Eluru District Latest News
-
ఉపాధ్యాయుల సమస్యలపై నిరంతరం పోరాడాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలపై నిరంతరం పోరాడాలని మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి సూచించారని వైఎసార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్ తెలిపారు. మంగళవారం తాడేపల్లిలో వైఎస్ జగన్ మోహన్ రెడ్డిని ఆయన మర్యాద పూర్వకంగా కలుసుకున్నట్లు తెలిపారు. రాష్ట్రంలో విద్యారంగం ప్రస్తుతం తిరోగమనంలో ఉందని, ఆఖరికి విద్యార్థులకు యూనిఫారం ఇవ్వడానికి కూడా ప్రభుత్వం చందాలు వసూలు చేసే పరిస్థితికి దిగజారిందని, ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు విడుదల చేయకపోవడంతో అనేక మంది పేద కుటుంబాల విద్యార్థులు చదువుకు దూరమయ్యే ప్రమాదంలో పడ్డారని వైఎస్ జగన్ దృష్టికి తీసుకెళ్లినట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం: మట్టి అక్రమ రవాణా చేస్తున్న 3 మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ తెలిపారు. సోమవారం రాత్రి మట్టి అక్రమ రవాణాపై సమాచారం అందడటంతో పుట్లగట్లగూడెం కొంగల చెరువు వద్దకు వెళ్లేసరికి అనుమతులు లేకుండా మట్టిని తరలిస్తున్న 3 మట్టి ట్రాక్టర్లను గుర్తించి సీజ్ చేసినట్లు చెప్పారు. తదుపరి చర్యల నిమిత్తం రెవెన్యూ శాఖకు సమాచారం ఇచ్చినట్లు ఆయన తెలిపారు. -
మద్దిలో పూజలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో మంగళవారం విశేష పూజలు నిర్వహించారు. అధిక సంఖ్యలో భక్తులు స్వామిని దర్శించుకున్నారు. స్వామికి ఆలయ ముఖ మండపం వద్ద నాగవల్లీ దళాలతో అష్టోత్తర పూజలు నిర్వహించారు. అర్చకులు స్వామిని విశేషంగా అలంకరించి పూజా కార్యక్రమం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల ద్వారా రూ.3,11,511 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సోమవారం నుంచి ప్రారంభమైన 10వ తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు రెండో రోజు మంగళవారం ప్రశాంత వాతావరణంలో జరిగాయి. సెకండ్ లాంగ్వేజ్ హిందీ పరీక్షకు 484 మంది విద్యార్థులకు 55 మంది హాజరయ్యారు. సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహించిన ఎస్ఎస్సీ ఇంగ్లీష్ పరీక్షకు మొత్తం 68 మంది విద్యార్థులకు గాను 50 మంది హాజరయ్యారు. దూరవిద్య ఇంటర్ తెలుగు పరీక్షకు 99 మందికి గాను 85 మంది హాజరయ్యారు. పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణ ప్రాంతంలో కేంద్ర మట్టి, పదార్థాల పరిశోధనా సంస్థ (సీఎస్ఎంఆర్ఎస్) బృందం మంగళవారం పరీక్షలు నిర్వహించింది. ఈ పరీక్షలు బుధవారం కూడా కొనసాగనున్నాయి. పరీక్షల్లో ప్రాజెక్ట్ నిర్మాణంలో వినియోగిస్తున్న, మట్టి, పదార్ధాలు, రాళ్లు నాణ్యతగా ఉన్నాయని తేలింది. బుధవారం ఇదే తరహా పరీక్షలు గ్యాప్–2లో ఈ బృందం నిర్వహించనుంది. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ అడ్వాన్స్డ్ పరీక్షలకు మంగళవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు మొత్తం 2468 మంది హాజరయ్యారు. ఉదయం 32 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన మ్యాథ్స్ (బీ)/ బయాలజీ,/ జువాలజీ పరీక్షలకు మొత్తం 1452 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 30 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన జువాలజీ/ఎకనామిక్స్–2 పరీక్షలకు మొత్తం 1016 మంది హాజరయ్యారు. వీరిలో 775 మంది జనరల్ విద్యార్థులకు గాను 684 మంది హాజరు కాగా 91 మంది గైర్హాజరయ్యారు. అలాగే 364 మంది ఒకేషనల్ విద్యార్థులకు గాను 332 మంది హాజరు కాగా 32 మంది గైర్హాజరయ్యారు. ఏలూరు టౌన్: ప్రజల శాంతిభద్రతల పరిరక్షణపై జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక దృష్టి సారించారు. ఏలూరు నగరం, జాతీయ రహదారిపై అర్ధరాత్రి స్వయంగా తనిఖీ చేశారు. ఏలూరు నగరంలోని ప్రధాన కూడళ్ళు, జాతీయ రహదారిలోనూ సిబ్బంది పనితీరును గమనించేందుకు తనిఖీ చేశారు. బ్లూకోల్ట్స్, హైవే పెట్రోలింగ్, నైట్ రౌండ్స్ సిబ్బందిని ఆయా ప్రాంతాల్లో కలుస్తూ రికార్డులు పరిశీలించారు. రోడ్ సేఫ్టీ మొబైల్ సిబ్బంది రాత్రివేళల్లో నిరంతరం మూవింగ్లో ఉండాలని, నిర్లక్ష్యంగా ఉండకూడదని సిబ్బందికి ఎస్పీ చెప్పారు. నగరంలోని సిబ్బంది బీట్ పుస్తకాలు తనిఖీ చేశారు. అనుమానాస్పద వ్యక్తులు, సమస్యాత్మక ప్రాంతాలపై ప్రత్యేక నిఘా ఉంచాలని సిబ్బందిని ఆదేశించారు. వేసవిలో చోరీలు జరిగే ఆస్కారం ఉందని, కాలనీల్లో తాళాలు వేసిన ఇళ్ళపై నిఘా ఉంచాలని స్పెషల్ క్రైమ్ ప్రివెన్షన్ టీమ్స్ను ఆదేశించారు. సరైన కారణాలు లేకుండా యువత రోడ్లపై తిరిగితే చట్టపరంగా చర్యలు తీసుకోవాలని చెప్పారు. -
పౌల్ట్రీకి వడదెబ్బ
మండుతున్న ఎండలు పౌల్ట్రీకి గుబులు పుట్టిస్తున్నాయి. వడదెబ్బతో వేల సంఖ్యల్లో కోళ్లు మృత్యువాత పడుతున్నాయి. రోజువారీ గుడ్ల ఉత్పత్తి పదిశాతం మేర తగ్గింది. ఆయా రూపాల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని పౌల్ట్రీ రంగానికి రోజుకు రూ.4.17 మేర నష్టం వాటిల్లుతున్నట్టు అంచనా. జూన్ మొదటి వారం వరకు ఎండల తీవ్రత ఉంటుందన్న వాతావరణశాఖ హెచ్చరికలు కోళ్ల రైతులను కలవరపరుస్తున్నాయి. ● షెడ్లలో చల్లదనం కోసం పైకప్పుపై వాటర్ స్ప్రింక్లర్లు ఏర్పాటుచేసి కొబ్బరి ఆకులు కప్పాలి. వేడిగాలులు చొరబడకుండా చుట్టూ గోనెసంచులు కట్టి తరచూ వాటిని నీటితో తడుపుతుండాలి. షెడ్లు లోపల ఫ్యాన్లు ఏర్పాటుచేయాలి ● కోళ్లు వడదెబ్బకు గురికాకుండా ఎలక్ట్రోలైట్స్, విటమిన్స్, సప్లిమెంట్స్ను వాటర్, ఫీడ్ ద్వారా అందించాలి ● పగటి పూట మేత తగ్గించేసి రాత్రిపూట పెట్టాలి, చల్లటి తాగునీటిని అందించాలి ● విద్యుత్ సరఫరాకు అంతరాయం లేకుండా చూసుకోవాలి ● చనిపోయిన కోళ్లను లోతుగా గోతులు తీసి పాతిపెట్టాలి ఎండ తీవ్రతకు చనిపోయిన కోళ్లు సాక్షి, భీమవరం: ఉమ్మడి జిల్లాలోని తణుకు, తాడేపల్లిగూడెం, జంగారెడ్డిగూడెం, అత్తిలి, ఇరగవరం, ఉంగుటూరు, దేవరపల్లి, ఉండ్రాజవరం తదితర మండలాల్లో దాదాపు కోటి వరకు లేయర్ కోళ్లు ఉన్నాయి. ఆరోగ్యంగా ఉన్న కోళ్లు 36 డిగ్రీల సెంటిగ్రేడ్ ఉష్ణోగ్రత వరకు తట్టుకుంటాయి. వారం రోజులుగా 45 నుంచి 48 డిగ్రీల సెంటీగ్రేడ్ వరకు ఉష్ణోగ్రతలతో ముందెన్నడూ లేనివిధంగా కోళ్ల మరణాలు అధికమయ్యాయి. అధికారవర్గాల లెక్కలు ప్రకారం రోజుకు 1.5 శాతం వరకు కోళ్లు చనిపోతున్నాయి. ఈ మేరకు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రోజుకు లక్షన్నర వరకు కోళ్లు మృత్యువాత పడుతున్నట్టు అంచనా. ఒక కోడి చనిపోవడం వల్ల రూ.250 వరకూ నష్టం వాటిల్లుతుండగా కోళ్ల మరణాలు ద్వారా రోజుకు రూ. 3.76 కోట్లు మేర కోళ్ల రైతులు నష్టపోతున్నారు. ఉత్పత్తిపైనా ప్రభావం ఎండల తీవ్రత గుడ్ల ఉత్పత్తిపైనా ప్రభావం చూపు తోంది. సాదారణ పరిస్థితుల్లో జిల్లాలో రోజుకు 80 లక్షల గుడ్లు ఉత్పత్తి అవుతుంటాయి. ప్రస్తుతం సుమారు 72 లక్షల గుడ్లు మాత్రమే ఉత్పత్తి అవుతున్నాయి. ఎనిమిది లక్షల గుడ్ల డ్రాపింగ్తో కోళ్ల రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రస్తుతం ఫాంగేట్ వద్ద గుడ్డు ధర రూ.5.30 పైసలు ఉండగా రోజుకు రూ.42.4 లక్షలు కోల్పోతున్నారు. కోళ్ల మరణాలు, గుడ్ల డ్రాపింగ్ రూపంలో జిల్లాలోని పరిశ్రమకు రోజుకు రూ.4.17 కోట్ల మేర నష్టం వాటిల్లుతోంది. కొద్ది రోజులుగా ఎండల తీవ్రత అధికంగా ఉండటంతో ఈ మేరకు నష్టం జరిగినట్టు అంచనా. పెరిగిన నిర్వహణ భారం : అధిక ఉష్ణోగ్రతల నుంచి కోళ్లను కాపాడుకునే జాగ్రత్తలతో ఖర్చు తడిసి మోపెడవుతోందని కోళ్ల రైతులంటున్నారు. వడదెబ్బకు గురికాకుండా ప్రత్యేక మందులు, షెడ్లలోని వాతావరణాన్ని చల్లబర్చేందుకు ప్రత్యేక సంరక్షణ చర్యలతో నిర్వహణ భారం పెరిగిందంటున్నారు. కోళ్ల మేతకు వినియోగించే సోయా, డీఓబీ, మొక్కజొన్న, జీఎన్సీ, నూకలు, మందుల ధరలు విపరీతంగా పెరిగిపోవడం, గుడ్డు ధర గిట్టుబాటవ్వక కొట్టుమిట్టాడుతున్న పౌల్ట్రీ పరిశ్రమను ప్రస్తుత ఎండలు మరింత సంక్షోభంలోకి నెట్టేస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తక్కువ ధరకే ప్రజలకు పౌష్టికాహారాన్ని అందిస్తూ ప్రత్యక్షంగా, పరోక్షంగా వేలాది మందికి ఉపాధి కల్పిస్తున్న పౌల్ట్రీ పరిశ్రమను ఆదుకునేందుకు ప్రభుత్వం చొరవ చూపాలని కోళ్ల రైతులు కోరుతున్నారు. అప్రమత్తంగా ఉండాలి : అధిక ఉష్ణోగ్రతలతో కోళ్ల మరణాలు పెరిగిపోవడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. పశ్చిమగోదావరి జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా పశుసంవర్ధకశాఖ జేడీ ఆర్.కోటిలింగరాజు, పౌల్ట్రీ యజమానులు, పౌల్ట్రీ అసోసియేషన్ ప్రతినిధులతో సమీక్షించారు. జూన్ మొదటి వారం వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదవుతాయన్న వాతావరణశాఖ హెచ్చరికల నేపథ్యంలో కోళ్ల మరణాల నియంత్రణకు ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. వడగాల్పులకు కళ్లు తేలేస్తున్న కోళ్లు అధిక ఉష్ణోగ్రతలతో పెరిగిన మరణాలు లక్ష కోళ్ల పౌల్ట్రీలో రోజుకు 1500 వరకు మృత్యువాత 10 శాతం మేర తగ్గిన గుడ్లు ఉత్పత్తి ఎండల తీవ్రతతో రోజుకు రూ.4.17 కోట్ల నష్టం -
ఆరోగ్యశ్రీలో రూ. 6,740 గుంజేశారు
ఈ ఏడాది ఫిబ్రవరి 14న అత్తిలికి చెందిన నా సోదరి బొప్పే విజయలక్ష్మి ఇంట్లో కాలుజారి పడి కాలు విరిగిన సందర్భంలో తణుకు ఆపిల్ ఆస్పత్రిలో చేర్చాను. శస్త్రచికిత్స చేయాల్సిన క్రమంలో ఆరోగ్యశ్రీ రిజిస్ట్రేషన్ చేయించుకున్నప్పటికీ బెడ్ ఇవ్వకుండానే స్ట్రెచర్పైనే ఉంచి రక్తపరీక్షలు, ఎక్స్రే ఇతర ఖర్చులంటూ రూ.6,740 వసూలు చేశారు. మరో రూ.15 వేలు ఇవ్వాలని డిమాండ్ చేయడంతో డిశ్చార్జ్ అయి తణుకులోని మరో ఆరోగ్యశ్రీ ఆస్పత్రిలో చేర్చి ఉచిత వైద్యసేవలు పొందాము. దీనిపై జిల్లా కలెక్టరుకు ఫిర్యాదు చేసినా ఇంతవరకు న్యాయం జరగలేదు. – దొడ్డిపట్ల మల్లిఖార్జున గంగాప్రసాద్, అత్తిలి -
కానిస్టేబుల్పై కేసు నమోదు
కుక్కునూరు: వివాహితను లైంగిక వేధింపులకు గురిచేసిన కానిస్టేబుల్పై మంగళవారం కేసు నమోదైంది. కుక్కునూరు ఎస్సై రాజారెడ్డి చెప్పిన వివరాల ప్రకారం, పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితను వెంకటేశ్వర్లు అనే కానిస్టేబుల్ లైంగిక వేధింపులకు పాల్పడుతూ, బ్లాక్ మెయిల్ చేశాడని ఇచ్చిన ఫిర్యాదు మేరకు సదరు కానిస్టేబుల్పై కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టినట్టు చెప్పారు. నూజివీడు: పల్లెర్లమూడికి చెందిన వైద్యురాలు ఉప్పలపాటి స్రవంతి న్యూరాలజీ విభాగంలో దేశవ్యాప్తంగా టాపర్గా నిలిచి ప్రతిష్టాత్మకమైన ప్రెసిడెంట్ గోల్డ్ మెడల్ పురస్కారాన్ని అందుకున్నారు. 2023 సంవత్సరానికి గాను న్యూరాలజీ విభాగంలో జాతీయ స్థాయిలో అత్యుత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెకు ఈ గౌరవం లభించింది. ఈ అవార్డును కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా చేతుల మీదుగా ఈనెల 23న ఢిల్లీలో జరిగిన కార్యక్రమంలో అందుకున్నట్లు స్రవంతి కుటుంబ సభ్యులు తెలిపారు. ప్రస్తుతం స్రవంతి హైదరాబాద్లోని అపోలో ఆసుపత్రిలో వైద్యురాలిగా పనిచేస్తున్నారు. ఆమె సాధించిన ఈ ఘనత పట్ల గ్రామస్తులు హర్షం వ్యక్తం చేస్తున్నారు -
కారు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి
నూజివీడు: కారు ఢీకొని ట్రాక్టర్ డ్రైవర్ మృతి చెందిన ఘటన పట్టణంలోని బైపాస్ రోడ్డులో సోమవారం అర్ధరాత్రి చోటుచేసుకుంది. హనుమంతులగూడెంకు చెందిన ట్రాక్టర్ డ్రైవర్ యండ్రపాటి రవికుమార్ (37) సోమవారం రాత్రి 8 గంటల సమయంలో పుల్లల లోడుతో ఉన్న ట్రాక్టర్ను తీసుకొని కృష్ణాజిల్లా బాపులపాడు మండలం వీరవల్లిలో గల ఫ్యాక్టరీ వద్ద పుల్లలను దించి తిరిగి వస్తుండగా అర్ధరాత్రి 12.30 గంటల సమయంలో నూజివీడు బైపాస్ రోడ్డులో గల బృందావన్ గార్డెన్ సమీపంలోకి వచ్చే సరికి వెనుక నుంచి కారు ట్రాక్టర్ ట్రక్కును ఢీకొంది. ఈ ప్రమాదంలో రవికుమార్ అక్కడికక్కడే మృతిచెందాడు. రవికుమార్కు భార్య వీర ధర్మవతి, ఇరువురు కుమార్తెలు ఉన్నారు. మృతుడి భార్య ఫిర్యాదు మేరకు పట్టణ సీఐ పీ సత్య శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. పోలవరం రూరల్: నేషనల్ పార్క్, టైగర్ జోన్ల పేరుతో ఆదివాసులను అడవుల నుంచి తరలిస్తే తిరుగుబాటు తప్పదని సీపీఐ ఎంఎల్ న్యూ డెమోక్రసీ జిల్లా కార్యదర్శి టి సుధాకర్ అన్నారు. గడ్డపల్లిలో మంగళవారం సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు పోరండ్ల శ్రీనివాస్ అధ్యక్షతన నిర్వహించిన జనరల్ బాడీ సమావేశంలో ఆయన మాట్లాడారు. నేషనల్ పార్క్ పేరుతో టైగర్ జోన్ల అభివృద్ధి పేరుతో గడ్డపల్లి పంచాయతీ గ్రామాలైన దారువాడ, చిలకలూరు, తంగేడుగొండ, గిన్నెపెల్లి, చీమలూరు, గడ్డపల్లి గ్రామాలను అడవి నుంచి ఖాళీ చేయించాలని అధికారులు చేస్తున్న ప్రయత్నాలను తప్పుపట్టారు. ఆదివాసులు, అడవి జంతువులు కలిసి మెలిసి జీవిస్తున్న ప్రకృతి సహజ సిద్ధ జీవన సౌందర్యం అడవిని ప్రభుత్వం ధ్వంసం చేయడం కోసం ప్రయత్నిస్తుందని విమర్శించారు. ఈ సమావేశంలో జిల్లా నాయకులు కారం రాఘవ, సరియం రామ్మోహన్, పీవైఎల్ జిల్లా కన్వీనర్ గురుగుంట్ల ప్రసాద్, అరుణోదయ రాష్ట్ర కమిటీ నాయకుడు నడపల ముక్క రెడ్డి, ముంజలూరు సర్పంచ్ కెచ్చల ముక్కారెడ్డి, గడ్డపల్లి వైస్ ప్రెసిడెంట్ ముసలారెడ్డి, పెద్ద ఎత్తున ఆదివాసీలు పాల్గొన్నారు. పోలవరం రూరల్: జిల్లాలో వడగాలులు తట్టుకోలేక ఐదుగురు మృతి చెందారు. పోలవరం పంచాయతీ పరిధిలోని బెస్తా వీధికి చెందిన పెదమల్లు అనసూయ (85) మంగళవారం వడదెబ్బ తగిలి ఇంట్లో తీవ్ర అస్వస్థతకు గురైంది. స్థానికులు ఆమెను స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించగా అక్కడ ప్రథమ చికిత్స అనంతరం రాజమండ్రి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా, అక్కడ మృతిచెందింది. నిద్రలోనే మరణం ఆగిరిపల్లి: మండలంలోని అనంతసాగరంనకు చెందిన ఈసం వెంకటేశ్వరరావు (70) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. సోమవారం ఉదయం వెంకటేశ్వరరావు తన గేదెలను మేపడానికి పొలంలోకి తోలుకొని వెళ్లాడు. ఎండవేడికి వడదెబ్బకు గురై తీవ్ర అస్వస్థతకు గురి అవడంతో కుటుంబ సభ్యులు ప్రథమ చికిత్స అందజేశారు. మంగళవారం ఉదయం వెంకటేశ్వరరావు నిద్రలోనే మరణించాడు. ఆయనకు ముగ్గురు కుమార్తెలు, ఒక కుమారుడు ఉన్నారు. ప్రభుత్వం ఆదుకోవాలని కుటుంబ సభ్యులు కోరుతున్నారు. ఉపాధి హామీ పనికి వెళ్లి.. కుక్కునూరు: వడదెబ్బకు గురై ఉపాధి హామీ కూలీ మృతి చెందాడు. కమ్మరిగూడెం గ్రామానికి చెందిన మిడియం ఎర్రయ్య (50) శనివారం ఉదయం ఉపాధి హామీ పనికి వెళ్లి ఇంటికి వచ్చి అస్వస్థతకు గురయ్యాడు. దీంతో కుటుంబ సభ్యులు స్థానికంగా వైద్యం చేయించారు. పరిస్థితి విషమించడంతో ఆదివారం భద్రాచలం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. చింతలపూడిలో... చింతలపూడి: స్థానిక వైఎస్సార్ కాలనీకి చెందిన తోట సీతామహాలక్ష్మి (37) సోమవారం వడదెబ్బ తగిలి తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. ఆమెను కుటుంబ సభ్యులు వెంటనే చింతలపూడి ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రథమ చికిత్స అనంతరం పరిస్థితి విషమించడంతో మెరుగైన వైద్యం కోసం ఏలూరు ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందినట్లు కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు. కొత్తగూడెంలో... దెందులూరు: కొత్తగూడెంలో ఉపాధి కూలీ లంకపల్లి ఏలియా (55) మంగళవారం వడదెబ్బకు మృతి చెందాడు. ఉదయం ఉపాధి పనికి వెళ్లి ఇంటికి వచ్చిన ఏలియా వాంతులు, విరోచనాలతో అస్వస్థతకు గురయ్యాడు. వెంటనే దెందులూరు ప్రభుత్వాసుపత్రి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. -
ఆటపాక కేంద్రంలో పక్షుల విలవిల
వీడిన ఆక్రమణల చెర పాలకోడేరు మండలం శృంగవృక్షంలో గ్రామాభివృద్ధి కమిటీ చొరవతో ప్రభుత్వ భూమిని ఆక్రమణల చెర నుంచి విడిపించారు. 8లో uకై కలూరు: అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యంతో ఆటపాక పక్షుల విహార కేంద్రంలో నీరు లేక పక్షులు పస్తులుంటున్నాయని పర్యావరణ ప్రేమికులు ప్రొఫెసర్ సుధాబత్తుల విజయకుమార్, సామాజిక కార్యకర్త ఎల్.ఎస్.భాస్కరరావులు ఆరోపించారు. నీరు లేక ఎడారిగా మారిన ఆటపాక పక్షుల విహార కేంద్రాన్ని మంగళవారం వీరు పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆటపాకలో 286 ఎకరాల విస్తీర్ణంలో పక్షుల విహార చెరువును అటవీశాఖ ఏర్పాటు చేసిందన్నారు. ఏటా సైబిరియా, నైజిరియా, అస్ట్రేలియా వంటి దూర ప్రాంతాల నుంచి విదేశీ వలస పక్షులు విడిదికి వస్తాయన్నారు. వేసవిలో నీటి కొరత వేధిస్తున్నా అటవీ అధికారులు ముందస్తు ప్రణాళిక రూపొందించడం లేదన్నారు. ఆటపాక పంట కాల్వ నుంచి నీటిని ఇక్కడకు తరలించే అవకాశం ఉన్నప్పటికీ పట్టించుకోవడం లేదన్నారు. సమీప పోల్రాజ్ కాల్వలో నీరు ఉంటున్నా నీరు నింపడం లేదన్నారు. అటపాక పక్షుల కేంద్రం చుట్టూ చేపల చెరువుల్లో నీరు పుష్పలంగా ఉన్నాయన్నారు. కేవలం అధికారుల నిర్లక్ష్యంతోనే పక్షుల కేంద్రం చెరువు బీటలు వారిందన్నారు. ఇప్పటికై న అధికారులు పక్షుల కేంద్రం చెరువులో ఎల్లప్పుడు నీరు ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. -
ఇంటర్నేషనల్ బీచ్ వాలీబాల్ పోటీలకు ఎంపిక
భీమవరం: ఇంటర్నేషనల్ పురుషుల బీచ్ వాలీబాల్ పోటీల్లో పాల్గొనే భారత్ జట్టు జిల్లాకు చెందిన బీచ్ వాలీబాల్ క్రీడాకారులు ముదునూరి రామకృష్ణంరాజు, పెన్మత్స కృష్ణ చైతన్య ఎంపికయ్యారని జిల్లా వాలీబాల్ అసోసియేషన్ అధ్యక్షుడు సత్యవామ మంగళవారం భీమవరంలో విలేకర్లకు తెలిపారు. జూన్ 4 నుంచి నాలుగు రోజులపాటు చైనీస్ తైపీలో జరగనున్న టూర్లో భారత జట్టుకు ప్రాతినిధ్యం వహించనున్నారన్నారు. పోటీలకు ఎంపికై న రామకృష్ణంరాజు, కృష్ణ చైతన్యలను సత్యవామ, కార్యదర్శి రాఘవేంద్రరావు, కోశాధికారి ప్రసాద్, ఆర్గనైజింగ్ సెక్రటరీ పవన్ కుమార్రాజు తదితరులు అభినందించారు. -
ఆక్వాకు గడ్డుకాలం
కై కలూరులో గళమెత్తిన రొయ్యల రైతులు కై కలూరు: కూటమి ప్రభుత్వం వచ్చిన వంద రోజుల్లోనే ఆక్వా రైతులందరికీ జోన్లతో సంబంధం లేకుండా విద్యుత్ యూనిట్ రూ.1.50కి అందిస్తానని సీఎం చంద్రబాబు వాగ్ధానం చేసి రెండేళ్లు అవుతోన్నా అమలు చేయడం లేదని రొయ్యల రైతులు మండిపడ్డారు. డెల్టా ఆక్వా ఫార్మర్స్ అసోషియేషన్ పేరుతో ముదినూరి లింగరాజు ఆధ్వర్యంలో ఉమ్మడి పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల స్థాయి రొయ్యల రైతుల సమావేశం సీఎన్నార్ గార్డెన్లో మంగళవారం జరిగింది. రాష్ట్ర చేపల రైతు సంఘ అధ్యక్షుడు తాడినాడ బాబు అధ్యక్షతన జరిగిన సమావేశంలో జై భారత్, క్షీరారామ ఆక్వా అసోషియేషన్ అధ్యక్షుడు గొట్టుముక్కల గాంధి భగవాన్రాజు మాట్లాడుతూ రాత్రికి రాత్రి రొయ్యల మేతల రేట్లు పెంచుతూ నిర్ణయం తీసుకోవడం అన్యాయమన్నారు. సోయా, ఫిష్ ఆయిల్ వంటి మేతల ముడిసరుకులు ధరలు తగ్గినప్పుడు కంపెనీలు రేట్లు ఎందుకు తగ్గించలేదని ప్రశ్నించారు. కోనసీమ ఆక్వా అసోషియేషన్ అధ్యక్షుడు సీహెచ్.నాగభూషణరావు మాట్లాడుతూ గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి తీసుకొచ్చిన అప్సడా యాక్టులో రైతులకు అవసరమైన ఎన్నో చట్టాలు ఉన్నాయన్నారు. వాటిని అమలు చేయడం లేదని విమర్శించారు. భీమవరం ఆక్వా అసోషియేషన్ అధ్యక్షుడు తులశి రాంబాబు మాట్లాడుతూ రైతుల నష్టాల కారణమవుతున్న సిండికేట్లపై పార్టీలకతీతంగా అందరూ కలసి పోరాటం చేయాలన్నారు. మరో సంఘ నాయకుడు సుబ్బరాజు మాట్లాడుతూ ప్రభుత్వం ధరల స్థిరీకరణకు ప్రాథన్యత ఇవ్వాలన్నారు. యువ రొయ్యల రైతు యువరాజు మాట్లాడుతూ హేచరీలలో రొయ్య సీడ్ వల్ల నష్టపోతే రైతులు సోషల్ మీడియా గ్రూప్లో పోస్టు చేస్తే మరొకరు నష్టపోరన్నారు. కార్యక్రమంలో కై కలూరు ఏఎంసీ చైర్మన్ పెన్మత్స త్రినాథరాజు, ప్రకాశం జిల్లా ఆక్వా సంఘ నాయకుడు కుమార్, ఆక్వా రైతులు పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్, సయ్యపురాజు గుర్రాజు, గాదిరాజు కిట్టు, బొడ్డు నోబుల్, నర్సిపల్లి రవి, బీకేఎం.నానీ, బలే ఏసురాజు, జంపన రామలింగరాజు, భాస్కరరాజు, బూరుబోయిన శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నేటి నుంచి నూతన క్యూ కాంప్లెక్స్ సేవలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ఇటీవల ప్రారంభమైన శాశ్వత క్యూ కాంప్లెక్స్ భవనం బుధవారం నుంచి భక్తులకు అందుబాటులోకి రానుంది. ఈ క్రమంలో దర్శన మార్గాలను దేవస్థానం అధికారులు మార్పు చేశారు. ఇకపై స్వామివారి దర్శనానికి వెళ్లే భక్తులు జంట గోపురాల మీదుగా, నూతన అనివెట్టి మండపంలోకి ప్రవేశించి, అక్కడి నుంచి కొత్త క్యూ కాంప్లెక్స్లోని కంపార్ట్మెంట్లలోకి చేరుకోవాలి. ఆ తరువాత దక్షిణ రాజగోపురం మీదుగా ఆలయంలోకి ప్రవేశించి, క్యూలైన్ల గుండా స్వామి, అమ్మవార్ల దర్శనానికి వెళ్లాలి. దర్శనానంతరం ఎప్పటిలానే తూర్పు రాజగోపురం మీదుగా బయటకు వెళ్లాలి. ఆ తరువాత పాత అనివెట్టి మండంపం లోంచి షాపింగ్ కాంప్లెక్స్ మీదుగా పార్కింగ్ ప్రదేశాలకు చేరుకోవాలి. అలాగే వీఐపీలు, వీవీఐపీలు తూర్పు రాజగోపురం మీదుగా, అదేవిధంగా గ్రామస్తులు, ఆలయ సిబ్బంది, రూ. 500 ల (అంతరాలయ) దర్శనం టికెట్లు కొనుగోలు చేసిన భక్తులు, నిత్య కల్యాణంలో పాల్గొనే వారు ఉత్తర రాజగోపురం మీదుగా, అలాగే అర్చక స్వాములు పడమర రాజగోపురం మీదుగా ఆలయంలోకి ప్రవేశించేలా ఏర్పాట్లు చేశారు. ఇదిలా ఉంటే క్యూ కాంప్లెక్స్లోని ఏర్పాట్లను ఆలయ ఈఓ వేండ్ర త్రినాధరావు, ఈఈ డీవీ భాస్కర్లు పరిశీలించారు. బుధవారం ఉదయం 6 గంటల నుంచి ఈ కాంప్లెక్స్ను పూర్తి స్థాయిలో వినియోగంలోకి తేనున్నారు. అన్ని సౌకర్యాలతో.. రూ. 12.50 కోట్లతో ఈ నూతన క్యూ కాంప్లెక్స్ భవనాన్ని నిర్మించారు. ఇందులో ఉన్న 6 కంపార్ట్మెంట్లలో అన్ని సౌకర్యాలను సమకూర్చారు. ఒక్కో కంపార్ట్మెంట్లో 250 మంది భక్తులు కూర్చునేందుకు వీలుగా స్టీల్ బల్లలను ఏర్పాటు చేశారు. అలాగే ప్రతి కంపార్ట్మెంట్లో 5 సీసీ కెమేరాలు, ఒక డిజిటల్ స్క్రీన్, సెంట్రలైజ్డ్ సౌండ్ సిస్టమ్ను అమర్చారు. ఒక్కో దాంట్లో ప్రత్యేకంగా ఒక హై వాల్యూమ్–లో స్పీడ్ (హెచ్వీఎల్ఎస్) సీలింగ్ ఫ్యాన్ను, అలాగే 12 సాధారణ (చిన్న) సీలింగ్ ఫ్యాన్లను అమర్చారు. క్యూ కాంప్లెక్స్ పక్కనే మరుగుదొడ్లను నిర్మించారు. వాటిలోకి వెళ్లేందుకు వీలుగా ప్రతి కంపార్ట్మెంట్లో ఒక ఎగ్జిట్ మర్గాన్ని ఏర్పాటు చేశారు. ఈ నూతన క్యూ కాంప్లెక్స్లో భక్తులు మరింత ఉపశమనాన్ని పొందనున్నారు. ఇప్పటి వరకు భక్తులకు సేవలందించిన తాత్కాలిక వైకుంఠం క్యూ కాంప్లెక్స్ గెడ కర్రలు, టార్పాలిన్లతో నిర్మించింది కావడంతో వేసవిలో ఎండ వేడి ఎక్కువగా లోపలికి వస్తోంది. దేవస్థానం అధికారులు జంబో కూలర్ల ద్వారా ఆ వేడి నుంచి భక్తులకు రక్షణ కల్పిస్తున్నారు. అయితే ఇక శాశ్వత క్యూ కాంప్లెక్స్ భవనం వాడుకలోకి వస్తోంది కాబట్టి ఇకపై ఆ ఇబ్బందులు తొలగినట్టే. ఇక ప్రధాన రాజగోపురం మీదుగానే ఆలయ ప్రవేశం -
వైద్యం.. అపహాస్యం
తణుకు అర్బన్: జిల్లాలో వైద్యం.. అపహాస్యంగా మారింది. అధికారుల పర్యవేక్షణ కొరవడడంతో ప్రైవేటు ఆస్పత్రులు, స్కానింగ్ సెంటర్లు పుట్టుగొడుగుల్లా పుట్టుకొస్తున్నాయి. ప్రైవేటు ఆస్పత్రుల ఏర్పాటులో నిబంధనలు పాటించకపోయినా, కొన్నిరకాల ధృవపత్రాలు సక్రమంగా లేకపోయినా వారికి అనుమతులు ఇవ్వడంలో వైద్యారోగ్య శాఖ రాజకీయ సిఫార్సులు, ఇతర వ్యవహారాలకు తలొగ్గి పూర్తిస్థాయిలో పరిశీలన లేకుండానే అనుమతులు ఇస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. వైఫలంపై విమర్శలు ఈనెల 16న తణుకులో బీహార్కు చెందిన రింకూ కుమారి అనే గర్భిణిని ఒక ఆర్ఎంపీ వైద్యుడు పైడిపర్రులోని స్టార్ హాస్పిటల్లో చేర్చగా ఊరు, పేరుతోపాటు కేస్ హిస్టరీ తెలియకుండానే శస్త్రచికిత్స చేయడం.. కొద్ది గంటల్లోనే ఆడశిశువుకు జన్మనిచ్చి బాలింత మృతి చెందింది. మూడేళ్లుగా అనుమతులు లేని ఆస్పత్రిలో శస్త్రచికిత్సలు జరుగుతున్నాయంటే వైద్య ఆరోగ్య శాఖ ఏం చేస్తుందనేది ప్రశ్నగా మిగులుతోంది. పైగా వైద్యం వికటించి బాలింత చనిపోతే వారం రోజులకు కానీ వైద్య ఆరోగ్య శాఖ స్పందిచకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఇక తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రిలో గతనెల 28న ఉండ్రాజవరానికి చెందిన గర్భిణి మానుకొండ ప్రవల్లిక రెండు చెవులు లేని ఆడ శిశువుకు జన్మనిచ్చింది. సదరు గర్భిణి 22వ వారంలో తణుకు వేవ్ స్కానింగ్ సెంటర్లో టిఫా స్కానింగ్ చేయించుకోగా అన్ని అవయవాలు బాగానే ఉన్నట్లుగా రిపోర్టు ఇచ్చింది. స్కానింగ్ సెంటర్ వైఫల్యంపై వివరణ కోరగా టిఫా స్కానింగ్లో చెవులు ప్రొటోకాల్ కాదని తణుకు వేవ్ స్కానింగ్ సెంటర్ రేడియాలజిస్ట్ వైద్య ఆరోగ్య శాఖకు సంజాయిషీ ఇవ్వడం, అదే నివేదికను సమర్థిస్తూ డీఎంహెచ్వో డాక్టర్ జి.గీతాబాయ్ సైతం పత్రికా ప్రకటనగా ఇస్తూ సమర్థించుకోవడం సైతం పలు విమర్శలకు తావిస్తోంది. ప్రైవేటు వైద్యశాలలో అనుమతి లేకుండా ప్రసవాలు బాలింత మృతి జరిగిన వారం రోజులకు విచారణ రెండు చెవులు లేకుండా బిడ్డ జన్మించినా పట్టని వైనం స్కానింగ్ సెంటర్ల నిర్లక్ష్యం.. పట్టించుకోని అధికారులు -
రొయ్య ధరపై కుదరని సయోధ్య
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం కలెక్టరేట్లో కలెక్టర్ నాగరాణి ఆధ్వర్యంలో జరిగిన రొయ్యల ఎగుమతిదారులు, ఆక్వా సంఘ నాయకులు, రైతుల సమావేశం ఆశించిన ఫలితాన్ని ఇవ్వలేదు. రొయ్యల ధరల పెరుగుదల లేదా స్థిరత్వంపై ఎక్స్పోర్టర్ల నుంచి ఎలాంటి హామీ రాకపోవడంతో రైతులకు నిరాశే ఎదురైంది. ఈ సమావేశానికి కొందరు ఎక్స్పోర్టర్లు మాత్రమే హాజరయ్యారు. ఎగుమతిదారుల నాయకుడు తోట జగధీష్ మాట్లాడుతూ.. ఈక్వెడార్, చైనా దేశాలలో రొయ్యల ఉత్పత్తి విపరీతంగా పెరగడం వల్లే మన రొయ్యలకు అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్, ధరలు తగ్గుతున్నాయని వెల్లడించారు. కోవిడ్ సమయంలోనూ ఇలాంటి పరిస్థితే తలెత్తిందని, దీనికి తోడు ప్రాసెసింగ్ ప్లాంట్లలో లేబర్ సమస్య కూడా ఉందని పేర్కొంటూ, రైతులు ఆందోళన చెందవద్దని సూచించారు. ఆక్వా రైతు సంఘం నాయకులు తులసి రాంబాబు, సుబ్బరాజులు మాట్లాడుతూ.. కేవలం పది రోజుల వ్యవధిలోనే టన్నుకు రూ.50 వేల వరకు రైతు నష్టపోయాడని ఆవేదన వ్యక్తం చేశారు. రొయ్యల ధరలు కనీసం 10 నుంచి 15 రోజుల పాటైనా స్థిరంగా ఉండేలా చూడాలని కోరారు. ఇటీవల జరిగిన సమావేశంలో తీసుకున్న నిర్ణయాలను ఎక్స్పోర్టర్లు అమలు చేయడం లేదని వారు ఆరోపించారు. ఈ సందర్భంగా కలెక్టర్ నాగరాణి కొన్ని సూచనలు చేశారు. ఎక్స్పోర్టర్లు, ఆక్వా రైతులు సమన్వయంతో ముందుకు వెళ్లాలని కలెక్టర్ నాగరాణి సూచించారు. ప్రభుత్వ ఆదేశాల ప్రకారం ఫీడ్ (మేత) ధరల విషయంలో రైతులకు ఉపశమనం కలిగించామని, లేబర్ సమస్యను కూడా వారం రోజుల్లోగా పరిష్కరిస్తామని తెలిపారు. ఎగుమతిదారులు ధరలను మార్చే ముందు రైతులతో చర్చించాలని, నిర్ణయించిన రేట్లు కనీసం 15 రోజుల వరకు స్థిరంగా ఉండేలా చూడాలని, అప్సడా రిజిస్ట్రేషన్లను వేగవంతం చేయాలని సూచించారు. అంతర్జాతీయ మార్కెట్ పరిస్థితుల వల్ల పెట్టుబడి వ్యయం పెరిగి, రొయ్యల ధరలు తగ్గడంపై రైతులు ఆందోళన చెందవద్దని, పరిస్థితి త్వరలోనే చక్కబడుతుందని భరోసా ఇచ్చారు. సమావేశంలో అప్సడా డైరెక్టర్ వి.సత్యనారాయణరాజు, జిల్లా మత్స్యశాఖ అధికారి డి.శ్రీనివాస్, ఎంపెడా డీడీ ఆనంద్, ఆక్వా రైతులు, హ్యాచరీ యజమానులు, ఫీడ్ కంపెనీ ప్రతినిధులు పాల్గొన్నారు. -
పారిశ్రామిక అభివృద్ధికి కృషి చేయాలి
ఏలూరు (టూటౌన్): జిల్లా గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించేందుకు అధికారులు క్షేత్రస్థాయిలో పర్యటించి లక్ష్యాలు పూర్తి చేయాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అన్నారు. మంగళవారం కలెక్టరేట్లో జిల్లా పారిశ్రామిక, ఎగుమతి ప్రోత్సాహక కమిటీ సమావేశంలో సంబంధిత శాఖల అధికారులతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ గిరిజన తండాల్లో యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులు నాణ్యతను మరింత పెంచి, అందమైన ప్యాకింగులు, రవాణా, మార్కెటు సౌకర్యం కల్పించి గిరిజన కుటుంబాలు ఆర్థికంగా బలోపేతం చేయాలన్నారు. నిరుద్యోగ యువతకు పరిశ్రమలు స్థాపనకు అవగాహన కల్పించి, సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు జారీ చేయాలన్నారు. జిల్లాలో 22ఏ భూ సమస్యల కింద అందిన దరఖాస్తులను క్షేత్రస్థాయిలో పరిశీలించి నిబంధనల మేరకు పరిష్కారానికి చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ రాష్ట్ర భూపరిపాలన ప్రధాన కమిషనర్ జి.జయలక్ష్మికి తెలిపారు. జూమ్ కాన్ఫరెన్స్ సమీక్ష ఈ విషయం వెల్లడించారు. -
30న ‘సర్’పై అవగాహన
వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ కై కలూరు: ఎన్నికల స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (సర్)పై ఈనెల 30న సాయంత్రం 4 గంటలకు కై కలూరు సీతారామ ఫంక్షన్ హాలులో పార్టీ బూత్ లెవల్ ఏజెంట్లకు అవగాహన కార్యక్రమం నిర్వహించనున్నామని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) సోమవారం తెలిపారు. ఓటర్ల జాబితాలపై తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మార్పులు, చేర్పులు, ప్రధానంగా సర్ కార్యక్రమంపై అవగాహన కలిగిస్తామన్నారు. బూత్స్థాయి ఏజెంట్లు తప్పక హాజరుకావాలని పిలుపునిచ్చారు. బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబు తొలి సంతకం మెగా డీఎస్సీ–2025లో కుంభకోణాలు వెలుగులోకి వస్తున్నాయని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాల రాజు అన్నారు. సోమవారం ఆయన దుద్దుకూరులో విలేకరులతో మాట్లాడుతూ విద్యాశాఖలో ఉపాధ్యాయ ఉద్యోగాల భర్తీలో జరిగిన అక్రమాలు ఒక్కొక్కటిగా బయటకు వస్తున్నాయన్నారు. డీఎస్సీ స్పోర్ట్స్ కోటాలో 421 పోస్టులు అమ్ముకున్న వైనం ఇప్పటికే బట్టబయలైందన్నారు. ఇదేక్రమంలో జనరల్ డీఎస్సీలో కూడా భారీగా అ క్రమాలు వెలుగులోకి వస్తున్నాయన్నారు. చంద్రబా బు నిరుద్యోగులను నిండా ముంచారని తీవ్రంగా విమర్శించారు. ఈ వ్యవహారంపై సమగ్ర విచారణ చేసి నిరుద్యోగులకు న్యాయం చేయాలని డిమాండ్ చేశారు. అక్రమాలకు బాధ్యత వహిస్తూ తక్షణమే మంత్రి పదవి నుంచి లోకేష్ను తప్పించాలని డిమాండ్ చేశారు. -
ఓటర్ వెరిఫికేషన్ ప్రరకియ కీలకం
దెందులూరు: ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియ అత్యంత కీలకమని, పార్టీలోని అన్ని విభాగాలు పూర్తిస్థాయి లో అవగాహన పెంచుకుని అప్రమత్తంగా ఉండా లని వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయ రాష్ట్ర కార్యదర్శి శివారెడ్డి అన్నారు. సోమవారం రాత్రి పెదవేగి మండలం రాయన్నపాలెంలో దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయిచౌదరి క్యాంపు కార్యాలయంలో ‘సర్’పై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా శివారెడ్డి మాట్లాడుతూ ఓటర్ వెరిఫికేషన్పై పూర్తిస్థాయిలో శిక్షణ ఇస్తామని, పార్టీ శ్రేణులంతా అత్యంత శ్రద్ధతో సేవలందించాలన్నారు. పార్టీ జి ల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) మాట్లాడుతూ రానున్నది జగనన్న ప్రభుత్వమే అని, పార్టీ శ్రేణులంతా విజయానికి రెట్టింపు ఉత్సాహంతో పనిచేయాలన్నారు. రెండేళ్లుగా పార్టీ శ్రేణు లు పడుతున్న ఇబ్బందులను పార్టీ అధ్యక్షుడు వై ఎస్ జగన్మోహన్రెడ్డితో పాటు ప్రజలంతా గమనిస్తున్నారన్నారు. పార్టీ నిర్దేశించిన అంశాలపై పూర్తి అవగాహన పెంచుకోవాలన్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజవర్గ సమన్వయకర్త మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బాయిచౌదరి మాట్లాడుతూ ఎన్నికల ప్రక్రియలో అప్రమత్తంగా లేకపోవడం వల్లే దేశంలో పలు రాష్ట్రాల్లో బలమైన నాయకులు ఓటమి చెందారని, పార్టీ శ్రేణులంతా ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై పూర్తిస్థాయిలో అవగాహన పెంపొందించుకోవాలన్నారు. ఎన్నికల ప్రక్రియ పూర్తయ్యేంత వరకూ అప్రమత్తంగా ఉండాలన్నారు. కొత్తగా పెళ్లయిన వారు, మృతులు, వలసలు, దీర్ఘకాలిక వ్యా ధిగ్రస్తుల ఓట్ల విషయంలో మరింత శ్రద్ధ చూపాలన్నారు. నియోజకవర్గ పరిశీలకుడు వి.వెంకటేశ్వర రావు, ఏపీ ఆయిల్ఫెడ్ మాజీ చైర్మన్ కొఠారు రామచంద్రరావు, జెడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు, జెడ్పీటీసీలు ఎన్.లీలానవకాంతం, మండల సరస్వతి, ఎంపీపీలు తాతా రమ్యశ్రీ, శ్రీనివాసరాజు, బత్తుల రత్నకుమారి, మండల పార్టీ అధ్యక్షులు కామిరెడ్డి నాని, అప్పన ప్రసాద్, జానంపేట బాబు, దెందులూరు మండల వైస్ ఎంపీపీ వే మూరి జితేంద్ర, రాష్ట్ర కార్యదర్శులు కట్టా ఏసుబా బు, డీవీఆర్కే చౌదరి, గొల్ల కిరణ్, జిల్లా ఉపా ధ్యక్షుడు మేకా లక్ష్మణరావు, ఏలూరు రూరల్ మండ ల అధ్యక్షుడు తేరా ఆనంద్ తదితరులు పాల్గొన్నారు. -
పెట్రోలు బంకు వద్ద మంటలు
తణుకు అర్బన్ : తణుకు పట్టణ పరిధిలోని ఇరగవరం రోడ్డులో పెట్రోలు బంకు ప్రాంతంలో వ్యాపించిన మంటలు ఆందోళన రేకెత్తించాయి. కన్యకా ఫిల్లింగ్ సెంటర్ సరిహద్దులోని పొలంలో ఏపుగా ఎదిగిన పచ్చగడ్డి ఎండకు ఎండిపోవడంతో ఒక్కసారిగా మంటలు వ్యాపించాయి. మంటలకు అతి సమీపంలోనే బంకులోని పెట్రోలు పంపు ఉండడంతో బంకు సిబ్బందితో పాటు ప్రయాణికులు కొంతసేపు తీవ్ర ఆందోళనకు గురయ్యారు. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది హుటాహుటిన ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేయడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు. సాక్షి టాస్క్ఫోర్స్: ఏలూరు జిల్లా కుక్కునూరు పోలీస్స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న ఓ కానిస్టేబుల్ తనను వేధింపులకు గురిచేస్తున్నాడంటూ ఆ మండలానికి చెందిన ఒక వివాహిత ఆరోపణలు చేసింది. ఆమె తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని పెద్దరావిగూడెం గ్రామానికి చెందిన వివాహితకు 2023లో కుక్కునూరు స్టేషన్ పరిధిలో ఎస్ఈబీ కానిస్టేబుల్గా విధులు నిర్వహిస్తున్న ఒక వ్యక్తి పరిచయమయ్యాడు. సారా అమ్మేవారి సమాచారం అందించాలంటూ తనను ఇన్ఫార్మర్గా ఉపయోగించుకుని, ఆ క్రమంలో తనకు దగ్గరయ్యాడని ఆమె తెలిపింది. ఈ వ్యవహారం తన భర్తకు తెలియడంతో అప్పటి నుంచి ఆ కానిస్టేబుల్తో మాట్లాడటం మానేశానని వివరించింది. ప్రస్తుతం కుక్కునూరు స్టేషన్లో విధులు నిర్వహిస్తున్న సదరు కానిస్టేబుల్, తనను వేధిస్తున్నాడని ఆరోపించింది. చెప్పినట్టు వినకపోతే గతంలో తీసిన వీడియోలు, రికార్డింగ్లు బయటపెడతానని, ఆర్థికంగా దెబ్బతీస్తానని, అట్రాసిటీ కేసు పెడతానని, తన భర్తను, పిల్లలను చంపుతానని బెదిరిస్తున్నాడని ఆమె వాపోయింది. -
25 శాతం ఉచిత సీట్లు అమలు చేయాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని అన్ని ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఆర్థికంగా వెనుకబడిన విద్యార్థులకు తప్పనిసరిగా 25 శాతం ఉచిత సీట్లు కేటాయించాలని భారత చైతన్య యువజన పార్టీ రాష్ట్ర కో–కన్వీనర్ నెరుసు నాగమణి యాదవ్ డిమాండ్ చేశారు. సోమవారం ఆమె కలెక్టరేట్ వద్ద నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. ఈ అంశంపై ప్రభుత్వం స్పష్టమైన చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉన్నప్పటికీ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ పట్టించుకోవడం లేదని ఆరోపించారు. రైట్ టు ఎడ్యుకేషన్ (ఆర్టీఈ) చట్టాన్ని వచ్చే విద్యా సంవత్సరం నుంచి కచ్చితంగా అమలు చేయాలని, ప్రతి ప్రైవేట్ పాఠశాలలో 25 శాతం సీట్లు పేద మరియు వెనుకబడిన వర్గాల విద్యార్థులకు ఉచితంగా ఇవ్వాలని ఆమె పేర్కొన్నారు. ఆ సీట్ల వివరాలు, ఫీజుల వివరాలను పాఠశాలల ముందు బహిరంగంగా ప్రదర్శించేలా ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరారు. రాష్ట్రంలో అనుమతి లేకుండా నడుస్తున్న ప్రైవేట్ విద్యాసంస్థలపై ప్రత్యేక తనిఖీలు నిర్వహించి చట్టపరమైన చర్యలు తీసుకోవాలని నాగమణి యాదవ్ డిమాండ్ చేశారు. అలాగే ప్రైవేట్ ఉపాధ్యాయులకు సరైన జీతాలు, ఉద్యోగ భద్రత, కనీస సౌకర్యాలు కల్పించకుండా వేధిస్తున్న యాజమాన్యాలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. ఏలూరు జిల్లా యూత్ కన్వీనర్ వీర్ల పాపారావు, కై కలూరు నియోజకవర్గం కన్వీనర్ తోకల రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించేందుకు పలు కంపెనీలు జాబ్ డ్రైవ్ను నిర్వహిస్తున్నాయని జిల్లా ఉపాధి అధికారి పీవీ రమేష్ కుమార్ అన్నారు. సోమవారం జిల్లా ఉపాధి కార్యాలయంలో నేషనల్ కెరీర్ సర్వీసులో ఈ నెల 29న ఉదయం 10 గంటలకు డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఈ డ్రైవ్లో క్లౌడ్మెలో, సేఫ్మాక్ సొసైటీ, ఎస్బీఐ లైఫ్ బీమా కంపెనీలు ఉంటాయన్నారు. పదో తరగతి నుంచి డిగ్రీ వరకు చదువుకున్న వారు పాల్గొనవచ్చన్నారు. నెలకు రూ.13 వేల నుంచి రూ.30 వేల వరకు జీతం ఉంటుందని, మరిన్ని వివరాల కోసం 8886882032, 7416118388 నెంబర్లలో సంప్రదించాలన్నారు. -
274 అర్జీల స్వీకరణ
ఏలూరు (టూటౌన్): ప్రజాసమస్యల పరిష్కార వేదికలో అందిన ప్రతి సమస్యను పరిష్కరించే దిశగా అధికారులు ప్రత్యేక దృష్టి పెట్టాలని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్లో సోమవారం జిల్లాస్థాయి ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లలో మొత్తం 274 అర్జీలు అందాయని, అర్జీల పరిష్కారంలో నిర్లక్ష్యం వహించే అధికారులపై చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. ఇన్చార్జి డీఆర్వో దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో పదో తరగతి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు ప్రశాంతంగా ప్రారంభమయ్యాయి. సోమవారం తెలుగు పరీక్షకు 2,253 మంది విద్యార్థులకు 1,562 మంది హాజరయ్యారు. అలాగే ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న ఎస్ఎస్సీ, ఇంటర్మీడియెట్ సప్లిమెంటరీ పరీక్షలు సైతం ప్రారంభమయ్యాయి. ఎస్ఎస్సీ తెలుగు పరీక్షకు 173 మందికి 144 మంది, ఇంటర్ ఇంగ్లిష్ పరీక్షకు 43 మందికి 32 మంది హాజరయ్యారు. ఫ్లయింగ్ స్క్వాడ్ బృందాలు 19 కేంద్రాలను, జిల్లా విద్యాశాఖాధికారి 7 కేంద్రాలను, ప్రభుత్వ పరీక్షల సమాయ కమిషనర్ 5 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని డీఈఓ ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో సోమవారం జరిగిన ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలకు 4,964 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఉదయం 31 కేంద్రాల్లో ఫస్టియర్ పరీక్షలకు 3,480 మంది హాజరయ్యారు. వీరిలో 3,160 మంది జనరల్ విద్యార్థులకు 3,003 మంది, 518 మంది ఒకేషనల్ విద్యార్థులకు 477 మందికి 436 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం 30 కేంద్రాల్లో సెకండియర్ పరీక్షలకు 1,484 మంది హాజరయ్యారు. వీరిలో 1,365 మంది జనరల్ విద్యార్థులకు 1,243 మంది, 271 మంది ఒకేషనల్ విద్యార్థులకు 241 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ తెలిపారు. ఏలూరు (టూటౌన్: జిల్లాలో జలధార–జలహారతి కార్యక్రమంలో ఇరిగేషన్, డ్వామా అధికారులు సమన్వయంతో పనిచేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లాలో జలధార కార్యక్రమంలో చేపట్టిన పనుల ప్రగతిపై కలెక్టర్ సమీక్షించారు. రూ.82.22 కోట్లతో 1,929 పనులు మంజూరు కాగా, 380 పనులు పూర్తి అయ్యాయన్నారు. కాలువల్లో డీసిల్టింగ్ పనులను ఇరిగేషన్ శాఖ నిర్దేశించిన ప్రమాణాల మేరకు చేయాలన్నారు. పనుల్లో నాణ్యతా లోపం గుర్తిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. డ్వామా పీడీ సుబ్బారావు, అదనపు పీడీ రాజశేఖర్, ఇరిగేషన్ శాఖ అధికారులు, ఎంపీడీఓలు, డ్వామా ఏపీడీ పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రస్తుత వేసవిలో పెరుగుతున్న విద్యుత్ డిమాండ్ను సమర్థవంతంగా ఎదుర్కొనేందుకు ప్రత్యేక కార్యాచరణ ప్రణాళిక అమలు చేస్తున్నామని విద్యుత్ సరఫరాలో అంతరాయం కలగకుండా నిరంతరం పర్యవేక్షిస్తున్నామని ఈపీడీసీఎల్ ఏలూరు సర్కిల్ సూ పరింటెండింగ్ ఇంజనీర్ పి.సాల్మన్రాజు ప్రకటనలో తెలిపారు. జిల్లాలో రానున్న ఐదు రో జులపాటు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, ఈ మేరకు పూర్తి అప్రమత్తతతో ఉన్నామన్నారు. జిల్లావ్యాప్తంగా సు మా రు 400 ట్రాన్స్ఫార్మర్లు అందుబాటులో ఉంచా మన్నారు. అలాగే ప్రత్యేక కంట్రోల్ రూములు ఏర్పాటు చేశామన్నారు. పర్యవేక్షక ఇంజనీర్, ఏలూరు: 9440812702, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, జంగారెడ్డిగూడెం 9491049797, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్, ఏలూరు 9440812704, వి ద్యుత్ శాఖ టోల్ ఫ్రీ నంబర్ 1912, లోడ్ మోనిటరింగ్ సెల్స్ జంగారెడ్డిగూడెం డివిజన్ 9491030712, ఏలూరు డివిజన్ 94409 04037, ఏలూరు సర్కిల్ 9440902926 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. -
బాలలను నిరంతరం పర్యవేక్షించాలి
దెందులూరు: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యా య సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి సో మవారం ప్రపంచ తప్పిపోయిన పిల్లల దినోత్సవ సందర్భంగా ఏలూరు రూరల్ ఎంపీడీఓ కార్యాలయంలో ఉమ్మడి జిల్లా అధికారులతో సమావేశం నిర్వహించారు. ప్రస్తుత సమాజంలో ఇన్స్ట్రాగామ్, సోషల్ మీడియా ప్రభావం బాలలపై ఎక్కువగా ఉందని, తల్లిదండ్రులు నిరంతరం పర్యవేక్షించాలని, అవసరమైతే తప్ప సెల్ఫోన్లను ఇవ్వవద్దని అ న్నారు. బాలలు క్షణికావేశంలో ఇంటి నుంచి వెళ్లిపోవడం, సంఘ విద్రోహ శక్తులు మాయమాటలతో అక్రమ రవాణాకు పాల్పడటం వంటివి జరుగుతున్నాయని అన్నారు. ఉమ్మడి కుటుంబాలు లేకపోవడం, పెద్దలు క్రమశిక్షణ నేర్పకపోవడంతో పిల్లలు ఇలా తయారవుతున్నారని, అందరూ ఉమ్మడి కుటుంబ వ్యవస్థను ప్రో త్సహించాలని సూచించారు. అపరిచితులు, అనుమానితుల గురించి బాలలను అప్రమత్తం చేయాలని, అవసరమైతే 15100 ద్వారా న్యాయ సహాయం పొందాలని ఆమె సూచించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల బాలల సంరక్షణ అధికారులు సూర్యచక్రవేణి, ఆర్.రాజేష్కుమార్, మహిళా పోలీస్స్టేషన్ సీఐ సుబ్బారావు, సీడబ్ల్యూసీ ఇన్చార్జి చైర్పర్సన్ పి.వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మి -
నారికేళం.. ధర పతనం
● వెయ్యి కాయలు రూ.12 వేలు ● రూ.8 వేల వరకూ తగ్గిన ధర ● జిల్లాలో 25 వేల ఎకరాల్లో కొబ్బరి సాగు భీమవరం: జిల్లాలో వరితో పాటు ఆక్వా, కొబ్బరి సాగుకు రైతులు ప్రాధాన్యమిస్తున్నారు. జిల్లాలో కొబ్బరితోటల సాగుతోపాటు పెరటిదొడ్లు, పుంత గట్లు, ఆర్అండ్బీ, పంచాయతీయ రాజ్ రోడ్లు వెంబడి ఎక్కువగా కొబ్బరిని పెంచుతున్నారు. రెండు నెలలుగా దిగుబడి, ధర తగ్గడంతో కొబ్బరి రైతులు ఆందోళన చెందుతున్నారు. 20 మండలాలు.. 25 వేల ఎకరాలు జిల్లాలోని 20 మండలాల్లో సుమారు 25 వేల ఎకరాల్లో కొబ్బరి తోటలు ఉన్నాయి. యలమంచిలి, పెనుగొండ, పోడూరు, వీరవాసరం, పాలకొల్లు, పాలకోడేరు తదితర మండలాల్లో కొబ్బరి తోటలు ఎక్కువగా ఉన్నాయి. కొన్నేళ్లుగా ఆక్వా సాగు పెరుగుతుండటంతో చెరువు గట్లపై కొబ్బరి పెంపకం కూడా పెరుగుతోంది. కొబ్బరి తోటల్లో ఎకరా విస్తీర్ణంలో 60 చెట్లకు గాను కొందరు 90 వరకు చెట్లు పెంచుతున్నారు. కొబ్బరి సాగుకు ఖర్చు తక్కువగా ఉండటంతో రైతులు ఎక్కువ ఆసక్తి చూపేవారు. అయితే కొన్నేళ్లుగా కొబ్బరికి నల్లమట్టి పురుగు, తెల్లదోమ వంటి తెగుళ్లు ఆశించడంతో పాటు చెట్టకు ఎరువులు వేయాల్సి రావడంతో పెట్టుబడి వ్యయం పెరిగిపోయింది. దీనికితోడు కొబ్బరి దింపు, వ లుపు ఖర్చులు కూడా గణనీయంగా పెరగడంతో కొబ్బరి ద్వారా ఆశించిన ఆదాయం రావడం లేదు. దిగుబడి.. ధరలు తగ్గుదలు ఐదారు నెలలుగా కొబ్బరి దిగుబడులు బాగుండటంతో పాటు ధరలు కూడా పెరిగాయి. జిల్లాలో కొ బ్బరి ప్రధాన వ్యాపార కేంద్రమైన పాలకొల్లు నుంచి దాదాపు 100 లారీల కొబ్బరి కాయలు ఎగుమతులు కావడంతో వేలాది మందికి జీవనోపాధి దొరికేది. ఈ ఏడాది మార్చి వరకు రైతుల నుంచి వ్యాపారులు వెయ్యి కొబ్బరికాయలు రూ.20 వేల ధర వరకూ కొనుగోలు చేశారు. అలాగే ఒక్కో చెట్టుకు సుమారు ఏడాదికి 150 కాయల వరకు దిగుబడి వచ్చేది. అయితే ప్రస్తుతం దిగుబడితో పాటు ధరలు బాగా తగ్గిపోయాయి. ప్రస్తుతం వెయ్యి కాయలు రైతుల వద్ద రూ.12 వేలకు మించి వ్యాపారులు కొనుగోలు చేయడం లేదు. తమను ప్రభుత్వం ఆదుకోకుంటే కొబ్బరి సాగు చేయలేమని రైతులు అంటున్నారు. జిల్లాలో దాదాపు 13 వేల మంది రైతులు కొబ్బరి సాగు చేస్తున్నారు. అయితే రైతులంతా ఎగుమతులపై ఆధారపడటంతో కొబ్బరి ధర తగ్గినప్పుడు ఇబ్బంది పడుతున్నారు. కొబ్బరి సాగుతోపాటు కొబ్బరి అనుబంధ పరిశ్రమలు ఏర్పాటు చేస్తే ధరలు హెచ్చుతగ్గులతో రైతు లకు ఇబ్బంది ఉండదు. కొబ్బరి పౌడర్ వంటి పరిశ్రమ స్థాపనకు కేంద్ర ప్రభుత్వం 35 శాతం రాయితీతో రుణాలు మంజూరు చేస్తోంది. వా టిని వినియోగించుకుని ఆదాయం పొందవ చ్చు. అలాగే మరింత మందికి ఉపాధి కూడా క ల్పించవచ్చు. రైతులు కొబ్బరి అనుబంధ పరిశ్రమలపై దృష్టి పెట్టాలి. – ఎం.హరిప్రసాద్, జిల్లా ఉద్యానశాఖ అధికారి, భీమవరం -
శ్రీవారి కొండపై కూల్.. కూల్గా..
ద్వారకాతిరుమల: రోజురోజుకి పెరుగుతున్న భానుడి భగభగలకు మూగజీవాలు అల్లాడుతున్నాయి. మానవులైతే ఏసీలు, కూలర్లు, ఫ్రిజ్లు వంటి వాటి ద్వారా ఎండ వేడిమి నుంచి ఉపసమనాన్ని పొందుతున్నారు. మరి జంతువుల పరిస్థితి ఏంటి? ద్వారకాతిరుమల శ్రీవారి కొండపైన దేవస్థానం గోసంరక్షణశాలలో మూగజీవాలు షవర్ బాత్లు చేస్తూ ఉపశమనాన్ని పొందుతున్నాయి. ఎక్కడాలేని విధంగా దేవస్థానం అధికారులు ఈ మూగజీవాల కోసం రూ.2 లక్షలకు పైగా వెచ్చించి గో, గజ శాలల్లో గతంలోనే షవర్లను ఏర్పాటు చేశారు. ప్రస్తుతం అక్కడ ఆవులు, గిత్తలకు, అలాగే అశ్వానికి షవర్లు కిందే సిబ్బంది జల్లు స్నానం చేయిస్తున్నారు. అదేవిధంగా గజలక్ష్మి సైతం జల్లు స్నానం చేస్తూ సేదతీరుతోంది. కజానా బాతులైతే ఎక్కువ సమయం గోసంరక్షణశాలలోని కొలనులోనే ఉంటున్నాయి. ఇవి చూపరులను ఆకర్షిస్తున్నాయి. చల్లని షెల్టర్లో కజానా బాతులకు మంచినీరు, మేతను అందిస్తున్నారు. కుందేళ్ల పార్కులో వాటి కింద పచ్చగడ్డి వేసి, అక్కడే మేత, మంచి నీటిని ఏర్పాటు చేస్తున్నారు. క్షేత్రంలో మూగజీవాలపై ఆలయ అధికారులు చూపుతున్న ప్రత్యేక శ్రద్ధను పలువురు భక్తులు ప్రశంసిస్తున్నారు. జల్లు స్నానం చేస్తున్న అశ్వం, ఆవులు జల్లు స్నానంతో సేదతీరుతున్న మూగజీవాలు -
దళారులను ఆశ్రయించి మోసపోవద్దు
ఏలూరు (ఆర్ఆర్పేట): రవాణా శాఖ సేవలను పొండంలో కొంతమంది దళారులను నమ్మి మోసపోతున్నారని, దీనివల్ల వారు అధిక మొత్తంలో సొమ్ము పోగొట్టుకుంటున్నారని ఉప రవాణా కమిషనర్ షేక్ కరీమ్ అన్నారు. సోమవారం స్థానిక ఉప రవాణా కమిషనర్ కార్యాలయంలో నిర్వహించిన అవగాహన సదస్సులో ఆయన మాట్లాడుతూ దళారుల వ్యవస్థను నిర్ములించి, రవాణా శాఖ సేవలను పౌరులకు మరింత చేరువ చేసే ఉద్దేశంతో 2001లో ప్రభుత్వం రవాణా శాఖ సేవలను ఆన్లైన్ విధానంలోకి తీసుకువచ్చిందన్నారు. ఆన్లైన్ విధానంపై అవగాహన లేని కొందరు, దళారులను – మధ్యవర్తులను ఆశ్రయిస్తున్నారన్నారు. మొబైల్ ఫోన్, కంప్యూటర్లను ఉపయోగించుకుని లేదా సీఎస్ఎసీ సెంటర్లు, ఈసేవల ద్వారా ప్రభుత్వం నిర్ణయించిన రసీదు రుసుం మాత్రమే చెల్లించి పౌరులు రవాణా సేవలను పొందాలన్నారు. వాహనాల ఫిట్నెస్ సర్టిఫికెట్స్ కోసం చలానా ఆన్లైన్లో చెల్లించి, ఆటోమేటిక్ టెస్టింగ్ స్టేషన్ (ఏటీఎస్) ద్వారా వాహన ఎఫ్సీ వాహనదారు స్వయంగా పొందవచ్చునని, ఏటీఎస్ల వద్ద ఆర్టీఏ అధికారుల ప్రమేయం ఏమీ ఉండదని స్పష్టం చేశారు. ఎవరికై నా రవాణా సేవలను పొందటంలో ఇబ్బందులు కలిగితే తమ కార్యాలయంలోని హెల్ప్ డెస్క్ వద్దకు వచ్చి సమాచారాన్ని పొందొచ్చని కరీమ్ తెలిపారు. జంగారెడ్డిగూడెం: యువతి అదృశ్యంపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. మండలంలఘొక గ్రామానికి చెందిన 22 ఏళ్ళ యువతి ఈ నెల 20 నుంచి కనిపించడం లేదని తెలిపారు. చుట్టుపక్కల, బంధువులు, స్నేహితుల ఇంటి వద్ద వెతికినా కనిపించకపోవడంతో తండ్రి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. భీమవరం అర్బన్: భీమవరం రూరల్ పోలీసు స్టేషన్ పరిధిలో సోమవారం వడదెబ్బ తగిలి వ్యక్తి మృతి చెందాడు. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం దిర్సుమర్రు గ్రామంలోని రామాయణపురం గ్రామానికి చెందిన గంధం శివశంకర్ రావు (35) వడదెబ్బ తగిలి మృతి చెందాడు. ఆయన కుటుంబ సభ్యుల ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్ఐ వీర్రాజు కేసు నమోదు దర్యాప్తు చేస్తున్నారు . -
పెన్షన్ పెంపునకు కృషి చేయాలి
ఏలూరు (టూటౌన్): కార్మికులు సంవత్సరాల తరబడి ఈపీఎఫ్ఓకి చందాదారులుగా ఉంటూ, లక్షలాది రూపాయలు చందా చెల్లిస్తున్నప్పటికీ కనీస పెన్షన్ పెంపుదల విషయంలో కేంద్రంలోని మోదీ–షా ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ఐఎఫ్టీయూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు. వెంకటేశ్వరరావు ఆరోపించారు. సోమవారం స్థానిక బీఎస్ఎన్ఎల్ భవనంలోని ఈపీఎఫ్ఓ కార్యాలయం వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ నాయకులు మాట్లాడుతూ.. కనీస పెన్షన్ రూ. 7,500 పెంపుదలకై కార్మిక వర్గం ఐక్యంగా పోరాడాలని పిలుపునిచ్చారు. పార్లమెంటరీ స్టాండింగ్ కమిటీ సిఫారసులు, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ ట్రస్టీస్ సూచనలు, సుప్రీంకోర్టు సలహాల మేరకు కనీస పెన్షన్ రూ.7500కు పెంచాలని, ఆరు నెలలకు ఒకసారి పెన్షన్ పెరిగే విధంగా డీఏ లింక్ చేయాలని, కుటుంబ సభ్యులందరికీ వైద్య సదుపాయం కల్పించాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో ఐఎఫ్టీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, నగర అధ్యక్షులు బి. సోమయ్య, అనుబంధ ఏపీ ప్రగతిశీల ఈపీఎఫ్ పెన్షనర్ల సంక్షేమ సంఘం నాయకులు కోసూరి నూకరాజు, బుద్ధా నాగేశ్వరరావు, కింతల చిట్టయ్య, కొంపంగి కృష్ణ, బగాది రమణ, బుడుమూరు శ్రీనివాసరావు, కె. దేవేందర్, కె. విజయలక్ష్మి, పి. మంగతాయారు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ ఆఫీసుకు విద్యుత్ పునరుద్ధరించాలి
ఏలూరు టౌన్: ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియం సమీపంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయ భవనానికి విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాలని, ఏపీ హైకోర్టు ఉత్తర్వులు తక్షణమే అమలు చేయాలని కోరుతూ జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్కు సోమవారం పార్టీ లీగల్సెల్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. లీగల్ సెల్ జిల్లా అధ్యక్షుడు సీహెచ్ రాజేంద్రప్రసాద్ ఆధ్వర్యంలో రాష్ట్ర కార్యదర్శులు వి.లక్ష్మీకుమార్, ఆల్తి శ్రీనివాస్, ఏలూరు లీగల్సెల్ అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, నాయకులు జేసీకి సమస్య వివరించారు. హైకోర్టు ఆదేశాలు జారీ చేసినా విద్యుత్ శాఖ అధికారులు పట్టించుకోవడం లేదని, ఈ మేరకు కంటెమ్ట్ ఆఫ్ కోర్ట్స్ యాక్ట్ మేరకు లీగల్ నోటీసులు జారీ చేశా మని స్పష్టం చేశారు. రిట్ పిటీషన్ తుది విచారణ పూర్తియ్యేవరకూ ఎలాంటి బలవంతపు చర్యలు చేపట్టకుండా విద్యుత్శాఖ అధికారులకు ఆదేశాలు ఇవ్వాలని జేసీను కోరారు. నాయకులు డీవీ రామాంజనేయులు, బి.జగన్నాథరెడ్డి, వై.యశ్వంత్, పి.మధుకుమార్, ఫణికుమార్, రాజేష్, కె.తంబి తదితరులు ఉన్నారు. అలాగే ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో మాజీ సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి వి గ్రహానికి పూర్తి రక్షణ కల్పించి, పరిరక్షణ, ని ర్వహణ, సుందరీకరణ పనులు చేపట్టాలని కో రుతూ పార్టీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో లీగల్ సెల్ నాయకులు జేసీకి వినతిపత్రం సమర్పించారు. -
ఆగని మట్టి తవ్వకాలు
పోలవరం రూరల్: పోలవరం మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎల్ఎన్డీపేట రిజర్వాయర్ నుంచి ఇష్టానుసారంగా మట్టిని తవ్వేస్తున్నారు. అలాగే పోలవరం గ్రామంలోని కొత్తూరు చెరువు నుంచి కూడా మట్టి తవ్వకాలు ప్రారంభించారు. ఈ మట్టిని తరలించి దళారులు సొమ్ము చేసుకుంటున్నారు. వాస్తవానికి మట్టి తరలింపునకు కొంతమేర అనుమతులు తీసుకున్నప్పటికీ, ఆ అనుమతుల పరిమితికి మించి దళారులు ప్రవేశించి ఇటుక బట్టీలకు మట్టిని తరలించేస్తున్నారు. చెరువు, రిజర్వాయర్లలో కూడా హిటాచీ మిషన్లు, ట్రాక్టర్లు పెట్టి పగలూ రాత్రి తేడా లేకుండా తరలిస్తున్నారు. దీనివల్ల జలాశయంలో భారీగా గోతులు ఏర్పడుతున్నాయి. మట్టి అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నా సంబంధిత అటవీశాఖ అధికారులు అటువైపు కన్నెత్తి చూడని పరిస్థితి ఏర్పడింది. ప్రధాన రహదారుల్లో ట్రాక్టర్లపై మట్టి తరలిస్తున్నా ఆపే నాథుడే లేడు. పొలాలు మెరక చేసుకునేందుకు రైతులకు మట్టి తోలుకునేలా అనుమతులు ఇచ్చారనే పేరుతో, దాన్ని ఇటుక బట్టీలకు తరలించేస్తున్నారు. ఎల్ఎన్డీపేట రిజర్వాయర్ నుంచి నేషనల్ హైవే రోడ్డుకు మట్టి తరలించేందుకు అనుమతులు ఉన్నాయని చెబుతున్నారు గానీ, ఆ పేరుతో ఇతర ప్రాంతాలకు మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. మైనింగ్ అధికారులు, సంబంధిత శాఖాధికారులు ఇటువైపు చూసిన దాఖలాలు లేవు. -
పొగాకు రైతుల కన్నెర్ర
జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలంటూ ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం ఆధ్వర్యంలో జంగారెడ్డిగూడెం పొగాకు వేలం కేంద్రాల వద్ద సోమవారం రైతులు ధర్నాకు దిగారు. వేలం కేంద్రాల పరిశీలనకు అనుమతి లేదని వేలం అధికారులు చెప్పడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. వేలం కేంద్రం ఆవరణలో ధర్నా చేపట్టి వర్జీనియా పొగాకుకు గిట్టుబాటు ధర కల్పించాలని, ప్రభుత్వమే పొగాకు కొనుగోలు చేయాలంటూ పెద్ద ఎత్తున నినాదాలు చేశారు. ఈ సందర్భంగా రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ కంపెనీలు సిండికేట్గా మారి అంతర్జాతీయ మార్కెట్లో డిమాండ్ లేదని సాకు చూపి వర్జీనియా పొగాకు రైతులను నిలువునా దోచేస్తున్నారని విమర్శించారు. పొగాకు రైతులు నష్టపోతున్నా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు, పొగాకు బోర్డు పట్టించుకోకపోవడం దుర్మార్గమన్నారు. కిలో వర్జీనియా పొగాకు సరాసరి ధర రూ.380 కల్పించాలని డిమాండ్ చేశారు. వేలం కేంద్రాల పరిశీలనకు అను మతి లేదనడం తగదన్నారు. మీడియాపై కూడా ఆంక్షలు విధించడం నియంతృత్వ పోకడలకు నిదర్శమని విమర్శించారు. తమను కంపెనీల ప్రతినిధులు అడ్డుకునే ప్రయత్నం చేయడం దారుణమన్నారు. వచ్చేనెల 1న గుంటూరు పొగాకు బోర్డు కా ర్యాలయం వద్ద రైతుల రాయబారం కార్యక్రమం చేపట్టారని, రైతులు పెద్ద సంఖ్యలో తరలిరావాలని పిలుపునిచ్చారు. పొగాకు రైతులను ఆదుకోవాలి రైతు సంఘం జిల్లా సహాయ కార్యదర్శి బొడ్డు రాంబాబు, పొగాకు రైతుల సంఘం నాయకులు బిక్కిన వీరసత్యం, ఎల్.సత్యనారాయణ, బండారు నాగరాజు, గూడవల్లి రామకృష్ణ, ఘంటసాల ప్రభాకరరావు త దితరులు మాట్లాడుతూ సాగు ఖర్చులు విపరీతంగా పెరిగిపోయి కనీస ధరలు రాక పొగాకు రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నాణ్యమైన పొగాకు పండించినా గిట్టుబాటు ధర లేదన్నారు. పొగాకు రైతులను ఆదుకోవాలని కోరారు. వివిధ గ్రామాలకు చెందిన రైతులు పాల్గొన్నారు.గిట్టుబాటు ధర కల్పించాలని ధర్నా -
కూటమి నేతల అత్యుత్సాహం!
భీమవరం: కూటమి నాయకులు ప్రభుత్వాసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకారం సందర్భంగా చేసిన హంగామా, రోహిణీ కార్తె ప్రవేశంతో భానుడి భగభగలతో జనం ఠారెత్తారు. మరొక వైపు విద్యుత్ కోతలతో ప్రయాణికులు, ప్రజలు ఉక్కిరిబిక్కిరయ్యారు.సోమవారం జిల్లా వ్యాప్తంగా ఎండ తీవ్రత మరీ ఎక్కువగా ఉండటంతో ఉదయం 9 గంటలకే రోడ్లపై తిరగడానికి ప్రజలు భయపడ్డారు. ఇలాంటి తరుణంలో అత్యవసర పనులను ముగించుకుని ఇంటికి చేరదామనుకున్న పాదచారులు, వాహనదారులకు భీమవరం ప్రభుత్వాసుపత్రి వద్ద చుక్కలు కనిపించాయి. ఆసుపత్రి అభివృద్ధి కమిటీ ప్రమాణస్వీకార కార్యక్రమాన్ని ఎంతో అట్టహాసంగా ఏర్పాటు చేశారు. ప్రభుత్వాసుపత్రి యనమదుర్రు కాలువపై ఉన్న కాలిబాట వంతెనకు దగ్గరలో ఉండటంతో ఆ రహదారి నిత్యం రద్దీగా ఉంటుంది.నిత్యం వేలాది మోటారుసైకిళ్లు, పెద్ద సంఖ్యలో కాలినడకన వెళ్లే ప్రజలు ప్రయాణిస్తుంటారు. అయితే ప్రమాణస్వీకారం సందర్భంగా పెద్ద ఎత్తున బాణాసంచా రోడ్డుపైనే కాల్చడంతో ప్రయాణికులకు తీవ్ర ఇబ్బంది ఏర్పడింది. దీనికి తోడు ప్రమాణస్వీకార కార్యక్రమానికి వచ్చిన ప్రజాప్రతినిధులు, కూటమి పార్టీల నాయకుల వాహనాలతో ఆసుపత్రి ఎదురుగా రోడ్డుపై ట్రాఫిక్ సమస్య తలెత్తింది. మండుటెండలో గంటల తరబడి వాహనాల రాకపోకలు నిలిచిపోవడంతో ప్రయాణికులు, ఆసుపత్రికి వచ్చే రోగుల అవస్థలు వర్ణనాతీతం. రోడ్డుపైనే బాణసంచా కాల్చడంతో వాహనాలు వెళ్లే దారిలేక ఎండలోనే నిలబడక తప్పలేదు. ట్రాఫిక్ను క్రమబద్ధీకరించడానికి పోలీసులు అవస్థలు పడాల్సి వచ్చింది.కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తరచూ విజయోత్సవాలు, వివిధ సభలను ప్రధాన రోడ్డుపైనే నిర్వహించడంతో ప్రయాణికులు తరచూ ఇబ్బందులు పడాల్సి వస్తోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఎండ తీవ్రతతో పాటు అప్రకటిత విద్యుత్ కోతలు తోడవడంతో ప్రజలు విలవిలలాడారు. బయట గాలి లేక, ఇళ్లలో ఉండలేక తీవ్ర ఇబ్బందులకు గురయ్యారు. -
మళ్లీ పెట్రో పిడుగు
కూల్.. కూల్గా.. ద్వారకాతిరుమలలోని శ్రీవారి కొండపై గో సంరక్షణ శాలలో మూగజీవాలు షవర్ బాత్తో ఉపశమనం పొందుతున్నాయి. 8లో uపోలవరం మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. ఎల్ఎన్డీపేట రిజర్వాయర్ నుంచి మట్టిని తవ్వేస్తున్నారు. మంగళవారం శ్రీ 26 శ్రీ మే శ్రీ 2026ఏలూరు (ఆర్ఆర్పేట): ఒక పక్క వేసవి.. భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి అవుతున్న ప్రజల నడ్డివిరిగేలా ప్రభుత్వాలు ధరల కొరడా ఝుళిపిస్తున్నా యి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఉష్ణోగ్రతల వేడి తెలియనివ్వకుండా ఉండేందుకు పెట్రో ధరలను మళ్లీ మళ్లీ పెంచుతున్నాయి. సాధారణంగా కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ పెట్రో ధర లు తమ పదవీ కాలంలో ఒకసారో, రెండుసార్లో పెంచడానికి కూడా ఆలోచిస్తాయి. ఎందుకంటే సామాన్యులపై నేరుగా భారం పడే ఈ ధరల పెరుగుదల భవిష్యత్లో తమ ప్రభుత్వంపై వ్యతిరేక ప్రభావం చూపిస్తుందనే భయం ఉండేది. కానీ ప్రస్తుత కేంద్ర ప్రభుత్వం గానీ, రాష్ట్ర ప్రభుత్వం గానీ ధరలు పెంచడానికి కించిత్తు కూడా ఆలోచించడం లేదు. తమ చేతిలో అధికారం ఉంది కాబట్టి ఏం చేసినా చెల్లుబాటు అవుతుందనే అధికార దర్పం ప్రభుత్వాధినేతల్లో కనిపిస్తోంది.. పది రోజుల వ్యవధిలో.. పెట్రోల్, డీజిల్ రెండింటిపైనా సోమవారం ఉదయం నుంచి లీటరుకు రూ.3 చొప్పున ధరలు పెరిగాయి. పది రోజుల వ్యవధిలో ఇప్పటికే మూడుసార్లు ధర లు పెంచగా తాజా వడ్డనతో లీటరు పెట్రోల్ రూ.118, డీజిల్ రూ.105కు చేరుకున్నాయి. చము రు సెగతో నిత్యావసర ధరలకు రెక్కలొచ్చి సామాన్యుల జీవనం దుర్భరంగా మారుతోంది. ఈనెల 15న ఉదయం నుంచి పెట్రోల్పై రూ.3.29, డీజిల్పై రూ.3.14 చొప్పున ఆయిల్ కంపెనీలు ధరలను పెంచేశాయి. తర్వాత రెండుసార్లు రెండింటిపైనా రూ.0.90 పైసలు చొప్పున పెంచేశాయి. తా జాగా నాల్గోసారి ధరలను పెంచాయి. పది రోజుల క్రితం జిల్లాలో లీటరు రూ.109.90 ఉన్న పెట్రోల్ ధర ప్రస్తుతం రూ.118కి చేరింది. అదేమాదిరి లీటరు రూ.97 వరకు ఉన్న డీజిల్ రూ.105కు పెరిగింది. జిల్లాలో 260 బంకులు ఏలూరు జిల్లాలో వివిధ ఆయిల్ సంస్థలకు చెందిన 260 పెట్రోల్ బంకులున్నాయి. వీటి ద్వారా రోజూ జిల్లా ప్రజలు మొత్తం 6.25 లక్షల లీటర్లను వినియోగిస్తున్నారు. దీనిలో 3.65 లక్షల లీటర్ల డీజిల్, 2.60 లక్షల లీటర్ల పెట్రోల్ను వినియోగిస్తున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు పెరిగిన ధరలతో జిల్లా ప్రజలపై రోజుకు రూ.50 లక్షల వరకు అదనపు భారం పడుతోంది. అంటే సుమారు రెండు రోజులకు ఒక లీటర్ పెట్రోల్ వినియోగించే వినియోగదారునిపై ఏడాదికి సు మారు రూ.1,800 అదనపు భారం పడుతోంది. జిల్లాలో ఆయిల్ వినియోగం (ఒకరోజుకు) పెట్రోల్, డీజిల్ ధరల పెంపు సామాన్యుడి జీవితాన్ని దుర్భరంగా మార్చింది. ఎన్నికల ముందు ధరలు పెంచమని గొప్పలు చెప్పిన ముఖ్యమంత్రి చంద్రబాబు గద్దెనెక్కిన తర్వాత ఆ మాట మరిచారు. ప్రధానంగా డీజిల్ ధరల పెంపు ఆక్వా రంగంపై ప్రభావం చూపుతుంది. నిత్యావసర వస్తువులైన గ్యాస్, పెట్రోల్, డీజిల్ ధరల పెంపు ప్రజల జీవితాలపై పెనుప్రభావం చూపుతుంది. –దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్), వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే, కై కలూరు వినియోగదారులపై భారంరూ.50లక్షలు పెట్రోల్2.60లక్షల లీటర్లు డీజిల్3.65లక్షల లీటర్లు పెట్రోల్ రూ.118.. డీజిల్ రూ.105 లీటరుకు రూ.3 చొప్పున వడ్డన 10 రోజుల్లో రూ.8 వరకు పెరిగిన ధరలు జిల్లాలో వినియోగదారులపై రోజుకు రూ.50 లక్షల భారం దేశంలోనే అత్యధికంగాఏపీలోనే పెరుగుదల మేం పెరుగుతాం.. మీ కష్టం కూడా పెరుగుతుంది ! బియ్యం పప్పులు వంట నూనె పాలు కూరగాయలు గ్యాస్ పది రోజుల్లో రూ.8కు పైగా పెట్రోల్ ధరలు పెంచడం దారుణం. సామన్యులు, చిరుద్యోగులకు పెంచిన ధరలు భారంగా మా రుతున్నాయి. ఇప్పటికే గ్యాస్ సిలిండర్లు అందుబాటులో లేకపోవడంతో బ్లాక్లో కొనాల్సి వస్తోంది. దీనికి కొంత అదనపు భారం పడుతుండగా తాజాగా పెట్రోలు ధరలు కూడా పెంచితే సామాన్యులు ఎలా భరించగలరు. నిత్యా వసర సరుకుల ధరలూ పెరుగుతున్నాయి. – కె.రమేష్బాబు, ఏలూరు పెట్రోల్ ధరలు పెంచడంతో ఆ భారం ఒక్క పెట్రోల్ రూపంలోనే కాక ఇతర నిత్యావసరాల రూపంలో కూడా మాపై పడు తోంది. కూరగాయల ధరలు పెరిగాయి. హోటళ్లలో టీ ధరలు కూడా పెట్రో ధరల పెంపును కారణంగా చూపి పెంచేశారు. ఆటోలు కూడా చార్జీలు పెంచేశారు. రానున్న రోజుల్లో ఇంకా వేటి ధరలు పెరుగుతాయో అంచనా వేయలేకపోతున్నాం. – ఎస్.అప్పారావు, ఏలూరుఇంత ఖర్చులు ఎలా భరించాలి ఖర్చుల బిల్లు డీజిల్ ధర పెరిగింది సరుకుల రవాణా ఖర్చు పెరిగింది గ్యాస్ ధర పెంపుతో ఇప్పటికే హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో టిఫిన్, మీల్స్పై ప్లేటుకు రూ.5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. పెట్రోల్, డీజిల్ ధరలు పెంపు ప్రభావం సరుకుల రవాణాపై పడి వాటి ధరలకూ రెక్కలొచ్చాయి. మార్కెట్లో బియ్యం, పప్పులు, నూనెలు ధరలు పెరిగిపోయాయి. గతంలో సూపర్ఫైన్ కిలో బియ్యం రూ.62 ఉండగా ప్రస్తుతం రూ.69కు, గ్రేడ్–2 బియ్యం కిలో రూ.39 నుంచి రూ.46కు పెరిగాయి. పామాయిల్ లీటరు ప్యాకెట్ రూ.126 నుంచి రూ.140కు, సన్ఫ్లవర్ ఆయిల్ రూ.140 నుంచి రూ.186కు చేరుకున్నాయి. కూరగాయాల ధరలు 30 శాతం నుంచి 40 శాతానికి పెరిగాయి. -
నిబంధనలు మీరి.. ప్రజాధనం పక్కదారి
ఏలూరు (టూటౌన్): అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఓ ప్రైవేట్ లేఅవుట్లో మౌలిక వసతుల కల్పనకు నామినేషన్ విధానంలో పనులు చేయించేసి సొమ్ము చేసేసుకున్నారు. లేఅవుట్ నిబంధనలు, నామినేషన్ విధానానికి విరుద్ధంగా రూ.1.73 కోట్లతో స్థానిక మార్కెట్ యార్డు సమీపంలోని ఎస్ఎంఆర్ నగర్ లేఅవుట్లో రోడ్లు, డ్రెయిన్లు, పైప్లైన్ పనులు చేయించడం విమర్శలకు తావిస్తోంది. ప్రభుత్వ గ్రాంట్లు, పన్నుల రూపంలో వసూలు చేసిన సొమ్ములతో ఎవరి మెప్పు కోసం నగరపాలక సంస్థ అధికారులు ఈ లేఅవుట్లో వెచ్చించారని పలువురు ప్రశ్నిస్తున్నారు. లేఅవుట్ నిబంధనలు ఇలా.. లేఅవుట్ నిబంధనలను అనుసరించి లేఅవుట్లు ఏర్పాటు చేసిన సమయంలో రోడ్లు, డ్రెయిన్లు, వీధి లైట్లు, వాటర్ సప్లయ్, పైప్లైన్లు, ప్లాంటేషన్ పనులు లేఅవుట్ యజమానులు చేయించాలి. వీటి కోసం లేఅవుట్లో 30 శాతం స్థలాన్ని కేటాయించాలి. అలాగే పార్కులు, ప్లే గ్రౌండ్ కోసం మరో 10 శాతం స్థలం కేటాయించాలి. ముఖ్యంగా మౌలిక వసతులకు అయ్యే ఖర్చును యజమానులే భరించాల్సి ఉంటుంది. ఇలా అన్ని సదుపాయాలు కల్పించిన తర్వాత ఆ లేఅవుట్ను స్థానిక సంస్థకు అప్పగించాల్సి ఉంటుంది. ఆ సమయంలో పార్కులు, ప్లేగ్రౌండ్ కోసం ఉంచిన స్థలాన్ని గిఫ్ట్ డీడ్ కింద స్థానిక సంస్థకు లేఅవుట్ యాజమాన్యం రిజిస్ట్రేషన్ చేయాల్సి ఉంటుంది. సదరు లేఅవుట్ను స్థానిక సంస్థ అధికారులు పరిశీలించి అన్ని నిబంధనలు పాటించిన తర్వాతే స్వాధీనం చేసుకోవాలి. అనంతరం ఆ లేఅవుట్లో నిర్వహణ పనులు మాత్రమే స్థానిక సంస్థలు చేపట్టాల్సి ఉంది. నిర్వహణ పనులు మాత్రమే చేయాల్సిన చోట వసతులు ఏలూరు మార్కెట్ యార్డు సమీపంలోని ఎస్ఎంఆర్ నగర్ను నగరపాలక సంస్థకు గతంలో అప్పగించారు. అక్కడ నిర్వహణ ప నులను మాత్రమే చే యాల్సిన నగరపాలక సంస్థ అధికారులు ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా 2025–26 ఆర్థిక సంవత్సరంలో 15వ ఆర్థిక సంఘం నిధుల నుంచి రూ.1.35 కోట్ల నిధులతో రోడ్లు, డ్రెయిన్లు వేయించారు. అలాగే అత్యవసరం కాని పనులను నామినేషన్ విధానానికి విరుద్ధంగా రూ.29.35 లక్షలతో ఆరు పైపులైన్, రూ.8.49 లక్షలతో ఆర్సీసీ కల్వర్టు, అప్రోచ్ పనులకు కమిషనర్ అనుమతించగా ఆ యా పనులు చేసేశారు. నామినేషన్ పద్ధతిని చేసిన ఆరు పైప్లైన్ పనులు మూడు పనులుగా మాత్ర మే చేయాలి. కానీ రూ.5 లక్షలు దాటకూడదనే ఆలోచనతో నిబంధనలకు విరుద్ధంగా ఇంజనీరింగ్ అధికారులు ఆ మూడు పను లను ఆరు ముక్కలుగా చేసి అక్రమాలకు తెరతీశా రు. నామినేషన్ ద్వారా పనులకు రూ.37.84 లక్షలు వెచ్చించారు. క్రాస్ రోడ్డు నం.3లో 110 మి.మీ హెచ్డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.87 లక్షలు క్రాస్రోడ్లలో 110 మి.మీ హెచ్డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.89 లక్షలు 160 మిమీ హెచ్డీపీఈ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.92 లక్షలు దక్షిణ వైపు క్రాస్ రోడ్డులో 160 మి.మీ పైప్ ఇంటర్ కనెక్షన్ పనులకు రూ.4.92 లక్షలు మెయిన్ లైన్ హెచ్డీపీఈ పంపిణీ పైప్లైన్ రెక్టిఫికేషన్కు రూ.4.85 లక్షలు క్రాస్ రోడ్లలో హెచ్డీపీఈ పంపిణీ పైప్లైన్ రెక్టిఫికేషన్కు రూ.4.90 లక్షలు ఆర్సీసీ కల్వర్ట్ నిమిత్తం రూ.4.99 లక్షలు సీసీ అప్రోచ్ ఏర్పాటుకు రూ.3.50 లక్షలు మొత్తంగా నామినేషన్ ద్వారా పనులకు రూ.37.84 లక్షలు వెచ్చించారు. 15వ ఆర్థిక సంఘం నిధులతో పనులు సీసీ డ్రెయిన్కు రూ.10.22 లక్షలు సీసీ డ్రెయిన్కు రూ.10.85 లక్షలు సీసీ రోడ్డుకు రూ.23.92 లక్షలు సీసీ రోడ్డుకు రూ.27 లక్షలు సీసీ డ్రెయిన్కు రూ.10.37 లక్షలు సీసీ రోడ్డుకు రూ.52.63 లక్షలు మొత్తంగా ఆర్థిక సంఘ నిధులు రూ.134.99 లక్షలు ప్రజాధనాన్ని ప్రైవేట్ లేఅవుట్లో ఖర్చుపెట్టారు. దీనికి బాధ్యులైన నగరపాలక సంస్థ అధికారులు, కమిషనర్పై ఉన్నతాధికారులు చర్యలు తీసుకోవాలి. స్థానిక సంస్థలకు అప్పగించిన ప్రైవేట్ లేఅవుట్లను కేవలం నిర్వహణ మాత్రమే చేయాల్సి ఉండగా ఎస్ఎంఆర్ నగర్లో ఏకంగా పనులు చేపట్టి నిధులను దుర్వినియోగం చేశారు. ఈ అక్రమాలపై లోకాయుక్తను ఆశ్రయించడంతో పాటు కలెక్టర్, విజిలెన్స్, ఏసీబీ అధికారులకు ఫిర్యాదు చేస్తా. –కేవీ సాయిప్రసాద్, మున్సిపల్ రిటైర్డ్ అసిస్టెంట్ ఇంజనీర్, ఏలూరు ప్రైవేట్ లేఅవుట్లో నామినేషన్ పనులు రూ.1.73 కోట్ల కార్పొరేషన్ నిధులతో మౌలిక వసతులు 15వ ఆర్థిక సంఘం నిధులూ వినియోగం నగరపాలక సంస్థ అధికారుల లీలలు -
కంకరను మింగేస్తున్న కింకరులు
కనసానపల్లిలోని రావిచెరువులో మట్టి తవ్వకాలుఉంగుటూరు: ఉంగుటూరు మండలంలో కంకర అక్రమ తవ్వకాలు యథేచ్ఛగా జరుగుతున్నాయి. పగలూరాత్రీ తేడా లేకుండా అక్రమార్కులు కంకరను తవ్వి తరలించేస్తున్నారు. అయినా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. వారం రోజులుగా మెట్ట ప్రాంతంలోని మైనర్ ఇరిగేషన్ చెరువుల్లో అఽధికార పక్ష నాయకులే తవ్వకాలు చేస్తున్నారు. టీడీపీకి చెందిన మాజీ జెడ్పీటీసీ చింతల వాసు ఆదివారం తవ్వకాలు జరుగుతున్న ప్రాంతాన్ని పరిశీలించి ఆశ్చర్యపోయారు. ఉంగుటూరులోని ఎర్రచెర్వు, నల్ల చెర్వు, ఎల్లమిల్లి, ఎర్రమళ్ల, గొల్లపాడు, బాదంపూడి, గొల్లగూడెం, గోపాలపురం, గోకవరం తదితర గ్రామాల్లో కంకర తవ్వకాలు జరుగుతున్నాయి. తవ్వకాలతో చెరువుల్లో 20 అడుగులకు పైగా భారీ గోతులు పడ్డాయి. దీంతో ప్రమాదాలు పొంచి ఉన్నాయని ప్రజలు అంటున్నారు. అధికారపక్ష నేతలే అక్రమ తవ్వకాలకు పాల్పడుతుంటే తాము ఎవరికి చెప్పుకోవాలని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు ఫిర్యాదు చేసినా ఫలితం ఉండటం లేదని అంటున్నారు. -
వడదెబ్బతో ఐదుగురి మృతి
తణుకు అర్బన్/కుక్కునూరు/దెందులూరు/జంగా రెడ్డిగూడెం: ఎండల తీవ్రతకు వడదెబ్బతో ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాల్లో ఐదుగురు వ్యక్తులు మృతిచెందారు. తణుకు తహసీల్దారు కార్యాలయం ప్రాంతంలోని సిమెంట్ బెంచ్పై పడుకుని ఓ వ్యక్తి ప్రాణం విడవగా స్థానికులు గుర్తించి పోలీసులకు తె లియజేశారు. వడదెబ్బకు చనిపోయి ఉంటాడని అనుమానిస్తున్నారు. కుక్కునూరులో.. వడదెబ్బతో కుక్కునూరు మండలంలో ఇద్దరు వ్య క్తులు మృతిచెందారు. తొండిపాక పంచాయతీ మె ట్టగూడెం గ్రామానికి చెందిన నోముల వంశీకృష్ణ (35) జీవనోపాధి నిమిత్తం సరిహద్దు గ్రామమైన బూర్గంపాడులో హోటల్లో వంట మాస్టర్గా విధు లు నిర్వహిస్తున్నాడు. రోజులా శనివారం విధులకు వెళ్లిన వంశీకృష్ణ అస్వస్థతకు గురై హోటల్లోనే కుప్పకూలిపోయాడు. సహచరులు అతడిని బూర్గంపాడు ప్రభుత్వ ఆసుపత్రికి చికిత్స నిమిత్తం తరలించగా వడదెబ్బ తగిలిందని నిర్ధారించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉండడంతో చికిత్స నిమిత్తం జిల్లా ఆస్పత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ వంశీకృష్ణ శనివారం రాత్రి మృతి చెందాడు. వంశీకృష్ణకు భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. బంజరగూడెంలో 84 ఏళ్ల వృద్ధుడు బంజరగూడెం గ్రామానికి చెందిన గవర్ల పెరుమాళ్లు (84) అనే వృద్ధుడు ఆదివారం ఉదయం వడదెబ్బకు గురై మృతి చెందాడు. ఆస్పత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. పోతునూరులో.. దెందులూరు మండలం పోతునూరులో కోడెల సత్యనారాయణ (79) వడదెబ్బకు గురై మృతి చెందారు. మధ్యాహ్నం వేళ ఎండ తీవ్రతకు ఆయన ఒక్కసారిగా అస్వస్థతకు గురికావడంతో కుటుంబ సభ్యులు స్థానిక పీహెచ్సీకి తరలించారు. పరీక్షించిన వైద్యులు పరిస్థితి విషమంగా ఉందని తెలపడంతో మరో ఆస్పత్రికి తరలించేలోపు ఆయన క న్నుమూశారు. మృతుడికి ఇద్దరు కుమారులు, కు మార్తె ఉన్నారు. జంగారెడ్డిగూడెంలో.. జంగారెడ్డిగూడెం లక్ష్మీనారాయణ థియేటర్ సమీపంలోని చాపల దాసుగారి రోడ్డులో గుర్తుతెలియని వ్యక్తి మృతిచెందాడు. సుమారు 40 ఏళ్ల వయసున్న వ్యక్తి వడదెబ్బకు గురై మృతిచెంది ఉంటాడని భావిస్తున్నారు. ఎస్సై ఎన్వీ ప్రసాద్ వెళ్లి వివరాలు సేక రించారు. అతడు ఉప్పలమెట్టకు చెందిన వ్యక్తిగా చె బుతున్నారు. మృతుడి వివరాలు తెలియాల్సి ఉంది. తణుకులో గుర్తుతెలియని వ్యక్తి నోముల వంశీకృష్ణ (ఫైల్) కోడెల సత్యనారాయణ (ఫైల్) గవర్ల పెరుమాళ్లు (ఫైల్) -
● వంతెన.. ప్రమాదం అంచున..
మండపాక నుంచి గుమ్మంపాడు వెళ్లే (ఎడ్ల పందేల పుంత) రహదారిలోని రేలంగి కాలువపై వంతెన రెయిలింగ్ లేక ప్రమాదకరంగా మారింది. వంతెనకు ఇరువైపులా రెయిలింగ్ కూలిపోయి దాదాపు పదేళ్లు కావస్తోంది. తణుకు, ఇరగవరం, అత్తిలి మండలాల ప్రజలు ఇటుగా రాకపోకలు సాగిస్తుంటారని, రాత్రిళ్లు ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు బళ్ల చిన వీరభద్రరావు అన్నారు. వంతెన రెయిలింగ్ నిర్మించాలని కోరుతున్నారు. – ఇరగవరం -
అత్యవసర వైద్యం.. అందనంత దూరం
సుమారు రెండు నెలల క్రితం వీరవాసరం మండలానికి చెందిన ఓ మహిళ తీవ్ర అనారోగ్యంతో భీమవరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రిలో చేరారు. ఆమెకు మెరుగైన వైద్యం అవసరమైంది. అయితే స్థానికంగా స్పెషలిస్టులు లేకపోవడంతో వెంటనే గుంటూరు ప్రభుత్వాస్పత్రికి తరలించారు. నరసాపురం మండలం ముత్యాలపల్లిలో ఇటీవల రోడ్డు ప్రమాదంలో తండ్రీకొడుకులు తీవ్రంగా గాయపడ్డారు. వారిని అంబులెన్స్లో భీమవరంలో ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తీసుకురాగా అక్కడ వైద్యులు వారి పరిస్థితి విషమంగా ఉందన్నారు. భీమవరంలో ఎక్కడా అత్యవసర మెరుగైన వైద్యం అందించే న్యూరో స్పెషలిస్టులు లేకపోవడం, చినపిల్లల వైద్యానికి కూడా అత్యంత మెరుగైన వైద్య పరికరాలు, వైద్యులు లేకపోవడంతో వారిలో తండ్రిని కాకినాడకు, కుమారుడిని గుంటూరు మెడికల్ కళాశాలకు సిఫార్సు చేశారు. తండ్రిని కాకినాడ తరలిస్తుండగా మార్గమధ్యలో కన్నుమూశారు. కుమారుడు ఇప్పటికీ చికిత్స పొందుతున్నాడు. రోడ్డు ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి అత్యంత మైరుగైన వైద్యం అందించి ప్రాణాలు నిలబడాలంటే పా లకొల్లు సమీపంలోని దగ్గులూరులోని మెడికల్ కాలేజీ అందుబాటులోకి రావాలి. క్షతగాత్రులను దూర ప్రాంతాలకు తీసుకువెళ్లేలోపు వారి పరిస్థితి విషమించి చనిపోతుండగా.. ఆయా కుటుంబాలు దిక్కులేనివి అవుతున్నాయి. మెరుగైన వైద్యం కోసం గుంటూరు, విజయవాడ, కాకినాడ తీసుకువెళ్లడం భారంగా ఉంది. ముఖ్యంగా పేద, మధ్యతరగతి కుటుంబాలు ఇబ్బంది పడుతున్నాయి. మెడికల్ కాలేజీ నిర్మాణంపై ప్రభుత్వం దృష్టి సారించాలి. – వి.శ్రీనివాస్, తోకలపూడి, వీరవాసరం మండలం దూరం 130 కి.మీ. భీమవరం(ప్రకాశం చౌక్) : జిల్లాలో ప్రమాదాల్లో తీవ్రంగా గాయపడిన వారికి స్థానికంగా అత్యవసర వైద్యం అందించే పరిస్థితి ప్రభుత్వ, ప్రైవేట్ ఆస్పత్రుల్లో లేదు. దీంతో ఎమర్జెన్సీ కేసులను గుంటూరు, విజయవాడ, కాకినాడ ప్రభుత్వాస్పత్రులకు సిఫార్సు చేస్తున్నారు. అప్పటికే పరిస్థితి విషమించిన క్షతగాత్రులు అంబులెన్సుల్లో తరలించేలోపు మృత్యువాత పడుతున్న ఘటనలు చోటుచేసుకుంటున్నాయి. ఏదైనా రోడ్డు ప్రమాదం లేదా తీవ్ర అనారోగ్యం వస్తే జిల్లాలోని తణుకు, భీమవరంలోని మల్టీస్పెషాలిటీ ఆస్పత్రులకు తీసుకువస్తున్నారు. అయితే ఇక్కడ పూర్తిస్థాయిలో స్పెషలిస్టులు, మైరుగైన వైద్యం అందించడానికి పరికరాలు లేవు. దీంతో ఆయా ఆస్పత్రుల వైద్యులు వేరే ఆస్పత్రులకు సిఫార్సులు చేస్తున్నారు. క్షతగాత్రులను 125 కిలోమీటర్లకు పైగా దూరం తీసుకువెళ్లడం దాదాపు 2 గంటల నుంచి 3 గంటల వరకు సమయం ప ట్టడం కుటుంబసభ్యులకు ఇబ్బందిగా మారింది. అ లాగే ప్రమాద తీవ్రత కూడా పెరిగిపోతోంది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతి జిల్లాలో ప్రభుత్వ మెడికల్ కాలేజీ ఉండాలని సంకల్పించారు. దీనిలో భాగంగా పాలకొల్లు మండలం దగ్గులూరులో మెడికల్ కాలేజీ నిర్మాణ పనులు కూడా చేపట్టారు. అత్యంత మెరుగైన వైద్యం, అధునాతన పరికరాలు ఏర్పాటుచేసేలా చర్యలు తీసుకున్నారు. ఈ కాలేజీ నిర్మాణం పూర్తయితే పలురకాల స్పెషలిస్టులతో పాటు అత్యాధునిక పరికరాలు అందుబాటులోకి వస్తాయి. అత్యవసర సేవలు కూడా వేగంగా అందుతాయి. అయితే కూట మి ప్రభుత్వం అధికారం చేపట్టిన తర్వాత ఈ కాలేజీ నిర్మాణాన్ని అటకెక్కించింది. నిర్మాణ పనులు ఎక్కడికక్కడే నిలిచిపోయాయి. జిల్లా లో మంత్రి నిమ్మల రామానాయుడు, కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ, కూటమికి చెందిన ఆరుగురు ఎమ్మెల్యేలు ఉన్నా ప్రజలకు ఉత్తమ సేవలందించే వైద్య కళాశాల నిర్మాణాన్ని మాత్రం పట్టించుకోవ డం లేదు. స్థానికంగా మెడికల్ కాలేజీని అందుబాటులోకి తీసుకువచ్చి పేదల ప్రాణాల కాపాడవచ్చనే ఆలోచనల కూడా వీరు చే యడం లేదు. దీనిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. వైద్యో నారాయణో ‘హరి’ స్థానికంగా అందని ఎమర్జెన్సీ సేవలు తీవ్రంగా గాయపడిన వారికి వైద్యసేవలు కొరత కాకినాడ, విజయవాడ, గుంటూరుకు సిఫార్సు మార్గమధ్యలో మృత్యువాత జిల్లాలో ముందుకు సాగని మెడికల్ కాలేజీ నిర్మాణం -
చెక్పోస్ట్తో సమస్యలు
బుట్టాయగూడెం: మండలంలోని కామవరం సమీపంలోని అటవీ ప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మవారి ఆలయానికి వచ్చే భక్తులు తెలంగాణ అటవీశాఖ అధికారులు ఏర్పాటుచేసిన చెక్పోస్ట్తో ఇబ్బంది పడ్డారు. ఆలయానికి వచ్చే వాహనచోదకుల నుంచి డబ్బులు వసూలు చేసేందుకు తెలంగాణ అటవీ శాఖ అధికారులు చెక్పోస్ట్ను ఏర్పాటుచేయగా ఆలయ కమిటీ, గ్రామస్తులు ఇటీవల దానిని తీయించేశారు. అయితే మళ్లీ ఆ అధికారులు ఆదివారం టోల్గేట్ను ఏర్పాటుచేసి సొమ్ములు వసూలుచేశారు. అధిక సంఖ్యలో బస్సులు, మినీ వ్యాన్లు, ఆటోలు రావడంత ట్రాఫిక్ సమస్య తలెత్తింది. దీనిని పరిష్కరించేందుకు ఆలయ కమిటీ ఇబ్బందులు పడిఇంది. టోల్గేట్ పెట్టి సొమ్ములు వసూలు చేస్తున్న తెలంగాణ అటవీశాఖ అధికారులు కనీసం ట్రాఫిక్ క్లియరెన్స్కు కూడా చర్యలు తీసుకోలేదని వాహనచోదకులు అన్నారు. టోల్గేట్ ఏర్పాటు వివాదానికి చోటుచేసుకునే అవకాశం కనిపిస్తోంది. ఇదిలా ఉండగా ఆలయానికి భక్తులు పోటెత్తారు. వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. -
రోడ్డు ప్రమాదంలో తెగిపడిన మహిళ చేయి
జంగారెడ్డిగూడెం: తాడువాయి సమీపంలో ఆదివారం తెల్లవారుజామున జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక మహిళ చేయి తెగిపడింది. దీనికి సంబంధించి ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఉంగుటూరు మండలం కాకర్లమూడి గ్రామానికి చెందిన 54 మంది భక్తులు తాడేపల్లిగూడెం డిపో ఆర్టీసీ బస్సు మాట్లాడుకుని తెలంగాణ రాష్ట్రం భద్రాచలం శ్రీరాముని దర్శనానికి శనివారం రాత్రి బయలుదేరారు. మండలంలోని తాడువాయి సమీపంలోకి వచ్చే సరికి జగిత్యాల నుంచి పాలకొల్లు ధాన్యం లోడుతో వెళుతున్న లారీ వీరి బస్సును వెనుక పక్క భాగంలో (సుమారు రెండు సీట్లు వద్ద ) బలంగా ఢీకొంది. దీంతో వెనుక సీట్లో చేయి బయటకు పెట్టుకుని ఉన్న రాజాన పద్మకుమారి చేయి తెగిపడిపోయింది. పక్కనే ఉన్న నాయుడు రామలక్ష్మికి కూడా గాయాలయ్యాయి. వెంటనే క్షతగాత్రులను 108 వాహనంలో స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. వెనుక ఉన్న మిగిలిన ప్రయాణికులు పద్మకుమారి చేయిని వెతికి ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చారు. దీంతో ప్రాథమిక చికిత్స చేసి, మెరుగైన వైద్యం కోసం రాజమండ్రి పంపించారు. ఆర్టీసీ డ్రైవర్ షేక్ అఫ్రాన్ ఫిర్యాదు మేరకు సూర్యపేటకు చెందిన లారీ డ్రైవర్ కంభం ఆంజనేయులపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. బస్సును ఢీకొన్న లారీ.. ఇద్దరికి గాయాలు -
చీటింగ్ కేసులో ఇద్దరికి రిమాండ్
దెందులూరు: ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తామని మోసం చేసిన కేసులో ఇద్దరిని అరెస్టు చేసినట్లు దెందులూరు ఎస్సై డి.వెంకట్ కుమార్ తెలిపారు. పెరుగుగూడెం గ్రామానికి చెందిన మోత్కూరి లక్ష్మణరావు కుమార్తెకు ఎంబీబీఎస్ సీటు ఇప్పిస్తానని చెప్పి ఏలూరుకు చెందిన మాగంటి లక్ష్మీ రత్న దుర్గ వాణి, మాగంటి అశోక్ కుమార్ రూ.1.20 కోట్లు తీసుకున్నట్లు దర్యాప్తులో వెల్లడైందన్నారు. నకిలీ రసీదులు, అడ్మిషన్ పత్రాలు, లేఖలు, ఇతర డాక్యుమెంట్లు సృష్టించి ఫిర్యాదుదారున్ని మోసం చేశారన్నారు. పలుమార్లు నోటీసులు జారీ చేసినప్పటికీ నిందితులు విచారణకు సహకరించకుండా తప్పించుకుంటూ వచ్చారన్నారు. అరెస్ట్ చేసిన నిందితులను ఏలూరు కోర్టులో హాజరుపరచగా 14 రోజుల రిమాండ్ విధించినట్లు ఎస్సై తెలిపారు. -
వరి గడ్డి కాల్చివేతతో అనర్థాలు
వీరవాసరం: దాళ్వా వరి కోతలు పూర్తయిన అనంతరం పొలాల్లో మిగిలిపోయిన వరిగడ్డిని ఎట్టి పరిస్థితుల్లోనూ కాల్చవద్దని వ్యవసాయ అధికారి కె.భరత్ సూచించారు. పొలాల్లో మిగిలిపోయిన వరిగడ్డిని పశుగ్రాసం కొరకు కొందరు రైతులు కట్టలు కడుతుంటే మరి కొందరు మిగిలిన వరిగడ్డిని కాల్చి వేస్తున్నారు. వరి గడ్డిని కాల్చడం వలన నేల సహజమైన సారవంతమైన స్వభావాన్ని కోల్పోతుందని, అంతేకాకుండా పంటలకు మేలు చేసే స్వప్న జీవులు నశిస్తాయని వ్యవసాయ అధికారి భరత్ వివరించారు. వరి చేలలో మిగిలిన అవశేషాలు కుళ్లిపోయేలా డి కంపోజర్లను వినియోగించడం వలన నేల సారవంతం పెరగడమే కాకుండా రసాయన రువులు వినియోగం కూడా తగ్గుతుందన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు భూమి ఆరోగ్యాన్ని కాపాడే విధంగా రైతులు శాసీ్త్రయ వ్యవసాయ పద్ధతులను అనుసరించాలని ఆయన కోరారు. -
ప్రకృతి సంగీతం.. గిరిపుత్రుల సొంతం
● పండుగలు, ఇంటి శుభకార్యాల్లో లయబద్ధంగా నృత్యాలు ● వినసొంపుగా సరిగమలు ఎరుగని రాగాలు బుట్టాయగూడెం: దట్టమైన అటవీ ప్రాంతంలో బాహ్య ప్రపంచానికి దూరంగా కొండ కోనల నడుమ స్థిర నివాసాలు ఏర్పాటు చేసుకుని జీవిస్తుంటారు కొండరెడ్డి గిరిజనులు. వీరు సంస్కృతి, సాంప్రదాయాలకు ఎక్కవ ప్రాధాన్యత ఇస్తుంటారు. వీరికి బయట ప్రపంచంతో పనిలేదు. అటవీ ప్రాంతమే ప్రపంచం. ప్రకృతి అందించిన సంగీతం వీరి సొంతం. సరిగమలు ఎరుగని రాగాలతో లయబద్ధంగా నృత్యాలు చేస్తూ పండుగలు, శుభకార్యాల్లో సందడి చేస్తారు. నేటి ఆధునిక ప్రపంచంలో సంగీతం ఎన్నో కొత్త పుంతలు తొక్కుతుంది. డాన్సుల్లో అనేక రకాలు పుట్టు కొస్తున్నాయి. ‘రామ.. రామ.. రామ.. ఉయ్యాలో.. రామనే శ్రీరామ ఉయ్యాలా. రామ..రామ..రామ.. ఉయ్యాలో...రాగమెత్తరాదే ఉయ్యాలా....’ అంటూ బతుకమ్మ పాటలు పాడడం రాదు. ‘అదిగో అల్లదిగో శ్రీ హరి వాసమూ పదివేల శేషుల పడగల మయమూ’ అంటూ అన్నమయ్య కీర్తనలు పాడరు. బ్రేక్ డాన్స్, స్నేక్ డాన్స్, కూచిపూడి, భరత నాట్యం తెలియదు. వీరికి తెలిసింది చుట్టూ కొండకోనలు, వాగు వంకలతో అలలారే గిరి పల్లెల్లో ప్రకృతి నేర్పిన సంగీతం, నాట్యంతోనే తమదైన శైలిలో ఆట, పాటలతో జీవితాన్ని ఆనందంగా గడపుతుంటారు. కూ... అంటూ కూసే కోయిలమ్మల పాట, గలగలపారే సెలయేటిని మరిపించే కమ్మదనం గిరిపుత్రుల ఆట, పాటలు సొంతం. గిరిజనుల్లోనే కోయ తెగకు చెందిన వారు ‘రెరెలయ్య ..రెరెల....రెరెలా....రేలా....’అంటూ పాడుకుంటే కొండరెడ్లు ‘జొన్నకూడు...జొన్న విల్లు.. జొన్నకూలితే.. పోతేనత్త’ అంటూ కొత్త పంటలు వచ్చిన సమయంలో పసుపు పచ్చపండుగ, మామిడి పండుగ, చింత పండుగ, భూదేవి పండుగలలో పాడుకుంటారు. అలాగే పెళ్ళిళ్ల సమయంలో కొండరెడ్డు ‘కళ్ళేడమ్మ.. కళ్ళేడమ్మ.. గోగులపిల్లకు.. కెచ్చెల పెల్లోడు’ అంటూ పెళ్లికి సంబంధించిన పాటలు పాడుతూ లయ బద్ధంగా నృత్యాలు చేస్తూ ఆనందంగా గడుపుతారు. వాయిద్య పరికరాలు సొంతంగా తయారీ కొండరెడ్డి గిరిజనులు వారు వాయించే వాయిద్య పరికరాలు సొంతంగా తయారు చేసుకుంటారు. అడవిలో లభించే ఉస్కటేకు, వేగెసా చెట్టులతో డప్పుల నమోనాలను తయారు చేసి వాటిని మేక చర్మాలతో అందంగా తయారు చేసుకుంటారు. అలాగే అడ్డతీగ గిల్లలతో గుత్తులు కట్టి డప్పు వాయిద్యాల నడుమ ఆ గిల్లలు ఊపుతూ చక్కటి తాళంతో మహిళలు నృత్యం చేస్తూ ఉంటారు. వేసవిలోనే డోలుకొయ్యిల వాయిద్యాల మోత గిరిజన పల్లెలు వేసవి కాలంలో డోలు కొయ్యిల వాయిద్యాలతో మోగిపోతుంటాయి. ఇటు శుభ కార్యాలతో పాటు గిరిజనులు తరతరాలుగా జరుపుకునే బాట పండుగ, మామిడికాయ పండగ వన దేవతలు పండుగలతో సందడి నెలకొంటుంది. ఈ నేపథ్యంలో గ్రామాల్లో డోలుకొయ్యిల వాయిద్యాలు, రేల పాటలు, సాంప్రదాయ నృత్యాలు గ్రామాల్లో సంచరించే వారికి కనువిందు చేస్తాయి. -
పెద్దింట్లమ్మా.. పాహిమాం
కై కలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ నీ చల్లని దీవెనలు మాకు అందించమ్మా అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు ఆదివారం తరలివచ్చి అమ్మను దర్శించుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తులు వేడి నైవేద్యాలను సమర్పించారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఆదివారం ఒక్క రోజు ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల విక్రయం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.80,870 ఆదాయం వచ్చిందని చెప్పారు. -
చెట్టును ఢీకొన్న కారు
బుట్టాయగూడెం: మండలంలోని నూతిరామన్నపాలెం సమీపంలో ఆదివారం సాయంత్రం ఓ కారు చెట్టును ఢీకొట్టింది. తాడేపల్లిగూడెంకు చెందిన కొందరు యువకులు గుబ్బల మంగమ్మగుడి దర్శనానికి వెళ్లి తిరిగి వస్తుండగా నూతిరామన్నపాలెం సమీపంలో ఒక ఆటోను ఢీకొట్టి పక్కనే ఉన్న కొబ్బరిబొండాల కొట్టును ఢీకొట్టి ఎదురుగా ఉన్న చెట్టును ఢీకొట్టారు. ఈ ఘటనలో తమకు అన్యాయం జరిగిందని, న్యాయం చేయాలని ఆటో డ్రైవర్, కొబ్బరిబొండాల వ్యాపారులు సతీష్, భవానీ కోరుతున్నారు. కాళ్ల: తల్లిదండ్రులు తమ పిల్లలను అనుమతి లేని పాఠశాలలో చేర్పించి ప్రభుత్వం అందించే సంక్షేమ పథకాలు కోల్పోవద్దని మండల విద్యాశాఖాధికారి–1 డీ శ్రీనివాసరావు విజ్ఞప్తి చేశారు. ఈ మేరకు ఆయన ఆదివారం విలేకరులతో మాట్లాడారు. కాళ్ల మండలం సీసలి గ్రామంలో ప్రభుత్వ అనుమతి లేకుండా శ్రీ భారతి స్కూలు అడ్మిషన్లు నిర్వహిస్తూ, ఫీజులు వసూలు చేస్తున్నట్టు సమాచారం వచ్చిందని, ఈ నేపథ్యంలో యాజమాన్యానికి నోటీసు ఇచ్చామన్నారు. పిల్లలను గుర్తింపు లేని పాఠశాలలో చేర్పించడం వల్ల ప్రభుత్వం నుంచి వచ్చే విద్యా పథకాలు, సంక్షేమ ప్రయోజనాలు, ఉపకార వేతనాలు, తల్లికి వందనం, యూనిఫాం, మధ్యాహ్న భోజన పథకం వంటివి వర్తించవని వెల్లడించారు. రూ.2 లక్షల నగదు అపహరణ ఏలూరు టౌన్: ఏలూరు ఆర్ఆర్పేట రైల్వే ట్రాక్రోడ్డులోని ఓ ఏసీల దుకాణంలో గుర్తుతెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. ఏలూరు సంతోష్నగర్ ప్రాంతానికి చెందిన గేదెల చంద్రశేఖర్ గత ఏడాది కాలంగా రైల్వేట్రాక్ రోడ్డులో డైకిన్ సాయిబాలాజీ కూలింగ్ సొల్యూషన్స్ పేరుతో ఏసీల విక్రయ దుకాణం నిర్వహిస్తున్నాడు. శనివారం రాత్రి యథావిధిగా తన పనులు ముగించుకుని షాప్ షట్టర్లకు తాళాలు వేసి ఇంటికి వెళ్లాడు. ఆదివారం ఉదయం వచ్చి చూసేసరికి షాపు వెనుకవైపు షట్టర్ తాళాలు పగలగొట్టి ఉండటంతో లోనికి వెళ్లి చూడగా కౌంటర్లోని రూ.2 లక్షల నగదు అపహకరణకు గురయ్యాయని గుర్తించాడు. సీసీ కెమెరాలను పరిశీలించగా గుర్తు తెలియని వ్యక్తి లోనికి ప్రవేశించి కౌంటర్లోని నగదు అపహరించినట్లు గుర్తించారు. షాప్ యజమాని చంద్రశేఖర్ ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. లింగపాలెం: మండలంలోని నరసన్నపాలెం గ్రామంలో ఆదివారం రాత్రి అగ్ని ప్రమాదం సంభవించింది. కూరాకుల రత్తయ్యకు చెందిన కోళ్ల ఫారాలు కాలి బూడిదయ్యాయి. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది. కై కలూరు: వివాహితను వేధిస్తున్న వ్యక్తిపై రూరల్ పోలీసు స్టేషన్లో ఆదివారం కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం ముదినేపల్లి మండలం బొమ్మినంపాడు గ్రామానికి చెందిన వివాహిత బోనాల దుర్గాతేజా(32) కొద్ది రోజులుగా రామవరంలో నానమ్మ ఇంటి వద్ద ఉంటుంది. ఈ నేపథ్యంలో గ్రామానికి చెందిన వి.ప్రవీణ్ అనే వ్యక్తి ఆమె పట్ల అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడు. కొద్దిరోజుల క్రితం ఆమె చేయి పట్టుకున్నాడు. ఆమె పెద్దలకు చెప్పింది. ప్రవీణ్లో మార్పు లేకపోవడంతో ఆమె పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేసింది. -
● లో ఓల్టేజీతో ‘దిమ్మె’తిరిగే షాక్
కాళ్ల మండలం ఏలూరుపాడు గరువు ప్రాంతంలో లోఓల్టేజీ సమస్య పరిష్కారానికి స్థానికులు సొంత ఖర్చుతో ట్రాన్స్ఫార్మర్ దిమ్మె ఏర్పాటు చేసుకున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేస్తామని అధికారులు చెప్పడంతో దిమ్మె ఏర్పాటుచేశామని, ఏడాది గడిచినా ట్రాన్స్ఫార్మర్ మాత్రం బిగించడం లేదని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. లోఓల్టేజీతో చాలా ఇబ్బంది పడుతున్నామని అంటున్నారు. దీనిపై విద్యుత్ ఏఈ రాంబాబును వివరణ కోరగా సమస్య పరిష్కారానికి ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు చేస్తామన్నారు. – కాళ్ల -
ద్విచక్ర వాహనాలు ఢీకొని వ్యక్తి మృతి
ఉండి: యండగండిలో ఆదివారం ఉదయం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఓ యువకుడు మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. పాలకోడేరు మండలం గొల్లలకోడేరు నుంచి ఒరిస్సా రాష్ట్రానికి చెందిన కామేష్(20) స్థానికుడైన కార్తీక్ ఇద్దరు కలిసి ద్విచక్రవాహనంపై గరగపర్రు రోడ్డు నుంచి యండగండి వైపు వెళుతున్నారు. ఇదే సమయంలో యండగండి వైపు నుంచి వస్తున్న మరో వ్యక్తి ద్విచక్రవాహనం ఎదురెదురుగా ఢీకొన్నాయి. ఈ ప్రమాదంలో కామేష్ రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. వాహనం నడుపుతున్న కార్తీక్కు తీవ్ర గాయాలయ్యాయి. అతడిని చికిత్స నిమిత్తం ఏలూరు తరలించారు. మరో ద్విచక్రవాహనంపై వచ్చిన వ్యక్తికి గాయాలుకాగా అతడిని భీమవరంలోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ ఘటనపై ఉండి పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ సాయినగర్ శివారు సూర్యనారాయణ కాలనీలో గుర్తు తెలియని వృద్ధుడు మృతిచెంది రోడ్డుపక్కన పడి ఉండటాన్ని పోలీసులు గుర్తించారు. మృతుని వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉంటుందన్నారు. వడదెబ్బకు మృతి చెంది ఉంటాడా.. లేక అనారోగ్యంతో మృతిచెందాడా అనే అంశంపై పోలీసులు విచారణ చేపట్టారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
మట్టి కనిపిస్తే మాయం
ముసునూరు: ముసునూరు మండలంలో గ్రావెల్, మట్టి మాఫియా చెలరేగిపోతోంది. అయితే నాకెందుకులే అన్నట్లు నీటిపారుదల, మైనింగ్, రెవెన్యూ శాఖ, పోలీస్ శాఖలు వ్యవహరిస్తున్నాయి. దీంతో అక్రమార్కులు గ్రావెల్, మట్టి దోపిడీని నిరంతరాయంగా కొనసాగిస్తున్నారు. మండల కేంద్రమైన ముసునూరులోని నల్లచెరువు నుంచి రెండు జేసీబీలు, 20 ట్రాక్టర్లతో వలసపల్లి వెళ్లే దారిలో ఉన్న పౌల్ట్రీ పరిశ్రమలకు పగలు, రాత్రి తేడా లేకుండా మట్టిని తరలిస్తున్నారు. ఇప్పటివరకు 300 ట్రక్కులకు పైగా మట్టిని అక్రమంగా తరలించి సొమ్ము చేసుకున్నారు. వలసపల్లిలో దోపిడీ గుడిపాడు, వలసపల్లి గ్రామాల మధ్య ఉన్న నల్లచెరువు నుంచి ఇరు గ్రామాలకూ చెందిన, జేసీబీలు ఉన్న రాజకీయ నేతలు గ్రావెల్ను నిరంతరాయంగా తరలిస్తూ విక్రయిస్తున్నారు. రక్షిత మంచి నీటి సరఫరా బోరుకు అతి సమీపంలో ఏకంగా 30 అడుగుల లోతుకు తవ్వేయడంతో చెరువు లోయలా మారిపోయింది. వర్షాకాలంలో చెరువు నిండిన తర్వాత పశువులకు, మనుషులకు సైతం ఇది తీవ్ర ప్రమాదకరంగా మారుతుందని ఇరు గ్రామాల ప్రజలు ఆందోళన చెందుతున్నారు. గోపవరంలో కంసాలి కుంట చెరువులో మట్టిని మూడు రోజుల నుంచి ఎడతెరిపి లేకుండా అక్రమంగా తరలిస్తున్నా అధికారులు కన్నెత్తి చూడడం లేదు. అడుగడుగునా నిర్లక్ష్యం అధికారుల నిర్లక్ష్యం, నేతల ధనార్జనే ధ్యేయంగా సాగుతున్న ఈ మట్టి, గ్రావెల్ దోపిడీని భరించలేక స్థానికులు రెవెన్యూ అధికారులకు సమాచారం అందిస్తున్నారు. సమాచారం అందించిన కాసేపటికే అధికార పార్టీకి చెందిన గ్రామ, మండల స్థాయి నేతల నుంచి ఫిర్యాదుదారులకు బెదిరింపు ఫోన్ కాల్స్ వస్తున్నాయి. దీంతో ఎవరికి వారు భయంతో మిన్నకుండిపోతున్నారు. సహజ సంపదైన గ్రావెల్, మట్టిని కొల్లగొడుతూ లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దోచుకుంటున్నా మండల రెవెన్యూ అధికారులు కానీ, నూజివీడు సబ్ కలెక్టర్ కానీ ఈ తోలకాలను నియంత్రించే ప్రయత్నం చేయడం లేదనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. రెవెన్యూ, నీటిపారుదల, గనుల శాఖల నుంచి ఎలాంటి అనుమతులు లేకుండానే, మండలంలోని చోటా నేతలు దూరాన్ని బట్టి ట్రాక్టర్ ట్రక్కుకు రూ.800 నుంచి రూ.1000 వరకు ధర నిర్ణయించి అక్రమ వ్యాపారం సాగిస్తున్నారు. చివరకు సమాచార, గృహనిర్మాణ శాఖ మంత్రి పేరు చెప్పుకుని అధికారులను బెదిరిస్తూ.. వాణిజ్య అవసరాలకు, భూస్వాముల తోటలకు, పౌల్ట్రీ ఫాంలకు వేలాది ట్రాక్టర్ల మట్టిని తరలిస్తున్నట్లు విమర్శలు వస్తున్నాయి. అధికారులు మాత్రం సమాచారం ఇచ్చిన వారికి ఏదో ఒక సాకు చెప్పి తప్పించుకుంటున్నారు తప్ప చర్యలు తీసుకోవడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. దీంతో అక్రమ మట్టి రవాణాపై రెవెన్యూ అధికారులకు చెప్పినా ప్రయోజనం లేకుండా పోయింది. జిల్లా కలెక్టర్ తక్షణమే స్పందించి ఈ దోపిడీని అడ్డుకోవాలని మండల ప్రజలు కోరుతున్నారు. చర్యలు తీసుకుంటాం అక్రమ మట్టి రవాణాపై మండల తహసీల్దార్ డి.ప్రశాంతిని వివరణ కోరగా... తక్షణమే వీఆర్వోను పంపి, అక్రమ తోలకాలపై తగిన చర్యలు తీసుకుంటామని తెలిపారు. మొద్దు నిద్రలో మైనింగ్, రెవెన్యూ శాఖలు వలసపల్లి నల్లచెరువులో 30 అడుగుల లోతున గ్రావెల్ తవ్వకం ముసునూరు నల్లచెరువు నుంచి తోలకాలు -
గురువులకు సర్దుపోటు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయ వర్గంపై చిన్నచూపును చంద్రబాబు ప్రభుత్వం మరోసారి చూపించింది. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి వారిని ముప్పతిప్పలు ఎలా పెట్టాలనే ఆలోచనతోనే వ్యవహరిస్తోందని ఇప్పటికే ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్న సంగతి విధితమే. ఉపాధ్యాయుల కోరిక మేరకు ఏటా బదిలీలు నిర్వహిస్తామని గతంలో విద్యా శాఖ మంత్రి నారా లోకేష్ ఉపాధ్యాయులకు స్పష్టమైన హామీ ఇచ్చారు. ఈ హామీ కేవలం నీటి మూట మాత్రమే అని ఉపాధ్యాయులకు ఈ ఏడాది అవగతమయింది. ఈ ఏడాది బదిలీలు జరుగుతాయి, తాము అనుకున్న ప్రాంతాలకు బదిలీ కావచ్చని ఎంతో ఆశగా ఎదురు చూస్తున్న ఉపాధ్యాయులకు విద్యా శాఖ ఈ ఏడాది బదిలీలు ఉండవని, కేవలం సర్దుబాటుతో సరిపెడతామనే సంకేతాలు పంపింది. దీంతో ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన గతంలో బదిలీ అయి సుదూర ప్రాంతాల్లో పని చేస్తున్న ఉపాధ్యాయుల ఆశలపై నీళ్ళు చల్లినట్టయ్యింది. ఈసారి వేసవి సెలవులు ప్రారంభమై నెల రోజులు గడిచినా టీచర్ల బదిలీల ఊసెత్తడం లేదు. బదిలీలకు బదులు సర్దుబాటు అంటూ కొత్త అంశాన్ని ప్రభుత్వం తెరపైకి తెచ్చింది. దీంతో ఏటా వేసవి సెలవుల్లో ఉపాధ్యాయుల బదిలీలు నిర్వహిస్తామని, పాఠశాలల పునఃప్రారంభం నాటికే బదిలీ స్థానంలో రిపోర్టు చేయాల్సి ఉంటుందని లోకేష్ గతంలో చెప్పిన మాటలను ఈ సందర్భంగా ఉపాధ్యాయులు గుర్తు చేస్తున్నారు. ఈసారి ఉమ్మడి జిల్లా ప్రాతిపదికన కాకుండా కొత్త జిల్లా ప్రాతిపదికన బదిలీలకు బదులు పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేయాలని చంద్రబాబు సర్కారు యోచిస్తోంది. ఈ మేరకు జిల్లా విద్యాశాఖ కార్యాలయానికి ఆదేశాలు అందాయి. దీంతో ఉపాధ్యాయ వర్గాల్లో ఆందోళన నెలకొంది. కొత్త జిల్లాల ప్రాతిపదికన.. కొత్త జిల్లాలకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం జారీ చేసిన ఏపీ పబ్లిక్ ఎంప్లాయిమెంట్ ఆర్డర్–2025 గెజిట్కు అనుగుణంగా ఉద్యోగ నియామకాలు, బదిలీలు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈ క్రమంలో రాష్ట్రం మొత్తాన్ని ఆరు జోన్లు, రెండు మల్టీ జోన్లుగా విభజించింది. ఏలూరు, పశ్చిమగోదావరి, ఎన్టీఆర్, కృష్ణా జిల్లాలను 3వ జోన్ పరిధిలోకి తెచ్చారు. ఉద్యోగ బదిలీలు, నియామకాలకు ఈ జోన్నే ప్రామాణికంగా తీసుకుంటారు. సూపరింటెండెంట్, ఫస్ట్ గ్రేడ్ గెజిటెడ్ పోస్టులను జోనల్ పోస్టులుగా, డిప్యూటీ కలెక్టర్, దీనికి సమానమైన క్యాడర్లను మల్టీజోన్ పోస్టులుగా పరిగణిస్తారు. జూనియర్ అసిస్టెంట్, అంతకంటే దిగువన ఉండే పోస్టులను జిల్లా స్థాయి క్యాడర్గా పరిగణిస్తారు. దీని ప్రకారం సెకండరీ గ్రేడ్ టీచర్లు, స్కూల్ అసిస్టెంట్లు, పంచాయతీరాజ్, మున్సిపల్ ప్రధానోపాధ్యాయ గ్రేడ్–2 పోస్టులు జిల్లా క్యాడర్లోనే ఉంటాయి. అందుకే వీరి నియామకాలు, బదిలీలు ఇకపై జిల్లా స్థాయిలోనే జరుగనున్నాయి. ప్రభుత్వ పాఠశాల ప్రధానోపాధ్యాయుల పోస్టును మాత్రం జోనల్ పోస్టుగా పరిగణించనున్నారు. సందిగ్ధంలో పీఎస్ హెచ్ఎం పోస్టులు గత ఏడాది టీచర్ల బదిలీల సమయంలో మోడల్ ప్రైమరీ స్కూళ్లకు తరగతికి ఒక ఉపాధ్యాయుడిని నియమించడంతో పాటు ప్రత్యేకంగా హెచ్ఎం పోస్టు కేటాయించి, హెచ్ఎంగా స్కూల్ అసిస్టెంట్ను నియమించారు. ఈసారి మోడల్ స్కూళ్లలో 40 మంది లోపు విద్యార్థులుంటే అక్కడున్న హెచ్ఎం పోస్టును రద్దు చేయాలని సర్కార్ ఆదేశించింది. సర్దుబాటు క్రమంలో అక్కడున్న హెచ్ఎంను ఎక్కడికి పంపాలో తెలియడం లేదని మండల విద్యాశాఖాధికారులు మల్లగుల్లాలు పడుతున్నారు. పాఠశాలల పునఃప్రారంభం తర్వాతే ఉపాధ్యాయులందరూ ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా ప్రాతిపదికన నియామకాలు పొందారు. ఇప్పటి వరకూ ఇదే ప్రాతిపదికన బదిలీల కౌన్సెలింగ్ నిర్వహించారు. ఈసారి ప్రభుత్వం కొత్త జిల్లా అంశాన్ని తెరపైకి తెచ్చింది. ఈ నేపథ్యంలో ఈసారి నూతన జిల్లా ప్రాతిపదికన బదిలీలకు బదులు సర్దుబాటు చేయనున్నారు. జూన్ మొదటి వారంలోనే ఈ ప్రక్రియ మొత్తం పూర్తి చేయాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశించినప్పటికీ పాఠశాలలు పునః ప్రారంభమైతే గానీ ఆయా పాఠశాలల్లోని విద్యార్థుల సంఖ్య పక్కాగా తెలియదు. అందువల్ల పాఠశాలల ప్రారంభం తర్వాతే సర్దుబాటు చేయనున్నారు. ఉపాధ్యాయులకు కూటమి ప్రభుత్వం ఇచ్చిన హామీని నిలబెట్టుకోవాలి. ఏటా బదిలీలు చేస్తామని చెప్పి ఈ ఏడాది సర్దుబాటుకు పూనుకోవడం ఉపాధ్యాయులను మోసగించడమే. పైగా విద్యార్థుల సంఖ్యను బట్టి సర్దుబాటు చేస్తామనడం న్యాయసమ్మతం కాదు. మారుమూలన పని చేస్తున్న ఉపాధ్యాయులు ఈ సారి తాము కోరుకున్న ప్రాంతానికి బదిలీ అవుతామని ఎదురు చూస్తుండగా సర్దుబాటు వార్త తీవ్ర నిరాశ కలిగించింది. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధిజిల్లాలో 1748 ప్రభుత్వ యాజమాన్యాల్లోని పాఠశాలలు ఉన్నాయి. మొత్తం 7802 మంది ఉపాధ్యాయులు బోధిస్తున్నారు. వీరిలో ఒకే చోట ఎనిమిదేళ్లు సర్వీసు పూర్తి చేసిన వారు తప్పనిసరిగా బదిలీ కావాల్సి ఉంది. ఒకే స్కూల్లో రెండేళ్లు పనిచేసిన వారు బదిలీకి అర్హులు. ఇలాంటి వారు జిల్లాలో 3,200 మంది వరకూ ఉన్నట్లు తెలుస్తోంది. బదిలీలపై ఎంతో ఆశపెట్టుకున్న ఉపాధ్యాయులంతా చంద్రబాబు ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై గుర్రుగా ఉన్నారు. మాట తప్పుతున్న బాబు ప్రభుత్వం ఏటా బదిలీలు చేస్తామన్న మాట నీటిమూటే బదిలీల కోసం ఎదురు చూస్తున్న 3200 మంది ఉపాధ్యాయులు -
ఎఫెక్ట్
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీదేవి, శనివారం జిల్లా న్యాయసేవా అధికార సంస్థ భవనంలో ఏలూరు ప్యానల్ న్యాయవాదులతో సమావేశాన్ని నిర్వహించారు. ఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికారి సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీదేవి న్యాయవాదులు కేసులు పురోగతి, కేసులు సత్వర విచారణకు తీసుకోవాల్సిన చర్యలపై చర్చించారు. కేసుల పురోగతి అడిగి తెలుసుకున్నారు. కేసులను త్వరితగతిన పరిష్కరించడానికి కృషి చేయాలని, అలసత్వం తగదని ప్యానల్ న్యాయవాదులకు సూచించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ అడ్వాన్స్డ్ పరీక్షలకు శుకృవారం ప్రథమ, ద్వితీయ సంవత్సరాల విద్యార్థులు మొత్తం 3,938 మంది హాజరయ్యారు. ఉదయం ఇంగ్లీష్–1 పరీక్షకు మొత్తం 2987 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 951 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని ఎక్కడా మాల్ ప్రాక్టీస్ కేసులూ నమోదు కాలేదని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాన్ తెలిపారు. 28న పరీక్షలు వాయిదా ఈ నెల 28వ తేదీన జరగాల్సిన ప్రథమ సంవత్సరం ఎకనామిక్స్–1, ద్వితీయ సంవత్సరం గణితం–2, ప్రథమ, ద్వితీయ సంవత్సరాల ఒకేషనల్ పరీక్షలు బక్రీద్ నేపథ్యంలో వాయిదాపడ్డాయని తెలిపారు. ఈ పరీక్షలు జూన్ 5న జరుగుతాయని, విద్యార్థులు పాత హాల్ టికెట్తో పరీక్షకు హాజరుకావచ్చన్నారు. జూన్ 5న జరగాల్సిన ఎథిక్స్ అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్షను జూన్ 12కి వాయిదా వేసినట్టు తెలిపారు. బుట్టాయగూడెం: ‘విద్యుత్ కోతతో ఇక్కట్లు’ శీర్షిక సాక్షి దినపత్రికలో ప్రచురించిన కథనంపై విద్యుత్శాఖ అధికారులు స్పందించారు. బుట్టాయగూడెం, కొమ్ముగూడెం సెంటర్, బూసరాజుపల్లిలో నెలకొన్న విద్యుత్ సమస్యను పూర్తిస్థాయిలో పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని విద్యుత్ శాఖ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ పీర్ అహ్మద్ఖాన్ తెలిపారు. కొమ్ముగూడెం సెంటర్ పరిధిలో మంగళవారం రాత్రి ఒంటి గంట నుంచి ఉదయం 7 గంటల వరకూ విద్యుత్ సరఫరా నిలిచిపోయిందని, ట్రాన్స్ఫార్మర్ ట్రిప్ అయ్యిందన్నారు. విద్యుత్ కోత లేకుండా చూస్తున్నామని చెప్పారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితుల కోసం సేకరిస్తున్న రెండో విడత భూసేకరణ స్థానిక ఎమ్మెల్యే అనుచరులు, దళారులు, అధికారులకు ఏటీఎంలా మారిందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ సమన్వయకర్త తెల్లం బాలరాజు అన్నారు. బుట్టాయగూడెం మండలం దుద్దుకూరులో విలేకర్లతో మాట్లాడుతూ ప్రాజెక్టు నిర్వాసితుల కోసం బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో సుమారు 4 వేల ఎకరాల వరకూ భూసేకరణ చేస్తున్నట్లు చెప్పారు. ఈ భూములను వరరామచంద్రాపురం, చింతూరు, కూనవరం మండలాల నిర్వాసితుల కోసం సేకరిస్తున్నారన్నారు. ఈ భూసేకరణలో అనేక అక్రమాలు చోటు చేసుకున్నాయని ఆరోపించారు. భూసేకరణ సమయంలో అధికారులు, దళారులు కమిషన్ల రూపంలో 15 నుంచి 20 శాతం వరకూ వసూలు చేస్తున్నారని ఆరోపించారు. బ్యాంక్ చెక్లు ముందే తీసుకుంటున్నారని అన్నారు. భూములిచ్చే రైతుల వివరాలను బట్టి సమగ్రంగా విచారణ చేస్తే వాస్తవాలు బయటకు వచ్చే అవకాశం ఉందన్నారు. నిర్వాసితులకు జరిగే అన్యాయాలపై వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో త్వరలో ఆందోళన చేపడతామని చెప్పారు. ఇదే విషయంపై మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దృష్టికి తీసుకువెళ్తానని చెప్పారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో భూసేకరణలో జరుగుతున్న అక్రమాలపై సిట్, సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. -
కానరాని క్యాంపస్ ప్లేస్మెంట్స్
నిట్కు తగ్గిన కంపెనీల రాక తాడేపల్లిగూడెం: జాతీయ విద్యాసంస్థల్లో సీటు సాధిస్తే చాలు ఉద్యోగాలకు ఢోకా లేదనే ధీమా ఉండేది. విద్యావ్యవస్థలో వస్తున్న వినూత్న మార్పులు, ఏఐ కారణంగా క్యాంపస్ ప్లేస్మెంట్లు దాదాపుగా తగ్గాయి. ఒకప్పుడు నిట్లు, ఐఐటీలు వంటి జాతీయ విద్యాసంస్థలకు కంపెనీలు క్యూ కట్టేవి. వందల సంఖ్యలో సంస్థలు వచ్చి విద్యార్థులకు భారీ వేతనాలతో ఆఫర్ లెటర్లు ఇచ్చేవి. దేశంలో 31వ నిట్గా ఏర్పడిన ఏపీ నిట్ కూడా ఉద్యోగాల కల్పనలో తిరుచ్చి నిట్తో పోటీపడేది. ఇప్పుడు పరిస్థితి మారింది. గత రెండు మూడు సంవత్సరాలుగా ఏపీ నిట్కు కంపెనీల రాక తగ్గిపోవడంతో ఉద్యోగాల లభ్యత అంతంత మాత్రంగానే ఉంది. ఏఐ ప్రభావం నేరుగా కొలువులపై పడడంతో కంపెనీల రాక పూర్తిగా తగ్గింది. 2019లో ఏపీ నిట్ తొలి బ్యాచ్ బయటకు వెళ్లినప్పటి నుంచి 2025–26 బ్యాచ్ వరకు గణాంకాలను పరిశీలిస్తే ఈ తేడా స్పష్టంగా కనిపిస్తోంది. గతంలో ప్రతి బ్యాచ్లో దాదాపుగా 90 శాతానికి పైగా విద్యార్థులు భారీ ప్యాకేజీలతో ఉద్యోగాలు పొందేవారు, ఇప్పుడు వాతావరణం భిన్నంగా ఉంది. ● 2022 బ్యాచ్లో 270 కంపెనీలు రాగా 522 మంది విద్యార్థులకు ఆఫర్ లెటర్లు లభించాయి. అప్పుడు ప్లేస్మెంట్ శాతం 95.69గా ఉండగా, అత్యధిక వార్షిక వేతనం రూ.47.3 లక్షలుగా నమోదైంది. ● 2023 బ్యాచ్కు సంబంధించి 174 కంపెనీలు రాగా, కేవలం 352 మందికి మాత్రమే ఉద్యోగాలు లభించాయి. దీంతో ప్లేస్మెంట్ శాతం 88.75కు పడిపోయింది. అత్యధిక వార్షిక వేతనం రూ.47 లక్షలుగా ఉంది. ● 2024 బ్యాచ్లో 174 కంపెనీలు మాత్రమే వచ్చి 361 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా, ప్లేస్మెంట్ శాతం 74.55కు తగ్గి, అత్యధిక వార్షిక వేతనం రూ.44.1 లక్షలుగా నమోదైంది. ● 2025–26 పాస్డ్ అవుట్ బ్యాచ్లో 180 కంపెనీలు వచ్చి 510 మందికి ఆఫర్ లెటర్లు ఇవ్వగా, ప్లేస్మెంట్ శాతం 80.94గా ఉంది. ఈ బ్యాచ్లో అత్యధిక వార్షిక వేతనం రూ. 65 లక్షలుగా నమోదైంది. -
పవన్ మా గోడు పట్టదా..?
డిప్యూటీ సీఎం కార్యాలయం వద్ద ఉణుదుర్రు బాధితుల నిరసన ఉండి: ఉణుదుర్రు ఆర్అండ్బీ రోడ్డు పక్కన ఇళ్ళు కోల్పోయిన బాధితులకు కూటమి ప్రభుత్వంలో న్యాయం జరగకపోవడంతో చివరికి ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ వద్దకు వెళ్లారు. ఉణుదుర్రు బాధితులు సుమారు 30 మంది వరకు మంగళగిరికి వెళ్లారు. అక్కడ మండుటెండలో మాకు న్యాయం చెయ్యండి అంటూ బ్యానర్ పట్టుకుని నిరసనకు దిగారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు ఎదురు చూసినా డిప్యూటీ సీఎం అపాయింట్మెంట్ లభించకపోవడంతో కార్యాలయ అధికారిగా భావిస్తున్న ఓ వ్యక్తికి తమ సమస్య చెప్పి వినతి పత్రాలను ఆయనకు అందజేసినట్లు బాధితులు తెలిపారు. పవన్కు కలిసేందుకు రాత్రి వరకు ఎదురు చూశారు. ఆలకోడు భూముల్లో ఉన్న ఇళ్లను గ్రామానికి చెందిన కొందరు కూల్చేసేందుకు పన్నాగం పన్నారని తెలిపారు. ఈ నెల 13న ఇళ్ళలో నుంచి బయటకు గెంటేసి దౌర్జన్యంగా ఇళ్ళు కూల్చేసారని వాపోయారు. చాలా మందికి అద్దె ఇళ్ళు కూడా దొరక్కపోవడంతో సీపీఎం నాయకుల సహాయంతో గ్రామంలోని హైస్కూల్లో తలదాచుకున్నామని వారి సహకారంతోనే భోజనాలు చేస్తున్నట్లు తెలిపారు. తమపై కక్షకట్టిన గ్రామానికి చెందిన కొందరు నాయకులు, ఆక్వా రైతులు గ్రామంలోని హైస్కూల్లో తలదాచుకుంటున్న తమను ఖాళీ చేయించారని తెలిపారు. -
జీవ వైవిధ్యం.. లేదంటే వినాశనం
చెట్టుకిందే చెక్పోస్టు దెందులూరు: ఏలూరు రూరల్ మండలం చాటపర్రులో ఏఎంసీ చెక్పోస్ట్ కేవలం చెట్టు కిందే నిర్వహిస్తున్నారు. ఇక్కడ చెక్పోస్టు బోర్డు మాత్రమే ఉంది. శురకవారం శ్రీ 22 శ్రీ మే శ్రీ 2026కై కలూరు: జీవ వైవిధ్యం అంటే భూమిపై ఉండే జన్యువులు, మొక్కలు, జంతువులు, సూక్ష్మజీవులు సహా పలు జాతులు, పర్యావరణ వ్యవస్థల సముదాయం. అయితే మానవ తప్పిదాల వల్ల అరుదైన జాతులు అంతరించిపోతుండడంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఈ నేపథ్యంలో భవిష్యత్ తరాలకు జీవ వైవిధ్యాన్ని అందించేందుకు ఏటా మే 22న అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవాన్ని జరుపుకుంటాం. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవ వైవిధ్య బోర్డు (ఏపీఎస్బీబీ) బయోడైవర్సిటీపై అవగాహన కల్పిస్తోంది. ఈ ఏడాది స్థానిక చర్యలు – ప్రపంచ ప్రభావం అనే నినాదంతో ప్రపంచ వ్యాప్తంగా జీవ వైవిధ్యంపై అవగాహన పెంచుతున్నారు. ఉమ్మడి పశ్చిమకే కళ రాష్ట్రంలో 37,258 చదరపు కిలోమీటర్లలో అటవీ విస్తీర్ణం ఉంది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాల్లో జీవ వైవిధ్యం ఉట్టిపడుతోంది. కొల్లేరు సరస్సు రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏకై క చిత్తడి నేలల ప్రాంతంగా గుర్తింపు పొందింది. కొల్లేరులో 184 జాతుల పక్షులు సంచరిస్తాయి. ఇక పాపికొండల ప్రయాణం జీవితంలో మరుపురానిది. వీటితో పాటు రాష్ట్రంలో రోళ్లపాడు, కోరింక, నాగార్జునసాగర్, శ్రీశైలం టైగర్ రిజర్వ్, శ్రీ వేంకటేశ్వర జాతీయ ఉద్యానవనం, శేషాచల కొండలు, పులులు, చిరుతలు, ఏనుగులు, పక్షులు ఇలా ఎన్నో ఆకట్టుకుంటాయి. తూర్పుతీరంలో రెండో అతిపెద్ద మడ అడవులు ఉన్నాయి. జీవ వైవిధ్య హాట్స్పాట్లుగా చిత్తూరు, అనంతపురం, కడప, కర్నూలు జిల్లాలు వినతికెక్కాయి. మొట్టమొదటి బయోస్పియర్ రిజర్వ్గా శేషాచలం కొండలను గుర్తించారు. నల్లమల ఏపీలో అతిపెద్ద అడవి. అంతరిస్తున్న అరుదైన జాతులు మానవ తప్పిదాల వల్ల అరుదైన జాతులు అంతరిస్తుండడంతో జీవ వైవిధ్యానికి ముప్పు వాటిల్లుతోంది. ఆడవుల నరికివేత, రసాయనాల వాడకం, కాంక్రిట్ జంగిల్, ఆహార, ఆవాసాల కొరత ఇందుకు కారణాలుగా కనిపిస్తున్నాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూసీఎన్) రెడ్ లిస్ట్ వెల్లడిస్తోంది. ప్రపంచ వ్యాప్తంగా ఐయూసీఎన్ 48,600 జాతులు అంతరిస్తున్నాయని ప్రకటించింది. ఏపీలో ఎర్ర చందనం, సెరోఫిజియా ఆండ్రికా వంటి మొక్కలు, జెర్డాన్ కోర్సర్ పక్షి, ఫిషింగ్ క్యాట్ వంటి జంతువులు అంతరిస్తున్నాయి. నిధుల కొరతతో బీఎంసీ కమిటీలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జీవవైవిధ్య బోర్డు (ఏపీఎస్బీబీ) అనేది 2002 జీవవైవిధ్య చట్టం కింద ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేసిన ఒక చట్టబద్ధమైన సంస్థ. జీవవైవిధ్య పరిరక్షణ, సుస్థిర వినియోగం, జీవవనరుల వినియోగంతో కలిగే ప్రయోజనాలు వంటి విషయాలపై రాష్ట్ర ప్రభుత్వానికి సలహా ఇవ్వడం ఈ బోర్డు బాధ్యత. మన రాష్ట్రంలో బయోడైవర్సిటీ మేనేజ్మెంట్ కమీటీలు(బీఎంసీ)లు కీలకంగా ఉన్నాయి. రాష్ట్రంలో పంచాయతీలు మండల, మున్సిపాలిటీ, మున్సిపాల్ కార్పొరేషన్లు జిల్లా కమిటీలు వెరసి 14,117 ఉన్నాయి. అత్యధికంగా 13,363 పంచాయతీ కమిటీలు పనిచేస్తున్నాయి. నిధుల కొరత కమిటీలను వేధిస్తోంది. జీవి వైవిధ్యం భూమిపై సమస్త జీవరాశికి పునాది వంటిది. ఇందులో జన్యు వైవిధ్యం, జాతుల వైవిధ్యం, పర్యావరణ వైవిధ్యం అనే మూడు రకాలు ఉంటాయి. కలుషిత నీరు కారణంగా కొల్లేరు సరస్సులో అరుదైన నల్లజాతి చేపలు అంతరిస్తున్నాయి. జీవి వైవిధ్యానికి అందరూ కట్టబడి ఉండాలి. – డాక్టర్ పి.రామమోహనరావు, విశ్రాంత మత్స్యశాఖ ఉపసంచాలకుడు, కాకినాడ నేడు అంతర్జాతీయ జీవ వైవిధ్య దినోత్సవం ఈ ఏడాది ‘స్థానిక చర్యలు – ప్రపంచ ప్రభావం’ అనే నినాదం జిల్లాలో జీవ వైవిధ్యానికి నిలయాలుగా కొల్లేరు, మడ అడవులు అంతరించిపోతున్న అరుదైన జాతులు -
ఇళ్ల గణనను పూర్తి చేయాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఏలూరు రూరల్ మండలం వెంకటాపురం పంచాయతీ మాదేపల్లిలో జరుగుతున్న జనగణన కార్యక్రమంలో ఇళ్ల గణనను కలెక్టర్ కె.వెట్రిసెల్వి గురువారం తనిఖీ చేశారు. కలెక్టర్ మాట్లాడుతూ ఇళ్లగణనను సచివాలయ సిబ్బంది యుద్ధప్రాతిపదికన పూర్తిచేయాలన్నారు. వేడి గాలుల బారిన పడకుండా ప్రజలను అప్రమత్తం చేయాలన్నారు. ప్రతి గ్రామ సచివాలయ పరిధిలో అవసరమైన మేర చలివేంద్రాలు ఏర్పాటుచేయాలన్నారు. ఈ నెల 22న నిడమర్రు మండల పరిషత్ కార్యాలయంలో నిడమర్రు గ్రామానికి సంబంధించి ఒక నెల, ఒక నియోజకవర్గం, నాలుగు పర్యటనల కార్యక్రమం నిర్వహిస్తారని కలెక్టర్ తెలిపారు. ఏలూరు రూరల్ : ఈ నెల 21న ఏలూరు అల్లూరి సీతారామరాజు స్టేడియంలో చేపట్టాల్సిన జిల్లా స్థాయి అథ్లెటిక్స్ పోటీలు వాయిదా వేశామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. కొద్దిరోజులుగా జిల్లాలో అధిక ఉష్ణోగ్రతల కారణంగా దూర ప్రాంతాల నుంచి వచ్చే అథ్లెట్లు ఇబ్బందులు పడకుండా పోటీలు వాయిదా వేశామని వివరించారు. త్వరలో జిల్లా అథ్లెటిక్స్ కోచ్ జి.కృష్ణకుమారి, అథ్లెటిక్స్ అసోసియేషన్ కార్యదర్శి దేవరపల్లి ప్రసాద్తో చర్చించి తదుపరి పోటీల నిర్వహణ తేదీ వెల్లడిస్తామన్నారు. ఏలూరు(ఆర్ఆర్పేట): నిధులు కేటాయించకుండా వచ్చే రెండేళ్ల కాలంలో రాష్ట్రంలోని 36 ప్రాజెక్టులు పూర్తి చేయడం తమ ప్రభుత్వ ప్రాధాన్యతని ముఖ్యమంత్రి, జలవనరుల శాఖ మంత్రి ప్రకటించడం హాస్యాస్పదంగా ఉందని, నిధులు లేకుండా ప్రాజెక్టులు ఎలా పూర్తి చేస్తారని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. ప్రభాకర్ రెడ్డి ప్రశ్నించారు. 36 ప్రాజెక్టులు పూర్తి చేసేందుకు నిధులు వెంటనే కేటాయించాలని డిమాండ్ చేశారు. గురువారం ఏలూరులో మాట్లాడుతూ.. రాష్ట్రంలోని చిన్న,మధ్య తరహా ప్రాజెక్టులు పూర్తి చేస్తామని లక్ష్యం ప్రకటించడం సరిపోదని, అందుకు అవసరమైన కార్యాచరణ ఉండాలన్నారు. ఉత్తరాంధ్ర, రాయలసీమ వెనకబడిన ప్రాంతాలలోని ప్రాజెక్టులు తక్షణమే పూర్తి చేయాలని డిమాండ్ చేశారు. ఏలూరు, ఎన్టీఆర్, తూర్పుగోదావరి జిల్లాలకు ఎంతో ఉపయోగకరమైన చింతలపూడి ఎత్తిపోతల పథకం పనులు వెంటనే ప్రారంభించాలని కోరారు. ఆగిరిపల్లి: మండలంలోని చొప్పరమెట్లకు చెందిన పోలగాని నాగేశ్వరమ్మ (55) వడదెబ్బ తగిలి మృతి చెందింది. కుటుంబ సభ్యులు తెలిపిన వివరాల ప్రకారం గురువారం ఉదయం నాగేశ్వరమ్మ ఎప్పటిలాగానే సగ్గూరు చెరువు వద్ద గేదెలు మేపడానికి వెళ్లింది. సాయంత్రమైనా ఇంటికి తిరిగి రాకపోవడంతో కుటుం సభ్యులు వెతకగా చెరువు సమీపంలో పొలాల వద్ద ఆమె విగతజీవిగా పడి ఉంది. గేదెలు మేపడానికి వెళ్లిన ఆమె వడదెబ్బ తగిలి మరణించడంతో కుటుంబం శోకసంద్రంలో మునిగిపోయింది. నాగేశ్వరమ్మకు ఇరువురు కుమారులు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ సప్లిమెంటరీ పరీక్షలు గురువారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. తొలిరోజు ప్రథమ, ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు తెలుగు, సంస్కృతం, హిందీ, ఉర్దూ పరీక్షలు నిర్వహించారు. ఉదయం 32 కేంద్రాల్లో ప్రథమ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 1614 మంది విద్యార్థులు హాజరయ్యారు. మధ్యాహ్నం 31 కేంద్రాల్లో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు నిర్వహించిన పరీక్షకు మొత్తం 893 మంది హాజరయ్యారు. ముదినేపల్లి(కై కలూరు): సదరం ధ్రువపత్రానికి ఏలూరు వెళ్లిన గురజా గ్రామానికి చెందిన దేవరకొండ పోతురాజు(30) గురజ గవర్నమెంటు కాలేజీ వెనుక బోదెలో శవమై గురువారం కనిపించాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పోతురాజు ఈ నెల 18న ఏలూరు ప్రభుత్వాసుపత్రికి సదరం ధ్రువపత్రం కోసం వెళ్లాడు. తిరిగి ఇంటికి రాకపోవడంతో అన్నయ్య చిన్న వెంకటేశ్వరరావు 19న ముదినేపల్లి స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. గాలింపు చర్యల్లో భాగంగా అతడు మృతి చెందినట్లు గుర్తించామన్నారు. సోదరుడి ఫిర్యాదుపై ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
● ప్రభుత్వాసుపత్రిలో నరకమే
ఏలూరు (ఆర్ఆర్పేట): వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన పలువురు నాయకులను వివిధ పదవుల్లో నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేరకు ఏలూరు నియోజకవర్గానికి చెందిన మోటమర్రి సదానంద కుమార్ను రాష్ట్ర వాణిజ్య విభాగం కార్యదర్శిగా నియమించారు. అలాగే జిల్లా ఎస్సీ సెల్ ప్రధాన కార్యదర్శిగా రావి సునీల్ (నాని), ఎస్సీ సెల్ జిల్లా కార్యవర్గ సభ్యునిగా రాచేటి మట్టయ్య, జిల్లా వైఎస్సార్ ట్రేడ్ యూనియన్ కార్యదర్శిగా కందా రాజు, యువజన విభాగం జిల్లా కార్యదర్శిగా పసుపులేటి దినేష్ నియమితులయ్యారు. వీరితో పాటు ఏలూరు నియోజకవర్గ ఐటీ విభాగ అధ్యక్షునిగా కొమ్మోజు ప్రేమ్కుమార్ను నియమించారు. రోగుల బంధువులే స్కానింగ్, ఎక్స్రే వార్డులకు తీసుకెళ్తున్న దృశ్యం పేద, మధ్యతరగతి వారికి ప్రభుత్వాసుపత్రే దేవాలయం. ఆసుపత్రికి వస్తే అన్ని రకాలుగా వైద్యం సకాలంలో అందుతుందనేది పాత మాట. ఇప్పుడు ఎందుకు వచ్చాం రా.. భగవంతుడా అన్నట్లు తయారైంది ఏలూరు సర్వజన ఆసుపత్రి. రోగులను ఎక్స్రేకు తీసుకెళ్లాలన్నా... రక్తనమూనాకు తీసుకెళ్లాలన్నా, స్కానింగ్ వార్డుకు తీసుకెళ్లాలన్నా రోగి బంధువులు నరకం చూడాల్సిందే. స్ట్రెచర్, వీల్చైర్పై తీసుకువెళ్లాలంటే నానా యాతన పడుతున్నారు. ఆసుపత్రి సహాయ ఉద్యోగులు స్పందించకపోవడంతో వారి బంధువులే అవస్థలు పడుతున్నారు. గురువారం ప్రభుత్వాసుపత్రిలో కనిపించిన దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు వీల్చైర్ లేక మనవరాలి సాయంతో నడుస్తున్న వృద్ధురాలు -
అయ్యో.. రొయ్య
సాక్షి, భీమవరం : రొయ్య ధరలు పతనమవుతున్నాయి. పది రోజుల వ్యవధిలో కౌంట్ను బట్టి కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు పడిపోవడంతో ఎకరాకు రూ.లక్ష వరకు రైతులు నష్టపోవాల్సి వస్తోంది. ప్రాసెసింగ్ ప్లాంట్ల యజమానులు, ఎగుమతిదారులు ఏకమై ధరలు తగ్గించేస్తున్నారని రైతులు వాపోతున్నారు. సిండికేటు దోపిడీని అరికట్టాలని డిమాండ్ చేస్తూ పోరుబాట పడుతున్నారు. శుక్రవారం పాలకొల్లులో నిరసన తెలిపేందుకు ఆక్వారైతు సంఘం పిలుపునిచ్చింది. రాష్ట్రంలో 5.75 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగవుతుంటే 2.63 లక్షల విస్తీర్ణం, ఏటా దాదాపు మూడు లక్షల టన్నుల రొయ్యల దిగుబడితో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా మొదటిస్థానంలో ఉంది. కిలోకు 30 నుంచి 40 కౌంట్ వరకు రొయ్యలు అమెరికాకు, 50 నుంచి 100 కౌంట్ వరకు చైనా, యూరోపియన్ దేశాలకు ఎగుమతి అవుతున్నాయి. పది రోజుల క్రితం 100 కౌంట్ కిలో రూ.265 ఉండగా ప్రస్తుతం రూ.230కి పడిపోయింది. నేరుగా కంపెనీలకు కాకుండా మధ్యలో దళారులకు విక్రయించుకునే వారికి రూ.220లోపే ఉంటుంది. అన్ని కౌంట్ల రొయ్యల ధరలు ఆదే మాదిరి కిలోకు రూ.30 నుంచి రూ.40 వరకు తగ్గిపోయాయి. ప్రతికూల వాతావరణం, నాణ్యతలేని సీడు, ఫీడుతో ఇబ్బందులు పడుతుంటే ధరల పతనం తమను మరింత నష్టాల్లోకి నెట్టేస్తోందని ఆక్వా రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మార్కెట్లోకి రొయ్యలు అధికంగా వస్తుండటంతో ప్రాసెసింగ్ ప్లాంట్ల యాజమాన్యాలు, ఎగుమతిదారులు సిండికేటుగా ఏర్పడి భారీ మొత్తంలో కోల్డ్ స్టోరేజీలో నిల్వ చేసుకునే పనిలో ఉన్నారంటున్నారు. ఆన్సీజన్లో ఎగుమతులు చేసుకోవడం ద్వారా పెద్ద మొత్తంలో లాభాలను ఆర్జిస్తుంటారని చెబుతున్నారు. అందులో భాగంగానే ప్రస్తుతం ధరలను తగ్గించేస్తున్నారని, ఈ ధరలు మరింత తగ్గే అవకాశం ఉందన్న ఆందోళన వ్యక్తమవుతోంది. కౌంట్ 10 రోజుల ప్రస్తుతం 100 రూ.265 రూ.230 90 రూ.275 రూ.240 80 రూ.295 రూ.260 70 రూ.305 రూ.270 60 రూ.315 రూ.280 50 రూ.335 రూ.305 40 రూ.365 రూ.335 30 రూ.475 రూ.435 రైతులకు సిండికాటు రొయ్య ధరలు భారీగా పతనం పది రోజుల వ్యవధిలో కౌంట్కు రూ.30 నుంచి రూ.40 వరకు వ్యత్యాసం ఎకరానికి రూ.లక్ష వరకు నష్టపోతున్న రైతులు ఇప్పటికే మేత ధరలు పెంచుతామంటున్న ఫీడ్ కంపెనీలు పోరుబాట పట్టిన ఆక్వా రైతులు నేడు పాలకొల్లులో భారీ నిరసన ఫీడ్, ప్రాసెసింగ్ ప్లాంట్లు, ఎగుమతిదారులు సిండికేటుగా ఏర్పడి రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారు. మార్కెట్లోకి రొయ్యలు ఎక్కువగా వచ్చే సమయం చూసి ముందుగానే ధరలు తగ్గించేస్తున్నారు. సిండికేటు దోపిడికి ప్రభుత్వం అడ్డుకట్ట వేయాలని డిమాండ్ చేస్తూ శుక్రవారం పాలకొల్లులో నిరసన కార్యక్రమం చేపట్టాం. ఉదయం 9 గంటలకు పూలపల్లి వై జంక్షన్ వద్ద జరిగే కార్యక్రమానికి అధిక సంఖ్యలో రైతులు హాజరుకావాలని కోరుతున్నాం. – గొట్టుముక్కల గాంధీభగవాన్రాజు, జైభారత్ క్షీరారామా ఆక్వారైతు సంఘం అధ్యక్షుడు, పాలకొల్లుమేత ధరల పిడుగు మేత ధరలను పెంచుతున్నట్టు ఇటీవల ఫీడ్ కంపెనీలు ప్రకటించిన విషయం విదితమే. ఈ ధరలు అమల్లోకి వస్తే టన్ను మేత ధర అధనంగా రూ.10 వేల వరకు పెరగనుంది. ఎకరానికి రెండు నుంచి రెండున్నర టన్నుల మేత వినియోగిస్తుండగా రూ.20 వేల నుంచి 25 వేల భారం పడుతుంది. మేత ధరల పెంపును నిరసిస్తూ వీరవాసరం, పాలకొల్లులో రైతులు ఆందోళనలు చేసి ఫీడ్ బస్తాలను తగలపెట్టారు. వైఎస్సార్ సీపీ రైతులకు మద్దతుగా నిలిచింది. ధరలు పెంచితే రైతులకు అండగా ఉద్యమిస్తామని పార్టీ నేతలు హెచ్చరించారు. ఈ నేపథ్యంలో ప్రభుత్వం దిగి వచ్చి మేత ధరల పెంపును వాయిదా వేస్తున్నట్టు తెలిపింది. కాగా ధరలు పెరగడం ఖాయమన్న ఆందోళనలో రైతులు ఉన్నారు. సీడు, ఫీడు ధరలు, చెరువుల లీజు తదితర ఖర్చులతో వంద కౌంట్ కేజీ రొయ్యల ఉత్పత్తికి రూ. 250 వరకు వ్యయమవుతుందని రైతులు అంటున్నారు. ధరలు తగ్గించేసి రూ.230కు కొనుగోలు చేస్తుండటంతో తీవ్రంగా నష్టపోతున్నామని వారు వాపోతున్నారు. ప్రాసెసింగ్, ఫీడ్ ప్లాంట్లు, ఎగుమతిదారులు ఆక్వా రైతుల కష్టాన్ని దోచుకుంటున్నారని మండిపడుతున్నారు. రొయ్యల ధరలు తగ్గించడాన్ని నిరసిస్తూ పోరుబాట పడుతున్నారు. శుక్రవారం పాలకొల్లులో భారీ ఎత్తున నిరసన తెలపనున్నట్టు జైభారత్ క్షీరారామ ఆక్వా రైతు సంఘం గురువారం ప్రకటించింది. -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.06 కోట్లు
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు గురువారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో దేవాదాయశాఖ అసిస్టెంట్ కమిషనర్, మద్ది ఆంజనేయస్వామి ఆలయ ఈఓ ఆర్వీ చందన, పోలీసుల పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడిచిన 15 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,06,21,794 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వేండ్ర త్రినాథరావు తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 281 గ్రాముల బంగారం, 2.887 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.2,000, రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ.31 వేలు లభించినట్టు చెప్పారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. -
ఎలక్ట్రిక్ బస్సులను ఆర్టీసీనే నిర్వహించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యుత్ (ఎలక్ట్రిక్) బస్సులను ఆర్టీసీ లేదా ప్రభుత్వం ద్వారానే కొనుగోలు చేయాలని, వాటిని పూర్తిగా ఆర్టీసీ సిబ్బందితోనే నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని ఆర్టీసీ నేషనల్ మజ్దూర్ యూనిటీ అసోసియేషన్ నాయకులు డిమాండ్ చేశారు. అసోసియేషన్ ఆధ్వర్యంలో ఏలూరు ఆర్టీసీ డిపో గ్యారేజ్ వద్ద బుధవారం ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ సీ్త్ర శక్తి పథకం అమలు చేస్తున్న బస్సుల్లో జీరో టికెట్ విధానాన్ని నిలుపు చేయాలని, పీఆర్సీ కమిషన్ను నియమించాలని, ఐఆర్ ప్రకటించాలని, 4 డీఏల ఏరియర్స్, లీవ్ ఎన్క్యాష్మెంట్లను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. సిబ్బంది కుటుంబాలకు సెటిల్మెంట్స్లో జాప్యాన్ని నివారించాలని, ఉద్యోగులను ఎంప్లాయ్ హెల్త్ స్కీమ్ నుంచి మినహాయించి, పాత విధానాన్ని పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఆయా సమస్యల పరిష్కారం కోసం గురువారం కూడా నిరసన కొనసాగిస్తామన్నారు. ఎన్ఎంయూ అసోసియేషన్ నాయకులు ఎస్.ప్రసాదరావు, బి.శ్రీనివాసరావు, పీసీహెచ్ శేఖర్, బి.గంగరాజు, ఎ.విజయ, పి.హరిబాబు తదితరులు పాల్గొన్నారు. -
ట్రిపుల్ఐటీ.. మెంటార్లు పిటీ
● 18 ఏళ్లుగా అవే కష్టాలు ● సర్వీసుల క్రమబద్ధీకరణకు ఎదురుచూపులు ● మొదట్లో 200 మంది.. ప్రస్తుతం 80 మంది విధులు నూజివీడు: ఐదుసార్లు వడబోసి ఎంతో మెరిట్తో ఎంపికయ్యారు.. 18 ఏళ్లుగా పీయూసీ విద్యార్థులకు పాఠాలు బోధిస్తున్నా వారి జీవితాల్లో మాత్రం వెలుగులు లేవు.. సర్వీసుల క్రమబద్ధీకరణకు నోచుకోక, తక్కువ జీతాలతో ఇబ్బందులు పడుతున్నారు రాష్ట్రంలోని ఆర్జీయూకేటీ పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ ట్రిపుల్ఐటీల్లో కాంట్రాక్టు విధానంలో పనిచేస్తున్న మెంటార్లు. 2008లో రాష్ట్రంలో ట్రిపుల్ఐటీలను ప్రభుత్వం స్థాపించింది. విద్యార్థులకు ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ విద్యలో భాగంగా మొదటి రెండేళ్లు పీయూసీ కోర్సు బోధనకు అ ప్పట్లో ఐదు దశల ఎంపిక ప్రక్రియ ద్వారా దాదాపు 200 మంది మెంటార్లను నియమించారు. హామీల అమలెప్పుడు? ఆర్జీయూకేటీ వ్యవస్థాపక చాన్సలర్ ఆచార్య డి.రా జ్రెడ్డి మెంటార్లను నియమించేటప్పుడు పదేళ్ల స ర్వీసు తర్వాత రెగ్యులరైజేషన్ దిశగా పరిశీలి స్తామని హామీ ఇచ్చారు. దీంతో మెంటార్లు ఉద్యోగ బాధ్యతలు నిర్వర్తించారు. హామీ ఇచ్చి 18 ఏళ్లు గడుస్తున్నా ఇప్పటికీ ఉద్యోగ భద్రత లేకుండా, పర్మినెంట్ కాకుండా అరకొర జీతాలతోనే వీరు జీవితాలను నెట్టుకొస్తున్నారు. సర్వీసుల క్రమబద్ధీకరణకు మెంటార్లు కోర్టును ఆశ్రయించగా వారి అభ్యర్థనను పరిశీలించి సానుకూల నిర్ణయం తీసుకోవాలని కోర్టు ఉత్తర్వులు ఇచ్చింది. అయినా ప్రభుత్వాలు పట్టించుకోవడం లేదు. జూనియర్ లెక్చరర్ల కంటే జీతం తక్కువే.. రాష్ట్రంలోని కాంట్రాక్ట్ లెక్చరర్ల కంటే మెంటార్ల జీతాలు తక్కువగా ఉన్నాయి. జూనియర్ లెక్చరర్లకు రూ.57 వేల జీతం చెల్లిస్తుండగా మెంటార్లకు రూ. 45 వేల నుంచి రూ.50 వేల వరకు మాత్రమే ఇస్తున్నారు. అర్హతలు, విధులు, బోధనా బాధ్యతలు అన్నీ జూనియర్ లెక్చరర్లతో సమానంగా ఉన్నా జీతాల విషయంలో వీరికి న్యాయం జరగడం లేదు. ఎంటీఎస్లో కూడా మొండిచేయే యూనివర్సిట్లో కాంట్రాక్ట్ బోధనా సిబ్బందికి మినిమమ్ టైమ్ స్కేల్ (ఎంటీఎస్)ను అమలు చేసిన ప్రభుత్వం ఈ విషయంలో ట్రిపుల్ఐటీల్లో మెంటార్లకు మాత్రం మొండిచేయి చూపింది. తమపై వివక్ష దారుణమని వీరంతా ఆవేదన చెందుతున్నాయి. ప్రభుత్వం స్పందించాలని వినతి ట్రిపుల్ఐటీల ప్రారంభంలో మొత్తంగా 200 మంది మెంటార్లు విధుల్లో చేరారు. సర్వీసులు క్రమబద్ధీకరణ కాకపోవడంతో చాలా మంది వేరే ఉద్యోగాల్లోకి వెళ్లిపోయారు. ప్రస్తుతం 80 మంది వరకు పనిచేస్తుండగా వీరి వయసు 45 ఏళ్లకు చేరింది. కుటుంబ బాధ్యతలు, పిల్లల చదువులు, ఆరోగ్య సమస్యలు, ఆర్థిక ఒత్తిళ్ల మధ్య ఇంకా తాత్కాలిక ఉద్యోగాలతోనే వీరు కొనసాగుతున్నారు. తమ సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని మెంటార్లు విజ్ఞప్తి చేస్తున్నారు. -
జీలుగతో భూసారం పెంపు
కాళ్ల: పంటల సాగులో రోజురోజుకు పెరుగుతున్న రసాయనిక ఎరువుల వాడకం వలన భూసారం తగ్గిపోయి నేల ఆరోగ్యం క్షీణిస్తుందని, ఇటువంటి పరిస్థితుల్లో పచ్చిరొట్ట సాగు చేయడం అవసరమని మండల వ్యవసాయాధికారి పి.రమేష్ నాయుడు తెలిపారు. జీలుగ విత్తనాలు భూసారాన్ని పెంచే అత్యుత్తమ పచ్చిరొట్ట ఎరువు. పంటలను విత్తడానికి ముందు పచ్చిరొట్ట సాగు చేసి నేలలో కలియదున్నాలని. తద్వారా నేలకు ముఖ్యమైన పోషకాలు అంటే ముఖ్యంగా నత్రజని, కొంత మేరకు భాస్వరం, పొటాష్లతో పాటు ఇతర సూక్ష్మ పోషకాలు కూడా నేలకు అందుతాయని చెప్పారు. తద్వారా భూసారం పెరిగి, నేల ఆరోగ్యం కూడా మెరుగవుతుందన్నారు. పచ్చిరొట్ట ఎరువులుగా సాగు చేయడానికి అనువైన పంటలు ముఖ్యంగా జనుము, జీలుగ, పెసర, పిల్లిపెసర అని తెలిపారు. ఈ పంటలను నేలలో ప్రధాన పంట విత్తడానికి ముందుగా సాగు చేసుకొని 30–40 రోజులలో అంటే 50 శాతం పూత దశలో నేలలో కలియదున్నాలి. ఈ పచ్చిరొట్ట ఎరువులను నేలలో కలియదున్నిన వెంటనే ఒక ఎకరాకు 3 బస్తాల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ కనుక వేసుకున్నట్లయితే పచ్చిరొట్ట బాగా చివికి నేలకు మంచిగా అందడమే కాకుండా ప్రధాన పంటకు భాస్వరం ఎరువులైన డీఏపీ కానీ సూపర్ ఫాస్పేట్ కానీ వేయాల్సిన అవసరం ఉండదని స్పష్టం చేశారు. జీలుగ విత్తనాలు రాష్ట్ర ప్రభుత్వం వ్యవసాయ శాఖ ద్వారా 50 శాతం రాయితీపై అందజేస్తుందని, ప్రస్తుతం మండలంలోని అన్నీ రైతు సేవా కేంద్రాలలో అందుబాటులో ఉన్నాయని, రైతులు సద్వినియోగం చేసుకోవాలని ఆయన కోరారు. -
ముగిసిన వెయిట్ లిఫ్టింగ్ పోటీలు
వెయిట్ లిఫ్టింగ్లో జూనియర్, సీనియర్ విభాగాల్లో పాల్గొన్న లిఫ్టర్లుఏలూరు రూరల్: శాప్ లీగ్స్ పోటీల్లో భాగంగా బుధవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలోని వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జిల్లాస్థాయి వెయిట్ లిఫ్టింగ్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో సుమారు 50 మంది బాలబాలికలు పాల్గొన్నారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన వారు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికకానున్నారు. ఈ సందర్భంగా డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య మాట్లాడుతూ కఠోర సాధనతో బాలబాలికలు వెయిట్లిఫ్టింగ్లో సత్తా చాటవచ్చన్నారు. రాష్ట్రస్థాయి పోటీలు ఏలూరులోనే నిర్వహిస్తామన్నారు. పోటీల ప్రారంభోత్సవంలో సెట్వెల్ సీఈఓ కెఎస్ ప్రభాకరరావు, రాష్ట్ర వెయిట్లిఫ్టింగ్ అసోసియేషన్ కార్యదర్శి దీన్షాబాబు, పశ్చిమగోదావరి జిల్లా డీఎస్డీఓ ఎన్ మోహన్దాస్ తదితరులు పాల్గొన్నారు. -
వంతెన పనులతో నీటి సమస్య తీవ్రం
భీమవరం: భీమవరం పట్టణంలోని లోసరి ప్రధాన కాలువపై నిర్మిస్తున్న వంతెన పనులు నత్తనడకన సాగుతుండడంతో పలు గ్రామాలకు మంచినీటి సమస్య తీవ్రమవుతుందనే ఆందోళన వ్యక్తమవుతోంది. ఇప్పటికే గ్రామాల్లోని మంచినీటి చెరువుల్లో నీరు అడుగంటడం, పసర్లుబారడంతో ప్రజలు తాగునీటికి పడుతున్న కష్టాలు చెప్పనలవికావు. ఈనెలాఖరుకు కాలువలకు నీరు వదులుతారని మంచినీటి చెరువులను నీటితో నింపి నీటి ఎద్దడి నివారిస్తామంటూ పంచాయతీల అధికారులు చెబుతుండగా లోసరి కాలువపై భీమవరం వద్ద నిర్మిస్తున్న వంతెన పనులు కారణంగా మరికొన్ని రోజులు నీటి సరఫరా నిలిచిపోతుందనే ఆందోళన పలు గ్రామాల్లో వ్యక్తమవుతుంది. పనులు ఇంకా గ్రౌండ్ లెవిల్లోనే.. భీమవరం నుంచే ప్రవహించే లోసరి ప్రధాన పంట కాలువ ద్వారా మండలంలోని గొల్లవానితిప్ప, తోకతిప్ప, గూట్లపాడు, కొత్త పూసలమూరు, దొంగపండి, లోసరి, బర్రెవానిపేట తదితర గ్రామాల ప్రజలకు తాగు, సాగు నీరు లభిస్తుంది. కాలువపై నిర్మించిన వంతెనలకు ఎంతోకాలంగా అప్రోచ్ రోడ్లు లేకపోవడంతో నిరుపయోగంగా మిగిలిపోయాయి. గత ప్రభుత్వ హయాంలో అప్రోచ్ రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరైనా సాంకేతిక కారణాలతో పనులు ప్రారంభం కాలేదు. అయితే ఎట్టకేలకు రూ.24 కోట్లు నిధులు మంజూరు కావడంతో ఏప్రిల్ 17న ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్తో అమరావతి నుంచి వర్చువల్గా శంకుస్థాపన చేస్తారంటూ భారీ ఏర్పాట్లు చేశారు. అయితే పవన్కల్యాణ్ అనారోగ్యంతో ఆసుపత్రిలో చేరడంతో ఆ శంకుస్థాపన నిలిచిపోయింది. ఆ తరువాత లోసరి కాలువపై నూతనంగా నిర్మించాల్సిన వంతెన పనులు తరువాత చేపట్టారు. పనులు ప్రస్తుతం గ్రౌండ్ లెవిల్లోనే ఉండడంతో మరో 10 రోజుల్లో కాలువలకు నీరు వదిలినా లోసరి కాలువకు నీటి సరఫరా మరికొన్ని రోజులు నిలిపివేయాల్సి ఉంటుంది. వంతెనకు కనీసం పిల్లర్ల నిర్మాణం పూర్తిచేస్తేగాని కాలువకు నీరు వదిలే అవకాశంలేదు. లోసరి కాలువపై నత్తనడకన సాగుతున్న వంతెన నిర్మాణ పనులు ఈనెల 31వ తేదీన కాలువలకు నీటి విడుదల వంతెన నిర్మాణ పనులతో కాలువలకు నీటి విడుదల ఆలస్యమయ్యే ప్రమాదం ఇప్పటికే అడుగంటిన మంచినీటి చెరువులు తాగునీటి కోసం ప్రజల ఆందోళన లోసరి కాలువపై భీమవరం వద్ద వంతెన నిర్మాణం పనులు నత్తనడకన సాగుతున్నాయి. దీనివల్ల ఈనెలాఖరుకు కాలువలకు నీటిని వదిలినా లోసరి కాలువకు నీటి సరఫరా కష్టమే. ఇప్పటికే తాగునీటికి ఇబ్బందులు పడుతున్న ప్రజలు కాలువకు సకాలంలో నీరు వదలకపోతే గుక్కెడు నీళ్లు కోసం పడరాని పాట్లు పడాల్సి ఉంటుంది. అధికారులు స్పందించి పనులు వేగంగా చేయించి కాలువకు నీటి విడుదలలో జాప్యం లేకుండా చూడాలి. – బోకూరి విజయరాజు, వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర కార్యదర్శి లోసరి కాలువపై బ్రిడ్జి నిర్మాణ పనులు కారణంగా కాలువకు నీటి విడుదలలో ఇబ్బందులు లేకుండా చూస్తాం. బెడ్లెవిల్ పనులు వేగంగా పూర్తిచేయించి నీటి సరఫరా చేయిస్తాం. ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదు. – అడబాల శ్రీనివాస్, ఆర్అండ్బీ ఈఈ, భీమవరం కాలువలకు నీటి సరఫరా నిలిపివేసిన వెంటనే పనులు ప్రారంభించి ఉంటే ఇప్పటికే చాలా వరకు పనులు పూర్తిచేసి నీటి సరఫరాకు అటంకం లేకుండా ఉండేదని, ఉప ముఖ్యమంత్రి శంకుస్థాపనంటూ పనుల ప్రారంభంలో జాప్యం కారణంగా ప్రజలు ఇబ్బందులు పడే పరిస్థితి ఏర్పడిందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శంకుస్ధాపనకు భారీ ఏర్పాట్లుచేసిన అధికారులు పెద్ద మొత్తంలో ఖర్చుచేయగా కనీసం స్థానిక ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు (అంజిబాబు)తోనైనా శంకుస్థాపన చేసి పనులు ప్రారంభించకుండా జాప్యం చేయడం ప్రజలను ఇబ్బందులపాలు చేయడమేనని విమర్శిస్తున్నారు. ఇప్పటికై నా పనులు వేగంగా చేయించి నీటి సరఫరాకు అడ్డంకులు లేకుండా చూడాలని కోరుతున్నారు. -
పల్లెల్లో బయోత్పాతం
గురువారం శ్రీ 21 శ్రీ మే శ్రీ 2026బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేస్తే వ్యర్థాలు మా గ్రామంలోని వాగులోకి తరలిస్తున్నారని అంటున్నారు. దీంతో గ్రామస్తులు రోగాల బారిన పడితే ఎవరు బాధ్యత తీసుకుంటారా? ఎట్టి పరిస్థితుల్లో ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పుకోం. ప్రభుత్వం మంత్రి కుటుంబసభ్యులకు ఇచ్చిన స్థలాన్ని వెంటనే రద్దు చేయాలి. –వీర్ల సుజాత, చిన్న ఆగిరిపల్లి గొల్లగూడెం మా పూర్వీకుల నుంచి పశుపోషణకు ఈ కొండ మీదే ఆధారపడే వాళ్లం. గొర్రెలు, మేకలను మేపుకుంటూ వాటి మీద ఆధారపడి బతుకుతున్నాం. ఇక్కడ మంత్రి కుటుంబసభ్యులు బయో గ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేస్తే మాకు జీవనాధారం లేకుండా పోతుంది. కంపెనీ ఏర్పాటుచేసి మా పొట్టలు కొట్టవద్దు. – పుసునూరు సాంబశివరావు, రైతు, చిన్న ఆగిరిపల్లి గొల్లగూడెం ప్లాంట్ నుంచి వచ్చే విషవాయు వులతో చుట్టుపక్కల గ్రామాల్లో చిన్నారులు అనారోగ్యం పాలవుతారు. ఎట్టి పరిస్థితుల్లో మా గ్రామంలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటుకు ఒప్పుకోం. బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు రద్దు చేసే వరకూ దీనికోసం చుట్టుపక్కల గ్రామాల వారితో కలిపి పోరాడతాం. – దాసరి శరత్బాబు, రైతు, తోటపల్లి సాక్షి ప్రతినిధి, ఏలూరు: మంత్రి కొలుసు పార్థసారథి మంచి చేస్తాడని నమ్మాము.. ఓట్లు వేసి గెలిపిస్తే మా జీవనాధారానికి గండి కొట్టి కోట్లు గడించాలని చూస్తున్నారు.. వేల ఎకరాల భూముల విధ్వంసం, చెరువులు విషపూరితానికి కారణమవుతున్నారు.. అంటూ పల్లెలు గగ్గోలు పెడుతున్నాయి.. అయినా ఏ మాత్రం పట్టించుకోకుండా మంత్రి మొండిగా ముందుకు వెళుతున్నారు.. ప్రభు త్వం ఆగిరిపల్లి మండలం తోటపల్లిలో మంత్రి కు మారుడికి కేటాయించిన భూమిలో బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటును నాలుగు గ్రామాల ప్రజలు ముక్తకంఠంతో వ్యతిరేకిస్తున్నారు. నిర్మాణ పను లను అడ్డుకుని ఆందోళనకు దిగడం పరిస్థితి తీవ్రతకు అద్దంపడుతోంది. రాష్ట్ర గృహనిర్మాణ, పౌరసంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథికి నూజివీడు నియోజకవర్గంలో గ్రామస్తుల నుంచి తీవ్ర సెగ తగిలింది. టీడీపీ అధికారంలోకి వచ్చిన నాటి నుంచి నియోజకవర్గంలో తన కుమారుడితో పరిశ్రమ పెట్టించడానికి భూమి కోసం రకరకాల సెచ్క్లు గీశారు. కట్చేస్తే.. 250 ఏళ్లుగా తోటపల్లి, చిన్న ఆగిరిపల్లి, తోటపల్లి సమీపంలోని ఏడు గ్రామాలకు చెందిన చిన్న సన్నకారు రైతులు, గొల్లగూడెం, హరిజనగూడానికి చెందిన రైతులు పశువుల మేతకు వినియోగించే కొండను స్వాహా చేయడానికి తెరదీశారు. దీంతో ఆగిరిపల్లి మండలంలోని తోటపల్లి పరిధిలో సర్వే నం.2/1లో 45.60 ఎకరాల భూమిని మంత్రి కుమారుడికి చెందిన నితిన్ సాయికృష్ణ కన్స్ట్రక్షన్కు ప్రభుత్వం ఎకరా రూ.5 లక్షలకు కేటాయించింది. వాస్తవానికి ఆగిరిపల్లి మండలంలో ఎకరా భూమి సగటున రూ.40 లక్షల ధర ఉంటుంది. అయితే చాలా తక్కువ ధరకు కేటాయించారు. ఇటీవల ఇక్కడ కంప్రెస్డ్ బయోగ్యాస్ ప్లాంట్ ఏర్పాటు చేయడం కోసం భూమిలో లెవెలింగ్ పనులు మొదలుపెడితే భారీగా గ్రామస్తులు వచ్చి అడ్డుకున్నారు. తోటపల్లి, చిన్న ఆగిరిపల్లి, గొల్లగూడెం, శరణాలగూడెం, సింగన్నగూడెం గ్రామస్తులు ప్లాంటు ఏర్పాటు చేయొద్దంటూ కొంతకాలంగా ఆందోళన నిర్వహిస్తున్నా మంత్రి మాత్రం ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. మంత్రి అనుచరుల మంతనాలు ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు సర్దిచెప్పడానికి మంత్రి పార్థసారథి అనుచరగణం రంగంలోకి దిగింది. సోమవారం గ్రామస్తులు పనులను అడ్డుకోవడంతో మంగళవారం రాత్రి మంత్రి అనుచరులు రంగంలోకి దిగి మూడు గ్రామాలకు చెందిన కొందరు రైతులతో మాట్లాడి సర్దిచెప్పే ప్రయత్నం చేసినా అందరూ ససేమిరా అనడంతో వారు వెనుదిరిగారు. అమాత్యా.. ఇది తగునా బయోగ్యాస్ ప్లాంట్తో ధ్వంసం చేయొద్దు మంత్రి కొలుసు ఇలాకాలో తిరుగుబాటు తోటపల్లిలో 45.60 ఎకరాలు తనయుడికి కేటాయింపు కంపెనీ పనులను అడ్డుకున్న గ్రామస్తులు రాత్రిళ్లు మంత్రి అనుచరుల మంతనాలు నాలుగు గ్రామాలకు చెందిన సన్న, చిన్నకారు రైతులు మేకలు, గొర్రెలు, గేదెలను మేపుకోవడానికి దాదాపు 250 ఏళ్ల నుంచి ఈ కొండను వినియోగించుకుంటున్నారు. గతంలోనూ గ్రావెల్ తవ్వకాల కోసం ఇదే తరహాలో అక్రమ కే టాయింపులకు ప్రయత్నాలు జరిగితే గ్రామస్తులంతా ఇంటికి రూ.వెయ్యి చందా వేసుకుని మరీ హైకోర్టును ఆశ్రయించారు. పశువుల మేతకు తప్ప వేరే అవసరాలకు వినియోగించకూడదని స్టే ఆర్డర్ ఇచ్చింది. దాదాపు వేల సంఖ్యలో పశువులకు ఇదే ఆధారం. దీనిని ధ్వంసం చేసి బయోగ్యాస్ ప్లాంటు ఏర్పాటు చేస్తే దాని నుంచి వచ్చే విషవాయువులు, వ్యర్థాలకు భూగర్భ జలాలతో పాటు సమీపంలోని పెద్ద రావిచెరువు, కొత్తచెరువుల్లో నీరు విషమవుతుందని గ్రామస్తులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. బయోగ్యాస్ ప్లాంట్ ప్రభావం సమీపంలోని 5 కిలోమీటర్ల పరిధి వరకు ఉంటుంది. ఈ గ్రామాలన్నీ రెండు కిలోమీటర్ల పరిధిలోనే ఉండటం గమనార్హం. దీంతో పాటు తోటపల్లి, చిన్న ఆగిరిపల్లిలో మామిడి, మొక్కజొన్న ఇతర పంటలు వేల ఎకరాల్లో సాగవుతున్నాయి. అక్కడి రైతులూ పంటల సాగుపై తీవ్ర ప్రభావం చూపుతుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు రూ.కోట్ల విలువైన గ్రావెల్ కొండను కంపెనీ ముసుగులో దండుకోవడానికి మంత్రి కొలుసు చూ స్తున్నారనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. దీనిపై గ్రామస్తులు న్యాయపోరాటానికి సిద్ధమయ్యారు. -
అభయాంజనేయస్వామి హుండీ ఆదాయం రూ.11.90 లక్షలు
పెదపాడు: అప్పనవీడులో వేంచేసియున్న శ్రీ అభయాంజనేయస్వామి హుండీ ఆదాయాన్ని బుధవారం దేవాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వీ సురేష్ పర్యవేక్షణలో లెక్కించినట్లు ఆలయ చైర్మన్ వేమూరి శ్రీనివాసరావు తెలిపారు. 55 రోజులకుగాను రూ.11,90,806 ఆదాయం లభించిందన్నారు. కార్యక్రమంలో ఈఓ తారకేశ్వరరావు, ఆలయ సిబ్బంది, భక్తులు పాల్గొన్నారు. భీమవరం: పట్టణంలోని ఒక ఫ్యాక్టరీ వద్ద ఉన్న డ్రెయినేజీలో సిల్ట్ తీస్తుండగా విషవాయువు ప్రభావంతో ఓ వ్యక్తి మృతి చెందిన ఘటన బుధవారం చోటు చేసుకుంది. టూటౌన్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం స్థానిక ఉండి రోడ్డులో ఉన్న ఒక రైస్మిల్లును కొన్నేళ్ల క్రితం మూసివేశారు. కాగా రైస్మిల్లులో మరో ఫ్యాక్టరీ నడుపుతున్నట్లుగా సమాచారం. ఆ ఫ్యాక్టరీ వద్ద డ్రెయినేజీలో సిల్ట్ తీసేందుకు భీమడోలు మండలం గుండుగొలను నుంచి ఈ నెల 19వ తేదీన నలుగురు వ్యక్తులు వచ్చారు. 20వ తేదీన కూడా ఎనిమిది మంది వచ్చారు. అందరూ కలిసి బుధవారం మధ్యాహ్నం 4 గంటల సమయంలో మిల్లు వద్ద ఉన్న డ్రెయినేజీలో సిల్ట్ తీస్తుండగా ఏదో తెలియని విషవాయువు లాంటిది వారికి తగలడంతో ముగ్గురు వ్యక్తులు అక్కడే సొమ్మసిల్లి పడిపోయారు. వెంటనే వారిని దగ్గరలో ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించగా, వాలేపు వెంకన్న (45) అనే వ్యక్తి మృతి చెందాడు. వాలేపు రాజు, బత్తుల ప్రభాకర్ ప్రస్తుతం చికిత్స పొందుతున్నారు. దీనిపై వివరాలు సేకరిస్తున్నామని టూటౌన్ ఎస్ఐ రెహ్మాన్ తెలిపారు. ఆ రైస్మిల్లులో ఏ ఫ్యాక్టరీ నడుపుతున్నారనేది చర్చనీయాంశమైంది. పట్టణానికి చెందిన రాజకీయ పార్టీ నాయకుల అండదండల్లో ఆ ఫ్యాక్టరీ నడుస్తుందని గుసుగుసలు వినిపిస్తున్నాయి. -
స్కూల్ బస్సుల తనిఖీ
జంగారెడ్డిగూడెం, పోలవరం రూరల్ : రవాణా శాఖ కమిషనర్ ఆదేశాల మేరకు మే ఒకటి నుంచి స్కూలు బస్సులు తనిఖీ చేస్తున్నామని రవాణాశాఖ అధికారులు ఎస్ఎస్ రంగనాయకులు, కేడీవీ రవిగోపాల్, సీహెచ్ సత్యనారాయణ మూర్తి తెలిపారు. బుధవారం పోలవరం మండలంలో స్కూల్ బస్సులను తనిఖీ చేశారు. ఈ సందర్భంగా అధికారులు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం డివిజన్లో 296 బస్సులు ఉండగా ఇప్పటివరకు మొత్తం 248 స్కూల్ బస్సులను తనిఖీ చేశామని, భద్రతా లోపాలు ఉన్న 209 బస్సులకు లోపాలను సరి చేసుకోవాలని నోటీసులు జారీ చేసినట్లు చెప్పారు. స్కూల్ బస్సులకు అత్యవసర ద్వారం, అగ్నిమాపక యంత్రాలు, ప్రథమ చికిత్స పెట్టే, వేగ నియంత్రణ, జీపీఎస్ పరికరాలు, అదేవిధంగా 185జి ప్రమాణాలు, ఇన్సూరెన్స్, డ్రైవింగ్ లైసెన్స్, ఇతర పత్రాలు అన్నీ చెల్లుబాటులో ఉండాలని ఆదేశించామన్నారు. ఆగిరిపల్లి: బైక్ దొంగల ముఠాను పోలీసులు బుధవారం అరెస్ట్ చేశారు. వారం రోజుల క్రితం సగ్గూరు గ్రామానికి చెందిన యలమర్తి పుల్లయ్య తన ఇంటి ముందు ఉంచిన బైకు కనిపించకపోవడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశాడు. దర్యాప్తు చేపట్టిన ఎస్సై శుభశేఖర్ ఈ కేసులో ముగ్గురు నిందితులను అరెస్ట్ చేసి, వారి నుంచి రూ.2.50 లక్షల విలువైన నాలుగు బైకులను స్వాధీనం చేసుకున్నారు. నిందితులైన సగ్గూరు గ్రామానికి చెందిన పోతర్లంక చరణ్, కొత్త సురవరం గ్రామానికి చెందిన షేక్ ఇమ్రాన్, ఉంగుటూరు మండలం ఆత్కూరు గ్రామానికి చెందిన మారెళ్ళ నాగసాయిపై కేసు నమోదు చేసి నూజివీడు కోర్టులో హాజరు పరిచినట్లు ఎస్సై తెలిపారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పట్టణంలో జిల్లా కలెక్టర్, జాయింట్ కలెక్టర్ ఆదేశాల మేరకు ఆహార భద్రత శాఖ ఆధ్వర్యంలో మామిడి పండ్ల విక్రయ కేంద్రాలు, గోదాములు, పండ్ల దుకాణాల్లో బుధవారం ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల సందర్భంగా వ్యాపారులకు రసాయనాలు ఉపయోగించి కృత్రిమంగా పండించిన మామిడి పండ్లను విక్రయించరాదని కఠిన హెచ్చరికలు జారీ చేశారు. ముఖ్యంగా కాల్షియం కార్బైడ్ వంటి హానికర రసాయనాలతో పండ్లు పండించడం ప్రజల ఆరోగ్యానికి ప్రమాదకరమని వారికి వివరించి అవగాహన కల్పించారు. వినియోగదారుల ఆరోగ్య పరిరక్షణ దృష్ట్యా అనుమానాస్పదంగా ఉన్న మామిడి పండ్ల నమూనాలను సేకరించి, ప్రయోగశాలకు పరీక్షల నిమిత్తం పంపించారు. పరీక్షల ఫలితాల ఆధారంగా ఆహార భద్రత చట్టాల ప్రకారం తదుపరి చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అలాగే ప్రజలు సహజసిద్ధంగా పండిన పండ్లను మాత్రమే కొనుగోలు చేయాలని, కృత్రిమంగా పండించిన పండ్లను గుర్తించిన పక్షంలో సంబంధిత అధికారులకు సమాచారం అందించాలని కోరారు. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని మోదుగ గుంట గ్రామానికి చెందిన వివాహిత గెల్లా సంధ్యను పాత గొడవలను పురస్కరించుకుని అదే గ్రామానికి చెందిన కొడమంచిలి నరేష్ రాయితో కొట్టి గాయపరిచాడు. ఈ ఘటన బుధవారం చోటు చేసుకుంది. బాధిత మహిళ సంధ్య ఇచ్చిన ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై రవికుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పొగాకు వేలం కేంద్రాల పరిశీలన
జంగారెడ్డిగూడెం: రైతులు పొగాకును గ్రేడింగ్ చేసే సమయంలో ఎన్టీఆర్ఎం రాకుండా చర్యలు తీసుకోవాలని పొగాకు బోర్డు గుంటూరు మేనేజర్(ఎక్స్టెన్షన్) సురేఖ అన్నారు. బుధవారం జంగారెడ్డిగూడెం వర్జీనియా వేలం కేంద్రం 1, 2 లను ఆమె రాజమండ్రి ఆర్ఎం జె.సురేంద్రకుమార్తో కలిసి సందర్శించారు. పొగాకు మార్కెట్ గురించి పొగాకు కొనుగోలుదారులతో చర్చించి రైతులకు మంచి యావరేజ్ ధర వచ్చే విధంగా కొనుగోలు జరపాలని సూచించారు. అలాగే రైతులతో సమావేశంలో భాగంగా పొగాకు గ్రేడింగ్ గురించి, ప్రస్తుతం ఉన్న పొగాకు మార్కెట్ పరిస్థితులు దృష్టిలో పెట్టుకొని పంట నియంత్రణ గురించి సూచనలు చేశారు. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల్లో పరిధిలో ఉన్న తాడువాయి, వేగవరం, నరసన్నపాలెం గ్రామాల్లో పొగాకు క్యూరింగ్ బ్యాలెన్స్, గ్రేడింగ్ పాయింట్లను పరిశీలించి గ్రేడింగ్ చేసేటప్పుడు ఎన్టీఆర్ఎం రాకుండా గ్రేడింగ్ చేసుకోవాలని సూచనలు ఇచ్చారు. ఈ కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాల ఆక్షన్ సూపరింటెండెంట్లు గ్రేస్ మార్గరెట్, ప్రశాంత్, రైతులు పాల్గొన్నారు. -
ఆన్లైన్ ఫార్మసీలతో అనర్థాలు
మెడికల్ షాపుల బంద్.. వ్యాపారుల ర్యాలీ ఏలూరు (ఆర్ఆర్పేట): ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ లేని కార్యకలాపాలు, కార్పొరేట్ సంస్థల భారీ డిస్కౌంట్ల వల్ల మెడికల్ షాపుల యాజమాన్యాలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నాయని కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ జిల్లా నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. దేశవ్యాప్తంగా గురువారం చేపట్టిన మెడికల్ షాపుల బంద్లో భాగంగా నగరంలో భారీ ర్యాలీ నిర్వహించారు. అసోసియేషన్ జిల్లా అధ్యక్షుడు గుత్తా రవిచంద్ర మాట్లాడుతూ దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఔషధ పంపిణీదారులు ఆన్లైన్ మెడికల్ వ్యాపార కార్యకలాపాల కారణంగా తీవ్రంగా నష్టపోతున్నారని, సుమారు 5 కోట్ల కుటుంబాల ఉపాధి ప్రమాదంలో పడిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆయా సమస్యలపై ప్రధాని నరేంద్ర మోదీకి పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా చర్యలు తీసుకోలేదని, దీంతో బంద్ చేపట్టామన్నారు. ఈ–ఫార్మసీ నో టిఫికేషన్ను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. స్థానిక ఏలూరు కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్స్ అసోసియేషన్ కార్యాలయం నుంచి ర్యాలీగా వసంతమహల్ సెంటర్ మీదుగా ఫైర్స్టేషన్ సెంటర్ వరకూ ర్యాలీ చేశారు. సెక్రటరీ వజ్రపు శేఖర్, ఈసీ మెంబర్లు నెరుసు కృష్ణ చైతన్య, చెన్నా రామ్కుమార్, ఎం. వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. -
కొబ్బరిచేడు ప్రక్షాళనకు మోక్షమెప్పుడో?
కాళ్ల: మండలంలోని ఎల్ఎన్ పురం నుంచి ఆనందపురం గ్రామం మీదుగా ఉప్పుటేరులో కలిసే కొబ్బరిచెడు మురుగు కాలువ కిక్కిస, గురప్రుడెక్క, తూడుతో పూర్తిగా పూడుకుపోయి నీరు ముందుకు సాగడం లేదు. సుమారు ఐదు కిలోమీటర్ల పొడవునా విస్తరించి ఉప్పుటేరులో కలిసే ఈ కాలువను ఆనుకుని సుమారు 1,700 ఎకరాల ఆక్వాసాగు జరుగుతుంది. కాలువ పూర్తిగా పూడుకుపోవడంవల్ల వర్షాకాలం గ్రామాల్లో మురుగునీరు లాగక ముంపునకు గురవుతున్నాయని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఎప్పుడో 20 ఏళ్ల క్రితం తవ్విన ఈకాలువను ప్రక్షాళన చేయాలని అధికారులు, నాయకులను ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోవడం లేదన్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి కొబ్బరిచేడు కాలువను ప్రక్షాళన చేసి గ్రామాలను ముంపు బారి నుంచి కాపాడి, తమ ఆక్వాసాగుకు ఇబ్బంది లేకుండా చూడాలని రైతులు, ప్రజలు కోరుతున్నారు. ఈ సమస్యపై స్థానిక ఎమ్మెల్యే రఘురామకృష్ణంరాజు దృష్టికి తీసుకువెళ్ళనున్నట్లు రైతులు తెలిపారు. -
రీ సర్వేతో భూవివాదాలకు పరిష్కారం
భీమడోలు: రీసర్వే వల్ల భూవివాదాలకు శాశ్వత పరిష్కారం లభిస్తుందని సర్వే, సెటిల్మెంట్ అండ్ ల్యాండ్ రికార్డ్స్ డైరెక్టర్ రోణంకి కూర్మనాథ్ అన్నారు. పూళ్లలో భూసర్వే పనులను బుధవారం ఆయన పరిశీలించారు. గ్రౌండ్ ట్రూతింగ్, ఈకేవైసీ ప్రక్రియలను పరిశీలించి సర్వే నిర్వహణ తీరును అధ్యయనం చేశారు. రైతులతో మాట్లాడి రీ సర్వేలో సమస్యలు, సందేహాలు, భూ హద్దుల అంశాలను తెలుసుకుని వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని అధికారులను ఆదేశించారు. రీ సర్వేను పారదర్శకంగా నిర్వహించాలన్నారు. అలాగే భీమడోలులో రెవెన్యూ సర్వే సిబ్బందితో ఆయన సమీక్షించారు. పనుల పురోగతిని తెలుసుకుని, ఈకేవైసీ వేగవంతంగా పూర్తి చేయాలన్నారు. ఆర్జేడీ సీహెచ్వీఎన్ఎస్ కుమార్, డీఎల్ఎల్ఓ షేక్ ఎండీ అన్సారీ, డీఐవో టీబీఎస్వీ రమణారావు, తహసీల్దార్ బి.రమాదేవి తదితరులు పాల్గొన్నారు. -
పారదర్శకంగా రిజిస్ట్రేషన్ సేవలు
ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో రిజిస్ట్రేషన్ సేవలు పారదర్శకంగా, వేగంగా అందిస్తున్నామని ఏలూరు జిల్లా రిజిస్ట్రార్ కొమ్మినేని శ్రీనివాసరావు తెలిపారు. బుధవారం ఏలూరు సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాన్ని ఆయన సందర్శించారు. రిజిస్ట్రేషన్ల ప్రక్రియను పరిశీలించి సిబ్బందికి సూచనలిచ్చారు. రిజిస్ట్రేషన్ జరిగిన గంటలోపు దస్తావేజులు అందించేలా చర్యలు తీసుకోవాలన్నారు. రిజిస్ట్రేషన్ సేవల కోసం దళారులను ఆశ్రయించవద్దన్నారు. బుధవారం కార్యాలయంలో 40 రిజిస్ట్రేషన్లు జరగ్గా ఆయన స్వయంగా దస్తావేజులు అందించారు. ఏలూరు జాయింట్ సబ్ రిజిస్ట్రార్–1 బెల్లంకొండ నాగేశ్వరరావు, సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో వైద్య సిబ్బంది నిర్లక్ష్యం కారణంగా మాతాశిశు మరణాలు సంభవిస్తే కఠిన చర్యలు తప్పవని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. జిల్లాలో మాతాశిశు మరణాల నివారణ, మెరుగైన వైద్య సేవలపై వైద్యులు, వైద్యాధికారులు, సిబ్బందితో కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. జిల్లాలో ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వాస్పత్రుల్లో 2,711 ప్రసవాలు జరగ్గా 16 మంది శిశువులు మృతి చెందడంపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇందుకు సిబ్బంది కారణమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటానని కలెక్టర్ హెచ్చరించారు. మాతాశిశు మరణాల నివారణకు సమన్వయంతో పనిచేయాలన్నారు. డీఎంహెచ్ఓ డా.యు.శోభ, డీసీహెచ్ఎస్ డా.బి.పాల్ సతీష్కుమార్, ఐసీడీఎస్ పీడీ పి.శారద తదితరులు పాల్గొన్నారు. జల్జీవన్ మిషన్ పనులపై.. జిల్లాలో జల్ జీవన్ మిషన్ 2.0, స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ) కార్యక్రమాలను నిర్దేశిత సమయంలోపు పూర్తిచేసేందుకు చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కాంతి లాల్దండేకు తెలిపారు. బుధవారం కాంతిలాల్ దండే వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించగా కలెక్టరేట్ నుంచి కలెక్టర్, ఆర్డబ్ల్యూఎస్ సూపరింటెండెంట్ తదితరులు హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్): రహదారి భద్రత అందరి బాధ్యతని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. స్థానిక కలెక్టరేట్లో బుధవారం జిల్లా రహదారి భద్రత కమిటీ సమావేశాన్ని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్తో కలిసి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ జిల్లాలో గతేడాదిలో జ నవరి నుంచి ఏప్రిల్ వరకు 240 రోడ్డు ప్రమాదాలు జరగ్గా 113 మంది, ఈ ఏడాదిలో జనవరి నుంచి ఏప్రిల్ వరకు 194 ప్రమాదాలు జరగ్గా 154 మంది ప్రాణాలు కోల్పోయారన్నారు. ప్రమాదాల నివారణకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ రోడ్డు భద్రత ఎన్ఫోర్స్లో భాగంగా వాహన తనిఖీలు, డ్రంక్ అండ్ డ్రైవ్, ర్యాష్ డ్రైవింగ్ తదితర కేసుల్లో పలువురిపై కేసులు నమోదు చేశామన్నారు. రవాణా శాఖ ఉప కమిషనర్ ఎస్కే కరీం, ఆర్అండ్బీ ఎస్ఈ కె.విజయరత్నం, జిల్లా ప్రజా రవాణాధికారి షేక్ షబ్నం, డీఎంహెచ్ఓ యు.శోభ తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో సూక్ష్మ, చిన్న మధ్య తరహా పరిశ్రమలు, స్టార్టప్ సంస్థల అభివృద్ధికి సాంకేతిక ఆవిష్కరణలు కీలకమని ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి అన్నారు. భీమవరం కలెక్టరేట్లో బుధవారం ‘ఆవిష్కరణల ద్వారా ఎంఎస్ఎంఈలు, స్టార్టప్ల బలోపేతం– మేధో సంపత్తి హక్కులు, సాంకేతిక పరిజ్ఞాన బదిలీ, వాణిజ్యీకరణ’ అంశంపై అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించారు. ఇన్చార్జి కలెక్టర్ మాట్లాడుతూ ఆధునిక టెక్నాలజీ వినియోగంతో ఉత్పత్తి ప్రక్రియలో సమయం, వనరుల వృథాను తగ్గించి తక్కువ వ్యయంతో అధిక నాణ్యత గల ఉత్పత్తులు తయారు చేయవచ్చని తెలిపారు. జిల్లా పరిశ్రమల శాఖ అధికారి యు.మంగపతిరావు మాట్లాడుతూ ఎంఎస్ఎంఈ యూనిట్లకు ప్రభుత్వం ద్వారా రుణ సదుపాయాలు, శిక్షణ కార్యక్రమాలు, సబ్సిడీలు, మార్కెటింగ్ సహా యం అందిస్తున్నట్టు చెప్పారు. విశాఖకు చెంది న ఎన్ఆర్డీసీ సైంటిస్టు, ప్రాజెక్టు హెడ్, పాలకొల్లు ఏపీ ఎంఎస్ఎంఈ డైరెక్టర్ సత్యనారాయణమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
బాలింత మృతదేహానికి పోస్టుమార్టం
తణుకు అర్బన్: తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి మార్చురీలో ఉన్న బాలింత మృతదేహానికి బుధవారం పోలీసుల పంచనామా అనంతరం వైద్యులు పోస్టుమార్టం నిర్వహించి మునిసిపల్ కార్మికులచే ఖననం చేయించారు. ఈనెల 16వ తేదీన స్టార్ హాస్పిటల్లో శస్త్రచికిత్స ద్వారా ఆడ శిశువుకు జన్మనిచ్చి బాలింత మృత్యువాత పడిన విషయం అందిరికీ తెలిసిందే. ఆమె బీహార్కు చెందిన కుమారిగా గుర్తించడం మినహా ఆమెకు సంబంధించిన ఆధారాలు ఇంతవరకు సేకరించలేకపోయారు. ఆస్పత్రికి ప్రసవం నిమిత్తం తీసుకువచ్చిన ఆర్ఎంపీ వైద్యుడు చంటి, అతని స్నేహితుడు రాజమండ్రికి చెందిన మోషే, మరొక మహిళ ఈ వ్యవహారంలో ఉన్నప్పటికీ ఘటన తరువాత మోషే, మహిళ పరారవ్వడం, వారిని పట్టుకునేందుకు పోలీసులు గాలించడం తప్ప మరేమీ పురోగతి లేదు. ఈ వ్యవహారపై వైద్య ఆరోగ్య శాఖ అధికారులు స్పందించకపోవడం కూడా చర్చనీయాంశంగా మారింది. ఉంగుటూరు: ప్రమాదంలో గాయపడిన వ్యక్తి ఆసుపత్రిలో చికిత్స పొందుతూ సోమవారం రాత్రి మృతి చెందాడు. చేబ్రోలు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం తాడేపల్లిగూడెం కుచెందిన తాటిపర్తి కాంతారవు (49) ఈనెల 13న ఏలూరు ద్విచక్రవాహనంపై వెళ్లి తిరిగి వస్తుండగా నారాయణపురంలోని పెట్రోలు బంకు సమీపంలో అదుపు తప్పి డివైడరుపై పడిపోయాడు. ఈ ప్రమాదంలో డివైడరుపై ఉన్న చెట్టు మెద్దు ఒకటి అతడి కంటికి గుచ్చుకుంది. హైవే అంబులెన్సు వారు తొలుత తాడేపల్లిగూడెం, అనంతరం మెరుగైన వైద్యం కోసం గుంటూరు జీజీహ్చ్కి తరలించారు. అక్కడ చికిత్స పొందుతున్న కాంతారావు సోమవారం రాత్రి మృతి చెందాడు. కాంతారావు భార్య విజయ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. -
శ్రీవారి క్షేత్రం.. సేవల్లో ప్రథమం
● మరోమారు మొదటి ర్యాంకు ● వాట్సాప్, ఐవీఆర్ఎస్ సర్వేలో వెల్లడి ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఏడు ప్రధాన ఆల యాలకు వచ్చే భక్తులకు ఆయా దేవస్థానాలు అందిస్తున్న సేవలపై ప్రభుత్వం తాజాగా నిర్వహించిన సర్వేలో ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికే మళ్లీ మొదటి ర్యాంకు దక్కింది. ప్రతి నెలా వాట్సాప్, ఐవీఆర్ఎస్ ద్వారా దర్శనం సంతృప్తికరంగా జరిగిందా? ఆలయాల్లో తాగునీటి వసతులు బాగున్నాయా? ప్రసాదం తాజాగా, రుచిగా ఉందా? పారిశుద్ధ్యం సంతృప్తికరంగా ఉందా? అనే ఈ నాలుగు అంశాలపై సర్వే నిర్వహిస్తున్నారు. అందులో ప్రతి నెలా ఏదో ఒక అంశంలో మొదటి ర్యాంకు సాధిస్తున్న ద్వారకాతిరుమల దేవస్థానం, గత నెల అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ సాధించింది. తాజాగా మూడు రోజుల క్రితం వెలువడిన మే నెలకు సంబంధించిన సర్వేలో ద్వారకాతిరుమల దేవస్థానం మళ్లీ అన్ని అంశాల్లోనూ మొదటి ర్యాంక్ పొందింది. అయితే ఈసారి దర్శనం ఇతర అంశాల్లో శ్రీశైలం దేవస్థానం, సౌకర్యాల కల్పనలో సింహాచలం దేవస్థానం ఆఖరి స్థానాల్లో నిలిచాయి. దర్శనం, ఇతర అంశాల్లో.. ద్వారకాతిరుమల 73.4 శాతంతో మొదటి ర్యాంక్ సాధించగా, శ్రీకాళహస్తి 73.1 శాతంతో రెండో, విజయవాడ 71.4 శాతంతో మూడో, కాణిపాకం 70.8 శాతంతో నాల్గో, అన్నవరం 70.7 శాతంతో ఐదో, సింహాచలం 70.4 శాతంతో ఆరో, శ్రీశైలం 70.1 శాతంతో ఆఖరి స్థానంలో నిలిచాయి. సౌకర్యాల కల్పనలో.. ద్వారకాతిరుమల 73.25 శాతంతో మొదటి ర్యాంక్, శ్రీకాళహస్తి 72.73 శాతంతో రెండో, విజయ వాడ 71.42 శాతంతో మూడో, కాణిపాకం 70.86 శాతంతో నాల్గో, అన్నవరం 70.55 శాతంతో ఐదో, శ్రీశైలం 69.85 శాతంతో ఆరో, సింహాచలం 69.79 శాతంతో చివరి ర్యాంకు సాధించాయి. -
అనుమతుల పేరుతో అక్రమ తవ్వకాలు
ఆగిరిపల్లి: పొలంలో మెరక నిమిత్తం అనుమతులు తీసుకొని అధికార పార్టీ నాయకులు మట్టిని యథేచ్ఛగా తవ్వేస్తున్నారు. మండలంలోని కొమ్మూరు రిజర్వాయర్ పరిధిలో కృష్ణవరం, సురవరం, కొమ్మూరుకి చెందిన వారు పొలాలు మెరక కోసమని అనుమతులు తీసుకున్నారు. అయితే అధికార పార్టీకి చెందిన నాయకులు కృష్ణవరం గ్రామంలో చెరువుని ఆనుకుని ఉన్న 8 ఎకరాల ముంపు పొలానికి మట్టిని తరలిస్తున్నారు. పొక్లయిన్లతో తవ్వి 50 ట్రాక్టర్లలో వందలాది ట్రిప్పులు ఇలా తరలించేశారు. గ్రామంలో మెరక పొలాలకు కాకుండా ఆ ఒక్క పొలానికి మట్టిని ఎందుకు తరలిస్తున్నారని గ్రామస్తులు ప్రశ్నిస్తున్నారు. నిబంధనలు విరుద్ధంగా రాత్రిళ్లు కూడా మట్టి తవ్వకాలు చేపడుతున్నారని, అధికారులు పట్టించుకోవడం లేదని గ్రామస్తులు అంటున్నారు. -
చంపొద్దు.. సమాచారం ఇవ్వండి..
కై కలూరు: ప్రకృతి రమణీయతకు, పక్షుల అందాలకు చిరునామాగా నిలుస్తున్న కొల్లేరు ప్రాంతంలో అరుదైన కొండ చిలువల మరణమృదంగం మోగుతోంది. విషపూరిత సర్పాలు కానప్పటికీ వీటి భారీకాయాన్ని చూసి భయపడి జనం చంపేస్తున్నారు. కై కలూరు నియోజకవర్గం కలిదిండి లాల్వ డ్రెయిన్ సమీప చెరువుపై సోమవారం 10 అడుగుల భారీ కొండ చిలువ కనిపించడంతో పొలుగు, పారతో దాని తల పగులగొట్టి ప్రాణం తీశారు. ఇటువంటి ఘటనలు ఇటీవల ఎక్కువయ్యాయి. కొద్ది ఘటనల్లో మాత్రమే అటవీశాఖ అధికారులు వీటిని రక్షించి చింతలపూడి ఎగువన అడవుల్లో వదులుతున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి 9 మండలాల పరిధిలో 77,138 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు అభయారణ్యం విస్తరించి ఉంది. ఇక్కడ 2.90లక్షల ఎకరాల్లో చేపల, రొయ్యల చెరువులు సాగవుతున్నాయి. ఈ ప్రాంతానికి సుమారు మూడు దశాబ్దాల క్రితం అరణ్య ప్రాంతాల నుంచి బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు, గుండేరు వంటి వాగుల ద్వారా కొండ చిలువలు వలస రావటం మొదలైంది. కిక్కిస పాదలు, చేపల చెరువుల గట్లపై ఆవాసాలను ఏర్పాటు చేసుకుని ఇక్కడే తిష్ట వేశాయి. కొల్లేరు చిత్తడి నేలలు కొండ చిలువలకు అనుకూల ఆవాసాలుగా మారాయి. చెరువులపై కోళ్లు, పక్షులు, ఎలుకలను ఆహారంగా తీసుకుంటున్నాయి. నీటిలో వేగంగా ప్రయాణించగలిగిన కొండ చిలువలు ఆహార అన్వేషణలో భాగంగా బయటకు వచ్చి ప్రజల చేతిలో మృత్యువాతపడుతున్నాయి. భయపడి ఊపిరి తీసేస్తున్నారు.. సరీసృపాలలో అరుదైన కొండచిలువలను వాటి భారీ ఆకారాలను చూసి దాడి చేస్తున్నారు. ఏలూరు జిల్లా కలిదిండి మండలం కొండంగి, మట్టగుంట, పడమటిపాలెం, కలిదిండి, కై కలూరు మండలం ఆటపాక, వరహపట్నం, భుజబలపట్నం, ముదినేపల్లి మండలంలోని కొన్ని గ్రామాలు, పశ్చిమ గోదావరి జిల్లా ఆకివీడు ప్రాంతాల్లో కొండచిలువల సంచారం కనిపిస్తోంది. ఇవి మాంసాహారులు. నీటిలో సైతం వేగంగా ఈదగలవు. పాడుబడిన క్షీరదాల బొరియలు, చెట్లు, మడ అడవుల్లో దాక్కుంటాయి. క్షీరదాలు, పక్షులు, సరీసృపాలు, ఉభయచరాలను తింటాయి. ఒకసారి ఆహారం తీసుకున్న తర్వాత వారం పాటు ఏమీ తినకుండా ఉండగలవు. ఎక్కువగా ఒంటరి జీవితం గడుపుతాయి. సంభోగ సమయంలో మాత్రమే జత కడతాయి. ఒంటరిగా కనిపిస్తున్న సమయంలో వీటిని హతమారుస్తున్నారు. అంతరిస్తున్న అరుదైన జాతి ఇండియన్ రాక్ పైథాన్గా పిలిచే కొండ చిలువల శాసీ్త్రయ నామం పైథాన్ మోలురూస్. గోధుమరంగుపై నల్లటి డైమండ్ మచ్చలు ఉంటాయి. ఇవి 12 అడుగుల పొడవు, 52 కేజీల బరువు పెరుగుతాయి. వీటి జీవితకాలం గరిష్టంగా 21 సంవత్సరాలు. ఏడాది వయసు నుంచి జత కడుతుంటాయి. ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూ సీఎన్) హాని కలిగే జాతుల జాబితా (రెడ్ లిస్ట్)లో వీటిని చేర్చింది. చిత్తడి నేలలు, గడ్డి భూములు, రాతి పర్వతాలు, నదీ లోయల్లో ఇవి నివసిస్తుంటాయి. ఐయూసీఎన్ సంస్థ దాదాపు 40 శాతం రాక్ పైథాన్ జాతి అంతరించిందని ఆందోళన వ్యక్తం చేస్తోంది. కొల్లేరు పరివాహక ప్రాంతాల్లో ఏటా 20 నుంచి 30 కొండచిలువలు ప్రజల చేతిలో హతమవుతున్నట్టు అంచనా. పుట్టిన బిడ్డలను తల్లే తినేస్తోంది సాధారణంగా మార్చి, ఏప్రిల్ నెలల్లో ఇవి జతకట్టి 2 నుంచి 3 నెలల్లో గర్భం దాలుస్తాయి. అనంతరం మూడు నుంచి నాలుగు రోజుల వ్యవధిలో రోజుకు 20 నుంచి 30 గుడ్ల చొప్పున కనీసం 100 గుడ్ల వరకు పెడతాయి. నాలుగు నెలల పాటు గుడ్లను పొదుగుతాయి. పొదిగిన గుడ్లలో 80 శాతానికి పైగా పిల్లలు అవుతాయి. పుట్టిన పిల్లలు 18–24 అంగుళాల వరకు పాడవు ఉంటాయి. అయితే, పుట్టిన వాటిలో 25 శాతం పిల్లల్ని వరకు తల్లే తినేస్తుంది. ఆహారం అందక ఇంకొన్ని చనిపోతాయి. చివరకు 10–15 పిల్లలు మాత్రమే బతికే అవకాశం ఉంటుంది. చిత్తడి నేలలు, గడ్డిభూములు, ఎర్రనేలలు, మడ ఆడవుల్లో ఇవి ఉంటాయి. పాకిస్తాన్, శ్రీలంక, బంగ్లాదేశ్, భూటాన్ దేశాల్లో వీటి సంతతి ఎక్కువగా ఉంది. ఇండియన్ రాక్ పైథాన్గా పిలిచే కొండచిలువలు అరుదైనవి. వీటిని ప్రభుత్వాలు షెడ్యూ ల్–1 కేటగిరిలో చేర్చింది. ఎలుకలు, కోళ్లు, పందికొక్కులను తింటాయి. ఇవి అంతరించిపోతున్నాయని ఇంటర్నేషనల్ యూనియన్ ఫర్ కన్జర్వేషన్ ఆఫ్ నేచర్ (ఐయూ సీఎన్) ఆందోళన వ్యక్తం చేస్తోంది. ఇవి విషపూరితం కావు. ఇవి కనిపిస్తే చంపకుండా ఫారెస్టు అధికారులకు చెప్పండి . – కంటమహింతి మూర్తి, తూర్పు కనుముల వన్యప్రాణి సంరక్షణ సంస్థ అధ్యక్షుడు, విశాఖపట్టణం కొండ చిలువలు అరుదైన జాతి. వీటిని చంపడం నేరం. మూడేళ్లు శిక్ష పడే అవకాశం ఉంటుంది. ఈ జాతిని షెడ్యూల్–1లో చేర్చారు. కొల్లేరు ప్రాంతాల్లో కనిపిస్తే అటవీశాఖ అధికారులకు, ఇతర ప్రాంతాల్లో కనిపిస్తే టొరిటోరియల్ సిబ్బందికి సమాచారం ఇవ్వండి. వీటికి హానిచేయకుండా అప్పగిస్తే అటవీ ప్రాంతాల్లో వదిలిపెడతాం. – కె.రామలింగాచార్యులు, అటవీశాఖ రేంజర్, కై కలూరు ప్రజల చేతుల్లో కొండ చిలువలు హతం మూడు దశాబ్దాలుగా కొల్లేరు చిత్తడి నేలల్లో నివాసాలు చేపల, రొయ్యల చెరువు గట్లుపై సంచారం అంతరిస్తున్న జాతిగా గుర్తించిన ఐయూసీఎన్ ఆందోళన వ్యక్తం చేస్తున్న అటవీశాఖ -
ధర్మాకోల్ పరిశ్రమలో అగ్నిప్రమాదం
ఉంగుటూరు: చేబ్రోలులోని లక్ష్మీ సమన్విత ధర్మాకోల్ పరిశ్రమలోని గోదాములో మంగళవారం తెల్లారుజామున అగ్నిప్రమాదం చోటుచేసుకుంది. దీంతో గోదాములో ఉన్న ధర్మాకోల్ పెట్టెలు దగ్ధమయ్యాయి. లక్షలాది రూపాయల మేర ఆస్తి నష్టం జరిగిందని పరిశ్రమ యాజమాన్యం తెలిపింది. పరిశ్రమలో మంటలను అదుపుచేసే పటిష్టమైన వ్యవస్థ ఉండటంతో ముడి సరుకు నిల్వ ఉంచిన గోదాములోకి మంటలు వ్యాపించకుండా సిబ్బంది కట్టడి చేశారు. భీమడోలు అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. పాలకోడేరు: విస్సాకోడేరులో బాలికపై లైంగిక దాడికి పాల్పడిన కేసులో ముగ్గురు నిందితులను అదుపులోకి తీసుకున్నట్లు నర్సాపురం డీఎస్పీ ఎం సుధాకర్రావు తెలిపారు. బాలికను పెళ్లి చేసుకుంటానని చెప్పి మంచెం వెంకట గణేష్, బ్లాక్ మెయిల్ చేసి అత్యాచారం చేసిన మరో ఇద్దరు బడేటి దుర్గా మహేష్ అలియాస్ బాబి, దేవరకొండ భోగేశ్వరరావులను అదుపులోకి తీసుకున్నట్లు డీఎస్పీ తెలిపారు. నాలుగో నిందితుడు ఆకుల చిన్న పరారీలో ఉన్నాడని, అరెస్ట్ చేసిన ముగ్గురిని కోర్టులో హాజరుపరచగా రిమాండ్ విధించినట్లు పోలీసులు తెలిపారు. ఉండి: జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేటు ఐటీఐలలో 2026–27 విద్యా సంవత్సరంలో ప్రవేశానికి గాను విద్యార్థులు జూన్ 30వ తేదీలోగా ఽఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవాలని ఐటీఐ జిల్లా కన్వీనర్, ఎన్నార్పీ అగ్రహారం ప్రభుత్వ ఐటీఐ ప్రిన్సిపాల్ ఎం వెంకటేశ్వరరావు తెలిపారు. విద్యార్థులు తమ సమీపంలోని (ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం, ఆచంట) ప్రభుత్వ ఐటీఐలో ఒరిజినల్ సర్టిఫికెట్లను తీసుకువెళ్లి వెరిఫికేషన్ చేయించుకుని రసీదు పొందాలన్నారు. వివరాలకు 08816 297093, 96664 07468 నంబర్లలో సంప్రదించాలన్నారు. కొయ్యలగూడెం: రోడ్డు ప్రమాదంలో వ్యక్తి మృతి చెందాడు. ఎస్సై వి.చంద్రశేఖర్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. తూర్పుగోదావరి జిల్లా రాజానగరం మండలం లాలాచెరువు ఏపీహెచ్బీ కాలనీకి చెందిన మోటపర్తి వెంకట శివ నాగ గణపతిరాజు (63) మంగళవారం ఉదయం తన మోటార్సైకిల్పై అశ్వారావుపేట బయలుదేరాడు. కొయ్యలగూడెం గ్రామ శివారు సామిల్లు దాటిన తరువాత మోటార్సైకిల్ అదుపు తప్పి రోడ్డుమార్జిన్పై పడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుడి భార్య మోటపర్తి శైలజ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పెనుగొండ: మోటార్సైకిల్ నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందింది. పెనుగొండ ఏఎస్సై అంజిబాబు తెలిపిన వివరాల ప్రకారం డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా ఆత్రేయ పురం మండలం అంకంపాలెంకు చెందిన పేరూరి వెంకట రమణ (53) మధుమేహ సమస్యలు, హైపర్ టెన్సన్తో బాధపడుతోంది. మంగళవారం ఉదయం కుమారుడు సతీష్తో కలసి మోటార్సైకిల్పై తణుకు వైపు వెళ్తుండగా దొంగరావిపాలెం వద్ద అకస్మాత్తుగా స్పృహ తప్పి రోడ్డపై పడిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. ఆమెను వెంటనే తణుకు ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే వెంకట రమణ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మహిళపై దాడి భీమవరం: బ్యాంక్లో తీసుకున్న లోన్ తిరిగి చెల్లించడంలో ఆలస్యమైందనే కారణంతో తన మరిధి కొట్టాడంటూ భీమవరం టూటౌన్ పోలీసుస్టేషన్లో ఉయ్యూరు విజయదుర్గ పిర్యాదు చేసింది. ఈ కేసుకు సంబంధించిన వివరాలను ఎస్సై రామారావు మంగళవారం తెలిపారు. పట్టణంలోని బలుసుమూడి బీసీ కాలనీకి చెందిన విజయదుర్గ తన మరిధి సత్యనారాయణ, తోటి కోడలు పేరున బ్యాంక్లో రుణం తీసుకుంది. అయితే ఇప్పటికే కొంతమొత్తం బ్యాంక్కు చెల్లించగా మిగిలిన సొమ్ము ఎందుకు చెల్లించలేదంటూ కొట్టి గాయపర్చాడని పిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై చెప్పారు. -
మిస్టరీగా బాలింత మృతి కేసు
● మూడురోజులుగా మృతదేహం మార్చురీలోనే.. ● పత్తాలేని వైద్యారోగ్య శాఖ ● శిశువు భీమవరం శిశు గృహకు తణుకు అర్బన్: తణుకులో సంచలనం రేకెత్తించిన బాలింత మృతి కేసులో చిక్కుముడులు వీడటంలేదు. పోలీసుల దర్యాప్తులో బాలింత బీహార్కు చెందిన వారని రాజమండ్రిలో ఉంటున్నట్లుగా తెలుస్తోంది. ప్రసవానికి రాజమండ్రి నుంచి తణుకు పట్టణానికి ఎందుకు వచ్చారు, పట్టణానికి చివరగా ఉంటూ ప్రసవాల్లో చివరి స్థానంలో ఉండే ఆస్పత్రినే ఎందుకు ఎంచుకున్నారనే ప్రశ్నలు అనుమానాలను రేకెత్తిస్తున్నాయి. ఎన్నో అనుమానాలు.. ఈనెల 16వ తేదీన తణుకులోని పైడిపర్రు ప్రాంతంలోని ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో శస్త్రచికిత్స చేసి ఆడ శిశువును బయటకు తీయడం వెంటనే బాలింత మృతి చెందిన విషయం తెలిసిందే. ఈ బాలింతను ఆస్పత్రిలో చేర్చిన ఆర్ఎంపీ వైద్యుడు చంటి, రాజమండ్రిలో ఉండే అతని స్నేహితుడు మోషేతోపాటు మరొక మహిళ మాత్రమే శస్త్రచికిత్స చేయించడంపై తలెత్తిన అనుమానాలు నివృత్తి కాలేదు. ప్రస్తుతం మోషే పోలీసుల అదుపులో ఉండగా, మోషేతోపాటు మరొక మహిళ ఆచూకీ దొరికితేనే కానీ కేసు కొలిక్కి వచ్చే పరిస్థితి కనిపించడంలేదు. బాలింత తరపున ఎవరూ ఆస్పత్రికి రాకపోవడంతో గత మూడు రోజులుగా తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలోని మార్చురీలోనే మృతదేహం ఉంచాల్సి వచ్చింది. తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్న శిశువు ఆరోగ్య పరిస్థితి మెరుగుపడడంతో మంగళవారం ఐసీడీఎస్, పోలీసుల సహకారంతో భీమవరంలోని శిశు గృహకు తరలించినట్లుగా వైద్యులు చెబుతున్నారు. వైద్యమే లోపమా.. బాలింత మృతి ఘటనకు సంబంధించి గర్భిణి వద్ద ఎటువంటి వైద్య పరీక్షలకు చెందిన రిపోర్టులు లేకపోవడం, ఆమెకు సంబంధించిన ఆరోగ్యస్థితి హిస్టరీ తెలియకుండానే శస్త్రచికిత్స చేయడం కూడా వివాదాస్పదంగా మారింది. గర్భిణిగా ఆస్పత్రికి వచ్చినప్పుడు ఆమె గుండె పరిస్థితి ఎలా ఉంది, రక్త శాతం ఎంత ఉంది, ఇతర సమస్యలు ఏమైనా ఉన్నాయా అనే విషయాలు చూసి శస్త్రచికిత్స చేయాల్సి ఉండగా అవేమీ పట్టించుకోకుండా శస్త్రచికిత్స ఎలా చేశారనేది ప్రశ్నార్థకంగా మారింది. ప్రభుత్వ ఆస్పత్రులైన తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి కానీ, లేదంటే అన్ని విభాగాల సౌకార్యాలు ఉన్న ఏలూరు, కాకినాడ వంటి ప్రభుత్వ ఆస్పత్రుల్లో శస్త్రచికిత్స చేయించి ఉంటే బాలింత బతికి ఉండేదేమోననే అంశంపై కూడా తణుకులో చర్చ జరుగుతోంది. రక్తశాతం తక్కువగా ఉన్న సమయాల్లో శస్త్రచికిత్స చేసిన వెంటనే గుండెకు సరిపడా రక్తం అందక ప్రాణం పోయే పరిస్థితులు ఉంటాయని సైతం వైద్యులు చర్చించుకుంటున్నారు. మౌనంగా వైద్యారోగ్య శాఖ గర్భిణులు, బాలింత, శిశు మరణాలు తగ్గించాలనే ఉద్దేశంతో ప్రభుత్వాలు కోట్లాది రూపాయిలు వెచ్చిస్తున్నా మాతాశిశు మరణాలు జరుగుతుండడం శోచనీయం. ఈనెల 16వ తేదీన బాలింత మృతిచెందడం, 17న వెలుగులోకి రావడం, ఇప్పటికే మూడు రోజులు గడిచిపోయినా వైద్యారోగ్య శాఖ ఇంతవరకు ఎటువంటి స్పందన లేకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. ఈ ఘటనపై డీఎంహెచ్వో డాక్టర్ గీతాబాయిని వివరణ కోరేందుకు సాక్షి ప్రయత్నించగా ఫోన్లో అందుబాటులోకి రాలేదు. -
సీతమ్మవారికి స్వర్ణ కిరీటం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో కొలువైన సీతాదేవికి అమలాపురానికి చెందిన తాతపూడి వెంకట సాంబమూర్తి మంగళవారం రూ.25 లక్షల విలువైన స్వర్ణ కిరీటాన్ని సమర్పించారు. ప్రధానార్చకులు పీవీఎస్ఎస్ఆర్ జగన్నాథాచార్యులు కిరీటాన్ని అమ్మవారి ఉత్సవమూర్తికి అలంకరించారు. అనంతరం ప్రత్యేక పూజలు జరిగాయి. బంగారు దుకాణాలు మూసివేసి స్వర్ణకారుల నిరసన ఏలూరు (ఆర్ఆర్పేట): బంగారం కొనుగోళ్ల నియంత్రణపై ప్రధాని నరేంద్ర మోడీ ఇచ్చిన పిలుపును వ్యతిరేకిస్తూ రాష్ట్రవ్యాప్తంగా స్వర్ణకారులు మంగళవారం బంద్కు దిగారు. రాష్ట్ర సంఘం పిలుపులో భాగంగా ఏలూరు పట్టణంలో బంగారు దుకాణాలు మూసివేసి స్వర్ణకార సంఘాల కార్యాలయాల వద్ద నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ఈ సందర్భంగా స్వర్ణకారుల సంఘం అధ్యక్షుడు బొద్దూరి నాగభూషణం మాట్లాడుతూ ఇప్పటికే అంతంత మాత్రంగానే జీవనోపాధి కొనసాగుతోందని, తాజాగా బంగారం కొనుగోళ్లపై ప్రజల్లో అనిశ్చితి పెరగడంతో పూర్తిగా ఆర్డర్లు తగ్గిపోయాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఐదు కాసుల బంగారం పనికి ఐదు వేల రూపాయల వరకు ఆదాయం వచ్చేదని, ఇప్పుడు బంగారం ధరలు పెరుగుతాయో తగ్గుతాయో తెలియక వినియోగదారులు కొనుగోళ్లు మానేశారని, దీంతో తయారీ పనులు పూర్తిగా దెబ్బతిన్నాయన్నారు. ప్రధాని పిలుపు ఇవ్వడానికి ముందు స్వర్ణకార వర్గాలతో చర్చించి ఉండాల్సిందని విమర్శించారు. సంవత్సరం పాటు బంగారం కొనొద్దని చెబితే మా కుటుంబాల పరిస్థితి ఏంటో ప్రభుత్వం సమాధానం చెప్పాలని ప్రశ్నించారు. స్వర్ణకారసంఘ ప్రధాన కార్యదర్శి చిట్టూరి త్రినాథ్ మాట్లాడుతూ స్వర్ణకార కుటుంబాల జీవనోపాధి దెబ్బతినకుండా ప్రత్యేక ఆర్థిక నిధులు ఏర్పాటు చేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్దఎత్తున ఆందోళనలు చేపడతామని హెచ్చరించారు. -
ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఓటరు జాబితా ప్రత్యేక సవరణ కార్యక్రమంలో భాగంగా జిల్లా వ్యాప్తంగా వచ్చే జూన్ 15 నుంచి జూలై 14వ తేదీ వరకూ నిర్వహించే ఇంటింటి సర్వేను విజయవంతం చేయాలని జిల్లా కలెక్టర్ కే. వెట్రిసెల్వి సూచించారు. ఈ కార్యక్రమంపై జిల్లా కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో సంబంధిత అధికారులతో కలెక్టర్ సమీక్ష సమావేశం నిర్వహించారు. జూలై 21వ తేదీన ముసాయిదా ఓటరు జాబితా విడుదల అవుతుందని తెలిపారు. తదుపరి అభ్యంతర సేకరణ కార్యక్రమం జూన్ 21 నుంచి ఆగస్టు 20వ తేదీ వరకు నిర్వహించాలన్నారు. అనంతరం సెప్టెంబరు 22వ తేదీన తుది ఓటరు జాబితా విడుదల చేస్తారని తెలిపారు. జూన్ 10వ తేదీ నుంచి 13వ తేదీ వరకూ బూత్ లెవల్ ఏజెంట్లకు ఓరియంటేషన్ వర్కు షాప్లు ఈఆర్వోస్ నిర్వహించాలని ఆదేశించారు. జిల్లాలో జనగణన కార్యక్రమంలో భాగంగా ఇళ్ల గణనను పూర్తి చేయాలని అధికారులను ఆదేశించారు. ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణపై ఈనెల 25వ తేదీలోగా జిల్లా స్థాయిలో హెల్ప్డెస్క్ ఏర్పాటుచేయాలని, ఖాళీగా ఉన్న సూపర్వైజర్లు, బీఎల్వో పోస్టుల వివరాలపై నివేదికను వెంటనే సమర్పించాలన్నారు. సమావేశంలో ఇన్చార్జి జిల్లా రెవెన్యూ అధికారి ఎల్. దేవకీదేవి, ఇన్చార్జి ఆర్డీవో ఐ.కిషోర్, జెడ్పీ సీఈవో పీ జగదాంబ, ఏపీ ఐఐసీ జోనల్ మేనేజరు కే బాబ్జీ, తహసీల్దార్లు పాల్గొన్నారు. -
బ్లేడుతో దాడి కేసులో ఏడాది జైలు
ఏలూరు టౌన్: ఓ వ్యక్తిపై బ్లేడుతో దాడి చేసిన కేసులో ముద్దాయికి ఏడాది జైలు శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కేఎండీ అబుతాలిబ్ పర్వేజ్ తీర్పు చెప్పారు. ఏలూరు కత్తేపువీధి సెంటర్లో 2020 డిసెంబర్ 25న రాత్రి 9గంటల సమయంలో జూపూడి సుకుమార్ తన స్నేహితులతో మాట్లాడుతన్నాడు. అదే సమయంలో కత్తేపువీధి సీఎస్ఐ చర్చి ప్రాంతానికి చెందిన బండ్లమూడి నవీన్ ఆకస్మికంగా వెనుకవైపు నుంచి వచ్చి బ్లేడుతో సుకుమార్ మెడపై దాడి చేశాడు. బాధితుడు మరుసటి రోజు ఏలూరు వన్టౌన్ ఎస్సై రామకృష్ణకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. దీనిపై ఏలూరు ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ జడ్జి ఎస్కేఎండీ అబుతాలిబ్ పర్వేజ్ విచారణ చేపట్టారు. ప్రాసిక్యూషన్ తరపున సహాయ ప్రభుత్వ న్యాయవాది హేమలత సాక్షాధారాలను న్యాయస్థానం ముందు ప్రవేశపెట్టారు. ముద్దాయి నవీన్ నేరం రుజువు కావటంతో ఏడాది కఠిన కారాగార శిక్ష, రూ.5వేల జరిమానా విధిస్తూ న్యాయమూర్తి పర్వేజ్ తీర్పు ఇచ్చారు. ఏలూరు వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఎస్సైలు సుధాకర్, రామకృష్ణ, దుర్గాప్రసాద్, కోర్టు కానిస్టేబుల్ హరికిషోర్ సాక్షులను కోర్టులో హాజరుపరిచారు. భీమవరం: అతిగా మద్యం సేవించి వ్యక్తి మృతిచెందినట్లు భీమవరం వన్టౌన్ ఎస్సై ఎస్వీవీ కృష్ణాజీ మంగళవారం చెప్పారు. ఒరిస్సా రాష్ట్రం కాండ్రపడ జిల్లా రాధానాగ్కు చెందిన యాదాపు స్వయమ్ (35) మరొక ముగ్గురు భీమవరం ఎల్అండ్టీ కంపెనీలో పనిచేయడానికి ఈనెల 17వ తేదీన వచ్చారు. తాడేరు రోడ్డులోని మద్యం షాపు వద్ద మద్యం కొనుగోలు చేసి రెండు రోజులపాటు అతిగా మద్యం సేవించడంతో మంగళవారం మృతి చెందాడు. దీనిపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై కృష్ణాజీ చెప్పారు. -
తేనెటీగల పెంపకంతో అధిక ఆదాయం
తాడేపల్లిగూడెం: తేనెటీగల పెంపకంతో రైతులు అధిక ఆదాయాలు పొందవచ్చని శాస్త్రవేత్తలు పేర్కొన్నారు. మంగళవారం వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో హనీబీ న్యూక్లియస్ కేంద్రం ప్రారంభోత్సవం నిర్వహించారు. ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఉద్యానవర్సిటీ వీసీ డాక్టర్ కె.ధనుంజయరెడ్డి మాట్లాడుతూ జాతీయ తేనెటీగల పెంపకం తేనె మిషన్ ఆధ్వర్యంలో న్యూక్లియస్ స్టాకు కేంద్రం ప్రారంభమైందన్నారు. ఎన్బీహెచ్ఎం పథకం కింద వెంకట్రామన్నగూడెం కేవీకేకు రూ.92.728 లక్షల నిధులు మంజూరు కాగా, తొలి విడతలో 43.99 లక్షలతో తేనెటీగల పెంపకంపై రైతులు, గ్రామీణ యువత, మహిళలకు శాసీ్త్రయ శిక్షణా కార్యక్రమాలు నిర్వహిస్తున్నట్టు చెప్పారు. మూడు బ్యాచ్లలో మొత్తం 75 మందికి వారం రోజుల పాటు శిక్షణ ఇస్తామన్నారు. కేవికెలో న్యూక్లియస్ కల్చర్ యూనిట్ను ఏర్పాటుచేసి 75 శాతం రాయితీపై 425 తేనెటీగల పెట్టెలు, తేనె సేకరణ యంత్రాలు , 24 రకాల అనుబంధ పరికరాలను రైతులకు అందజేశారు. వర్సిటీ విస్తరణ సంచాలకులు డాక్టర్ రూత్, రిజిస్ట్రార్ ఎం.మాధవి, డీన్ ఆఫ్ హార్టీకల్చర్ బి.ప్రసన్నకుమార్, పరిశోధన సంచాలకులు జి.రామానందం, కంట్రోలర్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఎస్ఎస్.విజయ పద్మ, అసోసియేట్ డీన్ ఎన్బీవీ, చలపతిరావు, ప్రధాన శాస్త్రవేత్తలు టి.సుశీల, ఈ.పద్మ, ఎన్.ఇమ్మానుయేల్, కేవీకే సమన్వయకర్త కిరణ్కుమార్ పాల్గొన్నారు. -
భర్త నుంచి రక్షణ కల్పించాలని నిరసన
లింగపాలెం: భర్త నుంచి తనకు, తన పిల్లలకు ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని ధర్మాజీగూడెంకు చెందిన పఠాన్ సల్మా పర్వీన్ వేడుకుంటోంది. మంగళవారం ఆమె తన ఇంటి ముందే ఇద్దరు పిల్లలతో కలిసి నిరసన వ్యక్తం చేసింది. దీనికి సంబంధించి సల్మాపర్వీన్, స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పఠాన్ సల్మా పర్వీన్కు, మాబు సుభానికి 16 ఏళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇద్దరు మగ పిల్లలు ఉన్నారు. పెళ్లయిన కొన్నేళ్ల తరువాత నుంచి వీరిద్దరి మధ్య మనస్పర్ధలు పెరిగాయి. పెద్దల్లో, పోలీస్స్టేషన్లో పలు మార్లు కౌన్సెలింగ్ జరిగింది. అయినప్పటికీ వీరి మధ్య సమస్య పరిష్కారం కాకపోవడంతో పర్వీన్ కోర్టును ఆశ్రయించింది. కోర్టు పర్వీన్కు భరణం కింద రూ.10 లక్షలు, ప్రతి నెలా రూ.10 వేలు ఇవ్వాలని తీర్పునిచ్చింది. దీనిని తప్పించుకునేందుకు పర్వీన్ను ఒప్పించి మళ్లీ ఇంటికి తీసుకువెళ్లాడు సుభాని. అయితే కొన్ని నెలలు బాగా చూసుకున్న తరువాత నుంచి యధావిధిగా భార్యతో గొడవలు పడుతున్నాడు. ఈ క్రమంలో మంగళవారం ఉదయం పర్వీన్ను కొట్టి చంపేందుకు యత్నించగా, సుభానిని కుమారులు అడ్డుకున్నారు. దీంతో వారిని ఇంటి నుంచి బయటకు గెంటి ఇంటికి తాళాలు వేసి వెళ్లిపోయాడు. దీంతో ఇంటిలో తనకు ఆశ్రయం కల్పించాలని, భర్త నుంచి తనను, తన పిల్లలను రక్షించాలని పోలీసు అధికారులను కోరుతోంది. -
గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి కృషి
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని మారుమూల గ్రామంలో నివసిస్తున్న కొండరెడ్డి గిరిజనుల వ్యవసాయాభివృద్ధికి తోడ్పాటు అందించేలా కృషి చేస్తున్నామని నాబార్డు డీడీఎం అనిల్కాంత్ అన్నారు. రామనర్సాపురంలో నాబార్డు యాక్షన్ సహకారంతో టీడీఎఫ్–మా తోట కార్యక్రమంలో భాగంగా హైబ్రీడ్ జీడిమామిడి, మామిడి మొక్కల పెంపకానికి అవసరమైన నీటి వసతులను కల్పిస్తున్నట్టు చెప్పారు. ఐదు గ్రామాల్లో 7 సోలార్ బోర్లు ఏర్పాటు చేశామన్నారు. సోలార్ ఫినిషింగ్ను 50 మంది రైతులకు అందించామని అన్నారు. గ్రామంలో సోలార్ బోరు, కరెంట్ మోటర్ పనితీరును పరిశీలించారు. యాక్షన్ స్వచ్ఛంద సంస్థ కో–ఆర్డినేటర్స్ సాల్మన్ తదితరులు పాల్గొన్నారు. -
● ఎన్సీసీ శిక్షణ.. దేశ రక్షణ
దేశరక్షణలో మేము సైతం అంటూ ఎన్సీసీ క్యాడెట్లు శిక్షణ పొందుతున్నారు. ఏలూరు సీఆర్రెడ్డి కళాశాలలో ఎన్సీసీ శిబిరంలో 574 మంది క్యాడెట్లకు డ్రిల్ విభాగంలో శిక్షణ ఇస్తున్నారు. యుద్ధ నైపుణ్యాలు, 22 రైఫిల్ ఫైరింగ్, మ్యాప్ రీడింగ్, టెంట్ నిర్మాణ నిర్వహణ, విపత్తుల నిర్వహణ, ట్రాఫిక్పై అవగాహనపై శిక్షణ ఇస్తున్నారు. 19 ఆంధ్రా బెటాలియన్ కమాండింగ్ అధికారి కల్నల్ అమిత్ పాండే ఆధ్వర్యంలో శిబిరం నిర్వహిస్తుండగా.. బెటాలియన్ ఆఫీస్ సూపరింటెండెంట్ ఎం. కొండయ్య, క్యాంపు కెప్టెన్ కె.శివశంకర్, సంజయ్ మౌర్య, సిద్ధప్ప పర్యవేక్షిస్తున్నారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
లైంగిక దాడులు అరికట్టాలి
మోటార్సైకిల్ నుంచి జారిపడి.. మోటార్సైకిల్పై నుంచి జారిపడి ఓ మహిళ మృతి చెందిన ఘటన పెనుగొండ మండలం దొంగరావిపాలెంలో చోటుచేసుకుంది. 8లో uఉమ్మడి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి శ్రీలక్ష్మిఏలూరు(ఆర్ఆర్పేట): సమాజంలో బాలల పై లైంగిక దాడులు పెరిగిపోయాయని, వాటిని అరికట్టడానికి సమాజంలో ప్రతిఒక్కరూ కృషి చేయాలని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి ఎన్.శ్రీలక్ష్మి సూచించారు. మంగళవారం వట్లూరు లోని వెలుగు కార్యాలయంలో జాగృతి పథకం–2025 సురక్షిత్ భవిష్య–పోక్సో కార్యక్రమంలో భాగంగా అవగాహన సదస్సులో ఆమె మాట్లాడారు. లైంగిక నేరాల నుంచి పిల్లల రక్షణ చట్టాన్ని ఏర్పాటు చేశారని, ఈ చట్టంలో నేరస్తులను కఠినంగా శిక్షిస్తారన్నారు. ఇటువంటి నేరాలు ఎక్కువగా బంధువులు, స్నేహితుల ద్వారానే జరుగుతున్నాయన్నారు. మహిళలు, బాలలపై జరిగే నేరాల్లో బాధితులకు జిల్లా న్యాయ సేవా ధికారి సంస్థ ఉచితంగా న్యాయ సహాయాన్ని అందిస్తుందని ఆమె చెప్పారు. ఈ కార్యక్రమంలో సీడబ్ల్యూసీ మెంబర్ న్యాయవాది పి.వెంకటేశ్వరరావు, డీఆర్డీఏ పీడీ విజయలక్ష్మి, ఏలూరు జిల్లా బాలల సంరక్షణ అధికారిణి సూర్యచక్రవేణి, డీఆర్డీఏ ప్రాజెక్టు ఆఫీసర్ అనిత, ప్యానల్ న్యాయవాదులు ఎ.గంగాభవాని, సంధ్యారాణి తదితరులు పాల్గొన్నారు. -
ప్రమాదాల నివారణకు ప్రత్యేక చర్యలు
ఐజీ అశోక్కుమార్ ఉంగుటూరు: జాతీయ రహదారిలో ప్రమాదాల నివారణకు ప్రత్యేక కార్యాచరణతో ముందకు వెళుతున్నామని ఐజీ జీవీజీ అశోక్కుమార్ తెలిపారు. మంగళవారం చేబ్రోలు పోలీస్స్టేషన్లో ఆయన విలేకరులతో మాట్లాడారు. జాతీ య రహదారిపై గంజాయి రవాణాను అరికట్టడానికి ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నామన్నారు. ఆధునిక సాంకేతికతను వినియోగించుకుని నేరాల అదుపునకు చర్యలు చేపట్టామన్నారు. మహిళల రక్షణకు జిల్లాలో 25 వేల కెమెరాలు అమర్చామన్నారు. అనంతరం ఆయన మహి ళా పోలీసులతో సమావేశమయ్యారు. గ్రామా ల్లో ప్రజలతో మమేకం కావాలని, గుడ్టచ్, బ్యాడ్టచ్పై పిల్లలకు అవగాహన కల్పించాలన్నారు. సోషల్ మీడియా ప్రభావంతో నేరాలు ఎక్కువగా జరుగుతున్నాయని, సెల్ఫోన్లకు పిల్లలు ఎక్కువగా ఆకర్షితులవుతున్నారన్నారు. పరీక్షల్లో అధిక మార్కులు వచ్చిన ఇద్దరు పోలీస్ కానిస్టేబుళ్ల పిల్లలను సత్కరించారు. మహిళా పోలీసులు, చేబ్రోలు పోలీసులకు హె ల్మెట్లు అందించారు. తిరుమల పాల పరిశ్రమ అందించిన అంబులెన్స్ను మరోమారు ఐజీతో డాక్టర్ శ్రావణరెడ్డి పీహెచ్సీకి అందజేశారు. తొలుత స్టేషన్లో రికార్డులను ఆయన పరిశీలించారు. ఎస్పీ కేపీ శివకిషోర్, డీఎస్పీ శ్యామ్కుమార్, సీఐ రజనీకుమార్, ఎస్సైలు సూర్యభగవాన్ (చేబ్రోలు), మణికుమార్ (గణపవరం ), ఏలూరు ఎస్బీ ఎస్సై ఐ.రమేష్ (నిడమర్రు) పాల్గొన్నారు. -
గాడితప్పిన పోలీస్ !
సాక్షి, భీమవరం: ప్రజల నుంచి ఫిర్యాదులు అందినప్పుడు చట్టప్రకారం నిష్పక్షపాతంగా దర్యాప్తు చేసి చార్జిషీట్ దాఖలు చేయడం పోలీసుల పనిగా ఉన్నత న్యాయస్థానం చెబుతోంది. అందుకు భిన్నంగా జిల్లాలో కొందరు పోలీసులు తెరవెనుక సెటిల్మెంట్లు, పైరవీలు చేస్తున్నారన్న ఆరోపణలున్నాయి. పాలక పక్షాల నేతల కనుసన్నల్లో విపక్ష నేతలు, సామాజిక కార్యకర్తలపై అక్రమ కేసులు పెట్టడం, బాధితుల నుంచి ఫిర్యాదులు వచ్చినప్పుడు కేసు నమోదుకు తాత్సారం, ఫిర్యాదులు వెనక్కి తీసుకోవాలని బాధి తులపై ఒత్తిడి తెచ్చి కేసులు నీరుగార్చే ప్రయత్నాలు జరుగుతున్నాయి. ఆయా సందర్భాల్లో న్యాయం కోసం బాధితులు ఉన్నతాధికారుల తలుపు తడుతున్న ఘటనలు ఇటీవల కాలంలో ఎక్కువగా వినిపిస్తున్నాయి. జిల్లాలోని ఎస్పీ, ఏలూరులోని డీఐజీ కార్యాలయాలకు అందుతున్న ఫిర్యాదుల్లో స్థానిక పోలీస్ అధికారుల అవినీతి వ్యవహారాలపై అధికంగా ఉంటున్నట్టు తెలుస్తోంది. పోలీసులకు వ్యతిరేకంగా కొందరు న్యాయస్థానాలను ఆశ్రయిస్తున్న ఘటనలు వెలుగుచూస్తున్నాయి. ఏసీబీ వలలో.. జిల్లాలోని కొందరి అవినీతి ఏసీబీ గడపకు చేరుతోంది. రెండు నెలల క్రితం చీటింగ్ కేసుకు సంబంధించి నాన్ బెయిలబుల్ సెక్షన్లు నమోదు చేయకుండా ఉండేందుకు బాధితుల నుంచి రూ.25 వేలు తీసుకుంటూ తణుకులో ఒక హెచ్సీ ఏసీబీకి చిక్కారు. ఈ వ్యవహారంలో స్టేషన్ లోని మరికొందరి పాత్రపైనా అప్పట్లో ఏసీబీ అధికారులు అనుమానాలు వ్యక్తం చేశారు. ఇటీవల తాడేపల్లిగూడెంలో ప్రేమ వ్యవహారానికి సంబంధించిన కేసు విషయమై పోలీసులు యువకుడిని బెదిరించి రూ.2 లక్షలు డిమాండ్ చేశారు. బాధితులు రూ.70 వేలు చెల్లించేందుకు పోలీసులతో ఒప్పందం కుదుర్చుకుని ఏసీబీని ఆశ్రయించారు. ఎస్సై, కానిస్టేబుల్ నగదు తీసుకుంటున్న సమయంలో ఏసీబీకి పట్టుబడ్డారు. క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నా.. విధి నిర్వహణలో అలసత్వం, ఆరోపణలు తదితర కారణాలతో నాలుగు నెలల వ్యవధిలో జిల్లాలోని పలువురు సీఐలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లపై ఉన్నతా ధికారులు క్రమశిక్షణ చర్యలు తీసుకున్నారు. జనవరిలో తణుకు సర్కిల్లోని సీఐ, ఎస్సైను లీవ్పై పంప గా, ఫిబ్రవరిలో మరో సీఐ, ఎస్సైను రేంజ్ వీఆర్కు పంపారు. నెలరోజుల క్రితం ఆకివీడు సీఐపై సస్పెన్షన్ వేటు వేశారు. ఆయన స్థానంలో బాధ్యతలు తీసుకున్న సీఐ తాజాగా ఆరోపణలు ఎదుర్కొంటున్నారు. కొద్దిరోజుల క్రితం యలమంచిలి ఎస్సైపై సస్పెన్షన్ వేటు వేయగా, ఉండి ఎస్సైను వీఆర్కు పంపారు. క్రమశిక్షణ చర్యలు ఏ మేరకు మార్పు తీసుకువస్తున్నాయనేది ప్రశ్నార్థకమే. తాజా ఘటనలు ఇందుకు నిదర్శనంగా నిలుస్తున్నాయి. క్షేత్రస్థాయిలో ప్రజలకు న్యాయం అందించే దిశగా పోలీస్ వ్యవస్థ పనిచేయాలని ప్రజలు కోరుతున్నారు. బాలికపై లైంగిక దాడి కేసులో ఇటీవల భీమవరం పోలీసులపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. బాలికకు న్యాయం చేయాల్సింది పోయి నిందితులకు కొమ్ము కాస్తారా? అని ప్రశ్నించింది. అధికార పక్షానికి చెందిన నిందితులను కాపాడేందుకు కేసు వాపసు తీసుకొమ్మని పోలీసులు తమపై ఒత్తిడి తెస్తున్నట్టు బాలిక తల్లి న్యాయం కోసం హైకోర్టును ఆశ్రయించారు. తన కుమారుడి మరణానికి ఆకివీడు పోలీసులు కారణమని తల్లి ఆరోపిస్తోంది. కోడలు, అత్త పెట్టిన అక్రమ కేసుపై ఈనెల 10న పోలీసులు తన కుమారుడిని స్టేషన్కు పిలిచి చిత్రహింసలకు గురిచేయడంతో నొప్పులు తట్టుకోలేక 11న ఆత్మహత్య చేసుకున్నట్టు బోరుమంది. తనకు న్యాయం చేయాలని జిల్లా ఎస్పీని కలిసే ప్రయత్నం చేయగా స్థానిక పోలీసులు అడ్డంకులు కల్పించడంతో ఏలూరులో డీఐజీని కలిసి వినతిపత్రం అందజేసినట్టు తెలిపింది. ఈ ఘటనపై విచారణకు డీఐజీ ఆదేశించారు. నరసాపురం రూరల్లో జనసేన పార్టీకి చెందిన మాజీ సర్పంచ్ లైంగిక వేధింపులకు పాల్పడినట్టు ఓ బాలిక పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసింది. తన తల్లితో వివాహేతర సంబంధం పెట్టుకుని తనను కూడా లైంగికంగా వేధిస్తున్నట్టు పేర్కొంది. స్థానిక పోలీసుల దృష్టికి తీసుకువెళ్లినా స్పందించకపోవడంతో ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేసినట్టు తెలిపింది. పోక్సో కేసు నమోదుకు ఇన్చార్జి కలెక్టర్ ఆదేశించారు. పోలీసుల చెరలో న్యాయం సెటిల్మెంట్లు, పైరవీల్లో పోలీసులు కూటమి నేతల సేవలో తరిస్తున్న లోకల్ బాస్లు కేసుల నమోదుకు తాత్సారం బాధితులపై ఒత్తిడి తెచ్చి నీరుగార్చే ప్రయత్నాలు న్యాయం కోసం ఉన్నతాధికారులను ఆశ్రయిస్తున్న బాధితులు -
క్షేత్రంలో ఆటోవాలా బీభత్సం
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రంలో మంగళవారం ఓ ఆటోవాలా బీభత్సాన్ని సృష్టించాడు. పూటుగా మద్యం సేవించి, పలు బైక్లను ఢీకొట్టాడు. దాంతో స్థానికులు అతడిని పోలీస్టేషన్లో అప్పగించారు. స్థానికుల కథనం ప్రకారం.. ఉప్పలపాడుకు చెందిన ఓ ఆటో డ్రైవర్ పూటుగా మద్యం సేవించి ఉదయం కొండపైకి వెళ్లాడు. తిరుగు ప్రయాణంలో ఆటోను అతి వేగంగా నడుపుతూ, శివాలయం ఘాట్ రోడ్డు మీదుగా కొండ కిందకు వెళ్తున్నాడు. ఘటనా స్థలమైన ఆర్చిగేటు సమీపంలోకి వచ్చేసరికి ఆటో అదుపు తప్పి, రోడ్డు పక్కనున్న పలు బైక్లను ఢీకొట్టింది. దానికి ముందు కొండపైన ఓ భక్తుడి బైక్ను ఢీకొట్టినట్టు స్థానికులు చెబుతున్నారు. ఈ ప్రమాదాల్లో పలు బైక్లు ధ్వంసమయ్యాయి. బాధితులు ఆటో డ్రైవర్ను స్థానిక పోలీస్టేషన్లో అప్పగించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో జనగణన కార్యక్రమం బుధవారం నాటికి పూర్తిచేయాలని జేసీ ఎంజే అభిషేక్ గౌడ ఆదేశించారు. మంగళవారం అ ధికారులతో ఆయన టెలీ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఇళ్ల గణనలో ప్రగతి చూపని అధికారులపై చర్యలు తీసుకుంటామన్నారు. 70 శాతం కన్నా తక్కువగా గణన చేసిన అధికారులు కారణాలను తెలియజేసి, బుధవారంలోపు లక్ష్యాలను సాధించాల న్నారు. తాళం వేసి ఉన్న ఇళ్ల యజమానులను ఫోన్లలో సంప్రదించి వివరాలు నమోదు చే యాలన్నారు. ఇన్చార్జి డీఆర్వో ఎల్.దేవకీదేవి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జెడ్పీ సీఈఓ జగదాంబ, డీపీఓ అనురాధ, ఆర్డీఓలు, తహసీల్దార్లు, ఎంపీడీఓలు పాల్గొన్నారు. పాలకొల్లు సెంట్రల్: గంజాయి అక్రమంగా నిల్వ చేసి రవాణా చేసిన కేసులో ముగ్గురు ముద్దాలకు ఒ క్కొక్కరికీ 10 ఏళ్ల చొప్పున జైలు శిక్ష విధించినట్టు మంగళవారం పట్టణ సీఐ కె.రజనీకుమార్ తెలిపారు. 2020లో పాలకొ ల్లు బైపాస్ రోడ్డు స్వప్న బా ర్ అండ్ రెస్టారెంట్ సమీపంలో కొందరు యువకు లు గంజా యి విక్రయిస్తున్నారని సమాచారం రావడంతో తనిఖీ చేయగా గంజాయి విక్రయిస్తున్న వ్య క్తులను అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశామన్నారు. అనంతరం విచారణ చేపట్టగా విశాఖకు చెందిన పోతురాజు సురేష్, సంకిన గణేష్, మూ రుగంటి ఈశ్వరరావుగా గుర్తించి అరెస్టు చేశామన్నారు. మంగళవారం కేసు విచారణలో జిల్లా అడిషనల్ జడ్జి యు.ఇందిర ప్రియదర్శిని ముద్దాయిలకు ఒక్కొక్కరికి 10 ఏళ్ల జైలుతో పాటు రూ.లక్ష జరిమానా విధించారన్నారు. యలమంచిలి: మండలంలోని కాంభొట్లపాలేనికి చెందిన బాలికకు ఆచంట మండలం వల్లూరుకి చెందిన యువకుడితో వివాహం జరిగినట్టు వచ్చిన స మాచారంతో మంగళవారం ఐసీడీఎస్ సూపర్వైజర్ ఎస్ఎన్ మల్లీశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమో దు చేసినట్టు హెడ్ కానిస్టేబుల్ కె.శ్యాంసన్రాజు తెలిపారు. గతంలో బాల్యవివాహం సమాచారం మేరకు ఇరు కుటుంబాలకు కౌన్సెలింగ్ ఇచ్చామని మల్లీశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. ఆ సమయంలో పెళ్లి చేయమని చెప్పి రహస్యంగా ఈ ఏడాది ఏప్రిల్ 3న వివాహం చేశారన్నారు. ఈ విషయం తమకు ఆలస్యంగా తెలిసిందంటూ ఇరు కుటుంబాల తల్లిదండ్రులపై ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేశామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలో రెవెన్యూ క్లినిక్స్ ద్వారా 18 విడతల్లో 399 భూసమస్యల దరఖాస్తులను పరిష్కరించినట్టు ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. ప్రతి సోమవారం కలెక్టరేట్లో ప్రజా ఫిర్యాదుల పరిష్కార వ్యవస్థకు అనుబంధంగా రెవెన్యూ క్లినిక్స్ను నిర్వహిస్తున్నామని పేర్కొన్నారు. మొత్తంగా 684 దరఖాస్తు లను తీసుకున్నామన్నారు. డివిజన్ల వారీగా భీమవరంలో 107 దరఖాస్తులు, నరసాపురంలో 104 దరఖాస్తులు, తాడేపల్లిగూడెంలో 50 దరఖాస్తులను పరిష్కరించామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు రాష్ట్రస్థాయిలో అత్యుత్తమ పనితీరు కనబరిచి జిల్లా వైద్యారోగ్య వ్యవస్థ ప్రతిష్టను నిలబెట్టాయని కలెక్టర్ సీహెచ్ నాగ రాణి తెలిపారు. హెల్త్ మేనేజ్మెంట్ ఇన్ఫర్మేషన్ సిస్టమ్ ఆధారంగా రాష్ట్ర ప్రభుత్వం నిర్వహించిన తాజా పనితీరు అంచనాల్లో జిల్లాలోని 34 పీహెచ్సీల్లో 33 కేంద్రాలు ఏ గ్రేడ్ సాధించడం గర్వకారణమని పేర్కొన్నారు. -
రైతుల సమస్యలు పట్టని మంత్రి కొలుసు
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు మండిపాటు నూజివీడు: గిట్టబాటు ధరలు లేక నష్టపోతున్న మామిడి, మొక్కజొన్న రైతులను ఆదుకుందామనే ఆలోచనే నూజివీడుకు ప్రాతినిధ్యం వహిస్తున్న మంత్రి కొలుసు పార్థసారథికి లేదని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు తీవ్రంగా విమర్శించారు. నూజివీడులో బుధవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాజకీయ వ్యభిచారం గురించి మంత్రి మాట్లాడుతుంటే దెయ్యాలు వేదాలు వల్లించినట్టు ఉందని, సొంత పార్టీ వారే నవ్వుకుంటున్నారని ఎద్దేవా చేశా రు. రైతులను ఆదుకోవాలని అడుగుతుంటే దానిని పక్కదారి పట్టించాలని చూడటం గర్హనీయమన్నా రు. నియోజకవర్గంలో 12 వేల ఎకరాల్లో వాణిజ్య మొక్కజొన్న సాగు చేశారని, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచేయకపోవడంతో రైతులు దళారులకు విక్రయించి నష్టపోతున్నారన్నారు. ఎకరాకు రూ.28 వేల వరకు నష్టం వాటిల్లుతోందని, ఇలా నియోజకవర్గంలో రూ.33.60 కోట్లు నష్టపోయారన్నారు. నష్టపోతున్న రైతులను ఆదుకోవాలనే ఆలోచనే మంత్రికి లేదని, రెండు నెలల క్రితం మాట్లాడానని చెబుతున్న మంత్రి ఇప్పటికీ రైతులకు ఒక్క రూపాయి పరిహారం ఇప్పించారా, ఒక్క కొనుగోలు కేంద్రమైనా ఏర్పాటు చేశారా అని నిలదీశారు. ముఖ్యమంత్రితో మాట్లాడి కేంద్రానికి లేఖ రాసి మంత్రి ఏం సాధించారో చెప్పాలన్నారు. రైతుల సమస్యలపై మాట్లాడితే సొల్లు మాట్లాడినట్లా.. రైతుల సమస్యలపై మాట్లాడితే మంత్రికి సొల్లు మాట్లాడినట్టుగా ఉందా అని ప్రతాప్ అప్పారావు నిలదీశారు. నియోజకవర్గంలోని మామిడి, మొక్కజొన్న రైతులకు ఏం న్యాయం చేశారని నిలదీశారు. అలాగే రెండేళ్లలో నూజివీడుకు చేసింది ఏమిటో చెప్పాలన్నారు. మామిడికి కేరాఫ్ అడ్రస్ నూజివీడు అని అలాంటి మామిడిని, మామిడి రైతులను కూటమి ప్రభుత్వం నాశనం చేసిందని ధ్వజమెత్తారు. నూజివీడు మామిడిని, మామిడి రైతులను కాపాడుకోవాల్సిన బాధ్యత ఎక్కడి నుంచో వచ్చిన మంత్రికి లేకపోయినా స్థానికులమైన తమపై ఉందన్నారు. నూజివీడు అభివృద్ధి అంతా దివంగత వైఎస్సార్, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిల హయాంలోనే జరిగిందన్నారు. తమ హ యాంలో టీటీడీ లెటర్లను నియోజకవర్గ ప్రజలకు పిలిచి ఉచితంగా ఇచ్చామని చెప్పారు. ప్రస్తుతం లెటర్లను కొనుక్కోవాల్సి వస్తోందని ప్రజలు విమర్శిస్తున్నారన్నారు. పీజీ కేంద్రంలో రూ.6 కోట్లతో అకడమిక్ భవనాన్ని నిర్మిస్తే ప్రారంభించడమే మంత్రికి చేతకావడం లేదన్నారు. మంత్రికి కావాల్సింది చెరువులు, కొండల మట్టి తప్ప ప్రజల సంక్షేమం, అభివృద్ధి కాదని మండిపడ్డారు. ట్రిపుల్ఐటీ గో డను ఆనుకుని ఏడు ఎకరాల సీలింగ్ భూమి ఉందని, దానిని పేదలకు పంచాలని హైకోర్టు బెంచ్కు వెళ్లనున్నట్టు మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు తెలిపారు. -
నకిలీ మద్యంపై ఉక్కుపాదం
ఏలూరు టౌన్: జిల్లాలో నాటుసారా, నకిలీ మద్యం, కల్తీ కల్లు, మాదకద్రవ్యాల నేరాలపై ఉక్కుపాదం మోపాలని, ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడితే సహించేది లేదని ఎక్సైజ్ ప్రొహిబిషన్ ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టర్ రాహుల్దేవ్ శర్మ హెచ్చరించారు. మంగళవారం స్థానిక ఎకై ్సజ్ డీసీ కార్యాలయంలో ఉమ్మడి పశ్చిమ ఎకై ్సజ్ అధికారులతో ఆయన సమావేశం నిర్వహించారు. నవోదయం కార్యక్రమం ద్వారా నాటుసారా కట్టడి చేస్తూ గ్రామాల్లో మరోసారి సారా తయారీ పునరావృతం కాకుండా పటిష్ట చర్యలు చేపట్టాలని చెప్పారు. పెండింగ్ కేసుల దర్యాప్తు వేగవంతం చేయాలనీ, నిందితులకు కఠిన శిక్షలు కోర్టుల్లో విధించేలా చర్యలు చేపట్టాలని ఆదేశించారు. కక్షిదారులు రాబోయే మెగా లోక్అదాలత్లో అధిక సంఖ్యలో కేసులను పరిష్కరించుకునేలా ప్రత్యేక దృష్టి సారించాలని తెలిపారు. రాష్ట్ర సరిహద్దు వెంబడి, చెక్పోస్టుల్లోనూ పటిష్ట నిఘా ఏర్పాటు చేస్తూ రాష్ట్రంలోకి నాన్డ్యూటీ పెయిడ్ లిక్కర్ ప్రవేశించకుండా అరికట్టాలని చెప్పారు. యువత మాదకద్రవ్యాల బారిన పడకుండా కేర్ కమిటీతో విద్యాసంస్థల్లోనూ, పరిశ్రమల్లోనూ అవగాహన సదస్సులు నిర్వహించాలన్నారు. మద్యం దుకాణదారులు విధిగా నిబంధనలు పాటించేలా, ప్రతి లిక్కర్ బాటిల్ను స్కాన్ చేసి విక్రయాలు జరిపేలా క్షేత్రస్థాయి సిబ్బంది చర్యలు చేపట్టాలని ఆదేశించారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ శాఖ డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ ఎన్ఫోర్స్మెంట్ కేవీఎన్ ప్రభుకుమార్, ఏలూరు జిల్లా ఎకై ్సజ్ అధికారి ఎ.అవులయ్య, పశ్చిమగోదావరి జిల్లా ఎకై ్సజ్ అధికారి బి.సుబ్బారావు, జిల్లా అసిస్టెంట్ ఎకై ్సజ్ సూపరిటిండెంట్లు, 13 మంది సీఐలు, ఎన్ఫోర్స్మెంట్, టాస్క్ఫోర్స్ సీఐలు, ఎస్సైలు పాల్గొన్నారు. -
సాగులో సమతుల్యత అవసరం
తాడేపల్లిగూడెం: సాగులో సమతుల్యత ఎరువుల వినియోగం ఖరీప్ 2026కు సంబంధించి ఐసీఏఆర్ అటారి జోన్ పరిధిలోని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యానవర్సిటీ, కృషి విజ్ఞానకేంద్రం సంయుక్త ఆధ్వర్యంలో సోమవారం అవగాహన కార్యక్రమం నిర్వహించారు. సమీకృత వ్యవసాయ పద్ధతులు సమర్థవంతమైన విధానమని కేవీకే సైంటిస్టు ఏ.దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. ఒకే రకమైన పంటపై ఆధారపడకుండా అనుబంధ కార్యకలాపాలను సమన్వయం చేసుకోవడం వల్ల లాభాలుంటాయన్నారు. ఈ వ్యవసాయంలో భాగంగా చేపల పెంపకం, పశుపోషణ, కోళ్ల పెంపకం వంటి వాటిని అనుసంధానం చేసుకోవాలన్నారు. రైతులు బహుళ ఆదాయాలు పొందడానికి ఇది ఒక మార్గమన్నారు. చేపల చెరువుల్లోని నీటిని పంటలకు ఉపయోగించడం, పశువుల నుంచి లభించే పేడను సేంద్రియ ఎరువుగా వాడటం, కోళ్ల పెంపకం ద్వారా గుడ్లు, మాంసం నుంచి అధిక ఆదాయం పొందవచ్చన్నారు. మత్స్య విభాగంలో చేపల పట్టుబడి, వలల వినియోగంపై అవగాహన కల్పించారు. దీంతో పాటు ఎరువుల వినియోగంపై విశదీకరించారు. -
ప్లాస్టిక్ వ్యర్థం.. కాలువలకు అనర్థం
భీమవరం: స్వచ్ఛాంధ్ర, స్వర్ణాంధ్ర అంటూ అధికారులు పెద్ద ఎత్తున ప్రచారం చేస్తుంటే భీమవరం పట్టణంలోని వివిధ పంట కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. కళ్లెదుటే పంట కాలువను డంపింగ్ యార్డులుగా మారుస్తున్నా మునిసిపల్ అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. జిల్లా కేంద్రమైన భీమవరం పట్టణంలో ప్లాస్టిక్ నిషేధమంటూ సాక్షాత్తు జిల్లా కలెక్టర్ చదలవాడ నాగరాణి అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించినా, జాయింట్ కలెక్టర్ టి రాహుల్కుమార్రెడ్డి స్వయంగా షాపుల్లో తనిఖీలు చేసినా క్యారీబాగ్ల అమ్మకాలు యథేచ్ఛగా సాగిపోతున్నాయి. ప్రధానంగా కిరాణా, స్వీట్స్ షాపులు, కూరగాయల దుకాణాలు, భోజన హోటళ్లు, తోపుడుబండ్లు వంటి వాటి వద్ద వీటి వినియోగం ఎక్కువగా కనబడుతోంది. కొందరు వ్యాపారులు నిజాయతీగా క్యారీబాగ్ల వినియోగం తగ్గించినా ఎక్కువ శాతం వ్యాపారులు పట్టించుకోవడం లేదు. అడపాదడపా మునిసిపల్ అధికారులు తనిఖీలు చేసి మొక్కుబడిగా పెనాల్టీలు వేయడం తప్ప కఠినమైన చర్యలు లేకపోవడంతో పట్టణంలో ఎక్కడ చూసిన ప్లాస్టిక్ వ్యర్థాలు దర్శనమిస్తున్నాయి. ప్లాస్టిక్ వ్యర్ధాలతో పూడిపోతున్న కాలువలు పట్టణం గుండా లోసరి, గూట్లపాడు వెళ్లే కాలువతోపాటు, చినఅమిరం వెళ్లే పంట కాలువ, లోసరి ఛానల్, అనాకోడేరు పంట కాలువల గుండా భీమవరం మండలంలోని అనేక గ్రామాలకు తాగు, సాగునీటి సరఫరా జరుగుతుంది. ఎంతో ప్రధానమైన కాలువలు భీమవరం పట్టణం మధ్య నుంచి వెళ్లడం ఈ కాలువల్లో ప్లాస్టిక్ వ్యర్థాలతోపాటు చెత్తా, చెదారాలు వేయడంతో నీరు కలుషితమై ప్రజలు తాగునీటికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ప్రస్తుతం ఏ కాలువ చూసినా తీవ్ర దుర్గంధం, చెత్తతో నిండి ఉన్నప్పటికీ వీటిని ప్రక్షాళన చేసే చర్యలు లేకపోవడం విశేషం. కాలువల్లో పూడిక తీయించి ప్రక్షాళన చేయాలని, ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్త వేయకుండా అధికారులు చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు. -
24న జిల్లా రచయితల సంఘం వార్షికోత్సవం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా రచయితల సంఘం 6వ వార్షికోత్సవం ఈ నెల 24వ తేదీన స్థానిక వైఎంహెచ్ఏ హాలులో నిర్వహించనున్నట్టు ఆ సంఘ అధ్యక్ష, కార్యదర్శులు లంకా వెంకటేశ్వర్లు, నాగారస్త్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ కార్యక్రమానికి కేంద్ర సాహిత్య అకాడమీ పురస్కార స్వీకర్త బేతవోలు రామబ్రహ్మం ముఖ్య అతిథిగా విచ్చేయనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా సాహిత్య సభ జరుగుతుందని, అనంతరం వివిధ రంగాల్లో విశేష సేవలు అందించిన పలువురు ప్రముఖులకు పురస్కారాలు ప్రదానం చేయనున్నట్టు తెలిపారు. నూజివీడు: మండలంలోని అన్నవరం వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడకు చెందిన జే సాయికుమార్, ఉదయ్ విస్సన్నపేట నుంచి విజయవాడకు బైక్పై వెళ్తుండగా అన్నవరం వద్దకు వచ్చేసరికి నూజివీడు నుంచి ఖమ్మం వెళ్తున్న వాహనం వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో సాయికుమార్ (26) అక్కడికక్కడే మృతిచెందగా తీవ్ర గాయాలైన ఉదయ్ను చికిత్స నిమిత్తం నూజివీడు ఏరియా ఆసుపత్రికి తరలించారు. విషయం తెలిసిన వెంటనే రూరల్ ఎస్సై జ్యోతీబసు సంఘటన జరిగిన ప్రదేశానికి వెళ్లి మృతదేహాన్ని పోస్టుమార్టమ్ నిమిత్తం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పిల్లలు లేని దంపతులు దేశవ్యాప్తంగా సెంట్రల్ అడాప్షన్ రిసోర్స్ అథారిటీ (సీఎఆర్ఏ) పోర్టల్ ద్వారా ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని చట్టబద్ధంగా దత్తత తీసుకోవాలని జిల్లా ఇన్చార్జి కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సూచించారు. జిల్లా శిశు గృహ కేంద్రంలోని ప్రత్యేక దత్తత విభాగంలో ఆశ్రయం పొందుతున్న 7 నెలల వయస్సు గల ఆడ శిశువును ఈ ఏడాది మార్చి 17న కర్ణాటక రాష్ట్రానికి చెందిన దంపతులు చట్టబద్ధంగా దత్తత స్వీకరించారు. వారికి నిబంధనల ప్రకారం సోమవారం జాయింట్ కలెక్టర్ ఛాంబర్ నందు తుది ఉత్తర్వులు అందజేశారు. బుట్టాయగూడెం: నూరు శాతం సబ్సిడీపై రైతులకు ఆయిల్పామ్ మొక్కలను పంపిణీ చేస్తున్నట్లు ఉద్యానవన శాఖ అధికారిణి ఎన్. ప్రసన్నలక్ష్మి తెలిపారు. సోమవారం బుట్టాయగూడెం వ్యవసాయాధికారి కార్యాలయంలో ఆమె విలేకర్లతో మాట్లాడుతూ గత ఏడాది 594 మంది రైతులకు 680 హెక్టారుల్లో 85 వేల మొక్కలను పంపిణీ చేసినట్లు చెప్పారు. ఈ ఏడాది కూడా అంతే స్థాయిలో మొక్కలను పంపిణీ చేస్తున్నామని, సబ్సిడీపై ఎరువులు కూడా అందిస్తున్నామని తెలిపారు. మొక్కలు కావాల్సిన రైతులు బ్యాంక్ పుస్తకం, ఆధార్కార్డు వివరాలతో రైతు సేవా కేంద్రాల్లో తమ పేర్లలను నమోదు చేసుకోవాలన్నారు. అదేవిధంగా జీలుగుమిల్లి మండలంలో కూడా 700 హెక్టారుల్లో 610 మంది రైతులకు సుమారు 87,500 మొక్కలను పంపిణి చేస్తున్నట్లు చెప్పారు. జంగారెడ్డిగూడెం: దేవులపల్లి – లక్కవరం రహదారిలో ఓ వృక్షం అగ్నికి ఆహుతైంది. గుర్తు తెలియని వ్యక్తి సిగరెట్ కాల్చి నిర్లక్ష్యంగా రోడ్డు పక్కన పడేయడంతో, ఎండు ఆకులు అంటుకుని వృక్షం అగ్నికి ఆహుతైంది. వాహనదారులు గమనించి అగ్నిమాపక శాఖకు సమాచారం ఇవ్వడంతో హుటాహుటిన చేరుకుని మంటలను అదుపు చేసినట్లు అగ్నిమాపక అధికారులు చెప్పారు. -
అనుమానాస్పదంగా బాలింత మృతి
తణుకు అర్బన్: తణుకులో శిశువును ప్రసవించిన కొద్దిసేపటికే తల్లి మృతిచెందిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. తణుకు ఆర్టీసీ బస్టాండ్ సమీపంలోని స్టార్ ఆస్పత్రిలో శస్త్రచికిత్స ద్వారా ఆడబిడ్డకు జన్మనిచ్చిన ఆ మహిళ వ్యవహారం గందరగోళంగా మారింది. అసలు ఆమె ఎవరు.. ఏ ఊరు.. ఏంటనే వివరాలు లేకుండా అప్పటికప్పుడు ప్రసవానికి రావడం, కండీషన్ను బట్టి వెంటనే శస్త్రచికిత్స చేయడం, ఆమె చనిపోవడం మిస్టరీగా మారింది. వివరాల్లోకి వెళితే.. ఈనెల 17న రాత్రి తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రికి బాలింత మృతదేహాన్ని తీసుకురాగా ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది. ఇద్దరు వ్యక్తులు మృతదేహాన్ని ఆస్పత్రికి తీసుకురావడంతో ఆస్పత్రి సిబ్బంది మార్చురీలో భద్రపరిచారు. ఆమె తరఫున ఏ ఒక్కరూ రాకపోవడం అను మానాలకు తావివ్వడంతో తణుకు రూరల్ పోలీసులు రంగప్రవేశం చేశారు. పిల్లల విక్రయాలకు సంబంధించిన వ్యవహారంగా అనుమానాలు రావడంతో ఆ దిశగా దర్యాప్తు చేస్తున్నట్టు సమాచారం. అనుమానాలెన్నో.. తణుకులో ఓ ఆస్పత్రిలో కాంపౌండర్గా, బయట ఆర్ఎంపీగా చలామణి అవుతున్న పెనుమాక డేవిడ్ చంటి తనకు తెలిసిన వ్యక్తుల ద్వారా ఓ గర్భిణిని ఈనెల 16న పట్టణంలోని స్టార్ ఆస్పత్రికి తీసుకువెళ్లాడు. ఆస్పత్రి వైద్యుడు కనీసం ఆమె వివరాలు ఏమీ తెలుసుకోకుండా, ఎలాంటి రిపోర్టులు లేకుండానే సిజేరియన్ చేసి శిశువును బయటకు తీశారు. కొద్దిసేపటికే ఆమె మృతిచెందడంతో మృతదేహాన్ని చంటి, రాజమండ్రికి చెందిన అతడి సన్నిహితుడు బిక్కవోలు మోషే కలిసి దువ్వ వెంకయ్య వయ్యేరు వద్దకు తీసికెళ్లినట్టు సమాచారం. తిరిగి అక్కడి నుంచి అంబులెన్స్లో ఈనెల 17న సాయంత్రం తణుకు ప్రభుత్వాస్పత్రికి చేర్చి వారే పోలీసులకు సమాచారం ఇచ్చారు. బాలింత వేరే రాష్ట్రానికి చెందిన మహిళకాగా ఆస్పత్రిలో చేర్చే సమయంలో మోషేతో పాటు మరో మహిళ కూడా ఉన్నట్టు ఆస్పత్రి వర్గాలు చెబుతున్నాయి. పోలీసులు వచ్చేలోపు మోషేతో పాటు ఆ మహిళ అక్కడి నుంచి ఉడాయించింది. గర్భిణి పేరు కుమారి అని తనకు మోషే అప్పగించాడని చంటి చెబుతున్నాడు. వివరాలు తెలియకుండా ఆపరేషన్ ఎలా చేశారని వైద్యుడు సుంకవల్లి పాండురంగారావుని అడగ్గా ఎమర్జెన్సీ అని చెప్పడంతోనే సిజేరియన్ చేసినట్టు చెప్పారు. పసిపిల్లల విక్రయాల్లో భాగమేనా..? చంటి గతంలోనూ ఇదే తరహాలో కొందరికి సిజేరియన్లు చేయించి శిశువులను విక్రయించేవాడనే ఆ రోపణలు ఉన్నాయి. ఇదే క్రమంలో గర్భిణికి ఆపరేషన్ చేయించారనే అనుమానాలు వ్యక్తమవుతున్నా యి. చంటిని అదుపులోకి తీసుకుని విచారిస్తుండగా మోషే ఆచూకీ కోసం గాలిస్తున్నట్టు తణుకు రూరల్ ఇన్చార్జి ఎస్సై జానా సతీష్ తెలిపారు. 16న బాలింత మృతిచెందగా సుమారు 24 గంటలపాటు మృతదేహాన్ని ఎక్కడ ఉంచారు, ఏం చేయాలనుకున్నారనేది అనుమానాస్పదంగా ఉంది. ఇదిలా ఉండగా చంటి పొంతన లేని సమాధానాలు చెబుతున్నాడు. శిశువును వీరభద్రపురంలో ఒక ఇంట్లో ఉంచారనే సమాచారంతో పోలీసులు శిశువును తీసుకువచ్చి ప్ర భుత్వాస్పత్రిలో చేర్చారు. ఐసీడీఎస్ సూపర్ వైజర్లు కృష్ణకుమారి, వెంకటలక్ష్మి, మహాలక్ష్మి శిశువును సో మవారం పరిశీలించారు. శిశు గృహ సెంటర్కు తరలిస్తామని వారు చెప్పారు. వివరాలు తెలియకుండాశస్త్రచికిత్స చేసిన డాక్టర్ ఆస్పత్రిలో చేర్పించిన ఆర్ఎంపీ గందరగోళంగా బాలింత మృతి వ్యవహారం శిశువుల విక్రయాల్లో భాగమా అనే అనుమానాలు -
వైద్యం కోసం ఆపన్నహస్తం
కొయ్యలగూడెం: తలసేమియా వ్యాధితో బాధపడుతున్న బాలుడికి రూ.22 లక్షల విరాళాన్ని సేకరించి సోమవారం అందించారు. బయ్యన్నగూడేనికి చెందిన సింగంశెట్టి మణికంఠ అనే బాలుడు తలసేమియా వ్యాధితో బాధపడుతుండగా ఈనెల 10న ‘సాక్షి’లో ‘సాయం కోసం ఎదురుచూపులు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. అలాగే గ్రామ యు వత సోషల్ మీడియా ద్వారా విస్తృత ప్రచారం చేశారు. వైద్యానికి అవసరమైన రూ.22 లక్షలు సేకరించి గ్రామ పెద్దల సమక్షంలో బాలుడి కుటుంబానికి అందజేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీసెట్ పరీక్షలు సోమవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఉదయం, మధ్యాహ్నం షిఫ్టుల్లో పరీక్షలకు 459 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం 120 మందికి 117 మంది, ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 169 మంది, మధ్యాహ్నం 180 మందికి 173 మంది హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు కలెక్టరేట్లో సోమవారం జరిగిన పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్ ద్వారా 246 అర్జీలు స్వీకరించినట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని సూ చించారు. ప్రతి వినతిని సంబంధిత అధికారు లు క్షేత్రస్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించి, దరఖాస్తుదారులతో మాట్లాడి నిర్ణీత గడువులోపు సత్వర పరిష్కారం చూపాలన్నారు. అర్జీలు రీఓపెన్ కాకుండా చూడాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, అసిస్టెంట్ కలెక్టర్ సీహెచ్ శ్రావణ్కుమార్రెడ్డి, ఇన్చార్జి డీఆర్వో ఎల్.దేవకీదేవి, స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ కె.భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, జిల్లా సర్వే సహాయ సంచాలకులు అన్సారీ పాల్గొన్నారు. ఏలూరు టౌన్: చాట్రాయి పోలీస్స్టేషన్లో విధులు నిర్వర్తిస్తూ అనారోగ్యంతో మృతిచెందిన వి.మాధవరెడ్డి భార్య సుజాతకు ఏలూరు జిల్లా పోలీస్ అధికారుల సంఘం నుంచి ఆర్థిక సాయం అందించారు. పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ చేతులమీదుగా రూ.లక్ష చెక్కు అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ పోలీస్ కుటుంబాలకు ఎల్లప్పుడూ అండగా ఉంటామనీ, పోలీస్ సిబ్బంది సంక్షేమానికి ప్రాధాన్యమిస్తామని చెప్పారు. ఇప్పటికే మాధవరెడ్డి కుటుంబానికి ప్లాగ్ ఫండ్ రూ.25 వేలు, విడో ఫండ్ రూ.50 వేలు అందజేశామన్నారు. ప్రభుత్వం నుంచి రావాల్సిన రాయితీలను వేగంగా అందించేలా చర్యలు తీసుకుంటామని భరోసా కల్పించారు. పోలీస్ అధికారుల సంఘం అధ్యక్షుడు ఆర్.నాగేశ్వరరావు, పోలీస్ సిబ్బంది ఉన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): వెంకట్రామన్నగూడెం వైఎస్సార్ ఉద్యాన వర్సిటీలో వచ్చేనెల 5న రైతు సదస్సు, నూతన సాంకేతిక పరికరాల ప్రదర్శన ఏర్పాటు చేస్తున్నట్టు వీసీ కట్టుపల్లి ధనుంజయరావు తెలిపారు. సుస్థిర ఉద్యానం, సుభిక్ష ఫలసాయం ప్రధానాంశంగా ఉద్యాన పంటల్లో ఆధునిక సాగు పద్ధతులు పరిచయం, సాంకేతిక పరిజ్ఞానంపై అవగాహన కల్పిస్తామన్నారు. భీమవరం(ప్రకాశం చౌక్): ఏలూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ పరిధిలోని జిల్లాలోని భీమవరం, వీరవాసరం మండలాల్లోని అక్రమ లేఅవుట్లను అధికారులు పొక్లయిన్లతో ధ్వంసం చేయించారు. భీమవరం మండలంలోని విలీన గ్రామాలుగా ఉన్న తాడేరులో నాలుగు, కొమరాడలో మూడు, కొవ్వాడ అన్నవరంలో రెండు లేఅవుట్లను ధ్వంసం చేయించారు. -
కూటమికి తొత్తులా మున్సిపల్ కమిషనర్
ఏలూరు (టూటౌన్): ఏలూరు నగరపాలక సంస్థ కమిషనర్ ఎ.భానుప్రతాప్ కూటమి ప్రభుత్వానికి తొత్తులా పనిచేస్తున్నారని, తమ సమస్యలపై ఎన్నిసార్లు కలిసినా కనీస మర్యాద కూడా ఇవ్వకుండా స్పందించడం లేదని వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) విమర్శించారు. కూటమి నాయకుల కనుసన్నల్లో కావాలనే తమను ఇబ్బంది పెడుతున్నారంటూ సాక్షాత్తు కలెక్టర్ వెట్రిసెల్వి ఎదుటే నిలదీశారు. ఈ సందర్భంగా కమిషనర్ భానుప్రతాప్ వైఎస్సార్సీపీ నాయకులతో వాగ్వాదానికి దిగడంతో కలెక్టర్ ఆయన్ను పక్కకు పంపించి వేశారు. అనంతరం కలెక్టరేట్ బయట జయప్రకాష్ విలేకరులతో మాట్లాడుతూ స్థానిక ఫైర్స్టేషన్ సెంటర్లో దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహం చుట్టూ గ్రానైట్ మరమ్మతులు చేయించే విషయంలో ఇప్పటికే పీజీఆర్ఎస్లో పలుమార్లు వినతిపత్రం అందించామన్నారు. దీనిపై కమిషనర్కు కలెక్టర్ లేఖ పంపగా తాము కమిషనర్ను ఆయన చాంబర్లో కలిశామన్నారు. ఆ సమయంలో ప్రతిపక్ష నాయకులన్న మర్యాద లేకుండా కనీస గౌరవం ఇవ్వకుండా కమిషనర్ మాట్లాడారని మండిపడ్డారు. ఈ విషయంలో కమిటీ వేస్తామని చెప్పి రెండు నెలలు కావస్తున్నా ఇప్పటికీ ఎలాంటి నిర్ణయం తీసుకోకపోవడం సిగ్గుచేటన్నారు. గతంలో మున్సిపల్ నిధులతో వైఎస్సార్ విగ్రహాన్ని నిర్మించారని గుర్తుచేశారు. 2023లో ఇడా ఆధ్వర్యంలో బ్యూటిఫికేషన్ పేరుతో విగ్రహం చుట్టూ గ్రానైట్ను తొలగించారని.. పనులు మొదలు పెట్టేలోపు ప్రభుత్వం మారడంతో పనులు నిలిచిపోయాయన్నారు. అప్పటి నుంచి మీరైనా బాగు చేయండి, లేదంటే తామైనా బాగు చేయించుకునేందుకు అనుమతి ఇప్పించాలని మొరపెట్టుకుంటున్నా పట్టించుకోవడం లేదన్నారు. అలాగే జిల్లా పార్టీ కార్యాలయం నిర్మాణం విషయంలోనూ అన్ని అనుమతులు ఉన్నా ఎన్ఓసీ ఇవ్వకుండా కావాలనే ఇబ్బంది పెడుతున్నారన్నారు. కోర్టు ఉత్తర్వులు ఉన్నా విద్యుత్ సరఫరాను కట్ చేయించడం, ఎన్ఓసీ ఇవ్వకపోవడం వంటి చర్యలు ఏకపక్షంగా తీసుకుంటున్నారన్నారు. దీనిపై కోర్టును ఆశ్రయిస్తామని చెప్పారు. కమిషనర్పై కలెక్టర్ చర్యలు తీసుకోవాలని కోరారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, నాయకులు నూకపెయ్యి సుధీర్బాబు, మున్నుల జాన్ గురునాథ్, గంటా మోహనరావు, జిజ్జువరపు విజయనిర్మల, నెరుసు చిరంజీవులు, ప్రత్తిపాటి తంబి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ దృష్టికి తీసుకువెళ్లిన వైఎస్సార్సీపీ నేతలు -
లక్ష మల్లెల అర్చన
ప్రసిద్ధ క్షేత్రంగా విరాజిల్లుతున్న ముదినేపల్లి మండలం శింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లో వల్లీ దేవసేన సమేత సుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో జ్యేష్ట మాసం సందర్భంగా లక్ష మల్లెల అర్చన సోమవారం జరిగింది. ప్రధాన అర్చకుడు తోలేటి వీరభద్రశర్మ నేతృత్వంలో ప్రత్యేక పూజలు జరిగాయి. ఏటా లక్ష మల్లెల అర్చన ఇక్కడి ఆనవాయితీ. ఆలయ చైర్మన్ బొంగు రవికుమార్, సహాయ కమిషనర్, ఈఓ ఆర్.గంగాశ్రీదేవి, ధర్మకర్తల మండలి సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. – ముదినేపల్లి (కై కలూరు) -
ఖాళీ బిందెలతో రోడ్డెక్కిన మహిళలు
నూజివీడు: పట్టణంలోని ట్రిపుల్ఐటీ ఎదురుగా ఉన్న జగనన్న కాలనీలో మండు వేసవిలో నీళ్లు లేక కాలనీ మహిళలు సోమవారం రోడ్డెక్కి ఆందోళనకు దిగారు. వీరి ఆందోళనకు సీపీఎం నాయకులు మద్దతు తెలిపారు. గత నాలుగు నెలలుగా నీటి సమస్యతో సతమతమవుతున్నా మున్సిపల్ అధికారులు గాని, పాలకులు గాని ఎవరూ పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. 20 రోజుల క్రితం తమ నీటి సమస్యపై సబ్కలెక్టర్ కార్యాలయంలో పీజీఆర్ఎస్ కార్యక్రమంలో అర్జీని అందజేశామని అయినా ఇంత వరకు నీటి సమస్యను పరిష్కరించలేదని, ఇంక అర్జీలను తీసుకోవడం ఎందుకని వారు ప్రశ్నించారు. సీపీఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు జీ రాజు మాట్లాడుతూ కాలనీవాసులు నీటి సమస్యతో నెలల తరబడి ఇబ్బందులు పడుతున్నా కనీసం ట్యాంకర్లతోనైనా సరఫరా చేయాలనే ఆలోచన చేయకపోవడం దారుణమన్నారు. కాలనీలోని మంచినీటి సమస్యను పరిష్కరించకుంటే మున్సిపల్ కార్యాలయాన్ని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో సీపీఎం నాయకులు రామకూరి మరియదాసు, స్థానికులు పాల్గొన్నారు. -
మొక్కజొన్న రైతుల నిరసన దీక్ష
నూజివీడు: నూజివీడు ప్రాంతంలో అనేక సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు ప్రతి ఏటా రైతులను దారుణంగా మోసం చేస్తున్నారని రైతు సంఘం రాష్ట్ర నాయకులు చలసాని వెంకట రామారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. దేవరగుంట గ్రామ ఆర్గనైజర్ ద్వారా అడ్వంటా సీడ్ కంపెనీ వారి నాసిరకం మొక్కజొన్న విత్తనాలతో తీవ్రంగా నష్టపోయిన గొల్లపల్లి గ్రామానికి చెందిన కౌలు రైతులకు పంట నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేస్తూ పట్టణంలోని సబ్ కలెక్టర్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన దీక్ష చేపట్టారు. ఈ దీక్షను ప్రారంభించిన చలసాని రామారావు మాట్లాడుతూ ప్రభుత్వం, రైతులు, వ్యవసాయ అధికారుల మెతకతనాన్ని ఆసరా చేసుకున్న సీడ్ కంపెనీలు, ఆర్గనైజర్లు రైతుల పట్ల చులకన భావంతో వ్యవహరిస్తున్నారన్నారు. అనేక గ్రామాల్లో సీడ్ మొక్కజొన్న బాధిత రైతులను బెదిరించటం, ప్రలోభ పెట్టడం వంటి దుష్ట చర్యలకు పాల్పడుతున్నారని ఆగ్రహించారు. రైతు సంఘం నేత నిమ్మగడ్డ నరసింహా మాట్లాడుతూ గొల్లపల్లి సీడ్ మొక్కజొన్న బాధిత రైతులకు తక్షణమే పంట నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. ఇకనైనా సీడ్ ఆర్గనైజర్ల పట్ల ప్రభుత్వం మెతకతనం విడనాడాలని కోరారు. దీక్షా కార్యక్రమం అనంతరం సబ్ కలెక్టర్ కార్యాలయంలో బాధిత రైతులకు న్యాయం చేయాలని వినతిపత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో రైతు సంఘం నేతలు మడుపల్లి నాగేందర్రావు, చాట్ల పుల్లారావు, సూర్య కుమార్, బాధిత రైతులు బండి రత్నబాబు, మెరుగు సువర్ణరాజు, రుద్రపాటి సురేష్ పాల్గొన్నారు. -
మృత్యు శకటాలుగా మట్టి ట్రాక్టర్లు
తణుకు అర్బన్: మట్టి ట్రాక్టర్లు మితిమీరిన వేగంతో పయనిస్తూ ప్రజలను భయాందోళనకు గురిచేస్తున్నాయి. ట్రాక్టర్ డ్రైవర్లు నిబంధనలు పాటించకుండా నిర్లక్ష్యంగా వాహనాలను నడపడంతో నిత్యం పలుచోట్ల ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. వేసవి వస్తుందంటే చాలు మట్టి మాఫియా ఆగడాలకు అంతే లేకుండా పోతుంది. వ్యవసాయ భూముల్లో మట్టి తోలకం కోసం పోటాపోటీగా నడస్తున్న ట్రాక్టర్లతో ప్రయాణికులను భయాందోళనకు గురిచేస్తున్నారు. ఈ వేసవి మొదలైన రోజు నుంచి మట్టి తోలకాలు జోరుగా సాగుతున్న నేపధ్యంలో మట్టి ట్రాక్టర్ల వేగానికి వాహనదారులు బెంబేలెత్తిపోతున్నారు. ఒకరికంటే మరొకరు అధికంగా ట్రిప్పులు వేయాలనే ఉద్దేశంతో వేగంగా నడుపుతున్న తీరు ప్రయాణికుల ఒళ్లు గగుర్పొడిచేలా ఉంది. ఇందుకు నిదర్శనమే తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని బైపాస్ రోడ్డులో ఒక అమాయక ప్రాణం బలిగొంది. ఈనెల 17వ తేదీన బైపాస్ రోడ్డులో ద్విచక్ర వాహనంపై వెళ్తున్న పాలకోడేరు మండలం అన్నాకోడేరు గ్రామానికి చెందిన పులగం బాలాజీ, భవాని దంపతులను ట్రాక్టరు వెనుక నుంచి వేగంగా ఢీకొట్టడంతో భవాని అక్కడికక్కడే మృతిచెందిన విషయం తెలిసిందే. వాహనాన్ని ఢీకొట్టిన వెంటనే ట్రాక్టరు సైతం సమీపంలోని పొలాల్లోకి దూసుకువెళ్లిన తీరు వాహన వేగాన్ని తెలుపుతుందనే విమర్శలు వినిపిస్తున్నాయి. అంతేకాకుండా ట్రాక్టరు డ్రైవరు కూడా మైనరుగా ఉన్నాడని, విపరీతమైన సౌండ్తో పాటలు పెట్టుకుని వేగంగా వచ్చాడని ప్రయాణికులు చెబుతున్నారు. నిర్లక్ష్యం, వేగం, నిబంధనలు పాటించని వైనానికి ఒక నిండు ప్రాణం బలైంది. గతంలోనూ ఇటువంటి ప్రమాదాలు చోటుచేసుకున్నా అధికారులు పట్టించుకోవడంలేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. మృత్యుశకటాలుగా.. తణుకు నియోజకవర్గంలోని తణుకు, అత్తిలి, ఇరగవరం మండలాల్లోని గ్రామాల్లో వ్యవసాయ భూముల నుంచి నిబంధనలకు వ్యతిరేకంగా మట్టిని తవ్వడం ఒకటైతే, మట్టిని తరలిస్తున్న ట్రాక్టర్లు ప్రయాణిస్తున్న వేగం ప్రయాణికులను భయపెడుతోంది. ముఖ్యంగా ట్రాక్టరు డ్రైవర్లు అధికశాతం మైనర్లే ఉంటున్నారని, ట్రాక్టరుకు నిబంధనలకు విరుద్ధంగా భారీ సౌండ్ బాక్స్లు ఏర్పాటుచేసుకుని విపరీతమైన సౌండ్స్తో ప్రయాణిస్తున్నారని ఆయా గ్రామాల్లోని నివాసితులు చెబుతున్నారు. గ్రామాల్లోని రోడ్లపై వేగంగా వెళ్తున్న తీరు చూస్తుంటే పిల్లలను రోడ్డుపైకి వదలాలంటేనే భయమేస్తుందని పలువురు చెబుతున్నారు. నిబంధనలు పాటించకుండా నడుస్తున్న వాహనాలపై చర్యలు తీసుకోవాల్సిన సంబంధిత అధికారులు చోద్యం చూస్తున్నారనే ఆరోపణలు లేకపోలేదు. కొన్ని ట్రాక్టర్లకు నంబరు ప్లేట్లు కూడా ఉండడంలేదని, కొన్నింటికి ఉన్నప్పటకీ విపరీతమైన అలంకరణతో ఆ నంబరు ప్లేట్లు కనిపించని పరిస్థితిలో ఉంటున్నాయి. అయితే అధికారులు ఈ తరహా వాహనాలను నిలువరించినా రాజకీయ ఒత్తిడిలు, సిఫార్సులతో చర్యలు తీసుకోలేకపోతున్నారనే ఆరోపణలు లేకపోలేదు. మితిమీరిన వేగంతో పయనం పలు ప్రమాదాలు చోటుచేసుకుంటున్న వైనం ఇటీవల మట్టి ట్రాక్టరు ఢీకొని మహిళ మృతి నిబంధనలు పాటించని ట్రాక్టర్ల డ్రైవర్లు పట్టించుకోని అధికారులు -
ఇదేనా బాబు.. మీ విజనరీ
వ్యర్థం.. కాలువలకు అనర్థం భీమవరం పట్టణంలో పంట కాలువలు ప్లాస్టిక్ వ్యర్థాలు, చెత్తాచెదారాలతో నిండిపోతున్నాయి. అధికారులు పట్టించుకున్న దాఖలాలు లేవు. 8లో uతల్లిదండ్రులని కూడా చూడకుండా వృద్ధ దంపతులపై కుమారుడు, మనుమలు దాడికి తెగబడ్డారు. ఈ దృశ్యాలు వైరల్ అయ్యాయి. 8లో uమంగళవారం శ్రీ 19 శ్రీ మే శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: పెట్రోల్, డీజిల్ ధరలు అడ్డగోలుగా పెంచి వేల కోట్ల అదనపు భారం ప్రజలపై వేయడమేనా ముఖ్యమంత్రి చంద్రబాబు విజనరీ అంటూ వైఎస్సార్సీపీ శ్రేణులు మండిపడ్డారు. ఇంధన ధరల పెంపును నిరసిస్తూ సోమవారం జిల్లావ్యాప్తంగా ధర్నాలు, నిరసనలు, మానవహారాలు నిర్వహించారు. డీజిల్, పెట్రోల్ ధరలకు సంబంధించి రాష్ట్ర ప్రభుత్వం తన వంతుగా వ్యాట్ను తగ్గించకుండా ఇది తమ పరిధిలోని అంశం కాదంటూ చేతులు దులుపుకునేలా మాట్లాడటంపై ధ్వజమెత్తారు. జిల్లాలోని నియోజకవర్గాల్లో నిరసన ర్యాలీలు నిర్వహించి తహసీల్దార్లకు వినతిపత్రాలు అందించారు. అలాగే ఏలూరులో కలెక్టర్ కె.వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. ● కై కలూరులో.. కై కలూరులో పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నేతృత్వంలో భారీ నిరసన ర్యాలీ నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి తాలూకా సెంటరుకు చేరుకుని అక్కడ కొద్దిసేపు ఆందోళన నిర్వహించి అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ఒకేసారి రాష్ట్ర ప్రభుత్వం ప్రజలపై రూ.3,391 కోట్ల భారాన్ని మోపిందని, కనీసం రాష్ట్ర ప్రభుత్వానికి సంబంధించిన వ్యాట్ సెస్ను మినహాయించి భారం పడకుండా చూడాల్సి ఉన్నా సీఎం చంద్రబాబు పట్టించుకోకపోవడం నీతిమాలిన చర్య అని మండిపడ్డారు. రానున్న రోజుల్లో ప్రజలు చంద్రబాబుకు గుణపాఠం చెప్పడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ● ఉంగుటూరులో.. ఉంగుటూరులో నియోజకవర్గ సమస్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ప్రధాన సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేపట్టారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చంద్రబాబు పెట్రోల్, డీజిల్ ధరలను నియంత్రిస్తామని పదేపదే చెప్పి స్పష్టమైన హామీ ఇచ్చి.. ఇప్పుడు మాట తప్పి ధరలు పెంచి సామాన్యులని ఇక్కట్లు పాల్జేస్తున్నారని ధ్వజమెత్తారు. ధరలను అదుపు చేయా ల్సిన ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ● ఏలూరులో.. ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరు పాత బస్టాండ్ సెంటర్లో నిరసన కార్యక్రమం చేశారు. గ్యాస్ సిలిండర్లతో వినూత్న నిరసన తెలిపి అనంతరం కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం అందించారు. నాకు విజన్ ఉంది.. జాతీయ నాయకుడిని అని డబ్బా కొట్టుకునే చంద్రబాబు ఒకేసారి ప్రజలపై వేల కోట్ల భారాన్ని మోపాడని, డీజిల్, పెట్రోల్ ప్రభావం అన్ని రంగాలపై పడి నిత్యావసరాల ధరలు కూడా మండిపోతున్నాయని జయప్రకాష్ ఆందోళన వ్యక్తం చేశారు. ఎన్నికల మేనిఫెస్టోలో పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామని ప్రకటించి దానిని పట్టించుకోకపోగా నానాటికీ పెంచి ప్రజలను ఇబ్బందుల పాల్జేస్తున్నారని మండిపడ్డారు. ● చింతలపూడిలో.. చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో చింతలపూడిలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. పార్టీ కార్యాలయం నుంచి ర్యాలీగా వెళ్లి ఫైర్స్టేషన్ సెంటర్లో మానవహారంగా ఏర్పడి ధర్నా చేశారు. అక్కడి నుంచి తహసీల్దార్ కార్యాలయం వద్దకు చేరుకుని ధర్నా నిర్వహించి తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. విజయరాజు మాట్లాడుతూ దేశాల్లో ఎక్కడా లేనివిధంగా మన రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్ ధరలు ఆకాశానంటుతున్నాయని, ప్రజలపై మోయలేని భారాన్ని మోపారన్నారు. చంద్రబాబు ప్రభుత్వ చర్యలతో పేదల జీవితాలు ఇబ్బందికరంగా మారుతున్నాయన్నారు. తక్షణమే పెట్రోల్, డీజిల్, గ్యాస్ ధరలు తగ్గించకపోతే తీవ్రస్థాయిలో ఉద్యమిస్తామని హెచ్చరించారు. పార్టీ మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు మాట్లాడుతూ ఎన్నికలకు ముందు మంత్రి లోకేష్ పెట్రోల్ బంకుల వద్ద ధరల బోర్డుల వద్ద సెల్ఫీలు దిగి హంగామా చేశాడని, ఇప్పుడు పెరిగిన రేట్లపై ఏం మాట్లాడతారని ప్రశ్నించారు. ● పోలవరంలో.. పోలవరం నియోజకవర్గం కొయ్యలగూడెంలో నిరసన కార్యక్రమం పోలవరం నియోజకవర్గ పరిశీలకుడు మంతెన శివరామరాజు ఆధ్వర్యంలో చేపట్టారు. కనకదుర్గమ్మ సెంటర్ నుంచి తహసీల్దార్ కార్యాలయం వరకు ర్యాలీ చేశారు. అనంతరం తహసీల్దార్కు వినతిపత్రం అందించారు. శివరామరాజు మాట్లాడుతూ రాష్ట్రాన్ని చీకట్లోకి నెట్టేసేలా చంద్రబాబు పాలన జరుగుతుందని, ప్రజలు బుద్ధి చెప్పే రోజు దగ్గరలోనే ఉందన్నారు. పెట్రో మంటపై వైఎస్సార్సీపీ నిరసనాగ్రహం జిల్లావ్యాప్తంగా ర్యాలీలు, ధర్నాలు కలెక్టరేట్, తహసీల్దార్ కార్యాలయాల్లో వినతిపత్రాల అందజేత కై కలూరులో జిల్లా అధ్యక్షుడి నేతృత్వంలో భారీ ర్యాలీలు -
నా బిడ్డ మరణించింది ఆకివీడు పోలీసుల వల్లే
ఏలూరు (టూటౌన్): ఆకివీడు పోలీసుల చర్యల వల్లే తన కుమారుడు వీధి నవీన్ ఆత్మహత్య చేసుకున్నాడని, తనకు న్యాయం చేయాలంటూ మృతుని తల్లి వీధి బుజ్జి సోమవారం డీఐజీ అశోక్కుమార్ను కలిసి ఫిర్యాదు చేశారు. అనంతరం ఫిర్యాదు వివరాలను ఏలూరు కలెక్టరేట్ వద్ద మీడియాకు విడుదల చేశారు. బాధితురాలి కథనం మేరకు ఈనెల 10వ తేదీన ఆకివీడు పోలీస్ స్టేషన్లో సీఐ ఖాళీచరణ్ తమ కుమారుడు వీధి నవీన్ కుమార్ బట్టలు విప్పి కొట్టాడని, దీంతో నొప్పులు భరించలేక 11వ తేదీన అతడు గడ్డి మందు తాగి ఆత్మహత్య చేసుకున్నాడని, తమకు న్యాయం చేయాలని నవీన్ తల్లి బుజ్జి కోరారు. తాను గల్ఫ్లో ఉపాధి నిమిత్తం పనికి వెళ్లానని చెప్పారు. తమ కుమారుడిపై కోడలు, అత్త పెట్టిన అక్రమ కేసు నిమిత్తం స్టేషన్కు పిలిచి బట్టలు ఊడదీసి కొట్టడం కారణంగా తన బిడ్డ ఆత్మహత్య చేసుకున్నాడని వాపోయారు. ఈ విషయంపై భీమవరం డీఎస్పీ, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీని కలిసేందుకు ప్రయత్నించినప్పటికీ పోలీసులు ఆటంకాలు కలిగించి అడ్డగించారని చెప్పారు. విధి లేని పరిస్థితుల్లో డీఐజీని కలవడానికి ఏలూరు వచ్చినట్లు తెలిపారు. ఆర్పీఐ పార్టీ మత్తే బాబీ, కుటుంబ సభ్యులతో కలిసి ఆమె డీఐజీని కలిసి వినతిపత్రం సమర్పించారు. అనంతరం డీఐజీ అశోక్ కుమార్ వెంటనే పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీతో ఫోన్లో మాట్లాడి విచారణకు ఆదేశించారు. డీఐజీకి ఫిర్యాదు చేసిన మృతుడి తల్లి -
ఆస్తి కోసం కన్నవారిపైనే దాడి
● వృద్ధ దంపతులపై దాడికి తెగబడ్డ కుమారుడు, మనవళ్లు ● సోషల్ మీడియాలో వైరల్ అవుతున్న దృశ్యాలు నరసాపురం రూరల్: సమాజంలో బంధాలు, అనుబంధాలు ఎంతగా దిగజారిపోతున్నాయో చెప్పడానికి మొగల్తూరు మండలంలోని కొత్తోట గ్రామంలో జరిగిన ఒక ఘోర సంఘటనే నిదర్శనం. రెక్కలు ముక్కలు చేసి పెంచి పెద్ద చేసిన తల్లిదండ్రులని కూడా చూడకుండా, కేవలం ఆస్తి కోసం ఓ కొడుకు, అతని బిడ్డలు (మనవళ్లు, మనవరాలు) కలిసి వృద్ధ దంపతులపై అమానుషంగా దాడికి తెగబడ్డారు. సుమారు రెండు రోజుల క్రితం జరిగిన ఈ ఘటనకు సంబంధించిన దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. వివరాల ప్రకారం.. కొత్తోట గ్రామానికి చెందిన వృద్ధ దంపతులు సూర్యనారాయణ, కొపనాతి కస్తూరి బాయిలకు ముత్యాలరాజు అనే కొడుకు ఉన్నాడు. గత కొంతకాలంగా ఆస్తి విషయమై తల్లిదండ్రులతో ముత్యాలరాజు గొడవపడుతున్నాడు. ఈ క్రమంలోనే, ముత్యాలరాజు తన కొడుకులు రాధాకృష్ణ, శేఖర్, ఇతర కుటుంబ సభ్యులతో కలిసి వృద్ధ దంపతులపై కర్రలు, రాడ్లతో విచక్షణారహితంగా దాడి చేశాడు. వయసుపైబడిన వారనే కనీస మానవత్వం లేకుండా, ప్రాణాలు తీయాలనే ఉద్దేశంతోనే ఈ దారుణానికి ఒడిగట్టారు. ఈ దాడికి సంబంధించిన దృశ్యాలన్నీ అక్కడి సీసీ కెమెరాలో స్పష్టంగా రికార్డయ్యాయి. వృద్ధులను కిందపడేసి కర్రలతో కొట్టి కాళ్లతో తన్నుతున్న దృశ్యాలు సామాజిక మాధ్యమాల్లో వైరల్గా మారాయి. ప్రస్తుతం తీవ్ర గాయాలపాలైన సూర్యనారాయణ, కస్తూరి బాయి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఇదిలా ఉంటే ఈ ఘటనపై కొన్ని మీడియా ఛానెళ్లలో శ్రీపోలీసులు పట్టించుకోవడం లేద్ఙు అంటూ వస్తున్న వార్తలను మొగల్తూరు పోలీసులు తీవ్రంగా ఖండించారు. ఈ మేరకు మొగల్తూరు ఎస్సై జి.వాసు సోమవారం ఒక అధికారిక ప్రెస్ నోట్ విడుదల చేశారు.ఆ వార్తలు కేవలం అవాస్తవాలని, ఈ గొడవకు సంబంధించి బాధితురాలు కొప్పనాతి కస్తూరి బాయి ఈ నెల 16న ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని, నిందితులపై చట్టపరమైన కఠిన చర్యలు తీసుకుంటున్నారు. -
రెచ్చిపోతున్న మట్టి మాఫియా
● ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో దందా ● రేయింబవళ్లు అక్రమ తవ్వకాలు జంగారెడ్డిగూడెం: ఏజెన్సీ, మెట్ట ప్రాంతంలో మట్టి మాఫియా రెచ్చిపోతోంది. రేయింబవళ్లు యథేచ్ఛగా మట్టిని తవ్వి తరలించేస్తున్నారు. ఎర్రకాలువ జలాశయం, చెరువులు, కాలువ గట్లు కాదేదీ మట్టి దోపిడీకి అన్నట్టు చెలరేగిపోతున్నారు. వాస్తవానికి రైతులు తమ పొలాలను ఎత్తు చేసుకునేందుకు చె రువులు, జలాశయాల నుంచి మట్టిని తవ్వుకోవ చ్చు. దీనిని అడ్డం పెట్టుకుని అక్రమార్కులు మట్టిని అక్రమంగా తవ్వుతూ ఇటుక బట్టీలు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. అధికారులపై దాడులకు తెగబడుతూ.. జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, బుట్టాయగూడెం, కొయ్యలగూడెం, టి.నరసాపురం మండలాల్లో మట్టి దోపిడీ ఎక్కువగా ఉంది. తాజాగా ఎటువంటి అనుమతులు లేకుండా జంగారెడ్డిగూడెం మండలంలోని ఎ.పోలవరంలో చిన్న, పెద్ద చెరువు మట్టిని తరలిస్తుండగా ఇరిగేషన్ అధికారులు అడ్డుకోగా మట్టి మా ఫియా వారిపై దాడులకు పాల్పడింది. దీంతో పోలీసులు రంగ ప్రవేశం చేసి జేసీబీ, మట్టి ట్రాక్టర్లను సీజ్ చేసి పోలీస్స్టేషన్కు తరలించారు. అలాగే మైనింగ్ అధికారులకు సమాచారం ఇచ్చారు. తవ్వేయ్.. దోచేయ్.. ● వేగవరం, తాడువాయి గ్రామాల పరిధిలో ఎర్రకాలువ జలాశయంలో మట్టిని ఇటుక బట్టీలకు, రియల్ ఎస్టేట్ వెంచర్లకు తరలిస్తున్నారు. ఇలా ఒక్కో లారీ మట్టిని రూ.5 వేలకు విక్రయిస్తున్నారు. ● కొయ్యలగూడెం మండలంలో చెరువుల్లో మట్టిని తరలించేస్తున్నారు. చెరువుల్లో భారీ గోతులు పెట్టడంతో రైతులు, పశువుల కాపర్లు, పశువులు ప్రమాదాలకు గురవుతారని ఆందోళన వ్యక్తమవుతోంది. ఆయా గ్రామాల పరిధిలో రోడ్లు పాడవుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నా మాఫియా ఖాతరు చేయడం లేదు. ఇక్కడ పరిమిత క్యూబిక్ మీటర్లకు అనుమతులు తీసుకుని వేలాది క్యూబిక్ మీటర్ల మట్టిని తవ్వేస్తున్నారు. ● టి.నరసాపురం మండలం కేతవరం రెవెన్యూ పరిధిలో గ్రావెల్ను తవ్వి తరలించేస్తున్నారు. దీనికి దళారులు తయారై టిప్పర్కు రూ.500 వసూలు చేస్తున్నారని ఆరోపణలు ఉన్నాయి. ● బుట్టాయగూడెం, కొయ్యలగూడెం సరిహద్దులో ఉన్న చెరువులో మట్టిని అనుమతులు లేకుండా అక్రమంగా తరలించేస్తున్నారు. -
ఫీడ్ ధరలు తగ్గించకపోతే ఊరుకోం
వీరవాసరం: ఆక్వా ఫీడ్ ధరలను తగ్గించకపోతే ఆందోళనలు పెద్ద ఎత్తున ఉధృతం చేస్తామని పశ్చిమగోదావరి జిల్లా భీమవరం ప్రాంత రొయ్యల రైతుల సంక్షేమ సంఘం తీర్మానం చేసింది. ఆదివారం వీరవాసరం తులసి ఫంక్షన్ హాల్లో ఐదు నియోజకవర్గాల రొయ్యల రైతుల సంక్షేమ సంఘ గ్రామస్థా యి, జిల్లాస్థాయి కమిటీల నాయకుల సమావేశం జరిగింది. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రొయ్య రైతులకు ఎటువంటి నష్టం వాటిల్లినా అండగా ఉండటామని, సమస్యల పరిష్కారానికి ప్రత్యేక శ్రద్ధ కనబరుస్తామన్నారు. ప్రస్తుతం రాష్ట్రస్థాయిలో జరుగుతున్న ఫీడ్ కంపెనీలు, రొ య్యల రైతుల నాయకులు, ప్రభుత్వ అధికారులు నిర్వహిస్తున్న ప్రత్యేక సమీక్ష సమావేశాలు సానుకూలంగానే ఉండటం ఆనందాన్ని ఇస్తుందన్నారు. ఆక్వా ఫీడ్ యజమానులు చేస్తున్న ప్రభుత్వ లాబీయింగ్కు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తలొగ్గుతాయేమో అన్న అనుమానాన్ని రైతులు వ్యక్తం చేశా రు. భీమవరం ప్రాంత జిల్లా అధ్యక్షుడు మల్ల తులసీరామ్, కార్యదర్శి గాదిరాజు సుబ్బరాజు, బాపిరాజు, వీరవల్లి చంద్రశేఖర్, ఎం.వెంకట్రావు, పెద్దెత్తున రొయ్య రైతులు పాల్గొన్నారు. -
నిర్వాసితులపై నిర్లక్ష్యం
బుట్టాయగూడెం: పోలవరం ప్రాజెక్టు కోసం సర్వం త్యాగం చేశారు.. తరాలుగా పెనవేసుకున్న బంధాన్ని వీడి కట్టుబట్టలతో తమ ప్రాంతం విడిచి నిర్వాసిత కాలనీల్లో అడుగుపెట్టారు ఈ గిరి జనులు. ఇక్కడ ఉపాధి హామీ పనులు లేక, వసతులు కరువై సమస్యలతో సహవాసం చేస్తున్నారు. గ్రామాలు విడిచి ఏడేళ్లు గడుస్తున్నా తమను పట్టించుకునే నాథుడే లేడని ఆవేదన చెందుతున్నారు. పనుల్లేక.. జీవనం సాగక.. బుట్టాయగూడెం మండలం ముప్పినవారిగూడెం సమీపంలో వేలేరుపాడు మండలంలోని చిగురు మామిడి, బోళ్లపల్లి, శ్రీరాంపురం, కొర్రాజుగూడెం, వసంతవాడ గ్రామాల నిర్వాసితుల కోసం కోసం పునరావాస కాలనీ (చిగురుమామిడి కాలనీ) నిర్మించారు. చిగురుమామిడి గ్రామానికి చెందిన 80 కుటుంబాలు, శ్రీరాంపురానికి చెందిన 10 కు టుంబాలు ఏడేళ్ల క్రితం ఇక్కడికి వచ్చారు. వీరిలో 40 మందికి మాత్రమే ఉపాధి హామీ పనులు కల్పిస్తుండగా మిగిలిన వారు జాబ్కార్డులు బదిలీ కా కపోవడంతో ఇబ్బంది పడుతున్నారు. పనుల్లేక అవస్థలు పడుతున్నారు. వీరంతా పనులు కల్పించాలని కోరుతున్నారు. కాలనీకి రెండు గ్రామాల నిర్వాసితులు రాగా.. మూడు గ్రామాల నిర్వాసితులు రా వాల్సి ఉంది. వీరంతా ఆర్అండ్ఆర్ పరిహారం అందిన తర్వాత వస్తారని తెలిసింది. రాత్రిళ్లు భయం.. భయం నిర్వాసిత కాలనీలో సోలర్తో పాటు విద్యుత్ లైట్లను ఏర్పాటుచేశారు. ఇవి చాలాకాలంగా వెలగక పోవడంతో రాత్రిళ్లు బిక్కుబిక్కుమంటూ జీవిస్తున్నామని నిర్వాసితులు ఆవేదన చెందుతున్నారు. కాలనీలోని ఏ వీధిలోనూ దీపాలు వెలగడం లేదని చెబుతున్నారు. అయితే రాత్రిళ్లు పాముల బెడద ఎ క్కువ ఉందని, తాము వేలేరుపాడు మండలం పరిధిలోనే ఉన్నట్టు అధికారులు చెప్పడంతో తమ సమస్యలు ఎవరికి చెప్పుకోవాలో అర్థం కావడం లేదని ఆవేదన చెందుతున్నారు. ఖాళీ ఇళ్లు.. సమస్యల లోగిళ్లు ప్రస్తుతం ఖాళీగా ఉన్న ఇళ్లలో పిచ్చిమొక్కలు భా రీగా పెరిగిపోయాయి. అస్తవ్యస్తంగా ఉన్న కాలనీని చూసి నిర్వాసితులు ఆందోళ చెందుతున్నారు. ఉ పాధి హామీ పథకంలో అయినా పేరుకుపోయిన పిచ్చిమొక్కలును తొలగించాలని కోరుతున్నారు. వర్షాకాలంలో వరద నీరు ముంచెత్తుతోందని, నివారణ చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. అలాగే కాలనీలో 60 వేల లీటర్ల వాటర్ ట్యాంకు నిర్మించినా విద్యుత్ కోతల సమస్యతో నీటి సమస్య నెలకొందని అంటున్నారు. కాలనీలో చేతి పంపులు ఏర్పాటుచేయాలని నిర్వాసితులు కోరుతున్నారు. చిగురుమామిడి నిర్వాసిత కా లనీలో వీధిలైట్లు వెగడం లే దు. రాత్రిళ్లు పాములు, విషపురుగుల బెడదతో ఇబ్బందు లు పడుతున్నాం. అలాగే గ్రా మంలో ఖాళీ స్థలం లేదు. దీనివల్ల ఏదైనా శుభ కార్యక్రమాలకు అవస్థలు తప్పడం లేదు. అధికారులు సమస్యలు పరిష్కారానికి కృషి చేయాలి. – బాడిస భాస్కరావు, కాలనీవాసిఈ కాలనీని ఐదు గ్రామాల నిర్వాసితులకు కలిపి నిర్మించారు. ప్రస్తుతం రెండు గ్రా మాల వారు రాగా.. మిగిలిన వారు ఈ ఏడాదిలో వచ్చే అ వకాశం ఉంది. కాలనీలో 60 వేల లీటర్ల సామర్థ్యంతో నిర్మించిన వాటర్ ట్యాంకు సరిపోయే పరిస్థితి లేదు. మరో ట్యాంక్ నిర్మించి, చేతి పంపులు కూడా ఏర్పాటుచేయాలి. – కుంజా వెంకన్నబాబు, కాలనీవాసికాలనీలో కొందరికే ఉపాధి పనులు కల్పించారు. చాలా మంది కార్డులు బదిలీ కాకపోవడంతో ఖాళీగా ఉంటున్నారు. జాబ్కార్డులు బదిలీ చేయించి పనులు కల్పించాలి. వర్షాకాలంలో వరద నీరు ఇళ్లల్లోకి వస్తుంది. ఇందుకు డ్రైనేజీ పనులు సక్రమంగా చేయకపోవడమే కార ణం. ఆయా సమస్యలు పరిష్కరించాలి. – కుంజా మారయ్య, చిగురుమామిడి నిర్వాసితుడు, బుట్టాయగూడెం మండలంపునరావాసం.. సమస్యలతో సహవాసం చిగురుమామిడి కాలనీలో సమస్యల తిష్ట వెలగని వీధిలైట్లు, పాముల బెడద తాగునీటికి ఇక్కట్లు కొందరికే ‘ఉపాధి’ పనులు ఏడేళ్లు గడుస్తున్నా అందని జాబ్కార్డులు కన్నెత్తి చూడని ప్రజాప్రతినిధులు -
నేడు వైఎస్సార్సీపీ నిరసనలు
కైకలూరు: పెట్రోల్, డీజిల్ ధరల పెంపుపై వైస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు సోమవారం కైకలూరులో నిరసన కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు పార్టీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) ఆదివారం తెలిపారు. ఉదయం 9 గంటలకు నియోజకవర్గ నాలుగు మండలాల నుంచి నాయకులు ఏలూరు రోడ్డులోని వైఎస్సార్సీపీ కార్యాలయానికి రావాలని పిలుపునిచ్చారు. ఇక్కడ నుంచి కై కలూరు తహసీల్దార్ కార్యాలయానికి వెళ్లి వినతిపత్రం అందిస్తామని చెప్పారు. ఏలూరు (టూటౌన్) : రాష్ట్రంలో విశ్రాంత ఉ ద్యోగులకు పెండింగ్ డీఏ ఏరియర్స్ను త క్షణమే చెల్లించాలని జిల్లా రాష్ట్ర ప్రభుత్వ వి శ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ అధ్యక్ష, కార్యదర్శులు బి.ఆంజనేయులు, కె.మహాలక్ష్ముడు కోరారు. ఆదివారం స్థానిక కోటదిబ్బలోని సంఘ కార్యాలయంలో ఆయన మాట్లాడుతూ ఈనెల 30న జరుగునున్న జిల్లా కార్యవర్గ ఎన్నికల్లో విశ్రాంత ఉద్యోగులు పాల్గొనాలని కో రారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి పాత పెన్షన్ విధానాన్ని కొనసాగించాలని కోరారు. విశ్రాంత ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలన్నారు. జిల్లా కోశాధికారి డి.గంగాధర్ రావు, జిల్లా నాయకులు, ఏఐటీయూసీ నాయకులు ఎ.అప్పలరాజు మాట్లాడారు. దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంటలోని రాట్నాలమ్మ ఆలయంలో ఆదివారం విశేష పూజలు జరిగాయి. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించుకుని పూజలు చేయించారు. ఆలయ ఆవరణలో ముడుపుల మొక్కులు కట్టారు. ఆలయ కమిటీ సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షించారు. పెనుమంట్ర: మార్టేరు ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్థానంలో సోమవారం నుంచి ఎంటీయూ 1318 ఫౌండేషన్ వరి విత్తనాల అమ్మకాలు ప్రారంభిస్తున్నట్టు పరిశోధన సంచాలకుడు డాక్టర్ సీహెచ్ శ్రీనివాస్ ప్రకటనలో తెలిపారు. కిలో విత్తనాలు రూ.42 చొప్పున 20 కిలోల బస్తా రూ.1,050 చొప్పున విక్రయిస్తున్నట్టు పేర్కొన్నారు. రైతులు ఉదయం 9 గంటల నుంచి 11:30 గంటల వరకు, మ ధ్యాహ్నం 2 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు సంప్రదించవచ్చని కోరారు. కాకినాడ బోట్క్లబ్: కాకినాడ గాంధీభవన్లో ఆదివారం సాహితీ స్రవంతి ఆధ్వర్యాన కోగంటి విజయ్ రాసిన ‘ఎవరిదీ చూపు’ కవితా సంపుటి ఆవిష్కరణ, సమీక్ష సభ జరిగింది. ఈ పుస్తకాన్ని కవిసంధ్య పత్రిక సంపాదకుడు శిఖామణి ఆవిష్కరించారు. సభకు అధ్యక్షత వహించిన జోస్యుల కృష్ణబాబు మాట్లాడుతూ గ్రంథకర్త కోగంటి విజయ్ కామవరపుకోట ప్రభుత్వ డిగ్రీ కళాశాల ప్రిన్సిపాల్గా పనిచేస్తూ, సాహిత్యంపై మక్కువతో అనేక గ్రంథాలు వెలువరించారని అన్నారు. ప్రముఖ రచయిత్రి వాడ్రేవు వీరలక్ష్మీదేవి మాట్లాడుతూ స్ఫూర్తిదాయకమైన కవిత్వం విజయ్ కవిత్వం అన్నారు. వక్త కాళ్లకూరి శైలజ మాట్లాడుతూ కోగంటి విజయ్ కవిత్వం ఎటువంటి సంక్లిష్టతకు తావులేకుండా అర్థమయ్యేలా ఉందన్నారు. సంపుటి లో సుమారు 70 కవితలు ఉన్నాయన్నారు. అనంతరం కవి సమ్మేళనం జరిగింది. -
ఫెన్సింగ్ సెలెక్షన్స్
తణుకు అర్బన్: జాతీయస్థాయి ఫెన్సింగ్ పోటీలకు 24 మంది క్రీడాకారులు ఎంపికై నట్టు ఏపీ ఫెన్సింగ్ ఆఫ్ అసోసియేషన్ కార్యదర్శి జీఎస్వీ కృష్ణమోహన్ తెలిపారు. ఏపీ స్టేట్ క్యాడెట్ బాయ్స్ అండ్ గరల్స్ (అండర్ 17) ఫెన్సింగ్ చాంపియన్షిప్ 2026–27, 21వ నేషనల్ క్యాడెట్ ఫెన్సింగ్ ఏపీ స్టేట్ టీమ్ సెలెక్షన్స్ స్థానిక ఆకుల శ్రీరాముల ఇంజనీరింగ్ కళాశాలలో ఆదివారం నిర్వహించారు. రాష్ట్రంలోని పలుజిల్లాల నుంచి 120 మంది క్రీడాకారులు హా జరయ్యారు. ఎంపికై న క్రీడాకారులు ఈనెల 23న ఉత్తరాఖండ్లో జరిగే జాతీయ క్యాడెట్ ఫెన్సింగ్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కళాశాల అధినేత ఆకు ల విష్ణువర్థన్, ఏపీ ప్రైవేట్ ఐటీఐ మేనేజ్మెంట్ అసోసియేషన్ గౌరవ అధ్యక్షుడు బసవ రామకృష్ణ పోటీలను ప్రారంభించారు. -
పద్మావతీ.. మాకేంటీ దుస్థితి
ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న దే వస్థానంలో పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) (పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థ) మేనేజర్పై మహిళా కార్మికులు చేస్తున్న ఆరోపణలు తారాస్థాయికి చేరాయి. తమ పట్ల అసభ్యకరంగా ప్రవర్తించడంతో పాటు పరుష పదజాలాన్ని వాడుతున్నాడని వారు అంటున్నారు. ఇదేంటని ప్రశ్నిస్తున్న వారిని ఏదో ఒక వంకతో పనిలోంచి తీసేస్తున్నాడని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ క్రమంలోనే పలువురు మహిళా కార్మికులు ఆది వారం ఆలయ సూపరింటెండెంట్ ఐవీ రామారావుకు ఫిర్యాదు చేశారు. సదరు మేనేజర్పై ఈ ఆరోపణలు, ఫిర్యాదులు కొత్తేమీ కాదు. గతేడాది అక్టోబర్ 1న ఈ సంస్థ శ్రీవారి దేవస్థానంలో పారిశుద్ధ్య కాంట్రాక్ట్ పనులు చేపట్టినప్పటి నుంచి ఈ ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. కొందరు మహి ళా కార్మికులతో అసభ్యకరంగా చేసిన వాట్సాప్ చా టింగ్లు, ఫోన్లలో మాట్లాడిన వాయిస్ రికార్డింగ్లు గతంలోనే బయటపడ్డాయి. అయితే కాంట్రాక్టర్ సాక్షాత్తూ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో అధికారులు మేనేజర్పై చర్యలు తీసుకునేందుకు వెనుకాడుతున్నారని పలువురు అంటున్నారు. అలాగే నాసిరకం మెటీరియల్ వినియోగంపై నోరు విప్పితే.. టార్గెట్ చేసి, పనిలోంచి తీసేస్తున్నారని కొందరు కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇదిలా ఉంటే పారిశుద్ధ్య పనులకు సంబంధించి మెషీనరీకి మాత్రమే దేవస్థానం నెలకు సుమారు రూ.3.50 లక్షలు కాంట్రాక్టర్కు చెల్లిస్తోంది. ఇలా రెండేళ్లకు దాదాపు రూ.84 లక్షలు చెల్లించనుంది. అయితే ఇంత విలువైన మెషినరీ ఈ దేవస్థానానికి వచ్చిందా.. అన్న ప్రశ్నలు తలెత్తుతున్నాయి. ఇదిలా ఉంటే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొత్తంగా పారిశుద్ధ్య పనులకు నెలకు రూ.18.28 లక్షలు చెల్లిస్తే ప్రస్తుత కూటమి ప్రభుత్వంలో నెలకు సుమారు రూ.54 లక్షల వరకు చెల్లిస్తోంది. ఎప్పుడూ ఇంత ఇబ్బంది పడలేదు తాము పదేళ్ల నుంచి పారిశుద్ధ్య కార్మికులుగా పనిచేస్తున్నామని, ఇప్పటివరకు ఏ మేనేజర్ వల్ల ఇంత ఇ బ్బంది పడలేదని సూపరింటెండెంట్కు కార్మికులు తెలిపారు. దేవస్థానంపై ఆధారపడి బతుకుతున్న తమను అధికారులు ఆదుకోవాలని, అలాగే సదరు మేనేజర్పై చర్యలు తీసుకోవాలని వారు కోరారు. ఇప్పటివరకూ జీతాల్లేవ్ ఈ కాంట్రాక్ట్ సంస్థ కింద దేవస్థానంలో 180 మంది కార్మికులు పనిచేస్తున్నారు. ఈ సంస్థ మొదటి నుంచి కార్మికులకు జీతాలు ఆలస్యంగానే చెల్లిస్తోంది. ఈనెల 5లోపు అందాల్సిన జీతాలు ఇప్పటివరకు అందలేదు. ప్రతి నెలా జీతాల కోసం ఎదురుచూ డాల్సి వస్తోందని కార్మికులు అంటున్నారు. పారిశుద్ధ్య కాంట్రాక్ట్ సంస్థపై కార్మికుల మండిపాటు శానిటేషన్ మేనేజర్ ఆగడాలపై ఫిర్యాదు అసభ్యకరంగా ప్రవర్తిస్తున్నాడంటూ మహిళా కార్మికుల ఆరోపణలు నెలలో సగం రోజులు గడిచినా అందని జీతాలు కాంట్రాక్టర్ సీఎం చంద్రబాబు బంధువు కావడంతో చర్యలు శూన్యం -
ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నం దారుణం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్టీసీ ప్రైవేటీకరణ యత్నం దారుణమని ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా ప్రధాన కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే అన్నారు. ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ఏలూరు డిపో వద్ద రెండో రోజు ఆదివారం ఆర్టీసీ కార్మికులు ధ ర్నా చేశారు. ఈ సందర్భంగా యూనియన్ ఏలూరు రీజినల్ కోశాధికారి జి.భాస్కర్ మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ కొనుగోలు చేసి, ఆర్టీసీయే నడపాలని డిమాండ్ చేశారు. ఆ ర్టీసీలో కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు. సీ్త్రశక్తి పథకం వల్ల ఉద్యోగ సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని కోరారు. ఆర్టీసీ ఉద్యోగులు, కార్మికులు ఎదుర్కొంటున్న పలు సమస్యల పరిష్కా రానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు డిపో నాయకులు, కార్మికులు పాల్గొన్నారు. -
రుణాలు సద్వినియోగం చేసుకోవాలి
పెనుగొండ: డ్వాక్రా మహిళలకు, రైతులకు అందిస్తున్న వ్యవసాయ రుణాలను, ఇతర రుణాలు లబ్ధిదారులు సద్వినియోగం చేసుకోవాలని యూనియన్ బ్యాంక్ రీజనల్ హెడ్ వీరభద్రరావు తెలిపారు. శనివారం ఆచంటలో యూనియన్ బ్యాంక్ ఆధ్వర్యంలో అగ్రికల్చర్ ఔట్ రీచ్ కార్యక్రమాన్ని ఆచంట చాంబర్ కమిటీ హాల్లో నిర్వహించి రుణాల చెక్కులను అందించారు. యూనియన్ బ్యాంక్లో వ్యవసాయ రుణాలు, ఇతర పథక రుణాలపై అవగాహన కల్పించారు. డిపాజిట్లపై వచ్చే వడ్డీని, తిరిగి తక్కువ వడ్డీకి తీసుకొనే అవకాశాలను వివరించారు. కార్యక్రమంలో పశుసంవర్ధక శాఖాధికారి డాక్టర్ ఫణి, ఏపీఎం రామకృష్ణ, ఆచంట బ్రాంచ్ మేనేజరు కే సుధాకర్, సీహెచ్ శ్రీనివాస్, దివ్య రాంబాబు, కేతా రామకృష్ణ, కోట వెంకటేశ్వరరావులు పాల్గొన్నారు. భీమవరం: భీమవరం పట్టణం బలుసుమూడి ఎస్టీ కాలనీ చర్చిలో మేరిమాత, ఏసుప్రభు విగ్రహాలను ధ్వంసం చేశారని చర్చి పాస్టర్ ఎన్. స్టాలిన్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు టూటౌన్ ఎస్ఐ రామారావు శనివారం చెప్పారు. ఈ నెల 13వ తేదీ రాత్రి చర్చి పక్కన గల ఖాళీ స్థలంలో ఐదుగురు వ్యక్తులు మద్యం సేవించి, అక్రమంగా చర్చిలోనికి ప్రవేశించి విగ్రహాలను ధ్వంసం చేశారని ఫిర్యాదులో పేర్కొన్నట్లు ఎస్ఐ తెలిపారు. జంగారెడ్డిగూడెం: అదృశ్యమైన మహిళ మృతదేహం శనివారం జంగారెడ్డిగూడెం మండలం లక్కవరం ఎర్రకాలువలో లభ్యమైంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ వివరాల ప్రకారం.. జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెంకు చెందిన తోట మేరీ (45) ఈ నెల 7న ఇంటి నుంచి అదృశ్యమైంది. మేరీ సోదరుడు గండే సురేష్ వద్ద ఉంటోంది. ఆమె కుటుంబసభ్యులు ఆమె కోసం వెతికినా.. ఆచూకీ లభించకపోవడంతో ఈ నెల 12వ తేదీన జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. దీంతో పోలీసులు తోట మేరీ అదృశ్యంపై కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి తోట మేరీ ఆచూకీ కోసం పోలీసులు, ఆమె కుటుంబసభ్యులు వెతుకుతున్నారు. ఆమెకు మతిస్థిమితం లేదని సోదరుడు సురేష్ ఫిర్యాదులో పేర్కొన్నాడు. శనివారం మధ్యాహ్న సమయంలో మేరీ కోసం వెతుకుతుండగా, ఎర్రకాలువలో కుటుంబసభ్యులకు మృతదేహం లభించింది. దీంతో పోలీసులకు సమాచారం ఇచ్చారు. ఘటనా స్థలానికి చేరుకుని మేరీ మృతదేహాన్ని గుర్తించారు. అనుమానాస్పద మృతి కేసును మార్చి దర్యాప్తు చేస్తున్నారు. భీమడోలు: భీమడోలు రైల్వే స్టేషన్ సమీపంలో రైలు ప్రమాదంలో గుర్తు తెలియని వృద్ధుడి మృతదేహాన్ని శనివారం ఏలూరు రైల్వే పోలీసులు గుర్తించారు. మృతదేహాం ట్రాక్ పక్కనే పడి ఉంది. వయసు 70 నుంచి 75 ఏళ్ల మధ్య ఉంటుందని, తెల్లని గడ్డంతో గళ్ల చొక్కా ధరించి ఉన్నాడని రైల్వే పోలీసులు తెలిపారు. మృతదేహాన్ని ఏలూరు సర్వజన ఆసుపత్రికి తరలించారు. భీమడోలు రైల్వే హెచ్సీ ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
రోడ్డు ప్రమాదంలో మహిళ మృతి
తాడేపల్లిగూడెం రూరల్: గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందినట్లు రూరల్ పోలీసులు తెలిపారు. మండలంలోని కుంచనపల్లి హైవేను ఆనుకొని ఉంటున్న పమ్మి పుష్ప (40) శుక్రవారం రాత్రి చర్చికి వెళ్ళింది. జాతీయ రహదారి డివైడర్ను దాటుతుండగా తణుకు నుంచి ఏలూరు వైపు వెళ్తున్న గుర్తు తెలియని వాహనం ఢీకొంది. దీంతో ఆమె మృతి చెందింది. శనివారం ఉదయం హైవే పోలీసులు గుర్తించి రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని తాడేపల్లిగూడెం ఏరియా ప్రభుత్వాసుపత్రికి తరలించారు. ఏఎస్సై గోపీనాథ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉంగుటూరు: చేబ్రోలు రైల్వే ఓవర్ బ్రిడ్జి (ఆర్ఓబీ) నిర్మాణానికి తమ స్థలాలు, ఇళ్లు కోల్పోతున్నామని.. కనీసం తమతో చెప్పకుండా, ఎటువంటి సమావేశం జరపకుండా భూసేకరణ చేస్తున్నారని నారాయణపురం మహిళలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. శనివారం నారాయణపురం బాధితులు పెద్ద ఎత్తున నిరసన తెలిపారు. మా అనుమతులు లేకుండా, కనీసం చర్చలు జరపకుండా భూమిని ఎలా తీసుకుంటారు అని వారు అధికారులను ప్రశ్నించారు. రైల్వే, రెవెన్యూ అధికారులు తమ భూముల జోలికి రావద్దని, అవి తమకు జీవనాధారమని వారు ఆవేదన వ్యక్తం చేశారు. తామంతా రోడ్డున పడకుండా అధికారులు, ప్రజాప్రతినిధులు కృషి చేయాలని కోరారు. ఆర్ఓబీ నిర్మాణానికి ఇతర అనువైన ప్రదేశాలు ఉన్నా, వాటిని వదిలేసి పేద ప్రజలు జీవించే ప్రాంతాలలో భూసేకరణ చేయవద్దని డిమాండ్ చేశారు. బొమ్మిడి అనిల్, శీలం పల్లేశ్వరరావు ఆధ్వర్యంలో ఈ ఆందోళన కార్యక్రమం జరిగింది. ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ (శాప్) ఆదేశాల మేరకు రాష్ట్రవ్యాప్తంగా చేపట్టిన శ్రీశాప్ లీగ్శ్రీ పోటీల్లో భాగంగా.. ఈ నెల 20, 21 తేదీల్లో ఏలూరులో జిల్లా స్థాయి ఆటల పోటీలు నిర్వహించనున్నట్లు డీఎస్డీఓ ఎస్.ఏ.అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. మే 20న ఉదయం 9 గంటలకు ఏలూరు ఇండోర్ స్టేడియంలో వెయిట్లిఫ్టింగ్ యూత్ అండర్–17 బాలుర విభాగంలో 56 కేజీల నుంచి 95 ప్లస్ కేజీల వరకు పోటీలు జరుగుతాయి. దీంతో పాటు యూత్ అండర్–17 బాలికలు, జూనియర్ మెన్, జూనియర్ అండర్–20 విభాగాల్లో వివిధ కేటగిరీల పోటీలు ఉంటాయి. మే 21న స్థానిక అల్లూరి సీతారామరాజు స్టేడియంలో అండర్–16 బాలబాలికలకు హైజంప్, లాంగ్జంప్, జావలిన్ త్రో, రన్నింగ్ తదితర అంశాల్లో పోటీలు నిర్వహిస్తారు. ఈ పోటీల్లో ప్రతిభ చాటిన క్రీడాకారులు జిల్లా జట్లకు ఎంపికై , రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొనే అర్హత సాధిస్తారని ఆయన వివరించారు. మరింత సమాచారం కోసం 9440375277, 7981635592 నంబర్లకు ఫోన్ చేయవచ్చని తెలిపారు. చాట్రాయి: రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు సివిల్ సప్లయిస్ డీటీ బాజీ తెలిపారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ మండలంలోని పోలవరంలో అక్రమంగా రేషన్ బియ్యం దాచారన్న సమాచారం రావడంతో ఏలూరు, నూజివీడు, చింతలపూడి సివిల్ సప్లయ్ డీటీలు దాడులు చేయగా సాతాని శివాజీ వద్ద 3.50 క్వింటాళ్లు, సాయి కుమార్ వద్ద 1.40 క్వింటాళ్లు రేషన్ బియ్యాన్ని స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. -
బీపీ లేకుండా హ్యాపీగా ఉందాం
అసంక్రమిత వ్యాధులను గుర్తించేందుకు జిల్లా వ్యాప్తంగా ఎన్సీడీ సర్వే నిర్వహిస్తున్నాం. ఈ సర్వేలో ఎక్కువగా అధిక రక్త పోటు కేసులు నమోదవుతున్నాయి. జిల్లాలో సుమారు 2 లక్షల 70 వేల మంది రక్తపోటు ఉన్న వారిని గుర్తించాం. వైద్యుల సూచనలు పాటిస్తూ బీపీ, సుగర్ వ్యాధులను నియంత్రించుకోవచ్చు. – డాక్టర్ నరేంద్రకృష్ట, ఎన్సీడీ ప్రోగ్రాం ఆఫీసర్ ప్రస్తుత జీవనశైలి కారణంగా వయసుతో సంబంధం లేకుండా అధిక రక్తపోటు బారిన పడుతున్న వారి సంఖ్య పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ప్రతి ఒక్కరూ వ్యాధిపై అవగాహన కలిగి ఉండి ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలి. ఆరోగ్యకరమైన ఆహార శైలితో అధిక రక్తపోటును అధిగమించవచ్చు. – డాక్టర్ డాక్టర్ డి.వంశీకృష్ణ, బుట్టాయగూడెం సామాజిక ఆరోగ్య కేంద్రంబుట్టాయగూడెం: ప్రపంచ వ్యాప్తంగా అతి పెద్ద అనారోగ్య సమస్యల్లో అధిక రక్తపోటు ఒకటి. బీపీతో బాధపడే వారి సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. సైలెంట్ కిల్లర్గా ఆరోగ్యాన్ని దెబ్బతీస్తోంది. అందువల్ల దీనిపై ప్రతిఒక్కరూ అవగాహన పెంచుకోవాలి. ప్రారంభ దశలో ఎలాంటి లక్షణాలు లేకుండా గుండె, బ్రెయిన్, కిడ్నీలకు తీవ్ర నష్టం కలిగిస్తుంది. అధిక రక్త పోటు కారణంగా మధుమేహం, స్ట్రోక్, గుండె జబ్బులు, మూత్రపిండాల వైఫల్యం, బ్రెయిన్స్ట్రోక్ వంటి అనేక సమస్యలు వచ్చే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. తరచూ రక్తపోటును పరీక్షించుకోవడం, ఆరోగ్య కరమైన జీవనశైలితో రక్తపోటు నివారించ వచ్చని డాక్టర్లు చెబుతున్నారు. నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం సందర్భంగా శ్రీసాక్షి శ్రీ ప్రత్యేక కథనం ఆధునిక కాలంలో మనిషి జీవనశైలి పూర్తిగా మారిపోయింది. సాంకేతిక ప్రభావం వల్ల దినచర్యలో చాలా మార్పులు వచ్చాయి. పూర్వ కాలంతో పోలిస్తే వ్యాయమం లేకపోవడం, శ్రమ లేని పనులు పెరిగిపోయాయి. ప్రతి పనిలో ఒత్తిడి పెరిగిపోయింది. దీనివల్ల బీపీ బారిన పడుతున్న వారి సంఖ్య అధికమవుతుంది. జిల్లా వ్యాప్తంగా బీపీ బాధితులపై సర్వే నిర్వహించారు. ఈ సర్వేలో సుమారు 2.70 లక్షల మందికి రక్తపోటు ఉన్నట్లు గుర్తించారు. బీపీ అంటే.. రక్తనాళాల్లో రక్తం వేగంగా ప్రవహించి అధిక ఒత్తిడి పెరగడం వల్ల వచ్చే సమస్యే హై బీపీ. ఒక వ్యక్తి సాధారణ స్థితిలో బ్లడ్ ప్రెజర్(బీపీ) 120/80గా పేర్కొంటారు. అయితే తాజాగా ప్రపంచ ఆరోగ్య సంస్థ పెద్ద వయసులో కొన్ని పరిస్థితుల్లో 140/90గా ఉన్నా సాధారణ స్థితిగానే నిర్ధారిస్తున్నారు. చాలా మందికి రక్తపోటు ఉన్నట్లు తెలియకపోడం వల్ల ఉన్నట్టుండి గుండెపోటు వచ్చి కుప్పకూలిపోతున్నారు. తల నొప్పి, అలసట అనిపిస్తే ఏ మాత్రం నిర్లక్యం చేయకుండా తక్షణమే వైద్యులను సంప్రధించి బీపీ చెక్ చేయించుకోవాలి. హైపర్ టెన్షన్ అసాధరణ రీతిలో రావడంతో అనారోగ్య సమస్యలు ఏర్పడతాయి. మెదడు, గుండెలో నరాలు దెబ్బతిని ప్రాణాపాయ స్థితికి చేరుకుంటారు. పక్షవాతం, కిడ్నీ సమస్యలు, నరాల సమస్యలు ఏర్పడే ప్రమాదం ఉంది. ఇటీవల 20 – 30 ఏళ్ల లోపు యువత గుండెపోటు, బ్రెయిన్ స్ట్రోక్, కిడ్నీ సమస్యలతో మృత్యువాత పడుతున్న సంఘటనలు చోటుచేసుకుంటున్నాయి. జాగ్రత్తలు తీసుకోవాలి అధిక రక్తపోటుతో బాధపడే రోగులు ఆహార పదార్థాల్లో ఉప్పు తక్కువగా వినియోగించుకోవాలి. మసాలాలు, నిల్వ చేసిన పచ్చళ్లు, కారం తగ్గించాలి. రోజూ గంట పాటు సాధారణ వ్యాయామం, యోగా వంటివి చేయడం మంచిది. మానసిక ఒత్తిడికి దూరంగా ఉండాలి. మత్తు పదార్థాలు, ఆల్కహాల్, సిగరెట్ వంటి వాటికి దూరంగా ఉండాలి. సాధారణంగా వయసు మళ్లిన వారికి రక్తపోటు వస్తుంది. జన్యుపరమైన కారణాలతో కూడా వస్తుంది. ధూమపానం, ఊబకాయం, ఏ పని చేయకుండా ఒకే చోట గంటల తరబడి ఉండడం, హైపో థైరాయిడ్, ఒత్తిడి, అనారోగ్యకర ఆహార అలవాటుతో పాటు కంటికి సరిపడా నిద్ర లేకపోవడం, శారీరక శ్రమ లేకపోవడం, దీర్ఘకాలిక మూత్ర పిండాల జబ్బుల వల్ల బీపీ వస్తుంది. మెడ నరాల లాగేస్తున్నట్లు ఉండడం, కళ్లు తిరగడం, ఆకస్మికంగా తూలిపోవడం, తరచూ తలపోటు రావడం, ఒళ్లంతా చెమటలు పట్టడం, యూరిన్ తక్కువగా రావడం, కాళ్లు తిమ్మిరిగా ఉండడం బీపీ లక్షణాలు అధిక రక్తపోటుతో అనర్థాలు ముందస్తు గుర్తింపుతో ప్రమాద నివారణ ఆరోగ్యకరమైన జీవన శైలితోనే రక్తపోటు నివారణ నేడు ప్రపంచ అధిక రక్తపోటు నివారణ దినోత్సవం -
ఆలయాల్లో వేసవి ఏర్పాట్లు
మహిళ మృతి గుర్తుతెలియని వాహనం ఢీకొని మహిళ మృతి చెందిన ఘటన తాడేపల్లిగూడెం మండలంలోని కుంచనపల్లి హైవేపై చోటుచేసుకుంది. 8లో uద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ఆలయాల్లో భక్తుల సౌకర్యార్థం వేసవి ఏర్పాట్లు చేసినట్టు దేవదాయశాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ హరి జవహర్లాల్ తెలిపారు. ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని శనివారం ఆయన సతీసమేతంగా సందర్శించారు. ఆలయంలో ప్రత్యేక పూజలు చేయించారు. అనంతరం వైకుంఠం క్యూ కాంప్లెక్స్లో భక్తులకు ఆయన వడజావ వితరణను ప్రారంభించారు. ఇటీవల ప్రారంభించిన శాశ్వత క్యూ కాంప్లెక్స్, అనివెట్టి మండపం ఫేజ్–2, శివాలయం ఐదు అంతస్తుల రాజగోపురాన్ని పరిశీలించారు. నిత్యాన్నదాన భవనంలో అన్నప్రసాదం నాణ్యత, రుచిపై భక్తులను ఆరా తీశారు. క్షేత్రంలో పలు విభాగాలను తనిఖీ చేసి రికార్డులను పరిశీలించారు. క్షేత్ర అభివృద్ధి, సౌకర్యాలపై సంతృప్తిని వ్యక్తం చేశారు. వేసవి ఉష్ణోగ్రతల దృష్ట్యా భక్తులకు వడజావను వచ్చే నెలాఖరు వరకు పంపిణీ చేస్తామన్నారు. అనంతరం ఆలయ అధికారులతో సమీక్షించారు. ఈఓ వేండ్ర త్రినాథరావు, ఈఈ డీవీ భాస్కర్, డీఈఓ వై.భద్రాజీ, ఏఈఓలు, సూపరింటెండెంట్లు, ఇంజనీరింగ్ విభాగ అధికారులు పాల్గొన్నారు. -
బిల్లులు దూరమై.. సంరక్షణ భారమై..
దెందులూరు: జాతీయ గ్రామీణ ఉపాధి పథకంలో భాగంగా ఉద్యాన పంటలు సాగు చేస్తున్న రైతులకు ప్రోత్సాహం కరువైంది. మొక్కల సంరక్షణకు సంబంధించి ఏడాదిగా బిల్లులు పెండింగ్లో ఉండటంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. జిల్లాలో పలువురు రైతులు తమ పొలాల్లో కొబ్బరి, ఆయిల్పామ్, నిమ్మ, జీడిమామిడి, మామిడి, సపోటా, జామ, దానిమ్మ వంటి మొక్కలను నాటారు. మొక్కలు నాటేంత వరకూ ఒత్తిడి చేసిన అధికారులు అనంతరం వీటి సంరక్షణకు ప్రోత్సాహాన్ని మరిచిపోయారు. ఏడాదికి పైగా రైతులు బిల్లుల కోసం కార్యాలయాల చుట్టూ ఎవరూ తిరుగుతు న్నా పట్టించుకోవడం లేదు. మూడేళ్ల పాటు.. ఉద్యాన పంటల సాగుకు సంబంధించి మొక్క ఎంపిక నుంచి నాటుకుని పంట చేతికొచ్చే వరకూ మూడేళ్లకు అయ్యే ఖర్చు నూరు శాతం ప్రభుత్వం భరిస్తుంది. దీనికి సంబంధించి ప్రతినెలా బిల్లులు ఇవ్వాల్సి ఉంది. జిల్లాలో 1,984 మంది రైతులు 3,500 ఎకరాల్లో 3,29,346 మొక్కలు నాటారు. మొక్కల రవాణా, నాటించడం, ఎరువులు, పురుగు మందుల పిచికారీ వంటి ఖర్చులు రైతులు భరించారు. వీటికి సంబంధించి బిల్లులు పెండింగ్లో ఉన్నాయి. జిల్లాలో రైతులకు మొక్కలు తెచ్చుకొని, గుంతలు పాతిన స్థితికి రూ.3,39,82,000ను ప్రభుత్వం చెల్లించింది. మొక్కల పెంపకం, ఇతర ఖర్చులు, వేతనం, సామగ్రి కింద సుమారు రూ.25 లక్షల వరకు బిల్లులు చెల్లించాల్సి ఉంది. దీనిపై జాతీయ ఉపాధి పథకం (డ్వామా) ప్రాజెక్టు డైరెక్టర్ వెంకట సుబ్బారావును వివరణ అడగ్గా ఉద్యాన పంటల సాగుకు తగు ప్రాధాన్యమిస్తున్నామని, త్వరితగతిన బిల్లులు చెల్లిస్తామని చెప్పారు. మండలాలు 27 పంచాయతీలు 549 సాగు ఎకరాలు 3,500 రైతులు 1,984 సాగు చేస్తున్న మొక్కలు 3,29,346 ‘ఉపాధి’ ఉద్యాన పంటల సాగు రైతులకు అందని బిల్లులు ఏడాదిగా మెటీరియల్ బకాయిలు జిల్లాలో రూ.25 లక్షల వరకు బిల్లుల పెండింగ్ జిల్లాలో ఉద్యాన పంటల సాగుకు తోడ్పాటు ఇవ్వాలి. క్షేత్రస్థాయిలో మరింత అవగాహన కల్పించాలి. సాగు ప్రారంభం నుంచి చివరి వరకు ఆర్థిక ఇబ్బందులు లేకుండా చూడాలి. – ఆళ్ల సతీష్చౌదరి, రైతు నాయకులు ప్రభుత్వం రైతు సమస్యలు పరిష్కరించాలి. ఉద్యాన సాగు కు ప్రోత్సాహం క్రమం తప్పకుండా ఇవ్వాలి. ఎప్పటికప్పు డు సాయం చేస్తూ ఆర్థిక ఇబ్బందులు లేకుండా అండగా ఉండాలి. – తట్టుకోళ్ల శ్రీనివాసరావు, రైతు -
పవనూ.. ఇది తగునా!
సాక్షి, భీమవరం: ‘నేనేమీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అంటూ జనసేనఽ అధ్యక్షుడు, డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్ చేసిన వ్యాఖ్యలు హాట్టాఫిక్గా మారాయి. ఎన్నికల సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకన్న సందేహాలు తలెత్తుతున్నాయి. తమ అభిమాన నేతను ముఖ్యమంత్రిగా చూడాలన్న కేడర్ ఆశలపై ఆయన మాటలు నీళ్లు చల్లినట్లయ్యింది. తమిళనాడులో సినీ హీరో విజయ్ పార్టీని స్థాపించిన రెండేళ్లకే ముఖ్యమంత్రిగా ఎన్నికై న విషయం తెలిసిందే. ఇతర పార్టీలతో పొత్తు పెట్టు కోకుండా ఒంటరిగా పోటీచేసి అత్యధిక స్థానాల్లో విజయం సాధిస్తే.. జనసేన పార్టీ పెట్టి పుష్కర కాలమైనా ఇంకా పొత్తుల కోసం పాకులాటపై ఇంటా బయట తీవ్ర చర్చ జరుగుతోంది. ఈ విషయమై శుక్రవారం మంగళగిరిలో పార్టీ నా యకులు, కార్యకర్తలతో జరిగిన సమావేశంలో ‘నేనే మీ సీఎం కావాలని పార్టీ పెట్టలేదు’ అన్న పవన్కల్యాణ్ మాటలు కేడర్ను నైరాశ్యంలోకి నెట్టేస్తున్నాయి. గతంలోని ఎన్నికల ప్రచారంలో ఎక్కడ కు వెళ్లినా అభిమానులతో సీఎం.. సీఎం.. అని పిలి పించుకున్న పవన్ ఇప్పుడు అందుకు భిన్నంగా మా ట్లాడటాన్ని వారు జీర్ణించుకోలేకపోతున్నారు. గతంలో వామపక్షాలతో జతకట్టిన పవన్ తాను వామపక్షవాదిని కాదని చెప్పడం చర్చకు దారితీస్తోంది. మొదట్లో విమర్శలు టీడీపీ, వైఎస్సార్సీపీకి వ్యతిరేకంగా జనసేన పార్టీ స్థాపించినట్లు మొదట్లో పవన్కల్యాణ్ చెప్పుకొచ్చా రు. చంద్రబాబు పోలవరం, అమరావతిలో రాజ ధాని పేరుతో సొంత సామాజికవర్గానికే దోచి పెడుతున్నాడని ఆరోపించారు. అమరావతిలో రాజధాని ఏర్పాటుకు అన్ని వేల ఎకరాలు అవసరం లేదంటూ ధ్వజమెత్తారు. రాజధాని నిర్మాణానికి ప్రధాని మోదీ పాచిపోయిన లడ్డూలు, పిడికెడు మట్టి ఇచ్చారంటూ భారతీయ జనతా పార్టీపై ఽసైతం విమర్శలు గుప్పించారు. కూటమిలో రచ్చకెక్కిన విభేదాలు తాడేపల్లిగూడెంలో జనసేన, టీడీపీ మధ్య వైరం ఇప్పటికే రచ్చకెక్కింది. మరోపక్క టీడీపీ ఎమ్మెల్యేలు గెలుపొందిన పాలకొల్లు, ఆచంట, ఉండి, తణుకులలో తమకు తగిన ప్రాధాన్యం లేదన్న నిరాశలో పార్టీ శ్రేణులు చాలా వరకు సైలెంటైపోయారు. పార్టీ కోసం జిల్లాలో కీలకంగా పనిచేసిన నేతలకు ప్రభుత్వంలో తగిన స్థానం దక్కలేదన్న అసంతృప్తి ఉంది. పవన్ సీఎం అయితే తమకు తగిన ప్రా తినిధ్యం లభిస్తుందని ఎదురుచూస్తున్న వారు ఎంతో మంది ఉన్నారు. గతంలో లోకేష్ను డిప్యూటీ సీఎం చేస్తారని ప్రచారం జరిగిన సందర్భంలో ప్ర భుత్వంలో పవన్కు ప్రాధాన్యత తగ్గుతుందని కేడర్ ఆందోళన చెందారు. సోషల్ మీడియా వేదికగా తమ గళం వినిపించారు. అప్పట్లో సోషల్ మీడి యాలో టీడీపీ, జనసేనలు పోటాపోటీగా పోస్టులు సైతం పెట్టుకున్నారు. ప్రభుత్వంలో తర్వాతి స్థానంలో ఉన్న పవన్ సీఎం అవుతారని ఎదురుచూస్తున్నారు. కాగా సీఎం కావాలని పార్టీ పెట్టలేదన్న పవన్ వ్యాఖ్యలు ఆయన అభిమానుల్ని ఆందోళనకు గురిచేస్తున్నాయి. ఈ మాటలు దేనికి సంకేతమనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. పార్టీ పెట్టింది సీఎం అయ్యేందుకు కాదా! సభల్లో సీఎం.. సీఎం.. అని పిలిపించుకుంది ఎందుకు ? పవన్కల్యాణ్ వ్యాఖ్యలపై జనసేన కేడర్లో నిర్వేదం కడదాకా టీడీపీకి కొమ్ము కాయాల్సిందేనా..? అసంతృప్తితో రగలిపోతున్న నేతలు -
ఉద్యాన విద్యకు క్రేజ్
● ఆకర్షిస్తున్న కోర్సులు ● ఉపాధికి, ఉద్యోగానికి ఢోకా లేదు ● విదేశీ విద్యార్థుల ఆసక్తి ఇంటర్మీడియట్ బైపీసీ చదివిన విద్యార్థులు ఈ కోర్సులో చేరవచ్చు. 31–12–2026 నాటికి వయస్సు 17 నుంచి 22 సంవత్సరాల మధ్య ఉండాలి. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 25 ఏళ్లు, దివ్యాంగులకు 27 ఏళ్ల వరకు వయోపరిమితి సడలింపు ఉంటుంది. వర్సిటీ పరిధిలో నాలుగు ప్రభుత్వ ఉద్యాన కళాశాలలు ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా వెంకట్రామన్నగూడెం కళాశాలలో 100 సీట్లు, అన్నమయ్య జిల్లా అనంతరాజుపేట కళాశాలలో 100 సీట్లు, వైఎస్ఆర్ జిల్లా పులివెందులలో 60 సీట్లు, పార్వతీపురం మన్యం జిల్లా పార్వతీపురం, నెల్లూరు జిల్లా చినలాటరిపి కళాశాలల్లో 50 సీట్ల చొప్పున ఉన్నాయి. వర్సిటీ అనుబంధ కళాశాలలైన అనంతపురంలోని శ్రీకృష్ణదేవరాయ కాలేజ్ ఆఫ్ హార్టికల్చరల్ సైన్సెస్, ప్రకాశం జిల్లా మార్కాపురం, చంద్రశేఖరపురంలోని కళాశాలల్లో కన్వీనర్ కోటా కింద 60 సీట్ల చొప్పున మొత్తం 180 సీట్లు అందుబాటులో ఉన్నాయి. ఈ సీట్లను ఏపీ ఈఏపీసెట్ మెరిట్ ప్రాతిపదికన భర్తీ చేస్తారు. హార్టికల్చర్ డిప్లొమా పూర్తి చేసిన విద్యార్థులకు 15 శాతం కోటా ఉంటుంది. దీని ద్వారా హార్టీసెట్ మెరిట్ ఆధారంగా యూనివర్సిటీ కళాశాలల్లో 54 సీట్లు, అనుబంధ కళాశాలల్లో 27 సీట్లు భర్తీ చేస్తారు. ఐసీఏఆర్ ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికై న వారికి 20 శాతం సీట్లు, స్టడీ ఇన్ ఇండియా పోర్టల్ ద్వారా విదేశీ విద్యార్థులకు 70 సీట్లు కేటాయిస్తారు. ఎన్ఆర్ఐ స్పాన్సర్షిప్ కోటాలో 47 సీట్లు, ఇండస్ట్రీ కోటాలో ఆరు సీట్లు ఉన్నాయి. రైతు కోటా కింద కనీసం ఒక ఎకరం పొలం కలిగిన వ్యవసాయ కుటుంబాల నుంచి వచ్చిన విద్యార్థులకు నిబంధనల మేరకు సీట్లు కేటాయిస్తారు. తాడేపల్లిగూడెం : పచ్చని ప్రకృతి ఒడిలో చదువుకోవాలని ఎవరికి మాత్రం ఉండదు? అచ్చంగా ఇలాంటి వాతావరణంలోనే తాడేపల్లిగూడెం పరిధిలోని వెంకట్రామన్నగూడెంలో ఉన్న డాక్టర్ వైఎస్సార్ ఉద్యాన విశ్వవిద్యాలయం విద్యార్థులకు చక్కని అవకాశాలను కల్పిస్తోంది. కొత్త విద్యాసంవత్సరం ప్రారంభం కానున్న నేపథ్యంలో, ప్రస్తుతం ఉద్యాన విద్యకు క్రేజ్ బాగా పెరిగింది. ఈ విద్యను అభ్యసిస్తే కొలువులకు కొదువ లేదు, ఉపాధికి బోలెడు అవకాశాలున్నాయి. డిమాండ్కు తగ్గట్టుగా మారుతున్న కోర్సులు విద్యార్థుల బంగారు భవితకు బాటలు వేస్తున్నాయి. దివంగత ముఖ్యమంత్రి డాక్టర్ వైఎస్సార్ మానస పుత్రికగా 2007లో దేశంలోనే రెండో విశ్వవిద్యాలయంగా ఇది ఊపిరి పోసుకుంది. ఐసీఏఆర్ పరిధిలో ఏ–గ్రేడ్ సాధించిన ఈ వర్సిటీ, 2026–27 విద్యాసంవత్సరానికి గాను పాలిటెక్నిక్, డిగ్రీ కోర్సులకు దరఖాస్తులను ఆహ్వానిస్తోంది. ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సు ఉద్యోగం, ఉపాధి, ఉన్నత విద్యకు చక్కని అవకాశం కల్పించే ఉద్యాన పాలిటెక్నిక్ కోర్సులో ప్రవేశానికి పదో తరగతి ఉత్తీర్ణులైన వారు, ఇంటర్ ఫెయిల్ అయిన విద్యార్థులు అర్హులు. 31–08–2026 నాటికి 15 నుంచి 22 ఏళ్ల లోపు వయస్సు కలిగి ఉండాలి. ఈ కోర్సు కాలపరిమితి రెండేళ్లు కాగా, బోధన పూర్తిగా ఇంగ్లీష్ మీడియంలో ఉంటుంది. వర్సిటీ పరిధిలోని నాలుగు ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలల్లో 200 సీట్లు, మూడు ప్రైవేటు కళాశాలల్లో 120 సీట్లు అందుబాటులో ఉన్నాయి. డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ జిల్లా రామచంద్రపురం, శ్రీ సత్యసాయి జిల్లా మడకశిర కళాశాలల్లో 60 సీట్ల చొప్పున ఉన్నాయి. ఏలూరు జిల్లా నూజివీడు, అన్నమయ్య జిల్లా కలికిరి, ప్రకాశం జిల్లా పొదిలి, పల్నాడు జిల్లా మద్దిరాల, నంద్యాల జిల్లా కోయిలకుంట్ల కళాశాలల్లో 40 సీట్ల చొప్పున కేటాయించారు. ఈ ఏడాది పాలిటెక్నిక్లో ల్యాండ్ స్కేపింగ్, నర్సరీ మేనేజ్మెంట్ కోర్సును రామచంద్రపురం, మడకశిర కళాశాలల్లో ప్రవేశపెట్టారు. ఈ ప్రత్యేక కోర్సు కోసం మొత్తం 50 సీట్లు కేటాయించారు. మెరిట్, రూల్ ఆఫ్ రిజర్వేషన్ ఆధారంగా ప్రవేశాలు కల్పిస్తారు. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి ఎరువులు, పురుగు మందుల కంపెనీలు, వివిధ ఉద్యాన పరిశ్రమల్లో మంచి ఉద్యోగ అవకాశాలు లభిస్తాయి. నాణ్యమైన విద్యాబోధన – వసతులు అనుభవజ్ఞులైన అధ్యాపకులు, శాస్త్రవేత్తలతో డిజిటల్ తరగతులు, అత్యాధునిక ప్రయోగశాలల ద్వారా ఇక్కడ నాణ్యమైన విద్యను అందిస్తున్నారు. ఐసీఏఆర్ ఆరవ డీన్స్ కమిటీ సిఫారసుల మేరకు ఇక్కడ పాఠ్యాంశాల బోధన జరుగుతుంది. చదువుతో పాటు ఆటలు, క్రీడలు, సెంట్రల్ లైబ్రరీ సౌకర్యాలు ఉన్నాయి. బాలురు, బాలికలకు వేర్వేరుగా సురక్షితమైన వసతి గృహాల (హాస్టల్) సదుపాయం కల్పించారు. విస్తృత ఉద్యోగావకాశాలు రాష్ట్ర సర్వీస్ కమిషన్ నిర్వహించే పరీక్షల ద్వారా అభ్యర్థులు మండల హార్టికల్చర్ ఆఫీసర్, హెచ్ఈఓ, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్ వంటి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించవచ్చు. ఐసీఏఆర్, డీఆర్డీఓ, స్పైసెస్ బోర్డు, కాఫీ బోర్డు, రబ్బర్ బోర్డు, టీ బోర్డులలో కూడా ఉద్యోగ అవకాశాలు ఉంటాయి. సివిల్ సర్వీసెస్ పరీక్షలు రాయాలనుకునే హార్టీకల్చర్ గ్రాడ్యుయేట్లు యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ ( ్ఖ్కఇ) పరీక్షలకు హాజరు కావచ్చు. ప్రైవేటు రంగంలో కొలువులతో పాటు, స్వయం ఉపాధి పొందేందుకు ఉద్యాన విద్య ఎంతగానో దోహదపడుతుంది. ఉద్యాన వర్సిటీ ముఖద్వారం ఉద్యాన విద్య అనేది యువత భవిష్యత్తుకు బాటలు వేసే అత్యంత ప్రాధాన్యత కలిగిన రంగం. పండ్లు, కూరగాయలు, పూలు, ఔషధ, సుగంధ పంటల ఉత్పత్తి ద్వారా దేశ ఆహార భద్రతకు, పోషకాహార లభ్యతకు, రైతుల ఆదాయ వృద్ధికి ఉద్యానరంగం ఎంతో కీలకంగా మారింది. ప్రభుత్వం రాయలసీమను హార్టికల్చర్ హబ్గా అభివృద్ధి చేస్తుండటంతో, ఉద్యాన విద్యార్థులకు ఉద్యోగాలతో పాటు స్వయం ఉపాధి, అగ్రి బిజినెస్, స్టార్టప్లు, ఎగుమతి రంగాలలో విస్తృత అవకాశాలు లభిస్తున్నాయి. భవిష్యత్తులో ఆర్థికంగా స్థిరపడుతూ సమాజానికి సేవ చేయాలనుకునే యువత ఉద్యాన విద్యను ఎంచుకోవాలి. – డాక్టర్ కె.ధనుంజయరావు, వీసీ, ఉద్యాన విశ్వవిద్యాలయం, వెంకట్రామన్నగూడెం -
ఆర్టీసీ ఉద్యోగుల ధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీఎస్ఆర్టీసీ ఎలక్ట్రికల్ బస్సులను కొనుగోలు చేసి, ఆర్టీసీ ద్వారానే ని ర్వహించాలని, పీఆర్సీ కమిషన్ ఏర్పాటు, మధ్యంతర భృతి, సమస్యల పరిష్కారం కోరుతూ శనివారం ఏలూరు ఆర్టీసీ గ్యారేజీ వద్ద ఏపీపీటీడీ ఎంప్లాయీస్ యూనియన్ ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు. సంఘ ఏలూరు డిపో కార్యదర్శి డి.ఆంజనేయులు, రీజియన్ కార్యదర్శి బి.రాంబాబు, ఏఐటీయూసీ జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు మాట్లాడుతూ ఎలక్ట్రికల్ బస్సులను ఆర్టీసీ నడపాలని, ప్రైవేట్ ఏజెన్సీలకు అప్పగించవద్దని డిమాండ్ చేశారు. కాలం చెల్లిన బస్సుల స్థానే కొత్త బస్సులను కొనుగోలు చేయాలని కోరారు. సీ్త్రశక్తి పథకం వల్ల ఉద్యోగ, సిబ్బంది ఎదుర్కొంటున్న ఇబ్బందులను తొలగించాలని, 11వ పీఆర్సీ బకాయిలు, పెండింగ్ డీఏలు చెల్లించాలని డిమాండ్ చేశారు. అలాగే పలు పలు సమస్యల పరిష్కారానికి ఆర్టీసీ యాజమాన్యం చర్యలు చేపట్టాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు డిపో గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, రీజనల్ కోశాధికారి జి.భాస్కర్, డిపో ఆర్గనైజింగ్ కార్యదర్శి పి.శ్రీహరి, ఎస్.ధనుంజయ తదితరులు పాల్గొన్నారు. -
మామిడి రైతు గుండెలధర
ఆదివారం శ్రీ 17 శ్రీ మే శ్రీ 2026నూజివీడు: పండ్లలో రారాజుగా పిలుచుకునే మా మిడిని సాగుచేసే రైతుల పరిస్థితి దయనీయంగా తయారైంది. ఈ ఏడాది దిగుబడి తక్కువగా ఉన్న నేపథ్యంలో ధర ఎక్కువగా ఉంటుందని భావించిన రైతుల ఆశలు అడియాశలవుతున్నాయి. మామిడి కాయలకు గిట్టుబాటు ధర లభించక, పెట్టిన పెట్టుబడి రాక రైతులు నష్టాల పాలవుతున్నారు. నూజివీడు డివిజన్ వ్యాప్తంగా 40 వేల ఎకరాల్లో ఉన్న మామిడి తోటలకు చెందిన రైతుల దుస్థితి దయనీయంగా తయారైంది. 25 వేల ఎకరాల్లో బంగినపల్లి రకం, 10 వేల ఎకరాల్లో కలెక్టర్ రకం, మిగిలిన 5 వేల ఎకరాల్లో చిన్నరసాలు, ఇతర రకాలు సాగవుతున్నాయి. డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా విలసిల్లుతున్న మామిడి గత కొన్నేళ్లుగా నష్టాలను పంచుతోంది. రెండేళ్లుగా అయితే పరిస్థితులు దా రుణంగా తయారయ్యాయి. అయినా ప్రభుత్వం ఏమాత్రం రైతులను పట్టించుకోవడం లేదు. పూత దశలోనే కుదేలై.. ఈ ఏడాది బంగినపల్లి, కలెక్టర్ రకాల్లో పూత బాగా వచ్చినా పిందె కట్టే దశలో నల్లతామర తెగులు ఆ శించడం, ప్రతికూల వాతావరణం వల్ల ఆశించిన స్థాయిలో పిందె కట్టకుండా పూతంతా రాలిపోయింది. దీంతో దిగుబడి పూర్తిగా పడిపోయింది. రైతులు పూత, పిందె నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు వరకు రసాయన మందులు పిచికారీ చేసినా లాభం లేకుండా పోయింది. రోజురోజుకూ ధరల పతనం మామిడి సీజన్ ప్రారంభమైన ఫిబ్రవరి ద్వితీయార్థంలో మామిడికి ధరలు మెరుగ్గా ఉన్నా రానురాను పతనమవుతున్నాయి. బంగినపల్లి రకానికి ప్రారంభంలో ముంబై మార్కెట్లో టన్నుకి రూ.1.20 లక్షలు సైతం ధర లభించింది. అది క్రమేణా పడిపోయి చివరకు రూ.40 వేలకు చేరగా ప్రస్తుతం కాయలు బాగుంటే టన్ను రూ.25 వేలు మాత్రమే లభిస్తోంది. స్థానిక మార్కెట్ల్లో టన్నుకి రూ.12 వేల నుంచి రూ.18 వేలు మాత్రమే లభిస్తోంది. దీనికి మరలా టన్నుకు వంద కిలోల కాయలను సూట్ పేరుతో తీసేస్తున్నారు. పది టన్నులు తీసుకెళ్తే టన్ను కాయలు సూట్ పేరుతో దోచుకుంటున్నారు. దీనికి తోడు కమీషన్ పేరుతో కూడా రైతులను దోచుకోవడంతో మామిడి రైతులకు కోత ఖర్చులు, కిరాయిలు రాని పరిస్థితి. వేలాది మంది రైతులు ఆధారపడిన మామిడి నష్టాలను పంచుతున్నా పాలకులు పట్టించుకోవడం లేదు. తామంటేనే ప్రభుత్వానికి అలుసుగా తయారైందని మామిడి రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైతు శ్రేయస్సే లక్ష్యమంటూ చెప్పే ప్రకటనలు పత్రికలకు పరిమితమవుతున్నాయే గాని క్షేత్రస్థాయిలో తమను పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. మామిడి.. ధర తడబడి మరింత దిగజారిన ధరలు బంగినపల్లి టన్ను రూ.12 వేల నుంచి రూ.18 వేలు కలెక్టర్ రకం టన్ను రూ.3,500 లబోదిబోమంటున్న రైతులు నాకు 14 ఎకరాలు మామిడి తోట ఉండగా గతేడాది రూ.4 లక్షల నష్టం వచ్చింది. దీంతో ఏడెకరాల్లో చెట్లు నరికించేసి అందులో ఆయిల్పామ్ వేశా. ఈ ఏడాది కూడా రూ.2 లక్షల నష్టం వచ్చింది. దీంతో మిగిలిన ఏడెకరాల్లోని మామిడి చెట్లు తొలగించి అందులో కూడా ఆయిల్పామ్ వేస్తా. మామిడిపై స్థిరమైన ఆదాయం రావడం లేదు. – లావు ధనకోటేశ్వరావు, కొత్తరావిచర్ల, నూజివీడు మండలం తోతాపురి కాయలు కొనేవాళ్లే కనిపించడం లేదు. టన్ను రూ. 3,500 అంటే కోత కూ లి, కిరాయిలు కూడా రావు. కోత కోసే బదులు తోటల్లోనే వదిలేస్తే ఖర్చులు అయినా మిగులుతాయి. ఇంత దారుణమైన పరిస్థితులు ఎ ప్పుడూ చూడలేదు. ఆదాయం రాక చాలా మంది రైతులు తోటలు తీసేస్తున్నారు. – పెద్దగమళ్ల ఆదినారాయణ, నూజివీడు -
మంచి పాలన అంటే కూల్చడమేనా?
● ఉండిలో రఘురామ రాక్షసరాజ్యం ● సీపీఎం రాష్ట్ర కార్యదర్శి శ్రీనివాసరావు ఉండి: ఉండి నియోజకవర్గంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు నేతృత్వంలో బుల్డోజర్, రాక్షస రాజ్యం నడుస్తోందని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు ఆరోపించారు. ఉండి మండలం ఉణుదుర్రు, సాగుపాడు గ్రామాల్లో అధికారులు అక్రమంగా కూల్చివేసిన ఇళ్ల బాధితులను శుక్రవారం ఆయన పరామర్శించారు. నివాసాలు కోల్పోయి రోడ్డున పడ్డ మహిళల బాధలను అడిగి తెలుసుకున్నారు. మహిళలు కన్నీటి పర్యంతమవుతుంటే వారిని ఓదార్చారు. ఈ సందర్భంగా శ్రీనివాసరావు మాట్లాడుతూ.. కొందరు భూస్వాముల స్వార్థం కోసం పోలీసుల అండతో 84 కుటుంబాలకు చెందిన 71 ఇళ్లను, ఆలయాలను తెల్లవారుజామున బుల్డోజర్లతో కూల్చి వేయడం అత్యంత దుర్మార్గమన్నారు. ఇంట్లోని సామాగ్రిని కూడా బయటకు తెచ్చుకోనివ్వకుండా అధికారులు నిరంకుశంగా వ్యవహరించారని మండిపడ్డారు. భూస్వాముల ఇళ్లు, గెస్ట్హౌస్లను వదిలేసి, పేదల ఇళ్లను మాత్రమే కూల్చడం వెనుక ఉన్న ఉద్దేశం ఏమిటని ప్రశ్నించారు. బాధితులకు సీపీఎం తరపున తాత్కాలిక పునరావాసం కల్పిస్తామని హామీ ఇచ్చారు. కూల్చివేతలకు నోటీసులు ఇచ్చి చేతులు దులుపుకుంటే సరిపోదని, నివాసయోగ్యం కాని చోట సెంటున్నర భూమి ఇస్తే న్యాయం జరిగినట్టు కాదని హితవు పలికారు. ప్రభుత్వం ఎన్నికల వాగ్దానం ప్రకారం బాధితులకు 3 సెంట్ల భూమి, ఇల్లు కట్టుకోవడానికి రూ.5 లక్షల నగదు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఉండి నియోజకవర్గంలో పేదలకు జరుగుతున్న అన్యాయంపై పెద్ద ఎత్తున పోరాడతామని అన్నారు. నియోజకవర్గంలో బుల్డోజర్, రఘురామ రాక్షస పాలన సాగనివ్వబోమని పేదల పక్షాన ఉద్యమిస్తామని అన్నారు. కలెక్టర్, ఎస్పీలు చట్టవిరుద్ధమైన చర్యలను చూస్తూ మౌనంగా ఉండటం దారుణమన్నారు. పేదలకు న్యాయం జరిగే వరకు సీపీఎం ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున ఉద్యమిస్తామని స్పష్టం చేశారు. ఈ పర్యటనలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, వాసుదేవరావు, నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. కార్యక్రమంలో సీపీఎం జిల్లా కార్యదర్శి జేఎన్వీ గోపాలన్, జిల్లా కార్యదర్శివర్గ సభ్యుడు వాసుదేవరావు, కర్రి నాగేశ్వరరావు, ధనికొండ శ్రీనివాస్, జుత్తిగ నర్సింహమూర్తి, జక్కంపూడి సత్యనారాయణ, కేవీపీ జిల్లా కార్యదర్శి క్రాంతి తదితరులు పాల్గొన్నారు. -
ఎస్.కొండేపాడు బాధితులకు వాసుబాబు పరామర్శ
గణపవరం: గణపవరం మండలం ఎస్. కొండేపాడు గ్రామంలో రెండు రోజుల క్రితం కలుషిత మైదాపిండితో వేసిన బజ్జీలు తిని తీవ్ర అస్వస్థతకు గురైన బాధితులను శుక్రవారం ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్ సీపీ పీఏసీ సభ్యుడు పుప్పాల వాసుబాబు పరామర్శించారు. భీమవరంలోని వివిధ ప్రైవేటు ఆస్పత్రులలో చికిత్స పొందుతున్న వారి వద్దకు వెళ్లి వారి ఆరోగ్య పరిస్థితిని అడిగి తెలుసుకున్నారు. బాఽధితుల ఆరోగ్య పరిస్థితిపై వైద్యులతో చర్చించారు. బాధితులంతా పూర్తిగా కోలుకునే వరకూ వైద్యం అందించాలని ఆయన వైద్యులను కోరారు. ఏ అవసరం వచ్చినా తనకు తెలియజేయాలని, అవసరమైన సహాయ సహకారాలు అందిస్తానని బాధితులకు భరోసా ఇచ్చారు. వాసుబాబు వెంట గణపవరం ఎంపీపీ అర్థవరం రాము, మండల వైఎస్సార్ సీపీ కన్వీనర్ దండు రాము, వైఎస్సార్ సీపీ మండల యూత్ అధ్యక్షుడు కొట్టు నరేష్, కొందేపాడు మాజీ సర్పంచ్ తోట సత్యనారాయణ, వైఎస్సార్ సీపీ కొండేపాడు గ్రామ అధ్యక్షుడు గంగుమోలు సూరిబాబు తదితరులు ఉన్నారు. ఉంగుటూరు : మండలంలోని బాదంపూడిలో ఉండ్రాజవరపు గంగ ఇంట్లో దొంగతనానికి పాల్పడిన కేసులో నిందితుడు తాడేపల్లిగూడేనికి చెందిన బొగత శివకు ఏడాది జైలు, 2వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం అడిషనల్ జ్యుడిషియల్ ఫస్టు క్లాస్ మెజిస్ట్రేట్ కె.లలిత తీర్పు శుక్రవారం వెలువరించినట్లు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ తెలిపారు. 6–7–2025న ఉండ్రాజవరపు గంగ వరంగల్ వెళ్లగా ఎవరు ఇంట్లో లేకపోవడం చూసి తాళాలు బద్దలు కొట్టి బీరువాలో బంగారపు మంగళ సూత్రాలు 4 గ్రామలు, బంగారు కాయిన్ 2 గ్రాములు, ఒక వెండి గ్లాసును శివ దొంగలించాడు. దీంతో ఎస్సై సూర్యభగవానన్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేసి నిందితుడిని కోర్టులో హజరపరిచారు. నేరం రుజువు కావడంతో నిందితుడికి శిక్ష వేశారు. -
సేంద్రియ వ్యవసాయ పద్ధతులు ఎంతో మేలు
చింతలపూడి: ప్రస్తుత రోజుల్లో రైతులు తక్కువ విస్తీర్ణంలో ఎక్కువ పంటను పండించడానికి విచక్షణారహితంగా రసాయన ఎరువులు వాడుతున్నారు. ఫలితంగా భూముల్లో పంటలకు కావలసిన పోషకాలు అందుబాటులో లేక సమతుల్యత లోపించి ముందెన్నడూ లేని విధంగా ద్వితీయ సూక్ష్మ పోషక లోపాలు పంటల్లో కనిపిస్తుంది. ఈ పోషకాలు లోపించినప్పుడు సాగులో మిగతా యాజమాన్య పద్ధతులన్నీ సక్రమంగా పాటించకపోయినా దిగుబడులు తగ్గుతాయి. వీటిని అధిగమించడానికి సేంద్రియ వ్యవసాయ పద్ధతులు మేలని వ్యవసాయ సహాయ సంచాలకులు వై.సుబ్బారావు సూచిస్తున్నారు. చింతలపూడి సబ్డివిజన్ పరిధిలో ఏటా ఖరీఫ్ సీజన్లో 35,542 ఎకరాల్లో వరి పంటను సాగు చేస్తుంటారు. ఇవి కాక 340 ఎకరాల్లో మొక్కజొన్న, 157 ఎకరాల్లో వేరుశనగ పంటలు పండిస్తారు. రబీ సీజన్లో సుమారు 1,500 హెక్టారుల్లో వరి, 18,000 హెక్టారుల్లో మొక్కజొన్న, 2, 500 హెక్టారుల్లో వేరుశెనగ పంటలను రైతులు సాగు చేస్తుంటారు. ఎరువుగా జిప్సం జిప్సంలో 24 శాతం కాల్షియం, 18 శాతం గంధకం ఉంటుంది. కాల్షియం, గంధకం మొక్కల పెరుగుదలకు అవసరమైన ద్వితీయ శ్రేణి పోషకాలను అత్యంత చౌకగా జిప్సం ద్వార అందించవచ్చు. ముఖ్యంగా నూనె గింజలు, పప్పు ధాన్యాల వంటి పంటల్లో గంధకం ఆవశ్యకత అధికంగా ఉంటుంది. కాల్షియం మొక్కల్లోని జీవకణాల అంచులు గట్టిగా ఉండటానికి, కణ విభజనకు, వేర్ల అభివద్ధికి గింజకట్టడానికి అవసరమవుతుంది. దీని వల్ల మొక్కలకు చీడపీడలను ఎదుర్కొనే శక్తి సమకూరుతుంది. వేరుశనగలో ఇలా వేరుశనగ పంటలో అధిక దిగుబడులకు జిప్సంను పూత దశలో వేసుకుని భూముల్లో కలియ బెట్టడం వల్ల వేరుశనగ ఊడలు జిప్సంలోని కాల్షియం, గంధకాన్ని తీసుకుని అధిక దిగుబడులు వస్తాయి. వేరుశెనగలో జిప్సం వినియోగం వల్ల కాయలు గట్టిగా ఉండి కాయ నిండా పప్పు వద్ధి చెంది గింజల్లో అధిక నూనె శాతం కలిగి ఉంటుంది. ఫలితంగా కాయలు అధిక బరువు కలిగి మంచి ధర పలుకుతాయి. కాబట్టి పూత సమయంలో ఎకరాకు 200 కిలోల చొప్పున భూమిలో తగిన తేమ ఉన్నప్పుడు మొక్కలకు దగ్గరగా వేసుకోవాలి. బీడు ,చౌడు భూముల్లో నీరు సరిగా ఇంకదు. గాలి ప్రసరణ తక్కువగా ఉంటుంది. భూమి భౌతిక లక్షణాలు క్షీణించి ఉంటాయి. ఈ పరిస్థితుల్లో మొక్కల వేర్లు సరిగా వద్ధి చెందక మొక్కల్లో ఎదుగుదల ఉండదు. ఇలాంటి భూముల్లో జిప్సం వినియోగంవల్ల నేల గుల్లబారి భూమిలో నీరు ఇంకే స్వభావం పెరిగి మొక్కల వేర్లు బాగా వృద్ధి చెందుతాయి. పంట దిగుబడి గణనీయంగా పెరుగుతుంది. – వై సుబ్బారావు, చింతలపూడి వ్యవసాయ సబ్డివిజన్ ఏడీఏ పాడి–పంట -
గూడెంపై ఏసీబీ డేగకన్ను
సాక్షి టాస్క్ఫోర్స్: తాడేపల్లిగూడెం నియోజకవర్గంపై ఏసీబీ డేగకన్ను వేసిందా? గురువారం నాటి ఏసీబీ దాడితో దాడులు ఆగుతాయా? ఇది ప్రస్తుతం నియోజకవర్గంలో జరుగుతున్న చర్చ. గత రెండేళ్లుగా నియోజకవర్గంలోని అధికారులు కొందరు అవినీతి విషయంలో చురుగ్గా ఉన్నట్టు విమర్శలున్నాయి. మున్సిపాలిటీలో సర్వేయర్ రౌతు రామకృష్ణ, తాజాగా గురువారం పట్టణ ఎస్ఐ నాగరాజు, బాలకృష్ణలపై ఏసీబీ దాడులతో రానున్న నెలల్లో మరిన్ని అవినీతి జలగలను పట్టే అవకాశాలున్నట్టు విస్తృతంగా చర్చ నడుస్తోంది. బియ్యం అక్రమ రవాణాకు అడ్డుకట్ట పడటంలేదు. పౌరసరఫరాల శాఖ అధికారులు, విజిలెన్స్ అధికారులు దాడులు చేస్తున్నా, లారీల అక్రమ తరలింపునకు బ్రేక్ పడటంలేదు. మున్సిపాలిటీలో కొన్ని సంవత్సరాలుగా ప్రత్యేకాధికారుల పాలన సాగుతోంది. దీంతో వచ్చిన అధికారగణం ఇష్టారాజ్యం సాగుతోంది. అధికార కేంద్రాలను ప్రసన్నం చేసుకుంటే చాలు, ఇక్కడ మన రాజ్యమే అన్నట్టుగా వ్యవహారాలున్నట్టుగా ప్రచారం ఉంది. తాజాగా మున్సిపాలిటీలో సామాజిక జాడ్యం కూడా వేళ్లూనుకున్నట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో సుపీరియారిటీ కాంప్లెక్స్ పద్ధతిలో వర్గాలుగా అధికారులు విడిపోయినట్టుగా చెబుతున్నారు. దూకుడుగా ఏసీబీ అధికారులు నియోజకవర్గానికి సుపరిచితుడుగా ఉన్న పట్టణ సర్వేయర్ రామకృష్ణపై ఏసీబీ దాడి చేసినట్టు దాడి అనంతర పరిణామాలు తేటతెల్లం చేస్తున్నాయి. తాజాగా గురువారం పట్టణ ఎస్ఐ నాగరాజు, కానిస్టేబుల్ బాలకృష్ణల ఉదంతంలో అవినీతి కోణం కన్నా, వ్యక్తిగత ప్రాబల్యాల నేపథ్యంలో దాడి జరిగినట్టుగా తెలుస్తోంది. దాడులు ఇకపై కొనసాగవచ్చని, నియోజకవర్గంలో ఆరుగురు అవినీతి అధికారుల వివరాల సేకరణలో ఏసీబీ దూకుడుగా ఉన్నట్టుగా సమాచారం. నాగరాజుపై దాడి చేయడానికి గాను 72 గంటల పాటు ఏసీబీ అధికారులు గూడెంలో మకాం వేసి, రెడ్ హ్యాండెడ్గా ఎస్సైను, కానిస్టేబుల్ను పట్టుకున్నట్టుగా తెలుస్తోంది. పట్టణ పోలీస్ స్టేషన్ కొన్ని సంవత్సరాలుగా వార్తల్లో ఉంది. ఇక్కడ రాష్ట్రంలో ఒక పోలీసు ఉన్నతాధికారికి బంధువుగా ఉన్న సిబ్బంది ఒకరి నేతృత్వంలోనే వ్యవహారాలు సాగినట్టు కలరింగ్ ఇచ్చారు. అధికారుల బదిలీలు, చేర్పులు, మార్పుల నేపథ్యంలో ఒక వ్యక్తిని హోల్డ్లో ఉంచినట్టుగా తెలుస్తోంది. శ్రీచైతన్యశ్రీవంతుడైన వసూలుదారుడు ఒకరు ఇద్దరు అధికారులకు కలెక్షన్ ఏజెంట్గా వ్యవహరించినట్టుగా బాహాటంగానే చెబుతున్నారు. వాస్తవానికి గురువారం జరిగిన ఏసీబీ దాడిలో కలెక్షన్ ఏజెంట్ బుక్ కావాల్సి ఉండగా, ట్రాప్లో బాలకృష్ణ పడినట్టు సమాచారం. మున్సిపాలిటీలో సర్వేయర్ను ట్రాప్ చేసి వాయిస్ రికార్డింగ్ ఆధారంగా మాత్రమే అదుపులోకి తీసుకొని అరెస్టు చేశారు. తర్వాత కొందరి పోద్బలంతో జరిగిన ట్రాప్ అని తేలింది. తాజా ఉదంతంలో కూడా ప్రేమజంట వ్యవహారంలో ఎస్ఐ వాయిస్ రికార్డింగ్ క్రియాశీలక భూమిక పోషించినట్టుగా తెలుస్తోంది. పట్టణంలో ఒక వ్యాపారికి సంబంధించి కుటుంబ వ్యవహారంలో వరకట్న వేధింపుల కేసును కాస్తా, హత్యాయత్నం కేసుగా నమోదు చేయించేందుకు గాను ఒక ప్రజాసంఘ నేత ద్వారా పట్టణ పోలీసులు కొందరితో సంప్రదింపులు సాగించినట్టుగా తెలుస్తోంది. హిట్ జాబితాలో ఆరుగురు అధికారులునియోజకవర్గంలో ఒక రెవెన్యూ అధికారి అక్రమ రేషన్ వ్యవహారంలో చురుగ్గా ఉన్నట్టు, ఈ క్రమంలో ఫొటోగ్రాఫర్ నేనున్నా, ఎవ్వరు నిన్ను టచ్ చేస్తారో నే చూసుకుంటా అనే భరోసా ఇచ్చినట్లు సమాచారం. వారసత్వపు ఆస్తులు, మాస్టర్ప్లాన్లు, టీడీఆర్ బాండ్లు వంటి విషయాలలో ముగ్గురు మున్సిపాలిటీ అధికారుల వ్యవహార శైలి, తదనంతర వ్యవహారాలపై ఏసీబీకి సమాచారం ఉన్నట్టుగా తెలుస్తోంది. ఒకరు సామాజిక కార్డు బలంతో నెట్టుకొస్తున్నట్టు ప్రచారం ఉంది. ఇంకొకరు సైలెంట్గా వ్యవహారాలు జరపడంలో నిష్ణాతుడంటున్నారు. ఇలాంటి ఆరుగురు వ్యక్తులకు చెందిన సమాచార సేకరణలో ఏసీబీ అధికారులు ఉన్నట్టుగా విశ్వసనీయ వర్గాల సమాచారం. -
కోకో గింజల ధర పెంచాలి
దెందులూరు: అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని, విదేశీ కోకో గింజల దిగుమతులు వెంటనే నిలుపుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం పెదవేగి మండలం విజయరాయి గాంధీనగర్ సీతారామ కల్యాణమండపంలో ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం ఆధ్వర్యంలో కోకో రైతుల సమావేశం నిర్వహించారు. రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అధ్యక్షత నిర్వహించిన సమావేశంలో కోకో రైతుల సమస్యలపై చర్చించి పలు తీర్మానాలు ఆమోదించారు. ఈ సందర్భంగా కె.శ్రీనివాస్ మాట్లాడుతూ అన్సీజన్ వర్షాకాలపు గింజలకు కిలోకు రూ.350 ధర ఇచ్చి కంపెనీలు కొనుగోలు చేశాయని, అత్యంత నాణ్యత కలిగిన సీజన్ గింజలకు ప్రస్తుతం కంపెనీలు కిలోకు రూ.300 మాత్రమే ధర ఇస్తున్నాయని చెప్పారు. ప్రస్తుతం అంతర్జాతీయ మార్కెట్ ధర ప్రకారం కిలో గింజలకు రూ.400 ఉందని, దిగుమతి సుంకాలతో అధర రూ.600 పైగా ఉంటుందని చెప్పారు. అంతర్జాతీయ మార్కెట్ ధర తగ్గినప్పుడు కోకో గింజలకు ధర తగ్గించిన కంపెనీలు పెరిగినప్పుడు ఎందుకు పెంచడం లేదు? అని ప్రశ్నించారు. కేంద్ర,రాష్ట్ర ప్రభుత్వాలు కూడా ఏమీ మాట్లాడకపోవడం అన్యాయమన్నారు. రాష్ట్ర ప్రభుత్వం వెంటనే కోకో రైతుల సంఘం, కోకో రైతులు, ఆయా కంపెనీల ప్రతినిధులతో జాయింట్ సమావేశం వెంటనే జరిపి అంతర్జాతీయ మార్కెట్ ధరలకు అనుగుణంగా కోకో గింజలకు ధర కల్పించాలని డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ కోకో రైతుల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు పానుగంటి అచ్యుతరామయ్య (అశోక్), రాష్ట్ర సహాయ కార్యదర్శి గుదిబండి వీరారెడ్డి, రాష్ట్ర కమిటీ సభ్యులు కోనేరు సతీష్ బాబు,కూసం రామిరెడ్డి, ఆలపాటి శ్రీనివాసరావు, ప్రాంతీయ కొబ్బరి రైతుల సంఘం ఉపాధ్యక్షుడు మున్నంగి సుబ్బారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
పేకాడుతున్న 9 మంది అరెస్టు
మండవల్లి: మండలంలోని దెయ్యంపాడులో నిర్వహిస్తున్న పేకాట శిబిరంపై శుక్రవారం ఎస్సై రామచంద్రరావు తన సిబ్బందితో దాడి చేశారు. ముందస్తు సమాచారం మేరకు చేసిన దాడిలో పేకాడుతున్న 9 మందిని అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి రూ.49 వేలు స్వాధీనం చేసుకున్నారు. అలాగే 9 సెల్ ఫోన్లు సీజ్ చేశారు. ఈ మేరకు పోలీసులు కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నారు. పాలకొల్లు సెంట్రల్: పట్టణంలో యడ్లబ బజారు, రామయ్యహాలు ప్రాంతాల్లో ఉన్న డంపింగ్ యార్డుల్లో పొగ వస్తుందని ఫిర్యాదులు రావడంతో ఏలూరు పర్యావరణ శాఖ ఇంజనీర్ రామచంద్రమూర్తి విచారణకు వచ్చారు. ఈ సందర్భంగా రామచంద్రమూర్తి డంపింగ్ యార్డు తనిఖీ చేసి, మునిసిపల్ అధికారులకు నోటీసులు జారీ చేశారు. -
జీడి.. మద్దతు కొరవడి
● జీడిపిక్కల కొనుగోలుకు ప్రభుత్వం వెనుకంజ ● దళారుల గుప్పిట్లో గిరిజన రైతులు ● గిట్టుబాటు ధర రాక ఇళ్లలోనే నిల్వ బుట్టాయగూడెం: అమాయక గిరిజన రైతులు దళారులు చేతుల్లో చిక్కుకుంటున్నారు. ఆరుగాలం శ్రమించి సాగు చేసిన పంటకు కనీసం గిట్టుబాటు ధర లభించకపోవడంతో ఆ పంటలను తక్కువ ధరలకే అమ్ముకుంటున్నారు. ఈ ఏడాది చంద్రబాబు ప్రభుత్వం జీడిమామిడి పంటకు గిట్టుబాటు ధర కల్పించకపోవడంతో దళారులు చేతుల్లో గిరిజన రైతులు నిలువునా మోసపోతున్నారు. దళారుల దందా తెలిసినా ప్రభుత్వాధికారులు మిన్నకుండిపోవడం శోచనీయం. మన్యంలో 1,100 మందికి పైగా రైతులు గిరిజన ప్రాంతంలోని బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, పోలవరం, కుక్కునూరు, వేలేరుపాడు మండలాల పరిధిలో సుమారు 11 వందల మందికి పైగా గిరిజన రైతులు సుయారు 2 వేల ఎకరాల్లో జీడిమామిడి పంటలను పండిస్తున్నారు. ప్రతిఏటా ఆరువేల టన్నులు వరకు జీడిమామిడి పిక్కల దిగుబడి వస్తుంది. సగటున 160 కిలోల దిగుబడి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిరిజన ప్రాతంలో పండించే జీడి పిక్కలకు మార్కెట్లో మంచి డిమాండ్ ఉంటుంది. గిరిజన ప్రాంతంలో సేకరించే జీడిమామిడి పప్పు బయట పప్పుకంటే ఎంతో రుచిగా ఉంటుంది. అందుకే ఇక్కడి పప్పు కొనుగోలు చేసేందుకు బయట వ్యాపారులు ఎగబడతారు. ఎక్కడా కనిపించని కొనుగోలు కేంద్రాలు గిరిజనులు పండించిన జీడిమామిడి పంట అమ్మకోవడానికి ఈ ప్రాంతంలో ఎక్కడా కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేసిన దాఖలాలు లేవు. దీంతో దళారులే గ్రామస్థాయిలో విక్రయాలు చేస్తుంటారు. ఈ ఏడాది ప్రారంభంలో కిలో రూ.170కి వ్యాపారులు జీడిమామిడి పిక్కలు కొనుగోలు చేశారు. తర్వాత కిలో రూ.150 నుంచి ప్రస్తుతం కిలో రూ. 140 కి కొనుగోలు చేస్తున్నట్లు గిరిజన రైతులు చెబుతున్నారు. దీని వల తీవ్రంగా నష్ట పోతున్నామని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కొంత మంది బయట నుంచి వచ్చిన వ్యాపారులు సిడికెట్గా ఏర్పడి ధరను పతనం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. గిట్టుబాటు ధర కోసం రైతుల విజ్ఞప్తి గిరిజన ప్రాంతంలో ప్రధానంగా ఉద్యాన తోటలో జీడిమామిడి పంటల సాగు చేస్తుంటారు. ఐటీడీఏ ద్వారా ఉద్యానవన శాఖ పంటల సాగుకు ప్రోత్సహిస్తుంది. అయితే గిరిజనులు పండించిన పంటలను అమ్ముకునే సమయంలో మాత్రం పట్టించుకునే నాథుడే లేరని గిరిజన రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పంట అమ్ముకోవడానికి కోనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయాలని గిరిజన రైతులు కోరుతున్నారు. అలాగే తాము పండించిన పంటకు క్వింటాకు రూ.20 వేలు ధర కల్పించాలని రైతులు కోరుతున్నారు. గిరిజన ప్రాంతంలో గిరిజనలు ప్రతిసీజన్లో జీడిమామిడి పంటను అమ్ముకోవడాకి కొనుగోలు కేంద్రా ఏర్పాటు చేయకపోవడం అన్యాయం. ప్రభుత్వం, అధికారులు కనీసం పట్టించుకోకపోడం వల్ల గిరిజనులు దళారు చేతిలో మోసపోతున్నారు. ఐటీడీఏ అధికారులు పట్టించుకుని కనీసం జీసీసీ ద్వార నైనా జీడిపిక్కలను కొనుగోలు చేసే విధంగా కృషి చేయాలి. – కారం రాఘవ, సీపీఐఎంఎల్ న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు, అలివేరు -
పెట్రో మంట
జీడి.. మద్దతు కొరవడి ఈ ఏడాది ప్రభుత్వం జీడిమామిడి పంటకు గిటుబాటు ధర కల్పించకపోవడంతో దళారులు చేతుల్లో గిరిజన రైతులు మోసపోతున్నారు. 8లో uశనివారం శ్రీ 16 శ్రీ మే శ్రీ 2026పశ్చిమాసియా కల్లోలంతో చమురు ధరలు సెగలు పుట్టిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం పెట్రోల్, డీజిల్ ధరలు పెంచడంతో సామాన్యుడికి మళ్లీ కష్టాలు తప్పడం లేదు. సాధారణ, మధ్య తరగతి ప్రజల నెలవారీ ఖర్చులపై పెట్రోభారం భారీగానే ఉండనుంది. ఇప్పటికే గ్యాస్ ధరలకు రెక్కలు రాగా శుక్రవారం నుంచి పెట్రోల్పై లీటరుకు రూ.3.29, డీజిల్కు రూ.3.14 చొప్పున పెరిగాయి. దీంతో లీటరు పెట్రోల్ రూ.113.12కు, డీజిల్ రూ.100.78 చేరాయి. ఈ మేరకు జిల్లాలోని వినియోగదారులపై రోజుకు రూ. 18.75 లక్షల అదనపు భారం పడుతుందని అంచనా. ఏలూరు (ఆర్ఆర్పేట): నెలల తరబడి సాగుతున్న అమెరికా– ఇరానన్ యుద్ధం అంతర్జాతీయంగా ముడిచమురు ధరలపై తీవ్ర ప్రభావం చూపుతోంది. మార్చి రెండో వారంలో గ్యాస్ ధరలను కేంద్ర ప్రభుత్వం పెంచింది. డొమెస్టిక్ సిలెండర్ రూ.892 నుంచి రూ.952కు, వాణిజ్య సిలెండర్ రూ.1850.50 నుంచి రూ. 2177కు పెరిగాయి. రెండు నెలలు తిరగకుండానే వాణిజ్య సిలెండర్ ధరను రూ.3,170కు పెంచింది. సామాన్యులకు సెగ : మార్కెట్లో నిత్యావసర వస్తువుల ధరలు మండిపోతున్నాయి. కంది, మినుము, పెసరపప్పులు నాణ్యత రకాన్ని బట్టి కిలో రూ.125 నుంచి రూ.135 వరకు ఉన్నాయి. పామాయిల్ ప్యాకెట్ రూ.140 వరకు ఉండగా, సన్ఫ్లవర్, వేరుశనగ, బ్రాన్ ఇతర ఆయిల్ ధరలు రూ.150 నుంచి రూ.200 పైగా పలుకుతున్నాయి. నిత్యావసర సరుకులు లేనిదే రోజు గడవక సామాన్యుల జీవనం దుర్భరంగా మారింది. ఇప్పటికే గ్యాస్ ధరల పెంపుతో వారిపై అదనపు భారం పడింది. కమర్షియల్ సిలెండర్లు ధర భారీగా పెంచడంతో హోటళ్లు, ఫాస్ట్ఫుడ్ సెంటర్లు, బజ్జీల బళ్లు, స్వీట్స్ షాపులు, కర్రీ పాయింట్లలో ధరలకు రెక్కలొచ్చాయి. టిఫిన్, మీల్స్పై ప్లేటుకు రూ.5 నుంచి రూ.20 వరకు ధరలు పెంచేశారు. మిగిలిన ఆహార పదార్థాల ధరలు పెరిగాయి. తాజాగా పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుతో రవాణా భారం కానుంది. సరుకుల రవాణా చార్జీలు పెరిగి కూరగాయలు, ఇతర వస్తువుల ధరలు పెరుగుతాయన్న ఆందోళన వ్యక్తమవుతోంది. ధరల నియంత్రణకు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. శుక్రవారం ఉదయం పెట్రోల్ కొట్టించుకోవడానికి వెళ్ళిన వినియోగదారులకు బంకుల్లో పెరిగిన ధరలు షాకిచ్చాయి. ధరలు పెరిగిన విషయం తెలియక పెట్రోల్ కొట్టించుకున్న వినియోగదారులకు లీటర్పై రూ. 3 పెరిగిందని చెబితే గానీ తెలియలేదు. దీనితో కొందరు వినియోగదారులకు, బంకులో కార్మికులకు మధ్య వాదోపవాదాలు జరిగాయి. కేంద్రం పెట్రోధరలు మూడు రూపాయలే పెంచినా స్థానిక పన్నుల రూపంలో మరో రూపాయి వరకూ అధికంగా చెల్లించాల్సిన పరిస్థితి నెలకొంది. ఏలూరు జిల్లాలో వివిధ ఆయిల్ సంస్థలకు చెందిన 260 పెట్రోల్ బంకులున్నాయి. వీటి ద్వారా రోజూ జిల్లా ప్రజలు మొత్తం 6.25 లక్షల లీటర్లను వినియోగిస్తున్నారు. దీనిలో 3.65 లక్షల డీజిల్, రూ. 2.60 లక్షల పెట్రోల్ను వినియోగిస్తున్నట్టు అధికారిక గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. ఈ మేరకు పెరిగిన మూడు రూపాయల చొప్పున జిల్లా ప్రజలపై రోజుకు రూ.18.75 లక్షల అదనపు భారం పడుతోంది. అంటే సుమారు రెండు రోజులకు ఒక లీటర్ పెట్రోల్ వినియోగించే వినియోగదారుడిపై ఏడాదికి సుమారు రూ.1000 అదనపు భారం పడుతోంది. చూడడానికి ఈ మొత్తం చిన్నగానే కనిపిస్తున్నా సామాన్య, మధ్య తరగతి ప్రజలకు మాత్రం విపరీతమైన భారమనే చెప్పాలి. పెట్రోల్, డీజిల్ ధరల పెంపుతో సామాన్యుడికి కష్టాలు జిల్లాపై రోజుకు రూ.18.75 లక్షల భారం జిల్లాలో రోజుకు 6.25 లక్షల లీటర్ల పెట్రోల్, డీజిల్ వినియోగం -
విద్యుత్ ఎస్ఈకి వైఎస్సార్సీపీ లీగల్ నోటీసులు
ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలోని వైఎస్సార్సీపీ జిల్లా కార్యాలయానికి ఎలాంటి ముందస్తు నోటీసూ ఇవ్వకుండా విద్యుత్ సర్వీసును తొలగించిన అంశంపై రాష్ట్ర అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన ఉత్తర్వులను అమలు చేయడంలో విఫలమైన విద్యుత్ అధికారులకు వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నాయకులు శుక్రవారం నోటీసులు జారీ చేశారు. నగరంలోని వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యాలయానికి ఇటీవల విద్యుత్ సరఫరాను తొలగించారు. ముందస్తు నోటీసులూ ఇవ్వకుండా సర్వీసును తొలగించడాన్ని సవాలు చేస్తూ హైకోర్టులో వైఎస్సార్సీపీ నాయకులు పిటిషన్ దాఖలు చేశారు. దీనిపై విచారణ చేసిన హైకోర్టు సదరు కార్యాలయానికి మూడు రోజుల్లోపు సర్వీసును పునరుద్ధరించాలని ఉత్తర్వులు జారీ చేసింది. ఈ ఉత్తర్వుల ప్రతులను నాయకులు ఈనెల 12న ఈపీడీసీఎల్ ఎస్ఈ సాల్మన్రాజుకు కలిసి అందచేశారు. ఈ నెల 15 తేదీలోపు విద్యుత్ సర్వీసును పునరుద్ధరించాల్సిన అధికారులు ఆ పని చేయకుండా తిరిగి వైఎస్సార్సీపీ నాయకులకు నోటీసులు పంపి చేతులు దులుపుకునే ప్రయత్నం చేశారు. దీనిపై స్పందించిన లీగల్ సెల్ నాయకులు కోర్టు ధిక్కరణ నోటీసులు అందచేశారు. హైకోర్టు ఉత్తర్వులను ధిక్కరిచిన నేరానికి వ్యక్తిగతంగా జరిమానా, ఇతర క్రమశిక్షణ చర్యలను ఎదుర్కోవలసి వస్తుందని సదరు నోటీసులో గుర్తు చేశారు. వైఎస్సార్సీపీ లీగల్ సెల్ నగర అధ్యక్షుడు ప్రత్తిపాటి తంబి, డి.రామాంజనేయులు తదితరులు ఉన్నారు. -
వైద్యం, వ్యవసాయం నిర్వీర్యం
వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగ అధ్యక్షుడు రాజశేఖర్ ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టినప్పటి నుంచి రాష్ట్రంలో విద్య, వైద్యం, వ్యవసాయంతో పాటు అన్ని రంగాలను నిర్వీర్యం చేసిందని.. సరైన వైద్యం అందక పేద, మధ్య తరగతి వర్గాలు ప్రాణాలపై ఆశలు వదులుకుంటున్నారనీ.. రైతన్నలు పరిస్థితి దారుణంగా తయారైందని వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార విభాగం అధ్యక్షుడు కాకుమాను రాజశేఖర్ విమర్శించారు. ఏలూరు హోటల్ ఎన్లో విలేకరులతో మాట్లాడుతూ.. గిట్టుబాటు ధర లేక, పంటను అమ్ముకునే పరిస్థితి లేక రైతన్న కొట్టుమిట్టాడుతున్నాడని ఆవేదన వ్యక్తం చేశారు. గత వైఎస్సార్సీపీ హయాంలో రైతు భరోసా కేంద్రాలతో మేలు జరిగేదని, ధాన్యం కొనుగోలుకు ఎక్కడా ఇబ్బంది లేకుండా చర్యలు చేపట్టారని గుర్తు చేశారు. ఆక్వా రంగాన్ని ప్రభుత్వం పూర్తిగా పెట్టుబడిదారులకు తాకట్టు పెట్టిందనీ, కంపెనీలు ఇష్టారాజ్యంగా ధరలు పెంచుకునే వెసులుబాటు కల్పించటం దారుణమని మండిపడ్డారు. కూటమి ప్రభుత్వం ఆక్వా రైతులను వెంటనే ఆదుకోవాలని, లేనిపక్షంలో ఉద్యమిస్తామని, రైతులతో కలిసి పోరాటం చేస్తామని హెచ్చరించారు. పశ్చిమాసియా దేశాల్లోని యుద్ధాలను బూచిగా చూపిస్తూ పెట్రోల్, డీజిల్ ధరలను లీటరుకు రూ.3 చొప్పున పెంచటం రైతులను నాశనం చేయటానికే అంటూ మండిపడ్డారు. కూటమి అధికారంలోకి వస్తే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గిస్తామంటూ హామీలు ఇచ్చారనీ, ఇప్పుడు ధరలు పెంచటం అన్యాయం కాదా అంటూ ప్రశ్నించారు. కూటమి ప్రభుత్వం తక్షణమే పెట్రోల్, డీజిల్ ధరలు తగ్గించేలా చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు. సమావేశంలో జిల్లా ప్రచార విభాగం అధ్యక్షుడు తల్లాబత్తుల శ్రీనివాసరావు, రాష్ట్ర కార్యదర్శి వామిశెట్టి పావనికుమారి, రాష్ట్ర ప్రచార విభాగం ప్రధాన కార్యదర్శులు లక్ష్మీనారాయణ, బ్రహ్మయ్య, బేతపూడి రాజేంద్ర, ప్రేమ్, పాముల గంగాధర్రావు, తదితరులు ఉన్నారు. -
ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గొల్ల కిరణ్
దెందులూరు: వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శిగా గొల్ల కిరణ్ నియమితులయ్యారు. ఈ మేరకు పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి లిఖితపూర్వక ఆదేశాలు జారీ చేశారని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి తెలిపారు. సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా రియాజ్ షరీఫ్ పోలవరం రూరల్: వైఎస్సార్సీపీ రాష్ట్ర అనుబంధ విభాగాల కమిటీలో పోలవరానికి చెందిన షేక్ రియాజ్ షరీఫ్కు స్థానం దక్కింది. పార్టీ కేంద్ర కార్యాలయం రాష్ట్ర సోషల్ మీడియా వింగ్ కార్యదర్శిగా షేక్ రియాజ్ షరీఫ్ను నియమిస్తూ శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ సందర్భంగా రియాజ్ షరీఫ్ మాట్లాడుతూ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి, రాష్ట్ర, జిల్లా, నియోజకవర్గ నాయకులకు కృతజ్ఞతలు తెలిపారు. తనపై ఉంచిన నమ్మకాన్ని నిలబెట్టుకుంటానని అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలోని ఇంజనీరింగ్ కళాశాలల్లో ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరేందుకు నిర్వహించే ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు శుక్రవారం నగరంలో ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులోని మూడు పరీక్షా కేంద్రాల్లో ఉదయం, మధ్యాహ్నం షిప్టుల్లో నిర్వహించిన పరీక్షలకు మొత్తం 787 మంది హాజరయ్యారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో మధ్యాహ్నం షిప్ట్నకు 120 మందికి గాను 116 మంది హాజరు కాగా ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170 మందికి 163 మంది, మధ్యాహ్నం 170 మందికి 161 మంది హాజరయ్యారు. సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180 మందికి 176 మంది హాజరు కాగా మధ్యాహ్నం 180 మందికి 171 మంది హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్): యుద్ధ సంక్షోభ పరిస్థితుల దృష్ట్యా ఇందన వనరుల వినియోగంలో పొదుపు పాటించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ విజ్ఞప్తి చేశారు. కలెక్టరేట్లో శుక్రవారం మాట్లాడుతూ రాష్ట్రంలో పెట్రోల్, డీజిల్కు ఎలాంటి కొరతా లేదని, సోషల్ మీడియాలో వస్తున్న అవాస్తవాలను నమ్మి ప్రజలు ఆందోళనకు గురికావద్దన్నారు. రబీ ధాన్యం సేకరణలో రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరవాత ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘాలకు సంబంధించి 50 శాతం బకాయిలను చెల్లించిందని చెప్పారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో బడి పిలుస్తోంది కార్యక్రమం ద్వారా 5,965 మంది బడి ఈడు పిల్లలను ప్రభుత్వ బడులలో చేర్పించామని కలెక్టర్ కె. వెట్రిసెల్వి రాష్ట్ర విద్యా శాఖ కార్యదర్శి కోన శశిధర్కు తెలిపారు. బడి పిలుస్తోంది, ఎన్రోల్మెంట్ డ్రైవ్ పై కలెక్టర్లతో విద్యా శాఖ కార్యదర్శి శనివారం జూమ్ కాన్ఫరెన్న్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కోన శశిధర్ మాట్లాడుతూ అంగన్వాడీలలో ప్రీ స్కూల్లో ఉన్న పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలని, బడి మానివేసిన వారిని తిరిగి బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలో అంగన్వాడీలలో ప్రీ స్కూల్ చదువుతున్న వారిలో 11,200 మంది పిల్లలను మొదటి తరగతిలో చేర్పించేందుకు లక్ష్యం కాగా, ఇంతవరకు 5,965 మందిని బడులలో చేర్పించామని, మిగిలిన వారిని కూడా త్వరలో ప్రభుత్వ బడులలో చేర్పించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): భీమవరం పంచారామ క్షేత్రానికి చెందిన గునుపూడి టిడ్కో ఇళ్ల సమీపంలోని వ్యవసాయ భూమిలో కొందరు అక్రమంగా మట్టి తవ్వకాలు చేస్తుండగా భక్తులు గమనించి పంచారామ క్షేత్ర అధికారులకు తెలియజేశారు. శుక్రవారం ఆలయ ఈఓ కృష్ణంరాజు, ఆలయ అధికారులు అక్రమ తవ్వకాలను అడ్డుకున్నారు. వారి ఫిర్యాదుతో రెవెన్యూ, పోలీస్ శాఖా ధికారులు మట్టి తవ్వుతున్న జేసీబీ, మూడు ట్రాక్టర్లను స్వాధీనం చేసుకుని సీజ్ చేశారు. అనుమతులు లేకుండా దేవస్థానం భూమిలో మట్టి తవ్వకాలకు సిద్ధపడడంపై అటు భక్తులు, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నిమ్మకాయల యార్డులో మృతదేహం లభ్యం
ఏలూరు టౌన్: ఏలూరు నిమ్మకాయల యార్డ్ ప్రాంగణంలో గోడ పక్కగా ఒక మృతదేహాన్ని గుర్తించారు. శుక్రవారం ఉదయం 11 గంటల సమయంలో గుర్తు తెలియని సుమారు 50 ఏళ్ల వయస్సున్న వ్యక్తి ఒక మృతదేహాన్ని నిమ్మకాయల యార్డులో పనిచేసే వారు గుర్తించారు. వెంటనే ఏలూరు రూరల్ పోలీసులకు సమాచారం అందించారు. ఏలూరు వన్టౌన్ సీఐ జి.సత్యనారాయణ ఆధ్వర్యంలో పోలీసులు సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. మృతదేహం పూర్తిగా కుళ్ళిన స్థితిలో గుర్తు పట్టలేని విధంగా ఉంది. సుమారుగా వారం రోజుల క్రితం చనిపోయి ఉండవచ్చని భావిస్తున్నారు. మృతదేహంపై లేత ఆకుపచ్చ రంగు పుల్హ్యాండ్స్ చొక్కా, నలుపురంగు ప్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుని వివరాలు తెలియాల్సి ఉందనీ... ఎవరికై నా తెలిస్తే తమను సంప్రదించాలని ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణ తెలిపారు. -
పెట్రోలు, డీజిల్ ధరలు తగ్గించాలి
ఏలూరు (టూటౌన్): పెట్రోల్ డీజిల్ ధరలు తక్షణమే ఉపసంహరించుకోవాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు డిమాండ్ చేశారు. ఆ పార్టీ ఆధ్వర్యంలో పెట్రోల్, డీజిల్ ధరలు పెంపుదలను నిరసిస్తూ కొత్త బస్టాండ్ వద్ద ఉన్న ఆర్టీసీ పెట్రోల్ బంక్ వద్ద వినూత్న రీతిలో ధర్నా నిర్వహిస్తూ ఆటోను లాగుతూ నిరసన తెలిపారు. నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షత వహించారు. జిల్లా కార్యదర్శి ఆర్ లింగరాజు మాట్లాడుతూ ఎన్డీఏ ప్రభుత్వం ప్రజలపై నిత్యం భారాలు మోపుతూ కార్పొరేట్లకు ప్రజల సంపదను దోచిపెడుతుందని విమర్శించారు. అంతర్జాతీయంగా క్రూడాయిల్ ధరలు తగ్గినప్పుడు ఈ దేశంలో ఆయిల్ ధరలు తగ్గించని ప్రభుత్వం యుద్ధాన్ని అడ్డుపెట్టుకుని ఆయిల్ కంపెనీల మాఫియాకు తలొగ్గి ప్రజలపై భారాల మోపిందని తీవ్రంగా విమర్శించారు. ఐదు రాష్ట్రాల ఎన్నికల అనంతరం కేంద్ర ప్రభుత్వం కమర్షియల్ గ్యాస్ సిలిండర్ ధరలు నేడు పెట్రోల్ డీజిల్ ధరలు పెంచడం ప్రజలను మోసం చేయడమేనన్నారు. కరోనా తర్వాత ప్రజలు కోలుకోలేక ఇబ్బందులు పడుతున్న ప్రజలపై ఈ ధరల పెంపు భాగంగా మారుతుందని ఆవేదన వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు డీఎన్వీడీ ప్రసాద్, కె,శ్రీనివాస్ తదితరులు పాల్గొన్నారు. -
కూటమి నేత దర్జాగా కబ్జా
తాడేపల్లిగూడెం: జాగా కనిపిస్తే దర్జాగా కబ్జా చేసేయ్ అన్న రీతిలో నియోజకవర్గంలోని కూటమి నేత వ్యవహార శైలి ఉంది. ఈ నేత తాజాగా పట్టణంలోని రెండో టౌన్లో బాలవెంకటేశ్వరస్వామి భూమిని ఆక్రమించిన నిర్మాణాలు వివాదాస్పదమయ్యాయి. గత ప్రభుత్వ హయాంలో ఈ నేత అక్రమాలకు అప్పటి ఎమ్మెల్యే కొట్టు సత్యనారాయణ చెక్ పెట్టారు. ఆక్రమణలు తొలగించి భూమిని దేవదాయ శాఖకు బదలాయించారు. కూటమి పాలన వచ్చాక సదరు నేత మళ్లీ అక్రమ నిర్మాణాలు చేశారు. కట్టడి చేయాల్సిన దేవదాయ శాఖ అధికారులు తూతూ మంత్రంగా బోర్డు ఏర్పాటుచేసి చేతులు దులిపేసుకున్నారు. ఈ నేత ఉంటున్న ఇల్లు కూడా దేవదాయ శాఖకు చెందిన భూమిలో ఉందని కేసు నమోదైంది. -
పీఏసీఎస్లో ఇష్టారాజ్యంగా నియామకాలు
నూజివీడు: నూజివీడు పీఏసీఎస్లో అధికార పార్టీ నాయకులు నిబంధనలకు విరుద్ధంగా ఇష్టారాజ్యంగా నియామకాలు చేసుకుంటూ ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తున్నారు. తమ అనుచరులను, కావాల్సిన వారిని నియమంచుకుంటూ వారికి జీతాల రూపంలో వేల రూపాయలు చెల్లిస్తున్నారు. సొసైటీల్లో ఏవరినైనా నియమించాలంటే జిల్లా స్థాయి సాధికార కమిటీ ఉత్తర్వుల ప్రకారం నియమించుకోవాల్సి ఉండగా ఈ సొసైటీలో ప్రస్తుతం 8 మంది ప్రైవేటు వ్యక్తులను నియమించుకుని వారికి ప్రతినెలా రైతుల సొమ్మును దోచిపెడుతూ దుర్వినియోగం చేస్తున్నారు. ఈ సొసైటీలో పర్మినెంట్ పోస్టులు ఆరు ఉండగా ముగ్గురు ఉద్యోగులు పనిచేస్తున్నారు. మూడు పోస్టులు ఖాళీగా ఉన్నాయి. ఈ పోస్టులలో ముగ్గురు వ్యక్తులను నియమించుకుంటే సరిపోతుంది. కానీ ఇక్కడ ఎనిమిది మందిని నియమించుకున్నారు. ఇందులో ఐదుగురు గత నాలుగేళ్ల నుంచి పనిచేస్తుండగా ముగ్గురిని మాత్రం నూతన పాలకవర్గం ప్రమాణ స్వీకారం చేసిన తరువాత ఇటీవలే నియమించారు. గత ఆర్థిక సంవత్సరంలో కేవలం రూ.12 కోట్ల వ్యాపారం మాత్రమే చేసినా సొసైటీ రుణాల రికవరీ కూడా వందశాతం లేదు. ఇష్టారాజ్యంగా నియమించుకొని జీతాలకు సొసైటీ సొమ్మును దుర్వినియోగం చేస్తే తరువాత ఆడిట్ అభ్యంతరాలు వచ్చి రికవరీ చేయాలని ఉన్నతాధికారులు ఆదేశిస్తే ఎవరు భరిస్తారనే ప్రశ్నలు సైతం ఉత్పన్నమవుతున్నాయి. ఇప్పటికై నా నూజివీడు సొసైటీ తీరుపై సహకారశాఖ ఉన్నతాధికారులు దృష్టి సారించి చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. -
భూ సమస్యల పరిష్కారంలో ప్రథమం
ఏలూరు (టూటౌన్): 22ఏ భూ సమస్యల పరిష్కారంలో ఏలూరు జిల్లా రాష్ట్రానికే ఆదర్శంగా నిలిచిందని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో శుక్రవారం 22ఏ మెగా పరిష్కార మేళా కార్యక్రమంలో పాల్గొని ప్రజల వద్దకు వెళ్లి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. 290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22 ఏ జాబితా నుంచి తొలగించి, సంబంధిత రైతులకు తొలగింపు ఉత్తర్వులను అందజేశారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ గత డిసెంబర్లో రాష్ట్రంలోనే మొదటిసారిగా ఏలూరు జిల్లాలో 22ఏ మెగా పరిష్కార మేళా కార్యక్రమాన్ని నిర్వహించి వందలాది ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించామన్నారు. ప్రస్తుతం నిర్వహించిన కార్యక్రమంలో 290 దరఖాస్తులకు సంబంధించి 74 ఎకరాలను 22ఏ జాబితా నుంచి తొలగించి, ఉత్తర్వులను అందించామని, మరో 202 అర్జీలను పరిశీలించి 15 రోజులలలోగా పరిష్కారానికి చర్యలు తీసుకోమని అధికారులను ఆదేశించామన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ.. రాష్ట్ర ప్రభుత్వ ఆదేశాలమేరకు రెండవ దఫా పరిష్కార మేళాను నిర్వహిస్తున్నామని, ప్రజల నుంచి మంచి స్పందన వచ్చిందన్నారు. ఈ కార్యక్ర మంలో జాయింట్ కలెక్టర్ ఎం.జె. అభిషేక్ గౌడ, ఎమ్మెల్యేలు చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, డీఆర్వో దేవకీదేవి తదితరులు పాల్గొన్నారు. -
కోకో ధర పెంచాలి
అంతర్జాతీయ మార్కెట్లో పెరిగిన కోకో గింజల ధరకు అనుగుణంగా రైతుల కోకో గింజలకు ధర పెంచాలని కోకో రైతులు డిమాండ్ చేస్తున్నారు. 8లో uకేంద్ర ప్రభుత్వం ప్రజల సంక్షేమాన్ని గాలికొదిలేసి వారిపై ధరల భారాన్ని మోపుతోంది. పెట్రోల్ ధరలను పెంచి రాత్రికి రాత్రే అమలులోకి తీసుకురావడం చీకటిదెబ్బగానే పరిగణించాలి. ఇటీవల 5 రాష్ట్రాల ఎన్నికలు ముగిసిన తరువాత ధరలను పెంచడం ప్రజలను దారుణంగా మోసగించడమే. – పంపన రవికుమార్, సీపీఎం నగర కార్యదర్శి కేంద్రం పెంచిన పెట్రో ధరలను తక్షణం ఉపసంహరించుకోవాలి. కార్పొరేట్ సంస్థల లబ్ధి కోసమే మోదీ ప్రభుత్వం పని చేస్తోంది. బడాబాబుల ఆస్తులు పెంచుకోవడానికి, సామాన్య, మధ్య తరగతి ప్రజల చెమటను దోపిడీ చేయడానికి మోదీ ప్రభుత్వం చేస్తున్న కుటిల ప్రయత్నాలను ప్రజా ఉద్యమాల ద్వారా తిప్పికొడతాం. – మంచెల్ల ఇస్సాకు, సీఐటీయూ నగర కార్యదర్శి -
నేలసారాన్ని కాపాడుకోవాలి
తాడేపల్లిగూడెం : నేలసారాన్ని కాపాడుకుంటే మంచి దిగుబడులు సాధించవచ్చని కేవీకే శాస్త్రవేత్త డాక్టర్ దేవీవరప్రసాదరెడ్డి అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కృషి విజ్ఞాన కేంద్రంలో నాణ్యమైన చేప పిల్లల ఉత్పత్తి పద్ధతులు, నర్సరీల నిర్వహణ, సంరక్షణ పద్ధతులపై రైతులకు వివరించారు. సమతుల్య ఎరువుల వినియోగంపై అవగాహన కల్పించారు. ప్రతిరైతూ తమ నేలను పరిరక్షించుకోవాలని, దాని ఆధారంగానే ఎరువులను వాడుకోవాలన్నారు. ఎరువుల ఖర్చును తగ్గించుకొని భూసారం పెంచుకోవాలన్నారు. రసాయనిక ఎరువుల ప్రభావాన్ని తగ్గించుకునేందుకు జీవ ఎరువులు, సూక్ష్మ జీవుల వాడకం, వర్మి కంపోస్టు పద్ధతులపై విశదీకరించారు. నాణ్యమైన చేప పిల్లల ఎంపిక, ఉత్పత్తి పద్ధతులు తల్లి చేపల ఎంపిక, అఽఽధిక దిగుబడులు సాధించడం గురించి తెలిపారు. వ్యాధులులేని అధిక దిగుబడినిచ్చే రోహు, కట్ల, మృగల, గ్రాస్ కార్ప్,సిల్వర్ కార్ప్ చేపల ఎంపిక గురించి వివరించారు. హార్మోన్ ఇంజక్షన్లు, నర్సరీల నిర్వహణ గురించి అవగాహన కల్పించారు. కార్యక్రమంలో జిల్లా మత్స్య శాఖాధికారి రాజ్కుమార్, జిల్లా సహకార సంఘం అధ్యక్షులు వసంత్ రావులు పాల్గొన్నారు. -
మద్ది క్షేత్రం పాలకవర్గం నియామకం
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయ పాలకవర్గాన్ని నియమిస్తూ ప్రభుత్వం శుక్రవారం ఉత్తర్వులు జారీ చేసింది. ముందుగా ఊహించిన విధంగా రాజాన సత్యనారాయణ (పండు) ఆలయ చైర్మన్ కానున్నారు. ఆయనతో పాటు 11 మంది సభ్యులను నియమిస్తూ ఉత్తర్వులు వచ్చాయి. రాజాన సత్యనారాయణ, ఓబిలినేని సూర్యభవానీ, చింతపల్లి రత్నసురేష్, ధూళిపాళ సూర్యచంద్ర వెంకట ప్రభాకరరావు, వల్లూరి సునీత, జగన్నాధం వెంకటమ్మ, తిరుమలశెట్టి నాగ వరలక్ష్మి అనీల, దూనబోయిన నారాయణమూర్తి, గెడ దుర్గా హరి సాగర్ చందు, నడిపల్లి విద్యాసాగర్, ఆరుగోల్లు సావిత్రిలు ఉన్నారు. ఆలయ అర్చకులు వేదాంతం వెంకటాచార్యులు ఎక్స్ అఫీషియో మెంబర్గా నియమిస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. కాగా, ఎన్నికై న 11 మంది సభ్యుల్లో రాజాన పండును సభ్యులు ఛైర్మన్గా ఎన్నుకోనున్నారు. నియమితులైన సభ్యులు ప్రమాణస్వీకారం చేసిన నాటి నుంచి రెండు సంవత్సరాల పాటు కొనసాగుతారు. ఏలూరు టౌన్: నగరంలో ట్రాఫిక్ నియంత్రణంలో భాగంగా నగరంలోకి భారీ వాహనాల ప్రవేశంపై ఆంక్షలు విధించామని ఏలూరు ట్రాఫిక్ సీఐ లక్ష్మణరావు తెలిపారు. ఏలూరు పోలీస్ డార్మిటరీలో ఇటుకబట్టీల ట్రాక్టర్ డ్రైవర్లతో ట్రాఫిక్ సీఐ ప్రత్యేకంగా అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఏలూరు నగరంలో ట్రాఫిక్ రద్దీ నివారణకు ఉదయం 8గంటల నుంచి మధ్యాహ్నం 12గంటల వరకూ, సాయంత్రం 4 గంటల నుంచి రాత్రి 8 గంటల వరకూ ట్రాక్టర్లు, లారీలు, ఇతర భారీ వాహనాల ప్రవేశాన్ని నిషేధించామని స్పష్టం చేశారు. ఈ సమయంలో డ్రైవర్లు ప్రత్యామ్నాయ మార్గాల్లో తమ గమ్యస్థానాలకు చేరుకోవాలని సూచించారు. ఇష్టారాజ్యంగా నగరంలోకి ప్రవేశించి ప్రజలకు ఇబ్బందులు కలిగిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు. ఏదైనా రోడ్డు ప్రమాదం జరిగితే క్షతగాత్రులను సకాలంలో హాస్పిటల్కు చేర్చేందుకు ప్రతీ ఒక్కరూ బాధ్యత తీసుకోవాలని సూచించారు. అతివేగం ప్రమాదకరమనీ, ట్రాక్టర్ డ్రైవర్లు ముఖ్యంగా పరిమిత వేగంతోనే ప్రయాణించాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ట్రాఫిక్ ఎస్సై శ్రీధర్, ట్రాఫిక్ సిబ్బంది ఉన్నారు. -
ఉపాధ్యాయులను నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా మార్చాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులను వేసవి సెలవుల్లో కూడా పనిచేయిస్తున్న పరిస్థితి కనపడుతోందని, ఉపాధ్యాయులతో పూర్తి స్థాయిలో పనిచేయించాలనే ఉద్దేశ్యం ఉంటే నాన్ వెకేషన్ డిపార్ట్మెంట్గా మార్చి సంపాదిత సెలవులను పెంచాలని జాక్టో నాయకులు కోరారు. ఈమేరకు గురువారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మను కలిసి వినతిపత్రం సమర్పించారు. రెమిడియల్ తరగతుల నిర్వహణకు హాజరౌతున్న ఉపాధ్యాయులకు, బడి పిలుస్తోందిలో భాగంగా ఎన్రోల్మెంట్ డ్రైవ్లో పాల్గొన్న ఉపాధ్యాయులకు సంపాదిత సెలవులు మంజూరు చేయాలని డిమాండ్ చేశారు. వేసవి తీవ్రత కూడా 40 డిగ్రీలకు పైగా నమోదవుతున్న దృష్ట్యా శిక్షణ తరగతులు వాయిదా వేయాలని, సర్వీసులో ఉన్న టీచర్లకు టెట్ అర్హత నిబంధనను రద్దు చేయాలని, మున్సిపల్, ఎయిడెడ్, ఎంటీఎస్ టీచర్ల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జాక్టో నాయకులు పువ్వుల ఆంజనేయులు, బూక్యా రాము, టీఎల్ఎస్ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్, ఎం. రాంబాబు, డీఎస్ ప్రసాద్, ఈ. నారాయణ ఉన్నారు. -
ట్రిపుల్ఐటీల అభివృద్ధికి పటిష్టమైన చర్యలు
నూతన వీసీ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు నూజివీడు: రాష్ట్రంలోని ఆర్జీయూకేటీల పరిధిలోని నూజివీడు, ఇడుపులపాయ, ఒంగోలు, శ్రీకాకుళం ట్రిపుల్ ఐటీలలో నాణ్యమైన సాంకేతిక విద్యను అందించేందుకు మరింత కృషి చేస్తానని వైస్ ఛాన్సలర్ ఆచార్య మద్దాలి లక్ష్మీనారాయణరావు పేర్కొన్నారు. వీసీగా బాధ్యతలు స్వీకరించిన అనంతరం తొలిసారిగా నూజివీడు ట్రిపుల్ఐటీకి విచ్చేసిన ఆయన గురువారం విలేకర్లతో మాట్లాడారు. పదో తరగతి పూర్తయిన వెంటనే విద్యార్థులు ట్రిపుల్ ఐటీల్లోని ఆరేళ్ల ఇంటిగ్రేటెడ్ ఇంజినీరింగ్ కోర్సులో జాయిన్ అవుతున్నారని, వారిని దేశానికి ఉపయోగపడే భావిభారత ఇంజినీర్లుగా తీర్చిదిద్దడమే లక్ష్యంగా పనిచేస్తానన్నారు. తన 26 ఏళ్ల అధ్యాపక బోధన అనుభవంతో ట్రిపుల్ ఐటీల్లో సంస్కరణలను తీసుకువచ్చి మరింత అభివృద్ధిలోకి తీసుకెళ్తానన్నారు. విద్యార్థుల భవిష్యత్కు ఉపయోగపడే నాణ్యమైన సాంకేతిక విద్యను అందించడమే కాకుండా ఎప్పటికప్పుడు ప్రపంచ వ్యాప్తంగా వస్తున్న మార్పులకు అనుగుణంగా బోధన సాగేలా చర్యలు చేపడతామన్నారు. బోధన, బోధనేతర సిబ్బంది సహకారంతో ఆర్జీయూకేటీ పేరు ప్రతిష్టలు మరింత ఇనుమడించేలా పనిచేస్తామన్నారు. వైస్ఛాన్సలర్ను ట్రిపుల్ ఐటీలోని అసిస్టెంట్ ప్రొఫెసర్లు, మెంటార్లు, బోధనేతర సిబ్బంది కలిసి శుభాకాంక్షలు తెలిపారు. -
గిరిజనాభివృద్ధికి గ్రహణం
బుట్టాయగూడెం: కూటమి ప్రభుత్వం గిరిజనాభివృద్ధిని గాలికి వదిలేసింది. సమస్యల పరిష్కారానికి వేదిక కావల్సిన కోటరామచంద్రపురం (కేఆర్పురం) ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్నర సంవత్సరాలుగా నిర్వహించకపోవడంపై గిరిజన ప్రజల నుంచి తీవ్ర నిరసన వ్యక్తమవుతోంది. నిబంధనల ప్రకారం ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా నిర్వహించలేదు. గిరిజన సంక్షేమ పథకాల అమలు తీరు, గ్రామాల్లో సమస్యల పరిష్కారానికి తీసుకోవాల్సిన చర్యలు, వార్షిక బడ్జెట్ రాబడులు, వ్యయాలపై సమీక్షకు పాలక వర్గ సమావేశం ఎంతో కీలకమైనది. అంత ప్రాముఖ్యత ఉన్న ఈ సమావేశం నిర్వహణ గురించి పట్టించుకునే నాథుడే కరువయ్యారని గిరిజన సంఘ నాయకులు తీవ్రంగా విమర్శిస్తున్నారు. పట్టించుకునే వారే లేరు కేఆర్పురం ఐటీడీఏ పాలకవర్గ సమావేశం 2023 ఆగస్టు 30న నిర్వహించారు. ఆ తర్వాత మళ్లీ సమీక్ష సమావేశం నిర్వహణకు సంబంధించి ఎవ్వరూ పట్టించుకోలేదు. గిరిజన గ్రామాల్లో అనేక సమస్యలు నెలకొన్నాయని గిరిజనులు చెబుతున్నారు. గిరిజన గ్రామాలకు సరైన రహదారులు లేక గిరిపుత్రులు పడుతున్న బాధలు వర్ణనాతీతం. అలాగే పోడుభూములకు దరఖాస్తు చేసుకున్నా పట్టించుకునే వారే లేరని గిరిజనులు ఆరోపిస్తున్నారు. ఐటీడీఏ ద్వారా నిర్వహిస్తున్న పాఠశాలల్లో కొత్తగా వస్తున్న విద్యా విధానంతో అనేక మంది గిరిజన విద్యార్థులు డ్రాప్ అవుట్స్గా మారే అవకాశం ఉందని గిరిజన సంఘాల నాయకులు పేర్కొంటున్నారు. ఇలా అనేక సమస్యల పరిష్కారానికి పాలకవర్గ సమావేశం వేదికగా ఉంటుంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి ఐటీడీఏ పాలకవర్గ సమావేశం నిర్వహించాలని పలువురు కోరుతున్నారు. దీనిపై ఐటీడీఏ పీఓ రాములు నాయక్ను వివరణ కోరగా త్వరలోనే పాలకవర్గం సమావేశం ఏర్పాటు చేస్తామని చెప్పారు. రెండున్నరేళ్లుగా నోచుకోని ఐటీడీఏ పాలకవర్గ సమావేశం గిరిజన ప్రాంతంలో ఎక్కడి సమస్యలు అక్కడే తక్షణమే సమీక్ష ఏర్పాటు చేయాలని గిరిజన సంఘాల డిమాండ్ -
వేసవి తాపం.. చేపకు శాపం
● వాతావరణంలో మార్పులతో కొట్టుకుంటున్న మత్స్యం ● చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్న ఆక్వా రైతులు భీమవరం అర్బన్: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఆక్వా రంగం ప్రస్తుతం వాతావరణ మార్పులతో సంక్షోభంలో కొట్టుమిట్టాడుతుంది. ఆక్వా రైతులు చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఇంజిన్ బోట్లు, ఏరియేటర్లు తిప్పుతూ మరికొన్ని చోట్ల ఆక్సిజన్ ట్యాబ్లెట్లు వినియోగిస్తున్నారు. చేపలను రక్షించుకునేందుకు రైతులు రాత్రులు, పగలు తేడా లేకుండా చెరువుల వద్దే పడిగాపులు కాస్తున్నారు. జిల్లాలో భీమవరం, ఉండి, నరసాపురం, మొగల్తూరు, ఆచంట, పాలకొల్లు, కాళ్ల తదితర మండలాల్లో సుమారు లక్షా 40 వేల ఎకరాల్లో శీలావతి, కట్ల, ఫంగస్, రూప్చంద్, తిలాఫీ, గడ్డిచేప తదితర సప్పనీటి చేపలను పెంచుతున్నారు. చేపల పెంపకంలో నష్టాలు తక్కువగా ఉండడంతో ఎక్కువ మంది రైతులు వాటిని పెంచేందుకు మొగ్గు చూపిస్తున్నారు. రోజుకు సుమారు 1000 టన్నుల పైగా చేపలు కోల్కత్తా, బెంగాల్, మహారాష్ట్ర, ఒడిస్సా తదితర ప్రాంతాలకు ఎగుమతులు అవుతూ ఉంటాయి. దీంతో కోట్లాది రూపాయలు విదేశీ మారకద్రవ్యం జిల్లాకు చేరుకుంటుంది. దినదిన గండం గతేడాది కంటే ఈ ఏడాది ప్రారంభంలోనే ఎండలు ఎక్కువగా ఉండటంతో చేపలు చెరువుల్లోని నీరు ఇంకిపోయి ఉప్పుశాతం పెరిగిపోతుందని రైతులు వాపోతున్నారు. గత మూడు వారాలుగా వడగాల్పులు కారణంగా వాతావరణంలో మార్పులు చోటు చేసుకోవడంతో ఆక్సిజన్ శాతంలో హెచ్చుతగ్గులు ఏర్పడడంతో చేపలు ఉపరితలంపై అసహనంగా ఈదుతున్నాయి. దీంతో వాటికి తాటాకు తెగులు, మొప్ప తెగులు, పేను పట్టడం వంటి వ్యాధులతో మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. వేసవిలో సాధారణంగా ఉప్పు శాతం నాలుగుపైగా ఉంటే చేపలు ఒక్కొక్క సారి హఠాత్తుగా మృత్యువాత పడడంమే కాకుండా ఎదుగుదల మందగిస్తుందని రైతులు చెబుతున్నారు. వేసవి అంటేనే చేపకు గడ్డు కాలం ఫిబ్రవరి నుంచి పంట కాలువల ద్వారా వచ్చే సాగునీరు వంతుల వారీ విధానంతో చేపలు చెరువులకు నీళ్లు పెట్టడానికి ఆస్కారం తక్కువ ఉండటంతో జూలై నెల వరకు వేసవి తాపానికి తట్టుకుని చెరువులో చేపలు బతికితేనే రైతుకు పెట్టుబడులు వస్తాయని లేకుంటే నష్టాలే మిగులుతాయని రైతులు చెబుతున్నారు. చేపలు చెరువు సాగు చేసే రైతులు ప్రతి వారానికి ఒకసారి నీటిని నింపడంతో పీహెచ్, అమ్మోనియా, నైట్రేట్ తదితర క్షార గుణాలు అదుపులో ఉంటాయి. సుమారు 4 నెలలు సప్పనీరు లేకపోవడంతో నీటిలో ఉన్న క్షారగుణాల్లో మార్పులు వచ్చి చేపలు మృత్యువాత పడుతున్నాయని రైతులు చెబుతున్నారు. నీటి పరమాణువులను అదుపులోకి తీసుకువచ్చేందుకు రసాయనిక మందులు, ఎరువులు వాడాల్సి వస్తుంది. చేపలు పెంపకంపై ఆధారపడ్డ సన్నచిన్న కారు రైతులు వాతావరణ మార్పులతో కుదేలవుతున్నారు. ఎండలు వల్ల చెరువులో నీటి వేడిమికి తట్టుకోలేక మృత్యుపడతున్నాయని దీంతో ఏటా తీవ్ర నష్టాలు చవి చూడాల్సి వస్తుందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒక ఎకరం చేపల సాగు చేసేందుకు సుమారు రూ.2 లక్షలు వరకు ఖర్చు చేస్తున్నామని రైతులు చెబుతున్నారు. చేపల సాగు చేయాలంటే 15 ఎకరాలు పైగా చేపలు చెరువు ఉండాలని వెల్లడిస్తున్నారు. చేపలకు మేతలుగా డీఓపీ తవుడు, చెక్క, పత్తిపిండి, పిల్లేట్స్ వేస్తుంటారు. చేపకు పెట్టే మేతను బట్టీ 6 నుంచి 9 నెలల్లో కేజీ చేప తయారవుతుందని చెబుతున్నారు. చేప ఎదుగుదల మందగిస్తే చివరకు అప్పులు మిగులుతాయని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. గడ్డు పరిస్థితుల్లో ఉన్న ఆక్వా రైతులను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతున్నారు. వాతావరణంలో మార్పులు కారణంగా ఎప్పటికప్పుడు నీటి పరీక్షలు చేయించుకుని వాటికి అనుగుణంగా మందులు వినియోగించాల్సి వస్తుంది. దీంతో పెట్టుబడులు ఎక్కువతున్నాయి. ప్రతి రోజు చెరువు వద్దే ఉండి పరిశీలించాల్సి వస్తుంది. – ఆర్ బాలకృష్ణ, ఆక్వా రైతు, దొంగపిండి నేను రెండు ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నాను. అయితే ఈ ఏడాది ఎండలు ఎక్కువగా ఉండడంతో చేపలు మృత్యువాత పడుతుండడంతో పట్టుబడికి రాకముందే పట్టేశాను. దీంతో ఈ ఏడాది నష్టాలు ఎదురయ్యాయి. – వాటాల విజయకృష్ణ, ఆక్వా రైతు, నాగేంద్రపురం -
చెరువు మట్టి.. కొల్లగొట్టి
ద్వారకాతిరుమల: అవినీతికి కాదేదీ అనర్హం అన్నట్టుగా ఉంది ద్వారకాతిరుమల మండలంలోని కొందరు టీడీపీ నాయకుల తీరు. అందినకాడికి దోచుకోవడం.. దాచుకోవడమే వారి అజెండాగా మారింది. రాత్రయితే చాలు వారి చీకటి వ్యాపారానికి తెరతీస్తున్నారు. చెరువుల్లోకి చేరి అక్రమంగా మట్టిని కొల్లగొడుతున్నారు. నిత్యం వందలాది టిప్పర్ల మట్టిని పలు ప్రాంతాలకు తరలించి, జేబులు నింపుకుంటున్నారు. సూర్యచంద్రరావుపేట కృష్ణాపురం (కనకాపురం) చెరువులో ఈ మట్టి దందా నిత్యం నిరాటంకంగా సాగిపోతోంది. మండలంలోని తిరుమలంపాలేనికి చెందిన ఓ టీడీపీ నాయకుడి టిప్పర్లు, జేసీబీ సహాయంతో, పంగిడిగూడేనికి చెందిన అదే పార్టీ నాయకుడు ఈ మట్టి దందాను సాగిస్తున్నాడు. చీకటి పడగానే టిప్పర్లు, జేసీబీలు చెరువులోకి చేరిపోతున్నాయి. ప్రస్తుతం ఈ చెరువు మట్టిని వెంకటకృష్ణాపురం, తాడేపల్లిగూడెంలోని ఇటుకల బట్టీలకు విక్రయిస్తున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ. 6 వేల నుంచి రూ. 10 వేలకు అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్క రాత్రిలో 30 నుంచి 40 టిప్పర్ల మట్టి బయటకు తరలిపోతోంది. అమలు కాని కలెక్టర్ ఆదేశాలు కాలువలు.. చెరువు గట్లను కొల్లగొట్టి మట్టి అక్రమ తవ్వకాలు జరిపి, రవాణా చేసే వారిపై కేసులు నమోదు చేయాలని, అలాగే వాహనాలను సీజ్ చేయాలని ఏలూరు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఈ ఏడాది మార్చి 28న అధికారులను ఆదేశించారు. మట్టి అక్రమ రవాణా నియంత్రణకు ఇరిగేషన్, రెవిన్యూ, పోలీస్ అధికారులతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి, గట్టి నిఘా ఏర్పాటు చేయాలని సూచించారు. అయితే ఆదేశాలను అటు అధికారులు, ఇటు అక్రమార్కులు మట్టిలో కప్పెట్టేశారు.ఈ అక్రమ దందాపై స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా.. అధికారులు తమకేమీ తెలియనట్టు చోద్యం చూస్తున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి ఈ అక్రమ మట్టి తవ్వకాలకు అడ్డుకట్ట వేయాలని ప్రజలు కోరుతున్నారు. సూర్యచంద్రరావుపేటలో కృష్ణాపురం చెరువుకు తూట్లు -
శుచి, శుభ్రతతోనే శ్రీవారి ప్రసాదాల తయారీ
ద్వారకాతిరుమల: శ్రీవారి పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయని సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారంలో వాస్తవం లేదని దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు స్పష్టం చేశారు. దీనిపై ఇప్పటి వరకు భక్తుల నుంచి తమకు ఎటువంటి ఫిర్యాదు అందలేదన్నారు. వివరాల్లోకి వెళితే. తూర్పుగోదావరి జిల్లా, నల్లజర్ల మండలం అనంతపల్లి గ్రామానికి చెందిన విప్పిలి నరేష్ అనే వ్యక్తి తాను తెప్పించుకున్న శ్రీవారి పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయంటూ వీడియోలను సోషల్ మీడియాలో బుధవారం రాత్రి పోస్ట్ చేశాడు. అయితే ప్రసాదంలో అవి పొరపాటున వచ్చాయా.. లేక ఎవరైనా కావాలనే ఇది చేశారా.. అన్న భక్తుల అనుమానాలపై సాక్షి దినపత్రిక గురువారం ‘శ్రీవారి ప్రసాదం నాణ్యతపై దుమారం’ శీర్షికన కథనం ప్రచురించింది. దీనిపై ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి స్పందించి, అధికారులను వివరణ కోరారు. ఇదిలా ఉంటే విచారణ జరిపిన ఈఓ త్రినాథరావు వివరాలను మీడియాకు వెల్లడించారు. స్వామివారి లడ్డూ, పులిహోర, శర్కర పొంగలి ప్రసాదాలు శుచి, శుభ్రత కలిగిన ప్రత్యేక భవనం (అంబరుఖానా)లో తయారవుతాయని పేర్కొన్నారు. సిబ్బంది చేతులకు గ్లౌజ్లు, నోటికి మాస్క్లు, తలకు క్యాప్లు ధరించిన తరువాతే ప్రసాదాలను తయారు చేసి, ప్యాకింగ్ చేస్తారన్నారు. ఎవరైనా తిని పడేసిన ములక్కాయ ముక్కలు పులిహోర ప్రసాదంలో కలిశాయని అనుకోవడానికి ఏమాత్రం అవకాశం లేదన్నారు. ఎందుకంటే అంబరుఖానాలో అసలు ఎవరూ భోజనాలు చేయరన్నారు. అన్నప్రసాద భవనం, ప్రసాదాల తయారీ భవనం రెండూ వేరువేరుగా ఉండటం వల్ల ఇలాంటివి జరిగే వీలు లేదన్నారు. కావున భక్తులు దీన్ని గమనించాలని ఈఓ కోరారు. ఇలా జరగడం ఇది రెండోసారి.. రెండేళ్ల క్రితం ఓ వ్యక్తి శ్రీవారి పులిహోర ప్రసాదంలో పురుగు వచ్చిందంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. అప్పట్లో అది తీవ్ర దుమారాన్ని రేపింది. మళ్లీ ఇప్పుడు పులిహోర ప్రసాదంలో నమిలేసిన ములక్కాయ ముక్కలు వచ్చాయంటూ సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు. అయితే అధికారులకు కనీసం ఫిర్యాదు చేయకుండా సోషల్ మీడియాలో ఇలా పోస్ట్ చేయడం వల్ల ప్రసాదాల పవిత్రత, భక్తుల మనోభావాలు దెబ్బతినే ప్రమాదం ఉందని పలువురు అంటున్నారు. అసలు సోషల్ మీడియాలో పెట్టే ఈ పోస్టుల్లో వాస్తవం ఉందా.. లేదా అన్న అనుమానాలు కూడా సర్వత్రా వ్యక్తమవుతున్నాయి. ఈ పోస్టులపై అధికారులు పూర్తిస్థాయిలో విచారణ జరిపి, వాస్తవాలను నిగ్గుతేల్చి, బాధ్యులపై చర్యలు తీసుకోవాలని భక్తులు కోరుతున్నారు. దేవస్థానం ఈఓ వేండ్ర త్రినాథరావు వెల్లడి -
ఉచిత న్యాయ సహాయం
ఏలూరు (టూటౌన్): అవసరమైన వారికి ఉచిత న్యాయ సహాయం అందజేయనున్నట్లు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి తెలిపారు. రాష్ట్ర న్యాయ సేవాధికార సంస్థ అమరావతి వారి ఆదేశాల ప్రకారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి యన్.శ్రీలక్ష్మి శనివారపుపేటలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని, శ్రీరామనగర్ ఆరవరోడ్డులోని సైనిక వెల్ఫేరు ఆఫీసు నందు ఉన్న లీగల్ ఎయిడ్ క్లినిక్ను, జిల్లా కారాగారాన్ని గురువారం సందర్శించారు. శనివారపుపేటలోని బాలుర వసతి గృహంలో బాలలకు అందిస్తున్న ఆహార పదార్థాల నాణ్యత, మంచినీటి సౌకర్యం, పరిసరాల పరిశుభ్రతను పరిశీలించారు. అలాగే అబ్జర్వేషన్ హోమ్లోని బాలలకు ఉచిత న్యాయ సహాయంపై అవగాహన కల్పించారు. తదనంతరం శ్రీరామనగర్ 6వ రోడ్డులోని సైనిక సంక్షేమ కార్యాలయము నందు ఏర్పాటు చేసిన లీగల్ ఎయిడ్ క్లినికల్ను సందర్శించి, క్లినిక్ పనితీరు మాజీ సైనికులకు అందుతున్న న్యాయ సహాయంపై అడిగి తెలుసుకున్నారు. అలాగే జిల్లా కారాగారంలోని ఖైదీలకు అందుతున్న సౌకర్యాలపై అడిగి తెలుసుకున్నారు కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి నరసింహమూర్తి తదితరులు పాల్గొన్నారు. -
అంతర్జాతీయ చెస్ పోటీల్లో ప్రతిభ
టి.నరసాపురం: అంతర్జాతీయస్థాయి చదరంగం పోటీల్లో చిన్న గుర్వాయిగూడెం మోడల్ ప్రైమరీ స్కూల్ విద్యార్థి గుడికందుల చిరన్వి బాలికల అండర్–7 విభాగంలో ద్వితీయ స్థానం సాధించినట్లు విద్యాశాఖాధికారులు టి.రామ్మూర్తి, ఎస్.కళ్యాణిలు తెలిపారు. ఈ మేరకు స్థానిక పాఠశాలలో గురువారం అభినందన సభ నిర్వహించారు. ఆంధ్ర చెస్ అసోసియేషన్, ఎస్ఆర్ఆర్ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గత నెల 26న విజయవాడ నగరంలో కానూరులోని స్కాట్ స్పైన్ ఇంటర్నేషనల్ స్కూల్లో నిర్వహించిన ఇంటర్నేషనల్ ఓపెన్ రాపిడ్ పిడే రేటింగ్ చెస్ టోర్నమెంట్–2026లో చిరన్వి ప్రతిభ చూపిందన్నారు. హెచ్ఎం టి.కన్నయ్య, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: హనుమద్ జయంతి మహోత్సవాలల సందర్భముగా గురవాయిగూడెం మద్ది ఆంజనేయ స్వామి దేవస్థానంలో గురువారం విశేష పూజలు నిర్వహించారు. ఉపాలయంలో వేంకటేశ్వరస్వామి వార్షిక కల్యాణాన్ని సామూహికంగా నిర్వహించారు. సాయంత్రం 4 గంటల నుంచి రాష్ట్రంలో పలు ఆలయాలకు చెందిన వేద పండితులతో చతుర్వేదస్వస్తి పారాయణలు చేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్, ఈఓ ఆర్వీ చందన తెలిపారు. శుక్రవారం ఆలయంలో హనుమద్ వ్రతం, మహాశాంతి హోమం నిర్వహిస్తామన్నారు. ఉండి: మండలంలోని చెరుకువాడ గ్రామంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో గాయపడిన వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం చెరుకువాడ పెదపేటకు చెందిన కంకిపాటి జాన్బాబు (27) ఈ నెల 4వ తేదీ రాత్రి 9:30 గంటలకు తన ద్విచక్రవాహనంపై జాతీయ రహదారిలో ఉండి శివారు గోరింతోట వెళ్తున్నాడు. ఈ సమయంలో వెనుక నుంచి లారీ అతనిని ఢీ కొట్టడంతో అతని తలకు తీవ్రంగా గాయమైంది. వెంటనే అతనిని భీమవరంలోని ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఈ ప్రమాదంపై అతని తండ్రి లాజరు ఫిర్యాదు మేరకు పోలీసులు 5న కేసు నమోదు చేశారు. అప్పటి నుంచి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న జాన్బాబు పరిస్థితి విషమించడంతో గురువారం ఉదయం మృతి చెందాడు. -
20న మెడికల్ షాపుల బంద్
చెరువు మట్టి.. కొల్లగొట్టి ద్వారకాతిరుమల మండలంలోని కొందరు టీడీపీ నాయకులు రాత్రి అయితే చాలు చెరువుల్లోకి చేరి అక్రమంగా మట్టిని తరలించి జేబులు నింపుకుంటున్నారు. 8లో uఏలూరు (ఆర్ఆర్పేట): కెమిస్టుల జీవనాధారం, ప్రజారోగ్య పరిరక్షణ కోసం ఈనెల 20వ తేదీన దేశవ్యాప్తంగా మెడికల్ షాపుల బంద్ నిర్వహించనున్నట్లు కెమిస్ట్స్ అండ్ డ్రగ్గిస్ట్ వెల్ఫేర్ అసోసియేషన్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు గుట్ట రవిచంద్ర తెలిపారు. ఏలూరులోని అసోసియేషన్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. దేశవ్యాప్తంగా ఉన్న 12.40 లక్షలకు పైగా కెమిస్టులు, ఔషధ పంపిణీదారులు ఆన్లైన్ ఫార్మసీల నియంత్రణ లేని కార్యకలాపాలు, పెద్ద కార్పొరేట్ సంస్థల అన్యాయ భారీ డిస్కౌంట్ విధానాల వల్ల తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని తెలిపారు. ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిరసనగా ఈ నెల 20న దేశవ్యాప్తంగా బంద్ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. సెక్రటరీ వజ్రపు శేఖర్, ఈసీ మెంబర్లు నెరుసు కృష్ణ చైతన్య, చెన్నా రామ్ కుమార్, ఎం.వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ ఈఏపీ సెట్ పరీక్షలు గురువారం ప్రశాంతంగా జరిగాయి. ఏలూరులో మొత్తం 780 మంది పరీక్షలకు హాజరయ్యారు. సిద్ధార్థ క్వెస్ట్ కేంద్రంలో 120కి గాను 117 మంది, ఏలూరు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 170కిగాను 163 మంది, మధ్యాహ్నం 170కిగాను 159 మంది, ఏలూరు సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 180కి గాను 168 మంది, మధ్యాహ్నం 180కి గాను 173 మంది హాజరయ్యారు. -
ఫార్మర్ యాప్ రైతులకు వరం
కై కలూరు: వ్యవసాయ సాంకేతిక పరిజ్ఞానానికి ఫార్మర్ యాప్ ఒక నిదర్శనమని, ఇది రైతుల పాలిట వరంగా భావించాలని వ్యవసాయ శాఖ జిల్లా జాయింట్ డైరెక్టర్ షేక్ హబీబ్ బాషా చెప్పారు. మండలంలోని తామరకొల్లు, ముదినేపల్లి మండలం పెయ్యేరు గ్రామాల్లో ఫార్మర్ యాప్ ఉపయోగాలపై రైతులకు గురువారం అవగాహన కల్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ స్మార్ట్ ఫోన్లో గూగుల్ ప్లే స్టోర్ నుంచి ఫార్మర్ యాప్ డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. రైతులు తమ సాగు విస్తీర్ణం, వ్యవసాయ యాంత్రీకరణ, మార్కెట్ ధరలు ఎరువుల లభ్యత, పంట నష్టాలు, చీడపీడలపై అవగాహన, వ్యవసాయంపై సూచనలు సలహాలు ఇచ్చే ఏఐ అగ్రనమిస్ట్ వంటి సదుపాయాలు ఈ యాప్లో ఉన్నాయన్నారు. డౌన్లోడ్ చేసుకున్న రైతులందరూ కూడా ప్రతిరోజు యాప్లో లాగిన్ అయ్యి యాప్ ద్వారా అందే సమాచారాన్ని తెలుసుకుని ముందస్తుగా సాగు ప్రణాళికలు రూపొందించుకోవచ్చన్నారు. సాగు ఖర్చులు తగ్గించుకుని అధిక దిగుబడులు పొందవచ్చని సూచించారు. కార్యక్రమంలో కై కలూరు ఇన్చార్జి ఏడీఏ ఎం.శ్రీనివాస్కుమార్, కై కలూరు, ముదినేపల్లి మండలాల వ్యవసాయధికారులు ఆర్.దివ్య, వేణుమాధవ్, వీఏఏ చింతా బింద తదితరులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా మట్టి తవ్వకాలు
వీరవాసరం : మండలంలో మట్టి తవ్వకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. మండలంలోని మత్స్యపురి, బొబ్బనపల్లి, కొణితివాడ తదితర గ్రామాల్లో మట్టి తవ్వకాలు పెద్ద ఎత్తున సాగుతున్నాయి. వరి చేలలో మట్టిని తరలించుకోవాలంటే సీనరీజ్ను అందజేసి రెవెన్యూ అధికారులకు తెలియజేయాలి. ప్రభుత్వ అనుమతులు తీసుకుని మట్టిని తవ్వుకొని పనులు పూర్తి చేసుకోవాలి. అయితే అలాంటి పనులేమీ కట్టకుండానే సీనరీజిల్ని పన్నులను కట్టకుండానే స్థానిక గ్రామ రెవెన్యూ అధికారులను, రెవెన్యూ సిబ్బందిని మచ్చిక చేసుకుని మట్టి తవ్వకాలను పెద్ద ఎత్తున కొనసాగిస్తున్నారు. మట్టి ట్రాక్టర్లపై ఎలాంటి బరకాలను కప్పకపోవడంతో ఆ మట్టి రోడ్డుపై పడి ఇబ్బందులు పడుతున్నామని వాహనదారులు వాపోతున్నారు. సంబంధిత శాఖ అధికారులు తక్షణమే స్పందించి చర్యలు తీసుకోవాలని ప్రజలను కోరుతున్నారు. అయితే మట్టి తవ్వకాలపై తహసీల్దార్ ఏవీ రామాంజనేయులును వివరణ కోరగా మండలంలో మట్టి తవ్వకాలకు అనుమతులు లేవని స్పష్టం చేశారు. ఎవరైనా మట్టి తరలిస్తే పొక్లెయిన్లను, ట్రాక్టర్లను సీజ్ చేస్తామని హెచ్చరించారు. -
ఆక్వాపై అక్కసు !
వేసవి తాపం.. చేపకు శాపం ఆక్వా రంగం సంక్షోభంలో కొట్టుమిట్టాడుతోంది. ఎండలు ఎక్కువగా ఉండడంతో చెరువుల్లో చేపలను రక్షించేందుకు ఆక్వా రైతులు నానా పాట్లు పడుతున్నారు. 8లో uశురకవారం శ్రీ 15 శ్రీ మే శ్రీ 2026కై కలూరు: ఆర్థికాభివృద్ధిలో కీలకమైన ఆక్వారంగం కుదేలవుతోంది. చంద్రబాబు పాలనలో చెప్పే మాటలకు చేసే పనులకు పొంతన ఉండటం లేదు. రెండేళ్ల కాలంలో మేతల ధరలు పెంపు రొయ్యల రైతులకు శాపంగా మారుతోంది. తాజాగా మరో మారు ధరల పెంపు సూచనలతో రైతులు విలవిల్లాడుతోన్నారు. శుక్రవారం అధికారులు, రైతులు, వివిధ కంపెనీల ప్రతినిధులతో జరిగే సమావేశంలో మేత ధరలపై నిర్ణయం ఎలా ఉంటుందనే అంశం రాష్ట్రంలో ఆక్వా రైతులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తోంది. మరో పక్క ఇదే సాకుగా రొయ్యల ధరలను దళారులు తగ్గించేస్తున్నారు. ఉమ్మడి జిల్లాలో 2.90 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు జరుగుతోంది. ఇందులో చేపలు 1.80 లక్షల ఎకరాలు, 1.10 లక్షల ఎకరాల్లో రొయ్యల సాగు చేస్తున్నారు. దాదాపు 80 వేల మంది ఆక్వా రైతులు ఈ రంగంపై ఆధారపడి జీవిస్తున్నారు. ఏటా రాష్ట్రంలో 10 లక్షల టన్నుల రొయ్యల ఉత్పత్తుల్లో సింహభాగం ఉమ్మడి జిల్లాల నుంచి ఎగుమతులు అవుతున్నాయి. లీజు ధరలను బట్టి వనామీ రొయ్యలు టన్ను ఉత్పత్తికి రూ.2.60 లక్షలు. ఇదే టైగర్ రొయ్యలకు టన్నుకు రూ.3.50 లక్షలు పెట్టుబడి అవుతోంది. ఇప్పటికే రొయ్యలసాగులో వైరస్ల వల్ల నష్టం అధికంగా ఉంది. ఇప్పుడు కంపెనీలు మేతల ధరలను పెంచితే సాగు చేయలేమని రైతులు ఖరాఖండిగా చెబుతున్నారు. హామీలు మరిచిన ప్రభుత్వం ఉమ్మడి మేనిఫెస్టోలో సీఎం చంద్రబాబు, ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ ఆక్వారంగానికి వరాలు ప్రకటించారు. అవసరమున్న జిల్లాల్లో 5 వేల టన్నుల నిల్వ సామర్థ్యం కలిగిన కోల్డ్ స్టోరేజీలు, అన్ని జోన్లలో ఉన్నవారికి విద్యుత్ యూనిట్కు రూ.1.50కే సరఫరా, విద్యుత్ ట్రాన్మ్ఫార్మర్ల ధరలు తగ్గింపు, సబ్సిడీపై రొయ్యల సాగు, ఏరియేటర్ల పంపిణీ అని గొప్పగా చెప్పారు. ఆక్వా రైతులు కూడా ఆనందించారు. ఇవి అమలుకు మాత్రం నోచుకోవడం లేదు. గత ప్రభుత్వంలో రైతులకు మినహాయించి కూటమి పాలనలో 1.50 యూనిట్ అమలు జరగడం లేదు. కోల్డ్ స్టోరేజీల మాటే మరిచారు. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు, సబ్సిడీ ఏరియేటర్లు కలగా మారాయి. కరోనా సమయంలో సైతం ఆక్వా రైతులకు వైఎస్ జగన్ ప్రభుత్వం రవాణా సదుపాయం కల్పించి, ఈ రంగంపై ప్రేమను చాటుకుంది. ధరల నియంత్రణ ఏది కూటమి పాలనలో ఆక్వా ఉత్పత్తుల ధరల నియంత్రణ గాలిలో దీపంగా మారింది. సమస్యలు వస్తున్నపుడు ఆక్వా నాయకులుగా చలామణీ అవుతున్నా కొందరు ఎందుకొచ్చిన తంటా అంటూ నోరుమెదపడం లేదు. ఉదాహరణకు బుధవారం 100 కౌంట్ రొయ్యల ధర రూ.260 ఉండగా గురువారం రూ.250కి చేరింది. దళారులు సాకులు చెప్పి రూ.240కి కొనుగోలు చేశారు. ఆంధ్రప్రదేశ్ స్టేట్ డెవలప్మెంట్ అథారిటీ(అప్సడా) నిబంధనలను తుంగలో తొక్కుతున్నారు. ఇప్పటికై నా ప్రభుత్వం ఆక్వారంగంలో ధరల స్థిరీకరణకు ప్రత్యేక చట్టం చేయాలని పలువురు కోరుతున్నారు. రొయ్యల పట్టుబడి రొయ్యల మేత చంద్రబాబు పాలనలో ౖపైపెకి మేతల ధరలు ఎన్నికల హామీల అమలులో వైఫల్యం కరోనాలోనూ వైఎస్ జగన్ ప్రభుత్వం రైతుకు సేవలు ప్రభుత్వాన్ని ప్రశ్నించని కూటమిలో ఆక్వాసాగు నాయకులు -
పాలకవర్గ సమావేశం నిర్వహించాలి
ప్రతి మూడు నెలలకు ఒకసారి జరగాల్సిన ఐటీడీఏ పాలకవర్గ సమావేశం రెండున్న సంవత్సరాలుగా జరగకపోవడం బాధాకరం. కూటమి ప్రభుత్వం గిరిజన సమస్యలను పూర్తిగా గాలికి వదిలేసింది. అనేక సమస్యలతో గిరిజన గ్రామాల్లో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. – తెల్లం బాలరాజు, పోలవరం మాజీ ఎమ్మెల్యే గ్రామ స్థాయిలో గిరిజనులు ఎదుర్కొనే అన్ని సమస్యలను సభ్యులందరూ ఐటీడీఏ పాలకవర్గం దృష్టికి తీసుకువస్తారు. రెండున్నరేళ్లుగా సమావేశం జరగకపోవడం వల్ల గిరిజనులకు అన్యాయం జరుగుతుంది. ఇప్పటికై నా అధికారులు, ప్రభుత్వ పాలకులు స్పందించి చర్యలు తీసుకోవాలి – సరియం రామ్మోహన్రావు, ఏఐటీఎఫ్ జాతీయ కన్వీనర్, బుట్టాయగూడెం -
వైభవంగా శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి
జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు గురువారం నిత్య హోమం, వసంతోత్సవం, శ్రీచక్రస్నానం, మహా పూర్ణాహుతి వైభవంగా నిర్వహించారు. రాత్రి గజవాహన సేవ, ధ్వజారోహణం కార్యక్రమం నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం విద్యా వికాస్ యాజమాన్యం వల్లభనేని శ్రీనివాసరావు, ప్రసన్నలక్ష్మి దంపతులు, కోటపోతుల బాబి, కోటపోతుల శ్రీనివాస్ కుటుంబ సభ్యులు ఉభయదారులుగా వ్యవహరించారు. పండితులు పోనంగి పవన్కుమార్ ఆచార్యులు, ఆలయ ప్రధాన అర్చకులు నల్లూరి రవికుమార్ ఆచార్యులు, ఋషికేశ్ ఆచార్యులు వైదిక కార్యక్రమాలు చేశారు. శుక్రవారం ధ్రువమూర్తికి పంచామృత అభిషేకం, నవకల స్నపనం, ద్వాదశ ఆరాధన, ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, శ్రీ పుష్పయాగం నిర్వహించనున్నారు. ఆయా కార్యక్రమాలను ఆలయ చైర్మన్ అల్లూరి రామకృష్ణ, ఈఓ కలగర శ్రీనివాస్ పర్యవేక్షించారు. -
కువైట్లో చిక్కుకున్న కలిదిండి మహిళ
కలిదిండి(కై కలూరు): ఇద్దరు ఆడ పిల్లలకు తల్లి ప్రేమ కరువైందని కువైట్లో చిక్కుకున్న తన భార్యను ప్రభుత్వం చొరవ తీసుకుని తిరిగి పంపించే ఏర్పాట్లు చేయాలని కలిదిండి మండలం కలిదిండి ఇందిరా కాలనీకి చెందిన బండి వెంకన్న వేడుకుంటున్నాడు. వెంకన్న భార్య ప్రశాంతి పొట్టకూటి కోసం మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లిది. ఆమె కువైట్లో ఉండగానే ప్రశాంతి తల్లిదండ్రులు మరణించిన కడచూపుకు నోచుకోలేకపోయింది. బిడ్డల కోసం తిరిగి భారత్ రావడానికి శత విధాలా ప్రయత్నిస్తున్నా ఫలితం దక్కడం లేదు. అసలేం జరిగిందంటే..? ప్రశాంతి ఓ కాంట్రాక్టరు ద్వారా మూడేళ్ల క్రితం కువైట్ వెళ్లింది. రెండేళ్లు ఎగ్రిమెంటుపై కువైట్లో ఓ కుటుంబంలో పనికి కుదిరింది. ప్రతినెలా డబ్బులు కలిదిండిలో భర్త వెంకన్నకు పంపుతోంది. రెండేళ్లు పూర్తయిన తర్వాత తిరిగి ఇంటికి వెళ్తానని ఆమె యజమానులను కోరితే అందుకు నిరాకరించారు. పాస్పోర్టు ఇవ్వలేదు కానీ, తిరిగి ప్రశాంతిపై దొంగతనం నెపం ఆరోపించారు. చివరకు కువైట్ పోలీసులు విచారణ చేసి ప్రశాంతి తప్పు లేదని తేల్చారు. ప్రస్తుతం ఆమెకు భారత్ ఎంబసీలో ఆశ్రయం కల్పించారు. ఇదిలా ఉంటే దక్షిణాసియాలో యుద్ధం కారణంగా ఆమె ప్రయాణానికి ఆటంకం ఏర్పడింది. ప్రస్తుతం పరిస్థితులు చక్కబడ్డాయని తన భార్యను ఇండియాకు పంపించేలా చర్యలు తీసుకోవాలని భర్త వెంకన్న కోరుతున్నాడు. -
ఆక్వా రైతులను నట్టేట ముంచొద్దు
ఆక్వా రంగమే ఆర్థిక పరిపుష్ఠికి వెన్నెముక అని ఒక్క పక్క చెబుతూనే, మరొపక్క ఆక్వారంగం నడ్డివిరుస్తున్నారు. ఎన్నికల సందర్భంగా చంద్రబాబు, పవన్ కల్యాణ్ ఉమ్మడిగా చెప్పిన మేనిఫెస్టోను అమలు చేయాలి. మేతల కంపెనీలను ప్రభుత్వమే కట్టడి చేయాలి. – గంటా సంధ్య, వైఎస్సార్సీపీ రాష్ట్ర మహిళా విభాగ సెక్రటరీ, ముదినేపల్లి ఆక్వా రైతులు అప్పులు చేసి మరీ ఆక్వా సాగు చేస్తున్నారు. వాతావరణ పరిస్థితుల వల్ల రొయ్యల సాగులో వ్యాధులు వ్యాపిస్తున్నాయి. దీనికితోడు మేతల ధరలు పెంచడం దారుణం. వైఎస్ జగన్ పాలనకు, కూటమి పాలనకు మద్య తేడాను ఆక్వా రైతులు గమనిస్తున్నారు. – సమయం వీరాంజనేయులు, ఆక్వారైతు, వైఎస్సార్ సీపీ టౌన్ అధ్యక్షుడు, కై కలూరు రాష్ట్రంలోనే అధిక ఆక్వా ఉత్పత్తుల్లో ఈ ప్రాంతం వినతికెక్కింది. కూటమి పాలనలో ఆక్వా సాగు మేతల ధరల నియంత్రణ లేదు. పండించిన రైతు అందినకాడికి అమ్ముకోవాల్సి వస్తోంది. దళారులు లాభపడుతున్నారు. ఈ విధానం మారకపోతే పంట విరామం తప్పదు. – ఐనాల బ్రహ్మాజీరావు, ఆక్వా రైతు, వైఎస్సార్సీపీ రాష్ట్ర రైతు విభాగ జాయింట్ సెక్రటరీ -
కలుషిత బజ్జీల సంఘటనపై అధికారుల దర్యాప్తు
గణపవరం: మండలంలోని కొందేపాడు గ్రామంలో నిల్వ మైదాపిండితో చేసిన బజ్జీలు తిని 13 మంది తీవ్ర అస్వస్థతకు గురైన సంఘటనకు సంబంధించి అధికారుల దర్యాప్తు ముమ్మరంగా సాగుతుంది. గురువారం రాష్ట్ర ఫోరెన్సిక్ సహాయ సంచాలకులు శ్రీనివాస్, గణపవరం సిఐ నక్కారజనీకుమార్ వైద్య శాఖ అధికారులు కొందేపాడుగ్రామంలో బజ్జీలు వేసిన ఇంటిని పరిశీలించారు. వంట గదిలో మైదాపిండిని, నూనె తదితర వస్తువులను వారు పరిశీలించి శాంపిల్స్ సేకరించారు. ఘటనుకు గల కారణాలు తెలుసుకునే పనిలో వారు నిమగ్నమయ్యారు. కొందేపాడు గ్రామంలో బుధవారం చేపల చెరువు వద్ద గోదాములో నిల్వ ఉన్న మైదా పిండిని చెరువు వద్ద పనిచేసే మిరియాల మణికంఠ అనే వ్యక్తి తెచ్చి తమ సమీపబంధువైన ముఖమట్ల కనకదుర్గకు ఇవ్వడం, ఆమె ఆ మైదా పిండితో వేసిన బజ్జీలు కుటుంబసభ్యులతోపాటు ఇరుగు పొరుగువారికి ఇవ్వడం, అవి తిన్న 13 మంది వాంతులతో తీవ్ర అస్వస్థతకు గురై వివిధ ఆస్పత్రులలో చికిత్స పొందడం తెలిసిందే. అయితే ఒకరిద్దరు తప్ప మిగిలిన బాధితులంతా కోలుకోవడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఆ ఇద్దరి పరిస్థితి కూడా మెరుగుపడుతున్నట్లు వైద్యులు ధ్రువీకరించారు. గ్రామంలో పిప్పర పీహెచ్సీ వైద్యాధికారులు కె.ప్రియాంక, రియోలతో పాటు ప్రథమ చికిత్స శిబిరం నిర్వహిస్తున్నారు. అయితే ఇప్పటివరకూ కొత్త కేసులు ఏమీ లేవని వైద్యాధికారులు తెలిపారు. మరో 24 గంటల పాటు గ్రామంలోనే ఉండి పరిస్థితిని పరిశీలిస్తామని వారు తెలిపారు. -
పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ
ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో పనిచేసే ఓ పారిశుద్ధ్య కార్మికురాలి నిజాయతీ కారణంగా ఒక భక్తుడు పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ తిరిగి అతడికి దక్కింది. వివరాల్లోకి వెళ్తే తెలంగాణలోనిఖమ్మంకు చెందిన భవానీ శంకర్, కావేరీల వివాహం బుధవారం రాత్రి జరిగింది. గురువారం ఉదయం వారు శ్రీవారి క్షేత్రానికి వచ్చారు. ఆలయం నుంచి బయటకు వెళ్లే సమయంలో తన చేతికి ఉండాల్సిన సుమారు మూడున్నర కాసుల బంగారు బ్రాస్లెట్ లేకపోవడాన్ని భవానీ శంకర్ గుర్తించి ఆలయ కార్యాలయంలో ఫిర్యాదు చేశారు. అనివేటి మండపంలో పారిశుదద్ధ్య పనులు నిర్వహిస్తున్న అన్నపురెడ్డి దుర్గకు ఈ బ్రాస్లెట్ దొరికింది. వెంటనే ఆమె ఆలయ కార్యాలయానికి వెళ్లి, అక్కడున్న భవానీ శంకర్కు దాన్ని అందించారు. ఈ సందర్భంగా పలువురు దుర్గను అభినందించారు. పోగొట్టుకున్న బంగారు బ్రాస్లెట్ భక్తుడికి అందజేత


