ఒకప్పుడు గణితం అంటే విద్యార్థులు గాబరా పడేవారు. ఇప్పుడు అలాంటి పరిస్థితి లేదు. ప్రాథమిక అంశాలపై పట్టు సాధించి క్రమం తప్పకుండా సాధన చేస్తే నూటికి నూరు మార్కులు తెచ్చుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయి. ఇక సీ,డీ గ్రేడ్ విద్యార్థులు మొదటి మూడు, చివరి రెండు అధ్యాయాలు పూర్తిస్థాయిలో సన్నద్ధంగా ఉంటే 50 మార్కుల వరకు వచ్చేస్తాయి.ఊర్థ్వకోణం,నిమ్నకోణం నిర్వచనాలు, అవసరమైన పటాలతో నేర్చుకోవాలి. ప్రతి ప్రాబ్లమ్ కూడా నిర్ణీత సమయంలో కొట్టివేతలు లేకుండా వేయాలి.
–పాలేటి సుధాకర్రెడ్డి,
స్కూల్ అసిస్టెంట్, గణితం,
జెడ్పీహెచ్ఎస్.మర్రిపాడు


