breaking news
Eluru District Latest News
-
మోడ్రన్ పెంటాథ్లాన్లో సత్తాచాటిన క్రీడాకారులు
తణుకు అర్బన్: ఈ నెల 11, 12 తేదీల్లో ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో జరిగిన 10వ రాష్ట్ర స్థాయి మోడ్రన్ పెంటథ్లాన్ లేజర్ రన్ పోటీల్లో తణుకు క్రీడాకారులు పతకాలు సాధించినట్లు జిల్లా అసోసియేషన్ కార్యదర్శి సంకు విరాటలక్ష్మి తెలిపారు. అండర్–9 విభాగంలో ఎన్.రుత్విక్ నాగ్ స్వర్ణ పతకం, అండర్–15 విభాగంలో ఐ.ఆశ్రిత స్వర్ణ పతకం, అండర్–17 విభాగంలో జి.పవిత్ర, కె.సాత్విక్లు స్వర్ణ పతకాలు, ఎస్.షణ్ముఖ సంతోష్ కాంస్య పతకం సాధించారు. రిలే అండర్–17 విభాగంలో బాలురు, బాలికలు స్వర్ణ పతకాలు, మిక్స్డ్ రిలేలో స్వర్ణ పతకాలు సాధించినట్లు వివరించారు. పతకాలు సాధించిన క్రీడాకారులను అసోసియేషన్ అధ్యక్షుడు రేలంగి రామకృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ సంకు సూర్యనారాయణ, టీం కోచ్ పీవీఎస్ సాయిబాబు, వ్యాయామ ఉపాధ్యాయుడు ఎన్.అప్పారావు అభినందించారు. కుక్కునూరు: మండలంలోని బంజారగూడెం గ్రామ పరిధిలో జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ వాచ్మన్ అక్కడికక్కడే మృతి చెందాడు. కుక్కునూరు పోలీసుల వివరాల ప్రకారం.. తెలంగాణ రాష్ట్రం భద్రాద్రి కొత్తగూడెం జిల్లా అశ్వాపురం మండలం మల్లెలమడుగు గ్రామానికి చెందిన చిట్రాల చంద్రశేఖర్ (40) గత మూడేళ్లుగా బంజారగూడెంలోని నరుకుల నరసింహరావుకు చెందిన యూకలిప్టస్ చాంబర్లో వాచ్మెన్గా పనిచేస్తున్నాడు. శనివారం రాత్రి అతడు కొచ్చర్లపాటి నరేష్ అనే వ్యక్తితో కలిసి మెయిన్ రోడ్డు వరకు వెళ్లి తిరిగి వస్తుండగా, కుక్కునూరు నుంచి భద్రాచలం వైపు వెళ్తున్న గుర్తుతెలియని వాహనం బలంగా ఢీకొట్టింది. ప్రమాదంలో చంద్రశేఖర్ తలకు, ఎడమ కాలుకు తీవ్ర గాయాలు కావడంతో అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాడు. ఆదివారం ఉదయం చాంబర్ యజమాని మృతదేహాన్ని గమనించి కుటుంబ సభ్యులకు సమాచారం అందించారు. మృతుడి కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు కుక్కునూరు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం గోకుల తిరుమల పారిజాతగిరి వెంకటేశ్వర స్వామి దేవస్థానంలో నూతన కల్యాణ, అన్నదాన మండపాల నిర్మాణానికి ఆదివారం ఘనంగా భూమి పూజ నిర్వహించారు. ఆలయం నిరంతరం భక్తులతో కళకళలాడుతుండటం, ముఖ్యంగా ప్రతి శనివారం నిర్వహించే గిరి ప్రదక్షిణకు వేలాదిగా భక్తులు తరలివస్తుండటంతో అన్నదాన, కల్యాణ మండపాలు, పార్కింగ్ స్థలం అవసరాన్ని గుర్తించిన ఆలయ కమిటీ, కూటమి నాయకులు ఈ నిర్మాణ పనులకు శ్రీకారం చుట్టారు. ఉదయం 10:50 గంటలకు ఆలయ అర్చకులు నల్లూరు రవికుమార్ ఆచార్యులు శాస్త్రోక్తంగా భూమి పూజ కార్యక్రమాన్ని నిర్వహించారు. కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా జిల్లా టీడీపీ ఉపాధ్యక్షుడు రావూరి కృష్ణ, జెడ్పీటీసీ పోల్నాటి బాజ్జి, బీజేపీ నాయకులు కొప్పాక శ్రీనివాస్ పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ధర్మకర్తల మండలి సభ్యులు అన్నాప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగసురేంద్ర, ఆరేపల్లి నాని, వడిగళ్ల కుమారి, ముప్పిడి భానులతో పాటు ఆలయ అభివృద్ధి కమిటీ చైర్మన్ అబ్బిన దత్తాత్రేయ, సభ్యులు ఈ పూజా కార్యక్రమంలో పాల్గొన్నట్లు ఆలయ ఈఓ ఆర్.వి. చందన తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి శాశ్వత నిత్యాన్నదాన పథకానికి ఆదివారం ఇద్దరు భక్తులు వేరువేరుగా రూ.2 లక్షలు విరాళంగా అందజేశారు. అందులో భాగంగా నూజివీడుకు చెందిన చమనపూడి వెంకటరమణ రూ.లక్ష, గుడివాడకు చెందిన నీలం పాండురంగారావు రూ. 1,00,116 శాశ్వత నిత్యాన్నదాన ట్రస్ట్కు జమ చేశారు. ఈ సందర్భంగా దాతలకు ఆలయ ఏఈవో మెట్టపల్లి దుర్గారావు, సూపరింటెండెంట్ గోవాడ సుబ్రహ్మణ్యం తదితరులు విరాళం బాండ్ పత్రాలను అందజేశారు. -
జయ జయహో జగన్నాథ
● ఈనెల 16 నుంచి జగన్నాథ రథోత్సవాలు ● పూరీ క్షేత్ర తరహాలో వైభవంగా వేడుకలు ద్వారకాతిరుమల: పూరీ క్షేత్రంలో జరిగే జగన్నాథ రథోత్సవాల తరహాలో ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్ర దత్తత ఆలయమైన లక్ష్మీపురంలోని జగన్నాథ స్వామి ఆలయంలో ఉత్సవాలకు ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. ఈ నెల 16 నుంచి 25 వరకు 10 రోజుల పాటు ఈ ఉత్సవాలను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఉత్సవాల్లో భాగంగా జగన్నాథ స్వామి ఆలయ ప్రాంగణంలోని మండపంలో రోజుకో అలంకారంలో భక్తులకు దర్శనమివ్వనున్నారు. ఇందుకోసం మండపాన్ని ప్రత్యేకంగా ముస్తాబు చేస్తున్నారు. ఆలయం ముందు చలువ పందిరిని నిర్మించడంతో పాటు ఆలయం, పరిసరాలను విద్యుద్దీప తోరణాలతో అలంకరిస్తున్నారు. రథయాత్రలకు వినియోగించే రథ వాహనాన్ని సైతం సిద్ధం చేస్తున్నారు. ద్వారకాతిరుమలకు తొలి రథయాత్ర ఉత్సవాల ప్రారంభ రోజైన 16న సాయంత్రం సుభద్ర, బలభద్ర సమేత జగన్నాథ స్వామివారు రథ వాహనంపై కొలువుదీరి లక్ష్మీపురం ఆలయం నుంచి ద్వారకాతిరుమల క్షేత్రానికి చేరుకుంటారు. ఉత్సవాల ఆఖరి రోజైన 25న (ఏకాదశి నాడు) ఆలయం నుంచి సమీపంలోని తిమ్మాపురం గ్రామం వరకు రథయాత్ర నిర్వహించనున్నారు. అలాగే పది రోజుల పాటు జగన్నాథ స్వామి దశావతార అలంకారాలు భక్తులకు కనువిందు చేయనున్నాయి. అధిక సంఖ్యలో భక్తులు ఈ ఉత్సవాల్లో పాల్గొని స్వామివారి కృపకు పాత్రులు కావాలని ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు కోరారు. లక్ష్మీపురం జగన్నాథ ఆలయానికి 130 ఏళ్ల చరిత్ర ఉంది. ఒడిశా రాష్ట్రంలోని పూరీకి చెందిన మఠాధిపతి మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) ఈ ఆలయాన్ని నిర్మించారు. జగన్నాథ స్వామివారితో పాటు శ్రీ వేంకటేశ్వర స్వామివారిని ప్రతిష్ఠించారు. అప్పటి నుంచి ఆలయంలో కల్యాణోత్సవం, పవిత్రోత్సవం వంటి కై ంకర్యాలు వైభవంగా కొనసాగుతున్నాయి. శ్రీవారి దేవస్థానం ఈ ఆలయాన్ని దత్తత తీసుకున్న అనంతరం జీర్ణోద్ధరణ పనులు చేపట్టి మరింత అభివృద్ధి చేసింది. ఆలయంలో శ్రీ వేంకటేశ్వర స్వామి, అమ్మవార్లతో పాటు జగన్నాథ స్వామి, బలరామస్వామి, సుభద్రాదేవి, ఆళ్వారులు, శ్రీ సంతాన వేణుగోపాల స్వామి సన్నిధులు ఉన్నాయి. 16 న మత్స్యావతారం 17 కూర్మావతారం 18 వరాహావతారం 19 నరసింహావతారం 20 వామనావతారం 21 పరశురామావతారం 22 శ్రీ రామావతారం 23 శ్రీ బలరామావతారం 24 శ్రీ కృష్ణావతారం 25 న శ్రీ కల్కి అవతారం -
పేరుకే జంక్షన్.. బస్సుల టెన్షన్
● భీమడోలులో ఆగని ఎక్స్ప్రెస్లు ● ద్వారకాతిరుమల భక్తులు, ప్రయాణికుల పడిగాపులు భీమడోలు: ప్రముఖ పుణ్యక్షేత్రం ద్వారకాతిరుమలకు ప్రధాన కూడలిగా, సుమారు 50 గ్రామాలకు కేంద్రంగా ఉన్న భీమడోలు జంక్షన్లో ఎక్స్ప్రెస్ బస్సులు నిలవకపోవడంతో భక్తులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గుండు గొలను – కొవ్వూరు జాతీయ రహదారి విస్తరణ తర్వాత, దూరప్రాంతాలకు వెళ్లే ఎక్స్ప్రెస్ బస్సులన్నీ కొత్త హైవే మీదుగానే వెళ్లిపోతుండటమే ఈ సమస్యకు ప్రధాన కారణం. ఎదురవుతున్న ఇబ్బందులు గంటల కొద్దీ నిరీక్షణ: నిత్యం సుమారు 2,500 మంది ప్రయాణించే ఈ జంక్షన్లో ఎక్స్ప్రెస్ బస్సుల కోసం గంటల తరబడి వేచి చూడాల్సి వస్తోంది. భద్రతా లోపం: బస్టాండ్ ప్రాంగణంలోకి కేవలం పల్లె వెలుగు బస్సులు మాత్రమే వస్తున్నాయి. వచ్చే అరకొర ఎక్స్ప్రెస్ బస్సులు కూడా బయట రోడ్డుపైనే ఆగుతుండటంతో వాటిని అందుకోవడానికి వృద్ధులు, మహిళలు, పిల్లలు ఉరుకులు పరుగులు పెట్టాల్సి వస్తోంది. ఈ క్రమంలో ప్రమాదాలు జరిగి పలువురు గాయపడుతున్నారు. ఆదాయంపై ప్రభావం ద్వారకాతిరుమల దేవస్థాన అధికారులు గానీ, ఆర్టీసీ యాజమాన్యం గానీ బస్సుల నిలుపుదలకు తగిన శ్రద్ధ చూపడం లేదు. వాడపల్లి తరహాలో ద్వారకాతిరుమలకు ప్రత్యేక ఎక్స్ప్రెస్లు నడిపితే ఆర్టీసీకి భారీ ఆదాయం లభిస్తుందని భక్తులు సూచిస్తున్నారు. వీటి కోసం కూటమి నాయకులు, ప్రజాప్రతినిధులు ఆర్టీసీ అధికారులకు వినతిపత్రాలు ఇచ్చినా ఫలితం లేకుండా పోయింది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి భీమడోలు జంక్షన్లో ఎక్స్ప్రెస్ బస్సులు ఆగేలా చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. భీమడోలు జంక్షన్, భీమ డోలు రైల్వేగేటు వద్ద ఎక్స్ ప్రెస్ బస్సులను ఆపాలని ఎంపీ పుట్టా మహేష్కుమార్, ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజుకు గ్రామపెద్దలు వినతిపత్రాలు అందించారు. దూర ప్రాంతాల నుంచి ద్వారకాతిరుమలకు వచ్చే భక్తులు తీవ్ర ఇబ్బంది పడుతున్నారు. శని, ఆదివారాలతో పాటు సెలవు రోజుల్లో భీమడోలు బస్టాండ్ కిక్కిరిసిపోతుంది. అధికారులు స్పందించి ఎక్స్ప్రెస్ బస్సులు ఆపేలా చర్యలు తీసుకోవాలి. – ముప్పిరిశెట్టి సుబ్రహ్మణ్యం, గ్రామస్తుడు, భీమడోలు -
అధిక ఫీజుల వసూలు అరికట్టాలి
ఏలూరు (టూటౌన్): ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల్లో అధిక ఫీజులను అరికట్టాలని ఆర్సీపీఐ జిల్లా కార్యదర్శి పి.కిషోర్ డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక పార్టీ కార్యాలయంలో పార్టీ విద్యా విభాగం సమావేశం నిర్వహించారు. సమావేశంలో పి.కిషోర్ మాట్లాడుతూ తమ పిల్లలకు మంచి విద్యను అందించాలని ఆశతో తల్లిదండ్రులు ప్రైవేటు విద్యాసంస్థల్లో చదివిస్తున్నారని, దాన్ని అవకాశంగా మలుచుకొని కార్పొరేట్ విద్యాసంస్థలో విద్యార్థుల తల్లిదండ్రుల వద్ద ఫీజుల పేరుతో దోచేస్తున్నారన్నారు. విద్యాహక్కు చట్టం ప్రకారం ప్రతి ప్రైవేటు స్కూల్లో 25 శాతం పేద విద్యార్థులకు ఉచితంగా సీట్లు కేటాయించాలని, అది ఎక్కడ అమలు కావడం లేదని అన్నారు. ప్రైవేట్ పాఠశాలలలో సరిపడా స్కూలు గ్రౌండ్లు, లైబ్రరీ, కనీసం విద్యార్థులకు సైకిల్ స్టాండ్లు ఉండటం లేదని అన్నారు. విద్యార్థులకు సరైన సౌకర్యాలు కల్పించని కార్పొరేట్ విద్యాసంస్థలు విపరీతంగా ఫీజులు మాత్రం వసూలు చేస్తున్నారని విమర్శించారు. విద్యాహక్కు చట్టం ప్రకారం నిబంధనలు పాటించే విధంగా చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. -
ఎండుతున్న నారుమడుల పరిశీలన
గణపవరం: సాగునీరు అందక నారుమడులు నెర్రలు తీసి, నారు ఎండిపోతున్న గ్రామాల్లో ఇరిగేషన్, వ్యవసాయ శాఖ అధికారులు హరికృష్ణ, ఆర్ఎస్ప్రసాద్, నీటి సంఘాల సభ్యులు ఆదివారం పర్యటించారు. ‘సమస్యల సుడిగుండంలో సాగు’ శీర్షికన శనివారం ‘సాక్షి’లో ప్ర చురించిన కథనానికి స్పందించారు. కొందేపాడు, ము ప్పర్తిపాడు, మొయ్యేరులో పంట కాలువలను పరిశీలించి తూడు, కర్రనాచు తొలగింపునకు చర్యలు చేపట్టారు. మండపాక చానల్ నుంచి వచ్చే మొయ్యేరు, కొమ్మర, పాలూరు కాలువల్లో అనధికార తూములు ఎక్కువగా ఉన్నాయని, వాటిని తొలగిస్తేనే తమకు సాగునీరు అందుతుందని రైతులు అధికారుల దృష్టికి తీసుకువెళ్లారు. తమ గ్రామాలు శివారున ఉండటంతో సాగునీరు పూర్తిగా అందడం లేదని, నీటిమట్టం పెంచాలని కోరారు. ఎలినినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితుల ఏర్పడటం, శివారు గ్రామాలు కావడంతో నీటి సమస్య తలెత్తిందని, తక్షణమే చర్యలు తీసుకుంటామని అధికారులు రైతులకు హామీ ఇచ్చారు. కాలువల్లో నీటిమట్టం పెంచుతామని, ఇంజన్లు ఏర్పాటు చేసి నీరందించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ముందుగా పగుళ్లు తీసిన నారుమడులు, పూడుకుపోయిన పంట కాలువలను పరిశీలించారు. అనధికార తూముల తొలగింపునకు చర్యలు తీసుకుంటామని ఇరిగేషన్ ఏఈ హరికృష్ణ కొందేపాడు గ్రామ రైతులకు హామీ ఇచ్చారు. -
ఆక్వా రైతుల ఆశలన్నీ జగన్పైనే..
భీమవరం : రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఉదాసీన తతో ఆక్వారంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయింది. ప్రభుత్వ తీరు, సిండికేట్ల దగాతో ఢీలాపడ్డ రైతులు ఆశలన్నీ వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపైనే పెట్టుకున్నారు. మూడు నెలలుగా ఆక్వా ఫీడు, సీడు ధరలు విపరీతంగా పెరగడం, రొయ్యల ధరలు తగ్గడంతోపాటు తెగుళ్ల కారణంగా ఆక్వా రంగంలో అలజడి మొదలైంది. ఫీడు ధరలు తగ్గించాలంటూ రైతులు ఫీడు బస్తాలను తగలపెట్టడం, రొయ్యలను రోడ్లపై పారబోయడం వంటి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఆక్వారంగానికి అండగా ఉంటానంటూ వైఎస్ జగన్ ప్రకటించడంతో పాటు ప్రభుత్వ నిరంకుశ వైఖరిని తూర్పారబట్టారు. జగన్ భరోసాతో రైతులు తమ ఆందోళనలను మరింత ఉధృతం చేయడంతో ప్రభుత్వంలో చలనం వచ్చింది. ఫీడు ధరను కిలోకు రూ.4 తగ్గించేలా కంపెనీ యజమానులను ఒప్పించడమేగాక రొయ్యల ధరలు నిలకడగా ఉండేందుకు రొయ్యల ఎగుమతిదారులతో ప్రభు త్వం సమావేశాలు నిర్వహించింది. అలాగే జోన్తో పరిమితం లేకుండా ఆక్వా రైతులందరికీ సబ్సిడీ విద్యుత్ ఇస్తామంటూ సీఎం చంద్రబాబు ప్రకటించారు. అయినా కంపెనీలు ఫీడు ధరను రూ.2 మా త్రమే తగ్గించడం, రొయ్యల ధర తగ్గుదల, సబ్సిడీ విద్యుత్ అమలు కావడం లేదు. దీంతో ఆగ్రహించిన కొందరు ఆక్వా రైతులు స్వచ్ఛందంగా క్రాప్ హాలిడే కూడా ప్రకటించారు. ఇదే తరుణంలో ప్రభుత్వమే క్రాప్ హాలిడే ప్రకటించాలంటూ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధీ భగవాన్ రాజు డిమాండ్ చేశారు. ఈ నేపథ్యంలో ఆక్వా రైతులకు అండగా ఈనెల 15న భీమవరంలో వైఎస్ జగన్ నిర్వహించే బహిరంగ సభపై రైతులు ఆశలు పెట్టుకున్నారు. అప్పటికై నా ప్రభుత్వంలో చలనం వచ్చి ఆక్వారంగాన్ని ఆదుకునేలా చర్యలు తీసుకుంటుందని ఆకాంక్షిస్తున్నారు. విస్తృత ప్రచారం భీమవరంలో జరుగనున్న ఆక్వా సదస్సును జయప్రదం చేసేందుకు వైఎస్సార్సీపీ విస్తృత ప్రచారం చేపట్టింది. దీనిలో భాగంగా ఆదివారం పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు ప్రత్యేక ప్రచార రథాలకు జెండా ఊపి ప్రారంభించారు. జగన్ రాకను మారుమూల ప్రాంతంలోని ఆక్వా రైతులకు సైతం చేరేలా ప్రచారం చేస్తున్నారు. ప్రచార రథాల ప్రారంభోత్సవంలో భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త చినమిల్లి వెంకటరాయుడు, పరిశీలకుడు మంతెన సోమరాజు, పార్టీ రాష్ట్ర కార్యదర్శి ఏఎస్ రాజు, ఎస్ఈసీ సభ్యుడు మంతెన యోగీంద్రబాబు, పట్టణ పార్టీ అధ్యక్షుడు గాదిరాజు రామరాజు, సోషల్ మీడియా జిల్లా అధ్యక్షుడు బందన పూర్ణచంద్రరావు, గంటా రాహుల్ పాల్గొన్నారు. సంక్షోభంలో ఆక్వా రంగం పెరిగిన సీడ్, ఫీడ్ ధరలతో సతమతం రైతులకు అండగా వైఎస్సార్సీపీ పోరాటం 15న భీమవరానికి వైఎస్ జగన్ రాక ప్రత్యేక వాహనాలతో విస్తృత ప్రచారం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి పర్యటనపైనే ఆశలు పెట్టుకున్నారు. గత రెండేళ్లుగా టమాటా, మామిడి, పొగాకు వంటి రైతుల ఇబ్బందుల తరుణంలో జగన్మోహన్రెడ్డి ఆయా రైతులకు అండగా నిలిచారు. అదేబాటలో ఆక్వా రైతులు కూడా జగన్ పర్యటనతో తమకు మేలు చేకూరుతుందని ఆశిస్తున్నారు. – చినమిల్లి వెంకటరాయుడు, భీమవరం సమన్వయకర్త తండ్రి బాటలోనే వైఎస్ జగన్ కూడా రైతులకు భరోసాగా నిలుస్తున్నారు. కోవిడ్ సమయంలో సైతం రొయ్యల ధరలు తగ్గకుండా ప్రభుత్వ యంత్రాంగంతో కట్టుదిట్టమైన ఏర్పాట్లుచేశారు. ప్రస్తుత ఆక్వారంగ సంక్షోభంలో రైతులకు నేనున్నానంటూ భరోసా కల్పించేందుకే భీమవరం పర్యటనకు వస్తున్నారు. ఇప్పటికై నా ప్రభు త్వంలో కదలిక వస్తుందనే ఆశ. – ముదునూరి ప్రసాదరాజు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు రాష్ట్రంలోని పలు జిల్లాల్లో ఆక్వా రైతులు సంఘాలుగా ఏర్పడి ఉద్యమిస్తున్నాయి. రాజకీయ పార్టీలకు అతీతంగా నిరసనలు చేపడుతున్నారు. ఈ నేపథ్యంలో జగన్ పర్యటనను విజయవంతం చేయడానికి ఉమ్మడి పశ్చిమ, తూర్పు కృష్ణా జిల్లా రైతులు స్వచ్ఛందంగా పెద్ద సంఖ్యలో తరలివచ్చి జగన్ వద్ద తమ గోడును వెళ్లబోసుకోవాలని, తద్వారా ప్రభుత్వానికి కనువిప్పు కలిగించాలనే సంకల్పంతో భీమవరం సభకు వచ్చేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. -
జాతీయ లోక్ అదాలత్లో 7,910 కేసుల రాజీ
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా నిర్వహించిన జాతీయ లోక్ అదాలత్లో 7,910 కేసు లను రాజీ చేసినట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి తెలిపారు. ఏలూరులో 10, భీమవరంలో 5, కొవ్వూరులో 2, నరసాపురంలో 4, తణుకులో 5, తాడేపల్లిగూడెంలో 3, పాలకొల్లులో 2, నిడదవోలులో 1, జంగారెడ్డిగూడెంలో 2, చింతలపూడిలో 1, భీమడోలులో 1 బెంచీలు ఏర్పాటుచేశామన్నారు. మొత్తంగా 7,857 పెండింగ్, 53 ప్రీ లిటిగేషన్ కేసులను రాజీ చేసినట్టు చెప్పారు. పెండింగ్ కేసుల్లో 7,454 క్రిమినల్, 185 మోటార్ వాహన ప్రమాద బీమా, 215 సివిల్ కేసులు ఉన్నాయన్నారు. కోర్టుల వారీగా.. ఏలూరులో 2,328, భీమవరంలో 478,చింతలపూడిలో 404, జంగారెడ్డిగూడెంలో 906, కొవ్వూరులో 756, నరసాపురంలో 335, పాలకొల్లులో 448, తాడేపల్లిగూడెంలో 711, తణుకులో 1,197, నిడదవోలులో 228, భీమడోలులో 66 కేసులను రాజీచేశామన్నారు. లోక్అదాలత్ విజయవంతానికి సహకరించిన వారందరికీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ కమ్ జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ సెక్రటరీ కమ్ సీనియర్ సివిల్ జడ్జి ఎన్.శ్రీలక్ష్మి కృతజ్ఞతలు తెలిపారు. -
నైతిక విలువల పెంపే బాల వికాస్ లక్ష్యం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల దివ్యక్షేత్రం వేదికగా సమరసత సేవా ఫౌండేషన్ (ఎస్ఎస్ఎఫ్) ఆధ్వర్యంలో నిర్వహించిన బాల వికాస్ కేంద్ర మాతాజీలు, ఆచార్యుల శిక్షణ తరగతులు ఆదివారంతో ముగిశాయి. ఈనెల 10, 11, 12 తేదీల్లో మాధవ నిలయంలో నిర్వహించిన తరగతుల్లో రాష్ట్రవ్యాప్తంగా 350 మంది పాల్గొన్నారు. టీటీడీ ఆర్థిక సాయంతో ఎస్ఎస్ఎఫ్ నిర్మించిన ఆలయాల పరిధిలోని కాలనీలు, పేటలు, బస్తీల్లోని విద్యార్థులకు విద్యతో పాటు సంస్కారం, సంస్కృతి, సంప్రదాయాలు, పాటలు, ఆటలు, కళలను నేర్పించేందుకు బాల సంస్కార్ కేంద్రాలను నిర్వహిస్తున్నారు. చిన్నారులకు మార్గదర్శనం చేసేందుకు ఏటా ప్రత్యేక శిక్షణ తరగతులు నిర్వహిస్తున్నారు. బాల వికాస్ కేంద్రాల ద్వారా చిన్నారుల్లో నైతిక విలువలు, భారతీయ సంస్కృతిపై అవగాహన పెంపొందించడమే లక్ష్యమని నిర్వాహకులు తెలిపారు. అనంతరం క్షేత్ర పురవీధుల్లో నగర సంకీర్తన నిర్వహించారు. -
సీడ్ బాల్స్తో సహజ అడవుల పునరుద్ధరణ
బుట్టాయగూడెం: సీడ్ బాల్స్ ద్వారా సహజ అడవుల పునరుద్ధరణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి తెలిపారు. జీలుగుమిల్లి మండలం పి.అంకంపాలెం, కనకాపురంలో ఉన్న అటవీ శాఖ నర్సరీలను ఆయన ఆదివారం పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ అటవీ విస్తీర్ణాన్ని పెంపొందించడం, సహజ అడవుల పునరుద్ధరణ, జీవవైవిధ్య పరిరక్షణ లక్ష్యాలతో రిజర్వ్ ఫారెస్ట్ పరిధిలో సీడ్ బాల్స్ చల్లే కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు తెలిపారు. దీనిలో భాగంగానే కనకాపురం వనసంరక్షణ సమితి (వీఎస్ఎస్) ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని విజయవంతంగా నిర్వహించామని చెప్పారు. సీడ్ బాల్స్ తయారీలో నేరేడు, చింత, రావి, వేప వంటి స్థానిక వృక్షజాతుల విత్తనాలను వినియోగించడం జరిగిందన్నారు. వర్షపునీరు అందిన తర్వాత సీడ్ బాల్స్ క్రమంగా కరిగి అందులోని విత్తనాలు మొలకెత్తి సహజ పద్ధతిలో మొక్కలుగా అభివృద్ధి చెందుతాయని డీఎఫ్ఓ చెప్పారు. ఈ విధానం సహజ పునరుత్పత్తిని వేగవంతం చేసి అడవుల సాంద్రత పెంపుకు గణనీయంగా దోహదపడుతుందని పేర్కొన్నారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం సబ్–డీఎఫ్ఓ వెంకట సుబ్బయ్య, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ దుర్గాకుమార్ బాబు, సెక్షన్ ఆఫీసర్ కె.రాంబాబు, బీట్ ఆఫీసర్లు మారేష్, ఏసుపండు, రాము, ప్రొడక్షన్ హెల్పర్లు రమేష్, పాపారావు, రామ్ ప్రకాష్, వీఎస్ఎస్ సభ్యులు పాల్గొన్నారు. -
ఫ్యాప్టో పోరాటానికి మద్దతు
ఏలూరు (ఆర్.ఆర్.పేట): ప్రభుత్వం ఇచ్చిన హామీలను వెంటనే అమలు చేయాలని ఫ్యాప్టో చేపట్టిన పోరాటానికి స్కూల్ టీచర్స్ అసోసియేషన్ సంపూర్ణ మద్దతు తెలియజేస్తుందని ఆ సంఘం రాష్ట్ర అసోసియేట్ అధ్యక్షుడు జీజేఏ స్టీవెన్, ఏలూరు జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కాటి వెంకటరమణ, తోట ప్రసాద్ ఒక ప్రకటనలో తెలిపారు. పన్నెండవ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, 30 శాతం మధ్యంతర భృతి చెల్లించాలని, సీపీఎస్ రద్దు చేసి ఓపీఎస్ అమలు చేయాలని, పెండింగ్లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని, పెండింగ్ బకాయిలన్నీ చెల్లించాలని జూలై 14న జిల్లా కలెక్టరేట్ల వద్ద జరిగే రాష్ట్రవ్యాప్త భారీ నిరసన కార్యక్రమంలో తమ సభ్యులు పాల్గొంటారని తెలిపారు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఆదివారం భక్తులతో కిటకిటలాడింది. సమీప జిల్లాల నుంచి వచ్చిన భక్తులు మొక్కులు తీర్చుకున్నారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, తలనీలాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజల ద్వారా రూ.84,970 ఆదాయం వచ్చిందని తెలిపారు. -
విహారయాత్రలో విషాదం
● సీలేరు నదిలో చిక్కుకుని యువకుడి మృతి ● ఆరుగురు పర్యాటకులను రక్షించిన పోలీసులు, జెన్కో సిబ్బంది మోతుగూడెం: పోలవరం జిల్లా చింతూరు మండలం పొల్లూరు గ్రామం వద్ద సీలేరు నదిలో చిక్కుకొని యువకుడు మృతిచెందిన ఘటన ఆదివా రం చోటుచేసుకుంది. పశ్చిమ గోదావరి జిల్లా గణపవరాని కి చెందిన చెందిన ఏడుగురు యువకులు విహారయాత్ర కో సం మోతుగూడెం పర్యాటక ప్రదేశానికి వచ్చారు. సీలేరు నదిలో వీరు స్నానాలు చేస్తుండగా అకస్మాత్తుగా పొల్లూరు జలవిద్యుత్ కేంద్రం నుంచి నీరు రావడంతో ఏడుగురు యువకులూ నీటిలో చిక్కుకున్నారు. స్థానికులు, మోతుగూడెం పోలీసులు, జెన్కో సిబ్బంది వెంటనే అప్రమత్తమై ఆరుగురిని రక్షించగలిగారు. గణపవరానికి చెందిన మహంకాళీ ఉదయ్కిరణ్ (23) అనే యువకుడు నీటి ప్రవాహంలో కొట్టుకుపోయి మృతిచెందాడు. స్థానిక సీఐ గోపాలకృష్ణ ఆధ్వర్యంలో అతని కోసం డ్రోన్ సహాయంతో గాలింపు చేపట్టిన పోలీసులు యువకుడి మృతదేహాన్ని గుర్తించారు. కేసు నమోదు చేసి మృతదేహాన్ని చింతూరు ప్రభుత్వాసుపత్రికి తరలిస్తున్నట్టు సీఐ తెలిపారు. మృతుడు ఉదయ్కిరణ్ భీమవరం కిడ్నీ సెంటర్లో డాక్టర్గా పనిచేస్తున్నాడు. -
నాగిరెడ్డిగూడెం పాఠశాల ఎదుట ధర్నా
చింతలపూడి: ఏలూరు జిల్లా చింతలపూడి మండలం నాగిరెడ్డిగూడెం పరిధిలోని బాలికల గురుకుల పాఠశాలలో మౌలిక వసతుల కొరతపై విద్యార్థులు, వారి తల్లిదండ్రులు ఆదివారం ఆగ్రహం వ్యక్తం చేశారు. పాఠశాలలో గత పది రోజులుగా తాగునీరు, నిత్యావసరాలకు సరిపడా నీరు రాకపోవడంతో పిల్లలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తూ ఉదయం పాఠశాల ఎదుట ధర్నా నిర్వహించారు. పాఠశాలలో నీటి సరఫరా పూర్తిగా నిలిచిపోవడంతో కనీసం స్నానాలు చేయడానికి, టాయిలెట్లకు వెళ్లడానికి కూడా నీరు లేక నరకం చూస్తున్నామని విద్యార్థినులు కన్నీరుమున్నీరయ్యారు. సమస్యపై పాఠశాల యాజమాన్యం స్థానిక అధికారులకు పలుమార్లు విన్నవించినా ఎవరూ స్పందించకపోవడంతో, విధిలేక తాము రోడ్డుపైకి వచ్చి నిరసన తెలపాల్సి వచ్చిందని వారు పేర్కొన్నారు. విద్యార్థినులు, తల్లిదండ్రులు పాఠశాల గేటు ముందు బైఠాయించి పెద్ద ఎత్తున నిరసన తెలియజేశారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, నాగిరెడ్డిగూడెం గురుకుల పాఠశాలలో నెలకొన్న నీటి సమస్యను తక్షణమే పరిష్కరించి, విద్యార్థినులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. ఈ సమస్యపై పాఠశాల ప్రిన్సిపాల్ హేమలతను వివరణ కోరగా.. పాఠశాలలో ఉన్న రెండు బోర్లలో ఒకదానిలో భూగర్భ జలాలు తగ్గిపోవడం వల్ల నీరు సరిగా రావడం లేదని చెప్పారు. ప్రస్తుతానికి తాగునీటికి ఇబ్బంది లేదని, మున్ముందు ఇబ్బందులు వచ్చే అవకాశం ఉందన్నారు. సమస్యలను జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకువెళ్లి, సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకుంటామని ఆమె తెలిపారు. -
మధురం మీ స్వరం.. మరువలేం ఆ గానం
● స్వర సామ్రాజ్ఞి జానకికి ఘన నివాళి ● భీమవరంలో కళాకారుల సంతాపం భీమవరం: ఆమె కంఠంలో పలకని స్వరం లేదు.. రస హృదయాలను ఆనంద డోలికల్లో ఓలలాడించిన పాటల సామ్రాజ్య నాయకి ఆమె. గంధర్వ గాయకి.. ఆ సురాగ, సరాగ మాలిక పేరే ఎస్.జానకి అని వక్తలు కొనియాడారు. భీమవరం పట్టణ కళాకారుల సంఘం, శ్రీవిజ్ఞానవేదిక ఆధ్వర్యంలో ఆదివారం భీమవరంలో ప్రముఖ గాయని ఎస్.జానకి సంతాప సభ నిర్వహించారు. కళారంజని నాటక పరిషత్ అధ్యక్షుడు జవ్వాది శ్రీనివాస్, అఖిల భారత శోభన్బాబు సేవా సమితి అధ్యక్షుడు భట్టిప్రోలు శ్రీనివాసరావు మాట్లాడుతూ 65 ఏళ్లుగా పాటకి ప్రాణం పోసిన మహా గాయనీ జానకి అని, ఆమె గొంతు విప్పితే ప్రకతి కూడా తన్మయత్వంలో మునిగిపోతుందన్నారు. రచయితలు కలిగొట్ల గోపాలశర్మ, దొంతబత్తుల నాగేశ్వరరావు, డా.ఎస్.సత్యనారాయణరాజు మాట్లాడుతూ దేశంలోని మొదటి నలుగురు మహిళా గాయకుల్లో ఒకరిగా జానకి గుర్తింపు పొందారన్నారు. తన స్వర జీవితం మొదలైన మొదటి ఏడాదిలోనే ఆరు భాషల్లో వంద పాటలు పాడిన ఘనత ఆమెదన్నారు. ఇప్పటికీ అదే ఒక రికార్డుగా నిలిచిపోయిందన్నారు. కార్యక్రమ నిర్వాహకుడు చెరుకువాడ రంగసాయి మాట్లాడుతూ 1977లో పదునారు వయదినిలే, 1980లో ఒప్పోల్, 1984లో సితార, 1993లో దేవర్ మగన్ చిత్రాల్లో పాడిన పాటలకు ఉత్తమ గాయనిగా ఆమె పురస్కారాలు పొందారన్నారు. 13 సార్లు కేరళ, 6 సార్లు తమిళనాడు, 10 సార్లు ఆంధ్రరాష్ట్ర బహుమతులు, కర్నాటక, ఒడిసా రాష్ట్ర బహుమతులు ఒక్కొక్కటి చొప్పున ఆమెకు దక్కా యన్నారు. 1987లో తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారం ప్రదానం చేసిందన్నారు. 2013లో ప్రతిష్టాత్మక పద్మభూషణ్ పురస్కారాన్ని భారత ప్రభుత్వం ప్రకటించగా వివిధ కారణాల తో ఆ పురస్కారాన్ని ఆమె తిరస్కరించారని చెప్పారు. ఈ కార్యక్రమంలో అరసవల్లి సుబ్రమణ్యం, వి జ్జురోతి రాఘవులు, కొండ్రు శ్రీనివాస్, అల్లు శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మవారి ఆలయ వార్షికోత్సవాలను పురస్కరించుకుని 2000లో ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ప్రముఖ సినీ గాయని ఎస్.జానకిని సత్కరించారు. ఈ సందర్భంగా ఆమె జిల్లాకు విచ్చేశారు. -
చినవెంకన్న సన్నిధిలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ బాలాజీ మెడమల్లి ఆదివారం కుటుంబసమేతంగా సందర్శించారు. ముందుగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు దేవస్థానం అధికారులు, అర్చకులు ఆలయ మర్యాదలతో స్వా గతం పలికారు. ఆలయ ప్రదక్షిణల అనంతరం ఆయన శ్రీవారు, అమ్మవార్లను దర్శించుకుని ప్రత్యేక పూజలు చేయించారు. న్యాయమూర్తికి అర్చకులు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనం అందించారు. దేవస్థానం ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు చినవెంకన్న చిత్రపటంతో పాటు ప్రసాదాలను అందజేశారు. భీమడోలు కోర్టు జడ్జి ఎస్.ప్రియదర్శిని నూతక్కి, ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : రాష్ట్రంలో విద్యార్థులు ఎదుర్కొంటున్న సమస్యల పరిష్కారం కోసం సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద భారీ ధర్నా నిర్వహించనున్నట్టు ఏఐఎస్ఎఫ్ జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ ప్రకటనలో తెలిపారు. ఉదయం 10 గంటలకు స్థానిక ఫైర్స్టేషన్ సెంట నుంచి కలెక్టరేట్ వరకూ ర్యాలీ నిర్వహిస్తామన్నారు. ముఖ్య అతిథులుగా ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి బందెల నాసర్జీ, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎం.సాయికుమార్ తదితరులు పాల్గొంటారన్నారు. పోలవరం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్న నేపథ్యంలో పటిష్ట భద్రత ఏర్పాట్లు చేసినట్టు ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. పోలవరం ఆదివారం అధికారులతో సమావేశం నిర్వహించి సూచనలిచ్చారు. రూట్ బందోబస్తు, రూఫ్టాప్ భద్రత, ప్రధాన కూడళ్లలో మూవబుల్ బ్యారికేడ్ల ఏర్పాటు, ట్రాఫిక్ నియంత్రణ, పార్కింగ్ నిర్వహణపై ప్రత్యేక దృష్టి సారించాలని ఆదేశించారు. వర్షాకాల పరిస్థితుల దృష్ట్యా సిబ్బంది అంతా రెయిన్కోట్లు, గుర్తింపు కార్డులు తెచ్చుకోవాలని, విధుల పట్ల అలసత్వం వహిస్తే సహించేది లేదని హెచ్చరించారు. అనంతరం కాన్వాయ్ ట్రయల్రన్ నిర్వహించారు. జిల్లా అదనపు ఎస్పీ (అడ్మిన్) వై.ప్రసాదరావు, డీఎస్పీలు శ్రావణ్కుమార్, ప్రసాద్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, పోలవరం ఇన్స్పెక్టర్, ఎస్సై అప్పారావు తదితరులు పా ల్గొన్నారు. ఇదిలా ఉండగా మధ్యాహ్నం 1:20 నిమిషాలకు సీఎం ప్రాజెక్టు ప్రాంతానికి చేరుకుంటారు పనులను పరిశీలించిన అనంతరం అధికారులతో సమావేశం నిర్వహిస్తారు. పెదవేగి : భక్తుల పాలిట కల్పతరువు రాట్నాలకుంటలో రాట్నాలమ్మవారిని దర్శించేందుకు భక్తులు బారులు తీరారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి మొక్కు లు తీర్చుకున్నారు. ఆలయానికి పలు రూ పాల్లో రూ.1,33,187 ఆదాయం లభించినట్టు ధర్మకర్తల మండలి చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఈఓ నల్లూరి సతీష్కుమార్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. పాలకొల్లు సెంట్రల్: పంచారామక్షేత్రం పాలకొల్లు క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో సోమవారం మాసశివరాత్రి ప్రత్యేక పూజలు నిర్వహించనున్నారు. ప్రధానార్చకులు సన్నిదిరాజు కృష్ణారావు మాట్లాడుతూ సోమవారం, మాసశివరాత్రి, ఆరుద్ర నక్షత్రం కలిసి రావడం అరుదని అన్నారు. ప్రతి సోమవారం ఆలయంలో సప్త మారేడు దళాలతో ఏడు ప్రదక్షిణలు, ఏడు సోమవారాలు చేయనున్నట్టు చెప్పారు. -
ఆక్రమించుకుని ఆక్వా సాగు
నిడమర్రు: కొల్లేరు అభయారణ్య పరిధిలోని నిషేధిత భూముల్లో ఆక్వా సాగు చేస్తున్నట్లు రైతుల నుంచి వచ్చిన ఫిర్యాదులకు.. అధికారులు మాత్రం రాతపూర్వక సమాధానాలు మాత్రమే చెబుతున్నారు. ఆ భూముల్లో ఆక్వా సాగు చేస్తున్న రైతులపై ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని స్థానిక రైతులు చెబుతున్నారు. దేవరగోపవరం గ్రామంలో 5వ కాంటూరు పరిధిలోని జీ రాయితీ భూముల్లో ఆక్వా సాగు నిషేధం కాగా, ఖండ్రిక పరిధిలోని సుమారు 75 ఎకరాల్లో జరుగుతున్న ఆక్వా సాగు వివాదాస్పదంగా మారింది. ఈ ఆక్వా చెరువుల మధ్యలో ప్రభుత్వ భూమి ఉందని, సర్వే చేసి ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని స్థానిక గ్రామస్థుడు తుమ్మూరి శ్రీను గత కొంత కాలంగా పీజీఆర్ఎస్లో ఫిర్యాదులు చేస్తున్నారు. ఇంతవరకూ పూర్తి స్థాయిలో ఈ వివాదాస్పద చెరువుల భూములను సమగ్ర సర్వే నిర్వహించలేదని ఆయన ఆరోపిస్తున్నారు. ఆక్రమణలో ఖండ్రిక కోడు కొల్లేరు 5వ కాంటూరు పరిధిలోకి వచ్చే దేవర గోపవరం ఖండ్రిక కోడును ఆనుకుని గతంలో జీ రాయితీ పొలాలు ఉండేవి. కొల్లేరు ప్రక్షాళన అనంతరం ఆ భూములను ఆక్వా చెరువులుగా కొందరు పెద్దలు మార్చేశారు. ఈ క్రమంలో స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. 2.5 కిలోమీటర్ల మేర ఉన్న ఖండ్రిక కోడును ఆక్రమించుకుని ఆయా చెరువుల మధ్యలో కలిపేసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. దీని వల్లే భారీ వర్షాలు వచ్చినప్పుడు ఎగువ నుంచి వచ్చే వరద నీరు కొల్లేరులోకి వెళ్లే మార్గం మూసుకుపోవడంతో, నీరు ఎగదన్ని ఎగువన ఉన్న వరి పొలాలు ముంపు బారిన పడుతున్నాయని పలువురు రైతులు చెబుతున్నారు. ఖండ్రిక కోడును ప్రక్షాళన చేసి తిరిగి రికార్డుల ప్రకారం ఇరిగేషన్ డ్రైన్గా భౌతికంగా చూపించాలని కోరుతున్నారు. సర్వేకు అనుకూలంగా లేదు ఆర్డీవో స్పందిస్తూ.. ఫిర్యాదులో పేర్కొన్న సర్వే నంబర్లు కొల్లేరు అభయారణ్య పరిధిలో ఉండి, ప్రస్తుతం 75 ఎకరాలతో కూడిన 6 చెరువుల మధ్యలో పూర్తిగా నీటితో నిండి ఉండటం వలన సర్వే నిర్వహించేందుకు వీలు పడదని మండల సర్వేయర్ చెప్పినట్లు తెలిపారు. పీజీఆర్ఎస్లో ఇదే ఫిర్యాదును+ రీఓపెన్ చేసినప్పుడు మరోసారి సర్వే చేసేలా ఆర్డీవో చర్యలు తీసుకోగా.. ఈ ఏడాది ఫిబ్రవరి 5న అటవీశాఖ, రెవెన్యూ సిబ్బంది కలిసి సర్వే చేశారు. ఆ నివేదికలో ఖండ్రిక కాలువ సుమారు 1,127 మీటర్ల పొడవున విస్తరించి ఉన్నట్లు, నలుగురు ఆక్వా రైతులకు చెందిన చెరువుల గుండా వెళుతున్నట్లు నిర్ధారించారు. ఫిర్యాదులో పేర్కొన్న సర్వే నంబర్లు కొల్లేరు అభయారణ్య పరిధిలో కలిసి ఉన్నట్లు నివేదించారు. ఈ సర్వే చేయాలన్నా, ఆక్రమణలు తొలగించాలన్నా అటవీశాఖ అనుమతితో తదుపరి చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. ప్రభుత్వ భూమిని కలుపుకున్నారని పీజీఆర్ఎస్లో ఫిర్యాదులుఖండ్రిక కోడును కలిపేసుకుని చెరువులు తవ్వేశారని, ఆ భూమిని ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని నేను పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశాను. దీంతో 5 నెలల క్రితం సర్వే చేసేందుకు అధికారులు వచ్చి, ఖండ్రిక కోడు ఆక్రమణలో ఉందని నిర్ధారించారు. నేటి వరకూ ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోలేదు. – తుమ్మూరి శ్రీనివాసు, దేవరగోపవరం -
పిచ్చికుక్క స్వైరవిహారం
జంగారెడ్డిగూడెం: పట్టణ పరిధిలోని రామచంద్రపురంలో ఆదివారం మధ్యాహ్నం ఓ పిచ్చికుక్క స్వైరవిహారం చేసింది. వీధుల్లో వెళ్తున్న వారిపై పడి సుమారు ఆరుగురిని తీవ్రంగా గాయపరిచింది. స్థానికులు కుక్కను వెంటాడి హతమార్చారు. గాయపడినవారిని వెంటనే స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి, సకాలంలో వైద్య చికిత్సలు అందించారు. ఈ ప్రాంతంలో ఇంకా వీధి కుక్కల సంచారం ఎక్కువగా ఉందని, ప్రక్కనే ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల ఉండటంతో విద్యార్థుల తల్లిదండ్రులు తీవ్ర భయాందోళన వ్యక్తం చేస్తున్నారు. గతంలో కూడా ఇక్కడ ఓ చిన్నారిపై కుక్క దాడి చేయడంతో తీవ్ర గాయాలయ్యాయని స్థానికులు గుర్తు చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి వీధి కుక్కలను పట్టుకుని దూర ప్రాంతాలకు తరలించాలని, తగిన రక్షణ చర్యలు చేపట్టాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
జీజీహెచ్లో కరోనా ప్రత్యేక వార్డు
వైద్యాధికారుల అప్రమత్తం ఏలూరు టౌన్: రాష్ట్రంలోని కడప, రాజంపేట ప్రాంతాల్లో ఇద్దరు కోవిడ్ (కరోనా) బారినపడి మృత్యువాతకు గురికావటం ఆందోళన కలిగిస్తోంది. దీంతో వైద్యాధికారులు అప్రమత్తమయ్యారు. ముందస్తు చర్యల్లో భాగంగా ఏలూరు సర్వజన ఆస్పత్రి (జీ జీహెచ్)లో ప్రత్యేకంగా కోవిడ్ వార్డును ఏర్పాటు చేశారు. జీజీహెచ్ సూపరింటెండెంట్ డాక్టర్ శ్యా మల ముందస్తు చర్యలకు ఉపక్రమించారు. ప్రజలు ఎవరూ ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, అప్రమత్తంగా ఉండాలనీ, అనారోగ్యంగా ఉంటే వెంటనే వైద్యులను సంప్రదించాలని ఆమె సూచించారు. ఆక్సిజన్ సరఫరా, సాధారణ రోగులకు దూరంగా ఉండేలా వార్డును అందుబాటులో ఉంచారు. త్రీటీస్లో భాగంగా టెస్ట్–ట్రాక్–ట్రీట్ విధానంతో ముందుకు వెళ్లేలా చర్యలు చేపట్టారు. కరోనా లక్షణాలైన జ్వరం, పొడిదగ్గు, ఆయాసం, గొంతునొప్పి, ఊపిరితిత్తుల సమస్య వంటివి ఉంటే ఆలస్యం చేయకుండా కోవిడ్ పరీక్ష చేయించుకోవాలని సూచిస్తున్నారు. ఏలూరు జిల్లాలో ప్రస్తుతానికి కోవిడ్ లక్షణాలతో ఎవరినీ గుర్తించలేదని వైద్యులు చెబుతున్నారు. -
గోస్తనీ కాలువలో బాలిక మృతదేహం లభ్యం
తణుకు అర్బన్: తణుకు గోస్తనీ కాలువలోకి దూకి గల్లంతైన బాలిక గాలిదేవర శ్రీ యామిని లాస్య (15) మృతదేహం శనివారం లభ్యమైంది. శుక్రవారం ఉదయం స్థానిక సజ్జాపురం శివాలయం వంతెన పైనుంచి బాలిక దూకి ఆత్మహత్యకు పాల్పడిన విషయం తెలిసిందే. శనివారం ఉదయం నుంచి గోస్తనీ కాలువలో ఎన్డీఆర్ఎఫ్ బృందం బోటులో గాలింపు చర్యలు చేపట్టారు. మధ్యాహ్నం సమయంలో బాలిక దూకిన ప్రాంతానికి కొంత దూరంలోనే మృతదేహం లభ్యమైంది. లాస్య మృతదేహం ఎన్డీఎంసీ అనే పేరుతో ఉన్న ప్రైవేటు దంత వైద్యశాల యూనిఫామ్లో ఉంది. బాలిక కుటుంబ సభ్యులతోపాటు బంధువులు, స్థానిక ప్రజలు ఘటనా ప్రాంతానికి భారీగా చేరుకుని కన్నీరుమున్నీరయ్యారు. ఏం జరిగిందో.. బాలిక ఆత్మహత్యకు గల కారణాలు ఇంకా తెలియలేదు. కాలువలోకి దూకే ముందు వంతెనపై కొంత సేపు టచ్ఛాడడం, ఈక్రమంలో స్థానికులు పలుకరించగా ఎటువంటి అనుమానం రాకుండా కాలువలో చేపలు చూస్తున్నానని సమాధానం చెప్పడం వంటి అంశాలు అనుమానాస్పదంగా మారాయి. రెండేళ్ల క్రితం తల్లి లక్ష్మి అదే వంతెన పైనుంచి గోస్తనీ కాలువలోకి దూకి ఆత్మహత్యకు పాల్పడడం, ఆ తరువాత తండ్రి సైతం కుటుంబాన్ని పట్టించుకోకపోవడంతో లాస్య మేనత్త సత్యవతి వద్ద ఉండగా ఆమె చెల్లెలు శ్రీహన్సిక నానమ్మ, తాతయ్యల వద్ద ఉంటోంది. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో పోస్టుమార్టం నిర్వహించిన అనంతరం బాలిక మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అందచేశారు. పట్టణ ఎస్సై సీహెచ్వీ సత్యనారాయణ పర్యవేక్షించారు. కన్నీరు మున్నీరవుతున్న కుటుంబసభ్యులు -
పెంటాథ్లాన్ పోటీలు ప్రారంభం
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో మోడరన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ ఛాంపియన్ షిప్ – 2026 క్రీడా పోటీలు శనివారం నిర్వహించారు. ఈ పోటీలను ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి జెండా ఊపి ప్రారంభించారు. అనంతరం మాట్లాడుతూ ప్రతి క్రీడాకారుడు అవకాశాలను అందిపుచ్చుకుంటూ ముందకు సాగాలన్నారు. ఈ క్రీడలకు రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి అధిక సంఖ్యలో క్రీడాకారులు హాజరయ్యారు. ఏపీ స్పోర్ట్స్ డైరెక్టర్ కే. జగదీశ్వరి, డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్, ఏపీ మోడరన్ పెంటాథ్లాన్ చైర్మన్ సీహెచ్.వెంకటేశ్వరరావు, ప్రెసిడెంట్ కే. హరిబాబు, వైస్ చైర్మన్ పీ. షణ్ముగం తదితరులు పాల్గొన్నారు. భీమడోలు: కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో ముగ్గురికి గాయాలయ్యాయి. కోనసీమ జిల్లా రావులపాలెం సమీపంలోని ఉప్పలగుప్తం మండలం టి.చల్లపల్లికి చెందిన ఐదుగురు ఓ కారులో ద్వారకాతిరుమల శ్రీవేంకటేశ్వరస్వామి వారిని దర్శించుకునేందుకు వచ్చారు. దర్శనం ముగించుకుని తిరిగి తమ స్వగ్రామానికి వెళ్తుండగా మార్గమధ్యమైన భీమడోలు జాతీయ రహదారిపైకి వచ్చేసరికి ముందుగా వెళ్తున్న ఓ వాహనాన్ని తప్పించబోయి కారు అదుపు తప్పి డివైడర్పైకి దూసుకెళ్లి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులోని డ్రైవర్ ఏ.ప్రకాష్, ప్రయాణికులు జయరాం శ్రీనివాస్, సుంకర సందీప్కు గాయాలయ్యాయి. క్షతగాత్రులను హైవే అంబులెన్స్ సిబ్బంది ఆసుపత్రికి తరలించారు. భీమడోలు పోలీసులు విచారణ చేస్తున్నారు. 100 మార్కులు తెచ్చుకున్న విద్యార్థికి విమాన ప్రయాణం లింగపాలెం: పదో తరగతి పరీక్షల్లో ప్రతిభ చాటిన విద్యార్థికి ఒక ప్రభుత్వ ఉపాధ్యాయుడు ఇచ్చిన మాట ప్రకారం సొంత ఖర్చులతో విమాన ప్రయాణం చేయించి ఆదర్శంగా నిలిచారు. లింగపాలెం మండలం కలరాయనగూడెం జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల సాంఘిక శాస్త్ర ఉపాధ్యాయుడు కె.వజ్రకుమార్ విద్యార్థుల్లో చదువుపై పోటీతత్వాన్ని పెంచేందుకు ఒక వినూత్న ప్రకటన చేశారు. పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సాంఘిక శాస్త్రం (సోషల్ స్టడీస్) సబ్జెక్టులో 100కు 100 మార్కులు సాధించిన వారికి ఉచితంగా విమానంలో హైదరాబాద్ తీసుకెళ్లి, అక్కడ పర్యాటక ప్రదేశాలను చూపిస్తానని మాటిచ్చారు. ఉపాధ్యాయుడు ఇచ్చిన స్ఫూర్తితో కష్టపడి చదివిన కొండపల్లి వినయ్ అనే విద్యార్థి పబ్లిక్ పరీక్షల్లో వందకు వంద మార్కులు సాధించి లక్ష్యాన్ని అందుకున్నాడు. దీంతో ఉపాధ్యాయుడు వజ్రకుమార్ తన మాట నిలబెట్టుకుంటూ, సదరు విద్యార్థి విమాన ప్రయాణ ఖర్చులను స్వయంగా భరించి గన్నవరం విమానాశ్రయం నుంచి హైదరాబాద్ తీసుకెళ్లారు. అక్కడ విద్యార్థికి పలు పర్యాటక ప్రాంతాలను చూపించి సరికొత్త అనుభూతిని అందించారు. విద్యార్థిని ఈ విధంగా ప్రోత్సహించిన ఉపాధ్యాయుడు వజ్రకుమార్ను నూజివీడు డివిజన్ ఉప విద్యాశాఖ అధికారి పీఎస్. సుధాకర్, ఎంఈఓలు కేవీకే దుర్గారావు, జె.రవీంద్ర, ఎస్ఎంసీ చైర్మన్ గద్దల తబిత అభినందించారు. -
మట్టి తవ్వకాలకు చెక్
ద్వారకాతిరుమల: రామన్నగూడెం పంచాయతీ ప రిధిలోని జలపవారికుంట చెరువులో మట్టి అక్రమ తవ్వకాలు నిషిద్ధమంటూ శనివారం రెవెన్యూ, పంచాయతీ అధికారులు ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. ఈనెల 9న ‘సాక్షి’లో ‘వేంపాడు చెరువులో యఽథేచ్ఛగా మట్టి తవ్వకాలు’ శీర్షికన ప్రచురించిన కథనానికి స్పందించారు. చెరువులో మట్టి తోలకం నిషిద్ధమని, అతి క్రమిస్తే చర్యలు తప్పవని ఫ్లెక్సీ ఏర్పాటుచేశారు. పోలవరం రూరల్: ముఖ్యమంత్రి చంద్రబాబు సోమవారం పోలవరం ప్రాజెక్టును సందర్శించనున్నారని, పటిష్ట ఏర్పాట్లు చేస్తున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శనివారం ఆమె పోలవరం ప్రాజెక్టు పరిధిలో హెలీప్యాడ్ ప్రాంతాన్ని, ఈసీఆర్ డ్యామ్ గ్యాప్ 1, 2, పోలవరం హైడ్రో ఎలక్ట్రిక్ ప్రాజెక్టు (పవర్ హౌస్) పనులను పరిశీలించారు. అనంతరం పోలవరం జిల్లా కలెక్టర్ కె.దినేష్కుమార్, జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్, జేసీ ఎంజే అభిషేక్గౌడతో కలిసి సమావేశం నిర్వహించారు. ధవళేశ్వరం గేట్ల ప్రారంభోత్సవ పర్యటన ముగించుకుని, అదే రోజు మధ్యాహ్నం 12.55 గంటలకు సీఎం పోలవరం చేరుకుంటున్నారన్నారు. జిల్లా ఎస్పీ శివకిషోర్ మాట్లాడుతూ సీఎం పర్యటనకు కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాట్లు చేస్తున్నామన్నారు. పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ వి.అభిషేక్, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, ఇరిగేషన్ ఎస్ఈ ఆర్.రామచంద్రరావు, ఏఎస్పీ వై.ప్రసాదరావు, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, ఆర్డీఓ ఎంవీ రమణ పాల్గొన్నారు. ఉంగుటూరు: నారాయణపురం సచివాలయ ఉద్యోగులపై ఏలూరు ఆర్డీఓ లక్ష్మీప్రసన్న ఆగ్రహం వ్యక్తం చేశారు. ముందుగా సమా చారం ఇచ్చినా ఎవరు అందుబాటులో లేకపోవడంపై మండిపడ్డారు. ఓటర్ల సమగ్ర సర్వేలో వెనుకబడి ఉండటంపై ప్రశ్నించారు. శనివారం ఆమె బాదంపూడి, ఉంగుటూరు, నారాయణపురం, చేబ్రోలు, కై కరం గ్రామాల్లోని సచివాలయాలను పరిశీలించారు. త్వరితగతిన ఓటర్ల సర్వే పూర్తి చేయాలని ఆదేశించారు. ఓటర్లు జాబితా డిజిటలైజేషన్లో అలసత్వం వహిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. పూర్తి చేయని ఉద్యోగులను సస్పెండ్ చేస్తామన్నారు. నారాయణపురం–1 సచివాలయంలోకి వెళ్లినప్పుడు వీఆర్వో, డిజిటల్ అసిస్టెంట్ తప్ప మిగిలిన ఉద్యోగులు లేకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. సర్ ప్రక్రియకు 14 ఆఖరి తేదీ అని ఈ సమయంలో కార్యాలయంలో ఎవరూ లేకుంటే ఎలా అని ప్రశ్నించారు. అనంతరం సిబ్బంది అందరూ సచివాలయానికి హాజరై విధులు నిర్వహించారు. యువకుడిపై కేసు నమోదు ద్వారకాతిరుమల: బాలికకు మాయమాటలు చెప్పి లోబర్చుకుని గర్భిణిని చేసిన యువ కు డిపై ద్వారకాతిరుమల పోలీసులు శనివారం కేసు నమోదు చేశారు. ఎస్సై టి.సుధీర్ తెలిపిన వివరాల ప్రకారం.. ద్వారకాతిరుమల మండలంలోని పంగిడిగూడెం గ్రామానికి చెందిన ఓ బాలిక భీమడోలులో ఓ కళాశాలలో ఇంటర్మీడియట్ చదువుతోంది. రోజూ బస్సులో రాకపోకలు సాగిస్తోంది. ఇటీవల ఆమె ఆరోగ్యం సరిగా లేక పోవడంతో వైద్య పరీక్షలు చేయించగా గర్భిణి అని నిర్ధారణ అయ్యింది. దీంతో బాలికను తల్లి ఆరా తీయగా అదే గ్రామానికి చెందిన పి.మాన్సింగ్ అనే యువకుడు తనకు మాయమాటలు చెప్పి శారీరకంగా లోబర్చుకున్నాడని, తన ఫొ టోలు, వీడియోలు తీసి బెదిరిస్తూ పలుమార్లు లైంగికదాడికి పాల్పడినట్టు చెప్పింది. బాలిక తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. -
సమయం లేదు సర్
ఆదివారం శ్రీ 12 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటరు జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) ఇంటింటా సర్వే చివరి దశకు చేరింది. ఓటర్లకు ఇచ్చిన ఎన్యుమరేషన్ ఫారాల (ఈఎఫ్)ల మ్యాపింగ్ గడువు మంగళవారంతో ముగియనుంది. ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల ఓటర్లకు 83.29 శాతం ఓట్లు డిజిటలైజేషన్ కాగా ఇంకా 16 శాతం ఎన్యుమరేషన్ ఫారాలు ఓటర్ల వద్దే ఉన్నాయి. గడువులోపు మిగిలిన వారు మ్యాపింగ్ చేసుకోకుంటే ఓటు గల్లంతే అంటున్నారు. మరోపక్క వలస ఓట్లలో వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు కూటమి నేతలు కుట్రలు చేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 31.19 లక్షల మంది.. ఓటరు జాబితా ప్రక్షాళన కోసం గతనెల 15 నుంచి ఎన్నికల కమిషన్ సర్ కార్యక్రమం చేపట్టింది. 2002 జాబితా ప్రకారం తొలిదశలో ఓటర్ల మ్యాపింగ్కు నిర్ణయించింది. ఈ మేరకు బూత్ లెవిల్ ఆఫీసర్లు (బీఎల్ఓ) ఈనెల 14 వరకు ఇంటింటికీ వచ్చి ఓటర్లకు ఎన్యుమరేషన్లు అందజేయాలి. జాబితాలోని అడ్రస్లో ఓటరు ఉంటున్నారా లేదా అనేది పరిశీలించి మ్యాపింగ్ చేయాలి. 2002 తర్వాత ఓటుహక్కు పొందిన వారి వివరాలను ఈసీ మార్గదర్శకాల మేరకు మ్యాపింగ్ చేయాలి. ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 16,44,193 ఓట్లకు గాను 92.95 శాతంతో 15.28 లక్షల ఓట్లు మ్యాపింగ్ పూర్తయ్యింది. పశ్చిమగోదావరి జిల్లాలో 14,75,036 మంది ఓటర్లు ఉండగా శనివారం నాటికి 81.05 శాతంతో 11.95 లక్షల ఓట్లు మ్యాపింగ్ పూర్తయ్యింది. అధికంగా భీమవరం, నరసాపురం, తణుకు, తాడేపల్లిగూడెం అర్బన్ ఏరియాలు, వీరవాసరం మండలంలోను, ఏలూరు జిల్లా పరిధిలోని ఏలూరు అర్బన్తో పాటు నూజివీడు, దెందులూరు ఏరియాలో మ్యాపింగ్ చేయాల్సిన ఓట్లు ఉన్నాయి. పొంతనలేని లెక్కలు ఏలూరు జిల్లాలో నూరుశాతం, పశ్చిమలో 99.91 శాతం ఎన్యుమరేషన్ ఫారాలను ఓటర్లకు అందజేసినట్టు బీఎల్ఓలు చెబుతున్నారు. అయితే ఈ మేరకు డిజిటలైజేషన్ మాత్రం జరగలేదు. ఎన్యుమరేషన్ పూర్తికి మరో రెండు రోజులు గడువు ఉండగా 11 నాటికి పూర్తిచేయాలని జిల్లా యంత్రాంగం లక్ష్యంగా నిర్ణయించింది. డెత్, షిఫ్టింగ్, శాశ్వత వలసదారుల దరఖాస్తులపై ఈఆర్ఓ, ఏఈఆర్ఓలు ఏ మేరకు శ్రద్ధ చూపారనేది ప్రశ్నార్థకమే. సర్వే అనంతరం తొలగించిన ఓట్లు, కొత్తగా నమోదైన ఓట్లు, మార్పులు, చేర్పుల వివరాలతో జూలై 21న ముసాయిదా ఓటర్ల జాబితా ప్రచురిస్తారు. అనంతరం క్లయిమ్లు, అభ్యంతరాలు స్వీకరించి సెప్టెంబరు 18లోపు పరిష్కరిస్తారు. సెప్టెంబరు 22న తుది ఓటరు జాబితాను ప్రచురిస్తారు. ఈ నేపథ్యలో నిర్ణీత గడువులోపు డిజిటలైజ్ చేయించుకోకుంటే ఓటును కోల్పోవాల్సి వస్తుందని నిపుణులు అంటున్నారు. ఏలూరు జిల్లా నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం ఉంగుటూరు 2,07,346 1,95,375 94.23 దెందులూరు 2,25,615 2,10,860 93.46 ఏలూరు 2,34,948 2,23,046 94.93 పోలవరం 2,55,122 2,36,203 92.58 చింతలపూడి 2,74,003 2,49.089 90.91 నూజివీడు 2,40,581 2,26,439 94.12 కై కలూరు 2,06,578 1,87,214 90.63 మొత్తం 16,44,193 15,28,226 92.95 పశ్చిమగోదావరి జిల్లా నియోజకవర్గం ఓటర్లు డిజిటలైజేషన్ శాతం ఆచంట 1,79,987 1,49,707 83.18 పాలకొల్లు 1,95,062 1,64,813 84.49 నరసాపురం 1,71,053 1,46,367 85.57 భీమవరం 2,52,549 1,85,981 73.64 ఉండి 2,26,503 1,80,241 79.58 తణుకు 2,35,359 1,91,697 81.45 తాడేపల్లిగూడెం 2,14,523 1,76,771 82.40 మొత్తం 14,75,036 11,95,557 81.05 ఉమ్మడి పశ్చిమలో 31.19 లక్షల ఓటర్లు 83.29 శాతం డిజిటలైజేషన్ పూర్తి ఇంకా ఓటర్ల వద్ద ఉన్న ఎన్యుమరేషన్ ఫారాలు 17 శాతం 14తో ముగియనున్న గడువు ఈలోపు డిజిటలైజ్ కాకుంటే ఓటు గల్లంతే! వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లు తొలగింపునకు కూటమి కుట్రలు ఏఐ సృష్టించిన చిత్రం షిఫ్టింగ్, శాశ్వత వలసదారుల ఓట్ల విషయంలో కూటమి ప్రభుత్వం కుట్రలకు తెరలేపుతున్నట్టు తెలుస్తోంది. సాధారణంగా మ్యాపింగ్ కాని ఆయా ఓట్లను తొలగించాల్సి ఉంది. కాగా వైఎస్సార్సీపీ సానుభూతిపరుల ఓట్లను తొలగించి కూటమి పార్టీలకు చెందిన వారి ఓట్లను కాపాడుకునేందుకు కుట్రలు చేస్తున్నట్టు సమాచారం. -
విద్యార్థులు లేక వెలవెలబోతున్న హాస్టల్
మండవల్లి: మండల కేంద్రంలోని బీసీ బాలుర వసతి గృహంలో ప్రస్తుతం విద్యార్థులెవరూ లేకపోవడంతో హాస్టల్ వెలవెలబోతోంది. ఈ హాస్టల్ సమీపంలో రైల్వే ట్రాక్ ఉండటమే ఇందుకు ప్రధాన కారణంగా కనిపిస్తోంది. విద్యార్థులు హైస్కూల్కు వెళ్లాలన్నా, తిరిగి హాస్టల్కు రావాలన్నా రైల్వే ట్రాక్ దాటాల్సి వస్తోంది. అలాగే రైల్వే ట్రాక్ వెంబడే నడవాల్సి వస్తుండటంతో, భద్రతా కారణాల దృష్ట్యా పిల్లలను ఈ హాస్టల్లో ఉంచేందుకు తల్లిదండ్రులు అంగీకరించడం లేదు. గతంలో ఈ వసతి గృహంలో సుమారు 40 మంది వరకు విద్యార్థులు ఉండేవారు. ప్రస్తుతం ఈ హాస్టల్కు ఇన్ఛార్జ్ మేట్రన్గా రాధ వ్యవహరిస్తుండగా, వర్కర్గా సుస్మిత విధులు నిర్వహిస్తూ హాస్టల్ను శుభ్రం చేస్తున్నారు. విద్యార్థులను చేర్పించేందుకు తాము నందిగామలంక, పెనుమాకలంక తదితర గ్రామాలకు వెళ్లి ప్రచారం చేసినప్పటికీ, హాస్టల్లో ఒక్కరు కూడా చేరలేదని మేట్రన్ రాధ తెలిపారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, ఈ హాస్టల్ను గ్రామంలోని ఏదైనా అద్దె భవనంలోకి మార్చితే విద్యార్థులు చేరే అవకాశం ఉందని స్థానికులు అభిప్రాయపడుతున్నారు. వసతి గృహాన్ని తక్షణమే గ్రామంలోకి మార్చాలని పలువురు కోరుతున్నారు. -
గంటల వ్యవధిలో బాలుడి గుర్తింపు
కై కలూరు: తాతతో వచ్చిన మనవడు తప్పిపోయిన సంఘటనలో సీసీ కెమెరాల సాయంతో గంటల వ్యవఽధిలోనే పోలీసులు బాలుడిని గుర్తించారు. ఈ సంఘటన కై కలూరు బంగారపు కొట్లు వీధి స్టీల్ సామగ్రి విక్రయ దుకాణం వద్ద శనివారం చోటుచేసుకుంది. కై కలూరు టౌన్ ఎస్సై కె.గణేష్కుమార్ తెలిపిన వివరాల ప్రకారం.. రాచపట్నంకు చెందిన చక్కా మురళీ స్టీల్ కొట్టు వద్దకు మనవడు సుందర్ (5)తో కలిసి సాయంత్రం 5.30 గంటలకు వచ్చారు. కొద్ది సమయానికి బాలుడు కనిపించలేదు. దీంతో పోలీసులకు సమాచారం అందించగా సీసీ కెమెరాల ఆధారంగా బాలుడు బైపాస్ రోడ్ మాత స్కూల్ గ్రౌండ్లో ఉన్నట్టు గుర్తించారు. రాత్రి 8.30 గంటలకు సీఐ ఏవీఎస్ రామకృష్ణ సమక్షంలో బాలుడిని తాతకు అప్పగించారు. తక్షణమే స్పందించిన ఎస్సైను సీఐ అభినందించారు. నరసాపురం: నరసాపురంలో పుష్కరాల అభివృద్ధి పనులకు కేంద్ర ప్రభుత్వం 25 శాతం రుణవాటా కింద అర్బన్ చాలెంజ్ ఫండ్ (యూసీఎఫ్) గ్రాంట్ మంజూరు చేసినట్టు మున్సిపల్ శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. శనివారం స్థానిక మున్సిపల్ కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. కేంద్రం గ్రాంటును 25 శాతం రుణం రూపంలో ఇస్తుందని, మిగిలిన 75 శాతం రాష్ట్ర ప్రభుత్వం మంజూరు చేస్తుందన్నారు. యూసీఎఫ్ గ్రాంటు కింద నరసాపురం మున్సిపాలిటీ రూ.34 కోట్ల అర్హత సాధించిందన్నారు. ముందుగా పుష్కరాల అభివృద్ధి పనులు, నిర్వహణపై సమీక్షించారు. -
పుస్తకాల్లేని చదువులు
ప్రస్తుత విద్యాసంవత్సరం గత నెల 12వ తేదీన ప్రారంభమైనప్పటికీ, నేటికీ విద్యార్థులకు పూర్తిస్థాయిలో పాఠ్య, నోట్ పుస్తకాలను అందించలేదు. గత జగన్ ప్రభుత్వ హయాంలో పాఠశాలలు తెరిచిన రోజే పాఠ్య, నోట్ పుస్తకాలతో పాటు స్కూల్ బ్యాగ్, షూస్, సాక్స్, టై, బెల్ట్, యూనిఫామ్ వంటివన్నీ అందించేవారు. అయితే ఈ ఏడాది జిల్లాలోని 1,376 ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 87 వేల మంది విద్యార్థులకు విద్యా సామాగ్రి అందించాల్సి ఉండగా, ఏ పాఠశాలకూ నూరు శాతం పుస్తకాలు, సామాగ్రి అందిన దాఖలాలు లేవు. అంతేకాకుండా, ఈ ఏడాది ప్రభుత్వ పాఠశాలల్లో అదనంగా చేరిన విద్యార్థులకు ఇప్పటివరకు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, విద్యా సామాగ్రి అందకపోవడంతో, విద్యార్థుల తల్లిదండ్రులు ప్రైవేట్ దుకాణాల్లో కొనుగోలు చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వేసవి సెలవుల్లో ఉపాధ్యాయులంతా ఇంటింటికీ తిరిగి, పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే అన్నీ ఉచితంగా అందుతాయని ప్రచారం చేశారు. తీరా ఇప్పుడు ప్రభుత్వం నుంచి పుస్తకాలు, యూనిఫామ్ వంటివి సకాలంలో ఇవ్వకపోవడంతో తల్లిదండ్రులకు ఏం చెప్పాలో తెలియక ఉపాధ్యాయులు ఇబ్బందులు పడుతున్నారు. పుస్తకాలే సక్రమంగా అందించలేని ప్రభుత్వం, ఇక ’తల్లికి వందనం’ పథకంలో ఎటువంటి మెలికలు పెట్టి కోత విధిస్తుందోనని, తమ పిల్లలకు ఆ సొమ్ము అందుతుందో లేదోనని తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. భీమవరం: విద్యకు పెద్దపీట వేస్తామని, ఉద్యోగాలు, ఉపాధి కల్పనలో తామే మేటి అని గొప్పగా ప్రచారం చేసుకుంటున్న కూటమి ప్రభుత్వం, ప్రస్తుత విద్యాసంవత్సరం ప్రారంభమై నెల రోజులు గడిచినా విద్యార్థులకు నేటికీ పూర్తిస్థాయిలో పుస్తకాలు, విద్యా సామాగ్రి పంపిణీ చేయలేకపోయింది. వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో పాఠశాలలు తెరిచిన రోజునే విద్యార్థులందరికీ ’జగనన్న విద్యా కానుక’ కిట్లను అందజేయడమే కాకుండా, ప్రభుత్వ పాఠశాలలను కార్పొరేట్ స్కూళ్లకు ధీటుగా అభివృద్ధి చేసిన సంగతి తెలిసిందే. ప్రభుత్వ పాఠశాలల్లో ఇంగ్లీష్ మీడియం అమలు చేయడం, ’అమ్మఒడి’ పథకం ద్వారా విద్యార్థుల తల్లులకు ప్రతి ఏటా రూ. 15 వేల ఆర్థిక ప్రోత్సాహం అందించడంతో ప్రభుత్వ బడులకు ఆదరణ పెరిగింది. దీంతో భారీగా ఫీజులు చెల్లించి ప్రైవేట్ స్కూళ్లలో చదివించే మధ్యతరగతి తల్లిదండ్రులు సైతం తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించడం ప్రారంభించారు. ఇందులో భాగంగానే ఈ ఏడాది జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 5,673 మంది విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలను వీడి ప్రభుత్వ పాఠశాలల్లో చేరారు. బడులు తెరిచి నెల దాటినా పూర్తికాని పుస్తకాల పంపిణీ విద్యార్థులకు తప్పని అవస్థలు కొత్తగా చేరిన విద్యార్థులకు అందని పుస్తకాలు, యూనిఫాం కూటమి పాలనపై మండిపడుతున్న తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలల్లో ఈ ఏడాది అదనంగా చేరిన విద్యార్థులకు కూడా అందించడానికి వీలుగా ఆయా పాఠశాలలకు పుస్తకాలు, ఇతర విద్యా సామాగ్రి చేరుతున్నాయి. గత ఏడాది విద్యార్థులందరికీ పాఠశాలల ప్రారంభంలోనే పంపిణీ పూర్తి చేయగా, ఈసారి కొత్తగా చేరిన విద్యార్థులకు అందించే కార్యక్రమం చేపట్టాం. పుస్తకాలు, విద్యా సామాగ్రి కోసం విద్యార్థుల తల్లిదండ్రులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – పి.శ్యామ్సుందర్, సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్ట్ కోఆర్డినేటర్, భీమవరం -
లోక్ అదాలత్తో సత్వర పరిష్కారం
ఏలూరు (టూటౌన్): కేసుల సత్వర పరిష్కారం కోసం జాతీయ లోక్ అదాలత్ నిర్వహిస్తున్నట్టు ఉ మ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్పర్సన్ ఎస్.శ్రీదేవి చెప్పారు. శనివారం స్థానిక జిల్లా న్యాయసేవాధికార సంస్థ భవనంలో 2వ జాతీయ లోక్అదాలత్ ప్రారంభ కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. కక్షిదారుల మధ్య సామర స్య వాతావరణంలో విభేదాలు తగ్గించేందుకు, కేసు ల సత్వర పరిష్కారానికి లోక్ అదాలత్ నిర్వహి స్తున్నామని చెప్పారు. ఉమ్మడి జిల్లావ్యాప్తంగా 36 బెంచీలు ఏర్పాటు చేశామన్నారు. వాహన ప్రమాద బీమా కేసులో టాటా జనరల్ ఇన్సూరెన్స్ ద్వారా రూ.20 లక్షల చెక్కులను కక్షిదారులకు అందజేశారు. 1వ అదనపు జిల్లా జడ్జి యు.ఇందిరా ప్రియదర్శిని, 2వ అదనపు జిల్లా జడ్జి ఎం.మీనాదేవి, 5వ అదనపు జిల్లా జడ్జి ఆర్వీవీఎస్ మురళీకృష్ణ, 8వ అదనపు జిల్లా జడ్జి ఐ.శ్రీనివాసమూర్తి, జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి, బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ కోనె సీతారాం, ప్రభుత్వ న్యాయవాది సుబ్రహ్మణ్యం, లోక్ అదాలత్ సభ్యుడు అబ్బినేని వి జయకుమార్ పాల్గొన్నారు. కక్షిదారులకు సీతారాం ఆహార పొట్లాలను అందజేశారు. 7,890 కేసుల రాజీ : 7,890 కేసులను రాజీ చేశారు. వీటిలో 7,437 క్రిమినల్, 215 సివిల్, 185 వాహన ప్రమాద, 53 ఫ్రీలిటిగేషన్ కేసులు రాజీ చేసినట్టు తెలిపారు. వాహన ప్రమాద బీమా కేసులకు సంబంధించి రూ.12.18 కోట్లు పరిహారంగా చెల్లించారు. -
క్షేత్రంలో ఆన్లైన్ సేవలకు అంతరాయం
గంటల తరబడి క్యూలైన్లలో వేచి ఉన్న భక్తులు ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంలో ఆన్లైన్ సేవలకు శనివారం ఉదయం అంతరాయం ఏర్పడింది. దీంతో స్వామివారి దర్శనం, మొక్కులు చెల్లించుకునేందుకు వచ్చిన భక్తులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ముఖ్యంగా కల్యాణకట్ట్ట వద్ద మొక్కులు తీర్చుకునే భక్తులు టికెట్ల కోసం గంటల తరబడి వేచి ఉన్నారు. ఉదయం 8 గంటల నుంచి సర్వర్లో సమస్య తలెత్తడంతో ఆన్లైన్ సేవలు నెమ్మదించాయి. కొంతసేపు పనిచేసిన సర్వర్ మధ్య మధ్యలో నిలిచిపోవడంతో టికెట్ల జారీ ప్రక్రి య మందగించింది. దీంతో కల్యాణకట్ట ప్రాంతం భక్తులతో కిటకిటలాడింది. ఆఫ్లైన్లోనూ సమస్యలే.. సమస్యను గుర్తించిన దేవస్థానం అధికారులు బ్యాంకు పీఓఎస్ మెషీన్ల ద్వారా ఆఫ్లైన్ సేవలు ప్రారంభించినా, కొంత సమయం పాటు అవి కూడా మొరాయించాయి. కియోస్క్ మెషీన్లు సైతం నెమ్మదిగా పనిచేయడంతో భక్తుల నిరీక్షణ మరింత పెరిగింది. దీంతో సిబ్బంది కేశఖండనశాల వద్ద ప్రత్యేకంగా కంప్యూటర్ ఏర్పాటు చేసి టికెట్లు జారీ చేసేందుకు ప్రయత్నించారు. అయితే సర్వర్ సమస్య కొనసాగడంతో ఆ ప్రయత్నాలు కూడా సకాలంలో ఫలించలేదు. కౌంటర్ల వద్ద భారీ రద్దీ దర్శనం టికెట్లు, ప్రసాదాల విక్రయాల కౌంటర్ల వద్ద కూడా ఇదే పరిస్థితి నెలకొంది. ఆన్లైన్ సేవా కౌంటర్ల వద్ద భక్తులు బారులు తీరారు. చిన్నపిల్లలు, వృద్ధులతో వచ్చిన వారు గంటల తరబడి వేచి ఉండాల్సి రావడంతో అసహనం వ్యక్తం చేశా రు. మనమిత్ర వాట్సాప్ సైతం పనిచేయకపోవడంతో భక్తులు గగ్గోలు పెట్టారు. మధ్యాహ్నం వరకూ ఆన్లైన్ కష్టాలు కొనసాగాయి. కల్యాణకట్ట ప్రాంతంలో ఏర్పాటుచేసిన కంప్యూటర్ వద్ద, కియోస్క్ మెషీన్ వద్ద పోటెత్తిన భక్తులు కేశఖండనశాల వద్ద టికెట్ అడిగితే సర్వర్ పనిచేయడం లేదన్నారు. దీంతో గంట సమయం అక్కడే వేచి ఉన్నా. ఆ తర్వాత దర్శనం టికెట్ కోసం మరో గంటకు పైగా సమయం పట్టింది. ఇన్ని ఇబ్బందులు ఎప్పుడూ పడలేదు. దేవదాయశాఖ అధికారులు భక్తుల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని సాంకేతిక సమస్యలను పరిష్కరించాలి. – బేతే సురేష్, మల్లాయిగూడెం, అశ్వారావుపేట మండలం -
ఆక్వాకు అండగా.. అన్నొస్తున్నాడు
విదేశీ మారకద్రవ్యంతో దేశానికి మేలు చేస్తున్న ఆక్వా రైతులు చంద్రబాబు సర్కారు దగాతో రోడ్డున పడ్డారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు సిండికేటు దోపిడీతో సాగు భారమై దిక్కుతోచక కొట్టుమిట్టాడుతున్నారు. దగాపడ్ట తమ పక్షాన ప్రభుత్వంపై సమరభేరి మోగించిన వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి రాక కోసం ఆక్వా రైతులు వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. సాక్షి, భీమవరం: ఫీడ్ కంపెనీలు ఇష్టానుసారం పెంచిన ఆక్వా మేత ధరలు తగ్గించాలని, రొయ్యలకు గిట్టుబాటు ధర కల్పించాలని, ఆక్వా రైతులకిచ్చిన ఎన్నికల హామీలు అమలుచేయాలని ఇప్పటికే కూటమి ప్రభుత్వానికి వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి అల్టిమేటం జారీచేశారు. లక్షలాది మంది రైతు కుటుంబాలను రోడ్డున పడేసి సిండికేటు ప్రయోజనాలకే ప్రాధాన్యమిస్తున్న చంద్రబాబు సర్కారు నిగ్గు తేల్చేందుకు ఈనెల 15న నేరుగా ఆయనే భీమవరం వస్తున్నారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎక్స్పోర్టర్లు చేస్తున్న మోసాలు, దోపిడీ, ఇతర సమస్యలపై ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేయనున్న వేదిక వద్ద రైతులతో భేటీ కానున్నారు. ఆక్వా రైతుల ప్రయోజనాల కోసం పోరాటం సాగించనున్నారు. ఈ సందర్భంగా జగన్ రాక కోసం ఉభయగోదావరితో పాటు కృష్ణా జిల్లాల ఆక్వా రైతులు ఎంతో ఆశగా ఎదురుచూస్తున్నారు. అప్పటికైనా ప్రభుత్వం చల నం వస్తుందని ఆకాంక్షిస్తున్నారు. వేదిక స్థలం పరిశీలన ఉండి బైపాస్ రోడ్డులోని బీవీ రాజు విగ్రహం సమీపంలో ఏర్పాటుచేయనున్న ముఖాముఖీ వేదిక స్థలాన్ని శనివారం జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు, పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, భీమవరం నియోజకవర్గ కో–ఆర్డినేటర్ చినమిల్లి వెంకటరాయుడు, మాజీ ఎమ్మెల్సీ మేకా శేషుబాబు తదితరులు పరిశీలించారు. ముఖా ముఖీ కార్యక్రమం నిర్వహణకు అవసరమైన ఏర్పాట్లపై సమీక్షించారు. అలాగే పర్యటన అనుమతుల కోసం కలెక్టర్ సీహెచ్ నాగరాణిని పార్టీ నేతలు క లిసి వినతిపత్రం అందజేశారు. ఎంబీసీ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు పెండ్ర వీరన్న, పార్లమెంట్ సెక్రటరీ యడ్ల తాతాజీ, పార్టీ నేతలు కోడే యుగంధర్, గాదిరాజు రామరాజు, చిలుకూరి దత్తాత్రేయవర్మ తదితరులు పాల్గొన్నారు. అధినేత పర్యటనకు సంబంధించిన సన్నాహాల్లో వైఎస్సార్సీపీ జిల్లా కార్యవర్గం నిమగ్నమైంది. పార్టీ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రీజనల్ కో–ఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్ నేతృత్వంలో ఇటీవల ఉమ్మడి ఉభయగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన నేతలు సమావేశమై ఏర్పాట్లపై సమీక్షించారు. ఉమ్మడి పశ్చిమగోదావరితో పాటు తూర్పుగోదావరి, కృష్ణా జిల్లాలకు చెందిన ఆక్వా రైతులు తరలిరానున్నారు. ఆక్వా రైతులకు కోసం జిల్లాకు వస్తున్న జగన్కు ఘన స్వాగతం పలికి పర్యటన విజయవంతం చేసేందుకు ఉమ్మడి జిల్లా అంతటా నియోజకవర్గాల వారీగా వైఎస్సార్సీపీ శ్రేణులు సన్నాహాక సమావేశాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. రొయ్య రైతుల కష్టాలపై పోరుబాట 15న వైఎస్ జగన్ భీమవరం రాక ఉండి బైపాస్ రోడ్డులో ఆక్వా రైతులతో ముఖాముఖీ ఏర్పాట్లలో వైఎస్సార్సీపీ నేతలు రొయ్యల ఎగుమతిదారుల సిండికేట్ వల్లే రొయ్యల ధరలు తగ్గించివేస్తున్నారు. ప్రభుత్వం ధరల స్థిరీకరణకు ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు. మేత ధరల్ని ఇష్టానుసారం పెంచేస్తున్నారు. ముడిసరుకు ధరలు తగ్గినా మేత ధరల్ని తగ్గించడం లేదు. ధర ఒరల్లో రైతులు నలిగిపోతున్నారు. విద్యుత్ రాయితీల హామీని అమలుజేయాలి. రైతులు లక్షల రూపాయలు నష్టపోతున్నారు. – పాతపాటి శ్రీనివాసరాజు, ఆక్వా రైతు, పెదకాపవరం, ఆకివీడు మండలం ఏడాదిన్నరగా పోరాటం చేస్తున్నా రొయ్య రైతుల సమస్యలపై కూటమి ప్రభుత్వం స్పందించడం లేదు. జగనన్న వస్తేనే ఆక్వా రైతులకు న్యాయం జరుగుతుందని మా నమ్మకం. ఫీడు కంపెనీలు ఇష్టానుసారం ధరలు పెంచేస్తున్నా ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఇలానే కొనసాగితే ఆక్వా సాగు చేసే పరిస్థితి లేదు. జగనన్న రాక కోసం రొయ్య రైతులంతా ఎదురుచూస్తున్నాం. – కె.సర్వేశ్వరరావు, రొయ్యల రైతు, రాయకుదురు, వీరవాసరం మండలం -
అంతర్ జిల్లా పోటీలకు ఫుట్బాల్ జట్టు
భీమవరం: ఆంధ్రప్రదేశ్ ఫుట్బాల్ అసోసియేషన్ ఆధ్వర్యంలో ఈనెల 11 నుంచి మూడు రోజులపాటు అన్నమయ్య జిల్లా మదనపల్లిలో జరిగే జూనియర్ బాలుర అంతర్ జిల్లాల చాంపియన్షిప్ పోటీల్లో జిల్లా జూనియర్ బాలుర జట్టు పాల్గొంటుందని జిల్లా అసోసియేషన్ గౌరవ చైర్మన్ ఇళ్ల రాధాకృష్ణ శనివారం చెప్పారు. నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పాటు తర్వాత మొదటిసారిగా రాష్ట్రస్థాయి ఫుట్బాల్ పోటీల్లో జట్టు పాల్గొంటున్నట్లు తెలిపారు. పోటీలకు వెళ్లిన క్రీడాకారులకు రాధాకృష్ణ, ఉప అధ్యక్షులు ఎఎస్ఎన్ రాజు, ఇళ్ల మధుసూదనరావు, కార్యదర్శి వానపల్లి రమేష్, గౌరవ అధ్యక్షుడు పాపోలు ఏడుకొండలు శుభాకాంక్షలు తెలిపారు. భీమవరం: ఉద్యోగులు, ఉపాధ్యాయులు, కార్మికుల పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం తక్షణమే పరిష్కరించాలని కలెక్టర్ చదలవాడ నాగరాణికి అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం వినతిపత్రం అందజేశారు. ఏపీ ఎన్జీవోల సంఘం జిల్లా అధ్యక్షుడు, జేఏసీ చైర్మన్ వుదిసి వెంకట పాండురంగారావు మాట్లాడుతూ పీఆర్సీ కమిషన్ తక్షణమే వేయాలని, తాత్కాలిక భృతి, ఐఆర్, పెండింగ్లో ఉన్న డీఏ, సరెండర్ లీవ్ ఇవ్వడంతోపాటు పలు సమస్యలను పరిష్కరించే విధంగా ముఖ్యమంత్రి చంద్రబాబు దృష్టికి తీసుకెళ్లాలని కోరారు. కార్యక్రమంలో కామరాజు, ఎస్ఎన్వీ సత్యనారాయణ, పేపకాయల కృష్ణ, జేఏసీ సెక్రెటరీ రామచంద్రరావు, యూటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు విజయరామరాజు, ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు సాయివర్మ, ఆర్గనైజింగ్ సెక్రటరీ చిట్టూరి హరిప్రసాద్బాబు తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం రూరల్: విద్యుదాఘాతానికి గురై ఓ వ్యక్తి మృతి చెందాడు. పట్టెంపాలెం గ్రామంలో శొంఠి లక్ష్మీనారాయణకు చెందిన పామాయిల్ తోటలో ద్వారకాతిరుమల మండలం తిరుమలపాలెంకు చెందిన పుట్టి నాగదుర్గారావు (19), అతని తండ్రి ఆదినారాయణ, కొత్తపల్లి వెంకటరమణ పనికి వెళ్లారు. శనివారం ఇనుప కోత పరికరంతో పామాయిల్ గెలలను కోస్తుండగా ప్రమాదవశాత్తు పరికరం విద్యుత్ తీగలపై పడింది. దీంతో నాగదుర్గారావు విద్యుదాఘాతానికి గురయ్యాడు. అపస్మారక స్థితిలో ఉన్న అతడిని ఆదినారాయణ, కొత్తపల్లి వెంకటరమణ కలిసి తాడేపల్లిగూడెంలోని ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. అయితే, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు ధ్రువీకరించారు. మృతుడి సోదరుడు వెంకటేశ్వరరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు రూరల్ ఎస్సై రవికుమార్ తెలిపారు. -
ట్రిపుల్ఐటీలో ‘మెటా గేట్’ శిక్షణ
నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీలోని మెటలర్జికల్ అండ్ మెటీరియల్స్ ఇంజనీరింగ్ (ఎంఎంఈ) విభాగ విద్యార్థుల కోసం ‘మెటా గేట్’ కోచింగ్ సంస్థ ఆధ్వర్యంలో శనివారం ప్రత్యేక గేట్ శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. విద్యార్థులు జాతీయ స్థాయి పోటీ పరీక్షల్లో రాణించడమే లక్ష్యంగా హయ్యర్ ఎడ్యుకేషన్ సెల్ ద్వారా ఆర్జీయూకేటీ పరిపాలనా విభాగం దీనిని చేపట్టింది. గేట్ మెటలర్జీ అకడమిక్ హెడ్ శుభ్రదీప్ పాల్ హాజరై, గేట్ పరీక్ష ద్వారా లభించే ఉన్నత విద్యా, పరిశోధనా అవకాశాలపై విద్యార్థులకు అవగాహన కల్పించారు. వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణ రావు, రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్ర కుమార్ తదితర అధికారులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పీయూసీ విద్యార్థుల కోసం ఒప్పందం పీయూసీ విద్యార్థుల విద్యా ప్రమాణాలను మెరుగుపరిచేందుకు, ప్రారంభ దశలోనే సబ్జెక్టులపై పట్టు సాధించేందుకు వీలుగా ‘మెటాగేట్ బ్రిడ్జ్ కోర్స్’ నిర్వహణ కొరకు సదరు సంస్థతో విశ్వవిద్యాలయం రెండో అవగాహన ఒప్పందాన్ని కుదుర్చుకుంది. కార్యక్రమంలో సెంట్రల్ అకడమిక్ డీన్ దువ్వూరి శ్రావణి, ఈఐటీపీ డీన్ శ్యామ్, సెంట్రల్ ఫైనాన్స్ ఆఫీసర్ నాగార్జున దేవి, ఎంఎంఈ హెచ్ఓడీ వీరశ్రీను, హయ్యర్ ఎడ్యుకేషన్ అండ్ కాంపిటేటివ్ సెల్ కోఆర్డినేటర్ రామకృష్ణ, వెంకటేశ్వర్లు తదితర అధ్యాపకులు పాల్గొన్నారు. -
అక్రమ పొగాకు బేళ్లు సీజ్
జంగారెడ్డిగూడెం: కొయ్యలగూడెం, గోపాలపురం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా రవాణా అవుతున్న 28 హైగ్రేడ్ పొగాకు బేళ్లను విజిలెన్స్ అధికారులు సీజ్ చేసినట్లు ఎన్ఎల్ఎస్ రీజినల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్ తెలిపారు. ముందస్తు సమాచారంతో నిఘా ఉంచిన విజిలెన్స్ అధికారులు కిరణ్ జీఎం, సాయి ప్రశాంత్, ధర్మతేజ రెండు ఆటోల్లో తరలిస్తున్న ఈ పొగాకును పట్టుకుని, తదుపరి చర్యల నిమిత్తం జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి తరలించారన్నారు. ఈ సందర్భంగా రీజినల్ మేనేజర్ మాట్లాడుతూ, నిబంధనలు ఉల్లంఘించి అక్రమ రవాణా చేస్తే కఠిన చర్యలు ఉంటాయని హెచ్చరించారు. దళారులను నమ్మి రైతులు మోసపోవద్దని, కేవలం వేలం కేంద్రాలలోనే పొగాకు అమ్మాలని కోరారు. అక్రమ రవాణా సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని, బోర్డు నిబంధనల ప్రకారం బహుమతి కూడా ఇస్తామన్నారు. బ్రైట్ గ్రేడ్ పొగాకు 100 కేజీల బేలుకు రూ.500, మీడియం గ్రేడ్ బేలుకు రూ.400, లో గ్రేడ్ బేలుకు రూ.200, పొగాకు చూరా బేలుకు రూ.100 చొప్పున పారితోషికం ఇస్తామన్నారు. సమాచారం కోసం ఔస్డీ విజిలెన్స్ గుంటూరు 91540 30702, జంగారెడ్డిగూడెం 98497 77055 నంబర్లలో సంప్రదించవచ్చని ఆర్ఎం సురేంద్రకుమార్ తెలిపారు. -
రాష్ట్రస్థాయి రోల్బాల్ పోటీలకు ఎంపిక
తణుకు అర్బన్: రోల్బాల్ అసోసియేషన్ ఆఫ్ అంద్రప్రదేశ్ ఆధ్వర్యంలో శనివారం తణుకులో జరిగిన రోల్ బాల్ జిల్లా స్థాయి ఎంపిక పోటీల్లో 8 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి వి.లావణ్య తెలిపారు. ఎంపికలకు 18 మంది క్రీడాకారులు హాజరుకాగా అండర్ 14 విభాగంలో ఆర్.గగన్దీప్, కె.యశ్వంత్, జి.భువన్, వి.వీహాస్, అండర్ 17 విభాగంలో జి.రంజిత్, కె.అఖిల్, ఎం.తనిష్క్, ఎన్.శరత్రావు ఎంపికై నట్లు చెప్పారు. ఈనెల 24 నుంచి 26 తేదీల్లో గుంటూరులో జరిగే రోల్ బాల్ రాష్ట్రస్థాయి పోటీలకు వీరు పశ్చిమ గోదావరి జిల్లా తరుఫున ఆడనున్నారని వివరించారు. -
తల్లి లేక.. తండ్రి ప్రేమకు నోచుకోక..
తల్లి లేని లోటు, తండ్రి లేని అనాథరికం ఆ పసి హృదయాన్ని నిలువెల్లా దహించివేసింది. రెండేళ్ల క్రితం కన్నతల్లి ఏ కాలువలో దూకి అదృశ్యమైందో.. అదే గోస్తనీ కాలువ ఒడ్డున నిలబడి శుక్రవారం 15 ఏళ్ల లాస్య బలవన్మరణానికి యత్నించింది. ఎందుకు బతకాలి? అనే నిరాశతో ఆ బాలిక తీసుకున్న నిర్ణయం తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదఛాయలు నింపింది. తణుకు అర్బన్: తల్లి లేకపోవడం, తండ్రి బాధ్యతారాహిత్యం వంటి కుటుంబ సమస్యల నేపథ్యంలో 15 ఏళ్ల బాలిక తణుకులో కాలువలోకి దూకి ఆత్మహత్యకు యత్నించింది. తణుకు హౌసింగ్ బోర్డు కాలనీకి చెందిన గాలిదేవర పెద్దిరాజు, దుర్గల మనుమరాలు గాలిదేవర శ్రీ యామిని లాస్య (15) పది వరకు చదువుకుని, ప్రస్తుతం ఒక ప్రైవేటు దంత వైద్యశాలలో పనిచేస్తోంది. తండ్రి వెంకటేశ్వరరావు గత కొన్నేళ్లుగా కుటుంబాన్ని వదిలేసి విజయవాడలో ఉంటున్నాడు. దీంతో లాస్య పట్టణంలోని బెల్లం మార్కెట్ ప్రాంతంలో మేనత్త సత్యవతి వద్ద, ఆమె చెల్లెలు నానమ్మ ఇంట పెరుగుతున్నారు. శుక్రవారం ఉదయం నానమ్మ ఇంటికి వచ్చి మాట్లాడిన లాస్య ఆసుపత్రికి వెళ్తున్నానని చెప్పి బయలుదేరింది. తల్లి బాటలోనే కుమార్తె రెండేళ్ల క్రితం కుటుంబ కలహాల కారణంగా లాస్య తల్లి లక్ష్మి కూడా అదే గోస్తనీ కాలువ వంతెన పైనుంచి దూకి గల్లంతైంది. ఇప్పటికీ ఆమె ఆచూకీ లభించలేదు. ఇప్పుడు కుమార్తె లాస్య కూడా తల్లి మరణించిన అదే ప్రదేశం నుంచే కాలువలోకి దూకడం గమనార్హం. రక్షించే ప్రయత్నం విఫలం కాలువలోకి దూకడానికి ముందు లాస్య వంతెనపై అనుమానాస్పదంగా తిరుగుతుండటం చూసి కొందరు ప్రశ్నించగా చేపలు చూస్తున్నానని సమాధానమిచ్చింది. దూకిన తర్వాత సుమారు 200 మీటర్ల దూరం ఆమె నీటిపై తేలుతూ వెళ్తుండటం గమనించిన స్థానిక మహిళలు ఒడ్డుకు రావాలని కేకలు వేశారు. కానీ ఆమె వారిని చూస్తూనే నీటి ప్రవాహంలో కొట్టుకుపోయింది. అక్కడ పురుషులెవరూ లేకపోవడంతో ఆమెను కాపాడలేకపోయారు. పోలీసుల దర్యాప్తు : సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది గాలింపు చర్యలు చేపట్టినా లాస్య ఆచూకీ లభించలేదు. తణుకు పట్టణ ఎస్సై సీహెచ్వీ సత్యనారాయణ ఘటనా స్థలానికి చేరుకుని పరిశీలించారు. తల్లి లేని లోటు, తండ్రి నిరాదరణ వల్ల మనస్తాపానికి గురై ఆత్మహత్యకు యత్నించింది, లేక మరేదైనా వేధింపుల కారణమా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. గోస్తనీ కాలువలో దూకి బాలిక గల్లంతు రెండేళ్ల క్రితం అదే ప్రాంతంలో కాలువలో దూకిన బాలిక తల్లి తణుకు హౌసింగ్ బోర్డు కాలనీలో విషాదఛాయలు -
ఆక్వా అతలాకుతలం
సమావేశానికి హాజరైన ఆక్వా రైతులు, పార్టీ శ్రేణులు, బువ్వనపల్లిలో ఆక్వా రైతుల సమావేశంలో మాట్లాడుతున్న పేర్ని నానిగణపవరం: రాష్ట్రంలో ప్రగతి పథంలో నడుస్తున్న ఆక్వారంగం, కూటమి పాలనలో అధోగతిపాలైందని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ సీనియర్ నాయకుడు పేర్ని నాని అన్నారు. శుక్రవారం రాత్రి బువ్వనపల్లిలోని వైఎస్సార్సీపీ నియోజకవర్గ కార్యాలయంలో నిర్వహించిన ఆక్వా రైతుల సదస్సులో ఆయన ముఖ్యఅతిథిగా పాల్గొన్నారు. ఈ సదస్సుకు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు అధ్యక్షత వహించారు. ఆక్వా రైతులపై భారం పేర్ని నాని మాట్లాడుతూ.. రెండేళ్లుగా రాష్ట్రంలో ఏ ఆక్వా రైతు మొహంలో చిరునవ్వు లేదని, రైతులు నేడు తిరగబడే పరిస్థితి వచ్చిందని అన్నారు. వైఎస్సార్సీపీ పాలనలో మేతల ధర కిలోకు రూ.2 పెంచితేనే అప్పట్లో జగన్కు లంచాలు వెళ్తున్నాయని గగ్గోలు పెట్టిన పచ్చనేతలు, ఇప్పుడు కిలోకు రూ.10 పెంచి, తొడగొట్టి చెబుతుంటే ఏం చేస్తున్నారని ప్రశ్నించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు, వ్యవసాయశాఖ మంత్రి అచ్చెన్నాయుడు మేతల కంపెనీలను కిలోకు రూ.4 తగ్గించమని ఆదేశిస్తే, వారు కేవలం రూ.2 మాత్రమే తగ్గించి తమ సత్తా ఏంటో చూపెట్టారని విమర్శించారు. కంపెనీలతో పాలక పెద్దలు కుమ్మక్కు కాకుండా ఇలాంటి దుస్సాహసానికి ఒడిగట్టడం సాధ్యం కాదన్నారు. ఈ ప్రభుత్వానికి ఇప్పటికే సగం చార్జింగ్ దిగిపోయిందని, మిగిలిన చార్జింగ్ను రైతులు దింపుతారని హెచ్చరించారు. భీమవరం వస్తున్న జగన్ జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ.. ఆక్వా రైతుల కష్టాలను స్వయంగా తెలుసుకోవడానికి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈ నెల 15న భీమవరం వస్తున్నారని, ఆయన పర్యటనను రైతులు పెద్ద సంఖ్యలో పాల్గొని విజయవంతం చేస్తే ప్రభుత్వం కళ్లు తెరుస్తుందని అన్నారు. మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ.. ప్రభుత్వానికి అధిక ఆదాయం తెచ్చిపెడుతున్న ఆక్వారంగాన్ని కూటమి ప్రభుత్వం దగా చేస్తోందని, ఇచ్చిన ఏ ఒక్క హామీని అమలు చేయకుండా రైతులను ముంచేస్తున్నారని విమర్శించారు. వైఎస్ జగన్ పాదయాత్రలో గణపవరం మండలంలోనే ఆక్వా రైతులకు సబ్సిడీ విద్యుత్ పథకాన్ని ప్రకటించిన విషయాన్ని గుర్తు చేశారు. కార్యక్రమంలో ఎంపీపీలు అర్ధవరం రాము, ధనుకొండ ఆదిలక్ష్మి, గంటా శ్రీలక్ష్మి, కనుమాల రామయ్య, జెడ్పీటీసీ సభ్యులు దేవారపు సోమలక్ష్మి, కోడే కాశీ, కొరిపల్లి జయలక్ష్మి, తుమ్మగుంట రంగాభవాని, మండల పార్టీ అధ్యక్షులు దండు రాము, సంకు సత్యకుమార్, మరడ మంగారావు, రావిపాటి శ్రీనివాస్, పార్టీ సీనియర్ నాయకులు ముళ్లగిరి జాన్సన్, వెజ్జు వెంకటేశ్వరరావు, నడింపల్లి సోమరాజు, శెట్టి రాజా, నియోజకవర్గ పరిశీలకుడు ఏఎస్ రాజు, కాన్వెంట్ శ్రీను తదితరులు పాల్గొన్నారు. -
ఆ రోజులు మళ్లీ రావాలి
శనివారం శ్రీ 11 శ్రీ జూలై శ్రీ 2026భీమవరం: ఆక్వా హబ్గా పేరొందిన జిల్లాలో అనేక సమస్యలతో సతమతమవుతున్న ఆక్వా రైతులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లా పర్యటన కోసం వేయి కళ్లతో ఎదురుచూస్తున్నారు. జగన్ పర్యటనతో ప్రభుత్వంలో కదలిక వస్తే తమ కష్టాలు కొంతైనా తీరతాయని గంపెడాశతో ఉన్నారు. ప్రభుత్వానికి డాలర్ల పంట పండిస్తున్న ఆక్వా సాగులో రైతుల ఇబ్బందులు ప్రభుత్వానికి కళ్లకు కట్టినట్లు కన్పిస్తున్నా వాటి పరిష్కారానికి చొరవ చూపకపోవడంతో రైతులు సాగులో నష్టాలను భరించలేక క్రాప్ హాలీడే తప్ప మరొక మార్గం లేదనే నిర్ణయానికి వచ్చారు. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 1.20 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగుచేస్తుండగా దాంతో సుమారు 90 వేల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు విద్యుత్ యూనిట్ రూ.1.50 అందించడంతోపాటు ఫీడ్, సీడ్ ధరలపై నియంత్రణ విధించారు. కోవిడ్ సమయంలో ఎగుమతులు లేవంటూ రొయ్యల ఎగుమతులదారులు ధరలు ఘననీయంగా తగ్గించగా.. ఎక్స్పోర్టు కంపెనీల వద్ద రెవెన్యూ అధికారులను పెట్టి రైతులు నష్టపోకుండా ప్రభుత్వం నిర్ణయించిన ధరకు కొనుగోలు చేయించారు. ప్రస్తుత పరిస్థితిని రైతులు గుర్తు చేసుకుని కూటమి ప్రభుత్వం ఆక్వా రంగానికి చేస్తున్న ద్రోహంపై మండిపడుతున్నారు. ముంచిన మేత ధరలు రొయ్యల మేత తయారీకి ఉపయోగించే ముడిసరుకు ధరలు పెరిగాయంటూ ఇటీవల ఫీడ్ ధరలు విపరీతంగా పెంచారు. ఇదే తరుణంలో రొయ్యల ధరలు పతనం కావడంతో రైతులు రోడెక్కి ఆందోళనలు చేపట్టారు. గతంలో ఎన్నడూలేని విధంగా ఫీడ్ బస్తాలను రోడ్డుపై వేసి తగులబెట్టారు. రొయ్యలు రోడ్డుపై పారబోసి నిరసన తెలిపారు. పంట విరామంటూ చెరువుల వద్ద ఫ్లెక్సీలు పెట్టి మరీ నిరసన తెలిపారు. ఈ సమయంలో వైఎస్సార్సీపీ రైతులకు అండగా ఉంటుందంటూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రకటించడంతో కంగారు పడ్డ ప్రభుత్వం తక్షణం ఫీడ్ ధరను కిలోకు రూ.4 తగ్గిస్తామని, సబ్సిడీ విద్యుత్ను ఆక్వా రైతులందరికీ వర్తించేలా నిర్ణయం తీసుకుంటామని ప్రకటించింది. అయితే ఫీడ్ కంపెనీలు కేవలం రూ.2 లు మాత్రమే తగ్గించడంతో రైతులు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. సబ్సిడీ విద్యుత్ ఫలాలు నేటికీ రైతులకు అందకపోవడంతో ప్రభుత్వం పట్ల తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. తెగుళ్లతో కుదేలు జూన్ నెల ప్రారంభం నుంచి రొయ్యల సాగుకు ప్రతికూల వాతావరణంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఎండ, ఉక్కబోత ఎక్కువగా ఉండడం వెంటనే ఈదురుగాలులు, వర్షంతో చల్లగా మారడంతో రొయ్యలకు వైరస్ వ్యాపిస్తున్నాయి. వైట్గట్ తెగుళ్లుతో నష్టపోతున్నారు. తెగుళ్ల కారణంగా మందులకు పెద్ద మొత్తంలో పెట్టుబడి పెట్టాల్సి రావడంతోపాటు తీవ్రంగా నష్టపోతున్నారు. ఒకప్పుడు మీసం మెలేసిస రొయ్యల రైతు నేడు దిగాలుగా చెరువు వైపు చూస్తున్నారు. ఇప్పటికే చెరువులు తవ్వకానికి, విద్యుత్, ఇంజిన్లు, ఏరియేటర్స్ వంటివాటికి లక్షలాది రూపాయలు పెట్టుబడి పెట్టిన రైతులు ప్రతికూల వాతావరణం, ప్రభుత్వ సహాయం లేకపోవడంతో దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఇలాంటి సమయంలో జగన్ పర్యటన సందర్భంగా ప్రభుత్వంలో చలనం వచ్చి రైతులకు మేలుచేకూర్చేలా నిర్ణయాలు తీసుకుంటుందని ఆశిస్తున్నారు. వైఎస్ జగన్ పాలనను గుర్తు చేసుకుంటున్న ఆక్వా రైతులు జగన్ భీమవరం పర్యటనపై ఆశలన్నీ తగ్గని ఫీడ్, సీడ్ ధరలతో రైతులు సతమతం అమలు కాని సబ్సిడీ విద్యుత్ -
కదం తొక్కిన అంగన్వాడీలు
ఏలూరు (టూటౌన్): అంగన్వాడీ వర్కర్ల సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ సీఐటీయూ అనుబంధ ఆంధ్రప్రదేశ్ అంగన్వాడీ వర్కర్స్ అండ్ హెల్పర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరులో కదం తొక్కారు. కలెక్టరేట్ వద్ద ఆందోళన నిర్వహించారు. పోలీసులకు, యూనియన్ నాయకులకు మధ్య తీవ్ర వాగ్వాదం, తోపులాట జరిగింది. బారికేడ్లను తోసుకుని వెళ్ళేందుకు ప్రయత్నించారు. ముందుగా జ్యూట్మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి ప్రదర్శనగా కలెక్టర్ కార్యాలయం వరకు వెళ్లారు. అంగన్వాడీ వర్కర్లను ప్రభుత్వ ఉద్యోగులుగా గుర్తించాలని, కనీస వేతనం అమలు చేయాలని, పెన్షన్, పీఎఫ్ ఇవ్వాలని, సంక్షేమ పథకాలు అమలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన వేతన పెంపు హామీని అమలు చేయాలని నినాదాలు చేశారు. అంగన్వాడీల ఆందోళనకు యూనియన్ జిల్లా కార్యదర్శి టి.మాణిక్యం అధ్యక్షత వహించారు. యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కారుసాల సుబ్బరావమ్మ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం తమను మోసం చేసిందని విమర్శించారు. మార్చిలో వారం రోజుల్లో వేతనాలు పెంచేలా ముఖ్యమంత్రి ప్రకటన చేస్తారని అసెంబ్లీ వేదికగా రాష్ట్ర మంత్రి ఇచ్చిన ప్రకటన అడుగు కూడా ముందుకు పడలేదని చెప్పారు. అంగన్వాడీలకు కనీస వేతనం రూ.26 వేలు ఇవ్వాలని కోరారు. పెన్షన్, పీఎఫ్, ఈఎస్ఐ వంటి సామాజిక భద్రతా సౌకర్యాలు అమలు చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ కేంద్రం ఐసీడీఎస్ను ఏర్పాటు చేసి 50 సంవత్సరాలు పూర్తయినా నేటికీ అంగన్వాడీలను కార్మికులుగా గుర్తించలేదన్నారు. అనంతరం జిల్లా అధికారులను, కలెక్టర్ను కలిసేందుకు మూకుమ్మడిగా బయలుదేరారు. దీనితో పోలీసులు బారికేడ్లు అడ్డుగా పెట్టారు. మూడో పట్టణ సీఐ కోటేశ్వరరావు సిబ్బందితో అడ్డుకున్నారు. అనంతరం ధర్నా శిబిరం వద్దకు జిల్లా రెవెన్యూ అధికారి మైథిలి, కలెక్టరేట్ పరిపాలన అధికారి నాంచారయ్య, ఐసీడీఎస్ ప్రాజెక్టు డైరెక్టర్ శారద చేరుకుని సమస్యల పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. -
రుద్రమకోటలో ఎస్డీఆర్ఎఫ్ మాక్ డ్రిల్
వేలేరుపాడు: ప్రకృతి వైపరీత్యాలు, ముఖ్యంగా గోదావరి నదికి వచ్చే వరదల సమయంలో ప్రాణ, ఆస్తి నష్టాన్ని తగ్గించేందుకు అవసరమైన సహాయక చర్యలపై ఏలూరు జిల్లా పోలీసులు, ఎస్డీఆర్ఎఫ్ బృందాలు సంయుక్తంగా మండలంలోని రుద్రమకోట గ్రామంలో మాక్ డ్రిల్ నిర్వహించాయి. ఈ సందర్భంగా వరద సమయంలో నీటిలో చిక్కుకున్న వారిని సురక్షితంగా ఎలా బయటకు తీసుకురావాలనే అంశంపై సిబ్బందికి అవగాహన కల్పించారు. అత్యవసర పరిస్థితుల్లో తమ ప్రాణాలను కాపాడుకుంటూనే, బాధితులను ఎలా కాపాడాలనే అంశాలపై ఎస్డీఆర్ఎఫ్ సిబ్బంది ప్రత్యక్ష ప్రదర్శన చేశారు. రెస్క్యూ సమయంలో ఉపయోగించే బోట్లు, లైఫ్ జాకెట్లు, ఇతర అత్యాధునిక పరికరాల వినియోగంపై సిబ్బందికి శిక్షణ ఇచ్చారు. వరద ప్రభావిత ప్రాంతాల్లో ఉన్న ప్రజలు ఎల్లప్పుడూ అప్రమత్తంగా ఉండాలని, ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు కంగారు పడకుండా అధికారుల సూచనలను పాటించాలని కోరారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ శ్రీనివాసరావు, కుక్కునూరు ఇన్స్పెక్టర్ బాల సురేష్బాబు, వేలేరుపాడు ఎస్సై నవీన్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
విద్యుత్ షాక్తో యువతి మృతి
ఏలూరు టౌన్: శిక్షణ పొందిన కోర్సులో నైపుణ్యం సాధించింది. సొంతంగా తన కాళ్లపై నిలబడి, కుటుంబానికి అండగా ఉండాలని అడుగులు వేస్తున్న యువతి ఆశలు ఆవిరయ్యాయి. వివరాల ప్రకారం ఏలూరు వన్టౌన్ ఏసుపాదపురానికి చెందిన వంజరపు మనోజ (24) శుక్రవారం విద్యుత్ షాక్తో మృతి చెందింది. బ్యూటీషియన్ కోర్సు పూర్తి చేసిన మనోజ ఏలూరు వన్టౌన్లోని కన్నయ్య పార్క్ వద్ద ఓ భవనంలో బోటిక్ షాపును ప్రారంభించేందుకు పూనుకుంది. శుక్రవారం ఉదయం బోటిక్ వ్యాపారాన్ని ప్రారంభించేందుకు సామగ్రి అంతా కొనుగోలు చేసింది. అలాగే షాపు ఓపెనింగ్కు సంబంధించి భవనం మొదటి అంతస్తు వద్ద ఫ్లెక్సీ ఏర్పాటు చేస్తోన్న తరుణంలో సమీపంగా వెళ్తున్న విద్యుత్ వైర్లకు ఫ్లెక్సీ ఐరన్ పైప్ తగలడంతో విద్యుత్షాక్తో సంఘటనా స్థలంలోనే మనోజ మృతి చెందింది. సమాచారం అందుకున్న ఏలూరు వన్టౌన్ పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు సర్వజన ఆసుపత్రి మార్చురీకి తరలించారు. -
జంగారెడ్డిగూడెంలో అంబేడ్కర్ విగ్రహం ధ్వంసం
జంగారెడ్డిగూడెం : స్థానిక ఇందిరానగర్ కాలనీలో గురువారం రాత్రి నిర్మాణంలో ఉన్న అంబేడ్కర్ భవన పునాదులతో పాటు విగ్రహాన్ని ధ్వంసం చేశారని ప్రముఖ అంబేడ్కర్ వాది పీఎస్ఎస్ఎస్ గాంధీ శుక్రవారం ఆవేదన వ్యక్తం చేశారు. గత 26 ఏళ్లుగా కాలనీలో అంబేడ్కర్ ఉత్సవాలను శాంతియుతంగా నిర్వహిస్తున్నామన్నారు. అయితే గురువారం రాత్రి కొందరు దుండగులు దౌర్జన్యంగా ప్రవేశించి అంబేడ్కర్ హాలు పునాదులను, స్థలం చుట్టూ వేసిన తాత్కాలిక కాంపౌండ్ క్లాత్ను ధ్వంసం చేశారని తెలిపారు. నిర్మాణ సామగ్రిని నేలపాలు చేయడమే కాకుండా, ఇక్కడ విగ్రహం ఉండడానికి వీల్లేదంటూ కుల వివక్షతో కూడిన మాటలతో దూషించారని ఆరోపించారు. అంబేడ్కర్ విగ్రహం ముక్కును పగలగొట్టారని, ప్రొక్లెయిన్తో మొత్తం విగ్రహాన్ని కూలగొడతామంటూ నానా హంగామా చేసి స్థానికులను భయబ్రాంతులకు గురిచేశారని వివరించారు. నిందితులను గుర్తించి కఠిన చర్యలు తీసుకోవాలని పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశామని పేర్కొన్నారు. యలమంచిలి: అబ్బిరాజుపాలెం సూరయ్య రేవు ఫెర్రీ వేలం రూ.8.10 లక్షలకు ఖరారైంది. స్థానిక సచివాలయంలో ఇన్చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ పర్యవేక్షణలో గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్ వేలం నిర్వహించారు. గ్రామానికి చెందిన శిరిగినీడి శ్రీనివాస్, శిరిగినీడి వెంకటేశ్వరరావు చెరో రూ.50 వేలు ధరావతు, రూ.5 లక్షలు సాల్వెన్సీ, పంటు లైసెన్స్దారు నుంచి అగ్రిమెంట్ తీసుకుని వేలంలో పాల్గొన్నారు. వేలాన్ని రూ.7.50 లక్షల నుంచి ప్రారంభించి రూ.4 లక్షల వరకు తగ్గించారు. అక్కడి నుంచి శిరిగినీడి శ్రీనివాస్, శిరిగినీడి వెంకటేశ్వరరావు వేలాన్ని పెంచారు. చివరిగా శిరిగినీడి శ్రీనివాస్ రూ.8.10 లక్షలకు దక్కించుకున్నట్లు గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్ ప్రకటించారు. ఉన్నతాధికారులకు సమాచారం అందించి వేలం ఖరారు చేస్తామన్నారు. ఈ వేలం 2027 జూన్ వరకు అమలులో ఉంటుందని గ్రామ కార్యదర్శి ఎం.దుర్గాప్రసాద్ తెలిపారు. పాలకొల్లు సెంట్రల్ : పట్టణంలో ఓ ఆటో బోల్తా కొట్టడంతో వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కోనసీమ జిల్లా రాజోలు మండలం నాగార్జున వీధికి చెందిన గుబ్బల సత్యనారాయణ (57), గుబ్బల రాజేశ్వరి దంపతులకు ఇద్దరు కుమార్తెలు. ఈ నెల 7న పెద్ద అల్లుడు ఆస్ట్రేలియా నుంచి హైదరాబాద్ వస్తున్నారని చూడడానికి వెళ్లిన సత్యనారాయణ దంపతులు శుక్రవారం నర్సాపూర్ ఎక్స్ప్రెస్కు తిరిగి వచ్చారు. స్టేషన్లో దిగిన సత్యనారాయణ దంపతులు బస్టాండ్ వరకూ షేరింగ్ ఆటో ఎక్కారు. స్టేషన్ నుంచి బయలుదేరిన ఆటో డ్రైవర్ అతి వేగంగా నడపడంతో దేశాలమ్మ ఆలయం సమీపంలో దుర్గాప్రూట్స్ జ్యూస్ వద్దకు వచ్చే సరికి బ్రేక్ వేయడంతో ఆటో తిరగబడింది. ఈ ఘటనలో సత్యనారాయణకు తీవ్రమైన గాయాలు కావడంతో స్థానికులు హుటాహుటిన 108కు కాల్ చేసి స్థానిక ప్రభుత్వ ఏరియా ఆసుపత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. మృతుడి భార్య ఫిర్యదు మేరకు కేసు నమోదు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పెదతాడేపల్లి డాక్టర్ బీఆర్.అంబేడ్కర్ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాల, కళాశాలను శుక్రవారం సర్వశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ పి.శ్యామ్ సుందర్ తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పాఠశాలలోని సైన్స్ ల్యాబ్, లైబ్రరీ, వృత్తి విద్య ల్యాబ్, ఇతర విద్యా సౌకర్యాలను పరిశీలించారు. తొలుత నూతనంగా ఏర్పాటు చేసిన లైబ్రరీ హాలును ఆయన ప్రారంభించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ వచ్చే విద్యా సంవత్సరంలో పది ఫలితాల్లో నూరు శాతం లక్ష్యాన్ని సాధించడానికి కృషి చేస్తామన్నారు. ఆయన వెంట ఎంఈఓ–2 పీఎంకే జ్యోతి, ప్రిన్సిపాల్ బి.రాజారావు, ఉపాధ్యాయులు పి.శశికుమార్, ఎస్. ఆనందరావు, డి.కృష్ణ, అనిల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు. -
మురుగు కాలువలో విద్యుత్ స్తంభాలు
ఆకివీడు: పంట కాలువలు, మురుగు కాల్వల ఆక్రమణలపై స్థానిక రైతులు తీవ్ర స్థాయిలో మండిపడుతున్నారు. మండల పరిధిలోని అయిభీమవరం గ్రామంలో పంట కాల్వ గట్టు వెంబడి విద్యుత్ స్తంభాలను ఏర్పాటు చేయడమే కాకుండా, వాటికి సపోర్టుగా మరికొన్ని స్తంభాలను కాల్వ మధ్యలోనే పాతడంపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.ఆకివీడు నుంచి ఏలూరు జిల్లా పోతుమర్రు ప్రాంతానికి విద్యుత్ సరఫరా చేసేందుకు గానూ, ఇక్కడ హైటెన్షన్ వైర్ల కోసం ఈ స్తంభాలను నాటారు. కాలువ మధ్యలో సపోర్టింగ్ స్తంభాలు, కాల్వ గట్టును ఆనుకుని ప్రధాన విద్యుత్ స్తంభాలు ఏర్పాటు చేయడంతో భవిష్యత్తులో పంట కాల్వను ఆధునికీకరించుకునే అవకాశం లేకుండా పోయిందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక రైతుల ఇబ్బందులను పట్టించుకోకుండా, మరో జిల్లాకు విద్యుత్ సరఫరా చేయడం కోసం ఇష్టానుసారంగా స్తంభాలు వేయడంపై రైతులు లబోదిబోమంటున్నారు. ఇప్పటికే కాల్వ గట్లపై ఆక్రమణలు ఉండటంతో కాల్వలను బాగు చేసుకోలేకపోతున్నామని మొరపెట్టుకుంటున్న రైతులకు, ఈ విద్యుత్ స్తంభాల ఏర్పాటుతో దిక్కుతోచని పరిస్థితి ఏర్పడింది. కాలువలో చెత్త, పూడిక పేరుకుపోయినప్పుడు కాలువ తవ్వకం పనులు చేపడితే ఈ విద్యుత్ స్తంభాలు పక్కకు ఒరిగి ప్రమాదాలు జరిగే అవకాశముందని రైతులు హెచ్చరిస్తున్నారు. ప్రస్తుతం అసలు కాలువలో పూడిక తీయడమే చాలా కష్టతరంగా మారిందని ఆందోళన చెందుతున్నారు. అసలు నిబంధనలకు విరుద్ధంగా కాలువల్లో విద్యుత్ స్తంభాల ఏర్పాటుకు అధికారులు, ఉన్నతాధికారులు, ప్రజాప్రతినిధులు ఎందుకు అనుమతులు ఇచ్చారో అర్థం కావడం లేదని పలువురు రైతులు బహిరంగంగానే ఆరోపిస్తున్నారు. -
భీమవరంలో ఎస్ఆర్ షాపింగ్మాల్ ప్రారంభం
భీమవరం: పట్టణంలోని ఉండి రోడ్డులో ఎస్ఆర్ షాపింగ్మాల్ 16వ బ్రాంచ్ను శుక్రవారం సినీ నటి కృతిశెట్టి ప్రారంభించారు. అభిమానులతో సెల్ఫీలు దిగి సందడి చేశారు. భీమవరం పరిసర ప్రాంతాలంటే తనకెంతో ఇష్టమని, ఇక్కడి ప్రేక్షకుల అభిమానం మరువలేనన్నారు. ఎస్ఆర్ షాపింగ్ మాల్లో అద్భుతమైన డిజైన్లు, అన్ని వయసుల వారికి నచ్చే వస్త్రాలు అందుబాటులో ఉంటాయన్నారు. ముందుగా శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, కేంద్ర ఉక్కు, భారీపరిశ్రమశాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, రాజ్యసభ సభ్యుడు పాక వెంకట సత్యనారాయణ, ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు), మాజీ ఎంపీ తోట సీతారామలక్ష్మి, మున్సిపల్ మాజీ చైర్మన్ కొటికలపూడి గోవిందరావు తదితరులు షాపింగ్మాల్ను సందర్శించి వస్త్రాలను పరిశీలించారు. ఈ కార్యక్రమంలో సంస్థ ఎండీ ఎస్.గోపీనాథ్రెడ్డి, డైరెక్టర్ ప్రసాద్రెడ్డి, పర్చేజింగ్ డైరెక్టర్ కేశవరెడ్డి, పీఈవో ఉదయ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. జ్యోతి ప్రజ్వలన చేస్తున్న మండలి చైర్మన్ మోషేన్రాజు, ఎంపీ, ఎమ్మెల్యే, మాట్లాడుతున్న కృతిశెట్టి -
ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియ బహిష్కరణ
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరంలోని ఉప విద్యాశాఖాధికారి (డిప్యూటీ డీఈఓ) కార్యాలయంలో శుక్రవారం నిర్వహించిన డివిజన్ స్థాయి ఉపాధ్యాయుల సర్దుబాటు ప్రక్రియను ఏలూరు నగరపాలక సంస్థ (కార్పొరేషన్) ఉపాధ్యాయులు బహిష్కరించారు. ఉపాధ్యాయ సంఘాల నాయకులు మాట్లాడుతూ జీఓ నెంబర్ 84, 73, 74 రాజ్యాంగ సవరణలకు వ్యతిరేకంగా కార్పొరేషన్ ఉపాధ్యాయులను ఇతర యాజమాన్యాల్లోకి సర్దుబాటు చేయడం వల్లే కౌన్సెలింగ్ ప్రక్రియను బహిష్కరించినట్టు చెప్పారు. కార్పొరేషన్ యాజమాన్యంలోని ఉపాధ్యాయులను ఇతర యాజమాన్య పాఠశాలలకు బదిలీ చేయడమే కాకుండా, నగరానికి దాదాపు 120 కిలోమీటర్ల దూరంలో ఉన్న జిల్లా సరిహద్దు ప్రాంతాలకు పంపాలని చూడటం ఉపాధ్యాయులను తీవ్రంగా వేధించడమేనని వారు మండిపడ్డారు. ఈ మేరకు ఏలూరు ఉప విద్యాశాఖాధికారి నిమ్మగడ్డ రవీంద్ర భారతికి వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ ఏలూరు నగర శాఖ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు కురమా ఆనంద్ కుమార్, అబ్బదాసరి శ్రీనివాసరావు, యూటీఎఫ్ నాయకులు సీహెచ్ షణ్ముఖి, జొన్నకూటి రాజారావు పాల్గొన్నారు. అయితే నగరపాలక సంస్థకు చెందిన సుమారు 10 మంది ఉపాధ్యాయులు సర్దుబాటు ప్రక్రియకు హాజరు కాలేదని, శనివారం నిర్వహించే సర్దుబాటు ప్రక్రియకు హాజరు కాని పక్షంలో వారిపై శాఖా పరమైన చర్యలు తీసుకుంటామని ఉపాధ్యాయుల వాట్సాప్ గ్రూపులకు ఉప విద్యాశాఖాధికారి మెసేజ్లు పంపారు. నిబంధనల ప్రకారం సర్దబాటు చేయని పక్షంలో కోర్టులోనే ఈ విషయాన్ని తేల్చుకోవడానికి సిద్ధపడుతున్నట్టు తెలుస్తోంది. -
దూరవిద్య కోర్సుల ప్రయోజనాలపై అవగాహన
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యా పీఠం ఆధ్వర్యంలో దూర విద్యా విధానంలో నిర్వహిస్తున్న వివిధ కోర్సుల ప్రయోజనాలపై అవసరార్థులకు అవగాహన కలిగించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ సూచించారు. ఏపీఓఎస్ఎస్ 2026–27 విద్యా సంవత్సరానికి సంబంధించిన ఒక రోజు శిక్షణ కార్యక్రమాన్ని శుక్రవారం స్థానిక సుబ్బమ్మదేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ చదువు మధ్యలో ఆపివేసిన వారికి దూరవిద్యా విధానంలో నిర్వహించే పదో తరగతి, ఇంటర్మీడియట్ కోర్సులు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. ఈ విధానంలో 10వ తరగతి పూర్తి చేసిన వారు రెగ్యులర్ ఇంటర్మీడియట్ కోర్సుల్లో చేరవచ్చని, ఇంటర్మీడియట్ పూర్తి చేసిన వారు రెగ్యులర్ డిగ్రీ కోర్సుల్లో చేరవచ్చని తెలిపారు. ఈ కార్యక్రమంలో విద్యాశాఖ అసిస్టెంట్ కమిషనర్ ఆర్ ఆశ, జిల్లాలోని ఎంఈఓలు, అపోస్ గుర్తింపు పొందిన కేంద్రాల ప్రతినిధులు పాల్గొన్నారు. కుక్కునూరు: మండలంలోని తొండిపాక పంచాయతీలో ఉపాధి హామీ పథకం పనుల్లో జరిగిన అవకతవకలపై అధికారులు ఎట్టకేలకు చర్యలు చేపట్టారు. ఉపాధి హామీ పనుల్లో అక్రమాలపై సాక్షిలో కథనం నేపథ్యంలో టెక్నికల్ అసిస్టెంట్ (టీఏ), ఫీల్డ్ అసిస్టెంట్ (ఎఫ్ఏ)ను సస్పెండ్ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. వాస్తవంగా పనులు చేయకుండానే చేసినట్లు మస్తర్లు అప్లోడ్ చేసి బిల్లులు డ్రా చేసినట్లు ఆరోపణలు వెల్లువెత్తాయి. దీంతో సంబంధిత సిబ్బంది అవకతవకలకు పాల్పడ్డారన్న విషయం వెలుగులోకి వచ్చింది. ఈ వ్యవహారంపై పత్రికల్లో వచ్చిన కథనాలను అధికారులు సీరియస్గా తీసుకుని విచారణ చేపట్టారు. అక్రమాలు జరిగినట్లు తేలడంతో శుక్రవారం సంబంధిత ఫీల్డ్ అసిస్టెంట్, టెక్నికల్ అసిస్టెంట్లను సస్పెండ్ చేస్తూ చర్యలు తీసుకున్నారు. -
పంట కాల్వలకు నీటి విడుదల
కై కలూరు: సాగు నీరు లేక వరి నారు ఎండిపోతున్న వైనంపై రైతుల ఇబ్బందులను వివరిస్తూ ‘తడవని మడి.. అన్నదాత అలజడి’ శీర్షికతో సాక్షిలో శుక్రవారం కథనం వెలువడిన విషయం పాఠకులకు విధితమే. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ స్పందించి నీటిని శివారు ప్రాంతాలకు విడుదల చేయాలని ఇరిగేషన్ సిబ్బందిని ఆదేశించారు. ఇరిగేషన్ డీఈఈ ఎం.శిరిష కై కలూరు నియోజకవర్గానికి నీటిని చేరవేసే పోల్రాజ్, క్వాంప్ బెల్ కాల్వలకు ఒక్కోదానికి 100 క్యూసెక్కుల నీటిని విడుదల చే యించారు. పాలకొల్లు సెంట్రల్: నరసాపురం నుంచి బెంగళూరుకు వీక్లీ ఎక్స్ ప్రెస్ రైలును కేంద్ర ఉక్కు శాఖ సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ శుక్రవారం ప్రారంభించారు. రైలు ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 3:50 గంటలకు నరసాపురం నుంచి బయలుదేరి, మరుసటి రోజు ఉదయం 9:45 గంటలకు బెంగళూరు చేరుతుంది. ప్రతి శనివారం ఉదయం 11:00 గంటలకు బెంగళూరు నుంచి బయలుదేరి మరుసటి రోజు ఉదయం 5:50 గంటలకు నరసాపురం చేరుకుంటుంది. -
తరగతుల కుదింపును ఉపసంహరించుకోవాలి
ఏలూరు (టూటౌన్): గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలల్లో తరగతుల కుదింపును ఉపసంహరించుకోవాలని, ప్రభుత్వ పాఠశాలల్లోని మౌలిక వసతుల సమస్యలను పరిష్కరించాలని కోరుతూ పీడీఎస్ఓ ఆధ్వర్యంలో ఏలూరు నగరంలోని కరల్ర వంతెన సెంటర్ నుంచి పాత బస్టాండ్ మీదుగా అంబేద్కర్ విగ్రహం కూడలి వరకు నిరసన ప్రదర్శన నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పీడీఎస్ఓ రాష్ట్ర కోశాధికారి ఎల్.భాను మాట్లాడుతూ తరగతుల కుదింపు రద్దు రేషనలైజేషన్ పేరుతో జిల్లెలగూడెం, ఇటుకలకోట, లంకపాకల, పులిరామన్న గూడెం ఆశ్రమ పాఠశాలల్లో తరగతులను కుదించడం వల్ల ఆదివాసీ పిల్లలు విద్యకు దూరమవుతున్నారని, 10–20 కి.మీ దూరంలోని పాఠశాలలకు వెళ్లలేక విద్యార్థులు బడి మానేస్తున్నారని, వీటిని వెంటనే నిలిపివేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు కోటదిబ్బ ప్రభుత్వ బాలుర ఉన్నత పాఠశాలలో పాడైపోయిన తరగతి గదుల పైకప్పులను బాగు చేయాలని, స్మార్ట్ కిచెన్ ఏర్పాటు చేయడంతో పాటు కంప్యూటర్ ఇన్స్ట్రక్టర్ను నియమించాలన్నారు. -
ఆపరేషన్ గోల్డ్మాల్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో జరిగిన భారీ గోల్డ్లోన్ మోసాన్ని పోలీసులు ఛేదించారు. వినియోగదారులు తాకట్టు పెట్టిన దాదాపు రూ.10 కోట్ల విలువైన బంగారాన్ని బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ మాయం చేసినట్లు పోలీసులు గుర్తించారు. ఈ కేసుకు సంబంధించిన వివరాలను జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ మీడియా సమావేశంలో వెల్లడించారు. జంగారెడ్డిగూడెంలోని బ్యాంక్ ఆఫ్ బరోడాలో ఖాతాదారులు తమ బంగారు ఆభరణాలను కుదువపెట్టి రుణాలు తీసుకున్నారు. అయితే బ్యాంక్లో భారీగా గోల్డ్ లోన్ మోసం జరిగినట్లు గుర్తించిన బ్యాంక్ సీనియర్ మేనేజర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. జిల్లా ఎస్పీ పర్యవేక్షణలో, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత ఈ కేసుపై దర్యాప్తు చేపట్టారు. విచారణలో భాగంగా 176 గోల్డ్ లోన్ ఖాతాల్లో భారీ అవకతవకలు జరిగినట్లు పోలీసులు కనుగొన్నారు. సుమారు రూ. 10 కోట్ల విలువైన, దాదాపు 6.449 కిలోల బంగారు ఆభరణాలు మాయమైనట్లు తేలింది. గోల్డ్ అప్రైజర్ రాజు అరెస్ట్ ఈ మోసానికి పాల్పడిన జంగారెడ్డిగూడెం వెలమపేట ప్రాంతానికి చెందిన బ్యాంక్ గోల్డ్ అప్రైజర్ చలపాక రాజును పోలీసులు అరెస్టు చేశారు. ఖాతాదారులు తాకట్టు పెట్టిన అసలైన బంగారాన్ని అపహరించి, వాటి స్థానంలో నకిలీ ఆభరణాలను ఉంచినట్లు దర్యాప్తులో వెల్లడైంది. అపహరించిన బంగారాన్ని నిందితుడు తన పేరుతో, తన తల్లిదండ్రుల పేరుతో జంగారెడ్డిగూడెంలోని వివిధ జ్యూవెలరీ షాపుల్లో విక్రయించడమో లేదా తాకట్టు పెట్టడమో చేసినట్లు ఆధారాలు లభించాయి. సొత్తు రికవరీ.. సిబ్బందికి అభినందనలు నిందితుడి నుంచి రూ. 10 లక్షల నగదును, వివిధ జ్యూవెలరీ షాపుల నుంచి సుమారు 4.120 కిలోల బంగారు ఆభరణాలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న ఈ సొత్తు విలువ సుమారు రూ.5.81 కోట్లు ఉంటుందని అంచనా వేశారు. ఈ కేసులో ఇంకా ఎవరి ప్రమేయమైనా ఉందా అనే కోణంలో లోతైన విచారణ చేస్తున్నామని ఎస్పీ తెలిపారు. కేసును సమర్థవంతంగా ఛేదించిన ఏఎస్పీ సుస్మిత, సీఐ ఎం.వి.సుభాష్, ఎస్సైలు ఎన్.వీరప్రసాద్, ఎం.కుటుంబరావు, ఎస్.కె.జబీర్, ఎస్.వల్లీపద్మ, ఇతర సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. ఛేదించిన జంగారెడ్డిగూడెం పోలీసులు రూ.10 కోట్ల విలువైన 6.449 కిలోల బంగారం మాయం రూ.10 లక్షల నగదు, 4.12 కిలోల బంగారం రికవరీ -
ధరల శ్లాబ్లో నిలకడ అవసరం
రొయ్యల ధరల్లో నిలకడలేకపోవడంతో రైతులు నష్టపోతున్నారు. రొయ్యలు 80 కౌంట్ నుంచి కౌంట్ తగ్గే స్థితిలో గతంలో కేవలం రూ.10 వ్యత్యాసం ఉండగా నేడు రూ.30 వరకు ఉంటుంది. దీంతో రైతులకు నష్టాలు తప్పడంలేదు. రొయ్యల ధరలు 15 రోజులపాటు ఒకే విధంగా ఉండేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – గాదిరాజు సుబ్బరాజు, ఆక్వా ఫ్రాన్ ఫార్మర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ కార్యదర్శి ప్రస్తుతం రొయ్యలకు వైట్గట్ వంటి వ్యాధులు సోకాయి. ఫీడ్, మందుల ధరలు పెరిగిపోవడంతో పెట్టుబడులు పెట్టలేక సతమతమవుతున్నారు. తెగుళ్ల కారణంగా అనేక చెరువులు ఖాళీగానే దర్శన మిస్తున్నాయి. ఫీడ్ ధరలు తగ్గించడానికి, సబ్సిడీ విద్యుత్ రైతులందరికీ అందించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలి. – భోగిరెడ్డి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, తోలేరు ఆక్వా రైతులను కూటమి ప్రభుత్వం పట్టించుకోవడం లేదు. ఆక్వా జోన్స్ ప్రమేయం లేకుండా సబ్సిడీ విద్యుత్ ఇస్తున్నట్లు ప్రకటించి నెలలు గడిచిపోతున్నా అమలు కావడం లేదు. ఫీడ్ ధరలు రూ.4 తగ్గించినట్లు ప్రకటించినా కేవలం రూ.2 మాత్రమే తగ్గించాయి. ముడిసరుకు ధరలు తగ్గించేలా కేంద్రంపై రాష్ట్రప్రభుత్వం ఒత్తిడి తేవాలి. – బొల్లెంపల్లి శ్రీనివాసరావు, ఆక్వా రైతు, అండలూరు -
●ఆచంటేశ్వరునికి జలాభిషేకం
రైతన్నలు, ప్రజల ఇబ్బందులు తొలగించడానికి వర్షాలు సమృద్ధిగా కురువాలని కోరుతూ ఆచంటలోని ఆచంటేశ్వరునికి గోదావరీ జలాలతో సహస్ర ఘట్టాభిషేకం నిర్వహించారు. శుక్రవారం ఉదయం నుంచి పూజా కార్యక్రమాలు నిర్వహించిన, గోదావరి నుంచి వెయ్యి కుండలతో తీసుకువచ్చిన జలాలను వేద పండితుల మంత్రోచ్ఛరణలతో ఆచంటేశ్వరునికి జలాభిషేకం చేశారు. జలాభిషేకం తిలకించడానికి భక్తులు భారీగా హజరయ్యారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ రంగరాజు, చైనెక్కంటి గణేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. – పెనుగొండ -
గ్రేడింగ్ పేరుతో కోతలు తగదు
ద్వారకాతిరుమల : నాణ్యమైన పంటను అందిస్తున్నా గ్రేడింగ్ పేరుతో కోతలు విధించడం సరికాదని ఆయిల్పామ్ రైతులు గోద్రెజ్ ఫ్యాక్టరీ యాజమాన్య ప్రతినిధులను నిలదీశారు. ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురంలో ఆయిల్ పామ్ రైతు సంఘం ఆధ్వర్యంలో శుక్రవారం సమావేశం నిర్వహించారు. సీహెచ్ పోతేపల్లిలోని గోద్రెజ్ ఆయిల్ పామ్ ఫ్యాక్టరీ పరిధిలోని రైతులు, కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. పలువురు రైతులు మాట్లాడుతూ తాము నాణ్యమైన గెలలను ఫ్యాక్టరీకి సరఫరా చేస్తున్నప్పటికీ గ్రేడింగ్ సాకుతో కోతలు విధిస్తూ అన్యాయం చేస్తున్నారని తెలిపారు. ప్రభుత్వ నిబంధనలకు వ్యతిరేకంగా కంపెనీ యాజమాన్యం కోర్టును ఆశ్రయించడం వల్ల రైతులు, కంపెనీ మధ్య సఖ్యత దెబ్బతింటోందని అభిప్రాయపడ్డారు. తక్షణమే ఆ ప్రక్రియను విరమించుకుని, రైతులకు ప్రయోజనం చేకూరేలా యాజమాన్యం నిర్ణయం తీసుకోవాలని విజ్ఞప్తి చేశారు. దీనిపై ఫ్యాక్టరీ ప్రతినిధి నవనీత్ స్పందిస్తూ రైతుల సమస్యలను యాజమాన్యం దృష్టికి తీసుకెళ్లి, వాటి పరిష్కారానికి తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ఈ కార్యక్రమంలో ఆయిల్ పామ్ రైతు సంఘం అధ్యక్షుడు, ద్వారకాతిరుమల దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యుడు చింతమనేని హనుమంతరావు, సొసైటీ చైర్మన్ పోలిన శ్రీనివాసరావు, మాసిరెడ్డి హరిబాబు, అక్కిసెట్టి సుధాకర్, మాజీ జడ్పీటీసీ సభ్యుడు దేవరపల్లి వీరాస్వామి చౌదరి తదితరులు పాల్గొన్నారు. -
ప్రత్యేక పీజీఆర్ఎస్లో 150 అర్జీలు
వీరవాసరం : భీమవరం, నియోజకవర్గ పరిధిలో ప్రజా సమస్యలను పరిష్కరించడానికి అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అధికారులను ఆదేశించారు. శుక్రవారం భీమవరం నియోజకవర్గం స్థాయిలో వీరవాసరం మండల కేంద్రం తులసి ఫంక్షన్ హాల్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక ప్రత్యేక కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ నాగరాణి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఈ కార్యక్రమంలో ప్రజల నుంచి వివిధ సమస్యలపై 150 అర్జీలు వచ్చాయని కలెక్టర్ చెప్పారు. ఈ కార్యక్రమంలో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, జేసీ కేఆర్ కల్ప శ్రీ, ఏలూరు జెడ్పీ సీఈఓ పి.జగదాంబ, గృహ నిర్మాణ శాఖ ప్రాజెక్ట్ డైరెక్టర్ జి.పిచ్చయ్య, డ్వామా ప్రాజెక్ట్ డైరెక్టర్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. -
ఫెర్రీ వేలం కోసం గ్రామస్తుల ఆందోళన
యలమంచిలి: అబ్బిరాజుపాలెం ఫెర్రీ వేలాన్ని మూడోసారి కూడా వాయిదా వేయడాన్ని నిరసిస్తూ గురువారం సచివాలయం వద్ద గ్రామస్తులు ఆందోళన చేశారు. గత రెండు పర్యాయాలు సరైన లైసెన్స్ లేని కారణంగా అధికారులు వేలాన్ని వాయిదా వేశారు. ఈసారి గ్రామానికి చెందిన శిరిగినీడి శ్రీనివాస్ లైసెన్స్ అగ్రిమెంట్ తీసుకురావడంతో వేలం రూ.13 లక్షలతో ప్రారంభించారు. రూ.7.50 లక్షల వరకు పాటను తగ్గించారు. అప్పటికీ పాట పాడకపోవడంతో పాటను శుక్రవారం మధ్యాహ్నం రెండు గంటలకు వాయిదా వేస్తున్నట్లు ఇన్చార్జి ఎంపీడీఓ జేడీవీ ప్రసాద్ ఆదేశాల మేరకు పంచాయతీ కార్యదర్శి ఎం దుర్గాప్రసాద్ ప్రకటించారు. దీనిపై గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. గతేడాది రేవు పాట రూ.3.47 లక్షలకు వెళ్లిందని, అంతవరకు తగ్గించి వేలం నిర్వహించాలని పట్టుబట్టారు. అయితే వారి మాటలను పట్టించుకోకుండా వేలాన్ని వాయిదా వేయడంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలాన్ని కొనసాగించాలని సచివాలయం ముందు బైఠాయించి ఆందోళన చేశారు. అనంతరం గ్రామస్తులు మాట్లాడుతూ శుక్రవారం వేలం తీరును చూస్తామని, అకారణంగా మరోసారి వాయిదా వేస్తే కలెక్టర్కు ఫిర్యాదు చేస్తామని చెప్పారు. -
ఎట్టకేలకు గిరిజన విద్యార్థుల బడి బాట
బుట్టాయగూడెం : మండలంలోని పీఆర్గూడెం గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలకు గురువారం నుంచి విద్యార్థులు బడిబాట పట్టారు. సుమారు 28 రోజులపాటు మా బడి మాకే కావాలని పాఠశాల స్థాయి కుదింపు, రేషనలైజేషన్ను నిరసిస్తూ గ్రామస్థులు, విద్యార్థుల తల్లిదండ్రులు చేస్తున్న ఆందోళన, నిరసన కార్యక్రమాన్ని విరమించడంతో పిల్లలు మళ్లీ బడిలో చేరారు. అయితే ఐటీడీఏ పీఓ కె. రాములు నాయక్ విద్యార్థుల తల్లిదండ్రులతో కలిసి విద్యార్థులను ఆయా తరగతి గదులకు పంపించారు. ఈ సందర్భంగా పీఓ మాట్లాడుతూ గిరిజన విద్యార్థుల చదువులకు ప్రత్యేక చర్యలు తీసుకుంటామని చెప్పారు. మాజీ ఎంపీటీసీ సభ్యుడు యు. ఏసుబాబు గ్రామాభివృద్ధి కమిటీ సభ్యులు మూలెం రమేష్, మడకం వెంకటేశ్వరరావు, బట్టు సురేష్ మాట్లాడుతూ 1986 నుంచి ఉన్నత పాఠశాలగా అప్గ్రేడ్ అయ్యి ఎంతోమంది విద్యార్థులకు చదువులు అందిస్తున్న తమ పాఠశాల రేషనలైజేషన్ పేరుతో 8, 9, 10 తరగతులు నిలిచిపోతున్నాయని తెలిసి ఎంతో ఆందోళన చెందామని చెప్పారు. ఈ నేపథ్యంలోనే పాఠశాలను కాపాడుకోవడం కోసం ఆందోళన చేశామన్నారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి, ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, ఏపీఎస్ ఆర్టీసీ జోనల్ చైర్మన్ రెడ్డి అప్పల నాయుడుల సమక్షంలో పులిరామన్నగూడెం, రెడ్డికోపల్లి పాఠశాలను యధాతథంగా కొనసాగించేందుకు జరిగిన చర్చలు ఫలప్రదంకావడంతో తిరిగి పాఠశాలలను ప్రారంభించేందుకు ఒప్పుకున్నారని చెప్పారు. అలాగే పాఠశాలలో నూటికి నూరు శాతం విద్యార్థులు చేర్పించే బాధ్యతను కూడా తీసుకుంటామని చెప్పారు. అలాగే తమపై పెట్టిన అక్రమ కేసులను తొలగించాలని పీఓ దృష్టికి తీసుకువెళ్లారు. ఈ కార్యక్రమంలో కమిటీ సభ్యులు మడకం పాపాయమ్మ, పొడియం వసంత, బన్నే పూర్ణ, లక్ష్మీనారాయణ, డీవైఈఓ రవి ప్రసన్న కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
ఆక్వా రైతులకు అండగా
● 15న వైఎస్ జగన్ భీమవరం రాక ● ఏర్పాట్లను సమీక్షించిన నేతలు ● రైతులతో ముఖాముఖీ వేదికకు స్థల పరిశీలన భీమవరం పర్యటనలో భాగంగా జగన్ ఆక్వా రైతులతో భేటీకానున్నారు. అందుకోసం ఉండి బైపాస్ రోడ్డులో అనువైన స్థలాన్ని శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేనురాజు, రీజనల్ కోఆర్డినేటర్ అమర్నాథ్, ఎమ్మెల్సీ, ప్రోగ్రాం కోఆర్డినేటర్ తలశీల రఘురాం పరిశీలించారు. ఏర్పాట్లుపై నాయకులకు సూచనలు చేశారు. ఆయా కార్యక్రమాల్లో పార్టీ పార్లమెంట్ కార్యదర్శులు, ఎస్ఈసీ సభ్యులు, జిల్లా అనుబంధ విభాగాల నేతలు పాల్గొన్నారు. సాక్షి, భీమవరం: సిండికేట్ దోపిడీతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్న ఆక్వా రైతులకు అండగా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ఈనెల 15న భీమవరం రానున్నారు. ఆక్వా సమస్యలపై ఉండి బైపాస్ రోడ్డులో ఏర్పాటుచేయనున్న వేదిక వద్ద రైతులతో నేరుగా భేటీ కానున్నారు. ఈ సందర్భంగా పర్యటన ఏర్పాట్లపై పార్టీ జిల్లా అధ్యక్షుడు ముదునూరి ప్రసాదరాజు అధ్యక్షతన గురువారం భీమవరంలోని పార్టీ జిల్లా కార్యాలయంలో రీజనల్ కోఆర్డినేటర్ గుడివాడ అమర్నాథ్, కృష్ణా, తూర్పుగోదావరి జిల్లాల అధ్యక్షులు పేర్ని నాని, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, పీఏసీ సభ్యుడు కొట్టు సత్యనారాయణ, నరసాపురం పార్లమెంట్ పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణంరాజు, పార్లమెంట్ కోఆర్డినేటర్ గూడూరి ఉమాబాల, ఉంగుటూరు, తాడేపల్లిగూడెం, భీమవరం, పాలకొల్లు నియోజకవర్గాల కోఆర్డినేటర్లు ఉప్పల వాసుబాబు, వడ్డి రఘురామనాయుడు, చినమిల్లి వెంకట్రావు, గుడాల శ్రీహరిగోపాలరావు తదితరులు సమావేశమయ్యారు. రైతుల ఆందోళనలు చంద్రబాబుకు పట్టవు ఈ సందర్భంగా పర్యటనకు సంబంధించిన వివరాలను అమర్నాఽథ్ మీడియాకు వివరించారు. సీడ్, ఫీడ్, ప్రాసెసింగ్ కంపెనీలు ఏకమై మేత ధరలు పెంచేసి, రొయ్య ధరలు తగ్గించేసి ఆక్వా రైతుల్ని అడ్డగోలుగా దోచుకుంటున్నాయన్నారు. తమను ఆదుకోవాలని రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేస్తున్నా చంద్రబాబు ప్రభుత్వానికి పట్టడం లేదన్నారు. నాలుగైదు కంపెనీలకు ఆక్వా సంపదను దోచిపెట్టేందుకు లక్షలాది ఆక్వా రైతు కుటుంబాల్ని రోడ్డున పడేస్తున్నారని మండిపడ్డారు. మత్స్యకారులు వేటకు వెళ్లి ఆరుగురు గల్లంతయ్యారన్నారు. జంగారెడ్డిగూడెం ప్రాంతంలో పొగాకు రైతులు, డెల్టాలో యూరియా దొరక్క వరి రైతులు పడుతున్న ఇబ్బందులు ఇవేమీ చంద్రబాబుకు పట్టవన్నారు. వైఎస్సార్సీపీ ప్రశ్నిస్తే గొడ్డలంటాడు, తల్లంటాడు, చెల్లంటాడే తప్ప ప్రజాసమస్యల్ని ఏరకంగా పరిష్కరించాలనే ఆలోచన చంద్రబాబు చేయకపోవడం సిగ్గుచేటని విమర్శించారు. ఆక్వా రైతుల సమస్యల పరిష్కారానికి గడువిచ్చినప్పటికి ప్రభుత్వం పట్టించుకోకపోవడంతో రైతుల పక్షాన పోరాటానికి జగన్ భీమవరం వస్తున్నారన్నారు. ఉండి బైపాస్ రోడ్డులో రైతులతో ముఖాముఖీగా సమావేశమై వారి సమస్యలు తెలుసుకుంటారని అమర్నాథ్ తెలిపారు. పేర్ని నాని మాట్లాడుతూ విద్య, ఆక్వా తదితర అన్ని రంగాల్లో తన వాళ్లకి దోచిపెట్టడం లక్ష్యంగా చంద్రబాబు పాలన సాగిస్తున్నారన్నారు. ఇచ్ఛాపురం నుంచి తడ వరకూ ఉన్న తీరప్రాంతం మొత్తం ప్రజలు చేపలు, రొయ్యల సాగుపై ఆధారపడి జీవిస్తున్నారన్నారు. వీరి కష్టాన్ని చంద్రబాబు ఫీడ్, సీడ్ కంపెనీలకు దోచిపెడుతున్నారన్నారు. ఆక్వా చరిత్రలో తొలిసారి జిల్లా అధ్యక్షుడు ప్రసాదరాజు మాట్లాడుతూ నాలుగు దశాబ్దాల ఆక్వా చరిత్రలో రైతులు రోడ్డెక్కి ఆందోళనలు చేయడం మొదటిసారి చూస్తున్నామ న్నారు. రాయితీ విద్యుత్, ధరల నియంత్రణతో జగన్ ఆక్వా రంగాన్ని ఆదుకున్నారన్నారు. అంతకంటే ఎక్కువ మేలు చేస్తామంటూ ఎన్నికల్లో చెప్పుకొచ్చిన చంద్రబాబు రైతుల నడ్డి విరిచారని విమర్శించారు. జగన్ పర్యటనకు సంబంధించిన షెడ్యూల్ను త్వరలో ప్రకటిస్తామని ప్రసాదరాజు తెలిపారు. -
రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు ఎంపిక
ముసునూరు : రాష్ట్రస్థాయి బాస్కెట్బాల్ పోటీలకు రమణక్కపేట జెడ్పీ హైస్కూల్ విద్యార్థినులు ఇందుప్రియ, భార్గవి ఎంపికై నట్లు హెచ్ఎం పీవీఎస్ రామకృష్ణారావు తెలిపారు. ఈ నెల 1న విజయవాడ మేరీ స్టెల్లా కళాశాలలో జరిగిన బాస్కెట్ బాల్ సెలెక్షన్లలో అండర్–16 విభాగంలో తమ విద్యార్థులు ఎంపికయ్యారన్నారు. వీరు విజయవాడ పటమట జెడ్పీ హైస్కూల్లో జరుగనున్న పోటీల్లో ఉమ్మడి కృష్ణా జిల్లా బాస్కెట్ బాల్ జట్టు తరుఫున పాల్గొంటున్నట్లు చెప్పారు. ఈ సందర్భంగా పోటీలకు ఎంపికై న విద్యార్థినులను ఉపాధ్యాయులు, గ్రామ పెద్దలు అభినందించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : గునుపూడి శ్రీ సోమేశ్వర జనార్దస్వామి దేవస్థానంలో గురువారం హుండీల ఆదాయాన్ని లెక్కించారు. 112 రోజులకుగాను రూ. 11,02,607 ఆదాయం లభించింది. విదేశీ కరెన్సీ 4 డాలర్లు ఉన్నాయి. స్వామివారి శాశ్వత నిత్యాన్నదానంనకు రూ.31,045 ఆదాయం వచ్చింది. దేవదాయ ధర్మాదాయ శాఖ భీమవరం తనిఖీ దారు పీఎస్ సాయికుమారి, ధర్మకర్తల మండలి చైర్మన్ చింతలపాటి బంగార్రాజు, ధర్మకర్తల మండలి సభ్యులు, గ్రామస్తులు ఈ కార్యక్రమాన్ని పర్యవేక్షించారు. పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు జై భారత్ క్షీరారామ ఆక్వా సంఘం అధ్యక్షుడిగా పట్టణానికి చెందిన బోణం చినబాబు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. గురువారం పూలపల్లి ఎస్ఎస్ఎస్ కళ్యాణ మండపంలో నూతన కార్యవర్గాన్ని ఎన్నుకున్నారు. గౌరవ అధ్యక్షుడిగా గాంధీ భగవాన్రాజు, నూతన అధ్యక్షుడు బోణం చినబాబు, సెక్రటరీ సత్యనారాయణరాజు, ట్రెజరర్ సోంబాబు, ఇతర కార్యవర్గ సభ్యులను ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా చినబాబు మాట్లాడుతూ గత మూడేళ్లుగా పాలకొల్లు, నరసాపురం, ఆచంట నియోజకవర్గాల ఆక్వా రైతు సంఘం ఏర్పాటుచేసి ఎనలేని పోరాటం చేస్తున్న గాంధీ భగవాన్రాజు రాష్ట్ర అధ్యక్షుడిగా ఎన్నికవ్వడం అభినందనీయమని అన్నారు. జై భారత్ క్షీరారామ ఆక్వా నూతన సంఘం కూడా గాంధీ భగవాన్రాజు బాటను అనుసరిస్తూ ఆక్వా రైతుల సమస్యలపై పోరాటం చేస్తామన్నారు. అలాగే శుక్రవారం లంకలకోడేరు గ్రామంలో ఎంపెడా ఆధ్వర్యంలో జరగనున్న అవగాహనా సదస్సుకు ఆక్వా రైతులు హాజరుకావాలన్నారు. నూతన కార్యవర్గ సభ్యులను ఆక్వా రైతు సంఘం నాయకులు, రైతులు ఘనంగా సత్కరించారు. -
అంగన్వాడీల పోరుబాట
● నేడు ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా ● సమస్యలు పరిష్కరించాలని డిమాండ్ ఏలూరు (టూటౌన్): తమ అపరిష్కృత సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ ఏలూరు జిల్లా వ్యాప్తంగా అంగన్వాడీలు మరోసారి పోరుబాట పట్టారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చి రెండేళ్లు గడుస్తున్నా ఎన్నికల హామీలను నెరవేర్చలేదని ఆవేదన వ్యక్తం చేస్తూ.. ఈ నెల 10న ఏలూరు కలెక్టరేట్ వద్ద మహాధర్నాకు పిలుపునిచ్చారు. ప్రధాన డిమాండ్లు ఇవే.. ● సుప్రీంకోర్టు ఆదేశాల ప్రకారం అంగన్వాడీలకు రూ.26 వేల కనీస వేతనం, ఉద్యోగ భద్రత, పీఎఫ్, ఈఎస్ఐ, గ్రాట్యూటీ సౌకర్యాలు కల్పించాలి. ● అంగన్వాడీల వేతనాలను పీఆర్సీకి అనుసంధానం చేయడంతో పాటు, గుజరాత్ హైకోర్టు తీర్పునకు అనుగుణంగా జీతాలు పెంచాలి. ● మినీ సెంటర్లను మెయిన్ సెంటర్లుగా మార్చాలి. హెల్పర్ల ప్రమోషన్కు 5 ఏళ్ల సీనియారిటీ నిబంధనను రద్దు చేయాలి. ● అంగన్వాడీలకు ‘తల్లికి వందనం’ సహా అన్ని ప్రభుత్వ సంక్షేమ పథకాలను వర్తింపజేయాలి. ● సిగ్నల్ సమస్యలతో తీవ్ర ఇబ్బంది పెడుతున్న ముఖ గుర్తింపు (ఎఫ్ఆర్ఎస్) ఫేస్ యాప్ను, పనిభారం పెంచే నవచేతన యాప్ను తక్షణమే రద్దు చేయాలి. పెండింగ్లో ఉన్న టీఏ, మెయింటినెన్స్ బిల్లులను వెంటనే విడుదల చేయాలి. -
సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్యకేసులో నిందితుడి అరెస్ట్
భీమవరం అర్బన్: సాఫ్ట్వేర్ ఉద్యోగిని హత్యకేసులో నిందితుడు, ఆటో డ్రైవర్ శ్యాంబాబును పోలీసులు అరెస్ట్ చేశారు. భీమవరంలోని రూరల్ పోలీస్ స్టేషన్లో డీఎస్పీ రఘువీర్ విష్ణు గురువారం వివరాలను వెల్లడించారు. తాడేరు గ్రామానికి చెందిన కొత్తపల్లి అనంతవాణి హైదరాబాద్లోని ప్రైవేట్ కంపెనీలో సాఫ్ట్వేర్ ఉద్యోగిని. కొంతకాలంగా తల్లి అనారోగ్యంగా ఉండటంతో స్వగ్రామం తాడేరు వచ్చి వర్క్ ఫ్రం హోం ద్వారా ఉద్యోగం చేస్తోంది. బేతపూడి గ్రామ శివారు కొర్రపాడు గ్రామానికి చెందిన ఆటో డ్రైవర్ శ్యాంబాబు అనంతవాణికి మాయమాటలతో దగ్గరయ్యాడు. అయితే శ్యాంబాబుకు వివాహమై ఇద్దరు పిల్లలు కూడా ఉన్నారని తెలియడంతో కొంతకాలంగా అతడిని దూరం పెడుతూ వచ్చింది. ఈ నేపథ్యంలో అనంతవాణిపై కక్ష్య పెంచుకున్న శ్యాంబాబు ఈ నెల 5వ తేదీన ఆమె ఇంటికి వెళ్లి గొడవ పడి ఆమెను కత్తితో హత్య చేశాడు. దీనిపై కేసు నమోదు చేసిన పోలీసులు నిందితుడు శ్యాంబాబుని యనమదుర్రు గ్రామంలోని వంతెన వద్ద అదుపులోకి తీసుకున్నారు. నిందితుడు హత్యకు వినియోగించిన కత్తి, ఆటో, ద్విచక్ర వాహనం, హత్య చేసిన సమయంలో ధరించిన దుస్తువులను స్వాఽధీనం చేసుకున్నట్లు డీఎస్పీ రఘువీర్ విష్ణు తెలిపారు. విలేకరుల సమావేశంలో రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ జగదీశ్వరరావు, రూరల్ ఎస్సై ఐ వీర్రాజు, పోలీస్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. -
మూసివేసిన బాలకేంద్రం ప్రహరీ గోడ
స్పందనపాలకొల్లు సెంట్రల్ : ఉదయం బాలభవన్... సాయంత్రం క్లబ్ పార్కింగ్ శీర్షికతో గత నెల 24న ‘సాక్షి’లో ప్రచురితమైన కథనానికి అధికారులు, క్లబ్ సభ్యులు స్పందించారు. బాలభవన్ ప్రహరీగోడను ఇష్టానుసారంగా పగులగొట్టి, ఆ స్థలాన్ని క్లబ్ సభ్యులు పార్కింగ్కు వాడుకుంటున్న తీరుపై సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై బాలభవన్ చైర్మన్, జిల్లా కలెక్టర్ స్పందిస్తూ.. క్లబ్ ఆక్రమణలపై తక్షణమే పర్యవేక్షణ చేపట్టాలని స్థానిక అధికారులను ఆదేశించారు. దీంతో స్థానిక తహసీల్దార్, మున్సిపల్ కమిషనర్లు బాలభవన్ ప్రాంతాన్ని సందర్శించి పరిశీలించారు. అనంతరం క్లబ్ నిర్వాహకులను పిలిపించి గట్టిగా హెచ్చరించారు. అధికారుల హెచ్చరికలతో దిగొచ్చిన క్లబ్ సభ్యులు.. గత రెండేళ్లుగా తాము పార్కింగ్ స్థలంగా వాడుకుంటున్న బాలభవన్ స్థలాన్ని ఖాళీ చేశారు. అంతేకాకుండా, గతంలో పగులగొట్టిన ప్రహరీగోడను తిరిగి యథావిధిగా నిర్మించి బాలభవన్కు అప్పగించారు. ఈ వ్యవహారం పట్టణంలో పెద్ద చర్చనీయాంశంగా మారింది. బాలభవన్కు చిన్నారులు శిక్షణా తరగతుల కోసం వస్తుంటారని, దానికి పక్కనే క్లబ్ నిర్వహించడం పట్ల స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. భవిష్యత్తులో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు. -
బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు
తణుకు అర్బన్: మాజీ కేంద్ర మంత్రి డాక్టర్ బోళ్ల బుల్లిరామయ్య శత జయంతి వేడుకలు తణుకు ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థ ఆవరణలో గురువారం ఘనంగా నిర్వహించారు. ఆయన చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. వక్తలు మాట్లాడుతూ ది ఆంధ్రా సుగర్స్ లిమిటెడ్ సంస్థ చైర్మన్, మేనేజింగ్ డైరెక్టర్గాను, రాజకీయ రంగంలో నాలుగుసార్లు ఎంపీగా, కేంద్ర వాణిజ్య శాఖ మంత్రిగా బుల్లిరామయ్య అందించిన సేవలను కొనియాడారు. అనంతరం ఉద్యోగులకు మిఠాయిలు పంచారు. సంస్థ అడిషనల్ సెక్రటరీ పీవీఎస్ విశ్వనాధకుమార్, జనరల్ మేనేజరు (హెచ్ఆర్) ఎ.సాంబశివరావు, వివిధ విభాగాల అధిపతులు, సంస్థ ఉద్యోగులు పాల్గొన్నారు -
మావుళ్లమ్మ సేవలో కేరళ డీజీపీ
భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం ఇలవేల్పు ఆరాధ్యదైవం శ్రీ మావుళ్లమ్మ అమ్మవారిని కేరళ రాష్ట్ర డీజీపీ రావాడ ఆజాద్ చంద్ర శేఖర్, సరిత దంపతులు గురువారం దర్శించుకున్నారు. అర్చకులు అమ్మవారికి పూజలు చేసి డీజీపీ దంపతలకు ఆశీర్వచనాలు అందజేశారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, వుదీశి మీనాక్షి శేషవస్త్రం, ప్రసాదం ఫొటో అందజేసినట్లు అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. బుట్టాయగూడెం: బూసరాజుపల్లి సమీపంలోని గిరిజన సంక్షేమ గురుకుల పాఠశాల, గిరిజన సంక్షేమ డిగ్రీ విద్యార్థుల వసతిగృహాన్ని జిల్లా పశు సంవర్థకశాఖ జేడీ రామ్మోహన్రావు గురువారం తనిఖీ చేశారు. విద్యార్థులకు అందిస్తున్న భోజనాలను, స్టోర్ రూమ్ను పరిశీలించారు. మరుగుదొడ్ల నిర్వహణ, ఆర్ఓ ప్లాంట్లపై ఆరా తీశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ కలెక్టర్ ఆదేశాల మేరకు తనిఖీకి వచ్చా నని, వివరాల నివేదికను ఆమెకు అందిస్తానన్నారు. డిగ్రీ కళాశాల విద్యార్థుల వసతిగృహం ప్రస్తుతం ఒక గదిలోనే ఏర్పాటుచేశారని, ఆర్ఓ ప్లాంట్ కోసం మరో గది లేదని వార్డెన్ టి.వెంకటేశ్వరరావు ఆయన దృష్టికి తీసుకువచ్చారు. ఎంఈఓలు తెల్లం బాబూరావు, సీహెచ్ నరేంద్రరాయ్, ఇన్చార్జి ఎంపీడీఓ ఈఎస్ఎస్ శ్రీనివాస్, ఆర్డబ్ల్యూఎస్ ఏఈ కె. గంగరాజు, ఎంఆర్కే పారేపల్లి బాపిరాజు ఉన్నారు. -
తడవని మడి.. అన్నదాత అలజడి
ఖరీఫ్ సాగు రైతుల కంట కన్నీరుకు కారణమవుతోంది. ప్రభుత్వ నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ లోపంతో ఖరీఫ్ సీజన్లో సాగునీరు అందక ఏలూరు జిల్లా కై కలూరు నియోజకవర్గంలోని వరి పొలాలు బీడు భూములుగా మారుతున్నాయి. పాలకులు జలహారతుల పేరుతో పూజలు చేసినా పంట కాలువల్లో నీటి ప్రవాహం కనిపించడం లేదు. వరుణుడు కూడా ముఖం చాటేయడంతో రైతులు వెదజల్లిన వరి నారు నీరు లేక ఎండిపోతోంది. కైకలూరు: కైకలూరు నియోజకవర్గంలోని నాలుగు మండలాల్లో 21,832 ఎకరాల వరిసాగు విస్తీర్ణానికి గాను ఇప్పటికే 7,080 ఎకరాల్లో మార్టేరు, స్వర్ణ, 1318 రకాలను వెదజల్లారు. ప్రకాశం బ్యారేజీ నుంచి పోల్రాజ్ కాలువకు 600 క్యూసెక్కులు, క్వాంప్బెల్ కాలువ నుంచి 700 క్యూసెక్కులు నీరు విడుదల కావాల్సి ఉన్నా, గట్లు బలహీనంగా ఉన్నాయనే నెపంతో అధికారులు పూర్తిగా నీటిని వ దలడం లేదు. ఇప్పటికే వారం నుంచి 20 రోజుల వ్యవధికి నారు చేరుకుంది. కై కలూరు మండలం రాచపట్నం, గోపవరం, మండవల్లి మండలం కా నుకొల్లు, లింగాల, కలిదిండి మండలం పలు గ్రామాల్లో ఇదే పరిస్థితి ఉంది. పెట్టుబడి భారం.. కౌలు కష్టం ప్రస్తుతం ఎకరం వరి సాగుకు (దుక్కులు, ఎరువులు, కోతలు, కూలీలతో కలిపి) రూ.30,000 ఖర్చవుతోంది. ఎకరానికి 30 బస్తాల దిగుబడి వస్తే, బస్తా రూ.1,760 చొప్పున రూ.52,800 ఆదాయం లభిస్తుంది. అయితే ఇందులో 12 బస్తాలు కౌలు కింద భూ యజమానులకు ఇవ్వాల్సి రావడంతో, తమకు మిగిలేది శూన్యమని కౌలు రైతులు వాపోతున్నారు. ఆక్వా చెరువులకే నీటి మళ్లింపు కై కలూరులో 84,852 ఎకరాల్లో ఆక్వా చెరువులు ఉన్నాయి. పంట కాలువల మరమ్మతులు చేయకపోవడంతో చెత్త పేరుకుపోయింది. తాగు, సాగునీటి కోసం విడుదల చేసే నీటిని ఆక్వా చెరువులకు యథేచ్ఛగా తరలిస్తున్నారు. నీటి సంఘాల ప్రతినిధులుగా అధిక శాతం చేపల రైతులే ఉండటంతో వరి రైతుల డిమాండ్లను పట్టించుకునేవారే కరువయ్యారు.నారు ఎండుతోంది వెదజల్లిన వరి రైతుల గగ్గోలు సాగునీటి సరఫరాలో ప్రభుత్వం విఫలం బీటలు వారుతున్న వరి చేలు రాచపట్నంకు చెందిన చేబోయిన రామకృష్ణ నాలుగు ఎకరాల్లో కావేరి, స్వర్ణ రకం వరి వెదజల్లి సుమారు రూ.50 వేలు ఖర్చు చేశారు. 15 రోజులు దాటినా కాలువలో నీరు లేక పంట ఎండిపోయింది. అలాగే మరో రైతు మాడెం రామయ్య 11 ఎకరాల్లో వెదజల్లి రూ.1.5 లక్షలు ఖర్చు చేశారు. 20 రోజులు గడుస్తున్నా చుక్క నీరు అందలేదు. -
లాభాలు చేపట్టేలా..
● జిల్లాలో మత్స్యశాఖ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమాలు ● నేడు జాతీయ చేపల రైతుల దినోత్సవం మత్స్యశాస్తవేత్తలు హీరాలాల్ చౌదరీ, అలీకున్హీ కృషి వల్ల ఈ రోజు హేచరీల్లో చేప పిల్లల ఉత్పత్తి అధికంగా ఉంది. ఎంఎన్ఆర్ హేచరీ ద్వారా 10 ఏళ్లుగా నాణ్యమైన ఫంగస్, కట్లా, రూప్చంద్, శీలావతి పిల్లలను ఉత్పత్తి చేస్తున్నాను. నీలివిప్లవానికి ఆధ్యులైన శాస్త్రవేత్తలను స్మరించుకోవడం ఉత్తమం. – ముంగర నరసింహారావు, ఎంఎన్ఆర్ హేచరీస్ అధినేత, ఆకివీడు జాతీయ చేపల రైతుల దినోత్సవం సందర్భంగా జిల్లావ్యాప్తంగా పలు అవగాహన కార్యక్రమాలు చేపడుతున్నాం. ముఖ్యంగా కైకలూరు మత్స్యశాఖ కార్యాలయంలో ఆక్వా రైతులకు అవగాహన సమావేశాలు నిర్వహిస్తున్నాం. ఆక్వారంగం కొత్త పుంతలు తొక్కడానికి శాస్త్రవేత్తల కృషి కారణం. – సీహెచ్ గణపతి, మత్స్యశాఖ అభివృద్థి అధికారి, కై కలూరు కై కలూరు: రాష్ట్రం ఆక్వారంగానికి మణిహారంగా నిలిస్తోంది. సముద్ర తీర ప్రాంతం 974 కిలోమీటర్లు ఉంది. ప్రధానంగా ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలు ఆక్వా ఉత్పత్తులలో అగ్రస్థానంలో నిలుస్తున్నాయి. ఏపీలో ఆక్వాసాగు 5.75 లక్షల ఎకరాల్లో ఉండగా ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో సాగువుతోంది. దేశ రొయ్యల ఉత్పత్తుల్లో రాష్ట్ర వాటా 73 శాతంగా ఉంది. ఇలా మత్స్యరంగం అభివృద్ధి చెంది సిరులు కురిపించే అక్షయ పాత్రగా మారడానికి ఇద్దరు మత్స్య శాస్తవేత్తలు డాక్టర్ హీరాలాల్ చౌదరీ, డాక్టర్ కొల్లియిల్ హమీద్ అలీకున్ హీల పాత్ర కీలకంగా ఉంది. వీరిని స్మరించుకుంటూ ఏటా జూలై 10న జాతీయ చేపల రైతుల దినోత్సవం నిర్వహిస్తారు. జిల్లాలోని కై కలూరు మత్స్య శాఖ కార్యాలయలో శుక్రవారం ఆక్వా రైతులకు అవగాహన కల్పించనున్నారు. ప్రేరిత ప్రజననం : చేపల్లో ప్రేరిత ప్రజననం (ఇన్డ్యూసుడ్ బ్రీడింగ్) అనేది హార్మోన్ల ఇంజెక్షన్ల ద్వారా కృత్రిమంగా చేపలు గుడ్లు పెట్టేలా ప్రేరేపించే ఒక ఆధునిక సాంకేతిక పద్ధతి. సహజసిద్ధంగా నదుల్లో మాత్రమే సంతానోత్పత్తి చేసే కొన్ని రకాల చేపలు (బొచ్చె, కట్ల, శీలవతి, రోహు, మృగాల వంటి మేజర్ కార్ప్స్) చెరువు నిలువ నీటిలో గుడ్లు పెట్టవు. ఈ సమస్యను అధిగమించడానికి 1957 జూలై 10న మత్స్యశాస్తవేత్తలు డాక్టర్ హీరాలాల్ చౌదరీ, డాక్టర్ కొల్లియిల్ హమీద్ అలీకున్హీలు విజయం సాధించారు. ఈ పద్ధతి ద్వారా మత్స్యకారులు తమకు అవసరమైనప్పుడు కృత్రిమంగా చేప పిల్లలను ఉత్పత్తి చేసుకునే అవకాశం కలిగింది. చేప విత్తన మిగులు రాష్ట్రంగా ఏపీ ప్రస్తుతం చేపల విత్తనాల మిగులు రాష్ట్రంగా ఏపీ నిలిచింది. రాష్ట్రంలో 429 రొయ్యల హేచరీస్ ద్వా రా ఏడాదికి 60,000 మిలియన్ల పిల్లలను ఉత్పత్తి చేస్తున్నారు. మొత్తం 106 ప్రాసెసింగ్ ప్లాంట్లలో రో జూ 5,891 టన్నుల ఎగుమతులు జరుగుతు న్నాయి. అలాగే రాష్ట్రంలో 42 మేతల ఫ్యాక్టరీల నుంచి రోజూ సుమారు 9,750 టన్నుల మేతలు ఉ త్పత్తి చేస్తున్నారు. ఇక కొల్లేరు ప్రాంతంలో ఆక్వా ప రిశ్రమ శరవేగంగా విస్తరించింది. ఈ ప్రాంతంలో చిత్తడి నేలల చేపల ఎదుగుదలలో కీలక పాత్ర పో షిస్తుంది. ప్రత్యేక్షంగా, పరోక్షంగా ఆక్వా పరిశ్రమ లక్షల కుటుంబాలను ఆదుకుంటుంది. -
చంద్రబాబు పాలనలో దోచుకోవడమే లక్ష్యం
మాజీ మంత్రి పేర్ని నాని భీమవరం: రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వంలో ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ప్రజలను దోచుకోవడం మినహా అభివృద్ధి, సంక్షేమం ఎక్కడా కనిపించడం లేదని వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ మంత్రి పేర్ని నాని విమర్శించారు. గురు వారం భీమవరంలో జరిగిన విలేకర్ల సమావేశంలో ఆయన మాట్లాడా రు. రాష్ట్రంలో ప్రైవేట్ విద్యాసంస్థలు రాజ్యమేలుతున్నాయన్నారు. నారాయణ, చైతన్య, భా ష్యం, విజ్ఞాన్ వంటి ప్రైవేట్ విద్యాసంస్థలన్నీ చంద్రబాబు మనుషులవే అని, ఎన్నికల్లో వీరు ఇచ్చిన నిధులకు బదులుగా, ఇప్పుడు ప్రభుత్వం ఫీజుల రూపంలో ప్రజల రక్తాన్ని పిండటానికి సహకరిస్తోందని మండిపడ్డారు. కూటమి ప్రభు త్వం ఆక్వా రైతులకు అన్యాయం చేస్తోందని నాని ధ్వజమెత్తారు. తీరప్రాంతంలోని ఆక్వా రంగాన్ని చంద్రబాబు అనుచరులైన సీడ్, ఫీడ్ కంపెనీల యజమానులే శాసిస్తున్నారన్నారు. వారు ఇష్టారాజ్యంగా ధరలు పెంచి రైతులను దోచుకుంటున్నారని, ఫీడ్పై రూ.4 తగ్గించాలని సీఎం చెబితే, కంపెనీలు రూ.2 మాత్రమే తగ్గించినా ప్రభుత్వం పట్టించుకోలేదని విమర్శించా రు. అలాగే ధాన్యం కొనుగోళ్లలో ప్రభుత్వం వి ఫలమైందన్నారు. చివరి గింజ వరకు కొంటామనే మాట దేవుడెరుగు, మొదటి గింజను కూడా ప్రభుత్వం సక్రమంగా కొనడం లేదని, మిల్లుల బాకీలు చెల్లించాలంటే 10 శాతం కమిషన్ అడ్వాన్స్గా అడుగుతున్నారన్నారు. 15న వైఎస్ జగన్ రాక కూటమి ప్రభుత్వ అసమర్థతను, తప్పుడు పరి పాలనను రైతుల తరఫున నిలదీయడానికి ఈ నెల 15న మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి భీమవరం వస్తున్నారని నాని తెలిపా రు. నష్టపోయిన రైతులు, ప్రజలు పెద్ద సంఖ్య లో తరలివచ్చి తమ సమస్యలను జగన్కు వివరించాలని పేర్ని నాని కోరారు. -
ఎరువు.. అక్రమాల దరువు
సాక్షి, భీమవరం: ఎరువుల బ్లాక్ మార్కెట్, జిల్లాల మధ్య అక్రమ రవాణాకు తాడేపల్లిగూడెం కేరాఫ్ అడ్రస్గా మారిందా? కొందరు హోల్సేల్ డీలర్లు పాత స్టాకును రీప్యాకింగ్ చేసి అధిక ధరలకు అమ్మకాలు చేస్తున్నారా? ఇందుకు కూటమి నేతలు, కొందరు ఉద్యోగులు కొమ్ముకాస్తున్నారా? అంటే అవుననే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. అక్రమాలకు అడ్డుకట్ట వేయాలని కోరుతూ స్థానికులు ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలుస్తోంది. జిల్లాలో తాడేపల్లిగూడెం ఎరువుల ర్యాక్ పా యింట్గా ఉంది. ఫెర్టిలైజర్స్ వ్యాపారంలో దీర్ఘకాలంగా వ్యాపారం అనుభవం ఉన్న డీలర్లు ఇక్కడ ఎందరో ఉన్నారు. జిల్లాలో ఖరీఫ్ సాగు విస్తీర్ణం 2.21 లక్షలు, రబీ సాగు విస్తీర్ణం 2.3 లక్షల ఎకరాల వరకు ఉంటుంది. తొలకరిలో 17,800 టన్నుల యూరియా, 1,650 టన్నుల డీఏపీ, 32,500 ట న్నుల కాంప్లెక్స్ ఎరువులు అవసరమవుతాయి. దా ళ్వాలో 41,821 టన్నుల యూరియా, 64,992 టన్నుల ఇతర ఎరువులు వినియోగిస్తుంటారు. జిల్లాతో పాటు పరిసర జిల్లాలకు కంపెనీల కేటాయింపుల మేరకు యూరియా, డీఏపీ, ఇతర రకాల ఎరువులు రైల్వే వ్యాగన్లు ద్వారా సరఫరా అవుతుంటాయి. గూడెం నియోజకవర్గంలోని ప్రత్తిపాడు, నవాబుపాలెం, పెదతాడేపల్లి, చినతాడేపల్లి తదితర ప్రాంతాల్లో మార్క్ఫెడ్, ప్రైవేట్ డీలర్లకు చెందిన గోదాముల్లో వీటిని నిల్వ చేస్తుంటారు. రీ ప్యాకింగ్తో సొమ్ములు ఏడాదిన్నర క్రితం ఓ కంపెనీ తాడేపల్లిగూడెం పరిసర ప్రాంతాల్లో బ్రాంచులు ఉన్న హోల్సేల్ డీలర్కు పెద్ద మొత్తంలో ఎరువులను కేటాయించింది. సదరు డీలరు వీటిని రీప్యాకింగ్ చేసి బస్తాకు రూ.30 నుంచి రూ.40 అదనంగా సొమ్ము చేసుకున్నారని ఆరోపణలు వచ్చాయి. ఇదే తరహాలో మరికొందరు అక్రమాలకు పాల్పడినట్టు అప్పట్లో చర్చ నడిచింది. గతేడాది అధికారుల తనిఖీల్లో పలు గోదాముల్లో స్టాకు వ్యత్యాసాలు గుర్తించినా రాజకీయ ఒత్తిళ్లతో వాటిని కప్పిపుచ్చారన్న ఆరోపణలు కూడా ఉన్నాయి. కృత్రిమ కొరత సృష్టించి.. కొందరు హోల్సేల్ డీలర్లకు పలు జిల్లాల్లో లైసెన్సులు ఉండటంతో కృత్రిమ కొరత సృష్టించి ఒక జిల్లాకు కేటాయించిన ఎరువులను మరో జిల్లాలో అధిక ధరలకు విక్రయిస్తూ రైతులపై భారం మోపుతున్నారంటున్నారు. అధికారులు తనిఖీలకు వచ్చి న సమయంలో కేవలం స్టాకు రికార్డులు మాత్రమే పరిశీలిస్తున్నారని, ఒక జిల్లాకు వచ్చిన సరుకు వాస్తవానికి ఏ జిల్లాలో విక్రయించారు? వే బిల్స్, ఇతర రవాణా పత్రాల ఆధారంగా పూర్తి పరిశీలన చేయకపోవడం వలన అక్రమాలు బయటకు రావడం లేదంటున్నారు. ఇటీవల యూరియా కంపెనీలు ఎమ్మార్పీ ధరను దఫదఫాలుగా రూ.5 నుంచి రూ.30 వరకు పెంచుతూ వచ్చాయి. ఈ క్రమంలో తక్కువ ధరకు వచ్చిన వాటిని రీప్యాకింగ్ చేసి కొత్త ధరకు సరఫరా చేశారని తెలుస్తోంది. పక్కదారి పట్టిస్తూ.. ప్రస్తుతం రైతులు యాప్ను డౌన్లోడ్ చేసుకుంటేగాని ఎరువుల కొనుగోలుకు అవకాశం లేదు. ఇదంతా రికార్డ్ ప్రకారం జరుగుతుంది. జిల్లాలో వ్యవసాయం చేసే రైతుల కంటే కౌలు రైతులు అధిక సంఖ్యలో ఉన్నారు. వీరిలో చాలామందికి కౌలు గుర్తింపు కార్డులు లేవు. ఎరువుల కోసం అసలు రైతు పాస్బుక్ జెరాక్సులను ఎరువుల దుకాణాల్లో అందజేసి ఎరువులు పొందుతున్నారు. వీటి ఆధారంగా వ్యాపారులు ఎరువులను దారి మళ్లిస్తున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం యూరియా బస్తా అసలు ధర రూ.260 కాగా జి ల్లాలోని పలుచోట్ల రూ.300 నుంచి రూ.320 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నట్టు తెలిసింది. ఉన్నత స్థాయికి ఫిర్యాదు గోదాములపై పూర్తిస్థాయిలో నిఘా కొరవడటంతో డీలర్ల ఇష్టారాజ్యంగా మారిందన్న విమర్శలున్నాయి. గతేడాది యూరియా కొరత ఏర్పడటం, అ ధిక ధరలకు అమ్మకాలు చేయడం నిదర్శనంగా రై తులు చెబుతున్నారు. అక్రమాలకు అడ్డుకట్ట వేసే ది శగా అధికార యంత్రాంగం చర్యలు తీసుకోవాలంటున్నారు. గోడౌన్లలో ఉన్న స్టాకును భౌతికంగా త నిఖీలు చేయాలని, వేబిల్స్, రవాణా పత్రాలు, స్టాక్ మూమెంట్, రిటైల్, హోల్సేల్ డీలర్ల లావాదేవీలను పూర్తిగా పరిశీలించాలని కోరుతున్నారు. గుంటూరుకు చెందిన ఒక అధికారి అండతో జిల్లాలో ఎ రువుల అక్రమాలు జరుగుతున్నాయంటూ కొంద రు ఉన్నత స్థాయికి ఫిర్యాదు చేసినట్టు సమాచారం. నిఘా కరువు ఫెర్టిలైజర్స్ ర్యాక్ పాయింట్గా తాడేపల్లిగూడెం గూడెం, పరిసరాల్లో విస్తరించిన ఎరువుల గోదాములు గతంలో రీ ప్యాకింగ్, బ్లాక్ మార్కెట్తో భారీగా దోపిడీ కూటమి నేతల కనుసన్నల్లో ఎరువుల దందా అక్రమాల అడ్డుకట్టకు ఉన్నత స్థాయికి ఫిర్యాదు -
గోదావరి వరదలపై అప్రమత్తం
ఏలూరు (టూటౌన్): రానున్న వర్షాకాలంలో గోదావరికి వచ్చే వరదల కారణం ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టాలు కలగకుండా సన్నద్ధంగా ఉండాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్ నుంచి గురువారం గో దావరి వరదలకు సన్నద్ధత, ముఖ్యమంత్రి పర్యటన ఏర్పాట్లు, జీఎస్టీ వసూళ్లు, సర్ ప్రగతి తదితర అంశాలపై జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ప్రకృతి వైపరీత్యాల కారణంగా ప్రాణ, ఆస్తి నష్టాలు సంభవించకుండా పటిష్ట ప్రణాళికలు రూపొందించుకోవాలన్నారు. గండ్లు పడే అవకాశం ఉన్న కాలువలు, చెరువుల ప్రాంతాలను గుర్తించి నివారణ చర్యలు తీసుకోవాలన్నారు. వరద హెచ్చరికల స మయంలో పటిష్ట ప్రణాళికలు అమలు చేయాలన్నారు. ఈనెల 13న సీఎం చంద్రబాబు పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ పనులను పరిశీలించేందుకు వచ్చే అవకాశం ఉందని, పక్కా ఏర్పాట్లు చేయాలన్నారు. జేసీ అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్వో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. -
గోడు పట్టించుకోరా?
మా కుటుంబం రెండు త రాలుగా వరి సాగు చేస్తోంది. ఎకరాకు అరకట్ట ఎరువులు ఇస్తామంటున్నారు. ఇంతవరకూ మా కాలువలకు నీరు రాలేదు. ఆక్వా రైతులకు ఒక న్యాయం, వరి రైతులకు మరో న్యాయంగా అధికారుల ప్రవర్తన ఉంది. రైతుల గోడు పట్టించుకోరా? – చేబోయిన రామకృష్ణ, రైతు, రాచపట్నం అదునులో చేస్తేనే పంట చేతికొస్తోంది. వెదజల్లు విధానంలో నారు వచ్చి 15 రోజులు దాటింది. నీరు లేక పలుచోట్ల రంగు మారి నారు చచ్చిపోతోంది. మరోవైపు రైతులను ఆదుకుంటున్నామని నేతలు ప్రకటనలు చేస్తున్నారు. మా కాలువలకు నీటిని తక్షణమే విడుదల చేయాలి. – బోడావులు శ్రీనివాసరావు, రైతు, రాచపట్నం కైకలూరు నియోజకవర్గంలో పోల్రాజ్, క్వాంప్బెల్ కాలువల ద్వారా నీరు విడుదలవుతోంది. ఇటీవల తా గునీటి చెరువులకు విడుదల చేశాం. ప్రస్తుతం వెదజల్లే పద్ధతిలో రైతులు నారు వేశారు. పోల్రాజ్ కాలువకు 100 క్యూసెక్కుల నీటిని గుడ్లవల్లేరు లాకుల వద్ద విడుదల చేశారు. క్యాంప్బెల్ కాలువకు 100 క్యూసెక్కులను త్వరలో విడుదల చేయనున్నారు. – ఎం.శిరీషా, ఇరిగేషన్ డీఈఈ, కై కలూరు -
పీఆర్సీ కమిషన్ను నియమించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్ర ప్రభుత్వం వెంటనే పీఆర్సీ కమిషన్ను నియమించాలని ఏపీ ప్రైమరీ టీచర్స్ అసోసియేషన్ (ఏపీపీటీఏ) జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మేకా శేషుకుమార్, చాగంటి శివరాం డిమాండ్ చేశారు. గురువారం డీఈఓ ఎం. వెంకట లక్ష్మమ్మకు గురువారం వినతిపత్రం సమర్పించారు. కమిషన్ను నియమించేలోపు 30 శాతం మధ్యంతర భృతి ఇవ్వాలని, ఐదు పెండింగ్ డీఏలను విడుదల చేయాలని కోరారు. ఇన్ సర్వీస్ టీచర్లకు టెట్ నుంచి మినహాయించాలని, లేకుంటే సర్వీసుకు ఏడాదికి ఒక మార్కు చొప్పున వెయిటేజీ ఇవ్వాలని డిమాండ్ చేశారు. అలాగే ప్రాథమిక పాఠశాలలను కాపాడాలని, బీపీఎస్ స్కూల్లో 40 పైగా రోల్ ఉన్నచోట ఒక ఎంటీఎస్ లేదా మిగులు ఉపాధ్యాయులను ఇవ్వాలని కోరారు. ముందుగా ఏపీపీటీఏ (2026–28) కార్యవర్గం ఎన్నిక నిర్వహించారు. అబ్దుల్ రజాక్ అస్లాం ఎన్నికల అధికారిగా వ్యవహరించారు. -
ఖైదీలకు అందించే ఆహారంలో రాజీ పడొద్దు
ఏలూరు (టూటౌన్): ఖైదీలకు అందించే ఆహారంలో రాజీ వద్దని జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి ఆదేశించారు. గు రువారం ఏలూరులోని జిల్లా కారాగారాన్ని ఆ మె సందర్శించారు. ముద్దాయిలకు అందిస్తున్న సౌకర్యాలపై తమ పర్యవేక్షణ ఉంటుందన్నారు. నాణ్యమైన ఆహారం, మంచినీరు, వైద్య సదుపాయం అందించాలన్నారు. అలాగే ముద్దాయిల కేసుల వివరాలు అడిగి తెలుసుకున్నారు. అవసరమైతే ఉచిత న్యాయ సహాయం అందిస్తామన్నారు. శనివారం జాతీయ లోక్అదాలత్ నిర్వహిస్తున్నారని రాజీయోగ్యమైన కేసులను పరిష్కరించుకోవచ్చని సూచించారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని అన్ని కోర్టుల్లో శనివారం జాతీయ లోక్ అదాలత్ నిర్వహించనున్నట్టు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి ప్రకటనలో తెలిపారు. ఏలూరు జిల్లా కోర్టు ఆవరణలోని న్యాయసేవా సదన్ భవన్లో అదేరోజు ఉదయం 10 గంటలకు లోక్ అదాలత్ ప్రారంభిస్తామన్నారు. ఈ సందర్భంగా అవగాహన కార్యక్రమాన్ని నిర్వహిస్తామని ఆమె చెప్పారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జలవనరుల శాఖ పరిధిలో ఏలూరు ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్గా గోదావరి గోపాల్ గురువారం ఉదయం బాధ్యతలు చేపట్టారు. ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ ఆఫ్ ఇంజనీర్స్ రాష్ట్ర అసోసియేట్ ప్రెసిడెంట్ దేవరకొండ వెంకటేశ్వర్లు, అసోసియేషన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు వెంకటస్వామి, గౌరవ అధ్యక్షుడు సీహెచ్ దేవప్రకాష్, ఉపాధ్యక్షుడు ధనుంజయులు ఆయనకు సత్కారం చేశారు. ఉమ్మడి గోదావరి జిల్లాలోని జలవనరులను సాగునీటికి, తాగునీటికి, ప్రజల ఇతర అవసరాలకి స మర్థవంతంగా వినియోగిస్తామని గోపాలన్ అ న్నారు. ఇంజనీర్లంతా సహకరించాలని కోరా రు. డీఈఈలు, ఏఈఈలు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): డీఈఎల్ఈడీ 2023–25 రెగ్యులర్ బ్యాచ్, ఒకసారి ఫెయిలైన 3,4 సె మిస్టర్ల విద్యార్థులకు సంబంధించిన మార్కుల జాబితాలు విడుదలయ్యాయని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఆయా కళాశాలల్లో మార్కుల జాబితాలు పొందవచ్చ ని పేర్కొన్నారు. అలాగే డీఈఎల్ఈడీ 2024– 26 రెగ్యులర్ బ్యాచ్కు గత ఏప్రిల్లో జరిగిన పరీక్షల ఫలితాలు కూడా విడుదల చేసినట్టు చెప్పారు. వీటిని బీఎస్ఈ ఏపీ వెబ్సైట్ ద్వారా తెలుసుకోవచ్చని తెలిపారు. 17 రోజులు.. రూ.1.98 కోట్లు ద్వారకాతిరుమల: చినవెంకన్న ఆలయ హుండీల ఆదాయాన్ని గురువారం లెక్కించారు. జి ల్లా దేవదాయశాఖ అధికారి కె.శ్రీనివాసు, పోలీసుల పర్యవేక్షణలో జరిపిన లెక్కింపులో విశేష ఆ దాయం సమకూరింది. గత 17 రోజులకు నగదు రూపేణా రూ.1,98,46,114, కానుకల రూపంలో 219 గ్రాముల బంగారం, 2.070 కిలోల వెండితో పాటు అధికంగా విదేశీ కరెన్సీ లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే లెక్కింపులోకి రాని రద్దయిన పా త రూ.1,000, రూ.500 నోట్ల ద్వారా రూ.10 వేలు లభించిందన్నారు. సగటున రోజుకి రూ.11,67,418 ఆదాయం వచ్చిందన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్)–2026 కార్యక్రమంలో భాగంగా ఎన్యుమరేషన్ ఫారాల డిజిట లైజేషన్ పనులు 11వ తేదీలోపు పూర్తిచేయా లని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. గురువారం ఈఆర్ఓలు, ఏఈఆర్ఓలతో ఆమె టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ఎ న్యుమరేషన్ ఫారాల డిజిటలైజేషన్, ఓటర్ల మ్యాపింగ్ ప్రక్రియను వేగవంతం చేయాల న్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, ఇన్చార్జి డీఆర్వో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. -
ముగిసిన గ్రామస్తుల ఆందోళన
బుట్టాయగూడెం: పాఠశాల స్థాయి కుదింపుపై గత 27 రోజులుగా పులిరామన్నగూడెంలో గ్రామస్తులు, విద్యార్థుల తల్లిదండ్రులు చేపట్టిన ఆందోళన కలెక్టర్ హామీతో ఎట్టకేలకు ముగిసింది. గ్రామాభివృద్ధి కమిటీ ప్రతినిధులు మూలెం రమేష్, మడకం వెంకటేశ్వరరావు, తామా నాగేశ్వరరావు, మాజీ ఎంపీటీసీ యు.ఏసుబాబు బుధవారం సాయంత్ర విలేకరులకు వివరాలు వెల్లడించారు. పాఠశాలలో 8, 9, 10 తరగతులు రద్దు చేయడం వల్ల సుమారు 20 గ్రామాలకు చెందిన విద్యార్థులు చదువులకు దూరమవుతారని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్, కలెక్టర్ కె.వెట్రిసెల్వి దృష్టికి తీసుకెళ్లినట్లు వివరించారు. పాత పద్ధతిలోనే తరగతులు కొనసాగించాలని, హాస్టల్ సదుపాయం కూడా ఏర్పాటు చేయాలని కోరినట్లు చెప్పారు. అయితే నూటికి నూరుశాతం విద్యార్థులు పాఠశాలలకు హాజరైతే తరగతులు యథాతథంగా కొనసాగేలా చర్యలు తీసుకుంటామని కలెక్టర్ హామీ ఇవ్వడంతో పాఠశాల ఎదుట చేస్తున్న ఆందోళన విరమించినట్లు మాజీ ఎంపీటీసీ ఏసుబాబు తెలిపారు. అలాగే గురువారం ఉదయం నుంచి గ్రామాభివృద్ధి కమిటీ ఆధ్వర్యంలో నూటికి నూరు శాతం విద్యార్థులను పాఠశాలలో చేర్పించేందుకు కృషి చేస్తామని చెప్పారు. కార్యక్రమంలో కమిటీ సభ్యులు మడకం పాపమ్మ, మొడియం వసంత, బన్నే పూర్ణ, బట్టు సురేష్, కుంజా వెంకటేశ్వరరావు, బండార్లు శ్రీను, గడుసుకోటి నవీన్కుమార్, తదితరులు పాల్గొన్నారు. -
సీఎం పర్యటన ఏర్పాట్ల పరిశీలన
పోలవరం రూరల్: ముఖ్యమంత్రి ఈనెల 13న పోలవరం ప్రాజెక్టు నిర్మాణ పనులను పరిశీలించేందుకు రానున్నందున కలెక్టర్ కె.వెట్రిసెల్వి బుధవారం అధికారులతో కలిసి ఏర్పాట్లను పరిశీలించారు. హెలీప్యాడ్ ఏర్పాటు చేసే స్థలాన్ని, ఈసీఆర్ఎఫ్ డ్యామ్, పవర్ హౌస్, యూనిట్ టర్బైన్ తదితర ప్రాంతాలను పరిశీలించారు. ఆయా ప్రదేశాలలో పనుల పురోగతి, ఎగ్జిబిషన్ వివరాలను ప్రాజెక్టు అధికారులను అడిగి తెలుసుకున్నారు. పట్టిసీమలో సదుపాయాలపై ఆరా గోదావరి పుష్కరాల సందర్భంగా పట్టిసీమలో స్నానఘట్టాల ఏర్పాటు, భక్తులకు కల్పించాల్సిన సదుపాయాలపై కలెక్టర్ అధికారులతో కలిసి పట్టిసీమ రేవు వద్ద క్షేత్రస్థాయి పరిశీలన చేశారు. రోజుకు ఎంతమంది భక్తులు పుణ్యస్నానాలు ఆచరిస్తారనే అంచనాలను అడిగి తెలుసుకున్నారు. భక్తుల సంఖ్యకు తగినట్లుగా అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. పెనుమంట్ర: రాష్ట్ర జేఏసీ, రాష్ట్ర ప్రభుత్వ పెన్షనన్ల అసోసియేషన్ పిలుపు మేరకు ప్రభుత్వ పెన్షనర్ల సమస్యలు పరిష్కరించాలని కోరుతూ బుధవారం పెనుమంట్ర తహసీల్దార్కు అసోసియేషన్ సభ్యులు వినతిపత్రం అందజేశారు. 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని, తక్షణం ఐఆర్ 30 శాతం ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న డీఆర్ ఇవ్వాలని, తగ్గించిన ఎడిషన్ క్వాంటం యథావిధిగా కొనసాగించాలని, హెల్త్ కార్డ్స్ ద్వారా మెరుగైన వైద్యం అందించాలని డిమాండ్ చేశారు. -
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
పోలవరం రూరల్ : పోలవరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ఏపీ ఇరవై సూత్రాల కార్యక్రమం (వికసిత్ భారత్ – స్వర్ణ ఆంధ్రప్రదేశ్) అమలు చైర్మన్ లంకా దినకర్, రాజ్యసభ సభ్యులు పాకా వెంకట సత్యనారాయణ బుధవారం క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ సందర్భంగా ప్రాజెక్టు ఇంజనీరింగ్ బృందం వారికి పూలమొక్కలు, పుష్పగుచ్ఛాలు అందించి స్వాగతం పలికింది. అనంతరం లంకా దినకర్, ఎంపీ పాకా వెంకట సత్యనారాయణ కలిసి ప్రాజెక్టులోని స్పిల్ వే, కాపర్ డ్యామ్, ఎర్త్ కమ్ రాక్ ఫిల్ డ్యామ్, టన్నెల్స్ తదితర పనులను పరిశీలించారు. పనుల పురోగతిపై అధికారులు ఏర్పాటు చేసిన ఫొటో ఎగ్జిబిషన్, మ్యాపులను తిలకించి, ఇంజనీరింగ్ అధికారులను వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ పరిశీలనలో ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్, పోలవరం ప్రాజెక్టు అథారిటీ సీఈ రమేష్ కుమార్, ఎస్ఈ కె.రామచంద్రరావు, ఈఈలు, డీఈ పాల్గొన్నారు. -
విద్యుత్ లైన్మెన్ల కొరతతో ఇక్కట్లు
పాలకోడేరు: మండలంలో విద్యుత్ లైన్మెన్ల కొరత తీవ్రంగా ఉంది. 14 గ్రామాలకు కుముదవల్లి, వేండ్ర, గొరగనమూడి గ్రామాలకు విద్యుత్ లైన్మెన్లు లేరు. విస్సాకోడేరు గ్రామానికి ఇద్దరు ఉండాల్సి ఉండగా ఒక్కరే విధులు నిర్వహిస్తున్నారు. మండల స్థాయిలో పనిభారం ఎక్కువగా ఉండడంతో ఇద్దరు లైన్ ఇన్సెపెక్టర్లు ఉండాలి. ప్రస్తుతం వారు మెడికల్ లీవ్పై వెళ్లిపోవడంతో పరిస్థితి దిగజారిందని వినియోగదారులు ఆరోపిస్తున్నారు. మొత్తం మండలానికి ఇంకా 6 మంది లైన్మెన్ల కొరత ఉందని, ఈ కొరతను వెంటనే తీర్చకపోతే వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడతారని అధికారులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ అంతరాయం ఏర్పడితే సిబ్బంది లేక గంటల తరబడి పరిష్కారం కావడం లేదని, దీంతో రైతులు, గృహ వినియోగదారులు ఇబ్బంది పడుతున్నారు. కొరతను అధిగమించాలంటే జిల్లాలోని కొన్ని గ్రామాల్లో ఇద్దరు లైన్మెన్లు ఉన్నచోట నుంచి అసలు లేని గ్రామాలకు భర్తీ చేస్తే కొంతమేర ఇబ్బందులు తప్పుతాయని అంటున్నారు. -
ఎరువుల అమ్మకాలపై అవగాహన సదస్సు
పోలవరం రూరల్: మండలంలోని కృష్ణారావుపేట సొసైటీలో రైతులకు యూరియా, డీఏపీ ఎరువుల అమ్మకాలపై ఏలూరు జిల్లా వ్యవసాయ అధికారి ఎస్.కె.హబీబ్ బాషా అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ఎరువులు పక్కదారి పట్టకుండా, పారదర్శకంగా రైతులకు అవసరమైన సమయంలో మూడు దఫాలుగా సరఫరా చేయడానికి ఈ యాప్ ఉపయోగపడుతుందన్నారు. దీనివల్ల రైతులు క్యూలైన్లలో వేచి ఉండాల్సిన అవసరం లేదని తెలిపారు. యాప్ వినియోగానికి ఆధార్ తప్పనిసరని, శాస్త్రవేత్తల సిఫార్సుల మేరకే పంటల వారీగా ఎరువుల కోటా కేటాయిస్తారని, రైతులు కొనుగోలు చేసిన వివరాలు మొబైల్కు సందేశం ద్వారా అందుతాయని వివరించారు. అనంతరం రైతులు అధికారుల దృష్టికి పలు సమస్యలు తీసుకొచ్చారు. పోలవరం మండలంలోని ముంపు ప్రాంతాల్లో గోదావరి వరదల వల్ల పంటలు పాడై, రెండు మూడు సార్లు నాట్లు వేయాల్సి వస్తోందని, ముంపు ప్రాంతాలకు ఎరువుల కోటాను పెంచాలని కోరారు. ప్రస్తుతం ఎకరానికి ఇచ్చే రెండు బస్తాల యూరియాను మూడు బస్తాలకు పెంచాలని, డీఏపీ కూడా ఎకరానికి బస్తా కేటాయించాలని కోరారు. పొలాలకు రహదారులు లేనందున, రెండో పంటకు సంబంధించిన మూడు విడతల కోటాను ఒకేసారి ఇస్తే నిల్వ చేసుకునేందుకు వీలుంటుందని తెలిపారు. -
ఆర్ఐఓను సస్పెండ్ చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో గుర్తింపు లేకుండా నడుపుతున్న విద్యా సంస్థలకు కొమ్ముకాస్తున్న ఆర్ఐఓ యోహాన్ను తక్షణం సస్పెండ్ చేయాలని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డీ శివకుమార్, జిల్లా కార్యదర్శి కే సిద్ధూ డిమాండ్ చేశారు. ప్రభుత్వ అనుమతి లేకుండా నడుపుతున్న విద్యా సంస్థలపై చర్యలు తీసుకోవాలని, ప్రైవేటు, కార్పొరేట్ విద్యా సంస్థల యాజమాన్యాలకు వత్తాసు పలుకుతున్న ఆర్ఐవోను సస్పెండ్ చేయాలని కోరుతూ బుధవారం స్థానిక ఆర్ఐఓ కార్యాలయం వద్ద ఏఐఎస్ఎఫ్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ విద్యాసంస్థల యాజమాన్యాలు విద్యార్థుల తల్లిదండ్రుల నుంచి అధిక ఫీజులు వసూలు చేస్తున్నారని విమర్శించారు. చర్యలు తీసుకోవాల్సిన ఆర్ఐఓ నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రభుత్వ గుర్తింపు లేకుండా నడుపుతున్న విద్యా సంస్థలపై సరైన పర్యవేక్షణ చేయడంలేదని ఆరోపించారు. పలుమార్లు ఆర్ఐఓకు వినతిపత్రాలు అందించినా కూడా చర్యలు తీసుకున్న దాఖలాలు లేవని విమర్శించారు. ఏలూరు (టూటౌన్): అంగన్వాడీల వేతనాలు పెంచాలని కోరుతూ జులై 10న ఏలూరు కలెక్టరేట్ వద్ద మహా ధర్నా నిర్వహిస్తున్నట్లు ఏపీ అంగన్వాడీ వర్కర్స్ హెల్పర్స్ యూనియన్ సీఐటీయు జిల్లా అధ్యక్షుడు పి.భారతి, కార్యదర్శి టి.మాణిక్యం బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ముఖ్యమంత్రి చంద్రబాబు ఎన్నికల ముందు వేతనాలు పెంచుతానని వాగ్దానం చేసి రెండు సంవత్సరాలు గడిచినా ఒక్క రూపాయి వేతనం పెంచలేదని ఆవేదన వ్యక్తం చేశారు. ధరలు పెరుగుదలతో తీవ్ర ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. మరోవైపు యాప్స్ పేరుతో అంగన్వాడీలపై తీవ్ర పనిభారం పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. చంద్రబాబు ఇచ్చిన వాగ్దానాన్ని తక్షణమే అమలు చేయకపోతే పోరాటాన్ని ఉధృతం చేస్తామని తెలిపారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి బుధవారం శనివారపు పేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని సందర్శించారు. వసతి గృహంలో బాలురకు అందిస్తున్న వసతులు అడిగి తెలుసుకున్నారు, ఆహార పదార్థాల నాణ్యత విషయంలో రాజీ పడవద్దని సూచించారు. అనంతరం విద్యానగర్ లోని ప్రభుత్వ శిశుగృహాన్ని సందర్శించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో వైఎంహెచ్ఏ హాల్లో నిర్వహించిన అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీల్లో ఉత్తమ నాటికగా గుంటూరు అభినయ ఆర్ట్స్ శ్రీసహాన్ఙా ప్రథమ బహుమతి గెలుచుకుంది. ద్వితీయ ఉత్తమ నాటికగా యడ్లపాడు మానవతా సాగరి వారి ‘అందరూ మంచివారే కానీ!’, తృతీయ ఉత్తమ నాటికగా హైదరాబాద్ స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ వారి ‘సీ్త్ర మాత్రే నమః’ఎంపిక కాగా ప్రత్యేక జ్యూరీ బహుమతి చిలకలూరిపేట మద్దుకూరి ఆర్ట్స్ వారి శ్రీమా ఇంట్లో మహాభారతం్ఙ గెలుచుకుంది. పోటీల్లో ఉత్తమ నటుడుగా సహానా నాటికలో వాసుదేవరావు పాత్ర పోషించిన ఎన్.రవీంద్ర రెడ్డి, ద్వితీయ ఉత్తమ నటుడుగా ఎస్.పవన్ కుమార్, ఉత్తమ ప్రతినాయకుడిగా లక్ష్మణ శాస్త్రి, ఉత్తమ సహాయ నటుడిగా తాళాబత్తుల వెంకటేశ్వర రావు బహుమతులు గెలుచుకున్నారు. అలాగే ఉత్తమ నటిగా సహానా పాత్రధారి కుసుమ సాయి, ద్వితీయ ఉత్తమ నటిగా సురభి పూజిత బహుమతులు అందుకున్నారు. -
రివిట్మెంట్ పనుల్లో నిర్లక్ష్యం
ఉండి : గోడ కట్టారు.. కాలువ పూడ్చారు అన్నట్లుంది ఉండి కాలువపై చేపట్టిన రివిట్మెంట్ వాల్ (రక్షణ గోడ) నిర్మాణం. గత మే నెలలో జాతీయ రహదారి కుంగిపోకుండా నివారణ చర్యల్లో భాగంగా ఆకివీడు మండలం అజ్జమూరు పరిధిలో చిన్న చిన్న ముక్కలుగా ఈ గోడను నిర్మించారు. నెల రోజుల పాటు ట్రాఫిక్ నిలిపివేసి హడావుడిగా పనులు ముగించడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. అసంపూర్తి పనులు – కుంగుతున్న గట్టు అధికారులు జాతీయ రహదారి భద్రతపైనే దృష్టి పెట్టి కాలువను నిర్లక్ష్యం చేశారు. గోడను అసంపూర్తిగా ముక్కలు ముక్కలుగా కట్టడంతో, మధ్యలో ఖాళీ ఉన్న ప్రాంతంలో రోడ్డు కాలువలోకి కుంగిపోతోంది. మరోవైపు కాలువ గట్టు కూడా మట్టితో సహా కాలువలోకి జారిపోతోంది. దీనివల్ల కాలువ పూడుకుపోయి శివారు ప్రాంతాల వరిచేలకు, ఆక్వా చెరువులకు సాగునీరు అందడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. అధికారుల పర్యవేక్షణా లోపం వల్లే ఈ పరిస్థితి దాపురించిందని స్థానికులు మండిపడుతున్నారు. విద్యుత్ స్తంభాలతో పెను ప్రమాదం నిర్మాణ సమయంలో తగిన జాగ్రత్తలు తీసుకోకపోవడంతో రహదారి పక్కనే ఉన్న భారీ విద్యుత్ స్తంభాలు కాలువలోకి వాలిపోతున్నాయి. నిత్యం రద్దీగా ఉండే ఈ జాతీయ రహదారిపై విద్యుత్ స్తంభాలు కూలిపోతే పెను ప్రమాదం జరిగే అవకాశముంది. కాలువ గట్లు జారిపోకుండా, వాలిపోయిన విద్యుత్ స్తంభాలను సరిచేసి ప్రమాదాలు జరగకుండా చూడాలని స్థానిక రైతులు, ప్రయాణికులు ఉన్నతాధికారులను కోరుతున్నారు. -
పీహెచ్సీల్లో ప్రసవాల సంఖ్య పెంచాలి
పెంటపాడు: ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ప్రసవాల సంఖ్యను గణనీయంగా పెంచి, తల్లీబిడ్డల సంక్షేమానికి పెద్దపీట వేయాలని డీఎంహెచ్వో ఎం.రవిబాబు పేర్కొన్నారు. బుధవారం ముదునూరు ప్రాధమిక ఆరోగ్యకేంద్రాన్ని ఆయన అకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో జరుగుతున్న పలు ఆరోగ్యకార్యక్రమాలపై సమీక్షించారు. రికార్డులు పరిశీలించారు. రోగులతో మాట్లాడారు. ఫార్మసీ, లేబర్రూం, డెలివరీ రూంను పరిశీలించారు. ఈ సందర్భంగా డాక్టర్ పూజిత, సిబ్బందికి పలు సూచనలు చేశారు. ఆసుపత్రికి వచ్చిన రోగులకు మంచి వైద్యం అందించడంతో పాటు, డెలివరీ రూంలో ఉన్న చిన్నపాటి లోపాలు సవరించుకొని ప్రసవాల సంఖ్యను పెంచాలన్నారు. గర్భిణులకు మంచి భరోసా, నమ్మకమైన ప్రచారం కల్పించాలన్నారు. ఎంపీహెచ్ఈవో సీహెచ్ సత్యనారాయణ, పీహెచ్ఎన్ అనంతలక్ష్మి, హెచ్వీ సత్యవతి, ఆసుపత్రి సిబ్బంది పాల్గొన్నారు. -
నిను మరువలేం రాజన్న
గురువారం శ్రీ 9 శ్రీ జూలై శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: మహానేత మేలును మరిచిపోలేం.. జిల్లాలో దివంగత వైఎస్సార్ హయాంలో చేసిన అభివృద్ధి సుస్థిరం. అనేక మందికి రాజకీయ గురువుగా.. లక్షలాది మందికి అభిమాననేతగా మారిన దివంగత వైఎస్సార్ జయంతి వేడుకలు జిల్లాలో ఘనంగా నిర్వహించారు. వైఎస్సార్సీపీ శ్రేణులు వాడవాడల ఘనంగా నివాళులర్పించి బైక్ ర్యాలీ, సేవా కార్యక్రమాలు పెద్ద ఎత్తున నిర్వహించారు. ఏలూరు, ఉంగుటూరు నియోజకవర్గాల్లో సేవా కార్యక్రమాలు నిర్వహించారు. ● ఏలూరు నియోజకవర్గంలో.. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ నేతృత్వంలో జిల్లా పార్టీ కార్యాలయం నుంచి ఫైర్స్టేషన్ సెంటర్ వరకు పార్టీ శ్రేణులు మోటారు సైకిల్ ర్యాలీ నిర్వహించాయి. అనంతరం ఫైర్స్టేషన్ సెంటరులో దివంగత నేత వైఎస్సార్ విగ్రహానికి పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ నివాళులర్పించి అనంతరం భారీ కేక్ను కట్ చేశారు. పార్టీ కార్యాలయంలో మహిళలకు చీరలు, దివ్యాంగులకు దుప్పట్లు పంపిణీ చేశారు. ● కై కలూరు నియోజకవర్గంలో.. కై కలూరు నియోజకవర్గం కై కలూరులో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా నిర్వహించారు. పార్టీ జిల్లా అధ్యక్షులు దూలం నాగేశ్వరరావు ఆధ్వర్యంలో కై కలూరు సంత మార్కెట్ వద్ద 24 అడుగుల వైఎస్సార్ విగ్రహానికి గజమాల వేసి నివాళులర్పించారు. అనంతరం భారీ కేక్ కట్ చేశారు. ● నూజివీడు నియోజకవర్గంలో.. నూజివీడు నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతిని ఘనంగా నిర్వహించారు. నూజివీడులో చినగాంధీ బొమ్మ సెంటరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప అప్పారావు నివాళులర్పించారు. అనతంరం భారీ కేక్ను కట్ చేశారు. ఏరియా ఆసుపత్రిలో రోగులకు బ్రెడ్, పండ్లు పంపిణీ చేశారు. ● పోలవరం నియోజకవర్గంలో.. పోలవరం నియోజకవర్గంలో బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో వైఎస్సార్ విగ్రహానికి నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం కేక్ను కట్ చేశారు. పెద్ద ఎత్తున పార్టీ కార్యకర్తలు హాజరయ్యారు. ● ఉంగుటూరు నియోజకవర్గంలో.. ఉంగుటూరు నియోజకవర్గంలో వైఎస్సార్ జయంతి వేడుకలు ఘనంగా జరిగాయి. నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఉంగుటూరు మండలం చేబ్రోలులో, నిడమర్రు మండలం పెదనిండ్రకొలను, గణపవరం మండలాల్లో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం చేబ్రోలులో పంచాయతీ మహిళా పారిశుద్ధ్య కార్మికులకు చీరలు పంపిణీ చేశారు. ● చింతలపూడి నియోజకవర్గంలో.. చింతలపూడి నియోజకవర్గం పార్టీ కార్యాలయంలో సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో వైఎస్సార్ చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం ఫైర్స్టేషన్ సెంటరులో వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్చేశారు. అనంతరం పార్టీ మండల నాయకుల ఆధ్వర్యంలో పాతబస్టాండ్ సెంటరులో అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. ● దెందులూరు నియోజకవర్గంలో.. దెందులూరు నియోజకవర్గంలో దెందులూరులో నాగులదేవునిపాడు, పెదవేగి మండలంలో విజయరాయి, పెదపాడు మండలంలో అప్పనవీడు, ఏలూరు రూరల్ మండలంలో పాలగూడెంలో పార్టీ సీనియర్ నేత, ఏపీ ఆయిల్ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు దివంగతనేత వైఎస్సార్ విగ్రహాలకు పూలమాలలు వేసి నివాళులర్పించి కేక్ కట్ చేశారు. ● గోపాలపురం నియోజకవర్గంలో.. గోపాలపురం నియోజకవర్గం ద్వారకాతిరుమలలో మాజీ హోం మంత్రి తానేటి వనిత ఆధ్వర్యంలో వేడుకలు జరిగాయి. వైఎస్సార్ విగ్రహానికి ఆమె పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం అన్నదానం చేశారు. మహానేత వైఎస్సార్కు ఘన నివాళి వాడవాడలా ఘనంగా 75వ జయంతి వేడుకలు ఏలూరు, ఉంగుటూరుల్లో సేవా కార్యక్రమాలు మహానేత సేవలు కొనియాడిన నేతలు -
శిలాఫలకాలను మూసివేయడం అవివేకం
నూజివీడు: అభివృద్ధి చేయడం చేతకాని పిరికిపందలే గతంలో జరిగిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను ప్రజలకు కనిపించకుండా చేయడానికి ప్రయత్నిస్తారని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. వైఎస్ జయంతి సందర్భంగా రోగులకు రొట్టెలు, పండ్లు పంచేందుకు బుధవారం పట్టణంలోని ఏరియా ఆసుపత్రికి వెళ్లగా అక్కడ ఆసుపత్రి ప్రారంభించిన వివరాలతో కూడిన శిలాఫలకాన్ని గుడ్డతో కప్పి ఉంచారు. దీనిని చూసిన ప్రతాప్ అప్పారావు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేసి ఆ గుడ్డను తొలగించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వ హయాంలో రూ.24 కోట్లను మంజూరు చేయించి కార్పొరేట్ ఆసుపత్రిని తలపించేలా అన్ని వసతులతో కూడిన భవనాన్ని నిర్మించి అందుబాటులోకి తెచ్చామన్నారు. ప్రస్తుత పాలకులు కూడా చేతనైతే నూజివీడును అభివృద్ధి చేయాలేగానీ గతంలో చేసిన అభివృద్ధి పనులకు సంబంధించిన శిలాఫలకాలను కనిపించనీయకుండా ఉంచాలని చూడటం వారి అవివేకానికి నిదర్శమన్నారు. ఇంకెప్పుడైనా శిలాఫలకాన్ని మూసివేయడం చేస్తే కార్యకర్తలతో కలసి వచ్చి ఆసుపత్రి వద్ద ధర్నాకు దిగుతానని హెచ్చరించారు. రోగులకు అవసరమైన సదుపాయలను కల్పించి మరింత అభివృద్ధి చేసి శిలాఫలకాలు వేసుకోవచ్చని, గత ఐదేళ్లల్లో ఏనాడైనా తాను పాత శిలాఫలకాలను కనిపించకుండా చేశానా అని ప్రశ్నించారు. ప్రజలకు సదుపాయాలు, సౌకర్యాలను కల్పించడమే కాకుండా అభివృద్ధే ధ్యేయంగా పనిచేశామన్నారు. నూజివీడు అభివృద్ధి అనేది వైఎస్ రాజశేఖర్రెడ్డి పాలనలోను, వైఎస్ జగన్ పాలనలోనే సాధ్యమైందన్నారు. ప్రస్తుతం మాత్రం చెరువులను, కొండలను లూటీ చేయడమే తప్ప నూజివీడుకు ఈ రెండేళ్లల్లో సాధించింది శూన్యమన్నారు. నిబంధనలకు విరుద్ధంగా చెరువుల్లో అడ్డగోలుగా గోతులు తవ్వి మట్టిని దోచేస్తున్నారని, భారీ గోతుల వల్ల భవిష్యత్లో అనేక ప్రమాదాలు జరిగే అవకాశం ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము తదితరులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
రాష్ట్రవ్యాప్తంగా రెడ్డి సంక్షేమ సంఘాలు
భీమవరం: రాష్ట్రవ్యాప్తంగా ఉన్న 175 నియోజకవర్గాల్లో రెడ్డి సంక్షేమ సంఘాలు ఏర్పాటు చేస్తున్నట్లు ఆంధ్రప్రదేశ్ రెడ్డి సంక్షేమ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తాడి భీమారెడ్డి చెప్పారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా రెడ్డి సంక్షేమ సేవా సంఘం ఆధ్వర్యంలో బుధవారం పట్టణంలో భీమవరం, ఉండి, కై కలూరు నియోజకవర్గాల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ప్రతి నియోజకవర్గంలో సంఘాల ఏర్పాటు ద్వారా సభ్యుల సంక్షేమం, ఐక్యతకు అవకాశం ఉంటుందన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సంఘం అధ్యక్షుడు ద్వారంపూడి వేణుగోపాలకృష్ణారెడ్డి మాట్లాడుతూ ఉమ్మడి పశ్చిమ జిల్లాకు అనుబంధంగా 17 నియోజకవర్గస్థాయి కమిటీలు నియమించామన్నారు. ముఖ్య అతిథులుగా ఎస్ఆర్ షాపింగ్మాల్ అధినేతలు డాక్టర్ ఎస్ఎల్ఎన్ ప్రసాద్రెడ్డి, ఎస్ఆర్ గోపీనాథ్ రెడ్డి హాజరుకాగా జిల్లా రెడ్డి సంఘం ప్రధాన కార్యదర్శి గుడిమెట్ల విజయ లక్ష్మణ్ రెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ కర్రా రామచంద్రారెడ్డి, తమనంపూడి వెంకటరెడ్డి, మేడపాటి చిరంజీవిరెడ్డి, కొవ్వూరి వెంకటరెడ్డి పాల్గొన్నారు. -
పెరిగిన గోదావరి ప్రవాహం
పోలవరం రూరల్: ఈ ఏడాది తొలిసారిగా గోదావరి వరద నీరు ఉభయగోదావరి జిల్లాల మధ్య లంక ఒడ్డులను తాకుతూ ప్రవహిస్తోంది. మహారాష్ట్ర, నదీ పరీవాహక ప్రాంతాల్లో కురుస్తున్న భారీ వర్షాల నీరు నదిలోకి చేరడంతో వరద ఉధృతి పెరుగుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 27.370 మీటర్లకు నీటి మట్టం చేరుకుంది. స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు 97 వేల క్యూసెక్కుల నీరు దిగువకు చేరు తోంది. దీంతో వరద ప్రవాహం మరింత పెరిగింది. స్పిల్వే నుంచి నీరు దిగువకు చేరుతుండటంతో స్పిల్ చానల్ ప్రాంతంలో మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్ళే మార్గంలో నిర్మించిన తాత్కాలిక రోడ్డు మార్గం వరద ఉధృతికి కొట్టుకుపోయింది. రోడ్డు అడుగుభాగంలో వేసిన తూరలు చెల్లాచెదురయ్యాయి. దిగువన వరద ప్రవాహం పెరుగుతూ ఇసుక తిన్నెలు ముంచుకుంటూ ప్రవహిస్తోంది. -
లారీ డ్రైవర్ దుర్మరణం
కొయ్యలగూడెం: మండలంలోని యర్రంపేట గ్రీన్ఫీల్డ్ హైవే వద్ద బుధవారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో లారీ డ్రైవర్ దుర్మరణం పాలయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. పిప్పర గ్రామానికి చెందిన కుచ్చర్లపాటి దిలీప్ కుమార్ (32) లారీ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం సాయంత్రం లారీ లోడ్తో కొయ్యలగూడెం వెళ్లిన అతను, అక్కడ అన్లోడ్ చేసిన అనంతరం బుధవారం తెల్లవారుజామున 5 గంటల సమయంలో రాజమండ్రి వైపు వస్తున్నాడు. ఈ క్రమంలో యర్రంపేట గ్రీన్ఫీల్డ్ హైవే వద్దకు వచ్చేసరికి, దిలీప్ కుమార్ నడుపుతున్న వాహనానికి ఎదురుగా వస్తున్న ఒక లారీని తప్పించబోయాడు. ఆ లారీని తప్పించే క్రమంలో ఇతని వాహనం అదుపుతప్పి పక్కకు దూసుకుపోవడంతో తీవ్ర గాయాలై దిలీప్ కుమార్ అక్కడికక్కడే మృతి చెందాడు. మృతునికి ఇంకా వివాహం కాలేదు. దిలీప్కుమార్ తల్లి జంపన సుశీల ఫిర్యాదు మేరకు కొయ్యలగూడెం పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శబ్ద కాలుష్యంపై కఠిన చర్యలు
ఏలూరు టౌన్: ప్రజలను ఇబ్బందులకు గురిచేస్తూ శబ్దకాలుష్యం చేస్తే కఠిన చర్యలు తప్పవని ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ హెచ్చరించారు. ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ఆదేశాలపై ఏలూరు పాతబస్టాండ్ సెంటర్లో ట్రాఫిక్ సీఐ ఎస్.లక్ష్మణరావు ఆధ్వర్యంలో స్పెషల్ డ్రైవ్ చేపట్టి వాహన తనిఖీలు చేశారు. 15 స్పీకర్ బాక్సులు, 225 ఎల్ఈడీ లైట్లు, 50 మోటారు సైకిళ్ల సైలెన్సర్లు స్వాధీనం చేసుకుని ధ్వంసం చేశారు. ఈ సందర్భంగా డీఎస్పీ శ్రావణ్కుమార్ మాట్లాడుతూ నిబంధనలకు విరుద్ధంగా వాహనాల్లో మార్పులు చేస్తే కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. వాహనాలకు అనుమతులు లేకుండా ఇష్టారాజ్యంగా ఎల్ఈడీ లైట్లు ఏర్పాటు చేసినా... మోటారు సైకిళ్లకు భారీ శబ్దాలు చేసే సైలెన్సర్లు పెట్టినా చర్యలు తప్పవన్నారు. కైకలూరు : కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయ హుండీ కానుకలను బుధవారం దేవదాయ ధర్మదాయ శాఖ అధికారి ఎ.పవన్కుమార్ పర్యవేక్షణలో ఆలయ ధర్మకర్తలమండలి చైర్మన్ వెంకన్నబాబు ఆధ్వర్యంలో లెక్కించారు. 105 రోజులకు గాను రూ.16,63,951 ఆదాయం లభించిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు తెలిపారు. కార్యక్రమంలో పోలీసు, రెవెన్యూ, గ్రామ పెద్దలు పాల్గొన్నారు. వేలేరుపాడు: జగన్నాఽథపురం గ్రామంలో ఎండీ ఇబ్రహీంకు చెందిన పెంకుటిల్లు బుధవారం తెల్లవారుజామున అగ్ని ప్రమాదంలో దగ్ధమైంది. విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా ఈ ప్రమాదం జరిగినట్లు భావిస్తున్నారు. అంతా నిద్రిస్తున్న సమయంలో ఈ ప్రమాదం సంభవించడంతో ఇంట్లో దాచిన రూ.రెండున్నర లక్షల నగదుతోపాటు ఇనుప బీరువాలు, వంట పాత్రలు, ఎల్ఈడీ టీవీ, మంచాలు, బట్టలు, ఇతరత్రా వస్తువులన్నీ కాలిబూడిదయ్యాయి. సుమారు రూ.15 లక్షల ఆస్తినష్టం సంభవించింది. ఈ ఇంట్లో ఉంటున్న ఎండీ నయీమ్, నఖీమ్ కుటుంబాలు కట్టుబట్టలతో బయటపడ్డాయి. కుక్కునూరు నుంచి వచ్చిన ఫైర్ ఇంజన్ మంటలను అదుపు చేసింది. బాధితులను వేలేరుపాడు తహశీల్దార్ శ్రీనివాసరావు, ఎంపీడీఓ శ్రీహరి, ఎస్సై నవీన్, వీఆర్ఓ బుడిపిటి సంగీతరావు పరామర్శించారు. తక్షణ ప్రభుత్వ సాయంగా నిత్యావసర వస్తువులు అందజేశారు. భీమవరం: భీమవరం వన్టౌన్ పోలీస్ స్టేషన్ పరిధిలోని టౌన్హాల్పై బుధవారం రాత్రి పోలీసులు ఆకస్మికంగా దాడి చేశారు. ఈ దాడికి సంబంధించి రెగ్యులర్ తనిఖీల్లో భాగంగానే దాడి చేశామని, ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ కార్యకలపాలు చోటు చేసుకోలేదని పోలీసులు చెబుతున్నారు. అయితే పోలీసుల దాడిలో పలువురు రాజకీయ ప్రముఖులు పేకాడుతూ పట్టుబడ్డారని, రాజకీయ పెద్దల జోక్యంతో కేసు లేకుండా చేశారంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. నరసాపురం రూరల్: వివిధ పనుల నిమిత్తం ఈశాన్య రాష్ట్రాల నుంచి వచ్చి ఇక్కడ నివసిస్తూ చట్టపరమైన సమస్యలు ఎదుర్కొంటున్నవారికి, విద్యార్థులకు న్యాయసహాయం అందించేందుకు ప్రత్యేక న్యాయ సహాయ కేంద్రంను ప్రారంభించినట్లు నరసాపురం 10వ అదనపు జిల్లా న్యాయమూర్తి ఎ వాసంతి తెలిపారు. నరసాపురం మండలం రుస్తుంబాద గ్రామంలోనిని ఫ్లెయిజ్ మెమోరియల్ హయ్యర్ సెకండరీ స్కూల్ ఆఫ్ సెవెంత్ డే అడ్వెంటిస్ట్లో బుధవారం నిర్వహించిన కార్యక్రమంలో న్యాయమూర్తి వాసంతి మాట్లాడారు. ప్రత్యేక న్యాయ సహాయ సెంటర్లో ప్యానల్ లాయర్గా కొప్పినీడి చిట్టి పద్మజ, పారా లీగల్ వాలంటీర్ గా బొడ్డు కృష్ణ భగవాన్ వ్యవహరిస్తారన్నారు. ప్రతి శుక్రవారం మధ్యాహ్నం 2 నుంచి 5 గంటల వరకు వీరు అందుబాటులో ఉంటారన్నారు. -
ముగిసిన జాతీయ స్థాయి నాటిక పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లోని కానాల గురుమూర్తి కళావేదికపై నిర్వహిస్తున్న శ్రీ అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీలు నాలుగో రోజైన మంగళవారం ఆహ్లాదభరిత వాతావరణంలో ముగిశాయి. ముందుగా యడ్లపాడు మానవత సాగరి సంస్థ ఆధ్వర్యంలో జరుగుల రామారావు రచన, దర్శకత్వంలో ప్రదర్శించిన ‘అందరూ మంచివారే.. కానీ’ అనే నాటిక కుటుంబ బంధాలను, మానవ సంబంధాలను కాపాడుకోవాలనే సందేశాన్ని ఇస్తూ సాగింది. అనంతరం జరుగుల రామారావు దర్శకత్వంలోనే ‘బావా ఎప్పుడు వచ్చితీవు’ అనే మరో నాటికను ప్రదర్శించారు. సంకుచిత భావాలున్న భర్తకు తగిన రీతిలో బుద్ధి చెప్పే భార్య కథను ప్రదర్శించి ప్రేక్షకులను ఆకట్టుకున్నారు. ఘనంగా బహుమతుల ప్రదానం నాటిక ప్రదర్శనల అనంతరం రాత్రి బహుమతి ప్రదానోత్సవ సభ అత్యంత వైభవంగా నిర్వహించారు. హేలాపురి కళా పరిషత్ అధ్యక్షులు పెదపాటి రామకృష్ణ అధ్యక్షతన నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆత్మీయ అతిథులుగా ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ల సమాఖ్య అధ్యక్షుడు బుద్దాల వెంకట రామారావు, ఆంధ్రప్రదేశ్ నాటక పరిషత్ వేదిక అధ్యక్షుడు ముత్తవరపు సురేష్ బాబు, బొప్పన నరసింహారావు, కళారత్న ఎస్.వి. రామారావు, గరికపాటి కాళిదాసు, మజ్జి సూర్యకాంతారావు, కే.బి. రావు తదితరులు హాజరై విజేతలకు బహుమతులు అందజేశారు. ఈ కార్యక్రమంలో గుత్తా కౌసలేంద్రరావు, పి. విజయ్ కుమార్, వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ తదితరలు పాల్గొన్నారు. -
రైతు కంట కన్నీరు
జంగారెడ్డిగూడెం: రైతు కంట కన్నీళ్లు పెట్టించే ప్రభుత్వానికి మనుగడ ఉండదని ఏలూరు జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. వర్జీనియా పొగాకు రైతులకు గిట్టుబాటు ధర కల్పించాలని డిమాండ్ చేస్తూ మంగళవారం జంగారెడ్డిగూడెంలో వైఎస్సార్సీపీ, రైతు సంఘాలు, వామపక్షాల ఆధ్వర్యంలో భారీ ప్రదర్శన, ధర్నా, సభ నిర్వహించారు. పెద్ద ఎత్తున ట్రాక్టర్లు, కార్లు, బైకులతో ర్యాలీగా తరలివచ్చారు. జంగారెడ్డిగూడెం మార్కెట్ యార్డ్ వద్ద ప్రారంభమైన ఈ నిరసన ర్యాలీ పంచాయతీ కార్యాలయం, గంగానమ్మ గుడి సెంటర్, బోసు బొమ్మ సెంటర్, అశ్వరావుపేట రోడ్డు మీదుగా టొబాకో బోర్డు కార్యాలయం వరకు సాగింది. వర్జీనియా పొగాకు బోర్డు రీజనల్ మేనేజర్ సురేంద్రకు నాయకులు వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా జరిగిన సభలో డీఎన్నార్ మాట్లాడుతూ చంద్రబాబు ప్రభుత్వం రైతులను మోసం చేస్తోందని, రైతు సంక్షేమంపై దృష్టి పెట్టాలని డిమాండ్ చేశారు. రాష్ట్రంలో ఏ ఒక్క రైతు ఆనందంగా లేరని, దీనికి కారణం చంద్రబాబు రైతు వ్యతిరేక విధానాలేనని విమర్శించారు. వర్జీనియా పొగాకు రైతుకు కనీస మద్దతు ధర కేజీ రూ. 300 ఇవ్వాలని డిమాండ్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాల్ మాట్లాడుతూ గత ఏడాది వర్జీనియా పొగాకుకు గరిష్టంగా రూ.450 పైగా రాగా, ఈ ఏడాది గరిష్టంగా రూ.260 మాత్రమే వస్తోందని చెప్పారు. దివంగత నేత వైఎస్సార్ రైతు బాంధవుడిగా ఉచిత విద్యుత్, ఫీజు రీయింబర్స్మెంట్, జలయజ్ఞం వంటి పథకాలు ప్రవేశపెట్టి ఆదర్శంగా నిలిచారని గుర్తు చేశారు. చంద్రబాబు, అచ్చెన్నాయుడు వరి పండించవద్దని అనడం దౌర్భాగ్యమని విమర్శించారు. నష్టాల ఊబిలో రైతులు వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ప్రస్తుతం వర్జీనియా రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయారని ఆవేదన వ్యక్తం చేశారు. గతంలో జగన్ హయాంలో మార్క్ఫెడ్ ద్వారా నిధులు ఏర్పాటు చేసి పొగాకును కొనుగోలు చేశారని గుర్తు చేశారు. ప్రభుత్వం పండించిన పంట కొనుగోలు చేయకపోవడం దారుణమన్నారు. వర్జీనియా పొగాకు వల్ల విదేశీ మారకద్రవ్యం లభిస్తుందని, లక్షలాది మంది కూలీలు దీనిపై ఆధారపడి ఉన్నారని పేర్కొన్నారు. చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ చంద్రబాబు తనను విజనరీ సీఎంగా చెప్పుకుంటారని, అసలు విజన్ ఎక్కడ ఉందని ప్రశ్నించారు. అమరావతి పేరుతో రూ.లక్షల కోట్లు దోచుకుంటున్నారని, రైతుల ఉసురు తగులుతుందని హెచ్చరించారు. వైఎస్స్సార్ హయాంలో రూ.200 కోట్ల సాయం పోలవరం నియోజకవర్గ కన్వీనర్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ దివంగత నేత వైఎస్సార్ హయాంలో పొగాకు రైతులను రూ.200 కోట్లు ఇచ్చి కొనుగోలుచేసి ఆదుకున్నారని గుర్తు చేశారు. జగన్మోహన్రెడ్డి కూడా మార్క్ఫెడ్ ద్వారా కొనుగోలు చేసి ఆదుకున్నారన్నారు. చంద్రబాబు మాత్రం వ్యవసాయం దండగని రైతులను నిర్లక్ష్యం చేస్తున్నారన్నారు. ప్రజలు చంద్రబాబు నాయుడు ప్రభుత్వాన్ని ఎందుకు గెలిపించుకున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారన్నారు. రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా మాట్లాడుతూ ప్రభుత్వానికి రైతుల సంక్షేమం ముఖ్యం కాదని, కేవలం రాజకీయాలే ముఖ్యమని విమర్శించారు. మామిడి, మిర్చి, వరి రైతులంతా తీవ్ర నష్టాల్లో ఉన్నారని, విత్తనాలు, ఎరువుల దగ్గర నుంచి పంట అమ్ముకునే వరకు రైతులు ఇబ్బందులు పడుతున్నారని పేర్కొన్నారు. ప్రశించే వారిపై కేసులు పెట్టడం, మామిడి రైతులపై లాఠీఛార్జి చేయడం అమానుషమని మండిపడ్డారు. వైఎస్సార్సీపీ రైతు విభాగం రాష్ట్ర అధ్యక్షుడు రామారావు మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో చంద్రబాబు ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. ఏఐకేఎంఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి చిట్టిపాటి వెంకటేశ్వరరావు, సీపీఐఎంఎల్ న్యూ డెమోక్రసీ రాష్ట్ర కమిటీ సభ్యులు ధర్ముల సురేష్, సీపీఐ జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య తదితరులు మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని పొగాకు కొనుగోలుకు రూ. 1000 కోట్లు కేటాయించేలా రాష్ట్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకురావాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు రైతులను చిన్న చూపు చూస్తున్నారని ధ్వజమెత్తారు. పొగాకు రైతులకు అండగా నిలబడి పోరాటం చేద్దామన్నారు. ఈ కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఉంగుటూరు నియోజకవర్గ కన్వీనర్ పుప్పాల వాసుబాబు, ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, బీవీఆర్ చౌదరి, రైతు సంఘాల నాయకులు సత్రం వెంకటరావు, వామిశెట్టి హరిబాబు, ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గుప్త, కుక్కల ధర్మరాజు, జెట్టి సత్య ఆదిత్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర, జిల్లా, మండల, పట్టణ విభాగాల నాయకులు, కార్యకర్తలు, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ నాయకులు, రైతులు పెద్దెత్తున పాల్గొన్నారు. ఈ ప్రభుత్వానికి మనుగడ ఉండదు వర్జీనియా పొగాకు రైతుల భారీ నిరసన ర్యాలీలో వక్తలు గిట్టుబాటు ధర కల్పించాలంటూ జంగారెడ్డిగూడెంలో భారీ బహిరంగ సభ కేజీకి కనీస మద్దతు ధర రూ.300 ఇవ్వాలని డిమాండ్ వైఎస్సార్సీపీ, వామపక్షాలు, రైతుల సంఘాల నేతల హాజరు -
కోస్తా విద్యార్థులకు వరదాయిని
రాజీవ్గాంధీ వైజ్ఞానిక సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో భాగంగా రాష్ట్రంలో మూడు ట్రిపుల్ఐటీలను వైఎస్సార్ హయాంలో ప్రారంభించారు. వాటిలో నూజివీడు ట్రిపుల్ఐటీ ఒకటి. 120 ఎకరాల విస్తీర్ణంలో ఏటా 2వేల అడ్మిషన్లతో కార్పొరేట్కు దీటుగా ఆధునాతన భవనాలతో ప్రారంభమైంది. 6 వేల సీట్లతో ఇంటిగ్రేటెడ్ ఇంజనీరింగ్ కోర్సును పేద పిల్లలకు ప్రతిభ ఆధారంగా అందిస్తున్నారు. వైఎస్ మరణానంతరం అడ్మిషన్ల సంఖ్య తగ్గించారు. 75 మంది మెంటార్లు, ఇంజనీరింగ్ ఫ్యాకల్టీ, గెస్ట్ లెక్చరర్లు ఇలా 175 మందికిపైగా సిబ్బంది ఉన్నారు. కెమికల్ ఇంజనీరింగ్, సీఎస్ఈ, ఈసీఈ, మెకానికల్, ఎంఎంఈ బ్రాంచుల్లో వేలాది మంది విద్యార్థులు దేశవ్యాప్తంగా ఉన్నత కొలువుల్లో స్థిరపడ్డారు. -
గోటేరులో ముగ్గురిపై కేసు నమోదు
ఇరగవరం: మండల పరిధిలోని గోటేరు గ్రామంలో ఓ మహిళపై దాడి చేసిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై నసీరుల్లా తెలిపారు. వివరాల ప్రకారం గోటేరు గ్రామానికి చెందిన యండమూరి రత్నకుమారికి అదే గ్రామంలో సుమారు 5 సెంట్ల స్థలం ఉంది. ఆ స్థల సరిహద్దుల్లో ఉన్న దాదాపు 15 గజాల స్థలాన్ని కొవ్వూరు కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు ఆక్రమించారు. ఈ సరిహద్దు వివాదాన్ని పరిష్కరించుకునేందుకు, ఇరుపక్షాల స్థల పత్రాలను పరిశీలించి కొలతలు వేసుకుందామని రత్నకుమారి పలుమార్లు కోరారు. తమ స్థల పత్రాలను తెస్తామని, వారిని కూడా తీసుకురావాలని అడిగినప్పటికీ కృష్ణమోహన్ కుటుంబ సభ్యులు స్పందించకుండా రత్నకుమారితో తరచూ గొడవకు దిగేవారు. ఈ నేపథ్యంలో, యండమూరి రత్నకుమారి తన స్థలంలో పూలు కోసుకుంటుండగా కొవ్వూరు కృష్ణమోహన్, అతని భార్య, కుమారుడు అరవింద్ కలిసి ఆమైపె దాడికి తెగబడ్డారు. దీంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించింది. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం నుంచి గుంటూరుకు ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా తరలిస్తున్న 32 నాణ్యమైన పొగాకు బేళ్లను పొగాకు బోర్డు నిఘా (విజిలెన్స్) అధికారులు చాకచక్యంగా పట్టుకున్నారు. ముందస్తు సమాచారంతో కలపర్రు టోల్ ప్లాజా వద్ద నిఘా ఉంచిన అధికారులు, అనుమానాస్పదంగా వెళ్తున్న రెండు ఆటోలను తనిఖీ చేసి ఈ పొగాకును స్వాధీనం చేసుకున్నారు. అక్రమ రవాణాకు పాల్పడుతున్న వారిపై కేసు నమోదు చేసి, సీజ్ చేసిన పొగాకును జంగారెడ్డిగూడెం వేలం కేంద్రానికి తరలించారు. ఈ దాడుల్లో నిఘా అధికారులు కిరణ్, జీఎం సాయి ప్రశాంత్, ధర్మతేజ పాల్గొన్నారు. ఇరగవరం: పేకాట ఆడుతున్న ముగ్గురు వ్యక్తులపై కేసు నమోదు చేసిన ఘటన ఇరగవరం మండలం కె.ఇల్లిందలపర్రు గ్రామంలో చోటు చేసుకుంది. ఎస్సై నసిరుల్లా తెలిపిన వివరాల ప్రకారం గ్రామంలో మంగళవారం పేకాట శిబిరంపై దాడి చేసి ముగ్గురు వ్యక్తులను అదుపులోకి తీసుకుని, వారు వద్ద నుంచి రూ.2430 నగదు స్వాధీనం చేసుకున్నామని తెలిపారు. వారిపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరుపరుస్తున్నట్లు తెలిపారు. ఏలూరు టౌన్: తల్లి మరణించి, తండ్రి వదిలేయడంతో దయనీయ స్థితిలో ఉన్న ముగ్గురు చిన్నారులకు ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చొరవతో తండ్రి నీడ దక్కింది. కుక్కునూరు మండలం కివ్వక గ్రామానికి చెందిన షేక్ మహాలక్ష్మి (7), లావణ్య (5), అమూల్య (3) అనే చిన్నారుల తల్లి రెండేళ్ల క్రితం మరణించగా, తండ్రి షేక్ వెంకన్న తొమ్మిది నెలల క్రితం పిల్లలను వదిలి వెళ్లిపోయాడు. ఇటీవల ఏలూరు బాలసదనంలో ఈ పిల్లలను కలిసిన ఎస్పీ, వారి దీనస్థితిపై చలించి తండ్రి ఆచూకీ కనుగొనాలని ఆదేశించారు. దీంతో రంగంలోకి దిగిన మహిళా పీఎస్ సీఐ ఎం.సుబ్బారావు, కుక్కునూరు పోలీసులు, శక్తి టీమ్ మహారాష్ట్రలో ఉన్న తండ్రి వెంకన్నను గుర్తించి ఏలూరుకు రప్పించారు. ఎస్పీ శివకిషోర్ సమక్షంలో ఆయనకు కౌన్సిలింగ్ ఇచ్చి పిల్లల బాధ్యతను అప్పగించారు. పిల్లల సంక్షేమం, భద్రతకు పోలీస్ శాఖ ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటుందని ఎస్పీ స్పష్టం చేశారు. పాలకొల్లు సెంట్రల్: మండలంలోని పెనుమదం గ్రామంలో మంగళవారం సాయంత్రం ఓ కుక్క స్వైర విహారం చేయడంతో సుమారు పది మందికి గాయాలైనట్లు స్థానికులు తెలిపారు. కుక్క దాడిలో తీవ్ర గాయాలైన నాగలక్ష్మీ, బాలుడు విన్నులు పాలకొల్లు ప్రభుత్వ ఏరియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. నాగలక్ష్మిని బుగ్గపై, చెవులపై తీవ్రంగా కరవగా బాలుడి చేతిపై దారుణంగా కరిచింది. కుక్కలను అదుపు చేయకపోవడం వల్లే ఇలాంటి ప్రమాదాలు జరుగుతాయని, పంచాయతీ అధికారులు వెంటనే స్పందించి కుక్కల సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు కోరుతున్నారు. నకిలీ బిల్లులు తయారు చేసిన వ్యక్తిపై కేసు తణుకు అర్బన్: నకిలీ బిల్లులు తయారు చేసి సంస్థ యజమానిని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదుచేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాస్ తెలిపారు. తణుకు మండలంలోని శ్రీనివాస ఇండస్ట్రీస్లో సారిక వెంకటేశ్వరరావు గుమస్తాగా పనిచేస్తూ కంప్యూటర్లో ట్యాలీ సాఫ్ట్వేర్ ద్వారా బిల్లులు తయారుచేయడం, అకౌంట్స్ నిర్వహించడం విధుల్లో భాగంగా బయట వ్యక్తుల పేర్లపై నకిలీ బిల్లులు తయారుచేసి వాటిని ఇచ్చినట్లుగా చూపిస్తూ సదరు నగదును తన భార్య బ్యాంక్ అకౌంట్కు ఫోన్పే ద్వారా జమ చేయించాడు. దీంతో ఇండస్ట్రీస్ యజమాని సింహాద్రి వెంకటరత్నం పోలీసులను ఆశ్రయించాడు. -
బాలిక మృతిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారుల విచారణ
బుట్టాయగూడెం: మండలంలోని మారుమూల గ్రామమైన మోతుగూడెంకు చెందిన నాలుగేళ్ల కొండరెడ్డి బాలిక మృతిపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు మంగళవారం విచారణ జరిపారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి (డిఎంహెచ్ఓ) డాక్టర్ యు.శోభ, జిల్లా మలేరియా అధికారి వి.ఎస్.ఎస్.ప్రసాద్, జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి ఆర్ఎంఓ డాక్టర్ రాంబాబు, కేఆర్ పురం ఐటిడిఏ డిప్యూటీ డిఎంహెచ్ఓ సుమతి మంగళవారం బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రాన్ని (సిహెచ్సీ) సందర్శించారు. ఈ సందర్భంగా బాలిక మృతికి గల కారణాలపై అక్కడి వైద్యులు, సిబ్బందిని వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ ఘటనపై పూర్తి నివేదికను ఉన్నతాధికారులకు పంపిస్తామని అధికారులు తెలిపారు. అనంతరం డిఎంహెచ్ఓ శోభ మోతుగూడెం గ్రామాన్ని సందర్శించారు. మృతి చెందిన బాలిక తల్లిదండ్రులు గురుగుంట్ల వెంకటరెడ్డి, సునీతలను పరామర్శించి, ఘటనకు సంబంధించిన వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా డీఎంహెచ్ఓ మాట్లాడుతూ భవిష్యత్తులో ఇటువంటి సంఘటనలు పునరావృతం కాకుండా తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. ప్రభుత్వ ఆసుపత్రుల్లో పనిచేస్తున్న డాక్టర్లు, సిబ్బంది ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ ప్రజలకు మెరుగైన వైద్య సేవలు అందించాలని స్పష్టం చేశారు. విధి నిర్వహణలో నిర్లక్ష్యం వహిస్తే కఠిన చర్యలు తప్పవని ఆమె హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ వసుంధర, ప్రోగ్రామ్ ఆఫీసర్ పూజ, అంతర్వేదిగూడెం పిహెచ్సీ వైద్యాధికారి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
75.42 శాతం డిజిటలైజేషన్
కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఏలూరు (టూటౌన్): జిల్లాలో ప్రత్యేక ఇంటెన్సివ్ రివిజన్ (ఎస్ఐఆర్) –2026లో భాగంగా ఇంతవరకు 12 లక్షల 40 వేల 130 (75.42 శాతం) ఎన్యూమరేషన్ ఫారంలు డిజిటైజేషన్ పూర్తయినట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. జిల్లాలో 16 లక్షల 44 వేల 194 మంది ఓటర్లు ఉన్నారని, వారిలో ఇప్పటివరకు 16 లక్షల 41 వేల 778 (99.85 శాతం) ఎన్యూమరేషన్ ఫారంలు పంపిణీ చేయడం జరిగిందన్నారు. జిల్లాలో 1744 మంది బీఎల్ ఓలు సర్ కార్యక్రమంలో విధులు నిర్వర్తిస్తున్నారన్నారు. ప్రజలు తమకు అందిన ఎన్యూమరేషన్ ఫారాలను పూర్తిచేసి, బీఎల్ఓలకు అందించి నిర్దేశించిన సమయంలోగా సర్ కార్యక్రమం పూర్తయ్యేందుకు సహకరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి విజ్ఞప్తి చేశారు. పోలవరం రూరల్: గోదావరి నదిలోకి ఎగువ ప్రాంతాల నుంచి వరద నీరు చేరుతుండటంతో నీటి మట్టం క్రమేపీ పెరుగుతోంది. మహారాష్ట్రలో కురుస్తున్న భారీ వర్షాలతో పాటు నదీ పరీవాహక ప్రాంతంలో కురుస్తున్న వర్షాల నీరు నదిలోకి చేరుతోంది. పోలవరం ప్రాజెక్టు స్పిల్వే వద్ద 26.690 మీటర్లకు నీటిమట్టం చేరుకుంది. నీటిమట్టం పెరుగుతుండడంతో స్పిల్వే 48 గేట్ల నుంచి దిగువకు నీటిని విడుదల చేస్తున్నారు. మహానందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే తాత్కాలిక రోడ్డు మార్గం కోతకు గురై రోడ్డు దిగువన వేసిన తూరలు కూడా కొట్టుకుపోయాయి. ఉంగుటూరు: చేబ్రోలు వద్ద రైలు కింద పడి ఒకే కుటుంబానికి చెందిన నలుగురు ఆత్మహత్య చేసుకున్న ఘటనలో మృతిచెందిన షేక్ చాంద్ బాషా, అతని భార్య హసీనా, పెద్ద కుమార్తె ఫరీన్, చిన్న కుమార్తె సమీరాల మృతదేహాలకు మంగళవారం గుడివాడలో హసీనా తమ్ముడు అబ్దుల్లా అంత్యక్రియలు నిర్వహించారు. సోమవారం సాయంత్రానికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం పూర్తి కావడంతో, రైల్వే పోలీసులు మృతదేహాలను బాషా బావమరిదికి అప్పగించారు. తాడేపల్లిగూడెంలో బాషా బంధువులు ఎవరూ లేకపోవడంతో అబ్దుల్లా మృతదేహాలను గుడివాడకు తీసుకెళ్లి అంత్యక్రియలు జరిపారు. వారి మరణానికి గల ప్రధాన కారణాలను కేసు దర్యాప్తు చేస్తున్న సీఐ శ్రీనివాసరెడ్డి వెల్లడించారు. కుటుంబంలోని నలుగురూ వివిధ రకాల ఆరోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, దీనికి తోడు తీవ్ర ఆర్థిక ఇబ్బందులు కూడా ఎదుర్కొంటున్నట్లు తెలిపారు. ఈ సమస్యలన్నింటికీ చావే పరిష్కారం అనుకుని వారు ఈ దారుణానికి పాల్పడినట్లు ప్రాథమిక దర్యాప్తులో గుర్తించినట్లు చెప్పారు. ఏలూరు టౌన్: పోలీస్ శాఖలో 2004 సంవత్సరానికి ముందు విధుల్లో చేరిన పోలీస్ ఉద్యోగులను సీపీఎస్ నుంచి జీపీఎస్ పెన్షన్ విధానంలోకి మార్పు చేసే నిర్ణయంపై ఏలూరు జిల్లా పోలీస్ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ను పోలీస్ సిబ్బంది ప్రత్యేకంగా కలిసి కృతజ్ఞతలు తెలిపారు. పోలీస్ సిబ్బంది మరింత ఉత్సాహంతో ప్రజలకు మెరుగైన సేవలు అందించాలని ఎస్పీ శివకిషోర్ ఈ సందర్భంగా సూచించారు. కార్యక్రమంలో పోలీస్ అధికారులు, సిబ్బంది, సంఘం ప్రతినిధులు ఉన్నారు. ఏలూరు (టూటౌన్): ఏపీ ప్రగతిశీల భవన, ఇతర నిర్మాణ కార్మిక సంఘం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో మంగళవారం ఏలూరు జిల్లా లేబర్ కమిషనర్ కార్యాలయం వద్ద భవన నిర్మాణ కార్మికులు ధర్నా నిర్వహించారు. సంఘ జిల్లా అధ్యక్షుడు ఈమని గ్రీష్మ కుమార్, ప్రధాన కార్యదర్శి మానికల నాగరాజు మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం ఎన్నికల్లో భవన నిర్మాణ కార్మికులకు ఇచ్చిన హామీలు అమలు చేయాలని కోరారు. ప్రమాద మరణం, అంగవైకల్య పరిహారం, వైద్య ఖర్చులు, కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్లు వంటి వాటిని పథకాలను తక్షణమే పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఐఎఫ్టీయూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, జిల్లా ఉపాధ్యక్షుడు బుద్దా సోమయ్య మాట్లాడుతూ భవన నిర్మాణ కార్మికులు 60 ఏళ్లు పైబడినా వృత్తిలో కొనసాగుతున్న నేపథ్యంలో కార్మికులు మరణించేవరకూ సంక్షేమ పథకాలు వర్తింప చేయాలని డిమాండ్ చేశారు. అనంతరం డీసీఎల్ శ్రీనివాసరావుకి వినతిపత్రం అందజేశారు. -
నూజివీడు ట్రిపుల్ఐటీ డైరెక్టర్ మార్పు
ఇన్చార్జి డైరెక్టర్గా వైస్ ఛాన్సలర్ లక్ష్మీనారాయణరావు బాధ్యతల స్వీకరణ నూజివీడు: నూజివీడు ట్రిపుల్ఐటీ ఇన్చార్జి డైరెక్టర్గా ఆర్జీయూకేటీ వైస్ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు మంగళవారం బాధ్యతలు స్వీకరించారు. గత నాలుగు నెలలుగా ఇన్చార్జి డైరెక్టర్గా పూర్తి అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజును అకస్మాత్తుగా మార్చి ఆయన స్థానంలో వైస్ఛాన్సలర్ ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించడంపై ట్రిపుల్ఐటీ వర్గాల్లో తీవ్ర చర్చ జరుగుతోంది. గోపాలరాజు మార్చి 12న ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు స్వీకరించారు. మరో నాలుగు రోజుల్లో నాలుగు నెలలు పూర్తికావస్తుండగా డైరెక్టర్ పదవి నుంచి పక్కకు తప్పుకోవడం గమనార్హం. దీంతో కొత్త డైరెక్టర్ను నియమించే వరకు వైస్ఛాన్సలర్ ఆచార్య మద్దాల లక్ష్మీనారాయణరావు ఇన్చార్జి డైరెక్టర్గా బాధ్యతలు నిర్వహించనున్నారు. ఆయన మాట్లాడుతూ ట్రిపుల్ఐటీ అభివృద్ధికి కృషి చేస్తానన్నారు. ఈ కార్యక్రమంలో ఆర్జీయూకేటీ రిజిస్ట్రార్ ఆచార్య సండ్ర అమరేంద్రకుమార్, నూజివీడు ట్రిపుల్ఐటీ ఏఓ బీ లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఇటీవల పదో తరగతి ఉత్తీర్ణులైన షెడ్యూల్ కులాలకు చెందిన విద్యార్థులు ‘తల్లికి వందనం 2026–2027’ పథకం లబ్ధి పొందుటకు తప్పనిసరిగా స్టేట్ బ్యాంకు ఆఫ్ ఇండియా/ యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా/ పోస్టాఫీస్ నందు బ్యాంక్ ఖాతా తెరవాలని, ఎన్పీసీఐకి లింక్ చేయించుకోవాలని ఉప సంచాలకులు, జిల్లా సాంఘీక సంక్షేమ, సాధికారిత అధికారి వై.విశ్వమోహన్ రెడ్డి మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 10వ తేదీలోగా ఖాతా ప్రారంభించాలన్నారు. వివరాలకు కె.వీరబాబు, డీపీఎంయు 95022 28533 నంబర్లో సంప్రదించాలన్నారు. -
వ్యక్తిని బలిగొన్న భూ వివాదం
జంగారెడ్డిగూడెం: కొద్దిపాటి వ్యవసాయ భూమి కోసం అన్నదమ్ముల కుటుంబాల మధ్య నడుస్తున్న వివాదం చివరకు రక్తపాతానికి దారితీసింది. జంగారెడ్డిగూడెం మండలం పేరంపేట గ్రామ శివారులోని రైతు భరోసా కేంద్రం వద్ద మంగళవారం మధ్యాహ్నం కారుమూరి దుర్గారెడ్డి (55) తన అన్న కుమారుడి చేతిలో హత్యకు గురయ్యాడు. గ్రామస్తులు, కుటుంబ సభ్యుల వివరాల ప్రకారం పేరంపేట గ్రామానికి చెందిన కారుమూరి వెంకటరెడ్డి, దుర్గారెడ్డి అన్నదమ్ములు. వీరికి పంగిడిగూడెం వెళ్లే ప్రధాన రహదారి పక్కన ఉన్న 1.70 ఎకరాల వ్యవసాయ భూమి విషయంలో గత కొంతకాలంగా వివాదం నడుస్తోంది. తమకు ప్రాణహాని ఉందని, భూమిని ఇప్పించాలని దుర్గారెడ్డి గతంలో జిల్లా కలెక్టరేట్లో పీజీఆర్ఎస్ ద్వారా ఫిర్యాదు చేశారు. గత ఆదివారం కూడా పొలంలో పని చేసుకుంటుండగా వెంకటరెడ్డి, అతని కుమారుడు శ్రీనివాసరెడ్డి వచ్చి దుర్గారెడ్డిపై దాడికి ప్రయత్నించాడు. దీనిపై బాధితుడు డయల్ 112కు ఫిర్యాదు చేయడంతో పోలీసులు ఇరువర్గాలను పిలిపించి బైండోవర్ చేశారు. మంగళవారం మధ్యాహ్నం దుర్గారెడ్డి రైతు భరోసా కేంద్రం వద్ద కూర్చుని ఫోన్ మాట్లాడుతుండగా, అతని అన్న కుమారుడు శ్రీనివాసరెడ్డి కత్తితో విచక్షణా రహితంగా నరికి చంపాడు. అనంతరం నిందితుడు పోలీస్ స్టేషన్లో లొంగిపోయాడు. పోలీసుల నిర్లక్ష్యం వల్లే.. చింతలపూడి ఎమ్మెల్యే సొంగా రోషన్ కుమార్ ఘటనాస్థలానికి చేరుకుని మృతుడి కుటుంబ సభ్యులను పరామర్శించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ దుర్గారెడ్డిని హత్య చేయడం దుర్మార్గమని మండిపడ్డారు. దుర్గారెడ్డికి ప్రాణహాని ఉందని హత్యకు అరగంట ముందే మా క్యాంపు కార్యాలయం నుంచి జంగారెడ్డిగూడెం పోలీసులకు ఫోన్ చేసి రక్షణ కల్పించాలని కోరినా పోలీసులు నిర్లక్ష్యంగా వ్యవహరించారని ఆరోపించారు. పోలీసులు సకాలంలో స్పందించ లేదని, ఇది ముమ్మాటికీ శాంతిభద్రతల వైఫల్యమే అని ఆగ్రహం వ్యక్తం చేశారు. మా వైఫల్యం లేదు దుర్గారెడ్డి హత్య కేసులో పోలీసుల వైఫల్యం ఏమీ లేదని, నిందితుడిని అదుపులోకి తీసుకున్నామని జిల్లా అదనపు ఎస్పీ వై.ప్రసాదరావు, ఏఎస్పీ సుస్మిత స్పష్టం చేశారు. మంగళవారం రాత్రి జంగారెడ్డిగూడెం పోలీస్ సర్కిల్ కార్యాలయంలో జరిగిన విలేకరుల సమావేశంలో వివరాలను వెల్లడించారు. వివాదాస్పద భూమిని దున్నుతున్నారని సమాచారం అందడంతో, పోలీసులు పనులు నిలిపివేయించి వెళ్లారని వివరించారు. అయితే పోలీసులు అక్కడి నుంచి వెళ్లిన కొద్దిసేపటికే దుర్గారెడ్డి హత్యకు గురయ్యాడని తెలిపారు. బాబాయిని నరికి చంపిన వ్యక్తి -
శబ్ద కాలుష్యానికి కారణమైతే వాహనాల సీజ్
ఏలూరు టౌన్: ఏలూరు నగరంతో పాటు జిల్లా వ్యాప్తంగా నిబంధనలకు విరుద్ధంగా వాహనాలు నడుపుతూ శబ్ద కాలుష్యంతో ప్రజలకు ఇబ్బందులు సృష్టిస్తే భారీ జరిమానాలతో పాటు వాహనాలను సీజ్ చేస్తామని ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ హెచ్చరించారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో శబ్ద కాలుష్యంపై తీసుకుంటున్న చర్యలను ఆయన వివరించారు. నిబంధనలు ఉల్లంఘించే వారిపై పోలీసులు ఉక్కుపాదంతో చర్యలు చేపడతారని స్పష్టం చేశారు. ఈ డ్రైవ్లో భాగంగా ఇప్పటివరకు 15 స్పీకర్ బాక్సులు, 225 ఎల్ఈడీ లైట్లు, మోడిఫైడ్ సైలెన్సర్లను స్వాధీనం చేసుకున్నట్లు తెలిపారు. ఏలూరు ట్రాఫిక్ సీఐ ఎస్.లక్ష్మణరావు నేతృత్వంలో సిబ్బంది మంగళవారం నగరంలో ప్రత్యేక తనిఖీలు చేపట్టారు. నగర ప్రజలను తీవ్ర ఇబ్బందులకు గురిచేసేలా నిబంధనలకు విరుద్ధంగా అమర్చిన స్పీకర్లు, ఎదురుగా వచ్చే వాహనదారుల కళ్లు మిరుమిట్లు గొలిపేలా ఉన్న ఎల్ఈడీ లైట్లు, రణగొణ ధ్వనులు చేసే 50 మోటారు సైకిళ్ల సైలెన్సర్లను అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ సమావేశంలో ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్, ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, కై కలూరు రూరల్ సీఐ రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. -
చెరగని వైఎస్ సంతకం
ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రస్థానంలో దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి పాత్ర సుస్పష్టం. జిల్లాలోని మెట్ట ప్రాంతాన్ని సైతం సిరులు పండించే బంగారు భూమిగా మార్చి, బీడు వారిన పొలాల్లో పచ్చని పంటలు పండేలా చేసిన ఘనత ఆయనదే. జిల్లా శాశ్వత ప్రయోజనాలే లక్ష్యంగా కీలక అభివృద్ధి పనులకు శ్రీకారం చుట్టి, సాగునీటి ప్రాజెక్టులను పరుగులు పెట్టించారు. నూజివీడులో ప్రతిష్టాత్మక ట్రిపుల్ఐటీ ఏర్పాటు, డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం, పోలవరం ప్రాజెక్టు, చింతలపూడి ఎత్తిపోతల పథకం వంటి చారిత్రాత్మక నిర్ణయాలతో జిల్లా దశను, దిశను మార్చి అభివృద్ధి పథంలో దూసుకువెళ్లేలా చేశారు. నేడు దివంగత వైఎస్సార్ జయంతి సందర్భంగా, ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాకు ఆయన చేసిన మేలును స్మరించుకుంటూ.. సాక్షి ప్రతినిధి, ఏలూరు : దేశవ్యాప్తంగా గుర్తింపు పొంది.. లక్షలాది ప్రాణాలను కాపాడిన ఆరోగ్యశ్రీకి ఏలూరులోనే అంకురార్పణ జరిగింది. రాష్ట్రంలో ఎన్నడూ లేని విధంగా ఏజెన్సీల్లో నివసించే గిరిపుత్రులకు పోడు భూములిచ్చి సాగు దిశగా వారిని మళ్లించి వేలాది కుటుంబాల్లో వెలుగురేఖలు నింపింది కూడా ఉమ్మడి పశ్చిమ నుంచే. ఇలా రాష్ట్ర స్థాయిలో ఖ్యాతి గాంచిన పథకాలు జిల్లాలోనే ప్రారంభమయ్యాయి. దశాబ్దాలుగా పాలకుల నిర్లక్ష్యానికి గురైన పెండింగ్ ప్రాజెక్టులను 2004లో ప్రారంభించి 2009 వరకు పనులు వేగంగా జరిగేలా చేశారు. ఏలూరులో తమ్మిలేరు ముంపునకు శాశ్వత పరిష్కారం చూపారు. 2005 తమ్మిలేరు వరదలతో ఏలూరు అతలాకుతలం అయిన క్రమంలో రూ.17 కోట్ల వ్యయంతో తమ్మిలేరు రిటైనింగ్వాల్ మంజూరు చేశారు. మళ్లీ 2019 తరువాత పనుల నిర్మాణ వ్యయం పెరిగి రూ.90 కోట్లతో ఆయన తనయుడు వైఎస్ జగన్ హయాంలో పనులు పూర్తయ్యాయి. రాష్ట్ర జీవనాడిగా పోలవరం ఆంధ్రప్రదేశ్ జీవనాడిగా ఉన్న పోలవరం ప్రాజెక్టుకు దివంగత వైఎస్సార్ శంకుస్థాపన చేశారు. 2004లో పోలవరం ప్రాజెక్టును రూ.10,151 కోట్ల వ్యయంతో శంకుస్థాపన చేసి కుడి, ఎడమ కాల్వల నిర్మాణం, పునరావాసం పనులు ఇలా విభజించి ప్రాజెక్టు పనులను పరుగులు పెట్టించారు. వైఎస్సార్ హయాంలోనే 60 శాతం కుడి, ఎడమ కాల్వల నిర్మాణాన్ని పూర్తి చేశారు. ఆయన మరణంతో ప్రాజెక్టు పనులు మందగించాయి. తరువాత వైఎస్ జగన్ హయాంలో 2019 నుంచి 2024 వరకు వేగంగా సాగాయి. అలాగే చింతలపూడి ఎత్తిపోతల పథకానికి కూడా మహానేతే శ్రీకారం చుట్టారు. 2008 అక్టోబర్ 30న కామవరపుకోటలో శంకుస్ధాపన చేసి రూ.1701 కోట్లతో ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టారు. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాలోని 15 మెట్ట ప్రాంత మండలాల్లో 2.10 లక్షల ఎకరాలకు సాగునీరు అందించేలా దీన్ని రూపొందించారు. తదనంతర ప్రభుత్వాలు ప్రాజెక్టు స్వరూపాన్ని, పరిధిని పెంచుకుంటూ వెళ్లాయి. రెండు జిల్లాలో 4.80 లక్షల ఎకరాలకు సాగునీరందించేలా రూ.3,200 కోట్లతో 53.50 టీఎంసీల గోదావరి జలాలు వాడుకునేలా మార్పులు చేశారు. అయితే నేటికీ ప్రాజెక్టు పనులను ప్రస్తుత ప్రభుత్వం సీరియస్గా తీసుకోకపోవడంతో ఒక్క అడుగు కూడా ముందుకు పడని పరిస్ధితి. 4,500 ఎకరాల పోడు భూముల పంపిణీ దశాబ్దాలుగా పోడు భూములపై ఆశలు పెంచుకున్న గిరిజనుల స్వప్నాన్ని దివంగత వైఎస్సార్ సాకారం చేశారు. ఉమ్మడి పశ్చిమ ఏజెన్సీలో 4,500 ఎకరాల పోడు భూములను 2,200 మంది గిరిజనులకు పంపిణీ చేసి సాగుకు అవసరమైన పూర్తి సహకారం అందించారు. ప్రస్తుతం పోడు భూముల్లో నాణ్యమైన పంట సాగు జరుగుతుంది. ప్రధానంగా వరి, పొగాకు, మొక్కజొన్నతో పాటు ఇతర పంటల సాగుతో గిరిజనులకు మేలు జరిగింది. అలాగే రూ.26 కోట్లతో పోగొండ రిజర్వాయర్ నిర్మించి బుట్టాయగూడెం, కొయ్యలగూడెంలో 7,500 ఎకరాలకు సాగునీరు ఇచ్చింది దివంగత వైఎస్సారే. ఇక కొండ కాల్వ వద్ద జరిగే ప్రమాదాల శాశ్వత నివారణకు రూ.26 కోట్లతో వ్యయంతో హైలెవెల్ బ్రిడ్జి నిర్మించారు. ఏజెన్సీ ప్రజలకు మెరుగైన వైద్యం కోసం జంగారెడ్డిగూడెంలో 100 పడకల ఆసుపత్రి శంకుస్థాపన చేసింది కూడా దివంగత వైఎస్సారే. పోలవరం ప్రాజెక్టు పశ్చిమ అభివృద్ధిపై దివంగత వైఎస్సార్ ముద్ర పోలవరానికి బీజం వేసింది మహానేతే చింతలపూడి ఎత్తిపోతలకు శ్రీకారం చుట్టింది రాజన్నే పేద విద్యార్థులకు ట్రిపుల్ఐటీ వరదాయిని పోడు భూముల పంపిణీతో గిరిజనులకు మేలు ఏలూరుకు రిటైనింగ్ వాల్.. వైఎస్సార్ చలవే నేడు దివంగత ముఖ్యమంత్రి వైఎస్సార్ జయంతి -
దళిత రైతులకు దక్కని అసైన్డ్ ఫలాలు
చింతలపూడి: నిరుపేద దళితుల ఆర్థికాభివృద్ధి కోసం గతంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన ఒక మంచి పథకం క్షేత్రస్థాయిలో అక్రమార్కుల పాలువుతోంది. గత ప్రభుత్వం ఏలూరు జిల్లాలోని పలు మండలాల్లో నిరుపేద ఎస్సీ రైతులకు సాగు నిమిత్తం అసైన్డ్ భూములను కేటాయించింది. ఆ భూములకు సాగునీటి సౌకర్యం కల్పించి, దళిత రైతులు ఆర్థికంగా నిలదొక్కుకునేలా చేయాలనే లక్ష్యంతో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా ప్రభుత్వం ఉచితంగా సామూహిక వ్యవసాయ బావులను (కమ్యూనిటీ బోర్వెల్స్) తవ్వించింది. అంతేకాకుండా లక్షలాది రూపాయల ప్రజాధనంతో వీటికి మోటార్లు, విద్యుత్ సౌకర్యం కూడా కల్పించింది. చేతులు మారిన భూములు.. అక్రమార్కుల చేతుల్లో బోర్లు ప్రభుత్వం ఆశించిన ఆశయం బాగున్నా, ప్రస్తుతం క్షేత్రస్థాయిలో పరిస్థితి మాత్రం అత్యంత దారుణంగా మారింది. నిరుపేదలకు చెందిన ఆ అసైన్డ్ భూములు, లక్షల రూపాయల ఖర్చుతో వేయించిన బోర్ల ఫలాలు నేడు అర్హులైన ఎస్సీ రైతుల చేతుల్లో లేవు. దళితుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకున్న కొందరు బడా రైతులు, స్థానిక రాజకీయ పలుకుబడి ఉన్న నేతలు ఆ భూములను, బోర్లను అతి తక్కువ ధరకు కొనుగోలు చేసి తమ స్వాధీనంలోకి తీసుకున్నారు. సొంత భూముల్లోనే కూలీలుగా.. గత కొద్ది సంవత్సరాలుగా సాగు పెట్టుబడులు పెరిగిపోవడం, చేసిన అప్పులు తీర్చలేకపోవడంతో దళిత రైతులు తమ భూములను ధనిక రైతులకు అప్పగించాల్సి వచ్చింది. చాలా చోట్ల ఎస్సీ కార్పొరేషన్ నిర్మించిన బోర్లు, మోటార్లతో సహా భూములను అనధికారికంగా బడా రైతులు కొనుగోలు చేశారు. రికార్డుల్లో దళిత రైతుల పేర్లు ఉన్నప్పటికీ, క్షేత్రస్థాయిలో పంటలు పండించి లాభాలు గడిస్తున్నది మాత్రం ఇతర ధనిక వర్గాలే కావడం గమనార్హం. నాడు ప్రభుత్వం ఎవరినైతే భూయజమానులుగా చూడాలనుకుందో, ఆ దళిత రైతులే నేడు తమ సొంత భూముల్లోనే కూలీలుగా మారిన దుస్థితి నెలకొంది. సమగ్ర విచారణ అత్యవసరం ఈ వ్యవహారంపై జిల్లా యంత్రాంగం, ఎస్సీ కార్పొరేషన్ అధికారులు స్పందించి ప్రత్యేక సర్వే నిర్వహించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. జిల్లాలోని ఏయే మండలాల్లో ఎస్సీ కార్పొరేషన్ ద్వారా బోర్లు వేశారు? ప్రస్తుతం అవి ఎవరి ఆధీనంలో ఉన్నాయి? అనే అంశాలపై సమగ్ర విచారణ జరపాలి. అక్రమంగా భూములు, బోర్లను అనుభవిస్తున్న వారిపై కఠిన చర్యలు తీసుకుని, తిరిగి ఆ వసతులను నిరుపేద దళిత రైతులకు దక్కేలా చూడాలి. లేనిపక్షంలో ప్రభుత్వం ప్రవేశపెట్టిన సంక్షేమ పథకాల ఆశయం నీరుగారిపోతుంది. మా సంస్థ ఆధ్వర్యంలో సమాచార హక్కు చట్టం ద్వారా జిల్లా ఎస్సీ కార్పొరేషన్ అధికారులను వివరాలు కోరగా.. ఆ సమాచారం తమ వద్ద అందుబాటులో లేదని సమాధానం ఇచ్చారు. కోట్లాది రూపాయల ప్రజాధనం ఖర్చు చేసిన ఒక పెద్ద పథకానికి సంబంధించిన వివరాలు లేవని చెప్పడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి బాధితులకు న్యాయం చేయాలి. – తుల్లిమెల్లి కుటుంబరావు, ఎన్జీఓ అసోసియేషన్ అధ్యక్షుడు -
పోలవరం ప్రాజెక్టు పనుల పరిశీలన
పోలవరం రూరల్ 2027 గోదావరి పుష్కరాల నాటికి పోలవరం ప్రాజెక్టును పూర్తి చేసి, ప్రధాని నరేంద్ర మోదీ చేతుల మీదుగా జాతికి అంకితం చేస్తామని రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి డాక్టర్ నిమ్మల రామానాయుడు తెలిపారు. మంగళవారం ఆయన ప్రాజెక్టు పనులను క్షేత్రస్థాయిలో పరిశీలించారు. ఈ నెల రెండో వారంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పోలవరాన్ని సందర్శించనున్నట్లు వెల్లడించారు. కూటమి ప్రభుత్వం రూ.990 కోట్లతో 440 రోజుల్లోనే కొత్త డయాఫ్రం వాల్ నిర్మించిందని మంత్రి చెప్పారు. ఏడాది కాలంలో గ్యాప్–1 పనులు 48 శాతం, గ్యాప్–2 పనులు 29 శాతం పూర్తయ్యాయని, 2027 నాటికి ఈసిఆర్ఎఫ్ డ్యాం పూర్తి చేయడమే లక్ష్యమని పేర్కొన్నారు. ప్రధాన కాలువలను అనుసంధానించే 4 టన్నెల్స్ మరో 10 రోజుల్లో పూర్తవుతాయన్నారు. కేంద్రం రూ.8,323 కోట్లు అడ్వాన్స్గా ఇచ్చిందని దీంతో పనుల్లో వేగం పెరిగిందని తెలిపారు. నిర్వాసితుల ఇళ్ల నిర్మాణ సాయాన్ని రూ.3.5 లక్షలకు, ఇంటి స్థలం మొత్తాన్ని రూ.2 లక్షలకు పెంచామని, జూలైలో సీఎం పర్యటన సందర్భంగా రూ.200 కోట్ల నష్టపరిహారం అందిస్తామని ప్రకటించారు. 2027 నాటికి తొలిదశ ఆర్అండ్ఆర్ పూర్తి చేస్తామన్నారు. పోలవరాన్ని ఐకానిక్ బ్రిడ్జిలు, రిసార్ట్స్తో టూరిజం హబ్గా మారుస్తామని మంత్రి వివరించారు. ఈ కార్యక్రమంలో జేసీ వి.అభిషేక్, ఈఎన్సీ నరసింహారావు తదితరులు పాల్గొన్నారు. -
మీరు ఇక మారరా ‘సర్’?
సాక్షి, టాస్క్ఫోర్స్: సర్ కార్యక్రమంలో టీడీపీ నాయకులు చొరబడుతున్నారు. ఏకంగా గ్రామ సచివాలయంలో బీఎల్ఓలతో కలిసి డిజిటలైజేషన్ కార్యక్రమంలో పాల్గొంటున్నారంటే పరిస్థితి ఎలా ఉందో? అర్థం చేసుకోవచ్చు. తాజాగా పెంటపాడు మండలం మౌంజీపాడు గ్రామ సచివాలయంలో టీడీపీ నాయకుడు పాతూరు రాంప్రసాద్ చౌదరి డిజిటలైజేషన్ ప్రకియను నిర్వహిస్తున్నాడు. గతంలో ఈయనే ఓ మహిళ ఫామ్ను నింపడం చర్చనీయాంశమైంది. అయితే ఇంత జరుగుతున్నా టీడీపీ నాయకులపై ఎన్నికల అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోకవపోవడం గమనార్హం. తణుకు అర్బన్: కట్నం కోసం వేధిస్తున్న భర్తతో పాటు మరొక నలుగురిపై కేసు నమోదు చేసినట్లు తణుకు రూరల్ ఎస్సై నాళం శ్రీనివాసరావు తెలిపారు. మంగళవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ తణుకు మండలం వేల్పూరు గ్రామానికి చెందిన మానసకు హైదరాబాద్కు చెందిన తుమ్మల కృష్ణతో 2002లో వివాహమైంది. పెళ్లి నాటి నుంచి అదనపు కట్నం తీసుకురావాలని భర్త, అత్తమామలు వేధిస్తున్నారని బాధితురాలి తండ్రి శ్రీమన్నారాయణమూర్తి పోలీసులను ఆశ్రయించాడు. -
రహదారి ధ్వంసం.. నిలిచిన రాకపోకలు
ఆగిరిపల్లి: గుర్తు తెలియని వ్యక్తులు మండలంలోని కనసానపల్లి, గన్నవరం మండలం గొల్లనపల్లి వెళ్లే రహదారిని ధ్వంసం చేయడంతో రెండు గ్రామాల మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. దీంతో రైతులు, గ్రామస్తులు, ద్విచక్ర వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మూడు రోజుల క్రితం కనసానపల్లి నుంచి గొల్లనపల్లి వెళ్లే రహదారిని కొందరు గుర్తు తెలియని వ్యక్తులు రాత్రి వేళ జేసీబీతో భారీ గుంత తవ్వి రహదారిని ధ్వంసం చేశారని గ్రామస్తులు తెలిపారు. దీంతో వ్యవసాయ పనులకు వెళ్లే రైతులు, పశువుల కాపరులు, నిత్యావసరాల కోసం ప్రయాణించే ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని గ్రామస్తులు తెలిపారు. రాజకీయ దురుద్దేశంతోనే ఈ రోడ్డును ధ్వంసం చేశారని గ్రామస్తులు ఆరోపిస్తున్నారు. ఈ ఘటనపై గ్రామస్తులు కారు సత్యనారాయణ, నల్లమోతు నరేష్, శోభన్బాబు సోమవారం ఆగిరిపల్లి పోలీస్స్టేషన్న్లో ఎస్సై నాగరాజుకు ఫిర్యాదు చేశారు. ఆగిరిపల్లి: ఈదులగూడెం వీఆర్ఏ రామిశెట్టి లక్ష్మణరావు గ్రామంలో అక్రమాలకు పాల్పడుతుండడంపై రైతు దండబోయిన వెంకటేశ్వరరావు జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశాడు. పెద్ద చెరువు భూమిలోని 50 సెంట్ల భూమిని వీఆర్ఏ లక్ష్మణరావు అక్రమంగా ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు వేసి, చుట్టూ ఫెన్సింగ్ వేశాడు. అంతేకాకుండా అతని అనుచరులను కూడా ప్రోత్సహించి చెరువు భూమిని ఆక్రమించుకునేలా చేస్తున్నాడని దీంతో పొలాల్లో రైతుల రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయని రైతు వెంకటేశ్వరరావు తెలిపాడు. అంతేకాకుండా గ్రామంలోని సీతారామాంజనేయ స్వామికి చెందిన 1.06 ఎకరాల భూమిని వీఆర్ఏ అనుచరులు ఆక్రమించుకొని జామాయిల్ మొక్కలు వేశారని, దీంతో ఆలయానికి వచ్చే ఆదాయానికి గండి కొడుతున్నారని ఫిర్యాదులో పేర్కొన్నాడు. -
కామన్వెల్త్ క్రీడలకు స్విమ్మర్ కార్తీక్ ఎంపిక
జంగారెడ్డిగూడెం: స్కాట్లాండ్లో జూలై 21 నుంచి 31 వరకు జరగనున్న కామన్వెల్త్ క్రీడల స్విమ్మింగ్ విభాగంలో భారతదేశం తరఫ/న ప్రాతినిధ్యం వహించడానికి స్థానిక బుడిగిన రవి కార్తీక్ ఎంపికయ్యాడు. ఈ పోటీల్లో విజయం సాధించి రాష్ట్రానికి, దేశానికి మంచి పేరు తీసుకురావాలని మంత్రి లోకేష్ అభినందించారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంలోని గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వర స్వామి దేవస్థానంలో సోమవారం హుండీ లెక్కింపు కార్యక్రమం నిర్వహించారు. దేవాదాయ ధర్మదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి.సురేష్ కుమార్, ఆలయ ఈవో, అసిస్టెంట్ కమిషనర్ ఆర్.వి.చందన పర్యవేక్షణలో ఈ లెక్కింపు జరిగింది. గత 101 రోజులకు స్వామికి హుండీ ద్వారా రూ.14,87,335 ఆదాయం లభించిందని ఆలయ ఈవో ఆర్వీ చందన తెలిపారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, బోర్డు సభ్యులు అన్నప్రగడ వీరరాఘవరావు, కొప్పుల నాగ సురేంద్ర, దండు భవాని, వడిగళ్ల కుమారి, ప్రియాంక, దివ్య ప్రసన్న పాల్గొన్నారు. ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవ అధ్యక్షులు పేరిచర్ల జగపతి రాజు, సభ్యులు గొట్టుముక్కల భాస్కరరాజు, ఏలూరు రిటైర్డ్ ఎంప్లాయిస్ యూనియన్ ప్రతినిధులు, దొండపూడి, టి.నరసాపురం సేవా సంఘాల సభ్యులు, ఇండియన్ బ్యాంక్ సిబ్బంది, ఆలయ అర్చకులు, సిబ్బంది ఈ హుండీ లెక్కింపులో భాగస్వామ్యులయ్యారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టు నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని బయటకు పంపే ‘డీ–వాటరింగ్’ పనులు సోమవారం ప్రారంభమయ్యాయి. ప్రాజెక్టులోని గ్యాప్–1 ప్రాంతంలో జలవనరుల శాఖ, నిర్మాణ సంస్థ అధికారులు సంయుక్తంగా ప్రత్యేక పూజలు నిర్వహించి ఈ పనులను మొదలుపెట్టారు. వర్షాకాలం నేపథ్యంలో పనులకు ఎలాంటి ఆటంకం కలగకుండా ఉండేందుకు నిర్మాణ ప్రాంతంలో నిల్వ ఉన్న నీటిని ఎప్పటికప్పుడు తోడిపోసేలా ఈ ఏర్పాట్లు చేశారు. డీ–వాటరింగ్ కోసం మొత్తం 240 మోటార్లను అందుబాటులో ఉంచనున్నారు. వీటి ద్వారా గరిష్టంగా 700 క్యూసెక్కుల నీటిని తోడే అవకాశం ఉంది. ఈ మోటార్లలో 88 హార్స్ పవర్, 83.5 హార్స్ పవర్ సామర్థ్యం కలిగిన యంత్రాలు ఉన్నాయి. తొలి రోజు 40 మోటార్లను ప్రారంభించగా, రానున్న రోజుల్లో అవసరాన్ని బట్టి మిగిలిన మోటార్లను నడపనున్నారు. ఎగువ, దిగువ కాఫర్ డ్యామ్ల మధ్య జరగబోయే ఈసీఆర్ఎఫ్ పనులకు ఎలాంటి అంతరాయం కలగకుండా ఈ డీ–వాటరింగ్ ప్రక్రియ కొనసాగుతుందని అధికారులు పేర్కొన్నారు. భీమవరం: విశాఖపట్నం గంభీరగెడ్డ రిజర్వాయర్లో నిర్వహించిన సౌత్ జోన్ అంతర్రాష్ట్ర కనోయింగ్ అండ్ కయాకింగ్ చాంపియన్షిప్ పోటీల్లో భీమవరం బీవీ రాజు డిగ్రీ కళాశాల విద్యార్థిని వనమాడి మౌనిక రెండు కాంస్య పతకాలు సాధించినట్లు కళాశాల ప్రిన్సిపల్ ఐఆర్ కృష్ణంరాజు చెప్పారు. సోమవారం పతకాలు సాధించిన మౌనికను అభినందించిన సందర్భంగా ఆయన వివరాలు తెలిపారు. ఈ నెల 4న కేంద్ర యువజన వ్యవహారాలు, క్రీడల మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో సాప్ సహకారంతో పోటీలు జరిగాయన్నారు. -
జ్వరం, వాంతులతో చిన్నారి మృత్యువాత
● ప్రభుత్వాసుపత్రిలో సరైన వైద్యం అందలేదని తల్లిదండ్రుల ఆవేదన ● మోతుగూడెంలో విషాదచాయలుబుట్టాయగూడెం: వాంతులు, జ్వరం, విరేచనాలతో బాధపడుతూ వైద్యం కోసం ప్రభుత్వ ఆస్పత్రికి వచ్చిన ఒక నాలుగేళ్ల చిన్నారి మృత్యువాత పడింది. అనారోగ్యంతో బాధపడుతున్న తమ బిడ్డకు వైద్యం చేయించి, క్షేమంగా ఇంటికి తీసుకువెళ్దామనుకున్న ఆ తల్లిదండ్రులకు కడుపుకోత మిగిలింది. బిడ్డ మృతదేహాన్ని చూసి వారు తల్లడిల్లిపోతున్నారు. ఈ విచారకర సంఘటనకు సంబంధించి చిన్నారి తల్లిదండ్రులు గురుగుంట్ల వెంకటరెడ్డి, సునీత తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తమ మూడో సంతానమైన రిత్విక శనివారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ ఎంతో ఆరోగ్యంగా, ఆటపాటలతో గడిపిందని వారు తెలిపారు. శనివారం సాయంత్రం జ్వరం రావడంతో పాటు వాంతులు, విరేచనాలు అవుతుండడంతో బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంలో (సీహెచ్సీ) చేర్పించినట్లు చెప్పారు. వైద్యం కోసం వచ్చిన తమ బిడ్డను ఆస్పత్రిలో చేర్పించేందుకు కూడా చాలా కష్టపడాల్సి వచ్చిందని, స్థానిక వ్యక్తి ఒకరితో మాట్లాడించిన తర్వాతే చేర్చుకున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణం తమ కూతురు రిత్వికను ఆస్పత్రిలో చేర్చిన తర్వాత ఎటువంటి వైద్య పరీక్షలు చేయకుండా కేవలం ఒక సిరప్, పారాసెట్మాల్ టాబ్లెట్ మాత్రమే ఇచ్చారని తల్లి సునీత ఆరోపించారు. ఆదివారం రాత్రి సమయానికి బిడ్డ విపరీతంగా ఏడుస్తూ బాధపడుతున్నా, ఆ సమయంలో ఎవరికి చెప్పుకున్నా పట్టించుకోలేదని వాపోయారు. బిడ్డ బాధ చూడలేక అక్కడ ఉన్న సిబ్బందిని నిద్ర లేపగా.. వారు డాక్టర్కు ఫోన్ చేశారని, ఆ తర్వాత వచ్చిన డాక్టర్ పరిశీలించి పాప పరిస్థితి ఆందోళనకరంగా ఉందని చెప్పారన్నారు. వెంటనే అంబులెన్స్ సిద్ధం చేసి జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి రిఫర్ చేశారని తెలిపారు. అయితే, జంగారెడ్డిగూడెం ఆస్పత్రికి తీసుకువెళ్లగా అప్పటికే తమ కూతురు మృతి చెందిందని, మార్గమధ్యంలోనే చనిపోయి ఉండవచ్చని అక్కడి వైద్యులు తెలిపారన్నారు. సకాలంలో వైద్యం అంది ఉంటే తమ బిడ్డ బతికేదని సునీత తీవ్రంగా రోదించారు. బాలిక తండ్రి వెంకటరెడ్డి మాట్లాడుతూ.. గురువారం నుంచి తాను కూడా టైఫాయిడ్ జ్వరంతో బాధపడుతున్నానని, శనివారం సాయంత్రమే తాను ఇదే బుట్టాయగూడెం సీహెచ్సీ నుంచి డిశ్చార్జ్ అయ్యానని చెప్పారు. నీరసంగా ఉండటం వల్ల తాను తిరిగి ఆస్పత్రికి రాలేకపోయానని, కడసారి కూతుర్ని కూడా చూసుకునే పరిస్థితి లేకుండా పోయిందని వెంకటరెడ్డి కన్నీరుమున్నీరయ్యారు. చిన్నారి రిత్విక మృతితో మోతుగూడెంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ప్రభుత్వ ఆస్పత్రుల్లో రోగుల పట్ల నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని, ఈ సంఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని మాజీ సర్పంచ్ కోర్సా గంగరాజు డిమాండ్ చేశారు. బాలిక కుటుంబానికి ఎక్స్గ్రేషియా చెల్లించాలి సరైన వైద్యం అందక మృతి చెందిన రిత్విక కుటుంబానికి రూ. 50 లక్షల ఎక్స్గ్రేషియా ప్రకటించాలని సీపీఐ(ఎంఎల్) న్యూడెమోక్రసీ నాయకులు కారం రాఘవ డిమాండ్ చేశారు. సోమవారం ఆయన బాలిక మృతిపై స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రం సూపరింటెండెంట్ వసుంధరను, వైద్యులను, సిబ్బందిని కలిసి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆయన మాట్లాడుతూ.. ఈ ఘటనపై ఉన్నతాధికారులతో సమగ్ర విచారణ జరిపించాలని లేనిపక్షంలో పెద్ద ఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు బన్నే వినోద్, బాషా శ్యాంబాబు, కెచ్చెల మంగిరెడ్డి, ప్రతాప్ పాల్గొన్నారు. -
గోల్డ్ బాధితులకు భరోసా
ఆలోచింపజేసిన నాటికలు ఏలూరులో నిర్వహిస్తున్న జాతీయస్థాయి నాటిక పోటీలు సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 3వ రోజు ప్రదర్శించిన నాటికలు ఆకట్టుకున్నాయి. 8లో uజంగారెడ్డిగూడెం: స్థానిక బ్యాంక్ ఆఫ్ బరోడాలో బంగారం తాకట్టు పెట్టి మోసపోయిన బాధితులు సోమవారం జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మితను మర్యాదపూర్వకంగా కలిసి ఆవేదనను విన్నవించారు. ఈ సందర్భంగా బాధితులు మాట్లాడుతూ, దర్యాప్తులో భాగంగా పోలీసులు తమ వద్ద ఉన్న బంగారు తాకట్టు ఆభరణాల ఒరిజినల్ రసీదులను తీసుకుంటున్నారని, భవిష్యత్తులో ఒరిజినల్ రసీదులు లేకపోతే రేపు బ్యాంకు నుంచి నగలు విడిపించుకునే సమయంలో ఇబ్బందులు తలెత్తుతాయని తమ అనుమానాలను ఏఎస్పీ దృష్టికి తెచ్చారు. దీనిపై ఏఎస్పీ సానుకూలంగా స్పందిస్తూ.. కేసును త్వరితగతిన ఛేదించడానికి, దర్యాప్తు ప్రక్రియలో భాగంగానే ఒరిజినల్ రసీదులను సేకరిస్తున్నామని, ఇవి కేసులో చాలా కీలకమని స్పష్టం చేశారు. బాధితులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, రసీదులు తీసుకున్నందుకు ప్రతి ఒక్కరికీ పోలీసుల తరఫున గ్యారెంటీగా అక్నాలెడ్జ్మెంట్ పత్రం ఇస్తామని చెప్పారు. తామే స్వయంగా బ్యాంకు అధికారులతో మాట్లాడి బాధితులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా చూస్తామని హామీ ఇచ్చారు. ఈ బంగారం మోసంపై దర్యాప్తు అత్యంత పారదర్శకంగా సాగుతుందని, బాధితులందరికీ పోలీస్ వ్యవస్థ అండగా ఉండి న్యాయం జరిగేలా చూస్తుందని ఏఎస్పీ భరోసా ఇచ్చారు. భీమవరం: గురుపూజోత్సవం సందర్భంగా రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డుల కోసం అర్హులైన ఉపాధ్యాయులు నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి ఇ.నారాయణ సోమవారం ఒక ప్రకటనలో తెలిపారు. డివిజినల్ స్థాయిలో ఈనెల 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చునన్నారు. -
మహిళా రిజర్వేషన్ బిల్లు అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): ఎలాంటి షరతులు లేకుండా రానున్న పార్లమెంటు వర్షాకాల సమావేశాలలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్కు ఉద్దేశించిన, 2023లో పార్లమెంటులో ఆమోదం పొందిన నారి శక్తి వందన్ బిల్లు ప్రవేశపెట్టి చట్టరూపంలో అమలు చేయాలని మహిళా సమాఖ్య జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ యామిని, జిల్లా అధ్యక్షురాలు వర్కా శ్యామల కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. సోమవారం కలెక్టర్ కార్యాలయం వద్ద బిల్లు తక్షణం అమలు కోరుతూ మహిళా సమాఖ్య ఏలూరు జిల్లా సమితి ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. ధర్నానుద్దేశించి మన్నవ యామిని, వర్కా శ్యామల మాట్లాడుతూ జనగణన, నియోజకవర్గాల పునర్విభజనతో సంబంధం లేకుండా మహిళా రిజర్వేషన్ అమలు చేయాలని డిమాండ్ చేశారు. దశాబ్దాలుగా రిజర్వేషన్ కోసం పోరాడుతున్నా పాలకులకు రిజర్వేషన్ అమలు చేయడంలో చిత్తశుద్ధి లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికై నా రిజర్వేషన్ అమలు చేసి తమ చిత్తశుద్ధి నిరూపించుకోవాలని కోరారు. జిల్లా వ్యాప్తంగా చేసిన సంతకాల ప్రతులను, విజ్ఞాపన పత్రాన్ని కలెక్టర్కు అందజేశారు. -
కళాకారులను ప్రోత్సహించడంలో విఫలం
భీమవరం: ప్రజా కళలను కళాకారులను ప్రోత్సహించే విషయంలో రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం తీవ్రంగా విఫలమైందని ప్రజానాట్య మండలి రాష్ట్ర అధ్యక్షుడు పి.మంగరాజు తీవ్రంగా విమర్శించారు. సోమవారం భీమవరంలో ఏర్పాటుచేసిన ప్రజానాట్యమండలి జిల్లా మహా సభలకు ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లా డారు. ప్రజా నాట్యమండలి ఎంతోకాలంగా ప్రజల కష్టసుఖాలను పాటలుగా వీధి నాటకాలుగా తయారుచేసి ప్రజలను చైతన్య పరుస్తుందన్నారు. ప్రభుత్వాలు కళాకారులను పట్టించుకోవడంలేదని గుర్తింపు కార్డులు, ఇతర ప్రోత్సాహకాలు లేవని ఆందోళన వ్యక్తం చేశారు. కార్యక్రమానికి చైతన్య ప్రసాద్ అధ్యక్షత వహించగా గోదావరి సాహితీ స్రవంతి కన్వీనర్ శ్రీనివాసరాజు, సిఐటియు జిల్లా కార్యదర్శి బి వాసుదేవరావు, ప్రజానాట్యమండలి జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ వల్లి తదితరులు పాల్గొన్నారు. -
అర్జీలకు శాశ్వత పరిష్కారం చూపాలి
ఏలూరు (టూటౌన్): కలెక్టరేటు గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ప్రజా సమస్యలు పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ప్రజా సమస్యలు పరిష్కారానికి రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక ప్రాధాన్యత ఇస్తున్న నేపథ్యంలో అధికారులు అర్జీలపై ప్రత్యేక శ్రద్ధపెట్టి, అర్జీదారులు సంతప్తి చెందేలా పరిష్కారం చూపాలని సూచించారు. ప్రజా సమస్యల పరిష్కారంలో అధికారులు మరింత బాధ్యతతో వ్యవహరించి, పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లో అందిన అర్జీలను నిర్ణీత గడువులోపు పరిష్కరించాలని ఆదేశించారు. అధికారులు లబ్ధిదారులతో ప్రత్యక్షంగా మాట్లాడి సమస్యలను అర్థం చేసుకుని పరిష్కరించాల్సిన అవసరం ఉందన్నారు. పీజీఆర్ఎస్లో మొత్తం 365 అర్జీలను స్వీకరించారు. కలెక్టరుతో పాటు జాయింటు కలెక్టరు ఎం.జె.అభిషేక్ గౌడ, అసిస్టెంటు కలెక్టరు సీహెచ్.శ్రావణ్ కుమార్ రెడ్డి, ఇన్చార్జ్ డీఆర్వో ఎల్.దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. అర్జీలలో కొన్ని.. ● గ్రామ ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘంలో రూ1.44 కోట్లకు పైగా ఎరువులు అవకతవకలు జరిగాయని, వాటిపై విచారణ చేపట్టాలని టి.నరసాపురం మండలం మక్కినవారిగూడెంకు చెందిన సిరిమళ్ళ వెంకటేశ్వరరావు అర్జీ సమర్పించారు, ● పంట బొదేను పూడ్చివేశారని వారిపై చర్యలు తీసుకుని, పంట బొదేను తిరిగి ఏర్పాటు చెయ్యా లని ముదినేపల్లి మండలం పెదపాలపర్రు గ్రామానికి చెందిన చల్లగుళ్ల నరేష్ కుమార్ కోరారు. ● రహదారిని ఆక్రమించుకున్నారని, తిరిగి రహదారిని ఏర్పాటు చేయాలని పెదపాడు మండలం వట్లూరుకు చెందిన షేక్ మహబూబ్ సుభానీ కోరారు. -
ఆలోచింపజేసిన నాటికలు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర సృజనాత్మక, సాంస్కృతిక సమితి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నాటక అకాడమీ సౌజన్యంతో హేలాపురి కళా పరిషత్ ఆధ్వర్యంలో స్థానిక వైఎంహెచ్ఏ హాల్లోని కానాల గురుమూర్తి కళావేదికపై నిర్వహిస్తున్న ‘శ్రీ అల్లూరి సీతారామరాజు 18వ స్మారక జాతీయస్థాయి నాటిక పోటీలు’ సోమవారం మూడో రోజుకు చేరుకున్నాయి. 3వరోజు ప్రదర్శించిన నాటికలు నాటక ప్రియులను, రసజ్ఞులను విశేషంగా ఆకట్టుకున్నాయి. తొలుత హైదరాబాద్కు చెందిన స్వర్ణ సూర్య డ్రామా లవర్స్ బృందం సీ్త్ర మాత్రే నమః నాటికను ప్రదర్శించారు. బొప్పన నరసింహారావు సౌజన్యంతో ప్రదర్శితమైన ఈ నాటికకు పూర్ణిమ పెమ్మరాజు మూలకథ అందించగా, ఉదయ్ భాగవతుల నాటకీకరణ, దర్శకత్వం వహించారు. సమాజంలో సీ్త్ర ఉనికిని చాటిచెప్పే ఈ కథాంశం ప్రేక్షకులను ఆలోచింపజేసింది. అనంతరం గుంటూరుకు చెందిన ఆరాధన ఆర్ట్స్ అకాడమీ బృందం సరి గమ పాప అనే నాటికను రంగస్థలంపై అద్భుతంగా ఆవిష్కరించారు. గోకవరపు దీప్తి సౌజన్యంతో ప్రదర్శితమైన ఈ నాటికకు గోవిందరాజుల నాగేశ్వరరావు రచన చేయగా, నాడింపల్లి వెంకటేశ్వరరావు దర్శకత్వం వహించారు. నటీనటుల హావభావాలు, చక్కటి సంభాషణలు ప్రేక్షకులను మంత్రముగ్ధులను చేసి, సభలో చప్పట్ల వర్షం కురిపించాయి. పరిషత్ గౌరవ అధ్యక్షుడు గుత్తా కౌసలేంద్రరావు, అధ్యక్షుడు పెదపాటి రామకృష,్ణ సహాయ కార్యదర్శులు వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ, కోశాధికారి మహ్మద్ ఖాజావలి, కమిటీ సభ్యులు ఎస్. కస్తూరిరావు, చింతల మల్లేశ్వరరావు, ఎం. సూర్యనారాయణ యాదవ్ కార్యక్రమ నిర్వహణలో కీలక పాత్ర పోషించి, కార్యక్రమాన్ని విజయవంతం చేశారు. -
పోడు భూములకు పట్టాలివ్వాలి
ఏలూరు (టూటౌన్): గత కొన్నేళ్ళుగా ఆదివాసీ గిరిజనులు సాగు చేస్తున్న పోడు భూములకు ఆర్ఓఎస్ఆర్ పట్టాలివ్వాలని కోరుతూ సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ఆధ్వర్యంలో సోమవారం ఏలూరు కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ధర్నాలో జిల్లాలోని ఏలేరుపాడు, కుక్కునూరు, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మండలాలకు చెందిన 30 గ్రామాల ప్రజలు పాల్గొన్నారు. ధర్నా అనంతరం పీజీఆర్ఎస్లో కలెక్టర్కు వినతి పత్రం అందజేసారు. ఈ సందర్భంగా సీపీఐ ఎంఎల్ మాస్లైన్ ఏలూరు జిల్లా కార్యదర్శి ఎస్కె గౌస్ మాట్లాడుతూ.. అనేక సంవత్సరాలుగా సాగు భూములకు హక్కు పత్రాలు ఇవ్వాలని పోరాటం చేస్తూనే ఉన్నారన్నారు. అంబానీ, అదానీ లాంటి కార్పొరేట్లకు వేలాది ఎకరాల అటవీ భూములు అప్పనంగా అప్పగిస్తున్న ప్రభుత్వాలు పేదల సాగులోని భూములకు హక్కు పత్రాలు ఇవ్వడానికి చేతులు రావడం లేదన్నారు. ఆదివాసీల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్లక్ష్య వైఖరి విడనాడాలని డిమాండ్ చేశారు. ఎన్నికలకు ముందు ఆదివాసీలను అన్ని రకాలుగా ఆదుకుంటామని ఇచ్చిన హామీ మేరకు కూటమి ప్రభుత్వం ఆదివాసీ గిరిజనులకు ఆర్ఓఎఫ్ఆర్ పట్టాలివ్వాలని కోరారు. -
గుడికి దారేది?
లక్ష్మీపురంలో ఆలయ భూ వివాదం రోజురోజుకి కొత్త మలుపు తిరుగుతోంది. వివాదాస్పదంగా మారిన భూమిలోనే శ్రీ వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మండపం, ఆలయానికి వెళ్లే ప్రధాన దారి ఉండటం భక్తులను ఆందోళనకు గురిచేస్తోంది. ఇదిలా ఉంటే సదరు భూమిలో నరికి విక్రయించగా వచ్చిన చెట్ల సొమ్ము ఏ నాయకుడి జేబులోకి వెళ్లిందని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. దేవుడి భూమి కబ్జా వ్యవహారంలో సూత్రధారులు, పాత్రధారులపై ఇంతవరకు ఉన్నతాధికారులు ఎందుకు చర్యలు చేపట్టలేదని భక్తులు ప్రశ్నిస్తున్నారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల మండలం తిమ్మాపురం పంచాయతీ, లక్ష్మీపురం గ్రామంలోని శ్రీ సంతాన వేణుగోపాల జగన్నాథ, శ్రీ వేంకటేశ్వరస్వామి ఆలయాన్ని పూరీ మఠాధిపతులు మంత్రరత్నం అమ్మాజీ (లక్ష్మీ అమ్మవారు) కుటుంబ సభ్యులు 1992 లో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి దత్తత ఇచ్చారు. అప్పటి నుంచి ఆ ఆలయం, దానికి సంబంధించిన ఆర్ఎస్ నెంబర్ 38/1 లోని 1.73 ఎకరాల భూమి దేవస్థానం ఆధీనంలోనే ఉంది. ఫెయిర్ ల్యాండ్ రిజిస్టర్ (ఎఫ్ఎల్ఆర్)లో సదరు భూమి దాత కుటుంబ సభ్యుడైన శ్రీమత్ మంత్రరత్నం ప్రతివాద భయంకర వెంకట సంపత్ కుమారాచార్యులు పేరు ఉంది. దేవస్థానం అధికారుల అశ్రద్ధ కారణంగా రెవిన్యూ రికార్డుల్లోకి స్వామివారి పేరు చేరలేదు. దాంతో దేవుడి భూమి ఇప్పుడు చిక్కుల్లో పడింది. అంతా తప్పులతడకే.. దాత సంపత్ కుమారాచార్యులు సదరు భూమిని 1967 జనవరి 18న కమ్మ సేవ సంఘం ద్వారకాతిరుమల మండలానికి బహుమతిగా ఇచ్చినట్టు కొందరు టీడీపీ నేతలు ఒక అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ను తెచ్చారు. దాని ఆధారంగానే రెవెన్యూ అధికారులు ఆన్లైన్ రికార్డులను సంఘం పేరు మీదకు మార్చారు. ఇటీవల దీనిపై వివాదం రాజుకోవడంతో మళ్లీ సదరు భూమి ఆన్లైన్ రికార్డులను మ్యూటేషన్ ద్వారా అధికారులు మార్చారు. దానికి సంబంధించిన ఆన్లైన్ రికార్డ్ ఇంకా అప్డేట్ కాలేదు. అయితే తప్పు జరగబట్టే అధికారులు సర్దుబాటు చర్యలు చేపట్టినట్టు స్పష్టమైంది. ఇదిలా ఉంటే ఆలయ ఆవరణలోని వేంకటేశ్వరస్వామి వారి కల్యాణ మండపం, ఆలయానికి వెళ్లే ప్రధాన దారి సైతం వివాదాస్పద సర్వే నెంబర్ భూమిలోనే ఉన్నాయి. దాత గుడిని దేవస్థానానికి అప్పగించి, గుడి దారిని సంఘానికి రాసిచ్చారా.. అని పలువురు ప్రశ్నిస్తున్నారు. భూమి దేవస్థానం చేజారితే ఆలయానికి వెళ్లే దారి కూడా ఉండదని భక్తులు ఆందోళన చెందుతున్నారు. చెట్లు అమ్మిన సొమ్ము ఎక్కడ? టీడీపీ నేతలు సదరు భూమి తమ చేతిలోకి వచ్చిందన్న ఆనందంతో ఇటీవల అందులోని పెద్ద పెద్ద చెట్లను, తులసి మొక్కలను తొలగించారు. చెట్ల కలపను అమ్ముకుని రూ.50 వేల వరకు సదరు నాయకులు లబ్ధి పొందినట్టు సమాచారం. ఆ సొమ్ము ఏ నాయకుడి జేబులోకి చేరిందనే దానిపై ప్రస్తుతం చర్చ జరుగుతోంది. వివాదాస్పద భూమి ప్రభుత్వ ఆధీనంలోనే ఉంటుందని చెబుతున్న గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, చెట్ల సొమ్మును కూడా ప్రభుత్వ ట్రెజరీలోనే ఉంచాలి కదా.. తమ నేతల జేబుల్లో ఉంచడం ఏంటని పలువురు ప్రశ్నిస్తున్నారు. అధికార పార్టీ వారు కావడంతో కబ్జా చేసింది అధికార పార్టీ నేతలు కావడంతో చర్యలకు వెనకాడుతున్నారు. దాత అసలు ఇంటి పేరు శ్రీమత్ మంత్రరత్నం ప్రతివాద భయంకర అయితే అన్ రిజిస్టర్డ్ డాక్యుమెంట్లో ఇంటి పేరు శ్రీమత్ భయంకర ప్రతివాద అని ఉంది. అసలు దాత తండ్రి పేరే లేదు. దాత 1967 లో ఈ భూమి బహుమతిగా ఇచ్చినట్టు ఇందులో ఉంది. దాత 1967కు ముందే మృతి చెందాడని, అలాంటప్పుడు సంఘానికి ఈ భూమిని ఆయన ఆత్మ రాసిచ్చిందా? అని పలువురు అంటున్నారు. సదరు కమ్మ సేవ సంఘం అధ్యక్షుడు ఎవరు? ఆయనకు ఇంత వరకు ఎందుకు నోటీసులు జారీ చేయలేదు? అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. దేవుడి భూమిని దేవుడికి అప్పగించాల్సిందే. లేకపోతే వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో ఆందోళన ఉధృతం చేస్తాం. కొందరు టీడీపీ నేతలు ఆ భూమిని కబ్జా చేసినట్టు స్పష్టంగా కనిపిస్తోంది. రెవెన్యూ అధికారులు తమ తప్పులను సరిచేసుకుంటున్నారు. దాత కుటుంబీకులు ఆ భూమి దేవస్థానానికే చెందాలని అధికారులకు తెలిపారు. అయినా బాధ్యులపై చట్టపరమైన చర్యలు చేపట్టలేదు. – తానేటి వనిత – మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి ముదురుతున్న లక్ష్మీపురం ఆలయ భూ వివాదం కబ్జా భూమిలోనే కల్యాణ మండపం, గుడికి వెళ్లే దారి చెట్టు నరికి విక్రయించిన సొమ్ము ఏమైంది? నిగ్గు తేల్చాలంటున్న భక్తులు, స్థానికులు -
● కన్నకొడుకే కర్కశకుడిగా మారి..
కన్నకొడుకే కర్కశకుడిగా మారి నవమాసాలు మోసి పెంచిన తల్లిని వేధిస్తున్న ఘటన ఇది. తంగెళ్ళమూడి ప్రాంతానికి చెందిన బుగత నీలమ్మ (95) అనే వృద్ధురాలి భర్త ప్రభుత్వ ఉద్యోగం చేస్తూ మరణించారు. అప్పటి నుంచి ఆమె ప్రభుత్వం ఇచ్చే పింఛన్ డబ్బులతోనే జీవనం సాగిస్తోంది. అయితే, ప్రతి నెలా పింఛన్ డబ్బులు రాగానే ఆమె కుమారుడు బుగత రమేష్ తల్లి వద్దకు వచ్చి, ఆమెను తీవ్రంగా కొట్టి ఆ డబ్బులను బలవంతంగా లాక్కెళుతున్నాడు. కొడుకు పెడుతున్న బాధలను భరించలేక, సోమవారం కలెక్టరేట్లో నిర్వహించిన పీజీఆర్ఎస్లో ఆ వృద్ధురాలు సహాయకుల సాయంతో వచ్చి ఫిర్యాదు చేసింది. కన్నకొడుకు వేధింపుల నుంచి తనకు రక్షణ కల్పించి, న్యాయం చేయాలని కలెక్టర్ వెట్రిసెల్విని ఆమె కన్నీటితో వేడుకుంది. – ఫొటో: సాక్షిఫొటోగ్రాఫర్/ ఏలూరు -
సర్... గడువివ్వండి
● ఓటర్ల ఎన్యూమరేషన్ గడువు పెంచాలి ● కేంద్ర ఎన్నికల సంఘానికి ఓటర్ల విజ్ఞప్తి ● ముసాయిదా జాబితా రూపకల్పనలో లోపిస్తున్న పారదర్శకత! ఆకివీడు: ఓటర్ల ఎన్యూమరేషన్ కార్యక్రమ గడువును మరింత పెంచాలని ఓటర్లు కేంద్ర ఎన్నికల సంఘాన్ని విజ్ఞప్తి చేస్తున్నారు. ఎన్యూమరేషన్ గడువును ఈ నెల 14వ తేదీ వరకే పరిమితం చేయడం వల్ల ఓటర్లకు పూర్తి స్థాయిలో న్యాయం జరిగే అవకాశం లేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. అధికారులు మాత్రం వంద శాతం ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారాలను అందజేశామని చెబుతున్నప్పటికీ, క్షేత్రస్థాయిలో చాలా ప్రాంతాల్లో ఇంకా ఫారాలు అందలేదని ఓటర్లు వాపోతున్నారు. అందిన ఫారాలను కూడా ఏవిధంగా పూర్తి చేయాలో తెలియక తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కూటమి నేతల చేతుల్లోకి ఫారాలు ఫారాలను పూర్తి చేయించే బాధ్యతను బూత్ స్థాయి అధికారులు (బీఎల్ఓలు) పూర్తిగా విస్మరించారనే ఆరోపణలు వస్తున్నాయి. దీంతో కొంతమంది నిరక్షరాస్యులైన ఓటర్లు తమ ఫారాలు పూర్తి చేయించుకోవడం కోసం స్థానికుల చుట్టూ తిరుగుతున్నారు. చదువుకున్న వారు సైతం ఫారాలను ఎలా పూర్తి చేయాలో తెలియక తప్పులు దొర్లిస్తున్నారు. దీనివల్ల ఓటర్ల జాబితాలో తమ పేర్లు నమోదు అవుతాయో లేదోనన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. మరోవైపు, చాలా గ్రామాలు, వార్డుల్లో బీఎల్ఓలు స్వయంగా ఓటర్లకు ఫారాలు ఇవ్వకుండా, కూటమి నాయకుల ఆధ్వర్యంలో పంపిణీ చేయిస్తున్నారు. తిరిగి ఆ ఫారాలను మళ్లీ ఆ నాయకులకే ఇవ్వాల్సి వస్తోంది. బీఎల్ఓల పరిధిలో ఫారాలు పూర్తి చేయడానికి సమయం సరిపోకపోవడంతో, వాటిని రాజకీయ నాయకుల చేతుల్లో పెట్టి ఈ నెల 12వ తేదీ లోపు అందజేయాలని సూచించినట్లు తెలుస్తోంది. దీంతో ఆయా ఫారాలు ఏ విధంగా భర్తీ అవుతున్నాయో ఓటర్లకే తెలియడం లేదు. ఈ ప్రక్రియ వల్ల ఫారాలు పూర్తి స్థాయిలో అధికారులకు చేరుతాయా లేదా అన్న సంశయం నెలకొంది. నిబంధనల ప్రకారం.. బీఎల్ఓలే స్వయంగా ఓటరుకు ఫారం అందజేసి, పూర్తి చేయించాల్సి ఉంటుంది. ఈ గందరగోళం వల్ల చనిపోయిన ఓటర్ల పేర్ల తొలగింపులో కూడా నిర్లక్ష్యం జరిగే అవకాశం ఉందని పలువురు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. పాత వివరాలతో ఓటర్ల తికమక 2002 ఓటరు జాబితాలో పేరు ఉంటే ఇతర వివరాలు చెప్పాల్సిన అవసరం లేదని అధికారులు చెబుతున్నప్పటికీ.. నాటి ఓటరు సంఖ్యను, గతంలో ఓటు వేసిన సమయంలో ఉన్న ఓటరు సంఖ్యను నమోదు చేయాలన్న సూచనతో ఓటర్లు తికమక పడుతున్నారు. అప్పటి జాబితాలో పేరు లేకపోతే ఈసారి తమకు ఓటు హక్కు లభించదా అనే అనుమానాలు కూడా వ్యక్తమవుతున్నాయి. హడావిడిగా ఓటర్ల జాబితాను తయారు చేయడం వల్ల పారదర్శకత లోపించి పలు అక్రమాలకు తావిచ్చినట్లవుతుందని, గతంతో పోలిస్తే ఈసారి ఓటర్ల సంఖ్య కొంత మేర తగ్గే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఎన్యూమరేషన్ గడువును పెంచితేనే బీఎల్ఓలు సమర్థవంతంగా ఓటర్ల జాబితాను తయారు చేయగలరని కోరుతున్నారు. ఎన్యూమరేషన్ వివరాలను డిజిటలైజేషన్ పూర్తి చేసి, ఈ నెల 14వ తేదీ లోపు తుది వివరాలను అందజేయాల్సి ఉంది. అనంతరం ఈ నెల 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా ప్రచురణ జరుగనుంది. ఈ ముసాయిదాపై క్లెయిములు, అభ్యంతరాలను ఈ నెల 21 నుంచి ఆగస్టు 20వ తేదీ లోపు దాఖలు చేసుకోవచ్చు. అభ్యంతరాల పరిష్కారం సెప్టెంబర్ 18వ తేదీ లోపు పూర్తి చేసి, తుది ఓటర్ల జాబితాను సెప్టెంబర్ 22వ తేదీన అధికారికంగా ప్రచురించనున్నారు. -
సామాన్యులపై విద్యుత్ బాదుడు
ఆగిరిపల్లి: మండలంలోని కొత్త ఈదరలో విద్యుత్ అధికారులు ఇతర చార్జీల పేరుతో వినియోగదారుల జేబులకు చిల్లు పెడుతున్నారని పలువురు గ్రామస్తులు వాపోతున్నారు. గత నెలలో సాధారణంగా రూ.వెయ్యి వరకు వచ్చిన విద్యుత్ బిల్లులు.. ఈసారి ఇతర చార్జీల పేరిట రూ.5 వేల నుంచి రూ.10 వేల వరకు రావడంతో వినియోగదారులు లబోదిబోమంటున్నారు. దీనిపై విద్యుత్ శాఖాఅధికారులను అడిగితే గత నెలలో అధిక లోడుతో మీ గ్రామంలో రెండు ట్రాన్స్ఫార్మర్లు కాలిపోయాయని,.. ఆ నష్టం మీరే భరించాలని చెప్పడంపై వినియోగదారులు మండిపడుతున్నారు. సాంకేతిక లోపాల వల్లనో, అధిక లోడు వల్లనో ట్రాన్స్ఫార్మర్లు కాలిపోతే ఆ నష్టాన్ని ప్రభుత్వమే భరించాలి గానీ, సామాన్య వినియోగదారులపై రుద్దడం ఏంటని గ్రామస్తుడు అక్కిరెడ్డి ప్రసాద్ వర్మ ప్రశ్నించారు. తాను ఏసీ కూడా వాడటం లేదని, 267 యూనిట్లకు గాను రూ.1384 విద్యుత్ బిల్లు వచ్చిందని, దీనికి తోడు అదర్ చార్జీల పేరుతో రూ.4,550 వచ్చిందని ఏమి చేయాలో అర్థం కావటం లేదని వాపోయారు. దీనిపై విద్యుత్ అధికారులును అడిగితే విద్యుత్ బిల్లు కట్టాల్సిందేనని తేల్చి చెబుతున్నారని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. ఒకేసారి వేల రూపాయల్లో అదనపు బిల్లులు రావడంతో సామాన్యులు, మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఉన్నతాధికారులు వెంటనే స్పందించి, నిబంధనలకు విరుద్ధంగా వేసిన ఈ ఇతర ఛార్జీలను విద్యుత్ బిల్లుల నుంచి తక్షణమే తొలగించాలని గ్రామస్తులు డిమాండ్ చేస్తున్నారు. -
పంట కాలువలో దూకి వ్యక్తి మృతి
తాడేపల్లిగూడెం (టీఓసీ): పంట కాలువలో దూకి ఓ వ్యక్తి మృతి చెందాడు. గణపవరం మండలం కాశిపాడు గ్రామానికి చెందిన గొట్టాపు చిన్న (30) పంట కాలువలో దూకినట్లు తాడేపల్లిగూడెం ఫైర్ స్టేషన్కు సమాచారం అందింది. దీంతో ఫైర్ సిబ్బంది సోమవారం ఉదయం 6 గంటల నుంచి కాలువలో వెతికినట్లు ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు తెలిపారు. చిలకంపాడు లాకుల వద్ద మృతదేహాన్ని కనుగొని, బయటకు తీసి, మృతుని బంధువులకు అప్పగించినట్లు ఆయన తెలిపారు. నూజివీడు: చెల్లని చెక్కు కేసులో నూజివీడుకు చెందిన శీలం పద్మశ్రీకి రూ.2 లక్షల జరిమానా, ఆరు నెలల జైలుశిక్షను విధిస్తూ స్పెషల్ మేజిస్ట్రేట్ వేల్పుల కృష్ణమూర్తి సోమవారం తీర్పు చెప్పారు. ప్రాసిక్యూషన్ కథనం ప్రకారం నూజివీడుకు చెందిన వీర్ల వెంకటేశ్వరరావు 2023 అక్టోబర్ 5న పద్మశ్రీకి రూ.1.25 లక్షల నగదును అప్పుగా ఇచ్చారు. కొంతకాలం తరువాత బాకీ చెల్లించమని అడగగా పద్మశ్రీ 2023 డిసెంబరులో రూ.లక్షకు చెక్కును వెంకటేశ్వరరావుకు ఇచ్చారు. ఆ చెక్కును ఆయన బ్యాంకులో వేయగా పద్మశ్రీ బ్యాంకు ఖాతాలో నగదు లేదని బ్యాంకు అధికారులు తిరస్కరించారు. దీనిపై వెంకటేశ్వరరావు కోర్టులో కేసు వేయగా విచారణ అనంతరం స్పెషల్ మేజిస్ట్రేట్ రూ.2 లక్షల జరిమానా, ఆరు నెలల జైలుశిక్ష విధిస్తూ తీర్పును వెలువరించారు. భీమవరం: సినీ నటుడు నిఖిల్ భీమవరంలో సందడి చేశారు. సోమవారం రక్షాదళ్ సేవా సంస్థ ఆధ్వర్యంలో పలు ప్రభుత్వ, ప్రైవేట్ పాఠశాలల్లోని విద్యార్థులకు పుస్తకాలు పంపిణీ చేశారు. అనంతరం నిఖిల్ మాట్లాడుతూ దానాల్లో విద్యాదానం గొప్పదని, రక్షాదళ్ అధ్యక్షుడు మంగదొడ్డి మహేంద్ర ఆధ్వర్యంలో విద్యార్థులకు విలువైన పుస్తకాల కిట్స్ పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. అనంతరం విద్యార్థులకు సెల్పీలకు ఫోజులిచ్చారు. త్వరలో విడుదలైయ్యే తన చిత్రం టికెట్లను విద్యార్థులకు ఉచితంగా అందిస్తానన్నారు. కార్యక్రమాల్లో ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు(అంజిబాబు), జిల్లా విద్యాశాఖాధికారి ఇ నారాయణ, మంగదొడ్డి మహేంద్ర, ఎంఈవో ఎన్ శ్రీనివాసరావు, సాయిరామ్, ఎన్ఎస్ ప్రసాద్, దాయన చంద్రజీ, షేక్ బాబాజీసాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని వేలేరుపాడు, కుక్కునూరుల్లో ఉన్న కస్తూరిబా బాలికోన్నత పాఠశాలల విషయంలో పాల్పడిన అవినీతికి సంబంధించి ఏలూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే. పంకజ్ కుమార్ని మాతృ సంస్థకు సరెండర్ చేస్తూ సమగ్రశిక్ష రాష్ట్ర ప్రాజెక్టు డైరెక్టర్ బీ శ్రీనివాసరావు ఉత్తర్వులు జారీ చేశారు. కై కలూరు వైవీఎన్ఆర్ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో లెక్చరర్గా పని చేస్తున్న పంకజ్ కుమార్ను ఏలూరు జిల్లా సమగ్రశిక్ష అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్గా గతంలో నియమించారు. ఇటీవల వేలేరుపాడు, కుక్కునూరు కస్తూరిబా బాలికోన్నత పాఠశాలల్లో జరిగిన అవినతీకి సంబంధించి ఆయా పాఠశాలల ప్రిన్సిపాళ్లు ఫిర్యాదు చేశారు. సదరు ఫిర్యాదులపై విచారణ అనంతరం అందిన నివేదికను అనుసరించి ఆయనపై క్రమశిక్షణ చర్య తీసుకున్నట్టు తెలిపారు. ఏలూరు (టూటౌన్): యూట్యూబర్ ప్రశ్న రావణ్పై వరుసగా కేసులు నమోదు చేయడం, ఒక కేసులో బెయిల్ పొందిన వెంటనే మరో కేసులో అరెస్టు చేయడం, అనంతరం కఠిన చట్టాల కింద కేసులు నమోదు చేయడం రాష్ట్రంలో రాజ్యాంగ హక్కులు, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛ, న్యాయపాలనపై తీవ్ర ఆందోళన కలిగిస్తోందని వైఎస్సార్సీపీ న్యాయ విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి డీవీ రామాంజనేయులు ఆందోళన వ్యక్తం చేశారు. భారత రాజ్యాంగంలోని ఆర్టికల్స్ 14, 19(1)(ఎ), 21 ప్రతి పౌరుడికి సమానత్వం, భావ ప్రకటనా స్వేచ్ఛ, వ్యక్తిగత స్వేచ్ఛను హామీ ఇస్తున్నాయన్నారు. సుప్రీంకోర్టు పలుమార్లు ‘బెయిల్ ఈజ్ ది రూల్, జైల్ ఈజ్ ది ఎక్సెప్షన్’ అని స్పష్టం చేసిందన్నారు. అలాగే, నేరం కోర్టులో రుజువయ్యే వరకు ప్రతి వ్యక్తి నిర్దోషిగానే పరిగణించబడతాడనే సూత్రాన్ని గౌరవించాలన్నారు. దేశ భద్రత కోసం ఉద్దేశించిన కఠిన చట్టాలను రాజకీయ కక్షసాధింపుకు ఉపయోగిస్తున్నారనే అనుమానాలకు తావు లేకుండా ప్రభుత్వం వ్యవహరించాలని పేర్కొన్నారు. మృతదేహాన్ని వెలికితీస్తున్న ఫైర్ సిబ్బంది -
ప్రశ్నించే వారిపై అణచివేత చర్యలు
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రజా సంక్షేమం కంటే ప్రశ్నిస్తున్న వారిపై అణిచివేత చర్యలు కొనసాగుతున్నాయని భారత విప్లవ కమ్యూనిస్టు పార్టీ (ఆర్సీపీఐ) ఏపీ రాష్ట్ర కార్యదర్శి డి.నాగన్న విమర్శించారు. సోమవారం ఏలూరులో జరుగుతున్న జిల్లా సమావేశాలకు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు ఇచ్చిన హామీలు అమలు చేయడం కంటే ప్రభుత్వ వైఫల్యాలను ప్రశ్నిస్తున్న వారిపై కేసులు పెట్టి భయభ్రాంతులకు గురి చేస్తున్నాయని విమర్శించారు. కేంద్ర నుంచి రావాల్సిన ప్రత్యేక హోదా, విభజన హామీల అమలు కోసం ప్రభుత్వం మాటైనా మాట్లాడటం లేదని అన్నారు. ఎన్నికల ముందు సూపర్ సిక్స్ అని ప్రకటించి తల్లికి వందనం, మహిళల ఉచిత బస్సు అంశాలను మాత్రమే అమలు చేసి, ఆడబిడ్డనిధి రూ.1500, నిరుద్యోగ భృతి, వెనుకబడిన తరగతుల వారికి 50 సంవత్సరాలకే పెన్షన్ తదితర అనేక అంశాలు అమలు చేయలేదని విమర్శించారు. వామపక్ష పార్టీలు పోరాడి సాధించిన ఉపాధి హామీ చట్టాన్ని నీరుగారిస్తున్నారన్నారు. -
మాంసం దుకాణాల తొలగింపు
ద్వారకాతిరుమల: క్షేత్రంలోని కొత్త బస్టాండ్ సమీపంలో ప్రధాన రహదారి పక్కన ఏర్పాటు చేసిన మాంసం దుకాణాల కారణంగా భక్తులు, స్థానికులు పడుతున్న ఇబ్బందులపై సాక్షి దినపత్రికలో సోమవారం ‘క్షేత్రంలో రోడ్డుపక్కన మళ్లీ మాంసం దుకాణాలు’ శీర్షికతో ప్రచురితమైన కథనంపై పంచాయతీ అధికారులు స్పందించారు. రోడ్డుపక్కన ఉన్న దుకాణాలను సిబ్బందితో తొలగింపజేశారు. మళ్లీ రోడ్డు పక్కన మాంసం దుకాణాలను ఏర్పాటు చేస్తే చట్టపరమైన చర్యలు చేపడతామని పంచాయతీ కార్యదర్శి జీటీవీ శ్రీనివాస్ వ్యాపారులను హెచ్చరించారు. సంతకం ఫోర్జరీ చేశారని ఫిర్యాదు తణుకు అర్బన్: విద్యుత్ స్మార్ట్ మీటరు ఏర్పాటులో విద్యుత్ శాఖ సిబ్బంది నా తల్లి సంతకాన్ని ఫోర్జరీ చేశారంటూ దువ్వ గ్రామానికి చెందిన సిర్రా రమేష్ సోమవారం తణుకు తహసీల్దారు కార్యాలయంలో పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేశారు. గతనెల 20వ తేదీన తాము వద్దని చెప్పినా తమ అనుమతి లేకుండా విద్యుత్ స్మార్ట్ మీటరును విద్యుత్ శాఖ లైన్మెన్ అజకర్ ఏర్పాటుచేశారని, తమ అనుమతి లేకుండా ఎలా బిగించారని నిలదీసిన క్రమంలో తన తల్లి రత్నకుమారి సంతకాన్ని ఫోర్జరీ చేసి ఉన్న అంగీకార పత్రాన్ని చూపించారని ఆరోపించారు. ప్రతినెలా రూ.వెయ్యి నుంచి రూ.1,500 లోపు వచ్చే బిల్లు స్మార్ట్ మీటరు కారణంగా రూ. 14,539 వచ్చిందని చెప్పారు. ఫోర్జరీ సంతకం చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు. -
సిగ్నల్ లేక ఇబ్బందులు
వ్యవసాయ పనులు ప్రారంభం కావడంతో మా రైతులకు యూరియా అవసరం ఎంతో ఉంది. ప్రభుత్వం పాత పద్ధతిలో కాకుండా కొత్తగా మొబైల్ యాప్ విధానంలో యూరియా బుకింగ్ కోరుతుండడంతో మా ప్రాంతంలో సిగ్నల్ లేక బుకింగ్ చేసుకోవడానికి తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నాం. ఇకనైనా ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతం వరకు పాత పద్ధతిలోనే యూరియా అందించేలా చర్యలు చేపట్టాలి. – కారం నరేంద్ర, ఇసుకపాడు గ్రామం, కుక్కునూరు మండలం. ఏజెన్సీ ప్రాంతాల్లో చాలా మంది గిరిజన రైతులకు మొబైల్ యాప్ ద్వారా యూరియా బుకింగ్ చేసే విధానం గురించి సరైన అవగాహన లేదు. దీంతో యూరియా బుకింగ్ చేయడం కష్టంగా మారుతోంది. అందుకే ప్రభుత్వం ఏజెన్సీ ప్రాంతాల్లో రైతుల పరిస్థితిని దృష్టిలో పెట్టుకుని పాత పద్ధతిలోనే యూరియాను అందించేలా చర్యలు తీసుకోవాలి. – సోడే నాగేశ్వరరావు, కమ్మరిగూడెం, కుక్కునూరు మండలం -
ఏజెన్సీలో యూరియా కష్టాలు
కుక్కునూరు: ఏజెన్సీ ప్రాంతాల్లో రైతులకు మొబైల్ యాప్పై సరైన అవగాహన లేకపోవడంతో యూరియా బుకింగ్ కష్టతరంగా మారింది. యాప్ ఆధారిత బుకింగ్ విధానాన్ని అమలు చేస్తున్నప్పటికీ, ఏజెన్సీ ప్రాంతాల్లో చాలామంది రైతులు స్మార్ట్ఫోన్ వినియోగంలో అనుభవం లేకపోవడం, నెట్వర్క్ సమస్యలు, సాంకేతిక పరిజ్ఞానం లోపం వంటి కారణాలతో యూరియా బుకింగ్ చేయడంలో ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం సాగు పనులు ఊపందుకున్న వేళ యూరియా అవసరమైన సమయంలో బుకింగ్ సమస్యలు ఆందోళనకు గురిచేస్తున్నాయి. యాప్ ద్వారా బుకింగ్ చేయడం తెలియక పలువురు రైతులు ఎరువుల కోసం అటు ఏజెన్సీలు, ఇటు రైతు భరోసా కేంద్రాల చుట్టూ తిరగాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో పంటలకు అవసరమైన సమయంలో యూరియా అందక దిగుబడిపై ప్రభావం పడే అవకాశం ఉందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏజెన్సీ ప్రాంతాల ప్రత్యేక పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రభుత్వం యాప్ ఆధారిత విధానానికి బదులుగా పాత పద్ధతిలోనే యూరియాను అందుబాటులోకి తేవాలని రైతులు డిమాండ్ చేస్తున్నారు. రైతులు నేరుగా కేంద్రాలకు వెళ్లి అవసరమైన యూరియాను పొందేలా పాత విధానాన్ని పునరుద్ధరించాలని కోరుతున్నారు. అధికారులు తక్షణ చర్యలు తీసుకుని ఏజెన్సీ ప్రాంతాల్లో యూరియా సరఫరాను సులభతరం చేయాలని కోరుతున్నారు. పాత విధానంలో సరఫరా చేయాలని రైతుల డిమాండ్ -
చోరీ మొబైల్స్ రికవరీ
జంగారెడ్డిగూడెం: చోరీకి గురై మొబైల్ ఫోన్లను రికవరీ చేసి, వాటిని నేరుగా బాధితుల ఇళ్లకే వెళ్లి అందజేశారు జంగారెడ్డిగూడెం పోలీసులు. జిల్లా ఎస్పీ కె. ప్రతాప్ శివ కిషోర్, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ఇన్స్పెక్టర్ ఎం.వి.సుభాష్ ఆదేశాల మేరకు స్థానిక ఎస్ఐ ఎన్.వీరప్రసాద్, కె.సోమరాజు గత నెల రోజుల్లో రికవరీ చేసిన సుమారు రూ.5,75,000 విలువైన 28 మొబైల్ ఫోన్లను బాధితుల ఇళ్లకు వెళ్లి స్వయంగా అందజేశారు. మరోసారి జిల్లాలోనే అత్యధిక సంఖ్యలో మొబైల్ ఫోన్లను రికవరీ చేసినందుకు జంగారెడ్డిగూడెం పోలీసు సిబ్బందిని ఉన్నతాధికారులు ప్రత్యేకంగా అభినందించారు. -
సందేశాత్మకంగా నాటిక పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట) : నగరానికి చెందిన హేలా పురి కళాపరిషత్ ఆధ్వర్యంలో అల్లూరి సీతారామ రాజు 18వ స్మారక జాతీయ స్థాయి నాటిక పోటీల్లో భాగంగా రెండో రోజు ఆదివారం ప్రదర్శించిన నాటికలు సందేశాత్మకంగా సాగాయి. స్థానిక వైఎంహెచ్ఏ హాలులో ప్రదర్శించిన నాటికలు సమాజంలోని సమకాలీన అంశాలను, మానవీయ విలువలను ప్రతిబింబించాయి. తొలుత హర్ష క్రియేషన్స్ (విజయవాడ) బృందం భువి కోరని భ్రమణం నాటికను ప్రదర్శించారు. ముడుపల్లి మోహన్ గుప్తా (గుప్తా ఫౌండేషన్) సౌజన్యంతో ప్రదర్శితమైన నా టికకు మూలకథ ఆచార్య ఉమామహేష్ అందించా రు. తాళాబత్తుల వెంకటేశ్వరరావు నాటకీకరణ చేశారు. కత్తి శ్యామ్ప్రసాద్ దర్శకత్వం వహించారు. అనంతరం ముద్దుకూరి ఆర్ట్స్ క్రియేషన్స్ (చిలకలూరిపేట) బృందం మా ఇంట్లో మహాభారతం నాటికను ఆవిష్కరించింది. మహమ్మద్ ఖాజావలీ సౌజన్యంతో నిర్వహించిన నాటికకు ముద్దుకూరి రవీంద్రబాబు రచన, దర్శకత్వం వహించారు. కు టుంబ విలువలు, నేటి సమాజంలో ఎదురవుతున్న మానసిక సంఘర్షణల నేపథ్యంలో సాగిన నాటిక వినోదాత్మకంగా సాగింది. హేలాపురి కళాపరిషత్ గౌరవ అధ్యక్షుడు గుత్తా కౌసలేంద్రరావు, అధ్యక్షుడు పెదపాటి రామకృష్ణ, ఉపాధ్యక్షుడు పి.విజయ్కుమార్, సహాయ కార్యదర్శులు వల్లముల రామాంజనేయులు, మండవ రాజగోపాలకృష్ణ, కోశాధికారి మహ్మద్ ఖాజావలి కార్యక్రమాలను పర్యవేక్షించారు. గుప్తా సంస్థల ప్రతినిధి కె.శ్రీనివాస్, లంకా వెంకటేశ్వర్లు, కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. -
రైతు సంఘం అధ్యక్ష, కార్యదర్శులుగా ఎంపిక
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నూతన రాష్ట్ర కమిటీ ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. రైతు సంఘం రాష్ట్ర 23వ మహాసభల చివరి రోజు రాష్ట్ర అధ్యక్షుడిగా వి.కృష్ణయ్య, కార్యదర్శి గా కె.ప్రభాకరెడ్డి, కోశాధికారిగా మర్రాపు సూర్యనారాయణ, ఉపాధ్యక్షులుగా వై.కేశవరావు, జొన్నా శివశంకరరావు, పీవీ ఆంజనేయులు, మూలి వెంగయ్య, పి.హేమలత, ఆర్ చంద్రశేఖర్ రెడ్డి, గౌరుశెట్టి నాగేశ్వరరావు, ఆకుల హరేరామ్, వల్లూరు భారతి, సహాయ కార్యదర్శులుగా ఏ.హరి, జి.రామకృష్ణ, టి.రామచంద్రుడు, జె.జయంతి బాబు, కంచుమాటి అజయ్ కుమార్, కె.శ్రీనివాస్, ఎం.అప్పలరాజు, బుద్ధరాజు రాంబాబుతో పాటు మరో 46 మంది ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. తణుకు అర్బన్: మోడ్రన్ పెంటాథ్లాన్ లేజర్ రన్ జిల్లా జట్ల ఎంపికలు ఆదివారం తణుకు శ్రీ చిట్టూరి ఇంద్రయ్య ప్రభుత్వ డిగ్రీ కళాశాల క్రీడా ప్రాంగణంలో నిర్వహించారు. అండర్ 9, 11, 15,17, 19 కేటగిరీలకు సంబంధించి జిల్లా నలుమూలల నుంచి 100 మంది క్రీడాకారులు హాజరుకాగా అత్యుత్తమ ప్రతిభ చూపించిన 32 మంది క్రీడాకారులను ఎంపిక చేసినట్లు అసోసియేషన్ జిల్లా కార్యదర్శి సంకు విరాటలక్ష్మి తెలిపారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 11, 12 తేదీల్లో ఏలూరులో నిర్వహించనున్న రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఎంపికలను వ్యాయామ ఉపాధ్యాయులు ఎస్.సూర్యనారాయణ, కె.బాబూరావు, కె.సుబ్బారావు, ఎ.నాగేశ్వరరావు, ఆర్.నాయక్లు పర్యవేక్షించారు. -
కిరణ్ రాయల్పై పోలీసులకు ఫిర్యాదు
ఏలూరు టౌన్: కిరణ్ రాయల్పై వైఎస్సార్సీపీ నాయకులు ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. మాజీ ముఖ్యమంత్రి, వైఎస్సార్సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డిని అసభ్యంగా, వ్యక్తిగతంగా కించపరిచేలా కిరణ్ రాయల్ వ్యాఖ్యలు చేశారని.. తమ మనోభావాలు తీవ్రస్థాయిలో దెబ్బతిన్నాయని, అతనిపై చట్టపరమైన చర్యలు చేపట్టాలంటూ వైఎస్సార్సీపీ సోషల్మీడియా ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండ్లమూడి సునీల్, ఏలూరు నియోజకవర్గ సోషల్ మీడియా ప్రెసిడెంట్ పచ్చిపులుసు సుజన్, పార్టీ నేతలు ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ ఏలూరు నగరంలోని డివిజన్ ఇన్చార్జ్లు ప్రత్తిపాటి విజయకుమార్, సురేంద్రకుమార్, వినయ్, వైష్ణవి, కోండ్రు వినోద్కుమార్, బూరగ జ్యోతిసాగర్, కొండ్రు కిరణ్, ఇందేటి ఏసుబాబు, లంకపల్లి దీపక్, ఉప్పెన రజనీకాంత్, కరణం జగ్గారావు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. యలమంచిలి: అడవిపాలెంలో శనివారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో మహ్మద్ కరీముల్లా (31) మృతి చెందాడు. మేడపాడు శివారు కొంతేరు జగనన్న కాలనీకి చెందిన కరీముల్లా పాలకొలు్ోల్లని ఇండియన్ గ్యాస్ కంపెనీలో మేనేజర్ పని చేస్తున్నాడు. పని పూర్తయిన తరువాత తన బైక్పై ఇంటికి వెళ్తుండగా అడవిపాలెం పంచాయతీ గాంధీనగర్లోని బిస్కెట్ ఫ్యాక్టరీ వద్ద వెనుక నుంచి లారీ ఢీ కొట్టింది. ప్రమాదంలో కరీముల్లా తీవ్ర గాయాలు కావడంతో ప్రమాద స్థలంలోనే కన్నుమూశాడు. ఈ మేరకు తండ్రి మహ్మద్ మునిరుద్దీన్ పోలీసులకు పిర్యాదు చేయడంలో హెడ్ కానిస్టేబుల్ కె.శ్యాంసన్రాజు కేసు నమోదు చేశారు. మృతదేహానికి ఆదివారం పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రిలో పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని కుటుంబ సభ్యులకు అప్పగించారు. దెందులూరు: హోటల్ సరుకులు తీసుకురావడం కోసం వెళ్తూ గాలాయగూడెంలో ఈ నెల 4న బైక్ ప్రమాదంలో దేసు కోటివెంకట శ్రీనివాస్ (22)కు తలకు గాయమైంది. వెంటనే స్థానికులు ఆశ్రం ఆస్పత్రికి తరలించగా.. మెరుగైన వైద్యం కోసం గుంటూరు ప్రభుత్వ వైద్యశాలకు తీసుకువెళ్లారు. చికిత్స పొందుతూ ఆదివారం ఉదయం అతను మృతి చెందాడు. మృతుడు గంగన్నగూడెం హోటల్లో 8 నెలలుగా పని చేస్తున్నాడని, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ వెంకట్ కుమార్ తెలిపారు. కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవాలయంలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సమీప జిల్లాల నుంచి భారీగా అమ్మవారిని దర్శించుకుని వేడి నైవేద్యాలు సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ ప్రత్యేక పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున అమ్మవారి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదాలు, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.80,206 ఆదాయం వచ్చిందని పేర్కొన్నారు. ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వినియోగదారుల వ్యవహారాలు, ఆహార, పౌరసరఫరాల శాఖ పరిధిలో రాష్ట్ర స్థాయి విజిలెన్స్ కమిటీ నాన్– అఫిషియల్ సభ్యుడిగా కొవ్వలి వినియోగదారుల సేవా మండలి అధ్యక్షులు, సీనియర్ న్యాయవాది ఎస్.ఎన్.కట్టా నియమితులయ్యారు. ఈ మేరకు ఎక్స్ అఫిషియో సెక్రెటరీ కే.కన్నబాబు రాష్ట్ర ప్రభుత్వం తరఫున జీవో జారీ చేశారు. కట్టా నియామకంపై జిల్లా వినియోగదారుల సంఘాల ప్రతినిధులు బొబ్బిలి బంగారయ్య, కుకునూరి రామచంద్ర రావు మానవత స్వచ్ఛంద సంస్థ నాయకులు కడియాల వెంకట కృష్ణారావు, మేతర అజయ్ బాబు, ఏలూరు బార్ అసోసియేషన్ అధ్యక్షుడు కోనే సీతారామారావు తదితరులు అభినందనలు తెలిపారు. -
అదృశ్యమైన తల్లి, పిల్లల అప్పగింత
కామవరపుకోట: ఈ నెల 29న భర్తతో గొడవపడి పిల్లలతో సహా అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీని తడికలపూడి పోలీసులు గుర్తించి ఆమె కుటుంబ సభ్యులకు అప్పగించారు. ఎస్సై వల్లి పద్మ వివరాల ప్రకారం మండలంలో తడికలపూడి గ్రామానికి చెందిన బాకీ దుర్గ భర్తతో గొడవపడి జూన్ 29వ తేదీన ఇద్దరు కుమారులను తీసుకొని ఇంటి నుంచి వెళ్లిపోయింది. ఆమె తిరిగి రాకపోవడంతో తల్లి వెంకటలక్ష్మి ఫిర్యాదు మేరకు ఈనెల 2న తడికలపూడి పోలీసులు మిస్సింగ్ కేసు నమోదు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో తూర్పుగోదావరి జిల్లా రామచంద్రపురంలో ఆమె ఆచూకీ గుర్తించి, శనివారం రాత్రి తడికలపూడి పోలీస్ స్టేషన్కి తీసుకొచ్చి కౌన్సిలింగ్ ఇచ్చి ఆమెను, ఆమె కుమారులను కుటుంబసభ్యులకు అప్పగించినట్లు ఎస్సై తెలిపారు. -
చికెన్ ధరలకు రెక్కలు
గణపవరం : ఇటీవల కాలంలో చికెన్ ధరలు విపరీతంగా పెరగడంతో పేద, మధ్యతరగతి ప్రజలకు చికెన్ అందుబాటులో లేకుండా పోయింది. వారం రోజులుగా ధరలు ౖపైపెకి ఎగబాకుతూ, ప్రస్తుతం కిలో స్కిన్లెస్ చికెన్ ధర రూ.300 కు చేరింది. పది రోజుల క్రితం దీని ధర రూ.200 మాత్రమే ఉండటం గమనార్హం. అలాగే, స్కిన్తో కూడిన చికెన్ ప్రస్తుతం కిలో రూ.250 వరకు విక్రయిస్తుండగా, బ్రాయిలర్ లైవ్ కోడి (బర్డ్) ధర కిలో రూ.160 నుంచి రూ.180 వరకు పలుకుతోంది. ధరల పెరుగుదలకు కారణాలు ఇటీవల కూరగాయల ధరలు విపరీతంగా పెరగడంతో, చాలామంది వినియోగదారులు చికెన్ కొనుగోలు వైపు మొగ్గు చూపారు. దీనివల్ల ఒక్కసారిగా డిమాండ్ పెరిగి ధరలు ఆకాశాన్నంటాయి. అలాగే ప్రస్తుతం రైతుల వద్ద అవసరానికి సరిపడా కోళ్ల లభ్యత లేకపోవడాన్ని ఆసరాగా చేసుకుని కార్పొరేట్ సంస్థలు ధరలను తమ ఇష్టానుసారంగా పెంచుతున్నాయనే విమర్శలు వస్తున్నాయి. గతంలో కూడా ఇదే పరిస్థితి సాధారణంగా ఏటా వేసవిలో చికెన్ ధరలు మండిపోతుంటాయి. ఈ ఏడాది కూడా మార్చి నుంచి మే చివరి వరకు కిలో చికెన్ రూ.300 నుంచి రూ.350 వరకు, ఓ దశలో రికార్డు స్థాయిలో రూ.380 వరకు కూడా విక్రయించారు. వేసవి తర్వా త ధరలు తగ్గి సాధారణంగా కిలో రూ.200 లోపే ఉన్నప్పటికీ, మళ్లీ పది రోజులుగా ధరలు భారీగా పెరిగాయి. ఆదివారం వచ్చిందంటే చికెన్ సెంటర్ల వద్ద సందడి కనిపించేది. కానీ ఈ వారం ధరలు చుక్కలు తాకడంతో మాంసాహార ప్రియులు తమ కొనుగోళ్లను సగానికి సగం తగ్గించుకున్నారు. -
నైపుణ్యం మెండుగా.. కొలువులు దండిగా..!
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఇంజనీరింగ్ చదువు వేలాది మంది విద్యార్థుల కల. సాంకేతిక విద్యపై మక్కువతో పాటు కోర్సు పూర్తయితే కొలువులు సులభంగా సాధించవచ్చనే ఆశతో ఇంటర్మీడియట్ పూర్తయిన విద్యార్థులు బీటెక్ వైపు అడుగులు వేస్తుంటారు. ఇటీవల విడుదలైన ఏపీ ఈఏపీ సెట్ ఫలితాల్లో ర్యాంకు లు సాధించిన విద్యార్థులు, త్వరలో ప్రారంభం కా నున్న కౌనర్సెలింగ్ నేపథ్యంలో ఏ బ్రాంచ్ ఎంచుకోవాలనే సందిగ్ధంలో ఉన్నారు. ఉద్యోగావకాశాలు, భా రీ ప్యాకేజీలు అందించే కోర్సుల గురించి నిపుణులు, సీనియర్ల నుంచి సలహాలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ప్రధాన ఇంజనీరింగ్ కోర్సులు, వాటి ప్రాధాన్యతలను పరిశీలిస్తే.. కంప్యూటర్ సైన్స్ అండ్ ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ● డిమాండ్ : క్యాంపస్ రిక్రూట్మెంట్లలో ఐటీ కంపెనీలు మొదటగా సీఎస్ఈ విద్యార్థులకే ప్రాధాన్యత ఇస్తున్నాయి. ● ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ : రానున్నది కృత్రిమ మేధ శకం కావడంతో విద్యార్థులు ఏఐ, మెషీన్ లెర్నింగ్, డేటా సైన్స్ కోర్సుల వైపు ఎక్కువగా మొగ్గు చూపుతున్నారు. గత నాలుగేళ్లుగా ఈ సీట్లు పూర్తిగా భర్తీ అవుతున్నాయి. ● పాఠ్యాంశాలు : కంప్యూటర్ ప్రోగ్రామింగ్, సాఫ్ట్వేర్/హార్డ్వేర్, ఆపరేటింగ్ సిస్టమ్స్, డేటా బేస్ వంటి అంశాలపై ఇక్కడ శిక్షణ ఇస్తారు. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ● ద్వితీయ ప్రాధాన్యం : విద్యార్థుల రెండో చాయిస్గా ఈసీఈ నిలుస్తోంది. ● ద్వంద్వ ప్రయోజనం: ఈ బ్రాంచ్ చదవడం వల్ల అటు కోర్ (హార్డ్వేర్) రంగంతో పాటు ఇటు సాఫ్ట్వేర్ రంగంలోనూ సులభంగా ఉద్యోగాలు సాధించవచ్చు. ● పాఠ్యాంశాలు : శాటిలైట్ కమ్యూనికేషన్స్, మై క్రో ప్రాసెసర్స్, సర్క్యూట్స్, యాంటెన్నా వంటి అంశాలపై అవగాహన కల్పిస్తారు. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ● భారీ ఉద్యోగావకాశాలు: ప్రైవేట్ రంగంలో వస్తున్న హైడల్ పవర్ ప్రాజెక్టుల కారణంగా రా బోయే నాలుగేళ్లలో దాదాపు 2 లక్షల ఉద్యోగాలు లభించే అవకాశం ఉందని నిపుణుల అంచనా. ● ప్రయోజనం : విద్యార్థులకు అటు ఎలక్ట్రికల్, ఇటు ఎలక్ట్రానిక్స్ రెండింటిపైనా పట్టు లభిస్తుంది. మెకానికల్ అండ్ కెమికల్ ఇంజనీరింగ్ మెకానికల్ (ఎవర్గ్రీన్ బ్రాంచ్): ద్విచక్ర వాహనాల నుంచి విమానాలు, ఆటోమొబైల్స్, భారీ యంత్రాల రూపకల్పన వరకు మెకానికల్ ఇంజనీర్ల పాత్ర కీలకం. కెమికల్ ఇంజనీరింగ్ : డీఎన్ఏ సీక్వెన్సింగ్, జెనెటిక్ ఇంజనీరింగ్ వంటి ఆధునిక మార్పుల వల్ల ఈ కోర్సుకూ మంచి భవిష్యత్తు ఉంది. ఏలూరులో ఏపీఈఏపీసెట్కు హాజరైన విద్యార్థులు (ఫైల్) ఊరిస్తున్న ఇంజనీరింగ్ కోర్సులు పట్టుసాధిస్తే ముంగిటకే ఉద్యోగం కృత్రిమ మేధ పిలుస్తోంది బ్రాంచ్ కన్నా నైపుణ్యాలే కీలకం ఉమ్మడి జిల్లాలో 8,350 సీట్లు ఏఐ రావడంతో కంప్యూటర్ సైన్స్కు ఉద్యోగావకాశాలు ఉండవనే అపోహ సరైంది కాదు. ఆధునిక నైపుణ్యాలు మెరుగుపర్చుకుంటే మెకానికల్, సివిల్, ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ వంటి కోర్ బ్రాంచ్ విద్యార్థులకు కూడా విస్తృత అవకాశాలు లభిస్తాయి. బ్రాంచ్ ఎన్నిక కీలకమే కానీ ఎంపిక చేసుకున్న బ్రాంచ్లో నైపుణ్యం సాధిస్తేనే అవకాశాలు వస్తాయి. కళాశాలల ఎంపిక కేవలం దానికి ఉన్న పేరు, చేస్తున్న ప్రచారం ఆధారంగా ఉండకూడదు. నాక్, ఎన్బీఏ గుర్తింపు వంటి అంశాలను కూడా పరిగణనలోకి తీసుకోవాలి. – డాక్టర్ మార్లపల్లి కృష్ణ, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాల సీఎస్ఈ ప్రొఫెసర్ఏలూరు జిల్లా పరిధిలో 4 ఇంజనీరింగ్ కళాశాలలు ఉన్నాయి. ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో 1,200, రా మచంద్ర కళాశాలలో 1,020, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో 600, హేలాపురి కళాశాలలో 330 సీట్లు మొత్తంగా 3,150 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ ఏడాది ఏలూరు జిల్లా నుంచి 3,816 మంది పరీక్ష రాయగా, 2,766 మంది ఇంజనీరింగ్కు అర్హత సాధించారు. పశ్చిమగోదావరి జిల్లాలో 9 కాలేజీల్లో 5,200 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ జిల్లాలో 11,287 మంది పరీక్షలు రాయగా.. 8,212 మంది అర్హత సాధించారు. అయితే, ఇతర జిల్లాల టాపర్లు ఉమ్మడి జిల్లాలోని కళాశాలల్లో చేరేందుకు ఆసక్తి చూపడం వల్ల స్థానిక విద్యార్థుల మధ్య సీట్ల కోసం గట్టి పోటీ నెలకొనే అవకాశం ఉంది. -
తణుకులో రేషన్ దందా
తణుకు అర్బన్: తణుకులో చౌక డిపోల రేషన్ దందా జోరుగా సాగుతోంది. ప్రజా పంపిణీ వ్యవస్థ ద్వారా పేదలకు అందాల్సిన బియ్యాన్ని కొందరు రేషన్ డీలర్లు బొక్కేస్తున్నారు. 1వ తేదీ నుంచి రేషన్ డిపోల్లో బియ్యం, పంచదార పంపిణీ చేయాల్సి ఉన్నప్పటికీ కొన్ని డిపోలు తెరవకపోవడం, కొన్ని డిపోల్లో అవకతవకల నేపథ్యంలో తలెత్తిన ఫిర్యాదుల మేరకు తణుకులో నిర్వహించిన విజిలెన్స్ దాడులు సంచలనం రేకెత్తించాయి. తణుకులో ఈ నెల 2, 3 తేదీల్లో జరిపిన విజిలెన్స్ దాడుల్లో భాగంగా ముందుగా దుకాణ షట్టర్లు తెరవకుండా సీల్ వేశారు. అనంతరం పూర్తిస్థాయి అధికారుల తనిఖీల్లో 12, 21, 35, 49 డిపోల్లో సరుకుల్లో అవకతవకలు గుర్తించి ఆ దుకాణాలను సీజ్ చేసి 6 ఏ కేసులు నమోదు చేశారు. ఇంతవరకు బియ్యం బదులుగా డబ్బులు ఇవ్వడం, తక్కువ తూకం తూచడం లేదా లబ్ధిదారుడి బయోమెట్రిక్ వేయించుకుని బియ్యం ఇవ్వకుండా ఎగ్గొట్టడం చూశాం కానీ తణుకులో మాత్రం ఏకంగా దించిన బియ్యం బస్తాలను నేరుగా బ్లాక్ మార్కెట్కు తరలించేసి క్యాష్ చేసుకోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. వివాదాస్పదంగా 21వ నంబరు డిపో వివాదాస్పదంగా మారిన 21వ నంబరు డిపోలో ఈ నెల 1వ తేదీ నుంచి సరుకులు ఇవ్వాల్సి ఉండగా తణుకు ఇరగవరం కాలనీలోని మొఖమట్ల ఉమాదేవి పేరుతో ఉన్న డిపోను ఆ రోజు కొంతసేపు తెరచి తరువాత మూసివేశారు. 2వ తేదీన పూర్తిగా తెరవకపోవడంతో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు విజిలెన్స్, తణుకు రెవెన్యూ అధికారులు దుకాణం తెరవకుండా ముందుగా సీల్ వేశారు. 3వ తేదీన విజిలెన్స్ అధికారులు షట్టర్ తెరచి చూడగా ఒక్క బియ్యం బస్తా కూడా కనిపించకపోవడంతో విస్తుపోయారు. రికార్డుల ప్రకారం 9,690 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా, 8,790 కిలోల బియ్యం తక్కువగా ఉన్నట్లు గుర్తించారు. కేవలం రెండో రోజుకే బియ్యం బస్తాలు మాయం కావడంపై ఆరా తీస్తే, ప్రజా పంపిణీ వ్యవస్థ నుంచి దించుకున్న బియ్యం బస్తాలను వెంటనే బ్లాక్ మార్కెట్కు తరలించారని తెలుస్తోంది. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తరువాత తణుకులో కొన్ని రేషన్ డిపోల్లో డీలర్లను మార్చి తమ వారికి కట్టబెట్టారు. ఇదే అదనుగా కొందరు రేషన్ డిపోలను తమ ఆదాయ వనరుగా మార్చుకుని దోపిడీకి దిగుతున్నారు. ఈ ఏడాది జనవరి మొదటి వారంలో తణుకు పాతవూరులోని 23వ నంబరు డిపో కూడా ఇదే తరహాలో డిపో తెరవకుండా ఉండటం, లబ్ధిదారుల ఫిర్యాదుతో అధికారుల రంగప్రవేశంతో 210 బస్తాల బియ్యం, 342 కిలోల పంచదార, సుమారుగా రూ.6 లక్షల విలువైన సరుకులు మాయం చేసినట్లు తేలింది. ఈ వ్యవహారం నిరూపణ కావడంతో సదరు రేషన్ డీలరుపై రెవెన్యూ అధికారులు 6 ఏ కేసు నమోదు చేశారు. తాజాగా 21వ నంబరు రేషన్ డిపోలో సైతం సుమారుగా రూ.5 లక్షల విలువైన 8,790 కిలోల బియ్యం మాయం చేయడం వివాదాస్పదంగా మారింది. రేషన్ డిపోల బియ్యం నేరుగా బ్లాక్ మార్కెట్కు -
వ్యవసాయ క్షేత్రాన్ని సందర్శించిన కెన్యా ప్రతినిధులు
ద్వారకాతిరుమల: మండలంలోని గుణ్ణంపల్లి గ్రామానికి చెందిన రైతు పల్లి సుబ్బారెడ్డి సాగు చేస్తున్న పీఎండీఎస్ ఫీల్డ్ వరి పంటను కెన్యా దేశానికి చెందిన ప్రతినిధులు ఆదివారం సందర్శించారు. ప్రకృతి వ్యవసాయ పద్ధతిలో రైతు అనుసరిస్తున్న సాగు విధానాలను క్షేత్రస్థాయిలో పరిశీలించి, పంట నిర్వహణ, జీవామృతం, ఘనజీవామృతం వినియోగం, తెగుళ్ల నివారణ, ఖర్చు తగ్గింపు, దిగుబడి పెంపు వంటి వివరాలను రైతుతో నేరుగా మాట్లాడి తెలుసుకున్నారు. ప్రకృతి వ్యవసాయం ద్వారా తక్కువ పెట్టుబడితో అధిక నాణ్యత గల దిగుబడులు సాధిస్తున్న తీరును కెన్యా ప్రతినిధులు అభినందించారు. రైతుల అనుభవాలను ప్రత్యక్షంగా తెలుసుకోవడం తమకు ఎంతో ఉపయోగకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ ప్రాజెక్టు మేనేజర్ వెంకటేష్, ఏడీపీఎం వల్లీ, తదితరులు పాల్గొన్నారు. -
‘హద్దులు’ దాటిన ఇసుక అక్రమాలు
● చింతలపూడి వద్ద రెండు లారీలు స్వాధీనం ● తెలంగాణకు అక్రమ రవాణా చింతలపూడి: తెల్లవారక ముందే రోడ్లెక్కితే చాలు.. గోదావరి బంగారం సరిహద్దులు దాటిపోతోంది. ఏపీలో దొరికే నాణ్యమైన గోదావరి ఇసుకను పొరుగు రాష్ట్రంలో భారీ ధరలకు విక్రయిస్తూ కొందరు అక్రమార్కులు కోట్లకు పడగలెత్తుతున్నారు. తాజాగా ఏలూరు జిల్లా చింతలపూడి మండలం మేడిశెట్టివారిపాలెం వద్ద ఆదివారం తెల్లవారుజామున అక్రమంగా తరలిస్తున్న గోదావరి ఇసుక లారీలను పోలీసులు పట్టుకున్నారు. వాహన తనిఖీల్లో దొరికిన లారీలు చింతలపూడి ఎస్సై కే.సతీష్ కుమార్ ఆధ్వర్యంలో పోలీసులు ఆదివారం తెల్లవారుజామున సరిహద్దు ప్రాంతాల్లో ముమ్మరంగా వాహన తనిఖీలు చేపట్టారు. ఈ క్రమంలో కొవ్వూరు పరిసర ప్రాంతాల నుంచి గోదావరి ఇసుక లోడుతో తెలంగాణ వైపు దూసుకుపోతున్న రెండు లారీలను పోలీసులు అడ్డుకున్నారు. వీటికి సంబంధించి సరైన అనుమతులు లేకపోవడంతో సదరు లారీలను స్వాధీనం చేసుకున్నారు. పట్టుబడ్డ వాహనాలను చింతలపూడి మార్కెట్ కమిటీ ఆవరణకు తరలించారు. ఇసుక అక్రమ దందాపై కేసు నమోదు చేసి పూర్తిస్థాయి విచారణ జరుపుతామని, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని ఎస్సై సతీష్ కుమార్ ఈ సందర్భంగా హెచ్చరించారు. సరిహద్దు గ్రామాల్లో డంపింగ్ యార్డులు కొవ్వూరు, రాజమండ్రి పరిసర ప్రాంతాల నుంచి నిత్యం వేలాది టన్నుల గోదావరి ఇసుక పక్క రాష్ట్రాలకు తరలిపోతోంది. ఇందుకు తెలంగాణ సరిహద్దుల్లోని ఏపీ గ్రామాలే ప్రధాన కేంద్రాలుగా మారుతుండటం గమనార్హం. గురుబట్లగూడెం, మేడిశెట్టివారిపాలెం, మల్లేశ్వరం, ఎండపల్లి, అల్లిపల్లి గ్రామాల్లో పగటిపూట రహస్యంగా ఇసుకను భారీ ఎత్తున డంపింగ్ చేస్తున్నారు. చీకటి పడగానే తెలంగాణలోని పెద్ద పెద్ద నగరాలు, పట్టణాలకు లారీల ద్వారా తరలిస్తూ, అక్కడ డిమాండ్ను బట్టి భారీ ధరలకు విక్రయిస్తూ సొమ్ము చేసుకుంటున్నారు. జరిమానాలు విధిస్తున్నా.. తగ్గని జోరు! గతంలో పోలీసులు దాడులు చేసి, కేసులు నమోదు చేసి, జరిమానాలు విధించినా అక్రమార్కుల తీరులో మార్పు రావడం లేదు. ఇసుక ప్రతిరోజూ సరిహద్దులు దాటుతూనే ఉంది. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి, సరిహద్దు ప్రాంతాల్లో శాశ్వత నిఘా పెంచాలని, ఇసుక మాఫియాపై కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు. -
14న ఫ్యాప్టో ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులు, ఉద్యోగుల న్యాయమైన డిమాండ్ల సాధన కోసం జూలై 14న ఏలూరులో ఫ్యాప్టో ఆధ్వర్యంలో నిర్వహించనున్న భారీ ర్యాలీ, కలెక్టరేట్ పికెటింగ్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని రాష్ట్ర ఫ్యాప్టో కో–చైర్మన్ కే నరహరి ఉపాధ్యాయులు, ఉద్యోగులకు పిలుపునిచ్చారు. స్థానిక పవర్ పేట మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో ఆదివారం నిర్వహించిన కార్యక్రమంలో ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యలను వెంటనే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ముఖ్యంగా 12వ పీఆర్సీని వెంటనే నియమించి వేతన సవరణ ప్రక్రియ ప్రారంభించడంతో పాటు, 30 శాతం మధ్యంతర భృతిని తక్షణమే ప్రకటించాలని కోరారు. పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను వెంటనే విడుదల చేయాలని, టెట్ విధానాన్ని పూర్తిగా రద్దు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయులు, ఉద్యోగుల సమస్యల పరిష్కారం కోసం ఫ్యాప్టో చేపడుతున్న ఈ ఉద్యమంలో ప్రతి ఉపాధ్యాయుడు, ఉద్యోగి స్వచ్ఛందంగా పాల్గొని జూలై 14న కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఫ్యాప్టో జిల్లా చైర్మన్ జీ.మోహన్ మాట్లాడుతూ, ఉపాధ్యాయుల న్యాయమైన హక్కుల సాధన కోసం ఫ్యాప్టో నిరంతరం పోరాటం చేస్తోందని తెలిపారు. ఉద్యమ పోస్టర్ను ఆవిష్కరించారు. ఫ్యాప్టో సెక్రటరీ జనరల్ ఎం.ఆదినారాయణ, కో–ఛైర్మన్లు జీ. వెంకటేశ్వరరావు, జంగం రవీంద్ర తదితరులు పాల్గొన్నారు. -
చెరువు గట్టు ఆక్రమణలపై నోటీసులు
ద్వారకాతిరుమల : స్థానిక లింగయ్య చెరువు గట్టు ప్రాంతంలో ఆక్రమించి దుకాణాలు నిర్వహిస్తున్న వ్యాపారులకు గ్రామ పంచాయతీ అధికారులు ఆదివారం షోకాజ్ నోటీసులు జారీ చేశారు. చెరువు గట్టుపై ఆక్రమణల కారణంగా నిత్యం చిన వెంకన్న ఆలయానికి వచ్చే భక్తులకు రాకపోకల్లో తీవ్ర ఇబ్బందులు ఏర్పడుతున్నాయని, ట్రాఫిక్ సమస్య కూడా అధికమవుతోందని పేర్కొన్నారు. నోటీసు అందిన ఏడు రోజుల్లోపు ఆక్రమణలను స్వచ్ఛందంగా తొలగించి పంచాయతీ కార్యాలయానికి సమాచారం ఇవ్వాలని, లేకుంటే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయితే నోటీసులపై పలువురు వ్యాపారులు ఆందోళన వ్యక్తం చేస్తు న్నారు. తాము ఎన్నో ఏళ్లుగా ఇదే ప్రాంతంలో వ్యాపారాలు నిర్వహిస్తూ కుటుంబాలను పోషించుకుంటున్నామని, దుకాణాలు తొలగిస్తే జీవనోపాధిని కోల్పోతామని అంటున్నారు. చెరువు ప్రాంతాన్ని పార్కుగా అభివృద్ధి చేసి, దుకాణ సముదాయాలను ఏర్పాటు చేసి, వాటిని అద్దెకు ఇస్తే తమకు జీవనోపాధి కొనసాగడమే కాకుండా గ్రామ పంచాయతీకి రూ.లక్షల్లో ఆదాయం సమకూరుతుందని అంటున్నారు. -
గురువులపై సర్దుపోటు
ఉపాధ్యాయుల సర్దుబాటు విషయంలో పలు నిబంధ నలు సడలించాలి. ఫౌండేషన్, బేసిక్ ప్రైమరీ స్కూళ్లకు 15–20 మంది విద్యార్థులుంటే ఇద్దరు ఎస్జీటీలను కేటా యించాలి. అలాగే యూపీల నుంచి హైస్కూల్గా వర్గోన్నతి చెందిన పాఠశాలల్లో గ్రేడ్–2, పీడీ పోస్టులు ఇవ్వనందున ముందుగా మిగిలిన టీచర్లను సర్దుబాటు చేయాలి. –గోపీమూర్తి, ఉపాధ్యాయ ఎమ్మెల్సీ గణపవరం మండలంలో మూడు మాత్రమే మిగులు పోస్టులు ఉన్నాయి. మొత్తం 14 పోస్టులు అవసరం. రెండు గణితం, ఒక ఎస్జీటీ మి గులుగా ఉంటే ఇంకా 5 ఎస్జీటీలు, 3 స్కూల్ అసిస్టెంట్ లు, 3 పీడీలు, 3 గ్రేడ్–2 హెచ్ఎంల పోస్టులు అవసరం. ఆ పాఠశాలలో జూనియర్ టీచర్కు బదులుగా సీనియర్ టీచర్ విల్లింగ్ ఉంటే వారికి అవకాశం ఎంఈఓ లాగిన్లో కల్పించారు. –ఏసీవీ ప్రకాష్, ఎంఈవో–1, గణపవరంనిడమర్రు: జిల్లాలోని ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి అనుగుణంగా టీచర్ల నియామకానికి రంగం సిద్ధమైంది. గతనెల 30 నాటికి పాఠశాలల్లో విద్యార్థుల ఎన్రోల్మెంట్ను పరిగణనలోకి తీసుకుని సర్దుబాటు చేయనున్నారు. ఒకవైపు పాఠశాలల్లో ఎన్రోల్మెంట్ ప్రక్రియ జరుగుతుండగా.. మరోవైపు వర్క్ అడ్జస్ట్మెంట్ పేరుతో సర్దుబాటుపై ఉపాధ్యాయ సంఘాల నేతలు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. వాస్తవంగా ఆగస్టు 31 వరకూ పాఠశాలల్లో నమోదు ఉంటుంది. అయితే జూన్ 30 రోల్ ఆధారంగా పాఠశాలల్లో మిగుల పోస్టులు లెక్కతేల్చారు. దీంతో ఏలూరు జిల్లాలో 422, పశ్చిమగోదావరి జిలాల్లో 260 టీచర్ పోస్టులు సర్ప్లస్ (మిగులు)గా ఉన్నత అధికారులు లెక్కగట్టారు. ప్రస్తుతం ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడంతో టీచర్ పోస్టులు భారీగా మిగిలినట్టు అంచనా. ఈ మేరకు ఆదివారం జాబితాను అధికారులు విడుదల చేశారు. అయితే ఏ స్కూళ్లలో ఏ పోస్టులు అవసరమనే సమాచారం మాత్రం ఇవ్వలేదు. ఆ వివరాలు ఎంఈఓల లాగిన్లకు మాత్రమే అందుబాటులో ఉంచారు. సర్దుబాటు విషయంలో రోజుకో నిబంధనతో జూనియర్ టీచర్లు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. వర్క్ అడ్జస్ట్మెంట్ ఇలా.. ● గతేడాది 121 మంది విద్యార్థులున్న మోడల్ ప్రైమరీ పాఠశాలకు ఒక్ హెచ్ఎం, ఐదుగురు ఎస్జీటీలను ఇచ్చారు. ఈ ఏడాది 151 మంది విద్యార్థులకు పెంచారు. అయితే గతంలో మాదిరిగానే 121 మంది విద్యార్థులకు 6 పోస్టుల విధానం కొనసాగించాలని ఉపాధ్యాయ సంఘాలు డిమాండ్ చేస్తున్నా పరిగణనలోకి తీసుకోలేదు. ● స్కూల్ అసిస్టెంట్ల విషయంలో ప్రాథమికోన్నత పాఠశాలల్లో 6,7,8 తరగతుల్లో 10 మందికి ఒక ఎస్ఏ, 11–30 వరకూ ఇద్దరు, 31–140 వరకూ నలుగురు, 141–175 వరకూ ఐదుగురు చొప్పున ఎస్ఏలను సర్దుబాటు చేశారు. ● ఉన్నత పాఠశాలల్లో ఐదు సెక్షన్లకు గ్రేడ్–2 హెచ్ఎంతో సహా 8 మంది ఎస్ఏలు, 6 సెక్షన్ల వరకూ 9 మంది, 7 సెక్షన్లకు 12 మంది, 8 సెక్షన్లకు 13 మంది, 9,10 సెక్షన్ల వరకూ 15 మంది, 10, 11 సెక్షన్ల వరకూ 16 మంది, 13 సెక్షన్లకు 18 మంది, 14 సెక్షన్లకు 19 మంది ఎస్ఏలను మంజూరు చేశారు. ● ఈ విధంగా 25 సెక్షన్ల వరకే గ్రేడ్–2 హెచ్ఎంతోపాటు 31 పోస్టులు ఉండేలా సర్దుబాటు ప్రక్రియ జరిగినట్టు అధికారులు తెలిపారు. నేడు సర్దుబాటు సోమవారం మిగులు టీచర్లను సర్దుబాటు చేసే అవకాశం ఉంది. ఏ టీచర్ సర్ప్లస్ అయ్యారనేది అధికారులు ప్రకటించారు. అయితే ఏ మండలాల్లో ఏ పోస్టులు ఖాళీగా ఉన్నయనేది స్పష్టత లేక ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు. ముందుగా మిగులు టీచర్లతో మండలం యూనిట్గా ఆన్లైన్ కౌన్సెలింగ్ ద్వారా సర్దుబాటు ఉంటుంది. ఇంకా మిగిలితే డివిజన్ స్థాయిలో, జిల్లాస్థాయిలో కౌ న్సెలింగ్ నిర్వహిస్తారు. ఎక్కువగా తాజాగా పదోన్నతి వచ్చిన వారు, డీఎస్సీ–2025లో నియామకం పొందిన వారికి స్థానచలనం తప్పదని పలువురు చెబుతున్నారు. విద్యార్ధులకు పాఠాలు బోధిస్తున్న ఉపాధ్యాయుడు ఉమ్మడి జిల్లాలో 682 మిగులు టీచర్ పోస్టులు రోజురోజుకూ కొత్త నిబంధనలపై ఆందోళన అడ్మిషన్లు పూర్తవకుండానే వర్క్ అడ్జెస్ట్మెంట్ అవసరమైన పోస్టుల వివరాలు ఎంఈఓల లాగిన్కు.. డివిజన్లు మారే పరిస్థితిపై జూనియర్స్ ఆందోళన జిల్లా ఎస్జీటీలు స్కూల్ అసిస్టెంట్లు లాంగ్వేజ్ పండిట్లు ఏలూరు 247 125 50 పశ్చిమగోదావరి 174 57 29 -
పురుగు మందుల వాడకంలో జాగ్రత్తలు
పెదవేగి: పంటలకు వాడే క్రిమి సంహారక మందుల విషయంలో రైతులు తగిన జాగ్రత్తలు పాటించకపోతే, తీవ్రమైన అనారోగ్య సమస్యల బారిన పడటంతో పాటు ప్రాణాపాయం సంభవించే అవకాశం ఉందని వ్యవసాయ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ నేపథ్యంలో, పంటలపై మందులు పిచికారీ చేసేటప్పుడు తీసుకోవాల్సిన జాగ్రత్తలపై మండల వ్యవసాయ అధికారులు, డివిజనల్ వ్యవసాయ సహాయ సంచాలకులు పలు సూచనలు చేశారు. పిచికారీ సమయంలో జాగ్రత్తలు ● మందులు పిచికారీ చేసే సమయంలో శరీరాన్ని పూర్తిగా కప్పే దుస్తులు, ముఖానికి మాస్క్, చేతులకు గ్లౌజులు తప్పనిసరిగా ధరించాలి. ● పిచికారీ చేసే సమయంలో పొగ తాగడం, నీరు తాగడం లేదా భోజనం చేయడం చేయరాదు. ● పిచికారీ కోసం వాడే స్ప్రేయర్లు మంచి స్థితిలో ఉన్నాయో లేదో ముందుగా చూసుకోవాలి. నాజిల్స్ను శుభ్రం చేయడానికి నోటితో గాలి ఊదరాదు. ● పురుగు, తెగుళ్ల మందులను కలిపేటప్పుడు చేతులతో కాకుండా కర్రతో కలపాలి. ● మందులను ఆహార పదార్థాలతో కలిపి రవాణా చేయరాదు. పురుగు మందుల డబ్బాలను పిల్లలకు అందకుండా ప్రత్యేక గదిలో తాళం వేసి భద్రపరచాలి. ● మందులు వాడే ముందు వాటిపై ఉన్న వివరాలు, రంగు ముద్రలను జాగ్రత్తగా పరిశీలించాలి. ● గాలి వీచే దిశను బట్టి మాత్రమే మందును పిచికారీ చేయాలి. ● ఒకవేళ ప్రమాదవశాత్తు మందు కళ్లలో పడితే వెంటనే మంచినీటితో శుభ్రం చేసుకోవాలి. విష ప్రభావానికి గురైతే వెంటనే ప్రథమ చికిత్స అందించి, డాక్టర్ను సంప్రదించాలి. ● పిచికారీ పూర్తయిన వెంటనే స్నానం చేసి, దుస్తులను శుభ్రపరచుకోవాలి. స్ప్రేయర్లను శుభ్రంగా కడిగి, ఇంజన్ ఆయిల్ రాసి జాగ్రత్త పరచాలి. ● ఖాళీ అయిన మందుల డబ్బాలను భూమిలో గొయ్యి తీసి పూడ్చిపెట్టాలి. వాటిని ఇతర అవసరాలకు వాడకూడదు. -
ప్రజావ్యతిరేక విధానాలపై పోరాడాలి
ఏలూరు (టూటౌన్): ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ మహాసభలు ఏలూరులో విజయవంతంగా ముగిశాయి. ఈ సందర్భంగా సంఘం పూర్వ కార్యదర్శి వి.శ్రీనివాసరావు మాట్లాడుతూ, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ప్రజా వ్యతిరేక విధానాలపై యువతను భాగస్వాములను చేస్తూ గ్రామస్థాయి నుంచి పోరాడాలని పిలుపునిచ్చారు. రాష్ట్రంలో అభివృద్ధి కేవలం ప్రచారానికే పరిమితమైందని, వ్యవసాయ రంగం తీవ్ర సంక్షోభంలో పడిందని ఆయన ఆందోళన వ్యక్తం చేశారు. పరిశ్రమల పేరుతో సేకరించిన భూముల్లో నేటికీ పరిశ్రమలు నెలకొల్పలేదని, రైతులకు పరిహారం కూడా చెల్లించలేదని విమర్శించారు. ఆరు నెలల్లో పరిశ్రమలు పెట్టకుంటే ఆ భూ ములను తిరిగి సాగులోకి తెస్తామని హెచ్చరించారు. సహకార రంగంలోని చక్కెర, పాల, స్పిన్నింగ్ మిల్లుల మూతకు పాలకుల విధానాలే కారణ మన్నారు. సోలార్ విద్యుత్ పేరిట కార్పొరేట్ సంస్థలు లబ్ధి పొందుతుంటే, రైతులు రూ.2.40 లక్షల కోట్లు నష్టపోయారని తెలిపారు. పొగాకు రైతులకు మద్దతు ధర ఇస్తామన్న హామీ నెరవేరలేదని, నదీ అనుసంధానం వెనుక పారిశ్రామిక ప్రయోజనాలు ఉన్నాయని మండిపడ్డారు. ఓటర్ల జాబితా సర్వే వెనుక కార్పొరేట్, మైనార్టీ వ్యతిరేక కుట్ర దాగి ఉందని, దీనిపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు వి.కృష్ణయ్య, రాష్ట్ర కార్యదర్శి కె.ప్రభాకర్రెడ్డి, రాష్ట్ర నాయకులు వై.కేశవరావు, మార్రాపు సూర్యనారాయణ, కె.శ్రీనివాస్, వివిధ జిల్లాల నుంచి వచ్చిన 500 మంది రైతు ప్రతినిధులు పాల్గొన్నారు. -
మాడవీధుల విస్తరణకు రూ. 1.11 లక్షల విరాళం
కాళ్ల: మండలంలోని కాళ్లకూరులో ఉన్న స్వయంభూః శ్రీ వేంకటేశ్వరస్వామి దేవస్థానంలో మాడవీధుల విస్తరణకు భక్తులు విరాళం అందించినట్లు దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్ ఆదివారం తెలిపారు. దొడ్డనపూడి గ్రామానికి చెందిన ఆరేటి సర్వేశ్వరరావు–జానకమ్మల జ్ఞాపకార్థం వారి కుమారులు వీవీ సత్యనారాయణ–కృష్ణకుమారి, వెంకటేశ్వరరావు–సత్యవతి, రంగారావు–వెంకటరత్నం దంపతులు రూ.1,11,600 అందించినట్లు వివరించారు. ఈ సందర్భంగా దాతలకు ప్రత్యేక దర్శనం కల్పించి స్వామివారి ప్రతిమతో సత్కరించారు. -
రాట్నాలమ్మా.. నమోనమః
పెదవేగి: రాట్నాలకుంటలోని రాట్నాలమ్మవారి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఆలయానికి పలు రూపాల్లో రూ.1,32,165 ఆదాయం లభించిందని దేవస్థాన చైర్మన్ మన్నే శ్రీనివాసరావు తెలిపారు. ఆలయంలో భక్తుల సౌకర్యార్థం పటిష్ట ఏర్పాట్లు చేశామన్నారు. ఈఓ నల్లూరి సతీష్కుమార్ పర్యవేక్షించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : ప్రత్యేక ఓటర్ల జా బితా సవరణ (సర్) ప్రక్రియను పారదర్శకంగా, సమర్థవంతంగా నిర్వహించి స్వచ్ఛమైన, తప్పులు లేని ఓటర్ల జాబితాను రూపొందించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. పట్టణంలోని చిగుడీలుపేట పద్మశాలీల బజార్ ప్రాంతంలో ఆదివారం ఆమె పర్యటించి సర్ ప్రక్రియను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఎన్యుమరేషన్ ఫారాలపై ఓటర్లను ఆరా తీశా రు. డిజిటలైజేషన్పై బీఎల్ఓలను ప్రశ్నించా రు. ఫారాల పంపిణీ, సేకరణ, డిజిటలైజేషన్ పనులను గడువులోపు పూర్తిచేయాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాంతంలో వీధి కుక్కలు అధికంగా ఉండటాన్ని గమనించిన కలెక్టర్ వాటికి స్టెరిలైజేషన్ కార్యక్రమాన్ని వేగవంతం చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రారెడ్డి, సహాయ కమిషనర్ ఎ.రాంబాబు, బీఎల్ఓలు, మున్సిపల్ సిబ్బంది ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్) : ఓటర్ల జాబితా ప్ర త్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా ఎన్యుమ రేషన్ ఫారాల సేకరణ, డిజిటలైజేషన్ ప్రక్రియ ను వేగవంతంగా పూర్తి చేసి నూరు శాతం ల క్ష్యం సాధించాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. పట్టణంలోని 1, 2వ వార్డుల్లో ఆదివారం ఆయన పర్యటించి ఓటర్ల ఎన్యుమరేష న్, డిజిటలైజేషన్ను పరిశీలించారు. ఇంటింటికీ వెళ్లి ఓటర్లను ఆరా తీశారు. ఎన్యుమరేషన్ ఫారాలను ప్రజలు పూర్తిగా నింపి వీలైనంత త్వరగా బీఎల్ఓలకు అందజేయాలని, తద్వారా సమ గ్ర, పారదర్శకమైన ఓటర్ల జాబితా రూపకల్పనకు సహకరించాలని కోరారు. మెంటేవారితోట ప్రాంతంలో డ్రెయిన్లలో పేరుకుపోయిన చెత్తను గమించి పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఇంటింటికీ చెత్త సేకరణపై ఆరా తీశారు. తహసీల్దార్ రావి రాంబా బు, అసిస్టెంట్ మున్సిపల్ కమిషనర్ ఎ.రాంబాబు, బీఎల్ఓలు ఉన్నారు. యలమంచిలి: చించినాడ జాతీయ రహదారిపై శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఆచంట మండలం భీమలాపురం గ్రామానికి చెందిన చప్పిడి హేమచంద్రిక (19) తలకు బలమైన గాయమైంది. దీంతో ఆమెను భీమ వరం ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ ఆదివారం మరణించింది. చంద్రిక తన మేనమామ కట్టా శ్రీనివాస్తో కలిసి తాటిపాకకు అమ్మమ్మ ఇంటికి వెళ్తుండగా చించినాడ వద్ద ఈ ప్రమాదం జరిగింది. ప్రమాద సమయంలో బొలెరో ట్రక్ డ్రైవర్ ముగ్గు గణేష్ మద్యం సేవించి ఆ మత్తులో వాహనాన్ని రాంగ్ రూట్లో అతివేగంగా నడపడం వలనే ప్ర మాదం జరిగిందని నిందితుడిని కఠినంగా శిక్షించాలని కోరుతూ బంధువులు మృతదేహంతో పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. దీనిపై ఎస్సై రాజ్కుమార్ స్పందిస్తూ ప్రమాదంపై ఎఫ్ఐఆర్ నమోదు చేశామని, పోలీస్స్టేషన్ వద్ద ఆందోళన చట్ట విరుద్ధమని హెచ్చరించడంతో మృతదేహాన్ని అంబులెన్స్పై పోలీస్స్టేషన్ నుంచి దూరంగా తరలించారు. అనంతరం బంధువులు, కుటుంబ సభ్యులు సు మారు మూడు గంటలపాటు స్టేషన్ వద్ద ఆందోళన చేశారు. దీంతో ఎస్సై రాజ్కుమార్ చంద్రిక న్యాయం జరుగుతుందని చెప్పడంతో ఆందోళన విరమించారు. -
ఆర్ఎంపీ వైద్యుడి అనుమానాస్పద మృతి
దెందులూరు : మండలంలోని కొవ్వలి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ వైద్యుడు కాకిలేటి శివయ్య (55) అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. పోలీసులు, కుటుంబ సభ్యుల కథనం ప్రకారం... శివయ్య వంగాయగూడెంలో సొంతంగా క్లినిక్ నిర్వహిస్తున్నారు. రెండేళ్ల క్రితం కొవ్వలిలో ఇల్లు కొనుగోలు చేసి, అక్కడి నుంచే క్లినిక్కు వెళ్లి వస్తున్నారు. ఆయన భార్య వీరరాఘవమ్మ ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని ఐసీడీఎస్ విభాగంలో లీగల్ అడ్వైజర్గా పనిచేస్తుండగా, కుమార్తె హైదరాబాద్లో ఉంటున్నారు. శుక్రవారం ఉదయం పంచాయతీ కార్యాలయం సమీపంలోని మురుగు కాలువలో శివయ్య మృతదేహం ఉన్నట్లు వీరరాఘవమ్మకు ఆమె తమ్ముడు ఫోన్ ద్వారా సమాచారం అందించారు. దీంతో కుటుంబ సభ్యులు, గ్రామస్థులు అక్కడికి చేరుకున్నారు. కాలువలో శివయ్య మృతదేహంతో పాటు ఆయన వాడుతున్న స్కూటర్ కూడా పడి ఉంది. తన భర్త తలపై మారణాయుధాలతో నరికిన గాయాలు ఉన్నాయని, ఎడమ కాలు, కుడి చేయి, శరీరంపై తీవ్ర గాయాల గుర్తులు ఉన్నాయని ఎవరైనా హత్య చేసి ఉంటారనే అనుమానం ఉందని వీరరాఘవమ్మ దెందులూరు పోలీసులకు లిఖితపూర్వకంగా ఫిర్యాదు చేశారు. ఘటనా స్థలాన్ని నూజివీడు డీఎస్పీ, భీమడోలు సీఐ పరిశీలించారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు దెందులూరు ఎస్సై డి. వెంకట్ కుమార్ తెలిపారు. అయితే వైద్యుడు శివయ్య మృతి కేసులో ఆయన సెల్ఫోన్ కాల్ డేటా దర్యాప్తుకు అత్యంత కీలకంగా మారే అవకాశం ఉందని స్థానికులు భావిస్తున్నారు. పోలీసులు కూడా ఆ కోణంలో విచారణ జరుపుతున్నారు. -
విద్యుత్ షాక్తో యువకుడి మృతి
కామవరపుకోట: విద్యుత్ షాక్తో యువకుడు మృతి చెందిన ఘటన శుక్రవారం జలపావరిగూడెం గ్రామంలో చోటు చేసుకుంది. తడికలపూడి ఎస్సై వల్లి పద్మ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం చక్ర దేవరపల్లికి చెందిన దూదిపాల రవికుమార్ 27 సంవత్సరాలు వృత్తిరీత్యా వెల్డింగ్ పనులు చేస్తుంటాడు. ఈ నేపథ్యంలో కామవరపుకోట మండలం జలపువారిగూడెం గ్రామానికి చెందిన కాంతారెడ్డి సత్యనారాయణరెడ్డి ఆయిల్పామ్ తోట ఎదురుగా ఉన్న పశువుల షెడ్ నిర్మాణ స్థలంలో శుక్రవారం ఉదయం వెల్డింగ్ పని చేస్తుండగా, ట్రాన్స్ఫార్మర్ ఫ్యూజ్ బాక్స్ వద్ద విద్యుత్ సరఫరాను పరీక్షించే సమయంలో ప్రమాదవశాత్తు విద్యుత్ షాక్కు గురయ్యాడు. వెంటనే జంగారెడ్డిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, వైద్యులు పరీక్షించి అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. ఈ మేరకు దూదిపాల పోతురాజు ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు అనుమానాస్పద మృతి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై వల్లి పద్మ తెలిపారు. కుక్కునూరు: కుక్కునూరుకు చెందిన బొల్లు జగదీష్ అరుదైన గౌరవాన్ని దక్కించుకున్నారు. శుక్రవారం ప్రభుత్వం ఆంధ్రప్రదేశ్ నాన్ రెసిడెంట్ తెలుగు సొసైటీ (ఏపీఎన్ఆర్టీఎస్) తరఫున యునైటెడ్ అరబ్ ఎమిరేట్స్ (యూఏఈ) దేశ కోఆర్డినేటర్గా బోల్లు జగదీష్ ను నియమించింది. కుక్కునూరులో జన్మించిన జగదీష్ హైస్కూల్ విద్య వరకు స్వగ్రామంలోనే పూర్తి చేసి, ఉన్నత విద్య అనంతరం ఉపాధి కోసం దుబాయ్కు వెళ్లి అక్కడ స్థిరపడ్డారు. అక్కడ ప్రవాస ఆంధ్రుల సంక్షేమం, అభ్యున్నతికి కృషి చేస్తూ మంచి గుర్తింపు తెచ్చుకున్నాడు. రాష్ట్ర ఎన్ఆర్ఐ వ్యవహారాల శాఖ మంత్రి కొండపల్లి శ్రీనివాస్, ఏపీఎన్ఆర్టీఎస్ అధ్యక్షుడు రవికుమార్ జగదీష్కు శుభాకాంక్షలు తెలియజేశారు. మండవల్లి: ఏలూరు జిల్లా డీపీఆర్ఓగా దుర్గాప్రసాద్ పదోన్నతి పొందారు. ప్రస్తుతం ఆయన డీపీఆర్ఒ కార్యాలయంలో అడిషనల్ డీపీఆర్ఓగా పని చేస్తున్నారు. దుర్గాప్రసాద్ నియామకంపై పలువురు అధికారులు, డీపీఆర్ఒ కార్యాలయ సిబ్బంది హర్షం వ్యక్తం చేశారు. భీమవరం : పట్టణంలో వేరువేరు ప్రాంతాల్లో పార్కింగ్ చేసిన రెండు మోటారుసైకిల్స్ చోరీ చేశారని ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసులు టూటౌన్ పోలీసుస్టేషన్లో కేసులు నమోదయ్యాయి. గణపవరం మండలం సరిపల్లి గ్రామానికి చెందిన జి.అశోక్కుమార్ పట్టణంలోని ఒక ఫైనాన్స్ కంపెనీలో పనిచేస్తున్నాడు. గత నెల 27న అశోక్కుమార్ రాయలం గ్రామంలోని సాయిబాబా ఆలయం వద్ద బైక్ను పార్క్ చేసిన గుడిలోనికి వెళ్లి తిరిగివచ్చేసరికి బైక్ మాయమైంది. దీనిపై టూటౌన్ పోలీసు హెచ్కానిస్టేబుల్ ఎస్ఎన్ భూషణం కేసు నమోదు చేశారు. అలాగే గుంటూరు జిల్లా తెనాలికి చెందిన పి.బాలాజీసత్యకుమార్ గత నెల 5న టౌన్ రైల్వేస్టేషన్ వద్ద పార్కింగ్ చేసిన మోటారుసైకిల్ ఆదృశ్యమైంది. దీంతో భాధితుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు శుక్రవారం హెచ్కానిస్టేబుల్ టి గోవిందరాజు కేసు నమోదు చేసినట్లు పోలీసులు తెలిపారు. పెనుగొండ: కుటుంబ కలహాల నేపథ్యంలో తల్లీ కొడుకులు ఆత్మహత్యాయత్నం చేయగా తల్లి మృతి చెందిన ఘటన మండలంలో చోటు చేసకుంది. వివరాల ప్రకారం వల్లూరు శివారు చిల్లేవారిపాలెంలో గుండె వెంకట రమణ(47), గుండే నరేంద్ర(21)ల మధ్య కుటుంబ కలహాలు జరుగుతున్నాయి. ఈ తరుణంలో శుక్రవారం సాయంత్రం తల్లి గుండె వెంకట రమణ యాసిడ్ తాగి ఆత్మహత్యాయత్నానికి ప్రయత్నం చేయడంతో, అదే యాసిడ్ను కొడుకు నరేంద్ర లాక్కొని తాగాడు. దీంతో స్థానికులు 108లో తణుకు ఏరియా ఆసుపత్రికి తరలించగా, తల్లి వెంకటరమణ అప్పటికే మృతి చెందగా, కొడుకును మెరుగైన వైద్యం నిమిత్తం భీమవరం ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. ఈ మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.వెంకట రమణ తెలిపారు. భీమవరం: బంగారు ఆభరణాలను చోరి కేసులో ముద్దాయికి రెండేళ్ల కఠిన కారాగార శిక్ష విధిస్తూ భీమవరం రెండో అదనపు జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎన్. జ్యోతి శుక్రవారం తీర్పు చెప్పారు. సీఐ ఎ. రమేశ్ తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని కళాభవన్ వీధికి చెందిన వి.కృష్ణవేణి 2019 జులై 17న పాలకోడేరు మండలం వేండ్ర గ్రామంలోని పుట్టింటికి వెళ్లి తిరిగొచ్చేసరికి తాళాలు పగలగొట్టి మూడు కాసుల బంగారు ఆభరణాలను గుర్తు తెలియని వ్యక్తులు చోరీ చేశారని ఒకటో పట్టణ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పోలీసులు కేసు నమోదు చేసి, నిడదవోలుకు చెందిన మొహిద్దీన్ అలీని అప్పట్లోనే అరెస్టు చేసి బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. విచారణ అనంతరం శుక్రవారం తీర్పునిచ్చారు. -
ఏది నిజం సర్?
ఓటర్ల జాబితా సమగ్ర సవరణ (సర్) 2009, 2024 ఎన్నికల్లో భీమడోలులో శాసనసభ ఎన్నికల్లో నేను, నా భార్య ఓట్లు వేశా. స్థానిక సంస్థల ఎన్నికల్లో ఓట్లు వేశా. సర్ కార్యక్రమంలో మా ఓట్లు గల్లంతులయ్యాయి. 2002లో నా ఓటు గుంటూరులో ఉండేది. భీమడోలులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకోవడంతో అక్కడ ఓట్లు తొలగించారు. మ్యాపింగ్లో ఆన్లైన్లో నా పేరు గుంటూరులో కనిపించడం లేదు. బీఎల్వో గుంటూరులోని ఎపిక్ కార్డు నెంబర్, తల్లిదండ్రులు వివరాలుంటే తీసుకుని రావాలని చెప్పారు. దీంతో గత్యంతరం లేక గుంటూరు వెళ్తున్నాను. – కె.రామ్మోహనరావు, ఓటరు, భీమడోలుసాక్షి ప్రతినిధి, ఏలూరు: ఓటు ఎన్యూమరేషన్ ఫారంలు ఇంకా అందలేదు.. ఏలూరు నగరంలో ప్రతి మూడు వీధుల్లో 10 నుంచి 15 ఇళ్లకు దరఖాస్తులు చేరలేదు. బీఎల్ఓలు సచివాలయాలకు వచ్చి తీసుకెళ్లండి అని కూడా చెప్పలేదు. ఎవరైనా సచివాలయంలో సంప్రదిస్తే రేపు వస్తుంది.. ఎల్లుండి వస్తుందని చెబుతున్నారు. కట్చేస్తే.. జిల్లాలో మాత్రం 99 శాతం దరఖాస్తుల పంపిణీ ప్రక్రియ పూర్తయిపోయిందని జిల్లా యంత్రాంగం ప్రకటించడంతో పాటు ఎన్నికల సంఘానికి కూడా నివేదిక ఇచ్చింది. ఎన్నికల సంఘం ప్రతిష్టాత్మకంగా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (సర్) నిర్వహిస్తుంది. మొదటిగా జిల్లాలోని 16,44,193 మంది ఓటర్లకు ఎన్యూమరేషన్ ఫారంలు అందచేయాలి. ప్రతి నియోజకవర్గానికి పోలింగ్ బూత్ల సంఖ్యను బట్టి బూత్ లెవల్ ఆఫీసర్లను కలెక్టర్ నియమించారు. ఏలూరులో 213 మంది, దెందులూరులో 239, చింతలపూడిలో 273, నూజివీడులో 286, కై కలూరు 235, పోలవరంలో 284, ఉంగుటూరులో 214 మంది కలిపి 7 నియోజకవర్గాల్లో 1,744 మంది బీఎల్ఓలను నియమించి వారి పరిధిలో ప్రాంతాల వారీగా సచివాలయ సిబ్బందితో ఎన్యూమరేషన్ ఫారంలు ఇంటింటికి పంపిణీ చేయాల్సి ఉంది. అనేక ప్రాంతాల్లో ఎన్యూమరేషన్ పత్రాలు అందలేదని ఓటర్లు చెబుతున్నారు. అధికారిక యంత్రాంగం మాత్రం అన్ని పూర్తి చేశామని గత మూడు రోజుల నుంచి ప్రకటిస్తోంది. ఉంగుటూరు నియోజకవర్గంలో 100 శాతం ఫారంలు పంపిణీ చేసినట్లు, మిగిలిన అన్ని నియోజకవర్గాల్లో 99 శాతం, ఏలూరు నగరంలో 98.13 శాతం పూర్తి చేసినట్లు ప్రకటించారు. మరోవైపు సర్పై అధికార యంత్రాంగం అవగాహన కార్యక్రమాలు నిర్వహించకపోవడం, కార్యక్రమ ప్రధాన ఉద్దేశం, ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే అవకాశం ఉన్నా ఎలా చేసుకోవాలనే వివరాలను అధికారికంగా చెప్పకపోవడం ఇలా అనేక సమస్యలతో సర్ కార్యక్రమం నత్తనడకన కొనసాగుతుంది. ఇంకోవైపు పంపిణీ పూర్తి కాకుండానే జిల్లాలో 58.48 శాతం డిజిటలైజేషన్ చేసినట్లు ప్రకటించారు. అత్యధికంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 62.07 శాతం డిజిటలైజేషన్ పూర్తయినట్లు చెబుతున్నారు. 58.48 శాతం డిజిటలైజేషన్ పూర్తి ఇక దరఖాస్తులు పూర్తిగా అందకుండానే 58.48 శాతం డిజిటలైజేషన్ చేసి జిల్లా రాష్ట్రంలో ముందంజలో ఉందని ప్రకటించారు. దెందులూరు నియోజకవర్గంలో 50.54 శాతం, చింతలపూడిలో 52.72 శాతం, కై కలూరులో 51.39 శాతం, నూజివీడులో 58.03 శాతం, పోలవరంలో 61.06 శాతం, ఉంగుటూరులో 62.07 శాతం, ఏలూరులో 67.42 శాతం పూర్తయినట్లు అధికార యంత్రాంగం ప్రకటించింది. జిల్లాలో 16.38 లక్షల ఫారంలు పంపిణీ పూర్తయిందని ప్రకటన ఏలూరు నగరంలో అనేక ప్రాంతాల్లో అందని వైనం జిల్లా వ్యాప్తంగా 99.63 శాతం ఫారాలు పంపిణీ చేశామన్న అధికారులు సర్పై అవగాహన లేమితో గందరగోళం మా ఓటు హక్కును కాపాడండి నా పేరు జాబితాలో ఉందా? మాకు పత్రాలు అందలేదు ఫారాలు ఎప్పుడిస్తారు -
షాకిచ్చిన స్మార్ట్ మీటరు
తణుకు అర్బన్ : ‘స్మార్ట్ మీటరు వద్దు మొర్రో’ అని మొత్తుకున్నా వినకుండా విద్యుత్ సిబ్బంది బలవంతంగా బిగించడంతో, ఓ పేద కుటుంబానికి ఏకంగా రూ. 14,539 బిల్లు వచ్చింది. తణుకు మండలం దువ్వ గ్రామం హరిజనవాడకు చెందిన సిర్రా రమేష్ నివాసంలో ఆయన తల్లి రత్నకుమారి పేరుతో విద్యుత్ సర్వీస్ ఉంది. ఎస్సీ కోటా కింద గతంలో వీరికి 100 యూనిట్ల వరకు ఉచిత విద్యుత్ వర్తించేది. అయితే, గత నెల 20న సిబ్బంది వచ్చి పాత మీటరు పాడైందంటూ బలవంతంగా స్మార్ట్ మీటరు బిగించారు. తాజాగా మొబైల్కు రూ. 14,539 బిల్లు రావడంతో బాధితులు దిగ్భ్రాంతికి గురయ్యారు. వినియోగదారుల అనుమతి లేకుండా స్మార్ట్ మీటర్లు బిగించడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. చదువుకోని పేదల పరిస్థితి ఏమిటని ప్రశ్నిస్తున్నారు. ఈ విషయమై విద్యుత్ శాఖ డీఈ కె.నరసింహమూర్తిని వివరణ కోరగా పాత మీటరు స్ట్రక్ అవ్వడం వల్ల గతంలో వాడిన యూనిట్లు నిలిచిపోయాయని, దీనివల్ల స్లాబ్ మారి బిల్లు ఎక్కువగా వచ్చిందని తెలిపారు. బిల్లును సరిచేస్తామని, అనుమతి లేకుండా స్మార్ట్ మీటరు బిగించకూడదు కాబట్టి దానిని వెంటనే మారుస్తామని వివరించారు. -
స్కూటర్ చోరీ.. దొంగల అరెస్టు
భీమడోలు: స్థానిక గోలి అపార్ట్మెంట్లో చోరీకి గురైన స్కూటర్ను భీమడోలు పోలీసులు శుక్రవారం స్వాధీనం చేసుకున్నారు. ఈ కేసులో ఒక యువకుడితో పాటు అతనికి సహకరించిన మైనర్ బాలుడిని అరెస్ట్ చేశారు. భీమడోలు సీఐ కార్యాలయంలో శుక్రవారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సీఐ వి.కృష్ణ కేసు వివరాలను వెల్లడించారు.గోలి అపార్ట్మెంట్లో అద్దెకు ఉంటున్న గుట్టుట దుర్గాప్రసాద్ ఈ నెల 1వ తేదీ రాత్రి తన సుజుకి యాక్సిస్ స్కూటర్ను పార్క్ చేసి, తాళాలను వాచ్మెన్ గదిలో భద్రపరిచారు. గుర్తు తెలియని వ్యక్తులు ఆ తాళాలు పగులగొట్టి స్కూటర్ను చోరీ చేశారు. బాధితుడి ఫిర్యాదు మేరకు సీఐ వి.కృష్ణ పర్యవేక్షణలో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అయితేభీమడోలు జంక్షన్లోని సంతమార్కెట్ వద్ద పోలీసులు వాహన తనిఖీలు నిర్వహిస్తుండగా, అనుమానాస్పదంగా వస్తున్న ఒక స్కూటర్ను ఆపేందుకు ప్రయత్నించారు. దానిపై ఉన్న ఇద్దరు వ్యక్తులు పారిపోయేందుకు యత్నించగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. విచారణలో వారు ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లికి చెందిన వసంతటి మణిబాలాజీ (19)తో పాటు ఒక మైనర్ బాలుడిగా గుర్తించారు. తామే ఆ స్కూటర్ను దొంగిలించినట్లు నిందితులు అంగీకరించడంతో, వారి నుంచి రూ. లక్ష విలువైన వాహనాన్ని స్వాధీనం చేసుకున్నారు. నిందితుడు మణిబాలాజీని భీమడోలు కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. మైనర్ బాలుడిని జువైనల్ జస్టిస్ బోర్డు ఎదుట హాజరుపరిచి, హోంకు తరలించారు. ప్రధాన నిందితుడు మణిబాలాజీపై గతంలోనూ ఒక కేసు ఉందని సీఐ తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన హెడ్ కానిస్టేబుల్ సయ్యద్ బాజి, ఎస్. శ్రీనివాసరావు, పోలీస్ సిబ్బందిని సీఐ అభినందించారు. -
ప్రభుత్వానికి జగన్ అంటే భయం
కాళ్ల: కూటమి ప్రభుత్వానికి రెండేళ్లలోనే రాష్ట్ర ప్రజల్లో పూర్తి వ్యతిరేకత వచ్చిందని నరసాపురం పార్లమెంటు పరిశీలకుడు ముదునూరి మురళీకృష్ణం రాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్ అన్నారు. కాళ్ల మండలం పెద అమిరం పార్టీ కార్యాలయంలో శుక్రవారం నియోజవర్గ స్థాయి బీఎల్ఏలతో సమావేశం నిర్వహించారు. వారు మాట్లాడుతూ మన ఓటు కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్క బీఎల్ఎపై ఉందని స్పష్టం చేశారు. మన ఓటును మనం కాపాడుకోకపోతే రానున్న రోజుల్లో సంక్షేమ పథకాలు అందటం కష్టమవుతుందని ప్రతి ఇంటికి వెళ్లినప్పుడు బీఎల్ఏ లందరూ చెప్పాలని తెలిపారు. ఈ రెండేళ్లలో కూటమి ప్రభుత్వానికి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అంటే భయం ఏర్పడిందన్నారు. కూటమి ప్రభుత్వానికి రెండేళ్లకే పూర్తి వ్యతిరేకత వచ్చిందన్నారు. స్థానిక సంస్థల ఎన్నికల్లో సర్పంచులు, ఎంపీటీసీలు, జెడ్పీటీసీల గెలుపు బీఎల్ఎలపైనే ఉందని స్పష్టం చేశారు. రానున్న రోజుల్లో జగన్మోహన్ రెడ్డి కష్టపడ్డ ప్రతి ఒక్కరికి పెద్దపీట వేస్తారని తెలిపారు. కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీలు ఒక్కటీ నెరవేర్చకుండా పరిపాలన చేస్తుందని, ప్రభుత్వాన్ని ప్రజలు నమ్మే పరిస్థితిలో లేరని విమర్శించారు. సర్ను అడ్డుపెట్టుకుని ప్రజల్ని మోసం చేయాలని చూస్తున్నారని తప్పుపట్టారు. ఒక్క ఓటు పోకుండా కాపాడుకోవాల్సిన బాధ్యత మనందరిపై ఉందని తెలిపారు. వేరే ప్రాంతంలో ఉన్నా, బయట దేశాల్లో ఉన్నా మన ఓటును ఏ విధంగా కాపాడుకోవాలో ఈ కార్యక్రమంలో తెలిపారు. ఉండి నియోజకవర్గంలో పీవీఎల్ నరసింహరాజును ఎమ్మెల్యేగా గెలిపించుకోవడానికి ప్రతి ఒక్కరు కృషి చేయాలని పిలుపునిచ్చారు. సమావేశంలో పార్టీ జిల్లా ఉపాధ్యక్షులు పెనుమత్స ప్రసాదరాజు, ఆకివీడు నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి, పార్టీ నాయకులు కామన నాగేశ్వరరావు, నంద్యాల సీతారామయ్య, పడాల కిషోర్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
7న జంగారెడ్డిగూడెంలో రైతు మహా ధర్నా
జంగారెడ్డిగూడెం: వైఎస్సార్సీపీ, వామపక్షాల ఆధ్వర్యంలో పొగాకు రైతులకు మద్దతు ధర కల్పించాలనే డిమాండ్తో ఈ నెల 7న జంగారెడ్డిగూడెంలో చేపట్టే భారీ రైతు నిరసన కార్యక్రమం సన్నాహక సమావేశం శుక్రవారం జంగారెడ్డిగూడెంలోని జెట్టి కార్యాలయంలో జరిగింది. వైఎస్సార్సీపీ చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయరాజు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ అధినేత, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు జూలై 7న ఉదయం 9 గంటలకు భారీ ధర్నా నిర్వహిస్తున్నామని చెప్పారు. కూటమి ప్రభుత్వం రైతుల సమస్యలను పూర్తిగా విస్మరించిందని, గతంలో మొక్కజొన్న, మిరప, నాటు పొగాకు రైతులు తీవ్ర నష్టాలు చవిచూశారని మండిపడ్డారు. ప్రస్తుతం పొగాకు రైతులకు సరైన మద్దతు ధర లభించక రోడ్డున పడే పరిస్థితి వచ్చిందని ఆవేదన వ్యక్తం చేశారు. పోలవరం నియోజకవర్గ ఇన్చార్జ్ తెల్లం బాలరాజు మాట్లాడుతూ పొగాకు రైతులు తీవ్ర ఆవేదనతో ఉన్నారన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో కరోనా సంక్షోభం ఉన్నప్పటికీ మార్క్ఫెడ్ను రంగంలోకి దించి ప్రభుత్వం పొగాకు కొనుగోలు చేసి రైతులకు కొండంత అండగా నిలిచిందని పేర్కొన్నారు. చంద్రబాబుకు రైతులంటే ఇష్టం ఉండదని, గతంలో విద్యుత్ ఉద్యమం చేసిన రైతులపై కాల్పులు జరిపిన చరిత్ర ఆయనదని అన్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకులు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో, సీపీఐ, సీపీఎం, సీపీఐఎంఎల్ పార్టీల సహకారంతో, రైతు సంఘాల అభ్యర్థన మేరకు ఈ మహా ధర్నా కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నట్లు వెల్లడించారు. ధర్నాకు వచ్చే ప్రజల కోసం తమ కార్యాలయం పరిధిలో భోజన వసతులు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా ఉపాధ్యక్షురాలు జగ్గవరపు జానకిరెడ్డి, కొయ్యలగూడెం ఎంపీపీ గంజిమాల రామారావులతో పాటు తుమ్మలపల్లి గంగరాజు, మంతెన సోమరాజు, గంటా శ్రీను, జంగారెడ్డిగూడెం మండలం అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర కుమార్, పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
రేషన్ షాపులపై విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్: తణుకులో రేషన్ షాపులపై విజిలెన్స్ అధికారులు దాడులు చేశారు. గురువారం రాత్రి, శుక్రవారం ఉదయం నిర్వహించిన ఈ దాడుల్లో తణుకు, పైడిపర్రులోని 4 రేషన్ డిపోల్లో అవకతవకలను గుర్తించి బాధ్యులపై 6 ఏ కేసులు నమోదుచేశారు. గురువారం రాత్రి నిర్వహించిన దాడుల్లో తణుకు వీరభద్రపురం పరిధిలోని 35వ నంబరు గాడెల్లి అనూష పేరుమీద ఉన్న డిపోలో బియ్యం 9210 కేజీలు ఉండాల్సి ఉండగా 760 కిలోలు, పంచదార 6 కిలోలు తక్కువగా ఉన్నాయని, పైడిపర్రు మండపాక రోడ్డులోని 49వ నంబరు దిడ్ల శ్రీనివాస్ పేరుమీద ఉన్న రేషన్ డిపోలో 3335 కిలోలు బియ్యం ఉండాల్సి ఉండగా 865 కిలోలు, పంచదార 18.50 కిలోలు ఎక్కువ ఉన్నాయని సీఎస్డీటీ ఇన్చార్జి ఎన్.శ్రీదేవి తెలిపారు. శుక్రవారం నిర్వహించిన దాడుల్లో ఇరగవరం కాలనీలో 21వ నంబరు ముఖమట్ల ఉమాదేవి పేరుతో ఉన్న రేషన్ డిపోలో 9690 కిలోల బియ్యం ఉండాల్సి ఉండగా 8790 కిలోలు తక్కువ, పంచదార 7.50 కిలోలు ఎక్కువ ఉందని, ఎన్టీఆర్ పార్కు ప్రాంతంలోని 12వ నంబరు పూడి లక్ష్మి పేరుతో ఉన్న రేషన్ డిపోలో 10580 కిలోలు బియ్యం ఉండాల్సి ఉండగా 1880 కిలోలు తక్కువ ఉందని, పంచదార 3.50 కిలోలు ఎక్కువ ఉందని చెప్పారు. అత్యధికంగా 21వ నంబరుతో ఉన్న ముఖమట్ల ఉమాదేవి రేషన్ డిపోలో ఏకంగా 8790 కిలోల బియ్యం తక్కువగా ఉండడం, మూడు రోజుల వ్యవధిలోనే ఇంతటి తేడా రావడం సంచలనంగా మారింది. వచ్చిన బియ్యాన్ని నేరుగానే బ్లాక్ మార్కెట్కు తరలించే శారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ నెల 1న మాత్రమే దుకాణం తెరిచారని, 2న దుకాణం తెరవలేదని స్థానికులు చెబుతున్నారు. ఈ దాడుల్లో సీఐలు డి.ప్రసాద్కుమార్, డి.గంగాభవాని, విజిలెన్స్ అగ్రికల్చర్ ఆఫీసర్ జి.మీరయ్య తదితరులు పాల్గొన్నారు. -
చిర్రెత్తికొచ్చింది
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పోలవరం జనసేనలో వర్గ విబేధాలు తారాస్థాయికి చేరాయి. అవినీతి ఎమ్మెల్యేగా, తీవ్ర వివాదాస్పద నేతగా ఖ్యాతిగాంచిన జనసేన ఎమ్మెల్యే చిర్రి బాలరాజును నియోజకవర్గ కేడర్ మొదలుకొని పార్టీ అధిష్టానం వరకు ఎవరు సీరియస్గా పట్టించుకోని పరిస్థితి. బలప్రదర్శన చాటేలా వంద కార్లతో ఏలూరు పార్టీ సమావేశానికి హాజరై పోలవరంలో దొరల పాలనకు ముగింపు పలుకుతానని... రెండేళ్ళుగా పార్టీలో తనను ఇబ్బందిపెడుతున్నారని ఆయన వ్యాఖ్యలు చేయడం చర్చనీయాంశమైంది. పోలవరం నియోజకవర్గం నుంచి చిర్రి బాలరాజు గెలుపొందిన నాటి నుంచి వివాదాస్పద, దూకుడు వైఖరితో వివాదాలకు కేరాఫ్ అడ్రస్గా మారారు. పెద్ద ఎత్తున అవినీతి ఆరోపణలు వెలుగులోకి వచ్చాయి. స్వయంగా పోలవరం జనసేన నేత కరాటం రాంబాబు, మాజీ మంత్రి దేవినేని ఉమ ఫోన్ల సంభాషణ ఆడియో వైరల్గా మారడంతో ఎమ్మెల్యే అవినీతి తెరపైకి వచ్చింది. నియోజకవర్గ స్థాయి అధికారుల వరకు అందరి వద్ద డబ్బులు వసూలు చేసి అట్టహాసంగా జన్మదిన వేడుకలు నిర్వహించడం, పార్టీలో ప్రశ్నించిన వారిపై తన సొంత టీమ్తో దాడులు చేయించడంతో అప్రతిష్టపాలయ్యారు. బాలరాజు అవినీతి అంటూ నామినేటెడ్ పదవులకు ఎంత తీసుకుంది.. ఏఏ పనులకు ఎంత వసూలు చేసింది.. బాధితుల ఫోన్ నెంబర్లతో సహా లేఖలో పేర్కొని పార్టీకి ఫిర్యాదు చేయడంతో పాటు సోషల్ మీడియాలో వైరల్ చేశారు. ఎమ్మెల్యే తీరుపై అతని భార్య జనసేన అధ్యక్షుడు పవన్ కల్యాణ్ను కలిసి ఫిర్యాదు చేసి న్యాయం చేయమని కోరింది. గత నెలలో పవన్ పిలిపించి ఎమ్మెల్యేకు క్లాస్ పీకారు. నాలుగు వారాల్లోగా నియోజకవర్గంతో పాటు, కుటుంబ పరిస్థితులను చక్కదిద్దుకోవాలని హితవు పలికారు. కరాటం వర్సెస్ ఎమ్మెల్యే పార్టీ సీనియర్ నేత కరాటం రాంబాబు సోదరుడి కుమారుడు కరాటం సాయిబాబు జిల్లా ప్రధాన కార్యదర్శిగా ఉంటూ హవా సాగిస్తున్నారు. కొంతకాలం నుంచి ఎమ్మెల్యేకు, సాయిబాబుకు దూరం పెరిగింది. ఎమ్మెల్యేకు రాజకీయ గురువుగా ఉన్న జీ.రవికుమార్ కూడా కొద్ది రోజుల నుంచి ఎమ్మెల్యేకు దూరంగా ఉండటం మరింత చర్చగా మారింది. రెండ్రోజుల రోజుల క్రితం రాజానగరం ఎమ్మెల్యే బత్తుల బలరామకృష్ణ పార్టీ నియామకాల గురించి ఏర్పాటు చేసిన సమావేశానికి బలరాజుకు ఆహ్వానం అందలేదు. సాయిబాబుతో బలరామకృష్ణ సమావేశమై పార్టీ నియామకాలపై చర్చించారు. దీంతో బాలరాజుకు చిర్రెత్తుకొచ్చి శుక్రవారం ఏలూరులో జరిగిన పార్టీ సమావేశానికి బలప్రదర్శనగా హాజరయ్యారు. జంగారెడ్డిగూడెం వైజంక్షన్లో అన్ని మండలాల్లో కేడర్ను సమీకరించి కార్ల ర్యాలీ నిర్వహించి జంగారెడ్డిగూడెంలోనే మాట్లాడారు. ఏలూరు పార్టీ సమావేశానికి చేరుకుని నిర్మాణ సారథుల ఎంపిక కమిటీకి తన వర్గానికి చెందిన దరఖాస్తులను అందచేసి పోలవరంలో దొరల పాలనకు ఈ రోజు నుంచి తెరపడిందని.. వచ్చే స్థానిక సంస్థల ఎన్నికల్లో చిర్రి బాలరాజు పెట్టే నేతలనే గెలిపించుకుంటానని సవాల్ చేశారు. కరాటం సాయిబాబు మాట వినేవారికే సమాచారమిచ్చి వారికే పదవులు ఇవ్వాలని ప్రయత్నించారని, పార్టీ శ్రేణులు తన దగ్గరకు వచ్చి బాధపడితే 400 మందితో కలిసి ఏలూరు వచ్చి దరఖాస్తులు ఇచ్చానని, పెత్తందారీ వ్యవస్థను పారదోలాలని, దొరల పాలనకు చరమగీతం పాడతానని హెచ్చరించారు. పోలవరం జనసేనలో తారాస్థాయికి వర్గ విభేదాలు పార్టీ కార్యక్రమాల్లో ఎమ్మెల్యేకు దక్కని ప్రాధాన్యం వంద కార్లతో బలప్రదర్శనగా ఏలూరుకు చిర్రి బాలరాజు పోలవరంలో దొరల పాలనకు ముగింపు పలుకుతానని ప్రకటన -
సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించాలి
ఏలూరు (టూటౌన్): దేశానికి అన్నం పెడుతున్న రైతన్నకు సబ్సిడీలు ఇచ్చి ప్రోత్సహించేందుకు కేంద్ర ప్రభుత్వం ముందుకు రాకుండా రైతు ఆత్మహత్యలకు కారణం అవుతుందని అఖిల భారత కిసాన్ సభ జాతీయ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ అన్నారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం 23వ రాష్ట్ర మహాసభలు ఏలూరు నగరంలో శుక్రవారం అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. కళాకారుల డప్పు దరువులు, నృత్యాలతో ఉత్సాహపూరిత వాతావరణంలో కొనసాగింది. జ్యూట్ మిల్ సెంటర్ వద్ద ఉన్న అల్లూరి సీతారామరాజు విగ్రహం నుంచి భారీ కార్మిక ప్రదర్శన నిర్వహించారు. ఇండోర్ స్టేడియంలో జరిగిన బహిరంగ సభకు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షులు వి.కృష్ణయ్య అధ్యక్షత వహించారు. వీజు కృష్ణన్ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వ కార్పొరేట్ అనుకూల వ్యవసాయ విధానాలను తీవ్రంగా తప్పుపట్టారు. మోదీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత 12 ఏళ్ల కాలంలో 10 లక్షల మంది రైతులు ఆత్మహత్యలు చేసుకున్నారని విమర్శించారు. 30 లక్షల మంది కౌలు రైతులకు ఎలాంటి రాయితీ అందడం లేదన్నారు. రైతు సంఘం రాష్ట్ర అధ్యక్ష ,ప్రధాన కార్యదర్శులు వి.కృష్ణయ్య, కె ప్రభాకర్ రెడ్డి మాట్లాడుతూ గోదావరి జిల్లాల్లో సాగునీటపాటు రైతుల రక్తం కూడా ఆత్మహత్యల రూపంలో పారుతుందని చెప్పారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర అధ్యక్షుడు, బి.బలరాం, అఖిల భారత కిసాన్ సభ జాతీయ సహాయ కార్యదర్శి టి.సాగర్, సీనియర్ నాయకులు వై.కేశవరావు, పోలవరం నిర్వాసితుల సంఘం రాష్ట్ర నాయకులు మంతెన సీతారాం, అన్ని జిల్లాల ప్రతినిధులు పాల్గొన్నారు. కిసాన్ సభ ప్రధాన కార్యదర్శి విజు కృష్ణన్ -
కోర్టు ఆదేశాలతో స్పీడ్ బ్రేకర్ల తొలగింపు
సాక్షి టాస్క్ఫోర్స్ : కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుల్లో భాగంగా వైఎస్సార్ సీపీ నాయకుల ఇంటి ముందు ఏర్పాటుచేసిన అనధికార స్పీడ్ బ్రేకర్లను అధికారులు శుక్రవారం తొలగించారు. మండలంలోని అయితంపూడి గ్రామానికి చెందిన మాజీ సర్పంచ్ ఉప్పులూరు లావణ్య, ఆమె భర్త వైఎస్సార్ సీపీ నాయకుడు ఉప్పులూరి జితేంద్ర మాట్లాడుతూ తమ ఇంటి ముందు నరసాపురం, అశ్వారావుపేట స్టేట్ హైవేపై జనవరిలో అధికారులు, కూటమి నాయకులు కలిసి నిబంధనలకు విరుద్ధంగా స్పీడ్ బ్రేకర్లు వేశారని తెలిపారు. స్పీడ్ బ్రేకర్ల ఏర్పాటుకు వ్యతిరేకంగా మాజీ మంత్రి, రీజనల్ కోఆర్డినేటర్ కారుమూరి వెంకట నాగేశ్వరరావు పెద్ద ఎత్తున ఆందోళన చేశారు. అనంతరం లావణ్య, జితేంద్ర దంపతులు కోర్టును ఆశ్రయించగా గత నెలలో స్పీడ్ బ్రేకర్లు తొలగించాలని ఆదేశాలు ఇచ్చారు. అయినా అధికారులు స్పందించకపోవడంతో కోర్టు ధిక్కరణ కేసు వేశారు. దీనిపై స్పందించిన న్యాయస్థానం స్పీడ్ బ్రేకర్లు తొలగించకపోతే సంబంధిత అధికారులపై తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరిస్తూ ఆదేశాలు ఇచ్చింది. దీంతో అధికారులు ఆగమేఘాల మీద శుక్రవారం ఉదయం జేసీబీ సహాయంతో ఆర్ అండ్బీ అధికారులు అనధికారంగా వేసిన స్పీడ్ బ్రేకర్లు తొలగించారు. పెదపాడు: కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న నలుగురు వ్యక్తులపై పెదపాడు పోలీసులు శుక్రవారం కేసు నమోదు చేశారు. మండలంలోని వడ్డిగూడెం గ్రామానికి తెలంగాణ రాష్టంలోని సత్తుపల్లి నుంచి నిషేధిత కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్న ముగ్గురు వ్యక్తులతో పాటు చేపల చెరువు యజమాని ఘంటసాల తిరుపతిరాజులపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు ఎస్సై ఆర్.శ్రీను తెలిపారు. -
ఆక్వా రిజిస్ట్రేషన్లలో అలసత్వం
● అప్సడా నిబంధనలకు తూట్లు ● ఏలూరు జిల్లాలో నత్తనడకన సాగుతున్న నమోదు ప్రక్రియ ● రైతులు రాయితీలు కోల్పోయే ప్రమాదం కై కలూరు: ఆంధ్రప్రదేశ్లో ఆక్వారంగంలో పారదర్శకత, నాణ్యమైన ఉత్పత్తులు, జవాబుదారితనం పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టం–2020 అమలు జిల్లాలో నత్తనడకన సాగుతోంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు అందించే సబ్సిడీలు, విద్యుత్ రాయితీలు పొందాలంటే అప్సడా రిజిస్ట్రేషన్ తప్పనిసరని ప్రభుత్వం స్పష్టం చేసినప్పటికీ, క్షేత్రస్థాయిలో ప్రగతి శూన్యంగా ఉంది. ఈ చట్టంపై రైతులకు అవగాహన కల్పించడంలో అధికారులు విఫలమవుతున్నారు. ఏలూరు జిల్లాలో దాదాపు 40,149 మంది రైతులు 1,49,604 ఎకరాల్లో చేపలు, రొయ్యల సాగు చేస్తున్నారు. అయితే, ఇప్పటివరకు కేవలం 91,430 ఎకరాలకు మాత్రమే రిజిస్ట్రేషన్లు జరిగాయి. చట్టం ప్రకారం నమోదు చేసుకుంటేనే ప్రకృతి వైపరీత్యాల సమయంలో నష్టపరిహారం, విద్యుత్ సబ్సిడీలు అందుతాయి. అయినప్పటికీ, కొందరు రైతులు, స్థానిక రైతు సంఘాలు ఈ విషయంలో చొరవ చూపడం లేదు. జీడీపీలో టాప్.. నమోదులో లాస్ట్ రాష్ట్ర స్థూల దేశీయోత్పత్తిలో ఏలూరు జిల్లా కలిదిండి మండలం ప్రథమ స్థానంలో ఉంది. ఇక్కడ ఆక్వారంగం భారీగా విస్తరించినప్పటికీ, మొత్తం 30,406.3 ఎకరాలకు గాను కేవలం 11,308 ఎకరాలకే రిజిస్ట్రేషన్ జరిగింది. ఇంకా 19,097.50 ఎకరాల నమోదు పెండింగ్లో ఉంది. దీనిపై స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ అసహనం వ్యక్తం చేస్తూ, సిబ్బంది కొరతను తీర్చాలని కమిషనర్ను కోరారు. అయితే స్థానిక చేపల రైతుల సంఘాలు అవగాహన సమావేశాలు నిర్వహిస్తే ప్రయోజనం ఉంటుందని స్థానికులు సూచిస్తున్నారు. నమోదు ప్రక్రియలో ప్రధాన అడ్డంకులు ● ఆధార్ కార్డుతో భూమి సర్వే నంబర్లు లింక్ కాకపోవడం. ● ఇతర రాష్ట్రాల్లో ఉండే యజమానుల నుంచి ఓటీపీలు సకాలంలో రాకపోవడం ● జాయింట్ ఎల్పీఎంలో పదిమంది రైతులున్నా ఆన్లైన్లో ఒకే సైట్గా చూపించడం. ● చెరువులు అమ్మినా పాత యజమానుల పేర్లే ఉండటం, మ్యుటేషన్ సమస్యలు వేధించడం. ● ఇటీవల బదిలీల వల్ల గ్రామ మత్స్యశాఖ సహాయకులు కొరత ఏర్పడడం. దరఖాస్తుకు కావాల్సిన పత్రాలు ● భూమి అడంగల్, ల్యాండ్ పాస్బుక్ (లీజు భూమి అయితే రిజిస్టర్డ్ లీజ్ అగ్రిమెంట్). ● మండల సర్వేయర్ ధ్రువీకరించిన చెరువు ఆటోక్యాడ్ మ్యాప్. ● ఆధార్ కార్డ్, పాస్పోర్ట్ సైజ్ ఫోటోలు, రూ.10 స్టాంప్ పేపర్పై అఫిడవిట్. ● వీటిని సచివాలయంలో లేదా విలేజ్ ఫిషరీస్ అసిస్టెంట్కు అందించి, ఎకరానికి రూ.1,000 చొప్పున ఆన్లైన్లో ఫీజు చెల్లించాలి. అప్సడా రిజిస్ట్రేషన్ వల్ల ఆక్వా రైతులకు కలిగే ప్రయోజనాలపై గ్రామ స్థాయిలో అవగాహన కల్పిస్తున్నాం. కలిదిండి మండలంలో ఆక్వా రైతులు ఎక్కువుగా ఉన్నప్పటికీ రైతులు ముందుకు రావడం లేదు. ఆక్వా సాగు చేస్తున్న వారంతా అప్సడా చట్టం ప్రకారం రిజిస్ట్రేషన్ తప్పక చేయించాలి. నిబంధనలు పాటించని వారిపై జిల్లా కమిటీ చర్యలు తీసుకునే అవకాశం ఉంది. – బి.రాజ్కుమార్, మత్స్యశాఖ అధికారి, కై కలూరుమండలం మొత్తం విస్తీర్ణం జరిగిన రిజిస్ట్రేషన్లు చేయాల్సినవి కై కలూరు 15896.73 10371.2 5525.53 ముదినేపల్లి 18557.79 10580.68 7977.11 మండవల్లి 19919.83 11585.44 8334.39 కలిదిండి 30406.03 11308.53 19097.50 భీమడోలు 10900.70 9893.43 1007.27 నిడమర్రు 15172.60 10478.24 4694.36 ఉంగుటూరు 5718.46 4815.29 903.17 పెదపాడు 11166.08 9095.93 2070.15 దెందులూరు 7288.10 6151.04 1137.06 ఏలూరు 14578.19 6151.04 8427.15 మొత్తం 149604.51 91430.82 58173.69 -
పక్కదారి పడుతున్న చెరువు మట్టి
నూజివీడు : పొలంలో మెరక నిమిత్తం మట్టి కావాలని అనుమతులు తీసుకొని చెరువు మట్టిని తవ్వి యథేచ్ఛగా విక్రయిస్తూ టీడీపీ నాయకులు జేబులు నింపుకుంటున్నారు. మంత్రి పేరు చెబుతూ అధికారుల నోళ్లు మూయిస్తూ మట్టిని తమ ఇష్టారాజ్యంగా తవ్వేసి విక్రయించుకుంటున్నారు. మండలంలోని పోలసానపల్లి గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు సంబంధించిన 7ఎకరాల వ్యవసాయ భూమిని మెరక చేసుకునేందుకు గాను కురువిడి చెరువులో నుంచి 2500 క్యూబిక్ మీటర్ల పూడిక మట్టిని వారి సొంత ఖర్చులతో తవ్వి తోలుకునేందుకు ఇరిగేషన్ అధికారులు అనుమతినిచ్చారు. అయితే ఆ చెరువు నుంచి మట్టి తోలకుండా రాయన్న చెరువు నుంచి మట్టిని తవ్వి అమ్ముకుంటున్నారు. పొలాల్లోకి తోలుకుంటామని అనుమతి తీసుకొని వాణిజ్య అవసరాలకు, ఇతర అవసరాలకు అక్రమార్కులు అమ్మేస్తున్నారు. అనుమతులు ఒక చెరువులో తీసుకుని వేరే చెరువు నుంచి మట్టిని ఇష్టారాజ్యంగా తవ్వేస్తున్నా ఇరిగేషన్ అధికారులు గానీ, రెవిన్యూ అధికారులు గానీ అటువైపు కన్నెత్తి చూడకపోవడం వెనుక ఆంతర్యం ఏంటి? అని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. ఈ చెరువు నుంచి ఆగిరిపల్లి మండలం అనంతసాగారం పరిధిలో ఉన్న ఒక ప్రైవేటు కంపెనీకి చెందిన ఆయిల్ పామ్నర్సరీకి ట్రాక్టరు మట్టిని రూ.1,500లకు విక్రయించి సొమ్ము చేసుకుంటున్నారు. పొక్లెయిన్కు టక్కులో మట్టిని పోసినందుకు రూ.100 ఇస్తుండగా కొంత మొత్తం ట్రాక్టర్ కిరాయి కింద మినహాయించగా మిగిలిన మొత్తం అక్రమార్కుల జేబుల్లోకి వెళ్తోందని పలువురు పేర్కొంటున్నారు. మట్టిమాఫియాకు ఆదాయం ఫుల్లు మట్టి తవ్వకాలకు అనుమతి కోసం ప్రభుత్వం కేవలం క్యూబిక్ మీటరు మట్టికి ఒక రూపాయి చెల్లిస్తే చాలనే నిబంధన తీసుకొచ్చింది. దీంతో అనుమతి కోసం దరఖాస్తుదారుడు కేవలం 2500ల క్యూబిక్ మీటర్ల మట్టికి రూ.2500లు చెల్లించారు. అనుమతి వచ్చాక ఒక్క ట్రిప్పుకు రూ100ల నుంచి రూ.150లను అదనంగా వసూలు చేసి జేబులు నింపుకుంటున్నారు. అసలు ఒక చెరువులో అనుమతి తీసుకొని వేరొక చెరువులో తవ్వుతున్నా రెవిన్యూ, ఇరిగేషన్ అధికారులు పట్టించుకోకపోవడం దారుణమని, వ్యవస్థలన్నీ నిర్వీర్యం అయిపోయాయని గ్రామస్తులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
అలసత్వం వహిస్తే చర్యలు
జంగారెడ్డిగూడెం: వర్షాకాలంలో గ్రామీణ ప్రాంత ప్రజలకు ఎలాంటి వ్యాధులు ప్రబలకుండా సురక్షితమైన మంచినీరు అందించాలని, ముందస్తు జాగ్రత్తలు తప్పనిసరిగా తీసుకోవాలని జిల్లా పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు అధికారులను ఆదేశించారు. జంగారెడ్డిగూడెం డీఎల్డీవో కార్యాలయం వద్ద శుక్రవారం పది మండలాల పంచాయతీ అభివృద్ధి అధికారులు, విస్తరణ అధికారులు, ఉప మండల పరిషత్ అభివృద్ధి అధికారులతో సమీక్ష సమావేశం, పంచాయతీ రికార్డుల నిర్వహణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పంచాయతీ అధికారి జీవీకే మల్లికార్జునరావు ముఖ్య అతిథిగా హాజరై పలు విషయాలపై అవగాహన కల్పించారు. ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక ద్వారా వచ్చిన అర్జీల పరిష్కారం, పంచాయతీ పరిధిలో పన్నుల వసూళ్ల ప్రగతి, న్యాయస్థానం కేసులకు సంబంధించిన నివేదికలు, మొబైల్ అప్లికేషన్ ద్వారా గ్రామాల్లో పారిశుధ్య కార్యక్రమాల పర్యవేక్షణ, వర్షాకాలం దృష్ట్యా రక్షిత మంచి నీటి సరఫరా ట్యాంకులను శుభ్రపరచడం, ప్రభుత్వ నిబంధనల ప్రకారం కర్మయోగి డిజిటల్ ప్లాట్ఫామ్ ద్వారా ఆన్లైన్ కోర్సుల పూర్తి వంటి పలు కీలక అంశాలపై సమగ్రంగా సమీక్షించారు. సమావేశంలో డీఎల్డీవో ఎం.రాజు, డీఎల్పీవో ఏవీఎస్ రాయన్ తదితరులు పాల్గొన్నారు. జిల్లా పంచాయతీ అధికారి మల్లికార్జునరావు -
ఎన్నికల్లో ఇచ్చిన హామీలు అమలు చేయాలి
భీమవరం: న్యాయవాదుల రక్షణ చట్టాన్ని అమలుచేయాలని, న్యాయవాదులపై జరుగుతున్న దాడులను అరికట్టాలని, న్యాయవాదులందరికీ ప్రభుత్వ సంక్షేమ పథకాలు అమలు చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం భీమవరంలో న్యాయవాదులు కోర్టు ప్రాంగణంలో ధర్నా నిర్వహించారు. ఈ సందర్బంగా ఐఎఎల్ రాష్ట్ర ఉపాధ్యక్షుడు చెల్లబోయిన రంగారావు మాట్లాడుతూ న్యాయవాదులకు టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి నాయకులు ఎన్నికల్లో ఇచ్చిన హామీలను తక్షణం నెరవేర్చాలని డిమాండ్ చేశారు. న్యాయవాదుల రక్షణ, పర్యవేక్షణ చట్టాలను వెంటనే తీసుకురావాలని, న్యాయవాదులపై పెరిగిపోతున్న దాడులను నిలువరించాలన్నారు. జూనియర్ న్యాయవాదులకు రూ.10 వేల స్టైఫండ్ వెంటనే అమలు చేయాలని, వైద్యం, బీమా సదుపాయాలు అందించాలని, అర్హులైన న్యాయవాదులకు ఇళ్ల స్థలాలిచ్చి ఇళ్లు నిర్మించి ఇవ్వాలని చెల్లబోయిన డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ జనరల్ సెక్రెటరీ బడుగు అశోక్బాబు, ఐఎఎల్ నాయకులు మల్లుల శ్రీనివాసరావు, వైవీ ఆనంద్, మోకా రాముడు, బోకూరి విజయరాజు, సుబ్బయ్య, ఇంటి సురేష్ తదితరులు పాల్గొన్నారు. -
సొసైటీ అక్రమాలపై విచారణ చేయాలి
టి.నరసాపురం: మక్కినవారిగూడెం సొసైటీలో జరిగిన అవినీతి అక్రమాలను వెలికితీసి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని, దుర్వినియోగమైన నగదును రికవరీ చేసి రైతులకు న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం రైతులు ఆందోళన నిర్వహించారు. సొసైటీలో పనిచేస్తున్న ఇద్దరు గుమస్తాలు ఎరువుల విక్రయాల్లో సుమారు రూ.1.44 కోట్ల అవకతవకలకు పాల్పడ్డారనే ఆరోపణలపై, ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు నూజివీడు డీఆర్ఓ రవికుమార్ విచారణ చేపట్టారు. ఆరోపణలు ఎదుర్కొంటున్న గుమస్తా సిరిమళ్ళ సాయితేజ మనస్తాపంతో ఆత్మహత్యాయత్నం చేయగా చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈ అవినీతిలో సాయితేజ ప్రమేయం లేదని, ఆయనపై అన్యాయంగా ఆరోపణలు చేస్తూ నగదు కట్టించాలని చూడటం వల్లే ఆత్మహత్యకు యత్నించాడని అతని కుటుంబ సభ్యులు సొసైటీ వద్ద ధర్నాకు దిగారు. సొసైటీ చైర్పర్సన్ సూర్యనారాయణ వివరణ ఇస్తూ.. ఉన్నతాధికారుల పూర్తి విచారణ అనంతరం నిజానిజాలు వెల్లడవుతాయని తెలిపారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో ‘ప్రాజెక్ట్ మాతృ’ పథకం పటిష్టంగా అమలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్ నుంచి శుక్రవారం ‘ప్రాజెక్ట్ మాతృ’ పథకం అమలుపై అధికారులతో కలెక్టర్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గర్భిణి, బాలింతల ఆరోగ్య పరిరక్షణ ‘ప్రాజెక్ట్ మాతృ’పథకం ప్రధాన ఉద్దేశమన్నారు. జిల్లాలో ఎక్కడా ఏ గర్భిణీ, బాలింత కూడా పౌష్టికాహార లోపం, రక్తహీనతకు గురికాకుండా చూడాలన్నారు. వారి ఆరోగ్య పరిస్థితులకు అవసరమైన మందులు వారానికి ఒకసారి అందించేలా ఏర్పాటు చేయాలన్నారు. గర్భం దాల్చినప్పటి నుంచి ప్రసవం వరకు ఆరోగ్య పరీక్షలు నిర్వహించి, ఏదైనా అనారోగ్య సమస్యలు ఏర్పడితే వెంటనే చికిత్స అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. గిరిజన ప్రాంతాల్లోని గర్భిణులు, బాలింతల ఆరోగ్యంపై ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలన్నారు. జంగారెడ్డిగూడెం: సహచర అధికారిణి వేధింపులు తాళలేక ఓ ఆశా కార్యకర్త గుండెపోటుకు గురైంది. బాధితురాలి వివరాల ప్రకారం.. పట్టణంలోని హరిజనపేట అర్బన్ పీహెచ్సీ పరిధిలో బిట్రాల రమాదేవి ఆశా కార్యకర్తగా విధులు నిర్వహిస్తున్నారు. అదే కేంద్రంలో పనిచేస్తున్న ఏఎన్ఎం పద్మ గత కొంతకాలంగా తనను తీవ్రంగా అవమానిస్తూ, వేధింపులకు గురిచేస్తోందని రమాదేవి ఆరోపించారు. గత నెల 30న పల్స్ పోలియో చుక్కల మందు క్యారియర్ విషయమై ఏఎన్ఎం పద్మ ఆగ్రహం వ్యక్తం చేస్తూ దుర్భాషలాడినట్లు బాధితురాలు పేర్కొన్నారు. ఈ వేధింపులపై రమాదేవి మెడికల్ ఆఫీసర్కు ఫిర్యాదు చేయగా, విధులకు హాజరైన తర్వాత సమస్యను సర్దుబాటు చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. దీంతో తన భర్త ఆదినారాయణతో కలిసి ఇంటికి పయనమయ్యారు. అయితే, తీవ్ర మనస్తాపానికి గురైన రమాదేవికి మార్గమధ్యంలోనే ఒక్కసారిగా గుండెపోటు వచ్చింది. ఆమె భర్త వెంటనే స్థానిక ప్రభుత్వ ప్రాంతీయ ఆసుపత్రికి తరలించారు. అనంతరం అక్కడి నుండి ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. దెందులూరు: ప్రజా సమస్యలను అధికారులు పారదర్శకంగా పరిష్కరించాలని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం దెందులూరు ఎంపీడీవో కార్యాలయంలో ఒక నెల.. ఒక నియోజకవర్గం నాలుగు పర్యటనలు కార్యక్రమంపై గ్రామసభ నిర్వహించారు. 103 సమస్యలపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదులు అందజేశారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ, ఆర్డీవో లక్ష్మీ ప్రసన్న, జెడ్పీ సీఈఓ జగదాంబ, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ భాస్కర్, పోలవరం స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ శర్మ తదితరులు పాల్గొన్నారు. -
‘ఇదేంటి సర్’పై కదలిక
ఆక్వా రిజిస్ట్రేషన్లలో అలసత్వం ఆక్వారంగంలో పారదర్శకత, జవాబుదారీతనం పెంచేందుకు గత వైఎస్సార్ సీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ‘అప్సడా’ చట్టం–2020 అమలు నత్తనడకన సాగుతోంది. 8లో uద్వారకాతిరుమల: సర్ ప్రోగ్రామ్లో భాగంగా ఓటర్లకు అందిస్తున్న ఎన్యూమరేషన్ ఫారంలోని కాలమ్–1లో 2002 నాటి వివరాలను నమోదు చేసే విషయంలో ఓటర్లు అయోమయానికి గురవుతున్న అంశంపై సాక్షి దినపత్రికలో శుక్రవారం ‘ఇదేంటి సర్’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దీనిపై తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కీర్తి చేకూరి స్పందించి వివరణ ఇచ్చారు. అందులో భాగంగా సీహెచ్ పోతేపల్లిలోని సచివాలయంలో స్థానిక వైఎస్సార్ సీపీ ప్రతినిధుల సమక్షంలో ఓటరు జాబితాను పరిశీలించారు. జాబితాలోని 1,024 మంది ఓటర్లలో 641 మందికి ఒకే ఎపిక్ నంబర్ నమోదై ఉండడాన్ని గుర్తించామన్నారు. 2025 ఓటరు జాబితా నాటికి ప్రతి ఓటరుకి ప్రత్యేక ఎపిక్ నంబర్లు కేటాయించి లోపాన్ని పూర్తిగా సరిచేసినట్టు పేర్కొన్నారు. విచారణ సమయంలో వైఎస్సార్ సీపీ నేత యాచమనేని నాగేశ్వరరావు మాట్లాడుతూ 2025 ఓటరు జాబితా సక్రమంగా ఉన్నప్పుడు, ఎన్యూమరేషన్ ఫాంలో 2002 నాటి ఎపిక్ నెంబర్లు ఎందుకు నమోదు చేయమంటున్నారని అధికారులను ప్రశ్నించారు. 2025 నాటి ఓటరు జాబితాను మాత్రమే పరిగణలోకి తీసుకుని, ప్రత్యేక సవరణ జరిపితే ఎలాంటి అభ్యంతరం ఉండదన్నారు. -
అరకమ చెరువు గట్లు ధ్వంసం
కై కలూరు: కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువు గట్లను అటవీ శాఖ అధికారులు ధ్వంసం చేశారు. కై కలూరు మండలం పెంచికలమర్రులో పట్టపగలు ఎవరికీ అనుమా నం రాకుండా కూలీలతో ఓ వ్యక్తి చేపల చెరువు గట్లును పటిష్ట పరుస్తున్నాడు. కొల్లేరు ఆపరేషన్ సమయంలో అధికారులు ధ్వంసం చేసిన చెరువుల్లోనే సాగు చేస్తున్నాడు. దీనిపై ఇటీవల సాక్షిలో ‘ఆగని అక్రమ గట్లు పర్వం’ శీర్షికన కథనం వెలువడింది. దీనిపై అటవీశాఖ కైక లూరు రేంజర్ కె.రామంలింగాచార్యులు స్పందించారు. క్షేత్రస్థాయి సిబ్బందిని పంపించారు. గట్లును ధ్వంసం చేయించారు. ఈ సందర్భంగా రేంజర్ మాట్లాడతూ అభయారణ్యంలో అక్రమ సాగు చేసినా, గట్లు ఏర్పాటు చేసినా కేసులు నమోదు చేస్తామని హెచ్చరించారు. నూజివీడు: ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో భాగంగా ఓటర్లకు అందజేసిన గణన పత్రాలను పూర్తిచేసి త్వరితగతిన బీఎల్ఓలకు అందజేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ప్రజలను కోరారు. పట్టణంలోని అజరయ్యపేటలో గురువారం సర్ ప్రక్రియ అమలు తీరును ఆమె పరిశీలించారు. పలు గృహాలకు వెళ్లి గణన పత్రాలను అందజేసిందీ లేనిదీ ఆరా తీశారు. ఈనెల 14 వరకు సర్ ప్రక్రియ కొనసాగుతుందని, ప్రతి బీఎల్ఓ తమ పోలింగ్ కేంద్రం పరిధిలో ప్రతి ఇంటినీ సందర్శించి గణన పత్రాలు ఓటర్లకు అందజేశారన్నారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, మున్సిపల్ కమిషనర్ కొరపాటి పీరయ్య, తహసీల్దార్ షేక్ షంషుద్దీన్ ఉన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో సర్ కార్యక్రమంలో ఇప్పటివరకూ 16,35,754 ఎన్యుమరేషన్ ఫారాలు పంపిణీ చేశామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. రాష్ట్ర సచివాలయం నుంచి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాద్ జూమ్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టర్ హాజరయ్యారు. జిల్లాలో 99.49 శాతం పత్రాల పంపిణీ పూర్తయ్యిందని, 8,03,166 ఫారాల డిజిటలైజేషన్ పూర్తయ్యిందని చెప్పారు. ముసునూరు: వీబీజీ రాంజీ పథకం పల్లె సీమల అభివృద్ధికి దోహదపడుతుందని రాష్ట్ర సమా చార, గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థ సారథి అన్నారు. గురువారం ముసునూరులో కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలిసి వీబీజీ రాంజీలో ఫీడర్ చానల్ పనులను ప్రారంభించారు. కలెక్టర్ మాట్లాడుతూ గ్రామీణ ఉపాధి హామీ పథకం స్థానంలో ఈ పథకం వచ్చిందని ప్రతి కుటుంబానికి 125 రోజుల పాటు ఉపాధి కల్పిస్తామ న్నారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, సహా య కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్, డ్వామా పీడీ కె.వెంకట సుబ్బారావు, జిల్లా ఉద్యాన శాఖా ధికారి కె.షాజానాయక్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో ఏపీపీఎస్సీ గ్రూప్–2 ప్రిలిమ్స్ పరీక్షకు ఉచిత శిక్షణ ఇస్తున్నట్టు జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ డీడీ, బీసీ స్టడీ సర్కిల్ ఇన్చార్జి విశ్వమోహన్ రెడ్డి గురువారం ప్రకటనలో తెలిపారు. ఉమ్మడి జిల్లాకు చెందిన బీసీ, ఎస్సీ, ఎస్టీ అభ్యర్థులు ఈనెల 15లోపు ఏలూరు బీసీ స్టడీ సర్కిల్లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. 100 మంది అభ్యర్థులకు రెండు నెలల పాటు ఉచిత శిక్షణతో పాటు స్టయిఫండ్ కింద నెలకు రూ.1,500, స్టడీ మెటీరియల్ రూ.1,500 చొప్పున ఇస్తామన్నారు. ఎంపికై న అభ్యర్థులకు ఈనెల 20న శిక్షణ తరగతులు ప్రారంభమవుతాయన్నారు. వివరాలకు సెల్ 86861 80018, 90302 11920 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
టీడీపీ పాలనలో దేవుడి భూమికీ రక్షణ కరువు
● భూమి కనిపిస్తే యథేచ్ఛగా కబ్జా ● చినవెంకన్న భూమినీ వదలని నేతలు ● ఏలూరు కలెక్టరేట్ వద్ద వైఎస్సార్సీపీ ధర్నా ఏలూరు టౌన్: ద్వారకాతిరుమల దేవస్థానం భూమికి అన్రిజిస్టర్డ్ డాక్యుమెంట్ సృష్టించి టీడీపీ నేతలు కబ్జా చేసిన వ్యవహారంపై వైఎస్సార్సీపీ నేతలు, శ్రేణులు భగ్గుమన్నాయి. దేవుడి భూమికే రక్షణ కరువైందనీ.. రాష్ట్రంలో సామాన్యులకు దిక్కెవరనీ.. టీడీపీ కూటమి నేతలు భూమి కనిపిస్తే కబ్జా చేస్తూ.. ఆఖరికి స్వామివారి భూమిని సైతం కై ంకర్యం చేయటంపై కలెక్టరేట్ వద్ద ధర్నా చేపట్టారు. ముందుగా అక్కడ రోడ్డుపై బైఠాయించి ఆందోళనకు దిగారు. వైఎస్సార్సీపీ తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు, మాజీ మంత్రి చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, మాజీ హోమంత్రి తానేటి వనిత, రాష్ట్ర యు వజన అధ్యక్షులు జక్కంపూడి రాజా, రెండు జిల్లాలకు చెందిన పార్టీ ముఖ్యనేతలు, శ్రేణులు భారీ సంఖ్యలో హాజరయ్యారు. తక్షణమే స్వామివారి భూమి కబ్జాపై ఉన్నతస్థాయి విచారణ చేపట్టి బాధ్యులపై చర్యలు చేపట్టాలనీ, భూమిని స్వామివారి దేవస్థానానికి అప్పగించాలని డిమాండ్ చేశారు. అనంతరం జేసీకి వినతిపత్రం అందించారు. వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా బీసీసెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, యువజన విభాగం జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నాని, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు రాజేష్, రాష్ట్ర మహిళ విభాగం జాయింట్ సెక్రటరీ ఆచంట అనసూయ, తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, ద్వారకాతిరుమల మండల కన్వీనర్ ప్రతాపనేని వాసు, యువజన విభాగం రాష్ట్ర సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి బిరుదుగడ్డ చల్లారావు, మాజీ ట్రస్ట్బోర్డ్ సభ్యుడు మానుకొండ సుబ్బారావు, నాయకులు తాండ్ర రమేష్, భోగరాజు సాయికృష్ణ, మానుకొండ కన్నయ్య, దాసరి రాంబాబు తదితరులు పాల్గొన్నారు. -
ఏపీఏఐఎంఎస్ యాప్పై అవగాహన కల్పించాలి
ఏలూరు (టూటౌన్): జిల్లాలో ఎరువులకు ఎలాంటి కొరత లేదని, ఏపీఏఐఎంఎస్ యాప్ పై ప్రతి రైతుకూ అవగాహన కలిగించాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి వ్యవసాయాధికారులు ఆదేశించారు. జిల్లాలో ప్రస్తుత ఖరీఫ్ సీజన్లో ఎరువుల పంపిణీపై గురువారం స్థానిక కలెక్టరేట్ నుంచి వ్యవసాయ, అనుబంధ రంగాల అధికారులు, గ్రామస్థాయి వ్యవసాయ శాఖ సిబ్బందికి టెలి కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఈ–క్రాప్ వివరాల ఆధారంగా రైతులకు అవసరమైన మేరకు రైతులకు ఎరువుల పంపిణీ చేయాలని సూచించారు. ఎరువుల నిల్వలను డీలర్లు తప్పనిసరిగా నోటీస్ బోర్డులపై ప్రదర్శించాలన్నారు. ఈ టెలీకాన్ఫరెన్స్లో జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, వ్యవసాయ, అనుబంధ శాఖలకు చెందిన మండల, గ్రామ స్థాయి అధికారులు పాల్గొన్నారు. -
అడ్డగోలు అక్రమాలు
సాక్షి ప్రతినిధి, ఏలూరు: పదవీ కాలం కొద్దిరోజుల్లో పూర్తవుతుంది.. కనీసం ఇప్పుడైనా నాలుగు రూపాయలు సంపాదించుకోకపోతే ఎలా.. నిబంధనలు ఎలా ఉన్నా.. ఏఈ నుంచి కమిషనర్ వరకు ఎవరు బలైనా మాకు అనవసరం.. మా పనులు కావాల్సిందే.. మా కమీషన్లు అందాల్సిందే ఇది ఏలూరు నగ రపాలక సంస్థ సభ్యుల తీరు. కౌన్సిల్ తీర్మానం లేకుండా స్థాయి సంఘం సమావేశం రహస్యంగా నిర్వహించి కౌన్సిల్ తీర్మానం చేసినట్టు హడావుడిగా 19 పనులకు రూ.4.03 కోట్ల కేటాయింపు ప్రతిపాదనలు ఖరారు చేశారు. ఇక్కడ మరో ప్రత్యేక విషయమేమింటే.. ఏలూరు మేయర్ భర్తకు చెందిన లేఅవుట్లో మళ్లీ రోడ్లు నిర్మాణానికి రూ.96 లక్షలు కేటాయించుకోవడం గమనార్హం. ఒత్తిళ్లు.. నిబంధనలకు నీళ్లు ఏలూరు నగరపాలక సంస్థలో అడ్డగోలు దందాకు తెరపడటం లేదు. టౌన్ ప్లానింగ్ మొదలు ఇంజనీరింగ్ వరకు అధికారుల ఒత్తిళ్లతో నిబంధనలకు విరుద్ధంగా పనులు చేస్తున్నారు. తాజాగా కొద్ది నెలల క్రితం టౌన్ప్లానింగ్లో భారీ అవతవకలు జరిగాయని, అలాగే అనుమతులకు మించి అక్రమ కట్టడాలు నగరంలో ఉన్నాయనే ఫిర్యాదుతో ఏసీబీ అధికారులు రెండు రోజులపాటు సమగ్రంగా రికార్డులు పరిశీలించడం నగరంలో తీవ్ర కలకలం రేపింది. ఇక తాజాగా ఏలూరు నగరంలో జరిగిన రూ.56 కోట్ల విలువైన 1,621 నామినేషన్ పనులపైనా ఆరోపణలు రావడం లోకాయుక్తకు ఫిర్యాదులు అందడంతో లోకాయుక్త నామినేషన్ పనులపై క్షుణ్ణంగా విచారించి నివేదికలు సమర్పించాల్సిందిగా రాష్ట్ర మున్సిపల్ శాఖను ఆదేశించింది. ఈ క్రమంలో రాజమండ్రి మున్సిపల్ ఆర్డీ సీహెచ్ నాగనరసింహారావు, ఏలూరు కమిషనర్ ఎ.భానుప్రతాప్లు వివరాలు అందజేయాలని ఆదేశించారు. ఈ పనుల్లోనూ రూ.2.06 కోట్లు మేయర్ భర్త ఎస్ఎంఆర్ పెదబాబుకు చెందిన ఎస్ఎంఆర్నగర్లో పనులు నిర్వహించారు. లేఅవుట్లో నిబంధనలకు విరుద్ధంగా పనులు ఎలా చేశారు.. ఫైల్ ప్రా సెసింగ్ ఎలా చేశారని.. లేఅవుట్లో ఎన్ని ఇళ్లు ఉ న్నాయి.. కార్పొరేషన్కు ఎంత ఆదాయం వస్తుంద ని కూడా తదితర వివరాలు కోరారు. వీటిపై ఇప్పటికే ఇంజనీరింగ్ అధికారులు ఉక్కిరిబిక్కిరి అ వుతున్న తరుణంలో గత నెల 17న స్థాయి సంఘం సమావేశం నిర్వహించారు. ఏలూరు నగరపాలక సంస్థ కార్యాలయం ఏలూరు కార్పొరేషన్లో వింత పరిస్థితి కౌన్సిల్ నిర్వహించకుండానే పనుల ఖరారు 15వ ఆర్థిక సంఘం నిధులతో రూ.4.03 కోట్లతో పనులు మళ్లీ మేయర్ లేఅవుట్కు రూ.96 లక్షల పనులు లోకాయుక్త విచారణ కొనసాగుతున్నా మరోసారి పనుల కేటాయింపు పాలకవర్గం గడువు ముగియనున్న నేపథ్యంలో హడావుడి వ్యవహారం ప్రభుత్వ ప్రధాన కార్యదర్శికి ఫిర్యాదు కౌన్సిల్ సమావేశం నిర్వహించి రూ.4.03 కోట్ల వ్యయంతో 19 పనులు ఖరారు చేసి ప్రతిపాదనలు పంపారు. వీటిల్లో కూడా కొన్ని ఎస్ఎంఆర్ నగర్లోని లేఅవుట్లో రూ.96 లక్షలతో అంచనాతో రెండు పనులను ప్రతిపాదించిన ప నులను ఎస్ఎంఆర్ నగర్ లేకుండా సర్వే నెంబర్, ఫలనా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా వ్యక్తి ఇంటి వరకు సీసీ రోడ్డు నిర్మాణం రూ.24 లక్షలు, మళ్లీ అదే లేఅవుట్లో 50వ డివిజన్ సర్వే నంబబరుతో ఫలానా వ్యక్తి ఇంటి నుంచి ఫలానా ప్లాట్ వరకు రహదారి నిర్మాణం రూ.72 లక్షలు కేటాయింపు ప్రతిపాదనలు పంపారు. సాధారణ లేదా అత్యవసర కౌన్సిల్ సమావేశాన్ని నిర్వహించి పనులు ఖరారు చేస్తారు. అయితే 17న స్టాండింగ్ కౌన్సిల్ నిర్వహించినట్టు చెబుతున్నారు గాని మార్చి 27న బడ్జెట్ సమావేశాల అనంతరం ఇప్పటివరకు ఎలాంటి కౌన్సిల్ సమావేశం జరగలేదు. ఈ నెలాఖరుతో పాలకవర్గం ముగియనుండటంతో హడావుడిగా ప్రతిపాదనలు పెట్టడం, నిబంధనలకు విరుద్ధంగా కేటాయింపులు చేయడంపై రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, మున్సిపల్ అడ్మిస్ట్రేషన్కు రిటైర్డ్ ఏఈ కేవీ సాయిప్రసాద్ ఫిర్యాదు చేశారు. -
విద్యార్థులు పట్టుదలతో చదువుకోవాలి
నూజివీడు : విద్యార్థులు లక్ష్యాన్ని నిర్దేశించుకొని దాని సాధనకు పట్టుదలతో ముందుకు సాగాలని, అప్పుడే సులువుగా లక్ష్యాన్ని సాధించగలుగుతారని ట్రిపుల్ఐటీ డైరెక్టర్ ఆచార్య ఎస్ఎస్ఎస్వీ గోపాలరాజు పేర్కొన్నారు. నూజివీడు ట్రిపుల్ఐటీకి వచ్చిన పీయూసీ ప్రథమ సంవత్సర విద్యార్థులకు గురువారం స్టూడెంట్ యాక్టివిటీ సెంటర్లో ఓరియంటేషన్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా డైరెక్టర్ మాట్లాడుతూ జీవితంలో వచ్చిన అవకాశాన్ని విద్యార్థులు వృథా చేసుకోవద్దని, చక్కగా చదువుకుని దేశానికి ఉపయోగపడే పౌరులుగా మారాలన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే పాఠాలను శ్రద్ధగా వినాలని, ఏమైనా అర్థం కాకపోతే వెంటనే అడగాలని సూచించారు. క్యాంపస్లోనే అన్ని వసతులు ఉన్నాయని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏఓ బి.లక్ష్మణరావు, డీన్ అకడమిక్స్ సాదు చిరంజీవి, డీఎస్డబ్ల్యూఓలు లంకపల్లి రాజేష్, దుర్గాభవాని, పీయూసీ ఇన్చార్జి హరికృష్ణ తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: ఏపీ నిట్లో స్థానిక ఆదికవి నన్నయ విశ్వవిద్యాలయ విద్యార్థులకు పీహెచ్డీ సీట్లు వచ్చినట్లు ప్రిన్సిపాల్ టి.అశోక్ గురువారం తెలిపారు. పి.తేజస్విని, జీఆర్.సత్యనారాయణకు ప్రతిష్టాత్మక జాతీయ విద్యాసంస్థలో తమ విద్యార్థులకు సీట్లు రావడం ఆనందంగా ఉందని ప్రిన్సిపాల్ అన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులను అభినందించారు. కార్యక్రమంలో రసాయన శాస్త్ర విభాగం కోర్సు కో–ఆర్డినేటర్ శ్రీరాముడు, అధ్యాపకులు పుత్రయ్య, రమణ, డాక్టర్ ప్రశాంతి, రామ్మోహన్ పాల్గొన్నారు.


