breaking news
Eluru District Latest News
-
నేడు శ్రీవారి క్షేత్రంలో రథసప్తమి వేడుకలు
ద్వారకాతిరుమల: రథసప్తమి వేడుకలకు శ్రీవారి క్షేత్రం సర్వాంగ సుందరంగా ముస్తాబయింది. అందులో భాగంగా ఆదివారం నిర్వహించనున్న స్వామి, అమ్మవార్ల తిరువీధి సేవలకు వినియోగించే సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ సిబ్బంది శనివారం ముస్తాబు చేశారు. ముందుగా వాహన శాల నుంచి తీసుకొచ్చిన సూర్య, చంద్ర ప్రభ వాహనాలను ఆలయ ఆవరణలో ఉంచారు. అనంతరం వాటిని శుభ్రం చేశారు. రథసప్తమి పర్వదినాన్ని పురస్కరించుకుని ఉదయం 7 గంటల నుంచి స్వామి, అమ్మవార్లకు సూర్య ప్రభ వాహనంపై, అలాగే రాత్రి 7 గంటల నుంచి చంద్ర ప్రభ వాహనంపై తిరువీధి సేవలను కన్నులపండువగా నిర్వహిస్తామని ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ తెలిపారు. భక్తులు పెద్ద ఎత్తున ఈ వేడుకల్లో పాల్గొనాలని ఆయన కోరారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరుకు చెందిన బెజగం వెంకట శ్రీనివాసు ప్రతిష్టాత్మక గురురత్న అవార్డుకు ఎంపికయ్యారు. ప్రస్తుతం ఆయన నగరంలోని గ్రీన్సిటీలో నివసిస్తూ నారాయణపురంలోని మహాత్మాగాంధీ ప్రభుత్వ జూనియర్ కళాశాల ఇన్ఛార్జ్ ప్రిన్స్పాల్గా, జంతుశాస్త్ర అధ్యాపకునిగా పని చేస్తున్నారు. గత 37 సంవత్సరాలుగా ఇంటర్మీడియట్ విద్యా వ్యవస్థలో సేవలు అందిస్తూ రచయితగా, పాఠ్యపుస్తక రచయితగా, విద్యా వ్యాసకర్తగా, ప్రభుత్వ జూనియర్ లెక్చరర్ల సంఘం అసోసియేట్ అధ్యక్షునిగా వివిధ రంగాల్లో అందిస్తున్న ఆయన సేవలను గుర్తించి ఈ అవార్డుకు ఎంపిక చేశారు. ఈ మేరకు చైన్నెకి చెందిన అమెట్ యూనివర్సిటీ, జే. రామచంద్రన్ మారిటైమ్ ఫౌండేషన్ సంయుక్తంగా ఆయన్ను గురురత్న అవార్డుకు ఎంపిక చేసినట్టు ప్రకటించాయి. ఈ నెల 25వ తేదీన చైన్నెలోని అమెట్ యూనివర్సిలో వర్సిటీ ఛాన్సలర్ జే.రామచంద్రన్ చేతులమీదుగా శ్రీనివాస్ అవార్డు అందుకోనున్నారు. ఏలూరు(మెట్రో): విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఫిబ్రవరి 5 వ తేదీన జరుగబోయే ఏపీ జేఏసీ అమరావతి 4వ రాష్ట్ర మహాసభను జయప్రదం చేయాలని కోరుతూ శనివారం స్థానిక ఏలూరు రెవెన్యూ భవన్లో నాయకులు పోస్టర్ను ఆవిష్కరించారు. ఆ సంఘం ఏలూరు జిల్లా చైర్మన్ కె.రమేష్ కుమార్ మాట్లాడుతూ ఈ మహాసభకు జిల్లా ఉద్యోగులు తరలి వెళ్లడానికి ఏలూరు నుంచి బస్సులు ఏర్పాటు చేశామన్నారు. ఉద్యోగులకు రావాల్సిన బకాయిలు, 12వ పీఆర్సీ, మధ్యంతర భృతి తదితర ఆర్థిక, ఆర్థికేతర సమస్యల పరిష్కారాల కోసం మహాసభల్లో ఉద్యోగుల గళం వినిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఏపీ జేఏసీ అమరావతి జనరల్ సెక్రెటరి బి.రాంబాబు, రెవెన్యూ సర్వీసెస్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి ఏ.ప్రమోద్ కుమార్, ఏపీపీటీఏ గౌరవ అధ్యక్షుడు వై.శ్రీనివాస్, పెన్షనర్స్ అసోసియేషన్ జిల్లా కార్యదర్శి మహాలక్ష్ముడు, ఏపీ జేఏసీ అమరావతి జిల్లా వైస్ ప్రెసిడెంట్ ప్రభాకర్, ఏలూరు డివిజన్ ప్రెసిడెంట్ కృష్ణ స్వామి, వివిధ సంఘాల నాయకులు పాల్గొన్నారు. -
కానరాని పసివాడి జాడ
● అదృశ్యమై నాలుగు రోజులైనా లభించని ఆచూకీ ● దర్యాప్తు చేస్తున్న పోలీసులు ముదినేపల్లి రూరల్: రెండున్నరేళ్ల బాలుడు ఇంటి ముంగిట ఆటలాడుకుంటూ తప్పిపోయాడు. నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి కంట కన్నీరు ఆగడం లేదు. పోలీసులు పలు విధాలుగా గాలింపు చర్యలు చేపట్టినా ఇప్పటివరకు ఎటువంటి ప్రయోజనం లేదు. వివరాలు ఇలా ఉన్నాయి. మండవల్లి మండలం కానుకొల్లుకు చెందిన ఆకేటి శిరీష ముదినేపల్లి మండలంలోని శ్రీహరిపురంలో ఉన్న పుట్టింటికి వచ్చింది. ఆమె కుమారుడు రెండున్నర సంవత్సరాల వయసు గల మోక్షిత్ ఈ నెల 20న ఆటలాడుకుంటూ అదృశ్యమయ్యాడు. దీనిపై స్థానిక పోలీసుస్టేషన్లో బాలుడి తల్లి శిరీష ఫిర్యాదు చేసింది. దీంతో దర్యాప్తు చేపట్టిన పోలీసులు పరిసర ప్రాంతాల్లో పోలీసులు బాలుడి ఆచూకీ కోసం గాలించినప్పటికీ ఫలితం కనిపించలేదు. స్థానికంగా ఉన్న పంట కాలువలో పడి బాలుడు గల్లంతయి ఉంటాడని భావించి నాలుగురోజులుగా స్థానికంగా ఉన్న క్యాంపుబెల్ పొడవునా గాలింపు చర్యలు చేపట్టినప్పటికి జాడ దొరకలేదు. అదేవిధంగా బాలుడిని ఎవరైనా ఎత్తుకుపోయి ఉంటారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. రెండు కోణాల్లో దర్యాప్తు చేస్తున్నా ఫలితం లేకపోవడంతో బాలుడి తల్లి, కుటుంబసభ్యులు తీవ్ర ఆందోళనలో ఉన్నారు. సమాచారం తెలుసుకున్న తహసీల్దార్ లతీఫ్ పాషా, ఎస్సై వీరభధ్రరావుతో శ్రీహరిపురం వెళ్లి బాలుడి తల్లితో పాటు స్థానికులను విచారించారు. బాలుడి ఆచూకీ కోసం పోలీసులు తీవ్రంగా శ్రమిస్తున్నారని త్వరలోనే ఆచూకీ తెలుసుకుంటారని చెప్పారు. ఇందుకు సంబంధించి ఎస్సైతో పాటు సిబ్బందికి తహసీల్దార్ పలు సూచనలు చేశారు. -
తల్లిని కోల్పోయాం.. ప్రభుత్వమే ఆదుకోవాలి
జంగారెడ్డిగూడెం: ఇటీవల జరిగిన దాడిలో తమ తల్లిని కోల్పోయామని, తమను ప్రభుత్వం ఆదుకోవాలని కోరుతూ జంగారెడ్డిగూడెం వచ్చిన ఏలూరు ఎంపీ పుట్టా మహేష్ యాదవ్ను ఇటీవల హత్యకు గురైన కలపాల జీలుగులమ్మ కుమార్తెలు కోరారు. ఈ మేరకు ఎంపీకి వినతిపత్రం అందజేశారు. వారసత్వంగా తమకు రావాలసిన పొలం తమకు ఇవ్వకపోగా, గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేసి తమ తల్లి జీలుగులమ్మ, అమ్మమ్మ ముప్పిడి చుక్కమ్మలను హత్య చేసి తమకు ఆధారం లేకుండా చేశారని కన్నీటి పర్యంతమయ్యారు. తమ తల్లి ఎంతో కష్టపడి తమను ఉన్నత చదువులు చదివించిందని తెలిపారు. తమకు ప్రభుత్వమే ఉపాధి కల్పించి ఆదుకోవాలని కోరారు. స్పందించిన ఎంపీ కలెక్టర్తో మాట్లాడి న్యాయం చేస్తానని హామీ ఇచ్చారు. కార్యక్రమంలో కొండ్రెడ్డి కిషోర్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ తదితరులు ఉన్నారు. చాట్రాయి: కప్పుకున్న దుప్పటికి నిప్పంటుకుని వృద్ధురాలు మృతి చెందిన ఘటన చాట్రాయి మండలంలోని చనుబండలో చోటుచేసుకుంది. వివరాల ప్రకారం చనుబండ గ్రామానికి చెందిన గజవెల్లి నారాయణమ్మ (90) తాటాకింట్లో ఒంటరిగా నివసిస్తోంది. ఆమెకు చుట్ట తాగే అలవాట ఉండడంతో శుక్రవారం రాత్రి చుట్ట వెలిగించుకున్న అగ్గిపుల్ల మంచం మీద పడి పక్క దుప్పటికి అంటుకుని ఆ మంటల్లో నారాయణమ్మ శరీరం పూర్తిగా కాలిపోయింది. కోడలు గజవెల్లి చెన్నమ్మ శనివారం ఉదయం నారాయణమ్మకు టీ టిఫిన్ ఇవ్వడానికి వెళ్లగా మంచం మీద కాలిపోయి ఉండడాన్ని గుర్తించింది. మృతురాలికి ముగ్గురు కుమార్తెలు ఉన్నారు. -
వైభవం.. శోభనాచలుని గరుడోత్సవం
ఆగిరిపల్లి: మాఘమాస రథసప్తమి ఉత్సవాల్లో భాగంగా శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి శనివారం గరుడ వాహనంపై భక్తులకు దర్శనమిచ్చారు. ఉదయం 9 గంటలకు స్వామి వారి కళ్యాణ మండపంలో హైదరాబాద్కు చెందిన ఆకుల బసవ ప్రసాద్రావు దంపతులు కై ంకర్యాపరులుగా వ్యవహరించారు. అనంతరం రాత్రి 8 గంటలకు కమ్మ సంఘం ఆధ్వర్యంలో లక్ష్మీ నరసింహ స్వామిని పెళ్లి కుమారుడిగా అలంకరించి గరుడ వాహనంపై గ్రామోత్సవం నిర్వహించారు. అనంతరం స్వామివారి కల్యాణ మండపంలో నిత్య కల్యాణ మహోత్సవాన్ని ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంతకృష్ణ ఆధ్వర్యంలో వైభవంగా నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. భీమవరం: సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ విమెన్ టోర్నమెంట్ జేఎన్టీయూకే మహిళా క్రికెట్ టీమ్కు భీమవరం డీఎన్నార్ ఇంజనీరింగ్ కళాశాల విద్యార్థిని సీహెచ్ వర గాయత్రి ఎంపికై నట్లు కళాశాల ప్రిన్సిపాల్ ఎం అంజన్కుమార్ చెప్పారు. ఈ నెల 26 నుంచి ఫిబ్రవరి 2వ తేదీవరకు సౌత్ జోన్ ఇంటర్ యూనివర్సిటీ క్రికెట్ విమెన్ టోర్నమెంట్ చైన్నెలోని అన్నా యూనివర్సిటీలో జరుగుతుందన్నారు. పోటీలకు ఎంపికై న వరగాయత్రిని ప్రిన్సిపాల్ అంజన్కుమార్, ఫిజికల్ డైరెక్టర్ పి మురళీధర్, అడ్మినిస్ట్రేషన్ ఆఫీసర్ ఫణికుమార్ తదితరులు ఈ సందర్భంగా అభినందించారు. గణపవరం: ఉంగుటూరు మండలం నాచుగుంటలో ఈనెల 27, 28, 29 తేదీల్లో బైబిల్ మిషన్ 88వ మహాసభలు జరుగుతాయని బైబిల్ మిషన్ ప్రెసిడెంట్, మహాసభల చైర్మన్ బి.సంజీవరావు తెలిపారు. ఈ సభలకు వైస్ ప్రెసిడెంట్ ఎ.దైవారావు, కార్యదర్శి డి.ఇమ్మానుయేల్, జాయింట్ సెక్రటరీ జీఆర్ ఇమ్మానియేల్రాజు తదితరులు పాల్గొంటారన్నారు. ఈ మహాసభలకు పరిసర గ్రామాలకు చెందిన విశ్వాసులందరూ తప్పనిసరిగా హాజరు కావాలని ఆయన కోరారు. ద్వారకాతిరుమల: వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ద్వారకాతిరుమల మండలం సీహెచ్ పోతేపల్లి గ్రామ సర్పంచ్ పోల్కంపల్లి అనీల్ కుమార్ను పార్టీ రాష్ట్ర సంయుక్త కార్యదర్శిగా నియమిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శుక్రవారం ఓ ప్రకటనను విడుదల చేసింది. ఈ సందర్భంగా అనీల్ కుమార్ మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్ఆర్), ఏలూరు మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్, పార్టీ మండల కన్వీనర్ ప్రతాపనేని వాసులకు కృతజ్ఞతలు తెలిపారు. పార్టీ బలోపేతానికి తన శక్తివంచన లేకుండా కృషి చేస్తానని ఆయన పేర్కొన్నారు. ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. శ్రీవారికి ప్రీతికరమైన రోజు కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. తెల్లవారుజాము నుంచే భక్తుల రాక మొదలవడంతో క్షేత్ర పరిసరాలు భక్తులతో పోటెత్తాయి. ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, ప్రసాదం, టికెట్ కౌంటర్లు, కేశఖండనశాల, నిత్యాన్నదాన భనం, ఇతర విభాగాల వద్ద భక్తులు కిటకిటలాడారు. పలు భజనల మండలి సభ్యులు అనివేటి మండపంలో ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. సాయంత్రం వరకు క్షేత్రంలో భక్తుల రద్దీ కొనసాగింది. -
●భక్తిశ్రద్ధలతో పసుపు కొమ్ముల నోము
అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో వాసవీ శాంతిథాంలో శనివారం లక్ష పసుపు కొమ్ముల నోము భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. బెంగుళూరు నుంచి వచ్చిన భక్తులు 102 రుషీ గోత్ర మందిరంలోని 90 అడుగుల పంచలోహ వాసవీ మాత విగ్రహాన్ని దర్శించుకొని, మరకత శిల వాసవీ మాతకు పూజలు, అభిషేకాలు జరిపారు. అనంతరం మరకత శిల వాసవీ మాతను గాజుల అలంకరణ చేశారు. రుషీ గోత్ర మందిరంలో బెంగుళూరు దంపతులు లక్ష పసుపు కొమ్ముల నోము నిర్వహించారు. పసుపు కొమ్ములు స్వీకరించడానికి పరిసర ప్రాంత భక్తులు పోటీ పడ్డారు. దంపతుల పూజ, పసుపుకొమ్ముల నోముతో వాసవీ థాం కిక్కిరిసిపోయింది. భక్తులకు ట్రస్ట్ ఆధ్వర్యంలో అన్నదానం ఏర్పాటు చేశారు. – పెనుగొండ -
ఆది దేవా.. ప్రణమామ్యహం
ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన శ్రీ సూర్యభగవానుడికి శ్రీ వైఖానస ఆగమశాస్త్ర ప్రకారం ఆదివారం ఉదయం 11.30 గంటలకు కల్యాణ మహోత్సవం నిర్వహించేందుకు పండితులు ముహుర్తం నిర్ణయించారు. వేద పండితుల వేదమంత్రోచ్ఛరణాల మధ్య ఆలయ చైర్మన్ గమిని రామచంద్రరావు (రాము) దంపతులు పీటలపై కూర్చుని స్వామివారి కల్యాణ ఘట్టం నిర్వహిస్తారు. ఉదయం 5 గంటల నుంచి భక్తులకు స్వామివారి దివ్య దర్శనం, మధ్యాహ్నం 2 గంటలకు స్వామివారి రథోత్సవం, సాయంత్రం 6 గంటలకు పుష్పయాగం నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా ఉదయం నుంచి స్వామి వారికి పంచామృతాభిషేకాలు, ప్రత్యేక అలంకరణ, పూజాధికాలు నిర్వహిస్తారు. ఉదయం 11 గంటల నుంచి స్వామివారి ఆలయ ప్రాంతంలో అన్నప్రసాద వితరణకు ఏర్పాట్లు చేశారు. రథసప్తమి సందర్భంగా తణుకు సూర్యదేవాలయాన్ని సందర్శించేందుకు సమారుగా 50వేలకు పైగా భక్తులు వస్తారని అంచనా. భక్తుల సౌకర్యార్థం సూర్యాలయం వీధి పొడవునా చలువ పందిర్లు, భక్తులు క్యూలో వెళ్లి స్వామివారిని దర్శించుకునేలా బారికేడ్లు సిద్ధం చేశాం. క్యూలో ఉన్న వారికి తాగునీరు సరఫరా చేస్తాం. స్వామివారి దివ్య దర్శనం, కల్యాణాన్ని వీక్షించేందుకు వచ్చే భక్తులందరికీ తీర్థ ప్రసాదాలు అందజేస్తాం. – ముత్యాల సత్యనారాయణ, ఈవో, తణుకు సూర్యదేవాలయం తణుకు అర్బన్: భక్త ప్రజానీకం ఆరోగ్య ప్రదాతగా కొలిచే శ్రీ సూర్యనారాయణస్వామి కల్యాణమహోత్సవానికి తణుకు శ్రీసూర్యదేవాలయం ముస్తాబైంది. ఆదివారం రథసప్తమి సందర్భంగా సూర్యదేవాలయంలో ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన శ్రీ సూర్యభగవానుడికి కల్యాణం నిర్వహించేందుకు దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ పెద్దల ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తిచేశారు. రాష్ట్ర వ్యాప్తంగా శ్రీకాకుళం జిల్లా అరసవల్లి సూర్యదేవాలయం తరువాత రెండో ఆలయం తణుకులో ఉండడంతోపాటు అదే తరహాలో స్వామివారి కల్యాణం జరిపించే తణుకు సూర్యదేవాలయానికి జిల్లా నుంచే కాకుండా ఇతర జిల్లాల నుంచి కూడా వేలసంఖ్యలో భక్తులు ప్రతి ఏడాది తరలి వస్తుంటారు. భక్తుల రద్దీని దృష్టిలో పెట్టుకుని ఆలయ ప్రాంతంలో అన్ని ఏర్పాట్లు చేశారు. ఏ ఇబ్బందులు లేకుండా భక్తులంతా స్వామి వారిని దర్శించుకుని తీర్థప్రసాదాలు స్వీకరించే విధంగా సూర్యాలయం వీధి రోడ్డు పొడవునా చలువ పందిర్లు వేసి బారికేడ్లు ఏర్పాటుచేశారు. ప్రసిద్ధి చెందిన ఆలయం శ్రీకాకుళం జిల్లా అరసవల్లి తరువాత రాష్ట్రంలో రెండో సూర్యదేవాలయంగా తణుకు సూర్యదేవాలయం పేరుగాంచింది. ముఖ్యంగా ప్రతి ఏడాది రథసప్తమి సందర్భంగా స్వామివారి కల్యాణ మహోత్సవాన్ని తిలకించేందుకు జిల్లా నలుమూలల నుంచి 50 వేలకు పైగా భక్తులు వస్తుంటారు. ఈ ఏడాది స్వామివారికి ప్రీతికరమైన రోజు ఆదివారం రథసప్తమి రావడంతో భక్తుల తాకిడి మరింతగా పెరిగే అవకాశం ఉండడంతో దేవాదాయ ధర్మాదాయ శాఖ, ఆలయ కమిటీ పెద్దల పర్యవేక్షణలో స్వామి వారి కల్యాణం, దివ్య దర్శనం కార్యక్రమాలకు అంతా సిద్ధం చేశారు. అరుదైన విగ్రహం తణుకు సూర్యదేవాలయంలోని స్వామి విగ్రహం సప్త అశ్వాలతో అనూరుడను సారధితో ద్వారపాలకుల పహరాతో ఉష, పద్మిని, ఛాయ, సౌంజ్ఞ సమేతుడైన సూర్యభగవానుడి విగ్రహం అరుదైనదిగా చరిత్రలో నిలిచింది. 1942వ సంవత్సరంలో తణుకుకు చెందిన జోశ్యుల శ్రీరామమూర్తి స్థాపించిన తణుకు ఆలయంలోని ఈ సూర్య విగ్రహం స్కాంద, పద్మ పురాణాల్లో ప్రసుత్తించబడిన విధంగా చూపరులకు నేత్రానందం కలిగిస్తోంది. 2001వ సంత్సరంలో తణుకుకు చెందిన చిట్టూరి పరిపూర్ణ బ్రహ్మానంద చౌదరి, భక్తుల సహకారంతో ఆలయాన్ని పునఃప్రతిష్ట చేశారు. ఆలయంలో దేవతామూర్తుల విగ్రహాలు నేడు రథసప్తమి ముస్తాబైన తణుకు సూర్యదేవాలయం స్వామి దర్శనార్థం తరలిరానున్న భక్తులు ఉత్సవాలకు ఏర్పాట్లు పూర్తి -
కొనసాగుతున్న పులి దాడులు
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలంలో పులి దాడి చేసి చంపిన పశువులకు సంబంధించి వాటి యజమానులకు నష్టపరిహారం చె ల్లించాలని మాజీ ఎమ్మె ల్యే తెల్లం బాలరాజు అన్నారు. శనివారం ఆయన విలేకర్లతో మాట్లాడుతూ నాలుగు రో జులుగా ఈ పులి నాగులగూడెం, కోటనాగవరం, మెట్టగూడెం తదితర గ్రామాల్లో సంచరిస్తూ ప్రజలను భయపెడుతోందని, పులిని పట్టుకోవడంలో ఫారెస్ట్ అధికారులు విఫలమైనట్టు కనిపిస్తోందన్నారు. సకాలంలో పులిని బంధించి ఉంటే పశువులు మృత్యువాత పడేవి కావన్నారు. ఇప్పటివరకూ సుమారు 9 పశువుల వరకు పశువులను పులి వేటాడి చంపిందన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, రాత్రిళ్లు బయటకు రావద్దని సూచించారు. బుట్టాయగూడెం: ఏజెన్సీ గిరిజన గ్రామాల్లో ఎన్నడూలేని విధంగా పెద్దపులి సంచరిస్తూ పశువులపై పంజా విసురుతోంది. శనివారం వేకువజామున గుర్రప్పగూడెంలో లేగ గేదె దూడ, కోటనాగవరంలో మరో లేగ దూడ, గేదైపె దాడి చేసి హతమార్చింది. ఇలా కనిపిస్తున్న పశువులపై దాడి చేస్తూ ఫారెస్ట్ అధికారులకు చిక్కకుండా సంచరిస్తోంది. ఇదిలా ఉండగా పులిని తిరిగి అడవిలో పంపించేందుకు లేదా పులి నుంచి పశువులను, ప్రజలను రక్షించేందుకు ఫారెస్ట్ అధికారులు ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదని గిరిజనులు విమర్శిస్తున్నారు. నాలుగు రోజులుగా.. పశువుల మందలపై దాడి చేస్తున్న పులిని మీరు బంధిస్తారా లేక మాకు అప్పగిస్తారా అంటూ గిరిజనులు ఫారెస్ట్ అధికారులను ప్రశ్నిస్తున్నారు. నాలుగు రోజులుగా భయంతో బతుకుతున్నామని, ఎన్నిరోజులు బయటకు రాకుండా ఉంటామని ఆవేదన చెందుతున్నారు. సాయంత్రం 5 గంటలకు ఇళ్లకు చేరుకుంటున్నామని, తెల్లవారిన 8 గంటల తర్వాత గానీ బయటకు రావడం లేదని చెబుతున్నారు. కూలీలు పను లు మానేసే పరిస్థితి ఉందని, ప్రస్తుతం ముమ్మరంగా మొక్కజొన్న, వర్జీనియా పొగాకు పను లు ఉన్నాయని అంటున్నారు. పులి కారణంగా ఎవరూ పొలానికి వెళ్లలేని పరిస్థితులు నెలకొ న్నాయని చెబుతున్నారు. ఆధునిక టెక్నాలజీని ఉపయోగించి పులిని త్వరితగతిన అడవిలోకి పంపేందుకు అధికారులు చర్యలు తీసుకోవాలని అంతర్వేదిగూడెం సర్పంచ్ జోడే సత్య దుర్గాప్రసాద్ కోరుతున్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి. పోలవరం రూరల్: పులి సంచారం నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు శనివారం ప్రకటనలో తెలిపారు. పులి కదలికలపై సమాచారం తెలిస్తే పోలీసులకు తెలియజేయాలని కోరారు. -
కొల్లేరులో జనాగ్రహం
రెండున్నరేళ్ల బాలుడు అదృశ్యమై నాలుగు రోజులు గడిచినా ఆచూకీ లభించకపోవడంతో ఆ తల్లి కన్నీరు ఆగడం లేదు. ఆదివారం శ్రీ 25 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: కొల్లేరులో జనాగ్రహం కట్టలు తెంచుకుంది. కొల్లేరుకు శాశ్వత పరిష్కారం చూపిస్తామని గద్దెనెక్కిన కూటమి పాలకులు రెండేళ్లుగా మాయమాటలు చెబుతున్నారు. సమస్యకు పరిష్కారం లభించకపోగా ఆక్రమణల తొలగింపు పేరుతో కొల్లేరువాసుల కడుపుకొట్టడంతో జనాగ్ర హం పెల్లుబికింది. అటవీశాఖ అధికారులు స ర్వేలు, రీ సర్వేలు, ఆక్రమణల తొలగింపు అంటూ కొల్లేరు గ్రామాల్లో హడావుడిని కొల్లేరు వాసులు బలంగా ప్రతిఘటిస్తుండటంతో లంక గ్రామాల్లో టెన్షన్ మొదలైంది. రెండు రోజుల క్రితం కైకలూరు ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను కొల్లేరువాసులు కడుపు మండి నిలదీశారు. వీడని చిక్కుముడులు : గత ప్రభుత్వం హయాంలో సజావుగా ఉన్న కొల్లేరు వ్యవహారం ఒక్కసారిగా కదిలింది. సుప్రీంకోర్టు ఆదేశాలు పేరుతో కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు తొలగించి, నివేదిక ఇవ్వడానికి అటవీశాఖ అధికారులు హడావుడి చేస్తున్నారు. అసలు కొల్లేరు సరిహద్దుల అంశం ఇంకా పూర్తిస్థాయిలో చిక్కుముడి వీడకపోవడం, దశాబ్దాలుగా అపరిష్కృతంగా ఉన్న కొల్లేరు వ్యవహారాన్ని సుప్రీంకోర్టు పేరుతో తీవ్ర కదలికలు ప్రారంభమయ్యాయి. కొల్లేరు ప్రజల అమాయకత్వాన్ని ప్రజాప్రతినిధులు ఆసరాగా చేసుకుని శాశ్వత పరిష్కారం చూపిస్తామంటూ గద్దెనెక్కి అధికారంలోకి రాగానే అంతా సుప్రీంకోర్టు చేతుల్లో ఉంది, మా పరిధిలో ఏమీ లేదంటూ కూటమి ప్రజా ప్రతినిధులు మాట దాటవేస్తుండటంతో నిత్యం గందరగోళ పరిస్థితులు నెలకొంటున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో 10వ కాంటూరు వరకు 2.25 లక్షల ఎకరాల విస్తీర్ణంలో కొ ల్లేరు విస్తరించి ఉంది. ఆక్రమణల కారణంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో జీఓ నం.120ను జారీ చేశారు. ఈ క్రమంలో 5వ కాంటూరు వరకు అ భయారణ్యంగా గుర్తించి 77,135 ఎకరాల విస్తీర్ణా న్ని నిర్ణయించారు. ఆ తరువాత కొల్లేరు ఆపరేషన్ లో రెండు జిల్లాలో 31120 ఎకరాల్లో అక్రమ చెరువులను ధ్వంసం చేశారు. వీటిలో 14,932 ఎకరాల జిరాయితీ, 5510 ఎకరాల డి.ఫారం భూములు ఉన్నాయి. వీటికి పరిహారం ఇవ్వకుండా ధ్వంసం చేశారని రాష్ట్ర చేపల రైతుల సంఘం సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది. తదనంతర పరిణామాల్లో కాకినాడకు చెందిన పర్యావరణవేత్త కొల్లేరు అభయారణ్యంలో ఆక్రమణలు పెరిగాయని, కొల్లేరు ఆపరేషన్ అనంతరం సుప్రీంకోర్టు జారీ చేసిన ఉత్తర్వులను ప్రభుత్వం పాటించలేదంటూ దాఖలు చేసిన పిటీషన్ను కోర్టు విచారణకు గత ఏడాది స్వీకరించింది. ఈ క్రమంలో గతేడాది ఆక్రమణల వ్యవహారంపై సుప్రీంకోర్టు తీవ్రంగా స్పందించి కేంద్ర సాధికార కమిటీని నియమించడం, కమిటీ సభ్యులు నలుగురు గతేడాది జూన్ 17, 18 తేదీల్లో కొల్లేరులో పర్యటించడం, ప్రజాప్రతినిధులు, రైతులతో కలెక్టర్ అధ్యక్షతన సమావేశం నిర్వహించారు. అటవీ శాఖ అధికారులు, జిల్లా యంత్రాంగం నుంచి కొల్లేరుపై పూర్తి సమాచారం ఇవ్వని కారణంగా సుప్రీంకోర్టుకు నివేదిక సమర్పించలేదు. దీంతో అటవీశాఖ చీఫ్ కన్జర్వేటర్ రెండు జిల్లాల్లో అటవీ, రెవెన్యూ, ఇరిగేషన్ అధికారులతో హడావుడిగా సమీక్ష నిర్వహించి, నిడార్ సర్వే టెక్నాలజీ ద్వారా అభయారణ్యం సరిహద్దులను గుర్తించి నివేదిక ఇవ్వాలని సూచించారు. ఆ తరువాత వ్యవహారం ముందుకు సాగలేదు. ఏలూరు(మెట్రో): ఏలూరు కలెక్టరేట్లోని ఈవీఎం గోడౌన్ను శనివారం కలెక్టర్ కె.వెట్రిసెల్వి తనిఖీ చేశారు. భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. వచ్చే నెలాఖరులో కేసు విచారణకు రానుండటంతో అటవీశాఖ అధికారుల హడావుడి, అలజడి మొదలైంది. అదేస్థాయిలో కొల్లేరువాసులు అటవీశాఖ అధికారులను తిప్పి కొడుతున్నారు. అటవీశాఖ అధికారులు 18 వేల ఎకరాలు ఆక్రమణలో ఉందని, 9 వేల ఎకరాల్లో ఆక్రమణలను తొలగించామని నివేదికలు సమర్పించారు. అయితే క్షేత్రస్థాయిలో పరిస్థితి పూర్తిగా భిన్నం. ఈ క్రమంలో మళ్లీ కేంద్ర సాధికార కమిటీ నుంచి హడావుడి ఉంటుందని ఆక్రమణల తొలగింపు మొదలు పెట్టారు. ఈ క్రమంలో కై కలూరు మండలం చటకాయి, వడ్లకూటితిప్ప, శృంగవరప్పాడు, కొట్టాడ, ఏలూరు మండలంలో పత్తికోళ్ల లంక, అలాగే నిడమర్రు మండలం తోకలపల్లి, సాయన్నపాలెం గ్రామాల్లో అటవీశాఖ అధికారుల హడావుడిని కొల్లేరు ప్రజలు తీవ్రస్థాయిలో అడ్డుకోవడం, నిరసనలు నిర్వహించడం కొనసాగించారు. ఇక తాజాగా, ఎమ్మెల్యే కామినేని తీరుపై ఆగ్రహం వ్యక్తం చేయడం హాట్ టాపిక్గా మారింది. కొల్లేరు ప్రజలకు వేధింపులు పెరిగాయని, ఈనెల 27, 28 తేదీల్లో ఉప ముఖ్యమంత్రి పవన్కల్యాణ్ను కలవడానికి కొల్లేరు నుంచి పాదయాత్రగా వెళ్లాలని కొల్లేరువాసులు నిర్ణయించారు. ఈ క్రమంలో గురువారం కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం వద్ద కొల్లేరు పెద్దల సమావేశానికి ఎమ్మెల్యే కామినేని హాజరై పాదయాత్ర వద్దు, తాను మాట్లాడతానని, లేదంటే కొద్దిమందిని కలిసే ఏర్పాటు చేస్తానని పెద్దలకు చెప్పారు. దీంతో కూటమి మాటలు నమ్మి మోసపోయాం, వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఐదేళ్లలో అటవీశాఖ అధికారుల నుంచి ఇబ్బంది రాలేదని, కూటమి నేతలకు ఓట్లు వేసి గెలిపిస్తే మా పొట్టకొట్టారని తీవ్రస్థాయిలో నిలదీయడం చర్చనీయాంశంగా మారింది. కూటమి మాటలు నమ్మి మోసపోయామంటూ మండిపాటు కొల్లేటికోటలో ఎమ్మెల్యే కామినేనిని నిలదీసిన కొల్లేరు పెద్దలు ఆక్రమణల తొలగింపు పేరిట అటవీ శాఖ హడావుడి అధికారులను ప్రతిఘటిస్తున్న కొల్లేరు ప్రజలు సమస్యకు పరిష్కారం చూపాలంటూ వేడుకోలు -
జాతరలో డ్రోన్ నిఘా
ఏలూరు టౌన్: ఏలూరు తూర్పువీధిలో గంగానమ్మ జాతరకు భక్తులు భారీ సంఖ్యలో హాజరవుతారని, పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేపట్టాలని రేంజ్ ఐజీ జీ వీజీ అశోక్కుమార్ ఆదేశించారు. ఏలూరు వన్టౌన్ తూర్పువీధి, దక్షిణపువీధి జాతర ప్రాంతాలను ఎస్పీ కేపీ శివకిషోర్తో కలిసి ఆయన శనివారం ఆయన పోలీస్ బందోబస్తు చర్యలపై ఆరా తీశారు. ఊరేగింపు సమయంలో ట్రాఫిక్ సమస్య తలెత్తకుండా పర్యవేక్షించాలన్నారు. జాతర కమిటీ సభ్యులు, ఆయా శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పా ట్లు చేయాలన్నారు. జాతర ఊరేగింపులో మఫ్టీలో పోలీసులను రంగంలోకి దించాలనీ, డ్రోన్ కెమెరా లు, సీసీ కెమెరాలతో నిత్యం నిఘా ఉంచాలని ఆదేశించారు. డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, వన్టౌన్ సీఐ జీ.సత్యనారాయణ, ఎస్సై సుధాకర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు ఉన్నారు. -
హేలాపురి కల్పవల్లి
ఏలూరు నగర ఇలవేల్పు.. హేలాపురి ఆరాధ్య దేవత గంగానమ్మవారి జాతర మహోత్సవం వచ్చేసింది. మూడు నెలలుగా నగరంలోని ఏడు ప్రాంతాల్లో అమ్మవార్ల మేడల వద్ద చేస్తున్న కొలుపులు ముగింపు దశకు చేరుకున్నాయి. ఆదివారం నగరంలోని మూడొంతుల ప్రాంతాల్లో జాతరకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఏడేళ్లకోసారి వచ్చే జాతర కావడంతో నగరవాసులు మేడల వద్దకు వెళ్లి అమ్మవార్లకు నైవేద్యాలు, చీరలు, పసుపు కుంకుమలు సమర్పిస్తున్నారు. అలాగే సామాజికవర్గాలు, ప్రాంతాల వారీగా, అపార్ట్మెంట్ వాసులు బృందాలుగా వెళ్లి సారెలు సమర్పించారు. లక్ష్మీవారపుపేటలోని మేడలో.. ఏలూరు లక్ష్మీవారపుపేటలో అమ్మవారి ఉత్సవమూర్తి ఏలూరు (ఆర్ఆర్పేట): జాతరను పురస్కరించు కుని ఏలూరు నగరమంతా కోలాహలంగా మారింది. నగరవాసులు తమ బంధువులు, మిత్రులను ఆహ్వానించారు. ఇప్పటికే నగరంలోని లాడ్జీల్లో గదులు నిండుకున్నాయి. శనివారం సాయంత్రం నుంచి అతిథులు రాక మొదలుకాగా.. ఆదివారం ఉదయం మరింత పెరిగే అవకాశం ఉంది. ఆదివారం వేకువజాము 4 గంటల నుంచి అమ్మవార్ల మేడల వద్ద భక్తుల సందడి మొదలుకానుంది. మేడల వద్ద పూర్తయిన ఏర్పాట్లు అమ్మవార్ల మేడల వద్దకు చేరుకునే భక్తుల కోసం జాతర కమిటీ ప్రతినిధులు ఏర్పాట్లు పూర్తి చేశారు. భారీగా బారీకేడ్లు ఏర్పాటు చేశారు. నైవేద్యాలు సమర్పించేందుకు ఎక్కువ ఖాళీ ప్రదేశం ఉండేలా చర్యలు తీసుకున్నారు. జాతర ప్రశాంతంగా జరిగేలా అందరూ సహకరించాలని కమిటీల ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. మేడల వద్ద వైద్యారోగ్యశాఖ ప్రత్యేక శిబిరాలు ఏర్పాటుచేయనుంది. అతిథులకు ప్రత్యేక ఆతిథ్యం : నగరమంతా జాతర సందడి నెలకొంది. ప్రతి ఇంటి వద్ద అతిథుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు, టిప్టాప్ పందిళ్లు ఏర్పాటుచేశారు. నగరంలోని టిప్టాప్ సామగ్రికి డిమాండ్ రావడంతో పొరుగు గ్రామాల నుంచి తెప్పించారు. అలాగే వంట పాత్రలను శుక్రవారం సాయంత్రం నుంచి దింపుకుంటున్నారు. జాతరను పురస్కరించుకుని బంధు, మిత్రులకు ప్రత్యేక భోజన ఏర్పాట్లు చేస్తున్నారు. నిరంతర నిఘా అమ్మవార్ల మేడల వద్దకు లక్షల్లో భక్తులు వచ్చే అవకాశం ఉండటంతో పోలీసులు ప్రత్యేక దృష్టి సారించారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ ఇప్పటికే అధికారులకు సూచనలు, ఆదేశాలు జారీ చేశారు. మద్యం సేవించి అల్లర్లకు పాల్పడే వారిని నియంత్రించడానికి మఫ్టీలో పోలీసులను పహారా కోసం ఏర్పాటుచేశారు. సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా నిరంతర నిఘా పెట్టారు. ట్రాఫిక్ అంతరాయం కలగకుండా ట్రాఫిక్ మళ్లింపునకు చర్యలు తీసుకున్నారు. మది నిండుగా.. ఊరంతా పండుగ నేడు గంగానమ్మ జాతర నగరమంతా కోలాహలం అమ్మవార్ల మేడల వద్ద సర్వం సిద్ధం ఇళ్ల వద్ద సందడే సందడి -
వేగంగా వైఎస్సార్సీపీ కమిటీల డిజిటలైజేషన్
కై కలూరు: గ్రామాల్లో వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణ కమిటీల డిజిటలైజేషన్ వేగవంతం చే యాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూ లం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. పార్టీ అధ్యక్షుడు, మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ మోహన్రెడ్డి ఆదేశాల మేరకు కలిదిండి మండలం మట్టగుంట వైఎస్సార్సీపీ గ్రామ అ ధ్యక్షుడు బొమ్మిడి మర్రాజు ఇంటి వద్ద గురువారం ఈ కార్యక్రమం నిర్వహించారు. కమిటీ సభ్యుల ఫొటో వివరాలు డిజిటలైజేషన్ చేశారు. కలిదిండి మండల పార్టీ అధ్యక్షుడు తిరుమాని రమేష్, నియోజకవర్గ రైతు విభాగ అధ్యక్షుడు కొల్లాటి సత్యనారాయణ, రేవు నరసింహారావు, సిరింకి జల్సారాయుడు, తిరుమని నాగేశ్వర రావు, కొప్పనాతి యేసురాజు, బొడ్డు దుర్గాప్రసాద్, బలగం శ్యాంబాబు పాల్గొన్నారు. చాట్రాయి: అన్నదమ్ముల మధ్య ఏర్పడిన భూమి వివాదంలో దంపతులు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన సంఘటన మండలంలోని చోటుచేసుకుంది. ఎస్సై డి.రామకృష్ణ కథనం మేరకు మండలంలోని కృష్ణారావుపాలెం గ్రామానికి చెందిన పండు తిరుపతి దాసు, అన్న రామచంద్రయ్య మధ్య భూవివాదం నెలకొంది. మూడు నెలల క్రితం వివాదంలో ఉన్న 90 సెంట్ల భూమిలో తమ్ముడు తిరుపతిదాసు మామిడి మొక్కలు నాటాడు. గురువారం రామచంద్రయ్య కుటుంబసభ్యులు ఈ మామిడి మొక్కలను నరుకుతుండగా తిరుపతిదాసు, అతడి భార్య బేబి పురుగు మందు తాగి ఆత్మహత్యకు యత్నించారు. స్థానికులు వారిని 108లో విస్నన్నపేట ప్రభుత్వాస్పత్రికి, అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం నూజివీడు ఏరియా ఆస్పత్రికి తరలించారు. కేసు నమోదు చేసినట్టు ఎస్సై చెప్పారు. ఏలూరు (టూటౌన్): పెదవేగి పామాయిల్ ఫ్యాక్టరీని ప్రభుత్వ రంగ సంస్థగానే ఉంచాలని ఇఫ్టూ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రధాన కార్యదర్శి బద్దా వెంకట్రావు ప్రభుత్వాన్ని డి మాండ్ చేశారు. ఈ మేరకు ఏపీ ఆయిల్ ఫెడ్ ప్రాసెసింగ్ యూనిట్ మేనేజింగ్ డైరెక్టర్, వైస్ చైర్మన్ బాలాజీ నాయక్కి ఇఫ్టూ అనుబంధ సంఘాల ఆధ్వర్యంలో డిమాండ్లతో కూడిన వినతిపత్రం అందించారు. వివరాలను ఏలూరులో గురువారం పత్రికలకు వెల్లడించారు. పామాయిల్ ఫ్యాక్టరీని ఆధునికీకరించాలని, నూతన ఫ్యాక్టరీని నిర్మించాలని, రైతులకు అండగా ఉండాలని, పెద్ద ఎత్తున ఉపాధి కల్పించే ఆలోచన చేయాలని ఎండీని కోరామన్నారు. ఎండీని కలిసిన వారిలో మాణికొండ కాంతారావు, ముక్కు సుబ్బారావు, సింహాచలం, ఈశ్వరరావు ఉన్నారు. ఏలూరు (టూటౌన్): మధ్యాహ్న భోజన కార్మికులకు నెలల తరబడి బిల్లులు పెండింగ్లో ఉన్నాయని వెంటనే విడుదల చేయాలని ఏఐటీయూసీ డిమాండ్ చేసింది. స్థానిక ఏఐటీయూ సీ కార్యాలయంలో గురువారం మిడ్డే మీల్ వర్కర్స్ సమావేశంలో జిల్లా కార్యదర్శి రెడ్డి శ్రీనివాస్ డాంగే, జిల్లా సహాయ కార్యదర్శి పి. కిషోర్ మాట్లాడారు. బిల్లులు సకాలంలో రాకపోవడంతో భోజన కార్మికులు అప్పులు చేసి వండి వార్చాల్సి ఉంటోందని ఆవేదన వ్యక్తం చేశారు. బిల్లుల విడుదలతో నిర్లక్ష్యం తగదని, అలాగే కార్మికులకు కేవలం రూ.3 వేలు గౌరవ వేతంన ఇవ్వడం సిగ్గుచేటన్నారు. వీరి గౌరవ వేతనం పెంచాలని కోరారు. దెందులూరు: మండలంలోని జోగన్నపాలేనికి చెందిన అంతర్జాతీయ ఐస్ స్కేటర్ జెస్సీరాజ్ మత్రాపు ఖేలో ఇండి యా వింటర్ గే మ్స్–2026లో రజత పతకం సాధించింది. లడక్లో ఈనెల 20 నుంచి ఈ పోటీలు జరుగుతున్నాయి. జెస్సీరాజ్ సీనియర్ గరల్స్ ఫిగర్ స్కేటింగ్ కేటగిరీలో రెండో స్థానంలో ని లిచి పతకం సాధించింది. ఆమెను ఐస్ స్కేటింగ్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా అధ్యక్షుడు అమితాబ్ శర్మ, ఏపీ ఐస్ స్కేటింగ్ అసోసియేషన్ సెక్రటరీ ఖాజా, అధ్యక్షుడు మురళి, కోచ్ అబ్దుల్ హఫీజ్, శాప్ క్రీడల అధికారి సురేందర్బాబు తదితరులు అభినందించారు. -
హెల్మెట్ భారం కాదు.. భద్రత
● 37వ జాతీయ భద్రతా మాసోత్సవాలు ● హెల్మెట్ ధారణపై అవగాహన కార్యక్రమాలు యలమంచిలి: గమ్యస్థానాలకు చేరుకోవాలనే తొందరలో ద్విచక్ర వాహన చోదకులు అతివేగంగా వాహనాలను నడిపి ప్రమాదాల బారిన పడుతున్నారు. దీనికి తోడు హెల్మెట్ ధరించకపోవడంతో ప్రమాదాల్లో మృత్యువాతకు గురై కుటుంబ సభ్యులకు తీరని దుఃఖం మిగుల్చుతున్నారు. నిబంధనలు పాటించాలని ప్రభుత్వ అధికారులు మొత్తుకుంటున్నా వాహనచోదకులు లెక్కపెట్టక ప్రమాదాలు కొని తెచ్చుకుంటున్నారు. 37వ జాతీయ భద్రతా మాసోత్సవాల సందర్భంగా ప్రస్తుతం మోటార్ వెహికల్స్ అధికారులు రోడ్డు భద్రతా నియమాలపై వాహన చోదకులకు అవగాహన కల్పిస్తున్నారు. వాహనచోదకులు తప్పనిసరిగా నిబంధనలు పాటించాలని సూచిస్తున్నారు. అనుకోని ప్రమాదాలు జరిగినా హెల్మెట్ ధరించడం వల్ల ప్రాణాపాయం నుంచి బయట పడవచ్చని చెబుతున్నారు. హెల్మెట్ ధారణతో లాభాలు ద్విచక్రవాహనాలు నడిపే వ్యక్తులకు ప్రమాదంలో తలకు దెబ్బ తగిలితే, మెదడు దెబ్బ తినడంతో ఒక్కోసారి దెబ్బ తీవ్రతను బట్టి శరీరంలో కొన్ని అవయవాలు శాశ్వతంగా చచ్చుబడడం, జ్ఞాపకశక్తిని కోల్పోవడం, మంచానికే పరిమితం కావడం, పలు సందర్భాల్లో మరణించడం జరుగుతుంది. ద్విచక్ర వాహనదారులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలని ప్రతి ఒక్కరూ సూచిస్తున్నారు. హెల్మెట్ ధరించడం వల్ల ప్రమాదాలు జరిగినప్పుడు తలకు అయ్యే గాయాల తీవ్రతను తగ్గించడం వల్ల చాలావరకు ప్రాణాపాయం నుంచి బయటపపడే అవకాశం ఉంటుంది. అందుకే ప్రభుత్వం హెల్మెట్ ఆవశ్యకతను తెలియజేస్తూ వాహన చోదకులు తప్పనిసరిగా హెల్మెట్ ధరించాలన్న నిబంధనలను కఠినతరం చేసింది. హెల్మెట్ వాడకంపై వాహనచోదకులకు అవగాహన కల్పిస్తున్న అధికారులు హెల్మెట్ లేకుండా వాహనాలు నడుపుతున్న దృశ్యం వాహన చోదకులు నిబంధనలను అతిక్రమిస్తే చర్యలు తప్పవు. మద్యం సేవించి, మితిమీరిన వేగం, నిర్లక్ష్య డ్రైవింగ్ కారణంగా ఈ మధ్య కాలంలో రోడ్డు ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. హెల్మెట్ ధరించడంతో పాటు నిబంధనలు పాటించాలి. హెల్మెట్ లేకుంటే మొదటిసారిగా అపరాధం రుసుము విధిస్తాం. రెండోసారి, మూడోసారి పట్టుబడితే వాహనం సీజ్ చేసి కేసు నమోదు చేస్తాం. – అజ్మీర బద్దు, పాలకొల్లు మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ -
గణతంత్ర వేడుకలకు ఆహ్వానం
కొయ్యలగూడెం: భారత గణతంత్ర వేడుకల్లో పాల్గొనే అరుదైన అవకాశం కొయ్యలగూడెం మండలం కనకాద్రిపురం (ఆరిపాటి) గ్రామానికి చెందిన తోట కృపామణికి దక్కింది. ఈ మేరకు రాష్ట్ర ఎక్స్ అఫీషియల్ కార్యదర్శి నుంచి ఉత్తర్వులు జారీ అయినట్లు ఆమె తెలిపారు. ప్రస్తుతం కృపామణి ఆంధ్ర ప్రదేశ్ సీ్త్ర నిధి బ్యాంక్ డైరెక్టర్గా, ఏలూరు జిల్లా మహిళా సమాఖ్య కార్యదర్శిగా పనిచేస్తున్నారు. కనకాద్రిపురంలో ఆమె తయారు చేస్తున్న చిరుధాన్యాల ఉత్పత్తులకుగాను గ్రామం పేరు ప్రపంచ ఫుడ్ ఫెస్టివల్లో మార్మోగింది. అంతేగాక నాబార్డు ద్వారా ఉత్తమ మహిళా ఎంటర్ప్రిన్యూర్ అవార్డు అందుకున్న కృపామణిని గతేడాది కలెక్టర్ వెట్రీ సెల్వి జిల్లా తరుపున సత్కరించారు. యలమంచిలి: అధికంగా మద్యం సేవించి రోడ్డుపై పడిపోయిన వ్యక్తి గాయాలతో ఆస్పత్రిలో చిక్సిత పొందుతూ మృతి చెందాడు. ఎస్సై కర్ణీడి గుర్రయ్య తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. బూరుగుపల్లి గ్రామానికి చెందిన అంజూరి శ్రీను (45) ఈ నెల 20వ తేదీ రాత్రి అధికంగా మద్యం సేవించి బూరుగుపల్లి బస్టాండ్ సెంటర్లో పడిపోయాడు. అతను సిమెంట్ బల్లపై పడిపోవడంతో తలకు బలమైన గాయమైంది. అతడికి బుధవారం దొడ్డిపట్ల ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో ప్రాథమిక చికిత్స అనంతరం మెరుగైన వైద్యం నిమిత్తం పాలకొల్లు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. శ్రీను మృతదేహానికి పోస్టుమార్టం నిర్వహించి కుటుంబ సభ్యులకు అప్పగించినట్లు ఎస్సై గుర్రయ్య తెలిపారు. శ్రీను భార్య గంగావతి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మండవల్లి : పందెం కోళ్ల చోరీ కేసులో నిందితులను పోలీసులు అరెస్ట్ చేశారు. ఎస్సై సీహెచ్ఎస్ రామచంద్రరావు తెలిపిన వివరాలివి. గత నెలలో పసలపూడి గ్రామంలో గన్నమనేని సుధాకర్కు చెందిన 12 పందెం కోళ్లను గుర్తు తెలియని వ్యక్తులు తస్కరించారు. వీటి విలువ రూ.లక్షా 50 వేలు ఉంటుంది. దీనిపై బాధితుడి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై రామచంద్రరావు చెప్పారు. ఈ కేసులో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసి గురువారం రిమాండుకు పంపినట్లు తెలిపారు. కోళ్లను రికవరీ చేసినట్లు చెప్పారు. పెదవేగి : మద్యం మత్తులో ఓ వ్యక్తి ఎలుకల మందు తిని మృత్యువాత పడ్డాడు. పెదవేగి ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. పెదవేగి మండలం కొండలరావుపాలెం గ్రామానికి చెందిన కిలారి కుర్మినాయుడు (30) ఈనెల 17న మద్యం సేవించి తాగిన మత్తులో కడుపునొప్పి తట్టుకోలేక ఇంట్లో ఉన్న ఎలుకల మందు పేస్టును తిన్నాడు. వెంటనే కుటుంబీకులు అతడిని హుటాహుటిన ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ గురువారం మృతి చెందాడు. కుర్మినాయుడుకి 21వ తేదీ వరకు బాగానే ఉందని వైద్యులు చెప్పారని, కానీ గురువారం చనిపోయినట్లు వెల్లడించారని, మృతుడి సోదరుడు కిలారి నాగరాజు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. భీమవరం: మహాత్మాగాంధీ వర్థంతిని పురస్కరించుకుని సర్వోదయ మండలి ఆధ్వర్యంలో సర్వోదయమే గాంధేయం అనే అంశంపై ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాస్థాయిలో నిర్వహించిన సీనియర్ రచయితల కవితా రచనల పోటీల్లో విజేతల వివరాలను సర్వోదయ మండలి జిల్లా ప్రధాన కార్యదర్శి ఇందుకూరి ప్రసాదరాజు గురువారం తెలిపారు. పోటీల్లో 17 రచనలు ఉత్తమ రచనలుగా ఎంపికయ్యాయన్నారు. విజేతలుగా వీఎస్వీ ప్రసాద్ (తణుకు), పి నాగరాజు (జీలకర్రగూడెం), టి లక్ష్మీనర్సింహమూర్తి (పాలకోడేరు), ఎం సూర్యనారాయణ (పెనుమదం), వై పాండురంగాచార్యులు (గణపవరం), కె గోపాలశర్మ (భీమవరం), బి జ్ఞానప్రసాద్ (తాడేపల్లిగూడెం), జీఆర్కే రాజువంశీ (భీమవరం), కె రామప్రసాద్ (పాలంగి), డీవీ బాలసుబ్రహ్మణ్యం (ఉండి), కె సుబ్రహ్మణ్యశర్మ (గునుపూడి), ఎల్ఎన్ శశికళ (అజ్జమూరు), కె కుషాలివెంకట్ (బొర్రంపాలెం), సీహెచ్ లక్ష్మీనారాయణ (భీమవరం), జి శేషేంద్రరావు (అత్తిలి), డి శ్రీరామకృష్ణంరాజు (తాడేపల్లిగూడెం), వి శ్రీనివాస్ (పెదతాడేపల్లి) నిలిచారన్నారు. వీరికి ఈనెల 30వ తేదీన పెదనిండ్రకొలను మహాత్మాగాంధీ భవనంలో కవితా పురస్కారాలు, బహుమతులు అందజేస్తామని ప్రసాదరాజు తెలిపారు. -
కిచెన్ గార్డెన్లతో ఆరోగ్యం
కేంద్ర ప్రభుత్వం పోషణ అభియాన్ పథకంలో భాగంగా ప్రతి అంగన్వాడీ కేంద్రంలో పిల్లలు, బాలింతలు, గర్భిణులకు నాణ్యమైన ఆహారం అందించడమే లక్ష్యంగా ఆకు కూరలు, కూరగాయలను పండిస్తున్నాం. అలాగే ఆహ్లాదం కోసం అందమైన పూలమొక్కలను పెంచేలా కృషి చేస్తున్నాం. – యూవీ పద్మావతి, సీడీపీఓ, బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో ఉన్న అంగన్వాడీ కేంద్రాల్లో చుట్టూ పచ్చదనం, అందమైన పూలమొక్కలతో ఆహ్లాదకరంగా దర్శనమిస్తున్నాయి. అలాగే వీటితోపాటు కూరగాయలు, ఆరోగ్యాన్నిచ్చే ఆకుకూరలు వంటివి కూడా అంగన్వాడీ కేంద్రం చుట్టూ అంగన్వాడీ కార్యకర్తలు పెంచుతున్నారు. అంగన్వాడీ కేంద్రాల్లో పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు కలుషితంలేని ఆహారం అందించాలనే ఆలోచనతో కేంద్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో ప్రతి అంగన్వాడీ కేంద్రంలో కూడా న్యూట్రీషన్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నారు. అంగన్వాడీ కేంద్రాలకు వచ్చే పిల్లలకు, గర్భవతులు, బాలింతలకు సేంద్రియ ఎరువుల ద్వారా పెంచుతున్న తోటకూర, గోంగూర, మెంతికూర, బచ్చలికూర, పాలకూరతోపాటు వంగ, బెండ, చిక్కుడు, తదితర కూరగాయలను ఆహారంగా అందిస్తున్నారు. అలాగే రకరకాల పూలమొక్కలను కూడా పెంచి కార్యకర్తలు వాటిని రక్షిస్తున్నారు. వీటి పెంపకానికి ఎటువంటి రసాయనిక ఎరువులు వినియోగించకుండా కేవలం సేంద్రియ ఎరువులను మాత్రమే వినియోగించడం విశేషం. 63 న్యూట్రిషన్ గార్డెన్లు బుట్టాయగూడెం ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని అంగన్వాడీ కేంద్రాల్లో న్యూట్రిషన్ గార్డెన్లను కార్యకర్తలు పెంచుతున్నారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి, వేలేరుపాడు, కుక్కునూరు మండలాల్లో కూడా పోషణ అభియాన్ పథకంలో నూట్రిషన్ గార్డెన్లను ఏర్పాటు చేస్తున్నారు. కాగా ఒక్క బుట్టాయగూడెం మండలంలోనే సుమారు 63 అంగన్వాడీ కేంద్రాల్లో ఏర్పాటు చేసిన న్యూట్రిషన్ గార్డెన్లు కళకళలాడుతూ దర్శనమిస్తున్నాయి. అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకుకూరలు, మొక్కల పెంపకం -
జాతరకు పటిష్ట బందోబస్తు
పూతపైనే ఆశలన్నీ నూజివీడు నియోజకవర్గంలో మామిడి పూతలు బాగుండటంతో రైతులు ఆశతో ముందుకు సాగుతున్నారు. దాదాపు 85 శాతం తోటల్లో పూతలు వచ్చాయి. 8లో uఎస్పీ ప్రతాప్ శివకిషోర్ ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరులో ఈనెల 25, 26 తేదీల్లో జరిగే గంగానమ్మవారి జాతర మహోత్సవాలకు పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేసినట్టు జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ తెలిపారు. తూర్పువీధిలో జాతర జరిగే ప్రాంతాన్ని గురువారం ఆయన పరిశీలించి అధికారులకు సూచనలిచ్చారు. బందోబస్తు, ట్రాఫిక్ నియంత్రణపై ఆదేశాలు జారీ చేశారు. భక్తుల రద్దీ విపరీతంగా ఉండే అవకాశం ఉందని, తోపులాటలు జరగకుండా క్యూలైన్లు ఏర్పాటు చేయాల న్నారు. ట్రాఫిక్ మళ్లింపునకు పటిష్ట చర్యలు తీసుకోవాలన్నారు. జాతర ముసుగులో అసాంఘిక కార్య కలాపాలు జరగకుండా డ్రోన్లతో త నిఘా ఉంచాలన్నారు. అనంతరం దక్షిణపు వీధిలో జాతర జరిగే ప్రాంతాలను పరిశీలించారు. డీఎస్పీ డి.శ్రావణ్కుమార్, ఎస్బీ ఇన్స్పెక్టర్ మల్లేశ్వరరావు, ఏలూరు వన్టౌన్ ఇన్స్పెక్టర్ సత్య నారాయణ, ఎస్ఐ సుధాకర్ ఉన్నారు. -
ఎమ్మెల్యే పితాని వైఖరి మార్చుకోవాలి
పెనుగొండ: రాజ్యాంగ బద్ధంగా ప్రజల చేత ప్రత్యక్షంగా ఎన్నుకోబడిన స్థానిక సంస్థల ఎస్సీ, బీసీ ప్రజాప్రతినిధుల హక్కులకు, విధులకు ఆటంకం కల్పించే విధంగా ఆచంట నియోజకవర్గంలో వ్యవహరిస్తున్నారని, ఇప్పటికై నా స్థానిక ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ వైఖరిని మార్చుకోవాలని వైఎస్సార్ సీపీ ఎస్సీ సెల్ జిల్లా అధ్యక్షుడు చిన్నం ఏడుకొండలు, నియోజకవర్గ అధ్యక్షుడు పిల్లి రుద్ర ప్రసాద్ డిమాండ్ చేశారు. బుధవారం ఆచంటలో ఎస్సీ సెల్, బీసీ సెల్ల ఆధ్వర్యంలో డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ విగ్రహ వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆచంట పంచాయతీలో దళిత మహిళా సర్పంచ్ కోట సరోజనీ వెంకటేశ్వరరావు హక్కులను కాలరాసి గ్రామ కార్యదర్శి అధికార నాయకుల కనుసన్నల్లో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ఆచంట గ్రామ కార్యదర్శిపై ఎస్సీ, ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని డిమాండ్ చేశారు. అదేవిధంగా కొడమంచిలి పంచాయతీకి సంబంధించి రికార్డులను తారుమారు చేసి, ఓచర్లను చింపివేసి సర్పంచ్ను విచారణ పేరుతో ఇబ్బందులకు గురిచేస్తున్నారని వివరించారు. అలాగే పండితవిల్లూరు సర్పంచ్ బీసీ మహిళ చెక్ పవర్ రద్దు చేయించారని, జగన్నాధపురం బీసీ సర్పంచ్ బిల్లులు నిలుపుదల చేశారన్నారు. పెనుగొండ మండల పరిషత్లో బీసీ ఎంపీపీకి వ్యతిరేకంగా వ్యవహరిస్తున్నారన్నారు. కోరం ఉన్నా సమావేశం నిర్వహించకుండా గుండెపోటు నాటకం ఆడడమే కాకుండా, ఎమ్మెల్యే పితానిని కలిస్తేనే ముందుకు సాగడం జరుగుతుందని స్వయనా ఎంపీడీవో హెచ్చరించడం దారుణమన్నారు. ఇటువంటి దురాగతాలను ఆపకపోతే నియోజకవర్గ స్థాయిలో ప్రజాప్రతినిధులతో కలసి ఆమరణ నిరాహార దీక్ష చేపడతామని హెచ్చరించారు. అధికారాన్ని అడ్డుపెట్టుకొని ఎమ్మెల్యే చేయాల్సిన ప్రభుత్వ కార్యక్రమాలను ఎమ్మెల్యే కుమారుడు చేయడం ఎంతవరకూ సమంజవసమని ప్రశ్నించారు. కార్యక్రమంలో పార్టీ నాయకులు కేతా తాతారావు, జక్కంశెట్టి శ్రీరాములు, కాండ్రేకుల కనకేశ్వరరావు దొమ్మేటి రాంబాబు, గుబ్బల రామకృష్ణ, కొవ్వూరి సురేష్, దొంగ ఉపేంద్ర, చదలవాడ ముత్యాలరావు, పీతల అంబేడ్కర్, పీతల జ్ఞానరాజు, కోటగిరిధర్, మండేల శ్రీను, యడ్ల రామకృష్ణ, కుసుమే వెంకటేశ్వరరావు, ఏనుగుపల్లి వరప్రసాద్, బ్యూలా ప్రసాద్, కోటే శశిమధు, బొరుసు రాంబాబు, యల్లమెల్లి రాజేష్, కొండేటి భవానీ ప్రసాద్, నక్కా శ్రీనులు పాల్గొన్నారు. ఆచంటలో ప్రజాప్రతినిధుల నిరసన -
కవి ప్రసాద్కు జాతీయ పురస్కారం
తణుకు అర్బన్: తణుకుకు చెందిన ప్రముఖ కవి వీఎస్వీ ప్రసాద్ అక్షర ప్రవీణ జాతీయ ప్రతిభా పురస్కారం అందుకున్నారు. ఈనెల 21వ తేదీన విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్, శ్రీశ్రీ కళావేదిక సంయుక్త ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఈ అవార్డు అందుకున్నట్లు కవి ప్రసాద్ తెలిపారు. తెలుగు భాషకు గౌరవం, తెలుగు సంస్కృతికి గుర్తింపు, తెలుగు సంప్రదాయలకు చేస్తున్న సాహిత్య కృషిని గుర్తించి ఈ పురస్కారం అందజేసినట్లు వివరించారు. కవి సార్వభౌమ శ్రీనాధ కవి వంశీయులు డాక్టర్ కావూరి శ్రీనివాసశర్మ, శ్రీశ్రీ కళాశేదిక జాతీయ కార్యదర్శి నూకే బాలార్జున సత్యనారాయణ, సుప్రసిద్ధ సామాజిక సేవకులు, కవి జాబాది మోహన్ తదితరులు జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందజేసి గజమాలతో సత్కరించినట్లు చెప్పారు. శ్రీశ్రీ కళావేదిక అంతర్జాతీయ సీఈవో డాక్టర్ కత్తిమండ ప్రతాప్ జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరీ భూషణం, ప్రధాన కార్యదర్శి డాక్టర్ టి.పార్థసారధి కవి ప్రసాద్ను ప్రత్యేకంగా ప్రశంసించారు. -
టెక్నీషియన్ ఆత్మహత్య ఘటనలో ఇద్దరి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసత్రిలోని అపోలో డయాలసిస్ సెంటర్లో విధులు నిర్వహిస్తున్న టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆత్మహత్య ఘటనలో ఇద్దరు నిందితులను అరెస్ట్ చేసినట్టు ఇన్చార్జి డీఎస్పీ యు.రవిచంద్ర గురువారం తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. తూర్పుగోదావరి జిల్లా సీతానగరం మండలం ఉండేశ్వరపురానికి చెందిన సుధాకర్ డయాలసిస్ సెంటర్లో ఔట్సోర్సింగ్ విధానంలో సీనియర్ టెక్నీషియన్, సెంటర్ ఇన్చార్జిగా పనిచేస్తున్నారు. 2023లో డయాలసిస్ చికిత్సకు వచ్చే ఓ రోగి కుమారుడు కొమ్ము అజయ్బాబు, సెంటర్లో ఆయా యరమాల కరుణకుమారితో చనువుగా ఉండటంతో సుధాకర్ మందలించాడు. దీంతో వీరిద్దరూ కక్ష పెంచుకుని సుధాకర్పై అక్రమ కేసు పెట్టడంతో అధికారులు సుధాకర్ను అవనిగడ్డ బదిలీ చేశారు. ఈ నేపథ్యంలో గతేడాది సెప్టెంబర్లో సుధాకర్ బదిలీపై మరలా జంగారెడ్డిగూడెం వచ్చారు. అప్పటి నుంచి అజయ్బాబు, కరుణకుమారి, అలుగు ఆనందశేఖర్, మరో డయాలసిస్ రోగి ములకాల వీరరాఘవులతో కలిసి సుధాకర్పై పీజీఆర్ఎస్లో ఫిర్యాదు చేసి వేధించడం మొదలుపెట్టారు. 2023లో పెట్టిన కేసుకు సంబంధించి రాజీ పేరుతో భారీగా డబ్బులు డిమాండ్ చేయడంతో పాటు ఇవ్వకపోతే కేసులు, పిటీషన్లు పెడతామని బెదిరించారు. వేధింపులు తాళలేక ఈనెల 18న ఏరియా ఆస్పత్రిలోని ఆర్వో ప్లాంట్లో సుధాకర్ ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నారు. సూసైడ్ నోట్ రాసి బాధ్యులైన నలుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని కోరారు. ఈ కేసులో నింది తులు అజయ్బాబు, కరుణకుమారిని అరెస్టు చేసి రిమాండ్కు తరలించామని డీఎస్పీ చెప్పారు. మిగిలిన ఇద్దరు పరారీలో ఉన్నారన్నారు. సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్ పాల్గొన్నారు. -
అనుగృహమెప్పుడో..?
ఏలూరు(మెట్రో): అధికారంలోకి వస్తే అది చేస్తాం.. ఇది చేస్తామని ప్రగల్భాలు పలికిన చంద్రబాబు సర్కారు ఏరుదాటాక తెప్పతెగలేసిన చందంగా పాలన సాగిస్తోంది. అధికారంలోకి వచ్చి ఏడాదిన్నర గడిచినా జిల్లాలో ఒక్క కొత్త ఇంటిని కూడా మంజూరు చేయలేదు. అలాగే గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో అప్పటి సీఎం జగన్మోహన్రెడ్డి మంజూరు చేసిన ఇళ్లను మధ్యలో నిలిపివేసిన ఘనత కూడా చంద్రబాబు సర్కారుకే దక్కుతుంది. పేదల సొంతింటి కల సాకారం చేసేందుకు జగన్ సర్కారు ఉద్యమంలా ఇళ్లు మంజూరు చేస్తే, వీటి నిర్మాణాలకు సంబంధించి చంద్రబాబు ప్రభుత్వం ఒక్క రూపాయి కూడా విడుదల చేయలేదు. అప్పుడప్పుడూ పేదల ఇళ్ల నిర్మాణాలకు దరఖాస్తుల ఆహ్వానం అంటూ హడావుడి చేస్తూ సరిపెడుతోంది. గత ప్రభుత్వంలో 82 వేలకు పైగా.. జిల్లావ్యాప్తంగా గత ప్రభుత్వంలో 82,578 గృహ నిర్మాణాలు మంజూరు చేయగా వాటిలో 80,885 నిర్మాణాలు అప్పట్లోనే ప్రారంభమయ్యాయి. 2024 జూన్ నాటికి 30,429 ఇళ్ల నిర్మాణాలను అప్పటి ప్రభుత్వం పూర్తి చేయించింది. అనంతరం మరో 15 వేల నిర్మాణాలను పూర్తి చేసి 45,453 మందితో గృహప్రవేశాలు చేయించి పేదల సొంతింటి కల సాకారం చేసింది. అదే ప్రగతిని ప్రస్తుత చంద్రబాబు సర్కారు చెప్పుకుంటూ కాలం వెళ్లదీస్తోంది తప్ప ఒక్క రూపాయి కూడా వెచ్చించలేదు. ఈ నేపథ్యంలో గతేడాది డిసెంబర్ నాటికి 18,625 గృహ నిర్మాణాలు బేస్మెంట్ కంటే కింది స్థాయిలో, 9,569 నిర్మాణాలు బేస్మెంట్ స్థాయిలో ఉన్నాయి. 4,158 గృహాలు లెంటిల్ స్థాయిలో, 2,594 గృహాలు రూఫ్ స్థాయిలో నిలిచాయి. 486 గృహాలు రూఫ్ పైకి చేరుకోగా 1,693 గృహనిర్మాణాలు అ సలు ప్రారంభం కాకుండానే ఉండిపోయాయి. గృహ నిర్మాణాలపై ఇంత నిర్లక్ష్యం జరుగుతున్నా పాలకులు పట్టించుకున్న పాపాన పోలేదు. నూతనంగా గృహ నిర్మాణాలకు దరఖాస్తులు స్వీకరిస్తున్నాం, కొత్తగా గృహాలు మంజూరు చేస్తాం అని ప్రకటిస్తున్నా కార్యరూపం దాల్చడం లేదు. ఇళ్ల మంజూరు నిల్లు రెండేళ్లుగా నిలిచిన నిర్మాణాలు మాటలతో సరిపెట్టిన చంద్రబాబు సర్కారు జిల్లాలో పలు దశల్లో నిలిచిన 35,432 ఇళ్లు ఇప్పటికీ మొదలుకాని 1,693 నిర్మాణాలు జిల్లాలో 678 లేఅవుట్లలో ఇంటి నిర్మాణాలను చేపట్టిన ఘనత గత జగన్ సర్కారుకే దక్కుతుంది. గతంలో గృహ నిర్మాణాలకు భూసేకరణలో అవినీతి చోటుచేసుకుందని హడావుడి చేసిన తెలుగుదేశం పార్టీ నేతలు ఇప్పుడు ఇళ్ల నిర్మాణాలనే పట్టించుకోవడం లేదు. దీనిని బట్టి పేదల సంక్షేమంపై చంద్రబాబు సర్కారుకు ఉన్న చిత్తశుద్ధి ఏపాటిదో అర్థమవుతోంది. ఇప్పటికై నా గృహ నిర్మాణాలను మంజూరు చేసి సొంతింటి కల సాకారం చేయాలని పేదలు కోరుతున్నారు. -
పులి దాడులు.. ఏజెన్సీ బెంబేలు
● ఆవులపై దాడి చేసి హతమార్చిన వైనం ● భయాందోళనలో ప్రజలు ● అప్రమత్తంగా ఉండాలని అటవీశాఖ అధికారుల సూచన బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోని గిరిజన గ్రామాల్లో పెద్దపులి సంచరిస్తూ ఆవులపై దాడి చేస్తున్న సంఘటనతో కలకలం రేగింది. బుధ వారం బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం గుబ్బల మంగమ్మతల్లి గుడికి వెళ్లే మార్గంలో పులి కనిపించగా అధికారులు పాదముద్రలను గుర్తించారు. అలాగే అంతర్వేదిగూడెం సమీపంలో గోపాలరాజు అనే రైతుపై దాడికి యత్నించగా ఆయన ప్రాణాలు గుప్పిట్లో పెట్టుకుని పారిపోయాడు. గురువారం నాగులవారిగూడెం సమీపంలో కొవ్వాసి దూలయ్య, మల్లం కాంతమ్మకు చెందిన కట్టేసి ఉన్న మూడు ఆవులపై పెద్ద పులి దాడి చేసి చంపివేసింది. వీటిలో ఒక ఆవు సూడిది. కాగా రాత్రికి ఇదే ప్రాంతానికి మరలా పెద్ద పులి వచ్చి మరో రెండు ఆవులపై దాడి చేసింది. దీంతో ఈ ప్రాంతవాసుల్లో తీవ్ర భయాందోళనలు నెలకొన్నాయి. పెద్ద పులి జాడ కోసం అటవీశాఖ అధికారులు ప్రత్యేక చర్యలు చేపట్టారు. నిపుణులతో పా టు క్లూస్ టీమ్, వైల్డ్లైఫ్ అధికారులు రంగంలోకి దిగారు. ఆవులపై దాడి చేసిన ప్రదేశాల్లో ట్రాప్ కెమెరాలను ఏర్పాటుచేశారు. అప్రమత్తంగా ఉండాలి ఏలూరు (టూటౌన్)/జంగారెడ్డిగూడెం: జిల్లాలో పులి సంచారంపై ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఎటువంటి సమాచారం తెలిసినా అధికారులకు తెలియజేయా లని జిల్లా అటవీశాఖ అధికా రి సందీప్రెడ్డి తెలిపారు. గురువారం ఏలూరు జిల్లా కార్యాలయం, జంగారెడ్డిగూడెం అటవీ శాఖ కార్యాలయాల్లో విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. బుధవారం కావడిగుండ్లలో, గురువారం అంతర్వేదిగూడెం, నాగులగూడెం గ్రామాల్లో పులి సంచరించిందన్నారు. ములగలంపల్లి సెక్షన్, ములగలంపల్లి బీట్ బెడదనూరు రిజర్వ్ ఫారెస్ట్లో తిరుగుతున్నట్టు గుర్తించామన్నారు. ఇదే పులి తెలంగాణలోని కావిడగుండ్ల అటవీ ప్రాంతం నుంచి అంతర్వేదిగూడెం బీట్ పరిధిలోని నాగవరం ముఠా రిజర్వ్ ఫారెస్ట్ కంపార్టుమెంట్ నం.128 నుంచి జిల్లాలోకి ప్రవేశించినట్టు గుర్తించామన్నారు. బెడదనూరు, పాకలగూడెం, అంకన్నగూడెం మొదలగు రిజర్వ్ ఫారెస్ట్కు సమీప గ్రామాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, ఒంటరిగా సంచరించవద్దని సూచించారు. పశువుల పాకల వద్ద వెలుతురు వచ్చేలా దీపాలు ఏర్పాటుచేయాలన్నారు. ఇప్పటికే తమ సిబ్బంది ప్రజలను అప్రమత్తం చేశారన్నారు. సామాజిక మాధ్యమాల్లో పులి సంచారంపై అవాస్తవాలు వస్తే నమ్మవద్దన్నారు. తమ సిబ్బంది బృందాలుగా ఏర్పడి పులి కదలికలను గమనిస్తున్నారు. ఎన్టీపీఏ (న్యూఢిల్లీ) సూచనల మేరకు ట్రాప్ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నామన్నారు. కంట్రోల్ రూమ్ల ఏర్పాటు జిల్లాలో అటవీ శాఖ కార్యాలయంలో ప్రత్యేక కంట్రోల్ రూమ్ ఏర్పాటుచేశారు. సబ్ డివిజనల్ అటవీ అధికారి, జంగారెడ్డిగూడెం, సెల్ 95054 99141, ఫారెస్ట్ రేంజ్ ఆఫీసర్, జంగారెడ్డిగూడెం, సెల్ 94408 10223, ఫారెస్ట్ సెక్షన్ ఆఫీసర్, ములగలంపల్లి సెల్: 95509 02333, కంట్రోల్ రూమ్ ఏలూరు, సెల్ 9908880327లకు పులికి సంబంధించిన సమాచారం అందించాలని కోరారు. బుట్టాయగూడెం మండలం నాగులగూడెం సమీపంలో మృతి చెందిన ఆవును పరిశీలిస్తున్న అటవీ శాఖ అధికారులు, ట్రాప్ కెమెరాను అమరుస్తున్న దృశ్యం -
కాలువలో గుర్రపు డెక్క తొలగింపు
ఎఫెక్ట్ భీమడోలు: గోదావరి కాలువలో పేరుకుపోయిన గుర్రపు డెక్క, కర్ర నాచు తొలగింపు పనులను సాగునీటి సంఘాలు, ఇరిగేషన్ అధికారులు చేపట్టారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి వంతుల వారీ విధానం అమలయ్యే అవకాశాలున్నందున ఇప్పటికే సాగునీరు అందక వరి నాట్లు పూర్తి కాని స్థితిలో రైతులు పడుతున్న ఇబ్బందులపై ఈ నెల 3వ తేదీన దాళ్వాకు సాగు నీరందేనా? అనే శీర్షికన సాక్షిలో కథనం ప్రచురితమైంది. దీంతో అధికారులు స్పందించారు. రెండు రోజులుగా సాగునీటి సంఘాల ప్రతినిధులు, అధికారులు చెత్తాచెదారం తొలగింపు పనులు చేస్తున్నారు. ఇరిగేషన్ ఏఈ సుబ్రహ్మణ్యం పర్యవేక్షణలో గోదావరి కాలువ శివారు గుండుగొలను నుంచి దిగువ ప్రాంతాల్లో దట్టంగా పేరుకుపోయిన గుర్రపుడెక్క, కర్రనాచులను పంటుపై ఎక్స్కవేటర్ను ఏర్పాటు చేసి వాటిని తొలగించే పనులు చేస్తున్నారు. దెందులూరు మండల పరిధిలోని పాలగూడెం ఏరియాలో 600 ఎకరాల్లో నీరందక నేటికీ దాళ్వా వరి నాట్లు వేయలేని పరిస్థితి. ఈ క్రమంలో ఆ ప్రాంతానికి నీరందించేందుకు గుర్రపు డెక్క తొలగింపు పనులను అధికారులు యుద్ధ ప్రాతిపదికన చేపట్టారు. -
కేంద్రం పన్నుతో రైతు కుటుంబాల్లో సంక్షోభం
మినహాయింపు కోరుతూ కేంద్ర మంత్రికి వినతి కొయ్యలగూడెం: అకస్మాత్తుగా పన్ను పెంపు వల్ల ఎఫ్సీవీ పొగాకు సాగుపై ఆధారపడిన లక్షలాది రై తు కుటుంబాలు తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటాయని, అలాగే నియంత్రిత మార్కెటింగ్ వ్యవస్థకు భంగం కలుగుతుందని కొయ్యలగూడెం వర్జీనియా పొగాకు రైతు సంఘం అధ్యక్షుడు కాకర్ల నంది తెలిపారు. చట్టబద్ధ వ్యాపారం తగ్గడం వల్ల ప్రభుత్వానికి ఆదాయం తగ్గే ప్రమాదం ఉందన్నారు. రైతుల ఆదాయం, వేలం స్థిరత్వం, మొత్తం డిమాండ్ కొనసాగాలంటే తక్కువ గ్రేడ్ పొగాకు లభ్యత, వినియోగం కీలకమన్నారు. కేంద్ర ప్రభుత్వం ఇటీవల ప్రకటించిన ఎకై ్సజ్ డ్యూటీ పన్ను రద్దు చేయాల్సిందిగా వర్జీనియా పొగాకు రైతు సంఘం ప్రతినిధుల బృందం కేంద్ర మంత్రి నిర్మల సీతారామన్కు విన తిపత్రం సమర్పించారు. గురువారం బోర్డు చైర్మన్ చిడిపోతు యశ్వంత్కుమార్, ఎంపీ దగ్గుబాటి పు రందేశ్వరితో కలిసి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కర్ణాటక రైతుల బృందం న్యూఢిల్లీలో కేంద్ర మంత్రిని కలిశారు. ఈ వివరాలను కాకర్ల నంది వివరించారు. కొనుగోలుదారుల పాల్గొనడం తగ్గితే వేలాల్లో పోటీ తగ్గి ధరలు పడిపోవడం, అమ్ముడుపోని నిల్వలు పెరగడం, చివరకు రైతుల జీవనోపాధితో పాటు మొత్తం విలువ గొలుసుపై ప్రతికూల ప్రభావం పడుతుందని అన్నారు. ఆంధ్రా, తెలంగాణలో రైతు లు, పంట సిద్ధంగా ఉన్నాయని, వచ్చే నెల నుంచి వేలాలు ప్రారంభం కానున్నాయన్నారు. పన్ను పెంపుతో దేశీయ వినియోగం గణనీయంగా తగ్గి, ధరలు తీవ్రంగా పడిపోతాయన్నారు. దక్షిణాఫ్రికాలో అక్రమ వ్యాపారం సుమారు 75 శాతం మార్కెట్కు విస్తరించడంతో చట్టబద్ధ ఫ్యాక్టరీలు మూతపడ్డ వ్యవహారాన్ని ప్రస్తావించామన్నారు. -
మామిడి పూతపైనే ఆశలన్నీ
● నూజివీడు నియోజకవర్గంలో 35 వేల ఎకరాల్లో మామిడి విస్తీర్ణం ● మామిడి తోటల్లో కనిపిస్తున్న పూతలు నూజివీడు: నూజివీడు నియోజకవర్గంలో ప్రధాన వాణిజ్య పంటగా విలసిల్లుతున్న మామిడి పంట రైతుల్లో ఆశలు రేకెత్తిస్తోంది. ఈ ఏడాది మామిడి పూతలు నియోజకవర్గ వ్యాప్తంగా బాగానే ఉండటంతో రైతులు ఎంతో ఆశతో ముందుకు సాగుతున్నారు. ఒక ఏడాది కాస్తే మరొక ఏడాది కాయకపోవడం మామిడి ప్రధాన లక్షణం. గతేడాది మామిడి కాపు తక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఏడాది కాపు ఎక్కువగా ఉండవచ్చనేది కూడా వస్తున్న పూతలను బట్టి రైతులు భావిస్తున్నారు. దాదాపు 85 శాతం తోటల్లో పూతలు నూజివీడు, ఆగిరిపల్లి, చాట్రాయి, ముసునూరు మండలాల్లో పండ్ల తోటల్లో మామిడి ప్రధాన పంటగా విలసిల్లుతోంది. ఈ సీజన్లో డిసెంబరు ద్వితీయార్థం నుంచి తోటల్లో పూతలు రావడం ప్రారంభమై ప్రస్తుతం దాదాపు 85 శాతం తోటల్లో పూతలు వచ్చాయి. మిగిలిన తోటల్లో కూడా మరో వారం, పది రోజుల్లో పూతలు వచ్చే అవకాశం ఉందని ఉద్యానశాఖ అధికారులు చెబుతున్నారు. కొన్ని తోటలు తెల్లపూత దశలో ఉండగా, మరికొన్ని తోటలు పచ్చిపూత దశలో ఉన్నాయి. బంగినపల్లి, తోతాపురి, రసాలు తదితర అన్ని రకాల్లో పూతలు కనిపిస్తున్నాయి. నూజివీడు బంగినపల్లి కాయలకు, రసాలు, చెరుకు రసాలకు దేశవ్యాప్తంగానే కాకుండా విదేశాల్లో కూడా మంచి పేరుంది. రైతులు పూతల కోసం డిసెంబరు నెల ప్రారంభం నుంచే రసాయన మందులను పిచికారీ చేయడం ప్రారంభించి ప్రస్తుతం పూతలు నిలిచేందుకు పలు చర్యలు తీసుకుంటున్నారు. గత రెండేళ్లుగా మామిడి తోటలపై ఆదాయం ఏమీ రాకపోవడంతో రైతులు ఈ ఏడాదైనా కలిసి వస్తుందనే ఆశాభావంతో ఉన్నారు. వాతావరణమే కీలకం మామిడి డిసెంబరు నెలలో పూతలు ప్రారంభమై ఫిబ్రవరి తొలి వారంలో పిందెలు రావడం జరుగుతుంది. మామిడి పూత రావడానికి పగటి పూట అత్యధిక ఉష్ణోగ్రతలు, రాత్రి పూట అధిక చలి వాతావరణం ఉండాలి. గత 20 రోజులుగా వాతావరణం అనుకూలంగా ఉండటంతో పూతలు వస్తున్నాయి. సంక్రాంతి సమయంలో నాలుగు రోజుల పాటు పెద్ద ఎత్తున ఏర్పడిన పొంగమంచుకు తోటల్లో పురుగులు ఆశించి పూత ఏమైనా దెబ్బతింటుందేమోనని రైతులు ఆందోళన చెందారు. అయితే అలాంటి నష్టం ఏమీ జరగకపోవడంతో రైతులు ఊపిరిపీల్చుకున్నారు. మామిడి తోటల్లో పూతలు ఇప్పుడిప్పుడే వస్తున్నాయి. పూత నిలవడం కోసం రైతులు రసాయన మందులు పిచికారీ చేసుకుంటున్నారు. బంగినపల్లి, రసాలు, తోతాపురి వంటి రకాల్లో పూతలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దిగుబడి వచ్చిన తరువాత మార్కెట్లో ధర కూడా నిలకడగా ఉంటే మామిడి రైతులకు మేలు జరుగుతుంది. – పాలడుగు విజయ్కుమార్, మామిడి రైతు, తుక్కులూరు, నూజివీడు మండలంఇప్పటికే 85 శాతం తోటల్లో మామిడి పూతలు వచ్చాయి. ఈ నెలాఖరుకు మిగిలిన తోటల్లో కూడా పూతలు వచ్చేస్తాయి. వాతావరణం అనుకూలంగా ఉండటం మామిడికి మంచి పరిణామం. ఇప్పటి వరకు ఎలాంటి తెగుళ్లు, పురుగులు లేవు. రైతులు ఉద్యాన అధికారులు చెప్పిన విధంగా సలహాలను పాటిస్తే నాణ్యమైన దిగుబడులు వస్తాయి. పిందెలు వచ్చిన యెడల వాటికి కవర్లు కట్టుకుంటే మంచిది. – ఆర్ హేమ, ఉద్యాన అధికారిణి -
ప్రకృతి సాగుపై కేంద్ర బృందం అధ్యయనం
ద్వారకాతిరుమల: రాష్ట్రంలో ప్రకృతి వ్యవసాయం అమలు విధానాలపై కేంద్ర బృందం ప్రత్యేక అధ్యయనాన్ని చేపట్టింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం (గోల్) వ్యవసాయ ప్రణాళిక విభాగం, వ్యవసాయం, రైతు సంక్షేమ శాఖకు చెందిన పది మందితో కూడిన కేంద్ర కమిటీ ప్రతినిధుల బృందం గురువారం ద్వారకాతిరుమల మండలం సూర్యచంద్రరావుపేట, గుండుగొలనుకుంట గ్రామాల్లో పర్యటించింది. తొలుత ఈ బృందం సూర్యచంద్రరావుపేట లోని రైతు సరిపల్లి భాస్కర్ రాజు పొలాన్ని సందర్శించారు. గత ఏడేళ్లుగా ఆయన 11 ఎకరాల్లో ద్రవ జీవామృతం, సహజ వృద్ధి ప్రోత్సాహకాలతో సాగు చేస్తున్న కోకో, కొబ్బరి ఉద్యాన పంటలను సందర్శించి, ప్రకృతి వ్యవసాయ పద్ధతులను ప్రత్యక్షంగా పరిశీలించారు. అనంతరం గుండుగొలనుకుంటలోని ఒ.గోపాలకృష్ణ నిర్వహిస్తున్న బయో రిసోర్స్ సెంటర్ (బీఆర్సీ)ను సందర్శించి, అక్కడ తయారవుతున్న వివిధ రకాల కషాయాలు, ద్రావణాలు, వాటి వినియోగం, అలాగే గత 8 ఏళ్లుగా అమలు చేస్తున్న ప్రకృతి వ్యవసాయ విధానాలను పరిశీలించారు. అనంతరం ప్రకృతి వ్యవసాయంలోని 9 సూత్రాలపై లైవ్ డెమో మోడల్ గురించి తెలుసుకున్నారు. అదనంగా ఏటీఎం(ఎనీ టైమ్ మనీ) మోడల్ ద్వారా 28 కి పైగా రకాల పండ్లు, కూరగాయల సాగు విధానాన్ని పరిశీలించి, కషాయాలు–ద్రావణాల తయారీతో పాటు, విత్తన పెల్లైటెజేషన్పై ప్రత్యక్ష ప్రదర్శనను వీక్షించారు. ఈ సందర్భంగా క్షేత్రస్థాయిలో ప్రకృతి వ్యవసాయాన్ని సమర్థవంతంగా అమలు చేస్తున్న రైతు సాధికార సంస్థ (రైస్) పనితీరును కేంద్ర బృందం అభినందిస్తూ, రైతులు చేస్తున్న కృషిని ప్రశంసించింది. ఈ పర్యటనలో ప్రకృతి వ్యవసాయ జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ బి.వెంకటేష్, సీనియర్ కన్సల్టెంట్ కె.వరప్రసాద్, జిల్లా వ్యవసాయ అధికారి ఎస్కే హబీబ్ బాషా, డీహెచ్ఓ సజా నాయక్, మండల ఉద్యానశాఖ అధికారి అమర్నాథ్ పాల్గొన్నారు. -
హెల్మెట్ ధారణతో ప్రాణరక్షణ
ఏలూరు (ఆర్ఆర్పేట): హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించడం ద్వారా రహదారి ప్రమాదాల నుంచి ప్రాణ రక్షణ పొందవచ్చని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా స్థానిక శాంతినగర్లో గురువారం నిర్వహించిన బైక్ ర్యాలీని కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ హెల్మెట్, సీట్ బెల్ట్ ధరించని కారణంగా చాలామంది ప్రాణాలు కోల్పోతున్నారని, రహదారి నియమాలు పాటించాలని సూచించారు. రహదారి ప్రమాదాల నియంత్రణకు రహదారి భద్రత నియమాలపై అవగాహన పెంచేలా పాఠశాల, కళాశాల స్థాయిలో సమావేశాలు నిర్వహిస్తున్నామన్నారు. జిల్లాలో ఒక్క ప్రాణ నష్టం కూడా జరగకుండా రవాణా శాఖ అధికారులు చర్యలు తీసుకుంటున్నారన్నారు. ఈ కార్యక్రమంలో ఇన్చార్జి ఉప రవాణా కమిషనర్ కేఎస్ఎంవీ కృష్ణారావు, ఆర్టీఓ శేఖర్, మోటార్ వాహనాల డీలర్లు, అధికారులు పాల్గొన్నారు. -
కార్గో సేవల్లో తణుకు హ్యాట్రిక్
తణుకు అర్బన్: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ నిర్వహించిన కార్గో పార్సిల్స్ అండ్ కొరియర్ డోర్ డెలివరీ మాసోత్సవాల్లో తణుకు ఆర్టీసీ డిపో రీజియన్లో మొదటి స్థానంలో నిలిచింది. గతనెల 20 నుంచి ఈనెల 19వ తేదీ వరకు నిర్వహించిన మాసోత్సవాల్లో భాగంగా తణుకు డిపో మొదటి స్థానంలో నిలిచి సత్తాచాటింది. రీజియన్లోని 4 డిపోల ఆవరణల్లో ఉన్న కార్గో కేంద్రాలతోపాటు 5 పట్టణాల్లోని కార్గో ఏజెంట్ పాయింట్ల ద్వారా డోర్ డెలివరీ సేవలు అందుతున్నాయి. తణుకులో మాసోత్సవాల్లో వినియోగదారులను ఆకర్షించే రీతిలో డోర్ డెలివరీలకు సంబంధించి లక్కీ డిప్ల ద్వారా ప్రత్యేకమైన బహుమతులను అందజేశారు. డోర్ డెలివరీ మాసోత్సవాలకు సంబంధించి ప్రచారాలు, అవగాహన ర్యాలీలు నిర్వహించారు. వరుసగా మూడో సంవత్సరం కూడా తణుకు డిపోలోని కార్గో కేంద్రం మొదటి స్థానంలో నిలిచి హాట్రిక్ సాధించడంతో సిబ్బంది సంబరాలు చేసుకుంటున్నారు. మాసోత్సవంలో పార్సిల్ బుకింగ్స్ డిపో లక్ష్యం బుకింగ్స్ గ్రోత్ శాతం తణుకు 3,007 5,986 199.07 తాడేపల్లిగూడెం 2,511 3,659 145.72 నరసాపురం 2,511 3009 119.83 భీమవరం 3,503 4,101 117.07 199.07 శాతం గ్రోత్తో ఈ ఏడాది కూడా మొదటి స్థానం గత రెండేళ్లుగా కూడా తణుకు డిపోనే ఫస్ట్ ముగిసిన డోర్ డెలివరీ మాసోత్సవాలు -
అందరి కృషితోనే..
కార్గో డోర్ డెలివరీ మాసోత్సవంలో భాగంగా రీజియన్లో అత్యధిక బుకింగ్స్ చేసిన డిపో తణుకు అవ్వడం చాలా సంతోషంగా ఉంది. డీపీటీవో వరప్రసాద్ నిరంతర పర్యవేక్షణ, వినియోగదారులు గిఫ్ట్ స్కీం, స్పాన్సర్స్ సహకారం, కార్గో డీఎంఈ షేక్ లాల్ నిరంతర కృషితోపాటు కార్గో ఆపరేటర్స్, హమాలీల కష్టంతోనే మొదటి స్థానంలో నిలవగలిగాం. వినియోగదారుల్లో అత్యధిక డీడీలు బుక్ చేసిన లావణ్య ఫీడ్స్ ప్రాప్రెయిటర్ కోసూరి సతీష్ వర్మకు అభినందనలు. – సప్పా గిరిధర్కుమార్, తణుకు డిపో మేనేజర్ రీజియన్లో పరిధిలో అత్యధిక డోర్ డెలివరీలు చేయగలిగామంటే వినియోగదారులు, కార్గో కేంద్ర సిబ్బంది, హమాలీల కృషే. అధికారుల నిరంతర పర్యవేక్షణతోపాటు నరేష్ క్లాత్ షోరూం, షాలేం పెన్ కార్నర్, డాక్టర్ టీపీఎన్ ప్రసాద్, డాక్టర్ నల్లపాటి అనూషల సహకారంతో నిర్వహించిన గిఫ్ట్ స్కీం కీలకంగా పనిచేసింది. అలాగే సేవలపై విస్తృతస్థాయిలో ప్రచారం కూడా చేశాం. –షేక్ లాల్, తణుకు ఆర్టీసీ డిపో మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ -
నూజివీడు ఆస్పత్రిని అప్గ్రేడ్ చేయాలి
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు: నూజివీడులోని ప్రభుత్వ ఏరియా ఆస్పత్రిని జిల్లా ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం ఎంతైనా ఉందని, ఆ దిశగా మంత్రి కొలుసు పార్థసారథి చర్యలు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. నూజివీడులో బుధవారం ఆయన మాట్లాడుతూ వైఎస్ జగన్ ప్రభుత్వంలో రూ.25 కోట్లు మంజూరు చేయించి నూతన భవనాన్ని అన్ని వసతులతో నిర్మించామన్నారు. దీంతో ఆస్పత్రిలోని పాత బిల్డింగులో వంద పడకలు, నూతన బిల్డింగ్లో 200 పడకల సౌకర్యం అందుబాటులోకి వచ్చిందన్నారు. అలాగే ఐసీయూ యూనిట్, ఏడు ఆపరేషన్ థియేటర్లు ఏర్పాటు చేసుకునేందుకు సైతం వసతులు, ఆక్సిజన్ ప్లాంట్ కూడా అందుబాటులో ఉందన్నారు. ఈ నేపథ్యంలో జిల్లా ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తే స్పెషాలిటీ వైద్య సేవలు అందుబాటులోకి వస్తాయన్నారు. ఏరియా ఆస్పత్రిని 300ల పడకల ఆస్పత్రిగా అప్గ్రేడ్ చేయించి, ఆ తరువాత జిల్లా ఆస్పత్రిగా అభివృద్ధి చేయాలని డిమాండ్ చేశారు. పాలకొల్లు సెంట్రల్: స్థానిక కూరగాయల మార్కెట్లోని వేంకటేశ్వరస్వామి ఆలయంలో స్వామివారికి పట్టణానికి చెందిన బంగారు కృష్ణబాబు, నాగరాణి దంపతులు బుధవారం 20 కిలోల వెండి మకర తోరణాన్ని సమర్పించారు. అర్చకులు పూజలు చేసి అలంకరించారు. దాతలను మంత్రి నిమ్మల రామానాయుడు సత్కరించారు. మాజీ ఎమ్మెల్సీ అంగర రామ్మోహన్రావు, మాజీ ఎమ్మెల్యే బంగారు ఉషారాణి, పట్టణ ప్రముఖులు, ఆలయ ఈఓ పులగం వేణుగోపాలరావు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: ఏలూరులో ఓ కారులో ఆకస్మికంగా మంటలు చెలరేగాయి. స్థానికుల సమాచారంతో ఏలూరు అగ్నిమాపక సిబ్బంది వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపు చేశారు. అగ్నిమాపక సిబ్బంది సమాచారం తెలిపిన వివరాల ప్రకారం ఏలూరు వన్టౌన్ గడియార స్థంబం పక్కవీధిలో ఏపీ 16 ఎఫ్ఎల్ 3478 నెంబర్ ఇన్నోవా వాహనం చాలా రోజులుగా రోడ్డు పక్కనే పార్కింగ్ చేసి ఉంటుంది. బుధవారం ఒక్కసారిగా కారు ఇంజన్లో నుంచి మంటలు చెలరేగటంతో స్థానికులు అగ్నిమాపక సిబ్బందికి సమాచారం ఇచ్చారు. కారు ఇంజన్ మంటల్లో దగ్ధమైంది. కారు యజమాని అందుబాటులో లేకపోవటం, పూర్తి సమాచారం లేకపోవటంతో నష్టాన్ని అంచనా వేయలేదని అగ్నిమాపక సిబ్బంది తెలిపారు. పెదపాడు: అనారోగ్యంతో బాధపడత్ను ఓ వ్యక్తి ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాలివి. కొత్తూరు బీసీ కాలనీలో నివాసం ఉంటున్న పెద్దిబోయిన ధనంజయ కుమారుడు వెంకటరావు (48) ఏలూరులోని ఓ హోటల్లో వంటమేస్త్రిగా పనిచేస్తున్నాడు. వారం రోజులుగా ఇంటి వద్దనే ఉంటూ మనస్తాపంలో ఉంటున్నాడు. ఈనెల 20వ తేదీన రాత్రి ఇంట్లో భోజనం చేసిన తరువాత అందరూ నిద్రించారు. 21న తెల్లవారు జామున 4.30గంటల సమయంలో వెంకటరావు కనపడకపోవడంతో చుట్టుపక్కల వెదికి చూసే సరికి కాలనీలోని పడమర వైపున ప్లాట్లలో వేపచెట్టుకు ఉరివేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. నా చావుకు ఎవరూ కారకులు కాదని ఉత్తరం రాసి జేబులో పెట్టుకున్నట్లు పోలీసులు చెప్పారు. పెదపాడు హెచ్సీ కమలాకరబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. -
‘పోలవరం’ పరిహారం గల్లంతు
● అడ్డగోలుగా ‘నగదు బదిలీ’ ● నిర్వాసితుల గగ్గోలు ● అధికారుల నిర్లక్ష్యానికి పరాకాష్ట వేలేరుపాడు: పోలవరం నిర్వాసితుల జీవితాలతో అధికారులు ఆటలాడుకుంటున్నారు. నిజమైన నిర్వాసితులకు అందాల్సిన ఆర్అండ్ఆర్ ప్యాకేజీ పరిహారం నకిలీ నిర్వాసితుల ఖాతాల్లో జమ చేస్తూ నిర్లక్ష్యానికి పరాకాష్టగా నిలుస్తున్నారు. ఇంటి విలువల పరిహారం (స్టెక్చర్ వాల్యూస్) విషయంలోనూ పలు తప్పులు పదే పదే దొర్లుతున్నాయి. ఒకరికి చెల్లించాల్సిన పరిహారం మరొకరికి చెల్లించడం ఆ తర్వాత రికవరీ ప్రయత్నాలు చేయడంతో నిర్వాసితులు గగ్గోలు పెడుతున్నారు. పరిహారం కోసం ఏడాదిగా ఆఫీసుల చుట్టూ తిరుగుతున్నా పట్టించుకోకుండా అధికారులు తమ దర్పాన్ని ప్రదర్శిస్తున్నారు. లాలయ్య సొమ్ములు మరొకరి ఖాతాలోకి.. వేలేరుపాడు మండలంలోని నడిమిగొయ్యి గ్రామానికి చెందిన కాపుల లాలయ్య శ్రీరాంపురం బ్లాక్లో నిర్వాసితుడు. ఎస్ఈఎస్ నంబర్ 2/139గా అధికారులు నిర్ధారించగా రూ.6.86 లక్షలు ఆర్అండ్ఆర్ వ్యక్తిగత ప్యాకేజీ 2017లో మంజూరైంది. అవార్డు కూడా అయ్యింది. అయితే గతేడాది జనవరిలో శ్రీరాంపురం బ్లాక్లోని నిర్వాసితులందరికీ పరిహారం అందగా లాలయ్యకు అందలేదు. దీంతో లాలయ్య ఏడాదిగా కేఆర్పురం ఐటీడీఏ ఆఫీసు చుట్టూ తిరుగుతూనే ఉన్నాడు. ఈ క్రమంలో శ్రీకాకుళంలో అప్పల నర్సయ్య అనే వ్యక్తి పేరున ఉన్న బ్యాంకు ఖాతాలో లాలయ్య పరిహారం సొమ్ములు జమైనట్టు అధికారులు తేల్చారు. ఆ తర్వాత అధికారుల సూచన మేరకు లాలయ్య వేరే బ్యాంక్ ఖాతా నంబరు ఇవ్వగా అందులో ఇంటి పరిహారం సొమ్ములు రూ.5.81 లక్షలు మాత్రమే జమయ్యాయి. ఇప్పటికీ వ్యక్తిగత పరిహారం జమకాలేదు. ఇంటి విలువలు తారుమారు రేపాకగొమ్ము గ్రామానికి చెందిన ఇద్దరి నిర్వాసితులు పేర్లు ఒకేలా ఉండటంతో ఇంటి విలువల పరిహారం సొమ్ములు తారుమారు అయ్యాయి. కోడూరి పుల్లారావు, తండ్రి వెంకయ్య అవార్డు నం.376కు సంబంధించి ఇంటికి గాను రూ.12,46,840 పరిహారం మంజూరైంది. ఇదే గ్రామంలో అవార్డు నం.158లో కోడూరి పుల్లారావు, తండ్రి రామయ్య పేరున ఇంటికి రూ.1,10,162 మంజూరయ్యాయి. అయితే ఇద్దరి పేర్లు ఒకేలా ఉండటంతో ఒకరి పరిహారం మరొకరికి జమైంది. అవార్డు నం.376లో ఉన్న పుల్లారావు తక్కువ పరిహారం రావడంపై అధికారులను ఆశ్రయించగా, విషయం బయటపడింది. వీరిద్దరూ సమీప బంధువులు కావడంతో అవార్డు నం.158లో ఉన్నా పుల్లారావు అవార్డు నం.376లో ఉన్న పుల్లారావుకు తిరిగి పరిహారం సొమ్ములు ఇచ్చేందుకు అంగీకరించాడు. -
పనివేళల్లో మూసి ఉన్న సచివాలయం
కొయ్యలగూడెం: యర్రంపేట సచివాలయం–1 కార్యాలయాన్ని బుధవారం వేళకు తీయకపోవడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. వివిధ సేవల కోసం ఉదయం 9 గంటల నుంచి ప్రజలు ఎదురుచూశారు. పదకొండు గంటలు దాటినప్పటికీ ఉద్యోగులు ఎవరూ రాకపోవడం, కార్యాలయం తెరవకపోవడంతో నిరుత్సాహంగా వెనుతిరిగారు. ప్రభుత్వ పథకాల లబ్ధి కోసం సచివాలయం సేవలు అవసరమై ఉండగా సకాలంలో తెరవకపోవడం వలన తాము నష్టపోయామని ప్రజలు ఆవేదన వ్యక్తం చేశారు. పొలం పనులు ముమ్మరంగా సాగుతున్నాయని వాటిని వదులుకుని సచివాలయ సేవలకు వచ్చామని, కానీ పని వేళల్లో కార్యాలయం తెరవకపోవడంతో తాము నష్టపోయామని వాపోయారు. సుమారు సచివాలయంలో పది మంది వరకు ఉద్యోగులు సేవలు అందించాల్సి ఉండగా, ఒక్కరూ కూడా అందుబాటులోకి రాకపోవడం ఏంటని, విచారణ చేసి చర్యలు తీసుకోవాలని పలువురు కోరుతున్నారు. -
ఊరు శిథిలం.. జనం శోకం
ప్రాజెక్టు 41వ కాంటూరు పరిధిలోని కొంతమంది నిర్వాసితులకు మాత్రమే పట్టాలు అందించారు. అంతేకాకుండా మాకు భూమికి భూమి కింద ముంపులో భూములు ఇచ్చారు. ఈ విషయమై అధికారులకు ఫిర్యాదు చేశాం. ఈ సమస్య పరిష్కారమైతే అందరికీ ఇళ్ల పట్టాలు అందించిన తరువాత, ఆర్అండ్ఆర్ కాలనీలో అన్ని సౌకర్యాలు కల్పించిన తరువాతే అక్కడకు తరలివెళ్తాం. – తరుసం నరేష్, బోనగిరి సర్పంచ్, కుక్కునూరు ఆర్అండ్ఆర్ పరిహారం ఇంటి విలువ పరిహారం ఇచ్చి ఒకేసారి తరలిస్తే నిర్వాసితులందరూ కాలనీలకు వెళ్ళేందుకు సిద్ధంగా ఉండేవారు. ఇలా వేర్వేరుగా పరిహారం ఇవ్వడంతోనే 41 కాంటూరు నిర్వాసితులు వెళ్ళకుండా ఆగిపోవాల్సి వచ్చింది. – ఇర్పా వెంకటేష్, అల్లిగూడెం, కుక్కునూరు సాక్షి ప్రతినిధి, ఏలూరు: ముంపు బాధితుల వేదన అరణ్య రోదనగా మారింది. పోలవరం ప్రాజెక్టులో ఇళ్లు, భూములు కోల్పోయిన గిరిజనుల గోడును సర్కారు ఏ మాత్రం పట్టించుకోవడం లేదు. కనీసం గత ప్రభుత్వ హయాంలో నిర్మించిన ఆర్ అండ్ ఆర్ కాలనీలపై నిర్లక్ష్యపు నీడలు కమ్ముకోవడంతో శిథిలమవుతున్నాయి. ఒకటి కాదు రెండు కాదు కోట్లాది రూపాయల వ్యయంతో నిర్మించి ఇళ్ళకు పూర్తి స్థాయి సౌకర్యాలు కల్పించకపోవడంతో నిర్వాసితులు కాలనీల వైపు కన్నెత్తి చూడటం లేదు. దాంతో వందల ఇళ్ళు మొండిగోడలుగా మారిపోయాయి. కుక్కునూరు మండలంలోని గిరిజన గ్రామాల్లోని నిర్వాసితులకు పెదరావిగూడెం పంచాయతీ పరిధిలోని వెంకటాపురంలో పోలవరం పునరావాస కాలనీ నిర్మించారు. గత ప్రభుత్వ హయాంలో 758 ఇళ్ళను రూ.78 కోట్ల వ్యయంతో నిర్మించేలా ప్రాజెక్టును ఖరారు చేసి 565 ఇళ్ళను పూర్తి స్థాయిలో పూర్తిచేశారు. 41, 45 కాంటూరు పరిధిలోని గిరిజన గ్రామాల నిర్వాసితుల కోసం ఈ కాలనీని నిర్మించారు. కుక్కునూరు మండలంలో ఉప్పేరు, గణపవరం, తొండిపాక, పెదరావిగూడెం, వేలేరు, సీతారామనగరం పంచాయతీల్లోని గిరిజన నిర్వాసితుల కోసం ఈ ఇళ్ళ నిర్మాణం చేపట్టారు. కూటమి ప్రభుత్వం కొలువుదీరిన తరువాత 41వ కాంటూరు వరకే తరలించాలని నిర్ణయించడంతో 45వ కాంటూరు పరిధిలోని నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలను నిలిపివేశారు. గత ప్రభుత్వ హయాంలో రూ.42 లక్షల వ్యయంతో గ్రామ సచివాలయం, వైఎస్సార్ రైతుసేవా కేంద్రం, విలేజ్ హెల్త్ క్లినిక్, ఇలా అన్ని కార్యాలయాలు నిర్మించారు. పాలకులు పునరావాస కాలనీలపై దృష్టి సారించకపోవడం, పరిహారాల పంపిణీలో జాప్యం, ఇతర కారణాలతో కోట్లాది రూపాయలతో నిర్మించిన మెగా కాలనీ శిథిలమవుతుంది. శిథిలావస్థకు చేరిన ‘కోట్ల’ స్వప్నం గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పోలవరం నిర్వాసితుల కోసం 758 ఇళ్ళను భారీ వ్యయంతో ప్రారంభించి యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేశారు. నిర్వాసితులు సొంత గూడును వదులుకుని ఇక్కడ కొత్త జీవితాన్ని ప్రారంభిస్తారని భావించారు. క్షేత్రస్థాయిలో పరిస్థితి అందుకు భిన్నంగా ఉంది. కాలనీ నిర్మాణం పూర్తయినా మౌలిక వసతుల కల్పనలో వైఫల్యం లేదా ఇతర కారణాల వల్ల నిర్వాసితులు ఇక్కడ ఉండటం లేదు. ఫలితంగా పాడుబడ్డ భవనాల్లా కాలనీ శిథిలావస్థకు చేరుకుంది. నిరుపయోగంగా ఉన్న వైఎస్సార్ హెల్త్ క్లినిక్ గత ప్రభుత్వ హయాంలో ఏర్పాటు చేసిన గ్రామ సచివాలయం గిరిజన నిర్వాసితుల కాలనీపై సర్కారు నిర్లక్ష్యం గత ప్రభుత్వంలో రూ.78 కోట్లతో 758 ఇళ్ల మంజూరు మూడేళ్లలో 565 ఇళ్ల నిర్మాణం కనీస సౌకర్యాల కల్పనలో చంద్రబాబు సర్కారు వైఫల్యం ఆర్ అండ్ ఆర్ కాలనీలపై శీతకన్ను నిర్వాసితులు లేకపోవడంతో ఈ కాలనీ దొంగలకు అడ్డాగా మారింది. ఇళ్లకు అమర్చిన తలుపులు, కిటికీలు, విలువైన కలపతో చేసిన తలుపులు దొంగలు ఎత్తుకెళ్లిపోయారు. ట్రాన్స్ఫార్మర్లను పగలగొట్టి లోపల ఉండే విలువైన కాపర్ వైర్లను దొంగిలించారు. గ్రామ సచివాలయం, రైతు భరోసా కేంద్రం (ఆర్బీకే), హెల్త్ క్లినిక్ భవనాలు కూడా ధ్వంసమయ్యాయి. కిటికీలు ఊడిపోయి, గోడలు బీటలు వారి అసాంఘిక కార్యక్రమాలకు వేదికలుగా మారుతున్నాయి. జన సంచారం లేకపోవడం, అధికారుల పర్యవేక్షణ కరువవడంతో సాయంత్రం అయితే ఈ ప్రాంతం మందు బాబులకు, అసాంఘిక శక్తులకు అడ్డాగా మారాయి. కోట్లాది రూపాయల ప్రభుత్వ ఆస్తులు కళ్ల ముందే ధ్వంసమవుతున్నా సంబంధిత అధికారులు మాత్రం నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం స్పందించి, దొంగతనాలకు గురైన వస్తువులను రికవరీ చేయడంతో పాటు, కాలనీని పునరుద్ధరించి అర్హులైన నిర్వాసితులకు అప్పగించాలని స్థానికులు డిమాండ్ చేస్తున్నారు. -
● చెట్ల కిందే సేద.. రోగుల సహాయకుల వ్యథ
ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రిలో రోగులు హాస్పిటల్లో వైద్య చికిత్స పొందుతూ ఉంటే.. వారి కుటుంబ సభ్యులు మాత్రం చెట్లకింద నిరీక్షించాల్సి వస్తోంది. మహిళలు తమ పిల్లలతో సహా చెట్ల కిందనే కూర్చొని అక్కడే భోజనాలు చేయాల్సిన దుస్థితి. గతంలో స్కానింగ్ సెంటర్ సమీపంలో పెద్ద షెడ్డు వేసి సహాయకులు సేదదీరేందుకు, భోజనాలు చేసేందుకు ఏర్పాట్లు చేశారు. కానీ నేడు ఆ షెడ్డులో మెడికల్ కాలేజీకి సంబంధించి క్లాస్లు చెబుతూ ఉండడంతో జనాలకు కనీసం కూర్చొనే అవకాశం లేకుండా పోయింది. దీంతో ఏలూరు జీజీహెచ్ మాతాశిశు విభాగం వద్ద రోగుల సహాయకులు ఇలా చెట్ల కిందే విశ్రాంతి పొందుతున్నారు. గుండుగొలనుకు చెందిన ఝాన్సీ రెండవ ప్రసూతి కోసం జీజీహెచ్లో చేరగా ఆమె ఆలనాపాలన కోసం వచ్చిన భర్త రెండు రోజులుగా తన కుమారుడితో కలిసి ఇలా రోడ్డుపైనే చెట్టుకింద ఉంటున్న దృశ్యమిది. -
జాతీయ పురస్కారానికి తడికలపూడి పాఠశాల
కామవరపుకోట : జాతీయ స్థాయి స్వచ్ఛ పురస్కారానికి తడికలపూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల ఎంపికై నట్లు ప్రధానోపాధ్యాయులు అంగులూరి సర్వేశ్వరరావు తెలిపారు. పాఠశాలలో పరిశుభ్రత ,పచ్చదనం, నీటి సంరక్షణ, పునరుత్పాదక శక్తి వినియోగం వంటి అంశాలను ప్రోత్సహిస్తూ మన రాష్ట్రం నుంచి 20 పాఠశాలల జాబితాలో తడికలపూడి పాఠశాల కూడా ఎంపికై నట్లు ఆయన తెలిపారు. అందుకు కృషి చేసిన హెచ్ఎం సర్వేశ్వరావును మండల విద్యాశాఖ అధికారులు డి. సుబ్బారావు, చిన్నం ప్రశాంత్ కుమార్, మానవతా స్వచ్ఛంద సేవా సంస్థ సభ్యులు, గ్రామస్తులు అభినందించి సత్కరించారు. సర్పంచ్ కొత్తపల్లి రజనీ శ్రీనివాస్, స్కూల్ కమిటీ చైర్మన్ వెలమాటి నాగేశ్వరరావు, కొండపల్లి వెంకటేశ్వరరావు, బొంతు వెంకటేశ్వరరావు, తూతా లక్ష్మణరావు, తూతా బాలాజీ తదితరులు పాల్గొన్నారు ఏలూరు (ఆర్ఆర్పేట): జేఈఈ మెయిన్స్ తొలివిడత పరీక్షలు ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని 6 కేంద్రాల్లో బుధవారం ప్రశాంత వాతావరణంలో ప్రారంభమయ్యాయి. ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకూ నిర్వహించిన తొలి సెషన్ పరీక్షలకు మొత్తం 700 మంది విద్యార్థులు హాజరు కాగా మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ నిర్వహించిన రెండో సెషన్ పరీక్షకు 708 మంది విద్యార్థులు హాజరయ్యారు. తొలిసెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి 146 మంది హాజరు కాగా సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి గాను 144 మంది, తాడేపల్లిగూడెం వాసవి ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి 149 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 115 మందికి గాను 113 మంది హాజరయ్యారు. భీమవరం విష్ణ ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 49 మంది హాజరు కాగా. డీఎనన్నాఆర్ కళాశాలలో 100 మందికి 99 మంది హాజరయ్యారు. మధ్యాహ్నం సెషన్లో ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్లో 150 మందికి గాను 149 మంది, సీఆర్ఆర్ ఇంజనీరింగ్ కేంద్రంలో 150 మందికి 147 మంది, వాసవీ ఇంజనీరింగ్ కేంద్రంలో 147 మందికి 144 మంది, శశి ఇంజనీరింగ్ కేంద్రంలో 119 మందికి 118 మంది భీమవరం విష్ణ ఇంజనీరింగ్ కేంద్రంలో 50 మందికి 50 మంది, డీఎన్నాఆర్ కళాశాల కేంద్రంలో 100 మందికి గాను 100 మంది హాజరయ్యారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్ పబ్లిక్ పరీక్షల్లో భాగంగా ప్రథమ సంవత్సరం విద్యార్థులకు బుధవారం జిల్లాలోని 130 కేంద్రాల్లో ఎథిక్స్, అండ్ హ్యూమన్ వాల్యూస్ పరీక్ష ప్రశాంతంగా జరిగిందని ఇంటర్మీడియట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాన్ తెలిపారు. పరీక్షకు మొత్తం 15,258 మంది జనరల్ విద్యార్థులకు 14,881 మంది హాజరు కాగా 377 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. 2319 మంది ఒకేషనల్ విద్యార్థులకు 2,209 మంది హాజరు కాగా 110 మంది గైర్హాజరయ్యారని తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : ఈ నెల ఒకటి నుంచి రవాణా శాఖ ఆధ్వర్యంలో జరుగుతున్న 37వ జాతీయ రహదారి భద్రతా మాసోత్సవాల్లో భాగంగా ఈ నెల 22, 24 తేదీల్లో ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహించనున్నట్టు ఇన్చార్జ్ ఉప రవాణా కమిషనర్ కేఎస్ఎంవీ కృష్ణారావు ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ఈ నెల 22వ తేదీన ఉదయం 10 గంటలకు హెల్మెట్ ర్యాలీని స్థానిక శాంతినగర్ పోలీస్ పెట్రోల్ బంక్ వద్ద నుంచి స్థానిక పాత బస్టాండు వరకూ నిర్వహిస్తామన్నారు. అధిక సంఖ్యలో ప్రజలు హెల్మెట్ ధరించి పాల్గొనాలని కోరారు. అలాగే ఈ నెల 24వ తేదీన ఉదయం 10 గంటల నుంచి వాక్థాన్ నిర్వహిస్తామన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : జాతీయ ఓటర్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని ఏలూరు జిల్లాలోని ఎనిమిది, తొమ్మిది తరగతుల విద్యార్థులకు జిల్లా స్థాయిలో వ్యాసరచన, వక్తృత్వం, క్విజ్ పోటీలు నిర్వహించనున్నట్టు విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ నెల 23న స్థానిక ఈదర సుబ్బమ్మ దేవి నగరపాలక ఉన్నత పాఠశాలలో నిర్వహిస్తామన్నారు. విజేతలకు ఈ నెల 25న కలెక్టరేట్లోని గోదావరి ఫంక్షన్ హాల్లో బహుమతి ప్రదానోత్సవం జరుగుతుందన్నారు. -
రగులుతున్న కొల్లేరు
● పవన్ కల్యాణ్ కార్యాలయం వరకు పాదయాత్రకు శ్రీకారం ● కొల్లేరులో చెరువుల సాగుకు అవకాశం ఇవ్వాలని డిమాండ్ కై కలూరు: కొల్లేరు ప్రజలు రగిలిపోతున్నారు. అటవీశాఖ అధికారులు అక్రమ చేపల చెరువులను ధ్వంసం చేసి నివేదిక అందించాలని కొల్లేరు గ్రామాల్లో అవగాహనల పేరుతో హెచ్చరికలు జారీ చేస్తున్నారు. దీంతో కొల్లేరు ప్రజల్లో అలజడి రేగింది. ప్రభుత్వంతో తాడోపేడో తేల్చుకోడానికి ప్రజలు సిద్దమవుతోన్నారు. సుప్రీంకోర్టు నియమించిన కేంద్రం సాధికారిత కమిటీ(సీఈసీ) కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల లెక్కలు పక్కాగా అందించాలని కొరడా ఝులిపించడంతో అటవీశాఖ ఉన్నతాధికారులు మినీ కొల్లేరు ఆపరేషన్కు సిద్ధమవుతున్నారు. పలు మండలాల్లో ఆక్రమ చెరువులను ధ్వంసం చేసే క్రమంలో రాజమండ్రి సర్కిల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్ఎన్.మూర్తి, డీఎఫ్ఓ బి.విజయ ఆధ్వర్యంలో మూడు రోజులుగా కొల్లేరు గ్రామాల్లో ప్రజలకు అక్రమ చెరువులను ఖాళీ చేయాలని అవగాహన కలిగిస్తున్నారు. కొల్లేరు ప్రజలు సైతం మా ప్రాణాలైన వదులుతాం.. చెరువుల్లో సాగు వదలం.. మాకు జీవనోపాధి ఇదే అంటూ ధిక్కార స్వరాన్ని వినిపిస్తోన్నారు. కై కలూరు మండలం చటాకాయి, వడ్లకూటితిప్ప గ్రామాలకు వెళ్ళి వచ్చిన ఫారెస్టు అధికారులు, బుధవారం కొల్లేటికోటలో అమ్మవారి దేవస్థానం వెనుక 60 ఎకరాల అక్రమ చెరువు పరిశీలనకు వెళ్ళారు. ఇక్కడ కూడా ప్రజల నుంచి నిరసన వ్యక్తమైంది. ఉప ముఖ్యమంత్రి, అటవీ మంత్రి పవన్ కల్యాణ్కు కొల్లేరు ప్రజలు సమస్యలు వివరించి, చెరువుల ధ్వంసాన్ని అడ్డుకోడానికి ఈ నెల 27, 28 తేదీలలో సుమారు 25,000 మందితో మంగళగిరిలో ఆయన కార్యాలయం వరకు భారీ పాదయాత్రకు శ్రీకారం చుట్టారు. తుదీ తేదీల ప్రకటనకు కసరత్తు జరుగుతుంది. ఇప్పటికే వడ్డీ సాధికారిత రాష్ట్ర చైర్మన్ బలే ఏసురాజు ఆధ్వర్యంలో కొల్లేరు గ్రామాల్లో పెద్దలతో సమావేశాలు నిర్వహించారు. కై కలూరు మండలం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర నిర్వహణ నిమిత్తం గురువారం వస్తున్న ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్కు సమస్యను తీసుకువెళ్ళి, కొల్లేరు పెద్దలందరూ ప్రెస్మీట్ నిర్వహించనున్నారు. చట్టం అంటే అందరికీ సమానంగా పనిచేయాలి. సంక్రాంతి పండగ రోజుల్లో సుప్రీంకోర్టు కోడిపందేలు వద్దని చెబుతున్నా మూడు రోజులు జరుగుతున్నాయి. కొల్లేరు ప్రజలు చేపల చెరువులపైనే ఆధారపడి జీవిస్తున్నారు. వాటిని ధ్వంసం చేస్తే ఎలా? కొల్లేరు ప్రజలు ప్రభుత్వానికి వ్యతిరేకం కాదు. మా సమస్యను పవన్కల్యాణ్కు తెలియచేయడానికి పాదయాత్ర నిర్వహిస్తాం. –బలే ఏసురాజు, వడ్డీ సాధికారత రాష్ట్ర చైర్మన్, కొట్టాడ, కై కలూరు మండలం -
పారిశుద్ధ్య కార్మికుల ‘శ్రమ’ గోవిందా.!
ద్వారకాతిరుమల: రాష్ట్రంలోని ప్రధాన దేవాలయాల్లో ఒకటైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికుల శ్రమ దోపిడీకి గురవుతోంది. నెలరోజులూ పూర్తిగా పనిచేసినా వారికి 26 రోజులకు మాత్రమే వేతనాలు అందుతున్నాయి. మిగతా రోజుల్లోని శ్రమ బూడిదలో పోసిన పన్నీరవుతోంది. ఇదేంటని పారిశుద్ధ్య కాంట్రాక్ట్ మేనేజర్ను కార్మికులు ప్రశ్నిస్తుంటే, దేవస్థానం అధికారులు ఇలానే బిల్లులు ఇస్తున్నారని చెబుతున్నాడు. ఇంతకు మించి ప్రశ్నిస్తే.. తమను పనిలోంచి ఎక్కడ తీసేస్తారోనన్న భయంతో కార్మికులు కిమ్మనకుండా ఉంటున్నారు. వివరాల్లోకి వెళితే. శ్రీవారి ఆలయంలో పారిశుద్ధ్య, ఇతర (ఎలక్ట్రికల్, ప్లంబింగ్, ఏసీ మెకానిక్, కార్పెంటర్, మేషన్) పనులను పద్మావతి హాస్పిటాలిటీ అండ్ ఫెసిలిటీ మేనేజ్మెంట్ సర్వీసెస్ (తిరుపతి) సంస్థకు గతేడాది అక్టోబర్ 1 న అప్పగించారు. అగ్రిమెంట్ ప్రకారం 212 మంది పనిచేయాల్సి ఉంది. అయితే నూతన క్యూ కాంప్లెక్స్, కొత్త అనివేటి మండపం, ధర్మ అప్పారాయ నిలయం (120 గదుల సత్రం) పైన నిర్మిస్తున్న సూట్ రూమ్లు, ఇతర అభివృద్ధి పనులు ఇంకా ప్రారంభం కాకపోవడంతో ప్రస్తుతం 180 మంది పారిశుద్ధ్య, హౌస్ కీపింగ్ సిబ్బంది, సూపర్వైజర్లు, మేనేజర్తో మాత్రమే పనులు జరుగుతున్నాయి. దీనికి సంబంధించి దేవస్థానం ప్రతి నెలా సీజీఎస్టీ, ఎస్జీఎస్టీ 18 శాతం, టీడీఎస్ 2 శాతం, ఇతర ట్యాక్స్లను కట్ చేసి సుమారు రూ. 34 లక్షలను కాంట్రాక్టర్కు అందజేస్తోంది. శ్రమ దోపిడీ ఇలా.. పారిశుద్ధ్య కార్మికులు మూడు షిఫ్ట్లుగా పనిచేస్తున్నారు. అనారోగ్యం ఇతర కారణాల వల్ల ఎవరైనా సెలవులు పెడితే, వారి స్థానంలో మిగిలిన వారితో ఓవర్టైమ్ పని చేయిస్తున్నారని, దానికి ఓటీలు చెల్లించడం లేదని కార్మికులు చెబుతున్నారు. అలాగే నెల రోజులూ పూర్తిగా పనిచేసినా.. నెలకు నాలుగు సెలవులు తీసేసి 26 రోజులకు మాత్రమే వేతనాలు ఇస్తున్నారని, మిగిలిన రోజులకు ఓడీలు ఇవ్వడం లేదని అంటున్నారు. నెలలో ఒక్కరోజు కూడా సెలవు ఇవ్వకుండా, పనిచేసిన రోజులకు పూర్తిగా వేతనాలు చెల్లించకుండా తమ శ్రమను దోచుకుంటున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గట్టిగా అడిగితే పనిచేస్తే చేయండి.. లేకపోతే పోమ్మని అంటున్నారని కొందరు కార్మికులు వాపోతున్నారు. భక్తుల రద్దీ అధికంగా ఉండే పర్వదినాల్లో అదనపు సిబ్బందిని నియమించకుండా, తమతోనే అన్ని పనులు చేయిస్తున్నారని అంటున్నారు. ఈ విషయాలను బయటకు చెబితే తమను పనిలోంచి తీసేస్తారన్న భయంతో కుక్కిన పేనులా పడుంటున్నామని అంటున్నారు. కార్మికశాఖ అధికారులు ఎక్కడా? క్షేత్రంలో పారిశుద్ధ్య కార్మికులు శ్రమ దోపిడీకి గురవుతున్నా.. సంబంధిత కార్మికశాఖ అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. ఫలితంగా కార్మికుల కష్టనష్టాలు, వారి ఆవేదనను పట్టించుకునే నాథుడు లేకుండా పోయాడు. ఇప్పటికై నా అధికారులు స్పందించి కార్మికుల శ్రమ దోపిడీకి అడ్డుకట్ట వేయాలని పలువురు కోరుతున్నారు. అధికారుల వివరణ నెలరోజులూ పూర్తిగా పనిచేసినా కార్మికులకు 26 రోజులకు మాత్రమే వేతనాలు చెల్లిస్తున్న విషయం వాస్తవమేనని శానిటేషన్ మేనేజర్ ప్రవరాక్య వివరణ ఇచ్చారు. దేవస్థానం అధికారులు ఓడీలు, ఓటీలకు బిల్లులు చెల్లించడం లేదని, అదనంగా సిబ్బందిని నియమించనివ్వక పోవడంతో ఉన్న వారితోనే ఎక్కువ సమయం పనులు చేయిస్తున్నామని చెప్పారు. నిబంధనల ప్రకారమే.. టెండర్ నిబంధనల ప్రకారమే కాంట్రాక్టర్కు ప్రతి నెలా బిల్లులు చెల్లిస్తున్నామని పారిశుద్ధ్య విభాగం ఏఈ ఆదిత్య వివరణ ఇచ్చారు. అడిగిన కార్మికులకు సెలవులు ఇచ్చి, మిగిలిన వారితో పనులు చేయించమని మేనేజర్కు చెబుతున్నామన్నారు. నెల పూర్తిగా పనిచేసినా.. 26 రోజులకే వేతనాలు పర్వదినాల్లో ఓవర్ టైమ్ డ్యూటీలు అయినా ఓడీలు, ఓటీలు లేవు ప్రశ్నిస్తే పని పోతుందని కిమ్మనకుండా ఉంటున్న కార్మికులు -
పులి సంచారంతో భయం భయం
బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం పందిరిమామిడిగూడెం నుంచి గుబ్బల మంగమ్మ గుడికి వెళ్ళే రహదారి మధ్యలో పెద్దపులి సంచారంతో గిరిజన ప్రాంత ప్రజల్లో భయాందోళన నెలకొంది. సరిహద్దు గ్రామం కావిడిగూడెంలో పులి దాడి చేసి ఆవును చంపడంతోపాటు ఒక లేగదూడను చాలా దూరం వరకూ ఈడ్చుకెళ్లిన సంఘటనతో ఒక్కసారిగా ఈ ప్రాంత ప్రజలు ఉలిక్కిపడ్డారు. అనుకున్నట్టుగానే బుధవారం రాత్రి పొలం వెళ్లి తిరిగి ద్విచక్ర వాహనంపై వస్తున్న రాజు అనే ఒక రైతుపై అంతర్వేదిగూడెం సమీపంలో పులి దాడి చేసే ప్రయత్నం చేసిందని గ్రామస్తులు తెలిపారు. దాడి నుంచి చాకచక్యంగా తప్పించుకున్న రాజు గ్రామస్తులను కలవగా అతనికి ధైర్యం చెప్పి అనంతరం ఇంటికి పంపినట్లు తెలిపారు. గుబ్బల మంగమ్మ గుడికి భక్తులు ద్విచక్ర వాహనాలపై, కాలినడకన వెళ్తుంటారు. ప్రస్తుతం రబీ సీజన్లో మొక్కజొన్న పంటల్లో, వర్జీనియా పొగాకు, పనుల్లో కూడా కూలీలు పొలాలకు వెళ్తున్నారు. మరోపక్క కొండప్రాంతంలోని జీడిమామిడి తోటల్లో శుభ్రం చేసే పనులు, మందు వేసే పనుల్లో కూడా కూలీలు అధిక సంఖ్యలో పనిచేస్తున్నారు. బుధవారం పెద్దపులి గిరిజనుడికి కనిపించి అక్కడి నుంచి గ్రామ సమీపంలోని కొండవైపుకు వెళ్ళినట్లు చెబుతున్నారు. ఫారెస్ట్ అధికారులు పులి ఆచూకీని కనిపెట్టి సురక్షితంగా అడవిలో వదిలేలా ఏర్పాటు చేస్తున్నారు. రాత్రి వేళల్లో ప్రజలెవ్వరూ బయటకు రావొద్దని, పిల్లలను ఒంటరిగా వదలొద్దని, పొలాలకు వెళ్ళేటప్పుడు గుంపులుగా వెళ్ళాలని ఫారెస్ట్ అధికారులు సూచిస్తున్నారు. గత ఏడాదీ ఇదే పరిస్థితి గత ఏడాది కూడా ఇదే రోజుల్లో పోలవరం, బుట్టాయగూడెం మండలాల్లో పులి సంచారంతో ప్రజలు భయంతో బెంబేలెత్తిపోయారు. పాపికొండల అభయారణ్యం నుంచి బయటకు వచ్చిన పెద్ద పులి ద్వారకా తిరుమల, గోపాలపురం, బుట్టాయగూడెం మండలాల్లో సంచరించి పాడిపశువులపై దాడి చేసింది. ద్వారకా తిరుమల కొవ్వాడ, ఉడతపల్లి గ్రామాల్లో కూడా పులి సంచరించి భయబ్రాంతులకు గురి చేసి అనంతరం మళ్లీ పాపికొండల అభయారణ్యం వైపు వెళ్ళిపోయింది. ఈ ఏడాది పులి సంచారం ప్రజలను తీవ్ర భయాందోళనకు గురి చేస్తుంది. ప్రస్తుతం ఆవులపై దాడి చేసిన పులి గ్రామాల్లో ఎవరిపై దాడి చేస్తుందో అనే భయాందోళనలో ప్రజలు బిక్కుబిక్కుమంటూ ఉన్నారు. అంతర్వేదిగూడెం సమీపంలో రైతుపై దాడికి ప్రయత్నించిన పులి తాటి కల్లు తీసేందుకు తాడిచెట్టు ఎక్కాను. కిందకు తొంగి చూడగా పులి కనిపించింది. దగ్గరగా వచ్చేసరికి కేకలు పెట్టాను. ఒక్కసారిగా గాండ్రించుకుంటూ గ్రామ సమీపంలోని కొండవైపు వెళ్ళింది. పులిని చూసిన నేను భయాందోళన చెందాను. మా సోదరుడు కూడా పులిని చూశాడు. – బొల్లి రవీంద్రరెడ్డి, పందిరిమామిడిగూడెం, బుట్టాయగూడెం మండలం -
సమష్టిగా పోరుబాట
● వైఎస్సార్సీపీ సంస్థాగత నిర్మాణంపై దృష్టి ● ఏలూరు జిల్లా స్థాయి సమావేశంలో నేతలు ఏలూరు టౌన్: వైఎస్సార్సీపీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో రాష్ట్రంలో ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలపై పార్టీ నేతలంతా పోరుబాట పడుతూ.. పార్టీ కార్యకర్తలు, ప్రజలకు అండగా నిలవాల్సిన ఆవశ్యకత ఉందని ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు అన్నారు. నగరంలో జిల్లా స్థాయి పార్టీ సంస్థాగత కమిటీ నిర్మాణ సమావేశం బుధవారం నిర్వహించారు. ముఖ్య అతిథులుగా పార్లమెంట్ పరిశీలకులు, ఎమ్మెల్సీ వంకా రవీంద్రనాథ్, టాస్క్ఫోర్స్ కమిటీ సభ్యుడు, ఎమ్మెల్సీ మొండితోక అరుణ్కుమార్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పుత్తా ప్రతాప్రెడ్డి, రాష్ట్ర అధికార ప్రతినిధి పుత్తా శివశంకర్రెడ్డి, శివారెడ్డి, ఏలూరు పార్లమెంట్ ఇన్ఛార్జ్ కారుమూరి సునీల్కుమార్ హాజరయ్యారు. ఈ సమావేశంలో నేతలు మాట్లాడుతూ.. జిల్లాలో పార్టీని సంస్థాగతంగా పటిష్టంగా నిర్మించడంతో ప్రతి నాయకుడు, కార్యకర్త కీలకపాత్ర పోషించాలని నేతలు చెప్పారు. జిల్లాలో మండల కమిటీలు, అనుబంధ విభాగాల కమిటీలు, వార్డు, గ్రామస్థాయి పార్టీ కమిటీలు వేగంగా పూర్తి చేయాలన్నారు. రాబోయేది వైఎస్సార్సీపీ ప్రభుత్వమేననీ, వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేసుకోవటమే లక్ష్యంగా సైనికుల్లా పనిచేయాలన్నారు. ఉంగుటూరు సమన్వయకర్త పుప్పాల వాసుబాబు, పోలవరం సమన్వయకర్త తెల్లం బాలరాజు, ఏలూరు సమన్వయకర్త మామిళ్ళపల్లి జయప్రకాష్, చింతలపూడి సమన్వయకర్త కంభం విజయరాజు, కొఠారు రామచంద్రరావు, రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, రాష్ట్ర కార్యదర్శులు (పార్లమెంట్) నూకపెయ్యి సుధీర్బాబు, దాసరి రమేష్, డీవీఆర్కే చౌదరి, ఎస్ఈసీ మెంబర్ దయాల నవీన్బాబు, బీసీ సెల్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ నౌడు వెంకటరమణ, ముదిరాజ్ కార్పొరేషన్ అధ్యక్షులు కోమటి విష్ణువర్థన్, వడ్డీలు కార్పొరేషన్ అధ్యక్షులు ముంగర సంజయ్, సూర్యబలిజ కార్పొరేషన్ అధ్యక్షులు శెట్టి త్యాగరాజు, రాష్ట్ర బూత్ కమిటీ జోన్ అధ్యక్షులు బీవీఆర్ చౌదరి, ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాస్, జెడ్పీ వైస్ ఛైర్మన్ పెనుమాల విజయ్, జెట్పీటీసీ నిట్టా లీలానవకాంతం తదితరులు పాల్గొన్నారు. -
ఆర్థిక లావాదేవీలతోనే స్నేహితుడి హత్య
భీమడోలు: ఆర్థిక లావాదేవీల నేపథ్యమే స్నేహితుడి హత్యకు దారితీసింది. సోమవారం రాత్రి జరిగిన హత్య కేసులో నిందితుడిని బుధవారం భీమడోలు పోలీసులు అరెస్ట్ చేశారు. ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ బుధవారం భీమడోలు పోలీస్స్టేషన్లో వివరాలు వెల్లడించారు. సూరప్పగూడెంకు చెందిన వెజ్జు రమేష్(28), కర్రికొండ కుంకుళ్ల శివతులసి శ్రీనివాస్ స్నేహితులు. వీరిద్దరూ కలిసి కోకోకోలా కంపెనీ ట్రాన్స్ఫోర్ట్ వ్యాపారం చేస్తున్నారు. అయితే ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో వారిద్దరూ కొంతకాలంగా గొడవలు పడుతున్నారు. ఈ క్రమంలో పండుగల నేపథ్యంలో స్నేహితులతో కలిసి వారు మద్యం సేవించారు. ఎలాగైనా రమేష్ను అడ్డు తొలగించుకోవాలని శ్రీనివాస్ పథకం రచించాడు. ఈనెల 19వ తేదీ సోమవారం రాత్రి తన కారులో ఇనుప రాడ్ను వెంటబెట్టుకుని భీమడోలు పంచాయతీ పరిధిలోని ప్రభుత్వ సీలింగ్ భూముల సమీపంలో ఉన్న సర్వీసు రోడ్డు వద్ద జనం సంచారం లేని ప్రాంతానికి రమేష్ను తీసుకునివెళ్లాడు. మద్యం తాగిన తర్వాత శ్రీనివాస్ ఇనుపరాడ్తో రమేష్పై విచక్షణారహితంగా దాడి చేసి చంపి పరారయ్యాడు. దీనిని ప్రమాదంగా చిత్రీకరించే ప్రయత్నం చేశాడు. ఈ ఘటనపై రమేష్ సోదరుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు సీఐ విల్సన్ కేసు నమోదు చేశారు. కేసును ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎస్పీ కేపీఎస్ కిషోర్, ఏలూరు డీఎస్పీ డి.శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో భీమడోలు సీఐ యూజే విల్సన్, ఎస్సై ఎస్కే మదీనా బాషా, సిబ్బందితో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి దర్యాప్తు చేపట్టారు. 48 గంటల్లోనే పొలసానిపల్లి బస్టాండ్ వద్ద నిందితుడు కర్రి కొండ కుంకుళ్ల శివతులసి శ్రీనివాస్ను భీమడోలు సీఐ విల్సన్ అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ శ్రావణ్కుమార్ చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచామన్నారు. హత్య కేసును చాకచక్యంగా ఛేదించిన భీమడోలు హెచ్సీలు సూరిశెట్టి శ్రీనివాసరావు, కానిస్టేబుల్ జి.ధర్మరాజు, బి.లక్ష్మీనారాయణ, బి.గోపాలకృష్ణలను డీఎస్పీ అభినందించారు. 48 గంటల్లోనే నిందితుడిని అరెస్ట్ చేసిన పోలీసులు -
దాడి ఘటనలో మరో మహిళ మృతి
జంగారెడ్డిగూడెం: స్థానిక దళిత పేటలో ఆస్తి తగాదాల నేపధ్యంలో మంగళవారం రాత్రి నలుగురు మహిళలపై దాడి ఘటనలో తాజాగా మరొకరు మృతిచెందారు. మంగళవారం రాత్రి జీలుగులమ్మ మృతి చెందగా.. బుధవారం ఆమె తల్లి చుక్కమ్మ చికిత్స పొందుతూ మృతిచెందింది. జీలుగులమ్మ కూతుళ్లు ధనలక్ష్మి, ఉషారాణి ఏరియా ఆసుపత్రిలో కోలుకుంటున్నారు. బుధవారం ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. ఆసుపత్రిలో కోలుకుంటున్న ధనలక్ష్మి, ఉషారాణిని పరామర్శించి వారి నుంచి వివరాలు తెలుసుకున్నారు. క్లూస్ టీమ్, ఎఫ్ఎస్ఎల్ నిపుణులు ఘటనా స్థలంలో వేలి ముద్రలు, రక్తనమూనాలు, ఘటనకు సంబంధించి ఇతర ఆధారాలు సేకరించారు. ఏఎస్పీ, డీఎస్పీ యు.రవిచంద్ర వివరాలు వెల్లడించారు. ముప్పిడి వివేక్, ముప్పిడి పవన్, ముప్పిడి రవికుమార్, ముప్పిడి నాగేశ్వరి, కొత్తూరు శ్యామ్లు జీలుగులమ్మ కుటుంబంపై మంగళవారం రాత్రి గొడ్డలి, కర్రలతో దాడి చేశారన్నారు. ఆస్తి తగాదాల నేపథ్యంలో రాత్రి సమయంలో జీలుగులమ్మ ఇంటికి వెళ్లే దారిలో ముప్పిడి నాగేశ్వరి మంత్రించిన నిమ్మకాయలు, ఎండు మిరపకాయలు వేసి.. మళ్లీ వారే 112కు కాల్ చేసి దీనిపై ఫిర్యాదు చేశారు. స్థానిక పోలీసులు ఇరువర్గాలను పిలిచి సర్ధిచెప్పి ఇంటికి పంపించేశారు. పొద్దుపోయాక వివేక్, పవన్, రవికుమార్, నాగేశ్వరి, కొత్తూరి శ్యామ్ వీరంతా జీలుగులమ్మ ఇంట్లోకి ప్రవేశించి ఆమె కుటుంబసభ్యులపై దాడి చేశారు. వివేక్ గొడ్డలితో విచక్షణా రహితంగా దాడి చేయగా, జీలుగులమ్మ అక్కడికక్కడే మృతి చెందగా, తల్లి చుక్కమ్మ, జీలుగులమ్మ కుమార్తెలు ధనలక్ష్మి, ఉషారాణి తీవ్రంగా గాయపడినట్లు చెప్పారు. చుక్కమ్మ చికిత్స పొందుతూ మృతిచెందగా, ధనలక్ష్మి, ఉషారాణి కోలుకున్నట్లు తెలిపారు. ఘటనపై జీలుగులమ్మ కూతురు ఉషారాణి ఫిర్యాదు చేయగా, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు వారు తెలిపారు. -
లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
ఉంగుటూరు: తాడేపల్లిగూడెం వైపు వెళుతున్న లారీని హైదరాబాద్ నుంచి తాడేపల్లిగూడెం వస్తున్న ట్రావెల్స్ బస్సు వెనుకనుంచి ఢీకొన్న ఘటన బుధవారం ఉదయం జాతీయరహదారిపై బాదంపూడి – ఉంగుటూరు గ్రామాల మధ్య చోటుచేసుకుంది. ట్రావెల్స్ బస్సులో డ్రైవరు మినహా ప్రయాణికులు ఎవరూ లేకపోవడంతో పెను ప్రమాదం తప్పింది. బస్సు ముందు భాగం నుజ్జు అవడంతో అందులో డ్రైవర్ ఇరుక్కుపోయి గాయాలయ్యాయి. స్థానికులు బస్సు నుంచి గాయపడిన డ్రైవర్ను బయటకు తీసి 108 అంబులెన్స్లో తాడేపల్లిగూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. ఎస్సై సూర్యభగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డ్రైవర్ మినహా ప్రయాణికులు లేకపోవడంతో తప్పిన ప్రమాదం -
వేగంగా జాతీయ రహదారి పనులు
బుట్టాయగూడెం: ఏలూరు జిల్లాలోని ఏజెన్సీ ప్రాంతం జీలుగుమిల్లి– పట్టిసీమ జాతీయ రహదారి 365 బీబీ పనులు వేగంగా సాగుతున్నాయి. ఈ రహదారి నిర్మాణానికి సంబంధించి భూసేకరణ పనులు పూర్తి కావడంతో అధికారులు పనులు వేగవంతం చేశారు. ప్రస్తుతం జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం మండలం రెడ్డిగణపవరం, ఇప్పలపాడు , కంసాలికుంట మీదగా పద్మవారిగూడెం సమీపంలో నిర్మాణంలో ఉన్న మల్టీస్పెషాలిటీ ఆస్పత్రి వరకూ బైపాస్ నిర్మాణాల పనులను చేస్తున్నారు. అలాగే ఆయా పనులు జరిగే ప్రాంతంలో ఉన్న కాలువలపై కల్వర్టులు, వంతెన నిర్మాణం పనులు జరుగుతున్నాయి. ఏజెన్సీ ప్రాంతంలో పూర్తిగా గిరిజన గ్రామాలను కలుపుకుని నాలుగు వరుసల రోడ్డు నిర్మాణం జరుగుతుంది. రహదారి నిర్మాణానికి సంబంధించి రోడ్డు వెడల్పు పనులు చేయడంతో గ్రామాల స్వరూపం కూడా మారిపోయాయి. గ్రీన్ఫీల్డ్ హైవేకు సమీపంలోనే... సూర్యపేట నుంచి ఖమ్మం, చింతలపూడి నియోజకవర్గం మీదగా దేవరపల్లి జాతీయ రహదారికి కనెక్టివిటీ పెంచేలా గ్రీన్ఫీల్డ్ నేషనల్ హైవే పనులు జరిగాయి. దీనితో పాటు ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న పోలవరం ప్రాజెక్టు ప్రాధాన్యత, ఇతర అంశాలను దృష్టిలో ఉంచుకుని గ్రీన్ఫీల్డ్ హైవేకు సమీపంలోనే జాతీయ రహదారి 365 బీబీ నిర్మాణానికికు వైఎస్సార్సీపీ పాలనలోనే కేంద్రం ఆమోదం తెలిపింది. సూర్యపేట నుంచి కుసుమంచి, వైరా, తల్లాడ, సత్తుపల్లి, ఆశ్వారావుపేట మీదగా ఆంధ్రప్రదేశ్లోని జీలుగుమిల్లి, బుట్టాయగూడెం మీదగా పోలవరం సమీపంలో ఉన్న పట్టిసీమ వరకూ రహదారి కలుపుతూ డిజైన్ చేశారు. 2023లోనే ప్రారంభం జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకూ మొత్తం 86.5 కిలోమీటర్లు మేర రహదారి ఉంది. ఈ హైవే 365 బీబీ పనులకు సంబంధించి కేంద్ర ప్రభుత్వం రూ. 369 కోట్లు మంజూరు చేసింది. అయితే వైఎస్సార్సీపీ పాలన సమయంలోనే సుమారు రూ. 32 కోట్ల వ్యయంతో జీలుగుమిల్లి నుంచి కొవ్వూరు వరకూ సుమారు 86 కిలోమీటర్ల మేర రహదారిని అభివృద్ధి చేశారు. జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం వరకూ రూ. 5 కోట్లు, బుట్టాయగూడెం నుంచి కన్నాపురం వరకూ రూ. 7 కోట్లు, కన్నాపురం నుంచి ఎల్ఎన్డిపేట వరకూ రూ. 3 కోట్లు, ఎల్ఎన్డీ పేట నుంచి పట్టిసీమ వరకూ రూ. 4 కోట్లు, పట్టిసీమ నుంచి కొవ్వూరు వరకూ రూ. 13 కోట్లతో రోడ్డు నిర్మాణం పనులు పూర్తి చేశారు. అయితే నాలుగు రోడ్లుగా విస్తరణ, భూసేకరణకు సంబంధించి కూడా అప్పటి ఎమ్మెల్యే తెల్లం బాలరాజు 2023 డిసెంబర్ 28న శంకుస్థాపన చేశారు. జిల్లా అధికారులు భూసేకరణ పనులు పూర్తి చేసి పనులకు ఎలాంటి ఆటంకాలు లేకుండా ఏర్పాటు చేయడంతో వేగవంతంగా జరుగుతున్నాయి. ఎన్హెచ్ 365 బీబీ రోడ్డు పనుల వివరాలు మొదటి విడత పనులు – 40.4 కిలో మీటర్లు మంజూరైన నిధులు – రూ. 369 కోట్లు భూసేకరణకు కేటాయించిన నిధులు – రూ. 25.6 కోట్లు జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం మీదుగా బుట్టాయగూడెం శివారు మల్టీ స్పెషాలీటీ ఆస్పత్రి వరకూ 26 కిలో మీటర్లు.. ఎల్ఎన్డీ పేట బైపాస్ నుంచి పట్టిసీమ సాయిబాబా గుడి వరకూ నిర్మాణంచేపట్టనున్న నిర్మాణాలు చిన్న వంతెనలు – 5 కల్వర్టులు – 30 రెండో ప్యాకేజీలో 46 కిలోమీటర్లు భూసేకరణకు కేటాయించిన నిధులు రూ.50 కోట్లు ఏజెన్సీ ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పాటు ఆనందంగా ఉంది. ఈ పనులు పూర్తయితే రాజమండ్రి ప్రయాణం సులభతరంగా మారుతుంది. అలాగే బైపాస్ రోడ్డును ఏర్పాటు చేయడం వల్ల రైతులకు కూడా ఎంతో సౌకర్యంగా ఉంది. ఈ ప్రాంతంలో జాతీయ రహదారి ఏర్పాటవుతుందని కలలో కూడా ఊహించలేదు. – తెల్లం దేవరాజు, గిరిజన రైతు, కంసాలికుంట వైఎస్సార్ సీపీ పాలనలో జీలుగుమిల్లి, పట్టిసీమ మీదుగా రాజమండ్రి వరకూ నేషనల్ హైవే పనులు చేపట్టేలా కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. సుమారు రూ. 32 కోట్లతో జీలుగుమిల్లి నుంచి పట్టిసీమ మీదుగా సుమారు 86 కిలోమీటర్ల మేర పనులు చేపట్టాం. తదుపరి నాలుగు లైన్ల పనులకు కూడా చర్యలు తీసుకున్నాం. రోడ్డు విస్తరణకు, రెండవ దశ పనులకు శంకుస్థాపన చేశాం. ఎన్నికలు, భూసేకరణ నేపద్యంలో పనులు నిలిచాయి. – తెల్లం బాలరాజు, మాజీ ఎమ్మెల్యే, దుద్దుకూరు జీలుగుమిల్లి నుంచి బుట్టాయగూడెం మీదుగా పట్టిసీమ వరకు జాతీయ రహదారి నిర్మాణం రూ.369 కోట్లతో40 కిలో మీటర్ల పరిధిలో ఎన్హెచ్ 365 బీబీ పనులు వైఎస్సార్ సీపీ పాలనలోనే పనుల ప్రారంభం -
డయాలసిస్ రోగులకు ఇబ్బందులు
జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ చేయించుకోవడానికి వచ్చిన రోగులు మంగళవారం ఇబ్బందులు ఎదుర్కొన్నారు. ఏరియా ఆసుపత్రిలోని అపోలో డయాలసిస్ కేంద్రంలోని టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆదివారం ఉరి వేసుకుని మృతిచెందిన నేపథ్యంలో సోమవారం అపోలో డయాలసిస్ సెంటర్లో సేవలు నిలిచిపోయాయి. అయితే డయాలసిస్ చేయించుకునేందుకు మంగళవారం ఉదయం 6గంటల షిఫ్ట్ కేటాయించిన రోగులు ఆసుపత్రికి చేరుకున్నారు. తీరా వారు డయాలసిస్ కేంద్రానికి వచ్చి చూసేసరికి కేంద్రానికి తాళం వేసి ఉంది. దీంతో రోగులు, వారితో వచ్చిన వారు ఆసుపత్రిలో ఆందోళన చేశారు. సుమారు 4 గంటల పాటు వేచిన తరువాత ఉదయం 10.30 గంటలకు అపోలో సిబ్బంది డయాలసిస్ కేంద్రం తెరిచి రోగులకు వైద్యం అందించారు. ఈ సందర్భంగా రోగులకు, అపోలో సిబ్బందికి వాగ్వివాదం జరిగింది. డయాలసిస్ టెక్నీషియన్ సుధాకర్ మృతికి కారకులైన వారిపై ఎలాంటి చర్యలు తీసుకుంటారని సిబ్బందిని రోగులు, వారి సహాయకులు ప్రశ్నించారు. దీనిపై అపోలో రీజనల్ ఆపరేషన్స్ మేనేజర్ వి.మధుకిరణ్ మాట్లాడుతూ మృతి చెందిన సుధాకర్ తమ సంస్థలో ఎనిమిదేళ్లుగా నమ్మకంగా పని చేశారన్నారు. సుధాకర్ మృతికి కారకులైన ఇద్దరు పేషెంట్లకు అపోలో డయాలసిస్ కేంద్రంలో డయాలసిస్ చేయబోమని తెలిపారు. దీంతో రోగులు, సహాయకులు ఆందోళన విరమించారు. అనంతరం రోగులకు డయాలసిస్ చేశారు. -
రోడ్డు ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలి
ఏలూరు(మెట్రో): రహదారి ప్రమాదాల కారణంగా జిల్లాలో ఏ ఒక్కరూ ప్రాణాలు కోల్పోకుండా జాతీయ రహదారి వెంట నిఘా పెట్టాలని కలెక్టర్ కె. వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లోని గౌతమీ సమావేశపు హాలులో మంగళవారం రహదారి భద్రత కమిటీ సమావేశం జరిగింది. రహదారి ప్రమాదాల నివారణకు తీసుకోవలసిన చర్యలపై ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్తో కలిసి సంబంధిత శాఖల అధికారులతో సమీక్షించారు. కలెక్టర్ మాట్లాడుతూ రహదారి భద్రత నియమాలపై ప్రతి ఒక్కరికీ అవగాహన కలిగించాలని, పాఠశాల, కళాశాల స్థాయిలో అవగాహన సమావేశాలు నిర్వహించాలన్నారు. రహదారి భద్రతా సమావేశాలు ప్రతీ నెల నిర్వహించేలా చర్యలు తీసుకోవాలన్నారు. జాతీయ రహదారి వెంట గ్రామ సరిహద్దు ప్రాంతాలలో వీధి దీపాలు ఉండేలా చూడాలన్నారు. తాడేపల్లిగూడెం: తేనెటీగల వల్ల పంటల్లో పరాగసంపర్కం మెరుగుపడి, దిగుబడులు పెరుగుతాయని తాడేపల్లిగూడెం సహాయ వ్యవసాయ సంచాలకుడు ఆర్.గంగాధర్ అన్నారు. వెంకట్రామన్నగూడెంలోని కేవీకే లో మంగళవారం ప్రారంభమైన తేనెటీగల పెంపకం శిక్షణా కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తేనెటీగల పెంపకం వల్ల కలిగే లాభాలను వివరించారు. కేవీకే సమన్వయకర్త డాక్టర్ పి.విజయలక్ష్మి మాట్లాడుతూ తక్కువ పెట్టుబడితో ఎక్కువ లాభాలు పొందగలిగే వ్యవసాయ అనుబంధరంగం తేనెటీగల పెంపకం అన్నారు. -
టీ కార్నర్లో అగ్ని ప్రమాదం
తణుకు అర్బన్: టీ–కార్నర్లో గ్యాస్ లీకై మంటలు వ్యాపించి టీ–మాస్టర్తోపాటు ఏడుగురు గాయాలపాలైన ఘటన తణుకులో మంగళవారం చోటుచేసుకుంది. పట్టణ పోలీసులు, బాధితులు తెలిపిన వివరాల ప్రకారం తణుకు వంగవీటి మోహనరంగా వీధిలోని మమతా టీ–కార్నర్లో తెల్లవారుజామున 5:30 గంటల సమయంలో టీ–పెట్టే వంటగదిలో గృహావసరాలకు వినియోగించే గ్యాస్ సిలిండరు నుంచి వాణిజ్య అవసరాలకు వినియోగించే సిలిండరులోకి గ్యాస్ అక్రమంగా ఎక్కిస్తున్న సమయంలో ఈ ప్రమాదం చోటు చేసుకుంది. అయితే గ్యాస్ పొయ్యిపై టీ కాస్తుండగానే గ్యాస్ రీఫిల్లింగ్ చేసే క్రమంలో గ్యాస్ లీకై ఈ ప్రమాదం జరిగినట్లుగా బాధితులు చెబుతున్నారు. ఈ ప్రమాదంలో టీమాస్టర్ రమణతోపాటు గ్యాస్ ఎక్కిస్తున్న సామన ఏవుళ్లు, టీ తాగేందుకు వచ్చిన మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులు కొంబత్తుల పండు, అయినవల్లి పల్లపురావు, కొమ్మరఎలిజెబెత్, ఎల్లమిల్లి మందులయ్య, మరొక వ్యక్తి కాకుస్తు రాజారావు తీవ్రంగా గాయపడ్డారు. ప్రమాదం జరగిన వెంటనే బాధితులను సమీపంలోని ప్రైవేటు ఆస్పత్రికి తరలించి వైద్యసేవలు అందిస్తున్నారు. పారిశుద్ధ్య కార్మికుల ఫిర్యాదుమేరకు పట్టణ ఎస్సై శ్రీనివాస్ కేసు నమోదుచేశారు. బాధితులకు పరామర్శ ప్రమాదంలో గాయపడిన బాధితులను మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు పరామర్శించారు. మునిసిపల్ పారిశుద్ధ్య కార్మికులతోపాటు టీమాస్టర్, టీతాగుతూ గాయపడ్డ వారి ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. కాలిన గాయాలకు సంబంధించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మట్లాడుతూ అగ్ని ప్రమాద ఘటనలో గాయపడ్డ బాధితులకు ప్రభుత్వం తక్షణమే రూ. 2 లక్షలు చొప్పున పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. అంతేకాకుండా గ్యాస్ ఏజెన్సీ యాజమాన్యం కూడా బాధితులకు అండగా నిలబడి సాయం చేయాలని కోరారు. ఆయన వెంట లీగల్ సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పంచాయితీరాజ్ రాష్ట్ర కార్యదర్శి వడ్లూరి సీతారాం, పట్టణ అధ్యక్షుడు మారిశెట్టి శేషగిరి, పబ్లిసిటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు జల్లూరి జగదీష్, నియోజకవర్గ ప్రచారకమిటీ అధ్యక్షుడు గెల్లా జగన్ తదితరులు ఉన్నారు. అలాగే బాధితులను ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ, మునిసిపల్ కమిషనర్ టి.రామ్కుమార్, శానిటరీ అధికారులు, సీఐటీయూ, సీపీఐ బీజేపీ నాయకులు పరామర్శించారు. ఏడుగురికి తీవ్ర గాయాలు -
స్నేహితుడే కాలయముడై..
భీమడోలు: ఆర్థిక లావాదేవీల నేపథ్యంలో ప్రాణం పోస్తాడనుకున్న స్నేహితుడే ప్రాణం తీసి కాలయుముడయ్యాడు. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం సూరప్పగూడెం గ్రామానికి చెందిన వెజ్జు రమేష్ను అదే గ్రామానికి కర్రి కొండ కుంకుళ్ల తులసీ శ్రీను అలియాస్ కర్రి శ్రీను సోమవారం రాత్రి హతమార్చాడు. అయితే వెజ్జు రమేష్, కర్రి శ్రీనులు ప్రాణ స్నేహితులు కావడం గమనార్హం. వెజ్జు రమేష్ వ్యవసాయ పనులకు, కర్రి శ్రీను కూలీ పనులకు వెళ్తుంటారు. వారిద్దరు చెడు వ్యసనాలకు బానిసలై ఒకరి వద్ద మరొకరు అప్పులు చేస్తూ జూలాయిలుగా తిరుగుతుంటారు. ఈ నేపథ్యంలో సోమవారం కర్రి శ్రీను తన స్నేహితుడు వెజ్జు రమేష్ను నమ్మించి కారులో తీసుకుని వెళ్లాడు. రాత్రి మద్యం సేవించిన రమేష్తో డబ్బులు విషయంలో కర్రి శ్రీను గొడవ పడ్డాడు. కోపోద్రిక్తుడైన కర్రి శ్రీను స్నేహితుడు వెజ్జు రమేష్ను విచక్షణారహితంగా రాడ్డుతో చితకబాదాడు. దీంతో రమేష్ తీవ్రగాయాలతో మృతి చెందాడు. అక్కడ నుంచి కర్రి శ్రీను తాను హత్యకు వాడిన రాడ్డును దూరంగా విసిరేసి పరారయ్యాడు. ఈ క్రమంలో కారుపై రక్తపు మరకలు పడ్డాయి. అయితే ముందుగా వెజ్జు రమేష్ రోడ్డు ప్రమాదంలో మరణించాడనుకుని కుటుంబ సభ్యులు, స్థానికులు పెద్ద ఎత్తున ఆ ప్రాంతానికి వచ్చారు. భీమడోల సీఐ యూజే విల్సన్, ఎస్సై ఎస్కే మదీనా బాషాలు ఘటన స్థలానికి వెళ్లి పరిశీలించి, అనుమానం రావడంతో పలు కోణాల్లో విచారణ ప్రారంభించారు. క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్, సాంకేతిక బృందాలతో ఆ ప్రాంతంలో వెతగ్గా హత్యకు వాడిన రాడ్డు లభ్యమైనట్లు సమాచారం. అనంతరం వెజ్జు రమేష్ మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. మృతుని సోదరుడు మణికంఠ ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు సీఐ యూజే విల్సన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
కొల్లేరులో మళ్లీ అలజడి
కై కలూరు: సుప్రీం కోర్టు నిబంధనల అమలు తప్పనిసరి అంటూ ఫారెస్టు అధికారులు ఒక వైపు.. మా జీవనోపాధిపై దెబ్బకొడితే చావే శరణ్యం అంటూ పురుగుమందు డబ్బాలతో ప్రజలు మరో వైపు ఉండండతో మండలంలో చటాకాయిలో మంగళవారం ఉద్రిక్త పరిస్థితులు తలెత్తాయి. ఇటీవల కొల్లేరు ఆక్రమణలపై సుప్రీం కోర్టు సాధికారిత కమిటీ (సీఈసీ) సీరియస్ అయ్యింది. పూర్తి స్థాయిలో కొల్లేరులో ఆక్రమణలు తొలగించి నివేదిక అందించాలని అటవీ శాఖ అధికారులను ఆదేశించింది. చటాకాయి గ్రామంలో సుమారు 110 ఎకరాల విస్తీర్ణంలో 3 చెరువులు కొల్లేరు అభయారణ్యంలో సాగు చేస్తుండడంతో వీటిని ధ్వంసం చేసి సుప్రీం కోర్టుకు నివేదించాల్సి ఉంది. ఈ నేపథ్యంలో రాజమండ్రి సర్కిల్ చీప్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు బీఎన్ఎన్.మూర్తి, డీఎఫ్వో బి.విజయ, రేంజర్ నాగలింగాచార్యులు, రూరల్ సర్కిల్ సీఐ వి.రవికుమార్, ఎస్ఐలు రాంబాబు, రామచంద్రరావు ఇలా పోలీసు, ఫారెస్టు సిబ్బంది కలిపి మొత్తం 40 మంది చటాకాయి గ్రామానికి వెళ్లారు. అయితే గ్రామస్తులు మొత్తం సుమారు 1800 మంది గ్రామ ప్రారంభంలోనే అడ్డుకున్నారు. వీరితో మాట్లాడిన తర్వాత అధికారులు గ్రామంలోకి వెళ్లారు. ఆ సమయంలో కొందరు పురుగు మందు డబ్బాలు తీసుకొచ్చి మా చెరువులు కొడితే చావే శరణ్యమని అధికారుల ఎదుట వాపోయారు. వెంటనే పోలీసులు డబ్బాలను ప్రదర్శించకుండా అడ్డుకున్నారు. వడ్లకూటితిప్ప గ్రామంలోనూ ప్రజలు మా జీవనోపాధిని దెబ్బతీయవద్దని అధికారులను వేడుకున్నారు. సుప్రీం కోర్టు ఆదేశాలకు గౌరవం ఇవ్వాలి కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువులను ధ్వంసం చేస్తామంటే ఇప్పటికే చేపలు ఉన్నాయని చెప్పారు. వాటిని పట్టుకునే అవకాశం ఇవ్వమంటే కొంత సమయం ఇచ్చామని, మళ్లీ వాటిలో చేప పిల్లలు వేయడం కోర్టు ఆదేశాలను ధిక్కరించినట్లు అవుతుందని అటవీ అధికారులు కొల్లేరు ప్రజలను ప్రశ్నించారు. కొల్లేరు ప్రజలు మరో 6 నెలలు సమయం ఇవ్వండని అడిగారు. ఎట్టి పరిస్థితుల్లోనూ అక్రమ చెరువులను ధ్వంసం చేసి కోర్టుకు నివేదిస్తామని అటవీ అధికారులు చెబుతున్నారు. ఇటువంటి పరిస్థితుల్లో కొల్లేరులో మరో పర్యాయం ఆపరేషన్ కొల్లేరు జరిగే అవకాశాలు కనిస్తున్నాయి. అటవీ అధికారులు వర్సెస్ ప్రజలు -
సచివాలయ ఉద్యోగికి జిల్లా ఉత్తమ బీఎల్ఓ అవార్డు
టి.నరసాపురం: మండలంలోని వెలగపాడు పంచాయతీలో సచివాలయ ఉద్యోగినిగా పనిచేస్తున్న సరిపల్లి స్వాతి జిల్లా స్థాయి బెస్ట్ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ అవార్డుకు ఎంపికయ్యారని తహసీల్దార్ టి.సాయిబాబా తెలిపారు. స్థానిక తహసిల్దార్ కార్యాలయంలో మంగళవారం నిర్వహించిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ బీఎల్ఓగా ఉత్తమ ప్రతిభ కనబరిచిన ఆమెను జిల్లాస్థాయి ఉత్తమ ఎలక్ట్రోల్ ప్రాక్టీస్ అవార్డుకు అధికారులు ఎంపిక చేసినట్లు ఆయన తెలిపారు. 16వ జాతీయ ఓటర్ల దినోత్సవం పురస్కరించుకుని, ఈ నెల 25న విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఆమెకు రాష్ట్ర ఎలక్ట్రోల్ అధికారుల చేతుల మీదుగా అవార్డు అందజేస్తారని వివరించారు. జిల్లా ఉత్తమ బీఎల్ఓగా ఎంపికై న స్వాతిని సచివాలయ సిబ్బందితో పాటు పలువురు బీఎల్ఓలు అభినందించారు. ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో క్లస్టర్ డవలప్మెంట్ ప్రోగ్రాం (సీఎల్డీపీ) కింద నేషనల్ హార్టికల్చర్ బోర్డు (ఎన్హెచ్బీ) ద్వారా రూ.157. 82 కోట్లతో నవభారత్ లిమిటెడ్ కోకో క్లస్టర్ ఏర్పాట్లను ఉద్యానవన శాఖ జాతీయ స్థాయి అధికారులు మంగళవారం పరిశీలించారు. జిల్లాలో 8833 మంది రైతులకు ఉపయోగపడేలా 14500 హెక్టార్లలో ఏర్పాటుచేయనున్న కోకో క్లస్టర్ ఏర్పాట్లను క్షేత్ర స్థాయి పరిశీలనకు ఢిల్లీకి చెందిన నేషనల్ హార్టికల్చర్ బోర్డు టీం ప్రతినిధి పవన్ కుమార్ గౌరవ్, జయంత్ సింగ్, విజయవాడ నుంచి ప్రదీప్, ఉద్యానవన శాఖ జాయింట్ డైరెక్టర్ మునిరెడ్డి, సీఎల్డీపీ ప్రాజెక్ట్ కో–ఆర్డినేటర్ వై.విద్యా సాగర్, జంగారెడ్డిగూడెం యూనియన్ బ్యాంకు ప్రతినిధులు, కోకో, ఆయిల్ పామ్ తోటలను సందర్శించారు. మక్కినవారిగూడెం రైతులతో కోకో సాగు, అభివృద్ధి, ఎగుమతి అవకాశాలు గురించి చర్చించారని జిల్లా ఉద్యాన అధికారి కె.షాజా నాయక్ తెలియజేశారు. ఏలూరు టౌన్: ఏలూరు సర్వజన ఆసుపత్రి ఎంసీహెచ్ బ్లాక్లో బాలింత సుబ్బలక్ష్మి వైద్యుల నిర్లక్ష్యంతో నరకయాతన పడిన సంఘటనపై కలెక్టర్ వెట్రిసెల్వి సీరియస్ అయ్యారు. కలెక్టర్ ఆదేశాలతో జీజీహెచ్లో చికిత్స పొందుతున్న దివ్యాంగురాలు, బాలింత సుబ్బలక్ష్మి బంధువుల నుంచి జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ పీజే అమృతం వివరాలు అడిగి తెలుసుకున్నారు. వైద్యులు, వైద్య సిబ్బంది నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. వైద్య సిబ్బంది నిర్లక్ష్యంపై మంత్రి పార్థసారధి ఆగ్రహం వ్యక్తం చేశారు. 14 రోజుల క్రితం సుబ్బలక్ష్మికి శస్త్రచికిత్స చేసి డెలివరీ చేయగా, కుట్లు విడిపోయి తీవ్ర అస్వస్థతకు గురికావడంపై ఆయన స్పందించారు. కుట్లు విడిపోయి 5 రోజులైనా బాధితురాలిని వైద్యులు, సిబ్బంది పట్టించుకోకుండా, ఉదాసీనంగా వ్యవహరించటంతో బాధితురాలు తీవ్ర అనారోగ్యానికి గురైంది. -
రూ.28.50 లక్షలు బ్యాంకు ఖాతాలో వేయాలి
నూజివీడు: ఆగిరిపల్లిలో అన్నదానం నిర్వహించగా మిగిలిన రూ.28.50 లక్షలను వెంటనే ఆలయ అన్నదాన ట్రస్టు ఖాతాలో జమచేయాలని మంత్రి కొలుసు పార్థసారథిని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు డిమాండ్ చేశారు. గతేడాది నుంచి పోరాడుతుంటే ఇప్పటికి నిర్వాహకులు మిగిలిన రూ.28.50 లక్షలను మంత్రికి అప్పగించడం ఆగిరిపల్లి ప్రజల విజయమన్నారు. నూజివీడులో ఆయన మాట్లాడుతూ తన ఆధ్వర్యంలో రెండేళ్లు అన్నదానం నిర్వహించగా రూ.5.75 లక్షలు మిగిలితే వాటిని వెంటనే అన్నదాన ఖాతాలో జమచేశామని, 22 ఏళ్లు అన్నదానం నిర్వహిస్తే మిగిలింది రూ.28.50 లక్షలేనా అని ప్రశ్నించారు. పైగా బ్యాంకు ఖాతాలో వేస్తే వడ్డీ ఎంతో రాదని, రూపాయిన్నరకో, రెండు రూపాయల వడ్డీకో ఇచ్చారని మంత్రి చెప్పడాన్ని ప్రతాప్ అప్పారావు తీవ్రంగా ఖండించారు. ఇన్నేళ్లుగా డబ్బులు వసూలు చేస్తూ మిగిలిన డబ్బులకు లెక్కలు చెప్పకుండా దగ్గర ఉంచుకోవడం సబబేనా అని నిలదీశారు. ఆగిరిపల్లిలోని ప్రజలందరూ రూ.56 లక్షల వరకు ఉన్నాయని చెప్పుకుంటున్నారని, ఇచ్చింది మాత్రం రూ.28.50 లక్షలు మాత్రమేనన్నారు. -
మేనత్తపై కుటుంబంపై మేనల్లుడి దాడి
జంగారెడ్డిగూడెం: స్థానిక దళితపేటలో సరిహద్దు తగాదాల మంగళవారం రాత్రి మేనత్త కుటుంబంపై మేనల్లుడి గొడ్డలితో దాడి చేయడంతో ఓ మహిళ మృతి చెందగా, ముగ్గురు తీవ్రంగా గాయపడ్డారు. వివరాల ప్రకారం కలపాల జీలుగులమ్మ కుటుంబానికి ఆమె మేనల్లుడు ముప్పిడి వివేక్ కుటుంబానికి పొలం, ఇంటి సరిహద్దు తగాదాలు చాలా ఏళ్లుగా జరుగుతున్నాయి. ఈ నేపథ్యంలో మంగళవారం రాత్రి వివేక్ జీలుగులమ్మ కుటుంబంపై గొడ్డలితో దాడికి తెగబడ్డాడు. దీంతో జీలుగులమ్మ (45) మృతి చెందగా, ఆమె తల్లి చుక్కమ్మ, కూతుళ్లు ధనలక్ష్మి, ఉషారాణిలు తీవ్రంగా గాయపడ్డారు. స్థానికులు బాధితులను ఏరియా ఆస్పత్రికి తరలించారు. వీరిలో చుక్కమ్మ పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. విషయం తెలుసుకున్న డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐ ఎంవీ సుభాష్ ఘటనా స్థలాన్ని పరిశీలించి, ఆస్పత్రిలో క్షతగాత్రుల నుంచి వివరాలను సేకరించారు. ఈ మేరకు దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. మహిళ మృతి -
తెరవెనుక సూత్రధారులను అరెస్టు చేయాలి
రాజవరంలో కోట్ల రూపాయల విలువైన ఆస్తులను ప్రజల కోసం దాతలు దానం చేశారు. ఇప్పుడు అక్రమాలకు, అసాంఘిక కార్యకలాపాలకు వేదికైంది. చేస్తున్నదంతా కేవలం పాత్రధారులే, వెనుక నడిపిస్తున్న సూత్రధారులను చట్టం గుర్తించి శిక్షించినప్పుడే గ్రామంలో శాంతియుత పరిస్థితులు నెలకొంటాయి. – పాముల నాగముని స్వామి, రాజవరం మాజీ సర్పంచ్ ఎన్నో ఏళ్లుగా సాగు చేసుకుంటున్న భూమిని ప్రభుత్వం మారాక మాదంటూ కొందరు లాక్కోవడానికి చూస్తున్నారు. వాళ్ల నుంచి కొందరు డబ్బులు తీసుకుని మాపై కుట్రలు చేస్తున్నారు. మాకు న్యాయం చేసి ఆదుకోవాలి. – సాధనాల సౌధామణి, రాజవరం -
రాజవరం గడ్డ.. అక్రమార్కుల అడ్డా
● కూటమి పార్టీలు కలిసికట్టుగా దోపిడీ ● సంవత్సరంకాలంలో కోట్లకు పైనే స్వాహా కొయ్యలగూడెం: కొయ్యలగూడెం మండలంలో రెండో పెద్ద గ్రామంగా ఉన్న రాజవరం నేడు అక్రమార్కులకు అడ్డాగా మారింది. కాదేది అక్రమాలకు అనర్హం అన్నట్లుగా జూద క్రీడలకు, అక్రమ రవాణాకు కేంద్రంగా నిలిచింది. రాజవరం పంచాయతీ పరిధిలో మంగపతిదేవిపాలెం, గంగవరం గ్రామాలున్నాయి. గతంలో అడపాదడపా గ్రావెల్, ఇసుక, కలప రవాణాలు సాగినప్పటికీ గత సంవత్సరం నుంచి పంచాయతీ పరిధిలో రెవిన్యూ భూములలోని గ్రావెల్, సాగు చెరువులలో మట్టి, అటవీ ప్రాంతంలోని కలప అక్రమంగా రవాణ చేస్తున్నారు. తాజాగా భూ దందాలు, వైట్ కాలర్ మోసాలు ఎక్కువగా ఉన్నాయి. అటవీ ప్రాంతాన్ని అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మార్చారు. నాటు సారా తయారీ, పేకాట, కోతాట, వన్యప్రాణుల వేటకి నిలయంగా మార్చారు. రేషన్ మాఫియా, గంజాయి స్మగ్లింగ్ వంటి నేరాలకు అంతే లేకుండా పోయిందని పంచాయతీ ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. కూటమి పార్టీలన్నీ ఐక్యమత్యంగా ఈ దారుణాలకు పాల్పడుతున్నారని ఆరోపిస్తున్నారు. కొయ్యలగూడెం పోలీస్ స్టేషన్కి పంచాయతీ పరిధిలోని గ్రామాలు 15 కిలోమీటర్ల దూరంలో ఉండటం ఆక్రమార్కులకు కలిసి వచ్చింది. పోలీసులు వెళ్లేసరికే ఫలితం లేకుండా పోతుంది. పోలవరం నియోజకవర్గంలోని అత్యంత సమస్యాత్మకమైన గ్రామంగా రాజవరానికి పేరుంది. కొందరు వ్యక్తులు సమయానుకూలంగా అధికార పార్టీలోకి మారుతూ అక్రమాలకు పాల్పడుతున్నారని ప్రచారం సాగుతోంది. పంచాయతీ పరిధిలో మద్యం మాఫియా, గంజాయి రవాణాకు, కోడిపందాల నిర్వహణకు ప్రత్యేక యంత్రాంగమే ఉంది. ఈ అక్రమార్కుల భరతం పట్టే పాలన కోసం ప్రజలంతా ఎదురుచూస్తున్నారు. ఇప్పటికే జిల్లా పోలీసు బాస్ ఈ గ్రామంపై ప్రత్యేక దృష్టి పెట్టినట్లు సమాచారం. నాటు సారా కోసం బెల్లపు ఊట రాజవరంలో విక్రయిస్తున్న గంజాయి అక్రమంగా తరలిస్తున్న గ్రావెల్ -
జాతరకు పటిష్ట భద్రత
ఏలూరు(మెట్రో): ఏలూరు జాతర ఏర్పాట్లపై కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎమ్మెల్యే బడేటి చంటి, మేయర్ షేక్ నూర్జహాన్ మంగళవారం అధికారులతో సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ పటిష్టమైన భద్రతా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. జాతర సందర్భంగా ఎలాంటి అసౌకర్యం కలగకుండా రక్షిత మంచినీరు, పారిశుధ్యం, నిరంతరాయంగా విద్యుత్తు సరఫరా, రవాణా, జనరేటర్లు, వైద్య శిబిరాలు ఏర్పాటు చేయాలన్నారు. ట్రాఫిక్ నియంత్రణకు ప్రత్యేక చర్యలు తీసుకోవాలన్నారు. కంట్రోల్ రూం ఏర్పాటుచేసి 24 గంటలు పనిచేసేలా చూడాలన్నారు. అంబులెన్స్, అగ్నిమాపక వాహనాన్ని అందుబాటులో ఉంచనున్నట్లు తెలిపారు. సమావేశంలో జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, నూజివీడు సబ్ కలెక్టరు బొల్లిపల్లి వినూత్న, ఆర్డీవో అచ్యుత అంబరీష్, కమిషనరు ఏ.భానుప్రతాప్ తదితరులు, పాల్గొన్నారు. -
ఎట్టకేలకు విరాళాల నగదు అప్పగింత
ఆగిరిపల్లి: గత 20 ఏళ్లుగా శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి ఆలయంలో భక్తుల నుంచి అన్నదానం పేరుతో వసూలు చేసిన రూ. 28.50 లక్షల నగదును ఎట్టకేలకు మంత్రి కొలుసు పార్థసారథి సమక్షంలో అన్నదాన కమిటీ సభ్యులు మంత్రికి అందజేశారు. ఈ నెల 19న ‘అన్నదానం.. స్వాహా పర్వం’ అనే కథనం సాక్షిలో ప్రచురితమైంది. సాక్షిలో వెలువడిన కథనం తీవ్ర చర్చకు దారితీసింది. ఈ నేపథ్యంలో మంగళవారం మంత్రి పార్థసారథి రథసప్తమి తిరునాళ్లలో జరిగే అన్నదానం నిర్వహణపై గ్రామస్తులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా అన్నదాన కమిటీ నిర్వాహకులు గత కొన్ని సంవత్సరాలుగా భక్తుల నుంచి విరాళాల ద్వారా సేకరించిన వాటిలో మిగిలిన రూ.28.50 లక్షలను మంత్రికి అందజేశారు. దీనిలో నగదు రూ.15.50 లక్షలు, చెక్ ద్వారా రూ. 13 లక్షలు అందజేశారు. మంత్రి పార్థసారధి మాట్లాడుతూ రూ.28.50 లక్షలను దేవాలయ అభివృద్ధికి వినియోగిస్తామని అన్నారు. ఈ సంవత్సరం నుంచి రథసప్తమి రోజు నిర్వహించే అన్నదానానికి భక్తులు అందజేసే విరాళాలకు తప్పనిసరిగా రసీదు ఇవ్వాలని, అంతేకాకుండా భక్తుల నుంచి వచ్చిన విరాళాలు దేవస్థానం ఖాతాలోనే వేయాలని ఆదేశించారు. అన్నదాన కమిటీకి గ్రామస్తుల ఆధ్వర్యంలో నూతన కమిటీ ఏర్పాటు చేసుకోవాలని తెలిపారు. -
ముగిసిన జాతీయస్థాయి కబడ్డీ పోటీలు
కబడ్డీ చాంపియన్లుగా రైల్వే నాగ్పూర్, ఢిల్లీ జట్లు నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో సౌత్ ఈస్ట్ రైల్వే నాగ్పూర్ జట్టు, మహిళల విభాగంలో సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు చాంపియన్ షిప్ సాధించాయి. మహిళల విభాగంలో గత ఏడాది కూడా సీఆర్పీఎఫ్ ఢిల్లీ జట్టు చాంపియన్గా నిలిచింది. దీంతో ఈ ఏదాది కూడా మహిళల విభాగంలో ఢిల్లీ జట్టు టైటిల్ను నిలబెట్టుకున్నట్టు అయ్యింది. ఆదివారం అర్ధరాత్రి దాటిన తరువాత పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో రన్నరప్గా ఎస్డీ స్పోర్ట్స్ క్లబ్ హర్యానా జట్టు నిలిచింది. 3, 4 స్థానాల్లో సీఆర్ఎఫ్ ఢిల్లీ, బాబా హరిదాస్ హర్యానా జట్లు నిలిచాయి. మహిళల విభాగంలో హిమాచల్ప్రదేశ్ జట్టు రన్నరప్గా నిలిచి రెండవ స్థానం దక్కించుకోగా హర్యానా, బాబాహరిదాస్ హర్యానా జట్లు 3, 4 స్థానాలను దక్కించుకున్నాయి. మొత్తానికి ఇరు విభాగాల్లోను హర్యానా జట్లు ఆధిపత్యాన్ని చూపించాయి. అనంతరం జరిగిన బహుమతి ప్రదానోత్సవ సభలో జిల్లా ఎస్పీ నయాం అస్మి చేతుల మీదుగా విజేతలకు బహుబతులు అందించారు. పురుషుల, మహిళల విభాగాల్లో మొదటి బహుమతి రూ 1.50 లక్షలు, రెండవ బహుమతి రూ 1 లక్ష, మూడవ బహుమతి రూ 75 వేలు, నాల్గవ బహుమతి రూ 50వేలు నగదు, షీల్డ్స్ అందించారు. విజేత జట్లకు మొత్తం రూ 7.50 లక్షలు నగదు బహుమతి అందించారు. ఈ సందర్భంగా ఎస్పీ నయాం అస్మి మాట్లాడుతూ గ్రామీణ క్రీడలు సంస్కృతిలో భాగమన్నారు. యువత క్రీడలపై మక్కువ పెంచుకోవాలని సూచించారు. దీని ద్వారా ఉద్యోగ అవకాశాలు కూడా పెరుగుతాయని చెప్పారు. మారుమూల పట్టణంలో 30 ఏళ్ల నుంచి జాతీయస్థాయిలో కబడ్డీ పోటీలు నిర్వహించడం అభినంధనీయమన్నారు. మాజీమంత్రి, కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం ఆర్డీవో దాసి రాజు, గుగ్గిలపు మురళి, వన్నెంరెడ్డి శ్రీనివాస్, అధికారి ఏసు, బళ్ల వెంకటేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. మహిళల విభాగంలో చాంపియన్షిప్ సాధించిన ఢిల్లీ జట్టుకు నగదు, షీల్డ్ అందజేత పురుషుల విభాగంలో చాంపియన్షిప్ సాధించిన నాగ్పూర్ జట్టుకు నగదు, షీల్డ్ అందజేసిన దృశ్యం -
అమ్మ ప్రసాదం.. మోక్షదాయకం
భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ఇలవేల్పు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి 62వ వార్షికోత్సవ మహోత్సవాల సందర్భంగా అమ్మవారిని దర్శించేందుకు భక్తులు దూరప్రాంతాల నుంచి తరలివస్తున్నారు. వారికి ఉత్సవాల నిర్వాహకులు నీరులి ్లకూరగాయ పండ్ల వర్తక సంఘం, ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో ఉచిత భోజనం సౌకర్యం కల్పించారు. రెండు రకాల కూరలు, పప్పు, పచ్చడి, సాంబారు, పెరుగు, స్వీట్, పండు తదితర వాటిని భోజనంలో వడ్డిస్తున్నారు. ఈనెల 13వ తేదీ నుంచి ఫిబ్రవరి 12న ఉత్సవాలు ముగిసే వరకూ నెల రోజులపాటు భక్తులకు అన్నదాన కార్యక్రమం నిర్వహించనున్నారు. రోజుకు సుమారు వెయ్యి నుంచి 1,500 మంది భక్తులకు భోజన ప్రసాదం అందిస్తున్నారు. దూర ప్రాంతాల నుంచి వస్తున్న భక్తులు అమ్మవారి దర్శనం చేసుకున్న తర్వాత అమ్మవారి ఆలయం వద్ద భోజన సౌకర్యం కల్పించడంపై సంతోషం వ్యక్తం చేస్తున్నారు. కుటుంబ సమేతంగా వచ్చే భక్తులు పట్టణంలో హోటళ్లకు వెళ్లి భోజనం చేసే ఇబ్బంది లేకుండా ఆలయం వద్దే అమ్మవారి ప్రసాదం భోజన రూపంలో స్వీకరించడం మర్చిపోలేని అనుభూతి కల్పిస్తుందని అంటున్నారు. గత పదేళ్లుగా ఏర్పాట్లు శ్రీమావుళ్లమ్మ అమ్మవారి వార్షిక మహోత్సవాలను ఏటా నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ ఘనంగా నిర్వహిస్తుంది. ఉత్సవాల ముగింపునాడు సుమారు లక్ష మందికి అఖండ అన్న సమారాధన నిర్వహిస్తున్నారు. అయితే నెల రోజులపాటు నిర్వహించనున్న ఉత్సవాల్లో అమ్మవారిని దర్శించుకునేందుకు నిత్యం తరలివచ్చే భక్తులకు అన్న ప్రసాదం అందించాలని నిర్వాహకులు నిర్ణయించారు. గత పదేళ్లుగా ఉత్సవాల నెల రోజులపాటు నిత్యం భక్తులకు అన్నదానం చేసే కార్యక్రమాన్ని చేపట్టారు. జిల్లాలోని పలు ప్రాంతాలతోపాటు హైదరాబాద్, విజయవాడ, విశాఖపట్టణం, రాజమహేంద్రవరం, కాకినాడ, మచిలీపట్నం, అమలాపురం తదితర దూర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చి అమ్మవారిని దర్శించుకుంటారు. వారికి ఆలయం వద్ద ఉన్న వర్తక భవనంలో ఉదయం 8 నుంచి మధ్యాహ్నం 3 గంటల వరకూ నిర్విరామంగా భోజన కార్యక్రమం నిర్వహిస్తున్నారు. సుమారు రోజుకు రూ.50 వేలు భోజనానికి ఖర్చు చేయగా, ఉత్సవాల్లో నెలరోజులపాటు ఉచిత భోజన కార్యక్రమానికి రూ.10 నుంచి 12 లక్షల వరకూ ఖర్చు చేస్తున్నారు. అన్నప్రసాదాన్ని స్వీకరిస్తున్న భక్తులు భోజన ప్రసాదం కోసం క్యూలైన్లో భక్తులు మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాల్లో భక్తులకు నిత్యం అన్నదానం రాష్ట్రం నలుమూలల నుంచి తరలివస్తున్న భక్తులు రోజుకు సుమారు 1,500 మందికి అన్నప్రసాదం వితరణ నేను గత రెండేళ్లుగా అమ్మవారి వార్షిక మహోత్సవాలను తిలకించడానికి వస్తున్నాను. దూర ప్రాంతాల నుంచి వచ్చే భక్తులకు ఇబ్బంది లేకుండా అమ్మవారి సన్నిధి వద్దే భోజనం ఏర్పాటు చేయడం బాగుంది. పెద్ద సంఖ్యలో భక్తులు వస్తున్నప్పటికి భోజనం నాణ్యత తగ్గకుండా పెట్టడం అభినందనీయం. – ఎం.వెంకట లక్ష్మి, మచిలీపట్నంశ్రీమావుళ్లమ్మవారి ఉత్సవాలను తిలకించడానికి నేను మొదటిసారి వచ్చాను. అమ్మవారిని దర్శించుకున్న తర్వాత ఉత్సవ నిర్వాహకులు ఏర్పాటు చేసిన అన్నదాన ప్రసాదం స్వీకరించడం చాలా సంతోషంగా ఉంది. పిల్లలు, వృద్ధులతో వచ్చే వారికి ఆలయం వద్దే అన్నదానం ఎంతో సౌకర్యంగా ఉంటుంది. – సీహెచ్ సత్యవాణి, రాజమహేంద్రవరం -
నేడు వాసవీ మాత ఆత్మార్పణ దినోత్సవం
పెనుగొండ: ఆర్యవైశ్యుల ఆరాధ్యదేవత వాసవీ కన్యకపరమేశ్వరి ఆత్మార్ఫణ దినోత్సవం జన్మస్థలమైన పెనుగొండలో మంగళవారం అత్యంత వైభవంగా నిర్వహించనున్నారు. మూల విరాట్ కొలువై ఉన్న శ్రీనగరేశ్వర మహిషాసురమర్ధనీ వాసవీ కన్యక పరమేశ్వరి ఆలయంలో ఆత్మార్పణ దినోత్సవంను దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు పూర్తి చేశారు. ఉదయం విఘ్నేశ్వర పూజ, పుణ్యహవచనం, నగరేశ్వర స్వామికి ఏకాదశ రుద్రాభిషేకం, అనంతరం వాసవీ మాతకు 102 కలశాలతో అభిషేకం నిర్వహించనున్నారు. ముందుగా పెనుగొండలోని బజారు రామాలయం నుంచి 102 కలశాలతోనూ, అమ్మవారిని వెండి పల్లకీపై గ్రామోత్సవం కనుల పండుగగా నిర్వహించనున్నారు. అభిషేకాల అనంతరం ఆలయ ప్రాంగాణంలో వాసవీ మాలధారుల వాసవీహోమం నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. హోమానంతరం అమ్మవారికి ఇరుముడులు సమర్పించడానికి దేశం నలుమూలల నుంచి వాసవీ మాఽలధారులు భారీ సంఖ్యలో రానున్నారు. వాసవీ శాంతి థాంలో.. అఖిల భారత శ్రీవాసవీ పెనుగొండ టెంపుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలోని వాసవీ శాంతి థాంలోనూ ఆత్మార్పణ దినోత్సవం పీఠాథిపతి శ్రీపజ్ఞానంద సరస్వతీ(బాల) స్వామీజీ ఆధ్వర్యంలో నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. రాష్టమంత్రి నిమ్మల రామానాయుడు వాసవీ మాతకు పట్టువస్త్రాలు సమర్పిస్తారు. -
మార్చి 13 నుంచి జాతీయస్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణంలో పాలకొల్లు కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీలు నిర్వహించనున్నట్లు కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ తెలిపారు. ఈ పోటీలకు సంబంధించిన వివరాలను సోమవారం ఆయన వెల్లడించారు. పోటీల్లో మొత్తం 8 నాటికలు ప్రదర్శించబడతాయన్నారు. మార్చి 13వ తేదీ రాత్రి రవింద ఆర్ట్స్ తాడేపల్లి వారి దేవుణ్ణి చూశా, ఉషోదయ కళానికేతన్ కట్రపాడు వారి మంచి మనసులు, 14న సాంస్కృతిక సమితి విజయవాడ వారి మమ్మల్ని బతకనివ్వండి, చైతన్య కళాభారతి కరీంనగర్ వారి ఖరీదైన జైళ్లు, పరమాత్ముని ఆర్ట్స్ హైదరాబాద్ వారి ఎక్కడో ఏదో, 15న అభినయ ఆర్ట్స్ గుంటూరు వారి సహాన, గోవాడ క్రియేషన్స్ హైదరాబాద్ వారి అమ్మ చెక్కిన బొమ్మ, హర్ష క్రియేషన్స్ విజయవాడ వారి భువికోరని భ్రమణం (ప్రత్యేక ప్రదర్శన) నాటికలు ప్రదర్శింపబడతాయని తెలిపారు. కార్యదర్శి జక్కంపూడి కుమార్, గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావు, వ్యవస్థాపక కార్యదర్శి మానాపురం సత్యనారాయణ నిర్వహణ ఏర్పాట్లను పరీశీలిస్తున్నారు. తాడేపల్లిగూడెం : అమరావతిలో సోమవారం జరిగిన ఉద్యాన వర్సిటీ 68వ పాలకమండలి సమావేశంలో ఉద్యాన విశ్వవిద్యాలయం అధ్యాపకులకు, శాస్త్రవేత్తలకు పెండింగ్లో ఉన్న పదోన్నతులకు ఆమోదం తెలిపినట్లు ఉద్యానవర్సిటీ వీసీ కె.ధనుంజయరావు తెలిపారు. పాలకమండలి సమావేశ వివరాలను ఇక్కడ మీడియాకు విడుదల చేశారు. స్వర్ణాంధ్ర విజన్ 2047కు అనుగుణంగా విజన్ లక్ష్యాలను సాధించడానికి కార్యాచరణ రూపొందించినట్లు వీసీ తెలిపారు. రాయలసీమను ఉద్యాన హబ్గా గుర్తించే క్రమంలో అవసరమైన సాంకేతిక పరిజ్ఞానం అందిస్తామన్నారు. ఉద్యాన పంటల విస్తీర్ణం పెరిగేలా కృషి చేయాలని తీర్మానం చేశామన్నారు. ఉద్యాన పంటల వారీగా శాస్త్రవేత్తలను వర్గీకరించి, పంట యాజమాన్య పద్ధతులపై విస్తృత పరిశోధనలు చేయాలని నిర్ణయించినట్టు చెప్పారు. పెండింగ్లో మౌలిక వసతుల నిర్మాణాలను త్వరగా పూర్తి చేయాలని తీర్మానాలు చేసినట్టు తెలియజేశారు. బుట్టాయగూడెం: గిరిజన ప్రాంతాల్లో తరతరాలుగా వస్తున్న సంప్రదాయ వైద్యం మూలికా వైద్యం విస్తరణకు తమ వంతు కృషి చేస్తున్నట్లు కేఆర్పురం ఐటీడీఏ ఏఎమ్ఓ కుంజా శిరమయ్య తెలిపారు. సోమవారం ఆయన స్థానిక విలేకర్లతో మాట్లాడారు. ఈ నెల 16, 17 తేదీల్లో కేంద్ర గిరిజన మంత్రిత్వశాఖ వారి ఆధ్వర్యంలో గిరిజన వన మూలికపై హైదరాబాద్లో అవగాహన కార్యక్రమాన్ని నిర్వహించినట్లు చెప్పారు. ఈ కార్యక్రమానికి గత 20 ఏళ్లుగా విరిగిన ఎముకలకు మూలికా వైద్యం ద్వారా వైద్యసేవలు అందిస్తున్న మడకం దుర్గారావును, అలాగే ఫైల్స్ శాశ్వత నివారణ, ఇతర వ్యాధులకు మూలికలు ద్వారా వైద్యసేవలు అందిస్తున్న తూటిగుంటకు చెందిన చింతలాడ రామిరెడ్డిని, అలాగే సుమారు 300 రకాల వన మూలికలిను సేకరించి వాటి ద్వారా అనేక మందికి వైద్యసేవలు అందిస్తున్న రిటైర్డ్ ఉపాధ్యాయుడు పాయం కొయిందప్పను తీసుకువెళ్లినట్లు చెప్పారు. అక్కడ ఈ ముగ్గురు ఉత్తమమైన ప్రదర్శన ఇచ్చి పలువురి మన్ననలను పొందారని తెలిపారు. మూలికా వైద్యంలో పాల్గొన్న ముగ్గురు వైద్యులను సోమవారం డీడీ జనార్థన్రావు అభినందించారు. భీమవరం: భీమవరం రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో సుమారు 45 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి రైలు నుంచి జారి మృతి చెందినట్లు రైల్వే ఎస్సై ఎం సుబ్రహ్మణం తెలిపారు. రైల్వే స్టేషన్ మాస్టారు సమాచారం మేరకు ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. మృతుని వివరాలు తెలిసినవారు సెల్: 99084 48729 నంబర్కు తెలియజేయాలని ఎస్సై కోరారు. ఏలూరు (టూటౌన్): కృష్ణాజిల్లా కంకిపాడు మండలంలోని ఉప్పులూరు కోడిపందేల బరి వద్ద దళితులను అమానుషంగా హింసించిన నిర్వాహకులను అరెస్టుచేసి కఠినంగా శిక్షించాలని సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి ఎ.రవి సోమవారం ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. చట్టవిరుద్ధంగా కోడి పందేలు నిర్వహించినవారిపైనా, వారిని అనుమతించిన అధికారులపైనా కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు. బాధితులకు రక్షణ కల్పించి నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు. -
వీడని మత్తు.. జూదంలో చిత్తు
పెనుమంట్ర: సంక్రాంతి పర్వదినాలను పురస్కరించుకొని సంప్రదాయ కోడిపందేల ముసుగులో జరిగిన జూద క్రీడల్లో పాల్గొన్న యువత మద్యం మత్తులో తేలియాడుతూ లక్షలాది రూపాయలు చేజార్చుకున్నారు. పెనుమంట్ర మండలంలో పెనుమంట్ర, జుత్తిగ, నత్త రామేశ్వరం, ఆలమూరు, వెలగలేరు, మార్టేరు (జగన్నాధపురం) గ్రామపంచాయతీ పరిధిలో అనధికార అనుమతులు లభించడంతో నిర్వాహకులు విచ్చలవిడిగా బరుల వద్ద మద్యం విక్రయాలు సాగించారు. దీంతో యువత రాత్రి, పగలు తాగి తందనాలాడారు. పెనుమంట్ర బరి వద్ద నాయకుల మధ్య సయోధ్య కుదరకపోవడంతో మొదటి రోజు ప్రారంభంలోనే బెడిసి కొట్టడంతో అక్కడ కోడిపందేలు నిలిపివేశారు. అయితే జుత్తిగ, నత్త రామేశ్వరం, ఆలమూరు, వెలగలేరు, మార్టేరు (జగన్నాధపురం) పంచాయతీల పరిధిలో కోడిపందేలతో పాటు పేకాటలు, గుండాటలు యథేచ్ఛగా సాగాయి. మద్యం అమ్మకాలు భారీ స్థాయిలో జరిగాయి. ఈ పందేల్లో కోట్లాది రూపాయలు చేతులు మారగా, లక్షలాది రూపాయల మద్యం అమ్మకాలు జరిగినట్లు నిర్వాహకులే చెబుతున్నారు. పండగ వెళ్లి మూడు రోజులవుతున్న బరులు వద్ద నేటికీ తొలగించని చెత్తాచెదారాలతో పాటు ప్లాస్టిక్ వ్యర్థాలు, మద్యం సీసాల గుట్టలను చూస్తే ఏ మేరకు అసాంఘిక కార్యక్రమాలు జరిగాయో అర్థం అవుతుందని పలువురు చెబుతున్నారు. మండలంలో కోడిపందేలు జరుగుతున్న విషయాన్ని వెలగలేరు గ్రామానికి చెందిన బీజేపీ సీనియర్ నాయకుడు గుడిమెట్ల రామ కనకారెడ్డి పోలీసులకు ముందుగా రిజిస్టర్ పోస్టులో ఫిర్యాదు చేసినా పట్టించుకోకపోవడం పలు విమర్శలకు దారితీస్తోంది. పండగ మూడు రోజులు కనీసం రెవెన్యూ, పోలీస్, ఎకై ్సజ్ అధికారులు బరుల దరిదాపుల్లో కనిపించకపోవడం గమనార్హం. దీంతో నిర్వాహకులు భారీ స్థాయిలో ముడుపులు చెల్లించినట్లు చెప్పుకుంటున్నారు. -
పారిజాతగిరి ఈవోపై చర్యలు తీసుకోవాలి
జంగారెడ్డిగూడెం: తన సంతకాన్ని ఫోర్జరీ చేసి తనను, ప్రభుత్వాన్ని మోసం చేసిన ప్రస్తుత గోకుల తిరుమల పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్పై కఠిన చర్యలు తీసుకోవాలని ఆలయ మాజీ చైర్మన్, ప్రస్తుత ఆలయ అభివృద్ధి కమిటీ గౌరవాద్యక్షుడు పేరిచర్ల జగపతిరాజు డిమాండ్ చేశారు. సోమవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు. తాను 2002 నుంచి 2004 వరకు గోకుల తిరుమల పారిజాతగిరి శ్రీవేంకటేశ్వరస్వామి వారి దేవస్థానానికి ట్రస్ట్ బోర్డు ఛైర్మన్గా పనిచేశానని, ఆ కాలంలో కలగర శ్రీనివాస్ను కన్సల్టేటెడ్ జీతంతో జూనియర్ అసిస్టెంట్గా నియమించడం జరిగిందన్నారు. అయితే శ్రీనివాస్ సర్వీస్ రిజిస్టర్లో 1993లో జూనియర్ అసిస్టెంట్గా చేరినట్లు తన సంతకాన్ని ఫోర్జరీ చేసి సర్వీసు రిజిస్టర్ తయారు చేశారన్నారు. అప్పటి నుంచి విధుల్లో కొనసాగుతూ సీనియర్ అసిస్టెంట్గా, 2018లో కార్యనిర్వహణాధికారిగా ప్రమోషన్లు పొందాడన్నారు. 1993లో దేవస్థానానికి ఈవోగా ఏవీవీ రాఘువులు విధులు నిర్వహించారని, సదరు కాలంలో వేరే వ్యక్తులు ఇద్దరు అసిస్టెంట్లుగా పనిచేశారని, ఆ కాలంలో కలగర శ్రీనివాస్ విధులు నిర్వహించలేదన్నారు. అలాగే 1993లో కలగర శ్రీనివాస్ చేరి ఉంటే, అప్పటి ఈవో రాఘవులు సంతకం రిజిస్టర్లో ఉండాలి కాని, తన సంతకం ఉండటం ఖచ్చితంగా రిజిస్టర్ను ఫోర్జరీ చేశారన్నారు. కావున దీనిపై తన సమక్షంలో విచారణ నిర్వహించి, తనను, ప్రభుత్వాన్ని మోసం చేసిన కలగర శ్రీనివాస్పై చర్యలు తీసుకోవడంతో పాటు, ఇప్పటి వరకు ప్రభుత్వం నుంచి పొందిన సొమ్మును రికవరీ చేయాలని కోరారు. ఆ మేరకు సీఎం, డిప్యూటీ సీఎం, దేవాదాయ శాఖ మంత్రి, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ, కమిషనర్, ఆర్జేడీ, డిప్యూటీ కమిషనర్, విజిలెన్స్ అధికారికి ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. -
అప్పలరాజుపై అక్రమ కేసులను ఎత్తి వేయాలి
జంగారెడ్డిగూడెం: అనకాపల్లి జిల్లా నక్కపల్లి ప్రాంతంలో బల్క్ డ్రగ్ ప్రాజెక్ట్కు వ్యతిరేకంగా జరుగుతున్న పోరాటంలో కీలకంగా వ్యవహరిస్తున్న సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి వర్గ సభ్యుడు, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై కూటమి ప్రభుత్వం బనాయించిన పీడీ యాక్టు, అక్రమ కేసులను వెంటనే ఎత్తి వేయాలని, బేషరతుగా విడుదల చేయాలని అఖిల భారత రైతు కూలీ సంఘం (ఏఐకెఎంఎస్) ఆలిండియా జాయింట్ సెక్రటరీ బి.భాస్కర్ డిమాండ్ చేశారు. సోమవారం జంగారెడ్డిగూడెంలో జరిగిన ఆ సంఘ సమావేశంలో ఆయన మాట్లాడారు. నక్కపల్లి బల్క్ డ్రగ్ ప్రాజెక్టు ఏర్పాటును వెంటనే ఉపసంహరించుకోవాలని, అలాగే జీలుగుమిల్లి మండలం వంకావారి గూడెంలో పెడుతున్న ఇండియన్ నేవీ, అణ్వాయుధాల ఫ్యాక్టరీ నిర్మాణానికి భూ సేకరణ ఆపాలని డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో ఏఐకేఎంఎస్ ఆలిండియా ఉపాధ్యక్షుడు టీ.ప్రకాష్, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యు.గనిరాజు, రాష్ట్రకోశాధికారి వి.చిట్టిబాబు పాల్గొన్నారు. -
వచ్చే నెలలో జాతీయస్థాయి హ్యాకథాన్
భీమవరం: భీమవరం ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్లో ఫిబ్రవరి 27, 28 తేదీల్లో జాతీయస్థాయి హ్యాకథాన్ పోటీలు నిర్వహిస్తున్నట్లు కళాశాల కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్ (సీఎస్ఈ) హెడ్ డాక్టర్ బీహెచ్వీఎస్ రామకృష్ణంరాజు చెప్పారు. ప్రజ్వలన 2కె 26 పేరిట నిర్వహించనున్న హ్యాక్థాన్ పోస్టర్ను కళాశాల సెక్రటరీ కం కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత వర్మ సోమవారం జరిగిన ఒక ప్రత్యేక కార్యక్రమంలో విడుదల చేశారు. ఈ సందర్భంగా కళాశాల డైరెక్టర్ డాక్టర్ ఎం జగపతిరాజు మాట్లాడుతూ విద్యార్థుల్లో నూతన ఆవిష్కరణలు, వాస్తవ సమస్యలకు సాంకేతిక పరిజ్ఞానంతో పరిష్కారాలు రూపొందించడం హ్యాకథాన్ వంటి పోటీలు నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. పోటీల్లో విజేతలకు రూ.75,000 వరకు బహుమతులు అందిస్తామని రామకృష్ణంరాజు తెలిపారు. దీనికి సంబంధించి జనవరి 20 నుంచి రిజిస్ట్రేషన్లు ప్రారంభం అవుతాయని జాతీయస్థాయిలో విద్యార్థులు సద్వినియోగం చేసుకోవాలని కోరారు. కార్యక్రమంలో డీన్ అకాడమిక్స్ డాక్టర్ వి చంద్రశేఖర్, అసిస్టెంట్ ప్రొఫెసర్ పి సరోజ, కే హరికృష్ణ, ఏ నీలిమ కోఆర్డినేటర్లుగా వ్యవహరిస్తున్నారని చెప్పారు. -
కారు బోల్తా పడి వృద్ధురాలి మృతి
పెదవేగి: కారు అదుపు తప్పి ఓ వృద్ధురాలు దుర్మరణం పాలైంది. ఎస్సై ఎం హరిగోపాల్ తెలిపిన వివరాలు ఇటవి. చల్లా వెంకట్రావు అనే వ్యక్తి సోమవారం తల్లి వెంకటరమణమ్మతో కలసి కారులో చింతలపూడి నుంచి ఏలూరు వెళ్తుండగా పెదవేగి మండలం నడిపల్లి వద్దకు వచ్చే సరికి కారు అదుపుతప్పి బోల్తా పడింది. ఈ ప్రమాదంలో కారులో ప్రయాణిస్తున్న చల్లా వెంకటరమణమ్మ (76) అక్కడికక్కడే మృతి చెందగా, వెంకట్రావుకు తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రుడిని చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. కై కలూరు: అరటిపండ్ల దుకాణంలో రూ.3 లక్షలు, సెల్ ఫోన్ చోరీకి గురైన ఘటన కై కలూరులో ఆదివారం రాత్రి జరిగింది. కై కలూరు టౌన్ సీఐ ఏవీఎస్.రామకృష్ణ తెలిపిన వివరాలు ప్రకారం కోరుకొల్లు రోడ్ బృందావనం అపార్ట్మెంటు పక్కన మొవ్వా నాగేశ్వరరావు అరటిపండ్లు, చికెన్ దుకాణాన్ని నిర్వహిస్తున్నాడు. ఆదివారం రెండు దుకాణాల నుంచి వచ్చిన రూ.3 లక్షల నగదు, ఒక సెల్ ఫోన్ను అరటి పండ్ల దుకాణంలోని మూడు అరల ఇనుప సొరుగులో పెట్టి రాత్రి 9 గంటలకు ఇంటికి వెళ్లాడు. సోమవారం ఉదయం దుకాణం వద్దకు వచ్చి చూసేసరికి సొరుగు పగలగొట్టి ఉండడం గుర్తించి నాగేశ్వరరావు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. జిల్లా ట్రైనీ ఐపీఎస్ జయ శర్మ, డీఎస్పీ శ్రావణ్కుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించారు. టౌన్ ఎస్సైలు డి.వెంకట్కుమార్, ఆర్.శ్రీను కేసు దర్యాప్తు చేస్తున్నారు. -
రథసప్తమి ఉత్సవాలు ప్రారంభం
ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలోని శోభనగిరిపై వేంచేసి ఉన్న స్వయంభు శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నృసింహ స్వామి మాఘమాస రథసప్తమి ఉత్సవాలు సోమవారం దేవదాయ శాఖ ఆధ్వర్యంలో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. స్వామికి ఉదయం 9 గంటలకు పంచామృత కలశ స్నపన, స్వామి, అమ్మవార్లకు విశేష అష్టోత్తర శత రజిత తులసీదళార్చన ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు నిర్వహించారు. రాత్రి 7 గంటలకు పెళ్లి కుమారుడు అలంకరణలో చంద్రప్రభ వాహనంపై కొలువుదీరిన స్వామికి వైభవంగా గ్రామోత్సవం నిర్వహించారు. ఆలయం నుంచి గ్రామోత్సవం కల్యాణ మండపం వద్దకు చేరుకోగా భక్తులు విశేష సంఖ్యలో స్వామిని దర్శించుకుని ఆధ్యాత్మిక ఆనందం పొందారు. శోభనాచలుడికి ప్రత్యేక పూజలు ఉత్సవాల్లో భాగంగా స్వామివారికి తొలి పూజను రాత్రి ఎనిమిది గంటలకు ఆలయ వంశపారంపర్య ధర్మకర్త నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆధ్వర్యంలో జరిగింది. కల్యాణ మహోత్సవంలో స్వామికి వంశపారంపర్య ధర్మకర్త ప్రతాప్ అప్పారావు పట్టు వస్త్రాలు సమర్పించి ఉభయ దాతగా వ్యవహరించారు. ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షుడు బెజవాడ రాంబాబు, జిల్లా ఉపాధ్యక్షుడు పల్లగాని నరసింహరావు, నియోజవర్గ రైతు సంఘం అధ్యక్షుడు ఈలప్రోలు సుబ్బయ్య, జెడ్పీటీసీ పిన్నిబోయిన వీరబాబు, ఎంపీటీసీ సభ్యులు సాదం గోపి, గుర్రం శ్రీనివాసరావు, తదితరులు పాల్గొన్నారు. -
సూర్యకుమార్కు జాతీయ ప్రతిభా పురస్కారం
యలమంచిలి: పాలకొల్లు శంభునిపేటకు చెందిన ఉపాధ్యాయుడు, కవి, రచయిత కొల్లాబత్తుల సూర్యకుమార్ జాతీయ ప్రతిభా పురస్కారానికి ఎంపికయ్యారు. ఈ నెల 21న విజయవాడ చాంబర్ ఆఫ్ కామర్స్ ఆడిటోరియంలో ప్రాచీన కవుల వారసులచే నిర్వహించనున్న సాహితీ పట్టాభిషేక మహోత్సవంలో ఈ పురస్కారాన్ని సూర్యకుమార్కు ప్రదానం చేయనున్నట్లు కళావేదిక జాతీయ అధ్యక్షురాలు జి.ఈశ్వరి భూషణం తెలిపారు. శ్రీశ్రీ కళావేదిక, ప్రపంచ తెలుగు సంస్కృత కళావేదిక, తెలుగు అసోసియేషన్ ఆఫ్ నేషనల్ అకాడమీ బుక్ ఆఫ్ రికార్డ్స్, తెలుగు రైటర్స్ అకాడమీ, గోదావరి సోషల్ అండ్ కల్చరల్ అసోసియేషన్ సంయుక్త ఆధ్వర్యంలో పురస్కారానికి సూర్యకుమార్ను ఎంపిక చేశారు. -
త్వరలోనే గ్రీన్ఫీల్డ్ హైవేపై రాకపోకలు
● రాష్ట్రంలో 56 కిలోమీటర్ల మేర నిర్మాణం ● ప్రస్తుతం వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలు టి.నరసాపురం: పచ్చని పొలాల మధ్య తెలంగాణ– ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల గుండా వెళుతున్న గ్రీన్ఫీల్డ్ హైవేపై త్వరలోనే రాకపోకలు ప్రారంభం కానున్నాయి. ఆ మేరకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. హైవే పనులు పూర్తి కాకపోవడంతో ముందుగా తెలంగాణ రాష్ట్రం వైరా నుంచి ఆంధ్రప్రదేశ్లోని జంగారెడ్డిగూడెం వరకు వాహనాల రాకపోకలకు అనుమతించారు. నాలుగు లేన్ల గ్రీన్ ఫీల్డ్ హైవే ఖమ్మం నుంచి దేవరపల్లి మధ్య పాక్షికంగా అందుబాటులోకి వచ్చింది. ఖమ్మం జిల్లా పరిధిలో 105 కిలోమీటర్లు, రాష్ట్రంలోని ఏలూరు, తూర్పుగోదావరి జిల్లాల పరిధిలో 56 కిలోమీటర్లు మొత్తం 162 కిలోమీటర్లు ఈ రహదారి నిడివిగా ఉంది. ఖమ్మం జిల్లా మున్నేరు వాగు వంతెన వద్ద దాని సమీపంలోని రైల్వే లైన్ వద్ద వంతెన నిర్మాణాలు ఇంకా పూర్తి కావాల్సి ఉంది. కోర్టు వివాదాలు కారణంగా జాప్యం జరగడంతో యర్రంపేట, కన్నాయిగూడెం సమీపంలో రెండు కిలోమీటర్ల మేర ఇంకా నిర్మాణం జరుగుతోంది. వీటి నిర్మాణాలకు ఇంకా మూడు నెలలు సమయం పట్టే అవకాశం ఉంది. వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు దాదాపు 120 కిలోమీటర్లు పూర్తయ్యింది. దీంతో తొలుత వైరా నుంచి జంగారెడ్డిగూడెం వరకు రాకపోకలను అనుమతించడానికి సిద్ధం చేస్తున్నారు. టోల్ప్లాజాల నిర్మాణాలు సైతం శరవేగంగా జరుగుతున్నాయి. తెలంగాణ–ఏపీని కలుపుతూ ఖమ్మం–దేవరపల్లి మధ్య 162 కిలోమీట్ల మేర రూ.4054 కోట్లతో ఈ గ్రీన్ఫీల్డ్ హైవేను ఐదు ప్యాకేజీలుగా నిర్మిస్తున్నారు. ఈ రహదారి నిర్మాణం పూర్తయితే హైదరాబాద్ నుంచి ఖమ్మం మీదుగా ఏపీలోని రాజమండ్రి, వైజాగ్ వెళ్లేందుకు ప్రయాణ సమయం తగ్గనుంది. సూర్యాపేట నుంచి విజయవాడ వెళ్లకుండా ఖమ్మం మీదుగా ప్రయాణిస్తే గంటన్నరలోనే ఖమ్మం నుంచి రాజమండ్రి చేరుకోవచ్చు. ఈ గ్రీన్ఫీల్డ్ హైవేలో మొత్తం 11 చోట్ల ఎంట్రీ, ఎగ్జిట్ పాయింట్లు ఉన్నాయి. వాహనాలు ఎక్కడ అంటే అక్కడ హైవేపై ఎక్కేందుకు వీలుండదు. పశువులు, జంతువులు రాకుండా హైవే పక్కన పూర్తిస్థాయిలో ఇనుప కంచెతో నిర్మిస్తున్నారు. టూ వీలర్లు, ఆటోలు, ట్రాక్టర్లను కూడా హైవేపై అనుమతించరు. కార్లు, బస్సులు, లారీలు, ఇతర భారీ వాహనాలకే అనుమతి ఉంటుంది. హైవేపై ఎంట్రి, ఎగ్జిట్ వద్దే టోల్ ప్లాజాలు ఉండేలా ఏర్పాట్లు చేస్తున్నారు. హైవేలో ఎక్కడ ప్రవేశించాలో, ఎక్కడ బయటకు వెళ్లారో గుర్తించి దాని ప్రకారమే ఫాస్ట్ట్యాగ్ ద్వారా బ్యాలెన్స్ కట్ అయ్యేలా ఏర్పాట్లు చేస్తున్నారు. గ్రీన్ఫీల్డ్ హైవేపై వాహనాల డ్రైవర్లు, ప్రయాణీకులు రెస్ట్ తీసుకునేందుకు వసతులను సమకూర్చుతున్నారు. ఈ రహదారిలో డొంక దారులు, అంతర్గత రహదారుల వద్ద అండర్పాస్లు, సాగు నీటి కాలువల వద్ద అండర్ బ్రిడ్జిలు మొత్తం 124 నిర్మించారు. ఏలూరు జిల్లాలో నిర్మించిన గ్రీన్ ఫీల్డ్ హైవే -
ప్రైజ్ పాలసీ ఉండాలి
కోకోకు ప్రైజ్ పాలసీ నిర్ణయించడానికి ధరల ఫార్ములాను సిద్ధం చేయాలి. గతేడాదే చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చి నేటికీ నిలుపుకోలేదు. ఆయిల్పామ్కు క్రషింగ్ పర్సంటేజ్ అంతర్జాతీయ మార్కెట్ ధరను ప్రామాణికంగా తీసుకుని ప్రతి నెల నిర్ణయిస్తారు. అలాగే కోకో ప్రైజ్ పాలసీ ఉంటేనే రైతుకు న్యాయం జరుగుతుంది. – కే. శ్రీనివాస్, కోకో రైతుల సంఘం ప్రధాన కార్యదర్శి కోకోకు అంతర్జాతీయ మార్కెట్లో రూ.550 ధర ఉండగా, మాకు కనీసం రూ.500 ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నాం. నేడు దేనిని ఆధారం చేసుకుని మాకు రూ.400 ఇస్తున్నారో ఎవ్వరికి తెలీదు. ఇంటర్నేషనల్ మార్కెట్కు అనుసంధానంగా భారతదేశ కోకో రైతులకు ధర చెల్లించాలి. – పానుగంటి అచ్యుతరామయ్య, కోకో రైతు, వి.లక్ష్మీపురం గత రెండు సంవత్సరాల నుంచి కంపెనీలు సిండికేట్ అయ్యి చాలా తక్కువ ధర రైతులకు చెల్లిస్తున్నారు. ఇంటర్నేషనల్ మార్కెట్లో నిర్ణయించిన ధరను మాకు ఇవ్వడం లేదు. ఇది ఎంతవరకు సమంజసం. కేంద్ర ప్రభుత్వం దీనిపై చొరవ చూపి రైతులకు అంతర్జాతీయ మార్కెట్ ధర చెల్లించేలా చర్యలు తీసుకోవాలి. – బొల్లు రామకృష్ణ, కోకో రైతు, బాపిరాజుగూడెం -
కోకో ధర భారీగా పతనం
మంగళవారం శ్రీ 20 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు : కోకో రైతులకు కష్టాలు ఈ ఏడాది కూడా తప్పడం లేదు. సీజన్ ప్రారంభం కాగా.. ధరలు భారీగా పతనం కావడంతో రైతుల పరిస్థితి ఆగమ్యగోచరంగా మారింది. గతేడాది జనవరిలో అంతర్జాతీయ మార్కెట్లో కిలో రూ.750 నుంచి రూ.800 పలికిన కోకో ధర ఈ ఏడాది రూ.550కి చేరింది. దీంతో గతేడాది స్థానిక మార్కెట్లో రూ.650కి కొనుగోలు చేసిన కోకో ఈ ఏడాది సీజన్ ప్రారంభం కాగా.. రూ.350 నుంచి రూ.400 ధరతో కొనసాగుతోంది. రాష్ట్ర వ్యాప్తంగా 71 వేల ఎకరాల్లో కోకో సాగు జరుగుతుంటే ఒక్క ఏలూరు జిల్లాలో 44,163 ఎకరాలు సాగులో ఉంది. ఆయిల్పామ్లో అంతరపంటగా కూడా కోకో సాగులో ఉంది. 2023లో అత్యధికంగా కిలో కోకో రూ. వెయ్యికి పైగా అమ్ముడుకావడంతో అప్పటి వరకు సగటున రూ.40 వేల నుంచి రూ.70 వేల వరకు ఉన్న కౌలు లీజు ఒక్కసారిగా రూ. 90 వేల నుంచి రూ.1.20 లక్షల వరకు చేరింది. తక్కువ సమయం, ఎకరాకు మూడు క్వింటాళ్ళ దిగుబడితో ఆదాయం బాగుందనే కారణంతో రైతులు కోకో సాగుపై దృష్టి సారించారు. ఇప్పుడు ధరల పతనంతో తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. కౌలు రైతులకు అప్పులు మినహా మిగిలే పరిస్థితి లేదు. సిండికేట్లో రైతులు బలి : అంతర్జాతీయ మార్కెట్ ధరకు అనుగుణంగా ధర ఉండాలి. దీనిపై గతేడాది కోకో రైతులు పెద్ద ఎత్తున ఉద్యమించి విభిన్న రూపాల్లో నిరసనలు తెలియచేసి రాష్ట్ర ప్రభుత్వం దృష్టికి సమస్యను తీసుకువెళ్ళారు. అంతర్జాతీయంగా ఉన్న ధరలో సుమారు 20 నుంచి 30 శాతానికి తక్కువకు స్థానిక చాక్లెట్ కంపెనీలు కొనుగోలు చేస్తున్నాయి. గతంలో కంపెనీలు పోటాపోటీగా కొనుగోలుతో రైతుకు మంచి ధర లభించేది. గతేడాది నుంచి కంపెనీలన్నీ సిండికేటై ఒకే ధరకు కొనుగోలు చేయాలని నిర్ణయించడంతో ప్రభుత్వం కూడా చేతులెత్తేసింది. ఈ ఏడాది జనవరిలో ప్రారంభమైన సీజన్లో ఇంతవరకు సగటున కిలో రూ.550 అత్యధిక ధరకు గాను రైతుకు రూ.400 దక్కింది. సోమవారం అంతర్జాతీయ మార్కెట్లో రూ.460 ఉండగా, స్ధానిక మార్కెట్లో రూ. 350–380కు కొనుగోలు చేస్తున్నారు. రానున్న రోజుల్లో ధరలు మరింత పతనమవుతాయనే ఆందోళన నెలకొంది. మార్కెట్లో కిలో రూ.550 ఉండగా స్థానికంగా రూ.400కు కొనుగోలు దేశంలోనే అత్యధిక కోకో సాగు విస్తీర్ణం ఏలూరు జిల్లాలోనే 44 వేల ఎకరాల్లో సాగు గతేడాది జనవరిలో రూ.650 ధరకు స్థానికంగా కొనుగోలు కోకో రైతును వెంటాడుతున్న సాగు కష్టాలు -
పోస్టుమార్టం అడ్డుకుని నిరసన
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రిలో డయాలసిస్ సీనియర్ టెక్నీషియన్ ముప్పిడి సుధాకర్ ఆత్మహత్యకు కారణమైనవారిపై కేసు నమోదు చేసి సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని ఎమ్మార్పీఎస్ నాయకులు డిమాండ్ చేశారు. ముప్పిడి సుధాకర్ కుటుంబానికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తూ జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రి వద్ద ఎమ్మార్పీఎస్ ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహించారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకుడు బయ్యారపు రాజేశ్వరరావు మాట్లాడుతూ సుధాకర్ను మానసిక వేదనకు గురిచేసి, ఆత్మహత్య చేసుకోవడానికి కారణమైన వారిపై కేసు నమోదు చేయాలన్నారు. మృతుడి కుటుంబానికి న్యాయం చేసేంత వరకు పోస్టుమార్టం జరగనివ్వబోమని ఆందోళన చేపట్టారు. విషయం తెలుసుకున్న తహసీల్దార్ స్లీవ జోజి, డీఎస్పీ యు.రవిచంద్ర, సీఐలు ఎంవీ సుభాష్, టి.క్రాంతికుమార్లు ఆందోళనకారులతో చర్చించారు. ఈ సందర్భంగా ఎమ్మార్పీఎస్ నేతలు, మృతుడి కుటుంబసభ్యులు.. సుధాకర్ తన సూసైడ్ నోట్లో పేర్కొన్న అందరిపై కేసు నమోదు చేయడంతో పాటు, మృతుడి కుటుంబసభ్యుల్లో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇవ్వాలని డిమాండ్ చేశారు. బాధ్యులపై కేసు నమోదు చేస్తామని చెప్పడంతో ఆందోళన విరమించారు. మృతుడి భార్య మణిబాల సరస్వతి ఇచ్చిన ఫిర్యాదు మేరకు ఆరుగురిపై కేసు నమోదు చేసినట్టు సీఐ ఎంవీ సుభాష్ తెలిపారు. -
ప్రతి అర్జీని పరిష్కరించాలి
అనుమానాస్పద స్థితిలో మృతి ఉండిలో అనుమానాస్పద స్థితిలో ఓ వ్యక్తి మృతి చెందాడు. హత్యా లేక ఆత్మహత్యా అనే విషయంపై పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. 8లో uకలెక్టర్ కె. వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో): గోదావరి సమావేశ మందిరంలో సోమవారం జిల్లా స్థాయి ప్రజాసమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని కలెక్టరు కె.వెట్రిసెల్వి నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ ఫిర్యాదుదారులను ఆప్యాయతతో పలకరించి సమస్యలను పూర్తిగా విని చక్కని పరిష్కారం చూపాలని అన్నారు. పీజీఆర్ఎస్, రెవిన్యూ క్లినిక్లో ప్రజలు సమర్పించిన అర్జీలపై అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలని, అధికారులు క్షేత్రస్థాయిలో అర్జీదారులతో స్వయంగా మాట్లాడి నాణ్యమైన పరిష్కారాన్ని చూపాలన్నారు. ఏ శాఖకు వచ్చిన అర్జీలకు ఆయా శాఖ వారు మాత్రమే పరిష్కారం చూపాలని, వేరే శాఖకు పంపితే కాలయాపన జరిగి సమస్యలు ఉత్పన్నం అవుతాయన్నారు. క్షేత్రస్థాయిలో ఉత్పన్నమయ్యే సమస్యలను క్షేత్రస్థాయిలోనే పరిష్కారం చేసి అర్జీలు రీఓపెన్కు ఆస్కారం లేకుండా చూడాలన్నారు. వచ్చిన అర్జీలకు నాణ్యమైన పరిష్కారం చూపినప్పుడు అర్జీదారులు సంతృప్తి చెందుతారని అటువంటి పరిష్కారాలను విజయగాథలుగా జిల్లా కార్యాలయానికి పంపించాలని అన్నారు. -
బాధ్యతలు స్వీకరించిన జడ్జిలు
ఏలూరు (టూటౌన్): ఏలూరు జిల్లా కోర్టులో ఇటీవల నూతనంగా నియమితులైన స్పెషల్ క్లాస్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్లు సోమవారం బాధ్యతలు స్వీకరించారు. స్పెషల్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 11 క్లాస్ ఏలూరు జడ్జిగా రావూరి మురళీ కృష్ణ తన చాంబర్లో బాధ్యతలు స్వీకరించారు. మొదటి స్పెషల్ మేజిస్ట్రేట్ ఆఫ్ 11 క్లాస్ జడ్జిగా నండూరి నాగ వెంకట సత్య వరప్రసాదరావు బాధ్యతలు చేపట్టారు. ఏలూరు(ఆర్ఆర్పేట): పదో తరగతి విద్యార్థులు వార్షిక పరీక్షల్లో మంచి ఫలితాలు సాధించాలనే ఆకాంక్షతో క్వశ్చన్ బ్యాంక్ను తయారు చేశామని డెమోక్రటిక్ పీఆర్టీయూ రాష్ట్ర అధ్యక్షులు వెంకటేశ్వరరావు అన్నారు. సోమవారం జిల్లా కలెక్టర్ చేతుల మీదుగా క్వశ్చన్ బ్యాంక్ ఆవిష్కరించారు. కార్యక్రమంలో రాష్ట్ర సలహాదారు మరడాని అచ్యుతరావు, అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు తలపాటి శ్రీనివాసరావు, శేషపు శ్రీనివాసు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని కుక్కునూరు, వేలేరుపాడు కస్తూరిబా బాలికా విద్యాలయాల్లో ఖాళీగా ఉన్న నాన్ టీచింగ్ సిబ్బంది పోస్టులను అవుట్ సోర్సింగ్ ప్రాతిపదికన భర్తీ చేయడానికి అభ్యర్థుల నుంచి దరఖాస్తులను పరిశీలించి మెరిట్ లిస్ట్ రూపొందించామని, ఈ జాబితా జిల్లా విద్యాశాఖ అధికారిక వెబ్సైట్లో పొందుపరిచామని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. మెరిట్ లిస్ట్పై అభ్యంతరాలు ఉన్న అభ్యర్థులు ఈ నెల 22 సాయంత్రం 5 గంటల లోపు రాతపూర్వకంగా తమ కార్యాలయానికి పంపాలని, గడువు దాటిన తరువాత అందిన అభ్యంతరాలను పరిగణనలోకి తీసుకోమన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని చర్మకారులు, డప్పు కళాకారులకు ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్లు మంజూరు చేయాలని దళిత సేన విజ్ఞప్తి చేసింది. ఈ మేరకు కలెక్టరేట్లో సోమవారం నిర్వహించిన ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక కార్యక్రమంలో దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్ వినతి పత్రం అందజేశారు. రవిప్రకాష్ మాట్లాడుతూ జిల్లాలోని అర్హులైన డప్పు కళాకారులకు, చెప్పులు కుట్టే చర్మకారులకు ప్రభుత్వం ప్రత్యేక పెన్షన్లను మంజూరు చేయాలని విజ్ఞప్తి చేశారు. ఏలూరు టౌన్: నేరాలకు పాల్పడే వ్యక్తుల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, జిల్లాలో నేరాల నిరోధానికి ప్రత్యేక చర్యలు చేపట్టినట్లు ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ప్రజల నుంచి వినతులు, ఫిర్యాదులు స్వీకరించారు. జిల్లా వ్యాప్తంగా ఆయా ప్రాంతాల నుంచి వచ్చిన బాధితుల సమస్యలను సావధానంగా వింటూ వాటి పరిష్కారానికి సంబంధిత పోలీస్ అధికారులకు ఎస్పీ ఆదేశాలు జారీ చేశారు. ఆన్లైన్లోని ఫిర్యాదుల పురోగతిని తెలుసుకునేందుకు 1100 టోల్ఫ్రీ నెంబరులో సంప్రదించాలని సూచించారు. దెందులూరు: ధర్మవరం శివారు నాచుకుంటలో దుండగులు చర్చిని ధ్వంసం చేయడం క్రైస్తవుల మనోభావాలను దెబ్బతీయటమేనని ప్రభుత్వం వెంటనే కఠిన చర్యలు తీసుకోవాలని ఆల్ ఇండియా పాస్టర్ ఫెడరేషన్ జాతీయ ప్రధాన కార్యదర్శి, వైఎస్సార్సీపీ క్రిస్టియన్ మైనార్టీ వైస్ ప్రెసిడెంట్ డాక్టర్ జీవన్ కుమార్ ఆవేదన వ్యక్తం చేశారు. సోమవారం ఏలూరు రూరల్ మండలం మాదేపల్లిలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ అన్ని మతాలను విశ్వాసాలను గౌరవించాలని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వాటిని పరిరక్షించాలన్నారు. సమాజంలో విద్వేషాలు రెచ్చగొట్టేలా గుర్తు తెలియని కొందరు ఇలా చేయడం చాలా బాధాకరమన్నారు. ప్రభుత్వం విచారణ నిర్వహించి నిందితులను కఠినంగా శిక్షించాలని కోరారు. త్వరలోనే అన్ని రాష్ట్రాల ఆధ్యాత్మిక సంఘాల నాయకులతో సమావేశం ఏర్పాటు చేస్తామన్నారు. -
అలరించిన వేమన జయంతి వేడుకలు
అత్తిలి: మానవ జీవితానికి సంబంధించిన అనేక నిత్యసత్యాలను తనదైన శైలిలో తేట తెలుగు పదాలతో వర్ణించి తెలుగువారి హృదయాల్లో చిరస్మరణీయుడిగా నిలిచిన ప్రజా కవి యోగి వేమన. అత్తిలి మండలం ఆరవల్లిలో వేమనకు మందిరం నిర్మించి, ఏగా జనవరి 18న జయంతి ఉత్సవాన్ని ఘనంగా నిర్వహిస్తున్నారు. ఆదివారం యోగి వేమన 101వ జయంతి ఉత్సవాన్ని నేత్రపర్వంగా జరిపారు. వేకువ జామున వెలగల దాసు వంశీయులు వేమనకు గోస్తనీ నది స్నానం చేయించారు. వేమన మందిరాన్ని పుష్పాలతో విశేషంగా అలంకరించారు. ఉదయం నుంచి భక్తులు పెద్ద సంఖ్యలో హాజరై వేమనను దర్శించుకున్నారు. ఆలయ ప్రాంగణంలో భజన కీర్తనలు, కోలాట భజన, సినీ సంగీత విభావరి కార్యక్రమాలు నిర్వహించారు. బ్యాండు మేళాలు, మంగళ వాయిద్యాల నడుమ, బాణసంచా కాల్పులతో విశేషంగా అలంకరించిన పల్లకీపై వేమన చిత్రపటాన్ని ఉంచి పురవీధులలో ఊరేగించారు. వేమన పల్లకీ కింద నుంచి తల్లిదండ్రులు తమ చిన్నారులను దాటించారు. ఉత్సవాల సందర్భంగా ఏర్పాటు చేసిన గృహోపకరణ, ఫ్యాన్సీ వస్తు దుకాణాల వద్ద సందడి నెలకొంది. వేమన జయంతి సందర్భంగా గ్రామంలో పండుగ వాతావారణం నెలకొంది. దేశ, విదేశాలలో ఉన్నవారు స్వగ్రామానికి చేరుకుని బంధుమిత్రులతో ఉత్సాహంగా గడిపారు. ఆలయ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన విద్యుత్ దీపాలంకరణ ఉత్సవాలకు ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి. వేమన ఉత్సవ కమిటీ ఛైర్మన్ వెలగల అమ్మిరెడ్డి, కమిటీ సభ్యులు పర్యవేక్షణలో ఉత్సవాలను ఘనంగా నిర్వహించారు. ఆరవల్లి గ్రామానికి చెందిన ప్రముఖ సినీ దర్శకుడు ఎస్వీ కృష్ణారెడ్డి, నిర్మాత కె.అచ్చిరెడ్డి యోగి వేమనను దర్శించుకున్నారు. కృష్ణారెడ్డి, అచ్చిరెడ్డిలను ఆలయ కమిటీ ఛైర్మన్ వెలగల అమ్మిరెడ్డి సత్కరించి, వేమన పద్యాల పుస్తకాలను అందజేసారు. క్రీడా ప్రాంగణంలో జరుగుతున్న వాలీబాల్ పోటీలను వారు తిలకించారు. శునకాలకు అన్నదానం వేమన జయంతి ఉత్సవాలలో భాగంగా గ్రామ సింహాలైన శునకాలకు అన్నదానం చేశారు. పలు రకాల ఆహార పదార్థాలను కావిడిలో పెట్టుకుని గ్రామంలో తిరుగుతూ కనిపించిన శునకాలకు విస్తరి వేసి, ఆహార పదార్ధాలను వడ్డించారు. గ్రామానికి కాపలా ఉంటూ, గ్రామాన్ని రక్షించేది కాలభైరవుడని, ఏటా గ్రామంలో కాలభైరవ సంతర్పణ పేరుతో గ్రామంలో ఉన్న శునకాలకు భోజనం వడ్డిస్తామని యోగి వేమన జయంతి ఉత్సవ కమిటీ చైర్మన్ తెలిపారు. అత్తిలి మండలం ఆరవల్లిలో ప్రత్యేక కార్యక్రమాలు -
మనసు దోచే జలపాతాలు
● పశ్చిమ మన్యంలో ఆకట్టుకుంటున్న అందాలు ● వైఎస్సార్సీపీ పాలనలో రోప్ వే బ్రిడ్జిల కోసం రూ.60 లక్షల కేటాయింపు బుట్టాయగూడెం: పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో అనేక అద్భుత జలపాతాలు ఉన్నాయి. బయట ప్రపంచానికి తెలిసినవి కొన్ని మాత్రమే ఉండగా తెలియనివి అనేకం ఉన్నాయి. ప్రకృతి ప్రేమికుల మదిని దోచే కొండకోనలు ఈ ప్రాంతం సొంతం. ప్రభుత్వాలు, పాలకులు ఈ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించారు. ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేస్తే ఆదాయంతోపాటు స్థానిక నిరుద్యోగులకు ఉపాధి అవకాశాలు లభిస్తాయి. మన్యంలో అద్భుత జలపాతాలు బుట్టాయగూడెం మండలం ముంజులూరు సమీపంలో ఏనుగుతోగు జలపాతం, ఉప్పరిల్ల జలపాతం, పాపికొండల అభయారణ్యంలో జలతారు వాగు జలపాతాలు బయట ప్రపంచానికి తెలిసినవి. ఈ జలపాతాలకు వారాంతంలో, పండుగల పర్వదినాల్లో పర్యాటకులు తరలివస్తారు. బయట ప్రపంచానికి తెలియని అనేక జలపాతాలు ఉన్నాయి. గిన్నేపల్లి, గడ్డపల్లికి మధ్యలో సాగరాల వాటర్ఫాల్స్, పోలవరం మండలం రెడ్డికుంకాల సమీపంలోని జలపాతంతో పాటు అటవీ ప్రాంతంలో అనేక జలపాతాలు ఉన్నాయి. పర్యాటక ప్రదేశాల్లో కనిపించని అభివృద్ధి ఏజెన్సీ ప్రాంతంలోని పర్యాటక ప్రదేశాలకు వేల సంఖ్యలో పర్యాటకులు వచ్చి సందడి చేస్తున్నప్పటికీ ఆయా ప్రదేశాల్లో ఎలాంటి అభివృద్ధి లేదు. దీంతో పర్యాటకులు ఇబ్బంది పడుతున్నారు. ముఖ్యంగా మహిళా పర్యాటకుల ఇబ్బందులు వర్ణనాతీతం. ప్రభుత్వం, పాలకులు పర్యాటక ప్రదేశాలను అభివృద్ధి చేసేందుకు కృషి చేయాలని కోరుతున్నారు. రోప్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు నిధుల మంజూరు బుట్టాయగూడెం మండలం మారుమూల అటవీప్రాంతంలో ఉన్న ఏనుగుతోగు జలపాతానికి సందర్శకులు ఎక్కువగా వస్తుంటారు. ముంజులూరు శివారు నుంచి సుమారు 3 కిలోమీటర్ల దూరంలో ఈ జలపాతం ఉంది. రహదారి వెంట పచ్చని చీర పరిచినట్లుగా అడవి తల్లి అందాలు కనువిందు చేస్తుంటాయి. రహదారి పొడవునా ఒకే కొండకాల్వ 9 సార్లు కనిపిస్తుంది. ఈ కాల్వపై సుమారు 9 రోప్ వే బ్రిడ్జిల ఏర్పాటుకు వైఎస్సార్సీపీ ప్రభుత్వం సుమారు రూ.40 లక్షలు మంజూరు చేసింది. జలపాతం సమీపంలో మహిళలు దుస్తులు మార్చుకోవడానికి రూంలు, మరుగుదొర్ల ఏర్పాటుకు మరొక రూ.20 లక్షలు మంజూరు చేసింది. టెండర్లు పిలిచే సమయంలో ఎన్నికల కోడ్ రావడంతో ఆ పనులు నిలిచాయి. పశ్చిమ మన్యం ప్రాంతంలో ఉన్న పర్యాటక ప్రదేశాల అభివృద్ధికి ప్రభుత్వం, పాలకులు కృషి చేయాలి. ఈ ప్రదేశాలను చూసేందుకు ఇప్పటికే వేలాదిమంది పర్యాటకులు ఈ ప్రాంతానికి వస్తున్నారు. అభివృద్ధి చేస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. షేక్ ముత్తూ సాహెబ్, పులిరాముడుగూడెం, బుట్టాయగూడెం మండలం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలో మనసు దోచే జలపాతాలతోపాటు ఎల్తైన కొండలు, అడవితల్లి అందాలు, పర్యాటకులకు మధురానుభూతిని కలిగిస్తాయి. ఈ ప్రాంతానికి సెలవురోజుల్లో, ప్రతి ఆదివారం అనేక మంది పర్యాటకులు వస్తుంటారు. వీటిని అభివృద్ధి చేసి వసతులు కల్పిస్తే ప్రభుత్వానికి ఆదాయంతోపాటు ఈ ప్రాంత యువకులకు ఉద్యోగ అవకాశాలు కూడా లభిస్తాయి. కొండేపాటి రామకృష్ణ బుట్టాయిగూడెం -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాదలో జరుగుతున్న జాతీయస్థాయి కబడ్డీ పోటీల్లో పురుషుల విభాగంలో ఎస్సీ రైల్వే నాగ్పూర్, హర్యానా జట్లు, మహిళల విభాగంలో సీఆర్పీఎఫ్ ఢిల్లీ, హిమాచల్ ప్రదేశ్ జట్లు ఫైనల్స్కు చేరాయి. ఆదివారం ఉదయం నుంచి లీగ్లో చివరి మ్యాచ్లు, సెమీఫైనల్స్ మ్యాచ్లు హోరాహోరీగా సాగాయి. ఫ్లడ్లైట్స్ వెలుగులో జరిగిన ఫైనల్ మ్యాచ్కు కలెక్టర్ నాగరాణి, ఎస్పీ నయీం అస్మీ ముఖ్య అతిథులుగా హాజరై మ్యాచ్లు తిలకించారు. పెద్ద ఎత్తున ప్రేక్షకులు హాజరవ్వడంతో స్టేడియం నిండిపోయింది. అర్థరాత్రి వరకూ ఫైనల్స్ జరిగాయి. గెలుపొందిన జట్లకు మొత్తం రూ.7.50 లక్షల ప్రైజ్మనీ అందించారు. కాపు కార్పొరేషన్ చైర్మన్ కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, నరసాపురం ఆర్డీవో దాసి రాజు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, కబడ్డీ అసోసియేషన్ సీఈవో వీ.వీర్లెంకయ్య, వన్నెంరెడ్డి శ్రీనివాస్, గుగ్గిలపు మురళి, తదితరులు పాల్గొన్నారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ఉదయానికే జిల్లాలోని వివిధ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్ళశాల వద్ద నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద అధికసంఖ్యలో భక్తులు పూజలు చేశారు. గోకులంలోని గోవులకు మహిళలు పసుపు, కుంకుమతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అదనపు ప్రసాదాల కౌంటర్లను ఏర్పాటు చేశారు. అన్నదానం షెడ్డులో అన్నప్రసాదం కార్యక్రమంలో భక్తులు అధికసంఖ్యలో పాల్గొన్నారు. కై కలూరు: అమ్మా.. నీ దీవెనలు అందించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను భక్తితో వేడుకున్నారు. సంక్రాంతి పండగ సెలవులు ముగింపు కావడంతో ఆదివారం సమీప జిల్లాల నుంచి పెద్ద ఎత్తున భక్తులు విచ్చేశారు. ప్రధాన అర్చకులు పేటేటి పరమేశ్వరశర్మ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. మహిళలు పాలపొంగళ్లు సమర్పించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఒక్క ఆదివారం రోజున ప్రత్యేక, అంతరాలయ దర్శినాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డు ప్రసాదం, గధుల అద్దెలు, అమ్మవారి చిత్రపటాల అమ్మకం, వాహన పూజలు, విరాళాల ద్వారా రూ.66.321 ఆదాయం వచ్చిందని తెలిపారు. నరసాపురం: నరసాపురం పట్టణం ఎన్టీఆర్ కాలనీలో ఓ మహిళను సైబర్ కేటుగాళ్లు మోసం చేశారు. మీషో షాపింగ్లో రూ.7.49 లక్షలు గెలుచుకున్నారని నమ్మించి ఆమె బ్యాంకు ఖాతా, ఆధార్, పాన్కార్డు వివరాలు తీసుకుని ఓటీపీ పంపి ఆమె ఖాతా నుంచి రూ.4 లక్షలు కొట్టేశారు. మోసపోయినట్టు గ్రహించిన నంధ్యాల రాణి పట్టణ పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసింది. బాధితురాలు తెలిపిన వివరాలు ప్రకారం.. గత నెల 28న బాధిత మహిళ మీషో యాప్లో బెడ్షీట్స్ కొనుగోలు చేసింది. ఈ నెల 1న ఫోన్ చేసి లక్కీ డిప్ గెలుచుకున్నారని, రూ 7.49 లక్షలు గెలుపొందారని అవతలి వైపు నుంచి ఓ యువతి మాట్లాడింది. ఆధార్, పాన్ వివరాలు ఇవ్వాలని ఓటీపీ చెప్పాలని సూచించింది. ఆమె మాటలు నమ్మిన రాణి పక్కనున్న ఇంట్లో అమ్మాయితో వివరాలు పెట్టించింది. ముందురోజే దుబాయ్లో ఉంటున్న రాణి భర్త శ్రీనివాసరావు స్థానిక బ్యాంకులో ఉన్న అప్పుతీర్చాలని గల్ఫ్లో స్నేహితుల వద్ద రూ.4 లక్షలు అప్పు చేసి భార్య ఖాతాలో వేశాడు. ఈ సొమ్మును సైబర్ నేరగాళ్లు కొట్టేశారు. ఈ ఘటనపై తమకు ఇంకా ఫిర్యాదు అందలేదని పోలీసులు తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు కొమడవోలు ప్రాంతంలోని మహేశ్వర లే అవుట్లో ఇంటికి తాళాలు వేసి సంక్రాంతి వేడుకలకు ఊరెళ్లి వచ్చేసరికి తాళాలు పగులగొట్టి గుర్తు తెలియని వ్యక్తులు బంగారు వస్తువులు చోరీ చేశారు. మహేశ్వర లేఅవుట్లో ఉంటున్న పడాల రవితేజ సినీ డిజైనర్గా పనిచేస్తూ కుటుంబంతో కలిసి జీవిస్తున్నారు. ఈ నెల 12న ఇంటికి తాళం వేసి తన కుటుంబంతో రాజమండ్రి వెళ్ళాడు. ఈ నెల 17 సాయంత్రం ఇంటికి తిరిగి వచ్చి చూసుకునేసరికి తాళాలు పగులగొట్టి బీరువాలోని రెండు బంగారు ఉంగరాలు, చెవి దిద్దులు అపహరించుకుపోయారు. బాధితులు ఏలూరు రూరల్ పోలీసులకు ఆదివారం ఫిర్యాదు చేయటంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పెదపాడు: కోళ్ల వ్యర్థాలను అక్రమ రవాణా చేస్తున్న వాహనం సీజ్ చేసి ఆరుగురిపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు పోలీసులు తెలిపారు. మండలంలోని వీరభద్రపురం గ్రామానికి కోళ్ల వ్యర్థాలు తరలిస్తున్నట్లు సమాచారం మేరకు పెదపాడు పోలీసులు వాహనం అడ్డుకుని వాహనం సీజ్ చేసి, కోళ్ల వ్యర్థాలు తరలించడంలో భాగస్వాములైన ముంగర హరిబాబు, యలమంచిలి ప్రసన్నకుమార్, తోకల రాంబాబు, కూచిపూడి వాసు, నక్కా నాగమణికంఠ, హైదరాబాదుకు చెందిన సయ్యద్ సఫ్రీద్లపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. దెందులూరు: మండలంలోని సత్యనారాయణపురంలో వృద్ధురాలి మెడలో గొలుసు చోరీకి గురైంది. దెందులూరు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. అపరిచిత వ్యక్తి శనివారం వృద్ధురాలి ఇంట్లో చొరబడి మూడు కాసుల బంగారు గొలుసు లాక్కుని పారిపోయాడని బాధితురాలు ఫిర్యాదు చేసింది. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్సై ఆర్.శివాజీ వివరించారు. -
మామిడి పూతకు మంచు దెబ్బ
చింతలపూడి: ప్రతికూల ప్రభావంతో ఈ ఏడాది మామిడి రైతులు తీవ్ర సంక్షోభంలో కొట్టుమిట్టాడుతున్నారు. మండలంలో ఒక ప్రాంతంలో పూతలు బాగుంటే, మరో ప్రాంతంలో ఎక్కడా పూత కనిపించడం లేదు. ఈ పరిస్ధితుల్లో పూత పూసిన ప్రాంతంలో మామిడి పంట మంచు దెబ్బకు విలవిల్లాడుతూంది. గత రెండు, మూడేళ్ళుగా ధర ఆశాజనకంగా ఉండటంతో ఈ ఏడాది రైతులు మామిడి పంటపై గంపెడాశతో ఉన్నారు. సంవత్సరం అంతా సస్యరక్షణ చేపట్టి పంటను కాపాడుకుంటూ వస్తుంటే మంచు కారణంగా పూత, పిందె మాడిపోయి నష్టం వాటిల్లే ప్రమాదం ఏర్పడిందని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకప్పుడు రాష్ట్రంలో ద్వితీయ స్ధానం, జిల్లాలో ప్రథమ స్థానం ఆక్రమించి విదేశాలకు సైతం ఎగుమతి చేసిన మామిడి పంటకు నియోజకవర్గంలో గడ్డు కాలం ఏర్పడింది. ప్రకృతి వైపరీత్యాల కారణంగా దశాబ్దాల పాటు కన్నబిడ్డల్లా కాపాడుకుంటూ వస్తున్న మామిడి తోటలను రైతులు గత్యంతరం లేక గత కొద్ది సంవత్సరాలుగా తొలగిస్తున్నారు. గతంలో నియోజకవర్గంలో 50 వేల ఎకరాల్లో విస్తరించి ఉన్న మామిడి తోటలు క్రమక్రమంగా 10 వేల ఎకరాలకు తగ్గిపోయాయి. ప్రస్తుతం చింతలపూడి, టి.నరసాపురం, కామవరపుకోట, లింగపాలెం మండలాల్లో మాత్రమే తోటలు ఉన్నాయి. మామిడి తోటల అభివృధ్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుని రైతులకు ప్రోత్సాహం అందించక పోతే భవిష్యత్తులో మామిడి అంతరించిపోయే ప్రమాదం ఉంది. సస్యరక్షణ చేపట్టాలి ఈ సంవత్సరం వాతావరణ ప్రతికూల పరిస్థితుల కారణంగా మామిడి తోటలు పూయలేదని అధికారులు చెబుతున్నారు. నెల రోజులుగా వాతావరణం పొడిగా ఉన్నందున గత 10 రోజులుగా తోటల్లో పూత కనపడుతోంది. రైతులు ఇప్పట్నించీ సరైన సస్య రక్షణ చేపట్టాలి. 5 గ్రాముల పొటాషియం నైట్రేట్ లేదా 50 గ్రాముల యూరియా లీటరు నీటిలో కలిపి చెట్లకు స్ప్రే చేయాలి. ప్రస్తుతం మామిడి పూతపై తేనె మంచు పురుగు ఉధృతి ఎక్కువగా ఉంది. లేత పూ మొగ్గలు ప్రారంభంలో తేనె మంచు పురుగు ఆశిస్తుంది. దీని నివారణకు ఇమిడాక్లోప్రిడ్(కాన్ఫిడార్) ద్రావణం 10 లీటర్ల నీటికి 3 మిల్లీలీటర్లు కలిపి పిచికారీ చేయాలి. లేదా ధయో మిటాక్జిమ్ 10 లీటర్ల నీటికి 3 గ్రాములు కలిపి పిచికారీ చేస్తే పురుగు ఉధృతి తగ్గుతుంది. ఎండి షాఫియ ఫర్హీన్–ఉద్యానాధికారి , చింతలపూడి -
సందడి చేసిన అనిల్ రావిపూడి
తణుకు అర్బన్: మన శంకర వరప్రసాద్ చిత్రం ప్రదర్శిస్తున్న వీమాక్స్ థియేటర్ను ఆదివారం దర్శకుడు అనిల్ రావిపూడి సందర్శించారు. చిన్నతనం నుంచి చిరంజీవి సినిమాలను ఇలాగే థియేటర్కు వెళ్లి చూశానని, ఇప్పుడు మెగాస్టార్ చిరంజీవి సినిమాను దర్శకత్వం చేసే స్థాయికి ఎదగడం, ఇలా ప్రేక్షకుల ముందుకు రావడం మర్చిపోలేని అంశమన్నారు. మెగా అభిమానులు చూపిస్తున్న ప్రేమాభిమానాలతో తాను ఎంతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నానని, సినిమాను ఆదరిస్తున్న అభిమానులే తనకు దేవుళ్లుగా భావిస్తున్నట్లు చెప్పారు. త్వరలోనే మరో భారీ ప్రాజెక్టుతో ప్రేక్షకుల ముందుకు వస్తానని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర నిర్మాత గారపాటి సాహు, ఇతర చిత్ర బృందం పాల్గొన్నారు. గణపవరంలో.. గణపవరం: గణపవరంలోని మహాలక్ష్మీ థియేటర్లో మన శంకర వరప్రసాద్ చిత్ర విజయోత్సవ సభలో అనిల్ రావిపూడి పాల్గొని చిత్ర విజయం పట్ల అభినందనలు తెలిపారు. ఏలూరులో ఏలూరు(ఆర్.ఆర్.పేట): డైరెక్టర్ అనిల్ రావిపూడి ఆదివారం ఏలూరులో సందడి చేశారు. ఎస్వీసీ సినిమా థియేటర్లో ప్రేక్షకులతో ముఖాముఖి నిర్వహించారు. గంగానమ్మ జాతరకు సంబంధించిన అమ్మవారి మేడలను సందర్శించి పూజలు చేశారు. తాడేపల్లిగూడెం రూరల్: కారు ఢీకొని వ్యక్తి మృతి చెందినట్లు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ తెలిపారు. ఆదివారం ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మండలంలోని కొండ్రుప్రోలు జాతీయ రహదారిపై నిట్ కళాశాల జంక్షన్లో గేదెల సింహాచలం ఏలూరు నుంచి వస్తుండగా కారు ఢీకొంది. క్షతగాత్రుడిని ప్రైవేట్ ఆసుపత్రికి తరలిస్తుండగా మధ్యలో మృతి చెందాడు. మృతుడిని యాగర్లపల్లికి చెందిన జట్టు కూలీగా గుర్తించారు. -
నేటి నుంచి శోభనగిరిలో కల్యాణోత్సవాలు
ఆగిరిపల్లి: భక్తులు కోరిన కోరికలు తీర్చే కొంగుబంగారం కలియుగ వైకుంఠపురంగా ప్రసిద్ధి చెందిన ఆగిరిపల్లిలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నృసింహ స్వామి ఆలయంలో సోమవారం నుంచి కల్యాణోత్సవాలు జరుగనున్నాయి. ఈ క్షేత్రానికి పురాణ ప్రా శస్త్యం ఉంది. స్వామి వ్యాఘ్ర రూపంలో శోభనగిరిపై వెలిసినట్టు స్థలం పురాణం చెబుతోంది. శోభనగిరి శిఖర భాగాన ఉన్న శివుడు మల్లికార్జునస్వామిగా, దిగువ భాగాన ఉన్న కొండపై విష్ణుమూర్తి లక్ష్మీ నృసింహస్వామిగా కొలువుదీరారు. 18వ శతాబ్దం నుంచి నూజివీడు జమిందారులు ధర్మకర్తలుగా వ్యవహరిస్తున్నారు. ప్రస్తుతం నూజివీడు మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ఆలయ వంశపారంపర్య ధర్మకర్తగా వ్యవహరిస్తున్నారు. తొలిరోజు చంద్రప్రభ వాహనంపై.. కల్యాణోత్సవాల్లో భాగంగా తొలిరోజు స్వామివారిని చంద్రప్రభ వాహనంపై తీసుకువచ్చి పెండ్లి కుమారుడిగా అలంకరిస్తారు. రాత్రి 9 గంటలకు వేద పండితులు నిత్య కల్యాణం జరిపిస్తారు. ఇలా పది రోజులపాటు నిత్య కల్యాణాలు జరుగుతాయి. 25న రథసప్తమి నాడు ఆలయ ఆవరణలో గ్రామస్తుల ఆధ్వర్యంలో భారీ సమారాధన నిర్వహిస్తారు. కల్యాణోత్సవాల్లో ముఖ్య ఘట్టం 26న ఉదయం 8.45 గంటలకు గ్రామంలోని నాలుగు మాడ వీధులు చుట్టూ రాష్ట్రంలోనే అతి పెద్దదైన రథంలో రథోత్సవం నిర్వహిస్తారు. సోమవారం వంశపారంప ర్య ధర్మకర్త మేకా వెంకట ప్రతాప్ అప్పారావు క ల్యాణోత్సవాల్లో పాల్గొని స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పిస్తారు. -
అన్నదానం.. స్వాహాపర్వం
నూజివీడు: ప్రముఖ ప్రాచీన దివ్యక్షేత్రమైన ఆగిరిపల్లిలోని శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి కి శఠగోపం పెట్టే ప్రబుద్ధులు తయారవ్వడంపై గ్రా మస్తులతో పాటు భక్తుల్లో ఆందోళన నెలకొంది. ఏ టా మాఘమాసంలో నిర్వహించే రథసప్తమి ఉత్స వాల్లో భాగంగా అన్నదానం నిర్వహించేందుకు రసీదులు లేకుండా విరాళాలు సేకరించడం, లెక్కలు చెప్పకపోవడం తెలిసిందే. గ్రామ పెద్దలు నిలదీయడంతో గత 20 ఏళ్లుగా విరాళాలు వసూలు చేసి ఖ ర్చు చేయగా మిగిలిన సొమ్ము రూ.28.50 లక్షలు ఉ న్నాయని, వాటిని ఇచ్చేస్తామని చెప్పిన కమిటీ స భ్యులు సొమ్మును ఇవ్వకుండా మాటమార్చడం స ర్వత్రా చర్చనీయాంశమైంది. నూజివీడు జమిందారులు మేకా వంశీయులు నిర్మించిన ఈ ఆలయానికి రథసప్తమి నాడు లక్షలాది మంది భక్తులు విచ్చేస్తారు. రాత్రంతా, తెల్లవార్లూ నిర్వహించే తిరునాళ్ల మహోత్సవంలో పాల్గొంటారు. స్వామి వారికి మే కా వంశీయులు వేలా ఎకరాల భూములను, బంగా రు ఆభరణాలను సైతం సమర్పించారు. అన్నదానం ఖర్చుపై లోపించిన పారదర్శకత రథసప్తమి నాడు భక్తులకు భారీ అన్నసమారాధన నిర్వహించడం ఆనవాయితీ. స్థానికులే కమిటీగా ఏ ర్పడి అన్నదాన నిర్వహణ నిమిత్తం రసీదులు లే కుండానే విరాళాలు వసూలు చేసి అన్నదానాన్ని ని ర్వహిస్తున్నారు. అయితే వసూలు అవుతున్న సొ మ్ము ఎంత? ఎంత ఖర్చు అవుతోంది? ఎంత సొ మ్ము మిగులుతోంది? అనే అంశాల్లో పారదర్శకత లేకుండా పోయింది. దేవుడి పేరు చెప్పి విరాళాలు సేకరిస్తూ లెక్కలు చెప్పకుండా కొందరు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. అన్నదానం పూర్తయిన తరువాత అటు దేవదాయ శాఖ అధికారులు, కమిటీ సభ్యులకు, గ్రామస్తులకు గానీ విరాళాలు ఇచ్చిన గ్రామ పెద్దలకు లెక్కలు చెప్పడం లేదు. మిగిలిన సొమ్మును వడ్డీలకు ఇచ్చుకుంటూ మింగేస్తున్నారనేది అందరికీ తెలిసిందే. ఈ తంతు గత 20 ఏళ్లుగా సాగుతున్నట్లు గ్రామస్తులు చెబుతున్నారు. మాట మార్చి.. విరాళాలు మింగేసి రథసప్తమి ఉత్సవాలు దగ్గర పడుతున్న నేపథ్యంలో కమిటీ నిర్వాహకులు మిగిలి ఉన్న రూ.28.50 లక్షలను ఇచ్చేది లేదంటూ, తామే ఈ ఏడాది కూడా అన్నదానాన్ని నిర్వహిస్తామని మాట మార్చారు. దీంతో గ్రామస్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సొమ్ములు ఇవ్వాల్సిందేనని ఎవరైనా గట్టిగా మాట్లాడితే వారిని బెదిరిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. దీంతో ఎవరికి వారు తమకెందుకులే అని మిన్నకుండిపోతున్నారు. పట్టించుకోని ఉన్నతాధికారులు ఆలయంలో నిర్వహించే అన్నదాన కార్యక్రమంపై ఏడాదిగా ఆరోపణలు, విమర్శలు వస్తున్నా దేవదాయశాఖ ఉన్నతాధికారులు పట్టించుకోకపోవడంపై గ్రామస్తులు, భక్తులు విస్మయం వ్యక్తం చేస్తున్నారు. స్వామివారి పేరు చెప్పి విరాళాలు వసూలు చేస్తూ లెక్కలు చెప్పకుండా కొందరు తమ ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నా అధికారులు ఎందుకు మిన్నకుంటున్నారని ప్రశ్నిస్తున్నారు. దీనిపై దేవదాయ శాఖ మంత్రితో పాటు కమిషనర్కు కూడా ఫిర్యాదు చే సేందుకు సిద్ధమవుతున్నట్టు తెలిసింది. రథసప్తమి ఉత్సవాల నిర్వహణపై గత నెల 25న ఆలయ ఆవరణలో ఈఓ సాయి గ్రామ పెద్దలు, కుల సంఘాల పెద్దలతో సమావేశం నిర్వహించారు. 20 ఏళ్లుగా అన్నదానం నిర్వహణకు వసూలు అయిన సొమ్ములో ఖర్చులు పోను మిగిలిన సొమ్మును అప్పగిస్తామని చెప్పి ఏడాది అవుతున్నా అన్నదాన కమిటీ సభ్యులు ఎందుకు అప్పగించలేదని ప్రశ్నించారు. నాలుగేళ్ల క్రితం అప్పటి ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు చొరవతో గ్రామ పెద్దలతో కమిటీని ఏర్పాటు చేసి సేకరించిన విరాళాలకు రసీదులు ఇచ్చి రెండేళ్ల పాటు అన్నదానం నిర్వహించగా రెండేళ్లలో రూ.5.75 లక్షలు మిగిలాయి. వాటిని అన్నదానం పేరుతో అకౌంట్ ఓపెన్ చేసి అందులో ఫిక్స్డ్ డిపాజిట్ చేశారు. ఈ నేపథ్యంలో 20 ఏళ్లలో ఎన్ని డబ్బులు మిగిలాయో లెక్కలు చెప్పి అప్పగించిన తరువాతే అన్నదానం నిర్వహించాలని తేల్చిచెప్పారు. ఈ క్రమంలో ఈనెల 2న రెండోసారి నిర్వహించిన సమావేశంలో రూ.28.50 లక్షలు ఉన్నట్లు అన్నదాన కమిటీ నిర్వాహకులు తెలిపారు. ఈ సొమ్మును దేవస్థానం అన్నదానం బ్యాంకు ఖాతాలో వేసి కమిటీ ఏర్పాటు చేసి ఖర్చు చేయాలని నిర్ణయం తీసుకున్నారు. నరసన్నకే శఠగోపం ఆగిరిపల్లిలో ఏటా భారీ అన్నదానం రసీదులు లేకుండా విరాళాల సేకరణ కమిటీ నిర్వాహకుల ఇష్టారాజ్యం మిగులు సొమ్ములు ఇచ్చేందుకు నిరాకరణ -
అధిక ధరలకు మద్యం అమ్మకాలు
లక్కవరంలో షాపు వద్ద ఆందోళన జంగారెడ్డిగూడెం: లక్కవరంలోని మద్యం షా పులో ఎమ్మార్పీకి మించి అధిక ధరలకు మ ద్యం విక్రయిస్తున్నారంటూ మందుబాబులు ఆదివారం ఆందోళనకు దిగారు. దీంతో ఉద్రిక్త పరిస్థితి ఏర్పడింది. కొద్దిరోజులుగా జంగారెడ్డిగూడెం పట్టణం, మండలంలో మద్యం షా పుల సిండికేట్లు అధిక ధరలతో దోపిడీ చేస్తున్నారని ధ్వజమెత్తారు. ప్రతి బాటిల్పై రూ.20 వసూలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని మండిపడ్డారు. ఎంసీ విస్కీ క్వార్టర్ బాటిల్ ధర రూ.190 ఉండగా రూ.220 వసూలు చేస్తున్నారని, కొన్ని బ్రాండ్ల అమ్మకాలు నిలిపివేశారన్నా రు. అలాగే కొన్ని బ్రాండ్లను బెల్టు షాపులకు తరలిస్తూ మద్యం దుకాణాల్లో మాత్రం విక్రయించడం లేదన్నారు. బెల్టు షాపులకు ఇచ్చే బాటిళ్లపై ఎమ్మార్పీ స్లిక్కర్లు చింపేస్తున్నారని విమర్శించారు. అలాగే బాటిళ్లకు జేఆర్ అనే స్టిక్కర్ అంటించి బెల్టు షాపులకు సరఫరా చే స్తున్నారని అన్నారు. జంగారెడ్డిగూడెం ఎకై ్సజ్ అధికారులు, లక్కవరం ఎస్సై షేక్ జబీర్, ఎస్సై కుటుంబరావు ఇక్కడకు చేరుకున్నారు. ఎమ్మార్పీకే అమ్మేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇవ్వడంతో ఆందోళనకారులు శాంతించారు. మద్యం షాపుల నిర్వాహకులు దురుసు గా మాట్లాడుతున్నారని చెప్పగా అధికారులు వారితో క్షమాపణ చెప్పించారు. ద్వారకాతిరుమల: ద్వారకాతిరుమల చినవెంకన్న క్షేత్రంపై అమావాస్య ఎఫెక్ట్ పడింది. ఆదివారం ఆలయానికి భక్తుల రాక స్వల్పంగా ఉంది. మధ్యాహ్నం 3 గంటల వరకు ఆలయ పరిసరాల్లో నామమాత్రంగా భక్తులు సంచరించా రు. ఆ తరువాత నుంచి దాదాపుగా అన్ని విభాగాలు ఖాళీగా మారాయి. ఏలూరు (ఆర్ఆర్పేట): 11వ పీఆర్సీ కాల పరిమితి ముగిసి 27 నెలలకు కావస్తున్నా 12వ పీఆర్సీ కమిటీ నియామకంపై ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి లేదని ఎస్టీయూ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఫ్యాప్టో చైర్మన్ ఎల్.సాయి శ్రీనివాస్ అన్నారు. ఆదివారం స్థానిక ఎస్టీయూ భవన్లో నిర్వహించిన జిల్లా ఎస్టీయూ ముఖ్య నాయకుల సమావేశానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నాలుగు డీఏలు బకాయిలు ఉంచడం సరికాదని, 11వ పీఆర్సీ బకాయిలు, పీ ఎఫ్ లోన్ల బకాయిలు చెల్లించడానికి రోడ్ మ్యాప్ని విడుదల చేయాలని, డీఏ ఏరియర్ బకాయిల చెల్లింపులో సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. జిల్లా అధ్యక్షుడు పీబీవీఎన్ఎల్ నారాయణ మాట్లాడుతూ బోధనేతర కార్యక్రమాల ఒత్తిడి తగ్గించాలని, విద్యా శక్తి పేరుతో పాఠశాల పనివేళలను పెంచడం సరికాదన్నారు. ప్రభుత్వం ఉపాధ్యాయులపై, విద్యా వ్యవస్థలోని సమస్యలపై నిర్లక్ష్య ధోరణి ప్రదర్శించడం శోచనీయమన్నారు. ఉంగుటూరు మండల సంఘ నూతన కార్యవర్గాన్ని ఏర్పాటుచేశారు. అధ్యక్షుడిగా గుండె మధుసూదనరావు, ప్రధాన కార్యదర్శిగా షేక్ లెహర భానును ఎన్నుకున్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్కుమార్, రాష్ట్ర నాయకులు ఎండీ షఫీ, సీనియర్ నాయకులు పాల్గొన్నారు. -
వైఎస్సార్సీపీ నేత కుటుంబంపై దాడి
దెందులూరు: వైఎస్సార్సీపీ పంచాయతీరాజ్ విభా గం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పోకల రాంబాబు కు మారుడు ప్రవీణ్, కుమార్తె కల్యాణి, భార్య గంగమ్మ పై కొందరు విచక్షణారహితంగా దాడి చేసి గాయపరిచారు. బాధితులు, ప్రత్యక్ష సాక్షులు, పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి.. రాంబాబు శనివా రం సాయంత్రం 5 గంటల సమయంలో దెందులూరులోని తన నివాసంలో కుటుంబసభ్యులతో కలిసి ఉన్నారు. ఉంగుటూరు మండలం బావాయిపేటకు చెందిన శంకు పద్మారావు, శంకు రాజు, గోలి సత్య వతి, సిరి, సాయి, మరో 30 మంది ఐదు కార్లలో వచ్చి ‘మా డబ్బులు ఎప్పుడు ఇస్తారు.. ఇస్తారా ఇవ్వరా’ అంటూ అసభ్య పదజాలంతో దూషిస్తూ దౌర్జన్యానికి దిగారు. రాంబాబుతో పాటు ప్రవీణ్, కల్యాణిలపై దాడి చేశారు. రాంబాబును గుండైపె త న్నడంతో ఆయన కుర్చీ నుంచి వెనక్కి పడిపోయా రు. ప్రవీణ్ తల, ముక్కు, కళ్లు, ఛాతీపై రక్త గాయా లయ్యాయి. అడ్డు వచ్చిన గంగమ్మను గోడకేసి కొట్టడంతో ఆమె అక్కడికక్కడే కుప్పకూలిపోయింది. అంతటితో ఆగకుండా వరండాలో ఉన్న స్కూటర్ని కింద పడేసి ధ్వంసం చేశారు. అర గంటకు పైగా వీర విహారం చేశారు. విషయం తెలిసి చుట్టుపక్కల వారు, గ్రామస్తులు అక్కడికి చేరుకున్నారు. దాడి ఘటనపై రాంబాబు మాట్లాడుతూ బావాయిపేటలోని చేపల చెరువులో ఫీడ్ నిమిత్తం తన కుమార్తె భర్త కుటుంబసభ్యులకు రూ.3 లక్షలు ఇవ్వాల్సిన మాట వాస్తవమని, గత నెలలో వారి ఇంటికి వెళ్లి త్వ రలో ఇస్తామని స్వయంగా చెప్పి వచ్చానన్నారు. ఇంతలోనే ఇలా దౌర్జన్యం చేయడం దారుణమన్నారు. కల్యాణి మాట్లాడుతూ కట్నం కోసం చాలా కాలంగా తమను వేధిస్తున్నారని, ఇప్పుడు తమను హతమార్చాలని చూసినవారే గతంలో తనను చాలా ఇబ్బందులు పెట్టారని, దీనిపై ఉంగుటూరు, హైదరాబాద్ పోలీస్స్టేషన్లలో ఫిర్యాదు చేశానని చెప్పారు. అధిక కట్నం కోసం కొన్నేళ్లుగా తన భర్త కుటుంబ సభ్యు లు వేధిస్తూ దాడులు, దౌర్జన్యానికి దిగుతున్నారని ఆమె కన్నీటిపర్యంతమయ్యారు. రాంబాబుకు ఇటీ వల బైపాస్ సర్జరీ జరిగింది. దాడి అనంతరం కు టుంబసభ్యులు ఆయన్ను దెందులూరు వైద్యశాలకు తరలించారు. అనంతరం ఆయన దెందులూరు పోలీస్స్టేషన్కు వెళ్లి దాడి ఘటనపై ఎస్సై శివాజీకి ఫిర్యాదు చేశారు. రక్త గాయాలు, స్కూటర్ ధ్వంసం -
ప్రైవేట్ ట్రావెల్స్ ‘దారి’ దోపిడీ
● సంక్రాంతి తిరుగు ప్రయాణం భారం ● ట్రావెల్స్ బస్సుల్లో చార్జీల బాదుడు ● రవాణా శాఖ హెచ్చరికలు భేఖాతరు ఏలూరు (ఆర్ఆర్పేట): సంక్రాంతి పండుగకు తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు ప్రాంతాల నుంచి జిల్లాకు వచ్చిన వారికి తిరుగు ప్రయాణం భారంగా మారింది. పండక్కి వచ్చిన అతిథులు శుక్రవారం నుంచి వారి స్వస్థలాలకు పయనమవుతున్నారు. వీరిలో హైదరాబాద్ నుంచి వచ్చిన వారే ఎక్కువ. కాగా ఆర్టీసీ బస్సుల్లో సూపర్ డీలక్స్కు హైదరాబాద్కు సుమారు రూ.800, నాన్ ఏసీ స్లీపర్ బస్సు స్టార్ లైనర్కు రూ.910 వసూలు చేస్తున్నారు. అయి తే ఆర్టీసీ బస్సులు పరిమితంగా ఉండటం, రద్దీ దృష్ట్యా ప్రైవేట్ ట్రావెల్స్ బస్సులను ఆశ్రయించాల్సిన పరిస్థితి. ఇదే అదనుగా పలు ట్రావెల్స్ బస్సుల్లో అధిక చార్జీలు వసూలు చేశారు. విమాన చార్జీలను తలదన్నేలా.. జిల్లాకు సమీపంలోని గన్నవరం ఎయిర్పోర్ట్ నుంచి హైదరాబాద్కు విమాన చార్జీను తలదన్నేలా సంక్రాంతి డిమాండ్ దృష్ట్యా ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరలను పెంచేశాయి. జిల్లాలోని ఏలూరు, నూజివీడు, జంగారెడ్డిగూడెం, కై కలూరు, ఉంగుటూరు, భీమడోలు, చింతలపూడి తదితర ప్రాంతాల నుంచి హైదరాబాద్కు వెళ్లాలంటే రూ.2 వేల నుంచి రూ.3 వేల వరకు వసూలు చేస్తున్నారు. హెచ్చరికలు భేఖాతరు సంక్రాంతి పండక్కి ముందుగానే జిల్లా రవాణా శాఖ అధికారులు ప్రైవేట్ ట్రావెల్స్ బస్సుల యాజమాన్యాలతో సమావేశాలు నిర్వహించారు. టికెట్ ధరలు పెంచవద్దని, ప్రయాణికులకు సౌకర్యవంతమైన ప్రయాణ సదుపాయం కల్పించాలని సూచించారు. కండిషన్లో ఉన్న బస్సులు, నిబంధనల మేరకు టాక్స్లు చెల్లించడంతో పాటు ఫిట్నెస్ సర్టిఫికెట్ ఉన్న బస్సులను మాత్రమే తిప్పాలని ఆదేశించారు. అయితే రవాణా శాఖ అధికారుల ఆదేశాలను ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు పాటించిన దాఖలాలు కనిపించడం లేదు. తిరుగు ప్రయాణానికి ఉన్న డిమాండ్ను సొమ్ము చేసుకునేలా వారి ఇష్టారీతిన చార్జీలు వసూలు చేస్తున్నారు. కేసుల నమోదు ప్రైవేట్ ట్రావెల్స్ యాజమాన్యాలు టికెట్ ధరల దోపిడీకి తెరతీయడంతో వారిని నియంత్రించడానికి రవాణా శాఖ అధికారులు ప్రత్యేక డ్రైవ్ నిర్వహిస్తున్నారు. ఈనెల 9 నుంచి ఇప్పటివరకూ ఏలూరు సమీపంలోని కలపర్రు, జంగారెడ్డిగూడెం, నూజివీడు, చింతలపూడి తదితర ప్రధాన ప్రాంతాల్లో వి స్తృతంగా తనిఖీలు చేపట్టారు. అధిక ధరలు వ సూలు చేయడంతో పాటు ఇతర నియమాలను ఉ ల్లంఘించిన వారిపై కేసులు నమోదు చేశారు. ఇలా ఇప్పటివరకూ 48 బస్సులపై కేసులు నమోదు చేసి రూ.3.27 లక్షల అపరాధ రుసుం విధించారు. -
కోళ్లపర్రులో రెడ్బుక్ రాజ్యాంగం
ఆకివీడు : కోళ్లపర్రు గ్రామంలో కూటమి నాయకుల దౌర్జన్యాలు పెచ్చుమీరుతున్నాయని వైఎస్సార్సీపీ గ్రామ కమిటీ అధ్యక్షుడు పాశం నర్సింహరావు, నాయకులు ఆరోపించారు. గ్రామంలోని వైఎస్సార్ జెండా దిమ్మపై పసుపు రంగు పులిమిని సంఘటన పై నర్సింహరావు ఆదివారం విలేకరులతో మాట్లాడారు. గ్రామ పార్టీ అధ్యక్షుడిగా ఉన్న తనను పలు విధాలుగా వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. సరిహద్దు గొడవలు సృష్టిస్తున్నారని, చెరువు గట్ల వద్ద దౌర్జన్యాలు చేస్తున్నారని వాపోయారు. సంక్రాంతి పండుగ రోజుల్లో కూడా మనశ్శాంతిగా ఉండనివ్వకుండా పార్టీ నాయకులకు చెందిన ఫ్లెక్సీలను భోగిమంటలో వేసి దహనం చేశారని ఆవేదన వ్యక్తంచేశారు. అలాగే వైఎస్సార్సీపీ జెండా దిమ్మ పై పసుపు రంగు పులిమారని వాపోయారు. ఇటీవల కోళ్లపర్రు వంతెన వద్ద ఉన్న పేదల ఇళ్లు తొలగిస్తామని అధికారులు నోటీసులు ఇవ్వడంతో వారికి మద్దతుగా తహసీల్దార్ కార్యాలయం వద్ద నిరసన తెలపడంతో కూటమి నేతలు తనపై దౌ ర్జన్యానికి వచ్చారని ఆరోపించారు. గ్రామంలో రెడ్బుక్ అమలుజేసూ పార్టీకి అండగా ఉన్న వారిని, తనను పలు విధాలుగా వేధింపులకు గురిస్తున్నా రని వాపోయారు. విషయాన్ని నియోకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు ద్వారా అఽధిష్టానానికి తీసుకువెళతామన్నారు. ఎవరెన్ని ఇబ్బందులు పెట్టినా పార్టీని వీడే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. -
విద్యుత్ సర్వీసుల తొలగింపు అన్యాయం
కొయ్యలగూడెం: మండలంలోని సీతంపేటలో గృహాలకు ఉన్న విద్యుత్ సర్వీసుల తొలగింపు వివాదాస్పదమైంది. ఆదివారం విద్యుత్ శాఖ అధికారులు, సిబ్బంది దళితవాడలోని ఇళ్లకు విద్యుత్ సర్వీసులను తొలగించారని బాధితులు ఆరోపించారు. తాము 30 ఏళ్లుగా ఇక్కడ నివాసం ఉంటున్నామని, తమ ప్రాంతంపై కన్నేసిన కొందరు కబ్జాకు ప్రయత్నిస్తూ కక్ష సా ధింపులకు పాల్పడుతున్నారని అంటున్నారు. తమపై దౌర్జన్యానికి పాల్పడుతున్న వ్యక్తుల పొలం పక్కన తమ ఇళ్లు ఉన్నాయని, వాటిని ఖాళీ చేయించి ఈ ప్రాంతాన్ని స్వాధీనం చేసుకోవాలని చూస్తున్నారన్నారు. పండుగ నేపథ్యంలో ఇళ్లకు వచ్చిన పిల్లాపాపలతో, బంధుమిత్రులతో ఉంటున్నామని, ఎలాంటి నోటీసు లు ఇవ్వడకుండా విద్యుత్ సర్వీసులు తొలగించడం అన్యాయమని ఆవేదన వ్యక్తం చేశారు. ప్రభుత్వం తమ ప్రాంతంలో ఇళ్ల పట్టాలు అందించి గృహాలు నిర్మించాలని కోరుతున్నారు. బాధితులు గాలింకి పద్మ, ఏలేటి కుమారి, ఆరసాల మరియమ్మ, కంటిపటి బులెంకమ్మ, మదలా దుర్గమ్మ తదితరులు విద్యుత్ సర్వీసుల తొలగింపుపై నిరసన తెలిపారు. -
మేల్ నర్సు బలవన్మరణం
● జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో ఉరి వేసుకున్న వైనం ● ఐదుగురు వ్యక్తులు కారణమని సూసైడ్ నోట్ జంగారెడ్డిగూడెం: చేయని తప్పుకు తనను తీవ్రంగా వేధిస్తూ ఆత్మహత్య చేసుకునేందుకు కారణమైన ఐదుగురు వ్యక్తులపై చర్యలు తీసుకోవాలని సూసైడ్ నోట్ రాసి స్థానిక ఏరియా ఆస్పత్రిలో ప్రభుత్వ అండర్ టేకింగ్లో నడుస్తున్న అపోలో డయాలసిస్ కేంద్రంలో మేల్ నర్స్ (టెక్నీషియన్)గా పనిచేస్తున్న ముప్పిడి సుధాకర్ (27) ఆత్మహత్య చేసుకున్నాడు. ఆదివారం ఆస్పత్రి ఆర్వో ప్లాంట్ గదిలో ఉరి వేసు కుని బలవన్మరణం చెందాడు. వివరాలిలా ఉన్నా యి.. గతేడాది సెప్టెంబర్లో మృతుడు సుధాకర్కు, డయాలసిస్ చేయించుకునేందుకు వచ్చిన వ్యక్తికి మధ్య ఘర్షణ జరిగింది. ఈ క్రమంలో రోగిపై సుధాకర్ దాడి చేశాడని రోగి త రఫు బంధువులు పీజీఆర్ఎస్లో కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీంతో సుధాకర్ను వేరే డయాలసిస్ సెంటర్కు బదిలీ చేశారు. మూడు నెలల క్రితం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రిలో సుధాకర్ వి ధుల్లో చేరాడు. ఈ నేపథ్యంలో ఆత్మహత్యకు పాల్పడటం కలకలం రేపింది. తన చావుకి కారణం ఐదుగురు వ్యక్తులను, తనను బెదిరిస్తూ మానసిక వేదనకు గురిచేశారని సూసైడ్ నోట్లో పేర్కొన్నాడు. తాను బయట చనిపోతే న్యాయం జరగదనే ఉద్దేశంతోనే, ఆస్పత్రిలో ఆత్మహత్య చేసుకుంటున్నట్టు లేఖలో రా శాడు. తనపై వచ్చిన ఆరోపణలపై విచారణ చేసి, తాను తప్పు చేసి ఉంటే కేసు ముగించమని, లేదంటే తన మృతికి కారణమైన వారిపై చట్టప్రకారం చర్యలు తీసుకోవాలని కోరాడు. విషయం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని ద ర్యాప్తు ప్రారంభించారు. ఇదిలా ఉండగా సుధాకర్ కొన్నిరోజులుగా సెలవులో ఉన్నాడు. -
ఉత్సాహంగా బాస్కెట్బాల్ పోటీలు
నూజివీడు: స్థానిక డీఏఆర్ కళాశాలలో నాలుగు రోజుల పాటు నిర్వహించిన శ్రీ రాజా వెంకటాద్రి అప్పారావు బహదూర్ 49వ స్మారక పురుషుల, మహిళల జాతీయ బాస్కెట్ బాల్ పోటీలు బుధవారం రాత్రితో ముగిశాయి. పురుషుల విభాగంలో చైన్నె ఎస్ఆర్ఎం జట్టు, మహిళల విభాగంలో కేఎల్యూ జట్టు విజేతలుగా నిలిచాయి. పురుషుల, మహిళల సెమీస్, ఫైనల్ మ్యాచ్లతో పాటు రెండు విభాగాల్లో 3, 4స్థానాలకు పోటీలు నిర్వహించారు. సెమీఫైనల్ పోటీల్లో భాగంగా మహిళల విభాగంలో తొలిసెమీఫైనల్ ఏలూరు జట్టు ఏబీఏ నూజివీడుపై 34–17 స్కోర్తోనూ, రెండో సెమీఫైనల్ మ్యాచ్లో కేఎల్యూ జట్టు పల్నాడు జట్టుపై 57–33 స్కోర్తోను గెలుపొంది ఫైనల్లోకి ప్రవేశించాయి. మూడు, నాలుగు స్థానాల్లో పల్నాడు జట్టు, ఏబీఏ నూజివీడు నిలిచాయి. పురుషుల విభాగంలో తొలి సెమీఫైనల్ మ్యాచ్లో చైన్నె ఎస్ఆర్ఎం జట్టు స్వస్తిక్ హైదరాబాద్ జట్టుపై 66–34 స్కోర్తోనూ, రెండో సెమీఫైనల్ మ్యాచ్లో సదరన్ కమాండ్ పూణే జట్టు చిత్తూరు జట్టు పై 89–64 తేడాతో గెలవడంతో చైన్నె ఎస్ఆర్ఎం, సదరన్ కమాండ్ లు ఫైనల్కు చేరాయి. పురుషుల విభాగంలో మూడు, నాలుగు స్థానాల్లో స్వస్తిక్ హైదరాబాద్ జట్టు చిత్తూరు జట్టు నిలిచాయి. పోటాపోటీగా ఫైనల్ మ్యాచ్లు పురుషుల ఫైనల్ మ్యాచ్ చైన్నె ఎస్ఆర్ఎం, సదరన్ కమాండ్ పుణే జట్ల మధ్య ఆద్యంతం పోటాపోటీగా సాగినప్పటికీ ఎస్ఆర్ఎం జట్టు విజేతగా నిలిచింది. ఎస్ఆర్ఎం జట్టు ఆట ప్రారంభం నుంచి ఆధిక్యతను కనబరిచి చివరకు 49–34స్కోర్ తేడాతో ఎస్ఆర్ఎం గెలుపొంది విజేతగా నిలిచింది. మహిళల ఫైనల్మ్యాచ్లో ప్రారంభం నుంచి కేఎల్యూ జట్టు ఏలూరు జట్టుపై ఆధిక్యతను కనబరిచింది. అయితే ద్వితియార్థంలో ఏలూరు జట్టు అనూహ్యంగా పుంజుకొని గట్టి పోటీనిచ్చింది. చివరకు కేఎల్యూ జట్టు ఏలూరు జట్టుపై 61–48 స్కోర్ తో గెలుపొంది విజేతగా నిలిచింది. బాస్కెట్బాల్కు ఆదరణ అమోఘం 49 ఏళ్లుగా జాతీయ స్థాయి బాస్కెట్బాల్ టోర్నమెంట్ నిర్వహించడాన్ని బట్టే నూజివీడులో బాస్కెట్బాల్కు ఉన్న ఆదరణ ఎలా ఉందో చెప్పవచ్చని మాజీ ఎమ్మెల్యే మేకా ప్రతాప్ అప్పారావు పేర్కొన్నారు. బాస్కెట్బాల్ పోటీల బహుమతి ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథ/గా హాజరైన ఆయన మాట్లాడుతూ క్రీడాకారులు కృషి, పట్టుదలతో ఆడి తమ ప్రతిభతో ఉన్నత శిఖరాలను అధిరోహించాలని ఉద్బోధించారు. ఈ కార్యక్రమంలో నూజివీడు సీడ్స్ డైరెక్టర్ మండవ ఆశాప్రియ, కిమ్స్ డైరెక్టర్ బొల్లినేని కృష్ణయ్య, ఏబీఏ అసోసియేషన్ ఆర్గనైజింగ్ సెక్రటరీ కే రమేష్బాబు, కృష్ణాజిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ అధ్యక్షులు జీఎస్సీ బోస్, మిర్యాల కృష్ణకిషోర్, ఫెసిలిటేటర్ అంజాద్ ఆలీ తదితరులు పాల్గొన్నారు. పురుషుల విభాగంలో విజేతగా నిలిచిన చైన్నె ఎస్ఆర్ఎం జట్టుకు షీల్డును అందిస్తున్న మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావుమహిళల విభాగంలో విజేతగా నిలిచిన కేఎల్యూ జట్టుకు షీల్డును అందిస్తున్న నూజివీడు సీడ్స్ డైరెక్టర్ మండవ ఆశాప్రియ -
కొండేపాడులో అగ్ని ప్రమాదం
పెంటపాడు: మండలంలోని కొండేపాడు గ్రామంలో శుక్రవారం ఉదయం మూడు గడ్డి వాములు దగ్ధమయ్యాయి. గ్రామానికి చెందిన వార్డు సభ్యులు ఆలపాటి సాంబశివరాజు, బొక్కా గోపయ్య, మరో వ్యక్తికి చెందిన సుమారు 10 ఎకరాల గడ్డి వాములు దగ్ధమయ్యాయి. ఎవరో కాల్చిపారేసిన సిగరెట్ వల్ల ప్రమాదం జరిగి ఉంటుందని స్థానికులు చెబుతున్నారు. సుమారు రూ.20 వేల నష్టం వాటిల్లిందని స్థనికుల చెబుతున్నారు. వార్డు సభ్యుడు పంపన రాంబాబు చొరవతో అత్తిలి అగ్నిమాపక అధికారులకు సమాచారం అందించగా వారు మంటలను అదుపు చేశారు. అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధం పోలవరం రూరల్: అగ్ని ప్రమాదంలో ఇల్లు దగ్ధమై సుమారు రూ.6 లక్షల విలువైన ఆస్తి నష్టం వాటిల్లింది. వివరాల ప్రకారం పోలవరం పంచాయతీ పరిధిలోని బెజవాడ వారి వీధిలో నివాసముంటున్న రాచమల్ల భీమరాజు పండుగ సందర్భంగా ఇంటికి తాళం వేసి కుటుంబ సభ్యులతో బంధువుల ఇంటికి వెళ్లారు. శుక్రవారం ఉదయం ఇంట్లో నుండి మంటలు రాగా చుట్టుపక్కల వారు గమనించి భీమరాజుకు, ఫైర్ ఇంజన్ కు సమాచారం ఇచ్చారు. అగ్నిమాపక సిబ్బంది మంటలను ఆర్పారు. భీమరాజు కుటుంబ సభ్యులు ఇంట్లో ఉన్న సామగ్రి చూడగా పూర్తిగా కాలి బూడిదైంది. షార్ట్ సర్క్యుట్ కారణంగా సంఘటన జరిగిందని గుర్తించారు. అగ్ని ప్రమాదం జరిగిన ఇంటిని తహసీల్దార్ ఆర్ఎస్ రాజు పరిశీలించారు. -
రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీలు
ఆకివీడు: సంక్రాంతి యువజనోత్సవాలు సందర్భంగా డీవైఎఫ్ఐ నిర్వహిస్తున్న రాష్ట్ర స్థాయి చెడుగుడు పోటీలు శుక్రవారం ప్రారంభమయ్యాయి. రాష్ట్ర స్థాయి పోటీలకు 10 టీమ్లు హాజరుకాగా, ఆకివీడు, ఆరుగురు బుడ్డోళ్లు, కమతవానిగూడెం, కై కలూరు, వరదళ్లపాడు టీములు తలబడ్డాయి. శనివారం నుండి రాష్ట్ర స్థాయి టీములు తలబడనున్నాయి. కాగా సంక్రాంతి యువజనోత్సవాల్లో గత రెండు రోజులుగా జరిగిన జిల్లా చెస్ పోటీల్లో ప్రథమ గంటా కీర్తి, ద్వితియ సీహెచ్.వివేక్(ఏలూరు), తృతియ జోషిత్ వర్మ(భీమవరం) విజయం సాధించారు. మూడు జిల్లాల స్థాయి క్రికెట్పోటీల్లో విన్నర్స్గా పట్టి లెవెల్స్, రన్నర్స్గా దుంపగడప టీములు విజయం సాధించాయి. జిల్లా స్థాయి పాటల పోటీల్లో రెడ్డి అప్పారావు, నెల్లి బాలాదిత్య, షేక్ పరహాన్లు విజయం సాధించారు. ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత దేవాలయమైన ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయాన్ని ప్రముఖ సినీ దర్శకుడు వీవీ వినాయక్ శుక్రవారం సందర్శించారు. ఆలయానికి విచ్చేసిన ఆయనకు ముందుగా అర్చకులు, పండితులు ఘన స్వాగతం పలికారు. ప్రదక్షిణల అనంతరం ఆయన స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఈ సందర్భంగా పండితులు ఆయనకు వేద ఆశీర్వచనాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత ఆలయ ఆవరణలో దేవస్థానం సిబ్బంది, అర్చకులు, పండితులు వినాయక్తో కాసేపు ముచ్చటించారు. భీమవరం: భీమవరం రైల్వే పోలీసు స్టేషన్ పరిధిలో భీమవరం–ఉండి మధ్య పేరు తెలియని సుమారు నాలుగేళ్ల వయస్సు కలిగిన బాలికను గుర్తు తెలియని రైలు ఢీ కొనడంతో మృతి చెందినట్లు భీమవరం రైల్వే ఎస్సై సుబ్రహ్మణ్యం శుక్రవారం తెలిపారు. బాలిక మృతదేహంపై మొలతాడు, ఎడమ కాలికి గాలి తాడు ఉన్నాయని ఉండి రైల్వేస్టేషన్ మాస్టారు ఇచ్చిన సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామన్నారు. బాలిక వివరాలు తెలిసినవారు 99084 48729 నంబర్కు ఫోన్ చేసి సమాచారం ఇవ్వాలని కోరారు. జంగారెడ్డిగూడెం: మండలంలోని లక్కవరం పోలీస్ స్టేషన్ పరిధిలో గురువారం జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒక వ్యక్తి మృతి చెందాడు. ఘటనకు సంబంధించి లక్కవరం ఎస్సై షేక్ జబీర్ తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం టెక్కినవారిగూడేనికి చెందిన గాది వెంకట దుర్గారావు (35) తన ఇంటి నుంచి నిమ్మలగూడెం మోటార్ సైకిల్పై వెళుతున్నాడు. ఆ సమయంలో ఎదురుగా మరో మోటార్ సైక్లిస్ట్ వచ్చి ఢీకొన్నాడు. దీంతో దుర్గారావుకు తలపై తీవ్ర గాయమైంది. వెంటనే అతనిని విజయవాడ తరలించగా అక్కడి నుంచి మెరుగైన వైద్యం కోసం గుంటూరు తరలించారు. అక్కడ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందినట్లు ఎస్సై చెప్పారు. మృతుడికి భార్య, ఇద్దరు ఆడపిల్లలు ఉన్నారు. ఈ మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని వివరించారు. ఆకివీడు: నగర పంచాయతీ అధికారుల నిర్లక్ష్యానికి పంపింగ్ హౌస్ నిలువుటద్దంగా ఉంది. స్థానిక వెంకయ్య వయ్యేరు నుంచి ఆనాల చెరువు లోకి నీరు నింపే పంపు హౌస్ వద్ద పైపు పగిలిపోవడంతో తోడిన నీరు మళ్లీ కాలువలోకే చొచ్చుకుపోతుంది. ఉదయం నుండి సాయంత్రం వరకూ ఇదే పరిస్థితి ఉన్నప్పటికీ నగర పంచాయతీ వాటర్ వర్ుక్స అధికారులు, సిబ్బంది ఎవరూ పట్టించుకోలేదు. నీటి తోడకం నిర్లక్ష్యంగా జరగడంతో విద్యుత్ బిల్లులు, మోటార్ వినియోగ నష్టానికి గురికావాల్సి వస్తుందని పలువురు ఆరోపిస్తున్నారు. ఈ విషయంపై నగర పంచాయతీ సిబ్బందికి తెలియజేసినా పట్టించుకునే నాథుడే లేడని వాపోతున్నారు. -
పొంచి ఉన్న ప్రమాదాలు
కాలువలు, డ్రెయిన్లలోకి రోడ్లు జారిపోవడంతో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నాయి. ఒకవైపు జాతీయ రహదారి, మరోవైపు రాష్ట్రీయ రహదారులు ఇదే విధంగా ఉండడం దారుణం. నిత్యం వందలాది ప్రయాణికుల వాహనాలు వెళ్లే ఈ రహదారుల్లో సరైన చర్యలు చేపట్టాలి. – బాతు జాన్సన్, కలిసిపూడి, ఉండి మండలం కాలువలు, డ్రెయిన్లలోకి ప్రధాన రహదారులు కుంగిపోతున్నాయి. దీంతో పగలు ఎలా ఉన్నా రాత్రివేళల్లో ఈ ప్రాంతాల్లో ప్రయాణించే వాహనదారులు భయం భయంగా ప్రయాణాలు సాగిస్తున్నారు. అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి ఈ ప్రాంతాల్లో రివిట్మెంట్ వాల్స్ నిర్మాణం వెంటనే చేపట్టాలి. – బొడ్డు నాగన్న, చెరుకువాడ, ఉండి మండలం -
హోరాహోరీగా కబడ్డీ పోటీలు
నరసాపురం: నరసాపురం రుస్తుంబాధలో గోగులమ్మ ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో జరుగుతున్న 33వ జాతీయస్థాయి మహిళలు, పురుషులు ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. లీగ్కమ్ నాకౌట్ పద్ధతిలో ఈ పోటీల్లో జట్లు హోరాహోరీగా తలపపడుతున్నాయి. శుక్రవారం వరకూ జరిగిన పోటీల్లో ఇరు విభాగాల్లోను ఆంధ్రా జట్లు వెనకంజలో ఉండటంతో ప్రేక్షకులు నిరాశ చెందారు. మహిళలకు, పురుషులకు స్టేడియంలో రెండు వేర్వేరు కోర్టులు ఏర్పాటు చేసి పోటీలు నిర్వహిస్తున్నారు. ముఖ్యంగా రాత్రిపూట ఫ్టడ్లైట్ల వెలుగులో నిర్వహిస్తోన్న పోటీలకు ప్రేక్షకులు పెద్దసంఖ్యలో హాజరవుతున్నారు. మాజీమంత్రి కొత్తపల్లి సుబ్బారాయుడు, పోటీల కన్వీనర్ కొత్తపల్లి జానకీరామ్, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ సీఈవో వీ.వీర్లెంకయ్య, ఆంధ్రా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి పద్మజాబాల, రిఫరీస్ ఇన్చార్జ్ కె.బాలు, గుగ్గిలపు మురళి, వన్నెంరెడ్డి శ్రీనివాస్ పోటీలు పర్యవేక్షిస్తున్నారు. రెండు విభాగాల్లోనూ కలపి గెలుపొందిన జట్లకు మొత్తం రూ 7.50 లక్షలు ప్రైజ్మనీ అందించనున్నారు. మ్యాచ్ల ఫలితాలు ఇలా.. పురుషుల విభాగంలో ఢిల్లీ జట్టు, హర్యానాపై 19 ఫాయింట్ల తేడాతో, రాజస్థాన్ జట్టు జమ్మూ అండ్ కశ్మీర్ పోలీస్ జట్టుపై 16 పాయింట్ల తేడాతో, హోరాహోరీగా సాగిన మరో మ్యాచ్లో బాబా హరిదాస్ హర్యానా జట్టు ఢిల్లీ జట్టుపై 3 పాయింట్ల తేడాతో, రాజ్కోట్ రెడ్బుల్స్ జట్టు ఫదీరాబాద్ జట్టుపై 6 పాయింట్ల తేడాతో, రాజస్థాన్జట్టు ఆంధ్రా జట్టుపై 7 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. మహిళల విభాగంలో తమిళనాడు జట్టు ఆంధ్రా జట్టుపై 19 పాయింట్ల తేడాతో, బాబా హరిదాస్ హర్యానా జట్టు కేరళ జట్టుపై 12 పాయింట్ల తేడాతో, మరో మ్చాలో హిమాచల్ప్రదేశ్ జట్టు హర్యానాపై 3 పాయింట్ల తేడాతో, ఏకపక్షంగా సాగిని మరో మ్యాచ్లో సీఆర్ఫీఎఫ్ ఢిల్లీ జట్టు జమ్మూ అండ్ కాశ్మీర్ పోలీస్జట్టుపై 40 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. హర్యానా జట్టు ఆంధ్రాజట్టుపై 14 పాయింట్ల తేడాతో గెలుపొందాయి. ఇరు విభాగాల్లోనూ వెనుకంజలో ఆంధ్రా జట్లు -
కుంగుతున్న రోడ్లు.. నిత్యం ప్రమాదాలు
ఉండి: కాలువలు, డ్రెయిన్లు పక్కనున్న ప్రధాన రహదారులు కుంగిపోతుండడంతో నిత్యం ప్రమాదాలు సంభవిస్తున్నాయి. అధికారులు ప్యాచ్వర్కుల పేరుతో ప్రజాధనాన్ని వృథా చేస్తున్నారే తప్ప శాశ్వత పరిష్కారం మాత్రం చూపలేకపోతున్నారు. దీంతో మరమ్మతులు చేసిన కొద్దికాలంలోనే రోడ్లు మళ్లీ యథాస్థితికి రావడంతో వాహనదారులకు ఇబ్బందులు తప్పడం లేదు. ప్రమాదాల బారిన వాహనదారులు కాలువలు, డ్రెయిన్లు పక్కనున్న రోడ్లు కుంగిపోవడంతో నిత్యం ప్రమాదాలు చోటుచేసుకుంటున్నాయి. ఉండి జాతీయ రహదారి చెరుకువాడ నుంచి ఆకివీడు మండలం అజ్జమూరు సరిహద్దు వరకు సుమారు రెండు కి.మీ.మేర జాతీయరహదారి ఉండి పంటకాలువలోకి కుంగిపోయింది. దీనిలో ప్రధానంగా చెరుకువాడ శివారు రైస్ మిల్లుల వద్ద జరిగిన రోడ్డు ప్రమాదంలో ఉపాధ్యాయ ఎమ్మెల్సీ షేక్ సాబ్జీ ప్రాణాలు కోల్పోయారు. అలాగే చెరుకువాడ గ్రామ పరిధిలో జాతీయ రహదారి నెత్తురోడుతుంది. నెలలో రెండు నుంచి మూడు భారీ ప్రమాదాలు తప్పడం లేదు. ఆ దారులు.. యమడేంజర్ ● ఉండి సెంటర్ నుంచి గణపవరం వెళ్లే రహదారి.. దాని పక్కనే ప్రవహిస్తున్న బొండాడ మేజర్ డ్రెయిన్తో పాటు పిల్ల కాలుల్లోకి కుంగిపోవడంతో తరచూ ప్రమాదాలు చోటు చేసుకున్నాయి. ● ఉండి మండలం వాండ్రం గ్రామానికి వెళ్లాలంటే ఉండి నుంచి లేదా కాళ్ల మండలం కోపల్లె నుంచి బొండాడ మేజర్ డ్రెయిన్ గట్టుపై వేసిన ఆర్అండ్బీ రోడ్డుపై ప్రయాణించాలి. ఈ రోడ్డు సుమారు 6 కి.మీ పొడవున ఉండగా చాలా ప్రాంతాల్లో డ్రెయిన్లోకి కుంగిపోయింది. దీనిపై ప్రయాణించే వాహనాలు పలుమార్లు ప్రమాదాలకు గురయ్యాయి. ● ఇవే కాకుండా నియోజకవర్గంలోని ఆకివీడు, కాళ్ల, పాలకోడేరు మండలాల్లోనూ ప్రధాన రహదారులు ఆయా ప్రాంతాల్లో కాలువల్లోకి కుంగిపోయాయి. దీంతో ప్రయాణికులు, వాహనదారులు బిక్కుబిక్కుమంటూ ప్రయాణం సాగిస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు, ప్రజాప్రతినిధులు స్పందించి రహదారులు కుంగిపోతున్న ప్రాంతాల్లో రివిట్మెంట్ నిర్మాణం చేపట్టాలని ప్రజలు కోరుతున్నారు. కాలువలు, డ్రెయిన్లలోకి జారిపోతున్న ప్రధాన రోడ్లు ప్రమాదాల బారిన పడుతున్న వాహనదారులు రివిట్మెంట్ వాల్స్ నిర్మించాలని వేడుకోలు -
త్వరలో ‘వాయుపుత్ర’ విడుదల
పాలకోడేరు: త్వరలో వాయుపుత్ర సినిమా విడుదల కానుందని సినీ దర్శకుడు చందు మొండేటి అన్నారు. మండలంలోని గొరగనమూడిలో జరిగిన మిత్రుల ఆత్మీయ సమ్మేళనానికి ఆయన హాజరయ్యారు. గ్రామ దేవతల ఆలయాలను సందర్శించి ప్రత్యేక పూజలు చేసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సితార ఎంటెర్టైన్మెంట్స్పై నిర్మిస్తున్న వాయుపుత్ర చిత్రం విడుదలకు సిద్ధం కానుందని, తాను గతంలో తీసిన కార్తికేయ, కార్తికేయ–2, ప్రేమమ్, తండేల్ చిత్రాలను ప్రేక్షకులు ఎంతగానో ఆదరించడం ఆనందంగా ఉందన్నారు. సంక్రాంతి సందర్భంగా తన స్నేహితుడు మాజీ సర్పంచ్ చెల్లబోయిన పాపారావు, మిత్రులను కలవడం ఆనందంగా ఉందన్నారు. ఆయన వెంట సర్పంచ్లు గొట్టుముక్కల శివాజీరాజు, బొల్లా శ్రీనివాస్, జంగం సూరిబాబు, పెన్నాడ మాజీ సర్పంచ్ ఇట్టా సురేష్బాబు తదితరులు ఉన్నారు. జంగారెడ్డిగూడెం : స్థానిక ఏరియా ఆసుపత్రిలో వైద్యురాలిపై అసభ్యంగా ప్రవర్తించిన వ్యాయామ ఉపాధ్యాయుడు తెల్లం శ్రీనివాసరావుపై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్.వి ప్రసాద్ తెలిపారు. గురువారం బుట్టాయగూడేనికు చెందిన కారం శేఖర్ కోడి పందేల్లో గాయపడ్డాడు. అతనిని తీసుకుని బుట్టాయగూడెం జెడ్పీ హెస్కూల్లో వ్యాయామ ఉపాధ్యాయుడుగా పని చేస్తున్న తెల్లం శ్రీనివాసరావు జంగారెడ్డిగూడెం ఏరియా ఆసుపత్రికి తీసుకువచ్చాడు. ఆసుపత్రి వైద్యురాలు ఎస్.దీప్తి వైద్యం చేస్తుండగా తెల్లం శ్రీనివాసరావు వైద్యురాలిపై అసభ్యంగా ప్రవర్తించి డాక్టర్ వ్యక్తిగత రూంలోకి ప్రవేశించి వీడియో తీసినట్లు తెలిపారు. దీనిపై డాక్టర్ దీప్తి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎసై తెలిపారు. -
లాడ్జిలో వ్యక్తి మృతి
జంగారెడ్డిగూడెం: స్థానికంగా ఉన్న ఒక లాడ్జ్లో ఒక వ్యక్తి అతిగా మద్యం సేవించి మృతి చెందాడు. దీనికి సంబంధించి ఎస్సై ఎన్వి ప్రసాద్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. ఆర్యవైశ్య కల్యాణ మండపం రోడ్డులో నివశిస్తున్న గూడూరి మోహన ఈశ్వర సాయి (28) విజయవాడలో ఫార్మాసిస్టుగా పనిచేస్తున్నాడు. ఈ నెల 14న పండుగకు జంగారెడ్డిగూడెం వచ్చాడు. 15 మధ్యాహ్నం ఇంటి నుంచి బయటకు వెళ్లాడు. లాడ్జిలో రూమ్ తీసుకుని రాత్రి సమయంలో కొందరు స్నేహితులతో అతను మద్యం సేవించాడు. స్నేహితులు వెళ్లిపోయాక సాయి ఇంకా మద్యం సేవించాడు. కొద్దిసేపటికి అతనికి గ్యాస్ నొప్పి రావడంతో లాడ్జి సిబ్బందిని మెడికల్ షాపునకు తీసుకువెళ్లమనగా సిబ్బంది తీసుకువెళ్లారు. ఎక్కడా మందులు దొరకక పోవడంతో తిరిగి లాడ్జికి చేరుకున్నాడు. లాడ్జి వద్దకు చేరకుని అతనిని సిబ్బంది దించారు. 16న ఉదయం చూసేసరికి లాడ్జి బయట మోహన ఈశ్వర సాయి మృతి చెంది ఉన్నాడు. దీనిపై పోలీసులకు సమాచారం ఇవ్వగా తండ్రి మల్లికార్జునరావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. -
పందేలు మామూళ్లుగా లేవు
ఉత్సాహంగా బాస్కెట్బాల్ పోటీలు నూజివీడులో నిర్వహించిన బాస్కెట్ బాల్ పోటీలు ముగిశాయి. పురుషుల విభాగంలో చైన్నె ఎస్ఆర్ఎం, మహిళల విభాగంలో కేఎల్యూ విజేతలుగా నిలిచాయి. IIలో uనరసాపురం రుస్తుంబాదలో జాతీయస్థాయి మహిళలు, పురుషులు ఇన్విటేషన్ కప్ కబడ్డీ పోటీలు ఉత్కంఠగా సాగుతున్నాయి. జట్లు హోరాహోరీగా తలపపడుతున్నాయి. IIలో uశనివారం శ్రీ 17 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: సంక్రాంతి పండుగల మాటున కూటమి నేతలు జూదాల జాతర చేసుకున్నారు. కోర్టు ఆదేశాలను లెక్కచేయకుండా ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా విచ్చలవిడిగా కోడి పందేలు, పేకాట, గుండాటలు నిర్వహించారు. జూదాల్లో పాల్గొనేవారు కాలు బయట పెట్టాల్సిన పనిలేకుండా బరుల వద్దనే సకల సదుపాయాలు కల్పించారు. పందెం రాయుళ్లను ప్రోత్సహిస్తూ విజేతలకు కానుకలు అందించారు. సంప్రదాయం మాటున సాగిన జూదాల్లో రూ.1000 కోట్లకు పైనే నగదు చేతులు మారినట్టు అంచనా. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో 300కు పైనే బరులు ఏర్పాటు చేసి పందేలు నిర్వహించారు. పండుగల మూడు రోజులు పోలీసులు పత్తాలేకుండా పోవడంతో నిర్వాహకుల ఇష్టారాజ్యమైంది. భీమవరం, ఉండి, తాడేపల్లిగూడెం, దెందులూరు, తాడేపల్లిగూడెం, చింతలపూడి, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటుచేసిన పెద్ద బరుల్లో పెద్ద మొత్తాల్లో పందేలు జరిగాయి. తాడేపల్లిగూడెంలోని బరిలో సంక్రాంతి నాడు రూ.1.53 కోట్ల పందెం జరగ్గా, కనుమ రోజు రూ.90 లక్షల పందెం జరిగింది. భీమవరం పరిసరాల్లో ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన నాలుగు పెద్ద బరుల వద్ద అధిక శాతం మేర పందేలు రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షలు వరకు జరిగితే, ఓ మాదిరి బరుల్లో రూ.లక్ష నుంచి రూ.5 లక్షల వరకు, చిన్న బరుల వద్ద రూ.10 వేల నుంచి రూ.50 వేల వరకు జరిగాయి. ఇవికాకుండా పైపందేలు కోట్లల్లో కాసుకున్నారు. ఒక్కో బరిలో రోజుకు 20 నుంచి 30 వరకు పందేలు జరిగాయి. పందెంపై 10 శాతం వరకు నిర్వాహకులు కమిషన్గా తీసుకున్నారు. గుండాట, పేకాట, కోతాట, కేసినో, ఫాస్ట్ఫుడ్ సెంటర్లను వాటి నిర్వహణలో ఆరితేరిన వారికి నిర్వాహకులు ముందుగానే రూ. 10 లక్షల నుంచి రూ.1.5 కోట్ల వరకు కాంట్రాక్టుకు ఇచ్చేశారు. తమ డబ్బులతో పాటు లాభాలు రాబట్టుకునేందుకు వారు పగలు, రాత్రీ తేడా లేకుండా యథేచ్ఛగా జూద కార్యకలాపాలు నిర్వహించారు. సొమ్ములు అయిపోయిన వారు బయటకు వెళ్లాల్సిన పనిలేకుండా బరుల వద్దనే జీరో కమిషన్పై మినీ ఏటీఎంలను సైతం పెట్టారు. పలు రకాల మాంసాహారాలతో విందు భోజనాలు, జబర్దస్త్ నటులు, ఇతర కళాకారులతో వినోద కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. మద్యం స్టాళ్లు ఏర్పాటుచేసి హాఫ్ బాటిల్, ఫుల్ బాటిల్పై రూ.50 నుంచి రూ. 100 అదనంగా వసూలు చేస్తూ విచ్చల విడిగా అమ్మకాలు సాగించారు. భీమవరం, నరసాపురం, ఉండి, నూజివీడు ప్రాంతాల్లోని కొన్ని చోట్ల ఏర్పాటుచేసిన క్యాసినోలకు తెలంగాణ, రాయలసీమ ప్రాంతాల నుంచి అధిక సంఖ్యలో పందెంరాయుళ్లు హాజరైనట్టు సమాచారం. వీరికి ప్రత్యేకమైన ట్యాగులు అందజేశారు. పెద్ద బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటుచేశారు. ప్రత్యేకంగా ఏర్పాటుచేసిన గ్యాలరీల్లోకి ఇతరులు రాకుండా పందేల్లో పాల్గొనే వారు, పుంజులు తెచ్చినవారు, చూసేందుకు వచ్చిన వీఐపీలకు వేర్వేరు చేతిబ్యాండ్లు అందజేసి వారిని మాత్రమే గ్యాలరీల్లోకి అనుమతించారు. పట్టణ శివార్లలోని పలు గెస్ట్హౌస్లు, ప్లాట్లు పేకాట క్లబ్బులుగా మారిపోయాయి. పందెంరాయుళ్లకు కానుకలు బరుల వద్దకు పందెంరాయుళ్లను ఆకర్షించేందుకు నిర్వాహకులు కానుకల ఎత్తుగడ వేశారు. ఎక్కువ పందేల్లో గెలిచిన వారికి బుల్లెట్లు కానుకగా అందజేశారు. తణుకులోని ఒక బరిలో మూడు రోజుల్లో ఆరు బుల్లెట్లు కానుకలుగా అందజేయగా, నవుడూరులోని ఒక బరిలో ఒకరికి, నీలాద్రిపురం బరిలోను ఒకరికి, నూజివీడు నియోజకవర్గంలోని 10 బరుల్లోను, పోలవరం బరిలోను బుల్లెట్లు కానుకగా ఇచ్చారు.కోర్టు ఆదేశాలను పక్కనపెట్టి పందేలు, జూదాల నిర్వహణకు సహకరించినందుకు పలువురు ఎమ్మెల్యేలు, పోలీసులకు ముడుపులు ముట్టచెప్పే పనిలో నిర్వాహకులు ఉన్నారు. మధ్యవర్తిత్వం నెరిపిన కూటమి నేతలే ఈ మామూళ్ల సంగతి చూసుకుంటున్నారు. కొందరు ఎమ్మెల్యేలకు పెద్ద బరుల నుంచి రూ.25 లక్షలు వరకు అందజేయాలని నిర్ణయించినట్టు తెలుస్తోంది. చిన్నా పెద్దా తేడా లేకుండా అన్ని బరుల నుంచి స్టేషన్ మామూళ్లు రాబట్టే పనిలో ఉన్నారు. పందేలు, పేకాట, గుండాట తదితర జూద కార్యకలాపాల ద్వారా ఈ మూడు రోజులు జిల్లాలోని ఏ బరుల వద్ద ఎంత మొత్తంలో నగదు చేతులు మారింది ఇప్పటికే పోలీసుల వద్ద లెక్కలు ఉన్నట్టు సమాచారం. సంక్షేమ నిధి పేరిట చిన్నా పెద్ద బరుల వద్ద రూ.50 వేలు నుంచి రూ. ఐదు లక్షలు వరకు వసూలు చేస్తున్నట్టు తెలుస్తోంది. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా ఏర్పాటుచేసిన 40 వరకు పెద్ద బరుల్లో మామూళ్ల మొత్తం మరింత అధికంగా ఉంటుందంటున్నారు. జిల్లాలో జోరుగా కోడిపందేలు జరిగినట్టు మీడియాలో కథనాలు నేపధ్యంలో వాటిని అడ్డుకున్నట్టుగా కోర్టుకు చూపించే నిమిత్తం కొందరు వ్యక్తులు, పుంజులను అప్పగించాలని ఇప్పటికే పోలీసుల నుంచి నిర్వాహకులకు కబుర్లు పంపుతున్నారు. కత్తులు దూశాయ్.. కట్టలు తెగాయ్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా జూదాల జాతర ఎక్కడ చూసినా కోడి పందేలు, గుండాట, పేకాట రూ.కోట్లల్లో పందేలు, చేతులు మారిన వందల కోట్లు డబ్బులు ఇచ్చేందుకు బరుల వద్దనే మినీ ఏటీఎంలు నిర్వాహకుల నుంచి కూటమి నేతలు, పోలీసులకు భారీగా మామూళ్లు బరికి రూ.5 లక్షల నుంచి రూ.50 లక్షల పైనే ముడుపులు కోడిపందేలను వీక్షించేందుకు పలువురు రాజకీయ సినీ ప్రముఖులు తరలివచ్చారు. ఎంపీ బీద మస్తానన్ రావు, ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు, నిర్మాత దగ్గుబాటి సురేష్, సినీ హీరోలు బెల్లంకొండ శ్రీనివాస్, రోషన్, హీరోయిన్న్డింపుల్ హయాతి, యాంకర్ జెమినీ సురేష్, సినీ నటి హేమ తదితర సినీ రంగ ప్రముఖులు ఉన్నారు. -
కమనీయం.. కనుమ ఉత్సవం
● అట్టహాసంగా దొరసానిపాడుకు తరలి వెళ్లిన శ్రీవారు ● ఆకట్టుకున్న చిత్ర విచిత్ర వేషధారణలు ద్వారకాతిరుమల: శ్రీవారి కనుమ ఉత్సవం భక్తులకు కనువిందు చేసింది. ఉత్సవం నిమిత్తం శుక్రవారం దొరసానిపాడు గ్రామానికి తరలివెళ్లిన స్వామివారి దివ్య మంగళ స్వరూపాన్ని వీక్షించిన భక్తజనులు పరవశించారు. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, చిత్రవిచిత్ర వేషధారణలు, కేరళ డప్పు వాయిద్యాల నడుమ దొరసానిపాడు గ్రామంలో సంబరంలా జరిగిన ఈ ఉత్సవం అంబరాన్నంటింది. ముందుగా శ్రీవారి ఆలయంలో మధ్యాహ్నం ఉభయ దేవేరులతో స్వామివారిని రాజాధిరాజ వాహనంలో ఉంచి అర్చకులు ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ శ్రీవారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా పురవీధులకు పయనమైంది. తిరువీధుల్లో భక్తులకు దర్శనమిచ్చిన స్వామివారు, కొండ వెనుక భాగాన ఉన్న దొరసానిపాడు గ్రామానికి కనుమ ఉత్సవం నిమిత్తం అట్టహాసంగా తరలివెళ్లారు. గ్రామంలో మహిళలు శ్రీవారి వాహనం వచ్చే దారి పొడవునా రంగవల్లులను తీర్చిదిద్ది, పూలతో ఘన స్వాగతం పలికారు. దొరసానిపాడు పురవీధుల్లో తిరుగాడిన అనంతరం స్వామివారు రాత్రి కనుమ మండపం వద్దకు చేరుకుని భక్తులకు దర్శనమిచ్చారు. ఆ తరువాత శ్రీవారు, అమ్మవార్లను మండపంలో ఉంచి అర్చకులు, పండితులు ప్రత్యేక పూజలు జరిపి, హారతులిచ్చారు. గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు, ఆలయ ఈఓ వై.భద్రాజి ఈ వేడుకలో పాల్గొన్నారు. ఉత్సవంలో వేలాదిగా పాల్గొన్న భక్తులకు స్వామివారి తీర్ధ ప్రసాదాలను పంపిణీ చేశారు. అనంతరం శ్రీవారు, అమ్మవార్లు గిరిప్రదక్షిణగా తిరిగి ఆలయానికి చేరుకున్నారు. -
వైఎస్సార్సీపీ గ్రామ కమిటీలు నియమించాలి
అత్తిలి: వైఎస్సార్సీపీ గ్రామకమిటీలు నియమించి పార్టీని మరింత బలోపేతం చేసే దిశగా పార్టీ శ్రేణులు కృషిచేయాలని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. అత్తిలి మండలం లక్ష్మీనారాయణపురంలో వైఎస్సార్సీపీ నాయకులతో ముఖ్య సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి కారుమూరి నాగేశ్వరరావు మాట్లాడుతూ పార్టీలో కష్టపడి పనిచేసే వారికి తగిన గుర్తింపు లభిస్తుందని, వచ్చే ఎన్నికలలో వైఎస్సార్సీపీ అధికారం చేపట్టడం ఖాయమన్నారు. గ్రామాలలో పార్టీ నాయకులు ఏకతాటిపై నిలిచి పార్టీ ఇచ్చే ప్రతీ కార్యక్రమాన్ని విజయవంతం చేయడంలో కీలకపాత్ర పోషించాలన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు పైబోయిన సత్యనారాయణ, ఎంపీటీసీ సభ్యుడు ఆడారి శ్రీనివాసరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు బొడ్డేటి శ్రీనివాసరావు, మండల ఉపాధ్యక్షుడు దొడ్డి వెంకటేశ్వరరావు, ప్రగడ బాలు తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి మళ్లీ సీఎం కావాలని ఆ శ్రీవారిని వేడుకున్నట్టు వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆర్.శ్యామల తెలిపారు. సంక్రాంతి పర్వదినాన్ని పుర స్కరించుకుని గురువారం ఆమె ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. అనంతరం ఆలయ ముఖ మండపంలో పండితులు ఆమెకు శ్రీవారి శేష వస్త్రాన్ని కప్పి, వేద ఆశీర్వచనాన్ని పలికి, స్వామి వారి చిత్రపటాన్ని, ప్రసాదాలను అందజేశారు. ఆ తరువాత ఆమె ఆలయ తూర్పురాజగోపురం వద్ద మీడియాతో మాట్లాడారు. తన సొంత ఊరు కాకినాడని, హైదరాబాద్ వెళ్లిన తరువాత ఇక్కడకు రావడం తగ్గిందన్నారు. ఆ స్వామి ఆశీస్సుల వల్లే అనుకోకుండా సంక్రాంతి పండుగ రోజు ఇక్కడకు వచ్చానని, శ్రీవారిని దర్శించుకోవడం సంతోషాన్ని కలిగించిందన్నారు. నా మనస్సులో ఉన్న కోరిక జగన్ సీఎం కావడమేనని, అది తొందరలో నెరవేరాలని స్వామిని వేడుకున్నట్టు చెప్పారు. పెనుగొండ: ఆచంట మండలం కందరవల్లిలో శుక్రవారం ప్రభల తీర్థం వేడుకగా జరిగింది. సంక్రాంతి సందర్భంగా మూడో రోజు కనుమ రోజున ఇక్కడ ప్రభల తీర్థం నిర్వహించడం ఆనవాయితీగా వస్తుంది. మండలంలోని కోడేరు, కరుగోరుమిల్లి, కందరవల్లి, పెనుమంచిలి గ్రామాల నుంచి ప్రభలను ఊరేగింపుగా తీసుకువస్తే కందరవల్లిలో కొలువు తీర్చారు. అనేక మంది భక్తులు ప్రభలను దర్శించుకున్నారు. భీమవరం: సంక్రాంతి సందర్భంగా భీమవరం పట్టణంలో ట్రాఫిక్ నియంత్రణలో ముఖ్యభూమిక పోషించిన పోలీసు సిబ్బందికి ఎస్పీ అద్నాన్ నయీం ఆస్మీ అభినందలు తెలిపారు. సాధారణ రోజుల్లోనే రద్దీగా ఉండే భీమవరం పట్టణం సంక్రాంతి సమయంలో జనసంద్రంగా మారుతుందని అలాంటి క్లిష్ట పరిస్థితులలో కూడా వాహన రద్దీని నియంత్రించి ప్రజలకు అసౌకర్యం కలగకుండా భీమవరం పోలీసులు అత్యుత్తమ పనితీరు కనబర్చారన్నారు. -
‘తాట్కూరు’ గతి ఇంతేనా?
● ముంపు సాకుతో మరమ్మతులకు నోచుకోని వైనం ● పదేళ్లుగా రైతుల భూములకు అందని సాగునీరు వేలేరుపాడు: ప్రభుత్వాల పనితీరు పోలవరం ముంపు ప్రాంత రైతులకు శాపంగా మారింది. గోదావరి నీటిని పొలాలకు మళ్ళించేందుకు వేలేరుపాడు మడలంలోని తాట్కూరుగొమ్ములో ఏర్పాటు చేసిన ఎత్తిపోతల పధకం పదేళ్లుగా వృథాగా ఉంది. 2003లో రూ.1.8 కోట్లు వెచ్చించి ఐడీసీ శాఖ కాంట్రాక్టర్ ద్వారా నిర్మించిన ఈ ఎత్తిపోతల పథకం అలంకార ప్రాయంగా మారింది. ఈ ఎత్తిపోతలకు సంబంధించిన ఎనిమిది ఇన్ఫిల్టర్ వెల్స్ గోదావరి నీళ్ళలోనే నిర్మించారు. పంపుహౌస్లు, ప్రత్యేక విద్యుత్ లైన్ కూడా నిర్మించారు. ఈ ఎత్తిపోతల పథకం పరిధిలో మొత్తం 1,054 ఎకరాల ఆయకట్టు ఉంది. 300 మంది రైతులు ఈ ఎత్తిపోతల పథకం సాగునీటిపైనే ఆధారపడ్డారు. నిర్మించిన మూడేళ్లు పథకం బాగానే పనిచేసింది. ఆ తర్వాత మరమ్మతులు రావడంతో ఎవరూ పట్టించుకోవడం లేదు. పదేళ్ళుగా మరమ్మత్తులకు నోచుకోవడం లేదు. దీంతో రైతుల భూములకు చుక్క నీరందడంలేదు. ఐదేళ్ళ క్రితం దీని మరమ్మత్తులకు రూ.20 లక్షలు మంజూరైనప్పటికీ పోలవరం ముంపు సాకుతో నిధులను అధికారులు వెనక్కు పంపారు. రైతులు ఎంత ప్రాధేయపడ్డా వారి గోడును అధికారులు పట్టించుకోకుండా ముంపు ప్రాంతంలో మరమ్మతులు అనవసరమంటూ సాకు చూపారు. ఆ తర్వాత దీని గురించి రైతులు ఎన్నిసార్లు విన్నవించినా పట్టించుకోడంలేదని రైతులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఈ ఎత్తిపోతలపై ఆశలు వదులుకొని ప్రత్యామ్నాయ మార్గాలను చూసుకుంటున్నారు. గోదావరిలో ఆయిల్ ఇంజన్లు, విద్యుత్ మోటరులు వాడుకుంటూ పంటలకు సాగునీరు అందిస్తున్నారు. ఈ ఎత్తిపోతలకు సంబంధించిన మోటర్లు, ఇతర సామాగ్రి శిథిలమైపోతోంది. ఇకనైనా అధికారులు స్పందించి మరమ్మతులు చేపట్టి, సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని ఆయకట్టు రైతులు కోరుతున్నారు. -
కనుమ ఉత్సవానికి సర్వం సిద్ధం
ద్వారకాతిరుమల: శ్రీవారి కనుమ ఉత్సవానికి సర్వం సిద్ధమైంది. ఈ నెల 16న మండలంలోని దొరసానిపాడులో కనుమ మండపంలో ఈ ఉత్సవాన్ని దేవస్థానం అంగరంగ వైభవంగా నిర్వహించనుంది. సిబ్బంది ఇప్పటికే కనుమ మండపాన్ని, పరిసరాలను సుందరీకరించారు. ఆ ప్రాంతం విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతోంది. ఏటా సంక్రాంతి పండుగ మరుసటి రోజు స్వామివారు, ఉభయ దేవేరులతో కలసి దొరసానిపాడు గ్రామానికి అట్టహాసంగా వెళ్తారు. ఏడాదికోమారు తమ గ్రామానికి విచ్చేసే స్వామివారి ఆగమనం కోసం ఆ గ్రామస్తులు నియమ నిష్టలతో, భక్తి ప్రపత్తులతో నిరీక్షిస్తారు. కనుమ అయినప్పటికీ ఆ గ్రామ ప్రజలు మాంసాహారాన్ని ముట్టరు. ఈ క్రమంలో శుక్రవారం సాయంత్రం స్వామివారు ఉభయ దేవేరులతో కలసి రాజాధిరాజ వాహనంపై క్షేత్రం నుండి బయలుదేరి మండపానికి చేరుకుంటారు. అనంతరం ఆలయ అర్చకులు శ్రీవారు, అమ్మవార్లను మండపంలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహిస్తారు. ఆ తరువాత గిరిప్రదక్షిణగా ఆలయానికి చేరుకుంటారు. వైభవోపేతంగా జరిగే ఈ వేడుకలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొనాలని ఆలయ ఈఓ వై.భద్రాజి కోరారు. -
భోగి మంటల్లో ప్రైవేటీకరణ జీఓలు
● వైద్య కళాశాలలను ప్రభుత్వమే నిర్వహించాలని వైఎస్సార్సీపీ డిమాండ్ ● చంద్రబాబు ప్రభుత్వం విడుదల చేసిన జీవోల దహనం సాక్షి, భీమవరం/కై కలూరు: వైద్య విద్యను ప్రైవేట్పరం చేయాలన్న చంద్రబాబు ప్రభుత్వం పోకడలపై ప్రజల పక్షాన వైఎస్సార్సీపీ ఎడతెగని పోరాటం చేస్తోంది. ప్రైవేటీకరణ కోసం విడుదల చేసిన జీవోల ప్రతులను బుధవారం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా పార్టీ శ్రేణులు భోగి మంటల్లో దహనం చేశారు. ప్రభుత్వం వెనుకడుగేసేంత వరకూ పోరు ఆపేది లేదని స్పష్టం చేశారు. కై కలూరులోని పార్టీ కార్యాలయం వద్ద జిల్లా అధ్యక్షుడు, కై కలూరు కో–ఆర్డినేటర్ దూలం నాగేశ్వరరావు పెద్ద ఎత్తున పార్టీ శ్రేణులతో కలిసి జీఓ ప్రతులను దగ్ధం చేసి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. డీఎన్నార్ మాట్లాడుతూ మాజీ ముఖ్యమంత్రి వైఎస్.జగన్మోహన్రెడ్డి రాష్ట్రానికి 17 వైద్య కాలేజీలను తీసుకొచ్చారని.. వీటిని ప్రైవేటు పరం చేయడం వల్ల పేదలకు వైద్య సేవలు దూరమవుతాయన్నారు. ప్రభుత్వం టెండర్లు పిలిచినా ఎలాంటి సంస్థలు ముందుకు రాకపోవడం ఈ విధానంపై వ్యతిరేకతకు నిదర్శనమన్నారు. ఏలూరులోని పార్టీ జిల్లా కార్యాలయం ఎదుట నియోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు అధ్యక్షుడు జి.శ్రీనివాస్, జిల్లా అధికార ప్రతినిధి మున్నూరు జాన్ గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, వైఎస్సార్టీయూ జిల్లా అధ్యక్షుడు పల్లి శ్రీనివాస్, అధిక సంఖ్యలో పార్టీ శ్రేణులు భోగి మంటల్లో జీఓ ప్రతులను దగ్ధం చేశారు. చింతలపూడి మండలం ఫాతిమాపురంలో వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధులు కారుమూడి వెంకటరెడ్డి, ఆర్.శ్యామల భోగి మంటల్లో జీవో ప్రతులను వేసి దహనం చేశారు. -
రానున్నది జగనన్న ప్రభుత్వమే
కాళ్ళ: రానున్నది వైఎస్సార్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వమేనని వైఎస్సార్సీపీ నాయకుడు బైరెడ్డి సిద్దార్థ్ రెడ్డి అన్నారు. మంగళవారం రాత్రి ఆయన నియోజకవర్గంలో పర్యటించారు. ఈ సందర్భంగా ఉండి నియోజకవర్గ పార్టీ కార్యాలయంలో పార్టీ శ్రేణులను కలిశారు. పార్టీ కార్యకర్తలు, అభిమానులు, నాయకులు జగన్మోహన్రెడ్డి ఆశయాలకు అనుగుణంగా పనిచేయాలని పిలుపునిచ్చారు. ప్రజలంతా కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకంగా వున్నారని రానున్నది జగన్న ప్రభుత్వమేనని చెప్పారు. ఈ సందర్భంగా పార్టీ కార్యాలయంలో భీమవరం, ఉండి నియోజకవర్గ స్థాయి నాయకులను కలిసి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ముందుగా నియోజకవర్గ ఇన్చార్జి పీవీఎల్ నర్సింహరాజు ఆధ్వర్యంలో ఆయనకు ఘనంగా స్వాగతం పలికారు. ఏలూరు టౌన్: ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో సంక్రాంతి సంబరాలు అంబరాన్ని అంటాయి. తెలుగు జాతి సంస్కృతి సంప్రదాయాల విశిష్టతను భావితరాలకు తెలియజేసేలా జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్, పూర్వ జేసీ ధాత్రిరెడ్డి ప్రత్యేక ఆకర్షణగా నిలిచారు. హరిదాసుల వేషధారణ, కర్రసాము, రంగవల్లుల పోటీలు, పతంగుల పోటీలు నిర్వహించారు. ఎస్పీ దంపతులు ఎద్దుల బండిపై సందడి చేశారు. అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏఆర్ అదనపు ఎస్పీ మునిరాజా, డీఎస్పీ శ్రావణ్కుమార్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, మహిళా స్టేషన్ డీఎస్పీ యు.రవిచంద్ర, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్ తదితరులు సంప్రదాయ వస్త్రధారణతో అలరించారు. భీమవరం: కార్మికులు, కర్షకులు, ప్రజలకు తీవ్ర నష్టం కలిగించే నూతన చట్టాలు కాలి బూడిద కావడమే పీడిత ప్రజలకు భోగి వెలుగులని పలువురు ప్రజాసంఘాలు నాయకులన్నారు. బుధవారం భీమవరంలో సంక్రాంతి సందర్భంగా ఏర్పాటు చేసిన భోగి మంటల్లో ఉపాధి హామీ, కార్మికులకు నష్టం కలిగించే జీ రామ్ జీ చట్టాల ప్రతులతోపాటు లేబర్ కోడ్ ప్రతులను వేసి దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, కౌలు రైతు సంఘం జిల్లా కార్యదర్శి మామిడిశెట్టి రామాంజనేయులు, సీఐటీయు జిల్లా సహాయ కార్యదర్శి మల్లిపూడి ఆంజనేయులు మాట్లాడుతూ వ్యవసాయ, పారిశ్రామిక రంగాల్లో ఉపాధి లేకుండా చేసి కార్పొరేట్లకు కోట్లాది రూపాయల రాయితీలు కల్పించే చట్టాలను భోగి మంటల్లో కాల్చి బూడిద చేయడమే దేశ ప్రజలకు వెలుగన్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): ఏపీ విద్యుత్ నియంత్రణ మండలి (ఏపీఈఆర్సీ) ఆధ్వర్యంలో విద్యుత్ చార్జీలు, టారిఫ్లపై ఈ నెల 20, 22, 23, 27 తేదీలలో ఏపీఈఆర్సీ ఛైర్మన్ పీవీఆర్ రెడ్డి అధ్యక్షతన బహిరంగ ప్రజాభిప్రాయ సేకరణ జరుగుతుందని, విద్యుత్ వినియోగదారులు పాల్గొనాలని ఏపీఈపీడీసీఎల్ తాడేపల్లిగూడెం డివిజన్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ కె.నరసింహమూర్తి కోరారు. 20న తిరుపతిలో, 22, 23 తేదీలలో విజయవాడలో, 27న కర్నూలులో ప్రజా అభిప్రాయాలను వీడియో కాన్పరెన్స్ ద్వారా తీసుకుంటారని వెల్లడించారు. వీడియో కాన్ఫరెన్స్ స్థానిక జువ్వలపాలెం శివారు డివిజన్ ఈఈ కార్యాలయంలో జరుగుతుందని, ఆయా తేదీలలో విద్యుత్ వినియోగదారులు పాల్గొని అభిప్రాయాలను వెల్లడించాలని కోరారు. -
సంక్షేమ పథకాలు లేవు
జగనన్న ప్రభుత్వం సంక్షేమ పథకాలు కారణంగా ఏటా చేతిలో ఎంతో కొంత సొమ్ము ఉండేది. దీంతో ఏ పండుగ వచ్చినా, ఏ అవసరం వచ్చిన భయపడే పరిస్థితి ఉండేది కాదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత ఒక్క సంక్షేమ పథకం లేదు. – ముప్పిడి నాగేశ్వరరావు, జంగారెడ్డిగూడెం ఆరోగ్యశ్రీని చంద్రబాబు ప్రభుత్వం నీరు గార్చింది. జగనన్న ప్రభుత్వాసుపత్రుల్లో మెరుగైన సేవలు అందించేందుకు అన్ని ఏర్పాట్లు చేశారు. వైద్య విద్యను ప్రోత్సహిస్తూ, మరింత మంది వైద్యులు సమాజంలోకి వచ్చేలా 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను సైతం తీసుకువచ్చారు. అయితే ప్రభుత్వం మారడంతో, అధికారంలోకి వచ్చిన చంద్రబాబు వాటిని ప్రైవేట్ పరం చేయాలని చూస్తున్నాడు. – కొత్తూరి స్టాలిన్, జంగారెడ్డిగూడెం జగన్ హయాంలో లక్షలాది ఇళ్లు మంజూరు చేశారు. చాలా మంది పేదలు జగనన్న ఇచ్చిన స్థలంలో, ఇంటిని కట్టుకుని సంతోషంగా ఉన్నారు. కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత కొత్తగా ఇంటి స్థలం గాని, ఇల్లుగాని మంజూరు చేయలేదు. గత ప్రభుత్వంలో మంజూరు చేసిన వాటికి కూడా కొర్రి పెట్టేలా చూస్తోంది. – దున్న శివ, జంగారెడ్డిగూడెం విద్యార్థులకు ఉన్నత విద్య అవకాశాలు బాగుంటాయని ఆశపడ్డాం. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ నిర్ణయంతో ఉన్నత విద్య ఆశలపై నీళ్లు చల్లినట్టయింది. నేను చెన్నయ్లో చదువుతున్నా. గతంలో చాలా మంది ఏపీ ప్రజలు చదువు కోసం ఇక్కడికి రావాల్సిన అవసరం లేదని అనేవారు. ప్రభుత్వం మారడం.. ప్రస్తుత ప్రభుత్వ ప్రైవేటీకరణ నిర్ణయంతో మా తరువాత వచ్చే విద్యార్థులు ఇతర రాష్ట్రాలకు వెళ్లాల్సిన పరిస్థితి. – ఉరిటి భాను మాణిక్యమూర్తి, చెన్నయ్ నుంచి జుత్తిగకు వచ్చిన యువకుడు -
పందెం కొట్టిన కోడి
గురువారం శ్రీ 15 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి, భీమవరం: పోలీసులపై పందెంరాయుళ్లే పైచేయి సాధించారు. ఉమ్మడి జిల్లా అంతటా కోళ్లకు కత్తులు కట్టి పందేలకు తెరలేపారు. కూటమి ప్రజా ప్రతినిధులు దగ్గరుండి బరులను ప్రారంభించారు. పందేల మాటున పెద్ద ఎత్తున గుండాట, పేకాట, కోతాట, జూదాలను యథేచ్ఛగా నిర్వహిస్తున్నారు. మొదటి రోజునే రూ.100 కోట్లకు పైగా నగదు చేతులు మారుతుందని అంచనా. కోడి పందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామంటూ ప్రచారం హోరెత్తించిన పోలీసు యంత్రాంగం పత్తా లేకుండా పోయింది. మైకులు మూగబోయాయి. పశ్చిమగోదావరి, ఏలూరు జిల్లాల్లో ఎక్కడ చూసిన కోడిపందేల జోరే కనిపిస్తోంది. కూటమి నేతల ఆధ్వర్యంలో వందకు పైనే బరులు ఏర్పాటు చేశారు. ఉదయం నుంచే పందేలు, గుండాట, పేకాటను మొదలుపెట్టేశారు. డేగాపురం, నరసాపురం, పెదఅమిరంలో క్యాసినోలు ఏర్పాటుచేసి భారీ మొత్తంలో జూద కార్యకలాపాలు నిర్వహిస్తున్నారు. ఎక్కువ మంది తెలంగాణ నుంచి వచ్చిన వారే క్యాసినోలోకి వెళ్తున్నట్లు సమాచారం. భీమవరం, ఉండి, దెందులూరు, తాడేపల్లిగూడెం, నూజివీడు, ఉంగుటూరు, తణుకు తదితర చోట్ల ఏర్పాటుచేసిన పెద్ద బరుల వద్ద బౌన్సర్లను ఏర్పాటుచేశారు. పందెం కోసం పుంజులు తెచ్చినవారికి, డబ్బులు కాసేవారికి, చూసేందుకు వచ్చేవారికి వేర్వేరు చేతి బ్యాండ్లు ఇచ్చి గ్యాలరీల్లోకి అనుమతిస్తున్నారు. ఎక్కడికక్కడ మద్యం స్టాళ్లు ఏర్పాటచేసి విచ్చలవిడిగా మద్యం అమ్మకాలు చేస్తున్నారు. పట్టణ శివార్లలోని పలు గెస్ట్హౌస్లు, ప్లాట్లు పేకాట శిబిరాలతో జూద కేంద్రాలుగా మారిపోయాయి. చేతులు మారుతున్న రూ.కోట్లు పెద్ద బరుల్లో ఒక్కో పందె రూ. 5 లక్షల నుంచి రూ. 20 లక్షల వరకు జరిగితే, ఓ మాదిరి బరుల్లో రూ.50 వేల నుంచి రూ. 2 లక్షల వరకు, చిన్న బరుల వద్ద రూ. 5 వేల నుంచి రూ. లక్ష వరకు పందేలు జరుగుతున్నాయి. రూ.లక్ష నుంచి రూ.కోట్లలో పై పందేలు జరుగుతున్నాయి. చిన్నా పెద్దా బరులు కలిపి తొలిరోజు రూ. 100 కోట్లకు పైనే నగదు చేతులు మారినట్టు అంచనా. ● ఉండి నియోజకవర్గంలో.. పెదఅమిరంలో స్టేడియంను తలపించేలా ఏర్పాటుచేసిన పందెం బరిని డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు కోడి పందేలను ప్రారంభించారు. సీసలి, కలవపూడి, ఆకివీడు, అర్జమూరు, గుమ్ములూరు, సిద్దాపురం, ఉండి, మహదేవపట్నం, పాలకోడేరు, విస్సాకోడేరు, గరగపర్రు తదితర చోట్ల 40 బరుల్లో పందేలు జరుగుతున్నాయి. ● తాడేపల్లిగూడెం నియోజకవర్గంలో.. నియోజకవర్గంలో 27 చోట్ల బరులు ఏర్పాటు చేశారు. తాడేపల్లిగూడెంలోని పెద్దబరిలో తొలిరోజు 20 పందేలు రూ. 5 కోట్ల వరకూ సాగాయి. ఒక పందెం రూ.63 లక్షలు వెళ్లింది. ఉదయం కొన్ని బరుల వద్ద పోలీసులు హడావుడి చేసినప్పటికీ తర్వాత షరా మామూలే.. ● పాలకొల్లు నియోజకవర్గంలో.. పూలపల్లి, కలగంపూడి, యలమంచిలి, శివదేవుని చిక్కాల, పోడూరు తదితర ప్రాంతాల్లో 25కు పైగా బరులను ఏర్పాటుచేశారు. ఆయా చోట్ల గుండాట, పేకాటలు యథేచ్ఛగా సాగుతున్నాయి. అడ్డుకుంటామన్న పోలీసులు బరుల వద్ద ఎక్కడా కనిపించలేదు. ● భీమవరం నియోజకవర్గంలో.. ఎనిమిది పెద్ద బరులు, మరో 15 చిన్నబరులు ఏర్పాటు చేశారు. డేగాపురంలోని పెద్ద బరిలో క్యాసినో ఏర్పాటుచేసి బయటివాళ్లను రానివ్వకుండా పకడ్బందీగా నిర్వహిస్తున్నారు. రాజసభ సభ్యుడు బీద మస్తానన్ రావు, వైజాగ్ ఎమ్మెల్యే గంటా శ్రీనివాసరావు భీమవరం మండలంలో జరిగిన బరుల్లో పాల్గొన్నారు. ● తణుకు నియోజకవర్గంలో.. కూటమి నేతల ఆధ్వర్యంలో ఉదయం నుంచే కోడిపందేలు, జూదాలు జోరుగా జరుగుతున్నాయి. నియోజకవర్గంలో సుమారు 20 బరులు ఏర్పాట్లు చేసి పందేలు నిర్వహిస్తున్నారు. ● ఆచంట నియోజకవర్గంలో.. పెనుగొండ, దొంగరావిపాలెం, మార్టేరు, సత్యవరం, కవిటం, కొడమంచిలి, చినమల్లం, వల్లూరు, పెళ్లికూతరమ్మ చెరువులో కోడిపందేలు జోరుగా ప్రారంభమయ్యాయి. ఉదయం 10 గంటల వరకు హడావుడి చేసిన పోలీసులు వదిలివేయడంతో విచ్చలవిడిగా జూదం, కోడిపందేలు జరిగాయి. ● పోలవరం నియోజకవర్గంలో.. కొమ్ముగూడెం, దొరమామిడి, దుద్దుకూరు, రెడ్డిగణపవరం, అంతర్వేదిగూడెం, కొవ్వాడ, జీలుగుమిల్లి మండలంలో కామయ్యపాలెం, జీలుగుమిల్లి, రాచన్నగూడెంలలో కోడిపందేలు నిర్వహిస్తున్నారు. జీలుగుమిల్లిలో ఎమ్మెల్యే చిర్రా బాలరాజు కోడిపందేలు ప్రారంబించారు. పోలవరంలో గూటాల, పట్టిసీమ, కన్నాపురం అడ్డరోడ్డు, గుంజవరం గ్రామాల్లో భారీగా కోడిపందేలు నిర్వహిస్తున్నారు. ● నూజివీడు నియోజకవర్గంలో.. మీర్జాపురంలో పెద్దెత్తున పందేలు నిర్వహిస్తున్నారు. నియోజకవర్గం మొత్తంగా 16 చోట్ల భారీగా కోడిపందేలు జరుగుతున్నాయి. ఒక్కొక్క పందెం సుమారు రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షల వరకు జరుగుతున్నాయి. ● ఉంగుటూరు నియోజకవర్గంలో.. నియోజకవర్గం మొత్తంగా 25 బరులు వేశారు. ఉంగుటూరు మండలం నారాయణపురంలో ఒక బరి స్థానిక ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు పర్యవేక్షణలో జరుగుతోంది. బలమైన సామాజికవర్గం వారు ఆ బరి వద్ద పాల్గొంటున్నారు. బాదంపూడిలో జరిగే బరిలో పాల్గొనేందుకు రాయలసీమ, తెలంగాణ నుంచి పందెం రాయుళ్లు వస్తున్నారు. ● దెందులూరు నియోజకవర్గంలో.. నియోజకవర్గంలో 15 గ్రామాల్లో కోడిపందేలు జరిగాయి. పెదివేగి మండలంలో దుగ్గిరాల పెద్ద పందేలు జరగగా, ఈ పందేలు ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ పర్యవేక్షణలో జరిగాయి. ● నరసాపురం నియోజకవర్గంలో.. మొత్తం 25 బరులు వేశారు. గుండాట పేకాట విస్తృతంగా సాగుతోంది. నరసాపురం పట్టణంలోని వీవర్స్కాలనీలో ఏర్పాటు చేసిన కోడిపందేలను ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పాల్గొన్నారు. ● చింతలపూడి నియోజకవర్గంలో చింతలపూడి మండలంలో చింతంపల్లి, రేచర్ల, రాఘవాపురం, లింగపాలెం మండలం ములగలంపాడు, కలరాయనగూడెం, మల్లేశ్వరం, కామవరపుకోట మండలం కామవరపుకోట పాతూరు, వెంకటాపురం, రావికంపాడు, రత్నగిరినగర్, జంగారెడ్డిగూడెం మండలం శ్రీనివాసపురం, లక్కవరం, జంగారెడ్డిగూడెం పట్టణంలో పెద్ద పందేలు జరిగాయి. ములగలంపాడులో మాజీ ఎంపీ కోటగిరి శ్రీధర్ కోడి పందేలను ప్రారంభించారు. ● కై కలూరు నియోజకవర్గంలో.. 18 చోట్ల కోడిపందేల బరులను ఏర్పాటు చేశారు. గుండాట, పేకాట, కోతాట కూడా జోరుగా సాగుతోంది. ఇక్కడ అన్నీ చిన్న పందేలే జరుగుతున్నాయి.ఏలూరు మండలం మాదేపల్లిలో తలపడుతున్న కోళ్లు బరుల్లో కోట్లాట పోలీసులపై పందెంరాయుళ్ల పైచేయి మూగపోయిన పోలీసుల మైకులు ఉమ్మడి జిల్లావ్యాప్తంగా జూదాల జాతర బరుల వద్ద గుండాట, పేకాట, కోతాటలు, క్యాసినోలు, మద్యం స్టాళ్లు కోడి పందేలను ప్రారంభించిన కూటమి నేతలు -
ఊళ్లన్నీ వెలవెల
● సంక్షేమ సాయం లేక సామాన్యుడు ఢీలా ● పెరిగిన నిత్యావసరాల ధరలు ● జగన్ ప్రభుత్వ సంక్షేమ రాజ్యంతో పోల్చుకుని చర్చలు జంగారెడ్డిగూడెం: సంక్రాంతి సందడి ఈ సారి కానరావడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పండుగలన్నీ వెలవెలబోతున్నాయి. వైఎస్సార్సీపీ ప్రభుత్వం హయాంలో ఏదో ఒక రూపంలో ప్రజలకు సహాయం అందేది. ముఖ్యంగా సంక్రాంతి సమయంలో సంక్షేమ పథకాల సొమ్ములు జమ కావడంతో ప్రజలంతా సంతోషంగా పెద్ద పండుగ జరుపుకునేవారు. ఈ రెండేళ్లలో పరిస్థితి పూర్తిగా మారిపోయింది. ఎవరి చేతిలోనూ డబ్బులు ఆడక చాలా ఇబ్బంది పడుతున్నారు. సంక్రాంతి పండుగకు సొంతూళ్లకు వచ్చిన వారు, ఇక్కడి వారు అదే విషయమై చర్చించుకుంటున్నారు. గత వైఎస్సార్సీపీ పాలన, ప్రస్తుత కూటమి పాలనను బేరీజు వేసుకుంటున్నారు. – జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీలోని 8వ వార్డులో రామాలయం వద్ద రచ్చబండలో చర్చ ఇది. పండుగంటే ఖర్చులే తప్ప ఆదాయం నిల్ చంద్రబాబు ప్రభుత్వం వచ్చిన తరువాత పండుగ అంటేనే ప్రజలు భయపడే స్థితికి వచ్చింది. నిత్యావసరాల ధరలు పెరిగాయి. ఉద్యోగ కల్పన లేదు. పేదలకు సరైన ఉపాధి లేదు. మార్కెట్లోకి డబ్బులు వచ్చే పరిస్థితి లేకపోవడంతో వ్యాపారులు సైతం ఢీలా పడ్డారు. జగనన్న ప్రభుత్వంలో కళకళలాడిన వ్యాపారాలు ఇప్పుడు అంతంతమాత్రంగా సాగుతున్నాయి. బడులను గాలికొదిలేశారు నాడు అమ్మ ఒడి ఇస్తే, దానిని పేరు మార్చి తల్లికి వందనం అని చెప్పి కొద్ది మందికి డబ్బులు వేసి చేతులు దులుపుకున్నారు. ప్రభుత్వ పాఠశాలలను నీరుగార్చారు. నాడు–నేడు పథకం ద్వారా జగనన్న పాఠశాలలను అభివృద్ధి చేస్తే, వాటిని ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వం గాలికొదిలేసింది. సచివాలయాలు, ఆర్బీకేలు నిర్వీర్యం అయ్యాయని చర్చించుకోవడం గమనార్హం. ప్రజా వైద్యానికి జగనన్న పెద్ద పీట వేసి, 17 మెడికల్ కళాశాలలను తీసుకురావడం ద్వారా వైద్యాన్ని మరింత చేరువచేసేలా చూస్తే, ఆయా మెడికల్ కళాశాలల నిర్వహణ తమ వల్ల కాదంటూ పీపీపీ అంటూ ప్రైవేట్ వ్యక్తులు దోచుకోవడానికి అవకాశం కల్పించారు. ఎక్కడ వేసి గొంగడి అక్కడే పెనుగొండ : ‘నాడు సంక్రాంతికి స్వగ్రామానికి వస్తే మార్పు స్పష్టంగా కనిపించేది.. నేడు ఎక్కడ వేసి గొంగడి అక్కడే అన్నట్టుగా రెండేళ్లుగా ఎలాంటి మార్పూ లేదు’ ఇదీ సంక్రాంతి పండుగకు స్వగ్రామానికి వచ్చిన వారి మనోగతం. ఏ గ్రామంలో చూసినా ఇదే చర్చ. -
ముగిసిన ధనుర్మాస ఉత్సవాలు
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు బుధవారంతో ముగిశాయి. దాంతో నెలరోజుల పాటు తిరువీధుల్లో జరిగిన గ్రామోత్సవాలు సైతం ముగిశాయి. ఆఖరి రోజు స్వామి, అమ్మవార్లు, గోదాదేవి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో అట్టహాసంగా ఊరేగారు. ముందుగా అర్చకులు ఆలయంలో స్వామి, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. అనంతరం హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, గజ, అశ్వ సేవల నడుమ క్షేత్ర పురవీధులకు పయనమైంది. ప్రతి ఇంటి ముంగిటా స్వామి, అమ్మవార్లకు భక్తులకు నీరాజనాలు సమర్పించారు. అనంతరం ఆలయ ప్రధాన కూడలిలోని విలాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు పూజలు నిర్వహించి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. ముదినేపల్లి రూరల్: స్థానిక ఎంపీడీవో కార్యాలయంలో జూనియర్ అసిస్టెంట్గా పనిచేస్తున్న మల్లంపల్లి వెంకట సుబ్బారావు (50) బుధవారం మృతి చెందారు. ఈయనకు భార్య, ఇద్దరు కుమారులున్నారు. సుబ్బారావు అప్పుల బాధ భరించలేక ఈ నెల 6న పురుగుమందు తాగి ఆత్మహత్యకు ప్రయత్నించగా విజయవాడ ఆసుపత్రిలో చేర్పించి చికిత్స అందిస్తున్నారు. బుధవారం ఆయన చికిత్స పొందుతూ మృతి చెందారు. ఎంపీడీవో వై రామకృష్ణతో పాటు కార్యాలయ సిబ్బంది, స్థానిక ప్రజాప్రతినిధులు పలువురు సుబ్బారావు మృతికి సంతాపం తెలియజేశారు. పెనుమంట్ర: మార్టేరు– పెంటపాడు స్టేట్ హైవే రోడ్డుపై బుధవారం రాత్రి జరిగిన రోడ్డు ప్రమాదంలో ఒకే కుటుంబానికి చెందిన ముగ్గురు వ్యక్తులకు తీవ్ర గాయాలయ్యాయి. ఆలమూరు గ్రామానికి చెందిన నాగరాజు (40), చింటూ (15), ప్రభాస్ (19) అనే వ్యక్తులు మోటార్ సైకిల్పై వెళ్తుండగా గుర్తుతెలియని మరో మోటార్ సైకిలిస్టు వీరిని ఢీకొట్టి వెళ్లిపోవడంతో తీవ్ర గాయాలయ్యాయి. క్షతగాత్రులను 108 వాహనంలో తణుకు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతున్నట్టు సమాచారం. పూర్తి వివరాలు రావాల్సి ఉందని పోలీసులు తెలిపారు. ఉపాధి హామీ పథకం కొనసాగించాలి తాడేపల్లిగూడెం రూరల్: మహాత్మాగాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం కొనసాగించాలని, కూలీలకు నష్టం కలిగించే పని దినాలు కోల్పోయే వీబీజీరామ్జీ పథకం వద్దని ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం నాయకులు డిమాండ్ చేశారు. వీబీజీరామ్జీ పథకం వద్దంటూ రూరల్ మండలం నవాబుపాలెం, జగన్నాథపురం గ్రామాల్లో బుధవారం జాతీయ నేతలు డాక్టర్ బీఆర్ అంబేడ్కర్, బాబూజగ్జీవన్రామ్ విగ్రహాల వద్ద నిరసనలు తెలిపారు. వీబీజీరామ్జీ చట్టం ప్రతులను భోగి మంటల్లో దహనం చేశారు. వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ఉపాధ్యక్షుడు కండెల్లి సోమరాజు, నాయకులు కె.రమేష్బాబు, నూతంగి సూర్యారావు, విజయరుద్ర బూరయ్య, పెనుమాక నాగేశ్వరరావు, కొల్లి లక్ష్మి, పెనుమాక అరవిందు, వెంకట్రావు పాల్గొన్నారు. -
చంద్రబాబు ప్రభుత్వంలో కళ తప్పిన సంక్రాంతి
జంగారెడ్డిగూడెం: సంక్రాంతి పండుగ అంటేనే రైతన్నల పండుగ అని, అది చంద్రబాబు ప్రభుత్వంలో కొరవడిందని వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి ఆరే శ్యామల అన్నారు. సంక్రాంతి వేళ వైఎస్సార్సీపీ కుటుంబ ఆత్మీయ కలయిక కార్యక్రమంలో భాగంగా ఆమె ఏలూరు జిల్లా జంగారెడ్డిగూడెం విచ్చేశారు. వైఎస్సార్సీపీ పట్టణ, మండల, జిల్లా, రాష్ట్రనాయకులను మర్యాదపూర్వకంగా కలుసుకుని సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జరిగిన విలేకరుల సమావేశంలో ఆమె మాట్లాడుతూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం విత్తు విత్తే నాటి నుంచి పంట చేతికి వచ్చి అమ్ముకునే వరకు ప్రతి దశలో రైతుకు అండగా ఉండిందన్నారు. జగన్మోహన్రెడ్డి రైతు సంక్షేమం కోసం క్షేత్రస్థాయిలో అవసరాలు తీర్చేలా ఆర్బీకేలను అభివృద్ధి చేస్తే వాటిని కూటమి ప్రభుత్వం నీరుగార్చిందన్నారు. సంప్రదాయ సేవలతో పాటు సాంకేతిక సేవలు కూడా ఆర్బీకేల ద్వారా నాడు అందిస్తే, నేడు ఆ పరిస్థితి లేదన్నారు. రైతుకు పెట్టుబడి సహాయం కూడా అందడం లేదన్నారు. నేటి చంద్రబాబు పాలనలో విత్తు నాటిన చేతితోనే పంటను తీసేసే పరిస్థితి రైతుకు ఏర్పడిందన్నారు. నాడు రైతు కోసం రాజన్న, అనంతరం జగనన్న నిలబడి వారి ఉన్నతికి దోహదపడ్డారన్నారు. నేడు చంద్రబాబు ప్రభుత్వం రైతును రోడ్డున వదిలేసిందని శ్యామల అన్నారు. గత ప్రభుత్వంలో ప్రజా అవసరాల నిమిత్తం అప్పులు చేయాల్సి వస్తే, నేడు వారి జేబులు నింపుకునేందుకు రాష్ట్రాన్ని అప్పుల ఊబిలోకి నెట్టేస్తున్నారని విమర్శించారు. గత వైస్సార్సీపీ ప్రభుత్వంలో ఐదేళ్ల కాలంలో చేసిన అప్పులను, చంద్రబాబు ప్రభుత్వం కేవలం రెండేళ్లల్లోనే అధిగమించి కొత్త రికార్డును సృష్టించిందని ఎద్దేవా చేశారు. చంద్రబాబు పాలనను చూసి ప్రజలు ఈసడించుకుంటున్నారని, 2029లో జగనన్న గెలిపించుకునేందుకు సిద్ధంగా ఉన్నారన్నారు. 2029లో జగనన్న గెలిచాక నిజమైన సంక్రాంతి చేసుకుందామని శ్యామల పిలుపునిచ్చారు. చరిష్మా ఉన్న నాయకుడు జగన్ చరిష్మా ఉన్న నాయకుడు జగన్మోహన్రెడ్డి అని వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ నియోజకవర్గ పరిశీలకుడు జెట్టి గురునాధరావు అన్నారు. రెడ్బుక్, మెడికల కళాశాలల జీఓ తదితర ప్రజావ్యతిరేక పనులకు సంబంధించిన ప్రతులను దహనం చేయడానికి ప్రజలు ముందుకు రావడం ప్రభుత్వం వైఫల్యాన్ని సూచిస్తోందన్నారు. వైఎస్సార్సీపీ మండల, పట్టణ అధ్యక్షుడు ఓరుగంటి నాగేంద్ర, కర్పూరం గవరయ్య గుప్త, జెట్టి సత్య ఆదిత్య, ముప్పిడి శ్రీనివాసరావు, కుక్కల ధర్మరాజు, వీరవల్లి సోమేశ్వరరావు, లక్కవరం గంగాప్రసాద్, మహ్మద్ ఉమర్ షరీఫ్, గంజి వినోద్, బత్తిన చిన్న, అయినాల రమణమూర్తి, తాడేపల్లి ఉమ, కొయ్య లీలాధర్రెడ్డి, ఆరీఫ్, కాసర సోమిరెడ్డి, రమేష్రెడ్డి, గగ్గల కిరణ్కుమార్ తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్ సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి శ్యామల -
పండుగ పూట విషాదం
● మోటార్సైకిల్ను ఢీకొన్న వ్యాన్ ● యువకుడి మృతి.. అతని సోదరుడికి గాయాలు ● కురెళ్లగూడెంలో విషాదఛాయలు భీమడోలు: పండుగ సరుకుల కోసం బయటకు వచ్చిన ఓ యువకుడ్ని వ్యాన్ రూపంలో మృత్యువు కబళించింది. దీంతో కురెళ్లగూడెంలో విషాదచాయలు అలుముకున్నాయి. కురెళ్లగూడెంకు చెందిన కొండేటి వినయ్కుమార్ (18), వరుసకు సోదరుడైన సత్యకిరణ్ పండుగ సరుకుల కోసం మోటార్సైకిల్పై భీమడోలు వెళ్లారు. తిరిగి కురెళ్లగూడెం వస్తూ డివైడర్ సమీపంలోని మార్జిన్ వద్ద ఆగగా తాడేపల్లిగూడెం నుంచి ఏలూరు వైపు వెళ్తున్న వ్యాన్ వీరిని ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో బైక్ నడుపుతున్న వినయ్కుమార్ దుర్మరణం చెందగా, సత్యకిరణ్కు తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు హుటాహుటిన క్షతగాత్రుడ్ని చికిత్స నిమిత్తం ఏలూరు ఫ్రభుత్వ ఆసుపత్రికి, అనంతరం ఓ ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. వినయ్కుమార్ తండ్రి దుర్గ రమేష్ ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై ఎస్కే మస్తాన్ బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. సరుకుల కోసం వెళ్లిన కుమారుడు మృతి చెందడంతో తల్లిదండ్రులు, కుటుంబ సభ్యులు కన్నీరు మున్నీరుగా విలపించారు. ఈ దుర్ఘటన పండగు నాడు కురెళ్లగూడెంలో విషాదం నింపింది. -
శ్రీవారి కొండపై సంక్రాంతి సంబరాలు
● వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొన్న భక్తులు ● అలరించిన కళాకారుల వేషధారణలు ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై బుధవారం నిర్వహించిన సంక్రాంతి సంబరాలు అంబరాన్నంటాయి. భోగి పండుగను పురస్కరించుకుని ఆలయ తూర్పు ప్రాంతంలో ఈ సంబరాలను అట్టహాసంగా నిర్వహించారు. తెల్లవారుజామున ఆలయ ఈఓ వై.భద్రాజి, ఎగ్జిక్యూటీవ్ ఇంజనీర్ డీవీ భాస్కర్, తదితరులు చినవెంకన్న చిత్రపటానికి పూజలు జరిపి, భోగి మంటను వెలిగించి, సంబరాలను ప్రారంభించారు. ఆ తరువాత చిన్నారులకు భోగిపళ్లు పోశారు. అనంతరం పల్లెల్లో సంక్రాంతి వేడుకలు ఎలా జరుపుతారో అదే విధంగా సంబరాలు జరిపారు. పూరి గుడిసె, ఎడ్ల బళ్లు, అశ్వాలు, కోడి పుంజులు, డూడూ బసవన్నలు, కళాకారుల విన్యాసాలు, కోలాట భజనలతో ఆ ప్రాంతం పండుగ శోభను సంతరించుకుంది. అలాగే భక్తులు గజలక్ష్మి ఆశీర్వచనాలను పొందారు. ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన బుడబుక్కలు, పిట్టలదొర, చిలక జోస్యం తదితర వేషధారణలు చూపరులను ఆకట్టుకున్నాయి. యువతులు, మహిళలు రెండు తాడి చెట్ల మధ్య ఏర్పాటు చేసిన ఉయ్యాలలో ఊగుతూ సందడి చేశారు. రోకళ్లతో ఒడ్లు దంచి సంబరపడ్డారు. భక్తులు ఎడ్ల బండిపై తిరిగారు. అలాగే మహిళలు బావిలోని నీటిని తోడారు. క్షేత్రానికి వచ్చిన భక్తులు ఈ వేడుకల్లో పెద్ద ఎత్తున పాల్గొని ఫొటోలు, సెల్ఫీలు దిగి సందడి చేశారు. వరి, మొక్కజొన్న, చెరకు, అరటి వంటి పంటలు వేసి, పల్లె సంప్రదాయాలను కళ్లకు కట్టినట్టుగా క్షేత్రంలో ఈ వేడుకలను జరపడం ప్రత్యేకతను సంతరించుకుంది. -
ఆదివాసీలంతా కలిసిగట్టుగా ఉండాలి
బుట్టాయగూడెం: దేశంలోని అన్ని రాష్ట్రాల్లో ఉన్న ఆదివాసీ గిరిపుత్రులు ఒకే వేదికపైకి రావాలని జాతీయ ఆదివాసీ పాస్టర్స్ ఐక్యవేదిక గౌరవ అధ్యక్షుడు నిరీక్షణరావు పిలుపునిచ్చారు. మండలంలోని మారుమూల గ్రామమైన గుళ్లపూడిలో జాతీయ ఐక్యవేదిక, రాష్ట్ర కార్యవర్గ సభ్యుల సమావేశం బుధవారం నిర్వహించారు. ఈ సందర్భంగా నిరీక్షణరావు మాట్లాడుతూ ఆదివాసీ క్రైస్తవ సంఘాలు, క్రైస్తవులందరూ ఒకటిగా ఉండి దేశానికి, ప్రపంచానికి మంచి సందేశం అందించే విధంగా ఉండాలని కోరారు. క్రైస్తవులకు ఎదురయ్యే సమస్యల పరిష్కారానికి సమష్టిగా కృషి చేయాలన్నారు. కొందరు రాజ్యాంగాన్ని ఉల్లంఘిస్తూ చర్చిలను కూల్చడం, క్రైస్తవులపై దాడి చేయడం దారుణమని అన్నారు. క్రైస్తవులపైనా, ఆదివాసీలపైనా దాడులు చేస్తే సహించమని తెలిపారు. కార్యక్రమంలో ఆదివాసీ ఐక్యవేదిక రాష్ట్ర కమిటీ సభ్యులు, తదితరులు పాల్గొన్నారు. -
వృద్ధులే టార్గెట్.. బంగారు ఆభరణాల దోపిడీ
● నిందితులను అరెస్ట్ చేసిన పోలీసులు ● రూ.7.70 లక్షల విలువైన చోరీ సొత్తు స్వాధీనం జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని బెదిరించి బంగారు ఆభరణాలు దోచుకుపోతున్న నలుగురు వ్యక్తులను పోలీసులు అరెస్ట్ చేశారు. బుధవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఏఎస్పీ సుస్మిత రామనాథన్ వివరాలు వెల్లడించారు. నిందితులు ద్వారకాతిరుమల మండలం గొల్లగూడానికి చెందిన చవటపల్లి రామకృష్ణ, చవటపల్లి నాగరాజు, జంగారెడ్డిగూడెం పట్టణం రాముడుకుంటకు చెందిన ఉర్జని జగదీష్, కలపాల దిలీప్ ఒంటరిగా ఉన్న వృద్ధ మహిళలను లక్ష్యంగా చేసుకుని ఆయుధాలతో బెదిరించి ఆభరణాలను బలవంతంగా లాక్కొనిపోయినట్లు తెలిపారు. వీరిపై ద్వారకాతిరుమల, జంగారెడ్డిగూడెం, జీలుగుమిల్లి, లక్కవరం పోలీస్స్టేషన్ పరిధిలో కేసులు నమోదయ్యాయన్నారు. నిందితుల నుంచి రూ.7.70 లక్షల విలువైన చోరీ సొత్తు, రెండు మోటార్సైకిళ్లు, నాలుగు మొబైల్ఫోన్లు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. జీలుగుమిల్లి, లక్కవరం పరిధిలో జరిగిన చోరీ కేసులకు సంబంధించి ఇంకా చోరీ సొత్తు రికవరీ కావాల్సి ఉందని చెప్పారు. కేసు ఛేదనకు కృషి చేసిన జంగారెడ్డిగూడెం సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై ఎన్వీ ప్రసాద్, క్రైం పార్టీ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లు ఎన్.రమేష్, ఎస్కే షానుబాబును ఏఎస్పీ అభినందించారు. -
మహానేతకు పండుగ నైవేద్యం
తొలిపంట ధాన్యంతో అభిషేకించిన రైతులు కొయ్యలగూడెం: మహానేత వైఎస్ రాజశేఖర్రెడ్డి విగ్రహానికి రైతులు తొలిపంట ధాన్యంతో అభిషేకం, పండుగ నైవేద్యం సమర్పించి తమ అభిమానాన్ని చాటారు. రాజవరం పంచాయతీ గంగవరం గ్రామంలో మహానేత విగ్రహానికి తొలి పంటను(ఖరీఫ్ ధాన్యం) విగ్రహం వద్ద ఉంచి నూతన వస్త్రాలను విగ్రహానికి కట్టి పూలమాలలు వేసి నివాళులర్పించారు. గ్రామ కన్వీనర్ కంచర్ల సత్యనారాయణ మంగా వరలక్ష్మి దంపతుల ఆధ్వర్యంలో మరికొందరు రైతులు భోగి పండుగ పురస్కరించుకొని తమ ఇళ్లలో వండిన పిండి వంటలను విగ్రహాన్ని వద్ద ఉంచి నైవేద్యం సమర్పించారు. సంక్రాంతి పండుగ వేళ పూర్వీకులను, పితృ దేవతలను కొలవడం శుభ సూచకం అని, రైతాంగానికి దేవుడైన వైఎస్సార్ను ఈ విధంగా పూజించడం కృతజ్ఞతకు పట్టం కట్టడం వంటిదని వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి దాసరి పేర్కొన్నారు. మహానేత ఆత్మ శాంతికై శ్రద్ధాంజలి ఘటించి నివాళులు అర్పించారు. ఎంపీటీసీ కొండేపాటి చింతయ్య, తమ్మిర్చి బ్రహ్మన్న, ఉండి ఆనందరావు, కొడారి చిన్న, కొడారి బాలయేసు, కె శ్రీను, కె రేఖ, తదితరులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: నరసాపురం మండలం సీతారామపురం స్వర్ణాంధ్ర ఇంజనీరింగ్ కళాశాలలో బుధవారం నుంచి హెలీకాప్టర్ ఎడ్వంచర్ రైడ్స్ ప్రారంభమయ్యాయి. శుక్రవారం వరకూ ఈ రైడ్స్ జరుగున్నాయి. విహాంగ్ పేరుతో తీరప్రాంతంలో మొట్టమొదటిసారి హెలీకాప్టర్ ఎడ్వంచర్ రైడ్స్ నిర్వహిస్తుండడంతో పర్యాటకులు ఆసక్తి కనబరుస్తున్నారు. ఈ రైడ్కు సంబందించి టిక్కెట్ ధర రూ.5 వేలు ఉండటంతో కుటుంబ పరంగా విహాంగ వీక్షణం చేద్దామనుకునేవారికి భారంగా మారిందని పలువురు పేర్కొంటున్నారు. ఏలూరు (టూటౌన్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా లీగల్ సర్వీస్ అధారిటీలో డేటా ఎంట్రీ ఆపరేటర్, ఫ్రంట్ ఆఫీస్ కోఆర్డినేటర్ పోస్టుల భర్తీకి అర్హులైన అభ్యర్థుల నుంచి దరఖాస్తులు కోరుతున్నట్లు జిల్లా ప్రధాన న్యాయమూర్తి ఎస్.శ్రీదేవి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఓపెన్ కేటగిరీలో పోస్టులను భర్తీ చేయడం జరుగుతుందన్నారు. దరఖాస్తు నిబంధనలు జిల్లా కోర్టు, మండల లీగల్ సర్వీసెస్ అథారిటీ, కలెక్టరేట్, ఎంప్లాయిమెంట్, సమాచార శాఖ, సోషల్ వెల్ఫేర్, బీసీ సంక్షేమ శాఖ, ఐటీడీఏ కోటరామచంద్రపురం, జిల్లా గ్రంథాలయ సంస్థ కార్యాలయాల నోటీసు బోర్డుల్లో ప్రదర్శనకు ఉంచడం జరిగిందన్నారు. అర్హులైన అభ్యర్థులు తమ దరఖాస్తులను ఈ నెల 27వ తేదీ సాయంత్రం 5 గంటలలోగా కార్యాలయ పనిదినాల్లో చైర్పర్సన్ ప్రిన్సిపల్ జిల్లా జడ్జి, డీఎల్ఎస్ఏ, న్యాయ సేవాసదన్, జిల్లా కోర్టు కార్యాలయం ఆవరణ, ఏలూరు వారి చిరునామాకు రిజిస్టర్ పోస్టు ద్వారా పంపాలని కోరారు. -
రూ.20 కోట్ల దారి మళ్లింపు
ఏలూరు (టూటౌన్): చంద్రబాబు ప్రభుత్వం పథకాల ప్రచారం పేరుతో దారి మళ్లించిన రూ.20 కోట్ల భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డు డబ్బులు వెంటనే కార్మికుల కోసం వినియోగించాలని ఏపీ బిల్డింగ్ అదర్ కన్షట్రక్షన్ వర్కర్స్ యూనియన్ జిల్లా గౌరవాధ్యక్షుడు డీఎన్వీడి ప్రసాద్, జిల్లా అధ్యక్షుడు ఎర్ర రాంబాబు డిమాండ్ చేశారు. ఓవర్ బ్రిడ్జి సెంటర్లో భవన నిర్మాణ కార్మిక సంఘం ఆధ్వర్యంలో మంగళవారం నిరసన నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. కూటమి నాయకులు అధికారంలోకి వస్తే 100 రోజులలో భవన నిర్మాణ కార్మికుల సంక్షేమ బోర్డును పునరుద్ధరిస్తామని ఎన్నికల్లో ఇచ్చిన హామీని పక్కనపెట్టి పథకాల ప్రచారం పేరుతో రూ.20 కోట్లు దుర్వినియోగం చేయడం దుర్మార్గమన్నారు. కార్మిక శాఖ ఉన్నతాధికారులు, ప్రభుత్వ ప్రతినిధులు వందల కోట్ల భవన నిర్మాణ కార్మికుల వెల్ఫేర్ బోర్డు నిధులను దారిమళ్లిస్తున్నారని, అనేక అక్రమాలకు పాల్పడుతున్నారని చెప్పారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్రవ్యాప్తంగా పెద్ద ఎత్తున ఆందోళన నిర్వహిస్తామని హెచ్చరించారు. -
పందెం బరులు పంచుకున్నారు
డంపింగ్ యార్డులో మంటలు పాలకొల్లు యడ్లబజారు సెంటర్ డంపింగ్ యార్డులో మంగళవారం తారాజువ్వ పడి మంటలు చెలరేగడంతో ఆ ప్రాంతవాసులు ఉక్కిరిబిక్కిరి అయ్యారు. IIలో uబుధవారం శ్రీ 14 శ్రీ జనవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300 లకుపైగా పందెం బరులు సిద్ధమయ్యాయి. బుధవారం ఉదయం నుంచి పందెం కోళ్లు ఢీకొట్టనున్నాయి. పండగ మూడు రోజులు పాటు విచ్చల విడిగా కోడి పందేలు, జూద క్రీడలు కొనసాగేలా భారీ ఏర్పాట్లు చేశారు. దానికనగుణంగా ఎక్కడా పోలీసుల అభ్యంతరం లేకుండా అన్ని చక్కదిద్దేశారు. కొన్ని బరుల్లో కార్ల బహుమానం, మరికొన్ని చోట్ల ఏఏ సమయాల్లో ఏ స్ధాయి పందేం జరుగుతుందో వివరాలను సైతం సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నాలుగు బరుల్లో రూ.కోటి పందేలు నిర్వహించనున్నారు. పేకాట, గుండాట, కోతాట శిబిరాలు ఉమ్మడి జిల్లాలోని అనేక నియోజకవర్గాల్లో సంక్రాంతి పోటీల పేరిట నాలుగు రోజుల క్రితమే బరులను పూర్తిస్ధాయిలో సిద్ధం చేశారు. మంగళవారం వరకు సంప్రదాయ పోటీలు నిర్వహించి బుధవారం నుంచి పందెం బరులుగా తీర్చిదిద్దుతున్నారు. అన్ని నియోజకవర్గాల్లోనూ కూటమి నేతలే కీలకంగా వ్యవహరిస్తూ పోటీలు పడి మరీ భారీ బరులు ఏర్పాటు చేస్తున్నారు. హైకోర్టు నిషేధాజ్ఞల నేపథ్యంలో పోలీసులు మొక్కుబడిగా అక్కడక్కడ చిన్నబరులను ధ్వంసం చేసి పొలిటికల్ బరులవైపు కన్నెత్తి చూడకుండా ఉండేలా అన్ని సిద్ధం చేసి పందాలకు రెడీ అయ్యారు. ఈ ఏడాది కోడి పందేలల్లో పదుల సంఖ్యలో పేకాట, గుండాట, కోతాట శిబిరాలు ఏర్పాటు చేశారు. ఎక్కువ మంది నిర్వాహకులు భారీ ధరకు ముందస్తుగానే విక్రయించారు. భీమవరంలో ఒక బరిలో జూదక్రీడలన్నీ కలిపి అత్యధికంగా రూ.1.40 కోట్లకు విక్రయించారు. తాడేపల్లిగూడెం, ఉంగుటూరు, దెందులూరు, నూజివీడు, తణుకులోనూ రూ.50 లక్షల నుంచి రూ.కోటి వరకు విక్రయాలు చేశారు. ప్రజాప్రతినిధులే నిర్వాహకులు జిల్లాలో ఈ సారి కీలక నియోజకవర్గాల్లో ప్రజాప్రతినిధులే కీలక నిర్వాహకులుగా మారి పనులన్నీ నిర్వహించడానికి ఏజెన్సీలకు, జూదరులకు బరులు అప్పగించారు. నూజివీడు నియోజకవర్గంలోని మీర్జాపురంలో మంత్రి కొలుసు పార్థసారథి సహకారంతో భారీ బరి ఏర్పాటు చేసి సకల సౌకర్యాలు సిద్ధం చేశారు. మూడు రోజులు పాటు ఎక్కువ పందేలు గెలిచిన వారికి కారును, ఒక్కొక్క రోజు ఎక్కువ పందేలు గెలిచిన వారికి కారును బహుమతిగా ఇస్తున్నట్లు ప్రకటించారు. రోజుకు సగటున 22 పందేలు రూ.25 లక్షల స్ధాయిలో నిర్వహిస్తున్నట్లు సమాచారం. సినీ సెట్టింగుల హంగులతో ఎమ్మెల్యే చింతమనేని ప్రభాకర్ సహకారంతో దుగ్గిరాలలో బరి ఏర్పాటు చేశారు. ఏలూరు మండలం జాలిపూడిలో పందెం బరిఏలూరు మండలం మాదేపల్లిలో పేకాట శిబిరం మినీ స్టేడియంను తలపించే రీతిలో ఏర్పాట్లు.. మంత్రులు, పారిశ్రామికవేత్తలు, ఇతర ప్రముఖుల కోసం ప్రత్యేకంగా క్యారవాన్లు, మద్యం, మాంసం కోసం ప్రత్యేకంగా ఏసీ కంటైనర్లతో తాత్కాలిక గదులు, భారీ స్వాగత ద్వారాలతో కోడి పందేల బరులు.. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలో నేటి నుంచి మూడు రోజులు కోడి పందేలకు సర్వం సిద్ధమైంది. పందేలతో పాటు పెద్ద ఎత్తున గుండాట, పేకాట శిబిరాలకు ఏర్పాట్లు చేశారు. వీటిలో ఎక్కువ శాతం కూటమి నేతలు పంచుకుని జేబులు నింపుకునే పనిలో పడ్డారు. పశ్చిమలో అనేక చోట్ల ప్రజాప్రతినిధులే నిర్వాహకులు భీమవరం, ఉండి, దెందులూరు, నూజివీడు, ఉంగుటూరులో భారీ బరులు సంప్రదాయం మాటున కత్తి కట్టిన కోడిపందేలు బరుల్లో సినీ సెట్టింగ్లు, క్యారవాన్లు, ఏసీ ట్రక్కుల్లో ప్రత్యేక ఆతిథ్యాలు మీర్జాపురంలో కార్లు బహుమానం ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 300కుపైనే పందెంబరులు -
భోగి మంటల్లో వేయాలి
ఏలూరు (టూటౌన్): జాతీయ గ్రామీణ ఉపాధి చట్టాన్ని నిర్వీర్యం చేస్తూ వీబీ జీ రామ్ జీ చట్టాన్ని తీసుకువచ్చి పేదల ఉసురు తీస్తున్నారని వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ విమర్శించారు. స్థానిక అన్నే వెంకటేశ్వరరావు భవనంలో వ్యవసాయ కార్మిక సంఘం ముఖ్య కార్యకర్తల సమావేశం జిల్లా అధ్యక్షురాలు తామా ముత్యాలమ్మ అధ్యక్షతన మంగళవారం జరిగింది. ఈ సందర్భంగా రామకృష్ణ మాట్లాడుతూ కేంద్ర ప్రభుత్వం గ్రామీణ పేదల ఉసురు తీస్తుందన్నారు. ఉపాధి హామీకి నిధులు పెంచాల్సింది పోయి తగ్గిస్తూ.. పని దినాలు పెంచామని ఆర్భాటంగా ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. కేంద్ర ప్రభుత్వం మొన్నటి వరకు 90 శాతం నిధులు కేటాయిస్తే రాష్ట్ర వాటా పది శాతంగా ఉండేదని తెలిపారు. నేడు రాష్ట్రాలపై భారం వేస్తూ ఒకేసారి 40 శాతం రాష్ట్రాలు భరించాలంటే ఆంధ్రప్రదేశ్ లాంటి అప్పుల్లో ఉన్న రాష్ట్రానికి ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ఈ చట్ట రక్షణ కోసం జరుగుతున్న ఉద్యమంలో ప్రజలందరూ పాల్గొనాలని కోరారు. జనవరి 14న భోగిమంటల్లో ప్రతులను దగ్ధం చేయాలని పిలుపునిచ్చారు. -
గోడమీద పిల్లివాటంలా పవన్ కల్యాణ్
చాట్రాయి: ఉపాదీ హామీ పథకంలో రాష్ట్ర ప్రభుత్వంపై నిధుల భారం పడుతున్నా పంచాయతీరాజ్ మంత్రి పవన్ కల్యాణ్ ఎందుకు నిలదీయడం లేదని వైఎస్సార్ సీపీ మహిళా విభాగం అధికార ప్రతినిధి ఆర్ శ్యామల ప్రశ్నించారు. పవన్ కల్యాణ్ గోడమీద పిల్లివాటంలా వ్యవహరిస్తున్నారని ఆమె ఎద్దేవా చేశారు. కూటమి ప్రభుత్వం నిర్వాకం కారణంగా పెద్ద పండుగ సంక్రాంతికి రైతుల ముఖంలో సంతోషం కనపడడంలేదని 2029లో మళ్లీ వైఎస్ జగన్మోహన్రెడ్డిని ముఖ్యమంత్రిని చేద్దామని ఆమె పిలుపునిచ్చారు. ఈ నెల 25న మండలంలోని చిన్నంపేటలో మహానేత వైఎస్ రాజశేఖరెడ్డి విగ్రహ ఆవిష్కరణ జరుగుతుందని, వేలాది మంది కార్యకర్తలు, అభిమానులు పాల్గొనాలని ఆమె కోరారు. మరో వైఎస్సార్ సీపీ అదికార ప్రతినిఽఽధి కారుమూరి వెంకటరెడ్డి మాట్లాడుతూ రైతులను ఆదుకోవడంలో కూటమి ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు. వీకెండ్ వస్తే ఎమ్మెల్యేలు, మంత్రులు హైదరాబాద్ పబ్బుల్లో ఉంటారని ఆయన ఎద్దేవా చేసారు. రెడ్బుక్ రాజ్యాంగాన్ని భోగి మంటల్లో కలుపుతామని అన్నారు. మంగళవారం చాట్రాయి మండలంలోని నరశింహారావుపాలెం గ్రామానికి శ్యామల, వెంకటరెడ్డి పుచ్చకాయల శ్రీనివాసరెడ్డి (వైఎస్సార్ సీపీ ఐటీ వింగ్ కార్యదర్శి హైదరాబాదు) కుటుంబ సభ్యులను పరామర్శించారు. శ్రీనివాసరెడ్డి తల్లి సత్యవతి ఇటీవల మృతి చెందడంతో ఆమె చిత్రపటానికి పూలమాల వేసి నివాళులర్పించారు. కార్యక్రమంలో మండల పార్టీ నాయకులు గడ్డం లోకేశ్వరరెడ్డి, పరసా చెన్నారావు, గడ్డం శ్రీనివాసరెడ్డి, చింతలపూడి మండల వైఎస్సార్ సీపీ అధ్యక్షుడు రమేష్రెడ్డి, సిద్దిపేట పార్టీ అధ్యక్షుడు తడకా జగదీశ్వర్ గుప్తా తదితరులు పాల్గొన్నారు. -
సిండికేటుకు చంద్రన్న కానుక
సాక్షి, భీమవరం: తక్కువ ధరకే నాణ్యమైన మద్యం ఇస్తామంటూ ఎన్నికల్లో చెప్పిన చంద్రబాబు చేతల్లోకి వచ్చేసరికి మందుబాబులకు చుక్కలు చూపిస్తున్నారు. బాటిల్పై మరోసారి రూ.10 పెంచారు. లిక్కర్ సిండికేటుకు సంక్రాంతి కానుక అందించారు. అమ్మకాలపై ప్రస్తుతం ఉన్న 14 శాతం మార్జిన్ను 15 శాతంకు పెంచారు. మరోపక్క బార్లకు అదనపు రిటైల్ ఎకై ్సజ్ పన్ను(ఏఆర్ఈటీ) రద్దు చేశారు. జిల్లాలో 194 మద్యం దుకాణాలు కూటమి సిండికేట్ల ఆధ్వర్యంలోనే నడుస్తున్నాయి. అమ్మకాలపై వ్యాపారులకు మొదట్లో 10 శాతంగా ఉన్న మార్జిన్ను గత ఫిబ్రవరిలో ప్రభుత్వం 14 శాతంకు పెంచింది. మద్యం బాటిల్పై రూ.10 పెంచింది. ఏడాది తిరక్కుండానే రెండోసారి ధరలు పెంచేసింది. రూ.99 క్వార్టర్లు మినహా మిగిలిన అన్ని రకాల బ్రాండ్లపై బాటిల్కు రూ.10 పెంచింది. లిక్కర్ వ్యాపారుల మార్జిన్ పెంచుతూ, బార్లకు ఏఆర్ఈటీ రద్దు చేస్తూ ఉత్తర్వులు విడుదల చేసింది. 8వ తేదీన కేబినేట్ భేటీలో ఈమేరకు నిర్ణయం తీసుకోగా జీవో విడుదల కాకుండా అదే రోజు నుంచి వ్యాపారులు బాటిల్కు రూ.10 చొప్పున పెంచేసి అమ్మకాలు సాగిస్తుండటం గమనార్హం. పెరిగిన ధరలు 12వ తేదీ నుంచి అమల్లోకి రావడంతో నాలుగురోజులు అదనంగా వసూలు చేసిన సొమ్ములు సిండికేట్లు జేబుల్లోకి వెళ్లిపోయాయి. బార్లకు మేలుచేస్తూ.. భీమవరం, తణుకు, తాడేపల్లిగూడెం, పాలకొల్లు, నరసాపురం, ఆకివీడులలో 31 బార్లు ఉన్నాయి. గత ఏడాది జరిగిన టెండర్లలో 23 బార్లను వ్యాపారులు దక్కించుకున్నారు. తణుకు, తాడేపల్లిగూడెం, నరసాపురంలో ఎనిమిది బార్లకు ఎవరూ ముందుకు రాక అధికారులు మరోమారు టెండర్లు పిలిచే పనిలో ఉన్నారు. డిపోల నుంచి బార్లకు సరఫరా చేసే మద్యం బాటిళ్లపై ఎకై ్సజ్ శాఖ 15 శాతం ఏఆర్ఈటీ వసూలు చేస్తోంది. ఇది ఎత్తివేయాలన్న డిమాండ్ ఉంది. అందుకోసమే లిక్కర్ సిండికేట్ మిగిలిన బార్లకు టెండర్లు వేయకుండా ఆపివేసిందన్న అనుమానాలు ఉన్నాయి. ఈ పన్ను పూర్తిగా రద్దుచేస్తూ ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. ఇకపై షాపు లైసెన్సుదారులకు మాదిరి బార్లకు ఏ విధమైన పన్నులు లేకుంండా డిపోల నుంచి ప్రభుత్వం మద్యం సరఫరా చేయనుంది. గత ప్రభుత్వంలో మద్యం షాపులు ప్రభుత్వ అధీనంలో ఉండటంతో నిర్ణీత వేళల్లో మాత్రమే అమ్మకాలు జరిగేవి. షాపుల వద్ద కొనుగోలు చేసి తీసుకువెళ్లిపోవడమే తప్ప పర్మిట్ రూమ్లు, బెల్టుషాపులు ఉండేవికావు. మద్యం అమ్మకాలపై వచ్చే ప్రతి పైసా ప్రభుత్వ ఖజానాకు చేరి తిరిగి సంక్షేమం రూపంలో పేదలకు అందేవి. కాగా చంద్రబాబు పాలనలో మద్యం అమ్మకాల ఆదాయం చాలా వరకు కూటమి నేతలు, సిండికేటు జేబుల్లోకి వెళ్తుండడం గమనార్హం. మరోసారి మద్యం ధరల పెంపు బాటిల్పై రూ.10 బాదుడు లిక్కర్ వ్యాపారుల మార్జిన్ 14 నుంచి 15 శాతానికి పెంపు బార్లకు అదనపు రిటైల్ ఎకై ్సజ్ పన్ను రద్దు కూటమి నేతలు, సిండికేట్ జేబుల్లోకి మద్యం ఆదాయం జిల్లాలో రోజుకు సుమారు నాలుగు కోట్ల మేర మద్యం అమ్మకాలు జరుగుతున్నాయి. మద్యం సేవించే వారిలో అధిక శాతం మంది పేద, మధ్యతరగతి వర్గాల వారే. రూ.99 చీఫ్ లిక్కర్ బ్రాండ్లతో పోలిస్తే దిగువ మధ్యతరగతి వర్గాలు ఎక్కువగా రూ.120 ఓఏబీ, రూ.130 మంజీర, హెచ్డీ, రూ.150 ఖరీదైన క్లాసిక్ బ్లూ, ఏసీ బ్లాక్, పార్టీ స్పెషల్, సిల్వర్ బ్రాండ్లు, మధ్యతరగతి వర్గాల వారు రూ.190 ఎంసీ, ఐబీ, ఐకానిక్ వైట్, ఆప్టర్ డార్క్, రూ.190 ఎంహెచ్ బ్రాందీ, రూ.230 8 పీఎం తదితర క్వార్టర్ బాటిల్స్ కొనుగోళ్లు చేస్తుంటారు. వీటన్నింటిపైనా అదనంగా ప్రభుత్వం రూ.10 పెంచింది. మద్యం సిండికేట్లు రూ.10 అదనంగా వసూలు చేస్తుండగా, బెల్టుషాపుల్లో రూ.40 వరకు పెంచి అమ్మకాలు చేస్తున్నారు. ఏడాది క్రితంతో పోలిస్తే ప్రభుత్వం, సిండికేట్ బాదుడితో బాటిల్పై రూ.30 అదనంగా పెరిగిందని మందుబాబులు వాపోతున్నారు. -
కలెక్టర్ సంక్రాంతి శుభాకాంక్షలు
ఏలూరు(మెట్రో): సంక్రాంతి సందర్భంగా జిల్లా ప్రజలకు కలెక్టర్ కె.వెట్రిసెల్వి శుభాకాంక్షలు తెలిపారు. భారతీయ సంస్కృతి, సంప్రదాయాలు తెలిపే పల్లె పండుగ, రైతులు పండుగగా సంక్రాంతి నిలుస్తుందన్నారు. బంధుమిత్రులను కలుసుకుని కనువిందు చేసే అందరి పండుగ సంక్రాంతి అన్నారు. సంక్రాంతి పండుగతో జిల్లాలోని ప్రతి ఇంట్లో సిరులు వెల్లివిరియాలని, అభివృద్ధి, సంక్షేమంలో రాష్ట్రంలో ఏలూరు జిల్లాను ఆదర్శంగా నిలిచేలా కృషిచేద్దామని కలెక్టరు పిలుపునిచ్చారు. ఏలూరు (ఆర్ఆర్పేట): గత డిసెంబర్ 7న జరిగిన నేషనల్ మీన్స్–కం–మెరిట్ స్కాలర్షిప్ పరీక్షకు హాజరైన విద్యార్థులు ఈ నెల 20 నాటికి కులం, ఆదాయం, 7వ తరగతి మార్కుల శాతం సర్టిఫికెట్లను సిద్ధం చేసుకోవాలని డీఈవో ఎం. వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. పరీక్ష ఫలితాల ప్రక్రియలో భాగంగా, డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం జాబితాను త్వరలో సంబంధిత జిల్లా విద్యాశాఖాధికారి కార్యాలయానికి పంపుతారని, ఆ సమయంలో, అన్ని పత్రాలు, హాల్టికెట్ ఫొటోకాపీతో కార్యాలయానికి సమర్పించాలన్నారు. విద్యాశాఖాధికారి పేర్కొన్న తేదీ నాటికి సర్టిఫికెట్ కాపీలను సమర్పించని విద్యార్థుల వివరాలను తుది జాబితా నుంచి తొలగిస్తారని చెప్పారు. ఏలూరు(మెట్రో): జనగణన –2027 నిర్వహణకు సంబంధించి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు జారీ చేసిన మార్గదర్శకాల మేరకు జిల్లాలో అవసరమైన అన్ని చర్యలు చేపడుతున్నట్లు కలెక్టరు కె.వెట్రిసెల్వి తెలిపారు. మంగళవారం న్యూఢిల్లీ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగిన సమీక్షా సమావేశంలో కేంద్ర ప్రభుత్వ డైరెక్టరు ఆఫ్ సెన్సెస్ జె.నివాస్ పాల్గొని కలెక్టర్లకు దిశానిర్దేశం చేశారు. కలెక్టరు మాట్లాడుతూ జనగణన7కు జిల్లాలో అధికార యంత్రాంగం సిద్ధంగా ఉందన్నారు. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మార్గదర్శకాలను పూర్తిగా అమలు చేస్తూ జనగణన–2027ను విజయవంతంగా నిర్వహించేందుకు జిల్లా యంత్రాంగం సమన్వయంతో పనిచేస్తుందని తెలిపారు. ఏలూరు(మెట్రో): ఏలూరు జిల్లాలో రూ.679 కోట్లతో 7 పరిశ్రమల ఏర్పాటు కోసం దరఖాస్తులు అందగా, పరిశ్రమ ఏర్పాటులో వారి సమస్యలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి జూమ్ ద్వారా అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లా డుతూ పరిశ్రమలు స్థాపించే పారిశ్రామికవేత్తలకు అనుమతుల జారీలో ఏదైనా సమస్య ఎదురైతే సమస్యను వారితో చర్చించి నిబంధనలకు మేరకు పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. సింగిల్ డెస్క్ విధానంలో జిల్లాలో 793 చిన్న, మధ్య, పెద్దతరహా పరిశ్రమలకు అనుమతులు జారీ చేసినట్లు కలెక్టర్ చెప్పారు. పీఎంఈజీపీ కింద దరఖాస్తు చేసిన యూనిట్లను మంజూరు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జిల్లాలో పారిశ్రామికాభివృద్ధి పాలసీలో ఎంఎస్ఎంఈ యూనిట్లు ఏర్పాటు చేసిన పారిశ్రామికవేత్తలకు ఇన్వెస్ట్మెంట్, విద్యుత్, వడ్డీ, స్టాంప్ డ్యూటీ రాయితీల కింద 25 యూనిట్లకు రూ.96.04 లక్షలు మంజూరు చేస్తూ సమావేశం తీర్మానించింది. కాళ్ల : జిల్లా కలెక్టర్ సీహెచ్ నాగరాణి సాహసోపేత రైడ్ చేసి స్థానికులను ఆశ్చర్యానికి గురిచేశారు. కాళ్ల మండలం పెద అమిరంలో మంగళవారం ఈ ఘటన చోటుచేసుకుంది. మిత్ర హాస్పిటల్ ఎదురుగా ఉన్న ఖాళీ మైదానంలో ఏపీ అడ్వెంచర్స్ ప్రమోటర్స్ ఆధ్వర్యంలో పారా మోటర్ ఎరైవల్ అడ్వెంచర్ స్కై రైడ్ను ఏర్పాటు చేయగా, తొలి రైడ్ను కలెక్టర్ చేసి యువతను ఉత్సాహపరిచారు. భీమవరం అంటే కోడి పందేలు అనే నానుడి ఉందని, దీనికి భిన్నంగా అడ్వెంచర్స్ రైడ్ను తీసుకురావడానికి జిల్లా యంత్రాంగం కృషి చేసిందని కలెక్టర్ చెప్పారు. సంక్రాంతి పండుగ రోజుల్లో యువతకు అందుబాటులోకి తేవాలనే ఉద్దేశంతో ఈ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 వరకు రైడ్స్ నిర్వహిస్తారని అన్నారు. -
నిడమర్రు ఎఫ్డీవో రవి సస్పెన్షన్
నిడమర్రు: నిడమర్రు ఎఫ్డీవో టీవీ రవికుమార్ను మంగళవారం సస్పెండ్ చేసినట్లు జిల్లా మత్స్యశాఖ అధికారి బి.రాజకుమార్ తెలిపారు. నిడమర్రు మండలం అడవికొలను పంచాయతీ తిమ్మారావు గూడెం రెవెన్యూ గ్రామం పరిధిలో నిబంధనలకు విరుద్ధంగా చెరువులు తవ్వేవారిపై చర్యలు తీసుకోకుండా విధులు దుర్వినియోగం చేస్తున్నాడని స్థానిక రైతు గంగుల సత్యనారాయణ జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. దీనిపై విచారణ అనంతరం మత్య్సశాఖ అదనపు సంచాలకులు చంద్రశేఖర్ రెడ్డి నిడమర్రు ఎఫ్డీవో టీవీ రవికుమార్పై చార్జ్స్ ప్రేమ్ చేసి విచారణకు ఆదేశించారు. విచారణ అనంతరం ఎప్డీవో టీవీ రవికుమార్ను సస్పెండ్ చేసినట్లు డీఎఫ్వో బి.రాజకుమార్ తెలిపారు. జంగారెడ్డిగూడెం: పారిజాతగిరి ఈవో కలగర శ్రీనివాస్పై కేసు నమోదు చేసినట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. వివరాలు ఇలా ఉన్నాయి. స్థానిక పారిజాతగిరి ఆర్చి వద్ద పట్టణానికి చెందిన సొలస వెంకట సురేష్కుమార్కు వ్యవసాయ భూమి ఉంది. ఆ భూమిలో 20ఏళ్ల వయసున్న మారుజాతి చెట్లు ఉన్నాయి. వాటిని ఈవో తన కారు హెడ్లైట్ వెలుతురులో ఏడుగురు కూలీలను పెట్టి నరికించి ట్రాక్టర్పై తరలిస్తుండగా తాను గుర్తించానని, సొలస సురేష్కుమార్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీనిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
పాపికొండల్లో హాయి హాయిగా..
బుట్టాయగూడెం: గలగల పారే గోదారిలో లాంచీ ప్రయాణం నడుమ ప్రకృతి రమణీయతను ఆస్వాదిస్తూ సాగే ప్రయాణం ఒక అద్భుతం. అందులోని గోదారమ్మను ఆనుకొని పాపికొండల నడుమ సాగే బోటు ప్రయాణం ఓ మధురానుభూతి. దీంతో పాపికొండలను ఎప్పుడెప్పుడు చూద్దామా అని పర్యాటకులు ఆసక్తికగా ఎదురు చూస్తుంటారు. సంక్రాంతి పండుగ వేళ సెలవులు దొరకడంతో కుటుంబ సభ్యులతో కలిసి బోటులో విహరించేందుకు పర్యాటకులు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. ఒకటి రెండు రోజుల టూర్కు వెళ్లేందుకు ఇప్పటికే కొందరు ఆన్లైన్లో టికెట్లు బుక్ చేసుకున్నారు. సంక్రాంతి పండుగకు సెలవులపై వచ్చిన వారు సైతం ఇక్కడ చిల్ అయ్యేందుకు తరలి వస్తుండడంతో పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి పెరిగింది. సందర్శన స్థలాలు పాపికొండల విహారయాత్రలో భాగంగా పలు సందర్శనా స్థలాలను చూడవచ్చు. అల్లూరి సీతారామరాజు జిల్లాలోని దేవీపట్నం మండలంలోని గండిపోచమ్మ గుడి, బ్రిటిష్ కాలపు పోలీస్ స్టేషన్, 11వ శతాబ్దం నాటి ఉమాచోడేశ్వర స్వామి ఆలయం, కొరుటూరులో అటవీశాఖ ఆధ్వర్యంలో నిర్మించిన కార్టేజీలు, పేరంటాలపల్లి ఆశ్రమాన్ని సందర్శించి అక్కడ శివుడిని దర్శించుకోవచ్చు. అలాగే గోదావరి వెంబడి ఇరువైపులా గట్లపై దర్శనమిచ్చే గిరిజన గ్రామాల్లోని ఇళ్లు పర్యాటకులను కనువిందు చేస్తాయి. అదేవిధంగా పోలవరం ప్రాజెక్టు కూడా పర్యాటకుల మనస్సును దోచుకుంటుంది. గోదావరి నదిపై నిర్మించిన ఈ ప్రాజెక్టును తిలకించేందుకు వేలాది మంది పర్యాటకులు వస్తుంటారు. గిరిజనుల ఆప్యాయత, ఆదరణ పేరంటాలపల్లి పర్యాటకులకు గిరిజనుల ఆప్యాయత, ఆదరణ నాగరిక సమాజానికే తలమానికం. అక్కడి కొండరెడ్డి గిరిజనులు పర్యాటకులకు వారు వెదురుతో తయారు చేసిన రకరకాల కళాకృతులను విక్రయిస్తూ జీవనం సాగిస్తుంటారు. అవి చూపరులను ఎంతగానో ఆకట్టుకుంటాయి. పాపికొండల పర్యటనకు వెళ్లిన ప్రతిఒక్కరూ తప్పనిసరిగా అవి కొనుగోలు చేసి యాత్రకు గుర్తుగా ఇళ్లకు తీసుకువెళ్తూ ఉంటారు. గండిపోచమ్మ గుడి నుంచి ప్రశాంతమైన, సుందరమైన గోదావరి అలలపై సాగే సుమారు 5 గంటలకు పైగా ఈ యాత్ర ఎంతో ఆహ్లాదాన్ని కలిగిస్తుందని పర్యాటకులు చెబుతున్నారు. కాగా పర్యాటకులకు ఎటువంటి ప్రమాదాలు సంభవించకుండా ప్రభుత్వం, అధికారులు అన్ని ఏర్పాట్లు చేయడంతో యాత్రికుల సంఖ్య రోజురోజుకూ పెరుగుతుంది. పాపికొండల విహారయాత్రకు పర్యాటకుల తాకిడి సంక్రాంతి పండుగ సెలవులకునెలకొన్న రద్దీ యాత్రికుల కోసం అందుబాటులోకి సౌకర్యాలు -
● సంక్రాంతి సందడి
జిల్లా వ్యాప్తంగా సంక్రాంతి శోభ నెలకొంది. మహిళలు అందమైన రంగవల్లులతో వీధులను ముస్తాబు చేస్తుండగా.. పలుచోట్ల భోగి మంటలకు సిద్ధం చేశారు. పొరుగూర్ల నుంచి తమ సొంత ప్రాంతానికి వస్తున్న వారితో పలుచోట్ల ట్రాఫిక్కు అంతరాయం ఏర్పడుతోంది. చుట్టాలు, అయినవాళ్ల రాకతో గ్రామాలన్నీ కళకళలాడుతున్నాయి. – సాక్షి నెట్వర్క్ పాలకొల్లు మార్కెట్లో భోగి పిడకల విక్రయం గణపవరంలో ట్రాఫిక్ నిలిచిపోయి రోడ్డుపై బారులు తీరిన కార్లు -
పోలీసుల సేవలు భేష్
ఏలూరు టౌన్: తప్పిపోయిన ఇద్దరు చిన్నారులను ఏలూరు టూటౌన్ పోలీసులు కేవలం 20 నిమిషాల్లోనే తల్లిదండ్రుల చెంతకు చేర్చారు. అలాగే పర్సు పోగొట్టుకున్న వ్యక్తికి తిరిగి అప్పగించారు. దీంతో పోలీసుల సేవలను ప్రశంసిస్తున్నారు. ఏలూరు టూటౌన్ పరిధిలోని తాపీమేసీ్త్ర కాలనీకి చెందిన నరేష్, భార్గవిలకు బండి హర్షిణి సహస్ర (3), తేజీ శ్రీదస్ (5) అనే చిన్నారులు ఉన్నారు. వీరు ఇంటివద్ద ఆడుకుంటూ మంగళవారం బయటకు వెళ్లి తప్పిపోయారు. తల్లిదండ్రులు ఎంత వెదికినా పిల్లలు కనిపించకపోవడంతో డయల్ 112కు ఫోన్ చేసి సమాచారం అందించారు. ఏలూరు డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ వెంటనే ఏలూరు టూటౌన్ సీఐ కే.అశోక్కుమార్ను అప్రమత్తం చేయగా మూడు ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి గాలింపు చర్యలు చేపట్టారు. నిమిషాల వ్యవధిలో చిన్నారులు ఇద్దరూ లంకపేట ప్రాంతంలో ఉండగా గుర్తించిన టూటౌన్ ఎస్సై మధు వెంకట రాజా, సిబ్బంది పిల్లలను ఇంటికి చేర్చారు. పర్సు అప్పగింత హైదరాబాద్కు చెందిన ఎర్రమిల్లి ఉదయ్శర్మ ఏలూరులోని ఎస్ఎంఆర్ నగర్లో నివాసం ఉంటున్న తన కుమార్తె ఇంటికి వచ్చారు. ఈ క్రమంలో ఆయన రైల్వే స్టేషన్ పరిసరాల్లో తన పర్సును పోగొట్టుకున్నారు. అందులో రూ.8700 నగదు, ఏటీఎం కార్డు, ఆధార్ కార్డు ఉన్నాయి. ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్ పరిధిలో విధులు నిర్వర్తిస్తున్న బ్లూకోల్ట్స్ కానిస్టేబుల్స్ ఎన్.శ్రీనివాస్, ఈ.సతీష్కి ఆ పర్సు దొరకగా పోలీస్ స్టేషన్లో అప్పగించారు. బాధితుడు ఉదయ్శర్మ వివరాలను సేకరించి మంగళవారం ఆ పర్సును అతడికి అందజేశారు. -
పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై కేసులు
జంగారెడ్డిగూడెం: పీడీఎస్ బియ్యం అక్రమ రవాణా చేస్తున్న 11 మందిపై 6–ఏ కేసులు నమోదు చేసినట్లు తహసీల్దార్ కె.స్లీవజోజి ఒక ప్రకటనలో తెలిపారు. పీడీఎస్ బియ్యం అక్రమ రవాణాపై వచ్చిన సమాచారం మేరకు మండలంలోని వివిధ ప్రాంతాల్లో తనిఖీలు చేపట్టి , అక్రమ రవాణాకు పాల్పడుతున్న 11 మందిపై 6ఏ కేసులు నమోదు చేసి సదరు బియ్యాన్ని సీజ్ చేసినట్లు తెలిపారు. పట్టుబడిన బియ్యాన్ని ఎంఎల్ఎస్ పాయింట్కు తరలించినట్లు చెప్పారు. పట్టుకున్న 78.64 క్వింటాళ్ల బియ్యాన్ని ఈ నెల 17న తహసీల్దార్ కార్యాలయం వద్ద బహిరంగ వేలం నిర్వహిస్తామన్నారు. ఈ వేలం పాటకు జీఎస్టీ లైసెన్స్ కలిగి ఉన్న రైస్ ట్రేడర్స్, రిటైలర్, రైస్ మిల్లర్లు వేలంలో పాల్గొనవచ్చని తెలిపారు. గణపవరం: గణపవరంలోని చినరామచద్రపురంలో కోడికత్తులు తయారు చేస్తున్న ముసినాని శివాజీ అనే వ్యక్తిని మంగళవారం అరెస్ట్ చేసినట్లు ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ తెలిపారు. అతని వద్దనుంచి సుమారు 300 సాన పట్టిన కత్తులు, మరో 200 సానపట్టని కత్తులతో పాటు, సానపట్టే మోటార్ను స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. శివాజీ సంక్రాంతికి భారీగా కోడికత్తులు తయారు చేస్తున్నట్టు వచ్చిన సమాచారంపై సీఐ నక్కా రజనీకుమార్, ఎస్సై ఆకుల మణికుమార్ ఆధ్వర్యంలో సిబ్బంది ఆకస్మిక దాడిచేసి అతడిని అదుపులోకి తీసుకుని కేసు నమోదు చేసినట్లు చెప్పారు. ఈదాడిలో పాల్గొన్న పోలీసు సిబ్బంది డి.శివాజీ, డి.రత్నాభాయి, జె.బాబీ, పి.జగపతిలను ఆయన అభినందించారు. -
పోటాపోటీగా బరులు
భీమవరం, ఉండిలో పోటాపోటీగా పందెంబరులు సిద్ధమయ్యాయి. ఉమ్మడి పశ్చిమలోనే భారీ బరి భీమవరం రూరల్లోని గొల్లవానితిప్ప (డేగాపురం)లో పందెం నిర్వాహకుడు వెంప కాశీ ఏర్పాటు చేశారు. 20 ఎకరాల విస్తీర్ణంలో ఏర్పాటు చేశారు. ఎకరం విస్తీర్ణంలో ఒక్కొక్క బరిని భారీగా ఏర్పాటు చేసి సినీ ప్రముఖులను, రాష్ట్ర మంత్రులు, ఇతర ప్రముఖులను ఆహ్వానించారు. ఎల్ఈడీ స్క్రీన్లు, క్యారవ్యాన్లు, సకల సౌకర్యాలు ఏర్పాటు చేశారు. భీమవరంలోని ప్రకాష్నగర్లోని లేఅవుట్లో ఎమ్మెల్యే పులవర్తి రామాంజనేయులు తనయుడు నేతృత్వంలో భారీ బరిని ఏర్పాటు చేసి రూ.25 లక్షల నుంచి పందేలు నిర్వహిస్తున్నారు. ఉండిలోనూ భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. సీసలిలో ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజు సోదరుడు నేతృత్వంలో 5 ఎకరాల బరిని సిద్ధం చేసి ఎల్ఈడీ స్క్రీన్లు, ఏసీ గ్యాలరీలు, ఫ్లడ్లైట్లు, బౌన్సర్లు, క్యారవాన్లు ఏర్పాటు చేశారు. ఉండి నియోజకవర్గంలోని పెదఅమిరంలో డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణంరాజు సహకారంతో కోడి పందేల శిబిరాల నిర్వాహకుడు గబ్బర్ బరిని సిద్ధం చేశారు. 8 ఎకరాల విస్తీర్ణంలో బరిని ఏర్పాట్లు చేసి ఎల్ఈడీలు, భారీ స్వాగతద్వారాలు, క్యారవాన్లు ఏర్పాటు చేశారు. రాష్ట్ర మంత్రులు, ఇతర రాష్ట్రాల ప్రముఖులను కూడా బరికి ఆహ్వానించారు. ప్రత్యేకంగా వీఐపీల కోసం కోడి పందేల శిబిరం వద్దే తాత్కాలిక వసతి గృహాన్ని ఏర్పాటు చేసి లక్షల్లో పందేలు నిర్వహించేలా అన్ని ఏర్పాట్లు చేశారు. తాడేపల్లిగూడెంలో వెంకట్రామయ్య బరిలో రూ. కోటి పందాన్ని మూడు రోజులు పాటు నిర్వహించనున్నారు. రూ.25 లక్షల నుంచి రూ.కోటి వరకు ఎక్కువ పందేలు నిర్వహించనున్నట్లు సోషల్ మీడియా వేదికగా ప్రకటించుకున్నారు. ఉంగుటూరులోని నారాయణపురంలో ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు లేఅవుట్లో ఆయన సహకారంతో భారీ శిబిరం ఏర్పాటు చేసి రూ.కోటి పందేలు నిర్వహించనున్నారు. తణుకు, పాలకొల్లు, నర్సాపురంలోనూ భారీగా బరులు ఏర్పాటయ్యాయి. ప్రతి మండల కేంద్రంలోనూ ఇదే తరహాలో ఏర్పాట్లు చేస్తున్నారు. -
నేషనల్ పార్క్లో గొర్రెలు పెంచరాదు
పోలవరం రూరల్: పాపికొండలు నేషనల్ పార్క్ ప్రాంతంలో గొర్రెల పెంపకం చేస్తే చర్యలు తీసుకుంటామని అటవీశాఖ రేంజ్ అధికారి ఎస్కే వలీ హెచ్చరించారు. పోలవరం ప్రాజెక్టు ముంపు ప్రాంతమైన నదీపరీవాహక ప్రాంతంలో సమృద్ధిగా మేత, నీరు ఉండటంతో గొర్రెల కాపరులు ఈ ప్రాంతాన్ని గొర్రెల పెంపకానికి వినియోగిస్తున్నారు. రెండు రోజుల క్రితం గొర్రెల కాపరులు మెత్తాపుకోట, ఉడతపల్లి మీదుగా గొర్రెలను అటవీప్రాంతంలో దాటించే సమయంలో కాపరులకు, అటవీ శాఖ సిబ్బందికి మధ్య దీనిపై వాదోపవాదాలు చోటు చేసుకున్నాయి. 10 గొర్రెలను అటవీశాఖ సిబ్బంది నిలిపివేయడంతో గొర్రెల కాపరులు మంగళవారం ఉదయం అటవీశాఖ కార్యాలయానికి చేరుకుని రేంజర్ ఎస్కే వలీకి విషయం తెలిపారు. దీనిపై ఆయన స్పందిస్తూ ఈ ప్రాంతంలో గొర్రెల పెంపకాలు జరపడం వలన వన్యప్రాణులకు విఘాతం కలిగించే పరిస్థితులు ఎదురవుతాయని వెంటనే ఆ ప్రాంతంలో ఉన్న గొర్రెలను బయటకు తరలించాలని, లేదంటే చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. దీంతో 10 రోజుల్లో గొర్రెలను బయటకు తరలిస్తామని కాపరులు విజ్ఞప్తి చేశారు. ఇటువంటి ఘటనలు పునరావృతమైతే అటవీ సంరక్షణ చట్టం ప్రకారం చర్యలు తీసుకుంటామని రేంజర్ తెలిపారు. రేంజర్ ఎస్కే వలీ -
సార్లు.. ఇవిగో బరులు
క్షేత్రస్థాయిలో పరిస్థితి ఇందుకు భిన్నంగా ఉంది. న్యాయస్థానం ఆదేశాలు, పోలీసుల హెచ్చరికలు పందేల నిర్వాహకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదు. పండుగల్లో పెద్ద ఎత్తున కోడిపందేలు, జూదాల నిర్వహణకు జిల్లా అంతటా ఏర్పాటుచేస్తున్నారు. భీమవరం పరిసరాల్లోని డేగాపురం, పెదఅమిరం, సీసలి, మహదేవపట్న ం, వీరవాసరం, అలాగే తాడేపల్లిగూడెంలోను, తణుకులోని ఉండ్రాజవరం, పాలకొల్లు రూరల్ పూలపల్లి, వడ్లవానిపాలెం, ఆచంటలోని వడలి, దొంగరావిపాలెం తదితరచోట్ల పెద్ద బరులు సిద్ధం చేస్తున్నారు. కొన్నిచోట్ల రెండు మూడు వరకు పెద్ద, చిన్న బరులు ఏర్పాటుచేస్తున్నారు. భారీ సెట్టింగ్లతో సిద్ధం చేస్తున్న కొన్ని బరులకు ఒక్కో దానికి రూ.30 లక్షల నుంచి రూ.60 లక్షల వరకు, మిగిలిన వాటికి రూ.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకు వెచ్చిస్తున్నట్టు సమాచా రం. వీఐపీ, వీవీఐపీల కోసం ప్రత్యేక గ్యాలరీలు, ఎల్ఈడీ స్క్రీన్లు, గుండాట, పేకాట, కో తాట, ఇతర జూదాలు నిర్వహించేందుకు వీలు గా జర్మన్ షెడ్లు, ఫ్లడ్ లైట్లు, నగదు లెక్కించేందుకు కౌంటింగ్ మెషీన్లు ఏర్పాటు చేస్తున్నారు. అన్ని బరుల వద్ద మద్యం స్టాళ్లు, ఫాస్ట్ఫుడ్స్, తినుబండరాలకు స్టాళ్లు వెలుస్తున్నాయి. బరి ప్రత్యేకత, అక్కడకు వచ్చే జనం రద్దీని బట్టి రూ.25 లక్షలు నుంచి రూ.1.50 కోటి వరకు ఇచ్చేలా నిర్వాహకులు జూదాలు ఏర్పాటుచేసుకునే వారితో ఇప్పటికే ఒప్పందాలు చేసుకున్నట్టు తెలుస్తోంది. సాక్షి, భీమవరం: కోడి పందేలు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటున్న పోలీసుల హెచ్చరికలను నిర్వాహకులు డోంట్ కేర్ అంటున్నారు. షరా మామూలేనంటూ జిల్లావ్యాప్తంగా వందకుపైనే బరులు సిద్ధం చేసే పనిలో ఉన్నారు. వీటిలో పెద్ద బరులు 30 వరకు ఉండగా, మిగిలినవి చిన్నవి. బరుల చెంతనే భారీ ఎత్తున గుండాట, పేకాట, కోతాటలతో జూదాల జాతరకు ఏర్పాట్లు చేస్తున్నారు. సంప్రదాయం ముసుగులో.. కోడిపందేలు, పేకాట, గుండాట తదితర జూదాలపై సంపూర్ణ నిషేధం విధిస్తూ హైకోర్టు ఆదేశాలను క్షేత్రస్థాయిలో పకడ్బందీగా అమలు చేస్తున్నట్టు జిల్లా పోలీస్ యంత్రాంగం ప్రకటించింది. ఆదివారం జిల్లాలోని పలుచోట్ల ఏర్పాటుచేసిన కోడిపందేల బరులను ధ్వంసం చేసిన విషయం తెలిసిందే. సంప్రదాయం ముసుగులో ఎవరైనా చట్టాన్ని చేతిలోకి తీసుకుని అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడితే ఉపేక్షించేది లేదని, అటువంటి వారిపై చట్టపరంగా కఠిన చర్యలు తప్పవని హెచ్చరించారు. ఈ మేరకు జిల్లాలోని అన్ని సబ్ డివిజన్ల పరిధిలో ప్రత్యేక నిఘా బృందాలను ఏర్పాటుచేశామన్నారు. ఎక్కడైనా చట్ట వ్యతిరేక కార్యకలాపాలు జరుగుతున్నట్లు గమనిస్తే వెంటనే సమీప పోలీస్ స్టేషన్కు, లేదా 112 నంబర్కు ఫోన్చేసి తెలియజేయాలని, సమాచారం ఇచ్చిన వారి వివరాలు గోప్యంగా ఉంచుతామని పోలీసు అధికారులు తెలియజేశారు. నియోజకవర్గాల వారీగా బరులు ● ఉండి : పెదఅమిరం, సీసలి, మాలవానితిప్ప, ఆకివీడులోని గుమ్ములూరు రోడ్డు, అజ్జమూరు, సిద్దాపురం, మహాదేవపట్నం, ఉండి, కోలమూరు, చెరుకువాడ, గొల్లలకోడేరు, పాలకోడేరు, శృంగవృక్షం, వేండ్ర, విస్సాకోడేరు, మోగల్లు, గరగపర్రు. ● భీమవరం : డేగాపురం, శ్రీరాంపురం, గొల్లవానితిప్ప రోడ్డులో ప్రకాష్నగర్ వద్ద, చినఅమిరం, కొవ్వాడ అన్నవరం, యనమదుర్రు, తుందుర్రు, వీరవాసరం, నవుడూరు, కొణితివాడ, మత్య్సపురి, నందమూరుగరువు ● నరసాపురం : మొగల్తూరు, పేరుపాలెం, కేపీ పాలెం, మోళ్లపర్రు, కొత్తోట, ముత్యాలపల్లి, వేములదీవి, సీతారాంపురం, కొప్పర్రు, పీచుపాలెం, తూర్పుతాళ్లు, నరసాపురంలోని వీవర్స్ కాలనీ, ప్రభుత్వ ఆస్పత్రి వెనుక. ● పాలకొల్లు : కలగంపూడి, యలమంచిలి, అడివిపాలెం, కొంతేరు, యలమంచిలి, మేడపాడు, మట్లపాలెం, కట్టుపాలెం, పూలపల్లి, వడ్లవానిపాలెం, శివదేవుని చిక్కాల, దిగమర్రు. ● ఆచంట: కవిటం, పోడూరు, గుమ్ములూరు, పెనుమదం, వడలి, దొంగరావిపాలెం, పెనుగొండ, పెళ్లికూతురమ్మ చెరువు, ములపర్రు, రామన్నపాలెం, చినమదం, ఆచంట, వల్లూరు, ఆచంట వేమవరం, పెనుమంచిలి, కొడమంచిలి, పెనుమంట్ర, మార్టేరు, వెలగలేరు, సత్యవరం, పొలమూరు, నత్తారామేశ్వరం. ● తణుకు : రేలంగి, తూర్పువిప్పర్రు, అయినపర్రు, ఓగిడి, అత్తిలి, కె.సముద్రపుగట్టు, గు మ్మంపాడు, తేతలి, తణుకులోని ఉండ్రాజవరం రోడ్డు, హైవే ఆనుకుని రెండు చోట్ల. ● తాడేపల్లిగూడెం : ఏరియా ఆస్పత్రి వెనుక, పెంటపాడు, అల్లంపురం, కోరుమిల్లి, మీన వల్లూరు, జట్లపాలెం, పడమర విప్పర్రులో సిద్ధం చేస్తున్నారు. ఏలూరు జిల్లాలోని ఏడు నియోజకవర్గాల్లో పందెం బరులు సిద్ధమవుతున్నాయి. ప్రధానంగా దెందులూరు నియోజకవర్గంలో దుగ్గిరాల, నూజివీడు నియోజకవర్గంలో మీర్జాపురం, ఉంగుటూ రు నియోజకవర్గంలో నారాయణపురం, గొల్లగూడెం, బాదంపూడి అలాగే చింతలపూడి, పోలవ రం, కైకలూరు నియోజకవర్గాల్లో మరికొన్ని బరు లు ముస్తాబవుతున్నాయి. దుగ్గిరాల, మీర్జాపురం, గొల్లగూడెం, బాదంపూడి, నారాయణపురంలో భారీ బరులు ఏర్పాటు చేసి జిల్లా నుంచే కాకుండా తెలంగాణ, కర్నాటక, తమిళనాడు నుంచి కూడా పెద్ద ఎత్తున జూదరులు రావడానికి వీలుగా వస తితో సహా ప్రత్యేక ఏర్పాట్లుచేశారు. మరోవైపు కూటమి నేతలు, ప్రజాప్రతినిధులు నిర్వాహకులుగా కొన్నిచోట్ల వ్యవహరిస్తుండటంతో రాష్ట్ర మంత్రులను ప్రత్యేకంగా కోడి పందేలకు ఆహ్వానించారు. ఇక పోలీసులు యథావిధిగా హైకోర్టు ఉత్తర్వుల నేపథ్యంలో దుగ్గిరాల గ్రామ శివారులో చిన్నపాటి బరి, ముసునూరు మండలం చెక్కపల్లి, నూజివీడు మండలం పోత్తిరెడ్డిపల్లి మరికొన్ని చోట్ల బరులను ధ్వంసం చేశారు. కోట్లాటకు రెడీ కోడిపందేలు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటున్న పోలీసులు డోంట్ కేర్ అంటున్న నిర్వాహకులు జిల్లావ్యాప్తంగా వందకు పైనే బరులు సిద్ధం గుండాట, పేకాట, కోతాటలకు ఏర్పాట్లు భారీ మొత్తంలో చేతులు మారనున్న నగదు న్యాయస్థానం ఆదేశాలు అమలయ్యేనా? -
బాడీ బిల్డింగ్లో మిస్టర్ ఆంధ్రాగా విక్రమ్
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణంలో నిర్వహించిన బాడీబిల్డింగ్ పోటీల్లో వైజాగ్కు చెందిన విక్రమ్ మిస్టర్ ఆంధ్రాగా ఎంపికయ్యాడు. ఆదివారం రాత్రి స్థానిక చిన్నకార్ల స్టాండ్ వద్ద కేఏఎం జిమ్ పాలకొల్లు ఆధ్వర్యంలో మిస్టర్ ఆంధ్రా బాడీ బిల్డింగ్ చాంపియన్షిప్ పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బెస్ట్ మజిల్స్ భాస్కర్ – వైజాగ్, బెస్ట్ మస్కిలర్గా ప్రశాంత్ – మచిలీపట్నం ముగ్గురు ఎంపికయ్యారు. మొత్తం ఎనిమిది స్థానాల్లో 50 నుంచి 90 మంది బాడీబిల్డర్లు పోటీ పడినట్లు నిర్వాహకులు ఖండవల్లి వాసు తెలిపారు. విజేతలకు చాంబర్ సభ్యులు బహుమతులు అందజేశారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ నియోజకవర్గ ఇన్చార్జి గుడాల శ్రీహరిగోపాలరావు, యడ్ల తాతాజీ, చెల్లెం ఆనందప్రకాష్, చేగొండి సూర్యప్రకాష్, మేకా శేషుబాబు, కేఎస్పీఎన్ వర్మ, ఉచ్చుల స్టాలిన్, సనమండ ఎబినేజర్, రామాంజుల పెద్దమదు, పసుపులేటి రాజేష్ఖన్నా, తటవర్తి సుధాకర్, సబితి వెంకటరెడ్డి, వింజరపు రాము, పసుపులేటి రమేష్, రాధాకృష్ణ తదితరులు పాల్గొన్నారు. -
ఎయిడెడ్ విద్యా సంస్థలను ఆదరించాలి
పెనుగొండ: ప్రభుత్వ విద్యా సంస్థలకు దీటుగా సేవలందిస్తున్న ఎయిడెడ్ విద్యా సంస్థలను ప్రభుత్వం ఆదరించాలని ఆంధ్రప్రదేశ్ శాసన మండలి చైర్మన్ కొయ్యే మోషేన్ రాజు అన్నారు. పెనుగొండలోని ఎస్వీకేపీ విద్యా సంస్థల స్వర్ణోత్సవాలు ముగింపు సందర్భంగా సోమవారం నిర్వహించిన కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. ఎయిడెడ్ విద్యా సంస్థలకు ప్రభుత్వం సరైన వనరులు, సదుపాయాలు సమకూర్చకపోవడంతో నిర్వహణతో పాటు, విద్యార్థులు ఎన్నో ఇబ్బందులు పడుతున్నారన్నారు. దీనిపై విద్యాశాఖా మంత్రి లోకేష్ దృష్టికి రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపి మూర్తిలతో కలసి తీసుకువెళ్లడం జరుగుతుందని, అదేవిధంగా శాసన మండలిలోనూ ప్రస్తావిస్తామన్నారు. రాజ్యసభ సభ్యుడు పాక సత్యనారాయణ, ఎమ్మెల్సీలు వంక రవీంద్ర, బుర్రా గోపీ మూర్తి మాట్లాడుతూ ఉన్నతాశయాలతో గ్రామీణ ప్రాంతంలో ఏర్పాటుచేసిన కళాశాలను పేద విద్యార్ధులు సద్వినియోగం చేసుకోవాలన్నారు. పూర్వ విద్యార్థులు సేకరించిన విరాళాన్ని అతిథుల చేతుల మీదుగా పాలకవర్గానికి అందించారు. కార్యక్రమంలో సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ కే రామచంద్రరాజు, పాలకవర్గ అధ్యక్షుడు తాడి నాగిరెడ్డి, ప్రిన్సిపాల్స్ డాక్టర్ వైవీవీ అప్పారావు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): సంక్రాంతి పండుగ రద్దీ దృష్ట్యా విజయవాడ–విశాఖపట్టణం మధ్య 12 జనసాధారణ (అన్ రిజర్వ్డ్) రైళ్లను నడుపుతున్నట్లు దక్షిణ మధ్య రైల్వే అధికారులు సోమవారం ఒక ప్రకటనలో తెలియజేశారు. విశాఖపట్టణం–విజయవాడ మధ్య ఆరు సర్వీసులు ఈ నెల 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో రైళ్లు నడుస్తాయి. ఈ రైలు ఉదయం 10 గంటలకు విశాఖపట్టణంలో బయలుదేరి అదే రోజు సాయంత్రం నాలుగు గంటలకు విజయవాడ చేరుతుంది. విజయవాడ–విశాఖపట్టణం మధ్య 12, 13, 14, 16, 17, 18 తేదీల్లో ఆరు సర్వీసులు నడుపనున్నారు. ఈ రైలు విజయవాడలో సాయంత్రం 6.30 గంటలకు బయలుదేరి రాత్రి 12.35 గంటలకు విశాఖపట్టణం చేరుతుంది. కాకినాడ టౌన్ – చర్లపల్లి మధ్య ప్రత్యేక రైలు కాకినాడ టౌన్–చర్లపల్లి మధ్య ఈనెల 19న రైలు సర్వీసు నడుపనున్నారు. ఈ రైలు కాకినాడ టౌన్లో బయలు దేరి సామర్లకోట, రాజమండ్రి, తణుకు, భీమవరం టౌన్, ఆకివీడు, కై కలూరు, గుడివాడ, విజయవాడ, గుంటూరు, సత్తెనపల్లి, పిడుగురాళ్ల, మిర్యాలగూడ, నల్గొండ, చర్లపల్లి స్టేషన్లలో ఆగనుంది. ఇక్కడ సంక్రాంతి ఎంతో అనుభూతి భీమవరం: గత ఏడాది ఆగస్టు 15న ఒకేసారి 15 చిత్రాలను ప్రారంభించామని, ఈ ఏడాది ఆగస్టు 15 లోపు ఆ చిత్రాలను విడుదల చేసేందుకు సన్నాహాలు చేస్తున్నట్లు శతాధిక చిత్రాల నిర్మాత తుమ్మలపల్లి రామ సత్యనారాయణ చెప్పారు. సోమవారం భీమవరం విచ్చేసిన ఆయన నానాజీ కాంప్లెక్స్ వద్ద మాట్లాడారు. 20 ఏళ్ల వ్యవధిలో 114 పైగా చిత్రాలు నిర్మించామని, భీమవరం టాకీస్ పతాకంపై నిర్మించిన 15 చిత్రాల్లో 7 చిత్రాల షూటింగ్స్ పూర్తి చేసి, ఆ చిత్రాల ట్రైలర్స్ అన్నీ ఒకే రోజు ఒకే వేదికపై ఆవిష్కరించామన్నారు. మిగిలిన 8 చిత్రాల ట్రైలర్స్ను ఒకేసారి విడుదల చేయబోతున్నామ న్నారు. ప్రతి సంక్రాంతికి భీమవరం వస్తానని, భీమవరం అనుభూతి మరువలేనని అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఆంధ్రప్రదేశ్ విద్యుత్ నియంత్రణ కమిషన్ (ఏపీఈఆర్సీ) ఆధ్వర్యంలో 2026–27 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రిటైల్ విద్యుత్ సరఫరా టారిఫ్ దరఖాస్తులపై ఈనెల 20వ తేదీ నుంచి 27వ తేదీ వరకు ప్రజాభిప్రాయ సేకరణ హైబ్రిడ్ విధానంలో నిర్వహించనున్నట్లు ఆంధ్రప్రదేశ్ తూర్పు ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థ ఏలూరు సర్కిల్ సూపరింటెండింగ్ ఇంజనీర్ (ఆపరేషన్) సాల్మన్ రాజు ఒక ప్రకటనలో తెలిపారు. ఈనెల 20వ తేదీన తిరుపతిలో, 22, 23 తేదీలలో విజయవాడలో, 27వ తేదీన కర్నూలులో ఈ ప్రజా విచారణలు జరుగుతాయన్నారు. ఉదయం 10.30 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు ప్రత్యక్ష విధానంలో, మధ్యాహ్నం 2 గంటల నుంచి 4.30 గంటల వరకు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరుగుతాయన్నారు. ఈ ప్రజా విచారణల ప్రత్యక్ష ప్రసారం ఫేస్బుక్, ఎక్స్, వాట్సాప్, యూట్యూబ్, టెలిగ్రామ్ వంటి సోషల్ మీడియా వేదికల ద్వారా నిర్వహించనున్నట్టు తెలిపారు. -
పోలవరం ప్రాజెక్టును బ్యారేజ్గా మార్చేశారు
కుక్కునూరు: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి వెన్నుముక, జీవనాడి అయిన పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం బ్యారేజ్గా మార్చిందని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి గుజ్జల ఈశ్వరయ్య ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కుక్కునూరులో నూతనంగా నిర్మించిన అయితా శంకరయ్య సీపీఐ కార్యాలయం భవనాన్ని ఆయన రిబ్బన్ కట్ చేసి ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన సమావేశంలో ఈశ్వరయ్య మాట్లాడుతూ లక్షల ఎకరాల భూమికి సాగునీరు, రాష్ట్ర నలుమూలలకు తాగునీరు, విద్యుత్ అందిస్తూ బహుళార్థకంగా ఉపయోగపడే పోలవరం ప్రాజెక్టును కూటమి ప్రభుత్వం నిర్వీర్యం చేస్తూ బ్యారేజ్గా మార్చిందని విమర్శించారు. సుమారు 33 వేల కోట్ల పరిహారం నిర్వాసితులకు ఇవ్వకుండా ఎగొట్టడానికి కూటమి ప్రభుత్వం మొదటి దశ, రెండో దశ అంటూ కొత్త పాట పాడుతుందన్నారు. పూర్తిస్థాయిలో ప్రాజెక్టు నిర్మాణం చేపడితేనే రాష్ట్రం సస్యశ్యామలవుతుందని పేర్కొన్నారు. సర్వం త్యాగం చేస్తున్న నిర్వాసితులకు అన్ని విధాలుగా అండగా ఉండాల్సిన కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు వారికి తీవ్ర అన్యాయం చేస్తున్నాయని దుయ్యబట్టారు. ప్రజా శ్రేయస్సు కొరకు ప్రభుత్వాలు పనిచేయాలని సూచించారు. ఈ కార్యక్రమంలో జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, కుక్కునూరు మండల కార్యదర్శి కొన్నె.లక్ష్మయ్య, నాయకులు పాల్గొన్నారు. -
లైంగిక దాడి కేసులో 20 ఏళ్ల జైలు
పాలకోడేరు: బాలికను ప్రేమిస్తున్నానని, పెళ్లి చే సుకుంటానని నమ్మించి లైంగిక దాడికి పాల్పడి న కేసులో నిందితుడికి 20 ఏళ్ల జైలుతో పాటు రూ.20 వేల జరిమానా, బాధితురాలికి రూ.2 లక్షల నష్టపరిహారం చెల్లించాలంటూ భీమవ రం పోక్సో కోర్టు జడ్జి బి.లక్ష్మీనారాయణ సో మవారం తీర్పు చెప్పారు. వివరాలిలా ఉన్నాయి.. శృంగవృక్షంలోని నామనవారిపాలేనికి చెందిన పెరుమాళ్ల నరసింహారావు అలియాస్ చిన్నారి అనే వ్యక్తి అదే గ్రామానికి చెందిన బాలిక (14)ను రోజు స్కూల్కు వెళ్లేటప్పుడు ప్రేమిస్తున్నానని వేధించాడు. ఈ క్రమంలో 2016 ఆగస్టు 28న బాలిక ఇంట్లోకి బలవంతంగా ప్రవేశించి లైంగికదాడికి పాల్పడినట్టు బాలి క తల్లిదండ్రులు పాలకోడేరు పోలీస్స్టేషన్ను ఆశ్రయించారు. దీనిపై కేసు నమోదు చేసిన అప్పటి భీమవరం సీఐ ఆర్జీ జయసూర్య ద ర్యాప్తు ప్రారంభించారు. ఈ కేసులో నేరం రు జువు కావడంతో నిందితుడికి శిక్షలన్నీ ఏకకాలంలో అమలు చేయాలని జడ్జి ఆదేశించారు. పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఉండవల్లి రమేష్నాయుడు వాదనలు వినిపించగా, పాలకోడేరు ఎస్సై మంతెన రవివర్మ, కానిస్టేబుళ్లు ఎం.బాలకృష్ణ, జి. గోపి కీలకంగా పనిచేశారు. -
ఎంపీటీసీలకు అందని గౌరవం
బుట్టాయగూడెం: గత ఏడాదిన్నరగా ఎంపీటీసీలకు గౌరవ వేతనం అందడం లేదు. చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఎంపీటీసీలకు గౌరవ వేతనం చెల్లింపులకు ప్రభుత్వం నిధులు విడుదల చేయడం లేదు. వైఎస్సార్సీపీ ఎంపీటీసీలు అధికంగా ఉండడంతో చంద్రబాబు ప్రభుత్వం ఇలా తమపై నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని వారు విమర్శిస్తున్నారు. వేతనాల కోసం ఎంపీటీసీలు అధికారులను సంప్రదిస్తున్నా ఫలితం లేకుండా పోవడంతో నిరాశకు గురవుతున్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఏర్పడిన నాటినుంచి.. పోలవరం నియోజకవర్గంలో మొత్తం 94 మంది ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో బుట్టాయగూడెం మండలంలో 15 మంది, జీలుగుమిల్లి మండలం 9, పోలవరం 12, కుక్కునూరు 12, వేలేరుపాడు 7, కొయ్యలగూడెం 22, టి. నర్సాపురం మండలంలో 17 మంది చొప్పున ఎంపీటీసీలు ఉన్నారు. వీరిలో అత్యధికంగా వైఎస్సార్సీపీ ఎంపీటీసీలే ఉన్నారు. వీరికి నెలకు రూ. 3 వేల చొప్పున గౌరవ వేతనం అందించాల్సి ఉంది. అయితే చంద్రబాబు ప్రభుత్వం 2024 జూన్ 12వ తేదీన పగ్గాలు చేపట్టగా ఆ ఏడాదిలో పాత బకాయిలు చెల్లించారు. అప్పటి నుంచి దాదాపు ఏడాదిన్నర నుంచి గౌరవ వేతనం చెల్లించడంలేదని ఎంపీటీసీలు వాపోతున్నారు. అధికారిక కార్యక్రమాల్లో ప్రాధాన్యం లేదు ఎంపీటీసీలు ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులైనప్పటికీ కూటమి ప్రభుత్వం తమకు అధికార కార్యక్రమాల్లో కనీసం ప్రాధాన్యత ఇవ్వడంలేదని ఎంపీటీసీలు వ్యక్తం చేస్తున్నారు. అధికారులు కనీసం ప్రోటోకాల్ పాటించకుండా గ్రామాల్లోని కూటమి నేతలకే పెత్తనం ఇస్తున్నారని దీంతో తమకు ఎటువంటి గౌరవం ఉండటంలేదని వారు చెబుతున్నారు. తమకు అధికార కార్యక్రమాల్లో ప్రోటోకాల్స్ పాటించడంతో పాటు తమకు చెల్లించాల్సిన బకాయిలు చెల్లించాలని వారు కోరుతున్నారు. ఏడాదిన్నరకు పైగా విడుదల కాని గౌరవ వేతనం నిధులు అత్యధిక శాతం వైఎస్సార్సీపీ సభ్యులు కావడంతో నిర్లక్ష్యం ప్రోటోకాల్కు మంగళం పాడేసిన అధికారులు కూటమి నేతలకే పెత్తనం కూటమి ప్రభుత్వం వచ్చాక స్థానిక సంస్థలు నిర్వీర్యమయ్యాయి. ప్రజాస్వామ్యాన్ని ఖూనీ చేస్తూ స్థానిక ప్రజాప్రతినిధులను అవమానిస్తున్నారు. కార్యక్రమాల సమాచారం కూడా తెలియజేయకుండా కూటమి నాయకులతో చేయిస్తున్నారు. దీనిని ఖండిస్తున్నాం. ఎంపీటీసీలకు సరైన ప్రాధాన్యత ఇవ్వాలి. – గగ్గులోతు మోహన్రావు, వైస్ ఎంపీపీ, బుట్టాయగూడెం మండలం ఎంపీటీసీలకు ఏడాదిన్నర నుంచి చెల్లించాల్సిన గౌరవ వేతనాన్ని ప్రభుత్వం వెంటనే చెల్లించే విధంగా చర్యలు తీసుకోవాలి. మాకు రావాల్సిన గౌరవ వేతనం అందకపోవడం వల్ల అనేక ఇబ్బందులకు గురవుతున్నాం. బకాయిలు చెల్లిస్తే పండుగపూట ఎంపీటీసీలకు ఎంతో ఉపయోగకరంగా ఉంటుంది. – గాలి దుర్గారావు, ఎంపీటీసీ, కేఆర్పురం, బుట్టాయగూడెం మండలం -
సంక్రాంతి వైభవం చాటేలా..
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ముందెన్నడూ లేని విధంగా తెలుగు సంస్కృతి, సంప్రదాయాలు ఉట్టిపడేలా సంక్రాంతి సంబరాలను నిర్వహించేందుకు ఆలయ ఈఓ వై.భద్రాజి పర్యవేక్షణలో భారీగా ఏర్పాట్లు జరుగుతున్నాయి. అందులో భాగంగా కొండపైన షాపింగ్ కాంప్లెక్స్ వెనుక ఉన్న ఖాళీ ప్రదేశాన్ని సోమవారం ముస్తాబు చేశారు. పల్లెల్లో సంక్రాంతి సంబరాలు ఏవిధంగా జరుగుతాయో కళ్లకు కట్టినట్లుగా చూపేందుకు అధికారులు శ్రమిస్తున్నారు. పచ్చని పంటలతో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ఎలా ఉంటుందో చూపేందుకు వరి మడులు ఏర్పాటు చేసి, నాట్లు వేస్తున్నారు. అలాగే చెరకు, అరటి పంటలు వేశారు. ప్రస్తుతం మొక్కజొన్న సాగు పనులు, ఎడ్ల బండ్లకు రంగులు వేసే పనులు జరుగుతున్నాయి. పూరి గుడిసెను నిర్మించి దాన్ని ముస్తాబు చేస్తున్నారు. ఇంకా ఈత, తాడి చెట్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. అదేవిధంగా సంక్రాంతి విశిష్టతను తెలిపే చిత్రమాలికలు, రంగవల్లులు వేయాల్సి ఉంది. దేవస్థానం డీఈలు టి.సూర్యనారాయణ, సుధాకర్ల పర్యవేక్షణలో జరుగుతున్న ఈ పనులు మంగళవారం సాయంత్రం నాటికి పూర్తి కానున్నాయి. బుధవారం ఉదయం ప్రారంభమయ్యే ఈ సంక్రాంతి సంబరాల్లో వేలాది మంది భక్తులు పాల్గొనాలని ఈఓ కోరారు. -
నువ్వుల పంటతో రైతులకు అధిక లాభాలు
చింతలపూడి: రబీ కాలంలో సార్వా వరి తరువాత రైతులు నూనె గింజల పంటను సాగుచేస్తే నాణ్యమైన పోషక విలువలున్న నూనెను ఉత్పత్తి చేసుకోవడమే కాకుండా, విలువ ఆధారిత ఉత్పత్తులు మార్కెటింగ్ చేసుకుని ఆర్థికంగా పరిపుష్టి సాధించవచ్చని జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్, ప్రధాన శాస్త్రవేత్త, డాక్టర్ కె ఫణి కుమార్ రైతులకు సూచించారు. సోమవారం చింతలపూడి మండలం సమ్మెటవారిగూడెం గ్రామంలో నువ్వు పంట దిగుబడి – యాజమాన్య పద్ధతులు అనే అంశంపై నిర్వహించిన శిక్షణా కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సార్వా వరి పంట తర్వాత నువ్వులు వంటి నూనె గింజల పంటలు వేసుకుంటే లాభదాయంగా ఉంటుందన్నారు. పెట్టుబడి వ్యయం తక్కువని, చీడపీడల తాకిడి తక్కువగా ఉంటుందని తెలిపారు. ఎకరా వరికి కావలసిన నీటితో ఐదు ఎకరాల నువ్వు పంట సాగు చేయవచ్చని. చెప్పారు. తొలిదశలో కలుపు నివారణ, సమతుల్యమైన ఎరువులను వాడుతూ కేవలం 2, 3 తడులతో పంటను పండించుకోవచ్చన్నారు. నువ్వులకు మార్కెట్ రేటు ఎక్కువగా ఉండి సాగు ఖర్చు తక్కువ వలన నువ్వు పంట సాగులో అధిక లాభాలు పొందవచ్చునని తెలిపారు. ఏవో శ్రీ కె. మురళికృష్ణ, మాట్లాడుతూ జిల్లాలో నవ్వు పంట సాగుపై రైతుల్లో అవగాహన కల్పించి ప్రోత్సహిస్తున్నామన్నారు. తక్కువ నీటితో ఈ పంటను సాగు చేసి ఎక్కువ లాభాలను ఆర్జించవచ్చునని తెలిపారు. జిల్లా ఏరువాక కేంద్రం కోఆర్డినేటర్ డాక్టర్ ఫణి కుమార్ -
కోడి పందేలు చట్ట విరుద్ధం
కలెక్టర్ వెట్రిసెల్వి ఏలూరు(మెట్రో) : జిల్లాలో కోడి పందేలు జరగకుండా పటిష్ట చర్యలు తీసుకోవాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆదేశించారు. జిల్లాలో కోడి పందేలు, బెట్టింగులు నిర్వహించడం, ప్రోత్సహించడం, పాల్గొనడం చట్టవిరుద్ధమని, జిల్లాలో ఎవరైనా కోడి పందేలు, గుండాట, బెట్టింగులు నిర్వహిస్తే కఠిన చర్యలు తప్పవని హెచ్చరించా రు. పోలీసు, రెవెన్యూ అధికారులు గట్టి నిఘా పెట్టాలన్నారు. సదరు ఉత్తర్వులను అతిక్రమిస్తే కేసులు నమోదు చేస్తామన్నారు. జిల్లాలో ఎక్కడైనా కోడి పందేలు, గుండాట, బెట్టింగు లు నిర్వహిస్తున్నట్టు గుర్తిస్తే, సదరు సమాచారాన్ని కలెక్టర్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన కంట్రోల్ రూమ్ టోల్ ఫ్రీ నం. 18002331077కు తెలియజేయాలన్నారు. అ లాగే ఫొటోలు, వీడియోలను వాట్సాప్ నం.9491041428కు పంపాలని కోరారు. వచ్చేనెల రెండో వారంలో జరిగే రెండో విడత పట్టాదారు పాసు పుస్తకాల పంపిణీ, మొ దటి విడత పంపిణీపై పరిశీలన విషయాలను కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధ్యక్షతను సమీక్షించారు. ఏలూరు (టూటౌన్): కూటమి ప్రభుత్వం ఇచ్చి న హామీలను అమలు చేయాలని చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కమిటీ కలెక్టరేట్లో జేసీకి సోమవారం వినతి పత్రం సమర్పించింది. జి ల్లా కన్వీనర్ కడుపు కన్నయ్య, జిల్లా కో–కన్వీన ర్ పొట్టేలు పెంటయ్య మాట్లాడుతూ చేతి వృత్తి దారులకు 50 ఏళ్లకే పింఛన్ హామీని ప్రభుత్వం అమలు చేయాలని, సబ్సిడీపై రుణాలు, 300 యూనిట్ల ఉచిత విద్యుత్ ఇవ్వాలని కోరారు. చేతివృత్తిదారులతో పాటు బీసీలకు పలు హా మీలు ఇచ్చారని, వాటన్నింటినీ అమలు చే యాలని డిమాండ్ చేశారు. బీసీలకు రాష్ట్రంలో అనేక హామీలను ప్రభుత్వం ఇచ్చిందని అవి తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేశారు. భీమవరం (ప్రకాశంచౌక్): చాలా కాలంగా పెండింగ్లో ఉన్న పనుల కారణంగా సమ్మె నోటీ సు ఇస్తున్నట్టు భీమవరం మున్సిపల్ కాంట్రాక్టర్లు తెలిపారు. సోమవారం మున్సిపల్ కమిషనర్ రామచంద్రరెడ్డికి సమ్మె నోటీసు అందజేశారు. ఏళ్ల తరబడి చేసిన పనులకు బిల్లులు చె ల్లించకపోవడంతో తీవ్ర ఆర్థిక సంక్షోభాన్ని ఎ దుర్కొంటున్నామన్నారు. ప్రభుత్వం ప్రవేశపెట్టిన కొత్త చెల్లింపు విధానంతో సమస్యలు ఎదురవుతున్నాయని తెలిపారు. సుమారు రూ.18 కోట్ల బిల్లుల చెల్లింపులు పెండింగ్లో ఉన్నాయని, తక్షణమే చర్యలు తీసుకోవాలని కోరారు. పా త బకాయిలు చెల్లించే వరకూ కొత్త పనుల టెండర్లలో పాల్గొనరాదని నిర్ణయించామన్నారు. పట్టణానికి చెందిన కాంట్రాక్టర్లు పాల్గొన్నారు. భీమవరం: సంక్రాంతి పండుగకు ఇతర రా ష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల నుంచి వచ్చేవారు అక్కడి మద్యం తీసుకురావడం నేరమని జిల్లా మద్య నిషేధ అబ్కారీ అధికారి ఆర్వీ ప్రసాద్ రెడ్డి సోమవారం ప్రకటనలో తెలిపారు. మద్యం తీసుకువచ్చి పట్టుబడితే కేసు నమోదు చేయడంతో పాటు ఆయా వాహనాలను సీజ్ చేస్తామని హెచ్చరించారు. అలాగే ఇదే విషయాన్ని ప్రైవేట్ బస్సు, టూరిస్ట్ బ స్సు, ప్రైవేట్ టాక్సీ యజమానులు గుర్తుంచుకోవాలన్నారు. డిప్యూటీ కమిషనర్ బి.శ్రీలత, అసిస్టెంట్ కమిషనర్ కేవీఎన్ ప్రభుకుమార్ ఆధ్వర్యంలో ఏడు ప్రత్యేక బృందాలు ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 14 కేసులు నమోదు చేసి 14 మందిని అరెస్ట్ చేశారన్నారు. అలాగే 13.05 లీటర్ల మద్యాన్ని స్వాధీనం చేసుకున్నామని, 95 మంది పాత నేరస్తులను బైండోవర్ చేశామని పేర్కొన్నారు. ఇతర ప్రాంతాల నుంచి మద్యం రవాణా కాకుండా వాహన తనిఖీలు చేపట్టామని తెలిపారు. -
పందేల మాటున ‘పైసా’చికం
సాక్షి, భీమవరం: ఆయ్.. నేను పందెం పుంజునండీ.. పేరు డేగ.. మా ఈకల రంగు, శరీర తీరు బట్టి డేగ, నెమలి, పచ్చకాకి, నల్లకాకి, శవల, మైల, అ బ్రాస్, సేతువ పేర్లు పెట్టి మురిసిపోతుంటారు. తేడా వస్తే కోజంటూ కర్రీ చేసుకుని లొట్టలేసుకుంటూ తింటారు. ఎంత రాజభోగం అనుభవించినా సంక్రాంతి వస్తోందంటే చిగురుటాకుల్లా వణికిపోతాం. ప్రాణాలు అరికాల్లో పెట్టుకుని పోరాడతాం. ఈ భోగం మూణ్ణాళ్ల ముచ్చటనేనని తెలిసొచ్చేసరికి మా ఊపిరి పోతుంది. బతికున్నంత కాలం దర్జానే.. ఏమాటకామాట.. బతికున్నంత కాలం మా దర్జానే వేరు. పెద్ద పెద్ద లోగిళ్లు, మకాంలు మా నివా సాలు. మాలో కొందరికి ప్రత్యేకంగా పనివాళ్లు ఉంటారండోయ్. మా బాగోగులు చూస్తూ టైముకి మేత పెట్టేది వాళ్లే. అది ఆషామాషీ మేతనుకుంటే పొరపాటే. ఆ రాజభోగమే వేరు. అప్పుడప్పుడూ కాస్త ‘చుక్క’ కూడా పోస్తుంటారు. ట్రైనింగ్ మూడు నెలల్లో మా ఒక్కొక్కరిపై రూ.30 వేల వరకు ఖర్చు చేస్తుంటారు. ఇలా పెంచిన మమ్మల్ని పందెంరాయుళ్లు రూ.లక్షలు పెట్టి కొంటారు. పండుగల పేరు చెప్పి రూ.15 కోట్లకు పైనే మాపై వ్యాపారం జరుగుతుందంటే మాకున్న డిమాండ్ అలాంటిది మరి. ఇవన్నీ చూసి ఎంతో సంబరపడతాం. జన్మంటూ ఉంటే ఇక్కడే పుట్టాలని కోరుకుంటాం. అందుకే మా గోదారోళ్లకు కావాల్సిన వారిపై కోపం వచ్చినప్పుడు నిన్ను పందెం కోడిని మేపినట్టు మేపానని దెప్పిపొడవడం మమ్మల్ని చూసే వచ్చిందంటండీ.. ఆయ్. ఈ ఆనందం క్షణకాలమేనా.. ఈ ఆనందం క్షణకాలమేనని.. అమ్మవారికి బలిచ్చేముందు మేకపోతును మేపినట్టు.. పందెం బరి లో వదలడానికి మమ్మల్ని పెంచుతున్నారని తె లిసేసరికే భూమ్మీద మాలో చాలామందికి నూ కలు చెల్లిపోతాయండి. మాకు ట్రైనింగ్ మొదలవుతుందంటేనే అర్థమవుతుంది సంక్రాంతి దగ్గరపడుతోందని. అప్పటి నుంచి దినదినగండమే. ఇన్నాళ్లూ అనుభవించిన ఆనందం, రాజభోగం అంతా ఇంకొంతకాలమేనని. మా గోడు వినేదెవ్వరూ? ఎన్ని చట్టాలుండి.. వాటిని రక్షించే వ్యవస్థలు ఎన్నుండి.. కోర్టులు ఎంత కన్నెర్ర చేసి ఏం లాభం? కంచే చేను మేసినట్టు చట్టాలు చేసే పెద్దలే చంకలో మమ్మల్ని పెట్టుకుని ఫొటోలకు పోజులిస్తూ మరీ బరులు ప్రారంభిస్తారు. మాలో మేమే కత్తులు దూసుకునేలా పందెంలో దింపి వేలల్లో, లక్షల్లో పందేలు కాసి ఆనందిస్తారు. మా తలపై నిమిరిన చేతులే మా కాళ్లకు క త్తులు కడతాయి. వారికేం తెలుసు మా బాధ? పందెంలో దిగాక ఏం చేయలేని పరిస్థితి. చుట్టూ జనం, తప్పించుకునే వీలులేక మాలో మేమే ప్రాణాల కోసం తలపడాల్సిందే. ‘కాళ్లకు కట్టిన పదునైన కత్తులు శరీర భాగాల్ని చీలుస్తూ ఛిద్రం చేస్తున్నా.. ఒళ్లంతా నెత్తురోడుతున్నా.. కనురెప్ప వాలిపోతున్నా.. రెక్కలు తెగిపడి కదలలేకున్నా.. గెంతేందుకు శరీరం సహకరించకున్నా.. జాలి లేని జనం కోసం, వారి పైశాచికానందం కోసం ఊపిరున్నంతసేపూ పోరాడతాం. చివరి క్షణాల్లో అప్పుడనిపిస్తుంది.. రెక్కలకి బలమొచ్చి పక్షుల్లా ఎగిరిపోతే ఎంత బాగుంటుందని’. మేం అనుభవించే నరకాన్ని చూస్తూ పైశాచిక ఆనందం పొందడానికి పనిగట్టుకుని ఎక్కడెక్కడి నుంచో గొప్పగొప్పోళ్లు వస్తుంటారు. మూడు రోజులూ ఏమైపోతారో..? కోడిపందేలు నిర్వహిస్తే ఖబడ్దార్ అంటూ హె చ్చరించే పోలీసులు, జంతు సంక్షేమ సంఘం స మావేశాల పేరిట హడావుడి చేసే అధికారులు పండుగల మూడు రోజులూ ఏమైపోతారో తెలీదు. తర్వాత కొందరిపై ఏవో చిన్నచిన్న కేసులు పెట్టి చేతులు దులిపేసుకుంటుంటారు. ఇంకెవరికి చెప్పుకోవాలి మా బాధ? అదిగో అక్కడ బరి సిద్ధం చేసేశారు.. నన్ను పిలుస్తున్నారు.. బాయ్.. ఇక ఉంటాను. భూమ్మీద నాకింకా నూకలుంటే కొక్కొరోకో అంటూ తెల్లారి మిమ్మల్ని మేల్కొలుపుతాను. ఒకరు కోడి పోటీలంటారు.. ఇంకొకరు సంప్రదాయం అంటారు. కత్తుల్లేని పందేలు జరపమంటే మాత్రం నో అంటారు. ఆ కొట్లాటలో మాలో ఎవరోకరి ప్రాణాలు పోవాల్సిందే. నేను నెగ్గితే సరేసరి... ఓడినా వదలరు. కోజంటూ కోసేసి ఆరగిస్తారు. బతికుండగా రూ.లక్షల ధర పలికే మేము చచ్చినా తగ్గేదేలే అన్నట్టే ఉంటాం. మూడు నుంచి ఐదు కేజీల వరకు బరువుండే మా శరీరాలను రూ.5 వేల నుంచి రూ.15 వేల వరకు కొని గల్లీ నుంచి ఢిల్లీ దాకా కావాల్సిన రాజకీయ నాయకులు, అధికారులకు కానుకగా పంపిస్తుంటారు. పండుగల మూడు రోజుల్లో కోజాల పైనే జిల్లాలో రూ.5 కోట్ల పైనే వ్యా పారం జరుగుతుందంటుంటారు. కత్తి కట్టి.. నెత్తురోడి కాళ్లకు కత్తులు కట్టి కోడి పందేల నిర్వహణ శరీరం ఛిద్రమై నెత్తురోడుతూ.. కనురెప్ప పడుతున్నా కడ దాకా పోరాటం కానరాని జంతు ప్రేమికులు అడ్డుకోలేని చట్టాలు, వ్యవస్థలు పందెం పుంజుల గోడు -
అర్జీల పరిష్కారం వేగిరపర్చాలి
ఏలూరు(మెట్రో) : పీజీఆర్ఎస్లో అందిన అర్జీల పరిష్కారం వేగవంతం చేయాలని డీఆర్వో వి.విశ్వేశ్వరరావు ఆదేశించారు. సోమవారం కలెక్టరేట్లో పీజీఆర్ఎస్, రెవెన్యూ క్లినిక్లలో భాగంగా ప్రజల నుంచి 276 అర్జీలు స్వీకరించారు. రెవెన్యూ సమస్యల పరిష్కారానికి రెవెన్యూ క్లినిక్లు చక్కటి వేదిక అన్నారు. 28 మండలాలకు ప్రత్యేక కౌంటర్లు ఏర్పాటుచేసి అర్జీలు స్వీకరించారు. పీజీఆర్ఎస్ అర్జీల్లో కొన్ని.. ● చింతలపూడి మండలం ప్రగడవరం–జార్జిపేటకు చెందిన తాళ్లూరి శ్రీనివాసరావు తన ఇంటిని ఆనుకుని విద్యుత్ ట్రాన్స్ఫార్మర్ ఏర్పాటుచేశారని, దానిని మార్చాలని కోరారు. ● ముదినేపల్లి మండలం శింగారాయపాలేనికి చెందిన వేదుళ్లపల్లి సత్యవతి గ్రామ కంఠంలో ఉన్న భూమి ఆక్రమణకు గురైందని ఫిర్యాదు చేశారు. ● ద్వారకాతిరుమల మండలం కోడిగూడేనికి చెందిన బిరుదుగడ్డ మాణిక్యం తనకు ఉన్న కొద్దిపా టి పొలం తన కోడలు మాయమాటలు చెప్పి రిజిస్ట్రేషన్ చేయించుకుందని, తిరిగి ఇప్పించాలని అర్జీ అందించారు. ● జంగారెడ్డిగూడెం మండలం చిన్నవారిగూడేనికి చెందిన బండారు చంద్రమౌళి తన పట్టా భూమికి రక్షణ కల్పించాలని వినతిపత్రం అందించారు. ● లింగపాలెం మండలం కలరాయనగూడెం పరిధిలోని అటవీ భూముల్లో ఆక్రమణలు జరు గు తున్నాయని కోడూరి సురేష్ ఫిర్యాదు చేశా రు. అక్రమ ఆక్రమణలు జరుగుతున్నాయని కోడూ రి సురేష్ కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. సర్వే నంబర్లు 264, 269 పరిధిలోని అటవీ భూమిలో వ్యవసాయం చేయడంతో పాటు కోడి పందేలకు ఏర్పాట్లు చేస్తున్నారని అన్నారు. -
పాలకొల్లులో చెస్ పోటీలు
పాలకొల్లు సెంట్రల్: మేధా చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఏపీ స్టేట్ ఓపెన్ రాపిడ్ చదరంగం పోటీలు సోమవారం పాలకొల్లులో జరిగాయి. ఈ పోటీల్లో రాష్ట్రంలోని అన్ని జిల్లాల నుంచి 250 మంది క్రీడాకారులు పాల్గొన్నారు. ఈ పోటీలను ఏపీ స్టేట్ జనరల్ సెక్రెటరీ జగదీష్, మేధా చెస్ అకాడమీ ప్రెసిడెంట్, ఆడిటర్ పెద్దిబొట్ల లక్ష్మీనారాయణ, చాంబర్స్ ప్రెసిడెంట్ కారుమూరి నరసింహరావు, మద్దాల వాసులు మొదటి ఎత్తు వేసి ప్రారంభించారు. పోటీల్లో కాకినాడ జిల్లా వాసి జాన్స జాన్ సాయి సంతోష్ ప్రథమ బహుమతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన షణ్ముఖ రెడ్డి ద్వితీయ బహుమతి, తూర్పుగోదావరి జిల్లాకు చెందిన మజ్జి రామ్చరణ్తేజ్ తృతీయ బహుమతి సాధించారు. వివిధ కేటగిరిలో అండర్ 7, 9, 13, 15 విభాగాల్లో బాలబాలికలకు వేర్వేరుగా బహుమతులు అందజేశారు. నరసాపురం రూరల్: ఆలయాల్లో జరుగుతున్న చోరీలకు సంబంధించి నిందితుడిని సోమవారం అరెస్ట్ చేశారు. దీనికి సంబంధించి సోమవారం డీఎస్పీ జి శ్రీవేద వివరాలు వెల్లడించారు. మొగల్తూరు పోలీస్స్టేషన్ పరిధిలో వివిధ ఆలయాల్లో ఇటీవల చోరీలు జరిగాయి. ఈ చోరీ కేసుల్లో నిందితుడైన కాళీపట్నం పడమర గ్రామానికి చెందిన కవురు లోకేశ్వరరావు అనే 19 ఏళ్ల యువకుడిని అరెస్ట్ చేసినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడి నుంచి రూ.1.57లక్షలు విలువ గల 1.420 కేజీల వెండి, రూ.1.77 లక్షలు విలువగల 14 గ్రాముల బంగారు ఆభరణాలు స్వాధీనం చేసుకున్నట్లు చెప్పారు. నిందితుడిని కోర్టులో హాజరుపర్చగా రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
ఉద్యమాలపై ఉక్కుపాదం తగదు
ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలో ప్రజాఉద్యమాలపై ప్రభుత్వం నిర్బంధ చర్యలు ఆపాలని, అ నకాపల్లి జిల్లాలో రైతు నాయకుడు ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్టును ఎత్తివేయాలని, బుట్టాయగూడెం మండలం ఇనుమూరు గిరిజన రైతులపై పెట్టిన అక్రమ కేసు లు ఎత్తివేయాలని డిమాండ్ చేస్తూ రైతు, వ్యవసాయ కార్మిక, కార్మిక, ప్రజాసంఘాల ఆధ్వర్యంలో సోమవారం కలెక్టరేట్ ఎదుట ధర్నా చేశారు. ఈ సందర్భంగా వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు ఎ.రవి, జిల్లా కా ర్యదర్శి పి.రామకృష్ణ, రైతు సంఘం జిల్లా కా ర్యదర్శి కె.శ్రీనివాస్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి డీఎన్వీడీ ప్రసాద్ మాట్లాడుతూ అప్పలరాజుపై ప్రభుత్వం అక్రమంగా పీడీ యాక్టు పెట్టిందన్నారు. బుట్టాయగూడెం మండలం ఇనుమూరులో గిరిజన రైతుల సాగులో ఉన్న భూముల్లోని మొక్కజొన్న ఇతర పంటల ను ధ్వంసం చేయడం దుర్మార్గమన్నారు. విశా ఖలో విద్యార్థుల సమస్యలపై పోరాడుతున్న వి ద్యార్థి సంఘాల కార్యకర్తలపై రౌడీషీట్ ఓపెన్ చేయడం తగదన్నారు. ఉద్యమాలపై నిర్బంధాన్ని ప్రభుత్వం ఆపాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించుకోక తప్పదన్నారు. రైతు సంఘం జిల్లా అధ్యక్షుడు కట్టా భాస్కరరావు, జిల్లా నాయకులు కోన శ్రీనివాసరావు, సిరి బ త్తుల సీతారామయ్య, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా నాయకులు గూడెల్లి వెంకట్రావు తదితరులు పాల్గొన్నారు. అక్రమ పీడీ యాక్టు సిగ్గుచేటు భీమవరం : ప్రశ్నించే గొంతులపై పీడి యాక్ట్లను, రౌడీషీట్లను ప్రయోగిస్తున్న కూటమి ప్రభుత్వం పునరాలోచించాలని లేకుంటే తగిన మూల్యం చెల్లించక తప్పదని రైతు సంఘం రాష్ట్ర నేత బి.బలరాం హెచ్చరించారు. అనకాపల్లి జిల్లాలో రైతు సంఘం జిల్లా కార్యదర్శి ఎం.అప్పలరాజుపై అక్రమంగా పెట్టిన పీడీ యాక్ట్ రద్దు చేసి వెంటనే విడుదల చేయాలను కోరుతూ సీఐటీయూ, రైతు సంఘం, కౌలు రైతు సంఘం, వ్యవసాయ కార్మిక సంఘం, వృత్తి సంఘాల ఆధ్వర్యంలో స్థానిక ప్రకాశంచౌక్లో సోమవారం నిరసన సభ నిర్వహించారు. ఈ సందర్భంగా బలరాం మాట్లాడుతూ నక్కపల్లి ప్రాంతంలో భూముల కోసం పోరాటం చేస్తున్న అప్పలరాజు ప్రజలకు అండగా నిలవడం నేరమా అని ప్రశ్నించారు. గంజాయి, మద్యం, ఇసుక మాఫియా లాంటి వారిపై పెట్టాల్సిన కేసులు ప్రజలకు అండగా నిలిచే వారిపై పెట్టడం ఏంటని మండిపడ్డారు. ఏజెన్సీ ఏరియాలో బుట్టాయగూడెం మండలంలో గిరిజనుల భూముల్లో వేసుకున్న పంటలను ట్రాక్టర్లతో దున్ని నాశనం చేయడమే కాకుండా గిరిజను లు, నాయకులపై అక్రమంగా కేసులు పెట్టడం ఏరు దాటిన తర్వాత తెప్ప తగలేసిన విధంగా ఉందన్నారు. సీఐటీయూ జిల్లా కార్యదర్శి బి.వాసుదేవరావు, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి జక్కంశెట్టి సత్యనారాయణ, వృత్తి సంఘాల జిల్లా నాయకులు జుత్తిగ నరసింహమూర్తి, మామిడిశెట్టి రామాంజనేయులు, ఎం.ఆంజనేయులు, ఎం.వైకుంఠరావు తదితరులు పాల్గొన్నారు. -
రాగి వైర్ల చోరీ ముఠా అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ట్రాన్స్ఫార్మర్లలో రాగి వైర్లు చోరీ చేసే ముఠాని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. సోమవారం స్థానిక సర్కిల్ కార్యాలయంలో ఆమె వివరాలు వెల్లడించారు. ఈ నెల 1వ తేదీన కామవరపుకోట మండలం కేఎస్ రామవరంలో వ్యవసాయ పొలంలో గల నాలుగు విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలోని రాగివైరు చోరీకి గురైందన్నారు. దీనిపై రైతులు తడికలపూడి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. ఈ నేపధ్యంలో సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో దర్యాప్తు చేసి నిందితులను పట్టుకున్నారు. ద్వారకాతిరుమల మండలం గొల్లగూడెంనకు చెందిన కర్ని నాగశివ, చిలకలూరిపేట మండలం రామచంద్రాపురంనకు చెందిన గౌరవరపు దివాకర్బాబు, మంగళగిరి మండలం యర్రబాలెంకు చెందిన మహంకాళి కిషోర్, తెలంగాణ రాష్ట్రం మహాబూబ్నగర్ జిల్లా బెబ్బెరుకు చెందిన డక్కలి సురేంద్రలను అదుపులోకి తీసుకున్నట్లు ఏఎస్పీ తెలిపారు. వీరిని విచారించగా, మొత్తం 22 కేసులకు సంబంధించి 40 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లలో రాగివైరు చోరీ చేసినట్లు తేలిందన్నారు. దీంతో వీరిని అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచనున్నట్లు చెప్పారు. నిందితుల నుంచి సుమారు రూ.50 వేలు విలువ చేసే 50 కిలోల రాగివైరు, వైర్ల కటింగ్ అవసరమైన సామాగ్రి, 4 ద్విచక్రవాహనాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. కేసును ఛేదించిన జంగారెడ్డిగూడెం, తడికలపూడి ఎస్సైలు ఎన్వీ ప్రసాద్, పి.చెన్నారావు, క్రైంపార్టీ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, కానిస్టేబుళ్లను ఏఎస్పీ అభినందించారు. వీరికి రివార్డు కోసం సిఫార్సు చేస్తామని చెప్పారు. -
తిరువీధుల్లో శ్రీవారి వైభవం
ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్రంలో ధనుర్మాస ఉత్సవాలు తుది దశకు చేరుకున్నాయి. అందులో భాగంగా శ్రీవారికి సోమవారం క్షేత్ర పురవీధుల్లో జరిగిన తిరువీధి సేవ స్వామివారి వైభవాన్ని చాటింది. తొలుత ఆలయంలో శ్రీవారు, అమ్మవార్లు, గోదాదేవి ఉత్సవ మూర్తులను విశేషంగా అలంకరించిన తొళక్క వాహనంపై ఉంచి, అర్చకులు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామివారి వాహనం ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణలు, అశ్వ, గజ సేవల నడుమ తిరువీధి సేవ కన్నులపండువగా జరిగింది. తమ ఇంటి ముంగిటకు వచ్చిన చినవెంకన్నకు పెద్ద ఎత్తున భక్తులు నీరాజనాలు సమర్పించి, హారతులు పట్టారు. అనంతరం స్థానిక ధనుర్మాస మండపంలో శ్రీవారు, అమ్మవార్లకు అర్చకులు ప్రత్యేక పూజలు జరిపి, భక్తులకు తీర్థ ప్రసాదాలను అందజేశారు. -
బాస్కెట్బాల్ పోటీలు నూజివీడుకు గర్వకారణం
నూజివీడు: బాస్కెట్బాల్ పోటీలు నూజివీడుకే గర్వకారణమని మున్సిపల్ చైర్పర్సన్ రామిశెట్టి త్రివేణీదుర్గ అన్నారు. స్థానిక ధర్మఅప్పారావు కళాశాల ఆవరణలో శ్రీరాజా వెంకటాద్రి అప్పారావు బహద్ధూర్ 49వ స్మారక జాతీయస్థాయి బాస్కెట్బాల్ పోటీలను ఆదివారం రాత్రి మున్సిపల్ చైర్పర్సన్ త్రివేణీదుర్గ ప్రారంభించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ విద్యార్థి దశనుంచే క్రీడల పట్ల ఆసక్తి పెంచాలన్నారు. 49 ఏళ్లుగా దేశంలో ఎక్కడా లేని విధంగా నూజివీడులో బాస్కెట్బాల్ పోటీలను నిర్వహించడం చాలా గొప్ప విషయమన్నారు. పురుషుల విభాగంలో తొలి మ్యాచ్ నూజివీడు–కావలి జట్ల మధ్య నిర్వహించారు. సీఐ పీ సత్య శ్రీనివాస్, టోర్నమెంట్ కన్వీనర్ పీ సాధన, కృష్ణాజిల్లా బాస్కెట్బాల్ అసోసియేషన్ కార్యదర్శి దాసరి సత్యన్నారాయణ పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): కలెక్టరేట్లో ఆదివారం వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్వాతంత్య్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఘనంగా నిర్వహించారు. కలెక్టర్ నాగరాణి ఓబన్న చిత్ర పటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహారెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. -
కుట్రలతోనే కవ్వింపులు
సాక్షి, భీమవరం: తణుకు ప్రశాంతతను భగ్నం చేసేందుకు కూటమి నేతలు కుట్రలు పన్నుతున్నారు. ప్రతిపక్ష వైఎస్సార్సీపీ శ్రేణులను రెచ్చగొట్టే ధోరణిలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారు. మొన్న తణుకులో మొదలైన కూటమి కవ్వింపు చర్యలు తాజాగా ఉదరాళ్లపాలెంకు వ్యాపించాయి. సాధారణంగా పండుగల సందర్భంలో ప్రజలకు శుభాకాంక్షలు తెలుపుతూ ఏ పార్టీ నేతల విగ్రహాల చెంతన ఆ పార్టీకి సంబంధించిన నాయకులు ఫ్లెక్సీలు పెట్టడం పరిపాటి. అందుకు భిన్నంగా తణుకు వై.జంక్షనన్లో వైఎస్సార్ విగ్రహం ముందుభాగంలో గత నెల 25న రాత్రి సమయంలో పట్టణానికి చెందిన టీడీపీ సానుభూతిపరుడు కూటమి అగ్రనాయకత్వం, ఎమ్మెల్యే ఫొటోలతో ఫ్లెక్సీ ఏర్పాటుచేయడం వివాదాస్పదమైన విషయం విదితమే. తమ అభిమాన నాయకుడి విగ్రహం వద్ద ఏర్పాటుచేసిన కూటమి ఫ్లెక్సీని తొలగించాలని వైఎస్సార్సీపీ శ్రేణులు నిరసనకు దిగారు. వైఎస్సార్సీపీ ఫ్లెక్సీ ఏర్పాటుకు ప్రయత్నించగా పోలీసులు లాక్కున్నారు. విజయవాడ నుంచి హైదరాబాద్ ప్రయాణంలో ఉన్న మాజీ మంత్రి కారుమూరి వెంకటనాగేశ్వరరావుకు విషయం తెలిసి హుటాహుటిన తణుకు చేరుకుని పార్టీ శ్రేణులతో ఆందోళనకు దిగారు. శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా ఘటన స్థలం వద్ద వైఎస్సార్సీపీ ఫ్లెక్సీని ఏర్పాటు చేయించారు. 26వ తేదీ తెల్లవారుజామున పోలీసులు రెండు ఫ్లెక్సీలు తొలగించారు. 144 సెక్షన్ విధించామని మైకులో ప్రచారం చేయడంతో పాటు వైఎస్సార్ విగ్రహం వద్ద పోలీసు పికెటింగ్ ఏర్పాటుచేశారు. ఘటన స్థలం నేషనల్ హైవేకు సంబంధించిందని, ఇక్కడ ఏ విధమైన ఫ్లెక్సీలు ఏర్పాటుచేయరాదని హెచ్చరిక బోర్డుతో విగ్రహం చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటుచేశారు. ఆ రోజు నుంచి విగ్రహం వద్ద పగలు, రాత్రి పోలీసులు గస్తీ కొనసాగిస్తున్నారు. తణుకులో పరిస్థితి ఇలా ఉంటే శనివారం అత్తిలి మండలంలో ఆర్అండ్బీ శాఖ మంత్రి బీసీ జనార్ధనరెడ్డి పర్యటనను పురస్కరించుకుని ఉదరాళ్లపాలెం గ్రామంలో ఏర్పాటుచేసిన ఫ్లెక్సీలు వివాదాస్పదంగా మారాయి. మెయినన్ రోడ్ నుంచి గ్రామ పంచాయతీ వరకు మంత్రికి స్వాగతం పలుకుతూ ఫ్లెక్సీలను ఏర్పాటు చేశారు. ప్రధాన కూడళ్ల వద్ద మాజీ మంత్రి కారుమూరిని కించపర్చేలా ఊరు, పేరు లేకుండా ఫ్లెక్సీలు వెలిశాయి. ఉదయం నుంచి ఫ్లెక్సీలు ఉన్నా పోలీసులు పట్టనట్టు వ్యవహరించారని, వైఎస్సార్సీపీ లీగల్సెల్ రాష్ట్ర అధికార ప్రతినిధి వెలగల సాయిబాబారెడ్డి, పార్టీ శ్రేణులు నిరసన చేపట్టగా వాటిని తొలగించారంటున్నారు. అనంతరం బాధ్యులపై చర్యలు తీసుకోవాలని కోరుతూ వైఎస్సార్సీపీ నాయకులు అత్తిలి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు. ప్రశాంతంతకు పేరొందిన తణుకు నియోజకవర్గంలో ప్రతిపక్ష సభ్యులను కవ్వించి గొడవలు సృష్టించే కుట్రల్లో భాగంగానే ఈ తరహాలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేస్తున్నారన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. శాంతిభద్రతలకు విఘాతం కలిగించే ఇటువంటి దుశ్చర్యల పట్ల పోలీసులు కఠినంగా వ్యవహరించి అడ్డుకట్ట వేయాలని స్థానికులు కోరుతున్నారు. అధికారం ఇచ్చిన ప్రజానీకానికి మంచి పాలన అందించడం కంటే ప్రతిపక్షం వారిని ఏదోరకంగా కవ్వించి విధ్వంసాలు సృష్టించాలనే ఉద్దేశ్యంతో పనిచేస్తున్నారు. వైఎస్సార్సీపీలో చేసిన సంక్షేమం, అభివృద్ధికి ధీటుగా ప్రజలకు మంచి పరిపాలన అందిస్తే సంతోషిస్తాం. ఫ్లెక్సీలు పెట్టి గొడవలు సృష్టించాలనే చీఫ్ పాలిటిక్స్ చేయడం సిగ్గుచేటు. వైఎస్సార్ విగ్రహానికి టీడీపీ ఫ్లెక్సీ కట్టడం ఏమిటని ప్రశ్నిస్తే మాపై కేసులు పెట్టారు. ఇప్పుడు ఉరదాళ్లపాలెంలో నన్ను అవమానించాలనే ఉద్దేశ్యంతో ఫ్లెక్సీలు పెట్టి శునకానందం పొందుతున్నారు. గొడవలు సృష్టించి మాపై కేసులు నమోదుచేయించడమే లక్ష్యంగా ఉన్నారు. ఇంత జరుగుతున్నా పోలీసు అధికారులు ప్రేక్షకపాత్ర పోషిస్తున్నారు. నేడు వారు చేస్తున్నవన్నీ వారికి చేరే రోజులు వస్తాయి. – కారుమూరి వెంకట నాగేశ్వరరావు, మాజీ మంత్రి ఫ్లెక్సీలతో ప్రశాంతతను భగ్నం చేసే కుట్రలు మొన్న తణుకులో.. నిన్న ఉదరాళ్లపాలెంలో కూటమి నేతల కవ్వింపు చర్యలు -
పెద్దింట్లమ్మకు విశేష పూజలు
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానంలో ఆదివారం విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మవారిని దర్శించుకున్నారు. మహిళలు పాల పొంగళ్లు సమర్పించారు. ఆదివారం ఒక్క రోజున అమ్మవారి ప్రత్యేక, అంతరాలయ దర్శనాలు, కేశఖండన, పెద్ద, చిన్న తీర్థాలు, లడ్డూ ప్రసాదం, గదులు, అమ్మ చిత్రపటాలు అమ్మకం, విరాళాలు, వాహన పూజల ద్వారా రూ.36,025 ఆదాయం వచ్చిందని ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాస్ చెప్పారు. భక్తులకు అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.కాళ్ల: ధనుర్మాసం ఉత్సవాల్లో భాగంగా కాళ్ళకూరు గ్రామంలో వేంచేసియున్న స్వయం భూః శ్రీ వేంకటేశ్వర స్వామి వారి దేవస్థానం నందు ఆదివారం కూడారై పూజ నిర్వహించారు. ఈ సందర్భంగా కూడారై అక్కరసు (పాయసం) ప్రసాదాన్ని తయారు చేసి 1,350 గిన్నెలతో స్వామి, అమ్మ వార్లకు నివేదించారు. ఆలయ అర్చకులు పాంచరాత్ర ఆగమం శ్రీ వైష్ణవ సాంప్రదాయంలో పాశురములు, గానం చేశారు. దేవాలయంనందు వివిధ రకాల పుష్పాలతో శంఖు, చక్రం, నామాలతో అలంకరణలు చేయగా భక్తులు పెద్ద సంఖ్యలో పాల్గొని స్వామి, అమ్మవార్ల ప్రసాదాలు స్వీకరించారు. యతిరాజుల ఆండాళ్ గోష్టి వారు గోదాదేవి అమ్మవారికి చీర, సారె సమర్పించారు. దేవస్థానం చైర్మన్ అడ్డాల శివరామరాజు, ఈఓ మోకా అరుణ్ కుమార్, సిబ్బంది ఏర్పాట్లను పర్యవేక్షించారు.భీమవరం: పట్టణంలోని రైతు బజార్ ప్రాంతంలో మద్యం షాపు వద్ద ఒక వ్యక్తిపై మద్యం మత్తులో దాడిచేసి గాయపర్చిన ముగ్గురిపై కేసు నమోదు చేసినట్లు వన్టౌన్ ఎస్సై బీవై కిరణ్కుమార్ చెప్పారు.మహిళపై దౌర్జన్యం కేసుభీమవరం వన్టౌన్ పోలీసు స్టేషన్ పరిధిలోని చినరంగనిపాలెం ప్రాంతానికి చెందిన మహిళపై ప్రసన్నకుమారి, నర్సింహులు, మరో నలుగురు దౌర్జన్యం చేశారని అందిన ఫిర్యాదు మేరకు కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నట్లు వన్టౌన్ ఎస్సై కృష్ణాజీ చెప్పారు.గుర్తు తెలియని వ్యక్తి మృతిజంగారెడ్డిగూడెం: పట్టణంలోని యాక్సిస్ బ్యాంక్ సమీపంలో గుర్తు తెలియని వ్యక్తి మృతి చెందాడు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరిస్తున్నారు. మృతుడు గులాబీ కలర్ టీ షర్ట్, నల్లరంగు ఫ్యాంట్ ధరించి ఉన్నాడు. మృతుడు ఫిట్స్ కారణంగా మృతిచెంది ఉండవచ్చని భావిస్తున్నట్లు పోలీసులు తెలిపారు. కేసు దర్యాప్తు చేస్తున్నామన్నారు. -
మావుళ్లమ్మ ఆలయానికి ఉత్సవ శోభ
● రేపటి నుంచి 62వ వార్షిక మహోత్సవాలు ● ఫిబ్రవరి 14 వరకు ఉత్సవాలు.. ఏర్పాట్లు పూర్తి భీమవరం (ప్రకాశం చౌక్): భీమవరం ఇలవేల్పు మావుళ్లమ్మవారి 62వ వార్షిక మహోత్సవాలు మంగళవారం నుంచి ప్రారంభం కానున్నాయి. ఫిబ్రవరి 14 వరకు జరుగనున్న జాతర మహోత్సవాలకు సంబంధించి నీరుల్లి కూరగాయ, పండ్ల వర్తక సంఘం ఆధ్వర్యంలో దేవస్థానం సహకారంతో ఆమ్మవారి అలయం వద్ద అన్ని ఏర్పాట్లు పూర్తి చేశారు. ఆలయం వద్ద చలువ పందిళ్లు, ఆలయానికి నాలుగు దిక్కుల్లో ఆధ్యాత్మిక భావన కలిగేలా సెట్టింగ్లు, విద్యుత్ అలంకరణలు ఏర్పాటు చేశారు. అలాగే ప్రత్యేక క్యూలైన్లు సిద్ధం చేశారు. ఉత్సవాల్లో కార్యక్రమాలు ఇలా.. ప్రతి రోజూ సాయంత్రం 5 నుంచి రాత్రి 9 గంటల వరకు జానపద, భరత నాట్య ప్రదర్శనలు, హరికథ, బురక్రథ వంటి కళాప్రదర్శనలు, సినీ సంగీత విభావరిలు ఏర్పాటుచేశారు. సుమారు 30 నాటకాలు, 20 హరికథ, బురక్రథలు, 15 వరకూ సినీసంగీత విభావరి కార్యక్రమాలు ఏర్పాటు చేశారు. 5 నుంచి ప్రత్యేక అలంకరణలు ఫిబ్రవరి 5వ తేదీ నుంచి 13వ తేదీ వరకు శ్రీమావుళ్లమ్మ అమ్మవారికి అష్టలక్ష్మీలుగా ప్రత్యేక అలంకరణలు నిర్వహించి పూజలు నిర్వహిస్తారు. ఆదిలక్ష్మి, ధాన్యలక్ష్మి, ధైర్యలక్ష్మి, గజలక్ష్మి, సంతానలక్ష్మి, విజయలక్ష్మి, విద్యాలక్ష్మి, ధనలక్ష్మి, అన్నపూర్ణదేవి అలంకరణలో పూజలు అందుకుంటారు. భారీగా భక్తుల రాక అమ్మవారి ఉత్సవాలను తిలకించేందుకు జిల్లా వ్యాప్తంగా వేలాది మంది భక్తులు రావడంతో పాటు, రాష్ట్రాంలోని విజయవాడ, గుంటూరు, రాజమండ్రి, కాకినాడ, కొనసీమ, విశాఖపట్టణం, విజయనగరం, శ్రీకాకుళం నుంచి భక్తులు వస్తుంటారు. అలాగే హైదరాబాద్ నుంచి భారీగా భక్తులు తరలి వస్తారు. ముఖ్యంగా సంక్రాంతి నాలుగు రోజులు అమ్మవారి ఆలయం భక్తులతో కిక్కిరిసిపొతుంది. ఫిబ్రవరి 13న లక్ష మందికి అన్నదానం అమ్మవారి ఉత్సవాలను, అమ్మవారి దర్శనం కోసం వచ్చే భక్తులకు ఆలయం వద్ద నెల రోజులపాటు ఉత్సవ నిర్వాహకులు ఉచిత అన్నదానానికి ఏర్పాటు చేశారు. ఉత్సవాల్లో ఆఖరి రోజు ఫిబ్రవరి 13వ తేదీన మహా అన్నదానం నిర్వహిస్తారు. సుమారు లక్ష మందికి అన్నప్రసాదాన్ని అందిస్తారు. అమ్మవారి అన్న ప్రసాదం స్వీకరించడాన్ని జిల్లా ప్రజలు సెంటిమెంట్గా భావిస్తారు. ఉత్సవాల ఏర్పాట్లను ఆదివారం భీమవరం డీఎస్పీ రఘువీర విష్ణు పరిశీలించారు. ఉత్సవాల్లో భక్తులకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా ఉత్సవాల నిర్వాహకులు, దేవస్ధానం సిబ్బంది, పోలీసులు సమన్వయంతో పనిచేయాలని సూచించారు. ట్రాఫిక్కు ఇబ్బందులు రాకుండా పోలీసు సిబ్బంది ఏర్పాటు చేస్తామన్నారు. ఈనెల 13 నుంచి భీమవరం పట్టణ ఇలవేల్పు మావుళ్లమ్మ 62వ వార్షిక జాతరను నెల రోజులపాటు నిర్వహించనున్నట్లు ఉత్సవ నిర్వాహకులు, నీరుల్లి కూరగాయ పండ్ల వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటీ తెలిపారు. ఆదివారం విలేకర్ల సమావేశంలో సభ్యులు మాట్లాడుతూ మంగళవారం ఉదయం 5.15 గంటలకు వర్తక సంఘం అధ్యక్షుడు తుటారపు ఏడుకొండలు దంపతులు కలశస్థాపన చేసి ఉత్సవాలను ప్రారంభిస్తారని చెప్పారు. మధ్యాహ్నం 1 గంటకు అమ్మవారి గ్రామోత్సవాన్ని ఎమ్మెల్యే పులపర్తి రామాంజనేయులు, సాయంత్రం 4 గంటలకు కొటికలపూడి గోవిందరావు కళావేదికపై సాంస్కృతిక కార్యక్రమాలను మున్సిపల్ కమిషనర్ కె.రామచంద్రరెడ్డి ప్రారంభిస్తారన్నారు. సుమారు రూ.90 లక్షలతో ఉత్సవాలను నిర్వహిస్తున్నామన్నారు. ఉత్సవాల నెల రోజుల పాటు నాటకాలు, బుర్రకథలు, హరికథలు, కూచిపూడి, భరతనాట్యం, సినీ ఆర్కెస్ట్రాలు ప్రతి రోజు ఉంటాయని తెలిపారు. ఉత్సవ కమిటీ సభ్యులు తూటరపు ఏడుకొండలు, కొప్పుల సత్తిబాబు, రామాయణం చిన్నారి, కొప్పుల రంగారావు, రామాయణం శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
మాంసాహారం ధరలకు రెక్కలు
తణుకు అర్బన్ : చికెన్, మటన్, చేపల ధరలు షాకిస్తున్నాయి. పది రోజుల క్రితం వరకూ రూ.260 ఉన్న బ్రాయిలర్ చికెన్ నేడు రూ.320కు చేరుకోవడంతో మాంసాహారులు లబోదిబోమంటున్నారు. ముక్కలేనిదో ముద్దదిగని వారంతా మార్కెట్లో మాంసాహారం ధరలు చూసి గగ్గోలు పెడుతున్నారు. ఆదివారం వచ్చిందంటే చాలు మాంసాహారం తినాల్సిందే అనే ధోరణిలో ఉన్నవారు మార్కెట్లో ధరలు చూసి ఏం తినాలి.. ఏం కొనాలనే ధోరణిలో ఉన్నారు. మటన్ రూ.1000 నుంచి రూ.1200 వరకు ఉండగా చేప ధర కిలో రూ.220గా ఉంది. చికెన్కు విక్రయాలకు తగ్గట్లుగా ఉత్పత్తి లేకపోవడంతో ధరలు పెరుగుతున్నాయని రిటైల్ వ్యాపారులు చెబుతున్నారు. ధరలు పెరగడంతో కిలో కొనేవారు అర కిలో మాత్రమే కొనుగోలు చేస్తున్నారు. దీంతో కొనుగోళ్లు తగ్గాయని రిటైల్ వ్యాపారులు వాపోతున్నారు. జిల్లాలో రిటైల్ వ్యాపారంలో రోజుకు 30 వేల కిలోలకుపైగా చికెన్ అమ్మకాలు జరుగుతాయి. ఆది, మంగళవారాల్లో రెట్టింపు అమ్మకాలు జరుగున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. మటన్ విషయానికి వస్తే రోజూ 20 వేల కిలోల అమ్మకాలు జరుగుతుండగా, చేపలు ఆదివారం ఒక్కరోజే 50 వేల కిలోలకుపైగా విక్రయాలు జరుగుతున్నాయని సమాచారం. మాంసాహారం ధరలు విపరీతంగా పెరిగిపోవడంపై ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఏడాది కాలంగా మాంసాహార ధరలు విపరీతంగా పెరుగుతున్న ధరలపై ప్రభుత్వానికి ఎలాంటి నియంత్రణ లేదని విమర్శిస్తున్నారు. -
కోడిపందేల బరి ధ్వంసం
నూజివీడు: సంకాంత్రి సందర్భంగా కోడిపందేలు వేసేందుకు మండలంలోని తుక్కులూరులో సిద్ధం చేసిన కోడిపందేల బరిని రూరల్ సీఐ కొప్పిశెట్టి రామకృష్ణ ఆధ్వర్యంలో రూరల్ ఎస్సై జ్యోతీబసు, స్టేషన్ సిబ్బంది ధ్వంసం చేశారు. దీనిలో భాగంగా బరిని ట్రాక్టర్తో దున్నించారు. ఈ సందర్భంగా సీఐ మాట్లాడుతూ పండుగ పేరుతో కోడిపందేలు, జూదాలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సంక్రాంతి పండుగను శాంతియుతంగా కుటుంబంతో ఆనందంగా జరుపుకోవాలన్నారు. జూదాలు, కోడిపందేల జోలికి వెళ్లి ఆర్థికంగా నష్టపోవొద్దని విజ్ఞప్తి చేశారు. భీమవరం: చదరంగం క్రీడ అన్ని వయస్సుల వారికి మేథస్సును పెంచడమేగాక మానసిక వికాసానికి ఎంతగానో దోహదం చేస్తుందని భీమవరం మావుళ్లమ్మ ట్రస్ట్బోర్డు చైర్మన్ బొండాడ నాగభూషణం అన్నారు. అనసూయ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో ఆదివారం భీమవరం ఆర్యవైశ్య యువజన సంఘం భవనంలో ఏపీ స్టేట్ ర్యాపిడ్ చెస్ టోర్నమెంట్ను ప్రారంభించిన సందర్భంగా ఆయన మాట్లాడారు. ఈ టోర్నమెంట్కు వివిధ జిల్లాల నుంచి 56 మంది చెస్ క్రీడాకారులు హాజరయ్యారు. కార్యక్రమంలో చెస్ అసోసియేషన్ జిల్లా అధ్యక్ష, కార్యదర్శులు మాదాసు కిషోర్, గమిని పవన్, ఉపాధ్యక్షుడు పరుచూరి నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): విద్యతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని, ప్రతి విద్యార్థి తమ ఇంట భారత దేశ పవిత్ర గ్రంథమైన రాజ్యాంగ పుస్తకాన్ని ఉంచుకోవాలని రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డి కోరారు. స్థానిక గిరిజన భవన సమావేశ మందిరంలో ఆదివారం ఎస్టీ ఉద్యోగుల సంఘం డైరీ ఆవిష్కరణ, 1వ తరగతి నుంచి 10వ తరగతి వరకు 200 మంది నిరుపేద విద్యార్థులకు విద్యా ఉపకరణాలు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఎస్టీ కమిషన్ చైర్మన్ సోళ్ల బొజ్జిరెడ్డితోపాటు ఏలూరు ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), ఏపీ ఎస్టీ కమిషన్ సభ్యులు పన్నర్సు వెంకటప్ప, కాకి లక్ష్మి పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: సంక్రాంతి పండుగ సందర్భంగా సీపీఎస్ ఉద్యోగులకు డీఏ బకాయిలు చెల్లించాలని ఏపీసీపీఎస్ఈఏ రాష్ట్ర కార్యదర్శి ఆర్ నాగ దుర్గారావు ప్రభుత్వాన్ని కోరారు. 2018 జూలై నుంచి ఇప్పటి వరకూ సీపీఎస్ ఉద్యోగులకు ఒక్క డీఏ ఏరియర్ కూడా చెల్లించలేదన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన వెంటనే ఐఆర్ ఇస్తామని చెప్పి ఇప్పటివరకు ప్రకటించలేదని, వెంటనే ఉద్యోగులకు ఐఆర్ ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు. నూజివీడు: అప్పుల బాధ తట్టుకోలేక వివాహిత ఆత్మహత్యకు పాల్పడిన ఘటన నూజివీడు మండలం బోర్వంచ శివారు కొన్నంగుంటలో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం కొన్నంగుంటకు చెందిన ఆరేపల్లి దేవి(36), శివయ్య దంపతులు. వీరు కూలి పనులకు వెళ్లడంతో పాటు శివయ్య ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తూ కుటుంబాన్ని పోషించుకుంటున్నాడు. అయితే ఇల్లు నిర్మించుకునే సమయంలో అప్పులు చేయడం, ఆ అప్పులు రోజురోజుకు పెరిగిపోతుండగా వాటిని తీర్చే మార్గం కనపడక మనస్తాపంతో ఆదివారం తెల్లవారుజామున ఆరేపల్లి దేవి ఇంటి వద్ద చీరకు ఉరి వేసుకొని ఆత్మహత్య చేసుకుంది. ఈమెకు వివాహమైన కుమార్తె, కుమారుడు ఉన్నారు. రూరల్ ఎస్సై ఎన్ లక్ష్మణ్బాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం నూజివీడులోని ఏరియా ఆసుపత్రికి తరలించారు. -
స్వాగత ద్వారంపై రాజకీయ ఫ్లెక్సీ
ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రంలో శ్రీవారి కొండపైకి వెళ్లే ఘాట్రోడ్డులోని ఆర్చిగేటు (స్వాగత ద్వారం)కు కొందరు టీడీపీ నాయకులు ఆదివారం రాజకీయ ఫ్లెక్సీని అమర్చడం తీవ్ర దుమారాన్ని రేపింది. ఇది ఆధ్యాత్మిక కేంద్రమా.. లేక రాజకీయ కేంద్రమా అని భక్తులు ప్రశ్నిస్తున్నారు. వివరాల్లోకి వెళితే. ఆదివారం ఉదయం యాదవ కల్యాణ మండప ప్రాంతంలో మల్టీపర్పస్ భవనం అదనపు వసతి నిర్మాణానికి శంకుస్థాపన కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్య అతిథులుగా ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్, గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు పాల్గొన్నారు. దీనిని పురస్కరించుకుని టీడీపీ నాయకులు ఏకంగా ఆర్చిగేటుకు ఫ్లెక్సీని అమర్చారు. ఇది వివాదాస్పదమైంది. అయినా దేవస్థానం అధికారులు కన్నెత్తి చూడకపోవడంపై భక్తులు మండిపడుతున్నారు. గతంలో గరుడాళ్వార్ సెంటర్లో, లింగయ్య చెరువు మలుపులో వివిధ రాజకీయ పార్టీల నేతల ఫ్లెక్సీలు ఉండగా భక్తుల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమైతే దేవస్థానం అధికారులు వీటిని తొలగించారు. ముక్కున వేలేసుకుంటున్న భక్తులు -
వడ్డే ఓబన్నకు నివాళి
ఏలూరు(మెట్రో) : ప్రముఖ స్వాతంత్ర సమరయోధుడు వడ్డే ఓబన్న జయంతి ఉత్సవాలు ఏలూరు జిల్లా కలెక్టరేట్లో ఘనంగా జరిగాయి. కలెక్టర్ వెట్రిసెల్వి ఓబన్న చిత్రపటానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ బ్రిటిష్ వారిపై ఉయ్యాలవాడ నరసింహరెడ్డి చేసిన పోరాటంలో ఆయనకు సహాయకుడిగా ఉంటూ వడ్డే ఓబన్న చేసిన పోరాటం ఎంతో స్ఫూర్తిదాయకమని అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయుల ఈఎల్ బకాయిలు కాలయాపన లేకుండా తక్షణమే విడుదల చేయాలని ఆంధ్రప్రదేశ్ టీచర్స్ ఫెడరేషన్ (ఏపీటీఎఫ్–1938) ఏలూరు జిల్లా శాఖ అధ్యక్షుడు ఈ.రామ్మోహన్, జిల్లా ప్రధాన కార్యదర్శి జీ. మోహన్ ఒక ప్రకటనలో డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కుల కోసం నిరీక్షించాల్సి రావడం దురదృష్టకరమన్నారు. ఉపాధ్యాయులు వివిధ అత్యవసర అవసరాల నిమిత్తం దరఖాస్తు చేసుకున్న పీఎఫ్ రుణాలను కూడా ఆలస్యం లేకుండా వెంటనే మంజూరు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆర్జిత సెలవుల బకాయిలు, పీఎఫ్ రుణాలు ప్రభుత్వ దయాధర్మాలు కావని, ఉపాధ్యాయుల కష్టార్జిత హక్కులని స్పష్టం చేశారు. దరఖాస్తు చేసిన పీఎఫ్ రుణాలను కూడా వెంటనే మంజూరు చేయాలని రాష్ట్ర అకడమిక్ కమిటీ కన్వీనర్ జీ కృష్ణ డిమాండ్ చేశారు. లేనిపక్షంలో, ఉపాధ్యాయుల హక్కుల సాధన కోసం రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలను ఉధృతం చేస్తామని హెచ్చరించారు. పెనుగొండ: జాతీయ విద్యావిధానం–2020 ద్వారా ఉన్నత విద్యా రంగంలో ఎదుర్కొంటున్న సమస్యలను పరిష్కరించవచ్చని ఉన్నత విద్య జాతీయ డైరెక్టరు చప్పిడి కృష్ణ అన్నారు. పెనుగొండ ఎస్వీకేపీ కళాశాలలో ఉన్నత విద్యా రంగం ఎదుర్కొంటున్న సవాళ్లు– పరిష్కారంపై ఆదివారం జాతీయ సదస్సులో పాల్గొన్నారు. 2020 జాతీయవిద్యా విధానం 10 సంవత్సరాల పాటు అమలులో ఉంటుందని, ప్రస్తుతం ఐదు సంవత్సరాలు గడిచాయన్నారు. పెనుగొండ ఎస్వీకేపీలో నాణ్యమైన ఉపాధ్యాయులు, మౌలిక సదుపాయాల కల్పనలో పాలకవర్గం ఎప్పటికపుడు మార్పు చెందుతూ ముందుకు సాగడంతో ముందంజలో ఉందన్నారు. కేంద్ర గిరిజన విశ్వవిద్యాలయం వైస్ చాన్సలర్ డాక్టర్ శ్రీనివాసన్, శివనాడార్ యూనివర్శిటీ ప్రొఫెసర్ జయదేవ్, సెక్రటరీ కరస్పాండెంట్ డాక్టర్ రామచంద్రరాజు పాల్గొన్నారు. పెనుగొండ: విద్యాబుద్ధులు నేర్పి ఉన్నత శిఖరాలకు చేర్చిన గురువును సిద్ధాంతం విద్యార్ధులు వినూత్న రీతిలో గౌరవించి భక్తిని చాటుకున్నారు. సిద్ధాంతానికి చెందిన ఉపాధ్యాయుడు బండారు వెంకటేశ్వరరావు ఇటీవల పదవీ విరమణ చేశారు. 30 ఏళ్లుగా వెంకటేశ్వరరావు వద్ద విద్యనభ్యసించిన వందలాది మంది విద్యార్థులు ఆదివారం గురువుకు ప్రత్యేక రథంపై గ్రామోత్సవం నిర్వహించారు. పురవీధుల్లో కేరళ వాద్యాలతో హోరెత్తించారు. వెంకటేశ్వరరావు దంపతులను ఘనంగా సత్కరించారు. -
నత్తనడకన జలజీవన్ మిషన్ పనులు
గణపవరం: గణపవరం పట్టణాన్ని పట్టి పీడిస్తున్న మంచినీటి సమస్యకు పరిష్కారంగా ప్రారంభించిన జలజీవన్ మిషన్ పనులు నత్తనడకన సాగుతున్నాయి. పట్టణ విస్తీర్ణం పెరిగిపోవడంతో పాటు పాత పైపులైన్లు పాడయ్యాయి. శివారు ప్రాంతాల ప్రజలకు సరిపడా నీరు అందడం లేదు. పైపుల ద్వారా సురక్షిత మంచినీరు లభించక ప్రజలు ప్రైవేటు వాటర్ ప్లాంట్ల నుంచి తాగునీరు కొనుగోలు చేస్తున్నారు. వీటికి పరిష్కారంగా గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో అప్పటి ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు జలజీవన్ మిషన్ పథకం నుంచి రూ.3.11 కోట్లను మంజూరు చేయించారు. ఈ పథకంలో 1.20 లక్షల లీటర్ల ఓహెచ్ఎస్ఆర్, 100 కెఎల్ సామర్థ్యం కలిగిన సంపు, 200 ఎంఎల్ మైక్రోఫిల్టర్, 15 కిలోమీటర్ల మేర పైపులైన్లు ఏర్పాటు చేయాల్సి ఉంది. ఈ పథకానికి 2022 అక్టోబర్ 26న అప్పటి వాసుబాబు శంకుస్థాపన చేశారు. తొలిదశలో మంచినీటి పథకం ఓవర్ హెడ్ ట్యాంకు నిర్మాణం పూర్తి చేశారు. గ్రామంలో 15 కిలోమీటర్ల మేర పాత పైపులైన్లు తొలగించి, కొత్తపైపులు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. శంకుస్థాపన చేసిన తర్వాత ముమ్మరంగా సాగిన పనులు సాధారణ ఎన్నికలు రావడంతో మందగించాయి. కొత్త ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఇప్పటికీ పనులు పూర్తి కాలేదు. ఓవర్హెడ్ ట్యాంకు, సంపు నిర్మించినా తుదిదశ పనులు పూర్తి చేయాల్సి ఉంది. మైక్రో ఫిల్టర్ నిర్మాణం చేయాల్సి ఉంది. 15 కిలోమీటర్ల కొత్త పైపులైన్లు వేయాల్సి ఉండగా ఇప్పటికి 5 కిలోమీటర్ల లోపు మాత్రమే కొత్త పైపులు వేశారు. కొత్త పైపులైన్లు వేయడం పూర్తయితే పట్టణంలో దాదాపు రెండువేల పైచిలుకు ప్రైవేటు కుళాయిలను కొత్త పైపులైన్లకు మార్చాల్సి ఉంది. పైపులైన్ల నిర్మాణం కోసం పలు ప్రాంతాల్లో రోడ్లు ఎక్కడికక్కడ తవ్వేయడంతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. రోడ్డు, మార్జిన్లు తవ్విన సమయంలో కొన్ని చోట్ల పాత పైపులైన్లు దెబ్బతిని వాటి ద్వారా కుళాయిల్లో మురుగునీరు వస్తుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికై నా అధికారులు తగిన చర్యలు చేపట్టి జలజీవన్ మిషన్ పనులు త్వరితగతిన పూర్తిచేసి ప్రజల మంచి నీటికష్టాలు తీర్చాలని ప్రజలు కోరుతున్నారు. గణపవరం మంచినీటి సమస్యకు మోక్షమెప్పుడో? -
అంతర్రాష్ట్ర దొంగ అరెస్ట్
ఉయ్యూరు: నగల దుకాణాల్లో చోరీలకు పాల్పడుతున్న అంతర్రాష్ట్ర దొంగను ఉయ్యూరు పోలీసులు అరెస్ట్ చేశారు. గన్నవరం డీఎస్పీ చలసాని శ్రీనివాసరావు ఆదివారం ఉయ్యూరు టౌన్ పోలీసుస్టేషన్లో వివరాలు వెల్లడించారు. పశ్చిమగోదావరి జిల్లా అయి భీమవరానికి చెందిన గొర్రెల సత్యనారాయణ చిన్ననాటి నుంచే విలాసాలకు అలవాటు పడి దొంగతనాలను వృత్తిగా ఎంచుకున్నాడు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాల్లో బంగారు నగల దుకాణాలను టార్గెట్గా చేసుకుని చోరీలకు పాల్పడుతున్నాడు. ఇరు రాష్ట్రాల్లో 30కి పైగా కేసులు ఉన్నాయి. కృష్ణా జిల్లా గన్నవరం పోలీసుస్టేషన్లో చోరీ కేసు నమోదైంది. మధ్యాహ్న భోజన సమయాన్ని అదునుగా చేసుకుని నగల దుకాణాల్లోకి చొరబడి ఆభరణాలను అపహరిస్తుంటాడు. చోరీ సొత్తు కొంటున్న వ్యక్తి అరెస్ట్ ఈ క్రమంలో గత నెల 20న ఉయ్యూరు మార్కెట్ సెంటర్ సమీపంలో శ్రీకృష్ణసాయి జ్యూయలర్స్లో షాపు యజమానురాలు భోజనం చేస్తున్న సమయంలో షాపులోకి ప్రవేశించి 80 గ్రాములు విలువైన 35 జతల బంగారు చెవి దిద్దులను అపహరించుకుపోయాడు. షాపు యజమాని ఫిర్యాదు మేరకు సీసీ ఫుటేజ్ ఆధారంగా పోలీసులు సత్యనారాయణను గుర్తించి గాలింపు చర్యలు చేపట్టారు. సీసీఎస్ సీఐ గోవిందరాజు, ఉయ్యూరు పట్టణ సీఐ రామారావు సిబ్బందితో చాకచక్యంగా వ్యవహరించి ఉయ్యూరు మార్కెట్యార్డు సమీపంలో సత్యనారాయణను అదుపులోకి తీసుకుని అతని వద్ద నుంచి 30 జతల చెవి దిద్దులు, 12 చిన్న ఉంగరాలు స్వాధీనం చేసుకున్నారు. స్వాధీనం చేసుకున్న బంగారు ఆభరణాల విలువ రూ.12 లక్షలు ఉంటుందన్నారు. సత్యనారాయణతో పాటు చోరీ సొత్తు కొనటానికి వచ్చిన కంచర్ల సాయిసుధీర్ను గుంటూరు నల్లచెరువు సమీపంలో అరెస్టు చేశారు. నిందితులను అరెస్ట్ చేసి, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకున్నారు. నిందితులను కోర్టుకు తరలిస్తున్నట్లు డీఎస్పీ తెలిపారు. కేసులో చాకచక్యంగా వ్యవహరించిన సీఐలు, సిబ్బందిని డీఎస్పీ అభినందించారు. -
జీడి మామిడి.. జాగ్రత్తలతోనే అధిక దిగుబడి
చింతలపూడి: ఉమ్మడి ఏలూరు – పశ్చిమ గోదావరి జిల్లాల్లో విస్తరించిన ఉన్న జీడితోటలు ప్రస్తుతం పూత దశలో ఉన్నాయి. ఈ పరిస్థితుల్లో జీడిమామిడి రైతులు పూత దశ నుంచి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై ఉద్యాన శాఖ అధికారిణి ఎండీ షాఫియ ఫర్హీన్ రైతులకు సూచనలు చేశారు. సాధారణంగా జీడి మామిడిలో పూత అక్టోబర్, నవంబర్ నెలల్లో మొదలై జనవరి, ఫిబ్రవరి వరకు వస్తుంది. జీడిచెట్టుకు వచ్చిన పూతలో సుమారు 200 నుంచి 800 వరకు పూలు పూస్తాయి. జీడిమామిడి చెట్లు పరాగ సంపర్కం వల్ల ఫలదీకరణ చెందుతాయి. ఈ చెట్లు పూతకు రావాలంటే సుమారు 25 రోజుల నుంచి 30 రోజులు పొడి వాతావరణం ఉండాలి. ఒకవేళ అక్టోబర్ నుంచి నవంబర్ వరకు వర్షాలు పడినట్లయితే పూత ఆలస్యమై రాలిపోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అలాగే తెగుళ్ల తీవ్రత కూడా అధికం. జీడిమామిడి అంట్లు నాటిన రెండవ సంవత్సరం నుంచే పూత వస్తుంది. ఆ పూతను రైతులు తుంచివేసి చెట్ల శాఖలు పెరగడానికి ప్రోత్సహించాలి. దీనివల్ల చెట్లు బలంగా పెరిగి ఎక్కువ దిగుబడిని ఇస్తాయి. వర్షాకాలంలో సిఫార్సు చేసిన ఎరువులు రెండు నుంచి మూడు సమ భాగాలుగా వేసుకోవాలి. ఐదు సంవత్సరాలు పైబడిన చెట్టుకు యూరియ 1.5 కేజీలు, సూపర్ ఫాస్ఫేట్ 650 గ్రాములు, పొటాష్ 1 కేజీ వేసుకోవాలి. పూత దశలో తెగుళ్ల ఉధృతి పూత దశలో మంచు ఎక్కువగా పడుతున్నప్పుడు పూత లోపల తేమ చేరి ఎండిన మగపూల వలన తామర పురుగులు లేదా తేయాకు దోమ ఉధృతి ఎక్కువయ్యే అవకాశాలు ఉంటాయి. జీడిమామిడిలో టి దోమ పూత దశ అంటే అక్టోబర్, నవంబర్ నెలలో మొదలవుతుంది. జనవరిలో ఎక్కువై లేత చిగుళ్లు, పూత, పూత కాడలను, చిన్న కాయలను ఆశించి రసం పీల్చడం ప్రారంభిస్తాయి. రసం పీల్చినప్పుడు ఒక రకమైన పదార్థం వదలడం వల్ల కాయలపై, చిగుర్లపై గజ్జిలాంటి లక్షణాలు కనిపిస్తాయి. అంతేకాకుండా పూత, చిగుర్లపై చేసిన రంధ్రాల వలన ఫ్లవర్ బైట్ అనే తెగులు కూడా వ్యాప్తి చెందుతుంది. బూడిద తెగులుతో పూతకు నష్టం పొడి వాతావరణం ఉన్నప్పుడు బూడిద తెగులు కూడా ఎక్కువగా పూతను నష్టపరిచి పూత రాలిపోయేలా చేస్తుంది. బూడిద తెగులు వల్ల లేత చిగుళ్లను, పూతను ఆశించి ఎండిపోయేలా చేసి పంటను నష్టపరుస్తుంది. దీని నివారణకు సల్ఫర్ 3 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. లేదా ట్రై డేమోర్ప్ 1.5 గ్రాములు లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి. ఆకు, పూత, కాయమచ్చ తెగుళ్ల నివారణ ఆకులపై చిన్న, చిన్న లేత ఆకుపచ్చ వర్ణంలో మచ్చలు ఏర్పడి క్రమేపీ మచ్చలు పెరుగుతూ మచ్చ మధ్య ఎండిపోయి చివరికి మొత్తం ఆకు ఎండి రాలిపోతుంది. పూత, పూత కాడలపై మచ్చలు వచ్చి పూత ఎండిపోయి రాలిపోతుంది. దీని నివారణకు రైతులు తొలుత తెగులు ఆశించిన కొమ్మలు తొలగించుకోవాలి. మంకోజెట్ 1 గ్రాము లీటరు నీటికి, లేదా కాపర్ ఆక్సీక్లోరైడ్ 3 గ్రాములు లీటర్ నీటికి, లేదా క్లోరో తాలోనిల్ 1 మి.లీ లీటర్ నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. ఎండీ షాఫియ ఫర్హీన్, ఉద్యాన శాఖ అధికారిణి దోమ నివారణకు పూత మొదలై పువ్వు విచ్చుకోక ముందు ఒకసారి, పూలు ఫలదీకరణ చెందిన తరువాత రెండో సారి, టి దోమ ఉద్ధృతి ఎక్కువగా ఉన్నప్పుడు (కాయ గోలీ సైజులో ఉన్నప్పుడు) మూడో సారి పిచికారీ చేయాలి. చెట్లు చిగురించినప్పుడు మొదట పిచికారీకి రైతులు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటరు నీటికి, లేదా అసిటామాప్రిడ్ 0.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. అలాగే పూత కొమ్మలు కనిపించినప్పుడు రెండు, మూడు వారాల తరువాత ఇమిడాక్లోప్రిడ్ 0.6 మి.లీ లీటరు నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి రెండో సారి పిచికారీ చేయాలి. కాయలు గోలీ సైజులో ఉన్నప్పుడు ల్యాండా సైహాలో త్రిన్ 0.6 మిల్లీ లీటర్లు లీటర్ నీటికి లేదా ప్రొఫెనోఫాస్ 1.5 మి.లీ, లీటర్ నీటికి కలిపి మూడో సారి పిచికారీ చేయాలి. వీటితో పాటు వేపనూనెను తగిన మోతాదులో కలిపి వాడటం వలన మంచి ఫలితాలు వస్తాయి. -
కూటమి నిర్వాకంతోనే ఆలయాల్లో అపచారాలు
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి రాష్ట్రంలోని హిందూ ఆలయాల్లో వరుసగా అపచారాలు చోటు చేసుకుంటున్నాయని, దానికి తగిన శిక్ష అనుభవించక తప్పదని వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి కారుమూరు వెంకటరెడ్డి హెచ్చరించారు. ఆదివారం ఐఎస్ జగన్నాధపురంలోని శ్రీ లక్ష్మీనరసింహస్వామిని దర్శించుకున్న అనంతరం ఆయన, ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా స్వామి, అమ్మవార్లను దర్శించి, ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఆలయ తూర్పు రాజగోపుర ప్రాంతంలో మీడియాతో మాట్లాడారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ 19 నెలల కాలంలో దేవాలయాలపై దాడులు, అపవిత్రమైన కార్యక్రమాలు ఎన్నో జరిగాయన్నారు. విజయవాడ దుర్గమ్మ ఆలయంలో తాజాగా ఉచిత ప్రసాదం కౌంటర్ల వద్ద భక్తులకు కరెంట్ షాక్ తగిలిందన్నారు. అమ్మవారికి శ్రీచక్ర అర్చనలో పురుగులతో ఉన్న ఆవు పాలను వినియోగించడమనేది దుర్మార్గమైన చర్య అని అన్నారు. దుర్గమ్మ ఆలయానికి ఏకంగా కరెంటు సరఫరాను నిలిపివేసిన ఘనత కూటమి ప్రభుత్వానికే దక్కిందన్నారు. తిరుమల తిరుపతి శ్రీవారికి జరుగుతున్న అపచారాలు రోజురోజుకి పెరిగిపోతున్నాయని, కూటమి అధికారంలోకి వచ్చిన తరువాతే గోవులు చనిపోయాయన్నారు. ముఖ్యమంత్రి స్థానంలో ఉన్న వ్యక్తి లడ్డూ ప్రసాదాల్లో జంతువుల కొవ్వు కలిసిందని ఉన్మాదకరంగా మాట్లాడటం దారుణమన్నారు. డిప్యైటీ సీఎం పవన్ కల్యాణ్ సనాతనమని డ్రామాలు వేస్తున్నాడని ధ్వజమెత్తారు. పొద్దున సనాతన వేషం, రెండో పూట ఇంకేం వేషం వేస్తాడో తెలియదన్నారు. వీకెండ్ వస్తే సీఎం చంద్రబాబు హైదరాబాద్కు వెళిపోతున్నారని, డిప్యూటీ సీఎం అయితే వారంలో ఒకసారి మాత్రమే మన రాష్ట్రానికి వస్తున్నాడన్నారు. ఇక మంత్రులైతే ఉంటే హైదరాబాద్ లోని పబ్బుల్లో, లేదంటే హైదరాబాద్లో సెటిల్మెంట్లు చేస్తుంటారని విమర్శించారు. కార్యక్రమంలో వైఎస్సార్ సీపీ తూర్పుగోదావరి జిల్లా ఉపాధ్యక్షుడు బొండాడ వెంకన్నబాబు, పార్టీ గోపాలపురం నియోజకవర్గం మహిళా అధ్యక్షురాలు దాకారపు బంగారమ్మ, తదితరులున్నారు. వైఎస్సార్సీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి వెంకటరెడ్డి -
పండక్కి పప్పన్నం లేనట్లే..!
● పట్టించుకోని చంద్రబాబు సర్కారు ● మార్కెట్లో ధరల దరువు... ప్రభుత్వం నుంచి ఆదరణ కరువు ఏలూరు (మెట్రో) : ఓ వైపు ధరలు రోజురోజుకు పెరిగిపోతుంటే ప్రభుత్వం అందించాల్సిన నిత్యావసరాల సరఫరాను ప్రభుత్వం తగ్గించేస్తుంది. చంద్రబాబు సర్కారు అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి నేటి వరకూ జిల్లా రేషన్కార్డుదారులకు నిత్యావసరాలు అందించడంలో తీవ్ర నిర్లక్ష్యం ప్రదర్శిస్తూనే ఉంది. సంక్రాంతి పండుగ అనేది తెలుగు ప్రజలు ఎంతో ఘనంగా జరుపుకుంటారు. పండుగకు నిత్యావసరాలు పూర్తిస్థాయిలో చంద్రబాబు సర్కారు అందించిన పాపాన పోవడం లేదు. ఇప్పటికే నిత్యావసరాల ధరలు ఆకాశాన్నంటాయి. కనీసం బెల్లం, కందిపప్పు వంటివి కార్డుదారులకు అందిస్తే పండుగకు కాస్త ఆదరణ కల్పించినట్లు అవుతుంది. చంద్రబాబు సర్కారు దోపిడీనే రాజ్యంగా పాలన సాగిస్తుంది. అధికారంలోకి వచ్చినప్పటి నుంచి బియ్యాన్ని మాత్రమే కార్డుదారులకు అందిస్తూ చేతులు దులుపుకుంటున్న చంద్రబాబు సర్కారు రాగులు, జొన్నలు వంటివి అందిస్తామని ప్రచారాలు చేసినప్పటికీ ఇంతవరకూ అతీగతీ లేదు. కనీసం పెద్దపండుగ సంక్రాంతికి అయినా అందిస్తారని ఆశించినా అదీ లేకుండా పోయింది. కేవలం బియ్యం, అరకేజీ పంచదార మాత్రమే పంపిణీ చేస్తున్నా ఆ పంచదార కూడా పూర్తిస్థాయిలో అందించడం లేదని కార్డుదారులు లబోదిబోమంటున్నారు. బెల్లం, కందిపప్పు ఊసే లేదు జిల్లాలో 1,123 రేషన్ దుకాణాల ద్వారా 6,31,044 కార్డుదారులకు రేషన్ అందిస్తున్నారు. వీటి ద్వారా జిల్లా వ్యాప్తంగా ప్రతి నెలా 8,791.03 టన్నుల బియ్యం, 218.75 టన్నుల పంచదారను మాత్రమే ప్రభుత్వం అందిస్తుంది. కనీసం కార్డుదారులకు కేజీ చొప్పున కందిపప్పు పంపిణీ చేస్తే 631 టన్నులు అవసరం అవుతుంది. అరకేజీ చొప్పున 315 టన్నుల బెల్లం మాత్రమే అవసరం. ఇవేమీ పండుగకు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకోలేదు. బహిరంగ మార్కెట్లో కందిపప్పు, బెల్లం, వంటనూనెల ధరలు ఆకాశాన్నంటుతున్నాయి. కంపెనీని బట్టి లీటరు వంట నూనె రు.140 నుంచి రు.160 వరకూ విక్రయిస్తున్నారు. దీంతో సంక్రాంతి పండుగకు పిండివంటలు చేసుకోవాలంటేనే భయపడే పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సబ్సిడీ భారం తగ్గించుకునేందుకు ప్రజలకు అందించే కాస్త సరుకులనూ ప్రభుత్వం అందించేందుకు ముందుకు రావడం లేదనేది స్పష్టంగా తెలుస్తోంది. గతంలో కేజీ కందిపప్పు రూ.180 వరకూ ధర పలికింది. ప్రస్తుతం రూ.110కి చేరుకుంది. కందిపప్పు కొనుగోలు చేయాలంటే ప్రజలు బెంబేలెత్తిపోయారు. చంద్రబాబు సర్కారు చోద్యం చూస్తోంది.


