breaking news
IDF
-
గాజాలో 7 కి. మీ టన్నెల్ గుర్తింపు.. లోపల 80 నివాస క్వార్టర్ లు
-
గాజాపై విరుచుకుపడిన ఇజ్రాయెల్
జెరూసలేం: పాలస్తీనా, ఇజ్రాయెల్ మధ్య మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. గాజాను టార్గెట్ చేసి ఇజ్రాయెల్ సైన్యం విరుచుకుపడింది. ఇజ్రాయెల్ ఐడీఎఫ్ దాడుల్లో 34 మంది చనిపోయినట్టు గాజా డిఫెన్స్ ఏజెన్సీ వెల్లడించింది. దాడులకు సంబంధించిన వీడియోలు బయటకు వచ్చాయి.పాలస్తీనాలోని గాజాపై ఇజ్రాయెల్ దాడులు చేసింది. భారత కాలమానం ప్రకారం బుధవారం అర్ధరాత్రి ఇజ్రాయెల్ వైమానిక దళం గాజాను లక్ష్యంగా చేసుకొని దాడులు జరిగింది. ఇజ్రాయెల్ దాడుల కారణంగా గాజాలో 12 మంది, ఖాన్ యూనిస్ ప్రాంతంలో 10 మంది మృతి చెందినట్లు హమాస్ వెల్లడించింది. ఈ మేరకు గాజా డిఫెన్స్ ఏజెన్సీ వివరాలను వెల్లడించింది. అయితే, ఇజ్రాయెల్ మిలిటరీ వాదన మాత్రం మరోలా ఉంది. హమాస్ ఉగ్రవాదులు తమ దేశంపై దాడికి పాల్పడేందుకు ప్రయత్నించడంతోనే తాము దాడులు చేపట్టినట్లు ఇజ్రాయెల్ మిలిటరీ పేర్కొంది. కాగా, ఈ కాల్పులు దాదాపు ఆరు వారాలుగా కొనసాగుతున్న కాల్పుల విరమణ ఒప్పందాన్ని ఉల్లంఘించాయని ఇజ్రాయెల్ రక్షణ దళాలు తెలిపాయి.Israel launched airstrikes in Khan Younis and in the Zeitoun and Shejaiya areas of Gaza City after terrorists opened fire on soldiers earlier today.Palestinians report 34 eliminated. pic.twitter.com/Th7ZtpuHoD— Open Source Intel (@Osint613) November 19, 2025మరోవైపు.. దక్షిణ లెబనాన్లోని పాలస్తీనా శరణార్థి శిబిరం సమీపంలో ఇజ్రాయెల్ వైమానిక దాడి చేసింది. ఈ ఘటనలో 13 మంది మరణించగా, నలుగురు గాయపడినట్లు లెబనాన్ ప్రకటించింది. ఐన్ ఎల్-హిల్వే ప్రాంతంలో ఆయుధాలతో ఉన్న హమాస్ మిలిటెంట్లను లక్ష్యంగా చేసుకున్నట్లు ఇజ్రాయెల్ సైన్యం తెలిపింది. అయితే అక్కడ ఎలాంటి సాయుధ బలగాలు లేవని లెబనాన్ పేర్కొంది. హమాస్తో కాల్పుల విరమణ ఒప్పందం తర్వాత జరిగిన అతి పెద్ద దాడిగా తెలుస్తోంది.ఇదిలా ఉండగా.. అక్టోబర్ 10 నుండి కాల్పుల విరమణ ఒప్పందం అమల్లోకి వచ్చినప్పటి నుండి ఐడీఎఫ్ దళాలు గాజాలో సగానికి పైగా ప్రాంతాన్ని తమ ఆధీనంలోకి తీసుకున్నాయి. మిగిలిన ప్రాంతం వాస్తవ హమాస్ నియంత్రణలో ఉంది. 11/19/25 🇮🇱🇱🇧 Deir Kifa, South Lebanon 🚨 Breaking IDF airstrike just now. pic.twitter.com/6A8iktMEAu— 🇺🇸 Ray Murray jr (@rmjr2654) November 19, 2025 -
హెజ్బొల్లాకు మరో ఎదురు దెబ్బ
జెరూసలేం: హెజ్బొల్లా(Hezbollah),హమాస్లపై ఇజ్రాయెల్ జరుపుతున్న భీకర దాడులతో పశ్చిమాసియా రగులుతూనే ఉంది. ఇప్పటికే ఈ మిలిటెంట్ సంస్థల అగ్రనేతలను ఐడీఎఫ్ మట్టుబెట్టింది. ఈక్రమంలోనే హెజ్బొల్లాకు చెందిన రద్వాన్ ఫోర్స్పై ఐడీఎఫ్ దాడికి దిగింది. ఈ దాడిలో రద్వాన్ ఫోర్స్కు చెందిన నలుగురు ఉగ్రవాదులు హతమయ్యారు. వీరిలో ఒకరు హెజ్బొల్లాకు ఆయుధాల సరఫరా, ఉగ్రవాద మౌలిక సదుపాయాల పునరుద్ధరణలో కీలక పాత్ర పోషించినట్టు ఐడీఎఫ్ వెల్లడించింది.ఈ దాడి శనివారం రాత్రి రమాన్ ప్రాంతంలో జరిగినట్లు తెలుస్తోంది. ఇజ్రాయెల్ ఉత్తర కమాండ్ ఆధ్వర్యంలో వైమానిక దళాలు ఈ ఆపరేషన్ను చేపట్టాయి. రద్వాన్ ఫోర్స్ ఉగ్రవాదుల్ని మట్టుబెట్టాయి. ఐడీఎఫ్ ఆపరేషన్పై ఇజ్రాయెల్ రక్షణశాఖ మంత్రి యోవ్ గాలాంట్ (Yoav Gallant) స్పందించారు. హెజ్బొల్లా నిప్పుతో చెలగాటం ఆడుతోంది. వారు మమ్మల్ని రెచ్చగొడుతున్నారు. గత ఒప్పందం ప్రకారం, కాల్పుల విరమణ జరగాలి. హెజ్బొల్లా తన ఆయుధాలను సమర్పించి, దక్షిణ లెబనాన్ నుంచి వెనక్కి వెళ్లిపోవాలని లెబనాన్ ప్రభుత్వం ఆదేశించింది. కానీ ఆ సంస్థ అలాచేయడం లేదు. కాల్పులకు తెగబడుతోంది. దీనికి ప్రతిగా మేము మా దాడులను కొనసాగిస్తాం. అవసరమైతే మరింత ముమ్మరంగా స్పందిస్తాం. ఇజ్రాయెల్ తన భద్రతా చర్యలను గరిష్ట స్థాయిలో కొనసాగిస్తుంది. ఉత్తర ప్రాంత నివాసితులకు ముప్పు కలిగించే ప్రయత్నాలను మేము ఎట్టి పరిస్థితుల్లోనూ సహించము’ అని ఆయన హెచ్చరించారు -
తక్షణమే టెహ్రాన్ నగరం విడిచి వెళ్లాలని భారతీయులకు ఎంబసీ ఆదేశాలు
-
అమూల్ డెయిరీకి అంతర్జాతీయ పురస్కారం
మూడు భారతీయ డెయిరీ సంస్థలకు అంతర్జాతీయ డెయిరీ ఫెడరేషన్ (ఐడిఎఫ్) ‘ఇన్నోవేషన్ ఇన్ సస్టయినబుల్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ 2024’ ప్రతిష్టాత్మక పురస్కారాలు దక్కాయి. పాడి పశువులకు సోకే జబ్బులకు చేసే చికిత్సల్లో అల్లోపతి యాంటీబయాటిక్ ఔషధాలకు బదులుగా హోమియోపతి ఔషధాలను వాడి చక్కని ఫలితాలు సాధించినందుకు గాను ‘యానిమల్ కేర్’ విభాగంలో అమూల్ డెయిరీకి ఈ పురస్కారం ప్రదానం చేసినట్లు ఐడిఎఫ్ ప్రకటించింది.సుమారు 68 వేల పశువులకు సోకిన 26 రకాల సాధారణ వ్యాధులకు హోమియోపతి మందులతో చికిత్స చేయటం ద్వారా అమూల్ డెయిరీ సత్ఫలితాలు సాధించింది. ఇందుకోసం 2024 మే నాటికి 3.30 లక్షల (30 ఎం.ఎల్. సీసాలు) హోమియోపతి మందులను అమూల్ సొంతంగానే ఉత్పత్తి చేసి, 1.80 లక్షల సీసాలను పాడి సహకార సంఘాల రైతులకు పంపిణీ చేసింది. యాంటీబయాటిక్ ఔషధాల వాడకాన్ని తగ్గించటం ద్వారా పశువుల ఆరోగ్యం మెరుగవుతోంది. పాల ఉత్పత్తులు వినియోగించే ప్రజల ఆరోగ్యానికి కూడా మేలు జరుగుతోందని ఐడిఎఫ్ తెలిపింది. సంప్రదాయ ఆయుర్వేద (ఈవీఎం) చికిత్సా పద్ధతులతో పాటు హోమియో పశువైద్య పద్ధతులను కూడా అమూల్ ప్రాచుర్యంలోకి తేవటం హర్షదాయకం.పశ్చిమ బెంగాల్లోని సుందర్బన్ పాడి, పశు పెంపకందారుల సహకార సంఘానికి ఆర్థిక, సామాజిక విభాగంలో పురస్కారం లభించింది. 4,500 మంది మహిళా రైతులు పూర్తి సేంద్రియ పద్ధతుల్లో పాలు ఉత్పత్తి చేస్తున్నారు. అనేక పాల ఉత్పత్తులను, ఎ2 ఆవు నెయ్యిని తయారు చేస్తున్నారు. సేంద్రియ నాటు కోళ్ల పెంపకంతో పాటు సేంద్రియ పప్పుదినుసులను సైతం ఉత్పత్తి చేసి, ప్రాసెసింగ్ చేసి వినియోగదారులకు నేరుగా విక్రయిస్తూ మహిళా రైతులు ఆర్థికంగా, సామాజికంగా అభివృద్ధి సాధిస్తున్నారు.చదవండి: 90% కేసుల్లో యాంటీబయాటిక్స్ అవసరం లేదుఐడిఎఫ్ పురస్కారం అందుకున్న మరో సంస్థ ‘ఆశా మహిళా మిల్క్ ప్రొడ్యూసర్ కంపెనీ’. సౌర విద్యుత్తుతో నడిచే ఇన్స్టంట్ మిల్క్ చిల్లర్లను వినియోగించటం ద్వారా చిన్న, సన్నకారు పాడి రైతుల అభ్యున్నతికి వినూత్న రీతిలో దోహదపడటం ఈ ఎఫ్పిఓ ప్రత్యేకత. -
హెజ్బొల్లాపై పోరు: ఆరుగురి ఇజ్రాయెల్ సైనికులు మృతి
జెరూసలేం: లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూప్ లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. లెబనాన్ సరిహద్దు సమీపంలో బుధవారం జరిగిన దాడుల్లో ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతి చెందినట్లు సైన్యం వెల్లడించింది.‘‘దక్షిణ లెబనాన్లో జరిగిన యుద్ధంలో ఆరుగురు సైనికులు మృతిచెందారు’ అని ఇజ్రాయెల్ సైన్యం ఒక ప్రకటన విడుదల చేసింది. సెప్టెంబర్ 30 నుంచి ఇప్పటివరకు లెబనాన్ సరిహద్దుల్లో హెజ్బొల్లాతో చేస్తున్న యుద్ధంలో 47 మంది ఇజ్రాయెల్ సైనికులు మరణించటం గమనార్హం.🔴Eliminated: Muhammad Musa Salah, Ayman Muhammad Nabulsi and Hajj Ali Yussef Salah—Hezbollah’s Field Commanders of Khiam, Tebnit and Ghajar were eliminated in two separate strikes. These terrorists directed many terror attacks against Israelis, and were responsible for the…— Israel Defense Forces (@IDF) November 13, 2024 ఆరుగురు ఇజ్రాయెల్ సైనికులు మృతికి ప్రధాన మంత్రి బెంజమిన్ నెతన్యాహు ఎక్స్ వేదికగా సంతాపం తెలియజేశారు. మరోవైపు.. లెబనాన్లోని హెజ్బొల్లాకు వ్యతిరేకంగా యుద్ధంలో ఎలాంటి సడలింపు ఉండదని ఇజ్రాయెల్ కొత్త రక్షణ మంత్రి ఇజ్రాయెల్ కాట్జ్ ప్రకటించిన అనంతరం ఈ ఘటన చోటుచేసుకోవటం గమనార్హం.💔 pic.twitter.com/FGY2iDlvaA— Benjamin Netanyahu - בנימין נתניהו (@netanyahu) November 13, 2024 సెప్టెంబరు 23 నుంచి లెబనాన్లో హెజ్బొల్లా స్థావరాలపై బాంబు దాడుల్లో ఇజ్రాయెల్ సైన్యం వేగం పెంచింది. ప్రధానంగా దక్షిణ బీరుట్, దేశంలోని తూర్పు, దక్షిణాన ఉన్న హెజ్బొల్లా స్థావరాలే లక్ష్యంగా దాడులు చేస్తోంది. అక్టోబర్ 7, 2023 నుంచి గాజాలో ఇజ్రాయెల్ చేస్తున్న దాడులకు పాలస్తీనా మిత్రపక్షం హమాస్కు మద్దతుగా హెజ్బొల్లా ఇజ్రాయెల్పై దాడులు ప్రారంభించిన విషయం తెలిసిందే. -
లెబనాన్లో ఇజ్రాయెల్ భీకర దాడులు.. 33 మంది మృతి
బీరుట్: లెబనాన్పై ఇజ్రాయెల్ సైన్యం భీకర దాడులు కొనసాగిస్తోంది. హెజ్బొల్లా గ్రూప్ టార్గెట్గా చేసిన ఇజ్రాయెల్ సైన్యం చేసిన దాడుల్లో దేశవ్యాప్తంగా 33 మంది మృతి చెందినట్లు లెబనాన్ వెల్లడించింది. ఇరాన్ మద్దతుగల గ్రూప్ హెజ్బొల్లాకు బలమైన ప్రాంతాలు ఉన్న బీరుట్లోని దక్షిణ శివారును లక్ష్యంగా చేసుకొని ఇజ్రాయెల్ దాడులు చేసింది.బీరుట్కు దక్షిణంగా ఉన్న చౌఫ్ ప్రాంతంలోని ఓ పట్టణంలో జరిగిన దాడుల్లో కనీసం 15 మంది మరణించారని లెబనాన్ ఆరోగ్య మంత్రిత్వ శాఖ వెల్లడించింది. చౌఫ్ జిల్లాలో జోన్పై ఇజ్రాయెల్ దాడిలో.. ఎనిమిది మంది మహిళలు, నలుగురు పిల్లలు సహా 15 మంది మరణించారని పేర్కొంది. ఈ దాడిలో మరో 12 మంది గాయపడ్డారని తెలిపింది.అదే విధంగా బీరుట్కు తూర్పున ఉన్న పర్వతం అలే ప్రాంతంలో జరిగిన దాడుల్లో ఎనిమిది మంది మృతి చెందారని ఆరోగ్య మంత్రిత్వ శాఖ పేర్కొంది. నిరాశ్రయులైన ప్రజలు ఆశ్రయం పొందిన ఇంటిపై ఇజ్రాయెల్ దాడి చేసిందని అధికారులు తెలిపారు. దక్షిణ లెబనాన్లోని టైర్ ప్రాంతంలో ఇజ్రాయెల్ సైన్యం దాడిలో ఒకరు మరణించినట్లు అధికారులు పేర్కొన్నారు. -
సమాధుల కింద హెజ్బొల్లా టన్నెల్.. ఐడీఎఫ్ వీడియో విడుదల
లెబనాన్లో హెజ్బొల్లా గ్రూప్ సభ్యులు ఉపయోగించే పలు భూగర్భ సొరంగాలను ఇజ్రాయెల్ సైన్యం బయటపెట్టింది. ఆ సొరంగాలు స్మశానవాటిక కింద ఉండటం గమనార్హం. సుమారు కిలోమీటరు పొడవున్న సొరంగంలో.. కమాండ్, కంట్రోల్ రూమ్లు, స్లీపింగ్ క్వార్టర్లు, డజన్ల కొద్దీ ఆయుధాలు, గన్స్, రాకెట్లు, ఇతర సైనిక సామగ్రిని చూపించే వీడియోను ఇజ్రాయెలీ డిఫెన్స్ ఫోర్సెస్ (IDF) ‘ఎక్స్’ వేదికగా విడుదల చేసింది.‘హెజ్బొల్లాకు మానవ జీవితం అంటే లెక్క లేదు. చనిపోయినా, బతికినా పట్టించుకోదు’ అని ఐడీఎఫ్ పేర్కొంది.ఈ సొరంగంలోకి 4,500 క్యూబిక్ మీటర్ల కాంక్రీట్ పంపింగ్ చేసి సీల్ చేసినట్లు సమాచారం. గత ఏడాది అక్టోబర్ 7న ఇజ్రాయెల్ పట్టణాలపై హమాస్ దాడి చేసిన తర్వాత గాజాలో యుద్ధం చెలరేగినప్పటి నుంచి ఇజ్రాయెల్, ఇరాన్ మద్దతుగల హెజ్బొల్లా గ్రూప్ లెబనీస్ సరిహద్దులో దాడులు చేసుకుంటున్నాయి. సెప్టెంబరులో లెబనాన్లోకి ఇజ్రాయెల్ సైన్యం ప్రవేశించటం ప్రారంభించినప్పటి నుంచి ఐడీఎఫ్ పలు సొరంగాలను కనుగొంది. అందులో ఒకటి 25 మీటర్ల పొడవుతో ఇజ్రాయెల్ వైపు ఉండటం గమనార్హం.⭕️ Operational update from Lebanon: Multiple underground terrorist tunnels have been dismantled by our troops, including a tunnel that was strategically located under a cemetery. Hezbollah doesn’t value human life—dead or alive. pic.twitter.com/77Ry4bQk0V— Israel Defense Forces (@IDF) November 10, 2024గత నెలలో లెబనీస్ పౌరుడికి ఇంటి క్రింద హెజ్బొల్లా సభ్యులు వాడినట్లు ఆరోపింస్తూ.. ఇజ్రాయెల్ ఆర్మీ ఓ సొరంగం వీడియోను విడుదల చేసింది. అయితే.. ఆ సోరంగం గాజాలో హమాస్ సభ్యులు నిర్మించినటువంటిది కాదని పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని ఆ సొరగంలో ఇనుప తలుపులు, వర్కింగ్ రూంలు, ఏకే-47 రైఫిల్స్, ఒక పడకగది, ఒక బాత్రూం, జనరేటర్ల నిల్వ గది, నీటి ట్యాంకుల దృష్యాలు వీడియోలో కనిపించాయి.చదవండి: సిరియాలో ఇజ్రాయెల్ దాడులు.. హెజ్బొల్లా కమాండర్ హతం -
హెజ్బొల్లా దాడులతో ఇజ్రాయెల్లో బీభత్సం! తాజాగా..
జెరుసలేం: లెబనాన్లోని హెజ్బొల్లా గ్రూపు గురువారం ఇజ్రాయెల్పైకి భారీ సంఖ్యలో రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో మెటులా ప్రాంతంలో ఆలివ్ వ్యవసాయ క్షేత్రంలో పనిచేసే నలుగురు విదేశీ కారి్మకులు సహా ఏడుగురు ప్రాణాలు కోల్పోయారు. మృతి చెందిన కార్మికులు ఏ దేశస్తులో అధికారులు వెల్లడించలేదు. అక్టోబర్ మొదట వారంలో ఇజ్రాయెల్ బలగాలు లెబనాన్పై భూతల దాడులకు దిగాక హెజ్బొల్లా చేపట్టిన అతిపెద్ద దాడి ఇదేనని చెబుతున్నారు. పెద్ద సంఖ్యలో రాకెట్లు ఇజ్రాయెల్ ఉత్తర ప్రాంతంలోని హైఫా పైకి దూసుకొచ్చినట్లు సమాచారం. ఇలా ఉండగా, ఇజ్రాయెల్ వైపు దూసుకెళ్లే రాకెట్ ఒకటి బుధవారం లెబనాన్లోని తమ శాంతి పరిరక్షక దళం బేస్పై పడిందని ఐర్లాండ్ ప్రభుత్వం తెలిపింది. ఈ పరిణామంపై ఆందోళన వ్యక్తం చేసింది. ఈ ఘటనలో ఎటువంటి నష్టం వాటిల్లలేదని పేర్కొంది. ఆ రాకెట్ దానంతటదే పడిందా, లేక ఇజ్రాయెల్ ఆర్మీ కూల్చిందా అనేది తెలియాల్సి ఉందని పేర్కొంది. గాజాలో 25 మంది మృతి: డెయిర్ అల్–బలాహ్: గాజాలోని నుసెయిరత్ శరణార్ధి శిబిరంపై ఇజ్రాయెల్ ఆర్మీ గురు, శుక్రవారాల్లో జరిపిన దాడుల్లో మృతుల సంఖ్య 25కు చేరుకుంది. వీరిలో ఐదుగురు చిన్నారులున్నట్లు అల్ అక్సా ఆస్పత్రి వర్గాలు తెలిపాయి. వీరిలో పదేళ్ల చిన్నారి, 18 నెలల వయస్సున్న ఆమె సోదరుడు ఉన్నారు. దాడి తర్వాత వీరి తల్లి ఆచూకీ కనిపించడం లేదని కుటుంబసభ్యులు తెలిపారు. చిన్నారుల తండ్రి నాలుగు నెలల క్రితం ఇజ్రాయెల్ ఆర్మీ జరిపిన దాడిలో ప్రాణాలు కోల్పోయాడని వారు చెప్పారు. ఐరాస కార్యాలయం ధ్వంసం వెస్ట్బ్యాంక్లోని నూర్షమ్స్ శరణార్ధి శిబిరంలో ఉన్న ఐరాస శరణార్థి విభాగం కార్యాలయాన్ని ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం బుల్దోజర్లతో ధ్వంసం చేసింది. కార్యాలయ భవనం పాక్షికంగా దెబ్బతిందని పాలస్తీనా మీడియా తెలిపింది. కార్యాలయం వెలుపలి గోడ ధ్వంసమైంది. తాత్కాలిక హాల్ మొత్తం నేలమట్టమైంది. పైకప్పు దెబ్బతింది. భవనం ప్రాంగణం మట్టి, శిథిలాలతో నిండిపోయిట్లు కనిపిస్తున్న వీడియోను అసోసియేటెడ్ ప్రెస్ విడుదల చేసింది. లెబనాన్లో 24 మంది మృతి లెబనాన్లోని బీరుట్, బాల్బెక్–హెర్మెల్, దహియే ప్రాంతాలపై ఇజ్రాయెల్ ఆర్మీ శుక్రవారం జరిపిన దాడుల్లో 24 మంది చనిపోయారు. లెబనాన్–సిరియా సరిహద్దుల్లోని హెజ్బొల్లా ఆయుధ డిపోలు, స్థావరాలే లక్ష్యంగా ఇజ్రాయెల్ ఆర్మీ గురువారం భీకర దాడులకు పాల్పడింది. తమ యుద్ధ విమానాలు కుసాయిర్ నగరంలోని పలు లక్ష్యాలపై బాంబులు వేశాయని ఇజ్రాయెల్ ఆర్మీ తెలిపింది. మృతుల సంఖ్య మరింత పెరిగే అవకాశముందని చెబుతున్నారు.చదవండి : మీకు రిటర్న్ గిఫ్ట్ పక్కా -
మా యుద్ధం లెబనాన్ ప్రజలతో కాదు: ఇజ్రాయెల్
జెరూసలెం: లెబనాన్ రాజధాని బీరుట్తో పాటు దాని చుట్టుపక్కలప్రాంతాల ప్రజలు తమ ఇళ్లను వదిలివెళ్లాలని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్(ఐడీఎఫ్) హెచ్చరించింది.ఈమేరకు ఐడీఎఫ్ ఎక్స్(ట్విటర్)లో ఓ వీడియోని పోస్టు చేసింది.తమ యుద్ధం హెజ్బొల్లాతోనే కానీ లెబనాన్ ప్రజలతో కాదని ఐడీఎఫ్ స్పష్టం చేసింది. ఇజ్రాయెల్ పౌరులు లక్ష్యంగా హెజ్బొల్లా దాదాపు లక్షా 50వేల రాకెట్లు లెబనాన్లో ఉంచిందని తెలిపింది.వాటిల్లో కొన్నింటిని వ్యూహాత్మకంగా పౌరులు నివసించే ప్రాంతాల్లో ఉంచిందని, వాటిని తాము నిర్వీర్యం చేయనున్నామని వెల్లడించింది. ఇందులో భాగంగా దాడులు జరిగే అవకాశమున్నందున ప్రజలు ఆ ప్రాంతాలను విడిచి వెళ్లాలని ఐడీఎఫ్ కోరింది.ఉత్తర ఇజ్రాయెల్లోని పౌరులను హెజ్బొల్లా లక్ష్యంగా చేసుకున్నట్లు ఐడీఎఫ్ చీఫ్ తెలిపారు.లెబనాన్ నుంచి వచ్చిన రాకెట్తో ఆ ప్రాంతం మొత్తం దెబ్బతిన్నట్లు వెల్లడించారు.తమ పౌరులను లక్ష్యంగా చేసుకున్న హెజ్బొల్లా నుంచి తమ దేశ ప్రజలతో పాటు వనరులను రక్షించుకుంటామని చెప్పారు. ఇదీచదవండి: హూ ఈజ్ నస్రల్లా..ఇజ్రాయెల్ మోస్ట్వాంటెడ్ ఇతడే -
ఇజ్రాయెల్ భీకర దాడులు
జెరుసలేం: ఇజ్రాయెల్ ఆర్మీ, హెజ్బొల్లా మిలిటెంట్ల మధ్య దాడులు, ప్రతిదాడులు కొనసాగుతున్నాయి. ఇవి మరింత ముదిరి తీవ్ర యుద్ధానికి దారి తీసే ప్రమాదముందన్న ఆందోళనలు వ్యక్తమవు తున్నాయి. సోమవారం ఉదయం లెబనాన్లోని హెజ్బొల్లా స్థావరాలపై ఐడీఎఫ్ (ఇజ్రాయెల్ ఆర్మీ) భీకర దాడులకు తెరతీసింది. ఈ దాడుల్లో 21 మంది చిన్నారులు, 39 మంది మహిళలు సహా 356మంది చనిపోగా, 1,024 మంది గాయపడ్డారని లెబనాన్ తెలిపింది. సరిహద్దులకు 130 కిలోమీటర్ల దూరంలోని బిబ్లోస్ ప్రావిన్స్ అటవీ ప్రాంతంతోపాటు, బాల్బెక్, హెర్మెల్లపైనా బాంబు దాడులు జరిగినట్లు లెబనాన్ వెల్లడించింది. తాము లెబనాన్లోని 300కు పైగా లక్ష్యాలపై దాడులు జరిపినట్లు ఇజ్రాయెల్ ఆర్మీ ప్రకటించింది. ఈ దాడుల గురించి దక్షిణ లెబనాన్ వాసులను ఆర్మీ ముందుగానే హెచ్చరించింది. హెజ్బొల్లా స్థావరాలు, ఆయుధ డిపోలు, ఇతర మౌలిక వసతులకు, భవనాలకు సమీపంలో ఉండే పౌరులు తక్షణమే ఖాళీ చేయాల్సిందిగా కోరింది. ఇజ్రాయెల్ నగరాలు, పౌరులపైకి గురిపెట్టిన వందల సంఖ్యలో క్షిపణులు, రాకెట్లను ధ్వంసం చేసినట్లు అనంతరం ప్రధాని నెతన్యాహు వెల్లడించారు. వచ్చే రోజుల్లో పరిస్థితులు మరింత క్లిష్టతరం కానున్నాయంటూ ఆయన వ్యాఖ్యానించడం గమనార్హం. ఉత్తర ప్రాంతంలో సమీకరణాల్ని మార్చాలన్నదే తమ ప్రయత్నమని, ఇందుకు తగ్గ ఫలితం కన్పిస్తోందని అన్నారు. ఈ సమయంలో కలిసికట్టుగా ఉండి అధికారుల సూచనలు, హెచ్చరికలను పాటించాలని నెతన్యాహు ప్రజలను కోరారు. అనంతరం హెజ్బొల్లా హైఫా, గలిలీ ప్రాంతాల్లోని ఇజ్రాయెల్ ఆర్మీ వసతులపైకి డజన్లకొద్దీ రాకెట్లను ప్రయోగించింది. ఈ దాడుల్లో నష్టం వివరాలు తెలియాల్సి ఉంది.హెజ్బొల్లా సంస్థ ఆయుధాల డిపోలకు సమీపంలో ఉండే వారు వెంటనే ఖాళీ చేసి వెళ్లిపోవాలని ఆయన కోరారు. గతేడాది అక్టోబర్ నుంచి హెజ్బొల్లా, ఇజ్రాయెల్ ఆర్మీ మధ్య జరుగుతున్న పోరులో కనీసం 600 మంది చనిపోయారు. మృతుల్లో ఎక్కువ మంది మిలిటెంట్లే. వీరిలో 100 మంది వరకు పౌరులుంటారని అంచనా.శుక్రవారం లెబనాన్ రాజధాని బీరుట్పై ఇజ్రాయెల్ జరిపిన క్షిపణి దాడిలో హెజ్బొల్లా టాప్ కమాండర్లు సహా 45 మంది చనిపోవడం తెలిసిందే. మంగళ, బుధవారాల్లో వాకీటాకీలు, పేజర్లు, రేడియోలు పేలిన ఘటనల్లో 37 మంది చనిపోగా మరో 3 వేల మంది గాయపడ్డారు. ప్రతీకారంగా ఆదివారం హెజ్బొల్లా సరిహద్దులకు సుదూరంగా ఉన్న హైఫాలోని రఫేల్ డిఫెన్స్ సంస్థతోపాటు వివిధ లక్ష్యాలపైకి 150 వరకు రాకెట్లను ప్రయోగించడం తెలిసిందే.వెళ్లిపోవాలంటూ మెసేజ్లుతామున్న ప్రాంతాలను విడిచి వెళ్లాంటూ 80 వేల మందికి పైగా సెల్ఫోన్లలో మెసేజీలు అందాయని లెబనాన్ అధికారులు తెలిపారు. ఇలాంటి వాటిని పట్టించుకోవద్దని కోరారు. భయాందోళనలను, అయోమయాన్ని సృష్టించడం ద్వారా మానసికంగా దెబ్బతీసేందుకు శత్రువు పన్నిన పన్నాగమని ప్రజలకు తెలిపారు. అయితే, తీవ్ర దాడుల నేపథ్యంలో ప్రజలు పెద్ద సంఖ్యలో మూటాముల్లె సర్దుకుని అందుబాటులో ఉన్న వాహనాల్లో బీరుట్ దిశగా బయలుదేరారు. దీంతో, తీరప్రాంత సిడొన్ నగరంలో ట్రాఫిక్ స్తంభించింది. 2006లో ఇజ్రాయెల్– హెజ్బొల్లా మధ్య యుద్ధంగా జరిగాక ఇంత భారీగా జనం వలసబాట పట్టడం ఇదే మొదటిసారని పరిశీలకులు అంటున్నారు. ఈ పరిస్థితుల్లో కళాశాలలు, పాఠశాలలను తెరిచి ఉంచాల్సిందిగా లెబనాన్ హోం శాఖ అధికారులకు ఆదేశాలు జారీ చేసింది. ఇళ్లు వదిలేసి భారీగా వలస వస్తున్న ప్రజలకు పాఠశాల భవనాల్లో ఆశ్రయం కల్పించాలని కోరింది.దాడులు మరింత తీవ్రంరాకెట్ లాంఛర్లు తదితరాలతో సరిహద్దులకు దగ్గర్లోని దక్షిణ ప్రాంతాన్ని మిలటరీ స్థావరాలుగా హెజ్బొల్లా మార్చేసిందని ఇజ్రాయెల్ ఆరోపించింది. అందుకే భారీగా బాంబు దాడులు చేయక తప్పడం లేదంది. హెజ్బొల్లాను నిలువరించేందుకు వైమానిక దాడులపై తమ దృష్టంతా ఉందని పేర్కొంది. దక్షిణ లెబనాన్లోని 17 గ్రామాలు, పట్టణాల మ్యాప్ను విడుదల చేసింది. ఆపరేషన్లను మరింత విస్తరించనున్నట్లు ప్రకటించింది. రానున్న రోజుల్లో బెకా లోయతోపాటు మరిన్ని ప్రాంతాల్లో తీవ్ర దాడులుంటాయని ఇజ్రాయెల్ మిలటరీ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ హెర్జి హలెవి ప్రకటించారు. -
గాజాలో ముగ్గురి ఇజ్రాయెల్ బంధీల మృతదేహాలు స్వాధీనం
గాజాలో హమాస్ మిలిటెంట్లలను అంతం చేయటమే లక్ష్యంగా ఇజ్రాయెల్ సైన్యం దాడులు కొనసాగిస్తోంది. తాజాగా శుక్రవారం అర్ధరాత్రి వరకు ఇజ్రాయెల్ సైన్యం చేపట్టిన ఆపరేషన్లో ముగ్గురు బంధీల మృత దేహాలను స్వాధీనం చేసుకుంది. ఈ విషయన్ని ఇజ్రాయెల్ డిఫెన్స్ ఆర్మీ(ఐడీఎఫ్) ఓ ప్రకటనలో వెల్లడించింది.‘అక్టోబర్ 7న హమాస్ మిలిటెంట్లు ఇజ్రాయెల్పై దాడిన చేసిన సమయంలో షానీ లౌక్, అమిత్ బుస్కిలా , ఇత్జాక్ గెలెరెంటర్ సూపర్నోవా మ్యూజిక్ ఫెస్టివల్ పాల్గోన్నారు. ఆ సమయంలో దాడికి దిగిన హమాస్ మిలిటెంట్లు వారిని చంపేసి.. మృతదేహాను తమతో పాటు గాజాకు తీసుకెళ్లారు’ అని ఐడీఎప్ అధికార ప్రతినిధి అడ్మిరల్ డేనియల్ హగారి తెలిపారు.‘గాజా స్ట్రిప్లో భీకరమైన దాడులు కొనసాగుతున్నాయి. ఇజ్రాయెల బంధీలను తిరిగి తీసుకురావటమే ప్రధానమైన లక్ష్యంగా ప్రతి ఐడీఎఫ్ ప్రతి కమాండర్, సైనికుడు యుద్ధరంగంలో పోరాడుతున్నారు. ఇజ్రాయెల్ సేనలు సురక్షితంగానే ఉన్నాయి. ఆర్మీపై పుకార్లు వ్యాప్తి చేయవద్దని ప్రజలను కోరారు. నిష్పక్షపాతంగా ఎప్పటికప్పుడు మేము బంధీల కుటుంబాలకు సమాచారం అందిస్తాం. అర్వాత ప్రజలకు తెలియజేస్తాం’ అని డేనియల్ హగారి పేర్కొన్నారు. ఇక.. ఇజ్రాయెల్ సైన్యం గాజాపై చేస్తున్న దాడిలో ఇప్పటివరకు 35, 272 మంది పాలస్తీనా పౌరులు మృతి చెందారు. -
టన్నెల్లో హమాస్ అగ్రనేత! ఐడీఎఫ్ వీడియో విడుదల
ఇజ్రాయెల్ సైన్యం గాజాలోని హమాస్ దళాలపై దాడులు కొనసాగిస్తున్న విషయం తెలిసిందే. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్స్ (ఐడీఎఫ్) మంగళవారం ఓ వీడియోను విడుదల చేసింది. అక్టోబర్ 7న హమాస్ దళాలు ఇజ్రాయెల్పై మెరుపు దాడిచేసిన చేసినప్పటి నుంచి హమాస్ అగ్రనేత యాహ్యా సిన్వార్ దొరకకుండా ఇజ్రాయెల్ సైన్యానికి తలనొప్పిగా మారాడు. అయితే తాజాగా ఐడీఎఫ్ విడుదల వీడియోలో.. గాజాలోని ఓ టన్నెల్ యాహ్యా సిన్వార్ తన కుటుంబసభ్యులతో కనిపించాడు. ఐడీఎఫ్ విడుదల చేసిన వీడియో ప్రకారం.. దక్షిణ గాజాలోని ఖాన్ యూనిస్ ప్రాంతంలోని ఓ టన్నెల్లో యాహ్యా సిన్వార్ను, తన భార్య, ముగ్గురు పిల్లలతో పాటు సోదరుడు ఇబ్రహీంతో కనిపించారు. ఆర్టీఫిషియల్ ఇంటెలిజెన్స్ను ఉపయోగించి తాము యాహ్యా సిన్వార్ను టన్నెల్లోని వీడియోలో గుర్తించామని ఐడీఎఫ్ పేర్కొంది. ఐడీఎఫ్ ప్రతినిధి డేనియల్ హగారి మీడియాతో మాట్లాడుతూ.. ‘ఒక వీడియోలో హమాస్నేను చూసింది ఏమాత్రం పెద్ద విషయం కాదు. మేము.. హమాస్ నేతలు, వారి చెరలో ఉన్న ఇజ్రాయెల్ బందీల వద్దకు చేరుకోవటమే చాలా ముఖ్యమైన విషయం. మేము హమాస్ నేతలు, సిన్వార్ను పట్టుకునే వరకు ఈ యుద్ధం ఆపము. అతను చనిపోయి ఉన్నా? సజీవంగా ఉన్నా? అతన్ని పట్టుకోవటమే మా లక్ష్యం’ అని డేనియల్ తెలిపారు. Spotted: Yahya Sinwar running away and hiding in his underground terrorist tunnel network as Gazan civilians suffer above ground under the rule of Hamas terrorism. There is no tunnel deep enough for him to hide in. pic.twitter.com/KLjisBFq1f — Israel Defense Forces (@IDF) February 13, 2024 61 ఏళ్ల యాహ్యా సిన్వార్.. హమాస్ మాజీ ఎజ్డైన్ అల్ కస్సామ్ బ్రిగేడ్స్కు కమాండర్గా పనిచేశారు. 2017లో పాలస్తీనాలోని హమాస్ గ్రూపు చీఫ్గా ఎన్నికయ్యారు. అతను 2011లో విడుదలకు ముందు ఇజ్రాయెల్ జైళ్లలో 23 ఏళ్లు యుద్ధ ఖైదీగా ఉన్నారు. హమాస్ చేత బందీగా ఉన్న ఫ్రెంచ్-ఇజ్రాయెల్ సైనికుడు గిలాడ్ షాలిత్ అనే యుద్ధ ఖైదీ మార్పిడిలో సిన్వార్ విడుదల అయ్యారు. చదవండి: ఇజ్రాయెల్ అరాచకం.. హమాస్ అగ్రనేత కుమారుడు మృతి! -
జర్నలిస్టుపై ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన
జెరూసలెం: పాలస్తీనాకు చెందిన అల్జజీరా విలేకరి మహమ్మద్ వషా హమాస్ సీనియర్ కమాండర్గా పనిచేస్తున్నాడని ఇజ్రాయెల్ ఆర్మీ సంచలన ప్రకటన చేసింది. గాజాలోని హమాస్ క్యాంపులపై తాము చేసిన దాడుల్లో ఈ విషయం వెలుగు చూసినట్లు తెలిపింది. మహమ్మద్ వషాకు చెందిన ల్యాప్టాప్లో దొరికిన చిత్రాలే ఇందుకు ఆధారాలని తెలిపింది. హమాస్ యాంటీ ట్యాంక్ మిసైల్ యూనిట్ హెడ్గా వషా పనిచేశారని వెల్లడించింది. ‘హమాస్ క్యాంపులో దొరికిన ఒక ల్యాప్టాప్పై మా ఇంటెలిజెన్స్ దర్యాప్తు జరిపింది. దానిలో మహ్మద్ వషా కార్యకలాపాలకు సంబంధించిన చిత్రాలు దొరికాయి. త్వరలో జర్నలిస్టు ముసుగులో ఉన్న ఉగ్రవాదుల వివరాలు ఇంకెన్ని బయటపెడతామో ఎవరికి తెలుసు’ అని ఐడీఎఫ్ లెఫ్టినెంట్ కల్నల్ అవిచే అడ్రే అన్నారు. ఇదీ చదవండి.. ఆగని ఉత్తర కొరియా కవ్వింపు చర్యలు -
వాళ్లను చంపేయండి.. ఇజ్రాయెల్కు గాజా ప్రజల విన్నపం!
టెల్ అవివ్: గాజాలో ఇజ్రాయెల్ సేనలు దాడులు కొనసాగిస్తునే ఉన్నారు. గాజా- ఇజ్రాయెల్ మధ్య దాడులు మొదలై 100 వంద రోజులు పూర్తి అయింది. అయినా ఇజ్రాయెల్ గాజాపై దాడులను మరింత తీవ్రతరం చేస్తునే ఉంది. హమాస్ను అంతమొందించడమే లక్ష్యంగా దాడులకు తెగబడుతోంది. ఈ క్రమంలో ఇజ్రాయెల్ దేశ అర్మీ.. ఇజ్రాయెల్ డిఫెన్స్ ఫోర్సెస్(ఐడీఎఫ్) తాజాగా ఓ వీడియో విడుదల చేసింది. ఆ వీడియోలో.. హమాస్ మిలిటెంట్లపై పాలస్తీనియా ప్రజలు తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది. ‘‘హమాస్ నేతలు కుక్కలతో సమానం. వారిని అల్లా క్షమించడు. హమాస్ నేతల వల్లనే తమకు ఈ దారుణ పరిస్థితి ఏర్పడింది. మమ్మల్ని వారు 100 ఏళ్ల వెనక్కి నెట్టారు. సాయుధ బలంతో హమాస్ నేతలు విర్రవీగుతున్నారు. Gazan civilians on Hamas leaders: “Hamas’ people are abroad, outside of Palestine…They ruined us, they took us back 100 years.” Listen to the conversations between Gazan civilians and IDF officers. pic.twitter.com/TsmjAtIc6k — Israel Defense Forces (@IDF) January 14, 2024 హమాస్ నేతలు గాజాలో లేరు. వారంతా పాలస్తీనా విడిచిపెట్టి వేరే ప్రాంతాలకు వెళ్లిపోయారు. కావాలంటే హమాస్ బలగాలను పాలస్తీనా వెలుపల చంపండి. కానీ, గాజాలోని పాలస్తీనా ప్రజలపై దాడులు చేయకండి’’ అని గాజాలోని పాలస్తీనా ప్రజలు ఇజ్రాయెల్ సైనిక అధికారులతో మొర పెట్టుకున్నారు. ఇప్పటివరకు 23,968 మంది పాలస్తీనియా ప్రజలు మృత్యువాత పడ్డారు. ఇక.. అక్టోబర్ 7న హమాస్ సాయుధులు చేసిన మెరుపు దాడుల్లో ఇజ్రాయెల్కు చెందిన 1200 మంది మృతి చెందారు. హమాస్ నేతల చేతిలో ఇంకా 136 మంది ఇజ్రాయెల్ బంధీలు ఉన్న విషమం తెలిసిందే. తమ బంధీలు, హమాస్ బలగాలకు సంబంధిచిన నేతల జాడ తెలిస్తే చెప్పాలని పాలస్తీనా ప్రజలను ఐడీఎఫ్ కోరుతోంది. హమాస్ నేతల జాడ తెలియజేసిన వారికి 4 లక్షల అమెరికన్ డాలర్లను రివార్డుగా అందిస్తామని ఐడీఎఫ్ ప్రకటించిన విషయం తెలిసిందే. చదవండి: ఏలియన్ మమ్మీల గుట్టు రట్టు.. అసలు కథేంటంటే.. -
అబార్షన్లతో రోజూ 10 మంది మృత్యువాత
జైపూర్: సురక్షితం కాని గర్భ విచ్ఛిత్తుల(అబార్షన్) వల్ల భారత్లో రోజుకు పది మంది మహిళలు చనిపోతున్నారని నిపుణులు హెచ్చరిస్తున్నారు. దేశంలో ఏటా సుమారు 68 లక్షల అబార్షన్లు జరుగుతున్నాయని వెల్లడించారు. సురక్షితం కాని అబార్షన్ ప్రసవ సంబంధ మరణాలకు మూడో అతి పెద్ద కారణమని, ఏటా అలా జరుగుతున్న మరణాల్లో వీటి వాటా 8 శాతం అని ఐపీఏఎస్ డెవలప్మెంట్ ఫౌండేషన్(ఐడీఎఫ్) రాజస్తాన్ కార్యక్రమ మేనేజర్ కరుణా సింగ్ అన్నారు. ఏటా జరుతున్న అబార్షన్లలో కొంత శాతం మాత్రమే లింగనిర్ధారణకు చెందినవని తెలిపారు. ప్రసవ మరణాలు తగ్గించాలంటే సురక్షిత అబార్షన్ సౌకర్యాలను అందుబాటులోకి తేవాలని అభిప్రాయపడ్డారు. భారత్లో అబార్షన్ చట్టబద్ధమన్న సంగతి దాదాపు 80 శాతం మహిళలకు తెలియకనే రహస్యంగా కడుపు తీయించుకుంటున్నారని పరిశోధనలో తేలినట్లు తెలిపారు. అసురక్షిత అబార్షన్లతో కలిగే మరణాలు, అంగవైకల్యాలు రూపుమామడానికి ఐడీఎఫ్ కృషి చేస్తోంది.


