పింఛన్ అందించి ఆదుకోవాలి
నాకు కాళ్లు, చేతులు పనిచేయవు. కదల్లేని స్థితిలో మంచానికే పరిమితం అయ్యాను.పెన్షన్ కోసం రెండేళ్లుగా ప్రభుత్వ కార్యాలయాలు చుట్టూ తిరుగుతున్నా పట్టించుకునేవారు లేరు. ప్రభుత్వం తనకు పింఛన్ అందించి ఆదుకోవాలి. –భూమిరెడ్డి,
మట్టివారిపల్లె, కురుబలకోట మండలం
సదరం సర్టిఫికెట్ ఉన్నా..
మూడేళ్ల క్రితం ప్రమాదంలో గాయపడ్డాను. సద రం సర్టిఫికెట్ ఉన్నప్పటికీ అధికారులు పెన్షన్ మంజూరు చేయడం లేదు. భార్య అలివేలు కష్టంతో ఇంటిని పోషించుకుంటూ వస్తోంది. అధికారులు వెబ్సైట్ ఓపెన్ కాలేదని, వచ్చాక చూద్దాం అంటున్నారు. అప్పటిదాకా ఎలా బతకాలో అర్థం కావడం లేదు. –బాబు,
భవన నిర్మాణ కార్మికుడు, రాయచోటి
పింఛన్ అందించి ఆదుకోవాలి
పింఛన్ అందించి ఆదుకోవాలి


