breaking news
Eluru District Latest News
-
రోడ్డు ప్రమాదంలోయువకులకు గాయాలు
నరసాపురం రూరల్: విహారయాత్ర ముగించుకుని ఇంటికి తిరుగు ప్రయాణమైన ఇద్దరు యువకులు రోడ్డు ప్రమాదంలో తీవ్ర గాయాలపాలయ్యారు. వివరాల ప్రకారం నరసాపురం మండలం రుస్తుబాద సెవెంత్ డే స్కూల్ సమీపంలో ఆదివారం సాయంత్రం జరిగిన రోడ్డు ప్రమాదంలో జిన్నూరు గ్రామానికి చెందిన తాడి జోషి (20), గొట్టుముక్కల శామ్యూల్ రాజు (25) గాయపడ్డారు. ఈ ఇద్దరు యువకులు తమ బైక్పై పేరుపాలెం బీచ్ను సందర్శించి తిరిగి వస్తుండగా, రుస్తుంబాద సెవెంత్ డే స్కూల్ వద్దకు రాగానే ఎదురుగా వస్తున్న టాటా ఏస్ వ్యాన్ వీరిని ఢీ కొట్టింది. ఈ ప్రమాదంలో తాడి జోషి కాలికి తీవ్ర గాయమైంది. మరో యువకుడు శామ్యూల్ రాజు కాలు విరిగింది. ప్రమాదం జరిగిన వెంటనే స్థానికులు గమనించి 108కు సమాచారం అందించారు. యువకులున మెరుగైన వైద్యం కోసం నరసాపురం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం బాధితులు ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ ఘటనపై ఎలాంటి కేసు నమోదు చేయాలేదని పోలీసులు తెలిపారు. -
పూతంతా మాడిపోయింది
4 ఎకరాల్లో మామిడి తోట ఉండగా బంగినపల్లి, చిన్నరసాలు, సువర్ణ రేఖ రకాల చెట్లు ఉన్నాయి. ఈ ఏడాది పూత బాగా వచ్చింది. పూతను కాపాడుకునేందుకు 4 సార్లు మందులు పిచికారీ చేశాను. దీనికి రూ.60 వేలు పెట్టుబడి అయింది. అనుకోకుండా ఫిబ్రవరిలో నల్ల తామర ఆశించడంతో పూతంతా మాడిపోయింది. తోటలోకి వెళ్లాలని అనిపించడం లేదు. వెలివల శివరామకృష్ణ, సుంకొల్లు, నూజివీడు మండలం మామిడి పరిస్థితి దారుణంగా తయారైంది. పూతలు బాగా వచ్చినప్పటికీ తామర పురుగు వల్ల పూతంతా మాడిపోయింది. రెండేళ్లుగా నష్టాలే మిగులుతుండగా, ఈ ఏడాది కూడా నష్టాలు తప్పేలా లేవు. రెండెకరాల్లో ఉన్న చిన్న రసాల చెట్లకు 6 సార్లు మందులు పిచికారీ చేశా. రూ.30 వేలు పెట్టుబడి కాగా పెట్టుబడి వచ్చే పరిస్థితి కనబడటం లేదు. వికృతి రాంబాబు, కొత్త ఈదర, ఆగిరిపల్లి మండలం నల్ల తామర పురుగుల నివారణకు తోటల్లో జిగురు అట్టలు కాని, పాతచీరలను ఆముదంలో ముంచి గాలివాటంకు అనుగుణంగా తోటలలో కట్టాలి. దీంతో చీరకు అంటుకున్న నల్ల తామర పురుగులు అతుక్కుపోయి ఎగరలేవు. గతేడాది ఉన్నంత ఉధృతంగా అయితే ఈ ఏడాది లేవు. మంచు వల్ల కూడా నష్టం జరిగింది. ఆర్.హేమ, ఉద్యాన అధికారి, నూజివీడు -
రోడ్డు ప్రమాదంలో యువకుడి మృతి
పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు–నరసాపురం రోడ్డులో పెదగరువు వెళ్లే రోడ్డు సమీపంలో జరిగిన రోడ్డు ప్రమాదంలో భవిరిశెట్టి ప్రభు కుమార్ (32) అక్కడికక్కడే మృతి చెందాడు. పట్టణ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ఆదివారం ఉదయం తూర్పుగోదావరి జిల్లా అమలాపురం నుంచి ద్విచక్ర వాహనంపై తన సోదరి ఇంటికి పాలకొల్లు వస్తున్న ప్రభు కుమార్ పెదగరువు రోడ్డు వద్దకు వచ్చే సరికి లారీ ఢీకొట్టింది. ప్రమాదంలో తీవ్రంగా గాయపడిన ప్రభు కుమార్ను స్థానిక ప్రభుత్వ ఆసుపత్రికి తరలించగా అప్పటికే మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. మృతుడి తల్లి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై పృథ్వీ తెలిపారు. కై కలూరు: ద్విచక్రవాహనంపై ఆగివున్న వ్యక్తిని వేగంగా వచ్చిన కారు ఢీకొట్టడంతో అక్కడికక్కడే మృతి చెందిన ఘటన ఆలపాడు జాతీయ రహదారి ఆదర్శ స్కూల్ వద్ద ఆదివారం జరిగింది. రూరల్ పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు పంచాయతీ బొమ్ములూరుకు చెందిన చిన్నపరుపు నాగశ్రీను(49) బడ్డీ కొట్టు నిర్వహిస్తున్నాడు. కై కలూరులో బంధువుల ఇంటికి వచ్చి తిరిగి వెళ్తుండగా.. ఆదర్శ స్కూల్ వద్ద పక్కకు ఆపి నిలబడ్డాడు. ఇంతలో కై కలూరు నుంచి ఆకివీడు వెళ్తున్న కారు గట్టిగా ఢీకొట్టడంతో నాగశ్రీను మరణించాడు. కుమారుడు భానుప్రసాద్ ఫిర్యాదు మేరకు రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేశారు. -
పెద్దింట్లమ్మ జాతరకు భక్తుల తాకిడి
కై కలూరు: కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరలో ఆదివారం భక్తులు కిటకిటలాడారు. సమీప జిల్లాల నుంచి వేలాది మంది మొక్కులు సమర్పించుకున్నారు. పెద్దింట్లమ్మకు విశేషార్చన, నూతన వస్త్ర అలంకరణ, పుష్పాలంకరణ, పంచమావరణ కలశార్చన, ద్రవ్యోపచారాలతో అర్చన, ధూపసేవ, బాలభోగం, నీరాజన మంత్ర పుష్పార్చన జరిగింది. అమ్మవార్లకు వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ, ఉచిత ప్రసాద వితరణ దాతగా విజయవాడకు చెందిన కొయ వేంకటేశ్వరరావు దంపతులు వ్యవహరించారు. జాతరకు వచ్చిన భక్తులకు ఉచిత ప్రసాదం, మజ్జిగను ఆలయ ధర్మకర్త కొల్లి రాంబాబు అందించారు. భక్తులకు వాటర్ ప్యాకెట్లను విజయవాడకు చెందిన బండారు కృష్ణ ప్రసాద్ పంపిణీ చేశారు. వివిధ ప్రాంతాల నుంచి వాహనాలతో వచ్చిన భక్తులు కోనేరులో స్నానాలు ఆచరించి అమ్మకు తలనీలాలు సమర్పించుకున్నారు. భక్తులు వంటలు చేసుకోడానికి దేవస్థానం ఉచిత పందిర్లను కేటాయించింది. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా కూరెళ్ల లక్ష్మీజ్యోతి బృందం ప్రదర్శించిన కూచిపూడి భరతనాట్య ప్రదర్శన ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 28న జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వస్వామి కల్యాణం జరుగుతుందన్నారు. అమ్మవారికి రూ.2,29,565 ఆదాయం వచ్చిందని ఈవో శ్రీనివాసు చెప్పారు. 28న జలదుర్గా గోకర్ణేశ్వర కల్యాణం -
శ్రీవారి ఆలయంలో కొనసాగిన భక్తుల రద్దీ
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో ఆదివారం భక్తుల రద్దీ కొనసాగింది. సెలవుదినం కావడంతో వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దాంతో ఆలయ పరిసరాలు భక్తులతో కిక్కిరిశాయి. దర్శనం క్యూలైన్లు, వైకుంఠం క్యూ కాంప్లెక్స్, కల్యాణకట్ట, నిత్యాన్నదానం, తదితర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. ఇదిలా ఉంటే ఉదయం శ్రీవారి క్షేత్రంలో భారీగా వివాహాలు జరిగాయి. అందులో భాగంగా ఆలయ తూర్పురాజగోపుర ప్రాంతంలోని అనివేటి మండపంలో అధికంగా పెళ్లిళ్లు జరిగాయి. దాంతో క్షేత్రంలో పెళ్లి సందడి నెలకొంది. వివాహాల అనంతరం నూతన వధువరులు, వారి బంధువులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నారు. అలాగే వివిధ ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న వారు సైతం ఆలయానికి వచ్చి శ్రీవారిని దర్శించుకున్నారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామి పుట్టలో పాలు పోసి స్వామివారిని దర్శించుకున్నారు. పాలపొంగళ్ళ శాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగా శ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. బుట్టాయగూడెం: బుట్టాయగూడెం మండలం కామవరం సమీపంలో అటవీప్రాంతంలో కొలువైన గుబ్బల మంగమ్మ గుడికి ఆదివారం భక్తులు పోటెత్తారు. ద్విచక్ర వాహనాలు, ఆటోలు, ప్రత్యేక బస్సుల్లో తెల్లవారుజాము నుంచే భక్తులు అమ్మవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం దూపదీప నైవేద్యాలతో అమ్మవారికి పూజలు చేసి మొక్కులు చెల్లించుకున్నారు. అధికంగా తరలివచ్చిన భక్తుల వల్ల ఎలాంటి ఇబ్బందులు కలుగకుండా ఆలయ కమిటీతోపాటు పోలీసులు కూడా బందోబస్తు నిర్వహించారు. నరసాపురం రూరల్: సెలవు దినం కావడంతో సముద్ర తీరం పర్యాటకుల రాకతో కళకళలాడింది. మొగల్తూరు మండలంలోని కేపీ పాలెం, పేరుపాలెం గ్రామాలతో పాటు నరసాపురం మండలంలోని పెదమైనవానిలంక, చినమైనవానిలంక గ్రామాల పొడవునా విస్తరించి ఉన్న బీచ్ ప్రాంతం ఆదివారం ఉదయం నుంచే సందర్శకులతో కిక్కిరిసిపోయింది. ప్రకృతి ప్రేమికులు, యువత ప్రత్యేక వాహనాలు, ద్విచక్ర వాహనాలపై భారీ సంఖ్యలో తరలిరావడంతో తీరమంతా కోలాహలం నెలకొంది. ఉదయాన్నే బీచ్కు చేరుకున్న పర్యాటకులు ఉత్సాహంగా సముద్ర కెరటాలలో స్నానాలు చేస్తూ సేదతీరారు. ఒడ్డుకు కొట్టుకువస్తున్న కెరటాల మధ్య ఇసుక తిన్నెలపై చిన్నారులు ఆటలాడుకుంటూ సందడి చేశారు. తీరానికి సమీపంలో ఉన్న ఆలయాలను పర్యాటకులు దర్శించుకున్నారు. ఆకివీడు: స్థానిక గంగానమ్మ కోడు వీధిలో పాత కక్షల నేపథ్యంలో ఆదివారం ఇరు వర్గాలు ఘర్షణకు దిగాయి. మేకల పవన్ కుమార్ అనే వ్యక్తిపై మేకల వెంకటేశ్వరరావు గోపీచంద్ చాకుతో దాడి చేయడంతో అతనికి తీవ్ర గాయాలు కాగా ప్రభుత్వాసుపత్రిలో చికిత్స పొందుతున్నాడు. ఈమేరకు ఆసుపత్రి నుంచి వచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎస్సై హెచ్ నాగరాజు తెలిపారు. -
దళారులు చెప్పిందే ధర!
ఆక్వా రంగంలో దళారులు, వ్యాపారులదే రాజ్యం. వారు నిర్ణయించిందే ధర. రైతుల డిమాండ్కు ఏమాత్రం ప్రాధాన్యత లేదు. ప్రభుత్వం కనీస మద్దతు ధరలు నిర్ణయించినా అమలుకు నోచుకోవడం లేదు. నేను 20 ఎకరాల్లో రూప్చంద్ సాగు చేస్తున్నాను. 50 శాతం చెరువుల్లో చేపలు పట్టుబడికి సిద్ధంగా ఉన్నాయి. ధర రూ.85కు పడిపోవడంతో ఈ ధరకు అమ్మితే పెట్టిన పెట్టుబడి కూడా దక్కే పరిస్థితి లేదు. – సంకు శ్రీనివాసరావు, రూప్చంద్ రైతు ఏడాది కాలంగా చేపల సాగు నష్టాలతోనే నడుస్తోంది. వ్యాపారులు చేప ధర తగ్గించేయడం, కంపెనీలు మేత ధర పెంచేయడంతో మేం నలిగిపోతున్నాం. 20 ఎకరాల్లో వేసిన రూప్చంద్ పట్టుబడి దశకు చేరింది. ధర పడిపోవడంతో ఏం చేయాలో దిక్కుతోచడం లేదు. విద్యుత్ బిల్లులు సైతం తలకుమించి భారంగా మారాయి. ప్రభుత్వం ఆక్వా రైతుల సమస్యలపై దృష్టి సారించి న్యాయం చేయకపోతే ఈ సాగుకు మనుగడ ఉండదు. – రమేష్రాజు, ఆక్వా రైతు, గణపవరం -
మామిడిపై నల్ల తామర దాడి
● ప్రతికూల వాతావరణంతో నష్టం ● మాడిపోయిన మామిడి పూత నూజివీడు: ఈ ఏడాది మామిడి తోటల్లో 90 శాతం తోటలు పూతతో కళకళలాడాయి. దీంతో దిగుబడి బాగుంటుందని, కష్టాలు తీరతాయని మామిడి రైతులు భావించారు. ఇంతలోనే నల్ల తామరకు, ప్రతికూల వాతావరణం తోడవడంతో వచ్చిన పూతంతా మాడిపోయింది. దీంతో మామిడిపై పెట్టుకున్న ఆశలన్నీ అడియాశలైనట్లేనని రైతన్నలు లబోదిబోమంటున్నారు. నూజివీడు డివిజన్లో ప్రధాన వాణిజ్య పంటగా మామిడి దశాబ్దాలుగా సాగు చేస్తున్నారు. నూజివీడు రసాలన్నా.. సువర్ణరేఖ.. బంగినపల్లి అన్నా దేశ విదేశాల్లో ఎంతో ప్రసిద్ధి. అలాంటి మామిడి పరిస్థితి రానురాను దయనీయంగా తయారవుతోంది. గత రెండేళ్లుగా కాపు లేకపోవడం.. ఈ ఏడాది పూత పెద్ద ఎత్తున రావడంతో మామిడి ఆదుకుంటుందనే గంపెడాశతో ఉన్న రైతులను నల్లతామర, ప్రతికూల వాతావరణం నట్టేట ముంచింది. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి, చింతలపూడి, లింగపాలెం మండలాల్లో దాదాపు 40 వేల ఎకరాల్లో మామిడి తోటలున్నాయి. ఈ మామిడి తోటల్లో డిసెంబరు నుంచి పూతలు ప్రారంభమై, జనవరిలో గణనీయంగా రావడంతో రైతులు ఆనందపడ్డారు. బంగినపల్లి, తోతాపురి, రసాలు, సువర్ణరేఖ, తియ్యమామిడి తదితర అన్ని రకాల్లో పూతలు ముమ్మరంగా వచ్చాయి. ఫిబ్రవరి 2 నుంచి మామిడి తోటలపై తామర పురుగు దాడి చేయడం, ఉదయం 9 గంటల వరకు మంచు పడటంతో వచ్చిన పూతలో దాదాపు 70 శాతం పూత నిలువునా మాడిపోయింది. ఒక్కొక్క రైతు పూత వచ్చిన దగ్గర నుంచి పూత నిలుపుకోవడం కోసం 10 నుంచి 12 సార్లు రసాయన మందులు పిచికారీ చేసినప్పటికీ చివరలో తామర పురుగు ఆశించడంతో చేసిన ప్రయత్నమంతా వృథా అయింది. రైతుల ఆశలు అడియాశలయ్యాయి. కనిపించని పిందె కట్టు డివిజన్లోని మొత్తం విస్తీర్ణంలో 90 శాతం తోటల్లో ఈ ఏడాది పూతలు వచ్చాయి. మామిడి అనేది ఒక ఏడాది కాస్తే, మరో ఏడాది కాపు తక్కువగా ఉంటుంది. తామర పురుగు ఆశించడం, ప్రతికూల వాతావరణంతో పూత కాడలకు, పూమొగ్గలకు ఆశించి అందులోని రసాన్నంతా పీల్చేయడంతో పూతంతా మాడిపోయింది. ఎన్నిసార్లు రసాయన మందులు పిచికారీ చేసినా వాటిని నియంత్రించడం సాధ్యపడలేదు. దీంతో లక్షలాది రూపాయల పెట్టుబడులు పెట్టిన రైతులు నష్టాల ఊబిలో కూరుకుపోయి ఏం చేయాలో తెలియక దిక్కుతోచని స్థితిలో విలవిల్లాడుతున్నారు. వరుసగా మూడేళ్లు మామిడి తోటల వల్ల దెబ్బతినిపోయామని, తమను ప్రభుత్వమే ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. -
పాతాళానికి రూప్చంద్ ధర
● ఏడాదిలో కిలో రూ.125 నుంచి రూ.82కు పడిపోయిన ధర ● మేతల ధర పెంపుతో తీవ్ర ప్రభావం గణపవరం: రూప్చంద్ చేపల సాగు చేపట్టిన ఆక్వా రైతులు దిక్కుతోచని స్థితిలో ఉన్నారు. ఏడాది క్రితం వరకూ ధర బాగానే.. ప్రస్తుతం ధర పాతాళానికి పడిపోవడంతో రైతులు దిక్కుతోచని స్థితిలో పడ్డారు. పది నెలల్లో కిలోకు ఏకంగా రూ.40 వరకూ ధర తగ్గింది. దీంతో రూప్చంద్ సాగుచేసే రైతులకు కోలుకోలేని దెబ్బ తగిలింది గతంలో ఎన్నడూ లేని గడ్డు పరిస్థితి గతేడాది జనవరిలో రూప్చంద్ కిలో ధర రూ.125 వరకు పలికింది. రొయ్యల సాగులో తీవ్ర నష్టాల్లో ఉన్న రైతులు రూప్చంద్ సాగు చేపట్టారు. మంచి ధర ఉండడంతో రైతులు ఆనందపడ్డారు. అయితే క్రమంగా ధర తగ్గిపోవడంతో రైతు ఢీలపడ్డాడు. గత జూలై వరకు రూ.112 – రూ.115 వరకూ పలికిన ధర, క్రమంగా తగ్గుముఖం పడుతూ ప్రస్తుతం రూ.82కి చేరింది. గత మూడు, నాలుగు నెలలుగా రూ.80 నుంచి రూ.85 మధ్యే ఉంది. దీంతో రైతులు చేపలను అమ్ముకోలేక, చెరువుల్లో ఉంచి మేపలేక దిక్కుతోచని స్థితిలో కొట్టుమిట్టాడుతున్నారు. జిల్లాలో ఆక్వాసాగు మొదలైన తర్వాత ఇంతటి గడ్డు పరిస్థితి ఎప్పుడూ చూడలేదని రైతులంటున్నారు. సరిగా పట్టుబడి సమయానికి ధర తగ్గిపోవడాన్ని రైతులు జీర్ణించుకోలేకపోతున్నారు. రెండేళ్ల క్రితం కూడా రూప్చంద్ ధర కిలో రూ.60కు పడిపోయి రైతులు దారుణంగా నష్టపోయారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా సుమారు 2.35 లక్షల ఎకరాల్లో ఆక్వా సాగు చేస్తుండగా.. అందులో 1.5 లక్షల ఎకరాల్లో చేపల సాగు చేస్తున్నారు. ఇందులో అధిక శాతం అంటే 70 నుంచి 80 వేల ఎకరాల్లో రూప్చంద్ సాగు చేస్తున్నారు. ప్రస్తుత ధర కిలో రూ.85 చొప్పున అమ్మితే వచ్చే సొమ్ము కేవలం మేతలు, మందులకే సరిపోతుంది. చెరువు లీజులు, సీడ్, విద్యుత్ బిల్లులు, కాపలాదారుల జీతాలు, ఇతర నిర్వహణ ఖర్చులు చూసుకుంటే ఎకరాకు కనీసం లక్ష రూపాయల నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు. దీనికి తోడు మేత కంపెనీలు కిలోకు రూ.4 చొప్పున ధరలు పెంచడంతో మరింత నష్టం తప్పడం లేదు. కొంతకాలం వేచిచూస్తే చేప ధర పెరుగుతుందన్న ఆశతో రోజుల తరబడి చేపలను చెరువులో ఉంచి మేపడం వల్ల మరింత నష్టం తప్పదని రైతులు వాపోతున్నారు -
బలవంతపు భూసేకరణకు వ్యతిరేకం
ఏలూరు (టూటౌన్): నేవీ ఆయుధ డిపోకు వ్యతిరేకం కాదని, బలవంతపు భూసేకరణకు మాత్రమే తాము వ్యతిరేకమని, ఆ ప్రాంత ప్రజల పోరాటానికి మద్దతు తెలుపుతున్నామని అఖిలపక్ష పార్టీలు, ప్రజాసంఘాల నాయకులు తెలిపారు. ఆదివారం స్థానిక పవర్పేటలోని సీపీఎం కార్యాలయంలో కొయ్యలగూడెం మండలం నేవీ ఆయుధ డిపో భూ సేకరణపై రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించా రు. సీపీఎం జిల్లా కార్యదర్శి ఎ.రవి అధ్యక్షత వహించారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు మాట్లాడుతూ ప్రజల అనుమతితోనే ఆయుధ డిపో ఏర్పాటుచేయాలని, బలవంతపు భూసేకరణను తాము వ్యతిరేకమని స్పష్టం చేశారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, మంగపతిదేవిపేట పరిసర గ్రా మాల ప్రజలకు అండగా ఉంటామని హామీ ఇచ్చా రు. పోరాటాలు చేస్తున్న ప్రజలపై, వారికి అండగా ఉంటున్న రాజకీయ పార్టీలు, ప్రజాసంఘాల నా యకులపై తప్పుడు కేసులు బనాయించడం సరికాదన్నారు. ఇకనైనా రాష్ట్ర ప్రభుత్వం తన నిర్ణయాన్ని మార్చుకోవాలని లేకుంటే ప్రజాపోరాటంలో తా ము పాల్గొంటామన్నారు. సీపీఎం జిల్లా కార్యదర్శి రవి మాట్లాడుతూ ఆందోళనలకు సీపీఎం సంపూర్ణ మద్దతు ఉంటుందన్నారు. సీపీఐ జిల్లా సహాయ కార్యదర్శి బండి వెంకటేశ్వరరావు, సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ జిల్లా నాయకుడు ఎస్.రాజశేఖర్, రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్ మాట్లాడుతూ 2013 భూసేకరణ చట్టం ప్రకారం గ్రామసభలు నిర్వహించి ప్రజల ఆమోదంతోనే భూసేకరణ చేయాలన్నారు. వైఎస్సార్సీపీ ఏలూరు ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్, ఏలూరు ఏఎంసీ మాజీ చైర్మన్ నెరుసు చిరంజీవులు, సీపీఎం నగర కార్యదర్శి పంపన రవికుమార్, కొయ్యలగూడెం మండల కన్వీనర్ శుక్లబోయిన రాంబాబు, మంగపతిదేవిపేట సర్పంచ్ ఎ.సుబ్రహ్మణ్యం, బాధిత గ్రామాల పెద్దలు పాల్గొన్నారు. -
స్పందన
కొయ్యలగూడెం: అక్రమ క లప ట్రాక్టర్ స్వాధీనం చేసుకున్నట్టు కన్నాపురం అటవీశాఖ రేంజర్ భానుప్రకాష్ ఆదివారం తెలిపారు.. కుంకాల నుంచి అక్రమంగా కలపను ట్రాక్టర్పై తరలిస్తున్న సమాచారంతో ఎఫ్ఎస్ఓ మణికుమారి సిబ్బందితో కలిసి దాడులు చేశారన్నారు. ట్రాక్టర్ గుర్తించి రేంజ్ కార్యాల యానికి తరలించి కేసు నమోదు చేశామన్నారు. కలప అక్రమ రవాణాపై ఈనెల 8న, గత డిసెంబర్ 13న ‘సాక్షి’లో వచ్చిన కథనాలకు అటవీ శాఖ స్పందించింది. నెల రోజుల్లో పది కేసుల వరకు నమోదు చేయడం విశేషం. తనఖా పెట్టిన బంగారం మాయం జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెం ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో ఓ మహిళ కుదవపెట్టిన బంగారాన్ని బ్రాంచ్ మేనేజర్ మాయం చేశాడు. ఎ స్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాల ప్రకారం.. స్థానిక పాత బస్టాండ్ ప్రాంతానికి చెందిన ఎన్.ధనలక్ష్మి ఐఐఎఫ్ఎల్ బ్యాంకులో 270 గ్రాము ల బంగారు ఆభరణాలను 2023లో తనఖా పె ట్టి రుణం తీసుకున్నారు. బ్రాంచ్ మేనేజర్ ఉ ద్దగిరి చైతన్య రాము రుణంపై వడ్డీ కట్టాలంటూ ఫోన్ చేసేవాడు. ధనలక్ష్మి వడ్డీ కట్టలేకపో వడంతో రుణాన్ని అప్డేట్ చేస్తానని, ధనలక్ష్మి ఫోన్కు ఓటీపీ వచ్చిందని చెప్పమని అడిగేవా డు. అలా పలుమార్లు ఓటీపీ తెలుసుకున్నాడు. గత డిసెంబర్ 20న ధనలక్ష్మి బంగారాన్ని విడిపించేందుకు బ్యాంకుకు వెళ్లగా ధనలక్ష్మి పేరు న అసలు బంగారం తనఖా లేదని తెలిసింది. చైతన్య రాము ఎప్పుడో మానివేశారని బ్యాంకు సిబ్బంది చెప్పారు. చైతన్య రాము ఆ బంగారా న్ని విడిపించి వేరే వ్యక్తుల పేరున పెట్టినట్టు తె లుస్తోంది. ధనలక్ష్మి ఫిర్యాదు మేరకు పోలీసు లు కేసు నమోదు చేశారు.బాధితులు ఇంకా చా లా మంది ఉన్నట్టు ధనలక్ష్మి ఫిర్యాదులో పేర్కొన్నారు. దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. జంగారెడ్డిగూడెం: వైద్య పీజీ సీట్లు ఇప్పిస్తానని మోసం చేసిన వ్యక్తిపై కేసు నమోదు చేసినట్టు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. జంగారెడ్డిగూడేనికి చెందిన ఎస్కే షంషీర్ అహ్మద్ రాఘవాపురం పీహెచ్సీలో హెల్త్ అసిస్టెంట్గా పనిచేస్తున్నారు. ఆయన పెద్ద కుమార్తె, మేనల్లుడు ఎంబీబీఎస్ పూర్తిచేశారు. విదేశాల్లో పీజీ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో అహ్మద్ కు తెలంగాణలోని మహబూబ్నగర్ జిల్లా మ రికల్ గ్రామానికి చెందిన గుండా రాఘవ పరిచయమయ్యాడు. విదేశాల్లో పీజీ సీటు ఇప్పిస్తా నని నమ్మించాడు. దీంతో దఫదఫాలుగా షంషీర్ అహ్మద్ ఫోన్పే, ఆన్లైన్ ద్వారా రూ.19.50 లక్షలు రాఘవకు బదిలీ చేశారు. అనంతరం రాఘవకు ఫోన్ చేసినా సమాధానం చెప్పకపోవడం, పీజీ సీట్లు ఇప్పించకుండా తప్పించుకుని తిరుగుతూ మాయమాటలు చెప్పు కొచ్చాడు. దీంతో అహ్మద్ తాను మోసపోయానని గ్రహించి పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై చెప్పారు. పెదవేగి: వారం రోజుల్లోగా కోకో గింజల ధర ల పాలసీ ప్రకటించి, రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ధర నిర్ణయించకపోతే కోకో రైతుల పోరాటం తప్పదని ఏపీ కోకో రైతుల సంఘం రాష్ట్ర స మావేశం హెచ్చరించింది. విజయరాయిలో ఆ దివారం రాష్ట్ర అధ్యక్షుడు బొల్లు రామకృష్ణ అ ధ్యక్షతన సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె. శ్రీనివాస్ మాట్లాడుతూ కోకో గింజల ధరను కి లోకు రూ.350కు తగ్గించడం దారుణమన్నా రు. ఆయిల్పామ్ మాదిరిగా ఫార్ములాతో కో కో గింజల ధర నిర్ణయించాలని కోరారు. -
ఎన్నడూ లేని సంక్షోభం
నేను 11 ఎకరాల్లో ఆక్వా సా గు చేస్తున్నాను. ఇటువంటి ఆక్వా సంక్షోభం ఎన్నడూ చూడలేదు. చాలా ఇబ్బంది పడుతున్నాం. ప్రభుత్వం కనీ సం విద్యుత్ సబ్సిడీ ఇవ్వడం లేదు. ఇది ఇస్తే కొంతైనా కో లుకుంటాం. ఫీడ్ ధరల తగ్గించాలి గతంలో ముడిసరుకుల ధరలు తగ్గినా కిలోకు రూ.20 తగ్గించాల్సి ఉన్నా తగ్గించలేదు. ప్రస్తుతం ఫిష్ మీల్ ధర పెరిగిన నేపథ్యంలో మళ్లీ ధరలు పెంచడం అన్యాయం. –తంగెళ్లబాబు, ఆక్వా రైతు నాణ్యత లేని సీడ్ వల్ల ఆక్వా రైతులు తీవ్రంగా నష్టపోతున్నారు. ప్రస్తుతం ఈహెచ్పీ ఉన్న తల్లి రొయ్యల నుంచి సీడ్ దిగుమతి కావడంతో ఎక్కువ నష్టం జరుగుతోంది. సీఏఏ అధికారి ద్వారా సరైన పర్యవేక్షణ లేకపోవడం కారణంగా కనిపిస్తోంది. ఆక్వా సాగు బాగుండాలంటే మంచి సీడ్ లభించాలి. ఆక్వా రైతులు సమస్యలపై ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని సాగుకు అన్నిరకాలుగా ప్రోత్సాహం అందించాలి. –మరిడి వెంకటేశ్వరరావు, ఆక్వా రైతు -
విజయీభవ
ఏలూరు (ఆర్ఆర్పేట) : ఉమ్మడి జిల్లాలో ఇంటర్మీడియెట్ పబ్లిక్ థియరీ పరీక్షలకు సర్వం సిద్ధమైంది. సో మవారం నుంచి ప్రథమ సంవత్సరం, మంగళవారం నుంచి ద్వితీయ సంవత్సరం విద్యార్థులకు పరీక్షలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు ప్రభుత్వం ఇప్పటికే షెడ్యూల్ విడుదల చేయడంతో పాటు హాల్టికెట్లు కూడా వెబ్సైట్, వాట్సాప్లలో అందుబాటులో ఉంచింది. ఇక విద్యార్థులు తాము చదివిన చదవునంతా జవాబుపత్రాలపై పెట్టాల్సిన సమయం ఆసన్నమైంది. ఉన్నత విద్య చదవాలనుకునే విద్యార్థులకు తొలి మెట్టు అయిన ఈ పరీక్షల్లో చూపిన ప్రతిభ ఆధారంగానే వారు భవిష్యత్లో తమ లక్ష్యాలను చేరుకోవడానికి సోపానం ఏర్పడుతుంది. వచ్చేనెల 24 వరకు పరీక్షలు జరుగనున్నాయి. ఉమ్మడి జిల్లాలో 109 పరీక్షా కేంద్రాలు ఏలూరు జిల్లాలో ప్రథమ సంవత్సరం పరీక్షలకు 17,556 మంది, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 17,059 మంది మొత్తంగా 34,615 మంది హాజరుకానున్నారు. ఈ మేరకు ఏలూరు జిల్లాలో 56 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశారు. పరీక్షా పత్రాలను పంపిణీకి 21 స్టోరేజ్ పాయింట్లను సిద్ధం చేశారు. ఆయా రోజుల్లో ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు పరీక్షలు జరుగుతాయి. పశ్చిమగోదావరి జిల్లాలో ప్రథమ సంవత్సరం 19,662 మంది, ద్వితీయ సంవత్సరం 17,888 మొత్తంగా 37,550 మంది విద్యార్థులు పరీక్షలకు హాజరుకానున్నారు. ఈ మేరకు జిల్లావ్యాప్తంగా 53 కేంద్రాలను ఏర్పాటుచేశారు. 800 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల నిర్వహణకు సంబంధించి ఇప్పటికే అన్ని ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు అధికారులు పూర్తి చేశారు. ఏలూరు జిల్లాలో పరీక్షల నిర్వహణ కోసం మూడు ఫ్లయింగ్ స్క్వాడ్లు, రెండు సిట్టింగ్ స్క్వాడ్లను నియమించారు. పరీక్షా కేంద్రాల్లో 1,006 సీసీ కెమెరాలు ఏర్పాటుచేశారు. 800 మంది ఇన్విజిలేటర్లు పరీక్షల విధుల్లో పాల్గొంటారు. జిల్లా కేంద్రం ఏలూరులో 17 సెంటర్లు ఉన్నాయి. ఆరు సెంటర్లలో ప్రహరీ గోడలు లేకపోవడంతో అక్కడ మ రింత పకడ్బందీగా పరీక్షలు నిర్వహించడానికి భద్రతా ఏర్పాట్లు కట్టుదిట్టం చేశారు. ఒక్క నిమిషం ఆలస్యమైనా నో ఎంట్రీ ఇంటర్ పరీక్షలకు ఎంసెట్, నీట్ మాదిరిగా ఒక్క నిమిషం ఆలస్యమైనా విద్యార్థులను పరీక్షా కేంద్రాల్లోకి అనుమతించరు. కాగా ఉదయం 8.30 గంటల నుంచే పరీక్షా కేంద్రాల్లోకి అనుమతిస్తారు. పరీక్షల నిర్వహణకు సంబంధించి కేంద్రాల్లో చేస్తున్న ఏర్పాట్లను ఇంటర్మీడియెట్ బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కె.యోహాన్ పర్యవేక్షించి అధికారులకు సూచనలు జారీ చేశారు. ద్వితీయ సంవ్సతరం 24న.. సెకండ్ లాంగ్వేజ్–2 26న.. ఇంగిష్–2 28న.. బోటనీ, హిస్టరీ–2 మార్చి 4న.. లెక్కలు–2ఏ, సివిక్స్–2 మార్చి 6న.. జువాలజీ, ఎకనామిక్స్–2 మార్చి 9న.. లెక్కలు–2బీ మార్చి 11న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–2 మార్చి 13న.. ఫిజిక్స్–2 మార్చి 16న.. మోడరన్ లాంగ్వేజ్–2, జియోగ్రఫీ–2 మార్చి 18న.. కెమిస్ట్రీ–2 మార్చి 23న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్, లాజిక్–2 ఆల్ ద బెస్ట్ నేటి నుంచి ఇంటర్ పరీక్షలు కేంద్రాల్లో ఏర్పాట్లు పూర్తి వచ్చేనెల 24 వరకు నిర్వహణ ఉమ్మడి జిల్లాలో 72,165 మంది విద్యార్థులు ప్రథమ సంవత్సరం 23న.. తెలుగు, సంస్కృతం, ఉర్దూ, హిందీ 25న.. ఇంగ్లిష్–1 27న.. హిస్టరీ, బోటనీ–1, మార్చి 2న.. లెక్కలు–1 మార్చి 5న.. బయోలజీ–1, జువాలజీ–1 మార్చి 7న.. ఎకనామిక్స్–1 మార్చి 10న.. ఫిజిక్స్–1 మార్చి 12న.. కామర్స్, సోషియాలజీ, ఫైన్ ఆర్ట్స్, మ్యూజిక్–1 మార్చి 14న.. సివిక్స్–1 మార్చి 17న.. కెమిస్ట్రీ–1 మార్చి 21న.. పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్–1 మార్చి 24న.. మోడల్ లాంగ్వేజ్, జాగ్రఫీ–1 -
కాయ్ రాజా కాయ్
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఏజెన్సీ, మెట్ట ప్రాంతాలు అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారా యి. పోలవరం నియోజకవర్గంలోని కనకాపురం కేంద్రంగా సాగుతున్న జూద క్రీడలు, పక్కా ప్లానింగ్తో ‘క్యాసినో’ స్థాయిని తలపిస్తున్నాయి. జీలుగు మిల్లి మండలం కనకాపురానికి చెందిన ఓ కీలక వ్య క్తి ఈ వ్యవహారాన్ని నడిపిస్తుండగా, చట్టాన్ని కాపాడాల్సిన ఓ ‘ఖాకీ’ అధికారి అండదండలు పుష్కలంగా ఉన్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అటవీ ప్రాంతాలే సేఫ్ జోన్లు! జీలుగుమిల్లి, కనకాపురం, పూచికపాడు, రౌతుగూ డెం, రెడ్డిగణపవరం గ్రామ పరిసరాల్లోని దట్టమైన అటవీ ప్రాంతాలను నిర్వాహకులు ఎంచుకుంటున్నారు. ముఖ్యంగా ఫోన్ సిగ్నల్స్ అందని ప్రాంతా ల్లో జూద శిబిరాలు నిర్వహిస్తున్నారు. కొయ్యలగూడెం, జంగారెడ్డిగూడెం ప్రాంతాలకు చెందిన కొంద రు వ్యక్తులు సిండికేట్గా ఏర్పడి, సీతంపేట, బ య్యనగూడెం, లక్కవరం, రామ సింగవరం వంటి గ్రామాల నుంచి ఏజెంట్లు జూదగాళ్లను తరలిస్తున్నారు. ● హైటెక్ నిఘా: పోలీసుల ఇన్ఫార్మర్ వ్యవస్థకు ధీటుగా వీరు తమ సొంత నెట్వర్క్ను ఏర్పాటు చేసుకున్నారు. ● తనిఖీలు: జూదగాళ్ల వద్ద నుంచి సెల్ఫోన్లు స్వాధీ నం చేసుకుని, క్షుణ్ణంగా తనిఖీ చేసిన తర్వాతే ఆటోల్లో రహస్య ప్రాంతాలకు తరలిస్తారు. ● సిగ్నల్స్: ఎవరైనా అనుమానితులు లేదా పోలీసులు వస్తున్నట్టు తెలిస్తే, గాలిలోకి బాణసంచా పేల్చి 5–6 కిలోమీటర్ల పరిధిలోని జూదగాళ్లను అప్రమత్తం చేస్తారు. ● ఆటోల్లో ప్రయాణం: ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే వారు తమ ఖరీదైన కార్లను మండల కేంద్రాల్లోనే వదిలి, నిర్వాహకులు ఏర్పాటు చేసిన ఆటోల్లో ప్రయాణించాల్సి ఉంటుంది. ● మందు.. విందు.. చిందు: కేవలం జూదమే కాకుండా, పెద్ద ఎత్తున విందు వినోదాలు కూడా ఏర్పాటు చేస్తున్నట్టు సమాచారం. ఈనెల 7న రాజమండ్రిలో, 9న బుట్టాయగూడెం సమీపంలోని పోగొండ వాటర్ ఫాల్స్ వద్ద పట్టణాల నుంచి తెచ్చిన యువతులతో భారీ పార్టీలు ఇచ్చినట్టు తెలుస్తోంది. ఈ ఉదంతంలో ఓ పోలీసు అధికారి భారీగా మామూళ్లు అందుకున్నారని, నెలకు రూ.10 లక్షలతో పాటు ఇతర రాష్ట్రాల జూదగాళ్ల నుంచి సుమారు రూ.50 లక్షల వరకు వసూలు చేస్తున్నార నే ప్రచారం స్థానికంగా పెద్దఎత్తున జరుగుతోంది. గంజాయి మత్తు.. జూదం ముఠాల కన్ను ఇప్పుడు గంజాయి విక్రయాలపై పడింది. ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో గంజాయి ప్యాకెట్లు విక్రయిస్తుండటంతో స్థానిక యువత వ్యసనాలకు బానిసలవుతున్నారు. తమ బిడ్డల భవిష్యత్తు నాశనమవుతోందని తల్లిదండ్రులు కన్నీరు మున్నీరవుతున్నారు. ఇప్పటికై నా ఉన్నతాధికారులు స్పందించి అసాంఘిక కార్యకలాపాలపై ఉక్కుపా దం మోపాలని ప్రజలు డిమాండ్ చేస్తున్నారు. ఖాకీల అండతో కనకాపురంలో ‘క్యాసినో’ ఏజెన్సీ, మెట్ట ప్రాంతాల్లో యథేచ్ఛగా జూదం రూ.కోట్లలో చేతులు మారుతున్న నగదు ఇన్ఫార్మర్ల వ్యవస్థ.. బాణసంచా సిగ్నల్స్ -
అంతరాలయ దర్శనం.. కట్టుదిట్టం
ద్వారకాతిరుమల: చినవెంకన్న అంతరాలయ దర్శ నం టికెట్ల రీప్రింట్ దందాకు పూర్తిస్థాయిలో చెక్ పడింది. దీంతో స్వామివారి ఆదాయం గణనీయంగా పెరిగింది. గత శనివారంతో పోలిస్తే ఈ వారం 151 అంతరాలయ దర్శనం టికెట్లు అధికంగా అ మ్ముడయ్యాయి. ఈనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికన ప్రచురించిన కథనంతో టికెట్ల రీప్రింట్ వ్యవహారం బయటపడింది. దీ నిపై స్పందించిన దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు, ఈవో వై.భద్రాజీ చర్యలు తీసుకు న్నారు. పలువురు అధికారుల విధులను మార్పు చేశారు. అలాగే ఏఈఓ మెట్టపల్లి దుర్గారావు వీఐపీల పేరుతో వచ్చేవారి వివరాలను పూర్తిస్థాయిలో పరిశీలించిన తర్వాత అంతరాలయ దర్శనానికి అ నుమతిస్తున్నారు. అయితే దర్శనం టికెట్లను మాత్రం తప్పనిసరిగా కొనుగోలు చేయాలని అధికారులు సూచిస్తున్నారు. అధికారుల చర్యలతో అంతరాలయ దర్శనం టికెట్ల విక్రయాలు అధికంగా పెరిగాయి. ఈనెల వరుసగా మూడు శనివారాల్లో విక్రయించిన అంతరాలయ దర్శనం టికెట్ల సంఖ్యను పరిశీలిస్తే మార్పు స్పష్టంగా కనిపిస్తోంది. ఈనెల 7న 476, 14న 670, 21న 821 టికెట్లను విక్రయించారు. టికెట్ల రీప్రింట్ వ్యవహారం వెలుగులోకి వచ్చిన తర్వాత తొలి శనివారం 821 టికెట్లు విక్రయించడం విశేషం. గత వారంతో పోలిస్తే 151 టికెట్లు అదనంగా విక్రయించగా దేవస్థానానికి అ దనంగా రూ.75,500 ఆదాయం సమకూరింది. ఆ దివారం సాయంత్రం 6 గంటల వరకు 527 అంతరాలయ దర్శనం టికెట్లను విక్రయించారు. టికెట్ల రీప్రింట్ దందాకు చెక్ -
బిల్లు.. కాంట్రాక్టర్లు ఘొల్లు
తణుకు మున్సిపాలిటీలో రూ.10 కోట్ల బిల్లుల పెండింగ్తణుకు అర్బన్: తణుకు మున్సిపాలిటీలో బిల్లులు పెండింగ్ పడటంతో కాంట్రాక్టర్లు గగ్గోలు పెడుతున్నారు. టెండర్ అగ్రిమెంట్ ప్రకారం గడువులోపు పనులు పూర్తిచేసినా బిల్లులు ఇవ్వకుండా జాప్యం చేస్తున్నారంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు సర్కారులో 20 నెలల్లో 100కు పైగా పనులు చేశామని, రూ.10 కోట్లకు పైగా బిల్లులు పెండింగ్ లో ఉన్నట్టు చెబుతున్నారు. పనులు చేయించుకుంటున్నారే తప్ప బిల్లుల వరకూ వచ్చేసరికి అధికారులు అదిగోఇదిగో అంటూ కాలం గడిపేస్తున్నారని, పాలకుల దృష్టికి తీసుకువెళ్లినా పట్టించుకోవడంలేదని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. మున్సిపల్ నిధులతో పాటు జనరల్ ఫండ్స్, ఇతర ఫండ్స్తో చేసిన పనులకు సంబంధించిన బిల్లులు ఎంబుక్ల రూపంలో బీరువాల్లో మూలుగుతున్నాయని అంటున్నారు. దీంతో కొత్త పనులకు టెండర్లలో కూడా పాల్గొనడం లేదని చెబుతున్నారు. అప్పులు చేసి మరీ పనులు అప్పులు చేసి పనులు చేస్తున్నామని బిల్లులు ఇవ్వకపోవడంతో చేసిన అప్పులకు వడ్డీలు చెల్లించలేక ఇబ్బంది పడుతున్నట్టు క్లాస్–1 నుంచి క్లాస్–5 వరకు కాంట్రాక్టర్లు చెబుతున్నారు. చంద్రబాబు సర్కారు వచ్చిన తర్వాత మొదటి ఏడాది రెండు నెలల కాలంలో కొంత బిల్లులు ఇచ్చారని, ఆ త ర్వాత పనులు చేయించుకోవడమే తప్ప బిల్లుల ఊసే లేదన్నారు. కాంట్రాక్టర్లలో ఎక్కువ మంది చిన్నతరహా వారే కావడంతో బిల్లుల కోసం కార్యాలయాల వద్ద పడిగాపులు పడుతున్నారు. గ్రంథాలయ భవనం అందుబాటులోకి వచ్చినా.. తణుకు బ్యాంక్ కాలనీలో గత వైఎస్సార్సీపీ ప్రభు త్వ హయాంలో రూ.1.03 కోట్ల నిధులతో గ్రంథాలయ భవన నిర్మాణం మొదలుపెట్టగా చంద్రబా బు సర్కారులో ప్రారంభోత్సవం జరిగింది. ఈ భవనం అందుబాటులోకి వచ్చి ఏడాదిన్నర పూర్తయినా కాంట్రాక్టరుకు ఇవ్వాల్సిన బిల్లు ఒక్క రూ పాయి కూడా విడుదల చేయని దుస్థితి తణుకు మున్సిపాలిటీలో నెలకొంది. -
ఫీజులుంకు చెక్
ఏలూరు (ఆర్ఆర్పేట): ఇంటర్మీడియట్ పబ్లిక్ పరీక్షలు వస్తున్నాయంటే పేద కుటుంబాలకు చెందిన విద్యార్థుల్లో ఒకటే టెన్షన్. ఫీజులు చెల్లించలేని విద్యార్థులకు హాల్టికెట్లు ఇవ్వడానికి కార్పొరేట్ విద్యాసంస్థలు నిరాకరించడమే ఇందుకు కారణం. ఈ పరిస్థితిని అధిగమించి విద్యార్థులు ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాయడానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం స్పష్టమైన నిర్ణయం తీసుకుంది. ఫీజులు చెల్లించకపోయినా విద్యార్థులకు హాల్టికెట్లు నిరాకరించరాదని ఆదేశాలు ఇచ్చింది. 2022 నుంచి విద్యార్థులు నేరుగా ఇంటర్మీడియెట్ బోర్డు వెబ్సైట్ నుంచి హాల్టికెట్లు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కల్పించింది. అప్పటినుంచి ఇదే విధానం కొనసాగుతుండగా.. ప్రస్తుతం మనమిత్ర యాప్ ద్వారా డౌన్లోడ్ చేసుకునే అవకాశాన్ని ప్రభుత్వం కల్పించింది. దీంతో కార్పొరేట్ విద్యాసంస్థల ఫీ‘జులుం’కు చెక్ పెట్టినట్లయ్యింది. సంతకం, స్టాంప్ అక్కర్లేదు వెబ్సైట్, వాట్సాప్ ద్వారా హాల్టికెట్లు పొందిన విద్యార్థులు వివరాలతో పాటు పరీక్షల షెడ్యూల్, సబ్జెక్టుల వివరాలు సరిచూసుకోవాలి. హాల్టికెట్పై సంబంధిత కళాశాల ప్రిన్సిపాల్ సంతకం, కళాశాల స్టాంప్ అవసరం లేదు. పరీక్ష సమయానికి కనీసం అర గంట ముందుగానే కేంద్రాలకు చేరుకోవాలని ఇంటర్ బోర్డు సూచించింది. 56 కేంద్రాలు.. 34,615 మంది విద్యార్థులు జిల్లాలో ఈనెల సోమవారం నుంచి ఇంటర్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. మొత్తంగా 34,615 మంది విద్యార్థులు హాజరుకానుండగా 56 కేంద్రాలను ఏ ర్పాటుచేశారు. సీసీ టీవీల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. కేంద్రాల వద్ద గాలి, వెలుతురు ఉండటంతో పాటు ఆరోగ్య కేంద్రాల ఏర్పాటుకు చర్యలు తీసుకున్నారు. ఫస్టియర్ 17,556 సెకండియర్ 17,059 పరీక్షా కేంద్రాలు 56 వెబ్సైట్, వాట్సాప్ ద్వారా విద్యార్థులు హాల్టికెట్లు పొందవచ్చు. ఇంటర్ ఫస్టియర్ విద్యార్థులు హెచ్టీటీపీ://బీఐఈ.ఏపీ.జీఓవీ.ఐఎన్ సైట్లో లాగిన్ కావాలి. టెన్త్ హాల్టికెట్ నంబర్ ఎంటర్ చేసి ఇంటర్ హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. సెకండియర్ విద్యార్థులు ఫస్టియర్ హాల్టికెట్ నంబర్, ఆధార్, పుట్టినతేదీ వివరాలతో హాల్టికెట్ పొందవచ్చు. మనమిత్ర వాట్సాప్ నంబరు 95523 00009కు ఏజీ అని మెసేజ్ పంపడం ద్వారా కూడా హాల్టికెట్ డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫీజు బకాయిలు ఉన్నా హాల్టికెట్ వెబ్సైట్, వాట్సాప్ ద్వారా నేరుగా విద్యార్థులకు.. ప్రిన్సిపాల్ సంతకం, స్టాంప్ అవసరం లేదు ఇంటర్ విద్యార్థులకు అవకాశం జిల్లాలో 34,615 మంది విద్యార్థులు -
పరిశుభ్రత.. సామాజిక బాధ్యత
ఏలూరు (టూటౌన్): వ్యక్తిగత, పరిసరాల శుభ్రతను ప్రతిఒక్కరూ సామాజిక బాధ్యతగా స్వీకరించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక తంగెళ్లమూడి 1వ వార్డు సచివాలయం వద్ద, 27, 28వ డివిజన్ల పరిధిలో ఎఫ్సీఐ గోడౌన్లు ఏటిగట్టు ప్రాంతంలో శనివారం స్వర్ణాంధ్ర–స్వచ్ఛాంధ్ర కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ–వేస్ట్ సేకరణ థీమ్ కార్యక్రమం జరిగింది. ఎమ్మెల్యే బడేటి రాధాకృష్ణయ్య (చంటి), మేయర్ షేక్ నూర్జహాన్, ఆర్టీసీ విజయవాడ–2 చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, ఏలూరు ఉడా చైర్మన్ పెద్దిబోయిన శివ ప్రసాద్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): స్థానిక ఉమా కాలేజ్ ఆఫ్ స్పెషల్ ఎడ్యుకేషన్ వేదికగా మూడు రోజులుగా జరుగుతున్న స్టేట్ లెవల్ కంటిన్యూ రిహాబిలిటేషన్ ఎడ్యుకేషన్ (సీఆర్ఈ) శిక్షణా కార్యక్రమం శనివారం ముగిసింది. ముఖ్య అతిథులుగా విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్కుమార్, సర్వ శిక్ష అభియాన్ ఏపీసీ కె.పంకజ్కుమార్ హాజరయ్యారు. పంకజ్కుమార్ మాట్లాడుతూ ఆధునిక పద్ధతులు ఉపయోగించి దైనందిన జీవితాన్ని ఎలా ప్రభావితం చేసుకోవాలనే విషయాలను వివరించారు. రామ్కుమార్ మాట్లా డుతూ స్మార్ట్ హియరింగ్ ఎయిడ్స్, స్పీచ్–టు–టెక్ట్స్ సాఫ్ట్వేర్లు, ఏఐ యాప్ల ద్వారా దివ్యాంగులు స్వయంగా పనులు చేసుకునేలా తీర్చిదిద్దవచ్చన్నారు. సంస్థ ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎస్.పెద్దిరెడ్డి మాట్లాడుతూ స్పెషల్ ఎడ్యుకేటర్లు కేవలం సంప్రదాయ పద్ధతులకే పరిమి తం కాకుండా విజువల్ లెర్నింగ్ టూల్స్, ఇంటరాక్టివ్ సాఫ్ట్వేర్లను బోధనలో భాగం చే యాలని సూచించారు. అనంతరం శిక్షణలో పా ల్గొన్న వారికి సర్టిఫికెట్లు అందించారు. కో–ఆర్డినేటర్ డి.శ్రీనివాస్రెడ్డి, నెల్లూరు బృందం, ఉమా కాలేజ్ ప్రతినిధులు, స్పెషల్ ఎడ్యుకేషన్ నిపుణులు పాల్గొన్నారు. ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడా ప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో ఈనెల 24న జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు నిర్వహించనున్నట్టు డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ప్రకటనలో తెలిపారు. ఏలూరు ఇండోర్స్టేడియంలో ఉదయం 9 గంటలకు పోటీలు ప్రారంభమవుతాయని, 18 ఏళ్ల వయసున్న పు రుషులు, మహిళలు పాల్గొనవచ్చన్నారు. ప్ర తిభ చాటిన వారిని జిల్లా జట్లకు ఎంపిక చేస్తామని, వీరు ఈనెల 28 నుంచి విజయవాడలో జరిగే రాష్ట్రస్థాయి పోటీలకు ప్రాతినిధ్యం వహిస్తారన్నారు. శాప్ వెబ్సైట్లో పేర్లు నమోదు చేసుకోవాలని, మరిన్ని వివరాలకు కోచ్ షేక్ ఖాసీం 9492701324 నంబర్లో సంప్రదించాలని ఆయన కోరారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధులను నూరు శాతం వినియోగించాలని కలెక్టర్ సీహెచ్ నాగరాణి ఆదేశించారు. కలెక్టరేట్లో శనివారం సర్వే, వైద్యం, వ్యవసాయం, విద్య, పంచాయ తీరాజ్, ఐసీడీఎస్, ఉద్యాన శాఖల అధికారులతో ఆమె సమావేశమయ్యారు. జిల్లాకు కేటాయించిన కేంద్ర ప్రాయోజిత పథకాల నిధుల వినియోగంపై సమీక్షించారు. శాఖల వారీగా నిధుల మంజూరు, ఖర్చు, పనుల పురోగతి వివరాలు అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆమె మాట్లాడుతూ నిధుల వినియోగానికి నెల మాత్రమే గడువు ఉందని, ఈలోపు నూరు శాతం సద్వినియోగం చేయాలన్నారు. ఇబ్బందులుంటే తన దృష్టికి తీసుకురావాలని కోరారు. కేంద్రం నుంచి 60:40, 90:10 నిష్పత్తులో నిధులు మంజూరు చేస్తారన్నారు. భీమవరం(ప్రకాశంచౌక్): నరసాపురం పార్లమెంట్ పరిధిలోని జాతీయ రహదారులు, ఆర్అండ్బీ రోడ్ల అభివృద్ధిపై కేంద్ర సహాయ మంత్రి భూపతిరాజు శ్రీనివాసవర్మ తన క్యాంపు కార్యా లయంలో శనివారం ఉన్నతస్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. రాష్ట్ర రవాణా, ఆర్ అండ్బీ శాఖల స్పెషల్ చీఫ్ సెక్రటరీ కృష్ణబాబు, రోడ్డు రవాణా, రహదారుల మంత్రిత్వ శాఖ విజయవాడ రీజనల్ ఆఫీసర్ హరికృష్ణ, కలెక్టర్ నాగరాణి, జేసీ రాహుల్కుమార్రెడ్డి, ఆర్అండ్ బీ ఎస్ఈ విజయరత్న హాజరయ్యారు. -
అడ్డగోలుగా అసైన్డ్ దందా
సహకార ఉద్యోగుల ధర్నా సమస్యల పరిష్కారం కోసం సహకార పరపతి సంఘాల్లో పనిచేస్తున్న ఉద్యోగులు చేపట్టిన సమ్మె కొనసాగుతోంది. ఆందోళన ఆరో రోజుకు చేరింది. 8లో uప్రభుత్వం పేదలకు అందించిన భూములు అక్రమార్కుల పాలవుతున్నాయి. పేదవాడి ఆకలి తీర్చడం కోసం ప్రభుత్వం ఇచ్చిన అసైన్మెంట్ (అసైన్డ్) భూములు ఇప్పుడు భూబకాసురులకు వరంగా మారాయి. చింతలపూడి మండలంలోని పలు గ్రామాల్లో ఈ భూముల కొనుగోలు, అమ్మకాలు యథేచ్ఛగా సాగుతున్నాయి. చట్టప్రకారం ఈ భూములను అమ్మడం గానీ, కొనడం గానీ నేరం అని తెలిసినా.. రెవెన్యూ అధికారుల సహకారంతోరికార్డులు క్షణాల్లో మారిపోతున్నాయని బాఽధితులు ఆరోపిస్తున్నారు. ఆదివారం శ్రీ 22 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026చింతలపూడి: అసైన్డ్ భూముల బదిలీ నిరోధక చట్టం (పీఓటీ) యాక్ట్ ప్రకారం.. ప్రభుత్వం నుంచి పట్టా పొందిన భూమిని ఎవరికీ విక్రయించకూడదు. ఒక వేళ విక్రయించినా, ఆ భూమిని వేరొకరి పేరు మీ దకు మార్చే (మ్యుటేషన్) అధికారం అధికారులకు లేదు. అయితే చింతలపూడి మండలంలో సీన్ రివర్స్ అవుతోంది. వేలాది ఎకరాల అసైన్మెంట్ భూములు ఇప్పటికే ప్రైవేటు వ్యక్తుల పేర్లపైకి మారిపోయాయని ఎన్జీఓ సోషల్ సర్వీస్ అసోసియేషన్ అధ్యక్షుడు తుల్లిమెల్లి కుటుంబరావు తెలిపారు. ముడుపుల మత్తులో ఉన్న కొందరు అధికారులు, రెవెన్యూ సిబ్బంది కనీసం క్షేత్రస్థాయి పరిశీలన కూడా చేయకుండానే ఆన్లైన్ రికార్డులను తారుమారు చేస్తున్నారని ఆందోళన వ్యక్తం చేశారు. చాలాకాలంగా ఈ వ్యవహారం సాగుతోందని బాధితులు ఆరోపిస్తున్నారు. కోర్టుల్లో కేసులున్నా.. కొన్ని భూములు కోర్టు వివాదాల్లో ఉన్నా రెవెన్యూ యంత్రాంగం ఆ విషయాన్ని పక్కన పెట్టి మరీ రిజిస్ట్రేషన్లు, మ్యుటేషన్లు చేసేస్తోంది. ‘అమ్ముతున్నారు కాబట్టి కొంటున్నాం.. అధికారులు రికార్డులు మార్చి ఇస్తుంటే మీకేంటి బాధ?’ అంటూ కొనుగోలుదారులు ఎదురు ప్రశ్నిస్తుండటం చూస్తుంటే.. అక్రమాలకు ఏ స్థాయిలో అధికారుల అండదండలు ఉన్నాయో అర్థమవుతోంది. పేద రైతుల ఆర్థిక ఇబ్బందులను ఆసరాగా చేసుకుని దళారులు తక్కువ ధరకు భూములను చేజిక్కించుకుంటున్నారు. పెద్ద మొత్తంలో నగదు చేతులు మారగానే, నిబంధనలకు విరుద్ధంగా రికార్డుల్లో పట్టా భూములుగా మార్చేస్తున్నారు. ఉన్నతాధికారుల పర్యవేక్షణ లోపించడంతో కిందిస్థాయి సిబ్బంది ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నారు. ఒకవేళ ప్రజా ఫిర్యాదుల విభాగంలో నేరుగా కలెక్టర్కు ఫిర్యాదు చేసిన సందర్భంలో కిందిస్థాయి అధికారులను విచారణకు ఆదేశిస్తున్నారు. వారు తూతూమంత్రంగా విచారణ జరిపి సమస్య పరిష్కారం అయ్యింది అని చెప్పి ఫిర్యాదుదారుడికి మెసేజ్ పంపించి చేతులు దులుపుకుంటున్నారని ఆరోపణలు వస్తున్నాయి. అన్ని ఆధారాలతో సీఎంఓ కార్యాలయానికి ఫిర్యాదు పంపించినా ఇదే పరిస్థితి ఎదురవుతుందని లబ్ధిదారులు వాపోతున్నారు. ప్రభుత్వ విచారణ జరిగేనా? చట్టాన్ని తుంగలో తొక్కి సాగుతున్న ఈ భూ దందాపై ప్రభుత్వం తక్షణమే స్పందించాలని స్థానికులు కోరుతున్నారు. సమగ్ర విచారణ జరిపి, అక్రమంగా జరిగిన మ్యుటేషన్లను రద్దు చేయడంతో పాటు అసలైన లబ్ధిదారులకు ఆ భూములను తిరిగి అప్పగించడంతో పాటు అవినీతికి పాల్పడిన రెవెన్యూ అధికారులపై కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు. లేదంటే రాబోయే కాలంలో పేదలకు సాగుభూమి అనేది కలగానే మిగిలిపోయే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ చిత్రంలో కనిపిస్తున్న మహిళ పేరుముస్సే దుర్గమ్మ. చింతలపూడి మండలం, రామకృష్ణాపురం (మెతుకుమెల్లిగూడెం) గ్రామం. దుర్గమ్మకు గ్రామంలో సర్వే నం.455/6లో 75 సెంట్ల భూమి ఉంది. 1985లో ప్రభుత్వం దుర్గమ్మకు సాగుపట్టా ఇచ్చింది. ఆమె యర్రగుంటపల్లి కెనరా బ్యాంక్లో క్రాప్ లోన్లు కూడా తీసుకున్నారు. అయితే దుర్గమ్మకు చెందిన భూమిని రెవెన్యూ అఽధికారులు అడ్డగోలుగా ఇతరుల పేరుపై మ్యుటేషన్ చేయడంతో సదరు భూమిని ఆక్రమించుకున్న వ్యక్తులు దుర్గమ్మ కుటుంబాన్ని భూమిలోకి అడుగుపెట్టకుండా అడ్డుకుని భూమిని స్వాధీనం చేసుకున్నారు. దీంతో దుర్గమ్మ అధికారులకు ఎన్నిసార్లు మొరపెట్టుకున్నా పట్టించుకోకపోవడంతో హైకోర్టును ఆశ్రయించింది. తన భూమిని తిరిగి తన పేరున మార్చి న్యాయం చేయాలని విజ్ఞప్తి చేస్తోంది. చింతలపూడిలో భూచోళ్లు పేదల భూములపై అక్రమార్కుల కన్ను రెవెన్యూ అధికారుల అండతో భూ బదలాయింపు! ముడుపులకు ఆశపడి రికార్డుల తారుమారు కోర్టు పరిధిలోని భూములకు మ్యుటేషన్లు అధికారుల తీరుపై విమర్శలు అన్ని ఆధారాలు ఉన్నా మాకు చెందిన భూమిని ఆన్లైన్లో పేర్లు మార్చేశారు. మా అమ్మమ్మ నుంచి మా అమ్మకు సంక్రమించిన సుమారు 2.5 ఎకరాల భూమిని కోర్టు విచారణలో ఉండగానే మాకు తెలియకుండా మ్యుటేషన్ చేశారు. సాగు చేసుకుంటున్న మమ్మల్ని బయటకు నెట్టి ఆక్రమించుకున్నారు. మేం తహసీల్దార్కు ఫిర్యాదు చేసినా ఫలితం లేకపోవడంతో హైకోర్టులో కేసు వేశాం. – కాకర్ల శ్రీను, బాధితుడు, యర్రగుంటపల్లి -
శ్రీనివాసా.. గోవిందా
ద్వారకాతిరుమల: గోవిందా హరి గోవిందా.. అంటూ వేలాది మంది భక్తులు చిన వెంకన్నను దర్శించుకున్నారు. శనివారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, దర్శనం క్యూలైన్లు, తూర్పు రాజగోపుర ప్రాంతం, అనివేటి మండపం, కల్యాణకట్ట, ప్రసాదాలు, టికెట్ విక్రయాల కౌంటర్లు, ఇతర విభాగాలు భక్తులతో పోటెత్తాయి. వే లాది మంది అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో కోలాట భజన మండలి సభ్యుల నృత్యాలు ఆకట్టుకున్నాయి. అనివేటి మండపాలు, ఆలయ పరిసరాల్లో వివాహాలు జోరుగా జరిగాయి. అలాగే పలు ప్రాంతాల్లో వివాహాలు చేసుకున్న కొత్త జంటలు, వారి కుటుంబసభ్యులు ఆలయానికి వచ్చి స్వామివారిని దర్శించుకున్నారు. సాయంత్రం వరకూ క్షేత్రంలో రద్దీ కొనసాగింది. -
నేరాల నియంత్రణపై దృష్టి
ఐజీ అశోక్కుమార్ పెనుగొండ: నేర నియంత్రణలో పోలీసులు చురు గ్గా పనిచేస్తున్నారని ఏలూరు రేంజ్ ఐజీ అశోక్కు మార్ అన్నారు. శనివారం ఆచంట పోలీస్స్టేషన్ను ఆకస్మికంగా తనిఖీ చేశారు. స్టేషన్ ఆవరణలో మొక్కలు నాటారు. కేసుల వివరాలు, క్రైం రేటు, నమోదులపై ఆరా తీశారు. గంజాయి అక్రమ రవాణా నివారణ, మహిళల భద్రతపై ప్రత్యేక దృష్టి సా రించినట్టు చెప్పారు. రహదారి ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. జాతీయ రహదారిలో ప్రమాదాలకు అవకాశం ఉన్న 23 బ్లాక్ స్పాట్లను గుర్తించామన్నారు. నరసాపురం పట్టణం, పెంటపాడు, తణుకు, తాడేపల్లిగూడెంలో బ్లాక్ స్పాట్లు ఉన్నాయన్నారు. హైవే అధికారులతో చర్చించి ఆయా ప్రాంతాల్లో ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకుంటామన్నారు. తణుకు, భీమవరం స్టేషన్లను మోడల్ పోలీస్స్టేషన్లుగా అభివృద్ధి చేస్తున్నట్టు చెప్పారు. పశ్చిమగోవదావరి జిల్లా ఎస్పీ నయీం అస్మి, ఏఎస్పీ భీమారావు, డీఎస్పీ డాక్టర్ శ్రీవేద, సీఐ రాయుడు విజయకుమార్, సిబ్బంది ఉన్నారు. -
పంచాయతీల నిర్వహణపై శిక్షణ
ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని 10 మండలాలకు చెందిన గ్రేడ్ 4, గ్రేడ్ 5 పంచాయతీ డెవలప్మెంట్ అధికారుల శిక్షణ ముగింపు కార్యక్రమం శనివారం జరిగింది. జెడ్పీ సీఈవో, జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం ప్రిన్సిపాల్ ఎం.శ్రీహరి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. క్షేత్ర స్థాయి పాలనను పటిష్టం చేయడం, గ్రామ పంచాయతీల్లో సర్వీస్ డెలివరీ మెరుగుపరచడం, రికార్డుల సక్రమ నిర్వహణ, పంచాయతీ ఆస్తుల పరిరక్షణ, మంచినీటి సంరక్షణ పద్ధతులు, ఘన ద్రవ, మల వ్యర్ధాల నిర్వహణ, సొంత వనరుల పెంపుదల, 100 శాతం పన్నులు, పన్నేతర ఆదాయాల వసూళ్లు అనే లక్ష్యాల సాధనలో పంచాయతీ అధికారుల పాత్ర అత్యంత ప్రాధాన్యమని శ్రీహరి తెలిపారు. పంచాయతీ సొంతఆదాయ వనరుతో పాటు ఇంటి పన్ను మదింపు, వసూళ్ల ప్రక్రియపై అధికారులు దృష్టి సారించాలని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పంచాయతీ వనరుల కేంద్రం జిల్లా కో–ఆర్డినేటర్ ప్రసంగ రాజు, మాస్టర్ ట్రైనర్స్ జీడీ శ్రీనివాస్, సూర్య కుమార్, విజయ భాస్కర్, వెంకటేష్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్రంలోని ప్రస్తుత కూటమి ప్రభుత్వం కార్మికులకు రాయితీలు ప్రకటించినా.. ఇంతవరకు దానికి సంబంధించిన జీవో విడుదల చేయలేదని ఏపీ ఎలక్ట్రికల్ వర్కర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడు లింగమల్లు శ్రీనివాసరావు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక సంఘ కార్యాలయంలో శనివారం ఆయన మాట్లాడారు. కార్మికుల పిల్లల వివాహా లకు రూ.40 వేలు, కార్మికుడి భార్య లేదా కూతురి డెలివరీకి రూ.30 వేలు, సహజ మరణానికి రూ.60 వేలు, మట్టి ఖర్చులకు రూ.20 వేల చొప్పున ఇచ్చేలా చూస్తామని ప్రభుత్వం ప్రకటించిందన్నారు. అయినా ఇంత వరకు వీటికి సంబంధించిన జీవో విడుదల చేయలే దన్నారు. కార్మికుల పిల్లలకు స్కాలర్ షిప్ విధానాన్ని అమలు చేసే విధంగా తగు చర్యలు చేపట్టాలని కోరారు. సమావేశం అనంతరం సమస్యలతో కూడిన వినతి పత్రాన్ని జాయింట్ కమిషనర్ ఆఫ్ లేబర్ ఏ.రాణికి అందజేశారు. జంగారెడ్డిగూడెం: జంగారెడ్డిగూడెంకు చెందిన రిటైర్డ్ హవాల్దార్ (ఆర్మీ) దంగల గోపాలకృష్ణ కేఎం కరియప్ప స్మారక పురస్కారం అందుకున్నారు. ఇటీవల విజయవాడలో హోం మినిస్టర్ అనిత చేతుల మీదుగా గోపాలకృష్ణ పురస్కారం అందుకున్నారు. ఇండియన్ ఆర్మీలో అందించిన సేవలకు గుర్తింపుగా తనకు ఈ పురస్కారాన్ని అందచేసినట్లు తెలిపారు. -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: అక్రమంగా నిల్వ ఉంచిన కలపను స్వాధీనం చేసుకున్నట్లు కన్నాపురం ఫారెస్ట్ రేంజర్ భాను ప్రకాష్ శనివారం తెలిపారు. రాజవరం సమీపంలో రహస్య ప్రదేశంలో అక్రమ కలపను నిల్వ ఉంచారన్న సమాచారంతో సిబ్బందితో కలిసి దాడి చేశామన్నారు. రూ. లక్ష విలువైన 20 టేకు దిమ్మలు రేంజ్ కార్యాలయానికి తరలించామన్నారు. పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రం రేవులో నిత్యం తిరుగుతున్న ఫెర్రీ లాంచీ నిబంధనలకు విరుద్ధగా తిరుగుతున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. సాయంత్రం 6 గంటలకే బోట్లు నిలిపివేయాలని నిబంధనలు ఉన్నప్పటికీ ఏడు గంటల వరకు యథేచ్ఛగా తిరుగుతున్నాయని పలువురు పేర్కొంటున్నారు. అధికారుల పర్యవేక్షణ లోపించడంతో నిర్వాహకులు నిబంధనలు ఉల్లంఘిస్తున్నారు. దీనిపై శనివారం సాయంత్రం రేవులో విలేకరులు లాంచీ ఆలస్యంగా తిరగడంపై ప్రశ్నించగా, స్థానిక కూటమి భాగస్వామ్యంలోని పార్టీ నాయకులు దురుసుగా ప్రవర్తించడం కలకలం రేపింది. దెందులూరు: దెందులూరు నియోజకవర్గ సీహెచ్సీలో గత కొంతకాలం నుంచి ఎక్స్రే కంప్యూటర్ పనిచేయడం లేదు. ప్రజలు ఎక్స్రే తీయించుకోవడానికి వచ్చి వెళ్ళిపోతున్నారు. ఎక్స్రే సౌకర్యం లేదని సాక్షిలో కథనం ప్రచురితమైంది. సీహెచ్సీ అభివృద్ధి కమిటీ చైర్మన్ శ్రీహరి, సీఎస్సీ సూపరింటెండెంట్ డాక్టర్ సుందర్ బాబు జిల్లా అధికారులకు నివేదిక అందజేశారు. ఎక్స్రే కంప్యూటర్ యథావిధిగా సేవలందించేలా చర్యలు తీసుకున్నారు. బుట్టాయగూడెం: మండలంలోని నందాపురం సమీపంలో శనివారం రాత్రి కారు ఢీకొని ఒక వ్యక్తి మృతి చెందాడు. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం నందాపురానికి చెందిన పవెల సుబ్బారావు(55) రోడ్డు పక్కన నిలుచుని ఉండగా వేగంగా వచ్చిన కారు ఢీకొట్టి వెళ్లిపోయింది. ఈ సంఘటనలో సుబ్బారావు అక్కడికక్కడే మృతి చెందాడు. సుబ్బారావు మృతితో ఆగ్రహించిన గ్రామస్తులు రోడ్డుపై బైఠాయించి రాకపోకలు నిలిపివేశారు. ఎస్సై దుర్గామహేశ్వరరావు అక్కడికి చేరుకుని నచ్చజెప్పే ప్రయత్నం చేశారు. -
సహకార సంఘ ఉద్యోగుల ధర్నా
కొయ్యలగూడెం : సహకార సంఘ ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం కొయ్యలగూడెం డీసీసీ బ్రాంచ్ వద్ద శనివారం ధర్నా నిర్వహించారు. ధర్నాను ఉద్దేశించి సీఐటీయు జిల్లా ఉపాధ్యక్షుడు శుక్లబోయిన రాంబాబు మాట్లాడుతూ సొసైటీ ఉద్యోగులు సమ్మెబాట పట్టారని, ఏలూరు జిల్లాలో 122 సొసైటీలలో 415 మంది ఉద్యోగులు తమ సమస్యల పరిష్కారం కోసం న్యాయమైన డిమాండ్ల కోసం ఉద్యోగులు సమ్మెబాట పట్టారని తెలిపారు. ప్రభు త్వం సహకార సంఘ ఉద్యోగులుగా గుర్తించలేదన్నారు. పెన్షన్, గ్రాట్యుటీ, బీమా సౌకర్యం కల్పించాలని, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారం కోసం రాష్ట్ర కేంద్ర ప్రభుత్వాలు వెంటనే కలగజేసుకుని విధులకు హాజరయ్యేలా చూడాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. రైతులకు అందుబాటులో సేవలు అందించాలని కోరారు. కార్యక్రమంలో కె.సత్యనారాయణ, రఘు, యర్రంశెట్టి సుబ్రమణ్యం, అడపా నాగేశ్వరరావు, రవి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
బకాయిలు పూర్తి స్థాయిలో చెల్లించాలి
విద్యార్థుల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు మొత్తం చెల్లించేందుకు వీలుగా బడ్జెట్లో కేటాయింపులు లేవు. ఒక పక్క పరీక్షలు సమీపిస్తుండటంతో విద్యార్థులు, వారి తల్లిదండ్రులపై ఫీజుల భారం తలనొప్పిగా మారింది. ఫీజులు చెల్లిస్తేనే హాల్టిక్కెట్లు ఇస్తామంటూ యాజమాన్యాలు మెలిక పెట్టడంతో విద్యార్థుల పరిస్థితి అడకత్తెరలో పోక చెక్కలా తయారైంది. రాష్ట్ర వ్యాప్తంగా రూ.9 వేల కోట్లకు పైగా ఫీజుల బకాయిలు పేరుకుపోయాయి. – కె.లెనిన్, ఎస్ఎఫ్ఐ జిల్లా ప్రధాన కార్యదర్శి/ఏలూరు (టూటౌన్) -
●కవలలు.. కనువిందు
జాతీయ కవలల దినోత్సవాన్ని తణుకు మాంటిస్సోరీ స్కూలులో శనివారం ఘనంగా నిర్వహించారు. పాఠశాలలో ఉన్న 30 మంది కవలలతోపాటు రెండు కవల త్రయం జంటలను డైరెక్టర్ అనపర్తి ప్రకాశరావు ప్రత్యేకంగా అభినందించారు. ఈ సందర్భంగా ప్రకాశరావు మాట్లాడుతూ ఇంత మంది కవలలు తమ పాఠశాలలోనే ఉండడం ఆనందంగా ఉందని, కవలలంతా మంచి విద్యాబుద్ధులతో ఉన్నతస్థాయికి చేరాలని ఆకాంక్షించారు. కార్యక్రమంలో స్కూలు హెడ్మిస్ట్రస్ ఎం.లక్ష్మి, ఎగ్జిక్యూటివ్ డైరెక్టర్ ఎ.జ్ఞానమంజరి, కాలేజ్ ఎకడమిక్ డైరెక్టర్ పి.కిషోర్, ఉపాధ్యాయులు పాల్గొన్నారు. – తణుకు అర్బన్ -
30 దాటినా .. ఒంటరే!
●పెళ్లికాని ప్రసాద్లకు కొత్త తంటా ●మ్యారేజ్ బ్యూరోల్లో పేరుకుపోతున్న బయోడేటాలు తాడేపల్లిగూడెం: ఆరంకెల జీతం, ఆస్తిపాస్తులు ఉన్నా.. పెళ్లి మాత్రం కావడం లేదు. సమాజంలో పెళ్లి కాని ప్రసాద్ల సంఖ్య రోజు రోజుకు పెరిగిపోతోంది. ముప్పై ఏళ్లు దాటుతున్నా పెళ్లి పీటలు ఎక్కే భాగ్యం దక్కడం లేదు. ఒకప్పుడు అమ్మాయిల తల్లిదండ్రులు పెళ్లికొడుక్కి కట్నకానుకల కోసం ఇబ్బంది పడేవారు. ఇప్పుడు పిల్ల దొరికితే చాలు.. కట్నం అక్కర్లేదు, అని అబ్బాయిల తల్లిదండ్రులు అనే పరిస్థితి ఏర్పడింది. చాంతాడులా వధువుల డిమాండ్లు మారుతున్న కాలంతో పాటు అమ్మాయిల ఆలోచనా తీరు మారింది. ఒకప్పుడు పెళ్లిచూపుల్లో అబ్బాయిలు ప్రశ్నలు వేసేవారు, ఇప్పుడు అమ్మాయిలే అబ్బాయిల అర్హతలను పరీక్షిస్తున్నారు. వాళ్ల లిస్టు వింటుంటే అబ్బాయిలు పెళ్లిళ్లపై ఆశలు వదులేసుకుంటున్నారు. సాఫ్ట్వేర్ జాబ్, చిన్న కుటుంబం, ఆస్తిపాస్తులు ఇవన్నీ చూస్తుండడంతో పెళ్లి కాని అబ్బాయిల సంఖ్య పెరిగిపోతోంది. గత పదేళ్లలో అమ్మాయిలు ఉన్నత విద్య అభ్యసించడం సర్వసాధారణంగా మారింది. దీంతో తమకంటే ఎక్కువ చదువుకున్న అబ్బాయి, ఎక్కవ జీతం వచ్చే అబ్బాయి కావాలంటున్నారు. ఇంజినీరింగ్ కోర్సులు చేసిన అమ్మాయిలు.. డిగ్రీ చదివిన అబ్బాయిలను వద్దంటున్నారు. మ్యారేజ్ బ్యూరోల్లో వెయిటింగ్ మ్యారేజ్ బ్యూరోలకు వస్తున్న వారిలో 30 ఏళ్లకు పైబడిన వారే అధికంగా ఉంటున్నారు. అమ్మాయికి తగ్గ అబ్బాయి దొరకడం లేదని కొందరు అంటుంటే, అసలు అమ్మాయిలే దొరకడం లేదని అబ్బాయిల తరపు వారు బాధపడుతున్నారు అని పురోహితులు, మ్యారేజ్ బ్యూరో నిర్వాహకులు చెబుతున్నారు. లెక్కల్లో తేడా ఉమ్మడి పశ్చిమలో 2011 జనాభా లెక్కల ప్రకారం 39,36,966 జనాభా ఉండగా.. 19,72,048 మంది పురుషులు, 19,64,918 మంది మహిళలు ఉన్నారు. కొత్త పశ్చిమ జనాభా లెక్కల ప్రకారం 18 లక్షల మంది జనాభాలో పురుషులు 8,89,252 మంది, మహిళలు 8,90,683 మంది ఉన్నారు. ప్రతి 1004 మంది మహిళలకు, 1000 మంది పురుషులు ఉన్నారు. వెయ్యి మంది బాలురకు, 964 మంది బాలికలు ఉన్నట్టు లెక్కలు చెబుతున్నాయి. 2011 లెక్కల ప్రకారం బాలికల నిష్పత్తి తక్కువగా ఉండడం పెళ్లిళ్లపై ప్రభావం చూపిందంటున్నారు. మా అమ్మాయిలకు సంబంధాలు చూడమని గతంలో మ్యారేజ్ బ్యూరోలకు బయోడేటాలు వచ్చేవి. ఇప్పుడు పరిస్థితి పూర్తిగా మారింది. వయసు ముదిరిన యువకులకు సంబంధాలు చూడమనే వారు అధికం అయ్యారు. అయినా వివాహాలు కుదరడం లేదు. – నాయుడు, మ్యారేజ్ బ్యూరో అసోసియేషన్ నాయకుడు -
కోతకు గురవుతున్న ఆలయం
పోలవరం రూరల్: అఖండ గోదావరి నది మధ్య పోలవరం ప్రాజెక్టు దిగువన ఉన్న ప్రసిద్ధి చెందిన మహానందీశ్వరస్వామి ఆలయానికి ఒక వైపు వరదల ప్రభావంతో కోతకు గురవుతోంది. గత కొన్నేళ్ళుగా స్పిల్వే దిగువ నుంచి వరద ప్రవాహం ఉండటంతో ఆలయం చుట్టూ ఉన్న గట్టు మరింతగా కోతకు గురైంది. లంక ఒడ్డు పూర్తిగా కోతకు గురికావడంతో, దిగువన నిర్మించిన అన్నదాన శిబిరం భవిష్యత్తు ప్రశార్థకంగా మారింది. మళ్లీ వరద సమయానికి ఇది మరింత పెరిగితే అన్నదాన శిబిరం గోదావరిలో కలిసిపోయే పరిస్థితి ఉందని భక్తులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఆలయానికి దాతల సహకారంతో మోటార్లు ఏర్పాటు చేసి మంచినీటి వసతి, మరుగుదొడ్లు, నిర్వాహకులు ఉండేందుకు వీలుగా గదుల నిర్మాణాలు జరిగాయి. సెలవు దినాల్లో వివిధ ప్రాంతాల నుంచి యాత్రికులు ఈ దేవాలయాన్ని సందర్శిస్తుంటారు. నందీశ్వరస్వామి ఆలయానికి వెళ్లే మార్గంలో పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన పోలీస్ చెక్పోస్టు ఏర్పాటు చేశారు. ఈ చెక్ పోస్టు దాటి వెళ్లడానికి అందరికీ అనుమతులు లేవు. మహాశివరాత్రి ఉత్సవాల సమయంలో ఈ క్షేత్రానికి భక్తులు వెళ్ళేందుకు అనుమతులు రావడంతో సుమారు 10 వేల మంది వరకు దర్శించుకున్నారు. సెలవు దినాల్లో వచ్చే పర్యాటకులకు కూడా సందర్శనకు అనుమతులు కొనసాగించాలని కోరుతున్నారు. ఆలయం వద్ద ధ్వజస్ధంభ నిర్మాణ పనులు వేగంగా సాగుతున్నాయి. ఏప్రిల్ నాటికి పనులు పూర్తి చేసి ప్రారంభించేందుకు నిర్వాహకులు ఏర్పాట్లు చేస్తున్నారు. -
ఆలోచనలకు పదునుపెట్టిన వెబినార్
కై కలూరు: దృశ్య మాధ్యమ విధానంలో స్థానిక వైవీఎన్నార్ ప్రభుత్వ డిగ్రీ కాలేజీ కేంద్రంగా గురువారం ప్రారంభమైన అంతర్జాతీయ వెబినార్ శుక్రవారంతో ముగిసింది. మొదటి రోజు ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ సైన్స్ అంశంపై వెబినార్ జరిగింది. కృష్ణా యూనివర్సిటీ వైస్ చాన్సలర్ ప్రొఫెసర్ కూనా రాంజీ ప్రసంగించారు. శుక్రవారం మొదటి విభాగంలో డబ్లిన్ యూనివర్సిటీ, ఐర్లాండ్కు చెందిన డాక్టర్ అరుణ్ మణికందన్ ప్రొటెక్టింగ్ గ్రీన్ ఇన్నోవేషన్, ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ స్ట్రాటజీస్ ఫర్ సస్టైనబుల్ బయో ప్రాసెసింగ్ అండ్ బయో రిఫైనింగ్ అంశంపై విపులంగా ప్రసంగించారు. అనంతరం కృష్ణా యూనివర్సిటీ బయోటెక్నాలజీ విభాగం ప్రొఫెసర్ డాక్టర్ పీవీ.బ్రహ్మచారి కార్పొరేట్ మోనోపోలీ అండ్ డిప్లిటింగ్ రిసోర్సెస్ అంశంపై చక్కగా వివరించారు. ముగింపు సమావేశానికి ముఖ్య అతిథిగా విచ్చేసిన మంగళగిరి ఉన్నత విద్య జాయింట్ డైరెక్టర్ డాక్టర్ సీ.కృష్ణ రోల్ ఆఫ్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ రైట్స్ ఇన్ ఎన్విరాన్మెంటల్ ప్రొటెక్షన్ అంశంపై కూలంకషంగా ప్రసంగించారు. చివరిరోజు ప్రిన్సిపాల్ డాక్టర్ వై.శ్రీలత అధ్యక్షత వహించగా, రాజమహేంద్రవరం రీజినల్ జాయింట్ డైరెక్టర్, డాక్టర్ పీవీ.కృష్ణాజీ, వివిధ రాష్ట్రాల నుంచి అనేక మంది విద్యార్థులు, పరిశోధక విద్యార్థులు, అధ్యాపకులు పాల్గొన్నారు. పెంటపాడు: కొండేపాడు గ్రామంలో శుక్రవారం వివాహిత ఉరివేసుకొని ఆత్మహత్య చేసుకొంది. ఎస్సై కె.స్వామి వివరాల ప్రకారం గ్రామానికి చెందిన బిట్రా పోశిరత్నం (21) శుక్రవారం ఉదయం కొండేపాడులోని ఇంట్లో ఫ్యాన్కు ఉరివేసుకొని మృతి చెందింది. విషయాన్ని గమనించిన కుటుంబసభ్యులు పెంటపాడు పోలీసులకు సమాచారం అందించారు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గూడెం ఏరియా ఆసుపత్రికి తరలించారు. మృతురాలి పెదనాన్న ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. పోశిరత్నం ప్రస్తుతం 4 నెలల గర్భిణీ అని సమాచారం. -
ఏసీబీ దాడుల్లో డ్రగ్ ఇన్స్పెక్టర్ అరెస్టు
జంగారెడ్డిగూడెం: ఏసీబీ దాడుల్లో శుక్రవారం జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్, అతని సహాయకుడు పట్టుబడ్డారు. ఏసీబీ డీఎస్పీ జీవీ కృష్ణారావు వివరాల ప్రకారం.. నల్లజర్ల మండలం ఆవుపాడుకు చెందిన అచ్యుత బాబా దుర్గా సాయి జంగారెడ్డిగూడెంలో మెడికల్ షాప్ పెట్టడానికి ఈ నెల 6న డ్రగ్ లైసెన్స్ కోసం ఆన్లైన్ దరఖాస్తు చేసుకున్నాడు. ఆన్లైన్ దరఖాస్తుకు, అవసరమైన పత్రాలను జతచేసి జంగారెడ్డిగూడెం డ్రగ్ ఇన్స్పెక్టర్ కంపా సురేష్ కుమార్ను సంప్రదించాడు. దరఖాస్తు చేసి చాలా రోజులు అవుతున్నా.. లైసెన్స్ అందకపోవడంతో సురేష్ను సంప్రదించాడు. డ్రగ్ ఇన్స్పెక్టర్ డబ్బులు డిమాండ్ చేశాడు. జంగారెడ్డిగూడెం మెడికల్ షాప్స్ అసోసియేషన్ కోశాధికారి తడికమళ్ల శివరామకృష్ణను కలవాలని, ఎంతో అతను చెబుతాడని సూచించడంతో దుర్గాసాయి అతనిని కలిశాడు. రూ.20 వేలు ఇవ్వాలని చెప్పడంతో దుర్గాసాయి ఏసీబీని ఆశ్రయించాడు. శుక్రవారం దుర్గాసాయి నుంచి శివరామకృష్ణ రూ.20 వేలు తీసుకుంటుండగా పట్టుకున్నారు. శివరామకృష్ణను అదుపులోకి తీసుకుంటుండగా చాంబర్ ఆఫ్ కామర్స్ సభ్యులు అడ్డుపడ్డారు. సురేష్ కుమార్, శివరామకృష్ణను అరెస్టు చేసి రాజమండ్రి ఏసీబీ కోర్టులో హాజరుపరచనున్నట్లు తెలిపారు. ఏసీబీ సీఐలు ఎం.బాలకృష్ణ, కె.శ్రీనివాసరావు పాల్గొన్నారు. -
తెలుగు బుక్ ఆఫ్ రికార్డ్స్లో జాగృతి
ఏలూరు (ఆర్ఆర్పేట): శనివారపు పేట జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో శుక్రవారం నిర్వహించిన కార్యక్రమంలో నగరానికి చెందిన నారాయణం జాగృతి ప్రపంచ తెలుగు బుక్ ఆఫ్ రికార్డులో ఏడు కొత్త రికార్డులను సాధించి రికార్డు నెలకొల్పిందని పాఠశాల ప్రధానోపాధ్యాయుడు గారపాటి ప్రకాష్రావు తెలిపారు. జాగృతి ఇంతవరకు అనేక రంగాల్లో ప్రతిభ చూపి రికార్డులు సాధించిందని.. తాజాగా 7 రికార్డులు మైలురాయిగా నిలిచాయన్నారు. ఈ విజయంతో తెలుగు ప్రతిభను ప్రపంచ స్థాయిలో మరోసారి చాటి చెప్పిందన్నారు. పాలకొల్లు సెంట్రల్: ఏపీ వీల్ చైర్ క్రికెట్ కెప్టెన్గా పాలకొల్లు పట్టణానికి చెందిన మురపాక నళిని రాజశేఖర్ ఎంపికయ్యాడు. క్రికెట్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విశాఖపట్నంలో ఫిబ్రవరి 23 నుంచి 28 వరకూ నిర్వహించనున్న జాతీయ వీల్ చైర్ క్రికెట్ పోటీలకు రాజశేఖర్ను కెప్టెన్గా నియమిస్తూ ఏసీఏ శుక్రవారం ప్రకటించింది. -
పెద్దింట్లమ్మా.. భక్తులను రక్షించమ్మా..
కైకలూరు: అమ్మా.. పెద్దింట్లమ్మ.. నీ భక్తులను రక్షించమ్మా.. అంటూ భక్తులు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆర్తితో వేడుకున్నారు. అమ్మవారి జాతర(తీర్థం) శుక్రవారానికి 3వ రోజుకు చేరుకుంది. ఉదయం జలదుర్గా పెద్దింట్లమ్మకు నూతన వస్త్రాలంకరణ, పుష్పాలంకరణ చేశారు. అనంతరం అమ్మవారికి ఖడ్గనామార్చన, ధూపసేవ, బాలభోగం, అష్టోత్తరం, పాత్రసాధన, పంచహారతులు, నైవేద్యం, నీరాజన మంత్రపుష్పాల పూజలు జరిగాయి. భుజబలపట్నం గ్రామానికి చెందిన సయ్యపురాజు గుర్రాజు, శృంగవరప్పాడుకు చెందిన బలే గణేష్ దంపతులు అమ్మవారికి వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా వ్యవహరించారు. సాంస్కృతిక కార్యక్రమాల్లో భాగంగా రాత్రి నంది అవార్డు గ్రహీత మెజీషియన్ రఘు ప్రదర్శించిన మ్యాజిక్ షో అందరినీ ఆకట్టుకుంది. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ మార్చి 3 వరకు జాతర జరుగుతుందన్నారు. జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం ఈ నెల 28న జరుగుతుందన్నారు. కలిదిండి(కై కలూరు): బహిర్భూమికి వెళ్ళిన వ్యక్తి కాల్వలో పడి ఊపిరాడక మరణించిన ఘటన కలిదిండి మండలం కోరుకొల్లు పెద్ద కాల్వ వద్ద శుక్రవారం జరిగింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం కోరుకొల్లుకు చెందిన వీరవల్లి ప్రసాద్(28) ఉదయం 10 గంటల ప్రాంతంలో కాల్వలో కొట్టుకుపోతున్న ప్రసాద్ను స్థానికులు రక్షించి కోరుకొల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రానికి తీసుకువెళ్ళారు. డాక్టర్ పరీక్షించి అప్పటికే మరణించాడని ధ్రువీకరించారు. తండ్రి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం
రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన మూడో విడత బడ్జెట్లో ఎస్సీ, ఎస్టీలకు తీవ్ర అన్యాయం జరిగింది. ఎన్నికల్లో ఇచ్చిన హామీలు తుంగలో తొక్కి ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనారిటీలకు 50 ఏళ్లకే పింఛను ఇస్తామన్న హామీని పూర్తిగా విస్మరించారు. ఇందుకు సంబంధించి ఒక్క రూపాయి కూడా కేటాయించకపోవడమే ఇందుకు నిదర్శనం. కూటమి ప్రభుత్వంలో ఏ ఒక్కరికీ సంక్షేమ ఫలాలు అందడంలేదు. – బొంతు వెంకట్రావు, మండల ఎస్సీ సెల్ నాయకులు, పి.అంకంపాలెం, జీలుగుమిల్లి -
సొసైటీ ఉద్యోగుల పోరుబాట
● సమ్మెలోకి ఉద్యోగులు ● రైతులకు అందని ‘సహకార’ సేవలు ● జిల్లాలోని 254 సొసైటీలు మూత ఉద్యోగుల డిమాండ్లు ● జీఓ 36ను అమలు చేసి ఉద్యోగులందరికీ ప్రొసీడింగ్స్ ఇచ్చి జీతభత్యాలు చెల్లించాలి. ● సహకార ఉద్యోగులకు కూడా రిటైర్మెంట్ వయసును 62 ఏళ్లకు పెంచాలి. ● ప్రతి ఐదేళ్లకు ఒకసారి వేతన సవరణ చేయాల్సి ఉంది. అయితే 2019, 2024ల్లో చేయనందున రెండు వేతన సవరణలతోపాటు అప్పటివరకు మధ్యంతర భృతి చెల్లించాలి. ● 2019 తరువాత సహకార సంఘాల్లో చేరిన ఉద్యోగులందరినీ పర్మినెంట్ చేయాలి. ● ఉద్యోగులకు ఆరోగ్య బీమా రూ.5 లక్షలు, టర్మ్ ఇన్సూరెన్స్ రూ.20 లక్షలకు కల్పించాలి. ● ఉద్యోగులు మరణిస్తే కారుణ్య నియామకం కింద కుటుంబ సభ్యుల్లో ఒకరికి ఉద్యోగం ఇవ్వాలి. వీటితో పాటు ఇతర సమస్యల పరిష్కారానికి ఉద్యోగులు సమ్మెలోకి దిగారు. నూజివీడు: దీర్ఘకాలికంగా అపరిష్కృతంగా ఉన్న సమస్యల పరిష్కారానికి, తమ న్యాయమైన డిమాండ్ల సాధన కోసం సహకార సంఘాల ఉద్యోగులు సమ్మెబాట పట్టారు. ఈనెల 16 నుంచి నిరవధిక సమ్మెలోకి వెళ్లడంతో జిల్లాలోని 254 సహకార పరపతి సంఘాలు (పీఏసీఎస్లు) తలుపులు తెరుచుకోవడం లేదు. సొసైటీల కార్యకలాపాలు స్తంభించడంతో రైతులు ఇబ్బంది పడుతున్నారు. డిసెంబరు మొదటి వారం నుంచి జనవరిలో సంక్రాంతి వరకు దశల వారీగా పోరాటాలు చేసినా ప్రభుత్వం వారి ఉద్యమాన్ని ఏమాత్రం పట్టించుకోలేదు. కనీసం చర్చలకు కూడా పిలవలేదు. ఈ నేపథ్యంలో ఉద్యోగులు నిరవధిక సమ్మెకు దిగారు. జిల్లాలో 254 సొసైటీలు జిల్లాలో 254 సొసైటీలు ఉండగా ఉద్యోగులంతా నిరవధిక సమ్మెలోకి వెళ్లారు. ప్రతి నియోజకవర్గంలోని సొసైటీ ఉద్యోగులంతా రోజుకో కేంద్ర సహకార బ్యాంకు బ్రాంచీ వద్ద ఆందోళనలు చేస్తున్నారు. 2025–26 ఆర్థిక సంవత్సరం మరో 38 రోజుల్లో ముగుస్తుండగా ఈ దశలో రుణాలను వసూలు చేయాల్సి ఉండగా, ఉద్యోగులు సమ్మెలోకి వెళ్లడంతో రుణాల వసూళ్లు నిలిచిపోయే ప్రమాదం ఉంది. ఇదే జరిగితే సొసైటీలు నష్టాల్లోకి వెళ్లి సహకార వ్యవస్థ దెబ్బతినే అవకాశాలు ఉన్నాయని రైతుల్లో ఆందోళన వ్యక్తమవుతోంది. -
ఉద్యోగుల గ్రీవెన్స్కు 46 అర్జీలు
ఏలూరు(మెట్రో): ప్రభుత్వ ఉద్యోగుల స మస్యల పరిష్కారానికి ప్రతినెలా మూడో శుక్రవారం ఎంప్లాయిస్ గ్రీవెన్స్ డే నిర్వహిస్తున్నట్టు డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తెలిపారు. కలెక్టరేట్లో శుక్రవారం గ్రీవెన్స్ డే నిర్వహించారు. ఉద్యోగుల సంక్షేమం, సమస్యల పరిష్కారానికి కృషిచేస్తున్నట్టు ఆయన చెప్పారు. 46 మంది ఉద్యోగులు అర్జీలు సమర్పించారు. స్పెషల్ డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, హౌసింగ్ డీడీ జి.సత్యనారాయణ, డీపీఓ కె.అనురాధ, ఏపీఎస్జీఓ జిల్లా ప్రెసిడెంట్ చోడగిరి శ్రీనివాసరావు తదితరులు పాల్గొన్నారు. అర్జీల్లో కొన్ని.. ● చింతలపూడి మండలం యర్రగుంటపల్లి ప్రభుత్వ బీసీసి బాలురు వసతి గృహ హాస్టల్ వెల్ఫేర్ అధికారి బి.శశికుమార్ తన సస్పెన్షన్ రద్దు చేయాలని కోరారు. ● ద్వారకాతిరుమల మండలం గుణ్ణంపల్లి జెడ్పీ–1 స్కూల్ అసిస్టెంట్ (పీడీ) పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్ మంజూరు చే యాలని అర్జీ అందించారు. ● ఏలూరు జెడ్పీ ఏఓ కె.కనకరాజు నోషనల్ పదోన్నతి, పే ఫిక్సేషన్ ఇంక్రిమెంట్ల కోసం అర్జీ సమర్పించారు. ● కుక్కునూరు పంచాయతీ కార్యదర్శి వీవీ ఎస్ ఆంజనేయులు తన సస్పెన్షన్ రద్దు చే యాలని అభ్యర్థించారు. ● కొయ్యలగూడెం సాంఘిక సంక్షేమ శాఖ అధికారి పి.నాగసాయమ్మ గ్రేడ్–1 పదోన్నతి, పెండింగ్లో ఉన్న ఇంక్రిమెంట్ల కోసం వినతిపత్రం సమర్పించారు. తాడేల్లిగూడెం (టీఓసీ): తాడేపల్లిగూడెం 6వ వార్డు ఇందిరానగర్ గాంధీ బొమ్మ సెంటర్ నుంచి టీటీడీ కల్యాణ మండపం ప్రాంతంలో ఏరియా ఆస్పత్రికి వెళ్లే మార్గంలో ప్రధాన పైపులైన్కు అధికారులు మరమ్మతులు చేపట్టారు. ఈనెల 12న ‘లీకేజీలతో పెరుగుతున్న నీటి కష్టాలు’ శీర్షికన ‘సాక్షి’లో ప్రచురించిన కథనానికి స్పందించారు. మున్సిపల్ వాటర్ వర్క్స్ సిబ్బంది పలుచోట్ల లీకేజీలను అరికట్టారు. భీమవరం (ప్రకాశంచౌక్): సేవాభావంతో విభి న్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి అధికారులు చర్యలు తీసుకోవాలని జేసీ టి.రాహుల్కుమార్రెడ్డి సూచించారు. కలెక్టరేట్లో తొలిసారిగా శుక్రవారం విభిన్న ప్రతిభావంతుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక పీజీఆర్ఎస్ నిర్వహించారు. ఆరోగ్య సమస్యలు, వై ద్యం, ఉపాధి, రూ.15 వేల పింఛన్, బ్యాంకు రుణాల కోసం పలువురు అర్జీలు అందించారు. మొత్తంగా 40 అర్జీలను స్వీకరించారు. నలుగురు శారీరక దివ్యాంగులకు జేసీ స్మార్ట్ఫోన్లు అందించారు. విభిన్న ప్రతిభావంతులు, వృద్ధుల సంక్షేమ శాఖ సహాయ సంచాలకుడు బి.రామ్కుమార్, డీఎంహెచ్ఓ జి.గీతాబాయి, డ్వామా పీడీ కేసీహెచ్ అప్పారావు తదితరులు పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): మధ్యాహ్న భోజనం పథకం అమలు తీరుపై జిల్లావ్యాప్తంగా విస్తృత తనిఖీలు నిర్వహించినట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. జిల్లాలోని 916 మంది అధికారులు బుధవారం 20 మండలాల్లో పాఠశాలలను తనిఖీ చేసి పథకం అమలును పరిశీలించినట్టు చెప్పారు. 916 పాఠశాలల్లో 61,573 మంది విద్యార్థులకు 52,171 మంది హాజరుకాగా 50,033 మంది మధ్యాహ్న భోజనాన్ని భుజించారన్నారు. పథకాన్ని పటిష్టంగా అమ లు చేయాలని, ఆహార పదార్థాల నాణ్యతలో రాజీ పడబోమని అన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): 2027 జనాభా లెక్కల సేకరణకు ప్రత్యేకత ఉందని, డిజిటల్ రూపంలో వివరాలు సేకరించడంతో పాటు వెబ్ పోర్టల్ ద్వారా ప్రజలు వ్యక్తిగతంగా సెల్ఫ్ ఎన్యూమరేట్ చేసుకునే వీలుంటుందని కలెక్టర్ సీహెచ్ నాగరాణి అన్నారు. జనాభా లెక్కల సేకరణపై ప్రిన్సిపల్ సెన్సస్ అధికారులు కలెక్టర్లతో రాష్ట్రస్థాయి సమావేశాన్ని అమరావతిలో నిర్వహించారు. జిల్లా కలెక్టర్ నాగరాణి సమావేశానికి హాజరయ్యారు. -
హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ సమావేశం
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన మాధవ కల్యాణ మండపంలో హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ (హెచ్డీపీటీ) ఆధ్వర్యంలో గురువారం రాత్రి అర్చకులు, ట్రస్ట్ జిల్లా కో–ఆర్డినేటర్లతో విస్తృత సమావేశాన్ని నిర్వహించారు. ట్రస్ట్ ఛైర్మన్, రిటైర్డ్ ఐఏఎస్ అధికారి దాసరి శ్రీనివాసులు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం ఏఈఓ పి.నటరాజారావు, రాష్ట్ర కో–ఆర్డినేటర్ కోట సునీల్ కుమార్ పాల్గొన్నారు. ఈ సందర్భంగా జరిగిన సమావేశంలో అర్చకులు తమ జీవనోపాధి, గౌరవ వేతనాల పెంపు, పెండింగ్ బకాయిలు విడుదల, చిన్న దేవాలయాల అభివృద్ధి, దేవాలయ ఆస్తుల రక్షణ, హుండీ లెక్కల పారదర్శకత, గోశాలల పరిరక్షణ, అర్చకుల వైద్య–పింఛన్ భద్రత తదితర అంశాలపై విస్తృతంగా విన్నపాలు చేశారు. వీటిపై శ్రీనివాసులు స్పందిస్తూ అర్చకుల అభ్యర్థనలను పూర్తిగా అర్థం చేసుకున్నానని తెలిపారు. వీటిని సమగ్రంగా సంకలనం చేసి ప్రభుత్వం, దేవాదాయ శాఖ అధికారులతో చర్చించి ప్రతిపాదనల రూపంలో ముందుకు తీసుకెళ్లేందుకు తన వంతు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. పెదవేగి: ప్రమాదవశాత్తు కాలు జారి పడడంతో ఓ వ్యక్తి చికిత్స పొందుతూ మృతి చెందినట్లు పెదవేగి పోలీసులు కేసు నమోదు చేశారు. పెదవేగి ఎస్సై ఎం.హరిగోపాల్ తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగి మండలం విజయరాయిలోని నూజివీడు సీడ్స్ ఫ్యాక్టరీలో బిహర్కు చెందిన దుర్గేష్ గత 5 ఏళ్లుగా పనిచేస్తున్నాడు. దుర్గేష్ తమ్ముడైన చోటు కుమార్సాహ్ కూడా ఆరు నెలల క్రితం అన్న పనిచేస్తున్న ఫ్యాక్టరీలోనే చేరాడు. ఈ నెల 19న అన్నదమ్ములు ఓవర్ డ్యూటీ చేసే ప్రక్రియలో ఫ్యాక్టరీలో పైకి ఎక్కి పనిచేస్తుండగా, ప్రమాదవశాత్తు దుర్గేష్కు కాలు జారి కింద పడిపోయాడు. దీంతో తీవ్ర గాయాలైన అతడిని హుటాహుటిన ఏలూరులోని ఆశ్రం ఆసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ 20న దుర్గేష్(32) మృతిచెందినట్లు ఆసుపత్రి సమాచారం మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. ద్వారకాతిరుమల: మండలంలోని గొల్లగూడెంలో ఓ వ్యభిచార గృహంపై శుక్రవారం పోలీసులు దాడి చేశారు. నిర్వాహకురాలిని అరెస్టు చేసి, ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం.. గొల్లగూడెం గ్రామానికి చెందిన పంచవ నాగమణి ఇంటికి విటులను రప్పించి, గుట్టుచప్పుడు కాకుండా అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడుతున్నట్టు భీమడోలు సీఐ యుజే విల్సన్, ద్వారకాతిరుమల ఎస్సై టి.సుధీర్లకు సమాచారం అందింది. దాంతో వ్యభిచార ముఠా గుట్టును రట్టు చేసేందుకు సిబ్బందితో కలసి మెరుపుదాడి చేశారు. ఆ సమయంలో ఇంట్లో ఉన్న ఇద్దరు విటులను, బాధితురాలిని అదుపులోకి తీసుకున్నారు. నాగమణిని అరెస్టు చేసి, పలు సెక్షన్ల కింద కేసు నమోదు చేసినట్టు ఎస్సై సుధీర్ తెలిపారు. తాడేపల్లిగూడెం: నానో టెక్నాలజీపై ప్రపంచవ్యాప్తంగా విస్తృత పరిఽశోధనలు సాగుతున్నాయని దక్షిణ కొరియాలోని చుంగ్–ఆంగ్ విశ్వవిద్యాలయ బ్రెయిన్ పూల్ సైంటిస్టు డాక్టర్ గెడ్డా గంగరాజు తెలిపారు. ఏపీ నిట్లో కెమికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో శుక్రవారం గ్రీన్ సింథసిస్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఆఫ్ నానో మెటీరియల్స్ ఫర్ బయోమెడికల్ అండ్ ఎన్విరాన్మెంట్ అప్లికేషన్ అంశంపై విద్యార్థులకు ఆయన అవగాహన కల్పించారు. పర్యావరణానికి హాని కలుగకుండా సహజ వనరులను ఉపయోగించి నానో పదార్తాలను తయారుచేసే విధానాన్నే గ్రీన్ సింథసిస్ అంటారన్నారు. ఈ గ్రీన్ సింథసిస్ పద్ధతి పర్యావరణ పరిరక్షణతో పాటు సమర్ధవంతమైన జీవవైద్య పరిష్కారాలను చూపించే భవిష్యత్ సాంకేతికతగా గుర్తింపు పొందుతుందన్నారు. కెమికల్ ఇంజనీరింగ్ విభాగాఽధిపతి డాక్టర్ వినోద్కుమార్ రాజా, ఆచార్యులు కుల్దీప్ రాయ్, సుశాంత్ బెహరా తదితరులు పాల్గొన్నారు. -
ఫైర్లైన్స్తో అగ్ని ప్రమాదాలకు చెక్
● అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు ఏర్పాట్లు ● 50 కిలోమీటర్ల పరిధిలో ఫైర్లైన్స్ నిర్వహణ బుట్టాయగూడెం: వేసవికాలం వచ్చిందంటే అడవుల్లో అగ్ని ప్రమాదాలు సంభవించి వృక్ష సంపదకు, వన్యప్రాణులకు హాని కలిగే పరిస్థితులు నెలకొంటున్నాయి. అడవుల్లో అగ్నిప్రమాదాల వల్ల వాతావరణ సమతుల్యం కూడా దెబ్బతినే ప్రమాదం నెలకొంటుంది. దీంతో అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు అటవీశాఖ అధికారులు ప్రత్యేక దృష్టి పెడుతున్నారు. దీనిలో భాగంగా సుమారు 50 కిలోమీటర్ల పరిధిలో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నారు. అదేవిధంగా ఫైర్ బ్లోయర్స్ను కూడా సిద్ధం చేసి అటవీని అగ్ని ప్రమాదాల నుంచి సంరక్షిస్తున్నారు. జిల్లాలో విస్తరించి ఉన్న అటవీప్రాంతం జాతీయ అటవీ విధానం ప్రకారం మూడో వంతు భూభాగంలో చెట్లు ఉండాలి. ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లా పరిధిలో సుమారు 1.32 లక్షల హెక్టార్ల పరిధిలో అటవీప్రాంతం విస్తరించి ఉంది. ఇందులో 85 శాతం పశ్చిమ ఏజెన్సీ ప్రాంతంలోనే ఉందని అధికారులు చెబుతున్నారు. అడవులను సంరక్షించడంతో పాటు వనాల్లో ఉండే జంతువుల రక్షణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. అగ్నిప్రమాదాలు ఇలా వేసవి కాలంలో చెట్ల ఆకులు ఎక్కువగా రాలిపోతుంటాయి. అటవీప్రాంతంలోకి పశువులను తీసుకు వెళ్లిన పశువుల కాపరులు, తునికాకు, చింతపండు, ఇప్పపూలు, అడ్డపిక్కలు, తదితర వాటి సేకరణ కోసం వెళ్లిన వారిలో ఎవరైనా అనుకోకుండా చుట్ట, సిగరెట్, బీడీ వంటివి తాగి పడేస్తే అవి ఎండిన ఆకులకు అంటుకొని మంటలు వ్యాప్తి చెంది పెద్ద మొత్తంలో అడవులకు నష్టం వాటిల్లే అవకాశం ఉంది. అలాగే ఆకతాయిల చేష్టల వల్ల కూడా అడవుల్లో అగ్నిప్రమాదాలు సంభవిస్తుంటాయి. గిరిజన ప్రాంతంలో అడవుల్లో ప్రతి ఏటా ఏదో ఒక ప్రాంతంలో అడవికి నిప్పు రాజుకుని మంటలు చెలరేగుతున్న పరిస్థితులు నెలకొంటున్నాయి. వాటిని సమర్థవంతంగా ఎదుర్కొని అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణకు అధికారులు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నారు. ఫైర్లైన్స్ ఏర్పాటు ఇలా అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణలో భాగంగా ఫారెస్టు అధికారులు అటవీ ప్రాంతంలో ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తారు. అటవీ ప్రాంతంలో కాలిబాటలో ఐదు మీటర్ల వెడల్పుతో వీటిని ఏర్పాటు చేయడం జరుగుతుంది. చుట్టు పక్కల ఉన్న ఎండిన ఆకులను కాలి బాటలో పరిచి నిప్పు పెడతారు. ఒక వేళ ప్రమాదవశాత్తు అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగినా ఈ దారి వరకే మంటలు వ్యాప్తి చెంది ఆరిపోతాయి. మిగతా ప్రాంతానికి మంటలు వ్యాప్తి చెందకుండా ఫైర్లైన్స్ అరికడతాయి. అడవుల సంరక్షణకు ప్రతి ఏటా అటవీ శాఖ అధికారుల ఆధ్వర్యంలో వేసవి ప్రారంభంలో ముందస్తు చర్యలు చేపడతారు. ఫైర్లైన్స్ ద్వారా దాదాపు 2 కిలోమీటర్ల మేర ఏర్పాటు చేయడం ద్వారా అగ్నిప్రమాదాలు రాకుండా అరికట్టవచ్చని అధికారులు చెబుతున్నారు. అయితే పశ్చిమ ఏజెన్సీప్రాంతంలో అటవీ విస్తరణ అధికంగా ఉండటం వల్ల సుమారు 50 కిలోమీటర్ల మేర ఫైర్లైన్స్ ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. గత ఏడాది తీసుకున్న చర్యల వల్ల కేవలం 2 హెక్టార్లలో మాత్రమే అడవి అగ్నిప్రమాదానికి గురైందని అటవీశాఖ అధికారులు తెలిపారు. శాటిలైట్ ద్వారా సమాచారం అటవీ ప్రాంతంలో అగ్ని ప్రమాదం చోటు చేసుకుంటే వెంటనే సమాచారం అందించేందుకు అటవీశాఖ ప్రధాన కార్యాలయంలో ఫైర్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేశారు. శాటిలైట్ ద్వారా వచ్చే సమాచారాన్ని తక్షణమే అటవీశాఖ అధికారులకు చేరవేస్తుంది. జిల్లాలో ఎక్కడైనా అటవీప్రాంతంలో అగ్నిప్రమాదం సంభవించి మంటలు చెలరేగితే ఆ ప్రాంతానికి తక్షణమే సమాచారం అందించే వీలుంటుంది. దీనితో ఫారెస్ట్ అధికారులు అప్రమత్తమై ఆయా ప్రాంతానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువస్తారు. వేసవి కాలంలో అటవీ ప్రాంతంలో సంభవించే అగ్నిప్రమాదాల నివారణకు రాత్రి పగలు తేడాలేకుండా ప్రత్యేక నిఘా ఏర్పాటు చేస్తామని ఫారెస్ట్ అధికారులు చెబుతున్నారు. ఫైర్లైన్స్ ఏర్పాటు చేసి ఎండిన ఆకులను పరిచి అవి పూర్తిగా కాలిపోయే వరకూ కాపలా ఉంటారు. అలాగే అనుకోకుండా మంటలు వ్యాప్తి చెందితే అందుబాటులో ఉన్న సిబ్బంది పరుగులు తీసి ఆ మంటలను అదుపు చేస్తారు. వీటి వల్ల అగ్నిప్రమాదాలు చోటు చేసుకోకుండా ఉంటాయి. అడవులు, జంతువుల సంరక్షణ ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నాం. వేసవిలో సంభవించే అగ్ని ప్రమాదాల నివారణకు ఫైర్ వాచర్స్ ద్వారా కృషి చేస్తున్నాం. 50 కిలీమీటర్ల పరిధిలో ఫైర్ లైన్స్ ఏర్పాటు చేస్తున్నాం. వీటి ద్వారా మంటలను వ్యాప్తి చెందకుండా నివారించేలా కృషి చేస్తున్నాం. అలాగే అడవుల్లో అగ్నిప్రమాదాల నివారణపై పరిసర ప్రాంతాల్లోని ప్రజలకు పూర్తి అవగాహన కలిగించే విధంగా కృషి చేస్తున్నాము. – ఎస్కే వల్లీ, రేంజ్ అధికారి, పోలవరం -
చెట్లు.. మెట్లే.. ఆవాసాలు
ఏలూరు సర్వజన ఆస్పత్రికి గర్భిణిని ప్రసవానికి తీసుకువస్తే బంధువులకు కష్టాలు తప్పడం లేదు. తల్లీబిడ్డ వార్డులోకి ప్రవేశం లేకపోవడంతో వీరంతా వార్డు ముందున్న మెట్లు, చెట్లు, బల్లలపై వేచి ఉండాల్సి వస్తోంది. ఇలా ఒకటి కాదు.. రెండు కాదు.. రోజుల తరబడి ఇవే వారికి ఆవాసాలుగా మారుతున్నాయి. కాన్పు పూర్తయి తల్లీబిడ్డ డిశ్చార్జ్ అయ్యేవరకూ ఈ ఇబ్బందులు తప్పట్లేదు. కనీసం షెడ్డు కూడా లేకపోవడమే ఇందుకు కారణం. ఏలూరు జీజీహెచ్ ఆవరణలో పరిస్థితికి అద్దం పడుతున్న దృశ్యాలివి. – సాక్షి ఫొటోగ్రాఫర్, ఏలూరు బెంచీలపై అలా..మెట్లపై ఎదురుచూపులు -
వీఓఏల రణభేరి
సమస్యల పరిష్కారం కోసం వీఓఏలు (విలేజ్ ఆర్గనైజింగ్ అసిస్టెంట్లు) పోరుబాట పట్టారు. తమ జీవితాల్లో ‘వెలుగు’లు నింపాలని గళమెత్తారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, జీతాలు పెంచాలని, వేధింపులు నివారించాలని డిమాండ్ చేస్తూ ఈనెల 25న చలో విజయవాడ ధర్నాకు పిలుపునిచ్చారు. జిల్లావ్యాప్తంగా పెద్ద సంఖ్యలో వీఓఏలు తరలివెళ్లేందుకు సన్నద్ధమవుతున్నారు. శనివారం శ్రీ 21 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఏలూరు (టూటౌన్): జిల్లాలో 1,300 మంది వీఓఏలు ఉన్నారు. చంద్రబాబు కూటమి ప్రభుత్వం అధికారం చేపట్టిన ఆరు నెలల వ్యవధిలోనే 86 మందిని ఎటువంటి కారణాలు లేకుండా తొలగించడంతో వీఓఏలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. స్థానిక టీడీపీ నేతలు చెప్పినట్టు వింటేనే విధుల్లో ఉండండి లేకుంటే రాజీనామాలు చేసి వెళ్లిపోండనే బెదిరింపు లు మధ్య మిగిలిన వారు విధులు నిర్వహిస్తున్నా రు. పచ్చ నేతల వేధింపులు తాళలేక ఇప్పటివరకూ 86 మంది వీఓఏలు ఉద్యోగాలు వదులుకున్నారు. అధికారుల దాటవేత ధోరణి తమను అక్రమంగా తొలగించారంటూ బాధిత వీఏఓలు జిల్లా అధికారులకు మొరపెట్టుకున్నా పట్టించుకోని పరిస్థితి. తమను ఈ వ్యవహారంలో తలదూర్చవద్దని ప్రభుత్వం చెప్పిందని, గ్రామ సమాఖ్య తీర్మానం ప్రకారం వీఓఏలను నియమిస్తున్నట్టు డీఆర్డీఏ అధికారులు దాటవేత ధోరణిలో సమాధానం ఇస్తున్నారు. రాజకీయ దురద్దేశంతో తమను విధుల నుంచి తొలగించడంపై వీఓఏలు ఆవేదన చెందుతున్నారు. వీఓఏల నెలవారీ వేతనం రూ.8 వేలు కాగా ఇది కూడా ప్రతినెలా అందడం లేదు. 25న చలో విజయవాడ రాష్ట్రవ్యాప్తంగా వీఓఏలు తమ సమస్యలు పరిష్కరించాలంటూ ఈనెల 25న చలో విజయవాడకు పిలుపునిచ్చారు. ఏపీ వెలుగు వీఓఏ (యానిమేటర్స్) ఉద్యోగుల సంఘం (సీఐటీయూ) పిలుపు మేరకు జిల్లా నుంచి పెద్ద సంఖ్యలో తరలివెళ్లేందుకు సన్నాహాలు చేస్తున్నారు. కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. రెండేళ్ల సీ్త్రనిధి ఇన్సెంటివ్ బకాయిలు చెల్లించాలి. హెచ్ఆర్ పాలసీ అమలు చేయాలి. మొబైల్స్, సిమ్ కార్డ్స్ ఇవ్వాలి. రీచార్జ్ చేయించాలి. మహిళా మార్టుల్లో పొదుపు మహిళలు పెట్టిన పెట్టుబడులు తిరిగి సభ్యులకు చెల్లించాలి. స్వావలంబన, అభయహస్తం అమౌంట్స్ను పొదుపు మహిళలకు తిరిగి చెల్లించాలి. రూ.10 లక్షల వరకు వడ్డీ రాయితీ చెల్లించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలి. అక్రమ తొలగింపులు, రాజకీయ వేధింపులు ఆపాలి. వెలుగు లేని జీవితాలు సమస్యలపై పోరుబాట వేధింపులు ఆపాలని డిమాండ్ ఉద్యోగ భద్రత కల్పించాలి 25న చలో విజయవాడకు పిలుపు -
‘ఈ–నారీ’తో పని ఒత్తిడి
ఇటీవల ప్రభుత్వం కొత్తగా ప్రవేశ పెట్టిన ఈ–నారీ విధానంతో వీఓఏలపై పనిఒత్తిడి పెరిగింది. కోళ్ల యూనిట్లు టార్గెట్లు పెట్టడం తక్షణం నిలుపుదల చేయాలి. జిల్లాలో సరైన కారణాలు లేకుండా వీఓఏలను తొలగించే ప్రయత్నాలు జరుగుతున్నాయి. రాజకీయ కారణాలతో ఇది జరగడం బాధాకరం. – సీహెచ్ నాగలక్ష్మి, వీఓఏల సంఘ జిల్లా అధ్యక్షురాలు వీఓఏలకు ఉద్యోగ భద్రత కల్పించాలి. పని ఒత్తిడి భారాలను తగ్గించాలి. నెలనెలా వేతనాలు అందించాలి. నిత్యావసర వస్తువుల ధరలకు అనుగుణంగా వేతనాలు పెంచాలి. తమపై వేధింపులు ఆపాలి. ఆయా సమస్యల పరిష్కారానికి చలో విజయవాడకు పిలుపునిచ్చాం. జిల్లాలోని వీఓఏలు పెద్దసంఖ్యలో పాల్గొనాలి. – ఎస్కే సుభాషిణి, వీఓఏల సంఘ జిల్లా కార్యదర్శి రెండేళ్ల నుంచి సీ్త్రనిధి ఇన్సెంటివ్లను ఇవ్వలేదు. వెంటనే వీటిని విడుదల చేయాలి. మహిళా మార్టుల్లో స్వయం సహాయక సంఘాల మహిళలు పెట్టిన పొదుపు డబ్బులను తిరిగి చెల్లించాలి. స్వావలంబన, అభయహస్తం పథకాల్లో పొదుపు చేసిన సొమ్ములను మహిళలకు అందించాలి. గ్రూప్ ఇన్సూరెన్స్ కల్పించాలి. – బి.ఆదిలక్ష్మి, వీఓఏల సంఘ జిల్లా కోశాధికారి సుప్రీంకోర్టు ఆదేశాల మేరకు సమాన పనికి సమాన వేతనం చెల్లించాలి. వీఓఏలకు కనీస వేతనం రూ.26 వేలు చెల్లించాలి. చిన్నపాటి కారణాలతో వీరిపై రాజకీయ నాయకులు పెత్తనం చెలాయిస్తున్నారు. దీనిని నిరోధించాలి. వీఓఏలకు సీ్త్రనిధి ఇన్సెంటివ్ బకాయిలు వెంటనే చెల్లించాలి. – డీఎన్వీడీ ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి -
కలికితురాయిపై కక్ష
పెదవేగి : పెదవేగి మండల కేంద్రంలో 140 ఏళ్ల వయసున్న తురాయి చెట్టును కూలగొట్టడం చర్చనీయాంశంగా మారింది. చెట్టు ఉన్న ప్రాంతం తు రాయి చెట్టు సెంటర్గా పేర్గాంచింది. పంచాయతీ అధికారులకు తెలియకుండా శివరాత్రి రోజున ఈ చెట్టును కొందరు కూలగొట్టారు. దీనిపై సమాధానం చెప్పే నాథుడే కరువయ్యాడు. ఇదిలా ఉండ గా చెట్టు తొలగింపు తెలుగుదేశం పార్టీ, వైఎస్సార్ సీపీల మధ్య వాగ్వాదానికి దారితీసింది. ఇక్కడ వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహం ఉండటంతో అదే ప్రాంతంలో ఎన్టీఆర్ విగ్రహాన్ని ఏర్పాటుచేయాలని భావించి చెట్టును తొలగించినట్టు సమాచారం. ఈ నేపథ్యంలో ఇక్కడ ఆంజనేయస్వామి విగ్రహాన్ని వైఎస్సార్సీపీ నాయకులు ఏర్పాటుచేశారు. అయితే ఇది ప్రభుత్వ స్థలం అని పోలీసులు జోక్యం చేసుకుని ఆంజనేయస్వామి విగ్రహాన్ని తొలగించారు. అలాగే విగ్రహం ఏర్పాటుచేసిన వారికి నోటీసులు కూడా ఇచ్చారు. -
నిధుల దుర్వినియోగంపై విచారణ చేయాలి
చింతలపూడి: చింతలపూడి మహిళా మార్ట్లో నిధుల దుర్వినియోగంపై విచారణ జరిపించాలని సీఐటీయూ, ఏపీ వెలుగు ఉద్యోగుల సంఘం ఆధ్వర్యంలో వీఓఏలు శుక్రవారం తహసీల్దార్ కార్యాలయం వద్ద ఆందోళన చేశారు. వెలుగు వీఓఏలు, మెప్మా ఆర్పీల సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి షేక్ సుభాషిణి మాట్లాడుతూ మహిళల ఆర్థిక స్వావలంబన కోసం సుమారు రూ.48 లక్షల పెట్టుబడితో ప్రారంభించిన మహిళా మార్ట్ అవినీతి, నిర్లక్ష్యం, అక్రమాల కేంద్రంగా మారిందని ఆరోపించారు. ప్రస్తుతం మార్ట్లో రూ.4 లక్షల విలువైన సరుకులు మాత్రమే ఉండటం అనుమానాస్పదంగా ఉందన్నారు. మిగిలిన రూ.44 లక్షల విలువైన సరుకులు ఎక్కడికి వెళ్లాయో అంతుచిక్కడం లేదన్నారు. మహిళలకు లాభాలు ఇస్తామని హామీ ఇచ్చి, ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదని అన్నారు. అలాగే గణిజర్లకి చెందిన వీఓఏ ఈదర సరితను రాజకీయ ఒత్తిళ్లతో అక్రమంగా తొలగించేందుకు కుట్ర జరుగుతోందని ఆరోపించారు. అనంతరం తహసీల్దార్ డీఎల్ ప్రమద్వరకు వినతిపత్రం అందజేశారు. సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షుడు ఆర్వీఎస్ఎన్ నారాయణ, మెప్మా ఆర్పీల సంఘ అధ్యక్షురాలు ఝాన్సీ, కార్యదర్శి కృష్ణవేణి తదితరులు పాల్గొన్నారు. -
ఉండిలో రగులుతున్న దేశం
సాక్షి ప్రతినిధి, ఏలూరు: ఉండి నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే, శాసనమండలి డిప్యూటీ స్పీకర్ కనుమూరి రఘురామకృష్ణరాజుపై నియోజకవర్గంలో ధిక్కారస్వరం మొదలైంది. ఇప్పటివరకు నివురుగప్పిన నిప్పులా ఉన్న తెలుగుతమ్ముళ్ల అసమ్మతి ఒక్కసారిగా తారాస్థాయికి చేరింది. పార్టీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి వెంకటేశ్వరరాజు విలేకరుల సమావేశం నిర్వహించి మరీ ఎమ్మెల్యే రఘురామ అరాచకాలకు పాల్పడుతున్నారంటూ తీవ్రస్థాయిలో ధ్వజమెత్తడం జిల్లా రాజకీయాల్లో హాట్టాఫిక్గా మారింది. ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు తమ్ముళ్లు ఉండి నియోజకవర్గంలో ఎమ్మెల్యే వర్సెస్ తెలుగు తమ్ముళ్ల వ్యవహారం హాట్హాట్గా మారింది. దశాబ్దాలుగా టీడీపీలో పనిచేస్తున్న కేడర్ను పూర్తిగా నిర్లక్ష్యం చేయడంతో పాటు ప్రజాప్రతినిధి దగ్గరకు కూడా రానివ్వడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. తరచూ ఏదోక వివాదాస్పద చర్యలతో హాట్టాఫిక్గా నిలిచే ఎమ్మెల్యే వ్యవహారం మరో సారి జిల్లాలోని చర్చగా మారింది. నియోజకవర్గ అభివృద్ధి పేరుతో అందరి వద్ద భారీగా డబ్బులు దండుకుని ఎమ్మెల్యే దోపిడీకి తెరతీశారని, రఘురామకృష్ణరాజు ఉండి ఎమ్మెల్యేగా గెలిచాక కోడిపందాలు, జూదం విచ్చలవిడిగా సాగుతున్నాయని, ఆక్వా రైతులను భయాభ్రాంతులకు గురిచేసి వసూళ్లకు పాల్పడుతున్నారని ఇటీవల టీడీపీ రాష్ట్ర కార్యనిర్వాహక కార్యదర్శి పొత్తూరి వెంకటేశ్వరరాజు (బుడ్డియ్యరాజు) విలేకరుల సమావేశంలో ఆరోపించారు. తనకు ఎమ్మెల్యే నుంచి ప్రాణహాని ఉందని, నియోజకవర్గంలో ఎమ్మెల్యే చేసే అరాచకాలను త్వరలోనే ముఖ్యమంత్రికి, లోకేష్ను కలిసి ఫిర్యా దు చేస్తానని తెలిపారు. అనధికారిక మట్టి మాఫి యాను అధికారికం చేశారని, ఏ అధికారి కూడా అడ్డుకునే పరిస్థితి లేకుండా చేసి భారీగా దోచుకుంటున్నారని, జిల్లా ఉన్నతాధికారులు కూడా రఘురామకృష్ణరాజుకు మద్దతుగా ఉండి అరాచకాలపై ఫిర్యాదు చేస్తే చర్యలు తీసుకోకపోగా ఇబ్బందులకు గురిచేసేలా వ్యవహరిస్తున్నారని ఆరోపణలు గుప్పించారు. ఎన్నికల సమయంలో స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేసిన టీడీపీ మాజీ ఎమ్మెల్యే శివరామరాజు కార్యాలయం వద్ద గొడవలు చేయాలని రఘురామకృష్ణరాజు ఆదేశిస్తూ తాను వెళ్లి తనకు ఇవ్వాల్సిన డబ్బులు తిరిగి ఇవ్వాలంటూ శివరామరాజు కార్యాలయం వద్ద రచ్చ చేశానని అన్నారు. తనతో సహా ఎమ్మెల్యే రఘురామకృష్ణరాజును కలవడానికి ఎవరు వెళ్లినా చేతులు కట్టుకుని నుంచోవాలని, కొత్తపల్లి నాగరాజు ఎమ్మెల్యే ప్రధాన అనుచరుడిగా మారి అక్రమాలు, దందాలు చేస్తున్నారని పొత్తూరి ఆరోపించారు. తాజా పరి ణామాల నేపథ్యంలో నియోజకవర్గంలో ఎమ్మెల్యే తీరుపై ఫిర్యాదులకు పార్టీ నేతలే సన్నద్ధమవుతున్నట్టు సమాచారం. ఉండి టీడీపీలో మాజీ ఎమ్మెల్యే, ఏపీఐఐసీ చైర్మన్ మంతెన రామరాజుకు బలమైన వర్గం ఉంది. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత రామరాజు వర్గాన్ని దూరంగా పెట్టారు. ఎన్నికల సమయంలో టికెట్ సర్దుబాటుకు అవకాశం లేకపోతే సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్న రా మరాజు టికెట్ను రఘురామకృష్ణరాజుకు తెలుగుదేశం పార్టీ అధిష్టానం కేటాయించింది. ఈ క్రమంలో అధికారంలోకి వచ్చిన తర్వాత నియోజకవర్గంలో ఇబ్బంది ఉండదని మంతెన రామరాజుకు భరోసా ఇచ్చారు. కట్చేస్తే.. రఘురామకృష్ణరాజు ఎమ్మెల్యేగా గెలిచిన తర్వాత నియోజకవర్గంలో మంతెన పాత్రను పూర్తిగా నిర్వీర్యం చేశారు. కనీసం చిన్నపాటి బదిలీ మొదలు కేడర్కు పోస్టింగ్లు వేయించడం వరకు కూడా ఏ అంశంలోనూ మంతెన పాత్ర లేకుండా చేశారు. ఈ క్రమంలో ప్రస్తుత పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ఉన్న రామరాజు ఉండి రాజకీయాలు, నియోజకవర్గ పరిస్థితులపై టీడీపీ అధిష్టానానికి వివరించినట్లు సమాచారం. ఇక తాజా పరిణామాల నేపథ్యంలో వెంకటేశ్వరరాజు ఆరోపణలను నియోజకవర్గంలోని మూడు మండలాల టీడీపీ అధ్యక్షులు విలేకరుల సమావేశం పెట్టి ఖండించారు. ఈ క్రమంలో జిల్లా అధ్యక్షుడి హోదాలో మంతెన రామరాజు క్రమశిక్షణ తప్పితే చర్యలుంటాయని, ఎవరూ మాట్లాడవద్దంటూ ఏకవాక్యంలో ముగించడం విశేషం. డిప్యూటీ స్పీకర్పై ధిక్కార స్వరం టీడీపీ కేడర్ తిరుగుబాటు రఘురామపై తారాస్థాయిలో అసమ్మతి తీవ్రంగా వేధిస్తున్నారంటూ రాష్ట్ర కార్యదర్శి ధ్వజం అభివృద్ధి పేరుతో దోపిడీకి తెరతీశారంటూ విమర్శలు నివురుగప్పిన నిప్పులా అసమ్మతి నేతలు -
శ్రీవారి దర్శనం టికెట్ల గోల్మాల్
● రీప్రింట్ చేసి సొమ్ములు స్వాహా ● ‘సాక్షి’ కథనంతో బట్టబయలు ● ఆలయ చైర్మన్ తక్షణ చర్యలు ద్వారకాతిరుమల: చినవెంకన్న దర్శనం టికెట్ల రీప్రింట్ వ్యవహారం సంచలనం రేపింది. అంతరాలయ దర్శనం రూ.500 టికెట్లను కొందరు పెద్ద మొత్తంలో రీప్రింట్ చేసి, రూ.లక్షల సొమ్మును స్వాహా చేశారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్ల దందాపై ఈనెల 15న ‘సాక్షి’లో ‘దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు’ శీర్షికన ప్రచురించిన కథనంపై దేవస్థానం చైర్మన్ ఎస్వీ సుధాకరరావు, ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీఎన్ఎన్ నివృతరావు చర్యలకు ఆదేశించారు. ఈ మేరకు పలువురు అధికారుల విధులను ఆలయ ఈఓ వై.భద్రాజీ మార్పు చే శారు. సూపరింటెండెంట్ ఐవీ రామారావును ఆలయంలో సమస్యలు, ఫీడ్బ్యాక్ కౌంటర్, రూ.100, రూ.200 దర్శనం టికెట్ల కౌంటర్లు, మరికొన్ని విభాగాలపై పర్యవేక్షణాధికారిగా నియమించారు. అయితే రూ.500 టికెట్ల రీప్రింట్ వ్యవహారంపై విచారణ జరిపితే పూర్తిస్థాయిలో ప్రక్షాళన జరుగుతుందని భక్తులు అంటున్నారు. అయితే అధికారులు ఈ విషయాన్ని గోప్యంగా ఉంచేందుకు ప్రయత్నిస్తున్నారు. అంతరాలయ దర్శనం టికెట్ల ద్వారా.. గత నవంబర్ 27న శ్రీవారి అంతరాలయ దర్శనాన్ని దేవస్థానం పునః ప్రారంభించింది. ఈ మేరకు రూ.500 టికెట్లను విక్రయిస్తోంది. కొందరు సిబ్బంది ఆన్లైన్లో టికెట్లను డౌన్లోడ్ చేసి, వా టిని రీప్రింట్లు చేసి, టికెట్లు స్కానింగ్ చేసే సిబ్బందిని మేనేజ్ చేయడం ద్వారా భక్తులకు దర్శనాలకు పంపి కాసులు దండుకున్నారు. ఈ టికెట్లు కొనుగోలు చేసిన భక్తులకు రెండు లడ్డూ ప్రసాదాలు ఉచితంగా అందిస్తారు. ఇటీవల శని, ఆదివారం రోజుల్లో ఈ టికెట్లకు సంబంధించి 250 లడ్డూ ప్రసాదాలు తగ్గాయి. అంటే ఆయా రోజుల్లో 125 టికెట్లు రీప్రింట్ జరిగినట్టు స్పష్టమవుతోంది. ఈ ఒక్క ఉదంతంలోనే రూ.62,500 స్వాహా జరిగినట్టు తెలుస్తోంది. అయితే ఈ విషయాన్ని అధికారులు బయటకు పొక్కనివ్వకుండా మళ్లీ లడ్డూ ప్రసాదాలను తీసుకొచ్చి, అందులో కలిపి మేనేజ్ చేశారన్న ఆరోపణలు ఉన్నాయి. ఇదిలా ఉంటే కొందరు సిబ్బంది లడ్డూ ప్రసాదాలను సొంతంగా కొని తీసుకొచ్చి మరీ, రీప్రింట్ టికెట్ల ద్వారా దర్శనం చేసుకునే భక్తులకు ఇస్తున్నట్టు సమాచారం. పలువురు సిబ్బంది సాఫ్ట్వేర్ ఆగిందని చెప్పి, తమ ఫోన్పేలకు నగదును బదిలీ చేయించుకుని, ఈ రీప్రింట్ టికెట్లు ఇవ్వడం ద్వారా దందాకు పాల్పడినట్టు తెలిసింది. మా నోటీసుకు రాగానే సీట్లు మార్చాం.. ఆలయ ఈఓ వై.భద్రాజీ వివరణ ఇస్తూ టికెట్లు రీప్రింట్ జరగడం కాదు గానీ, విషయం మా నోటీసుకు రాగానే ట్రస్టుబోర్డులో చర్చించి, టెంపుల్ స్టాఫ్ సీట్లు మార్చామని చెప్పారు. -
కూటమిది కక్ష సాధింపుల పాలన
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం ప్రజాపాలనను పక్కనపెట్టి, వైఎస్సార్ సీపీ నాయకులపై కక్ష సాధింపు పాలన సాగిస్తోందని మాజీ మంత్రి అంబటి రాంబాబు అన్నారు. కూటమి ప్రభుత్వ అక్రమ కేసుల కారణంగా జైలుకెళ్లిన ఆయన బెయిల్పై విడుదలై గురువారం ఉదయం రాజమండ్రి నుంచి భారీ కార్ల ర్యాలీతో గుంటూరుకు పయనమయ్యారు. ఈ సందర్భంగా మార్గమధ్యలో భీమడో లు మండలం పోలసానిపల్లి వద్ద జాతీయ రహదారిపై మాజీ హోం మంత్రి, వైఎస్సార్ సీపీ గోపాలపురం నియోజకవర్గ ఇన్చార్జి తానేటి వనిత ఆధ్వర్యంలో భీమవరం, రాజమండ్రి రూరల్, కొవ్వూరు పార్టీ ఇన్చార్జులు చినమిల్లి వెంకటరాయుడు, చెల్లుబోయిన వేణుగోపాలకృష్ణ, తలారి వెంకట్రావు, ద్వారకాతిరుమల మండల పార్టీ నాయకులు ఆయనకు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా రాంబాబు మాట్లాడుతూ పార్టీ శ్రేణులు తనపై చూ పుతున్న ఆధరాభిమానాలను మరువలేనన్నారు. అనంతరం వనిత మాట్లాడుతూ కూటమి ప్రభుత్వాన్ని ప్రశ్నించే వారిపై కేసులు పెట్టడం, అరెస్టులు చేయడం సాధారణంగా మారిందన్నారు. డైవర్షన్ పాలిటిక్స్లో ఇదో భాగమైందని, కేసులకు తమ పార్టీ నాయకులు, కార్యకర్తలు భయపడరని అన్నా రు. నాయకులు దాకారపు బంగారమ్మ, తాండ్ర రమేష్బాబు, పెద్దిరెడ్డి జ్యోతి శ్రీనివాస్, బొండాడ వెంకన్నబాబు, దాసరి రాంబాబు, ప్రత్తిపాటి యో హాను, గుమ్మడి శ్రీను, ఉక్కుర్తి వెంకట్రావు, చి లుకూరి చంద్రం తదితరులు ఉన్నారు. మాజీ మంత్రి అంబటి రాంబాబు -
విజన్ పేరుతో రాష్ట్రం అథోగతి
సూపర్ సిక్స్ అంటూ గద్దెనెక్కిన చంద్రబాబు ప్రజల్ని వంచించి పాలన సాగిస్తున్నారు. ఇప్పటివరకు ప్రవేశపెట్టిన మూడు బడ్జెట్లలో ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, సున్నావడ్డీ, ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీలకు 50 ఏళ్లకే పింఛన్ హామీలకు ఒక్క రూపాయి కూడా కేటాయింపు చేయలేదు. అమరావతి అంటూ రెండేళ్లలో రెండు లక్షల కోట్లకు పైనే అప్పులు తెచ్చి ఎక్కడ పెట్టారో అర్థంకాని పరిస్థితి. విజన్ పేరుతో రాష్ట్రాన్ని అథోగతిపాలు చేస్తున్నారు. – ముదునూరి మురళీకృష్ణంరాజు, వైఎస్సార్ సీపీ పశ్చిమగోదావరి జిల్లా అబ్జర్వర్ / సాక్షి, భీమవరం -
ఈ ఒత్తిడి భరించలేం..
నూజివీడు: నిద్రలేచిన దగ్గర నుంచి పడుకునే వరకు ఇంటి పన్ను వసూళ్ల లక్ష్యం పూర్తయిందా? అంటూ అధికారుల నుంచి పంచాయతీ కార్యదర్శులకు తీవ్ర ఒత్తిడి ఎదురవుతోంది. రోజువారీ టార్గెట్లు పెట్టి మరీ పరుగులెత్తిస్తుండటంతో జిల్లాలోని పంచాయతీ కార్యదర్శులు తీవ్ర ఒత్తిడికి లోనవుతున్నారు. ఉదయం నుంచి రాత్రి వరకు తిరిగినా లక్ష్యానికి తగ్గట్టుగా పన్నులు వసూలు కాకపోవడంతో ఏం చేయాలో తెలియక పంచాయతీ కార్యదర్శులు తలలు పట్టుకుంటున్నారు. పంచాయతీల్లో పన్నుల వసూలుపై ఉన్నతాధికారులు గ్రూపు కాల్స్, కాన్ఫరెన్స్లు నిర్వహిస్తుండటం, లక్ష్యాలను నిర్దేశించడంతో కార్యదర్శులకు ఊపిరి సలపడం లేదు. దీనికి తోడు సర్పంచుల పదవీ కాలం ముగుస్తుండటంతో అధిక శాతం సర్పంచులు సహకరించకపోవడంతో పన్నుల వసూళ్లు వేగమందుకోలేదు. జిల్లాలో 3,96,714 అసెస్మెంట్లు ఏలూరు జిల్లాలోని 27 మండలాల్లో కలిపి 3,96,714 అసెస్మెంట్లున్నాయి. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంటిపన్ను, పన్నెతర టాక్స్లు కలిపి మొత్తం రూ.84.42కోట్లు వసూలు చేయాల్సి ఉండగా ఇంతవరకు రూ.31.77 కోట్లు మాత్రమే వసూలైంది. ఇంకా రూ.52.65 కోట్లు వసూలు కావాల్సి ఉంది. మొత్తం 37.64 శాతం మాత్రమే వసూలైంది. దీంతో ఉన్నతాధికారులు ఇంటి పన్ను వసూలుపైనే నిరంతరం సమీక్ష చేస్తున్నారు. మార్చి 31 వరకు సమయమున్నా.. వెంటనే వసూలు చేయాలనడంతో కార్యదర్శులు నలిగిపోతున్నారు. ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తే... గ్రామాల్లో ఇంటి పన్ను వసూలు ఆర్థిక సంవత్సరం ముగిసే ఒకటి రెండు నెలల్లో కాకుండా ఆరు నెలల ముందు నుంచే ప్రారంభిస్తే పంచాయతీ కార్యదర్శులపై ఇంత ఒత్తిడి ఉత్పన్నం కాదు. చివరి రెండు నెలల్లో వసూలు చేయాలంటూ వారి మెడపై కత్తి పెట్టడం వల్ల తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. అక్టోబర్ నుంచి వసూళ్లు ప్రారంభిస్తే ఎలాంటి ఒత్తిడి లేకుండా పన్నుల వసూలు నిర్వహించవచ్చు. దీనికి తోడు నవంబరు, డిసెంబర్ నెలల్లో వరి పంట తాలూకా డబ్బులు కూడా చేతిలో ఉంటాయి కాబట్టి పన్నులు చెల్లిస్తారు. మండలాల్లో పంచాయతీలను కార్యదర్శుల కొరత పీడిస్తోంది. ఒక్కొక్క కార్యదర్శి కనిష్టంగా రెండు పంచాయతీల బాధ్యతలను నిర్వర్తిస్తున్నారు. దీంతో రెండు పంచాయతీల్లో చెత్త సేకరణ ప్రక్రియను, రోజువారీ సమస్యల పరిష్కారం, మంచినీటి సమస్యల పరిష్కారం తదితర అనేక పనులను చూసుకోవాల్సి వస్తోంది. వీటన్నింటిని చూసుకుంటూనే పన్నుల వసూలుకు వెళ్తున్నారు. ఈ నేపధ్యంలో నిర్దేశించిన రోజువారీ లక్ష్యాలను చేరుకోవాలంటే ఒత్తిడి పెరిగిపోతోందని కార్యదర్శులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో వయసు పైబడిన వారు లేని బీపీ, సుగర్ వంటి వ్యాధుల బారిన పడతామేమోనని ఆందోళన చెందుతుంటే, బీపీ, సుగర్ ఉన్నవారు అవి కంట్రోల్ గాక సతమతమవుతున్నారు. వీటన్నింటికి తోడు ఆన్లైన్లో సర్వర్ సమస్యలు వస్తుండటంతో కార్యదర్శుల పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. పంచాయతీ కార్యదర్శుల తీవ్ర ఆవేదన వచ్చే నెలాఖరుకు 100 శాతం ఇంటి పన్ను వసూలు చేయాలని లక్ష్యం ఏలూరు జిల్లాలో పెండింగ్లో రూ.52.65 కోట్ల పన్ను -
వరాల మాసం.. రంజాన్
● జిల్లా వ్యాప్తంగా నేటి నుంచి రంజాన్ ఉపవాస దీక్షలు ప్రారంభం ● పవిత్రతకు ప్రతిరూపం.. క్రమశిక్షణకు నిదర్శనంచింతలపూడి: ముస్లింలకు అతి పవిత్రమైన రంజాన్ నెల ఉపవాసాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. బుధవారం నెల వంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. నెల రోజుల పాటు సాగే ఈ కఠిన దీక్షలు కేవలం ఆకలిని తట్టుకోవడమే కాదు.. అంతరాత్మను శుద్ధి చేసుకునే ఆధ్యాత్మిక ప్రయాణం. ఆధ్యాత్మిక శిఖరం.. రంజాన్ ఇస్లాం ఐదు స్తంభాలలో ‘సౌమ్’ (ఉపవాసం) అత్యంత కీలకమైనది. పవిత్ర ఖురాన్ అవతరించిన ఈ మాసంలో ముస్లింలు సూర్యోదయానికి ముందు నుంచి (సహర్) సూర్యాస్తమయం వరకు (ఇఫ్తార్) నీరు కూడా సేవించకుండా నిష్ఠగా గడుపుతారు. ఉపవాసం అంటే కేవలం ఆహారం మానేయడమే కాదు. రంజాన్ దీక్షలో కొన్ని ముఖ్యమైన నియమాలు ఉన్నాయి. అసత్యాలు పలకకూడదు, ఎవరినీ దూషించకూడదు. చెడు దృశ్యాలను చూడకూడదు. చెడు మాటలు వినకుండా భగవన్నామ స్మరణలో గడపాలి. తన సంపాదనలో కొంత భాగాన్ని పేదలకు పంచడం (జకాత్) ఈ మాసంలో విధి. ఖురాన్ ప్రకారం రంజాన్ నెలలో విధిగా ఉపవాస వ్రతాన్ని పాటిస్తారు. రంజాన్ నెల ముస్లిం విశ్వాసుల పండుగ. అభిమానానికి, స్నేహానికి ప్రతీకగా దీనిని ఆచరిస్తారు. రంజాన్ నెలలో ముస్లింలు క్రమశిక్షణ, దాతృత్వం, ధార్మిక చింతనతో అల్లాహ్ను ప్రార్థిస్తారు. జిల్లాలోని ఏలూరు, జంగారెడ్డిగూడెం, చింతలపూడి, నూజివీడు, కై కలూరు, పట్టణాల్లో రంజాన్ పండుగను ముస్లింలు ఏటా ఘనంగా జరుపుకుంటారు. నిష్ఠతో ఉపవాసాలు రంజాన్ మాసం ప్రారంభమైన నాటినుంచి ముగిసేవరకు ముస్లింలు పగలు నిష్ఠగా (రోజా) ఉపవాస దీక్షలను పాటిస్తారు. కేవలం ఆహార పానీయాలను మానేయడం మాత్రమే కాదు. నియమాలతో కూడుకున్న జీవన విధానాన్ని ఆచరిస్తారు. తెల్లవారు జామున ఆహారం తీసుకోవడాన్ని సహర్ అని, సాయంత్రం ఉపవాస దీక్ష విరమణలో తీసుకునే ఆహారాన్ని ఇఫ్తార్ అని అంటారు. ఇలా ప్రతి రోజు సుమారు 13 గంటలపాటు కఠిన ఉపవాస దీక్షను అవలంభిస్తారు. ఒకవేళ ఏదైనా అనారోగ్యంతో ఉపవాసం ఉండలేక పోతే అలాంటి వారు రంజాన్ తర్వాత వాటిని పూర్తి చేయాల్సి ఉంటుంది. షబ్–ఎ–ఖద్ర్ రంజాన్ నెల ప్రారంభమైన 27వ రోజు షబ్–ఎ–ఖద్ర్ ను ముస్లింలు జరుపుకుంటారు. ఈ రోజున దివ్య ఖురాన్ అవతరించిందని ముస్లింల విశ్వాసం. ఈ రోజున రాత్రంతా జాగరణ చేసి ప్రార్థనలతో గడుపుతారు. ఆ రాత్రి భక్తి శ్రధ్ధలతో ప్రార్థనలు చేసిన వారికి ఎన్నో సంవత్సరాల పాటు ప్రార్థనలు చేస్తే వచ్చే పుణ్యం దక్కుతుందని విశ్వాసం. జకాత్ ముస్లింలకు నమాజ్, రోజా ప్రకారమే జకాత్ కూడా నిర్ణయింప బడింది. దైవం కోసం, దైవ ప్రసన్నత పొందడానికి ఒక బాధ్యతగా సంపదలో కొంత మొత్తాన్ని పేదలకు అందించడమే జకాత్ ముఖ్య ఉద్దేశం. రంజాన్ నెలలోనే ముస్లింలు విధిగా జకాత్ చెల్లిస్తారు. పేద, ధనిక అంతరాలను రూపుమాపడానికి జకాత్ తోడ్పడుతుందని నమ్ముతారు. జకాత్ అంటే పరిశుధ్ధ పరిచేది అని అర్థం. ఫిత్రా రంజాన్ నెల అంతా నమాజులు, ఉపవాసాలు, జకాత్ చెల్లించడంతో పాటు నెల ముగిసి పండుగ జరుపుకునే ముందు ఫిత్రా అంటే దానం చేస్తారు. పేదలుకూడా పండుగ రోజు సంతోషంగా పాల్గొనాలని చేసిన ఏర్పాటు ఇది. కుటుంబంలో ఎంత మంది సభ్యులు ఉంటే అందరి తరుపున విధిగా ఫిత్రా చెల్లిస్తారు. ఒక్కో ఫిత్రా కింద రెండున్నర కిలోల ఆహార ధాన్యాలు, లేదా అందుకు సమానమైన నగదు చెల్లించాలి. పది రోజులకో ప్రత్యేకత 30 రోజుల ఉపవాస దినాల్లో ప్రతి 10 రోజులకు ఓ ప్రత్యేకత ఉంది. మొదటి 10 రోజులు కారుణ్య దినాలుగా భావిస్తారు. అల్లాహ్ కారుణ్యం కోసం ఈ పది రోజులు ఉపవాసం ఉంటారు. 11 నుంచి 20వ రోజు వరకు క్షమాభిక్ష దినాలుగా పరిగణిస్తారు. తమ పాపాలను క్షమించమని అల్లాహ్ను వేడుకుంటూ ఉపవాసాలు ఉంటారు. చివరి పదిరోజులు నరకాగ్ని నుంచి కాపాడమని దువాలు చేస్తూ ఉపవాసాలు పాటిస్తారు.ఉపవాసం మనిషిలో దైవ భీతిని కలుగ చేస్తుంది. కోరికలకు కళ్లెం వేస్తుంది. ఉపవాసం ఉండే మనిషికి మనసు మీద నియంత్రణ సులువు అవుతుంది. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. త్యాగ నిరతిని పెంపొందించే ఉపవాస దీక్షలు ప్రతి ముస్లిం విధిగా చేయాలి. – ఎండీ అక్బర్ ఆలి, జామియా మస్జిద్ కార్యదర్శి రంజాన్ ఉసవాసాల వల్ల పాపాలు తుడిచి పెడ్తాయి. ఆరోగ్యంతో పాటు ఇతరుల పట్ల సోదర భావం పెరుగుతుంది. ఆకలితో ఉన్నవారు, అవసరాలతో ఉన్న వారి పట్ల దయా భావం పెరుగుతుంది. నెల రోజుల ఉపవాసాల వల్ల పుణ్యం కలుగుతుంది. – సయ్యద్ మీర్ జాఫర్ ఆలి, జామియా మస్జిద్ కమిటీ అధ్యక్షుడు -
చంద్రబాబు సూపర్ మోసం
సూపర్ సిక్స్ అంటూ చంద్రబాబు ప్రజలను సూపర్ మోసం చేశాడు. ఆడబిడ్డలకు రూ.1,500, నిరుద్యోగ భృతి రూ.3 వేలు పథకాల కోసం మూడో బడ్జెట్లో కూడా నిధులు కేటాయించలేదు. ఎస్సీ, ఎస్టీ, బీసీ మైనార్టీ వర్గాలకు 50 ఏళ్లకే పింఛన్ కూడా అమలు కాలేదు. ముస్లిం మైనార్టీలకు దులహన్ పథకం కింద పెళ్లయిన ఆడ కూతురికి రూ.లక్ష, స్వయం ఉపాధి కోసం రూ.5 లక్షలు వరకు వడ్డీ లేని రుణాలు ఇస్తామని చెప్పి మోసం చేశారు. – ఎస్కే నౌషాద్ మొహిద్దీన్, వైఎస్సార్ సీపీ జిల్లా మైనార్టీ సెల్ ప్రధాన కార్యదర్శి / తాడేపల్లిగూడెం (టీఓసీ) -
తక్కువ ధరకే ఫార్చునర్ కారు అంటూ టోకరా
కళ్యాణదుర్గం: తక్కువ ధరకే ఫార్చునర్ కారు వస్తుందంటూ సైబర్నేరగాళ్లు ఆన్లైన్ ద్వారా ఓ అమాయకుడికి ఆశ చూపి రూ.24 లక్షలకు టోకరా వేశారు. ఈ ఘటన కళ్యాణదుర్గం మండలంలో వెలుగుచూసింది. వివరాలిలా ఉన్నాయి. పశ్చిమ గోదావరి జిల్లా పెదపాడు మండలం వట్లూరు గ్రామానికి చెందిన భీముడు అజిత్కుమార్ ‘ఓఎల్ఎక్స్’లో ఓ ఫార్చునర్ కారు రూ.24 లక్షలకే వస్తుందంటూ పోస్టు పెట్టాడు. ఈ పోస్టు చూసిన వైఎస్సార్ కడప జిల్లా పోరుమామిళ్లకు చెందిన వేణుగోపాల్రెడ్డి కారు కోసం అజిత్ కుమార్తో బేరం కుదుర్చుకున్నాడు. ఈ వ్యవహారంలో అజిత్ కుమార్ హైదరాబాద్లో క్యాబ్ డ్రైవర్గా పనిచేస్తున్న అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం మండలం ఉప్పొంక గ్రామానికి చెందిన తూర్పు త్రిశాంత్ను పావుగా వాడుకున్నాడు. ఈ క్రమంలో వేణుగోపాల్రెడ్డి ద్వారా రూ.24 లక్షలను తూర్పు త్రిశాంత్ పేరిట కళ్యాణదుర్గంలోని హెచ్డీఎఫ్సీ బ్యాంక్ ఖాతాకు జమ చేయించాడు. అనంతరం ఓఎల్ఎక్స్లో ఫార్చునర్ కారు పెట్టినందుకు ఒరిజనల్ ఓనర్ అకౌంట్కు రూ.10 వేలు ఫోన్ పే ద్వారా చెల్లించి.. మిగిలిన డబ్బుతో ఉడాయించేశాడు. కారు కోసం వేణుగోపాల్రెడ్డి.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా స్విచ్ ఆఫ్ వస్తోంది. తనను మోసం చేశారని గ్రహించాడు. బాధితుడు ఆ జిల్లాలో ఫిర్యాదు చేశాడు. దీని ఆధారంగా కేసు విచారణ జరుగుతోంది. వచ్చిన సొమ్ముతో అజిత్, త్రిషాంత్ కర్ణాటకకు వెళ్లి ఓ జ్యుయలరీ షాపులో బంగారం కొన్నట్లు పోలీసుల విచారణలో తేలింది. ఈ క్రమంలో నేరగాళ్ల కోసం విజయవాడ సైబర్ క్రైం పోలీసులు రెండు రోజుల క్రితం కళ్యాణదుర్గం వచ్చి విచారణ జరిపినట్లు సమాచారం.పక్కా ప్లాన్తో మోసాలుభీముడు అజిత్ కుమార్ అమాయకులను లక్ష్యంగా చేసుకుని పక్కా ప్రణాళికతో మోసాలకు పాల్పడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. ఇతనికి ఏకంగా పలు రకాల చిరునామాలతో ఐదు ఆధార్ కార్డులు ఉన్నట్లు తేల్చారు. ఇలాంటి కేసుల్లో న్యాయపరమైన ఇబ్బందులను ఎదుర్కొనేందుకు తన సోదరితో పాటు ఐదుగురు అడ్వకేట్లను నియమించుకున్నట్లు తెలుస్తోంది. ఏ సమస్య వచ్చినా అజిత్కుమార్ను అరెస్టు చేయకుండా అడ్వకేట్లే కాపాడుతుంటారని పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ క్రమంలోనే సైబర్ మోసంపై ఓ సీఐ.. అజిత్కుమార్కు ఫోన్ చేయగా.. ‘గాలిని పట్టుకోగలవా?! నీకు దమ్ముందా’ అంటూ వ్యంగ్యంగా మాట్లాడిన ఆడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది. -
పీహెచ్సీలో నవజాత శిశువు మృతి
భీమడోలు: పూళ్ల పీహెచ్సీలో మగ నవజాత శిశువు మృతిపై కుటుంబ సభ్యులు, గ్రామస్తులు మంగళవారం రాత్రి ఆందోళనకు దిగారు. వివరాల్లోకి వెళ్లితే.. పూళ్ల పంచాయతీ పరిధిలోని ఎంఎంపురం గ్రామానికి చెందిన పసుపులేటి పావనికి ఉంగుటూరు మండలం బొమ్మిడికి చెందిన వీరే శ్రీనివాస్తో ఏడాది క్రితం వివాహమైంది. వారిద్దరు దుబాయ్లో జీవనోపాధి కోసం ఉద్యోగాలు చేస్తున్నారు. పావని తొలి కాన్పు కోసం ఆరు నెలల క్రితం పుట్టిల్లు ఎంఎంపురం గ్రామానికి వచ్చింది. భర్త శ్రీనివాస్ దుబాయ్లో ఎలక్ట్రిక్ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. మంగళవారం ఉదయం పురిటి నొప్పులు రావడంతో కుటుంబ సభ్యులు పావనిని పీహెచ్సీలో చేర్చారు. సాయంత్రం సాధారణ కాన్పు అయ్యింది. పుట్టిన మగ బిడ్డను చూసి ఆనందంగా ఉన్న పావలి, కుటుంబ సభ్యులకు కొద్ది సేపటికే విషాదం మిగిలింది. బిడ్డ తక్కువ బరువుతో పాటు ఉమ్మనీరు తాగేసిందని చెప్పి బిడ్డ ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వైద్యులు ఎంవీ ప్రదీప్ ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి రిఫర్ చేశారు. వారు ఏలూరులోని ఓ ప్రైవేటు పిల్లల ఆసుపత్రికి తీసుకువెళ్లగా అప్పటికే శిశువు మృతి చెందినట్లు నిర్థారించారు. దీనితో కుటుంబ సభ్యులు, గ్రామస్తులు కోపోద్రిక్తులై మృత శిశువును రాత్రి పీహెచ్సీ వద్దకు తీసుకువచ్చి ఆందోళన చేశారు. దీనితో అక్కడ ఉద్రిక్తత పరిస్థితులు చోటు చేసుకున్నాయి. సమాచారం అందుకున్న సీఐ యూజే విల్సన్ ఆధ్వర్యంలో ఎస్సై ఎస్కే మదీనా బాషా సంఘటనా స్థలానికి చేరుకున్నారు. కుటుంబ సభ్యులు, వైద్యుల నుంచి వేర్వేరుగా వివరాలు అడిగి తెలుసుకున్నారు. బాధితురాలి అన్న పసుపులేటి మోహన్ ఫిర్యాదు మేరకు ఈ ఘటనపై విచారణ చేస్తామని సీఐ తెలపడంతో ఆందోళన విరమించారు. నవజాత శిశువు మృతదేహాన్ని పోస్ట్మార్టమ్ నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రి మార్చురీలో భద్రపర్చారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నటుల సీఐ విల్సన్ తెలిపారు. వైద్యుల నిర్లక్ష్యమే కారణమంటూ బంధువుల ఆగ్రహం -
పే స్కేల్ అమలు చేయాలి
భీమవరం: గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సీఐటీయు ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణలో మాదిరిగా పేస్కేలు అమలు చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్కు వినతిపత్రం అందజేశామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యకలాపాలలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న వీఆర్ఏలు కనీస వేతనాలు లేక పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని అన్నారు. ప్రమోషన్ల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వడానికి అభ్యంతరాల పేరుతో మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అదనపు డ్యూటీలు కూడా వీఆర్ఏలపై మోపుతున్నారని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు. -
నూజివీడు బస్టాండ్లో అసౌకర్యాలపై ఆగ్రహం
నూజివీడు: నూజివీడు బస్టాండు నిర్వహణపై కలెక్టర్ వెట్రిసెల్వి తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. బస్టాండును బుధవారం జిల్లా కలెక్టర్ పరిశీలించారు. ప్రయాణికులు కూర్చునే ప్రదేశంలో ఫ్లోరింగ్ దెబ్బతిని ఉండటం, రైలింగ్ పడిపోవడం వంటివి చూసి ఎందుకు మరమ్మత్తులు చేయించడం లేదని ప్రశ్నించారు. బస్సులు ఆగే చోట ప్లాట్ఫాం దిమ్మెలకు రంగులు వేయడం చూసి నేను వస్తున్నానని రంగులు వేయిస్తున్నారని బ్యూటిఫికేషన్ ముఖ్యం కాదని ప్రయాణికులకు మెరుగైన సౌకర్యాలు కల్పించాలన్నారు. బస్టాండు ఆవరణలో సీసీ కెమేరాలు పనిచేస్తున్నాయా అని ప్రశ్నిస్తే అధికారులు నీళ్లు నమిలారు. బస్టాండులోని పలు షాపుల్లో కాలం చెల్లిన తినుబండారాలు విక్రయించకుండా వారం వారం వాటిని తనిఖీ చేస్తూ ఉండాలన్నారు. అధిక ధరలకు కూడా విక్రయించకుండా చర్యలు తీసుకోవాలన్నారు. బస్టాండులోని టిక్కెట్ బుకింగ్ కౌంటర్ను పరిశీలించగా కంప్యూటర్ పనిచేయడం లేని విషయాన్ని గమనించారు. పది రోజుల్లో బస్టాండు నిర్వహణలో మార్పు రావాలని కలెక్టర్ ఆదేశించారు. కార్యక్రమంలో జిల్లా ప్రజారవాణాధికారి షేక్ షబ్నమ్, సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, డీఎం పీడీ ఆంజనేయులు తదితరులు పాల్గొన్నారు. -
ఉన్నత విద్యకు సెట్ చేసుకుందాం
● ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సులు చేసే వారు ఏపీ ఈఏపీ సెట్కు దరఖాస్తు చేసుకోవాలి. ● బీఈడీ, స్పెషల్ ఎడ్యుకేషన్ కోర్సులు చేసే వారు ఏపీ ఎడ్సెట్కు ● ఇతర కోర్సులు చదివి ఇంజనీరింగ్, బీ.టెక్, బీ.ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి ఈసెట్కు దరఖాస్తు చేసుకోవాలి. ● ఎంబీఏ, ఎంసీఏ కోర్సులు చేయడానికి ఏపీ ఐసెట్కు దరఖాస్తు చేసుకోవాలి. ● ఎం.టెక్, ఎం.ఫార్మసీ, ఫార్మా డీ కోర్సులు చేయడానికి ఏపీ పీజీఈ సెట్కు ● బీపీఈడీ, డీపీఈడీ కోర్సులకు ఏపీ పీఈ సెట్కు దరఖాస్తు చేసుకోవాలి. ● ఎంఏ, ఎం కామ్, ఎంఎస్సీ, ఎంసీజే, ఎం.లైబ్రరీ సైన్స్, ఎంఈడీ, ఎంపీఈడీ తదితర పోస్టు గ్రాడ్యుయేట్ కోర్సులకు ఏపీ పీజీ సెట్కు ● న్యాయవిద్య చదవడానికి లా సెట్కు దరఖాస్తు చేసుకోవాలి. ఏలూరు (ఆర్ఆర్పేట): ఉన్నత విద్య చదవాలనుకునే వారు వివిధ కోర్సుల్లో చేరడానికి ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సమయం దగ్గరపడింది. ఇంటర్ అనంతరం ఇంజినీరింగ్, బీ.ఫార్మసీ, అగ్రికల్చరల్, ఎంబీఏ, ఎంసీఏ, న్యాయ విద్య, డిగ్రీ తరువాత పీజీ, ఎం.టెక్, ఎం.ఫార్మసీ వంటి కోర్సులు చేయాలన్నా ఉమ్మడి ప్రవేశ పరీక్షలు రాయాల్సిందే. ఇంటర్ పరీక్షలు ప్రారంభం కాకుండానే వివిధ ఉమ్మడి ప్రవేశ పరీక్షలకు సంబంధించిన నోటిఫికేషన్ను ప్రభుత్వం ఇటీవల విడుదల చేసింది. షెడ్యూల్ విడుదల ఉన్నత విద్యా మండలి ఆయా కోర్సులకు ఏ సెట్ ఎప్పుడు జరుగుతుందో, ఏ సెట్కు ఎప్పుడు దరఖాస్తు చేసుకోవాలి, ఎంత ఫీజు చెల్లించాలి అన్న విషయాలతో ఈ షెడ్యూల్ విడుదల చేసింది. దీంతో విద్యార్థుల్లో సందడి ప్రారంభమైంది. తాము చేయాలనుకునే కోర్సులకు సంబంధించిన సెట్కు ఇప్పటి నుంచే దరఖాస్తు చేసుకోవడానికి సిద్ధమవుతున్నారు. ఈ మేరకు కొంతమంది విద్యార్థులు ఆన్లైన్లో ఉన్నత విద్యా మండలి సూచించిన వెబ్సైట్లలో నేరుగా దరఖాస్తు చేసుకుంటుండగా మరికొందరు విద్యార్థులకు ప్రస్తుతం చదువుతున్న విద్యాసంస్థల యాజమాన్యాలే ఆన్లైన్లో దరఖాస్తు చేసుకునే ఏర్పాట్లు చేశాయి. పరీక్షలకు దరఖాస్తు చేసుకోవడానికి ఉన్నత విద్యా మండలి ఇప్పటికే ఆన్లైన్లో అవకాశం కల్పించింది. ఏపీ ఈఏపీ సెట్కు అపరాధ రుసుం లేకుండా వచ్చే మార్చి 7 వరకూ అవకాశం ఉంది. ఏపీ ఎడ్ సెట్కు మార్చి 9 వరకూ, ఈ సెట్, ఐసెట్కు మార్చి 2 వరకూ, పీజీఈ సెట్కు మార్చి 6 వరకూ, ఏపీ పీ సెట్కు ఏప్రిల్ 30 వరకూ, ఏపీ పీజీ సెట్కు మార్చి 9 వరకూ, ఏపీ లా సెట్కు మార్చి 12 వరకూ అపరాధ రుసుం లేకుండా ఫీజు చెల్లించి దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది. ఏప్రిల్, మే నెలల్లో షెడ్యూల్ విడుదల దరఖాస్తు చేసుకున్న వారికి పరీక్షలు ఎప్పుడు నిర్వహించే విషయంపై ఉన్నత విద్యా మండలి విడుదల చేసిన షెడ్యూల్లో వివరించింది. ఏపీ ఈఏపీ సెట్ మే 12 నుంచి 20 వరకూ జేఎన్టీయూ కాకినాడ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఏపీ ఎడ్సెట్ మే 4న చిత్తూరు ద్రవిడియన్ యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఈసెట్ ఏప్రిల్ 23న జేఎన్టీయూ అనంతపురం ఆధ్వర్యంలో, ఐసెట్ మే 2న ఆంధ్రా యూనివర్శిటీ ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఏపీ పీజీఈ సెట్ ఏప్రిల్ 28 నుంచి 30 వరకూ ఆంధ్రా యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఏపీ పీ సెట్ జూన్ 3 నుంచి 8 వరకూ ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఏపీ పీజీ సెట్ మే 5 నుంచి 11 వరకూ తిరుపతి శ్రీ వెంకటేశ్వర యూనివర్సిటీ ఆధ్వర్యంలో, ఏపీ లా సెట్ మే 4న తిరుపతి శ్రీ పద్మావతి మహిళా విశ్వవిద్యాలయం ఆధ్వర్యంలో నిర్వహిస్తారు. ఉమ్మడి జిల్లాలో ప్రారంభమైన ప్రవేశ పరీక్షల సందడి నోటిఫికేషన్ విడుదల చేసిన ఉన్నత విద్యామండలి ఏప్రిల్, మే నెలల్లో పరీక్షలకు షెడ్యూల్ విడుదల -
పెద్దింట్లమ్మ జాతర ప్రారంభం
వరాల మాసం.. రంజాన్ రంజాన్ నెల ఉపవాసాలు గురువారం నుంచి ప్రారంభం అవుతున్నాయి. బుధవారం నెల వంక దర్శనంతో రంజాన్ మాసం ప్రారంభమవుతుంది. IIలో uకై కలూరు: రాష్ట్రంలో ప్రసిద్ధిగాంచిన కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతర ఘనంగా బుధవారం ప్రారంభమయ్యింది. ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ముఖద్వార నిర్మాణానికి శంకుస్థాపన, ఆలయ ప్రాకార మండపం ఎదురుగా శివపార్వతుల విగ్రహాలను ప్రారంభించారు. అనంతరం గోకర్ణపురం గోకర్ణేశ్వరస్వామి ఆలయ ధర్మకర్తల చైర్మన్ భల్లం రామరాజు, ధర్మకర్తల ప్రమాణస్వీకారోత్సవంలో పాల్గొన్నారు. మొదటి రోజు అమ్మవారికి విఘ్నేశ్వరపూజ, పుణ్యహవాచనం, పంచామృతాభిషేకం, నూతన వస్త్ర అలంకరణ, చక్రార్చన, దూపసేవ, బాలభోగం జరిగింది. భక్తులకు ఉచిత ప్రసాదాన్ని అందించారు. వస్త్రాలంకరణ, ఉచిత ప్రసాద దాతలుగా భుజబలపట్నం గ్రామానికి చెందిన ముదునూరి రామలింగరాజు, కనుమూరి నాగ వెంకట సుబ్బరాజు, పేరిచర్ల హేమంత్ దంపతులు వ్యవహరించారు. ఆలయ ఈవో కూచిపూడి శ్రీనివాసు మాట్లాడుతూ ఈ నెల 18 నుంచి మార్చి 3 వరకు అమ్మవారి జాతర జరుగుతుందన్నారు. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరస్వామి కల్యాణం ఈ నెల 28న జరుగుతోందని చెప్పారు. పెద్దింట్లమ్మ దేవస్థాన చైర్మన్ జల్లూరి వెంకన్న బాబు, ఎంపీపీ అడవి కృష్ణ, రాష్ట్ర వడ్డీ కార్పోరేషన్ చైరపర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ తదితరులు పాల్గొన్నారు. -
జీవో 36 అమలు చేయాలి
నూజివీడు: తమ సమస్యలను పరిష్కరించాలని, రెగ్యులర్ చేయాలని కోరుతూ రాష్ట్ర యూనియన్ పిలుపు మేరకు ఈ నెల 16నుంచి సహకార ఉద్యోగులు చేపట్టిన నిరవధిక సమ్మెలో భాగంగా పట్టణంలోని కేడీసీసీబీ బ్రాంచ్ వద్ద బుధవారం ఆందోళనకు దిగారు. నూజివీడు, ఆగిరిపల్లి, ముసునూరు, చాట్రాయి మండలాల్లో ఉన్న మొత్తం 29 సొసైటీలకు సంబంధించిన 100 మంది సిబ్బంది బ్రాంచ్ ముందు బైటాయించారు. దీక్షలకు ఏఐటీయూసీ నూజివీడు నియోజకవర్గ కార్యదర్శి చాట్ల పుల్లారావు, సీపీఐ నియోజకవర్గ కార్యదర్శి నిమ్మగడ్డ నరసింహ, సీఐటీయూ పట్టణ అధ్యక్షుడు ఎన్ఆర్ హనుమాన్లు, ఏపీ కోఆపరేటివ్ సెంట్రల్ బ్యాంక్ ఎంప్లాయిస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షులు అక్కినేని ఆంజనేయప్రసాద్ తదితరులు తమ మద్దతు తెలిపారు. జీవో నెంబర్ 36ను ప్రభుత్వం వెంటనే అమలు చేయాలని డిమాండ్ చేశారు. కార్యక్రమంలో సహకార సంఘాల యూనియన్ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి నీలం శ్రీనివాసరావు, పలు సంఘాల నాయకులు, ఉద్యోగులు పాల్గొన్నారు. -
నోరు అదుపులో పెట్టుకో!
కిరాక్ ఆర్పీపై బీసీ నేతల ఫైర్ ఏలూరు టౌన్: కామెడీ చేసుకునే కిరాక్ ఆర్పీ... నోరు అదుపులో పెట్టుకోవాలని వైఎస్సార్సీపీ ఏలూరు నగర అధ్యక్షులు గుడిదేశి శ్రీనివాసరావు హెచ్చరించారు. ఉత్తరాంధ్ర భాషపై వెకిలిచేష్టలు చేయడం, వైఎస్సార్సీపీ మండలి పక్ష నేత బొత్స సత్యనారాయణను బాడీ షేమింగ్ చేస్తూ... ఆయనపై వ్యంగ్యంగా మాట్లాడడాన్ని తప్పుపట్టారు. ఏలూరులోని పార్టీ కార్యాలయంలో వైఎస్సార్సీపీ బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర మహిళ ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నుల జాన్గురునాథ్తో కలిసి ఆయన విలేకరుల సమావేశంలో మాట్లాడారు. తూర్పు కాపులకు ఎనలేని సేవలు చేసిన బొత్స సత్యనారాయణపై అనుచిత వ్యాఖ్యలు చేయడంతో తమ మనోభావాలను దెబ్బతీశారని ఆవేదన వ్యక్తం చేశారు. కిరాక్ ఆర్పీ తన స్థాయి ఏంటో తెలుసుకోవాలని హెచ్చరించారు. అతనిది నీచమైన సంస్కృతి అని నగర అధ్యక్షుడు గుడిదేశి విమర్శించారు. సమావేశంలో వైఎస్సార్సీపీ నాయకులు బుద్దాల రాము, సాసుపల్లి యుగంధర్ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, తూర్పుకాపు నేతలు హాజరయ్యారు. -
శివయ్యకు శ్రీపుష్ప యాగోత్సవం
ద్వారకాతిరుమల: క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతోన్న శ్రీ భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో బుధవారం జరిగిన విశేష కార్యక్రమాలతో శివయ్య బ్రహ్మోత్సవాలు ముగిశాయి. ఉదయం దేవస్థానం సిబ్బంది ఆలయాన్ని సుగంధ భరిత పుష్పమాలికలు, మామిడి తోరణాలతో శోభాయమానంగా అలంకరించారు. అనంతరం గర్భాలయంలో కొలువైన శివదేవుడికి అర్చకులు విశేష అభిషేకాలు జరిపారు. ఆ తరువాత అమ్మవార్లకు కుంకుమార్చన నిర్వహించారు. రాత్రి అర్చకులు వేద మంత్రోచ్ఛరణలు, డోలు, సన్నాయి వాద్యాలు, భక్తుల శివనామస్మరణల నడుమ ద్వాదశ కోవెల ప్రదక్షిణను అట్టహాసంగా జరిపారు. అనంతరం స్వామి, అమ్మవార్లకు శ్రీపుష్ప యాగోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీ స్వామి, అమ్మవార్లకు పూలు, పండ్లను సమర్పించారు. -
నల్ల బ్యాడ్జీలతో వీఆర్ఓల నిరసన
దెందులూరు: దెందులూరు తహసీల్దార్ కార్యాలయం ఎదుట వీఆర్ఓల అసోసియేషన్ దెందులూరు మండల అధ్యక్షులు కిషోర్ ఆధ్వర్యంలో బుధవారం వీఆర్ఓలు నిరసన వ్యక్తం చేశారు. శాఖపరమైన సమస్యలు పరిష్కారం కోసం ముందుగా ఇచ్చిన నోటీసు ప్రకారం నల్లబ్యాడ్జీలతో నిరసనతో ప్రారంభించామన్నారు. ప్రభుత్వం తమ సమస్యలను పెడచెవిని పెట్టిందని పట్టించుకోవట్లేదని, పని ఒత్తిడి ఎక్కువైందని అన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లో అర్హులైన పేదల పిల్లలకు ఉచిత విద్య అవకాశం కల్పించడానికి నిర్దేశించిన చట్టం ప్రకారం 25 శాతం సీట్లకు 1వ తరగతిలో ప్రవేశాల కోసం అర్హులైన తల్లిదండ్రులు దరఖాస్తు చేసుకోవచ్చని సమగ్రశిక్ష జిల్లా అదనపు ప్రాజెక్టు కోఆర్డినేటర్ కే.పంకజ్ కుమార్ ఒక ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు ప్రైవేట్ అన్ ఎయిడెడ్ పాఠశాలల్లోని 25 శాతం సీట్లలో ఎస్సీలకు 10 శాతం, ఎస్టీలకు 4, బీసీలకు 6 శాతం, ఇతరులకు 5 శాతం సీట్లు రిజర్వ్ చేసినట్లు తెలిపారు. ఈ నెల 20 నుంచి మార్చి 10 వరకూ ఆన్లైన్లో దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపారు. పెదపాడు: రోడ్డు ప్రమా దంలో ఓ మహిళ మృతి చెందగా మరో ఇద్దరు గాయపడ్డారు. పెదపాడు పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విజయవాడ గుణదలకు చెందిన పోలవరపు వెంకట శివరామకృష్ణ తన కుటుంబసభ్యులతో కలిసి విజయవాడ నుంచి ఉదయం 5.30 గంటల సమయంలో ద్వారకాతిరుమలకు కారులో బయలు దేరారు. మధ్యలో పెదపాడు మండలంలోని తాళ్లమూడి వద్దకు వచ్చేసరికి ముందు వెళ్తున్న లారీని ఢీకొట్టాడు. దీంతో శివరామకృష్ణ కుమార్తెకు మరో ఇద్దరు బంధువులు కొత్తూరు శోభన్బాబు, పొట్లూరి సుజాతకు గాయాలయ్యాయి. వీరిని హనుమాన్జంక్షన్లోని ప్రైవేటు ఆసుపత్రికి తరలించారు. కీర్తి (27) తలకు బలమైన గాయాలవడంతో మృతిచెందింది. శోభన్బాబు, సుజాతను మెరుగైన వైద్యపరీక్షల కోసం విజయవాడ తరలించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలోని ఆగడాలలంక సీబీసీఎన్సీ ప్రాథమిక పాఠశాల, బుసరాజుపల్లి పీఎంకే ప్రాథమిక పాఠశాలల్లో ఎస్జీటీ పోస్టుల భర్తీ నిమిత్తం జిల్లా విద్యాశాఖ నిర్వహించనున్న పరీక్షలకు తమ పాఠశాలలకు ఎలాంటి సంబంధం లేదని ఆ పాఠశాలల కరస్పాండెంట్లు కాకర్ల శివప్రసాద్, పీ. జీవన్ కుమార్ ఒక సంయుక్త ప్రకటనలో తెలిపారు. న్యాయస్థానం జారీచేసిన మధ్యంతత ఆదేశాల్లో తమ పాఠశాలల్లో నియామకాలు సంబంధించిన పరీక్షలను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ద్వారానే నిర్వహించాలని స్పష్టంగా పేర్కొందన్నారు. కోర్టు ఆదేశాలను ధిక్కరించి విద్యాశాఖ పరీక్షలు నిర్వహించడంపై కోర్టు ధిక్కరణ కేసును దాఖలు చేశామన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఈ నెల 23 నుంచి ప్రారంభం కానున్న ఇంటర్ థియరీ పరీక్షలను ప్రశాంత వాతావరణంలో నిర్వహించేందుకు ప్రతి ఒక్కరూ కృషి చేయాలని బోర్డు ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కే.యోహాన్ సూచించారు. థియరీ పరీక్షల నిర్వహణపై స్థానిక సీఆర్ఆర్ కళాశాలలో బుధవారం పరీక్షల కోసం ఏర్పాటు చేసిన 56 పరీక్షా కేంద్రాల చీఫ్ సూపరింటెండెంట్, డిపార్ట్మెంటల్ ఆఫీసర్స్, కస్టోడియన్, అడిషనల్ చీఫ్ సూపరింటెండెంట్లకు శిక్షణా కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మాల్ ప్రాక్టీస్కు తావులేకుండా 56 పరీక్షా కేంద్రాలలో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు. ఇంటర్మీడియట్ విద్యామండలి సెక్రటరీ రంజిత్ బాషా జూమ్ ద్వారా మాట్లాడుతూ పరీక్షల నిర్వహణ పారదర్శకంగా జరపాలని, ఎలాంటి ఇబ్బంది లేకుండా పరీక్షలు రాసేలా అన్ని జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. -
త్వరలో వశిష్ట వారధి నిర్మాణ పనులు
భీమవరం: నరసాపురం ప్రజల చిరకాల వాంచ ఎన్హెచ్ఎ–216 బైపాస్ రోడ్డు నిర్మాణానికి న్యాయపరమైన అడ్డంకులు తొలగిపోయాయని, వశిష్ట వారధి, నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణానికి మార్గం సుగమమైందని త్వరలోనే పనులు ప్రారంభమవుతాయని కేంద్ర ఉక్కు శాఖ సహాయమంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ అన్నారు. జిల్లా బీజేపీ కార్యాలయంలో ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా వర్మ మాట్లాడుతూ త్వరలోనే బైపాస్ రోడ్ నిర్మాణ పనులు, వశిష్ట వారధి నిర్మాణ పనులు ప్రారంభమయ్యేలా కృషి చేస్తానని తెలిపారు. రెండు లైన్ల రహదారిగా ఉన్న ఎన్హెచ్ 216ను నాలుగు లైన్ల జాతీయ రహదారిగా అభివృద్ధి చేయడానికి అధికారులు అంగీకరించారని తెలిపారు. ఎన్హెచ్ 216 నరసాపురం బైపాస్ రోడ్డు నిర్మాణంతో పాటు ఎన్హెచ్ 165 దిగమర్రు ఆకివీడు రహదారి, భీమవరం బైపాస్ నిర్మాణం పనులు పూర్తి అయ్యేలా కృషి చేస్తానని కేంద్రమంత్రి శ్రీనివాస వర్మ తెలిపారు. -
అబార్షన్లు ఆందోళనకరం
బుట్టాయగూడెం: కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు తల్లీబిడ్డల ఆరోగ్య సంరక్షణకు ప్రాధాన్యత ఇస్తున్నా గిరిజన ప్రాంతంలో 281 అబార్షన్లు నమోదు కావడం ఆందోళనకరమని, దీనిపై సమగ్ర నివేదిక తయారు చేసి కలెక్టర్కు అందజేయాలని అధికారులను ఆదేశించినట్లు రాష్ట్ర మహిళా కమిషన్ చైర్పర్సన్ డాక్టర్ రాయపాటి శైలజ చెప్పారు. మంగళవారం ఆమె బుట్టాయగూడెం మండలంలో పర్యటించారు. ఈ సందర్భంగా కేఆర్పురం ఐటీడీఏ సమావేశ మందిరంలో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో అబార్షన్లపై వివరాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నందాపురం పీహెచ్సీని సందర్శించి గర్భవతులకు అందిస్తున్న వైద్యసేవలపై ఆరా తీశారు. ఏపీ ట్రైకార్ చైర్మన్ బొరగం శ్రీనివాసులు, ఐటీడీఏ పీఓ కె.రాములు నాయక్, డీఎం అండ్ హెచ్ఓ డాక్టర్ పీజె అమృతం, ఐసీడీఎస్ పీడీ శారద, డిప్యూటీ డీఎంఅండ్హెచ్ఓ జె.సురేష్, ఐటీడీఏ అధికారులు, డాక్టర్లు పాల్గొన్నారు. ఏలూరు రూరల్: త్వరలో తిరుపతిలో జరగబోయే శాప్ లీగ్స్ రాష్ట్రస్థాయి చెస్ పోటీలకు జిల్లా జట్లను ఎంపిక చేశామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ చెప్పారు. మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియం వెయిట్లిఫ్టింగ్ హాల్లో జిల్లాస్థాయి చెస్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో అండర్–13, 15, 19 బాలికల విభాగంలో వరుసగా వై ప్రేమ్రక్షిత్, చార్వి శ్రీ, వై ముకుంధప్రియ, డి జ్యోతికశ్రీదేవి, అల్లూరి తేజ, డి హారిణికతి బాలుర అండర్–17, 19 విభాగంలో కె తేజేష్సాయి, ఆర్ చింటు రాష్ట్రస్థాయి పోటీలకు ఎంపికయ్యారని డీఎస్డీవో వెల్లడించారు. రాష్ట్ర ఒలింపిక్ అసోసియేషన్ కార్యదర్శి బడేటి వెంకట్రామయ్య, సెట్వెల్ సీఈఓ కె ప్రభాకర్, ఎస్టీఎఫ్ కార్యదర్శి కె అలివేలు, చెస్ అకాడమీ సభ్యులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యార్థుల బంగారు భవిష్యత్తుకు అహర్నిశలు పాటుపడిన ఉపాధ్యాయుడు రాజ్పుట్ నాగేంద్రసింగ్ శిక్షారత్న అవార్డు అందుకున్నారు. ప్రాథమిక స్థాయిలో విద్యార్థులకు విద్యా బోధన, దస్తూరి, మౌలిక సదుపాయాల కల్పన, ఆరోగ్యం, తల్లిదండ్రులతో సమన్వయం, సాంస్కృతిక అంశాలు, క్రమశిక్షణ మొదలైన అంశాలను ప్రాతిపదికగా తీసుకుని నవాచారి గతి విద్యా సమూహ్ భారత్ సంస్థ జాతీయ ఇన్నోవేటివ్ శిక్షారత్న అవార్డులను ప్రకటిస్తుంది. ఈ మేరకు 2025–26వ సంవత్సరానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 8 మంది ఉపాధ్యాయులను శిక్షారత్న అవార్డుకు ఎంపిక చేసింది. ఏలూరు శ్రీరాంనగర్ మండల పరిషత్ ప్రాథమిక పాఠశాలలో ఉపాధ్యాయునిగా పనిచేస్తున్న రాజపుట్ నాగేంద్ర సింగ్ ఈ అవార్డుకు ఎంపికై న 8 మందిలో ఉన్నారు. ఆయనకు ఈ అవార్డును జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ మంగళవారం అందచేసి అభినందించారు. -
ఇష్టారాజ్యంగా కోళ్ల వ్యర్థాల రవాణా
గణపవరం: ఎన్ని చట్టాలు.. ఎంత నిఘా ఉన్నా కోళ్ల వ్యర్థాల రవాణా నిరాటంకంగా సాగుతోంది. ఒకవైపున పోలీసులు దాడులు చేసి కేసులు నమోదు చేస్తున్నా అక్రమ రవాణా ఆగడం లేదు. పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్రమాదమని తెలిసినా కోళ్లు, ఇతర జంతు వ్యర్థాలను యథేచ్ఛగా, పట్టపగలే దర్జాగా రవాణా చేస్తున్నారు. ఇందుకు అవసరమైన కోళ్ల వ్యర్థాలు మన రాష్ట్రంనుంచే కాక పొరుగు రాష్ట్రమైన తెలంగాణ నుంచి కూడా వాహనాల్లో కొల్లేరు, డెల్టా ప్రాంతాలకు అక్రమ రవాణా చేస్తున్నారు. ముఖ్యంగా మాంసాహారం అధికంగా వినియోగించే ఉభయ గోదావరి జిల్లాల్లోని పలు చికెన్ దుకాణాలు, చేపల మార్కెట్ల వద్ద దుకాణదారులు వాటి వ్యర్థాలను ప్లాస్టిక్ డబ్బాలలో వేసి ఉంచుతారు. వాటిని తరలించడానికి దుకాణదారులతో దళారులు ఒప్పందం చేసుకుని, వాటిని రాత్రి వేళల్లో రహస్యంగా సేకరించి వాటిని మినీ లారీలు, వ్యాన్లు, ట్రక్కు ఆటోల్లో ఇతర ప్రాంతాలకు తరలిస్తున్నారు. దీని నిమిత్తం వ్యాపారులకు ఏడాదికి రూ.10 నుంచి రూ.15 వేల వరకూ చెల్లిస్తుంటారు. ప్రభుత్వం నిషేధించినా.. పర్యావరణానికి పెనుప్రమాదకరమైన కోళ్లు ఇతర జంతు వ్యర్థాలను చేపలకు ఆహారంగా వేయడాన్ని నిషేధిస్తూ దశాబ్దకాలం క్రితమే ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అయినా కొందరు అక్రమార్కులు మాత్రం రహస్యంగా కోళ్ల వ్యర్థాలను తరలిస్తూనే ఉన్నారు. ఎక్కువగా రాత్రి సమయంలో అర్ధరాత్రి, తెల్లవారుజామున వీటిని తరలిస్తుండగా మరికొందరు పట్టపగలే వీటిని తరలిస్తూ ప్రజలను నానా ఇబ్బంది పెడుతున్నారు. ఇటీవలి కాలంలోనే నిడమర్రు సర్కిల్ పరిధిలో పోలీసులు రాత్రివేళల్లో డజనుకుపైగా కోళ్లవ్యర్థాలు అక్రమ రవాణా చేస్తున్న వాహనాలను పట్టుకుని కేసులు పెట్టారు. ఆరోగ్యానికి పెనుముప్పు కోళ్లవ్యర్థాలు రవాణా చేస్తున్న వాహనం రోడ్డుమీద వెళ్లిందంటే ఆ వాహనం వెళ్లిన అరగంట వరకూ దాని దుర్వాసన దారుణంగా ఉంటుంది. ఇలాంటి వాహనాలు వెళ్తుంటే దానినుంచి వెలువడే దుర్గంధంతో రోడ్డున వెళ్లే ప్రయాణికులు, రోడ్లవెంబడి ఉన్న వ్యాపారులు, దుకాణదారులు, సమీప గృహస్తులు ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. ప్రజలకు ఇంత ఇబ్బంది కలుగుతున్నా స్వార్థంతో కొందరు ఈ అక్రమ రవాణాను కొనసాగిస్తూనే ఉన్నారు. ఖర్చు తక్కువని.. చేపలకు మేతగా డీవోబి (నూనె తీసిన తౌడు) వినియోగిస్తుంటారు. దీని ధర ఆరు నెలలకు సగటున మూడు లక్షల వరకూ ఖర్చవుతుంది. దీని స్థానంలో మాంసం వ్యర్థాలను మేతగా వేస్తే లక్ష రూపాయల లోపే ఖర్చు అవుతుంది. చేపల మేత కిలో రూ.40 వరకూ ఉండగా చికెన్ వ్యర్థాలు రూ.10 కే రావడంవల్ల రైతులు వీటిపై మక్కువ చూపుతున్నారు. ఎకరా చేపల చెరువకు సంప్రదాయ మేత నెలకు సుమారు రూ.35 వేలు ఖర్చు అవుతుంది. అదే కోళ్ల వ్యర్థాలు 200 కిలోల డ్రమ్ము రూ.2 వేలకు వస్తుంది. ఈ లెక్కన నెలకు పది నుంచి పదిహేను వేల రూపాయలు మాత్రమే ఖర్చు అవుతుంది. దీంతో ఖర్చు సగానికి సగం తగ్గడంవల్ల రైతులు కోళ్లవ్యర్థాలను చేపలకు ఆహారంగా వినియోగిస్తున్నారు. నిబంధనల ప్రకారం కోళ్ల వ్యర్థాలను ఏరోజుకారోజు డంపింగ్ యార్డుకు తరలించాల్సి ఉండగా ఆదాయం వస్తుందన్న ఆశతో వ్యాపారులు వీటిని దాచి ఉంచి దళారులకు విక్రయిస్తున్నారు.కోళ్ల వ్యర్థాల రవాణాపై గట్టి నిఘా పెట్టాం. పర్యావరణానికి అత్యంత హానిచేసే వీటిని రవాణా చేయడం చట్టరీత్యా నేరం. ఇప్పటికే సర్కిల్ పరిధిలో పలు వాహనాలు పట్టుకుని కేసులు నమోదు చేశాం. వ్యాపారులపై నిఘా ఉంచి కోళ్లవ్యర్థాలు రవాణా జరుగకుండా చర్యలు తీసుకుంటున్నాం. చేపల రైతులు కూడా వీటిని వినియోగించకూడదు. – నక్కా రజనీకుమార్, సీఐ, గణపవరం చేపల చెరువుల కోసం యథేచ్ఛగా కోళ్ల వ్యర్థాల అక్రమ రవాణా పోలీసులు దాడులు చేస్తున్నా ఆగని దందా పర్యావరణానికి, ప్రజారోగ్యానికి ప్రమాదం అంటున్న అధికారులు -
ఆధ్యాత్మిక అభివృద్ధే లక్ష్యం
ఆధ్యాత్మిక అభివృద్ధి లక్షమే ఈ తపస్సు కాల దీక్షలు. దీక్షలు చేపట్టిన విశ్వాసులు దేవుని పట్ల విశ్వాసంతో దీక్ష, జీవన విధానం కొనసాగించాలి. ప్రేమ, త్యాగం, సేవాభావాలను కలిగి ఉండాలి. దీక్షాధారులు ఇతరులకు స్పూర్తి కావాలి. – ఏలూరు పీఠాధిపతి, డాక్టర్ పొలిమేర జయరావు, ఉమ్మడి పశ్చిమలో బిషప్ జాన్ ములగాడ ప్రొత్సాహకంతో దీక్షలను ప్రారంభించడం దేవుని ఆశీస్సులుగా, కర్తవ్యంగా భావిస్తున్నాను. ఆరుగురితో తపస్సుకాల దీక్షలు ప్రారంభం కాగా ప్రస్తుతం లక్షకుపైగా విశ్వాసులు దీక్షలు చేపడుతున్నారు. ఇది ఆహ్వానించదగ్గ పరిణామం. – ఏలూరు అమలోద్బవి చర్చి రెక్టర్ కెథ్రడల్ ఫాదర్ మైఖేల్ -
మోటార్ల దొంగల అరెస్ట్
పెదపాడు: గత కొద్ది రోజులుగా చేపల చెరువల వద్ద మోటార్ల చోరీకి పాల్పడుతున్న దొంగలు పోలీసులకు చిక్కారు. నేరాలకు పాల్పడుతున్న ముగ్గురిని పోలీసులు అరెస్ట్ చేసి వారి నుంచి 7 మోటార్లు స్వాధీనం చేసకున్నారు. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్, ఎస్సై ఆర్ శ్రీనివాస్ మంగళవారం వివరాలు వెల్లడించారు. పెదపాడు మండలంలోని గుడిపాడు గ్రామానికి చెందిన చొక్కా నాగదుర్గారావు అలియాస్ పెంటయ్య, అదే గ్రామానికి చెందిన చింతపల్లి నాగరాజు, సత్యవోలు గ్రామానికి చెందిన బొత్స వినోద్ వడ్డిగూడెం గ్రామ శివారున రాళ్లపల్లివారి పాలెం కల్వర్టు సమీపంలో అనుమానాస్పదంగా సంచరిస్తుండగా పోలీసులు వారిని అదుపులోకి తీసుకుని విచారించారు. ఈనెల 6 నుంచి 9వ తేదీ వరకు వడ్డిగూడెం, సత్యవోలు, గుడిపాడు పరిసర ప్రాంతాల్లో చేపల చెరువుల వద్ద మోటార్ల చోరీకి పాల్పడుతున్నట్లు అంగీకరించారు. కొన్ని మోటార్లను తుప్పల్లో దాచగా, మిగిలినవి డ్రైవర్ వినోద్కు విక్రయించినట్లు వెల్లడించారు. ఆకివీడు: అదనపు కట్నం వేధింపులపై స్థానిక పోలీస్ స్టేషన్లో బుధవారం కేసు నమోదైంది. మండలంలోని దుంపగడప గ్రామానికి చెందిన నక్క మరియమ్మకు కోనసీమ జిల్లా రామచంద్రాపురానికి చెందిన గంట సురేష్కుమార్తో 2025 అక్టోబర్లో వివాహమైంది. అప్పటి నుంచి భర్త, అతని కుటుంబ సభ్యులు అదనపు కట్నం కోసం వేధిస్తున్నట్లు బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై హెచ్.నాగరాజు చెప్పారు. -
గ్రావెల్ దోపిడీకి ‘కొత్త మార్గం’
● యథేచ్ఛగా గ్రావెల్ మట్టి తవ్వకాలు ● ఇసుక తరహాలో మట్టి రవాణా ద్వారకాతిరుమల: కొందరు టీడీపీ నాయకులు మట్టి దోపిడీకి కొత్త మార్గం ఎంచుకున్నారు. గతంలో ఇసుకను ఖాళీ ప్రదేశాల్లో డంప్ చేసి, అక్కడి నుంచి ఇతర ప్రాంతాలకు ఎలా రవాణా చేసేవారో.. ఇప్పుడు మట్టిని కూడా అలా రవాణా చేస్తున్నారు. ఈ క్రమంలో పగలూ, రాత్రి అనే తేడా లేకుండా పోలవరం కుడి కాలువ గట్టును తవ్వి, గ్రావెల్ మట్టిని తరలిస్తున్నారు. ద్వారకాతిరుమల మండలం ఎం.నాగులపల్లి వద్ద పోలవరం కుడి కాలువ గట్టును కొందరు పచ్చనేతలు ఇష్టానుసారంగా జేసీబీతో తవ్వేస్తున్నారు. ఆ మట్టిని అక్రమంగా ట్రాక్టర్ల ద్వారా తరలించి గ్రామంలోని అందనాలమ్మ చెరువు వద్ద ఉన్న ఖాళీ ప్రదేశంలో డంప్ చేస్తున్నట్టు స్థానికులు చెబుతున్నారు. అక్కడ నుంచి ఆ మట్టిని టిప్పర్ల ద్వారా ఇతర ప్రాంతాలకు తరలించి, అమ్ముకుని, సొమ్ము చేసుకుంటున్నారు. ఒక్కో టిప్పర్ మట్టిని రూ.5 వేల నుంచి రూ. 6 వేలకు విక్రయిస్తున్నట్టు తెలుస్తోంది. బెర్మ్ల పేరుతో.. గ్రామాల్లో నిర్మించిన సీసీ రోడ్లకు ఇరువైపులా బెర్మ్లు నిర్మించేందుకు మట్టిని తరలిస్తున్నట్టు నాయకులు చెబుతున్నారు. మంగళవారం ద్వారకానగర్లోని సీసీ రోడ్ల బెర్మ్లకు కొంత మట్టిని వినియోగించారు. అయితే మట్టిని కొనుగోలు చేసి, బెర్మ్లు నిర్మించాలి గానీ ఇలా కాలువ గట్టును కొల్లగొట్టడమేంటని స్థానికులు ప్రశ్నిస్తున్నారు. గోతులమయం కాలువ గట్టుపై ఉన్న మట్టితో పాటు, ఆ ప్రాంతంలో పెద్దగోతులు తవ్వి గ్రావెల్ మట్టిని తరలిస్తున్నారు. ఆ గోతులు భవిష్యత్తులో ప్రమాదాలకు కారణం అవుతాయని స్థానికులు అంటున్నారు. -
నేటి నుంచి తపస్సు కాల దీక్షలు
● సుమారు లక్ష మందికిపైగా దీక్షల స్వీకరణ ● 40 రోజులపాటు విశ్వాసుల దీక్షలు దెందులూరు: ప్రభువు ఏసుక్రీస్తు ఎడారికి వెళ్లి 40 రోజుల పడిన శ్రమలను అనుసరించి క్రైస్తవులు అనునిత్యం ప్రార్థిస్తూ, ఉపవాసం చేస్తూ తపస్సుకాల దీక్షలు చేస్తారు. నేటి నుంచి ఈ దీక్షలు ప్రారంభం కానున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో అన్ని క్రైస్తవ సంఘాలతో కలిపి లక్ష మందికిపైగా ఈ తపస్సు కాల దీక్షలు స్వీకరించనున్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో తపస్సు కాల దీక్షలను ఫాదర్ ఐ.మైఖేల్ ప్రారంభించారు. 1992వ సంవత్సరంలో భీమవరం ఆర్సీఎం విచారణ వేంపాడులో అప్పట్లో ఆర్సీఎం ఏలూరు పీఠాధిపతి జాన్ ములగాడ ప్రొత్సాహం, సహాయ సహకారాలతో ఆరుగురితో తపస్సు కాల దీక్షలను ప్రారంభించారు. జాన్ ములగాడ ప్రస్తుత ఏలూరు పీఠాధిపతి డాక్టర్ పొలిమేర జయరావు సహాయ సహకారాలతో అన్ని క్రైస్తవ సంఘాలతో కలిపి ప్రస్తుతం లక్షకుపైగా తపస్సు కాలదీక్షలు చేపడతున్నారు. దీక్షలు ఇలా.. ● ఉదయం, సాయంత్రం దేవాలయాలకు వెళ్లి ప్రార్థనలు చేయాలి. ● తెలుపు, ముక్కుపొడి రంగు దుస్తులు ధరించాలి. ● కాళ్లకు చెప్పులు వేయకూడదు. నేలపై చాప మీద నిద్రించాలి. ● మాంసాహారం, వివాహ జీవితానికి, మద్యానికి దూరంగా ఉండాలి. ● ప్రతి బుధ, శుక్రవారాల్లో శిలువు మార్గంలో పాల్గొనాలి. వారంలో ఒకరోజు దీక్షలు చేపట్టిన వారి సమూహం వద్ద రాత్రి ప్రార్థన నిర్వహించాలి. ● దీక్షా కాలంలో ఒక పుణ్యక్షేత్రాన్ని సందర్శించాలి. ● దేవాలయం వద్దే దీక్షను విరమింపచేయాలి. -
నిరుద్యోగ భృతి హామీ మరిచారు
ఎన్నికల సమయంలో ప్రతి నెలా నిరుద్యోగ భృతి రూ.3 వేలు ఇస్తామని చంద్రబాబు, కూటమి నాయకులు హామీ ఇచ్చి అధికారం దక్కించుకున్నారు. ఇప్పటివరకు మూడు బడ్జెట్లు ప్రవేశపెట్టినా నిరుద్యోగ భృతి పథకానికి ఒక్క రూపాయి కూడా కేటాయించకుండా నిరుద్యోగులను మోసం చేశారు. రాష్ట్రంలో లక్షలాది నిరుద్యోగులు భృతి కోసం ఎదురు చూస్తున్నారు. ఇప్పటికే చదివిన చదువులకు సరిపడా ఉద్యోగాలు లభ్యం కాక యువతీ యువకులు నిరాశలో ఉన్నారు. చంద్రబాబు ప్రభుత్వం ఇప్పటికైనా నిరుద్యోగ భృతి హామీని ఆచరణలో పెట్టి యువతను ఆదుకోవాలి. – ఎండీ.గాలిబ్బాబు, న్యాయవాది, కై కలూరు -
మహిళలకు టోకరా
ఆడబిడ్డ నిధి పథకానికి ఈ బడ్జెట్లో నిధులు కేటాయించలేదు. ప్రతి మహిళకు నెలకు రూ.1500 ఇస్తామని చెప్పారు. 19 నుంచి 59 ఏళ్ల మహిళలకు ఏడాదికి రూ.32 వేల కోట్లు ఇవ్వాల్సి ఉండగా, ఎగ్గొట్టారు. దీపం పథకం కింద మూడు సిలిండర్లు ఇస్తామని, ఒక్క సిలిండర్ మాత్రమే ఇచ్చారు. మూడు సిలిండర్లు ఎప్పుడు ఇస్తారో చెప్పలేదు. వైఎస్సార్ ఆసరా పథకాన్ని పూర్తిగా ఎత్తేశారు. మహిళలకు సున్నావడ్డీ రుణాలు ఇవ్వడం లేదు. ఎన్నికల హామలను నెరవ్చేకుండా మహిళలను మోసగించిన చంద్రబాబుకు ప్రజలు త్వరలోనే తగిన బుద్ధి చెబుతారు. – జిజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్సీపీ నగర మహిళా అధ్యక్షురాలు, ఏలూరు -
గల్ఫ్లో మహిళ మృతి..కానిస్టేబుల్ దంపతులపై కేసు
నరసాపురం రూరల్: ఉపాధి పేరిట నిబంధనలకు విరుద్ధంగా గల్ఫ్ దేశానికి పంపి, ఒక మహిళ మృతికి కారణమైన కానిస్టేబుల్ దంపతులపై నరసాపురం రూరల్ పోలీసులు సోమవారం కేసు నమోదు చేశారు. ఈ ఘటనకు సంబంధించి రూరల్ పోలీసులు తెలిపిన వివరాలిలా ఉన్నాయి. నరసాపురం మండలం చిట్టవరం గ్రామానికి చెందిన మురాల రాజమణి (48) గతంలో గల్ఫ్ దేశాల్లో పనిచేసి వచ్చి, ఇకపై వెళ్లకూడదని నిర్ణయించుకుంది. అయితే, ఉండి మండలం ఆగ్రహారం గ్రామానికి చెందిన బింకం విమల, ఆమె భర్త భీమవరంలో ట్రాఫిక్ కానిస్టేబుల్గా పనిచేస్తున్న అలుగు యేసేబు రాజమణి ఇంటికి వచ్చి, మెరుగైన ఉపాధితో పాటు ఎక్కువ జీతం ఆశచూపి మస్కట్ పంపిస్తామని నమ్మబలికారు. మృతురాలు మొదట నిరాకరించినప్పటికీ, కానిస్టేబుల్ యేసేబు వచ్చి చెప్పడంతో గల్ఫ్ వెళ్లేందుకు అంగీకరించింది. ఇందుకుగాను నిందితులు రూ.2 లక్షలు డిమాండ్ చేయగా, రాజమణి కూతురు ఉషారాణి రూ.1.50 లక్షలు చెల్లించింది. దీంతో రాజమణిని 2025 నవంబర్ 28న గల్ఫ్ పంపారు. రాజమణి అక్కడికి వెళ్లిన కొద్ది రోజులకే, డిసెంబర్ 4న ఆమె మరణించినట్లు నిందితులు సమాచారం ఇచ్చారు. వర్కింగ్ వీసా అని చెప్పి విజిటింగ్ వీసాపై పంపడం వల్ల రాజమణి తీవ్ర మానసిక ఒత్తిడికి గురైందని, ఆరోగ్యం క్షీణించినా అక్కడ ఉన్న బింకం విమల సరైన వైద్యం అందించడంలో నిర్లక్ష్యం వహించిందని బాధితులు ఆరోపించారు. ఉషారాణి చేసిన ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు నరసాపురం రూరల్ ఎస్సై వెంకట సురేష్ తెలిపారు. భీమడోలు: రైల్వే గేటు దాటుతున్న వ్యక్తిని రైలు ఢీకొట్టడంతో ఆతను అక్కడిక్కడే మృతి చెందాడు. ద్వారకాతిరుమలకు చెందిన సీమకుర్తి జ్యోతి కృష్ణ గణపతి(51) ఈనెల 14వ తేదీ రాత్రి భీమడోలులోని రైలు గేటు దాటుతుండగా అదే సమయంలో డిబ్రూగర్ వివేక్ సూపర్ఫాస్ట్ ఎక్స్ప్రెస్ రైలును ఆతన్ని ఢీకొట్టింది. ఈ ఘటనలో ఆతను అక్కడిక్కడమే మృతి చెందాడు. తొలుత కృష్ణ గణపతిది ఆత్మహత్యగా భావించగా అతడు రైలు ప్రమాదంలో మృతి చెందినట్లు రైల్వే పోలీసులు పేర్కొన్నారు. రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు అనుమానస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): సన్మార్గంలో నడిచే విశ్వాసులు ఏసు ప్రభువుకు చేరువవుతారని పాస్టర్ ఎం జ్యోతి రాజు అన్నారు. స్థానిక శాంతినగర్ మన్నా చర్చ్ పాస్టర్ జ్యోతిరాజు ఆధ్వర్యంలో ఆదివారం ప్రారంభమైన స్తుతి నైవేధ్యం కార్యక్రమం సోమవారం కూడా కొనసాగింది. స్థానిక గ్జేవియర్ నగర్లోని సెయింట్ గ్జేవియర్ స్కూల్ మైదానంలో నిర్వహించిన ఈ కార్యక్రమంలో వాక్య పరిచర్య చేసిన జ్యోతిరాజు మాట్లాడుతూ ఏసు ప్రభువు చూపిన మార్గం ప్రపంచానికి అనుసరణీయమన్నారు. విశ్వశాంతి కోసం ప్రతి ఒక్కరూ కృషి చేయాల్సిన అవసరం ఉందన్నారు. శాంతి సమాధానాలతో ప్రతి ఒక్కరూ జీవించాలని, బైబిల్ పఠనం ద్వారా మన నడవడికలో సమూల మార్పు వస్తుందని వివరించారు. ఈ సందర్భంగా వాద్య సంగీతాల మధ్య ఆలపించిన సువార్త గీతాలు విశ్వాసులను విశేషంగా అలరించాయి. కార్యక్రమంలో ఉభయ తెలుగు రాష్ట్రాలకు చెందిన దైవజనులు రాజ్ ప్రకాష్ పాల్, మోసన్న జాన్ వెస్లీ, రాజమండ్రి, విశాఖపట్నం నుంచి శామ్యూల్ ఖర్మోజీ, పలువురు అంతర్జాతీయ సువార్త గాయకులు, సంగీత కళాకారులు పాల్గొన్నారు. నరసాపురం రూరల్: బైక్ అదుపు తప్పిన ఘటనలో ఓ వ్యక్తి మృతి చెందగా మరో వ్యక్తికి గాయాలయ్యాయి. మొగల్తూరు హెడ్ కానిస్టేబుల్ సుబానీ తెలిపిన వివరాలిలా ఉన్నాయి. ఉండి గ్రామానికి చెందిన లారీ డ్రైవర్ చల్లా పవన్ కుమార్ (27) తన స్నేహితుడు చంద్రగిరి దుర్గారావుతో కలిసి మోటార్బైక్పై ఆదివారం పేరుపాలెం బీచ్కి వచ్చారు. తిరిగి ఉండి వెళ్లే క్రమంలో మోడి గ్రామానికి చేరుకునేసరికి వారి బైక్ అదుపుతప్పి పడిపోవడంతో ఇద్దరికీ తీవ్రగాయాలయ్యాయి. భీమవరం ఆసుపత్రిలో చికిత్స పొందుతూ పవన్ కుమార్ ఆదివారం రాత్రి మృతి చెందాడు. మృతుని సోదరి బత్తుల పెద్దింట్లు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మరో వ్యక్తి దుర్గారావు ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడన్నారు. కొట్లాట కేసులో మూడేళ్ల జైలు శిక్ష పెంటపాడు: కొట్లాట కేసులో ముద్దాయిలకు మూడేళ్ల జైలు శిక్ష విధిస్తూ కోర్టు తీర్పు వెలువరించినట్లు పెంటపాడు ఎస్సై స్వామి తెలిపారు. పెంటపాడు గేట్ సెంటర్లోని ఒక వెల్డింగ్ షాపు వద్ద 2021లో జరిగిన కోట్లాటలో పి.సత్తిబాబును కర్రి వీరారెడ్డి, సత్యనారాయణ రెడ్డి అనే వ్యక్తులు గాయపరిచారు. బాధితుని ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు. కోర్టు విచారణలో నేరం రుజువు కావడంతో వీరారెడ్డి, సత్యనారాయణరెడ్డిలకు ఒక్కొక్కరికి మూడేళ్ల జైలు శిక్ష, రూ.20 వేలు జరిమానా విధిస్తూ తాడేపల్లిగూడెం ఫస్ట్క్లాస్ మేజిస్ట్రేట్ పి.అన్నామణి సోమవారం తీర్పు వెలువరించారు. -
భృతి.. అంతా భ్రాంతి
జిల్లాలో వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమలకు అవకాశాలు ఉన్నాయి. ప్రధానంగా పామాయిల్, మామిడి ప్రాసెసింగ్ యూనిట్లతో పాటు పలు పరిశ్రమలకు పుష్కలంగా ల్యాండ్ బ్యాంక్ మెట్ట ప్రాంతంలో ఉంది. అయితే ఇవేమీ పట్టించుకోని సర్కారు గిరిజనులు తీవ్రంగా వ్యతిరేకిస్తున్న నేవీ ఆయుధ కర్మగార డిపో ఏర్పాటుకు అడ్డగోలుగా ప్రయత్నిస్తోంది. అయితే వ్యవసాయ ఆధారిత ఉత్పత్తులకు విలువ పెరిగేలా ప్రాసెసింగ్ యూనిట్లను ఏర్పాటు చేయని పరిస్థితి. జిల్లాలో పామాయిల్, కోకో, కొబ్బరి, ఆక్వా సంబంధిత పరిశ్రమల ఏర్పాటుకు చాలా అవకాశాలు ఉన్నాయి. ఉమ్మడి జిల్లాలో ఏకై క కార్పొరేషన్ గా ఉన్న ఏలూరు, శివారు ప్రాంతాల్లో కనీసం 200 మందికి ఉపాధి కల్పించే పరిశ్రమ కూడా లేకపోవడం గమనార్హం. ఉద్యోగాల మాటేంటిసాక్షి ప్రతినిధి, ఏలూరు : నిరుద్యోగులకు చంద్రబాబు సర్కారు పంగనామం పెట్టింది. ఇంటికో ఉద్యోగం లేదంటే నెలకు రూ.3 వేల నిరుద్యోగ భృతి అంటూ ఎన్నికల సమయంలో ఊకదంపుడు ప్రచారాలతో హోరెత్తించారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత మూడు రాష్ట్ర బడ్జెట్లు ప్రవేశపెట్టినా కనీసం నిరుద్యోగ భృతి మాటెద్దలేదు. ఉద్యోగాల కల్పనలో భాగంగా కనీసం జిల్లాలో ఒక్క పరిశ్రమకు కూడా కొబ్బరికాయ కొట్టలేదు. ఇలా జిల్లాలో 4.51 లక్షల కుటుంబాలను నిరుద్యోగ భృతి పేరుతో సర్కారు వంచించింది. ప్రశ్నిస్తే వేధింపులు ఏడాదికి 5 లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని, లేకుంటే నెలకు రూ.3 వేల చొప్పున నిరుద్యోగ భృతితో ఆదుకుంటామని కూటమి నేతలు హామీ ఇ చ్చారు. ఈ క్రమంలో జిల్లాలో ఏటా 20 వేలు చొప్పున 40 వేల ఉద్యోగాలు ఇవ్వాలి. లేకుంటే ఏడాదికి రూ.1,969 కోట్ల నిరుద్యోగ భృతి చెల్లించాలి. అయితే వీటన్నింటికీ సర్కారు మంగళం పాడింది. అలాగే ప్రశ్నించిన గొంతులపై వేధింపుల పర్వానికి దిగింది. జాబ్ క్యాలెండర్ను ప్రకటించినా కొత్తగా నోటిఫికేషన్ ఇవ్వని పరిస్థితి. దీంతో పాటు పూర్తి వ్యవసాయ ఆధారిత జిల్లా అయిన ఏలూరులో పరిశ్రమలు పూర్తిగా కరువయ్యాయి. వ్యవసాయ ఉత్పత్తుల అనుబంధ పరిశ్రమల ఏర్పాటుకు పుష్కలంగా అవకాశాలున్నా ప్రజాప్రతినిధుల నిర్లక్ష్యం, ప్రభుత్వం అలసత్వంతో కనీసం వంద మందికి ఉపాధి కల్పించే కొత్త పరిశ్రమ ఒక్కటీ కూడా ఏర్పాటు కాకపోవడం గమనార్హం. నిరుద్యోగ భృతి ఎప్పుడిస్తారు బడ్జెట్లో నిరుద్యోగులకు కేటాయింపుల్లేవ్ నిరుద్యోగ భృతి ఒట్టిమాటే జాబ్ క్యాలెండర్ ఊసే లేదు జిల్లాలో 4.51 లక్షల కుటుంబాలకు అందని సాయం పరిశ్రమల స్థాపనా పట్టదు నిరుద్యోగ యువతను చంద్రబాబు దగా చేశారు. ఎన్నికల ముందు నిరుద్యో గ యువతను ఆదుకుంటామన్నారు. పరిశ్రమలు ఏర్పాటు లేదు, ఉద్యోగాల కల్పన అసలే లేదు. నిరుద్యోగ భృతి ఊసే ఎత్తడం లేదు. బడ్జెట్లో ఏ మాత్రం కేటాయింపులు చేయకుండా ప్రభుత్వం చేతులెత్తేసింది. –నిట్టా శ్రీను, మాల మహానాడు జిల్లా అధ్యక్షుడునిరుద్యోగులను మరోసారి చంద్రబాబు ప్రభుత్వం ని ట్టనిలువునా దగా చేసింది. ప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు కావస్తున్నా ఒక్క నెల కూడా నిరుద్యోగ భృతి ఇ వ్వలేదు. ఈ పథకం అమలు చేసే ఉద్దేశం ఉంటే బడ్జెట్లో నిధులు ఎందుకు కేటాయించలేదు. – ముంగర సంజీవ్కుమార్, వడ్డీల కార్పొరేషన్ రాష్ట్ర మాజీ చైర్మన్ -
ఫీజుల భారం.. చదువుకు దూరం
ఏలూరు (టూటౌన్): విద్యకు ప్రభుత్వ సహకారం కొరవడటంతో పేద విద్యార్థులు ఉన్నత చదువులకు దూరమయ్యే పరిస్థితులు తలెత్తాయి. ఫీజు రీయింబర్స్మెంట్ నిధులను ప్రభుత్వం విడుదల చేయకపోవడంతో కళాశాల యాజమాన్యాలు విద్యార్థులపై ఒత్తిడి చేస్తున్నాయి. జిల్లాలో సుమారు రూ.200 కోట్ల మేర ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు పేరుకుపోయాయి. ఏడాదికి సగటున 40 వేల మంది విద్యార్థులకు ఫీజులు చెల్లించాల్సి ఉంది. గత, ప్రస్తుత విద్యాసంవత్సరాల్లో మొత్తంగా 80 వేల మంది విద్యార్థులు ఫీజు రీయింబర్స్మెంట్ కోసం ఎదురుచూస్తున్నారు. ఈ నేపథ్యంలో కళాశాల యాజమాన్యాలు ఫీజులు చెల్లించని వారికి పరీక్షల్లో హాల్టికెట్లు ఇచ్చేది లేదనడం, మరోపక్క ప్రభుత్వం ఫీజు రీయింబర్స్మెంట్ నిధులు చెల్లిస్తామంటూ కాలయాపన చేయడంతో విద్యార్థులు నలిగిపోతున్నారు. గత్యంతరం లేని పరిస్థితుల్లో విద్యార్థుల తల్లిదండ్రులు అప్పులు చేసి మరీ ఫీజులు చెల్లిస్తున్నారు. గత ప్రభుత్వంలో విద్యా విప్లవం గత వైఎస్సార్సీపీ పాలనలో (2014–19) వరకు విద్యార్థులకు స్వర్ణయుగంగా చెప్పవచ్చు. పేదల విద్యార్థుల చదువులకు ప్రోత్సాహమిచ్చేలా ప్రభు త్వం జగనన్న విద్యా, వసతి దీవెనల పేరుతో పథకాలు అమలు చేసింది. డిగ్రీ, పీజీ, ఇంజనీరింగ్, ఎంబీబీఎస్, డిప్లొమా వంటి కోర్సులు చదివే ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనార్టీ, అగ్రవర్ణ పేదలకు పూర్తి ఫీజు రీయింబర్స్మెంట్ అందించి అండగా నిలిచింది. అలాగే వసతి దీవెన పేరుతో రూ.10 వేల నుంచి రూ.20 వేల వరకూ ఆర్థిక సాయం అందించింది. ఇలా మొత్తంగా జిల్లాలో విద్యా దీవెన పథకం ద్వారా 1,75,118 మందికి రూ.450.77 కోట్లు, వసతి దీవెన పథకం ద్వారా 1,73,246 మందికి రూ.171.38 కోట్ల మేర ప్రయోజనం చేకూర్చింది. విద్యార్థుల మెడపై కత్తి విద్యకు కొరవడిన ప్రభుత్వ సహకారం జిల్లాలో రూ.200 కోట్ల మేర ఫీజు బకాయిలు ఫీజులు చెల్లించాలంటూ యాజమాన్యాల ఒత్తిళ్లు సుమారు 80 వేల మంది విద్యార్థులకు ఇబ్బందులు గత ప్రభుత్వంలో రూ.622 కోట్ల మేర లబ్ధి జిల్లావ్యాప్తంగా పేరుకుపోయిన ఫీజుల బకాయిలను ప్రభుత్వం తక్షణమే విడుదల చేయాలి. ఒక పక్క పరీక్షలు దగ్గరపడుతుంటే మరో పక్క ఫీజుల ఒత్తిడితో విద్యార్థులు మానసికంగా నలిగిపోతున్నారు. ఇలాంటి పరిస్థితుల్లో పరీక్షలు రాసి మంచి ఫ లితాలు సాధించాలంటే ఎలా సాధ్యం. ఇప్పటికై నా పాలకులు దీనిపై స్పందించి, పరీక్షల కన్నా ముందే ఫీజుల బకాయిలు చెల్లించాలి. – కాకి నాని, జిల్లా అధ్యక్షుడు, పీడీఎస్యూ, ఏలూరు జిల్లా పేదల చదువులపై చంద్రబాబు ప్రభుత్వం చిన్నచూపు చూడటం తగదు. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వం మా దిరిగా ప్రతి త్రైమాసికానికి బ కాయిలు విడుదల చేయాలి. దాని వల్ల విద్యార్థులకు ఎటువంటి ఇబ్బంది ఉండదు. అయితే విద్యార్థుల చదువులకు కూటమి సర్కారు సహకారం కొరవడింది. ఇప్పటికైనా బకాయి పడ్డ నిధులు వెంటనే విడుదల చేయాలి. – డి.శివకుమార్, అధ్యక్షుడు, అఖిల భారత విద్యార్థి సమాఖ్య (ఏఐఎస్ఎఫ్), ఏలూరు జిల్లా సంవత్సరం జగనన్న విద్యా దీవెన జగనన్న వసతి దీవెన విద్యార్థులు లబ్ధి (రూ.లలో) విద్యార్థులు లబ్ధి (రూ.లలో) 2019–20 36,527 95.78 కోట్లు 36,580 36.86 కోట్లు 2020–21 37,148 77.97 కోట్లు 37,750 35.76 కోట్లు 2021–22 38,677 105.67 కోట్లు 36,350 34.76 కోట్లు 2022–23 33,655 81.53 కోట్లు 32,316 30.96 కోట్లు 2023–24 29,111 67.35 కోట్లు 30,250 28.42 కోట్లు మొత్తం 1,75,118 450.77 కోట్లు 1,73,246 171.38 కోట్లు -
మేత వేసేందుకు వెళ్లి మృత్యుఒడికి..
● రొయ్యల చెరువు వద్ద ప్రమాదం ● ఫ్యాన్ సెట్ రాడ్లో చిక్కుకుని తల్లీకూతుళ్లు మృతి కలిదిండి (కై కలూరు): రొయ్యల చెరువులో మేత వేసేందుకు వెళ్లి తల్లీకూతుళ్లు మృతిచెందిన విషాద ఘటన కలిదిండి సమీప పడమటిపాలెంలో చో టుచేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కై కలూరు మండలం దొడ్డిపట్లకి చెందిన గంగుల శ్రీనివాసరావు, వీర నాగజ్యోతి భార్యాభర్తలు. వీరికి లీలాప్రసన్న, హిమశ్రీ (6) సంతానం. శ్రీనివాసరావు వ్యాన్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మహాశివరాత్రి సందర్భంగా శనివారం భార్యాకుమార్తెలను కోట కలిదిండిలో అత్తింటిలో దించాడు. 15న సాయంత్రం వచ్చి కలిదిండి భోగేశ్వరస్వామి శివరాత్రి వేడుకలకు వెళ్దామని అన్నాడు. ఆదివారం ఉదయం నాగజ్యోతి తల్లిదండ్రులు శివరాత్రి వేడుకలకు వెళ్లగా ఆమె భర్త కోసం వేచిచూస్తూ ఇంటి వద్దే ఉండిపోయింది. ఈ క్రమంలో తండ్రికి పడమటిపాలెంలో రొయ్యల చెరువు ఉండగా మేత వేసేందుకు మధ్యాహ్నం హిమశ్రీతో కలిసి వెళ్లింది. రొయ్యల చెరువుపై ఫ్యాన్ సెట్లు తిరుగుతున్నాయి. చెరువు గట్టుపై ఫ్యాన్ మోటారు వద్ద దాటుతుండగా నాగజ్యోతి చీర రాడ్డుకు చిక్కుకుంది. దీంతో ఆమె చుట్టు తిరిగి ఎగిరి బలంగా కిందపడింది. త ల్లీకూతుళ్లు ఇద్దరూ నలిగిపోయి అక్కడికక్కడే కన్నుమూశారు. విగతజీవులుగా పడి ఉన్న తల్లీకూ తుళ్లను చూసి బంధువులు గుండెలవిసేలా రోదించారు. కోట కలిదిండి, దొడ్డిపట్లలో విషాదచాయలు అలముకున్నాయి. కలిదిండి ఎస్సై వి.వెంకటేశ్వరరావు ఘటనా స్థలాన్ని పరిశీలించారు. భర్త శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేశారు. -
ఆక్వా ఆశలపై నీళ్లు చల్లి..
ఆకివీడు ఆక్వా రంగానికి బడ్జెట్లో అరకొర మాత్రమే నిధులు కేటాయించి చంద్రబాబు ప్రభుత్వం చేతులు దులుపుకుంది. ఆక్వా రంగం అభివృద్ధి చెందిన పశ్చిమ గోదావరి జిల్లా నుంచి రొయ్యల ఎగుమతుల ద్వారా కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు డాలర్ల రూపంలో వందల కోట్ల రూపాయాల్ని ఆదాయంగా గడిస్తున్నా, ఆ రంగానికి తగిన ప్రాతినిధ్యం, నిధుల కేటాయింపు చేయకపోవడంపై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆక్వా రైతాంగం ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యల పరిష్కారానికి సైతం బడ్జెట్లో ఏ విధమైన నిధులూ కేటాయించలేదు. నర్సాపురం తీరంలో ఆక్వా యూనివర్సిటీ నిర్మాణానికి మాత్రం మొక్కుబడిగా రూ. 20 కోట్లు కేటాయించారు. విపత్తులు, ధరలు పడిపోయినప్పుడు, తెగుళ్ల బెడదతో మూకుమ్మడిగా పట్టుబడులు పట్టిన సమయంలో రైతులు రొయ్యలు నిల్వ చేసుకునేందుకు కోల్డ్ స్టోరేజ్ల ఏర్పాటుకు బడ్జెట్లో స్థానం లేకపోయింది. విద్యుత్ రాయితీ గాలికే ఆక్వా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్య విద్యుత్. అప్సడాలో నమోదు కాకుండా ఉన్న చెరువులకు కూడా విద్యుత్ యూనిట్ ధర రూపాయిన్నరకు ఇస్తానని ఎన్నికల ముందు కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. అనంతరం అధికారం చేపట్టిన చంద్రబాబు ప్రభుత్వం అప్సడా అంటూనే డప్పుకొడుతోందని రొయ్య రైతులు ఆందోళన చేస్తున్నారు. దీంతో ఆక్వా రైతులు వేల కోట్ల రూపాయలు నష్టపోవాల్సి వస్తుందని ఆవేదన చెందుతున్నారు. జోన్లతో సంబంధం లేకుండా ఆక్వా రైతులందరికీ యూనిట్ రూ.1.50 పైసలకే విద్యుత్ ఇవ్వాలని డిమాండ్ చేస్తున్నారు. గతేడాది ఇదే సమస్యపై రైతులు ఆందోళన చేస్తే చంద్రబాబు పాలనలోని ప్రజాప్రతినిధులు నీళ్లు చల్లి ఉద్యమాన్ని నీరుగార్చారని పలువురు రైతులు ఆరోపిస్తున్నారు. పేరుకే రూ.1.50 విద్యుత్ ఆక్వా రైతులు మళ్లీ మోసానికి గురవుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన యూనిట్ ధర రూ.1.50 పేరుకేనని, బిల్లు వచ్చే సరికి మూడు రూపాయల వరకూ పడుతోందని పలువురు రైతులు వాపోతున్నారు. పది ఎకరాల లోపు రైతులకు, అప్పడాలో నమోదు కాని రైతులకు, నాన్జోన్లోని రైతులకు యూనిట్ ధర రూ.4.25 పైగా వస్తుందని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. డాలర్ల పంట పండించే రొయ్యల సాగును కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు అన్ని విధాలుగా ఆదుకోవాలని రైతులు కోరుతున్నారు. మళ్లీ పెరిగిన మేత ధర.. తగ్గిన రొయ్య ధర రొయ్యల మేత ధరల్ని మళ్లీ పెంచివేశారని రైతులు వాపోతున్నారు. ఇటీవల రైతులు ఉద్యమించడంతో మేత తయారీ యజమానులు దిగివచ్చి రూ.4 తగ్గించారు. అయితే ప్రస్తుతం రొయ్యల మేత భారీగా పెంచివేశారని ఆవేదన చెందుతున్నారు. రొయ్యల చెరువుల్లో పెంపకం తగ్గిపోతే ధర స్వల్పంగా పెంచుతున్నారని, చెరువుల్లో నిండుగా రొయ్యల పెంపకం, తెగుళ్లు వచ్చిన సమయంలో ధర పతనమైపోతుందంటున్నారు. ఈ విధానంపై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. ఆక్వా జోన్ల వారీగా విద్యుత్ బిల్లుల వివరాలు ఆక్వా జోన్ మొత్తం రైతులు సబ్సిడీ కలిగిన వారు నాన్జోన్ భీమవరం జోన్న్ 9,929 8,278 1,651 నర్సాపురం జోన్ 4,314 3,993 321 తాడేపల్లిగూడెం జోన్ 2,099 1,979 120 అధిక ఆదాయాన్ని ప్రభుత్వాలకు సమకూర్చే రొయ్యల సాగుపై కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు పూర్తి దృష్టి పెట్టాలి. ప్రపంచ దేశాల్లో మార్కెట్ సౌకర్యం, అధిక ధరలు లభించే విధంగా కృషి చేయాలి. స్థానికంగా విద్యుత్ సబ్సిడీలు, మేతలు, మందుల సబ్సిడీల సౌకర్యం కల్పించాలి. రైతులు సాగులో ఆటుపోటులతో తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. – నంద్యాల లక్ష్మీ సీతారామయ్య, అధ్యక్షుడు, వైఎస్సార్ సీపీ ఆకివీడు మండల కమిటీ, కుప్పనపూడి ఎన్నికల ముందు చేసిన వాగ్ధానం ప్రకారం రొయ్య రైతులందరికీ విద్యుత్ సబ్సిడీ కల్పించాలి. ఆక్వా జోన్ల వల్ల రైతులు ఆర్థికంగా నష్టపోతున్నారు. విద్యుత్ సబ్సిడీ కల్పిస్తే తెగుళ్లతో నష్టపోయిన రైతుకు కొంత ఉపశమనం దొరుకుతుంది. రూ.1.50 పైసల సబ్సిడీతోపాటు, ట్రాన్స్ఫార్మర్ల సబ్సిడీలు, అదనపు ఛార్జీల వడ్డన వంటివి తొలగించాలి. – పీవీఆర్కే ఆంజనేయరాజు, వైఎస్సార్సీపీ ఉండి మండల అధ్యక్షుడు, వాండ్రం బడ్జెట్లో ఆక్వాకు అరకొర కేటాయింపులు ఆక్వా యూనివర్సిటీకి మొక్కుబడిగా నిధులు విద్యుత్ రాయితీలపై ఊసెత్తని వైనం ధరల స్థిరీకరణ నిధులూ అటకెక్కినట్లే -
గళమెత్తిన వీఆర్వోలు
లింగపాలెం : పని ఒత్తిడితో వీఆర్వోలు మానసి కంగా ఆందోళన గురై ఆత్మహత్యలకు పాల్పడుతు న్నారని మండల వీఆర్వోలు గళమెత్తారు. నల్ల బ్యాడ్జీలతో స్థానిక తహసీల్దార్ కార్యాలయం వద్ద సోమవారం నిరసన తెలిపారు. రెవెన్యూ, జీఎస్డబ్ల్యూఎస్ అధికారుల్లో సమన్వయ లోపంతో వీఆర్వోలపై తీవ్ర ఒత్తిడి పడుతుందని, వీఆర్వోల సమస్యలను తక్షణమే పరిష్కరించాలని డిమాండ్ చేశారు. వీఆర్వోలు కొండపల్లి వేణుగోపాల్, దాసరి రంగారావు, షేక్ పహిర్ సాహెబ్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): చిరుధాన్యాలతో ఆర్యోగకరమైన వంటలు తయారు చేసుకుని తినాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం జిల్లా వ్యవసాయశాఖ రూపొందించిన చిరుధాన్యాలుతో రుచికరమైన వంటలు పుస్తకాలను ఆమె ఆవిష్కరించారు. ఈ పుస్తకాన్ని ప్రజల్లోకి తీసుకువెళ్లి ఆరోగ్యవంతమైన సమాజం తీర్చిదిద్దాలన్నారు. జేసీ ఎంజే అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వర రావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, జిల్లా వ్యవసాయ శాఖ జేడీ షేక్ హబీబ్ బాషా తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట) : జిల్లాలోని ఆగడాలలంక సీబీసీఎన్సీ ప్రాథమిక పాఠశాల, బుసరాజుపల్లి పీఎంకే ప్రాథమిక పాఠశాలలో ఎస్జీటీ పోస్టుల కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు ఈనెల 23, 25 తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్టు డీఈఓ ఎం.వెంకట లక్ష్మమ్మ ప్రకటనలో తెలిపారు. ఏలూరు సిద్ధార్థ క్వెస్ట్ స్కూల్లో పరీక్షలు నిర్వహిస్తారని, సీఎస్ఈఏపీ వె బ్సైట్ నుంచి హాల్ టికెట్లు డౌన్లోడ్ చేసుకోవాలన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 79890 02168లో సంప్రదించాలన్నారు. ఏలూరు(మెట్రో): చెస్, సైక్లింగ్ విభాగాల్లో శాప్ లీగ్ రాష్ట్రస్థాయి సెలెక్షన్స్, జిల్లా స్థాయి క్రీడా పోటీలు నిర్వహించనున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. కలెక్టరేట్లో సోమవారం శాప్ లీగ్ పోటీల పోస్టర్ను ఆవిష్కరించారు. మంగళవారం ఏలూరు ఇండోర్ స్టేడియంలో అండర్–13, 15, 17, 19 జిల్లాస్థాయి చెస్ పోటీలు, సెలెక్షన్స్ నిర్వహిస్తామన్నారు. 24న అండర్–18 సైక్లింగ్ పోటీలు, సెలెక్షన్స్ నిర్వహిస్తామన్నారు. మరిన్ని వివరాలకు సెల్ 9440647391, 9059485538 నంబర్లలో సంప్రదించాలని కోరారు. -
ఊసెత్తకపోవడం దారుణం
నిరుద్యోగ భృతి హామీని నిలబెట్టుకోవాలి. ఒక్క ఏలూరు నగరంలోనే దాదా పు 35 వేల మంది నిరుద్యోగులకు నెలకు రూ.10.50 కోట్లు చెల్లించాలి. ప్రభుత్వం అధికారంలోకి వచ్చి 20 నెలలు పూర్తయినా నిరుద్యోగ భృతి ఊసెత్తకపోవడం దారుణం. దీనిపై పెద్ద ఎత్తున నిరుద్యోగులను సమీకరించి ఆందోళనలు చేపడతాం. – పాతిన వలస రాజేష్, వైఎస్సార్సీపీ విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షుడు నిరుద్యోగ భృతి వస్తే కోచింగ్ ఫీజులకో లేదా కనీస అవసరాలకో ఉపయోగపడుతుందని నమ్మిన యువతకు ఈ బడ్జెట్ మొండిచేయి చూపింది. రాష్ట్ర బడ్జెట్ నిరుద్యోగుల ఆశలపై నీళ్లు చల్లింది. నిరుద్యోగ భృతి ప్రస్తావనే లేకపోవడం దారుణం. ఉపాధి అవకాశాల కల్పనపై కూడా స్పష్టత లేకపోవడం సరికాదు. – బి.రాంబాబు నాయక్, ఎంపీపీ, చింతలపూడి మండల పరిషత్ మరోసారి బడ్జెట్లో నిరుద్యోగులకు మొండిచేయి చూపారు. డిగ్రీలు పట్టుకుని ఏళ్ల తరబడి నోటిఫికేషన్ల కోసం ఎదురుచూస్తున్న యువతకు ఈ బడ్జెట్ మరో కోలుకోలేని దెబ్బ. నిరుద్యోగుల శ్రేయస్సు కోసం ప్రభుత్వం ఎందుకు ఆలోచించడం లేదు. బడ్జెట్ అంకెల గారడీగా ఉంది. – కె.దినేష్రెడ్డి, రాష్ట్ర యువజన విభాగం కార్యదర్శి, చింతలపూడి -
అర్జీలపై అలసత్వం తగదు
ఏలూరు(మెట్రో) : పీజీఆర్ఎస్లో అందిన అర్జీలపై అలసత్వం తగదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి హెచ్చరించారు. సోమవారం కలెక్టరేట్లో జిల్లాస్థాయి పీజీఆర్ఎస్లో ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల్లో కొన్ని.. ● ఆగిరిపల్లి మండలంలోని ఈదులగూడేనికి చెందిన విద్యుత్ లైన్మెన్ బెజవాడ రమేష్ విద్యుత్ బిల్లులు కడతామని గ్రామస్తుల నుంచి సుమారు రూ.4 లక్షలు తీసుకుని చెల్లించకుండా ఇబ్బంది పెడుతున్నారని పలువురు గ్రామస్తులు కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ● గుండుగొలనులో ఏడో వార్డు పెత్తందారి వీధి నిర్మాణం చేపట్టాలని స్థానిక నిర్వాసితులు కలెక్టర్కు అర్జీ అందించారు. ● బుట్టాయగూడెం మండల కేంద్రంగా ఎస్టీ బాయ్స్ కాలేజీ హాస్టల్ స్థలంలో షాపింగ్ కాంప్లెక్స్ నిర్మాణాన్ని ఆపాలని విద్యార్థి, యువజన, ప్రజా సంఘాల ఆధ్వర్యంలో కలెక్టర్కు వినతిపత్రం అందించారు. -
ఆల్బెండజోల్తో నులిమేద్దాం!
యలమంచిలి: నులి పురుగులు చిన్నారుల్లో రక్తహీనతకు దారితీస్తాయి. కడుపులో చేరి నొప్పి, మంట, వికారం కలుగుజేస్తాయి. దీనివల్ల ఆకలి ఉండదు. పిల్లలు నీరసపడతారు. శారీరక, మానసిక ఎదుగుదల లోపాలను కలిగి ఉంటారు. వ్యాధి నిరోధక శక్తి తగ్గుతుంది. వాంతులు, మలంలో రక్తం, అతిసారం వంటి సమస్యలు ప్రబలుతాయి. ఏడాది నుంచి 19 ఏళ్లలోపు వారిలో ప్రధానంగా నులి పురుగుల సమస్య ఎక్కువగా ఉంటుంది. జిల్లా వ్యాప్తంగా ఏడాది నుంచి 19 ఏళ్లలోపు పిల్లలు 3,51,125 మంది ఉన్నారు. జాతీయ నులిపురుగుల నివారణ దినోత్సవం సందర్భంగా వీరికి ఈనెల 17 నుంచి ఆల్బెండజోల్ మాత్రలు అందించేందుకు ప్రభుత్వం ఏర్పాట్లు చేసింది. పాటించాల్సిన జాగ్రత్తలు ● అపరిశుభ్రత వల్ల నులి పురుగుల సమస్య తలెత్తుతుంది. కావున చిన్నారులు ఎప్పుడూ శుభ్రంగా ఉండాలి. ● చేతి గోళ్లలో పేరుకున్న మట్టి వల్ల నులి పురుగులు శరీరంలోకి ప్రవేశిస్తాయి. పెరిగిన గోళ్లను ఎప్పటికప్పుడు కత్తిరించుకోవాలి. ● మల విసర్జన తరువాత, భోజనానికి ముందు తప్పనిసరిగా చేతులు సబ్బుతో శుభ్రం చేసుకోవాలి. కాళ్లకు చెప్పులు ధరించాలి. ● శుభ్రమైన నీటిని తాగాలి, పండ్లు, కూరగాయలు శుభ్రంగా కడిగాక మాత్రమే వినియోగించాలి. చిన్నారుల జీవితాన్ని నులి పురుగులు నులి మేస్తున్నాయి. పిల్లల ఆరోగ్యంపై తీవ్ర ప్రభావాన్ని చూపిస్తున్నాయి. అలాంటి నులి పురుగులను కేవలం ఒకే మాత్ర ఆల్బెండజోల్తో నులిమేయవచ్చు. రాష్ట్ర వ్యాప్తంగా 19 ఏళ్ల లోపు వారందరికీ ఆల్బెండజోల్ మాత్రల పంపిణీ ఈ నెల 17న ప్రారంభమవుతుంది. -
అదుపు తప్పి పల్టీలు కొట్టిన కారు
తణుకు అర్బన్: దువ్వ జాతీయ రహదారిపై సోమవారం ఉదయం కారు అదుపు తప్పి బోల్తా పడిన ఘటనలో కారులో ఉన్న నలుగురికి స్వల్పగాయాలయ్యాయి. తణుకు సజ్జాపురం ప్రాంతానికి చెందిన నలుగురు పల్నాడు జిల్లా కోటప్పకొండ దేవాలయానికి వెళ్లి తిరుగు ప్రయాణంలో భాగంగా దువ్వ సమీపంలోని వ్యవసాయ చెక్ పోస్టు వద్దకు వచ్చే సరికి కారు అదుపు తప్పి పల్టీలు కొట్టుకుంటూ విశాఖ–విజయవాడ రోడ్డుపైకి వచ్చి బోల్తా కొట్టింది. అప్పటికే కారు నుజ్జు అయినప్పటికీ కారులోని ప్రయాణికులకు ఎలాంటి ప్రాణాపాయం లేకపోవడంతో ఊపిరి పీల్చుకున్నారు. ఘటనపై ఎలాంటి ఫిర్యాదు అందలేదని తణుకు రూరల్ పోలీసులు తెలిపారు. క్షతగాత్రులకు కారుమూరి పరామర్శ చలో గుంటూరు కార్యక్రమానికి వెళ్లేందుకు అదే ప్రాంతంలో వేచి ఉన్న వైఎస్సార్ సీపీ నాయకులు, కార్యకర్తలు కారు బోల్తా పడడాన్ని గమనించి వెంటనే పరుగున వెళ్లి క్షతగాత్రులను కారులో నుంచి జాగ్రత్తగా బయటకులాగారు. కాసేపటికి ఘటనా స్థలానికి వచ్చిన మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు బాధితులను పరామర్శించారు. -
బలివేలో కల్యాణ శోభ
ముసునూరు: బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం రాత్రి జగజ్జ్యోతి కార్యక్రమం అనంతరం స్వామివారి కల్యాణోత్సవాన్ని నేత్రపర్వంగా జరిపించారు. అర్చకులు తోలేటి అరుణ భాస్కర్, చావలి అమర్బాబు కల్యాణ తంతు నిర్వహించారు. అనంతరం స్వామివారి గ్రా మోత్సవంగా కిలోమీటరు దూరంలోని మృత్యుమల్లేశ్వరస్వామి (తాత గుడి) ఆలయానికి వెళ్లి ఆశీర్వచనాలు తీసుకున్నారు. ఈ వేడుకలో అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఉత్సవ ప్రాంగణంలో సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. సోమ వారం ఉదయం బిందె తీర్థం, హోమం, బలిహరణ, సాయంత్రం హోమం, బలి హరణాదులు, రాత్రి మహాకుంభం, నారకోలోత్సవం నిర్వహించారు. మంగళవారం అమావాస్య కావడంతో సోమవారం రాత్రి నుంచే అమావాస్య స్నానాలకు భక్తులు తరలివస్తున్నారని ఈఓ ఈవో పామర్తి సీతారామయ్య తెలిపారు. ఆలయం వద్ద ఉచిత వైద్య శిబిరం కొనసాగుతోంది. నూజివీడు పోలీసులు పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, సభ్యులు ఏర్పాట్లను పర్యవేక్షిస్తున్నారు. -
నేత్రపర్వం.. రథోత్సవం
భీమవరం(ప్రకాశం చౌక్): పంచారామ క్షేత్రం భీమవరం గునుపూడిలోని ఉమాసోమేశ్వర జనార్దనస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోమవారం రథోత్సవం నేత్రపర్వంగా నిర్వహించారు. ప్రత్యేక అలంకరణ చేసిన రథంలో స్వామి ఉత్సవమూర్తులతో క్షేత్రం దగ్గర నుంచి నాచువారి సెంటర్ వరకు రథోత్సవం నిర్వహించారు. స్థానిక ఎమ్మెల్యే అంజిబాబు పూజలు నిర్వహించి రథోత్సవాన్ని ప్రారంభించారు. ఆలయ ఈఓ డి.రామకృష్ణంరాజు, చైర్మన్ బంగార్రాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. -
కరుణించమ్మా.. కొల్లేరు పెద్దింట్లమ్మా
● ఈనెల 18 నుంచి అమ్మవారి జాతర ● వేంగి చాళుక్యుల కాలం నుంచి పెద్దింట్లమ్మకు పూజలు ● తెలంగాణ బోనాల తరహాలో మొక్కులు కై కలూరు: కొల్లేటి మహాపట్టమహిషి పెద్దింట్లమ్మ జాతర ద్వీపకల్పమైన కొల్లేరు సరస్సు మధ్యన అంగరంగ వైభవంగా జరగనుంది. రాష్ట్రంలో అత్యంత పురాతన చరిత్ర కలిగిన దేవాలయాల్లో ఏలూరు జిల్లా, కై కలూరు మండలం కొల్లేటి కోట పెద్దింట్లమ్మ దేవస్థానం ఒకటి. ప్రతి ఏటా ఫాల్గుణ శుద్ధ పాడ్యమి నుంచి పౌర్ణమి వరకూ జాతర జరుగుతుంది. ఈ ఏడాది ఫిబ్రవరి 18 నుంచి మార్చి 3 వరకు అమ్మవారి జాతర (తీర్థం) నిర్వహిస్తున్నారు. జాతరలో అత్యంత కీలకఘట్టమైన జలదుర్గా గోకర్ణేశ్వరుల కల్యాణం ఈనెల 28 శనివారం రాత్రి జరుగుతుంది. కొల్లేరు సరస్సు మధ్యలో కోట దిబ్బపై పెద్దింట్లమ్మతల్లి 9 అడుగుల ఎత్తులో, విశాల నేత్రాలతో వీరాసన భంగిమలో భక్తులకు దర్శనమిస్తారు. కాలాలతో పాటు కోటలు మాయమైనప్పటికీ పెద్దింట్లమ్మ తల్లి విగ్రహం చెక్కుచెదరకుండా ఉండటం విశేషం. సామాన్యంగా ఒక గ్రామానికి ఒక దేవత ఉంటుంది. కానీ పెద్దింట్లమ్మను ఏలూరు, పశ్చిమ గోదావరి జిల్లాల పరిధిలో 44 కొల్లేరు దిబ్బలపై నివ సించేవారందరూ కులదైవంగా ఆరాధిస్తారు. కొల్లేరుకు తెలంగాణ బోనాల సంప్రదాయం తెలంగాణలో ఉజ్జయిని మహంకాళి, మైసమ్మ, పోచమ్మ.. పెద్దమ్మ, మారెమ్మలకు జూలై నెలలో బోనాలు సమర్పిస్తారు. అదేవిధంగా 2020 నుంచి కొల్లేటికోట పెద్దింట్లమ్మకు బోనాలు సమర్పిస్తున్నారు. అమ్మవారి దేవస్థానానికి 2 కిలోమీటర్ల దూరంలోని పందిరిపల్లిగూడెం నుంచి ప్రభల ఊరేగింపుతో పాటు బోనాలు ప్రతి ఏటా తీసుకొస్తున్నారు. బోనాలు, 7 కావిళ్లలో అమ్మవారి పుట్టించి నైవేద్యం పసుపు, కుంకుమ, నెయ్యి, వేప రొట్టలు, నిమ్మకాయలు, పానకం, కల్లుతో పెద్దింట్లమ్మ దేవస్థానం తీసుకువస్తారు. 3 మైళ్ల దూరంలోని గోకర్ణేశ్వరపురంలో గోకర్ణేశ్వరస్వామిని ఊరేగింపుగా తీసుకొచ్చి అమ్మవారితో అంగరంగ వైభవంగా కల్యాణం జరిపిస్తారు. జాతరలో కొల్లేరు భక్తజన సంద్రంగా మారిపోతుంది. చుట్టుపక్కల గ్రామాల నుంచి, జిల్లాల నుంచి భక్తులు విరివిగా విచ్చేసి అమ్మవారిని, స్వామివారిని దర్శించుకుని తమ మొక్కులు తీర్చుకుంటూ ఉంటారు. గ్రంథాల్లో కొల్లేరు అందాలు.. రామాయణం అరణ్యకాండలో అగస్త్య మహాముని, శ్రీరాముడికి ఈ సరస్సు గురించి చెప్పినట్లు ఉంది. అదే విధంగా దండి అనే మహాకవి తన దశకుమార చరిత్రలో కొల్లేరు సరస్సును అభివర్ణించాడు. చరిత్రలో కొల్లేటి కోట, కొల్లేరు సరస్సు ప్రాంతాన్ని కొల్లేటికోట, కొల్లివీటికోట, కర్ణపురి, కొల్హాపురి, కృష్ణా, గోదావరి సంగమ సృష్ట్యారంభ పద్మ సరస్సు, దేవపుష్కరిణి, బ్రహ్మ సరస్సు. అరజా సరోవరం, బ్రహ్మండ సరస్సు, కోలాహలపురం. కొల్లేరు, కొలనువీడు అని వ్యవహరించేవారు. ప్రయాణం సులభతరం పూర్వం కొల్లేటికోట పెద్దింట్లమ్మ జాతరకు వెళ్లాలంటే ప్రయాణం కష్టతరంగా ఉండేది. అటువంటిది ఆలపాడు నుంచి అమ్మవారి దేవస్థాఽనం 7 కిలోమీటర్ల రోడ్డుకు మరమ్మతులు చేశారు. కొన్ని ప్రాంతాల్లో నూతన రోడ్డు ఏర్పాటు చేశారు. వైఎస్సార్సీపీ పాలనలో మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) దాతల సాయంతో నిర్మించిన అతిపెద్ద అనివేటి మండపం ఆకర్షణీయంగా మారింది. చలువ పందిర్లు, భక్తులకు కావల్సిన అన్ని వసతులు సిద్ధం చేశారు. కొల్లేటికోట పెద్దింట్లమ్మ సేవ చేయడం అదృష్టంగా భావిస్తున్నాను. అమ్మవారి దేవాలయం వరకు ప్రభుత్వం సీసీ రోడ్లు ఏర్పాటు చేసింది. భక్తులకు జల్లు స్నానాలు, చలువ పందిర్లు, వంట ప్రాంగణాలు, కోనేరులో నీరు ఇలా అన్ని సౌకర్యాలు కల్పించాం. జాతరలో ప్రధాన ఘట్టమైన జలదుర్గాగోకర్ణేశ్వరుని కల్యాణం ఈ నెల 28న జరుగుతుంది. భక్తులు అమ్మను దర్శించుకోవాలి. – కూచిపూడి శ్రీనివాసు, పెద్దింట్లమ్మ ఆలయ కార్యనిర్వాహణాధికారి, కొల్లేటికోట -
ప్రణాళికాబద్ధంగా మాత్రల పంపిణీ
ఈ నెల 17న ఆల్బెండజోల్ మాత్రలను ఒకటి నుంచి 19 ఏళ్లలోపు పిల్లలచే మింగిస్తాం. ఆ రోజు కుదరని వారికి ఈ నెల 24న స్పెషల్ డ్రైవ్ పెట్టి మాత్రలు ఇస్తాం. నూరు శాతం లక్ష్యాన్ని చేరుకోవడానికి ప్రణాళిక సిద్ధం చేశాము. – డాక్టర్ వాకా ప్రసాద్, డిప్యూటీ డీఎంహెచ్ఓ, నరసాపురం ఏడాది నుంచి రెండేళ్లలోపువారికి ఆల్బెండజోల్ సగం మాత్రను నీళ్లలో కలిపి ఇవ్వాలి. 2 నుంచి 19 ఏళ్లలోపు వారు మధ్యాహ్నం భోజనం తరువాత మాత్రను చప్పరించేలా చూడాలి. టీచర్లు, వైద్య సిబ్బంది పర్యవేక్షణలో మాత్రలు నమిలి మింగించేలా చూడాలి. – డాక్టర్ కె.అశ్వని, వైద్యాధికారి, మేడపాడు పీహెచ్సీ -
శుభకార్యం ఇంట మృత్యు ఘంటికలు
● విద్యుత్ షాక్ తగిలి బాలుడి మృతి ● శోకసంద్రంలో బంధుగణం జంగారెడ్డిగూడెం: కొద్ది గంటల్లో శుభకార్యం జరగాల్సిన ఆ ఇంట మృత్యుఘంటికలు మోగాయి. పుష్పాలంకరణ వేడుక సందడిలో ఉన్న బంధుగణం అంతా విద్యుత్ షాక్ తగిలి బాలుడు మృతి చెందిన ఘటన చూసి హతాశులయ్యారు. జంగారెడ్డిగూడెం మండలం వెంకటరామానుజపురంలో విద్యుత్ షాక్ తగిలి 11 సంవత్సరాల బాలుడు మృతి చెందాడు. బాలుడి కుటుంబ సభ్యులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వెంకటరామానుజపురం గ్రామానికి చెందిన నూనె చంద్రం, లలిత దంపతుల కుమారుడు నూనె వెంకట సుశాంత్ (11) పట్టణంలోని ఓ ప్రైవేట్ పాఠశాలలో 6వ తరగతి చదువుతున్నాడు. సోమవారం నూనె చంద్రం బావమరిది నులకాని మధు కుమార్తె పుష్పాలంకరణ వేడుక జరగనుంది. వీరిద్దరి ఇళ్లు పక్కపక్కనే ఉండడంతో మధ్యు ఇంటి శుభకార్యం హడావుడిలో బంధువులు, కుటుంబసభ్యులు ఉన్నారు. అక్కడే వంటలు చేసేందుకు వినియోగించే గ్రైండర్ను విద్యుత్ బోర్డుకు తగిలించి స్విచ్ ఆన్ చేసి వదిలివేశారు. అటు ఇటు తిరుగుతున్న సుశాంత్ గ్రైండర్ వైర్ కట్ అయి ఉన్న చోట కాలు వేయడంతో విద్యుత్ షాక్ తగిలింది. వెంటనే బాలుడు ఒక చేతితో గ్రైండర్ను, మరో చేతితో ఐరన్ బల్లను పట్టుకుని అక్కడికక్కడే కూర్చిండిపోయాడు. కొద్దిసేపటికి బాలుడి అమ్మమ్మ నరాల సీతమ్మ వచ్చి అలా ఎంత సేపు కుర్చొంటావు అంటూ సుశాంత్ను పట్టుకోబోయింది. ఆమెకు విద్యుత్ షాక్ తగలడంతో వెంటనే వదిలించుకుని, బందువులను పిలిచింది. వారు విద్యుత్ బోర్డు స్విచ్ ఆఫ్ చేసి బాలుడిని హుటాహుటిన స్థానిక ఏరియా ఆసుపత్రికి తరలించారు. పరీక్షించిన వైద్యులు బాలుడి మృతి చెందినట్లు నిర్ధారించారు. పోస్టుమార్గం నిర్వహించి, మృతదేహాన్ని కుటుంబసభ్యులకు అప్పగించారు. బాలుడు తండ్రి చంద్రం ఫిర్యాదుతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపారు. కాగా, వేడుక జరగాల్సిన ఇంట బాలుడు మరణ వార్తతో గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. మధు ఇంట్లో జరగాల్సిన పుష్పాలంకరణ వేడుక నిలిచిపోయింది. కై కలూరు: వరకట్న వేధింపులపై కై కలూరు రూరల్ పోలీసు స్టేషన్లో సోమవారం కేసు నమోదైంది. కై కలూరు మండలం పెంచికలమర్రుకు చెందిన ప్రశాంతికి ఏలూరు జిల్లా గుడివాకలంకకు చెందిన బలే రామారావుతో మూడేళ్ల క్రితం వివాహమైంది. వీరికి ఇరువురు సంతానం. కొద్ది రోజులుగా అధికకట్నం తీసుకురావాలని వేధిస్తుడటంతో భర్త, అతని కుటుంబ సభ్యులపై ప్రశాంతి పోలీసులకు ఫిర్యాదు చేసింది. రూరల్ ఎస్సై వి.రాంబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శివోహం.. భజేహం
ముసునూరు మండలం బలివే ఉత్సవాల్లో జన సందోహం ముసునూరు: హరహర మహాదేవ శంభోశంకర స్మ రణలు మార్మోగాయి. బలివేలోని రామలింగేశ్వరస్వామి ఆలయంలో మహాశివరాత్రి ఉత్సవాలు వైభవంగా జరుగుతున్నాయి. శనివారం అర్ధరాత్రి నుంచి ఆలయ ప్రాంగణంలో భక్తులు బారులు తీరారు. ఆదివారం వేకువజామున విశేష అభిషేకాల అనంతరం భక్తులను అనుమతించారు. ముందుగా భక్తు లు తమ్మిలేరు, జల్లు స్నానఘట్టాల వద్ద పుణ్యస్నానాలు ఆచరించారు. పితృదేవతలకు పిండ ప్రదా నాలు చేసి తర్పణలు వదిలారు. అన్నిశాఖల అధికారులు, పంచాయతీ సమష్టి కృషితో ఉత్సవాలు జయప్రదమైనట్టు సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య ప్రకటించారు. మంత్రి కొలుసు పార్థసారథి, దెందులూరు ఎమ్మెల్యే ప్రభాకర్, జిల్లా అదనపు ఎస్పీ మునిరాజు, నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్, సీఐలు రామకృష్ణ, సత్య శ్రీనివాస్, రాజశేఖర్ తదితరులు స్వామివారిని దర్శించుకున్నారు. భక్తుల సేవలో స్వచ్ఛంద సంస్థలు స్వచ్ఛంద సేవా సంస్థలు, దాతల ఆధ్వర్యంలో భక్తులకు పులిహోర, చక్రపొంగలి, దద్దోజనం, బిస్కెట్లు, మంచినీరు, మజ్జిగ అందజేశారు. పీహెచ్సీ వైద్యాధికారి షకీనా ఇవాంజిలిన్ ఆధ్వర్యంలో ఏడుగురు వైద్యాధికారులతో ఉచిత వైద్య శిబిరం నిర్వహించి 1,708 మందికి వైద్య సేవలు అందించారు. సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాటుచేశారు. పట్టిసం.. భక్తజన సంద్రం పోలవరం రూరల్: పట్టిసంలో మహాశివరాత్రి ఉత్సవాలకు భక్తులు పోటెత్తారు. పవిత్ర గోదావరిలో పు ణ్యస్నానమాచరించి భద్రకాళీ సమేత వీరేశ్వర స్వామి దర్శించుకున్నారు. సుమారు 2 లక్షల మంది భక్తులు క్షేత్రానికి వచ్చినట్టు అంచనా. వీరిలో సు మారు 50 వేల మంది తూర్పుగోదావరి జిల్లా నుంచి ట్రాక్టర్లు, ఎడ్ల బండ్లు, కాలినడకన క్షేత్రానికి చేరుకున్నారు. భక్తులు క్షేత్రం దిగువన ఇసుక తిన్నెల వరకూ క్యూకట్టారు. క్యూలైన్లో భక్తులు తాగునీటికి ఇబ్బందులు పడ్డారు. ఇసుక తిన్నెలపై జాతర సందడి కనిపించింది. వేకువజామున ఆలయ వంశపారంపర్య ధర్మకర్త కొచ్చర్లకోట వీరభద్రరావు కుటుంబసభ్యులు స్వామివారికి తొలిపూజ నిర్వహించారు. సాయంత్రం నుంచి భక్తుల రద్దీ మరింత పెరిగింది. పాతాళ భోగేశ్వరా.. పాహిమాం కలిదిండి(కై కలూరు): దక్షిణ కాశీగా పేర్గాంచిన కలిదిండి పార్వతీ సమేత పాతాళ భోగేశ్వరస్వామి శివరా త్రి కల్యాణం (తీర్థం)కు భక్తులు పోటెత్తారు. శనివా రం అర్ధరాత్రి స్వామి కల్యాణాన్ని నిర్వహించారు. ఆ దివారం వేకువజాము నుంచి భక్తులు స్వామి దర్శనానికి తరలివచ్చారు. ఆలయంలో విశేష పూజలు జరిగాయి. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు, కై కలూరు మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) తదితరులు స్వామిని దర్శించుకున్నారు. సుమారు 2 లక్షల మంది స్వామివారిని దర్శించుకున్నట్టు అంచనా. రాత్రి స్వామివారి తెప్పోత్సవం ఘనంగా నిర్వహించారు. సీఐ వి.రవికుమార్ ఆధ్వర్యంలో పటిష్ట బందోబస్తు ఏర్పాట్లుచేశారు. ద్వారకాతిరుమలలో.. ద్వారకాతిరుమల : క్షేత్రపాలకుడిగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వరస్వామివారి ఆలయంలో శివదేవుని కల్యాణోత్సవం రాత్రి ఘనంగా జరిగింది. వే కువజాము నుంచి ఆలయానికి భక్తులు పోటెత్తారు. హరహర మహాదేవ శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు బలివే, పట్టిసంలో జనసందోహం వేకువజాము నుంచి బారులు ఘనంగా మహాశివరాత్రి ఉత్సవాలు -
వీఆర్ఏల సమస్యలపై ముఖం చాటేసిన ప్రభుత్వం
ఉండి: గత ఎన్నికల సమయంలో వీఆర్ఏల సమస్యలు పరిష్కరిస్తామని మాటిచ్చిన కూటమి ప్రభు త్వం అధికారం చేపట్టిన తర్వాత ముఖం చాటేసిందని వీఆర్ఏల సంఘ జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు ఆవేదన వ్యక్తం చేశారు. ఈనెల 18న వీఆర్ఏల సమస్యల పరిష్కారం కోరుతూ సంఘ ఆధ్వర్యంలో కలెక్టర్కు రాయబారం పంపే కార్యక్రమంపై ఆదివారం ఉండిలో చర్చించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర కమిటీ పిలుపుమేరకు 18న రాష్ట్రవ్యాప్తంగా కలెక్టర్లకు రాయబారం కార్యక్రమం నిర్వమించనున్నామన్నారు. సంఘ జిల్లా గౌరవాధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ సమస్యల పరిష్కారం కోసం పలుమార్లు వినతులు ఇచ్చినా ఫలితం లేదన్నారు. కనీసం సమస్యల పరిష్కారం దిశగా ఆలోచన కూడా చేయడం లేదన్నారు. తెలంగాణ మాదిరి పే స్కేలు తక్షణమే అమలు చేయాలని డిమాండ్ చేస్తున్నామన్నారు. భీమవరంలో జరిగే రాయబార కార్యక్రమాన్ని జిల్లాలోని వీఆర్ఏలు విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. వీఆర్ఏలు పాల్గొన్నారు. -
ఫైళ్లు కదలవు.. సమస్యలు తీరవు
భీమవరం(ప్రకాశం చౌక్) : పాలనా సౌలభ్యం, ప్రజ లకు పరిపాలన అందుబాటులో ఉండటంతో పా టు సమస్యలను వేగంగా పరిష్కరించాలనే లక్ష్యంతో గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి జిల్లాలను పునర్విభజన చేశారు. దీనిలో భాగంగా భీమవరం కేంద్రంగా నూతన పశ్చిమగోదావరి జిల్లా ఏర్పడింది. ఈ ప్రాంత ప్రజలకు కలెక్టరేట్ అందుబాటులోకి వచ్చింది. అయినా ప్రజల సమస్యలు తీరడం లేదు. అర్జీలు అందించి నెలలు గడుస్తున్నా భూసమస్యలు పరిష్కారం కావడం లేదు. నెలల తరబడి పెండింగ్లోనే.. కలెక్టరేట్కు వచ్చే రెవెన్యూ శాఖకు సంబంధించి ఫైళ్ల పరిస్థితి దారుణంగా ఉంది. రెవెన్యూ సమస్యలపై స్థానిక తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందిస్తే తర్వాత ఫైల్ సిద్ధం చేయడానికి నెల రోజులు, అక్కడ నుంచి ఆర్డీఓ కార్యాలయానికి పంపించడానికి మరో నెల రోజులు, అక్కడ నుంచి కలెక్టరేట్కు పంపించడానికి మరో నెల రోజులు ఇలా మూడు నెలలు సమయం పడుతుంది. అలాగే కొన్ని తహసీల్దార్, ఆర్డీఓ కార్యాలయాల్లోనే నెలల తరబడి పెండింగ్లోనూ ఉండిపోతున్నాయి. చివరకు కలెక్టరేట్ కు వచ్చినా ఫైల్ జాయింట్ కలెక్టర్, కలెక్టర్ లా గిన్కు వెళ్లడానికి మరో మూడు నుంచి ఆరు నెలలు సమయం పడుతుంది. అది కూడా అర్జీదారులు కలెక్టరేట్కు వచ్చి అధికారులు చూట్టూ తిరిగితే గానీ ఫైల్ ముందుకు కదలని పరిస్థితి. కలెక్టర్, జేసీ లాగిన్కు వెళ్లిన ఫైల్ కూడా ఎప్పుడు క్లియర్ చేస్తారో ఎవరికీ తెలియని పరిస్థితి. పైసలిస్తేనే ముందుకు..! భూ సమస్యల, మార్పులు చేర్పులపై దరఖాస్తులు ముందుకు కదలలాంటే వసూళ్ల పర్వం కొనసాగుతుందనే ఆరోపణలు ఉన్నాయి. తహసీల్దార్, ఆర్డీ ఓ కార్యాలయాల్లో పైసలిస్తేనే ఫైళ్లు కలెక్టరేట్కు చేరుతున్నాయని, లేకుంటే నెలల తరబడి నిరీక్షణ తప్పదనే విమర్శలు వస్తున్నాయి. సమస్యలు వేగంగా పరిష్కారం కాకపోవడంతో ప్రతి సోమ వారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో మళ్లీ మళ్లీ అవే అర్జీలు వస్తున్నాయి. కలెక్టర్, జాయింట్ కలెక్టర్ పట్టించుకుని అర్జీలను వేగంగా పరిష్కరించాలని అర్జీదారులు కోరుతున్నారు. ఆకివీడుకు చెందిన ఓ మహిళ తన అడంగల్లో భూ విస్తీర్ణానికి సంబంధించి సరిచేయాలని దరఖాస్తు చేసుకున్నారు. తహసీల్దార్ కార్యాలయం నుంచి ఆర్డీఓ కార్యాలయానికి అక్కడి నుంచి కలెక్టరేట్కు చేరడానికి మూడు నెలలు పట్టింది. కలెక్టరేట్కు చేరి ఆరు నెలలు గడిచింది. మహిళ కుటుంబసభ్యులు నెలల తరబడి కలెక్టరేట్లోని అధికారుల చుట్టూ తిరిగితే ఇటీవల జాయింట్ కలెక్టర్ లాగిన్కు వెళ్లింది. అయినా ఇప్పటికీ ఫైల్ క్లియర్ కాలేదు. భీమవరం మండలం గుట్లపాడుకు చెందిన ఓ రైతు తన భూమిని 22ఏ నుంచి తొలగించాలని కోర్టు ఆర్డర్ ఉందని ఏడాది క్రితం తహసీల్దార్ కార్యాలయంలో అర్జీ అందజేశారు. ఆర్డీఓ కార్యాలయం ద్వారా కలెక్టరేట్కు దరఖాస్తు చేసుకోగా.. నెలల తరబడి సదరు రైతును తిప్పుకుని చివరకు ఆ పని చేయలేమని కలెక్టర్, జేసి చేతులు ఎత్తేశారు. దీంతో సదరు రైతు కోర్టు ఆర్డర్ అమలు చేయలేదని మరలా కోర్టును ఆశ్రయించాడు. ముందుకు కదలని భూ సమస్యల దస్త్రాలు నెలల తరబడి లాగిన్లలోనే.. అధికారుల తీరుతో అర్జీదారుల అసంతృప్తి కలెక్టరేట్ చుట్టూ ప్రదక్షిణలు కలెక్టర్, జేసీ సమీక్షా సమావేశాలు, వీడియో కాన్ఫరెన్స్లు, పర్యటనల కారణంగానే ఫైల్స్ క్లియర్ చేయడంలో ఆలస్యమవుతోందని తెలుస్తోంది. తమ ఫైళ్ల పరిస్థితిపై అడిగితే కలెక్టరేట్ అధికారులు ఇదే సమాధానమిస్తున్నారని అర్జీదారులు ఆవేదన చెందుతున్నారు. నరసాపురం, భీమవరం ఆర్డీఓ కార్యాలయాల నుంచి కలెక్టరేట్ వరకు సుమారు 500 నుంచి 1,500 వరకు ఫైళ్లు పెండింగ్లో ఉన్నట్టు అంచనా. వాటిలో 22 ఏ, భూ విస్తరణ, వర్గీకరణ తదితర భూ సమస్యల ఫైళ్లు ఉన్నాయి. గ్రామాల్లో సమావేశాలు నిర్వహించి రెవెన్యూ సమస్యలు పరిష్కరిస్తామని గొప్పలు చెబుతున్న ప్రభుత్వం క్షేత్రస్థాయిలో మాత్రం పట్టించుకోవడం లేదనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. -
ఫ్రీజర్ లేదు.. కావాలంటే తెచ్చుకోండి
● మృతదేహంపై ప్రభుత్వాస్పత్రి అధికారుల నిర్లక్ష్యం ● భీమవరంలో ఘటన ● దళితుడనే ఇంత నిర్లక్ష్యమా అంటూ కేవీపీఎస్ ఆగ్రహంభీమవరం (ప్రకాశంచౌక్): చనిపోయిన వ్యక్తి మృతదేహాన్ని ఫ్రీజర్లో ఉంచాల్సి ఉండగా, తమ వద్ద అలాంటి సౌకర్యాలేమీ లేవని, కావాలంటే ఫ్రీజర్ తెచ్చుకోవాలని భీమవరం ప్రభుత్వాస్పత్రి వైద్యాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించారు. వివరాలిలా ఉన్నాయి.. ఆదివారం అత్తిలి మండలం వరిఘేడుకి చెందిన కన్నెపా ముల రాంబాబు (49) భీమవరం అంబేడ్కర్ సెంటర్లో సొంత ఆటోలో కూర్చొని ఉండగా ఒక్కసారిగా కుప్పకూలిపోవడంతో భీమవరం ప్రభుత్వాస్పత్రికి తరలించారు. వైద్యులు పరీక్షించి ఫిట్స్ ద్వారా మృతిచెందినట్టు నిర్ధారించారు. టూటౌన్ పోలీసులు కేసు నమోదు చేశా రు. పోస్టుమార్టం చేసి మృతదేహాన్ని అప్పగిస్తా మని వైద్యులు తెలిపారని, అయితే మృతదేహా న్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే వదిలేశారని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు. ఆస్పత్రిలో ఫ్రీజర్ లేదని, అలాంటి సౌకర్యాలు ఇ క్కడ లేవని నిర్లక్ష్యంగా సమాధానమిచ్చారని ఆగ్రహం వ్యక్తం చేశారు. బాడీని ఇవ్వకుండా.. ఫ్రీజర్లో పెట్టకుండా.. దళిత వ్యక్తి మృతదేహం పట్ల భీమవరం ప్రభు త్వ ఆసుపత్రి అధికారులు, సిబ్బంది తీరు దారుణమని కేవీపీఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి కె.క్రాంతి బాబు అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆసుపత్రిలో మార్చురీలో ఫ్రీజర్ లేకపోవడం అధికారుల నిర్లక్ష్యానికి నిదర్శనమన్నారు. మృతదేహాన్ని ఫ్రీజర్లో పెట్టకుండా బయటే పెట్టడంతో బంధువులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారని తెలిపారు. కనీసం బాడీని తమకు అప్పగించండని వేడుకుంటున్నా ఇవ్వకుండా.. అటు ఫ్రీజర్లో పెట్టకుండా ఇబ్బందులకు గురిచేస్తున్నారని తెలిపారు. జిల్లా అధికారుల నిర్లక్ష్యం వల్లే జిల్లా కేంద్ర ప్రభుత్వాస్పత్రిలో కనీస సదుపాయాలు లేవని అర్థమవుతోందన్నారు. సౌకర్యాలు లేకనా లేదా చనిపోయిన వ్యక్తి దళితుడు కాబట్టే ఇంత నిర్లక్ష్యమా అని ప్రశ్నించారు. ఏలూరు (టూటౌన్): రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి కేవలం 10.5 శాతం మాత్రమే కేటాయించారని, ఇది విద్యార్థుల సమస్యల పరిష్కారానికి, ప్రభుత్వ విద్య బలోపేతానికి ఏమాత్రం సరిపోదని ఏఐఎస్ఎఫ్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు డి.శివకుమార్ అన్నారు. కనీసం 30 శాతం నిధులు కేటాయించాలన్నారు. తల్లికి వందనం పథకానికి రూ.12 వేల కోట్లు అవసరం కాగా రూ.9,668 కోట్లు కేటాయించడం సరికాదన్నారు. ప్రభుత్వ విశ్వవిద్యాలయాల్లో పలు సమస్యలు ఉన్నాయని, 4,200 ప్రొఫెసర్, అసిస్టెంట్ ప్రొఫెసర్, అసోసియేట్ ప్రొఫెసర్ వంటి పోస్టులు ఖాళీలు ఉన్నాయన్నారు. అయినా బడ్జెట్లో 0.77 శాతం మాత్రమే నిధులు కేటాయించారన్నారు. పెండింగ్లో ఉన్న ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలపై బడ్జెట్లో ఊసే లేదని మండిపడ్డారు. హాస్టల్ విద్యార్థులకు మెస్, కాస్మోటిక్ చార్జీల పెంపు, భవనాలు, మరమ్మతులపై స్పష్టత లేదన్నారు. విద్యారంగానికి ప్రభుత్వం కేటాయించిన నిధులు అంకెల గారడీగా ఉన్నాయని, మరిన్ని నిధులు కేటాయించాలని డిమాండ్ చేశారు. ఏలూరు (ఆర్ఆర్పేట): పవిత్ర ఖురాన్ అవతరంచిన రంజాన్ మాసంలో విధిగా ఉపవాసా లు, దానధర్మాలు, పుణ్యకార్యాలు చేయాలని జమాతే ఇస్లామీ హింద్ ఏలూరు జిల్లా అధ్యక్షుడు ముహ్మద్ ముజాహిద్ అన్నారు. స్థానిక శనివారపుపేటలోని జామియా మసీ దులో జమాతే ఇస్లామీ హింద్ శనివారపుపేట శాఖ ఆధ్వర్యంలో రంజాన్ స్వాగత సభను శనివారం రాత్రి నిర్వహించారు. ముఖ్య అతిథిగా ముజాహిద్ మాట్లాడుతూ మానవ జీవన విధా నాన్ని ఖురాన్ తెలియజేస్తుందన్నారు. తమ సంపాదనలో నుంచి జకాత్ (కొంత సొమ్ము) తీసి పేదలు, అనాథలకు ఇవ్వాలని దేవుడు ఆదేశించాడన్నారు. మసీదు ఇమామ్ హాఫిజ్ గులాం రబ్బానీ మాట్లాడుతూ సర్వమానవులకు ఖురాన్ మార్గదర్శకమన్నారు. ఉపవాసా లు పాటిస్తూ చెడు పనులకు దూరంగా ఉండాలని హితవుపలికారు. శనివారపు పేట శాఖ ప్రతినిధి షేక్ షాజహాన్, స్థానిక జమాత్ అధ్యక్షుడు అబ్దుల్ ఖాదర్ తదితరులు పాల్గొన్నారు. -
స్కేటింగ్లో సత్తా
తణుకు అర్బన్: స్కేటింగ్లో సత్తాచాటి తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అంతర్జాతీయ స్థాయి పోటీలకు ఎంపికై ంది. 8 ఏళ్ల వయసులోనే స్కేటింగ్లో కఠోర సాధన చేసి ఇంత వరకు 25 పతకాలు సాధించి సంచలనం రేకెత్తిస్తోంది. 3వ తరగతి చదువుతున్న చిన్నారి ప్రతిరోజూ తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందుతూ తన ప్రతిభను చాటుతోంది. ఈవెంట్స్ ఉన్న రోజుల్లో ముందు నుంచి ఉదయం సమయంలో కూడా ప్రాక్టీస్ చేస్తుంది. అంతర్జాతీయ స్థాయికి చేరిన దీపికతో క్రీడాభిమానులు ఫొటోలు దిగి కూడళ్లలో ఫ్లెక్సీలు ఏర్పాటుచేయడం విశేషం. పతకాల ప్రయాణమిలా.. ఈ నెల 7, 8 తేదీల్లో పూనేలో జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో ఆంధ్రప్రదేశ్ తరపున పాల్గొన్న దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు ఈవెంట్స్లో మూడు బంగారు పతకాలు సాధించి మాల్దీవుల్లో జరగనున్న అంతర్జాతీయ స్కేటింగ్ పోటీలకు అర్హత సాధించింది. ఇంతవరకు పూనే, విశాఖపట్నం, విజయవాడ, రాజమండ్రి, ఏలూరు, కాకినాడ ప్రాంతాల్లో నిర్వహించిన పోటీల్లో పాల్గొని రాష్ట్ర, జిల్లా స్థాయిలో నిర్వహించిన పోటీల్లో 14 బంగారు, 7 సిల్వర్, 4 కాంస్య పతకాలు సాధించింది. -
మృతదేహంతో ధర్నా
ఉండి: సుమారు మూడు నెలల క్రితం ఒమన్ దేశంలో మృతి చెందిన ఓ మహిళ మృతదేహంతో ఆదివారం కుటుంబీకులు ఏజెంట్ ఇంటి ముందు ధర్నాకు దిగారు. మృతురాలి కుమార్తె వివరాల ప్రకారం నర్సాపురం మండలం చిట్టవరానికి చెందిన పిట్ట రాజమణిని ఉండి మండలం ఎన్నార్పీ అగ్రహారం గ్రామానికి చెందిన ఏజెంట్ విమల ఒమన్కు పంపించింది. వెళ్ళినప్పటి నుండి ఆమెకు అనారోగ్యంగా ఉండటంతో ఆసుపత్రిలో చేర్చారు. ఆరోగ్య పరిస్థితి విషమించడంతో గత ఏడాది డిసెంబర్ 4న ఆమె మృతి చెందింది. తన తల్లి మరణించినట్లు ఏజెంట్ ఫోన్ చేసి చెప్పిందని మృతదేహాన్ని తీసుకురావాలని ఎన్నిసార్లు అడిగినా పట్టించుకోలేదని తెలిపారు. స్థానికంగా ఉన్న భారతీయుల సాయంతో తల్లి మృతదేహాన్ని తీసుకొచ్చామని ఆమె తెలిపారు. మృతురాలి కుటుంబీకులు ఇచ్చిన ఫిర్యాదును స్వీకరించారు. కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గధామంగా పేరుపొందిన ఆటపాక పక్షుల విహార కేంద్రంలో పర్యాటకులు ఆదివారం సందడి చేశారు. శివరాత్రి పర్వదినం కావడంతో విజయవాడ – నరసాపురం రూట్లో శైవ క్షేత్రాలను సందర్శించే యాత్రకులు ఆటపాక పక్షుల కేంద్రాన్ని సందర్శించారు. బోటు షికారులో ప్రయాణించి పెలికాన్, పెయింటెడ్ స్ట్రార్క్ పక్షుల కేరింతలను దగ్గర నుంచి వీక్షించారు. భీమడోలు: మానసిక స్థితి బాగోలేక ఓ వ్యక్తి ఆత్మహత్య చేసుకున్నాడు. ద్వారకాతిరుమలకు చెందిన చీమకుర్తి జ్యోతికృష్ణ గణపతి(50) శనివారం రాత్రి భీమడోలు రైల్వే గేటు సమీపాన రైలు కింద పడి మృతి చెందాడు. జ్యోతికృష్ణ గణపతి ఆలయం వద్ద దుకాణాన్ని నిర్వహించేవాడు. కొంత కాలంగా ఆనారోగ్యంతో బాధపడుతున్నాడు. దీనితో ఇంట్లో ఎవరి చెప్పకుండా శనివారం సాయంత్రం బయటకు వచ్చేసాడు. భీమడోలు రైల్వే గేటు వద్ద ఆత్మహత్యకు పాల్పడ్డాడు. ఏలూరు రైల్వే పోలీసులు మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అనుమానాస్పద కేసుగా నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. మృతునికి భార్య, పిల్లలు ఉన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): నగరంలో స్థానిక శాంతినగర్లోని మన్నా చర్చ్ పాస్టర్ ఎం.జ్యోతిరాజు ఆధ్వర్యంలో ఆదివారం స్తుతి నైవేద్యం కార్యక్రమం వైభవంగా నిర్వహించారు. స్థానిక గ్జేవియర్ నగర్లోని సెయింట్ గ్జేవియర్ స్కూల్ ప్రాంగణంలో ఆదివారం సాయంత్రం నిర్వహించిన ఈ కార్యక్రమంలో జ్యోతిరాజు మాట్లాడుతూ ఏసుక్రీస్తు మార్గం ప్రపంచానికి అనుసరణీయమన్నారు. నిన్నువలె పొరుగువారిని ప్రేమించు అని సూచించిన ఏసు ప్రభువు మార్గంలో పయనిస్తూ ప్రతి ఒక్కరూ పొరుగువారితో సోదరభావంతో మెలగాలని, పేదలకు సేవ చేయడం ద్వారా ప్రభువుకు చేరువకావచ్చన్నారు. ఈ సందర్భంగా క్రైస్తవ సంగీత దర్శకులుగా, గాయకులుగా, వాయిద్య కళాకారులుగా పేరుగాంచిన 80 మందితో నిర్వహించిన సంగీత విభావరి వీనులవిందు చేసింది. తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని పట్టెంపాలెం వై.జంక్షన్లో కోడి పందేలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు రూరల్ ఎస్సై జేవీఎన్ ప్రసాద్ సిబ్బందితో ఆదివారం దాడి చేశారు. ఈ దాడిలో ఆరుగురిని అదుపులోకి తీసుకుని వారి వద్ద నుంచి రూ.3200, మూడు కోడి పుంజులు స్వాధీనం చేసుకున్నట్లు ఎస్సై ప్రసాద్ వివరించారు. కుక్కునూరు: అనుమానస్పద స్థితిలో యువకుడి మృతదేహం లభ్యమైన ఘటన ఆదివారం మండలంలోని గుండేటివాగు సమీపంలో జరిగింది. కుక్కునూరు మండల కేంద్రంలోని కిష్టారం గ్రామానికి చెందిన సోడే సంకురు(40) మృతదేహం గుండేటివాగు సమీపంలో పడి ఉండడాన్ని గమనించిన స్థానికులు పోలీసులకు సమాచారం ఇచ్చారు. దీంతో మృతదేహాన్ని స్వాదీనం చేసుకున్న పోలీసులు కేసు నమోదు చేశారు. మద్యం మత్తులో చేపల వేటకు వెళ్లి ప్రమాదవశాత్తు నీటిలో పడి మృతి చెంది ఉండొచ్చని పోలీసులు అనుమానం వ్యక్తం చేశారు. -
ఫలితాన్ని మార్చే చేతిరాత
ఏలూరు (ఆర్ఆర్పేట): పబ్లిక్ పరీక్షలు దగ్గరకు వచ్చేశాయి. ప్రశ్నాపత్రంలో ఇచ్చిన వాటికి సరైన మాధానాలు రాయడం ఒక్కటే మార్కులు సంపాదించడానికి ఉపయోగపడుతుందనుకుంటే పొరపాటే. జవాబు పత్రాలు మూల్యాంకనం చేసే వారికి విద్యార్థులు రాసిన జవాబులు పూర్తిగా అర్థమైతేనే వారు ఆశించిన మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. పరీక్షల సమయం దగ్గరకు వచ్చేయడంతో విద్యార్థుల తల్లిదండ్రులు సైతం తమ పిల్లల చదువు ఎలా సాగుతోంది అనే అంశంపైనే శ్రద్ధ చూపుతున్నారు. చదువుతో పాటు దస్తూరీ పైనా దృష్టి సారిస్తే చక్కటి మార్కులు సొంతమంటున్నారు నిపుణులు. అక్షర దోషాలు, గజిబిజి చేతిరాత వల్ల ఒకటి, రెండు మార్కులు కోల్పోయే ప్రమాదముందంటున్నారు. విద్యార్థి కోల్పోయే ఆ ఒకటి, రెండు మార్కులే ర్యాంకును వేలల్లో తగ్గించేస్తుందనే విషయాన్ని గుర్తెరిగి దస్తూరీపై కూడా శ్రద్ధ చూపాలని నిపుణులు హెచ్చరిస్తున్నారు. సమాధాన పత్రాన్ని దిద్దే ఉపాధ్యాయుడికి మంచి దస్తూరి కనిపిస్తే ఆ ప్రభావం ఆయన వేసే మార్కులపై సానుకూలంగా ఉంటుందని, ఈ క్రమంలో చక్కటి దస్తూరితో పరీక్షలు రాస్తే మంచి మార్కులు అందుకోవచ్చని నిపుణులు సూచిస్తున్నారు. జవాబు సూటిగా, అక్షరాలు పొందికగా ఉంటే పత్రాలను మూల్యాంకనం చేసే ఉపాధ్యాయులు మంచి మార్కులు వేసే అవకాశముంటుందంటున్నారు. పరీక్షలు ప్రారంభమయ్యే లోపు ప్రతి రోజూ కొద్ది సేపు రాతపై కూడా శ్రద్ధ పెట్టి సాధన చేస్తే పరీక్షల్లో ఆందోళన లేకుండా సాఫీగా రాయవచ్చంటున్నారు. విద్యార్థులు చేసే పొరపాట్లు కొందరు విద్యార్థులు ఒక జవాబు పత్రంపై 25–30 లైన్లు రాస్తారు. గజిబిజిగా ఉంటే జవాబు పత్రం చూడగానే ఆకట్టుకోదు. ఒక్కోపేజీలో 16–18 లైన్లకు మించకూడదు. లైన్లు సమాంతరంగా ఉండాలి. చాలా మంది విద్యార్థులు ఒత్తిపట్టి రాస్తుంటారు. పెన్నును వేళ్లతో బిగుతుగా పట్టుకుంటారు. దీంతో పేజీ రెండో వైపు అక్షరాలు కనిపిస్తూ చివరికి జవాబుపత్రం గజిబిజిగా తయారవుతుంది. హ్యాండ్ రైటింగ్పై దృష్టి పెట్టాలంటున్న అధ్యాపకులు -
సంక్షోభంలో ఉప్పు సాగు
● నిరాశతో సాగుకు సమాయత్తం ● తీరంలో కనిపించని ఒకప్పటి జోరు ● 200 ఎకరాలకు పడిపోయిన సాగు విస్తీర్ణం నరసాపురం: జిల్లాలోని నరసాపురం తీరంలో ఈ ఏడాది ఉప్పు సాగు పూర్తిగా సంక్షోభంలో కూరుకుపోయింది. గత ఏడాది వరస ప్రకృతి విపత్తులు, అధిక వర్షాలు నిండా ముంచాయి. పెట్టుబడులు రాక ఇబ్బందులు ఎదుర్కొన్నారు. గత ఏడాది దిగుబడి గణనీయంగా పడిపోయింది. దీంతో ఈ ఏడాది సాగుకు బ్రేక్ వేశారు. సాగు గణనీయంగా తగ్గిపోయింది. ఇదే పరిస్థిఽతి కొనసాగితే భవిష్యత్లో తీరంలో ఉప్పుసాగు కనిపించే పరిస్థితి ఉండదనే వాదనలు వినిపిస్తున్నాయి. వేసవి ప్రారంభం కావడంతో ప్రస్తుతం తీర గ్రామాల్లో ఉప్పు సాగు ముమ్మరంగా ప్రారంభమైంది. నరసాపురంలో 19 కిలోమీటర్లు ఉన్న తీరప్రాంతంలో 200 ఎకరాల్లో ఉప్పు సాగు చేపట్టారు. నరసాపురం, మొగల్తూరు మండలాల్లోని వేములదీవి, తూర్పుతాళ్లు, చినమైనవానిలంక, పెదమైనవానిలంక, పేరుపాలెం, కేపీపాలెం తదితర 8 గ్రామాల్లో ఉప్పుసాగు మొదలైంది. గిట్టుబాటు ధరలేక.. గత ఏడాది ఏప్రిల్ నుంచి ఉప్పుకు గిట్టుబాటు ధరలేక రైతులు విలవిల్లాడారు. తుపాన్లు, వర్షాల కారణంగా అసలు పంట దిగుబడి రావడమే తగ్గిపోవడంతో సాగు చేపట్టిన రైతులు అప్పులపాలయ్యారు. ప్రస్తుతం తీరంలో పండించే ఉప్పు బస్తా(50కిలోలు) రైతుల వద్ద దళారులు రూ.200కు కొనుగోలు చేస్తున్నారు. కనీసం బస్తా రూ.300 ఉంటేనే గిట్టుబాటు అవుతుందని రైతులు చెబుతున్నారు. కష్టపడి పంట పండించే రైతుకు ఏళ్ల తరబడి అదే ధర దక్కుతోంది. ఏటేటా తగ్గుతున్న విస్తీర్ణం.. 2022, 2023 సంవత్సరాల్లో తీరంలో 1500 ఎకరాల్లో ఉప్పు సాగు జరిగింది. ఏటా సాగు విస్తీర్ణం తగ్గుతూ వస్తోంది. గత ఏడాది 900 ఎకరాల విస్తీర్ణంలో జరిగింది. ఈ ఏడాది 200 ఎకరాలకు పడిపోయింది. తీరంలో ఉప్పుమడులు చేపలు, రొయ్యల చెరువులుగా మారుతున్నాయి. రెండు దశాబ్దాలు వెనక్కి వెళ్తే తీరంలో దాదాపు 15 గ్రామాల్లో 4 వేల ఎకరాల్లో ఉప్పు సాగు జరిగేది. రోజుల తరబడి కష్టం ఉప్పు సాగు కష్టంతో కూడుకున్నది. ఒక్కసారి మడి కడితే దాదాపు ఆ మడి నుంచి 6 నెలల వరకూ ఉప్పు దిగుబడి వస్తూనే ఉంటుంది. దీంతో ఉప్పుసాగు లాభాలు తెచ్చిపెడుతుంది. వేసవి ప్రారంభంలో ఏటా ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఉప్పుసాగు ప్రారంభం అవుతుంది. మండే ఎండల్లో చిన్న చిన్న మడులను ఏర్పాటు చేసి ఉప్పు సాగు చేస్తారు. ఒక్కో ఎకరానికి సంబంధించి 60 నుంచి 70 మడులు కడతారు. ముందుగా మడుల్లో మట్టిని కాళ్లతో తొక్కి చదును చేసి తరువాత సముద్రంలోని ఉప్పు నీటిని ఆ మడుల్లో నింపుతారు. సాగు ప్రారంభమైన నాటి నుంచి మడుల్లో 60 రోజుల పాటు 6 నుంచి 10 మంది విపరీతంగా శ్రమిస్తేనే కానీ ఉప్పు తయారీ కాదు. ఎకరానికి పెట్టుబడి రూ.30 వేల వరకు ఉంటుంది. వాతావరణం అనుకూలిస్తే ఎకరాకు రోజుకు 100 కిలోల వరకూ ఉత్పత్తి వస్తుందని రైతులు చెబుతున్నారు. గిడ్డంగుల సమస్యపై దృష్టి పెట్టని ప్రభుత్వం ఉప్పును భద్రపరచుకోవడానికి గిడ్డంగులు సదుపాయం పెద్ద సమస్య. ప్రభుత్వం గిడ్డంగులను నిర్మించాలనే కనీస ఆలోచన కూడా చేయకపోవడం గమనార్హం. గిడ్డంగులు ఉంటే వర్షాలు వచ్చినప్పుడు పండించిన ఉప్పును వాటిలో భద్రపరుచుకుని మంచి ధర వచ్చినప్పుడు అమ్ముకోవచ్చు. అకస్మాత్తుగా వర్షాలు పడినా, తుఫాన్లు వంటి విపత్తులు వచ్చి పడినా ఉప్పు కుప్పలు ద్వంసమయిపోతాయి. రైతు కష్టం మొత్తం కరిగిపోతుంది. అధికార పంటగా గుర్తింపు లేదు ఉప్పు సాగుకు అధికార పంటగా ఇంతవరకూ గుర్తింపు లేదు. ఉప్పు పంట ప్రకృతి విపత్తుల కారణంగా ధ్వంసమైనా ప్రభుత్వం నుంచి ఎలాంటి నష్ట పరిహారం రాదు. బీమా లాంటి సదుపాయాలు ఉండవు. ఉప్పుసాగును అధికార పంటగా గుర్తించాలని, మిగిలిన పంటలకు మాదిరిగా అందించే సదుపాయాలు కల్పించాలని రైతులు ఎంతోకాలంగా డిమాండ్ చేస్తున్నా పట్టించుకోవడం లేదు. ఎండలు ప్రారంభం కాగానే ఉప్పు సీజన్ మొదలవుతుంది. ఈ ఏడాది సాగుపై రైతులకు శ్రద్ధ లేదు. ఎన్నో ఏళ్లుగా ఉప్పు పంట సాగు చేస్తున్న రైతులు ఈ ఏడాది సాగుకు స్వస్తి చెప్పారు. వరుసగా నష్టాలు రావడమే కారణం. గత ఏడాది తుఫాన్లు, వర్షాలతో పెట్టుబడులు కూడా రాలేదు. రైతులు అప్పుల పాలయ్యారు. ఒకప్పుడు తీరం అంతా ఉప్పుమడులతో కళకళలాడేది. మైలా రాధాకృష్ణ, ఉప్పు రైతు, పీఎం లంక, నరసాపురం మండలం 50 కేజీల బస్తా రూ 200 పలుకుతోంది. దళారుల మా వద్ద కొన్న ధరకు బయట మార్కెట్లో ఉప్పు ధరకు సంబంధం లేదు. దాదాపు మూడేళ్ల నుంచి ఇదే ధర. గిట్టుబాటు కావడం లేదు. పెట్టుబడులు బాగా పెరిగాయి. గిట్టుబాటు ధర లేకపోతే సాగు కష్టం. గిడ్డంగులు లేకపోవడం వల్ల వర్షాలు పడితే దళారులు అడిగినంతకు అమ్ముకోవాలి. ఉప్పు సాగు రైతులను ప్రభుత్వం ఆదుకోవాలి –మైలా శ్రీనివాస్, పెదమైనవానిలంక, నరసాపురం మండలం -
వైభవంగా నృసింహ మహా యజ్ఞం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నృసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞం ఆదివారం రాత్రి కనుల పండువగా జరిగింది. హైదరాబాద్కు చెందిన కొచ్చెర్లకోట సత్యవేంకట లక్ష్మీనరసింహం గురుజీ ఆధ్వర్యంలో వివిధ ప్రాంతాలకు చెందిన రుత్వికులు, పండితులు పాల్గొని, ఈ యజ్ఞ క్రతువును వైభవోపేతంగా నిర్వహించారు. స్వయంభూ శ్రీ లక్ష్మీ నారసింహుడికి ఈ యజ్ఞం జరపడం వల్ల లోకశాంతి చేకూరుతుందని పండితులు తెలిపారు. ఈ క్రమంలో ఆలయ ప్రాంగణంలో జరిగిన పలు కార్యక్రమాలతో సుందరగిరి పరిసరాలు ఆధ్యాత్మిక శోభను సంతరించుకున్నాయి. ఉదయం విఘ్నేశ్వర పూజ, మండపారాధనలు, అనంతరం శాలిగ్రామ అభిషేకం, లక్ష బిల్వార్చన, సూర్య నమస్కారాలు, మృత్తిక లింగార్చన, ఏక బిల్వార్చన, సహస్ర లింగార్చన, మహా లింగార్చన, 365 లింగాలకు పార్ధివ మహాలింగార్చన, 121 పార్ధివ లింగార్చన, కలశారాధన తదితర పూజలు నిర్వహించారు. అనంతరం హోమగుండ ప్రతిష్ఠ, అగ్ని ప్రతిష్ఠాపనా కార్యక్రమాలను వైభవంగా జరిపారు. ఈ కార్యక్రమంలో అశేష భక్తజనంతో పాటు సినీ, రాజకీయ ప్రముఖులు, హైదరాబాద్కు చెందిన సాఫ్ట్వేర్ ఉద్యోగులు పాల్గొన్నారు. -
రెండు నెలలుగా జీతాల్లేవు
భీమవరం(ప్రకాశం చౌక్): విద్యుత్ శాఖలో స్పాట్ మీటర రీడర్లు జీవితాలతో కూటమి ప్రభుత్వం అడుకుంటుంది. ప్రభుత్వం, విద్యుత్ శాఖ అధికారుల నిర్లక్ష్యాన్ని ఆసరాగా తీసుకుని కాంట్రాక్టర్లు గత రెండు నెలలగా జీతాలు చెల్లించడం లేదు. జిల్లాలోని పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్లోని 100 మందికి రెండు నెలలగా జీతాలు ఇవ్వకుండా మీటర్ రీడింగ్ పనులు చేయిస్తున్నారు. పెద తాడేపల్లి, తణుకు నర్సాపురం సబ్ డివిజన్లో.. పెద తాడేపల్లి, నర్సాపురం, తణుకు సబ్ డివిజన్ల్లో మీటర్లు రీడర్లు 100 మంది ఉన్నారు. వారికి గత రెండు నెలలగా జీతాలు బ్యాంకు ద్వారా చెల్లించకుండా కాంట్రాక్టరు ఇబ్బందులు పెడుతున్నారు. దాంతో రీడర్లు నర్సాపురం, తాడేపల్లి డీఈల వద్ద మొరపెట్టకున్నారు. ఇప్పటికే రీడర్లుకు రెండు నెలల జీతాలు లేవు. మరో వారం రోజుల మూడో నెల వస్తుంది. పీఎఫ్, ఈఎస్ఐ మినహాయింపు లేదు జీతాలతో పాటు ప్రతి నెల పీఎఫ్, ఈఎస్ఐ కూడా కాంట్రాక్టర్ చెల్లించాలి. ఈ రెండు నెలలు జీతాలు చెల్లించకపోవడంతో పాటు పీఎఫ్, ఈఎస్ఐ కూడా చెల్లించడం లేదు. దాంతో మీటర్ రీడర్కు ప్రమాదం జరిగితే అతను, అతనిపై ఆధారపడిన కుటుంబం నష్టపోతారు. ఈ విషయం తెలిసి కూడా కూటమి ప్రభుత్వం, అధికారులు పట్టించుకోవడం లేదు. గత ప్రభుత్వంలో సకాలంలో జీతాలు గత ప్రభుత్వంలో విద్యుత్ శాఖలోని స్పాట్మీటర్ రీడర్లుకు ప్రతి నెల ఒకటో తేదీ జీతాలు బ్యాంకు ద్వారా జమ చేసేవారు. ప్రభుత్వం కాంట్రాక్టర్లు, విద్యుత్ శాఖ అధికారులను సమన్వయం చేసి మీటర్ రీడింగ్ సకాలంలో జరిగేలా, మీటర్లు రీడర్లుకు జీతాలు పెడింగ్ లేకుండా సకాలంలో అందేలా పనిచేసేవారు. కాంట్రాక్టర్లు, అధికారుల మధ్య అవినీతి జగరకుండా చర్యలు తీసుకుని మీటర్ రీడర్లకు ఇబ్బందులు లేకుండా చూసేవారు. తీవ్ర ఇబ్బందులు పడుతున్న రీడర్లు గత రెండు నెలలగా జీతాలు రాక మీటర్ రీడర్లు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఒక్కొక్కరి సుమారు రూ.50 వేల వరకు జీతాలు చెల్లించాల్సి ఉంది. జీతాలు రాక ఈఎంఐలు, ఇంటి అద్దెకు, కుటుంబ పోషణకు మీటర్ రీడర్లు అప్పులు చేస్తున్నారు. ఒక్కొక్క మీటర్ రీడర్ 5 వేల సర్వీసులు బిల్లింగ్ చేసి వియోగదారులకు సకాలంలో బిల్లు అందిస్తారు. దాంతో వినియోగదారులు సకాలంలో బిల్లు చెల్లిస్తారు. మూడు డివిజన్ల్లో మీటర్ రీడర్లుకు పెడింగ్లో ఉన్న జీతాలు వెంటనే బ్యాంకు ద్వారా జమ చేయాలని కాంట్రాక్టర్లు అదేశించాం. నిబంధనలకు విరుద్దంగా కాంట్రాక్టర్లు మీటర్లు రీడర్లుకు నగదు రూపంలో జీతాలు చెల్లించకూడదు. – పి.ఉషారాణి, విద్యుత్ శాఖ ఎస్ఈ వ్యాకరణ దోషాలు లేకుండా చూసుకోవాలి. దిద్దుబాటు, గజిబిజి ఉండకూడదు. పదానికి పదానికి మద్య దూరం ఉండాలి చేతి రాత గుండ్రంగా, అర్థమయ్యేలా ఉండాలి. సమాధాన పత్రంలో పేజీకి 15– 16 లైన్లు ఉండాలి. పేజీకి పైన, కింద మార్జిన్ విడిచి పెట్టాలి. మొదటి వరుసలో ఎంత బాగా రాసారో చివరి వరకు అదే దస్తూరి కొనసాగించాలి. తెలుగు, ఆంగ్లం, హిందీ సబ్జెక్టులలో లెటర్ రైటింగ్ ఒకే పేజీలో వచ్చేలా రాయాలి. అక్షర దోషాలు, దిద్దుబాట్లు లేకుండా చూసుకోవాలి గణితంలో అంకెలు స్పష్టంగా ఉండాలి. కొట్టివేతలు వస్తే మార్కులు తగ్గుతాయి. సాంఘికశాస్త్రంలో సమాధానాలు పాయింట్ల వారీగా రాయాలి. శీర్షికలు, ఉప శీర్షికలు కింద అండర్లైన్ చేయాలి. -
మానవత నాగేశ్వరరావు అనుమానాస్పద మృతి
ఏలూరు టౌన్: అనేక మందికి సేవలు అందించిన ఆలపాటి నాగేశ్వరరావు అలియాస్ మానవతా నాగేశ్వరరావు అనుమానస్పద స్థితిలో మృతిచెందారు. ఈ నెల 9న ఏలూరు నగరంలోని వసంతమహాల్ సెంటర్లోని ఆయన నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కార్యాలయం నుంచి ఒంటరిగా బైక్పై బయటకు వెళ్ళారు. ఆరు రోజుల అనంతరం ఆగిరిపల్లి ప్రాంతంలో పెద్ద చెరువులో విగతజీవిగా కనిపించారు. మానవత స్వచ్చంద సంస్థ ద్వారా అనేక మందికి సేవలు అందిస్తుండగా... ఆకస్మికంగా మృతిచెందటం ఏలూరు, పరిసర ప్రాంతాల్లో తీవ్ర చర్చకు దారితీసింది. శనివారపుపేట శాతవాహన నగర్లో తన కుటుంబ సభ్యులతో కలిసి ఆలపాటి నాగేశ్వరరావు ఉంటున్నారు. ఈనెల 9న ఉదయం 11గంటల సమయంలో వసంతమహాల్ సెంటర్లోని తాను నిర్వహిస్తోన్న గాయత్రి ఫైనాన్స్ కంపెనీ కార్యాలయం నుంచి బైక్పై బయటకు వచ్చారు. ఆ తరువాత ఆచూకీ దొరకలేదు. ఆయన భార్య టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేయగా... డీఎస్పీ డీ.శ్రావణ్కుమార్ ఆధ్వర్యంలో ప్రత్యేక బృందాలు గాలింపు చర్యలు చేపట్టాయి. నగరంలోని సీసీ కెమెరాల పుటేజ్ ఆధారంగా గాలింపు చేపట్టగా... నూజివీడు వైపు వెళుతున్నట్లు గుర్తించారు. అనంతరం ఆయన ఫోన్ స్విచ్ ఆఫ్ కావటంతో ఆచూకీ కనిపెట్టటం క్లిష్టంగా మారింది. గన్నవరం, ఆగిరిపల్లి మద్య ప్రాంతంలో బ్రహ్మలింగయ్య చెరువు వద్ద డ్రోన్లతో పరిశీలించగా ఆయన మోటారు సైకిల్ను గుర్తించారు. శనివారం చెరువు ప్రాంతం అంతా విస్తృతంగా గాలించగా తుప్పల వద్ద నాగేశ్వరరావు మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. అనుమానాస్పద మృతిగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. -
పంచముఖ ఆంజనేయుడికి వెండి కవచం
ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో కొలువుదీరిన పంచముఖ ఆంజనేయస్వామికి ఓ దాత రూ.16 లక్షల విలువైన వెండి కవచాన్ని శనివారం బహూకరించారు. ప్రస్తుతం హైదరాబాద్లో ఉంటున్న తూర్ల లక్ష్మీపురం గ్రామానికి చెందిన కొచ్చెర్లకోట సత్య వెంకట లక్ష్మీనరసింహం దంపతులు పంచముఖ ఆంజనేయ స్వామికి అలంకరణ నిమిత్తం 5.660 కేజీల బరువుగల వెండి కవచాన్ని ప్రత్యేకంగా తయారు చేయించారు. ముందుగా నరసింహ గురూజీ దీన్ని శిరస్సుపై పెట్టుకుని మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయంలో ప్రదక్షిణలు చేశారు. అనంతరం ఆలయ ఈఓ యర్రంశెట్టి భద్రాజీకి అందించారు. -
మద్యం మత్తుతో చిత్తు
ఆగిరిపల్లి లో రామాలయం పక్కన పడిపోయిన మందు బాబుస్టేట్ బ్యాంక్ వద్ద రోడ్డుపైనే పడక చంద్రబాబు ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ఊరుకో మద్యం షాపు.. వీధికో బెల్ట్ షాపు అన్నట్లుగా తయారైంది. దీంతో మందుబాబులతో 24 గంటలు తాగించేస్తున్నారు. బెల్ట్ షాపులు ద్వారా మద్యాన్ని ఏరులై పారిస్తున్నారు. ఆగిరిపల్లిలో యువత మద్యం తాగి, మత్తు ఎక్కువై రోడ్లపై ఎక్కడపడితే అక్కడ పడిపోతున్నారు. విజయవాడ రోడ్డులో తప్ప తాగి పడిపోతున్నారు. నిత్యం స్థానికంగా ఉండే వారితో గొడవలకు దిగడంతో స్థానిక ప్రజలు భయాందోళనకు గురవుతున్నారు. – ఆగిరిపల్లి -
మహాయజ్ఞానికి శ్రీకారం
● నేడు రాత్రి సుందరగిరిపై.. ● క్రతువుకు పూర్తయిన ఏర్పాట్లు ద్వారకాతిరుమల: సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ కనకవల్లీ సమేత శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో మహాశివరాత్రి పర్వదినాన్ని పురస్కరించుకుని ఆదివారం నిర్వహించనున్న అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహా యజ్ఞానికి ఏర్పాట్లు పూర్తయ్యాయి. ప్రతి ఏటాలాగే ఈ ఏడు కూడా మహా శివరాత్రి నాడు సాయంత్రం మొదలుగా తెల్లవార్లు ఈ మహా యజ్ఞాన్ని ఎంతో వైభవంగా నిర్వహించనున్నారు. అందులో భాగంగా హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో జరుగుతున్న ఈ యజ్ఞ ఏర్పాట్లను సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షిస్తున్నారు. ఈ క్రమంలో శనివారం ఆలయ యాగశాలలో యజ్ఞ క్రతువుకు భారీగా ఏర్పాట్లు చేశారు. ముందుగా నరసింహ గురూజీ గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్ వద్ద కంకణధారణ చేశారు. అనంతరం యాగశాలలో మహాగణపతి పూజ, హోమాన్ని నిర్వహించారు. ఆ తరువాత కలశ పూజ చేశారు. అలాగే పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో సహస్ర లింగార్చన, మహా లింగార్చన, మృత్తిక లింగాలకు శాస్త్రోక్తంగా పూజలు జరిపారు. లోకశాంతి కోసం పలు వనమూలికలు, భక్ష్యాలు, వివిధ రకాల ద్రవ్యాలు, సమిదులు, ఖరీదైన ద్రవ్యాలతో ఆదివారం రాత్రి నిర్వహించనున్న మహా యజ్ఞం భక్తులను పరవశింప జేయనుంది. -
దొడ్డిదారిన శ్రీవారి దర్శనాలు
● పలువురు సెక్యూరిటీ సిబ్బంది చేతివాటం ● హోంగార్డు, మహిళా సెక్యూరిటీ గార్డును పట్టుకున్న అధికారులు ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయంలో కొందరు ఆలయ, సెక్యూరిటీ సిబ్బంది దొడ్డిదారిన భక్తులను దర్శనాలకు పంపుతూ కాసులు దండుకుంటున్నారు. ఈ నెల 11న ఓ హోంగార్డు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని, దర్శనాలకు పంపుతున్న దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డ్ అయ్యాయి. దాంతో అతడిని దేవస్థానం అధికారులు మాతృ సంస్థకు అప్పగించారు. అలాగే మరో ఘటనలో మహిళా హోంగార్డును విధుల నుంచి తొలగించారు. వివరాల్లోకి వెళితే.. చిన్నతిరుపతిగా పేరొందిన ద్వారకాతిరుమల దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు సందర్శిస్తున్నారు. వారికి మెరుగైన సేవలు అందించేందుకు ఆలయ అధికారులు నిరంతరం శ్రమిస్తున్నారు. కొందరు సిబ్బంది సంపాదనే ధ్యేయంగా పనిచేస్తున్నారు. ధనికుల నుంచి డబ్బులు తీసుకుని అడ్డదారిలో వారిని దర్శనాలకు పంపుతూ శ్రీవారి ఆదాయానికి గండి కొడుతున్నారు. ముఖ్యంగా భక్తులు రద్దీ ఎక్కువగా ఉండే శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ వ్యాపారాన్ని జోరుగా సాగిస్తున్నారు. పట్టించిన నిఘానేత్రం.. ఆలయ తూర్పు రాజగోపురం వద్ద విధులు నిర్వర్తిస్తున్న ఓ హోంగార్డు ఈనెల 11న కొందరు భక్తుల నుంచి డబ్బులు తీసుకుని ఆలయంలోకి పంపాడు. ఆలయంలో విధులు నిర్వర్తిస్తున్న కొందరు ఉద్యోగులు వారిని రిసీవ్ చేసుకుని దర్శనాలు చేయించినట్టు తెలుస్తోంది. సీసీ కెమేరాల్లో రికార్డ్ అయిన ఈ దృశ్యాలను పరిశీలించిన అధికారులు సదరు హోంగార్డును మాతృ సంస్థకు పంపించివేశారు. ఆ మరుసటి రోజే దేవస్థానానికి చెందిన ఓ మహిళా సెక్యూరిటీ గార్డు భక్తుడి వద్ద డబ్బులు తీసుకుని, దర్శనానికి పంపుతూ అధికారులకు పట్టుబడింది. దాంతో ఆమెను విధుల నుంచి తొలగించారు. సెక్యూరిటీ సిబ్బంది సిఫార్సులతో వెళుతున్న భక్తులను ఆలయంలోకి పంపుతున్న సిబ్బంది ఎవరనేది అధికారులు తేల్చడం లేదు. తీగలాగితే తమకు కావాల్సిన సిబ్బంది డొంక ఎక్కడ కదులుతుందోనన్న భయంతోనే అధికారులు కిమ్మనకుండా ఉండిపోతున్నారన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. టికెట్లు రీప్రింట్ శ్రీవారి ఆలయంలో దర్శనం టికెట్లు రీప్రింట్ జరుగుతున్నట్టు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. రూ.500 అంతరాలయ దర్శనం టికెట్తో పాటు, మిగిలిన దర్శనం టికెట్లను కూడా రీప్రింట్ చేస్తున్నట్టు తెలుస్తోంది. ఆన్లైన్లో వస్తున్న టికెట్లను డౌన్లోడ్ చేసి, వాటిని రీప్రింట్ చేసి, భక్తులకు విక్రయిస్తూ చేతివాటాన్ని ప్రదర్శిస్తున్నట్టు సమాచారం. కొందరు టికెట్లు విక్రయించే సిబ్బంది, వాటిని స్కాన్ చేసే సిబ్బంది లాలూచీ పడి ఈ దందాను సాగిస్తూ, జేబులు నింపుకుంటున్నారు. దేవస్థానం అధికారులు దీనిపై దృష్టి సారించాల్సిన అవసరం ఉంది. ద్వారకాతిరుమల శ్రీవారి క్షేత్రం ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఈ నెల 11న హోంగార్డు డబ్బులు తీసుకుని భక్తులను దర్శనాలకు పంపుతున్నట్టు సీసీ టీవీ కెమెరాల్లో రికార్డ్ అయ్యింది. దాంతో అతడిని మాతృ సంస్థకు సరెండర్ చేశాం. మరో మహిళా సెక్యూరిటీ గార్డును విధుల నుంచి తొలగించాం. టికెట్ల రీప్రింట్ వ్యవహారాన్ని పరిశీలిస్తాం. – డీవీ భాస్కర్, శ్రీవారి దేవస్థానం ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ -
80 వేల నాణేలతో శివలింగం
పోలవరం రూరల్: పట్టిసం శివక్షేత్రానికి ఒక భక్తుడు నాణేలతో తయారు చేసిన శివలింగాన్ని అందజేశారు. గోపాలపురం మండలం కొవ్వూరుపాడు గ్రామానికి చెందిన చిలక సాయి రూ.1.25 లక్షలతో 80 వేల నాణేలతో శివలింగాన్ని తయారు చేశారు. ఆ శివలింగాన్ని ఆ గ్రామం నుంచి అధిక సంఖ్యలో భక్తులతో ఊరేగింపుగా తీసుకొచ్చి పట్టిసంలో దేవస్థానం అధికారులకు అప్పగించారు. నిత్యం ఈ శివలింగానికి భక్తులు కొలిచేలా ఏర్పాటు చేయాలని దేవస్థానం ఫౌండర్ ఫ్యామిలీ మెంబర్ కె.వీరభద్రరావు, ఈవో సీహెచ్ వెంకటలక్ష్మిని కోరారు. ఈ శివలింగం తయారీకి సుమారు 2 నెలలు పట్టిందని చిలక సాయి తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు త్రీటౌన్ పరిధిలోని విద్యుత్ నగర్లో ఒంటరిగా జీవిస్తోన్న ఒక వ్యక్తి అనుమానస్పద స్థితిలో మృతిచెందాడు. తాను ఉంటున్న ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు పోలీసులకు సమాచారం అందించగా... పోలీసులు ఇంట్లోకి వెళ్ళి చూడగా ఒక వ్యక్తి మృతిచెంది ఉన్నాడు. విద్యుత్నగర్లో మధుసూధన్రెడ్డి (41) ఒంటరిగా అద్దెకు ఉంటూ తాపీ పనులు చేసుకుంటూ జీవనం సాగిస్తున్నాడు. కొన్నేళ్ళ క్రితం భార్యతో విడాకులు తీసుకోవడంతో ఒంటరిగానే జీవిస్తున్నాడు. మధుసూధన్రెడ్డి ఉంటున్న ఇంటినుంచి దుర్వాసన రావటంతో స్థానికులు త్రీటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. అనారోగ్యంతో మృతిచెంది ఉంటాడని పోలీసులు ప్రాఽథమిక అంచనాకు వచ్చారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. -
రైతులకు మొండిచేయి
2026–27 రాష్ట్ర బడ్జెట్లో ప్రభుత్వం రైతులకు మొండిచేయి చూపించింది. కౌలురైతుల ఊసే ఎత్తలేదు. వ్యవసాయ రంగానికి ఆశించిన స్థాయిలో బడ్జెట్లో కేటాయింపులు లేవు. చింతలపూడి ఎత్తిపోతల పథకానికి నిధుల కేటాయింపు తక్కువగా ఉంది. పోలవరం నిర్వాసితుల గురించి ప్రస్తావనే లేదు. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు బడ్జెట్లో పోలవరం నిర్వాసితులకు ఎంత అనే స్పష్టత లేకపోవడం ద్వారా నిర్వాసితులను ముంచాలనుకున్నారని స్పష్టమవుతుంది. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు నిర్వాసితులను ముంచే పనిలోనే ఉన్నాయి. మహిళలకు నెలకు రూ.1,500, నిరుద్యోగ భృతి ప్రస్తావన లేకపోవడం ద్వారా హామీలను తుంగలో తొక్కారు. – ఎ.రవి, సీపీఎం జిల్లా కార్యదర్శి బడ్జెట్ ప్రజలను మభ్యపెట్టేదిగా, మోసపూరితంగా ఉంది. విద్యా, వైద్య రంగాల్లో కేటాయింపులు నామమాత్రంగా ఉన్నాయి. పోల వరం ప్రాజెక్టును 2027 పుష్కరాల నాటికి పూర్తి చేస్తామని ఆర్భాటపు ప్రకటనలు చేస్తున్నారు. బడ్జెట్ ఆద్యంతం ఆత్మస్తుతి పరనిందాగా ఉంది. పేదలకు మేలు చేయని బడ్జెట్. – డేగా ప్రభాకర్, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి వర్గసభ్యుడు కౌలు రైతులకు మొండిచేయి చూ పారు. అన్నదాత సుఖీభవ సా యంపై స్పష్టత ఇవ్వలేదు. పంట నష్టపోయిన రైతులకు పంటల బీమా పరిహారం కేటాయింపు జరగలేదు. ధరలు పడిపోయి రైతులు నష్టపోతున్నా కనీసం మద్దతు ధరలు కూడా అందడం లేదు. కౌలు రైతులపై దయ లేదు. – కె.శ్రీనివాస్, ఏపీ రైతు సంఘం జిల్లా కార్యదర్శి రాష్ట్ర బడ్జెట్ అంకెల గారడీగానే కనిపిస్తుంది. సూపర్సిక్స్ పథకా ల అమలుకు బడ్జెట్ కేటాయింపులు నోచుకోలేదు. ఇళ్ల స్థలాలు లేని పేదలకు గ్రామాల్లో మూడు సెంట్లు, పట్టణాల్లో రెండు సెంట్లు, ఇంటి నిర్మాణానికి రూ.4 లక్షలపై బడ్జెట్లో స్పష్టత లేదు. పా రిశ్రామికవేత్తలకు మేలు చేసేదిగా ఉంది. – మన్నవ కృష్ణ చైతన్య, సీపీఐ జిల్లా కార్యదర్శి గ్రామీణ పేదలు, రైతులకు నిరాశ ఎదురైంది. సాగునీటి ప్రాజెక్టుల నిర్మాణం, పోలవరం నిర్వాసితుల సమస్యల పరిష్కారానికి బడ్జెట్లో ప్రాధాన్యమివ్వలేదు. జీ రాం జీ పథకంలో రాష్ట్ర వాటాపై స్పష్టత లేదు. సంక్షేమ పథకాలకు కూడా కేటాయింపులు అంతగా లేవు. పేద, మధ్య తరగతి ప్రజలకు మేలు జరగదు. – బండి వెంకటేశ్వరరావు, బీకేఎంయు ప్రధాన కార్యదర్శి బడ్జెట్ ఉద్యోగులు, కార్మికులను తీవ్రంగా నిరాశపరిచింది. లక్షల మంది అంగన్వాడీ, ఆశ, మ ధ్యాహ్నం భోజన పథకం కార్మి కుల వేతనాల గురించి ఏ మా త్రం ప్రస్తావించలేదు. అసంఘటిత రంగ కార్మికులకు వెల్ఫేర్ బోర్డుల గురించి పట్టించుకోలేదు. 12వ పీఆర్సి గురించి కనీసం మాట్లాడలేదు. – డీఎన్వీడి ప్రసాద్, సీఐటీయూ జిల్లా ప్రధాన కార్యదర్శి బడ్జెట్లో కార్మిక సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు లేవు. మొత్తం రూ.3,22,205 కోట్ల బడ్జెట్లో కార్మిక సంక్షేమానికి ఎలాంటి కేటాయింపులు లేకపోవడం చాలా అన్యాయం. వ్యవసాయ, వైద్యం, మహిళా సంక్షేమానికి చాలా తక్కువగా నిధులు కేటాయించారు. – పి.కిషోర్, ఏఐటీయూసీ నాయకుడు, ఏలూరు మాటలు కోటలు దాటినా.. పద్దులు గడప దాటని విధంగా రాష్ట్ర బడ్జెట్ ఉంది. బడ్జెట్లో 30 శాతం లోటు ఉంది. పేదలకు ఏ మాత్రం ఉపయోగపడని బడ్జెట్ ఇది. 2027 నాటికి పోలవరం ప్రాజెక్టు పూర్తి చేస్తామన్న ప్రభుత్వం బడ్జెట్లో కేవలం రూ.6,105 కోట్లు మాత్రమే కేటాయించడం సరికాదు. ఎన్నడూ లేనివిధంగా ద్రవ్యలోటు ఉంది. – పీవీ రామకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి, వ్య.కా.స, ఏలూరు రాష్ట్ర బడ్జెట్లో విద్యారంగానికి అరకొరగా కేటాయింపులు చేయడం దారుణం. కనీసం 6 శాతం నిధులు కూటా విద్యారంగానికి కేటాయించక పోవడం శోచనీయం. ఈ నిధులతో సర్కారీ విద్యారంగం ఎలా అభివృద్ధి చెందుతుందో రాష్ట్ర ప్రభుత్వం ఆలోచించాలి. కనీసం 15 శాతం అయినా నిధులు కేటాయించాలి. – బి.రెడ్డిదొర, తాళ్లూరి రామారావు, ఏపీటీఎఫ్ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు -
బురిడీ.. అంకెల గారడీ
కొత్త పథకాలు, ప్రాజెక్టుల ఊసేలేదు.. పాత ప్రాజెక్టులకు అరకొరగా కేటాయింపులు.. పోలవరం నిర్వాసితుల గోడు పట్టని తీరు.. ఆక్వా వర్సిటీ, వశిష్ట గోదావరి వంతెన నిర్మాణాలు, కొల్లేరు వంటి సమస్యలను విజయవంతంగా అటకెక్కించిన వైనం.. గతేడాది మాదిరిగానే ఈ ఏడాదీ రాష్ట్ర బడ్జెట్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు చంద్రబాబు ప్రభుత్వం మొండిచేయి చూపింది. నిధుల కేటాయింపులు, కీలక అంశాలపై కనీసం ప్రస్తావన కూడా లేకపోవడం విచారకరం. రాష్ట్ర బడ్జెట్పై సర్వత్రా విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆదివారం శ్రీ 15 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి ప్రతినిధి, ఏలూరు: గత సార్వత్రిక ఎన్నికల సమయంలో ఉమ్మడి జిల్లాకు లెక్కకు మించిన హా మీలను కూటమి నాయకులు గుప్పించారు. వందల కోట్లతో పథకాలు, ప్రాజెక్టులతో అద్భుతాలు చేస్తామని ఊరూవాడా ప్రచారం చేశారు. తీరా అధికారం చేపట్టిన తర్వాత జిల్లా అభివృద్ధిని, ప్రజల సంక్షేమాన్ని పక్కన పెట్టారు. ఏటా రాష్ట్ర బడ్జెట్లో అరకొర కేటాయింపులతో సరిపెడుతున్నారు. ‘కౌలు’కునేదెలా..? ఉమ్మడి జిల్లాలో 2.45 లక్షల మందికిపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు వ్యవసాయం ఒడిదొడుకులతో సాగుతోంది. కౌలు రైతుల రక్షణ కోసం ప్రత్యే క చట్టంతో గుర్తింపు ఇచ్చి కౌలురైతులకు కూడా రైతుభరోసా మొదలు అన్ని పథకాల వర్తింపు, గుర్తింపు కార్డుల జారీ, పంట నష్ట పరిహరం వంటివి అందేలా చేస్తామని ఎన్నికల సమయంలో చంద్రబాబు హా మీలు ఇచ్చారు. అయితే బడ్జెట్ కౌలురైతుల ప్రస్తావనే లేకపోవడం గమనార్హం. ‘ఆక్వా’ంక్షలు ఫలించేనా..! గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో నరసాపురంలో ఆక్వా యూనివర్సిటీని ఏర్పాటుచేశారు. చంద్రబాబు ప్రభుత్వం ఈ యూనివర్సిటీని అటకెక్కించింది. రూ.332 కోట్లతో జరగాల్సిన భవన నిర్మాణానికి అరకొర నిధులను మంజూరు చేయడంతో పాటు వాటిని కూడా పూర్తిస్థాయిలో ఖర్చు చేయలేని పరిస్థితి. గత బడ్జెట్లో రూ.36 కోట్లు కేటాయించినా పనులకు అనుమతులు రాలేదు. ప్రస్తుత బడ్జెట్లో రూ.20 కోట్లు మాత్రమే కేటాయించారు. వంతెన.. యాతన నరసాపురం ప్రాంతంలో తలమానికంగా ఉండే వశిష్ట గోదావరి వంతెన నిర్మాణానికి గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో పూర్తి అనుమతులతో శంకుస్థాపన చేసి పనులకు శ్రీకారం చుట్టారు. అయితే చంద్రబాబు పాలనలో రాష్ట్ర బడ్జెట్లో రెండేళ్లుగా నిధులు కేటాయించకపోవడంతో ప్రాజెక్టు శంకుస్థాపనకే పరిమితమైంది. కీలక ప్రాజెక్టులకు రిక్తహస్తం జిల్లాలో కీలకమైన పోలవరం ప్రాజెక్టు, పునరావాసం, చింతలపూడి ఎత్తిపోతల పథకం, గోదావరి డె ల్టా ఆధునికీకరణ, ఎర్రకాల్వ, కొల్లేరు ఏ ఒక్క దాని కీ న్యాయం జరగలేదు. సుమారు రూ.5 వేల కోట్లు కేటాయించాల్సిన చింతలపూడి ఎత్తిపోతల పథకానికి రూ.435 కోట్లతో సరిపెట్టారు. గత బడ్జెట్లో రూ.220 కోట్లు కేటాయించినా ఒక్క రూపాయి కూడా ఖర్చు చేయలేదు. ● డెల్టా ఆధునికీకరణకు వందల కోట్లు అవసరం కాగా మొక్కుబడిగా రూ.100 కోట్లు కేటాయించారు. గతేడాది కేటాయింపులతోనూ పనులు జరగని పరిస్థితి. ● ఎన్నికల సమయంలో నల్లజర్ల నుంచి తాడేపల్లిగూడెం వరకు ఎర్రకాల్వ ముంపునకు శాశ్వత ప రిష్కారం చూపుతామని కూటమి నాయకులు ప్రకటించారు. అయితే బడ్జెట్లో నామమాత్రంగా సాధారణ మెయింటినెన్స్కు రూ.10 లక్షలు మాత్రమే కేటాయించారు. ● 122 గ్రామాల ప్రజల జీవనస్థితితో ముడిపడి ఉన్న కొల్లేరుకు సంబంధించి బడ్జెట్లో ఎలాంటి ప్రస్తావన లేదు. కొల్లేరును 3వ కాంటూరుకు కు దించి జిరాయితీ భూములిస్తాం, కొల్లేరు గ్రామా ల్లో రోడ్లు, తాగునీరు, మౌలిక సదుపాయాలన్ని కల్పిస్తామని ఎన్నికల్లో ప్రకటించి సుప్రీంకోర్టు సాకుతో గాలికి వదిలేశారు. ● పోలవరం ప్రాజెక్టు పరిధిలో నిర్వాసితులకు పరిహారం అలానే పెండింగ్లో ఉంది. పరిహారం గురించి బడ్జెట్లో ప్రస్తావన కూడా లేదు. పథకాల ఊసేదీ.. సూపర్ సిక్స్ హామీల పేరుతో కూటమి ప్రభుత్వం నిండా వంచించింది. ఈ బడ్జెట్లోనూ ఆడబిడ్డ నిధి, నిరుద్యోగ భృతి, జాబ్ క్యాలెండర్, రెండు సెంట్ల స్థలాలు వంటి హామీలను ప్రస్తావించలేదు. ఏలూరు జిల్లాలో 6.71 లక్షలు, పశ్చిమగోదావరి జిల్లాలో 6 లక్షల మందికి పైగా మహిళలు ఆడబిడ్డ నిధి సాయం కోసం ఎదురుచూస్తున్నారు. మోసాల పద్దు నిధుల్లేవ్.. పథకాల్లేవ్ పాత ప్రాజెక్టులకు అరకొర కేటాయింపులు అటకెక్కిన వశిష్ట గోదావరి వంతెన కనిపించని ఫుడ్, ఆక్వా క్లస్టర్లు ఉమ్మడి జిల్లాకు మరోసారి మొండిచేయి రాష్ట్ర బడ్జెట్పై విమర్శల వెల్లువ -
కూలికెళ్లారు.. క్షతగాత్రులయ్యారు
● నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబ్ కూలి ప్రమాదం ● 12 మందికి గాయాలు ● వీరిలో ఆరుగురికి తీవ్ర గాయాలు జంగారెడ్డిగూడెం: పొట్టకూటి కోసం కూలి పనులకు వెళ్లిన కార్మికులు నిర్మాణంలో ఉన్న భవనం శ్లాబ్ కుప్పకూలడంతో క్షతగాత్రులై మంచాన పడ్డారు. మండలంలోని వేగవరంలో ఢిల్లీ పబ్లిక్ స్కూల్ భవన నిర్మాణం శ్లాబ్ పనులు జరుగుతున్నాయి. సుమారు 100 మంది పనిచేస్తున్నారు. భవనం పొడవునా మొ దటి అంతస్తులో పోర్టికో నిర్మాణం జరుగుతుండటంతో గ్రౌండ్ ఫ్లోర్ నుంచి మొదటి అంతస్తు వరకు నిర్మించిన రెండు పిల్లర్ల సామర్థ్యం సరిపోకపోవడంతో నిర్మిస్తున్న శ్లాబ్ శనివారం ఒక్కసారిగా కుప్పకూలింది. దీంతో కార్మికులంతా మొదటి అంతస్తు నుంచి నేలపై శ్లాబ్తో సహా పడిపోయారు. ఈ ప్రమాదంలో 12 మంది గాయపడ్డారు. వారిని జంగారెడ్డిగూడెంలోని ఓ ప్రైవేట్ ఆస్పత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఆరుగురికి స్వల్ప, మరో ఆరుగురికి తీవ్ర గా యాలయ్యాయి. తీవ్రంగా గాయపడిన కార్మికులు ఆ స్పత్రిలో చికిత్స పొందుతున్నారు. క్షతగాత్రులను పరామర్శించిన జెట్టి : ఆస్పత్రిలో చికిత్స పొందుతున్న కార్మికులను వైఎస్సార్సీపీ రాష్ట్ర కార్యదర్శి, మచిలీపట్నం పార్లమెంట్ పరిశీలకుడు జెట్టి గురునాథరావు పరామర్శించారు. ఈ ప్రాంతంలో నిర్మాణంలో ఉన్న శ్లాబ్ కూలీ ప్రమాదం జరగడం ఇదే ప్రథమమని, మళ్లీ ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా భవన నిర్మాణ యాజమాన్యాలు చర్య లు తీసుకోవాలని కోరారు. కార్మికులు వ్యక్తిగత భద్రతకు ఏర్పాట్లు చేయాలన్నారు. నిర్మాణాలను అధికారులు కూడా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలన్నారు. బాధితులకు వైఎస్సార్సీపీ అండగా ఉంటుందని, మెరుగైన వైద్యం అందించాలని వైద్యులను కోరారు. జిల్లా కార్యదర్శి ముప్పిడి శ్రీనివాసరావు, బత్తిన చి న్న, వీరవల్లి సోమేశ్వరరావు, కె.వసంత కుమార్, ప ట్టణ యూత్ అధ్యక్షులు నేకూరి కిషోర్, చేతివృత్తుల విభాగం అధ్యక్షులు జీడికంటి రామారావు, కడిమి కి రణ్ ఉన్నారు. అలాగే సీఐటీయూ మండల కన్వీనర్ పి.సూర్యారావు క్షతగాత్రులను పరామర్శించారు. కార్మికులు పూర్తిగా కోలుకునే వరకూ యాజమాన్యం బాధ్యత వహించాలని డిమాండ్ చేశారు. సంక్షేమ బోర్డును పునరుద్ధరించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్యే సొంగా రోషన్కుమార్ బాధితుల వివరాలు ఫోన్లో అడిగి తెలుసుకున్నారు. -
మహాశివరాత్రికి బలివే సిద్ధం
ముసునూరు: దేవదాయశాఖ ఆధీనంలో ఉన్న బలే శ్రీరామ లింగేశ్వర ఆలయం మహాశివరాత్రి ఉత్సవాలకు సిద్ధమైంది. ప్రభుత్వ శాఖల సమన్వయంతో ఏటా మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహిస్తారు. ఏలూరు జిల్లాగా ఏర్పడిన తర్వాత నాలుగో ఏడాది ఈ నెల 14 నుంచి 18 వరకు ఐదు రోజులు పాటు ఉత్సవాలు నిర్వహించనున్నారు. ఈ ఉత్సవాలకు నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న ప్రత్యేక అధికారిగా, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, ఈఓ పామర్తి సీతారామయ్య నేతృత్వంలో ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తున్నారు. పిండ ప్రదానాలకు, అమావాస్య స్నానాల కోసం బలివే క్షేత్రంలో ఈ ఏడాది శాశ్వత జల్లు స్నానాలు, మహిళలకు ప్రత్యేక స్నాన ఘట్టాలు, రహదారుల వెడల్పుతో వన్ వే తరహా రాకపోకలకు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అలాగే రెండు జిల్లాల సరిహద్దులో ఉన్న బలే రామలింగేశ్వర స్వామి ఆలయానికి భక్తులు పెద్ద సంఖ్యలో తరలిరానున్న దృష్ట్యా మొత్తం 5 విభాగాలుగా నూజివీడు, ఏలూరు, సత్తుపల్లి ఆర్టీసీ డిపోల నుంచి ప్రత్యేక బస్సులు నడుపనున్నారు. -
బలవంతపు శిక్షణతో సమస్యలు
రెసిడెన్షియల్ విధానంలో విద్యార్థులకు శిక్షణ ఇవ్వాలనుకోవడం ఆహ్వానించదగిన పరిణామమే. అయితే వారికి ఇష్టం లేకుండా బలవంతంగా హాస్టళ్లలో ఉంచినంత మాత్రాన వారికి చదువు అబ్బుతుందన్న నమ్మకం లేదు. ఇలా ఇచ్చే బలవంతపు శిక్షణ వారిని మానసికంగా కుంగదీసి, అనార్యోగానికి గురి చేసే ప్రమాదం ఉంది. అదే జరిగితే విద్యార్థులు పరీక్షలకు హాజరు కావడం కూడా ప్రశ్నార్థకమవుతుంది. – కాకి నాని, పీడీఎస్యూ జిల్లా అధ్యక్షుడు రెసిడెన్షియల్ శిక్షణ విధానం విద్యార్థుల భవిష్యత్ కోసమే. వారి తోటి విద్యార్థులు ఉత్తీర్ణులై పై తరగతులకు వెళ్ళి వారు మాత్రం అనుత్తీర్ణులైతే బాధపడేది వారే. నెలరోజుల పాటు హాస్టళ్లలో ఉండి శిక్షణ పొందితే ఉత్తీర్ణులయ్యే అవకాశం ఉంది. కొందరు విద్యార్థులు హాస్టళ్ల నుంచి ఇళ్లకు వెళ్ళిపోవడం వాస్తవమే. – అరుణ్ కుమార్, ఏలూరు మండల విద్యాశాఖాధికారి–2 -
అత్త వేధింపులతో కోడలు ఆత్మహత్య
ముదినేపల్లి రూరల్: అత్త వేధింపులు భరించలేక కోడలు ఆత్మహత్య చేసుకున్న సంఘటన మండలంలోని దేవపూడిలో శుక్రవారం చోటు చేసుకుంది. పోలీసుల తెలిపిన వివరాల ప్రకారం శ్రీకాకుళం జిల్లా పాతపట్నం మండలం గురిండి గ్రామానికి చెందిన సింధుపురం సంతోషిని(27) దేవపూడికి చెందిన చేడు మహేష్ను ప్రేమించి 2023లో వివాహం చేసుకుంది. ఈ వివాహానికి సంతోషిని బంధువులు అంగీకరించినప్పటికీ మహేష్ తల్లి ఒప్పుకోలేదు. అయినప్పటికీ వీరిరువురు వివాహం చేసుకున్నారు. వీరికి రెండేళ్ల కూతురు ఉండగా తలసేమియా వ్యాధితో బాధపడుతోంది. దీంతో అత్త అప్పలనరసమ్మ తరచూ కోడలైన సంతోషిని అనారోగ్యవంతురాలైన కూతురిని కన్నావంటూ వేధిస్తోంది. అయితే ఇటీవల మళ్లీ సంతోషిని గర్భం దాల్చింది. అయినప్పటికీ అత్త వేధింపులు ఆపకపోవడంతో పడక గదిలో ఫ్యాన్కి ఉరి వేసుకుంది. చుట్టుపక్కల వారు గమనించి సంతోషిని గుడివాడ ప్రభుత్వాసుపత్రికి తరలించగా అప్పటికే చనిపోయినట్లు వైద్యులు నిర్ధారించారు. దీనిపై సంతోషిని సోదరుడు సింగుపురం శేఖర్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఎస్సై వీరభద్రరావు గుడివాడ ఆసుపత్రికి వెళ్లి మృతదేహాన్ని పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. దెందులూరు: మండలంలోని గాలాయగూడెంలో 2022లో సలాది ఉదయ కిరణ్ను హత్య చేసిన పాలడుగు దుర్గాప్రసాద్కు శుక్రవారం జీవిత ఖైదును, వెయ్యి రూపాయలు జరిమానా విధిస్తూ ఏలూరు 5వ అదనపు జిల్లా సెషన్స్ న్యాయమూర్తి మురళీకృష్ణ తీర్పు చెప్పారు. ఎస్సై రాజమల్లు శివాజీ తెలిపిన వివరాల ప్రకారం ఉదయ్ కిరణ్కు దుర్గాప్రసాద్ తమ్ముడు డబ్బులు ఇవ్వాలి. డబ్బుల గురించి దుర్గాప్రసాద్ తమ్ముడికి, ఉదయ కిరణ్కు ఘర్షణ జరిగింది. ఈ ఘర్షణ విషయాన్ని తన అన్న దుర్గాప్రసాద్కి చెప్పడంతో ఉదయ్ కిరణ్ ఇంటికి వెళ్లి నిలదీశాడు. ఇరువురి మధ్య వాగ్వివాదం పెరిగి దుర్గాప్రసాద్ కత్తితో ఉదయ్కిరణ్ తల వెనుక భాగంలో నరికాడు. తీవ్రంగా గాయపడిన ఉదయ్కిరణ్ను గుంటూరు వైద్యశాలకు తీసుకువెళ్లగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఆ కేసులో తాజాగా న్యాయమూర్తి నిందితుడికి శిక్ష వేశారు. ఉండి: మండలంలోని ఆరేడులో చోరీకి గురైన కోళ్లను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. గణపవరం గ్రామానికి చెందిన ముత్తిరెడ్డి రవితేజ రొయ్యల చెరువుల గట్లపై పెంచుతున్న కోళ్లను బుధవారం రాత్రి చోరీ చేసిన ఘటన పాఠకులకు విధితమే. గురువారం సాయంత్రం ఆ కోళ్లను ఆటోలో తరలిస్తున్న వీరవాసరం మండలం వడ్డిగూడేనికి చెందిన సైదు మోహన్రావును ఎన్నార్పీ అగ్రహారం వద్ద పోలీసులు అరెస్టు చేసి, కోళ్లను స్వాధీనం చేసుకుని ఆటోను సీజ్ చేశారు. శుక్రవారం నిందితుడిని రిమాండ్ నిమిత్తం కోర్టులో హాజరుపర్చినట్లు ఎస్సై ఎండీ నసీరుల్లా తెలిపారు. పెదపాడు: నిషేధిత కోళ్ల వ్యర్థాలను తరలిస్తున్న వాహనాన్ని సీజ్చేసి ఐదుగురు వ్యక్తులపై కేసు నమోదు చేసినట్లు పెదపాడు పోలీసులు శుక్రవారం విలేకరులకు తెలిపారు. మండలంలోని తోటగూడెం వైపునకు కోళ్ల వ్యర్థాల వాహనం వస్తున్నట్లు వచ్చిన సమాచారం మేరకు తోటగూడెం సెంటర్లో కాపుగాసి వాహనం సీజ్ చేశామని తెలిపారు. ఈ మేరకు సంబంధిత వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై ఆర్.శ్రీనివాస్ తెలిపారు. -
రెసిడెన్షియల్ శిక్షణ
●సీ, డీ గ్రేడుల విద్యార్థులకు 30 రోజుల ప్రణాళిక ●హాస్టళ్లలో ఉండి చదవాల్సిందేనని ఉన్నతాధికారుల హుకుంఏలూరు (ఆర్ఆర్పేట): ప్రభుత్వరంగ విద్యావ్యవస్థను కూటమి ప్రభుత్వం ఎంతగా భ్రష్టు పట్టించాలో? అంతగా భ్రష్టుపట్టిస్తోందని విద్యారంగ నిపుణులు విమర్శిస్తున్నారు. కొత్తకొత్త విధానాలను తెరపైకి తీసుకువచ్చి విద్యార్థులకు, ఉపాధ్యాయులకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. రెసిడెన్షియల్ శిక్షణ పేరుతో విద్యార్థులను కచ్చితంగా హాస్టల్స్లో ఉండి చదివించాల్సిందేనని తాజాగా ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. ఇప్పటికే ఉపాధ్యాయులపై పలు యాప్ల బారం మోపడంతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహించాలని ఆదేశాలు జారీ చేసి వాటికి నిధులు విడుదల చేయకపోవడంతో సొంత ఖర్చుతో ఉపాధ్యాయులు ఆయా కార్యక్రమాలను బలవంతంగా చేయాల్సి వచ్చింది. పదో తరగతి పర్యవేక్షణకు విద్యాశాఖ అధికారులను కాక విద్యారంగంపై ఏ మాత్రం అవగాహన లేని ఇతర శాఖల అధికారులను నియమించడం, ఇన్విజిలేషన్కు ప్రైవేట్ ఉపాధ్యాయులను కూడా నియమించాలని నిర్ణయం తీసుకోవడం విద్యారంగ నిపుణులను ఆశ్చర్యానికి గురి చేస్తోంది. ఆచరణ సాధ్యంకాని నిర్ణయాలు తీసుకుంటూ వాటిని అమలు చేయాలని పీకల మీద కత్తిపెట్టడంతో ఉపాధ్యాయులు మనోవేదనకు గురవుతున్నారు. 30 రోజుల ప్రణాళిక పేరుతో... మార్చి 16 నుంచి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రారంభంకానున్నాయి. అయితే విద్యార్థుల విద్యా ప్రమాణాలకు అనుగుణంగా వారిని ఏ, బీ, సీ, డీ గ్రేడులుగా విభజిస్తూ ప్రత్యేకంగా దృష్టి చదివిస్తూ ఉంటారు. తాజాగా పబ్లిక్ పరీక్షలు ముందున్న నేపథ్యంలో సీ, డీ గ్రేడుల విద్యార్థుల కోసం 30 రోజుల కార్యాచరణ ప్రణాళికను తెరపైకి తీసుకువచ్చింది. వారిని బలవంతంగా చదివించాలని ఆదేశాలు జారీ చేసింది. ఈ ఆదేశాలు ఉపాధ్యాయులు, ప్రధానోపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు, క్లస్టర్ ఉపాధ్యాయులకు తలనొప్పిగా మారింది. అలాగే విద్యార్థులను సైతం ప్రభుత్వ నిర్ణయం తీవ్ర ఒత్తిడికి గురి చేస్తోంది. హాస్టల్స్కు రావాల్సిందే సీ, డీ గ్రేడు విద్యార్థులను బలవంతంగా చదివించడానికి రెసిడెన్షియల్ శిక్షణకు ఆదేశాలు జారీ చేసింది. ఈ మేరకు ఉపాధ్యాయులు, మండల విద్యాశాఖాధికారులు సీ, డీ గ్రేడ్ విద్యార్థులతో పాటు తరగతులకు ఎక్కువ రోజుల పాటు హాజరు కాని విద్యార్థులను గుర్తించి వారిని రెసిడెన్షియల్ శిక్షణకు హాస్టళ్లకు తరలించారు. విద్యార్థినులను ఏలూరుకు సమీపంలోని వట్లూరు గురుకుల బాలికల వసతి గృహానికి తరలించారు. అలాగే బాలురను నగరంలోని అమీనా పేటలో ఉన్న బీసీ బాలుర హాస్టల్కు తరలించారు. ఈ మేరకు ఏలూరు పరిధిలో 120 మంది విద్యార్థిని, విద్యార్థులను ఇప్పటికే ఆయా హాస్టళ్లకు తరలించి శిక్షణకు ఏర్పాటు చేశారు. మామూలుగానే చదువులో వెనుకంజలో ఉన్న విద్యార్థులు రెసిడెన్షియల్ శిక్షణ పెద్ద శిక్షగా భావిస్తున్నారు. తల్లిదండ్రులకు దూరంగా బలవంతపు చదువులు వారిని మానిసికంగా తీవ్ర ఒత్తిడికి గురి చేస్తున్నాయి. కొంతమంది విద్యార్థులు ఇంటిపై, తల్లిదండ్రులపై బెంగ పెట్టుకుని రోధిస్తుండడంతో హాస్టళ్ల వార్డెన్లు వారిని ఇళ్లకు పంపేస్తున్నారు. మరికొంత మంది విద్యార్థులు కొత్త ప్రదేశంలో ఇమడలేక అనారోగ్యానికి గురవుతున్నారు. వారిని సముదాయించి అక్కడే ఉంచాలంటే విద్యాశాఖాధికారులకు సమస్యగా మారింది. ఇప్పటికై నా ప్రభుత్వం రెసిడెన్షియల్ శిక్షణపై పునరాలోచించాలని తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు కోరుతున్నారు. -
మార్చి 13 నుంచి జాతీయ స్థాయి నాటికల పోటీలు
పాలకొల్లు సెంట్రల్: సాంఘిక నాటక రంగానికి పుట్టినిల్లు అయిన పాలకొల్లులో కళా రంగాన్ని ప్రోత్సహించాలనే ఉద్దేశంతో నాటిక పోటీలను నిర్వహిస్తున్నామని పాలకొల్లు కళాపరిషత్ అధ్యక్షుడు కేవీ కృష్ణవర్మ అన్నారు. ఈ మేరకు శుక్రవారం కళాపరిషత్ ఆధ్వర్యంలో మార్చి 13, 14, 15 తేదీల్లో 17వ జాతీయ స్థాయి నాటికల పోటీల ఆహ్వాన పత్రికను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కృష్ణవర్మ మాట్లాడుతూ అడబాల థియేటర్ వెనుక భాగంలో ఉన్న స్థలంలో నాటిక పోటీలు నిర్వహించనున్నామన్నారు. అనంతరం మొదటి పత్రికను సంస్థ గౌరవ అధ్యక్షుడు మేడికొండ శ్రీనివాసరావుకు అందజేశారు. కార్యక్రమంలో కేఎస్పీఎన్ వర్మ, మానాపురం సత్యనారాయణ, జక్కంపూడి కుమార్ తదితరులు పాల్గొన్నారు. ముదినేపల్లి రూరల్ : మట్టి లారీల వల్ల రోడ్లు ధ్వంసమవుతున్నాయంటూ మండలంలోని పెదగొన్నూరు గ్రామస్తులు లారీలను నిలిపివేసిన సంఘటన శుక్రవారం చోటు చేసుకుంది. గ్రామస్తులు తెలిపిన వివరాల ప్రకారం కొన్ని రోజులుగా ప్రజాప్రయోజనాల కోసమంటూ టిప్పర్లతో గ్రామం నుంచి ఇతర ప్రాంతాలకు మట్టిని తరలిస్తున్నట్లు చెప్పారు. దీనివల్ల ఇటీవలనే నూతనంగా వేసిన రోడ్లు ధ్వంసమవుతున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ టిప్పర్లతో కాకుండా ట్రాక్టర్లతో మట్టిని తరలించాలని చెప్పినప్పటికీ టిప్పర్లతో తరలిస్తున్నందున రోడ్లు పాడైపోతున్నట్లు శ్రవణం బాలాజీ అనే గ్రామస్తుడు ఆవేదన వ్యక్తం చేశాడు. ఇప్పటికై నా ఎమ్మెల్యే జోక్యం చేసుకుని ట్రాక్టర్లతోనే మట్టిని తరలించేలా చర్యలు తీసుకోవాలని కోరారు. తణుకు అర్బన్: పూనేలో ఈ నెల 7,8 తేదీల్లో నిర్వహించిన జాతీయస్థాయి ఎండ్యూరెన్స్ స్కేటింగ్ పోటీల్లో తణుకుకు చెందిన క్రీడాకారులు బంగారు పతకాలు సాధించారు. తణుకు స్కేటింగ్ రేంజర్స్ అకాడమీలో శిక్షణ పొందిన తణుకుకు చెందిన కాకిలేటి గేయ దీపిక అండర్–8 బాలికల విభాగంలో మూడు బంగారు పతకాలు, అండర్–19 బాలుర విభాగంలో రెడ్డి పవన్ హర్షవర్థన్ రెండు బంగారు పతకాలు, ఒక వెండి పతకం, అండర్–7 విభాగంలో ఖండవల్ల మయాంక్ కాంస్య, అండర్–5 బాలికల విభాగంలో మండల నిహస్వి కాంస్య పతకం సాధించినట్లు కోచ్ లావణ్య శుక్రవారం విలేకరులకు తెలిపారు. వీరు త్వరలో మాల్దీవుల్లో నిర్వహించే అంతర్జాతీయ స్కేటింగ్ పోటీల్లో పాల్గొంటారని తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి సన్నిధిలో మార్చి 20 నుంచి 23 వరకు రాష్ట్ర స్థాయిలో ఒంగోలు, పుంగనూరు జాతి ఆవుల అందాలు, పాల పోటీలను నిర్వహించనున్నట్టు గోజాతి సంరక్షణ రాష్ట్ర అధ్యక్షులు యు.చక్రపాణి తెలిపారు. ఈ మేరకు పోటీలు జరిగే మార్కెట్ యార్డు స్థలాన్ని శుక్రవారం ఆయన ఏఎంసీ చైర్మన్ వై.బ్రహ్మరాజుతో కలసి పరిశీలించారు. ఈ సందర్భంగా వారు విలేకరులతో మాట్లాడుతూ ద్వారకాతిరుమలలో గోసమ్మేళనం పేరుతో కొంత కాలంగా ఒంగోలు, పుంగనూరు జాతి గోవులకు అందాలు, పాల పోటీలను నిర్వహిస్తున్నామన్నారు. రైతులకు, పశువులకు అన్ని సౌకర్యాలను కల్పించి, పోటీల్లో గెలుపొందే గోవులకు బహుమతులను అందిస్తామన్నారు. జంగారెడ్డిగూడెం: వైఎస్సార్ సీపీ రాష్ట్ర కార్యదర్శిగా (పార్లమెంట్) జంగారెడ్డిగూడెంకు చెందిన బీవీఆర్ చౌదరి నియమితులయ్యారు. వైఎస్సార్ సీపీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు పార్టీ కేంద్ర కార్యాలయం నుంచి శుక్రవారం ఉత్తర్వులు జారీ అయ్యాయి. ఈ సందర్భంగా బీవీఆర్ చౌదరిని పలువురు నాయకులు, కార్యకర్తలు అభినందించారు. -
ముగిసిన మావుళ్లమ్మ వార్షిక మహోత్సవాలు
● అమ్మవారికి మహానివేదన సమర్పణ ● అన్నసమారాధనకు పోటెత్తిన భక్తులు భీమవరం(ప్రకాశం చౌక్): దాదాపు నెల రోజుల నుంచి నీరుల్లి కూరగాయపండ్లు వర్తక సంఘం, అమ్మవారి ఉత్సవ కమిటి ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న శ్రీమావుళ్లమ్మ వారి 62వ వార్షిక మహోత్సవాలు శుక్రవారంతో ముగిశాయి. ఈ సందర్భంగా అమ్మవారికి మహానైవేద్యం సమర్పించి, అన్నసమారాధన నిర్వహించారు. ముందుగా ఆలయ ప్రధాన అర్చకులు మద్దిరాల మల్లికార్జునశర్మ అమ్మవారిని అన్నపూర్ణాదేవిగా అలంకరించి, ప్రత్యేక పూజలు చేశారు. ఎమ్మెల్యే అంజిబాబు, ఉత్సవ నిర్వాహకులు అమ్మవారికి పలు రకాల పిండి వంటలు, స్వీట్స్,పులిహోర తదితర వాటిని మహా నివేదనగా సమర్పించారు. రూ.1.45 లక్షలు పలికిన లడ్డూ ఉత్సవాలు సందర్భంగా అమ్మవారికి సమర్పించిన 36 కిలోల లడ్డును వేలం వేయగా భీమవరానికి చెందిన బోడపాటి చినబాబు అనే భక్తుడు రూ 1.45 లక్షలకు వేలం పాటలో దక్కించుకున్నారు. లక్ష మందికిపైగా అన్నప్రసాదం ఉత్సవాల ముగింపు సందర్భంగా ఉదయం 8 గంటల నుంచి రాత్రి వరకు అమ్మవారి ఆలయం వద్ద అన్నదాన ప్రసాదం వితరణ నిర్వీరామంగా కొనసాగింది. భీమవరం పట్టణంతో పాటు జిల్లా నలుమూలు నుంచి భక్తులు భారీగా తరలివచ్చి అమ్మవారి అన్నదాన ప్రసాదం స్వీకరించారు. ప్రత్యేక క్యూలైన్లు ద్వారా భక్తులు అమ్మవారి ఆలయం వద్దకు చేరుకుని అన్నదాన ప్రసాదం స్వీకరించారు. మిగిలిన వారికి అమ్మవారి ఆలయం ముందు ఖాళీ ప్రదేశంలో భోజన సౌకర్యం ఏర్పాటు చేశారు. అమ్మవారి ఆలయం పడమటివైపు తాలూకాఫీసు సెంటర్, దక్షిణంవైపు వేణుగోపాల స్వామి ఆలయం సెంటర్, ఆదివారం బజారు రోడ్డు, అన్నదానానికి వచ్చిన భక్తులతో కిక్కిరిసిపోయాయి. దాదాపు లక్ష మంది అన్నప్రసాదం తీసుకున్నట్లు ఉత్సవ కమిటీ నిర్వాహకులు తెలిపారు. -
సంచలనం రేకెత్తించిన విజిలెన్స్ దాడులు
తణుకు అర్బన్/ఇరగవరం: ఇరగవరం మండలం కంతేరు గ్రామంలో గురువారం నిర్వహించిన విజిలెన్స్ దాడుల్లో ఎరువులు, పురుగుమందుల అనధికార నిల్వల వ్యవహారం జిల్లాలో సంచలనం రేకెత్తించింది. సరుకు కొనుగోళ్లు చేసి ఎక్కడైనా అమ్మేసుకుంటాం అనే రీతిలో అనధికారిక గోడౌన్లో నిర్వహిస్తున్న బ్లాక్ వ్యాపారాన్ని విజిలెన్స్ అధికారులు బట్టబయలు చేశారు. ఈ దాడిలో కంతేరు గ్రామంలో దీవెన ఆగ్రో కెమికల్స్ పేరుతో నడుస్తున్న అనధికార గోడౌన్లో రూ. 80,01,059 విలువైన 22,893 కిలోల పురుగుమందులు, రూ. 14,34,142 విలువైన 26,474 మెట్రిక్ టన్నుల ఎరువుల బస్తాలను విజిలెన్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఎరువులు, పురుగుమందుల వ్యాపారం నిర్వహణ, అవసరమైన లైసెన్స్లు ఉన్నప్పటికీ గోడౌన్కు ఎటువంటి అనుమతి లేదని, వ్యవసాయాధికారుల నుంచి డోర్ నంబరుతో సహా తీసుకోవాల్సిన ధ్రువపత్రాలు లేవని గుర్తించారు. అలాగే ఎరువుల నిల్వల్లో తేడాలు ఉండడం వంటి కారణాలతో దీవెన ఆగ్రో కెమికల్స్ సంస్థ ప్రొప్రైటర్ గంటా సురేంద్రపై 6ఏ కేసు నమోదు చేశారు. వ్యవసాయాధికారుల నిర్లక్ష్య వైఖరి ప్రస్తుత చంద్రబాబు ప్రభుత్వంలో గత సీజన్లో ఎరువుల కొరతతోపాటు అరకొర పంపిణీలో సైతం తమకు కావాల్సిన వారికి మాత్రమే ఇచ్చారంటూ రైతుల ఆరోపణలు వెల్లువెత్తాయి. ముఖ్యంగా తణుకు మండలం ముద్దాపురం సొసైటీలో టీడీపీ నాయకులు తమకు అనుకూలమైన వారికి ముందుగానే ట్రాక్టర్లలో ఎరువుల బస్తాలు ఎక్కించి వారి ఇళ్లలో నిల్వలు చేశారు. ఈ వ్యవహారాన్ని రైతులు నిలదీయడంతో గతేడాది అక్టోబరు నెలలో సామాజిక మాధ్యమాల్లో హల్చల్ చేసింది. నాయకులు వ్యవసాయాధికారులను సైతం ప్రసన్నం చేసుకుని అధికంగా నిల్వలు చేసుకుంటారని రైతులు ఆరోపిస్తున్నారు. ఇప్పటికై నా అనధికార నిల్వలపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతున్నారు. -
ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలు
తాడేపల్లిగూడెం: ఖాతాదారుల అవసరాలకు అనుగుణంగా సేవలను విస్తరించడమే సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లక్ష్యమని బ్యాంకు ముంబై సెంట్రల్ ఆఫీస్ జనరల్ మేనేజర్ డాక్టర్ జి.భాస్కర్ తెలిపారు. బ్యాంకు ఆధ్వర్యంలో శుక్రవారం మాగంటి కల్యాణ మండపంలోని మెగా అగ్రికల్చరల్ క్రెడిట్ అవుట్ రీచ్ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమంలో బాస్కర్ మాట్లాడుతూ వ్యవసాయానికి ప్రాధాన్యత ఇస్తూ రుణాలను అందిస్తున్నామన్నారు. అనంతరం రైతులకు రూ.80 కోట్ల విలువైన రుణ మంజూరు పత్రాలను అందజేశారు. కార్యక్రమంలో విజయవాడ రీజినల్ మేనేజర్ పి.సతీష్బాబు, డాల్ఫిన్స్ గ్రూపు సీఈఓ డి.లీలాకృష్ణ, స్థానిక బ్యాంకు మేనేజర్ షేక్ కరీం పాల్గొన్నారు. అలాగే ఈ నెల 21న రిటైల్ క్రెడిట్ అవుట్ రీచ్ క్యాంపెయిన్ నిర్వహించనున్నట్టు తెలిపారు. -
తల్లికి వంచన
నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు.. నీకు పదిహేను వేలు అంటూ ఎన్నికల్లో ఊదరగొట్టారు. ఆనక తొలి ఏడాదికి ఎగనామం పెట్టి.. ఇప్పుడు మండలి వేదికగా తల్లికి వందనం అందరికి ఇచ్చామంటూ చంద్రబాబు ప్రభుత్వం అసత్యాలు వల్లించడంపై విమర్శలు వ్యక్తమవుతున్నాయి.పశ్చిమ గోదావరి జిల్లా పాలకోడేరు మండలం కుముదవల్లికి చెందిన కె. మరియమ్మ తనయుడు ఇంటర్ చదువుతున్నాడు. తల్లికి వందనం పథకం కింద గత ఏడాది రూ.8,850 మాత్రమే అకౌంట్కు జమచేశారు. ఈ మొత్తం రాష్ట్ర ప్రభుత్వ వాటా అని, త్వరలో కేంద్ర ప్రభుత్వ వాటా జమవుతుందంటూ మెసేజ్ వచ్చింది. ఎనిమిది నెలలు కావస్తున్నా మిగిలిన సొమ్ము రాలేదని ఆమె తెలిపారు. సాక్షి ప్రతినిధి,ఏలూరు: పేదరికం కారణంగా తమ బిడ్డలను చదువులకు దూరం చేయకూడదనే ఆశయంతో గత ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పధకాన్ని అమలు చేసి తల్లుల ఖాతాల్లో రూ.15 వేలు చొప్పున వేసి చరిత్ర సృష్టించారు. గత ఎన్నికల్లో కూటమి ప్రభుత్వం అమ్మ ఒడి పథకాన్ని తల్లి వందనం పేరుతో మార్చి అమలుచేస్తామని, ఎంత మంది పిల్లలుంటే అంతమందికి రూ.15 వేల చొప్పున ఖాతాల్లో వేస్తామని హామీలు ఇచ్చారు. చంద్రబాబునాయుడు అధికారంలోకి వచ్చిన తరువాత హామీలను తుంగలోతొక్కి సాంకేతిక కారణాలను సాకుగా చూపి అనేక మంది తల్లులకు తల్లికి వందనం పథకం దూరం చేసి వెన్నుపోటు పొడిచారు. అర్హులకు అందని సాయం జిల్లాలో తల్లి వందనం పథకం అమలులో పక్షపాతం చూపడంతో అర్హుల్లో అనేక మందికి ఈ పథకం దూరమైంది. ఇద్దరు బిడ్డలున్న తల్లులు తమకు రూ.30 వేలు వస్తాయని ఎదురుచూడగా ఒక్క రూపాయి కూడా రాకపోవడంతో కూటమి ప్రభుత్వంపై శాపనార్థాలు పెడుతున్నారు. కేవలం వైఎస్సార్సీపీ సానుభూతిపరులు ఈ పథకానికి దూరమైనట్లు చర్చ జరుగుతోంది. జిల్లాలో ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాల్లోని అన్ని పాఠశాలల్లో 1 నుంచి 10వ తరగతి చదువుతున్న విద్యార్థులు విద్యాశాఖ రికార్డుల ప్రకారం 2,72,135 మంది ఉండగా తల్లికి వందనం పథకం కేవలం 2,38,434 మందికి మాత్రమే అమలు చేస్తున్నారు. మరో 33,701 మందికి ఈ పథకాన్ని చంద్రబాబు ప్రభుత్వం దూరం చేసింది. దీనికితోడు పథకాన్ని అమలు చేసిన వారిలో సైతం ఎక్కువ మంది తల్లుల ఖాతాల్లో కేవలం రూ.8 వేల నుంచి రూ.10 వేలలోపు మాత్రమే వేయడంతో చంద్రబాబు చేతిలో తాము మరోసారి మోసపోయామని తల్లులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. పథకం అందని వారిలో సుమారు 9 వేల మంది తమకు పథకాన్ని అమలు చేయడానికి చర్యలు తీసుకోవాలని ప్రతి సోమవారం జరిగే ప్రజా సమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్కు వినతిపత్రాలు సమర్పిస్తున్నారు. అయినప్పటికీ వారికి ఈ పథకాన్ని అమలు చేయడంలో ప్రభుత్వం ఎలాంటి చొరవ తీసుకోవడం లేదు. రాష్ట్ర వ్యాప్తంగా అనేక మంది తల్లులు పథకానికి దూరం కావడంతో ప్రస్తుతం జరుగుతున్న శాసనమండలి సమావేశాల్లో ఈ విషయాన్ని సభ్యులు చర్చకు తీసుకురావడంలో మరోసారి తల్లికి వందనం పథకంపై రాష్ట్ర వ్యాప్తంగా తల్లుల నుంచి నిరసనలు వ్యక్తమవుతున్నాయి. పూర్తి స్థాయి అర్హులకు దక్కని సాయం సాంకేతిక కారణాలతో అందని తల్లికి వందనం 33,701 మందికి మొండిచేయి గ్రీవెన్స్లో 9 వేల దరఖాస్తులు జిల్లాలో 2.45 లక్షల మంది అర్హులు గ్రీవెన్స్లో 9 వేల దరఖాస్తులు -
అటకెక్కించారు
ఎన్నికల సమయంలో మీకు రూ.15 వేలు.. మీకు రూ.15 వేలు అంటూ కనిపించిన వారందరికీ గొప్పగా చెప్పారు. గద్దెనెక్కిన తరువాత తల్లి వందనం ఎగనామం పెట్టారు. కొందరికి కొర్రీలు పెట్టారు. నిరుద్యోగ భృతి, 50 ఏళ్ళు దాటిన వారికి పింఛన్ నెరవేర్చలేదు. ఎన్నికల హామీపై ప్రజలు తిరగబడే రోజులు దగ్గరలోనే ఉన్నాయి. – దూలం నాగేశ్వరరావు, వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు టీడీపీ ఎన్నికల ముందు తల్లికి వందనం కింద ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని ప్రజలకు హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరం అసలు పథకాన్నే అమలు చేయలేదు. ఇచ్చింది కేవలం రూ.13 వేలు మాత్రమే. కొందరికి రూ.6 వేలు, రూ.7 వేలు మాత్రమే ఇచ్చారు. వచ్చే సంవత్సరం అసలు ఈ పథకం అమలు చేస్తారో లేదోననే అనుమానంతో ప్రజలు ఉన్నారు. మొదటి సంవత్సరం తల్లికి వందనం నగదును కూడా ఇస్తే ప్రజలు సంతోషిస్తారు. – మేకా వెంకట ప్రతాప్ అప్పారావు, నూజివీడు నియోజకవర్గ సమన్వయకర్త ఎన్నికల ముందు చంద్రబాబునాయుడు తల్లికి వందనం పేరుతో ఇంట్లో ఉన్న ప్రతి విద్యార్థికి రూ.15 వేలు ఇస్తామని హామీ ఇచ్చారు. అధికారంలోకి వచ్చి రెండేళ్ళు దాటినా అది అవాస్తవమని తేలిపోయింది. అర్హులైన చాలా మందికి తల్లికి వందనం అందడం లేదు. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి అమ్మ ఒడి పథకంలో అర్హులైన ప్రతి ఒక్కరికీ నేరుగా తల్లుల ఖాతాల్లో జమ చేశారు. కూటమి ప్రభుత్వం మాత్రం తల్లి వందనం పేరుతో తల్లులను, పిల్లలను మోసం చేస్తున్నారు. – తెల్లం బాలరాజు, పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త -
పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేయాలి
ఏలూరు (టూటౌన్): రాష్ట్ర ప్రభుత్వం తక్షణం పీఆర్సీ కమిటీ ఏర్పాటు చేసి ఐఆర్ మంజూరు చేయాలని, సీపీఎస్ను రద్దు చేయాలని, మేనిపెస్టోలో పొందుపర్చిన హామీలను నెరవేర్చాలని కోరుతూ ఎస్టీయూ ఆధ్వర్యంలో శుక్రవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. ఈ ధర్నా కార్యక్రమాన్ని ఉద్దేశించి ఎస్టీయూ జిల్లా అధ్యక్షుడు పీబీవిఎన్ఎల్ నారాయణ మాట్లాడుతూ తమ న్యాయబద్ధమైన డిమాండ్లను తక్షణమే పరిష్కరించాలని లేనిపక్షంలో పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. 11వ పీఆర్సీ గడువు పూర్తై 30 నెలలు కావస్తున్నా 12వ పీఆర్సీ కమిటీని ఏర్పాటు చేయకపోవడం దారుణమన్నారు. దీనివల్ల ఉద్యోగ, ఉపాధ్యాయ, పెన్షనర్లు తీవ్ర ఆందోళన చెందుతున్నారన్నారు. ఉద్యోగుల సమస్యల పట్ల ప్రభుత్వ నిర్లక్ష్య ధోరణి సరికాదన్నారు. జిల్లా ప్రధాన కార్యదర్శి కేఆర్ పవన్ కుమార్ మాట్లాడుతూ ఇప్పటికే పీఆర్సీ గడువుదాటి మూడు సంవత్సరాలు కావస్తుందని తక్షణమే కమిటీ నియమించి ఐఆర్ ప్రకటింపచేయాలని డిమాండ్ చేశారు. ఉపాధ్యాయుల ధర్నాను సీపీఐ ఏలూరు జిల్లా ప్రధాన కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, ఏఐటీయూసీ ఏలూరు జిల్లా ఉపాధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు తదితరులు సందర్శించి మద్ధతు తెలిపారు. ఏలూరు (ఆర్ఆర్పేట): రెండో శనివారం పాఠశాలలకు సెలవుపై జిల్లా విద్యాశాఖాధికారి భిన్న ప్రకటనలు చేయడంతో విద్యార్థులు, ఉపాధ్యాయుల్లో గందరగోళ పరిస్థితి నెలకొందని వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర అధికార ప్రతినిధి గెడ్డం సుధీర్; జిల్లా అధ్యక్షుడు వీ. రామ్మోహన రావు ఒక ప్రకటనలో ఆందోళన వ్యక్తం చేశారు. గతంలో తుఫాను ప్రభావం వల్ల ఇచ్చిన సెలవులో భాగంగా రెండో శనివారం ప్రతి పాఠశాల పని చేయాల్సి ఉండగా, శుక్రవారం మధ్యాహ్నం ఉపాధ్యాయ సంఘాల కోరిక మేరకు శనివారం సెలవుగా డీఈఓ ప్రకటించారన్నారు. అది కూడా 220 పనిదినాలకు సరిపోయే పాఠశాలలు సెలవు దినంగా ప్రకటించుకోవచ్చని తెలిపారన్నారు. తిరిగి సాయంత్రం ఏడు గంటల సమయంలో జిల్లాలోని అన్ని పాఠశాలలు శనివారం పనిచేయాలని ప్రకటిస్తూ, వాట్సప్లో మెసేజ్ పెట్టడం దారుణమన్నారు. జిల్లా విద్యాశాఖాధికారి భిన్న ప్రకటనలతో గందరగోళం సృష్టించడాన్ని వివిధ ఉపాధ్యాయ సంఘాలు తీవ్రంగా ఖండించాయి. ఈ మేరకు ఆయా సంఘాల నాయకులు వేర్వేరుగా ప్రకటనలు విడుదల చేశాయి. ఏలూరు (మెట్రో): పది, ఇంటర్ పరీక్షలలో మాస్ కాపీయింగ్ జరగకుండా పటిష్ట చర్యలు తీసుకుంటున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె. విజయానంద్కి తెలిపారు. ఏపీ సచివాలయం నుంచి పరీక్షలు, ప్రభుత్వ సేవలపై ప్రజల సంతప్తి స్థాయి, కోర్టు భవనాల కోసం స్థలం, కొత్తగా ఏర్పడిన జిల్లాల్లో స్థల సమస్యలు, తదితర అంశాలపై శుక్రవారం సాయంత్రం కలెక్టర్లతో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సమీక్షించారు. ఈ సందర్భంగా సీఎస్ మాట్లాడుతూ పరీక్షల నిర్వహణకు పటిష్టమైన ప్రణాళిక రూపొందించుకుని అమలు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాను అవినీతి రహితంగా తీర్చిదిద్దేందుకు ప్రతి ఒక్కరూ తమ వంతు బాధ్యత నిర్వర్తించాలని అవినీతి నిరోధశాఖ డీఎస్పీ జీవీ కృష్ణారావు ఒక ప్రకటనలో కోరారు. ఫిర్యాదుదారుల వివరాలను అత్యంత గోప్యంగా ఉంచుతామని తెలిపారు. అవినీతి సమాజమే లక్ష్యంగా ప్రజలంతా భాగస్వాములు కావాలని, జిల్లాలో ప్రభుత్వ ఉద్యోగి ఎవరైనా.. ఎక్కడైనా లంచం కోరితే వెంటనే ఏసీబీకి సమాచారం ఇవ్వాలని తెలిపారు. టోల్ ఫ్రీ నెంబర్ 1064 లేదా 9440446157, 9440446159 నెంబర్లకు ఫోన్ చేసి ఫిర్యాదు చేయవచ్చని ఏసీబీ డీఎస్పీ కోరారు. బలివే (ముసునూరు): భక్తులు బలివే రామలింగేశ్వర స్వామిని సులువుగా దర్శించుకుని తిరిగి క్షేమంగా వెళ్ళేలా అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలని గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి, కలెక్టర్ వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. బలివే ఆలయ ప్రాంగణంలో శుక్రవారం సమీక్ష నిర్వహించారు. మంత్రి మాట్లాడుతూ గత అనుభవాలను దృష్టిలో పెట్టుకుని చిన్న పొరపాటుకు తావు లేకుండా మహా శివరాత్రి ఉత్సవాలు కనుల పండువగా నిర్వహించాలన్నారు. -
ఎదురుదాడి చేస్తున్నారు
ప్రభుత్వం సమర్థవంతంగా పథకాలు అమలు చేయకుండా అడిగిన వారిపై ఎదురుదాడి చేయడం దారుణం. తల్లికి వందనం పేరుతో అందరినీ మోసం చేస్తున్నారు. డబ్బులు పూర్తిగా తల్లుల ఖాతాల్లో జమ చేయడం లేదు. ఏదొక కారణం చెప్పి కోతలు పెడుతున్నారు. ప్రభుత్వం ప్రకటించిన ప్రకారంగా సొమ్ములు చెల్లించడంలేదు. – పుప్పాల వాసుబాబు, ఉంగుటూరు నియోజకవర్గ సమన్వయకర్త తల్లికి వందనం అమలు తీరు బాధాకరం. ఎన్నికల సమయంలో ఆకర్షించేలా నీకు 15 వేలు.. నీకు 15 వేలు అంటూ వాగ్దానాలు చేశారు. ప్రభుత్వం ఏర్పడిన తరువాత ఆ పథకాన్ని ఎలా అమలు చేస్తున్నారో తల్లులు గమనిస్తున్నారు. హామీలు ఇచ్చిన వారందరూ మౌనంగా ఉన్నారు. హామీలు ఇచ్చినవారు స్పష్టమైన ప్రకటన చేయాలి. – కొఠారు అబ్బయ్యచౌదరి, దెందులూరు నియోజకవర్గ సమన్వయకర్త కూటమి ప్రభుత్వం తల్లికి వందనం పథకం ప్రకటించి అధికారంలోకి వచ్చాక మొదటి సంవత్సరంలో ఒక్క రూపాయి కూడా తల్లుల ఖాతాల్లో జమ చేయలేదు. రెండో సంవత్సరం ప్రకటించిన రూ.15 వేలు కాకుండా తగ్గించి కొంతమందికి రూ. 13వేలు ఖాతాలో జమ చేశారు. కొన్నిచోట్ల అసలు ఒక రూపాయి కూడా వేయలేదు. ఇలా ప్రతి పథకంలోనూ మోసం చేశారు. కంభం విజయరాజు, చింతలపూడి నియోజకవర్గ సమన్వయకర్త ముఖ్యమంత్రి చంద్రబాబు చెప్పినవన్ని పచ్చి అబద్ధాలు. ఎన్నికల సమయంలో అమలు కాని హామీలు ఇస్తారు. తీరా గద్దెనెక్కిన తరువాత వాటిని అమలు చేయరు ఇది చంద్రబాబు నైజం. తల్లి వందనం పేరుతో ఇంట్లో ఎంత మంది ఉంటే అంతమందికి అర్హులైన వారికి ఇస్తానని హామీ ఇచ్చారు. మరోసారి చంద్రబాబు అబద్ధాల కోరని తేలిపోయింది. – మామిళ్ళపల్లి జయప్రకాష్, ఏలూరు నియోజకవర్గ సమన్వయకర్త -
మద్యం దోపిడీకి పచ్చజెండా
సాక్షి ప్రతినిధి, ఏలూరు: విచ్చలవిడి మద్యం దోపిడీకి మళ్ళీ తెరలేచింది. జిల్లాలో కొత్తగా పొలిటికల్ ఎమ్మార్పీ ట్రెండింగ్లోకి వచ్చింది. ఎమ్మార్పీ కంటే రూ.10 అదనంగా పెంచుకోవచ్చని ప్రభుత్వ ఉత్తర్వులతో మధ్యంతర దోపిడీకి ఒక వైపు తెరలేస్తే మరో రూ. 10 పొలిటికల్ ఎమ్మార్పీ అంటూ క్వార్టర్ సీసాపై రూ.20 అదనంగా వసూలు చేస్తున్నారు. బెల్టుషాపుల్లో నో రూల్స్. నో ఎమ్మార్పీ.. కూటమి చోటా నేతలు నిర్ణయించిందే ధర. సమీక్షా సమావేశాల్లో జిల్లా ఉన్నతాధికారులు ఎమ్మార్పీ ఉల్లంఘనకు పాల్పడితే కఠిన చర్యలు, లైసెన్స్ రద్దు అంటూ చేసే హడావుడి కేవలం ప్రకటనలకే పరిమితమవుతోంది. జిల్లాలో 155 వైన్షాపులు, 20 బార్లు కలిపి నెలకు సగటున రూ.120 కోట్ల నుంచి రూ.125 కోట్ల మద్యం విక్రయాలు జరుగుతున్నాయి. ప్రతి వైన్షాపుకు అనుబంధంగా పదుల సంఖ్యలో బెల్టుషాపులు వెలిశాయి. గ్రామగ్రామాన మద్యాన్ని ఏరులై పారించడమే ఏజెండాగా బెల్టుషాపులకు తెరదీశారు. జిల్లా వ్యాప్తంగా వందల సంఖ్యలో బెల్టుషాపుల్లో విక్రయాలు కొనసాగుతున్నాయి. జిల్లాలో ప్రత్యేక పొలిటికల్ ఎమ్మార్పీ, డ్రై డే ఇతర ప్రత్యేక రోజుల్లో ఇష్టానురీతిలో విక్రయించుకునేలా వ్యవస్థ ఏర్పాటు చేశారు. 7 నియోజకవర్గాల్లో వైన్షాపులు కూటమి ప్రజాప్రతినిధుల కనుసన్నల్లో, కొన్ని చోట్ల ప్రత్యక్ష భాగస్వామ్యంతో మరికొన్ని చోట్ల పరోక్ష భాగస్వామ్యంతో ఏర్పాటయ్యాయి. ఈ క్రమంలో షాపుల ఏర్పాటు సమయంలోనే షాపులకు రూ.5 లక్షల నుంచి 10 లక్షల మేరకు విక్రయాలు, షాపు స్థాయిని బట్టి ధర నిర్ణయించి అధికార పార్టీ నేతలు వ్యాపారుల నుంచి వసూలు చేశారు. గతేడాది కొత్త లైసెన్స్లు అమలులోకి వచ్చినప్పటి నుంచే రూ.10 ఎమ్మార్పీ అదనంగా కొనసాగిస్తున్నారు. తాజాగా రూ.10 అదనంగా అమ్ముకోవచ్చని ఇచ్చిన జీవోను అడ్డం పెట్టుకుని రూ.20 వసూలు చేస్తున్నారు. ఇదంతా ఎకై ్సజ్ అధికారులకు తెలిసే కొనసాగిస్తున్నారు. ఊరూరా బెల్టుషాపులు ప్రతి వైన్షాపుకు అనుబంధంగా సగటున 40 నుంచి 60 బెల్టుషాపులు ఏర్పాటు చేసి జిల్లా వ్యాప్తంగా సుమారు వెయ్యికి పైగా బెల్టుషాపులు అధికార పార్టీ నేతలే నిర్వహిస్తున్నారు. క్వార్టర్కు సగటున రూ.30 నుంచి రూ.50 వరకు అధికంగా విక్రయిస్తున్నారు. సమయపాలనతో సంబంధం లేకుండా విక్రయాలు జరుగుతున్నాయి. రెండు రోజులు క్రితం ముఖ్యమంత్రి ఐఎఎస్ అధికారులతో నిర్వహించిన ప్రగతి సమావేశంలోనూ దీనిపై చర్చ సాగింది. ఎమ్మార్పీ అధిక ధరలకు విక్రయాలు, బెల్టుషాపుల కట్టడి విషయంలో రాష్ట్రంలో జిల్లా 8వ స్ధానంలో ఉందని బెల్టుషాపులు లేకుండా, ఎమ్మార్పీకు విక్రయాలు జరిగేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ సమీక్షలో సూచించారు. ప్రతి వైన్షాపుకు ఓ ధర నిర్ణయించి ఎకై ్సజ్ శాఖ నెలవారీ ప్రత్యేక వసూళ్లు కొనసాగిస్తుంది. దీనికిగాను అడపాదడపా డ్రై డేలు, జాతరలు, ఇతర ప్రత్యేక సందర్భాల్లో అదనంగా రూ.30 పెంచి అమ్ముకున్నా పట్టించుకోని పరిస్థితి. క్వార్టర్పై రూ.20 అదనం రూ.10 ప్రభుత్వ ధరకు మరో రూ.10 పొలిటికల్ ధర జిల్లాలో నెలకు సగటున రూ.120 కోట్ల మద్యం విక్రయాలు బెల్టు షాపుల్లో స్పెషల్ రేట్లు -
ప్రాణాలైనా అర్పిస్తాం
● నేవీ ఆయుధ డిపో నిర్మాణం వద్దు ● పాలకుల కుట్రలు తిప్పికొడదాం ● మా భూములు ఇచ్చేది లేదు ఏలూరు(టూటౌన్): నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి మా భూములు ఇవ్వం.. ప్రాణాలైనా అర్పిస్తాం.. నేవీ ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకుంటామంటూ కొయ్యలగూడెం మండల ప్రజలు నిరసనగళం ఎత్తారు. కొయ్యలగూడెం మండలం బోడిగూడెం, బర్కిత్నగర్లో నావిక ఆయుధ డిపో నిర్మాణం నిలిపివేయాలని, బలవంతపు భూసేకరణ విరమించాలని కోరుతూ శుక్రవారం ఏలూరు కలెక్టర్ కార్యాలయం వద్ద బోడిగూడెం, మంగపతి దేవి పేట, బర్కిత్ నగర్,రే గులకుంట, ఊట్లగూడెం గ్రామాల నుంచి ప్రజలు రైతులు పెద్ద ఎత్తున తరలివచ్చి కలెక్టరేట్ కార్యాలయం వద్ద భారీ ధర్నా నిర్వహించారు. ఈ ధర్నాకు సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యురాలు అక్కినేని వనజ, జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణ చైతన్య, పలు ప్రజా సంఘాలు సంపూర్ణ మద్దతు ప్రకటించాయి. ఈ ధర్నాను ఉద్దేశించి అక్కినేని వనజ మాట్లాడుతూ జీలుగుమిల్లి మండలం వంకావారిగుడిలో నేవీ ఆయుధ డిపో పెట్టాలని ప్రభుత్వం ప్రయత్నించిందని, వామపక్షాలు స్థానిక ప్రజలు సాగించిన పోరాటంతో అక్కడి నుంచి కొయ్యలగూడెం మండలం బోడిగూడెం కేంద్రంగా మంగపతి దేవి పేట, బర్కిత్ నగర్, రేగులకుంట, ఊట్లగూడెం పరిధిలో పెట్టాలని చూస్తుందని తెలిపారు. మండలంలోని ప్రజానీకం, రైతులు భూములు ఇవ్వం అని తేల్చి చెబుతున్నా ప్రజాభిప్రాయానికి వ్యతిరేకంగా ఆయుధ డిపో నిర్మాణానికి ప్రభుత్వం పూనుకోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కౌలు రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పి.జమలయ్య మాట్లాడుతూ నేవీ ఆయుధ డిపో నిర్మాణం పట్ల ప్రజలు తీవ్ర వ్యతిరేకతతో ఉన్నారని, బలవంతపు భూసేకరణ తక్షణం ఆపాలని డిమాండ్ చేశారు. నేవీ ఆయుధ డిపో నిర్మాణం జరిగితే పచ్చని పొలాలలో వరి, మొక్కజొన్న, పొగాకు తదితర రెండు పంటలు పండే సారవంతమైన భూములు కోల్పోవాల్సి వస్తుందని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు సంసాని కిషోర్, ఇళ్ల శ్రీరామమూర్తి, బలుసు నాగేశ్వరరావు మాట్లాడుతూ నేవీ ఆయుధం డిపో నిర్మాణంతో రెండు పంటలు పండే సారవంతమైన కోల్పోతామని ఆవేదన వ్యక్తం చేశారు. కలెక్టర్ స్వయంగా పంట పొలాలను సందర్శించి వాస్తవాలను పరిశీలించి న్యాయం చేయాలని కోరారు. సీపీఐ ఏలూరు ఏరియా సమితి కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, కౌలు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి దొంత కృష్ణ, కొయ్యలగూడెం మండలం కార్యదర్శి తాడిగడప ఆంజనేయరాజు, సీపీఎం ఏలూరు జిల్లా కార్యదర్శి అరటికట్ల రవి, ఏపీ రైతు సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి (అన్నే భవన్) కే. శ్రీనివాస్ పాల్గొన్నారు. -
పట్టిసంలో పటిష్ట బందోబస్తు
పోలవరం రూరల్: పట్టిసంలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలకు 550 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేస్తున్నట్టు జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. పట్టిసీమలో మహాశివరాత్రి ఉ త్సవాలకు సంబంధించి ఏర్పాట్లను పరిశీలించారు. ఆలయం, ఇసుక తిన్నెలు, రేవులో ఏర్పాట్లపై సూచనలిచ్చారు. ఆయన వీరేశ్వరస్వామిని దర్శించుకుని పూజలు చేశారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ఏటిగట్టు రోడ్డులో ట్రాఫిక్కు అంతరాయం లేకుండా పర్యవేక్షించాలన్నారు. ట్రైనీ ఐఎఫ్ఎస్ కృష్ణచైతన్య, ట్రైనీ ఐపీఎస్ జయశర్మ, ఏఎస్పీ సుస్మిత రా మనాథన్, డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్బాబు, ఎస్సై పవన్కుమార్ ఉన్నారు. -
కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం
ప్రకృతి అందాలకు నెలవైన కొల్లేరులో కూటమి రాక్షస రాజ్యం సాగుతోంది. పెద్దల కట్టుబాట్లతో ఆచార సంప్రదాయాలు పాటిస్తూ ప్రశాంత జీవనం సాగిస్తున్న లంక గ్రామాల్లో కూటమి నేతలు చిచ్చురేపుతున్నారు. విభజించు.. పాలించు సిద్ధాంతంతో పెట్రేగిపోతున్నారు. ప్రశ్నించిన సర్పంచులపై మూకుమ్మడి దాడులకు పాల్పడుతున్నారు. గతంలో ఎన్నికల సమయంలోనే ఇక్కడ రాజకీయాలు ఉండేవి. ఆ తర్వాత అందరూ కలిసిమెలిసి జీవనం సాగించేవారు. అయితే చంద్రబాబు ప్రభుత్వం వచ్చాక.. ఎన్నికల్లో ఇచ్చిన హామీలను అమలు చేయాలని నిలదీసిన వారిపై రౌడీమూకలతో దాడులు, దౌర్జన్యాలకు తెగబడుతున్నారు. అక్రమ పోలీసు కేసులతో భీతావహ వాతావరణం సృష్టిస్తూ పైశాచికానందం పొందుతున్నారు. సాక్షి, టాస్క్ఫోర్స్: వేంగి–చాళుక్యుల పాలన నుంచి కొల్లేరు ప్రాంతానికి విశిష్ట స్థానం ఉంది. పూర్వపు కృష్ణా, పశ్చిమగోదావరి జిల్లాల్లో 44 దిబ్బలను కొల్లేరు ప్రాంతంగా పరిగణించారు. ఇక్కడి ప్రజలు కొల్లేటికోట పెద్దింట్లమ్మను ఆరాధిస్తారు. జిల్లాల పునర్విభజన తర్వాత ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లోని 9 మండలాల్లో 122 గ్రామాల్లో కొల్లేరు ప్రాంతం విస్తరించి ఉంది. ఏలూరు, కై కలూరు, దెందులూరు, ఉంగుటూరు, ఉండి నియోజకవర్గాల్లో 80 వేల కుటుంబాలతో సుమారు 3.20 లక్షల మంది జనాభా ఉన్నారు. కొల్లేరు అభయారణ్యాన్ని 77,138 ఎకరాలుగా నిర్ధారించారు. కట్టుబాట్లకు తూట్లు కొల్లేరు గ్రామాల్లో ప్రభుత్వానికి సమాంతరంగా ఒక ప్రత్యేక వ్యవస్థ ఉంటుంది. గ్రామ జనాభాను బట్టి బంటాలుగా విభజిస్తారు. ఒక్కో బంటాలో 100 నుంచి 50 మంది సభ్యులు ఉండవచ్చు. బంటాకు ఒక నాయకుడు ఉంటాడు. గ్రామంలో అన్ని బంటాలకూ కలిపి పెద్ద వడ్డీ అనే వ్యక్తి నాయకత్వం వహిస్తాడు. ఇతనికి అనుబంధంగా క్యాషియర్, గుమాస్తా, బంట్రోతులు ఉంటారు. కొల్లేరులో చేపల చెరువుల పాటల ద్వారా వచ్చే ఆదాయాన్ని గ్రామావసరాలు, పెద్ద వడ్డీ, సిబ్బంది జీతాలకు ఉపయోగిస్తారు. గ్రామ పంచాయతీ సర్పంచ్, వార్డు సభ్యులు ఉన్నా పెద్ద వడ్డీ నిర్ణయానికి లోబడి పనిచేయాల్సి ఉంటుంది. గ్రామంలో ఎవరైనా తప్పు చేస్తే పోలీస్స్టేషన్ల వరకు వెళ్లకుండా రూ.1,000 నుంచి రూ.50 వేల వరకు నగదును తప్పుగా కట్టాల్సి వస్తుంది. సైదు గంగరాజు స్ఫూర్తి ఇదేనా.. ఉభయ తెలుగు రాష్ట్రాల్లో కొల్లేరు పేరు చెప్పగానే పూర్వం ఠక్కున గుర్తుకొచ్చే పేరు దివంగత సైదు గంగరాజు. కొల్లేరు వడ్డీ సామాజికవర్గానికి చెందిన ఆయన అందరూ ఐకమత్యంగా ఉంటూ అభివృద్ధి సాధించాలని కోరుకున్నారు. నేడు ఆయన ఆశయానికి కూటమి సర్కారు తూట్లు పొడుస్తోంది. ఐక్యతకు మారుపేరైన గ్రామాల్లో రక్తపుటేరులు పారిస్తోంది. హామీలపై ప్రశ్నిస్తే గ్రామస్తులనే పావులుగా చేసుకుని సొంత మనుషులపైనే మూకుమ్మడిగా దాడులు చేయిస్తోంది. పోలీసు స్టేషన్లలో ఒకరిపై ఒకరు కేసులు పెట్టుకునేలా విభేదాలు సృష్టించి రాజకీయ పబ్బం గడుపుకుంటోంది. కేవలం కొల్లేరు అభయారణ్య చెరువుల పేరుతో సాగుతున్న మైండ్ గేమ్లో కొల్లేరు గ్రామాల్లోని అమాయక బిడ్డలు బలవుతున్నారు. గత నెలలో ఎన్నికల హామీలపై ప్రశ్నిస్తూ, సోషల్ మీడియాలో పోస్టు పెట్టినందుకు నత్తగుళ్లపాడు సర్పంచ్ ముంగర రామకృష్ణరాజుపై మూకుమ్మడి దాడి జరిగింది. రౌడీ మూకలు ఆయన ఇల్లు ధ్వంసం చేశారు. తిరిగి సర్పంచ్పైనే పోలీసులు కేసు నమోదు చేశారు. 2025 మేలో రాజకీయ నాయకుల మాటలు విని కొందరు మహిళలు చటాకాయి సర్పంచ్ ఘంటసాల శేషారావుపై కమ్యూనిటీ హాలు వద్ద దాడి చేశారు. దీంతో కొద్దిరోజులకే మనస్తాపంతో సర్పంచ్ మృతి చెందారు. 2025 జూలైలో రాజుల కొట్టాడలో వైఎస్సార్సీపీకి మద్దతుగా ఉన్నారని సర్పంచ్ కొల్లాటి పద్మావతి, శ్రీనుల కుమారుడు, బంధువులపై ఇదే గ్రామంలో కూటమి నేతలు కత్తులతో దాడి చేశారు. ఈ ఘటనలో నలుగురికి తీవ్ర గాయాలయ్యాయి. 2025 ఆగస్టులో నత్తగుళ్లపాడు యువతిని చటాకాయి యువకుడు ప్రేమించి తీసుకెళ్లాడు. ఇద్దరిదీ ఒకే సామాజిక వర్గం. వారిద్దరినీ తీసుకొస్తుండగా శ్రీపర్రు వద్ద కారు ఆపి నత్తగుళ్లపా డుకు చెందిన వ్యక్తులు ఇతరులతో కలిసి చ టాకాయిలో ముగ్గురు పెద్దలపై దాడి చేశారు. ఐక్యతకు తూట్లు నిలదీసిన సర్పంచులపై మూకుమ్మడి దాడులతో బీభత్సం విభజించు.. పాలించు విధానం అమలు లంక గ్రామాల్లో కట్టుబాట్లకు చెల్లుచీటీ వారిలో వారికే విభేదాలు సృష్టించి పైశాచికానందం పనికిమాలిన రాజకీయాలను పక్కన పెట్టి కష్టాల్లో ఉన్న కొల్లేరు ప్రజల సంక్షేమం కోసం కృషి చేయండి. నత్తగుళ్లపాడు సర్పంచ్పై దాడి దురదృష్టకరం. కట్టుబాట్ల గ్రామం అనే నానుడికి ఇటువంటివి మచ్చ. కొల్లేరు నాయకులు కళ్లు తెరవాలి. పూర్వ వైభవాన్ని పునరుద్ధరించుకోవాలి. – చింతపల్లి వెంకటనారాయణ, కొల్లేరుపై పుస్తక రచయిత, కై కలూరు -
బలివే ఉత్సవాలకు పటిష్ట ఏర్పాట్లు
ముసునూరు: బలివే మహాశివరాత్రి ఉత్సవాల్లో భక్తుల సౌకర్యాలు, భద్రతకు అధిక ప్రాధాన్యమివ్వాలని జేసీ అభిషేక్ గౌడ్ అన్నారు. ఉత్సవాల ప్రత్యేకాధికారి, నూజివీడు సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అధ్యక్షతన గురువారం ఆలయం వద్ద సమీక్షా సమావేశం నిర్వహించారు. జేసీ మాట్లాడుతూ గతేడాది కంటే అధికంగా భక్తులు హాజరయ్యే అవకాశం ఉందని, అన్ని శాఖల అధికారులు సమన్వయంతో ఏర్పాట్లు చేయాలన్నారు. భక్తుల పుణ్యస్నానాలు, పిండ ప్రదానాలు, అభిషేకాలు, దైవ దర్శనానికి ఆటంకాలు లేకుండా చూడాలన్నారు. జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ మాట్లాడుతూ 400 మంది పోలీసులు, ఎన్సీసీ, ఎన్ఎస్ఎస్ క్యాడెట్లు, సెక్యూరిటీ సిబ్బంది, సీసీ కెమెరాల నిఘాతో కట్టుదిట్టమైన భద్రతా చర్యలు చేపడుతున్నామన్నారు. డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్తో కలిసి ఆలయ ప్రాంగణం లోపల, వెలుపల క్యూలైన్లు, ప్రసాద కౌంటర్లు, పందిళ్లను పరిశీలించారు. ట్రైనీ ఐపీఎస్ జయసింహ, సర్పంచ్ రావు ప్రవీణ సుధాకర్, ఆలయ కమిటీ చైర్మన్ బొమ్మకంటి శ్యామలరావు, తహసీల్దార్ ప్రశాంతి, ఈవో పామర్తి సీతారామయ్య, సీఐ రామకృష్ణ, ఎస్సై ఎం.చిరంజీవి ఉన్నారు. జేసీ అభిషేక్ గౌడ్ -
కదం తొక్కి.. లేబర్ కోడ్లపై గళమెత్తి..
● గర్జించిన కార్మిక, కర్షక, ఉద్యోగ సంఘాలు ● భారీ ప్రదర్శనలు, నిరసన ర్యాలీలు ● లేబర్ కోడ్లు రద్దు చేయాలంటూ డిమాండ్ ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం తీసుకువచ్చిన నాలుగు లేబర్ కోడ్లు రద్దు చేయాలని కోరు తూ కార్మిక సంఘాల ఆధ్వర్యంలో గురువారం జరిగిన దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో వేలాది మంది కార్మికులు పాల్గొని విజయవంతం చేశారు. భారీ ప్రదర్శనలతో హోరెత్తించారు. ఏలూరు కలెక్టరేట్ వద్ద సీఐటీయూ ఆధ్వర్యంలో, ఆర్ఆర్పేట ఎన్టీఆర్ పార్కు వద్ద ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ ఆధ్వర్యంలో భారీ బహిరంగ సభలు నిర్వహించారు. ఏలూ రు జిల్లాలో బ్యాంకులు, బీమా, బీఎస్ఎన్ఎల్ తదితర కేంద్ర ప్రభుత్వ కార్యాలయాలు మూతపడ్డా యి. కార్మికులు సమ్మెలో ఉండటంతో పలు పరిశ్రమలు నడవలేదు. అంగన్వాడీ, ఆశావర్కర్లు, ము న్సిపల్, హమాలీ వర్కర్లు, భవన నిర్మాణ కార్మికులు, ఆటో, రవాణా కార్మికులు, మెడికల్ రిప్స్, ఎల్ఐసీ ఏజెంట్లు, రాష్ట్ర ప్రభుత్వ కాంట్రాక్ట్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగులు, ఆర్టీసీ, విద్యుత్ సంస్థల్లో పనిచేసే కార్మికులు సంఘీభావం తెలిపారు. కార్మికుల మెడకు ఉరితాడే.. లేబర్ కోడ్స్ అమలు చేయడం అంటే కార్మికుల మెడకు ఉరుతాడు వేయడమే అని సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరావు అన్నారు. సీఐటీయూ ఆధ్వర్యంలో జూట్ మిల్లు సెంటర్ నుంచి భారీ ప్రదర్శన జరిగింది. కార్మికులు విన్నూతంగా ఉరి బిగించుకుని నిరసన తెలిపారు. కలెక్టరెట్ వద్ద భారీ బహిరంగ సభ నిర్వహించారు. ఏలూరు కార్పొరేషన్ కార్యాలయం నుంచి ఏఐటీయూసీ, ఐఎఫ్టీయూ, ఉద్యోగ, కార్మిక సంఘాల నాయకులు భారీ ర్యాలీ నిర్వహించారు. ఎన్టీఆర్ పార్క్ వద్ద జరిగిన సభలో ఐఎఫ్టీయు రాష్ట్ర సహాయ కార్యదర్శి యు.వెంకటేశ్వరరావు, ఎన్ఎఫ్ఐడబ్ల్యూ జాతీయ నాయకురాలు అక్కినేని వనజ మా ట్లాడుతూ లేబర్ కోడ్లపై మండిపడ్డారు. కలెక్టరేట్ ఎదుట ఉద్యోగుల నిరసన అఖిల భారత రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగుల సమాఖ్య (ఏఐఎస్జీఈఎఫ్), ఏపీఎన్జీఓస్ రాష్ట్ర సంఘం పిలుపు మేరకు జిల్లా ఎన్జీజీఓ, జేఏసీ చైర్మన్ చోడగిరి శ్రీనివాస్ ఆధ్వర్యంలో జాతీయ సార్వత్రిక సమ్మెకు మద్దతుగా ఏలూరులోని కలెక్టరేట్ వద్ద భోజన విరామ సమయంలో ఉ ద్యోగులు నిరసన తెలిపారు. రాష్ట్ర కార్యదర్శి ఎం. సరస్వతి, జిల్లా కార్యదర్శి నెరుసు రామారావు పాల్గొన్నారు. దేశవ్యాప్త సార్వత్రిక సమ్మెలో భాగంగా కార్మిక సంఘాల ఆధ్వర్యంలో ఏలూరులో జరిగిన నిరసన కార్యక్రమాలకు వైఎస్సార్సీపీ ఏలూరు ని యోజకవర్గ ఇన్చార్జి మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ), మాజీ ఎమ్మెల్యే, దెందులూరు నియోజకవర్గ ఇన్చార్జి కొఠారు అబ్బయ్యచౌదరి సంఘీభా వం తెలిపారు. కార్మికుల శ్రమదోపిడీకి వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ పోరాడుతుందని తెలిపారు. వైఎస్సార్సీపీ నగర అధ్యక్షుడు గుడిదేసి శ్రీనివాస్, జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, జిల్లా బీసీ సెల్ ప్రధాన కార్యదర్శి కొల్లిపాక సురేష్, రాష్ట్ర వాణిజ్య విభాగ కార్యదర్శి భాస్కర్ల శంకర్ బాచి, సత్యనారాయణ, బసవ, రవలిశెట్టి శ్రీనివాస రావు, ఉయ్యాల గణేష్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): స్క్రాప్ ఎలక్ట్రిసిటీ (ఎమెండ్మెంట్) బిల్–2025కు వ్యతిరేకంగా విద్యుత్ ఉద్యోగులు గురువారం ఆందోళన కార్యక్రమం నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్పేటలోని విద్యుత్ భవన్ వద్ద మధ్యాహ్న భోజన విరామ సమయంలో విద్యుత్ ఉద్యోగుల జేఏసీ నాయకుల ఆధ్వర్యంలో భారీ నిరసన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు మాట్లాడుతూ విద్యుత్ రంగాన్ని, విద్యుత్ వనరులను ప్రైవేటీకరించేందుకు తీసుకువచ్చిన ఈ చట్టాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామన్నారు. ఈ చట్టంతో ఉద్యోగులతో పాటు వినియోగదా రులకు నష్టం జరుగుతుందన్నారు. -
ఎంపీహెచ్ఏల ఎంపికలో అవకతవకలు
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్యారోగ్యశాఖ అధికారులు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ సుప్రీంకోర్టు తీర్పును సైతం బేఖాతరు చేస్తూ మల్టీపర్సస్ హెల్త్ అసిస్టెంట్ (ఎం) పోస్టులను ఎంపిక చేస్తున్నారనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. సుప్రీం తీర్పులో జీఓ 1207 మేరకు ఉద్యోగాల నుంచి తొలగించిన ఎంపీహెచ్ఏ (ఎం) సిబ్బందిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని ఆదేశించింది. అయితే జిల్లాలో అర్హులకు అన్యాయం చేస్తున్నారనే ఆరోపణలు వస్తున్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాకు సంబంధించి 104 మందిని పునర్నియమించాలని రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఈ మేర కు ఏలూరు జిల్లా అధికారులు ఈనెల 4న 41 మందితో జాబితా విడుదల చేశారు. మరోసారి 10న 43 మందితో జాబితా సిద్ధం చేసి ఉన్నతాధికారులకు పంపారు. అయితే ఈ జాబితాపై అభ్యంతరాలు వ్యక్తమవుతున్నాయి. తాజాగా రూపొందించిన జా బితాలో పీఎన్వీ సత్యనారాయణ (68) రిటైర్డ్ కాగా, పీఎన్వీ పెద్దిరాజు మరణించారని చెబుతున్నారు. ఇక 273 జీఓలోని మరో ఇద్దరు లక్ష్మయ్య, శ్రీను అనే వారిని ఎంపిక చేయటంపై సర్వత్రా సందేహాలు వ్యక్తమవుతున్నాయి. 1207 జీఓ మేరకు ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో 104 మంది జాబితాలో 39వ పేరుతో తణుకు మండలం పైడిపర్రుకి చెందిన ముప్పిడి రత్నరాజుకు జాబితాలో చోటులేదని బాధితుడు వాపోతున్నాడు. తాను గతంలో అనారోగ్యంతో సెలవులో ఉన్నాననీ, మెడికల్ సర్టిఫికెట్లు సైతం అప్పట్లో ఏలూరు వైద్యారోగ్యశాఖ కార్యాలయంలో సమర్పించానని చెబుతు న్నాడు. అయినా తన పేరును జాబితాలో పెట్టకపోవటంపై ఉన్నతాధికారులకు ఫిర్యాదు చేశాననీ, న్యాయం చేయాలని రత్నరాజు కోరుతున్నారు. -
ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి
వచ్చేది వేసవి కాలం కావడంతో ఘన పదార్థాలు శరీరానికి పెద్దగా సహించవు. డీహైడ్రేషన్తో వాంతులు, విరోచనాలతో ఆరోగ్యం క్షీణించే ప్రమాదం ఉంటుంది. అటువంటి సమయంలో ఆరోగ్యకరమైన ద్రవ పదార్థాలు తీసుకోవాలి. ముఖ్యంగా మంచినీరు, కొబ్బరి నీరు, పండ్ల రసాలు, మజ్జిగ, రాగిజావ వంటివి తీసుకుంటే ఆరోగ్యానికి మంచిది. అలాగే రోజుకు కనీసం 8 గంటలు గాఢనిద్రకు కేటాయించాలి. ప్రతిరోజూ కొద్ది సమయం యోగ, ధ్యానం సాధనకు కేటాయించాలి. – డాక్టర్ ఎంఎల్వీ ప్రసాద్, ఆంధ్రా హాస్పిటల్స్ డైరెక్టర్ -
పట్టిసం ఉత్సవాల ఏర్పాట్ల పరిశీలన
సస్యరక్షణతో అధిక దిగుబడులు రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారులు సూచిస్తున్నారు. 8లో uపోలవరం రూరల్: పట్టిసం మహాశివరాత్రి ఉత్సవాలలో సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా ఏర్పాట్లు చేయాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. మహాశివరాత్రి ఉత్సవాలను పురస్కరించుకుని ఈ నెల 15న పట్టిసీమలో జరిగే మహాశివరాత్రి ఉత్సవాలు నిర్వహణ ఏర్పాట్లపై వివిధ శాఖల అధికారులతో జాయింట్ కలెక్టర్ అభిషేక్ గౌడతో కలిసి బుధవారం పట్టిసం రివర్ ఇన్లో సమీక్షించారు. క్యూలైన్లలో భక్తులు ఎక్కువసేపు వేచి ఉండకుండా త్వరితగతిన దర్శనం కలిగేలా క్యూలైన్లు నిర్వహించాలన్నారు. ఆలయం వద్ద, ప్రధాన రహదారుల్లో రాకపోకలకు అంతరాయం కలగకుండా, తొక్కిసలాట జరగకుండా ట్రాఫిక్ నియంత్రణ, బారికేడ్ల ఏర్పాటు చేపట్టాలన్నారు. భక్తుల రద్దీకి తగ్గట్టుగా సీసీ కెమెరాలు, డ్రోన్ల ద్వారా పటిష్ట భద్రతా ఏర్పాట్లు చేయాలన్నారు. తాగునీరు, ప్రథమ చికిత్స శిబిరాలు, ముఖ్యంగా గోదావరి వద్ద అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పటిష్టమైన రక్షణ ఏర్పాట్లు చేపట్టాలన్నారు. నదిని దాటించే సమయంలో ఫెర్రీ వద్ద ప్రమాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. నది వెంట 108 వాహనాలు, వైద్య కేంద్రాలు, మోటారు బోట్లు, గత ఈతగాళ్లను సిద్ధంగా ఉంచాలన్నారు. ఏఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఆర్డీఓ ఎంవీ.రమణ, ఐటీడీఏ పీవో కె.రాములు నాయక్ తదితరులు పాల్గొన్నారు. -
లేబర్ కోడ్లపై రణభేరి
ఏలూరు (టూటౌన్): కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన లేబర్ కోడ్లను రద్దు చేయాలని, రైతులకు గిట్టుబాటు ధరలు ఇవ్వాలని కోరుతూ ఈ నెల 12న ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్మిక, కర్షక వర్గాలు సమ్మెలో పాల్గొంటున్నాయి. సమ్మెకు సంబంధించి ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా నెల రోజుల నుంచి పలు సన్నాహాక కార్యక్రమాలు నిర్వహించారు. దీనిలో భాగంగా వాల్ పోస్టర్లు, కరపత్రాలు, ప్రచార జాతాలు, గేట్ మీటింగ్లు, పని ప్రదేశాల్లో కార్మికులను కలవడం, ఆయా సంస్థలకు సమ్మె నోటీసులు ముందుగా అందించడం వంటి కార్యక్రమాలు నిర్వహించారు. చివరిగా ఈ నెల 12న ఏలూరు, భీమవరంలలో భారీ ప్రదర్శనలు, బహిరంగ సమావేశాలు నిర్వహించేందుకు సమాయత్తమవుతున్నారు. సమ్మెకు రెండు జిల్లాల పరిధిలోని అన్ని కార్మిక సంఘాలు, రైతు సంఘాలు, ఉద్యోగులు, కర్షకులు, శ్రామికులు సంపూర్ణ మద్దతును తెలిపారు. కార్పొరేట్ల ఒత్తిడితోనే పాలకవర్గం లేబర్ కోడ్లు అమల్లోకి తెచ్చినట్లు కార్మిక సంఘాల నేతలు ఆరోపిస్తున్నారు. కార్మిక వర్గాన్ని మరింత దోచుకోవడానికి ఇప్పుడున్న కార్మిక చట్టాలు అడ్డుగా ఉన్నాయనేది కార్పొరేట్ల విధానం. కార్మిక వర్గానికి ఇప్పుడున్న హక్కులను కూడా తొలగించడమే లేబర్ కోడ్ల సారాంశం. కార్మికుల డిమాండ్లివే.. 8 గంటల పని విధానం కొనసాగించాలి. గతంలో మాదిరిగా యూనియన్ రిజిస్ట్రేషన్ ఏడుగురితో చేసుకునేందుకు అవకాశం కల్పించాలి. ఈఎస్ఐ అర్హతను పాత విధానం ప్రకారం 10 మందితో కొనసాగించాలి. కాంట్రాక్ట్ కార్మికులకు చట్టాలు వర్తించడానికి పెంచిన 50ను పాత విధానంలో 20కి తగ్గించాలి. 100 మంది కార్మికులు పనిచేసే కంపెనీల మూసివేత లే ఆఫ్, లాకౌట్లకు ప్రభుత్వ అనుమతి తీసుకుంటే సరిపోయేది. దాన్ని తాజాగా 300 మంది ఉంటేనే అమలు చేస్తాననడంపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. నేడు సార్వత్రిక సమ్మె -
తీరంలో తాబేళ్ల మృత్యుఘోష
● నరసాపురం, పేరుపాలెం బీచ్ల్లో విషాద దృశ్యాలు ● సుమారు 50 తాబేళ్ల మృత్యువాత నరసాపురం రూరల్: నరసాపురం నియోజకవర్గ తీర ప్రాంతంలో ఏటా వేల కిలోమీటర్ల దూరం నుంచి వచ్చే ఆలివ్ రెడ్లీ తాబేళ్లు, వేటగాళ్ల నిర్లక్ష్యానికి బలైపోతున్నాయి. గతేడాది కూడా ఇదే సమయంలో తాబేళ్లు మృత్యువాత పడిగా కలెక్టర్ చొరవతో తాబేళ్ల గుడ్లను సేకరించి సంరక్షించి పిల్లలు బయటకు వచ్చాకా సముద్రంలో విడిచే కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. పేరుపాలెం, పెదమైనవానిలంక, చినమైనవానిలంక వంటి తీరప్రాంత గ్రామాల్లో ఈ ఏడాది జనవరి నుంచే తాబేళ్లు గుడ్లు పెట్టేందుకు ఒడ్డుకు రావడం ప్రారంభించాయి. అటవీ శాఖ ఆధ్వర్యంలో వీటి గుడ్లను సేకరించి హ్యాచరీల ద్వారా సంరక్షించే పనులు ముమ్మరంగా సాగుతున్నప్పటికీ, సముద్రంలో జరుగుతున్న మరణాలు ఆందోళన కలిగిస్తున్నాయి. రెండు రోజులుగా భారీ సంఖ్యలో తాబేళ్లు మృతి చెంది తీరానికి కొట్టుకొస్తున్నాయి. పోయిన సంవత్సరం కూడా ఇదే సమయంలో సుమారు 100కు పైగా తాబేళ్లు ప్రాణాలు కోల్పోయాయి. తాజాగా మంగళవారం 29, బుధవారం 20 తాబేళ్లు మృత్యువాత పడ్డాయి. వీటితోపాటు రెండున్నర మీటర్ల పొడవు, 240 కిలోల బరువు ఉన్న హేంపర్ బ్యాక్ డాల్ఫిన్ కూడా తీరానికి కొట్టుకు వచ్చింది. కేవలం తూర్పుతీరానికి దగ్గరలో నదీముఖ తీర ప్రాంతాల్లో 30 మీటర్ల కంటే తక్కువ లోతులో ఇవి సంచరిస్తుంటాయి. ప్రమాదపుటంచున ఉన్న ఈ తరహా డాల్పిన్లు ప్రస్తుతం పరిరక్షించాల్సిన జాతిగా ఉన్నట్లు అధికారులు పేర్కొన్నారు. తాబేళ్ల కళేబరాలకు అధికారులు పోస్టుమార్టం నిర్వహించి, మరణానికి కారణాలు విశ్లేషించారు. దుర్వాసనతో ఇబ్బంది పడుతున్న సందర్శకులు చనిపోయిన తాబేళ్ల కళేబరాలు తీరం వెంబడి కుళ్లిపోతుండటంతో ఆ ప్రాంతమంతా తీవ్రమైన దుర్వాసన వెదజల్లుతోంది. దీనివల్ల బీచ్కు వచ్చే పర్యాటకులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. సముద్ర తాబేళ్లకు సంబంధించి పోస్టుమార్టంలో అధిక శాతం వాటి పాదాలు నరికివేసి ఉండటం, కళ్లు పీకేసి ఉండటంతో పాటు, బలమైన దెబ్బతగిలిన గాయలతో పాటు వలల్లో చిక్కుకున్న అవశేషాలు ఉన్నట్లు పోస్టుమార్టంలో గుర్తించిట్లు అఽధికారులు చెబుతున్నారు. వెటర్నరీ అసిస్టెంట్ డైరెక్టర్ డాక్టర్ పి.చంద్రశేఖర రెడ్డి ఆధ్వర్యంలో జిల్లా అటవీ అధికారి డీఏ కిరణ్, ఫారెస్ట్ రేంజర్ మురాల కరుణాకర్ పర్యవేక్షణలో మృత కళేబరాలకు పోస్టుమార్టం నిర్వహించారు. జిల్లా కాలుష్య నియంత్రణ మండలి ప్రాంతీయ అధికారి ఏయస్ఆర్ మూర్తి, మత్స్యశాఖ అభివృద్ది అధికారి ఏడుకొండలు, ఫారెస్ట్ బీట్ ఆఫీసర్ రాంప్రసాద్, మైరెన్ ఏఎస్సై ఫాతిమా, వీఆర్వో సుభాషిణి పాల్గొన్నారు. తీరంలో మృతి చెందిన తాబేళ్లు, డాల్ఫిన్ సముద్ర జీవుల సంరక్షణ కోసం ప్రభుత్వం కఠిన నిబంధనలు విధించినప్పటికీ, క్షేత్రస్థాయిలో అమలు కాకపోవడమే ఈ మరణాలకు ప్రధాన కారణమని తెలుస్తోంది. మత్స్యకారులు తీరం నుంచి 8 నాటికల్ మైళ్ల అవతల మాత్రమే వేట సాగించాలి. చాలా మంది ఈ నిబంధనను అతిక్రమించి తీరానికి దగ్గరగా వేటాడుతున్నారు. సంతానోత్పత్తి కోసం తీరానికి వచ్చే క్రమంలో, ఈ తాబేళ్లు మత్స్యకారుల వలల్లో చిక్కుకుని ఊపిరాడక మృతి చెందుతున్నాయి. తాజాగా తాబేళ్లతో పాటు డాల్ఫిన్ వంటి అరుదైన జీవులు కూడా మృతి చెందడం కలిచివేస్తోంది. -
పాత విధానాన్నే కొనసాగించాలి
పాత కార్మిక చట్టాల ప్రకారం అమల్లో ఉన్న 8 గంటల పని విధానాన్ని యధావిధిగా కొనసాగించాలి. దాన్ని 12 గంటలకు పెంచడం వల్ల కార్మికులు నష్టపోతారు. జాతీయ కనీస వేతనం రోజుకు రూ.178 ప్రకటించడం అన్యాయం. దీని వల్ల వేతనాలు పెరగకపోగా తగ్గుతాయి. దేశంలోనే వేతనం తక్కువుగా ఉన్న రాష్ట్రాన్ని కొలమానంగా తీసుకోవడం అన్యాయం. – డీఎన్వీడి ప్రసాద్, జిల్లా ప్రధాన కార్యదర్శి, సీఐటీయూ, ఏలూరు జిల్లా ఇప్పటి వరకు ఏడుగురుతోనే ట్రేడ్ యూనియన్ రిజిస్ట్రేషన్ జరిగేది. తాజాగా లేబర్కోడ్ల ప్రకారం కనీసం 100 మంది లేదా 10 శాతం మంది కార్మికులు ఉండాలని మార్చడం దుర్మార్గం. పరిశ్రమల లేఆఫ్, లాకౌట్, మూసివేతకు వంద మంది కార్మికులు ఉన్నా ప్రభుత్వ అనుమతులు ఉండాలనే నిబంధనను మార్చడం సరికాదు. – బండి వెంకటేశ్వరరావు, ఉపాధ్యక్షులు, ఏఐటీయూసీ, ఏలూరు జిల్లా ఒక కాంట్రాక్టరు కింద ఇంతవరకు 20 మంది కార్మికులు పనిచేస్తే ఈఎస్ఐ, పీఎఫ్, బోనస్, కనీస వేతనాలతో సహ అన్ని హక్కులు వర్తించాయి. దానిని ఇప్పుడు 50 మందికి మార్చడంతో భవిష్యత్తులో కాంట్రాక్ట్ కార్మికులకు ఏ చట్టాలు వర్తించని పరిస్థితులు నెలకొన్నాయి. లేబర్ కోడ్ల కారణంగా అనేక రాష్ట్రాల్లో ఉన్న సంక్షేమ బోర్డులు రద్దవనున్నాయి. – బద్ధా వెంకట్రావు, ప్రధాన కార్యదర్శి, ఇఫ్టూ, ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా -
అక్రమ కలప స్వాధీనం
కొయ్యలగూడెం: రేంజర్ భాను ప్రకాష్కి అందిన సమాచారంతో బుధవారం దిప్పకాయల పాడులో దాడులు నిర్వహించి అక్రమ కలపతో రవాణా అవుతున్న వాహనాన్ని స్వాధీనం చేసుకొని కన్నాపురం అటవీశాఖ కార్యాలయానికి తరలించినట్లు ఎఫ్ఎస్ఓ పి.మణికుమారి పేర్కొన్నారు. వాహనంలో సుమారు యాభైకి పైగా దిమ్మలతో ఉన్న టేకు దుంగలను గుర్తించి స్వాధీనం చేసుకున్నామన్నారు. కలప విలువను లెక్కించాల్సి ఉందన్నారు. బీట్ ఆఫీసర్ కె.నవీన్, కె.వెంకన్నబాబు, రాంబాబు పాల్గొన్నారు. పంట కాలువలో శిశువు మృతదేహం పెదపాడు: పెదపాడు ఎస్సీ ఏరియాలోని కమ్యూనిటీ హాలు వద్ద పంట కాలువలో శిశువు మృతదేహం లభ్యమైంది. స్థానికులు బుధవారం సాయంత్రం మృతదేహాన్ని గుర్తించి పోలీసులకు సమాచారం అందించారు. ఎస్సై ఆర్.శ్రీనివాస్ అక్కడకు చేరుకుని శిశువు మృతదేహాన్ని బయటకు తీయించారు. అనంతరం ఏలూరు ప్రభుత్వాసుపత్రికి పంపించారు. వీఆర్వో అనకాపల్లి నర్సింహరావు ఫిర్యాదు మేరకు ఎస్సై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జన్మనిచ్చిన బిడ్డను ఎవరు పడేశారనే కోణంలో దర్యాప్తు చేస్తున్నారు. -
వైఎస్సార్సీపీ నేత కారు అద్దాలు ధ్వంసం
వైఎస్సార్సీపీ నాయకుల నిరసనఉంగుటూరు: వైఎస్సార్సీపీ నాయకుడు, మాజీ సర్పంచి దంతంశెట్టి సత్యనారాయణ కారు అద్దాలు గుర్తు తెలియని వ్యక్తులు పగుల కొట్టారు. తన ఇంటి దగ్గరలో పార్కు చేసిన కారు వెనుక అద్దాలను మంగళవారం రాత్రి పగుల కొట్టడంతో చేబ్రోలు పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు మరడా మంగారావు, బూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి ఎలిశెట్టి పాపారావు బాబ్జి, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి పెనుగొండ బాలకృష్ణ, ఎంపీటీసీ చాంబర్ అధ్యక్షుడు బండారు నాగరాజు, పంచాయతీరాజ్ విభాగం జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి ,మహిళా విభాగం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మందా జయలక్ష్మి, పార్టీ బీసీ నాయకుడు రమణ తదితరులు ఈ ఘటనను ఖండించారు. దంతంశెట్టిని పరామర్శించారు. వైఎస్సార్సీపీకి అండగా నిలుస్తున్న దొంతంశెట్టి కారు అద్దాలు పగలగొట్టడం పలు అనుమానాలకు తావిస్తోంది. -
ఆరోగ్యం భద్రం.. ప్రణాళికతో విజయం
ఏలూరు (ఆర్ఆర్పేట): విద్యా సంవత్సరం ముగింపు దశకు చేరుకుంది. 10వ తరగతి, ఇంటర్మీడియెట్తో పాటు అన్ని తరగతులకు పరీక్షలు దగ్గర పడ్డాయి. ఏడాదంతా చదివింది ఒక ఎత్తు అయితే ఈ రెండు మూడు నెలలు చదివేది మరో ఎత్తుగా చెప్పవచ్చు. ఈ సమయంలో కేవలం చదువు ఒక్కటే కాదు. ఈ సమయంలో ఆరోగ్యమూ ముఖ్యమే అని వైద్యులు, సైకాలజిస్టులు చెబుతున్నారు. ఒత్తిడి.. పెను ప్రభావమే పబ్లిక్ పరీక్షలకు సిద్ధమౌతున్న విద్యార్థులపై సహజంగానే ఒత్తిడి అధికంగా ఉంటుంది. అలా ఒత్తిడి చేయడం విద్యార్థుల శారీరక, మానసిక పరిస్థితులపై పెను ప్రభావమే చూపుతుందని సైకాలజిస్టులు చెబుతున్నారు. పరీక్షల సమయంలో వినోదం, క్రీడలకు దూరమై విద్యార్థులు మానసికంగా అధిక ఒత్తిడికి గురయ్యే ప్రమాదం ఉందంటున్నారు. అదే జరిగితే ఆరోగ్యం కూడా క్షీణిస్తుందని హెచ్చరిస్తున్నారు. వారికి కొంత ఆటవిడుపు సమయం ఇవ్వాలని, సూచిస్తున్నారు. ఆహారం, విశ్రాంతిపై ప్రత్యేక శద్ధ అవసరం చదువు ధ్యాసలో పడి సమయానికి ఆహారం, విశ్రాంతి తీసుకోకపోయినా ప్రమాదమే అని, అటువంటి వారికి అనారోగ్య సమస్యలు తలెత్తే అవకాశం ఎక్కువగా ఉంటుందని అంటున్నారు. కొందరు పిల్లలను రాత్రి 11 గంటల వరకూ చదివించి, తిరిగి తెల్లవారుజామునే 5 గంటలకు నిద్రలేపి మళ్లీ చదివిస్తుంటారని అలా చేయడం వల్ల విద్యార్థికి తగిన విశ్రాంతి దొరకక తొందరగా అనారోగ్యానికి గురయ్యే ప్రమాదం ఉంటుందంటున్నారు. విద్యార్థులకు ఇచ్చే ఆహారంలో తేలికగా జీర్ణం అయ్యే ఇడ్లీ, చారుతో భోజనం మంచిందంటున్నారు. అలాగే అందుబాటులో ఉండే సీజనల్ పండ్లు, మెదడు చురుకుగా పని చేయడానికి ప్రోటీన్లు ఎక్కువగా ఉండే ఆహారం ఇవ్వాలి. పరీక్షలు పూర్తయ్యే వరకూ మాంసాహారాలకు, మసాలాలు, ఉప్పు, కారాలు అధికంగా ఉండే ఆహారాలు పెట్టకపోవడమే మంచిది. రాత్రి సమయాల్లో నిద్రకు ఉపక్రమించే ముందు టీలు, కాఫీలు తీసుకోకూడదు. రాత్రి పొద్దుపోయే వరకూ చదవకూడదు. కనీసం 8 గంటలు నిద్రపోవాలి. తెల్లవారుజామున చదివితే పాఠ్యాంశాలు బాగా గుర్తుంటాయి. పరీక్షలు రాస్తున్న విద్యార్థులు (ఫైల్) చదువుతో పాటు ఆరోగ్యమూ ముఖ్యమే.. పరీక్షల సమయంలో జాగ్రత్తలు తప్పనిసరి ఆహారం, విశ్రాంతిపై శ్రద్ధ అవసరం తల్లిదండ్రులూ ఒత్తిడి పెట్టొద్దు త్వరలో టెన్త్, ఇంటర్ పరీక్షలు జిల్లాలో 58 వేల మందికి పైగా విద్యార్థులు త్వరలోనే ఇంటర్మీడియెట్, 10వ తరగతి పబ్లిక్ పరీక్షలు ప్రాంభం కానున్నాయి. ఇంటర్మీడియెట్కు సంబంధించిన ప్రయోగ పరీక్షలు ముగిశాయి. పదో తరగతి విద్యార్థులకు ప్రస్తుతం ప్రీ ఫైనల్ పరీక్షలు జరుగుతున్నాయి. మార్చి 2వ తేదీ నుంచి గ్రాండ్ టెస్ట్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. అనంతరం ఈ నెల 23వ తేదీ నుంచి ఇంటర్మీడియెట్ విద్యార్థులకు, మార్చి 16వ తేదీ నుంచి పదో తరగతి విద్యార్థులకు పబ్లిక్ పరీక్షలు ప్రారంభం కానున్నాయి. వారి పరీక్షలు ముగిసిన అనంతరం డిగ్రీ, పీజీ, 1 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కూడా పరీక్షలు జరుగుతాయి. -
ఊ కొట్టలేదంటే ఊస్టింగే!
గురువారం శ్రీ 12 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026సాక్షి, టాస్క్ఫోర్స్: కొల్లేరు అభయారణ్యంలో విధులు నిర్వహించడం అటవీ అధికారులకు కత్తిమీద సాములా మారింది. ఓ పక్క సిబ్బందికి కష్టమొస్తే ఊరుకోనని అటవీశాఖ మంత్రి పవన్ కల్యాణ్ చెబుతున్నా.. అందుకు విరుద్ధంగా ఏలూరు జిల్లాలో రాజకీయ నేతల అండతో కొల్లేరు పెద్దల పంతం నెగ్గుతోంది. తాజాగా రాజమహేంద్రవరం అటవీ శాఖ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు(సీసీఎఫ్) బీఎన్ఎన్ మూర్తి, ఏలూరు జిల్లా అటవీ అధికారి బత్తిన విజయను ఒకేసారి బదిలీ చేశారు. డీఎఫ్ఓను రాష్ట్ర ఉన్నతాధికారికి రిపోర్టు చేయమన్నారు. దీంతో ఆ శాఖలో కలకలం రేగింది. అక్రమ చెరువుల విషయంలో ఊ.. కొడితే సరే.. లేదంటే ఊస్టింగే అన్న నానుడి కూటమి ప్రభుత్వంలో మరోసారి రుజువైంది. అసలేం జరిగిందంటే.. కొల్లేరు అభయారణ్యంలో అక్రమ చెరువుల పూర్తి స్థాయి ప్రక్షాళన చేయలేదని, వాటి వివరాలు తెలపాలని సుప్రీంకోర్టు నియమించిన సాధికారిత కమిటీ అటవీ అధికారులను నివేదిక కోరింది. దీంతో కై కలూరు మండలంలో చటాకాయి, కొట్టాడ, పందిరిపల్లిగూడెం వంటి గ్రామాల్లో చెరువులను ధ్వంసం చేయడానికి అటవీశాఖ డీఎఫ్వో విజయ, సీసీఎఫ్ బీఎన్ఎన్.మూర్తిలు సిబ్బందితో వెళ్ళారు. ఇప్పటివరకు సాగునకు ఊరుకున్నామని, ఖాళీ చేసిన అక్రమ చేపల చెరువుల్లో తిరిగి జీరో సైజు పిల్ల వేయవద్దని ఫారెస్టు అధికారులు కోరారు. దీంతో కోపమొచ్చిన కొల్లేరు పెద్దలు పవన్ కల్యాణ్ కార్యాలయం వరకు పాదయాత్ర చేస్తామని హెచ్చరించారు. ఇలాంటి సమయంలో కొల్లేటికోట వెళ్ళిన ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ను కొల్లేరు పెద్దలు అటవీ అధికారులను అడ్డుకోలేకపోతున్నారని నిలదీశారు. ఈ నేపధ్యంలో ఇరువురు అటవీ అధికారులపై బదిలీ వేటు పడింది. గతంలోనూ ఇలాగే.. కొల్లేరులో అటవీ అధికారులు బిక్కుబిక్కు మంటూ విధులు నిర్వహిస్తున్నారు. 2016లో టీడీపీ పాలనలో అక్రమ చెరువులను అడ్డుకునే అనేక మంది అధికారులను రాజకీయ నాయకులు అక్రమ బదిలీలు చేయించారు. 2014 నవంబరులో తూర్పుగోదావరి జిల్లా నుంచి రేంజర్ సునీల్కుమార్ కొల్లేరులో విధులు నిర్వహించేందుకు వచ్చారు. వచ్చీ రావడమే అక్రమ చేపల చెరువులపై కొరఢా ఝలిపించారు. కొల్లేరు పెద్దలు ప్రజాప్రతినిధుల వద్ద పంచాయతీ పెట్టారు. దీంతో మూడు నెలలకే బదిలీపై ఆయనను పంపించేశారు. 2016 డిసెంబరు 2న డీఎఫ్వోగా వీవీఎల్ సుభద్రాదేవి బాధ్యతలు చేపట్టారు. కై కలూరు మండలం చినకొట్టాడ, పెంచికలమర్రు, వడ్లకూటితిప్ప కొల్లేరు అభయారణ్య చెరువుల్లో చేప పిల్లలను వదిలిన 8 వాహనాలను సీజ్ చేసి కేసులు పెట్టారు. అంతే ఆమె రెండు వారాల్లోపే సెలవు పెట్టి వెళ్ళిపోయారు. తర్వాత శివశంకరరెడ్డి డీఎఫ్వోగా బాధ్యతలు చేపట్టారు. మాటవినకపోతే సెలవు పెట్టి వెళ్ళాలని చెప్పడంతో ఆయన సెలవులోకి వెళ్ళారు. అప్పటి చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టుగా ఎస్ఎస్.శ్రీధర్ కొల్లేరులో బాధ్యతయుతమైన విధులు నిర్వహించారు. ఆయనను అనంతపురానికి బదిలీ చేశారు. అటవీ చట్టాలు, పర్యావరణంపై పూర్తి పట్టున్న ప్రిన్సిపల్ చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్టు (పీసీసీఎఫ్) ఏవీ జోసఫ్ను బయోడైవర్సిటీ బోర్డు చైర్మన్గా పంపించారు. కొల్లేరులో మాట వినని ఫారెస్టు అధికారుల బదిలీ 2016 లోనూ ఇంతే అక్రమ చెరువులకు సహకరిస్తేనే కొల్లేరులో మనుగడ సుప్రీంకోర్టు నిబంధనలకు నీళ్లు కొల్లేరు అభయారణ్య విషయంలో వింత వాదన జరుగుతోంది. ఏదైన ఒక వస్తువును ఒక ప్రాంతం నుంచి మరో ప్రాంతానికి తరలించవచ్చు. కొల్లేరు అభయారణ్యంలో సర్వే నంబర్లు ఆధారంగా వేలాది ఎకరాలు అక్రమ చెరువులు సాగువుతోన్నాయి. అటవీ, రెవెన్యూ, పోలీసు అధికారులు వస్తే వస్తువు మాదిరిగా అక్రమ చెరువును తరలించే అవకాశం లేదు. ప్రజలు అడ్డుపడుతోన్నారనే సాకుతో అధికారులు చర్యలు తీసుకోవడం లేదు. ప్రస్తుతం కొల్లేరులో అక్రమ చెరువుల్లో జీరో సాగు చేప పిల్లలు సాగు చేస్తున్నారు. ఈ నెలలో సుప్రీంకోర్టు కొల్లేరు చెరువులపై తీర్పు వెలువరించనుంది. ఇటువంటి సమయంలో సుప్రీం కోర్టు నియమించిన సీఈసీ కమిటీకి నివేదికలు పంపించే అధికారులను బదిలీ చేయడంపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. అడ్డుఅదుపు లేకుండా అక్రమ చెరువులు తవ్వేస్తారని పర్యావరణవేత్తలు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. -
అనుమానాస్పద స్థితిలో యువతి మృతి
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారమ్లో ఒక యువతి ఆనుమానాస్పద స్థితిలో మృతి చెందింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం ఒరిస్సా రాష్ట్రం రాయ్ఘడ్ జిల్లా బీఎల్ఓడీ మండలం ఓయ్పంగు గ్రామానికి చెందిన పతిక రష్మిక (19) నాలుగు రోజుల క్రితం పి. అంకంపాలెం సమీపంలోని కోళ్లఫారం వద్ద జీవనోపాధి కోసం వచ్చి పనిలో చేరింది. అయితే ఆ యువతి షెడ్లో అనుమానాస్పద స్థితిలో ఉరి వేసుకుని మృతి చెందింది. రష్మిక అదే కోళ్లఫారమ్లో పనిచేస్తున్న ప్రశాంత్ అనే యువకుడితో గత 8 నెలలుగా పరిచయం ఉండి ఒరిస్సాలోనే సహజీవనం చేసినట్లు సమాచారం. అయితే ప్రశాంత్కు ఇప్పటికే భార్య, ఇద్దరు పిల్లలు ఉన్నారు. ఇటీవల ప్రశాంత్ తన భార్యతో కలిసి కోళ్ల ఫారమ్లో పనిచేస్తుండగా రష్మిక కూడా నాలుగు రోజుల క్రితం ఇక్కడికి వచ్చినట్లు పలువురు చెబుతున్నారు. ముగ్గురూ ఒకే గదిలో నివసిస్తున్నట్లు సమాచారం. బుధవారం ఉదయం ప్రశాంత్, అతని భార్య పని నిమిత్తం కోళ్లఫారమ్కు వెళ్లగా రష్మిక షెడ్లో ఉరివేసుకున్నట్లు చెబుతున్నారు. యువతి ఎందుకు ఆత్మహత్యకు పాల్పడిందో తమకు తెలియదని అంటున్నారు. సంఘటనా స్థలాన్ని పోలీసులు పరిశీలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆకివీడు చైర్పర్సన్కు అవమానం
ఆకివీడు: పట్టణ ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన గౌరవ మర్యాదలు ఇవ్వలేదు. బీసీ మహిళను అవమానపరిచారంటూ స్థానిక నగర పంచాయతీ చైర్పర్సన్ జామి హైమావతి ఆవేదన వ్యక్తంచేశారు. స్థానిక 13వ వార్డులోని శ్రీ నగర్ కాలనీలో 15వ ఆర్థిక సంఘ నిధులతో సీసీ రోడ్డు నిర్మాణ పనులకు తనను పిలవగా, నిర్మాణ ప్రాంతానికి వచ్చేసరికి పట్టణ టీడీపీ అధ్యక్షుడు గంధం ఉమ కొబ్బరికాయ కొట్టారని వాపోయారు. నా వార్డులో మీరు కొబ్బరికాయ కొట్టడమేమిటని ప్రశ్నించగా మీకు చెప్పాల్సిన అవసరం లేదంటూ దురుసుగా మాట్లాడారని హైమావతి ఆవేదన వ్యక్తంచేశారు. ప్రథమ పౌరురాలికి ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా, ప్రజాప్రతినిధిని లెక్కచేయకుండా ఇష్టానుసారం వ్యవహరించడం కూటమి నాయకుల దౌర్భాగ్యమన్నారు. వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు అంబటి రమేష్ మాట్లాడుతూ తన వార్డులో రోడ్డు నిర్మాణానికి కొబ్బరికాయ కొట్టననివ్వకుండా చైర్పర్సన్ను అవమాన పరచడం దారుణమన్నారు. స్థానికంగా సంబంధం లేని వ్యక్తులు వార్డుల్లోకి వచ్చి ఇలాంటి చర్యలకు పాల్పడటం దుర్మార్గమన్నారు. నగర పంచాయతీ చీప్ విప్ పడాల శ్రీనివాసరెడ్డి, కౌన్సిలర్లు దొడ్డి జగదీష్, గేదెల అప్పారావు, జిల్లా వైఎస్సార్సీపీ ఉపాధ్యక్షులు గుండా సుందర రామనాయుడు తదితరులు ఉన్నారు. -
పంచాయతీ కార్యదర్శిపై దాడి
బుట్టాయగూడెం : ఇంటి పన్ను కట్టమని అడిగినందుకు పంచాయతీ కార్యదర్శిపై ఒక వ్యక్తి దాడి చేశాడు. దీనిపై బుధవారం రాత్రి కార్యదర్శి పోలీసులకు ఫిర్యాదు చేశారు. దొరమామిడి గ్రామ పంచాయతీ కార్యదర్శి గుండేపల్లి సోమరాజు బుధవారం సాయంత్ర సిబ్బందితో కలిసి ఇంటి పన్నులు వసూలు చేసేందుకు వెళ్లారు. గ్రామంలోని ఒక టీస్టాల్ వద్ద పవన్కుమార్ అనే వ్యక్తిని ఇంటి పన్ను చెల్లించమని అడుగగా ఆ వ్యక్తి వివాదస్పదంగా మాట్లాడినట్లు కార్యదర్శి తెలిపారు. అసభ్య పదజాలంతో మాట్లాడుతూ పలుమార్లు తనపై దాడి చేసి కొట్టినట్లు కార్యదర్శి చెప్పారు. విధి నిర్వహణలో ఉన్న తనపై దాడి చేసిన వ్యక్తిపై చర్యలు తీసుకుని తనకు న్యాయం చేయ్యాలని కోరుతూ స్థానిక పోలీసులకు బుధవారం ఫిర్యాదు చేశారు. కార్యదర్శి సోమరాజుపై జరిగిన దాడిని డిప్యూటీ ఎంపీడీఓ, వీఎస్ఎస్ శ్రీనివాసరావు, కార్యదర్శిలు రామకృష్ణ, కిరణ్, తదితరులు తీవ్రంగా ఖండించారు. -
ముద్దాపురంలో శిలాఫలకం ధ్వంసం
తణుకు అర్బన్: తణుకు మండలం ముద్దాపురం గ్రామంలో టీడీపీ శ్రేణులు కయ్యానికి కాలు దువ్వారు. గత వైఎస్సార్సీపీ హయాంలో స్థానిక గాంధీ బొమ్మ సెంటర్లో 2024లో రోడ్డు శంకుస్థాపన కోసం ఏర్పాటుచేసిన శిలాఫలకాన్ని బుధవారం రాత్రి ధ్వంసం చేశారు. ధ్వంసం చేస్తున్న కార్మికులను వైఎస్సార్ సీపీ నాయకులు ప్రశ్నించగా తణుకు నుంచి పనికి వచ్చామని గ్రామ మాజీ సర్పంచ్ ముళ్లపూడి శ్రీనివాస్ పని పురమాయించినట్లు చెప్పారు. అప్పట్లో రూ.5 కోట్లు నిధులతో రోడ్డు నిర్మాణం కోసం మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు ఈ శిలా ఫలకాన్ని ఆవిష్కరించారని, నేడు అర్ధాంతరంగా రాత్రి సమయంలో ఆ శిలాఫలకాన్ని తొలగించే పనులు చేపట్టారని వైఎస్సార్ సీపీ నాయకులు తుమ్మగంటి నాగ సత్యనారాయణ (నాగు) విమర్శించారు. ఇదేమిటని మళ్లపూడి శ్రీనివాస్ను ప్రశ్నిస్తే సమాధానం ఇవ్వకుండా ఇంటి లోపలకు వెళ్లిపోయారని నాగు తెలిపారు. ద్వారకాతిరుమల: ఐఎస్ జగన్నాథపురంలో సుందరగిరిపై స్వయంభూ కనకవల్లీ సమేత లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో ద్వితీయ దివస మోదక హవన ప్రారంభ వేడుకలు బుధవారం అట్టహాసంగా నిర్వహించారు. ముందుగా ఆలయ యాగశాలలో మహా గణపతి లక్షమోదక హోమాన్ని జరిపారు. మహాశివరాత్రి నాడు జరిపే అతిరుద్రప్రయోగ సహిత సుదర్శన నృశింహ మహాయజ్ఞం నిర్వహణలో భాగంగా ఈ వేడుకను నిర్వహించారు. ఉదయం ఆలయ యాగశాలలో నారసింహుని ఉపాసకులు కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో పలు కార్యక్రమాలను వైభవంగా జరిపారు. రుత్వికులు, పండితులు మోదకాలను, పలురకాల దినుసులను హోమగుండంలో వేస్తూ క్రతువును నిర్వహించారు. లోక శాంతి కోసం ఈ యజ్ఞాన్ని నిర్వహిస్తున్నట్టు ఆయన చెప్పారు. ముదినేపల్లి రూరల్: ఇటీవల అదృశ్యమైన తల్లీపిల్లల ఆచూకీ తెలుసుకుని స్ధానిక పోలీసులు కుటుంబ సభ్యులకు బుధవారం అప్పగించారు. బొమ్మినంపాడుకు చెందిన వాసుపల్లి పెద్దిరాజులుకు భార్య శిరీషతోపాటు రాజేశ్వరి, శాంతిప్రియ, నాగదుర్గ కుమార్తెలున్నారు. వీరంతా ఈనెల 8న ఆధార్కార్డు సవరణలు చేసుకునేందుకు బయటకు వెళ్లారు. సాయంత్రమైనా ఇంటికి రాకపోవడంతో పెద్దిరాజులు పోలీస్స్టేషన్ ఫిర్యాదు చేయగా పోలీసులు గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు పెద్దిరాజులు భార్య శిరీష, కుమార్తెలు కలిదిండి మండలం కోరుకొల్లులో ఉన్నట్లు గుర్తించి పోలీస్ స్టేషన్కు తీసుకువచ్చారు. ఎస్సై వీరభద్రరావు వీరిని కుటుంబసభ్యులకు అప్పగించారు. తణుకు అర్బన్: గుర్తు తెలియని మృతదేహం తణుకు మండలం వేల్పూరు గ్రామ పరిధిలోని కంపోస్టు యార్డులో బుధవారం లభ్యమైంది. కంపోస్టు యార్డులోని చెత్తకు నిప్పుపెట్టిన స్థలంలో మృతదేహం కొంతభాగం కాలిపోయి ఉంది. మృతుడి వయస్సు సుమారుగా 40 నుంచి 50 మధ్య ఉండవచ్చని, తెలుపురంగు చొక్కా, నీలం రంగు జీన్స్ ఫ్యాంటు ధరించి ఉన్నారని, జుట్టు కొంతమేర తెలుపు రంగుతో ఉందని, నాలుగు రోజుల క్రితమే మృతి చెంది ఉండవచ్చని పోలీసులు చెబుతున్నారు. తణుకు రూరల్ పోలీసులు మృతదేహాన్ని తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రికి తరలించి పంచనామా అనంతరం అంత్యక్రియలు జరిపించారు. రూరల్ స్టేషన్ ఏఎస్సై అనుమానాదస్పద మృతిగా కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. మండవల్లి: ఓ మహిళ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ మృతి చెందింది. పోలీసుల కథనం ప్రకారం లింగాల గ్రామానికి చెందిన సాయిలక్ష్మి ఈ నెల 10వ తేదీన ఇంట్లో దేవుడికి దీపారాధన చేస్తుండగా, దీపం వత్తు ఆమె చీరకు అంటుకుని మంటలు వ్యాపించాయి. ఆ సమయంలో ఇంట్లో ఎవరూ లేరు. సమాచారం తెలుసుకున్న భర్త వెంకటేశ్వరరావు వెంటనే వచ్చి ఆమెను కై కలూరు ప్రభుత్వాసుపత్రికి అనంతరం మెరుగైన వైద్య సేవల నిమితం గన్నవరం సిద్ధార్ధ మెడికల్ కాలేజీకి తరలించారు. బుధవారం ఉదయం ఆమె చికిత్స పొందుతూ మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. కుమారుడు సాయిల శ్రీనివాసరావు ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
పది సూత్రాలు పాటిస్తే విజయం మీదే
పరీక్షల్లో విజయం సాధించాలంటే విద్యార్థులు పది సూత్రాలు పాటించాలి. రోజు, వారం, నెల వారీగా చదువుకు ప్రణాళిక రూపొందించుకోవాలి. తెలియని విషయాలను ఉపాధ్యాయల నుంచి తెలుసుకోవాలి. అర్థమైనవి పదేపదే చదవాలి. గతంలో నమూనా పరీక్షల ఆధారంగా ప్రణాళిక వేసుకోవాలి. పునశ్చరణ చేసుకోవాలి. మంచి దస్తూరీ అలవరుచుకుని నిర్ణీత సమయంలో పరీక్ష ముగించడానికి కృషి చేయాలి. సెల్ ఫోన్లు, టీవీలకు దూరంగా ఉండాలి. ఆరోగ్యకరమైన ఆహారం, సరైన నిద్ర ఉండాలి, అన్ని సబ్జెక్టులకు సమాన సమయాన్ని కేటాయించాలి. వ్యక్తిగత లక్ష్యాలను నిర్ధేశించుకుని వాటిని సాధించాలనే కసితో చదవాలి. – అక్కింశెట్టి రాంబాబు, సైకాలజిస్ట్ -
లారీ ఢీకొని వ్యక్తి మృతి
బుట్టాయగూడెం: మోటార్సైకిల్ను లారీ ఢీకొన్న ప్రమాదంలో ఓ వ్యక్తి మృతి చెందాడు. జీలుగుమిల్లి మండలం తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో ఈ ప్రమాదం జరిగింది. స్థానికులు, పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. అశ్వారావుపేటకు చెందిన నరాలశెట్టి నాగేశ్వరరావు (52) బుధవారం సొంత పనిమీద ద్విచక్రవాహనంపై జీలుగుమిల్లి వెళ్లి తిరిగి వస్తుండగా తాటాకులగూడెం సమీపంలోని కనకదుర్గమ్మ అమ్మవారి గుడి సమీపంలో లారీ ఢీకొంది. ఈ ప్రమాదంలో నాగేశ్వరరావు అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న ఎస్సై క్రాంతికుమార్ ఘటనా స్థలాన్ని పరిశీలించి నాగేశ్వరరావు భార్య నాగమల్లేశ్వరి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు తెలిపారు. నాగేశ్వరరావు మృతదేహాన్ని పోస్టుమార్టమ్ కోసం జంగారెడ్డిగూడెం ఏరియా ఆస్పత్రికి తరలించినట్లు చెప్పారు. మృతుడి స్వగ్రామం బాపట్ల జిల్లా అని ఉద్యోగ రీత్యా అశ్వారావుపేటలో హార్టికల్చడ్ డిపార్ట్మెంట్లో పనిచేస్తున్నట్లు నాగమల్లేశ్వరి ఫిర్యాదులో పేర్కొన్నారు. -
సస్యరక్షణతో మామిడిలో అధిక దిగుబడులు
నూజివీడు: రైతులు మామిడి తోటల్లో సస్యరక్షణ చర్యలను చేపట్టడం ద్వారా నాణ్యమైన అధిక దిగుబడులు సాధించవ్చని ఉద్యాన అధికారి ఆర్ హేమ పేర్కొన్నారు. మండలంలోని పలు గ్రామాల్లో మామిడి తోటలను సందర్శించిన ఆమె మామిడి తోటల సస్యరక్షణపై రైతులకు పలు సూచనలు చేశారు. మామిడి తోటల్లో పూతమీద తేనెమంచు పురుగు ఆశించినట్లయితే, నివారణకు అజారక్టిన్ 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి, బుప్రోపెజన్ 25 ఈసీ 1.5 ఎంఎల్ లీటరు నీటికి లేదా ఇమిడాక్లోప్రిడ్ 0.3 ఎంఎల్ లేదా థయామిథాక్సాన్ 25 శాతం 0.3 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలన్నారు. తామర పురుగుల నివారణకు నీలి రంగు జిగురు అట్టలు 40 నుంచి 50 వరకు తోటల్లో ఏర్పాటు చేసుకోవాలన్నారు. వేపనూనె 3000 పీపీఎం 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలని సూచించారు. పోంగామియా సోప్ 7.5 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలని, ఎసిఫేట్ 75 ఎస్పీ 1.5 గ్రాములు లీటర్ నీటికి లేదా ఫిప్రోనిల్ 5 ఈసీ 2ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవడం ద్వారా తామర పురుగులను నివారించుకోవచ్చన్నారు. బూడిద తెగులు నివారణ ఇలా.. నీటిలో కరిగే గంధకం 3 గ్రా లేదా హెక్సాకొనజోల్ 2 ఎంఎల్ లేదా అజాక్సిస్ట్రోబిన్ 1ఎంఎల్ లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. పక్షికన్ను తెగులు సోకితే.. నివారణకు 3 గ్రాముల కాపర్ ఆక్సీక్లోరైడ్ లేదా కార్బండిజమ్ 1 గ్రాము, మాంకోజబ్ 2.5 గ్రాములు కలిపి లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. మసిమంగు నివారణకు ఎమామెక్టిన్ బెంజీయేటర్ 0.4 గ్రాములు లీటరు నీటికి కలిపి పిచికారీ చేసుకోవాలి. ఆకులపై మసిని తొలగించుటకు 2 కిలోల గంజి పొడిని గోరువెచ్చని 3 నుంచి 4 లీటర్ల నీటిలో కలిపి ఉడికంచిన తరువాత మిగులు నీరుపోసి 100 లీటర్ల గంజి ద్రావకం తయారు చేసి తెగులు కనిపించిన భాగాలపై ఎండ బాగా ఉన్న రోజల్లో పిచికారీ చేయాలి. 4–5 రోజుల తరవాత నీటిని పిచికారీ చేస్తే చాలా వరకు మసి రంగు పోతుందని ఉద్యాన అధికారి హేమ తెలిపారు. పాడి–పంట -
విధులకు హాజరై.. తిరిగి వెళుతూ..
● ఆర్ఎంవో డాక్టర్ తాతారావు గుండెపోటుతో మృతి ● శోకసంద్రంలో తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి వైద్య సిబ్బంది తణుకు అర్బన్ : తణుకు జిల్లా కేంద్ర ప్రభుత్వ ఆస్పత్రి ఆర్ఎంఓ డాక్టర్ అందే వెంకట రమా సత్య తాతారావు (56) గుండెపోటుతో మృతిచెందారు. బుధవారం ఉదయం విధుల్లోకి వచ్చిన ఆయన ఓపీలో రోగులకు వైద్యసేవలందించారు. అనంతరం వైద్య సిబ్బందికి సమావేశం నిర్వహించి సూచనలు చేశారు. అనంతరం గుండెల్లో కొంచెం మంటగా ఉందంటూ ఆస్పత్రిలో ఈసీజీ తీయించుకుని నార్మల్గా ఉందని నిర్ధారించుకుని ఇంటికి వెళ్లిపోతానని నిడదవోలుకు కారులో స్వయంగా డ్రైవ్ చేసుకుంటూ బయలుదేరారు. ఉండ్రాజవరం దాటిన తర్వాత గుండెపోటు రావడంతో అకస్మాత్తుగా కారు అదుపు తప్పి రోడ్డు మార్జిన్లోని పిల్లకాలువ పక్కకు వెళ్లి నిలిచిపోయింది. స్థానికులు వెంటనే కారు అద్దాలు పగులగొట్టి కిందకు దించి సీపీఆర్ చేసి అక్కడ నుంచి నేరుగా ఆయన్ను తణుకులో ప్రైవేటు ఆస్పత్రికి తరలించారు. అప్పటికే ఆయన కన్నుమూసినట్టు వైద్యులు నిర్ధారించారు. గతేడాది జూన్లో సాధారణ బదిలీల్లో భాగంగా తాడేపల్లిగూడెం ఇన్చార్జ్ సూపరింటెండెంట్గా ఉన్న ఆయన తణుకు ఆర్ఎంఓగా విధుల్లో చేరారు. శోకసంద్రంలో ఆస్పత్రి వర్గాలు తాతారావు ఇక లేరు అనే వార్తను జీర్ణించుకోలేక ఆస్పత్రి వర్గాలు శోకసంద్రంలో నిలిచారు. తణుకు జిల్లా కేంద్ర ఆస్పత్రి ఆవరణలో ఉంచిన ఆయన భౌతికకాయాన్ని వైద్యవర్గాలు సందర్శించాయి. తాడేపల్లిగూడెం ఆర్టీవో కౌసర్ భానో ఆస్పత్రికి వచ్చి తాతారావు భౌతిక కాయాన్ని సందర్శించి నివాళులర్పించారు. ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ కె.సాయికిరణ్తోపాటు తహసీల్దార్ దండు అశోక్వర్మ, వైద్యులు, సిబ్బంది డాక్టర్ తాతారావుకు నివాళులర్పించారు. అనంతరం కుటుంబసభ్యులు నిడదవోలులోని ఆయన నివాసానికి తాతారావు భౌతికకాయాన్ని అంబులెన్స్లో తరలించారు. ఆయనకు భార్యతోపాటు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు. పెద్ద కుమార్తె ఏలూరు ఆశ్రం ఆస్పత్రిలోను, చిన్న కుమార్తె వైజాగ్ ఆస్పత్రిలో మెడిసిన్ విద్యనభ్యసిస్తున్నారు. ఆస్పత్రికి వెళ్దామన్నా వద్దన్న వైనం తణుకులో కార్డియాలజిస్ట్కు చూపించుదామని ఆస్పత్రి సూపరింటెండెంట్ డాక్టర్ సాయికిరణ్ పట్టుబట్టినా.. మా డాక్టరు దగ్గరకు వెళ్తానని బలవంతంగా బయలుదేరినట్లుగా ఆస్పత్రి వైదులు చెబుతున్నారు. గతంలోనే గుండెకు రెండు స్టంట్స్ పడటంతో అశ్రద్ధ వద్దని అన్నా వినలేదని వాపోయారు. ‘మనిషి ప్రాణం ఎంతో విలువైనది. ఆస్పత్రికి వచ్చే రోగికి అత్యవసర వైద్యం అందించేందుకు ప్రతి ఒక్కరూ కృషిచేయాలి. అత్యవసర పరిస్థితుల్లో వచ్చే రోగులకు విలువైన వైద్యం సత్వరమే అందించగలిగితే ఒక ప్రాణాన్ని నిలబెట్టిన వారవుతారు. అందుకోసం ప్రతి ఒక్కరూ వైద్యసేవలో అప్రమత్తంగా ఉండాలి.’ బుధవారం మధ్యాహ్నం వైద్య సిబ్బందికి నిర్వహించిన సమావేశంలో ఆయన ఇచ్చిన చివరి సందేశం. -
నృసింహ మహాయజ్ఞానికి ఏర్పాట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన ఐఎస్ జగన్నాథపురంలోని సుందరగిరిపై స్వయంభూగా కొలువైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ 32వ మహాయజ్ఞ నిర్వహణకు మంగళవారం ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. అందులో భాగంగా ఉదయం గర్భాలయంలో కొలువైన స్వామివారి మూలవిరాట్కు వేద పండితులు, రుత్వికులు వేద మంత్రోచ్ఛరణలతో విశేష అభిషేకాలు, పూజలు నిర్వహించారు. అనంతరం హైదరాబాద్కు చెందిన కొచ్చర్లకోట సత్యవెంకట లక్ష్మీనరసింహ గురూజీ ఆధ్వర్యంలో, సీహెచ్ కుటుంబరావు పర్యవేక్షణలో ప్రధాన యజ్ఞం ప్రారంభానికి సూచికగా మహా గణపతి లక్షమోదక హోమాన్ని ఆలయ యాగశాలలో వైభవంగా జరిపారు. సాయంత్రం వరకూ నిర్విరామంగా కొనసాగిన ఈ హోమ క్రతువుతో సుందరగిరి ప్రాంతంలో ఆధ్యాత్మిక శోభ వెల్లివిరిసింది. మహాశివరాత్రి సందర్భంగా నిర్వహిస్తున్న ఈ యజ్ఞ క్రతువులో భాగంగా ఈనెల 13న అంకురార్పణం, ధ్వజారోహణం, శ్రీ నృసింహ హోమం, 14న కలశప్రతిష్ఠ, మహా గణపతి హోమాన్ని నిర్వహించనున్నారు. 15న మహా శివరాత్రిని పురస్కరించుకుని మహా లింగార్చన, రాత్రి అతి రుద్ర సహిత శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహా యజ్ఞాన్ని వైభవంగా జరుపనున్నారు. అలాగే 16న నిర్వహించే కలశాభిషేకం, శాంతి కల్యాణంతో యజ్ఞ క్రతువు ముగియనుంది. ప్రతి రోజూ శాలిగ్రామ ఆరాధన, లక్ష బిల్వార్చన, లలితా సహస్ర నామార్చన కార్యక్రమాలను నిర్వహిస్తామని నరసింహ గురూజీ తెలిపారు. ఈనెల 15న మహాయజ్ఞం -
శాప్ ఆధ్వర్యంలో ఆటల పోటీలు
17న చెస్, 24 సైక్లింగ్ జట్లు ఎంపిక ఏలూరు రూరల్: రాష్ట్ర క్రీడాప్రాధికార సంస్థ ఆధ్వర్యంలో రాష్ట్రవ్యాప్తంగా శాప్ లీగ్స్ పేరిట ఆటల పోటీలు నిర్వహించనున్నామని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. మొత్తంగా 31 క్రీడాంశాల్లో జిల్లాస్థాయిలో పోటీలు చేపట్టి జిల్లా జట్లను ఎంపిక చేస్తుందన్నారు. ఈనెలలో లీగ్స్ ప్రారంభమై, 11 నెలల పాటు కొనసాగి డిసెంబర్లో ముగుస్తాయన్నారు. ఇందులో భాగంగా ఈ నెల 17వ తేదీన ఏలూరు ఇండోర్ స్టేడియం వెయిట్ లిఫ్టింగ్ హాల్లో జిల్లాస్థాయి చెస్ పోటీలు చేపట్టనున్నామని వివరించారు. అండర్ 13, 15, 17, 19 విభాగంలో పురుషులు, మహిళలకు పోటీలు చేపడతామని వెల్లడించారు. ఇదే క్రమంలో ఈ నెల 24వ తేదీన ఇండోర్ స్టేడియంలో జిల్లాస్థాయి సైక్లింగ్ పోటీలు చేపడతామన్నారు. ఇందులో ఎంపికై న వారు ఈ నెల 28వ తేదీ నుంచి మార్చి 1 వరకూ విజయవాడలో జరగబోయే రాష్ట్రస్థాయి పోటీల్లో పాల్గొంటారని పేర్కొన్నారు. వివరాలకు 90594 85538లో సంప్రదించాలని సూచించారు. -
తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానం జోడించండి
ఏపీ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ శ్రీదేవి కై కలూరు: తపాలా సేవల్లో సాంకేతిక పరిజ్ఞానాన్ని జోడించి ఉత్తమ ఫలితాలు సాధించాలని ఆంధ్రప్రదేశ్ చీఫ్ పోస్టుమాస్టర్ జనరల్ బీపీ.శ్రీదేవి సూచించారు. ఆటపాక బ్రాంచి పోస్టాఫీస్ను మంగళవారం ఆమె సందర్శించారు. అనంతరం కై కలూరు, పల్లెవాడ పోస్టాఫీసుల పరిధిలోని 20 బ్రాంచి పోస్టాపీసుల గ్రామీణ్ డాక్ సేవక్(జీడీఎస్) సిబ్బందితో సమీక్ష సమావేశం నిర్వహించారు. ఆమె మాట్లాడుతూ తపాలశాఖ ఐవీ 2.0 అనే నూతన సాంకేతిక పరిజ్ఞానంతో ప్రజలకు మరింత మెరుగైన సేవలను అందిస్తోందన్నారు. గుడివాడ డివిజన్ పోస్టల్ సూపరింటెండెంట్ ఎస్.కృష్ణమూర్తి, ఏఎస్పీ సీహెచ్.శ్రీనివాసరావు, కై కలూరు సబ్ డివిజన్ ఇన్స్పెక్టర్ కె.సురేష్కుమార్, ఇన్స్పెక్టర్ బి.విజయ్ పాల్గొన్నారు. ఏలూరు రూరల్: ఈ నెల 13, 14 తేదీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా అండర్–12 బాలుర క్రికెట్ జట్టు ఎంపిక పోటీలు చేపట్టనున్నామని క్రికెట్ అసోసియేషన్ త్రిసభ్య కమిటీ సభ్యుడు ఎస్కే షాకిర్హుస్సేన్ ఓ ప్రకటనలో తెలిపారు. ఏలూరు సీఆర్ఆర్ కళాశాల గ్రౌండ్లో ఉదయం 8 గంటలకు ఎంపిక పోటీలు ప్రారంభమౌతాయని వివరించారు. వివరాలకు 70136 33143లో సంప్రదించాలన్నారు. భీమడోలు: గుండుగొలను గ్రామంలోని మెయిన్ రోడ్డులోని వినాయకుని ఆలయం, రామాలయం, గంగానమ్మ ఆలయాల్లో చోరీకి విఫలయత్నం జరిగింది. ఆలయాల్లో హుండీ అపహారణ, వస్తువులను చెల్లాచెదురుగా పడేయడం, తలుపులు పగలగొట్టి ఉండడాన్ని ఆలయ కమిటీ సభ్యులు గుర్తించారు. రామాలయంలోని హుండీని అపహరించి, అందులోని రూ.15 వేలు నగదు కాజేశారని రామాలయం కమిటీ సభ్యుడు వెలివెల సుబ్బారావు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. పోలీసులు సీసీ ఫుటేజీ, వేలిముద్రలను సేకరించారు. జంగారెడ్డిగూడెం: ట్రాక్టర్ ట్రక్కు బోల్తా పడి కూలీ మృతిచెందిన ఘటన జంగారెడ్డిగూడెంలో చోటు చేసుకుంది. ఎస్సై ఎన్వీ ప్రసాద్ తెలిపిన వివరాలు ఇవి. పట్టణానికి చెందిన జాలా ప్రసాద్ (49) వ్యవసాయ కూలీగా జీవనం సాగిస్తున్నాడు. ఈ నెల 9న ఓ రైతుకు చెందిన పొగాకు తోటలో పనికి వెళ్లిన ప్రసాద్, అక్కడ నుంచి ట్రాక్టర్లో పొగాకు లోడు వేసుకుని వస్తున్నాడు. పట్టణంలోని బుట్టాయగూడెం రోడ్డులో ఉన్న రాజారాణి కళ్యాణ మండపం వద్దకు వచ్చేసరికి ట్రాక్టర్, ట్రక్కు తిరగబడటంతో ప్రసాద్ తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే మృతిచెందాడు. మృతుని భార్య రత్నకుమారి ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసినట్లు ఎస్సై తెలిపారు. -
శ్రీశైలం మల్లన్నకు శ్రీవారి దేవస్థానం పట్టువస్త్రాలు
ద్వారకాతిరుమల: శ్రీశైలం శ్రీ మల్లిఖార్జున స్వామివారికి ద్వారకాతిరుమల చినవెంకన్న దేవస్థానం అధికారులు సోమవారం రాత్రి పట్టు వస్త్రాలను సమర్పించారు. శివరాత్రిని పురస్కరించుకుని మల్లన్నకు నిర్వహించే బ్రహ్మోత్సవాల సందర్భంగా ఈ వస్త్రాలను అందజేశారు. ముందుగా శ్రీవారి దేవస్థానం ఈఓ యర్రంశెట్టి భద్రాజీ, ఏఈఓ పి.నటరాజారావు పట్టు వస్త్రాలను శిరస్సుపై పెట్టుకుని అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ మల్లన్న సన్నిధికి చేరుకున్నారు. అనంతరం అక్కడి అధికారులకు వాటిని అందజేశారు. ఆ తరువాత మల్లన్నను దర్శించి ప్రత్యేక పూజలు జరుపుకున్నారు. ఏటా బ్రహ్మోత్సవాల్లో మల్లన్నకు చినవెంకన్న దేవస్థానం పట్టు వస్త్రాలను ఇవ్వడం ఆనవాయితీగా వస్తోంది. ఈ కార్యక్రమంలో శ్రీవారి దేవస్థానం సూపరింటిండెంట్ హయగ్రీవాచార్యులు, ఆచారి తదితరులున్నారు. నూజివీడు: పశువుల కొవ్వు నుంచి నూనెను తయారు చేస్తున్న వ్యక్తిని మంగళవారం పట్టణ పోలీసులు అదుపులోకి తీసుకొని అతని వద్ద నుంచి 60 కిలోల గడ్డకట్టిన నూనెను స్వాధీనం చేసుకున్నారు. పట్టణ ఎస్సై నాగేశ్వరరావు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని అజరయ్యపేటకు చెందిన కంచిపోగు అజయ్ అలియాస్ మస్తాన్ గత 20 ఏళ్లకు పైగా పశువులను కోసి మాంసాన్ని విక్రయిస్తూ ఉంటాడు. అంతేగాకుండా పశువుల కొవ్వును కరిగించి నూనెను తయారు చేసి విక్రయిస్తూ ఉంటాడు. దీంతో పోలీసులకు వచ్చిన సమాచారం మేరకు ఉదయం 7గంటల సమయంలో ఎస్సై తన సిబ్బందితో వెళ్లి అతడిని అదుపులోకి తీసుకోవడంతో పాటు గడ్డకట్టి ఉన్న నూనె టిన్నులను, కొవ్వు మాంసాన్ని స్వాధీనం చేసుకొని స్టేషన్కు తరలించారు. మాంసం కొవ్వునుంచి నూనె తయారు చేస్తున్న వ్యక్తిపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. కొయ్యలగూడెం: నేవీ ఆయుధ డిపో నిర్మాణానికి ఎన్ని అడ్డంకులు వచ్చినా నిర్మాణ ప్రక్రియ పూర్తి చేసి తీరుతామని ఎమ్మెల్యే చిర్రి బాలరాజు పేర్కొన్నారు. మంగళవారం సరిపల్లి గ్రామంలో నిర్వహించిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ నేవీ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవడానికి కొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని అన్నారు. ఆయుధ డిపో నిర్మాణాన్ని అడ్డుకోవాలని చూస్తే ఎందాకై నా వెళ్లడానికి కూటమి ప్రభుత్వం సిద్ధంగా ఉందని తెలిపారు. ఎంపీ పుట్టా మహేష్యాదవ్, తానూ ఆయుధ డిపో నిర్మాణంలో కృత నిశ్చయంతో ఉన్నామన్నారు. చోడి పిండి సుబ్రహ్మణ్యం, ఏఎంసీ మాజీ చైర్మన్ పారేపల్లి రామారావు తదితరులు పాల్గొన్నారు. -
చికిత్స పొందుతూ వ్యక్తి మృతి
ముదినేపల్లి రూరల్: విద్యుత్షాక్కు గురై చికిత్స పొందుతూ వ్యక్తి మృతి చెందిన ఘటన మండలంలోని బొమ్మినంపాడులో జరిగింది. గ్రామానికి చెందిన యర్రా బిందుమాధవసాయి (30) రొయ్యల చెరువు సాగు చేస్తుంటాడు. గత నెల 28న చెరువు వద్దకు వెళ్లగా ఫ్యాన్ సెట్లు పనిచేయడం లేదని గుర్తించాడు. దీనితో ఎలక్ట్రీషియన్ను రప్పించి ఫ్యాన్సెట్లకు సంబంధించిన మోటార్ను బాగుచేస్తుండగా ప్రమాదవశాత్తూ బిందుమాధవసాయి విద్యుత్షాక్కు గురయ్యాడు. షాక్కు గురైన వెంటనే నీటిలో పడిపోగా ఒడ్డుకు తీసుకునివచ్చి నీళ్లు కక్కించి గుడివాడ ఆసుపత్రికి తరలించారు. మెరుగైన చికత్స కోసం విజయవాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం మృతి చెందాడు. బింధుమాధవసాయికి భార్య, ఇద్దరు కుమారులున్నారు. ఈ ప్రమాద ఘటనపై తండ్రి శ్రీరాములు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నూజివీడు: పట్టణంలో యువతిపై దాడిచేసి గాయపరిచిన నిందితుడు బండారు సురేష్కుమార్ను పట్టణ సీఐ పీ సత్యశ్రీనివాస్ అదుపులోకి తీసుకున్నారు. యువతిపై దాడి చేసిన అనంతరం నిందితుడు విస్సన్నపేట, చాట్రాయి ప్రాంతాలకు పరారయ్యాడు. అక్కడి నుంచి తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని వేంసూరుకు వెళ్లగా అక్కడ నిందితుడిని సోమవారం రాత్రి సీఐ అదుపులోకి తీసుకుని నూజివీడుకు తరలించారు. దాడికి గల కారణాల గురించి విచారిస్తున్నట్లు తెలిసింది. -
వృద్ధురాలిపై దాడి కేసులో నిందితుడి అరెస్ట్
జంగారెడ్డిగూడెం: ఒంటరిగా ఉన్న వృద్ధురాలిపై దాడి చేసి మెడలో బంగారుగొలుసు చోరీ చేసిన కేసులో నిందితుడిని అరెస్టు చేసినట్లు జంగారెడ్డిగూడెం ఏఎస్పీ సుస్మిత రామనాథన్ తెలిపారు. జంగారెడ్డిగూడెం పోలీస్స్టేషన్లో ఆమె మంగళవారం వివరాలు వెల్లడించారు. కామవరపుకోట పాతూరు బీసీ కాలనీకి చెందిన వృద్ధురాలు కలకోటి వెంకట సత్యవతి ఒంటరిగా నివాసం ఉంటోంది. ఈ నెల 7వ తేదీ రాత్రి 9 గంటల సమయంలో ఆమె భోజనం చేస్తుండగా, ఇంటి తలుపులు కొట్టిన శబ్ధం విని తలుపు తీసింది. ముఖానికి గుడ్డకట్టుకుని ఉన్న గుర్తు తెలియని వ్యక్తి ఆమైపె దాడి చేసి, ఇనుప రాడ్డుతో తలపై కొట్టి, వృద్ధురాలి మెడలోని 2 కాసుల బంగారు గొలుసు లాక్కొని పారిపోయాడు. దీనిపై వృద్ధురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు తడికలపూడి ఎస్సై టి.చెన్నారావు కేసు నమోదు చేశారు. సీఐ ఎంవీ సుభాష్ ఆధ్వర్యంలో ఎస్సై విచారణ నిర్వహించి నిందితుడు కామవరపుకోట మండలం పాతూరు గ్రామానికి చెందిన అడవికొట్టు వెంకటేశ్వరరావు అలియాస్ చక్రి అలియాస్ అంజిగా గుర్తించారు. కామవరపుకోట చింతలపూడి వెళ్లే రోడ్లో గ్రామ శివారు ఆర్ఆర్జీకే డైరీ వద్ద నిందితుడిని అరెస్టు చేసి అతని వద్ద నుంచి రూ.1.40లక్షలు విలువైన 14.600 గ్రాముల బంగారు గొలుసు, నేరానికి ఉపయోగించిన మోటార్సైకిల్, వృద్ధురాలిపై దాడికి వినియోగించిన ఇనుప రాడ్డు, దుస్తులు స్వాధీనం చేసుకున్నట్లు ఏఎస్పీ చెప్పారు. కేసును చేధించిన సీఐ ఎంవీ సుభాష్, ఎస్సై టి.చెన్నారావు, క్రైం పార్టీ ఏఎస్సై ఎన్వీ సంపత్కుమార్, పీసీలు ఎస్కే షాన్, ఎన్.రమేష్, ఎ.సుధీర్లను ఏఎస్పీ అభినందించారు. -
హరహర మహాదేవ.. శంభో శంకర
భీమవరం (ప్రకాశం చౌక్): మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు జరగనున్న శివరాత్రి మహోత్సవాల నేపథ్యంలో జిల్లావ్యాప్తంగా ఉన్న శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. జిల్లాలో దేవాదాయశాఖ నిర్వహణలో 30కు పైగా ప్రసిద్ధి శివాలయాలు ఉన్నాయి. ఆలయ కమిటీల ద్వారా నిర్వహించే శివాలయాలు మరో 15 వరకు ఉంటాయి. ముఖ్యంగా జిల్లాలో భీమవరం, పాలకొల్లులో పంచారామ క్షేత్రాలు, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరం రామలింగేశ్వరస్వామి వారి దేవస్థానాల్లో 5 రోజుల పాటు నిర్వహించే శివరాత్రి మహోత్సవాలకు జిల్లాతోపాటు రాష్ట్ర వ్యాప్తంగా వేలాది మంది భక్తులు వస్తుంటారు. చురుగ్గా ఏర్పాట్లు జిల్లాలోని పంచారామక్షేత్రాలు, ప్రముఖ శివాలయాల్లో శివరాత్రి ఏర్పాట్లు చురుగ్గా సాగుతున్నాయి. ఆలయాల్లో ప్రత్యేక క్యూలైన్లు, చలువ పందిళ్లు ఏర్పాటు చేస్తున్నారు. విద్యుత్ అలంకరణలు, సెట్గింగ్లు, డెకరేషన్ల పనులు చేస్తున్నారు. భక్తులకు మంచినీటి సౌకర్యం, టాయిలెట్స్ సౌకర్యాలు ఏర్పాటు చేస్తున్నారు. ఇప్పటికే ఆయా ఆలయాల్లో దేవదాయ శాఖ, పోలీసులు, పంచాయతీ, మున్సిపల్, ఆరోగ్య శాఖ, రెవెన్యూ, ఫైర్ తదితర శాఖలతో ఉత్సవాలపై సమన్వయ మీటింగ్లు పూర్తి చేశారు. 13, 15 తేదీల్లో స్వామి వారి కల్యాణం మహాశివరాత్రి మహోత్సవాల్లో స్వామి వారి కల్యాణ తంతు అద్భుతమైన ఘట్టం. స్వామి వారి కల్యాణాన్ని తిలకించడానికి వేలాది మంది భక్తులు వారికి అందుబాటులో ఉన్న శివాలయాలకు చేరుకుంటారు. ఈనెల 13వ తేదీన ఆచంటలోని శ్రీరామేశ్వరస్వామి వారి కల్యాణం కాగా మిగిలిన శివాలయాల్లో ఈనెల 15వ తేదీన స్వామి వారి కల్యాణం నిర్వహించనున్నారు. స్వామి వారి కల్యాణం అనంతరం రథోత్సవం, తెప్సోత్సం నిర్వహిస్తారు. ప్రసిద్ధ ఆలయాలు జిల్లాలోని పలు ప్రాంతాల్లో ప్రసిద్ధి చెందిన శివాలయాలు ఉన్నాయి. మహాశివరాత్రి ప్రత్యేక పూజలు అందుకునే ప్రముఖు శివక్షేత్రాలు ఇవి. భీమవరం మండలం యనమదుర్రులోని పార్వతీ సమేత శక్తీశ్వర స్వామి, భీమవరంలో భీమేశ్వర స్వామి, ఆచంట రామేశ్వరస్వామి, నత్తారామేశ్వరంలో రామేశ్వరస్వామి, జుత్తిగ ఉమాసోమేశ్వరస్వామి, లక్ష్మణేశ్వరంలో దుర్గా లక్ష్మణేశ్వరస్వామి, శివదేవుని చిక్కాలలో శివదేవస్వామి, పెనుగొండలో నగరేశ్వరస్వామి తదితర శివాలయాలు మహా శివరాత్రి మహోత్సవాలకు ముస్తాబవుతున్నాయి. భీమవరంలో పంచారామక్షేత్రంఉమాసోమేశ్వర స్వామి వారు జిల్లాలోని భీమవరం, పాలకొల్లు పంచారామక్షేత్రాల్లో 5 రోజుల పాటు నిర్వహించే మహాశివరాత్రి మహోత్సవాలకు భారీగా భక్తులు వస్తుంటారు. రోజుకు 10 వేలు నుంచి 30 వేలమంది వరకు భక్తులు పంచారామ క్షేత్రాలను దర్శిస్తారు. పంచారామ క్షేత్రాల్లో స్వామివార్లకు ప్రత్యేక అభిషేకాలు, పూజలు, విశేష అలంకరణలు నిర్వహిస్తారు. రధోత్సవాలు, తెప్పోత్సవాలు జరుపుతారు. అలాగే పలు సాంస్కృతికి కార్యక్రమాలు ఏర్పాటుచేయడం జరుగుతుంది. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరుడు చంద్రుడి ప్రతిష్ఠాపన కావడంతో శివలింగం అమావాస్యకు గోధుమ వర్ణంలో, పౌర్ణమి నాడు శ్వేతవర్ణంలోకి మారడం ఇక్కడి ప్రత్యేకత. క్షేత్ర పాలకుడు శ్రీజనార్థన స్వామి వారు. మహాశివరాత్రి మహోత్సవాలకు జిల్లాలోని దేవదాయ శాఖ పరిధిలోని పంచారామక్షేత్రాలతోపాటు అన్ని శివాలయాల్లో ఏర్పాట్లు చురుగ్గా జరుగుతున్నాయి. భక్తులు రద్ధీగా ఉండే శివాలయాల వద్ద ప్రత్యేక దృష్టి పెట్టి ఏర్పాట్లు చేయడం జరుగుతుంది. అన్ని శాఖల అధికారులతో సమన్వయ మీటింగ్ నిర్వహించి మహాశివరాత్రి మహోత్సవాలను విజయవతంగా నిర్వహించేలా చర్యలు తీసుకున్నాం. – వి.సూర్యప్రకాష్ జిల్లా దేవాదాయ శాఖ అధికారి 13 నుంచి మహాశివరాత్రి ఉత్సవాలు జిల్లావ్యాప్తంగా శివాలయాల్లో ఆధ్యాతిక శోభ జిల్లాలోని రెండు పంచారామాలు, శివాలయాల్లో ఏర్పాట్లు 5 రోజులపాటు విశేష పూజలు, ప్రత్యేక కార్యక్రమాలు -
కాలువ గట్టుపై ఆగని ‘పచ్చ’ దందా
ద్వారకాతిరుమల: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి కొందరు పచ్చ నేతల దందాలకు, దౌర్జన్యాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది. సంపాదనే ధ్యేయంగా ప్రకృతి వనరులను సైతం దోపిడీ చేస్తూ రూ.కోట్లకు పడగలెత్తుతున్నారు. ఈ దోపిడీకి ద్వారకాతిరుమల మండల పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టు కేంద్రంగా మారింది. అధికారాన్ని అడ్డంపెట్టుకుని ఎర్ర మట్టిని యథేచ్ఛగా తవ్వుకుని, అమ్ముకుంటున్నారు. అయినా అధికారులు ఆ వైపు కన్నెత్తి చూడకపోవడంపై ప్రజలు మండిపడుతున్నారు. నిత్యం మట్టి అక్రమ తవ్వకాలే.. పంగిడిగూడెం నుంచి గుణ్ణంపల్లి వరకు పోలవరం కుడి కాలువ గట్టుపై నిత్యం అక్రమ మట్టి తవ్వకాలు జరుగుతూనే ఉన్నాయి. స్థానికులు ఫిర్యాదులు చేస్తున్నా సంబంధిత అధికారులు పట్టించుకోకపోవడంతో మట్టి దందా యథేచ్ఛగా సాగుతోంది. మండలంలోని నారాయణపురం పంచాయతీ గుళ్లపాడు గ్రామ పరిధిలోని పోలవరం కుడి కాలువ గట్టుపై కొద్ది రోజులుగా మట్టి తవ్వకాలు జోరుగా సాగుతున్నాయి. ఓ పచ్చ ముఠా రాత్రి, పగలు అనే తేడా లేకుండా జేసీబీ సహాయంతో ఎంతో విలువైన ఎర్ర మట్టిని తవ్వి ట్రాక్టర్ల ద్వారా చుట్టుపక్కల గ్రామాలకు తరలిస్తోంది. ఈ మట్టిని ఆయిల్పామ్ తోటల్లో రోడ్ల నిర్మాణానికి వినియోగిస్తున్నట్టు పలువురు చెబుతున్నారు. అలాగే టిప్పర్ల ద్వారా పెద్ద ఎత్తున మట్టి కాలువ కింద రొయ్యలు, చేపల చెరువులకు తరలిపోతోంది. ఒక్కో ట్రాక్టర్ గ్రావెల్ రూ.800కు, ఒక్కో టిప్పర్ మట్టిని రూ.10 వేలకు విక్రయించి, సొమ్ము చేసుకుంటున్నట్టు స్థానికులు చెబుతున్నారు. ఇంత జరుగుతున్నా అధికారులెవరూ ఆ వైపు కన్నెత్తి చూడటం లేదు. పునాదుల పేరుతో.. ఇంటి పునాదులకంటూ కొందరు పచ్చ నేతలు ఇష్టానుసారంగా మట్టిని కొళ్లగొట్టి, అమ్ముకుని, జేబులు నింపుకుంటున్నారు. పైకి గ్రామ అభివృద్ధికి, ప్రజల అవసరాలకని పెద్దపెద్ద మాటలు చెబుతున్నారు. కానీ వేలాది రూపాయలకు మట్టిని అమ్ముకుంటున్నారు. వాస్తవానికి సామాన్య ప్రజల అవసరాలకు ఈ మట్టి ఉపయోగపడటం లేదని స్థానికులు అంటున్నారు. ఈ మట్టి అక్రమ తవ్వకాలపై కాలువ జేఈ బాపూజీని వివరణ కోరేందుకు ప్రయత్నించగా ఆయన అందుబాటులోకి రాలేదు. ద్వారకాతిరుమల మండలం గుళ్లపాడు వద్ద పోలవరం కుడి కాలువ గట్టుపై అక్రమంగా జరుగుతున్న ఎర్ర మట్టి తవ్వకాలు, ట్రాక్టర్లో తరలిపోతున్న గ్రావెల్ పోలవరం కుడి కాలువ గట్టుపై యథేచ్ఛగా ఎర్ర మట్టి తవ్వకాలు ట్రాక్టర్లు, టిప్పర్ల ద్వారా వివిధ ప్రాంతాలకు తరలింపు ఆ వైపు కన్నెత్తి చూడని అధికారులు -
గంజాయి తరలిస్తున్న ముగ్గురి అరెస్ట్
ద్వారకాతిరుమల: రెండు బైక్లపై గంజాయి తరలిస్తున్న ముగ్గురు యువకులను ద్వారకాతిరుమల పోలీసులు మంగళవారం పట్టుకున్నారు. పోలీసుల కథనం ప్రకారం. మండలంలోని ఎం.నాగులపల్లి జాతీయ రహదారిపై ఎస్సై టి.సుధీర్ సిబ్బందితో కలిసి వాహన తనిఖీలు నిర్వహిస్తున్నారు. ఆ సమయంలో హైదరాబాద్కు చెందిన బండారి శివ, దుదాని లక్ష్మణ్సింగ్, మూరగుంట్ల ఆనంద్లు బైక్లపై వస్తూ ఘటనా స్థలంలో పోలీసులను చూసి పారిపోయేందుకు ప్రయత్నించారు. దీంతో ఎస్సై సుధీర్కు అనుమానం వచ్చి వారిని పట్టుకున్నారు. అనంతరం తహసీల్దార్ జేవీ సుబ్బారావు, మధ్యవర్తుల సమక్షంలో సదరు యువకులను విచారించి, తనిఖీలు చేశారు. వారి వద్ద 12.885 కేజీల గంజాయి కలిగిన 10 ప్యాకెట్లను స్వాధీనం చేసుకున్నారు. వాటి విలువ రూ.6.45 లక్షలు ఉంటుందని నిర్ధారించారు. సీలేరు దగ్గర పసుపులంక నుంచి హైదరాబాద్కు ఈ గంజాయిని తరలిస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. దీంతో నిందితులను అరెస్టు చేసి, గంజాయి రవాణాకు వినియోగించిన బైక్లను సీజ్ చేశారు. దీనిపై కేసు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఎస్సై టి.సుధీర్ తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు ప్రభుత్వ వైద్య కళాశాల హాస్టల్ విద్యార్థుల నుంచి యాజమాన్యం అదనంగా రూ.1,500 వసూలు చేస్తున్నట్టు విద్యార్థులు ఆరోపిస్తున్నారు. మొదటి ఏడాది ఎంబీబీఎస్ విద్యార్థులకు ఏలూరు జీజీహెచ్లోని ఎంసీహెచ్ బ్లాక్ భవనం పై అంతస్తులో హాస్టల్ నిర్మించారు. నెలకు ఒక్కో విద్యార్థి నుంచి రూ.1,500 వరకు అనధికార వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు ఉన్నాయి. రూ.1,000 మెయింటినెన్స్, మరో రూ.500 బస్సు కోసం చెల్లించాలని చెబుతున్నారు. ఇప్పటికే హాస్టల్, మెస్కు ప్రతినెలా రూ.5,500 చెల్లిస్తుండగా అదనంగా రూ.1,500 కట్టాల్సి రావటంతో తమ కుటుంబాలపై భారం పడుతుందని అంటున్నారు. కాలేజీలో 150 మంది ఫస్టియర్ విద్యార్థులు ఉండగా వారిలో 130 మంది వరకూ హాస్టల్లో వసతి పొందుతున్నారు. వీరిలో ఫ్రీ సీటు సాధించిన వైద్య విద్యార్థులు సుమారు 78 మందికి పైగా ఉంటారు. వీరంతా సామాన్య రైతు, పేద, మధ్యతరగతి వర్గాల కుటుంబాలకు చెందిన వారు. ఫ్రీ సీటు సాధించిన సామాన్య, మధ్యతరగతి వర్గాల వైద్య విద్యార్థులపై చులకన భావనతో కాలేజీ యాజమాన్యం మాట్లాడుతుందని విద్యార్థులు అంటున్నారు. దీంతో ఎవరికి చెప్పుకోవాలో తెలియని దైన్యస్థితిలో విద్యార్థులు ఉన్నారు. అదనంగా సొమ్ములు చెల్లింపులు, హాస్టల్లో వసతులపై నిలదీస్తే.. మీ పేర్లు చెప్పండి.. మీరు ఎలా పాస్ అవుతారో చూస్తామంటూ వార్నింగ్ ఇస్తున్నారని చెబుతున్నారు. ఏలూరు(మెట్రో): ఉగ్రవాద హింస, తీవ్రవాదం, సరిహద్దు కాల్పులు, తదితర కారణాలతో తల్లిదండ్రులను కోల్పోయిన పిల్లలకు కేర్ అండ్ ఎడ్యుకేషన్ కింద ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ పథకంలో అర్హత కలిగిన పిల్లలకు 25 సంవత్సరాల వరకు వారి విద్యకు సంబంధించిన మౌలిక అవసరాల కోసం ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. ఈ పథక ప్రయోజనాలు పొందేందుకు జిల్లా బాలల సంరక్షణ కార్యాలయంలో సంప్రదించవచ్చని, ఇతర సమాచారం కోసం జిల్లా బాలల సంరక్షణ అధికారిని 08812– 249883 నెంబరులో సంప్రదించవచ్చన్నారు. తాడేపల్లిగూడెం: భారత ప్రభుత్వ ఆధీనంలోని కెపాసిటీ బిల్డింగ్ కమిషన్ ఆధ్వర్యంలో నిట్లో గత రెండు రోజులుగా సాగుతున్న రాష్ట్రీయ కర్మయోగి లార్జ్ స్కేల్ జన్ సేవా కార్యక్రమం మంగళవారం ముగిసింది. ప్రభుత్వ ఉద్యోగులను సృజనాత్మకంగా, వృత్తి నిపుణులుగా, సేవా దృక్పథం కలిగిన వారిగా తీర్చిదిద్దడమే ఈ కర్మయోగి మిషన్ ముఖ్య ఉద్దేశమని వక్తలు పేర్కొన్నారు. కొత్త విషయాలను ఉద్యోగులకు విశదీకరించారు. రెండు రోజుల్లో 122 మంది ఉద్యోగులు హాజరయ్యారు. ముగింపు కార్యక్రమంలో రిజిస్ట్రార్ దినేష్ శంకరరెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
మందకొడిగా ఆస్తి పన్ను వసూళ్లు
జంగారెడ్డిగూడెం: ఏలూరు జిల్లాలో ఆయా మున్సిపాలిటీల్లో ఆస్తి పన్ను వసూళ్లు మందకొడిగా సాగుతున్నాయి. ఆర్థిక సంవత్సరం సుమారు 50 రోజుల్లో ముగుస్తుండగా పన్ను వసూళ్లు మాత్రం ముందుకు సాగడం లేదు. జిల్లాలో 4 మున్సిపాలిటీలు ఉండగా, ఏలూరు కార్పొరేషన్, చింతలపూడి నగర పంచాయతీలుగా ఉన్నాయి. వీటిలో మొత్తం అసెస్మెంట్లు 1,15,903 ఉండగా, మొత్తంగా రూ. 96.02 కోట్లు ఆస్తి పన్ను వసూలు కావాల్సి ఉంది. వీటిలో పాత బకాయిలు కలిసి ఉన్నాయి. ఇంతవరకు రూ. 31.19 కోట్లు మాత్రమే వసూలయ్యాయి. మొత్తం మీద 37.2 శాతం ఆస్తి పన్నులు వసూలయ్యాయి. ఆయా మున్సిపాలిటీల్లో ఇంటి పన్నులు, ఖాళీ స్థలాల పన్నులు, కేంద్ర, రాష్ట్ర కార్యాలయాల పన్నులు కలిసి ఉన్నాయి. మొత్తం 1,15,903 అసెస్మెంట్లు ఉన్నాయి. ఇంత వరకు పన్నుల వసూళ్ళలో జంగారెడ్డిగూడెం మున్సిపాలిటీ 41.11 శాతం వసూళ్లతో ప్రథమస్థానంలో ఉండగా, ఏలూరు కార్పొరేషన్ 36.28 శాతంతో చివరి స్థానంలో ఉంది. చింతలపూడి నగరపంచాయతీ 39.49 శాతంతో రెండో స్థానం, నూజివీడు 37.68 శాతంతో మూడో స్థానంలో నిలిచాయి. మున్సిపాలిటీలు వసూలు వసూలైనది కావాల్సినది (రూ.కోట్లలో) (రూ.కోట్లలో)జంగారెడ్డిగూడెం 13.22 5.43 చింతలపూడి 2.79 1.10 నూజివీడు 11.04 4.16 ఏలూరు 68.97 25.02 (కార్పొరేషన్) మొత్తం 96.02 35.71సచివాలయాల వారీగా ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేశాం. పట్టణంలో మైక్ ద్వారా ఆస్తి పన్ను చెల్లించాలని ప్రచారం చేస్తున్నాం. ఆస్తి పన్ను చెల్లించాలని డిమాండ్ నోటీసు జారీ చేశాం. ఆర్థిక సంవత్సరం చివరి నాటికి పన్ను వసూళ్లకు ప్రణాళికలతో ముందుకు సాగుతున్నాం. పన్ను వసూళ్లలో ఎలాంటి అలసత్వం వహించవద్దని ఆదేశాలు జారీ చేశాం. ప్రజలు కూడా సకాలంలో పన్నులు చెల్లించి పట్టణాభివృద్ధికి సహకరించాలి. – కేవీ రమణ, మున్సిపల్ కమిషనర్, జంగారెడ్డిగూడెం -
ముసాయిదాలోని అంశాలు అంగీకరించం
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏపీ సివిల్ సర్వీసెస్ (పెన్షన్) రూల్స్– 2026 ముసాయిదాలోని అంశాలు ఉపాధ్యాయ, ఉద్యోగులకు తీవ్ర నష్టం చేకూర్చేలా ఉన్నాయని, ఆయా అంశాలను ఏమాత్రం అంగీకరించేది లేదని ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం స్పష్టం చేసింది. స్థానిక పవర్పేట నగరపాలక ఉన్నత పాఠశాలలో ఉపాధ్యాయ సంఘాల నాయకులతో మంగళవారం జిల్లా స్థాయి ఉపాధ్యాయ సంఘాల రౌండ్ టేబుల్ సమావేశం నిర్వహించారు. కొత్త ముసాయిదా పెన్షన్ నిబంధనలపై ఉపాధ్యాయులు, ప్రభుత్వ ఉద్యోగ సంఘాల నుంచి తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఈ అంశంపై సమష్టిగా చర్చించి, ప్రభుత్వానికి తమ అభిప్రాయాలు, సూచనలు తెలియజేస్తామన్నారు. ఏపీ రివైజ్డ్ పెన్షన్ రూల్స్ –1980ను దెబ్బతీసే ఏ మార్పులనైనా ఉపాధ్యాయులు, ఉద్యోగులు సహించబోమని, ప్రభుత్వం వెంటనే ఈ ముసాయిదాను వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేశారు. దీనిపై అవసరమైతే రాష్ట్రవ్యాప్తంగా ఉద్యమాలకు సిద్ధమవుతామని హెచ్చరించారు. -
పంచాయతీ ఎన్నికలకు కసరత్తు
హరహర మహాదేవ శివరాత్రి ఉత్సవాలకు శైవ క్షేత్రాలు ముస్తాబవుతున్నాయి. ఈనెల 13 నుంచి 17వ తేదీ వరకు ఉత్సవాల నేపథ్యంలో శివాలయాల్లో ఆధ్యాత్మిక శోభ సంతరించుకోనుంది. 8లో uశ్రీవారి ఆలయానికి దత్తత ఆలయమైన శ్రీ లక్ష్మీనరసింహ స్వామివారి ఆలయంలో శ్రీ సుదర్శన, నరసింహ ధన్వంతరీ మహాయజ్ఞానికి ఏర్పాట్లు ప్రారంభమయ్యాయి. 8లో uబుధవారం శ్రీ 11 శ్రీ ఫిబ్రవరి శ్రీ 2026ఏలూరు (టూటౌన్): పంచాయతీ ఎన్నికలకు సంబంధించి రాష్ట్ర ఎన్నికల కమిషన్ ఆదేశాలతో జిల్లా యంత్రాంగం కసరత్తు ప్రారంభించింది. గతేడాది సెప్టెంబర్ 3న రాష్ట్ర ఎన్నికల కమిషన్ తాత్కాలిక షెడ్యూల్ను ప్రతిపాదించి, అందుకు అనుగుణంగా కార్యక్రమాలను చేపట్టాలని అప్పట్లోనే జిల్లా పంచాయతీ అధికారులకు ఉత్తర్వులు జారీ చేసింది. ప్రతీ జిల్లా నుండి ముగ్గురు అధికారులకు పలు సాంకేతిక అంశాలపై శిక్షణ కూడా ఇచ్చారు. తాజాగా రాష్ట్ర ఎన్నికల కమిషన్ మార్చి 9 నాటికి పంచాయతీ ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఆదేశాలు జారీ చేసింది. దీంతో పల్లెల్లో ఎన్నికల వేడి రాజుకుంది. చాలా మంది ఆశావహులు పోటీలో దిగేందుకు రంగం సిద్ధం చేసుకుంటున్నారు. అవసరమైన ఆర్థిక గణాంకాల లెక్కలు వేసుకుంటున్నారు. ఏలూరు జిల్లాలో మొత్తం 543 పంచాయతీలు జిల్లాల పునర్విభజన అనంతరం ఏలూరు జిల్లా వ్యాప్తంగా 27 మండలాల పరిధిలో మొత్తం 543 గ్రామ పంచాయతీలు ఉన్నాయి. వీటి పరిఽధిలో మొత్తం 5,687 వార్డులు ఉన్నాయి. ఏలూరు నగరపాలక సంస్థ పరిధిలో 50 డివిజన్లు ఉన్నాయి. జంగారెడ్డిగూడెం పురపాలక సంఘంలో 29, నూజివీడు పురపాలక సంఘంలో 32 వార్డులు ఉన్నాయి. చింతలపూడి నగర పంచాయతీలో 20 వార్డులు ఉన్నాయి. ప్రారంభమైన ఎన్నికల చర్చలు గ్రామాల్లో ఎన్నికల హడావుడి మొదలైంది. రచ్చబండల వద్ద జనం చర్చలు ప్రారంభమయ్యాయి. ఈ సారి ఎన్నికల్లో ఎవరు పోటీ చేస్తారు. పోటీ చేసిన వారిలో ఎవరు గెలుస్తారు అనే లెక్కలు వేసుకుంటున్నారు. కిళ్లి షాపులు, టీ దుకాణాలు, హోటల్స్ వంటి వాటి వద్ద కూడా పంచాయతీ ఎన్నికల గురించి చర్చలు సాగుతున్నాయి. బయటకు వస్తున్న ఆశావహులు పంచాయతీ ఎన్నికలు త్వరలోనే నిర్వహించే అవకాశాలు ఉన్న నేపథ్యంలో ఆసక్తిగా ఉన్న పలువురు ఆశావహులు తెరపైకి వస్తున్నారు. ఎవరికి వారు తెరవెనుక కసరత్తు చేస్తున్నారు. సామాజిక వర్గాల వారీగా సమాలోచనలు చేస్తున్నారు. ఎన్నడూ లేని విధంగా ఈ సారి ఎన్నికల్లో అధికార పార్టీ వైపు నుంచి కంటే ప్రతిపక్ష పార్టీ వైపు నుంచి పోటీ చేసేందుకు ఆశావహులు పెద్ద సంఖ్యలో పైరవీలు చేస్తున్నారు. గ్రామ పంచాయతీ ఎన్నికల్లో కూటమిలోని టీడీపీ, జనసేన, బీజేపీ మధ్య పోటీ విషయంలో రచ్చ తప్పేలా లేదని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. ప్రతి పంచాయతీలో టీడీపీకి పోటీగా జనసేన నుంచి ఆశావహులు ప్రయత్నాలు మొదలెట్టేసారు. తమకు ఇవ్వాల్సిందే నంటూ గ్రామ స్థాయి నాయకులు మండల, నియోజకవర్గ స్థాయి నాయకుల వద్ద అప్పుడే పైరవీలు చేస్తున్నారు. సీట్ల విషయంలో కూటమి పార్టీల్లోని అసంతృప్తే ప్రతిపక్ష పార్టీ అభ్యర్థుల విజయానికి పరోక్షంగా దోహాదపడుతుందనే అభిప్రాయం వ్యక్తమవుతోంది. పంచాయతీ ఎన్నికలను షెడ్యూల్ ప్రకారం నిర్వ హించాలి. ఎన్నికల కమీషన్ రాజ్యాంగ బద్దమైన వ్యవస్థ. ఈ వ్యవస్థ సరిగా పనిచేసేలా అధికారులు కృషి చేయాలి. ప్రజల్లో నమ్మకం కలిగించి రాబోయే స్థానిక ఎన్నికల్లో నిజాయితీగా ఎన్నికల కమీషన్ పనిచేయాలి. – మెండెం సంతోష్ కుమార్, రాష్ట్ర అధ్యక్షుడు, ఎస్సీ సర్పంచుల హక్కుల పరిరక్షణ సంఘం పంచాయతీ ఎన్నికలను స్వేచ్ఛాయుత వాతావరణంలో నిర్వహించేలా ఎన్నికల కమిషన్ పనిచేయాలి. ఎస్సీ, ఎస్టీ సర్పంచుల రిజర్వేషన్ల స్థానాల్లో ఇతరుల పెత్తనం లేకుండా చూడాలి. సరైన సమయంలో ఎన్నికలు నిర్వహిస్తే గ్రామీణ వాతావరణంలో ప్రజలకు సేవ చేసే అవకాశం ప్రజా ప్రతినిధులకు కల్పించినట్లు అవుతుంది. – కంచర్ల వాణి, సర్పంచ్, గోపవరం, ముసునూరు మండలం ఏప్రిల్ 2తో ముగియనున్న పాలన మార్చి 9 నాటికి ఓటర్ల జాబితా సిద్ధం చేయాలని తాజాగా ఆదేశాలు ఇప్పటికే పల్లెల్లో మొదలైన ఎన్నికల హడావుడి పోటీకి రంగం సిద్ధం చేసుకుంటున్న ఆశావహులు జిల్లాలో మొత్తం 543 పంచాయతీలు, 5,687 వార్డులు రాష్ట్ర వ్యాప్తంగా పంచాయతీల పాలన 2021, ఏప్రిల్ 3న ప్రారంభమైంది. పంచాయతీల పాలకవర్గ పదవీ కాలం ఈ ఏడాది ఏప్రిల్ 2తో ముగియనుంది. దీంతో నిర్ణీత సమయంలోగా పంచాయతీ ఎన్నికలు నిర్వహించేందుకు వీలుగా చేపట్టాల్సిన ప్రక్రియను పూర్తి చేసుకునేందుకు ఎన్నికల కమిషన్ చర్యలు చేపట్టినట్లు తెలుస్తోంది. ఈ ఏడాది జనవరి 1 వరకు ఉన్న అసెంబ్లీ ఓటర్ల జాబితా ఆధారంగా పంచాయతీల్లో వార్డుల వారీగా ఓటర్ల జాబితాను సిద్ధం చేసుకోవాలని ఎన్నికల కమిషన్ ఆదేశాలు జారీ చేసింది. దానికి అనుగుణంగా జిల్లా పంచాయతీ అధికారి కార్యాలయంలో ఎన్నికల ప్రక్రియ ప్రారంభమైంది. జిల్లా వ్యాప్తంగా ఉన్న గ్రామ పంచాయతీల్లో ఎన్నికలను నిర్వహించేందుకు వీలుగా ఆయా గ్రామ పంచాయతీల్లో వార్డుల వివరాలు, జనాభా, సామాజిక వర్గాల వివరాలు సేకరించడం తదితర పనులలో అధికార యంత్రాంగం బిజీగా ఉంది. ఆయా పనుల్లో జిల్లాలోని పంచాయతీ అధికారులు, సిబ్బంది తలమునకలై ఉన్నారు. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 2021 ఫిబ్రవరిలో ఎన్నికలు నిర్వహించారు. ఏప్రిల్ 3న నూతన పాలకవర్గాలు బాధ్యతలు స్వీకరించాయి. ఈ క్రమంలో ఈ ఏడాది ఏప్రిల్ 2న పంచాయతీ పాలకవరా్గాల పదవీకాలం ముగియనుంది. ఈ లోగా గ్రామ పంచాయతీ ఎన్నికలు నిర్వహించాలి. పురపాలక, నగర పంచాయతీలు, నగరపాలక సంస్థల పాలకవర్గాల గడువు మార్చి 17తో, ఎంపీటీసీ, జెడ్పీటీసీల పదవీ కాలం సెప్టెంబర్ 23, 24తో పూర్తి కానుంది. 2021లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వ్యాప్తంగా 862 గ్రామ పంచాయతీల పరిధిలో 9,660 వార్డు స్థానాలకు నాలుగు విడతల్లో ఎన్నికలు నిర్వహించారు.


