breaking news
Eluru District Latest News
-
జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్ను అక్రమ మద్యం కేసులో ఇరికించారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తూ అక్రమ కేసులు కడుతున్నారని విమర్శించారు. నారా వారి సారా, కల్తీ మద్యం పల్లెల్లో ఏరులై పారుతుందని ఆరోపించారు. అలాగే కాశీబుగ్గ సంఘటనను డైవర్షన్ చేసేందుకే జోగి రమేష్ అరెస్ట్ చూపించారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను భయపెట్టా లని చూస్తే బెదిరే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ కోసం మరింత ముందుండి నడిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రో జుల్లో వారికి ఆ ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అక్రమ అరెస్ట్లను ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని బాలరాజు కోరారు. -
గౌరవ వేతనం ఏదీ?
ఏలూరు (ఆర్ఆర్పేట) : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లు 9 నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరు నిత్యం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ముస్లింలలో ఆధ్మాత్మి క చింతన పెంచుతున్నారు. వీరి సేవలను గుర్తిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతినెలా గౌరవ వేతనం ఇచ్చేలా నిర్ణయించారు. ఈ మేరకు ప్రతినెలా ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇవ్వాలని జీఓ కూడా విడుదల చేశారు. అప్పటినుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనాన్ని అందించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది వీరిని పూర్తిగా విస్మరించింది. దీంతో ముస్లిం సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత ప్రారంభంకావడంతో కొన్ని నెలలు గౌరవ వేతనాన్ని విడుదల చేసి మ రలా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిలిపివేశారు. జిల్లాలో 206 మసీదులు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో అసలు ఆదాయం లేని 206 మసీదులను గుర్తించి వాటిలోని ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం అందించారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఇమామ్, మౌజన్లకు అదనంగా రూ.5 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇమామ్లకు రూ.15 వేలు, మౌజన్లకు రూ.10 వేలు ఇస్తామ న్నారు. అయితే ఈ హామీని అమలు చేయకపోగా.. అప్పటికే ఇస్తున్న గౌరవ వేతనాన్ని కూడా బకాయి పెట్టారు. బకాయిలు రూ.4.66 కోట్లు కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఇమామ్లకు రూ.15 వేలు, మౌజన్లకు రూ.10 వేలు నెలకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన 206 మసీదుల్లో పనిచేసే ఇమామ్లకు 9 నెలల బ కాయిలు కింద రూ.2.78 కోట్లు, మౌజన్లకు రూ.1.88 కోట్లు మొత్తం రూ.4.66 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఏలూరు తంగెళ్లమూడిలో నెహర్ మసీదు మసీదుల్లో సమయానికి నమాజు ప్రార్థనలు చేసి ముస్లింలను ఆధ్యాత్మిక చింతనలో తరించేలా చేస్తున్న ఇమామ్, మౌజన్ల కుటుంబాలు చింతల్లో ఉన్నాయి. ఎటువంటి ఆదాయం లేక ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంపైనే ఆధారపడిన వారి కుటుంబాలు గత 9 నెలలుగా పస్తులతో ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి వెంటనే గౌరవ వేతనాలు విడుదల చేయాలి. –మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్, అధ్యక్షుడు, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ గతంలో గౌరవ వేతనం ప్రతి నెలా విడుదల చేసేవారు. దాంతో మా కుటుంబాలు తిండికి లోటు లేకుండా గడిపేవాళ్లం. ప్రస్తుతం గౌరవ వేతనం విడుదల చేయకపోవడంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనాన్ని విడుదల చేసి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలి. –ఎండీ రెహమాన్ షరీఫ్, వైఎస్సార్ కాలనీ మసీదు ఇమామ్, ఏలూరు ఇమామ్, మౌజన్లకు 9 నెలలుగా బకాయిలు వేతన పెంపు హామీనీ విస్మరించిన కూటమి సర్కారు ఉమ్మడి జిల్లాలో 206 మసీదులు రాష్ట్ర ప్రభుత్వ బకాయి రూ.4.66 కోట్లు -
జనాన్ని చంపేస్తే అది సుపరిపాలనా?
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు పాలనా వైఫల్యంతో ఆధ్యాత్మిక కేంద్రాల్లో తొక్కిసలాటలు జరుగుతూ అమాయక ప్రజలు చనిపోతుంటే అదే సుపరిపాలన అనుకోవాలా అని దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయాలకు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్ర మాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కో ల్పోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించా రు. కాశీబుగ్గలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ నిర్వాహకుడు ముందుగానే అధికారులకు, పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమేనని స్పష్టం చేశారు. అలాగే గతంలో తిరుమలలో ఆరుగురు, సింహాచలంలో ఏడుగురు చనిపోయిన విషయాన్ని మరి చిపోలేమన్నారు. ప్రచార యావ తప్ప ఎంతమంది చనిపోయారో అనే దానిపై మసిపూసి మారేడు కాయ చేయడానికి చంద్రబాబు.. తనకు ఉన్న ఎల్లో మీడియా ద్వారా పక్కదారి పట్టిస్తున్నాడని మండిపడ్డారు. 2018లో ఒంటిమిట్టలో కూడా చంద్రబాబు హయాంలోనే భక్తులు చనిపోయారని గుర్తుచేశారు. ఆలయాల్లో ఇటువంటి ఎన్ని సంఘటనలు జరిగినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదన్నారు. ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పాలనలో ఆలయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను జగన్ హయాంలో పున రుద్ధరించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు బాధ్యత వహించాలి కాశీబుగ్గ ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వ హించాలని కొట్టు డిమాండ్ చేశారు. బీజేపీ నా య కులు కూడా కాశీబుగ్గ ఘటనపై విచారం వ్యక్తం చే యకపోవడం చూస్తుంటే హిందూత్వం వారి రాజకీయాల కోసం వాడుకునే వస్తువుగా అనిపిస్తోందన్నారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలసిన ఉన్నతాధికారులు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుతో పాటు, పలువురు జిల్లాస్థాయి అధికారులు మర్యాదపూర్వకంగా కలిశా రు. చైర్మన్ సుధాకరరావు న్యాయమూర్తికి దు శ్శాలువాను కప్పి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అలాగే ఏలూరు జిల్ల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కొమ్మికిషోర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆయనకు పూల మొక్కలను అందజేశారు. జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి సుస్మిత రామనాథన్ ని యమితులయ్యారు. ప్రభుత్వం తాజాగా బదిలీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్కు ఐపీఎస్ అధికారిని నియమించడం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ యు.రవిచంద్రను బదిలీ చేశా రు. సుస్మిత రామానాథన్ ప్రస్తుతం గ్రే హౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా పనిచేస్తున్నారు. ఆమె తమిళనాడుకి చెందిన వారు. ఏలూరు (టూటౌన్): అంధ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం (ఏపీడీఎస్ఎస్) ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. 2010కి ముందు డీఎస్సీ ద్వారా నియామకం పొందిన టీచర్లకు కూడా టెట్లో మినహాయింపు ఇవ్వాలన్నారు. అంధ ఉపాధ్యాయులు టెట్ కోసం కంప్యూటర్ ఎగ్జామ్ రాయడం ఇబ్బంది అన్నారు. అలాగే ఫేషియల్ అటెండెన్స్ కూడా అంధ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. రాష్ట్ర కన్వీనర్ కె.వీర్రాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కుందేటి జయరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్క పాము రాంబాబు ప్రకటన చేసిన వారిలో ఉన్నారు. తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలోని లాడ్జీల్లో రిజిస్టర్లు చోరీ చేసిన ఐదుగురు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్ వి వరాలు వెల్లడించారు. కర్నాటకకు చెందిన శరణప్ప గంగప్ప, కార్తీక్ ఉమాపతి, ఎన్.శశికుమార్, రుద్రప్ప, సతివాడ సందీప్లు తాడేపల్లిగూడెంలోని వివిధ లాడ్జీల్లో రూములు అద్దెకు తీసుకుని చాకచక్యంగా లాడ్జీలకు సంబంధించిన రిజిస్టర్లను దొంగలించారు. వాటి ఆధారంగా లాడ్జీల్లో బస చేసినవారి ఫోన్ నంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేసి బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికేవారు. తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశతో కొందరు వ్యక్తులు వీరు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూడగా కత్తులు చూపించి వారి వద్ద నుంచి నగదును దొంగలించి పారిపోయేవారు. ఇలా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు చోరీ చేశారు. స్థానిక ఎంవీఆర్ లాడ్జి మేనేజర్ వీరాబత్తుల వెంకటరత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి నిట్ కాలేజీ సమీపంలోని హైవేపై నిందితులను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరు కర్నాటక నుంచి మన రాష్ట్రానికి వచ్చి పలు పట్టణాల్లోని లాడ్జీల్లో రిజిస్టర్లు దొంగిలించారని పోలీసులు తెలిపారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని, నిందితుల నుంచి రూ.3,510 నగదు, చాకు, కారు, లాడ్జి రిజిస్టర్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని కలెక్టరేట్, డివిజనల్, మండల కేంద్రాల్లో సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. -
శోభాయమానం.. శ్రీవారి తెప్పోత్సవం
శ్రీనివాసా.. గోవిందా.. వేంకటరమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. సుదర్శన పుష్కరిణిలో ఉభయ దేవేరులతో హంసవాహనంపై శ్రీవారి విహారం నేత్రపర్వమైంది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న తెప్పోత్సవాన్ని ఆదివారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. విద్యుద్దీప కాంతులు, బాణాసంచా కాల్పులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ వేడుక సాగింది. ముందుగా ఆలయంలో ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన రాజగోపురం, క్షేత్ర పురవీధుల మీదుగా వాహనం సుదర్శన పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడ హంస వాహన తెప్పలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం తెప్ప పుష్కరిణిలో విహరించింది. అర్చకులు పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, పెన్మత్స నరసింహరాజు, పోల్కంపల్లి అనిల్ పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. – ద్వారకాతిరుమల -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
పెదవేగి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జానంపేట బాబు ఆధ్వర్యంలో ఆదివారం కొప్పాకలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమానికి కొఠారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్త సనంపూడి రాంబాబు ఇంటి వద్ద ఏర్పాటుచేసిన కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం–రచ్చబండ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులకు కాలేజీలను కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. వీటని ప్రైవేటుపరం కాకుండా రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేద పిల్లలు డాక్టర్లు అవుతారన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ రేషన్ పంపిణీ చేయాలని మేం చూస్తే, కూ టమి నేతలు మందు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో 300కు పైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను తీసే సి, కూటమి నేతల ఫొటోలు, పేర్లు పెట్టుకోవడం సి గ్గుచేటని దుయ్యబట్టారు. దుర్మార్గ చర్యలకు పాల్పడితే అబ్బయ్యచౌదరి 2.0లో చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ పెనుమాల విజయ్బాబు, ఎంపీపీ తాతా రమ్య, సర్పంచ్లు మాత్రపు కోటేశ్వరరావు, దేవరపల్లి ఏసుమరియమ్మ, ఎంపీటీసీలు గెడ్డం సుజాత, పులవర్తి దేవానంద్, మాజీ ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, నాయకులు చళ్ళగొళ్ల భూ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో భక్తులకు భద్రత కరువు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వానికి భగవంతుడిపై ఏమాత్రం భయం, భక్తి లేవనీ, కనీసం భక్తులకు సరైన సౌకర్యాలు, భద్రత కల్పించటంలోనూ ఘోరంగా వైఫల్యం చెందుతుందనీ వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో భక్తులు మృతిచెందగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ వేలాది మంది భక్తులు వెళ్లే ఆలయానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని దేవదాయ శాఖ మంత్రి మాట్లాడటం దారుణమన్నారు. ఆలయం ప్రైవేటుది అయినా భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్ అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర హోంమంత్రి ప్రజల భద్రతను గాలికి వదిలేసి కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించటానికే మంత్రి అయినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్, జి ల్లా మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల తదితరులు ఉన్నారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, వారి ఊసురు తగులుతుందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. రావులపర్రులో ఆదివారం రాత్రి కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులతో నివాళులర్పించి శాంతి ర్యాలీ నిర్వహించారు. వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు కూటమికి ప్రచార్భాటమే తప్ప భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే బర్త్రఫ్ చే యా లని డిమాండ్ చేశారు. పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మరడ వెంకట మంగారావు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, బీసీ సెల్ నేత పెనుగొండ బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎలిశెట్టి బాబ్జి, నీలిమ జూనియర్, గాది రమణ తదితరులు పాల్గొన్నారు. రావులపర్రులో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
కుట్రతోనే జోగి రమేష్ అరెస్ట్
భీమడోలు: నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ అన్నారు. పూళ్లలో పార్టీ నేత కందులపాటి శ్రీనివా సరావు ఇంటి వద్ద ఆదివారం ఆయన మాజీ ఎ మ్మెల్యే పుప్పాల వాసుబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. జోగి రమేష్పై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం నీతిమాలిన చర్య అన్నారు. తుపాను బాధితులకు పరిహారం ఎగ్గొట్టడానికి, కాశీబుగ్గ ఘటన గురించి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. బీసీ నాయకులను అణచివేసే ధోర ణిలో అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోబోమన్నా రు. అక్రమ కేసులను మానుకుని తుపాను బాధిత రైతులను, కాశీబుగ్గ ఘటన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల కోసం మాజీ మంత్రి జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో అక్రమంగా ఇరికించారన్నారు. 18 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. కూటమి నేతల కనుసన్నలల్లో మద్యం బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారన్నారు. కుట్రపూరితంగానే ప్రస్తుత సమస్యల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకు జోగి రమేష్ను అరెస్ట్ చేశారన్నారు. కూ టమి దుశ్చర్యలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, వారిని ఎవరు నమ్మే స్థితిలో లేరని ఘాటుగా విమర్శించారు. తక్షణమే జోగి రమేష్ను విడుదల చేయాలని వాసుబాబు డిమాండ్ చేశారు. కారుమూరి సునీల్కుమార్ పుప్పాల వాసుబాబు -
ద్వారకాతిరుమలలో వరుస చోరీలు
ద్వారకాతిరుమల: వరుస చోరీలతో ద్వారకాతిరుమల ప్రజలు ఒక్కసారిగా భీతిల్లారు. శనివారం అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు మూడు ఇళ్లల్లోకి చొరబడి 12 కాసుల బంగారం, రూ.2.50 లక్షల నగదు, ఒక పల్సర్ బైక్ను తస్కరించారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని డీసీసీబీ బ్రాంచి సమీపంలోని ఓ ఇంట్లో పోలుబోయిన లక్ష్మణరావు ఉంటున్నాడు. రాత్రివేళ ఇంటి తలుపులు తెరచుకుని భార్యాభర్తలు ఓ గదిలో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరో గదిలో ఉన్న బీరువాను పగలగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దొంగలు వెండి వస్తువులను విడిచిపెట్టి కేవలం బంగారు వస్తువులను మాత్రమే దోచుకెళ్లారని, నిద్రిస్తున్న తమపై ఏదో స్ప్రే చేసినట్టు అనిపించిందని లక్ష్మణరావు భార్య కుమారి తెలిపారు. స్థానిక చెరువు వీదిలోని కనిగొళ్ల లక్ష్మీ కాశీ విశ్వనాథ్(కాశీ) ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలోని సుమారు 2 కాసుల బంగారు వస్తువులు, రూ.2.50 లక్షల నగదును చోరీ చేశారు. అశ్వారావుపేటలోని తన చెల్లి ఇంటికి ఒక శుభకార్యం నిమిత్తం శనివారం ఉదయం కుటుంబ సమేతంగా వెళ్లిన కాశీ, తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత ఈ చోరీని గుర్తించాడు. గ్రంథాలయం పక్క రోడ్డులోని ఒక ఇంట్లో పల్సర్ 220 బైక్ను చోరీ చేశారు. బాధితులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాలను పరిశీలించారు. చోరీలపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అర్ధరాత్రి మూడు ఇళ్లలో దొంగతనాలు -
ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు
ఉంగుటూరు: పేదలు, సామాన్యులకు మెడికల్ విద్యను దూరం చేస్తే చంద్రబాబు సర్కార్ ప్రజాగ్రహాంలో కొట్టుకుపోతుందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఉంగుటూరు మండలం రావులపర్రులో ఆదివారం రాత్రి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మండల అధ్యక్షుడు మరడ మంగారావు అధ్యక్షత వహించారు. వాసుబాబు మాట్లాడుతూ పేదలు, సామాన్యుల ఆరోగ్య భద్రత కోసం కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబు కార్పొరేట్ పక్షపాతి అని, బడుగు, బలహీన వర్గాలంటేనే చిన్న చూపు అని వారు ఎదగడాన్ని ఓర్వలేడన్నారు. ప్రైవేటీకరణను ఆపకుంటే చంద్రబాబు చరిత్రహీనుడు కాక తప్పదని, వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, బీసీ సెల్ నాయకులు పెనుగొండ బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎలిశెట్టి బాబ్జి, నీలిమ జూనియర్, గాది రమణ పాల్గొన్నారు. -
అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం సమీపంలోని శ్రీ నీలాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రైతులు పీఎస్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో హిందువుల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. హుండీ కూడా బద్దలు కొట్టి విలువైన సొత్తును అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కై కలూరు: మండలంలోని కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.21,530 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయంలో ఉదయం హనుమద్ హోమం, సువర్చలా హనుమద్ కల్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల రూపేణా రూ.2,47,129 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 3,600 మంది భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శ్రీ రాజా రాజేశ్వరి కూచిపూడి నాట్యలయం విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. జంగారెడ్డిగూడెం : మైసన్నగూడెం, శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో రాళ్ల కాలువను బాగు చేసి మురుగునీరు వెళ్లేలా ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మైసన్నగూడెంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతులు బొడ్డు దుర్గారావు, పాతూరి జానకిరామయ్య మాట్లాడుతూ.. రాళ్ల కాలువ బాగు చేయకపోవడంతో మైసన్న గూడెం, శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పారు. మైసన్నగూడెం నుంచి పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం సరిగా లేదన్నారు. రాళ్ల కాలువ బాగు చేయడానికి, కల్వర్టు, రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. రైతు సంఘం నాయకులు బొడ్డు రాంబాబు, సిరిబత్తుల సీతారామయ్య, రైతులు పాల్గొన్నారు. -
సంతానం కలుగుతుందనే నమ్మకంతో..
కార్తీక మాసంలో ధర్మాలింగేశ్వర స్వామి ఆలయం ఎదుట ప్రాణాచారం పడటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సంతానం లేని మహిళలు జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాచారం పడతారు. ఈ సందర్భంగా వచ్చిన కలలు నిజమని భక్తులు ధృఢంగా నమ్ముతారు. ఈ ప్రాంతంలో అనేక మందికి సంతానం కలిగిందనేది వాస్తవం. –నండూరి భాను, కొత్తూరు, కామవరపుకోట ఈ ప్రదేశానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే భక్తులతో, పిక్నిక్కి వచ్చిన విద్యార్థులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ వచ్చేవారికి సరైన మౌలిక వసతులు లేవు. ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి పరిచేలా చొరవ తీసుకోవాలి. -బొల్లు వెంకట సత్యనారాయణ, కామవరపుకోట -
భక్తులకు మెరుగైన సేవలందించాలి
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. చినవెంకన్న క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన ఆమె, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి కలెక్టర్కు శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆమె ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో స్వయంగా మాట్లాడి ఆలయంలో అందుతున్న సౌకర్యాలు, దర్శనానికి పడుతున్న సమయం, ఆలయ సిబ్బంది ప్రవర్తన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలోని వంటశాలను పరిశీలించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, త్వరితగతిన స్వామివారి దర్శనం జరిగేలా చూడాలన్నారు. భక్తులకు అందించే అన్న ప్రసాదం సరైన నాణ్యతతో ఉండేలా చూడాలని, వంటశాలలో పూర్తి పరిశుభ్రత ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం గో సంరక్షణ శాలను, బయో గ్యాస్ (గోబర్ గ్యాస్) ప్లాంట్ వినియోగాన్ని పరిశీలించి, సంప్రదాయేతర ఇంధన వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తున్న ఆలయ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటిండెంట్ కోటగిరి కిషోర్ తదితరులున్నారు. శ్రీవారి దేవస్థానం అధికారులను ఆదేశించిన కలెక్టర్ -
బౌద్ధారామాల్లో కార్తీక శోభ
కామవరపుకోట: మండలంలోని జీలకర్రగూడెం గ్రామ పంచాయతీ గుంటుపల్లిలోని బౌద్ధారామాలు కార్తీక మాసంలో భక్తులతో, పర్యాటకులతో సందడిగా మారింది. ఈ బౌద్ధారామాల వద్ద ఉన్న భారీ లింగాకారాన్ని ప్రజలు ధర్మ లింగేశ్వర దేవాలయంగా కొలుస్తారు. జగద్గురు ఆది శంకరాచార్యులు విదేశీ పర్యటనలో బౌద్ధారామంలోని ప్రధాన స్తూప చైతన్యాన్ని ధర్మ లింగేశ్వర స్వామిగా రూపాంతరం చేసి పూజలు చేశారని బౌద్ధులు చెబుతుంటారు. ఏటా కార్తీక మాసంలో తిరునాళ్లు నిర్వహిస్తారు. గట్టు తీర్థంగా ప్రసిద్ధి చెందిన ఈ తిరునాళ్ళలో మూడో సోమవారం యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలి వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పాండవులు తిరిగిన ప్రదేశంగా స్థానికులు చెప్పుకుంటారు. దీనిలో భాగంగానే ఇక్కడ రాతిపై భీముడి పాదం ఉన్నట్లుగా ప్రజల భావించి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడున్న ధర్మ లింగేశ్వర స్వామికి ప్రాణచారం పడితే సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ప్రాణాచారం అంటే సంతానం కోసం మొక్కుకున్న మహిళలు ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా బోర్లగా పడుకుని తనను తాను మరిచిపోయి దైవత్వంలోకి మునిగిపోతూ నిద్రావస్థలోకి చేరుకోవడాన్ని ప్రాణాచారం అంటారు. ప్రాణాచారంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై తను కోరుకున్న కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. సంతానం కలగని మహిళలు తలస్నానం చేసి పండ్లు, పువ్వులు చేతితో పట్టుకుని ఈ బౌద్ధాలయం వద్ద ధర్మాలింగేశ్వరి స్వామి ఎదుట ప్రాణాచారం పడతారు. అలా ప్రాణాచారం పడిన వారికి స్వామి కలలో ప్రత్యక్షమై పండ్లు అందజేసినట్లయితే మగబిడ్డ పుడతాడని, పూలు అందజేస్తే ఆడపిల్ల పుడుతుందని, చీపురు, చాట కనబడితే వారికి సంతాన భాగ్యం లేదనేది ఈ ప్రాంత వాసుల నమ్మకం. అలా పుట్టిన పిల్లలకు మొక్కులు తీర్చి ధర్మయ్య, లింగయ్య, ఈశ్వరయ్య, ధర్మవతి, ధర్మ లక్ష్మీ ఇలా అనేక పేర్లు పెడుతుంటారు. ఈ కారణంగా అధిక సంఖ్యలో మహిళలు ప్రాణచారం పడుతుంటారు. తిరుణాల సందర్భంగా మండలంలో మూడో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. ఈ ప్రాంతంలో అడపాదడపా సినిమా షూటింగ్లు సైతం నిర్వహిస్తుంటారు. ఈ ప్రదేశం పిక్నిక్ స్పాట్గా ఉండడంతో.. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో పాఠశాలల విద్యార్థులు వస్తుంటారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. దీంతో అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వారం మొత్తం రూ.26,560 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి సతీష్కుమార్ చెప్పారు. -
మార్కెట్లో మటన్ మంచిదేనా?
● చనిపోయిన గొర్రెలు కోసి విక్రయాలు ● రెస్టారెంట్లపై అనుమానాలు ● జిల్లాలో పశువైద్యులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలపై విమర్శలు తణుకు అర్బన్: ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహారులు అత్యధికంగా ఇష్టపడేది మటన్. మాంసాహార అమ్మకాల్లో కొందరు అక్రమార్కుల కారణంగా మటన్ ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. గత నెల 30న అత్తిలి మేకల కబేళాలో చనిపోయిన గొర్రెలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. మార్కెట్లో కొనుగోలు చేస్తున్న మటన్ మంచిదేనా అనే సందేహం మాంసాహార ప్రియుల్లో మొదలైంది. అత్తిలిలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తిలి సెక్రటరీ జి.భాస్కరరావు కబేళాను పర్యవేక్షించి చనిపోయిన గొర్రెలను వధించారని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో 8 చనిపోయిన గొర్రెలను కోసిన మాంసంతో పాటు చనిపోయిన 5 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. సదరు మాంసాన్ని ఇరగవరం మండలం రేలంగిలో విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది. మార్కెట్లో కిలో మటన్ ధరలు రూ.వెయ్యి ఉండగా చనిపోయిన గొర్రెల మాంసం రూ.500 నుంచి రూ.550కు జిల్లాలో కొన్ని చోట్ల విక్రయిస్తున్నారు. పట్టణాల్లో ఽరూ.వెయ్యికి అమ్మకాలు చేస్తుండగా కొన్ని గ్రామాల్లో మాత్రం కొందరు రిటైల్ వ్యాపారులు రూ.500కు కూడా మటన్ విక్రయిస్తున్నారు. జిల్లాలో మటన్ విక్రయాలకు సంబంధించి ఆదివారం 1,500 కిలోలు, మంగళవారం వెయ్యి కిలోలు, మిగిలిన రోజుల్లో రోజుకు 700 కిలోల చొప్పున సుమారుగా విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. పర్యవేక్షణపై అనుమానాలు నిబంధనల ప్రకారం మాంస విక్రయాలకు సంబంధించి గొర్రెలు, మేకలను వధించే ముందు పశు వైద్యులు వాటి ఆరోగ్యస్థితిని నిర్ధారించి ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే వధించేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. సదరు మాంసంపై కూడా స్టాంపు వేయాల్సి ఉంది. ఈ తరహా నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమల్లో లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాత్రి 3 గంటలకే మేకల కబేళాకు చేరుకోవడం తదితర వ్యవహారం అంతా కష్ట సాధ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పశు వైద్యులు పరీక్షలు నిర్వహించడం లేదని పలువురు చెబుతున్నారు. దీంతో మాంసం రిటైల్ విక్రయదారుల్లో కొందరు అక్రమ మార్గంలో చనిపోయిన జీవాలను వధించి విక్రయించేస్తున్నారని తెలుస్తోంది. చనిపోయిన గొర్రెల్లో రక్తం శరీరంలోనే ఇంకిపోతుందని, దాని వల్ల మాంసం త్వరగా కుళ్లిపోతుందని, అలాంటి మాంసాన్ని భుజిస్తే మనుషుల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రెస్టారెంట్లకు తక్కువ ధరకు విక్రయాలు ముఖ్యంగా జిల్లాలోని హాటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్న మాంసాహారాల్లో మటన్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారని తెలుస్తోంది. చనిపోయిన గొర్రెల మాంసం మార్కెట్లో అందుబాటులో ఉండడంతో పాటు కొన్ని రోజులపాటు ఫ్రిజ్లలో ఉంచి మరీ రెస్టారెంట్లలో వండి వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్తిలి వ్యవహారం బయటపడిన రోజు నుంచి రెస్టారెంట్లు, హోటళ్లలో మటన్ రుచిచూడాలంటే భయపడుతున్నామని పలువురు చెబుతున్నారు. దీనికితోడు ఫుడ్ పాడయిందని, దుర్వాసన వస్తుందని ప్రజలు బాహాటంగా చెప్పినా కూడా అధికారులు ఎలాంటి పర్యవేక్షణలు చేయకపోవడం, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బాధితులను పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. దుకాణాల్లోనే కోసేస్తున్న వైనం కొందరు రిటైల్ వ్యాపారులు మేకల కబేళాకు వెళ్లే పరిస్థితి లేకుండానే తమ దుకాణాల్లోనే గొర్రెలను వధించే దుస్థితి జిల్లాలోని చాలా చోట్ల కనిపిస్తోందని మాంసాహారులు చెబుతున్నారు. దుకాణాల్లో వెనుక భాగంలో జీవాలను వధించేసి మాంసాన్ని విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఈ విషయంపై తణుకు పశు సంవర్థకశాఖ అధికారి పృథ్వీరెడ్డిని సాక్షి వివరణ కోరగా ప్రతి రోజూ తణుకు మేకల కబేళాలో జీవాలను వైద్య పరీక్షలు చేసిన తరువాత మాత్రమే వధించేందుకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. -
వైభవంగా గిరి ప్రదక్షిణ
ఆగిరిపల్లి: శోభనాచలుడి గిరి ప్రదక్షిణ మహత్తర ఘట్టంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆగిరిపల్లి లోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శోభనగిరి (కొండ) చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణ కనుల పండువగా సాగింది. భూనీల సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తులకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను తిరుచ్చి పల్లకి వాహనంపై, శేష వాహనంపై శోభనగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు సామూహిక విష్ణు సహస్రనామం, గోవింద నామస్మరణల మధ్య గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. -
భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?
దెందులూరు: రాష్ట్రంలో భక్తుల ప్రాణాల భద్రతపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం బాధాకరమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిసారి అదే నిర్లక్ష్యం అదే బాధ్యతారాహిత్యం కనబడుతోందన్నారు. గతంలో తిరుమల, సింహాచలం ఇప్పుడు శ్రీకాకుళం.. ప్రాణనష్టం జరిగిన ప్రతిసారి ఏదో కుంటి సాకు చెబుతున్నారని శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా అని ప్రశ్నించారు. వసతుల లేమి పసిగట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన ఇంటెలిజెన్న్స్ ఏం చేస్తుందన్నారు. బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలోని జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి అటవీశాఖ సీసీఎఫ్ ఎంఎస్ఎన్ మూర్తి తెలిపారు. శుక్రవారం టేకూరు సెక్షన్ పరిధిలోని పాపికొండల అభయారణ్యంలో అటవీ శాల అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా అభయారణ్యం ప్రాంతంలో గ్రాస్ ల్యాండ్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించారు. అనంతరం సీసీఎఫ్ ఎంఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ టేకూరు సెక్షన్ పరిధిలో 20 హెక్టార్లలో, వాడపల్లి సెక్షన్ పరిధిలో 10 హెక్టారుల్లో మొత్తం 50 హెక్టారుల్లో వన్యప్రాణుల ఆహారం కోసం గ్రాస్ ల్యాండ్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి అటవీ క్షేత్ర కార్యాలయానికి పంపించాలని రేంజ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్, సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బయ్య, రేంజ్ అధికారులు ఎస్కె వల్లి, దావీదురాజు, తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: వివాహితను గదిలో నిర్భంధించి చిత్రహింసలు గురిచేసి ఆమె బావతో కాపురం చేయమని వేధించిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్ జబీర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక బుట్టాయగూడెంలో నివసిస్తున్న చిన్ని అమృతవల్లి భర్త చిన్ని రంజిత్కుమార్, అత్త చంద్రకళ, మామ నాగేశ్వరరావు, బావ ప్రవీణ్కుమార్, తోటికోడలు హరిప్రియపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అమృతవల్లిని వీరు వేధించినట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం)లో ఆదివారం రాత్రి జరుగనున్న చినవెంకన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. వేడుకలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామివారు విహరించనున్న తెప్పను హంస వాహనంగా అలంకరిస్తున్నారు. అలాగే తెప్పలో పచ్చిపూల మండపాన్ని నిర్మిస్తున్నారు. భక్తులకు రక్షణ కల్పించేలా పుష్కరణి గట్లపై బారికేడ్లు నిర్మించారు. సాగరం మధ్యలోని మండపానికి, అదేవిధంగా గట్లపైన, చెట్లకు విద్యుత్ అలంకారాలు చేశారు. దాంతో పుష్కరణి పరిసరాలు విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయం నుంచి తొళక్క వాహనంపై బయల్దేరి పుష్కరిణి వద్దకు రాత్రి 8 గంటల సమయానికి చేరుకుంటారని, ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భీమవరం: కౌలురైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 న కలెక్టరేట్ వద్ద ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, ఉందుర్తి శ్రీనివాసరావు శచెప్పారు. కూటమి ప్రభుత్వం కౌలురైతులను దగా చేసిందన్నారు. తుపాను కౌలు రైతులు పంట కోల్పోతే అధికారులు పంట నష్టం భూ యజమానుల పేరున నమోదు చేస్తున్నారని ఆరోపించారు. -
సైబర్ నేరగాళ్లకు చెక్
● దేశమంతా జల్లెడ పట్టిన ఏలూరు పోలీసులు ● 8 మంది అరెస్టు ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీసులు సాహసోపేతమైన ఛేజింగ్తో సైబర్ నేరగాళ్ళ ఆగడాలకు చెక్ పెట్టారు. ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఒక కేసు దర్యాప్తులో భాగంగా తీగ లాగితే డొంకంతా కదలింది ఏకంగా రాష్ట్రాలతోపాటు, ఇతర దేశాల్లోని సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఏలూరు జిల్లా పోలీసుల దర్యాప్తు ఉపయోగపడుతోంది. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి నేరాల దర్యాప్తుపై వివరాలు వెల్లడించారు. ఏకంగా ఏడు రాష్ట్రాలను జల్లెడ పట్టి సైబర్ నేరాలకు పాల్పడే సూత్రధారుల వద్దకే ఏలూరు జిల్లా పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. వేట మొదలైందిలా.. ఏలూరు ఆర్ఆర్ పేటకు చెందిన ఒక వృద్ధురాలు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.58 లక్షల నగదు సైబర్ నేరగాళ్ళు కాజేశారంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్దురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సైబర్ నేరాలను ఛాలెంజింగ్ తీసుకున్నారు. డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో 4 పోలీస్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. టూటౌన్ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ మధువెంకట రాజా, భీమడోలు సీఐ యూజే విల్సన్, సీఐ సుభాష్తో కూడిన నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలు సైబర్ నేరగాళ్ల మూలాలను ఛేదించేందుకు వేట ప్రారంభించారు. ఏడు రాష్ట్రాల్లో 14 వేల కిలోమీటర్ల ప్రయాణం ఏలూరు జిల్లా పోలీస్ బృందాలు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, కర్నాటక, తమిళనాడుతో పాటు నేపాల్ను చుట్టేశారు. ఏకంగా 14 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి నేరగాళ్లను పట్టుకునేందుకు శ్రమించారు. ముంబైకి చెందిన పూనమ్ ప్రవీణ్ సోనావాలేను ప్రధాన నిందితురాలి గుర్తించారు. ఈమె మ్యూల్ అకౌంట్లు దేశవ్యాప్తంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. యూపీకి చెందిన సచీంద్ర శర్మ, నితిన్ మిశ్రా, హర్షిత్ మిశ్రా, అభిషేక్ కశ్యప్, గోపాల్ యాదవ్, కో–ఆపరేటివ్ బ్యాంకులో రీజనల్ మేనేజర్గా పనిచేసే సందీప్ అలోనీ, హెడ్కానిస్టేబుల్ సందీప్తో పాటు మరో ముగ్గురు నేరస్తులను గుర్తించారు. 11 మంది సైబర్ నేరగాళ్లను గుర్తించగా 8 మందిని అక్టోబర్ 26న ఏలూరు తరలించి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఏపీకే ఫైల్స్తో మోసాలు సైబర్ నేరగాళ్ళు వినియోగిస్తున్న 12 రకాల హానికర ఏపీకే ఫైల్స్ను పోలీసులు గుర్తించారు. వీరంతా బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును క్రిప్టో కరెన్సీ ద్వారా కంబోడియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రూ.2.25 కోట్లు మ్యూల్ అకౌంట్ నుంచి తరలించినట్లు గుర్తించారు. ఈ భారీ నెట్వర్క్ మన దేశంతో పాటు కంబోడియా, సింగపూర్, నేపాల్, చైనా, అమెరికా వంటి దేశాల్లోనూ ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. వేల కోట్లు సొమ్ము సైబర్ నేరగాళ్ళ ఖాతాల్లో ఉన్నాయి. నగదు ఫ్రీజ్కు సైతం ఆయా బ్యాంకులకు దర్యాప్తు బృందాలు అభ్యర్థన పత్రాలు అందజేశాయి. కంబోడియాలోని ప్రత్యేక ఆన్లైన్ సర్వర్లకు, ఆలీబాబా సర్వర్కు జిల్లా పోలీసులు ఇప్పటికే అభ్యర్థన పంపారు. ఈ దర్యాప్తు బృందంలో సైబర్ సెల్ సీఐ దాసు, చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్, ఎస్సై వై.సుధాకర్, ఎస్బీ ఎస్సై వీరప్రసాద్, ఎస్సై వల్లి పద్మ, ఏఎస్సై అహ్మద్, హెడ్ కానిస్టేబుళ్లు రవికుమార్, శ్రీనివాస్, సెల్ ట్రాకింగ్ హెచ్సీ వెంకట సత్యనారాయణ, సైబర్ సెల్ కానిస్టేబుల్ శివకుమార్, బి.నాగరాజు, బి.రామకృష్ణ తదితరులున్నారు. -
రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి
ఉద్యాన పంటలు, వరి తుపాను కారణంగా నష్టపోయాయి. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నా సమయంలో రైతులను కూడా అధికారులతో పాటు భాగస్వాముల్ని చేయాలి. రైతులందరికీ న్యాయం జరగాలంటే అధికారులతో రైతులు ఉండాలి. – సున్నా వెంకటరావు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి ఈ సంవత్సరం 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇంతవరకు రూ.2 లక్షలు ఖర్చు చేశాను. తుపాను, ఈదురు గాలుల దెబ్బకు మొక్కజొన్న కంకులు విరిగిపోయి నీళ్లలో నాను తున్నాయి. ఖరీఫ్లో మొక్కజొన్న పంటకు బీమా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం. – గురజాల రమేష్, రైతు, కనసానపల్లి, ఆగిరిపల్లి మండలం -
కార్మికులు పస్తులుంటే పట్టించుకోరా!
కై కలూరు పంచాయతీ కార్మికులకు 8 నెలల జీతాలు బకాయి కై కలూరు: పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు సిబ్బందికి 8 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలను ఏలా పోషిస్తారు? ఇదేనా ప్రభుత్వాధికారుల తీరు అని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నిలదీశారు. కై కలూరు మేజర్ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్, నీటి సరఫరా, రిక్షా వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా 85 మందికి 8 నెలలుగా జీతాలు చెల్లిండడం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, పంచాయతీ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. నవంబరు 1 నుంచి విధులను బహిష్కరిస్తున్నామని సమ్మె నోటీసు అందించారు. శనివారం విధులు బహిష్కరించి నీటి సరపరా, చెత్త సేకరణ నిలిపేశారు. పంచాయతీ భవానమ్మ చెరువు విద్ద నిరసన తెలిపారు. మద్దతుగా డీఎన్నార్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. జీతాలు చెల్లించకపోతే పనులు ఎలా జరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని జీతాలు చెల్లించే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు అన్యాయం జరిగితే సహించమన్నారు. డీఎన్నార్తో పాటు కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, వివిధ హోదాల నాయకులు పంజా రామారావు, సయయం అంజి, కన్నా బాబు, సిరాజుద్ధిన్, పంజా నాగు, ఎండీ.గాలిబ్బాబు, మడక శ్రీను, ఉండ్రమట్ల ఏసుకుమార్ ఉన్నారు. టీడీపీ కవ్వింపు చర్యలు పంచాయతీ కార్మికులు జీతాల కోసం చేస్తున్న సమ్మె వల్ల పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకులు త్రినాథరాజు, పోలవరపు రాణి, జానీ, పడమటి వాసు, మల్యాద్రి కార్మికులతో మాట్లాడారు. ఆ సమయంలో డీఎన్నార్ సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. పంచాయతీ ఈవో ప్రసాద్ను పిలిచి జీతాల ఆలస్యానికి కారణాలు అడిగారు. ఇంతలో కార్మికులు డీఎన్నార్ వద్దకు వెళ్ళి గోడు చెప్పడం జీర్ణించుకోలేక టీడీపీ నాయకుడు జానీ డీఎన్నార్ను ఉద్దేశించి కవ్వింపు చర్యలకు దిగాడు. దీంతో డీఎన్నార్ కూడా ఘటుగా సమాధానం చెప్పారు. 8 నెలలుగా జీతాలు చెల్లించకపోతే టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్సార్సీపీ నేతలు ఘటుగా సమాధానం చెప్పారు. ఒకానొక సందర్భంలో ఇరు పార్టీల కేకలతో గందరగోళం ఏర్పడింది. చివరికు వైఎస్సార్సీపీ నుంచి పంజా రామారావు, టీడీపీ నుంచి పోలవరపు రాణి, త్రినాథరాజు, తాత్కాలిక సర్పంచ్ కేవీఎన్ఎం నాయుడు గొడవ పెద్దది కాకుండా చూశారు. విధుల్లోకి కార్మికులు పంచాయతీ కార్మికులకు రావల్సిన 8 నెలల జీతాలను ఈ నెల 11 లోపు కొంత, మిగిలిన బాకీ ఈ నెలాఖరుకు అందిస్తామనే హామీతో కార్మికులు సమ్మెను విరమించారు. యథావిధిగా పనులు మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు అండగా రావడంతోనే జీతాలు చెల్లింపు హామీ వచ్చిందనే భావన కార్మికులతో కనిపించింది. -
విహారం.. కారాదు విషాదం
నరసాపురం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏకై క పేరుపాలెం బీచ్ నేటి నుంచి కళకళలాడనుంది. కార్తీకమాసం ప్రారంభమైన తరువాత మోంథా తుపాను కారణంగా వారంరోజుల నుంచి బీచ్కు పర్యాటకులను అనుమతించ లేదు. తుపాను ప్రభావం తగ్గడం, నేడు ఆదివారం కావడంతో బీచ్లో పర్యాటకుల సందడి పెరగనుంది. అయితే ప్రతి ఏటా బీచ్లో మరణాలు నమోదు కావడం, అధికారులు మాత్రం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. బీచ్లో మృత్యుఘంటికలు ఏడాది పొడువునా బీచ్కు విహారం కోసం జనం వస్తుంటారు. వారాంతరాలు, సెలవు దినాల్లో బీచ్కు వచ్చేవారి సంఖ్య మరింత ఎక్కువ. ఇక కార్తీక మాసంలో అయితే లక్షల్లో వస్తుంటారు. పక్కజిల్లాలు నుంచి కూడా శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో హాజరవుతారు. కార్తీకమాసం నెలరోజుల్లో సుమారు 3 లక్షల మంది బీచ్ను సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడ సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలన బీచ్లో మృత్యుఘంటికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 15 ఏళ్లలో బీచ్లో 150 మంది వరకూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. వీరంతా యువకులే కావడం గమనార్హం. సముద్రంలో గల్లంతైన వారికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కనీసం మృతదేహాలు కూడా దొరకవు. గత పదేళ్లలో ఇప్పటికీ 25 మంది వరకూ మృతదేహాలు సైతం లభ్యం కాలేదు. పేరుపాలెం బీచ్ స్నానాలకు అనువుకాదా..? పేరుపాలెం బీచ్ ప్రాంతంలో సముద్రంలో గుంటలు, గుంటలుగా ఉంటాయని మత్స్యకారులు చెబుతారు. దీంతో అలలు పెద్దపెద్దగా వచ్చినప్పుడు, కాళ్ల క్రింద ఇసుక విపరీతంగా కోతకు గురవుతుంది. దీనినే నిపుణులు అండర్ కరెంట్గా పేర్కొంటారు. ఇలా పెద్ద అలలు, కాళ్లక్రింద కోత జరిగినప్పుడు సముద్రంలో ఉన్నవారు శరీరంపై నియంత్రణను కోల్పోతారు. వెంటనే సముద్ర అలలకు కొట్టుకుపోతారు. సరిగ్గా ఇక్కడా ఇదే జరుగుతుందనేది వాదన. నిపుణులతో సమగ్ర సర్వే చేయించి, బీచ్లో సేఫ్జోన్ ప్రాంతాలను గుర్తించి, భద్రత కట్టుదిట్టం చేసే వరకూ పర్యాటకులను అనుమతించకూడదనే డిమాండ్ గతంలో వినిపించింది. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎక్కవకాలం అధికారంలో ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట పడేనా పేరుపాలెం బీచ్ ఇటీవల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కూటమి ప్రభుత్వంలో తీర గ్రామాలను బెల్ట్షాపులతో నింపేయడంతో బీచ్లో మద్యం ఏరులై పారడం, పేకాట సర్వసాధారణమైపోయాయి. కనీసం బీచ్ వద్దకు మద్యం సేవించి రాకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అలాగే ప్రమాదాలు జరుతున్న ప్రాంతాన్ని నిషేధిత జోన్గా ప్రకటించకపోవడం పైనే ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నేటినుంచి పేరుపాలెం బీచ్లో సందడి కార్తీక ఆదివారం కావడంతో పెరగనున్న పర్యాటకుల తాకిడి తుపాను ప్రభావం తగ్గడంతో విహారానికి ఆసక్తి ఏటా బీచ్లో మోగుతున్న మృత్యుఘంటికలతో ఆందోళన భద్రతా చర్యలపై అధికారుల నిర్లక్ష్యం -
కన్నులపండువగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శనివారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అట్టహాసంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. దీపావళి పండుగ తరువాత స్వామివారు తొలిసారిగా పురవీధులకు రావడంతో భక్తులు ప్రతి ఇంటి ముంగిటా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అలాగే స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. పోటెత్తిన శ్రీవారి క్షేత్రం ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు, ఏకాదశి, కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో అన్నివిభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానంతరం పెద్ద ఎత్తున భక్తులు ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఉన్న దీపారాధన మండప ప్రాంతంలో కార్తీక దీపాలను వెలిగించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. -
రైతులను ఆదుకోవాలి
ఎన్నాళ్లీ ‘సెల్’ కష్టాలు.! శ్రీవారిని దర్శించడం కంటే.. సెల్ఫోన్లను భద్రపరచడమే భక్తులకు కష్టంగా మారింది. కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. 8లో uమాజీ ఎమ్మెల్యే వాసుబాబు ఉంగుటూరు: రైతుల తరఫు బీమా చెల్లించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంటే ఈ ప్రభుత్వం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. శనివారం ఉంగుటూరు మండలంలో దెబ్బతిన్న వరిపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోయారని, బేషరతుగా నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని కోరారు. 20 బస్తాలకు మంచి అవ్వని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 5,500 ఎకరాల పంట దెబ్బతిందని చెప్పారు. ఉచిత పంటల బీమా అమలుచేసింది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానని చెప్పి.. కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చేవారని తెలిపారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారని, అదంతా ఏం చేశారో తెలియదన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. ఆయన మండల పార్టీ అధ్యక్షుడు మరడా మంగరావు, బూత్ విభాగం కార్యదర్శి యెలిశెట్టి పాపారావు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, వీవర్సు విభాగం అధ్యక్షుడు దొంతంశెట్టి సత్యనారాయణ, పెనుగొండ బాలక్రష్ణ, షేక్ బాజి, మంద జయలక్ష్మి తదితరులున్నారు. -
భక్తులకు ఎన్నాళ్లీ ‘సెల్’ కష్టాలు.!
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీవారిని దర్శించడం కంటే.. సెల్ఫోన్లను భద్రపరచడమే భక్తులకు కష్టంగా మారింది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు సెల్ఫోన్లను డిపాజిట్ చేసేందుకు, దర్శనానంతరం వాటిని తిరిగి తీసుకునేందుకు భక్తులు కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. దాంతో స్వామీ.. మాకేమిటీ కష్టాలని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే. శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఇదిలా ఉంటే భక్తులు ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేదం ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, తూర్పు రాజగోపురం వద్ద భక్తులను తనిఖీ చేసిన తరువాతే సెక్యూరిటీ సిబ్బంది ఆలయంలోకి అనుమతిస్తారు. దాంతో భక్తులు తప్పనిసరిగా తమ సెల్ఫోన్లను ఆలయ తూర్పు ప్రాంతంలో ఉన్న డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకుంటున్నారు. భక్తుడి నుంచి ఒక్కో సెల్ఫోన్కు దేవస్థానం రూ. 5 రుసుమును వసూలు చేస్తోంది. అయితే నిర్వహణ లోపాలే భక్తుల ఇక్కట్లకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తిరిగి తీసుకునేందుకూ అవస్థలే.. శ్రీవారి దర్శనం క్యూలైన్ కంటే.. సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద ఉండే క్యూలైనే పెద్దగా ఉంటోందని భక్తులు వాపోతున్నారు. ఇదంతా ఒకైతెతే స్వామివారి దర్శనానంతరం తిరిగి సెల్ఫోన్లు పొందేందుకు మళ్లీ భక్తులు క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. దాంతో వారు విస్తుపోతున్నారు. సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద గంటల తరబడి సమయం వృథా అవుతోందని బాధిత భక్తులు మండిపడుతున్నారు. కష్టాలు పడలేక.. కార్లలో వచ్చే భక్తులు సెంట్రల్ పార్కింగ్లో తమ వాహనాలను పార్క్ చేసుకుని, సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్దకు వస్తున్నారు. అక్కడ క్యూ చూసి వెనక్కి వెళ్లిపోయి వారి ఫోన్లను కార్లలో పెట్టుకుంటున్నారు. బస్సులు, బైక్లు, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. కార్తీక మాసం శనివారం కావడంతో ఈ సమస్య స్పష్టంగా కనిపించింది. అధికారులు ఇందుకు పరిష్కార మార్గం ఎలా చూపిస్తారో?సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద భారీ క్యూలు -
అదుపు తప్పి ఆటో బోల్తా
తణుకు అర్బన్: ఆటో అదుపు తప్పి ఓ సైక్లిస్టును ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తేతలి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం తణుకు బ్యాంక్ కాలనీలోని గుఱజాడ స్కూలుకు మండలంలోని ముద్దాపురం గ్రామం నుంచి ఆటో బయలుదేరింది. ఇందులో 9 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. జాతీయ రహదారిపైకి వచ్చే సరికి ఆటో అదుపు తప్పి సైకిల్పై వెళ్తున్న సత్యనారాయణను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు, ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థిని తిరుపతిపాటి ఆకాంక్షకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను తణుకులోని ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన విద్యార్థులను యాజమాన్యం మరొక వాహనంలో పాఠశాలకు పంపించారు. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ దండు అశోక్వర్మ, తణుకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా ప్రాంతంతోపాటు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ దివ్యాంగుడు కాగా ఇతనికి డ్రైవింగ్ లైసెన్సు లేదన్నారు. ఎడమకాలు పనిచేయకపోయినప్పటికీ ఆటో నడుపుతున్నాడని దీంతో అదుపు తప్పిన ఆటో ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆకాంక్ష తీవ్రంగా గాయపడ్డ సైక్లిస్టు సత్యనారాయణ సైక్లిస్టుకు, విద్యార్థినికి తీవ్ర గాయాలు -
శ్రీవారి కొండపై కొమ్మల తొలగింపు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన, శివాలయం–పాత కేశఖండనశాల మెట్ల మార్గంలో పెరిగిన చెట్ల కొమ్మలను, పొదలను దేవస్థానం సిబ్బంది తొలగిస్తున్నారు. క్షేత్ర పరిసరాల్లో విష సర్పాల బెడదపై శనివారం సాక్షి దినపత్రికలో ‘పాములు కరుస్తున్నా.. పట్టదా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. వెంటనే శివాలయం– పాత కేశఖండనశాల మెట్ల మార్గంలో ఇరువైపులా ఉన్న పొదలను, దారి కనబడకుండా మూసివేసిన చెట్ల కొమ్మలను తొలగించారు. కొండపైన రహదారికి ఇరువైపులా, పలు ప్రాంతాలో దట్టంగా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ యూత్ వింగ్కు జిల్లా నుంచి ఇద్దరు
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు రాష్ట్ర పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కందుల దినేష్ రెడ్డిని వైఎస్సార్సీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. అలాగే ఏలూరు నియోజకవర్గానికి చెందిన గేదెల సూర్యప్రకాష్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరిద్దరూ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు. -
ధాన్యం కమీషన్.. సొసైటీల పరేషాన్
● సుమారు రూ.92 కోట్లు బకాయిలు పడ్డ కూటమి ప్రభుత్వం ● ఆర్థిక భారంతో కష్టతరంగా సొసైటీల మనుగడ భీమవరం: ధాన్యం కొనుగోలు కమీషన్ అందక సహకార సంఘాల మనుగడ కష్టతరంగా మారింది. కూటమి ప్రభుత్వం జిల్లాలోని సహకార సంఘాలకు సుమారు రూ.92 కోట్లు బకాయిలు పడడంతో వాటిని వెంటనే చెల్లించాలని సహకార సంఘాల పాలకవర్గాలు, ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒకప్పుడు రైతులనుంచి మిల్లర్లు, ధాన్యం కమీషన్ ఏజెంట్ల ధాన్యం కొనుగోలు చేసేవారు. దీంతో వారి ఇష్టారాజ్యంగా ఉండేది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేపట్టడంతో మిల్లర్లు, ఏజెంట్ల హవాకు గండిపడింది. ధాన్యం అమ్ముకున్న రైతులకు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం సొమ్ములు జమచేయడంతో రైతుల సంతోషానికి అవధుల్లేవు. రైతు భరోసా కేంద్రాలతోపాటు సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తూ సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేసినందుకు క్వింటాళ్లకు సుమారు రూ.32.50 కమీషన్ చెల్లించేది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 122 సహకార సంఘాలుండగా వాటిలో 115 సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో దాదాపు రూ.92 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కమీషన్ సొమ్ములు బకాయి పడడంతో ప్రస్తుత సార్వా సీజన్లో ధాన్యం కొనుగోలులో వాటి పాత్ర ఏమిటనేది ప్రశ్నర్థాకంగా మారింది. కమీషన్ బకాయిలు చెల్లించాలని ఇటీవల సహకార సంఘాల పాలకవర్గాలు, అధికారులు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. సంచుల భారం సైతం సొసైటీలదే అసలే ధాన్యం కొనుగోలు కమీషన్ అందక అవస్థలు పడుతున్న సహకార సంఘాలకు రైతులకు ఇవ్వాల్సిన సంచుల భారం కూడా పడడంతో రవాణా, హమాలీల చార్జీలతో తలకుబొప్పికడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రైతులకు ధాన్యం పట్టుబడికి సంచులు రైస్ మిల్లర్ల నుంచి సరఫరా అవుతుండగా జిల్లాలో సహకార సంఘాలు సరఫరా చేయాలని అధికారులు ఆదేశించడం విడ్డూరంగా ఉందని సహకార సంఘాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్ల నుంచి సహకార సంఘాలు సంచులు తెచ్చి రైతులకు ఇవ్వాల్సి ఉండడంతో వారినుంచి వచ్చే సంచుల కట్టల్లో తక్కువగా ఉండడం, చిరిగిన సంచులు రావడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన టార్ఫాలిన్స్ కూడా సహకార సంఘాలే సమకూర్చాలని ఆదేశించడం సంఘాలకు ఆర్థిక భారంగా మారిందంటున్నారు. దీనికితోడు రైతు సేవా కేంద్రాల్లోని కొందరు అధికారులు ధాన్యం కమీషన్ ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇప్పటికే తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా మిగిలిన చోట్ల మరో 10, 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కమీషన్ సొమ్ములు చెల్లిస్తే సహకార సంఘాలు మనుగడ సాగిస్తాయని లేకుంటే ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోలవరం ప్యాకేజీపై దర్యాప్తు చేయాలి
కొయ్యలగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేస్తున్న ప్యాకేజీపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శనివారం రామానుజపురం గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిర్వాసితులకు అందజేస్తున్న నష్టపరిహారం గురించి కూటమి పెద్దలే స్వయంగా అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నష్ట పరిహారాన్ని అందజేయడంలో దళారులు రాజ్యమేలుతుందని ఇటీవల డీసీఈబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఆరోపించడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు ప్రారంభమైందన్నారు. పార్టీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గొడ్డటి నాగేశ్వరరావు, ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు, కోనే నాగసూరి, తోట జయబాబు, చిక్కాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మోంథా ముంచేసింది
పెదపాడు మండలం వట్లూరుకు చెందిన ఇంటూరి నాగు కౌలు రైతు. ఎకరాకు ఇంతవరకూ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేశాడు. మరో 10 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవని, కనీసం పెట్టుబడులైనా దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట పూర్తిగా నేలవాలిందని, గింజ రంగు మారిపోయి తాలుగింజలు అవ్వడంతో భారీ నష్టం మిగిలిందని వాపోతున్నాడు. ప్రభుత్వం సాయం చేయకపోతే అప్పుల పాలుకాక తప్పదంటున్నాడు. పెదపాడుకు చెందిన మానం సత్యనారాయణ పెద్ద కౌలు రైతు. 40 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వాతావరణం గత వారం వరకు బాగుండటంతో వచ్చే నెలాఖరుకల్లా పంట అమ్మకం పూర్తి చేసి పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు జమ చేయాలనుకున్నాడు. ఈలోపు తుపాను దెబ్బకు పంట నేలకొరగడం, కుళ్ళిపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చే పంట ఇప్పుడు 15 బస్తాలు కూడా దాటదు. దానిలో రంగుమారిన గింజ ఎక్కువగా ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయరు. కౌలురైతు కావడంతో తమకేమీ రాదని, తమను పట్టించుకునేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళీ ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు పెట్టుబడి పెడితేనే గానీ ఉన్న నాలుగు గింజలు బయటకు రాని పరిస్థితని వాపోతున్నాడు. -
రచయిత్రి సత్యవతికి సాహిత్య పురస్కారం
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రముఖ కథా రచయిత్రి పీ సత్యవతికి 2025 సంవత్సరానికి శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అందచేయనున్నట్టు గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహన గుప్తా ప్రకటించారు. శుక్రవారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏటా తన జన్మదినం సందర్భంగా తన తండ్రి కృష్ణమూర్తి పేరిట ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ప్రకటిస్తున్నామని, ఈ ఏడాది ఎంపికై న సత్యవతికి పురస్కారంతోపాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక, రూ.3 లక్షల నగదు అందజేయనున్నట్లు తెలిపారు. 1989లో ప్రారంభించిన గుప్తా ఫౌండేషన్ ద్వారా ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రెడ్క్రాస్ భవనం తలసేమియా బ్లాక్పై రెండో అంతస్తు నిర్మాణా నికి రూ.60 లక్షలు, రూరల్ మండలం శ్రీపర్రులో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రూ.లక్ష రూపాయలు వ్యయంతో 15 మంది పోలియో వ్యాధిగ్రస్తులకు కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆడిటర్ డీవీ సుబ్బారావు, అంబికా గ్రూప్ సంస్థల అధినేత అంబికా కృష్ణ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
మోంథా పంజా
ఆటపాక కేంద్రంపై కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా రాష్ట్రంలో పేరు గడించిన ఆటపాక పక్షుల విహార కేంద్రంపై మోంథా తుపాను విరుచుకుపడింది. ఆహ్లాదాన్ని ఆవిరి చేసింది. అతిథ్యం కోసం విదేశాల నుంచి వస్తున్నా వలస పక్షులను భయపెట్టింది. తుపాను దాటికి గూళ్ళలో పక్షి కూనలు అల్లాడిపోయాయి. దీంతో పక్షుల కేంద్రాన్ని ఆరు రోజులుగా మూసివేశారు. శీతాకాలం వలస పక్షులకు అనువైన కాలం. ఇటువంటి తరుణంలో తుపాను ప్రభావం పక్షులపై పడుతోంది. ప్రతతి ఏటా కార్తీకమాసంలో పక్షుల వీక్షణకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. వేసవి కాలంలో నీరు లేకపోవడం, వర్షాకాలంలో గట్లు కొట్టుకపోవడం పరిపాటిగా మారుతుంది. ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువు 275 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అరుదైన విదేశీ పెలికాన్ పక్షులు అధిక సంఖ్యలో ఇక్కడకు రావడంతో పెలికాన్ ప్యారడైజ్గా దీనికి నామకరణ చేశారు. కొల్లేరులో దాదాపు 186 రకాల పక్షి జాతులు సంచరిస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో 156 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. వీటిపై పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి గావిస్తున్నాయి. ప్రస్తుతం 3,500 పెలికాన్ పక్షులు నివసిస్తున్నాయి. సాధారణ సమయంలో ఆటపాక విహార చెరువు 3 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. దీనిని మరింత లోతు చేయాలని ప్రతిపాదనలు పెడుతున్నా అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరతతో కార్యరూపం దాల్చడం లేదు. మోంథా మోత మోగించింది మోంథా తుపాను కొల్లేరు ప్రక్షుల కేంద్రంపై ప్రభావం చూపింది. ఆటపాక పక్షుల కేంద్రం సమీపంలో పోల్రాజ్ డ్రెయిన్(నాగరాజు కాల్వ) ఉంది. ఇది బుడమేరు, తమ్మిలేరు వంటి ఏరుల నుంచి వచ్చే నీటిని కొల్లేరుకు చేరుస్తుంది. ప్రతి ఏటా డ్రెయిన్ నుంచి ఏర్పరిచిన తూములతో నీటిని పక్షుల కేంద్రానికి నింపుతారు. పక్షుల కేంద్రం, పోల్రాజ్ డ్రెయిన్ గట్టు ఒకటే కావడంతో గట్లు మునిగి నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం నీటి వరవడికి పక్షుల కేంద్రం గట్లు పూర్తిగా కోతగా గురయ్యాయి. కేంద్రంలో ఈసీ సెంటర్ ఆవరణలో నీరు చేరింది. నీటి ప్రవాహం తగ్గకపోతే పక్షుల కేంద్రం చెరువు మరింత ప్రమాదంలో పడుతుంది. పట్టించుకోని ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తామని గొప్పలు చెబుతున్నా ప్రభుత్వం కొల్లేరు పర్యాటక అభివృద్ధికి పైసా విదల్చడం లేదు. ఇటీవల ప్రకటించిన పర్యాటకాభివృద్ధి ప్రణాళికలో కొల్లేరు అంశమే లేదు. ప్రధానంగా ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధి పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లాలో ప్లేమింగో ఫెస్టివల్ పేరుతో ప్రతి ఏటా పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వపరంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్క పర్యాయం పెలికాన్ ఫెస్టివల్ చేసినా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఆటపాక పక్షుల కేంద్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. ఆటపాక పక్షుల కేంద్రం నుంచి ఈసీ కేంద్రం వరకు 600 మీటర్ల రోడ్డులో మోంథా తుపాను వల్ల 200 మీటర్లు కోతకు గురైంది. చెరువు చుట్టూ పలు ప్రాంతాల్లో గట్లు దెబ్బతిన్నాయి. పక్షుల కేంద్రాన్ని పూర్తిగా ఎండగట్టి మార్చి నెలలో లోతు తవ్వడంతో పాటు గట్లును ఎత్తు పెంచుతాం. ప్రస్తుతం నీరు తగ్గగానే దెబ్బతిన్న గట్లుకు మరమ్మతులు చేస్తాం. – కే.రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు. ఆపదలో ఆటపాక పక్షుల కేంద్రం తుపాను దాటికి చెరువు గట్లు ధ్వంసం భారీ వర్షాలకు విహార కేంద్రం మూసివేత అటవీశాఖ నిర్లక్ష్యంతో గట్ల పటిష్ట పనుల ఆలస్యం -
తప్పు ఒప్పుకున్న టీడీపీ నేత
● ఐఎస్ జగన్నాథపురంలో శాంతించిన వరి రైతులు ● న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో వరి పంటలు నీట మునగడానికి ఓ టీడీపీ నేత కారణమైన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుని ఆ నేత సోదరుడు (టీడీపీ నేత) శుక్రవారం రైతుల ముందు తప్పయ్యిందని ఒప్పుకున్నాడు. అలాగే రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు శాంతించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రైతులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా గురువారం ఉదయం ఎర్రచెరువు తూముకు ఉన్న లాకును ఎత్తేశాడు. దీంతో సుమారు 30 మంది రైతులకు చెందిన 40 ఎకరాల వరి పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందని రైతులు గగ్గోలు పెట్టారు. అలాగే తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ‘సాక్షి’లో శుక్రవారం ‘పచ్చనేత నిర్వాకంపై రైతుల గగ్గోలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ దుర్గా మహాలక్ష్మి, మండల వ్యవసాయాధికారి చెన్నకేశవులు, ఆర్ఐ సత్యం, వీఆర్వో సత్యనారాయణ శుక్రవారం నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. అయితే పంట పొలాల్లోకి నీరు ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని రైతులు పట్టుబట్టారు. దీంతో నీరు వదిలిన నాయకుడి సోదరుడు వచ్చి, తన అన్న అందుబాటులో లేడని, జరిగింది తప్పేనని ఒప్పుకున్నాడు. అలాగే అధికారులు న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇకపై రైతులు ఎవరైనా పొలాలకు నీరు పెట్టుకోవాలంటే ముందుగా పంచాయతీ అధికారుల అనుమతి పొందిన తర్వాతే చెరువు తూముకు ఉన్న లాకును ఎత్తాలని అధికారులు సూచించారు. -
నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె
కై కలూరు: కై కలూరు మేజర్ పంచాయతీలో కాంట్రాక్టు సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో శనివారం నుంచి విధులకు హాజరుకాలేమని పంచాయతీ ఈఓ ప్రసాద్కు కార్మికులు శుక్రవారం నోటీసు అందించారు. శానిటేషన్, విద్యుత్, వాటర్ వర్ట్స్, రిక్షా పుల్లర్స్, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా దాదాపు 85 మందికి రూ.56 లక్షల జీతాలను చెల్లించాల్సి ఉంది. జీతాలు చెల్లించకపోతే విధులకు రాలేమని కార్మికులు తెగేసి చెప్పారు. దీనిపై పంచాయతీ ఈవో ప్రసాద్ను వివరణగా కోరగా సమస్యను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లానని, జిల్లా పంచాయతీ అధికారిని కలిసి సమస్యను తెలియజేశానన్నారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు, సాంకేతిక అంశాల వల్ల జీతాలు చెల్లింపు ఆలస్యమైందని, ప్రత్యేకాధికారి ద్వారా సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. ఏలూరు(మెట్రో): మీ డబ్బు.. మీ హక్కు నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం కార్యక్రమం పోస్టర్లను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పౌరులు తమ పేరు మీద ఉన్న క్లయిమ్ చేయని లేదా మరిచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులను సరైన పత్రాలతో పొందవచవ్చన్నారు. కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంకు మేనేజర్తో పాటు జిల్లాలోని బ్యాంకుల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తా మన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నీలాద్రి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, కృత్తిక దీపోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రా రంభమయ్యాయి. అర్చకులు వేదాంతం శేషు ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, నవ కలశ పంచామృత స్నపన, స్వామి వారి ప్రత్యేక అలంకరణ, పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం వినియోగం నిర్వహించారు. ఆ లయ ఈఓ సాయి పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భీమవరం అర్బన్: మండలంలోని గొల్లవానితిప్ప, యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యాలతిప్ప, గూట్లపాడు, తోకతిప్ప, నాగిడిపాలెం, లోసరి గ్రామాలను ఆనుకుని యనమదుర్రు డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మోంథా తుపాను కారణంగా ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఎర్రకాలువకు వరద పోటు ఎక్కువై యనమదుర్రు డ్రెయిన్ ద్వారా నీరు ఉప్పుటేరులో కలుస్తోంది. డ్రెయిన్ను ఆనుకుని వరి చేలు, చేపలు, రొయ్యలు చెరువులు ఉన్నాయి. డ్రెయిన్ ఉధృతంగా ప్రవహించడంతో తమ చేలల్లోని ముంపు నీరు లాగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి దుబ్బులు కుళ్లిపోతున్నాయని, మరో మూడు, నాలుగు రోజులు ఇలానే ఉంటే తీవ్ర నష్టం తప్పదని వాపోతున్నారు. -
ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన
భీమవరం (ప్రకాశంచౌక్): కార్తీకమాసం పదో రోజు గునుపూడి పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో సీహెచ్ రవిబాబు కుటుంబ సభ్యులు లక్ష పత్రి పూజ నిర్వహించారు. స్వామికి ఏకాదశి మహా రుద్రాభిషేకం అనంతరము లక్ష బిల్వార్చన, రుద్ర హోమం నిర్వహించారు. గునుపూడిలో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో కార్తీకమాసం 10వ రోజు సుమారు 4 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు, సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సప్తాహ మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆలయంలో శుక్రవారం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ ఆలయ కమిటీ, భక్తుల సహకారంతో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, సప్తాహ మహోత్సవాలు సైతం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 7 రోజుల పాటు నిర్విరామంగా భక్తి సంకీర్తనలు చేసిన భక్త బృందాలకు వేదాశీర్వాదం గావించినట్లు చెప్పారు. నవంబర్ 2న గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. భీమడోలు: జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద వృద్ధురాలి మెడలోంచి ఐదు కాసుల బంగారు ఆభరణాలను తెంపుకపోయారు. ఉంగుటూరు మండలం కై కరానికి చెందిన కుమారి బైక్పై భర్తతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం భీమడోలు వచ్చింది. పనులు ముగించుకుని కై కరం వెళ్తుండగా కురెళ్లగూడెం కొండాలమ్మ గుడి వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి కుమారి మెడలోని సుమారు ఐదు కాసుల సూత్రాల నానుతాడు, నల్లపూసల తాడును లాక్కుని తాడేపల్లిగూడెం వైపు పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉంగుటూరు: బైక్పై ఉంగుటూరు వస్తున్న తండ్రీ కూతుళ్లు యర్రచెరువు వద్ద ట్రాక్టరును తప్పించే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో కూతురు ఓలేటి వరలక్ష్మికి కాలు విరిగింది. ఆనందరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముదినేపల్లి రూరల్: రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు తెంపుకుని పారిపోయిన సంఘటన మండలంలోని వడాలిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన నక్కా సత్యవతి కిరాణా షాపులోకి వెళ్లి సరుకులు కొనుక్కుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు మోటారుసైకిల్పై వేగంగా వచ్చి సత్యవతి మెడలో ఉన్న రెండు కాసుల బంగారు నానుతాడు లాక్కొని పరారయ్యారు. సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభధ్రరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాములు కరుస్తున్నా.. పట్టదా?
ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై విషసర్పాల సంచారం ఎక్కువైంది. భక్తులతో పాటు దేవస్థానం సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 8లో uచంద్రబాబు పాలనలో రైతులకన్నీ కష్టాలే మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గణపవరం: చంద్రబాబు పాలనలో రైతులకు ఎప్పు డూ న్యాయం జరగలేదని, కనీసం ఇప్పుడైనా మోంథా తుపానుతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. శుక్రవారం ఆయన కాశిపాడు, పిప్పర, కోమట్లపాలెం గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం జ రిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయంలో తు పాను తుడిచి పెట్టేసిందని రైతులు బోరుమన్నారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ గత ప్ర భుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు ఉ చిత పంటల బీమా అమలు చేసి ఆదుకున్నారని, అ యితే కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను దూరం చేసి రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. గణపవరం మండలంలో 2,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు అఽధికారులు అంచనా వేశారని, నష్టపోయిన రైతులందరికీ పంట రుణా లు రద్దుచేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులనూ ఆదుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ స లహాసంఘం మాజీ అధ్యక్షుడు వెజ్జు వెంకటేశ్వరరావు, సర్పంచ్లు కురెళ్ల వెంకటరత్నం, మల్లంపల్లి సు రేష్, నాయకులు ఐఎన్ రాజు తదితరులు ఉన్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
కలిదిండి(కై కలూరు): పాము కాటుకు గురైన వివాహిత చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల విజయ(32) భర్త దుర్గారావుతో కలసి చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. దుర్గారావు పెయింటర్గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కొట్టులో పాల ప్యాకెట్టు తీసుకురావడానికి వెళ్ళిన ఆమె కాలిని పాము కరిచింది. గమనించి కలిదిండి ప్రభుత్వాసుపత్రి, అక్కడ నుంచి కై కలూరు సీహెచ్సీ, చివరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త దుర్గారావు ఫిర్యాదుతో కలిదిండి పోలీసులు కేసు నమోదు చేశారు. -
క్రీడలతో దేహదారుఢ్యం
చింతలవల్లి(ముసునూరు): క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు సమయ పాలన వంటి లక్షణాలు అలవడతాయని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడు–కొత్తూరులో గత వారం రోజులుగా జరిగిన 70 వ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీల విజేతలకు సర్పంచ్ పి.సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం రాత్రి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత 70 ఏళ్ళ నుంచి, చెడుగుడు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాలను విజయవాడ స్కై టీమ్, గోగులంపాడు శ్రీకృష్ణ టీమ్, జూనియర్స్ విభాగంలో గోగులంపాడు–1, గోగులంపాడు–2 టీంలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. విజయం సాధించిన జట్లను మాజీ ఎమ్మెల్యే అభినందించి సీనియర్లకు నగదు బహుమతులు అందించారు. జూనియర్లకు తాడిగడప శ్రీనివాస రావు, తొర్లపాటి శ్రీనివాసరావు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ కృష్ణంరాజు, వైస్ ఎంపీపీ రాజానాయన, సొసైటీ మాజీ అధ్యక్షుడు సుగసాని శ్రీనివాసరావు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పల్లిపాము సూర్య, మాజీ ఉపసర్పంచ్ చాకిరి రామకృష్ణ, చింతా వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
రేపే శ్రీవారి తెప్పోత్సవం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 2న రాత్రి స్వామివారి తెప్పోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి, గట్లపైన, పుష్కరణి పరిసరాల్లోని చెట్లకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. దాంతో అవి విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. పుష్కరిణి ముందు ఏర్పాటు చేసిన స్వామి భారీ విద్యుత్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. తెప్పను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవం జరిగే ఆదివారం నాడు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భారీగా జరుగుతున్న ఏర్పాట్లు -
ప్రైవేటీకరణ ప్రయత్నాలను తిప్పికొడదాం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా కూటమి సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ ఏ లూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జ యప్రకాష్ (జేపీ) పిలుపునిచ్చారు. మెడికల్ కా లేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కండ్రికగూడెం సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించలేక కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి పారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా పేదలకు వైద్యాన్ని దూరం చేసిందన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్య వ్యాపారానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాయకులు గుడిదేసి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, దాసరి రమేష్, జిజ్జువరపు విజయ నిర్మల, పిట్టా ధనుంజయ్, చిలకపాటి డింపుల్ జాబ్, కిలారపు బుజ్జి, కొల్లిపాక సురేష్, మరడా అనిల్, బుద్దాల రాము, సముద్రాల చిన్ని తదితరులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. -
9,200 హెక్టార్లలో వరికి నష్టం
ఉంగుటూరు: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో 9,200 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాల్లో తెలుస్తుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉంగుటూరు, నాచుగుంట కాగుపాడు, నారాయణపురం ఆయకట్టులో దెబ్బతిన్న చేలను ఎమ్మెల్యే ప త్సమట్ల ధర్మరాజుతో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంట రక్షణకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 3,200 హెక్టార్లలో వరి దెబ్బతిందని, అరటి, మినుము పంటలు కూడా దెబ్బతిన్నాయని కలెక్టర్ అన్నారు. ఆర్డీఓ అచ్చుత అంబరీష్, వ్యవసాయ శాఖ జేసీ హబీబ్ బాషా తదితరులు ఉన్నారు. -
పాములు కరుస్తున్నా.. పట్టదా?
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై విష సర్పాల సంచారం అధికమైంది. దాంతో భక్తులతో పాటు క్వార్టర్స్లో నివాసం ఉంటున్న దేవస్థానం సిబ్బంది సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో ఎటు నుంచి పాములు వస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక పాదయాత్ర భక్తులైతే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. ఫలితంగా పలు ప్రధాన మార్గాల్లో పొదలు, చెట్ల కొమ్మలు పెరిగిపోయాయి. అయినా వాటిని పట్టించుకునే నాధుడు లేడు. కనీసం భక్తులు ప్రమాదాల భారిన పడుతున్న మార్గాల వైపు కూడా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల జరిగిన ఒక ఘటనే ఇందుకు దర్పణంగా నిలుస్తోంది. చాట్రాయి మండలం, చిన్నంపేట గ్రామానికి చెందిన అన్నపరెడ్డి భారతి, మరో పది మంది భక్తురాళ్లు పాదయాత్రగా ఈనెల 26న రాత్రి క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగా వారు నిత్యాన్నదాన భవనంలో స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆ తరువాత శివాలయం–పాత కేశఖండనశాల మెట్లు మార్గం గుండా నడుచుకుంటూ ఆలయానికి వెళుతున్నారు. ఆ సమయంలో కట్లపాము భారతి చేతి వేలుపై కరిచింది. వెంటనే ఆలయ ప్రథమచికిత్సా కేంద్రం సిబ్బంది ఆమెను దేవస్థానం ఆంబులెన్స్లో స్థానిక పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీవారి దయవల్ల భారతికి ఏమీ కాలేదు. జరిగి ఐదు రోజులైనా.. ఈ ప్రమాదం జరిగి ఐదు రోజులైనా శివాలయం–పాత కేశఖండనశాల మెట్లు మార్గంపై అధికారులు దృష్టి సారించలేదు. ఫలితంగా ఆ మార్గం ఇంకా పొదలు, చెట్ల కొమ్మలతోనే దర్శనమిస్తోంది. ప్రస్తుతం కొందరు భక్తులు ఆ మార్గంలోంచే రాకపోకలు సాగిస్తున్నారు. దాంతో భక్తులకు ఏదీ.. రక్షణ అని అధికారుల తీరుపై పలువురు ధ్వజమెత్తుతున్నారు. సిబ్బంది క్వార్టర్స్లలోకి.. శ్రీవారి దేవస్థానం ఈఓ డ్రైవర్ శ్రీనివాస్ నివాసం ఉంటున్న క్వార్టర్స్లోకి ఇటీవల తాచుపాము ప్రవేశించి, పెంపుడు హచ్ కుక్కను కరవడంతో అది మృతి చెందింది. పది రోజుల క్రితం అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఫణి క్వార్టర్స్లోకి, తాజాగా గురువారం ఉదయం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ క్వార్టర్స్లోకి పాములు ప్రవేశించాయి. గోసంరక్షణశాలలోకి తరచూ పాములు వెళుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చుట్టూ పొదలు పెరగడమే ఇందుకు కారణం. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాముల నివారణకు చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. శ్రీవారి భక్తులకు ఏదీ రక్షణ.! శివాలయం పాత మెట్ల మార్గంలో.. ఇరు పక్కలా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలు ఐదు రోజుల క్రితం పాదయాత్ర భక్తురాలిని కరిచిన కట్లపాము ఆ మార్గాన్ని నేటికీ పట్టించుకోని అధికారులు -
రహ‘దారుణాలు’
● నరకానికి ‘దారులు’ ● అడుగడుగునా గోతులు ● వర్షం కురిస్తే చెరువులే.. కై కలూరు: చినుకుపడితే రోడ్లు తటాకాలుగా మారుతున్నాయి.. ఏ రోడ్డు చూసినా భారీ గోతులు, వర్షం నీటితో నరకానికి నకళ్లుగా భయపెడుతున్నాయి. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న రహదారులు మోంథా తుపాను తాకిడికి మరింత దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా రోడ్లు మరింత అధ్వానంగా మారి ప్రమాదాలకు నిలయమయ్యాయి. ప్రధానంగా కొల్లేరు పరీవాహక ప్రాంతమైన కై కలూరు నియోజకవర్గంలో రోడ్లపై అడుగుపెట్టేందుకు ప్రజలు హడలిపోతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో సుమారు 84 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దీంతో ఆక్వా ఉత్పత్తులతో భారీ లారీల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అధిక లోడు వాహనాలతో గ్రామీ ణ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికే గుంతల పడిన రోడ్లలో వర్షం నీరు నిలిచి మరింత దెబ్బతింటున్నాయి. జాతీయ రహ‘దారి’ద్య్రం పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (ఎన్హెచ్–165) కూడా అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల విస్తరణ పనులకు డబుల్ లైన్ల రోడ్డుగా తవ్వారు. అయితే పలుచోట్ల పనులు ఆలస్యం కావడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్హెచ్పై పలు ప్రాంతాల్లో గుంతలు పడ్డాయి. ఈ గుంతల్లో వర్షం నీరు నిలిచి ప్రమాదకరంగా మారాయి. చెరువు ఊటతో దెబ్బ అక్వా చెరువులు అధికంగా రహదారుల సమీపంలో ఉన్నాయి. జాతీయ, గ్రామీణ రహదారుల కిందకు చెరువుల నీటి ఊట చేరడంతో భూమి గుల్లగా మారి త్వరగా పాడవుతున్నాయి. కలిదిండి మండలంలో మద్వానిగూడెం–పెదలంక, మూలలంక–పెదలంక, ఆరుతెగళపాడు, కాళ్లపాలెం, కొండూరు రహదారులు, ముదినేపల్లి మండలం సింగరాయపాలెం–కోరుకొల్లు, జాతీయ రహదారి నుంచి కోడూరు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. కలిదిండి మండలంలో పెదలంక రోడ్డుముదినేపల్లి మండలం పెదకామనపూడి వద్ద.. -
పచ్చనేత నిర్వాకంపై రైతుల గగ్గోలు
● ఐఎస్ జగన్నాధపురంలో నీట మునిగిన 40 ఎకరాల వరి పంట ● లబోదిబోమంటున్న బాధిత రైతులు ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్ జగన్నాధపురంలో ఓ టీడీపీ నాయకుడి నిర్వాకం కారణంగా చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల కథనం ప్రకారం. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని ఎర్ర చెరువు పూర్తిగా నిండిపోయింది. అయితే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గురువారం ఉదయం రైతులకు గాని, అధికారులకు గాని సమాచారం ఇవ్వకుండా చెరువు తూముకు ఉన్న గేటును ఎత్తేశాడు. దాంతో చెరువు కింద ఉన్న ఆయకట్టులో సుమారు 40 ఎకరాల వరి పంట నీట మునిగింది. విషయం తెలుసుకున్న దాదాపు 30 మంది బాధిత రైతులు తమ పొలాల వద్దకు చేరుకుని, నీటమునిగిన పంటను చూసి లబోదిబోమన్నారు. వెంటనే లాకును మూసివేసి, ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్ఐ సత్యం, వీఆర్వో సత్యన్నారాయణ, పంచాయతీ కార్యదర్శి సాయిరామ్ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రేపు తహసీల్దార్ వచ్చి చూస్తారని చెప్పి ఆర్ఐ సత్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. లాకు ఎందుకు ఎత్తావని టీడీపీ నాయకుడిని ప్రశ్నించగా, మీకు చేతనైంది చేసుకోమన్నాడని రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. మరో రెండు రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నీట మునిగిందని, మొలకలు వచ్చి, పంట కుళ్లిపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు టీడీపీ నాయకుడు అసలు లాకు ఎందుకు ఎత్తాడో తెలియడం లేదని వాపోతున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
నేటినుంచి శోభనాచలుని బ్రహ్మోత్సవాలు
ఆగిరిపల్లి: కలియుగ వైకుంఠం.. శోభనగిరి క్షేత్రంలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం, కృత్తిక దీపోత్సవ కార్యక్రమాలను శుక్రవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఘనంగా నిర్వహించినున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సీహెచ్ సాయి, ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు విశేష పూజలు జరుపనున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, నవ కలశ పంచామృత స్నపన, పూర్ణహుతి, 1వ తేదీన అష్టోత్తర శత రజిత తులసీదళార్చన, నిత్య హోమం, బేరి పూజ, బేరి తాడనం, ధ్వజారోహణం, 2 వ తేదీన శ్రీవారి శోభనగిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు. 3న కొండపై స్వామివారు వెలిసిన మూడు గుళ్ల వద్ద స్వామివారికి శాంతి కల్యాణం, 4న దివ్య తిరు కల్యాణం, గరుడ వాహనోత్సవం, 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అవబృదోత్సవం, చక్రస్నానం, సాయంత్రం ఆలయం కోవెల వద్ద కృత్తికా దీపోత్సవం కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రతిరోజు స్వామి వారికి సుప్రభాత సేవ, ఆలయ నిత్య పూజ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవ విశేష పూజలు, నిత్య హోమాలు, సాయంకాలార్చనలు, నీరాజన మంత్రపుష్ప తీర్థ ప్రసాద వినియోగలను ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆలయ ఈవో సాయి తెలిపారు. -
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. నిట్ విద్యా సంస్థలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ స్పార్క్ 1.0 అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్షాపు గురువారం ప్రారంభించారు. విభాగం అధిపతి డాక్టర్ కర్రి ఫణికృష్ణ అధ్యక్షత వహించారు. దినేష్ శంకరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించకుని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలని సూచించారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పారు. విద్యార్ధులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను సాధించే దిశగా అడుగులు వేసి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. డీన్లు ఎన్.జయరామ్, వి.సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించాలన్నారు. కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఫణికృష్ణ మాట్లాడుతూ వర్క్షాపులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కోఆర్డినేటర్లు డాక్టర్ శంకర్ పెద్దపాటి, తేజావతు రమేష్, డాక్టర్ కిరణ్ తీపర్తి, అల్లంశెట్టి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. -
కలెక్టరమ్మా.. మా కన్నీళ్లు చూడమ్మా!
● కొల్లేరు ప్రజల వేడుకోలు ● మోంథా తుపానుకు మునిగిన కీలక రోడ్డు కై కలూరు: కలెక్టరమ్మా.. మా రోడ్డు దుస్థితి చూడమ్మా.. అంటూ కై కలూరు మండలం శృంగవరప్పాడు, గుమ్మళ్లపాడు, పందిరిపల్లిగూడెం, లక్ష్మీపురం, గోకర్ణపురం ప్రజలు వేడుకున్నారు. మోంథా తుపాను దాటికి గోకర్ణపురం నుంచి పైడిచింతపాడు రోడ్డులో మూడు ప్రాంతాల్లో రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వడ్డీ సాధికారిత కమిటీ చైర్మన్ బలే ఏసురాజు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల ప్రజలు ముంపు బారిన పడిన రోడ్డును గురువారం పరిశీలించారు. పలువురు మాట్లాడుతూ గోకర్ణపురం నుంచి పైడిచింతపాడు, ప్రత్తికోళ్ళలంక, గుడివాకలంక, చాటపర్రు మీదుగా ఏలూరు పట్టణం, అదే విధంగా పైడిచింతపాడు నుంచి చెట్నెంపాడు, ఆగడాలలంక, గుండుగొలును మీదుగా ద్వారకాతిరుమల సమీపంలో హైవే వెళ్లడానికి ఈ రోడ్డు ఎంతో కీలకమన్నారు. ప్రముఖ కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం చేరడానికి ఈ రోడ్డును భక్తులు, ప్రజలు ఉపయోగిస్తారన్నారు. అటువంటిది మూడు చోట్ల నీరు రోడ్డు పైనుంచి ప్రవహిస్తుండటంతో ప్రయాణాలు నిలిచాయన్నారు. దీంతో కై కలూరు, ఉండి, ఆకివీడు మీదుగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందన్నారు. ఎత్తుతో రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ను కోరారు. బలే ఏసురాజు మాట్లాడుతూ ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్కు రోడ్డు నిర్మాణం కోసం వినతిపత్రం అందించినట్లు తెలిపారు. అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో గమ్మళ్లపాడు సర్పంచ్ కొయ్యే గంగయ్య, ఆయా గ్రామాల పెద్దలు బలే సముద్రుడు, ఘంటసాల జగన్నాథం, రామారావు, దుర్గారావు ప్రజలు పాల్గొన్నారు. -
ఏరు దాటితేనే.. బతుకు పోరు
● కోమటిలంక ప్రజల అవస్థలు ● మోంథా తుపాను ధాటికి పొంగిన డ్రెయిన్ ● విద్యకు దూరమవుతున్న చిన్నారులు కై కలూరు: ప్రభుత్వాలు మారుతోన్నా.. ఏలూరు జిల్లా కోమటిలంక ప్రజల కష్టాలు తీరడం లేదు. మోంథా తుపాను దాటికి పోల్రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కోమటిలంక గ్రామం చుట్టూ నీటితో కొల్లేరులో ద్వీపకల్పంగా ఉంటుంది. గ్రామ ప్రజల రాకపోకలకు కై కలూరు మండలం ఆటపాక పక్షుల దొడ్డి గట్టు ఒక్కటే ఆధారం. కోమటిలంక గ్రామంలో దాదాపు 110 మంది విద్యార్థులు పాఠశాల, కాలేజీ చదువులు కై కలూరులో కొనసాగిస్తున్నారు. కోమటిలంక నుంచి సమీప సరిహద్దు ఆటపాక పక్షుల విహార చెరువు గట్టు దాటడానికి మధ్యలో పోల్రాజ్ కాల్వ ఉంటుంది. ఇక్కడ నుంచి పడవలో ప్రజలు దాటి పక్షుల కేంద్రం గట్టుపై నుంచి ద్విచక్ర వాహనాల్లో కై కలూరు చేరతారు. ఇలా నిత్యం జరుగుతుంది. పక్షుల విహార కేంద్రం అటవీశాఖ అభయారణ్య పరిధిలో ఉండటంతో పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. గర్భిణుల పాట్లు వర్ణనాతీతం కోమటిలంక గ్రామంలో గర్భిణుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆస్పత్రికి తీసుకురావడానికి పోల్రాజ్ డ్రెయిన్ దాటాల్సి వస్తుంది. పూర్వం అనేక మంది తుపాను సమయాల్లో డ్రెయిన్ దాటి మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. విషపురుగులు కరిస్తే సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లలేకపోతున్నారు. తక్కువ నీరు ఉన్నప్పుడు తాత్కలిక రోడ్డు ద్వారా వాహనాలతో కోమటిలంక ప్రజలు రాగలుతున్నారు. భారీ వర్షాలు, తుపాను సమయాల్లో పడవలపై దాటుతున్నారు. మోంథా తుపాను కారణంగా పోల్రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజులుగా చిన్నారులు పాఠశాలలకు రావడం లేదు. గురువారం కై కలూరులో డిగ్రీ చదువుతున్నా విద్యార్థి అతికష్టం మీద పడవపై ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా గ్రామం నుంచి ప్రతి రోజూ డ్రెయిన్ దాటి కై కలూరు కాలేజీకి వెళుతున్నాను. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. వంతెన నిర్మించాలని ఎంతో మంది కోరుతున్నాం. గ్రామంలో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. తుపానుల సమయంలో దినదిన గండంగా బయటకు వస్తున్నాం. ఇప్పటికై నా వంతెన నిర్మించండి. – పి.మంజు, డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థి, కోమటిలంకఉధృతంగా ప్రవహిస్తున్న పోల్రాజ్ డ్రెయిన్ అవతల కోమటిలంక గ్రామం -
అన్నదాత కుదేలు
అన్నదాతను మోంథా తుపాను కుదిపేసింది. వారం రోజుల్లో కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో తుపాను ధాటికి వరి కంకులు నేలకొరిగాయి. వేలాది ఎకరాల్లో వరితో పాటు మినుము, ఇతర వాణిజ్య పంటలు, పూల సాగు ఇలా అన్నీ భారీ నష్టాన్ని చవిచూశాయి. జిల్లాలో తుపాను నష్టం అంచనా రూ.100 కోట్లపై మాటే. మళ్లీ కోతలకు పెట్టుబడులు రెట్టింపు కావడం, తాలు గింజలతో పాటు దిగుబడి గణనీయంగా పడిపోవడం ఇలా ఎటు వైపు చూసినా పూర్తి నష్టాన్ని రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో సుమారు 26 వేల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఉంగుటూరు, దెందులూరు, కై కలూరు, ఏలూరు నియోకవర్గాల్లో వరికి అపారనష్టం వాటిల్లగా చింతలపూడి, పోలవరం, నూజివీడు నియోజకవర్గాల్లో మినుము, పత్తి ఇతర వాణిజ్య పంటలతో పాటు పూల తోటలకు నష్టం వాటిల్లింది. ఖరీఫ్ వరి సీజన్ మరో వారంలో ముగింపు దశకు చేరి జిల్లావ్యాప్తంగా కోతలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గోనె సంచులు మొదలు కొనుగోళ్ల వరకూ అన్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిన తుపాను పిడుగుపడటంతో కనీసం పెట్టుబడులు కూడా దక్కక పూర్తిగా విలవిలాడుతున్నారు. ఎకరాకు రూ.20 వేలు అదనపు భారం సాధారణంగా ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. అయితే వరి పూర్తిగా నేలకొరగడంతో ఎకరాకు 15 బస్తాల తాలు గింజలు రావడం, దీంతో పాటు సాధారణంగా గంటన్నరలో ఎకరా పంట కోత పూర్తయ్యే పరిస్థితి. అయితే పొలాల్లో నీరు నిలవడం, పంట నేలకొరగడంతో 4 నుంచి 5 గంటల కోత సమయం పట్టనుంది. దీంతో పెట్టుబడులు పెరగడం, కోత, కూలీ ఖర్చులు పెరగడం, నాణ్యత తగ్గిపోయి గింజ నల్లబడటంతో కనీస ధరలు కూడా దక్కని పరిస్థితి. మొత్తంగా ఎకరాకు సుమారు రూ.20 వేల వరకూ అదనపు భారం పడనుందని అంచనా. ‘కౌలు’కునేదెలా..? జిల్లాలో 2 లక్షలకుపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు బీమా, సబ్సిడీ, ఎటువంటి పథకాలు వర్తించడం లేదు. దీంతో కౌలురైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పంటకు ఉచిత పంటల బీమాను వర్తింపజేశారు. అయి తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీ మాకు స్వస్తి పలికింది. దీంతో జిల్లావ్యాప్తంగా 10 శాతం రైతులు కూడా బీమా చేయించని పరిస్థితి. ప్ర భుత్వం ఆదుకుంటామని, ఎన్యూమరేషన్ ఇస్తామ ని ప్రకటించిందిగానీ ఆంక్షలు విధిస్తే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ–క్రాప్తో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను నమోదు చేయడంతో పాటు కౌలు రైతుల పేర్లను కూడా నమోదుచేసి ఆహార పంటలకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున ఇస్తేనేగానీ అన్నదాత కోలుకోలేని పరిస్థితి. తుపానుతో పంగిడిగూడెంలో సుమారు వెయ్యి ఎకరాల వరకు పంటకు నష్టం వాటిల్లింది. కూటమి ప్రభుత్వంలో పంటల బీమాకు ఇబ్బంది పడ్డాం. బీమా ఉంటే ఇప్పుడు పరిహారం వచ్చేది. అయితే ఆ పరిస్థితి లేదు. బాధిత రైతులందరికీ నష్టపరిహారం తక్షణం అందించాలి. నేలవాలిన వరి పంట కోత కోస్తే ఎకరానికి 5 నుంచి 10 బస్తాలు మాత్రమే వస్తుంది. యంత్రంతో కోతకు గంటకు రూ.6 వేల వరకూ ఖర్చవుతుంది. అధికారులు నిష్పక్షపాతంగా పంట నష్టం సర్వే చేయాలి. – కోట వెంకటేశ్వరరావు, వరి రైతు, పంగిడిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయగూడెం మండలం నూ తిరామన్నపాలెం సమీపంలో నే ను నాలుగు ఎకరాల్లో 1001 రకం వరి పంట వేశాను. సుమా రు రూ.2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో పంట కోసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే తుపాను ప్రభావంతో పండిన పంటలో మూడున్నర ఎకరాలు నీట మునిగింది. వరి కంకులు నీటిలో తడిసిపోయాయి. దీంతో నాకు రూ.1.50 లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. – కోర్సా లక్ష్మి, గిరిజన రైతు, ఎన్ఆర్పాలెం, బుట్టాయగూడెం మండలం పెదపాడు మండలంలో నేలకొరిగిన వరిచేను కొవ్వలి హైవే సమీపంలో నేలకొరిగిన పంట నిండా ముంచిన ‘మోంథా’ వరిసాగు అతలాకుతలం జిల్లాలో 26 వేల ఎకరాలకు పైగా పంట నష్టం మినుము రైతులకూ అపార నష్టం వాణిజ్య పంటలదీ అదే పరిస్థితి రైతులపై అదనపు పెట్టుబడుల భారం జిల్లాలో అన్నదాతలకురూ.100 కోట్లకు పైగా నష్టం నియోజకవర్గాల వారీగా కై కలూరులో 3,330 ఎకరాలు, పోలవరంలో 4,485, ఉంగుటూరులో 5,540, దెందులూరులో 1,050, ఏలూరు రూరల్లో 1,500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇక నూజివీడులో 1,900 ఎకరాల్లో, చింతలపూడిలో 813 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా 20 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మినుము, 2,400 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో మొక్కజొన్న, 167 ఎకరాల్లో వేరుశెనగ, 80 ఎకరాల్లో పూలతోటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. -
ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్
ఏలూరు టౌన్: ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన పోలీస్ ఓపెన్ హౌస్ ఆ కట్టుకుంది. ఏలూరులోని పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రజలు భారీ సంఖ్యలో ఓపెన్ హౌస్ను సందర్శించా రు. కేసుల దర్యాప్తులో వినియోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరా లు, ఆధునిక డ్రోన్స్, పోలీస్ జాగిలాలు, ఆ యుధాలు ఆకట్టుకున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఓపెన్ హౌస్ను నిర్వహించగా జిల్లా ఎ స్పీ ప్రతాప్ శివకిషోర్ విద్యార్థులతో మమేకమయ్యారు. పోలీస్ దర్యాప్తులో క్లూస్టీం, కమ్యూనికేషన్ వ్యవస్థ, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ పరికరాలు, డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్ పనితీరును వివరించారు. పోలీస్ విధుల్లో వినియోగించే ఆయుధాలు ఎస్ఎల్ఆర్, ఏకే–47, ఎంపీ5కే, టియర్గ్యాస్ గన్స్, జాకెట్స్, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది విధులపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పుతో కృషి చేయాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ హబీబ్ బాషా, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఏఆర్ ఆర్ఐలు పవన్కుమార్, సతీష్, ఈగల్ ఆర్ఎస్ఐ ఉదయ్భాస్క ర్, ఐటీ కోర్ ఇన్చార్జి నరేంద్ర, అమరేశ్వరరావు, సత్యనారాయణ, వెంకటేశులు తదితరు లు పాల్గొన్నారు. -
చెరువుల్లా రోడ్లు.. ప్రజలకు పాట్లు
చేపలకు గాలం వేస్తూ వైఎస్సార్సీపీ నిరసనఏలూరు టౌన్: తాము అధికారంలోకి వస్తే రోడ్లన్నీ తళతళా మెరిపిస్తామంటూ కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా హామీలు తీరే ‘దారి’ కానరావడం లేదు. ఏలూరులోని 18వ డివిజన్ వంగాయగూడెం నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కార్పొరేటర్ కేదారేశ్వరి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్టీయూసీ నగర అధ్యక్షు డు ఘంటా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ నేతలతో కలిసి రోడ్డు గుంతల్లో చేపలు పట్టేందుకు గాలం వేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జే పీ మాట్లాడుతూ కూటమి నేతలకు ప్రజలు పడు తున్న కష్టాలు కనిపించటం లేదనీ, 18 నెలలుగా గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయటాన్ని ప్రజలు హర్షించరన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడటాన్ని జేపీ తప్పుబట్టారు. త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టకుంటే ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లేందుకు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వాహనదారులు తరచూ ప్రమాదాల బారి న పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర అ ధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్ జాబ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలారపు బుజ్జి తదితరులు ఉన్నారు. -
తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి
మండవల్లి: మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంట పొలాలకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండలంలోని అయ్యవారిరుద్రవరంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి, ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం అంచనాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 800 ఎకరాలు దెబ్బతిన్నట్టు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని వారికి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర వాణిజ్యవిభాగ కార్యదర్శి, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మైనార్టీ విభాగ కార్యదర్శి ఎండి గాలీబ్, మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి యేసోబురాజు, మండల రైతువిభాగ అధ్యక్షుడు బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బోణం శేషగిరి, జిల్లా యాక్టివ్ సెక్రెటరీ నాగదాసి థామస్, కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు పాము రవికుమార్, మెండా సురేష్బాబు, కై కలూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు సమయం రామాంజనేయలు, కై కలూరు మండల రైతు విభాగ అధ్యక్షుడు సలాది వెంకటేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు చిన్ని కృష్ణ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పెంటా అనిల్, నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షులు మండా నవీన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇంటి నాగరాజు, కుంచే రాజేష్, కుంచే వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
రైతులను ఆదుకుంటాం
నూజివీడు: మోంథా తుపానుతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, పంటలు దెబ్బతిన్న ప్రతి రైతు వివరాలను నమోదు చేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వీ తెలిపారు. గురువారం ఆమె మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రామన్నగూడెంలో దెబ్బతిన్న మినుము, పత్తి, మీర్జాపురంలో వరి పంటలను పరిశీలించారు. తుక్కులూరులో రామిలేరుపై ఉన్న లోలెవెల్ కాజ్వేను పరిశీలించారు. అలాగే తుక్కులూరు పునరావాస కేంద్రంలోని ఐదుగురు వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగలేదని, వరి, మినము పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేయాలని అధికారులకు ఆ దేశించారు. నూజివీడు మండలంలో మినుము పంట ఎక్కువగా దెబ్బతిందన్నారు. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టామని, తుపానుతో నష్టపోయా మని పలువురు రైతులు కలెక్టర్ వద్ద వాపోయారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్ హబీబ్ బాషా, నూజివీడు మండల ప్రత్యేక అధికారి, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కె.సంతోష్, తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సుమారు 4 గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. పోలవరం నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్పారు. బుట్టాయగూడెంలో 9 సెం.మీ, కొయ్యలగూడెంలో 7, జీలుగుమిల్లిలో 2, టి.నర్సాపురంలో 8, కుక్కునూరులో 4, వేలేరుపాడులో 4, పోలవరంలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసంది. దీంతో కొండవాగులు పొంగిపొర్లాయి. కేఆర్పురం సమీపంలోని కొండవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగుకు ఇరువైపు లా రాకపోకలు మూడు గంటలపాటు నిలిచిపోయాయి. ఐటీడీఏ పీఓ రాములునాయక్, బుట్టాయగూడెం తహసీల్దార్ చలపతిరావు ప్రవాహం తగ్గే వరకూ ప్రజలెవ్వరూ వాగు దాటకుండా చర్యలు చేపట్టారు. నందాపురం సమీపంలోని అల్లికాల్వ, బైనేరు వాగుతోపాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. కొయ్యలగూడెం: తుపాను ప్రభావంతో కురి సిన భారీ వర్షాలకు కాలువలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురంలో కాజ్వేపై నుంచి పడమటి కాలువ ప్రవహించడంతో కొయ్యలగూడెం–బుట్టాయగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాజ వరం వద్ద బైనేరు, పులివాగు కాలువలు కలవడంతో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తూ వంతెనను తాకుతూ పరవళ్లు తొక్కింది. కొయ్యలగూడెం మండలంలో మంగపతిదేవిపాలెం, జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య ఉన్న సప్టాపై ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో ఇటుగా రాకపోకలకు ఆటంకం కలిగింది. ఏజెన్సీ కొండ ప్రాంతాల నుంచి వర్షం నీరు ముంచెత్తుతోంది. పొక్లయిన్తో తూర్పుకాలువ వద్ద అడ్డుగా ఉన్న తూడును తొలగించారు. -
దోపిడీకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు: గత ప్రభుత్వంలో రాష్టంలో 17 ప్ర భుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే కూ టమి ప్రభుత్వం మాత్రం దోపిడీ చేసేందుకే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టనుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. మండలంలోని సిద్ధార్ధనగర్, సుంకొల్లు గ్రా మాల్లో మెటికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యసేవలందించేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. ఐదు కళాశాలలు పూర్తికాగా విద్యార్థులు చదువుకుంటున్నారని, మిగిలినవి వివిధ దశల్లో ఉండగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమవ్వడం దారుణమన్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చుచేస్తే అన్ని కళాశాలలూ అందుబాటులోకి వస్తాయని, అయితే ప్రభుత్వం ఆ పని చేయకుండా మాయమాటలతో ప్రజలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. భవిష్యత్ తరాల ఆస్తి అయిన వైద్య కళాశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలు చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నాయకులు రామిశెట్టి కృష్ణ, కిషోర్, మాజీ జెడ్పీటీసీ బాణావతు రాజు, సుంకొల్లు సర్పంచ్ దుడ్డు నాగమల్లేశ్వరరావు, కొనకాల శ్రీనివాసరావు, ముల్లంగి జమలయ్య, మాజీ సర్పంచ్ కొనకాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించాలి ఈ ఏడాది జూన్లోనే ప్రారంభించాల్సిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించకుండా కావాలని జా ప్యం చేస్తున్నారని, దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని, కేంద్రీయ విద్యాల యాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నను మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. గురువారం ఆయన సబ్ కలెక్టర్ను కలిసి సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. -
జీఎస్టీ జాయింట్ కమిషనర్ తీరుపై నిరసన
ఏలూరు టౌన్: సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వాణిజ్య పన్నుల శాఖలో సిబ్బంది పట్ల ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందని.. ఆధునిక యుగంలోనూ కిందిస్థాయి సిబ్బంది పట్ల అంటరానితనం ప్రదర్శిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఏలూరు వన్టౌన్ జీఎస్టీ కార్యాలయం వద్ద వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నేతలు, సిబ్బంది నిరసన ప్రదర్శన చేశారు. చిత్తూరులో వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ) జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్రెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అటెండర్ల పట్ల చులకన భావనతో చూడటంతో పాటు తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ సిబ్బంది మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కే.చిట్టిబాబు తెలిపారు. తన ముందు చెప్పులు వేసుకుని రాకూడదంటూ చెప్పటం అతని అహంకారానికి నిదర్శనం అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఏలూరులోనూ విధులను బహిష్కరించి నిరసన తెలిపామన్నారు. జాయింట్ సెక్రటరీ జీ.జాన్బాబు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా నిరసన తెలిపుతున్నామని, వెంటనే అధికారిని బదిలీ చేయటంతోపాటు, మరోసారి కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. -
పంట నష్ట నివారణ చర్యలు ఇలా
కై కలూరు : మోంథా తుపాను ప్రభావంతో వరి పొలాల్లో వర్షపు నీరు చేరిన రైతులు నీటిని బయటకు తోడి గింజ మొలకెత్తకుండా 5 శాతం ఉప్పుద్రావణం పిచికారీ చేయాలని కై కలూరు వ్యవసాయశాఖ సహాయసంచాలకులు ఏ.పార్వతీ చెప్పారు. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో తుపాను దాటికి పంట ఒరిగిన చేలను వ్యవసాయాధికారి విద్యాసాగర్తో కలసి బుధవారం పరిశీలించారు. ఏడీ మాట్లాడుతూ కై కలూరు మండలంలో 2,500 వరి విస్తీర్ణానికి 300 ఎకరాలు, కలిదిండి మండలంలో 1,500 ఎకరాలకు 600 ఎకరాల్లో పంట నేలకొరగడం, నీరు చేరడం జరిగిందన్నారు. పూర్తి నష్ట అంచనాలను వేస్తున్నామన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో 1310, స్వర్ణ, సంపద స్వర్ణ, 1140 రకాలను సాగు చేస్తున్నారన్నారు. పంట నష్ట నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వీలైనంత వరకు పొలంలో నిలచిన నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ● గింజలు రంగు మారడం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మి.లీ. ప్రోపికొనజోల్ పిచికారీ చేయాలి. ● వర్షాలు తగ్గిన తరువాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిన్ 1మి.లీ/లీటరు, కొసైడ్ (కాపర్ హైడ్రాకై ్సడ్) 2.0 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● తక్కువ సమయంలో, ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీకి అందుబాటులో ఉన్న డ్రోన్లను ఉపయోగించుకోవాలి. ● నిలిచిఉన్న, పడిపోయిన చేలలో కంకిపై గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లుప్పు / లీటరు నీటికి)కలిపి పిచికారీ చేయాలి. ● నూర్చిన ధాన్యం 2 – 3 రోజులు ఎండ బెట్టడానికి వీలు కాకపోతే కుప్పల్లో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ● ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు,, 20 కిలోల పొడి ఊక లేదా ఎండుగడ్డి కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల వారం రోజులపాటు గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా నివారించుకోవచ్చు. ● ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిలవ చేసుకోవాలి. -
మురుగునీటి పారుదలకు మార్గం సుగమం
పాలకొల్లు సెంట్రల్: అగ్రికల్చరల్ మార్కెట్ యార్డు ప్రహరీ గోడ మునిసిపల్ డ్రెయినేజీలో పడిపోవడంతో మురుగునీరు పారుదల లేకుండా పోయింది. దీనిపై ఈ నెల 25వ తేదీన ‘వర్షానికి కూలిన ఏఎంసి ప్రహరీ’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై మునిసిపల్ అధికారులు స్పందించారు. మురుగునీరు పారుదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొక్లెయిన్తో ప్రహరీగోడ శిథిలాలను తొలగించారు. మురుగునీటి పారుదలకు మార్గం సుగమం చేశారు. దీంతో తుపాను ప్రభావం వల్ల కురిసిన వర్షానికి మురుగునీరు పారుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో స్థానిక ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన ప్రహరీగోడను తొలగించడంలో మాత్రం స్పందించాల్సిన ఏఎంసీ అధికారులు మొద్దునిద్రను వీడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడు: ఖరీఫ్ సాగులో రైతులు తెగుళ్ల బెడదతో బెంబేలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని వరి చేలకు ఆకుపచ్చ తెగులు, ముడత, పండాకు తెగులు, కోడు వంటివాటితో సతమతమవుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి చేలు ఈనిక, గింజ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ దశలో తెగుళ్ల బారిన పడటం వల్ల కుదుళ్లకు నష్టం వాటిల్లి దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా మోంథూ తుపాను తాకిడికి మండలంలోని పలు గ్రామాల్లో 600 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది. దీనికితోడు ఎగువ ప్రాంతం నుంచి ముంపునీరు భారీగా చొచ్చుకువస్తుండడంతో రానున్న రోజుల్లో ఇంకా వందల ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని కడకట్ల ఫ్లైౖఓవర్ రోడ్డులోని లక్ష్మీసాహితీ ఆటో కన్సల్టెన్సీ ఫైనాన్స్ షాప్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. షాపులో 44 ద్విచక్రవాహనాలు ఉండగా 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. 3 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసినట్లు ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదని అధికారులు చెప్పారు. నష్టం వివరాలు తెలియరాలేదు. -
కొల్లేరులో కల్లోలం
కై కలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే మార్గాలైన పెదఎడ్లగాడి వంతెన, పోల్రాజ్ కాల్వ, ఉప్పుటేరులో రోజురోజుకు నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పెనుమాకలంక రహదారి రెండు వారాలుగా నీటిలో నానుతోంది. తాజాగా గోకర్ణపురం – పైడిచింతపాడు రోడ్డు వరద నీటికి మునిగింది. రహదారి మార్గాలు మూసుకుపోవడంతో సమీప గ్రామాల ప్రజలు పనులు లేక అల్లాడుతున్నారు. సాధారణంగా తుపానులు, భారీ వర్షాలు కురిసిన నాలుగు రోజులకు కొల్లేరులో నీటి ఉధృతి పెరుగుతోంది. మోంథా తుపానుకు ముందు బంగాళాఖాతంలో అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు కొల్లేరుకు భారీ వర్షపు నీరు చేరింది. తాజాగా తెలంగాణలో సైతం తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. రోజురోజుకు నీటిమట్టం పెరగడంతో కొల్లేరు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రహదారులకు రాకపోకలు బంద్ కొల్లేరుకు చేరుతున్న భారీ వర్షాలకు రహదారులు నీట మునుగుతున్నాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక గ్రామానికి చేరే రోడ్డు రెండు వారాలుగా నీటిలో నానుతోంది. దీంతో పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, శ్రీరామ్నగర్ వెళ్లే ప్రజలకు రహదారి సౌకర్యం లేదు. అదే విధంగా మోంథా తుపాను దాటికి కై కలూరు మండలం గోకర్ణపురం నుంచి ఏలూరు చేరే రహదారిపై నుంచి కొల్లేరు నీరు ప్రవహిస్తోంది. ప్రధానంగా ఏలూరు, చాటపర్రు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, పైడి చింతపాడు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం చేరడానికి 22 కిలోమీటర్లతో దగ్గర మార్గంగా ఉంది. రోడ్డు మూసుకుపోవడంతో 35 కిలోమీటర్లు చుట్టూ తిరిగి కై కలూరు మీదుగా రావాల్సి వస్తుంది. మరిన్ని రహదారులు మునిగే అవకాశం కనిపిస్తోంది. ఉప్పుటేరు ఉధృతం కొల్లేరు నీటిని సముద్రానికి పంపించడానికి ఏకై క మార్గంగా ఉన్న ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పుటేరు పరివాహక గ్రామాలకు మంపు ముప్పు పొంచి ఉంది. కై కలూరు మండలం కొట్టాడ, రాజుల కొట్డాడ, జంగంపాడు పల్లెపాలెం రేవుల వద్ద నీటి మట్టం పెరిగింది. కొల్లేరులో ఇప్పటికే చేపల చెరువుల్లో నీరు గట్టుల వరకు ఉంది. భారీ వరద నీటికి గట్లు తెగితే ఆ నీటితో మరింత ప్రమాదంగా మారుతుంది. పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.57 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇది 3 మీటర్లకు చేరితే ప్రమాదమని అధికారులు చెప్పారు. వలలను కాపాడుకోడానికి పోల్రాజ్ కాల్వ వద్ద సిద్ధంగా ఉంచిన ఇసుక బస్తాలు మండవల్లి మండలం కాకతీయనగర్ వద్ద ఉధృతంగా పోల్రాజ్ కాల్వ మోంథా తుపానుతో భారీగా వర్షంనీరు కొల్లేరులో నీట మునిగిన రహదారులు చిగురుటాకుల వణుకుతున్న లంక గ్రామాల ప్రజలు పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.57 మీటర్ల నీటిమట్టం నమోదు -
నిండు జీవితాల్లో విషాదం
● ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు ● ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరూ మృతి భీమడోలు: సంసారంలో ఒడిదిడుకులను తట్టుకోలేక, అవమానభారంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య గుండుమోలు భానుపూర్ణిమ (22) సోమవారం రాత్రి మృతి చెందగా భర్త సుధాకర్ (29) బుధవారం వేకువజామున మృతి చెందాడు. భానుపూర్ణిమ మృతదేహానికి విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించారు. సుధాకర్ మృతదేహానికి గుంటూరు ఆసుపత్రిలో పోలీసులు పోస్ట్మార్టమ్ నిర్వహించి ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి బుధవారం సాయంత్రం తరలించారు. దీంతో భీమడోలు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంసారంలో కుదుపు ఐదేళ్ల కితం గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు. సుధాకర్ మంచి వ్యక్తిగా అందరితో కలివిడిగా ఉండేవాడు. గ్రామంలోని కటారి మోహన్ నాగ వెంకట సాయి అనే యువకుడు భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి అమ్మవారి కుంకుమను ఇచ్చి నమ్మబలికి ఈనెల 6న ఆమెను ఇంటి నుంచి తీసుకుని వెళ్లాడు. బాధితురాలిని విజయవాడ తీసుకుని వెళ్లగా చనిపోతానని, ఇంటికి తీసుకు వెళ్లమని గొడవ చేయగా ఈనెల 19న భీమడోలు తీసుకువచ్చాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర అవమానభారంతో బాధపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుధాకర్ తన భార్యను వదులుకోలేక తీవ్ర వేదనకు గురయ్యాడు. తాను మానసిక వేదనకు గురయ్యాయని, నా జీవితాన్ని నాశనం చేశాడని, మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాల్లో పంపి ఈనెల 25న రాత్రి కూల్డ్రింక్లో కలుపు మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరు ఆసుపత్రిలో చిక్సి పొందుతున్న ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కరోజు గడువులో కన్నుమూశారు. నిందితుడు కటారి మోహన్ నాగ వెంకటసాయిను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. -
అపార పంట నష్టం
కొల్లేరులో కల్లోలం కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. 8లో uసంసారంలో ఒడిదొడుకులు తట్టుకోలేక, అవమానభారంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. 8లో uగురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సంస్థకు రూ.35.96 లక్షల నష్టం వాటిల్లింది. 20 11 కేవీ ఫీడర్లు తుపాను కారణంగా ప్రభావితమయ్యాయి. ఎనిమిది 33 కేవీ స్తంభాలు, 11 కేవీ స్తంభాలు 66, 109 లో టెన్షన్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 22 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో 129 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 107 చెట్లు కూలిపోయాయి. 4 పశువులు మృతి చెందగా ఒక ఇల్లు దెబ్బతింది. తుపాను నిమిత్తం వైద్యారోగ్యశాఖ 318 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 148 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 474 డ్రెయిన్లలో సిల్ట్ తొలగించారని సంబంధిత శాఖాధికారులు నష్టం వివరాలను అంచనా వేశారు. గురువారంలోపు నష్టం అంచనాలు తుపాను తీవ్రత తగ్గడంతో గురువారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను ముగిసిపోవడంతో బుధవారం రాత్రి వరకే 90 సహాయ కేంద్రాలను నిర్వహిస్తామని, 3,420 కుటుంబాలకు చెందిన 7 వేల మందికి భోజన వసతి కల్పించామని, బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంటనూనె, రెండు రకాల కూరగాయలు 2 కిలోల చొప్పున, మనిషికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేలు అందిస్తామని ప్రకటించారు. శాఖల వారీగా గురువారంలోపు నష్టం అంచనాలను సిద్ధం చేయనున్నారు. ప్రధానంగా విద్యుత్, వ్యవసాయ, ఆర్అండ్బీ శాఖలతో పాటు ఇతర శాఖల నుంచి నష్టం అంచనా నివేదికలు తెప్పించి ప్రభుత్వానికి పంపనున్నారు. కై కలూరు: మోంథా తుపాను నష్టాలను ప్రభుత్వ శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో నివారించామని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ చెప్పారు. నియోజకవర్గంలో కై కలూరు, భైరవపట్నం గ్రామాల్లో కొనసాగుతున్న తుపాను పునరావాస కేంద్రాలను బుధవారం సందర్శించారు. నిర్వాసితులకు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ పెద్ద తుపానును పోలీసు, రెవెన్యూ ఇతర శాఖలతో కలసి ఒక్క ప్రాణనష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా తక్షణం తొలగించారన్నారు. ముందస్తు చర్యల వల్ల ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయం అవసరం రాలేదన్నారు. పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కై కలూరు టౌన్, రూరల్ సర్కిల్ సీఐలు ఏవీఎస్.రామకృష్ణ, వి.రవికుమార్, ఎస్ఐలు డి.వెంకట్ కుమార్, ఆర్.శ్రీనివాస్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో తుపాను ప్రభావం తగ్గడం వల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల భవనం, ప్రాంగణం మొత్తం పరిశీలించాలని, ఎక్కడైనా తుపాను వల్ల చెట్లు, లేదా కొమ్మలు లేదా బిల్డింగు పైకప్పు పెచ్చులు సరిగా ఉన్నాయా, టైల్స్ ఊడిపోయాయా అని పరిశీలించాలని సూచించారు. తాగునీటి ట్యాంకులు, హ్యాండ్ పంప్లు, ట్యాపులు పరిశీలించి నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. పాఠశాల పరిసరాలలోని విద్యుత్ లైన్న్లు, సాకెట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా సరిచూడాలని, ఎక్కడైనా నీరు నిలిచిపోవడం, విద్యుత్ ప్రమాదం, గోడ కూలే పరిస్థితి, లేదా విద్యార్థులకు ప్రమాదకర వాతావరణం ఉంటే పాఠశాలను తాత్కాలికంగా మూసివేసి వెంటనే ఎంఈఓ/డీవైఈఓ/డీఈఓ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఏలూరు(మెట్రో): ప్రస్తుత సీజన్లో రైతుల నుంచి రికార్డు స్థాయిలో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం మాట్లాడుతూ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లతో చర్చించామన్నారు. పంట నష్టాలపై ఈ నెల 30 లోగా నివేదికలు అందించాలని ఆదేశించామన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో 10 నుంచి 30 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, అవసరం ఉన్న రైతులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు ధర పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు ధర పెరిగింది. మంగళవారం ధర రూ.455 ఉండగా.. బుధవారం మరో రూపాయి పెరిగి రూ.456కు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఎన్ఎల్ఎస్ ఏరియాలో ఐదు వేలం కేంద్రాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలతో పాటు కొయ్యలగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా కేజీ ఒక్కింటికి రూ.456 లభించింది. గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో రూ.455 లభించింది. లోగ్రేడ్ పొగాకుకు మాత్రం సరైన ధర లభించడం లేదు. లోగ్రేడ్ పొగాకు బుధవారం కేజీ ఒక్కింటికి రూ.50 మాత్రమే లభించింది. ఎన్ఎల్ఎస్ పరిధిలో ఇప్పటి వరకు సరాసరి ధర కేజీ ఒక్కింటికి రూ.305.01 లభించింది. విశాఖ సిటీ: మోంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్కు రూ.10.47 కోట్లు నష్టం సంభవించింది. అధికారులు విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. 7,973 మంది విద్యుత్ సిబ్బందితో 523 బృందాలుగా నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కువ నష్టం జరిగిన కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి సర్కిళ్లలో ఇప్పటివరకు 13,56,415 సర్వీసు కనెక్షన్లకు గాను 13,02,948 పునరుద్ధరించారు. గురువారం నాటికి విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: మోంథా తుపాను తీరం దాటింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు కొంతమేర ఊపిరిపీల్చుకున్నా.. తుపాను తీవ్రతతో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. 20 వేలకుపైగా ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయాయి. కోత దశకు వచ్చిన వరి, మినుము, ఇతర ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఇంకోవైపు వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. తుపాను తీవ్రతకు గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు అన్ని నియోజకవర్గాల్లో పంట నష్టం భారీగా వాటిల్లింది. ప్రధానంగా కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఎక్కువ నష్టం జరిగింది. వ్యవసాయశాఖాధికారుల పంట నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 5,540 ఎకరాలు, కై కలూరు నియోజకవర్గంలో 3,336 ఎకరాలు, పోలవరంలో 4,487, ఏలూరులో 1,500 ఎకరాలు, చింతలపూడిలో 813, దెందులూరులో 1050, నూజివీడులో 1700 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం నష్టపోయిన పంటల్లో 80 శాతానికిపైగా వరి పంటే. మరో వారం రోజుల్లో కోతలు ప్రారంభం కావాల్సి ఉన్న తరుణంలో పొలాల్లోకి నీరు చేరడం, వరి కంకులు నేలకొరగడంతో నష్టం వాటిల్లింది. నూజివీ నియోజకవర్గంలో 1700 ఎకరాల్లో మినుము పంటతో పాటు 120 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మోంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో 4.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జీలుగుమిల్లిలో 1.8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దాదాపు 31 మండలాలకుగాను 25 మండలాల్లో వర్షం జాడే లేకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు పెరుగుతున్న వరద : ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కొల్లేరు సరస్సు, ఉప్పుటేరు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మోంథా తుపానుకు ముందే ఈ రెండూ నిండుగా ఉన్నాయి. సుమారు 64 ప్రధాన కాల్వల నీరు కొల్లేరుకు అక్కడి నుంచి ఉప్పుటేరుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రెండు గరిష్ట నీటిమట్టానికి చేరాయి. పెద ఎడ్లగాడి వంతెన వద్ద కొల్లేరు 2.57 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఇప్పటికే పెనుమాలంక వంతెన వారం రోజులుగా జలదిగ్భందంలో చిక్కుకుంది. 3 మీటర్ల ఎత్తు దాటితే కొల్లేరులోని చెరువుల గట్లు తెగి మత్స్యసంపదంతా కొల్లేరు పాలవడటంతో పాటు 15 లంక గ్రామాల్లోకి వరదనీరు చేరే ప్రమాదముంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా కాల్వల్లో నీరు భారీగా కొల్లేరులోకి చేరుతుంది. మరోవైపు ఉప్పుటేరుకూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. 6 అడుగుల ఎత్తులో బలమైన ప్రవాహం ఉంది. ఉప్పుటేరు వద్ద 7 అడుగులు దాటితే పలు గ్రామాల్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది. ప్రత్తికోళ్లలంకలో రోడ్డుపైకి చేరిన వర్షం నీరు భీమడోలు మండలంలో మొలకలు వచ్చిన వరి ఏలూరులో లునానినగర్ నుంచి బీడీ కాలనీకి వెళ్లే రోడ్డు ఇలా.. బుట్టాయగూడెం మండలం ఎన్ఆర్పాలెంలో మునిగిన వరి చేను వద్ద రైతు బుట్టాయగూడెం: తుపాను ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని నూతిరామన్నపాలెం, అచ్చియ్యపాలెం గ్రామాల్లో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను బుధవారం మాజీ ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఎన్నో కష్టాలు పడి రైతులు పంటలు వేశారని పంట చేతికి వచ్చే సమయానికి కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యంగా పలు చోట్ల వరిపంట పొలాల్లోకి వర్షపు నీరు చేరి అన్నిట్లోనూ వరి కంకులు నానుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, సర్పంచ్ మొడియం లక్ష్మి, నాయకులు కిరణ్, పెంటపాటి శ్రీను, పూనెం వెంకటేశ్వరరావు, ఏలేటి చంద్రం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు సహాయక చర్యలు ముమ్మరం చేయాలి ఏలూరు(మెట్రో): జిల్లాలో తుపాను సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం సహాయ కార్యక్రమాలపై జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లా యంత్రాంగం మంచి స్పూర్తితో పనిచేసిందని, అదే స్పూర్తితో సహాయక కార్యక్రమాలను చేపట్టాలని, ఆస్తి, పంట, పశు నష్టం అంచనాలను ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. నదులు, చెరువులు, వాగులు, కాలువల గట్ల పటిష్టతను పరిశీలించాలని, బలహీనంగా గట్లను పటిష్టం చేయాలన్నారు. సహాయక శిబిరాలు బుధవారం రాత్రి వరకు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలకు కేంద్రం నుంచి వెళ్లే సమయంలో కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, రెండు రకాల కూరగాయలు అందిస్తామని, చెప్పారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే మాట్లాడుతూ తుపాను అనంతరం సహాయక చర్యలను అదే స్పూర్తితో అధికారులు, సిబ్బంది చేపట్టాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తుపాను ప్రత్యేక అధికారులు అందించిన సూచనలతో ముందుగానే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 19 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు వరి పంటకు భారీ నష్టం ప్రమాద స్థాయిలో కొల్లేరు, ఉప్పుటేరు ఆక్వా చెరువుల్లో పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్ నేలకొరిగిన వందల విద్యుత్ స్తంభాలు -
కామిరెడ్డి నానీకి బెయిల్ మంజూరు
దెందులూరు: వైఎస్సార్సీపీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నానికి బుధవారం రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన యాంటిస్పేటరీ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి 55 రోజుల పాటు తనను ఇబ్బంది పెట్టారని, ఈ రోజు న్యాయం గెలిచిందని అన్నారు. తన కష్టాల్లో వెన్నంటి ఉంటూ పూర్తి సహాయ సహకారాలు, మనోధైర్యాన్ని ఇచ్చిన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి వెంకట సునీల్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్కు రుణపడి ఉంటానన్నారు. -
ఆధ్యాత్మిక సేవలు విస్తరించాలి
దెందులూరు: ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తరింపజేయాలని పోప్ లియో సూచించారని ఆర్సీఎం ఏలూరు పీఠం జనరల్ డాక్టర్ పి.బాల తెలిపారు. బుధవారం ఇటలీలో వాటికన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పోప్ లియోను ఆయన అధికార బంగ్లాలో కలిశామన్నారు. 38వ గురుత్వ పట్టాభిషేకంలోకి ప్రవేశించిన బాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా నుంచి ఏలూరు పీఠం ప్రతినిధులుగా వెళ్లిన చాన్సలర్ ఇమ్మానుయేల్, భీమవరం ఫాదర్ స్టాలిన్ మస్కాలి, పట్టణ మేయర్ వేరోనికా లుండిన్ స్కోల్ద్కి ఉన్నారు. ఇటలీలోని సిసిలీలో సెయింట్ ఆంథోనీ చర్చిలో డాక్టర్ బాల ఇటాలియన్లో ప్రత్యేక దివ్య పూజ బలి అర్పించారు. ఏలూరు టౌన్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగాయగూడెం ప్రాంతానికి చెందిన వీ.జోజి (52) స్థానికంగా ఉన్న కేన్సర్ హాస్పిటల్లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్రెయినేజీలో చెత్త తొలగించేందుకు ఇనుప ఊచతో శుభ్రం చేస్తుండగా అదే సమయంలో పక్కనే ఉన్న నీటి మోటరుకు చెందిన విద్యుత్ వైరుకు ఇనుప ఊచ తగలటంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యాయత్నం ఘటనలో భార్య మృతి
భీమడోలు: తీవ్ర మనోవేదన, అవమానాన్ని భరించలేక కలుపు మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో భార్య గుండుమోలు భానుపూర్ణిమ (22) సోమవారం రాత్రి మృతి చెందింది. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. వివరాల ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ దంపతులు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. గ్రామానికి చెందిన కటారి మోహన్ నాగ వెంకట సాయి భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి ఆమెను 15 రోజుల పాటు గ్రామాంతరం తీసుకుని వెళ్లాడు. ఆమె తనను కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్లాలని గొడవ చేయడంతో ఈనెల 19వ తేదీన భీమడోలు తీసుకుని వచ్చాడు. అయితే తీవ్ర మనోవేదన, అవమానాన్ని తట్టుకోలేక ఈనెల 25వ తేదీ రాత్రి భీమడోలు సమీపంలోని ఓ పశువుల పాకలో భార్యాభర్తలు సుధాకర్, భానుపూర్ణిమ కూల్డ్రింక్లో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని గుంటూరు ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భానుపూర్ణిమ మృతి చెందింది. భర్త సుధాకర్ పరిస్థితి విషమంగా ఉంది. ఏఎస్సై చలపతిరావు, వీఆర్వో సింహాచలం సమక్షంలో మృతురాలి మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. భానుపూర్ణిమ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమడోలు ఎస్సై షేక్ మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరిస్థితి విషమం -
కొల్లేరులో పడవ ప్రయాణాలు వద్దు
కై కలూరు/మండవల్లి: మోంథా తుపాను నేపథ్యంలో కొల్లేరు ప్రజలు పడవ ప్రయాణాలు చేయవద్దని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల మంత్రి, జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ సూచించారు. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వద్ద నీటి ప్రవాహాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. పెదఎడ్లగాడిలో గుర్రపుడెక్కను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, రాష్ట్ర వడ్డీ కార్పోరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, అధికారులు పాల్గొన్నారు. కొల్లేరు నీటిని సముద్రానికి పంపించే ఉప్పుటేరు ప్రవాహాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్ యాదవ్, డెప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రాఘరామకృష్ణంరాజు పరిశీలించారు. జంగారెడ్డిగూడెం: మోంథా తుపాను బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో షెల్టర్ను ఏర్పాటు చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్త మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయ రాజు, బత్తిన నాగలక్ష్మి నేతృత్వంలో జంగారెడ్డిగూడెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున బత్తిన చిన్న కళ్యాణ మండపం వద్ద తుపాను బాధితులకు షెల్టర్, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బత్తిన చిన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
యోగాసన పోటీల్లో సత్తా చాటిన జిల్లా జట్టు
నూజివీడు: విశాఖపట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసనా పోటీల్లో జిల్లాలోని నూజివీడు, ఆగిరిపల్లి, శోభనాపురం, వడ్లమాను తదితర గ్రామాలకు చెందిన యోగ సాధకులు ఉత్తమ ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. 38వ యోగాసనా చాంపియన్షిప్ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యండూరు నరసింహమూర్తి, ప్రధాన కార్యదర్శి బొద్దూరు సాంబశివరావు, కోశాధికారి ఏపీవీ బ్రహ్మచారి, యోగ గురువులు టీవీకె కుమార్ నేతృత్వంలో 35 మంది యోగ సాధకులు పాల్గొన్నారు. ఈనెల 25, 26 తేదీలలో జరిగిన ఈ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ నుంచి పది డివిజన్లో పోటీపడగా ఏడింటిలో విజయం సాధించారు. మహిళల విభాగంలో బొద్దూరు పద్మశ్రీలత 3వ స్థానం సాధించగా, పురుషుల విభాగంలో మూడో స్థానంలో నూజివీడుకు చెందిన పత్రి కనకభూషణం, 5వ స్థానంలో టి.సాయి ప్రసన్నలక్ష్మి, 7వ స్థానంలో కే శ్రీనివాసరావు, 8వ స్థానంలో ఎం జ్యోతి కుమారి, 9వ స్థానంలో యండూరు నరసింహమూర్తి, 10వ స్థానంలో భావన, జూనియర్స్లో ఆరో స్థానంలో ఎల్ అను నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ యోగ అసోసియేషన్ అధ్యక్షుడు కోన కృష్ణదేవరాయలు. ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్లచే షీల్డ్స్, మెడల్స్ అందజేశారు. -
తుపాను రక్షణ చర్యలపై సమీక్ష
ఏలూరు టౌన్: జిల్లాలో మోంథా తుపాను రక్షణ చర్యలపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో ప్రత్యేక అధికారి ఆక్టోపస్ డీఐజీ ఎస్.సెంఽథిల్కుమార్ మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తుపాను ముందస్తు రక్షణ చర్యలపై ఆయన సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన డీఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ముందస్తు సహాయక చర్యలపై ఎస్పీ వివరించారు. తుపాను కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని, పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏలూరు డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఈడీఆర్ఎఫ్) బృందాలు సన్నద్దం చేశామన్నారు. ఆక్టోపస్ డీఐజీ సెంథిల్ కుమార్ -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: కార్తీక మాసం మంగళవారం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి 108 ప్రదక్షణలు చేసి, స్వామిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయానికి మధ్యాహ్నం వరకు వివిధ సేవల రూపేణా రూ.4,05,550 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో సుమారు 7,300 భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు చెప్పారు. ఉంగుటూరు: కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వెదురు పావులూరి జీవమణి (33) సోమవారం రాత్రి సమయంలో పురుగుమందు తాగి అనంతరం గ్రామ ఊరచెరువులో పడి మృతి చెందింది. ఆమెకు భర్త శ్రీహరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవమణి కడుపునొప్పి తాళలేక చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జీవమణి తల్లి నూజివీటి అనుసూయ ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: కంపెనీలో పనిచేసి అదే కంపెనీ పేరు వచ్చేలా నకిలీ కంపెనీ పెట్టి కొందరిని మోసం చేసిన నేరంపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ చెప్పారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకు చెందిన వంకాయల సతీష్, పట్టణానికి చెందిన మండపాక వినోద్కుమార్లను అరెస్టు చేశామన్నారు. వివరాల ప్రకారం.. బొమ్మగాని బాలకృష్ణ ఛైర్మన్గా ఉన్న ఐఎఫ్ఎల్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్ధలో కొంతకాలం వీరంకి శ్రీరాములు, వంకాల సతీష్, మండపాక వినోద్కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరు కంపెనీ నుంచి బయటకు వచ్చి అదే పేరు వచ్చేలా ఇనాకుల ఫార్మర్స్ లైఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఐఎఫ్ఎల్) పేరుతో మరో కంపెనీ ప్రారంభించి బాలకృష్ణ కంపెనీకి చెందిన ఖాతాదారులను, రైతులను మభ్యపెట్టి మోసం చేశారని బాలకృష్ణ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వీరంకి శ్రీరాములను అరెస్టు చేయగా, అతను హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందినట్లు ఎస్సై చెప్పారు. కాగా ఈ కేసులో వంకాయల సతీష్, మండపాక వినోద్కుమార్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
నీటమునిగిన పంటలు
మరో పది రోజుల్లో వరికోతలు జరగనున్న నేపథ్యంలో పొలాల్లోకి నీరు చేరడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. భీమడోలు, దెందులూరు, చింతలపూడి అనేకచోట్ల వరిచేలు నీటమునిగాయి. 2239 ఎకరాల వరిచేలల్లోకి నీరు చేరాయని, మినుము, ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 46 చెట్లు నేలకొరగగా, వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించారు. కొల్లేరు, ఉప్పుటేరులో ప్రమాదకర స్థాయిలో నీరు చేరింది. 64 ప్రధాన కాల్వల నుంచి కొల్లేరుకు ఉద్ధృతంగా నీరు చేరడంతో నిండుకుండలా మారింది. పెదయడ్లగాడి వంతెన సమీపంలోని పెనమాకలంక రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. కలిదిండి మండలంలో కోరుకొల్లు, ఎస్ఆర్పీ అగ్రహారం, గుర్వాయిపాలెం, ముదినేపల్లి మండలంలో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. మరోవైపు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులో తుపాను పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): మోంథా తుపాను ప్రభావంతో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బుధవారం సైతం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకూ డిజాస్టర్ సెలవుగా ప్రకటించినట్టు స్పష్టం చేశారు. ఉత్తర్వులు మీరి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కుదించిన బోగీలు.. ప్రయాణికుల అగచాట్లు
ఉంగుటూరు: ఒకప్పటి పాస్టు ప్యాసింజరు.. ప్రస్తుతం విజయవాడ మొము ఎక్సుప్రెస్గా నడుపుతున్న నం.17258 రైలులో బోగీలు తగ్గించేయడంతో రైల్వే ప్రయాణికులకు ప్రయాణం కష్టతరంగా మారింది. గతంలో ఈ రైలులో 13 బోగీలు ఉండగా ప్రస్తుతం వాటిని 7కి పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు నిలబడే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. బోగీలు తగ్గించేసి గోదావరి జిల్లాల ప్రజలపై రైల్వే శాఖ చిన్నచూపు చూస్తోందంటూ సర్వత్రా విమర్శిస్తున్నారు. అనువైన రైలు.. సౌకర్యాలు లేవు ఈ రైలు కాకినాడలో తెల్లారుజాము 4.10 గంటలకు బయలుదేరి ఉదయం 9 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరిగి కాకినాడకు చేరుకునేందుకు సాయంత్రం 6.15కి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో అనువైన సమయంలో ఈ రైలు ప్రయాణం ఉండడంతో ఎక్కువమంది ఈ రైలులో ప్రయాణం సాగిస్తుంటారు. ఉదయం వచ్చే రైలులో సామర్లకోట, రాజమండ్రిలోనే ఈ రైలులోని సీట్లు పుల్ అయిపోతుంటాయి. ఆతరువాత నుంచి రైలు ఎక్కిన ప్రయాణికులు నిలబడి ప్రయాణం సాగించాల్సిందే. అలాగే ఈ రైలులో మరుగుదొడ్లు కూడా రెండుకు మించి లేవు. దాంతో అవసరాలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఉద్యోగులకు సరైన సమయం ఈ రైలు ఉదయం వేళ గోదావరి, కొవ్వూరు, పశివేదల నిడదవోలు, తాడేపల్లిగూడెం, చేబ్రోలు, పూళ్ల, భీమడోలు, ఏలూరు, పవరుపేట, నూజువీడు స్టేషన్లలో ఆగుతూ విజయవాడ చేరుతుంది. ఉద్యోగస్తులకు సరైన సమయం కావడంతో ఎక్కువగా సీజన్ టికెట్లు తీసుకుని ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. అలాగే మార్కెటు పనులమీద వెళ్లేవారికి, దైవక్షేత్రాలకు వెళ్లే వారికి ఈ రైలు చాలా అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ రైలు ద్వారా విజయవాడ చేరుకుని అక్కడ నుంచి మరో రైలు పట్టుకుని ప్రయాణం సాగిస్తుంటారు. ఇదే రైలు గుంటూరు కూడా వెళుతుంది. దాంతో ఎక్కువమంది ఈ రైలును ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి రైలులో సౌకర్యాలు పెంచాల్సి ఉండగా బోగీలను ఇంకా తగ్గించేయడంపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణికుల బాధలు పట్టించేకునే రైల్వే అధికారులు గానీ, పార్లమెంటు సభ్యులు గాని ఎవరూ లేరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాస్టుప్యాసింజరుగా పిలుచుకునే మెము ఎక్స్ప్రెస్ రైలులో బోగీల కుదింపు ప్రయాణికులకు తప్పని పాట్లు గోదావరి జిల్లాలపై రైల్వే శాఖ చిన్నచూపు! -
హడలెత్తించిన పొగ
కొయ్యలగూడెం: బయ్యన్నగూడెం సమీపంలోని పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ రైతు చేలో నుంచి వచ్చిన పొగ ప్రయాణికులను, సమీపంలోని రైతులను హడలెత్తించింది. జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని పవర్ గ్రిడ్ సమీపంలోని ఎదురుగా ఉన్న మేకల సత్యనారాయణకి చెందిన వ్యవసాయ భూమిలో మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున దట్టంగా తెల్లని పొగ అలముకుంది. ఆ ప్రాంతంలో గ్యాస్ పైపులైను ఉందని, గ్యాస్ పైప్ లైన్ లీకు కావడం వల్లే పొగ పైకి వస్తోందని ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్.నాగరాజు వెంటనే డిప్యూటీ తహసీల్దారు వెంకటలక్ష్మి, రెవెన్యూ అధికారులను ఘటనా స్థలానికి పంపారు. సత్యనారాయణ తన పొలంలో ఉన్న మినప పంటను తగలబెట్టడం వల్ల పొగ దట్టంగా కమ్ముకుందని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ పేట పార్క్ వద్ద నుంచి విజయ విహార్ సెంటర్, రైతు బజార్, శంకర మఠం, సుబ్బమ్మ దేవి స్కూలు, రమా మహల్ సెంటర్ మీదుగా ఈ బైక్ ర్యాలీ సాగింది. అనంతరం మున్సిపల్ వాటర్ సప్లై ఎస్ఆర్ 2 పాయింట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పీ. కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఏ. అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 12వ పీఆర్సీని ప్రకటించాలని, మధ్యంతర భృతి 30 శాతం చెల్లించాలని, కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అడ్డకర్ల లక్ష్మీ ఇందిర, కురెళ్ళ వరప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు బీ.నారాయణరావు, సీహెచ్.అప్పారావు, డీ. అప్పారావు, డీ.వేంకటేశ్వరరావు, కే.శ్రీనివాసరావు, బీ.దుర్గారావు, ఎస్కే.ఆలీ, పీ.దుర్గారావు, ఎస్.గౌరీ శంకర్, ఎన్.శ్రీనివాసరావు, జీ.రవి, కే.బాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తించిన మోంథా
మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏలూరులో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. 8లో uకూటమికి బుద్ధొచ్చేలా ప్రజా ఉద్యమం బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025బుట్టాయగూడెం: తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏజెన్సీలోని కొండవాగులు పొంగే ప్రదేశాలను పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కొండవాగులు పొంగే అవకాశం ఉన్నందున ఎవ్వరూ వాగులు దాటే ప్రయత్నం చెయొద్దని సూచించారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఉద్ధృతంగా ప్రవహించే కొండవాగులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. చింతలపూడి : మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మంగళవారం అధికారులు 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు నెలలుగా పడుతున్న భారీ వర్షాలకు తమ్మిలేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చనని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు. పెనుగొండ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురుగాలుల బీభత్సం అధికంగా ఉండడంతో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులు.. కురిసిన వర్షపు జల్లులతో జిల్లా తడిసి ముద్దయ్యింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి తుపాను తీరాన్ని సమీపిస్తుండటంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమీపంలోని బియ్యపుతిప్ప వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం ఆమేరకు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాలోని కొల్లేరు, ఉప్పుటేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి జిల్లాలోని అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. పునరావాస కేంద్రాలకు 1203 మంది తరలింపు మోంథా తుఫాన్ ప్రభావం జిల్లాలో బలంగా ఉంది. 13 మండలాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రకటించి అక్కడ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టింది. మంగళవారం సాయంత్రం 6.30 గంటల వరకు జిల్లాలో 201.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను తీవ్రత నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జాతీయ రహదారులు సహా జిల్లాలో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 13 మండలాల్లో 29 గ్రామాలు తుపాను ధాటికి నష్టపోయాయని, 1203 మంది 49 పునరావాస కేంద్రాల్లో ఉన్నారని, జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదని, ఆర్అండ్బీ రహదారులు 3.5 మీటర్ల మేర ధ్వంసమయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. పునరావాస కేంద్రాల్లో 1122 ఆహార పొట్లాలు, 4500 వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఇక ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కై కలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం మణుగూరులో పర్యటించి కొల్లేరు పెద యడ్లగాడి వంతెనను, ఉప్పుటేరును పరిశీలించారు. అధికారుల ఏర్పాట్లు.. మంగళవారం రాత్రి నర్సాపురం సమీపంలోని బియ్యపుతిప్ప వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో జిల్లాలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నవారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కై కలూరు, ఉంగుటూరు, నూజివీడుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు. జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఉన్న చెరువుల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అవసరమైనచోట్ల చెరువులకు గండికొట్టేలా ఆదేశాలిచ్చారు. బుట్టాయగూడెం: దేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వంలో జరగని ప్రజా ఉద్యమం కూటమి ప్రభుత్వంలో మొదలైందని వైఎస్సార్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని కోయరాజమండ్రి పంచాయతీ మెట్టగూడెంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఐదేళ్ళ జగనన్న పాలనలో కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కేవలం రెండేళ్లలోనే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి అందులో 7 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్ల దశకు తీసుకువచ్చారని చెప్పారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పూర్తయ్యాయని తెలిపారు. వీటి పనులు పూర్తవ్వడానికి కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ కళాశాలలు పూర్తయితే పేదలందరికీ మెరుగైన వైద్యం అందడంతో పాటు పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించగలరని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఈ కళాశాలల పనులు చేపట్టడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, వైఎస్సార్సీపీ నాయకులు బానోతు బాబూరావు, బానోతు కృష్ణనాయక్, కుర్సం ప్రసాద్, తెల్లం రాజు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తుపాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు, వర్షాలు అనేక మండలాల్లో నేలకొరిగిన చెట్లు వేలాది ఎకరాల్లో వరి, మినుముకు అపార నష్టం ప్రమాదకర స్థాయిలో ఉప్పుటేరు, కొల్లేరు ప్రవాహం 13 మండలాల్లో కొనసాగుతున్న హై అలెర్ట్ భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసిన వైనం తుపాను ప్రభావంతో నేడు విద్యా సంస్థలకు సెలవు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత -
గుంతల రోడ్లపై పెల్లుబికిన ప్రజాగ్రహం
ఏలూరు (ఆర్ఆర్పేట): గుంతల రోడ్లపై ప్రజాగ్రహం పెల్లుబికింది. రోడ్లకు మరమ్మతులు చేయలేరా అంటూ ఏలూరులోని వంగాయగూడెం ప్రాంత ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. మోంథా తుపాను ప్రభావంతో ఏలూరు నగరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఏలూరు నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన మార్గంగా ఉపయోగపడుతున్న వంగాయగూడెం – కేన్సర్ ఆసుపత్రి రోడ్డులో ప్రమాదకర గుంటలు ఏర్పడి, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండగా, గత ఏడాది నుంచి రోడ్డు మరమ్మతులు చేపట్టకుండా వదిలివేయడంతో వర్షాలు మొదలైనప్పుడల్లా రహదారి మొత్తం బురద గుంటలుగా మారుతోంది. చిన్న వాహనాలు, టూ–వీలర్ ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైన అత్యవసర తరుణాల్లో కేన్సర్ ఆసుపత్రికి వెళ్లే రోగుల ప్రయాణం కూడా ప్రాణాంతకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగాయగూడెం మాత్రమే కాకుండా, ఏలూరులోని హనుమాన్ నగర్ నుంచి కొత్తూరు వెళ్తున్న కాలువ పక్క రోడ్డుతో పాటు అనేక కనెక్టింగ్ రోడ్లు కూడా ఇదే దుస్థితిలో ఉన్నాయని నివాసితులు వాపోయారు. పూర్తి స్థాయిలో రోడ్డు వేయలేకపోయినా కనీసం గుంటలను కూడా పూడ్చలేరా అని ప్రజలు నిలదీస్తున్నారు. స్థానికులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడంతో అటువైపు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు వారిని వారించి ధర్నా విరమించాలని సూచించినా వారు నిరాకరించారు. కొంతసేపు ధర్నా నిర్వహించిన అనంతరం అధికార యంత్రాంగం అంతా తుపాను విధుల్లో ఉన్నట్టు తెలుసుకుని తాత్కాలికంగా ధర్నాను విరమించారు. తుఫాను ప్రభావం ముగిసిన అనంతరం అధికారులు తమ సమస్య పరిష్కరించకుంటే రోజంతా ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
సమన్వయంతో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): విపత్తు నిర్వహణ విధుల్లో అధికారులు సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలసి అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. మండలాల వారీగా అధికారులతో తుపాను ప్రభావం, పునరావాస కేంద్రాల నిర్వహణ, రక్షణ ఏర్పాట్లు వంటి అంశాలపై సమీక్షించారు. తుపాను తీరం దాటే సమయంలో విపరీతమైన వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఫోన్ కాల్స్కి స్పందించి సహాయ కార్యక్రమాలను అందించాలని చెప్పారు. -
పారా షూటింగ్లో సిల్వర్ మెడల్
అత్తిలి: పారా షూటింగ్లో అత్తిలికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ సిల్వర్ మెడల్ సాధించినట్టు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి రామస్వామి ప్రకటనలో తెలిపారు. విజయవాడ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ వారి సహకారంతో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర పారా షూటింగ్ చాపియన్ షిప్ –2025లో ఎస్హెచ్ – సిట్టింగ్ విభాగంలో సూర్యనారాయణ ఈ ప్రతిభ సాధించారన్నారు. షూటింగ్ అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ ఎన్.సుబ్రహ్మణ్యశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు కె.దయానంద్ చేతుల మీదుగా సూర్యనారాయణ మెమొంటో, సర్టిఫికెట్ అందుకున్నారు. పారా స్పోర్ట్స్లో దివ్యాంగులు ఉన్నతస్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్న రాష్ట్ర గ్రంథాలయాల శాఖా చైర్మన్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ అంద్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుకుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామికి సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలు
చింతలపూడి: లారీ ఢీకొని భార్యాభర్తలు గాయపడిన ఘటన చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కామవరపుకోట మండలం, దొండపాటివారి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తాడిగడప రాజారావు, జ్యోతి వైద్యం నిమిత్తం చింతలపూడి ఆసుపత్రికి వచ్చి తిరిగి స్వగ్రామం వెళుతుండగా కామవరపుకోట వైపు నుంచి చింతలపూడి వస్తున్న పామాయిల్ లోడ్ లారీ రాంగ్ రూట్లో వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజారావు, జ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై కె రమేష్ రెడ్డి ఘటనా స్ధలానికి చేరుకుని గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించారు. లారీ డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో రాని 108.. వైఎస్సార్ సీపీ నేత సాయం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు 108కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. అదే సమయంలో అటువైపు వెళుతున్న వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్ రమేష్రెడ్డి స్పందించి స్థానికుల సహకారంతో తన వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. -
కై కలూరు, పెదపాడుపై ప్రత్యేక దృష్టి
ఆస్తి, ప్రాణనష్ట నివారణకు చర్యలు: ఎస్పీ శివకిషోర్ ఏలూరు టౌన్: మోంఽథా తుపాను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత మేర నివారించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ముఖ్యంగా కై కలూరు, పెదపాడు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ఏలూరు జిల్లాలో తొలిసారిగా.. ఏలూరు డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్(ఈడీఆర్ఎఫ్) బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈడీఆర్ఎఫ్లో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాలల్లో డ్రోన్ కెమెరాలతో నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అత్యవసర సేవలకు 112కు కాల్ చేయాలన్నారు. ఏలూరు నగరం, ఇతర ముఖ్య పట్టణాల్లో పెద్ద హోర్డింగ్లు వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యజమానిదే బాధ్యత కై కలూరు: చేపలు, రొయ్యల చెరువులపై కపాలాదారులుగా పనిచేస్తున్న కుటుంబాలకు మోంథా తుపానులో ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత చెరువుల యాజమానులే భరించాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. కై కలూరు, కలిదిండి మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఎస్డీఆర్ఎఫ్, ఈడీఆర్ఎఫ్ బృందాలకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, నూజివీడు, పెదవేగి మండలాల్లో అత్యధిక వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దన్నారు. రోడ్లు సమీపంలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు తొలగించాలన్నారు. నూజివీడు పెద్ద చెరువు పరిశీలన నూజివీడు: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నూజివీడులోని పెద్దచెరువుకు వరదను ఎప్పటికప్పుడు బయటకు పంపేంలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలోని పెద్దచెరువు, మొఘల్ చెరువును సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. కట్టలు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలు వేయాలని, అదనంగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద గృహాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటే వెంటనే అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద పెరిగినప్పుడు దిగవ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు(మెట్రో): తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అప్రమత్తంగా ఉండి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.శివ కిషోర్, జాయింటు కలెక్టర్ ఎంజే అభిషేక్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదం తగ్గే వరకు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. సహాయక కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో టార్ఫాలిన్ సిద్ధం చేశామని రైతులకు అందజేయాలని అన్నారు. ముఖ్యమంత్రి సూచనతో పౌర సరఫరాల శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. జిలాల్లోని 583 రేషన్ షాపులలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలను సిద్ధం చేశామన్నారు. మిగిలిన రేషన్ షాపులలో రేపు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తుపాను ప్రభావంతో పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే చెప్పారు. కలెక్టరేట్లో తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి మాట్లాడారు. -
కడలి అల్లకల్లోలం
నరసాపురం: నరసాపురం తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. తీరం పొడవునా సముద్రం 50 మీటర్లు మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి తీరం వెంట సముద్ర అలల తీవ్రత ఎక్కువగానే ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాలల్లో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక, మొగల్తూరు మండలంలో పేరుపాలెం బీచ్ల్లో ఒక్కసారిగా పరిస్థితి మారింది. పేరుపాలెం బీచ్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం సమీపం వరకూ కెరటాలు చొచ్చుకు వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం: మోంథా తుఫాను ప్రభావంతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున కేకేఎం ఎర్రకాలువ జలాశయాన్ని ఇరిగేషన్ అధికారులు సోమవారం పరిశీలించారు. ఒక్కసారిగా వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ముందస్తుగానే జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 900 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 3,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు డీఈ సునీత, ఏఈ రాహుల్ భాస్కర్లు తెలిపారు. జలాశయం సామర్థ్యం 83.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 82.30 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. మండలంలోని పంగిడిగూడెం వద్ద ఉన్న ఎర్రకాలువ ప్రవాహాన్ని సోమవారం ఆర్డీవో ఎంవీ రమణ పరిశీలించారు. జలాశయం నుంచి ముందస్తుగా నీరు వదులుతున్న నేపథ్యంలో ఎర్రకాలువ కాజ్వే పై నుంచి రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకున్నారు. చినమైనవానిలంకలో పాత తుపాను షెల్టర్ బిల్డింగ్ సమీపం వరకూ సముద్రం చొచ్చుకు వచ్చింది. పెదలంక, తూర్పుతాళ్లు, మోళ్లపర్రు ప్రాంతాల్లో సముద్రగట్టు కోతకు గురైంది. మంగళవారం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 25 గ్రామాలపై తుపాన్ ప్రభావం ఉండొచ్చని అధికారులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా ధర ఆల్ టైం రికార్డు ధర పలికింది. కేజీ రూ.454 పలికి వేలం ప్రక్రియలోనే చరిత్ర సృష్టించింది. సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని ఐదు వర్జీనియా వేలం కేంద్రాల్లో వేలం ఉత్సాహంగా సాగింది. గోపాలపురం వర్జీనియా వేలం కేంద్రంలో ధర రూ.454 పలికి కొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల అత్యధికంగా రూ.430 లభించింది. ఆ తరువాత పడిపోయి రూ.420, రూ.415 వరకు దిగజారింది. వేలం చివరి దశకు వచ్చే సరికి మళ్లీ రికార్డు ధర నమోదైంది. గత ఏడాది అత్యధికంగా రూ.411 ధర పలకగా, ఆ ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో సరాసరి ధర రూ.300 వచ్చింది. దీంతో రైతులు ఉత్సాహంగా వర్జీనియా సాగు చేశారు. ఈ ఏడాది మొదట్లో చాలా నిరాశగా ప్రారంభమైంది. కేజీ ధర రూ.290 పలకడంతో ఒక దశలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత క్రమంగా ఈ ధర రూ.390 వరకు పెరిగి తరువాత తగ్గుతూ రూ.350కు చేరుకుంది. ఈ ధర వద్దే ఎక్కువ కాలం వేలం ప్రక్రియ కొనసాగింది. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ పెరుగుతూ ధర రూ.430కు చేరుకుంది. ఏలూరు రూరల్: తుపాను కారణంగా ఈ నెల 29న అల్లూరి సీతారామరాజు స్టేడియంలో తలపెట్టిన సివిల్ సర్వీస్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు వాయిదా వేసామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. -
కార్తీక శోభ
బినామీలకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ కార్తీక మాసం మొదటి సోమవారం జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ రెండు క్షేత్రాలకు జిల్లా నలుమూలతో పాటు ఇతర జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలిరావడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమల శివాలయం, మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. – సాక్షి నెట్వర్క్ ముంచుకొస్తున్న మోంథా -
అధికారుల వివక్షపై దళిత సర్పంచ్ ధర్నా
ముసునూరు: తనపై పంచాయతీ అధికారులు వివక్ష చూపుతున్నారని, తనకు న్యాయం చేయాలని దళిత సర్పంచ్ గ్రామస్తులతో సహ ఆందోళనకు దిగారు. మండలంలోని చింతలవల్లి గ్రామ సర్పంచ్ పిల్లి సత్యనారాయణపై గతంలో పని చేసిన గ్రామ పంచాయతీ కార్యదర్శి, ప్రస్తుత కార్యదర్శి ఇరువురు కూడా వివక్షత చూపడంపై సోమవారం గ్రామస్తులతో కలసి నిరసన ధర్నా చేశారు. ఈ సందర్భంగా సర్పంచ్ సత్యనారాయణ మాట్లాడుతూ గ్రామ పంచాయతీకి సంబంధించిన అన్ని పనుల్లోనూ గ్రామ కార్యదర్శులకు ఎంత సహకరించినా, ఇబ్బందులు పెడుతున్నారని, బిల్లులు చెల్లించక పోగా, అధికార కార్యక్రమాలకు కూడా సమాచారం అందించడంలేదని వాపోయారు. గత కార్యదర్శి ఇళ్ల పన్నులు వసూలు చేసి, పంచాయతీ అక్కౌంటుకు నగదు జమ చేయలేదని, దానిని తాను గమనించి, నిలదీయగా రూ.6 లక్షల, 40 వేలు పంచాయతీ ఖాతాకు చెల్లించాడన్నారు. గతంలో తాను చేయించిన పనులకు కార్యదర్శి బిల్లులు పెట్టలేదని వాపోయారు. అధికారిక కార్యక్రమాలకు సమాచారం లేదు ప్రస్తుతం పని చేస్తున్న పంచాయతీ కార్యదర్శి మరో అడుగు ముందుకేసి, ప్రభుత్వ అధికారిక కార్యక్రమాలకు సైతం తనకు సమాచారం ఇవ్వకుండా చిన్న చూపు చూస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సొంత నిధులు రూ.14 లక్షలతో గ్రామ పంచాయతీలో చేయించిన పనులకు సంబంధించి బిల్లులు సమర్పించినా, నగదు పుస్తకంలో నమోదు చేయకుండా, చెల్లింపులు జరుపకుండా, గ్రామ టీడీపీ నేతలు చెబితేనే బిల్లులు మంజూరు చేయిస్తానంటున్నారని ఆరోపించారు. సర్పంచ్నైన తనకు తెలియకుండా కార్యదర్శి సొంతగానూ. ప్రైవేటు వ్యక్తులతోనూ పనులు చేయిస్తూ, వారి బిల్లులు నగదు పుస్తకంలో నమోదు చేసి, చెల్లిస్తున్నారని, కానీ తనకు రావలసిన బకాయిలు మాత్రం చెల్లించడం లేదని ఆరోపించారు. దీనిపై ఉన్నతాధికారులు తక్షణమే స్పందించి, ఎస్సీ సర్పంచ్పై జరుగుతున్న వివక్షతను తొలగించి, బకాయిల చెల్లింపు విషయంలో న్యాయం చేయాలని కోరారు. కార్యక్రమంలో ఎంపీటీసి సుధాకర్, సొసైటీ మాజీ అధ్యక్షుడు సుగసాని శ్రీనివాసరావు, గ్రామ వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు పల్లెపాము సూర్య, వైఎస్సార్ సీపీ జిల్లా కార్య నిర్వాహక కార్యదర్శి తొర్లపాటి శ్రీనివాసరావు, సుందరరావు, వార్డు సభ్యులు, మహిళలు పాల్గొన్నారు. -
ఏలూరులో జోరుగా చోరీలు
ఒకే రోజు రెండు ఇళ్లల్లో దొంగతనాలు ఏలూరు టౌన్: ఏలూరు రూరల్, టూటౌన్ పరిధిలో రెండు ఇళ్లల్లో చోరీ జరిగింది. భారీగా బంగారు ఆభరణాలు, వెండి వస్తువులు అపహరించుకుపోయారు. వివరాల ప్రకారం ఏలూరు రూరల్ పరిధిలో చొదిమెళ్ళ ప్రాంతంలో శ్రీ లక్ష్మీ గణపతినగర్ 5వ రోడ్డులో నివాసం ఉంటున్న వేమూరి వెంకట అనంత రామం భార్యపిల్లలతో కలిసి ఈనెల 26న తూర్పుగోదావరి జిల్లాలోని శివాలయానికి వెళ్లి అదేరోజు రాత్రి 10 గంటలకు ఇంటికి వచ్చారు. ఈలోగా దొంగలు ఇంటి తాళాలు పగులగొట్టి బీరువా తాళాలు తెరిచి సుమారు 20 కాసుల బంగారు ఆభరణాలు, కిలో వెండి దోచుకుపోయారు. బాధితుడి ఫిర్యాదుతో ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. ఏలూరు టూటౌన్ పరిధిలో మోతేవారి తోటలో తాళాలు వేసిన ఇంటిలో దొంగలు పడ్డారు. ఇంటి యజమానులు హైదరాబాద్లో ఉన్నట్లు తెలుస్తోంది. తాళాలు పగులగొట్టి ఇంటిలోకి వెళ్లిన దొంగలు భారీగా బంగారు ఆభరణాలు చోరీ చేసినట్లు చెబుతున్నారు. -
పాపికొండల బోటు ప్రయాణం రద్దు
బుట్టాయగూడెం: పాపికొండల బోటు ప్రయాణాలు తాత్కాలికంగా నిలిచిపోయాయి. మూడు నెలలుగా నిలిచిపోయిన పాపికొండల బోటు ప్రయాణాలు ఈ నెల 12వ తేదీన ప్రారంభమయ్యాయి. కార్తీక మాసం కావడంతో పర్యాటకులు కూడా అధిక సంఖ్యలో పాపికొండల విహారయాత్రకు బయల్దేరి వెళ్తున్నారు. అయితే మోంథా తుపాను ప్రభావంతో దేవీపట్నం మండల గండిపోచమ్మ రోడ్డు పాయింట్ నుంచి పర్యాటక బోటు సర్వీస్లను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు తెలిపారు. గుబ్బల మంగమ్మతల్లి దర్శనం నిలిపివేత బుట్టాయగూడెం: మోంథా తుపాను ప్రభావంతో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున బుట్టాయగూడెం మండలం కామవరం అటవీప్రాంతంలో కొలువై ఉన్న గుబ్బల మంగమ్మ తల్లి దర్శనాలను ఆలయ కమిటీవారు నిలిపివేశారు. వాతావరణం చక్కబడి పరిస్థితులు అనుకూలించిన తర్వాత మళ్లీ దర్శనాల తేదీలు ప్రకటిస్తామని ఆలయ కమిటీ ప్రతినిధులు కోర్సా గంగరాజు, కోర్సా రాంబాబు తెలిపారు. అప్పటివరకూ మంగమ్మతల్లి దర్శనానికి భక్తులెవ్వరూ రావొద్దని వారు విజ్ఞప్తి చేశారు. -
మోటార్సైకిళ్ల చోరీ కేసులో ముగ్గురి అరెస్ట్
ముదినేపల్లి రూరల్: మోటారు సైకిళ్లు చోరీ చేస్తున్న ముగ్గురిని పోలీసులు సోమవారం అరెస్టు చేశారు. వీరిలో ఒక మైనర్ ఉన్నాడు. స్థానిక పోలీస్ స్టేషన్లో కై కలూరు రూరల్ సీఐ వి రవికుమార్, ఎస్సై వీఎస్ వీరభద్రరావు వివరాలు వెల్లడించారు. వాహనాల తనిఖీల్లో భాగంగా సోమవారం ఉదయం దేవపూడి వద్ద తనిఖీలు చేస్తుండగా కొచ్చెర్ల వైపు నుంచి ముగ్గురు వ్యక్తులు మోటారుబైక్పై అనుమానాస్పదంగా సంచరిస్తుండగా వారిని అదుపులోకి తీసుకుని విచారించామన్నారు. నిందితులు విజయవాడకు చెందిన జలసూత్రం సాయిసురేష్కుమార్, మండలంలోని ప్రొద్దువాకకు చెందిన యండూరి జీవరాజు, విజయవాడకు చెందిన మరో మైనర్ కొంతకాలంగా మండలంతో పాటు విజయవాడ, కై కలూరు, కలిదిండి మండలాలతోపాటు తాడేపల్లి, దేవపూడి, ముదినేపల్లి ప్రాంతాల్లో 18 మోటారుబైక్లు, ఒక మొబైల్ఫోను దొంగతనం చేశారన్నారు. వీటి విలువ రూ.10లక్షలు పైగా ఉంటుందని చెప్పారు. దొంగిలించిన వాహనాలను మండలంలోని ప్రొద్దువాకకు చెందిన కుర్మా సుధాకర్ వద్ద దాచిపెట్టగా వీటిని స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. నిందితులను అరెస్టు చేయడంలో కీలకపాత్ర పోషించిన కానిస్టేబుళ్లు బి నాగబాబు, పి పవన్కుమార్, జి శివకోటయ్య, వై నాగరాజును సీఐ, ఎస్సై అభినందించారు. భీమడోలు: మహిళ నిర్బంధం కేసులో నిందితుడు కటారి మోహన్ నాగ వెంకట సాయిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు ఎస్సై షేక్ మదీనాబాషా తెలిపారు. వివరాల ప్రకారం భీమడోలు గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ దంపతులు. నిందితుడు కటారి మోహన్ నాగ వెంకట సాయి భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి 15 రోజులపాటు గ్రామాంతరం తీసుకువెళ్లగా ఆమె తన కుటుంబ సభ్యుల కోసం గొడవ చేయడంతో ఈనెల 19న భీమడోలు తీసుకువచ్చాడు. అనంతరం తీవ్ర మనోవేదన, అవమానభారంతో సూసైడ్ నోట్ రాసి భార్యభర్తలు సుధాకర్, భానుపూర్ణిమ కూల్డ్రింక్లో పురుగు మందు కలుపుకుని తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. ప్రస్తుతం వారు గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ కేసుకు సంబంధించి ఈనెల 7వ తేదీన గుండుమోలు సుధాకర్ ఫిర్యాదు మేరకు భీమడోలులో మహిళా అదృశ్యం కేసు నమోదు చేశారు. అయితే భానుపూర్ణిమ గుంటూరు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఇచ్చిన వాంగ్మూలం మేరకు మహిళ అదృశ్యం విభాగం నుంచి పరాయి సీ్త్ర నిర్బంధం, ఇతర సెక్షన్ల కింద మార్పు చేసి దర్యాప్తును ముమ్మరం చేశారు. ఈ కేసులో జిల్లా ఎస్పీ కేపీఎస్ కి షోర్, డీఎస్పీ శ్రావణ్కుమార్ ఆదేశాల మేరకు సీఐ యూజే విల్సన్, ఎస్సై మదీనా బాషా నేతృత్వంలో ప్రత్యేక దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. నిందితుడు కటారి మోహన్ నాగ వెంకట సాయిను భీమడోలు పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చగా న్యాయమూర్తి 14 రోజుల పాటు రిమాండ్ విధించినట్లు ఎస్సై మదీనా బాషా తెలిపారు. -
శ్రీవారి క్షేత్రంలో కొత్త క్యూలైన్ నిర్మాణ పనులు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో నూతన క్యూలైన్ నిర్మాణ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా యాగశాల పక్కన కొత్తగా గుమ్మం ఏర్పాటు చేసేందుకు సిబ్బంది యంత్రంతో గోడను కట్ చేస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ప్రస్తుతం రూ. 200 టికెట్లు తీసుకున్న భక్తులు ఉత్తరం వైపు క్యూలైన్ల ద్వారా పడమర వైపునకు చేరుకుని, అక్కడి నుంచి ఆలయంలోకి వెళుతున్నారు. అలాగే నిత్యార్జిత కల్యాణంలో పాల్గొంటున్న భక్తులు ధ్వజస్తంభం పక్కనున్న క్యూలైన్ల ద్వారా ఆలయంలోకి చేరుకుంటున్నారు. ఇక రూ.100 టికెట్లు తీసుకున్న వారు, ఉచిత దర్శనం భక్తులు ఉత్తరం వైపు క్యూలైన్ల ద్వారా తూర్పు వైపునకు చేరుకుని, అక్కడున్న గుమ్మంలోంచి ఆలయంలోకి వెళుతున్నారు. ఇదిలా ఉంటే రూ.200 టికెట్లు తీసుకునే వారిని, నిత్యార్జిత కల్యాణంలో పాల్గొనే భక్తులను తూర్పు వైపు ప్రత్యేకంగా గుమ్మాన్ని ఏర్పాటు చేసి, అందులోంచి ఆలయంలోకి పంపాలని అధికారులు నిర్ణయించారు. ఈ క్రమంలో తూర్పు వైపు (యాగశాల పక్కన) గుమ్మం ఏర్పాటు చేసేందుకు గోడను యంత్రంతో కట్ చేయిస్తున్నారు. అలాగే పాత క్యూలైన్లలో ర్యాంపు ఏర్పాటు నిమిత్తం గోడను నిర్మిస్తున్నారు. ఈ పనులను ఆలయ ఈఈ డీవీ భాస్కర్, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, తదితరులు పర్యవేక్షిస్తున్నారు. త్వరితగతిన ఈ నిర్మాణ పనులు పూర్తి కానున్నాయి. యాగశాల పక్కన గోడను కట్ చేస్తున్న సిబ్బంది అక్కడ గుమ్మం ఏర్పాటు చేసేందుకు అధికారుల చర్యలు రూ.200 టికెట్, నిత్య కల్యాణంలో పాల్గొనే భక్తుల కోసం ఏర్పాట్లు -
కార్తీకం.. శివోహం
వర్షాన్ని సైతం లెక్కచేయని భక్తజనంపాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయం మొదటి సోమవారం భక్తులతో కిటకిటలాడింది. వేకుజాము నుంచి భక్తులు శివనామస్మరణ చేస్తూ స్వామివారిని దర్శించుకున్నారు. మహిళలు వేకువజాము 2 గంటల నుంచి కాలువలో స్నానాలు చేయడానికి తరలివెళ్లారు. కాలువలో కార్తీక దీపాలు వదిలి అనంతరం క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. భక్తులు అధిక సంఖ్యలో తరలిరావడంతో ఆలయంలో క్యూలైన్లు నిండిపోయాయి. స్వామివారికి అభిషేకాలు చేయించుకునే భక్తులు మహన్యాసంలో పాల్గొన్నారు. ఆలయం వెనుకభాగం, అభిషేకాల మండపం భక్తులతో నిండిపోయింది. ఆలయం నుంచి బయటకు వెళ్లే మార్గాన్ని ఉత్తరం వైపునకు ఏర్పాటుచేశారు. యాత్రికులతో కిటకిట మధ్యాహ్నం 11 గంటల నుంచి పంచారామ యాత్రికులతో ఆలయం కిటకిటలాడింది. ద్రాక్షారామం, సామర్లకోట క్షేత్రాలను దర్శించుకుని వచ్చే భక్తులు మధ్యాహ్నం 12 గంటల సమయంలో, అమరావతి, భీమవరం క్షేత్రాలను దర్శించుకుని వచ్చే భక్తులు మధ్యాహ్నం 3 గంటల సమయంలో క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకున్నారు. అలాగే పాలకొల్లు, పరిసర గ్రామాల భక్తులు ముందుగా పైనాలుగు క్షేత్రాలను దర్శించుకుని రాత్రి 8 గంటల సమయంలో క్షీరారామలింగేశ్వరస్వామిని దర్శించుకోవడానికి వచ్చారు. కార్తీకమాసం మొదటి సోమవారం భక్తుల రద్దీ ఎక్కువగా ఉంటుందని ఆలయ అధికారులు అంచనాలు వేశారు. అయితే వాతావరణం మార్పు వల్ల అనుకున్నంత స్థాయిలో భక్తులు రాలేదు. సుమారు 15 నుంచి 20 వేల మంది వరకూ భక్తులు స్వామివారిని దర్శించుకున్నట్లు అంచనా వేశారు. ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు, పట్టణ సీఐ కె.రజనీకుమార్, పోలీసు సిబ్బంది, ఆలయ సిబ్బంది, డీఎన్నార్ కళాశాల విద్యార్థినులు, పలు సేవా సంస్థల సభ్యులు పాల్గొని తమ సేవలను అందించారు. భక్తులకు తప్పని ఇబ్బందులు ఆలయ ప్రాకార మండపం లోపల మహిళలు కార్తీకదీపాలు వెలిగించి అక్కడే కూర్చోవడంతో స్వామివారిని దర్శనానికి వెళ్లే భక్తులు నడవడానికి కూడా వీలు లేకుండా ఉండడంతో తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. ఉదయం 8.30 గంటల నుంచి వర్షం పడడంతో క్యూలైన్లో ఉన్న భక్తులు వర్షంలో తడుస్తూనే స్వామివారిని దర్శించుకున్నారు. ఆలయం పక్కన ఉన్న రేపాక వారి సత్రంలో అన్నదానం ఏర్పాటు చేయగా కనీసం ఒక్క టెంట్ కూడా ఏర్పాటుచేయకపోవడంతో భక్తులు వర్షంలో తడుస్తూ ఇబ్బందులు పడ్డారు. కాసేపటికి నిర్వాహకులు టెంట్ ఏర్పాటుచేయడంతో భక్తులు ఉపశమనం పొందారు. స్పెషల్ దర్శనం రూ.100కు పెంపు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయానికి వచ్చే భక్తులు కొరకు ప్రత్యేక దర్శనం టికెట్ ధర రూ.50 ఉండేది. ఈ ధరను రాత్రికి రాత్రి రూ.100 చేయడంతో భక్తులు ఆగ్రహాం వ్యక్తం చేశారు. దీనిపై ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావును ప్రశ్నించగా ప్రత్యేక దర్శనం టిక్కెట్లు ధర రూ.100 వరకూ పెంచుకునే వెసులుబాటు ఉందని తెలిపారు. అయినా రూ.50, రూ.100 రెండు టికెట్లు విక్రయిస్తున్నామన్నారు. దీనిపై భక్తుల నుంచి వ్యతిరేకత రావడంతో మధ్యాహ్నం నుంచి రూ.100 దర్శనం టికెట్లు నిలిపివేసి రూ.50 మాత్రమే స్పెషల్ దర్శనం చేశామని వివరించారు. మద్దిలో కార్తీకమాసోత్సవాలు జంగారెడ్డిగూడెం: మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. సోమవారం క్షేత్రంలోని ఆంజనేయస్వామి వారికి ఆలయ అర్చకులు వేదపండితులు, రుత్విక్లు శాస్త్రోక్తంగా లక్ష తమలపాకులతో లక్షార్చన కార్యక్రమం నిర్వహించారు. సాయంత్రం 5 గంటల వరకు వివిధ సేవల రూపేణా ఆలయానికి రూ.1,35,420 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అలాగే సుమారు 3,018 మంది అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు తెలిపారు. పాలకొల్లు సెంట్రల్ : క్షీరారామలింగేశ్వరునికి అభిషేకం చేస్తున్న అర్చకస్వాములు పాలకొల్లు సెంట్రల్ : క్షీరారామంలో గోశాల వద్ద కార్తీకదీపాలు వెలిగిస్తున్న మహిళలు, సాలగ్రామ దానాలు ఇస్తున్న భక్తులు భీమవరం(ప్రకాశం చౌక్) : శ్రీభీమేశ్వర స్వామికి నిర్వహస్తున్న అభిషేకంభీమవరం(ప్రకాశం చౌక్): కార్తీక మాసం మొదటి సోమవారం శివనామస్మరణతో భీమవరం పంచారామక్షేత్రం శ్రీఉమాసోమేశ్వరజనార్థన స్వామి వారి దేవస్థానం మార్మోగింది. వర్షాన్ని సైతం లెక్కచేయకుండా పంచారామక్షేత్రాల యాత్రికులు, జిల్లా నలమూల నుంచి భక్తులు భారీగా తరలివచ్చి స్వామి వారిని దర్శించుకున్నారు. దేవస్థానంలో స్వామి వారికి అభిషేకాలు, పూజలు, కార్తీక దీపారాధానలు, కార్తీక నోములు నోచుకున్నారు. దేవస్థానం ఆద్వర్యంలో నిర్వహించిన అన్నదానం కార్యక్రమంలో పెద్ద సంఖ్యలో భక్తులు పాల్గొని అన్నప్రసాదం స్వీకరించారు. స్వామికి ప్రత్యేక పూజలు శ్రీఉమాసోమేశ్వర స్వామికి కార్తీక మాసం మొదటి సోమవారం ప్రత్యేక పూజలు నిర్వహించారు. సోమవారం తెల్లవారుజాము నుంచే ప్రధాన అర్చకులు రామకృష్ణ ఆధ్వర్యంలో స్వామి వారికి మహన్యాసపూర్వక రుధ్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వీరామంగా నిర్వహించారు. సాయంత్రం స్వామి వారికి లక్షపత్రి పూజ నిర్వహించారు. ఈకార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి డి.రామకృష్ణంరాజు, ట్రస్ట్బోర్డు చైర్మన్ చింతలపాటి బంగార్ారజు, ధర్మకర్తలు, ఆలయ అధికారులు పాల్గొన్నారు. పట్టణంలోని మరో శివక్షేత్రమైన శ్రీభీమేశ్వర స్వామి వారికి కార్తీక మాసం మొదటి సోమవారం ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. కార్యక్రమంలో ఆలయ కార్యనిర్వహణ అధికారి తోట శ్రీనివాస్, ట్రస్ట్ బోర్డు సభ్యులు ఏర్పాట్లు పర్యవేక్షించారు. పంచారామాల్లో మార్మోగిన శివనామస్మరణ కార్తీక సోమవారం శివాలయాలకు పోటెత్తిన భక్తజనం వేకువజామునుంచే క్యూలైన్లో వేచి ఉన్న భక్తులు -
నాగేంద్రహారాయ.. నమఃశివాయ
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం పట్టణ పరిధిలో అరుదైన ఘటన చోటు చేసుకుంది. పట్టణంలోని పేరంపేట రోడ్డులో ఉన్న బాట గంగానమ్మ గుడి సమీపంలోని వేప చెట్టు వద్ద ఉన్న పుట్టల వద్ద కార్తీక సోమవారాన్ని పురస్కరించుకుని భక్తులు పూజలు నిర్వహించుకున్నారు. ఈ క్రమంలో పుట్ట వద్ద నాగు పాము ప్రత్యక్ష కావడంతో భక్తులు ఆశ్చర్యానికి గురయ్యారు. కార్తీక సోమవారం రోజున నాగుపాము రూపంలో శివుడు కరుణించాడంటూ భక్తులు నాగుపాముకు పూజలు నిర్వహించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంపై సోమవారం మోంథా తుపాను ఎఫెక్ట్ పడింది. కార్తీక మాస పర్వదినాల్లో క్షేత్రాన్ని వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. అయితే మోంథా తుపాను హెచ్చరికల నేపథ్యంలో భక్తుల్లో అధిక శాతం తమ యాత్రను వాయిదా వేసుకున్నారు. దాంతో స్వల్ప సంఖ్యలో భక్తులు క్షేత్రాన్ని సందర్శించారు. ఈ క్రమంలో వైకుంఠం క్యూ కాంప్లెక్స్ భక్తుల లేమితో నిర్మానుష్యంగా మారింది. దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట తదితర విభాగాల్లో భక్తులు నామమాత్రంగా కనిపించారు. -
శాయ్ లిఫ్టర్లకు పతకాల పంట
ఏలూరు రూరల్: ఏలూరులోని ఖేలో ఇండియా సెంటర్ (శాయ్) వెయిట్ లిఫ్టర్లు స్కూల్గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి వెయిట్లిఫ్టింగ్ పోటీల్లో ఓవరాల్ చాంపియన్షిప్ సాధించారని సెంటర్ ఇన్చార్జి ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 24వ తేదీ నుంచి 26 వరకూ తెనాలిలో రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వెయిట్లిఫ్టింగ్ పోటీలు జరిగాయి. ఇందులో పాల్గొన్న లిఫ్టర్లు మొత్తంగా 3 గోల్డ్మెడల్స్, 3 సిల్వర్మెడల్స్, 3 బ్రాంజ్మెడల్స్ సాధించారని వివరించారు. సీహెచ్ కీర్తన ఉత్తమ వెయిట్లిఫ్టర్గా అవార్డు అందుకున్నట్లు తెలిపారు. అండర్ 17 విభాగంలో పోటీపడిన ఎం పావని, సీహెచ్ కీర్తన రెండు గోల్డ్ మెడల్స్, జి.పవిత్ర, ఎన్ విహారిక రెండు సిల్వర్ మెడల్స్, ఎం దీక్షిత్, కె ఆశాజ్యోతి రెండు బ్రాంజ్మెడల్స్ చేజిక్కించుకున్నారని వివరించారు. అండర్ 19 విభాగంలో యు శశికళ గోల్డ్ మెడల్, పి దీపిక, కె శ్రీవెన్నల, సీహెచ్ హారికరెడ్డి మూడు సిల్వర్మెడల్స్, జడ్ పావని బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నారని వెల్లడించారు. బాలికలు అందరూ స్థానిక ఏఆర్డీజీకె పాఠశాల, ప్రభుత్వ జూనియర్ కళాశాలలో చదువుకుంటున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట)/పెదపాడు: కర్నూలులో జరిగిన ఘోర రోడ్డు ప్రమాదాన్ని దృష్టిలో ఉంచుకుని ఏలూరు జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల తనిఖీలను ముమ్మరం చేశారు. మూడవ రోజు సోమవారం తెల్లవారుజామున పెదపాడు మండలం కలపర్రు టోల్ ప్లాజా వద్ద నిబంధనలకు విరుద్ధంగా నడుస్తున్న 35 ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులపై కేసులు నమోదు చేశారు. టాక్స్ లేకుండా నడుపుతున్న నాలుగు బస్సులను సీజ్ చేశారు. ఈ మేరకు వివరాలను ఏలూరు ఉపరవాణా కమిషనర్ షేక్ కరీమ్ వెల్లడించారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలో జరిగిన రాష్ట్రస్థాయి చదరంగం పోటీలు సోమవారంతో ముగిశాయి. రాష్ట్రంలోని ఐదు జిల్లాల నుంచి సుమారు 200 మంది పోటీల్లో పాల్గొనగా, 15 మంది క్రీడాకారులు ఇంటర్నేషనల్ రేటింగ్ టోర్నమెంట్కి అర్హత సాధించారని నిర్వాహకులు తెలిపారు. ఈ టోర్నమెంట్ నవంబర్ 22 నుంచి 24 వరకు విజయవాడలో జరుగుతుందని చెప్పారు. విజేతల్లో మొదటి ఐదు స్థానాల్లో వరుసగా శ్రీ సాయి నంద గోపాల్, నవదీప్ కావూరి, కె.ఓంకార్, కుషాల్ కార్తికేయ నాయుడు, సూర్య జితేష్ నిలిచారు. బెస్ట్ ఓపెన్ మహిళగా శ్యామలను చీఫ్ ఆర్బిటర్ కిరణ్ కుమార్ ప్రకటించారు. పోటీలకు అవకాశం కల్పించిన జిల్లా ఆంధ్ర చెస్ అసోసియేషన్ వారికి టోర్నమెంట్ డైరెక్టర్ సూర్య నాగేశ్వరరావు కృతజ్ఞతలు తెలిపారు. శ్రీ హంస చెస్ అకాడమీ ఆధ్వర్యంలో స్థానిక నారాయణ స్కూల్లో ఈ పోటీలు నిర్వహించారు. భీమవరం : భీమవరం రెండో పట్టణంలో జరిగిన దొంగతనంలో 113 గ్రాముల బంగారు ఆభరణాలు, 3.46 క్యారెట్ల వజ్రాలు అపహరణకు గురయ్యాయి. వివరాల ప్రకారం సూర్యనారాయణపురంలో నివాసం ఉంటున్న కె.శ్రీనివాసరావు ఇంటికి హైదరాబాద్లో ఉంటున్న అతని కుమార్తె సూర్యదీప్తి ఈ నెల 25న వచ్చారు. తణుకులో జరిగిన ఓ వేడుకలో పాల్గొనేందుకు ఈ నెల 26న వెళ్లారు. అక్కడ్నుంచి అదేరోజు రాత్రి భీమవరం చేరుకున్నారు. తన హ్యాండ్ బ్యాగులో బంగారు ఆభరణాలు, వజ్రాలను ఉంచి గదిలోని కప్బోర్డులో పెట్టారు. తెల్లారిన తర్వాత చూసేసరికి బ్యాగు కనిపించకపోవడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై రెహమాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
చింతలపూడి: పేదలకు ప్రభుత్వ వైద్య విద్యను దూరం చేసేలా కూటమి ప్రభుత్వం కుట్రలు చేస్తోందని వైఎస్సార్ సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ధ్వజమెత్తారు. మండలంలోని దేశవరంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు ఎన్.రమేష్రెడ్డి ఆధ్వర్యంలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ చేపట్టిన కోటి సంతకాల ప్రజా ఉద్యమ కార్యక్రమాన్ని డీఎన్నార్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జరిగిన సభలో ఆయన మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో రాష్ట్రంలో 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను మంజూరు చేయించారని, వాటిలో ఏడు మెడికల్ కళాశాలల నిర్మాణం పూర్తయిందన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఈ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి కుటిల రాజకీయాలు చేస్తోందని విమర్శించారు. చంద్రబాబు ప్రభుత్వం వైద్య కళాశాలలను 66 ఏళ్ల లీజుకు ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేసేలా టెండర్లు పిలవడం దారుణమన్నారు. కూట మి ప్రభుత్వ హయాంలో రాష్ట్రంలో ఎక్కడ చూసినా కల్తీ మద్యం రాజ్యమేలుతోందని, కల్తీ మద్యం రాకెట్ నడిపించేది కూటమి నాయకులే అన్నారు. కూటమి దుర్మార్గాలను ఎండగట్టాలి కూటమి ప్రభుత్వం చేస్తున్న దుర్మార్గాలను ప్రజలకు వివరించాల్సిన బాధ్యత పార్టీ శ్రేణులపై ఉందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు అన్నారు. కోట్లు దండుకోవడానికి వైద్య కళాశాలలను పీపీపీ పద్ధతి ద్వారా ప్రైవేట్పరం చేయడానికి చేస్తున్న కుట్రలను గ్రామాల్లో ప్రచారం చేయాలన్నారు. మెడికల్ కాలేజీలు ప్రైవేటుపరం చేయడంతో వైద్య విద్య పూర్తిగా పేదలకు దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. పేద విద్యార్థులకు జరుగుతున్న అన్యాయాన్ని సంతకాల రూపంలో గవర్నర్ దృష్టికి తీసుకెళ్లడానికి కోటి సంతకాల సేకరణ కార్యక్రమం చేపట్టినట్టు తెలిపారు. ముందుగా గ్రామంలో సంతకాలు సేకరించారు. వైఎస్సార్ సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, జెడ్పీటీసీ ఎం.నీరజాసుధాకర్, ఎంపీపీ బి.రాంబాబు నాయక్, మండలపరిషత్ ఉపాధ్యక్షుడు గుత్తా కిషోర్, లింగపాలెం మండల పార్టీ అధ్యక్షుడు అన్నపనేని శాంతారావు, ఎంపీటీసీలు, సర్పంచ్లు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ నేను విజయనగరం జిల్లా మహారాజ వైద్య క ళాశాలలో వైద్య విద్య చ దువుతున్నాను. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొత్త మెడికల్ కళాశాలలను తీసుకురావడంతోనే నిరుపేదనైన నాకు మెడిసిన్లో సీటు వచ్చింది. వైఎస్ జగన్కి రుణపడి ఉంటాను. వైద్య కళాశాలలను ప్రభుత్వ ఆధ్వర్యంలోనే నిర్వహించాలి. – కందికొండ లలితశ్రీ, వైద్య విద్యార్థిని, దేశవరం -
మోంథా గుబులు
ఏలూరు (మెట్రో): జిల్లావ్యాప్తంగా మోంథా తుపా ను గుబులు నెలకొంది. జిల్లాపై తీవ్ర ప్రభావం ఉండనున్న నేపథ్యంలో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. ప్రధానంగా రైతుల్లో తీవ్ర ఆందోళన నెలకొంది. జిల్లాలో సుమారు 2 లక్షల ఎకరాల్లో వరి సాగు, 2.75 లక్షల ఎకరాల్లో ఉద్యాన పంటలు సాగవుతున్యాఇ. ముఖ్యంగా వరి పంటకు తీవ్ర నష్టం వాటిల్లే అవకాశం ఉంది. జిల్లాలో వరి చేలు ఈనిక, పొట్ట, కోత దశల్లో ఉన్నాయి. ఈనిక, పొట్ట దశల్లో ఉన్న చేలపై తీవ్ర ప్రభావం పడే అవకాశం ఉంది. ఉద్యాన పంటల్లో బొప్పాయి, అరటి, కూరగాయల సాగుపై తుపాను ప్రభావం ఉంటుంది. జిల్లాలో 980 ఎకరాల్లో కూరగాయలు, 300 ఎకరాల్లో బొప్పాయి, 3,500 ఎకరాల్లో అరటి సాగవుతున్నాయి. తీవ్ర గాలులకు బొప్పాయి, అరటి పంటలు నేలవాలే ప్రమాదం ఉంది. కంట్రోల్ రూమ్ల ఏర్పాటు తుపానును సమర్థంగా ఎదుర్కొనేందుకు అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, మండల స్థాయిల్లో కంట్రోల్ రూములు ఏర్పా టు చేశారు. ఎన్డీఆర్ఎఫ్ బృందాలను అందుబాటులో ఉంచారు. గంటకు 120 కి.మీ. వేగంతో గా లులు వీచే అవకాశం ఉన్నందుకు హోర్డింగ్లు, వి ద్యుత్ స్తంభాల విషయంలో జాగ్రత్తలు తీసుకుంటున్నారు. గోదావరిలోకి పర్యాటక లాంచీలను నిలిపేశారు. 9491041419, 18002331077 నంబర్లతో కంట్రోల్ రూములు ఏర్పాటు చేశారు. తుపాను ప్రభావిత ప్రాంతాల్లో ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించే ఏర్పాట్లు చేశారు. సోమవారం జిల్లా లోని కలెక్టరేట్, డివిజినల్, మండల స్థాయిలో నిర్వహించాల్సిన ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)ను రద్దు చేశారు. నేడు, రేపు పాఠశాలలకు సెలవు ఏలూరు (ఆర్ఆర్పేట): తుపాను హెచ్చరికల నేపథ్యంలో జిల్లాలోని అన్ని యజమాన్యాల్లోని పాఠశాలలకు సోమ, మంగళవారాల్లో సెలవులు ప్రకటించినట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. నిబంధనలు మీరితే చర్యలు తప్పవని హెచ్చరించారు. పోలవరం రూరల్: తుపాను ప్రభావంతో పట్టిసీమ శివక్షేత్రంలో రేవులో తిరిగే లాంచీలను మూడు రోజులపాటు నిలుపుదల చేస్తున్నట్టు డీ ఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు తెలిపారు. కార్తీకమాసాన్ని పురస్కరించుకుని క్షేత్రానికి వచ్చే భక్తులు తమ ప్రయాణాలు వాయిదా వేసుకోవాలన్నారు. అలాగే పోలవరం, పురుషోత్తపట్నం ప్రయాణికులను దాటించే ఫెర్నీ లాంచీ రాకపోకలు కూడా నిలుపుదల చేశామన్నారు. కాగా ఆ దివారం కావడంతో అధిక సంఖ్యలో భక్తులు రాగా వారు వెళ్లి స్వామివారిని దర్శనం చేసుకుని వచ్చేలా ఏర్పాట్లు చేశారు. సీఐ బాల సురేష్, ఎస్సై పవన్కుమార్ ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి కై కలూరు/మండవల్లి: తుపాను నేపథ్యంలో కొల్లే రు పరీవాహక ప్రాంతాల ప్రజలు పడవ ప్రయా ణాలు చేయవద్దని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో అత్యధిక వర్షపాతం నమోదవుతు న్న కలిదిండి మండలంలో ఆదివారం ఆమె పర్యటించారు. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన వద్ద నీటిమట్టాన్ని పరిశీలించారు. కొల్లేరులో నీటి ఉధృతి కారణంగా మునిగిన పెనుమాకలంక రహదారిని పరిశీలించారు. మూడు రోజులపాటు ఎవరూ పడవ ప్రయాణాలు చేయవద్దని సూచించారు. రాకపోకలు స్తంభించిన కొల్లేరు గ్రామాలకు సోమవారం నుంచి రేషన్ సరఫరా చేయాలని అధికారులను ఆదేశించారు. కొల్లేరు, ఉప్పుటేరులో చేపల వేటకు వెళ్లవద్దన్నారు. ఏటా వర్షాలకు పెనుమాకలంక రోడ్డు మునుగుతుందని కొల్లేరులంక గ్రామస్తులు కలెక్టర్ దృష్టికి తీసుకువచ్చారు. కలిదిండిలో లాల్వ డ్రెయిన్పై కూలిన వంతెనను కలెక్టర్ పరిశీలించారు. తాత్కాలిక వంతెనపై రాకపోకలకు అనుమతించవద్దన్నారు. కలిదిండి మండలం వెంకటాపురం, కై కలూరు మండలం వరహాపట్నం నూతన రహదారులపై నీరు నిల్వ ఉన్నా పట్టించుకోని పంచాయతీ సిబ్బంది, ఎంపీడీఓలకు మెమోలు జారీ చేయాలని ఆదేశించారు. ఆర్టీవో అచ్చుత అంబరీష్, డ్రెయినేజీ డీఈ ఎం.రామకృష్ణ, అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, సీఐ రవికుమార్, తహసీల్దార్లు ఉన్నారు. రైతుల గుండెల్లో తుపాను తీవ్ర ఆందోళనలో వరి రైతులు 120 కి.మీ వేగంతో తీవ్రగాలులు వీచే అవకాశం అధికారులు అప్రమత్తం నేడు, రేపు పాఠశాలలకు సెలవు నేటి పీజీఆర్ఎస్ రద్దు -
కేంద్ర ఆర్థిక విధానాలపై రాజీలేని పోరు
ఏలూరు (టూటౌన్): ఎల్ఐసీలో ఉన్న వేల కోట్ల రూపాయల ప్రజల ఆస్తిని ఏజెంట్ల కష్టాన్ని అదానీకి అప్పనంగా అప్పచెబుతున్న కేంద్ర ప్రభుత్వ దివాలాకోరు ఆర్థిక విధానాలపై రాజీ లేని పోరాటం కొనసాగించాలని టీచర్స్ ఎమ్మెల్సీ బి.గోపి మూర్తి పిలుపునిచ్చారు. స్థానిక సీతారామ భర్తీయా కళ్యాణ మండపంలో ఎల్ఐసి ఏజెంట్స్ ఆర్గనైజేషన్ ఆఫ్ ఇండియా ఆరో రాష్ట్ర మహాసభ ఆదివారం ఘనంగా జరిగింది. ఎల్ఐసీ ఏఓఐ రాష్ట్ర అధ్యక్షుడు టీ కోటేశ్వరరావు సంఘ పతాకాన్ని ఆవిష్కరించారు. ఎమ్మెల్సీ గోపి మూర్తి మాట్లాడుతూ నరేంద్ర మోదీ స్నేహితుడు అదాని కోసం ఎల్ఐసిని బలి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధపడిందన్నారు. ఏఐఈఈఏ సౌత్ సెంట్రల్ జోన్ అధ్యక్షుడు పి.సతీష్ మాట్లాడుతూ ప్రభుత్వ బీమా కంపెనీలపై నమ్మకం కోల్పోయేలా కేంద్ర ప్రభుత్వం వ్యవహరిస్తుందని చెప్పారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు ఆల్ ఇండియా ఎల్ఐసి వర్కింగ్ ప్రెసిడెంట్ ఎల్.మంజునాథ్ తదితరులు మాట్లాడారు. -
పాము కాటుకు గురైన భక్తురాలు
అందుబాటులో లేని 108 ఆంబులెన్స్లు ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై ఆదివారం రాత్రి ఓ పాదయాత్ర భక్తురాలు పాము కాటుకు గురైంది. 108 ఆంబులెన్స్లు అందుబాటులో లేకపోవడంతో ఆలయ ప్రథమ చికిత్స సిబ్బంది ఆమెను దేవస్థానం ఆబులెన్స్లో హుటాహుటీన ఆస్పత్రికి తరలించారు. చాట్రాయి మండలం, చిన్నంపేట గ్రామానికి చెందిన అన్నపరెడ్డి భారతి, మరో పది మంది భక్తులు పాదయాత్రగా రాత్రి కొండపైకి చేరుకున్నారు. ఆలయానికి చేరుకునే క్రమంలో పాత కేశఖండనశాల వద్ద నుంచి శివాలయానికి వెళ్లే మెట్ల మార్గం గుండా నడుచుకుంటూ వెళుతున్నారు. ఇంతలో భారతి మెట్లపై కూర్చుని, తన కుడి చేతిని పక్కనే ఉన్న రాతి గోడపై పెట్టింది. అక్కడున్న కట్లపాము కరిచింది. భారతిని ఆస్పత్రికి తరలించేందుకు దేవస్థానం ప్రథమ చికిత్సా కేంద్రం సిబ్బంది 108కు ఫోన్ చేయగా, బిజీగా ఉన్నాయని చెప్పి ఫోన్ కట్ చేశారు. దాంతో భారతిని దేవస్థానం అంబులెన్స్లో తొలుత స్థానిక పీహెచ్సీకి తరలించి చికిత్స అందించారు. మెరుగైన చికిత్స నిమిత్తం అదే అంబులెన్స్లో ఏలూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. ద్వారకాతిరుమల 108 ఆంబులెన్స్ 5 రోజుల క్రితం, కామవరపుకోట ఆంబులెన్స్ నెల క్రితం, భీమడోలు ఆంబులెన్స్ వారం క్రితం, అలాగే జంగారెడ్డిగూడెం ఆంబులెన్స్ సైతం మరమ్మతుల నిమిత్తం షెడ్డుకు చేరాయి. దాంతో ఈ మండలాల ప్రజలకు 108 సేవలు అందక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. -
నరసాపురం టీడీపీలో వర్గపోరు
జిల్లా ఇన్చార్జ్ మంత్రి ఎదుట నిరసన నరసాపురం: నరసాపురం టీడీపీలో వర్గపోరు మార్కెట్ యార్డ్ నూతన కమిటీ ప్రమాణ స్వీకార కార్యక్రమం నేపథ్యంలో రోడ్డెక్కింది. ఏఎంసీ ప్ర మాణ స్వీకార ఆహ్వాన పత్రికలో మాజీ ఎమ్మెలే బండారు మాధవనాయుడు పేరు వేయలేదని మూడు రోజుల నుంచి ఆందోళన చేస్తున్న బండారు వర్గీయులు ఆదివారం పట్టణంలో మో టార్ సైకిళ్లతో నిరసన ప్రదర్శన చేశారు. ఏఎంసీ నూతన కమిటీ ప్రమాణ స్వీకారం జరుగుతున్న స్థానిక గోదావరి గట్టున ఉన్న అల్లూరి సాంస్కృతిక ప్రదర్శన కేంద్రం వద్దకు చేరుకుని గొడవ చేశారు. కార్యక్రమానికి హజరైన జిల్లా ఇన్చార్జ్ మంత్రి గొట్టిపాటి రవికుమార్ను ఆపి టీడీపీ నరసాపురం నియోజకవర్గ ఇన్చార్జ్ బాధ్యతల నుంచి పొత్తూరి రామరాజును తప్పించి పార్టీని కాపాడాలని డిమాండ్ చేశారు. దీంతో అల్లూరి సాంస్కృతిక కేంద్రం వద్ద కొద్దిసేపు ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. చివరకు మంత్రికి వినతిపత్రం ఇచ్చి ఆందోళన విరమించారు. లోపల ఏఎంసీ కార్యవర్గం ప్రమాణ స్వీకారం జరుగుతున్న సమయంలోనే బయట బండారు వర్గీయులు ఆందోళన చేయడం గమనార్హం. అయితే ఆందోళనను ఏ మాత్రం పట్టించుకోకుండానే ప్రమాణస్వీకారం కార్యక్రమం నిర్వహించారు. -
విద్యుత్ ఉద్యోగుల హక్కుల కోసం పోరాటాలు
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ ఉద్యోగుల హక్కుల పరిరక్షణ కోసం, వారి సమస్యల పరిష్కారం కోసం 71 ఏళ్ల క్రితం ఏర్పాటుచేసిన విద్యుత్ ఉద్యోగుల సంఘం (327) తన పోరాటాలను కొనసాగిస్తోందని ఆ సంఘ ఈపీడీసీఎల్ డిస్కం అధ్యక్షుడు భూక్యా నాగేశ్వరరావు నాయక్ అన్నారు. ఏలూరులోని జిల్లా విద్యుత్ స్టోర్ వద్ద ఏపీ స్టేట్ ఎలక్ట్రిసిటీ ఎంప్లాయీస్ యూనియన్ (327) ఆవిర్భావ దినోత్సవాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆ యన మాట్లాడుతూ ఉమ్మడి ఉద్యమాల్లో భాగస్వామ్య సంఘాలతో కలిసి విద్యుత్ జేఏసీగా ఏర్పాటు చేసుకుని విద్యుత్ ఉద్యోగుల సమ స్యల పరిష్కారానికి పోరాటాలు చేస్తున్నామన్నారు. 1999 నుంచి 2004 వరకూ ఉద్యోగంలో చేరిన వారికి పెన్షన్ సౌకర్యం కల్పించాలని, జేఎల్ఎం గ్రేడ్–2 లను సంస్థలో విలీనం చేయాలని, కాంట్రాక్టు ఉద్యోగులకు సమాన పనికి సమాన వేతనం ఇవ్వాలని డిమాండ్ చేశారు. జిల్లా కార్యదర్శి వి. రాము, ఏలూరు డివిజన్ అధ్యక్షుడు పి.శ్రీనివాస్, కార్యదర్శి జి.నాగేశ్వరరావు, వర్కింగ్ ప్రెసిడెంట్ ఎస్.శ్రీనివాస్ నిర్మల్ గౌడ్ తదితరులు పాల్గొన్నారు. ఆకివీడు: ఆకివీడు పెదపేటలోని బీసీ హాస్టల్ ప్రాంగణాన్ని మట్టితో పూడ్చి ఎత్తు చేస్తున్నా రు. హాస్టల్ ప్రాంగణం లోతట్టుగా ఉండటంతో వర్షానికి, డ్రెయినేజీలో నీరు ప్రాంగణంలోకి చొచ్చుకువస్తోంది. దీంతో విద్యార్థులకు తీవ్ర ఇబ్బంది కలుగుతోంది. ‘దుక్కి వర్షానికే హాస్ట ల్ ప్రాంగణం ముంపు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. ప్రాంగణాన్ని మట్టితో పూడ్చుతున్నారు. లారీ ఢీకొని బాలుడు మృతి ఆకివీడు: అమ్మా.. ప్రైవేటుకు వెళ్లివస్తానంటూ సైకిల్పై బ్యాగ్ తగిలించుకుని వెళ్లిన బా లుడు లారీ ఢీకొని దుర్మరణం పాలైన ఘటన ఆదివారం సాయంత్రం గుమ్ములూరులో చోటుచేసుకుంది. వివరాలిలా ఉన్నాయి.. గ్రామంలోని ఇందిరమ్మ కాలనీకి చెందిన మల్లా వీరన్న కుమారుడు మోనేష్ శ్రీసాయి (11) సైకిల్పై ప్రైవేటుకు వెళుతుండగా గ్రామంలోని ప్రధాన సెంటర్లో గణపవరం వైపు వెళుతున్న రొయ్యల లోడు లారీ వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో శ్రీసాయి అక్కడికక్కడే మృతిచెందాడు. గ్రామస్తులు పెద్ద సంఖ్యలు అక్కడకు చేరుకున్నారు. వీరన్నకు ఏకై క కుమారుడు కావడంతో అల్లారుముద్దుగా పెంచుకుంటూ ఆకివీడులోని ప్రైవేట్ స్కూల్లో చదివిస్తున్నారు. ఏఎస్సై స త్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టంకు తరలించారు. లారీని పోలీస్స్టేషన్కు తీసుకువెళ్లారు. తండ్రి వీరన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లారీ వేగంగా రావడంతో అదుపు తప్పి బాలుడిని ఢీకొట్టిందని స్థానికులు చెబుతున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పశ్చిమగోదావరి జిల్లాకు కేటాయించిన ప్రత్యేక పర్యవేక్షణ అధికారి వి.ప్రసన్న వెంకటేష్ ఆదివారం రాత్రి జిల్లాకు చేరుకున్నారు. కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్కుమార్రెడ్డితో సమావేశమయ్యారు. తుపాను ప్రభావిత ప్రాంతాలు, ముందస్తు చర్యలపై సమీక్షించారు. వరద ప్రభావిత ప్రాంతాల ప్రజలు ఏదైనా సమాచారాన్ని 8639541520 నంబర్లో సంప్రదించి ప్రత్యేకాధికారికి తెలియజేయవచ్చు. జిల్లాలోని 7 అగ్నిమాపక కేంద్రాల పరిధిలో 90 మంది సిబ్బందిని, అత్యవసర పరికరాలు, వాహనాలను సిద్ధంగా ఉంచి నట్టు కలెక్టర్ తెలిపారు. చెట్లను నరకడానికి 12 బృందాలతో 24 మందిని నియమించామన్నారు. -
రెవెన్యూ ఉద్యోగులకు అండగా ఉంటాం
ఏలూరు (మెట్రో): జిల్లాలో రెవెన్యూ ఉద్యోగులకు యూనియన్ తరఫున ఎప్పుడూ అండగా ఉంటామని జిల్లా రెవెన్యూ అధ్యక్షులు కె.రమేష్కుమార్ అన్నారు. స్థానిక రెవెన్యూ అసోసియేషన్ భవనంలో జిల్లా కార్యవర్గ ఎన్నిక ఆదివారం నిర్వహించారు. ఈ ఎన్నికలో అధ్యక్ష కార్యదర్శులుగా కె.రమేష్కుమార్, ఎ.ప్రమోద్కుమార్ ఎన్నికయ్యారు. అసోసియేట్ అధ్యక్షుడిగా జి.విజయకుమార్రాజు, ఉపాధ్యక్షులుగా కె.చల్లన్నదొర, కె.రవిచంద్రరావు, ఎం.సోమేశ్వరరావు, పి.మాధవి, ఆర్గనైజింగ్ కార్యదర్శిగా సీహెచ్ యస్వంత్, క్రీడా కార్యదర్శిగా బి.సందీప్, జాయింట్ సెక్రటరీలుగా సీహెచ్ స్వామి, జె.శ్రీనునాయక్, పి.నాజీమబేగమ్, ఎమ్.మల్లిఖార్జునరావు, ట్రెజరర్గా ఆర్వీ రాజేష్, ఎగ్జిక్యూటివ్ మెంబర్లుగా టి.రాజరత్నకుమార్, కె.నరసింరావు, స్టేట్ కౌన్సిలర్గా శేఖర్బాబు ఎన్నికయ్యారు. -
నరకప్రాయంగా నగర రహదారి
పెద్ద రైల్వేస్టేషన్ మెయిన్రోడ్డు దుస్థితి గోతులమయంగా ఏలూరు గూడ్స్షెడ్డు మెయిన్ రోడ్డు ఏలూరు జిల్లా కేంద్రమైన ఏలూరులో ఎక్కడ చూసినా గుంతలే. ఇటీవల కురుస్తున్న వర్షాలకు ఆ గుంతలు కాస్త పెద్దవిగా మారి ప్రమాదాలకు నిలయంగా తయారయ్యాయి. ముఖ్యంగా ఏలూరు పాతబస్టాండ్ నుంచి తూర్పులాకుల వరకు ప్రధాన రహదారి అడుగడుగునా గోతులతో అధ్వానంగా ఉంది. తరచూ వాహనదారులు ఈ గోతుల్లో పడి ప్రమాదాలకు గురవుతున్నా కూటమి నాయకుల్లో మాత్రం చలనం లేదు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు -
మహిళ అదృశ్యంపై కేసు నమోదు
టి.నరసాపురం: మహిళ అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం.జయబాబు తెలిపారు. మండలంలోని మెట్టగూడెం గ్రామానికి చెందిన ములికి మహాలక్ష్మికి వివాహమై ఒక పాప ఉంది. నాలుగేళ్ల క్రితం భర్త చనిపోవడంతో ముత్యాలమ్మపేట గ్రామ శివార్లలో గల కాంచనమాల పామాయిల్ తోటలో మకాం ఉంటున్న కుటుంబ సభ్యులతో నివాసం ఉంటుంది. ఈ నెల 24న బొర్రంపాలెం బ్యాంకు పని నిమిత్తం వెళ్లి తిరిగి రాలేదు. ఆమె తండ్రి కలవకొల్లి వెంకన్న ఫిర్యాదుతో శనివారం కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. ఆగిరిపల్లి : లారీ ఢీకొని మహిళ దుర్మరణం చెందిన ఘటన మండలంలోని అడవినెక్కలంలో చోటు చేసుకుంది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాల ప్రకారం శనివారం ఎన్టీఆర్ జిల్లా నున్న గ్రామానికి చెందిన దేవరశెట్టి అప్పారావు, తన భార్య ప్రమీల దేవి (60)తో కలిసి ద్విచక్ర వాహనంపై మండలంలోని నెక్కలం గొల్లగూడెం అడ్డ రోడ్డులోని వేంకటేశ్వర స్వామిని దర్శించుకుని వెళ్తుండగా అడవినెక్కలం వద్దకు వచ్చేసరికి వెనుక నుంచి అతివేగంగా వచ్చిన లారీ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ప్రమీల దేవి తలకు గాయమై అక్కడికక్కడే మృతి చెందింది. ఆమె భర్తకు స్వల్ప గాయాలయ్యాయి. భర్త అప్పారావు ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు (మెట్రో): జిల్లాలోని ప్రకృతి వ్యవసాయ విభాగం ఆధ్వర్యంలో ఫార్మర్ మాస్టర్ ట్రైనర్లకు రెండు రోజుల శిక్షణా కార్యక్రమం శనివారం ఏలూరులోని ఐఏడీపీ హాలు నందు ప్రారంభించి నిర్వహించినట్లు జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి. వెంకటేష్ తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రైతులు ప్రకృతి వ్యవసాయ పద్ధతులను విస్తృతంగా అనుసరించడం ద్వారా పంటల ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించుకోవచ్చని, నేల ఆరోగ్యాన్ని కాపాడుకోవచ్చని అన్నారు. రైతులకు బయోకంట్రోల్ పద్ధతులు, జీవామృతం, ఘనజీవామృతం, కీటకనాశక తయారీ విధానాలు వంటి అంశాలపై వివరించామన్నారు. శిక్షణలో ప్రకృతి వ్యవసాయశాఖ అధికారులు, ఎఫ్ఎంటీ మాస్టర్ ట్రైనర్స్, సహాయక సిబ్బంది పాల్గొన్నారు. భీమవరం: టెట్ నోటిఫికేషన్లో ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులను పూర్తిగా మినహాయించాలని, దీనిపై రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలని, ఏపీటీఎఫ్ జిల్లా శాఖ ప్రధాన కార్యదర్శి రమణ, ఉపాధ్యక్షుడు హరికృష్ణ, అసోసియేట్ అధ్యక్షురాలు శ్రీవల్లి శనివారం ఒక ప్రకటనలో కోరారు. సుప్రీంకోర్టు ఉత్తర్వులు ఇవ్వగానే ప్రభుత్వం టెట్ నోటిఫికేషన్ ఇవ్వడం మినహా సుప్రీంకోర్టు ఉత్తర్వులలో ఏమున్నాయి, ఎవరికి వర్తిస్తాయి, కేంద్ర ప్రభుత్వ ఆలోచన ఏమిటనేది సమీక్షించకుండా సుప్రీంకోర్టు ఉత్తర్వులు అమలుపర్చాలని చూడడం దారుణమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ, తమిళనాడు, కేరళ ప్రభుత్వాల మాదిరిగా సుప్రీంకోర్టులో రివ్యూ పిటిషన్ వేయాలన్నారు. 20 నుంచి 30 ఏళ్లు పైబడి సర్వీస్ పూర్తి చేసిన అనేకమంది ఉపాధ్యాయులు ఈ వయస్సులో టెట్ ఉత్తీర్ణత విషయంలో ఒత్తిడి గురవుతున్నారని, పదోన్నతులకు కూడా టెట్ ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన సరికాదని ఆవేదన వ్యక్తం చేశారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
నూజివీడు: వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రభుత్వ మెడికల్ కాలేజీల్లో తొలి విడతగా 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేయడం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్ఛార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. పట్టణంలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో శనివారం ప్రజా ఉద్యమం పోస్టర్ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలోని ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడంపై నిరసనగా ఈ నెల 28న పట్టణంలో భారీ ర్యాలీ నిర్వహిస్తున్నామన్నారు. ఈ ర్యాలీలో ప్రజలందరూ పాల్గొనాలని ప్రతాప్ పిలుపునిచ్చారు. వైఎస్ జగన్ తన పాలనలో 17 ప్రభుత్వ కళాశాలలను తీసుకొస్తే నేడు కూటమి ప్రభుత్వం వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడం దుర్మార్గమన్నారు. 17 మెడికల్ కాలేజీల్లో ఐదు కళాశాలల నిర్మాణం పూర్తయ్యి తరగతులు నడుస్తున్నా కూటమి ప్రభుత్వం వాటిని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించిందన్నారు. పేద, మధ్యతరగతి వర్గాలకు చెందిన విద్యార్థులు వైద్య విద్యను చదువుకోవడం కూటమి ప్రభుత్వానికి ఏమాత్రం ఇష్టం లేదన్నది దీనినిబట్టి స్పష్టమవుతోందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కార్పోరేట్ శక్తులకు దోచిపెట్టడమే పనిగా పెట్టుకుందన్నారు. ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడం వల్ల పేదలకు ఉచిత వైద్యం దూరమవుతుందని విమర్శించారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ మున్సిపల్ విభాగం అధ్యక్షుడు మలిశెట్టి బాబీ, కోఆప్షన్ సభ్యులు ప్రసాదరావు, జిల్లా అధికార ప్రతినిధి కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ విభాగం జిల్లా అధ్యక్షులు పిళ్లా చరణ్ తదితరులు పాల్గొన్నారు. -
బువ్వనపల్లిలో ఈగల్ టీమ్ తనిఖీలు
నిడమర్రు: బువ్వనపల్లిలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం మేరకు ఎలైట్ యాంటీ–నార్కోటిక్స్ గ్రూప్ ఫర్ లా ఎన్ఫోర్స్మెంట్ ( ఈగల్) టీమ్ సభ్యులు శనివారం వేకుమజామున బువ్వనపల్లి గ్రామంలోని దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. విజయవాడ, ఏలూరు నుంచి వచ్చిన 20 మంది బృంద సభ్యులతోపాటు డ్యాగ్ స్కాడ్, స్థానిక పోలీస్ సిబ్బందితో సుమారు 3 గంటల పాటు తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో ఎటువంటి గంజాయి లేదని నిర్ధారించకున్నారు. దీంతో గ్రామస్తులు ఊపిరి పీల్చుకున్నారు. ఆక్వా చెరువుల మీద పని చేసేందుకు ఒరిస్సా నుంచి వచ్చే కూలీల వద్ద గంజాయి ఉన్నట్లు అందిన సమాచారం మేరకు ఈ ఆకస్మిక తఖీలు నిర్వహించినట్లు ఈగల్ టీమ్ సభ్యులు తెలిపారు. అనంతరం గణపవరం ఇందిరమ్మ కాలనీల్లో తనిఖీలు నిర్వహించారు. తనిఖీల్లో సీఐలు ఎం.రవీంద్ర, రజనీకుమార్, ఎస్సైలు రమేష్, సుఽధీర్, ఫణికుమార్ తదితర పోలీస్ సిబ్బంది ఉన్నారు. గంజాయి పట్టివేత తణుకు అర్బన్: తణుకు కొండాలమ్మ పుంత రోడ్డులో 4 కేజీల 350 గ్రాముల గంజాయిని స్వాధీనం చేసుకుని 7గురిని అరెస్ట్ చేసినట్లు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ తెలిపారు. ఉండ్రాజవరం మండలం పాలంగికి చెందిన పాలాడి భానుప్రకాష్, తణుకుకు చెందిన కాకరపర్తి బాలాజీ, పెరవలి మండలం అజ్జరం గ్రామానికి చెందిన కాకరపర్తి గణపతి, నల్లాకులవారిపాలెంనకు చెందిన పితాని విజయబాబు, తణుకుకు చెందిన గుబ్బల ఉదయ్ప్రసాద్, బొడ్డు షారోన్, ఖండేటి సత్యనారాయణలను అరెస్టుచేసి కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి 15 రోజులు రిమాండ్ విధించారన్నారు. -
సాంకేతికతతో చిన్నారి ఆచూకీ లభ్యం
తణుకు అర్బన్: అదృశ్యమైన చిన్నారి ఆచూకీని పోలీసులు సాంకేతిక పరిజ్ఞానంతో కనుగొని ఆమెను కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఈమేరకు తణుకు రూరల్ పోలీస్ స్టేషన్లో శనివారం తాడేపల్లిగూడెం డీఎస్పీ డి.విశ్వనాథ్ విలేకరులకు వివరాలు వెల్లడించారు. పెరవలి మండలం ఖండవల్లి గ్రామానికి చెందిన ధనకొండ దుర్గమ్మ తన సోదరి రెండు కుటుంబాలతో గంగిరెద్దులు ఆడిస్తూ ఉపాధి కోసం దీపావళి ముందురోజు తేతలి శ్మశానవాటిక సమీపంలోని బస్షెల్టర్లో తలదాచుకున్నారు. ఈనెల 21వ తేదీన మధ్యాహ్నం గంగిరెద్దులు ఆడించి నివాస ప్రాంతానికి వచ్చిన వారికి సోదరి కుమార్తె వీరమ్మ కనిపించకపోవడంతో తణుకు రూరల్ పోలీసులను ఆశ్రయించారు. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు చిన్నారి వీరమ్మను ఆకివీడు రైల్వేస్టేషన్లో కనిపెట్టారు. పెద్దలంతా బయటకు వెళ్లిన సమయంలో చిన్నారి తేతలి జాతీయ రహదారిపైకి వచ్చి ఆటో ఎక్కి బస్టాండ్ వద్ద దిగగా అక్కడ నుంచి ఆకివీడుకు చెందిన యాచక వృత్తిలో ఉన్న ఇద్దరు పాపవద్ద ఎవరూ లేకపోవడంతో తమ వెంట తీసుకువెళ్లారు. ఈ వ్యవహారమంతా సీసీ పుటేజీలు, సాంకేతికపరంగా సేకరించిన పోలీసులు నాలుగు బృందాలుగా ఏర్పడి అత్తిలి, గణపవరం, ఆకివీడు ప్రాంతాల్లో జల్లెడపట్టగా చివరకు ఆకివీడు రైల్వేస్టేషన్లో పాప నేలపై పడుకుని ఉండడాన్ని చూసి గుర్తించి తణుకు తీసుకువచ్చారు. అయితే ఆకివీడుకు చెందిన భార్యాభర్తలు సైతం ఉద్దేశ్యపూర్వకంగా తీసుకువెళ్లలేదని, ఒంటరిగా ఉందని తీసుకువెళ్లి సాకుతున్నట్లుగా డీఎస్పీ విశ్వనాథ్ చెప్పారు. రూరల్ సీఐ బి.కృష్ణకుమార్ నేతృత్వంలో చిన్నారి అదృశ్యం ఘటనను ప్రతిష్టాత్మకంగా తీసుకుని కేసును చాకచక్యంగా ఛేదించిన ఎస్సైలు కె.చంద్రశేఖర్, డి.ఆదినారాయణ, జె.సతీష్, పి.ప్రేమరాజులతోపాటు హెడ్కానిస్టేబుల్ ఎ.శ్రీనివాస్, కానిస్టేబుళ్లు షేక్ అన్వర్, మలక శ్రీనివాస్, ఎ.రవీంద్ర, వి.మహేష్, ఎస్.భాస్కరాచారిలను డీఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. పాపను తల్లితండ్రులకు అప్పగించారు. తేతలిలో అదృశ్యమై ఆకివీడులో దొరికిన చిన్నారి -
కొల్లేరుకు ముంపు ముప్పు
పెదఎడ్లగాడి వంతెన వద్ద శనివారం 2.47 మీటర్ల నీటి మట్టం నమోదైంది. మోంథా తుపాను కారణంగా ఎగువ నుంచి భారీ నీరు చేరితే ప్రమాదకరంగా మారుతుంది. ఇటీవల ఇక్కడ వంతెన వద్ద డెక్క తొలగించాం. తిరిగి పేరుకుపోయింది. ఎటువంటి సమస్య వచ్చిన ఎదుర్కోవడానికి అధికారులు సిద్ధంగా ఉన్నాం. – ఎం.రామకృష్ణ, డ్రెయినేజీ డీఈ, కై కలూరుకై కలూరు: కొల్లేరుకు వరద ముప్పు పొంచి ఉంది. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వల్ల ఐదు రోజులుగా విస్తార వర్షాలు కురుస్తున్నాయి. దీనికి తోడు మోంథా తుపాను హెచ్చరికలతో అధికారులు అప్రమత్తమయ్యారు. కొల్లేరు గ్రామాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలుసుకుంటున్నారు. ఎగువ నుంచి వచ్చిపడుతున్న వర్షపు నీటికి స్థానికంగా అధిక వర్షాలు తోడవడంతో కొల్లేరు నిండుకుండలా కనిపిస్తోంది. తుపానుతో కొల్లేరు ఉగ్రరూపం దాల్చితే భారీ నష్టం తప్పదనే ఆందోళన వ్యక్తమవుతోంది. కొల్లేరుకు చేరే వరద నీటిని సముద్రానికి పంపే పెద ఎడ్లగాడి వంతెన వద్ద గురప్రుడెక్క పేరుకుపోవడం ఆందోళన కలిగిస్తోంది. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో మొత్తం 122 గ్రామాలున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి, కృష్ణాజిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు కొల్లేరులోకి చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. వివిధ డ్రెయిన్ల ద్వారా చేరుతున్న వరద నీరు మండవల్లి మండలం పెద ఎడ్లగాడి, చిన ఎడ్లగాడి, పోల్రాజ్ డ్రెయిన్లకు చేరుతోంది. అక్కడ నుంచి నీరు ఉప్పుటేరు ద్వారా సముద్రానికి చేరాలి. పెదఎడ్లగాడి నుంచి ఉప్పుటేరు వరకు చానలైజేషన్ జరగకపోవడంతో లక్షా 10 వేల క్యూసెక్కుల నీటికి కేవలం 10 వేల క్యూసెక్కుల నీరే సముద్రంలోకి ప్రవహిస్తోంది. గుబులు పుట్టిస్తున్న గుర్రపుడెక్క వరద నీటిని సముద్రానికి చేరవేసే పెదఎడ్లగాడి వంతెన వద్ద మొత్తం 56 ఖానాలకు ఇంచుమించు అన్ని ఖానాల్లో గురప్రుడెక్క పేరుకుపోయింది. ఇటీవల పలు పర్యాయాలు డెక్కను తొలగిస్తున్న తిరిగి ఖానాల వద్ద పేరుకుపోతోంది. యంత్రాలు, మనుషులు ఇలా రెండు పద్ధతుల్లో తూడు తొలగింపులు విఫలమవుతున్నాయి. డెక్క కారణంగా నీటి ప్రవా హం తగ్గి సమీపంలో గ్రామాలను ముంచెత్తుతోంది. ప్రస్తుతానికి పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.47 మీటర్ల నీటి మట్టం నమోదైంది. ఇది 3.5 మీటర్లకు చేరితే లోతట్టు గ్రామాలు నీట మునుగుతాయి. కొల్లేరు పరివాహక గ్రామాలన్నీంటిలో వర్షపునీరు భారీగా చేరడంతో ఆందోళనకర పరిస్థితులు నెలకొన్నాయి. పెనుమాకలంక రహదారిలో రాకపోకలు బంద్ విస్తార వర్షాల కారణంగా పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక మీదుగా ఇంగిలిపాకలంక చేరే రహదారి పూర్తిగా కొల్లేరు నీటిలో మునిగిపోయింది. దీంతో ఐదు రోజులుగా గ్రామాలకు రహదారి సౌకర్యం లేదు. అంతకుముందు కూడా ఇదే పరిస్థితి రహదారిలో కొనసాగింది. ప్రమాదకరమైనప్పటికీ ప్రజలు పడవలపై గ్రామాలకు చేరుతున్నారు. ఈ రహదారిలో ఓ బడా రైతు వందల ఎకరాలను అక్రమంగా సాగు చేస్తున్నా పట్టించుకోని ఫారెస్టు అధికారులు పెనుమాకలంక రహదారి నిర్మాణానికి అడ్డుతగులుతున్నారని ప్రజలు వాపోతున్నారు. ఎత్తులో రోడ్డు పనులకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. పెద ఎడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు మూత మండవల్లి: పెదఎడ్లగాడి–పెనుమాకలంక రోడ్డు మూసి వేసినట్లు తహసీల్దార్ కె గోపాల్ శనివారం పేర్కొన్నారు. పెదఎడ్లగాడి వద్ద కొల్లేరుకు ఎగువనున్న డ్రెయిన్లు రామిలేరు, తమ్మిలేరు, బుడమేరుల నుంచి వచ్చిన నీటి కారణంగా నిండు కుండలా మారింది. దీంతో పెనుమాకలంక రహదారిపై సుమారు మూడు అడుగుల మేర నీరు నిలిచింది. దీంతో వాహనదారులు, పాదాచారులు రాకపోకలు సాగించే అవకాశం లేదు. ఈ నేపథ్యంలో ఈ రోడ్డును మూసివేసినట్లు తహసీల్దార్ చెప్పారు. ఎగువ నుంచి భారీగా చేరుతున్న వర్షపు నీరు పెద ఎడ్లగాడి వంతెన వద్ద 2.47 మీటర్ల నీటి మట్టం మోంథా తుపాను హెచ్చరికతో అధికారులు అప్రమత్తం ఐదు రోజులుగా పెనుమాకలంక రహదారిలో రాకపోకలు బంద్ పెద ఎడ్లగాడి వద్ద పేరుకుపోయిన గుర్రపుడెక్క -
అడుగడుగునా మడుగులే
● పట్టించుకోని అధికారులు, ప్రజా ప్రతినిధులు ● డ్రెయిన్లు తవ్వించినా పరిష్కారం శూన్యం ఆకివీడు: జాతీయ రహదారి నెం.165 ఆధునికీకరణ దేవుడెరుగు.. ప్రస్తుతం ఉన్న రోడ్డు అడుగడుగునా గుంతలతో భయపెడుతుంది. వాహన చోదకులు, ప్రయాణికులు, పాదచారుల అవస్థలు వర్ణణాతీతం. డ్రైనేజీ సౌకర్యం లేకపోవడంతో వర్షపు నీరు, మురుగు నీరు రోడ్లపై ప్రవహిస్తూ.. తీవ్ర దుర్గంధం వెదజల్లుతోంది. రోడ్డుపై వెళ్లే వారు వ్యాధులకు గురవుతామనే ఆందోళనలో ఉన్నారు. ఇటీవల కచ్చా డ్రెయిన్ తవ్వినప్పటికీ వర్షపు, మురుగు నీరు ప్రవహించడంలో తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. ఎన్హెచ్ నెం.165 అభివృద్ధికి ఉప్పుటేరు నుంచి దిగమర్రు వరకూ రూ.2200 కోట్లు కేటాయించినా, పనులు మాత్రం అంగుళం ముందుకు కదలడం లేదు. ఏళ్ల తరబడి జాతీయరహదారి అభివృద్ధి అంటూ పాలకులు, ఆ శాఖ అధికారులు ప్రజల్ని ఊరిస్తున్నారు. ఈ రోడ్డును జాతీయ రహదారుల శాఖ విలీనం చేసుకుని రెండు పుష్కర కాలాలు గడిచినా అభివృద్ధి ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్న చందంగా ఉందని వాపోతున్నారు. డ్రైనేజ్ సౌకర్యం కల్పించకుండా, రోడ్డు ఇరువైపులా ఉంటున్న వారినే డ్రైయినేజీ నిర్మించుకోమనడం దారుణమని పలువురు వాపోతున్నారు. జాతీయ రహదారిని అభివృద్ధిచేయాలని, రోడ్డును పునర్నిర్మించాలని కోరుతున్నారు. వైఎస్సార్ సెంటర్లో.. జెడ్పీ హైస్కూల్ సమీపంలో.. -
శ్రీవారి క్షేత్రంలో భక్తుల రద్దీ సాధారణం
ద్వారకాతిరుమల : శ్రీవారి క్షేత్రంలో శనివారం భక్తుల రద్దీ సాధారణంగా ఉంది. స్వామివారికి ప్రీతికరమైనరోజు అయినప్పటికీ నాగులచవితి కావడంతో నామమాత్రంగా భక్తులు ఆలయానికి విచ్చేశారు. దాంతో ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణ కట్ట తదితర విభాగాల్లో భక్తులు స్వల్ప సంఖ్యలో కనిపించారు. ఇదిలా ఉంటే స్వామివారి దీపారాధన మండప ప్రాంతంలో ఉన్న చెట్టు వద్ద భక్తులు కార్తీక దీపాలను వెలిగించారు. దాంతో ఆ ప్రాంతం సందడిగా మారింది. పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని రోడ్లన్నీ గుంతలతో అధ్వానంగా ఉండడంతో ప్రజల ప్రాణాలు తీస్తున్నాయి. ఈ రోడ్డులో స్థానిక టౌన్ ఆసుపత్రి వద్ద ఉన్న పెద్ద గుంత, అలాగే ఆర్ఆర్ రైస్మిల్లు వద్ద చిప్స్ లేచిపోవడంతో వాహనాలు జారి పడిపోతున్నాయి. అలాగే పెనుమదం రోడ్డులో గుంతలో పడి ఓ మహిళ మృతి చెందింది. దీంతో నియోజకవర్గంలో రోడ్ల అధ్వాన పరిస్థితులపై సెప్టెంబర్ 17న ‘ప్రాణాలు తీస్తున్న గుంతల రోడ్లు’ శీర్షికన సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన మంత్రి నిమ్మల రామానాయుడు ఎట్టకేలకు శనివారం సీసీ రోడ్డు నిర్మాణానికి శంకుస్థాపన చేశారు. స్టేట్ హైవే (ఎస్హెచ్) నిధులు రూ.1.50 కోట్లతో టౌన్ ఆసుపత్రి వద్ద శ్రీనిధి రెస్టారెంట్ నుంచి దాదాపు పెనుమదం రోడ్డులో గగ్గిపర్రు రోడ్డు వరకూ నిర్మాణం చేస్తున్నట్లు ఆర్అండ్బీ అధికారులు తెలిపారు. కాళ్ల: విద్యుదాఘాతంతో యువకుడు మృతి చెందిన ఘటన శనివారం కాళ్ల మండలం కోపల్లె గ్రామంలో చోటుచేసుకుంది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం గ్రామానికి చెందిన కె.షాలేంరాజు (15) మృతికి విద్యుత్ తీగలు తగలడం కారణంగా తెలుస్తోంది. ఉపాధి నిమిత్తం విదేశాల్లో ఉంటున్న తల్లిదండ్రులు కొడుకు మృతి చెందిన విషయం తెలిసి హుటాహుటిన కోపల్లెకు వస్తున్నట్లు తెలిసింది. ఈ ఘటనపై ఫిర్యాదు అందలేని పోలీసులు తెలిపారు. -
వరి రైతు వెన్నులో వణుకు
ఆదివారం శ్రీ 26 శ్రీ అక్టోబర్ శ్రీ 2025ఏలూరు(మెట్రో): వర్షాకాలం వెళ్లిపోయిందనుకుని ఊపిరి పీల్చుకుంటున్న రైతన్నను తుపాను హెచ్చరికలు భయపెడుతున్నాయి. గత వారం రోజులుగా వర్షాలతో ఇబ్బంది పడుతుండగా.. తాజాగా తుపాను వరి రైతు వెన్నులో వణుకు పుట్టిస్తోంది. ఏటా రైతన్నలు నష్టాన్ని చవిచూస్తూనే ఉన్నారు. ఈ ఏడాది వర్షాకాలం పూర్తయినప్పటికీ ప్రకృతి కనికరించకుండా విరుచుకుపడుతోంది. గత మూడు రోజులుగా వర్షాలతో రైతన్నలకు కంటిమీద కునుకు లేదు. ఆరుగాలం శ్రమించి పండించిన పంట వర్షాలకు కళ్ల ముందే దెబ్బతింటుంటే రైతన్న దుఃఖం వర్ణణాతీతం. ప్రస్తుతం మొంథో తుపాను విరుచుకుపడుతుందన్న ప్రచారంతో ఆందోళన నెలకొంది. సోమ, మంగళవారాల్లో తుపాను తూర్పు, పశ్చిమగోదావరి, కృష్ణా జిల్లాల్లో తీరం దాటే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెప్పింది. ఈ నేపథ్యంలో ఏలూరు జిల్లాలో ప్రభావం తీవ్రంగా ఉండే అవకాశం ఉంది. ఈ తుపాను ప్రభావంతో రైతులకు తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యే అవకాశం ఉంది. తుపాను ప్రభావంతో ఆదివారం నుంచి వర్షాలు కురుస్తాయని, సోమ, మంగళవారాల్లో తీవ్రత అధికంగా ఉంటుందని వాతావరణ శాఖ చెప్పడంతో ఒకవైపు ప్రజలు, మరోవైపు రైతులు తీవ్ర ఆందోళనకు గురవుతున్నారు. అత్యంత అప్రమత్తంగా ఉండాలి: కలెక్టర్ ఈ నెల 30 వరకు అధికారులు, సిబ్బంది పూర్తి అప్రమత్తతతో ఉండాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి ఆదేశాలు జారీ చేశారు. అదే విధంగా ఏలూరు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూం ఏర్పాటు చేశారు. 94910 41419, 180023 31077 నెంబర్లను ప్రజలకు అందుబాటులో ఉంచారు. 28, 29 తేదీల్లో తీవ్రమైన గాలులు వీస్తాయని, ఈ నేపథ్యంలో హోర్డింగులు, స్తంభాలు, బలహీనంగా ఉన్న చెట్లు, శిధిలావస్థలో ఇళ్ళు, పూరిల్లు కూలిపోయే అవకాశం ఉందని, వీటిపై అప్రమత్తంగా ఉండాలని వీటిని తొలగించేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఆదేశించారు. జిల్లా, డివిజన్, మండల స్థాయిలో 24 గంటలు కంట్రోల్ రూంలు ఏర్పాటు చేసి సిబ్బందిని అందుబాటులో ఉంచేందుకు చర్యలు తీసుకున్నారు. పీజీఆర్ఎస్ కార్యక్రమం రద్దు తుపాను కారణంగా సోమవారం నిర్వహించే పీజీఆర్ఎస్ కార్యక్రమాన్ని రద్దు చేశారు. జిల్లా ప్రజలు సోమవారం పీజీఆర్ఎస్కు హాజరుకావద్దని స్పష్టమైన ఆదేశాలు జారీ చేశారు. రైతన్నల విషయంలో ప్రాధమిక అంచనాలను సిద్ధం చేస్తున్న జిల్లా అధికారులు రైతులకు జాగ్రత్తలు, సూచనలు చేశారు. జిల్లా వ్యాప్తంగా 1,84,060 ఎకరాల్లో వరి పంటను రైతులు సాగు చేస్తున్నారు. వరి పంటను రక్షించుకునే పనిలో రైతులు నిమగ్నమయ్యారు. లక్ష ఎకరాల్లో వరి కోతకు సిద్ధం కాగా మిగిలిన చోట్ల వరి పొట్ట ఈనికదశలో ఉంది. ఈ నేపథ్యంలో పంటను తుపాను ఏం చేస్తుందో అనే ఆందోళనలో రైతులున్నారు. ఏది ఏమైనా రానున్న మూడు రోజుల్లో రైతులు, ప్రజలు అప్రమత్తంగా ఉండాల్సిందే. రెండు, మూడు రోజులు కీలకం తుఫాన్ హెచ్చరికల నేపథ్యంలో అధికారులు అప్రమత్తం మూడు రోజులుగా జిల్లా వ్యాప్తంగా వర్షాలు రెండు రోజుల్లో 300 మి.మీ. పైగా వర్షపాతం నమోదు -
ఈగల్ టీమ్ తనిఖీలు
నిడమర్రు మండలం బువ్వనపల్లిలో భారీగా గంజాయి ఉన్నట్లు సమాచారం మేరకు ఈగల్ టీమ్ సభ్యులు శనివారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): కర్నూలు వద్ద జరిగిన ట్రావెల్ బస్సు ప్రమాదం నేపథ్యంలో రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారులు ప్రైవేట్ బస్సులపై విస్తృత తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఏలూరు జిల్లాలో శుక్రవారం రాత్రి తనిఖీలు నిర్వహించినట్టు ఉప రవాణా కమీషనర్ షేక్ కరీమ్ తెలిపారు. ఏలూరు సమీపంలోని కలపర్రు టోల్గేట్, జంగారెడ్డిగూడెం పట్టణంలో ఆర్టీవోలు ఎస్బీ శేఖర్, ఎస్ఎస్ రంగనాయకులు పర్యవేక్షణలోని ప్రత్యేక బృందాలు బస్సులపై కేసులు నమోదు చేసినట్లు తెలియచేశారు. నిబంధనలు ఉల్లంఘించిన ప్రైవేట్ ట్రావెల్ బస్సులపై 55 కేసులు నమోదు చేసి రూ.2.80 లక్షల జరిమానా విధించామన్నారు. ఇందులో 3 బస్సులను సీజ్ చేసినట్లు కరీమ్ తెలిపారు. సరైన ధ్రువపత్రాలు చూపని, అత్యవసర ద్వారం, అగ్నిమాపక పరికరాలు, ప్యాసింజర్ జాబితా లేని ఉల్లంఘనలపై కేసులు నమోదు చేశామన్నారు. ద్వారకాతిరుమల: శ్రీవారి గోదానం, గో దత్తత పథకాలను వచ్చే నెల 1 నుంచి పునః ప్రారంభిస్తున్నట్టు ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి శనివారం ఒక ప్రకటన ద్వారా తెలిపారు. లంపి స్కిన్ వ్యాధి తీవ్రత కారణంగా ఇటీవల ఈ పథకాలను దేవస్థానం తాత్కాలికంగా నిలిపివేసింది. ప్రస్తుతం వ్యాధి తీవ్రత తగ్గుముఖం పట్టడంతో మళ్లీ వీటిని పునః ప్రారంభిస్తోంది. దానంగా ఇచ్చే ఆవులు, దూడలతో పాటు గతంలో వాటికి గాలి కుంటు, ముద్దచర్మ వ్యాధులు సోకలేదని మండల పశువైద్యాధికారి ధృవీకరించిన పత్రాన్ని తప్పనిసరిగా తీసుకొచ్చి ఇవ్వాలని సూచించారు. -
చెరువుల పటిష్టతను పరిశీలించాలి
ఏలూరు(మెట్రో): జిల్లాలో 350 మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ పనులకు సంబంధించి ప్రతిపాదనలకు రాష్ట్ర ప్రభుత్వం నుంచి అనుమతులు రాగానే యుద్ధ ప్రాతిపదికన చేపట్టాలని కలెక్టరు ఆదేశించారు. కలెక్టరేట్లో మాట్లాడుతూ అధిక వర్షాలను దృష్టిలో పెట్టుకుని జిల్లాలో 1513 చెరువులు పటిష్టతపై క్షేత్రస్థాయిలో పరిశీలించి పూర్తిస్థాయిలో నివేదికను సమర్పించాలని ఆదేశించారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు పరిస్థితిని గమనిస్తూ క్షేత్రస్థాయిలో పర్యటిస్తూ పరిస్థితిని అధ్యయనం చేసు కోవాలన్నారు. చెరువుగట్ల పరిస్థితిని ఒకటికి నాలుగు సార్లు పరిశీలించి, పటిష్టతకు అన్ని చర్యలు చేపట్టాలన్నారు. అవసరమనుకున్న చోట ఇసుక బస్తాలు తగ్గినన్ని నిల్వలు పెట్టుకోవాలని, ఇలాంటి విషయాల్లో అలసత్వం, నిర్లక్ష్యం వహించకుండా ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని అధికారులకు కలెక్టరు సూచించారు. సమావేశంలో ఇరిగేషన్ డిప్యూటీ సూపరింటెండెంట్ ధనుంజయ, డీఈలు పి.గనిరాజు, ధర్మజ్యోతి, అర్జునరావు, సహాయక ఇంజనీర్లు పాల్గొన్నారు. కలిదిండి(కై కలూరు): అధిక వర్షాలతో కై కలూరు – కలిదిండి రహదారిలో కలిదిండి ప్రారంభ లాల్వ డ్రెయిన్పై సింగిల్ లైన్ బ్రిడ్జి శుక్రవారం రాత్రి పూర్తిగా కొట్టుకుపోయింది. దీంతో అధికారులు శనివారం తాత్కాలిక కాలిబాట వంతెనను ఏర్పాటు చేశారు. విద్యుత్శాఖ నుంచి తీసుకొచ్చిన రెండు పొడవాటి సిమెంటు స్తంభాలను అమర్చారు. నడకదారులు పడిపోకుండా రెండు వైపుల కర్రలను కట్టారు. పరిస్థితి అదుపులోకి వచ్చిన తర్వాత బ్రిడ్జి నిర్మాణం చేస్తామని అధికారులు చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లా వైద్య ఆరోగ్యశాఖ పరిధిలో జిల్లా వైద్య ఆరోగ్యశాఖ అధికారిణి డాక్టర్ జి.గీతాబాయి ఆధ్వర్యంలో మాతృ మరణాలు, శిశు మరణాలు సబ్ కమిటీ అంతర్గత సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ త్రెమాసికంలో శిశు మరణాలు, కారణాలపై సంబంధిత వైద్యాధికారులు, పర్యవేక్షకులు ఏఏన్ఏం ఆశా కార్యకర్తలు, అంగన్వాడీ కార్యకర్తలతో సమగ్ర విశ్లేషణ నిర్వహించారు. సమావేశంలో జిల్లా ఇమ్యూనైజేషన్ అధికారి డాక్టర్ దేవ సుధా లక్మీ, జిల్లా ఆసుపత్రుల సమన్వయ అధికారి డాక్టర్ సూర్యనారాయణ, గర్భకోశ వ్యాధుల నిపుణులు డా.మాధవి కళ్యాణి, చిన్న పిల్లలు వ్యాధి నిపుణులు డా.ప్రవీణ్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: జిల్లా వ్యాప్తంగా శనివారం 507 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా పాలకొల్లులో 69.6 మిల్లీమీటర్లు నమోదుకాగా భీమవరంలో 26, నరసాపురంలో 16.6, తాడేపల్లిగూడెంలో 8, తణుకులో 7.6, ఆకివీడులో 30.2, పెంటపాడులో 14, అత్తిలిలో 22.6, గణపవరంలో 29.6, ఉండిలో 30.4, పాలకోడేరులో 19.2, పెనుమంట్రలో 23.8, ఇరగవరంలో 18.8, పెనుగొండలో 14.4, ఆచంటలో28, పోడూరులో 22.2, వీరవాసరంలో 34.2, కాళ్లలో 22.2, మొగల్తూరులో 22.2, యలమంచిలిలో 49.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. భీమవరం: జిల్లాలో మద్యం అమ్మకాలకు ప్రభుత్వం ఎలాంటి టార్గెట్లు పెట్టలేదని జిల్లా అబ్కారీ శాఖాధికారి కెవీఎన్ ప్రభుకుమార్ శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. మద్యం వ్యాపారులు అమ్మకాలకు సరిపడా స్టాక్ను డిపోల నుంచి కొనుగోలు, అన్ని రకాల స్టాక్ ఉండేలా దిశానిర్దేశం చేస్తున్నట్లు తెలిపారు. ఇతర రాష్ట్రాల మద్యం, కల్తీ మద్యం షాపుల్లో అమ్మకుండా చర్యలు తీసుకున్నామని ఆయన వివరించారు. కల్తీ మద్యం విక్రయాలను అడ్డుకోడానికి ప్రభుత్వం సురక్షయాప్ను అందుబాటులోని తీసుకొచ్చినట్లు వివరించారు. -
2న శ్రీవారి తెప్పోత్సవం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని వచ్చేనెల 2న రాత్రి స్వామివారి తెప్పోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం శరవేగంగా ఏర్పాట్లు చేస్తోంది. అందులో భాగంగా పుష్కరిణి గట్లపై ఉన్న ముళ్ల పొదలను, పిచ్చిమొక్కలను ఇప్పటికే తొలగించారు. ప్రస్తుతం విద్యుద్దీప అలంకారాల పనులు జరుగుతున్నాయి. అలాగే పుష్కరిణిని బోరు నీటితో నింపుతున్నారు. ఉత్సవం జరిగే రోజు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభం అవుతుందని, భక్తులు ఈ వేడుకలో పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి కోరారు. -
కూటమికి కాలం చెల్లినట్లే
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు కొయ్యలగూడెం: వైఎస్సార్సీపీ కోటి సంతకాల సేకరణ ఉద్యమం కూటమి ప్రభుత్వ పాతరకు కారణం కాబోతోందని జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు పేర్కొన్నారు. శనివారం పొంగుటూరులో సర్పంచ్ పసుపులేటి రాంబాబు ఆధ్వర్యంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి జెట్టి గురునాథరావుతో కలిసి పాల్గొన్నారు. వైద్య విద్యను కూటమి ప్రభుత్వం పేద విద్యార్థులకు దూరం చేయబోతోందన్నారు. చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఏనాడూ కూడా సొంత బలంతో గెలవలేక పోయాడని, దత్తపుత్రుడు ఆర్భాటాన్ని ప్రజలు నమ్మబట్టే గత సార్వత్రిక ఎన్నికలలో కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టారన్నారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్పై చేసిన దుష్ప్రచారమే మన ఓటమికి ప్రధాన కారణమని, ఇప్పుడు రైతులు నిజం తెలుసుకొని జగన్మోహన్ రెడ్డి నిజాయితీని విశ్వసనీయతను నమ్ముతున్నామని అంటున్నారన్నారు. 2029లె వైఎస్సార్సీపీ కార్యకర్తల పాలన ప్రారంభం కాబోతోందని జగన్ 2.0 కి రథసారథులు కార్యకర్తలే అన్నారు. జిల్లా ఉపాధ్యక్షుడు మంతెన సోమరాజు, జిల్లా అధికార ప్రతినిధి దాసరి విష్ణు, జిల్లా కార్యదర్శులు గొడ్డటి నాగేశ్వరరావు, ముప్పిడి శ్రీను పాల్గొన్నారు. -
వర్జీనియా రైతుల నిరసన
కొయ్యలగూడెం: పొగాకు సీజన్ ముగుస్తున్నా తమ వద్ద ఉన్న బేళ్లను కొనుగోలు చేయడంలో నిర్లక్ష్యం కనిపిస్తోందని రైతులు గురువారం నిరసన వ్యక్తం చేశారు. కొయ్యలగూడెం వేలం కేంద్రంలో వేలం ప్రక్రియ నిర్వహిస్తుండగా నోబిడ్లు అధికంగా రావడం వారి నిరసనకు కారణమైంది. ఈ సందర్భంగా రైతులు మాట్లాడుతూ ఓ వైపు పొగాకు పంట సీజన్ ప్రారంభమైందని, పెట్టుబడుల కోసం తమ వద్ద ఉన్న పొగాకును అమ్మితే తప్ప వేరే మార్గం లేదన్నారు. వేలం కేంద్రానికి తీసుకువచ్చిన బేళ్లను కిలోకు రూ.60కు అయినా కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. కంపెనీల ప్రాతినిధ్యం పెరిగితే ధరలు పెరిగే అవకాశం ఉందని రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తెలిపారు. ఎన్ఎల్ఎస్ పరిధిలోని కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం–1,–2 కేంద్రాల్లో సుమారు 10 మిలియన్ కిలోల పొగాకు మిగిలి ఉందని, త్వరగా కొనుగోలు చేయాలని ఈడీకి విన్నవించినట్టు చెప్పా రు. త్వరలోనే ట్రేడర్స్తో సమావేశ నిర్వహించి అనుకూల నిర్ణయం తీసుకుంటామని ఈడీ హామీ ఇచ్చినట్లు తెలిపారు. ఏలూరు(మెట్రో): జిల్లాలో రూ.258 కోట్లతో మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణ పనులకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ లో గురువారం మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణ (ఆర్ఆర్ఆర్) పనులు, భూగర్భ జలాల పెంపు తదితర అంశాలపై టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో మొత్తం 1,513 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా మొదటి దశలో 175 చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, పునర్నిర్మాణాలకు ప్రతిపాదనలు రూపొందించి ప్రభుత్వానికి సమర్పించామన్నారు. రెండో దశలో రూ.258 కోట్లతో 350 మైనర్ చెరువుల పనులకు ప్రతిపాదనలు సిద్ధ చేవామన్నారు. వాటిని పూర్తిస్థాయిలో పరిశీలించి తుది ప్రతిపాదనలు సమర్పించాలని ఆదేశించారు. జంగారెడ్డిగూడెం: కేంద్ర ప్రభుత్వం ఎరువులపై సబ్సిడీని నిరాకరించడంతో తయారీ కంపెనీలు ధరలు పెంచి రైతులపై భారం వేసేలా చర్యలు తీసుకుంటున్నాయని, దీంతో కాంప్లెక్స్ ఎరువులు 50 కిలోల బస్తాపై రూ.50 నుంచి రూ.100 భారం పడుతుందని ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ ఆందోళన వ్యక్తం చేశారు. గురువారం స్థానిక ప్రజాసంఘాల కార్యాలయంలో ఎరువుల ధరలు–రైతులపై భారం అనే అంశంపై ఆయన మాట్లాడారు. ఎరువులపై 18 శాతం జీఎస్టీని 5 శాతానికి తగ్గించామని ప్రభుత్వం చెబుతున్నా.. ఈ పన్ను రాయితీ తయారీ కంపెనీ లకు ప్రయోజనకరంగా మారుతుందన్నారు. జీఎస్టీ ప్రయోజనం రైతులకు దక్కేలా చర్యలు తీసుకోవాలని, సబ్సిడీ కొనసాగించాలని కోరారు. రాష్ట్రంలో రైతులపై రూ.300 కోట్ల వరకు అదనపు ఎరువుల భారం పడుతుందన్నారు. సంఘం మండల కార్యదర్శి బొడ్డు రాంబాబు, మండల ఉపాధ్యక్షుడు బోడిక రామచంద్ర రావు పాల్గొన్నారు. నరసాపురం: బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో సముద్ర తీర ప్రాంతాల్లో అలల ఉధృతి ఎక్కువగా ఉంది. అలలు ఉవ్వెత్తున ఎగసిపడుతున్నాయి. పేరుపాలెం బీచ్లో సందర్శకుల రాకపై నిషేధాజ్ఞలు విధించారు. కార్తీకమాసం పురస్కరించుకుని బీచ్లోకి సందర్శకుల రద్దీ ఎక్కువయ్యింది. అయితే బీచ్ వద్ద సముద్ర అలలు ప్రమాదకరంగా ఉండటంతో స్నానాలు చేయడానికి అనుకూల పరిస్థితులు లేవు. మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని అధికారులు హెచ్చరికలు జారీ చేయడంతో వేట బోట్లకు లంగరు పడింది. ఇప్పటికే సముద్రంలోకి వేట కు వెళ్లిన బోట్లను తీరానికి తరలిస్తున్నారు. అధికారులను ఆర్డీఓ దాసి రాజు అప్రమత్తం చేశారు. రెవెన్యూ ఉద్యోగులకు సెలవులు రద్దు చేశారు. కంట్రోల్రూట్ ఏర్పాటు చేశారు. -
ఎక్స్ఆర్డీ ల్యాబ్ ప్రారంభించిన నిట్ డైరెక్టర్
తాడేపల్లిగూడెం: స్ఫటికాకార పదార్థా పరమాణు, పరమాణు నిర్మాణాన్ని విశ్లేషించడానికి ఎక్స్రే డీప్రాక్షన్ పరికరాలను ఉపయోగిస్తారని ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎన్వీ రమణరావు అన్నారు. ఏపీ నిట్లో బృందావనం భవనంలో రూ.కోటి 65 లక్షలతో ఏర్పాటు చేసిన సెంట్రల్ రీసెర్చ్ ఫెసిలిటీస్ ఎక్స్ఆర్డీ ల్యాబ్ను గురువారం ఆయన ప్రారంభించారు. ఆయన మాట్లాడుతూ మెటీరియల్ క్యారెక్టరైజేషన్, నాణ్యత నియంత్రణ కోసం మెటీరియల్ సైన్సు, ఫార్మాస్యూటికల్స్, ఎలక్ట్రానిక్స్ వంటి రంగాల్లో ఉపయోగిస్తారన్నారు. విద్యార్థులు నాణ్యమైన పరిశోధనలు చేసేందుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాలతో ఉన్న నూతన ల్యాబ్ ఎంతగానో దోహదపడుతుందన్నారు. ల్యాబ్ సేవలను విద్యార్థులు సద్వినియోగం చేసుకొని ఉన్నతస్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు. డీన్ రీసెర్చ్ కిరణ్శాస్త్రి, ఆచార్యులు కృష్ణమూర్తి పి.తపస్ పర్మానిక్, రిజిస్ట్రార్ దినేష్, డీన్లు సందీప్, హిమబిందు, వీరేశ్కుమార్ పాల్గొన్నారు. ఏలూరు రూరల్: కేంద్ర ప్రభుత్వం అందించే మేజర్ ధ్యాన్చంద్ ఖేల్రత్న, అర్జున, ద్రోణాచార్య అవార్డులతో పాటు రాష్ట్రీయ ప్రోత్సాహన్ పురస్కార అవార్డులకు అర్హత కల్గిన క్రీడాకారులు దరఖాస్తు చేసుకోవాలని ఏలూరు జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 28వ తేదీ రాత్రి గం.11.59 లోపు డబ్ల్యూడబ్ల్యూబడబ్ల్యూ.డీబీఏటీవైఏఎస్–ఎస్పీఓఆర్టీఎస్.జీఓవీ.ఏఎన్ వెబ్సైట్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. భీమడోలు: జాతీయ రహదారి కురెళ్లగూడెం, భీమడోలు గ్రామాల మధ్య రోడ్డు పక్కనే కుళ్లిన గుర్తుతెలియని వ్యక్తి మృతదేహాం లభ్యమైంది. మృతుడి వయసు సుమారు 35 నుంచి 40 ఏళ్ల మధ్య ఉంటుందని, నీలం, తెలుపు రంగు గల షర్టు, సిమెంట్ కలర్ ఫ్యాంటును ధరించి ఉన్నాడని పోలీసులు తెలిపారు. కురెళ్లగూడెం వీఆర్వో ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసినట్లు భీమడోలు ఎస్సై షేక్ మదీనా బాషా తెలిపారు. -
బీమా పాలసీలకు మొబైల్ నెంబర్లు అప్డేట్ చేసుకోవాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీదారులు డిజిటల్ లావాదేవీలను ప్రోత్సహించేందుకు ప్రతి పాలసీదారుడు వారి పాలసీలకు మొబైల్ నంబర్, ఈ–మెయిల్ ఐడీలను తప్పకుండా అప్డేట్ చేసుకోవాలని ఏలూరు డివిజన్ సూపరింటెండెంట్ ఆఫ్ పోస్ట్ ఆఫీసర్ సురకత్తుల శ్రీకర్ బాబు తెలిపారు. గురువారం ఏలూరు కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ తపాలా జీవిత బీమా, గ్రామీణ తపాలా జీవిత బీమా పాలసీలకు సంబంధించిన ముఖ్యమైన సమాచారం, ప్రీమియం చెల్లింపు వివరాలు, ఇతర అలెర్ట్లను నేరుగా ఎస్ఎంఎస్, ఈ–మెయిల్ ద్వారా త్వరగా పొందవచ్చన్నారు. అప్డేట్ చేసిన వివరాలతో కస్టమర్ పోర్టల్ (http://pi.indiaport.gov.in) ద్వారా పాలసీదారుడు ప్రీమియంను స్వయంగా ఆనన్లైన్లో చెల్లించవచ్చన్నారు. పెదవేగి: గత రెండు రోజులుగా ఉత్కంఠభరితంగా జరిగిన అండర్ 19 అంతర్ జిల్లాల అథ్లెటిక్ చాంపియన్లో శ్రీకాకుళం బాల, బాలికల జట్టులు సత్తా చాటి చాంపియన్గా నిలిచారు. పెదవేగి మండలం ఎంఆర్సీ కాలనీలోని డాక్టర్ బీఆర్ అంబేద్కర్ గురుకులంలో ఈనెల 22, 23 తేదీల్లో అంతర్ జిల్లాల అథ్లెటిక్స్ పోటీలు నిర్వహించారు. రాష్ట్ర నలుమూలల నుంచి వచ్చిన బాల బాలికలు అన్ని రకాల విభాగాల్లో సత్తాచాటారు. ఈ పోటీల్లో ఓవరాల్ చాంపియన్గా శ్రీకాకుళం బాల, బాలికలు నిలిచారని ఎస్జీఎఫ్ అండర్ 19 కార్యదర్శి కె జయరాజు తెలిపారు. విజేతలను బహుమతులు, మెడల్స్, ప్రశంసా పత్రాలతో సత్కరించి, అభినందించారు. కార్యక్రమంలో ప్రిన్సిపాల్ ఎ శివప్రసాద్, పలువురు పీడీలు, తదితరులు పాల్గొన్నారు. -
మహిళా దొంగ అరెస్ట్
భీమడోలు: ఆర్టీసీ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగులను దొంగిస్తున్న ఓ మహిళా దొంగను గురువారం భీమడోలు సర్కిల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నెల్లూరు జిల్లా వెంకటాచలం మండలం గొలగమూడి గ్రామానికి చెందిన మహిళా దొంగ వేములపల్లి దుర్గ నుంచి 33.5 గ్రాముల బంగారు అభరణాలు, 117 గ్రాముల వెండి అభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. భీమడోలు సర్కిల్ కార్యాలయంలో గురువారం ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్తో కలిసి సీఐ యూజే విల్సన్ కేసు వివరాలను విలేకరులకు వెల్లడించారు. గత నెల 28వ తేదీ సాయంత్రం విశాఖపట్నం జిల్లా భీమిలి మండలం తాళ్లవలస గ్రామానికి చెందిన గొడుగు సత్యవాణి తన 8 ఏళ్ల కుమారుడితో కలిసి ద్వారకాతిరుమల మండలం రాళ్లకుంట తన బంధువుల ఇంట్లో జరిగిన శుభకార్యానికి హాజరై తిరిగి వెళుతుండగా ద్వారకాతిరుమల బస్టాండ్లో బస్సు ఎక్కే క్రమంలో బంగారు అభరణాలు, వెండి ఆభరణాల గల బ్యాగ్ ఆపహారణకు గురైంది. దీనితో సత్యవాణి ద్వారకాతిరుమల పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాల మేరకు భీమడోలు సీఐ యూజే విల్సన్ పర్యవేక్షణలో ఎస్సై టి.సుధీర్ తన సిబ్బందితో కలిసి సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించి ద్వారకాతిరుమల ఆర్టీసీ బస్టాండ్లో మహిళా దొంగ వేములపల్లి దుర్గను అదుపులోకి తీసుకున్నారు. ఆమె నుంచి చోరీ సొత్తును స్వాధీనం చేసుకున్నారు. వేములపల్లి దుర్గ, ఆమె భర్త శివకుమార్ బస్టాండ్లలో ప్రయాణికుల బ్యాగుల లక్ష్యంగా దొంగతనాలకు పాల్పడుతున్నారు. వారిలో వేములపల్లి దుర్గను అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చిన్నపిల్లల బ్రేస్లేట్, చైన్, గ్రీన్ రాయి, మ్యాటీలు, చిన్నపిల్లల ఉంగరాలు, చెవి బుట్టలు, చిన్న, పెద్ద చెవి దిద్దులు, జూకాలును స్వాధీనం చేసుకున్నారు. అదే విధంగా వెండి జాలర్ల పట్టిలు, వెండి చైన్, చిన్న పిల్లల వెండి బ్రాస్లెట్, వెండి తాళం గుత్తి, వెండి రాఖీలను రికవరీ చేశారు. రెండు బంగారు గాజులను మహిళా దొంగ అట్టికా గోల్డ్లో పెట్టిందని, వాటిని రికవరీ చేయాల్సి ఉందన్నారు. ఆమెను భీమడోలు కోర్టుకు హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. ఈ కేసుల ఛేదనకు కృషి చేసిన బృందం సభ్యులు జి.దుర్గారావు, సీహెచ్ లక్ష్మీనారాయణ, ఎం.రాఘవ, టి.లక్ష్మీనారాయణ, వీజే ప్రకాష్బాబులను సీఐ అభినందించారు. -
దళారులతో నిర్వాసితులకు సమస్యలు
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు సమస్యలు సృష్టిస్తున్న దళారులపై తక్షణమే చర్యలు తీసుకోవాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు డిమాండ్ చేశారు. పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారం కోసం నిర్వాసితులతో కలిసి గురువారం జీలుగుమిల్లి తహసీల్దార్ కార్యాలయం, పోలీస్స్టేషన్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పోలవరం మండలం కొరుటూరు, గాజులగొంది, చీడూరు, టేకూరు గ్రామాలకు చెందిన నిర్వాసిత గిరిజనులు జీలుగుమిల్లి మండలం తరలివచ్చినట్లు తెలిపారు. వీరికి పి.నారాయణపురం సమీపంలో సుమారు 250 ఎకరాలను భూమికి భూమిగా ప్రభుత్వం కేటాయించగా.. గత ప్రభుత్వంలో పలు రకాల పంటలు వేసుకుని జీవనం సాగించారన్నారు. అయితే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత కొందరు దళారులు ఆ భూముల్లో సమస్యలను సృష్టిస్తూ నిర్వాసితులను భయాందోళనకు గురిచేస్తున్నారన్నారు. భూముల్లో వ్యవసాయం చేయనీయకుండా అడ్డుకుంటున్నారని, దీనిని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. భూములపై అన్ని హక్కులు నిర్వాసితులకే ఉన్నా రెవెన్యూ అధికారులు పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. నిర్వాసితులకు న్యాయం చేయాలని, అలాగే నిర్వాసితులను ఇబ్బంది పెడుతున్న వారిపై పీడీ యాక్ట్ నమోదు చేసి చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. అనంతరం తహసీల్దార్ ఉదయ్కు, పోలీస్స్టేషన్లో వినతిపత్రం అందించారు. ఎంపీటీసీ సు న్నం సురేష్, నాయకులు తగరం రాంబాబు, మాజీ సర్పంచ్ కోర్సా వెంకటేశ్వరరావు, నిర్వాసిత కాలనీ సర్పంచ్ పి.రామ్గోపాల్రెడ్డి, ఎంపీటీసీ అరగంటి పెంటమ్మ తదితరులు పాల్గొన్నారు. -
విమానయానం.. తెలుగుకు ప్రోత్సాహం
నిడమర్రు: విద్యార్థులు, తల్లిదండ్రులు గణితం, సైన్స్లో నూటికి, నూరు వస్తే భవిష్యత్ అని భావిస్తారు. అదిశగా ఆయా సబ్జెక్టులపై దృష్టి పెట్టి, తెలుగుపై తక్కువ శ్రద్ధ పెడుతుంటారు. దీంతో ఓ ఉపాధ్యాయుడు విద్యార్థులకు తెలుగుపై ఆసక్తి పెంచేలా వినూత్న హామీ ఇచ్చారు. ఎంత మంది తెలుగులో 100 మార్కులు సాధిస్తే, అంతమందిని విమాన ప్రయాణ అనుభూతి కలిగిస్తానని హామీ ఇచ్చారు. ఈ ఏడాది విడుదలైన పది ఫలితాల్లో ఇద్దరు విద్యార్థులు తెలుగు భాషలో 100 మార్కులు తెచ్చుకోవడంతో తాజాగా ఆ ఉపాధ్యాయుడు తన హామీని నిలబెట్టుకున్నారు. ఆ ఇద్దరు విద్యార్థులను తన సొంత ఖర్చులతో విమానంలో వేరే రాష్ట్రానికి తీసుకువెళ్లి వారి కలను నెరవేర్చారు. ఈ ఘటన విద్యార్థుల పట్ల ఉపాధ్యాయులకు ఉన్న అంకితభావాన్ని, వాగ్ధానాన్ని నిలబెట్టుకునే గొప్పతనాన్ని తెలయజేస్తుందని పలువురు హర్షం వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చిన మాట ప్రకారం.. నిడమర్రు మండలం పెదనిండ్రకొలను జవహర్లాల్ నెహ్రూ ఉన్నత పాఠశాలలో తెలుగు ఉపాధ్యాయుడిగా పని చేస్తున్న షేక్ మౌలాలి తన విద్యార్థులకు విమాన యానం బహుమతి ఇచ్చారు. అన్న మాట ప్రకారం తెలుగు భాషలో నూటికి నూరు మార్కులు సాధించి, ప్రస్తుతం ఇంటర్ చదువుతున్న నిమ్మల పావని, నిమ్మల సత్యసాహితీలను గన్నవరం నుంచి విమానంలో విహార యాత్ర తరహాలో హైదరాబాద్ తీసుకువెళ్లి మూడు రోజుల పాటు ప్రముఖ పర్యాటక ప్రాంతాలను వారు తిలకించేలా కృషి చేయడంతో విద్యార్థుల్లో ఆనందోత్సాహాలకు అవధుల్లేవని వారు చెబుతున్నారు. గత మూడేళ్లుగా తెలుగులో టార్గెట్ గతంలో ద్వారకాతిరుమల మండలం ఐఎస్ రాఘవరం యూపీ స్కూల్లో ఎస్జీటీగా ఉన్న కాలంలో తోటి టీచర్ల ప్రోత్సాహంతో డిజిటల్ తరగతి గదులు, ఇతర పాఠశాల అభివృద్ధి పనులకు దాతల నుంచి రూ.4.5 లక్షలు సమకూర్చినట్లు మౌలాలీ తెలిపారు. పాఠశాలల్లో జరిగే వార్షికోత్సవాల్లో తన వంతుగా ప్రతిభగల విద్యార్థులను సత్కరించేందుకు ప్రయత్నించినట్లు చెప్పారు. అక్కడ నుంచి 2019 నవంబర్లో తెలుగు స్కూల్ అసిస్టెంట్గా పదోన్నతిపై పెదనిండ్రకొలను జెడ్పీస్కూల్ల్లో బాధ్యతలు స్వీకరించానని, గత మూడేళ్లుగా పదోతరగతి పబ్లిక్ పరీక్షల్లో తెలుగులో ఎక్కువ మార్కులు సాధించేలా విద్యార్థులను ప్రోత్సహించినట్లు తెలిపారు. 2023లో తెలుగులో 98, 2024లో 99 మార్కుల లక్ష్యాలను ఇవ్వగా.. సాధించిన విద్యార్థులకు స్కై బ్యాగ్స్లను బహుమతులుగా అందించినట్లు ఆయన చెప్పారు. 2025లో తెలుగులో నూరు మార్కులు సాధించిన ప్రతి విద్యార్థిని వియాన ప్రయాణం చేయిస్తానని ఇచ్చిన ప్రోత్సాహక హామీని నెరవేర్చినట్లు వివరించారు. సంతోషంగా ఉంది మా ఇద్దరికి తొలిసారి హైదరాబాద్ వెళ్లడం, అది విమానంలో వెళ్లడం మంచి అనుభూతిని ఇచ్చింది. తెలుగులో 100 మార్కులు సాధించిన మేము ఇద్దరం బాలికలు అవ్వడంతో మా తెలుగు టీచర్ మౌలాలీ, మా గ్రామంలో ప్రైమరీ స్కూల్లో ఎస్జీటీగా పనిచేస్తున్న మాస్టారిగారి సతీమణి మహమ్మద్ గుల్షీన్ బేగంను మాకు తోడుగా తీసుకువచ్చారు. మూడు రోజులపాటు హైదరాబాద్లోని చార్మినార్, హైటెక్ సిటీ, సాలార్జంగ్ మ్యూజియం వంటి పర్యాటక ప్రదేశాలు సందర్శించడం ఆనందంగా ఉంది. వెళ్లేటప్పుడు గన్నవరం నుంచి విమానంలో, తిరిగి వచ్చేటప్పుడు ట్రైన్లో ప్రయాణం సాగింది, ఇదే స్ఫూర్తితో ఉన్నత చదువుల్లో రాణిస్తాం. – నిమ్మల సత్యసాహితీ, నిమ్మల పావని తెలుగులో 100 మార్కులొస్తే.. విమాన ప్రయాణం హామీ ఫలించిన పెదనిండ్రకొలను తెలుగు గురువు వినూత్న ఆలోచన మాటనిలబెట్టుకుని విద్యార్థులను విమానం ఎక్కించిన మౌలాలి -
డిప్యూటీ స్పీకర్ వర్సెస్ జనసేన!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: భీమవరం డీఎస్పీ జయ సూర్య కేంద్రంగా కూటమి పార్టీలో చిచ్చురేగింది. జయసూర్య తీవ్ర అవినీతికి పాల్పడ్డారని, పేకా టను ప్రోత్సహిస్తూ ప్రైవేట్ సెటిల్మెంట్లు భారీగా చేస్తున్నాకని జనసేన నేతల ఫిర్యాదుల ఆధారంగా ఉప ముఖ్యమంత్రి విచారణకు ఆదేశించిన విష యం తెలిసిందే. దీనికి కౌంటర్గా డిప్యూటీ స్పీకర్ రఘరామకృష్ణరాజు.. జయసూర్య మంచి ఆఫీసర్ అంటూ కితాబివ్వడం హాట్ టాపిక్గా మారింది. పశ్చిమలో పేకాట సహజమని వ్యాఖ్యానించడం చర్చనీయాంశమైంది. మరోవైపు ప్రభుత్వ ఆదేశాలతో డీఎస్పీ జయసూర్యపై విచారణ నిర్వహిస్తున్నామని జిల్లా ఎస్పీ నయీం అస్మీ ప్రకటించారు. ఎవరైనా వాట్సాప్ ద్వారా ఫిర్యాదు చేయవచ్చని, లేదంటే స్వయంగా కలిసి ఫిర్యాదు చేసినా తీసుకుంటామని చెప్పారు. అన్ని అంశాలను విచారించి ప్రభుత్వానికి నివేదిక ఇస్తామని అన్నారు. ఆధిపత్య పోరేనా ! భీమవరం డీఎస్పీ వ్యవహారం రెండు పార్టీల మధ్య ఆధిపత్య పోరుగా మారింది. గతంలో భీమవరం సబ్ డివిజన్లో భీమవరం రూరల్, భీమవరం టూ టౌన్ సీఐగా జయసూర్య సుదీర్ఘ కాలం పనిచేశారు. ఈ క్రమంలో పేకాట క్లబ్లు, కోడిపందాల నిర్వాహకులు, క్రికెట్ బుకీలు, రియల్ ఎస్టేట్ సెటిల్మెంట్ ముఠాలు.. ఇలా అన్నింటిపైనా పూర్తి అవగాహనతో పాటు వ్యక్తిగతంగా పరిచయాలున్నాయి. ఉండి నియోజకవర్గ ఎమ్మెల్యే, డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ద్వారా డీఎస్పీగా భీమవరం సబ్ డివిజన్కు వచ్చిన జయసూర్య తొలుత భీమవరం ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, ఉండి ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజు ఇద్దరితోనూ, రెండు పార్టీల కేడర్తోనూ సత్సంబంధాలు కొనసాగించారు. తనకున్న వ్యక్తిగత పరిచయాల ద్వారా క్లబ్ లు మొదలు కోడిపందాల వరకు అన్నింటిలో ప్ర త్యక్ష జోక్యం చేసుకున్నారనే ఆరోపణలున్నాయి. ఈ క్రమంలో భీమవరం జూదానికి హబ్గా మారిందని విస్తృత ప్రచారం జరగడం, పత్రికల్లో వరుస కథనాలు రావడంతో భీమవరంలో పేకాటను కొద్దిగా కట్టడి చేసినట్లు హడావుడి చేసి వ్యవహారం సద్దుమణిగేలా చేశారు. ఇదే సమయంలో భీమవరంలో తగ్గించి ఉండి నియోజకవర్గంలో కోడిపందాలు, పేకాట, క్రికెట్ బెట్టింగులు ఇలా అన్నింటికీ డీఎస్పీ నే గేట్లు ఎత్తారనే ఆరోపణలున్నాయి. ఈ పరిణామాల క్రమంలో కొద్ది నెలల క్రితం డీఎస్పీపై కూటమిలో ఓ వర్గం ప్రభుత్వానికి ఫిర్యాదు చేసి, బదిలీ చేయించింది. అయితే డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు ఒత్తిడి తేవడంతో బదిలీ నిలిచిపోయిందని ప్రచారం సాగుతోంది. దీంతో డీఎస్పీ పూర్తిగా డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజుకు అనుకూలంగా మారి, ఉండిలో అసాంఘిక కార్యక్రమాలకు పూర్తిస్థాయిలో సహకరించడంతో పాటు ఏకపక్షంగా వ్యవహరించారనే ఆరోపణలు వచ్చాయి. భీమవరం రూరల్ పరిధిలో ఓ రొయ్యల వ్యాపారికి సంబంధించి రూ.8 కోట్ల డబ్బు పంచాయితీ చేశారని ఆరోపణలు. గతంలో సీఐగా ఉన్నప్పుడు తన వ్యక్తిగత స్నేహితుడిగా ఉన్న ఓ పేకాటరాయుడి కోసం భీమవరం–నరసాపురం మార్గంలో పేకాట శిబిరం ఏర్పాటు చేయించి వసూళ్లకు పాల్పడ్డారనే ఆరోపణలు. భీమవరంలో కీలక క్రికెట్ బుకీ నుంచి రూ.లక్షల్లో తీసుకున్నట్లు ఆరోపణలు. జనసేన రాష్ట్ర ప్రొటోకాల్ చైర్మన్ మల్లినేని బాబి భీమవరంలో రియల్ ఎస్టేట్, బిల్డర్గా ఉన్నారు. బాబికి సంబంధించి ఓ సెటిల్మెంట్లో భా రీగా వసూలు చేశారని, ఓ విద్యాసంస్థ, ఒక ప్రైవేట్ సంస్థ సెటిల్మెంట్లోనూ భారీగా వసూలు చేశారని తేలింది. రికవరీలు బాగా చేస్తారని పేరుంది. ఆ ముసుగులో చేయాల్సింది చేసి, ట్రాక్ రికార్డు కోసం నామమాత్రంగా కేసులు నమోదు చేస్తుంటారు. ఈ వ్యవహారాలన్నీ భీమవరంలోని ఒక సీఐ చూసుకుంటారు. ఆ సీఐ.. డీఎస్పీకి షాడోగా వ్యవహరిస్తూ.. ఆర్థిక వ్యవహారాల్లో కీలకంగా ఉంటారనేది జనసేన నేతల ఫిర్యాదు. కూటమిలో చిచ్చు రేపిన భీమవరం డీఎస్పీ డీఎస్పీ జయసూర్యపై తీవ్రస్థాయిలో ఆరోపణలు భీమవరాన్ని జూదానికి హబ్గా మార్చారంటూ జనసేన ఫిర్యాదు ఎస్పీతో మాట్లాడి విచారణకు ఆదేశించిన డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఆ డీఎస్పీ మంచి ఆఫీసర్ అంటూ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు కితాబు డీఎస్పీ వ్యవహారంపై పశ్చిమ ఎస్పీ విచారణ ప్రారంభం -
అంజుమన్లో నిధుల గోల్మాల్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ముస్లిం సామాజికవర్గానికి సంబంధించి ప్రతిష్టాత్మక సంస్థగా అంజుమన్ ముహాఫిజుల్ ఇస్లాంకు చరిత్ర ఉంది. సంస్థ ద్వారా నగరంలో ముస్లింలకు పలురకాల సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. సంస్థ ఆధ్వర్యంలో ఉచితంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. అలాగే పేద ముస్లింలకు వివాహం, విద్యకు ఆర్థిక సాయం, సంప్రదాయ ఖత్నా (సున్నీ) కార్యక్రమాలను ఉచితంగా నిర్వహిస్తున్నారు. అయితే ఇంతటి ప్రతిష్టాత్మక సంస్థ భ్రష్టుపట్టిపోయిందని ముస్లిం పెద్దలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్వయం ప్రతిపత్తితో కార్యక్రమాలు నిర్వహించే సంస్థలోకి రాజకీయాలను చొప్పించి ఎమ్మెల్యే, నగర మేయర్ సంస్థ నిర్వహణ విధానాలను వారి కనుసన్నల్లో చేసే పరిస్థితికి కొంతమంది సభ్యులు తీసుకువచ్చారని విమర్శిస్తున్నారు. సంస్థకు ఉన్న ఆర్థిక వనరులపై కన్నేసిన కొందరు స్వార్థపరులు రాజకీయ నాయకుల ప్రాపకం కోసం వారి చుట్టూ తిరుగుతూ సంస్థ ప్రతిష్టను దిగజార్చుతున్నారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రూ.కోటికి పైగా.. గత ఏడేళ్లుగా సంస్థ ఆదాయం పక్కదారి పడుతోందని సభ్యులు ఆరోపిస్తున్నారు. 2024 మార్చి ముందు వరకూ అధ్యక్షుడిగా ఉన్న వ్యక్తి, అనంతరం వచ్చిన అధ్యక్షులు జమా ఖర్చులూ కార్యవర్గం ముందు పెట్టడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవానికి సంస్థ బైలా ప్రకారం ప్రతి నెలా కార్యవర్గ సమావేశం నిర్వహించాల్సి ఉన్నా అడపదడపా మినహా సమావేశాలు నిర్వహించలేదని చెబుతున్నారు. ఆదాయానికి సంబంధించి లెక్కలు బహిర్గతం చేయాలనే కారణంతోనే సమావేశాలు నిర్వహించడం లేద ని చెబుతున్నారు. ఇలా సుమారు రూ.కోటికి పైగా ని ధులు గోల్మాల్ జరిగినట్టు అంచనా వేస్తున్నారు. నెలకు రూ.3.50 లక్షలకు పైగా ఆదాయం అంజుమన్ సంస్థకు ఉన్న షాపులు, ఫంక్షన్ హాల్ అద్దెల ద్వారా నెలకు రూ.3.50 లక్షలకు పైగా ఆ దాయం వస్తుందని చెబుతున్నారు. అయితే అద్దెల రూపంలో వచ్చిన ఆదాయంలో అధిక శాతం పక్కదారి పట్టించినట్టు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఆదాయానికి సంబంధించి ఎలాంటి లెక్కలు చూపకపోవడంతో ఏడాదికి సుమారు రూ.40 లక్షలకు పైగా నిధులు దుర్వినియోగమై ఉండవచ్చని అంచనా వేస్తున్నారు. మూడేళ్లలో ముగ్గురు అధ్యక్షులు సంస్థ బైలా ప్రకారం మూడేళ్లకోసారి కార్యవర్గ ఎన్నికలు నిర్వహించాలి. 2024 మార్చిలో ఎన్నికలు నిర్వహించారు. ఎండీ సలేమాన్ను అధ్యక్షుడిగా ఎన్నుకున్నారు. అయితే ఆయన నిధులు దుర్వినియోగానికి పాల్పడుతున్నారని అసమ్మతి పెట్టి ఈ ఏడాది మే నెలలో ఎండీ జబీఉల్లాను అధ్యక్షుడిగా ఎన్నుకున్నా రు. జబీఉల్లా రెండు నెలలు పదవిలో కొనసాగగా ప్రస్తుతం ఆయన్ను దౌర్జన్యంగా తొలగించారు. ఈ నేపథ్యంలో కార్యవర్గ సమావేశం పెట్టకుండానే ఎండీ సిద్ధిక్ అలీపాషా (ఆరిఫ్) అనే వ్యక్తి తనకు మె జార్టీ సభ్యుల మద్దతు ఉందని స్వయంగా ప్రకటించుకుని అధ్యక్షుడిగా చలామణి అవుతున్నారని కొందరు కార్యవర్గ సభ్యులు అసంతృప్తి వ్యక్తం చేస్తు న్నారు. నిబంధనల మేరకు కార్యవర్గ సమావేశం నిర్వహించి మెజార్టీ సభ్యుల మద్దతుతో అధ్యక్షుడిని ఎన్నుకుంటారు. అయితే ఇక్కడ అలాంటివేమీ జరగకుండా ఆరిఫ్ స్వయంగా అధ్యక్షుడిగా ప్రకటించుకోవడం కార్యవర్గ సభ్యులను ఆగ్రహానికి గురిచేసింది. తనకు ఎమ్మెల్యే కార్యాలయం నుంచి మద్దతు ఉందని కూడా ఆరిఫ్ ప్రకటించుకోవడంతో ఎవరూ బాహటంగా వ్యతిరేకించడం లేదు. బైలాకు విరుద్ధంగా.. గతంలో సంస్థ నిర్వహణ సక్రమంగా సాగేదని, అయితే 2024 నుంచి వచ్చిన అధ్యక్షులు సంస్థ నిధులను విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్నా వివరాలు తెలపడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. కార్యవర్గ సభ్యులకు తెలియజేయకుండా బైలాకు విరుద్ధంగా ఖర్చు చేయడంతో నిధులు గోల్మాల్ అయ్యాయనే చర్చ వాడీవేడిగా జరుగుతోంది. ఏలూరులో అంజుమన్ హాల్ రూ.కోటికి పైగా నిధుల స్వాహా! మూడేళ్లలో ముగ్గురు అధ్యక్షులు సంస్థ బైలాకు విరుద్ధంగా తీర్మానం లేకుండా ఖర్చులు కార్యవర్గ సభ్యుల మద్దతుతో సంబంధం లేకుండా అధ్యక్ష స్థానం ఆక్రమణ అంజుమన్ నిధులు గోల్మాల్ అయ్యాయని సభ్యులు తీవ్రంగా ఆరోపిస్తున్నారు. సంస్థ బైలా ప్రకారం ప్రతినెలా సంస్థ కార్యవర్గ సమావేశం నిర్వహించాలి. అయితే గత ఏడేళ్లలో అరకొర సమావేశాలు నిర్వహించడమే తప్ప ప్రతినెలా నిర్వహించ లేదు. నిధుల గోల్మాల్ విషయంలో ఆరోపణలు ఎదుర్కొంటున్న ముగ్గురు అధ్యక్షులు తమ హయాంలో జరిగిన ఆదాయ, వ్యయాల వివరాలు సభ్యులకు తెలపాలి. అతి తొందరగా కార్యవర్గ సమావేశం ఏర్పాటు చేసి సభ్యులతో చర్చలు జరపాలి. – ఎస్కే మస్తాన్ బాషా, అంజుమన్ గౌరవ అధ్యక్షుడు -
ఎడతెగని వాన
ఏలూరు(మెట్రో): బంగాళాఖాతంలో అల్పపీడన ప్రభావంతో జిల్లావ్యాప్తంగా విస్తారంగా వర్షం కురిసింది. గురువారం ఏజెన్సీలో కొండవాగులు పొంగిపొర్లాయి. మెట్టప్రాంతంలో భారీస్థాయిలో వర్షం నమోదైంది. ఏలూరులో ఎడతెగని వానతో జనజీవనం స్తంభించింది. మరికొద్ది రోజుల్లో వరి కోతలు ప్రారంభం కానున్న నేపథ్యంలో వర్షాలతో రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశించారు. బుధవారం నుంచి గురువారం ఉదయం వరకు కలిదిండి మండలంలో 78.2 మి.మీ. అత్యధిక వర్షపాతం నమోదైంది. మండలాల వారీగా వర్షపాతం మండవల్లిలో 51.2 మి.మీ., ముదినేపల్లిలో 46.6, కై కలూరులో 39.6, పెదపాడులో 17.4, ద్వారకాతిరు మలలో 17, లింగపాలెంలో 16.8, పెదవేగిలో 16.4, ఆగిరిపల్లిలో 13.6, ముసునూరులో 12.6, నూజివీడులో 10.2, కొయ్యలగూడెంలో 7.4, చాట్రాయిలో 6.8 మి.మీ వర్షపాతం నమోదైంది. నిడమర్రులో 6 మి.మీ, భీమడోలు, ఉంగుటూరులో 5.2 మి.మీ చొప్పున, టి.నరసాపురంలో 5, దెందులూరు, జంగారెడ్డిగూడెంలో 4.2 మి.మీ. చొప్పున, పోలవరంలో 3.8 మి.మీ., ఏలూరులో 3.2 , ఏలూరు రూరల్లో 2.8, కామవరపుకోటలో 2.4 మి.మీ వర్షపాతం నమోదైంది. జిల్లాలో సగటున 13.5 మి.మీ వర్షపాతం నమోదైంది. గురువారం ఉదయం నుంచి సాయంత్రం వరకు 20 మి.మీ సగటు వర్షపాతం నమోదుకావచ్చని అంచనా వేస్తున్నారు. మరో రెండు, మూడు రోజులపాటు జిల్లావ్యాప్తంగా వర్షాలు కురిస్తే అవకాశం ఉంది. విద్యుత్ కంట్రోల్ రూమ్లు ఏలూరు(ఆర్ఆర్పేట): భారీ వర్షాల నేపథ్యంలో విద్యుత్ శాఖ కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేసినట్టు ఎస్ఈ పి.సాల్మన్రాజు తెలిపారు. ఏలూరు జిల్లా విద్యుత్ శాఖ కార్యాలయంలో 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్ ఆఫీస్లో 9491030712 నంబర్తో కంట్రోల్ రూమ్లు ఏర్పాటుచేశామన్నారు. అలాగే టోల్ ఫ్రీ నంబర్ 1912, ఏలూరు సర్కిల్ ఆఫీస్ కంట్రోల్రూమ్ 9440902926, జంగారెడ్డిగూడెం డివిజన్ ఆఫీస్ 9491030712 నంబర్లలోనూ సంప్రదించవచ్చన్నారు. -
ఆక్వాకు ఆక్సిజన్ సమస్య
గణపవరం: పూటకోరకంగా మారుతున్న వాతావరణం ఆక్వా సాగుకు గుదిబండలా తయారైంది. ముఖ్యంగా ఈ వాతావరణం రొయ్యల సాగుకు పూర్తి ప్రతికూలంగా ఉండటంతో రైతులు దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఇటీవల దారుణంగా దెబ్బతిన్న రొయ్య సాగు కొద్దిగా కుదుటపడుతున్న సమయంలో వాతావరణ మార్పులతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఈ పరిస్థితిలో గత పదిరోజులుగా నిలకడలేని వాతావరణం రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. తుపాను ప్రభావంతో ఆక్వా కుదేలు వేసవి సాగు మొత్తం తుడిచిపెట్టుకు పోవడంతో గత సెప్టెంబర్ నెలలో ఎక్కువమంది రైతులు చెర్వులలో రొయ్య సీడ్ వేశారు. ప్రస్తుతం రొయ్య కౌంట్ 200 నుంచి 300 మధ్యలో ఉంది. ఈ పరిస్థితుల్లో తుపాను ప్రభావంతో కురుస్తున్న భారీ వర్షాలు ఆక్వా సాగును కుదేలు చేస్తున్నాయి. రొయ్యల చెర్వులలో ఆక్సిజన్ సమస్యతో పాటు వ్యాధుల ముప్పుతో రైతులు సతమతమవుతున్నారు. దీనితో రొయ్యల చెరువులలో నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ ఆక్సిజన్ లోటు భర్తీచేయడానికి శ్రమిస్తున్నారు. ఈ సమస్యలకు తోడు విద్యుత్ కోతలు ఆక్వా రైతులను ముప్పుతిప్పలు పెడుతున్నాయి. విద్యుత్ కోతల కారణంగా ఏరియేటర్లు తిరగడానికి ఆయిల్ ఇంజన్లు సైతం సిద్ధం చేసుకుంటున్నారు. నిరంతరం వర్షం జల్లులు పడుతూ వాతావరణం పూర్తిగా చల్లబడి పోవడంతో రెండు రోజులుగా రొయ్యల చెర్వులలో డీవో సమస్య ఏర్పడి రొయ్యలు సరిపడా ఆక్సిజన్ అందక అసహనంతో నీటి ఉపరితలం మీద తేలియాడుతున్నాయి. ఈసమస్య మరీ తీవ్రమైతే అప్పటికప్పుడు రొయ్యలు చనిపోతున్నాయి. దీనితో రైతులు ఆఘమేఘాలమీద రొయ్యలు పట్టుబడిచేసి అయినకాడికి అమ్ముకుని నష్టపోతున్నారు. ఆక్సిజన్ సమస్య అధిగమించేందుకు.. రైతులు నిరంతరం చెర్వులలో ఏరియేటర్లు తిప్పుతూ, చెర్వులలో ఇంజన్లువేసి నీటిని రీసైక్లింగ్ చేస్తూ, నిరంతరం నీటిలో కదలిక తేవడం ద్వారా ఆక్సిజన్ సమస్యను కొంతమేర అధిగమిస్తున్నారు. ఆక్సిజన్ లోటు పూడ్చడానికి రసాయనాలు చల్లుతున్నారు. ఆక్సిజన్ అందక చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినలేక నీరసించి పోవడంతో రైతులు యుద్ధ ప్రాతిపదికన పట్టివేసి అయినకాడికి అమ్ముకుంటున్నారు. ఉమ్మడి జిల్లాలో సుమారు 2.50 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతుండగా 50 శాతం చెర్వులలో అంటే 1.25 లక్షల ఎకరాల్లో రొయ్య సాగు జరుగుతుంది. ఉంగుటూరు నియోజకవర్గంలో వాతావరణం ప్రతికూలంగా మారడంతో జూన్ నెలలో దాదాపు నాలుగు వేల ఎకరాల్లో రొయ్యలు అర్ధాంతరంగా పట్టివేసినట్లు అంచనా. ప్రతికూల వాతావరణం తట్టుకోవాలంటే.. రొయ్యసీడ్ నాణ్యత కలిగి ఉండాలి. నీటి పీహెచ్స్థాయి సరైన మోతాదులో ఉండాలి. నిరంతరం ఆక్సిజన్ స్థాయిని సరిచూసుకుంటూ ఉండాలి. నీటి క్షారస్వభావం, నీటి కాఠిన్యం సరైన స్థాయిలో ఉండేలా చూడాలి. చెర్వులో ప్రమాదకరమైన విషవాయువులు అమ్మోనియా నైట్రేట్, హైడ్రోజన్ సల్ఫైడ్ వంటివి తయారవకుండా చర్యలు తీసుకోవాలి. చెర్వుల్లో రొయ్యపిల్ల సాంద్రతను బట్టి పాక్షిక పట్టుబడి చేసుకుంటే మిగిలిన రొయ్యలు ఒత్తిడికి గురికాకుండా స్వేచ్ఛగా పెరగడానికి అవకాశం ఉంటుంది. మత్స్యశాఖ అధికారుల సూచనలు చెర్వులలో ఉష్ణోగ్రతలు తగ్గకుండా నిరంతరం ఏరియేటర్లు తిప్పుతూ నీటిని రీసైక్లింగ్ చేయాలి. ఆక్సిజన్ లోపనివారణకు పొటాషియం పర్మాంగనేటు, ఆక్సిజన్ టాబ్లెట్స్ సిద్ధంగా ఉంచుకుని, అవసరం మేరకు చెర్వులో చల్లుతుండాలి. ఆక్సిజన్ సరిపడా అందకపోవడంతో చేపలు, రొయ్యలు మేతలు సరిగా తినని కారణంగా పరిమితంగా మేతలు వేస్తుండాలి. ఆక్సిజన్ సమస్య ఉన్న సమయంలో చెర్వులలో మేత, సేంద్రియ ఎరువులను వేయడం పూర్తిగా మానివేయాలి. చెర్వులలో మినరల్స్ ఎక్కువగా వినియోగించకూడదు. నీటి పరీక్షలు చేయించి చెర్వులో అమ్మోనియా స్థాయిని నిర్ధారించుకోవాలి. ఎడతెరిపిలేని వర్షాలతో అనర్థం -
కూటమి పాలనలో వైద్య సేవలు నిర్వీర్యం
ఎమ్మెల్సీ రవీంద్రనాథ్, జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: కూటమి పాలనలో వైద్య విద్య, ఆరోగ్య సేవలు అందని ద్రాక్షాలా మారాయని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా పార్లమెంట్ పరిశీలకుడు, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, పార్టీ జిల్లా అధ్యక్షుడు దూ లం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమాన్ని కలిదిండి మండలం పెదలంకలో గురువారం ప్రారంభించారు. జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొత్తం 17 కాలేజీల స్థాపన జరిగిందన్నారు. వీటిలో 7 కాలేజీలు పూర్తి, ఈ ఏడాది మరో 4 కా లేజీలు ప్రారంభం, వచ్చే ఏడాది 6 కాలేజీల పను లు పూర్తి చేసేలా వైఎస్ జగన్ ప్రణాళిక రూపొందించారన్నారు. కాలేజీల్లో పేద విద్యార్థులకు 75 శాతం ఉచిత మెడికల్ సీట్లు, మరో 25 శాతం ఎన్ఆర్ఐ కోటా కింద నిర్ణయించారన్నారు. కూటమి ప్రభు త్వం మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేస్తోందన్నారు. తిరిగి వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి రాగానే ప్రైవేటు టెండర్లను రద్దు చేస్తామన్నా రు. ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ మాట్లాడుతూ మెడికల్ కాలేజీల నిర్వాహణకు రూ.4,500 కోట్లు ప్రభుత్వం వెచ్చించలేకపోవడం ఏమిటనీ ప్రశ్నించారు. పేద లకు జరిగే అన్యాయాన్ని సంతకాల రూపంలో గవర్నర్కు తెలియజేయాలన్నారు. ముందుగా గ్రామంలో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం వద్ద నివాళి అర్పించారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర రైతు విభాగ కార్యదర్శి అయినాల బ్రహ్మాజీరావు, రాష్ట్ర మైనార్టీ విభాగ కార్యదర్శి ఎండీ గాలిబ్బాబు, జిల్లా మేధావుల విభాగ అధ్యక్షుడు దుగ్గిరాల నాగు, కలిదిండి, కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు తిరుమని రమేష్, సింగంశెట్టి రాము, వివిధ హోదాల్లో నాయకులు దున్నా బేబీ, ముండ్రు చార్లెస్, పండు ఆనంద రవి రాజు, ముద్దం రంగబాబు, నామాన అన్నవరం, దుగ్గిరాల రమేష్, రావాడి నాగ బాల బాలాజీ గారు, ఇమ్మనేని రమాదేవి, లక్ష్మణరావు తదితరులు పాల్గొన్నారు. -
పారిశుద్ధ్య సిబ్బంది జీతాల బకాయిలపై వినతి
ఏలూరు టౌన్: జిల్లాలోని ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న పారిశుద్ధ్య సిబ్బందికి జీతాల బకాయిలు వెంటనే చెల్లించేలా చర్యలు తీసుకోవాలని కోరుతూ డైరెక్టరేట్ ఆఫ్ సెకండరీ హెల్త్ కమిషనర్ చక్రధర్బాబుకు బుధవారం ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ అండ్ అవుట్ సోర్సింగ్ ఎంప్లాయీస్ యూనియన్ జిల్లా అధ్యక్షుడు కే.కృష్ణమాచార్యులు, జిల్లా కార్యదర్శి వి.దత్తాత్రేయ (దత్తు) వినతిపత్రం అందజేశారు. గతంలో ప్రభుత్వ ఆసుపత్రుల్లో శానిటేషన్ కాంట్రాక్ట్ పనులు చేపట్టిన ఫస్ట్ ఆబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ శానిటేషన్ వర్కర్లకు జీతాలు చెల్లించలేదనీ, భారీగా బకాయిలు పేరుకుపోయాయని తెలిపారు. ప్రస్తుతం ఫస్ట్ అబ్జెక్ట్ ప్రైవేటు లిమిటెడ్, ఫస్ట్ అబ్జెక్ట్ ఏజెన్సీ అని వేర్వేరుగా అగ్రిమెంట్లు చేసుకున్న కాంట్రాక్ట్ సంస్థలు తమ పారిశుద్ధ్య కార్మికులను దారుణంగా మోసం చేశాయని ఆరోపించారు. కార్మికులకు న్యాయం చేయకుంటే ఆందోళనలకు దిగుతామని హెచ్చరించారు. సిబ్బందికి జీతాలు చెల్లించని పక్షంలో వాటిని బ్లాక్ లిస్ట్లో పెడతామని హెల్త్ కమిషనర్ హామీ ఇచ్చారని నేతలు తెలిపారు. ఈ కార్యక్రమంలో యూనియన్ ఏలూరు బ్రాంచ్ అధ్యక్షురాలు పీ.విజయ, సూపర్వైజర్ అజయ్ తదితరులు ఉన్నారు. -
లోతట్టు ప్రాంతాలు జలమయం
కై కలూరు: ఎడతెరిపి లేని వర్షాలతో కై కలూరులో లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. ఏలూరు జిల్లాలోనే కై కలూరు నియోజకవర్గం ముదినేపల్లి మండలంలో 33.8 మిల్లీమీటర్ల అత్యధిక వర్షపాతం నమోదైంది. పలుచోట్ల విద్యుత్ స్తంభాలు నెలకొరిగాయి. పామర్రు–దిగమర్రు జాతీయ రహదారిలో పలు రోడ్లు వర్షానికి చెరువులుగా మారాయి. కలిదిండి ప్రారంభంలో లాల్వ డ్రైయిన్ అధిక వర్షాలకు మరోసారి కోతకు గురైంది. మరో 5 రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని ప్రకటించడంతో నియోజకవర్గంలో ఆక్వా రైతులు ఆందోళన చెందుతున్నారు. -
ఇది మీకు తెలుసా..
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో ఏదైనా అసౌకర్యం కలిగితే దానికి కారణమైన దేవస్థానం సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అధికారులకు ఏవైనా సలహాలు, సూచనలు కూడ ఇవ్వొచ్చు. దశాబ్దాల కాలం నుంచి అందుబాటులో ఉన్న ఈ ఫిర్యాదుల పుస్తకాల గురించి చాలా మంది భక్తులకు తెలియదు. వివరాల్లోకి వెళితే. రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తున్నారు. వారి సౌకర్యార్థం అధికారులు ఎప్పటికప్పుడు అనేక చర్యలు చేపడుతున్నారు. అందులో భాగంగానే ఈ సలహాలు, సూచనల పుస్తకాలు, బాక్సులను ఆలయ కార్యాలయం, కేశఖండనశాల, వకుళమాత నిత్యాన్నదాన భవనం, సీఆర్వో కార్యాలయం, సత్రాలు తదితర విభాగాల వద్ద భక్తులకు అందుబాటులో ఉంచారు. వాట్సాప్, మెయిల్ ద్వారా ఫిర్యాదులు చేసేవారి కోసం సలహాలు, సూచనల బాక్సులపైన, ఇతర ప్రాంతాల్లో క్యూఆర్ కోడ్లను ఏర్పాటు చేశారు. అయితే టీటీడీ సదనం, ప్రసాదాల మెయిన్ కౌంటర్లో ఈ పుస్తకాలు లేవు. దాంతో టీటీడీ సదనంలో ఇటీవల ఓ భక్తురాలికి కలిగిన అసౌకర్యంపై ఆమె స్వామివారి పాదుకా మండపం వద్ద ఉన్న సమాచార కేంద్రానికి వెళ్లి, అక్కడ ఫిర్యాదుల పుస్తకంలో తన ఫిర్యాదు రాయాల్సి వచ్చింది. ఎవరిపై ఫిర్యాదు చేయొచ్చంటే.. భక్తుల పట్ల అమర్యాదగా నడుచుకునే.. దురుసుగా ప్రవర్తించే.. మరేరకంగానైనా అవమానపరిచే వారిపై.. అలాగే శ్రీవారి సేవలకు అదనపు రుసుములు వసూలు చేసే సిబ్బందిపై ఫిర్యాదు చేయవచ్చు. అలాగే అధికారులకు అన్ని రకాల సూచనలు, సలహాలను ఇవ్వొచ్చు. ఫిర్యాదు చేసేదిలా.. ఫిర్యాదు చేయదలచిన, లేదా సూచనలు, సలహాలు ఇవ్వదలచిన భక్తులు సంబంధిత కార్యాలయాల్లోకి వెళ్లి అక్కడి ఉద్యోగులను ఫిర్యాదుల పుస్తకం అడిగి, అందులో రాయొచ్చు. లేదా ఆయా కార్యాలయాల వద్ద ఏర్పాటు చేసిన సలహాలు, సూచనల బాక్సుల్లో ఫిర్యాదు పత్రాలను వేయొచ్చు. డిజిటల్ విధానం ద్వారా ఫిర్యాదులు చేసే వారు ఆ బాక్సులపై ఉండే క్యూఆర్ కోడ్ను సెల్ఫోన్లోని గూగుల్ స్కానర్ ద్వారా స్కాన్ చేసి ఆలయ ఈఓ వాట్సాప్కు, లేదా మెయిల్కు ఫిర్యాదు చేయొచ్చు. ఫిర్యాది దారుడి చిరునామా, సెల్ నెంబర్ లను తప్పనిసరిగా అందులో చూపాలి. ఫీడ్బ్యాక్ సెక్షన్ పర్యవేక్షణలో.. సలహాలు, సూచనల బాక్స్లు, పుస్తకాలు డీఈఓతో పాటు, సంబంధిత విభాగాల గుమస్తాలతో కూడిన ఫీడ్బ్యాక్ సెక్షన్ పర్యవేక్షణలో ఉంటాయి. భక్తుల నుంచి వచ్చే ప్రతి ఫిర్యాదు, సలహా, సూచనను వారు ఈఓకు చేరవేస్తారు. పరిష్కారం ఇలా.. ప్రతి పది, పదిహేను రోజులకు ఒకసారి ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి ఈ ఫిర్యాదులు, సలహాలు, సూచనలను పరిశీలించి, సంబంధిత సెక్షన్ అధికారుల నుంచి వివరణ తీసుకుంటారు. ఆ తరువాత తగు చర్యలు చేపడతారు. వాటి వివరాలను నెలకోసారి ఆలయ ఛైర్మన్ ఎస్వీ సుధాకరరావు ముందు ఉంచుతారు. ఏవైనా మార్పులు, చేర్పులు ఉంటే ఈఓకు ఆయన సూచిస్తారు. అధికారులు తగు సమాచారాన్ని ఫిర్యాదికి తెలియజేస్తారు. ఇలా ప్రతి ఫిర్యాదుకు పరిష్కారం లభిస్తుంది. శ్రీవారి ఆలయంలో అసౌకర్యాలపై ఫిర్యాదు చేయొచ్చు అందుబాటులో సలహాలు, సూచనల బాక్సులు, పుస్తకాలు ప్రతి ఫిర్యాదుకు ఖచ్చితంగా లభిస్తున్న పరిష్కారం -
పట్టిసం శివక్షేత్రం కళకళ
పోలవరం రూరల్: కార్తీకమాసం ప్రారంభం కావడంతో అఖండ గోదావరి నది మధ్య గల పట్టిసం శివక్షేత్రం సందర్శనకు భక్తుల రాక ప్రారంభమైంది. బుధవారం వివిధ ప్రాంతాల నుంచి పట్టిసం రేవుకు చేరుకుని నదిలో లాంచా దాటి ఇసుక తిన్నెలపై నడుచుకుంటూ క్షేత్రానికి చేరుకున్నారు. ఈ ఏడాది వరద ఉధృతి ఉండటంతో క్షేత్రానికి సమీపం వరకు లాంచీ చేరుకుంది. శివకేశవులకు నిలయమైన ఈ క్షేత్రంలో శ్రీ భద్రకాళీ సమేత వీరేశ్వరస్వామిని, క్షేత్రపాలకుడైన బావన నారాయణస్వామిని భక్తులు దర్శించుకుని పూజలు నిర్వహించుకున్నారు. పట్టిసం శివక్షేత్రం వద్ద భక్తులను నది దాటించేందుకు నిర్వహించే ఫెర్రీ వేలం పాట ఈ ఏడాది ఏప్రిల్ నెలలో పట్టిసం గ్రామపంచాయతీ అధికారులు నిర్వహించారు. అప్పటి నుంచి ఇంజిన్ పడవపై క్షేత్రానికి భక్తులను తీసుకువెళ్లి తీసుకువచ్చేవారు. పోర్టు అధికారులు ఇచ్చిన అన్ని అనుమతులతో కొత్తగా లాంచీని ఏర్పాటు చేసి భక్తులను నది దాటిస్తున్నారు. మద్దిలో కార్తీక మాసోత్సవాలు ప్రారంభం జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో కార్తీక మాసోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ జ్యోతి ప్రజ్వలన చేసిన కార్తీకమాస ఉత్సవాలు ప్రారంభించారు. ఆలయ ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ కార్తీక మాసోత్సవాలు ఈ నెల బుధవారం నుంచి నవంబర్ 20 వరకు జరుగుతాయని తెలిపారు. బుధవారం ఆలయంలో స్వామికి లక్ష చామంతి పూలతో పుష్పార్చన ఆలయ అర్చకులు, వేద పండితులు, రుత్వికులుచే వైభవంగా నిర్వహించినట్లు తెలిపారు. శివక్షేత్రానికి వెళ్లేందుకు లాంచీ ఎక్కుతున్న భక్తులు మద్ది ఆలయంలో లక్ష పుష్పార్చన -
పడకేసిన వైద్యం
అత్తిలి, మంచిలి పీహెచ్సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ఇన్చార్జిగా ఉన్న వైద్యులు రెండు రోజులు మాత్రమే ఆస్పత్రులకు వచ్చి సేవలందించారు. తర్వాతి నుంచి వారు రావడం లేదు. సాధారణ వ్యాధులతో వచ్చేవారికి పాత చీటీల ప్రకారం ఇక్కడి వైద్య సిబ్బంది మందులిచ్చి పంపిస్తున్నారు. మిగిలిన కేసుల్ని తణుకు జిల్లా ఆస్పత్రికి రిఫర్ చేస్తుండటంతో రోగులు ఇబ్బంది పడాల్సి వస్తోంది. నెలరోజుల క్రితం వరకు రోజుకు 60కు ఓపీ నమోదయ్యేది. రెగ్యులర్ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ప్రస్తుతం 30 నుంచి 40 లోపు ఉంటోంది. సాక్షి, భీమవరం : డిమాండ్ల సాధన కోసం రూరల్ పీహెచ్సీ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో మూడు వారాలుగా గ్రామీణ వైద్యం పడకేసింది. సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రుల నుంచి సర్ధుబాటు చేసిన వైద్యులు చాలాచోట్ల చుట్టపు చూపునకే పరిమితమవుతున్నారు. పూర్తిస్థాయిలో వైద్యసేవలందక రోగులు ప్రైవేట్ ఆస్పత్రులను ఆశ్రయిస్తున్నారు. గతంతో పోలిస్తే రోజువారీ ఓపీ తగ్గిపోయింది. సర్వీస్లోని పీహెచ్సీ వైద్యులకు పీజీ కోటాలో సీట్లు పునరుద్ధరించాలని, టైం బాండ్ పదోన్నతులు కల్పించాలని, గిరిజన ప్రాంతాల్లో పనిచేసేవారికి బేసిక్పై 50 శాతం అలవెన్స్ ఇవ్వాలని, కౌన్సెలింగ్ విషయంలో అర్బన్ అండ్ నేటివిటీపై ఆరేళ్ల గడువుని ఐదు సంవత్సరాల కుదించడం, నేటివిటీ పై స్పష్టత కావాలని, చంద్రన్న సంచార చికిత్స కార్యక్రమానికి రూ.5000 అలవెన్స్ ఇవ్వాలని కోరుతూ ఏపీపీహెచ్సీడీఏ (ఏపీ ప్రైమరీ హెల్త్ సెంటర్స్ డాక్టర్ అసోసియేషన్) ఆందోళనకు పిలుపునిచ్చింది. జిల్లాలో 34 రూరల్ పీహెచ్సీల పరిధిలో దాదాపు 68 మంది వైద్యులకు దాదాపు 60 మంది ఈనెల 1వ తేదీ నుంచి విధులు బహిష్కరించి సమ్మె చేస్తున్నారు. ఇలా వచ్చి అలా వెళ్లిపోతున్నారు వైద్యసేవలకు అంతరాయం కలుగకుండా జిల్లాలోని తణుకు, భీమవరం, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడులలోని ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్ల్ సెంటర్ల నుంచి దాదాపు 27 మంది వైద్యులను డిప్యుటేషన్పై పీహెచ్సీలకు సర్దుబాటు చేశారు. ఉదయం తొమ్మిది గంటల నుంచి సాయంత్రం నాలుగు గంటల వరకు ఆస్పత్రిలోనే ప్రజలకు అందుబాటులో ఉండి వైద్యసేవలు అందించాలి. చాలాచోట్ల వైద్యులు రెండు మూడు గంటలు సేవలందించి మధ్యాహ్నం 1 గంట సమయానికి వెళ్లిపోతుండగా, కొన్నిచోట్ల విధులకు గైర్హాజరవుతున్నారు. అక్కడకక్కడ మాత్రమే సాయంత్రం వరకు అందుబాటులో ఉంటున్నారు. బుధవారం పలు పీహెచ్సీల్లో ఇటువంటి దృశ్యాలే కనిపించాయి. సిబ్బందే దిక్కు వైద్యులు అందుబాటులో లేకపోవడం, ఇన్చార్జిలు ఎప్పుడు వస్తారో? ఎప్పుడు వెళ్లిపోతారో తెలీని పరిస్థితుల్లో ఆస్పత్రులకు వచ్చే వైద్య సిబ్బంది వైద్యుల అవతారం ఎత్తుతున్నారు. మధ్యాహ్నం తర్వాత దాదాపు అన్ని పీహెచ్సీల్లోనూ ఇదే పరిస్థితి. తమ పరిధిలో సేవలందించి మిగిలిన కేసులను సీహెచ్సీ, ఏరియా ఆస్పత్రులకు వెళ్లాల్సిందిగా సూచిస్తుండటంతో రోగులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. దీంతో ఎందుకొచ్చిన గొడవన్నట్టు ముందుగానే రోగులు పట్టణాలకు వెళ్లిపోతున్నారు. రెగ్యులర్ వైద్యులు ఉన్న సమయంతో పోలిస్తే చాలా పీహెచ్సీల్లో ప్రస్తుత ఓపీ తగ్గినట్టు గణాంకాలు చెబుతున్నాయి. ఈ మేరకు రూరల్ పీహెచ్సీల్లో ప్రసవాలు సంఖ్య తగ్గింది. వైద్యుల ఆందోళనపై ప్రభుత్వం ఇంకా స్పందించకపోవడంతో సమ్మె ఇంకా ఎన్నిరోజులు కొనసాగుతుందో తెలీని పరిస్థితి. అప్పటి వరకు వైద్యసేవల కోసం ఇబ్బందులు తప్పవని రోగులు వాపోతున్నారు. త్వరితగతిన సమస్య పరిష్కారానికి ప్రభుత్వం చొరవ చూపాలని కోరుతున్నారు. పాలకోడేరులో ఖాళీగా ఉన్న బెడ్లు మూడు వారాలుగా సమ్మెలో రూరల్ పీహెచ్సీ వైద్యులు మధ్యాహ్నం వరకే ఆస్పత్రుల్లో అందుబాటులో ఇన్చార్జులు ఏఎన్ఎంలు, అటెండర్లే దిక్కు వైద్యం కోసం రోగుల ఇక్కట్లు వైద్యుల సమ్మెతో పెంటపాడు, ముదునూరు పీహెచ్సీల్లో రోజువారి ఓపీ 120 నుంచి దాదాపు సగానికి తగ్గింది. రెండు పీహెచ్సీలకు తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రి నుంచి ఇద్దరు ఇన్చార్జి వైద్యుల్ని నియమించినా వారు సకాలంలో రాకపోవడం, గంట లేదా రెండు గంటలు మాత్రమే వైద్యసేవలు అందించి వెళ్లిపోతుండటంతో వైద్యం కోసం వచ్చిన రోగులకు ఇబ్బందులు తప్పడం లేదు. పెంటపాడు పీహెచ్సీలో ఉదయం 11 గంటల వరకు వైద్యుడు రాకపోవడంతో రోగులు పాత చీటిపై మందులు తీసుకుని వెళ్లారు. పాలకోడేరు ఇన్చార్జి డాక్టర్ బుధవారం విధులకు హాజరుకాకపోవడంతో ఆయుష్ డాక్టర్ ఓపీ చూశారు. రెగ్యులర్ వైద్యులు సమ్మెలోకి వెళ్లడంతో ఇన్చార్జి వైద్యులు మధ్యాహ్నం వరకు ఆస్పత్రిలో ఉండి వెళ్లిపోతున్నారు. తర్వాత ఆనారోగ్య సమస్యలతో వచ్చేవారు ఇబ్బంది పడాల్సి వస్తోంది. గతంలో రోజుకు 60 నుంచి 70 వరకు ఓపీ ఉంటే వైద్యులు అందుబాటులో లేక ప్రస్తుతం తగ్గుతోంది. బుధవారం 47 ఓపీ నమోదైంది. బెడ్లు ఖాళీగానే ఉంటున్నాయి. గుండెల్లో మంటగా ఉండడంతో అత్తిలి పీహెచ్సీకి వైద్యం నిమిత్తం వచ్చాను. వైద్యులు అందుబాటులో లేరని తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి వెళ్లాల్సిందిగా సిబ్బంది సూచించారు. స్థానికంగా వైద్యులు అందుబాటులో లేక ఇబ్బందులు పడాల్సి వస్తోంది. – కోట జగపతిబాబు, అత్తిలి -
అన్ని రంగాల్లో టెక్నాలజీదే ప్రముఖ పాత్ర
భీమవరం: రానున్న రోజుల్లో విద్య, వైద్యం, వ్యవసాయం వంటి అన్ని రంగాల్లో టెక్నాలజీ ప్రముఖ పాత్ర వహిస్తుందని జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో వెస్ట్ గోదావరి డిస్ట్రిక్ట్ యూత్ ఫెస్టివల్ డిపార్ట్మెంట్ ఆఫ్ యూత్ సర్వీసెస్ ఇన్ అసోసియేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఏర్పాటుచేసిన సైన్స్ మేళా ఎగ్జిబిషన్ను ఆయన ప్రారంభించి మాట్లాడారు. అనంతరం ఎగ్జిబిషన్లో ఏర్పాటు చేసిన ఇన్నోవేటివ్ స్టాల్స్ను పరిశీలించారు. వాటిలో ప్రమాద సమయాల్లో, వ్యవసాయ రంగానికి, అడవుల రక్షణకు ఉపయోగపడే విధంగా విద్యార్థులు తయారుచేసిన పలు రకాల డ్రోన్స్ను జాయింట్ కలెక్టర్ ఆసక్తిగా తిలకించారు. సెట్వెల్ సీఈవో కేఎస్ ప్రభాకరరావు అధ్యక్షత జరిగిన కార్యక్రమంలో కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ ఎస్ఆర్కే నిశాంత్వర్మ, కళాశాల డైరెక్టర్ ఎం.జగపతిరాజు, ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజు, కోఆర్డినేటర్ ఎన్ గోపాలకృష్ణమూర్తి, కళాశాల చీఫ్ అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ సీహెచ్ దిలీప్ చక్రవర్తి పాల్గొన్నారు. మొదటి బహుమతి ఎస్ఆర్కేఆర్కే జిల్లా స్థాయి యూత్ ఫెస్టివల్లో దాదాపు 135 ఇన్నోవేటివ్ ప్రాజెక్టులు ప్రదర్శించగా మొదటి బహుమతి భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాల, ద్వితీయ బహుమతి నరసాపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలకు దక్కింది. అలాగే తృతీయ బహుమతి తణుకు ఎస్కేఎస్డి ప్రభుత్వ మహిళా కళాశాల విద్యార్థినులు రూపొందించిన ప్రాజెక్టుకు బహుమతి దక్కింది. వీరు అమరావతిలో జరిగే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారు. -
ఏలూరు జిల్లా డీఎస్డీఓగా అజీజ్ బాధ్యతలు
ఏలూరు రూరల్: ఏలూరు జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ (డీఎస్డీఓ) అధికారిగా సయిద్ అబ్దుల్ అజీజ్ బుధవారం బాధ్యతలు స్వీకరించారు. అనంతరం ఆయన ఏలూరు జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్విని కలిశారు. గతంలోనూ ఆయన ఏలూరు జిల్లా డీఎస్డీఓగా పనిచేశారు. ఇప్పటి వరకూ డీఎస్డీఓగా పనిచేసిన బి శ్రీనివాసరావు విజయవాడకు బదిలీ అయ్యారు. కాగా పశ్చిమగోదావరి జిల్లా డీఎస్డీఓగా నియమితులైన అధికారి బాధ్యతలు స్వీకరించకపోవడంతో ఆయన స్థానంలో అజీజ్ ఇన్చార్జి డీఎస్డీఓగా వ్యవహరించనున్నారు. శ్రీవారి క్షేత్రంలో కార్తీక సందడి ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో కార్తీకమాసం సందడి మొదలైంది. తొలిరోజు బుధవారం చినవెంకన్న ఆలయానికి విచ్చేసిన భక్తుల్లో అధిక శాతం మంది, స్వామివారి దీపారాధన మండప ప్రాంతంలోని చెట్టు వద్ద కార్తీక దీపాలను భక్తి శ్రద్ధలతో వెలిగించారు. అలాగే క్షేత్రపాలకుని ఆలయంలో అర్చకులు శివదేవునికి విశేష అభిషేకాలు జరిపారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామివారిని దర్శించి, తీర్థ ప్రసాదాలను స్వీకరించారు. ముదినేపల్లి రూరల్: స్థానిక మసీదు రోడ్డులో బుధవారం జరిగిన అగ్నిప్రమాదంలో రేకులషెడ్డు పూర్తిగా దగ్ధమైంది. స్థానిక హోటల్లో పనిచేస్తున్న మట్టి నరసమ్మ ఇంట్లో లేని సమయంలో ఈ ప్రమాదం సంభవించింది. ప్రమాదంలో గృహోపకరణాలు, బీరువాలో దాచుకున్న కొంతమేర నగదు కాలిపోయినట్లు బాధితురాలు నరసమ్మ తెలిపింది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. సర్వం కోల్పోయిన బాధితురాలు నరసమ్మకు స్థానిక ప్రముఖ వైద్యుడు అంబుల మనోజ్ రూ.5 వేల ఆర్థిక సాయాన్ని అందజేశారు. బాలికల కుస్తీలో ‘పశ్చిమ’కు మూడో స్థానం విజయవాడరూరల్: ఆంధ్రప్రదేశ్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ (ఏపీఎస్జీఎఫ్), సమగ్ర శిక్ష(ఎస్ఎస్), ఎన్టీఆర్ స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అశోక్ ఫంక్షన్హాలులో 69వ స్కూల్ గేమ్స్ అండర్–19 అంతర్ జిల్లాల కుస్తీ పోటీలు జరుగుతున్నాయి. నున్న గ్రామంలో బుధవారం జరిగిన బాలికల కుస్తీ పోటీల్లో పశ్చిమ గోదావరి జట్టు మూడోస్థానంలో నిలిచింది. బాలురు, బాలికల విభాగాల్లో నిర్వహిస్తున్న ఈ పోటీలకు 350 మంది క్రీడాకారులు, కోచ్లు మేనేజర్లు హాజరయ్యారు. విజేతలకు బహుమతులు అందజేశారు. -
బాలుడి అదృశ్యం కేసు సుఖాంతం
తణుకు అర్బన్: తణుకులో పాఠశాలకు బయలుదేరి అదృశ్యమైన బాలుడి వ్యవహారం సుఖాంతమైంది. సజ్జాపురానికి చెందిన బాలుడు అన్నెపు రూప భానుప్రసాద్ (13) కనిపించడంలేదని పట్టణ పోలీస్ స్టేషన్లో తాతయ్య కూన నరసింహారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఈనెల 21వ తేదీ రాత్రి తణుకు పట్టణ పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. పోలీసుల దర్యాప్తులో భాగంగా పూళ్లలోని నానమ్మ ఇంట్లో బాలుడు ఉన్నాడని తెలియడంతో అంతా ఊపిరిపీల్చుకున్నారు. భానుప్రసాద్ తణుకు జిల్లా పరిషత్ బాలుర ఉన్నత పాఠశాలలో 7వ తరగతి చదువుతున్నాడు. ఈనెల 21న పాఠశాలకు వెళ్లకుండా పూళ్లలో నివసిస్తున్న నానమ్మ, తాతయ్యల వద్దకు సైకిల్పై వెళ్లాడు. మధ్యాహ్నం పాఠశాలకు క్యారేజీ తీసుకువెళ్లిన తాతయ్య నరసింహారావుకు భానుప్రసాద్ పాఠశాలకు వెళ్లలేదనే విషయం తెలిసింది. ఆరోజు సాయంత్రం ఆయన పోలీసులను ఆశ్రయించారు. చైన్నెలో ఉంటున్న తల్లిదండ్రులు బుధవారం తణుకు వచ్చి పిల్లాడి వెతుకులాటలో పడ్డారు. అయితే నానమ్మ ఇంట్లో ఫోన్ సౌకర్యం లేకపోవడంతో తల్లిదండ్రులు పక్కింటి వారికి ఫోన్చేయడంతో అక్కడే ఉన్నట్లుగా తెలిసింది. -
క్షీరారామలింగేశ్వరస్వామి ఖాతాకు చేరిన నగదు
పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి కార్తీకమాస నిత్యాన్నదానం కమిటీ ఆధ్వర్యంలో ఉన్న నిల్వ సొమ్ము ఆలయానికి జమ చేసినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి ముచ్చర్ల శ్రీనివాసరావు తెలిపారు. ఈనెల 19వ తేదీన శ్రీవిరాళాలు దేవస్థానం ఖాతాలోకి వెళ్లేనాశ్రీ శీర్షికతో సాక్షి కథనాన్ని ప్రచురించింది. దీనిపై స్పందించిన పాత కమిటీ సభ్యులు శ్రిఖాకొల్లు వెంకన్న, శిడగం సతీష్ రూ.7,18,333 చెక్కు, రూ.62,101 నగదు రూపంలో మొత్తం రూ. 7,80,434 ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావుకు అందించినట్లు తెలిపారు. ఇప్పటివరకూ ఆలయ శాశ్వత అన్నదాన నిధికి ఎఫ్డీఆర్లో రూ.30 లక్షలు, క్యాష్ బుక్లో రూ.9,26,105 ఉన్నట్లు చెప్పారు. పాత కమిటీ జమ చేసిన నగదుతో నేటికి మొత్తం అన్నదాన నిధికి రూ.47,06,539 వచ్చినట్లు ఈవో శ్రీనివాసరావు తెలిపారు. అతి త్వరలో స్వామివారి అన్నదాన నిధికి రూ.50 లక్షలు పూర్తిచేస్తామని చెప్పారు. ఈ కార్యక్రమంలో ఆలయ కమిటీ సభ్యులు పినిశెట్టి శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. రూ.47 లక్షలకు చేరిన నిత్యాన్నదాన నగదు -
అధినేతతో ఆత్మీయ కలయిక
కొయ్యలగూడెం: వైఎస్సార్సీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డిని బుధవారం తాడేపల్లిలోని క్యాంపు కార్యాలయంలో కలుసుకున్నట్లు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుధవారం తెలిపారు. నియోజకవర్గ ఇన్చార్జి బాధ్యతలను అప్పగించినందుకు కృతజ్ఞతలు తెలిపానన్నారు. ఈ సందర్భంగా కొయ్యలగూడెం టౌన్ నాయకుడు నూకల రాము ఆధ్వర్యంలో మహానేత వైఎస్సార్ చిత్రపటాన్ని బహుకరించినట్లు పేర్కొన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమం అమలుపై అధినేతకు వివరించినట్లు తెలిపారు. సర్పంచ్ పసుపులేటి రాంబాబు, పార్టీ నాయకులు గంటా రమేష్, మందపాటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో ఈ నెల 24న కొయ్యలగూడెంలోని ప్రకాశం డిగ్రీ కళాశాలలో జాబ్మేళా నిర్వహించనున్నట్టు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి ఎన్.జితేంద్ర బాబు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ జాబ్ మేళాలో సుమారు 13 కంపెనీల ప్రతినిధులు పాల్గొంటారని, సుమారు 985 మందికి ఉద్యోగ అవకాశాలు కల్పించవచ్చన్నారు. పదో తరగతి, ఇంటర్, ఐటీఐ, డిప్లమో, డిగ్రీ, (డీ/బీ/ఎం) ఫార్మసీ, ఎంబీఏ, పీజీ, బీ.టెక్ వంటి విద్యార్హతలు ఉండి 18–35 సంవత్సరాల వయస్సు గల వారు అర్హులన్నారు. ఇతర వివరాలకు 9666322032, 9652503799 నెంబర్లతో పాటు టోల్ ఫ్రీ 9988853335 నెంబర్లో కూడా సంప్రదించవచ్చన్నారు. టి.నరసాపురం: నిబంధనలకు విరుద్ధంగా ఇసుక రవాణా చేస్తున్న లారీని మక్కినవారిగూడెం, కొల్లివారిగూడెం గ్రామస్తులు అడ్డుకున్నారు. కొవ్వూరు నుంచి తిరువూరుకు ఇసుక లారీ మక్కినవారిగూడెం మీదుగా వెళుతోంది. అధిక లోడుతో వెళ్లడంతో గ్రామస్తులు అడ్డుకున్నారు. అధిక లోడుతో వెళ్తుండడంతో రోడ్లు పాడవుతున్నాయని గ్రామస్తులు తెలిపారు. లారీని టి.నరసాపురం పోలీస్స్టేషన్కు తరలించి, ఎస్సైకు అప్పగించారు. దీంతో రికార్డులు సక్రమంగా ఉన్నాయో లేదో తేల్చాలంటూ తహసీల్దార్ సాయిబాబాకు లేఖ రాశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ ఖరీఫ్ సీజన్లో జిల్లాలో 4.50 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలుకు ముందస్తు ప్రణాళికలను సిద్ధం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్వి సంబంధిత అధికారులను ఆదేశించారు. స్థానిక డీసీఎంఎస్ ఫంక్షన్ హాల్లో బుధవారం జిల్లా పౌరసరఫరాల శాఖా ఆధ్యర్యంలో ఖరీఫ్ 2025– 26 ధాన్యం కొనుగోలుపై సంబంధిత సిబ్బందికి అవగాహన సదస్సు, సాంకేతిక శిక్షణ కార్యక్రమం కలెక్టరు, జాయింటు కలెక్టరు ఎంజే అభిషేక్ గౌడ అధ్యక్షతన జరిగింది. పవర్ పాయింటు ప్రజెంటేషన్ ద్వారా 2025– 26 ఖరీఫ్కు సంబంధించిన ధాన్యం కొనుగోలు ప్రక్రియ, టెక్నికల్ అంశాలను సిబ్బందికి వివరించారు. ఏలూరు(మెట్రో): పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాసానికి ఏలూరు జిల్లాలో 2799.60 ఎకరాల భూమిని గుర్తించామని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర జలవనరుల శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి.సాయి ప్రసాద్కు తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి బుధవారం పోలవరం ప్రాజెక్ట్ నిర్వాసితుల పునరావాస కార్యక్రమాల ప్రగతిపై సంబంధిత జిల్లా కలెక్టర్లతో సాయి ప్రసాద్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పునరావాస ప్యాకేజిలో భాగంగా అవసరమైన భూమికి భూమి, పునరావాస కాలనీల నిర్మాణానికి మొత్తం 7812.05 ఎకరాల భూమి అవసరం కాగా, ఇంతవరకు 2799.60 ఎకరాల భూమిని గుర్తించామని, 1734.63 ఎకరాల భూమికి భూసేకరణ దశలో ఉందన్నారు. -
కుడి కాలువ గట్టుకు తూట్లు
పోలవరం రూరల్: పోలవరం మండలంలో కుడికాలువ వెంట మట్టి, గ్రావెల్ తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఇటికిల కోట నుంచి రేపల్లెవాడ వరకు కాలువ సమీపంలో పలు చోట్ల అక్రమార్కులు తవ్వుకుపోతున్నా పట్టించుకునే వారులేరు. కాలువ గట్టు వెంట తరలించేస్తున్న అధికారుల కంటపడకపోవడం విశేషం. రేపల్లెవాడ సమీపంలో కుడికాలువ గట్టు పక్కన గావెల్ తవ్వి తూర్పుగోదావరి జిల్లా గోపాలపురం మండలానికి ట్రాక్టర్లపై తరలిస్తున్నారు. గ్రావెల్ తరలించేస్తున్న విషయాన్ని గ్రామస్తులు ఇంజినీరింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. దీంతో అధికారులు కాలువ వెంట తిరుగుతుండగా, ఒక ప్రదేశంలో జేసీబీ, ట్రాక్టర్లు ప్రత్యక్షమయ్యాయి. వీటిని అడ్డుకుని అనుమతులు ఎవరిచ్చారంటూ ప్రశ్నించడంతో వారు అక్కడి నుంచి జేసీబీ, ట్రాక్టర్తో సహా పరారయ్యారు. కాలువ మట్టి తరలిస్తున్నారన్న విషయంపై కుడి కాలువ డీఈ కోటేశ్వరరావును అడగ్గా సిబ్బందిని పంపామని, కాలువ వెంట పరిశీలిస్తున్నట్లు తెలిపారు. -
విద్యార్థి ఉసురు తీసిన బెట్టింగ్ వ్యసనం
మైలవరం: బెట్టింగ్లతో అప్పులపాలై ఓ ఇంజనీరింగ్ విద్యార్థి ఆత్మహత్యకు పాల్పడిన ఘటన మైలవరంలో బుధవారం జరిగింది. ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం మండలం దేవరపల్లికి చెందిన గొర్రె అరవింద్ (23) మైలవరంలోని ఓ ఇంజినీరింగ్ కళాశాలలో బీటెక్ ఆఖరి సంవత్సరం చదువుతున్నాడు. అతను స్నేహితులతో కలిసి హాస్టల్లో ఉంటున్నాడు. కొంత కాలంగా ఆన్లైన్లో బెట్టింగులకు అలవాటు పడ్డాడు. చేసిన అప్పులు చెల్లించలేక బుధవారం కాలేజీకి వెళ్లకుండా హాస్టల్ రూమ్లోనే ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందాడు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
ఎదురీదుతున్న వనామీ
భీమవరం అర్బన్: ఉమ్మడి జిల్లాలో వనామీ రొయ్య పెంపకం సిరులు కురిపించడంతో రొయ్య రైతులు మొగ్గు చూపుతున్నప్పటికీ వర్షాకాలంలో సోకే వైట్ స్పాట్, విబ్రియో, వైట్గట్ లాంటి వ్యాధులు రైతులను నష్టాల బాట పట్టిస్తున్నాయి. దీంతో పట్టుబడికి వచ్చిన రొయ్యలు లేకపోవడంతో రొయ్య ధరలకు రెక్కలొస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో సుమారు 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యలు సాగు చేస్తున్నారు. భీమవరం మండలంలో సుమారు 12 వేల ఎకరాలలో వనామీ పెంచుతున్నారు. ఈ ఏడాది మొత్తం రొయ్యల పెంపకంలో ప్రతికూల వాతావరణంతో వైరస్ సోకి తీవ్రంగా నష్టపోయామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా పన్ను పోటు వనామీ రొయ్యలపై పడటంతో కేజీకి రూ.40 నుంచి రూ.60 తగ్గించేయడం, మరోపక్క వైరస్ల దాడితో నష్టాల బాట పడుతున్నామని రైతులు చెబుతున్నారు. వర్షాకాలంలో వనామీ విలవిల ఈ ఏడాది వర్షాకాలంలో రెండు మూడు రోజులు వర్షాలు పడటం, మరో నాలుగు రోజులు ఎండలు తీవ్రంగా ఉండి ఉక్కబోతగా ఉండటంతో తరచూ వాతావరణ మార్పుల కారణంగా వనామీ రొయ్యలకు వైట్స్పాట్, విబ్రియో, ఈహెచ్పీ వంటి వైరస్లు సోకి రొయ్య పిల్ల దశలోనే మృత్యువాత పడుతోంది. మండలంలో 20 నుంచి 40 శాతం లోపు సీడ్ దశ నుంచి కౌంట్ వరకు రొయ్యలున్నాయి. వైరస్ దాడి చేయడంతో రైతులు గట్ల చుట్టూ బ్లీచింగ్ కొడుతూ పక్షులు వాలకుండా జాగ్రత్తలు తీసుకుని నిరంతర ఏరియేటర్లు తిప్పుతూ ఎప్పటికప్పుడు పరీక్షలు చేయిస్తూ రొయ్యలను కాపాడుకుంటున్నారు. ప్రస్తుతం వనామీ ధరలు ప్రస్తుత వనామీ ధరలు 100 కౌంట్ రూ.200, 90 కౌంట్ రూ.205, 80 కౌంట్ రూ.215, 70 కౌంట్ రూ.245, 60 కౌంట్ రూ.280, 50 కౌంట్ రూ.290, 45 కౌంట్ రూ.300, 40 కౌంట్ రూ.320, 30 కౌంట్ రూ.345 వరకూ ఉన్నాయి. రొయ్య ధరలపై ప్రభుత్వం పర్యవేక్షణ ఉంటే రైతుకు లబ్ధి చేకూరుతుంది. మార్చి నుంచి జూన్ వరకు వ్యాపారస్తులు కుమ్మకై ్క రొయ్యలు కొనుగోలు చేయడం లేదని చెప్పడంతో వారు చెప్పిన ధరకు అమ్ముకుని నష్టపోతున్నాం. రొయ్య ధరలను స్థిరీకరించి ఎప్పుడూ ఒకే ధర ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటేనే రైతుకు లబ్ధి చేకూరుతుంది. –పెనుమాల నరసింహస్వామి, గొల్లవానితిప్ప రొయ్యల చెరువులకు సంబంధించి ఫీడ్, సీడ్, మెడిసిన్, కూలీల ధరలు పెరిగినప్పటికీ రొయ్యల ధరలు మాత్రం పెరగడం లేదని రైతు లు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఆక్వా చెరువులకు సబ్సిడీలు రాకపోవడంతో పెట్టుబడులు పెరిగి పెంపకం భారంగా మారిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అమెరికా దిగుమతిపై 50 శాతం సుంకాలు పెంచడంతో ఆక్వా ట్రేడర్స్ కేజీకి 40 నుంచి 60 వరకు తగ్గించేశారు. దీంతో సాగులో పెట్టుబడులు కూడా రావడం లేదని రైతులు గగ్గోలు పెడుతున్నారు. రైతులు రొయ్యల సాగు చేపట్టకుండా ప్రత్నామ్నాయ మార్గాలైన పండుగొప్ప, శీలావతి, చేపల చెరువు సాగు చేసేందుకు మొగ్గు చూపుతున్నారు. వాతావరణ మార్పులతో వైరస్ ముప్పు -
ఎల్లో గ్యాంగ్ చేతుల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్!
సాక్షి టాస్క్ఫోర్స్: క్రయ, విక్రయదారులకు ప్రభుత్వం కల్పించిన వెసులుబాటు అక్రమార్కులకు వరంగా మారుతోంది. సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఎనీవేర్ రిజిస్ట్రేషన్ అపహాస్యమవుతోంది. ఇతర జిల్లాల నుంచి వచ్చి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో డాక్యుమెంట్లకు రిజిస్ట్రేషన్లు చేయించుకుంటున్నారు. బ్యాంకుల్లో పత్రాలు పెట్టి రుణాలు తీసుకుని మోసాలకు పాల్పడుతున్నారు. జిల్లా రిజిస్ట్రార్ విచారణ నివేదిక ఆధారంగా అక్రమ రిజిస్ట్రేషన్ల రద్దు అధికారం జిల్లా కలెక్టర్లు ఇస్తూ నోటిఫికేషన్ జారీ చేసినా వాస్తవరూపం దాల్చలేదు. దీంతో కూటమి నేతలు అక్రమార్కులతో చేయి కలుపుతున్నారు. స్థానిక బలంతో అధికారుల విధులకు అడ్డు తగులుతున్నారు. గణపవరానికి చెందిన కురెళ్ళ రాజ్కుమార్కు కలిదిండి మండలం, పటమటిపాలెం బర్రింకలగరువులో సర్వే నంబరు 728/9లో 9 సెంట్ల భూమి ఉంది. ఇదే గ్రామానికి చెందిన కూటమి నేత ఇదే సర్వే నంబరుతో 10.13 సెంట్లకు ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్ చేయించాడు. విషయం తెలుసుకున్న రాజ్కుమార్ పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల కలెక్టర్లకు ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదికలో ఫిర్యాదులు చేశాడు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయం వద్ద బ్యానర్తో నిరసన తెలిపాడు. ఇదిలా ఉంటే పీజీఆర్ఎస్లో సమస్య పరిష్కారం అయ్యిందని ఉండి ఎస్సై ఎండార్స్మెంటు ఇచ్చినట్లు రాజ్కుమార్కు మెసేజ్ వచ్చింది. తప్పుడు ఫొటోను సైతం అప్లోడ్ చేశారు. ఎస్సై నా ప్రమేయం లేదని చెప్పడంతో తిరిగి విచారణ చేశారు. ఎట్టకేలకు కూటమి నాయకుడిది తప్పుడు రిజిస్ట్రేషన్ అని అధికారులు విచారణలో తేల్చారు. కూటమి నేతల కుట్రలతో అధికారికి చిక్కులు కలిదిండిలో మరొకరి స్థలాన్ని తనదే అంటున్న కూటమి నేతకు రిజిస్ట్రేషన్ల శాఖలో ఇటీవల పదవీ విరమణ చేసిన జిల్లా స్థాయి అధికారి స్నేహితుడు. దీంతో ఉండి రిజిస్ట్రార్కు తన స్నేహితుడికి డాక్యుమెంట్ రిజిస్ట్రేషన్ చేయాలని సిఫార్సు చేశాడు. దీంతో ఆమె ఎటువంటి పత్రాలను పరిశీలించకుండానే రిజిస్ట్రేషన్ చేసింది. బాధితుడు రాజ్కుమార్ రిజిస్ట్రేషన్లు, స్టాంపుల ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేయడంతో ఉండి సబ్ రిజిస్ట్రార్ తప్పుడు రిజిస్ట్రేషన్ వెలుగుచూసింది. సదరు అధికారిణి నాలుగు నెలలుగా రావడం లేదు. స్టాంప్ అండ్ రిజిస్ట్రేషన్ శాఖ డీఐజీ నుంచి మెమోను సైతం అందించారు. సిఫార్సు చేసిన అధికారి వద్దకు తనను సమస్య నుంచి బయటపడేయాలని అధికారిణి తిరుగుతున్నారు. తప్పుడు రిజిస్ట్రేషన్లకు అడ్డాగా ఉండి, ఆకివీడు అక్రమ రిజిస్ట్రేషన్లకు అడ్డాగా పశ్చిమగోదావరి జిల్లా ఉండి, అకివీడు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాలు మారుతున్నాయి. ఏలూరు జిల్లా కై కలూరు, మండవల్లి మండలాలు, కృష్ణాజిల్లా బంటుమిల్లి, పెడన, మచిలీపట్నం, ప్రకాశం, పల్నాడు, గుంటూరు జిల్లాల నుంచి ఎనీవేర్ రిజిస్ట్రేషన్లు ఇక్కడ జరుగుతున్నాయి. రాజ్కుమార్ వంటి అనేక మంది బాధితులు తప్పుడు రిజిస్ట్రేషన్లు రద్దు చేయాలని కార్యాలయాల చుట్టూ తిరుగుతున్నారు. ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి వినూత్నంగా నిరసనలు తెలుపుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మరీ అక్రమార్కులు రెచ్చిపోతున్నారని బాధితులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తప్పుడు రిజిస్ట్రేషన్లు కలిదిండికి చెందిన భూమికి మరొకరి పేరుతో రిజిస్ట్రేషన్ కాళ్లరిగేలా తిరుగుతున్న బాధితుడు ఆక్రమణదారుడికి కూటమి నాయకుల అండ నా భూమిని ఆక్రమించుకోవడానికి ఉండిలో తప్పుడు రిజిస్ట్రేషన్కు కలిదిండికి చెందిన కూటమి నేత పాల్పడ్డాడు. అతని తప్పుని నేను ఎండగట్టాను. ఒకరి భూమిని ఆక్రమించుకుంటున్న వ్యక్తికే కూటమి నేతలు మద్దతు తెలుపుతున్నారు. ఉండిలో అక్రమ సవరణ దస్తావేజు 1531/2025ను రద్దు చేసి, మోసం చేసిన వ్యక్తిపై క్రిమినల్ కేసు నమోదు చేయాలి. నా భూమిని అధికారులు అప్పగించాలి. – కురేళ్ళ రాజ్కుమార్, బాధితుడు, గణపవరం -
బకాయిల విడుదలలో నిర్లక్ష్యంపై ఫిర్యాదు
ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాకు సంబంధించి 2015 నుంచి రేషన్ డీలర్లకు రావలసిన కమిషన్ బకాయిలను రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేసినా సంబంధిత ఫైలు జిల్లా పౌరసరఫరాల శాఖ మేనేజర్ కార్యాలయంలో పెండింగ్లోనే ఉందని జిల్లా రేషన్ డీలర్ అసోసియేషన్ అధ్యక్షుడు అత్తులూరి ఉదయ్ ఈశ్వరరావు ఆధ్వర్యంలో జేసీ అభిషేక్ గౌడ్ని కలిసి ఫిర్యాదు చేశారు. ఈ మేరకు జాయింట్ కలెక్టర్కు వినతిపత్రం ఇచ్చారు. అనంతరం ఉదయేశ్వరరావు మాట్లాడుతూ ఫైల్ డీఎం కార్యాలయానికి ఎప్పుడో పంపారని.. అక్కడ అప్రూవల్ చేసి కమిషనర్ కార్యాలయానికి పంపించాలని.. సిబ్బంది నిర్లక్ష్యంగా ఉన్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా ప్రధాన కార్యదర్శి లక్ష్మణరావు, కోశాధికారి నాగరాజు తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారికి దీపావళి ఉత్సవం
ద్వారకాతిరుమల: బాణ సంచా వెలుగుల నడుమ ఉభయ దేవేరులతో శ్రీవారికి కోవెల ఉత్సవాన్ని అట్టహాసంగా నిర్వహించారు. ప్రతి ఏటా క్షేత్రంలో దీపావళి ఉత్సవాన్ని ఘనంగా జరపడం సంప్రదాయంగా వస్తోంది. ఈ క్రమంలోనే పండుగ తిథిలో తగులు, మిగులు రావడంతో శ్రీవారి దేవస్థానం అధికారులు దీపావళిని మంగళవారం రాత్రి నేత్రపర్వంగా జరిపారు. క్షేత్ర పురవీదుల్లో అంగరంగ వైభవంగా జరగాల్సిన ఈ ఉత్సవం, ఆకాశం మేఘావృతం కావడంతో ఆలయానికే పరిమితమైంది. ముందుగా దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని దీపాలతో విశేషంగా అలంకరించారు. ఆ తరువాత స్వామి, అమ్మవార్లను తోళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేసి, హారతులిచ్చారు. అనంతరం శ్రీవారి వాహనాన్ని కోవెల చుట్టూ మూడుసార్లు తిప్పారు. దేవస్థానం సిబ్బంది స్వామివారి వాహనం ముందు, అలాగే ఆలయ ప్రధాన రాజగోపురం మెట్లపై పెద్ద ఎత్తున బాణాసంచా కాల్చారు. ఇదిలా ఉంటే స్వామివారి రాక కోసం.. వేయి కళ్లతో ఎదురు చూసిన గ్రామ ప్రజలు, గ్రామోత్సవం రద్దవడంతో తీవ్ర నిరుత్సాహానికి గురయ్యారు. వ్యక్తి అదృశ్యంపై కేసు నమోదు పెదపాడు: స్థానిక విద్యుత్ సబ్స్టేషన్లో షిఫ్ట్ ఆపరేటర్గా పనిచేస్తున్న నల్లపరాజు సత్యనారాయణరాజు (40) ఈ నెల 17 నుంచి కనిపించడం లేదని కుటుంబసభ్యులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సత్యనారాయణరాజు కాళ్ల మండలంలోని కలవపూడి గ్రామస్తుడు నల్లపరాజు రామరాజు కుమారుడు. పదేళ్లుగా పెదపాడులో ఉంటూ నాయుడుగూడెం, వీరమ్మకుంట గ్రామాల్లో చేపల చెరువులు సాగు చేస్తున్నాడు. దీంతో పాటు రైతుల నుంచి రొయ్యలు కొనుగోలు చేసి కంపెనీలకు విక్రయిస్తుంటాడు. ఇటీవల ఆర్థిక ఇబ్బందులతో సతమతమవుతున్నాడని కుటుంబసభ్యులు తెలిపారు. ఈ నెల 19న అతడి బైక్లో కుటుంబ సభ్యులకు ఓ ఉత్తరం కనిపించగా.. ఆర్థిక ఇబ్బందులు తాళలేక ఈ లోకం విడిచి వెళ్లిపోతున్నానని ఉత్తరంలో రాసినట్లు సమాచారం. మరోపక్క సత్యనారాయణరాజు అదృశ్యం కావడంతో కోట్లాది రూపాయల నగదు తమకు రావాల్సి ఉందని, తమ పరిస్థితి ఏమిటని రైతులు లబోదిబోమంటున్నారు. -
ఎంత వరకూ సమంజసం?
నాలుగు డీఎలు ఉద్యోగులకు బకాయిలు పడిన ప్రభుత్వం ఒక డీఎ విడుదలకు హామీ ఇచ్చింది. ఆ డీఎను ఉద్యోగులు మరణిస్తే ఇస్తామనడం, లేదంటే ఉద్యోగ విరమణ చేసిన తరువాత చెల్లిస్తామనడం ఎంత వరకూ సమంజసం. ఈ జీఓలను మార్చి ఉద్యోగుల బకాయిలు చెల్లించాలి – ఆర్ఎస్ హరనాథ్, పీఏఓ రాష్ట్ర అధ్యక్షుడు ప్రభుత్వం ఇచ్చిన ఒక డీఎ ప్రకటన చూసి ఉద్యోగులు కాస్త ఆనందం వ్యక్తం చేశారు. దీపావళికి టపాసులు పేలాయి. ప్రభుత్వం ఇచ్చిన డీఎ హామీ మాత్రం తుస్సుమంది. తక్షణమే ఈ డీఎ నిధులు జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి. పెన్షనర్లకు తక్షణమే చెల్లించే ఏర్పాట్లు చేయాలి. – కె.రమేష్కుమార్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు ప్రభుత్వం ప్రకటించిన డీఎ బకాయిలను తక్షణమే విడుదల చేసి జీపీఎఫ్ ఖాతాల్లో జమ చేయాలి. ఇప్పటికే 4 బకాయిలు పెండింగ్లో ఉన్నాయి. వాటి గురించి పక్కన పెట్టినా ఇచ్చిన హామీ ప్రకారం ఒక డీఎ బకాయినైనా ప్రభుత్వం చెల్లించే విధంగా జీఓలో మార్పులు చేయాల్సిందే. – సిహెచ్ శ్రీనివాస్, జిల్లా ఎన్జీఓ అధ్యక్షుడు ఇప్పటికే పెన్షనర్లు 70 సంవత్సరాల పైబడి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చిన డీఆర్ బకాయిలు రానున్న నెల నుంచి అమలు చేయాలి. మరో రెండు సంవత్సరాల తరువాత చెల్లిస్తానమడం, అది కూడా 12 విడతల్లో చెల్లిస్తాననడం ఎంత వరకూ సమంజసం. – కె.మహాలక్ష్ముడు, జిల్లా పెన్షనర్ల కార్యదర్శి -
అమర వీరుల త్యాగాలు మరువలేం
ఏలూరు టౌన్: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణలో ప్రాణాలను సైతం లెక్కచేయకుండా సేవలందించిన పోలీసు అమరవీరుల త్యాగాలు మరువలేనివని.. దేశ అంతర్గత భద్రతలో కీలకపాత్ర పోషిస్తూ నిరంతరం ప్రజా సేవకే అంకితమైన పోలీసు అమరవీరులకు ఘనంగా నివాళులు అర్పించాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ అన్నారు. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవం సందర్భంగా ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్తో కలిసి అమరవీరుల స్థూపం వద్ద ఘనంగా నివాళి అర్పించారు. పోలీస్ సిబ్బంది కవాతుకు ఏఆర్ ఆర్ఐ సతీష్ కమాండర్గా వ్యవహరిస్తూ పోలీస్ అమరవీరులకు స్మృతి పరేడ్ నిర్వహించారు. అమరవీరులకు రెండు నిమిషాలు మౌనం పాటించి శ్రద్ధాంజలి ఘటించారు. అనంతరం పోలీస్ పరేడ్ గ్రౌండ్స్ నుంచి నిర్వహించిన ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కుమార్ మాట్లాడుతూ.. పోలీస్ సేవలు మరువలేనివని, ప్రపంచమంతా నిద్రపోతుంటే పోలీస్ మాత్రమే మేల్కొని శాంతిభద్రతల పరిరక్షణకు పాటుపడతారని చెప్పారు. సమాజ వ్యతిరేక శక్తులతో నిత్యం పోరాటం చేస్తూ ఎందరో తమ ప్రాణాలను త్యాగం చేశారన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. శాంతిభద్రతల పరిరక్షణలో విశేష కృషి చేస్తోన్న పోలీస్లు రియల్ హీరోలని అభివర్ణించారు. విధుల్లో ఉంటూ ప్రాణాలు కోల్పోయిన అమరవీరుల కుటుంబాలకు ప్రభుత్వ అందించే పరిహారం, సంక్షేమ కార్యక్రమాలు త్వరగా అందేలా కృషి చేస్తామన్నారు. ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ.. పోలీస్ అమరవీరుల సంస్మరణ దినోత్సవాన్ని 1959, అక్టోబర్ 21న ప్రారంభించారని, లడఖ్లో విధులు నిర్వర్తిస్తోన్న 10 మంది సీఆర్పీఎఫ్ జవానులను అక్రమంగా భారత భూబాగంలోకి ప్రవేశించిన చైనా దళాలు బలితీసుకున్నాయని, వారి త్యాగాలను ఏటా గుర్తు చేసుకుంటూ సంస్మరణ దినోత్సవాన్ని జరుపుకోవటం ఆనవాయితీగా వస్తోందన్నారు. ఈ సంస్మరణ దినోత్సవంలో అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్, డీటీసీ డీఎస్పీ ప్రసాదరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఏవో మస్తాన్, వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
కార్తీక స్నానాలకు ఏర్పాట్లు
ముసునూరు: ఈ నెల 22 బుధవారం నుంచి ఆరంభం కానున్న కార్తీక మాస పుణ్య స్నానాలు, స్వామి దర్శనాలకు హాజరయ్యే భక్తుల కోసం అన్ని ఏర్పాట్లు చేసినట్లు బలివే రామలింగేశ్వరస్వామి ఆలయ ఈఓ పామర్తి సీతారామయ్య చెప్పారు. మంగళవారం ఆయన కార్తీక మాస ఏర్పాట్లను వివరించారు. వేలాది మంది భక్తుల రద్దీని దృష్టిలో ఉంచుకుని ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. గ్రామ పంచాయతీ అధికారులతో కలసి, తమ్మిలేరు స్నాన ఘట్టాల వద్ద పుణ్య స్నానాలాచరించే భక్తుల సౌకర్యార్ధం, ప్రమాదాల నివారణ కోసం బారికేడ్లు ఏర్పాటు చేయించారు. ఉదయం, సాయంత్రం వేళల్లో పూజలు, అభిషేకాలు, దైవ దర్శనానికి హాజరయ్యే భక్తులకు ఆలయ ప్రాంగణంలో ఎలాంటి ఆటంకం లేకుండా సౌకర్యాలు కల్పించామన్నారు. ఏలూరు (టూటౌన్): దివ్యాంగులకు ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ చేయాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం డిమాండ్ చేసింది. దివ్యాంగుల సంక్షేమ సంఘం జిల్లా కమిటీ సమావేశం మంగళవారం ఏలూరులో జరిగింది. సమావేశంలో రాష్ట్ర కన్వీనర్ కె వీర్రాజు, అధ్యక్షుడు కుందేటి జయరాజు, కార్యదర్శి ఎల్.రాంబాబు మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం దివ్యాంగులకు ఇళ్ల వద్దకే రేషన్ అందించాలని చెప్పినప్పటికీ, చాలాచోట్ల రేషన్ అందించడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వ హయాంలో ఇంటి వద్దకే రేషన్ సరుకులు పంపిణీ అందించేవారని గుర్తు చేశారు. సమావేశంలో ఏలూరు జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా కార్యదర్శి లక్కపాము రాంబాబు, ఉపాధ్యక్షుడు సీహెచ్ వాసు, కోశాధికారి భూలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. నూజివీడు: ఉద్యోగులకు డీఏపై జారీ చేసిన జీఓ విషయంలో ప్రభుత్వ తీరు సమంజసంగా లేదని సెకండరీ గ్రేడ్ టీచర్స్ ఫెడరేషన్(ఎస్జీటీఎఫ్) రాష్ట్ర ఉపాధ్యక్షుడు కొక్కెరగడ్డ సత్యం ఒక ప్రకటనలో పేర్కొన్నారు. డీఏ బకాయిలను పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని, పెన్షనర్లకు 2027–28 ఆర్థిక సంవత్సరంలో 12 విడతలుగా చెల్లిస్తామని తెలపడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు. సరండర్ లీవ్ బిల్లులు చాలా ఏళ్లుగా పెండింగ్లోనే ఉండగా వాటిపైనా ప్రతి ఏటా ఆదాయపు పన్ను చెల్లిస్తున్నామన్నారు. ఉద్యోగులకు చెల్లించాల్సిన డీఏ బకాయిలు రూ.3520 కోట్లను పీఎఫ్ ఖాతాలకు జమ చేస్తామని సీఎం తెలిపారని, సీఎం చేసిన ప్రకటనకు భిన్నంగా పదవీ విరమణ సమయంలో చెల్లిస్తామని ఉత్తర్వులు ఇవ్వడం ఉద్యోగులను మోసం చేయడమేనన్నారు. పెనుగొండ: కార్తీక మాసం సమీపిస్తుండడంతో కేదారీఘాట్ రేవుల దుస్థితిపై సాక్షిలో ప్రచురితమైన కథనానికి పంచాయతీ, దేవదాయ శాఖాధికారులు స్పందించారు. అధ్వానంగా మారిన సిద్ధాంతం కేదారీఘాట్ రేవులను పంచాయతీ, దేవదాయ శాఖల ఆధ్యర్యంలో శుభ్రం చేశారు. సర్పంచ్ చింతపల్లి గనిరాజు(చంటి), దేవస్థానం అధికారి ముత్యాల సత్యనారాయణల ఆధ్వర్యంలో రేవుల ప్రక్షాళనకు శ్రీకారం చుట్టారు, ఏలూరు(మెట్రో): జిల్లాలో భూగర్భ జలాల స్థాయిని పెంచేందుకు చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో మంగళవారం మైనర్ ఇరిగేషన్ చెరువుల మరమ్మతులు, పునరుద్ధరణ, భూగర్భ జలాల పెంపు తదితర అంశాలపై కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ మెట్ట ప్రాంతాలలో భూగర్భ జలాల స్థాయి తక్కువగా ఉందని, భూగర్భ జలాల స్థాయిని గణనీయంగా పెంచేలా చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో 1513 మైనర్ ఇరిగేషన్ చెరువులు ఉండగా, వాటిలో మొదటి దశలో 175 చెరువులకు మరమ్మతులు, పునరుద్ధరణ, పనులు చేపట్టేందుకు ప్రతిపాదనలను ప్రభుత్వానికి సమర్పించామన్నారు. -
డీఎస్పీ సారు.. జూదాలను పట్టించుకోరు!
సాక్షి, టాస్క్ఫోర్స్: పశ్చిమగోదావరి జిల్లా భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్య అసాంఘిక కార్యకలాపాలకు మద్దతు ఇస్తున్నారంటూ జనసేన అధినేత, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు ఫిర్యాదు అందిందనే ప్రచారం సోషల్ మీడియాలో విస్తృతంగా జరుగుతుండటంతో మంగళవారం జిల్లా వ్యాప్తంగా విషయం చర్చనీయాంశంగా మారింది. భీమవరం డీఎస్పీగా జయసూర్య సుమారు ఏడాది క్రితం బాధ్యతలు చేపట్టారు. సంక్రాంతి కోడిపందేల నిర్వహణ, పెద్ద ఎత్తున పేకాట వంటి జూదాలు విచ్చలవిడిగా సాగుతున్నాయని, దీనికి పరోక్షంగా డీఎస్పీ సహకారం ఉందంటూ ఎప్పటి నుంచో ప్రచారం ఉంది. ప్రధానంగా భీమవరం పట్టణంలోని క్లబ్బుల్లో విచ్చలవిడిగా జూదాలు నిర్వహిస్తున్నారని, అందుకు గాను పోలీసులకు పెద్ద మొత్తంలో ముడుపులు అందుతున్నాయనే ఆరోపణలు ఉన్నాయి. ఎమ్మెల్యే కార్యాలయానికి ముడుపులు ఇవ్వాలంటూ పోలీసులే ముడుపులు వసూలు చేస్తున్నారంటూ ప్రచారం సాగింది. దీంతో మండిపడ్డ ఎమ్మెల్యే.. క్లబ్బుల్లో జూదాల నిర్వహణను కట్టడి చేసేందుకు చర్యలు చేపట్టారు. అయితే.. పక్కనున్న ఉండి నియోజకవర్గంలో పెద్ద ఎత్తున కోడిపందేలు, పేకాట వంటి జూదాలు నేటికీ జోరుగా సాగుతున్నా పోలీసులు పట్టించుకోవడం లేదని, దీనికి పక్క నియోజకవర్గ కూటమి పెద్దలతో డీఎస్పీ అంటకాగడమే కారణమని బహిరంగంగా చెబుతున్నారు. దీంతో సుమారు ఆరు నెలల క్రితం డీఎస్పీ జయసూర్యను బదిలీ చేస్తూ పోలీసు ఉన్నతాధికారులు ఉత్తర్వులిచ్చారు. అయితే బదిలీని పక్క నియోజకవర్గ నాయకుడి అండదండలతో బదిలీని నిలుపుదల చేయించుకుని ఆయనకు అనుకూలంగా పనిచేస్తూ జూదాల నిర్వాహకుల జోలికి పోకుండా.. వారినుంచి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. అంతేగాకుండా సివిల్ తగాదాల్లో డీఎస్పీ ప్రమేయం ఉంటోందని, భీమవరంలో డీఎస్పీ జయసూర్య ప్రత్యేక దందా నిర్వహిస్తున్నారంటూ జనసేన నాయకులు పవన్కల్యాణ్కు ఫిర్యాదు చేయడంతో నేరుగా పవన్ ఎస్పీతో ఫోన్లో మాట్లాడినట్టు సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది. దీనిపై భీమవరం నియోజకవర్గంలో జనసేన కూటమి నాయకులు గాని, పోలీసులు గాని నోరుమెదపడం లేదు. డీఎస్పీ వ్యవహారం ఎలాంటి మలుపు తిరుగుతుందోననే చర్చ మాత్రం జోరుగా సాగుతోంది. డీఎస్పీ జయసూర్యపై సోషల్ మీడియాలో విస్తృత ప్రచారం -
ఆహ్లాదం... విహారం
బుట్టాయగూడెం: కార్తీకమాసం ప్రారంభం కావడంతో పర్యాటకులు దైవ దర్శనాలతో పాటు పిక్నిక్లకు సన్నాహాలు చేసుకుంటున్నారు. పిక్నిక్ పేరుతో పర్యాటక ప్రాంతాలను చూసేందుకు సిద్దమవుతున్నారు. చలికాలం కూడా ప్రారంభం కావడంతో అందమైన పర్యాటక ప్రాంతాలు ఎక్కడున్నాయో అని ఆరా తీస్తున్నారు. జిల్లాలో అందమైన, ఆహ్లాదకరమైన ప్రదేశాలతోపాటు ఆధ్యాత్మిక దేవాలయాలవైపు ఒక లుక్కేద్దాం. పశ్చిమ ఏజెన్సీలోని అటవీ అందాలు పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అడవి అందాలు చూపరులను కనువిందు చేస్తున్నాయి. జాలువారుతున్న జలపాతాలు, కొండలను తాకుతున్న మేఘాలు, ప్రకృతి రమణీయ దృశ్యాలు మనసును దోచుకుంటున్నాయి. జల్లేరు జలాశయం, ముంజులూరులోని ఏనుగుతోగు జలపాతం, ఉప్పరిల్ల జలపాతం, గుబ్బల మంగమ్మ సన్నిధి, పోగొండ రిజర్వాయర్తో పాటు అటవీప్రాంతంలోని పలు ప్రదేశాలు పిక్నిక్ స్పాట్లుగా ఉన్నాయి. ప్రతి ఏటా కార్తీకమాసంలో లక్షలాది మంది పర్యాటకులు ఆయా ప్రాంతాల్లో వనభోజనాలను ఏర్పాటు చేసుకుంటూ ఆనందంగా గడుపుతారు. ఈ ఏడాది ఆయా ప్రాంతాల్లో కూడా పిక్నిక్ సందడి ప్రారంభమైంది. గత కొద్ది రోజులుగా వర్షాలు విస్తరంగా కురుస్తున్నందున ప్రకృతి ఒడిలో విరాజిల్లే జలపాతాలు వర్యాటకుల మనస్సును దోచుకుంటున్నాయి. ఆహ్లాదకరం.. గోదావరి విహారం కార్తీకమాసం వచ్చిందంటే పాపికొండల యాత్రకు వెళ్లేవారి సంఖ్య అధికంగా ఉంటుంది. గోదావరి తీర ప్రాంతాలతో పాటు పాపికొండల విహారానికి పర్యాటకులు అధిక సంఖ్యలో తరలివస్తుంటారు. ముఖ్యంగా శని, ఆదివారాల్లో రాష్ట్రంతో పాటు తెలంగాణ ప్రాంతం నుంచి యాత్రికుల తాకిడి అధికంగా ఉంటుంది. అయితే ఈ ఏడాది అత్యధిక వర్షాలు కురిసి గోదావరి వరద కూడా ఉధృతంగా ప్రవహించడంతో బోటు ప్రయాణాలను పర్యాటక శాఖ నిలిపివేసింది. ప్రస్తుతం గోదావరి తగ్గుముఖం పట్టడంతో పర్యాటక శాఖ తిరిగి పాపికొండల విహార యాత్రకు సన్నాహాలు చేస్తున్నట్లు సమాచారం. దేవీపట్నం మండలం గండిపోచమ్మ ఘాట్ నుంచి పాపికొండల విహారయాత్రకు పర్యాటక శాఖ సన్నాహాలు చేస్తున్నట్లు తెలిసింది. సందర్శన స్థలాలు పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. ఇసుక తిన్నెలపై కొలువైన పోలవరం మండలం పట్టిసీమ వీరభద్రస్వామి, మహానందీశ్వర స్వామి ఆలయాలు, అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మగుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కార్టేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ శివుడిని దర్శించుకోవచ్చు. అలాగే గోదావరి వెంబడి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనసును దోచుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. నేటి నుంచి ప్రారంభం కానున్న కార్తీక మాసం సందడి విహారయాత్రలకు పశ్చిమ మన్యం సోయగాల ఆహ్వానం పర్యాటక శాఖ ఆధ్వర్యంలో అందుబాటులోకి అనేక సౌకర్యాలు -
కార్మికుల సమ్మె బాట
తణుకు అర్బన్: ఆసుపత్రుల్లోని పారిశుద్ధ్య కార్మికులు సమ్మె బాట పట్టారు. తమకు 4 నెలల వేతన బకాయిలు, 40 నెలల పీఎఫ్ సొమ్ము తక్షణమే ఇవ్వాలని, ఆస్పత్రిలోని బెడ్లకు అనుగుణంగా 50 మంది కార్మికులను కేటాయించాలంటూ పారిశుద్ధ్య కార్మికులు మంగళవారం నుంచి ఆందోళన బాట పట్టారు. జూలై, ఆగస్టు, సెప్టెంబరు నెలలతోపాటు మేనెలలో కూడా వేతనం ఇవ్వలేదని కానీ అధికారులు మాత్రం మే నెల వేసేశామని చెబుతున్నారని కార్మికులు ఆరోపిస్తున్నారు. జిల్లాలోని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రితోపాటు ఏరియా ఆస్పత్రులు, కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో పారిశుద్ధ్య కార్మికులకు వేతనాలు బకాయిలు ఉండగా తరచూ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నాలు నిర్వహిస్తున్నారు. ఇటీవల తాడేపల్లిగూడెం ఏరియా ఆస్పత్రిలో కూడా కార్మికులు సమ్మెబాట పట్టగా వైద్యాధికారులు చర్చలు జరపడంతో విధుల్లోకి వచ్చారు. జిల్లాలో మిగిలిన ఆస్పత్రుల్లోని కార్మికులు కూడా సమ్మెబాట పట్టేలా ఉన్నారని తెలుస్తోంది. ఒక్క రోజుకే కంపు... పారిశుద్ధ్య కార్మికుల సమ్మెతో మంగళవారం ఒక్కరోజుకే ఆస్పత్రి అంతా కంపు కొట్టింది. ఆస్పత్రి వార్డుల్లోకి వెళ్లాలంటే దుర్వాసనతో దుర్గంధంగా మారిందని రోగులు ఆరోపిస్తునారు. వార్డుల్లో ఏర్పాటుచేసిన డస్ట్బిన్లు నిండిపోయి నేలపై వ్యర్థాలు చెల్లాచెదురుగా పడిఉన్నాయి. ముఖ్యంగా బాలింతలు, బిడ్డలు ఉన్న వార్డులో చెత్త, వ్యర్థాలు నేలపైనే పడిపోయి కడు దయనీయంగా మారింది. వార్డులో ఉన్న టాయిలెట్స్ సైతం రొచ్చు కంపుతో కునారిల్లిపోయింది. ఆవరణ, వార్డుల్లో ఉన్న డస్ట్బిన్లు నిండిపోయి నేలపై పడిపోయిన వ్యర్థాలతో ఆస్పత్రి అంతా దుర్వాసన వెదజల్లుతోంది. సమ్మె కొనసాగితే ఆస్పత్రిలోని బాలింతలు, గర్భిణులు, వివిధ శస్త్రచికిత్సలు చేయించుకున్న రోగులకు ఇన్ఫెక్షన్స్ వస్తాయని ఆస్పత్రి వర్గాలు ఆందోళనలు వ్యక్తం చేస్తున్నారు. డీసీహెచ్ఎస్, ఆర్డీవో చర్చలు విఫలం పారిశుద్ధ్య కార్మికులు సమ్మెలోకి వెళ్లడంతో మంగళవారం ఉదయం డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ, ఆర్డీవో కౌసర్ బానో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి వచ్చి వైద్యాధికారులు, పారిశుద్ధ్య కార్మికులతో చర్చలు జరిపారు. ఈ రోజు రెండు నెలల వేతనాలు వేస్తే విధుల్లోకి వస్తామని కార్మికులు పట్టుబట్టడంతో చర్చలు విఫలమయ్యాయి. అనంతరం డీసీహెచ్ఎస్ సూర్యనారాయణ మీడియాతో మాట్లాడుతూ రాష్ట్ర వ్యాప్తంగా కొన్ని జిల్లాల్లో ఈ సమస్య నెలకొందని, తణుకు ఆస్పత్రిలో 3 నెలల వేతన బకాయిలు, పీఎఫ్ పెండింగ్ సమస్యలతో కార్మికులు సమ్మెలోకి వెళ్లారని తెలిపారు. 48 గంటల్లో సమస్య పరిష్కారానికి కృషిచేస్తామని చెప్పారు. అప్పటివరకు తణుకు, తాడేపల్లిగూడెం మునిసిపల్ కమిషనర్ల సహాయంతో ఆస్పత్రిలో పారిశుద్ధ్య నిర్వహణలో ఎటువంటి ఇబ్బందులు లేకుండా చూస్తామని స్పష్టం చేశారు. కూటమి పాలనలో మూడు సమ్మె నోటీసులు 16 నెలల కూటమి పాలనలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో విధుల్లో ఉన్న పారిశుద్ధ్య కార్మికులు వేతన బకాయిలు, పీఎఫ్ సొమ్మును ఇప్పించాలని మూడుసార్లు సమ్మె నోటీసులు వైద్యాధికారులకు అందచేశారు. మొదటగా 5 నెలల వేతన బకాయిలతో ఈ ఏడాది మార్చి 4వ తేదీ నుంచి సమ్మెలోకి వెళ్తున్నట్లుగా 3వ తేదీన, 4 నెలల వేతన బకాయిలతో సెప్టెంబరు 29 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని 27వ తేదీన, తిరిగి 4 నెలల వేతన బకాయిలతో ఈనెల 21 నుంచి సమ్మెలోకి వెళ్తున్నామని 17వ తేదీన వైద్యాధికారులకు సమ్మె నోటీసులు అందజేశారు. జిల్లా ఆస్పత్రి 1 ఏరియా ఆస్పత్రులు 4 కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు 3 పారిశుధ్య కార్మికులు 135 నిత్యం 6 వేలకు పైగా అవుట్ పేషెంట్స్, వెయ్యిలోపు ఇన్ పేషెంట్స్ విధులు బహిష్కరించిన ఆస్పత్రి పారిశుధ్య కార్మికులు 4 నెలల వేతన, 41 నెలల పీఎఫ్ బకాయిలు చెల్లించాలని డిమాండ్ ఆస్పత్రుల్లో పేరుకుపోయిన చెత్త, వ్యర్థాలు రోగులపై పడనున్న సమ్మె ప్రభావం -
విద్యార్థులకు ప్రభుత్వ విద్య దూరం
నూజివీడు: విద్యార్థులకు ప్రభుత్వ విద్యను దూరం చేస్తూ కార్పొరేట్ శక్తులకు ధారాదత్తం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం విద్యావ్యవస్థను ప్రైవేటుపరం చేస్తోందని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివ కుమార్ విమర్శించారు. విద్యారంగ సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 22 నుంచి నవంబర్ 12 వరకు ఇచ్చాపురం నుంచి హిందూపురం వరకు జరిగే బస్సు యాత్రను విజయవంతం చేయాలని కోరుతూ పట్టణంలోని అమర్భవన్లో మంగళవారం పోస్టర్లు విడుదల చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తక్షణమే నూజివీడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఏర్పాటు చేయాలన్నారు. రాష్ట్రంలోని మెడికల్ కళాశాలలను ప్రైవేట్ పరం చేసే పీపీపీ విధానాన్ని ప్రభుత్వం ఉపసంహరించుకోవాలని డిమాండ్ చేశారు. డిగ్రీ విద్యను అభ్యసించడానికి నూజివీడులో ప్రభుత్వ డిగ్రీ కళాశాల లేకపోవడంతో సమీపంలోని అనేక గ్రామాల నుంచి విద్యను అభ్యసించడానికి నూజివీడు వస్తున్న విద్యార్థులు ప్రైవేటు కళాశాలలకు సొమ్ము చెల్లించలేక తమ చదువులకు మధ్యలోనే స్వస్తి పలుకుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో 17 మెడికల్ కళాశాలలు తీసుకురాగా, కూటమి ప్రభుత్వం 10 ప్రభుత్వ వైద్య కళాశాలలను ప్రైవేట్ పరం చేస్తూ నిరుపేద విద్యార్థులకు మెడికల్ విద్యను దూరం చేయడం దుర్మార్గమన్నారు. -
తుస్సుమన్న డీఏ హామీ
ఏలూరు, (మెట్రో): ఉద్యోగులకు నెల జీతంలో వంద పెరిగినా ఎంతో ఆనంద పడతారు. అలాంటిది ఉద్యోగికి రావాల్సిన రూ.కోట్లాది బకాయిల్లో కాస్త ఇస్తున్నామని ప్రకటిస్తే ఆ ఉద్యోగి ఆనందానికి అవధులు ఉండవు. కూటమి ప్రభుత్వం మాత్రం ఉద్యోగుల జీవితాలతోనే ఆడుకుంటోంది. బతికుండగా ఇవ్వలేకపోతే ఉద్యోగులు మరణించాక వారికి బకాయిలు చెల్లిస్తామని చెబుతోంది. కనీసం పెన్షనర్లపైనా దయ చూపడం లేదు. రాష్ట్ర ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 16 నెలలైంది. కనీసం ఉద్యోగుల ప్రయోజనాలపై ఒక్క మాట కూడా మాట్లాడిన పాపాన పోలేదు. ఇటీవల ఉద్యోగులు, పెన్షనర్లతో సమావేశంలో ఉద్యోగులకు ఒక డీఎ, పెన్షనర్లకు ఒక డీఆర్ ఇస్తున్నట్లు కూటమి ప్రభుత్వం ప్రకటించింది. దీంతో కాస్త ఊరట కలిగిందని భావించే లోపే ఉద్యోగులకు, పెన్షనర్లపై కూటమి సర్కారు పిడుగు వేసింది. ప్రకటించిన డీఎ, డీఆర్లను ఉద్యోగులు రిటైర్ అయిన తరువాత చెల్లిస్తామని లేకుంటే ఉద్యోగి మరణిస్తే వారి వారసులకు చెల్లిస్తామని, పెన్షనర్లకు 2027–28 సంవత్సరాల్లో 12 విడతల్లో చెల్లిస్తామని ప్రకటించింది. ఇప్పటికే నాలుగు డీఏలు బకాయి : ప్రతి ఆరు నెలలకు డీఎ ప్రకటించి ఉద్యోగులకు చెల్లించాల్సి ఉంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులున్నారు. ఏలూరు జిల్లాలో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరికి ఇప్పటికే 4 డీఎలు చెల్లించాల్సి ఉంది. 2024 జనవరి 1 నుంచి 2024 జూన్ 30 నాటికి ఒక డీఎ, 2024 జూలై 1 నుంచి 2024 డిసెంబరు 31 2వ డీఏ, 2025 జనవరి 1 నుంచి జూన్ 30 3వ డీఎ, 2025 జూలై 1 నుంచి 2025 డిసెంబరు 31వరకూ 4వ డీఎ చెల్లించాల్సి ఉంది. ప్రస్తుతం 2024 జనవరి 1 నుంచి 2025 సెప్టెంబరు 30 వరకూ 21 నెలల డీఎ 3.64 శాతాన్ని చెల్లిస్తామని గొప్పలు చెప్పిన కూటమి సర్కారు ఉద్యోగులు చనిపోవాలని, లేదంటే ఉద్యోగవిరమణ చేయాలని జీఓలు విడుదల చేసింది. వాస్తవానికి పెన్షనర్లకు డీఆర్ ప్రకటించిన వెంటనే వచ్చే నెల పెన్షన్తో బకాయిలు ఇవ్వాల్సి ఉండగా దీనికి విరుద్ధంగా 2027 తరువాత 12 విడతల్లో చెల్లిస్తానని చెప్పడం చూస్తుంటే బకాయిలు తీసుకోవాలంటే ఉద్యోగులు, పెన్షనర్లు చనిపోవాలా అనే ప్రశ్నలు ఎదురవుతున్నాయి. కాగా ఉద్యోగుల నిరసనల నేపథ్యంలో ప్రభుత్వం బకాయిలను 10 శాతం 2016 ఏప్రిల్లో, మిగతా 2026 ఆగస్టు, నవంబరు, 2027 ఫిబ్రవరిలో చెల్లిస్తామని మరో జీవో విడుదల చేసింది. దీనిపై ఉద్యోగులు ఎలా స్పందిస్తారనేది వేచి చూడాలి. డీఎ రావాలంటే ఉద్యోగి మరణించాలి.. లేదంటే రిటైరవ్వాలి ఆ మేరకు జీవోలు జారీ చేసిన ప్రభుత్వం ప్రకటించిన ఒక్క డీఎ ఇప్పట్లో లేనట్టే ఉమ్మడి జిల్లాలో 67 వేల మంది ఉద్యోగులకు మొండిచేయి 20 వేల మంది పెన్షనర్లదీ ఇదే పరిస్థితి -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ తగదు
వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ బుట్టాయగూడెం: మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ మంగళవారం సాయంత్రం నిర్వహించారు. కార్యక్రమంలో మాజీ ఎమ్మెల్యే బాలరాజు మాట్లాడుతూ చంద్రబాబు అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొత్త కాలేజీలను ఆపేయాలని కుట్ర పన్నారన్నారు. 10 మెడికల్ కాలేజీలను ప్రైవేటు పరం చేసేందుకు కుట్ర చేస్తున్నారని చెప్పారు. ఈ కాలేజీలు ప్రైవేటుపరమైతే పేద, మధ్య తరగతి ప్రజలకు వైద్య విద్య, నాణ్యమైన వైద్యం దూరమవుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. జగన్ హయాంలో సుమారు రూ.50 కోట్లతో బుట్టాయగూడెం సమీపంలో మల్టీస్పెషాలిటీ ఆసుపత్రి నిర్మాణానికి శ్రీకారం చుట్టారన్నారు. సుమారురూ.12 కోట్లు ఖర్చు చేశారన్నారు. ఈ నిర్మాణం పూర్తయితే బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు, పోలవరం, కొయ్యలగూడెం మండలాలతో పాటు పరిసర ప్రాంతంలోని మండలాల ప్రజలకు ఈ ఆసుపత్రి ఎంతగానో ఉపయోగపడుతుందన్నారు. కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యం వీడి ఆసుపత్రి నిర్మాణానికి కృషి చేయాలన్నారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ చందా ప్రసాద్, జెడ్పీటీసీ మల్లం వసంతరావు, వైస్ ఎంపీపీలు సోమగాని శ్రీను, ఉప్పల లలితకుమారి, పార్టీ జిల్లా కార్యదర్శి బోదా శ్రీనివాసరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
రైలు ఢీకొని వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: ఏలూరు శివారు వట్లూరు ప్రాంతంలో రైలు ఢీకొని ఓ వ్యక్తి మృతిచెందాడు. ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాస్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవారం ఉదయం 8.30 గంటల సమయంలో ఓ వ్యక్తి వట్లూరు ప్రాంతంలో రైలుపట్టాలు దాటుతూ ఉండగా తిరుపతి నుంచి కాకినాడ వెళ్లే ఎక్స్ప్రెస్ రైలు ప్రమాదవశాత్తు ఢీకొనడంతో ఆ వ్యక్తి అక్కడిక్కడే మృతి చెందాడు. మృతుడి వయసు సుమారు 40 ఏళ్లు పైన ఉంటాయని, వివరాలు తెలిసిన వారు తమను సంప్రదించాలని రైల్వే హెచ్సీ శ్రీనివాస్ తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచామని చెప్పారు. నరసాపురం: పట్టణంలోని ఒకటో వార్డు శ్రీహరిపేటలో ఓ తండ్రి తన కన్నకూతురిపై ఘాతుకానికి ఒడిగట్టాడు. కుమార్తైపె అత్యాచారానికి పాల్పడ్డాడు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటనపై పపట్టణ పోలీసు స్టేషన్లో కేసు నమోదు చేసి, నిందితుడిని అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపరచగా.. రిమాండ్ విధించారు. తల్లి ఉపాధి నిమిత్తం గల్ఫ్లో ఉంటుండగా ఇద్దరు మైనర్ కుమార్తెలతో శ్రీహరిపేటలో నివాసం ఉంటున్న తండ్రి కామంతో నిర్దయగా ప్రవర్తించాడు. 13 ఏళ్ల కుమార్తైపె పలు దఫాలుగా అత్యాచారానికి పాల్పడ్డాడు. ఈ విషయం వారి బంధువుకు తెలియడంతో పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోక్సో చట్టం కింద కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేసినట్టు పోలీసులు తెలిపారు. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన స్థానికంగా సంచలనమైంది. నూజివీడు: పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన తాళ్లూరి నాగరాజు(56) అనుమానాస్పద స్థితిలో మృతి చెందిన ఘటన సోమవారం వెలుగుచూసింది. వివరాల ప్రకారం మైలవరం రోడ్డులోని కొడిమెల కొండయ్య సత్రంకు చెందిన బావిలో నాగరాజు శవమై తేలుతుండగా సోమవారం ఉదయం సమీపంలోని వారు చూసి పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. వారు బావిలో నుంచి మృతదేహాన్ని బయటకు తీసిన తరువాత నాగరాజుగా గుర్తించారు. పెయింటింగ్ పనులు చేసుకుంటూ జీవనం సాగించే నాగరాజు కొంతకాలంగా కొండయ్య సత్రంలో గది అద్దెకు తీసుకొని నివాసముంటున్నాడు. మద్యం మత్తులో బావిలో ప్రమాదవశాత్తు పడిపోయాడా లేదా ఆత్మహత్య చేసుకున్నాడా అనే దానిపై దర్యాప్తు చేస్తున్నామని పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ తెలిపారు. నూజివీడు: పట్టణంలోని ఇంజినీరింగ్ కాలేజీకి చెందిన కళాశాల బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న కందకంలోకి దూసుకెళ్లింది. మండలంలోని బోర్వంచ సమీపంలోని హెచ్పీ గ్యాస్ గోడౌన్ వద్ద 40 మంది విద్యార్థులతో మంగళవారం ఉదయం 8.30 గంటల ప్రాంతంలో వస్తున్న బస్సు అదుపుతప్పి రోడ్డు పక్కన ఉన్న గుంతలోకి వెళ్లి ఆగింది. ఈ ప్రమాదంలో విద్యార్థులందరూ క్షేమంగా బయటపడటంతో కళాశాల యాజమాన్యం, విద్యార్థుల తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు. -
50 మంది పని 19 మంది చేస్తున్నారు
తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పారిశుద్ధ్య కార్మికులు చేసిన పనికి వేతనాలు ఇవ్వలేని దుస్థితిలో ప్రభుత్వం ఉండడం సిగ్గుచేటు. 4 నెలలపాటు వేతనాలు లేక కార్మికులు అల్లాడుతుంటే ప్రభుత్వానికి, అధికారులకు చీమకుట్టినట్లుగా లేదు. ఆస్పత్రిలో 50 మంది చేయాల్సిన పనిని కేవలం 19 మందితో చేయిస్తున్నారు. – కోనాల భీమారావు, ఏపీ మెడికల్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్, తణుకు శాఖ అధ్యక్షుడు 4 నెలలపాటు జీతాలివ్వకపోతే మా బిడ్డలను ఎలా పోషించుకోమంటారు. ఆసుపత్రిలో 50 మంచాలతో ఉన్ననాటి నుంచి 19 మందితో పనిచేస్తున్నాం. నేడు 200 మంచాలకు పెరిగి 50 మంది కార్మికుల అవసరం ఉన్నా ఆ 19 మందిమే చెమట కక్కుతూ పనిచేస్తున్నాం. అయినా జీతాలు సక్రమంగా అందడం లేదు. – ధర్మాని పుష్పలత, పారిశుధ్ధ్య కార్మికురాలు ప్రభుత్వాసుపత్రిలో పారిశుద్ధ్య నిర్వహణ పనుల్లో ఉన్న మాకు వేతనాలు ఇవ్వకపోవడంతో మా బిడ్డలకు మూడు పూటలా అన్నం కూడా పెట్టలేని దుస్థితిలో ఉన్నాం. కాంట్రాక్టర్ ఇవ్వలేనప్పుడు మా జీతాలు ప్రభుత్వం అయినా చెల్లించాలి. మా పేద బతుకులకు 4 నెలల జీతాలు ఇవ్వకపోతే ఎలా బతకమంటారు. వెంటనే జీతాల బకాయిలు చెల్లించాలి. – బి.ప్రసన్న కుమారి, పారిశుద్ధ్య కార్మికురాలు -
22 నుంచి కార్తీక మాసోత్సవాలు
జంగారెడ్డిగూడెం: ఈ నెల 22 నుంచి వచ్చే నెల 21 వరకు మద్ది క్షేత్రంలో కార్తీక మాస మహోత్సవాలు వార్షిక సప్తాహ మహోత్సవాలు జరగనున్నాయి. 22న ప్రభాత సేవ, నిత్యార్చన, గోపూజ, కార్తీక మాసోత్సవాల ప్రారంభం, 24న సప్తాహ ప్రారంభ పూజా కార్యక్రమాలు, యాగశాల ప్రవేశం తదితర పూజలు, 25న పంచామృతాభిషేకాలు, 26న హనుమద్ హోమం అనంతరం సువర్చల హనుమద్ కల్యాణం, 27న స్వామి గ్రామోత్సవం, స్వామికి తమలపాకులతో వార్షిక లక్షార్చన నిర్వహించనున్నారు. 28న విశేష అష్టోత్తర పూజలు, 29న లక్ష పుష్పార్చన, 30న మద్ది ఆలయ ఉపాలయమైన శ్రీవెంకటేశ్వరస్వామి ఆలయంలో వెంకటేశ్వరస్వామికి శాంతి కళ్యాణం, 31న ప్రాతఃకాల అర్చన, మహాపూర్ణాహుతి, నవంబర్ 18న సాయంత్రం స్వామికి పుష్కరిణిలో తెప్పోత్సవం, ఈ నెల 26, వచ్చే నెల 2, 9, 16 తేదీల్లో హనుమద్ హోమాలు, సువర్చల హనుమద్ కల్యాణాలు జరుగుతాయి, ఈ నెల 27, వచ్చే నెల 3, 10, 17 తేదీల్లో స్వామికి లక్ష తమలపాకుల పూజ, ఈ నెల 25, వచ్చే నెల 1, 8, 15 తేదీల్లో స్వామికి పంచామృతాభిషేకాలు నిర్వహిస్తారు. ఈ నెల 22, 29, వచ్చే నెల 5, 12, 19 తేదీల్లో స్వామికి విశేష లక్ష పుష్పార్చన జరుగుతాయి. ఉత్సవాలకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు దేవదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ ఈవో ఆర్వీ చందన తెలిపారు. -
కార్తీకం.. శివోహం
● 23 నుంచి కార్తీక మాసోత్సవాలు ● జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ ● పంచారామాల్లో ప్రత్యేక ఏర్పాట్లు ● వేలాది మంది భక్తుల రాక భీమవరం(ప్రకాశం చౌక్): పరమ పవిత్రమైన కార్తీక మాసోత్సవాలకు జిల్లాలోని శైవక్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 23 నుంచి కార్తీకమాసం ప్రారంభం కానున్న నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జిల్లాలో దేవదాయశాఖ నిర్వహణలో 30కు పైగా ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. ఆలయ కమిటీల ద్వారా నిర్వహించే శివాలయాలు మరో 15 వరకు ఉంటాయి. ముఖ్యంగా జిల్లాలో భీమవరం, పాలకొల్లులో పంచారామ క్షేత్రాలకు ఏటా కార్తీక మాసంలో వేలాది మంది భక్తులు వస్తుంటారు. ప్రత్యేక పూజలు.. విశేష అలంకరణలు నెల రోజులపాటు పంచారామ క్షేత్రాల్లో స్వామివార్లకు ప్రత్యేక పూజలు, విశేష అలంకరణలు చేస్తుంటారు. అలాగే ప్రత్యేక అభిషేకాలు, కార్తీక దీపారాధనలు జరుగుతుంటాయి. రాత్రిళ్లు విద్యుత్ కాంతులతో క్షేత్రాలు దేదీప్యమానంగా వెలుగొందుతాయి. శక్తీశ్వరస్వామి ప్రత్యేకం ప్రపంచంలో ఎక్కడా లేనివిధంగా భీమవరం మండలం యనమదుర్రులో పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి ఆలయంలో స్వామివారు తలకిందులుగా దర్శనమిస్తారు. పార్వతీమాత బాలింతగా, కుమారస్వామి వారి ఒడితో పెట్టుకుని ఒకే పీఠంపై దర్శనమిస్తారు. ఈ ఆలయానికీ వేలాదిగా భక్తులు తరలివస్తారు. భీమవరం నుంచి ఐదు కిలోమీటర్ల దూరంలో ఈ క్షేత్రం ఉంది. మరిన్ని ప్రసిద్ధి ఆలయాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో మరిన్ని ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. భీమవరంలో భీమేశ్వరస్వామి వారు, ఆచంటలో ఆచంటేశ్వరస్వామి, నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామివారు, జుత్తిగలో ఉమా సోమేశ్వరస్వామివారు, లక్ష్మణేశ్వరంలో దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, వీరవాసరంలో వీరేశ్వరస్వామి, కొడమంచిలిలో సర్వేశ్వరస్వామి, శివ దేవుని చిక్కాలలో శివదేవస్వామి, సజ్జాపురంలో సోమేశ్వరస్వామి, పెనుగొండలో నగరేశ్వరస్వామి, ఎన్పార్పీ అగ్రహారంలో విశ్వేశ్వరస్వామి, ఉండిలో మల్లేశ్వరస్వామి, ఆకివీడులో భీమేశ్వరస్వామి, మల్లేశ్వరస్వామి, వేండ్ర అగ్రహారంలో రామలింగేశ్వరస్వామి, అండలూరులో మల్లేశ్వరస్వామి, నవుడూరులో రామలింగేశ్వరస్వామి, విస్సాకోడేరులో సోమేశ్వరస్వామి, తాడేరులో రామలింగేశ్వరస్వామి, తుందుర్రులో సోమేశ్వరస్వామి ఇలా పలు శివాలయాలు కార్తీక మాసోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. భీమవరంలో ఉమాసోమేశ్వరస్వామి పాలకొల్లులో క్షీరారామలింగేశ్వరస్వామి జిల్లాలో రెండు పంచారామ క్షేత్రాలు ఉన్నాయి. భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దన స్వామి వారి దేవస్థానం (సోమారామం), పాలకొల్లులో క్షీరా రామలింగేశ్వరస్వామి దేవస్థానం (క్షీరారామం)గా కీర్తిగడించాయి. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరుడు చంద్రుడి ప్రతిష్ఠాపన కావడంతో శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడ ప్రత్యేకం. కార్తీకమాసం నెల రోజులపాటు ఈ రెండు క్షేత్రాలు శివనామస్మరణతో మార్మోగుతాయి. దేశంలోని నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. ముఖ్యంగా సోమవారం రోజుల్లో 70 వేల మంది వరకు భక్తులు వస్తుంటారు. కార్తీకం ఎంతో పవిత్రమైన మాసం. శైవక్షేత్రాలను సందర్శించి పరమేశ్వరుడికి పూజలు చేయడంతో పాటు నిత్య దీపారాధన చేయాలి. పరమేశ్వరుడికి అభిషేకాలు చేయడం ద్వారా విశేష ఫలితం దక్కుతుంది. నవ వధువులు కార్తీక పౌర్ణమి నాడు ఉపవాసం ఉండి కార్తీక నోములు నోచుకుంటారు. దీపదానం, వస్త్రదానం, వెండి ఆవు, వెండి దూడ దానం, ఉసిరి దానం విశిష్టమైనవి. కాలువల్లో అరటి తెప్పలో దీపాలు పెట్టి వదలడం పుణ్యఫలం. – అకొండి రాంబాబు, అర్చకులు, గునుపూడి


