Eluru District Latest News
-
జంకుతున్న జయమంగళ..
ముచ్చటగా మూడో పార్టీలో కొనసాగుతోన్న ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ జనసేన పార్టీని దూకుడుగా తీసుకెళ్లడానికి జంకుతున్నారు. నియోజకవర్గ టీడీపీ మాజీ ఎమ్మెల్యేగా పనిచేసిన జయమంగళ, వైఎస్సార్సీపీ పాలన చివరిలో పార్టీలో చేరారు. దీంతో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి కొల్లేరు ప్రాంత బిడ్డకు గౌరవం ఇవ్వాలనే ఉద్దేశంతో ఎమ్మెల్సీగా అవకాశం కల్పించారు. తీరా చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి రాగానే ఆయన జనసేన పార్టీలో చేరారు. చుక్కాని లేని నావగా మారిన జనసేన పార్టీకి జయమంగళ రావడంతో పవన్ కల్యాణ్ సామాజికవర్గంతో పాటు బీసీలు పార్టీకి అండగా ఉంటారని అందరూ భావిం చారు. కానీ సీన్ రివర్స్ అయ్యింది. ఇప్పుడు టీటీడీ బ్రేక్ దర్శనాల సిఫార్సుల లెటర్లకే ఎమ్మెల్సీ పరిమితమయ్యారు. అధికారులు సైతం ఎమ్మెల్సీని లెక్కచేయడం లేదు. ప్రోటోకాల్ లేదు. ఎమ్మెల్యే కామినేనితో ఎమ్మెల్సీ జయమంగళ కలసి కార్యక్రమాల్లో పాల్గొనడం వేళ్ల మీద లేక్కేయాల్సిందే. -
నేడు కార్పొరేషన్ కార్యాలయం వద్ద ధర్నా
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగర పాలక సంస్థలో పనిచేసే మున్సిపల్ ఆప్కాస్ కార్మికులు 1000 మందికి మార్చి నెలలో ఇవ్వాల్సిన జీతాలు నేటికి ఇవ్వలేదని, వెంటనే జీతాలు ఇవ్వాలని కోరుతూ ఏపీ మున్సిపల్ ఎంప్లాయిస్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో బుధవారం ఉదయం 10 గంటలకు కార్పొరేషన్ ఆఫీసు వద్ద ధర్నా నిర్వహించాలని ఫెడరేషన్ ఏలూరు నగర కమిటీ సమావేశం నిర్ణయించిందని ఆ సంఘ నాయకులు తెలిపారు. స్థానిక ఐఎఫ్టీయూ కార్యాలయంలో ఫెడరేషన్ సమావేశం యూనియన్ అధ్యక్షుడు లావేటి కృష్ణారావు అధ్యక్షతన మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఫెడరేషన్ నగర కార్యదర్శి జి.వెంకటేశ్వరరావు మాట్లాడుతూ నిధి పోర్టల్ పేరుతో కార్మికుల జీతాలను ఆలస్యం చేస్తున్నారని, దానివల్ల కార్మికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారని తెలిపారు. సమావేశంలో యూనియన్ గౌరవాధ్యక్షుడు ఇఫ్టూ ఏలూరు నగర అధ్యక్షుడు బి.సోమయ్య, పంతం చిన్న నాగరాజు, బంగారు వెంకటేశ్వరరావు, తానంకి జార్జి పాల్గొన్నారు. -
సీహెచ్సీలో ఫ్యాన్లకు మరమ్మతులు
దెందులూరు: స్థానిక కమ్యూనిటీ హెల్త్ సెంటర్లో ఫ్యాన్లకు మంగళవారం మరమ్మతులు చేయించారు. సీహెచ్సీలో ఉన్న 3 ఫ్యాన్లు మరమ్మతులకు గురవడంతో ఆస్పత్రి సిబ్బంది, రోగులు పడుతున్న అవస్థలపై ‘ఫ్యాన్లు రిపేరు చేయించరూ..’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై స్పందించిన సీహెచ్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్బాబు రోగులకు ఇబ్బందులు లేకుండా చర్యలు తీసుకున్నారు. వెంటనే మూడు ఫ్లాన్లకు మరమ్మతులు చేయించారు.ఏలూరు (ఆర్ఆర్పేట): ఇటీవల నిర్వహించిన ఇంటర్మీడియెట్ పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనంను జాగ్రత్తగా ఎటువంటి తప్పులకు తావు లేకుండా పూర్తి చేయాలని ఇంటర్మీడియెట్ విద్యా మండలి కార్యదర్శి రంజిత్ బాషా ఆదేశించారు. మంగళవారం స్థానిక కోటదిబ్బలోని ప్రభుత్వ జూనియర్ కళాశాల ప్రాంగణంలో జరుగుతున్న మూల్యాంకన కేంద్రాన్ని ఆయన తనిఖీ చేశారు. ఏలూరు జిల్లాలో ప్రస్తుతం అన్ని సబ్జెక్టుల మూల్యాంకనం పూర్తయిందని, ఇంగ్లీష్ సబ్జెక్టు మూల్యాంకనం బుధవారంతో పూర్తవుతుందని తెలిపారు. ఈ సందర్భంగా మూల్యాంకన కేంద్రం స్ట్రాంగ్ రూమ్, స్కానింగ్ రూమ్లను తనిఖీ చేసి శిబిరం అధికారి కే యోహాన్కు, ఇతర అధికారులకు తగిన సూచనలు ఇచ్చారు. అనంతరం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు జరుగుతున్న తరగతులను పరిశీలించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా కోర్టులో వినియోగం నిమిత్తం రిజిస్టర్లు, బ్రౌన్ పేపర్లు, కంప్యూటర్ పేపర్లు వంటి స్టేషనరీ వస్తువులు కొనుగోలు చేసేందుకు సీల్డ్ టెండర్లు కోరుతున్నట్లు జిల్లా జడ్జి ఎస్.శ్రీదేవి ఒక ప్రకటనలో తెలిపారు. నమూనా కాగితాలతోపాటు సీల్డ్ టెండర్ కొటేషన్లు ప్రిన్సిపాల్ డిస్ట్రిక్ట్ కోర్ట్, ఏలూరు చిరునామాకు కార్యాలయ పనిదినాలలో ఈ నెల 18 సాయంత్రం 5 గంటలలోపు అందేలా పంపాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రెండో విడత జేఈఈ మెయిన్స్ పరీక్షల ఐదో రోజు మంగళవారం 465 మంది విద్యార్థులు హాజరయ్యారు. 5వ రోజు పరీక్షలు అన్ని కేంద్రాల్లో కేవలం మధ్యాహ్నం సెషన్లో మాత్రమే నిర్వహించారు. ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో పరీక్షకు 70 మందికి గాను 63 మంది హాజరు కాగా ఏడుగురు గైర్హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో మధ్యాహ్నం సెషన్లో 179 మందికి గాను 158 మంది హాజరు కాగా, శశి ఇంజనీరింగ్ కళాశాలలో 107 మందికి 77 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో 99 మందికి 83 మంది హాజరు కాగా, డీఎన్ఆర్ కళాశాలలో మధ్యాహ్నం సెషన్లో 100 మందికి 84 మంది హాజరయ్యారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రేషన్ పంపిణీ విషయంలో నిర్లక్ష్యం వహిస్తే డీలర్లను తొలగిస్తామని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ హెచ్చరించారు. మంగళవారం కలెక్టరేట్లో డీలర్ల పనితీరును జేసీ సమీక్షించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇటీవల ఐవీఆర్ఎస్ ఫీడ్బ్యాక్, రేషన్ పంపిణీ తదితర విషయాల్లో తక్కువ పనితీరు కనబరిచిన 45 మంది చౌకధరల దుకాణాల డీలర్లతో మాట్లాడారు. ప్రజలకు రేషన్ పంపిణీని సక్రమంగా చేయాలనీ, రేషన్ కోసం వచ్చే వారితో మర్యాదగా ప్రవర్తించాలన్నారు. తక్కువ పనితీరు కనబరిచిన 45 రేషన్ దుకాణాలను సీఎస్ డీటీలు వెంటనే వ్యక్తిగతంగా సందర్శిస్తామన్నారు. సమావేశంలో ఏలూరు జిల్లా పౌర సరఫరాల అధికారి బాబు విలియమ్స్, పౌర సరఫరాల సంస్థ జిల్లా మేనేజర్ శివరామమూర్తి పాల్గొన్నారు. -
గర్బిణుల ప్రాణాలతో చెలగాటం
ఏలూరు టౌన్: వైద్యులను దేవుడితో సమానంగా గౌరవిస్తూ ఉంటారు... ప్రాణాపాయ స్థితిలో హాస్పిటల్కు వెళితే వైద్యుడు తన ప్రాణాలను కాపాడతారనే నమ్మకంతో ఉంటారు. ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగం (ఎంసీహెచ్)లో గర్భిణుల ప్రాణాలతో చెలగాటం ఆడుతుందనే అభిప్రాయం సర్వత్రా వ్యక్తం అవుతోంది. నవమాసాలు మోసి... పండంటి బిడ్డకు జన్మనిస్తున్న గర్భిణుల ప్రాణాలకు భరోసా లేకుండా పోతుందంటూ బంధువులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకటీ...రెండో కాదు ఏకంగా పదుల సంఖ్యలో నిత్యం ఇదే తరహా తంతు సాగుతున్నా... జిల్లా స్థాయి అధికారులు సైతం ఏమీ చేయలేకపోవడంపై ప్రజల్లో అసంతృప్తి వ్యక్తం అవుతుంది. గర్భిణులకు ఆపరేషన్లు చేయగా... కుట్లు విడిపోవటం, తీవ్ర ఇన్ఫెక్షన్లతో అనారోగ్యం బారినపడటం, ప్రాణాపాయ స్థితి ఎదుకావడం ఇక్కడ సర్వసాధారణ అంశంగా మారిపోయింది. ప్రాణాలంటే... నిర్లక్ష్యమా ? ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ విభాగం వైద్యులు, వైద్య సిబ్బందికి మనుషుల ప్రాణాలంటే లెక్కలేదనీ... తీవ్ర నిర్లక్ష్యం కారణంగానే గర్భిణుల ఆపరేషన్ల విషయంలో విఫలం అవుతున్నారని అంటున్నారు. గత ఏడాది కాలంలో సుమారు 50 నుంచి 60మందికి పైగా గర్భిణులు ప్రాణాపాయ స్థితిని ఎదుర్కొంటూ హాస్పిటల్ నుంచి బలవంతంగా బయటకు వెళ్లిపోవటం పరిస్థితికి అద్దం పడుతుంది. తాజాగా ఎంసీహెచ్ బ్లాక్లో నిడిగట్టు మౌనిక, కొడాలి సుప్రియ, వెన్నెల, పెనుమాల రమ్య, లావణ్య ఇలా గర్బిణిలు వైద్యులు, సిబ్బంది అలసత్వంతో అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆపరేషన్ చేసిన అనంతరం కనీసం కుట్లు సరిగ్గా వేయకపోవటంతో కుట్లు విడిపోయి, తీవ్ర ఇన్ఫెక్షన్తో విలవిల్లాడుతున్నారు. పోనీ బయటకు వెళ్ళి వేరే హాస్పిటల్లో వైద్య చికిత్స చేయించుకుందామని అనుకుంటే... డిశ్చార్జ్ చేయకుండా వైద్య సిబ్బందితో బెదిరింపులకు పాల్పడడం నిత్య కృత్యంగా మారిపోయిందనే ఆరోపణలు ఉన్నాయి. ఎంసీహెచ్ బ్లాక్ వద్ద ఆందోళన ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ వద్ద గర్భిణులపై వైద్యులు, వైద్య సిబ్బంది తీరుకు నిరసనగా మాలమహానాడు రాష్ట్ర నాయకులు అబ్బూరి అనిల్ ఆధ్వర్యంలో పెద్ద ఎత్తున బాధితుల తరఫున ఆందోళనకు దిగారు. హాస్పిటల్ గేటు వద్ద బైఠాయించి బాధితుల బంధువులు, యువతతో కలిసి ధర్నా చేశారు. ప్రజలకు సరైన వైద్యం చేయకుండా నిర్లక్ష్యం వహిస్తూ అధికారులు చర్యలు చేపట్టకపోవటంపై ఆవేదన వ్యక్తం చేశారు. ఎంతోమంది పేదవర్గాల మహిళలు ప్రసూతి కోసం జీజీహెచ్కు వస్తుంటే... ఇలా ప్రాణాలతో చెలగాటం ఆడటం దారుణమంటూ నిరసన తెలిపారు. పీజీలతో వైద్యం చేయిస్తూ...చోద్యం చూస్తున్న అధికారులు కుట్లు విడిపోయి... ఇన్ఫెక్షన్లతో తీవ్ర అనారోగ్యం ఏలూరు జీజీహెచ్లో వైద్యసేవలపై తీవ్ర అసంతృప్తి ఏలూరు జీజీహెచ్లో వైద్యులు, సిబ్బంది తీరు దారుణంగా ఉంది. పేద మహిళలు ప్రసూతికి వస్తే ... తిరిగి ఇంటికి క్షేమంగా వెళ్లే పరిస్థితి లేకుండా చేస్తున్నారు. రెండు, మూడు సార్లు కుట్లు వేయటానికి వాళ్ళు మనుషులేనా ? అంటూ మండిపడ్డారు. కుట్లు విడిపోయి ఇన్ఫెక్షన్లతో బాధపడుతూ ఉంటే కనీస వైద్యచికిత్స చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు. ఆపరేషన్ చేశాక 20 నుంచి నెలరోజుల వరకూ హాస్పిటల్లోనే ఉంచుతూ... మందులు బయటకు రాస్తూ వ్యాపారం చేస్తున్నారు. – అబ్బూరి అనిల్, మాలమహానాడు, రాష్ట్ర నాయకులు నేను కడుపులో నొప్పితో సుమారు ఆరునెలల నుంచీ ఏలూరు జీజీహెచ్కు తిరుగుతూ ఉన్నా. మేము ప్రైవేటు ఆసుపత్రికి వెళ్లి చూపించుకునే స్తోమత లేక జీజీహెచ్కు వస్తే... ఇక్కడ వైద్యులు కనీసం చేయి పట్టుకుని కూడా చూడలేదు. రక్త పరీక్షలు పేరుతో తిప్పుతూ ఉన్నారు. కడుపులో గడ్డలు ఉన్నాయంటారు.. కానీ చికిత్స మాత్రం చేయడం లేదు. పేదలకు సరైన వైద్యం అందే పరిస్థితి కనిపించడం లేదు. ఆసుపత్రి అధికారులు దీనిపై చర్యలు తీసుకోవాలి. – దానం భవానీ, తంగెళ్లమూడి -
అనాథ బాలలకు నూతన జీవితం
గర్భిణుల ప్రాణాలతో చెలగాటం ఏలూరు సర్వజన ఆసుపత్రిలోని మాతాశిశు విభాగంలో గర్భిణుల ప్రాణాలతో వైద్య సిబ్బంది చెలగాటం ఆడుతున్నారని విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. 8లో uకలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు (ఆర్ఆర్పేట): కన్నతల్లి చనిపోయి, తండ్రి వదిలేసిన అనాథ బాలలు ముగ్గురిని కలెక్టర్ వెట్రిసెల్వి అక్కున చేర్చుకున్నారు. కుక్కునూరు చెందిన ఏడు, ఆరు, నాలుగు సంవత్సరాల వయసు కలిగిన ముగ్గురు బాలికల తల్లి ఇటీవల మరణించింది. తండ్రి పిల్లలను వదిలేసి ఎటో వెళ్లిపోయాడు. తల్లిదండ్రులు లేక దీనస్థితిలో ఉన్న వారి పరిస్థితిని సోషల్ మీడియా ద్వారా తెలుసుకున్న కలెక్టర్ వెట్రిసెల్వి ఆ పిల్లల పరిస్థితిని పరిశీలించి తీసుకురావాల్సిందిగా ఐసీడీఎస్ పీడీ శారద, జిల్లా బాలల సంరక్షణ అధికారి సీహెచ్ సూర్య చక్రవేణిలను ఆదేశించారు. కలెక్టరేట్కు తీసుకువచ్చిన ఆ బాలికలతో కలెక్టర్ వెట్రిసెల్వి కొంతసేపు మాట్లాడారు. వారికి కొత్త బట్టలు, చెప్పులు, బిస్కెట్లు, డ్రాయింగ్ పుస్తకాలు, కలర్ పెన్సిల్లు నోట్ బుక్స్ ఇచ్చి, తదుపరి చర్యలు తీసుకోవలసిందిగా జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సూర్య చక్రవేణికి ఆదేశాలు జారీ చేశారు. -
మూల్యాంకనం సమస్యలు పరిష్కరించండి
ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల జవాబు పత్రాల మూల్యాంకనంలో తలెత్తుతున్న సమస్యలను తక్షణమే పరిష్కరించాలని కోరుతూ జాక్టో నాయకులు మంగళవారం జిల్లా విద్యాశాఖాధకారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాక్టో జిల్లా చైర్మన్ పువ్వుల ఆంజనేయులు మాట్లాడుతూ మూల్యాంకన కేంద్రంలో స్థిరమైన, వేగవంతమైన నెట్వర్క్ సదుపాయం కల్పించాలని, ట్యాబ్ పరికరాల నాణ్యత, పనితీరును సమగ్రంగా సమీక్షించాలని డిమాండ్ చేశారు. మూల్యాంకన కేంద్రంలో మౌలిక సదుపాయాలను మెరుగుపరచాలని, స్పెషల్ అసిస్టెంట్లకు తీవ్ర ఇబ్బందుల విషయంలో సాంకేతిక సిబ్బందిని అందుబాటులో ఉంచాలన్నారు. సిబ్బందికి రెమ్యూనరేషన్ పెంచాలని కోరారు. -
ఓటరు జాబితాలో అవకతవకలపై అప్రమత్తం
ఏలూరు టౌన్: ఓటరు జాబితా సవరణలో జరుగుతున్న అవకతవకలపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అప్రమత్తంగా ఉండాలని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ బూత్ కమిటీ రాష్ట్ర అధ్యక్షుడు సుధాకర్రెడ్డి అన్నారు. బూత్ కమిటీ రీజనల్ కోఆర్డినేటర్ బీవీఆర్ చౌదరి, జిల్లా బూత్ కమిటీ అధ్యక్షుడు చింత అనిల్ ఆధ్వర్యంలో ఏలూరులో జిల్లా స్థాయి బూత్ కమిటీ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో ఓటర్ల జాబితాలో సవరణపై పవర్పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా పార్టీ నేతలకు, బూత్కమిటీ సభ్యులకు అవగాహన కల్పించారు. సుధాకర్రెడ్డి మాట్లాడుతూ దేశంలోని కొన్ని రాష్ట్రాల్లో స్పెషల్ ఇన్సెంటివ్ రివిజన్ (ఎస్ఐఆర్) పేరుతో ఓట్ల సవరణలో ఏవిధంగా ఓట్లను భారీఎత్తున తొలగించారో చూశామన్నారు. ఓటర్ వెరిఫికేషన్ ప్రక్రియపై ప్రతి బూత్ కమిటీ సభ్యుడు అవగాహన చేసుకుంటూ రాబోయే ఎన్నికలకు సిద్ధం కావాలని పిలుపునిచ్చారు. సమావేశంలో వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, పీఏసీ సభ్యులు, ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, పార్టీ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, కై కలూరు, చింతలపూడి, ఏలూరు పరిశీలకులు నూకపెయ్యి సుధీర్బాబు, దాసరి రమేష్, డీవీఆర్కే చౌదరి, పార్టీ నేతలు, బూత్కమిటీ సభ్యులు హాజరయ్యారు. -
15 నాటికి నీటి సరఫరా నిలిపివేత
పాలకొల్లు సెంట్రల్: సాగునీటి సంఘాల అధ్యక్షుల సమన్వయంతో మురుగు కాలువలు ప్రక్షాళణ చేసే దిశగా చర్యలు చేపడతామని డిస్ట్రిబ్యూషన్ కమిటీ చైర్మన్ పెన్మెత్స రామభద్రరాజు అన్నారు. మంగళవారం సాగునీటి సంఘాల అధ్యక్షులు, అధికారులతో స్థానిక డ్రెయినేజీ శాఖ కార్యాలయంలో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఈఈ సీహెచ్ మురళీకృష్ణ మాట్లాడుతూ ఈ నెల 15 నాటికి ప్రధాన కాలువలకు నీటి కట్టడం జరుగుతుందన్నారు. అనంతరం మురుగు కాలువల ప్రక్షాళనపై చర్యలు చేపడతామని చెప్పారు. వీటి బాధ్యతను సాగునీటి సంఘ అధ్యక్షులు చేపడతారని తెలిపారు. గతంలో ఉన్న రేట్లకు పని చేయడానికి ఎవరూ ముందుకు రావడంలేదని అన్నారు. కార్మికుల వేతనాల పెంపుపై ఉన్నతాధికారులతో మాట్లాడతామని చెప్పారు. కార్యక్రమంలో ఏఈఈలు ఎ.దుర్గాప్రసాద్, జి.సతీష్, బి.సాయిశాంతం, సాగునీటి సంఘాల అధ్యక్షులు గొట్టుముక్కల సూర్యనారాయణరాజు, ఇంటి శ్రీరాములు, ఆరుమిల్లి రామశ్రీనివాస్, దేవరపు దొరబాబు, దేవళ్ల మోహన్, మాతా రత్నరాజు, కుక్కల సత్యనారాయణ, పులంకడం రాఘవులు, టి.వెంకట కృష్ణారావు తదితరులు పాల్గొన్నారు. -
సెప్సిస్ ప్రాణాంతకం..
● తీవ్ర అనారోగ్యానికి గురువుతున్న బాధితులు ● జాగ్రత్తలు తప్పనిసరి అంటున్న వైద్యులు యలమంచిలి: ప్రస్తుతం వాతావరణ మార్పులతో ప్రజలు రోగాల బారినపడుతున్నారు. చాలారోగాలు ఇన్ఫెక్షన్ వల్ల వస్తుంటాయి. సాధారణంగా నలతగా ఉందంటే ఇన్ఫెక్షన్ సోకిందంటూ ఉంటా. వైద్యులు వివిధ పరీక్షలు చేసిన తరువాత ఏ ఇన్ఫెక్షనో చెబుతారు. అయితే ఈ సమస్యపై అంతులేని నిర్లక్ష్యం వహిస్తుంటాం. ఇన్ఫెక్షన్ ప్రాణాంతకం అయినా చాలామంది కొంచెం నలతగా ఉంటే సొంత వైద్యం చేస్తుంటారు. ఇలాంటి సందర్భాల్లో అనేక మంది ఇన్ఫెక్షన్ల బారిన పడి ప్రాణాలు కోల్పోతున్నారు. ఇన్ఫెక్షన్ను సకాలంలో గుర్తించి చికిత్స అందిస్తే ప్రాణాలు కాపాడవచ్చు. తీవ్రమైన ఇన్ఫెక్షన్ను సెప్సిస్ అంటారు. శరీరంలో సోకే ఎలాంటి ఇన్ఫెక్షన్ అయినా అదుపు చేయకపోతే అది తీవ్రమైన ఇన్ఫెక్షన్కు (సెప్సిస్)కు దారి తీయవచ్చు. తొలుత ఇన్ఫెక్షన్ నిర్ధారణ కచ్చితంగా జరగాలి. అనంతరం నియంత్రణకు అవసరమైన చికిత్స చేయించాలి. మల్టిఫ్లెక్స్ పీసీఆర్ అనే అధునాతన వైద్య పరీక్ష ద్వారా త్వరితగతిన సెప్సిస్ను నిర్ధారించవచ్చు. బయోఫయర్ ద్వారా మూడు గంటల్లో నిర్ధారణ చేయవచ్చు. నిర్ధారణతోపాటు ఇన్ఫెక్షన్ నియంత్రణకు కావాల్సిన మందులు వాడాలి. వ్యక్తిగత పరిశుభ్రతతోపాటు యాంటిబయాటిక్స్ వైద్యుల సలహాలు మేరకు మాత్రమే వాడాలి. – డాక్టర్ ఆర్ శ్రీ సాహిత్య ఎమర్జెన్సీ,ఐసీయూ, అత్యవసర చికిత్స వైద్య నిపుణురాలు, పాలకొల్లు ముఖ్యంగా 60 సంవత్సరాలు దాటిన వారికి, చిన్న పిల్లలకు, ఊపిరితిత్తులు, గుండె, లివర్ లాంటి దీర్ఘకాలిక వ్యాధులు ఉన్నవారికి, హెచ్ఐవీ బాధితులకు, సుగర్ వ్యాధి బాధితులకు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారికి సోకే అవ కాశం ఉంది. ప్రతి సంవత్సరం ఐదు కోట్ల మంది సెప్పిస్ వ్యాధి బారిన పడుతున్నారు. వీరిలో కోటిమంది ప్రాణాలు ప్రమాదస్థితికి చేరుకుంటున్నా యి. ప్రపంచవ్యాప్తంగా 50శాతం మంది సెప్సిస్వల్ల ప్రాణాలు కోల్పోతున్నారు. లక్షణాలు ఇది సూక్ష్మ క్రిముల ద్వారా వస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రతలు హెచ్చు తగ్గులుగా ఉండటం, గుండె వేగంగా కొట్టుకోవడం, శ్వాస వేగంగా తీసుకోవడం, విపరీతమైన నీరసం, తీవ్రమైన చలి, ఆయాసం, మూత్ర విసర్జన తగ్గిపోవడం, బీపీ తగ్గడం, పెరగడం, రోగి తికమక పడడం తదితర లక్షణాలు వ్యాధి బాధితుల్లో కనిపిస్తాయి. వ్యాధి సోకే భాగాలు నూటికి 50 శాతం ఊపిరితిత్తులు. కిడ్నీలు, బ్రెయిన్, యూరినరి ట్రాక్, చర్మం, ఇతర భాగాల్లో వ్యాధి ఇన్ఫెక్షన్లు సోకుతాయి. కడుపులో ఇన్ఫెక్షన్లు రావడం ద్వారా అల్సర్లు ఏర్పడతాయి. కాళ్లల్లో పుండ్లు ఏర్పడి చీము పట్టి పరిస్థితి ప్రమాదంగా మారి కొన్నిసార్లు ఆపరేషన్ల ద్వారా ఆ గాయాలను తొలగించాల్సి వస్తుంది. బ్లడ్ కల్చర్, కార్బాఆర్, బయోఫైయర్ (అన్ని రకాల సూక్ష్మ క్రిములకు) పరీక్షల ద్వారా సెప్సిస్ని నిర్ధారిస్తారు. అంటువ్యాధి కారకాలు, వాటి విషపూరిత పదార్థాల వ్యాప్తి, వాటి స్థానం నుంచి రక్త ప్రవాహంలో కలవడం ద్వారా ఇన్ఫెక్షన్ సోకుతుంది. ఇది ఒక ప్రమాదకరమైన, ప్రాణాంతకమైన జబ్బు అని వైద్యులు హెచ్చరిస్తున్నారు. తక్షణమే గుర్తించి చికిత్స చేయని పక్షంలో శరీరంలోని పలు అవయవాలు ఇన్ఫెక్షన్ల వల్ల పనిచేయడం మానేస్తాయని వివరిస్తున్నారు. చివరికి రోగి ప్రాణాలు కోల్పోయే ప్రమాదం ఉందని హెచ్చరిస్తున్నారు. వీరికి సకాలంలో వ్యాధి నిర్ధారణ చేసి వైద్యం అందించని పక్షంలో తీవ్రమైన ఇన్ఫెక్షన్ (సెప్సిస్) మారి రోగులను ఐసీయూలో అడ్మిట్ చేయాల్సి వస్తుందని చెబుతున్నారు. -
వైఎస్సార్ విగ్రహ మరమ్మతులకు అనుమతివ్వండి
ఏలూరు టౌన్: మాజీ ముఖ్యమంత్రి, దివంగత మహానేత డాక్టర్ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం వద్ద మరమ్మతులు చేపట్టేందుకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ వైఎస్సార్ సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఏలూరు జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వికి వినతిపత్రం సమర్పించారు. ఏలూరు ఫైర్స్టేషన్ సెంటర్లో మాజీ ముఖ్యమంత్రి వైఎస్సార్ విగ్రహం చుట్టూ ఉన్న రెయిలింగ్, ఫ్లోరింగ్ మరమ్మతులకు అనుమతులు మంజూరు చేయాలని కోరారు. గతంలో వైఎస్సార్ విగ్రహం వద్ద వాటర్ ఫౌంటెయిన్ నిర్మిస్తామంటూ రైలింగ్, ఫ్లోరింగ్ తొలగించారనీ, కానీ నేటికీ అభివృద్ధికి నోచుకోలేదన్నారు. ప్రభుత్వ నిధులతో కాకుండా తామే సొంత ఖర్చులతో మరమ్మతులు చేసేందుకు అనుమతి ఇవ్వాలని కలెక్టర్ను కోరారు. ఏలూరు నగరంలోనూ ప్రజలు అనేక సమస్యలు ఎదుర్కొంటున్నారనీ వాటి పరిష్కారానికి జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి చర్యలు చేపట్టాలని కోరినట్లు సమన్వయకర్త జయప్రకాష్ తెలిపారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ ఎస్సీసెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, బీసీ సెల్ జిల్లా అధ్యక్షులు నెరుసు చిరంజీవి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్, రాష్ట్ర మహిళ ప్రదాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, వాణిజ్య విభాగం రాష్ట్ర కార్యదర్శి భాస్కర్ల బాచి, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల ఉన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వికి వైఎస్సార్ సీపీ నాయకుల వినతి -
ప్రశాంతంగా పోలీస్ పదోన్నతుల అర్హత పరీక్షలు
ఏలూరు టౌన్: ఉమ్మడి ఉభయగోదావరి జిల్లా, ఉమ్మడి కృష్ణాజిల్లాలో పని చేస్తున్న హెడ్ కానిస్టేబుల్స్, ఏఎస్ఐలు ఫిట్ఫర్ ఎస్ఐ ప్రమోషన్స్లో భాగంగా ప్రీ ప్రమోషనల్ ట్రైనింగ్ క్వాలిఫైయింగ్ పరీక్షలు ఏలూరు పోలీస్ ప్రధాన కార్యాలయం సమీపంలోని శ్రీ సురేష్చంద్ర బహుగుణ స్కూల్లో ప్రశాతంగా జరిగాయి. ఏలూరు జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ ప్రత్యేక పర్యవేక్షణలో మంగళవారం ఉదయం 9గంటల నుంచి 11.30గంటల వరకూ పరీక్షలు నిర్వహించారు. పేపర్–1 పరీక్షకు మొత్తం 112మంది హాజరుకాగా, వారిలో మహిళలు 29మంది, పురుషులు 83మంది ఉన్నారు. మధ్యాహ్నం 2గంటల నుంచి సాయంత్రం 4.30గంటల వరకూ పేపర్–2 పరీక్ష నిర్వహించారు. ఏలూరు రేంజ్ ఐజీ జీవీజీ అశోక్ కుమార్ పరీక్ష కేంద్రాలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. పరీక్షల నిర్వహణ, సదుపాయాలను పరిశీలించారు. ఎక్కడా అవకతవకలకు తావులేకుండా పారదర్శకంగా, పటిష్టమైన ఏర్పాట్లు మధ్య పరీక్షలు సాగుతున్నాయని తెలిపారు. బుధవారం ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో పరీక్షలకు హాజరైన సిబ్బందికి టర్న్ అవుట్, స్వ్కాడ్ డ్రిల్, ఆర్మ్స్డ్రిల్, ఆయుధాల కోల్నా జోల్నా, వైవా, నేరస్థల పరిశీలన, నేర స్థలంలో వినియోగించే సాంకేతిక పరిజ్ఞానం వంటి అంశాలపై పరీక్షలు నిర్వహిస్తామన్నారు. ఈ రెండు పరీక్షల్లో అర్హత సాధించిన అభ్యర్థులకు పోలీస్ ట్రైనింగ్ కాలేజ్లో శిక్షణ అనంతరం వారికి సబ్ ఇన్స్పెక్టర్లుగా పదోన్నతులు లభిస్తాయని ఐజీ అశోక్కుమార్ స్పష్టం చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం ఏఎస్పీ ఆర్.సుస్మిత, పోలవరం డీఎస్పీ యం.వెంకటేశ్వరరావు, డీటీసీ డీఎస్పీ సీహెచ్జీవీ ప్రసాద్, డీఏఆర్ అదనపు ఎస్పీ ఎల్.చెంచిరెడ్డి, తూర్పుగోదావరి జిల్లా ఈస్ట్జోన్ డీఎస్పీ బీ.విద్య, డీఏఆర్ డీఎస్పీ బీ.చంద్రశేఖర్ తదితరులు పాల్గొన్నారు. -
లక్ష్మీపురంలో చోరీ
దెందులూరు: పెదవేగి మండలం లక్ష్మీపురం గార్డెన్స్లో రైతు మన్నె సుబ్రహ్మణ్యం ఇంట్లో గుర్తు తెలియని వ్యక్తులు చోరీకి పాల్పడ్డారు. గత నాలుగు రోజుల నుంచి యజమానులు ఇంట్లో ఉండకపోవడంతో అదును చూసి చోరీ చేసినట్లు పోలీసులు భావిస్తున్నారు. ఇంటి తలుపులు పగలగొట్టి ఇంట్లో ఉన్న 12 కాసుల బంగారు ఆభరణాలను దోచుకున్నారు. మంగళవారం చోరీ జరిగిన విషయాన్ని గుర్తించిన సుబ్రహ్మణ్యం పోలీసులను ఆశ్రయించాడు. సంఘటన తెలుసుకున్న పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, పెదవేగి ఎస్సై హరి సంఘటన స్థలాన్ని పరిశీలించి, బాధితుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని సీఐ వివరించారు. దెందులూరు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ బాధితులను పరామర్శించారు. భీమవరం (ప్రకాశంచౌక్): శోభిత వర్మ ఛారిటబుల్ ట్రస్ట్ ప్రథమ వార్షికోత్సవం సందర్భంగా రాజమండ్రి నగరంలో నిర్వహించిన ఒక కార్యక్రమంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక, సాంస్కృతిక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రఖ్యాత ఇంద్రజాలికుడు, రచయిత, మ్యాజిక్ స్టార్ డాక్టర్ బోస్ను ‘మార్నింగ్ స్టార్’ బిరుదుతో సత్కరించారు. మ్యాజిక్ రంగానికీ, రచనా రంగానికీ బోస్ చేస్తున్న విశిష్ట సేవలను ట్రస్ట్ వ్యవస్థాపక అధ్యక్షుడు డాక్టర్ శ్రీనివాస వర్మ కొనియాడారు. ఎస్వీ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ఇంద్రజాల ప్రదర్శనలు, ఏక పాత్రాభినయ పోటీలు, కవితా పఠనాలు వంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించారు. ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాలైన ద్వారకాతిరుమల, అన్నవరం, సింహాచలం దేవస్థానాలకు నూతన ట్రస్ట్బోర్డు ఏర్పాటు చేసినట్టు ఓ లిస్ట్ సోషల్ మీడియాలో హల్చల్ చేసింది. అందులో భాగంగా ద్వారకాతిరుమల శ్రీవారి దేవస్థానానికి చైర్మన్గా ఎస్వీ సుధాకరరావుతో కలిపి 17 మంది సభ్యులతో ట్రస్టుబోర్డు ఏర్పాటు చేసినట్టు అందులో పేర్కొన్నారు. చైర్మన్ మినహా మిగిలిన 16 మందిలో 13 మంది టీడీపీ, 2 జనసేన, 1 బీజేపీకి చెందిన వారు ఉన్నట్టు లిస్ట్లో పేర్కొన్నారు. ద్వారకాతిరుమల మండలం వేంపాడుకు చెందిన చింతమనేని హనుమంతరావు, ద్వారకాతిరుమలకు చెందిన కంపసాటి నాగసీత, నల్లజర్లకు చెందిన యలమాటి శ్రీనివాసరావు, ఆవపాడుకు చెందిన అచ్యుత సత్యనారాయణ, యర్నగూడేఇకి చెందిన పాలూరి వెంకట చరిత, దుద్దుకూరుకు చెందిన కడియం సత్యవతి, హుకుంపేటకు చెందిన హోట వీరభద్రరావు ఎంపికై నట్టు లిస్ట్లో ఉంది. అలాగే ఏలూరుకు చెందిన చలువాది శివకృష్ణ, అనపర్తికి చెందిన పల్లి శ్రీనివాసరెడ్డి, తణుకుకు చెందిన కాకి సురేష్ కుమార్, అల్లి సత్యనారాయణ, నెల్లిమర్లకు చెందిన కింతాడ కళావతి, గూడూరుకు చెందిన బత్తిన ప్రమీల, ప్రత్తిపాడుకు చెందిన చిరుగూరి సుశీల, తాడేపల్లిగూడేనికి చెందిన కాసిరెడ్డి మధులత, ఎమ్మిగనూరుకు చెందిన యుకే సుహాసిని ఎంపికై నట్టు ఉంది. ఆకివీడు: డ్వాక్రా యానిమేటర్ల అవినీతిలో అధికారులు, బ్యాంకు అఽధికారుల భాగస్వామ్యం ఉందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయని ఐద్వా జిల్లా అధ్యక్షురాలు సందక ఉదయ కుమారి ఆరోపించారు. స్థానిక సంఘ కార్యాలయంలో మంగళవారం ఐద్వా సభ్యుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆకివీడులోని సంతపేట, సమతానగర్ ప్రాంతాల్లోని డ్వాక్రా గ్రూపు సభ్యులకు రూ. 2 కోట్ల మేర టోకరా వేసిన సంఘటనపై నేటికీ చర్యలు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. అవినీతితో దుర్వినియోగమైన సొమ్మును డ్వాక్రా సభ్యుల వద్ద నుంచి వసూలు చేసేందుకు ఆదేశాలివ్వడం దారుణమన్నారు. గతంలో మేము తీసుకున్న సొమ్ము మాత్రమే తిరిగి చెల్లిస్తామని, అవినీతికి గురై బ్యాంక్లో డ్రా చేసిన సొమ్ముకు మాకు సంబంధంలేదని డ్వాక్రా సభ్యులు చెప్పినా పట్టించుకోకపోవడం దారుణమని ఆమె ఆవేదన వ్యక్తంచేశారు. దీనిపై గతంలో ఇచ్చిన ఫిర్యాదుపై పోలీస్ అధికారులు స్పందించకపోతే డ్వాక్రా సభ్యులతో జిల్లా అధికారుల కార్యాలయాలు ముట్టడిస్తామని ఉదయకుమారి హెచ్చరించారు. కార్యక్రమంలో డోకల లక్ష్మి, గేదల లావణ్య, ఎర్రా కృష్ణవేణి, బొక్కా కళ్యాణి, అర్జి లక్ష్మి తదితరులు పాల్గొన్నారు. -
నకిలీల డొంక కదిలింది
బుధవారం శ్రీ 8 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026ద్వారకాతిరుమల: శ్రీవారి రూ.200 నకిలీ దర్శనం టికెట్ల స్కాం కేసు దర్యాప్తు తుది దశకు చేరుకుంది. పోలీసులు తీగ లాగితే డొంకంతా కదిలింది. ఇప్పటికే ఈ కేసులో ఏడుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. మరింత లోతుగా విచారణ జరిగితే మరికొందరి పాత్రలు బయటపడే అవకాశం ఉంది. ఆ దిశగా పోలీసులు విచారణ జరుపుతారా.. లేదా అన్న అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. చిన వెంకన్న ఆలయంలో గతనెల 15న రూ.200 నకిలీ దర్శనం టికెట్ల విక్రయాలు బయటపడ్డాయి. దీనిపై ఆలయ ఈఓ వై.భద్రాజీ ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సుధీర్ దేవస్థానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఐఎస్జే రాజు, సెక్యూరిటీ గార్డు మేకా సతీష్పై కేసు నమోదు చేశారు. విచారణలో భాగంగా మరో అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎస్.శేషు బాబును అదుపులోకి తీసుకుని ప్రశ్నించారు. అనంతరం శేషు బాబును, సతీష్ను కోర్టుకు హాజరు పరచి, రిమాండ్కు తరలించారు. పోలీసుల అదుపులో సాఫ్ట్వేర్ ఉద్యోగి యలమంచిలి సమీపంలో ఐఎస్జే రాజును పోలీసులు సోమవారం అదుపులోకి తీసుకున్నారు. విచారణలో రాజు పలు విషయాలు వెల్లడించాడు. దేవస్థానం అవుట్ సోర్సింగ్ ఉద్యోగి రమేష్ తాడేపల్లిగూడెంలో సాఫ్ట్వేర్ ఇంజినీర్ అయిన తన స్నేహితుడి వద్ద నకిలీ టికెట్లకు సంబంధించిన సాఫ్ట్వేర్ తయారు చేయించినట్టు తెలుసుకున్నారు. దాంతో రమేష్తో పాటు, సాఫ్ట్వేర్ (బెంగుళూరు) ఉద్యోగిని, అవుట్ సోర్సింగ్లో హార్డ్వేర్గా పనిచేస్తున్న శ్రీను అనే వ్యక్తిని సైతం పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నిస్తున్నారు. ఇంతవరకు ఈ కేసులో ఏడుగురు అవుట్సోర్సింగ్ ఉద్యోగులను నిందితులుగా గుర్తించినట్టు తెలుస్తోంది. సెక్యూరిటీ, ఇతర సిబ్బంది కూడా ఉన్నట్టు సమాచారం. సెల్ఫోన్లో పంపకాల చిట్టా పోలీసులు ఐఎస్జే రాజు వద్ద స్వాధీనం చేసుకున్న సెల్ఫోన్ నుంచి మరింత సమాచారాన్ని సేకరించారు. నకిలీ టికెట్ల విక్రయాల ద్వారా వచ్చిన నగదును నిందితులు వాటాలు వేసుకుని పంచుకున్నారు. ఆ తరువాత ఆ లెక్కలను వారు వాట్సప్ల ద్వారా షేర్ చేసుకున్నట్టు గుర్తించారు. పంపకాల్లో ఉన్న ప్రతి ఒక్క ఉద్యోగి నిందితుడిగా ఉన్నట్టు తెలుస్తోంది. పోలీసులు సాఫ్ట్వేర్ ఉన్న పెన్డ్రైవ్ను, ఓ ల్యాప్ట్యాప్ను నిందితుల నుంచి స్వాధీనం చేసుకున్నట్టు సమాచారం. తుదిదశకు చేరిన శ్రీవారి దర్శనం టికెట్ల కేసు దర్యాప్తు ఏడుగురు అవుట్ సోర్సింగ్ ఉద్యోగుల పాత్ర ఉన్నట్టు గుర్తింపు పోలీసుల అదుపులో సాఫ్ట్వేర్ తయారు చేసిన ఇంజినీర్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్న శేషుబాబును మూడు నెలల క్రితం రూ.200 టికెట్ కౌంటర్ నుంచి మరో చోటికి మార్చారు. మరుసటి రోజే మళ్లీ అతడిని రూ. 200 కౌంటర్లో నియమించారు. ఇలా డ్యూటీ మార్చేం దుకు ఎస్టాబ్లిష్మెంట్ గుమస్తాకి రూ.20 వేలు ఇచ్చినట్టు శేషుబాబు పోలీసుల విచారణలో తెలిపాడు. సిబ్బంది విధుల కేటాయింపులో జరిగిన అవకతవకలపై చర్యలు తీసుకోవాలని దేవస్థానం ఈఓకి లెటర్ రాసేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. -
కైకలూరు జనసేనలో జగడాలు
సాక్షి టాస్క్ఫోర్స్: అన్యాయాలను ప్రశ్నించడానికి పిడికిలి ఎత్తామని పదే పదే చెప్పుకుంటున్న జనసేన పార్టీ కై కలూరు నియోజకవర్గంలో తన ఉనికిని కోల్పోతోంది. పార్టీ గుర్తుల చొక్కాలతో ఎంచక్కా దౌర్జన్యాలు, ఇసుక దోపిడి, కోడిపందేలు, పేకాట కోర్టు కేసులతో కొందరు చెడ్డ పేరు తెస్తున్నా కట్టడి చేసే ప్రయత్నం అధిష్టానం చేయడం లేదు. కొందరు చేసే తప్పును అందరిపై రుద్దవద్దంటూ సోషల్ మీడియా వేదికగా జనసేన నాయకులు నెత్తినోరు బాదుకుంటున్నారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ నీడగా మారిన జనసేన కార్యకర్త వల్ల మొత్తం పార్టీ అభాసుపాలవుతున్నా ప్రశ్నించడానికి ఎవరూ ముందుకు రావడం లేదు. రెండు జనసేన పార్టీ కార్యాలయాలు జనసేన పార్టీలో ఆధిపత్య పోరుకు నిదర్శనంగా నియోజకవర్గ పార్టీ జనసేన కార్యాలయాలు నిలుస్తున్నాయి. కై కలూరు పోస్టాఫీసు ఎదురుగా జనసేన నియోజకవర్గ ప్రధాన పార్టీ కార్యాలయం ఉంది. అదే విధంగా ఆటపాకలో జనసేన ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ఇంటి వద్ద కై కలూరు నియోజకవర్గ జనసేన పార్టీ కార్యాలయం కొనసాగుతోంది. మీడియా సమావేశాలను సైతం విడివిడిగా నిర్వహిస్తున్నారు. ఇటీవల అమరావతిపై పార్లమెంటులో బిల్లు ఆమోదంపై కై కలూరు జనసేన పార్టీ కార్యాలయంలో దీపాలు వెలిగించి హడావిడి చేశారు. బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ వెంట తిరిగే జనసేన నాయకులు ఒక వర్గంగా, జనసేన ఎమ్మెల్సీ జయమంగళతో కలసి ఉంటున్న నాయకులు మరో వర్గంగా ఇక్కడ పార్టీ తయారైందంటూ చర్చ జరుగుతోంది. ఇన్చార్జి నియామకంపై అధిష్టానం వెనకడుగు కై కలూరు నియోజకవర్గంలో జనసేన ఇన్చార్జిని నియమించడానికి పార్టీ అధిష్టానం వెనకడుగేస్తోంది. ఇక్కడ బీజేపీ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ గతంలో ప్రజారాజ్యం పార్టీలో ఎమ్మెల్యేగా పోటీ చేశారు. దీంతో చిరంజీవి కుటుంబంతో అవినాభావ సంబంధాలు ఉన్నాయి. అదేవిధంగా ఉప ముఖ్యమంత్రి పవన్ కల్యాణ్ కామినేని మాట కాదనరు. ఏలూరు ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్తో మంచి పరిచయాలు ఉన్నాయి. ఈ కారణాలతో బీజేపీ, టీడీపీ స్నేహబంధాన్ని దెబ్బతీయవద్దనే ధోరణితోనే జనసేన అదిష్టానం వ్యవహరిస్తోంది. కనీసం జనసేన పార్టీ మండల కమిటీలను సైతం నియోజకవర్గంలో వేయలేకపోతుంది. మాకంటూ ఓ ప్రత్యేక గుర్తింపు వస్తుందని కష్టపడిన జనసేన యువత ఇప్పుడు ఉసూరుమంటోంది. కైకలూరు పోస్టాఫీసు ఎదుట జనసేన పార్టీ మరో కార్యాలయంలో నాయకులు నియోజకవర్గంలో రెండు పార్టీ కార్యాలయాలు మౌనం వహిస్తున్న జనసేన ఎమ్మెల్సీ జయమంగళ నియోజకవర్గ బాధ్యతలు అప్పగించని అధిష్టానం ఎమ్మెల్యే కామినేని నీడగా మారిన వ్యక్తికే పనులు పార్టీకి ఫిర్యాదులు వెళ్లినా కనీసం ప్రశ్నించని నాయకత్వం -
కొల్లేరు.. ఎడారి తీరు
● మాయమవుతున్న పచ్చదనం ● సముద్రపు ఉప్పునీరు కొల్లేరులోకి.. ● రెగ్యులేటర్ల నిర్మాణంపై చంద్రబాబు ప్రభుత్వం నిర్లక్ష్యంకై కలూరు: కోటి అందాల కొల్లేరు కళ తప్పింది. ఏప్రిల్లోనే చుక్క నీరు లేక ఎడారిని తలపిస్తోంది. పచ్చదనం మాయమైంది. కొల్లేరు పక్షులు నీటికోసం, ఆహారం కోసం అల్లాడుతున్నాయి. అధికారుల నిర్లక్ష్యం, పాలకుల పర్యవేక్షణ కొరవడడంతో దక్షిణ కాశ్మీరంగా పేరొందిన కొల్లేరు కన్నీరు పెడుతోంది. కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల నుంచి 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు వరదల సమయంలో కొల్లేరులోకి చేరుతుంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు, రామిలేరు డ్రెయిన్ల నుంచి ఎక్కువ నీరు వస్తుంది. వర్షాభావ పరిస్థితుల కారణంగా ఈ ఏడాది కొల్లేరులోకి నీటి ప్రవాహం తగ్గింది. దీంతో లక్షాలాది ఎకరాల కొల్లేరు భూములు బీటలు వారాయి. పర్యాటకులను ఆకర్షించే సహజసిద్ధ అందాలు నీరులేక కళావిహీనంగా తయారయ్యాయి. అలమటిస్తున్న కొల్లేరు పక్షులు కొల్లేరు సరస్సుకు ఏటా సైబీరియా, ఆస్ట్రేలియా, నైజీరియా వంటి పలు దేశాల నుంచి వలస పక్షులు విడిది కోసం వస్తాయి. మొత్తం 189 రకాల పక్షులు కొల్లేరుపై ఆధారపడి జీవిస్తున్నాయి. ఏటా డిసెంబరు, జనవరి, ఫిబ్రవరి నెలలు పక్షుల సంతానోత్పత్తికి అనుకూల కాలం. కొల్లేరులో వింటర్ సీజన్ ముగిసినప్పటీకీ కొన్ని విదేశీ పక్షులతో పాటు స్వదేశీ పక్షులు కొల్లేరులోనే ఆవాసాలు ఏర్పాటు చేసుకుంటున్నాయి. ముఖ్యంగా పక్షి ప్రేమికుల స్వర్గథామంగా పేరుగడించిన ఆటపాక పక్షుల కేంద్రం విహార చెరువులో కేవలం రెండున్నర అడుగుల నీరు మాత్రమే ఉంది. ప్రస్తుత ఎండలు బట్టి మరో 20 రోజుల్లో నీరు అడుగంటే ప్రమాదం ఉంది. దీంతో పక్షులకు వేసవి ఆహార కష్టాలు ఈ ఏడాది తప్పడం లేదు. రెగ్యులేటర్ల నిర్మాణం కలేనా..? కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉండాలంటే రెగ్యులేటర్ల నిర్మాణమే శరణ్యమని పలు కమిటీలు తేల్చిచెప్పాయి. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి పాదయాత్రలో కొల్లేరు ప్రజలకు ఇచ్చిన హామీ మేరకు రెగ్యులేటర్ల నిర్మాణానికి గ్రీన్ సిగ్నిల్ ఇచ్చారు. ఉప్పుటేరు ముఖద్వారం, చినగొల్లపాలెం, పెదలంక డ్రెయిన్పై డబుల్ లైన్ బ్రిడ్జి. గరిసిపూడి అండర్ టెన్నల్ నిర్మాణాలకు రూ.452 కోట్లు కేటాయించారు. రెగ్యులేటర్ల నిర్మాణం జరిగితే కై కలూరు, ఆకివీడు, భీమవరం, పెడన, దెందులూరు నియోజకవర్గాలకు మేలు జరుగుతుంది. చంద్రబాబు ప్రభుత్వం రెగ్యులేటర్ల అంశాన్ని పక్కన పడేసింది. కొల్లేరులో నీరు లేకపోవడంతో సముద్రపు ఉప్పునీరు పైకి ఎగదన్నుతోంది. దీంతో పంట పొలాలు చౌడుబారుతున్నాయి. ఇప్పటికే కై కలూరు నియోజకవర్గంలో కలిదిండి మండలం ఉప్పుటేరు పరివాహక ప్రాంతాల్లో లక్షలాది ఎకరాల భూములు చౌడబారాయి. ప్రతి ఏటా ఏప్రిల్ నెల నుంచి మూడు నెలలు సముద్రపు నీరు కొల్లేరులో కలవడం వల్ల సరస్సులో సహజ సిద్ధంగా పెరిగే నల్ల జాతి చేపలు అంతరించిపోతున్నాయి. ఉప్పుశాతం ఎక్కువై కొల్లేరులో మట్టి బీటలు వేస్తోంది. మావులు (చేపలను పట్టే బుట్ట)ను కొల్లేరు సరస్సులో పెడుతోన్నా మత్స్యకారులకు రిక్తహస్తాలే మిగులుతున్నాయి. కొల్లేరుకు గోదావరి జలాలు మళ్లించాలి. చింతలపూడి వద్ద ఈ అవకాశం ఉంది. పోలవరం నిర్మాణం జరిగితే ఖచ్చితంగా కొల్లేరుకు నీరు వస్తుంది. అసలు కొల్లేరు సమస్యకు గుదిబండగా మారిన 120 జీవోను రద్దు చేయాలి లేదా సవరించాలి. కొల్లేరు ప్రజలతో చర్చలు జరిపి సమస్య పరిష్కారానికి ప్రభుత్వం కృషి చేయాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరు ప్రాంత సాహితీవేత్త, కై కలూరు రెగ్యులేటర్లు నిర్మిస్తే కొల్లేరు సరస్సులో నిత్యం నీరు నిల్వ ఉంటుంది. సముద్రపు నీరు ఏటా కొల్లేరులో ప్రవేశించకుండా షెట్టర్లు మూసుకునే అవకాశం కలుగుతుంది. నిల్వ చేసిన నీటిలో 2 అంగుళాల చేప పిల్లలను వదిలితే కొల్లేరు ప్రజలకు వేట ఉంటుంది. దీంతో కొల్లేరులో వలసలు నివారించవచ్చు. వైఎస్సార్సీపీలో కేటాయించిన పనులను చంద్రబాబు ప్రభుత్వం రాజకీయ కోణంలో చూడవద్దు. – ముంగర నరసింహారావు, కొల్లేరు నాయకుడు, ఆకివీడు -
పేకాటలో పట్టుబడ్డ ఏలూరు టీడీపీ ఎమ్మెల్యే గన్మెన్
సాక్షి, టాస్క్ఫోర్స్: ఏలూరు జిల్లా తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి) గన్మెన్ పేకాట ఆడుతూ పోలీసులకు పట్టుబడ్డారు. కేసు నమోదు చేసి అరెస్టు చేసిన పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపేశారు. పదిరోజుల తరువాత సోమవారం అతడిని సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు జారీచేశారు. సాధారణంగా పోలీసుశాఖలో సిబ్బంది ఏదైనా తప్పు చేసినా, క్రమశిక్షణ ఉల్లంఘించినా వెంటనే వీఆర్కు పంపడం లేదా విచారణ నిర్వహించి సస్పెండ్ చేయడం సర్వసాధారణం. కానీ ఈ కానిస్టేబుల్ విషయంలో మాత్రం పదిరోజులు ఉన్నతాధికారులు పట్టించుకోలేదు. గతనెల 28న ఏలూరు ఎమ్మెల్యే బడేటి చంటి గన్మెన్ శనపతి శ్రీఆంజనేయులు భీమడోలు పోలీస్స్టేషన్ పరిధిలో ఓ పేకాట శిబిరంలో పేకాడుతూ పోలీసులకు రెడ్హ్యాండెడ్గా చిక్కారు. అతడితో సహా ఎనిమిదిమందిని పోలీసులు అరెస్టు చేశారు. అనంతరం గన్మెన్కు భీమడోలు పోలీసులు స్టేషన్ బెయిల్ ఇచ్చి పంపారు. శాఖాపరమైన విషయం కావడంతో ఎస్పీ కార్యాలయానికి సమాచారం ఇచ్చారు. ఎస్పీ కూడా చర్యలేమీ తీసుకోలేదు. అప్పటినుంచి గన్మెన్ ఎమ్మెల్యే వెంట అన్ని కార్యక్రమాల్లో భద్రత నిమిత్తం పాల్గొంటున్నారు. సోమవారం ఉదయం చొదిమెళ్లలో జరిగిన సాగునీటి భద్రత–సాగునీటి సంఘాల బాధ్యత అనే కార్యక్రమంలో పాల్గొన్న ఎమ్మెల్యే వెంట ఆయన కూడా ఉన్నారు. ఈ నేపథ్యంలో శ్రీ ఆంజనేయులును సస్పెండ్ చేస్తూ ఎస్పీ సోమవారం ఉత్తర్వులు జారీచేశారు. గతనెల 28న భీమడోలులో పేకాట శిబిరంలో గన్మెన్ అరెస్ట్ పదిరోజుల తరువాత ఇప్పుడు సస్పెండ్ చేస్తూ ఎస్పీ ఉత్తర్వులు ఈ పదిరోజులు ఎమ్మెల్యే బడేటి చంటి వెంటే గన్మెన్ -
రోడ్డు ప్రమాదంలో హోంగార్డు మృతి
పాలకొల్లు సెంట్రల్: పోడూరు పోలీస్ స్టేషన్లో పనిచేస్తున్న హోంగార్డు రఘుమండ వెంకటరమణ (57) రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. విధి నిర్వహణలో భాగంగా ఆదివారం రాత్రి స్టేషన్కు వెళుతూ పాలకొల్లు మార్టేరు రోడ్డులో ఉల్లంపర్రు వద్ద ఉన్న ఓ పెట్రోల్ బంక్లో తన వాహనంలో పెట్రోలు కొట్టించుకున్నాడు. బంక్ నుంచి బయటకు వస్తుండగా ఓ కారు ఢీకొట్టడంతో రోడ్డుపై పడిపోయిన రమణ తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు హుటాహుటిన ప్రభుత్వ ఆశుపత్రికి తరలించగా మెరుగైన వైద్యం కొరకు భీమవరం తరలించారు. అక్కడి నుంచి విజయవాడ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ సోమవారం మృతి చెందినట్లు తెలిపారు. కారు టైర్ పంక్చర్ అవ్వడంతో అదుపుతప్పి హోంగార్డ్ను ఢీకొట్టినట్లు స్థానికులు చెబుతున్నారు. రమణకు భార్య, కుమారుడు, కుమార్తె ఉన్నారు. రమణ మృతి పట్ల పాలకొల్లు పట్టణ, రూరల్ సీఐలు కె రజనీకుమార్, జి శ్రీనివాస్, ఎస్సైలు, పోలీసులు, హోంగార్డులు ప్రగాఢ సంతాపాన్ని వ్యక్తంచేశారు. -
దంచికొట్టిన వాన
జిల్లాలోని పలు ప్రాంతాల్లో సోమవారం వర్షం దంచికొట్టింది. ఏలూరు నగరంలో సోమవారం ఉదయం నుంచి సాయంత్రం 3 గంటల వరకు తీవ్రమైన ఎండ, ఉక్కపోత. 3 గంటలు దాటిన తరువాత ఒక్కసారిగా వాతావరణంలో మార్పు వచ్చి దట్టమైన మబ్బులు, ఈదురుగాలులతో భారీ వర్షం కురిసింది. గంటన్నర పాటు ఏలూరు నగరంలో వర్ష బీభత్సం కనిపించింది. నగరంలోని ప్రధాన కూడళ్లు వర్షపు నీటితో నిండిపోయాయి. పవరుపేట, చాణిక్యపురి కాలనీ, ఫైర్స్టేషన్ సెంటర్ వంటి ప్రధాన సెంటర్లల్లో చెట్లు కూలి ట్రాఫిక్కు అంతరాయం కలిగింది. కళాశాలలు వదిలే సమయం కావడంతో విద్యార్థులు ఇళ్ళకు చేరేందుకు అవస్థలు పడ్డారు. – సాక్షి ఫొటోగ్రాఫర్/ఏలూరు డీసీసీబీ బ్యాంకు మెయిన్ రోడ్డులో.. ఏలూరు కొత్త బస్టాండ్ ఇలా.. ఏలూరు ఓవర్ బ్రిడ్జిపైన రెయిలింగ్ ధ్వంసమై దృశ్యం వర్షపు నీటిలో పత్తేబాద రైతుబజార్ -
ఉరుకులు.. పరుగులు
గణపవరం: సాఫీగా సాగుతున్న దాళ్వాసాగు చివరిదశలో రైతులను బెంబేలెత్తిస్తోంది. పంట చేతికందివచ్చిన సమయంలో అకాల వర్షాలు రైతన్నకు కంటిమీద కునుకులేకుండా చేస్తున్నాయి. రబీ పంట బాగా పండిందని ఆనందంగా మాసూళ్లకు ఏర్పాట్లు చేసుకుంటున్న రైతులకు వాతావరణ మార్పులు గుండెల్లో రైళ్లు పరుగు పెట్టిస్తున్నాయి. చేతికంది వచ్చిన పంట నోటికి అందకుండా పోతుందా అన్న ఆందోళన రైతులను వేధిస్తుంది. రెండు రోజులపాటు భారీ వర్షాలు పడేఅవకాశం ఉందని వాతావరణ శాఖ హెచ్చరికలతో రైతులు అప్రమత్తమయ్యారు. సోమవారం మధ్యాహ్నం మండలంలో అక్కడక్కడా ఓమోస్తరు వర్షం కురిసింది. ముఖ్యంగా రబీపైరు కోతలు ప్రారంభించిన పిప్పర, చిలకంపాడు, కాశిపాడు గ్రామాల్లో వర్షం జల్లులు రైతులను ఉరుకులు పెట్టించాయి. కోతకోసిన ధాన్యం వర్షంబారిన పడకుండా కాపాడు కోవడానికి రైతులు ధాన్యం రాశులపై బరకాలు కప్పి ఉంచారు. చాలా మంది రైతులు ప్లాస్టిక్ బరకాలు, టార్ఫాలిన్లను సిద్ధం చేసుకున్నారు. . పూటకోరకంగా మారుతున్న వాతావరణం రైతుల గుండెల్లో గుబులు రేపుతుంది. వారం రోజులుగా విపరీతంగా ఎండలు కాయడంతో రైతులు వరికోతలు ప్రారంభించారు. చిలకంపాడు, వాకపల్లి, వీరేశ్వర పురం, కాశిపాడు గ్రామాల ఆయకట్టులో నాలుగు రోజులుగా వరి కోతలు ప్రారంభించారు. ధాన్యం రాశులు సమీప పుంతలు, గట్లుమీద నిల్వచేసి ఉంచారు. ఈసమయంలో వర్షం హెచ్చరికలతో రైతులు ధాన్యం తడవకుండా రక్షణ చర్యలు చేపట్టారు. కోతకు ఏర్పాట్లు చేసుకున్న రైతులు వాయిదావేసుకున్నారు. మరోరెండు రోజులు వర్షాలు పడే అవకాశం ఉందన్న హెచ్చరికలవల్ల కోసిన ధాన్యం ఎండబెట్టు కోవడానికి రైతులకు ధైర్యం చాలడంలేదు. ధాన్యం ఎండబెట్టడం, మళ్లీ పోగులుపెట్టి బరకాలు కప్పుకుంటూ ఇబ్బందులు పడేకన్నా వాతావరణం కుదుటపడిన తర్వాత ధాన్యం ఎండబెట్టుకోవచ్చునని వేచిఉన్నారు. గణపవరం, నిడమర్రు మండలాలలో దాదాపు 15 వేల ఎకరాలలో దాళ్వా సాగు చేశారు. ఇప్పటికి 10శాతం రైతులు కోతలు పూర్తిచేశారు. వాతావరణం అనుకూలిస్తే ఈ వారంలో దాదాపు వరికోతలు ముమ్మరమయ్యే అవకాశం ఉంది. ఈనెల మూడో వారాంతానికి రబీ మాసూళ్లు పూర్తవుతాయని వ్యవసాయఅధికారులు అంచనా వేస్తున్నారు. -
గురువులకు స్పాట్
పాఠశాలకు వెళ్ళిన తర్వాత మూల్యాంకనానికి రావాలని పిలుపు రావడంతో, దాదాపు 25 కిలోమీటర్ల దూరం నుంచి మూల్యాంకన కేంద్రానికి రావాల్సి వచ్చిందని ఉపాధ్యాయులు లబోదిబోమన్నారు. నిబంధనల మేరకు మూల్యాంకన కేంద్రానికి 8 కిలోమీటర్ల దూరంలో ఉన్న ఉపాధ్యాయులకే విధులు వేయాల్సి ఉంది. 25 కిలోమీటర్ల కంటే దూరంలో ఉన్న వారిని సైతం విధులకు పిలవడం అన్యాయమని, వారు ఉదయం కేంద్రానికి చేరుకోవడం నుంచి తిరిగి ఇంటికి వెళ్లే వరకు తీవ్ర ఒత్తిడిలో ఉండే ప్రమాదం ఉంటుందని నాయకులు చెబుతున్నారు. ఉపాధ్యాయుడు ఒత్తిడిలో ఉంటే మూల్యాంకనంలో తేడాలు వస్తాయని, అది విద్యార్థుల భవిష్యత్తును ప్రశ్నార్థకం చేస్తుందంటున్నారు. స్పెషల్ అసిస్టెంట్లుగా వేయాల్సిన సీనియర్లను, జూనియర్లను విడిచి మధ్యస్థ సర్వీసు ఉన్న వారిని వేయడం విమర్శలకు తావిస్తోంది. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లా విద్యాశాఖ అధికారులు ఉపాధ్యాయులను పెట్టిన స్పాట్ వాల్యుయేషన్ పేరుతో ముప్పుతిప్పలు పెడుతున్నారని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ముందుగా సిద్ధం చేసిన జాబితాలోంచి కొంతమందిని తొలగించి కొత్తవారికి విధులు వేసేందుకు ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు విద్యాశాఖాధికారులు ఎందుకు శ్రద్ధ చూపారని ప్రశ్నిస్తున్నాయి. ఈ విషయంలో విద్యాశాఖాధికారులకు భారీగానే ముడుపులు అందాయని, అలాగే రాజకీయ నాయకుల సిఫార్సులూ పనిచేశాయని ఆందోళన వ్యక్తం చేశారు. జాబితా మార్పుపై సందేహాలు పదో తరగతి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకనం వాస్తవానికి ఈ నెల 4 నుంచి ప్రారంభం కావాల్సి ఉంది. అయితే ముందుగా ప్రకటించిన షెడ్యూల్లో ఈస్టర్ సెలవును గమనించకుండా షెడ్యూల్ విడుదల చేయడంతో, తర్వాత ఉపాధ్యాయులు ప్రాతినిధ్యం వహించగా ఈ నెల 6 నుంచి మూల్యాంకనం ప్రారంభమయ్యేలా షెడ్యూల్ను మార్పు చేశారు. 4 నుంచే ప్రారంభం కావాల్సిన మూల్యాంకనం కోసం అంతకుముందే జాబితా సిద్ధం చేయాల్సి ఉండగా, విద్యాశాఖాధికారులు 5 వ తేదీ సాయంత్రానికి గానీ జాబితా సిద్ధం చేయలేకపోయారు. ఆలస్యంగా జాబితా సిద్ధం చేసినా అందులో మార్పులు చేయాల్సి రావడం విద్యాశాఖాధికారుల వైఫల్యంగానే పరిగణించాలని ఉపాధ్యాయులు ఆరోపిస్తున్నారు. బడికెళ్లాక మూల్యాంకనానికి పిలుపు ఆదివారం రాత్రికి చాలామందికి మూల్యాంకన విధులు ఉన్నట్టు మెసేజ్లు వచ్చాయి. మెసేజ్లు రాని వారంతా తమకు విధులు పడలేదని భావించి ఉదయమే పాఠశాలలకు వెళ్ళారు. అలా విధుల్లోకి వెళ్ళిన దాదాపు 30 మందికి పైగా ఉపాధ్యాయులకు మూల్యాంకన విధులకు హాజరు కావాలని అప్పటికప్పుడు మెసేజ్లు పంపడం, ఎంఈఓల నుంచి ప్రధానోపాధ్యాయుల ద్వారా వ్యక్తిగతంగా సమాచారం ఇవ్వడం వంటి పరిణామాలు చోటుచేసుకున్నాయి. ఆదివారం రాత్రి వరకు జాబితాలో లేని తమ పేర్లు, ఉదయం పాఠశాల విధులకు హాజరైన తర్వాత ఎలా చేరాయో తెలియక ఉపాధ్యాయులు గందరగోళానికి గురయ్యారు. విఫలమైన ఆటోమేషన్ విధానం కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యారంగంలో ప్రవేశపెట్టిన ఆటోమేషన్ విధానం మరోసారి విఫలమైందని ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఎద్దేవా చేస్తున్నారు. గతంలో ఇన్విజిలేషన్ విధుల్లో కూడా ఈ విధానం లోపాల పుట్టగా మారడంతో దానిని మార్చి తిరిగి ఎంఈఓలు, డీఈఓల చేతుల్లోకే నియామక ప్రక్రియ వెళ్ళిన విషయాన్ని గుర్తించకుండా, మళ్ళీ ఆటోమేషన్లో జాబితా రూపొందించడం హాస్యాస్పదం అంటున్నారు. ఆటోమేషన్ లోపాల వల్ల ఆదివారం రాత్రి నుంచి సోమవారం ఉదయం వరకు మార్పులు చేయాల్సి వచ్చిందని కొందరు అంటుండగా, ఆ లోపాలను తమకు అనుకూలంగా మార్చుకుని విద్యాశాఖాధికారులు అస్మదీయులకు ఒకలా, తస్మదీయులకు ఒకలా విధులు వేశారని ఆరోపిస్తున్నారు. నిబంధనలు అమలు చేయాల్సిన విద్యాశాఖాధికాారులే వాటిని అతిక్రమించడం భావ్యం కాదు. 25 కిలోమీటర్ల దూరంలో ఉన్న వారికి విధులు వేయడంతో రవాణా ఇబ్బందులు ఎదురవుతున్నాయి. మహిళా ఉపాధ్యాయులు ఇంటి పనులన్నీ ముగించుకుని అంత దూరం రావడం కత్తిమీద సాములాంటిది. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938, రాష్ట్ర అకడమిక్ కన్వీనర్ మూల్యాంకన విధుల పేరుతో ఉపాధ్యాయులను ఒత్తిడికి గురి చేయడం సరికాదు. తల్లిదండ్రులను, పిల్లలను చూసుకోవాల్సిన వారిని కూడా విధులకు పిలవడం వల్ల ఆ ఒత్తిడి మూల్యాంకనంపై పడుతుంది. ఇది విద్యార్థుల భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తుంది. – గెడ్డం సుధీర్, వైఎస్ఆర్ టీచర్స్ అసోసియేషన్ అధికార ప్రతినిధి బడికెళ్లిన తరువాత పేపర్ల వాల్యుయేషన్కు పిలుపు ముందుగా తయారు చేసిన జాబితా మార్పు 25 కిలోమీటర్ల దూరంలో వారికీ విధులు -
వేప చెట్లను పరిశీలించిన శాస్త్రవేత్తలు
ఏలూరు (టూటౌన్): వివిధ మండలాల్లో పురుగు, తెగుళ్ల కారణంగా చనిపోతున్న వేప చెట్లను సోమవారం నూజివీడు మామిడి పరిశోధనా స్థానం ప్రధాన శాస్త్రవేత్త డా. బీకే లక్ష్మీ, వెంకటరామన్నగూడెం ఉద్యాన కళాశాల అసోసియేట్ డీన్ డా. ఎన్బీవీ చలపతిరావు, ఏలూరు జిల్లా ఏరువాక కేంద్రం సమన్వయకర్త డా. కె. ఫణికుమార్ సంయుక్తంగా పరిశీలించారు. డైబ్యాక్ కారణంగా వేప చెట్లు చనిపోతున్నట్లు గుర్తించారు. డైబ్యాక్ అన్ని వయసుల వేప చెట్ల ఆకులు, కొమ్ములు, పుష్పాలను ప్రభావితం చేస్తుందన్నారు. దీని ప్రభావంతో చెట్టు పైభాగం నుంచి కిందివరకు కొమ్మలు క్రమంగా ఎండిపోతాయన్నారు. డైబ్యాక్ ఒక ఫంగల్ రోగం అయినప్పటికీ, వేప చెట్లు కొన్నిసార్లు టీ మస్కిటో బగ్ కీటకం ద్వారా కూడా ప్రభావితమవుతాయన్నారు. డైబ్యాక్ సోకిన కొమ్ములను కత్తిరించి తొలగించాలని, తర్వాత కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రా లేదా కార్బెండెజిం 1 గ్రా, ప్రోఫెనోఫాస్ 2 మి.లీ లీటరు నీటికి కలిపి చెట్టు చిగురు, కొమ్మలు బాగా తడిచేలాగా పిచికారీ చేయాలని సూచించారు. -
26 నుంచి చిన్న వెంకన్న బ్రహ్మోత్సవాలు
● 30న రాత్రి 8 గంటల నుంచి తిరుకల్యాణం ● వచ్చేనెల 1న రథోత్సవంద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి వచ్చే నెల 3 వరకు అంగరంగ వైభవంగా జరగనున్నాయి. వైఖానస ఆగమాన్ని అనుసరించి పాంచాహ్నిక దీక్షతో ఈ ఉత్సవాలను 8 రోజుల పాటు అట్టహాసంగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. ఉత్సవాలు జరిగే రోజుల్లో శ్రీవారికి ఉదయం, సాయంత్రం వేళల్లో గ్రామోత్సవాలను, శ్రీహరి కళాతోరణ వేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను వైభవంగా జరుపుతామన్నారు. అలాగే ఆలయ ముఖ మండపంలో స్వామివారు రోజుకో ప్రత్యేక అలంకారంలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు. ఈ బ్రహ్మోత్సవాలను పురస్కరించుకుని ఈనెల 26 నుంచి వచ్చేనెల 3 వరకు ఆలయంలో స్వామివారికి నిత్యార్జిత కల్యాణాలు, ఆర్జిత సేవలను రద్దు చేస్తున్నట్టు చెప్పారు. యావన్మంది భక్తులు ఈ వేడుకల్లో పాల్గొని, స్వామివారిని దర్శించి తరించాలని ఈఓ కోరారు. ఉత్సవాలు జరిగేదిలా.. ● ఈనెల 26 న ఉదయం 9.30 గంటలకు శ్రీవారిని పెండ్లి కుమారునిగాను, అమ్మవార్లను పెండ్లి కుమార్తెలుగా చేసి ఉత్సవాలకు శ్రీకారం చుడతారు. ఆ రోజు రాత్రి 7 గంటలకు గజవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 27న రాత్రి 9 గంటలకు ధ్వజారోహణ, అనంతరం హంసవాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 28న ఉదయం 7 గంటలకు సూర్యప్రభ వాహనంపై, రాత్రి 7 గంటలకు చంద్రప్రభ వాహనంపై స్వామివారి గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 29న ఉదయం 7 గంటలకు హనుమద్వాహనంపై స్వామివారి గ్రామోత్సవం, రాత్రి 7 గంటలకు ఎదుర్కోలు ఉత్సవం, అనంతరం వెండి శేష వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 30న ఉదయం 7 గంటలకు సింహ వాహనంపై శ్రీవారి గ్రామోత్సవం, రాత్రి 8 గంటల నుంచి శ్రీ స్వామివారి తిరుకల్యాణ మహోత్సవం, అనంతరం వెండి గరుడ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● వచ్చేనెల 1న రాత్రి 8 గంటల నుంచి రథోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 2న ఉదయం 10.30 గంటలకు చక్రస్నానం, రాత్రి 9 గంటలకు ధ్వజావరోహణం, అనంతరం అశ్వ వాహనంపై గ్రామోత్సవాన్ని నిర్వహిస్తారు. ● 3న ఉదయం 9 గంటలకు చూర్ణోత్సవం, వసంతోత్సవం, రాత్రి 7 గంటలకు ద్వాదశ కోవెల ప్రదక్షిణలు, పవళింపుసేవ, శ్రీపుష్పయాగం కార్యక్రమాలు జరుగుతాయి. వీటితో శ్రీవారి బ్రహ్మోత్సవాలు ముగుస్తాయి. -
రూ.10 లక్షల ప్రమాద బీమా అందించాలి
ఏలూరు (టూటౌన్): నిర్మాణ కార్మికుల కుటుంబాలకు ప్రమాద బీమా రూ.10 లక్షలు అందించాలని యూనియన్ నాయకులు ఎర్ర రాంబాబు డిమాండ్ చేశారు. భవన నిర్మాణ కార్మిక సీఐటీయు సంఘం రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు రాష్ట్ర వ్యాప్తంగా ధర్నాలో భాగంగా కలెక్టరేట్ వద్ద ధర్నాలో ఎర్ర రాంబాబు మాట్లాడారు. ప్రభుత్వం మార్చి నెల నుంచి ప్రవేశపెట్టిన సంక్షేమ బోర్డు పథకాలు అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. జిల్లా ప్రధాన కార్యదర్శి నారపల్లి రమణారావు మాట్లాడుతూ గత ఆరేళ్లుగా పోరాడిన కార్మికులకు పునరుద్ధరించిన కార్మిక సంక్షేమ బోర్డులో స్థానం లేకుండా పోయిందన్నారు. రాష్ట్రంలో నిర్మాణ కార్మికులందరికీ చట్టం అమలు చేయాలని, 58 ఏళ్లు దాటిన భవన నిర్మాణ కార్మికులకు రూ.5000 పెన్షన్ చట్టం అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో చిట్టికొమ్మ కొండలరావు, తేడ్ల నాగరాజు, రెడ్డి లక్ష్మణరావు, తదితరులు పాల్గొన్నారు. -
శ్రీవారి సేవలో హైకోర్టు న్యాయమూర్తి
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయాన్ని రాష్ట్ర హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ వి.గోపాలకృష్ణారావు సోమవారం సందర్శించారు. కుటుంబ సమేతంగా ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా దేవస్థానం అధికారులు, అర్చకులు పూర్ణకుంభ స్వాగతం పలికారు. ఈ సందర్భంగా న్యాయమూర్తి స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో అర్చకులు, పండితులు ఆయనకు స్వామివారి శేష వస్త్రాన్ని కప్పి వేద ఆశీర్వచనాన్ని పలుకగా, ఆలయ ఈఓ వై.భద్రాజీ చిన్నవెంకన్న చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. కుక్కునూరు : మండలంలోని పెదరావిగూడెం పంచాయతీ, వెంకటాపురం గ్రామం వద్ద పెద్దపులి రోడ్డు దాటిందన్న వార్తలు సోమవారం కలకలం రేపాయి. ఆదివారం రాత్రి ఐటీసీ కర్మాగారం నుంచి వస్తున్న కార్మికులకు పులి రోడ్డు దాటుతూ కనిపించిందని గ్రామస్థులకు తెలపడంతో, వారు అటవీ శాఖ అధికారులకు సమాచారం అందించారు. అటవీ శాఖ సిబ్బంది జంతువు వెళ్లిన మార్గంలో పాదముద్రలను పరిశీలించారు. రాత్రి వేళ కావడంతో పాదముద్రలు సరిగా కనిపించక పులో కాదో పోల్చుకోలేకపోయారు. సోమవారం ఉదయం అటవీ శాఖ సిబ్బంది ఆ ప్రాంతంలోని పాదముద్రలను పరిశీలించారు. అయితే, అవి పులి పాదముద్రలు కావని నిర్ధారించారు. పెదరావిగూడెం ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్ జగదీష్ మాట్లాడుతూ.. పులి సంచరిస్తోందన్న వార్తలు కేవలం వదంతులు మాత్రమేనని స్పష్టం చేశారు. ఏలూరు (టూటౌన్): పీజీఆర్ఎస్ ద్వారా అందిన విజ్ఞప్తులు రీఓపెన్ కాకుండా నాణ్యమైన పరిష్కారం చూపాలని జిల్లా జాయింట్ కలెక్టర్ డా.ఎం.జె.అభిషేక్ గౌడ అధికారులను ఆదేశించారు. ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశ మందిరంలో సోమవారం ‘ప్రజా సమస్యల పరిష్కార వేదిక’ కార్యక్రమం జేసీ ఆధ్వర్యంలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. అర్జీలను నిర్దేశించిన సమయంలోగా పరిష్కరించాలని, క్షేత్రస్థాయిలో పరిశీలన జరపాలని సూచించారు. సోమవారం నాటి కార్యక్రమంలో మొత్తం 238 విజ్ఞప్తులు అందాయి. ఇందులో ఇన్చార్జ్ డీఆర్వో భాస్కర్, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం. ముక్కంటి, సర్వే శాఖ ఏడీ అన్సారీ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో చేపట్టాల్సినన నీటి సంరక్షణ పనులను సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలిసి ఖరారు చేయాలని జిల్లా కలెక్టర్ కె. వెట్రిసెల్వి ఆదేశించారు. శ్రీనీటి భద్రత – సాగునీటి సంఘాల బాధ్యతశ్రీ కార్యక్రమంపై ఆమె సోమవారం అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. భూగర్భ జలమట్టం పెంచేలా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టాలని, చెరువుల పూడికతీత, కాలువల మరమ్మతులు, గుర్రపుడెక్క తొలగింపు వంటి పనులపై నివేదికలు తక్షణమే సమర్పించాలని సూచించారు. క్షేత్రస్థాయిలో గ్రామ, మండల పరిధిలోని సాగునీటి వినియోగదారుల సంఘాల ప్రతినిధులతో కలిసి పరిశీలించి గ్రామాల వారీగా నివేదికలను మండల ప్రత్యేకాధికారి ధ్రువీకరించిన అనంతరం సంబంధిత ఎంపీడీవోలు రెండు రోజుల్లోగా సమర్పించాలన్నారు. ఉపాధి హామీ పధకం, వీబీజీ రాంజీ కింద గుర్తించిన పనులపై కూడా నివేదికలు రూపొందించి సమర్పించాలన్నారు. వేసవిలో 6 మీటర్లు, వర్షాకాలం ముగిసే నాటికి 3 మీటర్లు భూగర్భ జలమట్టాలు పెరిగేలా కురిసిన ప్రతి నీటి చుక్కని ఒడిసిపట్టేలా నీటి సంరక్షణ పనులు చేపట్టాలన్నారు. ఉద్యాన రైతులు తమ క్షేత్రాల్లో తప్పనిసరిగా ఫామ్ పాండ్స్ ఏర్పాటు చేసుకునేలా చూడాలని అధికారులను ఆదేశించారు. -
డివైడర్ ఎక్కిన కారు
తణుకు అర్బన్: తణుకు జాతీయ రహదారిపై సోమవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక కారు డివైడర్ పైకి దూసుకెళ్లింది. స్థానిక శర్మిష్ట సెంటర్ వద్ద జరిగిన ఈ ప్రమాదంలో ఎవరికీ గాయాలు కాకపోడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. ఉండ్రాజవరం మండలానికి చెందిన వ్యక్తి సోమవారం విజయవాడ నుంచి స్వగ్రామానికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది. నిద్రమత్తులోనే ఈ ప్రమాదం జరిగి ఉంటుందని పోలీసులు భావిస్తున్నారు. అయితే డివైడర్ పై ప్రమాద సూచికలు ధ్వంసం కాగా కారు ముందు భాగం నుజ్జుయింది. చికిత్స పొందుతూ మృతి మంగళగిరి టౌన్, నిడమర్రు: ఎస్సై కొట్టాడని ఓ యువకుడు పురుగుల మందు తాగి చికిత్స పొందుతూ మృతి చెందిన ఘటన సోమవారం చోటుచేసుకుంది. ఏలూరు జిల్లా నిడమర్రు గ్రామానికి చెందిన నండూరి శివకార్తికేయ (38)తన మేనకోడలు బంగారం గొలుసు పోవడానికి అదే గ్రామానికి చెందిన వేణుగోపాల్ కారణమని ఆరోపించడంతో ఇరు వర్గాలు మార్చి 29వ తేదీ ఘర్షణ పడ్డారు. ఇరువర్గాలు మార్చి 30న నిడమర్రు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. 31వ తేదీన నిడమర్రు బాల వెంకటేశ్వరస్వామి కల్యాణ మహోత్సవాల్లో బందోబస్తు నిర్వహిస్తున్న ఎస్సై రమేష్, పోలీస్ సిబ్బందితో శివకార్తికేయ కేసు విషయమై వాగ్వివాదానికి దిగాడు. తనపై కేసు నమోదు చేసి వేణుగోపాల్పై ఎందుకు చర్యలు తీసుకోలేదని ఎస్సైను ప్రశ్నించాడు. దీంతో శివకారిక్తేయను జీపులో స్టేషన్కు తీసుకువెళ్లి ఎస్సై రమేష్ కొట్టినట్లు శివకార్తికేయ కుటుంబ సభ్యులు ఆరోపించారు. కల్యాణ మహోత్సవాల్లో అందరూ చూస్తుండగా ఎస్సై రమేష్ కొట్టాడని, విచారణ పేరుతో స్టేషన్కు తీసుకువెళ్లారని బాధితుడు శివకార్తికేయ ఏప్రిల్ 1వ తేదీన పురుగుల మందు తాగాడు. చికిత్స నిమిత్తం మంగళగిరిలోని ఎయిమ్స్ ఆసుపత్రికి కుటుంబ సభ్యులు తీసుకువచ్చారు. శివకార్తికేయ చికిత్స పొందుతూ సోమవారం ఉదయం మృతి చెందాడు. పోలీసుల వేధింపులే మృతికి ప్రధాన కారణమని శివకార్తికేయ బంధువులు ఆరోపించారు. ఆకివీడు: జన్యు లోపంతో వింత దూడ జన్మించి, వెంటనే మృతి చెందినట్టు పశుసంవర్థక శాఖ సహాయ సంచాలకుడు జి.మల్లేశ్వరరావు సోమవారం చెప్పారు. స్థానిక కరెంట్ ఆఫీసు వద్ద ఉప్పల చిన్నాకు చెందిన పశువు ఆదివారం నాడు ప్రసవ సమయంలో ఇబ్బంది పడుతుందని రైతు ఫిర్యాదు చేయడంతో వెంటనే వెళ్లి ప్రేగుకు అడ్డంగా దూడ ఉందని గుర్తించి వైద్య సేవలందించామన్నారు. జన్యులోపంతో పుట్టిన దూడ గుర్రం ముఖం పోలి, వింత ఆకారంలో ఉందని, పుట్టిన వెంటనే దూడ చనిపోయిందని ఏడీ చెప్పారు. పశువును కాపాడినట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో రూ.200 దర్శనం నకిలీ టికెట్ల విక్రయాల కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న ఐఎస్జే రాజును సోమవారం పోలీసులు అదుపులోకి తీసుకున్నట్టు సమాచారం. నిందితుడి సోదరుడి ఫోన్ కాల్ డేటా ఆధారంగా వారి సొంత ఊరు అయిన కాకినాడ జిల్లా, తుని వద్ద ఉన్న వేంపాడు గ్రామంలో ఐఎస్జే రాజు ఉన్నట్టు ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్ తెలుసుకున్నారు. ఈ క్రమంలో ఉదయం వేంపాడు గ్రామానికి సిబ్బందితో కలసి వెళ్లిన ఎస్సై సుధీర్, అక్కడ పలువురిని విచారించారు. అనంతరం ఐఎస్జే రాజును గుర్తించి, అదుపులోకి తీసుకున్నారు. ఇదిలా ఉంటే ప్రస్తుతం నిందితుడు పోలీసుల సంరక్షణలో ఓ రహస్య ప్రదేశంలో ఉన్నట్టు సమాచారం. టి.నరసాపురం: బంగారు ఆభరణాల చోరీపై బాధితురాలి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎం జయబాబు తెలిపారు. తెడ్లం పంచాయతీలోని మరియపురం గ్రామానికి చెందిన గొల్లపల్లి మరియరాణి ఈస్టర్ పండుగ కావడంతో ఈ నెల 4వ తేదీ రాత్రి చర్చికి వెళ్లింది. ప్రార్థనలు ముగించుకుని ఇంటికి వచ్చింది. సోమవారం ఉదయం డ్వాక్రా డబ్బులు చెల్లించేందుకు బీరువా తెరవగా లాకర్ పగులగొట్టి ఉండటాన్ని గమనించింది. బీరువాలో ఉంచిన కాసున్నర బంగారు ఆభరణాలు, నగదు కనిపించకపోవడంతో బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
మొక్కజొన్న రైతుల ఆందోళన
పోలవరం రూరల్: తుపాను ప్రభావంతో చెదురుమదురుగా పడుతున్న జల్లులకు మొక్కజొన్న రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మొక్కజొన్న పంట ఆరబెట్టి ఉండటంతో చినుకులు పడితే బరకాలు కప్పి ఒబ్బిడి చేసుకునే పనులు చేపడుతున్నారు. పోలవరం మండలంలో పర్యటించిన వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు మొక్కజొన్న రైతులను కలుసుకుని వారి సమస్యలను తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ కూటమి ప్రభుత్వం వచ్చిన తరువత రైతులకు కష్టాలు పెరిగాయని విమర్శించారు. గతంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మొక్కజొన్న రైతులకు మద్దతు ధర కల్పించి ఆదుకున్నారని పేర్కొన్నారు. ప్రస్తుతం రైతులను ఆదుకోవడంలో ప్రభుత్వం విఫలమైందన్నారు. రెండేళ్లుగా సమస్యలను పట్టించుకోవడం లేదని తెలిపారు. ప్రభుత్వం మొక్కజొన్న రైతులకు రూ.3 వేల మద్దతు ధర నిర్ణయించి పంటను కొనుగోలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో రైతుల తరఫున ఆందోళన చేస్తామని హెచ్చరించారు. ఆయన వెంట ఎంపీపీ సుంకర వెంకటరెడ్డి, వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ బుగ్గా మురళీకృష్ణ, పార్టీ నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. -
మండే ఎండ.. అప్రమత్తతే అండ
● వేసవి వ్యాధుల పట్ల జాగ్రత్తగా ఉండాలంటున్న వైద్యలు ● అందుబాటులో ఓఆర్ఎస్ ప్యాకెట్లు భీమడోలు: ఎల్నినో పరిస్థితుల నేపథ్యంలో ఎండల తీవ్రత రోజురోజుకూ పెరుగుతోంది. గత ఏడాది కన్నా ఈ ఏడాది గరిష్ఠ ఉష్ణోగ్రతలు 2 నుంచి 4 డిగ్రీల మేర పెరుగుతాయని వాతావరణ శాఖ హెచ్చరిస్తోంది. వచ్చే కొన్ని రోజులు వేడి గాలులతో పాటు ఉక్కపోత పెరిగి ప్రజలను ఉక్కిరిబిక్కిరి చేయనుంది. సాధారణంగా మే నెల తొలి వారంలో పెరగాల్సిన ఉష్ణోగ్రతలు, ఎల్నినో ప్రభావంతో ఏప్రిల్ మొదటి వారంలోనే పెరిగాయి. జిల్లాలో 35 నుంచి 39 డిగ్రీల మధ్య ఉష్ణోగ్రతలు నమోదు కావడం వేసవి తీవ్రతకు అద్దం పడుతోంది. వడదెబ్బ ప్రభావంపై విస్తృత ప్రచారం దీనివల్ల రెక్కల కష్టంపై బతికే బడుగుల జీవనోపాధిపై తీవ్ర ప్రభావం పడుతోంది. వృద్ధులు, చిన్నారులు, మహిళలు, రోగులు, శ్రమజీవులు, వ్యాధి నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారంతా అనారోగ్యానికి గురై వడదెబ్బకు గురయ్యే అవకాశం ఉందని వైద్య ఆరోగ్య శాఖ హెచ్చరిస్తోంది. ఈ నేపథ్యంలో వడదెబ్బకు జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. పీహెచ్సీలు, సామాజిక ఆరోగ్య కేంద్రాల్లో ఓఆర్ఎస్ ద్రావణాన్ని అందుబాటులో ఉంచి ప్రజలకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. వేసవి దృష్ట్యా మానవుని శరీరంలో సంభవించే ఉష్ణోగ్రతలను తట్టుకోవడం లేదా నియంత్రించే శక్తి విఫలం కావడం వల్లే ఈ వడదెబ్బ సంభవిస్తుంది. శరరంలో లవణాలు కోల్పోవడంతో దుష్ఫరిణామాల వల్ల ప్రాణాంతకం కావచ్చు. అంతర్గత అవయవాలు సక్రమంగా పనిచేయక మరణం సంభవించవచ్చు. సత్వరం చికిత్స తీసుకుంటే ఉపశమనం పొందవచ్చు. వీటితో పాటు నీటి లోపం, జీర్ణ సంబంధ వ్యాధులు, దోమల ద్వారా వచ్చే వ్యాధులు, చర్మ సమస్యలు, మూత్ర సంబంధ సమస్యలు, తలనొప్పి, ఎలక్ట్రోలైట్ లోపం వల్ల కలిగే మూర్ఛల పట్ల జాగ్రత్తగా ఉండాలి. ముఖ్యంగా డయాబెటిస్, కిడ్నీ వ్యాధిగ్రస్తులు ఎక్కువ ప్రమాదంలో పడే అవకాశం ఉంది. ఎల్నినోనే కారణం ఈ వాతావరణ హెచ్చుతగ్గులకు ఎల్నినో ప్రభావమే కారణమని అధికారులు చెబుతున్నారు. పసిఫిక్ మహాసముద్ర జలాలు వేడెక్కడం వల్ల ఏర్పడే ఈ ప్రక్రియ కారణంగా ఈ వేసవి గతంలో కంటే ఎక్కువ తీవ్రంగా ఉంటుందని, వర్షాలు సైతం ఆలస్యమయ్యే సూచనలు ఉన్నాయని వివరిస్తున్నారు. వడదెబ్బ లక్షణాలు – జాగ్రత్తలు వడదెబ్బ తగిలితే శరీర ఉష్ణోగ్రత అమాంతంగా పెరిగిపోవడం, చెమట పట్టకపోవడం, వణుకు, పాక్షికంగా ఫిట్స్ రావడం, అపస్మారక స్థితికి చేరుకోవడం జరుగుతుంది. మగత నిద్ర, కలవరింతలు, పెదవులు తడిబారిపోవడం వంటివి కనిపిస్తాయి. అలాంటి వ్యక్తికి వీలైనంత త్వరగా ప్రాథమిక చికిత్స అందించాలి. వెంటనే నీడ ఉన్న ప్రదేశానికి చేర్చి గాలి తగిలేలా చూడాలి. శరీరం సాధారణ ఉష్ణోగ్రతకు వచ్చే వరకు తడి వస్త్రంతో తుడవాలి. ఉప్పు కలిపిన మజ్జిగ లేదా ఓఆర్ఎస్ తాగించాలి. అపస్మారక స్థితిలో ఉన్న రోగికి నీరు తాగించరాదు. వెంటనే సమీపంలోని ఆసుపత్రికి తరలించాలి. నివారణకు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● ఎండలో వెళ్లేటప్పుడు తప్పనిసరిగా టోపీ, గొడుగు లేదా తలపాగా ధరించాలి. ● తేలికపాటి నూలు (కాటన్) వస్త్రాలు ధరించడం మంచిది. ● వేడి గాలి ఇంట్లోకి రాకుండా కిటికీలకు పరదాలు లేదా గోనె సంచులు అడ్డుగా కట్టాలి. ● ఎక్కువగా నీరు, మజ్జిగ, కొబ్బరి నీళ్లు, ఓఆర్ఎస్ ద్రావణాన్ని తీసుకోవాలి. ● రోజుకు కనీసం 15 గ్లాసుల నీళ్లు తాగాలి. చేయకూడనివి ● మధ్యాహ్నం వేళ ఎండలో ఎక్కువగా తిరగరాదు. ● మద్యం సేవించరాదు. ● రోడ్లపై అమ్మే రంగు పానీయాలు, కలుషిత ఆహార పదార్థాలను తినరాదు. ● మాంసాహారం తగ్గించి, తాజా కూరగాయలు తీసుకోవాలి. ● పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుని దోమలు లేకుండా చూసుకోవాలి. పీహెచ్సీ పరిధిలోని అన్ని గ్రామాల్లో ప్రజలకు అవగాహన కల్పించి ఓఆర్ఎస్ ప్యాకెట్లు పంపిణీ చేస్తున్నాం. పంచాయతీల్లో వీటిని అందుబాటులో ఉంచాం. బీపీ, సుగర్ వ్యాధిగ్రస్తులు ద్రవ పదార్థాలను ఎక్కువగా తీసుకోవాలి. – ఆర్.జాహ్నవి కృష్ణ, వైద్యాధికారిణి, గుండుగొలను వేసవిలో వడదెబ్బతో పాటు విరోచనాలు, ఫుడ్ పాయిజనింగ్, టైఫాయిడ్, డెంగ్యూ వంటి వ్యాధులు సోకే ప్రమాదం ఉంది. ఉదయం 11 గంటల నుంచి సాయంత్రం 4 గంటల వరకు ఎండలో తిరగరాదు. ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచుతున్నాం. –జేఎం సాయి, జనరల్ మెడిసిన్, సీహెచ్సీ, భీమడోలు -
స్వచ్ఛంద సంస్థల సేవలు అభినందనీయం
భీమడోలు: ప్రజలకు నాణ్యమైన వైద్య సేవలను అందించడంలో స్వచ్ఛంద సంస్థలు ముందుకు రావడం అభినందనీయమని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. భీమడోలు మానస పాఠశాలలో ఆదివారం మానవత స్వచ్ఛంద సేవా సంస్థ ఆధ్వర్యంలో ఉచిత మెగా మెడికిల్ శిబిరాన్ని నిర్వహించారు. ఈ క్యాంపులోని పలు విభాగాలను వాసుబాబు, మానవత జిల్లా అధ్యక్షుడు కండేపు వెంకట సూర్యనారాయణ ప్రారంభించారు. ఈ సందర్భంగా విజయవాడ మణిపాల్ ఆసుపత్రి గుండె, క్యాన్సర్ ఆసుపత్రి, సరస్వతి ఎముకల ట్రామా కేర్, వేమగిరి కంటి వైద్య ఆసుపత్రిలకు చెందిన వైద్యులు వచ్చి రోగులకు వైద్య పరీక్షలు చేశారు. ఆయన విభాగాల్లో రోగులకు చేస్తున్న పరీక్షలను అడిగి తెలుసుకున్నారు. సందర్భంగా ఆయన మాట్లాడుతూ గ్రామీణ ప్రాంతాల్లో ఇటువంటి ఉచిత వైద్య శిబిరాలు ప్రజలకు ఎంతగానో మేలు చేస్తాయన్నారు. సేవాభావంతో మానవత సంస్థ చేస్తున్న మెగా వైద్య శిబిరాన్ని ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు. వారిని అభినందించారు. 350 మంది రోగులకు పలు పరీక్షలు చేసి ఉచితంగా మందులను పంపిణీ చేశారు. 47 మందికి కళ్లజోళ్లు వేశారు. ఏడుగురికి కంటి ఆపరేషన్లకు రిఫర్ చేశారు. 65 మందికి గుండె పరీక్షలు చేశారు. మహిళలకు గర్భాశయ క్యాన్సర్ పరీక్షలు చేశారు. కార్యక్రమంలో ఎముకల వైద్య నిపుణులు అక్కెం నరేష్, తాజా మాజీ సర్పంచ్ పాము సునీతామాన్సింగ్, పాఠశాల ప్రిన్సిపల్ యలమర్తి రవీంద్రకుమార్, వైఎస్సార్సీపీ నాయకులు రామిశెట్టి గంగాధర్, పంచకర్ల సత్యనారాయణ, చిలపర్తి ఆదినారాయణ, గోనుగుంట రమణ శంకర్, పసుపులేటి సాంబశివరావు, తుమ్మల ఉమామహేశ్వరరావు, ఉన్నమట్ల సత్యనారాయణ, చిలపర్తి రామారాయుడు తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ విగ్రహ ధ్వంసం
● టీడీపీ అల్లర మూకల పనే ● ఇద్దరిపై కేసు నమోదు పెనుమంట్ర: పెనుమంట్ర మండలం ఓడూరు గ్రామంలోని అంబేడ్కర్ పార్కు వద్ద ప్రధాన రహదారి పక్కనే ఉన్న దివంగత నేత వైఎస్ రాజశేఖరరెడ్డి శిలా విగ్రహాన్ని శనివారం అర్ధరాత్రి గ్రామానికి చెందిన కొందరు టీడీపీ అల్లరి మూకలు ధ్వంసం చేశారు. ఈ ఘటనపై వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు సిలువూరి హరివర్మ చేసిన ఫిర్యాదు మేరకు గ్రామానికి చెందిన సాదే టోనీ, కప్పల చందు అనే యువకులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పెనుమంట్ర ఎస్సై కె.స్వామి ఆదివారం తెలిపారు. ఈ ఇద్దరు యువకులతో పాటు మరో 18 మంది అర్ధరాత్రి పార్కులో పార్టీ చేసుకొని ఈ విగ్రహ విధ్వంసానికి పాల్పడినట్టు స్థానికులు చెబుతున్నారు. విగ్రహాన్ని ధ్వంసం చేసిన వారిని పూర్తిస్థాయిలో గుర్తించి తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు. -
పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం
నిడమర్రు: మండలంలోని పత్తేపురంలో లాల్ బహుదూర్ శాస్త్రి ఓరియంటల్ (పాచ్య) కళాశాల పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఆదివారం ఘనంగా జరిగింది. 1967 నుంచి 1994 మధ్య కాలంలో ఇక్కడ చదువుకున్న సుమారు 135 కుటుంబాలు ఈ వేడుకలో పాల్గొన్నాయి. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. కళాశాల వ్యవస్థాపకుడు, మాజీ మంత్రి మూర్తిరాజుకు నివాళులర్పించిన అనంతరం అప్పటి అనుభూతులను నెమరు వేసుకొన్నారు. వృద్ధాప్యంలో ఉన్న తమ గురువులను ఘనంగా సన్మానించుకున్నారు. గ్రూప్ ఫొటోలు దిగారు. క్షేమ సమచారం తెలుసుకున్నారు. మృతి చెందిన గురువులను గుర్తించుకుని నివాళులర్పించారు. ప్రస్తుతం కళాశాల అక్కడ లేకపోయినా, తమ గుండెల్లో ఆ జ్ఞాపకాలు పదిలంగా ఉంటాయని వారు భావోద్వేగానికి లోనయ్యారు. ఆదివారం గ్రామమంతా పండిత శ్రేష్టులతో పులకించింది. -
సెల్ఫోన్ల రికవరీ
జంగారెడ్డిగూడెం: సెల్ఫోన్ చోరీ జరిగినా, పోగొ ట్టుకున్నా పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయాలని జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ అన్నా రు. పట్టణంలో ఆదివారం 5వ విడత కార్యక్రమంలో భాగంగా రికవరీ అయిన సెల్ఫోన్లను ఏఎస్పీ సుస్మిత , సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్లతో కలిసి బాధితుల ఇళ్లకు వెళ్లి అందజేశారు. ఈ సందర్భంగా ఏఎస్పీ మాట్లాడుతూ సమీప పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసి సీఐఆర్లో నమోదు చేయించుకోవాలన్నారు. సెల్ఫోన్ ట్రేస్ కాగానే బాధితులకు అందిస్తామన్నారు. సెకండ్ హ్యాండ్ ఫోన్లు కొనుగోలు చేసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలన్నారు. సెల్ఫోన్ వినియోగించే సమయంలో పోలీస్ శాఖ నుంచి మెసేజ్లు, పోలీస్ సిబ్బంది ఫోన్ చేసి చోరీ సెల్ఫోన్ వివరాలు తెలియజేస్తే వెంటనే పోలీస్స్టేషన్లో అప్పగించాలని సూచించారు. నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే వారిపై కూడా కేసు నమో దు చేసే అవకాశం ఉంటుందన్నారు. ఇప్పటివరకు సీఐఆర్లో 393 రిక్వెస్ట్లు నమోదయ్యాయని ఏ ఎస్పీ చెప్పారు. కాగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్డివిజన్ పరిధిలో చోరీ సెల్ఫోన్ల రికవరీ 90 శాతం ఉందని అన్నారు. పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. -
జగ్జీవన్ జీవితం స్ఫూర్తిదాయకం
ఏలూరు (టూటౌన్): బాబూ జగ్జీవన్రామ్ జీవితం స్ఫూర్తిదాయకమని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. ఆదివారం స్థాని క ఓవర్ బ్రిడ్జి వద్ద జిల్లా సాంఘిక సంక్షేమ శా ఖ ఆధ్వర్యంలో జగ్జీవన్ రామ్ 118వ జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాల లు వేసి నివాళులర్పించారు. సామాజిక సేవ చే స్తూనే కుల నిర్మూలన కోసం ఉద్యమాలు నడిపిన సామాజిక విప్లవ యోధుడిగా జగ్జీవన్రా మ్ చరిత్రలో నిలిచిపోయారన్నారు. ఫుడ్ కా ర్పొరేషన్ ఆఫ్ ఇండియా సంస్థను ప్రవేశపెట్టి ఆహార సమస్యకు శాశ్వత పరిష్కారం చూపారన్నారు. కార్మికులు కోసం ప్రత్యేక చట్టాలను రూపొందించి వారి అభ్యున్నతికి విశేషంగా కృషి చేశారన్నారు. బడుగు,బలహీన వర్గాల కోసం అలుపెరగని పోరాటం చేసిన మహోన్నత వ్యక్తి జగ్జీవన్ అని కొనియాడారు. సాంఘిక సంక్షేమ శాఖ డీడీ వై.విశ్వమోహన్రెడ్డి, జిల్లా సాంఘిక సంక్షేమ శాఖ ఉద్యోగులు, ఏపీ ఎస్సీ ఫైనాన్స్ కార్పొరేషన్ డైరెక్టర్ దాసరి ఆంజనేయులు, పెద్దాడ వెంకటరమణ, అడబాల రవి, దొడ్డిగర్ల సుభమల్లిక్, కడిమి యోహాను, నల్లిమిల్లి శంకర్, డా.పొలిమేర హరికృష్ణ, మే తర అజయబాబు తదితరులు పాల్గొన్నారు. -
పొగాకు రైతుల బెంబేలు
బుట్టాయగూడెం : కోటి ఆశలతో పొగాకు పంట సా గు చేసిన రైతులకు ఈ ఏడాదీ నిరాశ తప్పేలా లేదు. గత మూడేళ్లుగా పెరిగిన భూమి కౌలు, పెట్టుబడులను సైతం లెక్కచెయ్యకుండా వర్జీనియా పొగాకు సాగుచేస్తున్నారు. ఈ ఏడాది వాతావరణం అనుకూలించకపోయినా చీడాపీడలు, తెగుళ్ల దాడులను తట్టుకుని మరీ సాగు చేశారు. పొగాకు రంగు, దిగుబడులు వచ్చే అవకాశం ఉందంటూ ఆనందపడ్డారు. ఈ నేపథ్యంలో గతనెల 25న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో వర్జీనీయా పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా మొదటిరోజు కిలో రూ.265 ధర పలకడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందారు. కనీసం రూ.295కు కొనుగోలు చేయాలని రైతులు కోరినా పొగాకు కొనుగోలు కంపెనీలు, పొగాకు బోర్డు అధికారులు పట్టించుకోకపోవడంతో ఆందోళన చెందుతున్నారు. ఉమ్మడి జిల్లా పరిధిలోని జంగారెడ్డిగూడెం–1, 2, కొయ్యలగూడెం, గోపాలపురం దేవరపల్లిలోని ఐదు వేలం కేంద్రాల్లోనూ ఇదే పరిస్థితి ఉంది. 49.32 మిలియన్ కిలోలకు అనుమతి ఈ ఏడాది పొగాకు సీజన్కు సంబంధించి ఐదు వేలం కేంద్రాల పరిధిలో సుమారు 49.32 మిలి యన్ కిలోల పొగాకు ఉత్పత్తికి బోర్డు అనుమతి ఇచ్చింది. సాగు విస్తీర్ణం పెరగడం, దిగుబడులు ఆశాజనకంగా ఉండటంతో సుమారు 80 మిలియన్ కిలోల పొగాకు ఉత్పత్తి అయ్యే అవకాశం ఉందని అధికారులు అంచనా వేస్తున్నారు. గతేడాది 60 మిలియన్ కిలోల ఉత్పత్తికి పొగాకు బోర్డు అను మతి ఇవ్వగా 83.88 మిలియన్ కిలోల ఉత్పత్తి జరిగింది. అలాగే గతేడాది మార్కెట్లో కిలో ధర గరిష్టంగా రూ.453 పలికింది. అలాగే కనిష్టంగా రూ.250 పలకగా సగటున రూ.297.50 చొప్పున లభించింది. ఈ ఏడాది అన్ని పరిస్థితులను తట్టుకు ని పొగాకు సాగు చేసిన రైతులు గిట్టుబాటు ధర వస్తుందనే ఆశాభావంతో ఉన్నా ఇటీవల ప్రారంభమైన పొగాకు కొనుగోలులో కేవలం రూ.265 మాత్రమే ధర పలకడంతో తీవ్ర నిరాశ చెందుతున్నారు. కొనుగోలు ప్రారంభమై 10 రోజులు దా టుతున్నా ధరల్లో మార్పు రాకపోవడంతో నిరాశ చెందుతున్నారు. పొగాకుకు రూ.360 ధర కల్పి ంచి కొనుగోలు చేయాలి. లేకపోతే రైతులు అప్పుల పాలవ్వడం ఖాయం. ప్రస్తుత ధర రూ.265 ఇస్తే రైతుల పరిస్థితి అగమ్యగోచరమే. పొగాకు పంట కొనుగోలుపై ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవాలి. లేనిపక్షంలో రైతుల పక్షాన ఆందోళన చేస్తాం. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి, ఏలూరు ఈ ఏడాది పంటలకు పెట్టుబడులు, ఖర్చులు బాగా పెరి గాయి. కౌలు ధరలు కూడా పెరిగాయి. ప్రస్తుతం వేలం కేంద్రాల్లో జరుగుతున్న కొనుగోలులో ధర చూస్తే భయమేస్తుంది. ఇలానే ధరలు కొనసాగితే నష్టాల పాలవుతాం. కనీసం పెట్టిన పెట్టుబడి కూడా రావు. ప్రభుత్వం ఆదుకోవాలి. – కలగర నాని, పొగాకు రైతు, కొమ్ముగూడెం, బుట్టాయగూడెం మండలం బె‘ధర’గొడుతోంది పొగాకు ధరలు చూసి నిరాశ వేలం ప్రారంభమై పది రోజులు పుంజుకోని వర్జీనియా ధరలు బ్రైట్ గ్రేడ్ పొగాకు ధరకిలో రూ.265 మాత్రమే సగటు ధర రూ.330 తగ్గితే నష్టం తప్పదంటున్న రైతులు ప్రభుత్వం పట్టించుకోవాలని వినతి -
బాధితుల ఇళ్లకు వెళ్లి సెల్ఫోన్ల అందజేత
భీమడోలు: భీమడోలు పోలీసులు ఆదివారం వినూత్న సేవా కార్యక్రమం చేపట్టారు. గతంలో సెల్ఫోన్లు పోగొట్టుకున్న బాధిత కుటుంబాల ఇళ్లకు వెళ్లి రికవరీ చేసిన సెల్ఫోన్లను వారికి అందించారు. భీమడోలు ఎస్సై ఎస్కే మదీనా బాషాతో కలిసి సీఐ వి.కృష్ణలు ఆర్జావారిగూడెంలోని ఇద్దరు బాధితుల గృహాల వద్దకు వెళ్లి వాటిని అందించగా, వారంతా పోలీసులకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ సందర్భంగా పోలీస్ శాఖలోని పలు విభాగాల పనితీరు, ఆన్లైన్ విధానం గురించి వారికి సీఐ అవగాహన కల్పించారు. ఫిర్యాదు చేసిన వెంటనే స్పందించి ఫోన్లు వెతికి పట్టుకుని వాటిని తమకు అందించడం చాలా సంతోషంగా ఉందన్నారు. ఫోన్లు పొగొట్టుకుంటే తిరిగి రాదనే ఆపోహ ఉండేదని, కానీ పోలీసు ఉన్నతాధికారులే తమ ఇళ్లకు వచ్చి వాటిని అందజేయడం వారి పనితీరుకు నిదర్శనమన్నారు. సీఐ మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యి మొబైల్ ఫోన్లు ఎస్పీ కేపీఎస్ కిషోర్ ఆదేశాల మేరకు బాధితులకు అందజేస్తున్నామన్నారు. కార్యక్రమంలో పోలీస్ సిబ్బంది పాల్గొన్నారు. నరసాపురం రూరల్: స్థానిక కెనాల్ రోడ్డులో కొలువై ఉన్న శ్రీ సత్తెమ్మ తల్లి జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా జరుగుతున్నాయి. ఈ నెల 3న శుక్రవారం నుంచి ప్రారంభమైన ఈ వేడుకలు సోమవారంతో ముగియనున్నాయి. ఈ ఉత్సవాల్లో భాగంగా ఆదివారం భక్తులు అమ్మవారికి మొక్కులు సమర్పించే కార్యక్రమాన్ని అత్యంత భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. ఆదివారం ఉదయం నుంచి డప్పు వాయిద్యాలు, పోతురాజుల నృత్యాలు, డీజే పోగ్రామ్లతో భక్తుల కోలాహలం మధ్య అమ్మవారి స్నానాల కార్యక్రమం అత్యంత వైభవంగా చేశారు. -
రోడ్డు ప్రమాదంలో ఇద్దరి మృతి
బుట్టాయగూడెం: శుభకార్యానికి వెళ్లి తిరిగి వస్తుండగా జరిగిన రోడ్డు ప్రమాదంలో ఇద్దరు గిరిజన యువకులు మృతి చెందారు. ఈ సంఘటనకు సంబంధించి స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. జీలుగుమిల్లి మండలం తాటిరామన్నగూడెంకు చెందిన మడకం సంతోష్ (19), పండు సందీప్ (20) తెలంగాణ రాష్ట్రం అశ్వారావుపేట మండలం చిచ్చోడుగుంటలో వేడుకకు హాజరై ద్విచక్ర వాహనంపై తిరిగి వస్తుండగా, గాండ్లగూడెం సమీపంలో ఎదురుగా వస్తున్న లారీ వీరిని బలంగా ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరూ అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయారు. అశ్వారావుపేట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సందీప్, సంతోష్ల మృతితో తాటిరామన్నగూడెంలో విషాద చాయలు అలముకున్నాయి. భీమడోలు: పొలసానిపల్లి పంచాయతీ శివారు ఆంజనేయనగరం గ్రామంలో శనివారం రాత్రి దొంగలు బీభత్సం సృష్టించారు. గుర్తు తెలియని వ్యక్తులు ఓ ఇంట్లోకి చొరబడి బంగారు ఆభరణాలు, రూ.68 వేల నగదు దోచుకెళ్లారు. బాధితుడు ముత్తంశెట్టి మణికంఠ తన కుటుంబసభ్యులతో కలిసి ఇంటి వరండాలో నిద్రపోతుండగా, దొంగలు వెనుక తలుపు తీసి లోపలికి ప్రవేశించారు. బీరువా పగులగొట్టి అందులో ఉన్న రెండు కాసుల బంగారు తాడు, చెవిదిద్దులు, నగదును అపహరించారు. ఆదివారం తెల్లవారుజామున నిద్రలేచిన మణికంఠ చోరీ జరిగినట్లు గుర్తించి భీమడోలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఎస్సై ఎస్.కే. మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: కుక్క కాటుకు గురై సరైన సమయంలో చికిత్స తీసుకోకపోవడంతో సుంకర పోసిబాబు (37) అనే వ్యక్తి రేబిస్ వ్యాధితో మరణించాడు. పట్టణంలోని అంబికా రెస్టారెంట్ రోడ్డులో హోటల్ నడుపుతున్న పోసిబాబును ఆరు నెలల క్రితం కుక్క కరిచింది. ఈ నెల 3న ఆయనలో రేబిస్ లక్షణాలు కనిపించాయి. ఇది గమనించిన భార్య, కుటుంబసభ్యులు ఆసుపత్రికి తీసుకువెళ్ళారు. అక్కడ మంచినీటిని చూసి బిగుసుకుపోతున్నాడు. వైద్యులు ముఖంపై నీళ్ళు చల్లినప్పటికీ మరింతగా బెదిరిపోయాడు. కుటుంబ సభ్యులు వెంటనే రాజమండ్రి, ఆపై కాకినాడ ఆసుపత్రులకు తరలించినప్పటికీ ఫలితం లేకపోయింది. శనివారం సాయంత్రం ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధృవీకరించారు. మృతుడికి భార్య అనంతలక్ష్మి, ఎనిమిదేళ్ల కుమారుడు ఉన్నారు. ఎస్సై ఎన్.వి. ప్రసాద్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. బుట్టాయగూడెం: మండలంలోని కామవరం అటవీ ప్రాంతంలో వెలసిన గుబ్బల మంగమ్మ తల్లి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలతో పాటు ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివచ్చారు. లారీలు, మినీ వ్యాన్లు, ఆటోలు, ద్విచక్ర వాహనాలపై తరలివచ్చిన భక్తులు అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పట్టణ ఇలవేల్పు శ్రీ మావుళ్లమ్మ తల్లికి నిలువెత్తు సంపూర్ణ స్వర్ణమయం స్వర్ణ నిధికి భీమవరంనకు చెందిన ఆలయ మాజీ ధర్మకర్త వడ్డీ సుబ్బారావు కుమారుడు వడ్డీ దివ్య శ్రీవీర వెంకట శ్రీకాంత్ దంపతులు 10 గ్రాముల బంగారం, మోటూరుకి చెందిన కారిచర్ల ఉషశ్రీ 7 గ్రాముల బంగారం సమర్పించారు. దాతలకు ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జున శర్మ ఆశీర్వచనాలు అందించారు. ఆలయ చైర్మన్ బొండాడ నాగభూషణం, ధర్మకర్తలు రామాయణం శ్రీనివాస్, పాపోలు ఏడుకొండలు దాతలకు అమ్మవారి ఫొటో, ప్రసాదం అందజేసినట్లు ఆలయ అసిస్టెంట్ కమిషనర్ బుద్ద మహాలక్ష్మి నగేష్ తెలిపారు. -
రైలు ప్రమాదంలో సీఐఎస్ఎఫ్ ఎస్ఐ మృతి
ఏలూరు టౌన్: ఏలూరు నగరానికి చెందిన గోపిరెడ్డి హేమంత్ సెంట్రల్ ఇండస్ట్రీయల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్ఎఫ్)లో సబ్ ఇన్స్పెక్టర్గా విధులు నిర్వర్తిస్తున్నారు. ఆయన పశ్చిమబెంగాల్ రాష్ట్రంలో ఎన్నికల విధులకు హాజరయ్యేందుకు ఢిల్లీ నుంచి పశ్చిమ బెంగాల్ రైలులో ప్రయాణిస్తూ ఉండగా.. మధ్యలో ప్రమాదవశాత్తు రైలు నుంచి జారిపడి మృతిచెందారు. హేమంత్ భౌతికకాయాన్ని నేడు ఏలూరు పత్తేబాదలోని ఆయన స్వగృహానికి తీసుకురానున్నారని బంధువులు తెలిపారు. అనంతరం ప్రభుత్వ లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహిస్తారని తెలిపారు. ఆయన మృతితో కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరు అవుతున్నారు. చాట్రాయి: చాట్రాయి ఆర్సీఎం స్కూల్లో ఆదివారం నగదు చోరీ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేశారు. స్కూలు సిబ్బంది జీతాల కోసం రూ.2 లక్షలు స్కూలు యాజమాన్యం ఆఫీసు రూంలో పెట్టి తాళం వేసి ఈస్టర్ పండుగను జరుపుకున్నారు. సాయంత్రం చర్చి నుంచి ఆఫీసుకు రాగా తాళాలు పటలకొట్టి రూ.2 లక్షల నగదును దొంగిలించారు. దీంతో యాజమాన్యం స్థానిక పోలీస్ స్టేషన్ ఫిర్యాదు చేసింది. నూజివీడు డీఎస్పీ వీఎన్వీ ప్రసాదు, సీఐ, ఎస్ఐ సంఘటనా స్థలాన్ని పరిశీలించారు. -
సాగునీరు విడుదల
దెందులూరు: ‘కొవ్వలిలో సాగుకు నీటి గండం’ శీర్షిక న ‘సాక్షి’లో గత బుధవా రం ప్రచురించిన కథనానికి అధికారులు స్పందించారు. దా దాపు 350 ఎకరాలు వరి పొలాలు పూర్తి స్థాయిలో సాగునీరు అందకపోవడంతో ఈనిపొట్ట దశలో ఉన్న పొలాల భూ ములు బీటలు వారాయి. సాగు చేసే రైతులు కన్నీట పర్యంతమవుతున్నారు. ఈ నేపథ్యంలో గోదావరి కాలువ ఇరిగేషన్ అసిస్టెంట్ ఇంజనీర్ సుబ్రమణ్యం పరిస్థితిని ఉన్నతాధికారులకు తెలియజేశారు. గోదావరి కాలువ నుంచి కొవ్వలిలో సాగు భూములకు నీటిని విడుదల చేసేలా చర్యలు తీసుకున్నారు. తణుకు అర్బన్: భారత కమ్యూనిస్టు పార్టీ (సీపీఐ) సీనియర్ నాయకురా లు, సీపీఐ మాజీ ఎమ్మె ల్యే వంక సత్యనారాయ ణ సతీమణి, ప్రస్తుత ఎ మ్మెల్సీ వంక రవీంద్రనాథ్ మాతృమూర్తి వంక నాగమణి (95) తణుకులోని ఆమె స్వగృహంలో ఆదివారం కన్నుమూశారు. కొంతకాలంగా ఆమె అనారోగ్యంతో బాధపడుతున్నారు. ఆమె భర్త వంక సత్యనారాయణ గతంలోనే మృతి చెందారు. కుమారులు రామదాస్, మోహన్, రవీంద్రనాథ్, కుమార్తెలు అరుణ, సీతామహాలక్ష్మి ప్రస్తుతం ఉన్నత స్థానాల్లో ఉన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): పుస్తక పఠనం ద్వా రా జ్ఞానం వస్తుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. ఆదివారం క్యాంపు కార్యాలయంలో ప్రకృతి క్షేత్రపాలకులు మధుసూదనరావు కలెక్టర్ను కలిసి ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవా లి?, గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య– పర్యా వరణం/పరిశుభ్రత అనే రెండు పుస్తకాలను సుమారు 300 ప్రతులను డీఈఓకు అందజేశారు. వీటిని హైస్కూల్ విద్యార్థులకు అందించాలని కోరారు. డాక్టర్ మీసరగండ రమాదేవి రచించిన ఎదిగే ఆడపిల్ల ఏమి తెలుసుకోవాలి? పుస్తకం యుక్త వయసు బాలికలకు అవసరమైన వ్యక్తిగత అవగాహన పెంచేందుకు దో హదపడుతుందన్నారు. కోడూరి శ్రీరామమూర్తి రచించిన గాంధీ మహాత్ముని దృష్టిలో విద్య – పర్యావరణం/ పరిశుభ్రత పుస్తకం ద్వారా పరిశుభ్రత పర్యావరణ పరిరక్షణపై అవగాహన పెంపొందించవచ్చని చెప్పారు. భీమవరం (ప్రకాశంచౌక్): ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ (ఏపీఎస్ఎస్డీసీ)నేషనల్ కెరీర్ సర్వీస్ (ఎన్సీఎస్) ఆధ్వర్యంలో భీమవరం ఎంపీడీఓ కార్యాలయంలో ఈనెల 8న ప్లేస్మెంట్ డ్రైవ్ నిర్వహించనున్నారు. అపోలో ఫార్మసీ, జగదీశ్ మైరెన్ ఎక్స్పోర్ట్స్, కియా మో టార్స్, జెస్పర్ మోటర్స్, ఇన్నోవా సోర్స్, టాటా ఎలక్ట్రానిక్స్ వంటి కంపెనీల్లో ఉద్యోగావకాశాలు కల్పిస్తామని జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి పి.లోకమాన్ తెలిపారు. మరిన్ని వివరాలకు సెల్ 9440838388, 8688594244 నంబర్లలో సంప్రదించాలని కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలకు ఆదివారం 1,167 మంది విద్యార్థు లు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 127 మందికి 119, మ ధ్యాహ్నం 121 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 181 మందికి 175 మంది, మధ్యాహ్నం 179 మందికి 172 మంది హా జరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఉ దయం 116 మందికి 111 మంది, మ ధ్యాహ్నం 105 మందికి 102 మంది హాజర య్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 99 మందికి 98 మంది, మ ధ్యాహ్నం 100 మందికి 95 మంది హాజరయ్యారు. డీఎన్ఆర్ కళాశాలలో ఉదయం 98 మందికి 95 మంది, మధ్యాహ్నం 93 మందికి 89 మంది హాజరయ్యారు. పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి. -
కోరిన ఫలాలు అందించే మద్ది అంజన్న
జంగారెడ్డిగూడెం: మనిషిలోని రాక్షసత్వాన్ని నశింపజేసి కోరుకున్న ఫలాలను అందించే దేవుడు మద్ది ఆంజనేయస్వామి అని ప్రవచనకర్త గరికిపాటి నరసింహారావు అన్నారు. మండలంలోని గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామిని ఆదివారం ఆయన దర్శించుకున్నారు. స్వామివారిని దర్శించు కోవడం ఎంతో ప్రశాంతతను చేకూర్చిందని, ఇక్క డి అర్చకులు, అధికారులు, ఈ ప్రాంతవాసులు ధన్యులని అన్నారు. ఆలయంలో ఆయన ప్రత్యేక పూజలు చేయించారు. ఆలయ అసిస్టెంట్ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన ఉన్నా రు. అనంతరం గుర్వాయిగూడెం మానస సరోవర్ విల్లాస్లో డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఏర్పాటుచేసిన కార్యక్రమంలో ఆయన ఆధ్యాత్మిక ప్రవచనం చేశారు. సుఖ దుఃఖ సమన్వయం అనే అంశంపై ప్రవచించారు. -
● నేత్రపర్వంగా రాట్నాలమ్మ ఉత్సవాలు
దెందులూరు: పెదవేగి మండలం రాట్నాలకుంట గ్రామంలో వెలసిన శ్రీ రాట్నాలమ్మ తల్లి ఉత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. ఉత్సవాల్లో భాగంగా ఆదివారం అమ్మవారిని రాజరాజేశ్వరిదేవిగా అలంకరించారు. ఉదయం అమ్మవారికి విఘ్నేశ్వర పూజ, నవగ్రహ మండపార్చన తదితర పూజ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ నిర్వహించారు. దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, జడ్పీ వైస్ చైర్మన్ పెనుమాల విజయబాబు అమ్మవారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం హరే శ్రీనివాస కోలాటం రాయుడుపాలెం, రత్నాలకుంట, వారిచే కోలాట ప్రదర్శన నిర్వహించారు. ఆలయం వద్ద మహా అన్నసమారాధన ఏర్పాటు చేశారు. కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల మండలి కమిటీ చైర్మన్ మన్నే శ్రీనివాసరావు, ఈవో ఎన్.సతీష్ కుమార్, భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. అమ్మవారిని దర్శించుకుంటున్న కొఠారు అబ్బయ్య చౌదరి అన్నసమారాధన రాజరాజేశ్వరిగా దర్శనమిచ్చిన అమ్మవారు -
పెద్దింట్లమ్మ దేవస్థానంలో భక్తుల రద్దీ
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం భక్తుల రద్దీ కనిపించింది. సమీప జిల్లాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు అమ్మను దర్శించుకున్నారు. మహిహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. పవిత్ర కోనేరులో స్నానాలు ఆచరించిన భక్తులు అమ్మవారికి తలనీలాల మొక్కులు తీర్చుకున్నారు. ఆలయ ఉప ప్రధాన అర్చకుడు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గదుల అద్దెలు, అమ్మవారి చిత్ర పటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.1,15,082 వచ్చిందని తెలిపారు. -
ట్రాక్టర్ బోల్తా.. డ్రైవర్ దుర్మరణం
పెనుమంట్ర : మాముడూరు గ్రామంలోని సత్తెమ్మ తల్లి ఆలయం సమీపంలో రొయ్యల చెరువుల్లో మట్టి లెవెలింగ్ పనులు చేస్తుండగా ట్రాక్టర్ బోల్తా పడిన ప్రమాదంలో అదే గ్రామానికి చెందిన ట్రాక్టర్ డ్రైవర్ బొక్క దుర్గాప్రసాద్ (27) అక్కడికక్కడే మృతి చెందాడు. ఈ ఘటన శనివారం మధ్యాహ్నం జరిగింది. మావుడూరు పంచాయతీ వార్డు మెంబర్ బొక్క రామకృష్ణ కుమారుడైన దుర్గాప్రసాద్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. రొయ్యల చెరువులో మట్టి పనులు చేస్తూ ట్రాక్టర్ రివర్స్ చేస్తుండగా బోల్తాపడటంతో ఈ ప్రమాదం జరిగింది. కొడుకు మృతితో ఆ కుటుంబం బోరున విలపిస్తోంది. దుర్గాప్రసాద్ మృతితో గ్రామంలో విషాద చాయలు అలముకున్నాయి. పెనుమంట్ర పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెం: దిప్పకాయలపాడులో శనివారం మధ్యాహ్నం జరిగిన ప్రమాదంలో రెండిళ్లు దగ్ధమయ్యాయి. తంగిరాల వెంకటేష్, షేక్ ఇమాంబిలకు చెందిన ఇళ్ళు అగ్నికి ఆహుతయ్యాయి. పొలం పనులకు వెళ్లిన సమయంలో అగ్ని ప్రమాదం సంభవించిందని స్థానికులు తెలిపారు. ముందుగా వెంకటేష్ ఇంటిలో అగ్ని ప్రమాదం సంభవించగా పక్కనే ఉన్న ఇమాంబి ఇంటికి వ్యాపించిందన్నారు. జంగారెడ్డిగూడెం నుంచి అగ్నిమాపక వాహనం వచ్చి మంటలను అదుపు చేసేసరికి రెండిళ్లు ఆహుతయ్యాయని బాధితులు వాపోయారు. ఇమాంబి ఇంటి నిర్మాణం కోసం తీసుకువచ్చిన లక్ష రూపాయల నగదుతో పాటు బంగారం కాలి బూడిద అయిందని విలపించింది. ఘటనా స్థలం వద్దకు రెవెన్యూ, విద్యుత్ శాఖ, అధికారులు వచ్చి ప్రమాదానికి కారణాలపై విచారణ చేపట్టారు. -
ఈస్టర్ పండుగకు సన్నద్ధం
ఉండి: గుడ్ఫ్రైడే జరుపుకున్న క్రైస్తవ సోదరులు ఆదివారం జరిగే ఈస్టర్ పండుగ కోసం సిద్ధమవుతున్నారు. మృతిచెందిన తమ వారి సమాధులను శనివారం పరిశుభ్రంగా కడిగి రంగులు వేసి అందంగా తీర్చిదిద్దారు. పూలు, పండ్లు, కొవ్వొత్తులు, విద్యుత్ లైట్లతో సమాధులను అలంకరించి ఆదివారం తెల్లవారు జామున చర్చ్ నుంచి బయలుదేరి సమాధుల వద్దకు ఊరేగింపుగా వెళ్తారు. బాణసంచా కాల్పులతో, భక్తి కీర్తనలతో ఊరేగింపు నిర్వహిస్తారు. క్రైస్తవులు తమవారి సమాధుల వద్దకు వెళ్ళి ప్రార్థనలు నిర్వహిస్తారు. ఒకరినొకరు ప్రేమతో పలకరించుకుంటూ ఈస్టరు పండుగ శుభాకాంక్షలు తెలుపుతారు. అనంతరం ఉదయం చర్చిల్లో జరిగే కార్యక్రమాల్లో పెద్ద సంఖ్యలో క్రైస్తవులు పాల్గొని ప్రార్థనలు చేస్తారు. -
ర్యాలీలకు అనుమతి లేదు
ఆకివీడు మండలంలో 144 సెక్షన్ అమలు భీమవరం(ప్రకాశం చౌక్): ఆకివీడు మండలంలో హిందూ, క్రైస్తవ, స్వచ్చంద సంస్థలు, రాజకీయ పార్టీలు చేపట్టే ర్యాలీలు, ఇతర కార్యక్రమాలకు అనుమతులు లేవని, 5న చలో ఆకివీడు పేరిట ర్యాలీలు, ఇతర కార్యక్రమాలు పెట్టుకున్న సంస్థలు రద్దు చేసుకొవాలని భీమవరం డీఎస్పీ రఘువీరా విష్ణు అన్నారు. శనివారం భీమవరం రెవెన్యూ డివిజన్ కార్యాలయంలో ఆర్డీవో ప్రవీణ్కుమార్రెడ్డితో కలిసి ఆయన విలేకర్ల సమావేశం నిర్వహించారు. ఆయన మాట్లాడుతూ ఆకివీడు పెద్దపేటలో ప్రస్తుతం ప్రశాంత వాతవరణం ఉందని, ర్యాలీలు ఏర్పాటు చేయడం వల్ల శాంతి భద్రతలకు విఘాతం కలుగుతుందన్నారు. మండలంలో 144 సెక్షన్ అమల్లో ఉందని. అలాగే 30 పోలీసు యాక్ట్ కూడా అమల్లో ఉందన్నారు. అనుమతులు లేకుండా కార్యక్రమాలు చేస్తే చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
మద్దిలో అభిషేక సేవ
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో శనివారం ఆంజనేయస్వామికి అభిషేక సేవ నిర్వహించారు. ఆలయ ముఖ మండపంపై ఆంజనేయస్వామి ఉత్సవ విగ్రహానికి పంచామృతాలతో అర్చకులు, వేదపండితుల ఆధ్వర్యంలో అభిషేకం నిర్వహించారు. ఆలయానికి వివిధ సేవల రూపేణా రూ.1,66,107 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 1357 మంది భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు ఈవో తెలిపారు. ద్వారకాతిరుమల : ఓ భక్తుడు పోగొట్టుకున్న ట్యాబ్ ఉన్న బ్యాగ్ను పోలీసులు కేవలం నాలుగు గంటల వ్యవధిలోనే సదరు భక్తుడికి అప్పగించారు. వివరాల్లోకి వెళితే.. నల్లజర్ల మండలం పోతవరం గ్రామానికి చెందిన ఏశాంత్ శనివారం శ్రీవారి దర్శనార్ధం ద్వారకాతిరుమలకు విచ్చేశాడు. స్వామివారి దర్శనానంతరం తిరుగు ప్రయాణంలో అతడు తన ట్యాబ్ ఉన్న బ్యాగ్ను పోగొట్టుకున్నాడు. వెంటనే స్థానిక పోలీసులను ఆశ్రయించాడు. దాంతో ఎస్సై టి.సుధీర్, కానిస్టేబుల్ లక్ష్మీనారాయణ సీసీ ఫుటేజీల ఆధారంగా బ్యాగ్ను కనుగొన్నారు. అనంతరం బ్యాగ్ను, అందులోని ట్యాబ్ను బాదితుడు ఏశాంత్కు భీమడోలు సీఐ పి.కృష్ణ, ఎస్సై సుధీర్లు అందజేశారు. ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ మండలం కొమడవోలు గ్రామంలో వివాహిత శనివారం ఆత్మహత్యకు పాల్పడింది. ఆరవల్లి నాగమణి (44) భర్త, పిల్లలతో కలిసి జీవిస్తోంది. కుటుంబ కలహాల నేపథ్యంలో ఆమె ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. సమాచారం అందుకున్న ఏలూరు రూరల్ ఎస్ఐ నాగబాబు, ట్రైనీ ఐపీఎస్ అధికారి జయశర్మ సంఘటనా స్థలానికి వెళ్ళి పరిశీలించారు. ఆత్మహత్యకు కారణాలేంటనే అంశంపై స్థానికులను ఆరా తీశారు. -
శ్రీవారి ఆలయంలో హిజ్రాల రౌడీయిజం
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రౌడీయిజం రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీస్, దేవస్థానం అధికారులను సైతం వారు లెక్కచేయడం లేదు. దర్శనాలకు వెళ్లే సమయంలో ఆలయంలో వారి దురుసు ప్రవర్తన భక్తులను విస్తుగొలుపుతోంది. ఎవరైనా అడ్డొస్తే వారిపై దౌర్జన్యాలకు దిగుతున్నారు. అంతే కాదు క్షేత్రంలోని అనివేటి మండపం, పరిసర ప్రాంతాల్లో పెళ్లి చేసుకునే వారిని బెదిరించి మరీ రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. అదే కల్యాణ మండపాల్లో డిమాండ్ చేసి ఒక్కో పెళ్లికి రూ.5 వేలు వసూలు చేస్తున్నారు. ఇవ్వకపోతే పెళ్లికొడుకు, పెళ్లి కూతురికి, వారి బంధువులకు శాపనార్ధాలు పెట్టడం, బెదిరించడం, నోటికొచ్చిన బూతులు తిట్టడం వంటివి చేస్తున్నారు. దాంతో భీతిల్లుతున్న పెళ్లి బృందాలు ఎందుకొచ్చిన గొడవలే అని వారు అడిగింది ఇచ్చి పంపుతున్నారు. బెదిరించి రూ.50 వేల వసూళ్లు సామాన్య, మధ్య తరగతి కుటుంబాల వారే అనివేటి మండపాలు, ఆ పరిసర ప్రాంతాల్లో వివాహాలు జరుపుకుంటారు. ఎందుకంటే పెద్ద పెద్ద కల్యాణ మండపాలకు వేలాది రూపాయల అద్దెలు చెల్లించలేక వారు ఇక్కడ పెళ్లిళ్లు చేసుకుంటారు. అయితే కొందరు హిజ్రాలు అలాంటి వారిని కూడా వదలడం లేదు. పెళ్లి జరిగే సమయంలో వారి వద్దకు వెళ్లి బెదిరించి, శాపనార్ధాలు పెట్టి, ఇష్టం వచ్చినట్టుగా బూతులు తిట్టి, అప్పటికీ వారు అడిగిన డబ్బులు ఇవ్వకపోతే దౌర్జన్యాలకు పాల్పడి ఒక్కో పెళ్లి బృందం నుంచి బలవంతంగా రూ.1,000 చొప్పున వసూలు చేస్తున్నారు. కల్యాణ మండపాల్లో పెళ్లిళ్లు చేసుకునే వారి నుంచి రూ.5 వేలు చొప్పున బలవంతపు వసూళ్లు చేస్తున్నారు. ఈ క్రమంలోనే శుక్రవారం రాత్రి అనివేటి మండపాలు, పరిసర ప్రాంతాల్లో 50 వరకు వివాహాలు జరగగా, హిజ్రాలు వారి నుంచి రూ.50 వేల వరకూ వసూలు చేశారు. అంతరాలయానికి పంపలేదని శనివారం ఉదయం ఇద్దరు హిజ్రాలు, ఒక మహిళను తీసుకుని శ్రీవారి దర్శనానికని వెళ్లగా, అధికారులు వారిని ఆలయంలోకి పంపారు. అయితే అంతరాలయ దర్శనానికి పంపలేదని వారు ఆలయంలో నానా హడావుడి చేశారు. తన చాతీపై చేతులు వేసి నెట్టారంటూ అందులో ఒక హిజ్రా సిబ్బందిని భయపెట్టే ప్రయత్నం చేసింది. అయినా వారు లెక్కచేయక పోవడంతో అక్కడున్న అధికారిని నోటికొచ్చినట్టు తిట్టారు. ఇదంతా చూసిన భక్తులు విసుగుచెందారు. హిజ్రాలు ఆలయంలో ప్రవర్తించిన తీరుపై పలువురు మండిపడ్డారు. దృష్టి సారించాలి గతంలో ఓ సారి హిజ్రాలు క్షేత్రంలో జరిగిన ఓ వీఐపీ వివాహానికి వెళ్లి, డబ్బులు డిమాండ్ చేసి రచ్చరచ్చ చేశారు. అప్పట్లో ఈ విషయాన్ని పోలీస్ ఉన్నతాధికారులు సీరియస్గా తీసుకున్నారు. పెళ్లిళ్లకు వెళ్లి బలవంతంగా డబ్బులు వసూలు చేసే, రౌడీయిజం చేసే హిజ్రాలపై కేసులు నమోదు చేయాలని అప్పట్లో సీఐ, ఎస్సైలకు ఆదేశాలిచ్చారు. కొద్ది నెలలు మాత్రమే ఆ ఆదేశాలు సక్రమంగా అమలయ్యాయి. ప్రస్తుతం పెళ్లిళ్లు చేసుకునే వారు కొందరు హిజ్రాలు పెడుతున్న ఇబ్బందులను భరించలేక పోతున్నారు. ఇప్పటికై నా పోలీస్ ఉన్నతాధికారులు ఈ సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలని పలువురు కోరుతున్నారు. అంతరాలయంలోకి ఎందుకు పంపరంటూ హడావుడి క్షేత్రంలో ఒక్కో పెళ్లికి రూ. వెయ్యి నుంచి.. రూ. 5 వేలు వరకు బలవంతపు వసూళ్లు ఇవ్వకపోతే బెదిరింపులు, తిట్లు, అసభ్యకర ప్రవర్తనలు -
8న మార్టేరులో కిసాన్ మేళా
ఏలూరు(టూటౌన్): ఆచార్య ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయం గోదావరి మండల పరిధిలో కిసాన్ మేళా నిర్వహిస్తున్నట్లు ఏలూరు ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ కె.ఫణి కుమార్ తెలిపారు. శనివారం ఏలూరులో ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఈ నెల 8న మార్టేరులోని ప్రాంతీయ వ్యవసాయ పరిశోధన స్ధానంలో కిసాన్ మేళా నిర్వహిస్తారన్నారు. మారుతున్న వాతావరణ, వాణిజ్య పరిస్థితులు–సుస్థిర వరి వ్యవసాయం అంశంపై కిసాన్ మేళా జరగనుందన్నారు. ముఖ్య అతిథిగా వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, ఇతర మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, విశ్వవిద్యాలయ అధికారులు, వివిధ రంగాలకు చెందిన శాస్త్రవేత్తలు, వ్యవసాయ అనుబంధ రంగాలకు చెందిన అధికారులు హాజరవుతారన్నారు. కిసాన్ మేళా సందర్భంగా వ్యవసాయ, ఉద్యాన, మత్స్య పరిశ్రమ, వ్యవసాయ యాంత్రీకరణ, వివిధ ప్రైవేట్ కంపెనీలకు చెందిన ప్రదర్శన శాలలను ఏర్పాటు చేస్తారన్నారు. రైతులకు నూతన వరి రకాల ప్రదర్శన, క్విజ్ పోటీ నిర్వహిస్తారన్నారు. జిల్లాలోని రైతులు పెద్ద సంఖ్యలో కిసాన్ మేళాకు హాజరుకావాలన్నారు. -
జెడ్పీటీసీలకు లక్షల్లో బకాయిలు
దెందులూరు: పేరుకే జెడ్పీటీసీసలమని.. గౌరవం వేతనం లేదని పలువురు జెడ్పీటీసీలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మండలం నుంచి ఒకరు జెడ్పీటీసీగా ఎన్నికవుతారు. జిల్లాలో 48 మంది జెడ్పీటీసీలున్నారు. ఒక్కొక్కరికి నెలకు గౌరవ వేతనంగా రూ.6000 ప్రభుత్వం కేటాయించింది. 36 నెలలుగా ఒక్కొక్కరికి సుమారు 2.18 లక్షలు రావాల్సి ఉంది. మొత్తం 48 మంది జడ్పీటీసీ సభ్యులకు కలిపి రూ. 1.03 కోట్లకు పైగా చెల్లించాల్సి ఉంది. ఆరు నెలలు మాత్రమే గౌరవ వేతనం మంజూరు చేశారంటున్నారు. జిల్లా పరిషత్ అధికారులు జెడ్పీటీసీ గౌరవ వేతనం బిల్లులు మంజూరుకు రెండు మూడుసార్లు ప్రభుత్వానికి పంపారని, బిల్లులకు సంబంధించి నిధులు మంజూరు కాలేదు. ఇదేనా జెడ్పీటీసీ సభ్యులకు ప్రభుత్వం ఇచ్చే గౌరవమని అని ప్రశ్నిస్తున్నారు. 2026 సెప్టెంబర్ 30 వరకు జెడ్పీటీసీ సభ్యుల పదవీకాలం ఉందని, ఇంకెప్పుడు ప్రభుత్వం గౌరవం వేతనం మంజూరు చేస్తుందని జెడ్పీటీసీ సభ్యులు ప్రశ్నిస్తున్నారు. ఒక్కో సంవత్సరానికి జిల్లాకు వివిధ పనుల నిమిత్తం కోట్లాది రూపాయలు మంజూరు చేస్తున్న ప్రభుత్వం ప్రజల నుంచి ఎన్నికై న జెడ్పీటీసీ సభ్యులకు గౌరవం వేతనం ఎందుకు పెండింగ్లో పెడుతున్నారని అడుగుతున్నారు. బయటి వాళ్లు అడిగే ప్రశ్నలకు సమాధానం చెప్పడం చాలా ఇబ్బందిగా ఉందని పలువురు జెడ్పీటీసీలు వాపోతున్నారు. జిల్లా పరిషత్ అధికారులు ఒకటికి రెండుసార్లు బిల్లులు పెట్టినా ఎందుకు మంజూరు చేయడం లేదని, పెండింగ్ ఎందుకు పెడుతున్నారని అంటున్నారు. జిల్లా పరిషత్ సర్వసభ్య సమావేశాల్లో జిల్లా ఇన్చార్జి మంత్రి దృష్టికి తీసుకువెళ్లి పరిష్కారానికి కృషి చేస్తున్నామని అధికారులు చెబుతున్నారు. తమకు అందించే గౌరవ వేతన విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం ఏమాత్రం సరైనది కాదని జెడ్పీటీసీలు అంటున్నారు మంజూరుకు నోచుకోని బిల్లులు -
భక్తులతో పోటెత్తిన చిన వెంకన్న క్షేత్రం
ద్వారకాతిరుమల: పదో తరగతి, ఇంటర్మీడియట్ పరీక్షలు ముగియడంతో చిన్న వెంకన్న క్షేత్రం శనివారం భక్తజన సంద్రమైంది. రాష్ట్ర నలుమూలల నుంచే కాకుండా, ఇతర రాష్ట్రాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు తెల్లవారుజాము నుంచే ఆలయానికి తరలివచ్చారు. దాంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. ముఖ్యంగా దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కల్యాణకట్ట తదితర విభాగాలు భక్తులతో రద్దీగా మారాయి. 104 జంటలు శ్రీవారి నిత్యార్జిత కల్యాణంలో పాల్గొన్నారు. వేలాది మంది భక్తులు స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఇదిలా ఉంటే అనివేటి మండపంలో పలు భజనమండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రం భక్తుల రద్దీ కొనసాగింది. నిత్య కల్యాణంలో పాల్గొన్న 104 జంటలు -
కారు ఢీకొని వ్యక్తి మృతి
కై కలూరు: అతి వేగంగా వస్తున్న కారు బైక్ను ఢీకొట్టడంతో ఒక వ్యక్తి అక్కడికక్కడే మరణించిన ఘటన ఆలపాడు ప్లైఓవర్ బ్రిడ్జిపై శనివారం జరిగింది. కై కలూరు రూరల్ పోలీసుల వివరాలు ప్రకారం భీమడోలు మండలం పొలసానిపల్లి గ్రామానికి చెందిన మామిడి శ్రీను(45) కై కలూరు మండలం ఆలపాడులో చిన్న అల్లుడు పులిపాక సుబ్బారావుతో కలిసి బైక్పై ఆకివీడు వెళ్ళి తిరిగి వస్తున్నాడు. ఆలపాడు ప్లైఓవర్ బ్రిడ్జిపై ఆకివీడు నుంచి వస్తున్న కారు వేగంగా ఢీకొట్టింది. వెనుక కూర్చున్న శ్రీను మరణించాడు. ద్విచక్రవాహం నడుపుతున్న సుబ్బారావుకు గాయాలయ్యాయి. అతనిని కై కలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. పెద్ద అల్లుడు ఫిర్యాదుపై కారు డ్రైవర్పై కేసు నమోదు చేసిన రూరల్ ఎస్ఐ రాంబాబు దర్యాప్తు చేస్తున్నారు. -
రైతు సేవా కేంద్రాలపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మొదలుపెట్టిన రైతు సేవా కేంద్రాల నిర్మాణాలను కూటమి సర్కారు పూర్తిచేయకపోవడంతో రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ అన్నారు. ఏలూరు జిల్లా సమీక్షా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిల్లాలో 488 కేంద్రాలను మంజూరుచేయగా గత ప్రభుత్వంలోనే 217 కేంద్రాలు వినియోగంలోకి రాగా.. 138 కేంద్రాల పనులు వివిధ దశల్లో ఉన్నాయన్నారు. కూటమి ప్రభుత్వం గద్దెనెక్కి రెండేళ్లు కావస్తున్నా చిన్నపాటి పనులను పూర్తిచేయకుండా కాంట్రాక్టర్లు జాప్యం చేస్తున్నారని, ప్రభుత్వం దృష్టి పెట్టి పనులు వేగవంతం చేయాలని కోరారు. ఏలూరు మెడికల్ కాలేజీ ఆస్పత్రిలో ఒక పేషెంట్ ప్రతి విభాగానికి వేరే ఓపీ కార్డు తీసుకోవాలనే నిబంధనతో సత్వర సేవలు అందడం లేదని, పలుమార్లు ఓపీ కోసం క్యూలలో నిలవలేక రోగులు ఇబ్బంది పడుతున్నారన్నారు. ఈ విధానాన్ని వెంటనే మార్చాలని కోరారు. బుట్టాయగూడెం ఆరోగ్య కేంద్రంలో జనరల్ సర్జన్, జనరల్ ఫిజీషియన్ 8 నెలలుగా లేకపోవడంతో ప్రజలకు సేవలందడం లేదన్నారు. మన్యం ప్రాంతం కొయిదా, కుక్కునూరు, అమరవరం ప్రాథమిక ఆస్పత్రుల్లో పూర్తిస్థాయిలో వైద్యులు లేరని, డిప్యూటేషన్పై ఒకరు అరకొరగా వచ్చి వైద్యం చేయడంతో ప్రజలకు సకాలంలో సేవలు అందడం లేదన్నారు. పెదపాడు మండలంలో నిడమర్రు ప్రాంతంలో రెండు పీహెచ్సీలు, 12 సబ్ సెంటర్లు శిథిలావస్థకు చేరుకున్నాయని, మరమ్మతులు చేయించాలని కోరారు. పారిశుద్ధ్య నిర్వహణలో భాగంగా గత ప్రభుత్వం అన్ని పంచాయతీలకు రిక్షా బళ్లు ఇవ్వగా, ప్రస్తుతం చిన్నపాటి మరమ్మతులు చేయకుండా వీటిని మూలన పడేశారన్నారు. అన్ని విషయా లపై చర్యలు తీసుకుంటామని, స్వచ్ఛాంధ్ర మిషన్ ద్వారా రిక్షాలను బాగు చేయిస్తా మని ఇంచార్జ్ మంత్రి మనోహర్ హామీ ఇచ్చారు . జీలుగుమిల్లిలో బస్షెల్టర్ను రోడ్డు విస్తరణలో తొలగించాలని, అయితే తిరిగి నిర్మాణం చేపట్టకపోవడంతో ప్రజలు ఇ బ్బందులు పడుతున్నారని ఎమ్మెల్సీ రవీంద్రనాథ్ సమావేశం దృష్టికి తీసుకువచ్చారు. ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ -
తిరుమల పవిత్రతను కాపాడండి
ఈస్టర్కు సన్నద్ధం క్రైస్తవ విశ్వాసులు ఈస్టర్ పండుగను ఘనంగా నిర్వహించేందుకు సన్నద్ధమయ్యారు. మృతిచెందిన తమ వారి సమాధులను సుందరంగా అలంకరించారు. 8లో uద్వారకాతిరుమల శ్రీవారి ఆలయంలో కొందరు హిజ్రాల రుబాబు రోజురోజుకు పెచ్చుమీరుతోంది. పోలీసులను కూడా వారు లెక్కచేయడం లేదు. 8లో uఆదివారం శ్రీ 5 శ్రీ ఏప్రిల్ శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: పవిత్ర పుణ్యక్షేత్రమైన తిరుమల తిరుపతి దేవస్థానం ప్రతిష్టను దిగజార్చిన టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడును వెంటనే చైర్మన్ పదవి నుంచి తొలగించాలని డిమాండ్ చేస్తూ శనివారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో జిల్లావ్యాప్తంగా నిరసన కార్యక్రమాలు నిర్వహించారు. తొలుత ఆయా ప్రాంతాల్లోని ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి, ఆలయం బయట సీఎం చంద్రబాబు, బీఆర్ నాయుడులకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. హిందువులు పవిత్రంగా భావించే తిరుమల వేంకటేశ్వరస్వామి దేవస్థానం చైర్మన్గా ఉంటూ అనైతిక కార్యక్రమాలకు పాల్పడిన బీఆర్ నా యుడిని పదవి నుంచి తొలగించకుండా వెనకేసు కుని రావడంలో చంద్రబాబు ఉద్దేశం ఏంటో స్ప ష్టం చేయాలని డిమాండ్ చేశారు. బీఆర్ నాయుడుపై వెంటనే చర్యలు తీసుకోకుంటే హిందువుల ఆగ్రహ జ్వాలల్లో గురికాకతప్పదని హెచ్చరించారు. జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో సమన్వయకర్తలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన కార్యక్రమాలు చేపట్టారు. ● కై కలూరు నియోజకవర్గం.. కై కలూరులో మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, నియోజకవర్గ సమన్వయకర్త దూలం నాగేశ్వరరావు వేంకటేశ్వరస్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి, నిరసన తెలిపారు. ● దెందులూరు నియోజకవర్గం.. పెదపాడు మండల కలపర్రులో వేణుగోపాలస్వామి ఆలయంలో ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్ మాట్లాడుతూ టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు లాంటి వారిపై చర్యలు తీసుకోకుండా సీఎం ఉదాసీనంగా వ్యవహరించడం హేయమైన చర్య అన్నారు. మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త కొఠారు అబ్బయ్యచౌదరి పూజలు నిర్వహించి అనంతరం నిరసన కార్యక్రమం చేపట్టారు. ● ఉంగుటూరు నియోజకవర్గం.. భీమడోలులోని రూపక వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త పుప్పాల వాసుబాబు ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి ఆందోళన చేశారు. ● నూజివీడు నియోజకవర్గం.. నూజివీడు వేంకటేశ్వరస్వామి ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. ● పోలవరం నియోజకవర్గం.. కొయ్యలగూడెం వై.జంక్షన్ వద్ద దుర్గమ్మ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే, నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు ఆధ్వర్యంలో పార్టీ శ్రేణులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. నిరసన తెలిపారు. ● ఏలూరు నియోజకవర్గం.. ఏలూరు ఆర్ఆర్పేటలోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు నిర్వహించి నిరసన కార్యక్రమం చేపట్టారు. ● చింతలపూడి నియోజకవర్గం.. చింతలపూడిలోని రామాలయంలో నియోజకవర్గ సమన్వయకర్త కంభం విజయరాజు ఆధ్వర్యంలో పూజలు నిర్వహించి అనంతరం పార్టీ శ్రేణులతో నిరసన తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): వేంకటేశ్వరస్వామి ఆలయం వద్ద నినాదాలు చేస్తున్న ఏలూరు కన్వీనర్ మామిళ్లపల్లి జయప్రకాష్, నాయకులు పెదపాడు: కలపర్రులో నిరసన తెలుపుతున్న మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్ తిరుమల ప్రతిష్టకు శాపంగా టీ టీడీ చైర్మన్ బీఆర్ నాయుడు పా పాలు నిలుస్తున్నాయి. వెంటనే ఆయన్ను పదవి నుంచి తొలగించాలి. ఛీత్కారం ఎదుర్కొంటు న్నా బీఆర్ నాయుడిని తొలగించకపోవడం అ నుమానాలకు తావిస్తోంది. చంద్రబాబులో వీక్ పాయింట్లు బీఆర్ నాయుడికి తెలుసు, అందుకే చర్యలు తీసుకోవడం లేదు. – దూలం నాగేశ్వరరావు, మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు రాసలీలలు చేస్తూ సాక్ష్యాధారాలతో దొరికిపోయారు. మహిళలతో అసభ్యకరంగా ప్రవర్తిస్తూ, పరమ పవిత్రమైన తిరుమల క్షేత్రానికి మచ్చ తెచ్చారు. అలాంటి వ్యక్తిని సీఎం చంద్రబాబు క్షమిస్తున్నాడు. కలియుగ దైవం తగిన శాస్తి చేయడం ఖాయం. సనాతనీ అని చెప్పుకునే పవన్కల్యాణ్ మౌనం వహించడం దారుణం. – పుప్పాల వాసుబాబు, మాజీ ఎమ్మెల్యే, ఉంగుటూరు కోట్లాది మంది భక్తుల మనోభావాలను దెబ్బతీసిన బీఆర్ నాయుడిని పదవి నుంచి తొలగించి తిరుమల పవిత్రత కాపాడాలి. టీటీడీ చైర్మన్ అశ్లీల కార్యక్రమాలకు పాల్పడిన వీడియోలు వైరల్ అయినా ఆయన్ను ఇప్పటివరకూ పదవి నుంచి తొలగించకుండా సీఎం చంద్రబాబు చోద్యం చూస్తున్నారు. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు కన్వీనర్ బీఆర్ నాయుడు టీటీడీ చైర్మన్గా ఉంటూ అసాంఘిక, అనైతిక చర్యలకు పాల్పడటం దారుణం. బీఆర్ నాయుడు రాసలీలలు వెలుగులోకి వచ్చి నెల రోజులు దాటుతున్నా ప్రభుత్వం ఎందుకు చర్యలు తీసుకోలేదు. అంతేకాకుండా సీఎం చంద్రబాబు బీఆర్ నాయుడుతో అంటకాగుతూ భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, మాజీ ఎమ్మెల్యే, నూజివీడు సద్బుద్ధి ప్రసాదించు స్వామీ టీటీడీ చైర్మన్ను తక్షణమే తొలగించాలి హిందువుల ఆగ్రహ జ్వాలలకు గురికాక తప్పదు జిల్లా వ్యాప్తంగా వైఎస్సార్సీపీ నిరసనలు ఆలయాల్లో ప్రత్యేక పూజలు -
చర్యలు తీసుకోరా?
క్రిమినల్స్పై చర్యలు తీసుకోకుండా కూటమి ప్రభుత్వం వ్యవహరిస్తోంది. ఆధ్యాత్మికమైన ఉన్నత పదవిలో ఉన్న బీఆర్ నాయుడు మహిళపై లైంగికంగా వ్యవహరించిన తీరును ఖండించకుండా వత్తాసు పలుకుతోంది. కూటమి ప్రభుత్వంలో మహిళలపై వేధింపులకు పాల్పడుతున్న ప్రజాప్రతినిధులకు అండదండలు అందిస్తున్నారు. బీఆర్ నాయుడు ఉమనైజర్. –తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, పోలవరం కోట్లాది మంది హిందువుల మనోభావాలతో కూటమి ప్రభుత్వం ఆటలాడుతోంది. టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడు మహిళతో అసభ్యంగా ప్రవర్తించగా వీడియోలతో సహా సోషల్ మీడియాలో వైరల్ కావడం హిందువులను దిగ్భ్రాంతికి గురిచేసింది. చైర్మన్ అనైతిక కార్యకలాపాల వలన తిరుమల తిరుపతి దేవస్థానం అప్రతిష్టపాలవుతోంది. బీఆర్ నాయుడు రాజీనామా చేయాలి. – మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు కన్వీనర్ తిరుమల పవిత్రతకు భంగం కలిగించేలా వ్యవహరిస్తున్న బీఆర్ నాయుడుని వెంటనే టీటీడీ చైర్మన్ పదవి నుంచి తొలగించాలి. పవిత్ర క్షేత్రానికి కళంకం తెచ్చిన వ్యక్తిని పదవిలో కొనసాగించడం సరికాదు. ఈ విషయంలో సీఎం చంద్రబాబుకు సద్బుద్ధి ప్రసాదించాలని స్వామివారికి విన్నవించుకున్నాం. రాష్ట్రంలో కూటమి పాలనలో మహిళలకు రక్షణ కరువైంది. – కంభం విజయరాజు, చింతలపూడి కన్వీనర్ -
కాంతారావుకు జాతీయ స్థాయి జ్యూరీ అవార్డు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరుకు చెందిన చిత్రకారుడు మజ్జి సూర్య కాంతారావు జాతీ య స్థాయిలో మరో అరుదైన గౌరవాన్ని అందుకున్నారు. శనివారం చైన్నె లలిత కళా అకాడమీ ఆర్ట్ గ్యాలరీలో శ్రీ ధరిణి కళైకూడమ్ (కాలేజ్ ఆఫ్ ఫైన్ ఆర్ట్స్) ఆధ్వర్యంలో నిర్వహించిన 21వ నేషనల్ కాంపిటీషన్ అండ్ ఎగ్జిబిషన్లో ప్రతిష్టాత్మక జ్యూరీ అవార్డు అందుకు న్నారు. ఆయన గీసిన చిత్రాల్లోని సృజనాత్మక త, భారతీయ సంస్కృతిని ప్రతిబింబించే శైలి జ్యూరీ సభ్యులను విశేషంగా ఆకట్టుకుంది. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులకు ప్రభుత్వం చెల్లించాల్సిన బకాయిలు వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా ఏపీ ఎన్జీఓస్ అసోసియేషన్ అధ్యక్షుడు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఆర్ఎస్ హరనాథ్ ప్రకటనలో డిమాండ్ చేశారు. ముఖ్యంగా 2022 నుంచి 2026 వరకు ఉన్న సరెండర్ లీవ్స్ బకాయిలు, మూడు డీఏలు,11 పీఆర్సీ అరియర్స్ ఇవ్వాలని కోరారు. 12 పీఆర్సీ కమిటీని వెంటనే నియమించి 30 శాతం మధ్యంతర భృతిని ప్రకటించాలన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలకు శనివారం 1,147 మంది విద్యార్థులు హాజరయ్యారు. ఏలూరులోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో ఉదయం 123 మందికి 110 మంది, మధ్యాహ్నం 116 మందికి 111 మంది హాజరయ్యారు. తాడేపల్లిగూడెం వా సవి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 184 మందికి 180 మంది, మధ్యాహ్నం 181 మందికి 174 మంది హాజరయ్యారు. శశి ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 116 మందికి 112 మంది, మధ్యాహ్నం 97 మందికి 93 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణు ఇంజనీరింగ్ కళాశాలలో ఉదయం 100 మందికి 92 మంది, మధ్యాహ్నం 100 మందికి 92 మంది హాజరయ్యారు. డీఎన్నార్ కళాశాలలో ఉదయం 97 మందికి 95 మంది, మధ్యాహ్నం 96 మందికి 88 మంది హాజరయ్యారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం ప్రజలకు అందించే సేవలపై సంతృప్త స్థాయిలో వృద్ధి కనిపించాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం జిల్లా సమీక్షా సమావేశాన్ని నిర్వహించా రు. మంత్రి మనోహర్ మాట్లాడుతూ జిల్లాలో రోడ్ల మరమ్మతులు, సంక్షేమ హాస్టళ్లలో వసతులపై సూచనలిచ్చారు. కాలువలు, డ్రెయిన్లలో పూడికతీత పనులు చేపట్టాలని, ధాన్యం సేకరణలో ఇబ్బందులు లేకుండా చూడాలన్నారు. ఈనెల 20 వరకు గోదావరి నుంచి కాలువలకు నీరందించేలా తీర్మానించారు. మంత్రి కొలుసు పార్థసారథి, ఎమ్మెల్సీ వంక రవీంద్రనాథ్, కలెక్టర్ వెట్రిసెల్వి, ఎమ్మెల్యేలు సొంగా రోషన్ కుమార్, చింతమనేని ప్రభాకర్, పత్సమట్ల ధర్మరాజు, చిర్రి బాలరాజు, మద్దిపాటి వెంకటరాజు మాట్లాడారు. పోలీస్స్టేషన్లకు వాహనాల అందజేత దాతల సహకారంతో జిల్లాలోని ఏడు పోలీస్ స్టేషన్లకు రూ.70 లక్షల విలువైన ఏడు వాహనాలను అందించినట్టు ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. శనివారం వాహనాలు అందించిన దాతలను మంత్రులు, శాసనసభ్యులు, కలెక్టర్, ఏలూరు రేంజ్ ఐజీ, జిల్లా ఎస్పీ ఘనంగా సన్మానించారు. సాక్షి, భీమవరం: విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సి) అమలులో ప్రైవేట్ విద్యాసంస్థలు నిబంధనలకు విరుద్ధంగా ఫీజులు వసూలు చేస్తే కఠిన చర్యలు తప్పవని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యాంసుందర్ హె చ్చరించారు. ‘ఉచిత విద్య.. అంతా మిథ్య’ శీ ర్షికన ‘సాక్షి’లో ప్రచురితమైన కథనంపై ఆయన మాట్లాడారు. జిల్లాలో తొలి విడతగా 1,047 మంది పేద విద్యార్థులు ఉచిత ప్రవేశాలకు అర్హత పొందారన్నారు. ప్రైవేట్, అన్ఎయిడెడ్ పాఠశాలల్లో ప్రభుత్వం వీరికి 25 శాతం రిజర్వేషన్ కింద ఉచిత ప్రవేశాలు కల్పిస్తున్నామన్నారు. -
కంటైనర్ ఢీకొట్టి ఇద్దరు మృతి
చౌటుప్పల్/కామవరపుకోట: ఆటోను రోడ్డుపక్కన ఆపి టైరు మారుస్తుండగా కంటైనర్ లారీ ఢీకొట్టడంతో ఇద్దరు మృతి చెందారు. ఈ ఘటన శుక్రవారం యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని హైదరాబాద్–విజయవాడ జాతీయ రహదారిపై చోటు చేసుకుంది. చౌటుప్పల్ సీఐ మన్మథకుమార్ తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు జిల్లా కామవరపుకోట మండలం, జాలపవారిగూడెం గ్రామానికి చెందిన పళ్ల నవీన్కుమార్, సాధనాల లక్ష్మీనర్సింహస్వామి, రాసపోలి కనకరాజు, నాగపోగుల కృష్ణఫణీంద్రలు ఏలూరు పరిసర ప్రాంతాల్లో కొబ్బరి బొండాలు సేకరించి ఆటోల్లో లోడు చేసుకుని గురువారం రాత్రి హైదరాబాద్కు బయలుదేరారు. శుక్రవారం తెల్లవారుజామున చౌటుప్పల్ మండలం దండుమల్కాపురం గ్రామ శివారులోని చెరువు సమీపంలోకి చేరుకోగానే పళ్ల నవీన్కుమార్కు చెందిన ఆటో పంక్చర్ అయింది. దీంతో వాహనాన్ని రోడ్డు పక్కన ఆపి టైరు మార్చే ప్రయత్నాలు చేస్తున్నాడు. అదే సమయంలో వెనుక నుంచి వచ్చిన మిగతా ముగ్గురు ఆటో డ్రైవర్లు కూడా తమ వాహనాలను ఆపారు. సెల్ఫోన్ లైట్ల వెలుతురులో ఆటో టైర్ మారుస్తుండగా హైదరాబాద్ వైపునకు వెళ్తున్న కంటైనర్ లారీ వేగంగా వచ్చి ఆటోను ఢీకొట్టింది. దీంతో సాధనాల లక్ష్మీనర్సింహస్వామి (39) తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మిగతా వారిని స్థానిక ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పల్లా నవీన్కుమార్(27) అక్కడే చికిత్స పొందుతూ మృతిచెందాడు. మిగలిన ఇద్దరు ఆటో డ్రైవర్లు చికిత్స పొందుతున్నారు. పల్లా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నట్లు సీఐ తెలిపారు. మృతులు పల్లా నవీన్ కు భార్య, ఏడాది కుమారుడు ఉన్నాడు. సాధనాల స్వామి భార్య గర్భవతి. వీరి మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆటో టైరు మారుస్తుండగా ఘటన -
ఎస్సై దాతృత్వం
లింగపాలెం: మండలంలోని ములగలంపాడులో ఇటీవలే కొడుకులు సరిగ్గా చూడక ఇంటి బయట చెట్టు కింద వృద్ధురాలు నివాసం ఉంటుంది. స్థానికులు, సోషల్మీడియాలో వచ్చిన కథనాలకు ఎస్సై వెంకన్న స్పందించారు. వృద్ధరాలి దగ్గరకు వెళ్లి కుటుంబసభ్యులతో మాట్లాడి ఆమెను పక్కనే ఉన్న వాళ్ళ బంధువుల ఇంటి దగ్గర పెట్టి ఆ వృద్ధురాలికి త్వరలోనే నివాసం ఏర్పాటు చేయాలని కుమారులకు కౌన్సెలింగ్ ఇచ్చారు. కామవరపుకోట: తడికలపూడి పోలీస్ స్టేషన్ ఎస్సై చెన్నారావును పోలీస్ ఉన్నతాధికారులు వీఆర్లో పెట్టారు. తడికలపూడి ఎస్సైగా బాధ్యతలు చేపట్టి రెండు సంవత్సరాలు గడిచింది. శాఖా పరమైన కారణాలతో వీఆర్లో పెట్టినట్లు సమాచారం. ప్రస్తుతం ఇన్చార్జి ఎస్సై జంగారెడ్డిగూడెం ట్రాఫిక్ ఎస్సైగా పని చేస్తున్న కుటుంబరావును నియమించారు. వేలేరుపాడు: గాలి వల్ల 11 కేవీ లైన్ కొయిదా ఫీడర్ వైర్ తెగడంతో వేలేరుపాడు మండలంలోని విద్యుత్ సబ్స్టేషన్ సమీపంలో ఐదు పశువులు అక్కడికక్కడే ప్రాణాలు కోల్పోయాయి. శివకాశీపురం గ్రామంలో శ్రీనివాసరావు చెందిన ఐదు ఎద్దులను (పశువులు) ఇదే గ్రామానికి చెందిన కుంబటి నాగరాజు శుక్రవారం మధ్యాహ్నం దగ్గరలోని పొలాలకు మేతకు తీసుకెళ్లాడు. తిరిగి ఇంటికి తోలుకొస్తున్న క్రమంలో ఒక్కసారిగా గాలి రావడంతో 11కేవీ లైన్ విద్యుత్ వైరు తెగి పశువులపై పడింది. దీంతో ఐదు పశువులు అక్కడికక్కడే మృతి చెందాయి. ఈ సమయంలో నాగరాజు పక్కకు పారిపోవడంతో ప్రాణాపాయం తప్పింది. గణపవరం: రక్తదానం చేయడం వల్ల ఎలాంటి ఆరోగ్య సమస్యలు రావని, రక్తదానంతో మరొకరికి ప్రాణదానం చేయవచ్చని గణపవరానికి చెందిన పద్మపూజిత గ్రూపు చైర్మన్ ఆర్.బసవరాజు అన్నారు. శుక్రవారం గణపవరంలో పద్మపూజిత గ్రూపు సంస్థల ఆధ్వర్యంలో మెగా రక్తదాన శిబిరం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా శిబిరాన్ని ప్రారంభించిన బసవరాజు రక్తదానంపై ప్రజలలో అవగాహన కల్పించడం ద్వారా స్వచ్ఛందంగా రక్తదానం చేసేలా చైతన్యవంతులు చేయాలని యూత్ సభ్యులకు సూచించారు. ఈ శిబిరంలో రక్తదానం చేసిన యువకులకు సర్టిఫికెట్లు అందించారు. ఈ కార్యక్రమంలో పద్మపూజిత అనుబంధ సంస్థల జోనల్, ఏరియా అధికారులు ఫణి, అనిల్ పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ జంగారెడ్డిగూడెం, పోలవరం సర్కిల్ కార్యాలయాలను శుక్రవారం ప్రొహిబిషన్ అండ్ ఎకై ్సజ్ ఎన్ఫోర్స్మెంట్ అసిస్టెంట్ కమీషనర్ కేవీ నాగ ప్రభుకుమార్ ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా రికార్డులను పరిశీలించి, సర్కిల్ పరిధిలో చేపట్టిన కార్యక్రమాలపై అడిగి తెలుసుకున్నారు. సిబ్బందిని నాటు సారాకు సంబంధించి సమాచారం సేకరించాలని ఆదేశించారు. ఈ సందర్భంగా నాగ ప్రభుకుమార్ మాట్లాడుతూ తెలంగాణ, ఇతర రాష్ట్రాల నుంచి సుంకం చెల్లించని మద్యంపై నిఘా ఉంచాలని సూచించినట్లు తెలిపారు. అనంతరం తెలంగాణ, ఆంధ్ర రాష్ట్ర సరిహద్దులోని బోర్డర్ చెక్పోస్టును ఆయన తనిఖీ చేసి, సూచనలు చేశారు. కార్యక్రమంలో జంగారెడ్డిగూడెం, పోలవరం సీఐలు కె.శ్రీనుబాబు, కె.వీరబ్రహ్మం, ట్రైనీ ఎస్సై సతీష్కుమార్ పాల్గొన్నారు. నేటి నుంచి పాలిసెట్ ఉచిత కోచింగ్ తాడేపల్లిగూడెం (టీఓసీ): పాలిటెక్నిక్ ప్రవేశ పరీక్షకు ఉచితంగా కోచింగ్ ఇవ్వనున్నట్లు ఎస్ఎ్ఫ్ఐ తాడేపల్లిగూడెం పట్టణ అధ్యక్ష, కార్యదర్శులు గణేష్, పతివాడ నాగేంద్రబాబు తెలిపారు. శుక్రవారం వారు విలేకరులతో మాట్లాడుతూ భీమవరంలోని డాక్టర్ బీవీరాజ్ విద్యా సంస్థల్లోని బి.సీతా పాలిటెక్నిక్ కళాశాలలో శిక్షణ ఇస్తామన్నారు. మరిన్ని వివరాలకు 90141 52239, 91823 09153, 76809 17097 నంబర్లకు ఫోన్ చేయాలని సూచించారు. -
గోపాలా..ఈ గోవులను పట్టించుకునే వారే లేరా?
● మేత లేక బక్కచిక్కుతున్న ఆవులు ● కె.పెంటపాడు బైరాగిమఠంగోశాల వద్ద వింత పరిస్థితి పెంటపాడు: జిల్లాలో ప్రసిద్ధి చెందిన కె.పెంటపాడు బైరాగిమఠం గోపాలస్వామి ఆలయంలో గోశాలలోని గోవులు మేత లేక అల్లాడుతున్నాయి. ఇక్కడ 150కి పైగా గోవులు ఉంటాయి. వీటి కోసం ప్రత్యేకంగా కాపరి ఉంటున్నా వాటి ఆలనాపాలనా పట్టించుకోవడం లేదు. గత కొన్ని రోజులుగా సమస్య తీవ్రతరమైంది. దీంతో గోపాలా.. మా మోర వినవా అంటూ నిత్యం గోపాలస్వామిని మొర పెట్టుకుంటున్నాయి. అయితే గోవుల సంరక్షణ బాధ్యతలు మాత్రం అధికారులు పట్టించుకోవడం లేదు. పచ్చగడ్డి ఏదీ? గతంలో ఆలయ ఆవరణలో ఆవుల కోసం ప్రత్యేకంగా పచ్చగడ్డి పెంచే వారు. గత రెండేళ్లుగా ఆ మేత లేదు. సార్వా ఎండుగడ్డి మాత్రం స్టోరేజీ చేశారు. అదికూడా రక్షణ లేకపోవడంతో కుళ్లిపోయింది. గోశాల చుట్టూ దుర్వాసన వస్తోంది. అక్కడే చెత్త వేయడం వల్ల దోమలు విపరీతంగా పెరిగిపోయాయి. గోశాల వద్ద నిత్యం మందుబాబులు మద్యం తాగుతున్నారు. అక్కడ, పడమర రాజగోపురం వద్ద మద్యం ఖాళీ బాటిళ్లు దర్శనమిస్తున్నాయి. గోవుల కోసం తాగునీరు లేదు. వారానికి ఒక సారి నీరు పోస్తున్నారని స్థానికులు చెబుతున్నారు. అయితే ఆ నీరు ఎండకు వేడెక్కడంతో గోవులు ముట్టుకోవడం లేదు. గోశాల చరిత్ర బైరాగిమఠంలో ఒక గోవు గోపాలుడిని సేవించేందుకు ఆలయం చుట్టూ ప్రదక్షణలు చేసి అలసిపోయి అక్కడే మృతి చెందింది. దీంతో ఆ ఆవు బొమ్మ ఆలయంలో ప్రతిష్టించారు. ఆలయానికి వచ్చే భక్తులు తప్పక ఆవు విగ్రహానికి కూడా పూజలు చేయడం ఆనవాయితీగా వస్తోంది. ఇంత ప్రాశస్త్యం ఉన్న గోశాలలోని గోవులను పట్టించుకోకపోవడం భక్తులు ఆందోళన చెందుతున్నారు. ఆలయానికి వేల ఎకరాలు భూమి ఉన్నా గోశాలకు విరాళాలివ్వండి అంటూ ప్రచారాలు చేసుకుంటున్నారే తప్ప వాటిని పట్టించుకోవడం లేదని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి గోశాల నిర్వహణను సవ్యంగా చేసేలా చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
డివైడర్ను ఢీకొట్టిన కారు
ఆలమూరు: 216ఏ జాతీయ రహదారిలో అంబేడ్కర్ కోనసీమ జిల్లా చొప్పెల్ల వద్ద శుక్రవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు ఎస్సై జి.నరేష్ కథనం ప్రకారం.. చింతలపూడికి చెందిన సుంకర నవీన్, చందుమళ్లకు చెందిన కె.రామ్తేజ, పాలకొల్లుకు చెందిన కె.శివాజీ గణేష్కుమార్ కారులో విశాఖపట్నం బయలు దేరారు. చొప్పెల్ల లాకుల వద్దకు వచ్చేసరికి రాంగ్ రూట్ వెళ్లేందుకు ప్రయత్నించిన ద్విచక్ర వాహనాన్ని తప్పించబోయి డివైడర్ను కారు ఢీకొంది. ఈ ప్రమాదంలో కారు ముందు భాగం నుజ్జునుజ్జయ్యింది. అందులో ఉన్న ముగ్గురికి తీవ్ర గాయాలయ్యాయి. ఎన్హెచ్, 108 అంబులెన్స్లలో క్షతగాత్రులకు ప్రాథమిక చికిత్స అందించి రాజమహేంద్రవరంలోని ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. అయితే అందులో ఒకరి పరిస్థితి విషమంగా ఉన్నట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఎస్సై నరేష్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ముగ్గురికి తీవ్ర గాయాలు -
రైతు గోడు ఎవరికీ పట్టదా?
● ఇంకా ప్రారంభం కాని ధాన్యం కొనుగోలు కేంద్రాలు ● ధాన్యం ఆరబెట్టేందుకు రైతుల అవస్థలు భీమడోలు: రబీ ధాన్యం రోడ్డెక్కింది. చేతికందిన పంటను కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం కొనుగోలు ప్రక్రియను ప్రారంభించకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. దీనితో రైతులు తమ ధాన్యాన్ని నిల్వ చేసుకునేందుకు నానా అవస్థలు పడుతున్నారు. దళారులకు ధాన్యాన్ని అయినకాడకు అమ్ముకుంటూ నష్టాన్ని మూటగట్టుకుంటున్నారు. ప్రస్తుతం రైతులకు కనీస మద్దతు ధర దక్కే పరిస్థితులు కనిపించడం లేదు. గ్రామీణ ప్రాంతాల్లో గోదాములు కొరత, వర్షాల భయంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. దీంతో మెషీన్లతో కోసిన పంట తేమ శాతం తగ్గించుకునేందుకు రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. దళారులను ఆశ్రయిస్తున్న రైతులు వారం రోజుల కితమే ధాన్యం చేతికందినప్పటికీ.. కొనేవాడు లేక బరకాలు కప్పి ఉంచి కాపలా కాస్తున్నారు. రబీ ధాన్యం చేతికందగానే కొనుగోలుకేంద్రాలు తెరవకపోవడంతో రైతాంగం ఆందోళన చెందుతుంది. మెట్ట ప్రాంతాల్లోని బోర్ల కింద సాగు చేసిన 1153 రకం పంట కోతలు ప్రారంభం కాగా మాసూళ్ల పర్వం కూడా పూర్తయ్యింది. అయితే అటూ ప్రభుత్వం కొనక.. దళారులకే అమ్మి తీవ్రంగా నష్టపోతున్నారు. దీనితో రైతులు, కౌలు రైతులు నానా అవస్థలు పడుతున్నారు. ఓ పక్క వాతావరణంలో ఏర్పడ్డ ఎల్నినో పరిస్థితులు నేపథ్యంలో విభిన్న పరిస్థితులు తలెత్తడంతో గుండెల్లో రైళ్లు పరిగెడుతున్నాయి. మార్చి నెలాఖరు నాటికి కోతలు ప్రారంభించినా.. జిల్లా యంత్రాంగం ధాన్యం కొనుగోలు కేంద్రాల ఊసే ఎత్తడం లేదు. వాస్తవానికి సార్వాలో రైతులు ఎకరాకు రూ.10 వేలకు పైగా నష్టాన్ని చవిచూసారు. అయితే దాళ్వాలో ఆ నష్టం నుంచి బయట పడాలంటే ఎకరాకు 50 బస్తాలకుపైగా దిగుబడులు రావాలి. కానీ కొన్ని చోట్ల 40 బస్తాలు మాత్రమే దిగుబడులు రావడంతో రైతులు దిగాలు చెందుతున్నారు. 1153 రకం వేసిన రైతాంగం తక్కువ దిగుబడులు వస్తుండడంతో దాళ్వా నష్టాల సాగుగా మారింది. ధాన్యం ఆరబోసుకునేందుకు ఇబ్బందులు దాళ్వాలో రైతులు 1121, పీఆర్ 126, 1153, 1426 వరి రకాలను సాగు చేసారు. మెట్ట ప్రాంతాల్లో బోర్ల కింద రైతులు 1153 రకాన్ని సాగు చేయగా.. 110 రోజుల పంట కావడంతో మార్చి నెలాఖరు నాటికి రైతుల చేతికందింది. అయితే ఆ ధాన్యాన్ని రోడ్లపైనే ఆరబోసుకుంటున్నారు. జాతీయ రహదారులు, అప్రోచ్ రోడ్లపై సీతంపేట, సూరప్పగూడెం తదితర గ్రామాల్లోని రైతులు ధాన్యాన్ని ఆరబోస్తున్నారు. గోదాముల్లో నిల్వ చేసుకునే అవకాశం లేక రైతులు వాటి పై బరకాలు కప్పి భద్రపర్చుకుంటుంన్నారు. ఎకరా సాగుకు రైతుకు రూ.40 వేల నుంచి రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. మెషీషన్లతో కోసిన ధాన్యాన్ని అరబెట్టేందుకు ఎకరాకు ఇద్దరు కూలీలకు రోజుకు రూ.800లు ఖర్చు అవుతుంది. ఎక్కువగా ఎండలో ఉండడంతో గింజ ముక్కలై నాణ్యత దెబ్బతింటుందని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇకనైనా సంబంధిత అధికారులు స్పందించి ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరవాలని రైతులు వేడుకుంటున్నారు. 10 ఏకరాల భూమిని ౖౖకౌలుకు తీసుకుని సాగు చేసాను, ఏకరాకు రూ.45వేల వరకు ఖర్చు అయ్యింది. ధాన్యాన్ని కోసి అరపోసి బస్తాలపై నింపాం. ధాన్యం కోనుగోళ్లు ప్రారంభించకపోవడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో మిల్లుకు తరిస్తున్నాం. ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరచిన తర్వాత రేటు తెలుస్తుంది. అయితే రోడ్లపై ధాన్యం ఉంచితే పోలీసులు ఊరుకోవడం లేదు. –ఎం.బాలయ్య, కౌలు రైతు, సీతంపేట ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించేందుకు తగిన ఏర్పాట్లు చేస్తున్నాం. ఈ నెల 6, 7వ తేదీల్లో ధాన్యం కొనుగోలు కేంద్రాలు తెరిచేందుకు చర్యలు చేపట్టాం. భీమడోలు సబ్ డివిజన్ పరిధిలో భీమడోలు, ఉంగుటూరు, నిడమర్రు, ద్వారకాతిరుమల మండలాల్లో 55 వేల ఏకరాల్లో దాళ్వా సాగు చేశారు. రైతులకు కనీస మద్దతు ధర ఇవ్వకుండా కొన్నా దళారులపై తగు చర్యలు తీసుకుంటాం. –పి.ఉషారాజకుమారి, ఏడీఏ, భీమడోలు -
ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలి
ఏలూరు (టూటౌన్): ధాన్యం కొనుగోలు కేంద్రాలు వెంటనే తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ డిమాండ్ చేశారు. శుక్రవారం అన్నే భవనంలో రబీ ధాన్యం కొనుగోలు సమస్యలపై ఆయన మాట్లాడారు. ఉంగుటూరు, దెందులూరు మండలాల్లో కొన్ని గ్రామాల పరిధిలో రబీ వరి కోతలు జరుగుతున్నాయని, రైతులు ధాన్యం అమ్ముకోవడానికి సిద్ధం చేస్తున్నారని, కొనుగోలు కేంద్రాలు తెరవకపోవడం వలన ఇబ్బంది పడుతున్నారని చెప్పారు. దళారులకు ధాన్యం అమ్ముకున్నాక కొనుగోలు కేంద్రాలు తెరవడం వల్ల రైతులకు ప్రయోజనం లేదన్నారు. రబీ ధాన్యం కొనుగోలు వెంటనే ప్రారంభించాలని డిమాండ్ చేశారు. -
బీసీలంటే కూటమి ప్రభుత్వానికి చులకనా?
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో బీసీలంటే కూటమి ప్రభుత్వానికి చులకనగా ఉందా అని భారత చైతన్య యువజన పార్టీ (బీసీవై పార్టీ) రాష్ట్ర కో కన్వీనర్ నెరుసు నాగమణి యాదవ్ ప్రశ్నించారు. శుక్రవారం స్థానిక సాహిత్య మండలి హాలులో ఆమె విలేకర్లతో మాట్లాడారు. చంద్రబాబు బీసీలకు ఇప్పటి వరకు ఏం చేశారో చెప్పాలని నిలదీశారు. బీసీలను ఓటు బ్యాంకుగా మాత్రమే చూస్తున్నారని, వారిని రాజ్యాధికారానికి దూరం చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీసీలను విస్మరిస్తే ఫలితం అనుభవించాల్సి వస్తుందని హెచ్చరించారు. బీసీవై పార్టీ పశ్చిమ గోదావరి జిల్లా కన్వీనర్ ఆకుల వెంకట స్వామి మాట్లాడుతూ బీసీల కోసం 5 డిమాండ్లతో తమ పార్టీ అధినేత బోడే రామచంద్ర యాదవ్ ఇచ్చిన అల్లిమేటం గడువు మార్చి 31తో ముగిసిందని, ప్రభుత్వం స్పందించకపోవడంతో ఈ నెల 11న ఆమరణ నిరాహార దీక్ష చేపట్టనున్నారని తెలిపారు. ఈ సందర్భంగా దీక్ష కరపత్రాలను విడుదల చేశారు. సమావేశంలో నాయకులు సర్నాల శివరాణి, తోకల రామకృష్ణ, అనగాని రామ్ ప్రసాద్, వెంకట సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. సెల్ టవర్ నిర్మాణంపై స్థానికుల ఆందోళన కొయ్యలగూడెం: సెల్ టవర్ నిర్మాణాన్ని వ్యతిరేకిస్తూ అశోక్ నగర్ ప్రాంతవాసులు శుక్రవారం పనులను అడ్డుకున్నారు. నివాసిత ప్రాంతాల మధ్య సెల్ టవర్ ఏర్పాటు చేయడం వలన ఆరోగ్యరీత్యా దుష్పరిణామాలు ఎదుర్కొంటామని వారు ఆందోళన వ్యక్తం చేశారు. తమకు అనుమతులు ఉన్నాయని కంపెనీ ప్రతినిధులు పేర్కొంటుండగా ప్రభుత్వ పరంగా ఉండాల్సిన అనుమతులు లేవని స్థానికులు ఆరోపించారు. దీనిపై నిర్మాణదారులకు నివాసితులకు మధ్య వాగ్వాదం చోటు చేసుకుంది. అన్ని అనుమతులు ఉంటేనే పనులను ప్రారంభించండని స్థానికులు పేర్కొన్నారు. దీనిపై పంచాయతీ, రెవెన్యూ శాఖ అధికారులకు వారు ఫిర్యాదు చేశారు. -
అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం
బుట్టాయగూడెం: ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అమరావతి పేరుతో రియల్ ఎస్టేట్ వ్యాపారం మొదలు పెట్టారని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు అన్నారు. మండల కేంద్రమైన బుట్టాయగూడెంలో శుక్రవారం జరిగిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ అమరావతికి సంబంధించి మొదటి విడతలో 50 వేల ఎకరాలు తీసుకుని పనులు చేయకుండా బాహుబలి సెట్టింగ్లు చేసి రాష్ట్ర ప్రజలకు సినిమా చూపించారని అన్నారు. మళ్లీ రెండో విడతలో 80 వేల ఎకరాలు భూములు సేకరించే ప్రయత్నం చేస్తున్నారని అన్నారు. అమరావతి భూములు ఇచ్చే విషయంలో రైతులు కూడా తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారని తెలిపారు. లక్ష ఎకరాలతో అమరావతి పేరుతో చంద్రబాబు నాయుడు దోపిడీకి తెరలేపారన్నారు. అమరావతి పేరుతో రూ.40 వేల కోట్లు అప్పు చేసి రూ.5 వేల కోట్లను అడ్వాన్స్గా తన అనుచరులకు దోచిపెట్టారని అన్నారు. ఒక చోటే కేంద్రీకృతం ఉండకూడదని అభివృద్ధి రాష్ట్ర నలుమూలల ఉండాలని వైఎస్ జగన్మోహన్రెడ్డి పదే పదే చెబుతూ వస్తున్నారని చెప్పారు. అమరావతికి వ్యతిరేకంగా వైఎస్ జగన్మోహన్రెడ్డి ఎన్నడూ మాట్లాడలేదని అన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి అద్భుతమైన ప్రతిపాదనను తీసుకువచ్చారన్నారు. ఆ ప్రతిపాదనలను కూడా చంద్రబాబు తీసుకునే పరిస్థితి లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రతిపాదించిన మావిగన్ను అన్ని వర్గాల ప్రజలు స్వాగతిస్తున్నారని చెప్పారు. కార్యక్రమంలో పార్టీ మండల కన్వీనర్ అల్లూరి రత్నాజీరావు, పార్టీ సీనియర్ నాయకులు ఆరేటి సత్యనారాయణ, ఎంపీపీ తెల్లం రమణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, తదితరులు పాల్గొన్నారు. -
అధ్వానంగా కాలువల నిర్వహణ
పెనుగొండ: పంట కాలువలు, డ్రెయిన్లు నిర్లక్ష్యపు నీడలో వాటి సర్వూపాన్ని కొల్పోతున్నాయి. సంబంధిత అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తుండడంతో శివారు ప్రాంత రైతులు పడుతున్న అవస్థలు వర్ణనాతీతం. ప్రధాన కాలువ గట్లు డంపింగ్ యార్డులుగా, అక్రమణలతో నిండిపోతుండడంతో దిగువ ప్రాంతానికి నీరు వెళ్లే పరిస్థితి లేకుండా పోతోందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు కాలువల నిర్వహణ గాలికొదిలేయడంతో రైతుల పరిస్థితి మరీ దారుణంగా మారింది. సాగు తుది దశకు చేరుకొన్న తరుణంలో ఇప్పటికే వంతుల వారీ విధానంతో సాగును రైతులు ముందుకు నెట్టుకెళ్తున్నారు. ఎండల తీవ్రత పెరుగుతుండడంతో ఆక్రమణల పరంపర, నిర్వహణా లోపంతో దిగువకు నీరు ప్రవహించే అవకాశం లేదని రైతులు వివరిస్తున్నారు. ముఖ్యంగా దేవ కాలువ, ఇలపర్రు కాలువ, చానల్ 1, చానల్ 2 వంటి ప్రధాన కాలువల్లో వ్యర్థాలు ఎక్కువగా పడేయడంతో పాటు, తూడు పెరిగిపోవడంతో నీరు కిందకు వెళ్లే పరిస్థితి లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనికి తోడు దేవ కాలువ పరీవాహక ప్రాంతాలు సైతం ఆక్రమణకు గురి కావడంతో రోజురోజుకు కాలువ బక్కచిక్కిపోతోంది. దీంతో ఆయకట్టు ప్రాంత రైతులు తీవ్ర ఇబ్బందులు పడాల్సి వస్తోంది. ఇప్పటికై నా అధికారులు స్పందించి పంటకాలువల నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ చూపి ఆక్రమణలు తొలగించడంతో పాటు, శివారు ప్రాంతాలకు నీరు సక్రమం చేరడానికి తగు చర్యలు తీసుకోవాలని రైతులు కోరుతున్నారు. డ్రెయిన్ల పరిస్థితి దారుణం మురుగు డ్రెయిన్ల పరిస్థితి మరీ దారుణంగా మారింది, డ్రెయిన్ల గట్టులను పరీవాహక పంచాయతీలు డంపింగ్ యార్డులుగా వినియోగించుకుంటున్నాయి. రోజురోజుకూ చెత్త పెరిగిపోతుండడంతో ఆయా మురుగు డ్రెయిన్లలోకి చెత్త డంపింగ్ చేసేస్తున్నారు. నక్కలు డ్రెయిన్, తాడేరు డ్రెయిన్లు డంపింగ్ యార్డులుగా ఉపయోగపడుతున్నాయి. దీంతో వర్షాకాలంలో నీరు ముందుకు సాగే పరిస్థితి లేక పరీవాహక ప్రాంతమంతా ముంపునకు గురై వందలాది ఎకరాల పంటను నష్టపోవాల్సి వస్తుంది. రైతులు పదేపదే అధికారులకు విన్నవించుకున్నా ఫలితం లేకుండా పోతుంది. డంపింగ్ యార్డులకు స్థలాలు కేటాయించకపోవడం వల్లే కాలువ గట్లను పంచాయతీలు డంపింగ్ యార్డులుగా ఉపయోగిస్తున్నాయని చెబుతున్నారు. -
తవ్వేయ్.. దోచేయ్
సాక్షి టాస్క్ఫోర్స్ : ఉంగుటూరు మండలంలో ఎర్ర కంకర కూటమి నేతలకు కాసులు పంటగా కురిపిస్తోంది. ఉంగుటూరు మండలం మెట్ట ప్రాంతంలో కంకర క్వారీలు ఇష్టానుసారం తవ్వకాలు చేస్తున్నారు. నల్లమాడు ఉప కేంద్రం పక్కన పెద్ద ఎత్తున కంకరను పొక్లెయినర్ల సాయంతో తవ్వి పట్టుకుపోతున్నారు. పోలవరం కుడి కాలువ గుట్లను దోచేస్తున్నారు. డెల్టా ప్రాంతానికి లారీల్లో కంకర, మట్టి తరలిపోతోంది. ఎ.గోకవరం ఆయకట్టులో ప్రభుత్వ పోరంబోకులో కంకర తవ్వేసి తరలించేస్తున్నారు. రోజుకు వంద లారీలు తగ్గకుండా కంకర తరలిపోతోంది. వీటి వెనక కూటమి నేతలు ఉన్నారనేది బహిరంగ రహస్యం . దాంతో మండలంలోని రెవెన్యూ అధికారులు చేతులేత్తేశారు. మండలంలోని ఎక్కడ చూసినా ఇవే దృశ్యాలు కనిపిస్తున్నాయి. -
ఏసు మార్గం అనుసరణీయం
మండవల్లి: మండలంలోని భైరవపట్నం ఆర్సీఎం చర్చి వద్ద గుడ్ప్త్రెడే సందర్భంగా సిలువ మార్గంలో వైఎస్సార్పీపీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు శుక్రవారం పాల్గొన్నారు. డీఎన్నార్ మాట్లాడుతూ యేసు బోధించిన కరుణ, జాలి, దయ, ప్రేమ, క్షమలను అందరూ అససరించి, తోటి మానవులకు అపకారం చేయకుండా ఉండాలని సూచించారు. డీఎన్నార్తో పాటు నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. కైకలూరు : వైఎస్సార్సీపీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు తిరుమల తిరుపతి దేవస్థాన పవిత్రతను కాపాడే దిశగా టీటీడీ చైర్మన్ పదవికి బీఆర్ నాయుడు రాజీనామా చేయాలనే డిమాండ్తో శనివారం సాయంత్రం 4 గంటలకు కై కలూరు వెంకటేశ్వరస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు చేయనున్నారు. ఈ మేరకు పార్టీ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) శుక్రవారం వెల్లడించారు. నియోజకవర్గ స్థాయిలో నాయకులు, కార్యకర్తలు, వివిధ హోదాల్లో నాయకులు తప్పక హాజరుకావాలని కోరారు. జంగారెడ్డిగూడెం: నేవీ ఆయుధ డిపో కారణంగా ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని సారవంతమైన భూములు రైతులు కోల్పోవాల్సి వస్తుందని, ఇది ఈ ప్రాంతానికి మంచిది కాదని డీసీసీబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు అన్నారు. శుక్రవారం ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. కొయ్యలగూడెం మండలంలో 1900 బ్యారెన్ల పరిధిలో రైతులు వర్జీనియా సాగు చేస్తున్నారని, ఈ ప్రాంతంలో వరి, మొక్కజొన్న, పామాయిల్తో పాటు వాణిజ్య పంటలు కూడా ఎక్కువగా పండుతాయన్నారు. ఇప్పటికే ఏజెన్సీ మెట్ట ప్రాంతంలోని రైతులు వేలాది ఎకరాలు కోల్పోయారన్నారు. ప్రస్తుతం నేవీ డిపో ఈ ప్రాంతంలో నిర్మించడానికి సన్నాహాలు జరుగుతున్నాయని, దీని కోసం సుమారు 1800 ఎకరాల వరకు అవసరమని, ఇందుకు కొయ్యలగూడెం మండలాన్ని ఏర్పాటుకు నిర్ణయించారన్నారు. కొయ్యలగూడెం మండలంలో అధిక ఉత్పాదక ఇచ్చే వ్యవసాయ భూములు ఉన్నాయని, వాటిని నేవీ డిపోకు వినియోగిస్తే వ్యవసాయం నాశనం అవుతుందన్నారు. వ్యవసాయం మీద ఆధారపడిన వారి పరిస్థితి ఏంటన్నారు. నేవీ ఆయుధ డిపో వస్తే ఉపాధి పెరుగుతుందని చెబుతున్నారని, అది వాస్తవం కాదన్నారు. ఇప్పటికై నా నాయకులు, అధికారులు ఈ ఆలోచనను విరమించుకోవాలని, ఒక వేళ ఇక్కడే పెట్టాలి అనుకుంటే మర్లగూడెం పారెస్ట్ భూమిని సేకరించాలని, ఇక్కడ 2 వేల ఎకరాల భూమి ఉందన్నారు. ఏలూరు (టూటౌన్): పోలవరాన్ని సందర్శించి తన జీవితం ధన్యమైందని గవర్నర్ చెప్పడం సంతోషకరమైన విషయమేనని సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి తెలిపారు. ఆ ప్రాంత గిరిజనుల, ప్రజల అవసరాలు, సమస్యలు గురించి పట్టించుకోకపోవడం బాధాకరమన్నారు. పోలవరం ప్రాజెక్టుపై ఉన్న శ్రద్ధ ఆ ప్రాజెక్టుకు భూములిచ్చిన గిరిజనులు, దళితులు, పేదలైన నిర్వాసితులపై లేకపోవడం శోచనీయమన్నారు. నిర్వాసితుల పునరావాసం గురించి ఆలోచన లేకపోవడం ఏంటని ఆయన ప్రశ్నించారు. పోలవరం నిర్వాసిత కుటుంబాలు 1,05,000 వరకు ఉన్నాయని, వాటిలో దాదాపుగా 50 శాతంగా ఉన్న 50వేల కుటుంబాలకు చెందిన గిరిజనులు గోడు పట్టించుకొనే నాథుడే లేడని ఆవేదన వ్యక్తం చేశారు. కాగ్ నివేదికలో పునరావాసం కేవలం 20 శాతం కూడా కల్పించలేదని, ప్రాజెక్టు నిర్మాణం మాత్రం 70 శాతం చేసారని తెలిపిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. మండలాన్ని యూనిట్గా తీసుకొని ఒకేసారి పరిహారం చెల్లించాలని చెప్పిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు. ఇదే విషయాన్ని కాగ్, సీపీఎం, ఇతర సంస్థలు డిమాండ్ చేస్తున్నా ప్రభుత్వాలకు పట్టడం లేదన్నారు. నిర్వాసితుల పరిస్థితి ముంపు వాటిల్లినప్పుడు చాలా దయనీయంగా ఉంటుందని, ఆధార్ కార్డులు చూసి కొవ్వొత్తులు, మంచినీటి ప్యాకెట్లు ఇస్తున్నారని ఆరోపించారు. మరోసారి ఈ ప్రాంతంలో గర్నవర్ పర్యటించి నిర్వాసితులను కలవాలని, వారి సమస్యలు అడిగి తెలుసుకోవాలన్నారు. -
ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటులో టీడీపీ నేతల చేతివాటం
సాక్షి టాస్క్ఫోర్స్: ప్రభుత్వం నిర్వహించే అభివృద్ధి పనులను సైతం తమకు అనుకూలంగా మార్చుకుంటున్న టీడీపీ నాయకులు ప్రజల ముక్కుపిండి డబ్బు దోచేస్తున్నారు. అత్తిలి మండలంలో కొందరు కూటమి నాయకులు చేస్తున్న ఈ తరహా దోపిడీకి ప్రజలు నెత్తీనోరు బాదుకుంటున్నారు. అత్తిలి మండలం ఆరవిల్లి గ్రామంలోని వైఎస్సార్ కాలనీలో విద్యుత్ శాఖ ఏర్పాటుచేసిన ట్రాన్స్ఫార్మర్ను టీడీపీ నాయకులు సొమ్ముచేసుకున్నారని ప్రజలు ఆరోపిస్తున్నారు. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు కాలనీలోని ప్రజల నుంచి ఒక్కో ఇంటికీ ఒక్కోలా ధర నిర్ధేశించి వసూళ్లకు దిగిన వ్యవహారం ఆరవల్లిలో గుప్పుమంది. ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటు కోసం అంటూ రూ.300 నుంచి రూ.1,500 వరకు గుంజేశారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఏసీ ఉన్న గృహానికి ఒకలా, ఏసీ లేని గృహానికి మరొకలా టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లలో రూ.50 వేలకుపైగా దోచుకున్నారన్న విషయం గుప్పుమంది. విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ విద్యుత్ శాఖ ఏర్పాటుచేస్తే టీడీపీ నాయకులు ఎందుకు డబ్బులు వసూలు చేశారంటూ కాలనీవాసులు గుర్రుగా ఉన్నారు. వైఎస్సార్ కాలనీలో 100 ఇళ్లు ఆరవల్లి వైఎస్సార్ కాలనీలో 100కుపైగా ఇళ్లు ఉండగా ఇప్పటివరకు ఉన్న ట్రాన్స్ఫార్మర్ సామర్థ్యం సరిపోక లోఓల్టేజీ సమస్య తలెత్తింది. దీంతో రూ.8 లక్షల నిధులతో విద్యుత్ 100 కేవీ విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుకు ఇటీవల విద్యుత్ శాఖ అధికారులు పనులు నిర్వహించారు. ముందుగా సరిపడా సిమెంట్ దిమ్మ కట్టించగా ఇదే అదనుగా చూసిన స్థానిక టీడీపీ నాయకులు డబ్బులు వసూళ్లకు తెరతీశారంటూ ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. ప్రస్తుతం ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేయగా కనెక్షన్లు ఇవ్వాల్సి ఉంది. ఈ విషయంపై విద్యుత్ శాఖ అధికారులు మాత్రం రూపాయితో సహా విద్యుత్ శాఖ వెచ్చిస్తుందని ప్రజలు ఎటువంటి విరాళాలు ఇవ్వాల్సిన అవసరం లేదని చెబుతుండడం విశేషం. రూ.25 వేలు దోచేశారు కాలం చెల్లిన తినుబండారాల ప్యాకెట్ విక్రయించారంటూ ఇటీవల ఒక వ్యాపారి నుంచి రూ.25 వేలు కూటమి నాయకుడు దోచుకున్న వ్యవహారం అత్తిలిలో సంచలనం రేకెత్తించింది. ఆర్యవైశ్యుడికి చెందిన ఒక దుకాణం నుంచి కొనుగోలు చేసిన ప్యాకెట్ కాలం చెల్లిందని అర్ధరాత్రి సమయంలో ఇంటిపైకి పది మంది వచ్చి దౌర్జన్యానికి దిగగా సదరు వ్యాపారి కాళ్లు పట్టుకున్నా క్షమించని దుస్థితి. ఈ క్రమంలో సదరు కూటమి నాయకుడు రూ.లక్ష డిమాండ్ చేయగా తమ వద్ద అంతలేదని చివరకు రూ.25 వేలు ఇచ్చినట్లుగా అత్తిలిలోని ఆర్యవైశ్యులు చర్చించుకుంటున్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన రోజు నుంచి అత్తిలి మండలం అంతా దోపిడీలు, దౌర్జన్యాలు, దాడులకు నిలయంగా మారిందని ప్రజానీకం చర్చించుకుంటున్నారు. అధికార పార్టీలో ఉన్న కొందరు నాయకులకు కప్పం కట్టకుంటే కానీ వ్యాపారాలు చేసుకోలేని స్థితిలో వ్యాపారులు ఉన్నారనే ఆరోపణలు గుప్పుమంటున్నాయి. మామూళ్లు వసూలు చేస్తున్న వైనం ఆరవల్లి వైఎస్సార్ కాలనీలో బయటపడిన వ్యవహారం ఇంటికొచ్చి రూ.1,500 వరకూ గుంజేశారని ఆరోపణలు విద్యుత్ శాఖ నిర్మిస్తే టీడీపీ నాయకుల దోపిడీ ఏంటనే ప్రశ్నలు -
పరీక్షలు అయిపోయాయోచ్
ముగిసిన 10 పరీక్షలు ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో జరుగుతున్న 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు గురువారం నాటితో ముగిశాయి. ఈ పరీక్షల్లో భాగంగా గురువారం నిర్వహించిన ఇంగ్లీష్ పరీక్షలకు 22,923 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 23,418 మంది విద్యార్థులకు గాను 495 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు శాతం 97.89 శాతంగా నమోదైంది. పరీక్షలను ఫ్లయింగ్ స్క్వాడ్ 32, డిస్ట్రిక్ట్ లెవెల్ అబ్జర్వర్ 06, జిల్లా విద్యాశాఖాధికారి 04, ప్రభుత్వ పరీక్షల సహాయ కమిషనర్ 03 మొత్తం 45 పరీక్షా కేంద్రాలను తనిఖీ చేశారు. ఈ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, పరీక్షలు ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ తెలిపారు. విద్యార్థుల్లో ఉత్సాహం ఏడాది పాటు కఠోరదీక్షతో చదివి పరీక్షలను విజయవంతంగా రాయడంతో విద్యార్థుల్లో ఉత్సాహం వెల్లివిరిసింది. వాస్తవానికి ఏప్రిల్ 1వ తేదీతో పరీక్షలు ముగియాల్సి ఉండగా గత నెలలో రంజాన్ పండుగ సెలవు రావడంతో ముందుగా ప్రకటించిన షెడ్యూల్ ప్రకారం ఇంగ్లీష్ పరీక్ష నిర్వహించలేకపోయారు. దీనితో ఈ పరీక్షను ఏప్రిల్ 2వ తేదీకి మార్చుతూ ప్రభుత్వ పరీక్షల కమిషనర్ ఉత్తర్వులు జారీ చేసిన నేపథ్యంలో ఇంగ్లీష్ పేపర్ పరీక్షను గురువారం నిర్వహించారు. పబ్లిక్ పరీక్షల్లో చివరి పరీక్ష రాశామన్న ఆనందంలో పరీక్ష కేంద్రం నుంచి బయటకు వచ్చిన విద్యార్థులు కేరింతలు కొట్టారు. వారి విద్యా సంస్థల బస్సుల్లో తిరిగి వెళుతూ కేకలు వేస్తూ తమ సంతోషాన్ని వ్యక్తం చేశారు. -
త్రుటిలో తప్పిన పెనుప్రమాదం
ఆకివీడు: పట్టణంలో త్రుటిలో ఘోర ప్రమాదం తప్పింది. స్థానిక రైల్వే స్టేషన్ రోడ్డులో గురువారం అతివేగంగా వచ్చిన కారు ట్రాక్టర్ను ఓవర్ టేక్ చేస్తూ కరెంట్ స్తంభం, గోడను ఢీకొట్టింది. సంఘటనలో ఎవరికీ గాయాలు అవ్వలేదు. స్థానిక శాంతి నగర్ వైపు నుంచి ఇద్దరు మైనర్లు మధ్యాహ్న సమయంలో అతి వేగంగా కారును నడుపుతూ ట్రాక్టర్ను తప్పించబోయి విద్యుత్ స్తంభాన్ని ఢీకొట్టి, దాని వెనుకనే ఉన్న గోడను ఢీకొట్టారు. ప్రమాదంలో విద్యుత్ స్తంభం ముక్కలై వైర్లు తెగిపడ్డాయి. మంటలు వచ్చి సరఫరా నిలిచిపోయింది. గోడ ధ్వంసమైంది. కారు ముందు భాగం నుజ్జునుజ్జు అయ్యింది. మధ్యాహ్నం కావడంతో ఆ ప్రాంతంలో జనసంచారం, పాఠశాల విద్యార్థులు బయటకు రాలేదు. లేకుంటే ఘోర ప్రమాదం జరిగి ఉండేదని స్థానికులు ఆందోళన వ్యక్తం చేశారు. విద్యుత్ స్తంభం ధ్వంసమైన సంఘటనపై స్తంభం పునరుద్ధరణ, లైన్లు ఏర్పాటు వంటి వాటికి రూ. 25,600 ఎస్టిమేట్ వేశామని, సంబంధిత కారు యజమాని వద్ద వసూలు చేస్తామని ట్రాన్స్కో ఏఈ రత్నాకర్ చెప్పారు. -
ఉత్సాహంగా వాటర్ స్పోర్ట్స్ పోటీలు
జంగారెడ్డిగూడెం: మండలంలోని కేకేఎం ఎర్రకాలువ రిజర్వాయర్లో జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో గురువారం జిల్లాస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీలను శాప్ డైరెక్టర్ కొవ్వాసు జగదీశ్వరి ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా క్రీడాభివృద్ధి అధికారి ఎస్ఏ అజీజ్ మాట్లాడుతూ శాప్ లీగ్స్లో భాగంగా జిల్లా స్థాయి వాటర్ స్పోర్ట్స్ నిర్వహించామన్నారు. కాయాకింగ్, కెనో యింగ్, రోయింగ్, డ్రాగన్ బోట్ తదితర పోటీలు అండర్–15 సబ్ జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలురు, బాలికల విభాగాల్లో పోటీలు నిర్వహించామని తెలిపారు. ఈ పోటీల్లో ఎంపికై న క్రీడాకారులు ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లా జిల్లా క్రీడా ప్రాధికార సంస్థలో నిర్వహించే రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీల్లో పాల్గొంటారన్నారు. కార్యక్రమంలో ఎస్.సత్యనారాయణ, ఎస్.రాంబాబు, యడ్ల తేజేశ్వరరావు పాల్గొన్నారు. -
ఉచిత విద్య.. అంతా మిథ్య
విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సీ) కింద భీమవరంలో పేద కుటుంబానికి చెందిన ఒక వ్యక్తి తన కుమారుడిని స్థానికంగా ప్రైవేట్ స్కూల్లో 1వ తరగతిలో చేర్పించేందుకు అర్హత పొందారు. కార్పొరేట్ స్కూల్లో తన కుమారుడికి సీటు రావడంతో ఉచిత విద్య అందుతుందని సంబరపడిపోయాడు. అడ్మిషన్ కోసం వెళితే ఫిజికల్ యాక్టివిటీస్, పుస్తకాలు, యూనిఫాం తదితర వాటి కోసం రూ.30 వేలు వరకు చెల్లించాలనడంతో షాకయ్యాడు. 7వ తేదీలోగా ఈ మొత్తం చెల్లించి అడ్మిషన్ తీసుకోకుంటే మీకు వచ్చిన సీటు రద్దవుతుందని చెప్పడంతో ఏం చేయాలో పాలుపోని స్థితిలో ఉన్నాడు. సాక్షి, భీమవరం: పేదల పిల్లలకు కార్పొరేట్ స్కూళ్లలో ఉచిత విద్యనందించాలన్న ఆశయానికి తూట్లు పడుతున్నాయి. అడ్మిషన్, ఫిజికల్ యాక్టివిటీస్, బుక్స్, యూనిఫాం తదితర వాటి పేరు చెప్పి విద్యాహక్కు చట్టం ఆర్టీఈ 12(1)(సీ) లబ్ధిదారులకు విద్యాసంస్థలు చుక్కలు చూపిస్తున్నాయి. చెప్పినంత చెల్లించి అడ్మిషన్ తీసుకోకుంటే సీటు రద్దయిపోతుందని చెబుతుండటంతో చిన్నారుల తల్లిదండ్రులు బెంబేలెత్తుతున్నారు. పేదల విద్యకు పెద్దపీట వేసిన జగన్ ప్రభుత్వం వారిపై ఫీజుల భారం పడకుండా ప్రైవేట్ విద్యాసంస్థల్లో విద్యనభ్యసించే వీలు కల్పించారు. ఉచిత నిర్బంద విద్యాహక్కు చట్టం సెక్షన్–12(1), (సి) కింద ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థుల కోసం కేటాయించేలా చర్యలు తీసుకున్నారు. ఐదేళ్లు నిండి ఆరేళ్ల లోపు పిల్లలకు ఒకటో తరగతిలో ప్రవేశం కల్పిస్తూ అందుకు అర్హతగా విద్యార్థుల తల్లిదండ్రుల వార్షిక ఆదాయం గ్రామీణ ప్రాంతాల్లో రూ.1.20 లక్షలు, పట్టణ ప్రాంతాల్లో రూ.1.14 లక్షలలోపు ఉండాలి. స్కూల్స్ యాజమాన్యాలకు ఏడాదికి అర్బన్లో రూ.8,000, రూరల్లో రూ.6,500, ఏజెన్సీలో రూ.5,500 ఫీజుగా నిర్ణయించారు. ఈ మొత్తాన్ని అమ్మఒడి సాయం నుంచి ప్రభుత్వమే చెల్లించి మిగిలిన సొమ్మును విద్యార్థి తల్లి ఖాతాకు జమచేసే విధంగా అప్పట్లో చర్యలు తీసుకుంది. జిల్లాలో 383 ప్రైవేట్ పాఠశాలలకు గాను 1వ తరగతిలో 25 శాతం సీట్లు పేద విద్యార్థులకు కేటాయిస్తూ 2022–23 విద్యాసంవత్సరం నుంచి ఉచిత విద్యను అమల్లోకి తెచ్చారు. తొలి ఏడాది వివిధ ప్రైవేట్ స్కూళ్లలో 38 మంది విద్యార్థులు చేరారు. 2023–24లో అనూహ్యంగా 1,812 దరఖాస్తులు రాగా అర్హత కలిగిన 1,162కి ఉచిత విద్య పొందే అవకాశం కల్పించారు. కూటమి ప్రభుత్వంలో ఉచిత విద్యకు కష్టాలు మొదలయ్యాయి. గత ప్రభుత్వం ఏటా క్రమం తప్పకుండా అమ్మఒడి సాయాన్ని విడుదల చేయడం వలన ఆ మొత్తం నుంచి ప్రైవేట్ విద్యాసంస్థలకు కనీస ఫీజు ఇచ్చేందుకు పేదలకు ఇబ్బంది ఉండేదికాదు. కాగా కూటమి ప్రభుత్వం తల్లికి వందనంకు తొలి ఏడాది ఎగనామం పెట్టడంతో ఫీజుల భారం తల్లిదండ్రులపై పడింది. ఫీజు మొత్తం చెల్లించాలంటూ అప్పట్లో పలు విద్యాసంస్థలు నోటీసులు ఇచ్చాయి. ఉచిత విద్య అందుతుందన్న ఆశతో ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించిన పేదలు తమ బిడ్డల భవిష్యత్తు కోసం అయినకాడికి అప్పులు చేసి ఫీజులు చెల్లించిన పరిస్థితులు ఎదురయ్యాయి. అడ్మిషన్, ఫిజికల్ యాక్టివిటీస్, పుస్తకాలు, యూనిఫాం పేరిట బాదుడు సీటు కోసం రూ.30 వేల వరకూ డిమాండ్ చేస్తున్న విద్యాసంస్థలు 7లోపు అడ్మిషన్ తీసుకోకుంటే సీటు ఉండదని భయపెడుతున్న వైనం బెంబేలెత్తుతున్న సెక్షన్–12(1)సీ లబ్ధిదారులు పేదలకు ప్రైవేట్ స్కూళ్లల్లో ఉచిత విద్య పొందే వీలు కల్పించిన జగన్ సర్కారు ప్రైవేట్ విద్యాసంస్థల్లోని 1వ తరగతిలో 25 శాతం సీట్లు కేటాయింపు రానున్న విద్యాసంవత్సరానికి ఆర్టీఈ 12(1)(సి) కింద తొలి విడతగా జిల్లాలో 1,047 మంది ఉచిత ప్రవేశాలకు అర్హత సాధించారు. ఈనెల 7వ తేదీలోగా విద్యార్థుల పేరెంట్స్ తమ ఆదాయం, కులం, ఆధార్, బర్త్ తదితర సర్టిఫికెట్లు అందజేసి అడ్మిషన్లు పూర్తి చేసుకోవాల్సి ఉంది. అందుకోసం వెళుతున్న వారికి ప్రైవేట్ స్కూళ్లు చుక్కలు చూపిస్తున్నాయి. అడ్మిషన్ నిమిత్తం రూ.500 నుంచి రూ.2000 వరకు, ఫిజికల్ యాక్టివిటీస్ కోసం రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకు, పుస్తకాలకు రూ. 10 వేల వరకు, యూనిఫాంకు రూ.3 వేల వరకు చెల్లించాలని స్కూల్ యాజమాన్యాలు చెబుతున్నట్టు పేరెంట్స్ అంటున్నారు. ఈ సొమ్ములు చెల్లించి నిర్ణీత గడువులోగా అడ్మిషన్ తీసుకోకుంటే సీటు రద్దయిపోతుందని చెబుతుండటంతో ఏంచేయాలో పాలుపోవడం లేదని వాపోతున్నారు. ఆయా ఫీజుల భారం లేకుండా ఉచిత ప్రవేశాలకు అవకాశం కల్పించాలని కోరుతున్నారు. ఈ విషయమై జిల్లా సమగ్ర శిక్ష ఏపీసీ పి.శ్యాంసుందర్ను సంప్రదించగా ఆయన ఫోన్కు అందుబాటులో లేరు. -
వైభవంగా త్రిశూల స్నానం
పాలకొల్లు సెంట్రల్ : పంచారామక్షేత్రం శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామి వారి కల్యాణోత్సవాల్లో భాగంగా గురువారం త్రిశూలస్నానం, కంకణ విమోచన అవభృద స్నానం కార్యక్రమాలు ఘనంగా నిర్వహించారు. రాత్రి స్వామివార్ల పుష్పోత్సవ కార్యక్రమం చేశారు. దాదాపు 25 మంది దంపుతులు అమ్మవారికి బుట్టల్లో సారెను సమర్పించారు. అనంతరం ముత్తయిదువులకు జాకెట్టు, గాజులు పంపిణీ చేశారు. దాతలు కంచర్ల రామారావు కుమారులు సత్యనారాయణ, సూర్యనారాయణ దంపతులు ప్రసాద వితరణ చేశారు. భక్తులు అధిక సంఖ్యలో స్వామివారి పూజా కార్యక్రమాల్లో పాల్గొన్నారు. కార్యక్రమంలో ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావు, సూపరింటెండెంట్ వాసు తదితరులు పాల్గొన్నారు. -
వన్స్టాప్ సెంటర్ పరిశీలన
ఏలూరు (టూటౌన్): పట్టణంలోని సర్వజన ఆసుపత్రి ప్రాంగణంలోని వన్ స్టాప్ సెంటర్ను గురువారం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ కార్యదర్శి కె.రత్న ప్రసాద్ సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన వన్ స్టాప్ సెంటర్ నిర్వహణ, ఆన్లైన్ ఫిర్యాదుల స్వీకరణ, పరిష్కారం మొదలైన విషయాలను అడిగి తెలుసుకున్నారు, ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అవుతున్నాయని, అధికారులు ఎక్కువగా గృహ హింస కేసులు నమోదు అయ్యే ప్రాంతాలలో అవగాహన సదస్సును నిర్వహించాలని సూచించారు. కార్యక్రమంలో సెంట్రర్ అడ్మిన్ నిర్మల, స్టాండింగ్ కౌన్సిల్ కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: పురుగుల మందు తాగిన ఓ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. వివరాల ప్రకారం కొయ్యలగూడెం మండలం రాజవరానికి చెందిన ఎ.నాగరాజు(30) ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లిలోని ఓ రైతు వద్ద కమతం ఉంటున్నాడు. ఏం జరిగిందో తెలియదు గానీ నాగరాజు గత మంగళవారం పురుగుల మందు తాగాడు. అప్పటి నుంచి ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. పరిస్థితి విషమించి మృతి చెందాడు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు లేకపోవడంతో పోలీస్టేషన్లో కేసు నమోదు కాలేదు. -
నా వేలితో నా కంటినే పొడుచుకున్నా..
కై కలూరు మాజీ సర్పంచ్ నవరత్నకుమారి కై కలూరు: కూటమి పార్టీలో చేరి నా వేలితో నా కంటిని నేనే పొడుచుకున్నానని కై కలూరు మాజీ సర్పంచ్ దానం మేరీ నవరత్నకుమారి ఆవేదన వ్యక్తం చేశారు. పదవీ కాలం చివరి రోజు గురువారం ఆమె కై కలూరులో మాట్లాడారు. వైఎస్సార్ సీపీ మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్), పార్టీ నాయకుల మద్దతుతో సర్పంచ్గా విజయం సాధించానన్నారు. కూటమిలో చేరిన అనంతరం ఎస్సీ సర్పంచ్గా విధులు నిర్వహిసున్న తనపై అసత్య ఆరోపణలు చేసి చెక్పవర్ రద్దుతో పాటు సర్పంచ్గా సస్పెండ్ చేశారన్నారు. కోర్టు ఆదేశాలతో తిరిగి ఇటీవల సర్పంచ్గా విధుల్లో చేరానన్నారు. కై కలూరులో సంపు తొగింపు, వెలంపేట స్కూల్ వద్ద ట్రాన్మ్ఫార్మర్ ఏర్పాటు, వార్లకోడు డ్రెయిన్, దళిత క్రైస్తవుల శ్మశాన వాటిక విషయంలో కచ్చితత్వంగా ఉండటం వల్ల నాపై కక్ష సాధింపు చర్యలకు నాయకులు దిగారన్నారు. న్యాయ స్థానంపై నమ్మకం ఉందని, అందరికీ కోర్టు ద్వారా సమాధానం చెబుతానని తెలిపారు. -
దేవదేవా ‘అశ్వాలు’ లేవా?
● అశ్వాలు లేని రథంలో చిన వెంకన్నకు రథోత్సవం ● అధికారులకు విషయం తెలిసినా పట్టించుకోని వైనం ద్వారకాతిరుమల: ఆ దేవదేవుడి దివ్య రథానికి అశ్వాలు లేవు. అయినా ప్రతి ఆరు నెలలకోసారి క్షేత్రంలో జరిగే బ్రహ్మోత్సవాల సమయంలో స్వామివారు ఉభయ దేవేరులతో కలసి ఈ రథంలోనే క్షేత్ర పురవీదుల్లో విహరించడం గమనార్హం. రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం వంటివి లేవని అధికారులకు తెలిసినా వారు నిమ్మకు నీరెత్తినట్టు వ్యవహరిస్తున్నారు. దీంతో తో భక్తులు ఇదేం దారుణమంటూ ముక్కున వేలేసుకుంటున్నారు. వివరాల్లోకి వెళ్తే రాష్ట్రంలోని ఏడు ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయం దినదినాభివృద్ధి చెందుతోంది. ప్రస్తుతం శ్రీవారి వార్షిక ఆదాయం రూ. 180 కోట్లు పైమాటే. ఇంత ఆదాయం వస్తున్నా.. కనీసం శ్రీవారి రథాన్ని పట్టించుకునే పరిస్థితుల్లో అధికారులు లేరు. అలాగే స్వామివారి చక్ర స్నానానికి కోనేరు నిర్మించే విషయంలోనూ అధికారులు తాత్సారం చేస్తున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. క్యాబిన్లోనే చక్ర స్నానం? బ్రహ్మోత్సవాల్లో ఆరో రోజు శ్రీవారికి రథోత్సవాన్ని, ఏడో రోజు చక్రస్నానాన్ని నిర్వహిస్తారు. అయితే అశ్వాలు లేని రథంలో రథోత్సవం, ఆలయ యాగశాలలో ట్యాప్ కింద చక్రస్నానం జరుపుతున్న తీరుపై గతేడాది అక్టోబర్ 11న సాక్షి దినపత్రికలో ‘ఆదాయమున్నా.. కనిపించని వైభవం’ శీర్షికతో కథనం ప్రచురితమైంది. దానికి స్పందించిన ఆలయ అధికారులు యాగశాలలో ట్యాప్ వద్ద ఐరన్ క్యాబిన్ను నిర్మించారు. ఇకపై బ్రహ్మోత్సవాల్లో స్వామివారికి చక్ర స్నానాన్ని అందులోనే జరపనున్నట్టు తెలుస్తోంది. అదే జరిగితే శ్రీవారి చక్రస్నానం ఇక భక్తులకు పూర్తిగా కనబడనట్టే అవుతుంది. దగ్గరపడుతున్న సమయం శ్రీవారి వైశాఖమాస దివ్య బ్రహ్మోత్సవాలు ఈనెల 26 నుంచి మే 3 వరకు జరగనున్నాయి. అందులో భాగంగా రథోత్సవం మే 1న జరగనుంది. అంటే రథోత్సవానికి ఇంకా 28 రోజులు మాత్రమే సమయం మిగిలి ఉంది. అధికారులు స్పందిస్తే ఆ సమయంలోపే రథానికి అశ్వాలను ఏర్పాటు చేయించొచ్చు. అలాగే భక్తులకు అమ్మవార్ల దర్శనం కలిగేలా రథంలో కొద్దిపాటి మార్పులు చేయించొచ్చు. అయితే అధికారులు ఏ విధంగా స్పందిస్తారనేది వేచి చూడాల్సి ఉంది. ఏడేళ్ల క్రితం లక్షలాది రూపాయలతో శ్రీవారి రథాన్ని నిర్మించారు. అయితే రథ నిర్మాణంలో తలెత్తిన లోపాలు కారణంగా రథం జీవకళను కోల్పోయిందన్న విమర్శలున్నాయి. ముఖ్యంగా రథానికి చెక్క అశ్వాలు, ఛత్రం (పైన గొడుగు), రథం చుట్టూ సింహం బొమ్మలు ఉండాలి. అలాగే అశ్వాలను అదుపు చేస్తున్నట్టుగా రజకుడి బొమ్మ ఉండాలి. కానీ అవేమీ రథంలో లేకపోవడంతో భక్తులు విస్మయానికి గురవుతున్నారు. ఇదిలా ఉంటే రథంలో స్వామివారి పక్కన ఉండే అమ్మవార్లు భక్తులకు కనిపించరు. దాంతో రథయాత్రలో పాల్గొనే భక్తులు తీవ్ర అసంతృప్తి చెందుతున్నారు. స్వామివారి ప్రస్తుత రథాన్ని పూర్వ రథాలకు మాదిరిగా చేయించాలని భక్తులు కోరుతున్నారు. -
గవర్నర్కు స్వాగతం
పోలవరం రూరల్: పోలవరం ప్రాజెక్టును రాష్ట్ర గవర్నర్ ఎస్.అబ్దుల్ నజీర్ గురువారం సందర్శించారు. ముందుగా హెలీకాప్టర్లో ఏరియల్ వ్యూ ద్వారా పోలవరం ప్రాజెక్టును పరిశీలించి, ప్రాజెక్టు వ్యూ పాయింట్ నుంచి పనుల పురోగతిని పరిశీలించారు. గవర్నర్ హెలికాప్టర్ దిగిన వెంటనే రాష్ట్ర జలవనరుల శాఖ మంత్రి నిమ్మల రామానాయుడు, కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఎస్పీ ప్రతాప్ శివకిషోర్, ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, బలరామకష్ణ ప్రసాద్, ట్రైకార్ ఛైర్మన్ బొరగం శ్రీను, పోలవరం ప్రాజెక్టు అడ్మినిస్ట్రేటర్ అభిషేక్, జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడ్, ఎస్ఈ ఆర్. రామచంద్రరావు, జిల్లా అటవీశాఖ అధికారి పీవీ సందీప్ రెడ్డి, మేఘ సీవో ఏవీ సతీష్, జీఎం గంగాధర్ స్వాగతం పలికారు. పోలవరం ప్రాజెక్టు చీఫ్ ఇంజనీర్ కె.నరసింహమూర్తి ప్రాజెక్టు పనులను గవర్నర్కు వివరించారు. నూజివీడు: నూజివీడు కేంద్రీయ విద్యాలయ ప్రవేశాలకు దరఖాస్తుల స్వీకరణ గురువారంతో పూర్తయినట్టు ప్రిన్సిపాల్ మహమ్మద్ ఫారూఖ్ తెలిపారు. నూజివీడులో కేంద్రీయ విద్యాలయంకు ప్రజల నుంచి స్పందన బాగా వచ్చిందన్నారు. ఒకటో తరగతికి 80 వరకు వచ్చాయని, రెండో తరగతిలో ప్రవేశానికి 108 దరఖాస్తులు, మూడో తరగతికి 96, నాలుగో తరగతికి 96, ఐదో తరగతికి 47 చొప్పున దరఖాస్తులు వచ్చాయన్నారు. ప్రస్తుతం మొదటి ఏడాది కాబట్టి తరగతికి 40 సీట్లు చొప్పున మాత్రమే ఉంటాయన్నారు. ఏలూరు (టూటౌన్): పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పెదపేట ఎస్సీ మాల క్రైస్తవులపై డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణరాజు చేసిన దాడిని ఖండిస్తూ తక్షణం ఆయన్ను బర్తరఫ్ చేయాలని మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ నాయకులు డిమాండ్ చేశారు. స్థానిక ఇండోర్ స్టేడియం ఎదురుగా గల లేడీస్ క్లబ్ నందు ఏలూరు జిల్లా మాల సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీ ఆధ్వర్యంలో రఘురామ కృష్ణరాజును బర్తరఫ్ చేయాలని డిమాండ్ చేస్తూ గురువారం సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వక్తలు మాట్లాడుతూ ఆకివీడు పెదపేట మాలలకు న్యాయం చేయాలని, అక్రమంగా అరెస్టు చేసిన మాలలందరిని బేషరతుగా విడుదల చేయాలని, జరిగిన సంఘటనపై హైకోర్టు సిట్టింగ్ జడ్జితో మెజిస్ట్రీయల్ విచారణ జరిపించాలని డిమాండ్ చేశారు. సమావేశ అనంతరం కలెక్టర్కి వినతిపత్రం అందజేశారు. అక్కడ నుంచి ఏలూరు రేంజ్ డీఐజీ ఆఫీసు వరకు ప్రదర్శనగా వెళ్లి డీఐజీకి వినతిపత్రం అందజేశారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ చాగంటి సంజీవ్, చింతలపూడి మాజీ ఎమ్మెల్యే ఉన్నమట్ల ఎలీజా, ఏలూరు మాజీ డిప్యూటీ మేయర్ నూకపెయ్యి సుధీర్బాబు, ప్రొఫెసర్ ఎన్ఏడి పాల్, డాక్టర్ మెండెం సంతోష్కుమార్, నేతల రమేష్ బాబు, దెందులూరు జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం తదితరులు పాల్గొన్నారు. తాడేపల్లిగూడెం: గ్లోబల్ బ్రాండ్లుగా దేశ కోకో, జీడి పంటలు మారనున్నాయని డాక్టర్ వైఎస్ఆర్ ఉద్యాన విశ్వవిద్యాలయ ఉపకులపతి డాక్టర్ కె.ధనుంజయరావు అన్నారు. న్యూఢిల్లీలోని కృషి భవన్లో కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ, రైతు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో గురువారం జరిగిన సమావేశానికి ధనుంజయరావు అతిఽథిగా హాజరయ్యారు. ఏపీలోని కోకో, జీడిపంటల సాగు, ఉత్పత్తి సామర్థ్యం, ప్రొసెసింగ్ గురించి వివరించారు. ఏపీ ప్రభుత్వం రాయలసీమ ప్రాంతాన్ని హార్టీకల్చర్ హబ్గా, ఏలూరు జిల్లాను కోకో హబ్గా ప్రకటించడంతో పాటు వార్షిక బడ్జెట్లో రూ.30 వేల కోట్లు కేటాయించిందన్నారు. ఉద్యానవర్సిటీని సందర్శించాలని ఐసీఏఆర్ డైరెక్టర్ జనరల్ డాక్టర్ మంగీలాల్ జాట్ని వీసీ కోరారు. -
నెలాఖరులోపు రుణాలు చెల్లిస్తే వడ్డీ మాఫీ
ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో షెడ్యూల్ కులాల సేవా సహకార సంఘం ద్వారా 2015–16 నుంచి 2018–19 మధ్య కేంద్ర ప్రభుత్వం వారి ద్వారా ఎన్ఎఫ్డీసీ/ఎన్ఎస్కేఎఫ్డీసీ పథకాల ద్వారా రుణం పొందిన వారు రుణం చెల్లిస్తే వడ్డీ మాఫీ అవుతుందని ఈడీ ఎం.ముక్కంటి తెలిపారు. గురువారం రుణాలు చెల్లించిన వారికి తన కార్యాలయంలో వడ్డీ మాఫీ సర్టిఫికెట్లను అందించి, సత్కరించారు. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా రుణాలు చెల్లించాల్సిన వారు 465 మంది ఉన్నారని, వారు. అసలు రూ.13.55 కోట్లు చెల్లిస్తే వడ్డీ రూ.1.66 కోట్లు మాఫీ అవుతుందని స్పష్టం చేశారు. నూజివీడు: పట్టణంలోని కొత్తపేట 17వ వార్డులో అనధికారికంగా వంటగ్యాస్ సిలిండర్లను విక్రయించే దుకాణంపై గురువారం నూజివీడు సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న మెరుపు దాడి చేశారు. అయితే సబ్కలెక్టర్ వెళ్లేసరికి దుకాణదారుడు దుకాణాన్ని మూసేసి వెళ్లిపోయాడు. దీంతో సబ్కలెక్టర్ ఇక్కడ ఏ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నారనే సమాచారాన్ని చుట్టుపక్కల వారిని అడిగి దుకాణాన్ని సీజ్ చేయించారు. అలాగే దుకాణం షట్టర్పై నోటీసు అంటించారు. ఈ సందర్భంగా సబ్కలెక్టర్ మాట్లాడుతూ డివిజన్, పట్టణ పరిధిలో ఎక్కడైనా వంట గ్యాస్ సిలిండర్లను అక్రమంగా నిల్వ చేసినా, అధిక ధరలకు విక్రయించినా చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సబ్కలెక్టర్ వెంట టీపీఓ కె.వెంకటేశ్వరరావు, మున్సిపల్ మేనేజర్ నరసింహారావు తదితరులు ఉన్నారు. -
‘సత్యసాయి’ మంచినీటి కోసం నిరసన
బుట్టాయగూడెం: సత్యసాయి మంచినీటిని సరఫరా చేయాలని కోరుతూ రెడ్డిగణపవరంనకు చెందిన గ్రామస్తులు గురువారం ఖాళీ బిందెలతో నిరసన తెలిపారు. గత సంవత్సర కాలంగా సత్యసాయి మంచినీటి సరఫరా నిలిచిపోయి తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నామని ఆవేదన వ్యక్తం చేశారు. వీరి ఆందోళనకు కేవీపీఎస్ జిల్లా నాయకులు అందుగుల ఫ్రాన్సిస్ మద్దతు తెలిపారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రస్తుతం నేషనల్ హైవే రోడ్ల నిర్మాణం వల్ల జరుగుతున్న పనులతో సత్యసాయి నీరు నిలిచిందని సంబంధిత అధికారులు చెబుతున్నారన్నారు. ఈ విషయంపై ఇటు సత్యసాయి వాటర్ప్లాంట్ కాంట్రాక్టర్లు, బ్రిడ్జిలు కట్టే కాంట్రాక్టర్ల దృష్టికి కూడా తీసుకువెళ్లినా ఎవరూ పట్టించుకోవడంలేదన్నారు. అధికారులు ఇప్పటికై నా స్పందించి సత్యసాయి నీటిని వెంటనే ప్రజలకు సరఫరా చేయాలని, లేనిపక్షంలో నిరాహార దీక్షలు చేపడతామని హెచ్చరించారు. కార్యక్రమంలో మాజీ ఎంపీటీసీ సభ్యులు పూనెం దుర్గారావు, గ్రామస్తులు ఏ సీతమ్మ, వింజరపు వేణు, కె.అరుణ్ తదితరులు పాల్గొన్నారు. -
వైఎస్సార్ సీపీలోకి చేరికలు
తాడేపల్లిగూడెం రూరల్: క్షేత్ర స్థాయిలో వైఎస్సార్ సీపీని బలోపేతం చేయాలని ఆ పార్టీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డి రఘురాం నాయుడు పిలుపునిచ్చారు. గురువారం మండలంలోని ఎల్.అగ్రహారం టిడ్కో గృహ సముదాయం వద్ద జనసేనకు చెందిన పలువురు వైఎస్సార్ సీపీలో చేరారు. వారికి నియోజకవర్గ ఇన్చార్జ్ వడ్డీ రఘురాం నాయుడు పార్టీ కండువాలు వేసి స్వాగతం పలికారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రతి కార్యకర్తకూ ఎల్లప్పుడూ పార్టీలో సముచిత స్థానం ఉంటుందన్నారు. తమ పార్టీ అధికారంలోకి రాగానే టిడ్కో గృహ సముదాయంలోని అన్ని సమస్యలను పరిష్కరిస్తామన్నారు. జగన్ను ముఖ్యమంత్రి చేసేందుకు ప్రతీ కార్యకర్త స మష్టిగా పనిచేయాలన్నారు. నియోజకవర్గంలో పార్టీ జెండాను ఎగురవేయాలన్నారు. కార్యక్రమంలో నాయకులు గొర్రెల శ్రీనివాస్, కాకర్ల శ్రీనివాస్, దత్తి సాయి, మానుకొండ వెంకటేశ్వరరావు, తానేటి అజయ్, లంకా రాజశేఖర్, గోకా వెంకటేశ్వరరావు, తాళ్ళప్రసాద్, వట్టి బుజ్జి, యాండ్రపు వంశీ తదితరులు పాల్గొన్నారు. -
మూల్యాంకనం ఉత్తర్వులు పునఃపరిశీలించాలి
ఏపీటీఎఫ్ నాయకుల వినతిఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబుపత్రాల మూల్యాంకన కార్యక్రమం ప్రారంభంకానున్న నేపథ్యంలో ఈ విధులపై విద్యాశాఖ అధికారులు విడుదల చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించాలని కోరుతూ ప్రభుత్వ పరీక్షల అసిస్టెంట్ కమిషనర్ ఆర్.ఆశకు గురువారం ఏపీటీఎఫ్ నాయకులు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా ఆ సంఘ నాయకులు మాట్లాడుతూ సంబంధిత సబ్జెక్టులను బోధించని ఉపాధ్యాయులకు కూడా మూల్యాంకన విధులు కేటాయించబడినట్లు గమనించామన్నారు. విభిన్న ప్రతిభావంతుల (వికలాంగుల) కేటగిరికి చెందిన ఉపాధ్యాయులకు కూడా ఉత్తర్వులను జారీ చేశారని, అలాగే ప్రాథమిక పాఠశాలల హెడ్మాస్టర్లకు ప్రత్యేక సహాయకులుగా విధులు కేటాయించినట్టు గుర్తించామన్నారు. అయితే వారు పాఠశాల నిర్వహణతో పాటు ఎన్రోల్మెంట్ డ్రైవ్ వంటి కీలక బాధ్యతలు నిర్వహించవలసి ఉంటుందని, ఈ సమస్యలు మూల్యాంకన ప్రక్రియ నాణ్యతపై ప్రతికూల ప్రభావం చూపే అవకాశముందన్నారు. ఈ మేరకు అధికారులు జారీ చేసిన ఉత్తర్వులను పునఃపరిశీలించి అర్హతలు, సంబంధిత సబ్జెక్టుల ఆధారంగా విధులను కేటాయించాలని సంఘం తరఫున విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడు ఈ రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ మోహన్, జిల్లా కార్యదర్శి డీ శ్రీనివాసరావు, గుంటూరు శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
పీడీఎస్ బియ్యం పట్టివేత
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలో పీడీఎస్ బియ్యంను అక్రమంగా తరలిస్తున్న వ్యాన్ను బుధవారం పట్టుకుని సీజ్ చేసినట్లు ఎస్సై క్రాంతి కుమార్ తెలిపారు. పేదలకు ప్రభుత్వం పంపిణీ చేస్తున్న పీడీఎస్ బియ్యంను తరలిస్తున్నట్లు అందిన సమాచారం మేరకు డిప్యూటీ తహసీల్దార్, వీఆర్ఓల సమక్షంలో పట్టుకున్నట్లు తెలిపారు. మొత్తం 50 కేజీల పరిమాణం గల 60 బస్తాలు వ్యాన్లో ఉన్నాయన్నారు. బియ్యంను అక్రమంగా రవాణా చేస్తున్న కె.సురేష్ అనే వ్యక్తిపై కేసు నమోదు చేసినట్లు తెలిపారు. రేషన్ బియ్యం బస్తాలు స్వాధీనం పెదపాడు: రేషన్ బియ్యం అక్రమ నిల్వలను పెదపాడు పోలీసులు స్వాధీనం చేసుకుని కేసు నమోదు చేశారు. మండలంలోని కొత్తూరు గ్రామంలో రేషన్ బియ్యం అక్రమ నిల్వ చేస్తున్నట్లు సమాచారం రావడంతో ఎస్సై ఆర్.శ్రీనివాస్ తన సిబ్బందితో కలిసి చితాడ పవిత్ర కుమార్ గోడౌన్పై దాడి చేసి బియ్యం నిల్వలను స్వాధీనం చేసుకుని అతడిపై కేను సమోదు చేశారు. చింతలపూడి: ఎదురెదురుగా రెండు మోటార్సైకిళ్లు ఢీకొని ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం రాఘవాపురం గ్రీన్ ఫీల్డ్ హైవే సమీపంలో ముగ్గురు యువకులు బైక్పై రాఘవపురం నుంచి అతివేగంతో వెళ్తున్నారు. అదే సమయంలో సత్తుపల్లి నుంచి ద్విచక్రవాహనంపై చింతలపూడి వైపు వస్తున్న తెడ్లం గ్రామానికి చెందిన గంజి రాధ (35)ను వారు ఢీకొన్నారు. ఈ ప్రమాదంలో రాధ అక్కడికక్కడే మృతి చెందాడు. ప్రమాదానికి కారణమైన యువకులకు కూడా స్వల్ప గాయాలయ్యాయి. స్థానికుల సమాచారంతో పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని రాధ మతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం తరలించారు. ఎస్సై కె సతీష్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కుక్కునూరు: రోడ్డు ప్రమాదంలో ఓ సర్పంచ్ తీవ్రంగా గాయపడ్డాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఎంపీడీవో కార్యాలయంలో సమావేశం అనంతరం కివ్వాక పంచాయతీ సర్పంచ్ మడివి రాజులు తన టీవీఎస్ ఎక్సెల్ వాహనంపై పెట్రోల్ బంక్ వద్దకు వెళ్లి తిరిగి వెనక్కి వస్తుండగా స్పోర్ట్స్ బైక్ పై వేగంగా వచ్చిన యువకుడు బలంగా ఢీకొట్టాడు. ఈ ప్రమాదంలో సర్పంచ్ రాజులు కాలి ఎముక విరిగిపోగా, తలకు తీవ్ర గాయమైంది. దీంతో స్థానికులు 108 వాహనంలో స్థానిక పీహెచ్సీకి తరలించి ప్రథమ చికిత్స అనంతరం మెరుగైన చికిత్స కోసం భద్రాచలం ఆస్పత్రికి తరలించారు. ఉంగుటూరు: పాము కాటుతో వ్యక్తి మృతి చెందిన ఘటన నీలాద్రిపురంలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం గ్రామానికి చెందిన తాళ్ల సుబ్బారావు (35) బుధవారం పొలంలో మెక్కజొన్న చేలో పొత్తులు విరుస్తుండగా కాలుమీద పాము కాటు వేసింది. దాంతో స్థానికులు అతడిని వెంటనే తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించిగా అక్కడ చికిత్స పొందుతూ మృతి చెందాడు. సుబ్బారావుకు భార్య భవాని, పిల్లలు ఉన్నారు. జంగారెడ్డిగూడెం: స్థానిక మార్కండేయపురానికి చెందిన యువతి (20) అదృశ్యంపై పోలీస్ స్టేషన్లో కేసు నమోదైంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం యువతి గతంలో కిరాణా షాపులో పనిచేసేదని, అక్కడ మానివేసి ఇంటి వద్దే ఉంటోందని తెలిపారు. మంగళవారం ఉదయం 11 గంటల సమయంలో ఇంటి నుంచి బయటకు వెళ్లి తిరిగి ఇంటికి రాకపోవడంతో ఆమె తల్లి పోలీసులకు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు చర్యలు
భీమవరం (ప్రకాశం చౌక్): జిల్లాలో పీఎన్జీ (పైప్డ్ నేచురల్ గ్యాస్) కనెక్షన్ల విస్తరణను వేగవంతం చేయాలని జిల్లా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు. బుధవారం జాయింట్ కలెక్టరేట్ ఛాంబర్ ఎన్ఎండీవై గోదావరి గ్యాస్, సివిల్ సప్లైస్, మున్సిపల్, పంచాయతీరాజ్, ఆర్అండ్బీ, ఇరిగేషన్ తదితర శాఖల అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ టి.రాహుల్ కుమార్ రెడ్డి మాట్లాడుతూ, గృహ వినియోగదారులకు సురక్షితమైన, సౌకర్యవంతమైన నిరంతర గ్యాస్ సరఫరా అందించేందుకు పీఎన్జీ గ్యాస్ విస్తరణ పనులను వేగవంతం చేయాలని సూచించారు. ప్రజల్లో అవగాహన కల్పించి, పీఎన్జీ కనెక్షన్లు పొందేందుకు అవసరమైన చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. జిల్లాలో తాడేపల్లిగూడెం ప్రాంతంలో మొత్తం 9,902 గ్యాస్ కనెక్షన్లకు పైప్లైన్ సదుపాయం సిద్ధంగా ఉన్నప్పటికీ, కేవలం 63 మంది మాత్రమే వినియోగం చేస్తున్నారని తెలిపారు. ఎల్పీజీ సిలిండర్లతో పోలిస్తే పీఎన్జీ గ్యాస్ వినియోగం ద్వారా వినియోగదారులకు నెలకు సుమారు రూ.100 నుంచి రూ.150 వరకు ఆదా అవుతుందని చెప్పారు. ప్రజలు ముందుకు వచ్చి సంబంధిత శాఖల అధికారులతో సంప్రదించి పీఎన్జీ గ్యాస్ కనెక్షన్లు పొందాలని సూచించారు. గ్యాస్ కనెక్షన్ల కోసం గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్ను ఫోన్ నెంబర్ 94914 24143 ద్వారా సంప్రదించాలన్నారు. అలాగే భీమవరం, పాలకొల్లు, నరసాపురం, తణుకు పట్టణాల్లో పీఎన్జీ గ్యాస్ కనెక్షన్ల విస్తరణకు తక్షణ చర్యలు తీసుకోవాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశించారు.సమావేశంలో డీఎస్ఓ ఎన్.సరోజ, గోదావరి గ్యాస్ అసిస్టెంట్ మేనేజర్ ఎం.సత్య రాకేష్, భీమవరం మున్సిపల్ కమిషనర్ ఎం.రామచంద్రారెడ్డి, జిల్లా పరిశ్రమల శాఖాధికారి యు.మంగపతిరావు, ఇతర అధికారులు పాల్గొన్నారు. -
ఏపీటీఎఫ్ జిల్లా అధ్యక్షుడిగా నారాయణ దాసు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీటీఎఫ్ ఏలూరు జిల్లా నూతన అధ్యక్షుడిగా ప్రస్తుత జిల్లా ఉపాధ్యక్షుడు, ముదినేపల్లి హైస్కూల్లో స్కూల్ అసిస్టెంట్గా పనిచేస్తున్న టీ.నారాయణదాసు ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. స్థానిక జిల్లా పరిషత్ ప్రాంగణంలోని ప్రధాన కార్యదర్శి తాళ్ళూరి రామారావు అధ్యక్షతన ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఈవీ రామారావు హాజరయ్యారు. నూతన అధ్యక్షుడిగా ఎన్నికై న నారాయణదాసు మాట్లాడుతూ ప్రభుత్వం పీఆర్సీ కమిషన్ నియమించకుండా తాత్సారం చేస్తోందని, వెంటనే ఐఆర్ ప్రకటించాలని, పెండింగ్లో ఉన్న నాలుగు డీఏలను విడుదల చేయాలని లేనిపక్షంలో ఉద్యమం తప్పదన్నారు. రాష్ట్ర కార్యదర్శి బీ రెడ్డి దొర, రాష్ట్ర మాజీ కార్యదర్శి బీఏ సాల్మన్ రాజు, సబ్ కమిటీ సభ్యులు తొమ్మండ్రు ప్రకాష్, వీ.గణేష్, యూవీఎన్ రాజు, ఎస్.దొరబాబు, డీకేఎస్ఎస్ ప్రకాష్ రావు, మండల నాయకులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా బుధవారం నిర్వహించిన ఏఎస్ఎస్సీ మెయిన్ లాంగ్వేజ్ పేపర్–2 (సంస్కృతం), ఒకేషనల్ థియరీ పరీక్షలకు 3,663 మంది హాజరయ్యారు. మొత్తం 3,843 మంది విద్యార్థులకు 180 మంది విద్యార్థులు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలను ఏలూరు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకటలక్ష్మమ్మ 2 కేంద్రాల్లో తనిఖీ చేశారు. ఈ పరీక్షల్లో ఎలాంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగాయని ఆమె తెలిపారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా వేలం ప్రక్రియ ధరల్లో మార్పు లేకపోవడంతో రైతులు ధర ఎప్పుడు పెరుగుతుందా అని ఎదురుచూస్తున్నారు. వేలం ప్రక్రియలో బయ్యర్లు, సిబ్బంది కొరతతో షిప్ట్ పద్దతిలో వేలం నిర్వహిస్తుండగా, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 5 వేలం కేంద్రాల పరిధిలో బుధవారం జంగారెడ్డిగూడెం–1, జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రాల్లో వర్జీనియా పొగాకు వేలం నిర్వహించారు. జంగారెడ్డిగూడెం–1 వేలం కేంద్రంలో మొత్తం 182 బేళ్లు రాగా, వాటిలో 113 బేళ్లు తిరస్కరించారు. 69 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ. 265, కనిష్ట ధర రూ.250 వచ్చింది. సరాసరి రూ.256.86గా నమోదైంది. జంగారెడ్డిగూడెం–2 వేలం కేంద్రంలో 232 బేళ్లు అమ్మకానికి రాగా, 130 బేళ్లు తిరస్కరించారు. 102 బేళ్ళు కొనుగోలు చేయగా, గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.255 వచ్చింది. సరాసరి ధర రూ.258.26 నమోదైంది. ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ రెండో విడత పరీక్షలు గురువారం నుంచి ప్రారంభం కానున్నాయి. గత జనవరి 21 నుంచి 29 వరకూ తొలి విడత జేఈఈ మెయిన్స్ పరీక్షలు నిర్వహించిన విషయం తెలిసిందే. రెండో విడత పరీక్షలు ఏలూరు జిల్లాలో ఒక కేంద్రంలో, పశ్చిమ గోదావరి జిల్లాలో నాలుగు కేంద్రాల్లో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఏలూరు జిల్లాకు సంబంధించిన ఏలూరు నగరంలోని సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో నిర్వహించనున్నారు. పశ్చిమ గోదావరి జిల్లాకు సంబంధించి భీమవరంలోని డీఎన్ఆర్ కళాశాల, విష్ణు ఇంజనీరింగ్ కళాశాలల్లో నిర్వహించనున్నారు. తాడేపల్లిగూడెంలోని శ్రీ వాసవి ఇంజనీరింగ్ కళాశాల, శశి ఇంజనీరింగ్ కళాశాలలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ఈ నెల 2, 4, 5, 6, 7, 8 తేదీల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ, తిరిగి మధ్యాహ్నం 3 గంటల నుంచి 6 గంటల వరకూ పరీక్షలు నిర్వహిస్తారు. ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో విధుల్లో అలసత్వం ప్రదర్శిస్తున్న ఇద్దరు సెక్యూరిటీ సూపర్వైజర్లను ఆలయ అధికారులు బుధవారం విధుల నుంచి తొలగించారు. సెక్యూరిటీ సిబ్బందితో పనిచేయించాల్సిన సూపర్వైజర్లే విధి నిర్వహణలో బాధ్యతారాహిత్యంగా ఉంటున్నారన్న ఆరోపణల నేపథ్యంలో అధికారులు ఈ నిర్ణయం తీసుకున్నారు. ఆలయంలో కొందరు భక్తులు, స్థానికులు ఇన్స్టా రీల్స్ చేస్తున్నా సూపర్వైజర్లు నిలువరించకపోవడాన్ని తీవ్రంగా పరిగణించారు. గార్డులకు విధుల కేటాయింపులో కూడా లోటుపాట్లు ఉన్నట్టు తెలుసుకున్నారు. ఇదిలా ఉండగా మంగళవారం శ్రీవారి కొండపైకి అన్యమత పోస్టర్లు ఉన్న వాహనం రాగా, అక్కడ విధులు నిర్వర్తిస్తున్న సెక్యూరిటీ గార్డు సెల్ఫోన్ చూసుకుంటూ, దానిని పట్టించుకోలేదు. అధికారులు సీసీ కెమెరాల ద్వారా ఈ విషయాన్ని గుర్తించి, వెంటనే అతడిని విధుల నుంచి తొలగించారు. -
మూల్యాంకనం నుంచి మినహాయింపునకు వినతి
ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 4వ తేదీ నుంచి ప్రారంభంకానున్న 10 వ తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించి విద్యార్థులు రాసిన జవాబు పత్రాల మూల్యాంకన విధుల నుంచి వివిధ వర్గాల ఉపాధ్యాయులకు మినహాయింపు ఇవ్వాలని కోరుతూ జాక్టో నాయకులు బుధవారం జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా జాక్టో నాయకులు మాట్లాడుతూ అనారోగ్య సమస్యలతో బాధపడుతున్న ఉపాధ్యాయులకు ఎస్ఎస్సీ మూల్యాంకన విధుల నుంచి మినహాయింపు ఇవ్వాలని, అలాగే 55 సంవత్సరాల వయసు దాటిన ఉపాధ్యాయులకు సైతం మినహాయింపు ఇవ్వాలని కోరారు. మూల్యాంకన విధుల్లో పాల్గొనే ఉపాధ్యాయులకు చెల్లించే రెమ్యూనరేషన్ను పెంచాలని, మంచినీరు, వెంటిలేషన్ తదితర సౌకర్యాలు కల్పించాలని, పాఠశాల యూనిట్గా 50 శాతం మించకుండా ఏఈ, స్పెషల్ అసిస్టెంట్లను నియమించాలని కోరారు. వినతిపత్రం సమర్పించిన వారిలో జాక్టో నాయకులు పువ్వుల ఆంజనేయులు, బీ రాము, కే వెంకట రమణ, బీ విద్యా సాగర్, పీ సురేష్, టీఎల్ఎస్ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్, ఎన్.ప్రవీణ్ కుమార్, ఎం.రాంబాబు, తోట ప్రసాద్ తదితరులున్నారు. -
టికెట్లు సులభం.. సేవలు పారదర్శకం
ద్వారకాతిరుమల: శ్రీవారి భక్తులకు ఆన్లైన్ సేవలను మరింత చేరువ చేసేందుకు కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేసినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. స్థానిక అనివేటి మండపంలో ఏర్పాటు చేసిన ఈ కియోస్క్ మెషీన్లను బుధవారం ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా ఈఓ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం, కరూర్ వైశ్యా బ్యాంక్ల సంయుక్త సహకారంతో రాష్ట్రంలోని ప్రముఖ దేవాలయాల్లో 100 కియోస్క్ మెషీన్లను ఏర్పాటు చేసే కార్యక్రమాన్ని తలపెట్టినట్టు చెప్పారు. అందులో భాగంగానే శ్రీవారి ఆలయంలో ఈ కియోస్క్ల సదుపాయం భక్తులకు అందుబాటులోకి తెచ్చామన్నారు. భక్తులు వీటిని సద్వినియోగం చేసుకోవాలని కోరారు. ఉపయోగాలిలా.. ● భక్తుల చేతిలో నగదు లేకపోయినా డిజిటల్ యూపీఐ, కార్డుల ద్వారా (నగదు రహిత) చెల్లింపులు జరిపి దర్శనం, ప్రసాదం, వివిధ సేవా టికెట్లను సులభంగా పొందవచ్చు. ● ఈ మెషీన్ల ద్వారా నేరుగా టికెట్లు తీసుకుంటే క్యూలైన్లలో వేచి ఉండక్కర్లేదు. దాంతో సమయం ఆదా అవుతుంది. ● టికెట్లు విక్రయించే ప్రక్రియలో భక్తులకు మరింత పారదర్శకత లభిస్తుంది. కియోస్క్లు ఏర్పాటు చేసిన ప్రదేశాలు ఇవీ.. భక్తుల రద్దీ ఎక్కువగా ఉండే ప్రదేశాల్లో ఈ కియోస్క్లను ఏర్పాటు చేశారు. ముఖ్యంగా అనివేటి మండపం, కొండ కింద సమాచార కేంద్రం, కేశఖండనశాల, శ్రీ ధర్మ అప్పరాయ నిలయం, ప్రసాదాల కౌంటర్ల సముదాయం, పీఆర్వో కార్యాలయం, నిత్య కల్యాణ మండపం వద్ద వీటిని ఏర్పాటు చేసినట్టు ఈఓ పేర్కొన్నారు. కియోస్క్ల ప్రారంభోత్సవ కార్యక్రమంలో ఆలయ ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు, ఎలక్ట్రికల్ డీఈ టి.సూర్యనారాయణ, కరూర్ వైశ్యా బ్యాంక్ డీజీఎం ఎన్.రమేష్, అరవింద్ గణేష్, సీబీ శేఖర్, ఏలూరు బ్రాంచ్ హెడ్ కె.ఫణికుమార్ తదితరులున్నారు. శ్రీవారి దేవస్థానంలో కియోస్క్ మెషీన్లు ప్రారంభం -
ఎండలపై అప్రమత్తంగా ఉండాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఈ వేసవిలో అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశం ఉందని, అత్యవసరమైతే తప్ప ఎండలో ముఖ్యంగా చిన్నపిల్లలు, గర్భిణులు, వృద్దులు, వ్యాధిగ్రస్తులు బయటకు రాకుండా నివారించాలని కలెక్టర్ కే.వెట్రిసెల్వి అన్నారు. బుధవారం కలెక్టరేట్లో ఎండ తీవ్రతపై తీసుకోవలసిన ముందు జాగ్రత్త చర్యలు, ప్రజలను అప్రమత్తం చేయడం తదితర అంశాలపై అధికారులతో కలెక్టర్ సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ వెట్రిసెల్వి మాట్లాడుతూ ఎండ తీవ్రతకు గురికాకుండా ప్రజలను అప్రమత్తం చేయాలని ఆదేశించారు. వడదెబ్బ తగిలిన వారికి తక్షణమే చికిత్స అందించేందుకు ప్రభుత్వ ఆసుపత్రులలో ప్రత్యేక వార్డులు ఏర్పాటుచేయాలని, ప్రభుత్వ ఆసుపత్రులు అన్నింటిలోనూ అవసరమైన ఓఆర్ఎస్ ప్యాకెట్లు సిద్ధం చేయాలన్నారు. ఉపాధి హామీ కూలీలకు తాగునీరు, నీడ ఉండేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్ఓ భాస్కర్, డీపీఓ అనురాధ, జిల్లా పరిషత్ సీఈఓ భీమేశ్వరరావు, తదితరులు పాల్గొన్నారు. -
దివ్యాంగులతో సదరంగం
కూటమి ప్రభుత్వం దివ్యాంగులతో ఆటలాడుతూ నరకం చూపిస్తోంది. అంగవైకల్యం స్పష్టంగా కనిపిస్తున్నా పింఛన్ల కోసం రీ వెరిఫికేషన్ అంటూ వారిని నానా యాతనలు పెడుతోంది. శ్లాట్ బుక్ చేసుకున్న తరువాత ఆసుపత్రికి వస్తే సంబంధిత డాక్టర్ లేరు... అక్కడికి వెళ్లు.. ఇక్కడికి వెళ్లు అంటూ వార్డులు తిప్పుతున్నారని దివ్యాంగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంటి బిడ్డలతో, నడవలేని పరిస్ధితుల్లో ఉన్న వృద్ధులు ఎలా తిరుగుతారంటూ ప్రభుత్వం, డాక్టర్లపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం ఉదయం 10 గంటలకు రాగా 12 గంటలు దాటినా దివ్యాంగులను పట్టించుకోకపోవడంపై మండిపడుతున్నారు. దివ్యాంగుల రీవెరిఫికేషన్ వార్డు వద్ద బాధితుల దయనీయమైన దృశ్యాలు ఇవి. – సాక్షి ఫొటోగ్రాఫర్/ ఏలూరు -
అపరాల రైతుల ఆందోళన
ఏలూరు (ఆర్ఆర్పేట): రైతులు పండించిన పెసర, మినుము పంటలను పూర్తిగా కొనుగోలు చేయాలని రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె. శ్రీనివాస్ అన్నారు. కొనుగోలు నిబంధనలతో రైతులను ఇబ్బందులు పెడుతున్న అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ అపరాల రైతులు బుధవారం ఏలూరు శివారు సుంకరివారితోట రైతు సేవా కేంద్రం వద్ద ఆందోళన చేశారు. ఈ సందర్భంగా శ్రీనివాస్ మాట్లాడుతూ కొనుగోలు లక్ష్యం పూర్తయిందని గత కొన్ని రోజులుగా కొనుగోలు నిలిపివేయడంతో అపరాల రైతులు ఇబ్బందులు పడుతున్నారన్నారు. ఇప్పటికే తగిన దిగుబడులు రాక, పెట్టుబడి ఖర్చులు పెరిగిపోయి అపరాల రైతులు నష్టపోయారన్నారు. అపరాల కొనుగోలు సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరారు. రైతు సేవా కేంద్రం వద్దకు తీసుకువచ్చిన పంట రోజులు తరబడి ఇక్కడే ఉండిపోవడంతో ఆ పంట కాపలాకు రాత్రి, పగలు ఇక్కడే పడిగాపులు పడాల్సి వస్తోందని అపరాల రైతుల ఆవేదన వ్యక్తం చేశారు. అనంతరం అక్కడికి వచ్చిన మార్క్ ఫెడ్ జిల్లా మేనేజర్తో సంప్రదింపులు జరుపగా పెసర పంటను వెంటనే గోడౌన్కు తరలిస్తామని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో పలు గ్రామాల రైతులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: బాల బాలికలు సురక్షితమైన ఆరోగ్యవంతమైన వాతావరణంలో పెరుగుతూ మంచి విద్యాబుద్ధులు నేర్చుకుని బంగారు భవిష్యత్ను నిర్మించుకోవాలని ఐటీడిఏ పీఓ కె.రాములు నాయక్ అన్నారు. కేఆర్పురం ఐటీడీఏ వద్ద మిషన్ వాత్సల్య పథకంపై బుధవారం నిర్వహించిన అవగాహన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. మిషన్ వాత్సల్య పథకం ద్వారా అమలు జరుగుతున్న చట్టాలు, సంక్షేమ పథకాలు, వాటి అమలు తీరుపై ప్రతి ఒక్కరూ అవగాహన పెంచుకోవాలని అన్నారు. జిల్లా బాలల సంరక్షణ అధికారి డాక్టర్ సీహెచ్ సూర్య చక్రవేణి మాట్లాడుతూ మిషన్ వాత్సల్య పథకంపై గిరిజన సంక్షేమ ఆశ్రమ పాఠశాలలు, కాలేజీలు, వసతిగృహాల్లో పాటించవలసిన భద్రత, రక్షణ వివరాలను ప్రధానోపాధ్యాయులు, వార్డెన్లు, ఉపాధ్యాయులకు ఒక రోజు శిక్షణ కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు చెప్పారు. బాలలతో పనిచేస్తున్న వివిధ శాఖల అధికారులు అందరూ సమన్వయంతో పనిచేసినప్పుడే మిషన్ వాత్సల్య పథకం లక్ష్యాలను చేరుకుని బాలల స్నేహపూర్వక, స్వేచ్ఛాయుత వాతావరణాన్ని కల్పించడం జరుగుతుందని చెప్పారు. ఈ కార్యక్రమంలో డీసీపీయూ జిల్లా సిబ్బంది యు.బాలస్వామి, రాజేష్, రాజ్కుమార్, డీడీ పి.జనార్థన్ రావు, డీవైఈఓ కె.రవిప్రసన్నకుమార్, ఏఎంఓ కె. శిరమయ్య, జీసీడీఓ డి.రాజేశ్వరి, సీఎంఓ ఎస్.శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. -
నకిలీ టికెట్ల వ్యవహారంపై సీరియస్
● టెక్నికల్ టీంను నియమించిన దేవదాయ శాఖ కమిషనర్ ● వారం రోజుల్లోగా నివేదిక ఇవ్వాలని ఆదేశాలు జారీ ద్వారకాతిరుమల: శ్రీవారి దేవస్థానంలో ఇటీవల వెలుగు చూసిన రూ.200 నకిలీ టికెట్ల వ్యవహారాన్ని సీరియస్గా తీసుకోవాలని దేవదాయ శాఖ ప్రిన్సిపల్ కార్యదర్శి, కమిషనర్లకు, జిల్లా ఎస్పీకి సీఎంఓ కార్యాలయం నుంచి ఆదేశాలు జారీ అయినట్టు సమాచారం. దాంతో పోలీసులు ఈ కేసు దర్యాప్తును మరింత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నట్టు తెలుస్తోంది. వివరాల్లోకి వెళితే.. ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయంలో గత నెల 15న రూ.200 నకిలీ టికెట్ల విక్రయాల వ్యవహారం బయటపడింది. దీనిపై దేవస్థానం ఈఓ వై.భద్రాజీ ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి, దర్యాప్తు చేపట్టారు. ఈ కేసులో ఏ2 నిందితుడిగా ఉన్న అవుట్ సోర్సింగ్ ఉద్యోగి ఎస్.శేషుబాబు, ఏ3 నిందితుడిగా ఉన్న సెక్యురిటీ గార్డు మేకా సతీష్ ప్రస్తుతం రిమాండ్లో ఉన్నారు. ఏ1 నిందితుడైన ఐఎస్జే రాజు ముందస్తు బెయిల్ కోసం జిల్లా కోర్టును ఆశ్రయించాడు. ఇదిలా ఉంటే రాష్ట్ర దేవదాయ శాఖ కమిషనర్ కె.రామచంద్రమోహన్ ఈ నకిలీ టికెట్ల స్కాంపై ఒక టెక్నికల్ కమిటీని నియమించారు. అందులో ఆంధ్రప్రదేశ్ టెక్నాలజీ సర్వీసెస్ (ఏపీటీఎస్) లిమిటెడ్ సభ్యులు, సింహాచలం దేవస్థానానికి చెందిన సిస్టం అడ్మినిస్ట్రేటర్, అన్నవరం దేవస్థానానికి చెందిన మరో సిస్టం అడ్మినిస్ట్రేటర్ ఉన్నారు. వారం రోజుల్లోగా సంబంధిత రిపోర్టును తనకు అందించాలని కమిషనర్ కమిటీని ఆదేశించారు. మరో ఒకటి రెండు రోజుల్లో కమిటీ దేవస్థానంలో విచారణ చేపట్టనుంది. అయితే వీరు పరిశీలించాల్సిన కంప్యూటర్ సిస్టంను పోలీసులు ఇప్పటికే స్వాధీనం చేసుకున్నారు. దాంతో పోలీసులు ఈ కమిటీకి సహకరిస్తారా.. లేక తామే టెక్నికల్ పరీక్షలు జరిపిస్తామని పోలీసులు చెబుతారా? అన్నది ప్రశ్నార్ధకంగా ఉంది. పోలీసులు కంప్యూటర్ సిస్టంను టెక్నికల్ టీమ్కు ఇవ్వకపోతే వారు దేవస్థానం వద్ద ఉన్న సీసీ ఫుటేజీలను పరిశీలించడం మినహా ఏమీ చేయలేరు. ఏది ఏమైనా ఈ కేసు రోజుకో మలుపు తిరుగుతూ సంచలనంగా మారింది. -
ఉపాధ్యాయుల సమస్యలను పరిష్కరించాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను వెంటనే పరిష్కరించాలని కోరుతూ యూటీఎఫ్ ఆధ్వర్యంలో బుధవారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం వద్ద నిరాహార దీక్ష నిర్వహించారు. పీఆర్సీ కమిషనర్ను వెంటనే నియమించాలని, 29 శాతం ఐఆర్ ప్రకటించాలని, మెమో నెంబర్ 57 అమలు చేయాలని, పెండింగ్ బకాయిలను విడుదల చేయాలని కోరుతూ యూటీఎఫ్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు ఈ కార్యక్రమాన్ని జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్. రవికుమార్ అధ్యక్షతన చేపట్టారు. సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కేఎస్ఎస్ ప్రసాద్ మాట్లాడుతూ ఉద్యోగ, ఉపాధ్యాయ, కార్మిక వర్గాలకు ముఖ్యమంత్రి ఇచ్చిన హామీలను నిలబెట్టుకోవాలని, అధికారంలోకి వచ్చేముందు ఉద్యోగులకు మెరుగైన పీఆర్సీ ఇస్తామని హామీ ఇచ్చిన మాట అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రభుత్వం మర్చిపోయిందన్నారు. ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఉద్యోగులకు రావాల్సిన ఆర్థిక బకాయిలు విడుదల చేయాలని, ఉద్యోగులకు ఇవ్వాల్సిన పెండింగ్ డీఎలను వెంటనే విడుదల చేయాలని, కేంద్ర ప్రభుత్వం మెమో 57ను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని, అవసరమైతే సీఎం ఇంటిని ముట్టడిస్తామని హెచ్చరించారు. ఏపీ జేఏసీ నాయకులు చోడగిరి శ్రీనివాసరావు, ఆర్ఎస్ హరినాథ్, నెరుసు రామారావు, సీఐటీయూ నాయకులు ఆర్. లింగరాజు, డీఎన్వీడీ ప్రసాద్, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం నాయకులు కే. శ్రీనివాసరావు, ఏపీటీఎఫ్1938, ఏపీటీఎఫ్ 257, ఎస్టీయూ, డీటీఎఫ్, బీటీఏ, ఆప్టా, ఏపీఎస్టీఏ, పీఆర్టీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల నాయకులు మద్దతు ప్రకటిస్తూ సంఘీభావ సందేశం తెలిపారు. యూటీఎఫ్ రాష్ట్ర కార్యదర్శులు ఎస్పీ మనోహర్ కుమార్, బీ సుభాషిణి, జిల్లా సహాధ్యక్షులు ఎస్.సుధారాణి, జీ వెంకటేశ్వరరావు, కోశాధికారి రంగమోహన్ తదితరులు పాల్గొన్నారు. -
ఉండి ఎమ్మెల్యే తీరు మార్చుకోవాలి
ఏలూరు(ఆర్ఆర్పేట): ఆకివీడు పెద్దపేటలో మతసామరస్యత వాతావరణానికి విఘాతం కలగడానికి ఉండి ఎమ్మెల్యే రఘురామ కృష్ణరాజు వైఖరే కారణమని సీపీఎం ఏలూరు నగర కమిటీ నిర్వహించిన సమావేశంలో వక్తలు పేర్కొన్నారు. బుధవారం పార్టీ జిల్లా కార్యాలయంలో నగర కార్యదర్శి పంపన రవికుమార్ అధ్యక్షతన రౌండ్ టేబుల్ సమావేశం జరిగింది. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ మాట్లాడుతూ గత నెల రోజులుగా ఆకివీడు పెద్దపేట వివాదం ముదురుతుంటుంటే జిల్లా పోలీసు యంత్రాంగం ఎమ్మెల్యే ఎలా వ్యవహరించినా సహకరించడం సరికాదన్నారు. పేటలో ఉన్న గుడిని ఏ విధంగా నిర్మించుకోవాలో వారే నిర్ణయించుకుంటారని తెలిపారు. ఇరువర్గాలను ఐక్యం చేస్తూ సమస్యను పరిష్కారం చేసేలా వ్యవహరించాలన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఏ.రవి మాట్లాడుతూ జిల్లా ప్రశాంతతకు మారుపేరని, చిన్న చిన్న ఘర్షణలు జరిగినా వెంటనే సద్దుమణిగేవన్నారు. ఆకివీడులో జరుగుతున్న వివాదం కేవలం డిప్యూటీ స్పీకర్ రాజేస్తున్న వివాదం మాత్రమే తప్ప ప్రజల మధ్య వివాదం కాదన్నారు. పోలీసులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారని ఆరోపించారు. అరెస్ట్ చేసిన 57 మంది దళిత యువకులను వెంటనే విడుదల చేయాలన్నారు. దళిత క్రిస్టియన్ రైట్స్ జేఏసీ చైర్మన్ డాక్టర్ పెరికే వరప్రసాదరావు మాట్లాడుతూ రాజ్యాంగంపై ప్రమాణ స్వీకారం చేసి ఒక కులానికో, మతానికో ఏకపక్షంగా వ్యవహరించడం తగన్నారు. జిల్లా కాంగ్రెస్ అధ్యక్షుడు రాజనాల రామ్మోహన్రావు మాట్లాడుతూ పశ్చిమ గోదావరి జిల్లా పోలీసు యంత్రాంగం వైఫల్యం వలనే ఈ వివాదం ముదిరిందన్నారు. టీడీపీ, జనసేన కేడర్ కూడా ఆలోచించాలని, రఘురామకృష్ణరాజు కుట్రలో బలికావద్దన్నారు. కార్యక్రమంలో అంబేద్కర్ పూలె ఉద్యమ నేతలు డాక్టర్ పెరియార్ దాసరి జీవన్ శ్యాం, కెవీపియస్ జిల్లా కార్యదర్శి అండుగుల ఫ్రాన్సిస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పీవీ రామకృష్ణ, సామజిక ఉద్యమ నేతలు మాంచెల్ల ఇస్సాక్, కాకర్ల రాజేంద్ర ప్రసాద్, పీ.వెంకటేశ్వర్లు, పళ్లెం ప్రసాద్, వైఎస్ కనకారావు, జీ.కోటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. రిటైర్డ్ ఐఆర్ఎస్ అధికారి చాగంటి సంజీవ్ -
ఆరోగ్యం.. ఆదాయం
● ద్విచక్ర వాహనంపై ‘సిరిధాన్యాల’ ప్రయాణం ● వ్యాపారంలో లాభం కంటే.. ప్రజల ఆరోగ్యానికే పెద్దపీట చింతలపూడి: నేటి ఉరుకుల పరుగుల జీవితంలో ‘ఫాస్ట్ ఫుడ్’ కల్చర్ పెరిగిపోయి ప్రజలు అనా రోగ్యం బారిన పడుతుంటే, ఓ యువకుడు మాత్రం ప్రజలకు ఆరోగ్యాన్ని పంచుతూ తన జీవనోపాధిని వెతుక్కుంటున్నాడు. చిరుధాన్యాల (మిల్లెట్స్) విలువను చాటిచెబుతున్నాడు చింతలపూడి పట్టణానికి చెందిన దేవగురు సత్యనారాయణ. ఆరోగ్యం.. ఆదాయం.. ఒకే బాటలో.. ఆర్గానిక్ పద్ధతిలో పండించిన కొరల్రు, అరికెలు, సామలు, ఊదలు, రాగి వంటి మిల్లెట్లతో తయారు చేసిన జావను విక్రయిస్తూ ఒకపక్క కుటుంబాన్ని పోషించుకుంటూనే, మరోపక్క ప్రజలకు పోషకాహారాన్ని అందిస్తున్నాడు. గత మూడు సంవత్సరాలుగా తన ద్విచక్ర వాహనాన్ని ఒక ‘మొబైల్ క్యాంటీన్’లా మార్చుకుని ఊరూరా తిరుగుతూ వీటిని విక్రయిస్తున్నాడు. కేవలం జావ అమ్మి వెళ్లిపోవడం కాకుండా, దాని వల్ల కలిగే ప్రయోజనాలను కూడా ఆయన వివరిస్తున్నాడు. మధుమేహం, రక్తపోటు నియంత్రణలో మిల్లెట్లు ఎలా తోడ్పడతాయో వినియోగదారులకు వివరిస్తున్నాడు. ప్రస్తుతం రోజుకు సగటున 40 నుంచి 50 గ్లాసుల జావ విక్రయిస్తూ తనదైన శైలిలో రాణిస్తున్నాడు. ఈ రోజుల్లో ప్రజలకు రుచిపై ఉన్న శ్రద్ధ ఆరోగ్యంపై లేదు. చిరుధాన్యాల గొప్పతనం గురించి ఇంకా సరైన అవగాహన రావాలి. ప్రభుత్వం నుంచి తగిన ప్రోత్సాహం అందితే, మరిన్ని ప్రాంతాల్లో ఈ ఆరోగ్యకరమైన జావను అందుబాటులోకి తీసుకువచ్చి ప్రజల ఆరోగ్యాన్ని కాపాడతానని అంటున్నాడు. మిల్లెట్ జావ తాగడం వల్ల మధుమేహం, రక్తపోటు నియంత్రణలో ఉంటాయి. కొవ్వు కరిగి బరువు కూడా తగ్గుతారు. చిరు ధాన్యాల జావ గురించి ప్రజలకు అవగాహన కలిగించాలి. ప్రభుత్వం సహాయం అందిస్తే వ్యాపారాన్ని మరింత విస్తరించే ఆలోచన ఉంది. – దేవగురు సత్యనారాయణ -
ఆక్వా రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలి
కై కలూరు: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు చేపలు, రొయ్యల రైతులకు గిట్టుబాటు ధరలు కల్పించాలని ఆంధ్రప్రదేశ్ ఆక్వా రైతుల సంఘం రాష్ట్ర కన్వీనర్ బి.బలరాం డిమాండ్ చేశారు. కై కలూరు ఎన్జీవోస్ కాలనీలో నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ ఇన్చార్జి, ఆక్వా రైతు బొడ్డు నోబుల్ నివాసం వద్ద ఆక్వారంగ ప్రస్తుత పరిస్థితులపై సమావేశం బుధవారం నిర్వహించారు. బలరాం మాట్లాడుతూ ట్రంప్ సుంకాలు, యుద్ధంతో ఆక్వా రంగం తీవ్ర సంక్షోభంలో కూరుకుపోయిందన్నారు. ప్రస్తుతం ఆక్వా ఉత్పత్తులకు స్థిరమైన, నిలకడైన ధరలు లేకపోవడంతో ఉత్పత్తి ఖర్చులు పెరిగి ఆక్వా రైతులు నష్టపోతున్నారని చెప్పారు. ఆక్వా ఫీడ్కు సంబంధించిన సోయాబీన్ ముడి సరుకుల ధరలు తగ్గినా ఫీడ్ ధరలు తగ్గించకపోవడం అన్యాయమన్నారు. ఫీడ్ ధరలు తగ్గించేలా ప్రభుత్వాలు చర్యలు చేపట్టాలని కోరారు. విద్యుత్ సబ్సిడీ రైతులందరికీ వర్తింపజేయాలని, పెంచిన విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ల ధరలు తగ్గించాలన్నారు. ఆక్వారంగాన్ని వ్యవసాయ రంగంగా గుర్తించాలని డిమాండ్ చేశారు. ఆక్వా రైతుల సమస్యలపై జూన్ 3, 4, 5 తేదీల్లో ఏలూరులో జరుగుతున్న ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర మహాసభల్లో చర్చిస్తామని చెప్పారు. సమావేశంలో ఆంధ్రప్రదేశ్ వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ పాల్గొన్నారు. -
ఆరోగ్యశ్రీ సేవలు బంద్
నేడునాడుఏలూరు టౌన్: ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని సుమారు 20 ఆసుపత్రుల్లో ఇప్పటికే ఆరోగ్యశ్రీ సేవలు నిలిచిపోయాయి. ఏలూరు జిల్లాలో 5, పశ్చిమగోదావరి జిల్లాలో 15 ఆసుపత్రులు సేవలు బంద్ చేశాయని రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ముఖ్యంగా తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు ప్రాంతాల్లోని ఆసుపత్రుల్లో ఈ పరిస్థితి దారుణంగా ఉంది. అత్యవసర చికిత్సలు అందక రోగుల ప్రాణాలకు ముప్పు పొంచి ఉన్నా, ప్రభుత్వం ఉదాసీనంగా వ్యవహరిస్తోందని బాధితులు గగ్గోలు పెడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఆరోగ్యశ్రీ సేవలు అందించే హాస్పిటల్స్ 73 వరకు ఉన్నాయి. ఏలూరు జిల్లాలో ప్రైవేట్, కార్పొరేట్ హాస్పిటల్స్ 33, ప్రైవేట్ దంత వైద్యశాలలు 10, పశ్చిమలో 30 ఎంప్యానల్ హాస్పిటల్స్ రోగులకు వైద్యచికిత్సలు అందిస్తున్నాయి. ఇప్పటికే 20 ఆసుపత్రులు సేవలు నిలిపివేయగా, మిగిలిన వాటిలో కూడా సేవలు ఆపేస్తే తమ పరిస్థితి ఏంటని, తమ ప్రాణాలకు భరోసా లేదని రోగులు ఆందోళనకు గురవుతున్నారు. ముఖ్యంగా క్యాన్సర్ రోగులకు కీలకమైన కీమోథెరపీ సేవలు అందక, అప్పులు చేసి కార్పొరేట్ ఆసుపత్రులను ఆశ్రయించాల్సి వస్తోంది. భారీగా పేరుకుపోయిన బకాయిలు ఏలూరు జిల్లాలో పేదల ఆరోగ్య భరోసా నీటి మూటగా మారుతోంది. ఆరోగ్యశ్రీ లక్ష్యానికి తూట్లు పొడుస్తూ కూటమి ప్రభుత్వం ప్రజల ప్రాణాలతో చెలగాటం ఆడుతోందనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఏలూరు జిల్లాలో సుమారు రూ.100 కోట్లు, పశ్చిమగోదావరిలో మరో రూ.100 కోట్లు.. మొత్తంగా రూ.200 కోట్లకు పైగా బకాయిలు పేరుకుపోయాయి. 22 నెలలుగా టీడీపీ ప్రభుత్వం బకాయిలు చెల్లించకుండా నిర్లక్ష్యం చేస్తోంది. ఏలూరు జిల్లాలో 2025 ఏప్రిల్ 1 నుంచి 2026 మార్చి 31 మధ్య సుమారు రూ.132 కోట్ల విలువైన సేవలు అందించగా, వీటిలో యాజమాన్యాలు సేవలు నిలిపివేస్తామని హెచ్చరించటం, పాక్షికంగా నిలిపివేయడంతో కొంత మేర నిధులు చెల్లించటం చేశారు. సీఎంఆర్ఎఫ్లోనూ సిఫార్సులదే హవా ఆరోగ్యశ్రీ పథకానికి తూట్లు పొడుస్తున్న టీడీపీ ప్రభుత్వంలో ఇబ్బంది పడుతున్న పేదలకు ముఖ్యమంత్రి సహాయ నిధి సీఎంఆర్ఎఫ్ కూడా అందని ద్రాక్షలా మారింది. ఆరోగ్యశ్రీలో వైద్యం అందకపోవటం, శస్త్రచికిత్సలకు భారీగా బిల్లులు చెల్లించాల్సి రావటం రోగులకు భారంగా మారింది. టీడీపీ నేతల సిఫార్సు ఉన్నవారికే సీఎంఆర్ఎఫ్ నిధులు మంజూరవుతున్నాయనే ఆరోపణలు వస్తున్నాయి. ప్రజాప్రతినిధుల కార్యాలయాల్లో పలుకుబడి ఉన్నవారికి మాత్రమే ఈ నిధులు దక్కుతున్నాయని, ఇందులో కూడా కొందరు నేతలు వాటాలు తీసుకుంటున్నారని బాధితుల బంధువులు విమర్శిస్తున్నారు. సిఫార్సులు లేని సామాన్య రోగులు మాత్రం వైద్యం కోసం అప్పుల ఊబిలో కూరుకుపోతున్నారు.ప్రస్తుత టీడీపీ ప్రభుత్వ హయాంలో ఆరోగ్యశ్రీ పథకం క్రమంగా నిర్వీర్యమవుతోంది. పేదలకు అనారోగ్యం వస్తే అప్పులు చేసి మరీ ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లాల్సిన దుస్థితి ఏర్పడింది. శస్త్రచికిత్సలు అవసరమైన వారు దేవుడిపై భారం వేయాల్సిన దైన్యస్థితిలో ఉన్నారు. బకాయిల కారణంతో ఏప్రిల్ 1 నుంచి ఆరోగ్యశ్రీ సేవలు బంద్ చేస్తున్నట్లు ఏపీ స్పెషాలిటీ హాస్పిటల్స్ అసోసియేషన్ ప్రకటించింది. గత ప్రభుత్వ హయాంలో వైఎస్సార్ ఆరోగ్యశ్రీ పథకాన్ని మరింత విస్తృతం చేస్తూ ఏకంగా 3,257 వ్యాధులకు చికిత్సలు అందేలా బలోపేతం చేశారు. ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షల వరకు పెంచి పేద, మధ్యతరగతి ప్రజలకు కొండంత అండగా నిలిచారు. పేదవారికి పెద్ద రోగమొచ్చినా అప్పులు చేయాల్సిన అవసరం లేకుండా, కార్పొరేట్ ఆసుపత్రుల్లో సైతం ఉచితంగా నాణ్యమైన వైద్యం అందేది. భారీగా పేరుకుపోయిన బకాయిలు ఉమ్మడి పశ్చిమలో రూ.200 కోట్లకు పైగా బకాయిలు ఆందోళనలో రోగులు, బంధువులు సీఎంఆర్ఎఫ్లో టీడీపీ నేతల సిఫార్సులతోనే పని -
చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరి అరెస్ట్
ఏలూరు టౌన్: చైన్ స్నాచింగ్ కేసుల్లో ఇద్దరు నేరస్తులు పోలీసులకు పట్టుబడ్డారు. వారి నుంచి భారీగా బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఈమేరకు ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ కేసు వివరాలను వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా పోడూరు మండలం పెనుమంట్ర గ్రామానికి చెందిన బండి గోపాలకృష్ణ, ప్రస్తుతం పెనుమంట్రలో నివాసం ఉంటున్న యలమంచిలి మండలం మేడపాడుకు చెందిన కుక్కల హరిప్రకాష్ జల్సాలు, విలాసాలకు అలవాటుపడ్డారు. సులువుగా డబ్బులు సంపాదించే క్రమంలో వారిద్దరూ దొంగతనాలు చేయటం ప్రారంభించారు. అనంతరం షాపుల వద్ద, ఒంటరిగా వెళ్లే మహిళల మెడల్లోని బంగారు ఆభరణాలు లాక్కుని పారిపోతున్నారు. దీంతో పలు ప్రాంతాల్లో వీరిద్దరిపై చోరీ కేసులు నమోదు అయ్యాయి. ఇటీవల చోరీ చేసిన బంగారు వస్తువులు విక్రయించేందుకు ఇద్దరూ రెండు మోటారు సైకిళ్లపై హైదరాబాద్ వెళుతుండగా పోలీసులకు పట్టుబడ్డారు. ఉంగుటూరు మండలం సీతారామపురం గ్రామ శివారు, గణపవరం నుంచి నారాయణపురం వైపు వెళ్లే రోడ్డులో నిడమర్రు సీఐ ఎన్.రజనీకుమార్ ఆధ్వర్యంలో చేట్రోలు ఎస్సై ఎం.సూర్యభగవాన్ తన సిబ్బందితో వాహన తనిఖీలు చేస్తుండగా ఆ ఇద్దరిని అదుపులోకి తీసుకున్నారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో విచారణ చేయగా చోరీలకు పాల్పడుతున్నట్లు గుర్తించి, వారి నుంచి సుమారు రూ.12.80లక్షల విలువైన 128 గ్రాముల బంగారు ఆభరణాలు, రెండు మోటారు సైకిళ్లను చేబ్రోలు పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. నరసాపురం టౌన్, యలమంచిలి, రాజోలు, చేబ్రోలు, పాలకొల్లు రూరల్ తదితర ప్రాంతాల్లో చోరీ చేసిన బంగారు వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. మరో కేసులో నేరస్తుడి అరెస్ట్ నిడమర్రు మండలం బావాయిపాలెం గ్రామంలో ముత్యాల వీరవెంకట సత్యనారాయణ అనే వ్యక్తి ఇంటిలో మార్చి 19న చోరీ జరిగింది. ఈ కేసును నిడమర్రు సీఐ రజనీకుమార్, ఎస్సై ఎస్ఎన్వీవీ రమేష్ విచారణ చేపట్టారు. సాంకేతిక పరిజ్ఞానం సహాయంతో గణపవరం అల్లూరివారి వీధికి చెందిన కాకర్ల నాగదుర్గారావు నిందితుడిగా నిర్ధారించి అరెస్ట్ చేశారు. అతడి నుంచి 26.2 గ్రాముల బంగారు ఆభరణాలు, 808 గ్రాముల వెండి వస్తువులు స్వాధీనం చేసుకున్నారు. ఈ రెండు కేసుల్లో ప్రతిభ చూపిన పోలీస్ అధికారులు, సిబ్బందిని ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అభినందించారు. -
వైఎస్సార్సీపీ నాయకుడిపై హత్యాయత్నం
ఉండి: వైఎస్సార్ సీపీ ట్రేడ్ యూనియన్ మండల అధ్యక్షుడు, జిల్లా యూత్ మాజీ ప్రధాన కార్యదర్శి శేషాద్రి శివశంకర నాగకుమార్ (శ్రీను)పై హత్యాయత్నం జరిగింది. దీనిపై బాధితుడి భార్య పోలీసులకు ఫిర్యాదు చేయగా వారు కేసు నమోదు చేశారు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఉండి గ్రామానికి చెందిన శేషాద్రి శివశంకర నాగకుమార్ అనే వ్యక్తికి అతడి మేనత్త మనుమడైన దోసా ఫణీంద్రకుమార్కు కొద్దికాలంగా ఆస్తి తగదాలు జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో వారం క్రితం పెద్దల సమక్షంలో పంచాయితీ జరిగింది. పెద్దలు చేప్పిన మాటలకు ఒప్పుకుని వెళ్లిన ఫణీంద్ర మరలా తిరిగిరాలేదు. సోమవారం రాత్రి 10:30 గంటల సమయంలో శేషాద్రి శ్రీను అతడి భార్య ధనలక్ష్మి ఇంట్లో కూర్చుని టీవీ చూస్తున్న సమయంలో ఫణీంద్రకుమార్ అతడి భార్య అనితతో ఇంట్లోకి వచ్చి ఆస్తి పంచమంటే పంచవేంట్రా అంటూ తమతో తెచ్చుకున్న కత్తితో దాడికి పాల్పడ్డాడు. భయభ్రాంతులకు గురైన శ్రీను, అతడి భార్య ధనలక్ష్మి పెద్దగా కేకలు వేయడంతో చుట్టుపక్కల వారు బయటకు వచ్చారు. దీంతో నిందితులు అక్కడి నుంచి పారిపోయాడు. వారిని వెంబడించిన బాధితుడి భార్య ఇంటి బయట మరో ముగ్గురు ఉండటం గమనించింది. శ్రీనును స్థానిక ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. అక్కడి నుంచి భీమవరంలో ఓ ప్రైవేటు ఆస్పత్రికి తరలించగా.. శస్త్రచికిత్స అనంతరం ప్రాణాపాయం నుంచి గట్టెక్కాడు. బాధితుని భార్య ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు ఎస్సై ఎండీ నసీరుల్లా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు చెప్పారు. -
అసెంబ్లీ తీర్మానం రాజకీయ డ్రామా
● కౌన్సిల్లో పెడితే అవినీతి బయటపడుతుందనే భయం ● రెండో విడత పూలింగ్కు కొత్త నాటకం ● వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ ఏలూరు టౌన్: రాజధాని అమరావతి టీడీపీ నేతలకు, చంద్రబాబుకు ఏటీఎంలా మారిపోయిందని, చంద్రబాబుకు నిధులు కావాలంటే అప్పుడు బ్యాంకుల నుంచి అప్పులు తీసుకొస్తూ.. శాశ్వత భవనాలేమీ కట్టకుండానే నీళ్ళు తోడటానికి, పిచ్చి మొక్కలు పీకటానికి వేలకోట్లు నిధులు ఖర్చు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్ విమర్శించారు. అమరావతి రాజధాని అంశంపై చంద్రబాబు తీరుపై ఏలూరులోని పార్టీ కార్యాలయంలో జరిగిన సమావేశంలో ధ్వజమెత్తారు. అమరావతిలో మూడు పంటలు పండే పొలాలను రైతుల నుంచి తీసుకున్నారని, ప్లాట్లు ఇస్తామంటూ నమ్మించి సుమారు 50 వేల ఎకరాల భూములు సేకరించారని.. ఒక్క శాశ్వత భవనమైనా నిర్మించారా అని ప్రశ్నించారు. డైవర్షన్ పాలిటిక్స్లో భాగంగానే అసెంబ్లీలో తీర్మానం పేరిట డ్రామా చేస్తున్నారని, రైతులు రెండో విడత పూలింగ్ చేసేందుకు సహకరించడం లేదనే సాకుతో ఇప్పుడు అసెంబ్లీలో రైతులను మభ్యపెట్టేలా డైవర్షన్ చేయడం నిజం కాదా అని నిలదీశారు. 2028 లోపు అమరావతి నిర్మాణం పూర్తి చేస్తామని చెబుతున్న చంద్రబాబు.. ఎవరైనా మార్చేస్తారంటూ ప్రచారం చేయటం వెనుక ఆంతర్యం ఏమిటో చెప్పాలని జేపీ ప్రశ్నించారు. అసెంబ్లీలో తీర్మానాలు చేశారు సరే.. కౌన్సిల్ను పక్కన పెట్టటం దేనికని.. మీరు చేసిన అవినీతి బట్టబయలైపోతుందని, ప్రజలకు మీ అవినీతి తెలుస్తుందనే భయమే కారణం అన్నారు. ఈ భారమంతా ఎవరు భరిస్తారు? అమరావతి పేరిట భూములు ఇచ్చిన రైతుల పరిస్థితి నేడు దారుణంగా ఉందని, ప్లాట్లు డెవలప్మెంట్ లేదని, రోడ్లు వేయలేదని, కొన్ని ప్లాట్లు చెరువుల్లో ఉన్నాయని, చంద్రబాబును మరోసారి నమ్మేస్థితిలో రైతులు లేరని అన్నారు. మొదటి దశలో 50 వేల ఎకరాల భూసేకరణ చేశారని, ఒక్కో ఎకరా అభివృద్ధికి రూ.2 కోట్లు చొప్పున రూ.లక్ష కోట్లు అవసరం అన్నారని, మరోసారి సెల్ఫ్ ఫైనాన్స్ రాజధాని అన్నారని.. ఇప్పుడు రెండవ దశలో మరో 20 వేల ఎకరాల భూసేకరణ, అభివృద్ధికి మరో రూ.50 వేల కోట్లు.. ఈ భారమంతా రాష్ట్ర ప్రజలు భరించే స్థితిలో ఉన్నారా? అని ప్రశ్నించారు. రూ.47 వేల కోట్ల అప్పులు దేనికి? అమరావతిలో కొత్త భవనాలు కట్టకుండా, డిజైన్ల పేరుతోనే సుమారు రూ.400 కోట్లు ఖర్చు చేస్తున్నారని, పాత టెండర్లను రద్దు చేసి కొత్త టెండర్లు పిలవడం అనుమానాలకు తావిస్తోందని విమర్శించారు. నిజంగా సెల్ఫ్ ఫైనాన్స్ అయితే రూ.47 వేల కోట్లు అప్పులు ఎందుకు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు. భూములు విక్రయించి డబ్బులు తెస్తామని చెప్పారని, ఇప్పటివరకూ ఎంత సంపాదించారో ప్రజలకు చెప్పాలన్నారు. జగన్ అమరావతికి వ్యతిరేకం కాదు వైఎస్ జగన్మోహన్రెడ్డి అమరావతికి వ్యతిరేకం కాదని ఎప్పుడో స్పష్టం చేశారని, మీ అవినీతికి, మోసానికి వ్యతిరేకమని స్పష్టం చేశారు. మాజీ సీఎం వైఎస్ జగన్ అమరావతిలోనే ఇల్లు కట్టుకున్నారనే విషయాన్ని మర్చిపోవద్దన్నారు. రాష్ట్రంలోని అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలి, రాష్ట్రంలో ప్రజలంతా అభివృద్ధి ఫలాలు అనుభవించాలనే ప్రణాళికతో పాలన వికేంద్రీకరణకు మొగ్గుచూపారని స్పష్టం చేశారు. సమావేశంలో వైఎస్సార్సీపీ కై కలూరు పరిశీలకుడు నూకపెయ్యి సుధీర్బాబు, చింతలపూడి పరిశీలకుడు దాసరి రమేష్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, అధికార ప్రతినిధి జాన్గురునాథ్, నగర బీసీ సెల్ అధ్యక్షులు కిలాడి దుర్గారావు, ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, విద్యార్థి విభాగం అధ్యక్షులు రాజేష్ తదితరులు పాల్గొన్నారు. -
హుండీ లెక్కింపు వేళ అలర్ట్
ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయ హుండీల నగదు, కానుకల లెక్కింపు వేళ అధికారులు అలర్ట్ అయ్యారు. ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీ చేశారు. 8లో uఏలూరు కలెక్టరేట్లో ప్రజా పరిష్కార వేదికకు జిల్లా నలుమూలల నుంచి ప్రజలు వచ్చి మొరపెట్టుకుంటున్నా సమస్య పరిష్కారం మాత్రం అంగుళం కూడా కదలడం లేదు. కొత్త పింఛన్ కోసం రెండేళ్లుగా కలెక్టరేట్ చుట్టూ తిరుగుతున్నా స్పందించే వారు లేరు. భూ తగాదాలు, ఆస్తి తగాదాలు, వేధింపులు ఇలా చెప్పుకుంటూ ఎన్నో సమస్యలతో వ్యయప్రయాసలకు ఓర్చి వచ్చినా పరిష్కారం మాత్రం కనుచూపు మేరలో లేదని ఫిర్యాదు చేస్తున్నారు. గంటల తరబడి క్యూలైన్లో నిలబడి ఫిర్యాదు చేయడం తప్ప సమస్య సమస్యగానే మిగిలిపోతోందని వాపోతున్నారు. -
హుండీల లెక్కింపు.. కట్టుదిట్టంగా
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయ హుండీల నగదు, కానుకల లెక్కింపు వేళ.. అధికారులు అలర్ట్ అయ్యారు. సోమవారం జరిగిన లెక్కింపులో అధికారులు పలు నిఘా ఏర్పాట్లు చేయడంతో పాటు, భద్రతా సిబ్బంది ప్రతి ఒక్కరిని మెటల్ డిటెక్టర్లతో తనిఖీలు చేశారు. వివరాల్లోకి వెళితే. ఈనెల 11న ప్రమోదా కల్యాణ మండపంలో జరిగిన హుండీల నగదు లెక్కింపులో పశ్చిమగోదావరి జిల్లా, ఇరగవరం మండలం, సూరంపూడి గ్రామానికి చెందిన బొల్లా సురేష్ అనే వ్యక్తి సేవకుడిగా పాల్గొని 59 గ్రాముల 700 మిల్లీ గ్రాముల బరువైన బంగారు చైన్, రెండు మంగళ సూత్రాలు, 4 డాలర్ నోట్లను చోరీ చేసిన విషయం తెలిసిందే. ఈ ఘటనపై అదే రోజు దేవస్థానం ఈఓ వై.భద్రాజీ స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై టి.సుధీర్ కేసు నమోదు చేసి దర్యాప్తు జరిపారు. అందులో భాగంగా నిందితుడి బ్యాంక్ అకౌంట్ లోని రూ. 5.10 లక్షలను ఫ్రీజ్ చేశారు. విచారణ అనంతరం నిందితుడిని భీమడోలు కోర్టులో హాజరుపరచగా న్యాయమూర్తి అతడికి బెయిల్ మంజూరు చేశారు. అయితే ఈ చోరీ ఘటన సంచలనంగా మారడంతో దేవస్థానం, పోలీస్ అధికారులు అప్రమత్తమయ్యారు. అందులో భాగంగా ఈసారి కౌంటింగ్ హాలు వద్ద ప్రత్యేకంగా పోలీస్ సిబ్బందిని నియమించారు. లెక్కింపు పూర్తయ్యే వరకు ఎస్సై టి.సుధీర్ తనిఖీలను పరిశీలించారు. రిజిస్టర్డ్ సేవా దళాలను మాత్రమే.. రిజిస్టర్డ్ సేవాదళాలను మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. సేవలో పాల్గొన్న ప్రతి సభ్యుడి వివరాలను రిజిస్టర్లో నమోదు చేసి, వారి నుంచి సంతకాలు సేకరించారు. ఈ లెక్కింపులో పలు సేవా దళాలకు చెందిన 130 మంది పాల్గొనగా, దేవస్థానం అధికారులు, రెగ్యులర్ ఉద్యోగులు, అవుట్ సోర్సింగ్ సిబ్బంది, కల్యాణకట్టలోని నాయీ బ్రాహ్మణులు మొత్తం 150 మంది వరకు పాల్గొన్నారు. ఇక ముందు జరిగే లెక్కింపులో పాల్గొనే సేవాదళ సభ్యులు తప్పనిసరిగా ఐడెంటిటీ కార్డులు ధరించాల్సి ఉంటుంది. ప్రత్యేక నిఘా.. కౌంటింగ్ హాల్లోకి వెళ్లే వారిని, బయటకు వచ్చే వారిని డోర్ఫ్రేమ్ మెటల్ డిటెక్టర్ (డీఎఫ్ఎండీ), హ్యాండ్ హెల్డ్ మెటల్ డిటెక్టర్ (హెచ్హెచ్ఎండీ) ద్వారా భద్రతా సిబ్బంది తనిఖీలు చేశారు. లోదుస్తులు (అండర్వేర్)ను తొలగించి, పంచి, కండువా ధరించిన వారిని మాత్రమే లెక్కింపునకు అనుమతించారు. అలాగే లెక్కింపు అందరికీ కనిపించేలా కౌంటింగ్ హాల్లో ఎల్ఈడీ మానిటర్ ఏర్పాటు చేసి, ఈఓ పర్యవేక్షించారు. ముడుపులు, విదేశీ, పెద్ద కరెన్సీ నోట్ల లెక్కింపును సూపరింటెండెంట్ల పర్యవేక్షణలో నిర్వహించారు. తనిఖీలకు మరింత అత్యాధునిక స్కానర్లను వినియోగించాల్సిన అవసరం ఉందని స్థానికులు, పలువురు భక్తులు అంటున్నారు. కౌంటింగ్ హాలు వద్ద భద్రతను పరిశీలిస్తున్న ఎస్సై సుధీర్ముడుపుల వద్ద పర్యవేక్షిస్తున్న సూపరింటెండెంట్ పద్మావతి బొల్లా సురేష్ చోరీ కేసులో షాకింగ్ అంశం బయటపడింది. శ్రీవారి దేవస్థానంలో జరిగే హుండీల నగదు, కానుకల లెక్కింపులో చోరీ చేయడం సులభమని అతడు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. ఇతర దేవాలయాల్లో లోదుస్తులతో లెక్కింపునకు అనుమతించరని, ఇక్కడ ఆ నిబంధన లేకపోవడమే అందుకు కారణమని చెప్పినట్టు సమాచారం. అందుకే లోదుస్తులు లేకుండా లెక్కింపులో పాల్గొనే పద్ధతిని ఇక్కడా అమలు చేస్తున్నారు. శ్రీవారి హుండీల నగదు, కానుకల లెక్కింపులో.. పటిష్ట బందోబస్తు నిర్వహణ కౌంటింగ్ హాలు వద్ద మెటల్ డిటెక్టర్ల ఏర్పాటు ప్రతి ఒక్కరినీ క్షుణ్ణంగా తనిఖీలు చేసిన భద్రతా సిబ్బంది అత్యాధునిక స్కానర్లు ఏర్పాటు చేయాలంటున్న భక్తులు -
●డ్రెయినేజీ ఆక్రమణలు తొలగించండి
ఏలూరులోని ప్రతి డ్రెయినేజీ ఆక్రమణకు గురైందని, ప్రతి పుట్పాత్ది ఇదే పరిస్థితి అని.. తక్షణం ఆక్రమణలను తొలగించాలని సామాజిక కార్యకర్త ఎన్.స్వర్ణలత డిమాండ్ చేశారు. ఏలూరు నగరంలోని సమస్యలపై అధికారులకు ఎన్నిసార్లు ఫిర్యాదులు చేసినా ఎండార్స్మెంట్లు ఇస్తున్నారే తప్ప చర్యలు మాత్రం ఉండటం లేదంటూ ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. అధికారుల తీరుపై నిరసన వ్యక్తం చేస్తూ సోమవారం ఆమె వినూత్నంగా నిరసన తెలిపారు. ముందుగా కలెక్టరేట్ వద్ద నిరసన వ్యక్తం చేసి.. అక్కడ నుంచి ఏలూరు కార్పొరేషన్ కార్యాలయానికి వెళ్లి అధికారులను నిలదీశారు. – ఏలూరు (టూటౌన్) -
క్షీణించిన వర్జీనియా ధర
● మరింత దిగజారిన కనిష్ట ధర ● సరాసరి కూడా పడిపోతుందని రైతుల ఆందోళన జంగారెడ్డిగూడెం: వర్జీనియా ధర మరింత క్షీణించింది. గరిష్ట ధర స్థిరంగా ఉన్నప్పటికీ కనిష్ట ధర గత ట్రేడింగ్ సెషన్తో పోల్చితే మరో ఐదు రూపాయలు దిగజారింది. వర్జీనియా వేలం ప్రక్రియ ప్రారంభమైన నాటి నుంచి రైతులు ధరపై ఆందోళన వ్యక్తం చేస్తూనే ఉన్నారు. కేజీ ఒక్కింటికి రూ.350 పైబడి ధర వస్తేనే సగటు ధర మెరుగ్గా వచ్చి రైతులు నష్టాల రాకుండా గట్టెక్కగలరని పేర్కొంటున్నారు. సీజన్ ముగిసే నాటికి సరాసరి ధర రూ.330 నుంచి రూ. 350 మధ్య వస్తేనే రైతుకు గిట్టుబాటు అవుతుందని వర్జీనియా రైతు సంఘం నాయకులు పేర్కొంటున్నారు. అయితే ప్రారంభం రోజునే అంచనాలను తారుమారుచేస్తూ గత ఏడాది ప్రారంభ ధర కన్నా తక్కువగా రూ. 265 వద్ద వేలం ప్రారంభమైంది. తొలి రోజే పొగాకు బోర్డు చైర్మన్ యశ్వంత్కుమార్కు రైతులు తమ అసంతృప్తిని, ఆందోళనను తెలియజేశారు. అయినప్పటికీ పరిస్థితిలో మార్పు రాకపోగా ధర పతనమవుతోంది. గరిష్ట ధర స్థిరంగా ఉండి, కనిష్ట ధర పడిపోతూ ఉంటే, సరాసరి కూడా అదే రీతిలో తగ్గిపోతుందని, ఇదిలా కొనసాగితే చివరకు సగటున కేజీ ఒక్కింటికి రూ.100 నుంచి రూ. 120 వరకు నష్టం వచ్చే అవకాశం ఉంటుందని రైతులు వాపోతున్నారు. రోజు విడిచి రోజు వేలం ఎన్ఎల్ఎస్ పరిధిలోని ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఐదు వేలం కేంద్రాల్లో జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాలు మినహాయించి, దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురం వేలం కేంద్రాల్లో సోమవారం వేలం జరిగింది. వేలం నిర్వహణకు బయ్యర్లు, సిబ్బంది కొరత రావడం, కర్ణాటకలో వేలం ప్రక్రియ జరుగుతుండటంతో రోజు విడిచి రోజు వేలం నిర్వహించనున్నారు. వచ్చే నెల రోజుల పాటు ఇలానే కొనసాగుతుందని అధికారులు తెలుపుతున్నారు. దేవరపల్లి, కొయ్యలగూడెం, గోపాలపురంలలో ఒక రోజు, జంగారెడ్డిగూడెం–1, –2 వేలం కేంద్రాల్లో ఒక రోజు నిర్వహించేలా నిర్ణయించినట్లు చెప్పారు. దేవరపల్లి వేలం కేంద్రానికి 6 బేళ్లు తీసుకురాగా, వాటిలో 3 తిరస్కరణకు గురై 3 బేళ్లు అమ్ముడయ్యాయి. ఇక్కడ ధర స్థిరంగా రూ. 265 పలికింది. కొయ్యలగూడెం వేలం కేంద్రానికి 113 బేళ్లు రాగా, వాటిలో 54 బేళ్లు తిరస్కరించారు. 59 బేళ్లు కొనుగోలు జరగ్గా, ఇక్కడ గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 నమోదైంది. అలాగే గోపాలపురం వేలం కేంద్రాలో 97కు గాను 79 బేళ్లు అమ్మకాలు జరగ్గా, ఇక్కడ కూడా గరిష్టం రూ. 265, కనిష్టం రూ.250 నమోదైంది. మొత్తంగా గరిష్ట ధర రూ.265, కనిష్ట ధర రూ.250 రాగా, సరాసరి ధర రూ. 257.85 లభించింది.వర్జీనియా పొగాకు బేళ్లు -
శ్రీవారి హుండీ ఆదాయం రూ.2.02 కోట్లు
ద్వారకాతిరుమల : ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల శ్రీవారి ఆలయ హుండీల నగదు లెక్కింపు సోమవారం స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో, అన్నవరం దేవస్థానం అసిస్టెంట్ కమిషనర్, ఏఈఓ ఎం.మంజులాదేవి పర్యవేక్షణలో నిర్వహించారు. ఈ లెక్కింపులో స్వామివారికి విశేష ఆదాయం సమకూరింది. గడచిన 20 రోజులకు గాను నగదు రూపేణా స్వామివారికి రూ. 2,02,77,293 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ వై.భద్రాజీ తెలిపారు. అలాగే కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 195 గ్రాముల బంగారం, 2.124 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రద్దయిన పాత రూ.1,000, రూ.500 నోట్లు ద్వారా రూ. 5 వేలు లభించినట్టు చెప్పారు. ఇదిలా ఉంటే హుండీల ఆదాయాన్ని పరిశీలిస్తే సగటున రోజుకి శ్రీవారికి రూ.10,13,865 ఆదాయం వచ్చినట్టు ఈఓ పేర్కొన్నారు. ఈ లెక్కింపులో శ్రీవారి దేవస్థానం అధికారులు, సిబ్బంది, సేవాదళం సభ్యులు పాల్గొన్నారు. చింతలపూడి: తిరుపతిలో సోమవారం ఘనంగా జరిగిన శ్రీ వెంకటేశ్వర వెటర్నరీ యూనివర్సిటీ 13వ స్నాతకోత్సవంలో చింతలపూడికి చెందిన విద్యార్థిని కారుమంచి రిషిత అద్భుత ప్రతిభ కనబరిచింది. తన విద్యా ప్రతిభతో ఏకంగా 9 బంగారు పతకాలు, ఒక వెండి పతకాన్ని సాధించి అందరి దృష్టిని ఆకర్షించింది. రాష్ట్ర గవర్నర్ జస్టిస్ ఎస్ అబ్దుల్ నజీర్ చేతుల మీదుగా రిషిత ఈ పతకాలను అందుకుంది. చింతలపూడికి చెందిన ఉపాధ్యాయులు కారుమంచి ప్రకాష్ మాస్టారు కుమార్తె అయిన రిషిత, గన్నవరం వెటర్నరీ కళాశాలలో చదువుతోంది. స్నాతకోత్సవం అనంతరం రిషితను కళాశాల అధ్యాపకులు ప్రత్యేకంగా అభినందించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో జరుగుతున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో భాగంగా సోమవారం నిర్వహించిన సాంఘిక శాస్త్ర పరీక్షకు 22751 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 23249 మంది విద్యార్థులకు గాను 498 మంది గైర్హాజరయ్యారు. విద్యార్థుల హాజరు 97.86 శాతంగా నమోదైంది. ఈ పరీక్షలో ఎటువంటి మాల్ ప్రాక్టీస్ కేసులు నమోదు కాలేదని, ప్రశాంతంగా జరిగాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం. వెంకటలక్ష్మమ్మ తెలిపారు. ముగిసిన దూర విద్య 10 పరీక్షలు ఆంధ్రప్రదేశ్ సార్వత్రిక విద్యాపీఠం ఆధ్వర్యంలో దూరవిద్యా విధానంలో నిర్వహిస్తున్న పదో తరగతి పబ్లిక్ పరీక్షల్లో సోమవారం నిర్వహించిన గణితం పరీక్షకు 575 మంది విద్యార్థులు హాజరయ్యారు. మొత్తం 690 మందికి గాను 115 మంది గైర్హాజరయ్యారు. అలాగే భారతీయ సంస్కృతి, వారతస్వం పరీక్షకు ముగ్గురు విద్యార్థులకుగాను ఇద్దరు హాజరు కాగా ఒకరు గైర్హాజరయ్యారు. ఈ పరీక్షలు సోమవారం నాటితో ముగిశాయని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ తెలిపారు. -
చిగురుమామిడిలో అగ్నిప్రమాదం
● నాలుగు పూరిళ్లు దగ్ధం ● రూ.50 లక్షల ఆస్తినష్టం వేలేరుపాడు: వేలేరుపాడు మండల పరిధిలోని చిగురుమామిడి గ్రామంలో సోమవారం మధ్యాహ్నం జరిగిన అగ్ని ప్రమాదంలో నాలుగు పూరిళ్లు పూర్తిగా దగ్ధమయ్యాయి. సుమారు రూ.50 లక్షల ఆస్తినష్టం సంభవించింది. వివరాలు ఇలా ఉన్నాయి. గ్రామానికి చెందిన చండ్రుగొండ సత్తిబాబు, చిన్న నర్శింహులు, ఎక్కిళ్ళ శ్రీను, సింగ్బాబు మిర్చి రైతులు. సోమవారం మిర్చి కోతలు ఉండటంతో అంతా పొలాలకు వెళ్లారు. మధ్యాహ్న సమయంలో ముందుగా చిన్న నర్శింహులు ఇంట్లో విద్యుత్ షార్ట్సర్క్యూట్ కారణంగా మంటలు చెలరేగాయి. ఆ తర్వాత పక్కనున్న మూడు ఇండ్లకు మంటలు వ్యాపించాయి. అక్కడ నుంచి ఇతర ఇండ్లకు మంటలు వ్యాపించకుండా గ్రామస్తులు మంటలను అదుపుచేశారు. బాధితుల ఇళ్లల్లో గ్యాస్ సీలిండర్లు పేలడం, 33 కిలోమీటర్ల దూరంలోని కుక్కునూరు నుంచి ఫైర్ ఇంజన్ వచ్చేసరికే గృహోపకరణాలు, నగదు, బంగారు ఆభరణాలు దగ్ధమయ్యాయి. ప్రమాదంలో చండ్రుగొండ సత్యంకు చెందిన విద్యుత్ పిండి మిల్లు, డీజిల్ ఇంజన్, చిన్న నర్శింహులుకు చెందిన ఓ ద్విచక్రవాహనం, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన కుట్టుమిషన్ కాలిపోయింది. చండ్రుగొండ సత్తిబాబుకు చెందిన రూ.2.20 లక్షలు, 10 కాసుల బంగారం, 5 కాసుల వెండి ఆభరణాలు, సింగ్బాబుకు చెందిన రూ.లక్ష నగదు, 8 కాసుల బంగారం, నాలుగు జతల వెండి పట్టీలు, ఎక్కిళ్ళ శ్రీనుకు చెందిన రూ.2 లక్షల నగదు, ఐదు కాసుల బంగారం, నాలుగు కాసుల వెండి ఆభరణాలు, చిన్న నర్శింహులుకు చెందిన 5 కాసుల బంగారం, లక్షా యాభైవేల నగదు, 6 కాసుల వెండి కాలిబూడిదయ్యాయి. బాధితులకు తక్షణ ప్రభుత్వ సాయం అందలేదు. బాధితులను వైఎస్సార్ సీపీ నేతలు పరామర్శించారు. కట్కూరు సర్పంచ్ లక్ష్మణ్, వైఎస్సార్ సీపీ మండల కన్వీనర్ కేసగాని శ్రీనివాసగౌడ్, కామినేని వెంకటేశ్వరావు, కౌలూరి సత్తిరాజు, చక్రి, అత్తిలి వెంకన్న బాధితులను పరామర్శించారు. -
చెరువును పూడ్చి అమ్మేస్తున్నారు
కామవరపుకోట: స్థానిక వీరభద్ర స్వామి కోటగట్టును పక్కన ఉన్న ఆగర్తి చెరువును పూడ్చి సొమ్ము చేసుకుంటున్నారు కూటమి ప్రభుత్వ నాయకులు. గత కొన్ని రోజుల నుంచి అర్ధరాత్రి సమయంలో విచ్చలవిడిగా టిప్పర్లతో మట్టిని తీసుకొచ్చి చెరువును పూడుస్తున్నారు. సెంటున్నర స్థలాన్ని రూ.30 వేల నుంచి రూ.50 వేల వరకు అమ్ముతూ సొమ్ము చేసుకుంటున్నా అధికారులు మాత్రం ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారని స్థానికులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు స్పందించి సమగ్ర విచారణ జరిపి చెరువును పూడుస్తున్న వారిపై చర్య తీసుకోవాలని, లేకుంటే దీనిపై జిల్లా ఉన్నతాధికారుల దృష్టికి తీసుకెళ్తామని స్థానికులు తెలిపారు. -
పామాయిల్ గెలలు నరుకుతూ..
టి.నరసాపురం: పామాయిల్ గెలలు నరుకుతుండగా విద్యుదాఘాతంతో యువకుడు మృతిచెందాడు. స్థానికులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. రాజుపోతేపల్లి గ్రామానికి చెందిన చెన్ని శివాజీ (23) పామాయిల్ గెలలు నరికే పనికి వెళుతూ కుటుంబానికి ఆసరాగా ఉంటున్నాడు. ఈ నేపథ్యంలో ఎప్పటిలాగానే మరో ఇద్దరు కూలీలతో కలసి మండలంలోని గుడ్లపల్లికి చెందిన రైతు పామాయిల్ తోటలో గెలులు నరకడానికి వెళ్లాడు. పామాయిల్ గెలలు నరుకుతుండగా గెడ కత్తి విద్యుత్ తీగలకు తగిలి విద్యుదాఘాతానికి గురయ్యాడు. దీంతో తోటి కూలీలు 108కి ఫోన్ చేయగా సిబ్బంది వచ్చి అతడిని పరిశీలించి, అప్పటికే మృతి చెందినట్లు తెలిపారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం చింతలపూడి తరలించారు. -
బస్సును ఓవర్టేక్ చేస్తుండగా..
కై కలూరు: ఆటో ఢీకొని ఓ మోటార్సైక్లిస్టు మృతి చెందాడు. వివరాలు ఇలా ఉన్నాయి. ఉండి మండలం, పెద్దపేటకు చెందిన బేతపూడి రవి(30)కు వివాహం కాగా ఇరువురు సంతానం. భార్యతో విభేదాల కారణంగా మరొకరితో సహజీవనం సాగిస్తున్నాడు. ఈ నేపథ్యంలో కొన్నాళ్లుగా హైదరాబాద్లో తండ్రి, బావ వద్ద తాళాల తయారీ పని చేస్తున్నాడు. సొంతూరు వెళ్లడానికి హైదరాబాదు నుంచి మోటార్సైకిల్పై ఆదివారం ఉదయం బయలు దేరాడు. సోమవారం ఉదయం ఆటపాక గ్రామం వచ్చేసరికి జాతీయ రహదారిపై ఓ ప్రైవేటు బస్సును ఓవర్టేక్ చేస్తుండగా ఎదురుగా వస్తున్న ట్రక్ ఆటో వెనుకభాగాన్ని ఢీకొట్టాడు. దీంతో రోడ్డుపై పడి అక్కడికక్కడే మృతి చెందాడు. టౌన్ ఎస్సై డి.వెంకట్కుమార్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
2న వాటర్ స్పోర్ట్స్ జిల్లా జట్ల ఎంపిక
ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఏప్రిల్ 11, 12 తేదీల్లో ఎన్టీఆర్ జిల్లాలో రాష్ట్రస్థాయి వాటర్ స్పోర్ట్స్ పోటీలు జరగనున్నాయని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ పోటీల్లో పాల్గొనే ఏలూరు జిల్లా అండర్–15 సబ్జూనియర్స్, అండర్–18 జూనియర్స్ బాలబాలికల జట్ల ఎంపిక పోటీలు ఏప్రిల్ 2వ తేదీన ఉదయం 9 గంటలకు జంగారెడ్డిగూడెం ఎర్రకాలువ వద్ద చేపట్టనున్నామని వివరించారు. కాయకింగ్, రోయింగ్, డ్రాగన్బోట్ విభాగాల్లో క్రీడాకారులు పాల్గొనాలని పేర్కొన్నారు. ఆసక్తి గల బాలబాలికలు ముందుగా శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలన్నారు. వివరాలకు పీవీవీఎస్ కృష్ణమూర్తి, 83318 73037 నంబరులో సంప్రదించాలన్నారు. ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కలెక్టరేట్లోని గోదావరి సమావేశపు హాలులో సోమవారం నిర్వహించిన ప్రజా సమస్యల పరిష్కార వేదికలో 289 వినతులు అందాయి. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ డా. ఎంజే అభిషేక్ గౌడ మాట్లాడుతూ ఫిర్యాదులను నిర్ధేశించిన సమయంలోగా పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఇన్చార్జి డీఆర్ఓ భాస్కర్, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. పెదపాడు: జాతీయ రహదారిపై గంజాయి రవాణా చేస్తుండగా పోలీసులు పట్టుకున్నారు. గుండుగొలను వైపు నుంచి విజయవాడ వైపు గంజాయి తరలిస్తున్నారనే సమాచారం మేరకు పెదపాడు ఎస్సై, ఎకై ్సజ్ సీఐ ధనరాజ్ కలపర్రు టోల్గేట్ వద్ద వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ క్రమంలో ఆటోలో గంజాయి తరలిస్తుండగా పోలీసులు స్వాధీనం చేసుకుని నిందితులు పిల్లా మోహనరావు, తాతపూడి జితేంద్ర, సబ్బవరపు సాయిబాబులను అరెస్ట్ చేశారు. ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. తనిఖీల్లో క్లూయిజ్ టీమ్, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): అపరిష్కృతంగా ఉన్న ఉపాధ్యాయ సమస్యలను పరిష్కరించాలని బీటీఏ రాష్ట్ర అధ్యక్షుడు భూపతి రామారావు డిమాండ్ చేశారు. బీటీఏ రాష్ట్ర శాఖ ఆదేశాను సారం దశలవారీ పోరాటాల్లో భాగంగా సోమవారం సాయంత్రం 4గంటలకు స్థానిక జిల్లా కలెక్టరేట్ కార్యాలయం వద్ద బీటీఏ ఏలూరు జిల్లాశాఖ ఆధ్వర్యాన ఉద్యోగ, ఉపాధ్యాయుల అపరిష్కృత సమస్యలపై కొద్ది సేపు నిరసన తెలిపారు. అనంతరం కలెక్టర్కి సమస్యలతో కూడిన వినతి పత్రం అందజేశారు. దెందులూరు: అనుమానాస్పద స్థితిలో ఓ వివాహిత మృతి చెందింది. ఎస్సై ఆర్ శివాజీ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సోమవరప్పాడు గ్రామానికి చెందిన తంగేళ్ల అప్పారావుకు, లత (20)కు ఏడు నెలల క్రితం వివాహమైంది. తల్లిదండ్రులతో కలిసి నివసిస్తున్న అప్పారావు దంపతుల మధ్య గత కొన్నిరోజులుగా చిన్నపాటి గొడవలు జరుగుతున్నాయి. ఇంట్లో మనస్పర్థల కారణంగా మనస్తాపానికి గురైన లత, భర్త అప్పారావు పనికి వెళ్లిన తరువాత ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడింది. పోలీసులు ఈ ఘటనపై అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. లత మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వాసుపత్రికి మార్చురీకి తరలించారు. -
మాజీ మంత్రి శ్రీరంగనాథరాజుకు పితృవియోగం
ఉండి: మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ రాష్ట్ర పొలిటికల్ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజుకు పితృవియోగం జరిగింది. ఆదివారం వేకువజామున ఉండి మండలం యండగండిలోని ఆయన నివాసంలో చెరుకువాడ వెంకట నర్సింహరాజు (96) తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య సూర్యకాంతమ్మ, ఇద్దరు కుమారులు శ్రీరంగనాథరాజు, బంగార్రాజు, కుమార్తె విజయ ఉన్నారు. నర్సింహరాజు భౌతికకాయాన్ని శాసనమండలి చైర్మన్ కొయ్యే మోషేన్రాజు, ఎమ్మెల్సీ కవురు శ్రీనివాస్, వైఎస్సార్సీపీ ఉండి నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు, పాలకొల్లు నియోజకవర్గ ఇన్చార్జి గుడాల గోపి, సీనియర్ నాయకులు కనుమూరు అబ్బాయిరాజు, ఆ కివీడు ఏఎంసీ మాజీ చై ర్మన్ వానపల్లి బాబూరా వు, కవిటం ఎంపీపీ వా సిరెడ్డి, పార్టీ నేత యడ్ల తాతాజీ, ఆచంట నియోజకవర్గ ప్రజాప్రతినిధులు తదితరులు సందర్శించి నివాళులర్పించారు. -
ఆందోళనలో మొక్కజొన్న రైతులు
దెందులూరు: రాష్ట్రంలో తక్షణమే మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలు తెరవాలని ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి కె.శ్రీనివాస్ డిమాండ్ చేశారు. ఆదివారం దెందులూరులో ఆయన విలేకరులతో మాట్లాడుతూ రాష్ట్రవ్యాప్తంగా 10 లక్షల ఎకరాలకు పైగా మొక్కజొన్నను పండించిన రైతులు తీవ్రమైన ఆందోళనలో ఉన్నారన్నారు. కష్టనష్టాలు, విపత్తులను తట్టుకుని మొక్కజొన్నను పండిస్తే మద్దతు ధర అందక, ప్రభుత్వం కొనుగోలు కేంద్రాలు ఏర్పాటుచే యక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. ఇదే అదనుగా దళారులు క్వింటాకు రూ.700 నుంచి రూ.800 వరకు ధర తగ్గించి దోచుకుంటున్నారన్నారు. ఏలూరు జి ల్లాతో పాటు విజయనగరం, ఎన్టీఆర్, బాపట్ల, నంద్యాల, అనంతపురం తదితర జిల్లాల్లో రై తులు కొనుగోలు కేంద్రాల కోసం పలు రూ పాల్లో నిరసనలు తెలిపినా ప్రభుత్వం పట్టించుకోవడం లేదని విమర్శించారు. వెంటనే కొనుగోలు కేంద్రాలను తెరవాలని, క్వింటాకు రూ.2,400 ధర చెల్లించాలని కోరారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో పీఎంఏవై, ఎన్టీఆర్ గృహ నిర్మాణ పథకం కింద సోమ వారం 1,160 ఇళ్లకు సామూహిక గృహ ప్రవేశాలు నిర్వహించనున్నట్టు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. నియోజకవర్గాల వారీగా చింతలపూడిలో 123, దెందులూరులో 89, ఏలూరులో 502, గోపాలపురంలో 12, కై కలూరులో 172, నూజివీడులో 119, పోలవరంలో 91, ఉంగుటూరులో 52 ఇళ్ల నిర్మాణాలు పూర్తయ్యాయన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): విద్యాహక్కు చట్టం కింద 2026–27కు సంబంధించి ప్రైవేట్ పాఠశాలల్లో ఉచిత ప్రవేశాలకు జిల్లాలో 1,047 మంది విద్యార్థులు ఎంపికయ్యారని సమగ్ర శిక్ష అడిషనల్ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ పి.శ్యామ్సుందర్ తెలిపారు. విద్యార్థుల తల్లిదండ్రులు సంబంధిత ధ్రువీకరణ పత్రాలు, ఆన్లైన్ దరఖాస్తు ప్రింట్ను ఏప్రిల్ 7లోపు కేటాయించిన పాఠశా లలో సమర్పించి అడ్మిషన్ ప్రక్రియ పూర్తి చేయాలన్నారు. గడువులోపు ప్రక్రియ పూర్తికాకుంటే సీటు రద్దు చేస్తారన్నారు. ఎంఈఓలు తమ పరిధిలో జరిగిన ప్రవేశాల వివరాలను ధ్రువీకరించి, పూర్తి నివేదికను జిల్లా సమగ్ర శిక్ష కార్యాలయానికి సమర్పించాలని ఆదేశించారు. భీమవరం (ప్రకాశంచౌక్) : జిల్లాలో నిషేధిత భూ ముల జాబితా 22ఏలో నమోదైన జిరాయితీ భూ ములను తొలగించేందుకు చర్యలు తీసుకుంటు న్నట్టు జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి తెలిపారు. రైతులు, భూ యజమానుల నుంచి అర్జీలు స్వీకరించేందుకు ప్రత్యేక గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. తొలి దశలో పైలెట్ ప్రాజెక్టుగా తాడేపల్లిగూడెం రెవెన్యూ డివిజన్ పరిధిలోని ఐదు మండలాల్లో మంగళవారం నుంచి ఏప్రిల్ 6 వరకు గ్రామ సభలు నిర్వహిస్తామన్నారు. భీమవరం రెవెన్యూ డివిజన్ పరిధిలో ఏప్రిల్ 7 నుంచి 13 వరకు గ్రామ సభలు జరుగుతాయన్నారు. గ్రామ సభల నిర్వహణపై తహసీల్దార్లు ముందుగా ప్రకటనలు చేయాలని, సందేహాలు ఉంటే జిల్లా కలెక్టర్ కార్యాలయా నికి చెందిన లాండ్స్ పర్యవేక్షణ అధికారి ఎం. భానుకుమార్, డీటీ ఎ.శివకృష్ణను సంప్రదించాలన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): దివంగత ఐపీఎస్ అధి కారి ఉమేష్ చంద్ర విధి నిర్వహణలో నిజాయతీ, నిబద్ధత, అంకిత భావంతో పనిచేసిన వ్యక్తి అని కలెక్టర్ సీహెచ్ నాగరాణి కొనియాడారు. ఆదివారం స్థానిక వీరమ్మ పార్కు సమీపంలోని ఉన్న ఎన్జీవో హోమ్ పట్టణ నిరాశ్రయుల వసతి గృహంలో ఉమేష్ చంద్ర 60వ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఉమేష్ చంద్ర చిత్రపటం వద్ద కలెక్టర్, అధికారులు నివాళులర్పించారు. కుటుంబ సభ్యులతో కలిసి నాగరాణి పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రజా శ్రేయస్సు దిశగా ఉమేష్ చంద్ర చేపట్టిన ప్రయోగాత్మక కార్యక్రమాలు ఆదర్శప్రాయమన్నారు. అనంతరం హోమ్లో వృద్ధులను ఆప్యాయంగా పలకరించి భోజన ఏర్పాట్లు చేశారు. వృద్ధులకు అవసరమైన పలు వస్తువులు అందించారు. -
పైపులు..ఎటు చూసినా లీకులు
● తాడేపల్లిగూడెంలో తాగునీరు వృథా ● లీకేజీలతో నీరు కలుషితం తాడేపల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం పట్టణంలో పలుచోట్ల పైప్లైన్ లీకేజీలతో తాగునీటికి ఇబ్బందులు తలెత్తుతున్నాయి. నీరు వృథా కావడంతో పా టు కుళాయిలు నుంచి మురుగు నీరు, దుర్వాసన వస్తుందని ప్రజలు ఆందేన చెందుతున్నారు. ప్ర ధాన పైప్లైన్లతో పాటు ఇళ్లకు వెళ్లే పైప్లైన్లకు సైతం లీకేజీలు పడుతున్నాయి. కొన్నిచోట్ల డ్రెయిన్ల వద్ద పైప్లైన్లు ఉండటంతో తాగునీటి పైపుల ద్వా రా మురుగునీరు వస్తుందని పలువురు అంటున్నా రు. తక్షణమే సంబంధిత అధికారులు పైప్లైన్ల లీకేజీలపై దృష్టి పెట్టాలని కోరుతున్నారు. ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద.. స్థానిక పెద్ద మసీదు సెంటర్ నుంచి టీటీడీ కల్యాణ మండపం రహదారి మార్గంలో ఈతకోట తాతాజీ మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద కాంప్లెక్స్కు సంబంధించిన పైప్లైన్కు సీసీ రోడ్డుకు దిగువన లీకేజీ పడింది. చాలా కాలంగా నీరు వృథా అవుతున్నా ఎవరూ పట్టించుకోలేదు. స్థానికులు మున్సిపల్ వాటర్ వర్క్స్ అధికారులకు తెలియజేయగా వారు వచ్చి పరిశీలించారు. రోడ్డుకు అవతల వైపు ప్రధాన పైపులైన్ వద్ద ఇతర పైప్లైన్లను సరిచేసేందుకు గొయ్యి తవ్వారు. ఎందుకు తవ్వారు తెలియరాలేదని స్థాని కులు అంటున్నారు. ఇప్పటికీ పైప్లైన్ లీకేజీని మాత్రం అరికట్టలేదు. ఇదిలా ఉండగా లీకేజీని అరికట్టేందుకు సీసీ రోడ్డును పగలగొట్టాల్సి ఉంటుందని సిబ్బంది చెబుతున్నారు. అంబేడ్కర్ భవనానికి ఎదురు సందులో.. మసీదు సెంటర్ అంబేడ్కర్ భవనానికి ఎదురుగా ఎంపీపీ పాఠశాల పక్క సందులో ఓ పైప్లైన్కు లీకేజీ పడింది. ఈ పైప్లైన్ డ్రెయినేజీ వద్ద ఉండటంతో లీకేజీ ద్వారా మురుగు నీరు పైప్లైన్లోకి వెళుతోందని స్థానికులు అంటున్నారు. ప్రభుత్వ పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా.. జిల్లా ప్రభుత్వ పాఠ్య పుస్తక విక్రయ కేంద్రం ఎదురుగా రోడ్డు పక్కగా డ్రెయినేజీకి సమీపంలో ఓ స్థలం వద్ద పైప్లైన్కు లీకేజీ ఏర్పడింది. నీరు వృథాగా పోతోంది. ఆయా సమస్యలపై అధికారులను వివరణ కోరగా లీకేజీలను పరిశీలించి సమస్యలను పరిష్కరిస్తామని తెలిపారు. ఈతకోట మున్సిపల్ కాంప్లెక్స్ వద్ద.. అంబేడ్కర్ భవనం ఎదురు సందులో.. మున్సిపల్ కాంప్లెక్స్ వద్ధతవ్వి వదిలేసిన గొయ్యి -
పెయింటింగ్ కార్మికులకు రక్షణ కరువు
ఏలూరు (టూటౌన్): పెయింటింగ్ కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించా లని ఇఫ్టూ రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు డిమాండ్ చేశారు. ఏలూరు ఏరియా పెయింటింగ్ కార్మికుల సమావేశం స్థానిక ఇఫ్టూ జిల్లా కా ర్యాలయంలో ఆదివారం యూనియన్ అధ్యక్షుడు లొట్ల సత్యనారాయణ అధ్యక్షతన జరిగింది. వక్తలు గా వెంకటేశ్వరరావు, ఉమ్మడి పశ్చిమగోదావరి జి ల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు, ఏలూరు న గర అధ్యక్షుడు బి.సోమయ్య మాట్లాడారు. భవన ఇతర నిర్మాణ కార్మిక సంక్షేమ బోర్డును పరిరక్షించాలని, 70 నుంచి 80 అడుగుల పైన ఎత్తుకు వెళ్లి రంగులు వేసే కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రమాద బీమా సౌకర్యం కల్పించాలని డిమాండ్ చేశారు. అ లాగే ప్రస్తుతం ఉన్న కార్మిక పథకాలను పెంచి ఇ వ్వాలని, నిర్మాణంలో ఉన్న బిల్డింగులపై ఒక శాతం సెస్ వసూలును రెండు శాతానికి పెంచాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. కూటమి ప్రభుత్వం నిర్మా ణ రంగ కార్మికులకు ఇచ్చిన హామీలను అమలు చేయాలని, ఈఎస్ఐ, పీఎఫ్, పెన్షన్ వంటి చట్టబద్ధమైన సౌకర్యాలు కల్పించాలని, సంక్షేమ బోర్డును పరిరక్షించాలని కోరారు. గత, ప్రస్తుత ప్రభుత్వాలు బోర్డు నుంచి తీసుకున్న డబ్బులను తిరిగి జమ చే యాలని డిమాండ్ చేశారు. నాలుగు లేబర్ కోడ్స్ ర ద్దు చేయాలని, ప్రభుత్వ రంగ సంస్థలను పరిరక్షించాలని అన్నారు. మేసీ్త్రలు గాజర్ల రాము, చిన్నా, దే వదానం, హలీం తదితరులు పాల్గొన్నారు. -
ఇంతి.. అధోగతి
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో చంద్రబాబు పా లనలో మహిళలు ‘రుణమో రామచంద్రా’ అని అ భ్యర్థిస్తున్నారు.. పథకాలు అందక.. ఉపాధికి మా ర్గాలు లేక అల్లాడుతున్నారు. కూటమి ప్రభుత్వంలో మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలు అమలు చేయకపోవడం, ఆర్థిక సాధికారత, స్వావలంబనకు ఊతమివ్వకపోవడంతో ఉసూరుమంటున్నా రు. దీంతో మహిళాభ్యున్నతి పూర్తిస్థాయిలో కుంటుపడింది. గత వైఎస్సార్సీపీ పాలనలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి మహిళా సంక్షేమానికి పెద్దపీట వేశారు. మహిళలను ఆర్థికంగా శక్తిమంతులను చేసేందుకు కృషి చేశారు. డ్వా క్రా సంఘాలకు పెద్ద ఎత్తున బ్యాంకు లింకేజీ, సీ్త్ర నిధి రుణాలు అందించారు. ఆసరా, కాపు నేస్తం, ఈబీసీ నేస్తం, చేయూత, చేదోడు, జగనన్న తోడు వంటి పథకాలతో ఆర్థికంగా అండగా నిలిచారు. ప్ర భుత్వ అండతో చిరు వ్యాపారాలు, డెయిరీ యూ నిట్లు, గొర్రెలు, మేకలు, కోళ్ల పెంపకం, కుటీర పరిశ్రమల నిర్వహణ వంటివి మహిళలు చేపట్టారు. అయితే ఇదంతా గతం.. ప్రస్తుతం ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా ఎక్కడా ఈ పరిస్థితి కానరావడం లేదు. ఈ నేపథ్యంలో పాత రోజులే బాగున్నాయని మహిళలు అంటున్నారు. చంద్రబాబు, కూటమి నేతల మాటలు నమ్మి మోసపోయామంటూ నిట్టూరుస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో స్వయం సమృద్ధి 2014–19 కాలంలో ఉమ్మడి జిల్లాలో డ్వాక్రా మ హిళలకు రూ.13,451.50 కోట్ల రుణాలు ఇచ్చారు. ఏలూరు జిల్లాలో 1,42,456 గ్రూపులకు రూ.7,682.40 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 1,04,576 గ్రూపులకు రూ.5,753.10 కోట్లు రుణాలుగా అందించి స్వయం సమృద్ధికి దోహదపడ్డారు. అయితే ప్రస్తుత చంద్రబాబు పాలనలో ఈ స్థాయిలో బ్యాంకుల నుంచి రుణాలు అందడం లేదు. దీనిపై మహిళలు పెదవి విరుస్తున్నారు. వైఎస్సార్సీపీ పాలనలో ఏటా నిర్దేశిత లక్ష్యానికి మించి రుణాలు మంజూరు చేశారు. ఏలూరు జిల్లాలో సగటున ఏటా 164.89 శాతం, పశ్చిమగోదావరి జిల్లా లో 177.69 శాతం బ్యాంకు రుణాలు అందించారు. రుణమాఫీతో ఆదుకుని.. వైఎస్సార్సీపీ పాలనలో వైఎస్సార్ ఆసరా పథకంలో డ్వాక్రా మహిళలకు రూ.2,300 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు. ఏలూరు జిల్లాలో 3.50 లక్షల మందికి పైగా మహిళలకు రూ.1377.16 కోట్ల రుణమాఫీ ప్రయోజనం చేకూరింది. పశ్చిమగోదావరి జి ల్లాలో సైతం మూడు లక్షల మందికి పైగా మ హిళలకు రూ.వెయ్యి కోట్ల మేరకు లబ్ధి కలిగింది. ‘కాపు’కాసిన నేస్తం వైఎస్సార్ కాపు నేస్తం పథకంలో ఒక్కో ఏడాది రూ.15 వేల చొప్పున నాలుగు విడతల్లో రూ.60 వేల చొప్పున ఆర్థిక సాయం అందించారు. ఉమ్మడి జిల్లాలో కాపు మహిళలకు రూ.220 కోట్ల మేరకు లబ్ధి చేకూరింది. ఏలూరు జిల్లాలో 66,488 మందికి రూ.100.45 కోట్లు, పశ్చిమలో లక్ష మందికి రూ.1,20 కోట్ల మేర సహకారం లభించింది. మెండైన చేయూత వైఎస్సార్ చేయూత పథకంలో ఉమ్మడి జిల్లాల పరిధిలోని మహిళలకు రూ.850 కోట్ల మేరకు లబ్ధి చే కూరింది. ఏలూరు జిల్లాలో 1,00,776 మందికి నా లుగు విడతల్లో కలిపి రూ.440 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లా పరిధిలో 95 వేల మంది మహిళలకు రూ.410 కోట్ల మేరకు లబ్ధి చేకూర్చారు. అగ్రవర్ణ పేదలను అక్కున చేర్చుకుని.. గత వైఎస్సార్సీపీ పాలనలో అగ్రవర్ణ పేదలకు అండగా ఈబీసీ నేస్తం పథకాన్ని అమలు చేశారు. ఏడాదికి రూ.15 వేల చొప్పున మూడు విడతల్లో రూ.45 వేలు అందించారు. ఏలూరు జిల్లాలో 15,047 మందికి రూ.68.68 కోట్లు, పశ్చిమగోదావరి జిల్లాలో 14 వేల మందికి 63 కోట్ల మేర లబ్ధి చేకూర్చారు. అతివకు అన్యాయం చంద్రబాబు పాలనలో అందని భరోసా పథకాల్లేవ్.. ఉపాధికి బాటల్లేవ్ కుంటుపడిన మహిళా సాధికారత వైఎస్సార్సీపీ పాలనలో మహిళాభ్యున్నతికి పెద్దపీట నాటి రోజులే బాగున్నాయంటున్న సీ్త్రమూర్తులు చంద్రబాబు, కూటమి నాయకులు ఎన్నికల ముందు సూపర్ సిక్స్, పథకాల పేరుతో మహిళలను వంచించారు. అధికారం చేపట్టి రెండేళ్లు కావస్తున్నా మహిళా సంక్షేమానికి ఎలాంటి పథకాలను అ మలు చేయలేదు. దీంతో మహిళలు ఆర్థిక భరోసా కోల్పోయారు. ఎప్పటిలాగానే ప్రతి చిన్న అవసరానికీ ఇంట్లో వారిపై ఆధారపడాల్సిన దుస్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. ఏదో పథకం ద్వారా మ హిళల చేతుల్లోకి డబ్బులు వచ్చే అవకాశం లేకపోవడంతో ఉసూరుమంటున్నారు. నాటి వైఎస్సార్ సీపీ ప్రభుత్వంలో వైఎస్ జగన్ పాలనే బాగుండేదని, ప్రస్తుతం తమకు ఎలాంటి పథకం అందకపో వడంతో వెంపర్లాడాల్సిన పరిస్థితి వచ్చిందని పలువురు మహిళలు ఆవేదన చెందుతున్నారు. -
30 శాతం ఐఆర్ ప్రకటించాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో ఉపాధ్యాయులకు 30 శాతం ఐఆర్ను తక్షణమే ప్రకటించాలని జాక్టో చైర్మన్ పువ్వుల ఆంజనేయులు డిమాండ్ చేశారు. ఆదివారం స్థానిక ఆశోకవర్థన ప్రాథమికోన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల ఐక్య కార్యాచరణ సమితి (జాక్టో) జి ల్లా నూతన కార్యవర్గ ఎన్నిక నిర్వహించారు. జా క్టో జిల్లా చైర్మన్గా పువ్వుల ఆంజనేయులు, వైస్ చైర్మన్గా తలపంటి శ్రీనివాసరావు, సెక్రటరీ జనరల్గా భూక్యా రాము, కోశాధికారిగా ఎన్.ప్రవీణ్ కుమార్ ఎన్నికయ్యారు. వీరితో పాటు అదనపు సెక్రటరీ జనరల్గా కేఎస్వీకే రాజ్కుమార్, కో చైర్మన్లుగా కాటి వెంకటరమణ, బి.విద్యాసాగర్, పేరాబత్తుల సురేష్, మహిళా కో–చైర్మన్గా నందిగం శర్వాణి, డిప్యూటీ సెక్రటరీ జనరల్స్గా టీఎల్ఎస్ఎన్ మూర్తి, తోట ఎడ్వర్డ్లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. నూతనంగా ఎన్నికై న కార్యవర్గ సభ్యులు ప్రమాణ స్వీకారం చేశారు. అనంతరం చైర్మన్ ఆంజనేయులు మాట్లాడుతూ జిల్లాలో ఉపాధ్యాయులు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపైనా జాక్టో రాజీలేని పోరాటం చేస్తుందన్నారు. రాష్ట్ర ప్రభుత్వం 12వ పీఆర్సీ కమిషన్ను వెంటనే నియమించాలని డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్ డీఏలను విడుదల చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని కోరారు. పీఆర్టీయూ, ఆపస్, ఎన్టీఏ, బీటీఏ (అమరావతి), టీఎన్యూఎస్, డీపీఆర్టీయూ, ఎంటీఎఫ్, ఏపీఎస్టీఏ, ఎంటీఎస్, ఏపీటీయూ తదితర ఉపాధ్యాయ సంఘాల జిల్లా ప్రతినిధులు పాల్గొన్నారు. -
ప్రజల చెవిలో పీ4 పూలు
నరసాపురం: ఉన్నది లేనట్టు.. లేనిది ఉన్నట్టు.. ఏ దో అద్భుతం జరిగిపోయిందంటూ హడావుడి చే యడంలో సిద్ధహస్తుడిగా పేరున్న సీఎం చంద్రబా బు రాష్ట్రంలో పేదలను ఉద్దారిస్తామంటూ పీ4 (పబ్లిక్–ప్రైవేట్–పీపుల్–పార్టనర్ఫిప్) కార్యక్రమా న్ని తీసుకువచ్చారు. ఎన్నికల హామీలను పూర్తిగా విస్మరించిన ముఖ్యమంత్రి పేదరిక నిర్మూలనకు పీ4 అంటూ హడావుడి చేశారు. ఈ కార్యక్రమాన్ని ప్రారంభించి ఏడాది గడిచినా ఏమాత్రం పురోగతి లేకపోగా.. సోమవారం రాష్ట్రవ్యాప్తంగా పీ4 సర్వే ప్రథమ వార్షికోత్సవాలు నిర్వహించాలని కలెక్టర్లకు ఆదేశాలిచ్చారు. ఇప్పటికే పీ4 సర్వేలో ఎదురవుతున్న ఆటుపోట్లతో తలలు పట్టుకుంటున్న అధికారులు వార్షికోత్సవాన్ని ఏదో రకంగా నిర్వహించి చేతులు దులుపుకోవాలని చూస్తున్నారు. ప్రభుత్వ ఆదేశాలతో జిల్లా అధికార యంత్రాంగం ఆదివారం సెలవు రోజైనా కార్యక్రమం నిర్వహణపై దృష్టి పెట్టింది. కలెక్టర్ నాగరాణి ఆర్డీఓలు, మున్సిపల్ కమిషనర్లు, తహసీల్దార్లు, ఎంపీడీవోలతో గూగుల్ మీట్ ద్వారా సమావేశం నిర్వహించారు. జిల్లాస్థాయిలో భీమవరం త్యాగరాజ భవన్లో కార్యక్రమం నిర్వహించాలని నిర్ణయించారు. అలాగే ఏడు ని యోజకవర్గాల్లో కార్యక్రమం నిర్వహించాలని ఆదేశాలిచ్చారు. ఏమిటీ పీ4 సర్వే ఎన్నికల హామీలను అమలు చేయకపోవడంతో తీవ్ర వ్యతిరేకత రావడంతో ప్రజల దృష్టి మరల్చేందుకు చంద్రబాబు ప్రభుత్వం పీ4 సర్వే ప్రారంభించింది. జిల్లాల్లోని అన్ని ప్రాంతాల్లో ప్రతి కుటుంబా న్నీ సర్వే చేయాలని నిర్ణయించారు. ఆయా కుటుంబాల ఆర్థిక పరిస్థితి, వారి ఇళ్లలో విలాస వస్తువులు, ఆదాయ మార్గాలు ఇలా పలు అంశాల్లో పడపోత కా ర్యక్రమం నిర్వహించాలన్నది సర్వే లక్ష్యం. తద్వారా బంగారు కుటుంబాల పేరుతో సంపన్న వర్గాలను గుర్తించి వారిని మార్గదర్శకులుగా నియమించి కొన్ని పేద కుటుంబాలను దత్తత తీసుకునేలా చే యాలనేది కార్యక్రమం ఉద్దేశం. ఇలా సంపన్న వర్గా లు దత్తత తీసుకున్న కుటుంబాలకు ఆర్థికంగా చే యూత ఇవ్వడం, అవసరమైన నైపుణ్యాలు పెంచడానికి సహకరించడం చేయాలి. చెప్పడానికి ఇదంతా బాగున్నా.. సర్వే దశలోనే ఈ కార్యక్రమం అట్టర్ఫ్లాఫ్ అయ్యింది. టార్గెట్ ఘనం.. మార్గదర్శకులు దొరకని వైనం జిల్లాలో 4,92,292 కుటుంబాలను సర్వే చేసి ద త్తతకు అర్హమైన 64,940 కుటుంబాలను అధికారు లు తేల్చారు. అయితే ఆయా కుటుంబాలను దత్తత తీసుకోవడానికి సంపన్న వర్గాలైన మార్గదర్శకులు 15 వేల మంది కావాలి. అయితే ఏడాది కాలంలో మార్గదర్శకులు ఎంత మందిని గుర్తించారనే అంశంలో జిల్లా అధికార యంత్రాంగం వద్ద స్పష్టత లేదు. విశ్వసనీయ సమాచారం మేరకు కనీసం 3 వేల కు టుంబాలను కూడా గుర్తించలేదని తెలిసింది. మరి సర్వే లక్ష్యం ఏ మేరకు నెరవేరుతుందనేది ప్రశ్నార్థకమే. పబ్లిసిటీలో పీక్గా పేరున్న చంద్రబాబు పీ4 సర్వే విషయంలోనూ అదే తరహాలో ముందుకు సాగుతున్నారనే విమర్శలు వ్యక్తమవుతున్నాయి. హవ్వ.. ఇదెక్కడి విడ్డూరం ? పీ4 సర్వే పేరుతో సీఎం చంద్రబాబు హడావుడి నేడు ప్రథమ వార్షికోత్సవానికి సన్నాహాలు జిల్లాలో మార్గదర్శకులు దొరకని వైనం కార్యక్రమం విజయవంతానికి అధికారుల పాట్లు పీ4 సర్వేకు సంబంధించి ప్రభుత్వ వ్యవహార తీరుతో తొలి నుంచి అధికారులు తీవ్ర ఒత్తిడికి లోనయ్యారు. మార్గదర్శకులుగా చెప్పే బంగారు కుటుంబాలను గుర్తించాలని ప్రభుత్వం ఒత్తిడి తెస్తూనే ఉంది. కలెక్టర్ తరచూ ఇదే అంశంపై రివ్యూలు నిర్వహించడంతో అధికారులు విసిగిపోయారు. అయినా జిల్లాలో మార్గదర్శకులను రిజిస్టర్ చేయించడం అధికారుల వల్ల కాలేదు. దీంతో వ్యవహారం బెడిసికొట్టే ప్రమాదం ఉందని గుర్తించిన చంద్రబాబు సర్కారు ఓ దశలో ఈ బంగారు కుటుంబాల బాధ్యతను ప్రభుత్వ అధికారులు, ఉద్యోగులకు అప్పగించాలని కూడా నిర్ణయించింది. ఒక్కో అధికారి, ఉద్యోగి జీతంలో నెలకు రూ.5 వేలు ఖర్చు చేయించేలా ప్రయత్నం జరిగింది. చివరకు సర్వే విఫలం విషయంలో ప్రభుత్వ ఉద్యోగులను బాధ్యులను చేసేలా సచివాలయ ఉద్యోగులకు షోకాజ్ నోటీసులు ఇవ్వడం, ఒత్తిడి పెంచడం వంటివి కూడా చేశారు. అయితే ప్రభుత్వ చర్యలను మొదటిగా ఉపాధ్యాయ సంఘాలు వ్యతిరేకించాయి. తర్వాత మిగిలిన ప్రభుత్వ ఉద్యోగులు, అధికారులు సర్వే లక్ష్యం అమలు సాధ్యం కాదని ధిక్కార స్వరం పెంచారు. మొత్తంగా అటు ప్రజల నుంచే కాకుండా ఇటు అధికారులు, మేధా వుల నుంచి తీవ్ర వ్యతిరేకతతో అభాసుపాలైన పీ4 సర్వేకు వార్షికోత్సవం చేయడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. -
దళితులకు రక్షణ లేదా?
ఏలూరు టౌన్ : రాష్ట్రంలో కూటమి పాలనలో దళితులపై రోజురోజుకూ అక్రమ కేసులు, దాడులు, దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని, ఆకివీడు పెదపేటలో శ్రీరామనవమి వేడుకల పేరుతో అక్కడకు వెళ్ళి రెచ్చగొట్టి దాడులకు ఉసిగొల్పి.. మత, కుల విద్వేషాలు రెచ్చగొట్టడం దారుణమని వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు తేరా ఆనంద్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు అన్నారు. పార్టీ కార్యాలయంలో శనివారం విలేకరుల సమావేశంలో వారు మాట్లాడారు. పెదపేటలో రామాలయం కట్టాలని భావిస్తే గ్రామపెద్దలతో సామరస్యంగా చర్చించి ఇరు పక్షాలకూ ఇబ్బంది లేకుండా చేయాలని, కుట్రపూరితంగా గ్రామంలోకి రాజకీయ నేతలతో, పోలీస్ బలగాలతో వెళ్ళి దళితులను అణచివేయాలనే ప్రయత్నం సరైంది కాదన్నారు. ఉప సభాపతి స్థానంలో ఉంటూ కావాలనే మతపరమైన చిచ్చు రేపేందుకు గత కొంతకాలంగా అక్కడికి వెళుతూ దళితుల మనోభావాలను దెబ్బతీస్తున్నారని విమర్శించారు. మందీ మార్బలంతో పెదపేటలోకి వెళ్ళి గొడవలు సృష్టించారు.. ఒక వర్గం నేతలు నినాదాలు చేస్తూ దళితులను రెచ్చగొట్టారు.. ఇది నిజం కాదా అంటూ వారు ప్రశ్నించారు. 57 మంది దళిత యువకులు, మైనర్లపై అక్రమ కేసులు బనాయించి వారి భవిష్యత్తో చెలగాటం ఆడాలని చూస్తే సహించేది లేదన్నారు. ఎస్సీ సెల్ అధికార ప్రతినిథి మున్నుల జాన్గురునాథ్, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్టా గంగరాజు మాట్లాడుతూ టీడీపీ ప్రభుత్వంలో దళితులకు రాష్ట్రంలో ఎక్కడా రక్షణ లేకుండా పోయిందని ఆవేదన వ్యక్తం చేశారు. రాష్ట్ర ఉన్నత పదవుల్లో ఉన్న నేతలు సైతం దళితులను అణచివేసే ధోరణిలో మాట్లాడుతూ పెదపేట వివాదానికి మతం రంగు పులిమే ప్రయత్నం చేయటం సిగ్గుచేటన్నారు. సమావేశంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ ఏలూరు నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, ఏలూరు నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, యువజన విభాగం జిల్లా ప్రధాన కార్యదర్శి ప్రత్తిపాటి విక్టర్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు ఆనంద్ ఆగ్రహం -
బస్సుషెల్టర్లు లేక అవస్థలు
తాడేపల్లిగూడెం(టీఓసీ): ఆర్టీసీ బస్సులు ఆగేందుకు తాడేపల్లిగూడెం పట్టణంలోని ప్రధాన కూడళ్లలో సరైన బస్సు షెల్టర్లు లేకపోవడంతో ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాడేపల్లిగూడెం బస్సు కాంప్లెక్స్ నుంచి ఏలూరు, భీమవరం, తణుకు, నల్లజర్ల వైపు వెళ్లే ప్రధాన మార్గాలు ఉన్నాయి. బస్సు కాంప్లెక్స్ నుంచి బయలుదేరిన తర్వాత తాలూకా ఆఫీస్ సెంటర్, శేషమహల్ రోడ్డు ప్రారంభంలోని ఎన్టీఆర్ జంక్షన్, ఫ్లై ఓవర్ మీదుగా తణుకు వెళ్లే స్టాప్, భీమవరం వెళ్లే స్టాప్, ఏలూరు వైపు వెళ్లే స్టాప్ల వద్ద ప్రయాణికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. అదేవిధంగా నల్లజర్ల వైపు గొల్లగూడెం సెంటర్, హౌసింగ్బోర్డు సెంటర్, మాగంటి కళ్యాణ మండపం సెంటర్లు కూడా రద్దీగా ఉంటాయి. తణుకు వైపు వెళ్లే ప్రయాణికుల కోసం షెల్టర్ నిర్మించినప్పటికీ, మిగిలిన చోట్ల పరిస్థితి దయనీయంగా ఉంది. హౌసింగ్బోర్డు సెంటర్ వద్ద దాతలు నిర్మించిన బస్సు షెల్టర్ ఉన్నా, అది బస్సులు ఆగే ప్రాంతానికి దూరంగా, ఒక మూలకు ఉండటంతో ప్రస్తుతం నిరుపయోగంగా మారింది. నేడు ఆ బస్సు షెల్టర్ను ఎవరూ ఉపయోగించడం లేదు. షెల్టర్లు లేక ప్రయాణికుల ఇబ్బందులు పట్టణంలోని ప్రధాన సెంటర్లయిన తాలూకా ఆఫీస్ సెంటర్, ఎన్టీఆర్ జంక్షన్, భీమవరం వైపు వెళ్లే ప్రభాత్ టాకీస్ సెంటర్, ఏలూరు వైపు వెళ్లే మోడ్రన్ కేఫ్ సెంటర్ల వద్ద బస్సులు నిలిపేందుకు షెల్టర్లు లేవు. దీంతో ఎండలు, వానలకు ప్రయాణికులు తీవ్ర ఇక్కట్లు పడుతున్నారు. ఈ వేసవిలో ఉష్ణోగ్రతలు పెరిగితే, షెల్టర్లు లేక ప్రయాణికులు ఎండలో నిలబడలేని పరిస్థితి ఏర్పడింది. వర్షం పడినప్పుడు సమీపంలోని దుకాణాల వద్ద తలదాచుకోవాల్సి వస్తోంది. మరోవైపు, షెల్టర్లు లేకపోవడంతో బస్సుల కోసం రోడ్లపైనే ఎదురుచూస్తున్నారు. సమీప షాపులు వద్ద నిలబడటం, లేదంటే రోడ్డుపైనే ఉంటున్నారు. ప్రయాణికులను ఎక్కించేందుకు బస్సు రోడ్డుపైన ఆపినప్పుడు బస్సు వెనుక నున్న వాహనాలు వారు ముందుకు వెళ్లేందుకు అవకాశం లేకపోవడంతో పలు చోట్ల ట్రాఫిక్కు తీవ్ర అంతరాయం కలుగుతుంది. ముఖ్యంగా ఏలూరు, భీమవరం మార్గాల్లో ఈ సమస్య అధికంగా ఉంది. తాలూకా ఆఫీస్ సెంటర్, ఎన్టీఆర్ జంక్షన్, భీమవరం వైపు, ఏలూరు వైపు తక్షణమే షెల్టర్లు నిర్మించి, బస్సులు రోడ్డు పక్కన ఆగేలా ఏర్పాట్లు చేస్తే ట్రాఫిక్ సమస్య కూడా తగ్గుతుందంటున్నారు. తాడేపల్లిగూడెంలో ప్రయాణికుల ఇక్కట్లు రానున్నది వేసవి కాలం అందువల్ల అధికారులు మరియు ప్రజాప్రతినిధులు స్పందించి పట్టణంలోని ప్రధాన ప్రాంతాలలో బస్సు షెల్టర్లు నిర్మించాలి. ప్రయాణికులు బస్సుల కోసం రోడ్డు మీద పడిగాపులు పడకుండా చూడాలి. బస్సులు వచ్చే వరకు కూర్చునేందుకు, సేద తీరేందుకు అవకాశం ఉండాలి. ఆ దిశగా అధికారులు, ప్రజాప్రతినిధులు చొరవ తీసుకోవాలి. – తాడేపల్లి శ్యాంబాబు, మాలల జేఏసీ టౌన్ యువజన అధ్యక్షుడు -
కరుణించమ్మా.. కుంకుళ్లమ్మ
ద్వారకాతిరుమల: క్షేత్ర దేవత శ్రీ కుంకుళ్లమ్మ అమ్మవారి ఆలయంలో వసంత నవరాత్రి ఉత్సవాలు శనివారం జరిగిన విశేష కార్యక్రమాలతో ముగిసాయి. ఉదయం ఆలయంలో ఐదు లక్షల గాజుల అలంకరణలో ఉన్న అమ్మవారికి అర్చకులు విశేష కుంకుమ పూజలు నిర్వహించి, హారతులిచ్చారు. ఈ సందర్భంగా ముత్తైదువలు ఆలయ మండపంలో సామూహిక కుంకుమ పూజలు నిర్వహించారు. అనంతరం ఆలయ యాగశాలలో అర్చకులు, పండితులు వేద మంత్రోచ్ఛరణల నడుమ జరిపిన చండీహోమం, పూర్ణాహుతి హోమంలో ఆలయ ఈఓ వై.భద్రాజీ, సూపరింటెండెంట్ దుర్గాప్రసాద్ పాల్గొన్నారు. అధిక సంఖ్యలో భక్తులు అమ్మవారిని దర్శించి, తీర్ధప్రసాదాలను స్వీకరించారు. -
అటవీ శాఖ మొద్దు నిద్ర
కుక్కునూరు: మండలంలో అటవీ శాఖ పనితీరుపై పలు విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. రాష్ట్ర అటవీ శాఖ పరిధిలోని బాంబూ చెట్లను తెలంగాణ అటవీశాఖ సిబ్బంది తమ ప్రాంతంలోదని పేర్కొంటూ అమరవరం రేంజ్ పరిధిలోని, కొత్తూరు బీట్ అటవీ ప్రాంతంలో సుమారుగా 20,000 కర్రలను నరికినట్టు తెలుస్తుంది. ఈ విషయం తెలిసి కూడా అమరవరం రేంజ్ సిబ్బంది అడ్డుకునే ప్రయత్నం చేయడం లేదన్న వ్యాఖ్యలు వినిపిస్తున్నాయి. అటవీ శాఖలో అక్రమ వసూళ్లు కొయ్యలగూడెం: అటవీ శాఖలో అక్రమ వసూళ్లపై పెద్ద ఎత్తున ఆరోపణలు వస్తున్నాయి. కన్నాపురం అటవీ శాఖ రేంజ్ పరిధిలో పుల్ల ట్రాక్టర్ల నుంచి వసూళ్లు చేస్తున్నారని రైతులు ఆరోపణలు చేస్తున్నారు. మామిడి, జీడిమామిడి పుల్ల ట్రాక్టర్కు రూ. 4 వేల నుంచి రూ.6 వేలు, ఇతర మారుజాతి పుల్ల ట్రాక్టర్కు రూ.10 వేల వరకు వసూలు చేసుకున్నారని అంటున్నారు. బేరన్ క్యూరింగ్ కోసం మామిడి, జీడి మామిడి తోటలను పొలాలలో నుంచి తీసి వేస్తున్న రైతుల నుంచి పుల్లను కొనుగోలు చేసి తమ అవసరాల కోసం తరలిస్తుంటే అడ్డుపడి వసూళ్లు చేస్తున్నారంటున్నారు. దీనిపై కార్యాలయంలోని ఓ అధికారిని వివరణ కోరగా పుల్ల ట్రాక్టర్లకు పర్మిషన్లు తప్పనిసరి అన్నారు. రైతుల అభ్యర్థన మేరకు మామిడి,జీడి మామిడి పుల్ల రవాణాకు అడ్డు చెప్పడం లేదన్నారు. అవినీతి అధికారిపై చర్యలు తీసుకోవాలని ఏజెన్సీ మెట్ట రైతులు కోరుతున్నారు. -
గ్యాస్ అక్రమ వినియోగదారులపై కేసుల నమోదు
కై కలూరు : గృహ అవసరాలకు వినియోగించాల్సిన గ్యాస్ సిలిండర్లను వాణిజ్య అవసరాలకు ఉపయోగిస్తున్న దుకాణాలు, హోటళ్లపై రెవెన్యూ అధికారులు శనివారం కై కలూరులో ఆకస్మిక దాడులు నిర్వహించారు. మండల పీడీఎస్ డీటీ కె.వెంకటరమణ ఆధ్వర్యంలో సిబ్బంది ఈ దాడులు చేసి మొత్తం 21 గ్యాస్ సిలిండర్లను సీజ్ చేశారు. అనంతరం తహసీల్దారు ఆర్.రామకృష్ణ మాట్లాడుతూ.. పట్టుబడిన వారికి 6ఏ నోటీసులు అందజేస్తామని, సీజ్ చేసిన సిలిండర్లను ఏలూరు జిల్లా కలెక్టర్ కార్యాలయానికి తరలిస్తామని తెలిపారు. నిబంధనలు అతిక్రమించి గ్యాస్ సిలిండర్లను వినియోగిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. తాడేపల్లిగూడెం : వ్యాపారంలో నైతిక విలువలు ఎంతో అవసరమని వరంగల్ నిట్ అసిస్టెంట్ ప్రొఫెసర్ వెంకటకృష్ణ అన్నారు. ఏపీ నిట్లో శనివారం నిర్వహించిన ‘స్టార్టప్ లీగల్ ఎథికల్ స్టెప్స్’ అనే అంశంపై ఆయన ప్రసంగించారు. జీవితంలో ఏదైనా సాధించాలనే పట్టుదల, అంకితభావంతో పాటు వినియోగదారులను ఆకట్టుకునే నేర్పు ఉండాలన్నారు. సరైన వ్యాపారాన్ని ఎంచుకోవడం, కంపెనీ రిజిస్ట్రేషన్ విధానాలు, మేధోసంపత్తి హక్కుల ప్రాధాన్యత గురించి వివరించారు. వ్యాపారంలో పారదర్శకత, నమ్మకం, నైతిక విలువలు ఉండాలని, ప్రభుత్వ పథకాలు, రాయితీలను సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. కార్తికేయశర్మ అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో డీన్లు రవికిరణ్ శాస్త్రి, జి.బి.వీరేష్కుమార్, సంతోష్కుమార్ తదితరులు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: మండలంలోని ఇప్పలపాడు సమీపంలో ఉన్న ఏకలవ్య మోడల్ రెసిడెన్షియల్ స్కూల్లో 2026–27 విద్యా సంవత్సరానికి ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి దరఖాస్తులు కోరుతున్నట్లు ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ మిశ్రా శనివారం ఒక ప్రకటనలో తెలిపారు. 7వ తరగతిలో బాలురు–1, బాలికలు–4, 9వ తరగతిలో బాలురు–1, 11వ తరగతిలో బాలురు–15, బాలికలకు 15 సీట్లు ఖాళీగా ఉన్నా యని వివరించారు. అర్హత గల విద్యార్థులు ఏప్రిల్ 10వ తేదీలోపు పాఠశాలకు నేరుగా వచ్చి దరఖాస్తులు సమర్పించాలని కోరారు. ఐటీడీఏ పీఓ ఆధ్వర్యంలో నిర్వహించే ప్రవేశ పరీక్షలో ఉత్తీర్ణత సాధించిన వారికే సీట్లు కేటాయిస్తామన్నారు. వివరాలకు 9412102600 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. చాట్రాయి: విద్యుత్ షాక్ తగిలి రైతు మృతి చెందిన సంఘటన మండలంలోని చనుబండలో జరిగింది. గ్రామానికి చెందిన చిన్నం లక్ష్మీ నారాయణ (45) శుక్రవారం రాత్రి 7 గంటల సమయంలో మొక్కజొన్న పంటకు నీరు పెట్టడానికి వెళ్లి ఫీజు వేస్తుండగా షాక్ తగిలి అక్కడి అక్కడే మృతి చెందాడు. రాత్రి రెండు గంటల వరకూ ఇంటికి రాకపోవడంతో కుటుంబ సభ్యులు పొలం దగ్గరకు వెళ్లి చూడగా మృతి చెంది ఉన్నాడు. మృతుడు తనకున్న భూమితో పాటు కొంత కౌలుకు తీసుకుని నిత్యం వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటూ ఇద్దరు కొడుకులను చదివించుకుంటన్నాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిర్వహించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై డి.రామకృష్ణ తెలిపారు. -
మట్టిరహిత నారు మొక్కలు అందిస్తాం
తాడేపల్లిగూడెం: మట్టిరహిత పద్ధతుల్లో ఉత్పత్తి చేసిన కూరగాయల నారును రైతులకు అందించడమే లక్ష్యంగా ఉద్యాన విశ్వవిద్యాలయంలో మొక్కలను తయారు చేస్తున్నామని వీసీ డాక్టర్ కె.ధనుంజయరావు తెలిపారు. శనివారం విశిష్ట రక్షిత సాగు కేంద్రంలో నామమాత్రపు ధరకే రైతులకు మొక్కలను అందజేశారు. ఈ పద్ధతిలో పెంచిన నారుకు తెగుళ్ల బెడద తక్కువగా ఉంటుందని, నారు దశలోనే వ్యాధులను నివారిస్తామని పేర్కొన్నారు. మొక్కలు కావాల్సిన రైతులు వీఆర్ గూడెం ఉద్యాన పరిశోధనా స్థానంలో రిజిస్ట్రేషన్ చేసుకోవాలని సూచించారు. వర్సిటీలోని సాంకేతిక పరిజ్ఞానాన్ని రైతులకు అందుబాటులోకి తెస్తున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో పరిశోధనా సంచాలకులు జి.రామానందం, హెడ్ టి.సుశీల, శాస్త్రవేత్త ఎన్.వి.గౌతమ్ పాల్గొన్నారు. అంటుగట్టిన నారు కోసం 73826 33654 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. భీమడోలు: గుండుగొలనులో భర్త వేధింపులు తాళలేక వివాహిత శుక్రవారం రాత్రి ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకుంది. విజయనగరం జిల్లాకు చెందిన నరేడుమిల్లి సత్యం కుమార్తె శ్రావణికి(26) గుండుగొలనుకు చెందిన బర్నాన ఆదినారాయణతో 2016లో వివాహమైంది. వారికి ఇద్దరు పిల్లలు. కొంత కాలంగా భర్త మద్యం తాగొచ్చి గొడవ చేసేవాడు. శారీరకంగా, మానసికంగా వేధిస్తున్నాడు. మనస్తాపానికి గురైన శ్రావణి భర్త లేని సమయంలో ఫ్యాన్కు ఉరి వేసుకుని మృతి చెందింది. సమాచారం అందుకున్న మృతురాలి తండ్రి సత్యం అనుమానంతో అల్లుడు ఆదినారాయణపై ఫిర్యాదు చేసాడు. భీమడోలు సీఐ వి.కృష్ణ, ఎస్సై ఎస్కే మదీనా బాషాలు మృతదేహాన్ని పరిశీలించి మృతికి గల కారణాలు అడిగి తెలుసుకున్నారు. మృతదేహాన్ని ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి పోస్ట్మార్టం నిమిత్తం తరలించారు. భీమడోలు పోలీసులు అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం మండలం వేగవరంలో శుక్రవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతిచెందాడు. పోలీసుల వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన పోలిశెట్టి పవన్కుమార్ (35) జల్లేరు నుంచి బైక్పై వస్తున్నాడు. ఆ సమయంలో జంగారెడ్డిగూడెం వైపు వస్తున్న లారీ బైక్ను వెనుక నుంచి ఢీకొంది. దీంతో పవన్కుమార్కు తీవ్ర గాయాలు కాగా, స్థానికంగా ఉన్న ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ పవన్కుమార్ చెందాడు. -
యువకుడి అదృశ్యం కేసు ఛేదించిన పోలీసులు
తణుకు అర్బన్: చనిపోతున్నానంటూ కుటుంబసభ్యులకు వాయిస్ మెసేజ్ పంపి అదృశ్యమైన యువకుడి కేసును తణుకు పోలీసులు ఛేదించారు. తణుకు పట్టణానికి చెందిన చిట్టూరి భీమరాజు ఈనెల 26 రాత్రి నుంచి అదృశ్యం కాగా శుక్రవారం రాత్రి తణుకు పట్టణ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తులో భాగంగా యువకుడి సెల్ఫోన్ ఆధారంగా గంట వ్యవధిలోనే వివరాలు తెలుసుకుని తణుకు మండలం తేతలి వైజంక్షన్లో అదుపులోకి తీసుకున్నారు. అనంతరం తల్లితండ్రులకు అప్పగించారు. భీమరావు తన ప్రేమ వ్యవహారంలో భాగంగా ఇటు కుటుంబసభ్యులను పోలీసులను సైతం పక్కదారి పట్టించే విధంగా ఆంధ్రా సుగర్స్ ప్రాంతంలోని కాలువ వంతెన సమీపంలో తన బైక్, చెప్పులు వదిలి అదృశ్యమైనట్లుగా నమ్మించాడు. ఆత్మహత్య చేసుకునే క్రమంలో కాలువలోకి దూకేశాడేమోనని భావించిన తల్లితండ్రులు కాలువ వెంట గాలింపు చర్యలు చేపట్టారు. ఈ క్రమంలో సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా పోలీసులు యువకుడి ఆచూకీ కనుగొన్నారు. యువకుడిని తణుకు పట్టణ పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చి తల్లితండ్రులకు అప్పగించారు. -
మతిస్థిమితం లేని వ్యక్తి అదృశ్యం
తణుకు అర్బన్: తణుకు పట్టణానికి చెందిన ఒక వ్యక్తి అదృశ్యమైనట్లు కుటుంబ సభ్యులు ఫిర్యాదు చేయడంతో కేసు నమోదు చేసినట్లు ఎస్సై కె.శ్రీనివాస్ తెలిపారు. అజ్జరం రోడ్డులోని ఇందిరమ్మ కాలనీకి చెందిన సంపు దుర్గాప్రసాద్ గత కొంతకాలంగా మతిస్థిమితం లేకుండా ఉంటున్నారు. మూడు నెలల క్రితం బ్రెయిన్ ఆపరేషన్ జరగడంతో ఇంట్లోనే ఉంటున్న ఆయన, ఈ నెల 25న మధ్యాహ్నం ఎవరికీ చెప్పకుండా బయటకు వెళ్లి తిరిగి రాలేదు. కుటుంబ సభ్యులు చుట్టుపక్కల గాలించినా ఆచూకీ దొరకలేదు. సోదరుడు ఏసుబాబు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. ముదినేపల్లి(కై కలూరు) : కడుపునొప్పి తాళలేక పురుగు మందు తాగి అత్మహత్యాయత్నానికి ప్రయత్నించిన వ్యక్తి చికిత్స పొందుతూ శనివారం మరణించాడు. ముదినేపల్లి పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం చినకామనపూడికి చెందిన నున్న శ్రీనివాసరావుకు 4 ఏళ్ల క్రితం శ్రీనివాసరావుకు బ్రెయిన్ స్టోక్ వచ్చింది. అప్పటి నుంచి తీవ్ర కడుపునొప్పితో బాధపడుతున్నాడు. ఈ నెల 25న కడుపునొప్పి, చిన్ని కుమార్తెకు వివాహం కాలేదనే బాధతో పురుగుమందు తాగాడు. అతనిని ముదినేపల్లి అస్పత్రికి తీసుకువెళ్ళి, అక్కడ నుంచి గుడివాడ ఈవీఆర్ ఆస్పత్రికి మెరుగైన వైద్యం కోసం తరలించారు. చికిత్స పొందుతూ అతను మృతి చెందాడు. -
భానుడి భగభగలు
● నిర్మానుష్యంగా రహదారులు ● చలివేంద్రాలు ఏర్పాటు చేయాలంటున్న ప్రజలు తణుకు అర్బన్: ఎండల తీవ్రతతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. వేసవి ప్రారంభం నుంచే ఉష్ణోగ్రతలు పెరిగాయి. దీనికి తోడు ఉక్కపోతతో ప్రజలు అల్లాడిపోతున్నారు. శనివారం అధిక వేడి కారణంగా, ఉక్కపోతతో తణుకు పట్టణంలో రహదారులన్నీ నిర్మానుష్యంగా మారాయి. ఎప్పుడూ రద్దీగా ఉండే తణుకులోని ప్రధాన రహదారులైన రాష్ట్రపతి రోడ్డు, రైల్వే ఓవర్ బ్రిడ్జి, వంగవీటి మోహన రంగా వీధి, రైల్వే స్టేషన్రోడ్డు, వేల్పూరు రోడ్డు, ఉండ్రాజవరం రోడ్డు ప్రాంతాలు జనసంచారం లేక నిర్మానుష్యంగా మారాయి. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 5 గంటల వరకు జనం సంచారం తగ్గింది. ప్రజలు ఇళ్లకే పరిమితమయ్యారు. ప్రయాణికులు ఎండతో ఇబ్బంది పడగా, చిరు వ్యాపారులు లేక డీలా పడ్డారు. చలివేంద్రాలు ఏర్పాటు చేయాలి వేసవి ఎండల తీవ్రత కారణంగా ప్రయాణికుల సౌకర్యార్ధం ప్రభుత్వం చలివేంద్రాలు ఏర్పాటుచేయాలని ప్రజలు కోరుతున్నారు. ఉక్కపోత వాతావరణానికి దాహంతో ప్రయాణాల్లో ఇబ్బందులు పడుతున్నారని ప్రధాన రహదారుల్లో చలివేంద్రాలు ఏర్పాటుచేస్తే ప్రయాణికులు దాహార్తిని తీర్చుకుంటారని పలువురు కోరుతున్నారు. -
చక్రబంధంలో మొగల్తూరు
అధ్వాన రోడ్లతో ప్రజలకు యాతన నరసాపురం రూరల్: మొగల్తూరు మండల కేంద్రంలో ట్రాఫిక్ సమస్య రోజు రోజుకూ జఠిలమవుతోంది. ఒకవైపు గుంతలమయమైన రోడ్లు, మరోవైపు క్రమబద్ధీకరణ లేని వాహనాల రాకపోకలతో స్థానికులు, ప్రయాణికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మొగల్తూరు సెంటర్ ట్రాఫిక్ పద్మవ్యూహాన్ని తలపిస్తోంది. మండలంలోని పలు ప్రాంతాల్లో రోడ్లు సరైన మరమ్మతులు లేక గుంతల మయంగా మారాయి. బైపాస్ రోడ్డు నుంచి ఊర్లోకి వెళ్లాలంటే వాహనచోదకులు భయపడాల్సిన పరిస్థితి నెలకొంది. రోడ్ల దుస్థితి వల్ల వాహనాల వేగం తగ్గడం తద్వారా ట్రాఫిక్ స్తంభించి పోవడం నిత్యకృత్యమైంది. మార్కెట్లో వ్యాపార సముదాయాలు ఉండటంతో సెంటర్ సాయంత్ర సమయంలో ప్రజలతో రద్దీగా ఉంటుంది. పార్కింగ్కు సరైన స్థలం లేకపోవడం, రోడ్డు పక్కనే వాహనాలు నిలిపివేయడంతో రహదారులు ఇరుకుగా మారుతున్నాయి. ఇటీవల అధిక లోడుతో వస్తున్న ఒక లారీ విద్యుత్ తీగలను తాకడంతో స్తంభం నేలకూలింది. ప్రాణనష్టం జరగక పోవడంతో స్థానికులు ఊపిరి పీల్చుకున్నారు. పర్యవేక్షణ కరువు ట్రాఫిక్ నియంత్రణ చర్యలు లేకపోవడంపై స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ట్రాఫిక్ మళ్లింపు, క్రమబద్దీకరణ చేసే సిబ్బంది లేకపోవడంతో గంటల తరబడి వాహనాలు నిలిపోతున్నాయి. మొగల్తూరు సెంటర్లోని ట్రాఫిక్ సమస్యను పరిష్కరించడానికి చర్యలు చేపట్టాలని, తక్షణమే రోడ్లకు మరమ్మతులు చేయించి ప్రమాదాలు జరుగకుండా చూడాలని స్థానికులు అధికారులను కోరుతున్నారు. మొగల్తూరు పాతకాలువ సెంటర్ ప్రాంతం నుంచి లాకు వరకు రహదారి వెడల్పు తక్కువగా ఉండటంతో వాహన చోదకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. అధికారుల పర్యవేక్షణ కొరవడటంతో ఉదయం, సాయంత్రం వేళల్లో ట్రాఫిక్ సమస్య తీవ్రంగా మారింది. సమస్య పరిష్కారానికి చర్యలు చేపట్టాలి. – యడ్ల చిట్టిబాబు, సీపీఎం నేత -
యథేచ్ఛగా మట్టి అక్రమ తవ్వకాలు
కొయ్యలగూడెం : మండలంలో మట్టి తోలకాలకు అద్దూఅదుపు లేకుండా పోతోంది. సాగునీటి చెరువుల నుంచి ట్రక్కుల ద్వారా అక్రమార్కులు మట్టిని తరలిస్తున్నారు. శుక్రవారం శ్రీరామనవమి సెలవు దినం కావడంతో అధికారుల పర్యవేక్షణ ఉండదనే భావనతో అక్రమార్కులు రెచ్చిపోయారు. రింగు రోడ్డు గ్రామాల్లో ఉన్న సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలించారు. వరుసగా నాలుగు రోజులు సెలవు దినాలు రావడంతో వందల ట్రక్కుల మట్టిని తోలడానికి ఒప్పందాలు కుదుర్చుకున్నారు. సాగునీటి చెరువుల్లోని మట్టిని కమర్షియల్ అవసరాలకు ఉపయోగిస్తున్నప్పటికీ అధికారులు పర్యవేక్షణ లేకపోవడంపై స్థానిక రైతుల ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. గతంలో రాత్రి వేళల్లో మట్టి తోలకాలు సాగించగా ఇప్పుడు పట్టపగలే మట్టి తోలకాలు చేస్తున్నారని వాపోతున్నారు. ఈ అక్రమ తోలకాల వల్ల రహదారులు అధ్వానంగా మారుతున్నాయని ప్రజలు గగ్గోలు పెడుతున్నారు. పశువులదాహార్తి కోసం చెరువులలో ఉన్న కొద్దిపాటి నీటిని కలుషితం చేస్తున్నారని దీంతో పశువులకు తాగడానికి నీరు కూడా దొరకడం లేదని పాడి రైతులు వాపోతున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఏపీ నిట్ ఆచార్యులకు జాతీయ ప్రాజెక్టుల మంజూరు
తాడేపల్లిగూడెం : నిట్కు చెందిన ఇద్దరు ఆచార్యులకు నూతనంగా జాతీయ ప్రాజెక్టులు మంజూరయ్యాయి. కెమికల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు డాక్టర్ కుల్డీప్ రాయ్, సివిల్ ఇంజనీరింగ్ విభాగానికి చెందిన ఆచార్యులు కె.షాలంలకు జాతీయ ప్రాజెక్టులు మంజూరయ్యాయనిశుక్రవారం నిట్ నుంచి విడుదలైన ఓ ప్రకటనలో పేర్కొన్నారు. డాక్టర్ కుల్డీప్ రాయ్ ఎండోక్రైన్కు భంగం కలిగించే ఫ్తాలేట్స్ను క్షీణింపజేయడానికి హైడ్రోడైనమిక్ క్యావిటేషన్ ద్వారా పర్సల్ఫేట్ సక్రియతపై యాంత్రిక అవగాహన అనే ప్రాజెక్ట్కు రూ 68 లక్షల నిధులను దక్కించుకున్నారు. కె.షాలం గ్రామీణ మల్టీ లేన్ రోడ్లలో డిజైన్ స్థిరత్వం కోసం నిరంతర ప్రయాణం డేటాతో స్థిరత్వం కోసం నిరంతర ప్రయాణం డేటాతో ఆపరేటింగ్ స్పీడ్ మోడల్స్ అభివృద్ధి అనే ప్రాజెక్ట్కు రూ.24 లక్షల నిధులను దక్కించుకున్నారు. ఆచార్యులు ఇద్దరూ మూడేల్ల కాల పరిమితిలో ఈ ప్రాజెక్ట్లను పూర్తి చేయాల్సిన ఉంటుంది. జాతీయ ప్రాజెక్ట్లను దక్కించుకున్న ఆచార్యులను ఏపీ నిట్ ఇన్చార్జి డైరెక్టర్ డాక్టర్ ఎస్వీ రమణారావు, రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకరరెడ్డి తదితరులు అభినందించారు. -
జోరుగా నాటు సారా విక్రయాలు
కొయ్యలగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో నాటు సారా విక్రయాలు యథేచ్ఛగా మండలంలో కొనసాగుతున్నాయి. మండలం సరిహద్దు ప్రాంతాలతో పాటు మంగపతిదేవిపేట, గంగవరం గ్రామాల్లోని మారుమూల ప్రాంతాలలో నాటుసారా బట్టీలను ఏర్పాటు చేసి అక్రమార్కులు నాటుసారా క్రయవిక్రయాలు చేస్తున్నారు. అచ్యుతాపురం గ్రామ పంచాయతీ పరిధిలో మద్యం బెల్ట్ షాపుల మాదిరిగా నాటుసారా దుకాణాలు ఏర్పాటు చేసి విక్రయాలు చేస్తున్నారని మహిళలు గగ్గోలు పెడుతున్నారు. గతంలో ఎకై ్సజ్ శాఖ అధికారలుకు ఫిర్యాదు చేసిన ఫలితం లేకుండా పోయిందని వాపోతున్నారు. నాటుసారా క్రయవిక్రయాలు చేస్తున్న వ్యక్తులు తాము మామూళ్లు ఇవ్వాల్సిన అధికారులకు సొమ్ములు ముట్ట చెబుతున్నామని తమను ఎవరు ఏమీ చేయలేరు అంటూ ధీమాగా మాట్లాడుతున్నారని ఆరోపిస్తున్నారు. ఫిర్యాదు చేసిన వ్యక్తులపై దౌర్జన్యానికి పాల్పడుతున్నారని రైతులు చెబుతున్నారు. వర్జీనియా పొగాకు సీజన్ ప్రారంభం అయిన నేపథ్యంలో ఇతర జిల్లాల నుంచి వస్తున్న వలస కార్మికులు నాటుసారాకి బానిసలుగా మారుతున్నారన్నారు. రాత్రి వేళల్లో యువకులు బైక్ల మీద ర్యాష్ డ్రైవింగ్ చేస్తూ ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నారన్నారు. గంగవరం గ్రామంలో సైతం నాటు సారావిక్రయాలు పెచ్చు మీరాయని రైతులు పేర్కొంటున్నారు. ఈ నేపథ్యంలో సంబంధిత శాఖల అధికారులు నాటు సారా క్రయ విక్రయాలు అరికట్టాలని ప్రజలు కోరుతున్నారు. -
అధికారులూ తేరుకోరూ..!
● క్షీరారామలింగేశ్వరుని రథం విషయంలో వింత పనులు ● టేకు రథానికి ప్లే ఉడ్తో మెరుగులు ● అధికారుల తీరుపై భక్తుల మండిపాటు పాలకొల్లు సెంట్రల్: జిల్లాలోని ప్రముఖ పుణ్యక్షేత్రం పంచారామక్షేత్రమైన శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో అధికారులు చేస్తున్న వింత పనులపై భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. స్వామి వారి రథం అంటే భక్తులకు ఎంతో సెంటిమెంట్. అయితే ఇటీవల గోల్డ్ కోటింగ్ పనుల పేరుతో టేకు చెక్కతో ఉన్న రథానికి ప్లైఉడ్తో ఫిటింగ్ పనులు చేస్తున్నారు. ఈ చర్యలపై భక్తులు అధికారుల తీరుపై మండిపడుతున్నారు. సాధారణంగా మరమ్మతుల విషయంలో ఆగమశాస్త్రానికి అనుగుణంగా అర్చకులు, అధికారులు వ్యవహరించాల్సి ఉంటుంది. భక్తులు ఆలయం విషయంలో ఏదైనా అనుమానం వ్యక్తం చేసినా ఆగమ శాస్త్రం ఒప్పుకోదంటూ, శృంగేరి పీఠాధిపతులతో సంప్రదించాలని అర్చకులు చెబుతూ ఉంటారు. అయితే రథం విషయంలో ప్లై ఉడ్తో కవరింగ్ పనులు చేస్తున్నా అర్చకులు ఈఓ, పాలకమండలి సభ్యుల తీరుపై పెదవి విప్పకపోవడం గమనార్హం. దీంతో వారు ఇష్టానుసారం ఆలయంలో వింత పనులు చేసుకుంటూపోతున్నారు. సుమారు మూడేళ్ల క్రితం పాడై ఉన్న స్వామివారి రథాన్ని ఓ భక్తుడు టేకు చెక్కతో మరమ్మతులు చేయించి అత్యంత శోభాయమానంగా తీర్చిదిద్దించాడు. నేడు ఆ రథానికి గోల్డ్ కోటింగ్ పేరుతో ఇష్టానుసారంగా చేస్తున్నారని అధిక సంఖ్యలో భక్తులు మండిపడుతున్నారు. భక్తుడు ఫోన్ లాక్కున్న సిబ్బంది సాధారణంగా ఆలయాల్లో ధ్వజ స్థంభం ఏర్పాటు చేసినా, రథం తయారు చేసినా ఎక్కువగా టేకు లేదంటే దేవదారు, చండ్ర వంటి కలపను ఉపయోగిస్తూ ఉంటారు. కానీ క్షీరారామలింగేశ్వరుని రథం విషయంలో మాత్రం టేకు చెక్కతో ఉన్న రథాన్ని ప్లైఉడ్తో మూసేసి దానిపై రాగి తాపడం చేయించి గోల్డ్ కోటింగ్ కొట్టిస్తామని అధికారులు చెబుతున్నారు. అయితే ప్లైఉడ్తో రథాన్ని ఎలా తయారు చేయిస్తారని ఓ భక్తుడు ఆ రథాన్ని ఫొటో తీసి ప్రశ్నించినందుకు అక్కడి సిబ్బంది ఆ భక్తుడి ఫోన్ లాక్కుని ఫొటో ఎందుకు తీశావు? అంటూ ఆ ఫొటోను డిలీట్ చేసి ఫోన్ భక్తుడికి ఇచ్చాడు. అయితే ఆ ఫోన్లోని రథం ఫొటో ఒకటి ఉండడంతో వెంటనే సదరు భక్తుడు విషయాన్ని ఈఓకు తెలియజేశాడు. రథాన్ని ప్లైఉడ్తో మరమ్మతులు చేయడాన్ని ఫొటో తీస్తుండగా ఆలయంలో టెంపరరీగా పని చేస్తున్న ఓ ఉద్యోగి తన ఫోన్ లాక్కున్నాడని రెండు రోజులు క్రితం భక్తుడు గూడపాటి దుర్గా వరదభుజంగరావు ఆలయ ఈఓ ముచ్చర్ల శ్రీనివాసరావుకు ఫోన్ చేశాడు. అయితే చర్యలు తీసుకోవాల్సిన ఈఓ తిరిగి భక్తుడిపైనే ఆగ్రహం వ్యక్తం చేయడం విశేషం. ‘మా అర్చకులు, అధికారులు, పాలకమండలి సభ్యులకు లేని ఇబ్బంది నీకెందుకు?’ అంటూ భక్తుడిపై ఆయన మండిపడ్డారు. నీకు వేరే పనిలేదా? ఇదే పని మీద ఉంటున్నావా? గుళ్లో చెక్క పెట్టారా? ప్లై ఉడ్ పెట్టారా? ఆయిల్ రాశారా? అసలు గుళ్లో ఇదే పనా? అంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. మేము ఉద్యోగం చేసుకోవాలా? మానేయాలా? నువ్వు ఎన్ని పిటిషన్లు పెట్టుకుంటావో? పెట్టుకో నేను చూస్తానులే అంటూ ఆ భక్తుడిపై సహనం కోల్పోయి ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటికై నా అధికారులు, పాలకవర్గ సభ్యులు, అర్చకులు భక్తుల మనోభావాలను గౌరవించి రథం పనులు చేయాలని కోరుతున్నారు. -
ఆక్రమణలను వెంటనే తొలగించాలి
పెనుగొండ : పంచాయతీ స్థలాలు ఆక్రమణలు, ప్రజలకు ఇబ్బంది కలిగించే ఆక్రమణలు గుర్తించి సత్వరం తొలగించాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి ఆదేశించారు. శుక్రవారం పెనుగొండలో ఆకస్మిక తనిఖీలు చేశారు. రైతు బజారు ఏర్పాటు, చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు స్థలాలను పరిశీలించారు. అనంతరం సంత మార్కెట్, పంచాయతీ కాంప్లెక్స్ల వద్ద ఆక్రమణలను పరిశీలించారు. పంచాయతీ కాంప్లెక్స్ అద్దెల వివరాలను ఆరా తీశారు. వేలంలో దక్కించుకొంటున్నవారే షాపుల నిర్వహిస్తున్నారా? తిరిగి ఇతరులకు అద్దెకిస్తున్నారా? అని ప్రశ్నించారు. దుకాణాలను ఆకస్మిక తనికీ చేసి ప్లాస్టిక్ వినియోగంపై తగు చర్యలు తీసుకోవాలని స్థానిక అధికారులను ఆదేశించారు. గ్రామాల్లో పార్కుల ఏర్పాటు వలన ప్రజలకు స్వచ్ఛమైన వాతావరణం లభిస్తుందన్నారు. ఆయన వెంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ సర్పంచ్ నక్కా శ్యామలాసోనీ శాస్త్రి, సొసైటీ ఛైర్మన్ నక్కా వేద వ్యాస శాస్త్రి ఉన్నారు. ఆచంటలో ఆచంటలో రైతు బజారు, చిల్డ్రన్ పార్కు ఏర్పాటుకు స్థలాలను శుక్రవారం జాయింట్ కలెక్టరు టి.రాహుల్కుమార్రెడ్డి పరిశీలించారు. జిల్లాలో గ్రామాభివృద్ధికి ప్రాధాన్యతనిస్తూ ప్రజా సౌకర్యాల విస్తరణపై జిల్లా యంత్రాంగం దృష్టి సారించిందన్నారు. అనంతరం ఆచంట రామేశ్వర స్వామిని దర్శించుకుని పూజలు చేశారు. యువకుడి అదృశ్యం తణుకు అర్బన్: తణుకుకు చెందిన యువకుడు తాను చనిపోతున్నానంటూ కుటుంబ సభ్యులకు వాయిస్ మెసేజ్ పెట్టి అదృశ్యమైన ఘటన కలకలం రేపింది. తణుకు పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణానికి చెందిన చిట్టూరి భీమరాజు (25) గురువారం రాత్రి తన కుటుంబ సభ్యులకు తాను చనిపోతున్నానని చెబుతూ వాయిస్ మెసేజ్ పెట్టి అదృశ్యమయ్యాడు. అతని బైక్, చెప్పులు వెంకట్రాయపురం ఆంధ్రా సుగర్స్ సమీపంలోని కాలువ వంతెన వద్ద కనిపించడంతో అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు కాలువ వెంబడి గాలింపు చర్యలు చేపట్టారు. అయితే ఎంతకూ భీమరాజు ఆచూకీ లభ్యం కాకపోవడంతో శుక్రవారం తణుకు పట్టణ పోలీసులకు సమాచారం అందించారు. అయితే భీమరాజు వినియోగిస్తున్న సెల్ఫోన్ సిగ్నల్ ఆధారంగా అతన్ని గుర్తించేందుకు ప్రయత్నిన్నామని తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ తెలిపారు. కుటుంబ సభ్యులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు మిస్సింగ్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. రేపు అండర్–9 చదరంగం పోటీలు తాడేపల్లిగూడెం (టీఓసీ): మాస్టర్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం తాడేపల్లిగూడెం అండర్–9 బాల బాలికల చదరంగం పోటీలు నిర్వహిస్తామని జిల్లా టోర్నమెంట్ కమిటీ కన్వీనర్ ఎస్ఎస్ చంద్రశేఖర్ తెలిపారు. శుక్రవారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ 01.01.2017 తరువాత పుట్టిన వారు మాత్రమే పోటీలకు అర్హులన్నారు. మొదటి, రెండు స్థానాలు సాధించిన క్రీడాకారులు జూన్ నెలలో తూర్పుగోదావరి జిల్లాలో జరిగే రాష్ట్ర స్థాయి అండర్–9 పోటీలకు ఎంపిక అవుతారని తెలిపారు. మరిన్ని వివరాలకు 94408 67370 నంబర్కు ఫోన్ చేయాలని ఆయన సూచించారు. -
అండర్–19, 23 క్రికెట్ జట్ల ఎంపిక
అండర్ –19 జట్టుకు ఎంపికై న క్రీడాకారులు అండర్–23 జట్టుకు ఎంపిక క్రీడాకారులు ఏలూరు రూరల్ : ఆంధ్ర క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో త్వరలో నిర్వహించే అంతర జిల్లాల క్రికెట్ పోటీల్లో పాల్గొనే ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా బాలుర క్రికెట్ జట్లు ఎంపిక చేశామని ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడు జి.ఆదిత్యవర్మ, కార్యదర్శి వీవీఎస్ఎం శ్రీనివాసరాజు శుక్రవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 25, 26 తేదీల్లో ఆశ్రం మెడికల్ కళాశాల క్రీడా మైదానంలో రెండురోజుల పాటు నిర్వహించే ఎంపిక, ప్రొబెబుల్స్ పేర్లు శుక్రవారం వెల్లడించారు. అండర్–23 జట్టు : ఈ జట్టుకు కె,రేవంగ్నాగకుమార్( కెప్టెన్), కేకేఎస్ఎన్ హరీస్( వికెట్ కీపర్), వీఎంవీఎస్ రక్షన్, సీహెచ్ వినయ్, కె.ప్రణీత్పవన్, టి.ప్రవీణ్కుమార్, ఎస్కె తస్లీమ్సాబిర్, వి.లోహిత్, ఆర్.చంద్రఅనిష్క్, బి.నాగేంద్రబాబు, ఎం.హర్షవర్ధన్, జి.చరణ్తేజ, ఎండీ మెహబూబ్ఆలీ, ఎ.కౌసిక్ మణిబాలాజీ, జె.శేయర్, కె.యశ్వంత్, డి.యశ్వంత్, బీహెచ్ సాయిసుశాంత్, ఒ.రణదీప్, కె.సాయికిరణ్వర్మ, పి.నిశ్చయ్, బీహెచ్ సాయిసుమంత్, ఎ.పార్థసారథి ఎంపికయ్యారు. అండర్–19 జట్టు : ఈ జట్టుకు ఒ.రణదీప్, కె.పొనన్నారాయణ, జి.గౌతమ్రాజ్, కేవీఎస్ సుబ్బారాయుడు, సీహెచ్ అకిల్, పీవీఎస్ రేవంత్వర్మ, సీహెచ్ వినయ్, ఎ.మోహనిష్, జి.జితేష్ సాయివల్లభన్, జె.సాయిరామ్చరణ్రాజు, సీహెచ్ వైభవ్రాజ్, ఆర్ఏ సత్యకుమార్, ఏఆర్ మోహనన్ వరప్రసాద్, ఎ.అర్జున్, కె.రేవంత్ నాగ కుమార్, కె.యశ్వంత్, ఎన్.రిషిసంజయ్, సీహెచ్ఎంఎస్ నాగశక్తి, టి.లలితపవన్, వై.ప్రవీణ్, వై.ప్రవీణ్, ఏటీఎస్ దీక్షిత్, వివేక్జైన్, ఎ.సురేష్, కె.సాయికిరణ్వర్మ, ఎ.పార్థసారథి, కె.చరీష్, ఏటీఎన్ఎస్ఎస్ అజిత్, టి.ధోనీవెంకటేశ్వరరావు ఎంపికయ్యారు. -
మతం మారితే కులం మారుతుందా?
ఏలూరు (టూటౌన్): మతం మారినంత మాత్రాన కులం మారుతుందా? అని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్కుమార్ ప్రశ్నించారు. స్థానిక ఎన్ఆర్ఫేటలోని ఎస్సీఆర్పీఎస్, ఏఐఏవైఎస్ రాష్ట్ర కార్యాలయంలో భారత రాజ్యాంగం, ఎస్సీ క్రైస్తవులు సుప్రీంకోర్టు తీర్పు అనే అంశంపై ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడారు. ఇటీవల సుప్రీంకోర్టు ఎస్సీ క్రైస్తవులపై ఇచ్చిన తీర్పుపై పునరాలోచన చేయాలని కోరారు. రాజ్యాంగంలోని ఆర్టికల్ 25 ప్రకారం మత స్వేచ్ఛ మత హక్కు మత పరిరక్షణ స్వేచ్ఛగా తీసుకునే అర్హత కలిగినా, దాని ఆధారంగా రిజర్వేషన్ లేదని చెప్పడం అన్యాయమన్నారు. కార్యక్రమంలో రాజ్యాంగ ధర్మ పరిషత్ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ఏడీ పాల్, పాస్టర్ యోహాను రిటైర్డ్ ఎస్సై పాక ప్రభాకర్, దిలీప్ తదితరులు పాల్గొన్నారు. తణుకు అర్బన్: ప్రమాదవశాత్తూ కాలువలో పడి వ్యక్తి మృతి చెందిన ఘటన శుక్రవారం తణుకులో చోటు చేసుకుంది. స్థానిక వేల్పూరు రోడ్డులోని వీమాక్స్ థియేటర్ సమీపంలో నివాసం ఉంటున్న కోలా శ్రీనివాస్ (58) స్నానం చేసేందుకు కాలువలోకి దిగాడు. అయితే ప్రమాదవశాత్తూ నీటిలో మునిగి మృతి చెందాడు. శ్రీనివాస్ భార్య ఏడేళ్ల క్రితం చనిపోగా, సెంట్రింగ్ పనులు చేసుకుంటూ తన కుమారుడి వద్ద ఉంటున్నారు. శుక్రవారం శ్రీరామనవమి కావడంతో జుట్టు కత్తిరించుకునేందుకు వెళ్లిన శ్రీనివాస్ పెద్ద వంతెన సమీపంలో కాలులో స్నానానికి దిగాడు. ప్రమాదవశాత్తూ మునిగిపోవడంతో మృతదేహం కొద్ది దూరంలో బయటపడింది. ఈ మేరకు మృతుడి కుమారుడు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తణుకు పట్టణ ఎస్సై కె.శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఇద్దరికి తీవ్ర గాయాలు భీమడోలు: గుండుగొలను– కొవ్వూరు జాతీయ రహదారి పొలసానిపల్లి వద్ద శుక్రవారం హైవేపై కూలీలున్న ఓ ట్రాక్టర్ను ఓ కారు ఢీకొట్టిన ఘటనలో ఇద్దరికి తీవ్ర గాయాలయ్యాయి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పొలసానిపల్లి వద్ద హైవేపై కూలీలు మొక్కలు, రోడ్డు పరిశుభ్రం చేసే పనుల కోసం వచ్చారు. అయితే రాజమండ్రి నుంచి ఏలూరు వైపుగా వస్తున్న కారు ట్రాక్టర్ను వెనుక నుంచి ఢీకొట్టింది. దీంతో ట్రాక్టర్ బోల్తా కొట్టింది. ట్రాక్టర్లో ఉన్నభీమడోలుకు చెందిన సూపర్వైజర్ అఖిల్, మహిళా కూలీ పెద్దింట్లుకు తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న భీమడోలు 108 అంబులెన్స్ సిబ్బంది సంఘటన స్థలానికి చేరుకుని, వారిని చికిత్స కోసం ఏలూరు ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. ఈ ఘటనపై భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
వెంకటేశ్వరస్వామిపై ఆదిత్యుడి కిరణాలు
భీమవరం (ప్రకాశంచౌక్): జువ్వలపాలెంలో శ్రీ దంతులూరి జగన్నాథరాజు సత్రం అనుబంధ సంస్థ వెంకటేశ్వరస్వామి ఆలయంలో శుక్రవారం ఉదయం సూర్యకిరణాలు ప్రసరించాయి. ఈ విషయం తెలియగానే ఆలయ పరిసర ప్రాంత ప్రజలు తరలివచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. పలువురు భక్తులు ఆనందం వ్యక్తం చేశారు. పాలకొల్లు సెంట్రల్: స్థానిక క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయంలో స్వామివార్ల కల్యాణోత్సవాల్లో భాగంగా శుక్రవారం రాత్రి గణపతి పూజ, అంకురార్పణ, ధ్వజారోహణ, అగ్ని ప్రతిష్ఠాపన, బలిహరణ పూజలు చేశారు. రాత్రి తెల్లవారితే ఆదివారం శ్రీ పార్వతి సమేత శ్రీ క్షీరారామలింగేశ్వరస్వామి, శ్రీ లక్ష్మీ సమేత శ్రీ జనార్దనస్వామి వారి సప్తాహ్నక కల్యాణం నిర్వహించనున్నారు. కార్యక్రమంలో ఆలయ చైర్మన్ మీసాల రామచంద్రరావు, ట్రస్ట్బోర్డు సభ్యులు, ఆలయ అభిషేక పండిట్ భమిడపాటి వెంకన్న, మద్దూరి సూరిబాబు, ఫని, ఆలయ ప్రధానార్చకులు కోట అనిల్, కిష్టప్ప తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉభయ గోదావరి జిల్లాల ఉపాధ్యాయ ఎమ్మెల్సీ బొర్రా గోపీమూర్తి స్థానిక ఏలూరు కోటదిబ్బ జూనియర్ కాలేజీలో జరుగుతున్న ఇంటర్మీడియట్ పరీక్ష పత్రాల మూల్యాంకన కేంద్రాన్ని శుక్రవారం సందర్శించారు. ఈ సందర్భంగా మూల్యాంకన విధులకు హాజరైన అధ్యాపకుల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. వారికి కల్పిస్తున్న సౌకర్యాలు ఆరా తీశారు. కార్యక్రమంలో యూటీఎఫ్ జిల్లా అధ్యక్షురాలు బొర్రా సుభాషిణి, జిల్లా కార్యదర్శి ఈడే శివశంకరరావు తదితరులు పాల్గొన్నారు. అనంతరం యూటీఎఫ్ కేంద్ర కార్యలయానికి చేరుకుని విధాన పరమైన ముఖ్యమైన విషయాల గురించి యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి రుద్రాక్షి రవికుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక హిందూ యువజన సంఘం 122వ వార్షికోత్సవాల్లో భాగంగా స్థానిక వైఎంహెచ్ఏ హాలులో శుక్రవారం శ్రీరామనవమి ఉత్సవం భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రదర్శించిన ఆధ్యాత్మిక, సాంస్కృతిక కార్యక్రమాలు విశేషంగా అలరించాయి. తొలుత వేదికపై సీతారామ సమేత లక్ష్మణ ఆంజనేయ స్వామిని పట్టు వస్త్రాలతో అలంకరించి, పూజలు చేశారు. సాయంత్రం ధనలక్ష్మి బృందం విష్ణు సహస్రనామ పారాయణం భక్తి పారవశ్యంలో ముంచెత్తింది. బీకే బిందు ఆలాపనలో సాయిగణేష్ చారి బృందం ఆలపించిన సాకేత రామ సంకీర్తనం మంత్రముగ్ధులను చేసింది. కళారత్న పార్వతీ రామచంద్రన్ శిష్యులు ప్రదర్శించిన సుందరకాండ కూచిపూడి నృత్య రూపకం, రామ కీర్తనలకు చేసిన నృత్యాలు ఆకట్టుకున్నాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వ ఉగాది పురస్కార గ్రహీతలు సోమ్లా నాయక్, ప్రముఖ సంగీత కళాకారుడు ఎస్పీఎస్ వాసులను దుశ్శాలువా, జ్ఞాపికలతో ఘనంగా సన్మానించారు. కార్యక్రమంలో హిందూ యువజన సంఘం మేనేజ్మెంట్ కమిటీ అధ్యక్షుడు యర్రా సోమలింగేశ్వర రావు, ప్రధాన కార్యదర్శి కేవీ సత్యనారాయణ, కోశాధికారి కానాల బాల వెంకట రమేష్ తదితరులు పాల్గొన్నారు. -
మహాకుంభం సమర్పణ
తాడేపల్లిగూడెం: పట్టణ ఇలవేల్పు బలుసులమ్మ తల్లి జాతర మహోత్సవాలలో భాగంగా తల్లికి ప్రీతికరమైన శుక్రవారం మహాకుంభాభిషేకం శుక్రవారం నిర్వహించారు. ఉదయం ఆలయ శిఖరం నుంచి బూరెలు పోశారు. మహుకుంభ నివేదన అనంతరం అన్న ప్రసాద వితరణ కార్యక్రమాన్ని ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాసు, ఉత్సవ కమిటీ చైర్మన్ శ్రీరంగం అంజి ప్రారంభించారు. భక్తులు సమర్పించిన బూరెలు, స్వీట్లు ఇచ్చారు. వీటిని రాశులుగా పోసి అన్నప్రసాదంలో పంచారు. మూడు ప్రాంతాల్లో ఈ కార్యక్రమం ఏర్పాటుచేయడంతో వచ్చిన భక్తులు ఇబ్బంది పడకుండా అమ్మ ప్రసాదాన్ని స్వీకరించగలిగారు. ఆలయం వద్ద పురుషుల కోసం, మహిళల కోసం వేర్వేరుగా ఆరు కౌంటర్లు ఏర్పాట్లు చేశారు. శేష్ మహల్ రోడ్డు, మసీదు సెంటర్ ప్రాంతాల్లో ఏర్పాటుచేసిన ప్రాంతంలో ఇదే తరహా పద్దతులను పాటించారు. వలంటీర్లు, భక్తులు అన్నప్రసాద వితరణ చేశారు. ఈ సందర్భంగా అమ్మవారి ప్రత్యేక రూపాన్ని నైవేద్య పదార్ధాలతో ఆలయం ముందు తయారుచేశారు. జాతర మహాకుంభ నివేదనతో పరిపూర్ణమైంది. -
నాటకాల ప్రాముఖ్యత చాటిచెప్పాలి
భీమవరం (ప్రకాశంచౌక్): సమాజంలో మార్పు కోసం, మంచి వైపు నడిపేలా నాటక రంగం ప్రభావితం చేస్తుందని పట్టణ కళాకారుల సంఘం కన్వీనర్ చెరుకువాడ రంగసాయి, ప్రజా నాట్య మండలి జిల్లా కార్యదర్శి మల్లుల సీతారామ ప్రసాద్ అన్నారు. భీమవరం వెంకట్రామ థియేటర్లో శుక్రవారం పట్టణ కళాకారుల సంఘం ఆధ్వర్యంలో ప్రపంచ రంగస్థల దినోత్సవాన్ని పురస్కరించుకుని 24 మంది నాటక, సంగీత, నృత్య కళాకారులను సత్కరించారు. ఈ సందర్భంగా పలువురు వక్తలు మాట్లాడుతూ నాటకాల ప్రాముఖ్యతను నేటి యువతరానికి తెలియజేయాలని, ప్రభుత్వాలు కూడా ఆదుకోవాలని అన్నారు. శ్రీవిజయ దుర్గ ఆర్ట్స్ థియేటర్ వైస్ ప్రెసిడెంట్ గాదిరాజు రంగరాజు, నాటక కళాకారులు పులగం నరసింహారావు, కొల్లాబత్తుల సూర్య కుమార్ మాట్లా డుతూ నాటకాలను ప్రోత్సహించడానికి ప్రభుత్వం ముందడుగు వేయాలని, తీర్థాలు, ఉత్సవాల్లో రంగస్థలానికి ప్రాముఖ్యత ఇవ్వాలన్నారు. అనంతరం 24 మంది నాటక, సంగీత, నృత్య కళాకారులకు సత్కరించారు. కార్యక్రమంలో కళాకారులు కాటి వెంకటరత్నం, షేక్ వల్లి, ఆదినారాయణ, దాశరధి శ్రీనివాస్, గొన్నాబత్తుల మల్లేశ్వరరావు, కలిగొట్ల గోపాల శర్మ, డా ఎస్ఎస్ రాజు, డా నాగేశ్వరరావు, కొత్తపల్లి త్రినాధ్ రాజు తదితరులు పాల్గొన్నారు. కళాకారులను సత్కరిస్తున్న దృశ్యం -
శ్రీరామనవమి శోభ
యథేచ్ఛగా అక్రమ తవ్వకాలు కొయ్యలగూడెం మండలంలో మట్టి తోలకాలకు అడ్డూ అదుపు లేకుండా పోతోంది. రింగు రోడ్డు గ్రామాల్లో సాగునీటి చెరువుల నుంచి మట్టిని అక్రమంగా తరలిస్తున్నారు. 8లో uశనివారం శ్రీ 28 శ్రీ మార్చి శ్రీ 2026ఏలూరు జిల్లాలో శుక్రవారం శ్రీరామనవమి వేడుకలు ఘనంగా జరిగాయి. సీతారాముల కల్యాణోత్సవాన్ని తిలకించేందుకు భక్తులు పెద్ద ఎత్తున తరలిరావడంతో ఆలయాలన్నీ కిటకిటలాడాయి. ఉదయం నుంచే ఆలయాల్లో ప్రత్యేక పూజలు, అభిషేకాలు నిర్వహించారు. పానకం, వడపప్పు ప్రసాదాల పంపిణీ చేశారు. – సాక్షి నెట్వర్క్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఆర్ఆర్పేట రామాలయం వద్ద పానకం పంపిణీజంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో సీతారామ కళ్యాణం ఏడాదంతా పందేల జోరు టిక్కెట్ల స్కాంలో ఇద్దరి అరెస్ట్ నిందితులకు రిమాండ్ -
మెట్ట ప్రాంతాల్లోనూ..
ఇక జిల్లాలోని మెట్ట ప్రాంతాలకు కూడా ఏడాది పొడవునా పందేల నిర్వహణ పాకింది. ప్రధానంగా జంగారెడ్డిగూడెం, చింతలపూడి, ద్వారకాతిరుమల, నూజివీడు నియోజకవర్గంలోని ఆగిరిపల్లి, నూజివీడు మండలాల్లో పెద్ద ఎత్తున పందాలు నిర్వహిస్తున్నారు. శుక్రవారం జంగారెడ్డిగూడెం మండలంలోని శ్రీనివాసపురంలోని ఓ పామాయిల్ తోటలో ఉదయాన్నే సుమారు 200 మందితో కోడిపందేల నిర్వహణ ప్రారంభించారు. పండగ హడావుడి కావడంతో ఎవరూ పట్టించుకోరని కోడిపందేలకు తెరతీయగా స్థానికులు సోషల్ మీడియాలో పందేల వీడియో పోస్టు చేయడం పోలీసులు వస్తున్నారనే సమాచారంతో పందెంరాయుళ్లు పరారయ్యారు. చింతలపూడి మండలంలోని శివాపురం, చింతలపూడి, తీగలవంచ, కొమ్ముగూడెం ప్రాంతాల్లో శుక్రవారం పోలీసులు దాడి చేయగా 32 మంది పందెంరాయుళ్లను అరెస్టు చేశారు. వారి నుంచి రూ.30,180 నగదు, 20 ద్విచక్రవాహనాలు, 14 కోళ్ళు స్వాధీనం చేసుకున్నారు. నూజివీడు మండలం సుంకొల్లు గ్రామంలో కోడిపందేల నిర్వహణపై పోలీసులు సమాచారం అందుకుని 3 కోళ్లు, 2 కత్తులు, రూ.6480 నగదు, 9 మందిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేశారు. -
నిద్రమత్తులో లారీపై నుంచి కింద పడి..
పెదపాడు: నిద్రమత్తులో లారీపై నుంచి కిందపడి క్లీనర్ మృతి చెందిన ఘటన పెదపాడు పోలీసు స్టేషన్ పరిధిలోని ఏపూరులో చోటుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాలు ప్రకారం మదనపల్లి గ్రామం అన్నమయ్య జిల్లాకు చెందిన షేక్ తాజుద్ధీన్(40) మేతలు లోడు చేసుకునేందుకు లారీ డ్రైవర్ షేక్ అబ్దుల్ షుకూర్తో కలిసి ఏపూరు స్నేహ ేఫీడ్స్ వద్దకు వచ్చాడు. రాత్రి 8.50 నిమిషాలు కావడంతో స్నేహ ఫీడ్స్ సిబ్బంది రేపు ఉదయం లోడు చేస్తామని చెప్పారు. దీంతో ఆ ప్రాంగణంలో పార్కింగ్ చేసి నిద్రించారు. సుమారు రాత్రి 11 గంటల సమయంలో పెద్ద ఎత్తున సౌండు రావడంతో డ్రైవర్ షుకూర్ చూసేసరికి క్లీనర్ తాజుద్దీన్ లారీపై నుంచి కింద పడి రక్తపు గాయాలతో ఉన్నాడు. వెంటనే అతడిని గన్నవరం పిన్నమనేని సిద్ధార్థ మెడికల్ కళాశాలకు తరలించగా అప్పటికే మృతి చెందినట్లు నిర్ధారించారు. తాజుద్ధీన్ తమ్ముడు ఇర్ఫాన్ ఫిర్యాదు మేరకు పెదపాడు ఎస్సై ఆర్ శ్రీనివాస్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఆగిరిపల్లి: బంగారం చోరీ కేసులో మహిళను పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమె నుంచి చోరీ సొత్తు స్వాధీనం చేసుకున్నారు. ఎస్సై శుభశేఖర్ కేసు వివరాలను వెల్లడించారు. నెక్కలం గొల్లగూడెం గ్రామానికి చెందిన ఉప్పలపాటి శోభనాద్రమ్మ ఇంట్లో గతేడాది అక్టోబర్లో గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లో చొరబడి 27 గ్రాముల బంగారం అపహరించారు. బాధితుల ఫిర్యాదు మేరకు ఎస్సై శుభశేఖర్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేశారు. పోలీసుల విచారణలో అదే గ్రామానికి చెందిన చదల వెంకటేశ్వరమ్మ ఈ చోరీకి పాల్పడినట్లు తేలింది. మంగళవారం పోలీసులు ఆమెను అరెస్ట్ చేసి ఆమె నుంచి దొంగిలించిన బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. అత్తిలి : ఆరవల్లి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ప్లస్లో బోటనీ అధ్యాపకురాలుగా పనిచేస్తున్న చల్లా హేమలత చండీఘర్లో నిర్వహించిన ఆల్ ఇండియా సివిల్ సర్వీసెస్ యోగ చాంపియన్ షిప్ పోటీల్లో బంగారు, రజిత పతకాలను సాధించారు. 40 నుంచి 50 సంవత్సరాల కేటగిరీలో ఆర్టిస్టిక్ ఫెయిర్లో బంగారు పతకాన్ని, రిథమిక్ పెయిర్లో సిల్వర్ పతకాన్ని ఆమె సాధించారు. జాతీయ స్థాయిలో రెండు పతకాలు సాధించిన హేమలతను ఈ సందర్భంగా పాఠశాల అధ్యాపకులు అభినందించారు. తన విజయానికి భర్త రామకృష్ణ ఎంతో సహకరించారని హేమలత తెలిపారు. -
రొయ్యల పెంపకంపై శిక్షణ ప్రారంభం
ఉండి: రొయ్యల సాగులో నీటి నాణ్యత, మేతల యాజమాన్యం అత్యంత ప్రాముఖ్యమైనవని ఎన్నార్పీ అగ్రహారం కేవీకే ప్రోగ్రాం కోఆర్డినేటర్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు అన్నారు. కేవీకేలో రొయ్యల పెంపకంపై ఏర్పాటు చేసిన శిక్షణా కార్యక్రమం గురువారం ప్రారంభమైంది. ముఖ్య అతిథిగా ఎంపెడా అసిస్టెంట్ డైరెక్టర్ శ్యామ్ కే మెహతా పాల్గొని మాట్లాడారు. రొయ్యల ఎగుమతులు, విలువ ఆధారిత ఉత్పత్తులు, దేశీయ రొయ్యల మార్కెట్ అభివృద్ధి, సుస్థిర రొయ్యల పెంపకం వంటి వాటిపై రైతులకు అవగాహన ఉండాలన్నారు. కేవీకే హెడ్ మాట్లాడుతూ చెరువు తయారీలో పలు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. కోర్సు ఇన్చార్జి, మత్స్య శాస్త్రవేత్త ఏ శ్రీనివాసరావు మాట్లాడుతూ రొయ్యల పెంపకంలో చెరువుల తయారీతో పాటు మట్టి పరీక్షలు జరగాలని అన్నారు. వానపాముల ఎరువు ఎకరాకు సుమారు 150 కి.వాడాలని సూచించారు. రొయ్యల పిల్ల చెరువులో వదిలే సమయంలో రెండు చిన్న ఆపాలు చెరువులో పెట్టుకుని వాటిలో ఒక్కొక్క దానిలో 100 పిల్లల చొప్పున వేసి రెండు రోజుల తరువాత లెక్కగట్టి బతుకుదల శాతం తెలుసుకొని యాజమాన్య పద్ధతులు పాటించాలని సూచించారు. కార్యక్రమంలో గాదిరాజు వెంకట సూర్యనారాయణరాజు, తాటిపట్టి భాను తదితర రైతులు పాల్గొని మాట్లాడారు. -
మద్ది హుండీ ఆదాయం రూ.63,26 లక్షలు
జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో గురువారం హుండీ ఆదాయాన్ని లెక్కించారు. జిల్లా దేవాదాయ శాఖ అధికారి కూచిపూడి శ్రీనివాస్ పర్యవేక్షణ, పోలీస్, రెవెన్యూ అధికారుల సమక్షంలో కేవీవీ బ్యాంక్ సిబ్బంది, ఆలయ సిబ్బంది హుండీలను తెరచి లెక్కింపు నిర్వహించారు. హుండీల ద్వారా 106 రోజులకు గాను రూ.62,34,432, అన్నదానం హుండీ ద్వారా రూ.92,023 మొత్తం రూ.63,26,455 ఆదాయం లభించినట్లు ఆలయ సహాయ కమిషనర్, కార్యనిర్వహణాధికారి ఆర్వీ చందన తెలిపారు. జంగారెడ్డిగూడెం: స్థానిక గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం హుండీ లెక్కింపు కార్యక్రమం గురువారం నిర్వహించారు. 80 రోజులకుగాను మొత్తం రూ.11,36,434 లక్షలు ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కలగర శ్రీనివాస్ తెలియజేశారు. జిల్లా దేవాదాయ ధర్మాదాయ శాఖ ఇన్స్పెక్టర్ వి.సురేష్కుమార్ ఆధ్వర్యంలో జరిగిన హుండీ లెక్కింపు కార్యక్రమంలో ఆలయ ధర్మకర్తల, మండలి చైర్మన్ అల్లూరి రామకృష్ణ, కన్నా కృష్ణ, కొప్పుల నాగ సురేంద్ర, ముప్పుడి భాను, ప్రియాంక, దివ్య ప్రసన్న, ఆరేపల్లి నాన్ని, అభివృద్ధి కమిటీ సభ్యులు అబ్బిన దత్తాత్రేయ, దండు ధనరాజు, ఫణి, ఏలూరు విజయవాడ రిటైర్డ్ ఎంప్లాయీస్ యూనియన్, ఇండియన్ బ్యాంక్, ఆలయ సిబ్బంది పాల్గొన్నారు. ముదినేపల్లి (కై కలూరు): ప్రేమ వివాహం చేసుకుందనే కోపంతో నిండు చూలాలిపై ఓ కన్నతండ్రి పాశవికంగా దాడి చేసిన ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. ముదినేపల్లి పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పెదకోమర్రుకు చెందిన పట్టపు సూర్యనారయణకు ఇద్దరు ఆడ పిల్లలు. పెద్ద కుమార్తె శ్రావణి కొన్ని నెలల క్రితం ప్రేమ వివాహం చేసుకుంది. ఆమె ప్రస్తుతం 8 నెలల నిండు గర్భిణి. ప్రేమ వివాహం చేసుకోవడంతో తల్లిదండ్రులతో పాటు చెల్లెలు ప్రవల్లిక సైతం శ్రావణిపై కోపం పెంచుకున్నారు. శ్రావణి తాత ఆంజనేయులు, తండ్రి వెంకట సూర్యనారాయణ పక్కపక్క ఇళ్లలోనే నివసిస్తున్నారు. ఈ క్రమంలో శ్రావణి గర్భవతి కావడంతో తాత ఆంజనేయులు ఆమెను తన ఇంటికి తీసుకువచ్చాడు. ఈ నెల 23న శ్రావణి ఇంటి తలుపు తీస్తుండగా తండ్రి సూర్యనారాయణ ఆమెను కొట్టడానికి రావడంతో భయపడి లోపలికి వెళ్లి తలుపులు వేసుకుంది. ఇంతలో అడ్డువచ్చిన ఆంజనేయులును సైతం సూర్యనారాయణ చితకబాదడంతో శ్రావణి బయటకు రాగా ఆమెను కాలితో కడుపుపై తన్నాడు. తండ్రితోపాటు శ్రావణిపై తల్లి, చెల్లి కూడా దాడి చేశారు. గర్భిణి శ్రావణిని గుడివాడ ఆస్పత్రికి 108లో తరలించారు. తాత ఆంజనేయులు ఫిర్యాదుతో గురువారం కేసు నమోదు చేశారు. -
పురుగు మందు తాగి దంపతుల ఆత్మహత్యాయత్నం
కలిదిండి (కై కలూరు): చెరువు తవ్వుకోవడానికి కొందరు వ్యక్తులు పెడుతున్న ఇబ్బందులు తాళలేక దంపతులు ఆత్మహత్యయత్నానికి పాల్పడ్డారు. వివరాలు ఇలా ఉన్నాయి. కలిదిండి మండలం కొండంగి గ్రామానికి చెందిన తిరుమలశెట్టి వెంకట నరసయ్య, పద్మావతి దంపతులు చెరువు తవ్వుకోవడానికి నిర్ణయించుకున్నారు. అయితే వారు కొందరికి అప్పుగా కొంత నగదు చెల్లించాల్సి ఉండడంతో వారు చెరువు తవ్వకుండా పొక్లెయిన్ను అడ్డుకున్నారు. దీంతో మనస్థాపం చెందిన దంపతులు పురుగుమందు తాగారు. వీరిని ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతున్న దంపతులను వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) పరామర్శించారు. మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. దంపతుల ఆత్మహత్య విషయమై కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావును వివరణ కోరగా తమకు సమాచారం రాలేదని చెప్పారు. వ్యాన్ ఢీకొని మోటార్సైక్లిస్టుకు గాయాలు భీమవరం అర్బన్: వ్యాన్ ఢీకొని మోటార్సైక్లిస్టుకు గాయాలయ్యాయి. నాగిడిపాలెంకు చెందిన బర్రె ఏసు తెల్లవారుజామున తన ద్విచక్ర వాహనంపై చేపల పట్టుబడికి వెళ్తుండగా నాగిడిపాలెం వంతెన వద్ద వ్యాన్ ఢీకొట్టడంతో గాయాలయ్యాయి. అతడిని స్థానికులు భీమవరంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. బాధితుడు ఏసు ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై ఐ వీర్రాజు కేసు నమోదు చేశారు.ఆస్పత్రిలో పరామర్శించిన డీఎన్నార్ -
ఇన్స్టా పరిచయం.. కడకు విషాదాంతం
● ఇన్స్ట్రాగామ్ ద్వారా వివాహితతో యువకుడి పరిచయం ● ఆ పరిచయం ప్రేమగా మారి వారిద్దరూ పెళ్లిచేసుకున్న వైనం ● పెద్దలు ఒప్పుకోరని కాలువలో దూకి ఆత్మహత్య ఉంగుటూరు: సోషల్ మీడియా ద్వారా ఓ వివాహితకు, యువకుడికి మధ్య పరిచయం ఏర్పడింది. అది కాస్తా ప్రేమగా మారి పెళ్లికి దారితీసింది. చివరికి ఇద్దరు ఆత్మహత్యకు పాల్పడడంతో రెండు కుటుంబాల్లో విషాదం మిగిలింది. ఉంగుటూరు మండలం యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) చేపల ప్యాకింగ్కు వెళ్తూ జీవనం సాగిస్తున్నాడు. అతడికి ఇంకా వివాహం కాలేదు. శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఎర్రి రమ (35) అనే వివాహితతో మావుళ్లుకు ఇన్స్ట్రాగామ్ ద్వారా పరిచయం ఏర్పడింది. అది కాస్త ప్రేమగా మారింది. అయితే అప్పటికే ఆమెకు వివాహం కాగా ఇటీవల మావుళ్లు ఆమెను ఇక్కడకు తీసుకువచ్చి వివాహం చేసుకున్నాడు. విషయం తెలుసుకున్న రమ తరుఫు బందువులు వచ్చి ఆమెను తీసుకువెళ్లారు. అప్పటి నుంచి మావుళ్లు తాడేపల్లిగూడెం మండల కడియద్దలోని తన చెల్లెలు ఇంటివద్ద ఉంటున్నాడు. ఈ క్రమంలో తిరిగి రెండు రోజుల క్రితం రమ శ్రీకాకుళం నుంచి మావుళ్లు దగ్గరకు వచ్చేసింది. ఈ సమాజం వారిని బతకనీయదు అనుకున్నారో ఏమో ఇద్దరూ కలిసి మంగళవారం రాత్రి నాచుగుంట రేవు వద్దకు చేరారు. మావుళ్లు తన తమ్ముడు కి ఫోను చేసి విషయం చెప్పి నాచుగుంట వంతెన మీదనుంచి ఇద్దరు కాలువలో దూకి ఆత్మహత్యకు పాల్పడ్డారు. మావుళ్లు తమ్ముడు వచ్చేసరికి వంతెన వద్ద సెల్ఫోను, ఇతర సామాన్లు కనిపించడంతో పోలీస్, ఫైర్ అధికారులకు సమాచారం అందించారు. భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది, చేబ్రోలు పోలీసులు గాలింపు చర్యలను చేపట్టారు. ఎస్సై సూర్యభగవాన్, తహసీల్దార్ పూర్ణచంద్రప్రసాద్, ఇతర అధికారులు గాలింపు చర్యలను ఎప్పుటికప్పుడు పర్యవేక్షించారు. బుధవారం రాత్రి 10,30 గంటలకు మావుళ్ల మృతదేహం ఉంగుటూరు టోలు ప్లాజా సమీపంలో లభ్యమైంది. అమరావతి నుంచి వచ్చిన ప్రత్యేక ఎస్టీఆర్ఎఫ్ బృందాలు గాలించగా రమ మృతదేహం చేబ్రోలు పోలీస్టేషన్ సమీపంలో గోదావరి కాలువలో గురువారం మధ్యాహ్నం 2 30 గంటలకు లభ్యమైంది. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో మావుళ్లు మృతదేహనికి తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రి వద్ద పోస్టుమార్టం పూర్తి చేసి కుటుంబ సభ్యులకు అప్పగించారు. గుండుగొల్లు మావుళ్లు మృతదేహం, చేబ్రోలు వద్ద లభ్యమైన ఎర్రి రమ మృతదేహం -
పోస్టాఫీస్ పథకాలు అత్యంత విశ్వసనీయమైనవి
ద్వారకాతిరుమల: ప్రజలు తమ పొదుపులను సురక్షితంగా పెట్టుబడి పెట్టడానికి పోస్టాఫీస్ పథకాలు అత్యంత విశ్వసనీయమైనవని ఆంధ్రప్రదేశ్ సర్కిల్ చీఫ్ పోస్ట్మాస్టర్ జనరల్ బీపీ శ్రీదేవి అన్నారు. ఏలూరు పోస్టల్ డివిజన్లోని ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి బ్రాంచి పోస్టాఫీసును గురువారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఆ శాఖలో అందిస్తున్న తపాలా సేవలు, వినియోగదారులకు అందుతున్న సదుపాయాలు, పనితీరు అంశాలను సమగ్రంగా సమీక్షించారు. అలాగే భీమడోలు, పూళ్ల, ద్వారకాతిరుమల సబ్ పోస్టాఫీసుల పరిధిలో ఉన్న మొత్తం 15 బ్రాంచ్ పోస్ట్ ఆఫీసుల పనితీరుపై సమీక్ష నిర్వహించి, సేవల మెరుగుదలకు సంబంధించిన పలు సూచనలు చేశారు. అలాగే ఈసీఆర్, ఐసీఆర్ ప్రమాణాల బలోపేతం, సేవింగ్స్ బ్యాంక్ ఖాతాలు, పోస్టల్ లైఫ్ ఇన్సూరెన్స్, బ్రాంచి ఆఫీసుల ఆర్థిక స్థిరత్వంపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. అలాగే బ్రాంచి పోస్టు మాస్టర్లు వ్యాపారాభివృద్ధి, ఆదాయవృద్ధి, వినియోగదారులకు చేరువయ్యే కార్యక్రమాల్లో చురుకై న పాత్ర పోషించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ఏలూరు పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.విజయ భాస్కర్, అసిస్టెంట్ పోస్టల్ సూపరింటెండెంట్ (హెచ్క్యూలు) డి.శ్రీనివాసరావు, కె.శ్రీనివాసరావు, అసిస్టెంట్ సూపరింటిండెంట్ జంగారెడ్డిగూడెం, పోస్టల్ ఇన్స్పెక్టర్లు డి.శ్రీకాంత్, యు.చంద్రశేఖర్, సిబ్బంది పాల్గొన్నారు. -
శ్రీసీతారాముల కల్యాణం చూతము రారండి
● చిన భద్రాద్రిగా యర్రగుంటపల్లి రాముని గట్టు ● నవమి వేడుకలకు ఏర్పాట్లు పూర్తి ● రాష్ట్రం నలుమూలల నుంచి భక్తుల రాక చింతలపూడి : శ్రీరామ నవమి వేడుకలకు మండలంలోని యర్రగుంటపల్లి గ్రామ సమీపంలోని శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయం ముస్తాబైంది. ఇక్కడ ఈనెల 27న సీతారాముల కల్యాణాన్ని అంగరంగవైభవంగా నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. ప్రతి ఏటా శ్రీరామ నవమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఇక్కడ నిర్వహించే సీతారాముల కల్యాణాన్ని తిలకించేందుకు రాష్ట్రం నలుమూలల నుంచి వేలాది మంది భక్తులు తరలివస్తుంటారు. దీంతో భక్తుల సౌకర్యార్థం ఆలయ నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేశారు. చిన భద్రాద్రిగా.. రాముడి గట్టుగా ప్రసిద్ధికెక్కిన శ్రీ సీతారామాంజనేయ ఆలయాన్ని ఈ ప్రాంత భక్తులు చిన్న భద్రాచలంగా పిలుచుకుంటారు. భద్రాద్రిలో వెలసిన విగ్రహాలను పోలి ఇక్కడి విగ్రహాలు ఉండటం విశేషం. అంతేగాకుండా భద్రాచలంలో సీతాదేవి రాముల వారి తొడపై ఆసీనురాలైనట్లు ఇక్కడ కూడా అదే విధంగా కూర్చుని ఉండటం జరిగింది. ఈ ఆలయాన్ని అతి ప్రాచీనమైనదిగా చెబుతుంటారు. వందల ఏళ్ల క్రితం శ్రీరామ చంద్రుడు సీతాలక్ష్మణ సహేతుడై శంఖు చక్రాలతో ఈ ప్రాంతంలో వెలిసినట్లు పూర్వీకులు చెబుతుంటారు. ఇక్కడ స్వామివారి కల్యాణం జరిపితే పెళ్లికాని అమ్మాయిలకు పెళ్లవుతుందని, సంతానం లేనివారికి సంతానం కలుగుతుందని భక్తుల విశ్వాసం. ఈ ఆలయాన్ని అభివృధ్ధి చేయడానికి శ్రీ రామ రామలింగేశ్వర స్వామి ఆలయ ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నారు. శివాలయంలో రాములోరి కల్యాణం సీతారామాంజనేయ ఆలయానికి చేరువలో కై లాసపతి పరమేశ్వరుడు నందీ సమేతంగా కొండ పైభాగంలో వేంచేసి ఉన్నాడు. పరమశివుణ్ని శ్రీరాముడు ముళ్ల గోరింట పూలతోను, బొంత పూలతోను పూజించినట్లు, వెలగ, నేరేడు పండ్లను నివేదించినట్లు చరిత్ర చెబుతోంది. ప్రతి ఏటా చైత్రశుద్ధ నవమికి ఇక్కడ స్వామివారి కల్యాణాన్ని వైభవంగా జరుపుతారు. చుట్టుపక్కల గ్రామాలనుంచి భక్తులు వేలాదిగా తరలివచ్చి స్వామివారి కల్యాణాన్ని వీక్షిస్తారు. ఆలయ కమిటీతో పాటు, ఆదినుంచి సత్యన్నారాయణ శాస్త్రి కుటుంబీకులు స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని గ్రామస్తుల సహకారంతో జరుపుతున్నారు. యర్రగుంటపల్లి రాముని గట్టు(ఆలయాన్ని) మరింత అభివృధ్ధి చేయడానికి ట్రస్ట్ ఆధ్వర్యంలో కృషి చేస్తున్నాం. ప్రభుత్వం కూడా ఆలయ అభివృద్ధికి నిధులు మంజూరు చేయాల్సిన అవసరం ఉంది. ఆలయానికి చెందిన భూములను ట్రస్ట్కు అప్పగించి ప్రభుత్వం రక్షణ కల్పించాలి. ఆలయం వద్దకు రోడ్డు సౌకర్యం ఏర్పాటు చేసి పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చేయాలి. – వి సత్యన్నారాయణ శాస్త్రి, ఆలయ కమిటీ అధ్యక్షుడు, యర్రగుంటపల్లి -
సొసైటీ సీఈఓల ఆందోళన
నూజివీడు: వేతన సవరణ అమలు చేయాలని డిమాండ్ చేస్తూ బుధవారం జాయింట్ ఫోరం ఆఫ్ డీసీసీబీ ఎంప్లాయీస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో నూజివీడు బ్రాంచి వద్ద ఆందోళన నిర్వహించారు. సొసైటీల సీఈఓలు బ్యాడ్జీలు ధరించి ఆందోళనలో పాల్గొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం నెరవేర్చేవరకు ఆందోళన కొనసాగుతుందన్నారు. నిత్యావసర వస్తువుల ధరలు, ఇతర ఖర్చులు పెరిగి జీవనానికి తీవ్ర ఇబ్బందులు పడుతున్నామని వాపోయారు. ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు అక్కినేని రాజా, కృష్ణా జిల్లా కార్యనిర్వాహక అధ్యక్షుడు గౌతం నాయక్ పాల్గొన్నారు. వీరికి మద్దతుగా పీఏసీఎస్ ఉద్యోగుల అసోసియేషన్ ఉపాధ్యక్షుడు నీలం నాగేశ్వరరావు, అక్కినేని ప్రసాద్, పసుపులేటి దుర్గారావు మద్దతు తెలిపారు. ఉండి: రొయ్యల సాగులో మెరుగైన యాజమాన్య పద్ధతులపై మండలంలోని ఎన్నార్పీ అగ్రహారం కృషీ విజ్ఞాన కేంద్రంలో ఈనెల 26 నుంచి 30వ తేదీ వరకు శిక్షణా కార్యక్రమం నిర్వహిస్తున్నట్లు కేవీకే హెడ్ డాక్టర్ ఎన్ మల్లిఖార్జునరావు పత్రికా ప్రకటనలో బుధవారం తెలిపారు. జాతీయ మత్స్య అబివృద్ధి మండలి హైదరాబాద్ సహకారంతో నిర్వహిస్తున్న శిక్షణలో రొయ్యల పెంపకంలో యాజమాన్య పద్ధతులు, చెరువు తయారీ, పిల్ల ఎంపిక, మేత, వ్యాధులు, నూతన యాజమాన్య పద్ధతులు గురించి వివరిస్తారన్నారు. సమాచారం కోసం కేవీకే మత్స్యశాస్త్రవేత్త డాక్టర్ శ్రీనివాసరావును సంప్రదించాలన్నారు. -
వ్యాపారులు, కేంద్రంతో చర్చిస్తాం
ఈ సీజన్లో ఎన్ఎల్ఎస్లో 48.75 మి.కిలోలు లక్ష్యం కాగా 80 మి.కిలోలు ఉత్పత్తి అయినట్లు అంచనా. బుధవారం ప్రారంభమైన వేలంలో ధరపై రైతులు అసంతృప్తి ప్రకటింంచి మద్దతు ధర లభించలేదని నిరసన తెలిపారు. దీనిపై వ్యాపారస్తులు, కేంద్రంతో చర్చించి, వారికి మద్దతు ధర ఇప్పించేందుకు ప్రయత్నిస్తాం. రైతుల పొగాకు పంట చివరి ఆకు వరకు అమ్మించేందుకు కృషి చేస్తా. – సి.యశ్వంత్కుమార్, చైర్మన్, పొగాకు బోర్డు గతేడాది ప్రారంభ ధర రూ. 290తో వేలం మొదలై, గరిష్టంగా రూ.456 వరకు తీసుకువెళ్లారు. ప్రస్తుతం తొలిరోజు వేలంలో ప్రారంభం ధర రూ. 265 ధర ఇవ్వడం రైతులను కంపెనీలు మోసం చేయడమే. ఇలాగే కొనసాగితే వచ్చే సంవత్సరం క్రాప్ హాలిడే తీసుకుని ఈ పంటను రెండు సంవత్సరాలు అమ్ముకుంటామని కంపెనీలకు తెలియజేస్తున్నాం. – వామిశెట్టి హరిబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకుడు ప్రారంభ ధర రూ.350 వస్తుందని ఆశిస్తే రూ.265 ఇచ్చారు. పొగాకు బోర్డు అధికారులు, కేంద్ర ప్రభుత్వం కలిసి సరాసరి రూ.350 వచ్చేలా చర్యలు తీసుకోవాలి. కానీ ఎవరూ పట్టించుకోలేదు. ఇప్పటికై నా పొగాకు బోర్డు, కేంద్రం స్పందించి రైతుకు న్యాయం చేయాలి. మద్దతు ధర ఇవ్వలేనప్పుడు పొగాకును పూర్తిగా బ్యాన్ చేయండి. మేము వేరే పంటల వైపు వెళతాం. – పరిమి రాంబాబు, వర్జీనియా రైతు సంఘం నాయకుడు -
కూటమిది అప్రజాస్వామిక పాలన
ద్వారకాతిరుమల : కూటమి ప్రభుత్వానిది అప్రజాస్వామిక పాలనని మాజీ మంత్రి, వైఎస్సార్ సీపీ గుంటూరు జిల్లా అధ్యక్షుడు అంబటి రాంబాబు ధ్వజమెత్తారు. ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చిన్నవెంకన్న ఆలయాన్ని బుధవారం ఉదయం మాజీ హోం మంత్రి తానేటి వనిత, తదితరులతో కలసి ఆయన సందర్శించారు. స్వామి, అమ్మవార్ల దర్శనానంతరం కాపు కల్యాణ మండపంలో ఏర్పాటు చేసిన అభినందన సభలో అంబటి రాంబాబు పాల్గొని మాట్లాడారు. తన ఇంటిపై జరిగిన దాడి ఒక అప్రజాస్వామిక, ఘోరమైన, రాష్ట్రంలో ఎన్నడూ జరుగని సంఘటన అని అన్నారు. ఏడు గంటల పాటు జరిగిన దాడిని పోలీసులు నిశ్చేష్టులై చూశారన్నారు. ఆ తరువాత దాడి చేసిన వారిని స్టేషన్ బెయిల్ ఇచ్చి విడిచిపెట్టారని, తనను మాత్రం అక్రమంగా అరెస్టు చేసి, 18 రోజులు జైల్లో పెట్టారన్నారు. భగవంతుడి దయ, తన కులం మద్దతు, వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ మద్దతుతో ఇలాంటి ఘటనలు చరిత్రలో మళ్లీ జరగకుండా ఉండేలా పోలీసులకు, కూటమి ప్రభుత్వానికి, తనపై దాడి చేసిన వారికి బుద్ధి వచ్చేలా, శిక్షలు పడేవరకు తాను న్యాయపోరాటం చేస్తానన్నారు. కోర్టుల్లో న్యాయపోరాటం.. మీ సమక్షంలో ధర్మపోరాటం చేసి తీరుతానన్నారు. లేకపోతే తనకు జరిగిన అన్యాయం రేపు మరొకరికి జరుగుతుందన్నారు. తాను ఎవరికీ భయపడేదే లేదని, మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి సైతం తాను కాపుల్లో పులిలాంటి వాడని అన్నారని అన్నారు. అందరూ మద్దతు ఇవ్వాలి ఇంటిపై దాడి చేసినా, రాజమండ్రి సెంట్రల్ జైల్లో పెట్టినా భరించానని అంబటి రాంబాబు అన్నారు. భరించిన వాటన్నింటికీ న్యాయం పొందాలనే తాపత్రయం, కసి, పట్టుదలతో లాజికల్ పోరాటం చేస్తున్నానని, దానికి కులం మద్దతు, పార్టీ మద్దతు కోరుతున్నానని అన్నారు. ఈ దారుణాలను ఎదుర్కోవడం కోసం చిన్నవెంకన్న సన్నిధిలో ప్రతిజ్ఞ చేశానన్నారు. తనను భయపెట్టడం అంత ఆషామాషీ కాదని, తనకు 40 శాతం ఓటు బ్యాంక్ ఉన్న వైఎస్సార్ సీపీ అండగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ దారుణాలను ఎదుర్కోవడం కోసం ఇవాళ చిన్నవెంకన్న సన్నిధిలో ప్రతిజ్ఞ చేశానన్నారు. ఈ కార్యక్రమంలో జెడ్పీ వైస్ చైర్మన్ పోసిన శ్రీలేఖ, రాష్ట్ర యువజన విభాగ సంయుక్త కార్యదర్శి పెద్దిరెడ్డి జ్యోతిశ్రీనివాస్, రాష్ట్ర సోషల్ మీడియా కార్యదర్శి వామిశెట్టి పరమేశ్వరరావు, ఏలూరు ఏఎంసీ చైర్మన్ నెరుసు చిరంజీవి, డిప్యూటీ మేయర్ నూకపేయి సుధీర్బాబు, పార్టీ ఏలూరు నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, కార్పొరేటర్ కిలారి దుర్గారావు, పార్టీ జిల్లా అధికార ప్రతినిధి జాన్ గురునాధ్, బంట్రోతు సురేంద్ర తదితరులున్నారు. జరిగిన అన్యాయంపై కోర్టుల్లో న్యాయ పోరాటం.. మీ సమక్షంలో ధర్మపోరాటం చేస్తా పార్టీలకు అతీతంగా ప్రతి కాపు నాయకుడు అండగా నిలవాలి ఇలానే వదిలేస్తే నాకు జరిగిన అన్యాయం రేపు మరొకరికి జరుగుతుంది మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా కూటమి ప్రభుత్వం ప్రజలను మభ్యపెడుతోంది. సీఎంగా ఉన్న వ్యక్తి తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంలో పంది కొవ్వు కలిసిందని ప్రచారం చేయడం దుర్మార్గం. అంబటి రాంబాబును టార్గెట్ చేసి ఆయన ఇంటిపై దాడి చేశారు. కాపు నేత వంగవీటిని చంపించిన పార్టీకి కాపులు మద్దతు ఇవ్వడం సరికాదు. – తానేటి వనిత, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ సమన్వయకర్త కూటమి నేతలు డైవర్షన్ పాలిటిక్స్ చేస్తూ అరాచకాలు సృష్టిస్తున్నారు. పరమ పవిత్రమైన శ్రీవారి లడ్డూలో జంతువుల కొవ్వు కలిసిందని రాద్దాంతం చేశారు. అదంతా డైవర్షన్ పాలిటిక్స్లో భాగమే. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత పీక్ స్టేజ్లో ఉంది. ఈరోజు ఎన్నికలు జరిగితే వైఎస్సార్ సీపీకి 175 కి 175 రావడం ఖాయం. – పుప్పాల వాసుబాబు, వైఎస్సార్ సీపీ ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త కూటమి అధికారంలోకి వచ్చిన తరువాత అన్ని పార్టీల్లో ఉన్న కాపులపై దాడులు జరుగుతున్నాయి. కాపుల మద్దతుతో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది. మన చిరకాల శత్రువులకు కాపు కాస్తూ అంబటి రాంబాబుపై దాడి చేయడం సరికాదు. ఆయన్ను కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి కాపు సైనికుడిపై ఉంది. జగనన్నకు కాపుల మద్దతు పూర్తిగా ఉంటుంది. – తోట రామకృష్ణ, గోపాలపురం నియోజకవర్గ పరిశీలకుడువంగవీటి మోహనరంగా తరువాత కాపుల కోసం పోరాడుతున్న వ్యక్తి అంబటి రాంబాబు. జైల్లో పెట్టినా ఎక్కడా ఆయన అధైర్య పడలేదు. కాపులంతా ఆయన వెంటే ఉంటాం. కూటమి ప్రభుత్వం నీచరాజకీయాలు చేస్తోంది. ఇప్పటికే తిరుమల శ్రీవారి ప్రతిష్ఠను దెబ్బతీశారు. లడ్డూ ప్రసాదంపై విషప్రచారం చేసి చివరకు భంగపడ్డారు. స్వామివారు వారికి తగిన బుద్ధి చెబుతారు. – వడ్డి రఘురామ్, వైఎస్సార్ సీపీ తాడేపల్లిగూడెం నియోజకవర్గ సమన్వయకర్త కాపుల అభ్యున్నతికి వంగవీటి మోహనరంగా ఎంతో కృషి చేశారు. ఆ క్రమంలోనే నిరాహార దీక్ష చేస్తున్న ఆయనను కర్కశంగా నరికి చంపారు. అప్పుడు ఏ ప్రభుత్వం అధికారంలో ఉంది, ఎవరు చేయించారనే విషయాలు అందరికీ తెలుసు. మాటకారితనం ఉన్న కాపులను అణగదొక్కుతున్నారు. ముద్రగడను కూడా తొక్కేస్తున్నారు. అంబటి రాంబాబు వెన్నెంటే మనమంతా ఉండకపోతే ఆయన్ను చంపేస్తారు. – చినమిల్లి వెంకటరాయుడు, వైఎస్సార్ సీపీ భీమవరం నియోజకవర్గ సమన్వయకర్త మాజీ మంత్రి అంబటి రాంబాబు ఇంటిపై జరిగిన దాడి అమానుషం. ఇంట్లో ఉన్న వారిని హత్య చేయాలన్న ఉద్దేశంతోనే పెట్రోల్ బాంబులు వేశారు. అక్రమంగా రాంబాబును అరెస్టు చేసి, జైల్లో పెట్టినా ఆయన భయపడలేదు. ప్రతిపక్షంలో ఉంటూ ఆయన ప్రభుత్వానికి వినిపిస్తున్న స్వరం.. ఒక వరం. వచ్చే ఎన్నికల్లో వైఎస్ జగన్మోహన్రెడ్డిని సీఎం చేయడమే లక్ష్యంగా కాపులు పనిచేయాలి. – మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), వైఎస్సార్ సీపీ ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త -
పొగాకు రైతుల గుండెల‘ధర’
● వర్జీనియా ప్రారంభ ధర పతనం ● తొలి రోజు రూ.265 పలికిన ధర ● ఆందోళన వ్యక్తం చేసిన రైతులు ● గోపాలపురం కేంద్రంలో నిలిచిన వేలం జంగారెడ్డిగూడెం : వర్జీనియా ప్రారంభ ధరతో రైతులు తీవ్ర అసంతృప్తికి లోనయ్యారు. గతేడాది అత్యధిక ధర రావడంతో ఈ ఏడాది రైతులు ఉత్సాహంగా సాగు చేపట్టారు. వేలం ప్రారంభం కోసం ఎదురుచూశారు. అయితే ప్రారంభ రోజున ధర పతనమై రూ.265 లభించడంతో రైతులు ఆందోళన వ్యక్తం చేశారు. తొలిరోజే ఆందోళన ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఎన్ఎల్ఎస్ పరిధిలోని 5 వేలం కేంద్రాల్లో బుధవారం వర్జీనియా పొగాకు వేలం ప్రారంభించారు. వేలం ప్రారంభం ముందు పొగాకు బోర్డు ఛైర్మన్ సి.యశ్వంత్కుమార్, రీజనల్ మేనేజర్ జె.సురేంద్ర కుమార్, వేలం అధికారులు వై.ప్రశాంత్, గ్రేస్ మార్గరేట్, పొగాకు కంపెనీలు రైతులతో జంగారెడ్డిగూడెంలో చర్చలు జరిపారు. పొగాకు కంపెనీలు ప్రారంభ ధర రూ. 265 మాత్రమే ఇస్తామని చెప్పడంతో రైతులు ఆందోళనకు దిగారు. గతేడాది ప్రారంభ ధర కేజీకి రూ.290 ఇచ్చారని, అదే ధర ఇవ్వాలని అధికారులు, రైతు సంఘం నాయకులు డిమాండ్ చేశారు. కంపెనీ ప్రతినిధులు తమ యాజమాన్యాలతో మాట్లాడి ప్రారంభ ధర రూ.265కు మించి ఇవ్వలేమని తెగేసి చెప్పారు. రైతులు కొద్ది సేపు సమావేశమై బోర్డు అధికారులతో ప్రారంభ రోజు కాబట్టి వేలం జరుపుతామని, పొగాకు బేళ్లను వేలం కేంద్రంలో ఉంచుతామని స్పష్టం చేశారు. తొలుత అధికారులు, కంపెనీలు అంగీకరించినా అనంతరం పొగాకు కంపెనీలు బేళ్లను తరలించుకున్నారు. వేలం ఇలా.. జంగారెడ్డిగూడెం–1, కొయ్యలగూడెం వేలం కేంద్రాల్లో ప్రాంరభం రోజున 27 బేళ్లు చొప్పున, దేవరపల్లిలో 18 బేళ్లు, జంగారెడ్డిగూడెం–2 కేంద్రంలో 99 బేళ్లు చొప్పున రైతులు వేలానికి తీసుకువచ్చారు. ప్రారంభ ధర కేజీకి రూ.265 లభించింది. కాగా, గోపాలపురం వేలం కేంద్రంలో 27 బేళ్లు పెట్టగా రైతులు వేలాన్ని నిలిపివేశారు. ఆదిలోనే రైతుల కన్నెర్ర కొయ్యలగూడెం: కొయ్యలగూడెం వేలం కేంద్రంలో బుధవారం పొగాకు కొనుగోళ్లు ప్రారంభం కాగా ప్రారంభ ధర కేజీ రూ.265 లభించడంతో రైతులు తీవ్ర ఆగ్రహాం వ్యక్తం చేశారు. గతేడాది రూ.295 ప్రారంభ ధర ఉండగా ఈసారి రూ.30 తగ్గించి కొనుగోలు చేశారని, ఏటా పొగాకు సాగుకి రెండింతలు ఖర్చు అవుతుందని రైతు సంఘం నేతలు ఆవేదన వ్యక్తం చేశారు. కర్ణాటకలో ప్రారంభ ధర రూ.320 ఉండగా ఎన్ఎల్ఎస్ పరిధిలోని వేలం కేంద్రాల్లో తక్కువ ధరకు కొనుగోలు చేయడం రైతుకు అన్యాయం చేయడమే అన్నారు. ఈ నేపథ్యంలో కొనుగోళ్లు అడ్డుకోవడంతో వేలం ప్రక్రియ నిలిచిపోయింది. విషయం తెలుసుకున్న బోర్డు చైర్మన్ ిసీహెచ్ యశ్వంత్ కుమార్ వేలం కేంద్రం వద్దకు చేరుకొని రైతు ప్రతినిధులతో చర్చలు నిర్వహించారు. మద్దతు ధర లభించే విధంగా కృషి చేస్తామని హామీ ఇవ్వడంతో ఆందోళన విరమించారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో వేలం జరుగుతున్న దృశ్యం కొయ్యలగూడెం: వర్జీనియా పొగాకు వేలం కేంద్రంలో ఆందోళన చేస్తున్న రైతులు -
ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురికి గాయాలు
క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్న దృశ్యంబుట్టాయగూడెం: ద్విచక్ర వాహనాలు ఢీకొని ఐదుగురు గాయపడ్డారు. ఈ ఘటన స్థానిక శివాలయం సమీపంలో బుధవారం రాత్రి జరిగింది. గుంటూరు జిల్లా రాజుపాలెం మండలం గణపవరంనకు చెందిన తాళ్లభోగి సురేష్, కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడతో పొగాకు పనుల నిమిత్తం వచ్చి కంసాలిపాలెంలో నివాసముంటున్నారు. మనవడు చిన్నా పానీపూరీ అడగడంతో సురేష్ కుమార్తెలు ప్రియాంక, శ్రావణి, మనవడు చిన్నాతో కలిసి ద్విచక్రవాహనంపై బుట్టాయగూడెం వస్తున్నారు. అదే సమయంలో స్థానిక అరుంధతీ కాలనీకి చెందిన ఉండ్రాజవరపు కాంతారావు, మరొక యువకుడు ద్విచక్ర వాహనంపై బుట్టాయగూడెం నుంచి శివాలయం వైపు వెళ్తున్నారు. ఆ సమయంలో రెండు ద్విచక్ర వాహనాలు ఎదురెదురుగా ఢీ కొనడంతో ఐదుగురు తీవ్ర గాయాల పాలయ్యారు. క్షతగాత్రులను అంబులెన్స్లో స్థానిక సామాజిక ఆరోగ్య కేంద్రానికి తరలించారు. ప్రియాంక, చిన్ని, శ్రావణిలకు స్వల్ప గాయాలు కావడంతో సామాజిక ఆరోగ్య కేంద్రంలోనే వైద్య సేవలు అందించారు. అనంతరం కాంతారావు, సురేష్లను జంగారెడ్డిగూడెం తరలించగా సురేష్ పరిస్థితి తీవ్రంగా ఉండడంతో రాజమండ్రి తరలించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): శ్రీరామనవమి సందర్భంగా భద్రాచలానికి ఏపీఎస్ఆర్టీసీ ప్రత్యేక బస్సు సర్వీసులు నడుపుతున్నట్టు జిల్లా ప్రజా రవాణా అధికారి షేక్ షబ్నం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ బస్సులు 26వ తేదీ ఉదయం నుంచి రాత్రి వరకు భద్రాచలం వైపు, తిరిగి 27వ తేదీ శ్రీ సీతారాముల కల్యాణం అనంతరం భద్రాచలం నుంచి ఆయా డిపోలకు చేరుకుంటాయన్నారు. ఏలూరు, జంగారెడ్డిగూడెం, నూజివీడు నుంచి ప్రత్యేక బస్సులు నడుపుతున్నట్టు తెలిపారు. రద్దీని బట్టి బస్సుల సంఖ్య పెంచుతామని ఆమె స్పష్టం చేశారు. -
గోదావరి కాలువలో యువకుడి గల్లంతు
ఉంగుటూరు: గోదావరి కాలువలో ఓ యువకుడు గల్లంతయ్యాడు. ఎస్సై సూర్యభగవాన్ ఆధ్వర్యంలో పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. వివరాలు ఇలా ఉన్నాయి. యర్రమళ్ల గ్రామానికి చెందిన గుండుగొల్లు మావుళ్లు (25) స్థానిక ఐస్ పరిశ్రమల వద్ద ప్యాకింగ్ పని చేస్తుంటాడు. ఈ క్రమంలో మంగళవారం రాత్రి అతని ఫోన్ నుంచి కుటుంబ సభ్యులకు ఫోను వచ్చింది. నేను నాచుగుంట రేవు వద్ద ఉన్నాను. తీసుకువెళ్లడానికి రమ్మని తెలిపాడు. వెంటనే చిన్నాన్న కొడుకు బయలుదేరి రేవు వద్దకు రాగా అప్పటికే నాచుగుంట వంతెనపై వాటర్బాటిల్, చెప్పులు, సెల్ ఫోను కనపించాయిగానీ మావుళ్లు కనిపించలేదు. దీంతో అతడు కాలువలో దూకినట్లు గ్రహించి కుటుంబసభ్యులకు, పోలీసులకు సమాచారం అందించాడు. మంగళవారం ఉదయం నుంచి మావుళ్లు కోసం చేబ్రోలు పోలీసులు, భీమడోలు, తాడేపల్లిగూడెం ఫైర్ సిబ్బంది కాలువలో గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు అతడి ఆచూకీ లభించలేదు. శ్రీకాకుళంకు చెందిన యువతిని మావుళ్లు ప్రేమించాడని, ఆమె ఇతడిని వదిలేసి వెళ్లిపోవడంతో మనస్తాపం చెంది ఆత్మహత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
సివిల్ పెన్షన్ వాలిడేషన్ చట్టం రద్దు చేయాలి
ఏలూరు (టూటౌన్): ఎన్డీఏ ప్రభుత్వం ప్రకటించిన 2025 సివిల్ పెన్షన్ వాలిడేషన్ చట్టం రద్దు చేయాలని విశ్రాంత ఉద్యోగులు డిమాండ్ చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ ఏలూరు జిల్లా యూనిట్ ఆధ్వర్యంలో బుధవారం నాడు ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద నిరసన కార్యక్రమం చేపట్టారు. పెన్షనర్ల సమస్యలతో కూడిన వినతిపత్రాన్ని జిల్లా జాయింట్ కలెక్టర్కు విశ్రాంత ఉద్యోగుల అసోసియేషన్ నాయకులు సమర్పించారు. లోక్సభలో ప్రవేశపెట్టిన బిల్ నెంబర్ 14 సీ ని ఉపసంహరించుకోవాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల ఏలూరు జిల్లా అసోసియేషన్ అధ్యక్ష కార్యదర్శులు బి ఆంజనేయులు, కే మహాలక్ష్ముడు కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. కొత్త పెన్షన్ విధానాన్ని రద్దుచేసి, పాత పెన్షన్ విధానాన్ని పునరుద్ధరించాలని, పెన్షనర్లకు బకాయి పడిన నాలుగు డీఏలను, డీఆర్లను తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేశారు. 11వ పీఆర్సీ బకాయిలను చెల్లించాలని, పెండింగ్ పడిన ఏరండ్ లీవ్ పేమెంట్లను చెల్లించాలని, 12వ పీఆర్సీ కమిషన్ వేయాలని వారు కోరారు. అసోసియేషన్ జిల్లా కోశాధికారి డి గంగాధర్రావు, జిల్లా నాయకులు ఏ అప్పలరాజు, ఏలూరు, చింతలపూడి, జంగారెడ్డిగూడెం, పోలవరం యూనిట్లకు చెందిన విశ్రాంత ఉద్యోగులు పాల్గొన్నారు. -
యథేచ్ఛగా అడవిలో వృక్షాల నరికివేత
బుట్టాయగూడెం: అడవిలో మారుజాతి కలపను నరికి అక్రమంగా తరలిస్తున్నా అధికారులు చోద్యం చూస్తుండడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. కొందరు అక్రమార్కులు బుట్టాయగూడెం మండలంలోని పాలకుంట, ఇప్పలపాడు, రెడ్డిగణపవరం, బూరుగువాడ సమీపాల్లోని అటవీప్రాంతంలో, పరిసర ప్రాంతాల్లో ఉన్న కాల్వ గట్లపై ఉన్న చెట్లను నరికివేసి యథేచ్ఛగా ట్రాక్టర్లతో తరలించి సొమ్ము చేసుకుంటున్నారు. పొగాకు బేరన్ల కోసం కలప అక్రమ రవాణా సాగిస్తున్నారు. పాలకుంట సమీపంలోని ఒక ప్రాంతంలో బేరన్ పుల్ల కోసం చెట్లను నరికివేసి తరలించేందుకు సిద్ధంగా ఉంచారు. దీనితోపాటు ఎగువ ప్రాంతంలో కూడా పెద్దపెద్ద చెట్లను నరికి వేసి రాత్రి, పగలు తేడా లేకుండా ట్రాక్టర్లలో అక్రమంగా తరలిస్తున్నారు. దీనిపై సంబంధిత అధికారులను వివరణ కోరగా కలప అక్రమ రవాణాను అడ్డుకునేందుకు చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు. -
హైదరాబాద్లో పాలకొల్లు వాసి మృతి
పాలకొల్లు సెంట్రల్: పట్టణంలోని వెలమగూడెం ప్రాంతానికి చెందిన దాసరి సురేష్ రాజు (52) హైదరాబాద్లోని రోడ్డు ప్రమాదంలో మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం పాలకొల్లుకు చెందిన సురేష్ రాజు ఏడేళ్ల క్రితం కుటుంబ సమేతంగా హైదరాబాద్ వెళ్లి స్థిరపడ్డారు. అక్కడ సమత నగర్, బోయినపల్లిలో నివాసం ఉంటూ రైస్ బిజినెస్ చేసుకుంటున్నారు. ఇతనికి భార్య, కుమారుడు ఉన్నారు. మంగళవారం మధ్యాహ్నం వ్యాపార పని నిమిత్తం తన ద్విచక్ర వాహనంపై కూకట్పల్లి వెళ్లారు. అక్కడ టిప్పర్ లారీ ద్విచక్ర వాహనాన్ని ఢీకొట్టిన ఘటనలో సురేష్ రాజు అక్కడికక్కడే మృతి చెందాడు. పంచనామా అనంతరం అతడి మృతదేహాన్ని పాలకొల్లుకు తీసుకురానున్నారు. వీరవాసరం: వీరవాసరం పోలీస్ స్టేషన్ పరిధిలో మంగళవారం పోక్సో కేసు నమోదైందని ఎస్సై ఎం.రాజకుమార్ తెలిపారు. మైనర్ బాలికపై, మైనర్ బాలుడు అత్యాచారం చేయడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. ఘటనా ప్రాంతాన్ని డీఎస్పీ రఘువీర్ విష్ణు, భీమవరం రూరల్ ఎస్సై శ్రీనివాసరావు సందర్శించి వివరాలు సేకరించినట్లు చెప్పారు.


