breaking news
Eluru District Latest News
-
పార్టీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా జయసరిత
పాలకొల్లు సెంట్రల్: వైఎస్సార్ సీపీ కాకినాడ జిల్లా మహిళా విభాగం ఇన్చార్జిగా పాలకొల్లుకు చెందిన రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి క్రరా జయసరితను నియమించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి గుర్తింపు, ఉన్నత స్థానం తప్పక లభిస్తుందన్నారు. తన సేవలను గుర్తించి పదవి కల్పించిన పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డికి, రాష్ట్ర మహిళా విభాగం అధ్యక్షురాలు వరుది కళ్యాణి, ఉభయగోదావరి జిల్లాల కోఆర్డినేటర్ బొత్స సత్యనారాయణ, పార్లమెంటరీ నియోజకవర్గ పరిశీలకులు ముదునూరి మురళీకృష్ణంరాజు, జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావులకు కృతజ్ఞతలు తెలియజేశారు. టి.నరసాపురం: ఒంటరి జీవితాన్ని భరించలేక ఓ వ్యక్తి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. గురువారం కె.జగ్గవరంలో జరిగిన ఈ ఘటనకు సంబంధించి హెచ్సీ కె.వెంకటేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం మండలంలోని కె.జగ్గవరం గ్రామానికి చెందిన బర్రి రాజేష్ (35) పదేళ్ల క్రితం తన పెద్దక్క కుమార్తెను వివాహం చేసుకున్నాడు. అయితే పెళ్లయిన నెల రోజులకే ఆమె రాజేష్ను విడిచి వెళ్లిపోయింది. ఈ క్రమంలో రాజేష్ తల్లి వద్ద ఉంటున్నాడని అతనికి చిన్నప్పటి నుంచి కొంచెం మతిస్థిమితం సరిగా లేకపోవడం వల్ల అప్పుడప్పుడు ఫిట్స్ వచ్చేదన్నారు. ఈ నేపథ్యంలో ఒంటరి జీవితాన్ని భరించలేక ఈనెల 13న గుర్తు తెలియని మందు తాగి ఇంటివద్ద ఆత్మహత్యాయత్నం చేసుకోవడంతో, స్థానికులు గుర్తించి చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ రాజేష్ మృతి చెందాడు. ఆసుపత్రి నుంచి సమాచారం, రాజేష్ అన్న ఏలియా ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు హెచ్సీ తెలిపారు. నూజివీడు: దేవాలయాలు, ప్రార్థనా మందిరాల్లో హుండీలను చోరీ చేసిన దొంగను చాట్రాయి పోలీసులు అరెస్టు చేశారు. డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ గురువారం నూజివీడులో వివరాలు వెల్లడించారు. ఈనెల 13న సాయంత్రం చాట్రాయి ఊరి చివర పోలవరం వెళ్లే రోడ్డు మలుపులో ఉన్న ఆంజనేయస్వామి గుడి వద్ద వాహనాలను తనిఖీ చేస్తుండగా చాట్రాయి వైపు నుంచి పోలవరం వైపునకు మోటార్సైకిల్పై వెళ్తూ అనుమానాస్పదంగా వ్యవరిస్తున్న పటాన్ సలార్ఖాన్ను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారించారు. ఏలూరు నగరంలోని పడమట వీధికి చెందిన పటాన్ సలార్ఖాన్(56)పై ఇప్పటి వరకు 51 దొంగతనం కేసులు ఉండగా ఏలూరు జిల్లాలో 25, నెల్లూరు జిల్లాలో 23, ఎన్టీఆర్ జిల్లాలో 3 చొప్పున కేసులు ఉన్నాయి. ఇతని వద్ద నుంచి రూ.5,900 నగదు, మోటర్ సైకిల్ను రికవరీ చేశారు. నిందితుడిని అరెస్టు చేయడంలో ప్రతిభ చూపిన నూజివీడు సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ, చాట్రాయి ఎస్సై డీ రామకృష్ణ, హెడ్కానిస్టేబుళ్లు ఎం విజయ్భాస్కర్, జీ శ్రీనివాసరావు, కానిస్టేబుళ్లు ఎస్ బాలాజీ, ఎం శ్రీనివాసులను డీఎస్పీ ప్రసాద్ అభినందించారు. -
నిండా ముంచేను
గణపవరం: భారీ వర్షంతో గణపవరం, కొత్తపల్లి, చినరామచంద్రపురం, కేశవరం, పిప్పర, మొయ్యేరు, కొందేపాడు తదితర గ్రామాల్లో వరి చేలు ముంపుబారిన పడ్డాయి. బుధవారం రాత్రి భారీ వర్షం కురవగా గణపవరం, చినరామచంద్రపురం ప్రాంతాల్లో చేలల్లో మోకాలి లోతు నిలిచిపోయింది. మండల వ్యవసాయ అధికారి ప్రసాద్, వ్యవసాయ సిబ్బంది నష్టం అంచనాలు తయారుచేస్తున్నారు. 650 హెక్టార్ల విస్తీర్ణంలో వరి నాట్లు నీటమునిగినట్టు అంచనా వేశారు. మండలంలోని పంట, మురుగు కాల్వలు నిండుకుండల్లా ప్రవహిస్తున్నాయి. గట్లు బలహీనంగా ఉన్న చోట్ల రైతులు మట్టితో గట్లను పటిష్టం చేసుకుంటున్నారు. పలుచోట్ల కాలువలకు గండ్లు పడగా రైతులు చేలు మునగకుండా కాపాడుకుంటున్నారు. గణపవరం నుంచి భీమవరం వెళ్లే రోడ్డు గోతులమయంగా మారి ప్రయాణం ప్రమాదకరంగా తయారైంది. అత్తిలి: మంచిలి గ్రామానికి చెందిన దివ్యాంగ సంఘటన సంఘ నాయకుడు నండూరి రమేష్ స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ నిర్వహించే ఎట్ హోం కార్యక్రమానికి ఎంపికయ్యారు. ఏటా స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా రాష్ట్ర గవర్నర్ ప్రముఖులతో ఎట్ హోమ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. అందులో భాగంగా దివ్యాంగుల కోట కింద మంచిలి గ్రామానికి చెందిన నండూరి రమేష్ను జిల్లా అధికారులు ఎంపిక చేశారు. దివ్యాంగుల సంక్షేమం కోసం రమేష్ పలు సేవా కార్యక్రమాలు నిర్వహించి జాతీయ స్థాయిలో ఉత్తమ అవార్డులు కూడా గతంలో పొందారు. -
ఉపాధ్యాయులకూ పరీక్షే
● విద్యార్థి సామర్థ్యానికి మించి ప్రశ్నలు ● సిలబస్లో లేని ప్రశ్నలు ఇస్తుండటంతో తలలు పట్టుకుంటున్న ఉపాధ్యాయులు ‘ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ పాఠశాలల్లో ఎఫ్ఏ–1 పరీక్షల గురించి ఆరా తీస్తున్న అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్..’ ‘ఎఫ్ఏ1 పరీక్షల స్ట్రాటజీని చూసి హార్వర్డ్, కేంబ్రిడ్జ్ యూనివర్సిటీల డీన్స్ సైతం ఆశ్చర్యపోయి ముక్కున వేలేసుకున్న వైనం..’ ఇవీ ఉపాధ్యాయుల, ఉపాధ్యాయుల సంఘాల వాట్సాప్ గ్రూపుల్లో, వాట్సాప్ ఛానల్స్లో చక్కర్లు కొడుతున్నాయి. నూజివీడు : కూటమి ప్రభుత్వం అడ్డగోలు నిర్ణయాలు తీసుకుంటూ ప్రభుత్వ విద్యారంగాన్ని భ్రష్టుపట్టిస్తోందన్న వాదన వినిపిస్తోంది. ఇప్పటికే పాఠశాలల విలీనం చేసి తొమ్మిది రకాల పాఠశాలలను తీసుకురావడమే కాకుండా క్లస్టర్ విధానంను తీసుకువచ్చి అస్తవ్యస్తం చేసిన ప్రభుత్వం ఇప్పుడు పరీక్షల తీరు చూస్తుంటే పరిస్థితులు అత్యంత దారుణంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. సిలబస్లో చెప్పిన పాఠాలు ఒకటైతే పరీక్షల్లో ఇస్తున్న ప్రశ్నలు వేరేగా ఉన్నాయని, గణితం గాని, ఇంగ్లిష్ గాని సిలబస్లో పాఠ్యపుస్తకంలో చెప్పిన లెక్కలు నుంచి ఒక్క ప్రశ్న కూడా ఇవ్వలేదని ఉపాధ్యాయులు వాపోతున్నారు. ఇలా ఇస్తే విద్యార్థులు ఎలా పరీక్షలు రాయగలరని వారు ప్రశ్నిస్తున్నారు. ఈ పరీక్షలు చూస్తుంటే విద్యార్థులకు పెట్టినట్లు లేదని, ఉపాధ్యాయులకు పరీక్షలు అన్నట్లు ఉందని వాపోతున్నారు. ఈనెల 11 నుంచి నిర్వహిస్తున్న ఎఫ్ఏ–1 పరీక్షల తీరు, ప్రశ్నాపత్రాల రూపొందించిన విధానం పరిశీలిస్తే ఉపాధ్యాయులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు మార్కులు రాకుండా ప్రభుత్వ పాఠశాలలను మరింత బలహీనం చేసేందుకే ఇలా చేస్తున్నారా అనే అనుమానాలను ఉపాధ్యాయులు వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ పాఠశాలలో చదివించిన, ప్రభుత్వం నిర్ధేశించిన సిలబస్ ఒకటైతే ప్రశ్నాపత్రాలలో ఇచ్చింది మరొకటి కావడం గమనార్హం. దీనిపై ఉపాధ్యాయ వర్గాల్లో ఆగ్రహం వ్యక్తమవుతోంది. దీనివల్ల చదివే పిల్లలు కూడా ఉపాధ్యాయులు చెప్పే ప్రశ్నలు చదివినా పరీక్షల్లో రావని చదవకుండా ఉండే అవకాశం ఉందని ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ప్రశ్నాపత్రాలు తయారు చేసే వారు ఒకసారి ఆలోచించి చదివినవి, సిలబస్లోనుంచి ఇస్తే కనీసం ప్రభుత్వ పాఠశాలల్లోని విద్యార్థుల చదువులు ముందుకు వెళ్తాయని ఉపాధ్యాయులు పేర్కొంటున్నారు. అన్ని ప్రశ్నలు కూడా అప్లికేషన్ మెథడ్లో ఇవ్వడం వల్ల చదివే వాళ్లు కూడా చదవకుండా పోయే అవకాశం ఉందని ఆందోళన చెందుతున్నారు. పరీక్షలనేవి విద్యార్థులు నేర్చుకున్న అంశాలను, వివిధ ప్రశ్నల ద్వారా అంచనా వేసే విధంగా ఉండాలే తప్ప వారి స్థైర్యాన్ని దెబ్బతీసేలా ఉండకూడదని అంటున్నారు. ఒకటో తరగతి విద్యార్థికి ఏప్రిల్ నెలలో నేర్చుకోబోయే సిలబస్లో ప్రశ్నలు ఆగస్టులో జరిగే యూనిట్ పరీక్షలు ఇవ్వడంపై ఉపాధ్యాయులు విస్మయానికి గురవుతున్నారు. పరీక్షల్లో ఇచ్చిన కొన్ని ప్రశ్నలు ఇలా.. ఒకటో తరగతి పిల్లలు ఇప్పుడిప్పుడే పాఠశాలలకు అలవాటు అవుతున్నారు. ఇంకా కొందరు పాఠశాలకు రావడానికి మొరాయిస్తున్నారు. వీరు ఇప్పుడిప్పుడే తెలుగు, ఇంగ్లిష్ అక్షరాలను గుర్తు పడుతున్నారు. అలాంటి పిల్లలకు ఇంగ్లిష్లో పేరాగ్రాఫ్ ఇచ్చి దానిని విని ఇంగ్లిష్లోని ప్రశ్నలకు సమాధానాలు రాయడం, పదాలు తయారు చేయడం చేయాలి. అలాగే మూడో తరగతి విద్యార్థి తెలుగులో పుస్తక సమీక్ష చేసి, ఆ సమీక్షను సమర్పణ చేయాలి. అలా చేసినప్పుడే వాటికి మార్కులు ఇవ్వాలి. మూడో తరగతి ఆంగ్ల భాష పరీక్షకు నాలుగో తరగతిలోని పాఠాల నుంచి ప్రశ్నలు ఇచ్చారు. ఎస్సీఈఆర్టీలో ప్రశ్నాపత్రాలు రూపొందించే వారికి విద్యార్థి స్థాయి, సామర్థ్యంపై కనీస అవగాహన ఉండటం లేదని ఉపాధ్యాయులు అభిప్రాయ పడుతున్నారు. ఉపాధ్యాయులను, విద్యార్థులను ఇబ్బంది పెట్టడానికి తప్ప ఈ పరీక్షలు దేనికి ఉపయోగమనే ప్రశ్నలు తలెత్తుతున్నాయి. -
ద్వారకాతిరుమలలో లారీ బీభత్సం
● రెండు కార్లను, ఒక ఆటోను ఢీకొట్టిన లారీ ● ఆటో డ్రైవర్కు గాయాలు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో గురువారం తెల్లవారుజామున ఒక లారీ బీభత్సాన్ని సృష్టించింది. గుడి సెంటర్లో రెండు కార్లను, గరుడాళ్వార్ సెంటర్లో రోడ్డు మధ్యలోని డివైడర్ మీద నుంచి దూసుకెళ్లి ఒక టాటా ఏస్ ఆటోను ఢీకొట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో ఆ ప్రాంతాల్లో ఎవరూ లేకపోవడంతో ప్రాణనష్టం తప్పింది. స్థానికుల కథనం ప్రకారం. ద్వారకాతిరుమల క్షేత్రంలో బుధవారం రాత్రి భారీగా వివాహాలు జరిగాయి. పెదపాడు మండలం అప్పన్నవీడు గ్రామానికి చెందిన మాతంగి వెంకటేష్ తన ఆటోలో పెళ్లి బృందాన్ని క్షేత్రానికి తీసుకొచ్చాడు. వారిని కల్యాణ మండపం వద్ద దింపిన తరువాత గరుడాళ్వార్ సెంటర్లోని దేవస్థానం బస్స్టేషన్ వద్ద ఆటోను నిలిపి, అందులో నిద్రిస్తున్నాడు. అలాగే మచిలీపట్నం, విశాఖపట్నంకు చెందిన పెళ్లి బృందాలు వేసుకొచ్చిన రెండు కార్లను గుడి సెంటర్లో నిలిపి, కల్యాణ మండపాల్లోకి వెళ్లారు. గురువారం తెల్లవారుజాము 2 గంటల సమయంలో చింతలపూడి నుంచి కాకినాడకు వెళుతున్న ఒక లారీ గుడి సెంటర్లో నిలిపి ఉన్న రెండు కార్లను ఢీకొట్టింది. అక్కడి నుంచి ఆగకుండా వెళ్లిన లారీ గరుడాళ్వార్ సెంటర్ వద్ద డివైడర్పైకి దూసుకెళ్లి రోడ్డుకు అవతల వైపు దేవస్థానం బస్ షెల్టర్ వద్ద నిలిపి ఉన్న ఆటోను ఢీకొట్టింది. ఆటో పక్కనే ఉన్న విద్యుత్ స్తంభానికి తగలడంతో స్తంభం కాస్తా విరిగిపోయింది. ఈ ప్రమాదంలో ఆటోలో నిద్రిస్తున్న డ్రైవర్ వెంకటేష్కు గాయాలయ్యాయి. అలాగే రెండు కార్లు, ఆటో ధ్వంసమయ్యాయి. ఈ ప్రమాదానికి లారీ డ్రైవర్ మద్యం మత్తే కారణమని పోలీసులు గుర్తించారు. వర్షం వల్ల తప్పిన పెను ప్రమాదం.. క్షేత్రంలో వివాహాలు జరిగే ప్రతిసారి రహదారులు పెళ్లి జనాలతో రద్దీగా ఉంటాయి. అయితే బుధవారం రాత్రి కుండపోత వర్షం కురవడంతో పెళ్లివారు ఎవరూ రోడ్లపైకి రాలేదు. దాంతో ఈ ప్రమాదంలో ప్రాణనష్టం జరగలేదు. గురువారం ఉదయం విద్యుత్శాఖ అధికారులు, సిబ్బంది విరిగిపోయిన విద్యుత్ స్తంభాన్ని తొలగించి, కరెంటు సరఫరాను పునరుద్ధరించారు. ప్రమాదానికి కారణమైన కాకినాడకు చెందిన లారీ డ్రైవర్ చెరుకూరి లక్ష్మీపతిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
మన్యం వీరుల పోరు అజరామరం
దేశం కోసం ప్రాణాలర్పించిన ధీరులుగిరిజన స్వాతంత్య్ర సమరయోధుల కుటుంబాలను గుర్తించి ప్రభుత్వం వారిని అన్ని విధాలుగా ఆదుకోవాలి. కేఆర్పురం ఐటీడీఏకు కారుకొండ సుబ్బారావు పేరు పెట్టాలి. గిరిజన స్వాతంత్య్ర పోరాట యోధులకు తగిన గౌరవం ఇవ్వాలి. – అయినారపు సూర్యనారాయణ, ఆదివాసీ మహాసభ న్యాయ సలహాదారు నేను గిరిజన వీరుడు కారుకొండ సుబ్బారెడ్డి ముని మనవడను. మాది పోలవరం మండలం కోండ్రుకోట. తెల్ల దొరలపై మా తాత చేసిన పోరాటాన్ని మా పెద్దలు మాకు ఎప్పుడూ చెబుతూ ఉండేవారు. సమరయోధుల కుటుంబానికి చెందిన మాకు ఎటువంటి గుర్తింపు లేదు. ప్రభుత్వం ఇప్పటికై నా గుర్తించి మమ్మల్ని అన్ని విధాలుగా ఆదుకోవాలి. – కారుకొండ అబ్బాయిరెడ్డి, కోండ్రుకోట బుట్టాయగూడెం: బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడి ప్రాణాలు విడిచిన గిరిజన పోరాట వీరులు ఎందరో ఉన్నారు. వారి పోరాటాలు, త్యాగాలకు చారిత్రక ఆధారాలు లేకపోయినా ఆనాటి శిథిల భవనాల్లో ఆ జ్ఞాపకాలు నేటికీ సజీవంగానే ఉన్నాయి. ఆ అమర వీరులను దేశ స్వాతంత్య్ర వేడుకల సందర్భంగా స్మరించుకుందాం. వెలుగులోకి రాని వీరుల త్యాగం తెల్లదొరలను ఎదురించి ప్రాణాలు పోగొట్టుకున్న వారిలో నలుగురు అజ్ఞాత స్వాతంత్య్ర పోరాట వీరులు పశ్చిమ మన్యానికి చెందిన వారు ఉన్నారు. అల్లూరి సీతారామరాజుకి ముందే వీరు పోరాటం చేసి మృతి చెందినప్పటికీ ఆ గిరిజన వీరుల త్యాగాలు వెలుగులోకి రాలేదు. ఆ నలుగురు వీరులు కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్య, కుర్ల వెంకట సుబ్బారెడ్డి, గురుగుంట్ల కొమ్మురెడ్డి. వీరు 1858లో బ్రిటిష్ పాలనకు ఎదురు తిరిగి తమ ప్రాణాలను తృణప్రాయంగా విడిచినట్లు చరిత్ర తెలిసిన పూర్వీకులు చెబుతున్నారు. తిరుగుబాటులో కారుకొండ సుబ్బారెడ్డి కీలకం 1857లో యావత్ భారతదేశంలో స్వాతంత్య్ర సమరం ప్రారంభమైనప్పుడు దేశవ్యాప్తంగా అనేక ప్రాంతాల్లో బ్రిటీష్ వారిపై తిరుగుబాటు జరిగింది. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పోలవరం మండలం కొరుటూరుకు చెందిన కొండరెడ్డి గిరిజన తెగకు చెందిన కారుకొండ సుబ్బారెడ్డి పోలవరం పరిసరాల ప్రాంతంతో పాటు బుట్టాయగూడెం నుంచి యర్నగూడెం వరకూ ఉన్న గిరిజన గ్రామాలకు జమిందారుగా ఉండేవారు. ఆయన స్వాతంత్య్ర సమరం జరుగుతున్న సమయంలో యర్నగూడెంలో ఆంగ్లేయులపై తిరుగుబాటు చేశాడు. ఆ సమయంలో గోదావరి దిగువ ప్రాంతంలో ఉన్న సుమారు 40 గ్రామాలతో బ్రిటీష్ వారిపై దండయాత్ర చేసి విజయం సాధించారు. సుబ్బారెడ్డికి ముఖ్య అనుచరుడిగా కుర్ల సీతారామయ్య ఉండేవారు. అలాగే గురుగుంట్ల కొమ్మురెడ్డి, అప్పటి తూర్పుగోదావరి జిల్లా కొండమొదలు గ్రామానికి చెందిన కుర్ల వెంకటరెడ్డి కలిసి తెల్లదొరలపై వీరోచిత పోరాటం చేశారు. ఆ సమయంలో సుబ్బారెడ్డి తలకు బ్రిటిష్ వారు రూ.2,500 వెల కట్టారు. చివరకు కొందరు గిరిజనులు వెన్నుపోటు పొడిచి కారుకొండ సుబ్బారెడ్డితోపాటు అతని అనుచరులను, మరికొందరు విప్లవ వీరులను 1858 జూన్ 11వ తేదీన బ్రిటీష్ వారికి పట్టించారు. 1858 అక్టోబర్ 7వ తేదీన కోర్టు విచారణ అనంతరం 8 మందిని అండమాన్ జైలుకు పంపారు. 35 మంది గిరిజన వీరుల్ని గుంటూరు దగ్గరున్న జైలులో యావజ్జీవ కారాగార శిక్ష విధించారు. కారుకొండ సుబ్బారెడ్డి, కుర్ల సీతారామయ్యలను బుట్టాయగూడెంలో ఉరి తీశారు. మిగిలిన ఆరుగురిని పోలవరం సమీపంలో ఉన్న దివానం వద్ద ఉరి తీశారు. కారుకొండ సుబ్బారెడ్డి చేసిన పోరాటానికి కోపోద్రిక్తులైన బ్రిటీష్వారు సుబ్బారెడ్డి మరణించిన తర్వాత అతడి మృతదేహాన్ని చిన్న బోనులో పెట్టి రాజమండ్రి దగ్గర ఉన్న కోటగుమ్మం వద్ద ప్రజలు చూసేవిధంగా వేలాడదీశారు. స్వాతంత్య్రం రావడానికి కొన్నేళ్ల ముందు వరకూ కూడా సుబ్బారెడ్డి మృతదేహం కోటగుమ్మం వద్ద వేలాడుతూ ఉండేదని పాతతరం వారు చెబుతున్నారు. బ్రిటీష్ వారిపై తిరుగుబాటు చేసి ఉరి కొమ్మలకు వేలాడిన ఆ అమర వీరుల పోరు అజరామరం. పాత పోలవరంలో బ్రిటీష్ వారు స్వాధీనం చేసుకున్న రెడ్డిరాజుల భవనం శిథిలావస్థలో ఉన్న దృశ్యం బ్రిటీష్ వారిపై పోరాటం చేసి మరణించిన వీరుల గ్రామం కొరుటూరు ముంపునకు గురై శిథిలావస్థలో ఉన్న దృశ్యం తెల్లదొరలను గడగడలాడించిన మన్యం బిడ్డలు బ్రిటీష్ వారికి పోరాటయోధులను పట్టించిన వెన్నుపోటుదారులు 8 మంది వీరులను ఉరితీసిన బ్రిటీష్ పాలకులు -
● విద్యార్థులతో మట్టి చాకిరీ
● అంతర్రాష్ట్ర బస్సుల్లో అనుమతి నిరాకరణ ● 63 రూట్లకే ఉచితం పరిమితం ● కండిషన్లో లేని బస్సుల్లో ప్రయాణంపై ఆందోళన తాడేపల్లిగూడెం: వెంకట్రామన్నగూడెంలోని ఉద్యా న వర్సిటీలో డిప్లమో హార్టీకల్చర్, డిప్లమో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సుల్లో ప్రవేశాలకు తుది విడత స్పాట్ కౌన్సెలింగ్ను ఈనెల 20న నిర్వహించనున్నారు. ఈ మేరకు రిజిస్ట్రార్ బి.శ్రీనివాస్ ప్రకటన విడుదల చేశారు. నాలుగు ప్రభుత్వ, మూడు గుర్తింపు పొందిన పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశానికి గతంలో దరఖాస్తు చేసుకున్నా, కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి ఉద్యాన వర్సిటీ ప్రాంగణంలో కౌన్సెలింగ్ నిర్వహిస్తామన్నారు. విద్యార్థులు ధ్రువీకరణ పత్రాలతో స్వయంగా హాజరుకావాలని సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గవర్నర్ కార్యాలయంలో గవర్నర్ అబ్దుల్ నజీర్తో జరిగే మీట్ ఎట్ కార్యక్రమానికి ఏలూరు జిల్లా నుంచి నాగేంద్ర సింగ్ ఎంపికయ్యారు. నాగేంద్రసింగ్ ఏలూరు శ్రీరామ్నగర్లోని ఎంపీయూపీ స్కూల్లో టీచర్గా పనిచేస్తున్నారు. అంతర్జాతీయస్థాయి దివ్యాంగుల క్రికెట్ పోటీలకు అంపైర్గా కూడా సేవలందిస్తున్నారు. శుక్రవారం సాయంత్రం గవర్నర్ ఇచ్చే తేనీటి విందులో పాల్గొని గవర్నర్ నుంచి సన్మానం అందుకోనున్నారు. హాస్టల్ ప్రాంగణాన్ని మట్టితో చదును చేస్తూ.. చెత్తను ఏరుతూ.. చెత్తను కాల్చుతున్న విద్యార్థులు ఉచిత ప్రయాణానికి కొర్రీలు ఏలూరు (ఆర్ఆర్పేట): ఎన్నికల హామీ ఉచిత బస్సు ప్రయాణం శుక్రవారం అమలు చేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. దాదాపు ఏడాదిన్నర నుంచి ప్రతిపక్షాలు, మహిళల నుంచి వస్తున్న వ్యతిరేకత తట్టుకోలేక నిర్ణయం తీసుకోక తప్పలేదు. రాష్ట్రంలో ఈ మూల నుంచి ఆ మూల వరకూ ఉచితంగా బస్సు ప్రయాణమని చెప్పిన సర్కారు ఇప్పుడు అనేక ఆంక్షలు పెట్టింది. కర్ణాటక, తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన వెంటనే పథకాన్ని అమలు చేశాయి. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం మాత్రం ఏడాదిన్నరకు ఈ పథకాన్ని అమలు చేస్తోంది. ఆయా రాష్ట్రాల్లో అన్ని బస్సుల్లో ఎక్కడి నుంచి ఎక్కడికై నా ప్రయాణించేలా అనుమతులిచ్చారు. రాష్ట్రంలో పల్లె వెలుగు, అల్ట్రా పల్లెవెలుగు, ఎక్స్ప్రెస్ బస్సుల్లో మాత్రమే ఉచిత ప్ర యాణమంటూ పెద్ద బాంబు పేల్చారు. జిల్లాలో ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు డిపోల నుంచి మొత్తం 309 బస్సులు నిత్యం ప్రయాణికులను వారి గమ్యస్థానాలకు చేర్చుతున్నాయి. ఈ బస్సుల్లో మహిళలు ఎక్కడానికి 177 బస్సుల్లో మాత్రమే అనుమతిస్తారు. ఉచిత బస్సు ప్రయాణంలో విధించిన కొర్రీల్లో భాగంగా జిల్లా మహిళలకు అంతర్రాష్ట్ర రూట్లలో ప్రయాణించే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతించరు. ఈ మేరకు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని పలు ప్రాంతాలకు వెళ్లే బస్సుల్లో ఉచిత ప్రయాణానికి అనుమతి ఉండదు. ఏలూరు జిల్లా నుంచి తెలంగాణ రాష్ట్రంలోని సత్తుపల్లి, అశ్వారావుపేట, భద్రాచలం వెళ్లే బస్సులు మొత్తం 14 ఉన్నాయి. ఈ బస్సులు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల మీదుగానే వెళతాయి. ఈ బస్సుల్లో తెలంగాణ సరిహద్దుల వరకూ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించవచ్చు. ప్రభుత్వం ఈ బస్సుల్లో అసలు ఉచిత ప్రయాణాన్ని అనుమతించేది లేదని స్పష్టం చేసింది. సగం మంది మహిళలకు దూరం ఏలూరు జిల్లా నుంచి నిత్యం ఆర్టీసీ బస్సులు 103 రూట్లలో తిరుగుతున్నాయి. వీటిలో ఉచిత బస్సు ప్రయాణం మాత్రం కేవలం 63 రూట్లకే పరిమితం చేశారు. ఏలూరు డిపో నుంచి మొత్తం 41 రూట్లలో ఆర్టీసీ బస్సులు తిరుగుతుండగా 23 రూట్లలో తిరిగే బస్సుల్లో మాత్రమే మహిళలకు అనుమతిస్తారు. జంగారెడ్డిగూడెం నుంచి 33 రూట్లలో తిరుగుతుండగా 22 రూట్లలో మాత్రమే ఉచిత ప్రయాణానికి అవకాశం ఉంటుంది. నూజివీడు డిపో నుంచి 29 రూట్లలో బస్సులు తిరుగుతుండగా వాటిలో 18 రూట్లలో మాత్రమే మహిళలకు ఉచిత ప్రయాణానికి అనుమతి లభిస్తుంది. ఏలూరు జిల్లాలోని వివిధ డిపోల నుంచి ఆర్టీసీ బస్సుల్లో నిత్యం సుమారు 80 వేల మంది ప్రయాణిస్తుండగా వారి లో 40 శాతం మంది అంటే సుమారు 32 వేల మంది మహిళలు ఉంటారని ఆర్టీసీ వర్గాలు తెలుపుతున్నాయి. ప్రస్తుత కూటమి ప్రభుత్వం విధించిన షర తుల కారణంగా వీరిలో దాదాపు 50 శాతం అంటే 16 వేల మంది మహిళలకు ఉచిత బస్సు ప్ర యాణం అందని ద్రాక్షగానే మిగిలిపోనుంది. -
వలంటీర్లపై కూటమి కక్ష
వ్యక్తులపై కాకుండా వ్యవస్థపైనే కూటమి ప్రభుత్వం కక్ష కట్టింది. ప్రజలకూ ప్రభుత్వానికి వారధిలా.. గడప ముంగిటకే సంక్షేమ పథకాలను అందించేలా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటుచేసి వలంటీర్ వ్యవస్థపై కక్ష కట్టింది. రూ.5 వేల జీతంతో వెట్టిచాకిరీ చేయిస్తున్నారు.. తాము అధికారంలోకి వస్తే రూ.10 వేలు జీతం ఇచ్చి వలంటీర్లను కొనసాగిస్తామని చంద్రబాబు, పవన్కల్యాణ్ ఎన్నికల్లో హామీలిచ్చారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత వ్యవస్థకు చట్టబద్ధత లేదనే సాకుతో ఒక్కసారిగా జిల్లాలో 10,800 మంది ఉద్యోగాలను తొలగించి రోడ్డున పడేశారు. వలంటీర్ వ్యవస్థ ఏర్పడి శుక్రవారం నాటికి ఆరేళ్లు పూర్తి కాగా వ్యవస్థ నిర్వీర్యమై ఏడాది గడిచింది. సాక్షి ప్రతినిధి, ఏలూరు : గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 2019 ఆగస్టు 15న వలంటీర్ల వ్యవస్థను అమలులోకి తీసుకువచ్చారు. జిల్లాలో గ్రామ, వార్డు సచివాలయాల ద్వారా పౌర సేవలను ప్రజల ముంగిటకు అందించేలా వలంటీర్ వ్యవస్థకు శ్రీకారం చుట్టి ఐదేళ్లపాటు విజయవంతంగా కొనసాగించారు. ముఖ్యంగా ఒకటో తారీఖున ఇంటి వద్దకే పింఛన్ పంపిణీ, రేషన్ కార్డుల్లో పేర్లు మార్పులు, విపత్తుల వేళ సాయం వంటి సేవలతో వలంటీర్లు ప్రజల అభిమానాన్ని చూరగొన్నారు. ఇలా జిల్లాలో 10,800 మంది వలంటీర్లు సేవే పరమావధిగా సేవలందించారు. రూ.3,897 కోట్ల పెన్షన్ పంపిణీ : జిల్లాలో ప్రతి నెలా ఒకటో తారీఖున సగటున 2.81 లక్షల మందికి సుమారు రూ.3,897 కోట్లను లబ్ధిదారులకు పెన్షన్ల కింద వలంటీర్లు పంపిణీ చేశారు. వేకువజాము నుంచి మధ్యాహ్న సమయానికి 95 శాతాన్ని పైగా పంపిణీ పూర్తిచేసేవారు. కోవిడ్ వంటి విప త్కర పరిస్థితుల్లో ఇంటింటా వైద్య సేవలతో పాటు వ్యాక్సినేషన్, ప్రభుత్వ సాయం అందజేతలో వలంటీర్లు కీలకంగా పనిచేశారు. తమ ప్రాణాలను పణంగా పెట్టి సేవలందించారు. వలంటీర్ వ్యవస్థ ద్వారా సేవలు సులభం చేయడం, అవినీతికి ఆస్కా రం లేకుండా కొనసాగిన తీరు దేశవ్యాప్తంగా గుర్తింపు పొందింది. పలు రాష్ట్రాల్లో వలంటీర్ల వ్యవస్థను అమలుచేసే ఉద్దేశంతో ఆయా రాష్ట్రాల ప్రతినిధులు క్షేత్రస్థాయిలో పరిశీలించారు. జిల్లాలో గోదావరి వరదల సమయంలో వలంటీర్లు నూరు శాతం సేవలందించి ముంపు బాధితులకు భరోసాగా నిలిచారు. వీరి సేవలను గుర్తించి కలెక్టర్ సైతం సత్కరించారు. ఎన్నికల సమయంలో వలంటీర్లను కూటమి ప్రభుత్వం నమ్మకంగా వంచించి గొంతు కోసింది. వలంటీర్ వ్యవస్థకు తాము వ్యతిరేకం కాదని అధికారంలోకి రాగానే జీతం రూ.5 వేల నుంచి రూ. 10 వేలు పెంచు తామని ప్రకటించారు. గద్దెనెక్కి న తర్వాత వలంటీర్ వ్యవస్థ సరికాదని, చట్టబద్ధత లేదంటూ ఉద్యోగాలు తొలగించారు. దీనిపై జిల్లా స్థాయి నుంచి రాష్ట్రస్థాయి వరకు వలంటీర్లు ఆందోళనలు చేసినా సర్కారు స్పందించని పరిస్థితి. సేవకులకు వంచన ప్రభుత్వానికీ ప్రజలకు వారధిలా పనిచేసిన వలంటీర్లు పారదర్శకంగా పథకాల అమలుకు దోహదం గౌరవ వేతనం రూ.10 వేలు చేస్తామని చంద్రబాబు, పవన్ కళ్యాణ్ హామీ అధికారంలోకి వచ్చాక ఆ ఊసెత్తని కూటమి పెద్దలు నేటితో వలంటీర్ వ్యవస్థకు ఆరేళ్లు జిల్లాలో 10,800 మంది వలంటీర్ల సేవలు ‘వలంటీర్లలో చాలా సమర్థత ఉంది. మేం అధికారంలోకి వస్తే వారిని ఉద్యోగాల నుంచి తీయబోం. వలంటీర్ వ్యవస్థను కొనసాగిస్తాం. వారికి ఇస్తున్న గౌరవ వేతనాన్ని రూ.10 వేలకు పెంచే బాధ్యత నేను తీసుకుంటాను’. – ఎన్నికల్లో చంద్రబాబు హామీ ‘వలంటీర్లు నా అక్కాచెల్లెళ్లు. ఏ రోజూ కూడా నాకు వారి పొట్టకొట్టాలన్న ఉద్దేశం లేదు. మీకు రూ.5 వేలు వస్తే.. మరో రూ.5 వేలు అదనంగా ఇచ్చే మనసున్న వాణ్ణి’. – ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ హామీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే వలంటీర్లను కొనసాగిస్తామని హామీ ఇచ్చారు. అయితే గద్దెనెక్కిన తర్వాత వలంటీర్ వ్యవస్థను రద్దు చేయడంతో ఉపాధి కోల్పోయాం. వలంటీర్ వ్యవస్థను రద్దు చేసి ఏడాది పైబడింది. ఎన్నికల్లో హామీ ఇచ్చిన ప్రకారం యువతకు ఉపాధి కల్పించేలా వలంటీర్ వ్యవస్థను కొనసాగించాలి. – కుచ్చులపాటి మహేష్, ఉప్పలపాడు, కామవరపుకోట మండలం కూటమి నాయకులు ఎన్నికల ముందు వలంటీర్లకు అండగా ఉంటామని, జీతం రూ.10 వేలు చేస్తామని నమ్మించారు. ప్రభుత్వం ఏర్పడిన వెంటనే లక్షలాది మంది వలంటీర్లను తొలగించారు. మాజీ సీఎం జగన్ వలంటీర్ వ్యవస్థకు ప్రత్యేక గుర్తింపు తీసుకువస్తే.. కూటమి నాయకులు దగా చేశారు. వలంటీర్ వ్యవస్థను కొనసాగించేలా కూట మి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవాలి. – జిలానీ, కొవ్వలి, దెందులూరు మండలం -
తాగునీటి కోసం ధర్నా
మండవల్లి: మండవల్లిలోని స్టేషన్ రోడ్డులో తా గునీటి సమస్య పరిష్కరించాలంటూ గురువా రం జాతీయ రహదారిపై గ్రామస్తులు ధర్నాకు దిగారు. 20 రోజుల నుంచి కుళాయిల నుంచి తాగునీరు రావడం లేదని, తమను పట్టించుకునే నాథుడే లేడంటూ మహిళలు ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. సర్పంచ్, అధికారులు వచ్చి సమాధానం చెప్పాలంటూ భీష్మించారు. కొద్దిసేపటికి పోలీసులు వచ్చి వారికి నచ్చజెప్పి ధర్నాను విరమింపజేశారు. తమ గోడు ఎవరూ పట్టించుకోవడం లేదని, ఎన్ని రోజులు ఓపిక పట్టాలని మహిళలు పోలీసుల వద్ద వాపోయారు. ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లో గురువారం వికసిత్ భారత్ 2047 లక్ష్యంగా స్కూలింగ్–బిల్డింగు బ్లాక్స్ అనే అంశంపై విద్యాశాఖ అధికారులతో కలెక్టర్ వెట్రిసెల్వి వర్క్షాప్ నిర్వహించారు. దేశం మొదటి స్థానంలో నిలిచే లక్ష్యంగా అన్ని రంగాల్లో నిరంతర లక్ష్యాలు, నిర్దేశం, సాధన చాలా అవసరమన్నారు. మానవ వనరుల అభివృద్ధి యువత, వయోజనులు, మహిళలపై నిర్మించబడి ఉందన్నారు. ఏలూరు(మెట్రో): ఏలూరు జిలాల్లో నీటి నిర్వహ ణకు పటిష్టమైన చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి సీఎం చంద్రబాబునాయుడుకి తెలియజేశారు. నీటి నిర్వహణ, భూగర్భ జలాల పెంపు, నీటి సంరక్షణ, తదితర అంశాలపై రాష్ట్రంలోని కలెక్టర్లు, సాగునీటి సంఘాల, ప్రాజెక్ట్ సంఘాల ప్రతినిధులు, జలవనరుల శాఖ అధికారులతో సీఎం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్, అధికారులు హాజరయ్యారు. చాట్రాయి: రెండు రోజుల నుంచి కురుస్తున్న వర్షాలతో మండలంలోని తమ్మిలేరు రిజర్వాయర్ ప్రాజెక్టుకు స్వల్పంగా వరద నీరు చే రుతోంది. మండలంలో బుధవారం రాత్రి నుంచి భారీ వర్షం కురవడంతో చెరువులు, కాలువల్లోని నీరు రిజర్వాయర్ ప్రాజెక్టులోకి చేరుతుంది. మండలంలో 55.5 మిల్లీమీటర్ల వర్షపాత నమోదయ్యింది. 850 క్యూసెక్కుల వరద నీరు చేరుతుందని, ప్రాజెక్టు నీటిమట్టం 255 అడుగులు కాగా ప్రస్తుతం 233 అడుగులు ఉందని టీఆర్పీ అధికారులు తెలిపారు. గణపవరం: మహిళలకు ఉచిత బస్సు పథకంతో రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం ఆటోవాలాల పొట్ట కొట్టనుందని, ఈ పథకాన్ని వెంటనే విరమించుకోవాలని గణపవరం మండల ఆటో వర్కర్ల యూనియన్ నాయకులు గళమెత్తారు. గురువారం గణపవరం ఏరియా స్నేహ ఆటో వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. గణపవరం, సరిపల్లె, బువ్వనపల్లి గ్రామాల్లో ఆటోలతో నిరసన ప్రదర్శనలు చేశారు. బస్టాండు నుంచి ఆటో డ్రైవర్లు నినాదాలు చేసుకుంటూ ప్రదర్శనగా గణపవరం సెంటర్లోని మూడు రోడ్ల కూడలి వద్దకు చేరుకుని మానవహారంగా నిలిచారు. ఈ సందర్భంగా యూనియన్ నా యకులు మాట్లాడుతూ తాము ఆటోలు నడుపుకుంటూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, ప్రతి నెలా ఈఎంఐలు చెల్లించడమే గగనంగా ఉందన్నారు. ఇలాంటి పరిస్థితిలో ఉచిత బస్సు ప్రయాణంతో జీవనం మరింత కష్టం కానుందని వాపోయారు. భీమవరం: జిల్లాలో గురువారం ఉదయం వర కు 20 మండలాల్లో సగటున 90 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా తణుకులో 236.6 మి.మీ., అత్యల్పంగా మొగల్తూరులో 8.6 మి.మీ. వర్షం పడింది. మండలాల వారీ గా వర్షపాతం ఇలా.. తాడేపల్లిగూడెంలో 162.2 మి.మీ, పెంటపాడులో 189 మి.మీ. కురిసింది. -
వాగు ప్రవాహానికి కొట్టుకుపోయిన రోడ్డు
బుట్టాయగూడెం: గత రెండు రోజులుగా కురుస్తున్న వర్షాల కారణంగా జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెం సమీపంలోని రోడ్డు గురువారం ఉదయం కొట్టుకుపోయింది. దీనితో పై గ్రామాలకు రహదారిపై వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. అధికారులు వెంటనే స్పందించి రహదారి మరమ్మతులు చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. అత్తిలి: మండలంలోని తిరుపతిపురం, వరిఘేడు ప్రాంతాల్లో నీట మునిగిన పంట పొలాలను గురువారం కలెక్టర్ సీహెచ్ నాగరాణి పరిశీలించారు. రైతులతో మాట్లాడి వివరాలు తెలుసుకున్నారు. కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో బుధవారం ఒక్కరోజు 1799.8 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైందన్నారు. దీంతో సుమారు 400 నుంచి 500 ఎకరాల వరకు పొలాలు ముంపు బారిన పడ్డాయని తెలిపారు. -
సత్యనారాయణపురంలో చోరీ
ఆకివీడు: మండలంలోని పెదకాపవరం శివారు సత్యనారాయణపురం గ్రామంలో తాళం వేసి ఉన్న ఓ ఇంట్లో చోరీ జరిగింది. గ్రామంలోని ఇందుకూరి సూర్యనారాయణరాజు బుధవారం ఉదయం తన ఇంటికి తాళం వేసి పిప్పర గ్రామంలోని బంధువుల ఇంటికి వెళ్లాడు. తిరిగి గురువారం ఉదయం ఇంటికి వచ్చేసరికి తాళం బద్దలుకొట్టి ఉండడంతో లోపలికి వెళ్లి చూడగా బీరువా తాళాలు తెరిచి ఉండడం, సుమారు రూ.1.60 లక్షల విలువైన ఆరు కాసుల బంగారు ఆభరణాలు చోరీకి గురైనట్లు గుర్తించి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. ఎస్సై హనుమంతు నాగరాజు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు టౌన్: టిప్టాప్ దుకాణంలో కూలీగా పనిచేస్తున్న ఓ యువకుడిపై గోడ కూలిపోవటంతో మృతిచెందాడు. దీంతో ఆ కుటుంబ సభ్యులు ఆందోళన చేపట్టారు. ఏలూరు నగరానికి చెందిన కోన సాయి (22) బాలబాలాజీ అనే టిప్టాప్ కంపెనీలో టెంట్లు వేసే కూలీగా పనిచేస్తూ జీవనం సాగిస్తున్నాడు. తంగెళ్ళమూడి ప్రాంతంలో నూతన భవన నిర్మాణానికి భూమిపూజ కోసం బుధవారం టెంట్లు వేశారు. అనంతరం గురువారం టెంట్లు తొలగించేందుకు సాయి అక్కడికి వెళ్లాడు. బుధవారం రాత్రి భారీ వర్షంతో గోడలు పూర్తిగా నానిపోయి ఉన్నాయి. ఈ నేపథ్యంలో టెంట్లు తీస్తూ ఉండగా ఆకస్మికంగా గోడ అతనిపై కూలిపోవడంతో సాయి అక్కడికక్కడే మృతిచెందాడు. దీంతో అతని బంధువులు, కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. తమకు న్యాయం చేయాలంటూ మృతదేహంతో రోడ్డుపై బైఠాయించారు. సమాచారం అందుకున్న ఏలూరు టూటౌన్ సీఐ అశోక్కుమార్ ఘటనా స్థలానికి వెళ్లి కుటుంబ సభ్యులకు నచ్చజెప్పడంతో ఆందోళన విరమించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
రాష్ట్రపతి విశిష్ట పురస్కారానికి పెద్దిరాజు ఎంపిక
పాలకోడేరు: సీబీఐ అధికారి పాలకోడేరు మండలం శృంగవృక్షం (బంటుమిల్లి) గ్రామానికి చెందిన బండి పెద్దిరాజు స్వాతంత్య్ర దినోత్సవం సందర్భంగా కేంద్ర ప్రభుత్వం అందించే రాష్ట్రపతి పోలీస్ పురస్కారానికి ఎంపికయ్యారు. ప్రస్తుతం న్యూఢిల్లీలోని కేంద్ర దర్యాప్తు సంస్థ (సీబీఐ) ప్రధాన కార్యాలయం సైబర్ క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డివిజన్లో ఆయన అదనపు పోలీసు సూపరింటెండెంట్గా విధులు నిర్వహిస్తున్నారు. 1993లో సీబీఐలో కానిస్టేబుల్గా చేరిన ఆయన తన 32 ఏళ్ల సర్వీసులో ఇప్పటివరకు 150 పైబడి రివార్డులు అందుకున్నారు. 2008లో ఇండియా ఉత్తమ దర్యాప్తు అధికారి గోల్డ్ మెడల్, 2017లో ఇండియన్ పోలీస్ మెడల్ – ఐపీఎం, 2014, 2018లో రెండుసార్లు అత్యుత్తమ దర్యాప్తు అధికారి అవార్డులు, 2019లో ‘డేటా సెక్యూరిటీ కౌన్సిల్ ఆఫ్ ఇండియా అవార్డు – ఇండియా సైబర్ కాప్ ఆఫ్ ది ఇయర్’ పొందారు. 1997లో సబ్ ఇన్స్పెక్టర్, 2003లో ఇన్స్పెక్టర్, 2016లో డిప్యూటీ ఏఎస్పీ, 2023లో అడిషనల్ ఎస్పీగా ఉద్యోగోన్నతులు పొందారు. కేసుల దర్యాప్తులో కీలకపాత్ర రామర్ హెర్బల్ ఫ్యూయల్ కేసు, పరిటాల రవి హత్య కేసు, న్యాయవాది సతీష్ హత్య అండ్ అంతర్రాష్ట్ర నారాయణన్ హత్య కేసులను మద్రాస్ హైకోర్టు ఆయనకు అప్పగించింది. ఏపీ హైకోర్టు న్యాయమూర్తులపై అసభ్యకరమైన సోషల్ మీడియా పోస్టుల కేసులు, బిట్స్ పిలానీ ఆన్లైన్ పరీక్ష కుంభకోణం, అంతర్జాతీయ ఆన్లైన్ పిల్లల లైంగిక వేధింపుల కేసు, మైక్రోసాఫ్ట్, అమెజాన్లను అనుకరిస్తూ అంతర్జాతీయ టెక్ సపోర్ట్ స్కామ్లు వంటి హై ప్రొఫైల్ కేసులను ఆయన దర్యాప్తు చేశారు. ఇటీవల ఆయన నీట్ 2024 ప్రశ్నపత్రం లీకేజ్ కేసులో చీఫ్ ఇన్వెస్టిగేటింగ్ ఆఫీసర్గా పనిచేశారు. అక్కడ ఆయన ప్రయత్నాలు 45 మంది నిందితులను అరెస్టు చేయడానికి, సమగ్ర చార్జిషీట్లను దాఖలు చేయడానికి ఉపయోగపడ్డాయి. బండి పెద్దిరాజుకు రాష్ట్రపతి పోలీసు పతకం లభించడంపై శృంగవృక్షం శ్రీ వాసవీ ఆర్య వైశ్య సంఘం, వాసవీ క్లబ్, గ్రామాభివృద్ధి కమిటీ హర్షం వ్యక్తం చేశాయి. -
ఏలూరు జిల్లాలో కుండపోత
ఏలూరు (మెట్రో): జిల్లా వ్యాప్తంగా బుధవారం సాయంత్రం నుంచి కురిసిన వర్షానికి జనజీవనం స్తంభించింది. జిల్లా వ్యాప్తంగా 28 మండలాల్లో భారీ స్థాయిలో వర్షపాతం నమోదైంది. అత్యధికంగా నిడమర్రు మండలంలో 95 మి.మీ వర్షపాతం నమోదు కాగా ద్వారకాతిరుమల మండలంలో 68.2, ఉంగుటూరు మండలంలో 65.2 మి.మీ వర్షపాతం నమోదైంది. ఏలూరులో 26.6, ఏలూరు రూరల్ మండలంలో 28.2 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లా వ్యాప్తంగా 723.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. బుధవారం అర్ధరాత్రి వరకూ మరో 200 మి.మీ వర్షపాతం నమోదు కావచ్చని వాతావరణ శాఖ అధికారులు అంచనా వేస్తున్నారు. ఏలూరులో భారీ వర్షానికి ఆర్ఆర్పేటలో రోడ్లు నీట మునిగాయి. అశోక్నగర్, పత్తేబాద, ఎన్ఆర్పేట, పవర్పేట, కొత్తపేట, 12 పంపుల సెంటర్, బీడీ కాలనీ, ఇజ్రాయేల్పేట, తంగెళ్ళమూడి ఏరియాలతోపాటు ఏలూరు వన్టౌన్ పూర్తిగా వర్షపు నీటితో నిండిపోతుంది. ఎన్టీఆర్ కాలనీ, శాంతినగర్, శ్రీరామ్నగర్, శనివారపుపేట, పోణంగి రోడ్డు, వైఎస్సార్ కాలనీ ప్రాంతంలోనూ రోడ్లన్నీ జలమయమయ్యాయి. ఏలూరు కలెక్టరేట్లో 18002331077, 9491041419 నెంబర్లతో కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశారు. భారీ వర్షాల నేపథ్యంలో పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని హోం మంత్రి అనితకు వీడియో కాన్ఫరెన్స్లో కలెక్టర్ వెట్రిసెల్వి తెలిపారు. విద్యుత్ సిబ్బంది అప్రమత్తం ఏలూరు (ఆర్ఆర్పేట): అల్పపీడనం నేపథ్యంలో విద్యుత్ శాఖ అధికారులను, సిబ్బందిని తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ పర్యవేక్షక ఇంజనీర్ సాల్మన్రాజు అప్రమత్తం చేశారు. ఎప్పటికప్పుడు పర్యవేక్షించేందుకు ఆర్ఆర్పేటలోని జిల్లా విద్యుత్ సంస్థ కార్యాలయంలో 9440902926 నెంబర్తో, జంగారెడ్డిగూడెం ఆఫీస్లో 9491030712 నెంబర్తో 24 గంటలూ కంట్రోల్ రూంలు ఏర్పాటు చేశామన్నారు. ఏదైనా విద్యుత్ అంతరాయం తలెత్తితే దగ్గరలోని విద్యుత్ సెక్షన్ ఆఫీసుకు గానీ, టోల్ ఫ్రీ నెంబరు 1912కు, కంట్రోల్ రూమ్ నెంబర్లకు గానీ ఫిర్యాదు చేస్తే వెంటనే పరిష్కరిస్తారన్నారు. స్తంభించిన జనజీవనం జిల్లా వ్యాప్తంగా 723.2 మి.మీ వర్షపాతం కలెక్టరేట్లో కంట్రోల్ రూం ఏర్పాటు -
వైద్య సేవల్లో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు
ఏలూరు (మెట్రో): జిల్లా లో వైద్యులు, సిబ్బంది కారణంగా మాతా, శిశు మరణాలు సంభవిస్తే, సదరు వైద్యులు, సిబ్బందిపై కఠిన చర్యలు తీసుకుంటానని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. కలెక్టరేట్లో బుధవారం జిల్లా మాతా, శిశు మరణాల నియంత్రణ కమిటీ సమావేశం కలెక్టర్ అధ్యక్షతన జరిగింది. ఈ సందర్భంగా గత ఏప్రిల్ నుంచి జూన్ వరకు మూడు నెలల సమయంలో జిల్లాలో సంభవించిన మాతా, శిశు మరణాలపై వైద్యాధికారులతో కలెక్టర్ సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ గత ఏప్రిల్ నుండి జూన్ వరకు మూడు నెలల కాలంలో జిల్లాలో 3 మాతా మరణాలు, 54 శిశు మరణాలు సంభవించాయని, వీటిపై సమగ్ర విచారణ జరిపి నివేదిక అందించాలని కలెక్టర్ ఆదేశించారు. మూల్యాంకన విధానంతో ఉపాధ్యాయులపై ఒత్తిడి నూజివీడు: పాఠశాలల్లో కొత్తగా తీసుకొచ్చిన మూల్యాంకన పుస్తక విధానంతో ఉపాధ్యాయులు తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం బుధవారం విడుదల చేసిన ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకనం పుస్తకాన్ని ప్రభుత్వం ఇచ్చిందని, ఒకటో తరగతి నుంచి 10వ తరగతి వరకు ఒక్కో విద్యార్థికి నాలుగు నుంచి ఆరు మూల్యాంకన పుస్తకాలు ఇచ్చారన్నారు. ఫార్మేటివ్, సమ్మేటివ్ అసెస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులు రాయాలని, పరీక్షలు రాసిన తర్వాత వాటిని దిద్ది అందులోనే ఉన్న ఓఎమ్మార్ షీట్లలో మార్కులు వేయడంతో పాటు ఓఎమ్మార్ షీటు విద్యాశాఖ ఇచ్చిన యాప్లో ఉపాధ్యాయులు అప్లోడ్ చేయాల్సి ఉందన్నారు. ఇప్పటికే బోధనేతర పనులతో సతమతమవుతున్న ఉపాధ్యాయులపై మూల్యాంకన పుస్తకాలు ఇచ్చి అదనపు భారం మోపడం సరికాదన్నారు. -
అధినేతకు నీరాజనం
సేంద్రియ ఎరువులపై శిక్షణ ద్వారకా తిరుమల మండలం గుండుగొలనుకుంటలో ఐదు జిల్లాలకు చెందిన 50 మందికి సేంద్రియ ఎరువుల తయారీపై శిక్షణనిచ్చారు. 8లో uగురువారం శ్రీ 14 శ్రీ ఆగస్టు శ్రీ 2025భీమవరం/భీమవరం(ప్రకాశం చౌక్): పశ్చిమగోదావరి జిల్లా భీమవరం విచ్చేసిన మాజీ సీఎం, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డికి అ భిమానులు, పార్టీ శ్రేణులు ఘన స్వాగతం పలికారు. ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు బుధవారం సాయంత్రం వైఎస్ జగన్ విచ్చేశారు. భీమవరంలో హెలీప్యాడ్కు చేరుకున్న జగన్ను మాజీ మంత్రులు, ఎమ్మెల్సీలు, రాష్ట్ర నాయకులు, పార్టీ ముఖ్య నాయకులు పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికారు. తూర్పుగోదావరి, కోనసీమ జిల్లాల నాయకులు ఆయన్ను మర్యాదపూర్వకంగా కలిశారు. అక్కడి నుంచి వైఎస్ జగన్ భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్లో జరుగుతున్న వివాహ వేడుక వద్దకు వెళ్లారు. ఆయన కాన్వాయ్ వెంట అభిమానులు బైక్ ర్యాలీ గా తరలివెళ్లారు. జై జగన్.. అంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. భారీ వర్షాన్ని సైతం లెక్క చేయకుండా.. వైఎస్ జగన్ తాడేపల్లి నుంచి రాక ముందే భీమవరంలో వర్షం ప్రారంభమైంది. అప్పటికే జగన్ను చూసేందుకు భీమవరంలో హెలీప్యాడ్, కల్యాణ మండపానికి వెళ్లే దారిలో పార్టీ నాయకులు, కా ర్యకర్తలు, అభిమానులు భారీగా చేరుకున్నారు. భీమవరంలో జగన్ హెలీకాప్టర్ దిగే సమయంలోనూ భారీ వర్షం కురుస్తున్నా అభిమానులు అలా గే వేచి ఉన్నారు. ఆయన వెంట ఉత్సాహంగా కేరింతలు కొడుతూ కల్యాణ మండపం వరకూ తరలి వెళ్లారు. వర్షంలోనూ అభిమానులకు అభివాదం చేస్తూ వైఎస్ జగన్ ముందుకుసాగారు. కల్యాణ మండపం వద్ద.. వీవీఆర్ గార్డెన్స్లో వేదికపైకి వచ్చిన జగన్ను చూసేందుకు అభిమానులు పోటీపడ్డారు. సోపాలు, కుర్చీలు ఎక్కి మరీ ఆయన్ను చూడటంతో పాటు తమ అభిమాన నేతను సెల్ఫోన్లలో బంధించారు. వైఎస్ జగన్ను కలిసిన ప్రముఖులు : వైఎస్ జగన్కు హెలీప్యాడ్ వద్ద నాయకులు ఘన స్వాగతం పలి కారు. శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, నరసాపురం పార్లమెంట్ ఇన్ చార్జ్ గూడూరి ఉమాబాల, మాజీ మంత్రులు చెరు కువాడ శ్రీరంగనాథరాజు, తానేటి వనిత, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, కారుమూరి వెంకటనాగేశ్వరరావు, కొట్టు సత్యనారాయణ ఎమ్మెల్సీలు కవురు శ్రీనివాస్, వంక రవీంద్రనాథ్, భీమవరం, ఉండి, చింతలపూడి, కైకలూరు, పోలవరం, ఉంగుటూరు, ఏలూరు, కొవ్వూరు, రామచంద్రాపురం, అమలాపురం ఇన్చార్జ్లు చినమిల్లి వెంకట్రాయుడు, పీవీఎల్ నర్సింహరాజు, కంభంపాటి విజయరాజు, దూలం నాగేశ్వరరావు, తెల్లం బాలరాజు, పుప్పాల వాసుబాబు, మామిళ్లపల్లి జయప్రకాష్, తలారి వెంకట్రావు, పిల్లి సూర్యప్రకాష్, పినిపే శ్రీకాంత్, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్ కుమార్, పార్టీ బీసీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ నవు డు వెంకటరమణ, సంచార జాతుల విభాగం అధ్యక్షుడు పెండ్ర వీరన్న, పార్టీ నేతలు మేడిది జాన్స న్, వేండ్ర వెంకటస్వామి, పాతపాటి శ్రీనివాస రాజు, కోడి విజయలక్ష్మి యుగంధర్, ఏఎస్ రా జు, చిగురుపాటి సందీప్, గాదిరాజు రామరాజు తదితరులు జగన్ను కలిసిన వారిలో ఉన్నారు. ఆత్మీయ పలకరింపు.. జగన్ను పలకరిస్తున్నఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే వాసుబాబున్యూస్రీల్జోరువానలోనూ అదే అభిమానం భీమవరంలో మాజీ సీఎం వైఎస్ జగన్కు ఘన స్వాగతం వర్షాన్ని సైతం లెక్కచేయకుండాపోటెత్తిన అభిమానులు తరలివచ్చిన ఉమ్మడి పశ్చిమ, తూర్పుగోదావరి నాయకులు హెలీప్యాడ్ నుంచి కల్యాణ మండపం వరకూ భారీ జనసందోహం -
వైఎస్ ముద్రను చెరిపేసే కుట్ర
తాడేపల్లిగూడెం: తాడేపల్లిగూడెం మండలం వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేసిన డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం ముఖద్వారం వద్ద యోగముద్రలో ఉన్న వైఎస్ విగ్రహం ఏర్పాటుకు సంబంధించి ఏర్పాటును అడ్డుకునేందుకు వర్సిటీ అధికారులు ప్రయత్నిస్తున్నట్లు సమాచారం. వాస్తవానికి 2023లో ఇక్కడ విగ్రహం ఏర్పాటుచేయాల్సి ఉంది. దీని తయారీకి అప్పటి డిప్యూటీ సీఎం శిల్పికి రూ.10 లక్షలు బయానాగా ఇచ్చారు. వర్సిటీ ముఖద్వారం వద్ద విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. ఇది కార్యరూపంలోకి తేకుండా అక్కడ ఒక రైతు, అతని భార్య బొమ్మలను ఏర్పాటుచేశారు. దీంతో వర్సిటీలో వైఎస్ ముద్రను చెరిపే కుట్ర మరోసారి తేటతెల్లమైంది. ఈ విషయంపై మాజీ డిప్యూటీ సీఎం కొట్టు సత్యనారాయణ కోర్టును ఆశ్రయించారు. విషయాన్ని పరిశీలించాల్సిన కోర్టు దీనికి సంబంధించిన వివరాలు అందచేయాల్సిందిగా ఉద్యాన వర్సిటీ అధికారులను ఆదేశించింది. రైతు ఉద్యాన పంటలతో ఆర్థిక స్వయం సమృద్ధి సాధించాలని వైఎస్ రాజశేఖరరెడ్డి ఆకాంక్షించారు. దక్షిణ భారత దేశంలో మొదటిది.. దేశంలో రెండవదిగా ఉద్యాన విశ్వవిద్యాలయాన్ని వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. తాడేపల్లిగూడెం ప్రాంతం వర్సిటీ ఏర్పాటుకు ఎందుకు అనుకూలమో కొట్టు సత్యనారాయణ అంకెలతో అసెంబ్లీలో విపులీకరించారు. గూడెంలో వర్సిటీని అడ్డుకొనే ప్రయత్నం చేసిన కొంతమంది నోటికి తాళం వేశారు. గూడెంలో రాజీవ్ గృహకల్ప సముదాయ ప్రారంభోత్సవ కార్యక్రమానికి వచ్చిన దివంగత సీఎం రాజశేఖరరెడ్డి అదే వేదికపై నుంచి గూడెంలో ఉద్యాన వర్సిటీ ఏర్పాటు చేస్తున్నట్టు అధికారికంగా ప్రకటించారు. అనంతరం 2007లో వెంకట్రామన్నగూడెంలో ఏర్పాటుచేశారు. 2014లో టీడీపి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక.. 2015లో డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం పేరును మార్చాలని జెడ్పీ సర్వసభ్య సమావేశంలో తీర్మానం చేశారు. దీనిపై అప్పట్లో పెద్ద ఎత్తున విమర్శలు రావడంతో ఈ ప్రతిపాదన అటకెక్కింది. తాజాగా రెండో కుట్ర : వైఎస్ విగ్రహాన్ని ఆయన స్మృతిచిహ్నంగా ముఖ ద్వారం వద్ద ఏర్పాటు చేయడానికి ప్లాట్ఫాం కట్టించారు. తూర్పుగోదావరి జిల్లాకు చెందిన శిల్పికి తయారీ బాధ్యత అప్పగించారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైఎస్ విగ్రహం ఏర్పాటుచేయాల్సిన ప్రాంతంలో రైతు దంపతుల బొమ్మను ఏర్పాటుచేసింది. దీంతో కొట్టు సత్యనారాయణ హైకోర్టును ఆశ్రయించారు. ఉద్యాన వర్సిటీ ముఖ ద్వారం వద్ద వైఎస్ విగ్రహం ఏర్పాటుకు అడ్డుపుల్ల కోర్టును ఆశ్రయించిన మాజీ మంత్రి కొట్టు మాట తప్పారు వైఎస్ కృషితో ఇక్కడ ఉద్యాన వర్సిటీ వచ్చింది. ఆయన సేవలకు గుర్తింపుగా వర్సిటీ ముఖద్వారం వద్ద యోగ ముద్రలో వైఎస్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని 2023లో నిర్ణయం తీసుకున్నాం. ఈ మేరకు విగ్రహం తయారీకి బయానా ఇచ్చాం. నిర్ణయించిన ప్రాంతంలో విగ్రహం ఏర్పాటుకు అప్పటి పాలకమండలి తీర్మానం చేసింది. అది కాదని రైతు దంపతుల బొమ్మను పెట్టారు. దీనిపై న్యాయస్ధానాన్ని ఆశ్రయించా. విచారణ ఈ నెల 19కి వాయిదా పడింది. – కొట్టు సత్యనారాయణ, మాజీ డిప్యూటీ సీఎం కోర్టు ఆదేశాలు అందలేదు వైఎస్ విగ్రహం ఏర్పాటులో హైకోర్టు ఆదేశాలు ఇంకా మాకు అందలేదు. అందిన తర్వాత గత విషయాలు పరిశీలించి ఉన్నతాధికారి నిర్ణయం తీసుకుంటారు. – బి.శ్రీనివాసులు. రిజిస్ట్రార్, ఉద్యాన వర్సిటీ -
రోడ్డు దాటుతూ.. ఇద్దరు మృతి
ద్వారకాతిరుమల: మండలంలోని జాతీయ రహదారిపై జరిగిన రెండు వేర్వేరు రోడ్డు ప్రమాదాల్లో ఇద్దరు మృతి చెందారు. పోలీసుల కథనం ప్రకారం. కామవరపుకోట మండలం నారాయణపురంనకు చెందిన పలగాని శ్రీరామమూర్తి(36) మొక్కజొన్న విత్తనాలు కొనుగోలు నిమిత్తం తన స్నేహితుడితో కలసి సోమవారం రాత్రి దూబచర్లకు వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో లక్ష్మీనగర్ వద్ద కారు దిగి, వాటర్ బాటిల్ కొనుగోలు చేసి రోడ్డు దాటుతుండగా, రాంగ్ రూట్లో కప్పలకుంట వైపు నుంచి వేగంగా వెళుతున్న ఒక లారీ శ్రీరామమూర్తిని ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ ప్రమాదంలో తీవ్ర గాయాలపాలైన క్షతగాత్రుడిని స్నేహితుడు హుటాహుటీన ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు. మృతుడి భార్య శ్రావణి ఇచ్చిన ఫిర్యాదుపై ద్వారకాతిరుమల ఏఎస్సై అమీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. అలాగే లైన్ గోపాలపురం వద్ద మంగళవారం తెల్లవారుజామున 3 గంటల సమయంలో రోడ్డు దాటుతున్న గుర్తు తెలియని 70 ఏళ్ల వృద్ధుడిని గుర్తు తెలియని వాహనం ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో వృద్ధుడు అక్కడికక్కడే మృతి చెందాడు. పోస్టుమార్టం నిమిత్తం హైవే సిబ్బంది మృత దేహాన్ని ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. -
కూటమి పాలనలో ఎస్సీలపై దాడులు
ఏలూరు (టూటౌన్): అమలు కాని హామీలతో ప్రజలను మోసం చేసిన కూటమి ప్రభుత్వాన్ని గద్దె దించే రోజు దగ్గరలోనే ఉందని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. ఏలూరు ఖండ్రిగగూడెంలోని సుఖీభవ కల్యాణ మండపంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశం జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ప్రజలను వంచిస్తున్న చంద్రబాబు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో టీడీపీ కూటమి ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు ఇచ్చిన హామీలను తుంగలోకి తొక్కిందన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత సూపర్ సిక్స్ హమీలు అమలు చేయకుండా ప్రజలను చంద్రబాబు నయవంచన చేస్తున్నారని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, రాష్ట్ర ఎస్సీ సెల్ వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు, రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షులు కాకుమాను రాజశేఖర్ మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి ఎస్సీలపై దాడులు విపరీతంగా పెరిగిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఎస్సీల మధ్య సామాజిక వర్గాల పేరుతో గొడవలు సృష్టించేందుకు కూటమి నాయకులు కుట్రలు పన్నుతున్నారన్నారు. గత ఎన్నికల్లో ఓట్లు వేయించుకుని గద్దె నెక్కి అవసరం తీరాక ఇచ్చిన హామీలను గాలికి వదిలేశారన్నారు. ఇచ్చిన హామీని పూర్తిగా అమలు చేయడంలో కూటమి ప్రభుత్వం విఫలమైందని దుయ్యబట్టారు. నిరుద్యోగ భృతి ఎక్కడ? వైఎస్సార్సీపీ అధికారంలో ఉన్నప్పుడు ఇచ్చిన ప్రతీ హామీని నెరవేర్చడంతో పాటు ఎన్నికల ముందు పార్టీ ప్రకటించిన మేనిఫెస్టోను పవిత్ర గ్రంథంగా భావించారన్నారు. ఎస్సీలను కూటమి ప్రభుత్వం మోసం చేస్తుందని నిజంగా టీడీపీకి చిత్త శుద్ధి ఉంటే ఇచ్చిన హామీలన్నీ అమలు చేయాలని డిమాండ్ చేశారు. వైఎస్సార్సీపీ ఏలూరు నియోజకవర్గం ఇన్చార్జి మామిళ్ళపల్లి జయప్రకాష్, దెందులూరు ఇన్చార్జ్ కొఠారు అబ్బయ్య చౌదరి, పోలవరం ఇన్చార్జి తెల్లం బాలరాజు, చింతలపూడి ఇన్చార్జి కంభం విజయరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన నాటి నుంచి వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులకు తెగబడి రాష్ట్రాన్ని అధోగతి పాలు చేస్తుందని విమర్శించారు. నిరుద్యోగ యువతకు నిరుద్యోగ భృతి నెలకు రూ.3 వేలు అందజేస్తామని, మహిళలకు నెలకు రూ.1500 చొప్పున ఏడాదికి రూ.18 వేలు అందజేస్తామని ప్రకటించిందని, అధికారం చేపట్టి 14 నెలలు కావస్తున్నా ఇంత వరకు వాటి ఊసే లేకపోవడం శోచనీయమన్నారు. రాష్ట్రంలో నిత్యం వైఎస్సార్సీపీ నాయకులు, కార్యకర్తలపై దాడులు, కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తోందని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు జగనన్న దళిత ఫోర్స్ను ప్రారంభించారు. సమావేశంలో రాష్ట్ర ఎస్సీ విభాగ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధులు మున్నుల జాన్ గురునాథం, ఇంజేటి నీలిమ, కత్తుల రవికుమార్, మోటార్ ఏసుబాబు, జెడ్పీటీసీలు నిట్టా నీలా నవకాంతం, నీరజ, ఏలూరు మహిళా విభాగం అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, కై కలూరు మహిళా విభాగం అధ్యక్షురాలు దున్న బేబీ, ఎస్సీ సెల్ నాయుకులు నిట్టా గంగరాజు, పల్లెం ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ కార్యవర్గ సమావేశంలో నేతల మండిపాటు కూటమి ప్రభుత్వానికి రోజులు దగ్గర పడ్డాయి: డీఎన్నార్ -
ఉద్యాన వర్సిటీ ఎంఓయూలు
తాడేపల్లిగూడెం: డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయం మంగళవారం నాలుగు ప్రముఖ సంస్థలతో అవగాహన ఒప్పందాలు చేసుకుంది. బయోప్యాక్ ఇన్పుట్స్ ప్రైవేట్ లిమిటెడ్, మదనపల్లె ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ అండ్ సైన్స్స్, జినోమిక్స్ సీఎఆర్ఎల్ ప్రైవేట్ లిమిటెడ్, సిస్ ఇన్నోవా ఎంటర్ప్రైజస్ ప్రైవేట్ లిమిటెడ్లతో ఎంఓయూ చేసుకున్నారు. ఉద్యానవన సాగు మొక్కల ఆరోగ్యం, పంట కోత తర్వాత సాంకేతికతను బలోపేతం, డ్రోన్లు, జీపీఎస్ ఆధారిత ఉత్పత్తులు, ఇమేజ్ ప్రోసెసింగ్, నానో టెక్నాలజీ, అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలను ఉపయోగించడం, శాస్ల్రీయ పురోగతిలకుగాను ఈ ఒప్పందాలు జరిగాయి. డైరెక్టర్ ఆఫ్ ఇండస్ట్రీయల్ అండ్ ఇంటర్నేషనల్ ప్రోగ్రామ్స్ కె.ధనుంజయరావు ఆధ్వర్యంలో జరిగిన ఈ కార్యక్రమంలో వీసీ కె.గోపాల్, సంస్థల ప్రతినిధులు కేఎల్ఎన్.రెడ్డి, సి.యువరాజ్, డాక్టర్ రత్నగిరి పోలవరపు, జీయూ మహేష్ పాల్గొన్నారు. రీసర్వే పనులు వేగవంతం ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రీ సర్వే పనులను వేగవంతం చేస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె.విజయానంద్కు తెలిపారు. సచివాలయం నుంచి రీ సర్వే, అన్నదాత సుఖీభవ తదితర కార్యక్రమాలపై కలెక్టర్లతో సీఎస్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వి జిల్లాలో చేపడుతున్న కార్యక్రమాలను వివరించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ రీ సర్వే పనులను నిర్దేశించిన సమయంలోగా పూర్తి చేయాలన్నారు. రైతుల నుంచి వచ్చిన అభ్యంతరాలపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. రీ సర్వే పనులను వేగవంతం చేస్తున్నామని, రైతుల నుంచి అభ్యంతరాల పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ తెలిపారు. ఉపాధ్యాయుడిపై చర్యలకు ఆదేశం ఏలూరు (ఆర్ఆర్పేట): అక్రమంగా పదోన్నతి పొందిన ఉపాధ్యాయుడిపై వెంటనే చర్యలు తీసుకోవాలని జిల్లా విద్యాశాఖాధికారిని పాఠశాల విద్యాశాఖ ఆర్జేడీ నాగమణి ఆదేశించారు. ఉండ్రాజవరం మండలం పసలపూడి ఎంపీయూపీ స్కూల్లో పీఎస్హెచ్ఎంగా పని చేస్తున్న పొలమూరు వీరాంజనేయులు గతం జూన్ 7న తీసుకున్న రివర్షన్ను ఉన్నతాధికారులకు తెలపకుండా తిరిగి పదోన్నతి పొందారని, ఈ కారణంగా అతనిపై చర్యలు తీసుకోవాలని తణుకుకు చెందిన ఇందుగపల్లి శ్రీనివాసరావు ఫిర్యాదు చేశారు. కలెక్టర్ కార్యాలయం నుంచి ఆదేశాలు రావడంతో వీరాంజనేయులుకు విద్యాశాఖాధికారి షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆర్జేడీకి కూడా ఫిర్యాదు చేయడంతో వీరాంజనేయులుపై చర్యలు తీసుకోవాలని డీఈవోను ఆదేశిస్తూ మంగళవారం ఉత్తర్వులు జారీ చేశారు. మనస్తాపంతో వివాహిత ఆత్మహత్య కొయ్యలగూడెం: బయ్యనగూడెంలో మనస్తాపంతో ఓ వివాహిత ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసుల వివరాల ప్రకారం యర్రంపేటకు చెందిన సంగనం పరిమళ (23), భర్త శ్రీరాములు ఆరు నెలల క్రితం బయ్యనగూడెం వచ్చి అద్దె ఇంట్లో ఉంటూ కూలి పనులు చేసుకుని జీవనం సాగిస్తున్నారు. గ్రామానికి చెందిన ఒక రైతు పొలంలోకి కూరగాయలు కోయడానికి కూలి పనులకు వెళ్లారు. కూలి సరిపోవడం లేదని పెంచాలని పరిమళ మేస్త్రిని, రైతును అడిగినా ఒప్పుకోలేదు. ఈ విషయం భర్తకు చెప్పగా ఇష్టమైతే పనికి వెళ్లు.. లేకపోతే మానేమని అన్నాడు. దీంతో మనస్తాపానికి గురైన పరిమళ చీరతో ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. -
దాడిలో విద్యార్థికి గాయాలు
పెదవేగి: పెదవేగి గురుకుల పాఠశాలలో ఇంటర్ విద్యార్థి దాడిలో గాయపడ్డ ఆరో తరగతి విద్యార్థిని వైద్యం నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. విద్యార్థి ఒంటిపై తీవ్రగాయాలు ఉండడంతో బాధిత విద్యార్థి తల్లిదండ్రులు జిల్లా ఉన్నతాఽధికారులకు సోమవారం ఫిర్యాదు చేశారు. ఇంటర్ విద్యార్థులు కింది తరగతి విద్యార్థులను ఇబ్బంది పెడుతున్నారని, ప్రిన్సిపాల్కి చెప్పినా పట్టించుకోవడం లేదని విద్యార్థుల తల్లిదండ్రులు చెబుతున్నారు. సారా కేసులో ఇద్దరి అరెస్టు కామవరపుకోట: పాత సారా కేసులలో ఇద్దరిని అదుపులోకి తీసుకున్నట్లు చింతలపూడి ఎకై ్సజ్ సీఐ పి.అశోక్ తెలిపారు. మండలంలో జలపావారిగూడెంలో సో మవారం దాడులు నిర్వహించగా నాటు సారా కేసులో పరారీలో ఉన్న నక్కా దావీదు, కళుకులూరి చిన వెంకటేష్ను అదుపులోకి తీసుకొని చింతలపూడి కోర్టు మేజిస్ట్రేట్ ముందు హాజరు పచ్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
●ఎమ్మెల్యే తాలూకా..
ఏలూరు నగరంలో ప్రతి రోజు ఉదయం 8 గంటల నుంచి మధ్యాహ్నం 2 గంటల వరకు సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకు లారీలు, ఇతర భారీ వాహనాల రాకపోకలు నిషేధం. ఈ సమయంలో వాహనాలు పొరపాటున ప్రవేశిస్తే రూ.2 వేలు అంతకుమించి అపరాధ రుసుం చెల్లించాల్సిందే.. ఇదంతా కేవలం సామాన్యులకే వర్తించే రూల్స్.. జూట్మిల్లు సమీపంలో సోమవారం ఉదయం 10.30 గంటలకు వరుసగా నాలుగు లారీలు రావటంతో ట్రాఫిక్ పోలీసులు వాహనాలు ఆపారు. కానిస్టేబుల్ సీఐకు సమాచారం ఇచ్చారు. మేం ఎమ్మెల్యే గారి తాలుకా మా వాహనాలే అపుతారా.. అంటూ డ్రైవర్ ఏవరికో ఫోన్ చేసి ట్రాఫిక్ పోలీసులకు ఇచ్చాడు. వెంటనే ఆ లారీలను నగరంలోకి వెళ్లడానికి అనుమతి ఇచ్చారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
వర్షాభావంతో రైతు దిగాలు
ఏలూరు (మెట్రో): పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో వర్షాభావ సమస్య నెలకొంది. భూగర్భ జలాలు రోజురోజుకు అడుగంటుతున్నాయి. సాగు పనులు 60 శాతం పూర్తి కావాల్సి ఉండగా సరైన వర్షాలు లేక ప్రస్తుతం 30 నుంచి 40 శాతం పనులు మాత్రమే పూర్తయ్యాయి.పూర్తిస్థాయిలో వర్షాలు కురవకపోవడంతో ఈ సంవత్సరం సాగు చేసుకోవాలా, వద్దా అన్న సందిగ్ధంలో రైతు ఉన్నాడు. పశ్చిమగోదావరి జిల్లాలో గత నెలలో 246.5 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 128.88 మీ.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. జూన్ నెల నుంచి ఆగస్టు 4 నాటికి 365.99 మిమి వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా కేవలం 254.04 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. మెట్ట ప్రాంతంగా ఉన్న ఏలూరు జిల్లాలోనూ ఇదే దుస్థితి నెలకొంది. గత జూలైలో 242.52 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 179.81 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. ఆగస్టు నెల ఆరంభం నుంచి గత 10 రోజులుగా సాధారణ వర్షపాతం 81.45 మిమి నమోదు కావాల్సి ఉండగా కేవలం 21.54 మి.మీ వర్షపాతం మాత్రమే నమోదైంది. సరాసరి జూన్ నెల నుంచి ఆగస్టు 10 నాటికి పరిశీలిస్తే 438.28 మి.మీ వర్షపాతం నమోదు కావాల్సి ఉండగా 274.69 మి.మీ వర్షపాతం నమోదైంది. పూర్తిగా మెట్ట ప్రాంతం, బోర్లు, వర్షాధారంపైనే ఏలూరు జిల్లా రైతులు ఆధార పడ్డాడు. భారీ వర్షాలను ఏలూరు జిల్లా రైతులు ఆశిస్తారు. భారీ వర్షాలు కురిస్తేనే మెట్ట ప్రాంతంలో జలాశయాలు, చెరువులు పూర్తిస్థాయిలో నిండుతాయి. ప్రస్తుతం వర్షాలు కురవకపోవడంతో పంటలు వేసేందుకు రైతులు జంకుతున్నారు. అడుగంటుతున్న భూగర్భ జలాలు భూగర్భ జలాలు రోజురోజుకూ కిందికి వెళ్లిపోతున్నాయి. డెల్టా ప్రాంతంగా ఉన్న పశ్చిమగోదావరి జిల్లాలో గతేడాది జూలైలో 8.9 మీటర్ల స్థాయిలో ఉన్న భూగర్భ జలాలు 9.54 మీటర్ల లోతుకు వెళ్లాయి. ఏలూరు జిల్లాలో గతేడాది జూలైలో 20.26 మీటర్లుగా ఉన్న భూగర్భ జలాలు ప్రస్తుత జూలైలో 21.98 మీటర్ల లోతుకు చేరాయి. వర్షాకాలం ఆరంభంలోనే ఇలా ఉంటే మున్ముందు ఎలా ఉంటుందోనని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవిని తలపిస్తున్న ఎండలు సరైన వానలు లేక మరింత లోతుకు భూగర్భ జలాలు ఇలాగైతే సాగు ఎలా? వర్షాలు కురవక సాగుకు వీలు లేకుండా పోతుంది. వర్షాకాలం ఆరంభంలోనే సమృద్ధిగా కురిస్తే సాగు పనులకు వీలుంటుంది. ప్రస్తుతం వర్షాకాలం వేసవిని తలపిస్తోంది. వర్షాకాలం ప్రారంభమై రెండు నెలలవుతున్నా.. సమృద్ధిగా వర్షాలు కురిసిన పాపాన పోలేదు. – దేవళ్లరాజు రాజశేఖర్, రైతు, కొండలరావుపాలెం ఉక్కబోతతో ఇక్కట్లు ఎండలు వేసవిలో మండినట్లు మండిపోతున్నాయి. దీనికి తోడు ఉక్కబోత. పగలు ఎండలు మండిపోతుంటే రాత్రి సమయంలో ఉక్కపోతతో తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నాము. వర్షాలు కురిస్తే కాస్త ఉపశమనం కలుగుతుంది. – శ్రీరామ శ్రావణి, కొవ్వలి, గృహిణి -
అసభ్యకర పోస్టులపై చర్యలు తీసుకోవాలి
తూర్పుగోదావరి ఎస్పీకి ఫిర్యాదు చేసిన వైఎస్సార్సీపీ నేతలు ద్వారకాతిరుమల: మాజీ హోం మంత్రి, వైఎస్సార్సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనితపై సోషల్ మీడియాలో అసభ్యకర పోస్టులు పెట్టిన టీడీపీ సోషల్ మీడియా కార్యకర్తలపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు సాలి వేణు సోమవారం జిల్లా ఎస్పీ నరసింహ కిషోర్కు ఫిర్యాదు చేశారు. కార్యక్రమంలో ద్వారకాతిరుమల మండలానికి చెందిన పార్టీ నేతలు పలువురు పాల్గొన్నారు. దళిత మహిళ అని కూడా చూడకుండా నల్లజర్ల గ్రామానికి చెందిన సవలం రామకృష్ణ ఈ నెల 7న రాత్రి తన ఫేస్బుక్ అకౌంట్ నుంచి వనితను అవమానపరిచేలా పోస్టు పెట్టాడన్నారు. ఈ పోస్ట్ను వేళ్లచింతలగూడెంకు చెందిన మద్దిపాటి మహేష్, నేకూరి చంద్రం, దేవరపల్లి మండలం లక్ష్మీపురానికి చెందిన నగ్గిన నాగేంద్రలు షేర్లు చేశారన్నారు. వీరిపై చట్టపరమైన చర్యలు తీసుకుని, భవిష్యత్తులో పునరావృతం కాకుండా చూడాలని ఎస్పీని కోరినట్టు చెప్పారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, పార్టీ మండల మహిళా అధ్యక్షురాలు మల్లిపూడి నాగమణి, మండల ఎస్సీసెల్ అద్యక్షుడు దాసరి రాంబాబు, బంకా అప్పారావు, పొనమాల ఉమామహేశ్వరరావు, పార్టీ రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ సెక్రటరీ వామిశెట్టి పరమేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
వీధి కుక్కల దాడిలో గాయాలు
భీమడోలు: భీమడోలు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు స్వైర విహారం చేసి దాడి చేశాయి. వేర్వేరు గ్రామాలకు చెందిన వీధి కుక్కల బాధితులు సోమవారం భీమడోలు ఆసుపత్రికి వచ్చారు. వారికి వైద్యులు యాంటీ రాబీస్ వ్యాక్సిన్ వేసి ఇళ్లకు పంపారు. పోలసానిపల్లికి చెందిన నాలుగేళ్ల చిన్నారి షేక్ అమ్మన్, భీమడోలు పంచాయతీ శివారు ఆర్జావారిగూడెంకు చెందిన పాము సుశాంత్(24), ఉమర్(9), మాధవరానికి చెందిన మడిచారాల ఆదిలక్ష్మీ(41), ఎం.నాగులపల్లికి చెందిన తులసి రామ్(34), సండ్రగుంటకు చెందిన కె.రాజు(66), గుణ్ణంపల్లికి చెందిన నక్కా చంద్రవతి(70) వీధి కుక్కల దాడిలో గాయపడ్డారు. కుటుంబ సభ్యులు భీమడోలు సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ఆసుపత్రి సూపరిండెంటెంట్ ఆనంద్ ఆధ్వర్యంలో వ్యాక్సిన్ వేశారు. ఇటీవల భీమడోలు సమీపంలోని ఎం.నాగులపల్లి పంచాయతీ పరిధిలో ఓ ప్రైవేటు పాఠశాలలోకి కుక్కలు చొరబడి ముగ్గురు విద్యార్థులను కరిచాయి. గ్రామాల్లో వీధి కుక్కల సంచారం పెరిగి పోయిందని, వాటి నుంచి ప్రజలను రక్షించాలని గ్రామాల ప్రజలు వేడుకుంటున్నారు. -
బాస్కెట్బాల్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: ప్రభుత్వం స్పోర్ట్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఆటల పోటీలను క్రీడాకారులు సద్వినియోగం చేసుకోవాలని డీఎస్డీఓ బి.శ్రీనివాసరావు అన్నారు. సోమవారం జిల్లా జట్ల ఎంపిక పోటీలు జరిగాయి. జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని ప్రభుత్వ ఆదేశాల మేరకు అండర్–22 విభాగంలో మహిళలు, పురుషులకు 10 క్రీడాంశాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నామన్నారు. జిల్లా జట్లకు ఎంపికై న వారు జోనల్ పోటీల్లో తలపడతారన్నారు. పరిశీలకురాలిగా హాజరైన శాప్ డైరక్టర్ కొవ్వాసు జగదీశ్వరి మాట్లాడుతూ క్రీడాకారుల్లో ఉత్సాహం నింపేందుకు శాప్ పోటీలు చేపడుతోందన్నారు. ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఖోఖో, వాలీబాల్, బాస్కెట్బాల్, హాకీ క్రీడాంశాల్లో పోటీలు చేపట్టి జట్ల ఎంపిక పూర్తి చేశారు. రోల్బాల్ జట్టు ఎంపిక తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రోల్ బాల్ స్టేట్ సెలక్షన్ క్యాంప్ ఈనెల 7 నుంచి 10 వరకు తణుకు సిల్వర్ జూబ్లీ కాలనీలోని మునిసిపల్ స్కేటింగ్ పార్కులో నిర్వహించారు. వివిధ విభాగాల్లో జాతీయస్థాయి పోటీలకు జట్టు ఎంపిక చేశారు. మొత్తం 100 మంది క్రీడాకారులు పాల్గొన్న ఈ క్యాంపులో 60 మందిని ఎంపిక చేసినట్లు రోల్బాల్ స్టేట్ సెక్రటరీ అనిల్కుమార్రెడ్డి తెలిపారు. సెప్టెంబర్ 13, 14 తేదీల్లో కేరళలోని కొల్లాంలో నిర్వహించే సౌత్ జోనల్స్కి జట్టును సంసిద్ధం చేశామని చెప్పారు. 60 మంది ఎంపిక కాగా.. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి తణుకుకు చెందిన 9 మంది క్రీడాకారులు ఉన్నట్లుగా వివరించారు. కార్యక్రమంలో స్టేట్ టెక్నికల్ చైర్మన్ వీజీ ప్రేమ్నాథ్, స్టేట్ ఆర్గనైజింగ్ డైరెక్టర్ తోట లలిత ప్రియ, కోచెస్ కమిటీ డైరెక్టర్ పూసర్ల సంతోష్ కుమార్, ఉమెన్ కమిషన్ డైరెక్టర్ వానపల్లి లావణ్య, కోచెస్ కమిటీ అసిస్టెంట్ డైరెక్టర్ మధుబాబు, రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన కోచ్లు పాల్గొన్నారు. -
యోగా పోటీల్లో విద్యార్థుల ప్రతిభ
నూజివీడు: యోగాసన పోటీల్లో నూజివీడు ట్రిపుల్ ఐటీ విద్యార్థులు ప్రతిభ కనబరిచి పతకాలు సాధించారు. ఈ నెల 10న ఏలూరులోని ప్రేమాలయ ఓల్డేజ్ హోంలో జరిగిన ఈ పోటీలో 14 మంది విద్యార్థులు వేర్వేరు ఆసనాలలో 16 పతకాలను సాధించారు. 9 మంది గోల్డ్ మెడల్స్, ఆరుగురు సిల్వర్ మెడల్స్, ఒకరు బ్రాంజ్ మెడల్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో తనూష, హరిత, దివాకర్లు గోల్డ్ మెడల్స్ సాధించగా, సీనియర్స్ విభాగంలో అశోక్, అభిషేక్, దీపక్ నాయుడు గోల్డ్ మెడల్స్ సాధించారు. హరిత, అశోక్, దీపక్ నాయుడులు యోగాసనాలలోని వివిధ ఈవెంట్లలో రెండేసి చొప్పున గోల్డ్ మెడల్స్ సాధించడం విశేషం. జూనియర్స్ విభాగంలో దేవిశ్రీ, స్పందన, ప్రమీల, వెంకటలక్ష్మి, యుగంధర్, దామోదర్లు సిల్వర్ మెడల్స్ సాధించగా, గీతిక అనే విద్యార్థిని బ్రాంజ్ మెడల్ సాధించింది. యోగాసనాలలో పతకాలు సాధించిన విద్యార్థులను ఇన్చార్జి డైరెక్టర్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, ఏఓ లక్ష్మణరావు, అకడమిక్ డీన్ చిరంజీవి, అకడమిక్ అసోసియేట్ డీన్ రఘు, యోగా టీచర్ పి. చంద్రశేఖర్ లు అభినందించారు. అభయాంజనేయ స్వామి హుండీ ఆదాయం లెక్కింపు పెదపాడు: మండలంలోని అప్పనవీడులోని వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం 10,32,522 వచ్చినట్లు ఆలయ అధికారులు వెల్లడించారు. మండలంలోని మొండూరు గ్రూప్ ఆఫ్ టెంపుల్స్ కార్యనిర్వహణాధికారి ఎం.రాంబాబు పర్యవేక్షణలో హుండీ లెక్కించారు. 76 రోజులకు ఈ లెక్కింపు చేసినట్లు తెలిపారు. పేకాట స్థావరంపై దాడి ద్వారకాతిరుమల: మండలంలోని దొరసానిపాడు శివారులోని ఒక పామాయిల్ తోటలో నిర్వహిస్తున్న భారీ పేకాట స్థావరంపై పోలీసులు సోమవారం సాయంత్రం దాడి చేశారు. పేకాట జరుగుతున్నట్టు సమాచారం అందుకున్న ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలసి స్థావరంపై దాడి చేశారు. ఆ సమయంలో కొందరు పేకాటరాయుళ్లు కార్లలో తప్పించుకునే ప్రయత్నం చేశారు. పోలీసులు వారిని వెంబడించి ద్వారకాతిరుమలలోని కొత్త బస్టాండు వద్ద పట్టుకున్నారు. మొత్తం 14 మందిని అరెస్టు చేసి, వారి నుంచి రూ. 1.23 లక్షల నగదు, 4 కార్లు, 15 సెల్ఫోన్లతో పాటు, నగదుకు బదులుగా వినియోగిస్తున్న రెండు రకాల 93 కాయిన్స్ స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వారంతా విజయవాడకు చెందిన వారుగా చెబుతున్నారు. స్థానికంగా వారికి సహకరించి, పేకాట శిబిరాన్ని ఏర్పాటు చేసింది ఎవరన్నది తెలియరాలేదు. రాత్రి 10.30 గంటలైనా దీనికి సంబంధించిన సమాచారం పోలీసులు ఇవ్వలేదు. -
డిగ్రీ కళాశాలల్లో బదిలీలు చేపట్టాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ప్రభుత్వ డిగ్రీ కళాశాలల్లో సాధారణ బదిలీలను ప్రభుత్వం వెంటనే చేపట్టాలని ఏలూరు ప్రభుత్వ డిగ్రీ కళాశాల అధ్యాపకులు భోజన విరామ సమయంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. బదిలీలతో పాటు అధ్యాపకుల రీ డిజిగ్నేషన్, సీఏఎస్ వంటి విషయాలపై సత్వరం నిర్ణయం తీసుకోవాలని గవర్నమెంట్ కాలేజ్ టీచర్స్ అసోసియేషన్, గవర్నమెంట్ కాలేజ్ గెజిటెడ్ టీచర్స్ అసోసియేషన్ సంయుక్తంగా ఇచ్చిన పిలుపుమేరకు ఈ నిరసన ప్రదర్శన చేశారు. జీసీటీఏ జిల్లా అధ్యక్షుడు ఎం. రాంబాబు, ట్రెజరర్ టీవీ దుర్గాప్రసాద్, జీజీటీఏ జిల్లా ట్రెజరర్ కే. రమేష్, ఇతర అధ్యాపకులు కార్యక్రమంలో పాల్గొని ప్రభుత్వ విధానాలపై అసంతృప్తి వ్యక్తం చేశారు. బుట్టాయిగూడెంలో.. బుట్టాయగూడెం: భోజన విరామ సమయంలో స్థానిక ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో పనిచేస్తున్న అద్యాపకులు నిరసన కార్యక్రమం చేశారు. నిరసన కార్యక్రమం అనంతరం ప్రిన్సిపాల్ డాక్టర్ మహేంద్రరావుకు వినతిపత్రాన్ని అందజేశారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో 13 మందికి జరిమానా భీమవరం: భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, గరగపర్రురోడ్డులోని బీవీ రాజు విగ్రహం ప్రాంతాల్లో మద్యం సేవించి బైక్ నడుపుతున్న 13 మందిని అరెస్టు చేసినట్లు టూటౌన్ సీఐ జి.కాళీచరణ్ సోమవారం చెప్పారు. పట్టుబడిన వారిని మేజిస్ట్రేట్ ముందు హాజరు పర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారని, అతి వేగంగా బైక్ నడిపిన వ్యక్తికి రూ.3 వేల జరిమానా విధించారని సీఐ కాళీచరణ్ చెప్పారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో జరిమానా ఉండి: ఈ నెల 11న ఉండి పోలీస్స్టేషన్ పరిధిలో నిర్వహించిన డ్రంక్ అండ్ డ్రైవ్లో నమోదైన 15 కేసుల్లో ముద్దాయిలను కోర్టుకు తరలించగా సోమవారం వారికి జరిమానాలు విధించినట్లు ఉండి ఎస్సై నసీరుల్లా తెలిపారు. వ్యాసరచన పోటీల్లో విజేతలు వీరే భీమవరం: స్వాతంత్య్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా స్థాయిలో గాంధీజీ ఆశించిన స్వరాజ్యం అంశంపై నిర్వహించిన వ్యాసరచన పోటీల విజేత వివరాలను సోమవారం ప్రకటించారు. సీనియర్స్ విభాగంలో ఎం.నాగలక్ష్మి(గోపాలపురం), ఎండీ సుమయ్య(నరసాపురం), ఎ.పూజిత(చినఅమిరం), పి.మంజుశ్రీ(గూట్లపాడు), కేఎస్.అమూల్య(వైఎస్ పాలెం), కె.రిషిత(కేఎస్ రామవరం), కె.దివ్య(మండపాక), ఎస్.అమృత లక్ష్మీసాయి(చిననిండ్రకొలను) విజేతలుగా నిలిచారు. జూనియర్స్ విభాగంలో కె.కుషాలి(బొర్రంపాలెం), డి.కోమలశ్రీ(వేగివాడ కల్లచెరువు), కె.యామిని ఐశ్వర్య(నరసాపురం), ఎన్.అక్షిత(చినఅమిరం), ఎ.సరసాదేవి(అరట్లకట్ట), కె.వర్షిత(భీమవరం), పి.ఆనందిత(పెదనిండ్రకొలను), కళాశాల స్థాయిలో ఎం.విజయమణి(తాడేపల్లిగూడెం), ఇ.వరుణ్(పెన్నాడ), వై.అవినాష్(భీమవరం) విజేతలుగా నిలిచారని వీరికి 13న పెదఅమిరం మహాత్మాగాంధీ ట్రస్ వద్ద, ఏలూరులో 14న పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో బహుమతులు అందజేస్తారు. -
విద్యుత్ శాఖలో సిఫార్సు బదిలీలలు!
ఏలూరు (ఆర్ఆర్పేట): తూర్పుప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ (ఏపీఈపీడీసీఎల్)లో త్వరలే జరిగే పదోన్నతులు, బదిలీలపై ఉద్యోగుల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. కొందరికి పదోన్నతులు వచ్చే అవకాశం ఉండటంతో వారు పనిచేసే స్థానాలను ఆశిస్తూ ఇప్పటికే కొందరు అధికారులు ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలను ఆ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్కు సమర్పించినట్టు గుసగుసలు వినిపిస్తున్నాయి. వ్యూహాత్మకంగా పావులు ఏలూరు ఆపరేషన్ సర్కిల్ ఎస్ఈ పి.సాల్మన్రాజుకు రానున్న జనవరిలో చీఫ్ జనరల్ మేనేజర్గా పదోన్నతి లభించనుంది. దీంతో ఈ పోస్టు ఖాళీ కానుంది. అలాగే భీమవరం సర్కిల్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఎం.ఝాన్సీకి ఇప్పటికే ఎస్ఈగా పదోన్నతి కల్పించాల్సి ఉంది. అయితే కొన్ని సమీకరణాల కారణంగా ఆమె స్వయంగా పదోన్నతిని వాయిదా వేసుకున్నట్టు ప్రచారం సాగుతోంది. భీమవరం ఎస్ఈ ఎ.రఘునాథబాబు ఈనెల 24 వరకూ సెలవు పెట్టారు. దీంతో ఈ స్థానానికి ఏలూరు ఎస్ఈని ఇన్చార్జిగా నియమిస్తూ సీఎండీ ఇటీవల ఉత్తర్వులు ఇచ్చారు. కాగా ఏలూరు ఎస్ఈ సాల్మన్ రాజు ఏలూరు స్థానానికి వచ్చి మూడేళ్లు ముగుస్తున్నందున ఆయన్ను తప్పనిసరిగా బదిలీ చేయాల్సి ఉంది. దీంతో ఆయనకు తొలుత భీమవరం సర్కిల్కు ఎఫ్ఏసీగా బాధ్యతలు ఇచ్చి, అనంతరం భీమవరం స్థానాన్ని కేటాయించడానికే వ్యూహాత్మకంగా పావులు కదుపుతున్నట్టు తెలుస్తోంది. సీఎండీకి సిఫార్సు లేఖలు ఏలూరు ఎస్ఈ స్థానం ఖాళీ అయితే భీమవరం సర్కిల్ ఈఈ (టెక్నికల్) ఝాన్సీని అక్కడికి బదిలీ చేస్తారని ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. ఆమె స్థానంలోకి (భీమవరం) కాకినాడ జిల్లా జగ్గంపేటలో పనిచేస్తున్న ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ను బదిలీ చేయడానికి ప్రయత్నాలు జరుగుతున్నాయంటున్నారు. ఇదిలా ఉండగా సంస్థ కార్పొరేట్ కార్యాలయంలో ఎస్ఈ హోదాలో పనిచేస్తున్న ఓ అధికారి సైతం ఏలూరు ఎస్ఈ స్థానానికి తీవ్రంగా ప్రయత్నాలు చేస్తున్నట్టు సమాచారం. ఆయన గతంలో ఏలూరు సర్కిల్ పరిధిలో వివిధ హోదాల్లో పనిచేసినందున సర్కిల్పై పట్టు ఉండటంతో కొందరు కూటమి ఎమ్మెల్యేలు ఆయన్ను ఇక్కడ నియమించాలని పట్టుపడుతున్నట్టు తెలిసింది. అలాగే భీమవరం టౌన్ ఏఈఈగా పనిచేస్తున్న అధికారికి ఈఈ గా పదోన్నతి కల్పించి ఆయన్ను జగ్గంపేట ఈఈగా నియమించే అవకాశం ఉందంటున్నారు. ఈ మేరకు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలోని పలువురు కూటమి ఎమ్మెల్యేలు సిఫార్సు లేఖలను కూ డా సీఎండీకి పంపినట్టు చర్చించుకుంటున్నారు. వేధింపులతో.. కూటమి ఎమ్మెల్యేల వేధింపులతో ఓ అధికారి బలి అవుతున్నాడనే చర్చ ఉద్యోగవర్గాల్లో జోరుగా సాగుతోంది. వారం క్రితం టెలీ కాన్ఫరెన్స్లో భీమవరం ఎస్ఈ రఘునాథబాబు పనితీరుపై సీఎండీ అందరి ముందు మందలించడంతో ఆయన కినుక వహించి సెలవు పెట్టారనే చర్చ జరుగుతోంది. దీనికి తోడు భీమవరం సర్కిల్లో అధిక శాతం ఓ సామాజిక వర్గానికి చెందిన అధికారులే పనిచేస్తుండటం, వారంతా రఘునాథబాబుపై ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులకు ఫిర్యాదులు చేస్తూ వేధిస్తున్నారని అంటున్నారు. వీటిని భరించలేక ఆయన సీఎండీ కార్యాలయంలో స్వచ్ఛంద పదవీ విరమణకు దరఖాస్తు చేసుకున్నారని విశ్వసనీయ వర్గాల ద్వారా తెలిసిందంటూ ఉద్యోగులు చర్చించుకుంటున్నారు. బదిలీలు, పదోన్నతులపై చర్చ ఇప్పటికే ఎమ్మెల్యేల సిఫార్సు లేఖలంటూ గుసగుసలు వేధింపులు భరించలేక భీమవరం ఎస్ఈ వీఆర్ఎస్కు దరఖాసు ్త! -
వైద్యం.. పూజ్యం
జిల్లాలోని ప్రభుత్వాస్పత్రుల్లో సమస్యలు రాజ్యమేలుతున్నాయి. ఏలూరు జీజీహెచ్, ఏరియా ఆస్పత్రులు, సీహెచ్సీలు, పీహెచ్సీల్లో పేదలకు పూర్తిస్థాయిలో వైద్యం అందని పరిస్థితి. సోమవారం జిల్లాలోని ఆస్పత్రుల్లో ‘సాక్షి’ జరిపిన పరిశీలనలో ఓపీ సేవల కోసం గంటల తరబడి పడిగాపులు, డాక్టర్ల కొరత, సమయానికి హాజరుకాని వైద్యులు, పనిచేయని సీటీ స్కానింగ్, ఆయా వార్డుల్లో సేవల కోసం ఎదురుచూస్తున్న రోగులు, కదలని 108 వాహనాలు.. ఇలా తదితర సమస్యలెన్నో వెలుగుచూశాయి. మంగళవారం శ్రీ 12 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు : జిల్లాలో ప్రధాన కేంద్రమైన ఏలూరులో ప్రభు త్వ సర్వజన ఆస్పత్రి, జంగారెడ్డిగూడెం, నూజివీడులో ఏరియా ఆసుపత్రులు, కై కలూరు, చింతలపూడి, దెందులూరు, భీమడోలు, బుట్టాయగూడెం, పోలవరంలో సామాజిక ఆరోగ్య కేంద్రాలు ఉన్నాయి. వీటితో పాటు జిల్లావ్యాప్తంగా 57 పీహెచ్సీలు ఉన్నాయి. ఏలూరు ప్రభుత్వాస్పత్రిలో 78 మంది వైద్యులకు 20 పోస్టులు ఖాళీగా ఉండగా, ఉన్న వైద్యులు కూడా పూర్తిస్థాయిలో అందుబాటులో లేరు. అలాగే మిగిలిన ఆస్పత్రుల్లోనూ ఇదే పరిస్థితి. జిల్లావ్యాప్తంగా సగటున 30 శాతానికిపైగా వైద్యులు, సిబ్బంది పోస్టులు ఖాళీగా ఉన్నట్టు అంచనా. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పీహెచ్సీలో ఇద్దరు వైద్యులు ఉండేవారు. ఒకరు ఓపీలో సేవలందించగా మరొకరు ఫ్యామిలీ డాక్టర్ పేరిట ఇంటింటికీ వెళ్లి గర్భిణులు, దీర్ఘకాలిక వ్యాధిగ్రస్తులకు సేవలందించేవారు. అలాగే పూర్తిస్థాయిలో 108 వాహనాలతో పాటు సీహెచ్సీ, పీహెచ్సీల్లో సైతం గుండెపోటుకు తక్షణమే చేయాల్సిన ఇంజెక్షన్స్, అత్యవసర సేవలకు మందులు అందుబాటులో ఉండేవి. ప్రస్తుతం ఏలూరు సర్వజన ఆస్పత్రిలో కూడా ఇవి అందని పరిస్థితి. వైద్యం.. ప్రహసనం జిల్లాలోని ఆస్పత్రుల్లో ఔట్పేషెంట్ వైద్యసేవలు పొందాలంటే ప్రహనసమే. ఏరోజు ఏ వైద్యులు అందుబాటులో ఉంటారో తెలియని పరిస్థితి. ఏలూరు జీజీహెచ్కి సగటున రోజుకు 1,000 నుంచి 1,200 వరకు ఓపీ ఉంటుంది. వీటిలో 900 మందికిపైగా దూర ప్రాంతాల నుంచి వచ్చేవారే. అలాగే 40 శాతం మందికి ఎక్స్రే, సిటీస్కాన్, ఈసీజీ, ఇతర స్కానింగ్లు అవసరం ఉంటుంది. ఈ క్రమంలో స్కానింగ్ పరికరాలు తరచూ మరమ్మతులకు గురికావడం, లేదంటే కనీసం వారం నుంచి నెల రోజులు వేచిచూడటం అనివార్యం. ఒకవేళ అలా ఇచ్చిన తేదీకి వచ్చినా మెషీన్ పనిచేస్తేనే స్కానింగ్ లేదంటే మరో వారం వేచి చూడాలి. ఆప్తామాలజీ, డెంటల్, గైనిక్, ఆర్థో, జనరల్ మెడిసిన్, న్యూరోతో పాటు ట్రామాకేర్, అత్యవసర వైద్యసేవలు ఉన్నాయి. అయితే వీటిలో పలు విభాగాల్లో డాక్టర్లు ఒక పూట మాత్రమే అందుబాటులో ఉంటున్నారు. జీజీహెచ్లో 108 వాహనాలు 27 ఉన్నా సమయానికి మాత్రం అందుబాటులో ఉండని పరిస్థితి. ఎమర్జెన్సీ కేసులు విజయవాడ తీసుకువెళ్లాలంటే వేలు ఖర్చు పెట్టి ప్రైవేట్ అంబులెన్స్లో తీసుకు వెళ్లాల్సి వస్తోంది. స్లిప్ కోసం ‘ఓపి’క పట్టాల్సిందే.. ఏలూరుతో సహా అన్ని ప్రభుత్వాస్పత్రుల్లో ఓపీ స్లిప్ సాధించాలంటే ప్రహసనమే. రోగి వివరాలన్నీ ఆన్లైన్లో నమోదు చేయించడం, అర గంటకుపైగా క్యూలో నిలబడి నమోదయ్యాక ఓటీపీ నంబర్ చెప్పడం, ఆ తర్వాత స్లిప్ తీసుకుని సంబంధిత వార్డుకు వెళ్లేందుకు గంటకు పైగా సమయం పడుతోంది. ఆయా వార్డుల్లో భారీ క్యూలు ఉండటంతో మరో రెండు గంటలు పడిగాపులు కాస్తేనే గాని డాక్టర్ చూడని పరిస్థితి. సుమారు ఏలూరులో 1,200, నూజివీడులో 300, చింతలపూడి, జంగారెడ్డిగూడెంలో 200కు పైగా ఓపీలు ఉన్నాయి. కైక లూరు మండలం కొల్లేటికోట పీహెచ్సీలో అన్నింటికి నర్సే దిక్కు. రెండు డాక్టర్లు పోస్టులు, ల్యాబ్ టెక్నీషియన్ పోస్టు ఖాళీగా ఉన్నాయి. న్యూస్రీల్ రోగుల పడిగాపులు వైద్యులు, సిబ్బంది కొరత స్కానింగ్ యంత్రాలకు మరమ్మతులు అందుబాటులో లేని 108 సేవలు కూటమి పాలనలో గాడి తప్పిన వైద్యం ఏజెన్సీలో విషజర్వాల విజృంభణ మంత్రి ఇలాకాలో.. రాష్ట్ర మంత్రి ప్రాతినిధ్యం వహిస్తున్న నూజి వీడు ఆస్పత్రిలో మార్చురీ అవస్థలు అత్యంత దారుణం. ఎవరైనా చనిపోతే శవాన్ని మార్చురీలో పెట్టాలంటే వారే రూ.5 వేలు బయట చె ల్లించి ఐస్బాక్స్ తెచ్చుకోవాల్సిన దుస్థితి. ఆరు నెలలుగా ఫ్రీజర్లు పాడైపోవడంతో ప్రమాద కేసుల్లో మృతదేహాలను భద్రపరచడానికి రూ.5 వేలు చెల్లించడం అనివార్యం. మంచం పట్టిన మన్యం ఏజెన్సీ ప్రాంతంలో మలేరియా, టైఫాయిడ్ కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయి. ఈ ఏడాదిలో ఇప్పటివరకు 570 మలేరియా కేసులు నమోద య్యాయి. అలాగే వందల సంఖ్యలో జ్వరాల కేసులు ప్రైవేటు ఆస్పత్రుల్లో నమోదవుతున్నాయి. బుట్టాయగూడెం మండలంలో కేఆర్పురం, నందపురం ఆస్పత్రుల్లో ల్యాబ్ టెక్నీషియన్, మందులు అందుబాటులో లేకపోవడంతో జంగారెడ్డిగూడెం ఆస్పత్రులకు వెళ్లాల్సిన పరిస్థితి. -
రేపు వైఎస్ జగన్ పర్యటన షెడ్యూల్ ఇలా..
సాక్షి, భీమవరం: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి బుధవారం భీమవరం విచ్చేయనున్నారు. ఉంగటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులను ఆశీర్వదించనున్నారు. జగన్ పశ్చిమగోదావరి జిల్లా పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను సోమవారం పార్టీ కేంద్ర కా ర్యాలయం విడుదల చేసింది. 13న మ ధ్యాహ్నం 3.15 గంటలకు తాడేపల్లిలోని నివాసం వద్ద నుంచి 3.20 గంటలకు హెలీప్యాడ్కు వస్తారు. 3.30 గంటలకు అక్కడి నుంచి బయలుదేరి 4.15 గంటలకు భీమవరంలోని వీఎస్ఎస్ గార్డెన్స్ సమీపంలోని హెలీప్యాడ్కు చేరుకుంటారు. రోడ్డు మార్గం గుండా 4.35 గంటలకు వివాహ వేదిక వీఎస్ఎస్ గార్డెన్కు చేరుకుని నూతన వధూవరులను ఆశీర్వదిస్తారు. అనంతరం 5.10 గంటలకు హెలీప్యాడ్ నుంచి తాడేపల్లి బయలుదేరి వెళతారు. నూజివీడు సబ్ కలెక్టర్ వినూత్న బాధ్యతల స్వీకరణ నూజివీడు: నూజివీడు సబ్కలెక్టర్గా ఐఏఎస్ అధికారి బొల్లిపల్లి వినూత్న సోమవారం బాధ్యతలు స్వీకరించారు. 2022–23 బ్యాచ్కు చెందిన ఆమె ఇప్పటివరకు అనంతపురం ట్రైనీ కలెక్టర్గా పనిచేశారు. బీటెక్ మెకానికల్ ఇంజినీరింగ్ చేసిన వినూత్న సివిల్స్ రాసి ఏఐఎస్గా ఎంపికయ్యారు. నూజివీడు సబ్కలెక్టర్గా తొలి పోస్టింగ్ కావడం గమనార్హం. వినూత్న తండ్రి పశుసంవర్ధకశాఖలో జిల్లా అధికారి కాగా, తల్లి వ్యవసాయశాఖలో జిల్లా అధికారిగా పనిచేస్తున్నారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం ఆమె మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటూ వారి సమస్యలను పరిష్కారమే ధ్యేయంగా పనిచేస్తానన్నారు. ప్రభుత్వ పథకాలను అర్హులందరికీ అందేలా చూస్తానన్నారు. ఇప్పటివరకు ఇక్కడ సబ్ కలెక్టర్గా వి ధులు నిర్వహించిన బచ్చు స్మరణ్రాజ్కు ప్రభుత్వం ఇంకా ఎక్కడా పోస్టింగ్ ఇవ్వలేదు. విద్యార్థి సంఘాల నిరసన ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాసంస్థల్లో తల్లిదండ్రులు, స్కూల్ యాజమాన్య కమిటీలు తప్ప బయట వ్యక్తులు, సంస్థలు ప్రవేశించరాదంటూ కూటమి ప్రభుత్వం జారీ చేసిన ఉత్తర్వులను వెంటనే ఉపసంహరించుకోవాలని పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు కాకి నాని డిమాండ్ చేశారు. పీడీఎస్యూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు సోమవారం జిల్లా శాఖ ఆధ్వర్యంలో స్థానిక కోటదిబ్బ ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద నిరసన తెలిపి ప్రభుత్వ ఉత్తర్వులను దహనం చేశారు. ఈ సందర్భంగా కాకి నాని మాట్లాడుతూ తాము అధికారంలోకి వస్తే ప్రభుత్వ విద్యను బలోపేతం చేస్తామన్న మంత్రి లోకేష్, ఈ మాటలను పూర్తిగా విస్మరించారన్నారు. పీడీఎస్యూ నగర అధ్యక్షుడు ఎం.యశ్వంత్ మాట్లాడుతూ విద్యార్థులు, యువత రాజకీయాల్లోకి రావాలని చంద్రబాబు ఇస్తున్న ఉపన్యాసాలు వట్టి మాటలేనా అని ప్రశ్నించారు. ఈ జీఓను రద్దు చేయాలని లేకుంటే పెద్ద ఎత్తున ఉద్యమాలు చేపడతామని హెచ్చరించారు. ఉపాధి హామీ కూలీలపై వివక్ష ఏలూరు (టూటౌన్): ఉపాధి కూలీలపై వివక్ష చూపుతున్న ప్రభుత్వాలు వేతన బకాయిలు విడుదల చేయకపోవడం దుర్మార్గమని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ అన్నారు. ఏలూరు పాత బస్టాండ్ అంబేడ్కర్ విగ్రహం వద్ద వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం నిరసన కార్యక్రమం నిర్వహించారు. మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకాన్ని నిర్వీర్యం చేయాలని పాలకవర్గాలు కుట్రలు చేస్తున్నాయన్నారు. మూడు, నాలుగు నెలల నుంచి వేతనాల ఇవ్వకపోవడంతో కూలీలు అవస్థలు పడుతున్నారని మండిపడ్డారు. నిధుల కోత వలన కనీసం 30 రోజులకు కూడా పనులు దక్కడం లేదని ఆరోపించారు. పనిచేసిన రెండు వారాల్లోపు వేతనాలు ఇవ్వాల్సి ఉన్నా పాలకులు పట్టించుకోవడం లేదన్నారు. సంఘం జిల్లా అధ్యక్షుడు ఎం.జీవరత్నం కమిటీ సభ్యులు తామా ముత్యాలమ్మ, ఎస్.మహంకాళిరావు, యు.వెంకటేష్, సత్యనారాయణ, కె.దుర్గ, చలపతి, ఎ.ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. -
అర్జీల పరిష్కారంపై దృష్టి పెట్టాలి
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థ (పీజీఆర్ఎస్)కు సంబంధించి జిల్లా అధికారులు ప్రత్యేక పర్యవేక్షణ చేసి త్వరితగతిన పరి ష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. ఏలూరు కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా అధికారులతో కలిసి ఆమె అర్జీలు స్వీకరించారు. మొత్తంగా 268 అర్జీలు స్వీకరించి ఆయా సమస్యల పరిష్కారానికి అధికారులకు ఆదేశాలిచ్చారు. సమస్యల పరిష్కారంలో క్షేత్రస్థాయిలోకి వెళ్లి పరిశీలన చేయాలన్నారు. అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యానికి తావులేదన్నారు. జేసీ పి.ధాత్రిరెడ్డి, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం. అచ్యుత అంబరీష్, ఎస్డీసీ కె.భాస్కర్, జెడ్పీ సీఈఓ ఎం.శ్రీహరి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● చింతలపూడి మండలం యండపల్లికి చెందిన దాసరి సురేష్కుమార్ బంగారు కుటుంబానికి ఎంపిక చేసినందుకు ధన్యవాదాలు తెలుపుతూ తనకు ఫుడ్ ప్రాసెసింగ్ సెంటర్ నెలకొల్పి మరికొందరికి ఉద్యోగ అవకాశాలు కల్పించాలని ఆశయం ఉందని మంచి మార్గదర్శిని సూచించాలని కోరారు. ● ద్వారకాతిరుమండలం పి.కన్నాపురానికి చెందిన పిండి ఎలీషా తన పంట భూమికి 1బీ–అడంగల్లో నమోదు చేసి పట్టాదారు పాసుబుక్ ఇప్పించాలని కోరారు. ● దెందులూరు మండలం కొవ్వలికి చెందిన వడ్లపట్ల వెంకటేశ్వరరావు తమ నివాసాలకు పక్కన బెల్ట్ షాపుల ద్వారా మద్యం అమ్ముతున్నారని ఫిర్యాదు చేశారు. ● కామవరపుకోటకు చెందిన వానరాశి లక్ష్మీరాజ్యం తన పంట పొలంలోకి వెళ్లే రోడ్డు ఆక్రమణకు గురైందని, తొలగించి దారి చూపాలని వినతిపత్రం అందజేశారు. రూ.5.72 కోట్లతో హాస్టళ్ల అభివృద్ధి జిల్లాలోని సంక్షేమ హాస్టల్స్, పాఠశాలలు, అంగన్వాడీల్లో చేపట్టిన మౌలిక సదుపాయాలు, అభివృద్ధి పనులను ఆగస్టు నెలాఖరులోపు పూర్తిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో రూ.5.72 కోట్లతో వివిధ ప్రాంతాల్లో సాంఘిక సంక్షేమ హాస్టళ్ల అభివృద్ధికి ఐదు ఇంజనీరింగ్ శాఖలకు పనులు అప్పగించామన్నారు. -
నేడు వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సమావేశం
దెందులూరు: వైఎస్సార్సీపీ జిల్లా ఎస్సీ సెల్ విస్తృత స్థాయి సమావేశాన్ని మంగళవారం ఏలూరు సుఖీభవ కల్యాణ మండపంలో నిర్వహించనున్నట్టు సెల్ జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్ తెలిపారు. దెందులూరులోని మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి కా ర్యాలయంలో సోమవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఉదయం 9 గంటలకు సమావేశం ప్రారంభమవుతుందని, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు టీజేఆర్ సుధాకర్ బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మూరి కనకారావు విచ్చేస్తారన్నారు. అతిథులుగా ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్, మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, మాజీ ఎమ్మెల్యేలు, పార్టీ ఇన్చార్జిలు హాజరవుతారన్నారు. పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో హాజరై జయప్రదం చేయాలని కోరారు. సమావేశంలో ఫారెస్ట్ కార్పొరేషన్ రాష్ట్ర మాజీ డైరెక్టర్ పల్లెం ప్రసాద్, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలానవకాంతం, సర్పంచులు బోదుల స్వరూప్, ప్రభుదేవా, ఎంపీటీసీ పులవర్తి దేవానంద్, పార్టీ నాయకులు గారపాటి నాగేశ్వరరావు, కమ్ముల మోహన్, మురళి ఉన్నారు. -
31 వరకు ‘ఆపరేషన్ ట్రేస్’
ఏలూరు టౌన్: జిల్లావ్యాప్తంగా ఆపరేషన్ ట్రేస్ అనే కార్యక్రమాన్ని పెద్ద ఎత్తున చేపట్టేందుకు చర్యలు చేపట్టినట్టు జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు తెలిపారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఆదేశాల మేరకు తప్పిపోయిన బాలలను గుర్తించి, వా రి తల్లిదండ్రుల చెంతకు చేర్చే కార్యక్రమాన్ని ఈనెలాఖరు వరకు చేపడతున్నామన్నారు. ప్రభుత్వ హోమ్స్, ఎన్జీఓ హోమ్స్లో ఉంటున్న పిల్లల తల్లి దండ్రిని ట్రేస్ చేసి వారి అప్పగించటమే ప్రధాన లక్ష్యంగా పెట్టుకున్నామన్నారు. ఏలూరు మహిళా స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు, ఏలూరు శక్తి టీమ్ శనివారపుపేటలోని ప్రభుత్వ వసతి గృహంలోని పిల్లలతో మమేకమయ్యారు. చైన్నె సీడబ్ల్యూసీ నుంచి ఏలూరు సీడబ్ల్యూసీకి ఇద్దరు బాలురు, ఇద్దరు బాలికలను పంపించారనీ, వారంతా పశ్చిమగోదావరి జిల్లా భీమవరం పరిసర ప్రాంతాల వారిగా చెప్పారనీ, అయితే పూర్తి చిరునామా చెప్పలేకపోయారన్నా రు. అనంతరం ఏలూరు మహిళా స్టేషన్, శక్తిటీం, భీమవరం చైల్డ్లైన్ సిబ్బంది సమన్వయంతో బా లల తల్లితండ్రిని గుర్తించి, వారికి అప్పగించారని తెలిపారు. సోమవారం ఏలూరు సీడబ్ల్యూసీ ముందు ప్రవేశపెట్టి పిల్లలను వారి కుటుంబాలకు అప్పగించారు. భీమవరం వన్స్టాప్ సెంటర్లో ఉన్న ఇ ద్దరు బాలికలను తల్లితండ్రి తీసుకువెళ్లవచ్చన్నారు. -
పాత తెరలు చిరిగిపోయాయి
గత రెండు సంవత్సరాల నుంచి మాకు దోమ తెరలు పంపిణీ చేయలేదు. గతంలో ఇచ్చిన దోమ తెరలు చిరిగిపోయాయి. మా గ్రామాల్లో దోమలు విపరీతంగా ఉన్నాయి. దోమ తెరల కోసం ఎదురు చూస్తున్నాం. ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేయాలి. నడపల ముక్కారెడ్డి, గడ్డపల్లి, పోలవరం మండలం ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదు కూటమి ప్రభుత్వానికి దోమ తెరల పంపిణీపై చిత్తశుద్ధి ఉన్నట్లు కనిపించడం లేదు. గతేడాది పంపిణీ చేయలేదు. ఈ ఏడాది పంపిణీ చేస్తారో లేదో అనే అనుమానం వస్తుంది. ప్రస్తుతం గిరిజన గ్రామాల్లో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నాయి. కారం రాఘవ, ఏఐకేఎంఎస్ నాయకుడు, అలివేరు, బుట్టాయగూడెం మండలం ప్రత్యేక దృష్టి పెట్టాం జిల్లాలో మలేరియా నివారణపై ప్రత్యేక దృష్టి పెట్టాం. దీని కోసం సుమారు 2 లక్షల 50 వేలు దోమ తెరలు అవసరమని ప్రతిపాదనలు పంపించారు. అవి వచ్చిన వెంటనే మలేరియా సమస్యత్మక గ్రామాల్లో పంపిణీ చేస్తాం. ఎన్ఎస్ఎస్ ప్రసాద్, జిల్లా మలేరియాధికారి, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
పశువుల్లో ఈనిక సమస్యలు
జంగారెడ్డిగూడెం: ఆవులు, గేదెల్లో ఈనికకు ముందు, సమయంలో, తర్వాత జరిగే వ్యాధులు పశువుల ఆరోగ్యం, పాల ఉత్పత్తి, రోగనిరోధక శక్తిని ప్రభావితం చేస్తాయి. ముందుగా గుర్తించడం, నివారించడం, తగిన చికిత్స ఇవ్వడం ద్వారా పశువుల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. పశువుల రైతులకు ఈ వ్యాధులను ఎలా నివారించాలో, ఎలా నిర్వహించాలో పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ వివరించారు. ఈనికకు ముందు వ్యాధులు ● పాల జ్వరం: పాల జ్వరం అనేది రక్తంలో కాల్షియం స్థాయి తగ్గడంతో కలిగే వ్యాధి. ఇది సాధారణంగా ఆవులు, గెదెలలో ఈనికకు ముందు లేదా తరువాత కనిపిస్తుంది. లక్షణాలు: కాళ్ళలో బలహీనత, నిలబడలేకపోవడం, చల్లని పాదాలు, తీవ్రమైన పరిస్థితిలో పశువు పడిపోయే ప్రమాదం ఉంటుంది. చికిత్స: వెంటనే కాల్షియం ఐవీ చుక్కల రూపంలో ఇవ్వాలి. పశువైద్యుడి సలహా మేరకు అధిక ప్రమాదం ఉన్న పశువులకు ముందస్తుగా కాల్షియం అందించాలి. నివారణ: ఆహారంలో సరైన పరిమాణంలో కాల్షియం, ఫాస్ఫరస్ ఉండేలా చూసుకోవాలి. ఈనికకు ముందు కాల్షియం సప్లిమెంట్స్ ఇవ్వడం వల్ల కాల్షియం స్థాయిలను కాపాడుకోవచ్చు. ● కీటోసిస్: కీటోసిస్ అనేది పశువు శక్తి లోటుతో కలిగే వ్యాధి, ఇది ఈనికకు ముందు ఎక్కువగా జరుగుతుంది. లక్షణాలు: పాల ఉత్పత్తి తగ్గిపోవడం, ఆకలి తగ్గడం, బరువు తగ్గడం. మూత్రంలో ఎసిటోన్ వాసన చికిత్స: ప్రొపైలీన్ గ్లైకాల్ రూపంలో ఇచ్చి గ్లూకోజ్ స్థాయిని పెంచాలి. నివారణ: ముఖ్యంగా అధిక పాల ఉత్పత్తి చేసే పశువులకు సమతుల్య ఆహారం అందించాలి. శరీరంలో తగిన శక్తి నిల్వల కోసం సరైన ఆహారం ఇవ్వాలి. ఈనిక సమయంలో వ్యాధులు ● కష్ట సాధ్యం: కష్టసాధ్యమైన ఈనిక సమయంలో.. లక్షణాలు: సుదీర్ఘ ఈనిక సమయంలో పిల్లలు బయటకు రాకపోవడం. చికిత్స: అవసరమైనపుడు ఈనికకు సహాయం చేయాలి. తీవ్ర పరిస్థితుల్లో సిజేరియన్ చేయవచ్చు. నివారణ: పెద్ద పిల్లలను ఈనే అవకాశం ఉన్న ఆవులకు తగిన ఆహారం, శ్రద్ధ తీసుకోవాలి. సరైన సమయానికి పశువైద్యుడి సలహాలు తీసుకోవాలి. ● గర్భపాతాల నిలుపు గర్భపాతం 12 గంటలలోపు బయటకు రాకపోతే ఇది ఒక సమస్యగా మారుతుంది. లక్షణాలు: జనన మార్గం నుండి చెడిపోయిన వాసన రావడం చికిత్స: పశువైద్యుడు సూచించిన విధంగా యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నివారణ: సరైన పోషకాహారం ఇవ్వడం, ముఖ్యంగా విటమిన్–ఇ, సెలీనియం తగిన మోతాదులో ఉండాలి. ఈనిక తరువాత వ్యాధులు ● మెట్రిటిస్: ఇది ఒక బాక్టీరియా ఇన్ఫెక్షన్. సాధారణంగా కష్ట్రపసవం లేదా గర్భపాతం తర్వాత కలుగుతుంది. లక్షణాలు: చెడు వాసన, జ్వరం, ఆకలి తగ్గడం. చికిత్స: యాంటీబయోటిక్స్, పశువైద్యుడి సూచనలతో సరైన చికిత్స చేయాలి. నివారణ: ఈనిక సమయంలో పరిశుభ్రత పాటించడం. ● మస్తిటిస్: మస్తిటిస్ అనేది పాలు ఉత్పత్తి చేసే గ్రంథులలో ఇన్ఫెక్షన్ ద్వారా కలిగే వ్యాధి. లక్షణాలు: ఉబ్బిన, వేడిగా ఉండే పొట్ట, మరియు పాలు అసాధారణంగా ఉండటం (గడ్డలు, రక్తం). చికిత్స: పశువైద్యుని సూచన మేరకు యాంటీబయోటిక్స్ ఇవ్వాలి. నివారణ: పాల యంత్రాల పరిశుభ్రత, పశువుల శుభ్రతతో పాటించాలి. సమతుల ఆహారాన్ని అందించాలి ఈనికకు ముందు, సమయంలో, తర్వాత వ్యాధులు పశువుల ఆరోగ్యాన్ని ప్రభావితం చేస్తాయి. ఇవి నివారించడం ద్వారా పశువుల పాల ఉత్పత్తిని పెంచి, వాటి ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చు. ముఖ్యంగా సమతుల ఆహారం, ముఖ్యంగా ఈనికకు ముందు, తర్వాత అందించాలి. పశువులు ఉండే వాతావరణం పరిశుభ్రంగా ఉంచాలి. పశువైద్యుడి పర్యవేక్షణలో వ్యాధులు గుర్తించడం, చికిత్స చేయడం చేయించాలి. – డా. బి. ఆర్. శ్రీనివాసన్, పశు వైద్యాధికారి, -
గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు
బుట్టాయగూడెం: కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు ముదినేపల్లి రూరల్: సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపుకుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. మద్దిలో హనుమద్ హోమం జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో హనుమద్ హోమం ఆలయ అర్చకులు, వేద పండితులు ఆద్వర్యంలో వైభవంగా ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ స్వామి వారి సన్నిధిలో ఈ హోమం ప్రతీ ఆదివారం భక్తులకు ఆర్జిత సేవగా దేవస్థానం నిర్ణయించిందన్నారు. హోమ కార్యక్రమం పర్యవేక్షణ ఆలయ పర్యవేక్షకుడు జవ్వాది కృష్ణ నిర్వహిస్తారని ఈవో తెలిపారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మను సమీప జిల్లాల నుంచి భక్తులు ఆదివారం దర్శించుకున్నారు. దేవస్థానం సమీప పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మకు వేడి నైవేద్యాలు, పొంగళ్లు సమర్పించారు. ఆలయ ప్రధాన అర్చుకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు చేపట్టారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున మొత్తం రూ.38,9085 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
కూర్మ విలాపం
కై కలూరు: తాబేళ్ల అక్రమ రవాణాకు కొల్లేరు ప్రాంతం కేంద్రంగా మారింది. పర్యావరణానికి వెలకట్టలేని మేలు చేస్తున్న నల్లచిప్ప తాబేళ్లను కాసులకు కక్కుర్తిపడి రాత్రి సమయంలో సరహద్దులు దాటించేస్తున్నారు. ఒడిశా రాష్ట్రంలో తాబేలు మాంసానికి మంచి గిరాకీ ఉండటంతో అడ్డదారుల్లో గుట్టు చప్పుడు కాకుండా తరలించి అక్రమార్కులు జేబులు నింపుకుంటున్నారు. తాబేళ్ల స్మగ్లర్ కుమార్ రెండేళ్లుగా ఒడిశాలో ఉంటూ కొల్లేరు ప్రాంతం నుంచి వచ్చే తాబేళ్లను మార్కెట్ చేస్తున్నాడు. అతనిపై తాబేళ్ల అక్రమ రవాణాలో పలు కేసులున్నాయి. అక్రమ రవాణా ఇలా.. ఉమ్మడి జిల్లాలో చేపలు 1.80 లక్షలు, రొయ్యలు 1.10 లక్షల ఎకరాల్లో సాగు చేస్తున్నారు. చేపల పట్టుబడుల వలలో తాబేళ్లు చిక్కుకుంటాయి. వలల మేసీ్త్ర సమాచారంతో కొందరు వీటిని సేకరిస్తున్నారు. ఎక్కువ మంది కొల్లేరు డ్రెయిన్లు, పంట బోదెలలో వీటిని పట్టుకుంటున్నారు. ఏజంట్లు సేకరించిన తాబేళ్ళను గోనె సంచులు, నీటి డ్రమ్ములలో దాస్తున్నారు. సేకరించిన వీటిని సైజును బట్టి కేజీ రూ.30 నుంచి రూ.40 వరకు ఇక్కడ కొనుగోలు చేసి ఒడిశాలో కేజీ రూ.300పైగా విక్రయిస్తోన్నారు. ఉదాహరణకు వాహనంలో సుమారు 5 టన్నుల తాబేళ్లు రవాణా చేస్తే రూ.15 లక్షలు ముడుతోంది. అన్ని ఖర్చులు పోయి అక్రమార్కులకు మినిమం రూ.10 లక్షల వరకు మిగులుతోంది. దీంతో అక్రమ మార్గాన్ని ఎంచుకుంటున్నారు. కేంద్ర బిందువుగా భీమవరం ఆక్వా హబ్గా పేరొందిన భీమవరం అక్రమ తాబేళ్లకు స్టాకింగ్ పాయింట్గా మారింది. కై కలూరు, కలిదిండి, మండవల్లి, ముదినేపల్లి మండలాల్లో సేకరించిన తాబేళ్లను కోరుకొల్లు, కలిదిండి, కాళ్ళ మీదుగా భీమవరం తరలిస్తున్నారు. అక్కడ నుంచి పెద్ద వాహనాల్లో ఒడిశా చేర్చుతున్నారు. కొల్లేరు ప్రాంతం నుంచి బొలోరో వాహనాల్లో అడుగున తాబేళ్లను పరిచి పైన చేప గురక పిల్లలను ఉంచుతున్నారు. ఎవరైన చెకింగ్కు వస్తే చేపలు కనిపిస్తాయి. అడుగున తాబేళ్లను గుర్తించలేకపోతున్నారు. మండవల్లి మండలం కొవ్వాడలంక, కలిదిండి మండలం బొబ్బిలిగూడెంకు చెందిన ఇద్దరు గతంలో తాబేళ్ళ రవాణాలో కీలకంగా వ్యవహరించారు. నియోజకవర్గంలో కలిదిండి, వెంకటాపురం, ఏలూరు రోడ్, ముదినేపల్లి ప్రాంతాల్లో అటవీ, పోలీసు అధికారులు అక్రమ తాబేళ్ల రవాణాను పలుమార్లు అడ్డుకున్నారు. కొల్లేరు చుట్టూ తాబేళ్ల అక్రమ రవాణా అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేళ్లు గుట్టుచప్పుడు కాకుండా ఒడిశాకు తరలింపు అంతరించిపోతున్న నల్లచిప్ప తాబేలు ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్(ఐయూసీఎన్) 2002లోనే అంతరించిపోతున్నా జాతులలో నల్లచిప్ప తాబేలును చేర్చింది. ఇండియాలో అసోం, త్రిపుర, బంగ్లాదేశ్లోని చిట్టగాంగ్ తదితర ప్రాంతాల్లో ఇవి ఎక్కువగా ఉన్నాయి. ఇవి 31 అంగుళాల వెడల్పు, 28 అంగుళాల పొడవు పెరుగుతాయి. సాధారణంగా 38 గుడ్లు పెడతాయి. మొక్కలు, చేపలు, పురుగులతో పాటు నీటిలో హనికర క్రిములను తింటాయి. అంతరించిపోతున్న తాబేలు జాతిని అన్ని దేశాలు షెడ్యూల్ –1 కేటగిరిలో చేర్చాయి. వన్యప్రాణి సంరక్షణ చట్టం 1972 ప్రకారం తాబేలును వేటాడడం, రవాణా చేయడం నేరం. ఏడేళ్లు కారగార శిక్ష విధించవచ్చు. అటవీ శాఖ చట్టాల సెక్షన్లు 27, 29, 31బీల ప్రకారం కేసులు నమోదు చేయొచ్చు. నిఘా ముమ్మరం చేశాం తాబేళ్ళ రవాణా నేరం. కొల్లేరు పరివాహక ప్రాంతాలు కాకుండా బయట ప్రాంతాల్లో వీటి రవాణా జరిగితే టెరిటోరియల్ ఫారెస్టు అధికారులు కేసులు నమోదు చేస్తారు. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో రవాణా చేస్తే అటవీశాఖ సిబ్బందికి సమాచారం అందించాలి – కేపీ రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు -
హుండీ దొంగతనం కేసులో నిందితుల అరెస్ట్
నిడమర్రు: గత నెల 26న పెదనిండ్రకొలను, పత్తేపురం గ్రామాల్లో దేవాలయాల్లో హుండీలు బద్దలుగొట్టి నగదు దోచుకున్న ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని అరెస్ట్ చేసినట్లు నిడమర్రు సీఐ ఎన్.రజనీ కుమార్ తెలిపారు. ఆదివారం ఆయన మాట్లాడుతూ ఉండి మండలం అరేడు గ్రామానికి చెందిన ప్రత్తిపాటి మహిమ కుమార్, గణపవరానికి చెందిన యంబల జోషి, పాలకొల్లు మండలం లంకలకోడేరుకు చెందిన మరొకరిని హుండీ దొంగతనం కేసులో నిందితులుగా గుర్తించినట్లు తెలిపారు. సీసీ కెమెరాల సాయంతో నిందితులను అరెస్ట్ చేసామన్నారు. వీరు గతంలో ద్వారకా తిరుమల్లో షాపు దొంగతనంలో, దెందులూరు పోలీస్ స్టేషన్ పరిధిలో హుండీ దొంగతనం కేసులో నిందితులుగా ఉన్నట్లు తెలిపారు. వీరిని ఆదివారం సాయంత్రం అరెస్ట్ చేసి బైక్, రూ.5,721 నగదు, రెండు రాడ్లు స్వాదీనం చేసుకున్నామని, సోమవారం తాడేపల్లిగుడెం కోర్టులో హాజరుపరుస్తామన్నారు. -
దోమ తెరలు ఎక్కడ?
బుట్టాయగూడెం: జిల్లాలోని మన్య ప్రాంతంలో మలేరియా జ్వరాలు విజృంభిస్తున్నా కూటమి ప్రభుత్వంలో ఏమాత్రం చలనం కనిపించడంలేదని గిరిజన సంఘాల నాయకులు విమర్శిస్తున్నారు. సీజనల్ జ్వరాలతో పాటు మలేరియా, డెంగ్యూ, టైఫాయిడ్ జ్వరాలు స్వైరవిహారం చేస్తున్నాయి. దోమల నియంత్రణలో కీలకమైన దోమ తెరల పంపిణీని గతేడాది గాలికి వదిలేసిన ప్రభుత్వం ఈ ఏడాది కూడా అదే ధోరణిలో వ్యవహరిస్తుందనే విమర్శలు విల్లువెత్తుతున్నాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది అత్యధికంగా మలేరియా కేసులు నమోదవుతున్నట్లు అధికారులు చెబుతున్నారు. గత ఏడాది జనవరి నుంచి ఆగస్టు నెలాఖరు నాటికి కేవలం 93 మలేరియా కేసులు నమోదు కాగా ఈ ఏడాది జనవరి నుంచి ఆగస్టు 10 నాటికి సుమారు 570 కేసులు నమోదైనట్లు అధికారులు తెలిపారు. గత ఏడాది కంటే ఈ ఏడాది 477 కేసులు అధికంగా నమోదయ్యాయి. గిరిజన గ్రామాల్లో దోమల నివారణకు ప్రస్తుతం మూడో దశలో మలాథియన్ స్పేయింగ్ పనులు జరుగుతున్నటు ఆ శాఖ అధికారులు చెబుతున్నారు. అయితే మలేరియా కేసులు అధికంగా పెరుగుతునే ఉన్నాయి. దోమలను నివారించాలంటే దోమ తెరలతోనే సాధ్యమని ఈ ప్రాంత వాసులు చెబుతున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో దోమతెరల పంపిణీ పశ్చిమ ఏజెన్పీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో మలేరియా నియంత్రణకు గత వైస్సార్సీపీ ప్రభుత్వం ఎంతో చిత్తశుద్ధితో కృషి చేసింది. గ్రామాల్లో దోమలను అరికట్టేందుకు అధికారులు పగడ్బందీగా చర్యలు చేపట్టారు. 2021లో అప్పటి మఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కేంద్ర ప్రభుత్వం ఆధీనంలో ఉన్న నేషనల్ వెక్టర్ బోర్న్ డిసీజ్ కంట్రోల్ ప్రోగ్రాం సంస్థ (ఎన్విబీడీసీపీ) నుంచి సుమారు 2 లక్షల 50 వేల దోమ తెరలను రప్పించి బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో ఉన్న గిరిజన గ్రామాల్లో ప్రజలకు పంపిణీ చేశారు. గిరిజన ఆశ్రమ పాఠశాలల్లో విద్యార్థులకు దోమ తెరలు పంపిణీ చేశారు. దోమ తెరల కాలపరిమితి మూడేళ్ల లోపు కావడంతో మళ్లీ 2024 జనవరిలో దోమ తెరల కోసం వైఎస్సార్సీపీ ప్రభుత్వం వైద్య ఆరోగ్య శాఖ ద్వారా ప్రతిపాదనలు పంపింది. కానరాని దోమ తెరల పంపిణీ కూటమి ప్రభుత్వం దోమ తెరల పంపిణీపై ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. గత ఏడాది దోమ తెరల పంపిణీ జరగలేదు. ఈ ఏడాది వేసవిలో వర్షాలు కురవడం, వర్షా కాలంలో తీవ్రమైన ఎండలు, వేడి గాలులు ఉక్కపోతలతో ప్రజలు అల్లాడిపోతున్నారు. సీజనల్ జర్వాలతో పాటు మలేరియా జ్వరాలు అధికంగా ఉన్నాయి. ఇప్పటికై న ప్రభుత్వం దోమ తెరలు పంపిణీ చేసి మలేరియా జ్వరాల నివారణకు కృషి చేయాలని గిరిజన సంఘాల ప్రతినిధులు కోరుతున్నారు. మన్యంలో విజృంభిస్తున్న మలేరియా జ్వరాలు గతేడాది కంటే అధికంగా పెరుగుతున్న కేసులు మొక్కుబడిగా నియంత్రణ చర్యలు గత ఏడాది నుంచి పంపిణీ చేయని దోమ తెరలు జిల్లాలో మలేరియా సమసాత్మక గ్రామాలు – 153 బుట్టాయగూడెం, పోలవరం, జీలుగుమిల్లి మండలాల్లో – 117 వీలీన మండలాలైన కుక్కునూరు, వేలేరుపాగు మండలాల్లో – 36 గ్రామాలు -
వాణిజ్య ఒప్పందాలతో వ్యవసాయానికి తీవ్ర నష్టం
ఏలూరు (టూటౌన్): కేంద్రంలోని మోదీ ప్రభుత్వం చేసుకుంటున్న విదేశీ స్వేచ్ఛా వాణిజ్య ఒప్పందాలతో దేశ వ్యవసాయ రంగానికి తీవ్ర నష్టం జరుగుతున్నదని రైతు సంఘాలు, కార్మిక సంఘాల నాయకులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేశారు. ఆదివారం ఏలూరు అన్నే భవనంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల సమన్వయ జిల్లా కమిటీ, కార్మిక సంఘాల జిల్లా సమన్వయ కమిటీ సంయుక్త సమావేశం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా అధ్యక్షులు కట్టా భాస్కరరావు అధ్యక్షతన జరిగిన సమావేశంలో వక్తలు మాట్లాడుతూ ఈ నెల 13న సంయుక్త కిసాన్ మోర్చా, కేంద్ర కార్మిక సంఘాల సమన్వయ కమిటీ ఇచ్చిన పిలుపుమేరకు ఏలూరులో నిర్వహించే క్విట్ కార్పొరేట్స్ నిరసన కార్యక్రమాలను విజయవంతం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, కాంగ్రెస్ కిసాన్ సెల్ జిల్లా నాయకులు రాజనాల రామ్మోహనరావు, ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస డాంగే, జిల్లా నాయకులు పుప్పాల కన్నబాబు, ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి. రామకృష్ణ పాల్గొన్నారు. -
వాహనం అదుపుతప్పి వ్యక్తి మృతి
తణుకు అర్బన్: ద్విచక్ర వాహనం అదుపుతప్పి ప్రచార బోర్డును ఢీకొట్టిన ఘటనలో వ్యక్తి అక్కడికక్కడే మృతిచెందాడు. ఇరగవరం కాలనీ శివారు ప్రాంతంలో శనివారం అర్థరాత్రి జరిగిన ఈ ప్రమాదం జరిగిందని పోలీసులు తెలిపారు. తూర్పు గోదావరి జిల్లా ఉండ్రాజవరం మండలం పసలపూడి గ్రామానికి చెందిన కత్తుల చక్రధరరావు అలియాస్ చక్రి (32) ఉపాధి నిమిత్తం కొన్నేళ్లుగా కువైట్లో ఉంటూ 20 రోజుల క్రితం సొంతూరుకు వచ్చాడు. తూర్పు విప్పర్రులోని అత్తవారింటి నుంచి ద్విచక్ర వాహనంపై వెళ్తూ ఇరగరం రోడ్డులో వాహనం అదుపుతప్పి బోర్డును ఢీకొట్టగా తలకు తీవ్రగాయమై ఘటనా ప్రాంతంలోనే కన్నుమూశాడు. బంగారు ఆభరణాల చోరీ ఆకివీడు: ఇంట్లో దొంగలు చొరబడి తొమ్మిది తులాల బంగారు ఆభరణాలు దోచుకుపోయిన ఘటన కాకరపర్తి చెంచయ్య వీధిలో జరిగింది. ఈ నెల 7న ఉదయం ఇంటికి తాళం వేసి నర్సాపురంలో వివాహ వేడుకకు విశ్రాంతి ఉపాధ్యాయుడు పులవర్తి వెంకటేశ్వరరావు కుటుంబం వెళ్లింది. ఆదివారం తిరిగి వచ్చే సరికి తాళాలు బద్ధలుకొట్టి ఉండడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. రూరల్ సీఐ జగదీశ్వరరావు, సిబ్బంది సంఘటనా స్థలానికి వచ్చి దొంగతనం జరిగిన తీరును పరిశీలించారు. 9 తులాల బంగారం చోరీకి గురైనట్లు ఫిర్యాదు చేశారని ఏఎస్ఐ బీ.సత్యనారాయణ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తి మృతి తణుకు అర్బన్: తణుకు పైడిపర్రు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతంలో ఆర్టీసీ బస్సు కిందపడి తీవ్రగాయాలపాలైన తణుకు మండలం దువ్వ గ్రామానికి చెందిన యార్లగడ్డ రవి (50) శనివారం రాత్రి రాజమండ్రి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతిచెందారు. తణుకు కోర్టులో గుమస్తాగా విధులు నిర్వర్తిస్తున్న రవి ఈనెల 9వ తేదీన ఉదయం పైడిపర్రు ప్రాంతంలో ఏలూరుకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టిన ఘటనలో కాలు నుజ్జునుజ్జయ్యింది. రాజమండ్రి ప్రభుత్వ ఆస్పత్రిలో పంచానామా అనంతరం పోస్టు మార్టం నిర్వహించి కుటుంబసభ్యులకు మృతదేహాన్ని అప్పగించినట్లు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ తెలిపారు. జంగారెడ్డిగూడెంలో చోరీ జంగారెడ్డిగూడెం: పట్టణంలో గుండాబత్తుల వారి వీధిలో ప్రైవేటు ఆసుపత్రిలో నర్సుగా పనిచేస్తున్న డి.శిరీష ఇంట్లో చోరీ జరిగింది. ఈనెల 8న ఇంటికి తాళం వేసి స్వగ్రామమైన టి.నరసాపురం మండలం ప్రకాశ్నగర్ వెళ్లింది. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి ఇంటి తలుపులు పగలకొట్టి ఉన్నాయి. అల్మరాలో ఉంచిన బంగారం ఉగరం, రూ.3 వేల నగదు చోరీకి గురయ్యాయి. వృద్ధుడి ఆత్మహత్య ఏలూరు టౌన్: అనారోగ్యంతో బాధపడుతూ మనస్తాపానికి గురైన వృద్ధుడు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ రంగారావు కాలనీకి చెందిన పిల్లా తాతారావు (67) రెండేళ్ళుగా తీవ్ర అనారోగ్యంతో బాధపడుతున్నాడు. మనస్థాపానికి గురై శనివారం పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడు. కుటుంబ సభ్యులు అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు జీజీహెచ్కు తరలించారు. చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి విషమించి ఆదివారం మృతిచెందాడు. -
ఆటో డ్రైవర్ల ఆక్రందన
కూటమి ఏకపక్ష నిర్ణయం తమ ఉపాధిని దెబ్బతిసేలా ఉచిత బస్సు పథకం అమలుపై కూటమి ప్రభుత్వం ఏకపక్ష నిర్ణయం తీసుకుందని ఆటో యూనియన్ నాయకులు ఆందోళన చెందుతున్నారు. ఆటో యూనియన్లతో కనీసం చర్చించలేదని అంటున్నారు. ఆటోల ద్వారా ప్రభుత్వానికి పలురకాలుగా ఆదాయం వస్తుందని చెబుతున్నారు. డ్రైవర్లకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయం వంటి వాటిపై మాట్లాడకపోవడం దారుణమని వాపోతున్నారు. ఈ నేపథ్యంలో తమను ఆదుకోవాలని కోరుతూ జిల్లాలోని ఆటో కార్మికులు మంగళవారం కలెక్టర్కు వినతిపత్రం అందించడానికి సన్నద్ధమవుతున్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వం అ మలు చేయనున్న ఉచిత బస్సు (సీ్త్ర శక్తి) పథకంతో తాము ఉపాధి కోల్పోతామంటూ ఆటో డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పులు చేసి, ఫైనాన్స్లపై ఆటోలు కొనుగోలు చేసి జీవనం సాగిస్తున్నామని, ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక, ఆటోలు నడవక తాము బతికేదెలా అంటూ ఆవేదన చెందుతున్నారు. తమకు ప్రత్యామ్నాయ ఉపాధి, ఆర్థిక సాయంపై మాట్లాడకుండా ప్రభుత్వం ఏకపక్షంగా నిర్ణయం తీసుకోవడం తగదని అంటున్నారు. ఉచిత బస్సు పథకంతో ఆటో డ్రైవర్ల పరిస్థితి అగమ్యగోచరంగా మారనుంది. ఉమ్మడి పశ్చిమలో 20 నుంచి 60 ఏళ్ల వయసున్న సుమారు 47 వేల మంది కార్మికులు ఆటోలపై ఆధారపడి జీవనం సాగిస్తున్నారు. తమ పొట్ట కొట్టడానికి ఈ పథకాన్ని తీసుకువచ్చారని వీరు మండిపడుతున్నారు. ఇప్పటికే ఉచిత బస్సుపై పలు రూపాల్లో ఆందోళనలు తెలుపుతున్నారు. ఫైనాన్స్లో కొనుగోలు జిల్లాలో నడుస్తున్న 90 శాతం ఆటోలను డ్రైవర్లు ఫైనాన్స్లో కొనుగోలు చేశారు. ఆటో ధర రూ.4 లక్షల వరకు ఉండగా.. నెలకు రూ.10 వేల నుంచి రూ.15 వేలకు వాయిదా కడుతున్నారు. అలాగే నెలకు ఆటో నిర్వహణకు రూ.2 వేలు, మరమ్మతులకు రూ.3 వేలు మొత్తంగా రూ.15 వేల నుంచి రూ.20 వేల వరకు ఖర్చవుతుంది. వీటితో పాటు రవాణా శాఖ అధికారుల కేసులు, ఏడాదికి బ్రేక్, ఫిట్నెస్స్ కోసం ఖర్చులు అదనం. ఈ పరిస్థితుల్లో రోజుకు డీజిల్ ఖర్చులు కాకుండా వీటి కోసమే రూ.800కు పైగా వెచ్చించాల్సి వస్తుంది. ఈ నేపథ్యంలో ఉచిత బస్సుతో ప్రయాణికులు లేక ఆటోలు నడపకపోతే జీవ నం ఎలా సాగుతుందని డ్రైవర్లు ఆందోళన చెందుతున్నారు. అప్పు లు తీర్చలేక ఆత్మహత్యలే శరణ్యమని వాపోతున్నారు. మాకు న్యాయం చేయాలి ఇప్పటికే ఆటోలు పెరిగి డ్రైవర్లకు ఉపాధి అంతంతమాత్రంగా ఉంది. ఉచిత బస్సు తో పూర్తిగా ఉపాధి కోల్పో యి ఆటోలను ఫైనాన్స్ కంపెనీలకు అప్పగించాల్సిందే. డ్రైవర్లంతా ఆటోలు వదిలి కూలీ పనులకు వెళ్లి కుటుంబాన్ని పోషించుకోవాలి. ఆటో డ్రైవర్ల కుటుంబాలకు న్యాయం జరిగేలా చూడాలి. – డి.నరేష్, ఆటోడ్రైవర్, పొలమూరు చాలా ఆందోళనగా ఉంది ఉచిత బస్సుపై చాలా ఆందోళన చెందుతున్నాం. ఆటో లు ఎక్కేవారి సంఖ్య బాగా తగ్గిపోతుంది. ట్రిప్పులు లేక, ఆదాయం లేక కుటుంబా లను ఎలా పోషించుకోవాలో అర్థం కావడం లేదు. మాకు ప్రత్యామ్నాయ ఉపాధి లేదా మరేదైనా ఆదాయ మార్గం చూపించిన తర్వాత కూటమి ప్రభుత్వం ఉచిత బస్సు పథకాన్ని అమలు చేయాలని కోరుతున్నాం. – పి.జగన్, ఆటోడ్రైవర్, భీమవరం ఉపాధికి ఇబ్బందులు ఉచిత బస్సుతో ఆటో డ్రైవర్లకు ఇబ్బందులు తప్పవు. ఆటోలకు ఫైనాన్స్లు కట్టలేక, కు టుంబాలను పోషించుకోలేక అవస్థలు పడాల్సిన పరిస్థితి. కూటమి ప్రభుత్వం ఆటో కార్మికుల కష్టాలు గురించి ఆలోచన చేసి మాకు మేలు జరిగేలా నిర్ణయం తీసుకోవాలి తప్ప ఏకపక్షంగా ఉచిత బస్సు పథకాన్ని అమలుచేయడం తగదు. – సీహెచ్ రామకృష్ణ, ఆటోడ్రైవర్, వేండ్ర ప్రత్యామ్నాయం చూపాలి ఉచిత బస్సుకు మేం వ్యతిరేకం కాదు గానీ ఆటో కార్మికుల సమస్యలను దృష్టిలో పెట్టుకుని యూనియన్లతో చర్చించాల్సింది. ఆటో కార్మికులకు ప్రత్యామ్నాయ ఉపాధి చూపాలి. ఆటో కార్మికులను ఆదుకునేలా ప్రకటన చేయాలి. నెలనెలా ఆటో కార్మికులకు భృతి ఇవ్వాలి. చాలా మంది అప్పులు చేసి ఆటోలు కొన్నారు. వారందరినీ ఆదుకోవాలి. – ఇంటి సత్యనారాయణ, జిల్లా ఆటో యూనియన్ అధ్యక్షుడు మహిళా ప్రయాణికులే ఎక్కువ ఆటోలో 90 శాతం మహిళలే ప్రయాణిస్తారు. వారి ద్వారానే మేం ఉపాధి పొందుతున్నాం. ఇప్పుడు ఉచిత బస్సుతో ఆటోలు ఎక్కేవారు తగ్గిపోతే మా పరిస్థితి ఏంటి. కూలీ పనులకు, ఆక్వా పరిశ్రమలకు మహిళలను తీసుకువెళుతూ ఉపాధి పొందుతున్నా. ఉచిత బస్సుతో అప్పుల ఊబిలో కూరుకుపోవడం ఖాయం. – పి.గోపి, ఆటోడ్రైవర్, భీమవరం ఆటో.. భవిత ఎటో ఉచిత బస్సుతో ఉపాధికి ముప్పు ఫైనాన్స్లపై 90 శాతానికి పైగా ఆటోల కొనుగోలు నెలనెలా వాయిదాలతో ఇప్పటికే ఇబ్బందులు ప్రత్యామ్నాయ ఉపాధికి డ్రైవర్ల డిమాండ్ కూటమి ప్రభుత్వ ఏకపక్ష నిర్ణయంతో కష్టకాలం ఉమ్మడి జిల్లాలో 40 వేల మంది డ్రైవర్లు40 వేల ఆటోలు.. 47 వేల మంది కార్మికులు ఉమ్మడి పశ్చిమలో సుమారు 40 వేల ఆటోలు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో 24 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 16 వేల వరకు ఆటోలు ఉండగా మొత్తంగా 40 వేల ఆటో డ్రైవర్ల కుటుంబాలు ఆధారపడి ఉన్నాయి. వీరితో పాటు ఆటో మెకానిక్, సీటు వర్క్, స్పేర్ పార్ట్స్ విక్రయదారుల కుటుంబాలు మరో 7 వేల వరకు ఉంటాయి. ప్రభుత్వం మహిళలకు ఉచిత బస్సు తీసుకురావడం ద్వారా ఆటోలు నడపటం కష్టం కాగా ఉపాధి లేక సుమారు 47 వేల కుటుంబాలకు ఇబ్బందులు తలెత్తవచ్చు. -
13న మాజీ సీఎం జగన్ రాక
భీమవరం : ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పు ప్పాల వాసుబాబు కుమార్తె వివాహ వేడుకకు ఈనెల 13న మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం రానున్నారు. ఆదివారం హెలీప్యాడ్ ప్రాంతాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు పరిశీలించారు. భీమవరం శివారు వీఎస్ఎస్ గార్డెన్స్లో వివాహ వేడుక జరుగనున్నందున సమీపంలో హెలీప్యాడ్ ఏర్పాటుకు అనుకూల పరిస్థితులను పరిశీలించారు. ఆయన వెంట వాసుబాబు, వైఎస్సార్సీపీ భీమవరం ని యోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, డీసీఎంఎస్ మాజీ చైర్మన్ వేండ్ర వెంకటస్వామి, భీమవరం పట్టణ అధ్యక్షుడు గా దిరాజు రామరాజు తదితరులు ఉన్నారు. టోల్గేట్ క్రాంటాక్టర్కు నోటీసులు ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన టోల్గేట్ నిర్వహిస్తున్న కాంట్రాక్టర్కు దేవస్థానం ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి ఆదివారం నోటీసు జారీ చేశారు. బైక్లు, మోపెడ్లకు రూ.10ల రుసుం వసూలు చేయాల్సి ఉండగా రూ.20లు వ సూలు చేస్తున్నారు. దీనిపై ఆదివారం ‘సాక్షి’లో ‘శ్రీవారి కొండపై టోల్ బాదుడు’ శీర్షికన కథనం ప్రచురించగా ఈఓ స్పందించారు. మూడు రోజుల్లోపు సంజాయిషీ ఇవ్వాలని కాంట్రాక్టర్కు నోటీసు ఇచ్చారు. పవిత్రోత్సవం.. పరిపూర్ణంద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో నా లుగు రోజులపాటు జరిగిన శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు ఆదివారం ముగిశాయి. ఉదయం ఆలయంలో పవిత్రావరోహణ, శ్రీ మహా పూ ర్ణాహుతి హోమం అనంతరం మహదాశీర్వచనాన్ని అర్చకులు, పండితులు వైభవంగా నిర్వహించారు. శ్రీవారి ములవిరాట్, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లు, ఉత్సవమూర్తులపై ఉంచిన దివ్య పవిత్రాలను అర్చకులు వేద మంత్రోచ్ఛరణల నడుమ తొలగించారు. అనంతరం వి విధ దినుసులతో మహాపూర్ణాహుతి హోమాన్ని జరిపించారు. పవిత్రోత్సవాలను పురస్కరించుకుని నాలుగు రోజులుగా ఆలయంలో నిలిపివేసిన నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను సోమవారం నుంచి పునరుద్ధరిస్తామని ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. సాయం చేసేలా.. సేవాభావం పెంచేలా.. ఏలూరులో కైండ్నెస్ వాల్ అల్మారా ఏర్పాటు ఏలూరు టౌన్ : సమాజంలో ప్రతిఒక్కరూ ఎదుటి వ్యక్తిపై బాధ్యత, అభిమానం చాటాలే వ్యవహరించాలనే లక్ష్యంతో... తోటి వారికి సహాయం చేయాలనే సంకల్పాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లే ఉద్దేశంతో జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వినూత్న విధానానికి శ్రీకా రం చుట్టారు. ఏలూరు అమీనాపేట పోలీస్ వెల్ఫేర్ పెట్రోల్ బంక్ వద్ద నూతనంగా కై ండ్ నెస్ వాల్ పేరుతో ప్రత్యేక అల్మారా ఏర్పాటుచేశారు. ఇంట్లో ఉపయోగం లేని, వినియోగించని వస్తువులు, బట్టలు, బొమ్మలు, ఎలక్ట్రానిక్ వస్తువులు ఇలా ఏమైనా ఈ అల్మారాలో పెట్టవచ్చు. వీటిలో ఏదైనా ఉపయోగపడుతుందని భావిస్తే అవసరమైన వారు ఉచితంగా తీసుకువెళ్లవచ్చు. జిల్లా ఎస్పీ శివకిషోర్, జా యింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి సంయుక్తంగా ఇప్పటికే టేక్ ఏ బుక్.. గివ్ ఏ బుక్ అనే పేరుతో పుస్తకాల మార్పిడి విధానానికి నాంది పలికా రు. తాజాగా కై ండ్నెస్ వాల్ అల్మారాను ఏ ర్పాటుచేసి సేవా దృక్పథాన్ని చాటారు. పోలీస్ పెట్రోల్ బంక్లోని కై ండ్నెస్ వాల్ అల్మారాలో నుంచి కొందరు బాలలు తమకు నచ్చిన బట్ట లు, బొమ్మలు తీసుకువెళుతూ సంతోషాన్ని వ్యక్తం చేస్తున్నారు. -
సుందరగిరి.. ఆధ్యాత్మిక ఝరి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్ర దత్తత ఆలయం ఐఎస్ జగన్నాథపురంలో సుమనోహర సుందరిగిరిపై శ్రీ లక్ష్మీ నరసింహస్వామి సన్నిధిలో తొలిసారిగా దివ్య పవిత్రోత్సవాలు నిర్వహించాలని అధికారులు నిర్ణయించారు. ఈనెల 19 నుంచి మూడు రోజులపాటు ఉత్సవాలు జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం పవిత్రోత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలు స్వామివారి వైభవాన్ని చాటనున్నాయి. పురాణ ప్రాశస్త్యం గల ఈ ఆలయాన్ని దర్శిస్తే కో రిన కోర్కెలు తీరి, సకల శుభాలు కలుగుతాయ న్నది భక్తుల నమ్మకం. ఏకాదశి, పర్వదినాల్లో వేలాదిగా భక్తులు స్వామిని దర్శిస్తున్నారు. చినవెంకన్న దేవస్థానం ఏటా స్వామివారి దివ్య కల్యాణోత్సవాలను నిర్వహిస్తోంది. ఏటా శివరాత్రి నాడు హైదరాబాద్కు చెందిన కొచ్చెర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ మహాయజ్ఞాన్ని నిర్వహిస్తూ స్వామివారి కీర్తిని చాటుతున్నారు. పవిత్సోవాలు ఇలా.. ● 19న ఉదయం నుంచి గణపతి పూజ, పుణ్యాహవచనం, హోమాలు వంటి పూజాదికాలు నిర్వహిస్తారు. సాయంత్రం అంకురార్పణ, మూలమంత్ర హోమాలు, బలిహరణ, శేషవాహన సేవ లు జరుగనున్నాయి. ● 20న మండప పూజలు, నిత్య హోమాలు, బలిహరణ, అభిషేకాలు, పవిత్రారోపణ, గరుడ వాహన సేవలు జరుగుతాయి. ● 21న మహాశాంతి పౌష్ఠిక హోమాలు, మహా పూర్ణాహుతి, పవిత్ర విసర్జన, శాంతి కల్యాణం, ఆశీర్వచనంతో ఉత్సవాలు పరిసమాప్తమవు తాయి. మతంగి మహర్షి తపోఫలంతో.. మతంగి మహర్షి తపోఫలంతో సుందరగిపై నారసింహుడు స్వయంభూగా శాలిగ్రామ రూపంలో వెలిసినట్టు పురాణాలు చెబుతున్నాయి. ఇప్పటికీ మతంగి మహర్షి సర్ప రూపంలో స్వామి వారిని నిత్యం సేవిస్తారని ప్రసిద్ధి. ఆలయం వెనుక ఎన్నో ఏళ్లుగా చెక్కు చెదరకుండా ఉన్న పుట్టే ఇందుకు సాక్ష్యమని పండితులు చెబుతున్నారు. దాదాపు వందేళ్ల క్రితం ఠాణేదారు అయిన ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చర్లకోట రామారావు, జంగారెడ్డిగూడెం మండలం లక్కవరానికి చెందిన గూడూరు అయ్యన్న, బెల్లన్న అరణ్య ప్రాంతమైన ఈ మార్గం మీదుగా వెళుతుండగా కొండపై సాలిగ్రామ రూపంలో ఉన్న స్వామిని గుర్తించి పాల పొంగలి చేసి నివేదించారు. ఇలా నారసింహుని ఉనికి తెలిసింది. తొలిసారిగా నారసింహుని పవిత్రోత్సవాలు ఐఎస్ జగన్నాథపురంలో 19 నుంచి వేడుకలు -
గిరిజనుల అభివృద్ధికి జగన్ కృషి
బుట్టాయగూడెం: అభివృద్ధికి ఆమడ దూరంలో ఉన్న ఆదివాసీ గిరిజనుల అభివృద్ధికి దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖరరెడ్డి కృషి చేశారని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెం శివారు డిగ్రీ కళాశాల నిర్మాణ భవనం వద్ద జాతీయ ఆదివాసీ ఐక్యవేదిక ఆధ్వర్యంలో ప్ర పంచ ఆదివాసీ దినోత్సవాన్ని నిర్వహించారు. ము ఖ్య అతిథిగా బాలరాజు మాట్లాడుతూ వైఎస్సార్ మరణానంతరం ఆయన తనయుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి కూడా గిరిజనుల అభివృద్ధికి ఎనలేని కృషిచేశారన్నారు. నాడు– నేడు పథకంలో పాఠశాలల రూపురేఖలు మార్చడంతో విద్యాభివృద్ధికి పాటుపడ్డారన్నారు. సాలూరులో యూని వర్సిటీని, కురుపాంలో ఆదివాసీ గిరిజనుల కోసం ఇంజనీరింగ్ కాలేజీని, పాడేరులో మెడికల్ కాలేజీని ఏర్పాటు చేశారన్నారు. ప్రతి ఐటీడీఏ పరిధిలో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణం చేపట్టారన్నారు. జాతీయ ఆదివాసీ ఐక్య వేదిక ప్రతినిధులు మడివి రాజులు, మడివి వెంకటేశ్వర్లు గుండి బుచ్చిరాజు, కుర్సం నిరీక్షణరావు, కోర్సా చిన్నరాజులు, తెల్లం రాజు తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు -
16న ప్రైవేట్ పాఠశాలల సమస్యలపై చర్చ
ఏలూరు (ఆర్ఆర్పేట): చీరాలలో ఈనెల 16న జరిగే అపుస్మా (ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ అన్ ఎయిడెడ్ స్కూల్ మేనేజ్మెంట్స్ అసోసియేషన్) రాష్ట్ర కార్యవర్గ సమావేశంలో ప్రైవేట్ పాఠశా లల యాజమాన్యాల సమస్యలపై చర్చిస్తా మని అపుస్మా రాష్ట్ర అధ్యక్షుడు కె.తులసీ ప్ర సాద్ తెలిపారు. ఆదివారం స్థానిక శ్రీశ్రీ పా ఠశాలలో నిర్వహించిన జిల్లా కార్యనిర్వాహక కమిటీ సమావేశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వి ద్యాహక్కు చట్టం ప్రకారం అడ్మిషన్ పొందిన వారికి ప్రభుత్వం కొత్త బ్యాంకు ఖాతాలు ఓపెన్ చేసుకోమనడం సరికాదదన్నారు. స్టార్ రేటింగ్ ప్రకారం కేవలం రూ.8 వేలు ఫీజులుగా ఇస్తామంటున్నారని, తల్లికి వందనం ఉచిత విద్యలో భాగమే కాబట్టి విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రవేశాలు పొందిన వారికి కనీసం రూ.13 వేలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర అదనపు ప్ర ధాన కార్యదర్శి ఎంబీఎస్ శర్మ మాట్లాడుతూ యాప్లు, బోధనేతర పనులను ఉపాధ్యాయులకు కేటాయించడం, ట్రాన్స్పోర్ట్, గ్రీన్ టాక్స్ వంటి సమస్యలపై చర్చించి ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతామన్నారు. అపుస్మా రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జంగా బాలాజీ, జిల్లా అధ్యక్షుడు ఎం.శివకుమార్ శర్మ, కార్యదర్శి ఎన్ఆర్కేఏ ప్రసాద్, కోశాధికారి కె.రామకృష్ణ, వివిధ జోన్ల అధ్యక్షులు పాల్గొన్నారు. -
అయ్యవార్లపై మూల్యాంకన భారం
నిడమర్రు: కూటమి ప్రభుత్వం సంస్కరణల పేరుతో విద్యావ్యవస్థలో తీసుకువస్తున్న పరీక్షల విధానాన్ని చూసి ఉపాధ్యాయులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా సోమవారం నుంచి జరిగే సెల్ఫ్ అసెస్మెంట్ (ఎఫ్ఏ–1) పరీక్షలు అటు విద్యార్థికి, ఇటు ఉపాధ్యాయులకు పరీక్షే అంటూ విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. పాఠశాలలకు అందించిన మూల్యాంకన పుస్తకాలతో మరో బోధనేతర పనికి సిద్ధమవ్వాలని ఉపాధ్యాయులు ఆవేదన చెందుతున్నారు. పొందుపరిచి.. స్కాన్ చేసి.. ఈ విద్యా సంవత్సరంలో నిర్వహించే ఎఫ్ఏ, ఎస్ఏ పరీక్షల మొ త్తం సమాచారాన్ని విద్యాశాఖ అందించిన మూల్యాంకన పుస్తకంలో ఉపాధ్యాయులు పొందుపరచాలి. అలాగే విద్యార్థుల సా మర్థ్యాలకు సంబంధించిన 15 మార్కుల అంశాలను ఉపాధ్యాయుడే స్వయంగా నమోదుచేయాలి. ఆయా సబ్జెక్టుల్లో ఆయా సామర్థ్యంలో ఎందుకు మార్కులు తక్కువ వచ్చాయి.. ఎక్కువ వస్తే ఎలా గుర్తించావు.. అనే విషయం వివరంగా రాయల్సి ఉంటుంది. అనంతరం వాటిని స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేయాలి. ఇప్పటికే పెరుగుతున్న బోధనేతర పనులకు తరగతికి దూరమవుతున్న ఉపాధ్యాయులు ప్రభుత్వం తాజాగా మూల్యాంకన భారం మోపడంపై తలలు పట్టుకుంటున్నారు. ఉరుకులు.. పరుగులు మూల్యాంకన పుస్తకాలు ఆటోలో తెచ్చుకోవడం, బ్యాలెన్స్ పుస్తకాల కోసం ఎంఈఓ కార్యాలయాల చుట్టూ తిరగడం, మూ ల్యాంకన పుస్తకాల్లో విద్యార్థుల ప్రతిస్పందనలు రాయడం ఒక ఎత్తయితే.. విద్యార్థులతో ఓఎంఆర్ షీట్లో జవాబులు రాయించడం మరో ఎత్తు. 1వ తరగతి విద్యార్థి కూడా ఓఎంఆర్ షీట్స్లోనే పరీక్షలు రాయడం ఆ ఉపాధ్యాయులకు పరీక్షే. అలాగే మొత్తం అంశాలు, ఓఎంఆర్ షీట్స్ను స్కాన్ చేసి యాప్లో అప్లోడ్ చేయడం, ఆన్లైన్లో మార్కులు నమోదు చేయడం వంటి పనులకే సమయం సరిపోతుందని టీచర్లు ఆవేదన చెందుతున్నారు. గురువులకే పరీక్ష ! ప్రభుత్వ ఉపాధ్యాయులకు బోధనేతర పనులు ప్రతి తరగతి, సబ్జెక్టుకు మూల్యాంకన పుస్తకాల పంపిణీ ఆ పుస్తకాల స్కానింగ్తో సమయం వృథా నేటి నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు ఉపాధ్యాయ సంఘాల నేతల ఆందోళన బోధనేతర భారం పెరిగి.. మూల్యాంకన పుస్తకాలతో ఉపాధ్యాయులకు బోధనేతర భారం మరింత పెరుగుతుంది. విద్యార్థి ప్రతిస్పందనలతో పాటు ఓఎంఆర్ షీట్లో కోడ్లు, అపార్ ఐడీలు, పెన్ ఐడీలను తప్పులు లేకుండా రాసేలా చూడటం, జవాబులను దిద్దిన తర్వాత స్కోరింగ్ ఇవ్వడం, దీనికి వివరణ రాయడంతో పాటు పేజీలన్నింటినీ స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. వీటి కోసం అవుట్ సోర్సింగ్లో డేటా ఎంట్రీ ఆపరేటర్స్ను నియమించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం. – లంకలపల్లి సాయిశ్రీనివాస్, స్టేట్ ఫ్యాప్టో చైర్మన్ సమయం హరిస్తుంది సంస్కరణలు విద్యార్థులకు మేలు చేయాలే తప్ప కీడు కాదు. మూల్యాంకన పుస్తకం వి ధానంతో ఉపాధ్యాయు లకు అదనపు భారం తప్ప విద్యార్థులకు ప్రయోజనం కనిపించడం లేదు. కొత్త విధానంలో తరగతి గదిలోనే విద్యార్థుల ప్రతిస్పందనలు పరిశీలించి మూల్యాంకన పుస్తకంలో నమోదు చేయాల్సి ఉంటుంది. ఉన్నత పాఠశాలల్లో పదుల సంఖ్యలో వి ద్యార్థులు ఉంటారు. దీంతో బోధనా కాలం హరిస్తుంది. దీంతో విద్యా ప్రమాణాలు తగ్గే ప్రమాదముంది. – బొర్రా గోపీ మూర్తి, టీచర్స్ ఎమ్మెల్సీశిక్షణ లేదు.. స్పష్టత లేదు మూల్యాంకనంలో మార్పులపై ఉపాధ్యాయులకు ఎలాంటి శిక్షణ ఇవ్వకుండా ఎఫ్ఏ–1 పరీక్షలకు విద్యాశాఖ సిద్ధం చేసింది. దీంతో వాట్సాప్లో వస్తున్న సమాచారం ఆధారంగానే పరీక్షలు నిర్వహించేందుకు ఉపాధ్యాయులు సిద్ధమవుతున్నారు. అకడమిక్ క్యాలెండర్ ప్రకారం ఈనెల 4 నుంచి ఎఫ్ఏ–1 పరీక్షలు నిర్వహించాల్సి ఉండగా మూల్యాంకన పుస్తకాలు మండలాలకు అందకపోవడంతో వాయిదా వేశారు. అయితే ఈ పుస్తకాలను ఎలా నిర్వహించాలి, ఏఏ అంశాలు పూరించాలనే విషయాలపై కేవలం వాట్సాప్లో వస్తున్న మెసేజ్లే తప్ప ఏ అధికారి సమగ్రంగా వివరించే అవకాశం లేకుండానే పరీక్షలు ప్రారంభించడాన్ని ఉపాధ్యాయులు తప్పుపడుతున్నారు. -
మున్సిపల్ సిబ్బంది టూల్స్ డౌన్
ఏలూరు(టూటౌన్): క్విట్ ఇండియా దినోత్సవం సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వం మున్సిపల్ కార్మికుల సమస్యల పరిరక్షణలో వహిస్తున్న నిర్లక్ష్య విధానాలకు వ్యతిరేకంగా ఏలూరులో శనివారం నాడు కార్పొరేషన్లో పనిచేస్తున్న ఇంజినీరింగ్ సెక్షన్ ఉద్యోగ సిబ్బంది టూల్స్ డౌన్ కార్యక్రమాన్ని ఏఐటీయూసీ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఏఐటీయూసీ జిల్లా అధ్యక్షులు రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు, ఏలూరు ఏరియా కార్యదర్శి ఏ అప్పలరాజు మాట్లాడుతూ అధికారంలోకి వచ్చి సంవత్సరం పూర్తయినా హామీలు అమలు చేయలేదని ఆరోపించారు. కాంట్రాక్ట్ అవుట్సోర్సింగ్, ఎన్ఎంఆర్లను తక్షణమే పర్మినెంట్ చేయాలని డిమాండ్ చేశారు. సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని, జీవో 36 ప్రకారం వేతనాలు చెల్లించాలని వారు ప్రభుత్వాన్ని కోరారు. 11వ పీఆర్సీలో పెండింగ్ బకాయిలను చెల్లించాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆక్రమణపై చర్యలు తీసుకోవాలి ఏలూరు (టూటౌన్): తమ్మిలేరు భూములను ఆక్రమించుకుంటున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ్ణ డిమాండ్ చేశారు. స్థానిక పవరుపేటలోని సంఘ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడుతూ.. తమ్ములేరు భూములు అన్యాక్రాంతమవుతున్నా ఇరిగేషన్ అధికారులు పట్టించుకోవడంలేదని ఆరోపించారు. శనివారం ఏలూరు రూరల్ మండలం చోదిమెళ్ళలో ఎఫ్సీఐ గోడౌన్స్ వద్ద తమ్మిలేరు భూమిని కొంతమంది ఇనుప కంచెలు వేసి దున్ని ఆక్రమించుకున్నారన్నారు. వారి నుంచి భూమిని స్వాధీనం చేసుకొని పేదలకు పంచాలని డిమాండ్ చేశారు. -
ధరల సెగ.. సర్కారు దగా
రూ.1.94 కోట్ల గౌరవ వేతనం బకాయి ఆదివారం శ్రీ 10 శ్రీ ఆగస్టు శ్రీ 2025ఏలూరు (ఆర్ఆర్పేట): కూటమి ప్రభుత్వ హయాంలో ధరలు చుక్కలు చూపెడుతున్నా విద్యార్థుల ఆకలి తీర్చడమే లక్ష్యంగా పని చేస్తున్న మధ్యాహ్న భోజన నిర్వహకులు, హెల్పర్లు వంటలు మానలేదు. కూరగాయల ధరలు రెట్టింపైనా అందుకు సంబంధించిన ధరలను మాత్రం ప్రభుత్వం పెంచకుండా పాత ధరలే ఇప్పటికీ చెల్లిస్తోంది. ధరలు పెంచుతామని ప్రకటించినా దానిని అమలు చేయడంలో మాత్రం మీన మేషాలు లెక్కిస్తోంది. దీనితో నిర్వాహకులు, హెల్పర్లకు ఆర్థిక భారం పెరిగి విద్యార్థులకు భోజనం పెట్టడానికి అప్పుల పాలవుతున్నారు. విద్యార్థులకు మధ్యాహ్న భోజనం కోసం ప్రభుత్వం విద్యార్థికి ఇంత అని ధరను నిర్ధేశించింది. ఆ ధరకే వండి పెట్టాలి. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నిర్ధేశించిన ధరలనే కూటమి ప్రభుత్వం ఇప్పటికీ అమలు చేస్తోంది. ప్రస్తుతం ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, అల్లం ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. టమాటాలు, వంకాయలు, బెండకాయలు వంటి కూరగాయల ధరలు సైతం అదే బాటలో పయనిస్తున్నాయి. ధరలు నిర్ణయించే సమయానికి కిలో రూ.18 ఉన్న ఉల్లిపాయలు ప్రస్తుతం రూ.25, కిలో రూ.16 ఉన్న పచ్చిమిర్చి ఇప్పుడు రూ.50, కిలో రూ.12 ఉన్న టమాటాలు ఇప్పుడు రూ. 48 ఇలా చెప్పుకుంటూ పోతే ప్రతీ కూరగాయ ధర రెట్టింపైంది. జూనియర్ కళాశాలలకు బిల్లులపై మౌనం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత జూనియర్ కళాశాలల విద్యార్థులకు మధ్యాహ్న భోజన పథకం అమలు చేస్తోంది. ఈ మేరకు జిల్లాలో 19 జూనియర్ కళాశాలలకు చెందిన 3,860 మంది విద్యార్థులు, 26 హైస్కూల్ ప్లస్కు చెందిన 586 మంది విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఇంటర్ చదివే విద్యార్థులకు గత జనవరి 4 నుంచి కూటమి ప్రభుత్వం మధ్యాహ్న భోజన పథకాన్ని అమలు చేస్తుండగా అప్పటి నుంచి ఇంత వరకూ వారికి చెల్లించాల్సిన మొత్తంలో ఒక్క రూపాయి కూడా కూటమి ప్రభుత్వం చెల్లించలేదు. జనవరి నుంచి పరీక్షలు జరిగే వరకూ మూడు నెలలు, కళాశాలలు పునఃప్రారంభించిన నాటి నుంచి ఇప్పటి వరకూ మరో మూడు నెలలు వెరసి ఆరు నెలలకు సంబంధించిన బకాయిలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. అధికారిక గణాంకాల ప్రకారం రోజుకు 4,446 మంది కళాశాల విద్యార్థులు మధ్యాహ్న భోజనం తింటున్నారు. ఒక్కొక్క విద్యార్థికి రూ.8.57 చొప్పున రోజుకు రూ.38,102 చెల్లించాలి. ఈ లెక్కన ఇంత వరకూ మొత్తం 132 పని దినాలకు రూ.50.29 లక్షలు ప్రభుత్వం మధ్యాహ్న భోజన కార్మికులకు బకాయిపడింది. న్యూస్రీల్బకాయిలు మొత్తం వెంటనే చెల్లించాలి జిల్లాలో పేద కుటుంబాలకు చెందిన వారే మధ్యాహ్న భోజన కుక్లు, హెల్పర్లుగా పని చేస్తున్నారు. ప్రభుత్వం వారికి ఇవ్వాల్సిన బకాయిలను విడుదల చేయకపోవడంతో అప్పులపాలవుతున్నారు. ప్రభుత్వం బకాయి ఉన్న ఇంటర్మీడియట్ విద్యార్థులకు సంబంధించిన రూ. 50.29 లక్షలు, గౌరవ వేతనం బకాయిలు రూ.1.94 కోట్లు వెంటనే చెల్లించాలి. ప్రభుత్వం పెంచుతామని ప్రకటించిన భోజనం తయారీ ధరను లక్షణమే పెంచి అమలు చేయాలి. – మొడియం నాగమణి, మధ్యాహ్న భోజన వర్కర్స్ యూనియన్ జిల్లా కార్యదర్శి మధ్యాహ్న భోజనం కుక్ అండ్ హెల్పర్లకు రెండు నెలల వేతనం బకాయి రెట్టింపైన కూరగాయల ధరలతో అవస్థలు జనవరి నుంచి జూనియర్ కళాశాలల బిల్లులకు మొండిచేయి కూరగాయల ధరలు పెరిగినా, ప్రభుత్వం భోజన తయారీ ధర పెంచకపోయినా విద్యార్థులను పస్తులు పెట్టడం ఇష్టం లేక నిర్వాహకులు వండి వడ్డిస్తున్నారు. ప్రభుత్వం వారిపై కనికరం చూపడం లేదు. గౌరవ వేతనం కూడా చెల్లించకుండా ఇబ్బందులకు గురి చేస్తోంది. ఈ మేరకు జిల్లా వ్యాప్తంగా మొత్తం 3,232 మంది కుక్లు, హెల్పర్లు పని చేస్తున్నారు. జిల్లా మొత్తం కుక్లు, హెల్పర్లకు రూ.96.96 లక్షలు చెల్లించాలి. గత రెండు నెలలుగా రూ.1.94 కోట్లు చెల్లించాల్సి ఉన్నా.. చెల్లించలేక ప్రభుత్వం చేతులెత్తేసింది. జిల్లాలో మొత్తం 1749 పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలు జరుగుతుండగా 1,06,021 మంది మధ్యాహ్న భోజనం తింటున్నారు. 1 నుంచి 5వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు రూ. 5.88 చొప్పున, 6 నుంచి 10 వరకూ రూ. 8.57 చొప్పున చెల్లిస్తోంది. ప్రభుత్వం ఇటీవల భోజనం తయారీ నిమిత్తం చెల్లించే ధరను 1 నుంచి 5వ తరగతి వరకూ చదివే విద్యార్థులకు 59 పైసలు, 6 నుంచి 10వ తరగతి చదివే విద్యార్థులకు 88 పైసలు పెంచుతామని ప్రకటించింది. అది ప్రకటనకే పరిమితమై అమలుకు మాత్రం నోచుకోలేదు. -
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
వాహన తనిఖీల్లో ముగ్గురు యువకులు గంజాయి రవాణా చేస్తుండగా కై కలూరు రూరల్ పోలీసులు పట్టుకుని 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. 8లో uగిరిజన చట్టాల పరిరక్షణకు కృషి చేయాలి బుట్టాయగూడెం: గిరిజన చట్టాలు, రాజ్యాంగ హక్కుల పరిరక్షణకు కూటమి ప్రభుత్వం కృషి చేయాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని తూర్పు పాలకుంట వద్ద సర్పంచ్ బన్నె బుచ్చిరాజు ఆధ్వర్యంలో జరిగిన ఆదివాసీ దినోత్సవ వేడుకల్లో ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆదివాసీ జెండాను ఎగురవేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఆదివాసీ గిరిజనుల ఆచారాలు, సాంప్రదాయాలు, సంస్కృతి, భాష, యాస కట్టుబాట్లను కాపాడుకోవాల్సిన బాధ్యత అందరిపై ఉందన్నారు. ప్రపంచం ఆధునికత వైపు పరుగులు పెడుతుంటే గిరిజనులు మాత్రం వెనకకు నెట్టబడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి నాడు గిరిజనాభివృద్ధికి పెద్ద పీట వేసారన్నారు. ఆదివాసీ దినోత్సవానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధిక ప్రాధాన్యత ఇచ్చిందని అన్నారు. గిరిజనుల అభివృద్ధి కోసం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎనలేని కృషి చేశారని చెప్పారు. పోడు చేసుకుంటున్న సుమారు 2 లక్షల మంది గిరిజనులకు పోడు భూములకు పట్టాలివ్వడమే కాకుండా రైతు భరోసా పథకంలో పెట్టుబడి సాయం కూడా అందించారని అన్నారు. గ్రామస్థులతో పాటు బాలరాజు గిరిజన సాంప్రదాయ నృత్యాలు చేశారు. సర్పంచ్ కుంజా వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, సర్పంచ్లు తెల్లం వెంకాయమ్మ, మాల్చి వెంకన్నబాబు, పొడియం లక్ష్మి, నాయకులు బన్నే చంద్రకళ, తెల్లం దేవరాజు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి క్షేత్రంలో డ్రోన్ కలకలం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయ ప్రధాన రాజగోపురంపై శనివారం రాత్రి డ్రోన్ ఎగరడంతో కలకలం రేగింది. ఆలయ భద్రతలో భాగంగా దేవాలయంపై డ్రోన్ ఎగరడాన్ని అధికారులు నిషేధించారు. క్షేత్రంలో వివాహాలు జరుగుతున్న నేపథ్యంలో ఒక డ్రోన్ ఆలయ ప్రధాన రాజగోపురంపై చక్కర్లు కొట్టింది. దాంతో అప్రమత్తమైన దేవస్థానం సెక్యురిటీ సిబ్బంది డ్రోన్ ఎగరవేస్తున్న వ్యక్తిని పట్టుకుని, అతడితో పాటు డ్రోన్ను స్థానిక పోలీస్టేషన్లో అప్పగించారు.బిల్లులు సమర్పించడానికి గడువు పొడిగించాలి ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయుల పొజిషన్ ఐడీలు ఇంకా కొంతమందికి రావలసి ఉన్నందున జీతాల బిల్లులు సమర్పించడానికి ఈ నెల15 వరకు గడువు పెంచాలని ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు తాళ్ళూరి రామారావు కోరారు. శనివారం ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా శాఖ సబ్ కమిటీ సమావేశం స్థానిక ఇఫ్టూ కార్యాలయంలో జరిగింది. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి బీ రెడ్డి దొర మాట్లాడుతూ ప్రభుత్వం ఇటీవల పంపిణీ చేసిన మూల్యాంకన పుస్తకాల వల్ల విద్యార్థికి ఎలాంటి అదనపు ప్రయోజనం లేకపోగా ఉపాధ్యాయులకు అనవసర పనిభారం పెరిగి బోధనా సమయాన్ని హరించి వేసేవిగా ఉన్నాయన్నారు. ఉపాధ్యక్షుడు బీ.శ్యాంసుందర్ మాట్లాడుతూ ఇంతవరకు పీఆర్సీ కమిషన్ నియమించకపోవడం, ఐఆర్ కూడా ప్రకటించకపోవడం బాధాకరమని, వెంటనే పెండింగ్లో ఉన్న మూడు డీఏలను ప్రకటించాలన్నారు. ఎంఈఓ 1, 2 పోస్టులను ఉమ్మడి సీనియారిటీ ఆధారంగా ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యక్షుడు ఎస్.దొరబాబు, ఆడిట్ కమిటీ సభ్యులు ఎస్కే.రంగావలి, కై కలూరు నాయకులు వీ శ్రీనివాస్, ఉపాధ్యక్షుడు కే కుటుంబరావు తదితరులు పాల్గొన్నారు. ఆరోగ్య సహాయకులను నియమించాలి భీమవరం: రాష్ట్రంలో వైద్య ఆరోగ్య శాఖలో ఉద్యోగాల నుంచి తొలగించిన ఆరోగ్య సహాయకులను పునర్నియామకం చేయాలని పారా మెడికల్ కాంట్రాక్టు ఉద్యోగుల సంఘం రాష్ట్ర కన్వీనర్ జీవీవీ ప్రసాద్ కోరారు. గత డిసెంబర్ 5న అధికారులు హడావుడిగా తొలగించిన రాష్ట్రంలోని 920 మంది ఆరోగ్య సహాయకుల కుటుంబాలు దుర్భర పరిస్థితిని అనుభవిస్తున్నారని చెప్పారు. ఆరోగ్య సహాయకులుగా ఉద్యోగాలు చేస్తూ వాటిని కోల్పోయిన వారంతా యాభై ఏళ్ళు వయస్సు పైబడ్డ వారేనని ఇలాంటి తరుణంలో ఉద్యోగాలు తొలగిస్తే వారి కుటుంబాల పరిస్థితి ఏంటనేది ప్రజాప్రతినిధులు గుర్తించాలన్నారు. ముఖ్యమంత్రి స్వయంగా కలుగజేసుకుని సుప్రీంకోర్టు ఇటీవల ఇచ్చిన ఆదేశాలకు అనుగుణంగా రాష్ట్రంలో ఆరోగ్యసహాయకుల ఖాళీల వివరాలను ప్రభుత్వం కోర్టుకు సమర్పించడమేగాకుండా మెరిట్ ఆధారంగా అందరినీ తిరిగి తీసుకోవాలని డిమాండ్ చేశారు. పారా అథ్లెటిక్స్లో ప్రతిభ ద్వారకాతిరుమల: విశాఖ పోలీస్ బ్యారక్స్ గ్రౌండ్లో శనివారం జరిగిన రాష్ట్రస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీల్లో ద్వారకాతిరుమల మండలం రాజా పంగిడిగూడెం గ్రామానికి చెందిన యువకుడు కస్సే పవన్కుమార్ సత్తా చాటాడు. 100 మీటర్లు, 200 మీటర్ల పరుగు, 6 అడుగుల లాంగ్ జంప్లో స్వర్ణ పతకాలు సాధించాడు. ఈనెల 22 నుంచి గ్వాలియర్లో జరిగే జాతీయస్థాయి పారా అథ్లెటిక్స్ పోటీలకు ఎంపికయ్యాడు. ఈ సందర్భంగా పవన్కుమార్ మాట్లాడుతూ తన లక్ష్యం 2026లో బెంగళూరులోని ఏఐ (స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా)లో చేరి దేశానికి ప్రాతినిధ్యం వహించడమేనని అన్నారు. తాను జంగారెడ్డిగూడెంలో ఇంటర్ ద్వితీయ సంవత్సరం చదువుతున్నట్టు చెప్పాడు. 11 నుంచి ఏబీవీపీ కార్యవర్గ సమావేశాలు భీమవరం: ఏబీవీపీ కార్యవర్గ సమావేశాలు ఈనెల 10,11 తేదిల్లో భీమవరం చాంబర్ ఆఫ్ కామర్స్ హాలులో నిర్వహిస్తున్నట్లు ఏబీవీపి రాష్ట్ర కార్యదర్శి యాగంటి వెంకటగోపి చెప్పారు. శనివారం భీమవరంలో మాట్లాడుతూ రాష్ట్రంలోని వివిధ ప్రాంతాల నుంచి సుమారు 250 మంది పాల్గొంటారన్నారు. -
అయ్యో.. రొయ్య!
పది రోజుల్లో ధరల వ్యత్యాసం (కిలోకు రూ.లలో) కౌంట్ పది రోజుల క్రితం ప్రస్తుతం 100 270 220 90 280 230 80 290 255 70 320 275 60 360 295 50 370 315 40 400 335 30 470 385 సాక్షి, భీమవరం: భారత ఉత్పత్తులపై అమెరికా సుంకాలు ఆక్వాపై తీవ్ర ప్రభావం చూపిస్తున్నాయి. దిగుమతులపై 50 శాతం పన్నుతో రొయ్య ధరలు కిలోకు రూ.50 నుంచి రూ.90 వరకూ పతనమయ్యాయి. అమెరికాకు ఎగుమతికాని 50 నుంచి 100 కౌంట్ల రొయ్యల ధరలను సైతం వ్యాపారులు తగ్గించేశారు. అయినప్పటికీ కొనుగోళ్లు అంతంత మాత్రంగానే చేస్తున్నారని రైతులు అంటున్నారు. రాష్ట్రంలోని 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే 2.63 లక్షల విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల దిగుబడితో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదటిస్థానంలో ఉంది. కిలోకు 30 నుంచి 40 కౌంట్ వరకు రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్ వరకు చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. 2023–24 గణాంకాల ప్రకారం ఏపీలో 10 లక్షల టన్నులు రొయ్యల దిగుబడి వస్తే వాటిలో 3.27 లక్షల టన్నులు అమెరికాకు ఎగుమతి అవుతున్నాయి. మళ్లీ పతనం : ఈ ఏడాది ప్రతికూల వాతావరణం, వైరస్ల బెడదతో ఆశించిన కౌంట్ రాకుండానే పట్టుబడులు చేయాల్సి వచ్చింది. ఉత్పత్తి తగ్గడంతో డిమాండ్ పెరిగి 100 కౌంట్ రూ.260–రూ.270 మధ్య, 30 కౌంట్ రూ.470, 40 కౌంట్ రూ.400లతో రైతుల్లో ఆశలు చిగురింపచేశాయి. ఇంతలో భారత ఉత్పత్తులపై ఆగస్టు 1 నుంచి 25 శాతం పన్ను, పెనాల్టీ విధిస్తున్నట్టు అమెరికా ప్రకటించిన 24 గంటల వ్యవధిలో వ్యాపారులు కౌంట్ను బట్టి రొయ్య ధరలను రూ.60 వరకు తగ్గించేశారు. అమెరికా పన్నులు సాకుగా చూపించి కేవలం చైనా, యూరప్ దేశాలకు మాత్రమే ఎగుమతయ్యే 50 నుంచి 100 కౌంట్ రొయ్యల ధరలను తగ్గించేశారు. సుంకాలను 50 శాతం వరకు పెంచినట్టు అమెరికా రెండోసారి చేసిన ప్రకటనతో పరిస్థితి మరింత దిగజారింది. ధరలు ఎప్పుడు ఎలా ఉంటాయోనన్న ఆందోళనతో కంపెనీలు, వ్యాపారులు చాలావరకు కొనుగోళ్లు నిలుపుచేశారు. ప్రస్తుతం పట్టుబడులకు వచ్చిన చెరువుల్లో వ్యాపారులు చెప్పిన ధరకే రైతులు అంగీకరించాల్సిన పరిస్థితి నెలకొంది. కొద్దిరోజులు లాభసాటి ధరతో ఆశలు రేకెత్తించిన రొయ్య ధరలు అంతలోనే పతనమవ్వడం రైతులను ఆందోళనకు గురిచేస్తోంది. ఎకరాకు రైతులు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టపోతున్నారు. డాలర్ ధర పెరిగినప్పుడు ఆ లాభాన్ని పొందే ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్లు సుంకాల భారాన్ని తమపై మోపడం సరికాదంటున్నారు. ప్రతికూల వాతావరణం, నాణ్యత లేని సీడు, ఫీడు, వైరస్ల బెడద, కాటా మోసాలతో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని వాపోతున్నారు. ఏప్రిల్ నుంచే సుంకాల బెడద ఏప్రిల్ 3న అమెరికా పన్నుల పెంపు ప్రకటనను సాకుగా చూపించి కిలోకు 30 కౌంట్కు రూ.460, 40 కౌంట్కు రూ.370, 100 కౌంట్కు రూ.230 ఉన్న ధరలను ప్రాసెసింగ్ ప్లాంట్ల నిర్వాహకులు, ఎక్స్పోర్టర్స్, వ్యాపారులు రూ.30 నుంచి రూ.70 వరకు తగ్గించేశారు. పన్నులు పెంపు వాయిదా వేస్తున్నట్టు తర్వాత అమెరికా ప్రకటించినా ధరలు పెంచకుండా నెలరోజులకు పైగా తగ్గింపు ధరలనే కొనసాగించారు. సిండికేట్ దోపిడీ, కూటమి సర్కారు నిర్లక్ష్యాన్ని నిరసిస్తూ రైతులు రోడ్లెక్కి ఆందోళనలు చేశారు. ఒక దశలో పశ్చిమగోదావరి జిల్లా రైతులు పిలుపునివ్వగా చాలామంది చెరువులను ఎండగట్టి పంట విరామం పాటిస్తున్నట్టు ఫ్లెక్సీలను సైతం కట్టారు. ఈ పరిణామాలతో ఉలిక్కిపడిన కూటమి ప్రభుత్వం ఉండిలో ఆక్వా సదస్సు, విజయవాడలో ప్రాన్స్ కో–ఆర్డినేషన్ కమిటీ సమావేశాలు నిర్వహించి మేత ధరలను కేవలం టన్నుకు రూ.4 వేల వరకు తగ్గింపు, స్వల్పంగా రొయ్య ధరల పెంపు వంటి కంటితుడుపు చర్యలతో సరిపెట్టింది. రొయ్య ధరలు పతనం కౌంట్కు రూ.50 నుంచి రూ.90 వరకు తగ్గించేసిన వ్యాపారులు అయినా అంతంతమాత్రంగానే కొనుగోళ్లు అమెరికాకు ఎగుమతి కాని రొయ్యల ధరలూ తగ్గించేసిన సిండికేట్ ఎకరాకు రూ.40 వేల నుంచి రూ.90 వేల వరకు నష్టపోతున్న రైతులు కూటమి ప్రభుత్వం విఫలం ఆక్వా రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు సర్కారు పూర్తిగా విఫలమైంది. అమెరికాకు ఎక్స్పోర్టు కాని 50 నుంచి 100 కౌంట్ల ధరలను తగ్గించేసి దోచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. లాభాలు వచ్చినప్పుడు, డాలర్లు విలువ పెరిగినప్పుడు ఆ ప్రయోజనాన్ని వ్యాపారులే పొందుతున్నారు. ఇప్పుడు సుంకాల భారాన్ని రైతులపై మోపడం సరికాదు. ధరల స్థిరీకరణకు ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. –వడ్డి రఘురాం, అప్సడా మాజీ వైస్ చైర్మన్, తాడేపల్లిగూడెం -
నేత్రపర్వంగా పవిత్రారోహణ
ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయంలో జరుగుతున్న శ్రీవారి దివ్య పవిత్రోత్సవాల్లో భాగంగా శనివారం పవిత్రారోహణ వేడుక అత్యంత వైభవంగా జరిగింది. ఉత్సవాలను పురస్కరించుకుని ఆలయంలో గత రెండు రోజులుగా విశేష కార్యక్రమాలు జరుగుతున్నాయి. అందులో భాగంగా ఉదయం ఆలయ యాగశాలలో హోమగుండం వద్ద అగ్ని ఆరాధన, చతుర్ధ కలశ స్నపనను అర్చకులు వేద మంత్రోచ్ఛరణలతో ఘనంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు అలంకరణలు చేసే పవిత్రాలను అర్చకులు శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాల నడుమ ఆలయంలో ప్రదక్షిణలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ సిబ్బంది, పలువురు భక్తులు స్వామివారి వాహనాన్ని భక్తి ప్రపత్తులతో మోశారు. ఆ తరువాత ఆలయ గర్భాలయంలో కొలువైన శ్రీవారి మూలవిరాట్కు, అమ్మవార్లకు అలాగే ఉత్సవమూర్తులకు అర్చకులు పవిత్రాలను ధరింపజేశారు. అనంతరం పవిత్రాంగ హోమం, శాంతి హోమాన్ని భక్తుల గోవింద నామస్మరణల నడుమ అట్టహాసంగా నిర్వహించారు. ఆదివారం జరిగే పవిత్రావరోహణ, శ్రీ మహా పూర్ణాహుతి వేడుకలతో ఈ పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయని ఆలయ ఈఓ ఎన్వీ సత్యన్నారాయణమూర్తి తెలిపారు. సోమవారం నుంచి ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను పునరుద్దరిస్తామని, భక్తులు గమనించాలని ఆయన కోరారు. -
ఒత్తిడితోనే రికార్డులు మారుస్తున్నారు
పాములపర్రులో కొనసాగుతున్న దళితుల నిరసనఉండి: కూటమి నాయకులు ఒత్తిడితోనే అధికారులు రికార్డులు మార్చేస్తున్నారంటూ పాములపర్రు దళితులు, దళిత సంఘాల నేతలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాములపర్రులో వివాదంగా మారిన శ్మశానంలో రోడ్డు నిర్మాణ ఘటనలో ఆందోళనలు రోజురోజుకు తీవ్రమవుతున్నాయి. కొద్ది రోజులుగా కూటమి నాయకులు, ఉద్యమాన్ని ఆపేది లేదని దళితులు చెబుతున్నారు. శనివారం సాయంత్రం గ్రామంలో దళితులు నిరసన తెలిపారు. ఈ సందర్భంగా బహుజన జేఏసీ కన్వీనర్ తాళ్ళూరి మధు, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి క్రాంతిబాబు, జేఏసీ గౌరవాధ్యక్షుడు స్టాలిన్బాబు మాట్లాడుతూ పాములపర్రులో ఒకపక్క దళితులు తమ శ్మశాన భూమి కోసం పోరాడుతుంటే మరో పక్క అధికారులు కూటమి నాయకుల ఒత్తిళ్లకు తలొగ్గి ఏకంగా రెవెన్యూ రికార్డులనే మార్చేసారని ఆవేదన వ్యక్తం చేశారు. పంచాయతీకి గానీ, బోర్డు సభ్యులకు గానీ శ్మశాన వాటికకు సంబంధించి సమాచారం లేకుండా పంచాయతీ కార్యదర్శి పై అధికారులు కోరినట్లు తహసీల్దార్కు శ్మశాన సరిహద్దులు మార్చాలంటూ లేఖ రాయడం ఏంటని వారు మండిపడ్డారు. తామంతా రాజీపడిపోయామని సమస్య సద్దుమణిగిపోయిందని అబద్ధపు ప్రచారాలు చేస్తున్నారని దళితులు తప్పుపట్టారు. 150 ఏళ్ల నుండి శ్మశానంగా వున్న భూమిని ఎలా మారుస్తారని ఏ విధంగా భూస్వాములకు కొమ్ముకాస్తున్నారని ప్రశ్నించారు. పక్క గ్రామానికి చెందిన ఇద్దరు ఆక్వా రైతుల ప్రాపకం కోసం అధికారులు, కూటమి నాయకులు ఇంత దారుణానికి ఎలా ఒడిగడతారని మండిపడ్డారు. ఏ అర్హతతో పంచాయితీ కార్యదర్శి లేఖ రాశారని అతనిపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. పంచాయతీకి సంబంధం లేదు సరిహద్దులు మార్చాలని పంచాయతీ సమావేశంలో ఎలాంటి చర్చ రాలేదని ఒకటో వార్డు సభ్యుడు దర్శి సాల్మన్ తెలిపారు. ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్న పంచాయితీ కార్యదర్శి అప్పారావుపై వెంటనే చర్యలు తీసుకోవాలన్నారు. ఆందోళనలో జేఏసీ రాష్ట్రాధ్యక్షుడు బిరుదుగడ్డ రమేష్ బాబు, దానం విద్యాసాగర్, మామిడిపల్లి ఏసేబు, దర్శి దేవానందం, ఆనందరావు, మత్తి చంద్రం, బడుగు ఆదాము, వజ్రపు సుందరరావు, దర్శి వెంకటరత్నం, దర్శి చంద్రం, తదితరులు పాల్గొన్నారు. -
సంస్కృతికి వేదాలు మూలం
గణపవరం: వేదాలు మన సంస్కృతి, సంప్రదాయాలకు మూలమని, వేదాల పరిరక్షణకు వేద విద్యార్థులు కృషి చేయాలని పండితులు, ఘనాపాఠీలు సూచించారు. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో మూడు రోజులపాటు నిర్వహించిన 105వ వేద శాస్త్ర పరిషత్ కార్యక్రమం శనివారం ముగిసింది. దేశం నలుమూలల నుంచి 138 మంది వేద విద్యార్థులు హాజరుకాగా వీరికి 14 మంది వేదపండితులు, ఘనాపాఠీలు పరీక్షలు నిర్వహించారు. రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాల్లో అభ్యర్థులకు రెండు రోజులపాటు పరీక్షలు నిర్వహించారు. ఉత్తీర్ణులైన విద్యార్థులకు శనివారం నిర్వహించిన వేదపరిషత్ సభలో సర్టిఫికెట్లు ప్రదానం చేశారు. సాగిరాజు సుబ్బరాజు కుటుంబ సభ్యులు దెందుకూరి ప్రసాదరాజు , దెందుకూరి వర్మ దంపతులు ఈకార్యక్రమం నిర్వహించారు. అనంతరం వేద పండితులు, ఘనాపాఠీలకు పండిత సత్కారం నిర్వహించారు. గాయత్రిబ్రాహ్మణ సేవాసంఘం సభ్యులు పాల్గొన్నారు. -
మహిళలకు శాపంగా కూటమి పాలన
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలన మహిళల పాలిట శాపంగా మారిందని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. శనివారం స్థానిక పార్టీ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో వారు మాట్లాడుతూ ప్రభుత్వమే స్వయంగా మద్యం విక్రయాలు ప్రోత్సహించడం దారుణమన్నారు. విచ్చలవిడిగా మద్యం షాపులు ఏర్పాటు చేయడంతోపాటు పర్మిట్ రూమ్లకు క్లియరెన్స్ ఇవ్వడం విచారకరమన్నారు. పెరుగుతున్న మద్యం వినియోగం చాలా కుటుంబాల్లో చిచ్చు పెడుతోందని, ఇది మహిళలకు తీరని వేదన మిగులుస్తోందన్నారు. రాష్ట్రం అంతటా మహిళలకు ఆర్టీసీ బస్సులో ఉచిత ప్రయాణం అంటూ ఎన్నికల మందు ఊదరగొట్టారని, ఒక ఏడాది ఈ పథకం పూర్తిగా ఎగ్గొట్టి, ఇప్పుడు అమలు చేస్తున్నామని చెబుతున్న దానిలో కూడా అనేక కొర్రిలు పెట్టారని మండిపడ్డారు. విలేకరుల సమావేశంలో వైఎస్సార్ సీపీ రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, ఏలూరు నియోజకవర్గం మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, జిల్లా కార్యదర్శి కంచుమర్తి తులసి, కార్పొరేటర్ డింపుల్ జాబ్, పోల్నాటి పరమేశ్వరి దేవి, మహిళా నేతలు పాల్గొన్నారు. -
ఆసుపత్రిలో పెచ్చులు ఊడిపడుతున్న శ్లాబ్
నూజివీడు: పట్టణంలోని ఏరియా ఆసుపత్రిలో శ్లాబ్ భాగం నుంచి పెచ్చులు ఊడి పడుతున్నాయి. పాత బిల్డింగ్లో రెండో అంతస్తులోని వార్డుల సమీపంలో శ్లాబ్ పెద్దపెద్ద పెచ్చులు ఊడి పడుతుండటంతో రోగులు, నర్సులు ఆందోళన చెందుతున్నారు. ఎప్పుడు ఎవరి నెత్తిన పెచ్చులు పడతాయేమోనని బిక్కుబిక్కుమంటూ సిబ్బంది విధులు నిర్వహిస్తున్నారు. రోగులు, వారి బంధువులు, ఆసుపత్రి సిబ్బంది నిత్యం రాకపోకలు సాగిస్తుంటారని, పెచ్చులు ఊడుతున్న చోట కనీసం మరమ్మతులు కూడా చేయించకుండా వదిలేశారని రోగులు, ఆసుపత్రి సిబ్బంది వాపోతున్నారు. 11 నుంచి జిల్లా జట్ల ఎంపిక ఏలూరు రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని అండర్–22 విభాగంలో మహిళలు, పురుషులకు 10 క్రీడాంశాల్లో ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి శ్రీనివాసరావు ఓ ప్రకటనలో తెలిపారు. ఈనెల 11, 13 తేదీల్లో జిల్లా స్థాయి పోటీలు జరుగుతాయన్నారు. 11 తేదీన జంగారెడ్డిగూడెంలో ఆర్చరీ, ఏలూరు భిశ్వనాధ్ భర్తియా స్విమ్మింగ్పూల్లో స్విమ్మింగ్, సీఆర్ఆర్ ఇంజినీరింగ్ కళాశాలలో బ్యాడ్మింటన్, ఖండ్రికగూడెం బాక్సింగ్ ఆకాడమీలో బాక్సింగ్ పోటీలు, అల్లూరి సీతారామరాజు స్టేడియంలో బాస్కెట్బాల్, హాకీ, కబడ్డీ ఖొఖో, వాలీబాల్ పోటీలు, ఇండోర్ స్టేడియంలో వెయిట్లిఫ్టింగ్ పోటీలు చేపడతామని వెల్లడించారు. తిరిగి 13న ఏలూరు ఏఎస్ఆర్ స్టేడియంలో అథ్లెటిక్స్ నిర్వహిస్తామని వివరించారు. వివరాలకు 98663 17326 నంబర్లో సంప్రదించాలని సూచించారు. -
శ్రీవారికి హారం సమర్పణ
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్నకు ఒక భక్తుడు శనివారం సుమారు రూ.7 లక్షలు విలువ చేసే 65 గ్రాముల బంగారు లక్ష్మీదేవి కాసుల హారాన్ని బహుకరించారు. విజయవాడకు చెందిన దాసరి రాధాకృష్ణ ముందుగా కుటుంబ సభ్యులతో కలసి స్వామి, అమ్మవార్లను దర్శించారు. అనంతరం ఈ హారాన్ని ఆలయ కార్యాలయంలో ఏఈఓ పి.నటరాజారావుకు అందజేశారు. ఈ సందర్భంగా దాతకు ఆయన సంబంధిత రసీదును అందజేశారు.శ్రీవారి క్షేత్రం.. భక్త జనసంద్రంద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రం శనివారం భక్త జనసంద్రమైంది. స్వామివారికి ప్రీతికరమైనరోజు, రాఖీ పండుగ కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిటకిటలాడాయి. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూకాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట, ఉచిత ప్రసాద వితరణ క్యూలైన్లు, నిత్యాన్నదాన విభాగాలు భక్తులతో పోటెత్తాయి. వైకుంఠం క్యూ కాంప్లెక్స్లోని వేదికపై ఎన్టీఆర్ జిల్లా, రెడ్డిగూడెం మండలానికి చెందిన శ్రీ రామాంజనేయ భజన సమాజం సభ్యులు నిర్వహించిన భజనలు భక్తులను అలరించాయి. -
క్రీడా పోటీలు సరే.. సౌకర్యాలేవి?
తణుకు అర్బన్: జాతీయ క్రీడా దినోత్సవాన్ని పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో తణుకులో నిర్వహిస్తున్న క్రీడా ఎంపికలు క్రీడాకారులు సహనానికి పరీక్షగా మారాయి. జిల్లా అధికారులు ప్రతిష్టాత్మకంగా నిర్వహించిన ఈ క్రీడా ఎంపికల్లో విద్యార్థులకు అవసరమైన వసతుల కల్పనలో అవకతవకలు కొట్టొచ్చినట్లుగా కనిపించాయి. తణుకు వేదికగా జిల్లా స్థాయి క్రీడాకారుల ఎంపికలు క్రీడాకారుల ప్రతిభకే కాకుండా వారికి తీవ్ర అసహనాన్ని కల్పించాయి. ముఖ్యంగా క్రీడా ఎంపికలకు వచ్చిన క్రీడాకారులకు మంచినీరు తప్ప మరే ఆహారం ఇవ్వకపోవడంతో వారంతా ఉక్కపోత వాతావరణానికి ఓ పక్క నీరసం, మరో పక్క ఆకలితో నకనకలాడారు. మధ్యాహ్నం 1 గంటకు ఎంపికలు పూర్తయినే వెంటనే రాష్ట్రపతి రోడ్డులో ఉన్న దుకాణాల వద్దకు పరుగులుపెట్టారు. చేతిలో డబ్బులు ఉన్న క్రీడాకారులు ఆకలి తీర్చుకోగా మిగిలిన వారు ఒకరి ముఖం ఒకరు చూసుకోవాల్సిన దుస్థితి నెలకొంది. అంతేకాకుండా క్రీడలకు సైతం పూర్తిస్థాయిలో సౌకర్యాలు కల్పించకపోవడంతో క్రీడాకారులు శారీరకంగా తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో హాకీ క్రీడకు సంబంధించి భీమవరం, శృంగవృక్షంకు చెందిన క్రీడాకారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. క్రీడా ప్రాంగణంలో ఉన్న గడ్డి దుబ్బులతో బాల్ గమనంపై సరిగా దృష్టిసారించలేకపోవడంతో పడిపోయిన సందర్భాలు కూడా ఎదురయ్యాయని క్రీడాకారులు వాపోయారు. భోజన వసతులు లేకపోవడంతో బ్యాగ్లు మోసుకుంటూ వెళ్లి మెస్లలో భోజనం చేయాల్సి వచ్చిందని ఆందోళన వ్యక్తం చేశారు. క్రీడా అసోసియేషన్లు ఏర్పాటుచేసే ఎంపికలకే అన్ని ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితుల్లో ప్రభుత్వం వైపు నుంచి ఎటువంటి సౌకర్యాలు కల్పించకపోవడం తీవ్ర చర్చనీయాంశమైంది. అండర్ 22లోపు.. తణుకులో జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాల, శ్రీచిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల, ఎస్కేఎస్డీ మహిళా కళాశాల, మాంటిస్సోరీ స్కూలులో ఈనెల 8వ తేదీ నుంచి మూడు రోజులపాటు అండర్ 22 లోపు క్రీడాకారులకు 10 క్రీడాంశాల్లో ఈ క్రీడా ఎంపికలు నిర్వహించారు. మూడు రోజులపాటు నిర్వహించే ఈ క్రీడా ఎంపికల్లో అథ్లెటిక్స్, బాస్కెట్ బాల్, బాక్సింగ్, హాకీ, ఆర్చరీ, బ్యాడ్మింటన్, కబడ్డీ, ఖోఖో, వాలీబాల్ అంశాల్లో ఎంపికలు నిర్వహిస్తున్నారు. ఇక్కడ ఎంపికై న క్రీడాకారులను రాష్ట్రస్థాయి పోటీలకు పంపించనున్నట్లు అధికారులు చెబుతున్నారు. మొదటిరోజు 82 మంది క్రీడాకారులు హాజరుకాగా, రెండోరోజైన శనివారం 125 మంది క్రీడాకారులు హాజరయ్యారు. ఆదివారంతో ఈ క్రీడా ఎంపికలు ముగియనున్నాయి. శనివారం ఆర్చరీకి సంబంధించి జోనల్ స్థాయి పోటీలకు 24 మందిని, అథ్లెటిక్స్లో 20, బాస్కెట్బాల్ 24, బాక్సింగ్ 25, హాకీలో 32 మందిని రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక చేసినట్లు జిల్లా స్పోర్ట్స్ డెవలప్మెంట్ అధికారి ఎం.రాజేష్ తెలిపారు. ‘ఆడుదాం ఆంధ్ర’తో సౌకర్యాలు ఫుల్... గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం క్రీడలను ప్రోత్సహించి నాణ్యమైన క్రీడాకారులను వెలికితీయాలనే ఉద్దేశ్యంతో ఆడుదాం ఆంధ్ర కార్యక్రమంతో క్రీడాకారులకు చక్కని సౌకర్యాలతో క్రీడా పోటీలు నిర్వహించారు. క్రీడా పోటీలకు వచ్చేవారికి అల్పాహారంతోపాటు భోజన వసతి కూడా కల్పించారు. క్రీడలకు సంబంధించి క్రీడా పరికరాలు ప్రభుత్వమే సరఫరా చేయడం, విజేతలకు ధ్రువపత్రాలు, మెమొంటోలు, మెడల్స్తోపాటు భారీ నజరానా కూడా అందజేశారు. ఆకలితో అలమటించిన క్రీడాకారులు తినుబండారాల కోసం దుకాణాల వెంబడి పరుగులెత్తిన వైనం ప్రమాదకరంగా క్రీడా ప్రాంగణం -
గంజాయి కేసులో ముగ్గురి అరెస్ట్
కై కలూరు: వాహన తనిఖీల్లో ముగ్గురు యువకులు గంజాయి రవాణా చేస్తుండగా కై కలూరు రూరల్ పోలీసులు వారిని పట్టుకుని 2.5 కిలోల గంజాయిని స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు స్థానిక పోలీసు స్టేషన్లో సీఐ వి.రవికుమార్ కేసు వివరాలను శనివారం వెల్లడించారు. కై కలూరు మండలం ఆలపాడు కోఆపరేటివ్ బ్యాంకు ఎదురు జాతీయ రహదారిపై వాహనాలు తనిఖీ చేస్తుండగా శుక్రవారం ముగ్గురు యువకులు గంజాయి రవాణా చేస్తూ పట్టుబడ్డారన్నారు. వీరిలో భుజబలపట్నం శివారు సింగాపురం గ్రామానికి చెందిన గురివెల్లి బాలసాయి రామిరెడ్డి(27) వైజాగ్లో హోటల్ మేనేజ్మెంట్ చదువుతున్న రోజుల్లో గంజాయికి అలవాటు పడ్డాడు. మలేషియా, హైదరాబాదు, విజయవాడ ప్రాంతాల్లో హోటళ్లలో పనిచేశాడు. ఇతను 2022లో అనకాపల్లి జిల్లా నాతవరం పోలీసు స్టేషన్లో గంజాయితో పట్టుబడిన కేసులో జైలు శిక్ష అనుభవించాడు. అలాగే ఇటీవల ఆకివీడులో ఇతని స్నేహితులు పవన్కుమార్ మరికొందరిని గంజాయి విక్రయాల కేసులో అరెస్టు చేశారు. చటాకాయి గ్రామానికి చెందిన జయమంగళ లక్ష్మీనారాయణ(26) డిగ్రీ వరకు చదివి కూలీపనులకు వెళుతూ మత్తుకు అలవాటు పడి గంజాయి విక్రయిస్తున్నాడు. కై కలూరు వెలంపేటకు చెందిన నరహరశెట్టి వెంకట అవినాష్(27) చైన్నెలో బీటెక్ చదువు మధ్యలో ఆపివేసి కై కలూరు లారీ ట్రావెల్స్లో మధ్యవర్తిగా వ్యవహరిస్తున్నాడు. ఇతను కూడా గంజాయి మత్తుకు బానిసై డబ్బు కోసం ఇతరులకు విక్రయిస్తున్నట్లు సీఐ రవికుమార్ తెలిపారు. నార్కోటిక్ డ్రగ్స్ అండ్ సైకోట్రోపిక్ సబ్స్టాన్సెస్(ఎన్డీపీసీ) యాక్టు – 1985 ప్రకారం గంజాయి కేసులో 20 సంవత్సరాల శిక్ష పడే అవకాశం ఉందన్నారు. గంజాయి వివరాలు తెలిస్తే 1972, 112 టోల్ఫ్రీ నంబర్లకు సమాచారం అందించాలని సీఐ కోరారు. కార్యక్రమంలో రూరల్ ఎస్సై వి.రాంబాబు, ట్రైనీ ఎస్సై ఎం.హరిగోపాల్ పాల్గొన్నారు. నిందితుల నుంచి 2.5 కిలోల గంజాయి స్వాధీనం -
శ్రీవారి కొండపై ‘టోల్’ బాదుడు
ద్వారకాతిరుమల : శ్రీవారి కొండపై సామాన్య భక్తులే టార్గెట్గా వారు వేసుకొచ్చే ద్విచక్ర వాహనాలకు టోల్ రుసుమును రెట్టింపు వసూలు చేస్తున్నారు. బహిరంగంగా జరుగుతున్న ఈ దోపిడీని అడ్డుకోవాల్సిన అధికారులు తమకేమీ తెలియనట్టు చోద్యం చూస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైకి వివిధ వాహనాలపై వెళ్లే భక్తుల నుంచి టోల్ రుసుమును రెండేళ్ల పాటు వసూలు చేసుకునే హక్కుకు గతేడాది జూలైలో దేవస్థానం బహిరంగ వేలాన్ని నిర్వహించింది. పాట దక్కించుకున్న ఓ కాంట్రాక్టర్ నిబంధనల ప్రకారం తొలి ఏడాది సుమారు రూ. కోటి 60 లక్షలను దేవస్థానానికి చెల్లించాడు. ఈనెల 1 నుంచి రెండో ఏడాది మొదలైంది. ఈ సంవత్సరం జీఎస్టీతో కలిపి సుమారు రూ. కోటి 80 లక్షలను చెల్లించాల్సి ఉండగా, ఇప్పటి వరకు కొంత సొమ్మును మాత్రమే జమ చేశారు. ఇదిలా ఉంటే ద్విచక్ర వాహనానికి రూ.10 వసూలు చేయాల్సిన కాంట్రాక్టర్, డబుల్ రుసుముగా రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదేం దారుణమంటూ ద్విచక్ర వాహనాలపై వస్తున్న భక్తులు ముక్కున వేలేసుకుంటున్నారు. దేవస్థానం నిర్ణయించిన ధరలు ఇవీ దేవస్థానం నిర్ణయించిన ధరల ప్రకారం లారీ, బస్సు, ఇతర భారీ వాహనానికి రూ.150, మినీ బస్సు, (407) వ్యాన్ స్వరాజ్, మజ్ధూర్ వాహనానికి రూ.100, ట్రాక్టరు (ట్రక్కుతో), ట్రక్కు ఆటో, తుఫాన్, టాటా ఏస్, ట్రాక్టర్ ఇంజన్, కారు, జీపు, వ్యాన్కి రూ.50, పాసింజర్ ఆటోకి రూ. 25, స్కూటర్, మోటర్ సైకిల్కి రూ.10 వసూలు చేయాలి. అయితే సామాన్య భక్తులు వచ్చే ద్విచక్ర వాహనాలకు దేవస్థానం నిర్ణయించిన ధరకంటే రెట్టింపు ధరను వసూలు చేస్తూ, భక్తులను దోచేస్తున్నారు. ధరల బోర్డుకు మొక్కలు అడ్డుపెట్టి మరీ భక్తులకు వాహనాల టోల్ రుసుములు కనిపించకుండా తెలివిగా టోల్గేటు వద్ద ఉన్న ధరల బోర్డుకు మొక్కలు అడ్డుపెట్టి మరీ ఈ దోపిడీకి పాల్పడుతున్నారు. ఇది ఎప్పటి నుంచి జరుగుతుందో తెలియదు గానీ, శనివారం శ్రీవారికి ప్రీతికరమైనరోజు, రాఖీ పండుగ, క్షేత్రంలో అధికంగా వివాహాలు జరగడంతో వందల సంఖ్యలో ద్విచక్ర వాహనాలపై వచ్చిన భక్తుల నుంచి ఈ రెట్టింపు రుసుములను వసూలు చేశారు. దీనిపై సంబంధిత సెక్షన్ ఏఈఓ రమణరాజును వివరణ కోరగా టోల్ రుసుములు అధికంగా వసూలు చేస్తున్నారన్న విషయం తమ దృష్టికి రాలేదన్నారు. విచారించి తగు చర్యలు చేపడతామన్నారు. సామాన్య భక్తులే టార్గెట్గా దోపిడీ ద్విచక్ర వాహనాలకు రెట్టింపు రుసుం వసూలు చోద్యం చూస్తున్న అధికారులు.. ముక్కున వేలేసుకుంటున్న భక్తులు రూ.20 తీసుకున్నారు ఫ్యామిలీతో బైక్పై వచ్చాను. కొండపైన టోల్గేటు వద్ద రూ.20 వసూలు చేశారు. గతంలో వచ్చినప్పుడు రూ.10 తీసుకున్నారు. ధరలు పెంచారని అనుకున్నాను. తీరా కొండపైకి వచ్చిన తరువాత టోల్ నిర్వాహకులు రెట్టింపు ధర వసూలు చేస్తున్నారని తెలిసింది. – అంగిరేకుల రమేష్, భక్తుడు, రాట్నాలకుంట, పెదవేగి మండలం అధికారులు ఏం చేస్తున్నారు దూరాన్ని సైతం లెక్కచేయకుండా ద్విచక్ర వాహనాలపై క్షేత్రానికి వచ్చేది సామాన్య భక్తులే. అటువంటి సామాన్య భక్తులను దోచేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారు. ఇదంతా వారికి తెలియకుండానే జరుగుతుందా.? మరీ ఇంత దారుణమా. – చీకటి విజయభాస్కర్, నాగుపల్లి, దమ్మపేట మండలం, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అడుగుదామంటే.. తరచూ నేను టీవీఎస్ మోపెడ్పై శ్రీవారి క్షేత్రానికి వస్తుంటాను. గతంలో టోల్ రుసుము రూ.10 మాత్రమే తీసుకునేవారు. ఇప్పుడు రూ.20 తీసుకున్నారు. ఇదేంటని అడుగుదామంటే వెనుక వాహనాలు నిలిచిపోయాయి. దాంతో ముందుకెళ్లిపోయాను. – గురజాల ధర్మారావు, నీలాద్రిపురం, ఉంగుటూరు మండలం -
ఆర్టీసీ బస్సు ఢీకొని వ్యక్తికి గాయాలు
తణుకు అర్బన్: ఆర్టీసీ బస్సు ఢీకొట్టి ద్విచక్ర వాహనదారుడికి తీవ్ర గాయాలైన ఘటన శనివారం తణుకులో చోటుచేసుకుంది. దువ్వ గ్రామానికి చెందిన యార్లగడ్డ రవి ద్విచక్ర వాహనంపై తణుకువైపు రైల్వే ఓవర్ బ్రిడ్జి ప్రాంతానికి వచ్చేసరికి ఏలూరు డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రవి కాలు నుజ్జయిపోవడంతో మొదట తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి, మెరుగైన వైద్యసేవల కోసం ప్రైవేటు ఆస్పత్రికి తరలించినట్లుగా తెలిసింది. బాధితుడు తణుకు కోర్టులో ప్లీడరు గుమస్తాగా విధులు నిర్వర్తిస్తుంటారని పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. స్నేహితుడిపై కత్తితో దాడి ఏలూరు (ఆర్ఆర్పేట): స్నేహితుడిపై ఓ వ్యకి కత్తితో దాడికి పాల్పడ్డాడు. ఏలూరు రూరల్ మండలం హనుమాన్ నగర్కు చెందిన కృష్ణవరపు ఆంజనేయ వరప్రసాద్ స్థానికంగా కారు డ్రైవర్గా జీవిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన పేరాడ శివాజీ ఇతనికి చిన్ననాటి నుంచి స్నేహితుడు. శనివారం వీరిద్దరి మధ్య చిన్న విషయంపై మాటమాట పెరిగింది. దీంతో ఆంజనేయ వరప్రసాద్పై శివాజీ కత్తితో దాడి చేశాడు. గమనించిన ప్రసాద్ బంధువులు వెంటనే అతడ్ని చికిత్స నిమిత్తం ఏలూరు సర్వజన ఆస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం ఏలూరు నగరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. ప్రస్తుతం ప్రసాద్ ప్రైవేట్ ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. -
పాములదిబ్బలో ఉద్రిక్తత
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక పాములదిబ్బలో మరోసారి ఉద్రిక్తత చోటుచేసుకుంది. రెండు నెలల క్రితం పాములదిబ్బకు చెందిన ముంగి యర్రబాబు ఏలూరు జాతీయ రహదారిపై హత్యకు గురయ్యాడు. ఈ కేసులో పాములదిబ్బ ప్రాంతానికి చెందిన కొందరు నిందితులుగా ఉండటంతో పోలీసులు వాళ్లను అరెస్ట్ చేశారు. హత్యకు గురైన వ్యక్తిని దహన సంస్కారానికి తీసుకువెళ్లే సమయంలోనే హతుడి కుటుంబ సభ్యులు నిందితుల ఇంట్లో సామాన్లు ధ్వంసం చేసి గందరగోళం సృష్టించారు. అప్పట్లో ఏలూరు డీఎస్పీ శ్రవణ్ కుమార్ ప్రత్యేక నిఘా, పోలీసు పికెట్ ఏర్పాటు చేసి శాంతిభద్రతలకు విఘాతం కలుగకుండా చర్యలు చేపట్టారు. ఈ విషయం సద్దుమణిగినా నివురుగప్పిన నిప్పులా ఇరువర్గాల మధ్య ఘర్షణ వాతావరణం నెలకొంది. ఈ క్రమంలోనే శుక్రవారం తెల్లవారుజామున హత్య కేసులో నిందితుడిగా ఉన్న దాసరి కుమార్ రాజా ప్రత్యర్థులు ఇంటికి నిప్పుపెట్టారు. దీంతో మళ్లీ పరిస్థితి ఉద్రిక్తంగా మారింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది మంటలను అదుపుచేశారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఏలూరు టూటౌన్ సీఐ అశోక్ కుమార్ ఆధ్వర్యంలో పాములదిబ్బలో మళ్లీ పోలీసు భద్రతను ఏర్పాటు చేశారు. ఇంటికి నిప్పు పెట్టిన ఘటనకు సంబందించి హత్యకు గురైన యర్రబాబు తల్లి పెద్దింట్లుపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
●రాఖీ.. సందడి
సోదర, సోదరీమణుల ఆప్యాయతానురాగాలకు ప్రతీక అయిన రాఖీ పౌర్ణమి శనివారం కావడంతో తాడేపల్లిగూడెం పట్టణ, రూరల్ మండలంలో రాఖీల కొనుగోలులో యువతులు నిమగ్నమయ్యారు. పట్టణంలోని ప్రధాన రహదారికిరువైపులా ఏర్పాటు చేసిన స్టాల్స్ వద్దకు యువతులు, మహిళలు చేరుకుని రాఖీలను కొనుగోలు చేశారు. రూ.20 నుంచి రూ.280 వరకు విలువైన రాఖీలను కొనుగోలుదారులకు అందుబాటులో ఉంచారు. అయితే స్టాల్స్ విరివిగా పెరగడంతో కొనుగోళ్ళు కూడా అంతంత మాత్రంగానే ఉన్నాయని వ్యాపారులు పేర్కొన్నారు. – తాడేపల్లిగూడెం రూరల్ -
వరలక్ష్మీ వ్రతం పేరిట ధరల దోపిడీ
భీమవరం(ప్రకాశం చౌక్): వరలక్ష్మీ వ్రతం అంటేనే ఏడాదిలో తొలి పండగా భావించి ఏంతో భక్తిశ్రద్ధలతో నిర్వహించుకుంటారు. భక్తుల సెంటిమెంట్ను ఆసరాగా తీసుకొని పూజకు అవసరమైనన పండ్లు, పూలు, అరటి పండ్లు, కొబ్బరికాయల ధరలను పెంచి వ్యాపారస్తులు దోపిడీ చేశారు. జిల్లా వ్యాప్తంగా పూజా సామగ్రి ధరలు గురువారం మధ్యాహ్నం నుంచి అనూహ్యంగా పెరిగిపోయాయి. సాధారణ రోజుల్లో డజను అరటి పండ్లు రూ.50 నుంచి రూ.60 ఉంటే రూ.100 రూపాయలకు విక్రయించారు. లక్ష్మీదేవి అమ్మవారికి పూజకు ఎక్కువగా చామంతి పూలు వినియోగిస్తుంటారు. ఈ నేపథ్యంలో చామంతి పూల రేటు పెంచి కేజీ చామంతులు రూ.600 వరకు విక్రయించారు. కనకాంబరాలను కూడా మర రూ.150 నుంచి రూ.200, మల్లెపూలు రూ.100 నుంచి రూ.150 వరకు అమ్మకాలు చేశారు. తమలపాకులు మోద రూ.50 నుంచి 70 రూపాయలు, కొబ్బరి కాయలు చిన్నవి రూ.30, పెద్దవి రూ.40 రూపాయలు చొప్పున అమ్మకాలు చేశారు. వరలక్ష్మీ వ్రతం పండుగ పేరట ధరల బాగా పెంచడంతో సామాన్యుల వరలక్ష్మీ పూజ ఖర్చుకు ఇబ్బందులు పడ్డారు. -
నేత్రపర్వం.. పవిత్రాదివాసం
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు నేత్రపర్వంగా నిర్వహిస్తున్నార. ఇందులో భాగంగా శుక్రవారం రాత్రి ఆలయ యాగశాలలో అర్చకులు పవిత్రాదివాసాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. ఉదయం విశ్వక్సేనపూజ, పుణ్యహవాచనం, అగ్నిప్రతిష్టాపన కార్యక్రమాలను అర్చకులు, రుత్వికులు అట్టహాసంగా చేశారు. అనంతరం పవిత్రాలకు పంచగవ్య ప్రోక్షణ, అభిమంత్రణలను నిర్వహించారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్ల ఉత్సవమూర్తుల వద్ద పవిత్రాలను ఉంచి పంచ శయనాదివాసాన్ని వేద మంత్రోచ్ఛరణతో అర్చక స్వాములు నిర్వహించారు. ఆ తర్వాత మహాశాంతి హోమాలు, చతుర్వేద పారాయణ చేశారు. -
ఎఫెక్ట్
జాతీయ రహదారి మరమ్మతులు ప్రారంభంకొయ్యలగూడెం: స్థానిక జాతీయ ప్రధాన రహదారి అభివృద్ధికి నేషనల్ హైవే అధికారులు శుక్రవారం పనులను ప్రారంభించారు. జూలై 26న సాక్షిలో ‘అధ్వాన రహదారులతో ఇక్కట్లు’ అనే శీర్షికన ప్రచురితమైన కథనానికి స్పందించిన అధికారులు ఇటీవల చెక్ పోస్ట్ సెంటర్ నుంచి హెచ్డీఎఫ్సీ బ్యాంకు వరకు ప్రమాదకరంగా ఉన్న రోడ్డు మార్జిన్ను పరిశీలించారు. అనంతరం పొక్లెయిన్తో రహదారిపై ఏర్పడిన మార్జిన్ను క్రమబద్ధీకరించే పనులను ప్రారంభించారు. రెండు రోజులలో పనులను పూర్తి చేసి రాకపోకలు పునరుద్ధరిస్తామని అధికారులు పేర్కొన్నారు. అప్పటివరకు డివైడర్కి ఒక పక్కనే రాకపోకలను సాగించడానికి ప్రయాణికులు సహకరించాలని కోరారు. పారిశుద్ధ్యం మెరుగుపర్చేందుకు చర్యలు తాడేపల్లిగూడెం రూరల్: భారీ వర్షాలు కురిస్తే రహదారులపై నీళ్లు నిలిచిపోతుండటం, పారిశుద్ధ్యం లోపిస్తుండటంపై ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి సంబంధిత అధికారులు స్పందించారు. మండలంలోని మోదుగ గుంట, ఉప్పరగూడెం గ్రామాల్లో రోడ్లపై నిలిచిన వర్షపు నీటిని మోటార్లు ఏర్పాటు చేసి, బయటకు పంపించే ఏర్పాటు చేశారు. ఇన్చార్జ్ ఎంపీడీఓ ఎం.వెంకటేష్ ఆధ్వర్యంలో పంచాయతీ సిబ్బంది ఈ కార్యక్రమం చేపట్టారు. అనంతరం రహదారులపై బ్లీచింగ్, ముగ్గు చల్లించారు. -
అడవి తల్లి బిడ్డలు.. కొండరెడ్డి గిరిజనులు
బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో ఆదివాసీ గిరిజన తెగల్లో కొండరెడ్డి గిరిజనుల తెగ ఒకటి. వీరు నేటికీ కొండలపై ఆవాసాలు ఏర్పాటు చేసుకుని నివాసం ఉంటున్నారు. అక్కడే వారి సాంప్రదాయ పంటలైన జొన్న, సామలు, మొక్కజొన్న వంటి పంటలను పండిస్తూ జీవనం సాగిస్తున్నారు. అలాగే పలు గ్రామాల్లో వెదురు అల్లికలు, తేనె, చింతపండు, ఇప్ప పువ్వు వంటి అటవీ ఉత్పత్తులను సేకరిస్తుంటారు. వారాంతపు సంత, ఇతర ప్రభుత్వ కార్యాలయ పనుల మీద మాత్రమే కొండ దిగి కిందకు వస్తుంటారు. వీరికి ప్రధానంగా పోడు వ్యవసాయమే జీవనాధారం. సాతంత్య్రం వచ్చి 79 ఏళ్లు కావొస్తున్నా నేటికీ కొండరెడ్డి గిరిజనులు కొండ ప్రాంతంలోనే జీవనం సాగిస్తూ వస్తున్నారు. ప్రకృతి మాత వడిలోనే జీవిస్తున్నారు. నేటికీ చెక్కుచెదరని సాంప్రదాయం నేటి ఆధునిక ప్రపంచంలో ఎవరి బ్రతుకులు వారివే, ఎవరి పనులు వారివే. అయితే కొండరెడ్డి గిరిజనులు నేటికీ నాటి సాంప్రదాయాలు, ఆచారాలకు కట్టుబడి ఉన్నారు. వ్యవసాయమే కాదు పెళ్లిళ్లు, పేరంటాలు ప్రతిదీ సమష్టిగా చేసుకునే సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. శుభకార్యాల్లో ఒకరికి ఒకరు సహకరించుకోవడం వంటివి నేటికీ చేస్తుంటారు. ప్రకృతే గిరిజనుల ఆరాధ్య దైవం ఆదివాసీ గిరిజనులు ప్రకృతినే ఆరాధ్య దైవంగా కొలుస్తుంటారు. రావి, వేప చెట్లను ముత్యాలమ్మగా భావిస్తారు. ముఖ్యంగా బాట పండుగ, పప్పుల పండుగ, మామిడికాయ పండుగ వంటి పండుగలను ఎంతో వైభవంగా చేస్తారు. అయితే గిరిజనుల్లోనే కోయ తెగ వారు భూదేవి పండుగను తొలకరి సమయంలో ఎంతో వైభవంగా నిర్వహిస్తారు. నేటికీ ఈ పండుగ సాంప్రదాయం కొనసాగుతూనే ఉంది. గత ప్రభుత్వ పాలనలో గిరిజన సంక్షేమానికి పెద్దపీట గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ పాలనలో పెద్దపీట వేశారు. సుమారు 3,220 మంది గిరిజనులకు 69814.72 ఎకరాల్లో పోడు భూములకు పట్టాలిచ్చారు. అదేవిధంగా రైతు భరోసా పథకంలో రైతులకు ప్రతీ ఏటా రూ. 15000 పెట్టుబడి సాయం అందేలా కృషి చేశారు. అలాగే ఫ్యామిలీ డాక్టర్ కాన్సెప్ట్ విధానంతో కొండ ప్రాంతంలో నివసిస్తున్న గిరిజనులకు సైతం మెరుగైన వైద్యసేవలు అందించే విధంగా కృషి చేశారు. అలాగే వలంటీర్ వ్యవస్థ ద్వారా పింఛన్లు కూడా కొండపైన ఉన్నవారికి కూడా ఇంటికే అందే విధంగా చర్యలు తీసుకున్నారు. గిరిజనులకు మెరుగైన వైద్యసేవలు అందేలా సుమారు రూ. 50 కోట్లతో మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి పూనుకున్నారు. అయితే ప్రస్తుతం నిర్మాణ పనులు నిలిచిపోయాయి. అలాగే మారుమూల గ్రామాల నుంచి డోలి కష్టాలు కూడా లేకుండా బైక్ అంబులెన్స్ సేవలను అందించారు. ప్రకృతే వారి ఆరాధ్య దైవం నేడు ప్రపంచ ఆదివాసీ దినోత్సవం గిరిజనులకు మళ్లీ కష్టాలు మొదలు.. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత గత ప్రభుత్వంలో ఏర్పాటు చేసిన పథకాలకు ఒక్కొక్కటిగా మంగళం పలకుతుంది. గతంలో ఎండీయూ వాహనాల ద్వారా ఇంటింటికి రేషన్ అందించేవారు. అయితే ప్రస్తుతం దానిని తొలగించడంతో మళ్లీ గిరిజనులకు వాగులు దాటుతూ తలపై బియ్యం పెట్టుకుని మైళ్ల దూరం నడిచే పరిస్థితులు వచ్చాయి. గతంలో వలంటరీ వ్యవప్థ ద్వారా కోడి కూయక ముందే మారుమూల కొండ ప్రాంతాల్లో ఉన్న వారికి సైతం అన్ని రకాల పింఛన్లు అందేవి. ప్రస్తుతం ఆ పింఛన్లు వారం రోజులు దాటితేకానీ అందే పరిస్థితి లేదని గిరిజనులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదేవిధంగా వైద్యసేవలపై కూడా ఆందోళన చెందుతున్నారు. అయితే ప్రస్తుత ప్రభుత్వ పాలకులు తమకు ఎటువంటి ఇబ్బంది కలుగకుండా పాలన సాగించాలని గిరిజనులు కోరుతున్నారు. -
12న వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ సమావేశం
కై కలూరు: వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా విస్తృత స్థాయి సమావేశ పోస్టర్ను పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం అవిష్కరించారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా ఎస్సీ సెల్ అధ్యక్షుడు తేర ఆనంద్ మాట్లాడుతూ ఈ నెల 12న కండ్రికగూడెం సుఖీభవ కల్యాణ మండపంలో ఉదయం 9 గంటలకు సమావేశం జరుగుతుందన్నారు. సమావేశానికి పార్టీ రాష్ట్ర ఎస్సీ సెల్ అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే టీజేఆర్.సుధాకర్బాబు, రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ కొమ్మరి కనకారావు, ఇతర రాష్ట్ర, జిల్లా స్థాయి నాయకులు విచ్చేస్తారన్నారు. కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని కోరారు. ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్ బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్ గురునాథం, దేవదాసు ప్రేమబాబు, యూత్ నాయకులు కోడిచుక్కల నాగశేషు తదితరులు పాల్గొన్నారు. విద్యాశక్తిపై నిర్బంధం తగదు ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధం చేయడం తగదని స్కూల్ టీచర్స్ అసోసియేషన్(ఎస్టీఏ) రాష్ట్ర అధ్యక్షుడు కాడిశెట్టి శ్రీనివాసులు అన్నారు. రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్తో కలిసి ఏలూరులోని జీజె రెసిడెన్సీలో జరిగిన ఏలూరు జిల్లా కార్యవర్గ సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఆయన మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో విద్యాశక్తి కార్యక్రమం ఐచ్ఛికంగా నిర్వహించాలని పాఠశాల విద్యా శాఖ డైరెక్టర్ తెలిపారని, కొన్ని జిల్లాల్లో విద్యాశక్తి కార్యక్రమాన్ని నిర్బంధంగా నిర్వహించమనడం సబబు కాదన్నారు. విద్యార్థులు సాయంత్రం నాలుగు గంటలకు అలసిపోతారని, ఆ సమయంలో విద్యాశక్తి అని చెప్పి అదనంగా తరగతులు నిర్వహించడం వల్ల ఎలాంటి ప్రయోజనం ఉండదన్నారు. విద్యాశక్తిపై ఎవరినీ నిర్బంధం చేయవద్దన్నారు. చాలామంది ఉపాధ్యాయులు అదనపు తరగతులు నిర్వహించి వారి సిలబస్ను పూర్తి చేసి వెనుకబడిన విద్యార్థులకు రెమిడియల్ తరగతులు నిర్వహిస్తున్నారన్నారు. కొత్త ప్రభుత్వం ఏర్పాటై సంవత్సరం దాటినా పీఆర్సీ, డీఏల ఊసెత్తకపోవడం దారుణమన్నారు. ఉద్యోగ, ఉపాధ్యాయులకు రావాల్సిన పెండింగ్ బకాయిలు వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. లీవ్ ఎన్క్యాష్మెంట్ బిల్లులు పెట్టి సంవత్సరాలు గడుస్తున్నా చెల్లింపులు చేయకపోవడం సమంజసం కాదన్నారు. కార్యక్రమానికి ఏలూరు జిల్లా అధ్యక్షుడు కాటి వెంకటరమణ అధ్యక్షత వహించగా, జిల్లా ప్రధాన కార్యదర్శి తోట ప్రసాద్, గౌరవ అధ్యక్షుడు ఉర్ల గంధర్వరావు, అసోసియేట్ అధ్యక్షుడు పిట్ట ఫెడ్రిక్ బాబు, మహిళా అధ్యక్షురాలు జీ సంధ్యారాణి, సీనియర్ నాయకులు కే బాలరాజు, టీ అంజిబాబు, దాసరి యేసు పాదం, కే జేమ్స్, డీ వరప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. రేషన్ బియ్యం పట్టివేత ద్వారకాతిరుమల: మండలంలోని జి.కొత్తపల్లిలో రేషన్ బియ్యం అక్రమంగా నిల్వ చేసిన ఓ ఇంటిపై సివిల్ సప్లై అధికారులు శుక్రవారం రాత్రి దాడి చేశారు. దాడిలో రూ. 1.50 లక్షలు విలువైన 3,750 కేజీల రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నారు. గ్రామానికి చెందిన మాటూరి దుర్గారావు జి.కొత్తపల్లి గ్రామంతో పాటు, చుట్టుపక్కల గ్రామాల్లో లబ్ధిదారుల నుంచి రేషన్ బియ్యాన్ని కొనుగోలు చేసి.. బియ్యాన్ని జి.కొత్తపల్లిలోని ఉపాధిహామీ కూలి దాసరి రాజు ఇంట్లో నిల్వ చేస్తున్నాడు. రాత్రి సమయాల్లో గుట్టుచప్పుడు కాకుండా ఆ బియ్యాన్ని బయటకు తరలిస్తున్నాడు. దీనిపై సమాచారం అందుకున్న ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం సివిల్ సప్లై డిప్యుటీ తహసీల్దార్లు నాగరాజు, వెంకటేశ్వరరావు, వీఆర్ఏ బ్రహ్మయ్యలు ఆ ఇంటిపై దాడి చేశారు. అనంతరం పోలీసుల సమక్షంలో గది తలుపులు తెరచి 75 రేషన్ బియ్యం బస్తాలను స్వాధీనం చేసుకున్నారు. -
న్యాయం జరిగే వరకూ పోరాటం
ఉండి: మండలంలోని పాములపర్రు దళిత శ్మశాన వాటికలో ఆక్వా రైతుల కోసం రోడ్డు వేయాలనే నిర్ణయంపై వివాదం రోజు రోజుకు ముదురుతోంది. శుక్రవారం మాల మహానాడు సంఘాలు, కేవీపీఎస్, సీపీఎం, అంబేడ్కర్ ఎంప్లాయిస్ యూనియన్, అంబేడ్కర్ మిషన్ వంటి సంఘాల నాయకులు పాములపర్రు దళితులను పరామర్శించి శ్మశాన వాటికను పరిశీలించారు. పాములపర్రు ఘటనపై పోలీసుల దౌర్జన్యాన్ని వారు తీవ్రంగా ఖండించారు. శ్మశానం జోలికి ఎవరు వచ్చినా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని ప్రతిజ్ఞ చేశారు. స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజుకు దళితులపై ఎందుకంత కక్ష అని వారు ప్రశ్నించారు. కార్యాలయంలో కూర్చుని ఆదేశాలివ్వడం కాదని శ్మశాన వాటికకు వచ్చి చూస్తే రోడ్డు ఎవరికోసం వేస్తున్నారో అర్థమవుతుందని అన్నారు.ఎవరో ఇద్దరు ఆక్వారైతుల కోసం రోడ్డు వేయిస్తూ వందల మంది దళితులను ఎందుకు బాధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు 150 ఏళ్ల నుంచి గ్రామంలో దళితుల శ్మశాన వాటిక భూమిని ఇప్పుడు కాదంటే ఎలా అని ప్రశ్నించారు. ప్రతి దళిత పేటకు రెండెకరాల వరకు భూమి ఇవ్వాలని ప్రభుత్వ జీవో చెబుతుంటే ఇప్పుడు ఆ భూమిలో రోడు వేస్తామనడంపై మండిపడ్డారు. ప్రభుత్వ రికార్డులను మాలమహానాడు నాయకులు అడుగుతుంటే సర్వే, రెవెన్యూ శాఖాధికారులు ఎందుకు ఇవ్వడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారుల తీరు ఇలాగే ఉంటే ఉద్యమం తీవ్రతరం కాక తప్పదని వివిధ సంఘాల నాయకులు హెచ్చరించారు. సామరస్యంగా సమస్య పరిష్కారం కావాలంటే ముందుగా 144 సెక్షన్ ఎత్తేసి పోలీసులు వెళ్లిపోవాలని వారు డిమాండ్ చేశారు. పరామర్శించిన వారిలో మాలమహానాడు అధ్యక్షుడు నల్లి రాజేష్, జిల్లా అధ్యక్షుడు గుండు నగేష్, దళిత ఐక్యవేదిక రాష్ట్ర అధ్యక్షుడు గంటా సుందర్కుమార్, దానం విద్యాసాగర్, కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కే క్రాంతిబాబు, జిల్లా అధ్యక్షుడు విజయ్, సీపీఎం జిల్లా నాయకుడు ధనికొండ శ్రీనివాస్, అంబేడ్కర్ ఎంప్లాయిస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు మధు, ఉపాధ్యక్షుడు రాజ్కుమార్ ఉన్నారు. మండల వ్యాప్తంగా 144 సెక్షన్ మండల వ్యాప్తంగా 144 సెక్షన్ అమలు చేస్తున్నట్లు మండలంలో ప్రచారం చేయించారు. పోలీసుల ద్వారా భయభ్రాంతులకు గురిచేసే ప్రయత్నాలను కూటమి నాయకులు చేస్తున్నారని దళితులు ఆరోపిస్తున్నారు. దళిత శ్మశాన వాటికలో రోడ్డు వేస్తారా? పాములపర్రులో దళిత సంఘాల నేతల ఆగ్రహం కూటమి నాయకులు, పోలీసుల మైండ్గేమ్ -
వేదంతో పులకించిన సరిపల్లె
గణపవరం: గణపవరం మండలం సరిపల్లె గ్రామం వేదపండితులు, ఘనాపాఠీలు, వేద విద్యార్థుల పాదస్పర్శతో పులకరించింది. దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలకు చెందిన వేదవిద్యార్థులు తమ ప్రతిభను నిరూపించుకోవడానికి ఇక్కడ నిర్వహించే వేద పరీక్షలకు హాజరయ్యారు. వీరిని పరీక్షించడానికి వేదపారాయణం, పాండిత్యంలో ఆరితేరిన వేదపండితులు, ఘనపాఠీలు పరీక్షాధికారులుగా విచ్చేశారు. సరిపల్లెలోని సఖ్యాభివర్ధక నిలయంలో గాయత్రి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో 105వ వేదశాస్త్ర పరిషత్ మహా సభలు మూడు రోజులపాటు నిర్వహించనున్నారు. గణపవరానికి చెందిన సాగిరాజు సుబ్బరాజు ఆర్థిక సహకారంతో గత మూడు దశాబ్దాలుగా సరిపల్లె టీటీడీ కల్యాణమండపంలోని ఈ వేదశాస్త్ర పరిషత్ మహాసభలు నిర్వహిస్తున్నారు. వేదవిద్యార్ధులకు ఇక్కడ రుగ్వేదం, యజుర్వేదం, సామవేదం, అధర్వణ వేదాలలో పరీక్షలు నిర్వహించి, ఉత్తీర్ణులైన వారికి సర్టిఫికెట్లు అందచేస్తారు. ఏటా శ్రావణ శుద్ధ పౌర్ణమి రోజును నిర్వహించే వేదపరిషత్ సభలో ఉత్తీర్ణులైన వేద విద్యార్థులకు ఉత్తీర్ణత సర్టిఫికెట్లు ప్రదానం చేస్తారు. గురు, శుక్రవారాలలో నాలుగు వేదాలలో నిర్వహించిన పరీక్షలకు ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాలతోపాటు, బిహార్, రాజస్థాన్, ఒడిశా, తమిళనాడు, మహారాష్ట్ర, బెంగుళూరు, తితిదే వేద విశ్వవిద్యాలయం నుంచి 130 మంది వేద విద్యార్థులు హాజరయ్యారు. 14 మంది సీనియర్ వేదపండితులు, ఘనపాఠీలు హాజరయ్యారు. -
ఇంటింటా శ్రావణ శోభ
శ్రావణ మాసం రెండో శుక్రవారం సందర్భంగా జిల్లా వ్యాప్తంగా మహిళలు భక్తి శ్రద్ధలతో వరలక్ష్మీ వ్రతం పూజలు వైభవంగా, ఆనందోత్సాహాలతో జరుపుకున్నారు. పూజ అనంతరం మహిళలు చేతికి తోరణాలు కట్టుకుని ముత్తైదువులకు తోరణాలు కట్టి వాయినాలు, తాంబూళాలు అందజేసి ఆశీర్వచనాలు తీసుకున్నారు. సాయంత్రం సమీపంలో ఉన్న అమ్మవారి ఆలయాలకు వెళ్లి అమ్మవార్లను దర్శించుకుని కుంకుమ పూజలు నిర్వహించారు. భీమవరంలో మావుళ్లమ్మ వారికి 9 లక్షల గాజులతో అలంకరణ చేశారు. మావుళ్లమ్మకు అజ్ఞాత భక్తులు సుమారు రూ. 11 లక్షల విలువ చేసే 108 బంగారు పుష్పాలను సమర్పించారు. – సాక్షి నెట్వర్క్ -
చింతలపూడి కూటమిలో సొసైటీ రగడ
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చింతలపూడి కూటమిలో సొసైటీల వార్ మొదలైంది. నిన్న మొన్నటి వరకు అడపాదడపా అసంతృప్తులు, వెంటనే సర్ధుబాటులతో కొనసాగిన టీడీపీ, జనసేన కాపురం రచ్చకెక్కింది. పదవుల పంపకాల్లో ప్రాధాన్యతలపై రెండు పార్టీల మధ్య మాటల యుద్ధానికి తెరలేచింది. నియోజకవర్గంలో 20 సొసైటీలుంటే ముష్టివేసినట్లు రెండు సొసైటీలే జనసేనకు కేటాయించడంపై జనసేన ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య, టీడీపీ ఎమ్మెల్యే సొంగా రోషన్ తీరును తప్పుపడుతూ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం కలకలం రేపింది. ఇదే క్రమంలో జిల్లాలో జనసేన ఎమ్మెల్యేలు ఉన్న నియోజకవర్గాల్లో మాత్రం టీడీపీ పట్టుపట్టి 50 శాతం వరకు పదవులు దక్కించుకుంది. టీడీపీ నియోజకవర్గాల్లో మాత్రం జనసేనకు పట్టుమని 10 శాతం కూడా కేటాయించకపోవడంపై జనసేనలో కలకలం రేగుతుంది. గత సార్వత్రిక ఎన్నికల్లో జనసేన, టీడీపీ, బీజేపీ కూటమిగా ఏర్పడి ఉమ్మడి అభ్యర్థులను బరిలో నిలిపింది. ఈ క్రమంలో ఏలూరు జిల్లాలో పోలవరం, ఉంగుటూరు జనసేనకు, కై కలూరు బీజేపీకి కేటాయించారు. ఆయా పార్టీలకు మద్ధతు ఇవ్వడంతో పాటు ప్రచారం నిర్వహించేలా ఒప్పందాలు చేసుకున్నారు. ఈ క్రమంలో మార్కెట్ యార్డు చైర్మన్లు, దేవాలయాల పాలక మండలి, సొసైటీ చైర్మన్లు, ఇతర స్థానిక నామినేటెడ్ పదవుల విషయంలో మూడు పార్టీలు పంచుకోవాలని నిర్ణయించారు. జనసేన నేత జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ పదవుల పంపకాల విషయంలో గతంలో జిల్లాలో సెటిల్మెంట్ తరహాలో సమావేశం పెట్టారు. ఉదాహరణకు టీడీపీ ఎమ్మెల్యే ఉన్న నియోజకవర్గంలో 50 శాతానికిపైగా పదవులు టీడీపీ ఎమ్మెల్యే తీసుకోవడం, మిగిలిన 50 శాతం జనసేన, బీజేపీ కలిపి పంచుకోవాలనేది పెద్దల నిర్ణయం. కట్చేస్తే.. టీడీపీ మాత్రం టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్న చోట 90 శాతానికిపైగా పదవులు టీడీపీకే కేటాయించుకోవడం, జనసేన ఎమ్మెల్యేలు ఉన్నచోట్ల పోటీగా 50 శాతం పదవులు దక్కించుకుని కూటమి ధర్మానికి తూట్లు పొడుస్తూ జనసేన నేతలను నిత్యం అవమానించేలా వ్యవహరిస్తున్నారు. 20 సొసైటీల్లో రెండు మాత్రమే 20 సొసైటీ చైర్మన్లకు 18 టీడీపీ, 2 జనసేనకు కేటాయింపు 5 ఇస్తామని ఒప్పందం చేసుకుని రెండు ఇవ్వడంపై మండిపాటు సోషల్ మీడియా వేదికగా టీడీపీ ఎమ్మెల్యేపై జనసేన ఇన్చార్జి తీవ్ర అసహనం 20 సొసైటీలకు 2 ముష్టి వేస్తారా? అంటూ ఆగ్రహం బీజేపీకి ఒక స్థానం కూడా దక్కని వైనం చింతలపూడి నియోజకవర్గంలో మొత్తం 20 సొసైటీలున్నాయి. వీటిలో 15 సొసైటీలు టీడీపీ తీసుకుంటే.. కామవరపుకోట, పోతునూరు, గుర్వాయిగూడెం, తాడువాయి, వేగవరం సొసైటీలను జనసేనకు ఇస్తామని ఎమ్మెల్యే సొంగా రోషన్, జనసేన ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య, మరికొందరు నేతలు కలిసి మాట్లాడుకుని ప్రకటించారు. సామాజిక ప్రయోజనాల నేపథ్యంలో మేజర్ సొసైటీ తాడువాయిని మళ్ళీ టీడీపీ కావాల్సిందేనని పట్టుపట్టి వెనక్కి తీసుకున్నారు. ఆ తరువాత ఇదేరీతిలో వేగవరాన్ని కూడా కుడిచేతితో ఇచ్చి ఎడమ చేతితో లాగేసుకున్నారు. ఇక పోతునూరు, గుర్వాయిగూడెంకు జనసేనను పరిమితం చేశారు. తిరుమలాపురం జనసేనకు ఇస్తామని గతంలో హామీఇచ్చారు. అయితే జనసేన ఇచ్చిన పేరు కాకుండా జనసేనలో ఎమ్మెల్యే రోషన్కు సన్నిహితుడైన వ్యక్తి పేరును జనసేన నేతలతో సంప్రదించకుండా ఇవ్వడంపై రగడ కొనసాగుతోంది. ఈ పరిణామాల క్రమంలో జనసేన ఇన్చార్జి మేకా ఈశ్వరయ్య సోషల్ మీడియా, వాట్సప్ల్లో భారీ పోస్టులు పెట్టి ఇదేనా పొత్తు ధర్మం.. జనసేనను ఎమ్మెల్యే రోషన్ అడుగడుగునా మోసం చేస్తూనే ఉంటారా? జనసేన పార్టీలోనూ ఎమ్మెల్యేదే పెత్తనమా అంటూ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. ఈ పోస్టు జిల్లాలో వైరల్గా మారింది. ఇదే క్రమంలో పోలవరం నియోజకవర్గంలో జనసేన ఎమ్మెల్యే ఉన్న చోట 24 సొసైటీలుంటే 10 టీడీపీ, 14 జనసేన దక్కించుకుంది. జనసేన ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తున్న ఉంగుటూరులో 17 సొసైటీలుంటే 8 జనసేన, 8 టీడీపీ, ఒకటి బీజేపీ పంచుకుంది. పోలవరం, చింతలపూడిలో బీజేపీని పూర్తిగా అటకెక్కించడం, చింతలపూడిలో జనసేనను 10 శాతానికి పరిమితం చేయడంపై రగడ కొనసాగుతోంది. -
ప్రజల్ని మోసగించడంలో బాబు దిట్ట
చింతలపూడి: ప్రజల్ని మోసం చేయడంలో చంద్రబాబు దిట్ట అని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. శుక్రవారం స్థానిక వీకేఎం ఫంక్షన్ హాల్లో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ చింతలపూడి మండల పార్టీ విస్త్రృత స్థాయి సమావేశం మండల అధ్యక్షుడు ఎస్.రమేష్ రెడ్డి అధ్యక్షతన జరిగింది. ముఖ్య అతిథిగా హాజరైన దూలం నాగేశ్వరావు మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన సూపర్ సిక్స్ వాగ్దానాలు ఏమయ్యాయని ప్రశ్నించారు. రాష్ట్రాన్ని అభివృద్ధి చేయడం చేతకాక జగన్ వల్లే రాష్ట్రం వెనుకబడిపోయిందని అసత్య ప్రచారాలు, బురదజల్లే కార్యక్రమాలు తప్ప ప్రజలకు కూటమి ప్రభుత్వం ఈ ఏడాది పాలనలో చేసింది ఏమీ లేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన వాగ్దానాలను నూరు శాతం అమలు చేసి ప్రపంచ చరిత్రలోనే జగన్మోహన్ రెడ్డి మన్ననలు పొందారన్నారు. జగన్ హయాంలో ప్రవేశపెట్టిన వలంటీర్ వ్యవస్థ అద్భుతం అన్నారు. ఇచ్చిన వాగ్దానాలను అమలు చేయలేక చంద్రబాబు రాష్ట్రాన్ని అప్పుల కుప్పగా మార్చారని ఎద్దేవా చేశారు. రాబోయే ఎన్నికల్లో నూటికి నూరు శాతం జగన్మోహన్ రెడ్డి సీఎం అవ్వడం ఖాయమన్నారు. పార్టీకి నష్టం కలిగించే వారు ఎంతటి వారైనా చర్యలు తప్పని హెచ్చరించారు. కేసులకు భయపడద్దని ధైర్యంగా ముందుకు వచ్చి కూటమి ప్రభుత్వ అవినీతిని ఎండగట్టాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. చంద్రబాబు నైజాన్ని ఎండగట్టాలి: విజయరాజు రాష్ట్రంలో చంద్రబాబు నయవంచక పాలనను ప్రజలు గమనిస్తున్నారని పార్టీ నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు అన్నారు. హామీలను అమలు చేయకుండా అబద్ధాలతో గద్దెనెక్కిన చంద్రబాబు నైజాన్ని గడపగడపకు వెళ్లి చెప్పాలని కార్యకర్తలకు పిలుపునిచ్చారు. పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ విభేదాలతో పార్టీని బలహీనపరచొద్దని కార్యకర్తలను కోరారు. అభిప్రాయ భేదాలు పక్కనపెట్టి పార్టీని గెలిపించుకోవాలని చెప్పారు. సమావేశంలో పార్టీ మండల అనుబంధ సంఘాలకు ఎంపికై న నాయకులను సత్కరించారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకి రెడ్డి, మండల అధ్యక్షుడు ఎస్.రమేష్ రెడ్డి, జెట్పీటీసీ ఎం.నీరజ సుధాకర్, ఎంపీపీ డాక్టర్ బి.రాంబాబు నాయక్, జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, సర్పంచులు, ఎంపీటీసీలు పాల్గొన్నారు. చింతలపూడిలో ‘బాబు ష్యూరిటీ.. మోసం గ్యారెంటీ’ సమావేశంలో డీఎన్నార్ -
సాక్షి కథనాలకు స్పందన
తాడేపల్లిగూడెం, కొయ్యలగూడెంలో పారిశుద్ధ్య లోపం, రహదారుల మరమ్మతులపై ‘సాక్షి’ పత్రికలో ప్రచురితమైన కథనాలకు అధికారులు స్పందించి చర్యలు చేపట్టారు. 8లో uఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ప్రమాదకరం ఏలూరు (టూటౌన్): ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ ఎన్నికల ప్రజాస్వామ్యానికి ప్రమాదమని, ఓటర్ల హక్కును హరించే ఎస్ఐఆర్ను ఉపసంహరించుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కమిటీ డిమాండ్ చేసింది. ఎన్నికల సంఘం బీజేపీకి తొత్తుగా మారడం తగదని, ఓటర్ల నమోదుకు పౌరుసత్వంతో ముడి పెట్టరాదని డిమాండ్ చేస్తూ సీపీఎం ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా జరిగిన ఆందోళనలో భాగంగా శుక్రవారం స్థానిక పాత బస్టాండ్ వద్ద ధర్నా నిర్వహించారు. సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఏ రవి మాట్లాడుతూ రాజ్యాంగం ఇచ్చిన ఓటు హక్కును తొలగించేలా ఎస్ఐఆర్ను చేపట్టడాన్ని సీపీఎం తీవ్రంగా వ్యతిరేకిస్తుందన్నారు. బీజేపీ ప్రభుత్వాన్ని గెలిపించడం కోసం ఎస్ఐఆర్ను తీసుకొచ్చారని విమర్శించారు. బిహార్లో దాదాపు 65 లక్షల ఓట్లను తొలగించారని తెలిపారు. కర్ణాటకలో ఉన్న మహాదేవపూర్ అనే పార్లమెంటు స్థానంలో 1,10,000 దొంగ ఓట్లు ఉన్నాయని రాహుల్ గాంధీ తెలిపిన విషయాన్ని ఈ సందర్భంగా గుర్తు చేశారు. ఎన్నికల కమిషన్ స్వతంత్రంగా వ్యవహరించాలని, దొంగ ఓటర్లను వెంటనే తొలగించాలని, అర్హులైన వారందరికీ తమ ఓటు హక్కును వినియోగించుకునేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. -
జోరుగా చేపనారు ఉత్పత్తి
ఉంగుటూరు: రాష్ట్రంలోనే పేరుగాంచిన బాదంపూడి ప్రభుత్వ మత్స్య కేంద్రంలో చేపనారు ఉత్పత్తి జోరుగా సాగుతోంది. ఇక్కడ చేపనారు ఉత్పత్తి జూలై నుంచి ప్రారంభించి నవంబరు వరకు కొనసాగిస్తారు. ఈ ఏడాది చేపనారు ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లుగా ప్రభుత్వం నిర్ధేశించగా జూలైలో 4 కోట్ల 40 లక్షలు చేపనారు ఉత్పత్తి పూర్తి చేశారు. రాహు, కట్ల, మ్రిగాలా, కామన్ రకాలు పిల్లలు ఇక్కడ ఉత్పత్తి చేస్తారు. ఉత్పత్తి చేసిన చేపనారు పిల్లలను కొవ్వలి, ఏలూరు, తణకు, కర్నూలు, గాజుల దిన్నె, మోటూరు, తదితర ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేశారు. ఫారంలో ఒక ఫీల్ట్మేన్, ఒక ఫిషర్మేన్, ఇద్దరు కూలీలు పనిచేస్తున్నారు. రెండు అంగుళాలు ఉన్న చేపపిల్లలు ఫింగర్ లింగ్సు టార్గెట్ ఒక కోటిగా ఉంది. 90 లక్షలు ఇప్పటికే నిల్వ చేసి ఉంచారు. చైనీస్ విధానంలోనే ఉత్పత్తి చేపనారు ఉత్పత్తి చైనీస్ హేచరీస్లోనే ఉత్పత్తి చేయడం జరుగుతోంది. మేలుజాతి తల్లిచేపలను ముందుగానే సేకరించి చెరువుల్లో పెంచుతారు. వాటిలో ముందురోజు సాయంత్రం తల్లి చేపలు మగ, ఆడకు ఓవ సీస్ (తల్లి చేపలకు హర్మోన్) ఇంజక్షన్ ఇస్తారు. ఆ రెండు చేపలు సంయోగ పక్రియ ద్వారా గుడ్లును విడుదల చేస్తాయి. ఈరెండు బాహ్యఫలదీకరణ చెందిన గుడ్డు ఏర్పడుతాయి. ఇవి నీటిని షోచించుకుని ఉబ్బి ఉదయానికి గుడ్లు మధ్యలో స్పష్టమైన కేంద్రకుము ఏర్పడుతుంది. ఈ గుడ్లు తరువాత సమవిభజనతో అబివృద్ధి చెంది వివిధ దశలగా రూపాంతరం చెందుతూ స్పాన్గా తయారవుతుంది. బ్రీడింగును సాయంత్రం వేళలో నిర్వహిస్తారు. తరువాత రోజు ఉదయానికి గుడ్లు ఏర్పడతాయి. ఈ గుడ్లు మరుసటి రోజు సాయంత్రానికి ఒక వయస్సు కలిగిన స్పాన్గా ఉత్పత్తి అవుతాయి. ఇలా అభివృద్ధి చెందిన స్పాన్ మరో రెండురోజులు హేచరీ నందు ఉంచడం జరుగుతుంది. మెత్తంగా మూడురోజులు కలిగిన స్పాన్ను ఉత్పత్తి చేయడం జరుగుతుంది. 6 గంటల సమయంలో చైనీస్ హేచరీలో వేస్తారు. ఇలాచేపనారు ఉత్పత్తిచేసి ప్రభుత్వ ఫారాలకు సరఫరా చేస్తారు. రాష్ట్రంలోనే ప్రసిద్ధి గాంచింది రాష్ట్రంలోనే పేరు గాంచిన ఈ చేపల ఉత్పత్తి కేంద్రానికి అనుబంధంగా శిక్షణా కళాశాల నడుస్తోంది. ఇందులో మూడు నెలలు కోర్సు ప్రభుత్వం నిర్వహిస్తోంది. ఇక్కడ చదువుకున్న వారికి ఫిషర్మేన్ ఇతర ప్రభుత్వ ప్రైవేట్ ఫారాల్లో పోస్టులు కూడా చేస్తున్నారు. అందువల్ల ఈశిక్షణా కేంద్రానికి ఉమ్మడి రాష్ట్రంలోనే పేరుంది. కాగా బాదంపూడి మత్య్స కేంద్రాన్ని అభివృద్ధి చేయాలని పలువురు కోరుతున్నారు. ఈ క్షేత్రంలో నూతన భవనాలు లేకపోవడంతో తల్లి చేపలు పెంచడంలేదు. సమయానికి కొనుగోలు చేసి కాలం వెళ్లదీస్తున్నారు. తగినంతమంది సిబ్బంది లేకపోవడం, జిల్లా, రాష్ట్ర స్థాయి మత్స్య శాఖ అధికారుల పర్యవేక్షణా లోపం కూడా ఇక్కడ ఉంది. ఈ ఏడాది ఉత్పత్తి లక్ష్యం 24 కోట్లు ఇప్పటివరకు 4.40 కోట్ల ఉత్పత్తి పూర్తి ఉత్పత్తి చేసిన చేపనారు ప్రభుత్వ ఫారాలకు సరఫరా -
వైభవంగా శ్రీవారి పవిత్రోత్సవాలు ప్రారంభం
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య పవిత్రోత్సవాలు గురువారం రాత్రి వైభవంగా ప్రారంభమయ్యాయి. ముందుగా ఆలయ యాగశాలలో అర్చకులు విష్వక్సేనపూజ, పుణ్యహవాచనము, అజాప్రదీపారాధన, వాస్తుపూజ, మృత్సంగ్రహణ, అలాగే వాస్తు హోమం, పవిత్ర శుద్ధిని జరిపారు. అనంతరం అంకురార్పణను నిర్వహించి ఉత్సవాలకు శ్రీకారం చుట్టారు. అంతక ముందు అర్చకులు, పండితులు పుట్టమన్నును తెచ్చి సిద్ధంగా ఉంచిన పాలికల్లో పోశారు. ఆ తరువాత మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ నవధాన్యాలను పాలికల్లో ఉంచారు. దాంతో అంకురార్పణ కార్యక్రమం ముగిసింది. ఆలయంలో ఏడాది పొడవునా తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయఃశ్చిత్తం నిమిత్తం ఈ పవిత్రోత్సవాలను జరపడం సంప్రదాయంగా వస్తోంది.పంట కాలువకు గండిఇరగవరం: కాకిలేరు నుంచి కొయ్యేటిపాడు మీదుగా వెళ్లే రాపాక చానల్ పంట కాలువకు బుధవారం సాయంత్రం కురిసిన వర్షానికి గండి పడింది. దీంతో వర్షపు నీరు పొలాల్లోకి చేరడంతో రైతులు ఆందోళన చెందారు. ఇరిగేషన్ అధికారులకు సమాచారం ఇవ్వగా రాపాక చానెల్ నీరు నిలుపుదల చేసి గండి పూడ్చారు. కాగా కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కూటమి నేతలు పనులు పంచుకుని వేసవిలో కాలువ ఆధునికీకరణ పనులు నాసిరకంగా చేశారని, పర్యవేక్షించాల్సిన అధికారులు ఆలసత్వం వహించడంతో ఇప్పుడు ఇబ్బందులు పడుతున్నామని రైతులు వాపోయారు. దీనిపై మార్టేరు ఇరిగేషన్ జేఈ జై శంకర్ని వివరణ కోరగా కాలువను ఆధునీకరిస్తు ఉండగా రైతులు తమ దృష్టికి తీసుకురాకుండా తూర ఏర్పాటు చేసుకున్నారని, దాని చుట్టూ మట్టి నెరలు ఏర్పడ్డాయని, అవి ఇప్పుడు వర్షానికి కరిగిపోయి గండిగా ఏర్పడిందని, మరమ్మతులు చేసినట్లు చెప్పారు. -
ఆంధ్రా చేపల సాగు అదుర్స్
జార్ఖండ్ ఆక్వా రైతుల కితాబు కై కలూరు : ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర కొల్లేరు ప్రాంతంలో ఆక్వా సాగు ఆచరణాత్మకంగా ఉందని జార్ఖండ్ రాష్ట్ర ఔత్సాహిక చేపల రైతులు కితాబిచ్చారు. మూడు రోజుల క్షేత్ర స్థాయి పరిశీలనలో భాగంగా కై కలూరు పరిసర ప్రాంతాల్లో రైతుల బృందం గురువారం పర్యటించింది. కై కలూరు మత్స్యశాఖ సహాయ సంచాలకులు బి.రాజ్కుమార్, మత్స్యశాఖ అభివృద్ధి అధికారి సీహెచ్.గణపతి ఆక్వా సాగు మెలకువలను రైతులకు వివరించారు. ఆటపాక గ్రామంలో ముదునూరి సీతారామరాజు చేపల చెరువును పరిశీలించి సాగు విధానాలను రైతుల నుంచి సేకరించారు. కై కలూరులో పలు ఆక్వా మందుల దుకాణాలను సందర్శించి చేపల సాగులో ఎదురవుతున్నా వ్యాధులు, ఎటువంటి మందులు వినియోగిస్తారు అనే విషయాలు నమోదు చేసుకున్నారు. అక్కడ నుంచి ఆచవరంలో చేపల ప్యాకింగ్ చేసే విధానాన్ని పరిశీలించారు. చివరిగా మండవల్లి మండలం కొర్లపాడులో కొరమేను చేపల సాగును పరిశీలించి రైతు నుంచి సాగు పద్ధతులు, పెట్టుబడి, కొరమేను విత్తనం, మార్కెట్లో రేటు, నీటి వనరులు వంటి విషయాలను అడిగి తెలుసుకున్నారు. బృందానికి నాయకత్వం వహించిన జార్ఖండ్ ఫిషరీష్ ఫిల్డ్ ఆఫీసర్ ప్రశాంత్కుమార్ దీపక్ మాట్లాడుతూ నేషనల్ ఫిషరీస్ డెవలప్మెంట్ బోర్డు(ఎన్ఎఫ్డీఏ), హైదరాబాదు సౌజన్యంతో జార్ఖండ్ ప్రభుత్వ మత్స్య, పశుసంవర్థక, కోఆపరేటివ్శాఖ ఆధ్వర్యంలో 15 మంది రైతులు బృందం వచ్చామన్నారు. ఇక్కడ సేకరించిన ఆక్వా సాగు పద్ధతులను జార్ఖండ్ ప్రభుత్వానికి నివేదిస్తామన్నారు. శుక్రవారం కొల్లేరు ప్రాంతంలో మరింతగా చేపల సాగు పద్ధతులను తెలుసుకుని, శనివారం మచిలీపట్నం వెళతామన్నారు. కార్యక్రమంలో గ్రామ మత్స్యశాఖ సహాయకుడు గోవింద్ తదితరులు పాల్గొన్నారు. -
ట్రావెల్ బస్సును ఢీకొన్న లారీ
ఒకరి మృతి, బస్సు డ్రైవర్కు గాయాలు భీమడోలు: పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెనపై బుధవారం ఆర్ధరాత్రి ప్రైవేటు ట్రావెల్ బస్సును లారీ ఢీకొట్టిన ఘటనలో ఒక వ్యక్తి మృతి చెందగా మరొకరికి గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అనకాపల్లికి చెందిన కె.గణేష్ (28) కుటుంబ పోషణ నిమిత్తం నెల్లూరులోని ఓ రైస్ మిల్లులో కూలీగా పని చేస్తున్నాడు. వరుసగా మూడు రోజులు సెలవులు రావడంతో స్వగ్రామంలోని కుటుంబ సభ్యులను చూసేందుకు గణేష్, తులసి ప్రైవేటు ట్రావెల్ బస్సు టికెట్ను రిజర్వేషన్ చేయించుకున్నాడు. బుధవారం రాత్రి నెల్లూరు నుంచి అనకాపల్లికి బస్లో వెళ్తుండగా మార్గమధ్యమైన పొలసానిపల్లి ఫ్లై ఓవర్ వంతెన వద్దకు వచ్చేసరికి ఓ లారీ డ్రైవర్ నిర్లక్ష్యంగా లారీని నడుపుతూ బస్సును ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో బస్సు డ్రైవర్ వెనుక సీటులో కూర్చుని నిద్రిస్తున్న కె.గణేష్ రోడ్డుపై పడడంతో తీవ్ర గాయాలయ్యాయి. బస్సు డ్రైవర్కు కూడా గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలిస్తుండగా మార్గమధ్యంలో కె.గణేష్ మృతి చెందాడు. మృతునికి భార్య, ఇద్దరు పిల్లలున్నారు. ఈ ప్రమాదంలో బస్సు ముందుభాగం దెబ్బతింది. ఈ బస్సులో 30 మంది ప్రయాణిస్తుండగా ప్రమాదం జరిగిన వెంటనే వారంతా బెంబేలెత్తిపోయారు. అదృష్టవశాత్తూ వారికి ఎటువంటి గాయాలు కాకపోవడంతో ఊపిరిపీల్చుకున్నారు. భీమడోలు ఎస్సై వై.సుధాకర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రంక్ అండ్ డ్రైవ్ కేసులో జరిమానా భీమవరం: డ్రంక్ అండ్ డ్రైవ్ కేసుల్లో పట్టుబడిన వ్యక్తులకు కోర్టు జరిమానా విధించినట్లు సీఐ జి కాళీచరణ్ చెప్పారు. భీమవరం టూటౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని అంబేడ్కర్ సెంటర్, పద్మాలయ థియేటర్, బీవీ రాజు విగ్రహం ఏరియాల్లో మద్యం సేవించి వాహనాలు నడుతున్న ఆరుగుర్ని అరెస్ట్ చేసి భీమవరం, స్పెషల్ జ్యుడిషియల్ సెకండ్ క్లాస్ మేజిస్ట్రేట్ వద్ద హాజరుపర్చగా రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. బహిరంగంగా మద్యం సేవిస్తున్న ముగ్గురికి రూ.500 చొప్పున జరిమానా విధించారని చెప్పారు. -
కూటమి ప్రభుత్వంలో బీసీలకు అన్యాయం
జంగారెడ్డిగూడెం : కూటమి ప్రభుత్వంలో బీసీలకు తీరని అన్యాయం జరుగుతోందని వైఎస్సార్సీపీ బీసీ నాయకులు, బీసీ ప్రజాప్రతినిధులు తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తారు. గురువారం స్థానిక పీపీఎన్ చంద్రరావు స్వగృహంలో ఏర్పాటుచేసిన విలేకరుల సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ బత్తిన లక్ష్మి, పట్టణ వైఎస్సార్సీపీ మాజీ అధ్యక్షుడు, కౌన్సిలర్లు పీపీఎన్చంద్రరావు, చిటికెల అచ్చిరాజు, చనమాల శ్రీనివాస్, బత్తిన చిన్న, భావన రుషి తదితరులు మాట్లాడారు. 50 సంవత్సరాలకు బీసీలకు పింఛన్ ఇస్తానని చంద్రబాబు మోసం చేశారని ధ్వజమెత్తారు. తల్లికి వందనం అందరికీ ఇవ్వలేదన్నారు. బీసీలను ఆకాశానికెత్తేస్తానని కల్లబొల్లి మాటలు చెప్పి చంద్రబాబు మరోసారి మోసం చేశారన్నారు. 2014లో కూడా బీసీలకు ప్రాతినిధ్యం లేదని, ప్రాధాన్యత సీట్లు కూడా ఇవ్వలేదన్నారు. బీసీ మహిళలకు నెలకు రూ.1500 ఇస్తానని చెప్పి ఇవ్వలేదని, బీసీల్లో చేతివృత్తులకు రుణం ఇస్తామని మొండి చేయి చూపించారన్నారు. హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చాక చేతులు ఎత్తేయడం చంద్రబాబుకు వెన్నతో పెట్టిన విద్య అని విమర్శించారు. పవన్ కళ్యాణ్ కూడా నిలకడలేని మనస్తత్వం అని, పొంతనలేని మాటలు మాట్లడతారని విమర్శించారు. ఈవీఎంల అక్రమాలతో అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం 53 శాతం ఉన్న బీసీలను ఓటు బ్యాంకుగా వాడుకుంటుందన్నారు. ఎన్నికల ముందు హామీ ఇచ్చిన సూపర్ సిక్స్ అంటే హత్యలు, అత్యాచారాలు, అవినీతి, అరాచకాలు, తప్పుడు ప్రచారాలు, తప్పుడు కేసులు పెట్టడమేనా అని ప్రశ్నించారు. చేనేత కార్మికులకు తీవ్ర అన్యాయం చేశారన్నారు. లోకేష్ మంగళగిరిలో చేనేత కార్మికులకు చేసింది ఏమీ లేదని మండిపడ్డారు. పథకాల అమలు జగన్కే సాధ్యం మాటిస్తే మడమ తిప్పని వైఎస్ జగన్మోహన్రెడ్డికే పథకాలు అమలు సాధ్యమని వైఎస్సార్ సీపీ నేతలు పేర్కొన్నారు. గత వైఎస్సార్ సీపీ పాలనలో బీసీలకు పట్టం కట్టారని, డీసీఎంఎస్, డీసీసీబీ చైర్మన్లు, ఎమ్మెల్సీలు ఆరుగురు, రాజ్యసభ సభ్యుల నలుగురికి పదవులు కల్పించారన్నారు. జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ పదవిని బీసీ మహిళకు కేటాయించడంతో జగన్మోహన్రెడ్డి బీసీలకు ఇచ్చిన ప్రాధాన్యత తెలుస్తుందన్నారు. ఒక్క జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలోనే బీసీలకు న్యాయం జరిగిందన్నారు. చేనేత సొసైటీలకు నూలు, రంగులు సబ్సిడీపై ఇవ్వాలని కూటమి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఎల్.వెంకటేశ్వరరావు, కేమిశెట్టి మల్లిబాబు, చిప్పాడ వెంకన్న, నేట్రు గణేష్, పెసరగంటి త్రిమూర్తులు, పెప్సీ శ్రీను, చిటికెల అచ్చిరాజు, ఆదినారాయణ, మాధవ్, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
స్నాతకోత్సవానికి నిట్ సిద్ధం
తాడేపల్లిగూడెం: నేషనల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (ఏపీ నిట్) ఏడవ స్నాతకోత్సవానికి సిద్ధమైంది. ఈ నెల 9వ తేదీ ఉదయం నిట్లోని రవీంద్రభారతి ఆడిటోరియంలో ఈ వేడుక జరుగనుంది. ఈ వేడుకలో 2021–25 బ్యాచ్ విద్యార్థులకు డిగ్రీలు ప్రదానం చేయనున్నారు. ముఖ్యఅతిథిగా టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ ప్రెసిడెంటు వి.రాజన్న హాజరవుతున్నారని ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ.రమణరావు తెలిపారు. రవీంద్ర కళాభారతి ఆడిటోరియంలో అవసరమైన ఏర్పాట్లు చేశారు. 2015లో ఏపీ నిట్ ఏర్పాటుకాగా, ఇప్పటి వరకు నాలుగేళ్ల ఇంజనీరింగ్ కోర్సును ఏడు బ్యాచ్ల విద్యార్థులు పూర్తి చేసుకున్నారు. ఏడో స్నాతకోత్సవంలో 506 మంది బాలురు, 161 మంది బాలికలకు డిగ్రీలు పట్టాలు ప్రదానం చేస్తారు. వీరితో పాటు పీహెచ్డీ పూర్తి చేసిన 29 మంది పరిశోధక విద్యార్థులకు డాక్టరేట్ పట్టాలను అందచేయనున్నారు. సంస్థలో మొత్తం ఎనిమిది కోర్సులను నిర్వహిస్తుండగా ఆయా కోర్సుల్లో అత్యధిక గ్రేడ్ పాయింట్లు సాధించిన ఒక్కొక్క విద్యార్థి చొప్పున మొత్తం ఎనిమిది మంది విద్యార్థులకు బంగారు పతకం అందిస్తారు. స్నాతకోత్సవానికి అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని నిట్ అకడమిక్ డీన్ డాక్టర్ ఎన్.జయరామ్ తెలియచేశారు. బంగారు పతకాలు అందుకొనేది వీరే బయో టెక్నాలజీ – శశాంక్, కెమికల్ ఇంజనీరింగ్ –సంగెపు అభినవ్, సివిల్ ఇంజనీరింగ్ – తమ్ము హరిత, సీఎస్ఇ– కలిదిండి పవన్ తేజ సత్యవర్మ, ఈఈఈ– ఆదిత్య ప్రతాప్ సింగ్, ఈసీఇ– చిత్తిడి ధనుషాలక్ష్మి దుర్గ, మెకానికల్ ఇంజనీరింగ్ – వుడుమూడి ప్రియాంక, ఎంఎంఇ– జయస్మిత కే ప్రధాన్ బంగారు పతకాలు అందుకుంటారు. బ్యాచ్లో అత్యధిక గ్రేడ్పాయింట్లు సాధించిన కలిదిండి పవన్ తేజ సత్యవర్మ ఇనిస్టిట్యూట్ తరపున కోర్సు వారీగానే రెండు బంగారు పతకాలను అందుకోనున్నారు. -
ఇంటికి వెళ్లే దారేది!
ఏజెన్సీప్రాంతంలో గురువారం సాయంత్రం భారీ వర్షం కురిసింది. దొరమామిడి, అలివేరు, లంకపాకల, ఎర్రాయిగూడెం, అంతర్వేదిగూడెం, కామవరం, తదితర గ్రామాల్లో భారీగా వర్షం కురవడంతో కొండవాగులు పొంగిపొర్లాయి. చింతకొండ వాగుతోపాటు రెడ్డిగణపవరం సమీపంలో ఉన్న జల్లేరువాగు పొంగి పొర్లడంతో రాకపోకలు నిలిచిపోయాయి. సాయంత్రం సమయానికి పనులు ముగించుకుని ఇళ్లకు వెళ్లే ఉద్యోగులు, కూలీలు, రైతులు ఇంటికి చేరే మార్గం లేక జల్లేరు వాగుకు ఇరువైపులా నిలబడిపోయారు. రాత్రి వరకూ వాగులు పొంగుతూనే ఉన్నాయి. – బుట్టాయగూడెం -
రైతుల భూములతో ‘కూటమి’ వ్యాపారం
ఏలూరు (ఆర్ఆర్పేట): రైతుల భూములతో రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని కేంద్ర మాజీ మంత్రి, కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకుడు చింతా మోహన్ విమర్శించారు. గురువారం ఏలూరు నగరంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా 70 వేల ఎకరాలు తీసుకుందని మండిపడ్డారు. రైతుల భూములతో, రాష్ట్ర ప్రభుత్వం వ్యాపారం చేస్తోందని, ఒకాయన బయట రాష్ట్రాల్లో ఉన్న ప్రముఖులకు ఫోన్లు చేస్తూ మీకు 100 ఎకరాలు ఇస్తాం.. మాకేం ఇస్తారు అని అడుగుతున్నారన్నారు. భూములు ఇచ్చిన రైతులకు న్యాయం జరగలేదని, రైతులను దగా చేశారని, ఒక రైతు 90 ఎకరాలు ఇచ్చాడని, ఎందుకిచ్చావయ్యా అని అడిగితే, మా ఖర్మకొద్దీ ఇచ్చామని బాధతో వాపోయాడని తెలిపారు. అభివృద్ధి కుంటుపడింది రాష్ట్రంలో అభివృద్ధి కుంటుపడిందని, ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై ప్రజల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోందని చింతా మోహన్ అన్నారు. గ్రామాల్లో పరిస్థితులు చాలా బలహీనంగా ఉన్నాయని, వీధిలైట్లు, రోడ్లు వేసుకునేందుకు డబ్బులేక, సర్పంచ్లు దిక్కుతోచని స్థితిలో ఉన్నారని చెప్పారు. లిక్కర్ అమ్మకాల వల్ల కుటుంబాల్లో విభేదాలు ఏర్పడుతున్నాయని ఆందోళన వ్యక్తం చేశారు. చేనేతలకు 200 యూనిట్లు ఉచిత విద్యుత్ ఇస్తే సరిపోతుందా, ఈ చర్యతో ఓబీసీలకు పెద్దపీట వేసినట్టేనా అని చింతా మోహన్ ప్రశ్నించారు. ఏడాదిన్నరలోనే కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత రాష్ట్ర ప్రభుత్వంపై కేంద్ర మాజీ మంత్రి చింతా మోహన్ విమర్శలు -
తవ్వుకో.. తరలించుకో..!
ద్వారకాతిరుమల: పచ్చనేతల అక్రమాలకు అడ్డే లేకుండా పోతోంది. మట్టి కనిపిస్తే చాలు తవ్వుకుని, అమ్ముకుంటున్నారు. అడిగేవారు.. అడ్డుచెప్పే వారు లేకపోవడంతో రోజురోజుకీ వీరి ఆగడాలు పెచ్చుమీరుతున్నాయి. ద్వారకాతిరుమల మండలం వెంకటకృష్ణాపురం గ్రామంలో ఏకంగా జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల్లోనే గురువారం గ్రావెల్ తవ్వకాలు జరిపారు. లబ్ధిదారులు వారిని అడ్డుకోవడంతో తవ్వకాలు తాత్కాలికంగా నిలిచాయి. వివరాల్లోకి వెళితే.. గత వైఎస్సార్ సీపీ ప్ర భుత్వంలో వెంకటకృష్ణాపురం గ్రామంలోని వాటర్ ట్యాంక్ సమీపంలో పలువురు లబ్ధిదారులకు ఇళ్ల స్థలాలను ఇచ్చారు. అందులో ఎవరూ ఇళ్లను నిర్మించుకోలేదు. అయితే కొందరు టీడీపీ నాయకులు రెండు పొక్లెయిన్లతో ఆ ఖాళీ ఇళ్ల స్థలాల్లో తవ్వకాలు జరిపి, గ్రావెల్ని రామన్నగూడెం గ్రామానికి టిప్పర్లు, ట్రాక్టర్ల ద్వారా తరలించేస్తున్నారు. ఆ గ్రావెల్ని ఎంతకు అమ్ముతున్నారన్నది బయటకు పొక్కనివ్వలేదు. ఇదిలా ఉంటే ఇళ్ల స్థలాల లబ్ధిదారులు ఈ తవ్వకాలను అడ్డుకున్నారు. సమాచారం అందుకున్న గ్రామ రెవెన్యూ అధికారి కూడా అక్కడికి చేరుకున్నారు. ఆ సమయంలో ఓ టీడీపీ నాయకుడు లబ్ధిదారులపై చిందులు వేసినా, అవి అక్రమ తవ్వకాలు కావడంతో నెమ్మదిగా అక్కడి నుంచి జారుకున్నాడని స్థానికులు చెబుతున్నారు. సంబంధిత అధికారులు అక్రమంగా మట్టి తవ్వకాలు జరిపే వారిపై చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు కోరుతున్నారు. జగనన్న కాలనీ ఇళ్ల స్థలాల్లో గ్రావెల్ అక్రమ తవ్వకాలు వెంకటకృష్ణాపురంలో బరి తెగించిన పచ్చ నేతలు -
సోమారామంలో ఆదాయం లెక్కింపు
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం గునుపూడి ఉమాసోమేశ్వర జనార్దన స్వామి దేవస్థానం (సోమారామం)లో హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. రూ.10,50,655 నగదు లభించిన్నట్లు ఈఓ డి.రామకృష్ణంరాజు తెలిపారు.. నిత్యాన్నదానానికి రూ.18,886 లభించిందన్నారు. ఉత్తమ ఉపాధ్యాయ అవార్డులకు దరఖాస్తుల ఆహ్వానం భీమవరం: గురు పూజోత్సవం సందర్భంగా సెప్టెంబర్ 5న ఉపాధ్యాయులకు అవార్డులు అందించనున్నామని, ఈనెల 8లోపు దరఖాస్తు చేసుకోవాలని డీఈఓ ఈ.నారాయణ గురువారం ఓ ప్రకటనలో తెలిపారు. కనీసం పదేళ్ల సర్వీసు పూర్తిచేసుకున్నవారు అర్హులన్నారు. ఽ16న తుది జాబితా రాష్ట్ర కార్యాలయానికి పంపిస్తామని, 21 నుంచి మూడు రోజుల పాటు రాష్ట్రస్థాయిలో ఎంపికై న ఉపాధ్యాయులకు ఇంటర్వ్యూలు నిర్వహించి 25న ఎంపికై న వారి తుది జాబితాను విడుదల చేస్తారని నారాయణ తెలిపారు. -
రాష్ట్రంలో బీసీలకు రక్షణ కరువు
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వ పాలనలో బీసీలకు రక్షణ కరువైందని, ఎమ్మెల్సీలు, ప్రజాప్రతినిధులపైనే దాడులు జరుగుతుంటే సామాన్య ప్రజల పరిస్థితి ఏంటని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా బీసీసెల్ నాయకులు ప్రశ్నించారు. పులివెందులలో జెడ్పీటీసీ ఎన్నికల నేపథ్యంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు, శాసనమండలి సభ్యుడు రమేష్ యాదవ్పై టీడీపీ నేతలు జరిపిన దాడికి నిరసనగా బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు ఆధ్వర్యంలో నగరంలో గురువారం నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా బీసీ సెల్ నాయకులు మాట్లాడుతూ పాలనలో విఫలమై, సంక్షేమ పథకాలు అమలు చేయలేక కూటమి ప్రభుత్వ పెద్దలు ప్రజల దృష్టి మళ్లించేందుకు పలు ఎత్తుగడలు వేస్తున్నారన్నారు. హామీలను విస్మరించిన ప్రభుత్వం ప్రజల ఆగ్రహానికి గురవుతామనే భయంతో ప్రతిపక్ష నేతలపై దాడులకు పాల్పడుతూ తిరిగి వారిపైనే తప్పుడు కేసులు పెట్టి వేధిస్తోందన్నారు. ప్రజలు కూటమి ప్రభుత్వ విధానాలను నిశితంగా పరిశీలిస్తున్నారన్నారు. కూటమి నేతలు ఇసుక కోసం, మట్టి కోసం ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్నారని, అలాగే అనేక ప్రాంతాల్లో ప్రొటోకాల్ వి వాదాలు నడుపుతున్నారని, టీడీపీ, జనసేన నేతలు కాలర్లు పట్టుకుని కొట్టుకుంటున్నారన్నారు. తమ పార్టీ నాయకులను నియంత్రించలేకపోతున్న రెండు పార్టీల నేతలు రాష్ట్రంలో శాంతిభద్రతలను ఏమి నియంత్రించగలుగుతారని ఎద్దేవా చేశారు. ప్రజల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమై ప్రజలు తిరగబడక ముందే కూటమి ప్రభుత్వ పెద్దలు మేలుకోవాలని, లేకుంటే ప్రజలే వారిని తరిమికొట్టే రోజు వస్తుందని హెచ్చరించారు. తొలుత నగరంలోని మహా త్మా జ్యోతిరావు పూలే విగ్రహానికి వినతిపత్రం సమర్పించారు. వైఎస్సార్సీపీ నాయకులు గుడిదేసి శ్రీనివాసరావు, తుమరాడ స్రవంతి, మోదుగుండు సూర్యనారాయణ, నూకపెయ్యి సుధీర్ బాబు, గురజాల పార్థసారథి, కట్ట ఏసుబాబు, మున్నుల జాన్ గుర్నాథ్, కంచుమర్తి తులసి, కొల్లిపాక సురేష్, బోగాటి ప్రభాకర్, పాటినవలస రాజేష్, స్టాలిన్, సాయిల స్వాతి యాదవ్, గంటా సాయి ప్రదీప్, కిలాడి దుర్గారావు, జుజ్జువరపు విజయనిర్మల తదితరులు పాల్గొన్నారు. -
అంగన్వాడీలతో సెల్గాటం
అంగన్వాడీ కేంద్రాలు ఏలూరు పశ్చిమగోదావరి జిల్లా జిల్లా మెయిన్ కేంద్రాలు 1,959 1,556 మినీ కేంద్రాలు 206 70 మొత్తం 2,165 1,626 అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులు పశ్చిమగోదావరి ఏలూరు ఆరేళ్లలోపు పిల్లలు 43,783 41,116 మూడు నుంచి ఆరేళ్లలోపు పిల్లలు 19,672 19,909 గర్భిణులు 8,596 7,889 బాలింతలు 6,170 5,606 మొత్తం 78,221 74,520 ఏలూరు (టూటౌన్): ‘సిగ్నల్స్ పని చేయవు.. యాప్స్ సపోర్టు చేయవు.. గతంలో 2జీ ఫోన్లు ఇచ్చారు.. ప్రస్తుతం 5జీ యాప్స్ అప్లోడ్ చేయమంటున్నారు.. యాప్ల సాకుతో ఫేస్ రికగ్నైజ్ కాకపోతే రేషన్ కట్ చేస్తామంటున్నారు.. ఇలాగైతే అంగన్ వాడీ కేంద్రాలను నడిపేది ఎలా.. తాము విధులు నిర్వర్తించేది ఎలా..’ అంటూ ఉమ్మడి జిల్లావ్యాప్తంగా అంగన్వాడీ కార్యకర్తలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొత్త ఫోన్లు అయినా ఇవ్వండి లేదా యాప్లను రద్దయినా చేయండి అంటూ అంగన్వాడీలు అధికారులను వేడుకుంటున్నారు. యాప్లపై కనీస శిక్షణ ఇవ్వకుండా, యాప్లను సపోర్టు చేసే ఫోన్లను అందించకుండా మెడపై కత్తి పెట్టి మరీ పనిచేయంటే ఎలా అంటూ ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్ర మంలో ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల వ్యాప్తంగా అంగన్వాడీలు ఐసీడీఎస్ ప్రాజెక్టు కార్యాలయాల్లో సెల్ఫోన్లను అప్పగిస్తూ నిరసన తెలుపుతున్నారు. ఈ నేపథ్యంలో కార్యకర్తలను ఐసీడీఎస్ అధికారులు వేధింపులకు గురిచేస్తున్నారని పలు సంఘాల నాయకులు ఆరోపిస్తున్నారు. రెండు జిల్లాల పరిధిలో 3,851 మంది అంగన్వాడీ కార్యకర్తలు, అదే సంఖ్యలో సహాయకులు పనిచేస్తున్నారు. యాప్లలో అప్లోడ్ తిప్పలు అంగన్వాడీ కేంద్రాలకు సంబంధించి కార్యకలాపాలను బాల సంజీవని, పోషణ ట్రాకర్ యాప్ల ద్వారా నిర్వహించాలి. ఫేస్ యాప్, ఫేస్ క్యాప్చర్, కేవైసీ, ఓటీపీ వంటి పనులు చేసేందుకు ప్రస్తుతం ఉన్న ఫోన్లు సహకరించడం లేదు. ఫేస్ క్యాప్చర్ అయితేనే.. యాప్లలో ఫేస్ క్యాప్చర్ అయితేనే అంగన్వాడీ కేంద్రాల్లో లబ్ధిదారులకు ఆహారం ఇవ్వాలి. దీంతో లబ్ధిదారులకు ముఖ ఆధారిత గుర్తింపుతో ఇబ్బందులు తప్పడం లేదు. గతంలో కుటుంబంలో ఎవ రూ వచ్చినా రేషన్ ఇచ్చేవారు. ఇప్పుడు లబ్ధిదారుడు తప్పనిసరిగా ఉండాలి. ఇప్పటికే కేంద్ర ప్రభుత్వం ఐసీడీఎస్కు నిధులు తగ్గిస్తోంది. దీంతో అరకొర సౌకర్యాలతో సెంటర్లు నడుస్తున్నారు. నాణ్యమైన ఆహారం అందడం లేదనే విమర్శలు వస్తున్నాయి. దీనికితోడు యాప్లతో ఇబ్బంది పడుతున్నామని, సిగ్నల్స్ సరిగా లేక, సర్వర్ పనిచేయక తిప్పలు పడుతుంటే.. అధికారుల వేధింపులు ఎక్కువయ్యాయని అంగన్వాడీలు అంటున్నారు. పదో తరగతి చదివిన తమను యాప్లలో పనిచేయాలంటే ఎలా అని అంగన్వాడీలు ప్రశ్నిస్తున్నా రు. ఒక లబ్ధిదారుడి ఫేస్ క్యాప్చర్ చేయాలంటే రెండు, మూడు గంటల సమయం పడుతుందంటున్నారు. ఒక్కో కేంద్రంలో సగటున మూడేళ్లలోపు పిల్లలు 50 నుంచి 60 మంది, గర్భిణులు, బాలింతలు 10 నుంచి 15 మంది వరకు, ప్రీ స్కూల్ పిల్లలు 10 నుంచి 20 మంది, కిశోర బాలికలు 10 నుంచి 50 మందిలోపు ఉంటారని అంటున్నారు. వీరందరికీ ప్రతినెలా ఈకేవైసీ, ఓటీపీ, ఫేస్ క్యాప్చర్ చేయాలంటే సమయం సరిపోవడం లేదని అంగన్వాడీలు ఆవేదన చెందుతున్నారు. యాప్ల కత్తి సపోర్టు చేయని ఫోన్లతో ఇబ్బందులు ముఖ ఆధారిత గుర్తింపుతోనే రేషన్ పనిచేయని యాప్లు.. అధికారుల ఒత్తిళ్లు ఐసీడీఎస్ కార్యాలయాల్లో ఫోన్ల అప్పగింత ఉమ్మడి జిల్లావ్యాప్తంగా నిరసనలు -
వేధింపులు ఆపాలి
పనిచేయని ఫోన్లను తిరిగి అప్పగించిన అంగన్వాడీలపై అధికారుల వేధింపులు మానాలి. టార్గెట్ల పేరుతో అధికారులు తీవ్రంగా వేధిస్తున్నారని అంగన్వాడీలు ఆవేదన వ్యక్తం చేశారు. వేధింపులు ఆపకపోతే సీఐటీయూ ఆధ్వర్యంలో పోరాటం ఉధృతం చేస్తాం. – డీఎన్వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా కార్యదర్శి, ఏలూరు వెసులుబాటు కల్పించాలి ఫేస్ క్యాప్చర్తో నిమిత్తం లేకుండా మాన్యువల్గా రేషన్ ఇచ్చే వెసులుబాటు కల్పించాలి. యాప్ల వల్ల మాతో పాటు లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. లబ్ధిదారులు ఓటీపీ చెప్పేందుకు సంబంధిత ఫోన్లు అందుబాటులో ఉండటం లేదు. – పి.సుజాత, జిల్లా అధ్యక్షురాలు, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా అప్లోడ్ కావడం లేదు మాకిచ్చిన ఫోన్లలో యాప్లు అప్లోడ్ అవడం లేదు. పీడీఎఫ్ ఫైల్స్ ఓపెన్ కావడం లేదు. దీనికితోడు స్వర్ణాంధ్ర యాప్ పనులు చేయమంటున్నారు. దీంతో చాలా ఇబ్బంది పడుతున్నాం. అయినా అధికారులు టార్గెట్లు పూర్తిచేయాలని ఒత్తిడి తెస్తున్నారు. – పి.భారతి, జిల్లా ప్రధాన కార్యదర్శి, ఏపీ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్, ఏలూరు జిల్లా 5జీ ఫోన్లు ఇవ్వాలి తక్షణమే అంగన్వాడీలకు 5జీ ర్యామ్ ఉన్న ఫోన్లను ఇవ్వాలి. పాత ఫోన్లలో న్యూవెర్షన్ యాప్లను అప్లోడ్ చేయమంటే ఎలా. ఐసీడీఎస్ అధికారులు అర్థం చేసుకోవాలే తప్ప మాపై కక్ష సాధింపులకు దిగడం సరికాదు. అన్ని యాప్లను కలిపి ఒకే యాప్గా మార్చాలి. – టి.మాణిక్యం, జిల్లా కోశాధికారి,ఏపీ అంగన్వాఢీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్,ఏలూరు జిల్లా ● -
ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశ
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర కేబినెట్ సమావేశం ఉద్యోగ, ఉపాధ్యాయులకు నిరాశ మిగిల్చిందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గెడ్డం సుధీర్ ఓ ప్రకటనలో తెలిపారు. పెండింగ్ బకాయిలు, డీఏలు, ఆర్థిక ప్రయోజనాలు, 12వ పీఆర్సీ, ఐఆర్ గురించి ప్రభుత్వం ప్రకటించలేదన్నారు. కూటమి ప్రభుత్వం నుంచి రావాల్సిన బకాయిలపై మాట్లాడకపోవడాన్ని ఖండిస్తున్నామన్నారు. 2004లో ఉపాధ్యాయ, ఉద్యోగులకు వ్యతిరేకంగా పనిచేసిన నాటి టీడీపీ ప్రభుత్వాన్ని గద్దెదింపిన విషయాన్ని గుర్తుచేశారు. ఉపాధ్యాయుల బదిలీలు జరిగి మూడు నెలలు కావస్తున్నా కొందరికి జీతాలు రాకపోవడం దురదృష్టకరమన్నారు. ఆయా సమస్యల పరిష్కారానికి ఉపాధ్యాయ సంఘాలతో కలిసి రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని హెచ్చరించారు.వైఎస్సార్సీపీ మేధావుల ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా బీవీ రావుకైకలూరు: వైఎస్సార్సీపీ ఇంటలెక్చువల్స్ (మేధావుల) ఫోరం రాష్ట్ర కార్యదర్శిగా బుసనబోయిన వెంకటేశ్వరరావు (బీవీ రావు)ను నియమిస్తూ పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాలతో తాడేపల్లి పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి నియామక ఉత్తర్వులు గురువారం అందాయి. కై కలూరు మండలం వరహాపట్నంకు చెందిన బీవీ రావు సీనియర్ చార్టర్ అకౌంటెంట్గా పనిచేస్తున్నారు. తనకు రాష్ట్రస్థాయి పదవి కేటాయించినందుకు పార్టీ అధినేత జగన్, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్)కు కృతజ్ఞతలు తెలిపారు.ఘనంగా చేనేత దినోత్సవంఏలూరు(మెట్రో): దేశ సాంస్కృతిక వారసత్వానికి చేనేతరంగం చిహ్నంగా నిలుస్తుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. గురువారం జిల్లా చేనేత, జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవరం సందర్భంగా నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ జెండా ఊపి ప్రారంభించారు. ముఖ్య అతిథిగా జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ పాల్గొన్నారు. ఫైర్స్టేషన్ సెంటర్ నుంచి కలెక్టరేట్ వరకూ చేనేత కార్మికులతో కలిసి ర్యాలీ నిర్వహించారు.చేనేత రంగాన్ని కాపాడాలిఏలూరు (టూటౌన్): చేనేత రంగాన్ని, నేత కార్మికులను ఆదుకోవడంలో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విఫలమయ్యాయని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి కడుపు కన్నయ్య, సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు విమర్శించారు. స్థానిక 36వ డివిజన్లో గురువారం చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ప్రభుత్వాలు బడ్జెట్లో అరకొర నిధులు కేటాయిస్తూ చేనేత పరిశ్రమను చిన్నచూపు చూస్తున్నాయన్నారు. రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ఏ ఐటీయూసీ జిల్లా అధ్యక్షుడు రెడ్డి శ్రీనివాస్ డాంగే, సంఘ కార్యకర్తలు పాల్గొన్నారు. చేనేతకు మరణ శాసనమైన జీఎస్టీ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఏపీ చేనేత కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పిచ్చుక ఆదిశేషు డిమాండ్ చేశారు. స్థానిక పత్తేబాద మరకవారి వీధిలో చేనేత దినోత్సవాన్ని నిర్వహించారు.బాల పురస్కార్కు దరఖాస్తుల ఆహ్వానంఏలూరు (టూటౌన్): రాష్ట్రీయ బాల పురస్కార్ అవార్డుల కోసం ఈనెల 15లోపు దర ఖాస్తు చేసుకోవాలని డీసీపీఓ సూర్యచక్రవేణి గురువారం ప్రకటనలో తెలిపారు. వివిధ రంగాల్లో అత్యుత్తమ ధైర్యసాహసాలు, ప్రతిభ కనబర్చిన 5–18 ఏళ్లలోపు బాలలు అర్హులని తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 79015 97267లో సంప్రదించాలని కోరారు.బ్యాంకు ఏజెంట్ల పేరుతో మోసంభీమవరం: బ్యాంకు రికవరీ ఏజెంట్లుమంటూ ఇద్దరు వ్యక్తులు భీమవరం ఏడో వార్డుకు చెందిన కె.రామలక్ష్మి నుంచి రూ.2 లక్షలు తీసు కుని మోసగించినట్టు పోలీసులు తెలిపారు. పట్టణంలోని మారుతీనగర్లో భవనానికి మార్టిగేజ్ రుణం తీసుకున్నారు. వాయిదా చె ల్లించాల్సి ఉండగా హైకోర్టులో స్టే వేద్దామని చెప్పి నగదు తీసుకుని ఇప్పటివరకు సమాధా నం చెప్పడం లేదని రామలక్ష్మి ఫిర్యాదు చేశారు. -
డాక్యుమెంట్ రైటర్లదే హవా
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వం డాక్యుమెంట్ రైటర్ల వ్యవస్థను రద్దు చేసి ఏళ్లు గడుస్తున్నా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో మాత్రం వీరిదే హవా నడుస్తోంది. రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు వచ్చేవారి అవగాహన రాహిత్యం వీరికి ఆదాయ వనరుగా మారింది. దీనికితోడు కార్యాలయాల్లో హెల్ప్డెస్క్ లు నామమాత్రంగా పనిచేస్తుండటంతో ‘రైటర్ల’ రాజ్యంగా మారింది. రిజిస్ట్రేషన్ ప్రక్రియపై పూర్తిగా అవగాహన లేక 95 శాతం మంది వీరిపైనే ఆధారపడుతున్నారు. క్రయ, విక్రయాల్లో ఆస్తి విలువ ఆధారంగా వీరు సొమ్ములు వసూలు చేస్తున్నారు. 2002లో దస్తావేజు లేఖర్ల వ్యవస్థను ప్రభుత్వం రద్దు చేసింది. అయినా లేఖర్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాలను వీడటంలేదు. అన్నీ తామై కార్యాలయా ల్లో రిజిస్ట్రేషన్ వ్యవహరాలు చక్కబెడుతున్నారు. నామమాత్రంగా హెల్ప్డెస్క్లు రిజిస్ట్రేషన్ కార్యాలయాల్లోని హెల్డెస్క్లు నామ మాత్రంగా పనిచేస్తున్నాయి. రిజిస్ట్రేషన్లు అధిక సంఖ్యలో జరిగే కార్యాలయాల్లో పని ఒత్తిడి, సిబ్బంది కొరతతో పూర్తిస్థాయిలో సేవలందించలేకపోతున్నాయి. ఉద్యోగులకు బెదిరింపులు ఏలూరులో కొందరు పాత దస్తావేజు లేఖర్లు యూ నియన్గా ఏర్పడి రిజిస్ట్రార్ కార్యాలయ ఉద్యోగులను బెదిరింపులకు గురిచేస్తున్నారు. ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో రోజుకు కనీసం 70 నుంచి 120 వరకూ రిజిస్ట్రేషన్లు జరుగుతాయి. ఇక్కడ జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్, జాయింట్–2 సబ్ రిజిస్ట్రార్లు పనిచేస్తున్నారు. అయితే జాయింట్–1 సబ్ రిజిస్ట్రార్ సెలవులో ఉండటంతో మిగిలిన సబ్ రిజిస్ట్రార్పై పనిభారం పెరిగింది. ఈ నేపథ్యంలో రెండు రోజుల క్రితం ఒక దస్తావేజు లేఖరి గన్నవరంలో ఉన్న ఆస్తిని రిజిస్ట్రేషన్ కోసం ఎనీవేర్ పద్ధతిలో ఆన్లైన్లో ఏలూరు కార్యాలయానికి తీసుకువచ్చారు. ఆస్తికి సంబంధించిన క్రయ, విక్రయదా రులిద్దరూ గన్నవరానికి చెందిన వారు కావడంతో వారిని గన్నవరంలోనే రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కార్యాలయ అధికారులు సూచించారు. దీనిపై ఆగ్రహం వ్యక్తం చేసిన డాక్యుమెంట్ రైటర్ కొందరు విలేకరులను కార్యాలయానికి పిలిచి సబ్ రిజిస్ట్రార్పై ఫిర్యాదు కూడా చేశారు. అలాగే మరికొందరు డాక్యుమెంట్ రైటర్లు తమపై ఉన్నతాధికారులకు ఆరోపణలతో ఫిర్యాదులు చేస్తున్నారని, తాము వివరణ ఇవ్వాల్సి వస్తోందని కార్యాలయ ఉద్యోగులు అంటున్నారు. చర్యలు తీసుకుంటాం డాక్యుమెంట్ రైటర్లకు ప్రత్యేక గుర్తింపు లేదు. రిజిస్ట్రార్ కార్యాలయాలకు వచ్చే వారు ఎవ రైనా సాధారణ కక్షిదారులుగానే రావాలి. కార్యాలయ ఉద్యోగులు, సిబ్బందిపై బెదిరింపులకు, దాడులకు దిగితే చట్టపరంగా చర్యలు తీసుకుంటాం. పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేసి కేసులు కూడా నమోదు చేస్తాం. ఏలూరులో జరిగినట్టుగా చెబుతున్న సంఘటన నా దృష్టికి రాలేదు. – కె.శ్రీనివాసరావు, జిల్లా రిజిస్ట్రార్, ఏలూరు అన్నీ తామై పనులు చేస్తున్న రైటర్లు రిజిస్ట్రేషన్లకు రూ.వేలల్లో వసూళ్లు కార్యాలయ ఉద్యోగులకు బెదిరింపులు -
రాజ్యాంగానికి రఘురామ వరకభాష్యం
ఏపీ బహుజన జేఏసీఉండి: రాజ్యాంగం కల్పించిన హక్కులకు వక్రభా ష్యం చెబుతూ డిప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరు రఘురామకృష్ణరాజు మాట్లాడటం విడ్డూరంగా ఉందని ఏపీ బహుజన జేఏసీ రాష్ట్ర నాయకులు అన్నారు. పాములపర్రులో జరిగిన ఘటనపై వివరణ ఇస్తూ రఘురామకృష్ణరాజు చేసిన వ్యాఖ్యలను ఖండిస్తూ పాములపర్రు దళితులు, జేఏసీ రాష్ట్ర నాయకులు గురువారం నిరసన తెలిపారు. ఏపీ బహుజన జేఏసీ ఫౌండర్, కన్వీనర్ తాళ్లూరి మధు మాట్లాడుతూ మత స్వేచ్ఛ రాజ్యాంగం ప్రసాదించిన హక్కు అని, దీనిని కాదని క్రైస్తవ మతానికి చెందిన వారు దళితులు కారని ఎమ్మెల్యే ఎలా మాట్లాడతారని మండిపడ్డారు. రాష్ట్రంలో వివిఽ ద కులాలకు చెందిన వారు క్రీస్తును నమ్ముకున్నారు వారిని క్రైస్తవులుగా మార్చేస్తారా? వారి కులాన్ని కాదంటారా? అంటూ ప్రశ్నించారు. కూటమి నాయకుల తప్పుడు సమాచారంతోనే ఎమ్మెల్యే రఘురామ మాట్లాడుతున్నారన్నారు. గతంలో అధికారులు ఇచ్చిన శ్శశాన భూమి రికార్డులు పరిశీలించడంతో పాటు 150 ఏళ్ల నుంచి ఇక్కడ సమాధులున్నాయని గమనించాలన్నారు. స్థానికంగా వరి చేలు లేవని, ఉన్నవి రొయ్యల చెరువులేనన్నారు. నలుగురు రైతుల సంక్షేమం కోసం వందల మంది మనోభావాలు దెబ్బతినేలా దళితులకు ప్రత్యేకమైన శ్శశాన భూమిని పాడుచేసేలా రోడ్డు నిర్మాణం చేస్తారా అని మండిపడ్డారు. పాములపర్రులో దళితులకు న్యాయం జరిగే వరకూ పోరాడుతామని చెప్పారు. ఈ ఘటనపై సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్, మాజీ సీఎం జగన్, జాతీయ మానవ హక్కుల సంఘాలకు ఫిర్యాదు చేసినట్టు ఆయన చెప్పారు. ఇదిలా ఉండగా ఉండిలో ఓ కూటమి నేత ఇంటికి రాత్రి వేళలో ఓ పోలీస్ అధికారి వెళ్లడం, వారితోపాటు శ్శశానంలో రోడ్డు కావాలంటూ ప్రేరేపించిన కూటమి నాయకులు ఉండటం అనుమానాలకు తావిస్తోందని దళితులు చెబుతున్నారు. -
సబ్ కలెక్టర్ స్మరణ్రాజ్కు సత్కారం
ఏలూరు (మెట్రో): బదిలీపై వెళుతున్న నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్రాజ్ను జిల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఘనంగా సత్కరించారు. స్థానిక కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో బుధవారం రెవెన్యూ అధికారుల సమావేశం అనంతరం నూజివీడు సబ్ కలెక్టర్ బి.స్మరణ్రాజ్ను దుశ్శాలువ, మెమొంటోతో ఘనంగా సత్కరించారు. కార్యక్రమంలో డీఆర్ఓ వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓలు అచ్యుత్ అంబరీష్, రమణ, ఎస్డీసీ భాస్కర్, సర్వే శాఖ ఏడీ అన్సారీ, కలెక్టరేట్ పరిపాలనాధికారి నాంచారయ్య, కలెక్టరేట్ సూపరింటెండెంట్లు చల్లన్న దొర, విజయ్కుమార్రాజు, జిల్లాలోని అన్ని మండలాల తహసీల్దార్లు, రీసర్వే డిప్యూటీ తహసీల్దార్లు పాల్గొన్నారు. -
చెట్లకు చేటు
జంగారెడ్డిగూడెం: విద్యుత్ లైన్ పేరు చెప్పి భారీ వృక్షాలను అక్రమంగా నరకివేసి కలప తరలించుకుపోయారు. ఈ ఘటన జంగారెడ్డిగూడెంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం శివారు మార్కండేయపురంలో పంచాయతీ రాజ్ రోడ్డు వెంబడి భారీ వృక్షాలు ఉన్నాయి. వీటిని కొందరు అక్రమార్కులు బుధవారం నరికివేశారు. స్థానికులు ఇదేంటని ప్రశ్నిస్తే విద్యుత్ లైన్ల నిర్మాణం నిమిత్తం చెట్లను నరికినట్లు తెలిపారు. దీంతో అనుమానం వచ్చి ప్రజా సంఘాల నాయకులకు తెలియజేశారు. ఘటనా స్థలానికి చేరుకున్న సీపీఐ నాయకులు జేవీ రమణరాజు, రాధాకృష్ణ చెట్ల నరికివేతపై పంచాయతీ రాజ్ డీఈ సాజుద్దీన్కు ఫిర్యాదు చేయగా చెట్ల నరికివేతకు సంబంధించి ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని తెలిపారు. ఈ విషయంపై విద్యుత్ శాఖ డీఈ యు.సుబ్బారావును వివరణ కోరగా, తాము ఆ ప్రాంతంలో ఎటువంటి విద్యుత్ లైన్లు వేసే పనులు నిర్వహించడం లేదని చెప్పారు. అక్రమార్కులు యథేచ్ఛగా చెట్లను నరికివేస్తూ శాఖల పేర్లు చెప్పి వాటిని తరలించుకుపోవడంపై ప్రజాసంఘాల నాయకులు అభ్యంతరం తెలిపారు. దీనిపై సాజుద్దీన్ స్పందిస్తూ పూర్తి స్థాయి విచారణ చేపట్టి అక్రమార్కులపై చర్యలు తీసుకుంటామని తెలిపారు. -
మధ్యాహ్నం.. అందని వైద్యం
ప్రైవేటుయాజమాన్యాలే టార్గెట్..? సర్కారు దవాఖానాలకు వచ్చే పేదలకు వైద్యసేవలు అందుతున్నాయా లేదా అని పర్యవేక్షణ చేయాల్సిన ఉన్నతాధికారులు ఇటీవల కేవలం ప్రైవేటు ఆస్పత్రులు, ప్రైవేటు స్కానింగ్ సెంటర్లు మాత్రమే తనిఖీలు చేయడం వెనుక గూడార్ధం ఏంటా అనేది వైద్యవర్గాల్లోను చర్చనీయాంశమైంది. తరచూ వైద్యశాఖ ఉన్నతాధికారులు కేవలం ప్రైవేటు యాజమాన్యాలనే కలుస్తుండడంపై కూడా పలువురు పెదవి విరుస్తున్నారు. ఇక డైరెక్టరేట్ ఆప్ సెకండరీ హెల్త్కు సంబంధించి ఉన్నతాధికారులు సంబంధిత ఆస్పత్రుల్లో ఎటువంటి పర్యవేక్షణ లేకపోవడంతో జిల్లాలో కొందరు వైద్యులు తమ ఇస్టానుసారంగా పనిచేస్తున్నారని తెలుస్తోంది. ఈ సమస్యలపై డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయిని ‘సాక్షి’ వివరణ కోరగా ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిందేనని, కొందరు వైద్యులు అదనంగా మరికొన్ని ఆస్పత్రుల్లో ఇన్చార్జులుగా ఉంటున్నారని, వైద్యుల తీరుపై ప్రత్యేక పర్యవేక్షణ చేస్తానని చెప్పారు. తణుకు అర్బన్ : గత ఐదేళ్లపాటు పేదలపాలిట సంజీవనిలా సత్వర వైద్యసేవలందించిన ఆస్పత్రులు నేడు వేళకు రాని వైద్యులతోపాటు, ఆస్పత్రిలో కాలు నిలవక బయటకు వెళ్లే వైద్యుల కారణంగా పేదలకు వైద్యసేవలు కునారిల్లుతున్నాయి. ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆస్పత్రుల్లో ఉండాల్సిన వైద్యులు నేడు విధులకు ఆలస్యంగా కొందరు, ఎఫ్ఆర్ఎస్ వేసేసి ప్రైవేటు ఆస్పత్రుల్లో ప్రాక్టీస్ కోసం వెళ్లే వారు కొందరు, మధ్యాహ్నం పూర్తిగా ఇంటికో, ప్రైవేటు ఆస్పత్రులకో పరిమితమయ్యే మరి కొందరు వైద్యుల కారణంగా ప్రభుత్వ ఆసుప్రతుల్లో వైద్యసేవలు అందడం లేదు. ముఖ్యంగా గ్రామాల్లో ఈ తరహా పరిస్థితులు అధికంగా కనిపిస్తున్నాయని రోగులు ఆరోపిస్తున్నారు. వైద్య ఆరోగ్య శాఖ, డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ విభాగాల్లో వైద్యులు 80 శాతం మంది ఒంటిపూట వైద్యానికి అలవాటుపడ్డారని వైద్య సిబ్బంది బాహాటంగానే చెబుతున్నారు. దూర ప్రాంతాల నుంచి క్యారేజీలు పట్టుకుని వచ్చే వైద్యులు మాత్రమే పూర్తిస్థాయిలో ఆస్పత్రిని అంటిపెట్టుకుని ఉంటుండగా, భోజనానికి ఇంటికెళ్లి వచ్చే వైద్యులు చాలా మంది తిరిగి ఎఫ్ఆర్ఎస్ వేసేందుకు మాత్రమే వస్తున్నట్లుగా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు వైద్యులైతే ఉదయం పూట కూడా ప్రైవేటు వైద్యానికి వెళ్లే పరిస్థితులు తలెత్తాయని రోగులు, వైద్య సిబ్బంది చెబుతున్నారు. గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వ హయాంలో గ్రామీణ ప్రాంతాల మాదిరిగానే పట్టణాల్లో కూడా పేదలకు వైద్యసేవలు మరింత చేరువ చేసే ఉద్దేశ్యంతో అర్బన్ హెల్త్ సెంటర్లను అందుబాటులోకి తీసుకువచ్చింది. దీంతో పట్టణ ప్రాంతాల్లోని పేదలు సైతం దూర ప్రాంతాల్లోని ప్రభుత్వాసుపత్రికి వెళ్లే అవసరం లేకుండానే సమీపంలోని అర్బన్ హెల్త్ సెంటర్లలో వైద్యసేవలు పొందుతున్నారు. దూరమైన సత్వర వైద్యం ప్రభుత్వ ఆస్పత్రుల్లో వైద్యులు ఉదయం 9 నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఆయా ఆస్పత్రుల్లో ఉండి రోగులకు సత్వర వైద్యం అందించాల్సి ఉండగా ప్రస్తుతం ఆ తరహా సేవలు అందడంలేదని రోగులు చెబుతున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ కొరవడడమే ఇందుకు కారణంగా తెలుస్తోంది. ఉదయం ఏదోలా వైద్యం అందుతున్నా ఇక మధ్యాహ్నం 1 గంట తరువాత జిల్లా వ్యాప్తంగా వైద్యులు ఆస్పత్రుల్లో అందుబాటులో ఉండడంలేదనేది వాస్తవమని రోగులు స్వయంగా చెబుతున్నారు. అంతేకాకుండా మధ్యాహ్నం నుంచి పీహెచ్సీలు, అర్బన్ హెల్త్ సెంటర్లకు వచ్చే రోగులకు అందుబాటులో ఉన్న వైద్య సిబ్బంది వైద్యం అందిస్తున్నారని తెలుస్తోంది. మధ్యాహ్నం వచ్చిన రోగులను మరుసటి రోజు రావాలని, ఇబ్బంది ఎక్కువగా ఉంటే వైద్యులకు ఫోన్ చేస్తామని అప్పుడు సదరు వైద్యుడు వస్తారని వైద్యసిబ్బంది చెబుతుండడం శోచనీయం. జిల్లాలో ప్రభుత్వ ఆస్ప్రతులు ఇలా.. వైద్య ఆరోగ్య శాఖ.. పీహెచ్సీలు 34 యూపీహెచ్సీలు 18 పీపీ యూనిట్ 1 లెప్రసీ వార్డు 1 డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ జిల్లా ఆస్పత్రి 1 ఏరియా ఆస్పత్రులు 5 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 వైద్యులు 200లకుపైగా.. నిత్యం 16 వేలకుపైగా రోగులు.. మధ్యాహ్నం ఇళ్లు.. ప్రైవేటు ఆస్పత్రుల్లో ఉంటున్న వైద్యులు వైద్యులు లేకపోవడంతో సొంత వైద్యం చేస్తున్న సిబ్బంది కునారిల్లుతున్న సర్కారు దవాఖానాలు అర్బన్ హెల్త్ సెంటర్కు ఓ వృద్ధుడు కర్ర చేతపట్టుకుని మధ్యాహ్నం పూట వచ్చాడు. అక్కడే ఉన్న నర్సు ఆ వృద్ధుడిని చూసి.. డాక్టర్ మధ్యాహ్నం ఉండరు తాతా.. రేపు ఉదయం రా అని చెప్పింది. సాయంత్రం 4 గంటల వరకు ఉండాల్సిన డాక్టర్ ఉండకపోతే అడిగేవారే లేకుండా పోయారు అంటూ సణుగుతూ వెనుదిరిగాడు. జ్వరంతో వణుకుతూ ఓ పెద్దావిడ పీహెచ్సీకి మధ్యాహ్నం సమయంలో వచ్చింది. ఆమెను చూసిన నర్సు ఇప్పుడు వచ్చావేంటి డాక్టర్ ఉండరు కదా.. ఉదయం రాకపోయావా అన్నారు. ఉన్నట్టుండి చలిజ్వరం రావడంతో వచ్చానమ్మ అని ఆ పెద్దావిడి సమాధానమిచ్చింది. దీంతో ఆ నర్సు డాక్టర్కు ఫోన్ చేసి విషయం చెప్పగా.. పారాసెట్మాల్, యాంటీబయాటిక్ ఇచ్చి పంపించేయ్.. రేపు ఉదయం రమ్మని చెప్పు.. అని కటువుగా వైద్యుడు చెప్పాడు. -
పశువుల్లో గురక వ్యాధికి చికిత్స ఇలా..
చింతలపూడి: ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పాడి పశువుల పెంపకానికి ప్రసిద్ధి. ఇక్కడి రైతులు పాడి పశువులను పెంచుకుంటూ ప్రత్యామ్నాయ ఆదాయ వనరుగా మార్చుకున్నారు. అయితే వర్షాకాలంలో పశువులు రకరకాల అంటు రోగాల బారినపడే ప్రమాదం ఉంది. ముఖ్యంగా కొత్త నీరు మురుగు నీటితో కలిసి కలుషితం కావడం కారణంగా పశువులు ఆ నీటిని తాగడంతో అంటురోగాలు సోకి విలువైన పశు సంపద కోల్పోయే ముప్పు ఉంది. వర్షాకాలంలో గేదెలు, గేదె దూడలు, పడ్డలకు ఎక్కువగా వచ్చే వ్యాధి గురక వ్యాధి. దీనినే గొంతు వాపు వ్యాధి అని కూడా పిలుస్తారు. పశువుల్లో వచ్చే వ్యాధుల్లో ఇది అత్యంత ప్రమాదకరమైనది. గురకవ్యాధి సోకిన పశువులకు అందించాల్సిన చికిత్సను గురించి పశుసంవర్థక శాఖ ఏడీ డా కె లింగయ్య వివరించారు. ఎలా సంక్రమిస్తుంది పాశ్చురెల్లా మల్టోసిడా అనే బ్యాక్టీరియ వల్ల పశువులు, గొర్రెలు, మేకల్లో వచ్చే ఈ వ్యాధి క్రిములు ఎడతెరపి లేని ముసురు వాతావరణంలో వేగంగా వృద్ధి చెందుతాయి. కలుషితమైన నీరు, మేత, పరికరాలు, విసర్జకాలు, స్రావాలు, కళేబరాలు, మాంసం ద్వారా వేగంగా వ్యాప్తి చెందుతాయి. ఇందుకు ఈగలు, దోమలు, ఇతర కీటకాలు కూడా దోహదపడతాయి. వ్యాధి క్రిములు శ్వాస, జీర్ణ వ్యవస్థ, దోమ కాట్ల ద్వారా శరీరంలోకి ప్రవేశించి ఎర్ర రక్త కణాలను ధ్వంసం చేసి రక్తం ప్రాణవాయువు ప్రక్రియను దెబ్బ తీస్తుంది. దీంతో ప్రాణ వాయువు సరిగా అందక పశువులు గురక పెట్టడం, రొప్పడం, ఆయాసపడటం వంటి లక్షణాలను ప్రదర్శిస్తుంది. పశువుల శరీర ఉష్ణోగ్రత 106 నుంచి 108 ఫారిన్ హీట్ వరకు పెరగడం, కనుపాపలు ఎర్రగా మారిపోవడం, మేత నెమరు నిలిచిపోవడం, మెడ గొంతు వాయడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. వ్యాధి క్రిములు శరీరంలోకి ప్రవేశించిన 12 నుంచి 36 గంటలకు వ్యాధి లక్షణాలు కనిపించి, సకాలంలో సరైన వైద్యం అందకపోతే మరో 12 నుంచి 24 గంటల్లో పశువు మరణిస్తుంది. గురక వ్యాధి చికిత్స వ్యాధిని గుర్తించిన మరుక్షణం రక్త పరీక్షలు నిర్వహించాలి. వ్యాధి సోకిన పశువును ఇతర పశువుల నుంచి వేరు చేయాలి. ప్రశాంత వాతావరణంలో పశువులకు పరీక్షలు చేయిస్తే మంచిది. ఈ పరిస్థితుల్లో పశువులను నిలబెట్టి మాత్రమే వైద్యం చేయడం శ్రేయస్కరం. యాంపిసిల్లిన్, క్లోక్సా సిలిన్, జెంటా మైసిన్, సెఫలాక్సిన్ వంటి యాంటి బయోటిక్ మందుల్ని సరైన మోతాదులో అవసరాన్ని బట్టి రక్తం లోకి ఎక్కిస్తే వేగంగా ఉపశమనం కలుగుతుంది. సాంబ్రాణి ధూపం వేయడం కూడా మంచిదే. వ్యాధి నిరోధక శక్తిని పెంచే మోమెజోల్ ఇంజక్షన్లు, బి–కాంప్లెక్స్ ఇంజక్షన్లు బాగా నీరశించిన పశువుకై తే డెక్ట్స్రోజ్ సైలెన్లు అవసరం కూడా ఉంటుంది. నివారణ గురకవ్యాధి సోకిన పశువులకు రోగ క్రిములను కలిగిన కలుషిత మేత, నీరు పరికరాలు, కళేబరాలను దూరంగా తరలించాలి. కళేబరాలను లోతుగా పూడ్చి వేయడం మంచిది. పరిసరాల్లో క్రిమి కీటకాలు వృద్ధి చెందకుండా పొడిగా ఉంచాలి. డిడిటి, గమాక్సిన్ ,సైపర్ మెధ్రిన్, కార్పొరిల్ వంటి క్రిమి సంహారకాలతో క్రిమి రహితం చేయాలి. పొరుగు ప్రాంతాల నుంచి వచ్చిన పశువులను కనీసం వారం రోజులన్నా వేరుగా ఉంచి వ్యాధి లేదని నిర్ధారించుకున్నాక మిగిలిన పశువులతో కలవనీయ్యాలి. గురకవ్యాధి నివారణకు ప్రభుత్వం ఏటా ఉచితంగా టీకాలు వేయిస్తోంది. ప్రస్తుతం గురకవ్యాధి, జబ్బవాపు, గాలికుంటు వ్యాధుల నిర్మూలనకు ఒకే వ్యాక్సిన్ అందుబాటులో ఉంది. పశువైద్యల సూచనల మేరకు ఈ టీకాలను తొలకరి తొలి దశలో లేదా ఎండలు ముదరక ముందు వేయిస్తే మంచిది. డా కె లింగయ్య, పశు సంవర్థక శాఖ ఏడీ, చింతలపూడి పాడి–పంట -
కొండరెడ్డి విద్యార్థిని మృతి
బుట్టాయగూడెం: మండలంలోని పులిరామన్నగూడెం పీహెచ్సీలో ఒక కొండరెడ్డి గిరిజన బాలిక బుధవారం మృతి చెందింది. పోలవరం మండలం దారావాడకు చెందిన బాలిక తల్లిదండ్రులు గురుగుంట్ల సింహాద్రిరెడ్డి, రామలక్ష్మి తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. గురుగుంట్ల పూర్ణ(6) చిలకలూరులో 1వ తరగతి చదువుతుండగా, బుధవారం కన్నాపురంలో తన తమ్ముడితోపాటు ప్రభుత్వ పథకాలు పొందేందుకు వేలిముద్ర వేయాలని ఒక ట్రాక్టర్లో దారావాడ నుంచి కన్నాపురం వచ్చారు. వేలిముద్ర వేసే సమయంలో పూర్ణ కళ్లుతిరిగి పడిపోయింది. హుటాహుటిన బాలికను పులిరామన్నగూడెం పీహెచ్సీలో ఆస్పత్రిలో చేర్పించారు. అయితే అంతకు ముందు కొండదిగే సమయంలో కూడా చింతపల్లి వద్ద ఉన్న చిలకలగండి సమీపంలో పూర్ణకు ఫిట్స్లా వచ్చాయి. కొద్దిసేపటికి బాగానే ఉండడంతో కన్నాపురం వెళ్లగా అక్కడ వేలిముద్ర వేస్తున్న సమయంలో ఫిట్స్తో పడిపోయింది. ఆస్పత్రిలో చేరిన బాలిక పూర్ణ మృతి చెందింది. బాలికకు ప్రాథనిక వైద్యంతోపాటు సీపీఆర్ కూడా చేసినా ఫలితం లేకుండా పోయిందని డాక్టర్ ఆకాంక్ష తెలిపారు. పూర్ణ మృతదేహాన్ని పీఆర్గూడెం నుంచి గడ్డపల్లి వరకూ మొబైల్ అంబులెన్స్లో తరలించారు. గడ్డపల్లి నుంచి దారావాడ వరకూ రహదారి అధ్వానంగా ఉండడంతో మొబైల్ అంబులెన్స్ కూడా వెళ్లలేని పరిస్థితి. దీంతో గిరిజనులే జోలి కట్టి మోసుకుంటూ దారావాడకు తీసుకువెళ్లారు. బాలిక గురుగుంట్ల పూర్ణ మృతికి కారణాలు తెలియాల్సి ఉంది. -
సీతంపేట వద్ద లారీ బోల్తా
కొయ్యలగూడెం : సీతంపేట సబ్ స్టేషన్ సమీపంలో జాతీయ ప్రధాన రహదారిపై బుధవారం ఓ లారీ అదుపు తప్పి బోల్తా పడింది. రాజమండ్రి వైపు వెళుతున్న లారీ ఎదురుగా వస్తున్న మరో లారీని తప్పించబోయి అదుపుతప్పి రోడ్డు మార్జిన్ వైపు పల్టీ కొట్టింది. అయితే ఈ ప్రమాదంలో ఎవరికీ ఎటువంటి గాయాలు కాలేదు. రోడ్డు పక్కనే ఉన్న చెత్తకి నిప్పు పెట్టడం వల్ల రోడ్డుపై భారీగా పొగ అలుముకోవడంతో ఎదురెదురుగా వస్తున్న వాహనాలు కనిపించకపోవడం ఈ ప్రమాదానికి కారణంగా పోలీసులు చెబుతున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆట్యా పాట్యా జిల్లా జట్ల ఎంపిక భీమవరం: పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్లో బుధవారం ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక జరిగింది. క్రీడాకారులు పి గోపీకృష్ణ, డి మోహన్కుమార్, జి యశ్వంత్రమణ, కె సాయిధనుష్, జె అభిషేక్పాల్, వి జయసంతోష్, పి రోహిత్ కుమార్, వి మణికంఠ గణేష్, ఎం తేజమహిమ, ఎం అభిరామ్, బి వెంకన్న, పి ప్రేమ్కుమార్, పి భాస్కరతేజ జిల్లా జట్లకు ఎంపికయ్యారని ఆట్యాపాట్యా జిల్లా అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్వర్మ తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9వ తేదీ నుంచి ఒంగోలులో నిర్వహించే రాష్ట్రస్థాయి జూనియర్ చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. వైభవం.. శోభనాచలుడి పవిత్రోత్సవం ఆగిరిపల్లి: స్థానిక శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా బుధవారం స్వామివారికి వైభవంగా పవిత్రములు సమర్పించారు ఉదయం స్వామివారికి స్నపన, ప్రత్యేక అలంకరణ, శ్రీ లక్ష్మీ నరసింహ సుదర్శన మూలా మంత్ర హోమం, దిగువ సన్నిధిలో ఉన్న స్వామివారికి పవిత్రములు సమర్పణ, నవ కుంభారాధన, శాంతి హోమం ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఆలయ కార్యనిర్వణాధికారి సాయి కార్యక్రమాలను పర్యవేక్షించారు. నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై విచారణ కుక్కునూరు: నకిలీ డెత్ సర్టిఫికెట్ వ్యవహారంపై భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. తెలంగాణ రాష్ట్రం సారాపాక గ్రామానికి చెందిన భూక్యా శ్రీరాములు పేరిట ఓ ఎల్ఐసీ ఏజెంట్ రూ.10 లక్షల పాలసీకి ఏడేళ్లుగా ప్రీమియం చెల్లిస్తున్నాడు. ఆ వ్యక్తి బతికుండగానే మరణించినట్లుగా కుక్కునూరు పంచాయతీ నుంచి డెత్ సర్టిఫికెట్ పోంది ఎల్ఐసీ నుంచి రూ.10 లక్షలు క్లయిమ్ చేశాడు. ఈ విషయాన్ని గత ఫిబ్రవరి 10వ తేదీన ‘సాక్షి’ దినపత్రిక బహిర్గతం చేసింది. కాగా ఈ వ్యవహారంలో డబ్బును రికవరీ చేసిన ఎల్ఐసీ కార్యాలయ అధికారులు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా భద్రాచలం పోలీసులు విచారణ చేపట్టారు. కుక్కునూరులో నకిలీ సర్టిఫికెట్ ఎవరు ఇచ్చారన్న విషయమై గత నాలుగు రోజులుగా కొందరిని స్టేషన్కు పిలిపించి ప్రశ్నించినట్టు తెలుస్తోంది. -
ఉంగుటూరు కూటమిలో కుంపట్లు
నీకు సగం.. నాకు సగం సాక్షి ప్రతినిధి, ఏలూరు: పైకి ఆప్యాయంగా పలకరించుకుని కౌగిలించుకుంటారు.. లోపల మాత్రం కత్తులు దూస్తారు. ఎమ్మెల్యే అధికారిక హోదాలో ఒక కార్యక్రమం చేస్తే.. ఆప్కాబ్ చైర్మన్ ప్రొటోకాల్ హోదాతో మరో కార్యక్రమం నిర్వహిస్తారు. సుపరిపాలన తొలి అడుగు పేరుతో ఉంగుటూరు నియోజకవర్గంలో నియోజకవర్గ ఇన్చార్జి, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు హడావుడి చేస్తుంటే.. పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు మరో కార్యక్రమానికి తెరతీసి పోటాపోటీగా హడావుడి చేస్తున్నారు. నియోజకవర్గంలో ఎమ్మెల్యేకు సమాంతరంగా హడావుడితో పార్టీ కేడర్ మొదలుకొని అధికారుల వరకు ఇద్దరు నేతల మధ్య నలిగిపోతున్నారు. నిత్యం కూటమిలోని జనసేన, టీడీపీ నేతల మధ్య అసంతృప్తి, అసహనాలతో ఉంగుటూరు రాజకీయం వేడెక్కుతోంది. ఎమ్మెల్యేతో చనువుగా ఉంటే వేటే.. పైకి ప్రేమగా కనిపించినా.. లోపల మాత్రం ఎమ్మెల్యే ధర్మరాజు, ఆప్కాబ్ చైర్మన్ గన్ని వీరాంజనేయులు కత్తులు దూసుకుంటున్నారు. ఎమ్మెల్యే నియోజకవర్గంలో బలపడితే భవిష్యత్లో తన రాజకీయ మనుగడ కష్టమవుతుందనే రీతిలో గన్ని చెక్ పెడుతూ వస్తున్నారు. ఆప్కాబ్ చైర్మన్ పదవి రావడంతో మరింత వేగం పెంచి నియోజకవర్గంలో మండలాల్లో పెత్తనం సాగించడంతో పాటు ఎమ్మెల్యేతో సన్నిహితంగా మెలిగే టీడీపీ నేతలపై వేటు కొనసాగిస్తున్నారు. ఉంగుటూరు మండల అధ్యక్షుడు పాతూరి విజయ్కుమార్ ఎన్నికల సమయంలో ధర్మరాజుకు సహకరించారనే కారణంతో మండల అధ్యక్ష పదవి నుంచి తొలగించారు. ఎన్నికల ప్రచార సమయంలోనే నారాయణపురంలో విజయ్కుమార్పై టీడీపీ వ్యక్తులే దాడి చేయడం గమనార్హం. భీమడోలు మండల అధ్యక్ష పదవిని సీనియర్లను కాదని నామినేట్ పదవి ఉన్న వ్యక్తికే కేటాయించడంపైన టీడీపీ కేడర్ రగులుతున్నారు. ఖర్చుతో కూడిన భీమడోలు మార్కెట్ యార్డు చైర్మన్ పదవిని తొలుత బీసీ మహిళకు కేటాయించారు. గన్ని వీరాంజనేయులు బీసీ మహిళ నుంచి దాన్ని బీసీ జనరల్ చేసి తన వర్గానికి చెందిన శేషగిరికి దక్కేలా చేశారు. మార్కెట్ యార్డుకు స్థానిక ప్రజాప్రతినిధి గౌరవ చైర్మన్గా వ్యవహరిస్తారు. ప్రొటోకాల్ ఉల్లంఘించి ప్రమాణస్వీకారానికి ఎమ్మెల్యేను పిలవకపోవడం వివాదమైంది. సుపరిపాలన తొలి అడుగు పేరుతో రాష్ట్ర మంత్రులు, జిల్లాలోని టీడీపీ ఎమ్మెల్యేలను ఆహ్వానించి గన్ని హడావిడి చేస్తున్నారు. మరోవైపు పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో అధికార యంత్రాంగాన్ని మొత్తం తీసుకుని ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. ఎమ్మెల్యే క్యాంపుతో టచ్లో ఉండే సీనియర్ నేతలను వ్యూహాత్మకంగా పక్కన పెట్టేలా గన్ని వ్యవహరిస్తున్నారు. ఈ నేపథ్యంలో టీడీపీ సీనియర్ నేతల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది. ఇప్పటికే అధిష్టానానికి ఫిర్యాదు చేసే దిశగా అసంతృప్తి నేతలు పావులు కదుపుతున్నారు. జనసేన ఎమ్మెల్యే వర్సెస్ ఆప్కాబ్ చైర్మన్ సుపరిపాలన తొలి అడుగు పేరుతో గన్ని హడావుడి పల్లె పల్లెకు పత్సమట్ల పేరుతో ఎమ్మెల్యే పోటీ కార్యక్రమం ఎమ్మెల్యేకు సన్నిహితంగా ఉండే టీడీపీ నేతలపై గన్ని వేటు గన్ని తీరుపై టీడీపీలో రగులుతున్న అసంతృప్తి ఉంగుటూరులో జనసేన వర్సెస్ టీడీపీ రగడ తారాస్థాయికి చేరింది. నిన్న మొన్నటి వరకు పనులు, పంపకాలు పర్సంటేజీల మధ్య చాప కింద నీరులా కొనసాగిన అంతర్యుద్ధం నేడు ప్రొటోకాల్ వ్యవహారాలకు పాకింది. మాజీ ఎమ్మెల్యే గన్ని వీరాంజనేయులను కాదని జనసేన ఇన్చార్జి ధర్మరాజుకు టిక్కెట్ కేటాయించడం, ఎన్నికల్లో ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో రగడకు తెరలేచింది. టీడీపీకే ఉంగుటూరు టిక్కెట్ ఇవ్వాలని ఎన్నికలకు ముందు గన్ని వర్గం భారీ ర్యాలీతో టీడీపీ రాష్ట్ర కార్యాలయం వద్ద హడావుడి చేసింది. టీడీపీ అధిష్టానం గట్టిగా చెప్పడంతో సైలెంట్ అయిపోయారు. ధర్మరాజు గెలవడంతో నియోజకవర్గంలో పూర్తి స్థాయి పెత్తనం కోసం హడావుడి మొదలైంది. నీకు సగం.. నాకు సగమంటూ పంచాయితీలకు తెరతీశారు. నామినేట్ పదవులు, వర్క్లు, మద్యం షాపుల ఇలా అన్నింటిని పంపకాలు చేసేలా టీడీపీ కీలక నేతలు ఒత్తిడి తెచ్చి నియోజకవర్గంలో ప్రతి దాంట్లో గన్నికి వాటాలు ఏర్పాటు చేశారు. ఉదాహరణకు నియోజకవర్గంలో 17 సొసైటీలు ఉంటే 8 జనసేన, 8 టీడీపీ, 1 బీజేపీకి కేటాయించారు. ఈ క్రమంలో టీడీపీ నుంచి సొసైటీ చైర్మన్లుగా ఎంపికై న వారికి చాలా ఖర్చయిందనేది నియోజకవర్గంలో అందరికి తెలిసిన బహిరంగ రహస్యం. -
చట్టంపై విద్యార్థులకు అవగాహన
చెట్లకు చేటు విద్యుత్ లైన్ పేరుతో జంగారెడ్డిగూడెంలో భారీ వృక్షాలను నరికి కలప తరలించుకుపోయారు. చెట్ల నరికివేతకు ఎవరికీ అనుమతులు ఇవ్వలేదని అధికారులు తెలిపారు. 8లో uఏలూరు (టూటౌన్): నేటి బాలలే రేపటి భావి భారత పౌరులని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. జాతీయ న్యాయ సేవాధికార సంస్థ న్యూఢిల్లీ, రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం శ్రీజాతీయ న్యాయ సేవాధికార సంస్థ–బాలల స్నేహ పూర్వక న్యాయ సేవల పథకం 2024పై అవగాహన కల్పించేందుకు ఆక్స్ఫర్డ్ ఒలింపియాడ్ స్కూలు విద్యార్థులకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ విద్యార్థి దశలోనే చట్టాలపై పూర్తి అవగాహన కలిగి ఉండాలని, రాజ్యాంగం కల్పించిన హక్కులతో పాటు బాధ్యతలు కూడా తెలుసుకుని ఉత్తమ పౌరులుగా తీర్చిదిద్దుకోవాలని సూచించారు. వ్యక్తిగత సమాచారాన్ని బహిర్గతం చేయరాదని, గుడ్ టచ్ బాడ్ టచ్ పైన అవగాహన కలిగి ఉండాలని సూచించారు. బాలలకు అవసరమైన పక్షంలో ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. -
యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా కారుమూరి సునీల్
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్సీపీ రాష్ట్ర యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్గా ఏలూరు పార్లమెంట్ నియోజకవర్గ సమన్వయకర్త కారుమూరి సునీల్కుమార్ను నియమించారు. పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జోన్ –2 వర్కింగ్ ప్రెసిడెంట్గా సునీల్ కుమార్ను నియమించినట్టు పార్టీ కేంద్ర కార్యాలయం తెలిపింది. జోన్ –2 పరిధిలోని కాకినాడ, డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పు గోదావరి, పశ్చిమ గోదావరి, ఏలూరు జిల్లాల్లో సునీల్ పార్టీ యువజన విభాగానికి నాయకత్వం వహించనున్నారు. ఆయన నియామకంతో పార్టీ యువజన విభాగం మరింత బలోపేతమవుతుందని పార్టీ వర్గాలు ఆశిస్తున్నాయి.టీడీపీ గూండాల దాడి హేయంభీమడోలు: వైఎస్సార్సీపీ ఎమ్మెల్సీ రమేష్యాదవ్, నాయకులపై పులివెందులలో టీడీపీ గుండాలు చేసిన దాడి అత్యంత హేయమని పార్టీ రాష్ట్ర బీసీ సెల్ వర్కింగ్ అధ్యక్షుడు నౌడు వెంకటరమణ ఓ పత్రికా ప్రకటనలో తీవ్రంగా ఖండించారు. ప్రజాస్వామ్యంలో ఇలాంటి దాడులకు తెగబడడం హేయమైన చర్య అన్నారు. టీడీపీలో పెదబాబు, చినబాబుకు భయం పట్టుకుందన్నారు. జగన్మోహన్రెడ్డి రోడ్డుపైకి వస్తే చాలు టీడీపీకి భయమని, అందుకే పార్టీ శ్రేణులపై పచ్చ గుండాలు దాడులు చేస్తున్నాయన్నారు. కూటమి ప్రభుత్వం తీరును మార్చుకోకపోతే వచ్చే ఎన్నికల్లో ప్రజలే తగిన గుణపాఠం చెబుతారన్నారు. దాడి చేసిన గుండాలను కఠినంగా శిక్షించాలని కోరారు. దాడికి నిరసనగా నేడు రాష్ట్రవ్యాప్తంగా బీసీ సెల్ ఆధ్వర్యంలో నిరసన ప్రదర్శనలు నిర్వహిస్తామన్నారు.అనుబంధ కమిటీలనియామకానికి చర్యలుబుట్టాయగూడెం: జిల్లాలోని అన్ని అసెంబ్లీ నియోజకవర్గాల్లో వైఎస్సార్సీపీ పార్టీ అనుబంధ కమిటీల నియామకం పూర్తి స్థాయిలో చేపట్టేలా చర్యలు తీసుకుంటున్నామని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాల అనుబంధ విభాగాల ఇన్చార్జి కొలుసు మోహన్యాదవ్ తెలిపారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, పార్టీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం రాజ్యలక్ష్మిలను మర్యాదపూర్వకంగా కలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ వచ్చే ఎన్నికల్లో పార్టీ బలోపేతానికి అనుబంధ విభాగాల్లో నియమితులైన నాయకులు కృషి చేయాలని కోరారు. కష్టపడి పనిచేసే ప్రతీ కార్యకర్తకు రాష్ట్ర అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి పార్టీలో సముచిత స్థానం కల్పించేందుకు కృషి చేస్తున్నారని తెలిపారు. ప్రజా వ్యతిరేక విధానాలను ఎండగట్టేలా కృషి చేయాలని పిలుపునిచ్చారు.ఎస్ఎస్సీ పరీక్షల పరిశీలనదెందులూరు: వేగవరం హేలాపురి ఇన్స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ కళాశాలలో జరుగుతున్న స్టాఫ్ సెలక్షన్ కమిషన్ స్టెనోగ్రాఫ్ పరీక్షలను ఏలూరు ఆర్డీఓ అచ్యుత్ అంబరీష్ పరిశీలించారు. బుధవారం వేగవరం కళాశాలను ఆయన పరిశీలించారు.విద్యాసంస్థల బస్సులపై కేసుల నమోదుఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు జిల్లావ్యాప్తంగా మోటారు వాహనాల తనిఖీ అధికారులు బుధవారం విద్యాసంస్థల బస్సులను తనిఖీ చేశారు. వివిధ ఉల్లంఘనలకు పాల్పడినందుకు 15 కేసులు నమోదు చేసి, రూ.26 వేలు జరిమానా విధించినట్లు ఉప రవాణా కమిషనరు షేక్ కరీమ్ తెలిపారు. వాహనదారులు లైసెనన్స్తో పాటు సంబంధిత వాహన పత్రాలను ఉంచుకోవాలని, రహదారి భద్రతా నియమాలను తప్పక పాటించాలన్నారు. విద్యార్థులను తరలించే విషయములో నిబంధనలను పాటించని విద్యాసంస్థల బస్సులను, ప్రైవేటు వాహనాలను సీజ్ చేస్తామని ఆయన హెచ్చరించారు. -
నేటి నుంచి శ్రీవారి పవిత్రోత్సవాలు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో గురువారం నుంచి స్వామివారి దివ్య పవిత్రోత్సవాలు ప్రారంభం కానున్నాయి. ఈ ఉత్సవాలు ఈ నెల 10 వరకు వైభవంగా జరుగనున్నాయి. ఏడాది పొడవునా ఆలయంలో తెలిసీ, తెలియక జరిగిన తప్పుల ప్రాయశ్చిత్తం నిమిత్తం నాలుగు రోజుల పాటు ఈ పవిత్రోత్సవాలను నిర్వహించడం సంప్రదాయంగా వస్తోంది. అందులో భాగంగా 7న అంకురార్పణ, 8న పవిత్రాధివాసం, 9న పవిత్రావరోహణ, 10న మహా పూర్ణాహుతి వేడుకలను నేత్రపర్వంగా నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి తెలిపారు. ఉత్సవాలు జరిగే ఈ నాలుగు రోజులు ఆలయంలో నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నామని, భక్తులు గమనించాలని ఆయన కోరారు. -
మూల్యాంకన పుస్తకాలపై వ్యతిరేకత
ఇప్పటికే విద్యాశక్తిని బహిష్కరించిన ఉపాధ్యాయులు నూజివీడు: రాష్ట్ర ప్రభుత్వం విద్యార్థులకు నిర్వహించే పరీక్షలకు సంబంధించి విద్యాశాఖ ద్వారా పాఠశాలలకు పంపిన మూల్యాకంన పుస్తకాలపై ఉపాధ్యాయుల్లో వ్యతిరేకత వ్యక్తమవుతోంది. విద్యాశాఖ ఉన్నతాధికారులు ఇస్తున్న పనులను చేయడానికే ఎక్కువ సమయం పడుతోందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. విద్యార్థులకు ఒక్కో సబ్జెక్టుకు ఒక్కో మూల్యాంకన పుస్తకం ఇచ్చింది. దీంతో ఆరో తరగతి నుంచి పదో తరగతి వరకు ఒక్కో విద్యార్థికి ఆరు మూల్యాంకన పుస్తకాలు ఇవ్వగా, ఫార్మేటివ్ అసిస్మెంట్, సమ్మేటివ్ అసిస్మెంట్ పరీక్షలను ఆ పుస్తకాల్లోనే విద్యార్థులతో రాయించాలి. విద్యార్థులు రాసిన తరువాత పరీక్షలను దిద్ది అందులోనే ఇచ్చిన ఓఎమ్మార్ షీట్లో మార్కులు వేయడంతో పాటు వారి పరీక్ష రాసిన పేజీలను స్కాన్ చేసి విద్యాశాఖ ఇచ్చిన యాప్లో ఆప్లోడ్ చేయాలి. అప్లోడ్ చేసేటప్పుడు సర్వర్ బిజీగా ఉన్నా, నెట్ స్లోగా ఉన్నా అప్లోడ్ చేయడం తీవ్ర జాప్యమయ్యే అవకాశాలున్నాయి. బడిలో దిద్దడానికి సమయమేది : గతంలో విద్యార్థి రాసిన పరీక్ష పేపర్లను ఉపాధ్యాయులు వారి వెసులుబాటును బట్టి బడిలో దిద్దేవారు. సమయం సరిపోకపోతే ఇళ్లకు తీసుకెళ్లి పేపర్లు దిద్దుకొని తీసుకొచ్చేవారు. ఇప్పుడు మూల్యాంకనం పుస్తకాలను ఇంటికి మోసుకొని వెళ్లే పరిస్థితి లేకుండా పోయిందని వాపోతున్నారు. ఆరో తరగతిలో 40 మంది విద్యార్థులుంటే వారందరి మూల్యాకనం పుస్తకాలు ఇంటికి తీసుకెళ్లి దిద్దడానికి వీలవ్వదు. బడిలోనే దిద్ది ప్రతి సబ్జెక్టుకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాలను స్కాన్ చేసి అప్లోడ్ చేయాలి. ఒక్కొక్క విద్యార్ధి మూడు పేజీలు రాస్తే వంద నుంచి 120 పేజీలను ఒక సబ్జెక్టుకు స్కాన్ చేయాల్సి ఉంటుంది. హైస్కూల్లో ఒక ఉపాధ్యాయుడు నాలుగు తరగతులకు వెళ్లినట్లయితే వారం రోజుల పాటు ఇదే పనిని చేస్తే పూర్తవుతుంది. ఇంత చేసినా విద్యార్థికి ఒనగూడే ప్రయోజనం శూన్యం అనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. ఈ మూల్యాంకనం పుస్తకాలను ఏ సబ్జెక్టుకు ఆ సబ్జెక్టు ఉపాధ్యాయుడు భద్రపరుచుకోవాలి. విద్యాశక్తి నిర్బంధంగా అమలు హైస్కూళ్లలో సాయంత్రం 4 గంటల తరువాత విద్యాశక్తి కార్యక్రమాన్ని విద్యాశాఖ అమలు చేస్తోంది. ఉన్నత పాఠశాలల ఉపాధ్యాయులు తప్పనిసరిగా విద్యాశక్తి కార్యక్రమాన్ని అమలు చేయాల్సిందేనని ఉన్నతాధికారులు చెబుతున్నారు. అయితే ఇది ఉపాధ్యాయులకు కొత్త తలనొప్పిలా మారింది. ఉపాధ్యాయ సంఘాలు అడిగినప్పుడు నిర్భంధం కాదని చెబుతున్న ఉన్నతాధికారులు ఆ తరువాత ఉపాధ్యాయులపై మండల స్థాయి అధికారులతో మేం వస్తున్నాం.. తనిఖీ చేస్తాం.. అంటూ ఒత్తిడి చేస్తూ పనిచేయిస్తున్నారు. ఇలాంటి పరిస్థితులు గతంలో ఎన్నడూ లేవని ఉపాధ్యాయులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో విద్యాశక్తి కార్యక్రమాన్ని బహిష్కరిస్తున్నట్లు ఉపాధ్యాయులు గత రెండు రోజులుగా ఫ్యాప్టో ఆధ్వర్యంలో డీఈవోలకు వినతిపత్రాలను సైతం అందజేస్తున్నారు. ప్రశాంతంగా సాగాల్సిన విద్యారంగ కార్యక్రమాలను హడావుడిగా మార్చేసి తీవ్ర ఒత్తిడికి గురయ్యేలా ప్రభుత్వం చేస్తుండటంతో ఎంతో మంది ఉపాధ్యాయులు నేడు అనారోగ్యం పాలవుతున్నారనే ఆందోళన ఉపాధ్యాయుల్లో వ్యక్తమవుతోంది. -
తిరగని రాట్నం
కూటమి పాలనలో చేనేత రంగానికి ప్రోత్సాహం కరువైంది. ఆదరణ లేక మగ్గాలు మూలకు చేరుతున్నాయి. అధికారంలోకి వచ్చిన ఏడాది కాలంలో చంద్రబాబు సర్కారు నేతన్నల వైపు కన్నెత్తి చూసింది లేదు. నేత మగ్గాలకు 200 యూనిట్ల వరకు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ అంటూ ఇప్పుడు కంటితుడుపు చర్యలతో సరిపెడుతోంది. సాక్షి, భీమవరం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఆరు వేల వరకు చేనేత కుటుంబాలున్నాయి. పాలకొల్లు, అత్తిలి, యలమంచిలి, పెంటపాడు, పోడూరు, ఆచంట మండలాల్లో నేత కార్మికులు అధికంగా ఉన్నారు. దివంగత వైఎస్ హయాంలో చేనేత రంగం ఒక వెలుగు వెలిగింది. నేత కార్మికులకు 50 ఏళ్లకే పింఛన్, రుణ మాఫీ, అధిక వడ్డీలతో కార్మికులు అప్పుల ఊబిలో కూరుకుపోకుండా ఆర్టిజన్ క్రెడిట్ కార్డుల ద్వారా పావలా వడ్డీకే కొత్తగా రుణ సాయం, చిలపనూలుపై పదిశాతం సబ్సిడీ, ఉచిత వైద్య శిబిరాలు, ఇళ్ల నిర్మాణం తదితర ఎన్నో కార్యక్రమాల ద్వారా చేనేత రంగాన్ని ఆయన ఆదుకున్నారు. తర్వాత పట్టించుకున్న వారు లేక సంక్షోభంలో కూరుకుపోయింది. నేతన్నకు అండగా తండ్రిని మించిన తనయునిగా చేనేత రంగానికి మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అండగా నిలిచారు. సొంత మగ్గం ఉన్న నేత కుటుంబాలకు వైఎస్సార్ నేతన్న నేస్తంగా నెలకు రూ. 2000 చొప్పున ఏడాదికి రూ.24,000 ఆర్థిక సాయం అందించారు. గత ప్రభుత్వంలోని ఐదేళ్లలో ఈ పథకం కింద ఉమ్మడి జిల్లాలో సరాసరి 1,063 కుటుంబాలకు రూ.12.76 కోట్ల లబ్ధి చేకూరింది. ప్రస్తుత పశ్చిమ గోదావరి జిల్లాలో 920 కుటుంబాలకు రూ.10.96 కోట్లు, ఏలూరు జిల్లాలో 150 కుటుంబాలకు రూ. 1.8 కోట్ల సాయం అందించారు. అమ్మఒడి, చేయూత, పింఛన్, వాహనమిత్ర, ఆరోగ్య శ్రీ వైద్యం తదితర పథకాల ద్వారా ఒక్కో కుటుంబానికి లక్షలాది రూపాయల ప్రభుత్వ సాయం అందింది. కంటి తుడుపు చర్యలే : గురువారం జాతీయ చేనేత దినోత్సవంగా సందర్భంగా చేనేతకు వరాల జల్లంటూ కూటమి ప్రచారం విమర్శలకు తావిస్తోంది. నేత మగ్గాలకు 200 యూనిట్లు, మర మగ్గాలకు 500 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్, జీఎస్టీ మినహాయింపు కంటితుడుపు చర్యలుగా కార్మికులు కొట్టిపారేస్తున్నారు. వీటివల్ల చేనేత రంగానికి ఒనగూరేదేమి లేదంటున్నారు. జిల్లాలో కేవలం 677 నేత మగ్గాలకు మాత్రమే ఈ సాయం పరిమితం కానుంది.గత ప్రభుత్వంలో నేతన్న నేస్తం ద్వారా అందించిన సాయం పశ్చిమగోదావరి జిల్లా : సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం (రూ. కోట్లలో) 2019–20 854 రూ. 2.01 2020–21 1,067 రూ. 2.57 2021–22 779 రూ. 1.87 2022–23 839 రూ. 2.02 2023–24 1,027 రూ. 2.47 ఏలూరు జిల్లా సంవత్సరం లబ్ధిదారులు ప్రభుత్వ సాయం (రూ. లక్షల్లో) 2019–20 142 రూ. 34.10 2020–21 187 రూ. 44.90 2021–22 120 రూ. 28.80 2022–23 149 రూ. 35.76 2023–24 153 రూ. 36.72 ఏడాదిగా నేతన్నల వైపు కన్నెత్తి చూడని కూటమి ప్రభుత్వం ప్రోత్సాహం లేక మూలకు చేరిన మగ్గాలు గతంలోనూ చీర–ధోవతి హామీని అటకెక్కించిన చంద్రబాబు నేతన్న నేస్తంతో అండగా నిలిచిన జగన్ సర్కారు ఉమ్మడి జిల్లాలోని 1,070 కుటుంబాలకు రూ. 12.76 కోట్ల సాయం నేడు జాతీయ చేనేత దినోత్సవం చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే చేనేత అంటే చంద్రబాబుకు ఎప్పుడూ చిన్నచూపే. చేనేత అభివృద్ధికి ఆయన చేసిందేమీ లేదు. నేత కార్మికులను నిజంగా ప్రోత్సహించింది దివంగత వైఎస్సార్. తండ్రిని మించిన తనయుడిగా నేతన్న నేస్తం, సంక్షేమ పథకాలతో మాజీ సీఎం జగన్ నేత కార్మికులను ఆదుకున్నారు. – వీరా మల్లిఖార్జునుడు, వైఎస్సార్సీపీ చేనేత విభాగం జిల్లా అధ్యక్షుడు, పాలకొల్లు ఎన్నికల హామీలు అమలుచేయాలి చేనేత కార్మికుల కుటుంబాలకు 200 యూనిట్ల వరకు ఉచితంగా విద్యుత్ ఇవ్వడం వల్ల నేత కార్మికులకు పెద్దగా మేలు జరిగేది లేదు. చేనేతను ప్రోత్సహించే విధంగా ఎన్నికల్లో ఇచ్చిన హామీలన్నింటిని అమలుచేయాలి. గత ప్రభుత్వంలో మాదిరి సంక్షేమ పథకాలను అందజేయాలి. నిల్లా బాలవీరయ్య, చేనేత కార్మికుడు, శివపురం మళ్లీ చిన్నచూపే చీర–ధోవతి పథకాన్ని పునరుద్ధరిస్తానని, చేనేత ఉత్పత్తులపై 30 శాతం రిబేటు ఇస్తామంటూ 2014 ఎన్నికల ముందు హామీ ఇచ్చిన చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ఆ ఊసే ఎత్తలేదు. ప్రతామ్నాయ ఉపాధి చూసుకోవాలని నేతన్నలను చిన్నచూపు చూశారు. కూటమి ప్రభుత్వంలోనూ అదే తీరుగా ఉన్నారన్న విమర్శలున్నాయి. ఏడాదిగా ప్రోత్సాహం కరువై చేనేత కుటుంబాలకు పూటగడవడం కష్టంగా మారింది. బతుకుదెరువు కోసం మగ్గాలకు స్వస్తి చెబుతున్న వారి సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. చాలామంది కార్మికులు నేత పని వీడి వ్యవసాయ కూలీలుగా, ఇతర పనుల్లోకి వెళ్లిపోతున్నారు. ఏడాది క్రితం ఉమ్మడి జిల్లాలో 1187 మగ్గాలు ఉండగా ప్రస్తుతం 677కు తగ్గిపోయినట్టు తెలుస్తోంది. -
పిల్ల జలగలతో గొర్రెలకు ప్రమాదం
జంగారెడ్డిగూడెం: గొర్రెలు, పశువుల్లో పొట్ట జలగల వలన చాలా నష్టాలు కలుగుతాయి. అందులో ముఖ్యంగా పిల్ల పొట్ట జలగల వల్ల గొర్రెల్లో విరేచనాలు కలిగి, నీరసించి మరణాలు సంభవించే ప్రమాదం ఉంది. కుంటలు, చెరువులు పక్కన తేమ గల ప్రాంతాల్లో నాట్లు ఉన్న ప్రాంతాల్లో నత్తలు ఉంటాయి. గొర్రెలను ఆ ప్రాంతాల్లో మేపడం వలన అవి అక్కడి నీరు తాగడం ద్వారా గొర్రెలకు ఈ వ్యాధి సోకుతుందని పశువైద్యాధికారి బీఆర్ శ్రీనివాసన్ తెలిపారు. ఇవి పొట్ట గోడల్లో స్థావరం ఏర్పాటు చేసుకుని పోషక పదార్థాలను పీల్చడం ద్వారా పశువుకు నష్టాన్ని చేకూర్చుతాయని, గొర్రెల పెంపకందారులు జాగ్రత్తలు పాటించాలని చెబుతున్నారు. వ్యాధి వ్యాప్తి పొట్ట జలగల గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జించబడి, నీటిలోనికి చేరినప్పుడు గుడ్లు పగిలి అందులోని లార్వా దశ (మిరసిడియం) నత్తల శరీరంలోకి ప్రవేశించి, నత్తల్లో కొంత అభివృద్ధి చెంది సర్కేరియా దశలో బయటకు విసర్జించబడతాయి. వీటితో కలుషితమైన గడ్డి, నీటి ద్వారా గొర్రె శరీరంలోనికి ప్రవేశించి, ముందుగా చిన్న ప్రేగుల లోపల పొరలకు చేరుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకుని, 3 నుంచి 5 వారాల్లో పెద్ద జలగలుగా అభివృద్ధి చెందుతాయి. రూమోన్లో స్థావరం ఏర్పరుచుకుని 7 నుంచి 14 వారాల తరువాత గుడ్లు పెడతాయి. ఆ గుడ్లు పేడ ద్వారా బయటకు విసర్జింపబడి ఇతర పశువులకు వ్యాపిస్తాయి. వ్యాధి లక్షణాలు పిల్ల పొట్ట జలగలు చిన్న ప్రేగుల మొదటి భాగమైన డ్యుమోడినము గోడ లోపలి పొరల్లో స్థావరం ఏర్పరుచుకుని, పోషక పదార్థాలను ఎక్కువగా పీల్చుకోవడం వలన గొర్రెలు బాగా క్షీణించి, నీరసించి పోతాయి. గొర్రెల్లో ఆకలి లేమి, నీరు ఎక్కువగా తాగడం, దుర్వాసనతో కూడిన నీళ్ల విరేచనాలు, దవడ కింద భాగంలో నీరు చేరడం, శరీర కుహరంలలో నీరు చేరడం అతిసారం, రక్తహీనత లక్షణాలు కనిపిస్తాయి. దవడ కింద వాపు సాయంత్రం కనబడి ఉదయానికి తగ్గుతుంది. ఈ వ్యాధి వల్ల గొర్రెల మందల్లో 80 శాతం వరకు మరణాలు సంభవించవచ్చు. కొన్ని పర్యాయాలు పిల్ల పొట్ట జలగలు అధిక సంఖ్యలో సోకడం వల్ల నీళ్ల విరేచనాలు కలిగి అకస్మాత్తుగా చనిపోయే అవకాశం ఉంది. కంటి లోపలి మ్యూకస్ పొర రక్తహీనత వల్ల తెల్లగా పాలిపోయి ఉంటుంది. వ్యాధి నిర్ధారణ పిల్ల పొట్ట జలగ వ్యాధి సోకినప్పుడు పేడలో జలగ గుడ్లు కనిపించవు. కాని కొన్ని సందర్భాల్లో పిల్ల పొట్ట జలగలు పేడలో కనిపిస్తాయి. కావున వ్యాధి లక్షణాలు, శవపరీక్ష ద్వారా వ్యాధి నిర్ధారణ చేయవచ్చు. శవ పరీక్ష చేసినప్పుడు డ్యుమోడినం లోపలి మ్యూకస్ పొర పాలిపోయి, అక్కడక్కడ రక్తపు చుక్కలు కనిపిస్తాయి. డ్యుమోడినం లోపలి మ్యూస్ పొరల నుంచి సేకరించిన పదార్ధంను సూక్ష్మదర్శిని ద్వారా పరీక్షించిన కనిపిస్తాయి. చికిత్స సాధారణంగా పొట్ట జలగల నివారణకు ఉపయోగించే మందుల వలన పిల్ల పొట్ట జలగల నివారణ జరగదు. వీటి నివారణకు నిక్లజమైడు 100 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున లేదా ఆక్సిక్లోజనైడు 18.7 మి.గ్రాలు ఒక కిలో శరీర బరువుకు చొప్పున రెండు రోజుల వ్యవధిలో రెండు మోతాదులు ఇవ్వాలి. అతిసారం అధిగమించడానికి రక్తంలోనికి సైలెన్లను ఎక్కించాలి. రక్తహీనత నివారించడానికి ఇనుపధాతువుతో కూడిన మందులు ఇవ్వాలి. కాలేయం సాధారణ స్థితికి చేరుకోవడానికి మందులు ఇవ్వాలి. బాక్టీరియా క్రిములు చేరకుండా ఉండటానికి అవసరమైతే యాంటి బయోటిక్ మందులు ఇవ్వాలి. చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి వ్యాధి సోకిన ప్రాంతాల్లోని చెరువులు, కుంటల్లోని నీరు తాగనీయకూడదు. అవసరమైతే చుట్టూ కంచె ఏర్పాటు చేయాలి. పరిశుభ్రమైన తాగునీరు అందుబాటులో ఉంచుకోవాలి. చెరువుల్లోని నత్తలను నాశనం చేయాలి. గొర్రెలకు సమతుల్యమైన పోషకాహారం అందించాలి. పరిశుభ్ర వాతారణం కల్పించాలి. – బీఆర్ శ్రీనివాసన్, పశువైద్యాధికారి -
సూర్యఘర్ పథకంపై అవగాహన కల్పించాలి
భీమవరం: ప్రతి వినియోగదారుడు సూర్యఘర్ పథకంలో సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేసుకునే విధంగా అవగాహన కల్పించాలని ఏపీఈపీడీసీఎల్ డైరక్టర్ టి. సూర్యప్రకాశ్ ఆదేశించారు. ఏపీఈపీడీసీఎల్ డైరెక్టర్ (ఆపరేషన్)గా బాధ్యతలు స్వీకరించిన సందర్భంగా మంగళవారం భీమవరం వచ్చిన ఆయన ఎస్ఈ కార్యాలయంలో అధికారులు, సిబ్బందితో ఏర్పాటు చేసిన సమీక్షా సమావేశంలో మాట్లాడారు. ఎస్సీ, ఎస్టీలకు వారి ఇళ్లపై సోలార్ ప్లాంట్లను ఏర్పాటు చేసేందుకు అనువైన స్థలం ఉంటే నెడ్క్యాప్ ద్వారా సోలార్ ప్యానల్స్ ఏర్పాటు చేస్తారని తెలిపారు. ఏ సబ్ స్టేషన్ల పరిధిలో అంతరాయాలు వస్తున్నాయో అడిగి, వినియోగదారులకు అంతరాయాలు లేని విద్యుత్ సరఫరా చేసేందుకు చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ఈ సందర్భంగా సూర్యప్రకాశ్ను సిబ్బంది సత్కరించారు. కార్యక్రమంలో ఈఈ ఎన్.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. -
ముఖం చాటేసిన పులస
పెనుగొండ: గోదావరి జిల్లాలకు సంక్రాంతి పండుగ ఎంత ప్రత్యేకమో.. వరదనీటితో ఎగురుకొంటూ వచ్చే అతిథి పులస అంతే విశిష్టతను కలిగి ఉంటుంది. ఎర్రనీరు వచ్చిందంటే చాలు సముద్రం నుంచి ఎగురుకొంటూ గోదావరిలో కలసి నామాంతరం మార్చుకొని పులసగా పిలువబడే చేపలరాజు ఈ ఏడాది చిక్కడం కష్ట సాధ్యంగా మారింది. ప్రతి ఏటా జూన్ నుంచి సెప్టెంబరు వరకూ ఇబ్బడి ముబ్బడిగా దొరికి, దీపావళి వరకూ అరకొరగా దొరికే పులస ప్రస్తుతం దొరకడం కష్టంగా మారింది. దీంతో ఆశలు వదులుకొన్న జాలర్లకు, పులస ప్రియులకు గోదావరికి రెండు మూడు పర్యాయాలు వరద నీరు రావడంతో ఆశతో ఎదురు చూస్తున్నారు. హిల్సా పులసగా నామాంతరం సముద్రంలో హిల్సాగా పిలవబడే చేపజాతి పసిపిక్ మహాసముద్రంలో జీవిస్తుంటుంది. ప్రతి ఏటా గోదావరికి ఎర్రనీరు వచ్చే సమయానికి ఖండాంతరాలు ఈదుకొంటూ గోదావరికి వచ్చి సంతతిని వృద్ధి చేసుకొని తిరిగి సముద్రంలోకి వెళుతుంటాయి. ఈ సమయంలో జాలర్లకు చిక్కి కాసులు కురిపిస్తాయి. పులసలు వచ్చే సమయానికి రాష్ట్రంలోని నలుమూలల నుంచి జాతీయ రహదారిలో గోదావరి జిల్లాల మీదుగా ప్రయాణించే ప్రతి ఒక్కరూ పులస రుచిని చూడడానికి మక్కువ చూపుతుంటారు. దీంతో దీని ధర ఘనంగానే ఉంటుంది. పులస విరివిగా దొరికే ప్రతి ఏటా కిలో రూ.1500 నుంచి రూ.3 వేల వరకూ పలుకుతుంది. సైజు పెరిగే కొద్దీ ఒక్కో పులసను పోటీ పడి పులస ప్రియలు రూ.25 వేలుకు కొనుగోలు చేసిన దాఖలాలు ఉన్నాయి. అయితే, ఈ ఏడాది వీటి జాడే కరువైంది. దీంతో కిలో రూ.3 వేలు నుంచి అమ్మకాలు సాగిస్తున్నారు. సముద్రపు పోటే కారణమా? పులసల జాడ తగ్గడానికి సముద్రపు పోటు ఓ కారణంగా చెబుతున్నారు. గోదావరి జలాలు సముద్రంలోకి కలిసేటప్పుడు ఉండే తీయదనం, ఎర్రదనం తగ్గడంతో పులసల జాడ తక్కువైందని భావిస్తున్నారు. ఉప్పు జలాలు ప్రస్తుతం ఇటు సిద్ధాంతం వరకూ, అటు జొన్నాడ ఆలమూరు వరకూ ప్రభావం చూపుతుండడంతో పులస మార్గానికి ఆటంకం కారణం కావచ్చునని భావిస్తున్నారు. ఇసుక తవ్వకాలు భారీగా ఉండడంతో సముద్రపు జలాలు గోదావరిలోకి నానాటికీ బాగా చొచ్చుకు వచ్చి గోదావరి ప్రవాహ ప్రాంతం కలుషితమైందని అంటున్నారు. దీంతో పులస మార్గానికి ఆటంకం కలుగుతుందంటున్నారు. ఆగస్టుపైనే ఆశలు సాధారణంగా గోదావరికి ఆగస్టు మధ్యమంలో వరద ఉధృతంగా వచ్చే అవకాశం ఉండడంతో ఇటు పులసల ప్రియులు, అటు జాలర్లు ఆశలు పెట్టుకొన్నారు. అయితే, ఎగువ ప్రాంతాల్లోనూ వర్షాభావ పరిస్థితులు ఉండడంతో వారి ఆశ నిరాశగా మిగిలిపోయే అవకాశాలు ఉన్నాయి. మార్కెట్ను ముంచేస్తున్న ఇలసలు పులస జాడ అంతంతమాత్రంగానే ఉండడంతో జాతీయ రహదారిలో పులసల స్థానంలో ఒడిస్సా నుంచి వచ్చిన ఇలసలు ముంచేస్తున్నాయి. అసలైన పులస ఎర్రనీరులో ఈదుకొంటూ వచ్చినపుడు పులసపై ఎర్రటి జాడ కనిపిస్తూ ఉంటుంది. దీనిని గుర్తించి తీసుకోవలసి ఉంటుంది. పులసలు తూర్పుగోదావరి జిల్లా ధవళేశ్వరం నుంచి ప్రారంభమై ఆత్రేయపురం, విజ్జేశ్వరం, జొన్నాడ ఆలమూరు, సిద్ధాంతం, కోడేరు, యలమంచిలి వరకూ జాలర్ల వలకు చిక్కుతుంటాయి. పులసకు, ఇలసకు తేడాను గోదావరి వాసులు గుర్తించినా, ఇతర జిల్లాల నుంచి జాతీయ రహదారిలో పయనించే వాహనదారులు గుర్తించే అవకాశం లేదు. దీంతో ఇలసలనే పులసలుగా కొందరు అమ్మకాలు సాగిస్తున్నారు. వీటి ధరా అధికంగానే ఉండడంతో ధర చూసి పులసగా భావిస్తూ మోసపోతున్నారు. సిద్ధాంతం, జొన్నాడ ఆలమూరు వంటి ప్రాంతాల్లోనూ పులసలు అరకొరగా దొరుకుతుండడంతో కొందరికి మాత్రమే అసలైన పులస దక్కుతుంది. గోదావరిలో జాడలేని పులస అరకొర లభ్యతతో ఆకాశాన్నంటిన ధరలు పుస్తులమ్ముకొనైనా పులస తినాలనే నానుడు గోదావరి జిల్లాల్లో ఉంది. కానీ ఈ ఏడాది పుస్తులమ్ముకొన్నా.. చేపల రాజు పులస దొరికే పరిస్థితి లేదు. గోదావరికి వరద ఉధృతి అంతంత మాత్రంగా ఉండడంతో పులస జాడ కనిపించడం లేదు. దీంతో పులస ప్రియులు జిహ్వను చంపుకోవాల్సి వస్తోంది. ప్రత్యేక వలలు సైతం ఎంచుకొని, నలుగురైదుగురు జాలర్లు వెళ్లినా ఒకటి రెండు మాత్రమే చిక్కడంతో గిట్టుబాటు కాక జాలర్లు సైతం తీవ్ర నిరాశకు గురవుతున్నారు. కూరా ప్రత్యేకమే పులస కూర తయారీ ప్రత్యేకమే. సాధారణంగా చేపల కూర ఒకటి రెండు రోజులు మించి ఉండే అవకాశాలు ఉండవు. అయితే, పులస కూర వారంకు పైగా నిలువ ఉంటుంది. దీని కోసం ప్రత్యేకంగానే తయారీ చేస్తుంటారు. పులస కూర తయారీలో వెన్నతో పాటు, ఆవకాయ ఊట, కుమ్ముడు ఆముదం వేసి వండుతారు. దీంతో పులస ముక్క కన్నా, పులుసే అమోఘమంటూ లొట్టలు వేసుకొని మరీ తింటారు పులస ప్రియులు. -
త్రుటిలో తప్పిన పెను ప్రమాదం
పాలకొల్లు సెంట్రల్: పూలపల్లి గ్రామంలో ఓ ఇంటిలో గ్యాస్ లీకై అగ్ని ప్రమాదం సంభవించగా సకాలంలో మంటలను అదుపు చేయడంతో పెను ప్రమాదం తప్పింది. వివరాల ప్రకారం గ్రామంలోని గంటాలమ్మ ఆలయం వద్ద నివాసం ఉంటున్న గంట సత్తిబాబు భార్య స్వరాజ్యలక్ష్మి మంగళవారం ఉదయం వంట చేస్తుండగా గ్యాస్ లీకై అగ్నిప్రమాదం సంభవించింది. వెంటనే ఆమె కేకలు వేయగా స్థానికులు పరుగున వచ్చి మంటలతో ఉన్న గ్యాస్ బండను బయటకు తీసుకువచ్చారు. సమాచారం అందుకున్న ఫైర్ సిబ్బంది, హెచ్పీ గ్యాస్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. ఆలస్యం అయ్యి ఉంటే బండ పేలిపోయేదని స్థానికులు ఆందోళనకు గురయ్యారు. సుమారు రూ.20 వేలు ఆస్తి నష్టం జరిగినట్లు అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. ఆటల పోటీలు వాయిదా ఏలూరు రూరల్: జాతీయ క్రీడా దినోత్సవం పురస్కరించుకుని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ చేపట్టిన ఆటల పోటీలు అనివార్య కారణాల వల్ల వాయిదా వేసినట్లు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి బి శ్రీనివాసరావు ప్రకటనలో తెలిపారు. తదుపరి జిల్లా జట్ల ఎంపిక, పోటీల నిర్వహణ తేదీలను త్వరలో ప్రకటిస్తామని వెల్లడించారు. డ్రంక్ అండ్ డ్రైవ్లో జరిమానా భీమవరం: మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న ఏడుగురిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా ఒక్కొక్కరికి రూ.10 వేలు చొప్పున జరిమానా విధించినట్లు భీమవరం వన్టౌన్ సీఐ ఎం.నాగరాజు మంగళవారం చెప్పారు. వన్టౌన్ పరిధిలో ఈనెల 4వ తేదీ రాత్రి ఎస్సైలు బి.వై కిరణ్కుమార్, ఎస్వీవీఎస్ కృష్ణాజి సిబ్బందితో కలిసి కొత్త బస్టాండ్ ప్రాంతంలో స్పెషల్ డ్రంక్ అండ్ డ్రైవ్ నిర్వహించినట్లు చెప్పారు. ఈ తనిఖీల్లో మద్యం సేవించి వాహనాలు నడుపుతున్న కారు, ఆటో డ్రైవర్లతోపాటు 9 మంది మోటార్సైకిల్ వాహనదారులపై కేసులు నమోదు చేశామన్నారు. నిందితుల్లో ఏడుగురిని మంగళవారం స్పెషల్ జ్యుడిషియల్ 2వ తరగతి మేజిస్ట్రేట్ కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి ఎంవీఎన్ రాజారావు ఒక్కొక్కరికి రూ.10 వేల చొప్పున జరిమానా విధించారన్నారు. వైద్యుల నిర్లక్ష్యంపై ఆసుపత్రి వద్ద ఆందోళన జంగారెడ్డిగూడెం: నిర్లక్ష్యంగా వైద్యం చేయడంతోపాటు తమపై దాడికి పాడ్పడ్డారని పట్టణంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రి వద్ద బాధితులు మంగళవారం ఆందోళన చేశారు. అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై షేక్జబీర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. టి.నరసాపురం మండలం గండిగూడానికి చెందిన యర్రగొర్ల రాజేష్ కుమార్తె పునర్వికశ్రీ జ్వరం, దగ్గు, జలుబుతో బాధపడుతుండడంతో జంగారెడ్డిగూడెంలోని ప్రైవేట్ వైద్యశాలకు చికిత్స నిమిత్తం ఈనెల 3వ తేదీన వచ్చారు. ఆసుపత్రి ప్రధాన వైద్యుడు కాకుండా వేరొక వైద్యుడితో గత రెండు రోజులుగా చికిత్స అందిస్తున్నారని, బాలిక కోలుకోకపోవడంతో ప్రధాన వైద్యుడిని ప్రశ్నించగా దురుసుగా ప్రవర్తించడంతో పాటు, ఆసుపత్రి సిబ్బందితో కలిసి రాజేష్ను నిర్భంధించి కొట్టారు. బంధువుల సహాయంతో రాజేష్ బయటకు వచ్చి ఫిర్యాదు చేశాడని, కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
సీతారాముని ఆలయంలో చోరీ
జంగారెడ్డిగూడెం: పట్టణంలోని శ్రీసీతారామస్వామి ఆలయంలో చోరీ జరిగింది. వివరాలు ఇలా ఉన్నాయి. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులోని సీతారామస్వామి ఆలయ తలుపులు తెరిచేందుకు మంగళవారం ఉదయం అర్చకులు శ్రీనివాసులు వెళ్లగా తలుపులు తాళాలు పగులగొట్టి ఉండడం, సీసీ కెమెరాలు ధ్వంసం కావడంతో చోరీ జరిగినట్లు గుర్తించారు. హుండీ కోసం వెతకగా ఆలయానికి ఆనుకుని కున్న ఎంపీయూపీ పాఠశాల ఆవరణలో లభించింది. అలాగే పాఠశాలలోని పలు గదుల తాళాలు సైతం పగులగొట్టి ఉన్నాయి. దీంతో వెంటనే పోలీసులకు సమాచారం అందించగా ఘటనా స్థలాన్ని ఎస్సై జబీర్ పరిశీలించారు. ఆలయ ఈవో కలగర శ్రీనివాస్ మంగళవారం ఫిర్యాదుచేశారు. కాగా, చోరీ చేసిన హుండీపై వేలి ముద్రలు పడకుండా దొంగలు కోడిగుడ్లు పగులగొట్టి వేసినట్లు పోలీసులు గుర్తించారు. ఆలయ వాచ్మన్ను ఈవో తన వాహనానికి డ్రైవర్గా వినియోగించుకోవడంతో సోమవారం రాత్రి అతడు విధులకు హాజరు కాలేదని తెలిసింది. ద్విచక్ర వాహనాల చోరీపై ఫిర్యాదు ఉండి: రెండు ద్విచక్ర వాహనాల చోరీపై బాధితుల ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. పోడూరు మండలం జగన్నాధపురానికి చెందిన కడలి బాబీ జూన్ 10వ తేదీన మహదేవపట్నలో రొయ్యల పట్టుబడికి వచ్చాడు. పని ముగించుకుని మద్యం దుకాణం వద్ద వాహనాన్ని నిలిపి లోనికి వెళ్లి బయటకు వచ్చేసరికి ద్విచక్రవాహనం కనిపించలేదు. ఆచూకీ లభించకపోవడంతో మంగళవారం ఉండి పోలీసులకు ఫిర్యాదు చేశాడు. దీనిపై హెడ్కానిష్టేబుల్ కేసు నమోదు చేశారు. అలాగే పెదపుల్లేరులో గత నెల 19వ తేదీ రాత్రి నిచ్చెనకొలను కృష్ణ తన ఇంటివద్ద ద్విచక్రవాహాన్ని పెట్టాడు. మరోసటి రోజు ఉదయానికి వాహనం కనిపించలేదు. ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కారు ఢీకొని ఆటో డ్రైవర్ మృతి
ద్వారకాతిరుమల: ముందు వెళుతున్న ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో ఆటో డ్రైవర్ తీవ్ర గాయాలపాలై, ఆస్పత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన ద్వారకాతిరుమల మండలం, లక్ష్మీపురంలోని విర్డ్ ఆస్పత్రి సమీపంలో జరిగింది. పోలీసుల కథనం ప్రకారం. పెదవేగి మండలం కవ్వగుంటకు చెందిన చోదిమెళ్ళ విజయరాజు(40) ఆటో నడుపుకుంటూ జీవనాన్ని సాగిస్తున్నాడు. ఈ క్రమంలోనే అతడు మంగళవారం మధ్యాహ్నం జేఎంఆర్ హాస్పిటల్ గురించి మైక్ ద్వారా ప్రచారం చేస్తూ, భీమడోలు నుంచి ద్వారకాతిరుమల వైపు వెళుతున్నాడు. ఘటనా స్థలం వద్దకు వచ్చేసరికి చైన్నెకు చెందిన అయిత సురేష్ కారును అతివేగంగా, నిర్లక్ష్యంగా నడుపుతూ ఆటోను వెనుక నుంచి ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ విజయరాజును స్థానికులు హుటాహుటీన ఏలూరు ఆశ్రం ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. విజయరాజు భార్య దేవమాత ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. -
వైభవంగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో మంగళవారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అంగరంగ వైభవంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా భక్తులు స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. నేడు ఆట్యా–పాట్యా జిల్లా జట్ల ఎంపిక భీమవరం: పట్టణంలోని ఎస్సీహెచ్బీఆర్ఎం స్కూల్లో ఈనెల 6వ తేదీన జిల్లా స్థాయి ఆట్యా–పాట్యా జూనియర్ బాలురు, బాలికల సెలక్షన్లు నిర్వహిస్తున్నట్లు ఆట్యా–పాట్యా జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మంతెన రామచంద్రరాజు, జి కిరణ్వర్మ చెప్పారు. బుధవారం మధ్యాహ్నం 2 గంటలకు నిర్వహించే పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఈనెల 9, 10 తేదీల్లో ఒంగోలులో జరిగే 10వ జూనియర్ రాష్ట్రస్థాయి ఆట్యా–పాట్యా చాంపియన్షిప్ పోటీల్లో పాల్గొంటారన్నారు. ఎంపికకు జనవరి 1, 2008 తరువాత పుట్టినవారు అర్హులని, ఆసక్తి కలిగిన క్రీడాకారులు ఆధార్ కార్డు, పుట్టిన తేది ధ్రువీకరణ పత్రం జిరాక్స్ కాపీలు, రెండు పాస్పోర్ట్సైజ్ ఫొటోలతో హాజరుకావాలన్నారు. -
విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి
తణుకు అర్బన్: విద్యుత్ షాక్తో ఎలక్ట్రీషియన్ మృతి చెందిన ఘటన మంగళవారం తణుకు మండలం కొమరవరంలో చోటుచేసుకుంది. వివరాల్లోకి వెళ్తే.. ఉండ్రాజవరం మండలం చివటం గ్రామానికి చెందిన పిప్పిరిశెట్టి మణికంఠ (24) కొమరవరం గ్రామంలోని లక్ష్మీ గణేష్ నగర్లో ఒక ఇంట్లో విద్యుత్ లైన్ల పనుల్లో ఉండగా తెగిపడి ఉన్న విద్యుత్ వైరు గమనించకుండా తాకడంతో అతడికి విద్యుత్ షాక్ తగిలింది. దీంతో గాయాలపాలైన మణికంఠను తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ప్రైవేట్ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తణుకు పట్టణానికి చెందిన బిల్డర్ వాసుకూరి వెంకట సుబ్బారావు నిర్మిస్తున్న భవనానికి సంబంధించి ప్లంబింగ్, ఎలక్ట్రిషన్ పనుల నిమిత్తం చివటం గ్రామానికి చెందిన కోలా ప్రసాద్ అనే వ్యక్తికి సబ్ కాంట్రాక్ట్ ఇచ్చారు. అతని వద్ద పనిచేస్తున్న మణికంఠ విధుల్లో ఉండగా విద్యుత్ షాక్ తగిలి మృతిచెందాడు. దీంతో బాధిత కుటుంబసభ్యులు రోదనలు మిన్నంటాయి. తణుకు రూరల్ ఎస్సై చంద్రశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మద్యం కేసులో వ్యక్తి అరెస్ట్ భీమవరం: పాతమద్యం కేసులో ఎండీపీఎల్ ముద్దాయి కాకినాడ జిల్లా తుని పట్టణం సీతారాంపురానికి చెందిన వీర్ల దుర్గా ప్రసాద్ను మంగళవారం అరెస్ట్ చేసినట్లు భీమవరం ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ సీఐ కె.బలరామరాజు చెప్పారు. అతడిని ఫస్ట్ ఏజేఎఫ్సీఎం కోర్టులో హాజరుపర్చగా నరసా పురం సబ్జైల్కు తరలించినట్లు సీఐ తెలిపారు. -
జర్నలిస్టుల సమస్యలు పరిష్కరించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జర్నలిస్టుల సమస్యలను ప్రభుత్వం వెంటనే పరిష్కరించాలని ఐజేయూ నాయకుడు జీవీఎస్ఎన్ రాజు, ఏపీయూడబ్ల్యూజే జిల్లా అధ్యక్షుడు కేపీకే కిషోర్ డిమాండ్ చేశారు. వర్కింగ్ జర్నలిస్టుల డిమాండ్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏపీయూడబ్ల్యూజే ఆధ్వర్యంలో మంగళవారం నగరంలో ర్యాలీ నిర్వహించి, అనంతరం కలెక్టర్ కే.వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా కొత్త అక్రిడిటేషన్లు విడుదల చేయకుండా, పాత అక్రిడిటేషన్ల గడువును ఇప్పటికే మూడుసార్లు పొడిగించారన్నారు. వెంటనే అర్హత ఉన్న జర్నలిస్టులకు కొత్త అక్రిడిటేషన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర, జిల్లా స్థాయి అక్రిడిటేషన్ కమిటీల్లో జర్నలిస్టు సంఘాలకు ప్రాతినిధ్యం ఉండాలని, జర్నలిస్టులకు ఇళ్ల స్థలాలు అందించాలని, ఇన్సూరెన్స్, పెన్షన్ వంటి పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. కలెక్టర్ వెట్రిసెల్వి స్పందిస్తూ జర్నలిస్టుల డిమాండ్లను ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో ఏపీయూడబ్ల్యూజే జిల్లా ప్రధాన కార్యదర్శి టైమ్స్ కిషోర్, ఎలక్ట్రానిక్ మీడియా అధ్యక్ష, కార్యదర్శులు ఎస్.సంజయ్కుమార్, శీర శ్రీనివాస్, ఏపీయూడబ్ల్యూజే నాయకులు షేక్ రియాజ్, ఉర్ల శ్రీనివాస్, సీహెచ్ రామకృష్ణరాజు, డీ.విజయ్ కుమార్, శ్రీధర్, పోతురాజు, బ్రహ్మయ్య, కే.రత్నకుమారి, వాసు తదితరులు పాల్గొన్నారు. -
ఏఆర్డీజీకే విద్యార్థులు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపిక
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక ఆదివారపు పేటలోని ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య నగరపాలక ఉన్నత పాఠశాల విద్యార్థులు ఇటీవల ఇండోర్ స్టేడియంలో జరిగిన జిల్లా స్థాయి మహిళా వెయిట్ లిఫ్టింగ్ పోటీల్లో అత్యుత్తమ ప్రతిభ చూపి రాష్ట్ర స్థాయి పోటీలకు ఎంపికయ్యారని ఆ పాఠశాల ప్రధానోపాధ్యాయుడు వీ. కాంతి జయకుమార్ తెలిపారు. ఈ మేరకు విద్యార్థుల అభినందన కార్యక్రమం మంగళవారం పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా హెచ్ఎం మాట్లాడుతూ జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 8వ తరగతి చెందిన కే. భార్గవి 58 కేజీల విభాగంలో తృతీయ స్థానం, కే.మేఘన 63 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, 9వ తరగతి విద్యార్థిని ఎం.పావని 44 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, సీహెచ్. కీర్తన 58 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎస్డీ మహీన్ 48 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎం.దీక్షిత 44 కేజీల విభాగంలో ద్వితీయ స్థానంలో నిలిచారన్నారు. పదో తరగతి విద్యార్థిని సీహెచ్.హారిక రెడ్డి 63 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, ఎన్.విహారిక 77 కేజీల విభాగంలో ప్రథమ స్థానం, జీ. పవిత్ర 58 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం, పీ.ఇందు 44 కేజీల విభాగంలో తృతీయ స్థానం, ఎం.అనూష 53 కేజీల విభాగంలో తృతీయ స్థానం, షేక్. ఆశాజ్యోతి 77 కేజీల విభాగంలో ద్వితీయ స్థానం సాధించారన్నారు. అలాగే అథ్లెటిక్స్లో కిలోమీటర్ విభాగంలో జే. పల్లవి ప్రథమ స్థానం సాధించారన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులకు వ్యాయామ ఉపాధ్యాయులు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బ దాసరి జోజి బాబు, ఇతర ఉపాధ్యాయులు, పూర్వ విద్యార్థుల సంఘం నాయకులు అభినందనలు తెలిపారు. -
స్మార్ట్ మీటర్లపై ఉద్యమం తీవ్రతరం
జిల్లా వ్యాప్తంగా కదం తొక్కిన ప్రజా సంఘాలు ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రజలపై కరెంటు బాదుడు ఉండదని, స్మార్ట్ మీటర్లను బిగిస్తే పగలగొట్టమని నాడు పిలుపునిచ్చిన నారా లోకేష్ ఇప్పుడు స్మార్ట్ మీటర్లు ఎందుకు బిగిస్తున్నారని ప్రజా సంఘాల నాయకులు ప్రశ్నించారు. మంగళవారం స్థానిక విద్యుత్ భవన్ వద్ద ప్రజా సంఘాల ఐక్యవేదిక ఆధ్వర్యంలో విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగించవద్దని డిమాండ్ చేస్తూ పెద్ద ఎత్తున ధర్నా నిర్వహించారు. ప్రజా సంఘాల ఐక్య కార్యచరణ వేదిక నాయకులు బద్దా వెంకట్రావు, మన్నవ చైతన్య, ఏ రవి మాట్లాడుతూ స్మార్ట్ మీటర్ల బిగింపు విషయంలో గత ప్రభుత్వాన్ని విమర్శించిన కూటమి నాయకులు అధికారంలోకి వచ్చి ఏడాది దాటినా అదానీ కంపెనీతో చేసుకున్న ఒప్పందాన్ని ఎందుకు రద్దు చేసుకోలేదని నిలదీశారు. స్మార్ట్ మీటర్ల బిగింపుపై ప్రజలు ఆగ్రహిస్తూ రోడ్ల మీదకు వచ్చి పోరాటం చేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోకపోవడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు బిగించే విధానాన్ని వెనక్కి తీసుకోవాలని లేనిపక్షంలో రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని తీవ్రతరం చేస్తామన్నారు. ప్రజా సంఘాల నాయకులు యు.వెంకటేశ్వరరావు, బండి వెంకటేశ్వరరావు, ఉప్పులూరి హేమ శంకర్, పంపన రవికుమార్, యర్రా శ్రీనివాస్రావు, డీఎన్వీడీ ప్రసాద్, గడసాల రమణ, మీసాల రమణ, బీ.సోమయ్య, కే.శ్రీను, సంధకం అప్పారావు, కాకర్ల శ్రీను, నౌడు నెహ్రూ బాబు, రెడ్డి శ్రీనివాస డాంగే తదితరులు పాల్గొన్నారు. జిల్లాలో అన్ని మండల కేంద్రాల్లోనూ ప్రజా వేదిక ఆధ్వర్యంలో ఆందోళనలు నిర్వహించారు. -
పరాకాష్టకు పీ–4
సాక్షి, భీమవరం: పేదరిక నిర్మూలన కోసమంటూ చంద్రబాబు సర్కారు చేపట్టిన పీ–4 కార్యక్రమం వేధింపులు పరాకాష్టకు చేరాయి. సర్కారు పిలుపునకు సంపన్నుల నుంచి స్పందన రాక ఉద్యోగులను బాధ్యులను చేసే పనిలో ఉంది. మార్గదర్శులుగా మ్యాపింగ్కు ఒత్తిడి తెస్తోంది. పీ–4 అమలులో సర్వే లక్ష్యం చేరుకోలేదంటూ సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు జారీ ఉద్యోగ వర్గాల్లో చర్చనీయాంశంగా మారింది. అట్టడుగు పేద కుటుంబాలను సంపన్నుల సాయంతో అభివృద్ధి చేసేందుకు పబ్లిక్– ప్రైవేట్ – పీపుల్ పార్టనర్షిప్ (పీ–4) కార్యక్రమం తెచ్చినట్టు ప్రభుత్వం చెప్పుకుంటోంది. పశ్చిమగోదావరి జిల్లాలో మొత్తం 4,92,292 కుటుంబాలకు పలు వడపోతల తర్వాత 64,940 కుటుంబాలను అర్హులుగా ఎంపిక చేశారు. సంపన్నులను మార్గదర్శులుగా చేర్పించి ఆయా కుటుంబాలను వారికి అనుసంధానించాలి. దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థిక చేయూత, లేదా జీవనోపాధికి అవసరమైన నైపుణ్యాలను నేర్పించడం ద్వారా వారి అభివృద్ధికి తోడ్పాటు ఇవ్వాలి. ఉద్యోగుల పైనే భారం : బంగారు కుటుంబాలు, మార్గదర్శుల గుర్తింపు, అనుసంధానం మొత్తం బాధ్యతలను ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపైనే మోపింది. ఈ నెల 15 నాటికి జిల్లాలో 15 వేల మంది మార్గదర్శులను గుర్తించాలని లక్ష్యంగా నిర్ణయించారు. పీ–4లో భాగస్వాములుగా చేరి బంగారు కుటుంబాలను బాగుచేసేందుకు కూటమి పక్షాల్లోని సంపన్న నేతలు ఆసక్తి చూపడం లేదు. శనివారం నాటికి జిల్లాలో 1,700 మంది మాత్రమే మార్గదర్శులుగా రిజిస్టర్ చేసుకున్నారు. వీరికి 35 వేల కుటుంబాలను మ్యాపింగ్ చేశారు. ఉన్నతస్థాయి నుంచి వస్తున్న ఒత్తిడితో త్వరితగతిన మిగిలిన కుటుంబాల మ్యాపింగ్ పూర్తిచేసేందుకు జిల్లా యంత్రాంగం తీవ్రంగా శ్రమిస్తోంది. నియోజకవర్గాల ప్రత్యేక అధికారులు, జిల్లా అధికారులు, మున్సిపల్ కమిషనర్లు, ఎంపీడీవోలతో ఉన్నతాధికారులు నిరంతర సమీక్షలు చేస్తున్నారు. పారిశ్రామిక, వ్యాపారవేత్తలు, పెద్ద రైతులు, రైస్ మిల్లర్స్, విద్యాసంస్థలు, కార్పొరేట్ సంస్థలు, మద్యం, ఎరువుల షాపుల యజమానులు, డీలర్లు తదితర వర్గాల వారితో సమావేశాలు ఏర్పాటుచేసి మార్గదర్శులుగా రిజిస్ట్రేషన్ చేయించుకోవాలని కోరుతున్నారు. పెద్దగా ఫలితం కనిపించకపోవడంతో మార్గదర్శుల భారాన్ని ప్రభుత్వం ఉద్యోగ వర్గాలపై మోపుతోంది. ఒక్కో కుటుంబాన్ని మ్యాపింగ్ చేసుకోవాలంటూ వస్తున్న ఒత్తిళ్లతో ఉద్యోగులు తలలు పట్టుకుంటున్నారు. నైపుణ్యాలను నేర్పించే ఆప్షన్లో ఒక్కో ఉద్యోగి ఒక్కో కుటుంబాన్ని దత్తత తీసుకోమంటున్నారని సచివాలయ ఉద్యోగులు అంటున్నారు. ఏడాదికి ఒక్కో ఉద్యోగి కనిష్టంగా దత్తత కుటుంబానికి రూ.5 వేలు సాయం అందించాలని, ఈ మేరకు తమ జీతం నుంచి మినహాయించుకుంటుందన్న ఆందోళన వారిని వెంటాడుతోంది. ఆదిలోనే తిప్పికొట్టిన ఉపాధ్యాయ సంఘాలు పీ–4 అమలులో టీచర్లను భాగస్వాములను చేసే ప్రయత్నాలను ఉపాధ్యాయ సంఘాలు ఆదిలోనే తిప్పికొట్టాయి. ఉపాధ్యాయుల రిజిస్ట్రేషన్కు ఏలూరు విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులను రాష్ట్రవ్యాప్తంగా సంఘ నాయకులు ఖండించారు. సంపన్నవర్గాలకు చెందిన పీ–4 అమలుకు మధ్య తరగతి శ్రేణిలో ఉండే ఉపాధ్యాయ, ఉద్యోగ వర్గాల వారిపై భారం మోపడం సరికాదని, వేరే కుటుంబాలను దత్తత తీసుకుని సాయపడే పరిస్థితి ఉండదనే విషయాన్ని ప్రభుత్వ పెద్దలు గుర్తించాలంటూ ఫ్యాప్టో చురకలంటించింది. ఉపాధ్యాయ వర్గాలు ఆందోళనలకు సిద్ధంకావడంతో ఉత్తర్వులను విద్యాశాఖ వెనక్కి తీసుకుంది. సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ : పీ–4 సర్వే లక్ష్య సాధనలో నిర్లక్ష్యంగా ఉన్నారంటూ భీమవరం మున్సిపాల్టీకి చెందిన 26 మంది సచివాలయ అడ్మిన్, ఎడ్యుకేషన్, డేటా ప్రాసెసింగ్ ఉద్యోగులకు ఉన్నతాధికారులు షోకాజ్ నోటీసుల జారీచేయడం చర్చనీయాంశంగా మారింది. పింఛన్ల పంపిణీ, రకరకాల సర్వేల పేరిట క్షణం తీరిక లేకుండా పనిచేస్తుంటే నోటీసులు ఇవ్వడం సరికాదని ఉద్యోగులు వాపోతున్నారు. జిల్లాలోని మిగిలిన మున్సిపాల్టీల్లోనూ ఈ తరహా ఒత్తిళ్లు అధికంగా ఉన్నట్టు చెబుతున్నారు. పేదలకు మేలు చేయాలన్న చిత్తశుద్ది ప్రభుత్వానికి ఉంటే నేరుగా వారిని ఆదుకోవాలని, ఉద్యోగులను ఇబ్బంది పెట్టడం సరికాదని ఉద్యోగ సంఘాల నాయకులు మండిపడుతున్నారు. మార్గదర్శులుగా ముందుకురాని కూటమి నేతలు ఉద్యోగులనే మార్గదర్శులుగా మ్యాపింగ్కు ఒత్తిళ్లు భీమవరంలో 26 మంది సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఎంపీడీవోలు, ఇతర అధికారులపైనా తీవ్ర ఒత్తిడి -
విద్యా శక్తి కార్యక్రమం బహిష్కరిస్తున్నాం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ విద్యా సంవత్సరం ప్రారంభం నుంచి పాఠశాల విద్యాశాఖ ప్రవేశ పెట్టిన విద్యాశక్తి అనే కార్యక్రమాన్ని ఉపాధ్యాయ సంఘాల సమాఖ్య(ఫ్యాప్టో) బహిష్కరిస్తోందని ఆ సమాఖ్య నాయకులు తెలిపారు. ఈ మేరకు మంగళవారం జిల్లా విద్యా శాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మకు మెమోరాండం ఇచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో నాయకులు మాట్లాడుతూ విద్యాశక్తి కార్యక్రమం నిర్బంధం కాదని ఇది కేవలం ఐచ్ఛికం మాత్రమేనని తెలిపినప్పటికీ కొంతమంది అధికారులు ఉపాధ్యాయులను విద్యా శక్తి కార్యక్రమం నిర్బంధంగా నిర్వహించవలసిందేనని ఇబ్బందులకు గురి చేస్తున్నారని తెలిపారు. డీఈఓకు మెమోరాండం ఇచ్చిన వారిలో ఫ్యాప్టో జిల్లా ఛైర్మన్ జీ మోహన్, సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, డిప్యూటీ సెక్రటరీ జనరల్ ఆర్.రవికుమార్, బీ రెడ్డి దొర, కేఆర్ పవన్ కుమార్, ఐ.రమేష్ ఉన్నారు. ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు అనుమతులు ఏలూరు(మెట్రో): జిల్లాలో వివిధ మొబైల్ టెలికాం కంపెనీలకు 4జీ నెట్వర్క్కు సంబంధించి ఆప్టికల్ ఫైబర్ కేబుల్ ఏర్పాటుకు అనుమతులు వెంటనే మంజూరు చేస్తామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర సమాచార శాఖ కార్యదర్శి కాటంనేని భాస్కర్కు తెలిపారు. సెక్రటేరియట్ నుండి జిల్లా కలెక్టర్లతో కాటంనేని భాస్కర్ వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఫైబర్ కేబుల్ అనుమతులను వెంటనే పరిశీలించి, నిబంధనల మేరకు అర్హత కలిగిన వాటికి వెంటనే మంజూరు చేయాలన్నారు. అంగన్వాడీలపై వేధింపులు ఆపాలి ఏలూరు (టూటౌన్): ఫోన్లను అంగన్వాడీ కార్యాలయంలో అప్పగించిన వారిపై వేధింపులు మానుకోవాలని సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్. లింగరాజు, ప్రధాన కార్యదర్శి డీఎన్వీడి ప్రసాద్ విజ్ఞప్తి చేశారు. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా అంగన్వాడీలు తమ ఫోన్లను ఐసీడీఎస్ కార్యాలయాల్లో అప్పగించారన్నారు. ఫోన్లు పనిచేయడం లేదని చెప్పినా వినకుండా టార్గెట్ల పేరుతో తీవ్రంగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నెట్ సిగ్నల్స్ లేకపోవడం, సర్వర్ పనిచేయకపోవడం వల్ల లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. అధికారుల బెదిరింపులకు అంగన్వాడీలు లొంగరన్నారు. సమస్య సానుకూలంగా పరిష్కరించాల్సిన అధికారులు ఇంతవరకూ స్పందించకుండా నిరంకుశంగా వ్యవహరిస్తున్నారని విమర్శించారు. తక్షణమే అంగన్వాడీలకు 5 జీ ఫోన్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ప్రమాదాల నివారణకు ప్రణాళిక కై కలూరు: జాతీయ రహదారులపై ప్రమాదాలు జరగకుండా పక్కా ప్రణాళికతో అధికారులు పనిచేయాలని ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జాయింట్ కలెక్టర్ ధాత్రిరెడ్డి చెప్పారు. కై కలూరు నియోజకవర్గంలో ముదినేపల్లి నుంచి కై కలూరు వరకు జాతీయ రహదారిలో ప్రమాదాలు జరిగే ప్రాంతాలను మంగళవారం పరిశీలించారు. ప్రధానంగా ముదినేపల్లి మండలంలో జరుగుతున్న జాతీయ రహదారి విస్తరణ పనులపై ప్రత్యేక దృష్టి సారించారు. అనంతరం కై కలూరు ట్రావెలర్స్ బంగ్లాలో ఎస్సీ, జేసీలు అధికారులతో సమీక్ష సమావేశం నిర్వహించారు. అధికారులు మాట్లాడుతూ ప్రమాద మలుపుల వద్ద హెచ్చరిక బోర్డులు ఏర్పాటు చేయాలన్నారు. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్నారు. లీజు జీఓ రద్దు చేయాలి ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ స్థలాన్ని లులూ షాపింగ్ మాల్కు కేటాయిస్తూ ప్రభుత్వం ఇచ్చిన జీఓను రద్దు చేయకపోతే ఆందోళన కార్యక్రమాలు ఉధృతం చేస్తామని ఆర్టీసీ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు స్పష్టం చేశారు. మంగళవారం ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జరిగిన విలేకరుల సమావేశంలో రీజనల్ కార్యదర్శి బీ రాంబాబు మాట్లాడుతూ విజయవాడ నగరం నడిబొడ్డున ఉన్న 4.15 ఎకరాలను లులూ షాపింగ్ మాల్కు ప్రభుత్వం కట్టబెట్టడం దారుణమన్నారు. లక్షల మంది ప్రయాణికులకు సేవలందిస్తున్న ఆర్టీసీ స్థలాలను ప్రైవేట్ వ్యక్తులకు ధారాదత్తం చేయడమంటే సంస్థను ప్రైవేట్ పరం చేయడమేనని, ఉద్యమాల బాట పట్టక ముందే జీఓ రద్దు చేయాలని కోరారు. అధికారంలోకి వచ్చి ఏడాది గడిచినా సరే ఆర్టీసీ ఉద్యోగులకు ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయడం లేదన్నారు. ఆర్టీసీని కాపాడుకొనేందుకు పోరాటాలకు సిద్ధంగా ఉంటామని తెలిపారు. -
నా జీవితం తెరిచిన పుస్తకం
బుట్టాయగూడెం: ఇద్దరు కూటమి నాయకులు మాట్లాడుకున్న ఆడియో సంభాషణకు తనకు సంబంధం ఏంటని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ప్రశ్నించారు. పోల వరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు ఏడాదిలో రూ. 100 కోట్లు సంపాదించారని టీడీపీ, జనసేనకు చెందిన అగ్ర నాయకులు మాట్లాడుకుంటే వారిని ప్రశ్నించకుండా చిర్రి బాలరాజు తనపై బురద చల్లాలని చూడటం ఎంతవరకూ సమజసమని ప్రశ్నించారు. 20 సంవత్సరాల పాటు ఎమ్మెల్యేగా పనిచేసిన తనను ఎంత సంపాదించానో బయటకు తీస్తానని చిర్రి బాలరాజు అనడం హాస్యాస్పదంగా ఉందన్నారు. తన జీవితం తెరిచిన పుస్తకం లాంటిదని తెల్లం బాలరాజు స్పష్టం చేశారు. తన తండ్రి తెల్లం చిన్నవడ్డీ వార్డు మెంబర్గా, సర్పంచ్గా జెడ్పీటీసీగా, ఎంపీపీగా అనేక పదువులు చెయ్యడమే కాకుండా పోలవరం నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా పోటీ చేశారని అన్నారు. తనది రాజకీయ కుటుంబమని చెప్పారు. 3 సార్లు ఎమ్మెల్యేగా గెలుపొందిన తనను ఉపఎన్నికల్లో కూడా అత్యధిక మెజారిటీతో ప్రజలు ఎమ్మెల్యేగా గెలిపించారని అన్నారు. చిర్రి బాలరాజు నిక్కర్లు వేసుకునే రోజుల్లో తాను ఎమ్మెల్యేగా ప్రజాసేవలో ఉన్నానని తెల్లం బాలరాజు తెలిపారు. తనమీద వచ్చిన ఆరోపణను పక్కదోవ పట్టించేందుకే తనపై లేనిపోని ఆరోపణలు చేస్తున్నారని విమర్శించారు. తనకు మద్యం షాపులు లేవని, ఇసుక, మట్టిలో కమిషన్ తీసుకోలేదని స్పష్టం చేశారు. వచ్చే ఎన్నికల్లో చిర్రి బాలరాజు జనసేన తరపున టికెట్టు తెచ్చుకుని పోటీకి రావాలన్నారు. తాను కూడా వైఎస్సార్సీపీ తరపున టికెట్టు తెచ్చుకొని నిలబడతానని ఎవరు ఎటువంటి వారో ప్రజలే తగిన తీర్పు ఇస్తారని చెప్పారు. కూటమి నేతలను నిలదీయలేకే బురదజల్లే ప్రయత్నం చిర్రి బాలరాజుపై మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు ఫైర్ -
పశ్చిమలో పేకాట దందా
సాక్షి ప్రతినిధి, ఏలూరు : పశ్చిమ గోదావరి జిల్లాలో పేకాట దందా మూడు షోలు.. ఆరు ఫుల్లులుగా సాగుతోంది. డ్రాప్నకు రూ.20 వేలు, మిడిల్ డ్రాప్నకు రూ.40 వేలు, ఫుల్ కౌంట్కు రూ.1.60 లక్షలు.. ఇదీ జిల్లా ప్రధాన కేంద్రమైన భీమవరంలో సాగుతున్న ప్రత్యేక పేకాట శిబిరంలోని ప్రధాన గేమ్. టీడీపీ నేతలే నిర్వాహకులు. స్థానిక ప్రజాప్రతినిధులు, పోలీసులకు వారం మామూళ్లు ఫిక్స్ చేసి ఉదయం 10 గంటలకు ప్రారంభమయ్యే పేకాట జాతర మరుసటి రోజు తెల్లవారుజామున మూడు గంటల వరకు నిర్విరామంగా సాగుతోంది. భీమవరం సహా పశ్చిమ గోదావరిలోని ప్రధాన పట్టణాల్లోనూ ఇదే పరిస్థితి నెలకొంది. కాకపోతే నిర్వాహకుల స్థాయిని బట్టి సభ్యులు, ఆట స్థాయి మారుతుంది. భీమవరంలో స్పెషల్ శిబిరం భీమవరంలోని మురుగు కాల్వ గట్టు సమీపంలో ఓ శిబిరం భారీ స్థాయిలో సాగుతోంది. పట్టణంలోని ఓ ప్రముఖ క్లబ్లో సభ్యుడిగా ఉన్న వ్యక్తి నిర్వాహకుడుగా మారి ప్రత్యేక ఏర్పాట్లు చేశాడు. ఉదయం 10 గంటల నుంచి రాత్రి 2 గంటల వరకు ఆట సాగుతుంది. 11 మంది సభ్యులతో మూడు కట్టలతో కనష్ట బోర్డు.. ఏడుగురితో మరో బోర్డును ఏర్పాటుచేసి గంటకు 7–10 ఆటలు ఆడిస్తున్నారు. ఓకుకు రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగే బోర్డు అందుబాటులో పెట్టారు. ఓకుకు రూ. 20 వేలు చొప్పున.. ఫుల్ కౌంట్ పడితే రూ.1.60 లక్షలు చెల్లించే గేమ్కు రూ.5 లక్షలు డిపాజిట్, మరో రూ.4.80 లక్షలు అంటే మూడు ఫుల్గేమ్ల మొత్తం వెరసి రూ.9.80 లక్షలు డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. డిపాజిట్ మొత్తం కిలోమీటరు దూరంలో ఉండే మరో వ్యక్తి ప్రత్యేకంగా లాకర్లు, ఇతర జాగ్రత్తలతో నగదును సేకరించి టోకెన్లు ఇచ్చి శిబిరానికి పంపుతారు. మరో ప్రత్యేక అంశమేమిటంటే.. సదరు నిర్వాహకుడు సభ్యుడిగా ఉన్న క్లబ్లో గెస్ట్ల పేరుతో కొందరిని అక్కడి ఆటకు పంపించడం, గెలుపోటములు పూర్తయ్యాక వెళ్లే సమయంలో స్లిప్ ద్వారా వసూళ్లు, చెల్లింపులు చేస్తున్నారు. భీమవరంలో పేకాట నిర్వహణలో సుదీర్ఘ అనుభవం ఉన్న సదరు వ్యక్తి ఆటకు రూ.4 వేలు చొప్పున నిర్వహణ ఖర్చులు వసూలు చేస్తున్నాడు. రోజుకు సగటున రూ.5 లక్షల నుంచి రూ.7 లక్షలు శిబిరం నిర్వాహకులకే దక్కుతోంది. వీటిల్లో పోలీసులకు, స్థానిక ప్రజాప్రతినిఽధికి వారం, నెలవారీలు మామూళ్లను ఖరారుచేసి పంపుతూ జోరుగా శిబిరం నిర్వహిస్తున్నారు. అధికార పార్టీ ప్రజాప్రతినిధుల సన్నిహితులే చూస్తుండటంతో ఉభయ గోదావరి జిల్లాలతో పాటు కృష్ణాజిల్లా నుంచి పెద్ద ఎత్తున ఇక్కడికి వస్తున్నారు. స్థానిక ఎస్ఐ మొదలుకుని ఉన్నతాధికారుల వరకు ఈ విషయం తెలిసినా పొలిటికల్ గేమ్ పేరుతో పట్టించుకోకపోవడం గమనార్హం. పోలీసు ఉన్నతాధికారులకు ఫిర్యాదుల పెరగడంతో కొద్ది రోజులుగా శిబిరాల్ని నడపడం లేదు. మరో అనువైన ప్రదేశం కోసం వేట సాగుతున్నట్లు సమాచారంఒక్కొక్కచోట ఒక్కోలా తణుకు మండలంలో అధికార పార్టీకి చెందిన కొందరు వ్యక్తులు ఒకరోజు పైడిపర్రులో, మరోరోజు తేతలి, ఇంకోరోజు వేల్పూరులో.. ఇలా ప్రతిరోజూ ఒక్కో ప్రాంతంలో పెట్టి ఎప్పుడూ వచ్చే వంద మంది జూదరులకు మెసేజ్ల ద్వారా సమాచారం ఇస్తున్నారు. ఉండి, ఆకివీడు, పాలకొల్లులో ఎంపిక చేసిన రొయ్యల చెరువుల వద్ద నిత్యం పెద్దఎత్తున జూదక్రీడ కొనసాగుతోంది. తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో పెదతాడేపల్లి, పెంటపాడు, రూరల్లో వారానికి రెండు ప్రాంతాల్లో శిబిరాలు నిర్వహిస్తున్నారు. ప్రతిచోటా ప్రజాప్రతినిధుల అండదండలు ఉండటంతో పోలీసుల దాడులు, కేసుల ఊసు లేకపోవడం గమనార్హం. టీడీపీ నేతల కన్నుసన్నల్లో శిబిరాల నిర్వాహకులు భీమవరంలో ఒక్క ఆటకు రూ.1.60 లక్షలు జిల్లాలో నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ ఉభయ గోదావరి జిల్లాల నుంచి పేకాటరాయుళ్లకు ప్రత్యేక ఆహ్వానాలు తణుకులో రోజూ మారుతున్న శిబిరాలు పాలకొల్లు, ఉండి, తాడేపల్లిగూడెంలోనూ ఇదే దందా టీడీపీ కూటమి సర్కారు రాగానే.. పశ్చిమ గోదావరి జిల్లాలోని భీమవరం, పాలకొల్లు, నర్సాపురం, తణుకు, తాడేపల్లిగూడెంలలో పదుల సంఖ్యలో అనధికారిక శిబిరాలు.. అనుమతుల పేరిట పాలకొల్లు, భీమవరంలో క్లబ్బుల్లో పేకాట నిర్వహిస్తున్నారు. గత ప్రభుత్వ హయాంలో జిల్లాలో పేకాటపై ఉక్కుపాదం మోపి క్లబ్లను మూసివేశారు. దీంతోపాటు జూద క్రీడలను పూర్తిగా నిషేధించి వందల కేసులు నమోదు చేశారు. టీడీపీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే టీడీపీ నేతలే పేకాట శిబిరాల నిర్వాహకులుగా అవతారమెత్తి మూడు ముక్కలాట మొదలుకుని కనష్ట గేమ్ వరకు భారీగా నిర్వహిస్తున్నారు. ఉమ్మడి పశ్చిమ గోదావరితో పాటు కృష్ణా, తూర్పు గోదావరి జిల్లాల నుంచి కూడా పేకాటరాయుళ్లను పెద్దఎత్తున ఆహ్వానించి నిత్యం రూ.5 కోట్లకు పైగా టర్నోవర్ చేస్తూ నిర్వాహకులే నిత్యం లక్షల్లో గడిస్తున్నారు. -
కారు ఢీకొని డ్రైవర్ మృతి
ద్వారకాతిరుమల మండలం లక్ష్మీపురంలో ఆటోను కారు అతి వేగంగా ఢీకొట్టడంతో తీవ్రంగా గాయపడిన ఆటో డ్రైవర్ చికిత్స పొందుతూ మృతి చెందాడు. 10లో uతణుకు ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య పనులుతణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో మురుగునీరు తిష్టతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నా రని సాక్షి దినపత్రికలో ‘సర్కారు దవాఖానాలో మురుగునీరు తిష్ట’ శీర్షికన మంగళవారం ప్రచురితమైన కథనానికి వైద్యాధికారులు స్పందించారు. ఆస్పత్రి సూప రింటెండెంట్ డాక్టర్ కాకర్లమూడి సాయి కిరణ్, ఆర్ఎంవో డాక్టర్ ఎ.తాతారావు సమస్యాత్మకంగా ఉన్న ప్రాంతాన్ని పరిశీలించి జేసీబీ ద్వారా డ్రెయినేజీలో ఉన్న మురుగును తొలగించే చర్యలకు చేపట్టారు. మురుగునీరు ప్రవహించేలా పనులు పూర్తిచేయించడంతోపాటు ఆస్పత్రి ఆవరణలో బ్లీచింగ్ చిమ్మించారు. -
సీహెచ్ఓలపై చిన్నచూపు
పెంటపాడు: గ్రామీణ ప్రాంతాల్లో పనిచేస్తున్న కమ్యూనిటీ హెల్త్ ఆఫీసర్లు(సీహెచ్ఓ)లు నిరాదరణకు గురవుతున్నారు. గత జగనన్న ప్రభుత్వంలో కేంద్ర ప్రభుత్వ సహకారంతో నియమితులైన వీరిని కూటమి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఉద్యోగ భద్రత లేక, సకాలంలో జీతాలు అందక, సేవలు అందిస్తున్నా సరైన గౌరవం దక్కక తీవ్ర మనోవేదనకు గురవుతున్నారు. జిల్లావ్యాప్తంగా గ్రామీణ ప్రాంతాల్లో సుమారు 368 సీహెచ్ఓలు పనిచేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం ద్వారా ఆయుష్మాన్ ఆరోగ్య సేవలో భాగంగా వీరికి 2019 నుంచి పోస్టులు మంజూరయ్యాయి. పీహెచ్సీల కన్నా మొదట వీరు ప్రాథమికంగా వైద్యనిర్ధారణ చేసి వ్యాధి తీవ్రతను బట్టి కేసులపై అధికారులకు రిఫర్ చేస్తారు. గ్రామీణ ప్రాంతాల్లో 14 రకాల సేవలు అందిస్తున్నారు. దీంతో పాటు, ప్రభుత్వం చేపడుతున్న ఆరోగ్య సర్వే, ఫ్యామిలీ హెల్త్ ఆరోగ్య సేవలు, ఇంటింటికీ సేవలతో పాటు, అంగన్వాడీ ప్రధానంగా గ్రామీణ ప్రజలకు చేరువగా ఉంటున్నారు. అయినా వారిని పాలకులు పట్టించుకోవడం లేదు. కమ్యూనిటీ హెల్త్ అధికారుల యూనియన్ పిలుపు మేరకు ప్రతి జిల్లా కేంద్రంలోనూ మే నెలలో ఒక నెల పాటు పలు ప్రాంతాలోల సీహెచ్వోలు నిరసనలు తెలిపారు. కలెక్టర్లను కలిసి వినతిపత్రాలు సమర్పించారు. అయినా వీరి సమస్యలు నేటికీ తీరలేదు. ప్రధాన డిమాండ్లు ● ఆరేళ్లు పూర్తయిన కమ్యూనిటీ హెల్త్ అధికారులు (సీహెచ్ఓ)లను తక్షణం క్రమబద్ధీకరించాలి. ● ఇతర ప్రభుత్వ ఉద్యోగుల మాదిరిగా 23 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ప్రతి సంవత్సరం 5 శాతం ఇంక్రిమెంట్ ఇవ్వాలి. ● జీతాలతో పాటు, ఇన్సెంటివ్లు అందించాలి. ● గ్రామాల్లో ప్రభుత్వ క్లినిక్ల అద్దెలను సకాలంలో చెల్లించాలి. రేషనలైజేషన్ పేరుతో కుదింపు చర్యలు వీరిని రేషనలైజేషన్ పేరుతో కుదించేందుకు కూటమి ప్రభుత్వం పావులు కదుపుతున్నట్లు వార్తలు వస్తున్న నేపథ్యంలో సీహెచ్ఓలు మనోవేదనకు గురౌతున్నారు. 5 వేల జనాభా ఉన్న ప్రాంతంలో ఒక సీహెచ్ఓను నియమించే యోచనలో ఉన్నట్లు సమాచారం. రేషలైజేషన్లో భాగంగా ఏ ప్రాతిపదికన ఈ చర్యలు చేస్తున్నారో తెలియడం లేదని చెబుతున్నారు. పేదలకు ఆరోగ్యం కోసం పాటు పడుతున్న వీరిని ప్రభుత్వం పట్టించుకోక పోవడం విచారం. పొరుగురాష్ట్రాల్లో సీహెచ్వోల సేవలను అక్కడి పాలకులు గుర్తించారు. మన రాష్ట్రంలో వీరిని పట్టించుకోకపోవడం కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యానికి అద్ధం పడుతోంది. సమ్మె చేసినా పట్టించుకోని కూటమి ప్రభుత్వం హామీలు అమలు చేయాలని డిమాండ్ గ్రామంలోనే సేవలు ఎంతో దూరంలో ఉన్న ఆరోగ్య కేంద్రానికి వెళ్లాల్సిన అవసరం లేకుండా మా గ్రామంలోనే మందులు అందిస్తున్నారు. ప్రభుత్వం వారి సేవల్ని గుర్తించడం లేదు. – కె. వెంకట్రావు, అలంపురం సకాలంలో వైద్య సేవలు 108,104 కన్నా రోజు మా గ్రామంలో ఆరోగ్యసేవలు అందిస్తున్న సీహెచ్ఓ వల్ల మాకు ఎంతో మేలు కలుగుతోంది. మందులు సకాలంలో అందిస్తున్నారు. జయవరపు విజయదుర్గ, అలంపురం -
విద్యాసంస్థల్లో ఆంక్షలపై నిరసన
భీమవరం: విద్యా సంస్థల్లో స్కూల్ మేనేజ్మెంట్ కమిటీ, విద్యార్థుల తల్లిదండ్రులు మినహా మరెవరికీ ప్రవేశంలేదంటూ పాఠశాల విద్యాశాఖ ఇచ్చిన ఉత్తర్వులు విద్యార్థుల స్వేచ్చను, ప్రజాస్వామిక హక్కులను హరించేలా ఉన్నాయని ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్షుడు బి.గణేష్ విమర్శించారు. ప్రభుత్వ ఉత్తర్వులను నిరసిస్తూ సోమవారం భీమవరం పట్టణం ప్రకాశం చౌక్ సెంటర్లో ఎస్ఎఫ్ఐ ఆధ్వర్యంలో నిర్వహించిన నిరసన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. పాఠశాల విద్యా కమిషనర్ ఇచ్చిన ఉత్తర్వులు మూలంగా విద్యార్థులు తమ స్వేచ్ఛను కోల్పోతారని వారి సమస్యలు తెలుసుకునేందుకు వెళ్లే వారికి ఈ ఉత్తర్వుల ద్వారా అనుమతులుండవన్నారు. ఉత్తర్వులు ద్వారా ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల వ్యాపారం, అన్యాయాలను బయటకు తీసే అవకాశం లేకుండా పోతుందని గణేష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఉత్తర్వులను ఉపసంహరించకపోతే విద్యార్థులను ఏకం చేసి పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా కమిటీ సభ్యులు ఎస్.లక్ష్మణ్, బి.సింధు, సాయికృష్ణ, హేమంత్, భాగ్యలక్ష్మి, శ్రావణి తదితరులు పాల్గొన్నారు. ఆంక్షలు విరమించుకోవాలి పాలకొల్లు సెంట్రల్: ప్రభుత్వ పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ విడుదల చేసిన జీవోను వెంటనే రద్దు చేయాలని ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఏఐఎస్ఏ) జిల్లా కార్యదర్శి టి.అప్పలస్వామి డిమాండ్ చేశారు. సోమవారం స్థానిక ఏఎస్ఎన్ఎం ప్రభుత్వ జూనియర్ కళాశాల వద్ద జీవోను రద్దు చేయాలంటూ నిరసన కార్యక్రమం చేపట్టారు. ఈ సందర్భంగా అప్పలస్వామి మాట్లాడుతూ ప్రభుత్వ పాఠశాలల్లో ఎస్ఎంసి కమిటీ సభ్యులకు తప్ప ఇంకెవ్వరికీ అనుమతి లేదంటూ కూటమి ప్రభుత్వం తీసుకువచ్చిన జీవోను తక్షణమే రద్దు చేయాలన్నారు. విద్యారంగ సమస్యలపై, విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోరుతూ దశాబ్దాలుగా విద్యార్థి సంఘాలు అనేక ఉద్యమాలు చేశాయన్నారు. ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నా విద్యారంగంలో గాని విద్యార్థులకు గాని సమస్యలు వస్తే తాము తప్పనిసరిగా న్యాయపోరాటం చేస్తామని అన్నారు. కార్యక్రమంలో ఏఐఎస్ఏ పట్టణ అధ్యక్షుడు మేడవాల రాజా, తానేటి రంజిత్ కుమార్, సిహెచ్ గణేష్, జి.భానుప్రకాష్, టి.మహేష్ బాబు తదితరులు పాల్గొన్నారు -
వివాదాస్పదంగా ఈవో తీరు
జంగారెడ్డిగూడెం: ఆలయాన్ని స్వాధీనం చేసుకునే క్రమంలో దేవదాయ శాఖ కార్యనిర్వాహక అధికారి తీరు వివాదాస్పదంగా మారింది. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్లో ఉన్న రామాలయానికి స్థానిక సుబ్బంపేటలో 33.65 ఎకరాల వ్యవసాయ భూమి ఉంది. కోర్టు తీర్పు అనంతరం ఇటీవలే ఆ భూమిని దేవదాయ శాఖ స్వాధీనం చేసుకుంది. ఈ క్రమంలో సదరు భూమిలో ఉన్న ఆలయాన్ని స్వాధీనం చేసుకునేందుకు సోమవారం ఈవో కలగర శ్రీనివాస్ తన సిబ్బందితో వెళ్లారు. ఆలయాన్ని నిర్వహిస్తున్న వ్యక్తులతో ఆలయ తాళాలు ఇవ్వాలని కోరారు. దీనికి వారు ఆలయంలో తమకు సంబంధించిన వస్తువులు ఉన్నాయని, వాటిని తీసుకున్న తరువాత మీకు అప్పగిస్తామని తెలిపారు. ఈ క్రమంలో ఆలయ నిర్వాహకులతో ఈవో దురుసుగా వ్యవహరిస్తూ మాట్లాడటంతో చిన్నపాటి వాగ్వాదం చోటు చేసుకుంది. ఆలయాన్ని ఎందుకు అప్పగించరు; వ్యాపారాలు చేసుకుందామనా.. అంటూ ఈవో మాట్లాడటంతో ఆలయ నిర్వాహకులు అభ్యంతరం తెలిపారు. పారిజాతగిరి ఈవోగా వ్యవహరిస్తున్న కలగర శ్రీనివాస్ జంగారెడ్డిగూడెం మండలంలోని 25 ఆలయాలకు ఇన్చార్జిగా వ్యవమరిస్తున్నారు. పలు ఆలయాల్లో పనిచేస్తున్న కింది స్థాయి ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. ఇక గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారికి ఎలా బాధ్యతలు అప్పగించారో ఉన్నతాధికారులే చెప్పాలని పలువురు పేర్కొంటున్నారు. గ్రేడ్–1 దేవాలయాల పరిరక్షణలో గ్రేడ్–2 అధికారి ఈవోగా ఎలా బాధ్యతలు నిర్వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఈవో శ్రీనివాస్ దేవదాయ శాఖలో చేరిన సంవత్సరం, ఎస్ఆర్లో నమోదు చేసిన సంవత్సరంలో కూడా తేడా ఉన్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆలయం స్వాధీనానికి వెళ్లగా.. దానిని ప్రైవేట్ వ్యక్తులు నిర్వహిస్తుండగా అడ్డుకున్నానని, దాని వల్లే తనను అల్లరి చేస్తున్నారని ఈవో కలగర శ్రీనివాస్ తెలిపారు. -
క్విజ్లో రాష్ట్ర స్థాయికి ఎంపిక
ఏలూరు (ఆర్ఆర్పేట): రెడ్ రిబ్బన్ క్లబ్ క్విజ్ జిల్లా స్థాయి పోటీల్లో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను రాష్ట్రస్థాయికి ఎంపిక చేసినట్లు జిల్లా లెప్రసీ, ఎయిడ్స్, టీబీ ఆఫీసర్ డాక్టర్ నరేంద్ర కృష్ణ తెలిపారు. స్టేట్ ఎయిడ్స్ కంట్రోల్ సొసైటీ ఆదేశానుసారం జిల్లా ఇంటిగ్రేటెడ్ స్ట్రాటజిక్ హెచ్ఐవీ ఎయిడ్స్ కార్యక్రమం ద్వారా ఏలూరు జిల్లాలోని జూనియర్ ఇంటర్ విద్యార్థులకు రెడ్ రిబ్బన్ క్విజ్ జిల్లా వ్యాప్తంగా ఏలూరు ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సోమవారం నిర్వహించారు. ఆస్పత్రిలో చికిత్స పొందుతూ వ్యక్తి మృతి ముసునూరు: పురుగుల మందు తాగిన వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై ఎం.చిరంజీవి తెలిపారు. మండలంలోని వేల్పుచర్ల శివారు అన్నపునేనివారిగూడెంకు చెందిన దుక్కిపాటి నాగరాజు (48)కూలి పనులు చేసేవాడు. తరచూ భార్యభర్తలు గొడవలు పడుతున్నారు. ఇటీవల గొడవలు అధికం కావడంతో మనస్తాపానికి గురై ఈ నెల మూడున పురుగుల మందు తాగాడు. బంధువులు అతనిని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన వైద్యం కోసం అక్కడ నుంచి విజయవాడ తరలించగా.. చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందాడు. బీచ్లో యువకుడి గల్లంతు నరసాపురం రూరల్: మొగల్తూరు మండలం పేరుపాలెం బీచ్లో సోమవారం సాయంత్రం యువకుడు గల్లంతయ్యాడు. పోలీసులు, స్థానికుల వివరాల ప్రకారం విజయవాడకు చెందిన బి.తన్వీర్ భీమవరంలోని ఓ ఇంజనీరింగ్ కళాశాలలో ఇంజనీరింగ్ తృతీయ సంవత్సరం చదువుతున్నాడు. సోమవారం తన మిత్రులతో కలిసి బీచ్కి వచ్చాడు. అలల ఉధృతికి గల్లంతయ్యాడు. సమాచారం అందుకున్న మొగల్తూరు ఎస్సై జి.వాసు సముద్రతీర ప్రాంతంలో గాలిస్తున్నారు. హోటళ్లపై దాడులు తణుకు అర్బన్: గృహ అవసరాలకు మాత్రమే వినియోగించాల్సిన రాయితీ గ్యాస్ సిలిండర్లు వాణిజ్య అవసరాలకు వినియోగిస్తే కఠినచర్యలు తీసుకుంటామని తణుకు తహసీల్దార్ దండు అశోక్వర్మ హెచ్చరించారు. అక్రమంగా గ్యాస్ సిలిండర్లు వినియోగిస్తున్న హోటళ్లపై సోమవారం దాడులు నిర్వహించారు. తణుకు పట్టణంలోని పలు హోటళ్లు, రెస్టారెంట్లపై దాడి చేసి మొత్తం 25 రాయితీ సిలిండర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. -
జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి
కుక్కునూరు: పుట్టిన రోజు జరుపుకోవాల్సిన రోజే జ్వరంతో చికిత్స పొందుతూ చిన్నారి మృతి చెందిన ఘటన సోమవారం జరిగింది. చిరవెల్లి గ్రామానికి చెందిన యర్నం ప్రదీప్, కావేరి దంపతులకు సహస్ర(6), స్నేహిత (3) సంతానం. సహస్రకు గత నెల 31న తీవ్రజ్వరం రావడంతో కుటుంబసభ్యులు భద్రాచలం ప్రైవేటు ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ పాపకు పరీక్షలు చేసిన వైద్యులు ప్లేట్లెట్లు తగ్గినట్టు చెప్పి చికిత్సను ప్రారంభించారు. శనివారం పాపకు జ్వరం తగ్గకపోగా ప్లేట్లెట్ల సంఖ్య 15 వేలకు పడిపోయి పరిస్థితి విషమించడంతో వైద్యులు మెరుగైన చికిత్స కోసం ఖమ్మంకు రిఫర్ చేశారు. ఖమ్మం ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తుండగా చిన్నారి మృతి చెందింది. -
లైంగిక వేధింపుల నుంచి రక్షణకు కృషిచేయాలి
భీమడోలు: లైంగిక వేఽధింపుల నుంచి మహిళళల రక్షణకు ఏర్పాటు చేసిన కమిటీలు తమ వంతు కృషి చేయాలని ఉమ్మడి జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ అన్నారు. భీమడోలు మండల సమాఖ్య కార్యాలయంలో సోమవారం జాతీయ న్యాయసేవాధికార సంస్థ ఆధ్వర్యంలో ఉచిత న్యాయ సదస్సును నిర్వహించారు. కె.రత్నప్రసాద్ మాట్లాడుతూ జిల్లా న్యాయ సేవాధికార సంస్థల ఉచిత న్యాయ సహాయాన్ని, బాధితులకు తాత్కాలిక, శాశ్వత పరిహారాన్ని అందిస్తాయన్నారు. జిల్లా బాలికా సంరక్షణాధికారిణి సీహెచ్ సూర్యచక్రవేణి మాట్లాడుతూ ప్రస్తుత సమాజంలో లింగ నిర్ధారణ పరీక్షలు కొనసాగుతున్నాయని, అలా చేసే వారిని చట్టం తీవ్రంగా శిక్షిస్తుందన్నారు. మహిళలకు అనేక చట్టాలున్నాయని, వాటిని సక్రమంగా వినియోగించుకుంటే రక్షణ పొందుతారన్నారు. పోలసానిపల్లి సాంఘిక సంక్షేమ గురుకుల బాలికల కళాశాలను న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి సందర్శించి కళాశాలలోని వసతులు, పరిసరాలను పరిశీలించారు. -
వర్షాకాలంలో విద్యుత్తో అప్రమత్తం
తణుకు అర్బన్: వర్షాకాలంలో విద్యుత్తో అప్రమత్తంగా ఉండాలని ఆ శాఖ అధికారులు సూచిస్తున్నారు. వర్షాలకు వృక్షాలు కూలినప్పుడు, విద్యుత్ తీగలు తెగిపడినప్పుడు విద్యుత్ షార్ట్ సర్క్యూట్ అయ్యే అవకాశం ఉంది. కొన్ని ప్రాంతాల్లో ఈదురుగాలులకు తెగిపడుతున్న విద్యుత్ తీగలు తగిలి నిండు ప్రాణాలు గాలిలో కలిసిపోతున్నాయి. గృహాల్లో సైతం తడిచేతులతో స్విచ్లు వేయడం, వర్షాలకు స్విచ్ బోర్డులు తడిసి విద్యుత్ షార్ట్ సర్క్యూట్ కావడం వంటివి చూస్తున్నాం. వర్షాకాలంలో విద్యుత్ ప్రమాదాలను దృష్టిలో పెట్టుకుని విద్యుత్ శాఖ పూర్తిస్థాయిలో అవగాహన కల్పించాలి. వర్షాకాలం మొదలైనా ఇంతవరకు విద్యుత్ శాఖ అధికారులు ఆ దిశగా చర్యలు తీసుకోలేదు. వర్షాల సమయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● భారీ వర్షాల సమయాల్లో గృహోపకరణాల స్విచ్లు ఆఫ్ చేసి ఉంచాలి. ● కరెంటు స్విచ్ బోర్డుల్లో స్విచ్లను తడి చేతులతో తాకరాదు. ● చిన్న పిల్లలను కరెంటు వస్తువులకు దూరంగా ఉంచాలి. ● ఇంటి సర్వీసు వైరు తెగినా, జాయింట్స్ కట్ అయినా తాకకుండా వెంటనే విద్యుత్ శాఖకు తెలియచేయాలి. ● విద్యుత్ స్తంభాలు, స్టే వైర్లను తాకరాదు. ● ఇంటి పరిసరాల్లో చెట్లు, కరెంటు స్తంభాలు పడిపోయిన సందర్భాల్లో దగ్గరకు వెళ్లకుండా ముందుగా విద్యుత్ శాఖకు తెలియచేయాలి. ● గృహాల ఆవరణలోని నీళ్ల మోటార్లకు ఉన్న కరెంటు వైర్లను తాకరాదు. ● గాలి, వాన సమయాల్లో కరెంటు లైన్ల కింద నిలబడడం, కూర్చోవడం చేయరాదు. ● రహదారుల్లో విద్యుత్ ప్రసారం జరిగే తీగలు తెగి పడి ఉంటే విద్యుత్ ప్రవాహం ఉన్నట్లుగా భావించి దూరంగా ఉండాలి. ● మోటార్ల స్టార్టర్లు, మోటార్లు వర్షం వలన నీటిలో మునగడం, పూర్తిగా తడవడం వల్ల షార్ట్ సర్క్యూట్ జరిగే ప్రమాదం ఉంది. రైతులు జాగ్రత్తలు పాటించాలి. ● విద్యుత్ ప్రమాదానికి గురైన వారిని కానీ ఆ విద్యుత్ పరికరాన్ని కానీ నేరుగా తాకరాదు. ● వర్షాలు పడుతున్న సమయాల్లో రహదారులపై ఉన్న విద్యుత్ స్తంభాలను ముట్టుకోరాదు. ● విద్యుత్ సమస్యల పరిష్కారం కోసం టోల్ప్రీ 1912 నంబరులో సంప్రదించాలి. -
యాప్లతో వేగలేం
పాలకోడేరు: సెల్ఫోన్లు ప్రభుత్వానికి తిరిగిచ్చేయాలనే నిర్ణయంతో సోమవారం విస్సాకోడేరు సీడీపీఓ కార్యాలయం వద్ద సెల్ఫోన్లను అప్పగించారు. ఈ సందర్భంగా ప్రాజెక్ట్ నాయకురాలు మహాలక్ష్మి మాట్లాడుతూ సిగ్నల్స్ లేక ఫోన్లు పనిచేయక తీవ్ర ఇబ్బందులను ఎదుర్కొన్నామని, అనేకసార్లు ప్రభుత్వ అధికారులకు తెలియచేసినప్పటికీ సమస్య పరిష్కారం కాకపోవడంతో యూనియన్ రాష్ట్ర కమిటీ సెల్ఫోన్లు ప్రభుత్వానికి అప్పగించాలని నిర్ణయించిందన్నారు. ప్రభుత్వం ఇప్పటికై నా అంగన్వాడీల సమస్యలను పరిష్కరించాలని లేదంటే మరింత తీవ్రంగా ఉద్యమిస్తామని అన్నారు. సీఐటీయు జిల్లా నాయకుడు ఎం.ఆంజనేయులు పాల్గొని పోరాటానికి సంఘీభావం తెలిపారు. అంగన్వాడీలను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ఏలూరులో.. ఏలూరు(టూటౌన్): పనిచేయని స్మార్ట్ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. స్థానిక ఏఎస్ఆర్ స్టేడియం వెనుకవైపున ఉన్న ఐసీడీఎస్ ఏలూరు ప్రాజెక్టు కార్యాలయం వద్ద సోమవారం నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా పని చేయని స్మార్ట్ఫోన్ల తో డేటా వివరాలు నమోదు చేయలేకపోతున్నామన్నారు. 5జీ టెక్నాలజీ యాప్లతో ఓల్డ్ వెర్షన్ ఫోన్లో ఎలా అప్లోడ్ చేయాలన్నారు. ప్రాజెక్ట్ యూనియన్ అధ్యక్ష కార్యదర్శులు షేక్ సమీమా, తలారి రజని మాట్లాడుతూ ప్రభుత్వం కొత్త ఫోన్లు ఇచ్చే వరకు మాన్యూవల్ పద్ధతిలోనే పని చేస్తామన్నారు. రాష్ట్ర కమిటీ నిర్ణయం మేరకు ఈ నిర్ణయం తీసుకున్నామని చెప్పారు. కై కలూరులో.. కై కలూరు: అంగన్వాడీ టీచర్లుకు ఇచ్చిన సెల్ ఫోన్లు పనిచేయడం లేదు. పైగా మూడు యాప్లలో వివరాలు నమోదు చేయడం కష్టమవుతోంది అంటూ అంగన్వాడీ కార్యకర్తలు కై కలూరులో సెక్టార్ ఆఫీసు సూపర్వైజర్ ప్రసన్న లక్ష్మీకి సోమవారం సెల్ఫోన్లు ఇచ్చేశారు. కై కలూరు నియోజకవర్గం నాలుగు మండలాల్లో కలపి మొత్తం 311 సెల్ఫోన్లు వెనక్కి ఇచ్చేశారు. అంగన్వాడీ కార్యకర్తల ప్రాజెక్టు సెక్రటరీ సుజాత మాట్లాడుతూ ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం అంగన్వాడీ సెంటర్లలో యాప్ల గొడవ లేకుండా చేస్తామని హామీ ఇచ్చారన్నారు. ఇప్పడు మూడు యాప్లు కలపి ఒక యాప్గా చేయాలని కోరుతున్నా పట్టించుకోవడం లేదన్నారు. ప్రభుత్వం ఇప్పటికై న సరైన నిర్ణయం తీసుకోవాలని కోరారు. సెల్ఫోన్లు తిరిగిచ్చేసిన అంగన్వాడీ కార్యకర్తలు -
ప్రొటోకాల్ పాటించడం లేదని ఫిర్యాదు
భీమవరం(ప్రకాశం చౌక్): యలమంచిలి మండల పరిధిలో అధికారులు ప్రొటోకాల్ పాటించడం లేదని యలమంచిలి ఎంపీపీ ఇనుకొండ ధనలక్ష్మి సోమవారం ఇన్చార్జ్ కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డికి వైఎస్సార్సీపీ నాయకులతో కలిసి ఫిర్యాదు చేశారు. మండలంలో జరుగుతున్న శంకుస్థాపనలకు, ప్రారంభోత్సవాలకు తనకు, వైఎస్సార్సీపీ చెందిన సర్పంచులకు, ఎంపీటీసీలకు ఆహ్వానం గాని, ప్రొటోకాల్ పరంగా గౌరవం గానీ ఇవ్వడం లేదన్నారు. ఇలా అనుమానించడం సరైన పద్ధతి కాదన్నారు. మండలంలో తీర్మానాలు చేసిన వర్క్లకు ఆర్డర్స్ ఇవ్వకుండా, మండలాన్ని అభివృద్ధి చేయకుండా అధికారులు అలసత్వాన్ని వీడి, ప్రొటోకాల్ ద్వారా మండ ల అభివృద్ధికి తోడ్పడేలే చర్యలు తీసుకోవాలని ఫి ర్యాదు చేయడంతో పాటు పలు అంశాలపై వినతిపత్రం అందజేశారు. పార్టీ జిల్లా అధ్యక్షుడు ము దునూరి ప్రసాదరాజు, మాజీ మంత్రి చెరుకువాడ శ్రీరంగనాథరాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, పార్లమెంట్ ఇన్చార్జి గూడూరి ఉమాబాల, పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, స ర్పంచుల చాంబర్ అధ్యక్షుడు కవురు గోపి పాల్గొన్నారు. ఫ్యాక్టరీల్లో నిబంధనలు తప్పనిసరి భీమవరం (ప్రకాశంచౌక్): కార్మిక చట్టాలు, ఉపాధికి సంబంధించిన పలు అంశాల పరిష్కారానికి అధికారులు చొరవ చూపాలి ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో సోమవారం ప్రాన్ ప్రాసెసింగ్ యూనిట్ రైడింగ్ జిల్లాస్థాయి కమిటీ సభ్యులు, అధికారులతో ఆయన సమీక్షించారు. ఈ సందర్భంగా ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఫ్యాక్టరీల్లో పనిచేసే మహిళా కార్మికుల సంక్షేమానికి నిబంధనలను విధిగా పాటించాలన్నారు. పని గంటలు, పని పరిస్థితులు మెరుగ్గా ఉండాలన్నారు. ఫ్యాక్టరీల్లో ఎక్కడ బాల కార్మికులు ఉండకూడదన్నారు. -
కూటమి పాలనలో రైతులకు కష్టాలు
ఏలూరు(మెట్రో): కూటమి పాలనలో రైతులు కష్టాలు ఎదుర్కొంటున్నారని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, నూజివీడు, చింతలపూడి నియోజకవర్గాల కన్వీనర్లు మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, కంభం విజయరాజు అన్నారు. రాష్ట్రంలో యూరియా సహా ఎరువుల కొరత, రైతు లు ఎదుర్కొంటున్న సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ రాష్ట్ర కమిటీ పిలుపు మేరకు ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్లో వైఎస్సార్సీపీ నాయకులు కలెక్టర్ కె.వెట్రి సెల్వికి వినతిపత్రం అంజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ కూటమి నాయకులు సూపర్సిక్స్ హామీలను అమలు చేయకపోగా రైతులను కష్టాలు పాలుజేశారన్నారు. రైతులకు పెట్టుబడి సా యం కింద ఏడాదికి రూ.20 వేలు ఇస్తామని, జూన్ 2024 నుంచి ఈ హామీ అమలు చేస్తామని చెప్పి మాట తప్పారన్నారు. రెండేళ్లకు రూ.40 వేలు ఇవ్వా ల్సి ఉండగా, కేవలం రూ.5 వేలు మాత్రమే ఇచ్చారని, అలాగే పథకం నుంచి 7 లక్షల మంది రైతులను తొలగించారని మండిపడ్డారు. పెట్టుబడి సాయం లేక రైతులు అప్పులపాలవుతున్నారని, పంటలకు గిట్టుబాటు ధరలు లేవని అన్నారు. ఉచిత పంటల బీమాను రద్దు చేశారని, సున్నావడ్డీ పథకాన్ని ఎత్తేశారన్నారు. రైతు భరోసా కేంద్రాలను నీరుగార్చారని, గ్రామస్థాయిలో వ్యవస్థలను ధ్వంసం చేశారని మండిపడ్డారు. ఎరువు.. బరువు : రైతులకు ఎరువుల పంపిణీలో కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైందని వి మర్శించారు. ముఖ్యంగా యూరియా దొరక్క రైతులు అల్లాడుతున్నారన్నారు. పొటాష్ కలిసిన కాంప్లెక్స్ ఎరువుల ధరలు అమాంతం పెరిగిపోయాయన్నారు. ప్రైవేట్ వ్యాపారులు యూరియా బస్తాపై రూ.60 నుంచి రూ.100 వరకు అదనంగా డిమాండ్ చేస్తున్నారన్నారు. రాష్ట్రవ్యాప్తంగా ఎరువులను అందుబాటులో ఉంచాలని, యూరియా కొ రతను నివారించాలని, గ్రామాల్లోనే రైతు భరోసా కేంద్రాల్లో నిల్వలు ఉంచి రైతులకు పంపిణీ చే యాలని డిమాండ్ చేశారు. ఉచిత పంటల బీమాను అమలు చేయాలని, గతేడాది రైతు భరోసా బకాయిలను కూడా వెంటనే చెల్లించాలని కోరారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో విత్తు నుంచి ధాన్యం కొనుగోలు వరకూ రైతులకు అన్నింటా అండగా నిలిచామని చెప్పారు. ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, రాష్ట్ర ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, రాష్ట్ర వాణిజ్య విభాగం ప్రధాన కార్యదర్శి గంటా మోహన్రావు, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర ఎస్సీ సెల్ కార్యదర్శి ఇమానైల్ జైకర్, రాష్ట్ర గ్రీవెన్స్ సెల్ సంయుక్త కార్యదర్శి బసవ లింగేశ్వరరావు, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, జిల్లా అధికార ప్రతినిధి ఎం.జాన్ గురునాథం, జిల్లా రైతు విభాగ అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, జిల్లా బీసీ సెల్ అధ్యక్షు డు నెరుసు చిరంజీవి, జిల్లా గ్రీవెన్స్ అధ్యక్షుడు సముద్రాల దుర్గారావు, జిల్లా వైఎస్సార్టీయూసీ అధ్యక్షుడు పల్లి శ్రీనివాసరావు, జిల్లా వికలాంగుల విభాగం అధ్యక్షుడు షేక్ షమీం, జిల్లా ఆర్టీఐ విభాగం అధ్యక్షుడు స్టాలిన్, కార్పొరేటర్లు డింపుల్ జాబ్ రిషి, ఏలూరు నియోజవర్గ మహిళా విభాగం అధ్యక్షురాలు జుజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, గ్రీవెన్స్ అధ్యక్షుడు మద్దాల ఫణి, జిల్లా స్టూడెంట్ విభాగం అధ్యక్షుడు పి.రాజేష్, కన్స్యూమర్ జిల్లా కార్యదర్శి టి.తులసి, పార్టీ నాయకులు పాల్గొన్నారు. యూరియాతో సహా ఎరువుల కొరత పూర్తిగా అందని పెట్టుబడి సాయం కలెక్టర్కు వినతిపత్రం అందజేసిన వైఎస్సార్సీపీ నాయకుల -
స్మార్ట్ బాదుడు
ఏలూరు (టూటౌన్): నాడు స్మార్ట్ మీటర్లు బిగిస్తే పగులకొట్టింది అని పిలుపునిచ్చిన కూటమి నాయ కులు.. నేడు అధికారంలోకి వచ్చాక అవే స్మార్ట్ మీటర్లను బిగిస్తుండటంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. ప్రతిపక్షంలో ఉన్పప్పుడు ఒకలా, అధికారం చేపట్టాక మరోలా వ్యవహరించడం కూటమి నాయకులకే చెల్లిందంటూ ప్రజలు దుయ్యబడుతున్నారు. ట్రూఅప్ చార్జీల పేరుతో అధికారం చేపట్టిన ఏడాది కాలంలోనే రూ.15,485 కోట్ల అదనపు భారాలు మోపి వినియోగదారుల నడ్డి విరిచారని గుర్తుచేస్తున్నారు. తాజాగా అదానీ లాంటి కార్పొరేట్ వ్యక్తులకు మేలు చేసేందుకు స్మార్ట్ మీటర్లను బిగించే కార్యక్రమానికి శ్రీకారం చుట్టడం సిగ్గుచేటని విమర్శిస్తున్నారు. ఈ క్రమంలో జిల్లావ్యాప్తంగా అన్ని కార్మిక సంఘాలు కలిపి ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక పేరుతో కొన్ని రోజులుగా స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున నిరసనలు, సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టారు. దీనికి కొనసాగింపుగా జిల్లా కేంద్రంలోని విద్యుత్ భవన్ వద్ద, జిల్లాలోని వివిధ సబ్ స్టేషన్ల వద్ద స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా మంగళవారం ధర్నాలకు పిలుపునిచ్చారు. పెద్ద ఎత్తున సంతకాల సేకరణ స్మార్ట్ మీటర్లను రద్దు చేయాలంటూ ప్రజా సంఘాల ఐక్యకార్యాచరణ వేదిక ఆధ్వర్యంలో జిల్లాలో పలు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున సంతకాల సేకరణ జరుగుతోంది. వారం రోజులుగా ఈ కార్యక్రమం ముమ్మరంగా సాగుతోంది. అన్నివర్గాల ప్రజలు భాగస్వాములవుతున్నారు. కూటమి నమ్మక ద్రోహం గత ఎన్నికల సమయంలో తాము అధికారంలోకి వస్తే విద్యుత్ చార్జీలు పెంచబోమని కూటమి నాయకులు హామీలు ఇచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా స్మార్ట్ మీటర్లు పగులకొట్టండని లోకేష్ పిలుపు కూడా ఇచ్చారు. గద్దెనెక్కిన కూటమి నాయకులు ప్రజలకు నమ్మక ద్రోహం చేశారు. ఏడాది కాలంలో కరెంటు బిల్లులు భారీగా పెరిగిపోయాయి. ఇప్పుడు స్మార్ట్ మీటర్ల అంశం తెరపైకి తెచ్చారు. ఈ నేపథ్యంలో మంగళవారం ఏలూరులో జిల్లా విద్యుత్ భవనం, జిల్లాలోని విద్యుత్ సబ్స్టేషన్ల వద్ద ధర్నాకు ఐక్య కార్యాచరణ వేదిక నాయకులు పిలుపునిచ్చారు. మీటర్ రీడర్లపై కత్తి స్మార్ట్ మీటర్లతో విద్యుత్ మీటర్ రీడర్లు ఉపాధిని కోల్పోనున్నారు. ఏలూరు జిల్లాలో 460 మంది, పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 400 మంది రోడ్డున పడనున్నారు. సర్దుపోటు రూ.15,485 కోట్లు ట్రూఅప్ సర్దుబాటు చార్జీల పేరుతో కూటమి ప్రభుత్వం ప్రజలపై రూ.15,485 కోట్ల భారం మోపింది. దీంతో పెరిగిన విద్యుత్ బిల్లులతో సామాన్యులు విలవిలలాడుతున్నారు. మరింత దోపిడీకి.. రాష్ట్రంలోని కూటమి సర్కార్ ప్రజలను మరింత దోపిడీ చేసేందుకే స్మార్ట్ మీటర్ల బిగింపును తెరమీదకు తీసుకువచ్చిందనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అదానీతో ఒప్పందం చేసుకుని ‘స్మార్ట్’గా ప్రజలను దోచుకునేందుకు ప్రయత్నిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. స్మార్ట్ మీటర్లతో బిల్లులు మరింత పెరుగుతాయని వినియోగదారులు ఆందోళన చెందుతున్నారు. తక్షణం రద్దు చేయాలి ప్రజలపై మరింత భారాలు మోపేలా ఉన్న స్మార్ట్ మీటర్ల బిగింపును తక్షణం రద్దు చేయాలి. పేదల పొట్ట గొట్టి పెద్దలకు పెట్టినట్టు అదానీ లాంటి కార్పొరేట్ శక్తులకు అప్పనంగా దోచి పెట్టేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు విద్యత్ స్మార్ట్ మీటర్లను తెరమీదకు తీసుకురావడం దారుణం. – డీఎన్వీడీ ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరు జిల్లా కమిటీ ప్రజలను మోసగిస్తున్నారు కూటమి ప్రభుత్వం ప్రజలను నమ్మించి మోసగించింది. ఎన్నికలకు ముందు స్మార్ట్ మీటర్లను పగలగొట్టండి అని పిలుపునిచ్చారు. తీరా అధికారంలోకి వచ్చాక అదే స్మార్ట్ మీటర్లను నిస్సిగ్గుగా బిగించేస్తున్నారు. ఇది ప్రజలను నమ్మించి మోసం చేయడమే. ప్రతిఒక్కరూ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకించాలి. – బండి వెంకటేశ్వరరావు,జిల్లా ఉపాధ్యక్షుడు, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా కమిటీ ప్రజలపై విద్యుత్ భారాలు స్మార్ట్ మీటర్లకు వ్యతిరేకంగా జరిగే ధర్నాను అందరూ విజయవంతం చేయాలి. ఎటువంటి చార్జీలు పెంచబోమని, అదనపు భారాలు మోపబోమని నమ్మబలికిన కూటమి నాయకులు తీరా గద్దెనెక్కిన తర్వాత మాట మార్చి ఎడాపెడా విద్యుత్ భారాలు మోపడం దుర్మార్గం. – బద్దా వెంకట్రావు, ఇఫ్టూ ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా, ఏలూరు సామాన్యులకు షాక్ స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తున్న ప్రజాసంఘాలు ఉపాధి కోల్పోతామంటున్న మీటర్ రీడర్లు కూటమి పాలనలో ప్రజలపై విద్యుత్ భారాలు నేడు జిల్లా విద్యుత్ భవన్,సబ్స్టేషన్ల వద్ద ధర్నాలకు పిలుపు -
శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే సహించం
ఏలూరులో మహిళలపై దాడి ఘటనలో కేసుల నమోదు ఏలూరు టౌన్: ఏలూరులో ఆదివారం రాత్రి మహిళలపై దాడి చేసిన ఘటనపై ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ సీరియస్ అయ్యారు. శాంతిభద్రతల కు విఘాతం కలిగించేలా ఎవరైనా వ్యవహరిస్తే స హించేది లేదని, కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏలూరు వన్టౌన్ పోలీస్స్టేషన్లో సోమ వారం రాత్రి ఆయన విలేకరుల సమావేశం నిర్వహించారు. దాడి ఘటనలో ఇరువర్గాలపై కేసులు నమోదు చేశామని చెప్పారు. డీఎస్పీ తెలిపిన వివరాల ప్రకారం.. ఏలూరు రూరల్ పరిధిలో మరడాని రంగారావు కాలనీ, పోణంగి రోడ్డులోని జరుగులమ్మ తల్లి గుడి ప్రాంతానికి చెందిన కాటూరి నిర్మల కుమారుడు లక్కీ అనే యువకుడు తల్లికి టిఫిన్ తెచ్చేందుకు మోటారు సైకిల్పై బయల్దేరాడు. అతడు వీఎస్ఆర్ గ్రాండ్ సిటీ వద్దకు చేరుకునేసరికి పల్లెపు సాయికుమార్, తురక మురళి, గుంజే జాన్ అనే ముగ్గురు వ్యక్తులు.. మోటారు సైకిల్ వేగంగా ఎందుకు నడుపుతున్నావంటూ నిలదీశారు. ఈ విషయంలో వారితో వాగ్వివాదం చోటుచేసుకోగా, లక్కీని కొట్టారని బాధితులు చెబుతున్నారు. అనంతరం మరోసారి ఈ ముగ్గురితో పాటు నిడిగట్టి నాగరాజు, బత్తుల దుర్గారావు, మరికొంతమంది కాటూరి లక్కీ ఇంటి వద్దకు వెళ్లారు. ఇరువర్గాల మధ్య వివాదం చెలరేగగా కొట్టుకున్నారని, ఆ ఘటనపై పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారని తెలిపారు. ఈ రెండు వర్గాలపై ఏలూరు రూరల్ పో లీస్స్టేషన్లో పలు సెక్షన్లలో కేసులు నమోదు చేశా మని డీఎస్పీ వివరించారు. ఈ రెండు వర్గాల వారికీ ఏ రాజకీయ పార్టీతో సంబంధం లేదని, స్వల్ప వివాదం నేపథ్యంలోనే గొడవ జరిగిందని, పోలీసులు స్పందించి చర్యలు తీసుకోలేదనే ఆరోపణల్లో వాస్తవం లేదన్నారు. మహిళల దుస్తులు చించేస్తూ.. భయోత్పాతం బాధితురాలు కాటూరి నిర్మల సోమవారం ‘సాక్షి’తో ఫోన్లో మాట్లాడుతూ తన కుమారుడు లక్కీని ముగ్గురు కలిసి కొట్టారని, లక్కీ ఇంటికి రాగా మరో 15 మంది వ్యక్తులు మహిళలని కూడా చూడకుండా ఇష్టారాజ్యంగా దుర్భాషలాడుతూ కొ ట్టారని, ఇదే సమయంలో మరో 50 మందిని పిలిపించుకుని తమ ఇళ్లపై దాడులు చేస్తూ భయో త్పాతం సృష్టించారని ఆవేదన వ్యక్తం చేశారు. మహిళల దుస్తులు చించేస్తూ ఇష్టారాజ్యంగా దాడి చేశారన్నారు. దీనిపై ఏలూరు రూరల్ పోలీస్స్టేషన్కు వెళ్లి ఆదివారం రాత్రి 7.30 గంటల సమయంలో ఫిర్యాదు చేశామని చెప్పారు. అనంతరం రక్షణ కల్పించాలంటూ ఏలూరు చిరంజీవి బస్టాండ్ వద్ద ఆందోళన చేశామని తెలిపారు. పోలీసులు తమకు న్యాయం చేస్తామని హామీ ఇవ్వటంతో నిరసన విరమించామన్నారు. -
టీడీపీ కోవర్ట్ ఆపరేషన్
యాప్లతో వేగలేం పనిచేయని స్మార్ట్ఫోన్లు మాకొద్దు అంటూ అంగన్వాడీలు నిరసన వ్యక్తం చేశారు. ఐసీడీఎస్ కార్యాలయాల్లో సెల్ఫోన్లను అప్పగించారు. 8లో uఆంక్షలపై నిరసన పాఠశాలల్లోకి విద్యార్థి సంఘాలకు అనుమతి లేదంటూ ప్రభుత్వం విడుదల చేసిన జీఓపై విద్యార్థి సంఘాల నాయకులు మండిపడ్డారు. 8లో uమంగళవారం శ్రీ 5 శ్రీ ఆగస్టు శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం ఎమ్మెల్యే అవినీతి వ్యవహారం జిల్లా రాజకీయాల్లో ప్రకంపనలు సృష్టిస్తోంది. వంద కోట్ల అవినీతి దేశానికే రోల్మోడల్ అంటూ దేవినేని ఉమ చేసిన వ్యాఖ్యల ఆడియో టేప్ హాట్టాపిక్గా మారిన క్రమంలో జన సైనికులు రగిలిపోతున్నారు. టీడీపీ కోవర్ట్ ఆపరేషన్తోనే ఇదంతా చేసి రాజకీయంగా జనసేనను పోలవరంలో అణచివేయడానికి తెరతీసిందని, దీనికి జనసేన కీలక నేత కరాటం రాంబాబును పావుగా వాడుకున్నారనే ప్రచారం జోరందుకోవడంతో నియోజకవర్గంలో జనసేన వర్సెస్ టీడీపీ రగడ హాట్ హాట్గా మారింది. జనసేన భవితవ్యం గందరగోళం జనసేన, టీడీపీ ఆధిపత్యపోరు కొనసాగిస్తున్న తరుణంలో తాజా ఎపిసోడ్తో జనసేన భవితవ్యం గందరగోళంలో పడింది. ఎమ్మెల్యే ఏడాదిలోనే వంద కోట్లు సంపాదించాడు.. భారీ భవనం కట్టుకున్నాడు.. దేశానికే అవినీతిలో రోల్మోడల్గా నిలిచాడంటూ చేసిన వ్యాఖ్యలపై ఎమ్మెల్యే వర్గం మండిపడటం మినహా మరేమీ చేయలేని పరిస్థితి. అయితే ఇదంతా అబద్ధపు ప్రచారం, తప్పుడు ఆడియో రికార్డు అని ఎవరూ ఖండించకుండా పెద్ద మనుషుల మధ్య జరిగిన సంభాషణలు టీడీపీ ఎలా బయటపెడుతుందని, దీనిపై స్పందించాలని జనసేన చోటా నేతలు బలంగా డిమాండ్ చేస్తున్నారు. అయితే ఈ వ్యవహారంపై ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు టీడీపీ జిల్లా అ ధ్యక్షుడు వరకు ఎవరూ స్పందించని పరిస్థితి. మూడు రోజులుగా ఎమ్మెల్యే అవినీతి చేయలేదంటూ.. జనసేన కేడర్ చెప్పడమే కానీ ఎవరూ పట్టించుకోకపోవడంతో ఏం చేయాలనే దానిపై సందిగ్ధం నెలకొంది. దేవినేని ఉమాతో మాజీ ఎమ్మెల్యే మొడియం శ్రీనివాస్ అనుచరుడు పరిమి రాంబాబు చౌదరి అతడి ఫోన్ నుంచే కరాటం రాంబాబుతో మాట్లాడించారు. ఆడియో వాయిస్ రికార్డును టీడీపీ నేత రాంబాబు చౌదరే బయటపెట్టాడని, అతడిపై టీడీపీ చర్యలు తీసుకోవాలని జనసేన డిమాండ్ చేస్తున్నా టీడీపీ లైట్గా తీసుకుంది. టీడీపీ ట్రాప్లో కరాటం మరోవైపు టీడీపీ ట్రాప్లో జనసేన నేత కరాటం రాంబాబు పడటం వల్ల పార్టీకి, ఎమ్మెల్యేకు భారీ డ్యామేజ్ జరిగిందనే అంతర్గత చర్చ కొనసాగుతోంది. పార్టీపరంగా ఇబ్బందులు వస్తే ఖండించాల్సిన నాయకుడే సంభాషించడంతో ఏం చేయాలో అర్థం కాని పరిస్థితి జనసేనలో నెలకొంది. ఇంకోవైపు దీనిపై కరాటం రాంబాబు స్పందిస్తూ దేవినేని ఉమానే సమాధానం చెప్పాలని ఒక్క మాటతో ముగించడంతో ఎమ్మెల్యే వర్గం మళ్లీ డైలమాలో పడింది. తాజా పరిణామాల క్రమంలో ఎమ్మెల్యే చిర్రి బాలరాజు అధికారిక కా ర్యక్రమాల్లో ఆదివారం దూరంగా ఉన్నారు. ఈ క్రమంలో ఏపీ ట్రైకార్ చైర్మన్, టీడీపీ నేత బొరగం శ్రీనివాస్ అన్నదాత సుఖీభవ సభలో పాల్గొనడం మరో చర్చకు తెరతీసింది. మొత్తంగా ఆడియో టేప్ వ్యవహారంలో జనసేన నేతనే టీడీపీ పావుగా వాడుకుని జనసేన ఎమ్మెల్యేనే అప్రతిష్టపాలు చేసే లా విజయవంతంగా మైండ్ గేమ్ నడిపింది. న్యూస్రీల్ రగులుతున్న జన సైనికులు పోలవరం ఎమ్మెల్యేను ఇరకాటంలో పడేసిన టీడీపీ శ్రేణులు ఉద్దేశ పూర్వకంగానే ఆడియో లీక్ చేశారని అభియోగం ముదురుతున్న జనసేన వర్సెస్ టీడీపీ రగడ -
మండుతున్న ఎండలు
పెంటపాడు: రోజురోజుకు ఎండలు ఠారెత్తిస్తున్నాయి. ఈ ఎండలు మండు వేసవిని తలపిస్తున్నాయి. ఎండ, ఉక్కపోతతో ప్రజలు ఇళ్ల నుంచి బయటకు రాలేక పోతున్నారు. వర్షాలు లేక ఎండకు నాట్లు దెబ్బతినే అవకాశం ఉంది. నాట్ల సమయంలో వర్షం వస్తే ఏపుగా ఎదుగుతాయి. ఎండల వల్ల ప్రజలు బయటకు రాక వ్యాపారాలు కూడా దెబ్బతింటున్నాయి. స్కూలుకు వెళ్లే చిన్నారులు ఎండ దెబ్బకు అల్లాడుతున్నారు. గూడెం నియోజకవర్గంలో అప్రకటిత విద్యుత్ కోతతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రాత్రి పూట అయితే చెప్పక్కరలేదు. పెంటపాడు, గూడెం ప్రాంతాలలో రోజూ 10 గ్రామాల చొప్పున విద్యుత్ కోత ఉంటోంది. -
కుంగిన వంతెన.. నిలిచిన రాకపోకలు
భీమవరం అర్బన్: భీమవరం మండలంలోని దొంగపిండిలో బందాల చేడు డ్రెయిన్పై నిర్మించిన వంతెన ఆదివారం తెల్లవారుజామున కుంగిపోయింది. దీంతో వాహనాల రాకపోకలు నిలిచిపోయాయి. గ్రామంలో సుమారు 6 వేల వరకు జనాభా ఉండగా.. గ్రామం చుట్టూ ఎటు చూసినా కాలువలు ఉన్నాయి. నిత్యం స్కూలు బస్సులు, కూలీలు, కార్మికుల వ్యాన్లు, ఆటోలపై పొరుగూరుకు వెళ్లి వస్తుంటారు. గ్రామంలో చేపలు, రొయ్యలు చెరువులు ఎక్కువగా ఉండటంతో తవుడు లోడులు, పట్టుబడులకు నిత్యం వందలాది వాహనాలు రాకపోకలు సాగిస్తుంటాయి. గ్రామం నుంచి పొరుగూళ్లు వెళ్లడానికి ఆర్ అండ్ బీ రోడ్డు ఒక్కటే కావడంతో ఆ మార్గంలో వంతెన కుంగిపోవడంతో ఆంధోళన వ్యక్తం చేస్తున్నారు. 3 దశాబ్దాల నాటి వంతెన సుమారు 3 దశాబ్దాల క్రితం బందాల చేడు డ్రెయిన్పై వంతెన నిర్మించారు. కొంతకాలంగా ఈ వంతెన శిథిలావస్థకు చేరుకుని అడుగుభాగం పెచ్చులూడిపోవడంతో కొంతమంది గ్రామస్తులు ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి తీసుకువెళ్లారు. ఇంతవరకూ ఎవరూ పట్టించుకోలేదని ఇప్పుడు వంతెన కూలిపోయిందని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కుంగిపోయిన వంతెన స్థానంలో ఎప్పుడు కొత్త వంతెన నిర్మిస్తారని, అప్పటి వరకు తమకు కష్టాలు తప్పవా అని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తాత్కాలికంగా వంతెన నిర్మించాలని గ్రామస్తులు, రైతులు కోరుతున్నారు. -
సీఎస్సీ భవన నిర్మాణానికి చర్యలు
కాళ్ల : మండలంలోని బొండాడ గ్రామంలో సచివాలయం వద్ద రూ.లక్షలతో నిర్మించిన మరుగుదొడ్లను ప్రైవేట్ వ్యక్తులు కూ ల్చివేయడంతో అధికారులు తప్పును సరిదిద్దుకునే పనిలో నిమగ్నమయ్యారు. సచివాలయ భవనం ప్రారంభం కాకుండానే మరుగుదొడ్లను కూల్చివేయడంపై గత నెల 27న ‘సాక్షి’లో ప్రచురించిన ‘ప్రభుత్వ భవనాలకే రక్షణ లేదు’ కథనానికి అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించారు. ఎవరైతే భవనాన్ని కూల్చారో వారే కట్టించేలా చూడాలని, లేకుంటే కఠిన చర్యలు తీసుకోవాలని పంచాయతీ కార్యదర్శితో పాటు అధికారులపై డిప్యూటీ స్పీకర్ ఆగ్రహం వ్యక్తం చేశారు. దీంతో అధికారులు కూల్చిన వ్యక్తితోనే భవనాన్ని కట్టిస్తున్నారు. ఆదివారం సీఎస్సీ భవనం (కమ్యూనిటీ శానిటరీ కాంప్లెక్స్) నిర్మాణానికి ఇంజనీరింగ్ సిబ్బంది మార్కింగ్ వేశారు. మెటీరియల్ సిద్ధం చేశారు. ఆర్డబ్ల్యూఎస్ జేఈ ఫణి పనులను పర్యవేక్షిస్తున్నారు. ఎవరైనా ప్రభుత్వ ఆస్తుల ధ్వంసానికి పాల్పడితే చర్యలు తప్పవని అధికారులు హెచ్చరించారు. -
భీమవరం మున్సిపాలిటీలో అవినీతి భాగోతం
భీమవరం(ప్రకాశం చౌక్): కూటమి ప్రభుత్వంలో భీమవరం మున్సిపాలిటీ అవినీతి అధికారులకు అడ్డాగా మారిపోయింది. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ స్థానికంగా ఉన్నా, వారి పర్యవేక్షణ లేకపోవడంతో మున్సిపల్ అధికారులు పేట్రేగి పోతున్నారు. కొందరు అధికారులు పైసా లేకపోతే పని జరగదనే స్థాయికి వెళ్లిపోయారు. టౌన్ప్లానింగ్ అధికారులు భీమవరంలో బిల్డింగ్ నిర్మాణ అనుమతులకు రూ.50 వేల నుంచి రూ.లక్ష వరకు వసూలు చేస్తున్నారు. నిర్మించిన భవనాలకు పన్ను వేయడానికి రెవెన్యూ అధికారులు రూ.15 వేల నుంచి రూ.40 వేల వరకు వసూలు చేస్తున్నారు. సివిల్ పనుల్లో కాంట్రాక్టర్ల నుంచి 2 నుంచి 5 శాతం కమిషన్ ఇంజినీరింగ్ అధికారులు వసూలు చేస్తుండగా.. నెలనెల హోటల్స్, దుకాణాల నుంచి శానిటేషన్ అధికారులు వసూలు చేస్తున్నారు. కుళాయి కనెక్షన్లకు రూ.10 వేలు నుంచి రూ.20 వేలు ఇవ్వాల్సిందే. బర్త్, డెత్ సర్టిఫికెట్లుకు వేలల్లో వసూలు చేస్తున్నారు. భీమవరం మున్సిపాలిటీలో ప్రతి దానిలో అవినీతి రాజ్యమేలుతుంది. ఇటీవల రివ్యూ సమావేశంలో ఎమ్మెల్యే అంజిబాబు టాన్ప్లానింగ్ అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేసి ఏసీబీకి పట్టిస్తానని చెప్పారు. మున్సిపాలిటిలో పనులుంటేనే ప్రజలు ఆందోళన చెందుతున్నారు. ఉన్నతాధికారికి పేమెంట్లు మున్సిపాలిటీలోని ఉన్నత అధికారికి అన్ని విభాగాల నుంచి నెల నెల పేమెంట్లను ఆయా విభాగాల అధికారులు అందిస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉన్నత అధికారి ఇంటికి భీమవరం నుంచి కాంట్రాక్టర్లతో మెటీరియల్ సరఫరా చేయించుకున్నారని ఆరోపణలు కూడా ఉన్నాయి. పేమెంట్లు అందించడం కోసం కొందరు అధికారులు రేటు పెట్టి వసూలు చేస్తున్నారని, అందులో కొంత అధికారికి, మరి కొంత వారికి అన్నట్లు వ్యాపారం సాగిస్తున్నారు. ఇప్పటికై నా జిల్లా ఉన్నతాధికారులు భీమవరం మున్సిపాలిటీపై దృష్టి సారించి అవినీతి అధికారులపై చర్యలు తీసుకోవాలి. ప్రతి సెక్షన్లోనూ వసూళ్ల దందా మున్సిపల్ ఉన్నతాధికారికి నెలనెలా పేమెంట్లు? -
డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు?
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పూర్తయిన విద్యార్థులు డిగ్రీ ప్రవేశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఇంటర్ పూర్తిచేసిన విద్యార్థుల్లో సగం మందికి పైగా ఇంజనీరింగ్ వైపు దృష్టి సారించగా.. మిగిలిన సగం మందికి డిగ్రీ విద్య ప్రత్యామ్నాయం. డిగ్రీలో సైతం పలు సాంకేతిక కోర్సులతో పాటు ఆర్ట్స్, సైన్స్ సబ్జెక్టులతో కోర్సులు అందుబాటులోకి వచ్చాయి. ఈ నేపథ్యంలో 50 శాతం మంది విద్యార్థులు డిగ్రీ కోర్సుల్లో చేరేందుకు ఆసక్తి చూపుతున్నారు. డిగ్రీ కోర్సులు పూర్తిచేసి సివిల్స్, సర్వీస్ కమిషన్, బ్యాంకింగ్, రైల్వేలో ఉద్యోగాలు సాధించే అవకాశం ఉండటంతో ఈ కోర్సులపై ప్రధానంగా దృష్టి సారిస్తున్నాయి. అయితే కూటమి ప్రభుత్వంలో 2025–26 విద్యా సంవత్సరంలో ఇప్పటివరకూ డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ విడుదల చేయలేదు. ఫలితాలు వచ్చి నాలుగు నెలలు ప్రభుత్వం ఇంటర్మీడియెట్ ఫలితాలను ఈ ఏడాది ఏప్రిల్ 12న విడుదల చేసింది. పరీక్షల్లో ఫెయిలైన విద్యార్థులకు అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు కూడా నిర్వహించి జూన్ 7న ఫలితాలు విడుదల చేసింది. ఇంజనీరింగ్ ప్రవేశాలకు కౌన్సెలింగ్ ముగిసి విద్యార్థులు తమకు సీటు వచ్చిన కళాశాలల్లో ఈనెల 4 నుంచి 8వ తేదీ వరకూ రిపోర్టు చేయనున్నారు. తమతో పాటు ఇంటర్మీడియెట్ రాసిన మిత్రుల్లో కొందరు ఇంజనీరింగ్ విద్యకు వెళ్లడం, వారు మరో మూడు, నాలుగు రోజుల్లో తరగతులకు హాజరయ్యే పరిస్థితి ఉంది. వారితో పాటే ఇంటర్ పూర్తి చేసుకుని డిగ్రీ కోర్సుల్లో చేరుదామని ఎదురుచూస్తున్న విద్యార్థులకు మాత్రం ఇప్పటివరకూ నోటిఫికేషనే ఇవ్వకపోవడం చూస్తుంటే ప్రభుత్వం డిగ్రీ విద్యను ఎంతటా నిర్లక్ష్యం చేస్తోందో అర్థమవుతుందని విద్యార్థులు ఆవేదన చెందుతున్నారు. డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూపులతోనే సరిపెట్టుకోవాల్సి వస్తోందని ఆందోళన చెందుతున్నారు. 91 కాలేజీలు.. 60 వేల సీట్లు ఏలూరు జిల్లాలో 40, పశ్చిమగోదావరి జిల్లాలో 51 డిగ్రీ కళాశాలు ఉన్నాయి. వివిధ గ్రూపుల్లో సుమా రు 60 వేల సీట్లు అందుబాటులో ఉన్నాయి. విద్యార్థుల జీవితాలతో ఆటలా.. డిగ్రీ ప్రవేశాలకు నోటిఫికేషన్ ఇవ్వని ప్రభుత్వం ఇంటర్ ఫలితాలు వచ్చి దాదాపు 4 నెలలు డిగ్రీ ప్రవేశాల కోసం విద్యార్థుల ఎదురుచూపులు ఏలూరు, పశ్చిమలో 91 కళాశాలలు విద్యార్థుల భవిష్యత్తో ఆటలు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన అనంతరం ప్రభుత్వ విద్యావ్యవస్థ నిర్వీర్యమవుతోంది. ఇప్పటికే పలు అసంబద్ధ నిర్ణయాలతో పాఠశాల విద్యను అటకెక్కించారు. ఇప్పుడు డిగ్రీ విద్యను కూడా నాశనం చేయాలని చూస్తున్నారు. ఇంటర్ ఫలితాలు వెల్లడై దాదాపు 100 రోజులు కావస్తోంది. 2025–26 విద్యా సంవత్సరం ప్రారంభమై రెండు నెలలు గడిచిపోతోంది. డిగ్రీ ప్రవేశాలు ఇంకెప్పుడు చేపడతారు. రెండు నెలల పాటు విద్యకు దూరంగా విద్యార్థులు ఉన్నారు. వారి భవిష్యత్తో ఆటలాడటం ప్రభుత్వానికి తగదు. – కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు ఎదురుచూపులు డిగ్రీలో ఏఏ కోర్సులతో ఉపాధి అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. ఏ కోర్సులు తేలికగా పూర్తి చేసి, పూర్తి చేసిన వెంటనే ఉద్యోగాలు వచ్చే కోర్సులు ఏమిటి అనే విషయాలపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఇప్పటికే తమకు తెలిసిన విద్యాధికులను సంప్రదించి ఒక నిర్ణయానికి వచ్చి డిగ్రీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఎదురు చూస్తున్నారు. సాధారణంగా ఇంటర్మీడియెట్ ఫలితాలు వెలువడిన నెలలోపే డిగ్రీ ప్రవేశాల ప్రక్రియ ప్రారంభించి విద్యా సంవత్సరం ఆరంభం నాటికి విద్యార్థులంతా కళాశాలలకు వెళ్లే ఏర్పాటు చేయాల్సి ఉంది. అయితే కూటమి ప్రభుత్వం ఇప్పటివరకూ ఆ దిశగా ఏ చర్యా తీసుకోకపోవడంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రుల్లో ఆందోళన పెరిగిపోతోంది. డిగ్రీ కళాశాలలు ఏలూరు జిల్లా పశ్చిమగోదావరి ప్రభుత్వ 7 4 ప్రభుత్వ అటానమస్ – 2 ప్రభుత్వ ఎయిడెడ్ అటానమస్ 1 4 ప్రైవేట్ అటానమస్ 1 1 ప్రైవేట్ ఎయిడెడ్ – 1 ప్రైవేట్ అన్ ఎయిడెడ్ 31 39 మొత్తం 40 51 -
అత్యవసర వైద్యం.. అందని దైనం
ఏలూరు టౌన్ : ఏలూరు సర్వజన ఆస్పత్రిలో (జీజీహెచ్)లో అత్యవసర వైద్యం అందనంత దూరంలో ఉంది. ముఖ్యంగా గర్భిణులు ప్రసూతి కోసం వస్తే గైనిక్ విభాగంలో వారి పరిస్థితి దయనీయంగా మా రింది. అలాగే ఆస్పత్రిలో గర్భిణులు, కడుపు నొప్పి తో బాధపడుతూ వచ్చే మహిళలకు ఆల్ట్రా సౌండ్ స్కానింగ్ చేసేందుకు రెగ్యులర్ టెక్నీషియన్లు లేరు. పీజీ వైద్య విద్యార్థినులు కొందరు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకు స్కానింగ్ చేస్తున్నారు. అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేట్ కేంద్రాల్లో స్కానింగ్ తీయించుకోవాల్సి వస్తుందని రోగుల బంధువులు అంటున్నారు. ‘గుండె’కు రక్షణ లేదు జీజీహెచ్కు గుండెపోటుతో ఎవరైనా వెళితే ప్రాణాలకు గ్యారెంటీ లేదు. కూటమి ప్రభుత్వ అధికారంలోకి వచ్చిన తర్వాత వైద్యులను బదిలీలు చేయటంతో గుండె వ్యాధి నిపుణులు లేకుండా పోయా రు. గుండె జబ్బుల నిర్ధారణ పరీక్షలను సైతం ప్రైవేట్ ఏజెన్సీకి కట్టబెట్టారు. ఈ ఏజెన్సీకి చెందిన టెక్నీషియన్లు వారానికి మూడు రోజులు ఏలూరు జీజీహెచ్లో 2డీ ఏకో స్కాన్ పరీక్షలు చేయాల్సి ఉండగా సోమవారం మాత్రమే పరీక్షలు చేస్తున్నారు. దీంతో మిగిలిన రోజుల్లో రోగుల పరిస్థితి దైన్యంగా మారింది. ప్రైవేట్ ఏజెన్సీలో టెక్నీషియన్లు, వైద్యు లు రోగులకు పరీక్షలు చేస్తూ విజయవాడలోని కార్పొరేట్ ఆస్పత్రులకు తరలిస్తున్నారని, ఇలా రిఫర్ చేయటం ద్వారా ఏజెన్సీ సిబ్బందికి గుండె ఆపరేషన్లు, ఇతర చికిత్సల్లో వాటాలు వస్తున్నాయ నే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రాత్రి 8 గంటల నుంచి ఉదయం 8 గంటల వరకు అత్యవసర మందులు అందుబాటులో ఉండటం లేదు. ‘ట్రామా కేర్’లెస్ అత్యవసర సేవల్లో భాగంగా న్యూరో విభాగంలో ఒక వైద్యుడు మాత్రమే పనిచేస్తుండటంతో రోడ్డు ప్రమాదాలు, ఇతర అత్యవసర వైద్య చికిత్సలు పూర్తిస్థాయిలో అందడం లేదు. అలాగే ట్రామా కేర్ వైద్య నిపుణులు లేరు. ఆస్పత్రి అభివృద్ధి కమిటీ ఉందా! జీజీహెచ్ అభివృద్ధి కమిటీ ఉందా అనే అనుమానాలు తలెత్తుతున్నాయి. ఏలూరు జిల్లా కేంద్రంలో కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ, ఏలూరు ఎంపీ, దెందులూరు, ఏలూరు టీడీపీ ఎమ్మెల్యేలు ఉన్నా ఉపయోగం లేదని ప్రజలు అభిప్రాయపడుతున్నారు. తూతూమంత్రంగా అభివృద్ధి కమిటీ సమావేశంలో ఆదేశాలు జారీ చేసినా జీజీహెచ్ అధికారులు, సిబ్బంది వాటిని పట్టించుకోవటం లేదనే సందేహాలు వ్యక్తమవుతున్నారు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏలూరు జిల్లా ఆస్పత్రి, బోధనాస్పత్రిగా అభివృద్ధి చేస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని నిర్వీర్యం చేసిందనే విమర్శలు వస్తున్నాయి. దెందులూరు నియోజకవర్గానికి చెందిన ఓ మహిళ ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్లో ప్రసూతికి వచ్చింది. ఆమెకు వైద్యులు శస్త్రచికిత్స చేశారు. అయితే కుట్లు సరిగా వేయకపోవటంతో ఆమె ఇంటికి వెళ్లిన తర్వాత ఇన్ఫెక్షన్తో తీవ్ర అస్వస్థతకు గురైంది. ఇదేంటని ఆస్పత్రి వైద్యులను ప్రశ్నించినా పట్టించుకునే నాథుడే లేడు. ఇదే తరహాలో ప్రసూతి కోసం వచ్చే గర్భిణులు వైద్యులు, సిబ్బంది నిర్లక్ష్యంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఏలూరుకి చెందిన ఓ వ్యక్తి గుండె సంబంధిత వ్యాధితో బాధపడుతూ జీజీహెచ్కు వచ్చారు. రాత్రి వేళ కావడంతో ఎమర్జెన్సీ విభాగానికి తీసుకువెళ్లగా అక్కడ వైద్యులు విజయవాడ రిఫర్ చేశారు. పరిస్థితి విషమంగా ఉండటంతో చేసేది లేక ఏలూరులోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకువెళ్లాల్సిన పరిస్థితి వచ్చింది. ఇలా పేద, మద్యతరగతి వర్గాలకు ఏదైనా అత్యవసర పరిస్థితి వస్తే ప్రాణాలు గాల్లో దీపమే అని బాధితులు వాపోతున్నారు. ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలు నిల్ ఒక్కరోజు మాత్రమే ఏకో పరీక్షలు వైద్య నిపుణుల కొరత -
బందా మృతి తీరని లోటు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరానికి చెందిన ప్రముఖ సాహితీవేత్త వీ.బందా మృతి సాహితీ లోకానికి తీరని లోటని పలువురు వక్తలు అన్నారు. బందా సంతాప సభను సాహిత్య మండలి, గరికిపాటి ఆర్ట్స్, హేలాపూరి కళా పరిషత్, జిల్లా రచయితల సంఘం తదితర సాహిత్య కళా సంస్థల ఆధ్వర్యంలో నిర్వహించారు. సభకు అధ్యక్షత వహించిన తెలుగు రచయితల సంఘం అధ్యక్షుడు లంకా వెంకటేశ్వర్లు మాట్లాడుతూ గొప్ప స్నేహ శీలి, మంచి సాహితీవేత్త బందా అన్నారు. గరికిపాటి కాళిదాసు మాట్లాడుతూ ప్రవచనకారుడు గరికపాటి నరసింహరావు ద్విశత అవధానం కార్యక్రమం బందా నేతృత్వంలో నిర్వహించామని గుర్తుచేసుకున్నారు. లేళ్ళ వెంకటేశ్వరావు, మహమ్మద్ ఖాజావలీ, నాగాస్త్ర పుల్లాభొట్ల పురుషోత్తం, పీ సత్యవాణి, పీ ఆంజనేయులు, సూర్య ప్రకాష్ తదితరులు పాల్గొన్నారు. -
పాపికొండల్లో అడవి దున్నలు
బుట్టాయగూడెం: అరుదైన జంతు జాలానికి నిలయమైన పాపికొండల అభయారణ్యంలో అడవి దున్నల ఉనికిని గుర్తించారు. సింహాలు, పులులు, ఏనుగులను సైతం తరిమి కొట్టే సత్తా ఉన్న జంతువులు ఈ అడవిదున్నలు. అభయారణ్య పరిధిలోని గోదావరి పరీవాహక ప్రాంతంలో ఇవి ఎక్కువగా సంచరిస్తుంటాయి. సుమారు 10 నుంచి 20 వరకూ గుంపులుగా ఈ అడవి దున్నలు మేత కోసం తిరుగుతూ ఉంటాయి. వైల్డ్ లైఫ్ అధికారులు ఏర్పాటు చేసిన ట్రాప్ కెమెరాలకు ఈ అడవి దున్నలు చిక్కాయి. మొత్తం 420 పైగా అడవి దున్నలు పాపికొండల అభయారణ్యంలో సంచరిస్తున్నట్లు అధికారులు చెబుతున్నారు. అడవుల్లోని గడ్డితోపాటు లేత వెదురు చిగుళ్లను ఇవి ఆహారంగా తీసుకుంటాయి. రాత్రి, పగలు కూడా దురుసుగా తల ఎగరేస్తూ సంచరిస్తాయి. మనుషులు కనిపిస్తే దాడి చేస్తాయి. అడవి దున్నల దాడుల్లో అనేక మంది మృతి చెందిన సంఘటనలు కూడా ఉన్నాయి. అడవి దున్నలు భారత ఉపఖండంలోని భారత్, బంగ్లాదేశ్, నేపాల్లోని అటవీ ప్రాంతాల్లో ఎక్కువగా ఉన్నట్లు వైల్డ్ లైఫ్ అధికారులు చెబుతున్నారు. మన దేశంలో పశ్చిమ కనుమలు, దండకారణ్యాల్లో వీటి ఉనికి ఉంది. తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం అటవీ ప్రాంతం, పాపికొండల అభయారణ్యంలోనూ అడవి దున్నల సంచారం అత్యధికంగా ఉంది. నల్లమల్ల అటవీ ప్రాంతంలో అడవి దున్నల సంచారం క్రమేపీ అంతరించిపోవడం వల్ల అక్కడ వీటి సంచారంలేదని అధికారులు అంటున్నారు. వన్యప్రాణుల కోసం గడ్డి పెంపకం పాపికొండల అభయారణ్యం పరిధిలో సుమారు 15 హెక్టారుల్లో వన్యప్రాణుల కోసం వైల్డ్ లైఫ్ అధికారులు గడ్డి పంటను పండిస్తున్నారు. ఈ పంట ముఖ్యంగా అడవి దున్నలు, కుందేళ్లు వంటి శాఖాహార జంతువులు తినేలా ఏర్పాటు చేస్తున్నామని అధికారులు అంటున్నారు. పులిని సైతం మట్టికరిపించే దున్న ఆరున్నర అడుగుల ఎత్తు.. 12 అడుగుల పొడవు, 800 నుంచి 1500 కేజీల భారీ బరువుతో అడవి దున్నలు ఉంటాయి. పెద్ద పులులను సైతం మట్టి కరిపించే వణ్యప్రాణి అడవిదున్న. దీని జీవిత కాలం 15 నుంచి 20 సంవత్సరాల వరకూ ఉంటుంది. రాత్రి, పగలు తేడా లేకుండా దురుసుగా తిరిగే జంతువు మనుషులు కనిపిస్తే దాడిచేసే ప్రమాదం -
నీరందక ఆక్వా రైతు విలవిల
భీమడోలు: ఆగడాలలంక చానల్ పరిధిలోని ఆక్వా చెరువులకు నీరందక రైతులు ఆందోళన చెందుతున్నారు. 7 వేల ఎకరాల ఆక్వా ఆయుకట్టులోని చేపల సాగు ప్రశ్నార్థకంగా మారింది. సకాలంలో నీరందించకపోవడంతో చేపలు, చేపల పిల్లలు మృత్యువాత పడి తీవ్రంగా నష్టపోతున్నామని రైతులు లబోదిబోమంటున్నారు. మురుగునీటిని చెరువుల్లో నింపుకోవాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గోదావరి కాలువలో నీటి లెవెల్స్ ఎక్కువగా ఉన్నందున రెండు అడుగుల మేర నీటిని విడుదల చేయాలని మొరపెట్టుకుంటున్నా అధికారులు పట్టించుకోవడం లేదు. చానల్ పరిధిలో భోగాపురం, వడ్డిగూడెం, లక్ష్మీపురం, సీతారామనగరం, ఆగడాలలంక, చెట్టున్నపాడు, మల్లవరంతో పాటు ఏలూరు రూరల్ మండలానికి చెందిన పలు గ్రామాలకు మంచినీరు, సాగునీరు అందిస్తారు. చానల్లో పేరుకుపోయిన తూడు, గుర్రపు డెక్కతో నీరు కిందకు పారడం లేదు. ఈ సమయంలో అడుగు లోపు నీరందించడం వల్ల శివారుకు నీరు చేరడం లేదు. మోటార్లు పెట్టి నీటిని తోడుకుంటున్నారు. నెలకు 10 రోజుల మాత్రమే నీటిని విడుదల చేస్తున్నారు. ఈ ఏడాది వర్షాలు సరిగా లేక రైతులు కాల్వ నీటిపై ఆధారపడి సాగు చేస్తున్నారు. నీరు లేకపోవడంతో చేప పిల్లలు బతికే అవకాశాలు తగ్గిపోతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రూ.33 లక్షల నీటి తీరువా వసూలు చేశారు అర అడుగు నీటి వల్ల వరి రైతులు, ఆక్వా రైతులకు ప్రయోజనం లేదని చెట్టున్నపాడు నీటి వినియోగదారుల సంఘం అధ్యక్షుడు ఆర్. రామకృష్ణం రాజు విమర్శించారు. గ్రామాల్లోని మంచినీటి చెరువులకు నీటిని తోడుకోవాల్సి ఉందని, ఇరిగేషన్ అధికారులు నీటిని పూర్తి స్థాయిలో అందించడం లేదన్నారు. సార్వా నాట్లు పూర్తయినా నీటి వినియోగం తగ్గినా ఆక్వా చెరువులకు నీరివ్వడం లేదని, నీటి తీరువా కింద రూ.33 లక్షలు రైతులు ప్రభుత్వానికి చెల్లించారని చెప్పారు. శివారుకు చేరని ఆగడాలలంక చానల్ నీరు నీటిని విడుదల చేస్తున్నాం గోదావరి కాల్వలో నీటి లభ్యత ఆధారంగా నీరిందిస్తున్నాం. వరి సాగు, మంచినీటి అవసరాలు తీర్చిన తర్వాతనే ఆక్వాకు నీరందిస్తాం. మంచినీటి చెరువులన్నీ నింపాం. వరి పొలాలకు నీరందించాం. వాతావరణ ప్రతికూల పరిస్థితుల నేపథ్యంలో మెరక తూములకు నీరందక రైతులు, ఆక్వా రైతులు ఇబ్బందులు పడుతున్న మాట వాస్తవమే. అయినప్పటికీ నీటిని సరఫరా చేస్తున్నాం. గుండుగొలను వద్ద నీటి మట్టం 4.6 అడుగుల వరకూ ఉంది. ఆగడాలలంక చానల్కు రెండు అడుగుల నీటిని విడుదల చేస్తే... గోదావరి కాల్వ ఆయకట్టుపై ప్రభావం పడుతుంది. సుబ్రహ్మణ్యం, ఏఈ, ఇరిగేషన్ సెక్షన్, గుండుగొలను -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి స్వామిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ల శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. రాట్నాలమ్మకు భక్తిశ్రద్ధలతో పూజలు పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన రాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో జిల్లా నలుమూలల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు దేవస్థానానికి చేరుకుని ప్రత్యేక పూజలు నిర్వహించి, వారి మొక్కుబడులు తీర్చుకున్నారు. ఇందులో భాగంగా చిన్నారులకు అక్షరాభ్యాసాలు, నామకరణలు, ఇతర మొక్కుబడులు చెల్లించారు. ఈ వారం అమ్మవారికి మొత్తం రూ 79,053 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి ఎన్.సతీష్కుమార్ తెలిపారు. గుర్తుతెలియని మృతదేహం లభ్యం పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని లాకు సెంటర్ వద్ద నిడదవోలు–నరసాపురం కాలువలో గుర్తు తెలియని పురుషుడి మృతదేహం కొట్టుకువచ్చింది. పై నుంచి కొట్టుకొచ్చినట్లుగా స్థానికులు చెబుతున్నారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. -
మద్యం షాపులో ఘర్షణ
ఇద్దరికి గాయాలు తణుకు అర్బన్: మద్యం దుకాణంలో ముగ్గురు వ్యక్తుల మధ్య జరిగిన వాగ్వివాదంలో ఇద్దరు వ్యక్తులు గాయపడ్డారు. తణుకులో జాతీయ రహ దారిలోని పాత బెల్లం మార్కెట్ ప్రాంతంలో రష్మిక మద్యం షాపు వద్ద ఆదివారం జరిగిన సంఘటనలో బీరు సీసాతో దాడికి తెగబడ్డారు. తణుకు పాతవూరుకి చెందిన సనమండ్ర రాజేష్, ముప్పిడి సత్యనారాయణ, చదలవాడ కిరణ్ మద్యం తాగుతుండగా పాత కక్షల నేపథ్యంలో ఘర్షణ రేగింది. దీంతో రాజేష్ బీరు సీసా పగులకొట్టి సత్యనారాయణ, కిరణ్లపై దాడి చేశాడు. తీవ్ర గాయాలైన ఇద్దరిని తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కూటమి నేతల వైఫల్యం
ఏలూరు జీజీహెచ్లో వైద్య సేవలు సరిగా అందటం లేద ని బాధితులు వాపోతున్నా రు. గత ప్రభుత్వంలో ఏలూరుకు ప్రభుత్వ మెడికల్ కాలేజీ, దానికి అనుసంధానంగా ఏలూరు జీజీహెచ్ను అభివృద్ధి చేస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఘోరంగా విఫలమైంది. కనీసం వైద్య నిపుణులను నియమించలేని దుస్థితి నెలకొంది. ప్రజలకు కనీస వైద్య సేవలు అందకపోయినా పట్టించుకునే నాథుడే లేడు. ప్రైవేటు ఏజెన్సీలకు గుండె వ్యాధుల నిర్ధారణ బాధ్యతలు అప్పగిస్తే ఎలా. –గుడిదేశి శ్రీనివాసరావు, వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షుడు మెరుగైన సేవలు అందించాలి జీజీహెచ్లో గర్భిణులు, బా లింతలకు సరైన వైద్య సేవ లు అందటం లేదని బాధితు లు గగ్గోలు పెడుతున్నారు. ఆపరేషన్లు సక్రమంగా చేయ కపోవటం, కుట్లు సరిగ్గా వే యకపోవటంతో బాలింతలు తీవ్ర అనారోగ్యం బారినపడుతున్నారు. ఆల్ట్రాసౌండ్ స్కానింగ్ చేయటానికి టెక్నీషియన్లను సైతం నియమించలేని దుస్థితి. జిల్లా ఉన్నతాధికారులు జీజీహెచ్పై ప్రత్యేక దృష్టి సారించాలి. మెరుగైన సేవలు అందించకుంటే ప్రజల తరఫున పోరాటం చేయాల్సి వస్తుంది. –తుమరాడ స్రవంతి, వైఎస్సార్సీపీ మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి -
అథ్లెటిక్స్ పోటీలకు ఎంపిక
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లాకు సంబంధించి అథ్లెటిక్స్ జిల్లా జట్ల ఎంపికకు అనూహ్యా స్పందన వచ్చినట్లు జిల్లా అథ్లెటిక్స్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్ తెలిపారు. స్థానిక ఏఎస్ఆర్ స్టేడియంలో ఆదివారం నిర్వహించిన అండర్–14, 16, 18, 20 విభాగాల్లో పెద్ద సంఖ్యలో బాలబాలికలు పాల్గొని తమ ప్రతిభ చూపారన్నారు. పోటీలకు జిల్లా అథ్లెటిక్స్ సంఘం అధ్యక్షుడు గుళ్ళా ప్రసాదరావు, జల్లా వీరభద్రరావు, మరడాని అచ్యుతరావు, కోశాధికారి అన్యం శ్రీనివాసరావు ముఖ్య అతిథులుగా హాజరై ప్రారంభించినట్లు తెలిపారు. పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల సందడి కై కలూరు: పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ నానాటికి పెరుగుతోంది. ఆదివారం ఉదయం పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారికి నైవేద్యాలను సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ రూ.70,414 ఆదాయం వచ్చిందని తెలిపారు. ముగ్గురిపై కేసు నమోదు జంగారెడ్డిగూడెం: భార్యా భర్తల గొడవల నేపథ్యంలో ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు హెచ్సీ టి.బాబూరావు తెలిపారు. ఈ నెల 1న పింగుల హరీష్కు, అతని భార్య మధ్య అక్కంపేటలోని వారి ఇంటి వద్ద చిన్న గొడవ జరిగింది. ఈ క్రమంలో అక్కడికి వచ్చిన ముగ్గురు వ్యక్తుల్లో ఇద్దరు హరీష్పై దాడి చేసి కొట్టారు. మరో వ్యక్తి హరీష్ భార్యను దూషించారు. దీంతో హరీష్ భార్య చీమల మందు తినడంతో ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చేర్పించారు. ఆదివారం హరీష్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు హెచ్సీ టి.బాబూరావు తెలిపారు. -
5న స్మార్ట్ మీటర్లను వ్యతిరేకిస్తూ ధర్నాలు
దెందులూరు: ప్రజలపై భారాలు మోపేలా కూటమి ప్రభుత్వం విద్యుత్ స్మార్ట్ మీటర్లను బిగిస్తోందని, దీనిని వ్యతిరేకిస్తూ మండల కేంద్రాలు, విద్యుత్ కార్యాలయాల వద్ద ఈనెల 5న ప్రజావేదిక ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహించనున్నట్టు ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ తెలిపారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ నాడు స్మార్ట్ మీటర్లను పగులకొట్టాలని పి లుపునిచ్చిన కూటమి నాయకులు.. నేడు మీటర్లను బిగించాలని ఆదేశాలు ఇవ్వడం ఏంటని ప్రశ్నించారు. స్మార్ట్ మీటర్ల ఒప్పందాలను రద్దు చేయకుండా వాటిని కొనసాగించడం రాష్ట్ర ప్రజలకు ద్రోహం చేయడమే అన్నారు. అలాగే కూటమి ప్రభుత్వం ఏడాది కాలంలో రూ.15,485 కోట్ల సర్దుబాటు చా ర్జీల భారాన్ని ప్రజలపై మోపిందని విమర్శించారు. స్మార్ట్మీటర్ల ఏర్పాటుతో దుకాణాలు, చిన్న పరిశ్రమలకు 10 రెట్ల విద్యుత్ చార్జీలు పెరిగాయన్నారు. అలాగే మీటర్ ఖర్చులను (రూ.10 వేల నుంచి రూ.17 వేలు) దశల వారీగా వినియోగదారులపై మోపడం దారుణమన్నారు. స్మార్ట్ మీటర్లు, సోలార్ విద్యుత్ ఒప్పందాలను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. పాత మీటర్లనే కొనసాగిస్తూ, పాత రీడింగ్ పద్ధతినే అమలు చేయాలని శ్రీనివాస్ కోరారు. -
అదుపుతప్పిన ఆర్టీసీ బస్సు
ద్వారకాతిరుమల: స్థానిక వెలుగు కార్యాలయ సమీపంలో ఆదివారం ఆర్టీసీ బస్సు టైర్ పంక్చర్ కావడంతో అదుపుతప్పింది. డ్రైవర్ అప్రమత్తమై చాకచక్యంగా బస్సును నిలుపుదల చేయడంతో పెను ప్రమాదం తప్పింది. స్థానికుల వివరాల ప్రకారం.. ఏలూరు నుంచి ద్వా రకాతిరుమల మీదుగా జంగారెడ్డిగూడేనికి 40 మంది ప్రయాణికులతో వెళుతున్న ఆర్టీసీ బస్సుకు ఘటనా స్థలం వద్ద ఎత్తు ఎక్కేటప్పుడు ఒక్కసారిగా టైర్ పంక్చర్ అయ్యింది. దీంతో రోడ్డు వెనుక పల్లంగా ఉండటంతో బస్సు అదుపు తప్పింది. వెంటనే అప్రమత్తమైన డ్రైవర్ బస్సును గేర్లో నిలుపుదల చేశారు. దీంతో ప్రయాణికులు ఊపిరిపీల్చుకున్నారు. అనంతరం వారిని వేరే బస్సులో ఎక్కించి పంపించారు. వైఎస్సార్సీపీ నేతపై టీడీపీ శ్రేణుల దాడి నూజివీడు: వైఎస్సార్సీపీ కార్యక్రమాల్లో చురు గ్గా పాల్గొంటున్నాడనే కక్షతో నూజివీడు మండలం జంగంగూడెంలో వైఎస్సార్సీపీ నేత తొమ్మండ్రు రాజేశ్వరరావుపై అదే గ్రామానికి చెందిన టీడీపీ కార్యకర్తలు ఇద్దరు శనివారం రాత్రి దాడికి పాల్పడ్డారు. రాజేశ్వరరావు రెండు నెలలుగా వైఎస్సార్సీపీ కార్యక్రమాల నిర్వహణలో కీలకపాత్ర పోషిస్తూ విజయవంతంగా సాగుతున్నారు. ఈ నేపథ్యంలో ఓర్వ లేని టీడీపీ కార్యకర్తలు కొలికపాం వెంకటేశ్వరరావు, తొమ్మండ్రు సింహాద్రి మాట్లాడాలని చెప్పి గ్రామంలోని చెరువు కట్ట వద్దకు రాజేశ్వరరావును తీసుకువెళ్లి రాయితో దాడి చేసి కొట్టారు. రాజేశ్వరరావు వారి నుంచి తప్పించుకుని తుక్కులూరు చేరుకుని 108 వాహనం ద్వారా నూజివీడు ఏరియా ఆస్పత్రిలో చేరా రు. బాధితుడి నుంచి పోలీసులు స్టేట్మెంట్ రికార్డ్ చేశారు. ప్రశాంతంగా నీట్ పీజీ పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): వైద్య విద్యలో ఎండీ, ఎంఎస్ కోర్సుల్లో ప్రవేశల నిమిత్తం ఆదివారం నీట్ పీజీ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. నగరంలోని సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల, సి ద్ధార్థ క్వెస్ట్ విద్యాసంస్థల్లో 373 మంది విద్యార్థులకు 343 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 200 మందికి 181 మంది, సిద్ధార్థ క్వెస్ట్లో 173 మందికి 162 మంది హాజరయ్యారు. భీమవరంలోని ఒక కేంద్రంలో..భీమవరం: భీమవరంలో ఆదివారం నీట్ పీజీ ప్రవేశ పరీక్ష ప్రశాంతంగా జరిగింది. డీఎన్నార్ అటానమస్ కళాశాలలో ఉదయం 169 మంది విద్యార్థులకు 160 మంది హాజరయ్యారని, మాల్ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని కళాశాల పరీక్షల నిర్వాహకుడు తెలిపారు. విద్యార్థుల హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వం ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం వి ద్యార్థుల హక్కులను కాలరాస్తోందని ఎస్ఎఫ్ఐ ఏలూరు నగర కార్యదర్శి బి.మనోజ్ విమర్శించారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సీఐటీయూ జిల్లా కార్యాలయంలో ఆదివారం జరిగిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ 30/67 జీఓను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. ఈ జీఓ ద్వారా కార్పొరేట్ విద్యాసంస్థలకు విచ్చలవిడిగా దోచుకోవడానికి మంత్రి లోకేష్ అవకాశమిచ్చారన్నారు. చైతన్య, నారాయణ విద్యాసంస్థల్లో ఇప్పటికే పలువురు వి ద్యార్థులు ఒత్తిళ్లతో ఆత్మహత్యలు చేసుకుంటున్నారన్నారు. ఈ జీఓ వెనక్కి తీసుకోకుంటే రా ష్ట్రవ్యాప్తంగా ఉద్యమం చేపడతామని మనోజ్ హెచ్చరించారు. ఎస్ఎఫ్ఐ నగర అధ్యక్షుడు ఎస్.శివాజీ మాట్లాడుతూ ఏలూరులోని ప్రభు త్వ హాస్టళ్లలో పలు సమస్యలు ఉన్నాయని, ఎస్సీ బాలుర హాస్టల్లో విద్యార్థులు మత్తుపదార్థాలకు అలవాటు పడ్డారన్నారు. అమీనాపేటలోని బాలికల హాస్టల్కు రక్షణ కరువైందన్నారు. అనంతరం ఎస్ఎఫ్ఐ నగర నూతన కమిటీ ఎన్నికై ంది. బీసీ హాస్టళ్ల తనిఖీ ఏలూరు (టూటౌన్): ఏలూరులోని బీసీ సంక్షేమ హాస్టళ్లను ఆదివారం రాష్ట్ర బీసీ సంక్షేమ శాఖ సంచాలకుడు డి.చంద్రశేఖరరాజు తనిఖీ చేశారు. ఏలూరులోని వెనుకబడిన తరగతుల సంక్షేమ వసతి గృహాలు, బీసీ బాలికల వసతి గృహం నం.1, 2, కళాశాల వసతి గృహం నం. 1,2లను పరిశీలించారు. విద్యార్థుల భోజనాలు, రికార్డులు తనిఖీ చేశారు. అనంతరం క్లీన్–గ్రీన్ కార్యక్రమంలో పాల్గొన్నారు. ఆయన వెంట జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ అధికారి ఆర్వీ నాగరాణి, సహాయ బీసీ సంక్షేమ అధికారి టి.వెంకటేశ్వర్లు, వసతి గృహ సంక్షేమ అధికారులు ఉన్నారు. -
22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఆఖరి శ్రావణ శుక్రవారాన్ని పురస్కరించుకుని ఈనెల 22న సామూహిక వరలక్ష్మీ వ్రతాలు నిర్వహించనున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణ మూర్తి ఆదివారం ఒక ప్రకటనలో తెలిపారు. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో ఉదయం 9.30 గంటల నుంచి జరిగే ఈ వేడుకలో పాల్గొనాలని ఆయన కోరారు. చిన్న తిరుపతిలో కిటకిటలాడిన భక్తులు ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. ఆదివారం సెలవుదినం కావడంతో పాటు, శ్రావణమాస పర్వదినాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు సుదూర ప్రాంతాల నుంచి ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో ఆలయ పరిసరాలు సందడిగా మారాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో సాయంత్రం వరకు భక్తుల రద్దీ కొనసాగింది. గుబ్బల మంగమ్మతల్లి గుడికి పోటెత్తిన భక్తులు బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన కాపవరం సమీపంలోని అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. తెల్లవారుజాము నుంచే ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు విజయవాడ, మచిలీపట్నం, తెలంగాణ రాష్ట్రంలోని భద్రాచలం, పాల్వంచ, కొత్తగూడెం, సత్తుపల్లి, అశ్వారావుపేట ప్రాంతాల నుంచి కూడా పెద్ద ఎత్తున భక్తులు వాహనాలతో తరలివచ్చి అమ్మవారికి దూపదీప నైవేద్యాలతో ప్రత్యేక పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. భక్తులు అధికంగా మంగమ్మతల్లి దర్శనానికి రావడంతో పోలీసులు ప్రత్యేక చర్యలు చేట్టారు. -
శ్రీవారి సేవలో..
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం స్టేట్ ఆడిట్ డిపార్ట్మెంట్ జోన్–2 రీజనల్ డిప్యూటీ డైరెక్టర్ బీఆర్ క్రాంతి కుమారి సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆమెకు ముందుగా దేవస్థానం అధికారులు మర్యాద పూర్వకంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా ఆమె స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు వేద ఆశీర్వచనం అందజేసి సత్కరించారు. సెప్టెంబరు 13న జాతీయ లోక్ అదాలత్ ఏలూరు (టూటౌన్): సెప్టెంబర్ 13వ తేదీన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ను సద్వినియోగం చేసుకుని కేసులు పరిష్కరించుకోవాలని జిల్లా న్యాయసేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్నప్రసాద్ కోరారు. స్థానిక జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవాసధన్ భవన్ నందు శనివారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. ఈ జాతీయ లోక్ అదాలత్ నందు రాజీయోగ్యమైన అన్ని క్రిమినల్ కేసులతో పాటు సివిల్, వాహనం ప్రమాద బీమా, బ్యాంకు లావాదేవీలు, కుటుంబ వివాదాలు, టెలిఫోన్ బకాయిలు, చిట్ ఫండ్ కేసులు, అమలు పిటీషన్లు (ఇ.పి) రాజీ చేయడం జరుగుతుందన్నారు. కేసుల పరిష్కారంలోగానీ, మరి ఏ ఇతర సమస్యలు ఎదురైన 15100 లేదా 08812 224555ను సంప్రదించాలన్నారు. -
కొనసాగుతున్న విచారణ
ఉండి: జూనియర్ లైన్మేన్పై వచ్చిన ఆరోపణలపై శనివారం మూడోరోజు కూడా విచారణ కొనసాగింది. ఉండి మండలం చెరుకువాడ, అర్తమూరు గ్రామాలకు జూనియర్ లైన్మేన్గా విధులు నిర్వర్తిస్తున్న దాసరి రాజుపై వచ్చిన ఆరోపణలపై గత మూడు రోజులుగా అధికారులు విచారణ చేస్తున్నారు. శనివారం రెండు గ్రామాల్లోను విద్యుత్ అధికారులు పర్యటించారు. ఆయా గ్రామాల్లో ఆక్వా రైతులు, ప్రజల నుంచి సేకరించిన వివరాలను ఉన్నతాధికారులకు అందజేయనున్నట్లు ఉండి ఎలక్ట్రికల్ ఏఈ పులగం శ్రీనివాసరావు తెలిపారు. దర్యాప్తును పూర్తిస్థాయిలో సోమవారం ముగిస్తామన్నారు. పారిజాతగిరిలో ప్రత్యేక పూజలు జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానంలో శనివారం విశేష పూజలు నిర్వహించారు. ఉదయం నుంచి భక్తులు గోవింద నామస్మరణతో పారిజాత గిరి ప్రదక్షిణ చేశారు. వారికి ప్రత్యేక దర్శనం, ప్రసాదం, అన్న ప్రసాదం ఏర్పాట్లు చేసినట్లు ఆలయ కార్య నిర్వహణ అధికారి కలగర శ్రీనివాస్ తెలిపారు. అన్నదాతలు జంగారెడ్డిగూడెం వాస్తవ్యులు సత్య గణేష్ చౌదరి, మంజుషలకు స్వామివారి వస్త్రాలు, ప్రసాదాలు, వేద పండితుల ఆశీస్సులతో సత్కరించారు. శనివారం ఆలయానికి వివిధ రూపాల్లో రూ.1,01,076 ఆదాయం లభించినట్లు ఈవో శ్రీనివాస్ తెలిపారు. అభివృద్ధి కమిటీ సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. -
అమ్మపాలు బిడ్డకు అమృతం
కై కలూరు: వ్యాధులకు కారణం పోతపాలు.. బిడ్డ సరైన ఎదుగుదలకు కావాలి తల్లిపాలు అంటూ ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు శుక్రవారం నుంచి జిల్లాలో ప్రారంభమయ్యాయి. మహిళాభివృద్ధి, శిశు సంక్షేమశాఖ సమగ్ర శిశు అభివృద్ధి సేవా పథకం(ఐసీడీఎస్) పర్యవేక్షణలో ఏలూరు జిల్లాలో 2,226 అంగన్వాడీ కేంద్రాల్లో 7వ తేదీ వరకు అవగాహన కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గర్భిణులు, శిశుతల్లులు, యువతులకు క్విజ్ పోటీలు, బొమ్మలు, పోస్టర్లు, బ్యానర్లతో ప్రదర్శనలు ఏర్పాటు చేస్తున్నారు. పుట్టిన గంటలోపే ముర్రిపాలు పట్టించడంపై నెలకొన్న తల్లుల అపోహలను తొలగించే దిశగా ఈ కార్యక్రమాలు చేపడుతున్నారు. తల్లి పాలకు ప్రాధాన్యత ఇవ్వండి ఈ ఏడాది ప్రపంచ వ్యాప్తంగా శ్రీతల్లిపాలకు ప్రాధాన్యత నివ్వండి, స్థిరమైన మద్దతు వ్యవస్థలను సృష్టించండిశ్రీ అనే నినాదంతో తల్లిపాల వారోత్సవాలను నిర్వహిస్తున్నారు. ప్రసుత్తం 120 దేశాల్లో తల్లి పాల వారోత్సవాలు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో 6 నెలల నుంచి మూడు సంవత్సరాల వయస్సు పిల్లలు 48,563, మూడేళ్ల వయస్సు నుంచి ఆరేళ్ల వరకు 23,499 పిల్లలు ఉన్నారు. ఇక జిల్లాలో గర్భవతులు 8,861, బాలింతలు 6,592, కౌమారదశ బాలికలు 21,498 మంది ఉన్నారు. తల్లిపాల వల్ల బిడ్డ పొందే లాభాలు ● తల్లి పాలలో శిశువు పెరుగుదలకు అవసరమైన ప్రోటీన్లు, కొవ్వులు, విటమిన్లు ఖనిజాలు సమతుల్యతలో ఉంటాయి. ● తల్లిపాలు తాగే బిడ్డలో 8 ఐ.క్యూ పాయింట్లు తల్లిపాలు తాగని బిడ్డ కంటే ఎక్కువ ఉంటాయి. ● మెదడు అభివృద్ధి చెందడంతో పాటు రోగనిరోధక శక్తిని బలపరుస్తుంది. ● బాల్య ఊబకాయం, టైప్– 2 డయాబెటిస్, ఉబ్బసం, కొన్ని రకాల బాల్య ల్యుకేమియా వ్యాధులు వచ్చే ప్రమాదం తక్కువగా ఉంటుంది. ● తల్లిపాలు సులభంగా జీర్ణమవుతాయి. బిడ్డకు మలబద్దకం, కడుపునొప్పి రాదు. ● బిడ్డకు కావలసిన ఇనుము, కాల్షియం అందడంతో రక్తహీనత రాదు. ● బిడ్డ చూపు, వాసన, వినికిడి, రుచి, స్వర్శ వంటి జ్ఞానేంద్రియాలు అభివృద్ధి. తల్లికి కలిగే ప్రయోజనాలు ● తల్లి పాలివ్వడం వల్ల తల్లికి రొమ్ము, ఓవరీస్ కాన్సర్లు, ఆస్టియో పోరోసిస్(ఎముకలు పటుత్వం కోల్పోవడం) జబ్బులు రావు. ● తల్లి, బిడ్డ మధ్య బలమైన భావోద్వేగ సంబంధాన్ని ప్రోత్సహిస్తుంది. ● అధిక రక్తపోటు, గుండె జబ్బులు, టైప్ 2 డయాబెటిస్ తగ్గించవచ్చు. ● డయాబెటిక్ తల్లులు బిడ్డకు పాలు ఇవ్వడం వల్ల ఇన్సూలిన్ తీసుకునే అవసరం తగ్గుతుంది. ● తల్లిపాలు ఇవ్వడం వల్ల ఆక్సిటోసిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. ఇది గర్భాశయం సాధారణ పరిమాణానికి తిరిగి రావడానికి సహాయపడుతుంది. ● ప్రసవానంతర రక్తస్రావాన్ని తగ్గించడంలో కూడా సహాయపడుతుంది. ● తల్లులు గర్భధారణ బరువును క్రమంగా తగ్గించడంలో సహాయపడుతుంది. ప్రసవించిన గంటలోపే ముర్రిపాలు పట్టాలి బిడ్డ పుట్టిన మూడు రోజుల్లో వచ్చే పాలను ముర్రిపాలు అంటారు. ప్రసవించిన గంట లోపే బిడ్డకు ముర్రిపాలు పట్టడం వల్ల శిశు మరణాలు తగ్గించవచ్చు. ముర్రిపాలలో విటమిన్ ఏ, సీ, డీ, ఇ, కే, ప్రొటీన్స్, మినరల్స్, క్రొవ్వులు పుష్కలంగా ఉంటాయి. ముర్రిపాలు శిశువు ప్రేగులను శుభ్రం చేసే ప్రభావం కలిగి ఉంటాయి. ప్రేగుల్లోని బెలిరూబిన్ విసర్జింపచేయడం ద్వారా బిడ్డకు కామెర్లు తీవ్రతను తగ్గిస్తోంది. బంగారం వంటి ముర్రిపాలను ఇప్పటికీ కొందరు మహిళలు మూఢ నమ్మకాలతో బిడ్డలకు పట్టడం లేదు. తల్లిపాల వారోత్సవాల సందర్భంగా ముర్రిపాల ఆవశ్యకతను చాటిచెబుతున్నారు. ఈ నెల 7 వరకు ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు జిల్లాలో 6,592 మంది బాలింతలకు అవగాహన బిడ్డకు సంపూర్ణ ఆరోగ్యం మొదటి 6 నెలలు తల్లి పాలే బిడ్డకు సంపూర్ణ పోషకాహారం. తల్లిపాలలో మాంసకృత్తులు, కొవ్వు, విటమిన్లు, కాల్షియం, ఇనుము ఇతర ఖనిజాలు పుష్పలంగా లభిస్తాయి. తల్లిపాల వారోత్సవాలను జిల్లాలో అన్ని కేంద్రాల్లో నిర్వహిస్తున్నాం. బాలింతలు, గర్భిణులు, కౌమారదశ యువతలకు అవగాహన కలిగిస్తున్నాం. తల్లి పాల ప్రయోజనాలను తల్లులు తెలుసుకోవాలి. – పి.శారద, ఐసీడీఎస్. జిల్లా పీడీ, ఏలూరు. వ్యాధుల నుంచి రక్షణ శిశువు జీవితంలో మొదటి తల్లిపాలే ప్రాథమిక వనరుగా ఉంటాయి. తల్లిపాలలో 87 శాతం నీరు, 7 శాతం కార్బోహైడ్రేట్, 4 శాతం లిపిడ్, 1 శాతం ప్రోటిన్, విటమిన్లు ఇతర ఖనిజాలు ఉంటాయి. తల్లి పాలు తీసుకున్నవారికి స్వల్ప, దీర్ఘ కాలిక వ్యాధుల నుంచి రక్షణ కలుగుతుంది. పిల్లలకు పాలు ఇవ్వడం వల్ల తల్లులూ ఆరోగ్యంగా ఉంటారు. – డాక్టర్ కె.అన్నపూర్ణ, శీతనపల్లి పీహెచ్సీ