కుక్కల దాడిలో జింక మృతి
చౌడేపల్లె : జనారణ్యంలోకి వచ్చిన జింకపై కుక్కలు దాడిచేయడంతో మృతిచెందింది. ఈ ఘటన మండలంలోని దిగువపల్లె పంచాయతీ కొలింపల్లెలో ఆదివారం జరిగింది.స్థానికుల కథనం మేరకు వివరాలిలాఉన్నాయి. సమీపంలోని అటవీ ప్రాంతంనుంచి జింక పంటపొలాల్లోకి రావడం గుర్తించిన కుక్కల గుంపు చట్టుముట్టడంతో అరుపులు కేకలను గుర్తించిన స్థానికులు జింకను కాపాడే ప్రయత్నం చేసినా ఫలితంలేకపోయింది. సమాచారం అందుకున్న ఫారెస్ట్ అధికారి రాము పశువైధ్యాధికారి పవన్కుమార్ల ఆధ్వర్యంలో పోస్టుమార్టం నిర్వహించి ఖననం చేశారు.


