గత ప్రశ్నపత్రాలను పరిశీలించి, ముఖ్యమైన పాఠ్యాంశాలపై దృష్టి సారిస్తే హిందీ లో మంచి మార్కులు సాధించవచ్చు.
1. మొదటి విభాగం (35 మార్కులు): పాసేజ్లు: ప్రశ్నపత్రంలోని మొదటి భాగంలో 35 మార్కులకు ప్యాసేజ్ ప్రశ్నలు అడుగుతారు. ప్రశ్నల్లోని ముఖ్య పదాలను ప్యాసేజ్లో వెతకడం ద్వారా వీటికి సులభంగా సమాధానం ఇవ్వవచ్చు.
కవి/రచయిత పరిచయం: కవి,రచయిత పరిచయాలు తప్పకుండా నేర్చుకోవాలి. ఇవి నేరుగా మార్కులు తెచ్చిపెడతాయి.
2. పద్యభాగం:
దోహాలు: పద్యభాగంలోని 4 దోహాలను కంఠస్థం చేస్తే, ఇతర చిన్న ప్రశ్నలను ప్రత్యేకంగా నేర్చుకోవాల్సిన అవసరం ఉండదు.
ముఖ్యమైన సారాంశాలు: పద్యభాగం నుండి ‘బరస్తే బాదల్’ మరియు ‘కణ్–కణ్ కా అధికారి’ పాఠ్యాంశాల సారాంశాలను క్షుణ్ణంగా నేర్చుకోవాలి.
3. గద్యభాగం – ఉపవాచకం:
ముఖ్యమైన పాఠాలు: గద్యభాగం నుండి ‘ఈద్గాహ్’ మరియు ‘లోక్ గీత్’ పాఠాలపై పట్టు సాధించాలి.
లఘు ప్రశ్నలు: ‘స్వరాజ్య కీ నీవ్’, ‘అంతర్జాతీయ స్థర్ పర్ హిందీ’, ‘దక్షిణీ గంగా గోదావరి’ పాఠాల నుంచి లఘు ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.
ఉపవాచకం: ఉపవాచకంలో ‘దో కళాకార్’ పాఠంలోని ప్రశ్నలన్నీ నేర్చుకుంటే సరిపోతుంది. లేఖలు: చుట్టీ పత్ర్ , పుస్తక విక్రేతకు లేఖ , ,పితాజీకి లేఖ నేర్చుకోవడం మంచిది. –కరీముల్లా ఖాదర్,
మున్సిపల్ హైస్కూల్ మెయిన్, కడప.


