకు.. కురబలకోట మండలం అంగళ్లు దగ్గరున్న హంద్రీనీవా పంప్ హౌస్ వద్ద శనివారం మధ్యాహ్నం సిబ్బంది ఫోర్ వే వద్ద చిక్కుకున్న చెత్త చెదారాన్ని తొలగించడానికి కిందికి దిగారు. కాలువ నీళ్లు సజావుగా పంప్ హౌస్లోకి వెళ్లడానికి వీలుగా.. అడ్డుగా ఉన్న చెత్తా చెదారన్ని తొలగించసాగారు. ఈ క్రమంలో ఓ చెయ్యి బయటపడింది. అతను ఉలిక్కి పడ్డాడు. ఈ సంఘటనతో స్థానికులతోపాటు పరిసర ప్రాంతాల వారిలో తీవ్ర కలకలం రేగింది. ఆ తర్వాత శవం కొట్టుకు వచ్చినట్లుగా భావించి స్థానిక పోలీసుల దృష్టికి తీసుకెళ్లారు. శవాన్ని అతి కష్టం మీద పోలీసులు కాలువలో నుంచి బయటికి తీశారు. పరిసర ప్రాంతాల వారు గుర్తించి ఇతను సమీపంలోని తెట్టు గ్రామం మిట్టపల్లికి చెందిన నారాయణ (50)గా గుర్తించారు. ఆయన వృత్తి రీత్యా పెయింటర్గా పని చేస్తూ రోజు వారి కూలిపై జీవనం సాగించేవారు. దీంతో ఒక్కసారిగా ఎవరన్న మిస్టరీ వీడిపోవడంతో పోలీసులు ఊపిరి పీల్చుకున్నారు. కుటుంబీకులకు సమాచారం అందించి శవాన్ని పోస్టుమార్టంకై మదనపల్లి జిల్లా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ఒంటిపై ఎలాంటి గాయాలు కనిపించలేదని పోలీసుల ప్రాథమిక విచారణలో వెల్లడైంది. మృతుడి స్వగ్రామం మిట్టపల్లి మీదుగా హంద్రీనీవా కాలువ వస్తుంది. శుక్రవారం రాత్రి ప్రమాదవశాత్తు కాలు జారి పడడం వల్ల దగ్గరలోనే ఉన్న అంగళ్లు పంప్ హౌస్ వద్దకు కొట్టుకుపోయాడా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఆత్మహత్యకు పాల్పడే పరిస్థితి లేదని స్థానికులు చెబుతున్నారు. వాస్తవం ఏమిటన్నది పోస్టుమార్టంలో తెలిసి రాగలదని ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. కాలువలో కష్టజీవి జీవితం కడతేరడం పట్ల స్థానికంగా విచారం వ్యక్తమవుతోంది. -
ట్రాఫిక్ నియంత్రణపై సమీక్ష
మదనపల్లె: మదనపల్లె పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణపై అమలు చేయాల్సిన కార్యాచరణపై శనివారం కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి సమీక్షించారు. కలెక్టరేట్లో జరిగిన సమావేశంలో ఈ మేరకు పట్టణ ప్రాంతాల్లో ట్రాఫిక్, దాని క్రమబద్ధీకరణపై రూట్లు, రద్దీపై సమీక్షించారు. పట్టణంలోని ప్రధాన రహదారు లు, బస్ రూట్లు, పార్కింగ్, ఆక్రమణలు, వన్–వే విధానాన్ని పోలీసు అధికారులు వివరించారు. పట్టణంలోకి భారీ వాహనాలు, ప్రైవేట్ బస్సులు, లారీల రాకపోకలతో ట్రాఫిక్ స్తంభించడం జరుగుతుందని, దీన్ని నియంత్రించేందుకు పట్టణ శివారులో బస్సుల పార్కింగ్కు స్థలాలను గుర్తించాలని, కడప, రాయచోటి, తిరుపతి, బెంగళూ రు మార్గాల నుంచి వచ్చే బస్సులకు వేరే మార్గా లు కేటాయిస్తే ఫలితం ఉంటుందని చర్చించారు. నియంత్రణ చర్యలు చేపట్టాలని తెలిపారు. ముఖ్య రహదారుల్లో అక్రమం తొలగింపు, ఉదయం తొమ్మిది నుంచి సాయంత్రం ఎనిమిది గంటల వరకు భారీ వాహనాలపై ఆంక్షలు విధింపు డివైడర్లు ఏర్పాటు, కూడళ్లలో ట్రాఫిక్ సిగ్నల్స్, జంక్షన్ల వద్ద ప్రవేశం, ఎగ్జిట్ నియంత్రణపై సమీక్షించారు. మదనపల్లె నుంచి విజయవాడ, హైదరాబాద్ వెళ్లే ప్రైవేట్ బస్సులు ప్యాసింజర్లను ఎక్కించుకునే పాయింట్లు తగ్గించుకునేలా చూడాలని నిర్ణయించారు. బైక్ పార్కింగ్ పై నియంత్రణ, తదితర అంశాలపై సమావేశంలో చర్చించారు. ప్రైవేట్ బస్సుల ఆపరేటర్లు, ట్రావెల్స్ నిర్వాహకులు, డ్రైవర్లతో సమావేశం నిర్వహించి కొత్త ట్రాఫిక్ నిబంధనలపై అవగాహన కల్పించాలని అధికారులను ఆదేశించారు. సమీక్షలో డీఎస్పీ ఎస్.మహేంద్ర, ట్రాఫిక్ సిఐ గురునాథ్, వన్ టౌన్, టూ టౌన్ సీఐలు రాజారెడ్డి, రఫీ తదితరులు పాల్గొన్నారు. -
వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి
కలికిరి : గర్తుతెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని మహిళ మృతి చెందిన ఘటన శనివారం ఉదయం కలికిరి మండల పరిధిలో చోటు చేసుకుంది. పోలీసుల కథనం మేరకు... మండలంలోని టి.సండ్రావారిపల్లి గ్రామం దూదేకులపల్లి బస్టాప్ సమీపాన చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలో సుమారు 55 ఏళ్ల వయసు కలిగిన మహిళను గుర్తుతెలియని వాహనం ఢీకొంది. ఈ ప్రమాదంలో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది. స్థానికుల సమాచారంతో టి.సండ్రావారిపల్లి వీఆర్ఒ శ్రీనివాసులు ఇచ్చిన పిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం కలికిరి ప్రభుత్వాసుపత్రికి తరలించినట్లు ఏఎస్ఐ నరసింహులు తెలిపారు. మహిళ సమాచారం తెలిసిన వారు పోలీస్ స్టేషన్లో సంప్రదించాలని పోలీసులు కోరారు. -
హార్సిలీహిల్స్లో ‘టూరిస్ట్ పోలీసు’ మూత !
● పర్యాటకుల భద్రతకు భరోసా ఇస్తూ 2023లో ప్రారంభం ● బి.కొత్తకోట పోలీస్స్టేషన్తో అనుసంధానం ● సిబ్బంది కొరతతో మూత గతంలో చూడని, జరగని విధంగా టూరిస్ట్ పోలీసు విధానం అమలు చేసి పర్యాటకులు, యాత్రికుల భద్రతకు అదనపు టూరిస్ట్ పోలీస్స్టేషన్లను ప్రారంభించడం పోలీసు సంస్కరణల్లో సువర్ణాధ్యాయం 2023 ఫిబ్రవరి 14న ప్రారంభోత్సవంలో అప్పటి సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి బి.కొత్తకోట : పర్యాటక ప్రాంతాలను సందర్శించే యాత్రికుల భద్రతకు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో టూరిస్ట్ పోలీసు కేంద్రాలను 2023లో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న పర్యాటక కేంద్రాల్లో ప్రారంభించారు. ఇందులో బి.కొత్తకోట మండలంలోని హార్సిలీహిల్స్పై ఏర్పాటుచేసిన టూరిస్ట్ పోలీసు (ఔట్పోస్టు పోలీస్స్టేషన్)ను వర్చువల్ పద్దతిలో ప్రారంభోత్సవం చేశారు. ఈ విధానం ద్వారా పర్యాటకులకు భద్రత, భోరసా కలుగుతుందని ఆకాంక్షించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఈ టూరిస్ట్ పోలీసు విధానం అటకెక్కింది. బ్రిటిష్ పాలనలోనే హార్సిలీహిల్స్లో ఔట్పోస్టు పోలీస్స్టేషన్ను నిర్మించి ప్రారంభించారు. తర్వాత ఇది మూతపడగా టూరిస్ట్ పోలీసు కేంద్రాన్ని ఇందులోనే ప్రారంభించారు. ఇప్పుడు మళ్లీ మూతపడింది. భధ్రతకు భరోసా ఏదీ రాష్ట్రంలో ప్రత్యేకంగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో హార్సిలీహిల్స్ టూరిస్ట్ పోలీసు కేంద్రం స్థానిక పోలీస్స్టేషన్తో అనుసంధానమై పనిచేసేలా విధులను రూ పొందించారు. ఈ కేంద్రంలో ఆరుగురు పోలీసులు షిఫ్ట్ పద్దతిలో విధులు నిర్వహిస్తే.. ఎస్ఐ, ఏఎస్ఐలు పర్యవేక్షిస్తారు. సందర్శకులకు కనిపించేలా ప్రత్యేక ఫోన్ నంబర్ బోర్డులపై రాశారు. విధుల్లోని సిబ్బందికి ప్రత్యేక యూనిఫాం ఇచ్చారు. వీరికి హార్సిలీహిల్స్కు సంబంధించిన పూర్తి వివరాలు, ఇక్కడ ప్రదేశాలపై అవగాహన కల్పించారు. పర్యాటకులు భయం లేకుండా విడిది చేసేలా టూరిస్ట్ పోలీసు భరోసా ఇచ్చింది. ప్రమాదాలు జరిగినప్పుడు ప్రథమ చికిత్సలు అందించడం, విపత్కర, అత్యవసర పరిస్థితులు ఎదురైనప్పుడు ఆదుకునేలా విధుల్లోని సిబ్బందికి తర్ఫీదు ఇచ్చారు. అయితే ప్రస్తుతం దీని నిర్వహణ ఆగిపోయింది. విధుల్లో ఉండాల్సిన సిబ్బంది లేకపోవడంతో పర్యాటకుల భద్రతపై ఆందోళన వ్యక్తం అవుతోంది. ఇటీవల హార్సిలీహిల్స్పై ప్రమాద ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. సిబ్బంది లేకపోవడంవల్ల సందర్శకుల్లో ఆభద్రతాభావం నెలకొంటోంది. ఆశ..నిరాశ హార్సిలీహిల్స్పై బ్రిటిష్హయాం నుంచి పోలీస్స్టేషన్ ఉంది. దీనికోసం స్టేషన్ భవనం నిర్మించి, విధులు నిర్వహించే సిబ్బందికి ఇళ్లను నిర్మించారు. 2002 వరకు ఒక హెడ్కానిస్టేబుల్, నలుగురు కానిస్టేబుళ్లు విధుల్లో ఉండేవారు. గవర్నర్లు, సీఎంలు, మంత్రులు, ప్రభుత్వస్థాయి అధికారులు విడిది చేసినప్పుడు, పర్యటనలకు భద్రత కల్పించడం జరిగేది. ఇక్కడ పనిచేస్తున్న సిబ్బంది స్థానంలో కొంతకాలం మొబైల్ పోలీసులను నియమించారు. 2023లో టూరిస్ట్ పోలీసు విధానం రావడంతో కొండపై భద్రత పెరిగిందని పర్యాటకులు భావించారు. అయితే మళ్లీ పాతరోజులే పునరావృతం అయ్యాయి. భద్రతపై సీఐ కే.గోపాల్రెడ్డి మాట్లాడుతూ సిబ్బంది కొరత ఉందన్నారు. దీంతో నిత్యం ఇద్దరు కానిస్టేబుళ్లతో భద్రత నిర్వహిస్తున్నామని చెప్పారు. ఎలాంటి ఇబ్బందికర పరిస్థితులు నెలకొన్నా తక్షణం స్పందించి చర్యలు తీసుకుంటున్నట్టు చెప్పారు. విద్యార్థి పురుషోత్తం లోయలో పడిపోగా తక్షణమే స్పందించి తీరును వివరించారు. హార్సిలీహిల్స్ టూరిస్ట్ పోలీసు కేంద్రం.వర్చువల్ పద్దతిలో నాటి సీఎం వైఎస్.జగన్ టూరిస్ట్ పోలీసును ప్రారంభించాక, శిలాఫలకం ఆవిష్కరిస్తున్న ఎస్పీ హర్షవర్దన్రాజు -
కుటుంబ సమస్యలతో ఆత్మహత్యాయత్నం
మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. మదనపల్లె మండలం మాలేపాడు పంచాయతీ ఆవుల పల్లెకు చెందిన సుధాకర్ భార్య నవిత(23) కుటుంబ సమస్యలతో గురువారం ఇంటి వద్ద పురుగుమందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాఽధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అదేవిధంగా కర్ణాటక రాష్ట్రం రాయల్పాడు గౌనుపల్లికి చెందిన హరీష్ భార్య జ్యోతి(26) కుటుంబ సమస్యల కారణంగా లక్ష్మణ రేఖ తిని ఆత్మహత్యాయత్నానికి పాల్పడింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలని వెంటనే మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. పశ్చిమ బెంగాల్ వ్యక్తి ఆత్మహత్య రొంపిచెర్ల : పశ్చిమ బెంగాల్ రాష్ట్రానికి చెందిన వ్యక్తి ఆత్మహత్య చేసుకున్న సంఘటన చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలంలో గురువారం జరిగింది. మృతుని భార్య కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. పశ్చిమ బెంగాల్ రాష్ట్రం నర్సరీలైన్, జల్పైగురి గ్రామానికి చెందిన రతు చిక్ బరాక్ కుమారుడు రవీంద్ర చిక్ బరాక్ (28) తన భార్య రష్మా చిక్ బరాక్ 40 రోజుల క్రితం బతుకు దెరువు కోసం రొంపిచెర్ల మండలం బొమ్మయ్యగారిపల్లెకు వచ్చారు. దండపాణి మామిడి తోట సమీపంలో కోళ్ల ఫారం షెడ్లో పని చేసుకుంటూ జీవిస్తున్నారు. గురువారం మధ్యాహ్నం భోజనం తిని షెడ్లోకి వెళ్లాడు. ఎంత సేపటికి బయట రాక పోవడంతో భార్య షెడ్ రూంలో చూడగా తాడుతో ఉరి వేసుకుని వేలాడుతుండడం కనిపించింది. దీంతో చుట్టు పక్కల వారిని పిలిచి కిందకు దించారు. అనంతరం అన్నమ్మయ్య జిల్లా పీలేరులో ఉన్న కోళ్లఫారం షెడ్ ఓనర్ అన్వర్బాషాకు తెలియజేశారు. దీంతో ఈ విషయాన్ని రొంపిచెర్ల పోలీసులకు సమాచారం ఇచ్చాడు. పోలీసులు మృతుడి భార్యను విచారించగా భర్త ఆనారోగ్యంతో ఉన్నాడని, మతి స్థిమితం కూడా సక్రమంగా ఉండదని చెప్పింది. భార్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసలు కేసు నమోదు చేశారు. మృతునికి భార్యతోపాటు ఒక కుమారై కూడా ఉన్నారు. ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి మృతి మదనపల్లె రూరల్ : అప్పుల బాధతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు యత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు తాలూకా పోలీసులు తెలిపారు. మండలంలోని బసినికొండకు చెందిన శ్రీధర్ బాబు(35) స్థానికంగా ఓ పెట్రోల్ బంక్ లో మేనేజర్గా పని చేస్తున్నాడు. అతనికి భార్య అనూరాధ, ఇద్దరు సంతానం ఉన్నారు. కుటుంబ,వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద దాదాపు రూ. 10 లక్షల పైగా అప్పు చేశాడు. తిరిగి చెల్లించేందుకు ఇబ్బందులు తలెత్తాయి.రుణదాతల నుంచి ఇటీవల ఒత్తిడి అధికమైంది. దీంతో మనస్తాపానికి గురైన శ్రీధర్ బాబు బుధవారం ఇంటి వద్ద గడ్డి మందు తాగాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమంగా ఉండడంతో, మెరుగైన వైద్యం కోసం కుటుంబ సభ్యులు బాధితుడిని వేలూరు సీఎంసీ ఆసుపత్రికి తీసుకెళ్లారు. అక్కడ చికిత్స పొందుతూ శుక్రవారం సాయంత్రం మృతి చెందినట్లు తెలిపారు. మృతుడి భార్య అనూరాధ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు చెప్పారు. కాటేసిన పాముతో ఆసుపత్రికి... మదనపల్లె రూరల్ : ప్రమాదవశాత్తు ఓ పాము వ్యక్తిని కాటు వేయగా, ఆసుపత్రికి పరుగులు తీసిన సంఘటన గురువారం మదనపల్లె మండలంలో జరిగింది. దుబ్బిగాని పల్లె పంచాయతీ యనమలవారిపల్లికి చెందిన మౌలా (40) ఇంటి పక్కన ఉన్న మరో ఇంట్లోకి పాము వచ్చింది. పక్కింటి వారు ఆందోళనకు గురై, పామును చంపేయమని మౌలాను కోరారు. పామును చంపడానికి ప్రయత్నిస్తుండగా మౌలా చేతిపై పాము కాటేసింది. వెంటనే తేరుకుని స్థానికుల సాయంతో పామును చంపి, వైద్యచికిత్సల కోసం పాము తో పాటు బాధితుడు మౌలా స్థానిక జిల్లా ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చాడు. అత్యవసర విభాగ వైద్యులు చికిత్సలు అందించడంతో ప్రమాదం తప్పింది. మూడు చోట్ల చోరీ పెద్దతిప్పసముద్రం : మండలంలోని కందుకూరులో గురువారం రాత్రి ఒక్కరోజే మూడు చోట్ల చోరీలు జరిగాయి.మరో రెండు చోట్ల విఫలయత్నం చేశారు. వివరాల్లోకి వెళితే కందుకూరులోని రియాజ్ చిల్లర దుకాణంలో నగదుతో పాటు మొత్తం రూ.20 వేల విలువ చేసే నిత్యావసర సరుకులను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకెళ్లారు. యజమాని శుక్రవారం ఉదయం దుకాణం తెరవగా చోరీ విషయాన్ని గుర్తించారు. అయితే దుకాణానికి వేసిన తాళాలు వేసినట్లే ఉన్నాయని ఎవరో తెలిసిన వ్యక్తులే దొంగతనాలకు పాల్పడి ఉంటారని పలువురు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా మసీదులో ఇటీవల కొత్తగా తెచ్చిన స్టాండ్ ఫ్యానును దోచుళ్లారు. మూడు రోడ్ల కూడలిలోని రెడ్డెప్ప అనే వ్యక్తి దుకాణంలో 30 లీటర్ల పెట్రోల్ను తీసుకెళ్లారు. అనంతరం ఖాదర్వలి, వాసులకు చెందిన దుకాణాల్లో చోరీకి విఫలయత్నం చేశారు. వరుస దొంగతనాలతో ప్రజలు భయాందోళన చెందుతున్నారు. పోలీసులు రాత్రి వేళ గస్తీ ముమ్మరం చేసి దొంగతనాలను అరికట్టాలని కోరుతున్నారు. రోడ్డు ప్రమాదంలో ఇద్దరికి తీవ్ర గాయాలు అట్లూరు : మండల పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడ్డా రు. స్థానికుల కథనం మేరకు అట్లూరు క్రాస్ రోడ్డుకు చెందిన పట్టెం రవికుమార్రెడ్డి, గంగిరెడ్డి ద్విచక్రవాహనంలో బద్వేలు వైపునకు వెళుతుండగా కడప–బద్వేలు ప్రధాన రహదారిలో ఉన్న కలివికోడి పరిశోధన కేంద్రం వద్ద అకస్మాత్తుగా పశువులు అడ్డురావడంతో అదుపు తప్పి కిందపడటంతో తీవ్రగాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్లో వారిని కడప రిమ్స్కు తరలించారు. -
మనసు గెలిచిన మానవత్వం
కురబలకోట : రోడ్డు ప్రమాదంలో మనిషి గాయపడితేనే పట్టించుకోకుండా చూస్తూ వెళ్లిపోయే రోజులివి. అలాంటిది ఓ వానరం రోడ్డు దాటుతుండగా లారీ ఢీకొనడంతో చావుబతుకుల మధ్య కొట్టుమిట్టాడుతుండగా దానిని తెచ్చి 15 రోజులుగా వైద్య సేవలు అందించి కోలుకునేలా చేశారు. మానవత్వాన్ని చాటారు. గ్రామస్తులు, హనుమాన్ భక్తుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. మదనపల్లి–అంగళ్లు మార్గంలోని కెఎన్ఆర్ ఫంక్షన్ హాల్ దగ్గర 15 రోజుల క్రితం ఓ వానరాన్ని లారీ ఢీకొట్టి వెళ్లిపోయింది. రోడ్డు పక్కన అచేతనంగా పడి ఉన్న దానిని ఆంజనేయ స్వామి గుడి వద్ద కొబ్బరి కాయలు విక్రయించే రాజమ్మ చూసి చలించిపోయింది. వెంటనే పక్కనే ఉన్న భారీ ఆంజనేయ విగ్రహ నిర్వాహకులు లూబీ విశ్వనాథ్వద్దకు తీసుకెళ్లింది. వారు హుటాహుటిన మదనపల్లె పశువుల ఆసుపత్రికి తీసుకెళ్లి అత్యవసర చికిత్స చేయించారు. వారి సంరక్షణలోనే ఉంచుకుని సపర్యలు చేయసాగారు. మరో వైపు అంగళ్లు పశు సంవర్ధకశాఖ ఏడీ డాక్టర్ శ్రీధర్ రెడ్డి సిబ్బందిని పురమాయించి ప్రతి రోజు దానికి చికిత్స చేయించారు. భక్త హనుమాన్ ఆశ్రమ నిర్వాహకులు కోసూరి (లూబీ) విశ్వనాఽథ్, ఎలక్ట్రిషన్ రామకృష్ణ, నార్లపల్లి మాంగాని రమణారెడ్డి, మరో భక్తురాలు ఎర్రదొడ్డి గంగులమ్మ ప్రత్యేక శ్రద్ధ వహించారు. స్థానిక పశు వైద్య సిబ్బంది ఎన్జీ ధరణీనాథ్ రెడ్డి, కనసానివారిపల్లి నిర్మల వానరానికి ఇంజెక్షన్లు, అవసరమైన మందులు రోజూ ఇస్తూ వచ్చారు. దీంతో ఇది క్రమేణా కోలుకుంటోంది. ఆశ్రమ వద్ద తిరుగాడుతూ మునుపటి స్థితికి వస్తోంది. ఓ వానరం కోసం ప్రతి రోజూ ఏడీ స్థాయి అధికారితో సహా ఎనిమిది మంది కనిపెట్టుకుని సపర్యలు చేయడం పలువురిని చలింపజేస్తోంది. వారి మానవత్వాన్ని పలువురు ప్రశంసిస్తున్నారు. గాయపడిన వానరానికి పునరుజ్జీవం -
ఏరులై పారిన మద్యం!
మద్యం విక్రయాలలో అన్నమయ్య జిల్లా రాష్ట్రంలో మూడోస్థానాన్ని దక్కించుకుంది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జిల్లా అభివృద్ధి అట్టడుగుస్థాయికి చేరినా మద్యం విక్రయాలలో మాత్రం మందుబాబుల పుణ్యమా అని పురోగతిని సాధించిందని చెప్పవచ్చు. రాష్ట్రంలో పాడేరు, సత్యసాయి జిల్లాలు తొలి రెండు వరుసలలో ఉండగా అన్నమయ్య జిల్లా రూ. 49.64 కోట్లు మద్యం విక్రయంతో మూ డోస్థానాన్ని చేరుకున్నట్లు అధికారులు వెల్లడించారు. రాయచోటి: మద్యం తాగితే ఆరోగ్యానికి చేటంటున్నా మందు బాబులు అస్సలు ఆగటం లేదు. పైగా న్యూ ఇయర్ ప్రారంభం నుంచి అన్నమయ్య జిల్లాలో మద్యాన్ని మందు ప్రియులు తెగ తాగేస్తున్నారు. సంక్రాంతి పండుగ సందర్భంగా మూడు రోజుల్లోనే జిల్లాలో రూ. 5 కోట్లు విలువగల మద్యం విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ అధికారులు లెక్కగట్టారు. దీంతో జిల్లాలో జనవరి ఒకటోతేది నుంచి 14వ తేది వరకు రూ. 49.64 కోట్లు విలువగల మద్యం విక్రయాలు జరిగినట్లు తేల్చారు. 14 రోజులలో 77,096 కేసుల మద్యం, 26, 134 కేసులు బీరు అమ్మకాలు జరిగాయి. ఇందులో 14వ తేది ఒక్కరోజే మూడు రోజులకు సరిపడా రూ. 4 కోట్లు విలువ గల మద్యాన్ని డిపో నుంచి దుకాణాలకు తరలించారు. ముందువారి దగ్గర ఉన్న స్టాక్తో కలిపి మూడురోజుల్లో రూ. 5 కోట్లు మద్యాన్ని మందు బాబులు తాగేశారని అధికారులు వివరిస్తున్నారు. పండుగ సందర్భంగా మందు బాబులకు అవసరమైన బ్రాండ్ల కొనుగోలులో మద్యం దుకాణాల దగ్గర జనం బారులు తీరి కనిపించారు. 52 శాతం అధికం: మద్యం విక్రయాలలో గత ఏడాది 14 రోజులలో విక్రయించిన మద్యం కంటే ఈ ఏడాది 14 రోజులలో 52 శాతం అధికంగా విక్రయాలు జరిగినట్లు అబ్కారీశాఖ అధికారులు చెబుతున్నారు. గత ఏడాది 14 రోజులలో 43,327 కేసులు మద్యం, 27060 కేసులు బీరు విక్రయాలతో రూ. 32.63 కోట్లు రాబడి ఉండగా ఈ ఏడాది 14 రోజులలో రూ. 49.64 కోట్లు మద్యం విక్రయమైంది. కూటమి ప్రభుత్వం అదికారంలోకి వచ్చిన తరువాత తెచ్చిన నూతన మద్యం విధానంలో భాగంగా కొత్తగా లైసెన్సులు పొందిన దుకాణాదారులు లైసెన్సు దుకాణాలతోపాటు బెల్టుషాపుల నిర్వహణను భారీస్థాయిలో చేపట్టారు. లైసెన్సు మద్యం షాపులలో ప్రభుత్వం నిర్ణయించిన ధరలకు విక్రయిస్తుండగా బెల్టుషాపులలో బాటిల్పై రూ. 10 నుంచి రూ. 50 వరకు అదనపు చార్జీలతో విక్రయాలు సాగిస్తూ మందు బాబుల జేబులలోని చిల్లరను కొల్లగొడుతున్నారు. పండుగ సందర్భంగా సుదూర ప్రాంతాలలో స్థిరపడిన వారు స్వగ్రామాలకు చేరుకొని బంధువులు మిత్రులతో పెద్దఎత్తున పార్టీలు చేసుకోవడంతో మద్యం ఏరులై పారింది. సంక్రాంతి పండుగ మూడు రోజుల్లో రూ. 5 కోట్ల మద్యం విక్రయం గత ఏడాది కంటే ఈ ఏడాది 52 శాతం అధికంగా విక్రయం విందులు, వినోదాలతో చిందులు మద్యం విక్రయాలలో రాష్ట్రంలోనేఅన్నమయ్యకు మూడోస్థానం -
వేర్వేరు ప్రమాదాల్లో ఏడుగురికి తీవ్ర గాయాలు
మదనపల్లె రూరల్ : వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఏడుగురు వ్యక్తులు తీవ్రంగా గాయపడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. మదనపల్లి మండలం సీటీఎం పంచాయతీ చిన్నాయని చెరువు పల్లెకు చెందిన కూలీ రెడ్డన్న (56) గురువారం సీటీఎం రైల్వే గేట్ సమీపంలోని కల్యాణమండపం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతి రూయాకు రిఫర్ చేశారు. పెద్దమండెం మండలం ఎల్లుట్ల చీలమాకులపల్లికి చెందిన వినోద్, కవితలు గురువారం సంక్రాంతి సందర్భంగా ద్విచక్ర వాహనంలో తిరుపతి నుంచి స్వగ్రామానికి వస్తుండగా, తురకపల్లె సమీపంలో మరో బైక్ వేగంగా వచ్చి ఢీకొనడంతో తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు 108లో మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. కవిత పరిస్థితి విషమంగా ఉండటంతో రుయాకు రెఫర్ చేశారు.కురబలకోట మండలం ముదివేడు యనమాలవారిపల్లికి చెందిన దంపతులు మధు(30) మాధవి(25) మదనపల్లెకు సొంత పనిపై వచ్చి, తిరిగి స్వగ్రామానికి స్కూటర్పై వెళ్తుండగా, మార్గమధ్యంలోని అంగళ్లు రైల్వే ఫ్లైఓవర్ వద్దకు రాగానే బైక్ అదుపుతప్పి పడి ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను మదనపల్లి ప్రభుత్వ జిల్లా ఆసుపత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మధు పరిస్థితి ఆందోళనకరంగా ఉండడంతో తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. మదనపల్లె పట్టణం రామారావు కాలనీకి చెందిన దంపతులు గంగరాజు(31), దాత్రి (26) కర్ణాటక రాయల్పాడులోని ఆలయానికి బైక్ లో వెళ్లారు. తిరిగి ఇంటికి వస్తుండగా మార్గమధ్యంలో బైక్ అదుపు తప్పి కింద పడి తీవ్రంగా గాయపడ్డారు. గమనించిన స్థానికులు బాధితులను ఆస్పత్రికి తరలించారు. -
రెడ్డెమ్మ దేవస్థానం వద్ద గోపూజ
గుర్రంకొండ: మండలంలోని చెర్లోపల్లి రెడ్డెమ్మ దేవత దేవస్థానంపై శుక్రవారం గోపూజ కార్యక్రమం ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా గోమాతకు విశేష అలంకరణ చేసి పూజలు నిర్వహించారు. గోపూజ విశిష్టతను అర్చకులు భక్తులకు వివరించారు. అనంతరం ముగ్గుల పోటీలు, ఆటల పోటీల్లో గెలుపొందిన వారికి ఆలయ చైర్మెన్ రాజన్న నాయుడు చేతులమీదుగా బహుమతులను అందించారు. చౌడేపల్లె: బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో గంగమ్మకు రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు అమ్మ వారి గర్భాలయంను శుధ్దిచేశారు. రాహుకాల సమయం 10:30 గంటలనుంచి 12 గంటల వరకు సాంప్రదాయరీతిలో అర్చనలు ,అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని ప్రత్యేకంగా బంగారు నగలు, రంగు రంగు పూలతో ముస్తాబు చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు పవిత్ర తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. కడప ఎడ్యుకేషన్: యోగివేమన విశ్వవిద్యాలయంలో ఈ నెల 19వ తేదీ యోగి వేమన జయంతి వేడుకలు నిర్వహించనున్నట్లు ప్రజా సంబంధాల విభాగ సంచాలకులు డాక్టర్ పి.సరిత తెలిపారు. ఉదయం 11 గంటలకు విశ్వవిద్యాలయ అధికారులు యోగి వేమన విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పిస్తారని పేర్కొన్నారు. మధ్యాహ్నం 3.15 గంటలకు విశ్వవిద్యాలయంలోని నూతన పరిపాలనా భవనంలోని అన్నమాచార్య సెనేట్ హాల్లో సమావేశం జరుగుతుందన్నారు. ములకలచెరువు: మిసెస్ ఇండియా విజేత అన్నమయ్య జిల్లా సంబేపల్లెకు చెందిన విజయలక్ష్మి కవ్వం శుక్రవారం ములకలచెరువు మండలంలో సందడి చేశారు. ములకలచెరువు మండలం గుండాలవారిపల్లెకు చెందిన ఆమె సమీప బంధువు శంకర్రెడ్డి ఇంటికి వచ్చారు. అనంతరం బంధువు పంట పొలంలో మొక్కలు నాటారు. పర్యావరణ పరిరక్షణతో పాటు వ్యవసాయానికి చెట్ల ప్రాధాన్యత గురించి ఆమె వివరించారు. -
పండగ వెలుగు
పల్లెకు హరివిల్లులోని వర్ణాలన్నీ ఒక్కటై ముంగిట ముగ్గులై వాలిపోయాయి.. వీధి చివర చిట్లాకుప్ప వెలుగులు నింగినంటాయి.. ఊరూరా సాంస్కృతిక కార్యక్రమాలు కోలాహలంగా సాగాయి.. ఊరూ..వాడా ఒక్క చోట చేరిన క్షణం ముచ్చట్లలో మునిగిపోయాయి.. వెరసి.. తెలుగు లోగిళ్లలోపండగ కళ ఉట్టి పడింది.. కర్షకుడి నేస్తమైన బసవన్న ముస్తాబై ఘల్లుఘల్లుమంటూ అడుగేయగా... కొత్త డ్రస్సులు ధరించిన బుడతలు బుడి బుడి అడుగులేస్తూ సందడి చేశారు. పసందైన వంటకాలతో... పార్వేట ఉత్సవాలతో.. ఊరూరా సంక్రాంతి సంబరాలు ఘనంగా జరిగాయి. ఇష్టదైవం పార్వేటకు వెళ్లగా.. భక్తజనం తోడుగా బయలుదేరింది.. గ్రామోత్సవంలో ఇంటివద్దకొచ్చిన కోదండరాముడిని.. కొబ్బరికాయ కొట్టి మనసారా వేడుకుంది.. ఇక... కనుమ రోజు మందు బాబులు మందేస్తూ.. చిందులేయగా.. పచ్చ నేతలు పండగ మూడు రోజులూ కోడి పందేల్లోనే మునిగి తేలారు.. ఎర్రగుంట్లలో అలరించిన కోలాటం -
తెలుగు తమ్ముళ్ల మధ్య గొడవ
సీపీఎం జిల్లా కార్యదర్శి జి చంద్రశేఖర్ డిమాండ్ కలసపాడు : కలసపాడు మండలంలో తెలుగు తమ్ముళ్లు ఢీ అంటే ఢీ అని గొడవకు దిగారు. ఈ విషయం జిల్లా పోలీసు ఉన్నతాధికారులకు చేరడంతో పోలీసులు రంగప్రవేశం చేసి గొడవను సద్దుమణిగింది. ఈ సంఘటన గురువారం కలసపాడులో చోటు చేసుకుంది. ప్రతి ఏటా సంక్రాంతి పండుగ రోజు కలసపాడులోని తెలుగుగంగ కాలువ పక్కన ఉన్న అంకాలమ్మ తిరునాల నిర్వహించడం ఆనవాయితీ. ఆలయ కమిటీ నిర్వాహకులు జిల్లా డీసీసీ బ్యాంకు చైర్మన్ మంచూరి సూర్యనారాయణరెడ్డిని కలిసి తిరునాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా సూర్యనారాయణరెడ్డి కొంత మొత్తం తిరునాల ఖర్చులకు అందజేశారు. మొదటిసారిగా సూర్యనారాయణరెడ్డి కలసపాడుకు వస్తుండటంతో ఆయన వర్గీయులు స్వాగత ఏర్పాట్లు చేశారు. విషయం తెలుసుకున్న బద్వేలు టీడీపీ ఇన్చార్జి రితీష్రెడ్డి వర్గీయులు సూర్యనారాయణరెడ్డి పర్యటనను అడ్డుకునే ప్రయత్నం చేశారు. తిరునాలకు హాజరైన సూర్యనారాయణరెడ్డి ఆలయంలో పూజలు చేసి బండలాగుడు పోటీలు ప్రారంభించేందుకు సన్నద్ధమయ్యారు. వెంటనే రితీష్రెడ్డి వర్గీయులు అడ్డుకునే ప్రయత్నం చేయడంతో ఘర్షణ వాతావరణం ఏర్పడింది. విషయం తెలుసుకున్న పోరుమామిళ్ళ సర్కిల్ ఇన్స్పెక్టర్ హేమసుందర్రావు, స్థానిక ఎస్ఐ సుభాన్, సిబ్బంది తిరుణాల ప్రాంతానికి చేరుకుని పరిస్థితిని చక్కదిద్దారు. పోలీసు బందోబస్తు మధ్య డీసీసీ బ్యాంకు చైర్మన్ సూర్యనారాయణరెడ్డి బండలాగుడు పోటీలను ప్రారంభించారు. -
బాబు ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం
మదనపల్లె రూరల్ : చంద్రబాబు ప్రభుత్వంలో రాష్ట్రంలోని ఎస్సీ,ఎస్టీలకు అన్యాయం జరుగుతోందని విడుదలై చిరుతైగల్ కట్చి(వీసీకే)పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పీటీయం.శివప్రసాద్ అన్నారు. శుక్రవారం స్థానిక వీసీకే కార్యాలయంలో ఏర్పాటుచేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ... చంద్రబాబు ప్రభుత్వం ఎన్నికల వాద్దానాలను తుంగలో తొక్కి ఎస్సీ,ఎస్టీలకు ద్రోహం చేస్తోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు టీడీపీ నేతలు...వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో ఎస్సీ,ఎస్టీలకు రక్షణ కరువైందని, హత్యలు జరుగుతున్నాయని, తప్పుడు కేసులు నమోదుచేశారని, సంక్షేమం గాలికి వదిలేసిందని, నిధులు పూర్తిగా ఆపేసి, ఉపాధి అవకాశాలు దూరం చేసిందని, విద్యార్థుల మెస్, కాస్మోటిక్ ఛార్జీలు పెంచకుండా పేదవిద్యార్థుల పొట్ట కొట్టిందని నానాయాగీ చేశారన్నారు. ఎస్సీ,ఎస్టీ సబ్ప్లాన్ నిధులు దారి మళ్లించి, అనేక పథకాలు రద్దుచేశారని తెగ బాధపడిపోయారన్నారు. టీడీపీ నాయకుల మాయమాటలు నమ్మి 2024లో ఎస్సీ,ఎస్టీలు బేషరుతగా కూటమి ప్రభుత్వాన్ని అధికారంలోకి తెస్తే, ఏరుదాటాక తెప్పతగలేసిన చందంగా ఎస్సీ,ఎస్టీలపై నిర్లక్ష్యం కనపరుస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీ,ఎస్టీలకు ఇచ్చిన హామీల అమలుకు అనుగుణంగా రాబోయే బడ్జెట్ సమావేశాల్లో ప్రభుత్వం నిర్ణయాలు తీసుకోవాలని, లేకుంటే కూటమిపార్టీలు తమ ఆగ్రహానికి గురికాక తప్పదని శివప్రసాద్ హెచ్చరించారు. కార్యక్రమంలో వీసీకే పార్టీ పట్టణ అధ్యక్షులు బురుజు రెడ్డిప్రసాద్, స్థానిక నాయకులు సొన్నికంటిరెడ్డెప్ప, జీ.వి.రమణ, బండకోట రవి, రవిశంకర్, రాయల్ సూరి తదితరులు పాల్గొన్నారు. -
●వైభవంగా కోదండ రాముని పార్వేట ఉత్సవం
ఒంటిమిట్ట: ఏకశిలానగరి ఒంటిమిట్టలో శుక్రవారం సాయంత్రం పరంధాముడి పార్వేట ఉత్సవం వైభవంగా నిర్వహించారు. కనుమ పండుగను పురస్కరించుకొని టీటీడీ ఆలయ స్పెషల్ ఆఫీసర్ రామచంద్రారెడ్డి, ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. కోవెలలో శ్రీ సీతారామలక్ష్మణ సమేత ఉత్సవమూర్తులకు ఆలయ అర్చకులు శ్రావణ్ కుమార్, పవన్ కుమార్ ప్రత్యేక అలంకరణలు చేసి పూజలు నిర్వహించారు. అనంతరం ఉత్సవ మూర్తులకు గ్రామోత్సవం నిర్వహించా రు. అలాగే సమీప నాగేటి తిప్పపై ఉన్న పార్వేట మండపం వద్దకు ఉత్సవ మూర్తులను తీసుకెళ్లి పార్వేట ఉత్సవాన్ని ఆలయ సంప్రదాయల పరంగా నిర్వహించారు. అనంతరం స్వామి వారి ఊరేగింపు నిర్వహించారు.టీటీడీ సివిల్ విభాగం ఏఈ అమర్ నాథ్ రెడ్డి, సిబ్బంది పాల్గొన్నారు. -
హార్సిలీహిల్స్ ఘాట్లో ప్రమాదం
బి.కొత్తకోట : మండలంలోని పర్యాటక కేంద్రం హార్సిలీహిల్స్ ఘాట్రోడ్డుపై శుక్రవారం ఉదయం ప్రమాదం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలు. విజయవాడకు చెందిన ఓ కుటుంబం హార్సిలీహిల్స్పై విడిది చేసేందుకు వస్తోంది. కొండపైకి వె వెళుతుండగా అదే సమయంలో మదనపల్లె–1 డిపో ఆర్టీసీ బస్సు కొండ దిగుతోంది. ఘాట్రోడ్డుపై రాళ్లుపడిన చోట బస్సు కారును ఢీకొంది. దాంతో కారు ముందు భాగం నుజ్జనుజ్జయ్యింది. బస్సు ముందుభాగం కుడివైపు కొద్దిగా దెబ్బతింది. ఈ ఘటనలో ఎవరికి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. పర్యాటకులు ఈ ఘటనపై పోలీసులకు ఫిర్యాదు చేయలేదు. కారును ఘటనాస్థలి నుంచి తరలించుకుని వెళ్లిపోయారు. వీధి కుక్కలదాడి – బాలుడికి తీవ్రగాయాలు గాలివీడు : గాలివీడు మండలంలోని గరుగుపల్లి గ్రామం టంటంవారి పల్లెలో వీధి కుక్కల దాడిలో బాలుడు తీవ్రంగా గాయపడ్డాడు.వివరాలు..గురువారం రాత్రి వీధి కుక్కలపై ఓ పిచ్చి కుక్క దాడి చేసింది. దీంతో వీధి కుక్కలు గ్రామ వీధుల్లో కలియతిరుగుతూ ప్రజలను బెంబేలెత్తించాయి. ఆ సమయంలో అడ్డుగా వచ్చిన ధనియాల యాసిర్(8) అనే బాలుడిపై విచక్షణా రహితంగా దాడి చేసి గాయపరిచాయి.అక్కడితో ఆగక వీధిలో ఆడుకుంటున్న ధరణి అనే బాలిక, మరో వ్యక్తిని గాయపరచగా, నీహా అనే బాలిక తప్పించుకుంది. రాత్రి వేళల్లో మహిళలు, పిల్లలు, వృద్ధులు బయటకు రావాలంటే భయపడుతున్నారు. కుక్కల బెడద నివారణకు గ్రామ పంచాయతీ అధికారులు చర్యలు తీసుకోవడం లేదని ప్రజలు చెబుతున్నారు. గడ్డివాములు దగ్ధం రామసముద్రం : అగ్నిప్రమాదంలో రెండు గడ్డివాములు దగ్ధమైన సంఘటన రామసముద్రం మండలంలో శుక్రవారం చోటుచేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. గ్రామంలో ఓ మహిళ అనారోగ్యంతో మృతి చెందగా అంత్యక్రియల కోసం తీసుకెళ్తూ టపాకాయలు కాల్చారు. నిప్పురవ్వలు సమీపంలో ఉన్న హనుమంతు, రామాచారిల గడ్డివాములపై పడ్డాయి. దీంతో మంటలు చెలరేగాయి. గమనించిన స్థానికులు వెంటనే పుంగనూరు అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించి మంటలను అదుపు చేసేందుకు ప్రయత్నించారు. ఈ ప్రమాదంలో సుమారు రూ.80వేలు ఆస్తి నష్టం వాటిల్లినట్లు అగ్నిమాపక సిబ్బంది అంచనా వేశారు. -
వీబీజీ రాంజీ స్కీంను రద్దు చేయాలి
కడప వైఎస్ఆర్ సర్కిల్ : కేంద్రంలోని నరేంద్రమోదీ ప్రభుత్వం మహాత్మా గాంధీ పేరుతో ఉన్న గ్రామీణ ఉపాధి హామీ చట్టాన్ని రద్దుచేసి ఆ స్థానంలో వీబీజీ రాంజీ పేరుతో తీసుకొచ్చిన నూతన స్కీమ్ను రద్దు చేయాలని సీపీఎం జిల్లా కార్యదర్శి జి.చంద్రశేఖర్ డిమాండ్ చేశారు. శుక్రవారం కడపలో రాష్ట్ర పార్టీ ముద్రించిన పోస్టర్లను ఇతర నేతలతో కలిసి ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్బంగా చంద్రశేఖర్ మాట్లాడుతూ కేంద్రం తీరుతో కోట్లాది మంది గ్రామీణ ప్రజలకు తీవ్ర నష్టం వాటిల్లుతుందన్నారు. ఈ కొత్త చట్టం రాష్ట్రానికి భారంగామారి, కార్పొరేట్లకు లాభం చేకూరుస్తుందని తెలిపారు. 2005 ఉపాధి హామీ చట్టం అమలుతో గ్రామీణ ప్రాంతాల్లో పేదరిక నిర్మూలనతో పాటు, సామాజిక న్యాయం, ఆర్థిక స్వాతంత్రం, భూస్వామ్య వర్గాలతో బేరమాడే శక్తి పేదలకు కల్పించిందన్నారు. ఈ చట్టాన్ని మరింత బలోపేతం చేయాల్సిన అవసరం ఉందన్నారు. అలాగే బలవంతపు భూసేకరణ ఆపాలని, సమస్యలపై ఉద్యమాలు చేస్తున్న రైతు నాయకులు అప్పలరాజుపై రాష్ట్ర ప్రభుత్వం పీడీ యాక్ట్ చట్టం పెట్టి జైల్లో వేయడం దుర్మార్గమన్నారు. వెంటనే రైతు నాయకుడు అప్పలరాజునువిడుదల చేయాలని డిమాండ్ చేశారు. అమెరికా సైన్యం వెనుజులా దేశంపై అర్ధరాత్రి బాంబులు వేసి దురాక్రమణ దాడి చేసి అధ్యక్షుని ఇంటి నుంచి బేడీ లేసి అమెరికాకు తరలించటం అత్యంత పాశవిక చర్య అని అన్నారు. సీపీఎం కడప జిల్లా కమిటీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలను ఖండిస్తూ ప్రజల వద్దకు ఈనెల 18 నుంచి 21 వరకు ఇంటింటికీ ఉపాధి క్యాంపెయిన్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు రామ్మోహన్ బి.మనోహర్, వి.అన్వేష్ తదితరులు పాల్గొన్నారు. -
వక్ఫ్ ఆస్తుల రక్షణకు ఎమ్మెల్యే బాధ్యత వహించాలి
మదనపల్లె : మదనపల్లెలోని వక్ఫ్ ఆస్తులను పరిరక్షించేందుకు టీడీపీ ఎమ్మెల్యే షాజహాన్బాషా బాధ్యత వహించాలని ఏపీఎండీసీ మాజీ చైర్మన్, వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ జి.షమీంఅస్లాం డిమాండ్ చేశారు. బుధవారం స్థానిక ఇందిరాగాంధీ సర్కిల్ వద్ద మీడియా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మదనపల్లెలో వక్ఫ్ ఆస్తి అయిన టిప్పు సుల్తాన్ మైదానంలోకి బెంగళూరు బస్టాండ్ను తరలించే అధికారుల ప్రతిపాదనలపై పునఃసమీక్షించాలని కోరారు. ఇప్పటికే టిప్పు మైదానంలో హాల్ట్ చేస్తున్న ప్రయివేటు బస్సుల నుంచి వసూలు చేస్తున్న సొమ్ము ఎవరి జేబుల్లోకి వెళ్తోందని ప్రశ్నించారు. ఎగ్జిబిషన్ నిర్వహణకు అద్దె వసూలు సొమ్ము ఎక్కడుందని నిలదీశారు. ఈ లెక్కలు ఎవ్వరూ చెప్పడం లేదు, ఇలాంటి పరిస్థితుల్లో బస్టాండ్ను మైదానంలోకి తరలిస్తే మరిన్ని వివాదాలకు కారణం అవుతుందని ఆందోళన వ్యక్తం చేశారు. మతపెద్దలు దీనిపై చర్చించి నిర్ణయం తీసుకోవాలన్నారు. వక్ఫ్ ఆస్తులను కాపాడేందుకు, అన్యాక్రాంతం కాకుండా ఉండేందుకు ఎమ్మెల్యే చొరవ తీసుకుని చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండ్ తరలింపు చర్యలను నిలిపివేయాలని, లేనిపక్షంలో కూలీలు, చిరువ్యాపారులు నష్టపోతారన్నారు. ఇప్పటికే బీటీ కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాల ఏర్పాటు విద్యాసంస్థ మనుగడను ప్రశ్నార్థకం చేస్తోందన్నారు. శానిటోరియం పరిస్థితి ఇలాగే ఉందన్నారు. ప్రభుత్వానికి భూమి కావాలంటే మదనపల్లె చుట్టూ అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములను స్వాధీనం చేసుకుని అందులో అభివృద్ధి పనులు, కార్యాలయాలను నిర్మించుకోవాలని కలెక్టర్ను కోరారు. మున్సిపల్ వైస్ చైర్మన్ నూర్ ఆజం మాట్లాడుతూ బ్రిటీష్ పాలన నుంచి బెంగళూరు బస్టాండ్ కొనసాగుతోందని అన్నారు. కౌన్సిలర్ బీఏ.ఖాజా మాట్లాడుతూ ట్రాఫిక్ సమస్యను పరిష్కరించకుండా తరలింపు ప్రతిపాదన సమంజసం కాదన్నారు. వైఎస్సార్సీపీ నాయకులు గుండ్లూరు రఫీ మాట్లాడుతూ కడప, బెంగళూరు నుంచి వచ్చి ఆగిపోయే బస్సుల కోసం బెంగళూరు బస్టాండ్ను తరలించాల్సిన అవసరం ఏముందని ప్రశ్నించారు. తరలింపు ఆపాలని మసీదు కమిటీ ఇప్పటికే వినతిపత్రం ఇవ్వడం జరిగిందన్నారు. సమావేశంలో కౌన్సిలర్ పాల్ చంద్రశేఖర్, వినుతాబాయి, మైనార్టీ నాయకులు పాల్గొన్నారు. బెంగళూరు బస్టాండ్ తరలింపు అంగీకరించం అన్యాక్రాంతమైన ప్రభుత్వ భూములు స్వాధీనం చేసుకోండి వైఎస్సార్సీపీ ఎస్ఈసీ మెంబర్ షమీంఅస్లాం, నేతల డిమాండ్ -
కనుల పండువగా గోదా కల్యాణం
వల్లూరు : పవిత్ర పుణ్య క్షేత్రమైన పుష్పగిరిలో కొండపై గల శ్రీ లక్ష్మీచెన్నకేశవస్వామి ఆలయ ప్రాంగణంలో బోగి పండుగను పురస్కరించుకుని బుధవారం శ్రీ గోదాదేవి కల్యాణ మహోత్సవం కనుల పండువగా జరిగింది. ఆలయ ప్రధాన అర్చకులు అఖిల్ దీక్షితులు ఆధ్వర్యంలో శాస్త్రోక్తంగా శ్రీ మహా విష్ణువు అంశయైన శ్రీ చెన్నకేశవస్వామికి, శ్రీ మహా లక్ష్మిదేవి అంశయైన గోదాదేవికి కల్యాణ మహోత్సవం అంగరంగ వైభవంగా నిర్వహించారు. ప్రత్యేకంగా అలంకరించిన ఆలయ మండపంలోని వేదికపై అలంకార భూషితులైన శ్రీ చెన్నకేశవస్వామి, శ్రీ గోదాదేవిలు ఆశీనులవగా మంగళవాయిద్యాల నడుమ, వేద మంత్రాలతో శాస్త్రోక్తంగా కల్యాణోత్సవం నిర్వహించారు. మొదట రక్షా సూత్రధారణ, కణ్యా వరుణ విశేషార్చన కార్యక్రమాలు చేపట్టారు. అనంతరం సంప్రదాయ బద్దంగా సాగిన పాద ప్రక్షాలనం, మాంగళ్య పూజలు భక్తులకు ఆనందాన్ని కలిగించాయి. వైభవోపేతంగా జరిగిన మాంగళ్య ధారణ, తలంబ్రాల కార్యక్రమాలను చూసిన భక్తులు ఆనంద పరవశులయ్యారు. ఈ సందర్బంగా కొండ ప్రాంగణం గోవిందనామ స్మరణతో మార్మోగింది. కాగా తెల్లవారు జామున ధనుర్మాస ప్రాతఃకాల పూజను నిర్వహించారు. ఉదయం స్వామివారికి బిందె తీర్థ సేవను నిర్వహించారు. అనంతరం స్వామి వారిని ప్రత్యేకంగా అలంకరించారు. మధ్యాహ్నం అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. కడప అర్బన్ : తెలుగు సంస్కృతి, సంప్రదాయాలను ఈ తరం వారికి గుర్తు చేస్తూ జిల్లా పోలీస్ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. బుధవారం ఉదయం ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ సతీసమేతంగా ముఖ్య అతిథిగా హాజరై సంబరాలను ప్రారంభించారు. అంతకుముందు పోలీస్ పరేడ్ గ్రౌండ్ను పోలీస్ అధికారులు అందంగా ముస్తాబు చేశారు. భోగిమంటలు, రంగవల్లులు, హరిదాసు సంకీర్తనలు, గాలిపటాల హోరు, ఎడ్ల బళ్ల చప్పుడు, సంప్రదాయ పిండి వంటలు ఆహూతులను సంభ్రమాశ్చర్యాలకు లోనయ్యేలా చేశాయి. ఎస్పీ భోగి మంటను వెలిగించి సంబరాలకు శ్రీకారం చుట్టారు. ఎప్పుడూ యూనిఫాంలో ఉండే పోలీసు అధికారులు, సిబ్బంది ఆటవిడుపుగా సంప్రదాయ దుస్తులలో తళుక్కున మెరిశారు. నిత్యం విధి నిర్వహణలో బిజీగా ఉండే పోలీసు అధికారులు అంతా తమ కుటుంబసభ్యులతో కలిసి ఒక్క చోటకు చేరి కుశల ప్రశ్నలు వేసుకుంటూ ఒకరికొకరు ఆత్మీయంగా పలకరించుకున్నారు. ముగ్గుల పోటీలు నిర్వహించి విజేతలకు జిల్లా ఎస్పీ బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో అడిషనల్ ఎస్పీ (అడ్మిన్) కె.ప్రకాష్ బాబు, ఏఆర్ అదనపు ఎస్పీ బి.రమణయ్య, స్పెషల్ బ్రాంచ్ డీఎస్పీ ఎన్.సుధాకర్, కడప డీఎస్పీ ఎ.వెంకటేశ్వర్లు, ఎస్బీ ఇన్స్పెక్టర్ యు.సదాశివయ్య, డి.సి.ఆర్.బి సీఐ ఈశ్వర్రెడ్డి, కడప నగర సీఐలు చిన్న పెద్దయ్య, ప్రసాద రావు, ఓబులేసు, ఎల్లమరాజు, రెడ్డెప్ప, బాలమద్దిలేటి, రామకృష్ణారెడ్డి, కృష్ణారెడ్డి, ఎస్ఐలు, ఆర్ఐలు శివరాముడు, శ్రీశైలరెడ్డి, సోమశేఖర్ నాయక్, కడప సబ్ డివిజన్లోని సీఐలు, ఆర్ఎస్ఐలు స్వామి నాయక్, వెంకటేశ్వర్లు, చూడామణి, శ్రీనాథ్, మహిళా ఆర్ఎస్ఐ పావని, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షుడు దూలం సురేష్, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఉప్పు శంకర్, పోలీస్, డీపీఓ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. -
పండగ పూట.. వారి ఇంట విషాదం
● శోకసంద్రంలో గండికొవ్వూరు ● ఒకే రోజు తాతమనవళ్లు మృతి ● అంత్యక్రియల్లో పాల్గొన్న సతీష్రెడ్డి, వైఎస్ కొండారెడ్డిచక్రాయపేట : సంక్రాంతి పండుగ పూట.. ఆ రెండు కుటుంబాల్లో విషాదం నెలకొంది. ఒకరు అనుమానాస్పదంతో మరొకరు అనారోగ్యంతో మృతి చెందారు. ఇద్దరి అంత్యక్రియలు బుధవారం భోగి పండుగ నాడు జరిగాయి. వారిద్దరూ దగ్గరి బంధువులు(వరుసకు తాతా మనవళ్లు) కావడంతో గండికొవ్వూరు గ్రామం మొత్తం శోక సంద్రంలో మునిగింది. వివరాల్లోకి వెళితే.. గండికొవ్వూరు గ్రామ సర్పంచ్ మోపూరి కిరణ్కుమార్రెడ్డి(33) మంగళవారం (గుండెపోటు అని కొందరు, గాయాల ఉన్నందున అనుమానం ఉందని మరికొందరు) చనిపోయిన విషయం తెలిసిందే. మరొకరు అదే గ్రామానికి చెందిన సుబ్బిరెడ్డిగారి రాజగోపాల్రెడ్డి(70). ఈయన సర్పంచ్ కిరణ్కు తాత. ఈయన కొంత కాలంగా అనారోగ్యంతో బాధ పడుతున్నాడు. కిరణ్ చనిపోయాడని తెలియగానే మరింత ఉద్విగ్నానికి గురయ్యాడు. కుటుంబీకులు కడప రిమ్స్కు తరలించగా అక్కడ మంగళవారం రాత్రి మృతి చెందారు. దీంతో కుటుంబీకులు రాజగోపాల్రెడ్డి మృతదేహానికి ఉదయం 11 గంటల సమయంలో అంత్యక్రియలు నిర్వహించారు. ఈయన అంత్యక్రియలు పూర్తయ్యాక కిరణ్కుమార్రెడ్డి అంత్యక్రియలు నిర్వహించారు. బంధుమిత్రులు పెద్ద ఎత్తున గండి కొవ్వూరుకు తరలివచ్చి వారి అంత్యక్రియల్లో పాల్గొన్నారు. దీంతో గ్రామం మొత్తం శోకసంద్రంలో మునిగింది. కాగా మృతులు ఇద్దరూ వైఎస్ఆర్సీపీ వర్గీయులే. అంత్యక్రియల్లో పాల్గొన్న సతీష్రెడ్డి, కొండారెడ్డి గండికొవ్వూరు గ్రామ సర్పంచ్ మోపూరి కిరణ్కుమార్రెడ్డి అంత్యక్రియల్లో వైఎస్ఆర్సీపీ రాష్ట్ర కార్యదర్శులు ఎస్వీ సతీష్కుమార్రెడ్డి, ఎల్ఎం మోహన్రెడ్డి (అనంతపురం జిల్లా గ్రంథాలయ సంస్థ మాజీ చైర్మన్) చక్రాయపేట మండల ఇన్చార్జి వైఎస్ కొడారెడ్డి పాల్గొన్నారు. కిరణ్ చనిపోయిన విషయం తెలుసుకున్న వారు గండి కొవ్వూరుకు వచ్చి ఆయన మృతదేహం వద్ద నివాళులు అర్పించారు. మృతుడి భార్య మాధవి, సోదరుడు అశోక్కుమార్రెడ్డితోపాటు కుటుంబ సభ్యులను ఓదార్చి ధైర్యం చెప్పారు. అంత్య క్రియల్లో వైఎస్ఆర్సీపీ, తెదేపా, జనసేన, బీజేపీ, కాంగ్రెస్ పార్టీలకు చెందిన నేతలు, సర్పంచులు, ఎంపీటీసీలు, ప్రజలు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. -
రాయచోటి వాసి బెళుగుప్పలో ఆత్మహత్య
బెళుగుప్ప(అనంతపురం) : అనంతపురం జిల్లా కల్యాణదుర్గం నియోజకవర్గం బెళుగుప్ప మండలంలోని గుండ్లపల్లిలో నివాసముంటున్న వేంపల్లి నాగేశ్వరరాజు (53) ఆత్మహత్య చేసుకున్నాడు. అన్నమయ్య జిల్లా రాయచోటికి చెందిన ఆయన 20 ఏళ్లుగా గుండ్లపల్లిలో అద్దె గదిలో నివాసముంటున్నాడు. డీఎంసీ కంకర యూనిట్లో ఆపరేటర్గా పని చేస్తూ జీవనం సాగిస్తున్నాడు. బుధవారం తాను నివాసముంటున్న అద్దె గదిలోనే ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. ఇందుకు కారణాలు తెలియాల్సి ఉంది. స్థానికుల నుంచి సమాచారం అందుకున్న బెళుగుప్ప పోలీసులు అక్కడకు చేరుకుని పరిశీలించారు. మృతదేహాన్ని కల్యాణదుర్గంలోని సీహెచ్సీలో ఉన్న మార్చురీకి తరలించారు. ఘటనపై దర్యాప్తు చేపట్టినట్లు పోలీసులు తెలిపారు. వ్యక్తి ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : రుణ బాధతో మనస్తాపం చెంది వ్యక్తి ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన బుధవారం మదనపల్లె మండలంలో జరిగింది. బసినికొండకు చెందిన శ్రీధర్బాబు(35) పట్టణంలోని ఓ పెట్రోల్ బంకులో మేనేజర్గా పని చేస్తున్నాడు. కుటుంబ, వ్యక్తిగత అవసరాల కోసం పలువురి వద్ద సుమారు రూ.10 లక్షలకు పైగా అప్పులు చేశాడు. ఇటీవల కొంత కాలంగా రుణదాతల నుంచి ఒత్తిడి అధికం కావడంతో తిరిగి చెల్లించలేక మనస్తాపం చెంది ఇంటి వద్దే గడ్డి నివారణ మందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన కుటుంబ సభ్యులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. తాలూకా పోలీసులు కేసు విచారణ చేస్తున్నారు. -
అరవైలో..ఇరవై !
రాజంపేట టౌన్ : ఐదు పదుల వయసు దాటితేనే శరీరంలో సత్తువ తగ్గుతూ వస్తుంది. ఇక ఆరుపదుల వయసు దాటితే చిన్న పని చేసినా అలసట వస్తుంది. అయితే రాజంపేట క్రికెట్ క్లబ్ (ఆర్సీసీ) వెటరన్ క్రీడాకారులు అందుకు భిన్నం అనే చెప్పాలి. అంతేకాక ఈ మాజీ క్రీడాకారులకు ఓ ప్రత్యేకత కూడా ఉంది. సంక్రాంతి సందర్భంగా పూర్వ విద్యార్థుల సమ్మేళనాల పేరిట చిన్ననాటి మిత్రులు కలుసుకుంటుండటం ఇప్పుడు సర్వసాధారణమైంది. అయితే క్రికెట్ వల్ల పరిచయమైన చిన్ననాటి స్నేహితులు చిన్నప్పుడు వారు క్రీడ ఆడిన రాజంపేటలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల క్రీడా మైదానం (పెద్ద గ్రౌండ్)లోనే బుధవారం భోగి పండుగ రోజున సరదాగా క్రికెట్ ఆడి అలనాటి తీపి గుర్తులను నెమరవేసుకున్నారు. దాదాపు మూడు దశాబ్దాలకు పైగా చరిత్ర ఉన్న ఆర్సీసీలో అనేక మంది క్రికెట్ ఆడుతూ వచ్చారు. వారిలో కొంత మందికి ఆరు పదుల వయసు దాటి ఉండగా, మరికొంత మంది నాలుగు పదుల వయసులో ఉన్నారు. కొంత మంది మధ్య వయసు రీత్యా దాదాపు ఇరవై సంవత్సరాల వ్యత్యాసం ఉంది. అలాగే వీరిలో కొంత మంది రాజకీయంగా, ఉద్యోగ రీత్యా ఉన్నత హోదాల్లో ఉండి రిటైర్డ్ అయిన వారు కూడా ఉన్నారు. అయినప్పటికీ వయసు, హోదాలు పక్కన పెట్టి అందరూ కలిసి మెలసి స్నేహితుల్లా క్రికెట్ ఆడటం గొప్ప విషయం అనే చెప్పాలి. అందరూ కూడా వెటరన్ క్రీడాకారులైనప్పటికీ క్రీడా మైదానంలోకి అడుగు పెట్టగానే చిన్నపిల్లల్లా మారిపోయి క్రికెట్ మ్యాచ్ ఆడి చిన్ననాటి స్నేహంలోని మాధుర్యాన్ని ఆస్వాదించారు. విజయం సాధించిన అబ్దుల్లా జట్టు వెటరన్ క్రీడాకారుల మధ్య జరిగిన క్రికెట్ మ్యాచ్లో ఒక జట్టుకు షేక్ అబ్దుల్లా, మరో జట్టుకు వడ్డే రమణ కెప్టెన్లుగా వ్యవహరించారు. వడ్డే రమణ టాస్ గెలిచి తొలుత బ్యాటింగ్ను ఎంచుకొని నిర్ణీత 15 ఓవర్లలో రమణ జట్టు 63 పరుగులు చేసింది. అనంతరం 64 పరుగుల విజయ లక్ష్యంతో బ్యాటింగ్ చేపట్టిన అబ్దుల్లా జట్టు ఒక్క వికెట్ కూడా నష్టపోకుండా 10 ఓవర్లలోనే 64 పరుగులు చేసి విజయం సాధించింది. ఇదిలావుంటే అబ్దుల్లా జట్టులో పోలా సాయివైభవ్రెడ్డి మూడు ఫోర్లు, మూడు సిక్స్లతో 31 పరుగులు చేయడంతో ఆ జట్టుకు విజయం సునాయాసమైంది. క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు రాష్ట్రంలో వివిధ ప్రాంతాల్లో స్థిరపడిన వారు తరలి రావడం విశేషం. కాగా రిటైర్డ్ హెడ్మాస్టర్ ఎ.శంకర్రాజు, అన్నమాచార్య యూనివర్సిటీ ఉద్యోగి రంగా అంపైర్లుగా వ్యవహరించారు. ఫ్రెండ్లీ మ్యాచ్తో వెటరన్ క్రీడాకారుల సందడి భోగి రోజు.. ఆత్మీయ కలయికకు వేదికై న గ్రౌండ్ హోదాలు.. వయో భేదాలు పక్కన పెట్టి.. రాష్ట్రంలోనే ప్రత్యేకత సంతరించుకుంటున్న ఆర్సీసీ -
కమనీయం.. మకర జ్యోతి దర్శనం
● పులకించిన భక్తజనం ● తిరు ఆభరణాల ఉరేగింపులో ఎమ్మెల్యే పెద్దిరెడ్డిసదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో బుధవారం సాయంత్రం మకరజ్యోతిని దర్శించుకొన్న భక్తులు భక్తిపారవశ్యంలో మునిగిపోయారు. జ్యోతి దివ్యదర్శనం కాగానే అయ్యప్పనామ స్మరణతో ఆలయ పరిసర ప్రాంతాలు మారుమోగాయి. అంతకు ముందు స్థానిక సదుమ్మ ఆలయంలో మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి తిరు ఆభరణాలను ఉంచి ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం ఆభరణాలను తలపైనెత్తుకుని కేరళ వాయిద్యాలు, ప్రత్యేక గొడుగుల మధ్య ఊరేగింపుగా తీసుకొని అయ్యప్ప సన్నిధానానికి చేరుకొన్నారు. పడిమెట్ల గుండా స్వామి వారికి సమర్పించారు. తిరు ఆభరణాలు అలంకరించిన అనంతరం ఆలయ నారాయణన్ నంబూద్రి ఆధ్వర్యంలో విశేష పూజలు జరిగాయి. ఆలయానికి తూర్పు దిక్కున ఉన్న కొండల్లో సాయంత్రం మకరజ్యోతి దర్శనం ఇచ్చింది. జ్యోతి దర్శనం అనంతరం ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ఆధ్వర్యంలో ఆలయ ప్రాంగణం అంతా కర్పూర జ్యోతులు వెలిగించారు. ఈ వేడుకలను తిలకించేందుకు భక్తులు పెద్దసంఖ్యలో తరలివచ్చి స్వామి వారిని దర్శించుకొన్నారు. భక్తులతో ఎర్రాతివారిపల్లె జనసంద్రంలా మారింది. ఆలయంలో పత్రాలు, పుష్పాలు, ఫలాలు, విద్యుత్ దీపాలతో చేసిన అలంకారం ఆకట్టుకున్నాయి. ఈ కార్యక్రమంలో పెద్దిరెడ్డి సతీమణి స్వర్ణలతమ్మ, రాజంపేట ఎంపీ పెద్దిరెడ్డి మిథున్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి, మాజీ ఎంపీ రెడ్డెప్ప, పలమనేరు మాజీ ఎమ్మెల్యే వెంకటేగౌడ, వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి పెద్దిరెడ్డి, మాజీ ఎంపీపీ పెద్దిరెడ్డి ఇందిరమ్మ, జెడ్పీటీసీ సభ్యుడు సోమశేఖర్రెడ్డి, రేణుకమ్మ, వేణుగోపాల్రెడ్డి, నిహాంత్రెడ్డి, అభినయ్ రెడ్డి, ఎంఆర్సీ రెడ్డి, టీటీడీ బోర్డు మాజీ సభ్యుడు పోకల అశోక్కుమార్, జింకా చలపతి, సురేంద్రనాథ రెడ్డి, బైరెడ్డిపల్లె కృష్ణమూర్తి, ఎంపీపీల సంఘం అధ్యక్షుడు రెడ్డెప్ప, కల్యాణ భరత్ పాల్గొన్నారు. -
రేపు బండలాగుడు పోటీలు
చాపాడు : సంక్రాంతి పండుగను పురస్కరించు కుని మండలంలోని వెదురూరు, నరహరిపురం గ్రామాల్లో శుక్రవారం రాష్ట్రస్థాయి బండలాగుడు పోటీలను నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 2 గంటల నుంచి జరిగే ఈ పోటీల్లో గెలుపొందిన ఎద్దుల యజమానులకు రూ.1,00,116, రూ.70, 116, రూ.40,116, రూ.20,115, రూ.10,116 చొప్పున నగదు బహుమతులు అందజేయనున్న ట్టు నిర్వాహకులు తెలిపారు. ఆలయ నిధులపై సమగ్ర వివరాలు ఇవ్వాలి మదనపల్లె: సీటీఎంలోని నలవీర గంగాభవానీ ఆలయ నిధులపై సమగ్ర వివరాలను వచ్చే సోమవారం నాటికి ఇవ్వాలని ఆలయ కమిటీ నిర్వాహకులను దేవదాయశాఖ జిల్లా అధికారి విశ్వనాఽథ్ ఆదేశించారు. బుధవారం ఆలయంలో గ్రామస్తులు, కమిటీతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన ఆలయ ఆదాయం, ఖర్చులు, ఆభరణాల విషయమై పీజీఆర్ఎస్కు రెండు ఫిర్యాదులు అందాయని, దీనిపై విచారణ చేయాలని కలెక్టర్ తనను ఆదేశించారని చెప్పారు. ఆలయానికి సొంతంగా ఎంతమేరకు ఆదాయం వస్తోంది, విరాళాలు, భక్తులు అందించిన బంగారు ఆభరణాలు తదితర వివరాలు ఇవ్వాలని కోరారు. ఈ వివరాలను పూర్తిగా అందిస్తామని కమిటి నిర్వాహకులు చెప్పారు. జాతర ఉత్సవాల సందర్భంగా భక్తులు ఇస్తున్న విరాళాల ను తెలపాలని గ్రామస్తులు ప్రశ్నించారు. విశ్వనాఽథ్ మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాలతో విచారణ జరిపి నివేదికను ఇవ్వనున్నట్టు చెప్పారు. -
పండగంటే... ఆ రోజుల్లోనే !
‘ఏం రామచంద్రప్పా.. ఇంటికాడ అందరూ బాగున్నారా..కొడుకులు ఏం చేస్తున్నారు..పిల్లపాపలు బాగున్నారా..వాళ్ల పనులేవో వాళ్లు చేసుకుంటూంటారులే’ అంటూ శివరాం పలకరింపుతో కనసానివారిపల్లిలో రచ్చబండ ముచ్చట్లు మంగళవారం మొదలయ్యాయి. ‘పల్లెల్లో మునుపటిలా పరిస్థితులు యాడుండాయి, సంక్రాంతి పండగకు అందరూ ఊరికి వచ్చినారు గాని ఊరు అభివృద్ధే తలకిందులయినాది’ అంటూ రామచంద్రప్ప అందుకున్నాడు. అన్నమయ్య జిల్లా కురబలకోట మండలం కనసానివారిపల్లిలో రైతులు, మహిళలు, వృద్ధులు రోజూ ఒకచోట చేరి రచ్చబండ కబుర్లు, ఊరు విషయాలు చెప్పుకుంటుంటారు. అలా పెద్ద పండగ సంక్రాంతి గురించి ‘ఆ రోజుల్లోనే పండగంటే’.. అంటూ ముచ్చట్లు చెప్పుకుంటూనే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనపై చర్చ మళ్లింది. ‘జగన్బాబు పాలనలో ఆఫీసులకు సచివాలయం, పంటల సాగుకు ఆర్బీకేలు, రోగమోస్తే హెల్త్ సెంటర్లు ఊరు, ఇంటికాడనే ఉండేటివి. ఊరు పొలిమేర దాటిపోలా కద మామ. ఈడనే పంపేటోడు జగన్. ఎరువు మూటకి అంగళ్లకో..మదనపల్లెకో పోతాంటివి..ఇప్పడు సూడు ఎలా ఉండాదో’..అని నిరాశలో మునిగిపోతూ చర్చ కొనసాగించుకొంటూ పోయారు. ‘చంద్రబాబు పాలన వచ్చాక ఏది మాట్లాడేది సెప్పరా సామి.. ఏదొటి మాట్లాడితే ఇదేందిరా ఈళ్లు ఇలా అంటావుండారు అంటారు. ముందుమాదిరి ఎరువులు యాడ వస్తండాయి సెప్పరా మామ..ఆగ్రికల్చరోళ్లు కనబళ్ల కద’ అని అంటుంటే.. మహిళా రైతు రాజమ్మ అందుకుంది. ‘ఏం సెప్తావులే సామి ఇత్తనాలు, ఎరువులు, ఈడ నుండే ఆర్బీకేలో తీసుకుంటుంటిమి..కాలు బయటపెట్టింది లేదు, చార్జీ ఖర్చు లేదు, తిరిగే పని తప్పింది కదా అప్పుడు..ఈయాల సూడు ఎలా ఉండాదో..ఇంటిముందిరే ఆఫీసు ఉంది కాని పనిలేక పాయే..ఏదన్నా పని కావాలన్నా సేద్యం పనులు వదిలి తిరగాల్సి వస్తాంది..అంతేకాదు నాయనా ఫించన్ కోసం సూత్తా ఉండేటోళ్ల బాధ సూడు పాపం ఎప్పుడిస్తారా అని కాపు కాస్తాన్నారు’ అంటూ నిట్టూర్చింది. వ్యవసాయ కూలీ లక్ష్మిదేవి మాట్లాడుతూ ‘ఓ అయ్యో.. పోయిన గవర్నమెంటులో మాదిరి ఈడ ఇలేజి క్లినిక్లో ఏం సూడ్డం లేదు, మదనపల్లికి పోతావుండారు జనం. పైసలిచ్చి ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లాలంటే చానా కష్టం కద, అప్పోసొప్పోజేసి సూపించుకోవాల సామి. సూయించడం అంటే గుర్తుకొచ్చిందిగాని..జగన్ ఇచ్చిన మదనపల్లి గవర్నమెంటు కాలేజీని కూడా ప్రైవేటికి ఇస్తా ఉండాడంట సెంద్రబాబు..ఆపేసిన పనులు జేసేందుకు కాసులు లేవంట గదా, అదేమోకాని మామ ఎన్టీవోడి ఇగ్రహం పెడ్తాన్నారంట గద అమరావతిలో. దానికి 1,700 కోట్లు ఖర్చు చేస్తారట. ఈ గొన్నమెంటుకు ప్రాణమున్నోళ్ల కంటే విగ్రహాలకే యాల్యూషన్ ఎక్కువనుకుంటాను. ఇది ఇడ్డూరంగా లేదా..జగన్ ఇచ్చిన పథకాలు తీసేసి..కొన్నిదాండ్లకి పేర్లు మార్చేసిరి. జగన్ పాలనలో జనానికి బాగుండేది. పండగంటే ఆ రోజుల్లోనే’ అంటూ వర్తమాన రాజకీయాలపైనా ముచ్చట కొనసాగించారు. మళ్లీ చర్చ కొనసాగిస్తూ...‘మనూరు పరిస్థితి ఏమిటిరా’ అందరూ సమీక్షకు దిగారు. ‘పోయిన వర్షాకాల పంట, మొన్న శనగ పంట పోయినాది కద..దానికి పెభుత్వం ఏమిచ్చింది. జగన్కాలమే బాగుండె.., యాళకు బీమా, పంటపోతే నష్ట పరిహారం, భరోసా..ఠంచనుగా ఖాతాలకు డబ్బులు పడేవికదా గుర్తు లేదా. పోయినతూరి వాన ల్యాకపొతే ఉలవలు ఇచ్చిరి. ఈసారి యాడిచ్చినారో, ఎవరికి ఇచ్చినారో నీకు తెలుసేమిట్రా’ అని రామచంద్రప్ప అంటే.. ‘అదేరోయ్ అప్పడైతే సెక్రటరి చెప్పేటోడు, ఇప్పడు సెప్పేటోళ్లు యాడున్నారు, సెక్రటరి, సచివాలయ ఆఫిసర్లు మనూళ్లోనే ఉంటాఉండిరి, జగన్ ఇచ్చేవన్ని సెబుతావుండ్రి, ఇస్తావుండే..ఇప్పడు ఏముందిలే..అంటూ శివరాం నిట్టూర్చాడు. ‘సరేకాని జగన్ ఉండగా మనూరి రోడ్లు బాగుపడినాయి శివరాము, ఎన్ని బిల్డింగులు వచ్చినాయి, ఆఫీసర్ సర్లు ఎంత మందుండిరి.. ఆ కతే వేరుకదా’ అంటూ రామచంద్రప్ప గత పాలనను గుర్తుకు తెచ్చుకుంటూ బాదపడసాగాడు. ‘ఏమైనా పరిపాలనంటే వైఎస్సోళ్లదే’ అనుకుంటూ ఎవరి పనులకు వాళ్లు పోసాగారు. – టైలర్ షామీర్ బాషా(మదనపల్లె) -
సామాన్యులకు భారంగా...
సంక్రాంతి పండగ ఈ సారి సామాన్యులకు భా రంగా మారింది. నిత్యావసర సరుకుల ధరలు పెరగడంతో పండగ కళ తప్పుతోంది. ధరల నియంత్రణలో ప్రభు త్వం చొరవ తీసుకోవాలి. అలాగైతేనే సామాన్యులు బతకగలరు. లేకుంటే వారి జీవనం దుర్భరంగా మారుతుంది. – దస్తగిరిరెడ్డి, ఏపీ రైతు సంఘ జిల్లా కార్యదర్శి, కడప. కడప అగ్రికల్చర్ : సామాన్యులకు ఈ సారి సంక్రాంతి కాంతిని లేకుండా చేస్తోంది. నిత్యా వసర సరుకుల ధరలు బహిరంగ మార్కెట్లో జనాలకు దడ పుట్టిస్తున్నాయి. ముఖ్యంగా పిండి వంటలకు సంబంధించిన సరకులతో పాటు నూనెల ధరలు అమాంతంగా పెరిగాయి. దీంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు వెన్ను లో వణుకు పుడుతోంది. సామాన్యుడి నుంచి స్థితిమంతుడి వరకు ప్రతి నిత్యం వినియోగించే నిత్యావసర సరుకుల ధరలు రోజురోజుకు పెరుగుతుండటంతో జనాలు బెంబేలెత్తిపోతు న్నారు. ధరలను నియంత్రించాల్సిన ప్రభుత్వా లు పట్టీపట్టనట్లు వ్యవహరిస్తున్నాయని సామాన్యులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ధరలు అమాంతంగా పెరుగుతుండటంతో కిలో కొనుగోలు చేసే చోట అర కిలోను కొనుగోలు చేసి సర్దుకుపోవాల్సిన పరిస్థితి నెలకొంటోందని జనాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇలా ఎన్ని రోజులు కాలం వెళ్లదీయాలని సామాన్యు లు ప్రభుత్వాలను ప్రశ్నిస్తున్నారు. కాగుతున్న నూనె ధరలు సంక్రాంతి పండగకు పిండివంటలను చేసుకుంటారు. కానీ ఈ ఏడాది అ పరిస్థితి సామాన్యులకు కరువైయింది. ఎందుకంటే నూనెధరలు సలసలకాగుతున్నాయి. దీంతో చాలా మంది పండివంటలకు దూరంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. కొంతమంది పండగ సాంప్రదాయం కాబట్టి అరకొరగా పిండివంటలను చేసుకుని మమ అనిపించుకున్నట్లు తెలిపారు. కొండెక్కిన కోడి.. మంటెక్కిన మటన్ ధర కోడికూర ధర కొండెక్కి కూర్చుంది. మొన్నమొన్నటి వరకు కిలో రూ. 230 ఉన్న బ్రాయిలర్ చికెన్ కిలో ధర ఏకంగా మూడు వందలకు చేరింది. నాటు కోడి ధర కిలో రూ. 450 నుంచి 600 వందల వరకు ఉంది. డిమాండ్ను బట్టి ఇంకా ఎక్కువకు కూడా అమ్ముతున్నారు. ఇక మటన్ కిలో రూ.860 నుంచి రూ.1000 వరకు ఉంది. ఈ ధరల్లో మాంసాన్ని కూడా కొని తినే పరిస్థితి లేదు. కాకపోతే ఎంఽత ధర ఉన్నా ఈ పండగ ముఖ్యమైయింది కాబట్టి మాంసం తినే ప్రతి ఒక్కరు తప్పకుండా మాంసాన్ని తెచ్చుకుని పండగ చేసుకోవాల్సిన పరస్థితి. సంక్రాంతి పండుగ అంటే అందరికీ ముఖ్యమే. ముఖ్యంగా మూడు రోజుల పండగలో భాగంగా చివరిరోజు కనుమ పండగకు దాదాపు ప్రతి ఒక్కరు మాంసాన్ని తింటారు, కానీ ఈ ఏడాది చికెన్ ధర రూ. 230 నుంచి ఏకంగా రూ. 300 పెరిగింది. ఇక మటన్ ధర చెప్పాల్సిన పనేలేదు. పండగకు మాంసం తినడం భారంగానే ఉంది. – మహేష్, కడప పెరిగిన ఽనిత్యావసర సరుకుల ధరలతో సామాన్యులకు పండగ నిర్వహణ భారంగా మారింది. పండగకు సంబంధించిన ముఖ్య సరుకులతో పాటు నూనె ధరలు కూడా పెరిగాయి. దీంతో సామాన్యులకు పండగ నిర్వహణ కడు భారంగా మారింది. – రాజశేఖర్రెడ్డి, ఆలంఖాన్పల్లి. ధరల పెరుగుదల ఇలా..సరుకుపేరు గత ఏడాది ఈ ఏడాది కిలో ధర కిలో ధర రూ.లలో రూ.లలో కొబ్బెర 200 280 చింతపండు 100 180 పెసలు 120 124 చక్కెర 42 46 మినుములు 118 123 బెల్లం 62 66 నువ్వులు 150 155 పామాయిల్ 92 114 వేరుశనగ నూనె 145 160 సన్ప్లవర్ 133 152 సామాన్యులకు భారంగా సంక్రాంతి పండుగ దడ పుట్టిస్తున్న నిత్యావసరాల ధరలు కొండెక్కిన కోడి మంటెక్కిన మటన్ -
సీమకు అన్యాయం చేస్తున్న చంద్రబాబు
కడప కార్పొరేషన్ : ముఖ్యమంత్రి చంద్రబాబు తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం కుదుర్చుకుని రాయలసీమ ప్రాంతానికి తీవ్ర అన్యాయం చేస్తున్నారని వైఎస్సార్సీపీ వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షుడు పి.రవీంద్రనాథ్రెడ్డి విమర్శించారు. కడపలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయంలో బుధవారం ఎమ్మెల్సీ ఎం.వి.రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, మేయర్ పాకా సురేష్తో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. రాయలసీమ ప్రాజెక్టులకు నీరు రావాలంటే శ్రీశైలం ప్రాజెక్టే ఆధారమని చెప్పారు. గతంలో వరద రోజులు 130 ఉండేవని, రానురాను పూర్తిగా తగ్గిపోయాయని తెలిపారు. కృష్ణా జలాల్లో రాయలసీమ వాటాను సక్రమంగా ఉపయోగించుకునేందుకు 11 వేల క్యూసెక్కులున్న పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర్రెడ్డి 44 వేల క్యూసెక్కులకు పెంచారని చెప్పారు. అప్పుడు కూడా చంద్రబాబు తెలంగాణ నేతలతో కలిసి అడ్డుకునేందుకు ప్రయత్నించారని గుర్తుచేశారు. శ్రీశైలంలో 841 అడుగుల నీటిమట్టం ఉంటేనే ఆ నీటిని వాడుకునేందుకు వీలుంటుందని, ఆలోపే తెలంగాణ విద్యుత్ ఉత్పత్తి పేరుతో నీటిని దిగువకు వదులుతోందని చెప్పారు. తెలంగాణ 800 అడుగుల్లో పాలమూరు–రంగారెడ్డి, 802 అడుగుల్లో కల్వకుర్తి వంటి అక్రమ ప్రాజెక్టులు కట్టి నీటిని తోడుకుంటోందన్నారు. ఈ నేపథ్యంలో 800 అడుగుల్లోనే రాయలసీమకు నీటిని తోడుకునేందుకు వీలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టి, 70 శాతం పనులు కూడా పూర్తి చేశారని చెప్పారు. రాయలసీమకు కేటాయించిన 101 టీఎంసీల నీటిని సక్రమంగా వాడుకోవాలన్నదే ఈ ప్రాజెక్టు లక్ష్యమన్నారు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో రహస్య ఒప్పందం చేసుకుని ఈ ప్రాజెక్టులను నిలిపేయడం దుర్మార్గమని, తమ పార్టీ దీన్ని తీవ్రంగా ఖండిస్తోందని చెప్పారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాష్ట్ర ప్రయోజనాలను తాకట్టు పెడుతున్నారని ధ్వజమెత్తారు. రాయలసీమ, నెల్లూరు, ప్రకాశఽం జిల్లాలకు జరుగుతున్న అన్యాయాన్ని ఎలుగెత్తి చాటేందుకు ఈ నెల 19వ తేదీ ఉదయం 10 గంటలకు కడపలోని బీసీ భవన్లో రౌండ్టేబుల్ సమావేశం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. ఈ సమావేశానికి అన్ని పార్టీలు, ప్రజాసంఘాల నాయకులను ఆహ్వానిస్తున్నట్లు తెలిపారు. రాయలసీమకు చెందిన మేధావులు, ప్రజా సంఘాల నేతలు ఈ సమావేశాన్ని జయప్రదం చేయాలని ఆయన కోరారు. ఈ సమావేశంలో డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, వైఎస్సార్సీపీ రైతువిభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, యువజన విభాగం నగర అధ్యక్షుడు గుంటి నాగేంద్ర, కార్పొరేటర్ బాలస్వామిరెడ్డి పాల్గొన్నారు. -
● కోనసీమను తలపించేలా కోడి పందేలు..
ములకలచెరువులో నకిలీమద్యం తయారీ ప్లాంటు వెలుగుచూసిన కేంద్రానికి సమీపంలోనే టీడీపీ నేతలు బహిరంగంగా కోడిపందేలు నిర్వహించారు. దీనికి వేలసంఖ్యలో జనం వచ్చారు. కార్లు, బైక్లు వందల సంఖ్యలో రోడ్లపై బారులు తీరాయి. కోనసీమను తలదన్నేలా కోడిపందేలు జరిగాయి. ఇక పీటీఎం మండలం పులికల్లు సమీపంలో జరిగిన కోడిపందాల శిబిరంలో ఇలాగే ఉంది. ఈ శిబిరం చుట్టూ ఏకంగా కంచెలాంటి తెరను కట్టించారు. లోపలికి వచ్చేవారు ఫొటోలు, వీడియోలు తీయకుండా కట్టడి చేయడం, నిఘా కోసం ప్రత్యేకంగా సిబ్బందిని పెట్టినట్లు సమాచారం. ఈ కోడిపందేల శిబిరంలో పేకాట జూదం, మద్యం విక్రయాలు జోరుగా సాగించారు. తమ దృష్టికి రాలేదన్న కుంటిసాకుతో పోలీసులు అటువైపు వెళ్లలేదు. మరి కోడి పందేలు నిషేధం, దానిపై కఠినచర్యలు తీసుకుంటామన్న ఎస్పీ, జాయింట్ కలెక్టర్ మాటలు ప్రకటనలకే పరిమితమవుతాయా.. ఇప్పటికైనా కఠిన చర్యలు తీసుకుంటారా.. అనేది వారికే తెలియాలి. -
ప్రభుత్వ ఆస్తులను ప్రైవేటీకరించడం బాబు నైజం
రాజంపేట రూరల్ : రాష్ట్రంలోని ప్రభుత్వ ఆస్తులను తన అనుమాయులైన వ్యక్తులకు ప్రైవేటీకరణ చేయటం సీఎం చంద్రబాబు నైజమని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి విమర్శించారు. మండల పరిధిలోని ఆకేపాటి ఎస్టేట్లో బుధవారం కడప మేయర్ పాకా సురేష్, డిప్యూటీ మేయర్ బండి నిత్యానందరెడ్డిలతో కలిసి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణ జీఓలను బోగి మంటలలో వేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దేశ చరిత్రలో 5 సంవత్సరాల కాలంలో 17 మెడికల్ కళాశాలను ఏర్పాటు చేసిన ఽఘనత మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిదని కొనియాడారు. స్వాతంత్రం వచ్చిప్పటి నుంచి రాష్ట్రంలో ఉన్నవి 12 మెడికల్ కళాశాలలు మాత్రమేనని గుర్తు చేశారు. అందులో దివంగత మహనేత వైఎస్ రాజశేఖరరెడ్డి పాలనలో 3 మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేశారన్నారు. బాబు ఎన్ని పర్యాయాలు సీఎంగా ఉన్న ఒక మెడికల్ కళాశాలను కూడా ఏర్పాటు చేయక పోవటం మన దౌర్భాగ్యమన్నారు. ప్రజలకు మంచి చేసేందుకు ఒక ప్రభుత్వం ఒక మంచి పని చేసిన తర్వాత ప్రభుత్వానికి వాటిని పూర్తి చేసే బాధ్యత లేదా అని నిలదీశారు. మెడికల్ కళాశాలలను ముందుకు తీసుకెళ్లటంలో బాబు ప్రభుత్వం విఫలమైందన్నారు. సీఎం చంద్రబాబులో మార్పు వచ్చి మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణను మానుకోవాలని రాష్ట్ర ప్రజలంతా కోరుకుంటున్నారన్నారు. మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులు తీసుకోరాదని హతవు పలికారు. తమ ప్రభుత్వం అధికారంలోకి వస్తే మెడికల్ కళాశాలలను తిరిగి స్వాధీనం చేసుకుంటామని మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హెచ్చరించారని గుర్తు చేశారు. కడప మేయర్ సురేష్ మాట్లాడుతూ కరోనా కష్ట కాలంలో వైద్యం కోసం పేద ప్రజల కష్టాలను చూసి తమ నేత వైఎస్ జగన్మోహన్రెడ్డి చలించి పోయారన్నారు. వైద్యం అందుబాటులోకి వస్తే తమ ప్రజలందరూ సంతోషంగా ఉంటారని 17 మెడికల్ కళాశాలలను మంజూరు చేశారన్నారు. అందులో 5 మెడికల్ కళాశాలలు పూర్తి అయ్యాయి అన్నారు. 3 మెడికల్ కళాశాలల్లో అడ్మిషన్లు పూర్తి చేశారన్నారు. మిగిలిన కళాశాలలన్నీ 3 వేల కొట్లు వెచ్చిస్తే పూర్తి అవుతాయన్నారు. వాటిని పూర్తి చేయకుండా ప్రైవేటీకరణం చేయటాన్ని వైఎస్సార్సీపీ నిరసిస్తోందన్నారు. అందులో భాగంగానే కోటి సంతకాల సేకరణ, రచ్చబండ, ర్యాలీలు, నిరసనలను చేపట్టామన్నారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, వైఎస్సార్సీపీ నాయకులు మాసిమబాబు, చొప్పా యల్లారెడ్డి తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షులు, ఎమ్మెల్యే ఆకేపాటి అమరనాథరెడ్డి -
● జోరుగా మంగతై, బుడబుక్కలాట
పులివెందుల రూరల్ : పులివెందుల మండలం నల్లపురెడ్డిపల్లె, కొత్తపల్లె తదితర గ్రామాల్లో కోడిపందేలు భారీగా జరిగాయి. కోళ్లకు కత్తులు కట్టకుండా పందాలు ఆడుకోవచ్చునని, జంతు బలులను నిషేధించాలని హైకోర్టు కలెక్టర్లు, ఎస్పీలకు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసింది. అవసరమైతే 144 సెక్షన్ విధించాలని పోలీసులను ఆదేశించింది. కానీ కోడి పందాల వద్ద పోలీసుల జాడ కనిపించింటే ఒట్టు. మరోపక్క కోడిపందాల మాటున విచ్చలవిడిగా మంగతై, బుడుబుక్కలాటలతోపాటు మరికొన్ని అసాంఘిక కార్యకలాపాలు యథేచ్చగా జరుగుతున్నాయి. బుడబుక్కలాటలో చిన్నపిల్లలు సైతం పాల్గొని పందేలు కాయడం విచారకరం. -
జూద క్రీడలకు పాల్పడితే కఠిన చర్యలు
రాయచోటి : సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లాలో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడేవారిపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి హెచ్చరించారు. పండుగ పేరుతో కోడిపందేలు, పేకాట, గుండాట వంటి జూద క్రీడలు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని మంగళవారం పత్రికా ప్రకటన ద్వారా జిల్లా ప్రజలకు ఎస్పీ తెలియపరిచారు. పందేల కోసం స్థలాలు ఇచ్చిన యజమానులు కూడా నిందితులుగా పరిగణించి కేసులు నమోదు చేస్తామన్నారు. పోలీసు కేసులు నమోదైతే ఉద్యోగాలు, పాస్పోర్టు రావడం కష్టమవుతుందన్నారు. యువత తమ భవిష్యత్తును పాడు చేసుకోవద్దని సూచించారు. పాత నేరస్తులపై నిఘా ఉంచామని, నిబంధనలు ఉల్లంఘిస్తే అరెస్టులు తప్పవని స్పష్టం చేశారు. అసాంఘిక కార్యకలాపాలపై సమాచా రం ఉన్న వారు స్థానిక పోలీసు స్టేషన్కు లేదా డయల్ 112కు ఫిర్యాదు చేయాలన్నారు. సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని తెలిపారు. శుభాకాంక్షలు : జిల్లా ప్రజలు, పోలీసులు, వారి కుటుంబ సభ్యులకు, మీడియా సోదరులకు ఎస్పీ భోగి, సంక్రాంతి, కనుమ పండుగ శుభాకాంక్షలను ప్రకటన ద్వారా తెలియజేశారు. అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
రైలు ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా నిర్ణయాలు
– రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ సభ్యుడు మేడా రఘునాథరెడ్డి రాజంపేట : ఇటీవల విశాఖపట్నంలో నిర్వహించిన రైల్వేస్టాండింగ్ కమిటీలో రైలు ప్రయాణికుల భద్రతే ధ్యేయంగా నిర్ణయాలు తీసుకున్నట్లు రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ కమిటీ సభ్యుడు, రాజ్య సభసభ్యుడు మేడా రఘునాథరెడ్డి తెలిపారు. మంగళవారం రాజంపేట బైపాస్లోని మేడాభవన్కు వచ్చిన సందర్భంగా ఆయన మాట్లాడారు. రైల్వేపరంగా నెలకొన్న ప్రయాణికుల సమస్యలను స్టాండింగ్ కౌన్సిల్లో చర్చించినట్లు చెప్పారు. మెరుగైన ప్రయాణానికి అవసరమైన చర్యలపై రైల్వే ఉన్నతాధికారుల నుంచి సలహాలు, సూచనలు తెలుసుకున్నట్లు తెలిపారు. అలాగే కొత్త రైళ్లు, బోగీలు, రైలుమార్గాల పురోగతి, పలు స్టేషన్లలలో రైళ్ల హాల్టింగ్స్పై చర్చించామన్నారు. భారతీయ రైల్వేలో వస్తున్న ఆధునిక మార్పులకు అనుగుణంగా, ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాల కల్పన దిశగా రైల్వేస్టాండింగ్ కౌన్సిల్ అడుగులు వేస్తోందన్నారు. అనంతరం పలువురు వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు కలిసి,శాలువాలు కప్పి ఘనంగా సత్కరించారు. ఎమ్మెల్యే సోదరుడు ఆకేపాటి అనిల్రెడ్డి, రాజంపేట మున్సిపాలిటి చైర్మన్ పోలా శ్రీనివాసులరెడ్డి, ఏఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వైఎస్సార్సీపీ నేతలు ఆకేపాటి వేణుగోపాల్రెడ్డి, టక్కోలు శివారెడ్డి, ఏకుల రాజేశ్వరీరెడ్డి , నందలూరు నేతలు గాలాసుధాకర్రెడ్డి, మోహన్రెడ్డి, బూసిరెడ్డి రాజశేఖర్రెడ్డి, ఆల్విన్ విజయుడు తదితరులు పాల్గొన్నారు. – ఇరువురికి తీవ్రగాయాలు, ఒకరి పరిస్థితి విషమం పోరుమామిళ్ల : పట్టణానికి కిలోమీటర్ దూరంలో ఈదుళ్లపల్లె సమీపంలో పెట్రోల్ బంకు వద్ద మంగళవారం సాయంత్రం నాలుగున్నర గంటల ప్రాంతంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో కలసపాడు మండలం కొండపేట ఎస్సీ కాలనీకి చెందిన తప్పెట రఘు (21) మృతి చెందాడు. రెండు బైకులు ఎదురెదురుగా రావడంతో ఢీ కొని ప్రమాదం చోటు చేసుకుంది. మృతుడు రఘు పెయింటర్ పనికి వచ్చి అక్కడ ఉన్న స్కూటీని తీసుకుపోతుండగా ఈ ప్రమాదం జరిగినట్లు తెలిసింది. ప్రమాద ప్రాంతానికి వచ్చిన ఓ వ్యక్తి మృతున్ని గుర్తించి, తన వద్దకు పెయింటింగ్ పనికి వచ్చి, అక్కడ పెట్టిన తన స్కూటీని దొంగలించుకు వచ్చాడని చెప్పాడు. కాశినాయన మండలం బాలాయపల్లెకు చెందిన ముగ్గురు ఒకే బైక్పై పోరుమామిళ్లకు వస్తుండగా ఈ ప్రమాదం జరిగింది. బైకులో ఉన్న ఇద్దరు తీవ్రంగా గాయపడగా 108లో పోరుమామిళ్ల ఆసుపత్రికి తరలించారు. వారిలో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలిసింది. ఈ ఘటనపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. -
మూడు ఆలయాల్లో చోరీ
● అమ్మవారి తాళ్లి బోట్లు చోరీ ● కోదండరామాలయంలో హుండీ చోరీ చోరీకి గురైన పెండ్ల గంగమ్మ ఆలయం చోరీకి గురైన కోదండ రామాలయం రొంపిచెర్ల : మండలంలోని మోటుమల్లెల గ్రామ పంచాయతీలో సోమవారం రాత్రి మూడు ఆలయాల్లో గుర్తు తెలియని వ్యక్తలు అమ్మవారి నగలు, డబ్బు చోరీ చేసినట్లు గ్రామస్థులు తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. ఆదినవారిపల్లెలోని శ్రీరాముల గుడి తాళాలు పగలగొట్టి ఆరు అమ్మవారి తాళ్లి బోట్లును చోరీ చేశారు. అలాగే పెండ్ల గంగమ్మ ఆలయంలో హుండీలో నగదు చోరీ చేశారు. సవ్వాలవారిపల్లె కోదండ రామాలయంలో అమ్మవారి మంగళసూత్రం, ఆలయంలో ఏర్పాటు చేసిన హుండీని చోరీ చేశారు. మూడు ఆలయాల్లో సుమారు రూ.40 వేలు విలువ చేసే బంగారు నగలు, రూ.15 వేలు నగదును చోరీ చేశారని గ్రామస్థులు తెలిపారు. ఆదినవారిపల్లె ఆలయాల్లో ఆరు నెల క్రితం దొంగలు దొంగతనం చేశారని, మళ్లీ ఇప్పుడు చోరీ చేశారని గ్రామస్థులు తెలిపారు. ఈ విషయాన్ని ఆలయ కమిటీ సభ్యులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. రొంపిచెర్ల పోలీసులు చోరీలు జరిగిన ఆలయాలను సందర్శించి వివరాలను అడిగి తెలుసుకున్నారు. స్థానిక పోలీసులు చోరీలు జరిగినప్పుడు వచ్చి చూసి వెళ్లుతున్నారే తప్పా దొంగలను పట్టుకుంది లేదన్నారు. దీంతో మండలంలో ఎక్కడ చూసిన విచ్చల విడిగా చోరీలకు పాల్పడుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఇప్పుటికై న అధికారులు తగు చర్యలు తీసుకుని చోరీదారులపై కేసులు నమోదు చేసి కఠినంగా శిక్షించాలని కోరుతున్నారు. -
రామయ్య సన్నిధిలో సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ
ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామిని సౌత్ సెంట్రల్ రైల్వే ఐజీ/పీసీఎస్సీ (ప్రిన్సిపల్ చీఫ్ సెక్యూరిటీ కమిషనర్) అరోమా సింగ్ఠాకూర్ కుటుంబ సమేతంగా దర్శించుకున్నారు. వారికి ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికి, ప్రదక్షిణ గావించి గర్భాలయంలోని మూలవిరాట్కి ప్రత్యేక పూజలు నిర్వహించి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈమె వెంట గుంతకల్ డివిజన్ డీఎస్సీ ఆకాశ్జైస్వాల్, కడప ఆర్పీఎఫ్ సీఐ కోటేశ్వరరావు, రేణిగుంట రైల్వే క్రైం బ్రాంచ్ సీఐ మునిప్రసాద్, ఒంటిమిట్ట సీఐ నరసింహరాజు, నందలూరు ఓపీ ఆర్పీఎఫ్ ఎస్ఐ త్రివేణి, ఒంటిమిట్ట ఎస్ఐ శ్రీనివాసులు ఉన్నారు. రామయ్య సన్నిధిలో ప్రముఖ పారిశ్రామికవేత్తలు ఒంటిమిట్ట శ్రీ కోదండరాముడి ఆలయంలో మండలంలోని మంటపంపల్లికి చెందిన ప్రముఖ పారిశ్రామికవేత్తలైన పుట్లంరెడ్డి వేణుగోపాల్రెడ్డి, పుట్లంరెడ్డి ప్రతాపరెడ్డి కుటుంబసభ్యులతో కలిసి స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం ఆలయ రంగమండపంలో సేదతీరిన వారిని డిప్యూటీ ఈఓ ప్రశాంతి ఘనంగా సత్కరించి, అర్చకుల చేత స్వామి వారి తీర్థప్రసాదాలను అందజేశారు. ఈ సందర్భంగా పారివ్రామికవేత్తలు స్వామి వారి భక్తులకు మూడు పూటలా అన్నప్రసాదం కల్పించాలని డిప్యూటీ ఈఓకు స్పష్ట సూచనలు చేశారు. తొందరలోనే ప్రారంభం కానున్న తాత్కాలిక నిత్య అన్నదాన కేంద్రానికి వారి సహాయ సహకారాలు అందించాలని డిప్యూటీ ఈఓ ప్రశాంతి కోరగా దానికి వారు సానుకూలంగా స్పందించారు. కార్యక్రమంలో ఒంటిమిట్ట జడ్పీటీసీ అద్దలూరు ముద్దుకృష్ణారెడ్డి, ఎంపీటీసీ సుంకేసుల భాషా, సుభాన్బాషా తదితరులు పాల్గొన్నారు. -
ముగ్గురు గంజాయి విక్రేతల అరెస్ట్
● 2 కిలోల గంజాయి స్వాధీనం ● ఏ–1, 2 నిందితుల కోసం గాలింపు మదనపల్లె రూరల్ : మదనపల్లె, కురబలకోట పరిసర ప్రాంతాల్లో గంజాయి విక్రయిస్తున్న ముగ్గురిని అరెస్ట్ చేసి, 2 కిలోల గంజాయిని స్వాఽధీనం చేసుకున్నట్లు రూరల్ సీఐ రవినాయక్ తెలిపారు. మంగళవారం రూరల్ పోలీస్స్టేషన్లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో నిందితుల వివరాలను వెల్లడించారు. కురబలకోట ఎస్ఐ మధురామచంద్రుడుకు ముందస్తుగా అందిన సమాచారం మేరకు సిబ్బందితో కలిసి ఈనెల 12న కురబలకోట రైల్వే ఓవర్ బ్రిడ్జి కింద నాగరాళ్లు వద్దకు వెళ్లినట్లు తెలిపారు. అప్పటికే అక్కడ ఉన్నటువంటి ముగ్గురు వ్యక్తులు పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించగా, వారిని చుట్టుముట్టి పట్టుకుని వారి చేతిలో ఉన్నటువంటి ప్లాస్టిక్ సంచులను పరిశీలిస్తే ఘాటైన గంజాయి వాసన వచ్చిందన్నారు. దీంతో కురబలకోట ఎంపీడీఓ గంగయ్య, వీఆర్వోలు ఖాదర్బాషా, రాజన్న సమక్షంలో నిందితులను అదుపులోకి తీసుకుని వారి నుంచి 2 కిలోల గంజాయి స్వాధీనం చేసుకున్నామన్నారు. నిందితులు మదనపల్లె టౌన్, మేదరవీధికి చెందిన ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ విద్యార్థి తాలే తరుణ్(19), కురబలకోట మండలం చింతమాకులపల్లె పంచాయతీ పులుసుగుంతలకు చెందిన టేకుమంద నాగరాజ(45), మదనపల్లె పట్టణం రామారావుకాలనీ గంగమ్మగుడి వద్ద నివాసం ఉంటున్న ఎలక్ట్రీషియన్ షేక్ సయ్యద్వలీ(19)గా గుర్తించామన్నారు. నిందితులను పట్టుకోవడంలో ప్రతిభ కనపరిచిన ముదివేడు ఎస్ఐ మధురామచంద్రుడు, కానిస్టేబుల్స్ రెడ్డిశేఖర్, సిద్ధేశ్వర, చక్రపాణి, వెంకటేశ్వరులు, శ్రీనివాసులు, జీ.ప్రసాద్ను అభినందిస్తూ రివార్డుల కోసం ఉన్నతాధికారులకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. -
అక్రమ లేఅవుట్లపై మున్సిపాలిటీ కన్నెర్ర
● అక్రమ లేఅవుట్లు తొలగింపు ● హడలిపోతున్న ప్రజలు, వ్యాపారులు పుంగనూరులో అక్రమ లేఅవుట్లను తొలగిస్తున్న మున్సిపల్ కార్మికులు పుంగనూరు : ఎన్నడు లేని విధంగా మున్సి పాలిటీ పరిధిలోని అక్రమ లేఅవుట్లను తొలగించడంతో ప్రజలు, వ్యాపారులు బెంబేలెత్తిపోయారు. ప్లాట్లు కొన్నవారి రాళ్ళను, హద్దులను తొలగించడంతో వ్యాపారం కుదేలైంది. మంగళవారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులు లేఅవుట్లను తొలగించారు. పట్టణంలోని గోకుల్ థియేటర్ వెనుక భాగంలో సర్వేనెంబరు 156, తిరు పతి రోడ్డులోని యూఎన్ఆర్ సర్కిల్లోని సర్వేనెంబరు 27, 29లలో, చౌడేపల్లె రోడ్డులోని 24 సర్వే నెంబరులో, ఎన్ఎస్.పేట శుభా రాం డిగ్రీకళాశాల వద్ద సర్వేనెంబరు 24లో వేసిన అక్రమ లేఅవుట్లను తొలగించినట్లు కమిషనర్ తెలిపారు. ప్రభుత్వాదేశాల మేర కు లేఅవుట్ల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం అనుమతి మంజూరు చేసిందని తెలిపారు. వ్యాపారులు మున్సిపల్ ఆదాయానికి గండికొట్టి లేఅవుట్లను ఏర్పాటు చేస్తుండటంతో తొలగించామన్నారు. అనధికార లేఅవుట్లను క్రమబద్ధీకరించుకునేందుకు ఈనెల 23 వరకు గడువు ఉందన్నారు. ఆలోపు అనుమతులు పొందాలన్నారు. అనుమతి పొందని స్థలాల క్రయవిక్రయాలు నిషేధిస్తూ, సంబంధిత సబ్ రిజిస్ట్రార్లకు ఆదేశాలు జారీ చేశామని కమిషనర్ తెలిపారు. ఈ విషయంలో ప్రజలు , వ్యాపారులు గమనించి, లేఔట్లకు అనుమతులు పొందాలని కోరారు. ఈ విషయమై పలువురు మాట్లాడుతూ లక్షలా ది రూపాయలు ఖర్చు చేసి వేసిన లేఅవుట్లను తొలగించడం బాధకరమన్నారు. డబ్బులు కట్టేందుకు గడువు ఉన్నా అధికారులు తొలగించడంతో వ్యాపారం కుదేలైందని ఆవేదన వ్యక్తం చేశారు. -
సంక్రాంతి శుభాకాంక్షలు
పుంగనూరు: నూతన సంవత్సర బోగి, సంక్రాంతి, కనుమ పండుగలను ప్రజలందరు సుఖసంతోషాలతో జరుపుకోవాలని మాజీ మంత్రి, ఎమ్మెల్యే డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి , రాజంపేట పార్లమెంటు సభ్యులు పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డిలు ఆకాంక్షించారు. మంగళవారం వారు మాట్లాడుతూ పండుగలను గ్రామీణ ప్రాంతాలలో ప్రజలు బంధుమిత్రులతో కలసి సంతోషంగా జరుపుకోవాలని కోరారు. గ్రామప్రాంతాలలో పంటలు బాగా పండి, వ్యాపారాలు బాగా అభివృద్ధి చెంది, ప్రతి ఇంటా సిరులు పండాలని వారిద్దరు ఆకాంక్షించారు. పులిచెర్ల(కల్లూరు): చిత్తూరు జిల్లా పులిచెర్ల మండలంలోని దేవళంపేట పంచాయతీ దిగువ మూర్తివారిపల్లె, గంటావారిపల్లెల్లో మంగళవారం తెల్లవారుజామున ఏనుగులు రైతుల భూముల్లో ప్రవేశించి పంటలను ధ్వంసం చేసాయి. గంటావారిపల్లెలో మామిడి తోపులకు వేసిన డ్రిప్ పరికరాలను, మోటరును ధ్వంసం చేశాయి. అలాగే మామిడి చెట్లను కొమ్మలతో సహా పూర్తిగా విరిచేసి ఎందుకూ పనికి రాకుండా చేసాయి.గతంలో మామిడి కొమ్మలను మాత్రమే విరిచే ఏనుగులు ఇప్పుడు చెట్లను పూర్తిగా విరిచేస్తున్నాయి. దీనితో రైతు కోలుకోని విధంగా పూర్తిగా నష్టపోతున్నాడు. రాయచోటి: సంక్రాంతి పండుగ సందర్భంగా అధిక చార్జీలు వసూలు చేస్తున్న ప్రైవేటు బస్సులపై కఠిన చర్యలు తీసుకుంటున్నట్లు జిల్లా రవాణాశాఖ అధికారి ప్రసాద్ తెలిపారు. ఇప్పటికే అదనపు చార్జీలు వసూళ్లకు పాల్పడుతున్న పలు బస్సులపై 13 కేసులు నమోదు చేశామని ఆయన ఒక ప్రకటనలో పేర్కొన్నారు. సంక్రాంతి పండుగ సందర్బంగా స్వగ్రామాలకు వెళ్లే ప్రయాణికుల సంఖ్య భారీగా పెరిగిన నేపథ్యంలో ప్రైవేటు బస్సులు అధిక చార్జీలు వసూలు చేయకుండా నియంత్రించేదుకు ఆంధ్రప్రదేశ్ రవాణాశాఖ కఠిన చర్యలు చేపట్టిందని వివరించారు. ఐదు రోజులుగా ఆర్టీజీఎస్ పర్యవేక్షణతోపాటు ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన ధరల పర్యవేక్షణ బృందాలు ద్వారా అన్ని ఆన్లైన్ బుకింగ్ ప్లాట్ యాప్లోని బస్సు చార్జీలను నిరంతరం పరిశీలిస్తున్నట్లు పేర్కొన్నారు. అధిక ధరలు వసూలు చేస్తున్నట్లు గుర్తించిన వెంటనే సంబంధిత ప్రైవేటు బస్సు యజమానులతో అధికారులు సమన్వయం చేసి చార్జీలను తక్షణమే తగ్గించి నియంత్రించే చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. ఎక్కువ ధరకు టిక్కెట్లు విక్రయిస్తే సంబంధిత బస్సు యాజమానులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. ప్రయాణికుల సంక్షేమాన్ని దృష్టిలో ఉంచుకొని రాష్ట్ర వ్యాప్తంగా హెల్ప్లైన్ నెంబరు 9281607001ను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. హెల్లైన్ నెంబర్ను ప్రతి ప్రైవేటు బస్సులో తప్పనిసరిగా స్పష్టంగా ప్రద రించాలని బస్సు యజమానులకు ఆదేశాలు జారీ చేశామని అందులో పేర్కొన్నారు. కాగా తనిఖీలలో అధిక చార్జీలు వసూలు చేసిన 13 బస్సులపై కేసులు నమోదు చేసి రూ. 1,30, 000లు జరిమానా విధించామన్నారు. అలాగే పన్ను, ర్మిట్ వంటి ఇతర నిబంధనలు ఉల్లంఘించన రెండు బస్సులపై కేసులు నమోదు చేశామన్నారు. ఈ ప్రత్యేక తనిఖీలు, పర్యవేక్షణ ప్రక్రియ జనవరి 18 వరకు కొనసాగుతాయని తెలిపారు. పెద్దిరెడ్డి వెంకటమిధున్రెడ్డి, రాజంపేట ఎంపీపెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, మాజీ మంత్రి -
ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి
రొంపిచెర్ల : ట్రాక్టర్ బోల్తా పడి డ్రైవర్ మృతి చెందిన సంఘటన చిత్తూరు జిల్లా రొంపిచెర్ల మండలం చిచ్చిలివారిపల్లె గ్రామ పంచాయతీలోని మల్లెలక్రాస్లో మంగళవారం ఉదయం చోటు చేసుకుంది. గ్రామస్థుల కథనం మేరకు వివరాలు ఇలా ఉన్నాయి. అన్నమ్మయ్య జిల్లా పీలేరు మండలం తలపలకు చెందిన నాగేశ్వర కుమారుడు లీలాకుమార్ (23) ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తున్నాడు. మంగళవారం ఉదయం 7 గంటలకు మామిడి చెట్లకు మందు పిచికారి చేసేందుకు ట్రాక్టర్ తీసుకుని పీలేరు వైపు వస్తుండగా రొంపిచెర్ల మండల పరిధిలోని మల్లెల క్రాస్ వద్ద అదుపు తప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో లీలాకుమార్ తీవ్రంగా గాయ పడ్డాడు. అతడిని చికిత్స కోసం 108 వాహనంలో పీలేరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. అప్పుటికే అతడు మృతి చెందాడు. ప్రస్తుతం భార్య గర్భిణిగా ఉందని బంధువులు తెలిపారు. రొంపిచెర్ల పోలీసులు సంఘటన స్థలాన్ని పరిశీలించారు. ప్రమాదానికి గురైన ట్రాక్టర్ను రొంపిచెర్ల పోలీసు స్టేషన్కు తరలించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కేన్సర్ బాధితుడికి ఎంపీ ఆర్థిక సాయం సుండుపల్లె : మండల పరిధిలోని భాగంపల్లె గ్రామ పంచాయతీ దిన్నెమీద బలిజపల్లెకు చెందిన బోనంశెట్టి నాగరాజ కుమారుడు నాగచైతన్య (14) బోన్ బ్లడ్ కేన్సర్తో ప్రాణాపాయ స్థితిలో వేలూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. విషయం తెలుసుకున్న రాజంపేట పార్లమెంట్ సభ్యులు పెద్దిరెడ్డి వెంకట మిథున్రెడ్డి మానవతా దృక్పథంతో స్పందించి ప్రత్యేక చొరవ తీసుకుని ప్రధానమంత్రి జాతీయ సహాయనిధి ద్వారా బాధితుని చికిత్స కోసం రూ.3 లక్షల ఆర్థిక సహాయాన్ని అందజేశారు. మంచి మనసున్న నాయకుడిగా తమ కుమారుని చికిత్సకు ఆర్థిక సహాయం అందజేసి ఎంపీకి బాధితుని కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు. ఒంటిమిట్ట : సంక్రాంతి పండుగలో భాగంగా మూడవ రోజు కనుమనాడు టీటీడీ సంప్రదాయబద్ధంగా నిర్వహించే పార్వేట ఉత్సవానికి ఒంటిమిట్ట రామయ్య బయలుదేరుతాడు. దాని కోసం టీటీడీ ఆలయ అధికారులు అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. స్థానిక నాగేటి తిప్పపై ఉన్న పార్వేట మండపాన్ని రంగు రంగు విద్యుత్ దీపాలతో ముస్తాబు చేశారు. పార్వేట అంటే తెలుగులో వేట అని అర్థం. ఇది దైవిక వేటను సూచిస్తుందని పండితులు చెబుతున్నారు. ఈ వేటలో ఉత్సవ మూర్తులను వేటగాళ్ల రూపంలో అలంకరించి, రాక్షసులను వేటాడినట్లుగా పూజలు చేస్తారు. అనంతరం గ్రామోత్సవంలో జగదభిరాముడు భక్తుల ఇంటి ముంగిళ్లకు వెళ్లి కటాక్షించి, తిరిగి ఆలయానికి తీసుకొస్తారు. ఈ ప్రక్రియ దేవతలు వేటగాళ్ల వలె అడవులకు వెళ్లి దుష్టశక్తులను సంహరించి, ప్రజలను రక్షించడాన్ని సూచించే ఒక పౌరాణిక వేడుక. దీని ఏటా ఒంటిమిట్టలో టీటీడీ వారు వైభవంగా నిర్వహిస్తారు. గుర్తు తెలియని వాహనం ఢీకొని వ్యక్తి మృతి జమ్మలమడుగు : గుర్తు తెలియని వాహనం ఢీకొని మైలవరం మండలం బెస్తవేముల గ్రామానికి చెందిన మదన మోహన్ (30) మృతి చెందాడు. సోమవారం అర్థరాత్రి దాల్మియా పరిశ్రమ వద్దనుంచి స్కూటర్లో జమ్మలమడుగుకు వస్తుండగా తాడిపత్రి బైపాస్ రోడ్డులో ఉన్న సాయి శివాని కల్యాణ మండపం వద్ద గుర్తు తెలియని వాహనం ఢీకొంది. మదన మోహన్ అక్కడిక్కడే మృతి చెందాడు. స్థానిక అర్బన్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఒంటిమిట్ట : మండల కేంద్రంలోని కడప–చైన్నె జాతీయ రహదారిపై సోమవారం మధ్యాహ్నం జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడి చికిత్స పొందుతూ చామా రాధ (35)మంగళవారం తెల్లవారుజామున మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు. చెర్లోపల్లి నుంచి తన అమ్మగారి ఊరు ఖాజీపేటకు తమ్ముడితో ద్విచక్రవాహనంలో రాధ వెళుతుండగా రామతీర్థం సమీపాన ఉన్న చెరువు కట్టపై గల దెబ్బతిని గుంతలు పడ్డ రహదారిపై అదపు తప్పి కింద పడ్డారు. ప్రమాదంలో చామా రాధ తలకు తీవ్రగాయమైది. తిరుపతిలో చికిత్స పొందుతూ ఆమె మృతి చెందింది. -
అశ్రునయనాల మధ్య జవాన్ అంత్యక్రియలు
కురబలకోట : మండలంలోని తూపల్లికి చెందిన జవాన్ ఎన్. రాజశేఖర్రెడ్డి అంత్యక్రియలు మంగళవారం స్వగ్రామంలో అశ్రునయనాల మధ్య నిర్వహించారు. ముదివేడు సమీపంలో సోమవారం రాత్రి టిప్పర్ ఢీకొనడంతో ప్రాణాలు కోల్పోయిన విషయం తెలిసిందే. సెలవులో ఇంటికి వచ్చిన అతను మృత్యు ఒడికి చేరడం కలచివేసింది. మదనపల్లి ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం అనంతరం మృత దేహాన్ని స్వగ్రామానికి తరలించారు. ఇతని అకాల మరణంతో పల్లె శోకసంద్రమైంది. తల్లి, భార్యను ఓదార్చడం ఎవరివల్ల కాలేదు. గ్రామంలో సంక్రాంతి పండగ సందడి స్థానంలో విషాద చాయలు అలుముకున్నాయి. జవాన్ ఆసస్మిక మృతి కుటుంబానికి తీరని వేదనగా మారింది. తండ్రి ప్రేమకు దూరమైన చిన్నారి ఊర్విని చూసి చలించిపోయారు. మనసుల్ని కలచివేసింది. వేర్వేరు ఘటనల్లో ముగ్గురు ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ముగ్గురు వ్యక్తులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్సలు పొందుతున్నారు. మదనపల్లె పట్టణం రామారావుకాలనీకి చెందిన కుమార్ కుమారుడు మనోజ్ (21) పనులకు వెళ్లకుండా జులాయిగా తిరుగుతుండటంతో తల్లిదండ్రులు మందలించారు. దీంతో మనస్తాపం చెందిన యువకుడు గడ్డిమందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. అదేవిధంగా గౌతమీనగర్కు చెందిన మైనర్ బాలిక (16) స్థానికంగా పదో తరగతి చదువుతోంది. తరచూ కడుపునొప్పి వేధిస్తుండటంతో మంగళవారం మరోసారి నొప్పి తీవ్రం కావడంతో భరించలేక పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. పెద్దమండ్యం మండలం వెలిగల్లుకు చెందిన మల్లికార్జున భార్య సుస్మిత(29) కుటుంబ సమస్యలతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు పాల్పడింది. ఆయా ఘటనల్లో గమనించిన కుటుంబసభ్యులు బాధితులను మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. సంబంధిత పోలీసులు కేసులు విచారణ చేస్తున్నారు. కుమారుడి మృతి తట్టుకోలేక తల్లి.. మదనపల్లె రూరల్ : ఆరునెలల క్రితం మృతిచెందిన కుమారుడిని గుర్తుచేసుకుని కుమిలిపోతూ మదనపడుతున్న ఓ తల్లి, బిడ్డ పుట్టినరోజు సందర్భంగా మనస్తాపంతో ఆత్మహత్యకు ప్రయత్నించిన ఘటన బి.కొత్తకోట మండలంలో చోటు చేసుకుంది. పిడింవారిపల్లెకు చెందిన రెడ్డెప్ప, శ్యామలమ్మ(35) దంపతుల కుమారుడు భాస్కర్(15) ఆరునెలల క్రితం పెద్దమండ్యం మండలం కలిచెర్లలో జరుగుతున్న తిరునాల కోసం స్నేహితుడి ఇంటికి వెళ్లాడు. స్థానికంగా ఉన్న చెరువులో ఈత కొట్టేందుకు మిత్రులతో కలిసి వెళ్లాడు. ప్రమాదవశాత్తు చెరువులో మునిగి భాస్కర్ మృతి చెందాడు. అప్పటి నుంచీ తల్లి శ్యామలమ్మ తీవ్ర మనస్తాపంతో కుమారుడిపై బెంగ పెట్టుకుంది. ఈ క్రమంలో మంగళవారం కుమారుడి పుట్టినరోజు కావడంతో భాస్కర్ను గుర్తుచేసుకుని కుమిలిపోయింది. బిడ్డ లేని జీవితం వద్దనుకుని పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబ సభ్యులు బాధితురాలిని బి.కొత్తకోట ప్రభుత్వ ఆస్పత్రికి తీసుకెళ్లారు. చికిత్సల అనంతరం అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. స్థానిక వైద్యులు ఐసీయూ విభాగంలో చికిత్సలు అందిస్తున్నారు. -
కోటలో కోలాహలం
డ్రమ్స్ శివమణి వాయిద్య ప్రదర్శనజమ్మలమడుగు/జమ్మలమడుగు రూరల్: గండికోటలో పర్యాటకుల కోలాహాలం నెలకొంది. మంగళవారం గండికోట ఉత్సవాలు చివరి రోజు కావడంతో పర్యాటకులు భారీగా తరలివచ్చారు. ముద్దనూరు, జమ్మలమడుగు రూట్లు ద్విచక్రవాహనాలు కార్లు, ప్రత్యేక బస్సులతో నిండిపోయాయి. చరిత్రాత్మక గండికోటను తిలకించడానికి యువతీ యువకులతో పాటు వృద్ధులు సైతం ప్రత్యేక ట్రాక్టర్లు ఆటోలలో వచ్చారు. ప్రమాదపు అంచున సెల్ఫీలు గండికోట ఉత్సవాలకు వచ్చిన పర్యాటకులు సెల్ఫీలతోనే నిమగ్నమయ్యారు. ప్రమాదం అని తెలిసిన కోట గొడల చివరికి వెళ్లి కుటుంబ సభ్యులతో సెల్పీలు దిగారు. గండికోట ఉత్సవాలలో మాధవరాయస్వామి ఆలయం, జూమ్మామసీదు , రంగనాథస్వామి ఆలయం, పెన్నాగాడ్జ్ ప్రాంతంలో భారీగా పర్యాటకులతో కిక్కిరిసిపోయింది. సాహస క్రీడలకు డిమాండ్.. గండికోటలో సాహస క్రీడలకు డిమాండ్ పెరిగింది. గండికోట ప్రారంభంలోనే గుర్రపుశాల వద్ద, జీప్రైడింగ్ ,బైక్ రైడింగ్ వద్ద పెద్దలు పిల్లలు క్యూకట్టారు. ఇక హెలీకాఫ్టర్ రైడింగ్క్ మూడో రోజూ డిమాండ్ కొనసాగింది. చాలా మందికి అవకాశం రాక వెనుదిరిగారు. కనీసం పారా గ్లైడరైనా ఎక్కి కోట అందాలు చూద్దామని పర్యాటకులు ఆశించినా నిర్వాహకులు నడపలేదని అసంతృప్తి వ్యక్తం చేశారు. విజేతలకు బహుమతుల ప్రదానం గండికోట ఉత్సవాల్లో భాగంగా నిర్వహించిన వివిధ విభాగాల్లో గెలుపొందిన వారికి కలెక్టర్ శ్రీధర్ చెరకూరి, ఎమ్మెల్యే ఆదినారాయణరెడ్డి బహుమతులను ప్రదానం చేశారు. అనంతరం స్టేజి పైన విద్యార్థులు , మహిళలతో సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. అయ్యా సౌండ్ పెంచు... అయ్యా సౌండ్ పెంచు గండికోట ఉత్సవాలకు సౌండ్ సక్రమంగా లేకుంటే ఎలా అంటూ మిమిక్రి ఆర్టిస్టు శివారెడ్డి అసహనం వ్యక్తం చేశారు. తాను పలుమార్లు సౌండ్ పెంచాలని చెప్పిన ఇలా చేయడం సరైంది కాదని వాపోయారు. అనతరం తన కార్యక్రమాన్ని కొనసాగించారు. మిమిక్రీని ప్రదర్శిస్తున్న శివారెడ్డి ప్రదర్శనలను తిలకిస్తున్న కలెక్టర్, ఎమ్మెల్యే కోటలో సందడి చేసిన కిరణ్ అబ్బవరం జమ్మలమడుగు: గండికోట ఉత్సవాల్లో భాగంగా ఆధ్యాత్మిక వేత్త, కేంద్ర సంగీత నాటక అకాడమి అవార్డు గ్రహీత గంగాధర శాస్త్రి ప్రసంగం వివాదాస్పదంగా మారింది. మంగళవారం చివరి రోజు ఆధ్యాత్మిక ప్రసంగం చేసిన ఆయన భగవద్గీత గురించి మాట్లాడారు. అయితే ప్రసంగంలో మంచీ చెడుల గురించి చెప్పాల్సింది పోయి ఇతర మతాల గురించి వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంపై పలువురు అభ్యంతరం వ్యక్తం చేశారు. ప్రతి ఒక్కరూ ఒక నరేంద్ర మోదీలాగా హిందువులను రక్షించుకునే విధంగా తయారు కావాలని పిలుపునిచ్చారు.గండికోటలో జరిగేది పర్యాటక ఉత్సవం. అన్ని వర్గాల వారు వచ్చి ఉంటారు.. ఒక రాజకీయ పార్టీ ప్రతినిధిగా ఆయన చేసిన వ్యాఖ్యలపై విమర్శలు వ్యక్తమయ్యాయి. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం
పీలేరు రూరల్ : రోడ్డు ప్రమాదంలో ఇద్దరు దుర్మరణం చెందిన సంఘటన మండలంలోని పొంతలచెరువు క్రాస్ వద్ద చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. సీఐ యుగంధర్ కథనం మేరకు వివరాలిలావున్నాయి. కేవీపల్లె మండలం నూతనకాల్వ పంచాయతీ చిన్నకంభిరెడ్డిగారిపల్లెకు చెందిన పఠాన్ అస్లామ్ (26), అదే గ్రామానికి చెందిన ఎస్. మున్నా (28) పీలేరులో సమీప బంధువుల ఇంటికి వచ్చారు. మంగళవారం రాత్రి స్వగ్రామానికి ద్విచక్రవాహనంలో బయలు దేరారు. అయితే మార్గం మధ్యలో రాయచోటి నుంచి చిత్తూరు వైపు వెళుతున్న లారీ ఢీకొంది. ప్రమాదంలో అస్లామ్ అక్కడికక్కడే మృతి చెందాడు. మున్నను చికిత్స నిమిత్తం 108లో తిరుపతికి తరలిస్తుండగా మార్గం మధ్యలో మృతి చెందాడు. అస్లామ్కు సుండుపల్లె మండలం రాయవరం గ్రామానికి చెందిన మెహతాజ్తో నెల రోజుల కిందటే వివాహం జరిగింది. మున్నాకు భార్య జ్యోతి తోపాటు ఒక కుమార్తె కలదు. ఒకే గ్రామానికి చెందిన ఇద్దరు రోడ్డు ప్రమాదంలోమృతి చెందడంలో చిన్నకంభిరెడ్డిగారిపల్లెలో విషాదఛాయలు అలుముకున్నాయి. సమీప బంధువులు పెద్ద ఎత్తున పీలేరు ప్రభుత్వాస్పత్రికి చేరుకుని బోరున విలపించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. అస్లామ్ (ఫైల్) మున్నా (ఫైల్) -
ఆ ఊళ్లకు సంక్రాంతి లేదు!
● తరతరాలుగా వస్తున్న పాతకాలంనాటి ఆచారం ● పూర్వీకుల సాంప్రదాయాన్ని ఆచరిస్తున్న నేటితరం యువత ● కలసికట్టుగా గ్రామ కట్టుబాట్లు అమలు గుర్రంకొండ: తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యమైన పండుగల్లో సంక్రాంతి పండుగకు మొదటిస్థానం ఉంది. పంటలు బాగా పండి ధాన్యరాశులు ఇంటికి చేరుకొన్న తరువాత వచ్చే తొలి పండుగ ఇదే. పంటలు పండించడానికి సాయపడే పశువులకు భక్తితో చేసుకొనే రైతు పండగ కూడా ఇదే. అందుకే ఆరుగాలం కష్టపడి పనిచేసే ప్రతిరైతూ ఈ పండుగను ఘనంగా జరుపుకొంటారు. ఇందుకు భిన్నంగా సంక్రాంతి పండుగను జరుపుకోని కొన్ని పల్లెలు ఉన్నాయంటే నమ్ముతారా... ఆ ఊళ్లలో సంక్రాంతి చేసుకోవడం నిషేధం.. అవును ఇదే నిజం.. అన్నమయ్య జిల్లా గుర్రంకొండ మండలంలోని 18 గ్రామాల్లో ఈ ఆచారం ఉంది. పాత కాలం నుంచి వస్తున్న ఈ ఆచారాన్ని నేటి ఆధునిక యువత కూడా పూర్వీకుల సాంప్రదాయాన్ని ఆచరిస్తుండడం విశేషం. గతంలో ఎప్పుడో.. ఎందుకో పెద్దలు ఏర్పాటు చేసుకొన్న కట్టుబాట్లను ఇప్పటికీ గ్రామస్తులు కలసి కట్టుగా అమలు చేస్తుండడం ఆ ఊళ్ల ప్రత్యేకత. ● పురాతన ఆచారాలకు నిలయంగా మారుమూల టి.పసలవాండ్లపల్లె పంచాయతీలో మొత్తం 18 గ్రామాలను చెప్పుకోవచ్చు. వీరి పురాతన ఆచారం ప్రకారం ఆయా గ్రామాల్లో ఈపండుగను జరుపుకోవడం నిషేధం. పల్లెల్లో పశువులను సింగారించడం. అందంగా అలంకరించడం, మేళతాళాలతో ఊరేగించడం వంటి దృశ్యాలు ఇక్కడ కనిపించవు. గ్రామపొలిమేర్లలో చిట్లాకుప్పల వద్దకు పశువులను తీసుకెళ్లడం, పాడిఆవుల ఆరాధ్యదైవమైన కాటమరాయుడికి పూజలు నిర్వహించడం వంటి దృశ్యాలు మచ్చుకై నా కనిపించవు. పాడిఆవులపై ఎంతో ప్రేమ కలిగిన ఈ గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేయడం నిషిద్ధం. సాధారణంగా రైతులు ఇప్పటికీ చాలా గ్రామాల్లో పాడిఆవులతో వ్యవసాయం చేస్తుంటారు. ఈ 18 గ్రామాల్లో మాత్రం పాడిఆవులతో వ్యవసాయ పనులు చేయరు. గోమాతను భక్తిశ్రద్ధలతో పూజించే సంస్కృతి ఇక్కడ మాత్రమే ఉండడం విశేషం. ఆచారాలను పాటిస్తున్నాం మాపూర్వికులు, పెద్దలు ఆచరించిన ఆచారాలను,సాంప్రదాయాలను ఇప్పటికీ పాటిస్తున్నాం. మాగ్రామదేవత శ్రీపల్లావలమ్మ ఉత్సవాల రోజున అమ్మవారి ఆవులను ఆలయం వద్దకు తీసుకొని వచ్చి పూజలు నిర్వహిస్తాం. – బ్రహ్మయ్య, ఆలయపూజారి, బత్తినగారిపల్లె పాడిఆవులతో వ్యవసాయమూ చేయరు.. -
● మార్చిలో జరిగే ఉత్సవాలే వీరికి సంక్రాంతి
ఏటా మార్చినెలలో నిర్వహించే గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలే ఇక్కడి ప్రజలకు సంక్రాంతి పండుగ. గ్రామదేవత శ్రీ పల్లావలమ్మ ఆజ్ఞానుసారం ప్రకారం ఈ పండుగ జరపకూడదంటూ పూర్వకాలంలో గ్రామపెద్దలు నిర్ణయించారు. వారి ఆదేశాలనే నేటికీ ఇక్కడ ప్రజలు తూచా తప్పకుండా పాటిస్తున్నారు. గ్రామంలో కొన్ని పశువులను గ్రామదేవత పల్లావలమ్మ పేరుమీద వదిలేసి కొందరు వాటిని మేపుతుంటారు. ప్రతి ఏడాది మార్చినెలలో శ్రీ పల్లావలమ్మ జాతర ఉత్సవాలు జరపుతుంటారు. ఆ ఉత్సవాల రోజున అమ్మవారి పేరుమీద వదిలిన ఆవులను మాత్రమే అందంగా అలంకరించి వాటిని ఆలయం వద్దకు ఊరేగింపుగా తీసుకెళతారు. అక్కడ వాటికి భక్తిశ్రద్ధలతో గ్రామస్తులందరూ పూజలు నిర్వహించడం ఆనవాయితీగా వస్తోంది. అదేవారికి సంక్రాంతి పండుగ. -
చుకు చుకు బండి.. పండక్కు లేదండి !
● ప్రత్యేక రైళ్లకు మొండిచెయ్యి ● కడప, తిరుపతి జిల్లా లైనులో ప్రయాణం కష్టం రాజంపేట : కడప, తిరుపతి జిల్లా రైలుమార్గంలో ప్రయాణం పట్టాలు తప్పింది. జిల్లాకు ఒక్కటంటే ఒక్కటి కూడా సంక్రాంతి రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రత్యేక రైలు వేయలేదన్న విమర్శలను రైల్వేశాఖ మూటగట్టుకుంది. తమకు ఉపయోగకరంగా ఉంటుందనే పేద, మధ్య తరగతి ప్రయాణికుల ఆవేదన రైల్వేశాఖ పట్టించుకోలేదు. తెలంగాణ, కర్నాటకతో పాటు ఇతర రాష్ట్రాలలో ఉన్న వారికి రెగ్యులర్ ట్రైన్లో రావాలంటే ప్రయాణం కష్టతరంగా మారింది. సంక్రాంతి రైళ్లేవీ లేకపోవడంతో స్వంత ఊళ్లకు రావాలంటే తలప్రాణం తోకకు వచ్చేలా తయారైంది. సంక్రాంతి రైళ్లు అన్నీ సర్కారు ప్రాంతం వైపే పరుగులు తీశాయి. సీమ రైల్వేలపై నిర్లక్ష్యానికి ఇది నిదర్శనం. నడుస్తున్న వారంతపు రైళ్లను ఈనెల 31 వరకు పొడిగించారు. ఈ రైళ్లకు కడపస్టేషన్ హాల్టింగ్కే పరిమితం కావడం గమనార్హం. బెర్త్ దొరకకపోయినా.. ఒక్కో బండిలో 500కు పైగా వెయింటింగ్ లిస్ట్ కనిపిస్తోంది. రైళ్లలో ఆ పరిమితి కూడా దాటిపోయి రిగ్రెట్కు చేరింది. బెర్తు దొరక్కపోయినా వెయింటింగ్ లిస్ట్ టికెట్తో ఏదోలా ప్రయాణం చేద్దామనుకునే వారికి ఆ అవకాశం కూడా లేకుండా నిరీక్షణ తర్వాత చాంతడంత ఉంది. 60 రోజుల ముందు నుంచే.. పండుగకు 60 రోజుల ముందు నుంచే ముందస్తు గా టికెట్లు బుక్ చేసుకున్నారు. ముందే రిజర్వేషన్లు ప్రారంభం కావడంతో.. వెంటనే ప్రయాణికులు టికెట్లు బుక్ చేసుకుంటున్నారు. ఇక కొంతమంది అయితే ముందురోజు ఓపెన్ అయ్యే తత్కాల్ లోనైనా టికెట్ దొరుకుతుందనే ఆశలో ఉన్నారు. సంక్రాంతి రద్దీ 14, 15, 16 తేదీలలో సంక్రాంతి పండుగ నేపథ్యంలో వారంరోజుల ముందునుంచే రైళ్లలో రద్దీ తీవ్రంగా ఉంది. హైదరాబాదు నుంచి ఉభయ వైఎస్సార్ జిల్లాలోని కడప, రాజంపేట, రైల్వేకోడూరు, ఎర్రగుంట్ల, ముద్దనూరు, కమలాపురం, నందలూరు తదితర ప్రాంతాలకు వేలాది మంది కుటుంబాలు సంక్రాంతి పండుగకు వచ్చేందుకు కష్టాలు పడాల్సి వస్తోంది. నలుగురున్న సభ్యులు సొంతూరికి.. నలుగురు సభ్యులున్న కుటుంబం సొంతూరికి వెళ్లిరా వాలంటే ఖర్చు ఎక్కువయ్యే స్థితి నెలకొంది. ఇక రైలులో టికెట్లు దొరకని వారంతా బస్సు అడ్వాన్స్డ్ రిజర్వేషన్ల కోసం ఎదురుచూస్తున్నారు. రైల్వేశాఖ పండగ సీజన్ దృష్ట్యా ఏమైనా ప్రత్యేక రైళ్లు నడిపితే వాటిలో టికెట్లు బుక్ చేసుకుందామనే ఆశలు లేవు. జిల్లా మీదుగా ప్రత్యేకరైళ్లు నడపడం లేదు. డే ట్రైన్ రన్ చేయాలనే డిమాండ్ ఉభయ జిల్లాలమీదుగా అన్రిజర్వడ్ డే ట్రైన్ను తెలంగాణకు నడిపించాలనే డిమాండ్ను ప్రజాప్రతినిధులు రైల్వేబోర్టు దృష్టికి తీసుకెళ్లాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. -
పరిష్కారం శూన్యం.. సమస్యలు పదిలం
● పీజీఆర్ఎస్లో పదే పదే అర్జీలు ఇస్తున్నా ఫలితం శూన్యం ● పెన్షన్లు, రెవెన్యూ సమస్యలే అధికం ● ప్రజా సమస్యలపై 266 అర్జీలు సాక్షి, అన్నమయ్య : ప్రభుత్వం ప్రత్యేకంగా నిర్వహిస్తున్న ప్రజా సమస్యల పరిష్కార వేదికకు బాధితు లు బారులు తీరుతున్నా ఎక్కడి సమస్యలు అక్కడ నే ఉంటున్నాయి. వినతిపత్రాలు ఇచ్చే వారి కష్టాలు తీరడం లేదు. కలెక్టర్ నిషాంత్కుమార్ సమస్యల పరిష్కారానికి ప్రత్యేక చొరవ తీసుకుంటున్నా కిందిస్థాయి యంత్రాంగంలో చిత్తశుద్ధి లో పించడంతో ఆశించిన ప్రయోజనం కనిపించడం లేదు. కూటమి ప్రభుత్వం ప్రతి సోమవారం నిర్వహిస్తున్న ప్రజాసమస్యల పరిష్కార వేదిక మొక్కుబడి తంతుగా మారింది. సమస్యలు పరిష్కారమవుతాయని నమ్ముకుని వచ్చే ప్రజలకు నిరాశే మిగులుతోంది. అర్జీలు పట్టుకుని ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగడం తప్పితే, ఇప్పటివరకు పరిష్కారమైన దాఖలాలు లేవని ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కలెక్టర్ అధ్యక్షతన జిల్లా స్థాయి అధికారులందరూ పీజీఆర్ఎస్ కార్యక్రమంలో పాల్గొంటున్నారు.కార్యక్రమంలో డీఆర్వో మధుసూదన్, సబ్ కలెక్టర్ చల్లా కల్యాణి, సర్వే ఏడీ భరత్కుమార్ ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. ప్రజాసమస్యలు తెలుసుకున్నారు. భారీగా వినతులు అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఏర్పడిన తర్వాత రెండోసారి సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమానికి భారీగా వినతులు వచ్చాయి. పీజీఆర్ఎస్ కార్యక్రమానికి అన్నమయ్య జిల్లాలోని 5 నియోజకవర్గాల నుంచి సమస్యలపై 266 అర్జీలు అందాయి. వివిధ ప్రాంతాల నుంచి ప్రజలు తరలివచ్చి వినతిపత్రాలు సమర్పించారు. ప్రధానంగా రెవెన్యూ పరమైన పెన్షన్లు, కబ్జాలు లాంటి వాటిపైనే పెద్ద ఎత్తున వినతులతో ప్రజలు తరలివచ్చారు. వచ్చిన దరఖాస్తుదారులే పదేపదే మళ్లీ వచ్చారు. పరిష్కారం ల భించకపోవడం ఆందోళన కలిగించే పరిణామం. ఒక్కొక్క అర్జీ రూ.100 జిల్లాలోని బాధితులు తమ గోడు ఉన్నతాధికారులకు చెప్పి సమస్య పరిష్కరించుకుందామని వస్తున్నవారి ఆవేదనను కొంతమంది వినతులు రాసే వారు సొమ్ము చేసుకుంటున్నారు. దరఖాస్తుదారుని బాధను పేపరులో నమోదు చేయడానికి రూ. 100 తీసుకుంటుండటంపై పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సుదూర ప్రాంతాల నుంచి ఇక్కడికి రావడం ఒక ఎత్తయితే, ఇక్కడ టిఫిన్, భోజన ఖర్చులు మొదలుకొని మళ్లీ అర్జీ రాసినందుకు ప్రత్యేకంగా నగదు చెల్లించాల్సి రావడం బాధాకరం. సాధారణంగా ఒక అర్జీ రాసేందుకు గతంలో అన్నమయ్య జిల్లా కేంద్రమైన రాయచోటి, వైఎస్సార్ జిల్లా కేంద్రమైన కడపలో రూ. 30 తీసుకునేవారు. అయితే ప్రస్తుతం అర్జీ రాసేందుకు ఒక్కసారిగా రూ. 100లు ఇవ్వాల్సి రావడంతో పలువురుబాధితులు వారితో గొడవకు దిగుతున్నారు. ఇది మంచి పద్దతి కాదని..ఇలా పెద్ద మొత్తంలో తీసుకుంటే మేమే ఇక్కడ కూర్చొని తక్కువ మొత్తానికి, లేకుంటే ఉచితంగా అర్జీలు రాసిస్తామంటూ ఓ మాజీ సైనికుడు వారితో వాద నకు దిగారు. అయినా అర్జీ రాసేవారిలో మార్పు కనిపించడం లేదు. ఉన్నతాధికారులు ప్రత్యేక చర్య లు చేపట్టి అర్జీ రాసే వారు నామమాత్రపు సొమ్ము తీసుకునేలా చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు నిమ్మనపల్లె మండలం రాచవేటివారిపల్లెకు చెందిన పిల్లి మల్లీశ్వరి దివ్యాంగుడైన తన తొమ్మిదేళ్ల కుమారుడికి పెన్షన్ మంజూరుచేయాల్సిందిగా కలెక్టర్కు అర్జీ సమర్పించింది. కాళ్లు చచ్చుపడిపోయి, నడవలేని స్థితిలో ఉన్నటువంటి తన కుమారుడి పోషణ కోసం వికలాంగ పెన్షన్ మంజూరు చేయాల్సిందిగా వేడుకుంది. మదనపల్లె మండలం సర్వే నం.367/1క్యూలోని తమ భూమికి వెళ్లేందుకు పక్క భూమి వారు దారి ఇవ్వడం లేదని మనేరి చలపతి అర్జీ సమర్పించారు. 1957 నుంచి కొండ వంకకు పూర్వీకులు బండిబాటగా వినియోగిస్తున్న దారి ఉన్నప్పటికీ, భూమిని ఆక్రమించుకుని తొమ్మిదేళ్లుగా తమతో పాటు ఇతర రైతులను ఇబ్బందులకు గురిచేస్తున్నారని ఫిర్యాదుచేశారు. పొలానికి వెళ్లేందుకు దారి ఇప్పించి, రైతులకు న్యాయం చేయాల్సిందిగా వేడుకున్నారు. -
పెట్టుబడి నష్టం
ఖరీఫ్లో వర్షాభావ పరిస్థితులు నష్టాలు కలిగించాయి. ఐదెకరాల పొలంలో వేరుశనగ పంటను సాగు చేస్తే పెట్టుబడి దక్కలేదు. కుటుంబంతో కలిసి చేసిన కష్టానికి తోడు రూ.50వేల పెట్టుబడి పెడితే రూ.15వేలు దక్కింది. జరిగిన నష్టానికి ప్రభుత్వం పరిహారం కింద సాయం అందిస్తుందని ఆశించినా ఇప్పటిదాక ఎలాంటి సహాయం అందలేదు. – బయ్యారెడ్డి, గుగ్గిళ్లపల్లె రైతు, పెద్దతిప్పసముద్రం గత ప్రభుత్వంలో లీటర్ పాలకు రూ.45 ధర ఇచ్చేవారు. అందులోనే రూ.4 ప్రోత్సాహక రాయితీ అందేది. ప్రస్తుత పరిస్థితుల మేరకు పాలధర పెరగాల్సి ఉన్నా పెరగలేదు. ఇప్పుడు లీటర్కు రూ.35–40 ఇస్తున్నారు. నాలుగు పాడిఆవులతో రోజుకు 40 లీటర్ల పాలును పోస్తున్నాను. గత ప్రభుత్వంలో 15 రోజులకోసారి రూ.18వేల దాక పాలబిల్లు వచ్చేది. ఇప్పుడు తగ్గిపోయింది. ఆర్థికంగా ఆదాయం పెరగడం లేదు. – గంగాధర, దిగువపల్లె పాడిరైతు, నిమ్మనపల్లె 2024లో మూడెకరాలు, 2025లో ఐదెకరాల్లో ఖరీఫ్ పంటగా వేరుశనగను సాగు చేస్తే వర్షాభావంతో పంటలు ఎండిపోయాయి. రెండు ఖరీఫ్లలో సాగుచేసిన పంటలకు దిగుబడులు దక్కక పూర్తిగా నష్టం వాటిల్లింది. రూ.1.20 లక్షలు పెట్టుబడి పెడితే కష్టానికి ఫలితంలేదు, పెట్టుబడి దక్కలేదు. ప్రభుత్వం పరిహారం ఇస్తుందని ఎదురుచూసినా నిరాశే మిగిలింది. ఇప్పటికై నా పరిహారం ఇచ్చి ఆదుకోవాలి. – చిన్న నారాయణ, మర్రిమాకులపల్లె రైతు, తంబళ్లపల్లె -
హత్యాయత్నం కేసులో ఇద్దరికి మూడేళ్ల జైలు
కడప అర్బన్ : జిల్లాలోని పులివెందుల అప్ గ్రేడ్ పీఎస్ పరిధిలో రెండున్నర సంవత్సరాల క్రితం జరిగిన హత్యాయత్నం కేసులో నిందితులు పిట్టు గౌతమ్ కుమార్ రెడ్డి(27), యకాసి జనార్ధన అలియాస్ జనార్ధన్ (30) లకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ. 10 వేల జరిమానా విధిస్తూ సోమవారం కడప ఏ.ఎస్.జె కోర్టు జడ్జి తీర్పు ఇచ్చారు. ఈ సంఘటనలో ఫిర్యాది దేరంగుల గణేష్ కుమార్(25) వద్ద నిందితులలో ఒకరైన గౌతమ్కుమార్ రెడ్డి తన మోటార్ సైకిల్ను రూ.70 వేలకు తనఖా పెట్టాడు. 2023 మే 26వ తేదీ మధ్యాహ్నం సదరు మోటార్ సైకిల్ను తనఖా నుంచి విడిపించుకునే విషయంలో ఫిర్యాదికి, నిందితుడు గౌతమ్కుమార్ రెడ్డికి మాటా మాటా పెరిగి ఘర్షణ చోటుచేసుకుంది. అనంతరం గౌతమ్ కుమార్ రెడ్డి, తన స్నేహితుడైన జనార్దన్ సహకారంతో కత్తి తీసుకుని ఫిర్యాదిని చంపాలనే ఉద్దేశ్యంతో దాడి చేసి తీవ్రంగా గాయపరిచారు. ఈ సంఘటనపై బాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పులివెందుల అప్ గ్రేడ్ పోలీస్ స్టేషన్ కేసు నమోదు చేశారు. అప్పటి సీఐ దర్యాప్తు చేసి నిందితులను అరెస్ట్ చేశారు. చార్జ్ షీట్ను కోర్టు కు సమర్పించారు. సోమవారం కడప అదనపు సెషన్న్స్ జడ్జి కె.ప్రత్యూష కుమారి, సాకా్ాష్ధరాలు పరిశీలించి నిందితులపై నేరం రుజువు కావడంతో ఇద్దరు నిందితులకు ఒక్కొక్కరికి 3 సంవత్సరాల సాధారణ జైలు శిక్షతో పాటు, 10 వేల రూపాయల జరిమానా విధిస్తూ తీర్పునిచ్చారు. ఈ కేసులో అడిషనల్ పి.పి ఎల్.బాలాజీ, తన బలమైన వాదనలతో నిందితులకు శిక్ష పడేలా చేశారు. నిందితులకు శిక్ష పడేలా కృషి చేసిన ప్రస్తుత పులివెందుల సీఐ సీతారామి రెడ్డి, కడప కోర్టు మానిటరింగ్ హెడ్ కానిస్టేబుల్ భాస్కర్ (హెచ్.సి 1988), పులివెందుల కోర్ట్ కానిస్టేబుల్ నూర్బాషా లను ఎస్పీ షెల్కే నచికేత్ విశ్వనాథ్ ప్రత్యేకంగా అభినందించినారు. -
తెలుగుభాష ఔన్నత్యాన్ని చాటి చెప్పిన అల్లసాని
ఎర్రగుంట్ల : తెలుగు భాష ఔన్నత్యాని, గొప్పతనాన్ని దేశానికి చాటి చెప్పిన మహోన్నతమైన వ్యక్తి అల్లసాని పెద్దనామాత్యులని పంపా క్షేత్ర పీఠాధిపతి గోవిందానంద సరస్వతి స్వామి తెలిపారు. సోమవారం ఎర్రగుంట్ల మండల పరిధిలోని పెద్దనపాడు గ్రామంలో వెలసిన పూరతమైన శివాలయం ఆవరణలో అల్లసాని పెద్దనామాత్యుల విగ్రహాన్ని ఆవిష్కరించారు. కొత్తపు రామ్మోహన్రెడ్డి, కళావతమ్మలు అల్లసాని పెద్దనామాఽత్యుల విగ్రహం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా స్వామిజీ మాట్లాడుతూ అల్లసాని పెద్దన్న నడయాడిన పెద్దనపాడు గ్రామంలోని శివాలయంలో ఆయన విగ్రహం ఏర్పాటు చేయడం సంతోషకరమని కొనియడారు. కృష్ణదేవరాయుల కాలంలోని అష్టదిగ్గజాలలో అగ్రగణ్యుడుగా పెద్దనామాత్యులు పేరుపొందారన్నారు. విగ్రహ దాత కొత్తపురామ్మోహన్రెడ్డి ఇంకా మరెన్నో సేవా కార్యక్రమాలు చేయాలని కొనియడారు. అనంతరం కవి సమ్మేళనం కూడా నిర్వహించారు. అలాగే కొత్తపు గంగా చైతన్య కూమార్రెడ్డి విగ్రహాన్ని కూడా పెద్దలు ఆవిష్కరించారు.పెద్దనపాడు శివాలయంలో అల్లసాని విగ్రహం ఆవిష్కరణ -
నీరుగారిన..ఉత్సవం
జమ్మలమడుగు/జమ్మలమడుగురూరల్ : గండికోట ఉత్సవాలు వెలవెలబోతున్నాయి. గండికోట వైభవాన్ని.. కీర్తిని నలుదిశలా వ్యాప్తి చెందేలా ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్న అధికారులు ఆదిశగా అడుగులు వేయలేదు. కోట వైభవం మాటేమోగానీ ఉత్సవాలతో కొంచైమెనా ప్రయోజనం జరగకపోగా.. చుట్టూ పారిశుధ్య లేమితో.. నిరు పయోగంగా మారిన తాగునీటి నిర్వహణ కేంద్రాలతో కోట పేరును గంగలో కలిపేస్తున్నారు. తొలి రోజు పర్యాటకుల తాకిడి విపరీతంగా ఉన్నా దానికి తగ్గట్టుగా ప్రోగ్రాంలు సక్రమంగా నిర్వహించడంలో అధికారులో వైఫల్యం స్పష్టంగా కనిపించింది. స్థానికులు ప్రాధాన్యత ఎక్కడా...! ఉత్సవాలలో స్థానిక ప్రభుత్వ, ప్రైవేట్పాఠశాల విద్యార్థులతో కల్చరల్ యాక్టివిటిస్ నిర్వహించేవారు. ఈ ఏడాది భాగస్వామ్యం కాదుకదా వారికి కనీస పిలుపే లేకుండా పోయింది. సోమవారం జరిగిన కార్యక్రమాలు సైతం వెలవెలబోయాయి. పట్టుమని పదిమంది కూడా కూర్చిలో కూర్చొలేని పరిస్థితి ఉంది. వెలవెలబోతున్న స్టాల్స్... గండికోట ఉత్సవాల్లో భాగంగా చేనేతవృత్తుల, వ్యవసాయానికి సంబంధించిన స్టాల్స్లు కొనుగోలు దారులు లేక వెలవెలబోయాయి. మూ డు రోజుల పాటు గండికోట ఉత్సవాలలో జిల్లాకు సంబంధించిన చేనేత వృత్తుల ప్రదర్శన ఉంటుందని అధికారులు పేర్కొన్నారు. ఈ ప్రదర్శనను తిలకించడానికి వచ్చిన వారికి నిరాశే ఎదురైంది. స్టాల్స్లో ముతక వస్త్రాలు చూసి ఉస్సూరుమన్నారు. తాగునీరు లేక ఇబ్బందులు... గండికోట ఉత్సవాలను చూడటానికి వచ్చిన పర్యాటకులకు కనీసం మంచినీటి సౌకర్యం కూడా అధికారులు కల్పించలేదు. అలాగే మరుగుదొడ్లు పనిచేయకపోవడంతో తలుపులకు తాళాలు వేశారు. మరుగుదొడ్లు వసతులు లేకపోవడంతో పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
కోడిపందేల నిర్వహణ నేరం
–జిల్లా జేసీ, ఎస్పీ మదనపల్లె : కోడిపందేల నిర్వహణ నేరమని జిల్లా జాయింట్ కలెక్టర్ ఆదర్శ్రాజేంద్రన్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. సోమవారం జెసీ, ఎస్పీ, సబ్కలెక్టర్ చల్లా కళ్యాణితో కలిసి కోడిపందేలు నిషేధం, శిక్షార్హం అన్న పోస్టర్లను మదనపల్లెలో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ జేసీ మాట్లాడుతూ ప్రజలు కోడిపందేలు, జూదం తదితర నిషేధిత కార్యక్రమాలకు దూరంగా ఉండాలని సూచించారు. దీనివల్ల ఆర్థికంగా నష్టపోవడం, శాంతిభద్రతల సమస్య తలెత్తే ప్రమాదం ఉన్నందున ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. ఎస్పీ మాట్లాడుతూ కోడి పందేలను నిర్వహించినా, ప్రోత్సహించినా, బెట్టింగ్లకు పాల్బడినా కఠినచర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. స్టాఫ్నర్స్గా పదోన్నతులుకడప రూరల్ : కడప వైద్య ఆరోగ్యశాఖ ప్రాంతీయ కార్యాలయంలో సోమవారం ఏఎన్ఎం నుంచి స్టాఫ్ నర్స్ గా పదోన్నతుల కౌన్సెలింగ్ నిర్వహించారు. జోన్–4 రాయలసీమ జిల్లాల పరిధిలో మొత్తం నలుగురికి ప్రమోషన్ లు కల్పించారు. ఈ సందర్భంగా ఆ శాఖ రీజినల్ డైరెక్టర్ డాక్టర్ రామ గిడ్డయ్య మాట్లాడుతూ ప్రభుత్వ నిబంధనలు, ఉద్యోగుల సీనియారిటీ ప్రకారం పదోన్నతులు కల్పించినట్లు పేర్కొన్నారు. కార్య క్రమంలో ఆ శాఖ డిప్యూటీ డైరెక్టర్ నాగరత్నమ్మ, సూపరింటెండెంట్ శ్రీనివాసులు, సీనియర్ అసిస్టెంట్ వనిష తదితరులు పాల్గొన్నారు. 23న వాక్–ఇన్ ఇంటర్వ్యూకడప ఎడ్యుకేషన్ : యోగి వేమన విశ్వవిద్యాలయం కళాశాల జంతు శాస్త్ర శాఖలో గెస్ట్ ఫ్యాకల్టీ నియామకం కోసం వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఈ నెల 23వ తేదీ ఉదయం 10 గంటలకు నిర్వహిస్తున్నట్లు ప్రిన్సిపల్ ఆచార్య టి.శ్రీనివాస్ తెలిపారు. ఎమ్మెస్సీ జంతు శాస్త్రంలో నెట్/ సెట్/ పీహెచ్డీ అర్హత కలిగి ఉండాలన్నారు. ఆసక్తి గల అభ్యర్థుల బయో–డేటా, సంబంధిత ఒరిజినల్ సర్టిఫికెట్లు.. వారి జిరాక్స్ కాపీల సెట్తో నేరుగా వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావాలని సూచించారు. వివరాల కోసం www.yvu.edu.inని సందర్శించాలని సూచించారు. జిల్లా జేసీగా శివనారాయణ శర్మ మదనపల్లె రూరల్ : అన్నమయ్య జేసీగా శివనారాయణ శర్మను నియమిస్తూ ప్రభుత్వ ముఖ్య కార్యదర్శి కె.విజయానంద్ ఉత్తర్వులు విడుదల చేశారు. సోమవారం రాష్ట్రప్రభుత్వం ప్రకటించిన ఐఏఎస్ అధికారుల బదిలీల్లో ప్రస్తుతం అన్నమయ్య జిల్లా జేసీగా పనిచేస్తున్న ఆదర్శ రాజేంద్రన్ను చిత్తూరుజిల్లాకు, ఆయన స్థానంలో అనంతపురం జిల్లా జేసీగా పనిచేస్తున్న శివనారాయణ శర్మను నియమించారు. 2021 ఆంధ్రప్రదేశ్, ఐఏఎస్ బ్యాచ్కు చెందిన శివనారా యణశర్మ, ఉత్తరప్రదేశ్ మధురలోని రాయకు చెందినవారు. -
అంబరాన్నంటిన ముందస్తు సంక్రాంతి సంబరాలు
● పోలీస్ కుటుంబాలలో నిండిన నూతనోత్సాహం ● కులమతాలకు అతీతంగా పండుగను జరుపుకోవాలి ● జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లిరాయచోటి : రాయచోటిలోని పోలీస్ పరేడ్ మైదానంలో ముందస్తు సంక్రాంతి సంబరాలు వైభవంగా నిర్వహించారు. సోమవారం జిల్లా ఎస్పీ ధీరజ్ కనుబిల్లి, ఆయన సతీమణి ఉమ శ్రీలక్ష్మీతో కలిసి ముఖ్య అతిథులుగా హాజరై భోగి మంటలు వెలిగించి వేడుకలను ఘనంగా ప్రారంభించారు. నిత్యం విధులు, కవాతులు, శిక్షణలతో కనిపించే పోలీస్ మైదానం సంక్రాంతి సందడితో ఒక్కసారిగా పల్లెటూరి వాతావరణాన్ని తలపించింది. జిల్లా ఎస్పీ కుటుంబం నుంచి కిందిస్థాయిలోని హోంగార్డు కుటుంబ సభ్యుల వరకు సంక్రాంతి వేడుకలలో పాల్గొనడంతో ఆ ప్రాంతం ఆనందం, ఆహ్లాదభరితంగా కనిపించింది. సంక్రాంతి పండుగ ఒక కులానికో, మతానికో పరిమితమైంది కాదని, శ్రమజీవులైన రైతులు, కూలీల పండుగని ఎస్పీ కొనియాడారు. కష్టపడి పండించిన పంట చేతికి వచ్చిన శుభవేళ అందరూ కలిసి ఆనందాన్ని పంచుకునే గొప్ప సందర్భమన్నారు. ఇలాంటి వేడుకలు పోలీసు సిబ్బందికి విధి నిర్వహణలో కలిగే ఒత్తిడిని తగ్గించి మానసిక ఉల్లాసాన్ని, నూతనోత్సహాన్ని నింపుతాయని అభిప్రాయపడ్డారు. పోలీసులు శాంతిభద్రతల పరిరక్షణలో అనునిత్యం ప్రజలకు అందుబాటులో ఉండాలని ఎస్పీ ఆదేశించారు. చట్టాన్ని అతిక్రమిస్తే చర్యలు తప్పవు పండుగ ముసుగులో అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడినా, చట్టాన్ని అతిక్రమించినా అలాంటి వారిని చట్టపరంగా ఉపేక్షించవద్దని ఎస్పీ స్పష్టం చేశారు. చట్టాన్ని గౌరవించే వారికి స్నేహితుడిగా, అతిక్రమించేవారికి సింహస్వప్నంగా ఉండాలన్నా రు. వేడుకలలో భాగంగా మహిళా పోలీసులు, వారి కుటుంబ సభ్యులు వేసిన రంగవల్లులు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. ముగ్గులు పోటీలను ఎస్పీ సతీమణి ఉమ శ్రీలక్ష్మీ ప్రారంభించి విజేతలను ఎంపిక చేశారు. మ్యూజికల్ చైర్స్, డ్రాయింగ్ పోటీలు, తంబోలా, గోళీలు, బొంగరాలు వంటి ఆటలు నిర్వహించారు. ఎస్పీ దంపతులు స్వయంగా పిల్లలతో కలిసి గాలిపటాలు ఎగురవేసి అందరిలో ఉత్సా హాన్ని నింపారు. కార్యక్రమం చివరిలో వివిధ పోటీల్లో పాల్గొన్న సిబ్బందికి, వారి పిల్లలకు ఎస్పీ దంపతులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో ఆర్ఐలు విజె రామకృష్ణ, ఎం పెద్దయ్య, ఇతర పోలీసు అధికారులు, మహిళా పోలీసులు, హోంగార్డులు, పోలీసు కుటుంబ సభ్యులు, పెద్ద సంఖ్యలో పాల్గొని పండుగను ఆనందంగా జరుపుకున్నారు. -
కూటమి కుట్రల్ని తిప్పి కొడదాం
వాల్మీకిపురం : క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేసుకుంటూ కూటమి కుట్రల్ని తిప్పికొట్టి జగనన్నను మరోసారి సీఎంను చేసుకుందామని పీలేరు మాజీ ఎమ్మెల్యే చింతల రామచంద్రారెడ్డి, రాష్ట్ర గ్రామ కమిటీల పరిశీలకులు వజ్ర భాస్కర్ రెడ్డి, నియోజకవర్గ పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి అన్నారు. సోమవారం స్థానిక షిరిడిసాయి కళ్యాణ మండపంలో వైఎస్సార్సీపీ నియోజకవర్గ స్థాయి విస్తృత స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వంలో రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందన్నారు. అధికారంలోకి రావడం కోసం కూటమి ప్రభుత్వం అనేక మాటలు చెప్పి, ప్రజలతో ఓట్లు వేయించుకున్న తర్వాత హామీలను విస్మరించిందని ధ్వజమెత్తారు. కూటమి ప్రభుత్వం వచ్చిన 19 నెలల్లోనే రాష్ట్రాన్ని రావణకాష్టంగా మార్చేసిందన్నారు. పార్టీ కోసం కష్టపడి పని చేసే ప్రతి ఒక్కరిని గుర్తించి మండల స్థాయి, రాష్ట్ర స్థాయి కమిటీలల్లో పదవులను అందించడం జరుగుతుందన్నారు. క్షేత్రస్థాయి నుంచి వైఎస్సార్సీపీని బలోపేతం చేద్దామన్నారు. స్థానిక సంస్థల ఎన్నికలతో పాటు 2029 సార్వత్రిక ఎన్నికల్లో పార్టీని గెలిపించి సత్తా చాటుదామన్నారు. గ్రామ, వార్డు స్థాయి నుంచి కమిటీలు ఏర్పాటు చేసుకొని ప్రతి ఒక్కరూ పార్టీలో అంతర్భాగం కావాలని పిలుపునిచ్చారు. ప్రతి గ్రామంలోనూ పార్టీ కమిటీల నిర్మాణాన్ని త్వరగా పూర్తి చేయాలన్నారు. మహిళా, యువజన, కార్మిక, విద్యార్థి, తదితర అనుబంధ విభాగాల కమిటీల నియామకంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పార్టీ కోసం నిరంతరం శ్రమించే కార్యకర్తలు, నాయకులకు ఈ కమిటీల్లో ప్రాధాన్యత కల్పించాలన్నారు. సమన్వయంతో పని చేస్తూ ప్రజల పక్షాన నిలబడాలని పిలుపునిచ్చారు. జగనన్న ఆశయాలకు అనుగుణంగా, పార్టీ సిద్ధాంతాలను ప్రతి ఇంటికి తీసుకెళ్లేలా కమిటీల నిర్మాణం ఉండాలన్నారు. అనంతరం పార్టీ కమిటీల ఏర్పాటు, సభ్యత్వం, డిజిటలైజేషన్, పార్టీ బలోపేతానికి తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. సమావేసానికి ముందు దివంగత మహానేత వైఎస్ రాజశేఖర్ రెడ్డి ఆత్మకు శాంతి చేకూరాలని మౌనం పాటించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర మైనార్టీ కార్పొరేషన్ మాజీ చైర్మన్ ఇక్బాల్ అహ్మద్, నాయకులు నల్లారి తిమ్మారెడ్డి, ఆఘామొహిద్దిన్, రత్నశేఖర్ రెడ్డి, మహిత, శివానంద రెడ్డి, వెంకట్రమణారెడ్డి, అప్పల్లా, నీళ్ల భాస్కర్, రమేష్ రెడ్డి, జగన్మోహన్ రెడ్డి, కమలాకర్ రెడ్డి, చక్రధర్, కేశవ రెడ్డి, ఆనంద, శ్రీధర్రాయల్, నియోజకవర్గంలోని సర్పంచ్లు, ఎంపీటీసీలు, వార్డు మెంబర్లు, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. అక్రమ కేసులకు భయపడొద్దు మన బలగం పెరగాలి. కష్టకాలంలో జెండా మోసిన ప్రతి కార్యకర్తకూ న్యాయం జరుగుతుందని జగనన్న భరోసా ఇచ్చారు. కమిటీలో సభ్యత్వం తీసుకొని డిజిటలైజేషన్ చేయించుకుంటే అమరావతిలోని మన పార్టీ కార్యాలయంలో బటన్ నొక్కినా వివరాలు కనిపిస్తాయి. వచ్చేది జగనన్న ప్రభుత్వమే అని రాష్ట్ర గ్రామ కమిటీల పరిశీలకులు వజ్ర భాస్కర్ రెడ్డి తెలిపారు. వైఫల్యాలను ఎండగడదాం రాష్ట్రంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి కూటమి పార్టీల నాయకులు కుట్రలు చేస్తున్నారు. వైఎస్సార్సీపీ కమిటీల ద్వారా టిడిపి కుట్రలను తిప్పికొడదామని పార్టీ పరిశీలకులు సుబ్బారెడ్డి అన్నారు. గ్రామ స్థాయి నుంచి ఐకమత్యంగా ఉంటూ, కమిటీల్లో చోటు సంపాధించిన వారందరూ చంద్రబాబు ప్రభుత్వ వైఫల్యాలను ప్రజల వద్ద ఎండగట్టి వైఎస్సార్సీపీ బలోపేతానికి బాటలు వేయాన్నారు. క్షేత్రస్థాయి నుంచి పార్టీని బలోపేతం చేద్దాం గ్రామ కమిటీలే పార్టీకి పునాదులు జగనన్నని మళ్లీ సీఎంను చేసుకుందాం అక్రమ కేసులకు భయపడొద్దు నియోజకవర్గ విస్తృత స్థాయి సమావేశంలో మాజీ ఎమ్మెల్యే చింతల -
రోడ్డు ప్రమాదంలో జవాన్ ఆకస్మిక మృతి
కురబలకోట : దేశ రక్షణలో సేవలందిస్తున్న ఓ జవాన్ రోడ్డు ప్రమాదంలో టిప్పర్ ఢీకొని ప్రాణాలు కోల్పోవడం మండలంలో తీవ్ర విషాదాన్ని కలిగిస్తోంది. సోమవారం రాత్రి ఈ విషాదకర ఘటన చోటు చేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..మండలంలోని తూపల్లికి చెందిన ఎన్. రాజశేఖర్ రెడ్డి (31) ఆర్మీలో జవాన్గా విధులు నిర్వహిస్తున్నాడు. లక్నో కేంద్రంగా పనిచేస్తున్న ఇతను ఇటీవల శిక్షణ నిమిత్తం బెంగళూరుకు వచ్చాడు. అస్వస్థతకు గురై చికిత్స పొందిన అతను అక్కడ నుంచి మూడు రోజుల క్రితం సెలవులో స్వగ్రామానికి వచ్చాడు. సోమవారం రాత్రి సమీపంలోని ముదివేడు నుంచి స్వగ్రామం తూపల్లికి మోటార్ సైకిల్పై వెళుతుండగా ఎనుములవారపల్లి క్రాస్ వద్ద ఎదురుగా వచ్చిన టిప్పర్ ఢీకొంది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడి సంఘటన స్థలంలోనే ప్రాణాలు విడిచాడు. సంక్రాంతి సందర్భంగా ఆనందంగా గడపాల్సిన ఆయన ఆకస్మికంగా మృతి చెందడం కుటుంబానికి తీరని వేదనను మిగిల్చింది. అతనికి భార్య రుక్మిణి, కుమార్తె ఊర్వి (3) ఉన్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను పూర్తి చేయాలి
కడప కార్పొరేషన్ : కడప అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో డివిజన్ కమిటీల డిజిటలైజేషన్ ప్రక్రియను త్వరగా పూర్తి చేయాలని మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష అన్నారు. సోమవారం సాయంత్రం మాజీ డిప్యూటీ సీఎం కార్యాలంలో నార్త్జోన్, వెస్ట్జోన్ల అధ్యక్షులు, కార్పొరేటర్లు, డివిజన్ ఇన్చార్జులు, పరిశీలకులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమాలు ఎంత ఉత్సాహంగా నిర్వహించామో ఇది కూడా అలాగే నిర్వహించాలన్నారు. ఈ ప్రక్రియ పూర్తయితేనే అందరికీ గుర్తింపు కార్డులు, బీమా కల్పించేందుకు ఆస్కారం ఉంటుందన్నారు. కేంద్ర కార్యాలయ రాష్ట్ర కార్యదర్శి పోతుల శివారెడ్డి మాట్లాడుతూ ఇంటర్నెట్ సక్రమంగా ఉన్నచోటు నుంచి డిజిటలైజేషన్ చేయాలని, పదిమందిని నియమించుకొని సాధ్యమైనంతవరకూ కంప్యూటర్ల ద్వారా అ పనిని పూర్తి చేయాలన్నారు. ఎలాంటి సాంకేతిక సమస్యలు వచ్చినా పరిష్కరించేందుకు 24 గంటలు అందుబాటులో ఉంటామని తెలిపారు. కార్యక్రమంలో మేయర్ పాకా సురేష్ కుమార్, నార్త్జోన్ అధ్యక్షుడు బీహెచ్ ఇలియాస్, వెస్ట్ జోన్ అధ్యక్షుడు నాగమల్లారెడ్డి, మాజీ కార్పొరేటర్ జమాల్వలీ, షఫీ, జమీల్ పాల్గొన్నారు. మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాష -
నకిలీ బంగారం విక్రయిస్తున్న ముఠా అరెస్టు
● రెండు కిలోల నకిలీ బంగారు స్వాధీనం ● రూ.3 లక్షల నగదు, కారు స్వాధీనంరాయచోటి : నకిలీ బంగారాన్ని విక్రయిస్తున్న ముఠాను రాయచోటి రూరల్ పరిధిలోని చిన్నమండెం పోలీసులు అరెస్టు చేసినట్లు సీఐ ఎస్కె రోషన్ తెలిపారు. అరెస్టు చేసిన వారి నుంచి రెండు కిలోల నకిలీ బంగారం, రూ. 3 లక్షల నగదు, నేరానికి ఉపయోగించిన కారు స్వాధీనం చేసుకున్నట్లు సోమవారం రాయచోటి రూరల్ పోలీసు స్టేషన్లో చిన్నమండెం ఎస్ఐ సుధాకర్తో కలిసి సిఐ మీడియాకు వివరించారు. తమిళనాడు రాష్ట్రం, తంజావూరుకు చెందిన బంగారు వ్యాపారులకు రెండు కిలీల నకిలీ బంగారాన్ని విక్రయించి మోసం చేశారన్నారు. వారు ఇచ్చిన ఫిర్యాదు మేరకు నకిలీ బంగారం విక్రయిస్తున్న వారిపై చిన్నమండెం పోలీసు స్టేషన్లో ఫిర్యాదు నమోదైందన్నారు. సమాచారం మేరకు చిన్నమండెం సమీపంలోని కేశాపురం చెక్పోస్టు వద్ద వాహనాల తనిఖీలో కారుతోపాటు శాంపిల్గా ఉన్న 170 మిల్లీ గ్రాముల బంగారం, నగదును స్వాధీనం చేసుక్నునామన్నారు. వీరబల్లి మండలం, షికారుపాలెంకు చెందిన నలుగురు తమిళనాడు రాష్ట్రానికి చెందిన మరో వ్యక్తి నకిలీ బంగారు విక్రయంలో భాగస్వాములుగా ఉన్నారన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ ఎంఆర్ కృష్ణమోహన్ల ఆదేశాల మేరకు వారిపై కేసు నమోదు చేసి విచారిస్తున్నట్లు సీఐ వివరించారు. -
అక్రమార్కుల నుంచి మా భూములు కాపాడండి
లక్కిరెడ్డిపల్లి : అక్రమార్కులు మా తెలియకుండానే మా భూములను ఆన్లైన్లో నమోదు చేసుకున్నారని బాధిత రైతులు వాపోయారు. తమ భూములను కాపాడాలని మండలంలోని గద్దగుండ్లరాచపల్లికి చెందిన బాధిత రైతులు కొండూరు రఘునాథరాజు, ఎనపడ్డ వెంకటసుబ్బన్న, వెంకటరామరాజు, షేక్ జబ్బర్ సాహెబ్, షేక్ దర్బార్ భాష, షేక్ తాజ్ భాష, షేక్ ఉమర్ భాషలు సోమవారం తహసీల్దార్ క్రాంతి కుమార్కు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లక్కిరెడ్డిపల్లి గ్రామ పరిధిలోని గద్దగుండ్ల రాచపల్లి పొలంలో సర్వే నెంబరు. 625లో 7.18 ఎకరాలతో పాటు సర్వే నెంబరులోని 626లో 6.24 ఎకరాలు, సర్వే నెంబరు 614లో 19.68 ఎకరాల భూములను కొంతమంది వ్యక్తులు అక్రమంగా ఆన్లైన్ చేసుకున్నారన్నారు. వారి నుంచి తమ భూములకు రక్షణ కల్పించాలని కోరారు. అనంతరం వారు ఎస్ఐ డి శోభ, సీఐలకు కూడా వినతిపత్రం సమర్పించినట్లు తెలిపారు.తహసీల్దార్కు బాధిత రైతుల వినతి -
108 ఉద్యోగుల సమ్మె బాట
మదనపల్లె సిటీ : అత్యవసర వైద్యం అందించే 108 వ్యవస్థ, ఉద్యోగులపై చంద్రబాబు ప్రభుత్వం కక్ష గట్టింది. అపద్భాంవులపై అక్కసు ప్రదర్శిస్తోంది. ఎమర్జన్సీ వైద్యం అందించే ఉద్యోగులపై నిర్లక్ష్యపు ధోరణి అవలంబిస్తోంది. గతంలో వేతన నిధులు మంజూరు చేయకుండా అలక్ష్యం ప్రదర్శించిన చంద్రబాబు ప్రభుత్వం.. ప్రస్తుతం వారి సమస్యలు పరిష్కరించకుండా మోసం చేస్తోంది. ఆరు నెలలుగా సమస్యల పరిష్కారానికి చొరవ చూపకుండా బాధ్యతా రాహిత్యంగా వ్యవహరిస్తోంది. దీంతో వారందరూ సమ్మెబాట పట్టనున్నారు. 12 వరకు డెడ్లైన్ 108 సిబ్బంది సమ్మె సైరన్ మోగించారు. తమ సమస్యలను ప్రభుత్వం పరిష్కరించకుంటే సమ్మెబాట పడతామని స్పష్టం చేశారు. ఈ నెల 12 వరకు ప్రభుత్వానికి డెడ్లైన్ విధించారు. అప్పటికి కూడా ప్రభుత్వం సానుకూలంగా స్పందించకుంటే జిల్లా వ్యాప్తంగా అత్యవసర సేవలు నిలిపివేసి సమ్మెలోకి వెళ్లనున్నామని 108 ఉద్యోగులు అల్టిమేటం జారీ చేశారు. ఈ మేరకు ఇప్పటికే సంబంధిత శాఖ జిల్లా ఉన్నతాధికారులతోపాటు కాంట్రాక్టు సంస్థకు కూడా సమ్మె నోటీసులను పలు దఫాలుగా అందజేశారు. గద్దెనెక్కిన నాటి నుంచి.. చంద్రబాబు ప్రభుత్వం గద్దెనెక్కిన నాటి నుంచి 108 ఉద్యోగులు ఇబ్బందులు పడుతూనే ఉన్నారు. సంస్థను మార్చడం మొదలు, పెంచామన్న జీతం జీవోకే పరిమితమవ్వడం, వైట్ యాఫ్రాన్ బదులు డ్రెస్కోడ్ మార్చడం, ఆరు నెలలుగా సమస్యలు పరిష్కరించాలని కోరుతున్నా పట్టించుకోకపోవడంతో వారికి సమ్మె అనివార్యంగా మారింది. ఇటీవల ఒకసారి చర్చలు జరిగినప్పటికీ అందులో ఇచ్చిన హామీలను పూర్తి స్థాయిలో పరిష్కరించకుండా కాలయాపన చేస్తుండటంతో.. వారు సమ్మె బాట పట్టాలని నిర్ణయించారు. డిమాండ్లు ● 108 ఉద్యోగులకు సీఎం చంద్రబాబు ప్రకటించిన రూ.4 వేలల్లో రూ. 2 వేలు మాత్రమే పెంచారు. మిగిలిన మొత్తాన్ని ప్రభుత్వం ఇచ్చిన మినిట్స్ ఆర్ఎఫ్పీ ప్రకారం ఈపీఎఫ్ఓ యాజమాన్య వాటాను యాజమాన్యమే చెల్లించాలని చెప్పినా నేటీకీ అమలు కాలేదు. ● చిన్న కారణాలను చూపిస్తూ ఉద్యోగులను విధుల నుంచి తొలగించడం మానుకోవాలి. ● ఈఎంటీలను ట్రైనింగ్ పేరిట భయభ్రాంతులకు గురి చేస్తున్నారు. ట్రైనింగ్ అంటే ఉన్న నాలెడ్జ్ని పెంపొందించాలే తప్ప భయభ్రాంతులకు గురి చేస్తూ ఫెయిల్ అయితే ఉద్యోగం నుంచి తొలగిస్తామని చెప్పడం దారుణం. ● ప్రతి అంబులెన్స్ ఉన్న చోట సిబ్బంది ఉండేందుకు వసతి, వాహనం నిలుపు కొనేందుకు పక్కా షెడ్డు నిర్మించాలి. ● వివిధ కారణాలతో ఉద్యోగాల నుంచి తొలగించిన వారికి తిరిగి ఉద్యోగాలు ఇవ్వాలి. ● భవ్య సంస్థ 108 బాధ్యత తీసుకుని ఏడు మాసాలు పూర్తయినా ఏ ఉద్యోగికి అపాయింట్మెంట్ లెటర్ ఇవ్వలేదు. వేతనాలపై సైతం స్పష్టత లేకపోవడంపై ఉద్యోగుల్లో ఆందోళన నెలకొంది. ● 10 ఏళ్ల సర్వీసు పూర్తి చేసుకున్న వారికి ఆటోమెటిక్ శ్లాబ్ అప్గ్రేడ్ చేయాలి. పనిష్మెంట్ కాలాన్ని చూపుతూ వేతనం తగ్గించడం తగదు. శ్లాబ్కు అనుగుణంగా వేతనాలు ఇవ్వాలి. ● కొంత కాలంగా పెండింగ్లో ఉన్న గత సర్వీస్ ప్రొవైడర్ రిలీవింగ్ బిల్లులు వెంటనే చెల్లించాలి. గతంలో మాదిరిగా షిఫ్ట్నకు రూ.200 ఇవ్వాలి. ● కాంట్రాక్టు, అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల తరహా పండుగ ప్రయోజనాలు కల్పించాలి. ● వాహనాల్లో అవసరమైన మేరకు సిబ్బందిని నియమించాలి. ● ఐఎఫ్టీ కేసుల్లో సరైన గైడెన్స్ రూపొందించి మెడికల్ ఆఫీసర్లకు, 108 సర్వీస్ ప్రొవైడర్లకు తెలపాలి. అధికారులు, కాంట్రాక్టు కంపెనీకి నోటీసులు డిమాండ్లు పరిష్కరించకుంటే 12 అర్ధరాత్రి నుంచి సమ్మెలోకి జిల్లా వ్యాప్తంగా ఆందోళనకు సిద్ధమైన ఉద్యోగులు -
నేడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక
మదనపల్లె రూరల్: ప్రజల సమస్యలను తెలుసుకుని, వాటిని పరిష్కరించేందుకు సోమవారం కలెక్టరేట్, ఎస్పీ కార్యాలయాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ నిశాంత్ కుమార్, ఎస్పీ ధీరజ్ కునుబిల్లి వేర్వేరుగా పత్రికా ప్రకటనలో పేర్కొన్నారు. సోమవారం ఉదయం 10 గంటలకు కలెక్టరేట్, మదనపల్లె డీఎస్పీ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమాలు నిర్వహిస్తామన్నారు. జిల్లా వ్యాప్తంగా వివిధ సమస్యలతో ఇబ్బంది పడుతున్న బాధితులు, ఫిర్యాదుదారులు కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకోవాలన్నారు. కడప సెవెన్రోడ్స్: రైతులకు పట్టాదారు పాసుపుస్తకాలు పంపిణీ చేయడంలో తీవ్ర నిర్లక్ష్యం వహించిన రెవెన్యూ అధికారులపై కలెక్టర్ శ్రీధర్ చర్యలకు ఉపక్రమించారు. ప్రభుత్వం ఈనెల 2 నుంచి 9వ తేదీ వరకు పట్టాదారు పాసుపుస్తకాలు రైతులందరికీ పంపిణీ చేయాలని ఆదేశించినప్పటికీ అలసత్వం వహించడంతో తొండూరు తహసీల్దార్ రామచంద్రుడును సస్పెండ్ చేశారు. అలాగే చెన్నూరు, పెండ్లిమర్రి, వీఎన్ పల్లె, గో పవరం, పోరుమామిళ్ల, కలసపాడు, చక్రాయపేట, ఖాజీపేట, బి.మఠం, ప్రొద్దుటూరు, సీకే దిన్నెమండల తహసీల్దార్లకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. తహసీల్దార్లు పట్టాదారు పాసుపుస్తకాలను పంపిణీలో చేస్తున్న నిర్లక్ష్యాన్ని గమనించకుండా, సరైన రీతిలో పర్యవేక్షించని కడప రెవెన్యూ డివిజనల్ అధికారి జాన్ ఇర్విన్, పులివెందుల రెవెన్యూ డివిజన్ అధికారి చిన్నయ్యలకు మెమోలు జారీ చేశారు. మదనపల్లె సిటీ: సంక్రాంతి స్పెషల్స్ బస్సులు నడపడం వలన మదనపల్లె ఆర్టీసీ–1డిపోకు రికార్డు స్థాయిలో ఆదాయం వచ్చింది. 10వతేదీన డిపో నుంచి హైదరాబాదు, బెంగళూరుతో పాటు పలు ప్రాంతాలకు ప్రత్యేక సర్వీసులు నడిపారు. ఒక్క రోజుకే రూ.23.34 లక్షల ఆదాయం వచ్చినట్లు డీఎం మూరే వెంకటరమణారెడ్డి తెలిపారు. ఈపీకే 50.49, ఓఆర్ 92 వచ్చిందన్నారు. ప్రయాణికుల రద్దీని దృష్టి పెట్టుకుని ప్రత్యేక సర్వీసులు నడిపినట్లు తెలిపారు. రికార్డు స్థాయిలో ఆదాయం రావడంపై డ్రైవర్లు, కండక్టర్లు, ట్రాఫిక్, గ్యారేజీ సిబ్బంది, సూపర్వైజర్లు, అద్దె బస్సు సిబ్బంది, ఔట్సోర్సింగ్ సిబ్బంది, ఆన్కాల్ డ్రైవర్లుకు అభినందలు తెలిపారు. మదనపల్లె సిటీ: పెన్షనర్లు లైఫ్ సర్టిఫికెట్లును సబ్ ట్రెజరీ కార్యాలయంలో సమర్పించాలని ఏపీ సీనియర్ సిటిజెన్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు ఎన్.మునిగోపాలకృష్ణ తెలిపారు. ఆదివారం స్థానిక జీఆర్టీ ఉన్నత పాఠశాలలో సీనియర్ సిటిజెన్స్ సమావేశం జరిగింది. ఆదిత్య కాలేజీ అధ్యాపకురాలు అరుణ పలువురి సీనియర్ సిటిజెన్స్కు లైఫ్ సర్టిఫికెట్లను ఆన్లైన్లో చేశారు. బీటీ కాలేజీ పూర్వపు విద్యార్థి స్కూల్లైఫ్ సినిమాలో విలన్గా నటించినందుకు శాలువ కప్పి సన్మానించారు. కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు మునిరత్నమయ్య, ఉపాధ్యక్షుడు జగన్మోహన్, కోశాఽధికారి ఉస్మాన్సాహెబ్, మహిళా ప్రతినిధి ధనలక్ష్మి తదితరులు పాల్గొన్నారు. ముద్దనూరు: స్థానిక రైల్వేస్టేషన్లో ధర్మవరం–మచిలీపట్నం రైలుకు స్టాపింగ్ సౌకర్యం కల్పించడంతో ఆదివారం స్థానిక ప్రజలు ఈ రైలుకు ఘనస్వాగతం పలికారు. మచిలీపట్నం నుంచి బయలుదేరిన ఎక్స్ప్రెస్ రైలు ఆదివారం ఉద యం స్థానిక స్టేషన్లో తొలిసారి ఆగింది. దీంతో మండలంలోని ప్రముఖులు, వ్యాపారులు, విద్యార్థులు, ఆర్యవైశ్యసంఘం ప్రతినిధులు రైల్వేస్టేషన్కు చేరుకున్నారు. స్టేషన్లో ఆగిన రైలును మామిడాకులు,పూలదండలతో అలంకరించారు. ఈ సందర్భంగా రైలు లోకో పైలెట్లకు సత్కరించి స్వీట్లు పంపిణీ చేశారు. ముద్దనూరులో రైలు స్టాపింగ్కు కృషిచేసిన ఎంపీ వైఎస్ అవినాష్రెడ్డికి మండల ప్రజలు కృతజ్ఞతలు తెలిపారు. వైఎస్సార్సీపీ మండలఅధ్యక్షుడు శ్రీధర్రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
కిటకిటలాడిన బోయకొండ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయం ఆదివారం భక్తుల రద్దీతో కిటకిటలాడింది. అమ్మవారి దర్శనం కోసం ఆంధ్ర, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. అర్చకులు అమ్మవారిని ప్రత్యేక పూజలు, బంగారు ఆభరణాలతో అత్యంత సుందరంగా ముస్తాబు చేశారు. కోరిన కోర్కెలు తీరిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలతో పాటు, జంతు బలులిచ్చి మొక్కులు చెల్లించారు. ఆలయంలో ఒక్కసారిగా భక్తుల రద్దీ పెరగడంతో క్యూలైన్లు నిండిపోయాయి. ఆలయ అధికారులు భక్తులకు ఉచిత తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
ఆ లింకుల జోలికి వెళ్లొద్దు
మదనపల్లె : పండగల సందర్భంగా మోసగాళ్లు ఆఫర్ల పేరుతో మోసాలకు పాల్పడే అవకాశం ఉందని, వారి నుంచి వచ్చే వాట్సప్ లింకుల జోలికి వెళ్లొద్దని జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి ప్రజలను కోరారు. ఆదివారం ఆయన ఈ మేరకు ఒక ప్రకటనలో.. మోసాలు ఎలా చేస్తారో వివరించారు. పండగల ఆఫర్లు, ఉచిత బహుమతులు, భారీ డిస్కౌంట్ల పేరుతో సోషల్ మీడియాలో సందేశాలను పంపుతూ ఆకర్షితులయ్యేలా చేస్తారని అప్రమత్తం చేశారు. వీటిని నమ్మి ప్రజలు లింకులను తెరిస్తే సంబంధిత వ్యక్తుల బ్యాంకు ఖాతాల్లోని నగదు ఖాళీ అవుతుందని హెచ్చరించారు. ఆన్లైన్ షాపింగ్, ట్రావెల్ బుకింగ్లపై ప్రజలు ఆధారపడే పరిస్థితి ఉన్నందున ఆఫర్ల పేరుతో లింకులు పంపుతారని తెలిపారు. అలాగే పరిచయం లేని వ్యక్తులు ఫోన్ చేసి ఓటీపీలు కోరితే వివరాలు చెప్పవద్దని సూచించారు. ఒకవేళ మోసపోతే అలాంటి వ్యక్తులు మోసం జరిగినట్టు గుర్తించిన గంటలోపు 1930 నంబర్కు కాల్ చేసి ఫిర్యాదు చేయాలని కోరారు. సకాలంలో బాధితులు అందిస్తే సాంకేతికత ఉపయోగించి చర్యలు తీసుకుంటామని ఎస్పీ తెలిపారు.జిల్లా ఎస్పీ ధీరజ్ -
అన్నదమ్ముల మధ్య ఘర్షణ
గోపవరం : మండలంలోని నెల్లూరు – ముంబై (ఎన్హెచ్–67) జాతీయ రహదారి పక్కనే సత్యాటౌన్షిప్లో ఆదివారం అన్నదమ్ముల మధ్య జరిగిన ఘర్షణలో.. ఒకరు మృతి చెందగా మరొకరి పరిస్థితి విషమంగా ఉంది. వివరాల్లోకి వెళితే.. కలసపాడు మండలం రామాపురం గ్రామానికి చెందిన మూడే పెద్దతిరుమలయ్య, గురమ్మలకు నలుగురు కుమారులు ఉన్నారు. వీరంతా ప్రస్తుతం వేర్వేరు ప్రాంతాల్లో నివాసముంటున్నారు. వీరిలో చిన్న కుమారుడు మూడే చిన్నగురయ్య (41) సీడ్ వ్యాపారంలో పని చేస్తున్నాడు. చిన్నగురయ్య అతని మూడవ అన్న గురయ్యకు డబ్బులు ఇవ్వడం జరిగింది. గురయ్య పోరుమామిళ్లలో టీచర్గా పని చేస్తున్నాడు. ఇద్దరి మధ్య గత కొంత కాలంగా డబ్బుల విషయంలో గొడవలు జరుగుతుండేవి. ఈ నేపథ్యంలో బద్వేలులో నివాసముంటున్న చిన్న తమ్ముడు చిన్నగురయ్యను డబ్బులు విషయం మాట్లాడదామని మిగిలిన ముగ్గురు అన్నదమ్ములు పిలవడం జరిగింది. అందరూ కలిసి సత్యాటౌన్షిప్ వద్దకు చేరుకున్నారు. అక్కడ వాదోపవాదాలు జరిగి ఘర్షణకు దిగినట్లు సమాచారం. ఈ ఘర్షణలో చిన్నగురయ్య అక్కడికక్కడే మృతి చెందాడు. తన అన్న పెద్దగురయ్య తీవ్రంగా గాయపడ్డాడు. ప్రస్తుతం ఇతని పరిస్థితి విషమంగా ఉండటంతో కడప రిమ్స్కు తరలించారు. ఈయన కలసపాడులో నివాసముంటూ కడప వాటర్షెడ్లో పని చేస్తున్నాడు. ఘర్షణలో చిన్నగురయ్య మృతి చెందడం, పెద్దగురయ్య తీవ్ర గాయాలతో కిందపడటంతో మిగిలిన ఇద్దరు అన్నదమ్ములు పరారైనట్లు తెలిసింది. పరారైన అన్నదమ్ముల్లో ఒకరు బెంగళూరులో పీజీ నడుపుతున్నారు. మరొకరు టీచర్గా పని చేస్తున్నారు. విషయం తెలుసుకున్న బద్వేలు అర్బన్, రూరల్ పోలీసులు ఘటన ప్రాంతానికి చేరుకుని గాయపడ్డ పెద్దగురయ్యను వైద్యం కోసం ఆసుపత్రికి తరలించారు. మృతిచెందిన చిన్నగురయ్యను పోస్టుమార్టం నిమిత్తం బద్వేలు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. కాగా అన్నదమ్ముల మధ్యే జరిగిన ఘర్షణలోనే చిన్నగురయ్య మృతి చెందాడా లేక ఇతరుల ప్రమేయం ఉందా అనే కోణంలో పోలీసులు విచారణ చేస్తున్నారు. గాయపడిన పెద్దగురయ్యమృతి చెందిన చిన్నగురయ్య -
భార్య ఫిర్యాదుపై రోడ్డుపై భర్త నిరసన
● రాజంపేట పీఎస్ ఎదుట హంగామా ● ఆర్టీసీ బస్సు కిందపడే యత్నం ● భర్త వేధింపులపై ఎస్పీకి ఫిర్యాదు చేసిన భార్యరాజంపేట : తన భార్య తనపై గృహ హింస కేసు పెట్టిన నేపథ్యంలో.. ఆమె భర్త రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్ ఎదుట హంగామా చేసిన సంఘటన రాజంపేట అర్బన్ పోలీసుస్టేషన్ ఎదుట శనివారం రాత్రి చోటుచేసుకుంది. పోలీసుల కథనం మేరకు వివరాల్లోకి వెళితే.. అన్నమయ్య జిల్లా మొలకలచెరువుకు చెందిన అఖిల్, పుల్లంపేటకు చెందిన రాధిక ప్రేమించి పెళ్లి చేసుకున్నారు. బెంగళూరులో కొన్నాళ్లు నివసించారు. వీరికి ఇద్దరు సంతానం. భార్యభర్తల మధ్య మనస్పర్థలు తలెత్తాయి. మొలకలచెరువులో కొంత కాలం కలిసి ఉన్నారు. కొన్ని రోజుల కిందట రాధిక రాజంపేటలోని అమ్మమ్మ ఇంటికి వచ్చింది. అయితే భార్య కనిపించడం లేదని మొలకలచెరువులో భర్త ఫిర్యాదు చేశారు. ఈ కేసుపై సీఐ నాగార్జున విచారణ చేపట్టారు. సీఐ నాగార్జునపై అఖిల్ ఆరోపణలు చేస్తూ, రోడ్డుపై నిరసన వ్యక్తం చేశారు. ఆర్టీసీ బస్సు కింద పడేందుకు యత్నించారు. పోలీసులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ విషయంపై సీఐ నాగార్జున మాట్లాడుతూ అఖిల్కు మతిస్థిమితం సరిగా లేదన్నారు. పోలీసులపై అఖిల్ వ్యవహరించిన తీరుపై కేసు నమోదు చేశామన్నారు. ఎస్పీకి ఫిర్యాదు చేశానంటున్న భార్య భర్త, అత్త, మామపై రాజంపేట పట్టణ పోలీసుస్టేషన్లో.. వేధింపులు చేస్తున్నారని ఫిర్యాదు చేయగా, గృహ హింస కేసు నమోదు చేశారని అఖిల్ భార్య రాధిక మీడియాకు తెలిపింది. తన భర్త తనను కొడుతూ రాక్షస ఆనందం పొందుతున్నాడని, ప్రతి నెల తన ఇంటి నుంచి డబ్బు తీసుకురావాలని వేధిస్తున్నాడన్నారు. రాకుంటే ఇకపై ఒకటే మానసికంగా వేధింపులు పెడతారన్నారు. పెళ్లయినప్పటి నుంచి మెంటల్ రీతిలో తనపై చావబాదేవాడన్నారు. రాయచోటికి వెళ్లి ఎస్పీకి తన భర్త శాడిజంపై ఫిర్యాదు చేశానని ఆమె వివరించారు. తాను కనిపించకుండా పోలేదని, మా అమ్మమ్మ ఇంటికి వచ్చానని తెలిపారు. మొలకలచెరువులో తాను కనిపించలేదని, తప్పుడు ఫిర్యాదు ఎలా చేస్తారన్నారు. తన భర్తతో వివాహమైనప్పటి నుంచి నేటి వరకు తనకు జరిగిన సంఘటనలను ఆమె వివరించింది. -
శ్రీరెడ్డెమ్మకొండలో భక్తుల రద్దీ
గుర్రంకొండ : మండలంలోని చెర్లోపల్లె గ్రామంలో వెలసిన సంతాన దేవత శ్రీ రెడ్డెమ్మతల్లి ఆలయంలో భక్తుల రద్దీ నెలకొంది. ఆదివారం ఆలయంలో అమ్మవారికి వేకువజామునే పలు రకాల నైవేద్యాలు సమర్పించి విశేష పూజలు, అభిషేకాలు నిర్వహించారు. సంతానాన్ని ప్రసాదించే చల్లని తల్లిగా పేరుపొందిన అమ్మవారి ఆలయానికి ఉదయం నుంచే భక్తుల సందడి మొదలైంది. ఆలయ పరిసరాల్లోని దిగువ తొట్లివారిపల్లెలో అమ్మవారి అర్చకుల కుటుంబీకులు పంపిణీ చేసే ఆకు పసరును తాగి మహిళలు అమ్మవారి కోనేట్లో పవిత్ర స్నానమాచరించిచారు. తడిబట్టలతోనే అమ్మవారి ఎదుట సంతానం కోసం వరపడ్డారు. కొందరు భక్తులు అమ్మవారికి బంగారు, వెండి, చీరెసారెలతో మొక్కులు చెల్లించుకొన్నారు. పలువురు అమ్మవారికి భక్తిశ్రద్ధలతో తలనీలాలు సమర్పించారు. ఆలయంలో అన్నదాన కార్యక్రమాలు నిర్వహించారు. హిందువులతోపాటు ముస్లింలు పెద్ద ఎత్తున అమ్మవారి ఆలయానికి తరలిరావడం విశేషం. -
14న మకరజ్యోతి దర్శనం
సదుం : మండలంలోని ఎర్రాతివారిపల్లె కోటమలై అయ్యప్పస్వామి ఆలయంలో ఈ నెల 14న మకరజ్యోతి దర్శనం నిర్వహిస్తున్నట్లు నిర్వాహకులు ఆదివారం తెలిపారు. ఆ రోజున మాజీ మంత్రి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి తిరు ఆభరణాలను కుటుంబ సభ్యులతో కలిసి ఊరేగింపుగా తీసుకువచ్చి అయ్యప్ప స్వామికి సమర్పిస్తారు. అనంతరం ఆలయ తూర్పు దిక్కున ఉండే కొండల్లో మకరజ్యోతి దర్శనం ఇస్తుంది. వివిధ ప్రాంతాల నుంచి భారీగా తరలి వచ్చే భక్తుల కోసం ఏర్పాట్లను ముమ్మరంగా చేస్తున్నారు. భక్తితోనే ముక్తికి మార్గంకలకడ : ధర్మాన్ని కాపాడండి.. ఆ ధర్మమే అందరినీ కాపాడుతుంది అని పరమపూజ్య శ్రీధర్ చరణ్దాస్ స్వామి అన్నారు. ఆదివారం మండలంలోని ఎనుగొండపాళ్యం పంచాయతీ దిగువపాళ్యంలో నిర్వహించిన హిందూ సమ్మేళనం కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రాష్ట్రీయ స్వయం సేవక్ సంఘ్ స్థాపించి 100 సంవత్సరాలు పూర్తయిన సందర్భంగా హిందూ సమ్మేళనం కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ప్రతి ఆలయంలో నిత్య ధూపదీప నైవేద్యం కొనసాగేలా సహకారం అందించాలన్నారు. చేసే పనిలో మంచి ఉండాలని, భక్తితోనే ముక్తికి మార్గం సాధ్యమని తెలియజేశారు. వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరికి గాయాలు మదనపల్లె రూరల్ : వేర్వేరు ప్రమాదాల్లో ఇద్దరు వ్యక్తులు తీవ్రంగా గాయపడి ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. ములకలచెరువు మండలం చౌడసముద్రంకు చెందిన గండన్న కుమారుడు కృష్ణప్ప(55) టీవీఎస్ ఎక్సెల్ వాహనంలో పొలం వద్దకు గడ్డి తెచ్చేందుకు వెళుతుండగా, తంబళ్లపల్లె మండలం ఎర్రగుంట్లపల్లె పూలబావి వద్ద ఎదురుగా వచ్చిన జీపు ఢీకొని తీవ్రంగా గాయపడ్డాడు. గమనించిన స్థానికులు బాధితుడిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. కర్ణాటక కోలారుకు చెందిన దంపతులు చంద్రశేఖర్, శశికళ(26) తమ కుమార్తెతో కలిసి గుర్రంకొండ మండలం చెర్లోపల్లె రెడ్డెమ్మకొండ దేవాలయానికి బైక్పై బయలుదేరారు. మార్గంమధ్యలో మదనపల్లె మండలం చీకలబైలు పంచాయతీ బార్లపల్లె వద్ద రోడ్డుపై ఉన్న స్పీడ్బ్రేకర్ దాటే క్రమంలో వెనుక కూర్చున్న శశికళ అదుపుతప్పి కిందపడి తీవ్రంగా గాయపడింది. గమనించిన స్థానికులు బాధితురాలిని మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్రమంగా బీర్ల తరలింపుకడప అర్బన్ : కడప నగర శివారులోని కేంద్ర కారాగారం సమీపంలో ఆదివారం కారులో అక్రమంగా రెండు కేస్ (20 బీర్లు) తరలిస్తున్న కె.సురేష్ అనే వ్యక్తిని రిమ్స్ పీఎస్ సీఐ రామకృష్ణారెడ్డి తమ సిబ్బందితో అరెస్టు చేశారు. తెలంగాణ రాష్ట్రం మహబూబాబాద్, కే. సముద్రం నివాసి అయిన కె.సురేష్ కడపలో బీర్లను కొనుగోలు చేసి విక్రయించేందుకు తీసుకెళ్తుండగా అరెస్టు చేసినట్లు సీఐ వెల్లడించారు. బీర్లను, కారును సీజ్ చేసినట్లు పేర్కొన్నారు. -
ఘర్షణలో వ్యక్తి మృతి
కేవీపల్లె : నీటి పైప్లైన్ విషయమై ఇరువురు ఘర్షణ పడి ఓ వ్యక్తి మృతి చెందిన సంఘటన మండలంలోని జమకులవడ్డిపల్లెలో చోటు చేసుకుంది. స్థానికుల కథనం మేరకు వివరాలిలా ఉన్నాయి. జమకుల వడ్డిపల్లెకు చెందిన పసుపులేటి రెడ్డప్ప (50) అదే గ్రామానికి చెందిన పి.రమణ మధ్య ఆదివారం రాత్రి నీటి కుళాయి పైపులైను విషయమై వాగ్వాదం చోటుచేసుకుంది. మాటకుమాట పెరిగి తోపులాటకు దారితీయగా, ఆ సమయంలో రెడ్డప్ప కింద పడిపోయాడు. దీంతో ఆయనకు తీవ్ర గాయాలయ్యాయి. ఆయన్ను చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మృతి చెందాడు. కేవీపల్లె పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు. 22న వేలం ఒంటిమిట్ట : ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయ ఆవరణలో టెంకాయల విక్రయ దుకాణం లైసెన్స్ కోసం ఈ నెల 22న వేలంపాట జరగనున్నట్లు ఆలయ ఇన్స్పెక్టర్ నవీన్ కుమార్ ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ టెండర్ ప్రారంభంలో ఒక సంవత్సర కాలానికి అనుమతులు ఇవ్వగా, ఏడాది గడువు ముగిసిన తరువాత వాయిదా చెల్లింపుల్లో టీటీడీ వారు సంతృప్తి చెందితే, మరో రెండు సంవత్సరాలు పొగించే అవకాశం ఉంటుందని ఆయన వివరించారు. 22న మధ్యాహ్నం 2 గంటలకు టెండర్లు ఆహ్వానిస్తున్నట్లు పేర్కొన్నారు. -
నేడు అల్లసాని పెద్దన విగ్రహావిష్కరణ
కడప ఎడ్యుకేషన్: తెలుగులో తొలి ప్రబంధానికి శ్రీకారం చుట్టి రాయలసీమకు ఎనలేని కీర్తి తెచ్చిన ’ఆంధ్ర కవితా పితామహుడు ’అల్లసాని పెద్దన విగ్రహాన్ని సోమవారం పెద్దన నడయాడిన ఎర్రగుంట్ల మండలం పెద్దనపాడు గ్రామ శివాలయంలో ఆవిష్కరిస్తున్నట్లు కొత్తపు రామమోహన్ రెడ్డి తెలియజేశారు. కార్యక్రమానికి అధ్యక్షుడిగా వైఎస్సార్ కడప జిల్లా రచయితల సంఘం అధ్యక్షుడు ఆచార్య మూల మల్లికార్జున రెడ్డి, పెద్దన్న విగ్రహావిష్కర్తగా పంపాక్షేత్రం శ్రీ గోవిందానంద సరస్వతి స్వామి, గంగా చైతన్య కుమార్ రెడ్డి విగ్రహావిష్కర్తగా జిల్లా రెవిన్యూ అధికారి ఎం విశ్వేశ్వర నాయుడు పాల్గొననున్నారు. ఆంధ్ర కవితా పితామహుడు అల్లసాని పెద్దన (వ్యాస సంపుటి) పుస్తకావిష్కర్తగా ’మహా సహస్రావధాన స్థాపనాచార్య’ డాక్టర్ మేడసాని మోహన్, ఆలయ చరిత్ర శిలాఫలకం ఆవిష్కర్తగా తిరుమల తిరుపతి దేవస్థానం పాలకమండలి సభ్యులు జి.భాను ప్రకాష్ రెడ్డి చేయనున్నారు. గౌరవ అతిథులుగా డాక్టర్ భూతపురి గోపాలకృష్ణ శాస్త్రి, జింకా సుబ్రహ్మణ్యం, ’పెద్దన జీవితం –సాహిత్యం ’అనే అంశంపై జరిగే శతాధిక కవి సమ్మేళన నిర్వాహకులుగా డాక్టర్ తవ్వా వెంకటయ్య, డాక్టర్ కొప్పోలు రెడ్డి శేఖర్ రెడ్డి, ’స్వామి వివేకానంద జీవితం –సాహిత్యం’ అనే అంశంపై పాఠశాల విద్యార్థులతో ఏర్పాటు చేసే క్విజ్ కు న్యాయ నిర్ణేత గా డాక్టర్ యాడికి శివ ప్రభాకర్ రెడ్డి విచ్చేయనున్నారన్నారని వారు తెలియజేశారు. ఒంటిమిట్ట: ప్రముఖ ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి దేవాలయాన్ని ఆదివారం రాష్ట్ర పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేశ్ దర్శించుకున్నారు. ఈ సందర్భంగా ఆయనకు ఆలయ లాంఛనాలతో స్వాగతం పలికారు. -
ప్రైవేటు ట్రావెల్స్కు పండగ!
మదనపల్లె రూరల్: సంక్రాంతి వచ్చిందంటే చాలు పండగంతా ప్రైవేటు ట్రావెల్స్దే. సీజన్లో దొరికిందే తడవుగా చార్జీల పేరుతో ప్రయాణికులను నిలువునా దోచుకుంటున్నాయి. దీంతో పండుగ ప్రయాణాలు సామాన్య ప్రజలకు భారంగా మారుతున్నాయి. రైళ్లలో రెండు నెలల ముందే రిజర్వేషన్లు ముగియడం, ఆర్టీసీ సైతం అవసరానికి తగినన్ని బస్సులు నడపకపోవడంతో టిక్కెట్లు దొరకని పరిస్థితి ఏర్పడింది. ఈ నేపథ్యంలో ప్రజలు తప్పనిసరి పరిస్థితుల్లో ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయించాల్సి వస్తోంది. దీన్ని అవకాశంగా తీసుకుని ఒక్కో ట్రావెల్స్ నిర్వాహకులు ఒక్కో విధంగా ప్రయాణికుల దోపిడీయే లక్ష్యంగా టిక్కెట్ ధర నిర్ణయించారు. సాధారణ టిక్కెట్టు ధర కంటే దాదాపు మూడు రెట్లు అధికంగా టిక్కెట్ రేట్లను పెంచేశాయి. పెరిగిన టిక్కెట్ ధరలతో బేజారెత్తిపోతున్న జనం కళ్లల్లో సంక్రాంతి కాంతులు కళా విహీనంగా కనిపిస్తోంది. అధిక వసూళ్లు సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు రావాలనుకునే వారి జేబులకు చిల్లులు పడుతున్నాయి. ఉద్యోగులు, ఉపాధి, చదువుల కోసం హైదరాబాదు, విజయవాడ, చైన్నె, బెంగుళూరులో ఉంటున్న జిల్లా వాసు లు పండక్కి ఇంటికి రావాలంటే భారీగా చెల్లించుకోవాల్సి వస్తోంది. ముందుగా ప్లాన్ చేసుకున్న వారంతా రైళ్లకు బుకింగ్ చేసుకున్నారు. సెలవు దొరుకుతుందో లేదో అని వెయిట్ చేసి చివరి నిమిషంలో ప్రయాణానికి సిద్ధ్దమైన వారి పరిస్థితి దారుణంగా ఉంది. రైళ్లలో అడుగు పెట్టలేని పరిస్థితి ఇక రైలు ప్రయాణం గురించి ఆలోచన మానుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. జిల్లాకు వివిధ నగరాల నుంచి వచ్చే రైళ్లకు సంబంధించి రెండు నెలల ముందే రిజర్వేషన్లు క్లోజ్ అయ్యాయి. కనీసం వెయిటింగ్ లిస్టు కూడా దొరకడం లేదు. పోనీలే జనరల్ బోగీల్లో వద్దామనుకుంటే అడుగు పెట్టలేని పరిస్థితి నెలకొంది. దీంతో రైలు ప్రయాణం ఆలోచనలను విరమించుకోవాల్సి వస్తోంది. చార్జీ రెట్టింపు..మామూలురోజుల్లో హైదరాబాద్ నుంచి మదనపల్లెకు ప్రైవేట్ ట్రావెల్స్ ఏసీ స్లీపర్ బస్సులో రూ.1,450, సీటర్..800–900 ఉండేది. ప్రస్తుతం హైదరాబాదు నుంచి మదనపల్లెకు 12వ తేదీ ప్రయాణానికి ఆన్లైన్లో చెక్చేస్తే... 4 ఆర్టీసీ బస్సులు మాత్రమే ఉన్నాయి. వాటిలో చార్జీ రూ.867 ఉంది. అదే ప్రైవేట్ ట్రావెల్ బస్సుల విషయానికి వస్తే.. ఒక్కో బస్సులో ధర ఒక్కో విధంగా ఉండటమే కాకుండా, స్లీపర్, సీటర్ ఒకే చార్జీలు ఉంటున్నాయి. వాటి ధరలను పరిశీలిస్తే...రూ.1,300 నుంచి 1,800 వరకు ఉంటున్నాయి. లక్షల జీతాలు సంపాదించే సాఫ్ట్వేర్లకు టికెట్ ధరలతో పెద్ద సమస్య ఉండకపోవచ్చు కానీ, ఉపాధి కోసం పెద్ద నగరాలకు వలసవెళ్లి పండుగకు సొంతూరికి రావాలనుకున్న బడుగు జీవులకు ప్రయాణం భారమవుతోంది. కష్టార్జితంలో చాలావంతు చార్జీలకే సరిపోతోంది. గమ్యస్థానం చేరకుండానే మధ్యలో... ప్రయాణికుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ప్రైవేట్ బస్సు ఆపరేటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. హైదరాబాద్ నుంచి పుంగనూరుకు బస్సు రిజర్వేషన్ చేసుకుని రూ.1,700 టికెట్ ధర చెల్లించినప్పటికీ, బస్సు యాజమాన్యం మదనపల్లెకు వచ్చాక వారిని ఆర్టీసీ బస్సులో వెళ్లాల్సిందిగా బస్టాండ్ ఎదుట దింపేశారు. ఎందుకని ప్రశ్నిస్తే.. బస్సు తిరిగి హైదరాబాద్కు వెళ్లి రాత్రికి లోడ్ చేసుకోవాల్సి ఉందని, సర్దుకుపోండని సమాధానమిచ్చారని ప్రయాణికులు వాపోయారు. చేసేదిలేక లగేజీ మోసుకెళ్తూ వచ్చామని ఆవేదన వ్యక్తం చేశారు. బస్సులు, రైళ్లలో ఖాళీలేక ప్రైవేటు ట్రావెల్స్ను ఆశ్రయిస్తున్న జనం అవసరాన్ని ఆసరాగా చేసుకుని దోచుకుంటున్న ప్రైవేట్ ట్రావెల్స్ హైదరాబాదు, విజయవాడ నుంచి రావాలంటే పెద్ద మొత్తంలో వసూలు దోపిడీపై పట్టీపట్టనట్లు వ్యవహరించిన కూటమి సర్కార్ -
బతుకు దెరువు కోసం వెళ్లి..
లక్కిరెడ్డిపల్లి : లక్కిరెడ్డిపల్లిలోని కుర్నూతుల స్టేట్ బ్యాంక్ సమీపంలో నివాసం ఉంటున్న జటిపిటి మధుకర్ (38) అనే వ్యక్తి బతుకుదెరువు కోసం కూలి పనికి తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి అక్కడ పని చేస్తుండగా శనివారం గుండెపోటుతో మృతి చెందినట్లు వారి బంధువులు తెలిపారు. ఆదివారం మధుకర్ మృతదేహం స్వగ్రామమైన లక్కిరెడ్డిపల్లికి చేరుకోవడంతో వారి కుటుంబం శోకసముద్రంలో మునిగిపోయింది. మధుకర్కు భార్య, ఒక కుమార్తె ఉన్నారు. బేల్దారి పని చేసుకుంటూ జీవనం సాగించే మధుకర్ తమిళనాడు రాష్ట్రానికి వెళ్లి అక్కడ పనిలో ఉండగానే గుండెపోటుకు గురై ఉన్నట్టుండి కుప్పకూలిపోవడంతో స్థానికులు ఆసుపత్రికి తరలించారు. అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించడంతో ఆదివారం మృతదేహాన్ని లక్కిరెడ్డిపల్లికి చేర్చారు. బాధిత కుటుంబ సభ్యులు గుండెలవిసేలా రోదించారు. పోలీసుల అదుపులో నిందితుడుఒంటిమిట్ట : మండల పరిధిలోని నరసన్నగారిపల్లిలో ఈ నెల 8వ తేదీన అమ్మమ్మ రాఘవమ్మను మనవడు పొట్టె నందకుమార్ పొడిచి పరారీ అయిన ఘటన విదితమే. అతన్ని పోలీసులు ఆదివారం అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. లక్కిరెడ్డిపల్లి వాసి తమిళనాడులో మృతి -
పండుగ వేళ.. క్రీడల హేల
పుంగనూరు : పట్టణంలోని గూడూరుపల్లె వద్ద ఉన్న జగనన్న టిడ్కో కాలనీలోని లబ్ధిదారులతో కలసి సంక్రాంతి సంబరాలను ఆదివారం నిర్వహించారు. కమిషనర్ మధుసూదన్రెడ్డి ఆధ్వర్యంలో టిడ్కో ఇన్చార్జ్ రవీన్కుమార్రెడ్డి మహిళలకు, చిన్నారులకు ఆటల పోటీలు, పరుగు పందెల పోటీలు నిర్వహించారు. అలాగే పట్టణంలోని నారాయణి ఫౌండేషన్ ప్రతినిదులు హేమంత్ రాయల్ ఆధ్వర్యంలో స్థానిక బీఎంఎస్ క్లబ్లో మహిళలకు ముగ్గుల పోటీలు నిర్వహించి బహుమతులు పంపిణీ చేశారు. పొంగళ్లు వండి, భోగి మంటలు వేసి, సంక్రాంతి పాటలు పాడుతూ సంబరాలు జరిపారు. ఆటలతోనే ఐక్యత చౌడేపల్లె : ఆటలతోనే యువకుల్లో ఐక్యత చేకూరుతుందని ప్రముఖ పారిశ్రామిక వేత్త దివ్యశ్రీ ఇండ్రస్ట్రీయల్ ఎండీ భాస్కర్రాజు పేర్కొన్నారు. మండలంలోని దాదేపల్లె సమీపంలోని రాజులూరు వద్ద ఏర్పాటుచేసిన క్రీడా ప్రాంగణంలో ఆదివారం కేపీఎల్ స్పోర్ట్స్ అండ్ కల్చరల్ అసోసియేషన్ (క్షత్రియ ప్రీమియర్ లీగ్) 11 యేళ్ళుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సీజన్ క్రికెట్ పోటీలను పారిశ్రామిక వేత్తలు సుదర్శనరాజు, ఎన్.పురుషోత్తంరాజు, వెంకటరమణరాజు, లక్ష్మిపతిరాజు, పి.పురుషోత్తంరాజు, రవిరాజు తదితరులు కలిసి క్రికెట్ పోటీలను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఏర్పాటుచేసిన ప్రత్యేక సమావేశంలో వక్తలు ప్రసంగించారు. వివిధ ప్రాంతాల నుంచి నైపుణ్యం ఉన్న క్రీడాకారులు తమ క్రీడలను మరుగున వేయకుండా ప్రదర్శించాలని సూచించారు. క్షత్రియుల సమస్యలను గుర్తించి వారికి చేయూత నివ్వడానికి ముందుకురావాలని సూచించారు. అనంతరం ప్రాంగణంలోని జెండాను ఆవిష్కరించి బ్యాటింగ్తో క్రీడను ప్రారంభించారు. క్షత్రియ ప్రీమియర్ లీగ్ క్రికెట్ పొటీల్లో పాల్గొనడానికి వివిధ గ్రామాల నుంచి క్రీడాకారులు తరలివచ్చారు. మూడు రోజులపాటు సాగే క్రికెట్ పోటీల్లో తలపడడానికి మొత్తం 13 టీంలు తలపడనున్నాయి. క్రికెట్ టోర్నమెంట్ ప్రారంభం కేవీపల్లె : మండలంలోని కేవీపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాల మైదానంలో గర్నిమిట్ట యల్లమ్మ తల్లి క్రికెట్ టోర్నమెంట్ ఆదివారం ప్రారంభించారు. ఈ సందర్భంగా నిర్వాహకులు మహేష్రెడ్డి, ఆనంద్ మాట్లాడుతూ సంక్రాంతి పండుగను పురష్కరించుకుని ఈ నెల 15వ తేదీ వరకు మండలస్థాయి క్రికెట్ టోర్నమెంట్ నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఈ టోర్నమెంట్లో విజేత జట్టుకు రూ. 15 వేలు, ద్వితీయ స్థానంలో నిలిచే జట్టుకు రూ. 10 వేలు తోపాటు ప్రతిభ చూపిన క్రీడాకారులకు మ్యాన్ ఆఫ్ ది సీరిస్, మ్యాన్ ఆఫ్ మ్యాచ్ బహుమతులు ఇస్తామని తెలిపారు. -
బస్సు ఢీకొని యువకుడి దుర్మరణం
సదుం : ఆర్టీసీ బస్సు, బైక్ ఢీకొని యువకుడు దుర్మరణం చెందిన సంఘటన మండలంలో ఆదివారం సాయంత్రం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల మేరకు.. చెరుకువారిపల్లెకు చెందిన సయ్యద్బాషా కుమారుడు రఫీ (27) కూలీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. గానుగ పనులకు వెళ్లి వచ్చి, సొంత పనుల కోసం బైక్పై మండల కేంద్రానికి వచ్చాడు. తిరుగు ప్రయాణంలో మత్తుకువారిపల్లె సమీపంలోని మల్లేశ్వరస్వామి ఆలయం మలుపు వద్ద ఆర్టీసీ బస్సు ఢీకొనడంతో తలకు తీవ్ర గాయం అయ్యి అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని ఏఎస్ఐ సత్యనారాయణ పరిశీలించి, విచారణ చేశారు. మృతుడికి భార్య, ముగ్గురు పిల్లలు ఉన్నారు. కుటుంబ సభ్యుల రోదన అందరినీ కలిచి వేసింది. -
వైఎస్ అభిషేక్ రెడ్డికి నివాళి
పులివెందుల/రూరల్ : ప్రముఖ పారిశ్రామికవేత్త వైఎస్ ప్రకాష్రెడ్డి మనుమడు, వైఎస్సార్సీపీ తొండూరు మండల ఇన్చార్జి వైఎస్ మధురెడ్డి కుమారుడు దివంగత వైఎస్ అభిషేక్రెడ్డి ప్రథమ వర్ధంతి సందర్భంగా కుటుంబ సభ్యులు, వైఎస్సార్సీపీ నేతలు నివాళి అర్పించారు. పులివెందుల పట్టణంలోని స్థానిక అంబకపల్లె రోడ్డులో ఉన్న వైఎస్ ప్రకాష్రెడ్డి నివాసంలో నిర్వహించిన నివాళి కార్యక్రమంలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సతీమణి వైఎస్ భారతిరెడ్డితో పాటు ఆమె సోదరుడు ఈసీ దినేష్రెడ్డి పాల్గొన్నారు. తొలుత వారు కుటుంబ సభ్యులతో కలిసి వైఎస్ అభిషేక్రెడ్డి చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వైఎస్సార్సీపీలో చిన్న వయస్సులో రాష్ట్ర వైద్య విభాగపు ప్రధాన కార్యదర్శిగా బాధ్యతలు చేపట్టి పార్టీ కోసం ఎనలేని కృషి చేశారన్నారు. తక్కువ కాలంలోనే పార్టీ కోసం అనేక సేవలు అందించి గొప్ప వ్యక్తిగా వైఎస్ అభిషేక్రెడ్డి నిలిచిపోయారన్నారు. ఆయన మరణం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీకి తీరని లోటని పేర్కొన్నారు. అనంతరం వైఎస్ కుటుంబ సభ్యులు అందరూ కలిసి ప్రత్యేక ప్రార్థనలు నిర్వ హించారు. సీఎస్ఐ చర్చి ఫాదర్ బాబు, మృత్యుంజయరావు, మణి ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. పరలోకంలో ఉన్న వైఎస్ అభిషేక్రెడ్డికి శాంతి కలగాలని దేవున్ని ప్రార్థించారు. ప్రొద్దుటూరు క్రైం: రెండు చోరీ కేసుల్లో ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి నుంచి 53 గ్రాముల రెండు బంగారు చైన్లను స్వాధీనం చేసుకున్నారు. అరెస్ట్ వివరాలను శనివారం రూరల్ పోలీసులు వెల్లడించారు. ప్రొద్దుటూరుకు చెందిన కొట్లూరు పర్వతమ్మ ఆటోలో వెళ్తున్న సమయంలో దువ్వూరు రోడ్డు సర్కిల్లోకి వెళ్లగానే దొంగలు బంగారు చైన్ను దొంగలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసిన రూరల్ పోలీసులు దొంగల కోసం గాలింపు చర్యలు చేపట్టారు. ఎర్రగుంట్ల రోడ్డులోని నంగనూరుపల్లె క్రాస్ వద్ద ముగ్గురు వ్యక్తులు అనుమానాస్పదంగా తిరుగుతున్నారని సమాచారం రావడంతో రూరల్ పోలీసులు శనివారం దాడులు నిర్వహించారు. దాడిలో తమిళనాడు రాష్ట్రానికి చెందిన నాగమణి అలియాస్ నాగమ్మ, వెంకటరమణరేఖ, రాచనేని అర్జున్లను అరెస్ట్ చేశారు. వారి వద్ద నుంచి 53 గ్రాముల రెండు బంగారు చైన్లను స్వాధీ నం చేసుకున్నారు. ప్రొద్దుటూరులోని పర్వతమ్మ మెడలోని చైన్తో పాటు నందలూరు బస్టాండులో వల్లూరు భాగ్యమ్మ అనే మహిళ మెడలో నుంచి బంగారు చైన్ను దొంగలించినట్లు నిందితులు పోలీసుల వద్ద అంగీకరించారు. రెండు కేసుల్లోని బంగారు చైన్లను దొంగల నుంచి స్వాధీనం చేసుకున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ కేసులో మరో ఇద్దరు నిందితులను అరెస్టు చేయాల్సి ఉందన్నారు. పట్లుబడిన ముగ్గురిపై తమిళనాడు రాష్ట్రంలో పలు కేసులు ఉన్నట్లు పోలీసులు పేర్కొన్నారు. -
పండుగకు ఊరెళుతున్నారా.. జాగ్రత్త !
● ఇంటి భద్రతపై పోలీస్ సూచనలు పాటించండి ● ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మదనపల్లె రూరల్ : సంక్రాంతి పండుగకు ఊరు వెళ్లే వారు తమ ఇంటి భద్రతకు సంబంధించి పోలీస్ సూచనలు పాటించి అప్రమత్తంగా ఉండాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. పండుగ సెలవుల్లో ఇళ్లకు తాళాలు వేసి సొంత ఊర్లకు వెళ్లే క్రమంలో చోరీలు జరిగేందుకు అవకాశం ఉన్నందున, ప్రజలను చైతన్యపరిచేందుకు జిల్లాలోని అన్ని పోలీస్స్టేషన్ల పరిధిలో మైకుల ద్వారా విస్తృత ప్రచారం కల్పించాలని పోలీస్ సిబ్బందిని ఆదేశించారు. శనివారం పండుగ సెలవులకు ఇళ్లకు తాళాలు వేసుకుని వెళ్లేవారు పాటించాల్సిన కీలకభద్రత సూచనలపై ఒక ప్రకటనలో పేర్కొన్నారు. ఇంటి తలుపులకు, బాల్కనీలకు నాణ్యమైన తాళాలు వాడాలన్నారు. ఇంట్లో భారీ నగదు, బంగారు ఆభరణాలు ఉంచవద్దన్నారు. బ్యాంక్ లాకర్లలో లేదా నమ్మకమైన బంధువుల వద్ద భద్రంగా ఉంచాలని సూచించారు. ఇంటి పరిసరాల్లో హై రిజల్యూషన్ సీసీ కెమెరాలు ఏర్పాటుచేసుకుని, వాటిని మొబైల్ ఫోన్కు అనుసంధానించుకుంటే, ఎక్కడి నుంచైనా ఇంటిని పర్యవేక్షించవచ్చని తెలిపారు. ఊరికి వెళ్లేవారు స్థానిక పోలీస్స్టేషన్లో లేదా బీట్ కానిస్టేబుల్కు సమాచారం ఇస్తే, గస్తీని ముమ్మరం చేస్తామని వివరించారు. ప్రయాణవివరాలను, లైవ్ ఫోటోలను సోషల్ మీడియాలో పోస్ట్ చేయడం ద్వారా దొంగలు సులభంగా సమాచారం తెలుసుకునే వీలుందని హెచ్చరించారు. రాత్రి వేళల్లో ఇంటి ఆవరణ, గ్యారేజ్ వెలుగుతో ఉండేలా చూడాలన్నారు. ప్రతి పోలీస్స్టేషన్ పరిధిలోని గ్రామాలు, పట్టణాలు, కాలనీల్లో పోలీస్వాహనాల ద్వారా మైకుల సహాయంతో ప్రజలకు రక్షణ సూచనలు వివరించాలని సిబ్బందిని ఆదేశించారు. మైకుల ద్వారా అవగాహన కల్పిస్తూనే, రాత్రి వేళల్లో పెట్రోలింగ్, బీట్కానిస్టేబుళ్ల తనిఖీలను మరింత పటిష్టం చేయాలన్నారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే ప్రజలు ఫోటో తీసి డయల్ 112 లేదా స్థానిక పోలీస్స్టేషన్కు సమాచారం ఇచ్చేలా ప్రజలను చైతన్యపరచాలని సూచించారు. ప్రజలు కూడా పోలీసుల సూచనలు పాటించాలని కోరారు. సంక్రాంతి పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని ఎస్పీ ధీరజ్ ఆకాంక్షించారు. -
అక్రమాలపై ఈఓ విచారణ
చౌడేపల్లె : ప్రముఖ పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో చంద్రబాబు ప్రభుత్వం ఏర్పాటైనప్పటినుంచి జరిగిన అవినీతి అక్రమాలపై అందిన ఫిర్యాదు మేరకు కాణిపాకం ఈఓ పెంచల కిషోర్ శనివారం విచారణ చేపట్టారు. బోయకొండ గంగమ్మ ఆలయం వద్దకు చేరుకొని తొలుత అమ్మవారిని దర్శించుకున్నారు. నవంబరు 6న బోయకొండలోఅవినీతి అక్రమాలపై రాష్ట్ర బీసీ కార్పొరేషన్ (పాల ఏకరి) చైర్మన్ , పుంగనూరు నియోజకవర్గపు టీడీపీ అబ్జర్వర్ నాగేశ్వర నాయుడు దేవదాయశాఖ కమిషనర్కు ఫిర్యాదు చేశారన్నారు. ఆయన ఫిర్యాదుపై స్పందించిన కమీషనర్ విచారణ అధికారిను నియమించి విచారణ చేపట్టాలని ఆదేశించారు. ఈమేరకు ఆలయ కార్యాలయంలో బీసీ కార్పొరేషన్ చైర్మన్ నాగేశ్వర నాయుడుతోపాటు పలువురు ఫిర్యాదిదారులను పెంచల కిషోర్ సుధీర్ఘంగా విచారణ చేపట్టి వారి వద్ద గల ఆధారాలను సేకరించారు. ఆలయంలో గల హుండీ ఆదాయంలో అక్రమాలు, ఆలయం వద్ద తలకాయలు అఽధిక రేట్లకు విక్రయిస్తున్నా ఈఓ ఏకాంబరం ప్రేక్షకపాత్ర పోషించారని ఆరోపించారు. అభివృద్ధి పనుల్లో భాగంగా గృహాలు కోల్పోయిన వారికి నష్టపరిహారం అందించాలని పలువురు విన్నవించారు. విచారణ నివేదికను దేవదాయశాఖ కమిషనర్కు త్వరలో అందజేస్తామని పెంచలకిషోర్ వెల్లడించారు. -
ఆత్మీయ కలయికకు వేళాయే!
● 14న రాజంపేటలోఓల్డ్ ప్లేయర్స్ క్రికెట్ మ్యాచ్ ● క్రికెట్ మ్యాచ్ ఆడేందుకుసిద్దమవుతున్న వెటరన్ క్రీడాకారులు రాజంపేట టౌన్ : సంక్రాంతి పండుగ ఆత్మీయ కలయికలకు వేదిక అవుతుంది. ఇటీవల కాలంలో అందరిది ఉరుకులు, పరుగులమయమైన జీవనమైంది. అందువల్ల సన్నిహితులను, స్నేహితులను చివరికి దగ్గరి బంధువులను కూడా స్వయంగా కలుసుకోలేక పోతున్నారు. ఈ నేపథ్యంలో రాజంపేటలో కొంత మంది మాజీ క్రికెట్ క్రీడాకారులు సంక్రాంతి సందర్భంగా ఆత్మీయ కలయిక పేరుతో ఈనెల 14వ తేదీ భోగి పండుగ రోజున క్రికెట్ మ్యాచ్ ఆడనున్నారు. ఈ క్రికెట్ మ్యాచ్ ఆడేవారంతా ఒకప్పుడు రాయలసీమలోనే పేరుగాంచిన రాజంపేట క్రికెట్క్లబ్ (ఆర్సిసి) ప్లేయర్స్ కావడం విశేషం. 1990 దశకంలో ఏర్పాటైన ఆర్సీసీ కొన్ని దశాబ్దాల పాటు ఓ వెలుగు వెలిగింది. తాజాగా ఆర్సీసీకి చెందిన మాజీ క్రీడాకారులంతా భోగి పండుగ రోజు క్రికెట్ మ్యాచ్ ఆడేందుకు సిద్దమయ్యారు. వీరిలో దాదాపు అందరు ఐదు, ఆరు పదుల వయస్సు పైబడిన వారు కావడం విశేషం. వీరిలో కొంత మంది ప్రముఖ రాజకీయ నాయకులు, పట్టణ ప్రముఖులు, ఉన్నత స్థాయి అధికారులు, వివిధశాఖల్లో పనిచేసే ఉద్యోగులు,రిటైర్డ్ ఉద్యోగులు, సాఫ్ట్వేర్ ఇంజనీర్లు ఉన్నారు. ఈనెల 14వ తేదీ జరిగే ఆత్మీయ క్రికెట్ మ్యాచ్ కోసం శ నివారం ఆర్సీసీ మాజీ క్రీడాకారులైన షేక్ అబ్దుల్లా, పసుపులేటి గోపినాధ్, చిట్వేలి రవికుమార్ ప్రభుత్వ జూనియర్ కళాశాలలోని క్రీడామైదానంలో క్రికెట్ మ్యాచ్ నిర్వహణ కోసం ఏర్పాట్లు ప్రారంభించారు. ఆర్సిసి వ్యవస్థాపకులైన మున్సిపల్ ఛైర్మన్ పోలా శ్రీనివాస్రెడ్డి, ప్రముఖ న్యాయవాది కాశిరెడ్డి గిరిచంద్రారెడ్డిని కలిసి ఆత్మీయ క్రికెట్ మ్యాచ్కు ఆహ్వానించారు. -
నారసింహునికి విశేష పూజలు
గుర్రంకొండ: మండలంలోని తరిగొండ గ్రామంలో వెలసిన శ్రీ లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో స్వామివారికి విశేషపూజలు నిర్వహించారు. శనివారం టీటీడీ వారి ఆధ్వర్యంలో ఆలయంలో స్వామివార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. వేకువజామునే స్వామివారికి పలు రకాల నైవేద్యాలు సమర్పించి అభిషేకాలు, అర్చనలు నిర్వహించారు. తోమాల సేవ, ఏకాంతసేవ కావించారు. ఈ సందర్భంగా స్వామివారిని రంగురంగుల పుష్పాలతో అందంగా అలంకరించారు. భక్తులు పెద్ద ఎత్తున ఆలయానికి చేరుకొని స్వామివారిని సేవించుకొన్నారు. అర్చకులు భక్తులకు స్వామివారి తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో టీటీడీ అధికారులు, ఆలయఅర్చకులు, సిబ్బంది పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: గండికోటలో ఈనెల 11, 12 13 తేదీలలో జరిగే ఉత్సవాల కోసం ఏపీఎస్ ఆర్టీసీ ప్రత్యేక బస్సులు నడపనుందని జిల్లా ప్రజా రవాణాధికారి పొలిమేర గోపాల్రెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లాలోని కడప, ప్రొద్దుటూరు, మైదుకూరు, జమ్మలమడుగు డిపోల నుంచి గండికోటకు ప్రత్యేక సర్వీసులుంటాయన్నారు. జమ్మలమడుగు డిపో నుంచి 20 బస్సులు, కడప 8, ప్రొద్దుటూరు 8, మైదుకూరు 3 బస్సులు, మొత్తం 39 బస్సులు రాకపోకలు సాగిస్తాయన్నారు. జమ్మలమడుగు నుంచి ప్రతి 15 నిమిషాలకు ఒక బస్సు చొప్పున ఉదయం నుంచి రాత్రి 10 గంటల వరకు బస్సులు తిరుగుతాయన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్ : బాల్య వివాహాలు చట్టవ్యతిరేకమని, ఇందుకు తగిన శిక్షలు ఉన్నాయని పారా లీగల్ వలంటీర్లు నిర్మల, దశరథ రామిరెడ్డి, ఈశ్వరయ్యలు తెలిపారు. జిల్లా ప్రధాన న్యాయమూర్తి డాక్టర్ సి.యామిని, న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ, సీనియర్ సివిల్ జడ్జి బాబా ఫకృద్దీన్ సూచనలతో లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సిల్ న్యాయవాదులచే చెన్నూరులో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. కడప ఎడ్యుకేషన్: కేంద్రీయ విశ్వవిద్యాలయ ఉమ్మడి ప్రవేశ పరీక్షపై (అండర్ గ్రాడ్యుయేట్ ) 11వ తేదీ ఆదివారం సాయంత్రం 7 గంటలకు నుంచి 8.30 వరకు ఆన్లైన్ గూగుల్ ద్వారా వెబినార్ నిర్వహిస్తామని సైన్స్ క్లబ్ అధ్యక్షుడు ఆర్. శ్రీనివాసులరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. దేశంలోని 200 పైగా సెంట్రల్ యూనివర్సిటీలు, స్టేట్ యూనివర్సిటీలు, ప్రైవేటు డీమ్డ్ టు బి యూనివర్సిటీలలో అండర్ గ్రాడ్యుయేట్ కోర్సులలో ప్రవేశం కోసం జరిపే ఈ పరీక్ష ద్వారా విద్యార్థులకు ఉజ్వలమైన భవిష్యత్తు ఉంటుందని తెలిపారు. భారత వ్యవసాయ పరిశోధనా మండలి (ఐకార్) గుర్తింపు పొందిన కళాశాలల్లో వ్యవసాయ కోర్సులకు కూడా ఈ పరీక్ష ప్రవేశ మార్గం అన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు గూగుల్ వెబి నార్ లింకు https://meet. google.com/ qgd&umvd&cvx,యూట్యూబ్ లింకు https:// youtube.com /live/RVYxs4V nS98?feature =shareలో చూడాలని తెలిపారు. కడప సెవెన్రోడ్స్: ప్రముఖ రచయిత, చరిత్రకారుడు తవ్వా ఓబుల్ రెడ్డి రచించిన గండికోట గ్రంథం ఇప్పుడు ఇంగ్లీషు భాషలో వెలువడుతోంది. పుస్తక రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి ఈ పుస్తకాన్ని స్వయంగా ఆంగ్లంలోకి అనువదించారు. గండికోట ఉత్సవాల సందర్భంగా ఆదివారం ఈ పుస్తకాన్ని ఆవిష్కరించనున్నారు. తెలుగులో ఐదుసార్లు ముద్రించబడి రాష్ట్ర ప్రభుత్వ ఉత్తమ పర్యాటక గ్రంథంగా 2013లో అవార్డుకు ఎంపికై ంది. ఈ పుస్తకం ఇప్పుడు ఇంగ్లీషులో కూడా వెలువడుతుండటంతో గండికోట చరిత్ర, వైభవం గురించి ఇతర రాష్ట్రాల, విదేశీ పర్యాటకులకు కరదీపిక కానుంది. తెలుగు పుస్తకంలోని అంశాలకు అదనంగా గండికోట చరిత్రకు సంబంధించిన అనేక కొత్త అధ్యాయాలను ఈ ఇంగ్లీషు పుస్తకంలో పొందుపరిచినట్లు పుస్తక రచయిత తవ్వా ఓబుల్ రెడ్డి తెలిపారు. -
నేటి నుంచి
● మూడు రోజులపాటు ప్రత్యేక కార్యక్రమాలు ● కలెక్టర్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి కడప సెవెన్రోడ్స్: మన చారిత్రక వైభవం, సంస్కృతీసంప్రదాయాలకు దర్పణం పట్టే గండికోట ఉత్సవాలకు అందరూ కుటుంబ సమేతంగా, బంధు మిత్రులతో తరలి రా వాలని జిల్లా ప్రజలకు కలెక్టర్, టూరిజం కౌన్సిల్ చైర్మన్ డాక్టర్ శ్రీధర్ చెరుకూరి పిలుపునిచ్చారు. కడప కలెక్టరేట్లో శనివారం ఏర్పాటు చేసిన పాత్రికేయుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గండికోట ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు సిద్ధం చేశామని, ప్రజలందరూ భాగస్వామ్యులు కావాలని ఆహ్వానం పలికారు. కన్నుల పండుగ వాతావరణంలో రాష్ట్ర పర్యాటక శాఖ ఆధ్వర్యంలో జిల్లా యంత్రాంగం ప్రతిష్టాత్మకంగా ఈ ఉత్సవాలను అత్యంత ప్రాధాన్యతతో జనవరి 11, 12, 13వ తేదీల్లో నిర్వహిస్తున్నామన్నారు. ఈ సందర్భంగా పర్యాటకులు, సందర్శకులను విశేషంగా ఆకట్టుకునేలా కార్యక్రమాలను రూపొందించామని కలెక్టర్ వివరించారు. వివిధ పోటీలలో విజేతలుగా నిలిచినవారికి చివరిరోజు బహుమతులను ప్రదానం చేస్తామన్నారు. -
ముగిసిన ఏఆర్ ఎస్ఐ అంత్యక్రియలు
పీలేరురూరల్ : మండలంలోని తలపుల పంచాయతీ పెద్దహరిజనవాడకు చెందిన దండు ఓబయ్య (55) అన్నమయ్య జిల్లా పోలీస్ విభాగంలో ఏఆర్ ఎస్ఐగా విధులు నిర్వహించేవారు. శుక్రవారం గుండెపోటుకు గురి కావడంతో చికిత్సనిమిత్తం తిరుపతికి తరలించారు. చికిత్సపొందుతూ మృతి చెందారు. సమాచారం తెలుసుకున్న ఎస్పీ ధీరజ్ కునుబిల్లి దిగ్బ్రాంతి వ్యక్తం చేశారు. బాధిత కుటుంబానికి తక్షణసాయంగా రూ. లక్ష అందజేశారు. ఆర్ఐ రామకృష్ణ, ఆర్ఎస్ఐ శ్రీనివాసులు, పోలీస్ సిబ్బంది ప్రభుత్వ లాంఛనాలతో గాల్లోకి మూడు రౌండ్లు కాల్పులు చేసి అంతిమ సంస్కరణలు నిర్వహించారు. రోడ్డు ప్రమాదంలో విద్యార్థిని మృతి కేవీపల్లె : సంక్రాంతి పండుగకు ఇంటికి వెళుతున్నానన్న ఆనందం.. రోడ్డు ప్రమాద రూపంలో మృత్యువు కబలించడంతో విషాదంగా మారింది. ద్విచక్రవాహనాన్ని కారు ఢీకొన్న ప్రమాదంలో విద్యార్థిని మృతి చెందిన సంఘటన మండలంలోని మహల్రాజుపల్లె వద్ద చిత్తూరు–కర్నూలు జాతీయ రహదారిలో చోటు చేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. సంబేపల్లె మండలం దేవపట్లకు చెందిన శివరాణి (17) తిరుపతిలోని శ్రీచైతన్య కళాశాలలో ఇంటర్మీడిట్ ద్వితీయ సంవత్సరం చదువుతోంది. శనివారం నుంచి సంక్రాంతి సెలవులు కావడంతో శివరాణి తన అన్న మల్లీశ్వరతో కలసి ద్విచక్రవాహనంలో తిరుపతి నుంచి స్వగ్రామానికి బయలుదేరారు. మార్గం మధ్యలో మహల్రాజుపల్లె వద్ద కడప నుంచి చిత్తూరు వెలుతున్న కారు ఎదురుగా వచ్చి ఢీకొంది. ఈ ప్రమాదంలో ఇద్దరూ తీవ్రంగా గాయపడ్డారు. చికిత్స నిమిత్తం 108 పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గం మధ్యలో శివరాణి మృతి చెందింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్ఐ వెంకటశివకుమార్ తెలిపారు. నాటుసారా విక్రేతల అరెస్ట్ పెద్దమండ్యం : నాటుసారా తయారు చేస్తున్న ఇద్దరిని అరెస్ట్ చేయడంతో పాటు వారి నుంచి సారా స్వాధీనం చేసుకున్నామని ఎస్ఐ పి. శ్రావణి తెలిపారు. మండలంలోని దిగువపల్లె గ్రామం వడ్డివంకతండాలో నాటుసారా తయారీ, విక్రయాలు చేస్తున్నారనే సమాచారం మేరకు శనివారం సిబ్బందితో వెళ్లి దాడులు నిర్వహించినట్లు తెలిపారు. దాడుల్లో తండాకు చెందిన లక్ష్మానాయక్, మునేనాయక్లు పట్టుబడినట్లు వెల్లడించారు. వీరి వద్ద నుంచి 20 లీటర్ల నాటుసారాను స్వాధీనం చేసుకున్నామని వివరించారు. ఈమేరకు కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరిచామని ఎస్ఐ తెలిపారు. -
సంక్రాంతి క్రికెట్ టోర్నీ విజేత ‘మదనపల్లె పోలీస్’
మదనపల్లె రూరల్ : జీవీఎస్సీఎస్ సొసైటీ, వాల్మీకిపురం సహకారంతో అన్నమయ్య క్రీడాభారతి ఆధ్వర్యంలో మదనపల్లె అఫిషియల్స్ సంక్రాంతి క్రికెట్ కప్ పోటీలు హోరాహోరీగా జరిగాయి. మదనపల్లె జర్నలిస్ట్స్, పోలీస్, రెవెన్యూ, జీవీఎస్సీఎస్ టీచర్స్, సర్వేపల్లె రాధాకృష్ణ, మదనపల్లె మున్సిపాలిటీ పేరుతో మొత్తం 6 జట్లు పాల్గొన్న ఈ టోర్నీ లో మదనపల్లె పోలీస్ జట్టు విజేతగా నిలిచింది. ఆద్యంతం రసవత్తరంగా జరిగిన ఫైనల్ పోటీల్లో పోలీస్ జట్టు 10 ఓవర్లలో 49 పరుగులు చేసి 4 వికెట్లు కోల్పోయింది. తర్వాత బ్యాటింగ్ దిగిన మదనపల్లె మున్సిపల్ జట్టు నిర్ణీత 10 ఓవర్లలో 47 పరుగులు చేసింది. పోటీల్లో గెలుపొందిన జట్టుకు చిత్తూరు డిస్ట్రిక్ట్ క్రికెట్ అసోసియేషన్ వైస్ ప్రెసిడెంట్, జీవీఎస్సీఎస్ సొసైటీ ఫౌండర్ జీ.శ్రీధర్కుమార్ చేతులమీదుగా మదనపల్లె అఫీషియల్స్ ఇన్విటేషన్ సంక్రాంతి క్రికెట్ కప్ను అందించారు. మదనపల్లె డీఎస్పీ కే.మహేంద్ర పోలీస్జట్టుకు ప్రాతినిథ్యం వహించడం విశేషం. కార్యక్రమంలో అన్నమయ్య జిల్లా క్రీడాభారతి కార్యదర్శి నరేష్బాబు, వైస్ ప్రెసిడెంట్ విష్ణుచైతన్య, అన్నమయ్యజిల్లా ఫుట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి మురళీధర్, స్పెషల్ బ్రాంచ్ సీఐ రాజారమేష్, జీవీఎస్సీఎస్ మెంబర్లు ఉదయ్, నాగరాజ, రంజిత్, కిల్లా నాగరాజ, నవీన్, స్కూల్ గేమ్స్ కార్యదర్శి నాగరాజ పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన జీవీఎస్సీఎస్ అఫిషియల్స్ క్రికెట్ పోటీలు -
చంద్రబాబు సీమ ద్రోహి
సీఎం చంద్రబాబు కేసులకు భయపడి తెలంగాణకు దాసోహం అయ్యారని మాజీ డిప్యూటీ సీఎం, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యులు అంజద్బాషా ఎద్దేవా చేశారు. రాయలసీమ ఎంతో వెనుకబడిన ప్రాంతమని, దేశంలో అతి తక్కువ వర్షపాతం నమోదయ్యే అనంతపురం రాయలసీమలోనే ఉందన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రూ.1000కోట్లతో చేపట్టిన రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీంను నేనే ఆపానని తెలంగాణ సీఎం అంటుంటే ఈ ప్రభుత్వం స్పందించకపోవడం దారుణమన్నారు. తాము కృష్ణా జలాల్లో వాటా అడుగుతుంటే బనకచెర్ల నుంచి గోదావరి నీటిని తెస్తానని సీఎం చెప్పడం దారుణమన్నారు. ఈ ప్రాజెక్టు వెంటనే పూర్తిచేయకపోతే పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని హెచ్చరించారు. కడప కార్పొరేషన్ : రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడాన్ని మించిన ద్రోహం మరొకటి లేదని... సీఎం చంద్రబాబు సీమ ద్రోహి అని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ క్రమశిక్షణా కమిటీ ఛైర్మన్ శెట్టిపల్లె రఘురామిరెడ్డి ధ్వజమెత్తారు. శనివారం జిల్లా పార్టీ కార్యాలయంలో ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి, మాజీ డిప్యూటీ సీఎం అంజద్బాషా, రాజంపేట పార్లమెంటు పరిశీలకులు కె. సురేష్ బాబులతో కలిసి నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. చంద్రబాబు తన స్వార్థ రాజకీయాల కోసం రాయలసీమ ప్రయోజనాలను తెలంగాణకు తాకట్టు పెట్టడం దారుణమన్నారు. తెలంగాణ సీఎం రేవంత్రెడ్డి అసెంబ్లీలో చేసిన వ్యాఖ్యలను సీఎం చంద్రబాబు, ఇరిగేషన్ మంత్రి ఖండించలేని స్థితిలో ఉన్నారన్నారు. కృష్ణా జలాలపై తాము మాట్లాడుతుంటే గోదావరి జలాల గురించి ముఖ్యమంత్రి మాట్లాడటం విచిత్రంగా ఉందన్నారు. కృష్ణా జలాలు లేకపోతే రాయలసీమ ఎడారిగా మారుతుందని హెచ్చరించారు. శ్రీశైలంలో 845 అడుగులకు నీరు వస్తేగానీ పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ నుంచి రాయలసీమకు నీరు వచ్చే అవకాశం లేదన్నారు. మొదటి ప్రాధాన్యత తాగునీటికి, ఆ తర్వాత సాగునీటికి ఇవ్వాలని, ఆ రెండింటి తర్వాతే విద్యుత్ ఉత్పత్తికి నీటిని వాడాల్సి ఉందన్నారు. కానీ అందుకు భిన్నంగా శ్రీశైలంలో 845 లెవెల్కు చేరకముందే తెలంగాణ నీటినంతా విద్యుత్ ఉత్పత్తికి తరలించుకుపోతోందన్నారు. 16 ఏళ్లు ముఖ్యమంత్రిగా పనిచేసిన చంద్రబాబుకు రాయలసీమ అంటే ఎప్పుడూ ద్వేషమేనని, కడప జిల్లా అంటే అసలు పడదన్నారు. అందుకే ఇక్కడి ప్రాజెక్టులను ఆయన పూర్తి చేయలేదని, దివంగత వైఎస్సార్ సీఎం అయిన తర్వాతే ఉమ్మడి రాష్ట్రంలో ప్రాజెక్టులన్నీ పూర్తయ్యాయన్నారు. ఇక శ్రీశైలం నుంచి 800 అడుగుల్లోనే నీటిని తోడేందుకు వీలుగా మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 2022లో రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం మొదలు పెడితే చంద్రబాబు ఆధ్వర్యంలోని కూటమి సర్కార్, తెలంగాణ సీఎం రేవంత్రెడ్డితో చీకటి ఒప్పందం చేసుకొని దాన్ని నిలిపేయడం దుర్మార్గమన్నారు. సీమ ప్రజలు తిరుపతి, హిందూపురం ఎమ్మెల్యేగా ఎన్టీఆర్ను గెలిపించారని, ఆయన కుమారులు హరిక్రిష్ణ, బాలక్రిష్ణలను కూడా ఎమ్మెల్యేలుగా గెలిపించారని గుర్తు చేశారు. ఇలా టీడీపీకి రాజకీయ భిక్ష పెట్టిన రాయలసీమకు ద్రోహం తలపెట్టడం తగదని హితవు పలికారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ పనులను మళ్లీ ప్రారంభించాలని, లేకుంటే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఎలాంటి పోరాటానికై నా సిద్ధమని హెచ్చరించారు. రాష్ట్ర బడ్జెట్నంతా అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారని, లక్ష కోట్లకు టెండర్లు పిలిచి పనులు చేస్తున్నారని రఘురామిరెడ్డి అన్నారు. అమరావతి రాజధానికి అనువైనది కాదని అన్ని కమిటీలు చెప్పాయని, అయినా అక్కడే రాజధాన్ని నిర్మిస్తూ వరద నీటిని బయటికి పంపడానికి రూ.423కోట్లు ఖర్చు చేస్తున్నారన్నారు. వేలకోట్లు ఖర్చు చేసి వరదనీటిని బయటికి పంపి రాజధాని కట్టాల్సిన ఆవశ్యకత ఏమిటని ప్రశ్నించారు. రాయలసీమను రాళ్లసీమగా మార్చవద్దు – ఎమ్మెల్సీ రామచంద్రారెడ్డి మాజీ ముఖ్యమంత్రులు వైఎస్సార్, వైఎస్ జగన్మోహన్రెడ్డి రాయలసీమలో బంగారు పంటలు పండించడానికి అనువుగా ప్రాజెక్టులు చేపట్టారని ఎమ్మెల్సీ ఎంవీ రామచంద్రారెడ్డి అన్నారు. సీఎం చంద్రబాబు వాటిని అడ్డుకొని రాయలసీమను రాళ్లసీమగా మార్చవద్దని కోరారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ స్కీం వల్ల నెల్లూరు, ప్రకాశం జిల్లాలకు కూడా మేలు జరుగుతుందని, కుప్పానికి కూడా తాగునీరు ఇచ్చే అవకాశముంటుందన్నారు. ఈ సమావేశంలో వైఎస్సార్సీపీ రైతు విభాగం జిల్లా అధ్యక్షుడు సంబటూరు ప్రసాద్రెడ్డి, పార్టీ నాయకులు దాసరి శివప్రసాద్, రామ్మోహన్రెడ్డి, మియ్యా, నాగమల్లారెడ్డి పాల్గొన్నారు. రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును ఆపడం దారుణం టీడీపీకి రాజకీయ భిక్ష పెట్టింది రాయలసీమ ప్రజలే రాష్ట్ర బడ్జెట్ అంతా అమరావతిలోనే ఖర్చు చేస్తున్నారు వరదనీటిని బయటికి పంపడానికే రూ.423కోట్లా! వైఎస్సార్సీపీ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ ఎస్. రఘురామిరెడ్డి ధ్వజం రాయలసీమలోని అన్ని ప్రాజెక్టుల్లో 62 టీఎంసీల నీటిని నింపిన ఘనత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డిదేనని రాజంపేట పార్లమెంటు పరిశీలకులు కె. సురేష్ బాబు అన్నారు. ఎన్టీఆర్ను పదవీచ్యుతున్ని చేసి గద్దెనెక్కిన చంద్రబాబు ప్రాజెక్టులకు శంకుస్థాపనలతోనే సరిపెట్టారే తప్పా ఏ ఒక్క ప్రాజెక్టును పూర్తి చేయలేదని దుయ్యబట్టారు. దివంగత వైఎస్సార్ మాత్రమే రాయలసీమ ప్రాజెక్టులను పూర్తి చేశారని గుర్తు చేశారు. పోతిరెడ్డిపాడు హెడ్ రెగ్యులేటర్ సామర్థ్యాన్ని వైఎస్సార్ 44వేల క్యూసెక్కులకు పెంచారని, మాజీ సీఎం వైఎస్ జగన్ దాన్ని 80వేల క్యూసెక్కులకు పెంచడానికి రాయలసీమ లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టును చేపట్టారన్నారు. -
పచ్చపార్టీలో రచ్చ!
మదనపల్లె: టీడీపీ మదనపల్లెలో పాత, కొత్త నేతల మధ్య పదవుల రచ్చ మొదలై అమరావతికి చేరింది. శుక్రవారం జరిగిన సంస్థాగత ఎన్నికల్లో మదనపల్లె పట్టణం, మండలాల అధ్యక్ష పదవులకు పార్టీ పరిశీలకులు ఎన్నిక నిర్వహించారు. ఇందులో ఎవరూ ఊహించని విధంగా పార్టీలోని సీనియర్ నేతలను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం ఎమ్మెల్యే షాజహన్బాషా వర్గం జీర్ణించుకోలేకపోతోంది. పదవులన్నీ తమ వర్గానికే దక్కుతాయన్న ఆశతో ఇంతకాలం ఎదురుచూసిన ఆయన వర్గీయులకు ఈ ఎన్నిక వ్యవహరం మింగుడుపడటం లేదు. చాలాకాలం క్రితమే పట్టణ, మండలాలకు అధ్యక్షులు ఎవరనేది ఎమ్మెల్యే వర్గీయులు ముందుగానే నిర్ణయించుకున్నారు. అయితే సమావేశం నిర్వహించాక ఎమ్మెల్యే వర్గానికి ఊహించని పరిణామం ఎదురైంది. సమావేశాల్లో మదనపల్లె పట్టణ అధ్యక్షుడిగా అరుణ్తేజ్, మదనపల్లె రూరల్ మండలానికి డి.శ్రీనివాసులు, రామసముద్రం అధ్యక్షుడిగా విజయ్కుమార్, నిమ్మనపల్లె అధ్యక్షుడిగా రాజన్నలను ఎన్నుకోవడం, ప్రకటించడం జరిగిపోయింది. ఎన్నికై న వారిలో అరుణ్తేజ మినహా అందరూ 30ఏళ్లకు పైబడిన సీనియర్లే. దీంతో ఒక్కసారిగా ఎమ్మెల్యే వర్గంలో కలకలం రేగింది. తమకు ఒక్క పదవీ దక్కలేదన్న ఆందోళనతో పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లేందుకు శుక్రవారం రాత్రికి రాత్రే ఎమ్మెల్యే సహా ఆయన వర్గీయులు అమరావతి బయలుదేరి వెళ్లినట్టు, శనివారం పార్టీ అధిష్టానం దృష్టికి తీసుకెళ్లి తమ వర్గానికి అన్యాయం జరిగిందని చెప్పుకునేందుకే ఎమ్మెల్యే వెళ్లినట్టు పార్టీ వర్గాలు చెబుతున్నాయి. టీడీపీ వర్గాలుగా విడిపోయి ఇదేవిషయాన్ని సోషల్ మీడియాలో ట్రోల్ చేసుకుంటున్నాయి. పాత, కొత్త రచ్చ టీడీపీ మదనపల్లె నియోజకవర్గ అధ్యక్షుల ఎన్నిక వ్యవహారం పాత టీడీపీ, కొత్త టీడీపీ అన్నట్టుగా రెండు వర్గాలైంది. ఇందులో ప్రస్తుతం పదవులు పొందిన నేతలు పాత టీడీపీ అని, పార్టీని నమ్ముకున్న వారికి న్యాయం జరిగిందని బహిరంగంగా అంటున్నారు. తాము కొత్తగా పార్టీలోకి వచ్చి పదవులు ఆశించలేదు, కష్టపడ్డామనే ఎన్నుకుని గుర్తించారని అంటున్నారు. ఈ ప్రచారంలో ఎమ్మెల్యే వర్గంలో అంతర్మథనం మొదలైంది. కొత్తగా వచ్చిన వాళ్లంటే ఎమ్మెల్యే కూడా కాంగ్రెస్ నుంచి టీడీపీలోకి వచ్చినవారే కదా అంటూ ఇలాంటి వ్యాఖ్యలు చేయడంపై ఎమ్మెల్యే వర్గం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది. పైగా పదవులు పొందిన కొత్త అధ్యక్షులు శనివారం వేసిన బ్యానర్లలో ఎమ్మెల్యే ఫొటో లేకపోవడంపై కూడా ప్రశ్నిస్తున్నారు. ఎమ్మెల్యేను గుర్తించరా, ఇది పార్టీ ధిక్కారం అంటూ గళం విప్పుతున్నారు. దాంతో ఇప్పుడు టీడీపీలో పాత, కొత్త రచ్చ ఒకవైపు ఉండగానే.. ఎమ్మెల్యే కొత్త అధ్యక్షుల విషయంలో తన అభిప్రాయాన్ని వ్యక్తపరచక పోవడంతో ఏం జరుగుతుందో అని క్యాడర్ ఆసక్తిగా చూస్తోంది. నిన్నటిదాకా ఎమ్మెల్యే నిర్ణయించిన వారికే పార్టీ పదవులు దక్కుతాయని, దీనిపై ఆయన వర్గీయులు ఆశలు పెట్టుకున్నారు. అయితే ఊహించని పరిణామాలతో ఎమ్మెల్యే ఈ వ్యవహరంపై ఎలా వ్యవహరించబోతున్నారదనేది ఉత్కంఠగా మారింది. కొత్త అధ్యక్షుల ఎన్నికలో తన ముద్ర లేకపోగా, పదవులేవీ తన అనుచరులకు దక్కకపోవడం ద్వారా పార్టీలో ఎమ్మెల్యే పట్టు తప్పిందన్న సంకేతాలు ఇప్పటికే వెళ్లాయి. ఈ పరిస్థితుల్లో ఎమ్మెల్యే పార్టీలో తనకు వ్యతిరేక వర్గం లేకుండా పా పట్టు ఎలా నిలుపుకుంటారన్నది చర్చనీయాంశమైంది. టీడీపీ పదవుల్లో సీనియర్ నాయకులదే హవా మదనపల్లె ఎమ్మెల్యే వర్గానికిఒక్కటీ దక్కని పట్టణ, మండలఅధ్యక్ష పదవులు తామే నిజమైన పార్టీనేతలంటున్న కొత్తనేతలు ఉన్నఫళంగా అమరావతికి ఎమ్మెల్యే, వర్గీయులు -
ప్రజలకు దక్కని వాటా
సాక్షి ప్రతినిధి, కడప: కడప ద్విశతాబ్ది ఉత్సవాలు అంగరంగ వైభవంగా నిర్వహించారు. కడపోత్సవాలు సైతం అదే తీరున చేపట్టారు. ఆ కార్యక్రమాల్లో జిల్లా కళాకారులకు ప్రాధాన్యత, చరిత్రకారులకు భాగస్వామ్యం దక్కింది. జిల్లా వ్యాప్తంగా ఉత్సవాన్ని స్వంత పండుగలా చేపట్టారు. ఇపుడు తద్భిన్నంగా గండికోట ఉత్సవాలు కొనసాగుతున్నాయి. జిల్లా భాగస్వామ్యం కొరవడింది. సినీ కళాకారులకే పరిమితమైంది. అది కూడా ఇరువురు సింగర్స్, డ్రమ్స్ నిర్వాహకుడు ఒకరికి మాత్రమే పరిమితమైంది. దీంతో ఉత్సవాల నిర్వహణలో నాటికి, నేటికి ఎంత తేడా ఉందో విశ్లేషకులు చర్చించుకుంటున్నారు. ● కడపోత్సవాలను అప్పటి కలెక్టర్లు జయేష్రంజన్, అశోక్కుమార్..కడప ద్విశతాబ్ది ఉత్సవాలను కృష్టబాబు అద్భుతంగా నిర్వహించారు. ఇప్పటికీ జిల్లా వాసులకు గుర్తుండిపోయేలా నాటి కార్యక్రమాలను చేపట్టారు. జిల్లాలోని అన్ని రంగాల ప్రముఖులను భాగస్వామ్యులను చేశారు. జిల్లా వ్యాప్తంగా చరిత్రకారులు, కళాకారులు, రాజకీయ నేతలు, మీడియా ప్రతినిధులతో చర్చించారు. ఎలాంటి కార్యక్రమాలు చేపట్టాలనే దిశగా కార్యచరణ ముందే సిద్ధం చేశారు. అప్పటి అధికారుల చిత్తశుద్ధి కారణంగానే అత్యంత పారదర్శకంగా చరిత్రలో గుర్తుండిపోయేలా ఉత్సవాలు చేపట్టారు. సమష్టి కార్యాచరణతో కడప ద్విశతాబ్ది, ఉత్సవాలు అంగరంగ వైభవంగా నాటి పాలకుల నిర్వహణ నేడు గండికోట ఉత్సవాల్లో కన్పించని నాటి ప్రణాళిక స్థానిక చరిత్రకారులు,కళాకారులకు దక్కని ప్రాధాన్యత -
ప్రకృతి అందాలకు పెట్టని కోట
జమ్మలమడుగు: 11వ శతాబ్దంలో చాణక్య రాజైన కాకరాజు గండికోట నిర్మాణం కోసం శ్రీకారం చుట్టారు. ఇప్పటికి గండికోట నిర్మాణం జరిగి 903 సంవత్సరాలు అవుతున్నట్లు చరిత్ర చెబుతోంది. ఇక్కడ గోల్కొండ నవాబుల కాలంలో జుమ్మా మసీదు నిర్మించారు. శ్రీకృష్ణదేవరాయలు సైతం గండికోటను పాలించినట్లు చరిత్ర చెబుతోంది. గండికోట వైభవాన్ని ప్రపంచానికి తెలియపరిచేందుకు గండికోట ఉత్సవాలకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. ప్రస్తుతం గ్రాండ్ కెన్యాన్ ఆఫ్ ఇండియాగా ప్రప ంచంలో ప్రఖ్యాతి గాంచిన గండికోట అందాలను వీక్షించడం కోసం ఇతర రాష్ట్రాల నుంచి భారీగా పర్యాటకులు వచ్చిపోతున్నారు. గండికోట అభివృద్ధికి నాటి ముఖ్యమంత్రిగా ఉన్న వైఎస్ రాజశేఖర్రెడ్డి శ్రీకారం చుట్టారు. గండికోటకు వచ్చే పర్యాటకులకు సరైన వసతుల కల్పన కోసం టూరిజం అభివృద్ధి కింద హరిత హోటల్ నిర్మాణం చేపట్టారు. ప్రస్తుతం ఇది పర్యాటకులకు ఎంతో ఉపయోగపడుతోంది. ప్రస్తుతం గండికోటలో రిసార్టులతోపాటు, టూరిస్టుల కోసం టెంట్ కల్చర్ను తీసుకు రావడంతో పర్యాటకులు పెన్నానది అందాలు చూడటంతో పాటు సూర్యోదయం, సూర్యా స్తమయం వీక్షించి కనులపండువ చేసుకుంటున్నారు. పెన్నానది లోయ అందాలను ఫేస్బుక్, యూట్యూబ్లలో పెడుతుండటంతో భారీగా పర్యాటకులు వస్తున్నారు. 11 నుంచి గండికోట ఉత్సవాలు గండికోట ఉత్సవాలు ఈనెల 11వ తేదీ ఆదివారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఈ సందర్భంగా పలు సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. ప్రముఖ గాయని మంగ్లీ, రామ్ మిర్యాల పాటల కార్యక్రమం, ప్రముఖ డ్రమ్స్ శివమణితో ప్రోగ్రామ్ ఏర్పాటు చేశారు. అసలు సమస్య రవాణా సౌకర్యం పర్యాటక కేంద్రమైన గండికోటకు సరైన రవాణా సౌకర్యం లేదు. ఆర్టీసీ బస్సులు ఉదయం, సాయంత్రం పూట మాత్రమే గండికోటకు ఉన్నాయి. ఆ తర్వాత ఆటోలపైనే పర్యాటకులు, స్థానికులు ఆధారపడవలసి వస్తుంది. ప్రస్తుతం ప్రభుత్వం గండికోట ఉత్సవాలకు శ్రీకారం చుట్టినందున పర్యాటకులకు సరైన రవాణా సౌకర్యం కల్పించవలసిన అవసరం ఎంతైనా ఉంది. ఉత్సవాలకు ఏర్పాట్లుగండికోట ఉత్సవాల్లో జిల్లాలోని చరిత్రకారులు, కళాకారులకు ప్రాధాన్యత శూన్యమనే చెప్పాలి. ఇప్పటికి వరకూ సింగర్స్ మంగ్లీ, రామ్ మిర్యాల, డ్రమ్స్ శివమణి ఒక్కొక్క రోజు ఒకరు పాల్గొననున్నారు. ఆమేరకు కలెక్టర్ చెరుకూరి శ్రీధర్ వెల్లడించారు. ఫలితంగా ఆనాటి వైభవం ఉట్టి పడేలా ఉత్సవాలను నిర్వహించడం, జిల్లా ప్రజల్ని భాగస్వామ్యులను చేయడంలో విఫలమయ్యారని పరిశీలకులు వెల్లడిస్తున్నారు. ఈ నెల 11, 12, 13వ తేదీలలో గండికోట ఉత్సవాలు నిర్వహిస్తుంటే ఆ దిశగా ప్రణాళికలు, స్థానికుల భాగస్వామ్యం దక్కలేదు. పైగా గండికోట కేంద్రంగా పెమ్మసాని వంశస్థులు పాలించారు. వారిలో పెమ్మసాని చిన తిమ్మనాయుడు ప్రముఖుడు. వారి వారసుడు పెమ్మసాని ప్రభాకర్నాయుడు ఇప్పటికీ పలుమార్లు గండికోట ఉత్సవాలకు హాజరయ్యారు. కాగా, అధికార యంత్రాంగం జిల్లా ప్రజలతో పాటు, పెమ్మసాని వారసులను కూడా విస్మరించారు. గండికోట ఉత్సవాలు నిర్వహిస్తున్నారనే సమాచారం మినహా ఎలాంటి కార్యక్రమాలు చేపడుతున్నారనేది ఇప్పటికీ ప్రజానీకానికి స్పష్టత లేకుండా పోయింది. సినిమా సెట్టింగ్ తరహాలో ఏర్పాట్లు చేయడం మినహా గండికోట ఉత్సవాల్లో జిల్లా వాసుల భాగస్వామ్యం ఏముందంటూ పలువురు ప్రశ్నిస్తున్నారు. పర్యాటకులకు గండికోట అందాలతో పాటు మైలవరం జలాశయం, ఆకాశ మార్గం నుంచి పెన్నానది లోయ అందాలు ఎంతో అద్భుతంగా పర్యాటకులకు చూపించాలనే లక్ష్యంతో విశాఖపట్నంకు చెందిన విహంగ్ సంస్థ ప్యారమోటర్స్, హెలిక్యాప్టర్ల ద్వారా సన్నద్ధమైంది. ఈ క్రమంలో హెలిక్యాప్టర్ శనివారం గండికోటకు చేరుకోనుంది. హెలిక్యాప్టర్లో పర్యాటకులు వీక్షించాలంటే ఐదువేల రూపాయలు ఒక్కరికి చెల్లించాల్సి ఉంటుంది. ఆరు నిమిషాల పాటు ఆకాశ మార్గంలో విహరించి గండికోట అందాలను చూపించబోతున్నారు. గండికోటకు 903 సంవత్సరాలు ఉత్సవాల సందర్భంగా విహంగ్ సవారి మూడు రోజుల పాటు ప్రత్యేక కార్యక్రమాలు చురుగ్గా ఏర్పాట్లు -
జిల్లా ఫైర్ ఆఫీసర్గా ఆదినారాయణరెడ్డి
రాయచోటి టౌన్: అన్నమయ్య జిల్లా ఫైర్ ఆఫీసర్గా ఎం.ఆదినారాయణరెడ్డి బాధ్యతలు చేపట్టారు. అనంతరం నియోజక వర్గాల అధికారులతో సమావేశం నిర్వహించి భవిష్యత్తు కార్యాచరణపై చర్చించారు. ఈయన స్థానంలో జిల్లా ఆఫీసర్గా పని చేసిన అనిల్ కుమార్ రెడ్డి గుంటూరు జిల్లా సత్తెనపల్లెకు వెళ్లారు. కడప ఎడ్యుకేషన్: ఇంటర్మీడియట్ యాన్యువల్ అకడమిక్ క్యాలెండర్ను అనుసరించి జిల్లా లోని అన్ని జూనియర్ కళాశాలలకు ఈ నెల 10వ తేది నుంచి 18వ తేది వరకు సంక్రాంతి సెలవులుగా ప్రకటించినట్లు ఇంటర్ ప్రాంతీయ పర్యవేక్షణ అధికారి టిఎన్యు వెంకటేశ్వర్లు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సంక్రాంతి సెలవులలో ఎవరైనా తరగతులు నిర్వహిస్తే బోర్డు నిబంధనల మేరకు చర్యలు తీసుకుంటామన్నారు. కడప ఎడ్యుకేషన్: ఈనెల 10వ తేదీ ఉదయం 9.30 గంటలకు కడప సీఎస్ఐ ఉన్నత పాఠశాలలో టీచర్స్ హౌస్ బిల్డింగ్ సొసైటీ(టీహెచ్బీఎస్) సర్వసభ్య సమావేశాన్ని నిర్వహిస్తున్నట్లు సొసైటీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు విశ్వనాథరెడ్డి, బాలశౌరిరెడ్డిలు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సమావేశంలో పబ్బాపురం ప్లాట్ల సాధనపై ప్రత్యేక చర్చలు జరిపి సమస్య పరిష్కారం కోసం పలు కీలక నిర్ణయాలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. కావున సొసైటీ సభ్యులంతా విరివిగా పాల్గొని సమావేశాన్ని విజయవంతం చేయాలని వారు కోరారు. మదనపల్లె సిటీ: సంక్రాంతి పండుగ సందర్భంగా జిల్లా స్థాయి సంప్రదాయ క్రీడా పోటీలు ఈ నెల 12వ తేదీన నిర్వహిస్తున్నట్లు జిల్లా క్రీడాభివృద్ది సంస్థ అధికారి జి.చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీలు రాయచోటి మండలం నక్కవడ్లపల్లి వద్దనున్న డీఎస్ఏ క్రికెట్ స్టేడియంలో ఉదయం 10 గంటలకు జరుగుతాయన్నారు. మహిళలు స్కిప్పింగ్, తొక్కొడు బిళ్ల, కర్రసాము–పురుషులు, మహిళలు– లగోరీ( 7 పెంకులాట)–పురుషులు, తాడిపోరు (టగ్ ఆఫ్ వార్) పురుషులు, మహిళలు– గాలిపటం పోటీలు– పురుషులకు నిర్వహిస్తామన్నారు. ఈ పోటీలలో ప్రజలు, డ్వాక్రా, వెలుగు గ్రూపు మహిళలు, క్రీడాకారులు, క్రీడాభిమానులు పాల్గొనాలని కోరారు. మరిన్ని వివరాలకు 9154731106 నంబరులో సంప్రదించాలని కోరారు. -
బాలికలు అన్ని రంగాల్లో రాణించాలి
జమ్మలమడుగు : బాలికలు అన్ని రంగాల్లో రాణించడం కోసం తల్లిదండ్రులు తమ వంతు బాధ్యతగా ప్రొత్సహించాలని టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి పేర్కొన్నారు. శుక్రవారం ముద్దనూరురోడ్డులోని ప్రభుత్వ బాలికల జూనియర్ కాలేజీలో నిర్వహిస్తున్న 69వ జాతీయ వాలీబాల్ పోటీల్లో గెలుపొందిన క్రీడాకారులకు బహుమతుల ప్రదాన కార్యక్రమాన్ని వాలీబాల్ ఆర్గనైజింగ్ కార్యదర్శి భానుమూర్తి అధ్యక్షతన నిర్వహించారు. ఈసందర్భంగా భూపేష్రెడ్డి మాట్లాడుతూ మొత్తం 27 టీంలు వివిధ ప్రాంతాల నుంచి ఈ ప్రాంతానికి రావడం ఎంతో అదృష్టంగా భావిస్తున్నామన్నారు. అనంతరం వాలీబాల్ క్రీడల్లో గెలిచిన పశ్చిమ బెంగాల్ టీంకు, రన్నర్గా వచ్చిన హార్యానా టీంకు, మూడో స్థానంలో నిలిచిన రాజస్థాన్ టీంలకు షీల్డ్లను బహుకరించారు. వాలీబాల్ విజేత పశ్చిమ బెంగాల్ : జాతీయ స్థాయి వాలీబాల్ విజేతగా పశ్చిమబెంగాల్ నిలిచింది. గురువారం జరిగిన మ్యాచ్లో గెలిపొంది క్వార్టర్ పైనల్కు వచ్చిన 8జట్ల మధ్య శుక్రవార సెమీఫైనల్ పోటీలను నిర్వహించారు. మొదట రాజస్థా న్–పశ్చిమ బెంగాల్ మధ్య జరిగిన మ్యాచ్లో పశ్చిమ బెంగాల్ గెలుపొందింది. అదేవిధంగా హర్యానా– తమిళనాడుల మధ్య జరిగిన మ్యాచ్లో హర్యానా జట్టు గెలుపొందింది. దీంతో ఫైనల్ మ్యాచ్లో పశ్చిమ బెంగాల్–హర్యానా జట్లు తలపడ్డాయి. -
20న డైట్లో జిల్లా స్థాయి రంగోత్సవ్ పోటీలు
● పోటీలకు 6,7,8 తరగతుల విద్యార్థులు అర్హులు ● రంగోత్సవ్ పోస్టర్లు ఆవిష్కరణ ● డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ నరసింహారెడ్డి రాయచోటి : ఉమ్మడి వైఎస్సార్ కడప జిల్లా రాయచోటి రంగోత్సవ్ పోటీలను జనవరి 20న రాయచోటి డైట్ ప్రాంగణంలో నిర్వహిస్తున్నట్లు డైట్ ఇన్చార్జ్ ప్రిన్సిపాల్ మడితాటి నరసింహారెడ్డి తెలిపారు. శుక్రవారం డైట్ ప్రాంగణంలోని రంగోత్సవ్ పోస్టర్లను తోటి అధ్యాపకులతో కలిసి ఆవిష్కరించారు. రంగోత్సవ్ అనేది విద్యార్థులు తమలోని ప్రతిభను స్వేచ్ఛగా, సృజనాత్మకంగా ప్రదర్శించుకునే అద్భుతమైన వేదిక అని అన్నారు. విద్యార్థుల సహజ కళా ప్రతిభను గుర్తించి దాన్ని పెంపొందించడమే రంగోత్సవ్ ఉద్దేశ్యమన్నారు. పోటీలను ఐదు విభాగాలలో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు గుర్తింపు పొందిన ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలు, కళాశాలలో చదువుతున్న 6,7,8 తరగతుల విద్యార్థులు ఈ పోటీలకు అర్హులన్నారు. ఒక విద్యార్థి ఒక పోటీలో మాత్రమే పాల్గొనాలన్నారు. పోటీలలో ప్రథమస్థాంలో నిలిచిన వారిని జనవరి 23న విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు పంపడం జరుగుతుందన్నారు. కార్యక్రమంలో డైట్ అధ్యాపకులు శివభాస్కర్, వైసీ రెడ్డప్పరెడ్డి, గిరిబాబు యాదవ్, తిరుపతి శ్రీనివాస్, వెంకటసుబ్బారెడ్డి, శివప్రసాద్, కలిముల్లా, మేరీ నిర్మల, ఓబుల్ రెడ్డి, యుగంధర్, ఛాత్రోపాధ్యాయులు ప్లాల్గొన్నారు. -
● ప్రభుత్వ కార్యాలయాలతో ఆందోళన
మదనపల్లె: అన్నమయ్య జిల్లా కేంద్రం మదనపల్లెలోని బిసెంట్ థియోసాఫికల్ కళాశాల (బీటీ కళాశాల) ఒక చరిత్రాత్మక విద్యా సంస్థ. 1915లో ఐరిష్ వనిత అన్నీబిసెంట్ స్థాపించిన ఈ కళాశాల దేశ స్వాతంత్ర పోరా టంలో జాతీయవిద్యకు కేంద్రమైంది. రాయలసీమలో తొలి కళాశాల, లక్షల మంది విద్యార్థులకు విద్యా దీపమై వెలిగి, స్వాతంత్య్ర ఉద్యమానికి కేంద్రంగా పోరుబాట నడిపించింది. తొలి తరం నుంచి మొన్నటి తరం వరకు ఇక్కడ చదువుకున్న విద్యార్థుల్లో మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్రెడ్డి, మాజీ గవర్నర్ పెండేకంటి వెంకటసుబ్బయ్య లాంటి ఉన్నతస్థానాలకు ఎదిగినవారు, ఎందరో మంత్రులు, ఎమ్మెల్యేలు, విద్యావేత్తలు, పారిశ్రామిక, శాస్త్రవేత్తలు.. ఇలా అన్నిరంగాల్లో మేధావులను అందించిన బీటీ కళాశాల భవిష్యత్తు ప్రశ్నార్థకంగా మారింది. ఏటా 5వేల మందికిపైగా విద్యార్థులతో కళకళలాడిన కళాశాలను ఇప్పుడు పట్టించుకునే దిక్కులేకుండా పోయింది. వందల కోట్ల విలువైన ఆస్తులు కలిగిన ఈ కళాశాలకు మళ్లీ పూర్వవైభవం తేవాలని, జిల్లాకు విశ్వవిద్యాలయం అందించాలన్న ఆశయంతో ఎంపీ పీవీ మిథున్రెడ్డి చేసిన కృషి, వైఎస్సార్సీపీ ప్రభుత్వం తీసుకున్న చర్యలను కూటమి ప్రభుత్వం రాగానే నీరుగార్చింది. కళాశాల స్థితిగతులను గాలికి వదిలేసింది. ప్రస్తుతం కేవలం 154 మంది విద్యార్థులతో కళాశాల దీనంగా నడుస్తోంది. మిథున్రెడ్డి కృషితో.. ఎయిడెడ్ బీటీ కళాశాలను ప్రభుత్వంలో విలీనం చేసి నడపాలన్న డిమాండ్తో ఉద్యమాలు జరిగాయి. స్పందించిన ఎంపీ పీవీ మిథున్రెడ్డి ఈ విషయమై విద్యావేత్తలు, మేధావులతో సమీక్షించి.. చర్చలు జరిపి వారి అభిప్రాయాలు, సూచనలు తీసుకున్నారు. కళాశాలను ప్రభుత్వ ఆధ్వర్యంలో నడపడం సముచితమన్న నిర్ణయానికి వచ్చి బీటీ కళాశాల ట్రస్టీలతో చర్చించాక వారు సుముఖత వ్యక్తం చేశారు. దాంతో డిగ్రీ కళాశాలను, దానికి సంబంధించిన ఆస్తులు, వగైరాలు ప్రభుత్వానికి అప్పగించడంతో వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటూ 2022 ఆగస్టు, 16న జీవో జారీ చేసింది. తర్వాత అన్నయ్యజిల్లాకు విశ్వవిద్యాలయం లేకపోవడంతో ఎంపీ పీవీ మిథున్రెడ్డి కృషితో ప్రభుత్వం 2024 ఫిబ్రవరి, 9న అన్నీబిసెంట్ యూనివర్సిటీని ఏర్పాటు చేస్తూ జీవో జారీ చేసింది. ఈ జీవోలోనే మిథున్రెడ్డి సిఫార్సు మేరకు అని స్పష్టంగా పేర్కొన్నారు. విలువైన ఆస్తులు సమకూర్చి.. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అన్నీబిసెంట్ యూనివర్సిటీ ఏర్పాటుకు జీవో జారీ చేయకముందే బీటీ కళాశాల ట్రస్ట్ నుంచి సుమారు రూ.150 కోట్ల విలువైన ఆస్తులను ప్రభుత్వానికి చెందేలా చేసింది. కళాశాల ట్రస్ట్కు 47.36 ఎకరాలు ఉండగా, అందులో 11.86 ఎకరాలను ప్రభుత్వానికి, కళాశాలను అప్పగించారు. దాంతో విశ్వవిద్యాలయం చేసేందుకు కూటమి ప్రభుత్వానికి ఎలాంటి సమస్య ఎదురు కాలేదు. కావాల్సినన్ని భవనాలు, భూమి అందుబాటులోకి వచ్చాయి. కూటమి ప్రభుత్వం అన్నీబిసెంట్ విశ్వవిద్యాల యం ఏర్పాటుపై చర్యలు తీసుకోకపోగా ఇప్పు డు కళాశాల భవనాల్లో జిల్లా కార్యాలయాలు ఏర్పాటు చేస్తుండటంపై ప్రజలు, సంఘాలు, పార్టీల నేతల్లో ఆందోళన వ్యక్తం అవుతోంది. విశ్వవిద్యాలయం ఏర్పాటు కలను ప్రభుత్వం చెరిపేస్తోందన్న భావన కలుగుతోంది. బీటీ కళా శాలలో ప్రభుత్వ కార్యాలయాలు ఏర్పాటు అవుతున్నందున ఇక కళాశాల అభివృద్ధి ఉండదని, విశ్వవిద్యాలయంపై ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని చర్చించుకొంటున్నారు. ఈ విష యమై ప్రజా సంఘాలు ఇప్పటికే ప్రశ్నిస్తున్నా యి. బీటీ కళాశాలలో ప్రభుత్వ కార్యాలయాలను ఏర్పాటు చేసి కళాశాలను ఎత్తివేస్తారా అని ప్రశ్నిస్తున్నారు. వైఎస్సార్సీపీ హయాంలో బీటీ కళాశాలకు యూనివర్సిటీగా గుర్తింపు అభివృద్ధి పనులకు రూ.5 కోట్లు మంజూరు కూటమి పాలకుల నిర్లక్ష్యంతోఒక్క అడుగు ముందుకు పడలేదు ఇప్పుడు జిల్లా కార్యాలయాలకువినియోగంపై ఆందోళన ఐరిష్ వనిత, హోంరూల్ ఉద్యమంనడిపిన అన్నీబిసెంట్ స్థాపించినచరిత్రాత్మక విద్యాసంస్థ 1919, 1929లో ఠాగూర్, గాంధీ సందర్శన ఎంతో ఖ్యాతి కలిగిన కళాశాలమనుగడపై నీలినీడలు వైఎస్సార్సీపీ ప్రభుత్వం కొనసాగి ఉంటే ఈపాటికి విశ్వవిద్యాలయ కార్యాచరణ మొదలై దాని ఫలితాలు కనిపించేవి. కూటమిపాలన రాకతోనే ఈ కళాశాలను నిర్లక్ష్యం చేశారు. ఇంటర్మీడియట్ కోర్సులు ఎత్తేశారు. డిగ్రీ కళాశాల నిర్వహణ ఉన్నప్పటికీ, దాని అభివృద్ధికి ఒక్క చర్య తీసుకోలేదు. అడ్మిషన్ల పరిస్థితి, అధ్యాపకులు, సిబ్బంది స్థితిగతులపైనా సమీక్ష లేదు. ప్రిన్సిపాల్ రిటైర్ అయి నెలలు గడుస్తున్నా రెగ్యులర్ ప్రిన్సిపాల్ నియామకం లేదు. విద్యార్థుల సంఖ్య పెంచే చర్యలు శూన్యం. చరిత్ర కలిగిన కళాశాల విషయంలో కూటమి పాలకులు పూర్తిగా నిర్లక్ష్యం చేస్తున్నారు. దీని ఫలితంగానే విశ్వవిద్యాలయం ఏర్పాటుకు ముందడుగు పడటం లేదు. దీనిని గత ప్రభుత్వం చేపట్టింది, తమకెందుకనే ధోరణి వ్యక్తం అవుతోంది. దాంతో పేద విద్యార్థులకు అందించే విద్యపైన రాజకీయాలు మొదలయ్యాయి. ప్రస్తుతం డిగ్రీకళాశాలలో మూడేళ్లకు కలిపి కేవలం 154 మంది విద్యార్థులు మాత్రమే ఉన్నారు. స్పందన లేకుంటే ఉద్యమరూపం బీటీ కళాశాలకు పూర్వవైభవం తేవడమే కాక, విశ్వవిద్యాలయంతో విద్యాభివృద్దికి కూటమి ప్రభుత్వం ఇప్పటికై నా స్పందించాలని జిల్లా ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన కార్యక్రమంగా భావించకుండా పేద విద్యార్థులు, మారుమూలన ఉన్న మదనపల్లె అభివృద్ధికి రాజకీయాలతో సంబంధం లేకుండా చర్య లు చేపట్టాలని జిల్లా ప్రజలు ప్రభుత్వాన్ని విన్నవిస్తున్నారు. లేనిపక్షంలో ఉద్యమించేందుకు ప్రజా సంఘాలు, విద్యార్థి, యువజన సంఘాలు సిద్ధమయ్యాయి. ఇప్పటికే ఈ సంఘాలు కళాశాల అభివృద్ధిని, భవిష్యత్తును ప్రశ్నిస్తున్నాయి. దీంతో పరిస్థితులు ఉద్యమరూపం దాల్చకముందే ప్రభుత్వం స్పందించాలని పరిశీలకులు కోరుతున్నారు. -
ఒంటిమిట్ట రెవెన్యూ కార్యాలయంలో ఏసీబీ దాడులు
● దాడుల్లో పట్టుబడ్డ వీఆర్వో ● కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు ఒంటిమిట్ట : మండల కేంద్రమైన ఒంటిమిట్టలోని రెవెన్యూ కార్యాలయంలో శుక్రవారం ఏసీబీ అధికారులు దాడులు చేశారు. ఈ దాడుల్లో కోనరాజుపల్లి వీఆర్వో శ్రీనివాసులు పట్టుబడినట్లు కడప ఏసీబీ డీఎస్పీ సీతారామరావు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..కోనరాజుపల్లి గ్రామంలో రైతులు అయినటువంటి చింతకుంట రాజారెడ్డికి సర్వే నెంబర్ 195లో 1.79 ఎకరాలు, చింతకుంట రమణారెడ్డికి సర్వే నెంబర్ 201 లో 2.31 ఎకరాలు భూమి ఉందన్నారు. ఈ భూముల్లో ఇదివరకే ఉన్న బోర్లకు వొల్టా చట్టం కింద ఎన్వోసీ ధ్రువీకరణ పత్రాల కోసం 2025 డిసెంబర్ 19వ తేదీన స్థానిక రెవెన్యూ కార్యాలయంలో దరఖాస్తు చేసుకున్నారు. ఈ దరఖాస్తుకు సంబంధించిన వివరాలను పరిశీలించి, రిపోర్టు తయారు చేయాలని ఆ గ్రామానికి చెందిన వీఆర్వో శ్రీనివాసులును తహసీల్దార్ దామోదర్ రెడ్డి ఆదేశించారు. అప్పటి నుంచి వీఆర్వో శ్రీనివాసులు దరఖాస్తు చేసుకున్న ఈ ఇద్దరి రైతుల నుంచి రూ. 9వేల చొప్పున మొత్తం రూ. 18వేలు లంచ అడిగినట్లు తెలిపారు. ఈ రూ.18వేలతో పాటు దరఖాస్తు చలానా ఇద్దరి రైతుల నుంచి రూ. 2వేలు చొప్పున మొత్తం రూ. 22వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారన్నారు. అయితే అంత ఇచ్చుకోలేని రైతులు రాజారెడ్డి, రమణారెడ్డి వీఆర్వోను తగ్గించమని ప్రాధేయపడగా ఒక్కొక్కరికి రూ. 8వేలు చొప్పున రూ.16 వేలు, దరఖాస్తు చెలానా రూ.2 వేలు చొప్పున మొత్తం రూ. 20వేలు ఇవ్వాలని లేని పక్షంలో మీ పని చేయలేనని బెదిరంచారన్నారు. వీఆర్వో చెప్పిన రూ. 20 వేల లంచంలో మొదటి విడతగా రూ.15 వేలు శుక్రవారం తీసుకురావాలని వీఆర్వో శ్రీనివాసులు ఆదేశించారన్నారు. అంత లంచం ఇవ్వడం ఇష్టంలేని రాజారెడ్డి కడప ఏసీబీ కార్యాలయంలోని తనను ఆశ్రయించి, ఫిర్యాదు చేశారు. ఈ కేసులో భాగంగా శుక్రవారం వీఆర్వో శ్రీనివాసులు స్థానిక రెవెన్యూ కార్యాలయం వెనుక వైపు ఫిర్యాదుదారుడు రాజారెడ్డి వద్ద నుంచి మధ్యాహ్నం 2:39 గంటలకు రూ. 15వేలు లంచం తీసుకుంటుండగా తాను, తమ సీఐలు శ్రీనివాసరెడ్డి, నాగరాజు, సిబ్బంది దాడులు చేసి, వీఆర్వో శ్రీనివాసులును రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నట్లు తెలిపారు. కేసు విచారణ పూర్తి అయిన తరువాత వీఆర్వో శ్రీనివాసులును కర్నూలు ఏసీబీ కోర్టులో హాజరు పరచి, రిమ్యాండ్ కు పంపనున్నట్లు తెలిపారు. -
రైతుల ఆర్థికాభివృద్ధి లక్ష్యంగా పీఎండీడీకేవై అమలు
పీలేరు: రైతుల ఆర్థిక అభివృద్ధి లక్ష్యంగా ప్రధానమంత్రి ధన ధాన్య కృషి యోజన (పీఎండీడీకేవై) కార్యక్రమాన్ని అమలు చేయాలని నోడల్ అధికారి బాలమురగన్, కలెక్టర్ నిశాంత్కుమార్ అన్నారు. శుక్రవారం వారు మండలంలోని గూడరేవుపల్లె పంచాయతీ పుట్టావాండ్లపల్లెలో పర్యటించారు. స్థానిక రైతులు, ఎఫ్పీవోలతో మాట్లాడుతూ పీఎండీడీకేవై పథకం గూర్చి వివరించారు. జిల్లాలో మామిడి కాయలకు కవర్లను సబ్సిడీతో రైతులకు అందించి వాటిని మామిడి పంటకు ఏర్పాటు చేయించడం ద్వారా పంట ఉత్పత్తి, పంట నాణ్యత ఏ విధంగా పెరుగుతుందో తెలియజేశారు. ఈశ్వరయ్య అనే రైతు తన వ్యవసాయ భూమిలో మామిడి, మిరప, వేరుశెనగ పంటలను అధికారులకు చూపించి ఏ విధంగా మల్టీ క్రాపింగ్ చేస్తున్నాడో వివరించారు. మరో రైతు కృష్ణయ్య సాగు చేసిన డ్రాగన్ ఫ్రూట్, అందులో అంతర పంటగా సాగు చేసిన డేట్పామ్ తోటను పరిశీలించారు. పీలేరులో తమకు అనుకూలంగా మార్కెట్ యార్డు ఏర్పాటు చేయాలని రైతులు కోరారు. మామిడి పంటకు సూక్ష్మ పోషకాలు అందించగలిగే పంట బాగా వస్తుందన్నారు. పంటలకు ఇచ్చే బీమా, టమాట ప్రాసెసింగ్, తదితర అంశాలపై దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ, ఉద్యానవన, సూక్ష్మ నీటి పారుదల శాఖల అధికారులను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో జేడీఏ శివనారాయణ, జిల్లా ఉద్యాన అధికారిణి సుభాషిణి, జిల్లా సూక్ష్మ నీటి అధికారిణి లక్ష్మీప్రసన్న, జిల్లా పశువైద్యాధికారి గుణశేఖర్, తహసీల్దార్ శివకుమార్, ఏఎంసీ చైర్మన్ రామ్మూర్తి, రైతులు పాల్గొన్నారు. నోడల్ అధికారి బాలమురగన్, కలెక్టర్ నిశాంత్కుమార్ -
పోగొట్టుకున్న పర్సు అందజేత
వాల్మీకిపురం : స్థానిక ప్రభుత్వాసుపత్రి వద్ద ఒక వ్యక్తి తనకు దొరికిన పర్సును సమీపంలోని పోలీస్ స్టేషన్లో అప్పగించి మానవత్వం చాటుకున్నాడు. శుక్రవారం స్థానిక గ్రోమోర్లో పని చేస్తున్న మేనేజర్ రెడ్డి శేఖర్ పర్సు పోగొట్టుకున్నాడు. పర్సును దారిలో వెళ్తున్న సికిందర్కు దొరకడంతో పక్కనే ఉన్న పోలీస్ స్టేషన్లో అందించారు. విచారించిన ఎస్ఐ తిప్పేస్వామి పర్సు గ్రోమోర్ మేనేజర్ రెడ్డి శేఖర్ది అని తెలియడంతో అతనికి పర్సును అందించారు. పర్సులో నగదు, ఎటీఎం కార్డులు ఉన్నాయి. విద్యార్థికి తీవ్ర గాయాలు బి.కొత్తకోట : మండలంలోని బడికాయలపల్లె పాఠశాలలో చదువుతున్న విద్యార్థిని హరిక (7)ను గుర్తు తెలియని వాహనం ఢీకొనడంతో తీవ్రగాయాలకు గురైంది. శుక్రవారం సాయంత్రం పాఠశాల నుంచి ఇంటికి వెళ్తుండగా వెనుకవైపు వచ్చిన వాహనం ఢీకొని వె వెళ్లిపోవడంతో హరికను స్థానిక సీహెచ్సీకి తరలించగా కాలు విరిగినట్టు వైద్యులు గుర్తించి చికిత్స అందించారు. విషయం తెలుసుకున్న సీఐ గోపాల్రెడ్డి, ఎంఈఓ రెడ్డిశేఖర్ బాలికను పరామర్శించి ఘటన వివరాలు తెలుసుకున్నారు. వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నం మదనపల్లె రూరల్ : వేర్వేరు ఘటనల్లో ఇద్దరు ఆత్మహత్యాయత్నానికి పాల్పడి స్థానిక ప్రభుత్వ జిల్లా ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారు. పుంగనూరు రెడ్డెమ్మక్వార్టర్స్కు చెందిన మహమ్మద్ హుస్సేన్ భార్య షాహీనా(40) కుటుంబసమస్యలతో పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించింది. గమనించిన కుటుంబసభ్యులు వెంటనే పుంగనూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స అనంతరం మెరుగైన వైద్యం కోసం మదనపల్లె ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తీసుకువచ్చారు. ఐసీయూ విభాగంలో చికిత్సలు అందిస్తున్నారు. మదనపల్లె పట్టణం రామారావుకాలనీకి చెందిన రామాంజులు కుమారుడు వెంకటరెడ్డి(33) కుటుంబ సమస్యలతో మనస్తాపం చెంది నీరుగట్టువారిపల్లె సమీపంలోని కాట్లాటవారిపల్లె రోడ్డులో గడ్డిమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించాడు. గమనించిన స్థానికులు బాధితుడిని ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. చికిత్సల అనంతరం పరిస్థితి విషమంగా ఉండటంతో మెరుగైన వైద్యం కోసం తిరుపతికి రెఫర్ చేశారు. దొంగతనం కేసులో వ్యక్తి అరెస్టు పులివెందుల రూరల్ : పట్టణంలోని స్థానిక ప్రశాంత్ నగర్లో 2024లో చోరీకి పాల్పడిర నల్లమూతుల సురేష్ అనే వ్యక్తిని శుక్రవారం కదిరి రింగురోడ్డు సమీపంలో అరెస్ట్ చేసినట్లు అర్బన్ సీఐ సీతారాంరెడ్డి తెలిపారు. అతని వద్ద నుంచి 30 గ్రాములు బంగారు స్వాధీనం చేసుకున్నామన్నారు. -
తల్లి పొత్తిళ్ల నుంచి.. ప్రార్థనా మందిరం మెట్లపైకి
ఆ తల్లికి తొమ్మిది నెలలు మోసినప్పుడు లేని బరువు...బయటకు వచ్చాక అనిపించిందేమో...కఠిన గుండె పేగు బంధం మరిచిందేమో...ఆడపిల్లని వద్దనుకుందో..లేక తల్లికి తెలియకుండా ఎవరైనా వదిలేశారో తెలియదు కానీ...బొడ్డు పేగు రక్తం మరక ఆరకనే పురిటిబిడ్డ ఎముకలు కొరికే చలిలో ప్రార్థనామందిరం మెట్లపై కనిపించింది. తల్లి పొత్తిళ్లలో వెచ్చగా నిద్రించాల్సింది పోయి, ఆరుబయట చలి, మంచుకు తట్టుకోలేక ఏడుస్తూ కనిపించింది. ఎవరో చేసిన నేరానికి..భూమిమీద పడగానే పసికందు శిక్ష అనుభవిస్తోంది. ● మదనపల్లె పట్టణంలో అమానుష ఘటన ● ఎముకలు కొరికే చలిలో పురిటిబిడ్డను వదిలివెళ్లిన కసాయి ● ఐసీడీయస్ అధికారులకు అప్పగించిన పోలీసులు మదనపల్లె రూరల్ : మదనపల్లె పట్టణం తిరుపతిరోడ్డు బాలాజీనగర్లో ప్రార్థనా మందిరం మెట్లపైన శుక్రవారం ఉదయం 4 గంటల ప్రాంతంలో అప్పుడే పుట్టిన ఓ ఆడ పసికందును వదిలేసి వెళ్లారు. చిమ్మ చీకట్లో, ఓ వైపు చలి, మరో వైపు మంచు కురుస్తుండగా, తట్టుకోలేక పసిప్రాణం విలవిలలాడుతూ ఏడుస్తుంటే...ఉదయాన్నే బిడ్డ ఏడుపులు ఏందంటూ స్థానికులు బయటకు వచ్చి చూశారు. చుట్టూ ఎవరూ లేకపోవడం, బొడ్డు పేగు సైతం సరిగ్గా కత్తిరించకుండా, రక్తపుమరకలతో పసికందును గుర్తించారు. దీంతో స్థానికంగా ఉన్న మహిళ గౌతమి, బిడ్డను చేతుల్లోకి తీసుకుని, ఓదార్చింది. టూటౌన్ పోలీసులకు సమాచారం అందించారు. ఘటనాస్థలానికి చేరుకున్న పోలీసులు...తక్షణం స్పందించి శిశువును ప్రభుత్వ జిల్లా ఆస్పత్రికి తరలించారు. ఆస్పత్రిలోని ఎన్ఐసీయూ విభాగంలో వైద్యులు పురిటిబిడ్డకు చికిత్సలు అందించారు. బిడ్డ ఆరోగ్యం నిలకడగా ఉండటంతో ఐసీడీయస్ అధికారులకు సమాచారం ఇచ్చారు. సీడీపీఓ నాగవేణి, సూపర్వైజర్ కళావతి జిల్లా ఆస్పత్రికి చేరుకుని బిడ్డ ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బిడ్డకు టీకాలు వేయించి, ప్రొసీడర్స్ పూర్తిచేసి, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ అనుమతితో ఎంపీడీఓ కార్యాలయం ఎదుట ఉన్న బాలసదన్ శిశుగృహకు తరలించి, మేనేజర్ సుప్రియకు అప్పగించారు. ఆడపిల్ల పుట్టిందనే వదిలి వెళ్లారా..? మరేమైనా కారణాలున్నాయా..? అనే కోణంలో ఐసీడీయస్ సిబ్బందితో స్థానికంగా విచారణ చేస్తున్నట్లు సీడీపీఓ నాగవేణి తెలిపారు. -
పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ
బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రంలో పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేస్తున్న అధికారులు రొంపిచెర్ల రైతు కేంద్రంలో పోలీసు బందోబస్తుతో యూరియా పంపిణీ చేస్తున్న అఽధికారులు రొంపిచెర్ల: పోలీసు బందోబస్తుతో చిత్తూరు జిల్లాలోని పలు రైతు సేవా కేంద్రాల్లో వ్యవసాయాఽధికారులు శుక్రవారం యూరియా పంపిణీ చేశారు. నాలుగు రోజుల క్రితం గానుగచింత రైతు సేవాకేంద్రంలో యూరియా కోసం రైతులు ఘర్షణ పడటం అందరికీ విధితమే. వ్యవసాయ శాఖ అధికారులు దీనిని దృష్టిలో పెట్టుకుని రొంపిచెర్ల–2, బొమ్మయ్యగారిపల్లె రైతు సేవా కేంద్రాల్లో యూరియాను పోలీసు బందోబస్తుతో పంపిణీ చేయాల్సి వచ్చింది. ఒక రైతుకు ఒక బస్తా వంతున మాత్రమే ఇచ్చారు. రెండు రైతు సేవా కేంద్రాల్లో 800 బస్తాలకు శుక్రవారం 405 బస్తాల యూరియాను పంపిణీ చేసినట్లు ఏవో శ్రావణి తెలిపారు. మిగిలిన యూరియా బస్తాలను సోమవారం ఇస్తామని చెప్పారు. యూరియా కోసం ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు. యూరియా పంపిణీలో ఎలాంటి గొడవలు జరగకుండా పోలీసులు చర్యలు తీసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఏఈవో ఖాదర్వల్లీ, వీహెచ్ఏలు ఉదయశ్రీ, తిరుమల, ప్రకృతి వ్యవసాయ సిబ్బంది ఓబులేసు తదితరులు పాల్గొన్నారు. -
ట్రాన్స్పోర్ట్ కంటైనర్ను ఢీకొని స్కూటరిస్టు మృతి
● కంటైనర్ క్యాబిన్లో చెలరేగిన మంటలు ● పరారీలో కంటైనర్ డ్రైవర్ రాయచోటి టౌన్ : బ్యాటరీల లోడుతో వెళ్లుతున్న కంటైనర్ను మాధవరం గ్రామానికి చెందిన శ్రీనివాసులు (58) శుక్రవారం అనే వ్యక్తి ఢీకొన్నాడు. ఈ దర్ఘటనలో శ్రీనివాసులు అక్కడిక్కడే తీవ్రంగా గాయపడి మృతి చెందాడు. ఈ దుర్ఘటనలో స్కూటర్ను కంటైనర్ లాకెళ్లడంతో స్కూటర్లో ఉన్న పెట్రోల్ లీక్ కావడంతో మంటలు చెలరేగాయి. ఈ మంటలు కంటైనర్ క్యాబిన్లోకి చొచ్చకోవడంతో పెద్ద పెద్ద మంటలు చెలరేగాయి. ఈ విషయాన్ని గమనించిన కంటైనర్ డ్రైవర్ పరారయ్యాడు. ఈ విషయం స్థానికులు ఫైర్స్టేషన్కు సమాచారం ఇవ్వడంతో ఫైర్ స్టేషన్ అధికారి వెంకట్రామిరెడ్డి తన సిబ్బందితో వచ్చి మంటలు అదుపు చేసి పెద్ద ప్రమాదం నుంచి తప్పించాడు. కంటైనర్లో ఉన్న సుమారు రూ. 25–30 లక్షల విలువ చేసే అమరన్ బ్యాటరీలు కాలిపోకుండా, నష్టం జరగకుండా చేశా రు. అనంతరం రాయచోటి ట్రాఫిక్ సీఐ కులాయప్ప తన సిబ్బందితో సంఘటనా స్థలానికి చేరుకొని ప్రమాదంపై విచారించి కేసు నమోదు చేశారు. -
నేడు తలనీలాల సేకరణకు వేలం
సిద్దవటం : మండలంలోని వంతాటిపల్లి గ్రామ సమీపంలో ఉన్న శ్రీ లంకమల అభయారణ్యంలో వెలసిన శ్రీ నిత్యపూజ స్వామి భక్తుల తలనీలాల పోగు హక్కు కోసం శనివారం సిద్దవటంలోని రంగనాయక స్వామి ఆలయంలో బహిరంగ వేలం నిర్వహిస్తున్నట్లు ఆలయ ఈఓ శ్రీధర్ శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 14 నుంచి 16వ తేదీ వరకు నిత్యపూజ స్వామి ఆలయంలో నిర్వహించే మహాశివరాత్రి ఉత్సవాల సందర్భంగా భక్తులు స్వామి వారికి సమర్పించు తలనీలాల ప్రోగు హక్కు కోసం వేలంలో పాల్గొనే పాటదారుడు డిపాజిట్ లక్ష రూపాయలు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. వేలం ముగిసిన వెంటనే హెచ్చు పాటదారుడు మిగిలిన డబ్బులు చెల్లించి అధికారుల వద్ద రసీదు పొందాలన్నారు. గంగమ్మకు రాహుకాల పూజలు చౌడేపల్లె : బోయకొండ గంగమ్మ ఆలయంలో అమ్మవారికి శుక్రవారం భక్తిశ్రద్ధలతో రాహుకాల అభిషేకపూజలు నిర్వహించారు. ఉదయాన్నే ఆలయ అర్చకులు గర్భాలయాన్ని శుద్ధి చేశారు. రాహుకాల సమయం 10:30 గంటలనుంచి 12 గంటల వరకు సాంప్రదాయరీతిలో అర్చనలు ,అభిషేక పూజలు నిర్వహించారు. అమ్మవారిని అలంకరించి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. మహిళలు ఉపవాస దీక్షలతో తరలివచ్చి మొక్కులు తీర్చారు. ఆలయ ఈఓ ఏకాంబరం ఆధ్వర్యంలో ఉభయదారులకు తీర్థప్రసాదాలను పంపిణీ చేశారు. -
విద్యతోనే సమాజాభివృద్ధి
రాజంపేట ఎమ్మెల్యే ఆకేపాటి రాజంపేట : విద్యతోనే సమాజాభివృద్ధి సాధ్యమని ఎమ్మెల్యే ఆకేపాటి అమర్నాథ్రెడ్డి అన్నారు. అన్నమాచార్య యూనవర్సిటీ వార్షికోత్సవ వేడుకలలో భాగంగా శుక్రవారం రాత్రి నిర్వహించిన ముగింపు సభలో ఆయన పాల్గొని ప్రసింగించారు. మూడు దశబ్దాల కిందట నల్లరాళ ప్రాంతం ఇప్పుడు అన్నమాచార్య యూనివర్సిటీ ఏర్పాటుతో ఈ ప్రాంతానికి మహర్దశ కలిగిందన్నారు. ఈ సందర్భంగా విద్యార్ధులు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు, నృత్యప్రదర్శనలు విద్యార్ధులను ఆకట్టుకున్నాయి. వివిధ పోటీల విజేతలకు బహుమతులను ఎమ్మెల్యే ఆకేపాటి, చైర్మన్ పోలా, ఏయూ అధినేత చొప్పాగంగిరెడ్డి చేతుల మీదుగా అందజేశారు. చదువుతో పాటు సామాజిక బాధ్యత – ఏయూ ఉత్సవాల ముగింపు సభలో సినీనటుడు నిఖిల్ సిద్ధార్థ రాజంపేట అన్నమాచార్య యూనవర్సిటీ విద్యాసంస్థలలో చదువుతో పాటు సామాజిక బాధ్యత, నాణ్యమైన బోధన, క్రమశిక్షణ, విలువలను అవలంభిస్తూ ఆదర్శంగా నిలవడం ప్రశంసనీయమని సినీనటుడు నిఖిల్ సిద్ధార్థఅన్నారు. అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవ ముగింపు సభలో ఆయన పాల్గొన్నారు. ఆయన మాట్లాడుతూ విద్యార్థులు విలువైన సమయాన్ని వృథా చేయరాదన్నారు. తల్లిదండ్రుల ఆశయాలను నేరవేర్చేవిధంగా, ఎంచుకున్న లక్ష్యాన్ని అధిగమించేలా ఇష్టపడి చదువుకోవాలన్నారు. పట్టుదల, క్రమశిక్షణ, నిరంతర కృషి తనను సినీరంగంలో నిలబెట్టిగలిగిందన్నారు. విద్యార్ధుల తమలోని ప్రతిభను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. లక్ష్యంపట్ల నమ్మకం ఉంటే ఏదైనా సాధించగలరన్నారు. వివిధ పోటీలలో విజేతలైన విద్యార్థులకు బహుమతులను అందజేశారు. ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఏఐటీఎస్ వైస్చైర్మన్ చొప్పా ఎల్లారెడ్డి, వీసీ డా.సాయిబాబరెడ్డి, రిజిస్ట్రార్ డా.మల్లికార్జునరావు తదితరులు పాల్గొన్నారు. -
ప్రభుత్వ సొమ్మే కదా..?
● సచివాలయంలో ఎలక్ట్రికల్బైక్కు చార్జింగ్ ● ఆరునెలలుగా ఇదే తంతు చౌడేపల్లె : ప్రభుత్వ సొమ్మే కదా...? మనం కూడా వినియోగించుకొంటే అడిగేవారెవరున్నారు..? అనుకొన్నారేమో చౌడేపల్లె మండలం కాగతి సచివాలయంలో పనిచేస్తున్న వెల్ఫేర్ అసిస్టెంట్. ఆ ఉద్యోగి రోజూ విధులకు ఎలక్ట్రికల్ బైక్లో వస్తుంటారు. ఇంటి వద్ద చార్జింగ్ పెట్టకుండా ఏకంగా సచివాలయం వద్ద కు బైక్ను తెచ్చి చార్జింగ్ పెట్టుకొని ఎంచెక్కా.. షికారుతోపాటు ఇంటికి వెళ్ళడం గత ఆరునెలలుగా సాగుతోంది. ఇంటి వద్ద కరెంటు బిల్లు ఆదా చేయాలనుకున్నారేమో కానీ.. ప్రభుత్వ సొమ్ముతో తమకున్న ఎలక్ట్రికల్ బైక్కు పవర్ను పక్కాగా వాడేస్తున్న దృశ్యం శుక్రవారం సాక్షి కెమెరాకు చిక్కింది. ఈ విషయమై పంచాయతీ కార్యదర్శి మొగిల్రెడ్డిను విచారించగా ఇక మీదట ఇలాంటి ఘటనలు పునరావృత్తం కాదని బదులిచ్చారు. -
మదనపల్లెకు పతకాల పంట
మదనపల్లె: జాతీయ స్థాయి స్కయ్ మార్షల్ ఆర్ట్స్ పోటీలలో మదనపల్లె విద్యార్థులు అద్భు త ప్రతిభ చూపించారు. ఈ వివరాలను చైర్మన్ ఇస్మాయిల్, కోచ్ ఖాదర్ బాషా గురువారం వెల్లడించారు. 26వ జాతీయ స్థాయి స్కయ్ స్పోర్ట్స్ మార్షల్ ఆర్ట్స్ పోటీలు జనవరి 5 నుంచి 7 వరకు హైదరాబాద్ గచ్చిబౌలి స్టేడియం జరిగాయి. ఈ పోటీలకు ఏపీ నుంచి 94 మంది విద్యార్థులు పాల్గొంటే అందులో 24 మంది మదనపల్లె విద్యార్థులే కావడం విశేషం. ఇందులో 15 మంది బంగారు పతకాలు, ఆరు గురు రజత పతకాలు, 16 మంది కాంస్య పతకాలు సాధించి చరిత్ర సృష్టించారు. మెడల్ సాధించిన విద్యార్థులను స్కయ్ ఫెడరేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి ఇబ్రహీం, చైర్ పర్సన్ ఇస్మాయిల్ అభినందించారు. -
పేద పిల్లలకు అండ.. అభినందనీయం
రాయచోటి : పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన చిన్నారులను సేవా దృక్పథంతో ఆదుకోవడంలో నిజమైన భక్తి ఉందని అన్నమయ్య జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి పేర్కొన్నారు. గురువారం రాయచోటిలోని గుట్టపై వెలసిన అయ్యప్పస్వామి ఆలయ ప్రాంగణంలో శ్రీ అయ్యప్ప స్వామి సేవా సొసైటీ ఆధ్వర్యంలో సంక్రాంతి పండుగ సందర్భంగా పేద పిల్లలకు ఉచితంగా దుస్తుల పంపిణీ కార్యక్రమానికి ఎస్పీ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. గురుస్వామి బయ్యారెడ్డి పర్యవేక్షణలో జరిగిన కార్యక్రమంలో దాతలు సమకూర్చిన నూతన వస్త్రాలను చిన్నారులకు ఎస్పీ అందజేశారు. విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేయాలని ఎస్పీ సూచించారు. ఈ కార్యక్రమంలో రాయచోటి అర్బన్ ట్రాఫిక్ ఇన్స్పెక్టర్లు బివి చలపతి, కుళాయప్ప, అయ్యప్ప స్వామి ట్రస్టు ప్రతినిధులు, ఆలయ కమిటీ సభ్యులు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి -
కృషి,పట్టుదలతో ఏదైనా సాధ్యమే
సినీనటి శ్రీదేవిని సత్కరిస్తున్న ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి, ఏయూ వార్షికోత్సవ సభకు హాజరైన వేలాది మంది విద్యార్ధులు రాజంపేట: సాధారణ నేపథ్యం నుంచి సినీపరిశ్రమలో నటిగా స్థిరపడ్డానంటే సవాళ్లను ఎదుర్కొవడంతో పాటు, కృషి, పట్టుదల కారణమని ప్రముఖ సినీనటి శ్రీదేవి అప్పల అన్నారు. గురు వారం రాత్రి అన్నమాచార్య యూనివర్సిటీ వార్షికోత్సవంలో భాగంగా క్రీడా–సాంస్కృతిక దినోత్సవం సభకు ఆమె ముఖ్యఅతిఽథిగా హాజరై ప్రసంగించారు. లక్ష్యాన్ని స్పష్టంగా నిర్ధారించుకుని నిరంతర శ్రమ,క్రమశిక్షణ, ఆత్మవిశ్వాసంతో మందుకు సాగితే ఏ రంగాలోనైనా విజయం సాధించవచ్చని పేర్కొన్నారు. విద్యార్థులు తమ లక్ష్యాలపై స్పష్టతతో ముందుకుసాగుతూ, తమలోని నైపుణ్యాలను నిరంతరం మెరుగుపరుచుకోవాలన్నారు. కమ్యూనికేషన్ స్కిల్స్ , నాయకత్వ లక్షణాలు జీవిత విజయానికి కీలకమని వివరించారు. ఏయూ అధినేత చొప్పా గంగిరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు ఆత్మవిశ్వాసం, పట్టుదలతో తల్లిదండ్రుల ఆశయాలను నెరవేర్చాలన్నారు. ఇందుకు అన్నమాచార్య యూనివర్సిటీ యాజమాన్యం విద్యార్థులకు నాణ్యమైనబోధన, అధునాతన సౌకర్యాలను కల్పిస్తోందని ఆయన పేర్కొన్నారకీ కార్యక్రమంలో ఏఈటీ చైర్మన్ రామచంద్రారెడ్డి, వీసీ సాయిబాబారెడ్డి, రిజిస్ట్రార్ మల్లికార్జునరావు, ప్రిన్సిపల్ నారాయణ, కార్యనిర్వహణ కమిటీ సభ్యులు డాక్టర్ బి.జయరామిరెడ్డి, డాక్టర్ ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం వివిధ క్రీడల్లో , ఆటలలో విజేతలైన వారికి సినీనటి శ్రీదేవి బహుమతులను అందచేశారు. విద్యార్థులు భారతీయ జ్ఞాన కేంద్రం భావనను ప్రతిబింబించే నృత్యాలు, దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన సాంప్రదాయ, జానపద నృత్యాల ప్రదర్శనతో అలరించారు. ఏయూ వార్షికోత్సవ వేడుకసభలో సినీనటి శ్రీదేవి అప్పల -
రామసముద్రంలో వైభవంగా ఇస్తిమా
రామసముద్రం : మండల కేంద్రంలో బుధ, గురువారాల్లో నిర్వహించిన ఇస్తిమా వేడుకలు వైభవంగా జరి గాయి. ఆంధ్రా, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేల సంఖ్యలో ముస్లింలు తరలివచ్చారు. భక్తు లకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సౌకర్యాలు కల్పించారు. ఆధ్యాత్మిక చింతన పెంపొందించడం, పరోపకారం, ప్రపంచ మానవాళి సుఖ, సంతోషాల తో జీవనం సాగించాలని ప్రార్థనలు చేశారు. మత పె ద్దలతో కలిసి ప్రత్యేక ప్రార్థనల్లో పాల్గొని వారి అమూల్యమైన మాటలు శ్రద్ధగా విన్నారు. ఎలాంటి సంఘటనలు జరగకుండా ఎస్ఐ ఉమా మాహేశ్వర్ రెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు బందోబస్తు నిర్వహించారు. -
గృహ నిర్మాణాలు వేగవంతం చేయండి
పుంగనూరు : పట్టణంలోని హౌసింగ్ కార్యాలయంలో పీడీ రమేష్రెడ్డి హౌసింగ్ సిబ్బందితో కలసి సమావేశం నిర్వహించారు. గురువారం పుంగనూరు, చౌడేపల్లె, సోమల మండలాల హౌసింగ్ అధికారులు, సిబ్బందితో సమావేశం నిర్వహించారు. పీడీ రమేష్రెడ్డి మాట్లాడుతూ గృహ నిర్మాణాలను త్వరితగతిన పూర్తి చేయాలన్నారు. గృహాలు మంజూరైన లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణాలు చేపట్టేలా అవగాహన కల్పించాలని తెలియజేశారు. లబ్ధిదారులకు చెల్లించాల్సిన బిల్లులను ఎప్పటికప్పుడు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. పనుల్లో నిర్లక్షం చేస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. కార్యక్రమంలో డీఈ దీన్దయాల్రాజు, ఏఈలు, వర్కింగ్ ఇన్స్పెక్టర్లు, సిబ్బంది పాల్గొన్నారు. -
కూలీల సంఖ్య పెంచకపోతే చర్యలు తప్పవు
పీడీ వెంకటరత్నంరామసముద్రం : ఉపాధి హామీ పథకంలో కూలీల సంఖ్య పెంచకుండా నిర్లక్ష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని పీడీ వెంకటరత్నం హెచ్చరించారు గురువారం రామచంద్ర మండలం లోని ఈజీఎస్ కార్యాలయంలో సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూలీలకు పని కల్పించడంలో నిర్లక్ష్యం వహిస్తే సహించేది లేదన్నారు. పనుల్లో అవకతవకలు జరిగితే చర్యలు తప్పవన్నారు. కూలీలకు పనులను కల్పించాలని, వికసిత్ భారత్ గ్యారంటీ ఫర్ రోజ్ గార్ అజీవికమిషన్ గ్రామీణ్ గురించి తెలియజేశారు. ప్రస్తుతం 125 రోజులు పని దినాలు ఏప్రిల్ నుంచి అమల్లోకి వస్తాయన్నారు. నీటి సంరక్షణ, నీటి నిల్వ పనులను చేపట్టాలని ఫారంపాండ్స్, కంపోస్ట్ పిట్స్ పనులు చేపట్టాలని తెలిపారు. అనంతరం మానేవారిపల్లి అరికెల పంచాయతీలలో ఉపాధి హామీ పనులను పరిశీలించారు. మానే వారి పల్లి పంచాయతీ దాసిరెడ్డిగారిపల్లి వద్ద సమస్యగా ఉన్న రోడ్డుపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంపై పరిశీలించి, స్థానికులతో మాట్లాడారు. గోపాల్ రెడ్డి కొబ్బరి తోటలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు.మానేవారిపల్లి పంచాయతీ చిట్టెంవారి పల్లిలో నిర్మించిన పశువుల షెడ్డు పరిశీలించారు. ఈ కార్యక్రమంలో ఏపీవో మాధవి, జె ఈ రెడ్డిశ్వర్, సిబ్బంది పాల్గొన్నారు. -
రోడ్డు ప్రమాదంలో వ్యక్తికి గాయాలు
రామసముద్రం : ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోవడంతో వ్యక్తికి తీవ్ర గాయాలైన సంఘటన రామసముద్రం మండలంలో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి. పుంగనూరుకు చెందిన ఇస్మాయిల్ (45) రామసముద్రంలో ఇస్తిమా కు వస్తుండగా దిన్నిపల్లి సమీపంలో ద్విచక్ర వాహనం అదుపు తప్పి పడిపోయాడు. ఈ ప్రమాదంలో ఇస్మాయిల్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108కు సమాచారం అందివ్వడంతో సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకున్నారు. గాయపడిన వ్యక్తిని పుంగనూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కుక్క అడ్డురావడంతో.. – బైక్పై నుంచి పడి ముగ్గురికి గాయాలు రొంపిచెర్ల : రోడ్డు ప్రమాదంలో ముగ్గురు గాయపడ్డారు. ఈ సంఘటన రొంపిచెర్ల మండలం ఫజులుపేటలో గురువారం జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. గానుగచింత గ్రామ పంచాయతీ మద్దిపట్లవారిపల్లెకు చెందిన మహేంద్రనాయుడు, శేషముని నాయుడు, జస్వంత్ ద్విచక్ర వాహనంలో రొంపిచెర్ల క్రాస్ రోడ్డుకు వెళుతుండగా ఫజులుపేట వద్ద కుక్క అడ్డు రావడంతో ఢీకొని కింద పడ్డారు. ఈ ప్రమాదంలో ముగ్గురు గాయ పడ్డారు. స్థానిక ప్రవేట్ ఆస్పత్రిలో చికిత్స తీసుకుని వెళ్లారు. రోడ్డు మీద కుక్కలు వీపరీతంగా ఉన్నాయని, ద్విచక్ర వాహనాల్లో వెళుతున్నవారిపై ఎగ బడుతున్నాయని వాహనదారులు తెలిపారు. అధికారులు స్పందించి కుక్కల బెడద నివారణకు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. బొలెరో, బైక్ ఢీ: రియల్టర్ మృతి కురబలకోట : రోడ్డు ప్రమాదంలో రియల్టర్ మృతి చెందిన విచారకర సంఘటన కురబలకోట మండలంలో గురువారం చోటుచేసుకుంది. ముదివేడు పోలీసుల కథనం మేరకు..మదనపల్లి రూరల్ మండలం సీటీఎం సోమలగడ్డకు చెందిన రెడ్డెప్ప (52) పరిసర ప్రాంతాల్లో రియల్టర్గా కొ నసాగుతున్నారు. ఇతను భవన నిర్మాణ పనులు చేపట్టాడు. గురువారం సాయంత్రం టైల్స్ కోసం మదనపల్లి దగ్గరున్న అమ్మచెరువు మిట్ట వద్దకు వెళ్లాడు. అనంతరం ద్విచక్రవాహనంలో మదనపల్లె హైవేపై అవతలి రోడ్డుపైకి వెళ్లడానికి ప్రయత్నించారు. అదే సమయంలో ఎదురుగా వాహనాలు వస్తుండడంతో ఆపాడు. హైవేపై వెనుకగా వచ్చిన బొలెరో వాహనం ఇతన్ని ఢీకొంది. తీవ్రంగా గాయపడిన రెడ్డెప్ప అక్కడికక్కడే మృతి చెందాడు. సంఘటన స్థలాన్ని స్థానిక సీఐ రవి నాయక్ సందర్శించారు. కేసు దర్యాప్తు చేస్తున్నట్లు ముదివేడు ఎస్ఐ మధు రామచంద్రుడు తెలిపారు. చికిత్సపొందుతూ.. పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో గాయపడిన స్కూటరిస్తు మృతి చెందినట్లు ఎస్ఐ లోకేష్ తెలిపారు. వివరాలి లావున్నాయి, పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన సి. వెంకటేష్ (28) బుధవారం ద్విచక్రవాహనంలో యల్లంపల్లె నుంచి స్వగ్రామానికి వెళుతుండగా వెనుక నుంచి వచ్చిన టిప్పర్ ఢీకొ న్న విషయం విధితమే. ఈ ప్రమాదంలో గాయప డిన వెంకటేష్ను చికిత్సనిమిత్తం తిరుపతి రుయా కు తరలించారు. అక్కడ చికిత్సపొందుతూ గురువారం మృతి చెందినట్లు ఎస్ఐ తెలిపారు. మృతునికి భార్య అన్నపూర్ణ, కుమారులు ధీరజ్, అరుణ్, ధనుష్ ఉన్నారు. మృతుడు ట్రాక్టర్ డ్రైవర్గా పని చేస్తూ జీవనం సాగించేవాడు. -
క్యూ ఆర్ కోడ్తో సులభంగా భూ వివరాలు
కలెక్టర్ నిశాంత్కుమార్ కలకడ: క్యూ ఆర్కోడ్ పట్టాదారు పాస్బుక్కు ద్వారా భూ యజమాని, భూమి వివరాలను సులభంగా తెలుకోవచ్చునని కలెక్టర్ నిశాంత్ కుమార్ పేర్కొన్నారు. గురువారం కలకడ మండలంలోని దేవులపల్లె గ్రామం సచివాలయంలో నిర్వహించిన పట్టాదారు పాస్పుస్తకాల పంపిణీ కార్యక్రమంలో కలెక్టర్ పాల్గొని రైతులకు రాజముద్రతో ముద్రించిన పట్టాదారు పాస్బుక్కులు అందజేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ అధునాతన సాంకేతికతద్వారా భూ వివాదాలను సులువుగా పరిష్కరించేందుకు కృషి చేయాలని సిబ్బందిని ఆదేశించారు. జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న రెవెన్యూగ్రామ సభ లను రైతులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. రైతులను పట్టాదారు పాస్బుక్కుల నమోదులో తప్పులు ఉంటే ఆధార్నెంబర్ అనుసంధానం చేసుకోవాలని సూచించారు. పట్టాదార్ పాస్పుస్తకాలలో తప్పులు దొర్లితే వెంటనే పరిష్కరించాలని మండల తహసీల్దార్ మహేశ్వరిభాయ్ను ఆదేశించారు. ఈ కార్యక్రమంలో వీఆర్ఓలు, సర్వేయర్, సచివాలయ సిబ్బంది పాల్గొన్నారు. -
కమిషనర్లకు బదిలీల గ్రహణం
రాజంపేట : పార్లమెంటరీ నియోజకవర్గ కేంద్రమైన రాజంపేట పురపాలకసంఘంపై పచ్చపెత్తనంతో అధికారులు అవినీతికి ద్వారాలు తెరిచేశారన్న ఆరోపణలు పట్టణవాసుల నుంచి వినిపిస్తున్నాయి. ప్రతి పనికి కమిషన్ అనే నినాదంతో వివిధ విభాగాలకు చెందిన కొందరు అధికారులు తమ విధులు చక్కబెడుతున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇలాంటి విధులకు వచ్చిన కమిషనర్ల మద్దతు లేకుంటే జరగదనే వాదన కూడా వినిపిస్తోంది. ఇలాంటి పరిస్ధితుల్లో కమిషనర్ల బదిలీలకు దారితీస్తోందన్న వాదన లేకపోలేదు. పుర పాలికను అవినీతి జలగలు పట్టిపీడిస్తున్నా ఉన్నతాధికారులు చోద్యం చూడటమే తప్ప చేసేదే లేదు..ఇందుకు కారణం పచ్చపెత్తనమే అని బహిరంగగానే వ్యా ఖ్యలు వినిపిస్తున్నాయి. ఇక్కడికి వచ్చిన కమిషనర్లు పచ్చపెత్తనానికి ఎదురొడ్డితే బదిలీ వేటునపడాల్సిన పరిస్ధితులు దాపురించాయని పట్టణవాసులు ఆందోళ న చెందుతున్నారు. టీడీపీ ప్రభుత్వం ఏర్పడినప్పటి నుంచి ఇప్పటి వరకు నలుగురు మారడం విశేషం. తాజాగా కమిషనర్గా కడప కార్పొరేషన్లో శ్యానిటరీ సూపర్వైజరుగా పనిచేస్తున్న లక్ష్మీనారాయణ నియమితులయ్యారు. మరీ ఈయన ఎన్నినెలలు ఉంటారన్నదే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది. మాట వినకుంటే..బదిలీనే.. పచ్చపెత్తనంలో భాగంగా తమ మాట వినకుంటే..కమిషనర్లు వెంటనే బదిలీ అవుతున్నారు. మరికొంతమంది కాసుల కక్కుర్తితో కూటమినేతల కబంధహస్తాల్లో చిక్కుతున్నారు. పట్టణాభివృద్ధికి సంబంధించి కూటమి నేతలు పురపాలకసంఘానికి సహకారం ఉండదు కానీ, అవుట్సోర్సింగ్, కాంట్రాక్టు పనులతోపాటు పలు కార్యకలాపాలకు కమిషనర్లు అనుకూలంగా కొనసాగించలేకపోతే, అప్పుడే కూటమి నేతల నుంచి ఆరోపణలు ఎదుర్కోవాల్సివస్తోంది. కమిషనర్ల బదిలీలకు సంబంధించి ముఖ్యనేత సిఫార్సు లేఖకు డబ్బులు వసూలు చేస్తున్నారనే ఆరోపణలు బహిరంగంగా వినిపిస్తున్నాయి. ఎన్నికల నుంచి...వరుసపెట్టి.. సార్వత్రిక ఎన్నికల సమయంలో కమిషనరుగా జనార్ధన్రెడ్డి పనిచేశారు. తర్వాత ఆయనను బదిలీ చేశారు. అనంతరం రాంబాబును నియమించారు. ఈయనను అధికారపార్టీ నాయకులు ముప్పుతిప్పలు పెట్టారు. చివరికి గదిలో బంధించి, గొడవకు దిగారు. ఎస్సీఎస్టీ కేసుకూడా పెట్టారు. చివరికి టీడీపీ నేతల ఆగడాలకు మానసికంగా అనారోగ్యంపాలయ్యారు. వేలూరు ఆసుపత్రిలో చికిత్సపొందేందుకు లాంగ్లీవ్ పెట్టి వెళ్లిపోయారు. నెల్లూరు కార్పొరేషన్ నుంచి నాగేశ్వరరావు కమిషనరుగా రాజంపేటకు వచ్చారు. వచ్చీరాగానే వివాదాల్లో ఇరుక్కున్నారు. గతంలో ఆరోపణల నేపథ్యంలో ఆయనను ప్రభుత్వం సస్పెండ్ చేసింది. అనంతరం శ్యానిటరీ ఇన్స్పెక్టర్గా పనిచేస్తున్న శ్రీనివాసులును కమిషనర్గా రాజంపేటకు ప్రభుత్వం నియమించింది. ఈయన రాగానే అనేక అవినీతి ఆరోపణలను ఎదుర్కొన్నారు. ఈయనను కూడా ఇటీవల ప్రభుత్వం ఆకస్మికంగా బదిలీ చేసిన సంగతి తెలిసిందే. శానిటరీఅధికారులే..కమిషనర్లు మేజర్ పంచాయతీగా ఉన్న రాజంపేట దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్రెడ్డి హయాంలో నగర పంచాయతీగా మారింది. వైఎస్ జగన్మోహన్రెడ్డి పాలనలో రాజంపేట పురపాలకసంఘం గ్రేడ్–2గా మారింది.టీడీపీ ప్రభుత్వం వచ్చాక పురపాలిక అభివృద్ధి అటుంచి, కమిషనర్ల బదిలీ, కమిషన్లు, స్వలాభర్జన దిశగా టీడీపీ నేతలు ముందుకు సాగుతున్నారు. పచ్చపెత్తనంలో కమిషనర్లు విలవిలలాడుతున్నారు. చివరికి చికెన్ వేస్ట్ను కై వసం చేసుకునేందుకు కూడా పురపాలిక పచ్చరాజకీయంతో వేడెక్కుతోంది. -
హుండీ ఆదాయం రూ.49.14లక్షలు
చౌడేపల్లె: ప్రముఖ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. భక్తులు సమర్పించిన కానుకలు లెక్కించగా రూ.49.14లక్షల ఆదాయం సమకూరినట్లు ఆలయ ఈఓ ఏకాంబరం తెలిపారు. ఇందులో బంగారం 19గ్రాములు , వెండి 292 గ్రాములు సమకూరినట్లు పేర్కొన్నారు. వీదేశీ కరెన్సీ నోట్లతోపాటు రణభేరి గంగమ్మ ఆలయంలో గల హుండీ ద్వారా రూ.28,943 నగదు లభించినట్లు తెలిపారు. ఈ ఆదాయం31 రోజులకు వచ్చినట్లు ఈఓ చెప్పారు. చిత్తూరు దేవదాయశాఖ అసిస్టెంట్ కమీషనర్ చిట్టెమ్మ, ఆలయ, ఏపీజీ బ్యాంకు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. మదనపల్లె సిటీ: కేంద్రీయ నవోదయ విద్యాలయంలో 2026–27 విద్యా సంవత్సరానికి 9, 11 తరగతుల ప్రవేశానికి దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈ నెల 11 నుంచి హాల్టిక్కెట్లు పొందవచ్చునని మదనపల్లె జవహర్ నవోదయ విద్యాలయ ప్రిన్సిపల్ ఎం.గీత ఓ ప్రకటనలో తెలిపారు. హాల్టిక్కెట్లు డౌన్లోడ్లో ఏదైనా సమస్య వున్నా రిజిస్ట్రేషన్ నంబర్ మరచిపోయినా హెల్ప్డెస్క్ 89199 56395, 80743 05048కు ఫోన్ చేసి సహాయం పొందవచ్చని చెప్పారు. ప్రవేశ పరీక్ష 7.2.2026న (శనివారం) జరుగుతుందని తెలియజేశారు. ఉమ్మడి చిత్తూరు జిల్లాకు సంబంధించి 11వ తరగతికి మదనపల్లె జెడ్పీ ఉన్నత పాఠశాలలో ఎ,బి కేంద్రాలు, 9వ తరగతికి మదనపల్లె హోప్ మున్సిపల్ ఉన్నత పాఠశాల, జవహర్ నవోదయ విద్యాలయ, వలసపల్లెలో పరీక్షలు నిర్వహణ ఉంటుందని వివరించారు. పరీక్షలు ఉదయం 11:15 నుంచి మధ్యాహ్నం 1:45 వరకు జరుగుతాయని అన్నారు. అభ్యర్థులు ఉదయం 10 గంటల కల్లా పరీక్షా కేంద్రానికి చేరుకోవాలని సూచించారు. ఒంటిమిట్ట: ఒంటిమిట్ట శ్రీ కోదండ రామస్వామి ఆలయ హుండీ ఆదాయం పెరిగింది. గురువారం ఆలయ టీటీడీ అధికారులు హుండీ ఆదాయాన్ని లెక్కించారు. ఈ సందర్భంగా డిసెంబర్ 9 నుంచి జనవరి 8వ లేది వరకు శ్రీరాముడిని దర్శించుకున్న భక్తులు స్వామి వారి హుండీలో వేసిన కానుకలను లెక్కించగా రూ. 10,15,154 వచ్చినట్లు టీటీడీ అధికారులు వెల్లడించారు. ఆలయ రంగమండపంలో ఈ లెక్కింపు జరిగింది. గత నెల రూ. 5,91,855 రాగా ప్రస్తుతం రూ.4,23,299 పెరిగినట్లు లెక్కలు చెబుతున్నాయి. కడప సెవెన్రోడ్స్: జిల్లా పర్యాటకరంగ ప్రముఖులు సిద్దవటం సీతారామయ్య వర్ధంతి కార్యక్రమం శుక్రవారం ఉదయం 10 గంటలకు నగరంలోని సాయిబాబా థియేటర్ సమీపంలోని గ్రాండ్ ఇన్ హోటల్లో నిర్వహించనున్నట్లు కొండూరు జనార్దన్రాజు తెలిపారు. రాజంపేట: రాజంపేట తహసీల్దారు కార్యాలయం ఆవరణలో కుక్కలదాడిలో పునుగుపిల్లి మృత్యువాతకు గురైన సంఘటన గురువారం వెలుగులోకి వచ్చింది. శేషాచలం అటవీ ప్రాంతంలో అరుదైన వన్యప్రాణిగా గుర్తించబడిన పునుగుపిల్లి పట్టణ ప్రాంతానికి ఎలా వచ్చిందో అన్న అనుమానాలు తలెత్తాయి. అటవీ అధికారులకు సమాచారం రాగానే పునుగుపల్లి కళేబరాన్ని స్వాధీనం చేసుకున్నారు. రాజంపేట పశుసంవర్దకశాఖ వైద్యులు పోస్టుమార్టం నిర్వహించారు. అనంతరం అటవీ ప్రాంతంలో దహనం చేశారు. శేషాచలం అటవీ ప్రాంతానికి పరిమితమైన పునుగుపిల్ల జననివాసాల్లోకి కనిపించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. -
సమస్యలు పరిష్కరించకుంటే సమ్మె చేస్తాం
మదనపల్లె రూరల్ : 108 ఉద్యోగుల సమస్యలు పరిష్కారం చేయకపోతే, ఈనెల 12 తర్వాత సమ్మెలోకి వెళ్తామని 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్(సీఐటీయూ) జిల్లా గౌరవఅధ్యక్షులు ఎ.రామాంజులు, జిల్లా అధ్యక్షులు రమణయాదవ్, ప్రధాన కార్యదర్శి బీవీ.చలపతి పేర్కొన్నారు. గురువారం 108 కాంట్రాక్ట్ ఉద్యోగుల యూనియన్ (సీఐటీయూ) పిలుపు మేరకు కలెక్టరేట్ ఎదుట నిరసన తెలిపారు. అనంతరం డీఆర్వో మధుసూదనరావుకు సమ్మె నోటీసు అందజేశారు. ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ..రూ.4వేలు వేతనం పెంచుతూ ప్రభుత్వం జీఓ.నంబర్ 49 ఇచ్చినప్పటికీ, పూర్తిస్థాయి వేతనం అమలుచేయకుండా కేవలం రూ.2వేలు ఇవ్వడం సరికాదన్నారు. ఉద్యోగుల వేతనం నుంచి పీఎఫ్ కట్చేసి, యాజమాన్యం వాటా పీఎఫ్ బ్యాంకు ఖాతాకు జమచేయకపోవడం దుర్మార్గపుచర్యగా పేర్కొన్నారు. ఒకో నెలలో కొందరికి కారణం తెలపకుండా వేతనాలు తగ్గించి ఇస్తున్నారన్నారు. కనీసం పే స్లిప్ ఇవ్వనటువంటి భవ్య యాజమాన్యంపై అధికారుల చర్యలు శూన్యమన్నారు. చిన్న చిన్న కారణాలు చూపి ఉద్యోగులను విధుల నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. 18 సంవత్సరాల సర్వీసు ఉన్నవారికి మళ్లీ పరీక్ష ఉత్తీర్ణులైతేనే నియామకం ఇస్తామని చెప్పడంపై ఉద్యోగ భద్రత గాల్లో దీపంగా ఉందన్నారు. వెంటనే పరీక్షలు రద్దుచేసి, ఐదేళ్ల సర్వీసు ఉన్నవారికి స్లాబ్ అప్గ్రేషన్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. రిలీవింగ్ బిల్లులు, ఐటీడీఏ అలవెన్సులు క్రమం తప్పకుండా ఇవ్వాలన్నారు. క్యాజువల్ లీవులు, పండుగ సెలవులు అమలుచేయాలన్నారు. పనిచేసే ప్రదేశంలో షెల్టర్, వాహన క్లీనింగ్ తదితర సౌకర్యాలు కల్పిస్తూ, 8 గంటల పని అమలుచేయాలని కోరారు. వాహన మరమ్మతులు ప్రభుత్వమే చేయించి సిబ్బందికి అప్పుల బాధ నుంచి ఉపశమనం కలిగించాలన్నారు. జిల్లాకు ఒకటి కాకుండా డివిజన్కు ఒక గ్యారేజీ ఏర్పాటుచేయాలన్నారు. కార్యక్రమంలో జిల్లా నలుమూలల నుంచి 108 సిబ్బంది పాల్గొన్నారు. -
● అధినేతను కలసిన అజయ్ రెడ్డి
ఉపాధి సిబ్బందికి పండుగ భారమే ! కడప సిటీ : ఉపాధి హామీ సిబ్బందికి కూటమిప్రభుత్వం వేతనాలు మంజూరు చేయకపోవడంతో పండుగ భారంగా మారబోతోందని పలువురు సిబ్బంది ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా వ్యాప్తంగా 40 మంది ఏపీఓలు, 40 మంది ఈసీలు, 160 మంది టీఏలు, 100కు పైగా కంప్యూటర్ ఆపరేటర్లు, 619 మంది ఫీల్డ్ అసిస్టెంట్లు, వాటర్షెడ్ సిబ్బంది ఉపాధి హామీలో పనిచేస్తున్నారు. కనిష్టంగా రూ. 9 వేల నుంచి గరిష్టంగా రూ. 72 వేల వరకు వేతనాలు అందాల్సి ఉంటుంది. ఈ మొత్తాన్ని కలిపితే రూ. 2 కోట్ల మేర నిధులు ప్రతినెల వేతనం కింద ప్రభుత్వం చెల్లించాలి. గతంలో ఆలస్యమైనా ఓపికతో ఉన్న సిబ్బంది అప్పో సప్పో చేసుకుని కుటుంబ పోషణ సాగిస్తున్నారు. సంక్రాంతి పండుగ సమీపిసున్నా జీతాలు తమ ఖాతాల్లో పడకపోవడంతో ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి తమ వేతనాలు అందజేయాలని కోరుతున్నారు. -
సేంద్రియ వ్యవసాయంతో బహుళ ప్రయోజనాలు
● జేడీఏ శివనారాయణ కేవీపల్లె: సేంద్రియ వ్యవసాయ పద్ధతుల్లో సాగు చేయడం ద్వారా రైతులు బహుళ ప్రయోజనాలు పొందవచ్చని జేడీఏ శివనారాయణ అన్నారు. గురువారం మండలంలోని వగళ్ల, తిమ్మాపురం గ్రామ పంచాయతీలలో పర్యటించి వివిధ రకాల పంటలను పరిశీలించారు. వగళ్లలో వర్మీకంపోస్టు యూనిట్ను పరిశీలించారు. వేరుశెనగ పొలాన్ని పరిశీలించి రైతులకు సూచనలిచ్చారు. తిమ్మాపురం పంచాయతీ చిన్నకమ్మపల్లెలో డ్రమ్ సీడర్ పద్ధతిలో వరిసాగు చేస్తున్న పొలంను పరిశీలించారు. ఈ సందర్భంగా జేడీఏ రైతులకు పలు సూచనలు చేశారు. స్థానికంగా వ్యవసాయ సిబ్బంది ఇచ్చే సూచనలు, సలహాలు పాటించి పంటలు సాగు చేయాలని సూచించారు. ప్రభుత్వం అందిస్తున్న పథకాలు, రాయితీలు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఏవో మాధవి, వ్యవసాయ సిబ్బంది పాల్గొన్నారు. కడప కోటిరెడ్డిసర్కిల్: ఏపీ ఎస్ఎస్డీసీ, జిల్లా ఉపాధి కల్పనా కార్యాలయం ఆధ్వర్యంలో శుక్రవారం ఉదయం 9 గంటలకు ఆర్టీసీ బస్టాండు సమీపంలోని జొయలుక్కాస్ జ్యువెలరీలో ప్రముఖ కంపెనీలతో జాబ్మేళా నిర్వహిస్తున్నట్లు జిల్లా ఉపాధి కల్పనాధికారి సురేష్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఇంటర్, ఏదైనా డిగ్రీ చదివి 19–30 ఏళ్లలోపు వయస్సు కలిగి ఉండాలన్నారు. అభ్యర్థి విద్యార్హతలకు సంబంధించిన ధృవపత్రాలు, ఫొటోలు తీసు కుని ఇంటర్వ్యూకు రావాల్సి ఉంటుందన్నారు. -
మదనపల్లె కోర్టులకు బాంబు బెదిరింపు
మదనపల్లె రూరల్: పట్టణంలోని కోర్టులకు గురువారం బాంబు బెదిరింపులు వచ్చాయి. చిత్తూరు జిల్లా కోర్టుకు ఈ–మెయిల్ ద్వారా బాంబు బెదిరింపు రావడంతో న్యాయాధికారులు మెయిల్ ద్వారా వచ్చిన లేఖలను పోలీసులకు అందించారు. మదనపల్లెలోని కోర్టు సిబ్బందిని అప్రమత్తం చేశారు. సమాచారం అందుకున్న వన్టౌన్ సీఐ మహమ్మద్ రఫీ, తాలూకా సీఐ కళావెంకటరమణ పోలీసు సిబ్బందితో కోర్టు ఆవరణకు చేరుకున్నారు. కోర్టు ప్రాంగణం, పరిసరాలు, కోర్టు భవనాలు క్షుణ్ణంగా పరిశీలించారు. బాంబు బెదిరింపు సమాచారాన్ని బాంబ్ స్క్వాడ్కు తెలియజేశారు. అనంతరం బాంబ్ స్క్వాడ్ కోర్టుకు చేరుకుని జిల్లా ఏడీజే కోర్టుతో పాటు మిగిలిన 8 కోర్టు భవనాలలోనూ బాంబ్ డిటెక్టింగ్ యంత్రం సహాయంతో తనిఖీలు చేపట్టారు. బాంబులు లేవని తేలడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. -
మూర్చవ్యాధితో పొలంలోనే రైతు మృతి
కలకడ : మండలంలోని నడిమిచెర్ల గ్రామంలో ఓ రైతు మూర్చవ్యాధితో పొలంలో పడి మృతి చెందాడు. కుటుంబసభ్యుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. నడిమిచెర్ల గ్రామానికి చెందిన రైతు నరసింహులు (45) మంగళవారం రాత్రి వరి పొలం వద్దకు వెళ్లాడు. బుధవారం ఉదయం వరకు ఇంటికి రాలేదు. దీంతో కుటుంబసభ్యులు పొలానికి వెళ్లి చూడగా బురదలో పడి ఉన్నాడు. నరసింహులుకు మూర్చవ్యాధి ఉన్నట్లు, అందువల్లే మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. మృతుడు నరసింహులుకు భార్య నిర్మల, ఒక కుమారుడు, ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. నిరు పేద రైతు కుటుంబాన్ని ప్రభుత్వం ఆదుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. -
బాలికలు అంతర్జాతీయ పోటీల్లోనూ రాణించాలి
జమ్మలమడుగు : బాలికలు జాతీయ స్థాయి నుంచి అంతర్జాతీయ క్రీడా పోటీల్లోనూ రాణించాలని బీసీ సంక్షేమశాఖ, జిల్లా ఇన్చార్జి మంత్రి సవిత పేర్కొన్నారు. బుధవారం సాయంత్రం వాలీబాల్ జాతీయ స్థాయి క్రీడా పోటీలను ఆమె తిలకించారు. అనంతరం ఆమె మాట్లాడుతూ చిత్తశుద్ధితో ప్రయత్నిస్తే ఏ ఆటలోనైనా రాణించవచ్చన్నారు. జమ్మలమడుగు ప్రాంతానికి చెందిన శ్రీచరణి అంతర్జాతీయ స్థాయి క్రికెట్లో పాల్గొని ప్రపంచకప్ సాధించడంలో కీలకంగా మారారని తెలిపారు. అనంతరం టీడీపీ జిల్లా అధ్యక్షుడు భూపేష్రెడ్డి, కమలాపురం ఎమ్మెల్యే చైతన్యరెడ్డిలు మాట్లాడుతూ జాతీయ స్థాయి క్రీడల్లో పాల్గొనటానికి దేశంలోని నలుమూలల నుంచి తమ జమ్మలమడుగుకు రావడం తమకు గర్వంగా ఉందన్నారు.కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్సీ నారాయణరెడ్డి, బద్వేల్ ఇన్చార్జి రితేశ్వరరెడ్డి, వాలీబాల్ అసోషియేషన్ సెక్రెటరీ భానుమూర్తి పాల్గొన్నారు. హోరాహోరీగా సాగిన మ్యాచ్లు అంతకుముందు వాలీబాల్ పోటీలు హోరాహోరీగా సాగాయి. బుధవారం జరిగిన మ్యాచ్ల్లో పశ్చిమబెంగాల్, ఉత్తరప్రదేశ్, రాజస్తాన్, కేరళ, హర్యానా, పంజాబ్, మహరాష్ట్ర, తమిళనాడు టీంలు గెలుపొందాయి. గురువారం గెలుపొందిన జట్లతోపాటు ఓడిన జట్ల మధ్య మరోమారు క్వార్టర్ ఫైనల్స్ ఆడనున్నాయి. గెలిలచిన జట్లు శుక్రవారం సెమీఫైనల్లో తలపడతాయి. గెలుపొందిన జట్ల మధ్య శనివారం ఫైనల్ మ్యాచ్ జరుగుతుందని నిర్వాహకులు తెలిపారు.ఇన్ఛార్జీ మంత్రి సబితా -
సోషల్ మీడియా కార్యకర్తపై దాడి హేయం
కడప కార్పొరేషన్ : వైఎస్సార్సీపీ సోషల్ మీడియా కన్వీనర్ రామచంద్రారెడ్డిపై టీడీపీ నాయకులు దాడి చేయడం హేయమని పార్టీ అన్నమయ్య, వైఎస్సార్ కడప జిల్లా అధ్యక్షులు ఆకేపాటి అమర్నాథ్రెడ్డి, పి.రవీంద్రనాథ్రెడ్డి అన్నారు. బుధవారం కడపలోని శ్యామల హాస్పిటల్లో చికిత్స పొందుతున్న ఆయనను ఎమ్మెల్సీ పి.రామసుబ్బారెడ్డి, బద్వేల్ ఎమ్మెల్యే డాక్టర్ దాసరిసుధ, మేయర్ పాకాసురేష్ కుమార్ల తో కలిసి పరామర్శించారు. దాడికి దారితీసిన పరిస్థితులను అడిగి తెలుసుకొని, అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. త్వరగా కోలుకొని ఆరోగ్యవంతుడిగా రావాలని ఆకాంక్షించారు. అనంతరం వారు మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలను లక్ష్యంగా చేసుకొని దాడులు చేస్తున్నారని, అక్రమ కేసులు బనాయించి జైళ్లకు పంపుతున్నారని మండిపడ్డారు. తాజాగా రాయచోటి జిల్లా కేంద్రాన్ని మదనపల్లెకు తరలించడంపై సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టినందుకు రామచంద్రారెడ్డిపై దాడి చేయడం దుర్మార్గమన్నారు. తమను ఎవరూ ప్రశ్నించకూడదనే ఏకై క లక్ష్యంతో వైఎస్సార్సీపీ నాయకుల గొంతునొక్కుతూ రెడ్బుక్ రాజ్యాంగాన్ని అమలు చేస్తున్నారన్నారు. వైఎస్సార్సీపీ నాయకులకు తాము అండగా ఉంటామని, రాబోయే రోజుల్లో దాడులు చేసిన ప్రతి ఒక్కరూ ముల్యం చెల్లించుకోక తప్పదని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్ఈసీ సభ్యులు మాసీమ బాబు, డిప్యూటీ మేయర్ నిత్యానందరెడ్డి, ఎస్సీసెల్ స్టేట్ వర్కింగ్ ప్రెసిడెంట్ పులి సునీల్ కుమార్ పాల్గొన్నారు. -
మార్కెట్ కమిటీ డైరెక్టర్పై టీడీపీ నాయకుల దాడి
మదనపల్లె రూరల్ : మార్కెట్ కమిటీ డైరెక్టర్, టీడీపీ నాయకులు మున్నా నాయక్పై, అదే పార్టీకి చెందిన నాయకులు దాడికి పాల్పడ్డారు. బుధవారం పట్టణంలోని జేఎన్ఆర్ గ్రాండ్ హోటల్లో, పంచాయతీ ఎన్నికలకు సంబంధించి నాయకులు, కార్యకర్తల సమావేశం జరిగింది. కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ పార్టీ పరిశీలకులు గురుమూర్తి హాజరయ్యారు. సమావేశంలో కోటవారిపల్లె సర్పంచ్ అభ్యర్థి ఎంపిక విషయంపై ప్రస్తావన వచ్చింది. మార్కెట్కమిటీ డైరెక్టర్ మున్నా, తనకు అవకాశం ఇవ్వాలని కోరగా, కొందరు వ్యతిరేకించారు. నిన్న లేక మొన్న నాయకులైన వారికి పదవులు ఇస్తారా అని అడిగితే, 11 నెలల క్రితం పార్టీలో చేరిన వ్యక్తికి ఎమ్మెల్యే సీటు ఇచ్చి గెలిపించుకున్నాం కదా అని మున్నా నాయక్ సమాధానం ఇచ్చినట్లు తెలిసింది. దీంతో సమావేశం ముగిసిన తర్వాత ఫంక్షన్ హాల్ నుంచి బయటకు వస్తున్న క్రమంలో మార్కెట్ కమిటీ డైరెక్టర్ మున్నా నాయక్ను, ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడు షంషీర్, స్నేహితుడైన టీడీపీకి చెందిన రఘునాయక్, లాల్బాషాలు నిలదీశారు. ఎమ్మెల్యేపైనే మాట్లాడేంత గొప్ప వ్యక్తి నువ్వా అంటూ నిలదీశారు. నియోజకవర్గ పరిశీలకులు గురుమూర్తి గౌడ్ ఎదుట మున్నానాయక్పై, ఉన్న పళంగా రఘునాయక్, లాల్బాషా దాడికి పాల్పడ్డారు. చెంపపై బలంగా కొడుతూ చేయి విరిచే ప్రయత్నం చేశారు. దీంతో మున్నానాయక్ చేయికి గాయమైంది. పార్టీ పరిశీలకుడి ఎదుటే మార్కెట్ కమిటీ డైరెక్టర్ను, సొంత పార్టీకి చెందిన కార్యకర్తలు కొట్టడంపై క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలని మార్కెట్ కమిటీ చైర్మన్ జంగాల శివరాం డిమాండ్ చేశారు. మున్నానాయక్ను పరామర్శించి ధైర్యం చెప్పారు. దీంతో విషయం పెద్దది అవుతుందని భావించిన ఎమ్మెల్యే షాజహాన్బాషా... ఈ విషయంలో జోక్యం చేసుకుని, మార్కెట్కమిటీ డైరెక్టర్ మున్నానాయక్ను, దాడిచేసిన రఘునాయక్, లాల్బాషాను ఇంటికి పిలిపించి కుటుంబ సమస్యతో వాగ్వాదం జరిగిందని చెప్పించారు. -
రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టుకు తీవ్ర గాయాలు
పీలేరురూరల్ : రోడ్డు ప్రమాదంలో స్కూటరిస్టు తీవ్రంగా గాయపడ్డ సంఘటన మండలంలోని ఠాణావడ్డిపల్లె వద్ద చోటు చేసుకుంది. వివరాలిలావున్నాయి. పీలేరు మండలం ముడుపులవేముల పంచాయతీ ఠాణావడ్డిపల్లెకు చెందిన సి.వెంకటేష్ (28) ద్విచక్రవాహనంలో యల్లంపల్లె నుంచి స్వగ్రామానికి బయలుదేరాడు. వెనుక నుంచి వచ్చిన గుర్తు తెలియని వాహనం ఢీకొని వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో వెంకటేష్కు ఎడమకాలు విరిగింది. తలకు బలమైన గాయమైంది. స్థానికుల సాయంతో క్షతగాత్రున్ని చికిత్సనిమిత్తం పీలేరు ఏరియా ఆస్పత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం తిరుపతి రుయాకు రెఫర్ చేశారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాసు పుస్తకాల్లో తప్పులు
● అధికారులకు తప్పని నిలదీతలు ● అధిక భూ విస్తీర్ణం నమోదుపై మండిపడుతున్న రైతులుపెద్దతిప్పసముద్రం : చంద్రబాబు ప్రభుత్వం ఎంతో ప్రతిష్టాత్మకమంటూ ఊదర గొడుతూ చేపట్టిన పట్టాదార్ పాసు పుస్తకాల పంపిణీతో రెవెన్యూ అధికారులు రైతుల నుంచి చీవాట్లు ఎదుర్కొంటున్నారు. తప్పులన్నీ చేసేదీ మీరే..మళ్లు మా జేబులకు చిల్లులు పెట్టి చలానా కట్టించుకుని సవరించేది మీరేనా అంటూ రైతులు అధికారులపై మండి పడుతున్నారు. ఈ నేపథ్యంలో బుధవారం మండలంలోని మడుమూరు సచివాలయం ఎదుట పాసు పుస్తకాల పంపిణీపై రెవెన్యూ అధికారులు గ్రామసభ నిర్వహించారు. పుస్తకాలు అందుకున్న రైతులు అందులో ఇష్టారాజ్యంగా పొందు పరచిన భూ వ్యత్యాసాలను చూసి అసహనం వ్యక్తం చేస్తున్నారు. అస్తవ్యస్తంగా వివరాలు నమోదు చేసి ఇస్తున్న ఈ పుస్తకాల కోసమా ప్రభుత్వం రూ. కోట్ల ప్రజాధనం దుర్వినియోగం చేసిందని రైతులు ఎద్దేవా చేస్తున్నారు. 1.75 ఎకరాలుంటే రూ.15 ఎకరాల నమోదు నాకు ఉన్న భూమి 1.75 ఎకరాలే. రాజముద్రతో మీరిచ్చిన కొత్త పాసు పుస్తకాల్లో మాత్రం 15.90 ఎకరాల భూమి ఉందని నమోదు చేశారు. అధికారులుగా మీరు ఇచ్చిన బుక్కుల ప్రకారం 15 ఎకరాల భూమి ఆన్లైన్ చేసి అది ఎక్కడ ఉందో చూపించండి అని శ్రీనివాసులురెడ్డి అనే రైతు తహసీల్దార్ శ్రీరాములు నాయక్ను ప్రశ్నించాడు. మళ్లీ చలానా కడితే సవరించి ఇస్తామని తహసీల్దార్ చెప్పడంతో మీరు ఇస్తున్న పాసు పుస్తకాల్లో 90 శాతం అన్నీ తప్పులే ఉన్నాయి..సరిచేసి ఇవ్వాలి కదా అని రైతు తిరిగి ప్రశ్నిస్తూ నిలదీశాడు. ప్రభుత్వ పథకాలు నిలిచిపోతే బాధ్యత ఎవరిది? కూలి చేసుకుని బతికేవాళ్ల. మాకు ఉన్న అరకొర భూములు కాకుండా మాకు లేని భూమి ఉన్నట్లు పాసు పుస్తకాల్లో ఉన్నాయి. మా కుటుంబాలకు ప్రభుత్వం ద్వారా వస్తున్న పింఛన్, అమ్మ ఒడి, స్కాలర్షిప్ లాంటి సంక్షేమ పథకాలు నిలిచిపోతే ఎవరు బాధ్యత వహిస్తారని రైతులు రెవెన్యూ అధికారుల ఎదుట గోడును వెళ్లబోసుకుంటున్నారు. లేదంటే మా దినసరి కూలి పనులు, సేద్యాలు, పాడి ఆవులన్నీ వదిలేసి భూమి విస్తీర్ణం మార్పుల కోసం చలానా కట్టి నెలల తరబడి మీ ఆఫీసు చుట్టూ ప్రదక్షిణలు చేయాలా అంటూ మరి కొందరు అధికారులపై మండి పడుతున్నారు. -
నకిలీ నోట్ల ముఠా గుట్టురట్టు
● 9 మంది నిందితుల్లో ఆరుగురు అరెస్ట్ ● రూ.2లక్షల10వేలు ఫేక్ కరెన్సీ, 6 మొబైల్ఫోన్లు స్వాధీనంమదనపల్లె రూరల్ : రూ.లక్ష అసలు కరెన్సీకి రెండు రెట్లు అధికంగా నకిలీ నోట్లు మార్పిడి చేస్తున్న ముఠా గుట్టు రట్టయింది. ఈ ముఠాను ముదివేడు పోలీసులు అరెస్ట్ చేయగా, మదనపల్లె డీఎస్పీ కే.మహేంద్ర బుధవారం వివరాలు వెల్లడించారు. నకిలీనోట్ల వ్యవహారంలో మొత్తం 9 మంది నిందితులను గుర్తించామని, వారిలో ఆరుగురిని అరెస్ట్చేసి, రూ.2లక్షల10వేలు ఫేక్ కరెన్సీ, 6 సెల్ఫోన్స్ స్వాధీనం చేసుకున్నామన్నారు. నకిలీనోట్ల తయారీకి సంబంధించిన ఏ–1 ప్రధాన నిందితుడుతో సహా మరో ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. దొరికిన నిందితుల నుంచి క్లూస్ సేకరించి త్వరలోనే వారిని పట్టుకుంటామన్నారు. నకిలీనోట్ల ముఠాలో ప్రధాన నిందితుడైన ఏ–1 ఫేక్ నోట్లను తయారుచేసి, కర్ణాటకలోని బెల్గామ్ జిల్లా హుక్కేరి తాలూకా గులాబషా టాకియా వీధికి చెందిన మహమ్మద్ జుబేర్ మకందర్(27) ద్వారా తను చెప్పిన వ్యక్తులకు 1ః2 నిష్పత్తిలో అంటే, 10 వేలు ఒరిజినల్ నోట్లు ఇస్తే...20 వేలు నకిలీనోట్లు ఇస్తుంటాడు. రెండేళ్లుగా ఈ విధంగా సంపాదించిన డబ్బులను ఏ–1, మహమ్మద్ జుబేర్ ఇద్దరూ పంచుకునేవారు. ఈ క్రమంలో తెలంగాణ హైదరాబాద్ సిటీ హయత్నగర్కు చెందిన చిన్నోళ్ల మాణిక్యరెడ్డి(50)కి ఏ–1 పరిచయం అయ్యాడు. నకిలీనోట్ల మార్పిడి గురించి చెబితే, అందుకు మాణిక్యరెడ్డి ఒప్పుకోవడమే కాకుండా, తనకు తెలిసిన వారైన తెలంగాణ భూపాలపల్లె జిల్లా టేకుమట్ల మండలం బోర్నపల్లెకు చెందిన రేనుకుంట్ల సుమన్(32), హైదరాబాద్ షామీర్పేట్ బీజేఆర్ నగర్కు చెందిన చింతకుంట్ల సుమన్ అలియాస్ పీటర్ (27)ను కలుపుకుని నకిలీనోట్లు మార్పిడి చేస్తుండేవారు. మూడు నెలల క్రితం ఏ–1, బెల్గామ్లో ఇచ్చిన రూ.2లక్షల నగదును తీసుకుని మార్పిడి చేయాలని నిర్ణయించుకున్నారు. ఒకే ప్రాంతంలో తరచూ నకిలీ నోట్లు మార్పిడి చేస్తే పట్టుబడతామనే ఆలోచనతో కొత్తగా వేరే ప్రాంతాల్లో చలామణి చేయాలని నిర్ణయించారు. ఈ క్రమంలో మాణిక్యరెడ్డి, కొద్దిరోజుల క్రితం తనకు పరిచయమైన శ్రీ సత్యసాయిజిల్లా రామగిరి మండలం పేరూరుకు చెందిన కమ్మర వెంకటేష్(42), అన్నమయ్యజిల్లా వాల్మీకిపురం మండలం ప్యారంపల్లె గొల్లపల్లెకు చెందిన దాదిమి రమణప్ప(39)ను ముఠాలో సభ్యులుగా చేర్చుకున్నారు. దాదిమి రమణప్ప అంగళ్లులో కాపురం ఉండటంతో, అక్కడ జనసంచారం తక్కువగా ఉంటుందని, నకిలీ నోట్లు మార్చేందుకు అనువుగా ఉంటుందని నిర్ణయించుకున్నారు. ఏ–1 నిందితుడు జనవరి 6న రూ.2లక్షల10వేల రూపాయల ఫేక్ కరెన్సీని, మహమ్మద్ జుబేర్ ద్వారా అంగళ్లుకు పంపాడు. జుబేర్ నుంచి మధ్యాహ్నం 3 గంటల సమయంలో మాణిక్యరెడ్డి, సుమన్, సైమన్, వెంకటేష్, రమణప్పలు నకిలీ కరెన్సీని తీసుకుని మాట్లాడుకుంటుండగా, పోలీసులకు ముందుగా అందిన సమాచారం మేరకు ముదివేడు పోలీసులు కదిరి–మదనపల్లె మెయిన్రోడ్డు దొమ్మన్నబావి క్రాస్ వద్ద ఆరుగురిని అరెస్ట్చేసి, నగదుతో పాటు 6 సెల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసు విచారణలో సమర్ధవంతంగా బాధ్యతలు నిర్వర్తించిన రూరల్ సీఐ రవినాయక్, ఎస్ఐ మధురామచంద్రుడు, సిబ్బంది ప్రసాద్, చక్రి, వెంకటేష్, ప్రతాప్, శ్రీనివాస్ను ప్రత్యేకంగా అభినందించారు. రివార్డుకు సిఫారసు చేస్తున్నట్లు తెలిపారు. -
ఎర్రచందనం దుంగలు స్వాధీనం
రామాపురం : గువ్వలచెరువు తూర్పుబీటు పాలకొండ వంగిమళ్ళ రిజర్వ్ ఫారెస్టులో పాము పొడుగు రాయి వద్ద 4 ఎర్రచందనం దుంగలను అటవీ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. రాయచోటి రేంజ్ ఆఫీసర్ జె మదన్మోహన్ ఆదేశాల మేరకు అధికారులు కూంబింగ్ చేస్తుండగా వాహనంలో ఎర్రచందనం దుంగలను ఎక్కిస్తున్న నిందితులను గుర్తించారు. అధికారులు వారిని చుట్టుముట్టారు. కర్ణాటకలోని గుల్బర్గాకు చెందిన డ్రైవర్ ఎండీ సుకూర్,తమిళనాడులోని వేలూరు చెందిన చిన్నరాజలతో సహా 4 ఎర్రచందనం దుంగలను పట్టుకున్నారు. దుంగల బరువు సుమారు 100 కేజీలు ఉంటుందని వాటి విలువ 50,000 వరకు ఉంటుందని రాయచోటి రేంజ్ ఆఫీసర్ జె మదన్మోహన్ అన్నారు. నిందితులను తిరుపతి రెడ్ శాండిల్ కోర్టుకు తరలించారు. దాడిలో ఎఫ్ఎస్ఓ జి.భరణికుమార్,ఎఫ్బిఓ కే.రఘుపతి రాజు తదితరులు పాల్గొన్నారు. -
రాయచోటి జిల్లా సాధన కోసం పోరాటం ప్రారంభం
రాయచోటి అర్బన్ : అన్నమయ్య జిల్లా కేంద్రంగా ఉన్న రాయచోటిని రద్దు చేసి ప్రభుత్వం చేసిన తప్పును సరిదిద్దుకోవడానికి 14 మండలాల కేంద్రంగా ఉన్న రాయచోటిని ప్రత్యేక జిల్లాగా ప్రకటించాలని రిటైర్డ్ సెకండ్ క్లాస్ మెజిస్ట్రేట్ రెడ్డికుమార్ పేర్కొన్నారు. ఈ మేరకు బుధవారం అంబేడ్కర్ ఫ్లెక్సీ వద్ద నూతనంగా తయారు చేసిన రాయచోటి జిల్లా చిత్రపటాన్ని అఖిలపక్ష కమిటీతో కలిసి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లా కేంద్రాన్ని మార్చే ప్రసక్తే లేదని హామీ ఇచ్చిన ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు మాటలు నమ్మి ప్రజలు పలు రకాల పెట్టుబడులు రాయచోటి ప్రాంతంలో పెట్టుకున్నారని గుర్తుచేశారు. అయితే జిల్లా కేంద్రం మార్చడంతో వారంతా నష్టపోతున్నారని తెలిపారు. ఈ తప్పును సరిదిద్దుకునేందుకు రాయచోటి చుట్టూ ఉన్న 14 మండలాలను కలుపుకుని ప్రత్యేక జిల్లాగా చేయాలని డిమాండ్ చేశారు. రిటైర్డ్ ఎంఈవో రెడ్డెన్న మాట్లాడుతూ మూడున్నర సంవత్సరాలుగా కొనసాగిన జిల్లా కేంద్రాన్ని రద్దు చేసి మదనపల్లెను జిల్లా చేయడంలో తమకు ఎలాంటి అభ్యంతరం లేదని అయితే రాయచోటి ప్రత్యేక జిల్లా చేయాల్సిందేనని ఆయన డిమాండ్ చేశారు. భారత న్యాయవాదుల సంఘం వర్కింగ్ ప్రెసిడెంట్ ఈశ్వర్, ఎమ్మార్పీఎస్ జాతీయ నాయకుడు, పౌర హక్కుల సంఘం నాయకుడు రెడ్డెయ్య, రవిశంకర్, ఉపాధ్యాయులు హరిబాబు, రామచంద్ర, రజక సంఘం నాయకులు రమేష్, శ్రీనివాసులు, వడ్డెర సంఘం నాయకులు జీవానందం, చల్లా రెడ్డెయ్య, చంద్రశేఖర్, న్యాయవాదుల సంఘం నాయకులు ఆనంద్ కుమార్, ఐఏఎల్ నాయకులు నాగముని, రవిశంకర్, జగదీష్, కోటేశ్వరరావు, శంకర్ నాయక్, రమణ, చెన్నకృష్ణ, తాతయ్య, ఖాదర్ బాషా, రామచంద్ర, బసిరెడ్డి, శ్రీనివాసులు తదితరులు పాల్గొన్నారు. -
నేడు బోయకొండలో హుండీ ఆదాయం లెక్కింపు
చౌడేపల్లె : పుణ్యక్షేత్రమైన శ్రీ బోయకొండ గంగమ్మ ఆలయంలో గురువారం ఉదయం 7 గంటలకు హుండీ కానుకలను లెక్కించనున్నారు. ఈ విషయాన్ని ఆలయ ఈఓ ఏకాంబరం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ లెక్కింపు కార్యక్రమానికి బ్యాంకు, ఆలయ, పోలీసు సిబ్బంది హాజరు కావాలని కోరారు. వైఎస్సార్ సీపీలో నియామకాలు సాక్షి అన్నమయ్య : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ రాష్ట్ర, జిల్లా అనుబంధ విభాగాల కమిటీలలో జిల్లాకు చెందిన పలువురిని నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్ర లీగల్ సెల్ కమిటీలో... జనరల్ సెక్రటరీగా వీసీ రెడ్డెప్పరెడ్డి (రాయచోటి), సెక్రటరీగా ఎన్.శ్రీనివాస్రెడ్డి (రాయచోటి), జాయింట్ సెక్రటరీలుగా ఎం.గోవర్దన్రెడ్డి (రాజంపేట), టి.ఆనంద్ యాదవ్ (మదనపల్లె)లు నియమితులయ్యారు. జిల్లా అనుబంధ విభాగ కమిటీలలో.. జిల్లా యూత్ వింగ్ సెక్రటరీగా యండపల్లి శ్రీకాంత్రెడ్డి, జిల్లా మైనార్టీ సెల్ కార్యదర్శిగా షేక్ మహమ్మద్ రఫీ, జిల్లా పబ్లిసిటీ విభాగం కార్యదర్శిగా షేక్ రెడ్డి గఫార్, జిల్లా సోషల్ మీడియా విభాగ కార్యదర్శిగా మండెం రాఘవేంద్రలను నియమితులయ్యారు. వీరందరూ రాయచోటికి చెందిన వారుగా ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. వైఎస్సార్సీపీలో నియామకాలు చిత్తూరు అర్బన్ : వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీలో పలువురికి స్థానం కల్పిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. మైనారిటీ విభాగం జోన్–5 వర్కింగ్ ప్రెసిడెంట్గా పుంగనూరుకు చెందిన షేక్ ఫక్రుద్ధీన్ షరీఫ్, రాష్ట్ర లీగల్ సెల్ ప్రధాన కార్యదర్శిగా చిత్తూరుకు చెందిన పి.రవీంద్రనాథ్ రెడ్డి, రాష్ట్ర లీగల్సెల్ అధికార ప్రతినిధిగా నగరికి చెందిన బి.రవీంద్ర, రాష్ట్ర లీగల్సెల్ కార్యదర్శులుగా పుంగనూరుకు చెందిన కె.గోవర్దన్రెడ్డి, చిత్తూరుకు చెందిన ఇ.సుగుణశేఖర్రెడ్డి, జిల్లా ఉద్యోగులు–పెన్షనర్ల విభాగం అధ్యక్షుడిగా పలమనేరుకు చెందిన ఎన్.సోమచంద్రారెడ్డిను నియమిస్తున్నట్లు ప్రకటించారు. శాస్త్రోక్తంగా అధ్యయనోత్సవాలు ఒంటిమిట్ట : పవిత్ర ధనుర్మాసంలో భాగంగా 20వ రోజైన బుధవారం ఒంటిమిట్ట శ్రీ కోదండ రామాలయంలో అధ్యయనోత్సవాలు శాస్త్రోక్తంగా సాగాయి. రంగమండపంలో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన పీఠంపై కొలువు తీరిన సీతారామలక్ష్మణ ఉత్సవ మూర్తులను పట్టువస్త్రాలు, అభరణాలు, పుష్పమాలలతో అలంకరించారు. అనంతరం వేదపండితులు రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలను పారాయణం చేశారు. మూల విరాట్ దర్శనానికి వచ్చేసిన భక్తులకు ఈ మహత్కార్యాన్ని తిలకించే భాగ్యం లభించింది. శని, ఆదివారాల్లోనూ దరఖాస్తుల స్వీకరణ కడప ఎడ్యుకేషన్ : జిల్లాలో సమగ్ర శిక్ష సొసైటీ ద్వారా నడుస్తున్న కస్తూర్బా గాంధీ బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న బోధన, బోధనేతర సి బ్బంది పోస్టులను (35 ఖాళీలు) పొరుగు సేవల (ఔట్సోర్సింగ్) ప్రాతిపదికన భర్తీ చేయుటకు అభ్యర్థుల నుంచి దరఖాస్తులను 10వ తేదీ రెండవ శనివారం, 11వ తేదీ ఆదివారం కూడా స్వీకరించనున్నట్లు సమగ్రశిక్ష ఏపీసీ ప్రేమంత్కుమార్ తెలిపారు. ప్రభుత్వ సెలవు రోజులయినప్పటికీ కార్యాలయ సిబ్బంది విధుల్లో కొనసాగి అభ్య ర్థుల నుంచి దరఖాస్తులను స్వీకరిస్తారని తెలిపారు. అభ్యర్థులు దరఖాస్తులు అందజేయాలని సమగ్రశిక్ష ఏపీసీ వివరించారు. హాల్టికెట్లు విడుదల రాజంపేట : రాజంపేట మండలం నారమరాజుపల్లెలోని జవహర్ నవోదయ విద్యాలయంలో 2026– 2027 విద్యాసంవత్సరానికి 9, 11వ తరగతులలో ప్రవేశపరీక్ష రాసేందుకు హాల్టికెట్లు విడుదలైనట్లు ఇన్చార్జి ప్రిన్సిపాల్ గంగాధరన్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఫిబ్రవరి 7న ప్రవేశపరీక్ష జరుగుతుందని పేర్కొన్నారు. ప్రవేశపరీక్ష నిమిత్తం దరఖాస్తు చేసుకున్న విద్యార్థుల రిజిస్ట్రేషన్ నంబరు, పుట్టినతేది నమో దు చేసి ఆన్లైన్ కింద ఇచ్చిన లింక్ ద్వారా డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. లింక్ హెచ్టీటీపీః//సీబీఎస్ఈఐటీఎంఎస్.ఆర్సీఐఎల్.జీఓవీ.ఇన్/ఎన్వీఎస్/ను సంప్రదించాలని సూచించారు. -
●హంద్రీ–నీవా నాశనం
● తాను చేపట్టని సాగునీటి ప్రాజెక్టులంటే చంద్రబాబుకు చిన్నచూపు ● వైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన రూ.వేల కోట్ల ప్రాజెక్టులను నిలిపివేసిన బాబు సర్కార్ మదనపల్లె : చంద్రబాబు అధికారంలో ఉండగా .. ఇతరుల హయాంలో మొదలైన ప్రాజెక్టులకు గ్రహణం పట్టినట్లే. అవును.. ఆయన చేపట్టని ప్రాజెక్టులంటే అస్సలు గిట్టదంతే.. ప్రాజెక్టుల పనులు మొదలైనా, పురోగతిలో ఉన్నా, చివరదశలో ఉన్నా సరే ఒక్క అడుగు ముందుకేస్తే ఒట్టే. ప్రస్తుత పరిస్థితి చూస్తే ఈ విషయం స్పష్టమవుతుంది. వ్యవసాయంపై ఆధారపడిన మన గ్రామీణ ప్రాంతాల రైతాంగానికి నీళ్లు పుష్కలంగా అందుబాటులో ఉండాలి. దీనికోసం అందుబాటులోని వనరులను సద్వినియో గం చేసుకోవాలి లేదంటే ప్రాజెక్టుల ద్వారా నీటి ఆధారం కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే. దీన్ని అక్షరాలా పాటించిన పాలకులు వైఎస్.రాజశేఖర్రెడ్డి, వైఎస్.జగన్మోహన్రెడ్డి. వీరిపాలనలో ఎప్పుడూ జరగనంతగా ప్రాజెక్టుల అభివృద్ధి జరిగింది. పురోగతిలో ఉన్న ప్రాజెక్టులను పూర్తిచేసి రైతాంగ ప్రయోజనాలను కాపాడాల్సిన చంద్రబాబు సర్కా ర్ వీటికి మరణశాసనం రాశారు. వేలకోట్లతో జరిగిన ప్రాజెక్టుల పనులు ఆగిపోయి కనిపిస్తున్నాయి. తనసొంతజిల్లాకు ఉపయోగమైనా సరే... ఎన్టీఆర్ చేపట్టిన హంద్రీ–నీవా ప్రాజెక్టు కూడా చంద్రబాబు పాలనలో వెన్నుపోటుకు గురైంది. అదే ప్రాజెక్టును సీఎం వైఎస్.రాజశేఖర్రెడ్డి చేపట్టి అత్యధిక శాతం పనులు పూర్తిచేస్తే..దీన్ని అపలేని పరిస్థితుల్లో కొంతమేర పని చేయించి ఇదిగో ఇది నా ఘనత, హంద్రీ–నీవాను నేనే పూర్తి చేశానంటూ చంద్రబాబు గొప్పగా ప్రచారం చేసుకుంటున్నారు. అనుసంధానం వద్దంట చంద్రబాబు సొంతజిల్లా ఉమ్మడిచిత్తూరుకు ప్రయోజనం కలిగించే హంద్రీనీవా, గాలేరు–నగరి ప్రాజెక్టుల అనుసంధానంతో కరువు రైతుల తలరాతను మార్చేదిశగా వైఎస్.జగన్మోహన్రెడ్డి రూ.4,373.23 కోట్లతో పనులు చేపట్టారు. వీటిలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చేనాటికి రూ.1,220 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఈ అనుసంధానం ద్వారా గండికోట రిజర్వాయర్ నుంచి 20 టీఎంసీల కృష్ణానీటిని తరలిస్తారు. 13 టీఎంసీలు ఉమ్మడిచిత్తూరుజిల్లాకు పంపిణీ అవుతాయి. తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పలమనేరు, కుప్పం నియోజకవర్గాల ప్రయోజనం. అధికారంలోకి రాగానే ఈ ప్రాజెక్టు వద్దంటూ పనులు నిలిపివేశారు. దీనివల్ల నిధుల వినియోగం నిష్పలంకాగా రైతాంగానికి ప్రయోజనం అన్న విషయాన్ని పట్టించుకోకుండా తాను చేపట్టింది కాదన్న ధోరణితో ఆపేయించారు. ఈ పథకంవల్ల అడవిపల్లె, శ్రీనివాసపురం రిజర్వాయర్లు, ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్లను నింపుతారు. ఈ పథకంతో ఈ ప్రాంతంలో కొత్తగా 2,48,150 ఎకరాల ఆయకట్టు సాగులోకి వస్తుంది. అయితే కూటమి పాలనలో చంద్రబాబు సర్కార్కు ఇది ఇష్టంలేదు ప్రాజెక్టు ఆగిపోయింది. వైడనింగ్ అసలే వద్దుహంద్రీ–నీవా ప్రాజెక్టులో భాగంపై పుంగనూరు ఉపకాలువను వెడల్పు అధిక సామర్థ్యంలో కృష్ణాజలాలను తరలించి రైతాంగానికి సాగునీరు ఇద్దామని వైఎస్.జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో రూ.1,929 కోట్లతో పనులు చేపట్టారు. మాజీ మంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి, ఎంపీ పీవీ.మిథున్రెడ్డి ఈ ప్రాజెక్టు మంజూరు కోసం చాల శ్రమపడ్డారు. చంద్రబాబు సర్కార్ అధికారంలోకి రాగానే పనులను అడ్డుకుంది. వెడల్పు పనులు వద్దంటూ, ఈ నిధుల నుంచే రూ.480 కోట్లతో లైనింగ్ పనులు చేపట్టింది. లైనింగ్ వద్దని రైతులు వ్యతిరేకించినా పట్టించుకోలేదు. దీనివల్ల రైతులు 13 టీఎంసీల అదనపు కృష్ణా జలాలను కోల్పోవాల్సి వచ్చింది. రిజర్వాయర్ల అడ్డగింత జిల్లాలోని తంబళ్లపల్లె, పుంగనూరు నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.2,100 కోట్లతో చేపట్టిన ముదివేడు, నేతికుంటపల్లె, ఆవులపల్లె రిజర్వాయర్ల నిర్మాణం చేపట్టారు. ఈ ప్రాంతాలకు గత పాలకులు పట్టించుకోకపోవడంతో మాజీమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ పీవి.మిథున్రెడ్డి, ఎమ్మెల్యే పెద్దిరెడ్డి ద్వారకనాథరెడ్డి కృషితో రిజర్వాయర్లను మంజూరు చేయించారు. ఈ పనులు ప్రారంభమై కీలకదశలో ఉన్న సమయంలో ప్రతిపక్షంలో ఉన్న చంద్రబాబు టీడీపీ నేతలతో కేసులు వేయించి పనులు అడ్డుకున్నారు. తర్వాత ప్రాజెక్టుల సందర్శన చేపట్టి చంద్రబాబు ప్రజలు, రైతాంగాన్ని తప్పుదోవ పట్టించేలా విమర్శలు చేశారువైఎస్సార్సీపీ ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం రైతులకు ద్రోహం చేయడమే. రైతులు, ప్రజల జీవన ప్రమాణాల్లో మార్పును తెచ్చి వ్యవసాయ అభివృద్ధికి దోహదం చేసే ప్రాజెక్టులను ఆధునిక దేవాలయాలంటారు. ఒక అభివృద్ధి పని మొదలయ్యాక ఏ ప్రభుత్వమైనా కొనసాగించి వాటి ఫలాలను ప్రజలకు అందించడం బాధ్యత. దీన్ని విస్మరించడం దారుణం. కోట్లు ఖర్చుచేసిన ప్రాజెక్టుల పనులు నిరుపయోగం చేయడం భావ్యంకాదు. రైతు ప్రయోజనాలను కాపాడేలా ప్రాజెక్టుల పనులు పూర్తి చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిదే. – పీవీ.మిథున్రెడ్డి, రాజంపేట ఎంపీ -
పెద్ద పండక్కు ధరాఘాతం
రాజంపేట టౌన్ : పెద్ద పండగ సంక్రాంతి ప్రజల గుండెల్లో గుబులు పుట్టిస్తోంది. నింగినంటిన కూరగాయలు,నిత్యావసర ధరలు వినియోగదారులకు చుక్కలు చూపిస్తోంది. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో వివిధ రకాల పథకాల వల్ల ప్రజలకు ఆర్థిక స్వావలంబన లభించేది. దీంతో ప్రజలు ఆర్థిక ఇబ్బందులు లేకుండా జీవనం సాఫీగా సాగించేవారు. పండుగలను కూడా ఆనందంగా జరుపుకునేవారు.చంద్రబాబు నాయుడు సర్కార్లో సీన్ రివర్స్ అయింది. చంద్రబాబునాయుడు గత ఎన్నికల్లో ఇచ్చిన మేరకు పథకాలను అమలు చేయకపోగా, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలోని పథకాలను కూడా తొలగించారు. దీంతో ప్రజలు ఆర్థికంగా తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితులు నెలకొన్నాయి. ఫలితంగా తెలుగువారికి అతి పెద్ద పండుగ అయిన సంక్రాంతిని కూడా పేద, మధ్యతరగతి ప్రజలు సంతోషంగా జరుపుకోలేని పరిస్థితి నెలకొంది. దీనికి తోడు గోరుచుట్టపై రోకటిపోటులా నిత్యావసర సరుకులు, కూరగాలు, కోడిగుడ్లు, చికెన్, మటన్ ... ఇలా అన్ని రకాల ధరలు ఆకాశాన్నంటాయి. దీంతో పేద,మధ్య తరగతి ప్రజలకు పండగ భారంగా మారింది. ఇక ప్రభుత్వం చౌకదుకాణాల్లో కూడా కందిపప్పును ఇవ్వక పోవడంతో పేద ప్రజలు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అప్పులు చేస్తే కాని పండుగ గడవదు.. సంక్రాంతి పండుగను జరుపుకోవాలంటే ప్రజలు అప్పులు చేయాల్సిన పరిస్థితి నెలకొంది. పండగ సందర్భంగా దాదాపు 90 శాతం మంది హిందువులు పిండివంటలు చేసుకుంటారు. పిండి వంటలకు కావాల్సిన ప్రధానమైన నూనె ధర లీటరు 155 రూపాయిలు ఉంది. అలాగే కందిపప్పు కిలో రూ.120, ఉద్దిపప్పు కిలో.110 ఉంది. ఇలాంటి పరిస్థితుల్లో దినసరి కూలీలు, పనికి వెళితేనే పూటగడిచే పరిస్థితులు ఉన్న నిరుపేద వర్గాల ప్రజల్లో సంక్రాంతి సంతోషం కనిపించడం లేదు. ఏది ఏమైనా కూటమి ప్రభుత్వం వచ్చినప్పటి నుంచి అన్నిరకాల వస్తువుల ధరలు అమాంతంగా పెరగడంతో సామాన్య ప్రజల జీవనం దుర్లభంగా మారింది. సంక్రాంతి పెద్ద పండుగ. రేషన్ స్టోర్లలో ప్రభుత్వం కందిపప్పు కూడా ఇవ్వకుంటే మాలాంటి పేదోళ్లకు పప్పు అన్నం కూడా కరువవుతుంది. కనీసం స్టోర్లలో ఈనెల కందిపప్పు ఇచ్చినా పప్పు అన్నం అయినా తినేవాళ్లం. అన్ని రకాల వస్తువులు, కూరగాయలు, మాంసాహార ధరలు పెరిగాయి. – లలితమ్మ, రాజంపేట మేము నిరుపేదలం. మాబోటివాళ్లు సంక్రాంతి పండుగను సంతోషంగా చేసుకునే పరిస్థితి లేదు. కూరగాయల నుంచి అన్ని ధరలు పెరిగి ఉన్నాయి. ధరలు ఈ విధంగా పెరిగితే ఏం కొనాలి.. పండుగను ఎలా చేసుకోవాలి.. పండుగ పూటయినా ధరలను తగ్గిస్తే బాగుంటుంది. – లక్షుమ్మ, తుమ్మల అగ్రహారం, రాజంపేట మండలం ఆకాశాన్నంటుతున్న కూరగాయల ధరలు నిత్యావసర సరుకులదీ అదే దారి గుడ్లు, చికెన్, మటన్ కూడా...... ప్రభుత్వ పథకాలు అమలుకాక... చేతిలో డబ్బులు లేక.. పేద, మధ్య తరగతి ప్రజల్లో కనిపించని సంక్రాంతి సంతోషం -
హెల్మెట్ భారం కాదు భరోసా
మదనపల్లె రూరల్ : ద్విచక్రవాహనదారులు హెల్మెట్ ధరించడాన్ని భారంగా అనుకోకుండా భరోసాగా భావించి తప్పనిసరిగా ధరించాలని ఎస్పీ ధీరజ్ కునుబిల్లి తెలిపారు. 37వ జాతీయ రహదారి భద్రత మాసోత్సవాల్లో భాగంగా బుధవారం పట్టణంలోని మిషన్ కాంపౌండ్ వద్ద హెల్మెట్ అవగాహన ర్యాలీని ఆయన జెండా ఊపి ప్రారంభించారు. ఎస్పీ ధీరజ్ కునుబిల్లి స్వయంగా హెల్మెట్ ధరించి, మిషన్ కాంపౌండ్ నుంచి చౌడేశ్వరి సర్కిల్ వరకు బైక్ నడిపి ఆదర్శంగా నిలిచారు. ఈ సందర్భంగా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా జరుగుతున్న రోడ్డు ప్రమాదాలను విశ్లేషిస్తే, సుమారు 70 శాతం మరణాలు కేవలం హెల్మెట్ లేకపోవడం వల్లే సంభవిస్తున్నట్లు తెలుస్తోందన్నారు. తలకు తగిలే చిన్న గాయం ఒక నిండు ప్రాణాన్ని బలి తీసుకుని, కుటుంబాన్ని రోడ్డున పడేస్తుందని, ఇది అత్యంత విచారకరమన్నారు. హెల్మెట్ అనేది కేవలం ఒక వస్తువు కాదని, ప్రాణాలను కాపాడే భద్రతా కవచంగా పేర్కొన్నారు. వాహనం నడిపే వారితో పాటు వెనుక కూర్చునే వ్యక్తి కూడా హెల్మెట్ ధరించడం వల్ల సంపూర్ణ రక్షణ లభిస్తుందన్నారు. మద్యం తాగి వాహనం నడపడం, మైనర్లకు వాహనాలు ఇవ్వడం, ట్రిపుల్ రైడింగ్ చేయడం చట్టరీత్యా నేరమన్నారు. డ్రైవింగ్ చేసేటప్పుడు సెల్ఫోన్ మాట్లాడటం ప్రాణాంతకమని హెచ్చరించారు. ప్రతి వాహనదారుడు తప్పనిసరిగా డ్రైవింగ్ లైసెన్స్ కలిగి ఉండాలని, అతివేగాన్ని నియంత్రించుకోవాలన్నారు. అడిషనల్ ఎస్పీ యం.వెంకటాద్రి, డీఎస్పీ కే.మహేంద్ర, ట్రాఫిక్ సీఐ గురునాథ్, సీఐలు చంద్రశేఖర్, మహమ్మద్ రఫీ, రాజారెడ్డి, కళా వెంకటరమణ, పోలీస్ సిబ్బంది, ప్రజలు పాల్గొన్నారు. -
టీడీపీ నాయకులా.. మజాకా
● పది రోజులకే ఎస్ఐపై బదిలీ వేటు ● నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే చర్యలా.. సాక్షి టాస్క్ఫోర్స్ : వైఎస్సార్ కడప జిల్లా పులివెందులలో టీడీపీ నాయకుల అధికార దాహంతో మేము చెప్పిందే వినాలి.. మేము చెప్పినట్టే చేయాలి అన్న ధోరణిలో వారి వ్యవహార శైలి మారింది. నాలుగు రోజుల కిందట పులివెందుల మున్సిపాలిటీ పరిధిలోని ఉల్లిమెల్లగ్రామ సమీపంలో టీడీపీ మున్సిపల్ చైర్మన్ అభ్యర్థి తూగుట్ల మధుసూదన్రెడ్డి తోటలో జూదమాడుతున్నారని సమాచారం తెలుసుకుని పులివెందుల ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డి, లింగాల ఎస్ఐ జగదీశ్వరరెడ్డిలు ఆ ప్రాంతానికి వెళ్లారు. 10 రోజుల క్రితం ఎస్ఐగా బాధ్యతలు చేపట్టిన ప్రణయ్కుమార్ రెడ్డి జూదమాడుతున్న వారిని అరెస్ట్ చేసి జిల్లా ఉన్నతాధికారులకు తెలియజేశారు. ఈ సంఘటనలో జూదమాడుతున్న టీడీపీ నాయకులు ఎస్ఐపై అసభ్యకరమైన మాటలు మాట్లాడారు. అంతేగాక నువ్వు ఆఫ్ట్రాల్ ఎస్ఐవి, నువ్వు మాపై, మా నాయకులపై కేసు నమోదు చేస్తావా అంటూ ఇష్టం వచ్చినట్లు మాట్లాడారు. ఎస్ఐగా ప్రణయ్కుమార్రెడ్డి పులివెందులలో బాధ్యత చేపట్టి పట్టుమని పది రోజులు కాకముందే టీడీపీ నాయకులు ప్రొద్దుటూరు నియోజకవర్గంలోని రాజుపాలెంకు బదిలీ చేయించారు. ఏదీఏమైనా పులివెందులలో టీడీపీ నాయకుల మాట వినకుంటే. పోలీసులకే కాదు.. ఏ అధికారికై నా బదిలీ వేటు తప్పదేమోనని పలువురు చర్చించుకుంటున్నారు. నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే చర్యలా.. పులివెందుల ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డి నిష్పక్షపాతంగా విధులు నిర్వహిస్తే అతనిపై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవడం ఆశ్చర్యానికి కలిగిస్తోంది.జూదశాల నిర్వహిస్తున్న వ్యక్తి తెలుగుదేశం పార్టీకి చెందిన పెద్ద నాయకుడు కావడంతో ఎస్ఐపై బదిలీ వేటు పడటం గమనార్హం. వివాదస్పదమవుతున్న సబ్ డివిజనల్ అధికారి పోలీసు డిపార్ట్మెంట్కు విధేయుడుగా ఉండాల్సిన పులివెందుల సబ్ డివిజనల్ అధికారి అధికార పార్టీ నాయకులు చెప్పిన మాటలకు జీ హుజూర్ అంటూ విధులు నిర్వహించడం వివాదస్పదంగా మారింది. పేకాట ఆడుతున్న టీడీపీ నాయకులను తన చాంబర్లో కుర్చీలో కూర్చొబెట్టుకుని వారి ముందే సక్రమంగా విధులు నిర్వహిస్తున్న ఎస్ఐని దండించడం ఎంతవరకు సబబు అని పోలీసు డిపార్ట్మెంట్లో పలువురు ప్రశ్నిస్తున్నారు. అంతేకాకుండా ఎస్ఐ బదిలీ విషయంలో టీడీపీ నాయకులతో కలిసి సబ్ డివిజనల్ అధికారి కీలక పాత్ర పోషించినట్లు తెలుస్తోంది. నాకు తెలియకుండా దాడులు చేయవద్దు అధికార పార్టీ చేసే ఆగడాలకు, వారు చేసే అసాంఘిక కార్యకలాపాలకు, జూదాలకు పులివెందుల సబ్ డివిజనల్ అధికారి వెన్నుదన్నుగా ఉన్నాడని చెప్పవచ్చు. మూడు రోజుల క్రితం జరిగిన సంఘటనలో ఎస్ఐ ప్రణయ్కుమార్రెడ్డి టీడీపీ నాయకుల జూదశాలపై దాడి చేయడంపట్ల సబ్ డివిజనల్ అధికారి తీవ్రంగా ఆక్షేపించారు. అంతేకాకుండా ఇకపై తనకు తెలియకుండా జూదశాలలపై ఎవరూ దాడులు చేయకూడదని ఆదేశాలు జారీ చేసినట్లు తెలిసింది. చట్టాన్ని కాపాడాల్సిన అధికారులు ఇలా అధికార పార్టీ నాయకులకు కొమ్ము కాస్తూ అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు తెలపడంపై ప్రజలు తీవ్రంగా ఆక్షేపిస్తున్నారు. -
మార్షల్ ఆర్ట్స్ క్రీడాకారులకు వర్క్షాప్
మదనపల్లె సిటీ: విజయవాడ భవానీదీవిలో ఈనెల 9,10 తేదీల్లో జరిగే మార్షల్ ఆర్ట్స్ వర్క్షాపును క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా క్రీడాభివృద్ధి అధికారి చంద్రశేఖర్ ఓ ప్రకటనలో తెలిపారు. వర్క్షాపులో కరాటే, తైక్వాండో, జూడో, కుంగ్ఫూ తదితర మార్షల్ ఆర్ట్స్ విభాగాలకు చెందిన క్రీడాకారులు, కోచ్లు, శిక్షణార్థులు పాల్గొనవచ్చని పేర్కొన్నారు. ఆసక్తిగల అభ్యర్థులు ఈనెల 7వతేదీ సాయంత్రంలోపు జిల్లా క్రీడాభివృద్ధి సంస్థ, అన్నమయ్య జిల్లాకు పంపాలన్నారు. వివరాలకు 91547 31106ను సంప్రదించాలని కోరారు. మదనపల్లె సిటీ: శబరిమలై అయ్యప్ప మాలధారుల కోసం ఈనెల 10న కొల్లం స్పెషల్ రైలు నడపనున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. 10న చర్లపల్లి నుంచి ఉదయం 10.30 గంటలకు బయలుదేరి మదనపల్లె రోడ్డుకు రాత్రి 10.28 గంటలకు చేరుకుని కొల్లంకు 11వతేదీ రాత్రి 10 గంటలకు చేరుకుంటుందన్నారు. తిరుగు ప్రయాణం 12వతేదీన కొల్లం నుంచి ఉదయం 2.30 గంటలకు బయలుదేరి మదనపల్లె రోడ్డుకు రాత్రి 11.48 గంటలకు చేరుకుంటుందన్నారు. అక్కడి నుంచి చర్లపల్లికి 13వతేదీ మధ్యాహ్నం 11.20 గంటలకు చేరుకుంటుందన్నారు. అయ్యప్ప మాలాధారులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. గాలివీడు: యూత్ గేమ్స్ ఎడ్యుకేషన్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా ఆధ్వర్యంలో నిర్వహించిన ఓపెన్ నేషనల్ ఖోఖో పోటీల్లో అన్నమయ్య జిల్లా, గాలివీడు మండలం అద్వైత గురుకులం పాఠశాల విద్యార్థులు విశేష ప్రతిభ కనబరిచి జాతీయ స్థాయి విజేతలుగా నిలిచారు. ఈ పోటీల్లో అద్వైత గురుకులం బాలురు,బాలికలు రెండూ జట్లు జాతీయ విజేతలుగా ఎంపిక కావడం విశేషం. జనవరి 25 నుంచి ఫిబ్రవరి 2 వరకు నేపాల్లో నిర్వహించనున్న అంతర్జాతీయ ఖోఖో పోటీలకు ఈ రెండు జట్లు ఎంపికయ్యాయని పాఠశాల చైర్మన్ డాక్టర్ బి. ఇంద్రసేన తెలిపారు. రాయచోటి టౌన్: రాష్ట్ర స్థాయి అండర్ –19 హాకీ జట్టుకు రాయచోటి రాజు విద్యాసంస్థలకు చెందిన జూనియర్ ఇంటర్ చదువుతున్న విద్యార్థి కోటకొండ వెంకటేష్ ఎంపికయ్యాడు. అన్నమయ్యజిల్లా జట్టు నుంచి ఈ నెలలో విశాఖపట్టణం జిల్లా నక్కపల్లెలో జరిగిన ఎస్జీఎఫ్ అండర్–19 విభాగంలో నిర్వహించిన పోటీల్లో ప్రతిభను చాటి రాష్ట్ర స్థాయికి ఎంపికై నట్లు రాయచోటి హాకీ ఫౌండర్ సీఐ చంద్రశేఖర్ తెలిపారు. ఈ విద్యార్థి ఈ నెల 12వ తేది నుంచి 17వ తేది వరకు రాజస్థాన్లో నిర్వహించే హాకీ పోటీల్లో పాల్గొంటాడని తెలిపారు. వెంకటేష్ను ఫౌండర్ సీఐతో పాటు రాజు కళాశాల ప్రిన్సిపల్ శంకర్ నారాయణ తదితరులు అభినందించారు. కురబలకోట: ఆదాయమే లక్ష్యంగా తక్కువ ఖర్చు ఎక్కువ దిగుబడి వచ్చే పంటలపై రైతులు దృష్టి సారించాలని జిల్లా వ్యవసాయ అధికారి శివనారాయణ సూచించారు. మంగళవారం ఆయన తెట్టులో స్ప్రింకర్లు, డ్రిప్ ద్వారా సాగవుతున్న వేరుశనగ సాగును పరిశీలించారు. రైతులకు సలహాలు, సూచనలు ఇచ్చారు. పూత దశ పంటకు ప్రాణం పోసే దశన్నారు. ఎఫ్పీఓ ద్వారా రైతులకు ఎరువులను అందుబాటులో ఉంచాలన్నారు. అలాగే చిరుధాన్యాల ఉత్పత్తిని పెంచాల్సిన అవసరం ఉందన్నారు. తక్కువ ఖర్చు తక్కువ నీటితో ఇవి సాగయి ఎక్కువ ఆదాయం వస్తుందన్నారు. ముఖ్యంగా ప్రకృతి వ్యవసాయం, సేంద్రీయ సాగు పద్దతులు అవలంభిస్తే రసాయనిక ఎరువులపై ఖర్చు తగ్గడంతో పాటు భూ సారం సంరక్షించుకోవచ్చన్నారు. -
భాకరాపేట జెడ్పీ హైస్కూల్ తనిఖీ
సిద్దవటం: మండలంలోని భాకరాపేట జెడ్పీ హైస్కూల్ను విద్యాశాఖ ఆర్జేడీ శామ్యూల్ మంగళవారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన ఉపాధ్యాయుల హాజరు పట్టిక పరిశీలించారు. అలాగే 6–10వ తరగతుల వరకు జరుగుతున్న ఎఫ్ఏ–3 పరీక్ష గదులను పరిశీలించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ పదవ తరగతి వంద రోజుల ప్రణాళికలో భాగంగా విద్యార్థులు వంద శాతం ఉత్తీర్ణులు అయ్యేలా చర్యలు తీసుకోవాలని ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మీకేశమ్మకు సూచించారు. అలాగే వెనుకబడిన విద్యార్థులపై ప్రత్యేక శ్రద్ధ తీసుకొని వారు కూడా పాస్ అయ్యే విధంగా చర్యలు తీసుకోవాలని సూచించారు. ఉపాధ్యాయులు పాల్గొన్నారు. -
● పుంగనూరుపై కక్షకట్టి
మదనపల్లె: వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో చేపట్టిన పథకాలు, ప్రాజెక్టులపై కూటమి ప్రభుత్వం వివక్ష చూపిస్తోంది. ఫ్లోరైడ్నీటితో ఇబ్బందులు పడుతున్న జిల్లా ప్రజలకు స్వచ్ఛమైన మంచినీటిని అందించేందుకు 2020లో సీఎం వైఎస్.జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన వాటర్గ్రిడ్ పథకాన్ని విడగొట్టి వివక్ష చూపిస్తోంది. పనులు చేపట్టకుండా కాంట్రాక్టును రద్దు చేయడమేకాక పథకాన్ని కుదించి ప్రజలకు అన్యాయం చేస్తోంది. – వాటర్గ్రిడ్ పథకాన్ని తంబళ్లపల్లె, మదనపల్లె, పుంగనూరు, పీలేరు, రాయచోటి నియోజకవర్గాలకు వర్తింపజేయాల్సిన ఆవశ్యకతను అప్పటిమంత్రి, పుంగనూరు ఎమ్మెల్యే పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, రాజంపేట ఎంిపీ పీవీ.మిథున్రెడ్డి గుర్తించి.. నిర్మాణానికి కృషి చేశారు. దాంతో వాటర్గ్రిడ్ పథకం పరిధి పెరిగి 27 మండలాల్లోని 4,938 పల్లెలు, మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీల్లో 2054 నాటి జనాభాకు అనుగుణంగా వాటర్గ్రిడ్కు ప్రభుత్వం రూపకల్పన చేసింది. దీనికోసం ఐదు నియోజకవర్గాలకు రూ.1,550 కోట్లు, మదనపల్లె, పుంగనూరు మున్సిపాలిటీలకు రూ.850 కోట్లను పనులకు కేటాయించారు. పనులు మొదలయ్యే దశలో... గండికోట రిజర్వాయర్ నుంచి కృష్ణా జలాలను ఐదు నియోజకవర్గాల్లోని గ్రామీణ, పట్టణ ప్రాంతానికి కలిపి 13,94,757 మంది జనాభాకు తాగునీటిని అందించే వాటర్గ్రిడ్ పనులకు 2023లో టెండర్లు నిర్వహించగా రివర్స్ టెండరింగ్లో రూ.1,825.68 కోట్లకు టెండర్ దాఖలైంది. దీనివల్ల ప్రభుత్వానికి రూ.76.08 కోట్లు మిగలగా, కాంట్రాక్టు సంస్థ గండికోట రిజర్వాయర్ నుంచి ఐదు నియోజకవర్గాల్లో పైప్లైన్, ట్యాంకులు, సంపులు, రీట్రిట్ప్లాంట్ నిర్మాణం తదితర వాటిపై సమగ్ర సర్వే పూర్తి చేసింది. ఇక పనులకు చర్యలు చేపడుతుండగా కూటమి ప్రభుత్వం రాకతో పథకానికి సంబంధించి కాంట్రాక్టును తప్పించింది. 18 మండలాలకే గ్రిడ్ పేజ్–1 పేరుతో చేపట్టిన పనులను తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజజకవర్గాల్లోని 18 మండలాలకే పరిమితం చేసింది. ఈ పనులకు 2025 ఏప్రిల్ 7 రూ.1,939.42 కోట్లతో కాంట్రాక్టు సంస్థతో ప్రభుత్వం ఒప్పందం చేసుకో గా 2027 అక్టోబర్ నాటికి పనులు పూర్తి చేయాలి. ఫేజ్–1కే రూ.2,370 కోట్లు వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదు నియోజకవర్గాల కు నీటిని అందించే పనులను రూ.1,825 కోట్లకే కాంట్రాక్టు అప్పగించింది. కూటమి ప్రభుత్వం ఈ కాంట్రాక్టును రద్దుచేసి వాటర్గ్రిడ్ పథకాన్ని తంబళ్లపల్లె, రాయచోటి, పీలేరు నియోజకవర్గాలకు కుదించి టెండర్లు నిర్వహించగా అంచనా వ్యయం రూ.2,370 కోట్లుగా, టెండర్ ఒప్పందం విలువ రూ.1,939 కోట్లకు అప్పగించింది. రెండు నియోజకవర్గాల్లో పని తగ్గినా విలువ తగ్గలేదు. పైగా వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ఒప్పంద విలువ కంటే రూ.114 కోట్లు అదనం. ప్రభుత్వం పని తగ్గించినా పని విలువ తగ్గకపోగా.. పెరగడం గమనార్హం. ఫేజ్–2కి రూ.2,989 కోట్లు వాటర్గ్రిడ్ పథకం నుంచి పుంగనూరు, మదనపల్లె నియోజకవర్గాలను తొలగించిన ప్రభుత్వం..కొత్త ఎత్తుగడ వేసింది. పథకానికి ఫేజ్–2 అని పేరుపెట్టి మరో రూ.2,989 కోట్లకు ప్రతిపాదన పెట్టింది. ఈ విడతలో పుంగనూరు, మదనపల్లె, పలమనేరు, కుప్పం నియోజకవర్గాలకు అమలు చేయబోతున్నట్లు నివేదికలు పంపారు. ఇది ఎప్పటికి ఆమోదం పొందుతాయో, ఎప్పుడు టెండర్లు నిర్వహిస్తారు, ఎప్పుడు పనులు ప్రారంభమవుతాయో చెప్పలేని పరిస్థితి. రూ.2,400 కోట్లతో ఐదు నియోజకవర్గాలకు వెఎస్సార్సీపీ ప్రభుత్వంలో వాటర్గ్రిడ్ పథకం మంజూరు టెండర్లు, సర్వే పూర్తయి పనుల చేపట్టే సమయంలో కూటమి ప్రభుత్వం రాక పథకం రద్దు చేసి 3 నియోజకవర్గాలకే పరిమితం కక్షగట్టి పుంగనూరు నియోజకవర్గం తొలగింపు ఇప్పుడేమో రెండు విడతలపేరుతో కాలయాపన 3 నియోజకవర్గాల పథకానికి రూ.2,370 కోట్లు రెండో విడత పేరుతో రూ.2,989 కోట్లు వైఎస్.జగన్మోహన్రెడ్డి సీఎం అయ్యాక 2020లో తంబళ్లపల్లె సహా మదనపల్లె, పీలేరు, పుంగనూరు, రాయచోటి నియోజకవర్గాల ప్రజలకు 30 ఏళ్లదాక...2054 వరకు నీటిసమస్య ఉండకూడదని భావించారు. ఇంటింటికి తాగునీరు అందించేలా రూ.2,400 కోట్లతో గండికోట ప్రాజెక్టు నుంచి 3.37 టీఎంసీల కృష్ణా జలాలను తరలించే భగీరథ పథకానికి నాంది పలికారు. కుప్పంను వాటర్గ్రిడ్ పరిధిలోకి తెవాలన్న నెపంతో పుంగనూరు నియోజకవర్గాన్ని పథకం నుంచి తొలగించారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అమలుచేసిన పథకం పనులు కూటమిపాలనలో కొనసాగించి ఉంటే పాతికశాతం పనులు పూర్తయ్యేవని ఇంజనీరింగ్ అధికారులు అంటున్నారు. కుప్పానికి పథకం వర్తించాలంటే తీవ్ర జాప్యం అవుతుంది, తద్వారా పుంగనూరుకు పథకం అమలు కాకుండా అడ్డుకట్ట వేయొచ్చన్న ప్రయత్నంగా తెలుస్తోంది. ఫలితంగా ప్రస్తుతం ఫేజ్–1 పేరుతో తంబళ్లపల్లె, పీలేరు, రాయచోటి నియోజకవర్గాల్లోని 18 మండలాలకే వాటర్గ్రిడ్ పథకం అమలు చేస్తున్నారు. వీటి పనులు ఇప్పుడిప్పుడే మొదలవుతున్నాయి. ఇవి ఎప్పటికి పూర్తవుతాయో మంచినీళ్లు ఎప్పుడిస్తారో అని ప్రజలు బాబు తీరుపై తూర్పారబడుతున్నారు. -
నేడు హైకోర్టులో రాయచోటి జిల్లా కేంద్రం అంశంపై వాదనలు
రాయచోటి అర్బన్: రాయచోటి జిల్లా కేంద్రంగా యథథాతథంగా కొనసాగించాలనే అంశంపై దాఖలైన ప్రజా ప్రయోజన వ్యాజ్యం(పిల్) హైకోర్టులో బుధవారం వాదనలు జరగనున్నాయని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కేసును ఇటీవలే హైకోర్టు స్వీకరించిందని, బుధవారం జరగనున్న వాదనలకు 7వ నంబరింగ్ పొందిందన్నారు. ఈ అంశంపై ఖచ్చితంగా న్యాయం జరుగుతుందని ఆశిస్తున్నామని పేర్కొన్నారు రాయచోటి నియోజకవర్గ ప్రజల ఆందోళనలు న్యాయస్థానం ద్వారా పరిష్కారం పొంది, ప్రజలకు మేలు జరుగుతుందనే ఆశాభావాన్ని శ్రీకాంత్ రెడ్డి వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రధానకార్యదర్శి గడికోట శ్రీకాంత్ రెడ్డి -
రైతులకు అండగా ఉంటాం
వీరపునాయునిపల్లె: రాష్ట్రంలోని ప్రతి రైతును ఆదుకోని వారికి అండగా నిలవడమే కూటమి ప్రభుత్వ లక్ష్యమని బీసి సంక్షేమ శాఖ మంత్రి సవిత అన్నారు. మంగళవారం మండల కేంద్రంలోని డిగ్రీ కళాశాలలో ఏర్పాటు చేసిన ఉల్లి రైతులకు చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై ప్రసంగించారు. రైతులు సాగు చేసిన పంటకు గిట్టుబాటు ధర లేక పోగా అధిక వర్షాలు పడడంతో తీవ్రంగా నష్టపోయారన్నారు. ఈ విషయాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లి పంటనష్ట పరిహారం మంజూరు చేశామన్నారు. కలెక్లర్ చెరుకూరి శ్రీదర్ మాట్లాడుతూ రైతులు మార్కెట్కు అనుకూలంగా పంటలు సాగు చేయాలని అలా కాకుండా పంటలు సాగు చేస్తే నష్టాల బారిన పడాల్సి వస్తుందన్నారు. అనంతరం రాజ ముద్రతో కూడిన పట్టాదారు పాసుపుస్తకాలు, ఉల్లి పంటకు సంబందించిన మెగా చెక్కును మంత్రి సవిత రైతులకు అందజేశారు. ఎమ్మెల్యే పుత్తా చైతన్యకుమార్రెడ్డి, టీడీపీ రాష్ట ఉపాధ్యక్షుడు నరసింహారెడ్డి పాల్గొన్నారు. మంత్రి సవిత


