breaking news
Eluru District Latest News
-
గోదావరిలో యువకుడి గల్లంతు
కుక్కునూరు: గోదావరిలో స్నానానికి దిగిన యువకుడు నీటి ప్రవాహంలో పడి గల్లంతైన ఘటన శుక్రవారం మధ్యాహ్నాం మండలంలోని దాచారం రేవులో జరిగింది. స్థానికుల తెలిపిన వివరాల ప్రకారం బెస్తగూడెం గ్రామానికి చెందిన కుమ్మరపల్లి నాగార్జున(22) కార్పెంటర్ పనులు చేస్తుంటాడు. ఇటీవల అయ్యప్ప దీక్ష తీసుకున్నాడు. శుక్రవారం మధ్యాహ్నాం తోటి దీక్షధారులతో కలిసి గోదావరి నదిలోకి స్నానానికి దిగాడు. ఇటీవల తుపాను ప్రభావంతో కురిసిన భారీ వర్షాల కారణంగా గోదావరిలో నీటి ప్రవాహం అధికంగా ఉండడంతో లోతును గమనించని నాగార్జున కొద్దిగా ముందుకు వెళ్లడంతో మునిగి గల్లంతయ్యాడు. విషయం తెలుసుకున్న సీఐ రమేష్బాబు జాలర్లను తీసుకోచ్చి సాయంత్రం వరకు గాలించినా ఆచూకీ లభించలేదు. చీకటి పడడంతో గాలింపు చర్యలు నిలిపివేశారు. యువకుడు వైఎస్సార్సీపీ అభిమాని కావడంతో విషయం తెలుసుకున్న వైఎస్సార్సీపీ మండల అధ్యక్షుడు తాండ్ర రాజేష్, నాయకులు రావు వినోద్, మల్లెల చంటినాయుడు ఘటనా స్థలానికి వెళ్లి గాలింపు చర్యలను పరిశీలించారు. కుటుంబసభ్యులను పరామర్శించి వివరాలు అడిగి తెలుసుకున్నారు. -
చోరీ కేసుల్లో దొంగల అరెస్ట్
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని నూజివీడు, దెందులూరు ప్రాంతాల్లో మోటారు సైకిళ్ల చోరీలకు పాల్పడుతున్న దొంగల ముఠాలను పోలీసులు అరెస్ట్ చేసి, భారీగా బైక్లు స్వాధీనం చేసుకున్నారు. జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయం వద్ద శుక్రవారం ఎస్పీ శివ కిశోర్ వివరాలు వెల్లడించారు. నూజివీడు పట్టణం, పరిసర ప్రాంతాల్లో మోటారు సైకిళ్ళ చోరీలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను నూజివీడు టౌన్ పోలీసులు అరెస్ట్ చేశారు. నూజివీడు డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ పర్యవేక్షణలో సీఐ సత్యశ్రీనివాస్, ఎస్ఐ కే.నాగేశ్వరరావు దర్యాప్తు చేపట్టారు. నూజివీడు రామన్నగూడెం రోడ్డులోని డంపింగ్ యార్డ్ వద్ద ఐదుగురు నిందితులను అరెస్ట్ చేశారు. దలాయి గణేష్ అలియాస్ నాగ, చౌటపల్లి సుభాష్ అలియాస్ సుబ్బు, షేక్ ఆసీఫ్ ఉల్లా అలియాస్ ఆసిఫ్, చిత్తూరి అజయ్కుమార్ అలియాస్ అజయ్ను అరెస్ట్ చేశారు. వీరు చెడు వ్యసనాలకు బానిసలుగా మారి బైక్ల చోరీలకు పాల్పడుతున్నారు. నిందితుల నుంచి 12 కేసుల్లో 12 బైక్లు పోలీసులు రికవరీ చేశారు. చోరీ సొత్తు విలువ సుమారు రూ.9.08 లక్షలు ఉంటుందని అంచనా. లింగపాలెం మండలం కళ్ళచెరువు గ్రామంలో మనీషా వైన్స్ షాప్లో గుమస్తాగా పనిచేస్తోన్న గుడివాక ఆంజనేయ ప్రసాద్ అక్టోబర్ 28న వైన్స్షాప్ నగదు రూ.40 వేలు తీసుకుని బైక్పై ప్రయాణమయ్యాడు. ఇదే సమయంలో గుర్తు తెలియని వ్యక్తులు వెంబడించారు. అతడిని నిలువరించి కర్రలో కొట్టి రూ.40 వేల నగదుతో పారిపోయారు. పెదవేగి సీఐ సీహెచ్ రాజశేఖర్ కేసును దర్యాప్తు చేశారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు సోమవరప్పాడు గ్రామంలో ఐదుగురిని అరెస్ట్ చేసి చోరీ సోత్తు స్వాధీనం చేసుకున్నారు. బంగారు సుబ్రహ్మణ్యంపాటు మరో నలుగురు బాలురను అదుపులోకి తీసుకున్నారు. వీరి నుంచి 9 బైక్లు, రూ.10వేల నగదు స్వాధీనం చేసుకున్నారు. వీరంతా దెందులూరు, పెదవేగి, ద్వారకాతిరుమల, ఏలూరు నగరంలో చోరీలకు పాల్పడుతున్నారు. వీరిపై 12 కేసులు ఉన్నాయని పోలీసులు తెలిపారు. 21 మోటారు సైకిళ్ల రికవరీ -
పాత కక్షల నేపథ్యంలో వ్యక్తి హత్య
ఏలూరు టౌన్: ఏలూరు రూరల్ పరిధిలో ఒక వ్యక్తి హత్యకు గురయ్యాడు. అతని ఇంటి వద్ద కత్తితో ఆకస్మికంగా దాడి చేయటంతో తీవ్ర గాయాలయ్యాయి. కుటుంబ సభ్యులు ఏలూరు జీజీహెచ్కు తరలించగా.. పరీక్షించిన వైద్యులు అప్పటికే మృతిచెందినట్లు నిర్ధారించారు. పాత కక్షల నేపథ్యంలోనే హత్య జరిగినట్లు పోలీసులు ప్రాథమిక నిర్ధారణకు వచ్చారు. రూరల్ పరిధిలో గణేష్ నగర్లో ఉంటున్న నమ్మిన హరికృష్ణ (32) ఆటోడ్రైవర్గా పనిచేస్తూ భార్య, ఇద్దరు పిల్లలతో జీవిస్తున్నాడు. అదే ప్రాంతానికి చెందిన దీపక్ ఆర్ఆర్పేటలోని హోటల్లో టీ మాస్టర్గా పనిచేస్తున్నాడు. ఇద్దరి మద్య గతంలో సన్నిహిత సంబంధాలు ఉండగా... ఇటీవల మనస్పర్థలు పెరిగాయని చెబుతున్నారు. ఒకరిపై ఒకరు కక్ష పెంచుకున్నారని సమాచారం. ఈ నేపథ్యంలో శుక్రవారం రాత్రి 6.30గంటల సమయంలో గణేష్నగర్లోని హరికృష్ణ ఇంటివద్దనే దీపక్ కత్తితో దాడి చేశాడు. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం ఏలూరు జీజీహెచ్ మార్చురీకి తరలించారు. ఏలూరు రూరల్ ఎస్ఐ నాగబాబు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
శ్రీవారిపై నమ్మకంతోనే..
ద్వారకాతిరుమల: శ్రీవారిపై తనకున్న నమ్మకం.. ఇష్టమే ఎనిమిది పదుల వయస్సులోనూ దీక్ష చేపట్టేలా చేసిందని ఒంగోలుకు చెందిన నీలంరాజు సీతమ్మ అన్నారు. కొద్ది రోజుల క్రితం గోవింద దీక్షను చేపట్టిన ఈమె, నియమ నిష్ఠలు, భక్తి ప్రపత్తులతో దీక్షను పూర్తి చేశారు. ఈ సందర్భంగా శుక్రవారం ఆమె ఇరుముడులను ధరించి, కుటుంబ సభ్యులతో కలసి ద్వారకాతిరుమల శ్రీవారి సన్నిధికి చేరుకున్నారు. అనంతరం ఇరుముడులను సమర్పించి స్వామి, అమ్మవార్లను దర్శించారు. ఇప్పటికే అయ్యప్ప దీక్షను కూడా పూర్తి చేసినట్టు సీతమ్మ తెలిపారు. ఇదిలా ఉంటే మనస్సు నిండుగా భక్తి ఉంటే.. వయస్సుతో సంబంధం లేదని సీతమ్మ నిరూపిస్తున్నారని పలువురు భక్తులు కొనియాడారు. ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు పరిసర ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్న లాక్ చిత్రానికి సంబంధించిన ట్రైలర్ను శుక్రవారం స్థానిక సెయింట్ ఆన్స్ కళాశాలలో చిత్ర బృందం విడుదల చేసింది. కార్యక్రమంలో సీనియర్ నటుడు గౌతమ్ రాజు మాట్లాడుతూ ఏలూరు పరిసర ప్రాంతాల్లోనే ఈ చిత్రం రూపుదిద్దుకుందని, చిత్రంలో నటించిన నటీనటులంతా దాదాపు కొత్తవారైనా ఎంతో అనుభవం ఉన్నవారిలా పాత్రలకు జీవం పోశారని చెప్పారు. కార్యక్రమంలో చిత్ర దర్శకుడు జోషి విక్టర్ తదితరులు పాల్గొన్నారు. ద్వారకాతిరుమల: చిన్నతిరుపతి క్షేత్రానికి శుక్రవారం కాలినడక భక్తులు పోటెత్తారు. కార్తీకమాసం కావడంతో పాదయాత్రగా వచ్చే భక్తుల సంఖ్య ఈ వారం అధికంగా ఉంది. కృష్ణ, ఎన్టీఆర్, ఏలూరు జిల్లాలకు చెందిన భక్తులు భీమడోలు మీదుగా, రాజమండ్రి, కొవ్వూరు, నిడదవోలు, తణుకు, తాడేపల్లిగూడెం, భీమవరం పరిసర ప్రాంతాలకు చెందిన భక్తులు దూబచర్ల–రాళ్లకుంట మీదుగా విచ్చేశారు. ఖమ్మం పరిసర ప్రాంతాల భక్తులు జంగారెడ్డిగూడెం–కామవరపుకోట మీదుగా క్షేత్రానికి చేరుకున్నారు. కాలినడక భక్తులకు దేవస్థానం ఉచిత అన్నప్రసాదాన్ని అందజేసింది. -
గురువుల్లో టెట్ గుబులు
శనివారం శ్రీ 8 శ్రీ నవంబర్ శ్రీ 2025ఏలూరు (ఆర్ఆర్పేట): ఉపాధ్యాయులంతా టెట్ (టీచర్ ఎలిజిబిలిటీ టెస్ట్) అర్హత సాధించాలని సుప్రీంకోర్టు ఇచ్చిన మార్గదర్శకాలు గురువుల్లో గుబులు పుట్టిస్తున్నాయి. ఏళ్ల తరబడి విధులు నిర్వహిస్తున్న టీచర్లకు ఇది గుదిబండగా మారింది. రాష్ట్రంలోని ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులకు ఇబ్బంది గా ఉన్న టెట్ నిబంధనపై కూటమి ప్రభుత్వం రి వ్యూ పిటిషన్ వేయకుండా నిర్లక్ష్యాన్ని ప్రదర్శించడంపై సర్వత్రా ఆగ్రహం వ్యక్తమవుతోంది. 2011కి ముందు డీఎస్సీల ద్వారా నియామకమైన ఉపాధ్యాయులంతా టెట్ అర్హత సాధించాల్సి ఉంది. టెట్లో ఉత్తీర్ణులు కాకుంటే ఉద్యోగాన్ని ఒదులుకోవాల్సిందేనని అత్యున్నత న్యాయస్థానం తీర్పు వెలువరించింది. ఐదేళ్లలోపు సర్వీసు ఉన్న ప్రతిఒక్కరూ ఉపాధ్యాయులుగా కొనసాగేందుకు, ఉద్యోగోన్నతులు పొందేందుకు టెట్ అర్హత తప్పని సరిచేసింది. అయితే దాదాపు 30 ఏళ్ల నుంచి ఉపాధ్యాయులుగా పనిచేస్తున్నవారు కూడా ఇప్పుడు టెట్ రాయాలనడం విడ్డూరంగా ఉందని ఉపాధ్యాయ సంఘాలు మండిపడుతున్నాయి. ఉద్యోగాల కోసం ఎప్పటి నిబంధనలు అప్పటి వరకే ఉండాలని, కొత్త నిబంధనలు గతంలో ఉద్యోగాలు సాధించిన వారు కూడా అనుసరించాలనడం సరికాదని అంటున్నారు. 2011కు ముందు చేరిన వారిపై.. రాష్ట్రంలో 2011 ముందు చాలా డీఎస్సీల ద్వారా ఉపాధ్యాయుల నియామకం జరిగింది. జిల్లాస్థాయిలో వందలాది మంది ఉద్యోగాలు సాధించారు. అప్పటి నిబంధనల మేరకే అప్పటి ప్రభుత్వాలు అభ్యర్థులను ఎంపిక చేశాయి. 2009లో కేంద్ర ప్ర భుత్వం నూతన జాతీయ విద్యా విధానంలో టెట్ అర్హతను తీసుకువచ్చింది. అప్పటి నుంచి ఆయా రాష్ట్రాలు టెట్ పరీక్షను నిర్వహిస్తూ కొత్తగా ఉపాధ్యాయ నియామకంలో టెట్కు వెయిటేజీ ఇస్తున్నా రు. అయితే కొత్త చట్టంలోని నిబంధనలు అప్పటికే ఉద్యోగాలు సాధించినవారు పాటించాలనడం సరికాదని విద్యారంగ నిపుణులు అంటున్నారు. సుమారు 6 వేల మందిలో టెన్షన్ ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ప్రభుత్వ పాఠశాలల్లో దాదాపు 11,500 మంది ఉపాధ్యాయు లు ఉన్నారు. వీరిలో 2000 కంటే ముందుగానే ఉ ద్యోగాల్లో చేరిన వారు కూడా ఉన్నారు. వీరంతా దా దాపు 25 ఏళ్లకు పైగా సర్వీసును పూర్తి చేసుకు న్నారు. మొత్తంగా చూస్తే 2000–2011 మధ్య ఉ ద్యోగంలో చేరిన వారు ఉమ్మడి జిల్లాలో సుమారు 6 వేల మంది ఉన్నారు. వీరంతా ఇప్పుడు టెట్ అర్హత సాధించాల్సి ఉంది. వారిలో 50 ఏళ్ల దాటి రక్తపో టు, మధుమేహం వంటి దీర్ఘకాలిక వ్యాధులతో బా ధపడేవారు కూడా ఉన్నారు. ఒక పక్క వ్యాధులతో సతమతమవుతూ, ప్రభుత్వ యాప్లను పూర్తి చేస్తూ, విద్యార్థులకు పాఠ్యాంశాలు బోధిస్తూ తీవ్ర పని ఒత్తిడికి గురవుతున్నారు. పాతికేళ్లుగా విధులు నిర్వహిస్తున్న తాము ఇప్పుడు కొత్తగా ఏం నిరూపించుకోవాలని వారు ప్రశ్నిస్తున్నారు. అర్హత పరీక్షపై ఆందోళన ఉత్తీర్ణత తప్పదన్న సుప్రీంకోర్టు 2011కు ముందు చేరిన వారిపై ప్రభావం ఉమ్మడి జిల్లాలో సుమారు 6 వేల మంది టీచర్లు -
కోటి సంతకాలతో కూటమిని నిలదీద్దాం
మాజీ ఎమ్మెల్యే వాసుబాబు గణపవరం: ప్రజావ్యతిరేక పాలనతో కంటగింపుగా మారిన కూటమి ప్రభుత్వాన్ని కోటి సంతకాలతో నిలదీద్దామని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పా ల వాసుబాబు అన్నారు. శుక్రవారం మండలంలోని పిప్పరలో రచ్చబండ, కోటిసంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పేద విద్యార్థులకు వ రంలా మాజీ సీఎం జగన్ తీసుకువచ్చిన 17 మెడికల్ కాలేజీలను చంద్రబాబు తన అను యాయులైన ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయడానికి సిద్ధపడ్డారన్నారు. రాష్ట్రంలో మెడికల్ కాలేజీలను జగన్ నిర్మిస్తే, చంద్రబాబు మాత్రం వాటిని ప్రైవేటుపరం చేసి కోట్లాది రూపాయలు దండుకునేందుకు ప్రణాళికలు వే శారన్నారు. ఇది పేద, బడుగు, బలహీన వర్గా ల విద్యార్థులకు శాపంగా మారనుందన్నారు. దీనిపై వైఎస్సార్సీపీ పోరాటం చేస్తుందని, ప్రజలంతా మద్దతుగా నిలవాలని ఆయన కో రారు. ఎంపీపీ అర్ధవరం రాము, వైఎస్సార్సీపీ రాష్ట్ర ప్రచార కమిటీ కన్వీనర్ నడింపల్లి సోమరాజు మాట్లాడారు. వైఎస్సార్సిపి రైతు విభాగం కన్వీనర్ వెజ్జు వెంకటేశ్వరరావు, స్టేట్ యూత్ కమిటి కన్వీనర్ కమ్మిల భాస్కరరాజు, నాయకులు ఇందుకూరి నర్సింహరాజు, వీరవల్లి తాతయ్య, మాజీ మంత్రి చెరుకువాడ రంగరాజు కుమారుడు చెరుకువాడ నరేష్, సర్పంచ్లు దుళ్లకుటుంబరావు (మొయ్యేరు), మీసా ల సురేష్ (వెంకట్రాజపురం), అడబాల రవి (వీరేశ్వరపురం), కర్రి శ్రీనివాసరెడ్డి (ము ప్పర్తిపాడు), ఆదిమూలం సురేష్ (వాకపల్లి), ఎంపీటీసీ సభ్యుడు పెచ్చెట్టి నారాయణ తదితరులు పాల్గొన్నారు. -
విధుల్లో నిర్లక్ష్యం సహించం
ఏలూరు(మెట్రో): విధుల్లో నిర్లక్ష్యం, నిర్దేశించిన లక్ష్యాలను పూర్తిచేయని అధికారులను ఉపేక్షించేది లేదని కలెక్టర్ కె.వెట్రిసెల్వి ఆర్డబ్ల్యూఎస్ అధికారులను హెచ్చరించారు. జిల్లాలోని సంక్షేమ వసతి గృహాలు, అంగన్వాడీ కేంద్రాలు, పర్యాటక శాఖకు చెందిన ప్రదేశాల్లో టాయిలెట్లు నిర్మాణ పనులపై ఆర్డబ్ల్యూఎస్, సంక్షేమ శాఖల అధికారులతో శుక్రవారం ఆమె జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. హాస్టళ్లకు టాయిలెట్లు మంజూరు చేసి మూడు నెలలు దా టినా ఇప్పటికీ నిర్మించకపోవడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కామవరపుకోట, జీలుగుమిల్లి, కై కలూరు, ము దినేపల్లి, పోలవరం, కలిదిండి మండలాల ఆర్డబ్ల్యూఎస్ ఇంజనీరింగ్ అధి కారుల పనితీరుపై అసంతృప్తి వ్యక్తంచేస్తూ, 24 గంటలలోపు పనుల్లో పురోగతి ప్రదర్శించని అధికారులను సస్పెండ్ చేస్తానని హెచ్చరించారు. ఆయా పనులను త్వరితగతిన పూర్తిచేయాలని ఆదేశించారు. సీపీఓ వాసుదేవరావు అధికారులు పాల్గొన్నారు. -
బాల్య వివాహాలను నియంత్రించాలి
నూజివీడు: డివిజన్లో బాల్య వివాహాలు ఎక్కువ జరుగుతున్నాయని, వాటిని పూర్తిగా నియంత్రించాల్సిన బాధ్యత అధికారులపై ఉందని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న అన్నారు. ఐసీడీఎస్ ఆధ్వర్యంలో స్థానిక సబ్ కలెక్టర్ కార్యాలయంలో శుక్రవారం బాల్య వివాహాల నియంత్రణపై డివిజన్ స్థాయి సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ కలెక్టర్ మా ట్లాడుతూ డివిజన్లోని ఆరు మండలాల్లో క లిపి 23 బాల్య వివాహాలు జరిగినట్టు రిపోర్టు అయ్యాయని, వైద్యారోగ్య శాఖ లెక్కల ప్రకారం మాత్రం టీనేజీ గర్భిణులు 302 మంది నమోదయ్యారన్నారు. ఇది అందరి వైఫల్యాన్ని సూచిస్తుందన్నారు. ఎంఎస్కేలు గ్రామస్థాయిలో మరింత చురుగ్గా పనిచేయాలన్నారు. ఐసీడీఎస్ పీడీ పి.శారద, డీసీపీఓ సూర్యచక్రవేణి, సీడీపీఓ పి.విజయకుమారి, డీఎస్పీ కేవీవీఎన్వీ ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): సుప్రీంకోర్టు చీఫ్ జస్టిస్ బీఆర్ గవాయ్పై దాడి చేసిన వారిపై సుమోటోగా కేసు నమోదు చేయాలంటూ కలెక్టరేట్ వద్ద దళిత సేన ఆధ్వర్యంలో శుక్రవారం ధర్నా నిర్వహించారు. దళిత సేన వ్యవస్థాపక అధ్యక్షుడు జిజ్జువరపు రవిప్రకాష్ మాట్లాడుతూ గవాయ్పై దాడి రాజ్యాంగంపై జరిగిన దాడిగా పరిగణిస్తున్నామని, దాడి జరిగి రోజులు గడుస్తున్నా సుమోటోగా కేసును సుప్రీంకోర్టు గాని, జాతీయ మానవ హక్కుల కమిషన్ గాని ఎందుకు నమోదు చేయలేదని ప్రశ్నించారు. ఇప్పటికై నా సుమోటో కేసు నమోదు చేయాలని డి మాండ్ చేశారు. అనంతరం వినతిపత్రాన్ని కలెక్టరేట్లో ఇచ్చారు. దళిత సేన రాష్ట్ర ప్రధాన కా ర్యదర్శి కాకర్లమూడి వెంకటరావు, పశ్చిమగోదావరి జిల్లా అధ్యక్షుడు చీలి మోహనరావు, ఏలూరు జిల్లా మహిళా అధ్యక్షురాలు బేతాళ జయసుధ, తూర్పుగోదావరి జిల్లా అధ్యక్షుడు దిరుసు పాము కృష్ణమూర్తి, పశ్చిమగోదావరి జిల్లా మహిళా అధ్యక్షురాలు డి.పుష్ప, కృష్ణా జిల్లా దళిత సేన అధ్యక్షుడు భూసే అనిల్ కుమార్, నాయకులు పాల్గొన్నారు. ఏలూరు టౌన్: దేశభక్తి, జాతీయ సమైక్యతను పెంపొందించడమే వందేమాతరం గీత లక్ష్యమని జిల్లా ఎస్పీ కేపీ శివకిషోర్ అన్నారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా శుక్రవారం స్థానిక పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. పోలీస్ అధికారులు, సిబ్బంది, సురేష్చంద్ర బహుగుణ పోలీస్ ఇంగ్లిష్ మీడియం స్కూల్ విద్యార్థులతో కలిసి వందేమాతర గీతాన్ని ఆలపించారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ మహనీయులు, వీరులు, జాతీయ నేతల పోరాట స్ఫూర్తితో ముందుకు సాగాలన్నారు. ధీరత్వానికి వందేమాతరం ప్రతీకగా నిలిచిందన్నారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, డీఎస్పీ శ్రావణ్కుమార్, డీటీసీ డీఎస్పీ ప్రసాద్, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, మహిళా స్టేషన్ సీఐ ఎం.సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): వందేమాతరం నినాదం ప్రజల్లో దేశభక్తిని మేల్కొలిపే శక్తి అని జాయింట్ కలెక్టర్ ఎంజే అభిషేక్ గౌడ అన్నారు. వందేమాతరం గీతానికి 150 ఏళ్లు పూర్తయిన సందర్భంగా కలెక్టరేట్లో ప్రత్యేక కార్యక్రమం ని ర్వహించారు. జేసీ మాట్లాడుతూ వందేమాత రం స్వాతంత్య్ర స్ఫూర్తికి మూలం అన్నారు. జిల్లా అధికారులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ అన్యాయం
మాజీ ఎమ్మెల్యే అబ్బయ్యచౌదరి దెందులూరు: పేదలకు ఉచిత వైద్య విద్యను అందించేందుకు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువస్తే కూటమి ప్రభుత్వం వీటిని ప్రైవేటీకరణ చేయడం అన్యాయమని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం పార్టీ మండల అధ్యక్షుడు కామిరెడ్డి నాని ఆధ్వర్యంలో దెందులూరు ఎంపీపీ బొమ్మన బోయిన సుమలత, పోతునూరు సర్పంచ్ బోదుల స్వరూప్ నాని అధ్యక్షతన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా అబ్బయ్యచౌదరి మాట్లాడుతూ జగన్ ముద్ర రాష్ట్రంలో ఉండకూడదనే దుర్మార్గపు ఆలోచనతో పేదలకు కీడు చేయాలని చూస్తే కూ టమికి పతనం తప్పదన్నారు. విద్యార్థులు, ఎన్జీఓ లు, మహిళలు, మేధావులు, రిటైర్డ్ ఉద్యోగులు, ప్రజలంతా ప్రభుత్వ నిర్ణయాలను నిశితంగా గమనిస్తున్నారని, కూటమికి తీవ్ర వ్యతిరేకత తప్పదన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా వైఎస్సార్సీపీ చేపట్టిన కోటి సంతకాల సేకరణను జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. జెడ్పీటీసీ నిట్టా లీలా నవకాంతం, పార్టీ జిల్లా కార్యదర్శి డీబీఆర్కే చౌదరి, ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి నిట్ట గంగరాజు, పార్టీ ఐటీ వింగ్ జిల్లా అధ్యక్షుడు గూడపాటి పవన్కుమార్, ఎంపీటీసీలు సున్నా నరేష్ రోహిణి, ని యోజకవర్గ బూత్ కమిటీ కన్వీనర్ తలారి రామకృష్ణ మాజీ సొసైటీ చైర్మన్ డీఎన్వీడీ ప్రసాద్, కొమ్మిన రాము తదితరులు పాల్గొన్నారు. -
హేతుబద్ధంగా లేదు
ఇన్ సర్వీస్ ఉపాధ్యాయులు కూడా టెట్ రాయాలని చెప్పడం హేతుబద్ధంగా లేదు. దాదాపు 20–25 ఏళ్లపాటు అంకితభావంతో విధులు నిర్వహించిన వారు ఇప్పుడు ఒత్తిళ్లతో టెట్ రాయడం, ఉత్తీర్ణత సాధించడం ఆచరణ సాధ్యం కాదు. సుప్రీంకోర్టు తీర్పుపై ప్రభుత్వం వెంటనే రివ్యూ పిటిషన్ వేసి సీనియర్ ఉపాధ్యాయులకు ఉపశమనం కలిగించాలి. – గెడ్డం సుధీర్, వైఎస్సార్ టీచర్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి సీనియర్ ఉపాధ్యాయులకు టెట్ అర్హత సాధించాలనే నిబంధన నుంచి మినహాయింపు ఇవ్వాలి. కొత్తగా చేసిన చట్టం ప్రకారం పాతతరం వారిని కూడా ఈ నిబంధనలకు లోబడే అర్హత సాధించాలనడం సరికాదు. అప్పటి పరిస్థితుల మేరకు పోటీ వాతావరణంలో నెగ్గుకొచ్చి ఉద్యోగాలు సాధించిన వారిని మరోసారి పరీక్షలంటూ వేధించడం తగదు. – గుగ్గులోతు కృష్ణ, ఏపీటీఎఫ్ 1938 రాష్ట్ర అకడమిక్ కన్వీనర్. టెట్ నిబంధనను సవరించేలా రాష్ట్ర ప్రభుత్వం ప్రాతినిధ్యం చేయాలి. దీనిపై కేంద్రంలోని బీజేపీ ప్రభుత్వాన్ని రాష్ట్రంలోని కూటమి ప్రభుత్వం పట్టుపడితే అసాధ్యమేమీ కాదు. ముఖ్యమంత్రి చంద్రబాబు తన అనుభవాన్ని ఈ విషయంలో వినియోగించి సీనియర్ ఉపాధ్యాయులకు తీపికబురు చెప్పాలి. – వి.రామ్మోహన్, వైఎస్సార్టీఏ జిల్లా ప్రధాన కార్యదర్శి -
జగనన్న కాలనీలో విద్యుత్ స్తంభాల తొలగింపు
చాట్రాయి: పేదల సొంతింటి కలను సాకారం చేస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో జగనన్న కాలనీలో ఏర్పాటుచేసిన విద్యుత్ స్తంభాలను కాంట్రాక్టర్ తొలగించిన సంఘటన మండలంలోని కొత్తగూడెంలో చోటుచేసుకుంది. కొత్తగూడెం గ్రామంలోని 3వ లేఅవుట్లో గత ప్రభుత్వంలో 30 మంది లబ్ధిదారులకు సెంటున్నర చొప్పున ఇంటి స్థలాలు కేటాయించి, రోడ్డు, విద్యుత్ స్తంభాలు ఏర్పాటుచేశారు. అయితే అనివార్య కారణాల వలన లబ్ధిదారు లు ఇళ్లు నిర్మించుకోలేదు. ఈ నేపథ్యంలో వి ద్యుత్ స్తంభాలు వేసిన కాంట్రాక్టర్ గురువారం లేఅవుట్లోని నాలుగు స్తంభాలను తొలగించి మరోచోటుకు తరలించారు. విషయం తెలిసిన సర్పంచ్ చల్లగుళ్ల వెంకటేశ్వరరావు వెళ్లి నిలదీయగా బిల్లులు రాకపోవడంతో స్తంభాలు తొలగిస్తున్నట్టు కాంట్రాక్టర్ చెప్పాడు. దీంతో వీరి మధ్య వాగ్వాదం చోటుచేసుకుంది. విద్యుత్ స్తంభాలు తొలగించడం దారుణమని లబ్ధిదా రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బిల్లులు రా లేకపోవడంతో ప్రైవేటు కాంట్రాక్టర్ స్తంభాల ను తొలగించాడని, తమకు ఎలాంటి సంబంధం లేదని ట్రాన్స్కో అధికారులు తెలిపారు. -
ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంలో తనిఖీలు
ఉండి: ఉండి సబ్ రిజిస్ట్రార్ కార్యాలయంపై వెల్లువెత్తుతున్న అవినీతి ఆరోపణలకు అధికారులు స్పందించారు. ముగ్గురు అధికారులతో కూడిన ప్రత్యేక బృందాన్ని తనిఖీలకు ఆదేశించారు. అత్తిలి సబ్ రిజిస్ట్రార్ వీవీవీ సత్యనారాయణ, ఆకివీడు, భీమ వరం కార్యాలయ సీనియర్ అసిస్టెంట్లు కిరణ్కుమార్, ఎస్కే ఆలీ బృందంగా గురువారం ఇక్కడి తనిఖీలు చేశారు. గతేడాది కాలంగా రిజిస్ట్రేషన్లు పరిశీలిస్తున్నారు. నాలుగు రోజులపాటు తనిఖీలు కొనసాగే అవకాశం ఉంది. ఏడాదిలో సుమారు 1,300 వరకు ఎనివేర్ డాక్యుమెంట్లు రిజిస్ట్రేషన్ జరిగినట్టు ప్రాథమికంగా అంచనా వేశారు. ఒక్క కృష్ణా జిల్లా బంటుమిల్లి కార్యాలయ పరిధిలోని ఆస్తులు 300 డాక్యుమెంట్లు ఇక్కడ రిజిస్టర్ చేయడం గమనార్హం. అలాగే కృష్ణా జిల్లా పెడన, మచిలీపట్నం, బంటుమిల్లి, మండవల్లి, ఉయ్యూరు, కైకలూరు, ప్రకాశం, పల్నాడు, గుంటూరు, ఏలూరు, భీమవరం తదితర ప్రాంతాలకు చెందిన వందలాది డాక్యుమెంట్లు ఇక్కడ రిజిస్ట్రేషన్ చేసినట్టు తెలిసింది. రాష్ట్రవ్యాప్తంగా సబ్ రిజిస్ట్రార్ కార్యాలయాల్లో ఏసీబీ దాడులు జరిగిన నేపథ్యంలో ఇక్కడ కూడా ఏసీబీ సోదాలు ఉంటాయని అందరూ భావించారు. అయితే ఉన్నతాధికారులు మాత్రం ప్రత్యేకాధికారుల బృందాన్ని పంపించింది. న్యాయం చేయాలి : ఉండి కార్యాలయంలో అవి నీతి బట్టబయలు కావడానికి ప్రధాన కారణంగా ఉన్న కురెళ్ల రాజ్కుమార్ ఇన్చార్జి సబ్ రిజిస్ట్రార్ సు రేష్ను కలిసి తనకు న్యాయం చేయాలని కోరారు. ఆయన ఆరు నెలలుగా ఇక్కడ పోరాటం చేస్తున్నారు. -
గోనె సంచుల కొరత తీరేనా?
చినిగిన గోనె సంచులే శురకవారం శ్రీ 7 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: చినిగిన సంచులు... సంచుల కోసం పడిగాపులు.. మిల్లర్ల దయాదాక్షిణ్యా లపై గోనె సంచులు.. జిల్లాలో అన్నదాతలకు గత రబీ సీజన్లో ఎదురైన అనుభవం ఇది. మళ్లీ అవే పరిస్థితులు కొనసాగే ప్రమాదముంది. అసలే మోంథా తుపాను ధాటికి పంట నష్టంతో అల్లాడుతున్న రైతులకు కొత్తగా గోనె సంచుల సమస్య మొదలైంది. జిల్లాలో ఖరీఫ్ సీజన్కుగాను 1.15 కోట్ల సంచులు అవసరం ఉండగా 70 లక్షలు మాత్రమే అందుబాటులో ఉండటం, అవి కూడా రీసైక్లింగ్ సంచులే కావడంతో ఈ సీజన్లో సంచుల కొరత వెంటాడే పరిస్థితి ఉంది. పదేపదే అదే మాట వచ్చే సీజన్ నాటికి 1.50 కోట్లు గోనె సంచులు కొనుగోలు చేస్తాం.. ఎక్కడా రైతులకు ఇబ్బంది అనేదే లేకుండా చేస్తామని గత రెండు, మూడు సీజన్లలో జిల్లా ఇన్చార్జి, పౌరసరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ మొదలు జాయింట్ కలెక్టర్ వరకు ప్రకటిస్తున్నా క్షేత్రస్థాయిలో అమలు కావడం లేదు. కూటమి ప్రభుత్వం ఏర్పడి 18 నెలలు గడిచినా ఒక్క గోనె సంచి కూడా కొత్తవి కొనుగోలు చేయని పరిస్థితి. జిల్లాలో ప్రస్తుతం 1,95,875 ఎకరాల్లో వరి సాగవుతోంది. ఈ సీజన్ లో 234 కొనుగోలు కేంద్రాల ద్వారా ధాన్యాన్ని ప్ర భుత్వం సేకరించనుంది. సొసైటీలకు చినిగిన గోనె సంచులు రావడంతో గత సీజన్లో రైతులు ఇబ్బందులకు గురయ్యారని, ఈ సీజన్కు కూడా అదే విధంగా పంపిస్తే ఇబ్బందులు తప్పవని మంగళవారం జరిగిన డీసీసీబీ మహాజన సభలో సొసైటీ అధ్యక్షులు, కార్యదర్శులు అధికారులకు, అధ్యక్షులకు తెలిపారు. మోంథా తుపానుతో ఆలస్యం జిల్లాలో ఇప్పటికే ధాన్యం కొనుగోలు ప్రారంభం కావాల్సి ఉన్నా మోంథా తుపాను తాకిడికి వరిచేలు నేలకొరిగాయి. రైతులు పంటలు విక్రయించే సమయానికి తుపాను కారణంతో తీవ్రంగా నష్టపోయారు. ఇదిలా ఉండగా వచ్చే వారంలో జిల్లాలో ధాన్యం కొనుగోలు ప్రారంభించేందుకు అధికారులు రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో జిల్లాలో 6.20 లక్షల టన్నుల దిగుబడికి గాను 3.50 లక్షల టన్నుల ధాన్యం సేకరణ లక్ష్యంగా నిర్ణయించారు. అయితే లక్ష్యం పూర్తవుతుందో లేదోననేది సందేహమే. అన్నదాతల గోస చినిగిన సంచులే మళ్లీ దిక్కా! జిల్లాలో వెంటాడుతున్న సమస్య 1.15 కోట్ల గన్నీ బ్యాగ్స్ అవసరం 70 లక్షలు అందుబాటులో ఉన్నట్టు ప్రకటన చినిగిన గోతాలు ఇస్తున్నారంటూ సొసైటీల ఫిర్యాదు వచ్చే వారం నుంచి ధాన్యం కొనుగోళ్లకు సన్నాహాలు జిల్లాలో ఇప్పటికే గోనె సంచులు అందుబాటులో ఉంచేందుకు అధికారులు చర్యలు తీసుకుంటున్నారు. గతంలో చినిగిన, నలిగిన గోనె సంచులను సొసైటీలకు అందించారని పలు ఫిర్యాదులు వచ్చాయి. జిల్లావ్యాప్తంగా కోటికి పైగా గోనె సంచులు అవసరం కాగా ప్రస్తుతం 65 లక్షల నుంచి 70 లక్షల వరకు ధాన్యం కొనుగోలుకు అందుబాటులో ఉన్న ట్లు అధికారులు చెబుతున్నారు. గోనె సంచులకు ఎ టువంటి సమస్య లేదని అధికారులు చెబుతున్నా.. సంచుల నాణ్యతపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. గతంలో గోనె సంచుల విషయంలో రైతు లు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. సంచుల కొరత ఉందని పలుమార్లు ఫిర్యాదులు సైతం చేశా రు. వచ్చే వారంలో ధాన్యం కొనుగోలు ప్రారంభం కానున్న నేపథ్యంలో మరలా ఇదే సమస్య ఉత్పన్నమవుతుందననే ఆందోళనలో రైతులు ఉన్నారు. ప్రస్తుతం జిల్లాలో 108 రైస్ మిల్లుల్లో గోనె సంచులు అందుబాటులో ఉన్నట్లు అధికారులు స్ప ష్టం చేశారు. ధాన్యం మాసూళ్లు ఎక్కడైతే ప్రారంభమవుతాయో ఆ ప్రాంతంలో ఆయా మిల్లర్ల వద్ద నుంచి గోనె సంచులను పంపించి, మిగిలిన చోట్ల కోతలు ప్రారంభమయ్యాక అవే గోనె సంచులను తిరిగి ఆ రైతులకే అందించేందుకు ఇలా రీసైక్లింగ్ పద్ధతిలో గోనె సంచులను రైతులకు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. అయితే ఇప్పటి కే పాతవి కావడం, వాడిన గోనె సంచులనే మళ్లీ మళ్లీ వాడటంతో గోనె సంచుల్లో నాణ్యతా ఎలా ఉంటుందో అర్థం కాని పరిస్థితి. -
రైతులను సత్వరమే ఆదుకోవాలి
ముదినేపల్లి రూరల్: మోంథా తుపాను వల్ల పంటలు దెబ్బతిన్న రైతులను ప్రభుత్వం సత్వరమే ఆదుకోవాలని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండలంలోని వణుదుర్రులో తుపాను వల్ల నీటమునిగిన పంట పొలాలను డీఎన్నార్ గురువారం పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆరుగాలం కష్టించి పండించిన పంట చేతికందే సమయంలో నీటిపాలు కా వడం బాధాకరమన్నారు. దీనివల్ల రైతులు కోలుకోలేని విధంగా దెబ్బతిన్నట్టు చెప్పారు. రైతులను తక్షణమే ఆర్థికంగా ఆదుకోకుంటే వ్యవసాయానికి దూరమయ్యే ప్రమాదముందన్నారు. నష్టపోయిన ప్రతి రైతుకూ ఇన్పుట్ సబ్సిడీతో పాటు బీమా పరిహారం అందేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. పార్టీ మండల అధ్యక్షుడు బోయిన రామారాజు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ కట్టా మహేష్, సర్పంచ్ చిన్నం సుగుణబాబు, ఉప సర్పంచ్ ఈడే పూర్ణచంద్రరావు, నాయకులు ఉన్నారు. -
ప్రకృతి వ్యవసాయం మేలు
ఏలూరు(మెట్రో): భవిష్యత్ తరాలకు రసాయనరహిత ఆహారాన్ని అందించేందుకు ప్రకృతి వ్యవసాయం ఒక్కటే మార్గమని, జిల్లాను ప్రకృతి వ్యవసాయ హబ్గా మార్చాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి పిలుపునిచ్చారు. స్థానిక ఐఏడీపీ హాలులో గురువారం ప్రకృతి వ్యవసాయంపై శిక్షణా కార్యక్రమంలో ఆమె మాట్లాడారు. ప్రకృతి వ్యవసాయం కారణంగా సేంద్రియ ఎరువుల వినియోగంతో సాగు ఖర్చులు తగ్గడంతో పాటు పంటలకు అధిక ధర లభిస్తుందన్నారు. ఈ కార్యక్రమంలో 117 మంది టీ–ఐసీఆర్పీఎస్ ఎంపికయ్యారు. వారు ఏలూరు జిల్లా నేచురల్ ఫార్మింగ్ను ముందుకు తీసుకెళ్లడంలో కీలక పాత్ర పోషించనున్నారని కలెక్టర్ పేర్కొన్నారు. జిల్లా వ్యవసాయాధికారి హబీబ్ బాషా, ప్రకృతి వ్యవసాయ విభాగం జిల్లా ప్రాజెక్ట్ మేనేజర్ వెంకటేష్ పాల్గొన్నారు. ఓటర్ల జాబితాపై సమీక్ష : జిల్లాలో కచ్చితత్వంతో కూడిన ఓటర్ల జాబితా రూపొందిస్తున్నామని కలెక్టర్ కె.వెట్రిసెల్వి రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి వివేక్ యాదవ్కి తెలిపారు. ఓటర్ల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్పై రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి కార్యాలయం నుంచి ఆయన గురువారం వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి డీఆర్వో వి.విశ్వేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. డేటా గవర్నెన్స్పై.. రాష్ట్ర పాలనలో డేటా డ్రివెన్ గవర్నెన్స్ కీలకంగా మారుతుందని సీఎం చంద్రబాబు అన్నారు. డేటా ఆధారిత పాలనపై వీడియో కాన్ఫరెన్స్ ద్వారా దిశా నిర్దేశం చేశారు. ఏలూరు కలెక్టరేట్ నుంచి కలెక్టర్ వెట్రిసెల్వి, జేసీ అభిషేక్ గౌడ తదితరులు పాల్గొన్నారు. కార్పెట్ రంగానికి పూర్వ వైభవం ఏలూరు (ఆర్ఆర్పేట): ఒక జిల్లా, ఒక ఉత్పత్తి కింద కేంద్ర ప్రభుత్వం నుంచి ఏలూరు జిల్లా తివాచీ రంగానికి గుర్తింపు ఇచ్చారని, కార్పెట్ రంగానికి పూర్వవైభవం తెచ్చేందుకు జిల్లా యంత్రాంగం కృషి చేస్తుందని కలెక్టర్ అన్నారు. స్థానిక పెన్షన్ లైను లక్ష్మీవారపుపేటలో గురువారం ఏలూరు పైల్ కార్పెట్ వీవర్స్ కో–ఆపరేటివ్ సేల్స్ అండ్ పర్చేజీ సెంటర్, ఏలూరు అసోసియేషన్ మాన్యుఫాక్చరింగ్ సెంటర్ను ఆమె సందర్శించి, పైల్ కార్పెట్ సొసైటీలో కొత్తగా ఏర్పాటు చేసిన రెండు లూమ్స్ను కలెక్టర్ ప్రారంభించారు. జిల్లా పరిశ్రమల కేంద్రం జీఎం పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, తహసీల్దార్ కె.గా యత్రీ దేవి తదితరులు పాల్గొన్నారు. కలెక్టర్ వెట్రిసెల్వి -
అంబేడ్కర్ విగ్రహంపై నిర్లక్ష్యం తగదు
ఏలూరు (టూటౌన్): విజయవాడ స్వరాజ్ మై దానంలో అంబేడ్కర్ విగ్రహం, స్మారక ప్రాంగణాన్ని రాష్ట్ర ప్రభుత్వం నిర్లక్ష్యం చేయడం బాధాకరమని ఆల్ ఇండియా అంబేడ్కర్ యువజన సంఘం జాతీయ ప్రధాన కార్యదర్శి డాక్టర్ మెండెం సంతోష్కుమార్ అన్నారు. స్థానిక ఎన్ఆర్పేటలోని సంఘ కార్యాలయంలో గురువారం విలేకరుల సమావేశంలో మా ట్లాడుతూ అంబేడ్కర్ విగ్రహం నిర్లక్ష్యానికి గురికావడం కలచివేస్తోందన్నారు. అలాగే రాత్రిళ్లు ఈ ప్రాంతంలో అసాంఘిక కార్యక్రమాలు జరుగుతున్నాయన్నారు. అంబేద్కర్ విగ్రహ ప్రాంగణాన్ని తక్షణమే శుభ్రం చేయించి, లైట్లు, నీటి ఫౌంటెన్లు, విద్యుత్ సదుపాయాలను వెంటనే పునరుద్ధరించాలని, అసాంఘిక కార్యకలాపాలు పూర్తిగా నిషేధించాలని కోరారు. పాము మాన్సింగ్, చిలకా సుబ్బారావు, వెంపా నాగరాజు, తెనాలి సరేష్, కనికెళ్లి మురళీ కృష్ణ, ఆర్.సురేష్ పాల్గొన్నారు. ఏలూరు (టూటౌన్): జిల్లాలో విభిన్న ప్రతిభావంతులకు (శారీరక వైకల్యం) మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం దరఖాస్తులు కోరుతు న్నట్టు విభిన్న ప్రతిభావంతుల సంక్షేమ శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ బి.రామ్కుమార్ ఓ ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు ఆన్లైన్లో దరఖాస్తు చేసుకుని, ధ్రువీకరణ పత్రాల నకళ్లతో కలిసి దరఖాస్తులను తమ కార్యాలయంలో ఈనెల 25లోపు అందజేయాలని కోరారు. దెందులూరు: స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆఫ్ ఇండియా రెజ్లింగ్ పోటీలకు రాష్ట్ర అబ్జర్వర్గా గోపన్నపాలెం ఉన్నత పాఠశాల ఫిజికల్ డైరెక్టర్ రమేష్ను రాష్ట్ర ప్రభుత్వం నియమించింది. కృష్ణా జిల్లా నున్నలో జరిగే రాష్ట్రస్థాయి రెజ్లింగ్ పోటీల్లో అబ్జర్వర్గా విధులు నిర్వహిస్తారు. మూడు రోజులు పాటు రెజ్లింగ్ పోటీలు జరుగుతాయి. ఏలూరు (టూటౌన్): కొద్దిమంది వ్యక్తుల దగ్గర పోగుబడిన సంపద, పెట్టుబడుదారీ విధానం పతనానికి దారి తీస్తుందని సీఐటీయూ ఉమ్మడి రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, సీపీఎం పొలిట్ బ్యూరో సభ్యుడు బీవీ రాఘవులు అన్నారు. ప్రపంచ పరిణామాలు సోషలిజం అనివార్యం అనే అంశంపై స్థానిక సీతారామ భర్తీయా కల్యాణ మండపంలో గురువారం రాష్ట్ర సదస్సు జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెట్టుబడిదారీ విధానం పేదల పొట్ట కొట్టి కార్పొరేట్ శక్తుల కబంధ హస్తాల్లో బంధిస్తుందని, నేటి ప్రపంచ పరిణామాలు ఇందుకు ఉదాహరణగా ఉన్నాయన్నారు. సదస్సుకు సీఐటీయూ జిల్లా అధ్యక్షుడు ఆర్.లింగరాజు అధ్యక్షత వహించారు. సీఐటీయూ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వి.ఉమామహేశ్వరరావు, ఏవీఆర్ విజ్ఞాన కేంద్రం కార్యదర్శి జీవీఎల్ నరసింహారావు, యూటీఎఫ్ జిల్లా ప్రధాన కార్యదర్శి ఆర్.రవికుమార్ తదితరులు పాల్గొన్నారు. భీమవరం: కోడి పందేల నిర్వహణ, ప్రైవేట్ సెటిల్మెంట్ల వ్యవహారాల్లో పెద్దెత్తున ముడుపులు అందుకున్నారనే ఆరోపణలపై భీమవరం డీఎస్పీ ఆర్జీ జయసూర్యపై గురువారం ప్రత్యేక పోలీసు బృందం విచారణ చేపట్టినట్లు తెలిసింది. డీఎస్పీ జయసూర్య తన పరిధిలో పేకాట, కోడి పందేల నిర్వాహకులను ప్రోత్సహించడమేగాక సెటిల్మెంట్ల వ్యవహారంలో తలదూర్చి పెద్ద మొత్తంలో ముడుపులు దండుకుంటున్నారంటూ డిప్యూటీ సీఎం పవన్కల్యాణ్కు జనసేన నాయకులు ఫిర్యాదు చేసిన నేపథ్యంలో డీఎస్పీపై విచారణకు ఆదేశించిన సంగతి తెలిసిందే. దీనిపై ఎస్పీ అద్నాన్ నయీం అస్మి విచారణ చేసి ఉన్నతాధికారులకు నివేదిక అందించారు. అయితే డీఎస్పీ జయసూర్యపై ప్రత్యేక విచారణ చేయాలంటూ విజయవాడ అడిషనల్ ఎస్పీని ఉన్నతాధికారులు ఆదేశించడంతో నలుగురు సభ్యుల బృందంతో విచారణ చేసినట్టు తెలిసింది. -
కూటమికి చెంపపెట్టులా ప్రజా ఉద్యమం
బుట్టాయగూడెం: సీఎం చంద్రబాబు చేతకానితనంతోనే ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటు సంస్థలకు అప్పగించే ప్రయత్నం చేస్తున్నారని, కూటమి ప్రభుత్వానికి బుద్ధి చెప్పేలా ప్రజా ఉద్యమం చేస్తున్నట్టు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తెలిపారు. మండలంలోని కృష్ణాపురంలో గురువారం రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గత ప్రభుత్వంలో అప్పటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలల ఏర్పాటుకు శ్రీకారం చుట్టారన్నారు. అయితే చంద్రబాబు సర్కారు పేద, మధ్య తరగతి విద్యార్థుల ప్రయోజనాలను పట్టించుకోకుండా మెడికల్ కళాశాలలను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించేందుకు ప్రయత్నం చేస్తోందని విమర్శించారు. దీనివల్ల పేద విద్యార్థులకు వైద్య విద్య అందనంత దూరమవుతుందన్నా రు. వైద్య విద్యకు ఫీజులు భరించలేనంతగా పెరిగిపోతాయని చెప్పారు. గిరిజన ప్రాంతంలో ప్రజలకు కార్పొరేట్ తరహాలో వైద్యం అందించాలనే ఉద్దేశంతో మల్టీ స్పెషాలిటీ ఆస్పత్రి నిర్మాణానికి కూడా వైఎస్ జగన్మోహన్రెడ్డి శ్రీకారం చుట్టారన్నారు. అయితే వాటి పనులు కూడా ప్రస్తుతం వివిధ దశల్లో ఉన్నాయని, వాటిని పూర్తిచేయడంలో కూడా కూటమి ప్రభుత్వం నిర్లక్ష్యంగా ఉందన్నారు. కూటమి ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానాలపై ప్రతిఒక్కరూ ఉద్యమించాలని పిలుపునిచ్చారు. పార్టీ సీనియర్ నేత ఆరేటి సత్యనారాయణ, వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, పార్టీ జిల్లా వాణిజ్య విభాగం అధ్యక్షుడు తాళ్లూరి ప్రసాద్, పార్టీ యువజన విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు బగ్గి దినేష్, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు -
పేదలకు వైద్య విద్యను దూరం చేసే కుట్ర
ఉంగుటూరు: పేదలకు వైద్య విద్యను దూరం చేసేందుకు సీఎం చంద్రబాబు మెడికల్ కాలేజీలను ప్రైవేట్ వ్యక్తులకు దారాదత్తం చేయనున్నారని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. గురువారం మండలంలోని గొల్లగూడెంలో రచ్చబండ కార్యక్రమం నిర్వహించారు. పార్టీ మండల అధ్యక్షుడు మరడా మంగరావు అధ్యక్షతన జరిగిన కార్యక్రమంలో వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు బినామీలకు కట్టబెట్టేందుకే ప్రైవేటుకు మెడికల్ కాలేజీలు అప్పగించేందుకు జపం చేస్తున్నారని విమర్శించారు. కాలేజీలు ప్రైవేటుపరం అయితే పేద విద్యార్థులకు వైద్య విద్య అందని ద్రాక్షలా మా రుతుందన్నారు. కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమాలు నిర్వహిస్తున్నారన్నారు. ఈ కార్యక్రమానికి ప్రజలంతా మద్దతు ఇవ్వాలని కోరారు. కాలేజీలు ప్రైవేటీకరణ చేస్తే పేదలు, బీసీలు, ఎస్సీ, ఎస్టీలకు వైద్య విద్య ఎలా అందుతుందన్నారు. ఎంపీపీ గంటా శ్రీలక్ష్మి, పంచాయతీరాజ్ వింగ్ జిల్లా అధ్యక్షుడు పుప్పాల గోపి, పార్టీ బీసీ విభాగం రాష్ట్ర కార్యదర్శి పెనుగొండ బాలకృష్ణ, మహిళా విభాగం రాష్ట్ర కార్యదర్శి మంద జయలక్ష్మి, బూత్ వింగ్ రాష్ట్ర కార్యదర్శి యెలిశెట్టి పాపారావుబాబ్జి, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే వాసుబాబు -
రాష్ట్రంలో కుంటుపడిన ప్రజారోగ్యం
ఏలూరు టౌన్: కూటమి పాలనలో రాష్ట్రంలో ప్రజారోగ్యం కుంటుపడిందని, ప్రభుత్వ వైద్య రంగాన్ని సీఎం చంద్రబాబు నిర్వీర్యం చేసేలా కుట్రలు చేస్తున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ అన్నారు. ఏలూరు నియోజకవర్గంలో 19, 20 డివిజన్ల పరిధిలో హనుమాన్నగర్ బ్రిడ్జి ప్రాంతంలో ఫిషరీస్ కార్యాలయం సమీపంలో కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని గురువారం చేపట్టారు. వలంటీర్ల విభాగం జిల్లా అధ్యక్షురాలు భోగిశెట్టి పార్వతి, ఐటీ వింగ్ ఏలూరు నగర కార్యదర్శి పిల్లంగోళ్ల సత్యదేవ్ ఆధ్వర్యంలో కోటి సంతకాల సేకరణ ఉద్యమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా జయప్రకాష్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి హయాంలో ఐదేళ్లపాటు ప్రజారంజక పాలన సాగిందనీ, ప్రజలకు విద్య, వైద్యాన్ని చేరువ చేసిన ఘనత ఆయనకే దక్కుతుందన్నారు. అయితే కూటమి ప్రభుత్వంలో సీఎం చంద్రబాబు అత్యంత దారుణంగా ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేయటం దుర్మార్గం అన్నారు. ప్రజల ఆరోగ్యం గాలిలో దీపంలా మారిందని, ప్రజలు ప్రభుత్వాస్పత్రులకు వెళ్లాలంటే భయపడేలా ఉందని ఆరోపించారు. ప్రజలు కూటమి నేతల కుటిల రాజకీయాలను గమనిస్తున్నారనీ, సరైన బుద్ధి చెబుతారన్నారు. పార్టీ నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్గురునాథ్, బీసీ సెల్ జిల్లా అధ్యక్షుడు నెరుసు చిరంజీవి, రాష్ట్ర కార్యదర్శి దాసరి రమేష్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్ తదితరులు పాల్గొన్నారు. నియోజకవర్గ ఇన్చార్జి జయప్రకాష్ -
కూటమి పాలనలో వైద్యానికి తూట్లు
కైకలూరు: పేదల వైద్యం కూటమి పాలనలో మిథ్య గా మారుతోందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం చేయడానికి నిరసిస్తూ కై కలూరు సంత మార్కెట్ వైఎస్ విగ్రహం వద్ద మండల, పట్టణ పార్టీ అధ్యక్షుడు శింగంశెట్టి రాము, సమయం అంజి ఆధ్వర్యంలో రచ్చబండ, కోటి సంతకాల సేకరణ కార్యక్రమం గురువారం నిర్వహించారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ మాజీ సీఎం వైఎస్ జగన్ పాలనలో మొత్తం 17 కాలేజీలకు గాను 7 మెడికల్ కాలేజీలు పూర్త య్యాయన్నారు. ఈ ఏడాది మరో 4, వచ్చే ఏడాది మరో 6 మెడికల్ కాలేజీలు ప్రారంభించేలా ప్రణాళిక రూపొందించారన్నారు. కూటమి ప్రభుత్వం మెడికల్ కాలేజీలు ప్రారంభ కాలేదని చెబుతున్నా.. కేంద్ర ప్రభుత్వం రాష్ట్రంలో కాలేజీలకు పీజీ సీట్లు ఎలా కేటాయించిందని ప్రశ్నించారు. కూటమి నిర్ణయం వల్ల మధ్యతరగతి ప్రజలకు ఉచిత సూపర్ స్పెషాలిటీ సేవలు దూరమవుతున్నాయ న్నారు. కై కలూరులో అన్ని వర్గాల ప్రజలు సంతకాల సేకరణలో ఉత్సహంగా పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ రాష్ట్ర బీసీ సెల్ కార్యదర్శి బలే నాగరాజు, రాష్ట్ర మైనార్టీ సెల్ విభాగా కార్యదర్శి ఎండీ గాలిబ్ బాబు, జిల్లా ఎంప్లాయీస్ అండ్ పెన్షనర్స్ విభాగ అధ్యక్షుడు ఎనుగుల వేణుగోపాలరావు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ జయమంగళ కాసులు, నాయకులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
థర్మాకోల్ షీట్ల లారీ దగ్ధం
విద్యుత్ తీగలు తగలడంతో మంటలు ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని సత్రంపాడు ఇండస్ట్రీయల్ ఎస్టేట్స్లో థర్మాకోల్ షీట్ల లోడుతో వెళ్తున్న లారీ విద్యుత్ షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగి కాలిబూడిదైంది. సమాచారం అందుకున్న వెంటనే ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు తన సిబ్బందితో సంఘటనా స్థలానికి వెళ్లగా అగ్నిమాపక శాఖ సిబ్బంది మంటలను అదుపులోకి తెచ్చారు. వివరాలు ఇలా ఉన్నాయి. దెందులూరులోని నాగహనుమాన్ ఆగ్రో ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీకి చెందిన అశోక్ లేలాండ్ ఏపీ 39 డబ్ల్యూఏ 8772 నెంబర్ లారీలో థర్మాకోల్ షీట్ల లోడుతో ఏలూరు సత్రంపాడు ఇండస్ట్రీయల్ ఎస్టేట్స్లోని మారుతీ ఫిష్ ప్యాకింగ్ కంపెనీకి తరలిస్తున్నారు. లారీ మారుతీ ఫిష్ కంపెనీ ప్రాంతానికి చేరుకునే సరికి లారీ వెనుక భాగంలో విద్యుత్ తీగలు తగలడంతో షార్ట్ సర్క్యూట్తో మంటలు చెలరేగాయి. లారీ వెనక భాగంలో మొదలైన మంటలు పెద్దెత్తున చెలరేగి లారీ మొత్తం అగ్నికి ఆహుతి అయ్యింది. అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపుచేశారు. లారీ రవాణాశాఖ నిబంధనలకు విరుద్ధంగా ఉన్నట్లు ప్రాథమికంగా పోలీసులు గుర్తించారు. దీనిపై విచారణ చేస్తున్నారు. సుమారుగా రూ.6 లక్షల వరకూ ఆస్తి నష్టం జరిగి ఉండవచ్చని భావిస్తున్నారు. -
వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలి
టి.నరసాపురం: వ్యవసాయ కార్మికులకు సమగ్ర చట్టం చేయాలని, భూమిలేని పేదలకు భూ పంపిణీ చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి వెంకటేశ్వర్లు డిమాండ్ చేశారు. గురువారం నాడు వ్యవసాయ కార్మిక సంఘం 32వ మహాసభలను సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకటేశ్వర్లు ప్రారంభించారు. మహాసభల ప్రారంభ సూచిక వ్యవసాయ కార్మిక సంఘం జెండాను సంఘం సీనియర్ నాయకులు జిల్లా ఉపాధ్యక్షుడు వై.నాగేంద్రరావు ఆవిష్కరించగా మహాసభ అధ్యక్షవర్గంగా ఎం.జీవరత్నం, తామా ముత్యాలమ్మ, వై.నాగేంద్రరావు, డి.రవీంద్ర అధ్యక్షతన మహాసభ నిర్వహించారు. సంఘం రాష్ట్ర కార్యదర్శి వి.వెంకటేశ్వర్లు మాట్లాడుతూ ఏలూరు జిల్లాలో భూమి, ఉపాధి హామీ, ఇళ్ల స్థలాలు, పామాయిల్ కార్మికుల సమస్యలపై నిరంతరం పోరాటం చేస్తున్నారని తెలిపారు. భూమిలేని పేదలకు భూ పంపిణీ చేయాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. అసైన్డ్ భూములపై 9/77 చట్టాన్ని యధావిధిగా అమలు చేయాలని కోరారు. అసైన్డ్ భూములను పలుకుబడి కలిగిన వారికి, గ్రామీణ సంపన్నులకు కట్టబెట్టడానికే ఈ ఫ్రీ హోల్డ్ పై ఉన్న నిషేధాన్ని ఎత్తివేయడానికి రాష్ట్ర మంత్రివర్గ ఉప సంఘం నిర్ణయం చేసిందని విమర్శించారు. అనంతరం సంఘం జిల్లా కార్యదర్శి పి.రామకృష్ణ మహాసభ నివేదికను ప్రవేశపెట్టారు. జిల్లాలో 18 మండలాల నుంచి 150 మంది ఎంపిక చేసిన ప్రతినిధులు హాజరయ్యారు. అనంతరం సంఘం రాష్ట్ర అధ్యక్షుడు రవి మాట్లాడుతూ అసైన్డ్ భూములకు రక్షణ కవచంగా ఉన్న 9/77 చట్టాన్ని యథాప్రకారంగా అమలు చేసి అనర్హుల చేతుల్లో ఉన్న అసైనన్డ్ భూములను కోల్పోయినటువంటి దళిత, గిరిజన, బలహీన వర్గాల పేదలకు తిరిగి ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈ మహాసభల్లో సంఘం జిల్లా కమిటీ సభ్యులు వై.సీత, సాయి కృష్ణ, హోలీ మేరీ, చిన్న మాధవ, రాము, చలపతి, మడకం సుధారాణి, మడకం కుమారి, బి.రాజు, అధిక సంఖ్యలో నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బుట్టాయగూడెం: సింగపూర్ అధునాతన విద్యావిధానాన్ని అధ్యయనం చేసేందుకు స్థానిక జిల్లా పరిషత్ హైస్కూల్లో పనిచేస్తున్న రాష్ట్ర ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు గ్రహీత, జువాలజీ అధ్యాపకుడు గుర్రం గంగాధర్ ఎంపికయ్యారు. ఈ నెల 27వ తేదీ నుంచి వచ్చే నెల 2వ తేదీ వరకూ సింగపూర్లోని ప్రముఖ పాఠశాలలను సందర్శించి అక్కడ అధునాతన సాంకేతిక విధానాలను, బోధనా పద్ధతులను, తరగతి గదుల్లోని వాతావరణ, బోధనా పద్ధతులు, మౌలిక ప్రమాణాలను అధ్యయనం చేయనున్నట్లు ఎంపికై న అధ్యాపకుడు గంగాధర్ చెప్పారు. గంగాధర్ ఎంపికపై పలువురు అధికారులు అభినందనలు తెలిపారు. పాలకొల్లు సెంట్రల్: పాలకొల్లు పట్టణానికి చెందిన షేక్ సమీరుద్దీన్ అండర్ 19 జాతీయ క్రికెట్ జట్టుకు ఎంపికై నట్లు అతని మేనమామ షేక్ రఫీ గురువారం తెలిపారు. డిసెంబర్ 5 నుంచి 9 వరకూ హర్యానాలో జరగనున్న అండర్ 19 స్కూల్ గేమ్స్ పెడరేషన్ ఆఫ్ ఇండియా (ఎస్జిఎఫ్ఐ) క్రికెట్ 69 వ నేషనల్ క్రీడల్లో సమీరుద్దీన్ పాల్గొంటున్నాడని చెప్పారు. సమీరుద్దీన్ పశ్చిమగోదావరి జిల్లాకు మూడేళ్ల నుంచి అండర్ 17కు రెండేళ్లు, అండర్ 19 టీంలకు ఒకసారి కెప్టెన్గా వ్యవహరించాడన్నారు. పీడీలు రామకృష్ణ, జయరాజ్, బాబూరావుల సమక్షంలో కోచింగ్ పొందినట్లు తెలిపారు. సమీరుద్దీన్ నియామకం పట్ల పలువురు అభినందనలు తెలియజేశారు. పెదవేగి: రాట్నాలకుంట గ్రామంలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మ దేవస్థానంలో హుండీ ఆదాయాన్ని గురువారం లెక్కించారు. 86 రోజులకుగాను రూ.14,56,054 ఆదాయం లభించినట్లు దేవస్థాన కార్యనిర్వహణాధికారి నల్లూరి సతీష్కుమార్ తెలిపారు. ఏలూరు దేవాదాయ శాఖ ఏలూరు డివిజనల్ ఇన్స్పెక్టర్ చల్లా ఉదయబాబు నాయుడు పర్యవేక్షించగా భక్తులు, గ్రామ పెద్దలు, ఆలయ చైర్మన్, ధర్మకర్తల మండలి సభ్యుల సమక్షంలో దేవాలయ ముఖ మండపంలో హుండీ లెక్కింపు నిర్వహించినట్లు ఈవో చెప్పారు. -
నేత్రపర్వం.. సహస్ర దీపోత్సవం
నెమలి వాహనంపై కొలువైన శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వరునికి హారతులిస్తున్న అర్చకులు సుబ్రహ్మణ్యేశ్వరుని ఆలయం వద్ద రోడ్డు పొడవునా అరటి బోదెలపై దీపాలు వెలిగిస్తున్న భక్తులు ద్వారకాతిరుమల: శ్రీవారి క్షేత్ర ఉపాలయమైన చెరువు వీధిలోని శ్రీ వల్లీ దేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఆలయంలో గురువారం స్వామివారికి లక్ష బిళ్వార్చన, మహన్యాస పూర్వక రుద్రాభిషేకం, సహస్ర దీపోత్సవ వేడుకలు నేత్రపర్వంగా జరిగాయి. కార్తీక పౌర్ణమి మరుసటి రోజు ఈ వేడుకలను నిర్వహించడం ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. దీన్ని పురస్కరించుకుని ఆలయ సిబ్బంది ముందుగా దేవాలయాన్ని సుగందభరిత పుష్పమాలికలతో శోభాయమానంగా అలంకరించారు. ఉదయం నుంచి మధ్యాహ్నం వరకు ఆలయ అర్చకులు, పండితులు, పురోహితులు వేద మంత్రోచ్ఛరణలతో స్వామివారికి మహన్యాస పూర్వక ఏకాదశ రుద్రాభిషేకాన్ని, లక్ష బిళ్వాలతో అర్చనను జరిపారు. సాయంత్రం శ్రీ వల్లీదేవసేన సహిత సుబ్రహ్మణ్యేశ్వర స్వామివారి ఉత్సవ మూర్తులను నెమలి వాహనంపై ఉంచి పూజాధికాలను జరిపారు. ఆలయ సిబ్బంది అఖండ దీపాన్ని వెలిగించగా, ఆలయం ముందు రోడ్డు పొడవునా అరటి బోదెలపై ఏర్పాటు చేసిన దీపాలను మహిళా భక్తులు, యువతులు భక్తి ప్రపత్తులతో వెలిగించారు. -
రైలు నుంచి జారిపడి వ్యక్తి మృతి
ఏలూరు టౌన్: ఏలూరు గిలకలగేటు ప్రాంతంలో రైలు నుంచి జారిపడి ఓ వ్యక్తి మృతి చెందాడు. రైల్వే పోలీసులు తెలిపిన వివరాలు ఇవి. పవర్పేట రైల్వే స్టేషన్ సమీపంలోని గిలకలగేటు ప్రాంతంలో గురువారం మధ్యాహ్నం ఈస్ట్కోస్ట్ రైలు నుంచి ప్రమాదవశాత్తు జారిపడి గుర్తు తెలియని వ్యక్తి మృతిచెందాడు. మృతుడి వయస్సు సుమారు 25 నుంచి 30 ఏళ్ల మధ్యలో ఉంటుందనీ, స్కై బ్లూ చొక్కా, బ్లూ ప్యాంట్ ధరించి ఉన్నాడని వివరాలు తెలిస్తే తమను సంప్రదించాలని ఏలూరు రైల్వే హెడ్ కానిస్టేబుల్ శ్రీనివాసరావు కోరారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచామనీ, కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. ముదినేపల్లి రూరల్: ఇన్స్ట్రాగామ్లో పరిచయమైన వ్యక్తి లైంగిక వేధింపులకు పాల్పడుతున్నాడంటూ మహిళ ఇచ్చిన ఫిర్యాదు మేరకు స్థానిక పోలీసులు గురువారం కేసు నమోదు చేశారు. మండలంలోని వాడవల్లికి చెందిన మహిళ స్థానిక ప్రైవేటు స్కూల్లో ఉపాధ్యాయురాలిగా పనిచేస్తోంది. రెండు నెలల క్రితం కై కలూరు మండలం వేమవరప్పాడుకు చెందిన నున్న శివరామకృష్ణ ఇన్స్ట్రాగాంలో పరిచయమయ్యాడు. ఈ నేపథ్యంలో ఇటీవల శివరామకృష్ణ గ్రామానికి వచ్చి లైంగికంగా వేధింపులకు పాల్పడినట్లు పోలీసులకు ఫిర్యాదు చేయగా ఎస్సై వీరభద్రరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
స్విమ్మింగ్లో పతకాలు
ఏలూరు రూరల్: ఏలూరు భిశ్వనాధ్భర్తియా స్విమ్మింగ్ పూల్లో శిక్షణ పొందిన క్రీడాకారులు ఎస్జీఎఫ్ పోటీల్లో పతకాలు సాధించారు. ఇటీవల నరసరావుపేటలో స్కూల్గేమ్స్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో అంతర జిల్లాల స్విమ్మింగ్ పోటీలు జరిగాయి. ఈ పోటీల్లో పాల్గొన్న ధనుష్సాయి 50, 100 మీటర్ల బట్టర్ఫ్లై విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్, 100 మీటర్ల ఫ్రీస్టయిల్లో సిల్వర్ మెడల్ సాధించాడు. మరో క్రీడాకారిణి పూర్వి 50 మీటర్ల బట్టర్ఫ్లై 200 మీటర్ల ఐవీ విభాగంలో రెండు గోల్డ్ మెడల్స్, 200 మీటర్ల ఫ్రీస్టయిల్లో బ్రాంజ్మెడల్ సొంతం చేసుకోగా, మోక్షప్రియ 50, 100 మీటర్ల బ్యాక్స్ట్రోక్ విభాగంలో రెండు సిల్వర్ మెడల్స్, 200 మీటర్ల ఐఎం విభాగంలో బ్రాంజ్ మెడల్ చేజిక్కించుకున్నాడు. విజేతలను డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ అభినందించారు. ఏలూరు రూరల్: రాష్ట్రస్థాయి స్కేటింగ్ చాంపియన్షిప్ పోటీల్లో ఏలూరు జిల్లా క్రీడాకారులు పతకాలు సాధించారని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఈ నెల 1వ తేదీ నుంచి 5 వరకూ కాకినాడలో డాక్టర్ వైఎస్ఆర్ స్కేటింగ్ ఆవరణలో 37వ ఏపీ ఇంటర్ డిస్ట్రిక్ట్ రోలర్ స్కేటింగ్ చాంపియన్షిప్ జరిగింది. ఈ పోటీల్లో 6 ఏళ్ల విభాగంలో పాల్గొన్న ఏలూరు చిన్నారులు ఎం శ్రీషిత బ్రాంజ్ మెడల్ గెలుపొందగా, 14 ఏళ్ల వయస్సు విభాగంలో ఎన్ భువన్రత్న సైతం మరో బ్రాంజ్మెడల్ సొంతం చేసుకున్నాడన్నారు. కోచ్ ఖాసిమ్, క్రీడాకారులను అభినందించారు. -
కళా ఉత్సవంలో ఏకలవ్య విద్యార్థుల ప్రతిభ
బుట్టాయగూడెం: రాష్ట్రస్థాయి ఉద్భవ్–2025 కల్చరర్ అండ్ లిటరరీ ఫెస్ట్ కళా ఉత్సవంలో తమ పాఠశాలకు చెందిన విద్యార్థులు ప్రతిభ కనబర్చారని స్థానిక ఏకలవ్య పాఠశాల ప్రిన్సిపాల్ ప్రవీణ్కుమార్ మిశ్రా తెలిపారు. మారేడుమిల్లిలో 3 రోజులపాటు ఏకలవ్య పాఠశాలల కళా ఉత్సవం జరిగిందని, తమ విద్యార్థులు పతకాలు సాధించారన్నారు. క్లాసికల్ సోలో డ్యాన్స్ సీనియర్ విభాగంలో యు.సాయినవదీప్ ద్వితీయ స్థానం, స్టోరీ టెల్లింగ్ హిందీ జూనియర్స్ విభాగంలో బి.గీతిక మొదటిస్థానం, స్టోరీ టెల్లింగ్ ఇంగ్లీష్ జూనియర్స్ విభాగంలో ఎం.ఖ్యాతిశ్రీ మొదటిస్థానం, ఇంగ్లీష్ పోయమ్ రెసిటేషన్ జూనియర్ విభాగంలో కె.మోర్విన్ రాజు మొదటిస్థానం, సాన్స్క్రిట్ జూనియర్స్ విభాగంలో కె.నాగవెంకటసాయి నాయక్ మొదటి స్థానంలో గెలుపొందినట్లు తెలిపారు. ఉపాధ్యాయులు వీఎస్ఎస్ రాజు, ఎం.హరికృష్ణ, సుమతి, గౌరవ్ పాల్గొన్నట్టు చెప్పారు. -
ఆకట్టుకున్న సైన్స్ డ్రామా పోటీలు
ఏలూరు (ఆర్ఆర్పేట): స్థానిక ఈదర సుబ్బమ్మాదేవి మున్సిపల్ కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో బుధవారం జరిగిన జిల్లా సైన్స్ డ్రామా పోటీలు విద్యార్థులకు విజ్ఞానం పంచడంతో పాటు సందేశాత్మకంగా సాగి ఆకట్టుకున్నాయి. బెంగళూరుకు చెందిన విశ్వేశ్వరాయ ఇండస్ట్రియల్ అండ్ టెక్నలాజికల్ మ్యూజియం ఆధ్వర్యంలో దక్షిణ భారత స్థాయిలో నిర్వహించనున్న పోటీల్లో భాగంగా తొలుత జిల్లా స్థాయిలో ఈ పోటీలను నగరంలో నిర్వహించారు. ఈ పోటీలకు జిల్లాలోని 6 మండలాల నుంచి 11 టీంలకు చెందిన 62 ప్రభుత్వ పాఠశాలల విద్యారినీ విద్యార్థులు పాల్గొన్నారు. పాఠశాల ప్రధానోపాధ్యాయుడు కుటుంబరావు కార్యక్రమాన్ని ప్రారంభించి, సైన్స్ అవసరాన్ని విద్యార్థులకు వివరించారు. ఈ పోటీల్లో నూజివీడు డివిజన్ పల్లెర్లమూడి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాల విద్యార్థులు ప్రథమ స్థానం కై వశం చేసుకోగా ఏలూరు ఎస్ఈఎస్డీఎం సీహెచ్ స్కూల్ విద్యార్థులకు ద్వితీయ స్థానం లభించింది. ఈ పోటీల్లో ప్రథమ స్థానం పొందిన జట్టు ఈనెల 7న గుంటూరులోని ఆచార్య నాగార్జున యూనివర్సిటీ ఆడిటోరియంలో జరిగే రాష్ట్ర స్థాయి పోటీలకు హాజరవుతుంది. ఈ కార్యక్రమంలో జిల్లా సైన్స్ ఆఫీసర్ సోమయాజులు, స్థానిక పాఠశాల బయాలజీ టీచర్ పద్మాసుకుమారి, గైడ్ టీచర్లు పాల్గొన్నారు. అనంతరం పోటీల్లో విజేతలకు సర్టిఫికెట్లు అందజేశారు. -
చెడు వ్యసనాలు, విలాసాలతో నేరాలు
● చోరీ కేసుల్లో ఐదుగురి అరెస్ట్ ● రూ.10.20 లక్షల చోరీ సొత్తు రికవరీ ఏలూరు టౌన్ : చెడు వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్, మోటార్సైకిళ్లు దొంగతనాలు చేస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. నిందితుల నుంచి రూ.10.20 లక్షల చోరీ సొత్తు రికవరీ చేశారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ వివరాలు వెల్లడించారు. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల పరిధిలో చోరీలపై ఎస్పీ శివకిషోర్ ఆదేశాల మేరకు పోలీసులు ప్రత్యేక దృష్టి పెట్టారు. ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో నిడమర్రు సీఐ ఎన్.రజనీకుమార్ ఆధ్వర్యంలో చేట్రోలు ఎస్సై ఎం.సూర్యభగవాన్, నిడమర్రు ఎస్సై ఎస్ఎన్వీవీ రమేష్, గణపవరం ఎస్సై ఏ.మణికుమార్, భీమడోలు ఎస్సై ఎస్కే మదీనాబాషా దర్యాప్తు చేపట్టారు. చైన్స్నాచింగ్, మోటారు సైకిళ్ల దొంగతనాలకు పాల్పడుతున్న ఐదుగురు నిందితులను బుధవారం మధ్యాహ్నం ఉంగుటూరు మండలం నారాయణపురం గ్రామశివారు మురుక్కోడు వంతెన, పత్తేపురం వైపు అరెస్ట్ చేశారు. వారి నుంచి రూ.3.70 లక్షల విలువైన నాలుగు మోటారు సైకిళ్లు, స్నాచింగ్ కేసుల్లో అపహరించిన రూ.6.50 లక్షల విలువైన బంగారు నగలను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. ఆకివీడు ఎస్బీఐ బ్యాంకు నుంచి 38.8 గ్రాముల బంగారు నగలు రికవరీ చేయాల్సి ఉంది. నిందితులపై పలు కేసులు నిందితులు పశ్చిమగోదావరి జిల్లా ఆకివీడు మండలం కోళ్ళపర్రు గ్రామానికి చెందిన తాటిపర్తి రాముడు, నక్క వెంకటేష్, తాటిపర్తి దుర్గారావు, ఉండి మండలం అర్తమూరు గ్రామానికి చెందిన గండికోట నాగరాజు, అత్తిలి మండలం ఎర్రనేలగుంట గ్రామానికి చెందిన ఆసెట్టి నాగేష్లపై ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని పలు పోలీస్స్టేషన్లలో కేసులు నమోదై ఉన్నాయి. రాముడుపై 11, దుర్గారావుపై 19, నాగరాజుపై 3, నాగేష్పై 14 కేసులు ఉన్నట్లు పోలీసులు తెలిపారు. నేరగాళ్లను పట్టుకోవడంలో కృషి చేసిన పోలీస్ సిబ్బందిని ఎస్పీ ప్రత్యేకంగా అభినందించారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏలూరు డీఎస్పీ శ్రావణ్కుమార్ ఉన్నారు. -
నేత్రపర్వం.. శోభనాచలుడి చక్రస్నానం
ఆగిరిపల్లి: జిల్లాలో ప్రసిద్ధిగాంచిన ఆగిరిపల్లిలోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీనరసింహస్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా స్వామివారి వరాహ పుష్కరిణిలో శోభనాచలునికి చక్రస్నానం కనుల పండువగా నిర్వహించారు. బుధవారం వరాహ పుష్కరిణి వద్ద దేవాదాయ శాఖ ఆధ్వర్యంలో స్వామివారికి ముందుగా వేద పారాయణం, అవబృదోత్సవం నిర్వహించారు. అనంతరం మేళతాళాల మధ్య ఉత్సవమూర్తులను వరాహ పుష్కరిణిలో అభిషేకించి చక్రస్నాన ఘట్టాన్ని నయనానందకరంగా నిర్వహించారు. అనంతరం భక్తులు పుష్కరిణిలో పుణ్య స్నానాలు ఆచరించారు. సాయంత్రం ఏడు గంటలకు ఆలయంలో స్వామివారికి మౌనబలి, ధ్వజారోహణ కార్యక్రమాలను ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణ ఆధ్వర్యంలో జరిపారు. శోభనగిరి మెట్లమీద కొండపై నుంచి దిగువ వరకు భక్తులు దీపాలు వెలిగించి కృత్తిక దీపోత్సవాన్ని వేడుకగా నిర్వహించారు. ఆలయ కార్యనిర్వహణాధికారి సాయి పర్యవేక్షించారు. -
కార్తీక పున్నమి.. పుణ్యాల కలిమి
భీమవరం(ప్రకాశం చౌక్): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా శైవక్షేత్రాలు భక్తులతో కిటకిటలాడాయి. కార్తీక పౌర్ణమి సందర్భంగా ఆలయాల్లో ప్రత్యేక పూజలు, విశేష అభిషేకాలు నిర్వహించారు. పంచారామ క్షేత్రాలు భీమవరం గునుపూడిలోని ఉమా సోమేశ్వర జనార్దన స్వామి, పాలకొల్లులోని క్షీరారామలింగేశ్వరస్వామి ఆలయాలకు బుధవారం వేకువజాము నుంచి భక్తుల రాక మొదలైంది. భీమవరంలోని ఉమాసోమేశ్వరస్వామికి నిర్విరామంగా రుద్రాభిషేకాలు, పంచారామృతాభిషేకాలు నిర్వహించారు. ఆలయ ప్రధాన అర్చకులు చేకూరి రామకృష్ణ ఆధ్వర్యంలో పూజాధికాలు, సాయంత్రం లక్షపత్రి పూజలు చేశారు. స్వామిని డ్రైప్రూట్స్తో ప్రత్యేకంగా అలంకరించారు. ఆలయంలో కొలువైన జనార్దనస్వామి, పార్వతీదేవి, అన్నపూర్ణదేవి అమ్మవార్లకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. భక్తులకు అన్నప్రసాదాన్ని అందించారు. ఆలయ ఈఓ డి.రామకృష్ణంరాజు, ధర్మకర్తలు ఏర్పాట్లను పర్యవేక్షించారు. స్ఫటిక లింగాన్ని దర్శించిన భక్తులు తాడేపల్లిగూడెం రూరల్: మండలంలోని వీరంపాలెం బాలాత్రిపుర సుందరీ పీఠం ఆవరణలో స్ఫటిక లింగ దర్శనానికి వేకువజాము నుంచి భక్తులు పోటెత్తారు. పీఠం వ్యవస్థాపకుడు గరిమెళ్ల వెంకటరమణ శాస్త్రి పర్యవేక్షణలో ఆత్మలింగేశ్వరునికి (స్ఫటిక లింగం) 12 నదీ జలాలతో అభిషేకాలు నిర్వహించారు. విశ్వేశ్వరునికి ఏకాదశ రుద్రాభిషేకం, హోమాలు, జ్యోతిర్లింగ సహిత లక్ష దీపార్చన కార్యక్రమాలు జరిపారు. భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా పీఠం ప్రతినిధులు ఈమని శశికుమార్, సందీప్ ఏర్పాట్లను పర్యవేక్షించారు. నేత్రపర్వం.. జ్వాలాతోరణం ద్వారకాతిరుమల : ద్వారకాతిరుమల క్షేత్రపాలకునిగా విరాజిల్లుతున్న భ్రమరాంబ మల్లేశ్వర స్వామివారి ఆలయంలో కార్తీక పౌర్ణమిని పురస్కరించుకుని బుధవారం రాత్రి జ్వాలాతోరణ మహోత్సవాన్ని నేత్రపర్వంగా నిర్వహించారు. వరిగడ్డితో తయారు చేసిన తోరణాన్ని వెలిగించి, దాని కింద నుంచి శివదేవుని వాహనాన్ని ప్రదక్షిణలు చేయించారు. ఈ వేడుక అట్టహాసంగా జరిగింది. ముందుగా ఆలయంలో గంగా, పార్వతీ సమేత శివదేవుని ఉత్సవ మూర్తులను పల్లకి వాహనంలో ఉంచి ప్రత్యేక పుష్పాలంకారాలు చేశారు. ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి దంపతులు, డీఈఓ భద్రాజీ, ఏఈఓలు మెట్టపల్లి దుర్గారావు, పి.నటరాజారావు ప్రత్యేక పూజలు జరిపి, జ్వాలా తోరణాన్ని వెలిగించారు. భక్తులు, ఆలయ సిబ్బంది తోరణం లోపలి నుంచి శివదేవుని వాహనంతో పాటు ప్రదక్షిణలు చేశారు. వెలిగించిన తోరణం నుంచి వచ్చిన భస్మాన్ని పంట పొలాల్లో వేస్తే పాడి పంటలు వెల్లివిరుస్తాయని పండితులు చెబుతున్నారు. దాంతో ఆ భస్మాన్ని పొందేదుందుకు భక్తులు పోటీపడ్డారు. వేడుక అనంతరం గంగా, పార్వతీ సమేత శివదేవుడు రావణబ్రహ్మ వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగారు. అధిక సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. వేడుకగా అఖండ జ్యోతి ప్రజ్వలనం పెనుగొండ : ఆచంటశ్రీఉమా రామేశ్వర స్వామి ఆలయం వద్ద బుధవారం రాత్రి అఖండ జ్యోతి (కర్పూర జ్యోతి) ప్రజ్వలన వేడుకగా నిర్వహించారు. కార్తీక పౌర్ణమి నాడు వెలిగించిన అఖండ జ్యోతి మహాశివరాత్రి వరకూ నిరాటంకంగా జ్వలిస్తూ ఉంటుంది. గంధర్వ మహాల్కు చెందిన గొడవర్తి వంశీయులు కృత్తికా నక్షత్రహోమం, మండపారాధన, మహా నైవేద్యం, దూప సేవ నిర్వహించి అనంతరం కర్పూర జ్యోతి వెలిగించారు. పది వేల మందికిపైగా భక్తులు కర్పూర జ్యోతిలో పాల్గొనడానికి రావడంతో ఆలయ పరిసరాలు కిటకిటలాడాయి. కర్పూర జ్యోతి అనంతరం జ్వాలా తోరణం వెలిగించి ప్రభను ఊరేగించారు. ఈఓ ఆదిమూలం వెంకట సత్యనారాయణ, ట్రస్ట్ బోర్డు ఆధ్వర్యంలో ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. భీమవరం ఉమాసోమేశ్వర స్వామిభీమవరంలో కార్తీక నోములు నోచుకుంటున్న భక్తులు వీరంపాలెంలో స్ఫటిక లింగం ద్వారకాతిరుమల శివాలయంలో జ్వాలాతోరణ వేడుక వేడుకలో పాల్గొన్న భక్తులు ఆచంట రామేశ్వర స్వామి ఆలయం అఖండ జ్యోతిలో ఆవు నెయ్యి వేస్తున్న భక్తులు శైవక్షేత్రాలకు పోటెత్తిన భక్తులు పంచారామాల్లో ప్రత్యేక పూజలు ద్వారకాతిరుమలలో జ్వాలాతోరణం వేడుక వీరంపాలెంలో స్ఫటిక లింగ దర్శనం ఆచంటలో అఖండ జ్యోతి ప్రజల్వనం పోలవరం రూరల్ : కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పట్టిసం శివక్షేత్రంలోని వీరేశ్వరస్వామికి లక్షపత్రి పూజ, భద్రకాళీ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహించారు. పోలవరం గ్రామానికి చెందిన పెంటపాటి లలితాదేవి కుటుంబసభ్యుల సహకారంతో అర్చకులు పూజాధికాలు జరిపారు. ఉదయం నుంచి సాయంత్రం వరకు క్షేత్రానికి అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించారు. ధ్వజస్తంభం వద్ద మహిళలు కార్తీక దీపాలను వెలిగించారు. భక్తులను నది దాటించేందుకు 2 లాంచీలను ఏర్పాటు చేశారు. పోలవరం ఎస్సై ఎస్ఎస్ పవన్కుమార్ పోలీసు బందోబస్తు ఏర్పాటు చేశారు. డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు, సీఐ బాల సురేష్బాబు క్షేత్రం వద్ద, రేవులో భక్తుల సౌకర్యాలను పర్యవేక్షించారు. దేవస్థానానికి వచ్చిన భక్తులకు అన్నప్రసాదం అందజేశారు. దేవస్థానం ఈవో సీహెచ్ వెంకటలక్ష్మి ఏర్పాట్లను పర్యవేక్షించారు. -
గోదావరిలో పడి వ్యక్తి మృతి
పెనుగొండ: ఆచంట మండలం కరుగోరుమిల్లి శివారు నెల్లివారి పేటకు చెందిన ఇంజేటి పెద్దిరాజు (58) ప్రమాదవశాత్తూ గోదావరిలో పడి మృతి చెందాడు. పెద్దిరాజు బుధవారం పాడి పశువును గోదావరిలో శుభ్రపరచుకోవడానికి వెళ్లాడు. దూడను కడిగే సమయంలో ప్రవాహంలో దూడ వెళ్లిపోతుండడంతో, పట్టుకొనే క్రమంలో గోదావరిలో మునిగిపోయాడు. గ్రామస్తులు పడవలతో గాలింపు చర్యలు చేపట్టగా, భీమలాపురం సమీపంలో పెద్దిరాజు మృతదేహాం లభ్యమైంది. మృతుడు పెద్దిరాజు భార్య ఇటీవలే మృతి చెందింది. వారికి ముగ్గురు కుమారులు సంతానం. కుటుంబసభ్యుల ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి, మృతదేహాన్ని పాలకొల్లు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించినట్లు ఎస్సై కే వెంకట రమణ తెలిపారు. ఏలూరు టౌన్: ఏలూరు నగరంలోని పంట కాలువలో గుర్తు తెలియని మృతదేహాన్ని స్థానికులు గుర్తించి ఏలూరు వన్టౌన్ పోలీసులకు సమాచారం అందించారు. వన్టౌన్ పరిధిలోని పాండురంగ థియేటర్ సమీపంలో బెనర్జీపేట పంట కాలువలో సుమారు 50 నుంచి 60 ఏళ్ల వయస్సు కలిగిన గుర్తు తెలియని వ్యక్తి మృతదేహాన్ని గుర్తించారు. మృతదేహంపై బ్లూ గడి లుంగీ, కట్ బనియన్తో నీటిపై తేలియాడుతూ ఉండగా ఏలూరు వన్టౌన్ పోలీసులు బయటకు తీశారు. వివరాలు తెలిసిన వారు ఏలూరు వన్టౌన్ సీఐ సత్యనారాయణను సంప్రదించాలని కోరారు. మృతదేహాన్ని ఏలూరు జీజీహెచ్ మార్చురీలో భద్రపరిచారు. -
రాష్ట్రస్థాయి కబడ్డీ పోటీలకు 24 మంది ఎంపిక
తణుకు అర్బన్: పశ్చిమ గోదావరి జిల్లా బాలురు, బాలికల సబ్ జూనియర్ కబడ్డీ సెలక్షన్లలో 12 మంది బాలురు, 12 మంది బాలికలను ఎంపిక చేసినట్లు జిల్లా కబడ్డీ అసోసియేషన్ కార్యదర్శి యలమరెడ్డి శ్రీకాంత్ తెలిపారు. బుధవారం తణుకు కేకేఆర్ స్కూలు క్రీడా ప్రాంగణంలో నిర్వహించిన ఎంపికల్లో జిల్లా నలుమూలల నుంచి 200 మంది క్రీడాకారులు హాజరుకాగా మొత్తం 24 మందిని ఎంపిక చేసినట్లు చెప్పారు. వీరంతా ఈనెల 7 నుంచి 10వ తేదీ వరకు కర్నూలులో నిర్వహించే రాష్ట్రస్థాయి సబ్ జూనియర్ కబడ్డీ టోర్నమెంట్లో పాల్గొంటారని వివరించారు. ఎంపిక పోటీలను ముఖ్య అతిథి బసవ రామకృష్ణ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో జి.వెంకటరావు, కె.కృష్ణ, సీనియర్ కబడ్డీ క్రీడాకారులు పి.శ్రీను, జి.శ్రీకాంత్ అభిలాష్, సన్నీ సాగర పాల్గొన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): విభిన్న ప్రతిభావంతులకు (శారీరక వైకల్యముగలవారు) మూడు చక్రాల మోటార్ వాహనాల కోసం ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకోవాలని విభిన్న ప్రతిభావంతులు, వయోవృద్ధుల సహాయ సంస్థ, జిల్లా మేనేజర్ బి.రామ్కుమార్ తెలిపారు. ఆన్లైన్లో దరఖాస్తు చేసుకొని సదరు దరఖాస్తును అన్ని ధ్రువపత్రాలతో ఈనెల 25వ తేదీలోగా కార్యాలయంలో సమర్పించాలని, అర్హులను జిల్లా ఎంపిక కమిటీ ద్వారా ఎంపిక చేస్తామన్నారు. నరసాపురం రూరల్: కార్తీక పౌర్ణమి సందర్భంగా బుధవారం పేరుపాలెం, కేపీపాలెం బీచ్లలో బందోబస్త్ ఏర్పాటు చేసినట్లు మైరెన్ సీఐ ఎ.నవీన్ నరసింహ మూర్తి తెలిపారు. గత కొన్ని రోజులుగా తుపాను ప్రభావంతో బీచ్కు పర్యాటకుల సందర్శనను నిలిపి వేశారు. తుపాను ప్రభావం తగ్గడం, కార్తీక పౌర్ణమి పురస్కరించుకుని పర్యాటకులు అధిక సంఖ్యలో బీచ్లను సందర్శించనున్న నేపథ్యంలో డీఐజీ, అదనపు ఎస్పీల ఆదేశాల మేరకు అంతర్వేది మైరెన్ , మొగల్తూరు పోలీసులు ప్రత్యేక బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. భక్తులు, పర్యాటకులు నిర్ధేశిత ప్రాంతాల్లోనే స్నానం చేయాలని, సెల్ఫీలు, వీడియోల కోసం లోపలికి వెళ్లవద్దని కోరారు. గజ ఈతగాళ్లు, పోలీసులు పహారా కాస్తున్నట్లు వెల్లడించారు. మైరెన్ ఎస్సై సోమశేఖర్ రెడ్డి, మొగల్తూరు ఎస్సై జి.వాసు, పోలీసు సిబ్బంది ఉన్నారు. దెందులూరు: కోళ్ల వ్యర్థాలు తరలివస్తున్న వ్యాన్ను పోలీసులు పట్టుకుని సీజ్ చేశారు. బుధవారం జాతీయ రహదారి సత్యనారాయణపురం సమీపంలో వాహనాలు తనిఖీ చేస్తుండగా హైదరాబాదు నుంచి నిడమర్రుకు తరలిస్తున్న కోళ్ల వ్యర్థాల వ్యాన్ను పట్టుకుని సీజ్ చేసినట్లు దెందులూరు ఎస్ ఆర్.శివాజీ తెలిపారు. పెదపాడు గ్రామానికి చెందిన డ్రైవర్తో పాటు అందే ఖాన్ చెరువు గ్రామానికి చెందిన వాహన యజమాని వినయ్రావు, నిడమర్రు చేపల చెరువు యజమాని విజయకృష్ణలపై కేసు నమోదు చేసినట్లు చెప్పారు. -
చెడు వ్యసనాలు, విలాసాలతో నేరాలు
చెడు వ్యసనాలు, విలాసాలకు అలవాటు పడి చైన్ స్నాచింగ్, మోటార్సైకిళ్లు దొంగతనాలు చేస్తున్న ఐదుగురిని పోలీసులు పట్టుకున్నారు. 8లో uతల్లిదండ్రుల ఆగ్రహం కాళ్ల: బాధ్యతగా చూసుకోవాల్సిన వారు నిర్లక్ష్యంతో విద్యార్థులు ఆరోగ్యాలతో ఆటలాడుకుంటున్నారు. మండల కేంద్రమైన కాళ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో సుమారు 450 మంది విద్యను అభ్యసిస్తున్నారు. మధ్యాహ్న భోజన పథకంలో బుధవారం విద్యార్థులకు పెట్టేందుకు ఉపాధ్యాయులు అందించిన గుడ్లలో కొన్ని కుళ్లిపోయాయి. ఈ విషయాన్ని నిర్వాహకులు ఉపాధ్యాయులకు చెప్పినా పట్టించుకోపోవడంతో అవే గుడ్లను ఉడకబెట్టారు. కుళ్ళిన గుడ్లు రంగు మారి దుర్వాసన రావడంతో విజిటింగ్కి వచ్చిన విద్యాశాఖ సిబ్బంది వెంటనే గమనించి గుడ్లను తీసి పారవేశారు. ఈ విషయాన్ని తెలుసుకున్న విద్యార్థుల తల్లిదండ్రులు పాఠశాలలో ఉపాధ్యాయుల తీరుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. కొన్ని వారాలు క్రితం ఇదే పరిస్థితి నెలకొనడంతో ఈ విషయాన్ని గ్రామపెద్దలు దృష్టికి తీసుకెళ్లినా వారి తీరు మారలేదని తల్లిదండ్రులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. అధికారులకు తెలిపినా తూతూమంత్రంగా వదిలేస్తున్నారని ఆరోపిస్తున్నారు. కుళ్ళిన గుడ్లు తిని పిల్లలకు ఏదైనా జరిగితే ఎవరు బాధ్యత వహిస్తారని ప్రశ్నిస్తున్నారు. ఇది ముమ్మాటికి ఉపాధ్యాయులు నిర్లక్ష్యమేనని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. -
నేర నియంత్రణపై ప్రత్యేక దృష్టి
ఏలూరు టౌన్: శాంతి భద్రల పరిరక్షణ, నేరాల నియంత్రణకు ప్రత్యేకంగా వ్యూహాత్మకంగా చర్యలు చేపట్టాలని, ప్రజలకు ఉత్తమ సేవలు అందించడం, బాధితులకు సత్వర న్యాయం చేసేందుకు కృషి చేయాలని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ అన్నారు. జంగారెడ్డిగూడెం అసిస్టెంట్ సూపరింటిండెంట్ ఆఫ్ పోలీస్ (ఏఎస్పీ)గా సుస్మిత బాధ్యతలు స్వీకరించారు. ప్రభుత్వం ఇటీవల పలువురికి పోస్టింగులు ఇచ్చిన నేపథ్యంలో 2023 బ్యాచ్కు చెందిన సుస్మితను ఏఎస్పీగా నియమించారు. సుస్మిత బుధవారం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఎస్పీని మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా జంగారెడ్డిగూడెం ప్రాంతంలో క్షేత్రస్థాయిలో ప్రజలతో మమేకం అవుతూ.. ప్రజలకు సేవలు అందించాలన్నారు. -
మెడికల్ రీయింబర్స్మెంట్ బిల్లులపై వినతి
ఏలూరు టౌన్: ఏలూరు జిల్లాలోని ఉద్యోగ, ఉపాధ్యాయ, పోలీస్, పెన్షనర్లకు సంబంధించి మెడికల్ రీయింబర్స్మెంట్ పెండింగ్ బిల్లులకు అనుమతులు ఇవ్వాలని కోరుతూ జేఏసీ నేతలు ఏలూరు జీజీహెచ్ సూపరింటెండెంట్, ఏడీఎంఈ డాక్టర్ ఎంఎస్ రాజును కలిసి వినతి చేశారు. ఏలూరు జీజీహెచ్లోని ఆయన చాంబర్లో బుధవారం జేఏసీ నేతలు కలిసి పలు అంశాలపై ఆయనతో చర్చించారు. రూ.50 వేల లోపు మెడికల్ రీయింబర్స్మెంట్ క్లెయిమ్స్ను పరిష్కరించేలా చర్యలు చేపట్టాలని కోరారు. గత 8 నెలలుగా బిల్లులు భారీగా పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఈ నెలాఖరు నాటికి బిల్లులు పూర్తి చేస్తానని ఆయన హామీ ఇచ్చారు. సమావేశంలో జేఏసీ ఛైర్మన్, ఏపీఎన్జీవోస్ ఉమ్మడి జిల్లా అధ్యక్షులు చోడగిరి శ్రీనివాస్, కార్యదర్శి నెరుసు రామారావు, పోలీస్ అధికారుల సంఘం జిల్లా అధ్యక్షులు నాగేశ్వరరావు, తాలూకా అధ్యక్షుడు జీ.శ్రీధర్రాజు, జీజీహెచ్ అసిస్టెంట్ డైరెక్టర్ కుమార్, అసోసియేట్ ప్రొఫెసర్ చోడగిరి వంశీ, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీసర్ శైలేంద్ర, ఫార్మాసిస్ట్స్ అసోసియేషన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఎం.మహిధరాచార్యులు, దయావతమ్మ ఉన్నారు. -
పేకాట క్లబ్పై చర్యలు తీసుకోవాలి
ఆగిరిపల్లి: మండలంలోని పోతవరప్పాడు రిక్రియేషన్ క్లబ్లో ఏర్పాటు చేస్తున్న పేకాట క్లబ్ను వెంటనే ఆపివేయాలని జూద నిర్వాహకుల వ్యతిరేక కమిటీకి చెందిన యువకులు డిమాండ్ చేశారు. మండలంలోని పోతవరప్పాడులోని మ్యాంగో రిసార్ట్స్ రిక్రియేషన్ క్లబ్లో గతంలో మూసివేసిన పేకాట క్లబ్ను తిరిగి ఏర్పాటు చేస్తుండడంతో యువకులు సోమవారం నుంచి చేస్తున్న ఆందోళన మంగళవారం కూడా కొనసాగించారు. నిర్వాహకులు పేకాట క్లబ్కు చేస్తున్న ఏర్పాటును ప్రభుత్వం వెంటనే నిలుపుదల చేయాలని.. లేకపోతే ఎన్ని రోజులైనా ఆందోళన కొనసాగిస్తామని హెచ్చరించారు. ఈ సందర్భంగా క్లబ్ నిర్వాహకులు మాట్లాడుతూ క్లబ్లో ఎలాంటి అసాంఘిక కార్యక్రమాలు నిర్వహించడం లేదని చెప్పారు. ఏలూరు రూరల్: తుపాను కారణంగా వాయిదా వేసిన జిల్లా సివిల్ సర్వీస్ ఉద్యోగుల మహిళ, పురుషుల క్రీడా జట్ల ఎంపిక పోటీలు ఈ నెల 11, 12 తేదీల్లో చేపట్టనున్నామని జిల్లా క్రీడాప్రాధికార సంస్థ అధికారి ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. అల్లూరి సీతారామరాజు స్టేడియంలో ఉదయం 9 గంటలకు ఎంపిక పక్రియ నిర్వహిస్తామని పేర్కొన్నారు. అథ్లెటిక్స్, బ్యాడ్మింటన్, బాస్కెట్బాల్, క్యారమ్స్, చెస్, క్రికెట్, ఫుట్బాల్, ఖో ఖో, బెస్ట్ ఫిజిక్, హాకీ, కబడ్డీ, టెన్నిస్, పవర్లిఫ్టింగ్, వెయిట్లిఫ్టింగ్, టేబుల్ టెన్నిస్, వాలీబాల్, యోగా, రెజ్లింగ్, స్విమ్మింగ్, మ్యూజిక్, డ్యాన్స్, షార్ట్ ప్లే క్రీడాంశాల్లో ఎంపిక జరుగుతుంది. జిల్లా జట్లుకు ఎంపికై న వారు త్వరలో జరగబోయే రాష్ట్ర స్థాయి పోటీల్లో పాల్గొంటారని వివరించారు. ఆసక్తి గలవారు సంబంధిత శాఖ ఉద్యోగుల గుర్తింపు కార్డుతో హాజరుకావాలని సూచించారు. మరింత సమాచారం కోసం 9948779015 నెంబరులో సంప్రదించాలన్నారు. ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్యారోగ్య శాఖ కార్యాలయంలో పనిచేస్తున్న ఉద్యోగులు వసూల్ రాజాలుగా అవతారం ఎత్తారు. ఏళ్ల తరబడి పాతుకుపోతూ తాము చెప్పిందే వేదం అన్నట్లుగా.. జిల్లాలోని సిబ్బంది నుంచి ఇష్టారాజ్యంగా సొమ్ములు వసూలు చేస్తున్నారని ఆరోపణలు వచ్చాయి. షాడో డీఎంహెచ్ఓగా వ్యవహరిస్తోన్న ఉద్యోగి డబ్బుల దందాకు దిగినట్లు సిబ్బంది గుసగుసలాడుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ కార్యాలయంలో ఎంపీహెచ్ఎం, ఎంపీహెచ్ఏ సిబ్బంది సీటు చూసే ఉద్యోగి చేతివాటం ప్రదర్శిస్తున్నట్లు చెబుతున్నారు. జిల్లాలో సమారుగా 245 వరకూ నర్సింగ్ సిబ్బంది పనిచేస్తుండగా.. పోలీస్ అటెస్టేషన్కు సొమ్ములు వసూలు చేస్తున్నట్లు ఆరోపణలు ఉన్నాయి. ఒక్కో ఉద్యోగి నుంచీ రూ.1,500 నుంచి రూ.2 వేల వరకూ వసూలు చేస్తున్నారని అంటున్నారు. జిల్లాలోని పీహెచ్సీలో పనిచేసే ఒకరికి బాధ్యత అప్పగించి ఫోన్పేకు డబ్బులు పంపేలా ఒత్తిడి చేస్తున్నారనే అపవాదు ఉంది. సుమారుగా రూ.4.50 లక్షలకు పైగానే వసూలు చేసి ఉంటారని సిబ్బంది చెప్పుకుంటున్నారు. భీమవరం: సర్వ శిక్ష కాంట్రాక్ట్ అవుట్ సోర్సింగ్ ఉద్యోగులను రెగ్యులర్ చేసి ఎన్నికల్లో కూటమి నేతలిచ్చిన హామీలు అమలు చేయాలని ఈనెల 10న కలెక్టర్ కార్యాలయం వద్ద నిర్వహించే ధర్నాను విజయవంతం చేయాలని జిల్లా సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల జేఏసీ కోరింది. భీమవరం యుటీఎఫ్ కార్యాలయంలో బుధవారం జిల్లా అధ్యక్షుడు బావాజీ అధ్యక్షతన సమావేశం జరిగింది. యూనియన్ గౌరవాధ్యక్షుడు, సీఐటీయు జిల్లా ప్రధాన కార్యదర్శి కె.రాజారామ్మోహన్రాయ్ మాట్లాడుతూ జేఏసీ ఇచ్చిన పిలుపులో భాగంగా కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నాలో సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులంతా పెద్ద ఎత్తున పాల్గొనాలని పిలుపునిచ్చారు. కార్యదర్శి జనార్దన్ మాట్లాడుతూ ఎన్నికల ముందు ఆనాటి ప్రతిపక్ష పార్టీలు ఇచ్చిన హామీలు ఇప్పటి వరకు అమలు చేయలేదని విమర్శించారు. సమావేశంలో జిల్లా నాయకులు మేరీ, సంతోషి, రమేష్, శ్రీనివాసరాజు, సువర్ణ రాజు, సీహెచ్ వెంకటేశ్వరరావు, ఎస్ బాలాజీ తదితరులు పాల్గొన్నారు. -
కోటి సంతకాలతో పేదలకు భవిత
మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబునిడమర్రు: కోటి సంతకాలతో పేద విద్యార్థుల తలరాతలు ముడిపడి ఉన్నాయని వైఎస్సార్సీపీ మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. బుధవారం సాయంత్రం మండలంలోని అడవికొలనులో రచ్చబండ, మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల సేకరణ నిర్వహించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ కూటమి రాష్ట్రంలో ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్మిస్తున్న 17 మెడికల్ కళాశాల్లో చంద్రబాబు వర్గం వాటాల కోసమే ప్రైవేటీకరణ జపమన్నారు. ప్రస్తుత ప్రభుత్వం పేద ప్రజలకు వైద్యంతోపాటు, విద్యను కూడా అందని ద్రాక్షగా మిగిల్చడమే లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కనీసం ఆరోగ్యశ్రీ నిధులను కూడా విడుదల చేయడం లేదన్నారు. గత ప్రభుత్వంలో రూ.5 లక్షలు ఉన్న ఆరోగ్యశ్రీ పరిమితిని రూ.25 లక్షలకు పెంచిన ఘనత జగన్మోహన్రెడ్డికే దక్కుతుందన్నారు. కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న తప్పుడు నిర్ణయాలతో పేదల ప్రజలకు తీరని నష్టం వాటిల్లుతుందన్నారు. కార్యక్రమంలో మండల కన్వీనర్ సంకు సత్యకుమార్, జెడ్పీటీసీ కోడే కాశీ, వైఎస్సార్సీపీ రైతు విభాగం నేత వెజ్జు వెంకటేశ్వరరావు, వైస్ ఎంపీపీ సమయం వీరరాఘవులు తదితరులున్నారు. -
సొంత ఆదాయ వనరులు పెంచాలి
ఏలూరు(మెట్రో): పంచాయతీలలో సొంత ఆదాయ వనరులను పెంపొందించేలా పంచాయతీరాజ్ శాఖ అధికారులు పనిచేయాలని జెడ్పీ సీఈవో ఎం.శ్రీహరి ఆదేశించారు. బుధవారం స్థానిక జిల్లా పంచాయితీ వనరుల కేంద్రంలో పంచాయతీలలో సొంత ఆదాయ వనరులు పెంపుదలపై శిక్షకులకు శిక్షణ కార్యక్రమం జరిగింది. ఈ సందర్భంగా సీఈవో మాట్లాడుతూ.. కేవలం ఇంటిపన్నులు ఒక్కటే కాదని ఇతర ఆధాయ వనరులను సృష్టించే అధికారాలు చట్టం ద్వారా పంచాయతీలకు ఉన్నాయని, వాటిని సద్వినియోగం చేసుకోవాలని పేర్కొన్నారు. ట్రైనింగ్ మేనేజర్ జి.ప్రసంగి రాజు మాట్లాడుతూ ఈనెల 11, 12 తేదీల్లో పంచాయతీ సర్పంచ్లకు పంచాయతీ కార్యదర్శులకు గ్రామ పంచాయతీలలో సొంత ఆదాయ వనరులు పెంపుదలపై అవగాహన నిర్వహిస్తున్నట్లు తెలిపారు. రిసోర్సు పర్సన్లుగా ఉంగుటూరు ఎంపీడీఓ జి.ఆర్.మనోజ్, గణపవరం డిప్యూటీ ఎంపీడీవో పీవీ సత్యనారాయణ, చేబ్రోలు, సూరప్పగూడెం సెక్రటరీలు జీడీ శ్రీనివాస్రావు, ముత్తయ్య ఫ్యాకల్టీలుగా వ్యవహారించారు. -
అన్నదాత గోడు పట్టదా!
సాక్షి ప్రతినిధి, ఏలూరు: చేతికందివచ్చిన పంట తుపాను పాలైంది. ఒకటి రెండు కాదు ఉమ్మడి పశ్చిమలో దాదాపు 50 వేల ఎకరాలకుపైగా పంట నష్టం. 2 వేల ఎకరాలకుపైగా ఆక్వాకు నష్టం వాటిల్లింది. సాగుదారులు, కౌలు రైతులు, ఉద్యానవన పంట రైతులు ఇలా వేలాది మందికి కోట్లలో నష్టం వాటిల్లింది. ప్రభుత్వం తుపాను పేరిట తారాస్థాయిలో హడావుడి అయితే చేసింది తప్ప క్షేత్రస్థాయిలో ప్రజాప్రతినిధులు మాత్రం తుపాను నష్టం పరామర్శకు దూరంగా ఉన్నారు. కొద్ది మంది మొక్కుబడిగా అరగంట, గంట పర్యటనలు చేసి వెళ్లిపోతున్నారు. మరికొంత మంది తుపాను ఈవెంట్లో పాల్గొనాలని ఓ ఫొటో కార్యక్రమం మినహా క్షేత్ర స్థాయిలో తిరిగి అన్నదాతలకు తక్షణ సాయం చేయలేకపోయినా భరోసా ఇవ్వడంలోనూ పశ్చిమలోని ప్రజాప్రతినిధులు వైఫల్యం చెందారు. గత నెల చివరి వారంలో వచ్చిన మోంథా తుపాను జిల్లాలోని అన్నదాతలను అతలాకుతలం చేసింది. ప్రధానంగా ఏలూరు జిల్లాలో 23 వేల ఎకరాలు, పశ్చిమగోదావరి జిల్లాలో 30 వేల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. 90 శాతానికిపైగా ఖరీఫ్ సీజన్ చివరిలో ఉన్న వరికి అపారనష్టం మిగిలింది. పశ్చిమగోదావరి జిల్లాలో 12 వేల ఎకరాలు వరి నీటమునగగా, 18 వేల ఎకరాల్లో పంట నేలకొరిగింది. ఇక ఏలూరు జిల్లాలో 4వేల ఎకరాల పంట నీటమునగగా, 16 వేల ఎకరాలకు పైగా నేలకొరగడం, మరో 3వేల ఎకరాల్లో నీరునిలిచి పంట పాడు అవ్వటం ఇలా పూర్తి నష్టం వాటిల్లింది. ఇవి కాక ఉమ్మడి జిల్లాలో అరటి, మినుము, పత్తి, వేరుశెనగ, మొక్కజొన్న, పూలతోటలు ఇలా మరో 6 వేల ఎకరాల్లోపైగా నష్టం వాటిల్లింది. నరసాపురంలో 1500 ఎకరాల్లో రొయ్యల చెరువు గట్లు తెగి పంట కాల్వల పాలైంది. ఈ పరిణామాల క్రమంలో రాష్ట్ర ప్రభుత్వం గత నెల చివరి వారమంతా మోంథా తుపాను ఎదుర్కొంటున్నాం సమర్థ్ధవంతంగా పనిచేస్తున్నామని సోషల్ మీడియా మొదలుకొని భారీ హడావిడి చేసింది. కాని క్షేత్ర స్థాయిలో మాత్రం ప్రజాప్రతినిధులు కనిపించకపోవడం జిల్లాలో చర్చగా మారింది. నూజివీడు నియోజకవర్గంలో మంత్రి కొలుసు పార్థసారథి రామన్నగూడెంలో సరిగా అరగంట పరిస్థితిని పరిశీలించి వెళ్లిపోయారు. ఆ తరువాత మినుము రైతులు ఎంత నష్టపోయారు ఇలా మిగతా అంశాలన్నీ పట్టించుకోకపోవడం గమనార్హం. మరో మంత్రి నిమ్మల రామానాయుడు నియోజకవర్గం సంగతి లైట్గా తీసుకుని నరసాపురంలో మాత్రం తుపాను రోజంతా హడావుడి చేసి తరువాత పట్టించుకోలేదు. కైకలూరు నియోజకవర్గ ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ ఒక మండలంలోని గ్రామంలో గట్ల మీద నుంచి పరిశీలించి విజయవాడలో ప్రైవేటు ఫంక్షన్లు, ఇతర పనుల్లో బిజీగా ఉండిపోయారు. పోలవరం ఎమ్మెల్యే చిర్రి బాలరాజు, తాడేపల్లిగూడెం ఎమ్మెల్యే బొలిశెట్టి శ్రీనివాస్, ఆచంట ఎమ్మెల్యే పితాని సత్యనారాయణలు ఏదో గంట తిరగాలి కాబట్టి తిరిగేసి వెళ్ళిపోయారు. అంతకుమించి తరువాత స్థితిగతులపై నామమాత్రపు సమీక్షలు నిర్వహించకపోవడం గమనార్హం. చింతలపూడి, ఉండి, ఉంగుటూరు, భీమవరం, దెందులూరు ఎమ్మెల్యేలు కూడా అదే రీతిలో ౖపైపెన పొలాలు పరిశీలించి తుపాను ఈవెంట్ ముగించేశారు. పొలాలకు దూరంగా కూటమి ప్రజాప్రతినిధులు అక్కడక్కడా మొక్కుబడిగా పరామర్శలు విదేశీ పర్యటనల్లో తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి బిజీబిజీ నరసాపురంలో తిరగని ఎమ్మెల్యే మంత్రులు కొలుసు, నిమ్మల కూడా మొక్కుబడి పరామర్శలు తణుకు ఎమ్మెల్యే ఆరిమిల్లి రాధాకృష్ణ మాత్రం పూర్తిగా ప్రత్యేకం. తుపాను హడావుడి ముందు రోజు వరకు ఇతర ప్రాంతంలో ఉన్న నేత తుపాను రాగానే నియోజకవర్గానికి వచ్చారు. అలా అని పొలాలు ఏమీ చూడకుండా ఫోన్లో అధికారులకు ఆదేశాలు ఇవ్వడం, అందరితో మాట్లాడేశానంటూ సోషల్ మీడియాలో వీడియో పోస్టు చేసి తుపాను పునరావాస కేంద్రానికి వెళ్ళి పరిశీలించి ఈవెంట్ను ముగించారు. పొలాల్లో తిరగడంగాని, పరామర్శలు తనకేమి సంబంధం లేదన్న రీతిలో న్యూజిలాండ్ పర్యటనలో బిజీబిజీగా ఉన్నారు. తుపాను తీరం దాటిన ప్రాంతమైన నరసాపురం ఎమ్మెల్యే బొమ్మిడి నాయకర్ పొలాలు, రైతులు పరిశీలన జోలికి వెళ్ళకుండా గండి పడిన ప్రాంతాన్ని పరిశీలించి తుపాను హడావుడి ముగించేశారు. కలెక్టర్లతో ప్రజాప్రతినిధులు విస్తృత స్థాయి సమీక్షా సమావేశాలు నిర్వహించడం, కనీసం రైతుల సాధక బాధకాలు వివరించి ప్రభుత్వానికి తెలిసేలా మాట్లాడటం ఇలాంటివేమి లేకపోవడం గమనార్హం. అధికారులు మాత్రమే యథావిధిగా 24 గంటల్లో పంట నష్టం నివేదికలు తయారు చేసి ప్రభుత్వానికి పంపి హడావుడి ముగించారు. -
మెడికల్ కళాశాలలను కాపాడుకుందాం
మండవల్లి: మెడికల్ కళాశాలల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా పోరాటం చేసి కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. మండలంలోని పెరికేగూడెంలో కోటి సంతకాల సేకరణ ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామ దుర్గాప్రసాద్, మండల శాఖ అధ్యక్షుడు బేతపూడి ఏసోబురాజు ఆధ్వర్యంలో బుధవారం జరిగింది. డీఎన్నార్ మాట్లాడుతూ జగన్మోహన్రెడ్డి ముఖ్యమంత్రి హోదాలో రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను సాధించారన్నారు. దీనివల్ల పేద విద్యార్థులు వైద్యవిద్యను అభ్యసించడంతో పాటు పేదలకు ఉచితంగా వైద్యసేవలు దక్కేవన్నారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ కళాశాలలను ప్రైవేటీకరణ చేయడం దారుణమన్నారు. ప్రైవేటుపరం కాకుండా చూడాల్సిన ఆవశ్యకత ప్రతి ఒక్కరిపై ఉందని, అందులో భాగంగానే ప్రజామద్దతు కూడగట్టేందుకు కోటిసంతకాల సేకరణ ఉద్యమాన్ని చేపట్టామన్నారు. ప్రతీ ఒక్కరూ ఇందులో భాగస్వాములై ప్రైవేటీకరణను అడ్డుకోవాలని కోరారు. పార్టీ ఎస్సీ సెల్ రాష్ట్ర కార్యదర్శి గుమ్మడి వెంకటేశ్వరరావు, జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, జిల్లా యాక్టివ్ సెక్రటరీ నాగదాసి థామస్, రైతు విభాగ ఉపాధ్యక్షుడు గుడివాడ వీరరాఘవయ్య, మండల బీసీ సెల్ అధ్యక్షుడు బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, సర్పంచ్ పెరుమాళ్ళ పద్మ, నాయకులు పెనుమాళ్ళ వీర వెంకట సత్యనారాయణ, సోబుల రెడ్డి, శివారెడ్డి, కొండారెడ్డి తదితరులు పాల్గొన్నారు. -
గోనె సంచులు సిద్ధం చేయాలి
భీమడోలు: ఖరీఫ్ ధాన్యం కొనుగోలుకు రైతులకు అవసరమైన గోనె సంచులను సిద్ధం చేయాల్సిన బాధ్యత అధికారులపై ఉందని జాయింట్ కలెక్టర్ డాక్టర్ ఎంజే అభిషేక్ గౌడ్ అన్నారు. గుండుగొలను, పూళ్ల, కురెళ్లగూడెం గ్రామాల్లో బుధవారం ఆయన ఆకస్మిక తనిఖీలు చేశారు. గుండుగొలనులో ఈ పంట నమోదు ప్రక్రియలో పంటను సక్రమంగా నమోదు చేసిందీ లేనిదీ ఆయన పరిశీలించారు. పూళ్ల గ్రామంలోని రైస్మిల్లులో గోనె సంచుల నాణ్యతను పరిశీలించి రైస్ మిల్లు యాజమాని, సంబంధిత అధికారులకు సూచనలు చేశారు. దిగుబడులను దృష్టిలో ఉంచుకుని రైతులకు తగినన్ని గోనె సంచులు పంపిణీ చేసేలా చర్యలు తీసుకోవాలని కోరారు. కురెళ్లగూడెం ధాన్యం సేకరణ కేంద్రాన్ని సందర్శించి తేమశాతం యంత్రాన్ని పరిశీలించి రైతుల నుంచి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. ధాన్యం కొనుగోళ్లలో రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు తీసుకోవాలన్నారు. రైతులను ఇబ్బందులకు గురి చేస్తే సహించేది లేదన్నారు. కార్యక్రమంలో జాయింట్ డైరెక్టర్ షేక్ హాబీబ్ బాషా, ఏడీఏ పి.ఉషారాజకుమారి, తహసీల్దార్ బి.రమాదేవి, ఏవో ఉషారాణి, సర్పంచ్ గుడివాడ నాగగౌతమి, రెవెన్యూ, వ్యవసాయ సిబ్బంది, రైతులు పాల్గొన్నారు. -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ దుర్మార్గం
నూజివీడు: రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్రెడ్డి సీఎంగా తెచ్చిన 17 ప్రభుత్వ మెడికల్ కళాశాలలను ప్రస్తుత కూటమి ప్రభుత్వం ప్రైవేటీకరణ చేయాలని చూడటం దుర్మార్గమని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నూజివీడు నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు మండిపడ్డారు. పట్టణంలోని మొఘల్ చెరువులోని లోపలి ప్రాంతంలో బుధవారం రాత్రి ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమాన్ని నిర్వహించారు. ముఖ్యఅతిధిగా పాల్గొన్న ప్రతాప్ అప్పారావు మాట్లాడుతూ జగన్కు మంచి పేరు వస్తుందోనని కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టాలని చూస్తోందన్నారు. చంద్రబాబు తన పాలనలో ఏనాడైనా ఒక్క మెడికల్ కళాశాల ప్రభుత్వ రంగంలో ఏర్పాటు చేశారా అని ప్రశ్నించారు. పేదవర్గాల విద్యార్థులకు వైద్య విద్య అందదన్నారు. రాష్ట్రంలోని ప్రజలందరూ ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకించాలన్నారు. రాష్ట్రంలో కూటమి ప్రభుత్వ పాలనపై ఏడాదిన్నరలోనే ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోందన్నారు. ఒక్క వృద్ధుడికి నూతన పింఛన్ను మంజూరు చేయలేదని, ఎవరైనా వృధాప్య పింఛను తీసుకుంటూ అతను మరణిస్తే అతని భార్యకు వితంతు పింఛన్ ఇస్తున్నారే తప్ప కొత్తవి ఇవ్వడం లేదని ధ్వజమెత్తారు. ఈ 16 నెలలుగా రాష్ట్రంలో అప్పుల పాలన తప్ప రాష్ట్రానికి ఒరిగిందేమీ లేదన్నారు. ఏ గ్రామంలో చూసినా వీధికి నాలుగు బెల్టుషాపులు ఉంటున్నాయని, తాగి రోడ్డు వెంట పడిపోతున్న వారు గ్రామాల్లో వీధికొకరు కనిపిస్తున్నారన్నారు. కార్యక్రమంలో వైఎస్సార్సీపీ పట్టణ అధ్యక్షులు శీలం రాము, మున్సిపల్ వైస్ చైర్మన్ కొమ్ము వెంకటేశ్వరరావు, వైఎస్సార్సీపీ జిల్లా అధికార ప్రతినిధి, కంచర్ల లవకుమార్, క్రిస్టియన్ మైనారిటీ జిల్లా అధ్యక్షుడు పిళ్లా చరణ్, కౌన్సిలర్ మీర్ అంజాద్ ఆలీ, నాయకులు పాల్గొన్నారు. మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు -
కొల్లేరు వాసుల్లో పాముల భయం
కై కలూరు: కలిదిండి మండలం వెంకటాపురం గ్రామానికి చెందిన సిద్దాబత్తుల విజయ (32) కిరాణాకొట్టుతో జీవనం సాగిస్తోంది. ఆమె భర్త దుర్గారావు పెయింటర్. వీరికి ఇద్దరు పిల్లలు. గురువారం సాయంత్రం కొట్టు ప్రిజ్లో పాలప్యాకెట్ తీసుకొస్తుండగా నాగుపాము కాటేసింది. భర్త సమీపంలో కలిదిండి పీహెచ్సీకి తీసుకెళ్లాడు. అక్కడ నుంచి కై కలూరు, ఏలూరు ఆస్పత్రులకు మెరుగైన వైద్యం కోసం వెళ్లగా చికిత్స పొందతూ ఆమె శుక్రవారం మరణించింది. కై కలూరు మండలం వరహాపట్నం గ్రామంలో కొన్ని నెలల క్రితం కత్తుల కౌసల్య(40) ఇంటి వద్ద నిద్రిస్తుండగా నాగుపాము కాటు వేసింది. అర్థరాత్రి కావడంతో గ్రామంలో నాటు వైద్యుని వద్దకు వెళితే నా వల్ల కాదన్నాడు. ఆటోలో ప్రభుత్వాసుపత్రికి వెళుతుండగా మరణించింది. భర్త వ్యవసాయ కూలీ. చదువుతున్న ముగ్గురు పిల్లలకు తల్లి ప్రేమ దూరమైంది. ఇలా ఇటీవల అనేక ఘటనలు జరుగుతున్నాయి. ఆలస్యం.. అమృతం.. విషం అనేది పురాతన సామెత. పాము కాటు విషయాల్లో నేడు ఇదే జరుగుతుంది. గ్రామీణ ప్రాంతాల్లో ఇప్పటికీ మంత్రాలు, ఆకుపసర, ఆయుర్వేదం అంటూ అమూల్యమైన సమయాన్ని వృథా చేస్తున్నారు. కొన్ని సందర్భాల్లో సమయానికి ఆస్పత్రికి తీసుకెళ్లినా చికిత్సలో ఆలస్యం జరుగుతుందని బాధితులు లబోదిబోమంటున్నారు. కై కలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది నుంచి ఇప్పటి వరకు ఆయా పీహెచ్సీ, సీహెచ్సీలో కై కలూరు మండలంలో 117, కలిదిండి మండలంలో 56, ముదినేపల్లి మండలంలో 14, మండవల్లి మండలంలో 1 కలిపి మొత్తం 188 పాము కాటు కేసులు నమోదయ్యాయి. గ్రామీణ ప్రాంతాల్లో పీహెచ్సీలకు రాకుండా ప్రైవేటు ఆస్పత్రులకు వెళ్లిన కేసులు ఎక్కువగానే ఉన్నాయి. అన్ని పాములు విషపూరితం కావు భారతదేశంలో 570 రకాల పాము జాతులు ఉన్నాయి. వీటిలో 60 రకాలు మనుషులను చంపే అవకాశం ఉన్న పాములుగా గుర్తించారు. ప్రతి ఏటా పాము విషం వల్ల, పాము కాటు భయంతో సుమారు 50 వేల మంది మరణిస్తున్నారని అంచనా. ప్రధానంగా నాగుపాము, కట్లపాము, రక్తపింజరి పాముల వల్ల మరణాలు సంభవిస్తున్నాయి. నాగుపాము కంటే కట్లపాము కాటును గుర్తించకపోవడం, నొప్పు తెలియకపోవడంతో చికిత్స సకాలంలో అందక ఎక్కువ మంది మరణిస్తున్నారు. పాము కాటుకు విరుగుడు మందు స్నేక్ వినమ్ ఏంటీ సిరమ్ ఐపీ పీహెచ్సీలలో అందుబాటులో ఉంది. పాము కాటును ఇలా గుర్తించండి.. ● విషపూరిత పాము కాటు వేసినప్పుడు రెండు చుక్కల గాట్లు కనిపిస్తాయి. ● విషరహిత పాము కాటు వేస్తే ఎక్కువ సంఖ్యలో చుక్కల గాట్లు ఉంటాయి. ● కరిచిన చోట రక్తం కారుతూ, ఎర్రగా మారి పోటుతో పాటు వాపు ఉంటుంది. ● కళ్లు తిరగడం, వాంతులు, వికారం, విరేచనలు, కళ్లు తెరవలేకపోవడం. ● కరిచిన పాము కనిపిస్తే సెల్ ఫోన్లో ఫొటో తీసీ డాక్టర్కు చూపించాలి. ● కరిచిన చోటును తుడవకూడదు. ఆ వ్యక్తికి ఆహారం పెట్టకూడదు. ఇవి పాటించండి ● సినిమాల్లో చూపినట్లుగా కోసి రక్తం పీల్లడం, కట్టు కట్టడం వద్దు. ● కాటుకు గురైన వ్యక్తికి విరుగుడు మందు ఉందని ధైర్యం చెప్పాలి. ● పాము కాటు బారిన పడ్డ వ్యక్తిని ఎట్టిపరిస్థితుల్లో నడిపించవద్దు. ● కాటు వేసిన 15 నుంచి 30 నిమషాలలోపు ఆస్పత్రికి తీసుకెళ్లాలి. ● మంత్రాలు, ఆకుపసర్లంటూ ఆలస్యం చేయవద్దు. ● కాటు వేసిన పామును చంపాలనే కోపంతో ప్రమాదాలు కొనితెచ్చుకోవద్దు. సిద్ధాబత్తుల విజయ, వెంటాపుర, (ఫైల్) కత్తుల కౌసల.్య వరహాపట్నం (ఫైల్) పెరుగుతున్న పాము కాటు కేసులు ఈ ఏడాదిలో ఇప్పటివరకు 188 కేసుల నమోదు పలు ఘటనల్లో ప్రాణాలు పోతున్న వైనం అవగాహన లోపంతో అలస్యంగా ప్రథమ చికిత్స ఇప్పటికీ గ్రామాల్లో మంత్రాలు, ఆకు పసరుపై ఆధారంపాము కాటుకు గురైన వ్యక్తి భయపడకుండా అందరూ ధైర్యం చెప్పండి. అన్ని ప్రభుత్వాసుపత్రుల్లో విరుగుడు మందు ఏఎస్వీ అందుబాటులో ఉంది. ఆలస్యం జరిగితే బాధితుడి నాడి వ్యవస్థ దెబ్బతింటుంది. కాటుకు గురైన వ్యక్తిని కదలించకుండా గంటలోపు ఆస్పత్రికి తీసుకురావాలి. మంత్రాలు, ఆకుపసర్ల జోలికి వద్దు. – అల్లాడి శ్రీనివాసరావు, సూపరిండెంటెండెంటు, సీహెచ్సీ, కై కలూరు -
విద్యుదాఘాతంతో ట్రాక్టర్ డ్రైవర్ మృతి
బుట్టాయగూడెం: పొలంలో ట్రాక్టర్తో దుక్కుదున్నుతున్న డ్రైవర్కు విద్యుత్ వైర్లు తగిలి మృతి చెందిన ఘటన మండలంలోని కొమ్ముగూడెంలో మంగళవారం జరిగింది. ఏఎస్సై సోమరాజు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం మండలం తిరుమలాపురంనకు చెందిన అయినం దుర్గారావు (64) వ్యవసాయ కూలీ. బుట్టాయగూడెం మండలం కొమ్ముగూడెంకు చెందిన రైతు నిమ్మగడ్డ సత్యనారాయణ వద్ద దుర్గారావు ట్రాక్టర్ డ్రైవర్గా పనిచేస్తున్నాడు. మంగళవారం పొలం పని చేస్తుండగా తక్కువ ఎత్తులో ఉన్న విద్యుత్ వైర్లు ట్రాక్టర్కు తగలడంతో డ్రైవర్ దుర్గారావు విద్యుదాఘాతానికి గురై అక్కడికక్కడే మృతి చెందినట్లు తెలిపారు. విషయం తెలిసిన కుటుంబ సభ్యులు అక్కడికి చేరుకుని దుర్గారావు మృతదేహం వద్ద కన్నీరుమున్నీరుగా విలపించారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసినట్లు ఏఎస్సై చెప్పారు. -
చర్చనీయాంశంగా ఐటీడీఏ పీఓ ఆడియో
కుక్కునూరు: కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక అవినీతి పేట్రేగిపోయిందన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ముఖ్యంగా విలీన మండలాల్లో నిర్వాసితుల పరిహారాన్ని ఆసరాగా చేసుకుని కూటమి నాయకులతో చేతులు కలిపిన అధికారులు వారు చెప్పినట్టుగా వ్యవహరిస్తూ నిర్వాసితుల వద్ద నుంచి పెద్దెత్తున వసూళ్లకు పాల్పడుతున్నట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఇందుకు సంబంఽధించి కేఆర్పురం ఐటీడీఏ పీఓ ఆడియా సంచలనంగా మారింది. చిరవెల్లి గ్రామానికి చెందిన ఓ నిర్వాసితుడికి జమైన ఇంటిపరిహారం విషయంలో పీవో స్వయంగా ఫోన్ చేసి కూటమి నాయకుడి వద్దకు వెళ్లి సెటిల్మెంట్ చేసుకోమని, లేకుంటే క్రిమినల్ కేసు నమోదు చేస్తామని మాట్లాడిన ఆడియో ఓ చానల్లో బహిర్గతమైంది. ఈ ఆడియోతో కూటమి ప్రభుత్వంలో అధికారుల స్వామి భక్తి స్పష్టమవుతుందని పలువురు వ్యాఖ్యానిస్తున్నారు. జంగారెడ్డిగూడెం: పట్టణంలో ఓ స్వర్ణకారుడు సుమారు రూ.50 లక్షల వరకు బంగారం, నగదుతో పరారయ్యాడు. బాధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పట్టణానికి చెందిన కొందరు స్థానిక మునుసుబు గారి వీధిలో స్వర్ణకార వృతి చేసుకుంటున్న పడగా రాముకు కొత్త బంగారు ఆభరణాలు చేసేందుకు పట్టణానికి చెందిన కె.కృష్ణరాజు సుమారు 3.5 కాసుల బంగారం, రూ.3.50 లక్షల నగదు, నూకవరపు చంద్ర 3 కాసుల బంగారం, రూ.3.50 లక్షల నగదు, కె.సూర్యకాంతం 5 కాసుల బంగారం, కొంత వెండి, ఎస్.మల్లేశ్వరి 3 కాసుల బంగారం, రూ.2.85 లక్షల నగదు, తాకట్టు పెట్టేందుకు డి.నాగుదర్గ వరప్రసాద్ 3.5 కాసుల బంగారు ఇచ్చారు. వీటన్నింటిని తీసుకుని కుటుంబంతో సహ స్వర్ణకారుడు పడగా రాము పరారైనట్లు బాధితులు చెబుతున్నారు. దీంతో అతని బంధువులను సంప్రదించినా సమాధానం లేకపోవడంతో బాధితులు కలెక్టర్కు, ఎస్పీకి ఫిర్యాదు చేసినట్లు చెప్పారు. పోలీసులు దర్యాప్తు చేసి తమకు న్యాయం చేయాలని వారు కోరుతున్నారు. దెందులూరు: జాతీయ రహదారిపై సత్యనారాయణపురం వద్ద మంగళవారం రాత్రి గుర్తు తెలియని వాహనం ఢీకొని గుర్తుతెలియని వ్యక్తి మృతి చెందాడు. మృతుడి వయస్సు సుమారు 50 సంవత్సరాలు ఉండవచ్చని దెందులూరు ఎస్సై రాచమల్లు శివాజీ చెప్పారు. బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం సిర్రివారిగూడెం సమీపంలో ట్రాక్టర్పై నుంచి జారిపడి యువకుడు మృతి చెందాడు. ఎస్సై వి. క్రాంతికుమార్ తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. సిర్రివారిగూడెంకు చెందిన పొట్టా అఖిల్ (18) జీలుగుమిల్లికి ట్రాక్టర్పై వెళ్లి తిరిగి వస్తుండగా ట్రాక్టర్ అదుపు తప్పి మొద్దుపై ఎక్కి తిరగబడింది. ఈ ప్రమాదంలో అఖిల్పై ట్రాక్టర్ చక్రం ఎక్కి అక్కడికక్కడే మృతి చెందాడు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై చెప్పారు. -
శ్రీవారి హుండీలో టాయ్ కరెన్సీ నోట్లు
ద్వారకాతిరుమల: శ్రీవారి హుండీలో టాయ్ కరెన్సీ నోట్లు బయటపడ్డాయి. మంగళవారం ద్వారకాతిరుమలలోని ప్రముఖ పుణ్యక్షేత్రమైన చినవెంకన్న దేవస్థానం ప్రమోద కల్యాణ మండపంలో హుండీల నగదు లెక్కింపును నిర్వహించారు. ఆ సమయంలో సిబ్బందికి టాయ్ కరెన్సీ రూ.500 నోట్లు కట్ట (రూ.50 వేలు) కనిపించింది. తీరా చూస్తే ఆ నోట్లపై సీరియల్ నెంబర్ ఉండాల్సిన చోట అన్నీ సున్నాలే ఉన్నాయి. అలాగే మరోపక్క శ్రీఫుల్ ఆఫ్ ఫన్శ్రీ అని, శ్రీమనోరంజన్ బ్యాంక్ ఆఫ్ ఇండియాశ్రీ అని ఉంది. దాంతో అవాక్కయిన సిబ్బంది వాటిని టాయ్ కరెన్సీగా గుర్తించారు. అధికారులకు చూపించి, వాటిని పక్కన పడేశారు. ఇదిలా ఉంటే కొందరు భక్తులు ఇప్పటికీ రద్దయిన పాత కరెన్సీ నోట్లను హుండీలో వేస్తున్నారు. చెల్లని నోట్లు వేయడం వలన స్వామివారి సేవలకు ఎలా పనిచేస్తాయని పలువురు అంటున్నారు. -
‘వందే భారత్’ రాక ఎప్పుడో?
నరసాపురం: ప్రస్తుతం విజయవాడ వరకూ నడుస్తున్న వందే భారత్ రైలును నరసాపురం వరకూ పొడిగించబోతున్నట్టు నరసాపురం ఎంపీ, కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ స్వయంగా నెలరోజుల క్రితం ప్రకటన చేశారు. దీంతో దసరా పండుగకు వందే భారత్ రైలు నరసాపురంలో ఆగుతుందని డెల్టా వాసులు ఎదురుచూశారు. అయితే దీపావళి దాటినా కూడా ఈ రైలు రాకపై రైల్వేశాఖ ఉలుకూపలుకూ లేకుండా ఉండటంతో ఉమ్మడి గోదావరి జిల్లాల వాసులు, ప్రత్యేకంగా పశ్చిమడెల్టా ప్రజలు నిరాశలో ఉన్నారు. దసరారోజు నాటికి వందేభారత్ రైలు విజయవాడ నుంచి గుడివాడ, కై కలూరు, భీమవరం మీదుగా నరసాపురం వరకూ పొడిగించడం జరుగుతుందని కేంద్రమంత్రి ప్రకటించారు. మంత్రి ప్రకటన తరువాత రైల్వే విజయవాడ డివిజన్ డీఆర్ఎం నరసాపురంలో పర్యటించి దసరారోజు నాటికి నరసాపురం వరకూ వందే భారత్రైలు పొడిగింపు జరుగుతుందని, ఇందుకు రైల్వే శాఖ ఏర్పాట్లు చేస్తుందని స్పష్టం చేశారు. దీంతో భారత ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా దేశవ్యాప్తంగా నడుపుతున్న వందే భారత్ రైలు సర్వీస్లు పశ్చిమడెల్టాలో అడుగుపెట్టబోతుందని ప్రజలు సంతోషించారు. ఇక అప్పటి నుంచి గోదావరి జిల్లాలో మొదటి సారిగా వందేభారత్ రైలు పరుగులు పెడుతుందని ఆశగా జనం ఎదురు చూస్తున్నారు. దసరా అన్నది దీపావళి పండుగకూడా దాటేసింది. కానీ ఇప్పటి వరకూ ఈ రైలు నరసాపురం రాకపై సస్పెన్స్ మాత్రం ఇంకా కొనసాగుతూనే ఉంది. నరసాపురం–విజయవాడ మధ్య డబుల్లైన్, విద్యుదీకరణ పూర్తయ్యి మూడేళ్లు గడిచింది. ట్రాఫిక్ తగ్గడంతో ప్రస్తుతం ఈ రూట్లో కొత్త రైళ్లు ప్రవేశపెట్టడానికి సాంకేతికంగా కూడా ఎలాంటి ఇబ్బందులు లేవు. మొత్తం విజయవాడ రైల్వే డివిజన్లోనే నరసాపురం–విజయవాడ రూట్ అత్యంత కీలకమైనది, డివిజన్కు ఎక్కువ ఆదాయం తెచ్చిపెడుతున్నది. మరి వందేభారత్ రైలు నరసాపురం పొడిగింపు విషయంలో రైల్వేశాఖ ఎందుకు ఆలస్యం చేస్తుందనే విషయం అంతుపట్టడంలేదు. నరసాపురం వరకు పొడిగిస్తామని కేంద్ర మంత్రి ప్రకటన నెలరోజులు దాటినా ఉలుకూపలుకూ లేని వైనం వందే భారత్ రైలు రాక కోసం డెల్టా వాసుల ఎదురుచూపు -
ఎస్ఆర్కేఆర్కు జాతీయస్థాయి అవార్డు
భీమవరం: స్థానిక ఎస్ఆర్కేఆర్ ఇంజనీరింగ్ కళాశాలకు జాతీయ స్థాయి అవార్డు లభించిందని కళాశాల సెక్రటరీ అండ్ కరస్పాండెంట్ సాగి రామకృష్ణ నిషాంత్వర్మ మంగళవారం విలేకరులకు తెలిపారు. గత నెల 25వ తేదీన హైదరాబాద్లో బ్రెయినో విజన్ సంస్థ నిర్వహించిన ఓవరాల్ ఎక్సలెన్స్ ఇన్ ఎడ్యుకేషన్ ఫర్ ఇట్స్ ఔట్ స్టాండింగ్ కంట్రిబ్యూషన్ టు అకడమిక్ ఎక్సలెన్స్, ఇన్నోవేషన్, స్టూడెంట్ ఎంపవర్మెంట్ అండ్ లీడర్షిప్ ఇన్ హైయర్ ఎడ్యుకేషన్లో అవార్డు లభించందన్నారు. అలాగే లీడర్షిప్ ఇన్నోవేషన్లో విద్యార్థులను ప్రోత్సహించడంలో కృషి చేసిన ప్రిన్సిపాల్ కేవీ మురళీకృష్ణంరాజుకు భీష్మాచార్య అవార్డు, టీచింగ్ ఇన్నోవేషన్, హ్యాకథాన్ ఇన్నోవేటివ్ కార్యక్రమాల్లో కృషి చేసిన ఐటీ డిపార్ట్మెంట్ సీనియర్ ప్రొఫెసర్ ఐ హేమలత ఉత్తమ అధ్యాపక అవార్డు అందుకుకున్నట్లు చెప్పారు. ముదినేపల్లి రూరల్: ఆర్టీసీ బస్సు నుంచి దిగుతూ ప్రమాదవశాత్తూ కిందపడి మహిళ దుర్మరణం చెందిన ఘటన మంగళవారం జరిగింది. ముదినేపల్లికి చెందిన కోడూరు విజయలక్ష్మి (69) గత నెల 30న విజయవాడ నుంచి వస్తూ గుడివాడలో ముదినేపల్లికి పల్లె వెలుగు బస్సు ఎక్కింది. బస్సు ముదినేపల్లి గురజ రోడ్డుకు రాగానే బస్సు దిగుతూ ప్రమాదవశాత్తూ కిందపడగా తలకు తీవ్ర గాయమైంది. స్థానికులు గమనించి 108 ఆంబులెన్సులో గుడివాడ ఆసుపత్రికి తరలించగా చికిత్స పొందుతూ మంగళవారం ఉదయం మృతి చెందినట్లు హెడ్కానిస్టేబుల్ ప్రదీప్కుమార్ తెలిపారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు చెప్పారు. -
మంత్రి పేరు చెప్పి భూములు కబ్జా చేస్తే ఊరుకోం
నూజివీడు : ఏలూరు జిల్లా నూజివీడు మండలంలోని సీతారామపురానికి చెందిన టీడీపీ నాయకుడు మంత్రి పేరు చెప్పి భూములను కబ్జా చేయాలని చూస్తే ఊరుకునే ప్రసక్తే లేదని జనసేన ఉమ్మడి కృష్ణాజిల్లా అధికార ప్రతినిధి మరీదు శివరామకృష్ణ హెచ్చరించారు. మండలంలోని మీర్జాపురానికి చెందిన బీసీల భూమిని ఆక్రమిస్తున్న నాయకుడి నుంచి బాధితులకు న్యాయం చేయాలని కోరుతూ మరీదు శివరామకృష్ణతో పాటు మండల అధ్యక్షుడు యర్రంశెట్టి రాము, నాయకుడు ముమ్మలనేని సునీల్కుమార్ మంగళవారం తహసీల్దార్ గుగులోతు బద్రూనాయక్ను కలిసి విజ్ఞప్తి చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ బాధిత రైతులు ఇప్పటికే తమకు న్యాయం చేయాలని కోరుతూ సోషల్ మీడియాలో ప్రభుత్వాన్ని, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ను, స్థానిక మంత్రిని కోరారని చెప్పారు. పామర్తి చిట్టిబాబు, బుచ్చిబాబులు సాగు చేసుకునే భూమిని కబ్జా చేయాలని చూస్తే ఎవరూ ఊరుకోరన్నారు. సాగు చేసుకుంటున్నవారిని బెదిరించి లాక్కోవాలని చూసినా అలాంటివి నెరవేరవన్నారు. భూమిని రీ సర్వే చేయనీయకుండా అడ్డుకోవడమే కాకుండా రికార్డుల్లోకి సైతం ఎక్కనివ్వడం లేదని విమర్శించారు. మంత్రి కొలుసు పార్థసారథి పేరు చెప్పి అరాచకాలు చేయాలని చూస్తున్నాడన్నారు. ఇలాంటివి మానుకోవాలని హెచ్చరించారు. జనసేన నాయకుడు మరీదు శివరామకృష్ణ -
రాష్ట్ర స్థాయి వాలీబాల్లో అఖిల్శ్రీవర్మ ప్రతిభ
ఏలూరు (ఆర్ఆర్పేట): ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని కొవ్వూరు వేదికగా జరిగిన రాష్ట్రస్థాయి ఎస్జీఎఫ్ వాలీబాల్ క్రీడా పోటీల్లో ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా వాలీబాల్ జట్టు తృతీయ స్థానం సాధించింది. ఈ జట్టులో ఏఆర్డీజీకే ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి అఖిల్ శ్రీ వర్మ జట్టులో ప్రాతినిధ్యం వహించాడు. ఈ సందర్భంగా ఆదివారపుపేట ఆంధ్ర రత్న దుగ్గిరాల గోపాలకృష్ణయ్య (ఏఆర్డీజీకే) కార్పొరేషన్ ఉన్నత పాఠశాలలో అభినందన సభ నిర్వహించారు. విద్యార్థి అఖిల్ శ్రీ వర్మను, వ్యాయామ ఉపాధ్యాయులు తోట శ్రీనివాస్ కుమార్, అబ్బదాసరి జోజి బాబులను ప్రధానోపాధ్యాయుడు ఉన్నమట్ల కాంతి జయకుమార్, ఇతర ఉపాధ్యాయులు, సిబ్బంది అభినందించారు. -
షాడో డీఎంహెచ్ఓ
● వైద్య ఆరోగ్య శాఖలో సాధారణ ఉద్యోగి పెత్తనం ● నిబంధనలకు పాతరేస్తూ డిప్యుటేషన్లు ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో ఆయనో సాధారణ ఉద్యోగి. ఆ శాఖలో ఏ పని కావాలన్నా చేసేస్తాడు. చేతులు తడిపితే చాలు నిబంధనలకు పాతరేస్తూ ఏదైనా చేయగల సమర్ధుడు. శాఖలోని వివిధ విభాగాల ఉద్యోగులు ఆయన్ని షాడో డీఎంహెచ్వో అంటారు. డబ్బులు కొట్టండి.. పనులు చేయించుకోండి అనే తరహా వ్యవహారశైలి ఉంటుందని చెబుతున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో డిప్యుటేషన్ల నుంచి కారుణ్య నియామకాల వరకూ.. ఆఖరికి పోలీసు అటెస్టేషన్ వరకూ సిబ్బందికి ఏ పని కావాలన్నా ఆయన్ను ప్రసన్నం చేసుకుంటే చాలు పని పూర్తి అయినట్లే అంటున్నారు. ఇష్టారాజ్యంగా డిప్యుటేషన్లు వైద్య ఆరోగ్య శాఖలో ఆఫీస్ సబార్డినేట్గా ఒక వ్యక్తి చేరగా.. అతనికి ప్రొహిబిషన్ పూర్తి కాకుండానే రాజమండ్రి డిప్యుటేషన్ వేశారు. ఈ ఏడాది జూన్లో ఆ ఉద్యోగి నుంచి సొమ్ములు తీసుకుని సదరు షాడో డీఎంహెచ్వో డిప్యుటేషన్ వేయించినట్లు ఆరోపణలు ఉన్నాయి. సదరు ఉద్యోగిది రాజమండ్రి కావటంతో సొంత ఊరిలోనే చక్కగా ఉద్యోగం చేసుకుంటున్నాడు. ఒక సాధారణ ఉద్యోగికి ఇలా జిల్లాలు దాటి డిప్యుటేషన్ వేయడం నిబంధనలకు విరుద్ధం. మరో ఉద్యోగి పెదపాడు నుంచి ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయంలో డిప్యుటేషన్పై చాలాకాలంగా పనిచేస్తున్నట్లు తెలుస్తోంది. ఇంకో ఉద్యోగి కృష్ణాజిల్లా గొల్లపూడి నుంచి ఏలూరు డీఎంహెచ్వో కార్యాలయానికి డిప్యుటేషన్పై వచ్చి మూడేళ్ళు పూర్తి కావచ్చినా.. బదిలీలు జరుగుతున్నా వీరికి మాత్రం నిబంధనలు వర్తించడం లేదు. దీని వెనుక షాడో డీఎంహెచ్వో పాత్ర ఉందనే ఆరోపణలు ఉన్నాయి. అర్హత లేకున్నా పెత్తనం అర్హత లేకున్నా ఒక ఉద్యోగి క్లాస్–4 సీటులో కూర్చొని ఇష్టారాజ్యంగా పెత్తనం చేస్తున్నట్లు ఆరోపణలు వస్తున్నాయి. అతని ఉద్యోగం పీవోడీటీ సీనియర్ అసిస్టెంట్ కాగా... మరో సీటులో పాగా వేసి అంతా తానే అన్నట్లు వ్యవహరిస్తున్నాడని అంటున్నారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖలో సొమ్ములు ఇస్తే ఉద్యోగాలు ఇప్పించటం నుంచి.. రెగ్యులరైజేషన్, కారుణ్య నియామకాలు ఇలా ఏదైనా ఆయన్ని కలిసి.. జేబులు నింపితే చాలు పని సులువుగా అయినట్లేనని ఉద్యోగులు గుసగుసలాడుతున్నారు. చాలా కాలంగా శాఖలో పాతుకుపోయిన సదరు ఉద్యోగి జిల్లా స్థాయి అధికారులను మాయచేస్తూ పెత్తనం చెలాయిస్తున్నాడని అంటున్నారు. అతని కారణంగా ఉన్నతాధికారులు సైతం చిక్కుల్లో పడిన సంఘటనలు చాలానే ఉన్నాయని సిబ్బంది చెప్పటం అతని అవినీతికి నిదర్శనం. -
సొసైటీల్లో చేతివాటానికి చెక్ పెట్టాలి
ఏలూరు (ఆర్ఆర్పేట): సహకార సొసైటీల్లో అనేక సమస్యలు ఉన్నాయని, వాటిని పరిష్కరించకపోతే రైతులకు తీవ్ర అన్యాయం చేసినవారమవుతామని జిల్లాలోని పలువురు ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల చైర్మన్లు డీసీసీబీ చైర్మన్ గన్ని వీరాంజనేయులు దృష్టికి తీసుకొచ్చారు. మంగళవారం నిర్వహించిన డీసీసీబీ మహాజన సభలో ఉండి సొసైటీ చైర్మన్ కనకరాజు సూరి మాట్లాడుతూ సొసైటీల్లో సిబ్బంది, పాలకవర్గం ప్రతినిధుల చేతివాటంతో అవకతవకలు జరుగుతున్నాయని, వాటిని పూర్తిగా అదుపు చేయాలని సూచించారు. రైతులకు త్వరగా రుణాలు అందేలా చర్యలు చేపట్టాలన్నారు. రైతు నేస్తం షేరు ధనం కింద 10 శాతం కట్టించుకున్నారని, సొసైటీలకు చిల్లిగవ్వ ఇవ్వలేదని ఆవేదన వ్యక్తం చేశారు. మొత్తం మీరే తీసుకుంటే సొసైటీల మనుగడ ఎలా సాధ్యమని ప్రశ్నించారు. ములపర్రు సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో కమిషన్ పెండింగ్లో ఉందని, దానిని వెంటనే విడుదల చేయాలన్నారు. యర్రంపల్లి సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ సొసైటీల్లో వైట్కాలర్ నేరగాళ్లపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించారు. సహకార వ్యవస్థలో రైతులకు తీవ్ర అన్యాయం జరుగుతోందని, దేశంలో ఎక్కడా లేని విధంగా వారికిచ్చే రుణాలపై 12.5 శాతం వడ్డీ వసూలు చేస్తున్నారని, జాతీయ బ్యాంకుల్లో సైతం 7.5 శాతం వడ్డీకే రుణాలు ఇస్తున్నారని గుర్తు చేశారు. మొగల్తూరు సొసైటీ చైర్మన్ మాట్లాడుతూ అసైన్డ్ భూములకు గతంలో సొసైటీల ద్వారా రుణాలు ఇచ్చేవారమని ఇప్పుడు 1బీ, పట్టాదారు పాస్పుస్తకం ఉంటేనే రుణాలు ఇచ్చే పరిస్థితి ఉందన్నారు. చైర్మన్ గన్ని వీరాంజనేయులు మాట్లాడుతూ నూతన త్రీ మెన్ కమిటీ ప్రతినిధులు సొసైటీల అభివృద్ధికి కృషి చేయాలని సూచించారు. సమస్యలు ఏకరువు పెట్టిన చైర్మన్లు -
జీతాల కోసం ఎదురు చూపులు
శ్రీవారి హుండీ ఆదాయం రూ.4.22 కోట్లు ఏలూరు (మెట్రో): ఒకటో తారీఖు వచ్చిందంటే చాలు పాల బిల్లు దగ్గర నుంచి ఇంటి అద్దెలు, ఇలా అన్నీ ఖర్చులే.. ఆ రోజు జీతం కోసం ప్రభుత్వ ఉద్యోగి కోసం ఎదురు చూస్తుంటాడు. ప్రస్తుత కూటమి సర్కారులో మాత్రం ఒకటో తేదీన జీతాలు పడడం కలగా మారింది. ఈ నెల ఇంతవరకూ జీతాలు జమ చేయకపోవడంతో ఉద్యోగులు ఇక్కట్లు పడుతున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 67 వేలకు పైగా ఉద్యోగ, ఉపాధ్యాయులు ఉన్నారు. ఏలూరు జిల్లాలో 38 వేలు, పశ్చిమగోదావరి జిల్లాలో 29 వేల మంది విధులు నిర్వహిస్తున్నారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 20 వేలకు పైగా పెన్షనర్లు ఉన్నారు. వీరితో పాటుగా 15 వేల మంది అవుట్ సోర్సింగ్ ఉద్యోగులు, 17 వేల మంది కాంట్రాక్టు ఉద్యోగులు విధులు నిర్వహిస్తున్నారు. ప్రస్తుత ప్రభుత్వం వీరికి జీతాలు చెల్లించడంలో మాత్రం తాత్సారం చేస్తుంది. ఒక్కొక్కరికి ఒక్కో తేదీన.. ఒకటో తేదీన జీతాలు చెల్లింపు ప్రక్రియకు కూటమి ప్రభుత్వం వక్ర భాష్యం చెబుతోంది. అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు, న్యాయశాఖ ఉద్యోగులకు, పెన్షనర్లకు, గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందికి 3న జీతాలు చెల్లింపు చేసింది. అన్ని విభాగాల్లో పనిచేస్తున్న ప్రభుత్వ ఉద్యోగులకు మాత్రం 4వ తేదీ రాత్రి వరకూ కూడా జీతాలు చెల్లింపులు చేయలేదు. ఒక్కోశాఖకు ఒక్కో తేదీన చెల్లింపులు చేయడం ఏంటో అర్ధం కావడం లేదు. బిల్లులు మంజూరు చేసే ట్రెజరీ శాఖలో 4వ తేదీ నాటికీ జీతాలు చెల్లింపులు జరగలేదు. ప్రతి ఉద్యోగి గంటగంటకూ బ్యాంకు బ్యాలెన్స్లు చెక్ చేసుకునే పనిలో నిమగ్నమయ్యారు. ఒకటో తేదీ నాటికి జీతాలు జమ చేస్తే ఉద్యోగులు తమ నెలవారీ అప్పులు తీర్చుకుని కొత్తగా నెలను ప్రారంభిస్తారు. నవంబరు నెలలో ప్రభుత్వ ఉద్యోగులకు కూటమి సర్కారు నిర్వాకంతో ఇది కష్టసాధ్యంగా మారింది. గత వారం తీవ్ర ప్రయాసలు ఎదుర్కొంటూ మోంథా తుఫాను విధుల్లో ఉద్యోగులు నిమగ్నమయ్యారు. కొన్ని సందర్భాల్లో ఉద్యోగులు తమ సొంత సొమ్ములు ఖర్చు చేశారు. మోంథా తుపానును సమర్ధంగా ఎదుర్కొన్నప్పటికీ కేవలం ప్రశంసలతోనే కూటమి సర్కారు సరిపెట్టింది. ప్రస్తుత నెల జీతాల చెల్లింపులో తీవ్ర జాప్యం చేసింది. దీనిపట్ల ఉద్యోగులు తీవ్ర నిరాశ వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే డీఎల చెల్లింపుల్లో తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తున్న సర్కారు, కోట్లాది రూపాయలు వివిధ బకాయిలు ఉద్యోగులకు చెల్లించాల్సి ఉన్నప్పటికీ తీవ్ర నిర్లక్ష్య ధోరణిని కూటమి సర్కారు ప్రదర్శిస్తుంది. ప్రతి నెలా ఒకటో తేదీన చెల్లించాల్సిన జీతాలు చెల్లింపులో ఎందుకు తాత్సారం చేస్తుందని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు. ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమల చినవెంకన్న ఆలయ హుండీల నగదు లెక్కింపు స్థానిక ప్రమోద కల్యాణ మండపంలో మంగళవారం అత్యంత కట్టుదిట్టమైన భద్రత నడుమ జరిగింది. ఈ లెక్కింపులో శ్రీవారికి విశేష ఆదాయం సమకూరింది. గత 41 రోజులకు నగదు రూపేణా స్వామివారికి రూ.4,22,31,799 ఆదాయం లభించినట్టు ఆలయ ఈఓ ఎన్వీ సత్యనారాయణమూర్తి తెలిపారు. కానుకల రూపేణా భక్తులు సమర్పించిన 569 గ్రాముల బంగారం, 7.708 కేజీల వెండితో పాటు, అధికంగా విదేశీ కరెన్సీ లభించిందన్నారు. అదేవిధంగా లెక్కింపులోకి రాని రదైన పాత రూ. 2000, రూ. 1,000, రూ. 500 ల నోట్లు ద్వారా రూ. 41 వేలు వచ్చినట్టు చెప్పారు. ఇంతవరకూ ఉద్యోగుల ఖాతాల్లో జమకాని వైనం గంట గంటకూ బ్యాంకు బ్యాలెన్స్ చూసుకుంటున్న ఉద్యోగులు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా 35 వేల మంది ఎదురుచూపులు ప్రతి నెలా ఒకటో తేదీన జీతాలు చెల్లింపులు చేయాల్సి ఉన్నప్పటికీ నేటికీ ప్రభుత్వం జీతం చెల్లించడంలో తీవ్ర నిరక్ష్యం ప్రదర్శిస్తుంది. ఎన్ని సమస్యల్లో ఉన్నప్పటికీ జీతాలు చెల్లించకపోవడం దారుణం. ఒకటో తేదీన జీతాలు రాకపోవడంతో ఉద్యోగులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఎదురవుతోంది. – ఆర్ఎస్ హరనాథ్, పీఎఒ రాష్ట్ర అధ్యక్షుడు నవంబరు నెల 4వ తేదీ వచ్చినా ప్రభుత్వ ఉద్యోగులకు జీతాలు చెల్లించపోవడం దారుణం. ఒకటో తేదీ కోసం ప్రభుత్వ ఉద్యోగి నెల అంతా ఎదురు చూస్తూ ఉంటాడు. పాలు, అద్దెలు, కిరాణా వంటి ప్రతి ఒక్కటీ ఒకటో తేదీతోనే ముడిపడి ఉంటుంది. ఈ నేపథ్యంలో ఒకటో తేదీన జీతాలు చెల్లించకపోవడం చూస్తుంటే ప్రభుత్వానికి ఉద్యోగులపట్ల ఎంత చిత్తశుద్ది ఉందో అర్ధం చేసుకోవచ్చు. – కె.రమేష్కుమార్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ అధ్యక్షుడు -
కౌలు రైతు విలవిల
కొల్లేరు వాసుల్లో పాముల భయం కొల్లేరు వాసుల్లో పాముల భయం నెలకొంది. కై కలూరు నియోజకవర్గంలో ఈ ఏడాది ఇంతవరకూ 188 పాము కాటు కేసులు నమోదయ్యాయి. 10లో uబుధవారం శ్రీ 5 శ్రీ నవంబర్ శ్రీ 2025సాక్షి ప్రతినిధి, ఏలూరు: అన్నదాత సుఖీభవ లేదు.. పెట్టుబడి సాయ ఇవ్వరు.. ఇన్పుట్ సబ్సిడీకి అనర్హుడు.. కొద్దొ గొప్పొ వచ్చే బీమా కూడా ఎత్తేశారు. జిల్లాలో కౌలు రైతు పరిస్థితి ఇది. క్షేత్రస్థాయిలో 80 శాతానికి పైగా సాగు చేసేది కౌలు రైతులు. జిల్లాలో లక్షల ఎకరాల భూమిని సాగుచేసే కౌలు రైతులు అప్పుల పాలై ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. సీజన్లో ధరలు బాగుంటాయనే ఆశతో అధిక వడ్డీలకు అప్పులు తేవడం, పంటలు సాగు చేయడం, కోతల సమయానికి తుపాన్తో నష్టపోవడం ప్రతి ఏటా నిత్యకృత్యంగా మారి వేలాది మందిని ఆర్థికంగా కుంగదీస్తుంది. కూటమి ప్రభుత్వం కౌలురైతులను పూర్తిగా ఆదుకుంటామని ఎన్నికల సమయంలో పదేపదే హామీ ఇచ్చి 18 నెలల పాలనలో విస్మరించారు. పర్యవసానంగా అప్పులతో పంట సాగు చేసే కౌలురైతులు ఏటా ఆత్మహత్యలకు పాల్పడుతున్న పరిస్ధితులు జిల్లాలో కొనసాగుతూనే ఉన్నాయి. రాష్ట్రంలోనే అత్యధికంగా కౌలు రైతులున్నది ఏలూరు జిల్లాలోనే. జిల్లాలో 4,77,500 ఎకరాల సాగు విస్తీర్ణంలో 1,95,875 ఎకరాల్లో వరి, అపరాలు, పత్తి పంటలు సాగులో ఉండగా మిగిలిన 2,72,939 ఎకరాల్లో పామాయిల్, కోకో సహా ఉద్యానవన పంటలు సాగులో ఉన్నాయి. జిల్లా వ్యాప్తంగా 5 లక్షల మంది రైతులుండగా అత్యధికంగా 2 లక్షలకుపైగా కౌలు రైతులే ఉండి 70 శాతం పైగా సాగు చేస్తున్నారు. కౌలు రైతుకు గుర్తింపు కార్డు మొదలుకొని ఎలాంటి అధికారిక సేవలు అందకపోవడంతో ఏటా నష్టాలు చవిచూడాల్సి వస్తుంది. గతంలో పామాయిల్, కోకో, పొగాకు ధరలు పెరగడంతో ఆ మూడు పంటల కౌలు ధరలు భారీగా పెరిగాయి. సీజన్ అనుకూలిస్తే తెచ్చిన అప్పు తీర్చే పరిస్థితి ఉంటుంది. గడిచిన 18 నెలల్లో జిల్లాలో ప్రకృతి వైపరీత్యాలతో నష్టపోవడం ఇది మూడవ సారి. తుపాను, గోదావరి వరదలు దాటికి పంట నష్టం వాటిల్లితే ఇన్పుట్ సబ్సిడీ ఇస్తామని ప్రకటించినా.. గత 18 నెలల్లో ఒక్కసారి ఇచ్చిన దాఖలాలు లేవు. గుర్తింపు కార్డుల కోసం పోరుబాట కౌలు రైతులకు గుర్తింపు కార్డులు ఇవ్వాలని కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన నాటి నుంచి పోరుబాట కొనసాగుతూనే ఉంది. తరుచూ ప్రజాసమస్యల పరిష్కార వేదికలో కలెక్టర్, ఇతర అధికారులకు కౌలు రైతులు వినతిపత్రాలు ఇస్తూనే ఉన్నారు. భూ యజమాని అంగీకారంతో సంబంధం లేకుండా గుర్తింపు కార్డులు ఇప్పిస్తామని, బ్యాంకు రుణాలు ఇస్తామని, క్రాప్లోన్, ఇన్పుట్ సబ్సిడీ, బీమా ఇస్తామని ప్రకటించి పూర్తిగా విస్మరించారు. ముఖ్యమంత్రి, ఉపముఖ్యమంత్రి మరో అడుగు ముందుకేసి మరణించిన కౌలురైతు కుటుంబానికి ఆర్థిక సాయం అందిస్తామని చెప్పారు. ఏ ఒక్కటీ అమలు చేయకపోవడంతో పరిస్ధితి ఆగమ్య గోచరంగా మారింది. తాజాగా మోంథా తుఫాన్ధాటికి 23 వేలకుపైగా పంట నష్టం వాటిల్లితే దానిలో 80 శాతానికిపైగా సాగుదారులు కౌలు రైతులు. ఈ క్రమంలో ప్రభుత్వం ఇచ్చే పరిహారం కూడా భూ యజమానులకే తప్ప కౌలు రైతులకు అందని పరిస్ధితి. వెబ్ల్యాండ్ నమోదు ఆధారంగా పంట నష్టాన్ని నమోదు చేసుకుని వారికే పరిహారం ఇవ్వనున్నారు. ఈ క్రమంలో వెబ్ల్యాండ్లో పూర్తిగా భూయజమానుల పేర్లే కాని కౌలురైతుల పేర్లు లేకపోవడం గమనార్హం. తుపాను వల్ల నష్టపోయిన కౌలు రైతులను ఆదుకునేందుకు కూటమి ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలు శూన్యం. పంటను పరిశీలించేందుకు ఏ అధికారీ రాలేదు. నేలకొరిగిన, పొట్ట దశలో దెబ్బతిన్న పంట వల్ల దిగుబడులపై తీవ్ర ప్రభావం చూపుతుంది. పెట్టుబడి ఖర్చులు వచ్చేలా లేదు. ఐదు ఎకరాల వరి కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాను. రూ.1.5 లక్షల అప్పు చేసి పెట్టుబడి పెట్టాను. తుపాను వల్ల పంట పడగా, వర్షం వల్ల పంట తాలు గింజలు ఏర్పడ్డాయి. పెట్టుబడులు కూడా వస్తాయన్న ఆశా లేదు. కౌలు రైతులకు భరోసా వస్తుందన్న నమ్మకం లేదు. – పెట్ల ఇశ్రాయేలు, కౌలు రైతు, ఎంఎం పురం, భీమడోలు మండలం కౌలు రైతులను ఆదుకుంటామని కూటమి ప్రభుత్వం హామీ ఇచ్చింది. సార్వాలో గతంలో కన్నా ఈ ఏడాది పురుగుమందులు, వ్యవసాయ కూలీలకు ఖర్చులు పెరిగాయి. దీంతో పాటు బ్లాక్ మార్కెట్లో యూరియాను కొనుగోలు చేసుకోవాల్సిన దుస్థితి ఏర్పడింది. 10 ఏకరాల భూమిని కౌలుకు తీసుకుని పీఎల్ పంటను సాగు చేస్తున్నాను. ఇప్పటి వరకు ఏ ఒక్క అధికారి కూడా నష్టపోయిన పంటను చూడడానికి రాలేదు. ఎకరాకు రూ.40 వేల వరకు ఖర్చు చేసాను. వర్షం వల్ల తాలు గింజలయ్యాయి. దిగుబడులు సగానికి తగ్గిపోతాయి. – పెద్దిరెడ్డి భోగయ్య, కౌలు రైతు, ఎంఎం పురం, భీమడోలు మండలం పెట్టుబడి సాయం నుంచి ఏ పథకమూఅందని వైనం కౌలు రైతులను ఆదుకుంటామని ఎన్నికల సమయంలో కూటమి ప్రభుత్వ ప్రకటన 18 నెలలు దాటినా కనీసం పట్టించుకోని వైనం మోంథా తుపానుతో మరింత నష్టం జిల్లాలో 2 లక్షల మందికిపైగా కౌలు రైతులు -
పేదల కల జగన్తోనే సాధ్యం
ముదినేపల్లి రూరల్: డాక్టర్ కావాలనే పేద విద్యార్థుల ఆకాంక్షలను నెరవేర్చేందుకు వైఎస్సార్సీపీ పాలనలో ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి కృషి చేశారని వైఎస్సార్సీపీ జిల్లా కన్వీనర్, మాజీ ఎమ్మెల్యే దూలం నాగేశ్వరరావు(డీఎన్నార్) అన్నారు. మండలంలోని శ్రీహరిపురం శివారు చేవూరుపాలెం, సింగరాయపాలెం గ్రామాల్లో కోటి సంతకాల సేకరణ ప్రజాఉద్యమం–రచ్చబండ కార్యక్రమాన్ని పార్టీ మండల శాఖ అధ్యక్షుడు బోయిన రామరాజు, ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ ఆధ్వర్యంలో మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ పేద విద్యార్థులకు మేలు చేసేందుకు ముఖ్యమంత్రిగా జగన్మోహన్రెడ్డి 17 మెడికల్ కళాశాలలకు అనుమతులు సాధించి నిర్మాణాలు చేపడితే అధికారంలోకి వచ్చిన కూటమి ప్రభుత్వం కక్ష సాధింపుతో వీటిని ప్రైవేటు పరం చేస్తుందని విమర్శించారు. దీనివల్ల పేదలకు వైద్య విద్యను అభ్యసించే అవకాశాన్ని కోల్పోవడంతో పాటు పేద ప్రజలకు వైద్యం ఖరీదుగా మారుతుందన్నారు. కార్యక్రమంలో ముదిరాజ్ విభాగం రాష్ట్ర అధ్యక్షుడు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర మహిళా కార్యదర్శి గంటా సంధ్య, జిల్లా అధికార ప్రతినిధి మోట్రు ఏసుబాబు, సాంస్కృతిక విభాగం జిల్లా ఉపాధ్యక్షుడు రంగిశెట్టి నరసింహారావు(కొండా), జిల్లా బూత్ కమిటీ కార్యదర్శి మంగినేని బాబ్జి, నాయకులు పంజా నాగు, రాచూరి మోహన్, సాక్షి సాయిబాబు, అచ్యుత రాంబాబు, శింగనపల్లి రామకృష్ణ, మీగడ సూర్యచ్రందరావు, పరసా శ్రీను, ఏసు రాజు, వాసే జయరాజు, శొంఠిరాము, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు. -
‘వందే భారత్’ రాక ఎప్పుడో?
చైన్నె–విజయవాడ వందేభారత్ రైలును నరసాపురం వరకూ పొడిస్తామని కేంద్ర మంత్రి శ్రీనివాసవర్మ చెప్పి నెల రోజులు గడిచినా ఇంతవరకూ పురోగతి లేదు 10లో uఏలూరు(మెట్రో): కలెక్టరేటు గౌతమీ సమావేశ మందిరంలో మంగళవారం జిల్లా పరిశ్రమలు, ఏగుమతులు ప్రోత్సాహక కమిటీ సమావేశం కలెక్టరు కె.వెట్రిసెల్వి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టరు మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల్లో పరిశ్రమలు, ఫుడ్ ప్రాసెసింగు యూనిట్లు ఎక్కువగా స్థాపించడంపై ప్రత్యేక దృష్టి పెట్టాలని, గిరిజన యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు మరింత పెంచి గిరిజన కుటుంబాల్లో వెలుగులు నింపాలన్నారు. ఐటీడీఏ గిరిజన ఉత్పత్తులు నాణ్యతను మరింత పెంచి, అందమైన ప్యాకింగులు, మార్కెటు సౌకర్యం కల్పించి గిరిజనులకు అధిక లాభాలు వచ్చేలా చర్యలు తీసుకోవాలన్నారు. ప్రతి అసెంబ్లీ నియోజకవర్గానికి ఇండస్ట్రియల్ పార్కులు ఏర్పాటు నిమిత్తం భూములు గుర్తించామని చెప్పారు. సింగిల్ విండో పథకం ద్వారా త్వరితగతిన అనుమతులు ఇవ్వాలని, మంజూరు చేసిన ప్రతి యూనిట్ ప్రారంభించేలా చర్యలు చేపట్టాలన్నారు. ఈ నెలలో 435 అనుమతులు మంజూరు గాక, పెండింగ్లో ఉన్న 39 అనుమతులు వీలైనంత త్వరగా మంజూరు చేయాలని కలెక్టరు ఆదేశించారు. ప్రైవేటు పెట్టుబడిదారులను ఆహ్వానించి ప్రభుత్వం నుంచి వారికి కావలసిన సౌకర్యాలు, సహాయం అందించడం కోసం వారితో ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేయాలని ఆదేశించారు. సమీక్ష సమావేశంలో జేసీ అభిషేక్ గౌడ, పరిశ్రమల కేంద్ర జీఎం పి.సుబ్రహ్మణ్యేశ్వరరావు, ఏపీఐఐసీ జోనల్ మేనేజరు కె.బాబ్జీ, పరిశ్రమలు తనిఖీ అధికారి కె.కృష్ణమూర్తి, డీఆర్డీఏ పీడీ ఆర్.విజయరాజు, స్కిల్ డెవలప్మెంట్ అధికారి జితేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు. -
కూరగాయలు కొనలేం
దొండకాయలు దడ పుట్టిస్తుంటే.. బీర కాయలు బెంబేలెత్తిస్తున్నాయి.. వంకాయలు వణుకు పుట్టిస్తుంటే.. బెండ కాయలు బేజారెత్తిస్తున్నాయి.. ఆనబకాయ తానేమీ తక్కువ కాదంటోంది.. కూరగాయలు రకం ఏదైనా వారం రోజుల వ్యవధిలో ధర రెండు, మూడింతలు పెరిగి వినియోగదారులకు చుక్కలు చూపిస్తున్నాయి. కార్తీకమాసంతో వినియోగం పెరగ్గా.. మోంథా తుపాను ప్రభావంతో పంటలకు నష్టం వాటిల్లడం ధరల పెరుగుదలకు కారణమని వ్యాపారులు అంటున్నారు. మొన్నటివరకు రూ.50 పెడితే పావు కిలో చొప్పున మూడు, నాలుగు రకాల కూ రగాయలు వచ్చేవి. ఇప్పుడు ఒక్కో కూరగాయ పావు కిలో రూ.30 పైనే ఉన్నాయి. ఎ న్నడూ లేనంతగా కూరగాయల ధరలు పెరిగిపోయాయి. సామాన్యులు కొ నలేని పరిస్థితి ఉంది. ఆయిల్, పప్పుల ధరలు కూడా ఎక్కువగా ఉంటున్నాయి. – కోరం లలిత, గృహిణి, గంగడుపాలెం నరసాపురం రూరల్ పితాని మెరక గ్రామంలో 1.5 ఎకరాల్లో వంగ, బీర, ఆనబ, దో సకాయలు సాగు చేస్తున్నాం. తుపాను ధాటికి రోజుల తరబడి నీరు నిలిచిపోవడంతో దోస పాదు పూర్తిగా పోయింది. బీర, ఆనబ పాదుల్లో పిందెలు మాడిపోయాయి. వంగ పంట పూర్తిగా దెబ్బతింది. వీటిని తొలగించి మరలా కొత్త పంట వేసుకోవాలి. – విజయ బాలచంద్ర, రైతు, నరసాపురం రూరల్, పశ్చిమగోదావరిసాక్షి, భీమవరం : కార్తీకమాసంలో మాంసాహారం తగ్గి కూరగాయల వినియోగం పెరుగుతుంది. రోజూ కార్తీక దీపారాధన చేసే భక్తులతో పాటు ఎక్కడ చూసినా శివ, అయ్యప్ప, మావుళ్లమ్మ వారి మాలధారులే కనిపిస్తున్నారు. ఊరూరా ఆలయ కమిటీలు, భక్త బృందాలు, దాతలు ఉచిత అన్నప్రసాద శిబిరాలను ఏర్పాటుచేసి మాలధారులకు బిక్షను అందిస్తున్నారు. దీంతో వినియోగం పెరగడంతో కార్తీకమాసం ప్రారంభం నుంచి కూరగాయల ధరలు పెరుగుతున్నాయని వ్యాపారులు చెబుతున్నారు. 5 వేల ఎకరాల్లో.. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలోని యలమంచిలి, పెనుగొండ, ఆచంట మండలాల్లోని గోదావరి లంక గ్రామాలు, కుక్కునూరు, వేలేరుపాడు, నూజివీడు, చింతలపూడి, ఆగిరిపల్లి తదితర ప్రాంతాల్లో 5 వేల ఎకరాల్లో కూరగాయల పంటలు సాగవుతున్నాయి. జిల్లాను ఆనుకుని ఉన్న డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ కోనసీమ, తూర్పుగోదావరి జిల్లాలోని లంకలు, చాగల్నాడు మెట్ట భూముల్లో బీర, బెండ, దొండ, వంకాయ, కాకర, ఆనబ తదితర పంటలు సాగవుతున్నాయి. ఉమ్మడి ఉభయగోదావరి జిల్లాల్లోని ఆయా పంటలు స్థానిక మార్కెట్లకు రావడంతో పాటు ఇతర జిల్లాలకు ఎగుమతి అవుతుంటాయి. ముంచేసిన మోంథా ఇటీవల వచ్చిన మోంథా తుపాను కూరగాయల పంటలపై తీవ్ర ప్రభావం చూపింది. రోజుల తరబడి ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలతో పంట పూత రాలిపోవడం, మొదళ్లలో నీరు నిలిచిపోయి, ఇవక అయిపోయి తీవ్ర నష్టం వాటిల్లింది. పశ్చిమగోదావరి జిల్లాలోని మొగల్తూరు, నర సాపురం రూరల్, ఆచంట, యలమంచిలి మండలాల్లోని దాదాపు 480 ఎకరాల్లోని కూరగాయల పంటలకు నష్టం వాటిల్లినట్టు ఉద్యాన శాఖ అధికారులు ప్రాథమికంగా అంచనా వేయగా, పంట నష్టం ఇంకా భారీగానే ఉంటుందని రైతులు అంటున్నారు. భారీగా పెరిగిన ధరలు పంటలు దెబ్బతిని వాటి దిగుబడులు గణనీయంగా తగ్గిపోయాయి. బీర, బెండ, దొండ, వంగ తదితర రకాల కూరగాయలు కిలో రూ.80 పైనే పలుకుతుండగా చిక్కుళ్లు రూ.160కి చేరాయి. గతంలో రూ.15కు దొరికే ఆనబకాయ ధర మూడింతలు పెరగ్గా, కోల్కతా, బెంగళూరు ప్రాంతాల నుంచి దిగుమతి చేసుకునే బంగాళాదుంప, బీట్రూట్, క్యారెట్, క్యాబేజీ ధరలు రెండింతల వరకు పెరిగాయి. బయటి మార్కెట్లో ధరలు ఇలా ఉంటే తోపుడు బండ్లు, సైకిళ్లపై అమ్మకాలు చేసే వారి వద్ద ఈ ధరలు మరింత అధికంగా ఉంటున్నాయని వినియోగదారులు అంటున్నారు. గతంలో ఎప్పుడూ ఇంత భారీస్థాయిలో ధరలు పెరగలేదని, కూరగాయల పంటలు పూర్తిస్థాయిలో అందుబాటులోకి వచ్చేందుకు రెండు, మూడు వారాల సమయం పడుతుందని వ్యాపారులు చెబుతున్నారు. దళారుల దోపిడీ రైతుల నుంచి నేరుగా దళారులు టోకున కూ రగాయలు కొనుగోలు చేసి చిల్లర వర్తకులకు అధిక ధరలకు విక్రయిస్తుండటం ధరలు పెరుగుదలకు దారితీస్తోంది. రిటైల్ మార్కెట్కు చేరేసరికి కూరగాయలు కిలోకు రూ.5 నుంచి రూ.8 వరకు పెరిగిపోతున్నాయి. దళారుల బెడదను అరికట్టే దిశగా అధికారులు చర్యలు తీసుకోవాలని వినియోగదారులు కోరుతున్నారు. బె‘ధర’గొడుతున్నాయ్ కార్తీకమాసంతో పెరిగిన వినియోగం పంటలపై మోంథా తుపాను ప్రభావం కూరగాయల ధరలకు రెక్కలు ఉమ్మడి పశ్చిమలో 5 వేల ఎకరాల్లో సాగు రకం తుపానుకు ముందు ప్రస్తుతం వంకాయ 30–40 100–120 బీరకాయ 40 80–100 బెండకాయ 25–30 80–90 దొండకాయ 40 60 పచ్చిమిర్చి 30 50–60 చిక్కుడు 60–80 140–160 క్యారెట్ 30 70 బీట్రూట్ 30 60–70 బంగాళాదుంప 20 30–40 ఆనబకాయ (ఒకటి) 15–20 50–60 -
కూటమి నిర్లక్ష్యం.. మెడికల్ పీజీ సీట్లలో కోత
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వ నిర్లక్ష్యంతో ఏ లూరు ప్రభుత్వ వైద్య కళాశాలకు పీజీ సీట్లలో కోత పడింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో రూ.525 కోట్ల అంచనాలతో ప్రభుత్వ వైద్య కళాశాల, బోధనాస్పత్రిని అందుబాటులోకి తీసుకువచ్చారు. 2023 సెప్టెంబర్లో ఎంబీబీఎస్ తరగతులు కూడా ప్రారంభించారు. అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన 18 నెలల కాలంలో కళాశాల అభివృది పనులపై చంద్రబాబు సర్కారు పూర్తి నిర్లక్ష్యం వహిస్తోంది. రాష్ట్రంలో గత ప్రభుత్వంలో ప్రారంభించిన ఐదు మెడికల్ కాలేజీలకు నేషనల్ మెడికల్ కౌన్సిల్ 60 పీజీ సీట్లను మంజూరు చేయగా.. దీనిలో ఏలూరు కాలేజీకి మాత్రం 4 సీట్లు మాత్రమే కేటాయించారు. 12 సీట్లు కోల్పోయి.. ప్రభుత్వ నిర్లక్ష్యం కారణంగా ఏలూరు వైద్య కళాశాలకు దక్కాల్సిన మరో 12 పీజీ సీట్లు కోల్పోయినట్టు తెలుస్తోంది. నంద్యాల ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 16 పీజీ సీట్లు, తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి ప్రభుత్వ మెడికల్ కాలేజీకి 16 పీజీ సీట్లు, మచిలీపట్నం, విజయనగరం ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు చెరో 12 పీజీ సీట్లు ఎన్ఎంసీ మంజూరు చేయగా.. ఏలూరుకు మాత్రం 4 సీట్లు కేటాయించారు. ఎన్ఎంసీ తనిఖీలు పీజీ సీట్ల మంజూరుకు సంబంధించి ఏలూరు కళాశాలలో ఎన్ఎంసీ తనిఖీలకు వచ్చే సమయానికి గైనిక్, జనరల్ సర్జరీ, పీడియాడ్రిక్స్, అనస్థీషియా, ఆర్థోపెడిక్స్ విభాగాల్లో పూర్తిస్థాయిలో ప్రొఫెసర్లు, అసోసియేట్ ప్రొఫెసర్ల నియామకం చేయకపోవటంతో పీజీ సీట్లు కోల్పోయినట్టు పలువురు చెబుతున్నారు. ఇటీవల జనరల్ సర్జరీ, పీడియాట్రిక్స్, అనస్థీషియా, ఆర్థోపెడిక్స్ విభాగాలకు ఫ్రొఫెసర్ల నియామకం చేశారు. అయినా గైనిక్లో ప్రొఫెసర్ పోస్టు ఖాళీగానే ఉంది. పీజీ సీట్లకు డిమాండ్ ఎంబీబీఎస్ వైద్య విద్యను అభ్యసించిన డాక్టర్లకు పీజీ కోర్సు పూర్తి చేయటం జీవిత ఆశయం. ఈ నేపథ్యంలో మెడిసిన్ పీజీ సీటు కోసం కార్పొరేట్, ప్రైవేట్ మెడికల్ కాలేజీల్లో మేనేజ్మెంట్ కోటాలో సుమారు రూ.2 కోట్ల నుంచి రూ.4 కోట్ల వరకు ధర పలుకుతుంది. ఇంతటి విలువైన పీజీ సీట్లను ప్రభుత్వ మెడికల్ కాలేజీలకు మంజూరుపై మరింత శ్రద్ధ పెట్టాల్సిన ప్రభుత్వం, అధికారులు అలసత్వంతోనే ఏలూరు కాలేజీ సీట్లు నష్టపోయిందని పలువురు అంటున్నారు. దీని వల్ల పేద విద్యా ర్థులకు నష్టమని అంటున్నారు. ఏలూరు ప్రభుత్వ మెడికల్ కళాశాల భవనం వైద్య విద్య అభ్యసిస్తున్న మెడిసిన్ విద్యార్థులకు మూడో ఏడాది వచ్చినా సరైన మౌలిక సదుపాయాలు కల్పించేందుకు ప్రభుత్వం బాధ్యత తీసుకోవటం లేదు. ఒకవైపు భవన నిర్మాణాలు, మరో వైపు వసతి సౌకర్యాలు, ప్రధానంగా నిపుణులైన ప్రొఫెసర్ల పోస్టుల భర్తీలో తీవ్ర జాప్యంతో పీజీ సీట్లు రాకుండా పోయాయి. మిగిలిన నాలుగు కొత్త ప్రభుత్వ వైద్య కళాశాలల్లో 56 పీజీ సీట్లు వస్తే, ఏలూరుకు కేవలం 4 పీజీ సీట్లు దక్కటం బాధాకరం. – కందుల దినేష్రెడ్డి, వైఎస్సార్సీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధి ఏలూరు మెడికల్ కాలేజీకి న్యాయంగా కేటాయించాల్సిన 12 పీజీ సీట్లు కోల్పోవటం బాధాకరం. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డి దార్శనికతతో రాష్ట్రంలోని బీసీ, ఎస్సీ, ఎస్టీ, మైనార్టీ, ఈబీసీ అభ్యర్థులకు ఉన్నత విద్యను చేరువ చేసేందుకు ప్రభుత్వ వైద్య కళాశాలలను ఏర్పాటుచేశారు. అయితే కూటమి ప్రభుత్వం కనీసం ప్రొఫెసర్ల పోస్టులు కూడా భర్తీ చేయకపోవటంతో విలువైన పీజీ సీట్లు నష్టపోయాం. వచ్చే ఏడాదికైనా ప్రభుత్వం శ్రద్ధ వహిస్తే బాగుంటుంది. –ప్రత్తిపాటి తంబి, వైఎస్సార్సీపీ లీగల్ సెల్ ఏలూరు అధ్యక్షుడు ఏలూరు కాలేజీకి 4 సీట్లు మాత్రమే కేటాయింపు ప్రొఫెసర్ల నియామకం చేయకపోవడమే కారణం మౌలిక వసతుల కల్పన లేమి -
అమాని చెరువుతో ముంపు ఇక్కట్లు
ఏలూరు (ఆర్ఆర్పేట): ఆగిరిపల్లి మండలంలోని సగ్గూరు, చొప్పరమెట్ల, అమ్మవారిగూడెం, నరసింగపాలెం గ్రామ రైతులను అమాని చెరువు ముంపు సమస్య నుంచి కాపాడాలని బాధిత రైతులు సోమవారం కలెక్టరేట్ వద్ద ధర్నా నిర్వహించారు. బాధిత రైతు కోటగిరి వెంకట విజయ మురళీమోహనరావు మాట్లాడుతూ సగ్గూరులోని అమానిచెరువు నాలుగు గ్రామాల భూములను ముంపునకు గురిచేస్తోందన్నారు. 2024లో ముంపుతో తీవ్రంగా నష్టపోయామని, తాజాగా తుపాను తాకిడికి పొలాలు ముంపు బారిన పడ్డాయన్నారు. చెరువు కళింగ ఎత్తు తగ్గించమని గతంలో కోరినా అధికారులు చర్యలు తీసుకోలేదని, కనీసం తూము కూడా తీయకపోవడంతో పొలాలు ముంపునకు గురవుతున్నాయన్నారు. తమ సమస్య పరిష్కారానికి చర్యలు తీసుకోవాలని కలెక్టర్కు వినతిపత్రం సమర్పించారు. -
మాల ధారణం.. సన్మార్గ సోపానం
బుట్టాయగూడెం: అయ్యప్ప స్వామి దీక్ష క్రమబద్ధమైన జీవన విధానం నేర్పే భక్తి మార్గం. దురలవాట్ల నుంచి విముక్తి కలిగించి క్రమశిక్షణ వైపు నడిపించే ఆధ్యాత్మిక మార్గం. భక్తి నియమ నిబంధనలే ప్రామాణికంగా సాగుతున్న అయ్యప్పస్వామి మాలధారణకు ఏటా ప్రాముఖ్యత పెరుగుతోంది. హరిహరాదులకు ప్రీతికరమైన కార్తీక మాసంలో మాలాధారణ ఎక్కువగా చేస్తారు. ఈ ఏడాది జిల్లా వ్యాప్తంగా సుమారు 18 వేల మందికి పైగా స్వామి మాల ధరించినట్లు సమాచారం. దీక్ష చేపట్టిన స్వాములు రాజమండ్రి సమీపంలో ఉన్న ద్వారపూడి, జంగారెడ్డిగూడెం సమీపంలోని గుర్వాయిగూడెం వద్దనున్న అయ్యప్పస్వామి ఆలయాల్లో స్వామికి ఇరుముడులు చెల్లించి దీక్షలు విరమిస్తారు. అత్యధికం శబరిమలై వెళ్లి అయ్యప్పను దర్శిచుకుని దీక్షను విరమిస్తారు. ఈ నెల 18న మండల దీక్ష కోసం వెళ్తున్నారు. మరికొందరు స్వాములు జనవరి 14న జ్యోతి దర్శనానికి బయల్దేరతారు. ప్రస్తుతం మండల, మకర జ్యోతి దర్శనం కోసం కార్తీకమాసం ఆరంభం నుంచి దీక్షలు చేపట్టిన స్వాములు ఎక్కడ చూసినా కనిపిస్తున్నారు. 41 రోజులపాటు కఠోర దీక్ష చేస్తారు. బ్రహ్మచర్యం, చన్నీటి స్నానం, దీపారాధనలు, అయ్యప్ప శరణ ఘోష, సాత్వికాహారంతో భక్తులు ముందుకు సాగుతారు. ఈ ఏడాది దీక్ష స్వీకరించిన వారిలో 30 నుంచి 45 సంవత్సరాల వయసున్న వారు 50 శాతం ఉంటే వీరిలో యువకులు 30 శాతం వరకూ ఉన్నట్లు తెలుస్తుంది. అయ్యప్ప దీక్ష నియమాలు ● రోజూ వేకువనే మేల్కొని చన్నీటి స్నానం చేయాలి. ● స్నానానికి ముందు మంచి నీరు తాగరాదు. ● మంత్ర మాలను ఎట్టి పరిస్థితుల్లో తీయకూడదు. ● శబరిమలై వెళ్లే భక్తులు 41 రోజుల దీక్షను కచ్చితంగా పాటించాలి. ● సన్నిధానంలో పదునెట్టంబడి ఎక్కే సమయానికి 41 రోజులు పూర్తి కావాలి. ● నలుపు లేదా నీలి రంగు దుస్తులు ధరించాలి(మొదటి సారి దీక్ష స్వీకరించిన కన్నె స్వాములు కచ్చితంగా నలుపు దుస్తులను ధరించాలి) ● కాళ్లకు చెప్పులు ధరించకూడదు. ● ప్రతీ సీ్త్రని దేవీ స్వరూపులుగా భావించాలి. ● తన పేరు చివర అయ్యప్పను కలుపుకోవాలి. ● దీక్ష కాలంలో ముఖ క్షవరం, కేశ ఖండన, గోళ్లు తీసుకోకూడదు. ఎవరైనా భిక్షకు పిలిస్తే తిరస్కరించకూడదు. ● రోజు మధ్యాహ్నం మాత్రమే భోజనం చేయాలి. రాత్రి అల్పాహారం మాత్రమే తీసుకోవాలి. ● ఉదయం పాలు, పళ్లు మాత్రమే ఆరగించాలి. అల్పాహారం తినకూడదు. ● మెత్తటి పరుపులు, దిండ్లు ఉపయోగించకూడదు. నేలమీద చాపపై విశ్రమించాలి. ● పగటిపూట నిద్రపోకూడదు, ఎల్లప్పుడూ విభూతి, చందనం, కుంకుమ బొట్టుతో ఉండాలి. ● మద్యం, మాంసం, ధూమపానం, తాంబూలం నిషేదం. కఠిన నియమాలే జీవిత ఉన్నతికి మార్గం దీక్షా నియమాలతో వ్యక్తిత్వ వికాసం సొంతం జిల్లాలో ఏటా పెరుగుతున్న అయ్యప్ప దీక్షాధారులు ఈ ఏడాది సుమారు 18 వేల మంది దీక్షలు చేపట్టిన స్వాములు స్వాముల పేర్లు ఇలా.. క్రమం తప్పకుండా ఏటా దీక్ష చేపట్టే భక్తులను పలు రకాల పేర్లతో పిలుస్తుంటారు. కన్నెస్వామి– మొదటి సారి దీక్ష కత్తి స్వామి– రెండో సారి దీక్ష గంట స్వామి– మూడో సారి దీక్ష గదస్వామి– నాల్గో సారి దీక్ష పెరుస్వామి– ఐదో సారి దీక్ష గురుస్వామి– ఆరో సారి దీక్ష అన్నప్రసాదం: అయ్యప్ప దీక్ష చేపట్టిన స్వాములు కొంత మంది సొంతంగా వండుకుంటారు. సాధ్యం కాని వారి కోసం అయ్యప్పస్వామి ఆలయ కమిటీలు అన్నదాన కార్యక్రమం నిర్వహిస్తున్నాయి. ఇరుముడికి అత్యంత ప్రాధాన్యం దీక్షలో 41 రోజుల తర్వాత చేసే ఇరుముడికి అత్యంత ప్రాధాన్యత ఉంటుంది. ఇరు అంటే రెండు అని అర్థం. అనగా రెండు ముడులు. మొదటి ముడిలో పీఠం, భస్మం, గంధం, కొబ్బరికాయలు, నెయ్యి, పూజా సామాగ్రి ఉంటాయి. రెండవ ముడిలో ప్రయాణానికి కావాల్సిన వస్తువులు ఉంటాయి. శబరిమలైకు ఆర్టీసీ బస్సులు దీక్షదారులు ఒక బృందంగా ఏర్పడి ఆర్టీసీ లేదా ప్రెవేటు బస్సులను సంప్రదిస్తే శబరిమలైకు బస్సు సౌకర్యం కల్పిస్తారు. కిలోమీటర్ ప్రకారం చార్జీలు వసూలు చేస్తారు. ప్రైవేటు ట్రావెల్స్ ఆధ్వర్యంలో ప్రత్యేక ప్యాకేజీల ప్రకారం ప్రత్యేక బస్సులు నడుపుతారు. ప్రత్యేక రైళ్ల ఏర్పాటు శబరిమలై అయ్యప్పను దర్శించుకోవడానికి రైలు అత్యంత తక్కువ ఖర్చుతో కూడింది. విజయవాడ నుంచి కొట్టాయం మీదుగా చెంగులూరు స్టేషన్లో దిగి కేరళ ఆర్టీసీ బస్సులు, స్వాములను పంపా నది, ఎరిమేలి, తదితర ప్రాంతాలకు తీసుకు వెళ్లేదుకు సిద్ధంగా ఉంటాయి. విమాన ప్రయాణం శబరిమలైకు విమానం ద్వారా వెళ్ళడానికి అవకాశం ఉంది. గన్నవరం, హైదరాబాదులోకి శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కొచ్చిన్ వెళ్లొచ్చు. లేదా బెంగుళూరు నుంచి కొచ్చిన్ వెళ్లొచ్చు. నేను సుమారు 8 సంవత్సరాల నుంచి దీక్షను స్వీకరించి శబరిమలకు వెళ్తున్నాను. 30 మంది బృందంగా ఏర్పడి దీక్షను ఆచరిస్తున్నాం. అయ్యప్ప దీక్ష వల్ల చక్కటి సేవా భావం ఏర్పడుతుంది. కంభంపాటి గంగరాజు, అయ్యప్ప మాలధారి, బుట్టాయగూడెం దీక్షలో ఉన్నన్ని రోజులూ జీవన విధానంలో ప్రత్యేకత ఉంటుంది. నియమ నిష్టలతో నిత్యం అయ్యప్పను స్మరించాలి. ఉదయం, సాయంత్రం ఆలయంలో పూజ చేయడంతో ఆధ్యాత్మిక ప్రశాంతత కలుగుతుంది. దండాబత్తుల ఫణికుమార్, అయప్ప మాలధారి, బుట్టాయగూడెం -
శంకర మఠానికి మంచి రోజులు!
ఏలూరు (ఆర్ఆర్పేట): ఏలూరు నగరం ఒకప్పుడు ఆధ్యాత్మిక కేంద్రంగా విలసిల్లింది. మఠాధిపతులు, పీఠాధిపతులు తమ పర్యటనకు వచ్చినప్పుడు వారికి ఆశ్రయం ఇవ్వడంతో పాటు జిల్లా కేంద్రానికి వచ్చే ఇతర ప్రాంతాలకు చెందిన ప్రజలకు ఆశ్రయం కల్పించి వారికి ఆకలిదప్పులు తీర్చేందుకు అప్పట్లో నగరంలోని రామచంద్రరావుపేటలో శంకరమఠం 80 సంవత్సరాల క్రితం స్థాపించారు. అనంతరం రామచంద్రరావు పేట నగరంలోనే కీలక వ్యాపార కేంద్రంగా మారింది. అక్కడి భూముల ధరలకు రెక్కలొచ్చాయి. శంకరమఠానికి ఉన్న భూములను ఆ సంస్థకు ధర్మకర్తలుగా వ్యవహరించిన వారే తెగనమ్ముకోవడం ప్రారంభించారు. శంకర మఠాన్ని 1946లో వడ్లమన్నాటి సుందరమ్మ అనే దాత స్థాపించారు. సుమారు 18 ఎకరాల భూమిని రిజిస్ట్రేషన్ చేయించారు. మఠం నిర్వహణకు ధర్మకర్తలను నియమించారు. శంకర మఠానికి తన పేరు పెట్టాలని, ఏలూరులో పర్యటించే పీఠాధిపతులు, వారి శిష్య పరివారం కోసం ఆశ్రమం నిర్మించాలని, వారికి భోజన సదుపాయాలు కల్పించాలని విల్లు రాశారు. శంకర మఠం నిర్మాణంలో ఉండగానే ఆమె మరణించారు. శంకర మఠాన్ని కొంతకాలం బాగానే నిర్వహించిన ధర్మకర్తలు సుందరమ్మ వారసుల పర్యవేక్షణ లేకపోవడంతో విల్లులో ఉన్న నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకుని సంస్థ ఆస్తులను విక్రయించడం మొదలుపెట్టారు. విల్లును అనుకూలంగా మలుచుకుని అమ్మకం దాత రాసిన విల్లు ప్రకారం రామచంద్రరావుపేట పడమర శ్రీఈశ్రీ వార్డులోని 3.06 ఎకరాల భూమిలో శంకర మఠం నిర్మించారు. దీని అభివృద్ధి కోసం 1948లో పత్తేబాద మోతే నరసింహరావు తోటకు పశ్చిమంగా (అశోక్ నగర్ ప్రాంతం) ఉన్న 8.32 ఎకరాల తమలపాకు తోటను రాసి రిజిస్టర్ చేయించారు. 1949 జనవరి 4న పెదపాడు మండలం సత్యవోలులోని మరో 8 ఎకరాల భూమిని మఠం అభివృద్ధి కోసమే రిజిస్టర్ చేయించారు. తన వంటమనిషి జాలమ్మ తనకు సేవలు చేస్తుండటంతో మెచ్చి సత్యవోలులోని 2 ఎకరాల భూమిని 1949లోనే రాసి ఆమె జీవిత కాలం అనుభవించవచ్చని, ఆమె మరణానంతరం ఆ భూమి శంకర మఠానికే చెందుతుందని విల్లు రిజిస్టరు చేయించారు. ఇవన్నీ ధర్మకర్తగా నియమించిన ఈదర వెంకట్రావు చేతిలో పెట్టారు. మఠం అభివృద్ధికి తాను రాసిన భూములను అవసరం మేరకు విక్రయించుకోవచ్చని విల్లులో పేర్కొన్నారు. మఠం అభివృద్ధికి అవసరమైతే విక్రయించుకోవచ్చనే పాయింటు ఆధారంగా ధర్మకర్త తమలపాకు తోటలోని 8.32 ఎకరాలను ఇళ్ల స్థలాలుగా మార్చి అమ్మేయడంతో పాటు, సత్యవోలులోని 8 ఎకరాల భూమిని కూడా విక్రయించేశారు. దాంతోపాటు శంకర మఠం ఉన్న 3.06 ఎకరాల విస్తీర్ణంలో ప్రస్తుతం మఠం ఉన్న భూమి 581.77 చదరపు గజాలు మినహా మిగిలిన భూమిని అమ్ముకుని సొమ్ము చేసుకున్నారు. 1972లో శంకరమఠం దేవాదాయశాఖ పరిధిలోకి వెళ్లింది. ఈ క్రమంలో మఠం ఉన్న 581.77 గజాల స్థలాన్ని క్రయవిక్రయాలకు తావు లేకుండా రిజిస్ట్రార్ కార్యాలయంలో నమోదు చేయించారు. అయినప్పటికీ ఆ ప్రాంతంలో ఖాళీగా ఉన్న కొన్ని వందల గజాలను కూడా ఆక్రమించుకోవడానికి ఇటీవల కొందరు ప్రయత్నించారు. ఈ మేరకు శంకర మఠం గోడను కూల్చి జేసీబీలతో చదును చేయించడం మొదలు పెట్టారు. విషయం తెలిసిన కొందరు దేవదాయ శాఖ అధికారుల దృష్టికి తీసుకువెళ్లగా ఆక్రమణకు గురి కాకుండా ఆపగలిగారు. రెండ్రోజుల క్రితం ఈ సంస్థకు సింగిల్ ట్రస్టీని దేవదాయ శాఖ అధికారులు నియమించడంతో సంస్థకు మంచి రోజులు వచ్చేనా అని పలువురు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. నగరంలోని శంకర మఠం సంస్థ దేవదాయ శాఖ గెజిట్లో నోటిఫై అయ్యింది. దీనిలో ఆక్రమణలకు తావులేదు. ఇటీవల మఠంలోని ఖాళీ స్థలం ఆక్రమణకు ప్రయత్నించడం వాస్తవమే. ఆక్రమణలను నిరోధించడాకే మా శాఖ డిప్యూటీ కమిషనర్ ఈ మఠానికి సింగిల్ ట్రస్టీగా నియమిస్తూ ఉత్తర్వులు ఇచ్చారు. కూచిపూడి శ్రీనివాస్, దేవదాయ శాఖ అధికారి, ఏలూరు జిల్లా కోట్లాది రూపాయల విలువైన ఆస్తులు ఇప్పటికే అన్యాక్రాంతం దేవదాయ శాఖ చేతిలోకి వెళ్లినా ఆగని ఆగడాలు ఇటీవలే ట్రస్టీ నియామకం -
పచ్చని పొలాల్లో నేవీ డిపో వద్దు
బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం వంకవారిగూడెంలోని పచ్చటి పొలాల్లో నేవీ ఆయుధ క ర్మాగారం డిపో నిర్మించవద్దని, ఖాళీ ప్రదేశాల్లో నిర్మించుకోవాలని సీపీఎం రాష్ట్ర కార్యదర్శి వి.శ్రీనివాసరావు అన్నారు. ఆయుధ కర్మాగారం నిర్మాణం చేపట్టే కొత్త చీమలవారిగూడెం, మడకంవారిగూడెం, దాట్లవారిగూడెం, వంకవారిగూడెం గ్రామాల్లో సో మవారం వామపక్షాల ఆధ్వర్యంలో నాయకుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా దాట్లవారిగూడెంలో జరిగిన కార్యక్రమంలో శ్రీనివాసరావు మాట్లాడుతూ ఆయుధ కర్మాగారం నిర్మాణంలో ప్రభుత్వాలకు సొంత ప్రయోజనం తప్ప మరొకటి లేదని విమర్శించారు. ఆయా గ్రామాల్లో సుమారు 1100 ఎకరాల వరకు సాగు భూములు ఉన్నాయని, వాటిలో ఆయిల్పామ్, వేరుశనగ, వర్జీనియా పొ గాకు వంటి అన్ని రకాల పంటలూ రెండు సీజన్ లలో పుష్కలంగా పండుతున్నాయని చెప్పారు. అటువంటి గిరిజనుల భూములను లాక్కోవడం అంటే వారి ఆత్మగౌరవాన్ని దెబ్బతీయడమేనని చెప్పారు. ఆయుధ డిపో నిర్మాణం వల్ల ఆయా గ్రామాల గిరిజనులు కూలీలుగా మారతారని సీపీఐ కేంద్ర కమిటీ సభ్యురాలు వనజ ఆవేదన వ్యక్తం చేశారు. డిపో నిర్మాణం నిలుపుదలకు గిరిజనులంతా సంఘటితంగా ఉండాలని పిలుపునిచ్చారు. సీపీ ఎం నాయకుడు ఎ.రవి, సీపీఐ నాయకుడు కృష్ణ చైతన్య, సీపీఐఎంఎల్ నాయకులు ఎంఎస్ నాగరాజు, కారం రాఘవ తదితరులు పాల్గొన్నారు. -
అక్రమ అరెస్టులకు బెదరం
టి.నరసాపురం: అక్రమ అరెస్టులకు వైఎస్సార్సీపీ బెదిరేది లేదని పోలవరం ఎమ్మెల్యే తెల్లం బాల రాజు అన్నారు. మండలంలోని మల్లుకుంటలో ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ సోమవారం కోటి సంతకాల సేకరణ కా ర్యక్రమం నిర్వహించారు. పార్టీ నేత తుమ్లూరి శ్రీనివాసరెడ్డి నివాసం వద్ద కార్యక్రమాన్ని నిర్వహించగా పలువురు సంతకాలు చేశారు. ఈ సందర్భంగా బాలరాజు మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్టును తీవ్రంగా ఖండించారు. చంద్రబాబు పాలనను గాలికి వదిలివేసి ఇచ్చిన వాగ్దానాలను తుంగలో తొక్కారన్నారు. ప్రజాస్వామ్యాన్ని మంటగలిపి రెడ్బుక్ రాజ్యాంగం నడిపిస్తున్నారని మండిపడ్డారు. జోగి రమేష్ అరెస్ట్ అక్రమమన్నా రు. పార్టీ అధినేత వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆధ్వర్యంలో ఎటువంటి పరిస్థితులనైనా ఎదుర్కొంటామన్నారు. కూటమి పాలనలో అక్రమ అరెస్టులు, అక్రమ కేసులు పరాకాష్టకు చేరాయన్నారు. తు పాను బాధితులకు నష్టపరిహారం చెల్లించకుండా ప్రజలను దారి మళ్లించడానికి అక్రమ అరెస్టుల బా టపట్టారని విమర్శించారు. ఆలయాల్లో భక్తులకు భద్రత లేదని, కాశీబుగ్గ దుర్ఘటన ప్రభుత్వ నిర్లక్ష్యానికి అద్దం పడుతోందన్నారు. పార్టీ మండల కన్వీనర్ శ్రీనురాజు, జిల్లా రైతు విభాగం అధ్యక్షుడు వాసిరెడ్డి మధు, పామాయిల్ రైతు ప్రతినిధి, వైఎస్సార్సీపీ జిల్లా నేత తుమ్మూరి శ్రీనివాసరెడ్డి, నా యకులు దాకారపు సూరిబాబు, ఉమ్మడి తేజ, బోళ్ల రంగారావు, బొడ్డు శ్రీను, పల్లా రమేష్, కొనకళ్ల సరేశ్వరరావు, కాల్నీడి సుబ్బారావు, డేవిడ్, దోరేపల్లి నరసింహారావు పాల్గొన్నారు. -
ధాన్యం కొనుగోలుకు ఏర్పాట్లు
ఏలూరు(మెట్రో): జిల్లాలో ధాన్యం కొనుగోలుకు పటిష్ట ఏ ర్పాట్లు చేయాలని జేసీ ఎంజే అభిషేక్గౌడ అ న్నారు. కలెక్టరేట్లో సో మవారం ధాన్యం కొనుగోలుపై అధికారులు, రైస్ మిల్లర్స్ అసోసియేషన్, లారీ అసోసియేషన్ ప్రతినిధులతో సమావేశాలు నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 108 రైసు మిల్లులు, 234 రైతుసేవా కేంద్రాల్లో 85 లక్షలు గోనే సంచులు సిద్ధం చేశా మని, వచ్చేవారం నుంచి కొనుగోలు ప్రక్రియ ప్రారంభమవుతుందన్నారు. 4.50 లక్షల టన్ను ల ధాన్యం సేకరణ లక్ష్యమన్నారు. రైసు మి ల్లర్స్ అసోసియేషన్ అధ్యక్షులు మాట్లాడుతూ లారీ యజమానులతో మాట్లాడి ధాన్యం సకాలంలో రవాణా అయ్యేలా చూడాలన్నారు. గత రబీ సీజన్తో జీపీఎస్ సమస్యలతో కొన్ని లారీలకు రవాణా చార్జీలు చెల్లించలేదని, వాటికి చెల్లింపులు చేయాలని కోరారు. లారీ ట్రాన్స్పోర్టు ప్రతినిధులు మాట్లాడుతూ పెండింగ్ బిల్లులు చెల్లించాలని, అలాగే ఇప్పుడు రవాణా బిల్లులు కూడా సజావుగా చెల్లించాలని కోరారు. డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, సివిల్ సప్లయ్ జిల్లా మేనేజర్ పి.శివరామమూర్తి, డీఎస్ఓ ఈబీ విలియమ్స్, డీసీఓ ఆరిమిల్లి శ్రీనివాసు, జిల్లా రైస్ మిల్లర్స్ అసోసియేషన్ ప్రెసిడెంట్ ఎన్వీఎస్ ప్రసాదరావు పాల్గొన్నారు. -
454 అర్జీల స్వీకరణ
ఏలూరు(మెట్రో): ప్రజా ఫిర్యాదుల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్)లో అందిన అర్జీల పరిష్కారంపై అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అన్నారు. కలెక్టరేట్లో సోమవారం పీజీఆర్ఎస్లో భాగంగా ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. అర్జీల పరిష్కారంలో బాధ్యతాయుతంగా వ్యవహరించాలన్నారు. మొత్తంగా 454 అర్జీలు స్వీకరించారు. జేసీ అభిషేక్ గౌడ, డీఆర్వో వి.విశ్వేశ్వరరావు, ఆర్డీఓ ఎం.అచ్యుత అంబరీష్, డిప్యూటీ కలెక్టర్ ఎల్.దేవకీదేవి, ఎస్సీ కార్పొరేషన్ ఈడీ ఎం.ముక్కంటి, డీర్డీఏ పీడీ ఆర్.విజయరాజు పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో): ప్రకృతి వ్యవసాయాన్ని మరింత ముందుకు తీసుకువెళ్లేందుకు 142 మంది నూతన ట్రైనీ ఇంటర్నల్ కమ్యూనిటీ రిసోర్స్ పర్సన్లను ఎంపిక చేసినట్టు ప్రకృతి వ్యవసాయం జిల్లా అధికారి (డీపీఎం) బి.వెంకటేష్ తెలిపారు. జిల్లా వ్యవసాయ కార్యాల యం పరిధిలో ఐదు రోజులపాటు రిసోర్స్ ప ర్సన్లకు శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జేడీఏ షేక్ హబీబ్ బాషా మాట్లాడుతూ ప్రకృతి వ్యవసాయం భవిష్యత్తుకు మ రింత అవసరమని, రసాయనాలు లేకుండా ప్రకృతి ఆధారిత పద్ధతుల్లో పంటలు పండించాలన్నారు. ప్రకృతి వ్యవసాయం ప్రాముఖ్య త, రైతుల శిక్షణ, జీవావరణ సంరక్షణ, ఆరో గ్యకర ఆహారం వంటి అంశాలపై అవగాహన కల్పించారు. రాష్ట్ర కార్యాలయం నుంచి ప్రభా కర్, యూనిట్ సిబ్బంది పాల్గొన్నారు. ఏలూరు(మెట్రో) : ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా ప్రజాపరిషత్ సర్వసభ్య సమావేశం ఈ నెల 11న మధ్యాహ్నం 2 గంటల నుంచి ఏ లూరులోని జెడ్పీ సమావేశపు హాలులో నిర్వహించనున్నామని జెడ్పీ సీఈఓ శ్రీహరి ప్రకటనలో తెలిపారు. అలాగే అదేరోజు ఉదయం 10 గంటల నుంచి జెడ్పీ 1 నుంచి 7 వరకు స్థాయి సంఘ సమావేశాలు నిర్వహిస్తామన్నారు. ఏలూరు(మెట్రో): జెడ్పీ చైర్పర్సన్ ఘంటా పద్మశ్రీ అధ్యక్షతన జిల్లాలోని జెడ్పీ రోడ్ల స్థితిగతులపై సోమవారం సమీక్షా సమావేశం నిర్వహించారు. తాజా వర్షాల ప్రభావంతో దెబ్బతి న్న రహదారులపై వివరాలు తెలుసుకుంటూ, ప్రజలకు ఇబ్బంది లేకుండా తక్షణ మరమ్మతులకు ఆదేశించారు. గ్రామీణ ప్రాంతాలు, అంతర్గత రహదారులు, పంటల రవాణా మార్గాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. పెదవేగి: రాజకీయ అండతో తమను వేధిస్తున్నారని, న్యాయం జరగకపోతే ఆత్మహత్యలే శరణ్యమని బాధిత కుటుంబం జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివకిషోర్ వద్ద వాపోయింది. బా ధితులు తెలిపిన వివరాల ప్రకారం.. పెదవేగికి చెందిన తాతా నాగమణి, దివ్యాంగుడైన ఆమె భర్త మాణిక్యాలరావుపై అదే గ్రామానికి చెందిన రేలంగి వంశీ అనే వ్యక్తి హత్యాయత్నం చేశాడని 2022లో పెదవేగి పోలీస్స్టేషన్లో కేసు నమోదైంది. ఈ నేపథ్యంలో ఈ ఏడాది సెప్టెంబర్ 3న కేసు రాజీకి మాణిక్యాలరావు దంపతులు అంగీకరించారు. అయితే మరు సటి రోజు మాణిక్యాలరావు తన పొలంలో పనిచేసుకుంటుండగా వంశీ వెళ్లి భౌతిక దాడికి పాల్పడ్డాడు. దీనిపై మాణిక్యాలరావు పోలీస్స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అయితే ఎస్సై స్పందించకపోగా తమపైనే కేసు పెట్టారని, బెదిరింపులకు పాల్పడ్డారని బాధితులు ఆరోపిస్తున్నా రు. సెప్టెంబర్ 15న జిల్లా ఎస్పీని కలిసి గోడు వెళ్లబోసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా ఎస్సై తమ ఫిర్యాదుపై కేసు నమోదు చేయకుండా రాజకీయ ఒత్తిళ్లతో 41 నోటీసులు తీసుకోమని వేధిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. తమకు ప్రాణహాని ఉందని ఎస్పీకి మరోమారు ఫిర్యాదు చేశామన్నారు. చర్యలు తీసుకోకుంటే ఆత్మహత్య చేసుకుంటామని హెచ్చరించారు. -
● వందేళ్ల బామ్మ.. వెరీ స్ట్రాంగ్
ద్వారకాతిరుమల: మండలంలోని తిమ్మాపురంలో కొందరు గురు తెలియని వ్యక్తులు ఆదివారం రాత్రి పలువురు రైతులకు చెందిన వ్యవసాయ భూముల్లోని మోటారు కేబుళ్లను తస్కరించారు. దాంతో బాధిత రైతులు సోమవారం పోలీసులను ఆశ్రయించారు. గ్రామానికి చెందిన సుమారు 10 మంది రైతులకు చెందిన పొలాల్లోని 500 మీటర్ల వైరును దొంగలు కట్చేసి, అపహరించారు. దాదాపు రూ.లక్ష మేర నష్టం వాటిల్లింది. తరచూ జరుగుతున్న ఈ వైర్ల దొంగతనాల కారణంగా బోర్ల కింద సాగవుతున్న కోకో, కొబ్బరి, వరి, పామాయిల్ తదితర పంటలకు తీవ్ర సష్టం వాటిల్లుతోందని బాధిత రైతులు కొయ్యలమూడి రామ్మోహన్రావు, ఏవీవీ కృష్ణారావు, బోళ్ల సత్యన్నారాయణ, కె.ప్రభాకరరావు. కె.నరసింహరావులు ఆవేదన వ్యక్తం చేశారు. దేవినేనివారిగూడెంలో గతేడాది జులై నెలలో సుమారు 15 మంది రైతులకు చెందిన పొలాల్లోని మోటారు వైర్లు ఇదే తరహాలో చోరీకి గురైనట్టు పలువురు రైతులు ఈ సందర్భంగా గుర్తు చేశారు. ద్వారకాతిరుమల: కాశీబుగ్గ వేంకటేశ్వర స్వామి ఆలయంలో జరిగిన తొక్కిసలాటతో దేవదాయ శాఖ మేల్కొంది. ఆలయాలకు విచ్చేసే భక్తుల రక్షణకు దేవస్థానం అధికారులు, సిబ్బంది చేపట్టాల్సిన చర్యలపై ఆ శాఖ కమిషనర్ కె.రామచంద్ర మోహన్ సోమవారం మెమో జారీ చేశారు. కార్తీక మాసంలో ఆది, సోమవారాలు, పౌర్ణమి, ఏకాదశి, ఇతర పర్వదినాల్లో ఆలయాలకు వచ్చే భక్తులకు ఎలాంటి సూచనలు ఇవ్వాలనే విషయాలను మెమోలో పేర్కొన్నారు. ఈ చర్యలు భక్తుల రద్దీ నియంత్రణ, భద్రత కోసం అత్యవసరమైనవని, అందువల్ల రాష్ట్రంలోని 6ఎ, 6బి దేవాలయాల ఈఓలు, దేవదాయ శాఖ అధికారులు, జోనల్ డిప్యూటీ కమిషనర్లు, రీజనల్ జాయింట్ కమిషనర్లు సూచనలను తక్షణమే అమలు చేయాలన్నారు. -
అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తి నష్టం
ముదినేపల్లి రూరల్: మండలంలోని బొమ్మినంపాడు శివారు జానకిగూడెంలో సోమవారం తెల్లవారుజామున జరిగిన అగ్నిప్రమాదంలో రూ.3 లక్షల ఆస్తి నష్టం సంభవించింది. గ్రామానికి చెందిన పుప్పాల సాయికి పశువులపాక, దాని పక్కనే గడ్డివాము ఉన్నాయి. ఊహించని రీతిలో విద్యుత్ షార్ట్ సర్క్యూట్ జరిగి పశువుల పాక, గడ్డివాము పూర్తిగా దగ్ధమయ్యాయి. పాకలో ఉన్న పశువుల సైతం మంటలకు గాయపడ్డాయి. సమాచారం అందుకున్న కై కలూరు అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను పూర్తిస్థాయిలో ఆర్పివేసి ఇతర ప్రాంతాలకు వ్యాపించకుండా కట్టడి చేశారు. బుట్టాయగూడెం: మోంథా తుపాను కారణంగా సుమారు వారం రోజులపాటు నిలిచిపోయిన పాపికొండలు పర్యాటక బోటు ప్రయాణాలు తిరిగి ప్రారంభమయ్యాయి. జలవనరుల శాఖ అధికారుల అనుమతితో ఆదివారం ప్రారంభం కాగా సుమారు మూడు బోట్లలో పలువురు పర్యాటకులు పాపికొండలు విహార యాత్రకు వెళ్లారు. రెండో కార్తీక సోమవారం కావడంతో పర్యాటకులు పాపికొండల పర్యటనకు వెళ్ళారు. దేవీపట్నం, గండిపోచమ్మ ఆలయం నుంచి పాపికొండల పర్యాటక ప్రాంతం పేరంటపల్లికి ఈ బోట్లు చేరుకున్నాయి. పేరంటపల్లి శివాలయం వద్ద పర్యాటకుల తాకిడితో సందడి నెలకొంది. ఆగిరిపల్లి: దొంగలు పట్టపగలే ఇంట్లో చొరబడి బంగారం చోరీ చేసిన ఘటన మండలంలోని కొత్త ఈదరలో సోమవారం జరిగింది. ఎస్సై శుభ శేఖర్ తెలిపిన వివరాలు ప్రకారం కొత్త ఈదర గ్రామానికి చెందిన బెక్కం పెద్ద సీత తన కుమారులు ఇద్దరు అమెరికాలో ఉండడంతో ఒంటరిగా నివసిస్తోంది. సోమవారం ఉదయం పాల కోసమని తాళం వేయకుండా గడియ పెట్టి వెళ్ళింది. ఇదే అదునుగా ఇంట్లోకి చొరబడి బీరువా తాళాలు పగలగొట్టి ఆరు ఉంగరాలు, ఒక బంగారు గాజు, రెండు చెవి దిద్దులు పారిపోతుండగా, ఇంటి పక్కనే ఉన్న మహిళ అడ్డుకుంది. ఆ మహిళను తోసివేసి అప్పటికే సిద్ధంగా ఉంచిన ద్విచక్ర వాహనంపై పరారయ్యారు. బంగారం విలువ సుమారు రూ.4 లక్షలు ఉంటుందని బాధితురాలు పాపోయింది. సమాచారం తెలుసుకున్న ఎస్సై శుభ శేఖర్ తన సిబ్బందితో సంఘటన స్థలాన్ని చేరుకొని వివరాలు అడిగి తెలుసుకుని కేసు నమోదు చేశారు. -
డాక్టర్ వెంపటాపునకు కళా గౌరవ్ సమ్మాన్
తణుకు అర్బన్: మన సంస్కృతి పేరిట విజయవాడ ఆర్ట్ అసోసియేషన్ గిల్డ్ బాలోత్సవ్ భవన్లో ఈ నెల 2న నిర్వహించిన చిత్రకళా ప్రదర్శనలో తణుకు చెందిన ప్రముఖ చిత్రకారుడు డాక్టర్ వెంపటాపు శ్రీనమో అంతర్ముఖ్ఙి శీర్షికతో చిత్ర రచన చేసి అభినందనలు అందుకున్నారు. జ్ఞాపిక, ప్రశంసాపత్రం అందుకున్నట్లు చెప్పారు. ఉత్తరప్రదేశ్ బరేలీకి చెందిన కళా రత్నం ఫౌండేషన్ ఆఫ్ ఆర్ట్ సొసైటీ ఇటీవల నిర్వహించిన ఇంటర్నేషనల్ ఆన్లైన్ ఆర్ట్ కాంపిటేషన్లో వెంపటాపు శ్రీకళా గౌరవ్ సమ్మాన్ఙ్ అవార్డును అందుకున్నట్లు చెప్పారు. నూజివీడు: రాష్ట్రంలోని నాలుగు ట్రిపుల్ ఐటీల నిర్వహణకు ఏడాదికి రూ.200 కోట్లు కేటాయిస్తున్నట్లు ఆర్జీయూకేటీ వీసీ ఆచార్య ఎం.విజయ్కుమార్ తెలిపారు. ఏలూరు జిల్లా నూజివీడు ట్రిపుల్ ఐటీలో సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ల్యాప్టాప్ల కొనుగోలు కోసం టెండర్లు పిలవనున్నట్లు తెలిపారు. మెస్ల నిర్వహణ హరేకృష్ణ మూమెంట్ సంస్థకు అప్పగించామని.. గతంలో మాదిరిగా విద్యార్థుల అభిప్రాయాలు తీసుకుంటామన్నారు. నిర్వహణ సరిగా లేకపోతే జరిమానాలు విధిస్తామని చెప్పారు. హౌస్ కీపింగ్, సెక్యూరిటీ సిబ్బందికి సంబంధించిన టెండర్లను త్వరలో ఖరారు చేస్తామన్నారు. నాలుగు ట్రిపుల్ ఐటీలకు డైరెక్టర్లు, ఆర్జీయూకేటీ వీసీ నియామకాలకు దరఖాస్తుల స్వీకరణ జరుగుతోందని తెలిపారు. బుట్టాయగూడెం: జీలుగుమిల్లి మండలం రమణక్కపేట సమీపంలో జాతీయ రహదారిపై సోమవారం రాత్రి రోడ్డు ప్రమాదం జరిగింది. స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం జంగారెడ్డిగూడెం మండలం చల్లవారిగూడెంలోని కొయిదా ఆర్అండ్ఆర్ కాలనీకి చెందిన కాకాని రవి (35) జీలుగుమిల్లి నుంచి ద్విచక్ర వాహనంపై వస్తుండగా.. రమణక్కపేట జాతీయ రహదారిపై ఆగిఉన్న లారీని ఢీకొట్టాడు. రవి తలకు తీవ్ర గాయమై అక్కడికక్కడే మృతి చెందాడు. సమాచారం అందుకున్న జీలుగుమిల్లి పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. -
జోగి రమేష్ అరెస్ట్ అక్రమం
మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు బుట్టాయగూడెం: మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ పూర్తిగా అక్రమమని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. ఆదివారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ కక్ష సాధింపు చర్యల్లో భాగంగానే జోగి రమేష్ను అక్రమ మద్యం కేసులో ఇరికించారన్నారు. రాజకీయ దురుద్దేశంతోనే తప్పుడు ప్రచారం చేస్తూ అక్రమ కేసులు కడుతున్నారని విమర్శించారు. నారా వారి సారా, కల్తీ మద్యం పల్లెల్లో ఏరులై పారుతుందని ఆరోపించారు. అలాగే కాశీబుగ్గ సంఘటనను డైవర్షన్ చేసేందుకే జోగి రమేష్ అరెస్ట్ చూపించారన్నారు. రాష్ట్రంలో అంబేడ్కర్ రాసిన రాజ్యాంగం కాకుండా రెడ్బుక్ రాజ్యాంగం నడుస్తుందని అన్నారు. అక్రమ కేసులు పెట్టి వైఎస్సార్సీపీ నాయకులను భయపెట్టా లని చూస్తే బెదిరే ప్రసక్తే లేదన్నారు. వైఎస్ జగన్మోహన్రెడ్డి నాయకత్వంలో పార్టీ కోసం మరింత ముందుండి నడిపిస్తామని చెప్పారు. ప్రస్తుతం కూటమి ప్రభుత్వం చేస్తున్న అరాచకాలు ప్రజలు గమనిస్తున్నారని రాబోయే రో జుల్లో వారికి ఆ ప్రజలే బుద్ధి చెప్తారని అన్నారు. అక్రమ అరెస్ట్లను ప్రతిఒక్కరూ తీవ్రంగా ఖండించాలని బాలరాజు కోరారు. -
గౌరవ వేతనం ఏదీ?
ఏలూరు (ఆర్ఆర్పేట) : మసీదుల్లో ప్రార్థనలు చేసే ఇమామ్, మౌజన్లు 9 నెలలుగా గౌరవ వేతనాలు అందక ఇబ్బంది పడుతున్నారు. వీరు నిత్యం మసీదుల్లో ప్రార్థనలు నిర్వహిస్తూ ముస్లింలలో ఆధ్మాత్మి క చింతన పెంచుతున్నారు. వీరి సేవలను గుర్తిస్తూ గత వైఎస్సార్సీపీ ప్రభుత్వంలో ప్రతినెలా గౌరవ వేతనం ఇచ్చేలా నిర్ణయించారు. ఈ మేరకు ప్రతినెలా ఇమామ్లకు రూ.10 వేలు, మౌజన్లకు రూ.5 వేలు ఇవ్వాలని జీఓ కూడా విడుదల చేశారు. అప్పటినుంచి ప్రతినెలా క్రమం తప్పకుండా గౌరవ వేతనాన్ని అందించారు. అయితే రాష్ట్రంలో కూటమి ప్ర భుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత తొలి ఏడాది వీరిని పూర్తిగా విస్మరించింది. దీంతో ముస్లిం సామాజికవర్గంలో తీవ్ర వ్యతిరేకత ప్రారంభంకావడంతో కొన్ని నెలలు గౌరవ వేతనాన్ని విడుదల చేసి మ రలా ఈ ఏడాది ఫిబ్రవరి నుంచి నిలిపివేశారు. జిల్లాలో 206 మసీదులు జగన్మోహన్రెడ్డి ప్రభుత్వంలో ఉమ్మడి జిల్లాలో అసలు ఆదాయం లేని 206 మసీదులను గుర్తించి వాటిలోని ఇమామ్, మౌజన్లకు గౌరవ వేతనం అందించారు. ఈ నేపథ్యంలో సార్వత్రిక ఎన్నికల సందర్భంగా చంద్రబాబు తాము అధికారంలోకి వస్తే ఇమామ్, మౌజన్లకు అదనంగా రూ.5 వేలు ఇస్తామని ప్రకటించారు. ఈ మేరకు ఇమామ్లకు రూ.15 వేలు, మౌజన్లకు రూ.10 వేలు ఇస్తామ న్నారు. అయితే ఈ హామీని అమలు చేయకపోగా.. అప్పటికే ఇస్తున్న గౌరవ వేతనాన్ని కూడా బకాయి పెట్టారు. బకాయిలు రూ.4.66 కోట్లు కూటమి నేతలు ఎన్నికల ప్రచారంలో భాగంగా ఇచ్చిన హామీ మేరకు ఇమామ్లకు రూ.15 వేలు, మౌజన్లకు రూ.10 వేలు నెలకు చెల్లించాల్సి ఉంది. ఈ లెక్కన ఉమ్మడి జిల్లాలోని ఎంపిక చేసిన 206 మసీదుల్లో పనిచేసే ఇమామ్లకు 9 నెలల బ కాయిలు కింద రూ.2.78 కోట్లు, మౌజన్లకు రూ.1.88 కోట్లు మొత్తం రూ.4.66 కోట్లు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. ఏలూరు తంగెళ్లమూడిలో నెహర్ మసీదు మసీదుల్లో సమయానికి నమాజు ప్రార్థనలు చేసి ముస్లింలను ఆధ్యాత్మిక చింతనలో తరించేలా చేస్తున్న ఇమామ్, మౌజన్ల కుటుంబాలు చింతల్లో ఉన్నాయి. ఎటువంటి ఆదాయం లేక ప్రభుత్వం ఇచ్చే గౌరవ వేతనంపైనే ఆధారపడిన వారి కుటుంబాలు గత 9 నెలలుగా పస్తులతో ఉండాల్సిన పరిస్థితి. ప్రభుత్వం మానవత్వంతో ఆలోచించి వెంటనే గౌరవ వేతనాలు విడుదల చేయాలి. –మొహమ్మద్ ఇస్మాయిల్ షరీఫ్, అధ్యక్షుడు, మూమెంట్ ఫర్ పీస్ అండ్ జస్టిస్ సంస్థ గతంలో గౌరవ వేతనం ప్రతి నెలా విడుదల చేసేవారు. దాంతో మా కుటుంబాలు తిండికి లోటు లేకుండా గడిపేవాళ్లం. ప్రస్తుతం గౌరవ వేతనం విడుదల చేయకపోవడంతో దుర్భర పరిస్థితిని ఎదుర్కొంటున్నాం. అప్పులు చేసి కుటుంబాన్ని పోషించుకోవాల్సిన పరిస్థితి. ప్రభుత్వం వెంటనే గౌరవ వేతనాన్ని విడుదల చేసి మమ్మల్ని కష్టాల నుంచి గట్టెక్కించాలి. –ఎండీ రెహమాన్ షరీఫ్, వైఎస్సార్ కాలనీ మసీదు ఇమామ్, ఏలూరు ఇమామ్, మౌజన్లకు 9 నెలలుగా బకాయిలు వేతన పెంపు హామీనీ విస్మరించిన కూటమి సర్కారు ఉమ్మడి జిల్లాలో 206 మసీదులు రాష్ట్ర ప్రభుత్వ బకాయి రూ.4.66 కోట్లు -
జనాన్ని చంపేస్తే అది సుపరిపాలనా?
ఏలూరు (ఆర్ఆర్పేట): చంద్రబాబు పాలనా వైఫల్యంతో ఆధ్యాత్మిక కేంద్రాల్లో తొక్కిసలాటలు జరుగుతూ అమాయక ప్రజలు చనిపోతుంటే అదే సుపరిపాలన అనుకోవాలా అని దేవదాయ శాఖ మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ మండిపడ్డారు. ఆదివారం ఆయన మీడియాతో మాట్లాడుతూ చంద్రబాబు రాజకీయాలకు సాక్షాత్తూ శ్రీ వేంకటేశ్వర స్వామిని కూడా వాడుకోవడం సిగ్గుచేటన్నారు. చంద్రబాబు అధికారంలోకి వచ్చిన తర్వాత ఎన్నో ప్ర మాదాల్లో పదుల సంఖ్యలో ప్రజలు ప్రాణాలు కో ల్పోయిన విషయం వాస్తవం కాదా అని ప్రశ్నించా రు. కాశీబుగ్గలో భక్తులు అధిక సంఖ్యలో వస్తారని ఆలయ నిర్వాహకుడు ముందుగానే అధికారులకు, పోలీసులకు తెలిపినా వారు పట్టించుకోకుండా పూర్తిగా నిర్లక్ష్యం చేసిన కారణంగానే ప్రమాదం జరిగిందన్నారు. ఇది పూర్తిగా పాలనా వైఫల్యమేనని స్పష్టం చేశారు. అలాగే గతంలో తిరుమలలో ఆరుగురు, సింహాచలంలో ఏడుగురు చనిపోయిన విషయాన్ని మరి చిపోలేమన్నారు. ప్రచార యావ తప్ప ఎంతమంది చనిపోయారో అనే దానిపై మసిపూసి మారేడు కాయ చేయడానికి చంద్రబాబు.. తనకు ఉన్న ఎల్లో మీడియా ద్వారా పక్కదారి పట్టిస్తున్నాడని మండిపడ్డారు. 2018లో ఒంటిమిట్టలో కూడా చంద్రబాబు హయాంలోనే భక్తులు చనిపోయారని గుర్తుచేశారు. ఆలయాల్లో ఇటువంటి ఎన్ని సంఘటనలు జరిగినా చంద్రబాబులో పశ్చాత్తాపం లేదన్నారు. ఐదేళ్ల జగన్మోహన్రెడ్డి పాలనలో ఆలయాల్లో ఇటువంటి సంఘటనలు జరిగాయా అని ప్రశ్నించారు. శిథిలావస్థలో ఉన్న ఆలయాలను జగన్ హయాంలో పున రుద్ధరించిన మాట వాస్తవం కాదా అని నిలదీశారు. చంద్రబాబు బాధ్యత వహించాలి కాశీబుగ్గ ఘటనకు చంద్రబాబే పూర్తి బాధ్యత వ హించాలని కొట్టు డిమాండ్ చేశారు. బీజేపీ నా య కులు కూడా కాశీబుగ్గ ఘటనపై విచారం వ్యక్తం చే యకపోవడం చూస్తుంటే హిందూత్వం వారి రాజకీయాల కోసం వాడుకునే వస్తువుగా అనిపిస్తోందన్నారు.మాజీ మంత్రి కొట్టు సత్యనారాయణ -
సుప్రీంకోర్టు న్యాయమూర్తిని కలసిన ఉన్నతాధికారులు
ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన సుప్రీంకోర్టు న్యాయ మూర్తి జస్టిస్ జేకే మహేశ్వరిని ఆలయ చైర్మన్ ఎస్వీ సుధాకరరావుతో పాటు, పలువురు జిల్లాస్థాయి అధికారులు మర్యాదపూర్వకంగా కలిశా రు. చైర్మన్ సుధాకరరావు న్యాయమూర్తికి దు శ్శాలువాను కప్పి, స్వామివారి జ్ఞాపికను అందజేశారు. అలాగే ఏలూరు జిల్ల్లా కలెక్టర్ కె.వెట్రిసెల్వి, ఏలూరు రేంజ్ డీఐజీ జీవీజీ అశోక్కుమార్, జిల్లా ఎస్పీ కొమ్మికిషోర్, పశ్చిమగోదావరి జిల్లా ఎస్పీ అద్నాన్ నయీం అస్మి ఆయనకు పూల మొక్కలను అందజేశారు. జంగారెడ్డిగూడెం : జంగారెడ్డిగూడెం ఏఎస్పీగా ఐపీఎస్ అధికారి సుస్మిత రామనాథన్ ని యమితులయ్యారు. ప్రభుత్వం తాజాగా బదిలీల్లో భాగంగా జంగారెడ్డిగూడెం పోలీస్ సబ్ డివిజన్కు ఐపీఎస్ అధికారిని నియమించడం విశేషం. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న డీఎస్పీ యు.రవిచంద్రను బదిలీ చేశా రు. సుస్మిత రామానాథన్ ప్రస్తుతం గ్రే హౌండ్స్లో అసాల్ట్ కమాండర్గా పనిచేస్తున్నారు. ఆమె తమిళనాడుకి చెందిన వారు. ఏలూరు (టూటౌన్): అంధ ఉపాధ్యాయులకు టెట్ నుంచి మినహాయింపు ఇవ్వాలని ఆంధ్రప్రదేశ్ దివ్యాంగుల సంక్షేమ సంఘం (ఏపీడీఎస్ఎస్) ఆదివారం ఓ ప్రకటనలో ప్రభుత్వాన్ని కోరింది. 2010కి ముందు డీఎస్సీ ద్వారా నియామకం పొందిన టీచర్లకు కూడా టెట్లో మినహాయింపు ఇవ్వాలన్నారు. అంధ ఉపాధ్యాయులు టెట్ కోసం కంప్యూటర్ ఎగ్జామ్ రాయడం ఇబ్బంది అన్నారు. అలాగే ఫేషియల్ అటెండెన్స్ కూడా అంధ టీచర్లకు మినహాయింపు ఇవ్వాలన్నారు. రాష్ట్ర కన్వీనర్ కె.వీర్రాజు, జిల్లా గౌరవ అధ్యక్షుడు బండి వెంకటేశ్వరరావు, జిల్లా అధ్యక్షుడు కుందేటి జయరాజు, జిల్లా ప్రధాన కార్యదర్శి లక్క పాము రాంబాబు ప్రకటన చేసిన వారిలో ఉన్నారు. తాడేపల్లిగూడెం అర్బన్: తాడేపల్లిగూడెంలోని లాడ్జీల్లో రిజిస్టర్లు చోరీ చేసిన ఐదుగురు నిందితులను పట్టణ పోలీసులు అరెస్టు చేశారు. ఆదివారం పట్టణ సీఐ బోణం ఆదిప్రసాద్ వి వరాలు వెల్లడించారు. కర్నాటకకు చెందిన శరణప్ప గంగప్ప, కార్తీక్ ఉమాపతి, ఎన్.శశికుమార్, రుద్రప్ప, సతివాడ సందీప్లు తాడేపల్లిగూడెంలోని వివిధ లాడ్జీల్లో రూములు అద్దెకు తీసుకుని చాకచక్యంగా లాడ్జీలకు సంబంధించిన రిజిస్టర్లను దొంగలించారు. వాటి ఆధారంగా లాడ్జీల్లో బస చేసినవారి ఫోన్ నంబర్లు తెలుసుకుని వారికి ఫోన్లు చేసి బంగారం తక్కువ ధరకు విక్రయిస్తామని నమ్మబలికేవారు. తక్కువ ధరకు బంగారం వస్తుందని ఆశతో కొందరు వ్యక్తులు వీరు చెప్పిన ప్రదేశానికి వెళ్లి చూడగా కత్తులు చూపించి వారి వద్ద నుంచి నగదును దొంగలించి పారిపోయేవారు. ఇలా పట్టణానికి చెందిన ఓ వ్యక్తి నుంచి రూ.40 వేలు చోరీ చేశారు. స్థానిక ఎంవీఆర్ లాడ్జి మేనేజర్ వీరాబత్తుల వెంకటరత్నం ఫిర్యాదు మేరకు పోలీసులు విచారణ చేపట్టి నిట్ కాలేజీ సమీపంలోని హైవేపై నిందితులను అరెస్ట్ చేశారు. జల్సాలకు అలవాటు పడిన వీరు కర్నాటక నుంచి మన రాష్ట్రానికి వచ్చి పలు పట్టణాల్లోని లాడ్జీల్లో రిజిస్టర్లు దొంగిలించారని పోలీసులు తెలిపారు. మరింత లోతుగా విచారణ చేపడుతున్నామని, నిందితుల నుంచి రూ.3,510 నగదు, చాకు, కారు, లాడ్జి రిజిస్టర్ పుస్తకాలు స్వాధీనం చేసుకున్నామన్నారు. భీమవరం (ప్రకాశంచౌక్): జిల్లాలోని కలెక్టరేట్, డివిజనల్, మండల కేంద్రాల్లో సోమవారం ప్ర జా సమస్యల పరిష్కార వేదిక (పీజీఆర్ఎస్) నిర్వహించనున్నట్టు కలెక్టర్ సీహెచ్ నాగరాణి తెలిపారు. -
శోభాయమానం.. శ్రీవారి తెప్పోత్సవం
శ్రీనివాసా.. గోవిందా.. వేంకటరమణా గోవిందా.. నామస్మరణలు మార్మోగాయి. సుదర్శన పుష్కరిణిలో ఉభయ దేవేరులతో హంసవాహనంపై శ్రీవారి విహారం నేత్రపర్వమైంది. క్షీరాబ్ధి ద్వాదశి సందర్భంగా ద్వారకాతిరుమల చినవెంకన్న తెప్పోత్సవాన్ని ఆదివారం రాత్రి కనులపండువగా నిర్వహించారు. విద్యుద్దీప కాంతులు, బాణాసంచా కాల్పులు, మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, వేద మంత్రోచ్ఛరణల నడుమ వేడుక సాగింది. ముందుగా ఆలయంలో ఉత్సవమూర్తులను తొళక్క వాహనంపై ఉంచి పూజాదికాలు నిర్వహించారు. అనంతరం ప్రధాన రాజగోపురం, క్షేత్ర పురవీధుల మీదుగా వాహనం సుదర్శన పుష్కరిణి వద్దకు చేరుకుంది. అక్కడ హంస వాహన తెప్పలో ఉత్సవమూర్తులను వేంచేపు చేసి ప్రత్యేక హారతులిచ్చారు. అనంతరం తెప్ప పుష్కరిణిలో విహరించింది. అర్చకులు పుష్కరిణి మధ్యలో ఉన్న మండపంలో శ్రీవారిని, పద్మావతి, ఆండాళ్ అమ్మవార్లను ఉంచి ప్రత్యేక పూజలు జరిపారు. ఆలయ అనువంశిక ధర్మకర్త ఎస్వీ నివృతరావు, ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి, పెన్మత్స నరసింహరాజు, పోల్కంపల్లి అనిల్ పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. – ద్వారకాతిరుమల -
మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణను అడ్డుకుంటాం
పెదవేగి: ప్రభుత్వ మెడికల్ కాలేజీలను ప్రైవేటుపరం కాకుండా అడ్డుకుంటామని మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్యచౌదరి అన్నారు. వైఎస్సార్సీపీ మండల కన్వీనర్ జానంపేట బాబు ఆధ్వర్యంలో ఆదివారం కొప్పాకలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ, రచ్చబండ కార్యక్రమానికి కొఠారు ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ముందుగా గ్రామంలో భారీ ర్యాలీ నిర్వహించి దివంగత సీఎం వైఎస్సార్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం వైఎస్సార్ సీపీ కార్యకర్త సనంపూడి రాంబాబు ఇంటి వద్ద ఏర్పాటుచేసిన కోటి సంతకాల సేకరణ, ప్రజా ఉద్యమం–రచ్చబండ కార్యక్రమంలో ఆయన మా ట్లాడుతూ ప్రైవేటు వ్యక్తులకు కాలేజీలను కట్టబెట్టాలని కూటమి ప్రభుత్వం చూస్తోందన్నారు. వీటని ప్రైవేటుపరం కాకుండా రక్షించుకుంటేనే భవిష్యత్తులో పేద పిల్లలు డాక్టర్లు అవుతారన్న విషయాన్ని ప్రతిఒక్కరూ గుర్తించాలన్నారు. కళాశాలల ప్రైవేటీకరణకు నిరసనగా చేపట్టిన కోటి సంతకాల కార్యక్రమాన్ని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. ప్రతి ఇంటికీ రేషన్ పంపిణీ చేయాలని మేం చూస్తే, కూ టమి నేతలు మందు పంపిణీ చేస్తున్నారని విమర్శించారు. నియోజకవర్గంలో 300కు పైగా బెల్టుషాపులు నిర్వహిస్తున్నారన్నారు. వైఎస్సార్ సీపీ హయాంలో చేసిన అభివృద్ధి కార్యక్రమాల శిలాఫలకాలను తీసే సి, కూటమి నేతల ఫొటోలు, పేర్లు పెట్టుకోవడం సి గ్గుచేటని దుయ్యబట్టారు. దుర్మార్గ చర్యలకు పాల్పడితే అబ్బయ్యచౌదరి 2.0లో చుక్కలు చూపిస్తామని హెచ్చరించారు. జెడ్పీటీసీ పెనుమాల విజయ్బాబు, ఎంపీపీ తాతా రమ్య, సర్పంచ్లు మాత్రపు కోటేశ్వరరావు, దేవరపల్లి ఏసుమరియమ్మ, ఎంపీటీసీలు గెడ్డం సుజాత, పులవర్తి దేవానంద్, మాజీ ఏఎంసీ చైర్మన్ మేకా లక్ష్మణరావు, నాయకులు చళ్ళగొళ్ల భూ స్వామి తదితరులు పాల్గొన్నారు. -
కూటమి పాలనలో భక్తులకు భద్రత కరువు
ఏలూరు టౌన్: కూటమి ప్రభుత్వానికి భగవంతుడిపై ఏమాత్రం భయం, భక్తి లేవనీ, కనీసం భక్తులకు సరైన సౌకర్యాలు, భద్రత కల్పించటంలోనూ ఘోరంగా వైఫల్యం చెందుతుందనీ వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) విమర్శించారు. కాశీబుగ్గలో వేంకటేశ్వరస్వామి ఆలయంలో తొక్కిసలాటలో భక్తులు మృతిచెందగా స్థానిక పార్టీ కార్యాలయంలో ఆదివారం రాత్రి కొవ్వొత్తుల ప్రదర్శన నిర్వహించి నివాళులర్పించారు. ఈ సందర్భంగా జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ మాట్లాడుతూ వేలాది మంది భక్తులు వెళ్లే ఆలయానికి భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వానికి లేదా అని ప్రశ్నించారు. మృతుల కుటుంబాలకు రూ.25 లక్షలు ఆర్థిక సహాయం అందించాలని డిమాండ్ చేశారు. ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ మాట్లాడుతూ ఈ ఆలయం దేవదాయశాఖ పరిధిలో లేదని దేవదాయ శాఖ మంత్రి మాట్లాడటం దారుణమన్నారు. ఆలయం ప్రైవేటుది అయినా భక్తులకు భద్రత కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వం, పోలీస్ అధికారులపై ఉందన్నారు. రాష్ట్ర హోంమంత్రి ప్రజల భద్రతను గాలికి వదిలేసి కేవలం మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డిని విమర్శించటానికే మంత్రి అయినట్టు కనిపిస్తుందని విమర్శించారు. ఈ కార్యక్రమంలో నగర అధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాసరావు, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా ప్రధాన కార్యదర్శి లంకలపల్లి గణేష్, రాష్ట్ర మహిళా విభాగం ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్, జి ల్లా మహిళ విభాగం ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్, నగర మహిళ అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల తదితరులు ఉన్నారు. భక్తుల ప్రాణాలతో చెలగాటం ఉంగుటూరు: కూటమి ప్రభుత్వం భక్తుల ప్రాణాలతో చెలగాటమాడుతుందని, వారి ఊసురు తగులుతుందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. రావులపర్రులో ఆదివారం రాత్రి కాశీబుగ్గ తొక్కిసలాట మృతుల ఆత్మకు శాంతి కలగాలంటూ కొవ్వొత్తులతో నివాళులర్పించి శాంతి ర్యాలీ నిర్వహించారు. వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు కూటమికి ప్రచార్భాటమే తప్ప భక్తుల ప్రాణాలకు రక్షణ లేకుండాపోయిందన్నారు. చంద్రబాబు ప్రభుత్వాన్ని వెంటనే బర్త్రఫ్ చే యా లని డిమాండ్ చేశారు. పూర్తిగా వైఫల్యం చెందిందన్నారు. మండల పార్టీ అధ్యక్షుడు మరడ వెంకట మంగారావు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, బీసీ సెల్ నేత పెనుగొండ బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎలిశెట్టి బాబ్జి, నీలిమ జూనియర్, గాది రమణ తదితరులు పాల్గొన్నారు. రావులపర్రులో కొవ్వొత్తులతో నివాళులర్పిస్తున్న మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు ఏలూరులో కొవ్వొత్తుల ప్రదర్శనతో నివాళులర్పిస్తున్న వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్, ఏలూరు సమన్వయకర్త జయప్రకాష్ వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
కుట్రతోనే జోగి రమేష్ అరెస్ట్
భీమడోలు: నకిలీ మద్యం అమ్ముతూ ప్రజల ఆరోగ్యంతో చెలగాటమాడుతున్న కూటమి ప్రభుత్వాన్ని ప్రజలు ఛీ కొడుతున్నారని వైఎస్సార్సీపీ ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి సునీల్కుమార్ అన్నారు. పూళ్లలో పార్టీ నేత కందులపాటి శ్రీనివా సరావు ఇంటి వద్ద ఆదివారం ఆయన మాజీ ఎ మ్మెల్యే పుప్పాల వాసుబాబుతో కలిసి విలేకరులతో మాట్లాడుతూ మాజీ మంత్రి జోగి రమేష్ అరెస్ట్ను తీవ్రంగా ఖండించారు. జోగి రమేష్పై ఇలాంటి అసత్య ఆరోపణలు చేస్తూ అక్రమ కేసులు బనాయించడం నీతిమాలిన చర్య అన్నారు. తుపాను బాధితులకు పరిహారం ఎగ్గొట్టడానికి, కాశీబుగ్గ ఘటన గురించి ప్రజల దృష్టి మళ్లించేందుకు డైవర్షన్ రాజకీయాలకు కూటమి ప్రభుత్వం పాల్పడుతుందన్నారు. బీసీ నాయకులను అణచివేసే ధోర ణిలో అక్రమ కేసులు బనాయిస్తే ఊరుకోబోమన్నా రు. అక్రమ కేసులను మానుకుని తుపాను బాధిత రైతులను, కాశీబుగ్గ ఘటన బాధితులను ఆదుకోవాలని డిమాండ్ చేశారు. చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు మాట్లాడుతూ చంద్రబాబు డైవర్షన్ రాజకీయాలకు కేరాఫ్ అడ్రస్ అన్నారు. కూటమి ప్రభుత్వం డైవర్షన్ రాజకీయాల కోసం మాజీ మంత్రి జోగి రమేష్ను నకిలీ మద్యం కేసులో అక్రమంగా ఇరికించారన్నారు. 18 నెలలుగా అధికారంలో ఉన్న కూటమి ప్రభుత్వ హయాంలో మద్యం అమ్మకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయన్నారు. కూటమి నేతల కనుసన్నలల్లో మద్యం బెల్ట్షాపులు నిర్వహిస్తున్నారన్నారు. కుట్రపూరితంగానే ప్రస్తుత సమస్యల నుంచి ప్రజలను దృష్టిని మళ్లించేందుకు జోగి రమేష్ను అరెస్ట్ చేశారన్నారు. కూ టమి దుశ్చర్యలను ప్రజలంతా గమనిస్తూనే ఉన్నారని, వారిని ఎవరు నమ్మే స్థితిలో లేరని ఘాటుగా విమర్శించారు. తక్షణమే జోగి రమేష్ను విడుదల చేయాలని వాసుబాబు డిమాండ్ చేశారు. కారుమూరి సునీల్కుమార్ పుప్పాల వాసుబాబు -
ద్వారకాతిరుమలలో వరుస చోరీలు
ద్వారకాతిరుమల: వరుస చోరీలతో ద్వారకాతిరుమల ప్రజలు ఒక్కసారిగా భీతిల్లారు. శనివారం అర్ధరాత్రి రెచ్చిపోయిన దొంగలు మూడు ఇళ్లల్లోకి చొరబడి 12 కాసుల బంగారం, రూ.2.50 లక్షల నగదు, ఒక పల్సర్ బైక్ను తస్కరించారు. స్థానికుల కథనం ప్రకారం.. గ్రామంలోని డీసీసీబీ బ్రాంచి సమీపంలోని ఓ ఇంట్లో పోలుబోయిన లక్ష్మణరావు ఉంటున్నాడు. రాత్రివేళ ఇంటి తలుపులు తెరచుకుని భార్యాభర్తలు ఓ గదిలో నిద్రిస్తుండగా, గుర్తు తెలియని వ్యక్తులు ఇంట్లోకి చొరబడి మరో గదిలో ఉన్న బీరువాను పగలగొట్టి 10 కాసుల బంగారు ఆభరణాలను చోరీ చేశారు. దొంగలు వెండి వస్తువులను విడిచిపెట్టి కేవలం బంగారు వస్తువులను మాత్రమే దోచుకెళ్లారని, నిద్రిస్తున్న తమపై ఏదో స్ప్రే చేసినట్టు అనిపించిందని లక్ష్మణరావు భార్య కుమారి తెలిపారు. స్థానిక చెరువు వీదిలోని కనిగొళ్ల లక్ష్మీ కాశీ విశ్వనాథ్(కాశీ) ఇంట్లోకి చొరబడిన దొంగలు బీరువాలోని సుమారు 2 కాసుల బంగారు వస్తువులు, రూ.2.50 లక్షల నగదును చోరీ చేశారు. అశ్వారావుపేటలోని తన చెల్లి ఇంటికి ఒక శుభకార్యం నిమిత్తం శనివారం ఉదయం కుటుంబ సమేతంగా వెళ్లిన కాశీ, తిరిగి ఆదివారం సాయంత్రం ఇంటికి వచ్చిన తరువాత ఈ చోరీని గుర్తించాడు. గ్రంథాలయం పక్క రోడ్డులోని ఒక ఇంట్లో పల్సర్ 220 బైక్ను చోరీ చేశారు. బాధితులు పోలీస్టేషన్లో ఫిర్యాదు చేయగా, ఎస్సై టి.సుధీర్ ఘటనా స్థలాలను పరిశీలించారు. చోరీలపై కేసులు నమోదు చేసి, దర్యాప్తు చేస్తున్నట్టు ఆయన తెలిపారు. అర్ధరాత్రి మూడు ఇళ్లలో దొంగతనాలు -
ప్రజాగ్రహంలో కొట్టుకుపోతారు
ఉంగుటూరు: పేదలు, సామాన్యులకు మెడికల్ విద్యను దూరం చేస్తే చంద్రబాబు సర్కార్ ప్రజాగ్రహాంలో కొట్టుకుపోతుందని ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. ఉంగుటూరు మండలం రావులపర్రులో ఆదివారం రాత్రి మెడికల్ కళాశాల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ కోటి సంతకాల సేకరణలో భాగంగా రచ్చబండ కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా కార్యక్రమానికి మండల అధ్యక్షుడు మరడ మంగారావు అధ్యక్షత వహించారు. వాసుబాబు మాట్లాడుతూ పేదలు, సామాన్యుల ఆరోగ్య భద్రత కోసం కేంద్రంతో పోరాడి రాష్ట్రానికి 17 మెడికల్ కళాశాలలను తీసుకొచ్చిన ఘనత వైఎస్ జగన్మోహన్రెడ్డికి దక్కుతుందన్నారు. చంద్రబాబు కార్పొరేట్ పక్షపాతి అని, బడుగు, బలహీన వర్గాలంటేనే చిన్న చూపు అని వారు ఎదగడాన్ని ఓర్వలేడన్నారు. ప్రైవేటీకరణను ఆపకుంటే చంద్రబాబు చరిత్రహీనుడు కాక తప్పదని, వచ్చే ఎన్నికల్లో కూటమి సర్కార్కు ప్రజలే బుద్ది చెబుతారన్నారు. పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, బీసీ సెల్ నాయకులు పెనుగొండ బాలకృష్ణ, జిల్లా నాయకులు ఎలిశెట్టి బాబ్జి, నీలిమ జూనియర్, గాది రమణ పాల్గొన్నారు. -
అమ్మవారి విగ్రహ ధ్వంసంపై ఫిర్యాదు
కొయ్యలగూడెం: కొయ్యలగూడెం సమీపంలోని శ్రీ నీలాలమ్మ అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంపై రైతులు పీఎస్లో ఆదివారం ఫిర్యాదు చేశారు. వెయ్యి సంవత్సరాలకు పైగా చరిత్ర కలిగిన అమ్మవారి విగ్రహాన్ని ధ్వంసం చేయడంతో హిందువుల మనోభావాలను తీవ్రంగా ప్రభావితం చేసిందన్నారు. హుండీ కూడా బద్దలు కొట్టి విలువైన సొత్తును అపహరించారని ఫిర్యాదులో పేర్కొన్నారు. కై కలూరు: మండలంలోని కొల్లేటికోట పెద్దింట్లమ్మ ఆలయానికి ఆదివారం భక్తులు పోటెత్తారు. జిల్లాతో పాటు సరిహద్దు జిల్లాల నుంచి భారీ సంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని అమ్మవారిని దర్శించుకున్నారు. ఆలయ అర్చకుల ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అలంకరణ చేసి భక్తులకు దర్శన భాగ్యం కల్పించారు. ఈ సందర్భంగా ఆలయానికి రూ.21,530 ఆదాయం వచ్చినట్లు ఆలయ కార్యనిర్వహణాధికారి కూచిపూడి శ్రీనివాస్ తెలిపారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు కొనసాగుతున్నాయి. ఆదివారం ఆలయంలో ఉదయం హనుమద్ హోమం, సువర్చలా హనుమద్ కల్యాణం ఆలయ అర్చకులు, వేద పండితులు, రుత్వికుల ఆధ్వర్యంలో నిర్వహించారు. కార్యక్రమంలో భక్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు. మధ్యాహ్నం 3 గంటల వరకు వివిధ సేవల రూపేణా రూ.2,47,129 సమకూరినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. నిత్యాన్నదాన సత్రంలో సుమారు 3,600 మంది భక్తులకు అన్నదానం చేశారు. రాజమహేంద్రవరం శ్రీ రాజా రాజేశ్వరి కూచిపూడి నాట్యలయం విద్యార్థులు ప్రత్యేక ప్రదర్శన ఇచ్చారు. జంగారెడ్డిగూడెం : మైసన్నగూడెం, శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో రాళ్ల కాలువను బాగు చేసి మురుగునీరు వెళ్లేలా ముంపు నివారణకు చర్యలు చేపట్టాలని రైతు సంఘం ఆధ్వర్యంలో మైసన్నగూడెంలో నిరసన కార్యక్రమం నిర్వహించారు. ఆంధ్రప్రదేశ్ రైతు సంఘం జిల్లా కార్యదర్శి కె.శ్రీనివాస్, రైతులు బొడ్డు దుర్గారావు, పాతూరి జానకిరామయ్య మాట్లాడుతూ.. రాళ్ల కాలువ బాగు చేయకపోవడంతో మైసన్న గూడెం, శ్రీనివాసపురం గ్రామాల పరిధిలో వందలాది ఎకరాల పంట నీట మునిగి రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కల్వర్టు నిర్మాణం లేకపోవడంతో పొలాలకు వెళ్లే మార్గం మూసుకుపోయి రైతులు ఇబ్బంది పడాల్సి వస్తోందని చెప్పారు. మైసన్నగూడెం నుంచి పొలాలకు వెళ్లే రోడ్డు నిర్మాణం సరిగా లేదన్నారు. రాళ్ల కాలువ బాగు చేయడానికి, కల్వర్టు, రోడ్డు నిర్మాణానికి నిధులు కేటాయించాలని కోరారు. రైతు సంఘం నాయకులు బొడ్డు రాంబాబు, సిరిబత్తుల సీతారామయ్య, రైతులు పాల్గొన్నారు. -
సంతానం కలుగుతుందనే నమ్మకంతో..
కార్తీక మాసంలో ధర్మాలింగేశ్వర స్వామి ఆలయం ఎదుట ప్రాణాచారం పడటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. సంతానం లేని మహిళలు జిల్లా నలుమూలల నుంచి వచ్చి ఇక్కడ ప్రాణాచారం పడతారు. ఈ సందర్భంగా వచ్చిన కలలు నిజమని భక్తులు ధృఢంగా నమ్ముతారు. ఈ ప్రాంతంలో అనేక మందికి సంతానం కలిగిందనేది వాస్తవం. –నండూరి భాను, కొత్తూరు, కామవరపుకోట ఈ ప్రదేశానికి జిల్లా నలుమూలల నుంచే కాకుండా దేశ, విదేశాల నుంచి నిత్యం పర్యాటకులు వస్తుంటారు. కార్తీక మాసం వచ్చిందంటే భక్తులతో, పిక్నిక్కి వచ్చిన విద్యార్థులతో కిటకిటలాడుతుంది. ఇక్కడ వచ్చేవారికి సరైన మౌలిక వసతులు లేవు. ఈ ప్రదేశాన్ని పర్యాటకంగా తీర్చిదిద్దేందుకు ప్రభుత్వం నిధులు కేటాయించి అభివృద్ధి పరిచేలా చొరవ తీసుకోవాలి. -బొల్లు వెంకట సత్యనారాయణ, కామవరపుకోట -
భక్తులకు మెరుగైన సేవలందించాలి
ద్వారకాతిరుమల: శ్రీవారి ఆలయంలో భక్తులకు మరింత మెరుగైన సేవలు అందించాలని కలెక్టర్ కె.వెట్రిసెల్వి అధికారులను ఆదేశించారు. చినవెంకన్న క్షేత్రాన్ని ఆదివారం సందర్శించిన ఆమె, స్వామి, అమ్మవార్లకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అర్చకులు, పండితుల నుంచి వేద ఆశీర్వచనాన్ని పొందారు. ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి కలెక్టర్కు శ్రీవారి చిత్రపటాన్ని అందజేశారు. అనంతరం ఆమె ఆలయంలోని పలు విభాగాలను పరిశీలించారు. ఈ సందర్భంగా పలువురు భక్తులతో స్వయంగా మాట్లాడి ఆలయంలో అందుతున్న సౌకర్యాలు, దర్శనానికి పడుతున్న సమయం, ఆలయ సిబ్బంది ప్రవర్తన తదితర అంశాలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం నిత్యాన్నదాన సదనంలోని వంటశాలను పరిశీలించి, భక్తులకు అన్నప్రసాదాన్ని వడ్డిస్తున్న తీరును పరిశీలించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ఆలయానికి వచ్చే సామాన్య భక్తులకు అసౌకర్యం కలగకుండా అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. క్యూ లైన్లలో ఎక్కువ సమయం వేచి ఉండకుండా, త్వరితగతిన స్వామివారి దర్శనం జరిగేలా చూడాలన్నారు. భక్తులకు అందించే అన్న ప్రసాదం సరైన నాణ్యతతో ఉండేలా చూడాలని, వంటశాలలో పూర్తి పరిశుభ్రత ఉండేలా అధికారులు పర్యవేక్షించాలన్నారు. అనంతరం గో సంరక్షణ శాలను, బయో గ్యాస్ (గోబర్ గ్యాస్) ప్లాంట్ వినియోగాన్ని పరిశీలించి, సంప్రదాయేతర ఇంధన వనరులను సమర్ధవంతంగా వినియోగిస్తున్న ఆలయ అధికారులను అభినందించారు. కార్యక్రమంలో ఆలయ ఏఈఓ రమణరాజు, సూపరింటిండెంట్ కోటగిరి కిషోర్ తదితరులున్నారు. శ్రీవారి దేవస్థానం అధికారులను ఆదేశించిన కలెక్టర్ -
బౌద్ధారామాల్లో కార్తీక శోభ
కామవరపుకోట: మండలంలోని జీలకర్రగూడెం గ్రామ పంచాయతీ గుంటుపల్లిలోని బౌద్ధారామాలు కార్తీక మాసంలో భక్తులతో, పర్యాటకులతో సందడిగా మారింది. ఈ బౌద్ధారామాల వద్ద ఉన్న భారీ లింగాకారాన్ని ప్రజలు ధర్మ లింగేశ్వర దేవాలయంగా కొలుస్తారు. జగద్గురు ఆది శంకరాచార్యులు విదేశీ పర్యటనలో బౌద్ధారామంలోని ప్రధాన స్తూప చైతన్యాన్ని ధర్మ లింగేశ్వర స్వామిగా రూపాంతరం చేసి పూజలు చేశారని బౌద్ధులు చెబుతుంటారు. ఏటా కార్తీక మాసంలో తిరునాళ్లు నిర్వహిస్తారు. గట్టు తీర్థంగా ప్రసిద్ధి చెందిన ఈ తిరునాళ్ళలో మూడో సోమవారం యాత్రికుల రద్దీ ఎక్కువగా ఉంటుంది. జిల్లాలతో పాటు పొరుగు జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలి వస్తుంటారు. ఈ ప్రాంతాన్ని పాండవులు తిరిగిన ప్రదేశంగా స్థానికులు చెప్పుకుంటారు. దీనిలో భాగంగానే ఇక్కడ రాతిపై భీముడి పాదం ఉన్నట్లుగా ప్రజల భావించి పూజలు నిర్వహిస్తారు. ఇక్కడున్న ధర్మ లింగేశ్వర స్వామికి ప్రాణచారం పడితే సంతానం కలుగుతుందని ఈ ప్రాంత ప్రజల నమ్మకం. ప్రాణాచారం అంటే సంతానం కోసం మొక్కుకున్న మహిళలు ధర్మలింగేశ్వర స్వామి ఆలయం ఎదురుగా బోర్లగా పడుకుని తనను తాను మరిచిపోయి దైవత్వంలోకి మునిగిపోతూ నిద్రావస్థలోకి చేరుకోవడాన్ని ప్రాణాచారం అంటారు. ప్రాణాచారంలో ఉన్నప్పుడు దేవుడు ప్రత్యక్షమై తను కోరుకున్న కోరికలు తీరుస్తాడని భక్తుల నమ్మకం. సంతానం కలగని మహిళలు తలస్నానం చేసి పండ్లు, పువ్వులు చేతితో పట్టుకుని ఈ బౌద్ధాలయం వద్ద ధర్మాలింగేశ్వరి స్వామి ఎదుట ప్రాణాచారం పడతారు. అలా ప్రాణాచారం పడిన వారికి స్వామి కలలో ప్రత్యక్షమై పండ్లు అందజేసినట్లయితే మగబిడ్డ పుడతాడని, పూలు అందజేస్తే ఆడపిల్ల పుడుతుందని, చీపురు, చాట కనబడితే వారికి సంతాన భాగ్యం లేదనేది ఈ ప్రాంత వాసుల నమ్మకం. అలా పుట్టిన పిల్లలకు మొక్కులు తీర్చి ధర్మయ్య, లింగయ్య, ఈశ్వరయ్య, ధర్మవతి, ధర్మ లక్ష్మీ ఇలా అనేక పేర్లు పెడుతుంటారు. ఈ కారణంగా అధిక సంఖ్యలో మహిళలు ప్రాణచారం పడుతుంటారు. తిరుణాల సందర్భంగా మండలంలో మూడో సోమవారం విద్యాసంస్థలకు సెలవు ప్రకటిస్తారు. ఈ ప్రాంతంలో అడపాదడపా సినిమా షూటింగ్లు సైతం నిర్వహిస్తుంటారు. ఈ ప్రదేశం పిక్నిక్ స్పాట్గా ఉండడంతో.. కార్తీకమాసంలో అధిక సంఖ్యలో పాఠశాలల విద్యార్థులు వస్తుంటారు. -
సుబ్బారాయుడిని దర్శించుకున్న భక్తులు
ముదినేపల్లి రూరల్: ప్రసిద్ధి చెందిన సింగరాయపాలెం–చేవూరుపాలెం సెంటర్లోని శ్రీసుబ్రహ్మణ్యేశ్వరస్వామి ఆలయంలో ఆదివారం భక్తులు పోటెత్తారు. సుదూర ప్రాంతాల నుంచి భారీసంఖ్యలో భక్తులు ఆలయానికి చేరుకుని స్వామివారి పుట్టలో పాలు పోసి దర్శించుకున్నారు. పాలపొంగళ్ళశాల వద్ద మహిళలు నైవేద్యాలు తయారుచేసి స్వామికి సమర్పించారు. నాగబంధాల వద్ద స్వామివారి మూర్తులను ప్రతిష్ఠించేందుకు అర్చకులతో పూజలు చేయించి ప్రతిష్ఠ తంతు నిర్వహించారు. నాగబంధాల వద్ద, గోకులంలోని గోవులకు మహిళలు పసుపు కుంకుమలతో పూజలు చేశారు. భక్తుల రద్దీకి అనుగుణంగా అన్నప్రసాద ఏర్పాట్లు చేశారు. స్వామిని దర్శించుకునే భక్తులు అన్నప్రసాదం కార్యక్రమంలో పాల్గొంటే మేలు జరుగుతుందనే విశ్వాసం ఉంది. దీంతో అన్నదాన కార్యక్రమానికి భక్తలు పోటెత్తడంతో ఆలయ సహాయ కమిషనర్ ఆర్.గంగాశ్రీదేవి ఆధ్వర్యంలో తగిన ఏర్పాట్లు చేశారు. పెదవేగి: పెదవేగి మండలం రాట్నాలకుంటలో వేంచేసిన శ్రీ రాట్నాలమ్మకు ఆదివారం ప్రీతికరమైన రోజు కావడంతో భక్తులు అమ్మవారిని దర్శించుకుని మొక్కుబడులను తీర్చుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి పూజలు నిర్వహించి, తీర్థప్రసాదాలు స్వీకరించారు. ఈ వారం మొత్తం రూ.26,560 ఆదాయం లభించిందని దేవస్థాన కార్యనిర్వహణాధికారి సతీష్కుమార్ చెప్పారు. -
మార్కెట్లో మటన్ మంచిదేనా?
● చనిపోయిన గొర్రెలు కోసి విక్రయాలు ● రెస్టారెంట్లపై అనుమానాలు ● జిల్లాలో పశువైద్యులు, ఫుడ్ ఇన్స్పెక్టర్ల పర్యవేక్షణలపై విమర్శలు తణుకు అర్బన్: ముక్కలేనిదే ముద్ద దిగని మాంసాహారులు అత్యధికంగా ఇష్టపడేది మటన్. మాంసాహార అమ్మకాల్లో కొందరు అక్రమార్కుల కారణంగా మటన్ ముట్టుకోవాలంటే భయపడే పరిస్థితి నెలకొంది. గత నెల 30న అత్తిలి మేకల కబేళాలో చనిపోయిన గొర్రెలను వధించి మాంసాన్ని విక్రయిస్తున్న వ్యవహారం జిల్లాలో సంచలనంగా మారింది. మార్కెట్లో కొనుగోలు చేస్తున్న మటన్ మంచిదేనా అనే సందేహం మాంసాహార ప్రియుల్లో మొదలైంది. అత్తిలిలో స్థానికులు ఇచ్చిన ఫిర్యాదు మేరకు అత్తిలి సెక్రటరీ జి.భాస్కరరావు కబేళాను పర్యవేక్షించి చనిపోయిన గొర్రెలను వధించారని నిర్ధారించుకున్న అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో నలుగురిపై కేసులు నమోదు చేశారు. ఈ వ్యవహారంలో 8 చనిపోయిన గొర్రెలను కోసిన మాంసంతో పాటు చనిపోయిన 5 గొర్రెలను స్వాధీనం చేసుకున్నారు. సదరు మాంసాన్ని ఇరగవరం మండలం రేలంగిలో విక్రయిస్తున్నట్లుగా విచారణలో తేలింది. మార్కెట్లో కిలో మటన్ ధరలు రూ.వెయ్యి ఉండగా చనిపోయిన గొర్రెల మాంసం రూ.500 నుంచి రూ.550కు జిల్లాలో కొన్ని చోట్ల విక్రయిస్తున్నారు. పట్టణాల్లో ఽరూ.వెయ్యికి అమ్మకాలు చేస్తుండగా కొన్ని గ్రామాల్లో మాత్రం కొందరు రిటైల్ వ్యాపారులు రూ.500కు కూడా మటన్ విక్రయిస్తున్నారు. జిల్లాలో మటన్ విక్రయాలకు సంబంధించి ఆదివారం 1,500 కిలోలు, మంగళవారం వెయ్యి కిలోలు, మిగిలిన రోజుల్లో రోజుకు 700 కిలోల చొప్పున సుమారుగా విక్రయాలు జరుగుతాయని వ్యాపారులు చెబుతున్నారు. పర్యవేక్షణపై అనుమానాలు నిబంధనల ప్రకారం మాంస విక్రయాలకు సంబంధించి గొర్రెలు, మేకలను వధించే ముందు పశు వైద్యులు వాటి ఆరోగ్యస్థితిని నిర్ధారించి ఆరోగ్యంగా ఉన్న వాటిని మాత్రమే వధించేందుకు అనుమతి ఇవ్వాల్సి ఉంది. సదరు మాంసంపై కూడా స్టాంపు వేయాల్సి ఉంది. ఈ తరహా నిబంధనలు జిల్లాలో ఎక్కడా అమల్లో లేవనే ఆరోపణలు బలంగా వినిపిస్తున్నాయి. రాత్రి 3 గంటలకే మేకల కబేళాకు చేరుకోవడం తదితర వ్యవహారం అంతా కష్ట సాధ్యంగా ఉంటుందనే ఉద్దేశంతో పశు వైద్యులు పరీక్షలు నిర్వహించడం లేదని పలువురు చెబుతున్నారు. దీంతో మాంసం రిటైల్ విక్రయదారుల్లో కొందరు అక్రమ మార్గంలో చనిపోయిన జీవాలను వధించి విక్రయించేస్తున్నారని తెలుస్తోంది. చనిపోయిన గొర్రెల్లో రక్తం శరీరంలోనే ఇంకిపోతుందని, దాని వల్ల మాంసం త్వరగా కుళ్లిపోతుందని, అలాంటి మాంసాన్ని భుజిస్తే మనుషుల్లో జీర్ణ వ్యవస్థకు సంబంధించిన ఇబ్బందులు తలెత్తే అవకాశం ఉందని వైద్యులు చెబుతున్నారు. రెస్టారెంట్లకు తక్కువ ధరకు విక్రయాలు ముఖ్యంగా జిల్లాలోని హాటళ్లు, రెస్టారెంట్లలో అందుబాటులో ఉన్న మాంసాహారాల్లో మటన్ అతి తక్కువ ధరకు కొనుగోలు చేస్తుంటారని తెలుస్తోంది. చనిపోయిన గొర్రెల మాంసం మార్కెట్లో అందుబాటులో ఉండడంతో పాటు కొన్ని రోజులపాటు ఫ్రిజ్లలో ఉంచి మరీ రెస్టారెంట్లలో వండి వస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి. అత్తిలి వ్యవహారం బయటపడిన రోజు నుంచి రెస్టారెంట్లు, హోటళ్లలో మటన్ రుచిచూడాలంటే భయపడుతున్నామని పలువురు చెబుతున్నారు. దీనికితోడు ఫుడ్ పాడయిందని, దుర్వాసన వస్తుందని ప్రజలు బాహాటంగా చెప్పినా కూడా అధికారులు ఎలాంటి పర్యవేక్షణలు చేయకపోవడం, ఫుడ్ ఇన్స్పెక్టర్ స్థానికంగా అందుబాటులో లేకపోవడంతో బాధితులను పట్టించుకునే వారు లేరని వాపోతున్నారు. దుకాణాల్లోనే కోసేస్తున్న వైనం కొందరు రిటైల్ వ్యాపారులు మేకల కబేళాకు వెళ్లే పరిస్థితి లేకుండానే తమ దుకాణాల్లోనే గొర్రెలను వధించే దుస్థితి జిల్లాలోని చాలా చోట్ల కనిపిస్తోందని మాంసాహారులు చెబుతున్నారు. దుకాణాల్లో వెనుక భాగంలో జీవాలను వధించేసి మాంసాన్ని విక్రయిస్తున్న పరిస్థితులు కనిపిస్తున్నాయని పలువురు వాపోతున్నారు. ఈ విషయంపై తణుకు పశు సంవర్థకశాఖ అధికారి పృథ్వీరెడ్డిని సాక్షి వివరణ కోరగా ప్రతి రోజూ తణుకు మేకల కబేళాలో జీవాలను వైద్య పరీక్షలు చేసిన తరువాత మాత్రమే వధించేందుకు అనుమతినిస్తున్నట్లు చెప్పారు. -
వైభవంగా గిరి ప్రదక్షిణ
ఆగిరిపల్లి: శోభనాచలుడి గిరి ప్రదక్షిణ మహత్తర ఘట్టంలో భక్తులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. ఆగిరిపల్లి లోని శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి కార్తీక బ్రహ్మోత్సవాల్లో భాగంగా ఆదివారం శోభనగిరి (కొండ) చుట్టూ నిర్వహించిన గిరి ప్రదక్షిణ కనుల పండువగా సాగింది. భూనీల సమేత లక్ష్మీ నరసింహ స్వామి ఉత్సవమూర్తులకు దేవదాయ శాఖ ఆధ్వర్యంలో ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు, అనంత కృష్ణలు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం స్వామి ఉత్సవమూర్తులను తిరుచ్చి పల్లకి వాహనంపై, శేష వాహనంపై శోభనగిరి చుట్టూ ప్రదక్షిణ నిర్వహించారు. భక్తులు సామూహిక విష్ణు సహస్రనామం, గోవింద నామస్మరణల మధ్య గిరి ప్రదక్షిణను వైభవంగా నిర్వహించారు. -
భక్తుల ప్రాణాలపై బాధ్యత లేదా?
దెందులూరు: రాష్ట్రంలో భక్తుల ప్రాణాల భద్రతపై కూటమి ప్రభుత్వానికి బాధ్యత లేకపోవడం బాధాకరమని దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి అన్నారు. శనివారం ఆయన కార్యాలయంలో మీడియాతో మాట్లాడుతూ ప్రతిసారి అదే నిర్లక్ష్యం అదే బాధ్యతారాహిత్యం కనబడుతోందన్నారు. గతంలో తిరుమల, సింహాచలం ఇప్పుడు శ్రీకాకుళం.. ప్రాణనష్టం జరిగిన ప్రతిసారి ఏదో కుంటి సాకు చెబుతున్నారని శ్రీకాకుళం ఆంధ్రప్రదేశ్లో భాగం కాదా అని ప్రశ్నించారు. వసతుల లేమి పసిగట్టి ప్రభుత్వానికి నివేదిక ఇవ్వాల్సిన ఇంటెలిజెన్న్స్ ఏం చేస్తుందన్నారు. బుట్టాయగూడెం: పాపికొండల అభయారణ్యంలోని జంతువుల సంరక్షణకు ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజమండ్రి అటవీశాఖ సీసీఎఫ్ ఎంఎస్ఎన్ మూర్తి తెలిపారు. శుక్రవారం టేకూరు సెక్షన్ పరిధిలోని పాపికొండల అభయారణ్యంలో అటవీ శాల అధికారుల బృందం పర్యటించింది. ఈ సందర్భంగా అభయారణ్యం ప్రాంతంలో గ్రాస్ ల్యాండ్స్ ఏర్పాటుకు సంబంధించిన ప్రదేశాలను సందర్శించారు. అనంతరం సీసీఎఫ్ ఎంఎస్ఎన్ మూర్తి మాట్లాడుతూ టేకూరు సెక్షన్ పరిధిలో 20 హెక్టార్లలో, వాడపల్లి సెక్షన్ పరిధిలో 10 హెక్టారుల్లో మొత్తం 50 హెక్టారుల్లో వన్యప్రాణుల ఆహారం కోసం గ్రాస్ ల్యాండ్స్ ఏర్పాటుకు ప్రతిపాదనలు తయారు చేసి అటవీ క్షేత్ర కార్యాలయానికి పంపించాలని రేంజ్ అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో డీఎఫ్ఓ సతీష్, సబ్ డీఎఫ్ఓ వెంకటసుబ్బయ్య, రేంజ్ అధికారులు ఎస్కె వల్లి, దావీదురాజు, తదితరులు పాల్గొన్నారు. జంగారెడ్డిగూడెం: వివాహితను గదిలో నిర్భంధించి చిత్రహింసలు గురిచేసి ఆమె బావతో కాపురం చేయమని వేధించిన ఘటనలో ఐదుగురిపై కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ షేక్ జబీర్ తెలిపారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం స్థానిక బుట్టాయగూడెంలో నివసిస్తున్న చిన్ని అమృతవల్లి భర్త చిన్ని రంజిత్కుమార్, అత్త చంద్రకళ, మామ నాగేశ్వరరావు, బావ ప్రవీణ్కుమార్, తోటికోడలు హరిప్రియపై కేసు నమోదుచేసినట్లు తెలిపారు. అమృతవల్లిని వీరు వేధించినట్లు తెలిపారు. ద్వారకాతిరుమల: శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం)లో ఆదివారం రాత్రి జరుగనున్న చినవెంకన్న తెప్పోత్సవానికి సర్వం సిద్ధమైంది. వేడుకలో భాగంగా ఉభయ దేవేరులతో స్వామివారు విహరించనున్న తెప్పను హంస వాహనంగా అలంకరిస్తున్నారు. అలాగే తెప్పలో పచ్చిపూల మండపాన్ని నిర్మిస్తున్నారు. భక్తులకు రక్షణ కల్పించేలా పుష్కరణి గట్లపై బారికేడ్లు నిర్మించారు. సాగరం మధ్యలోని మండపానికి, అదేవిధంగా గట్లపైన, చెట్లకు విద్యుత్ అలంకారాలు చేశారు. దాంతో పుష్కరణి పరిసరాలు విద్యుద్దీప కాంతులతో మిరుమిట్లు గొలుపుతున్నాయి. స్వామి, అమ్మవార్లు ఆలయం నుంచి తొళక్క వాహనంపై బయల్దేరి పుష్కరిణి వద్దకు రాత్రి 8 గంటల సమయానికి చేరుకుంటారని, ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భీమవరం: కౌలురైతుల సమస్యల పరిష్కారం కోసం ఈ నెల 3 న కలెక్టరేట్ వద్ద ఏపీ కౌలు రైతుల సంఘం ఆధ్వర్యంలో ఆందోళన నిర్వహిస్తున్నట్లు కౌలురైతుల సంఘం జిల్లా అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు మామిడిశెట్టి రామాంజనేయులు, ఉందుర్తి శ్రీనివాసరావు శచెప్పారు. కూటమి ప్రభుత్వం కౌలురైతులను దగా చేసిందన్నారు. తుపాను కౌలు రైతులు పంట కోల్పోతే అధికారులు పంట నష్టం భూ యజమానుల పేరున నమోదు చేస్తున్నారని ఆరోపించారు. -
సైబర్ నేరగాళ్లకు చెక్
● దేశమంతా జల్లెడ పట్టిన ఏలూరు పోలీసులు ● 8 మంది అరెస్టు ఏలూరు టౌన్: ఏలూరు జిల్లా పోలీసులు సాహసోపేతమైన ఛేజింగ్తో సైబర్ నేరగాళ్ళ ఆగడాలకు చెక్ పెట్టారు. ఏలూరు టూటౌన్ పోలీస్స్టేషన్లో నమోదైన ఒక కేసు దర్యాప్తులో భాగంగా తీగ లాగితే డొంకంతా కదలింది ఏకంగా రాష్ట్రాలతోపాటు, ఇతర దేశాల్లోని సైబర్ నేరగాళ్ల ఆటకట్టించేందుకు ఏలూరు జిల్లా పోలీసుల దర్యాప్తు ఉపయోగపడుతోంది. శనివారం విజయవాడలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో సైబర్ నేరాలకు పాల్పడుతున్న వ్యక్తులను అరెస్ట్ చేసి నేరాల దర్యాప్తుపై వివరాలు వెల్లడించారు. ఏకంగా ఏడు రాష్ట్రాలను జల్లెడ పట్టి సైబర్ నేరాలకు పాల్పడే సూత్రధారుల వద్దకే ఏలూరు జిల్లా పోలీసులు వెళ్లి అరెస్టు చేశారు. వేట మొదలైందిలా.. ఏలూరు ఆర్ఆర్ పేటకు చెందిన ఒక వృద్ధురాలు తన బ్యాంకు ఖాతా నుంచి రూ.58 లక్షల నగదు సైబర్ నేరగాళ్ళు కాజేశారంటూ ఈ ఏడాది సెప్టెంబర్లో ఏలూరు టూటౌన్ పోలీసులకు ఫిర్యాదు చేసింది. వృద్దురాలి ఫిర్యాదుపై కేసు నమోదు చేశారు. జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ సైబర్ నేరాలను ఛాలెంజింగ్ తీసుకున్నారు. డీఎస్పీ శ్రావణ్కుమార్ పర్యవేక్షణలో 4 పోలీస్ దర్యాప్తు బృందాలను ఏర్పాటు చేశారు. టూటౌన్ సీఐ అశోక్కుమార్, ఎస్ఐ మధువెంకట రాజా, భీమడోలు సీఐ యూజే విల్సన్, సీఐ సుభాష్తో కూడిన నాలుగు ప్రత్యేక దర్యాప్తు బృందాలు సైబర్ నేరగాళ్ల మూలాలను ఛేదించేందుకు వేట ప్రారంభించారు. ఏడు రాష్ట్రాల్లో 14 వేల కిలోమీటర్ల ప్రయాణం ఏలూరు జిల్లా పోలీస్ బృందాలు ఢిల్లీ, మహారాష్ట్ర, గుజరాత్, ఉత్తరప్రదేశ్, పశ్చిమ బెంగాల్, ఝార్ఖండ్, కర్నాటక, తమిళనాడుతో పాటు నేపాల్ను చుట్టేశారు. ఏకంగా 14 వేల కిలోమీటర్ల మేర ప్రయాణించి నేరగాళ్లను పట్టుకునేందుకు శ్రమించారు. ముంబైకి చెందిన పూనమ్ ప్రవీణ్ సోనావాలేను ప్రధాన నిందితురాలి గుర్తించారు. ఈమె మ్యూల్ అకౌంట్లు దేశవ్యాప్తంగా ఉన్నట్లు నిర్ధారించుకున్నారు. యూపీకి చెందిన సచీంద్ర శర్మ, నితిన్ మిశ్రా, హర్షిత్ మిశ్రా, అభిషేక్ కశ్యప్, గోపాల్ యాదవ్, కో–ఆపరేటివ్ బ్యాంకులో రీజనల్ మేనేజర్గా పనిచేసే సందీప్ అలోనీ, హెడ్కానిస్టేబుల్ సందీప్తో పాటు మరో ముగ్గురు నేరస్తులను గుర్తించారు. 11 మంది సైబర్ నేరగాళ్లను గుర్తించగా 8 మందిని అక్టోబర్ 26న ఏలూరు తరలించి కోర్టులో హాజరుపరచగా న్యాయస్థానం రిమాండ్ విధించింది. ఏపీకే ఫైల్స్తో మోసాలు సైబర్ నేరగాళ్ళు వినియోగిస్తున్న 12 రకాల హానికర ఏపీకే ఫైల్స్ను పోలీసులు గుర్తించారు. వీరంతా బాధితుల నుంచి కొల్లగొట్టిన సొమ్మును క్రిప్టో కరెన్సీ ద్వారా కంబోడియా, చైనా వంటి దేశాలకు తరలిస్తున్నట్లు దర్యాప్తులో వెల్లడైంది. సెప్టెంబర్ 17, 18 తేదీల్లో రూ.2.25 కోట్లు మ్యూల్ అకౌంట్ నుంచి తరలించినట్లు గుర్తించారు. ఈ భారీ నెట్వర్క్ మన దేశంతో పాటు కంబోడియా, సింగపూర్, నేపాల్, చైనా, అమెరికా వంటి దేశాల్లోనూ ఉన్నట్లు పోలీస్ దర్యాప్తులో వెల్లడైంది. వేల కోట్లు సొమ్ము సైబర్ నేరగాళ్ళ ఖాతాల్లో ఉన్నాయి. నగదు ఫ్రీజ్కు సైతం ఆయా బ్యాంకులకు దర్యాప్తు బృందాలు అభ్యర్థన పత్రాలు అందజేశాయి. కంబోడియాలోని ప్రత్యేక ఆన్లైన్ సర్వర్లకు, ఆలీబాబా సర్వర్కు జిల్లా పోలీసులు ఇప్పటికే అభ్యర్థన పంపారు. ఈ దర్యాప్తు బృందంలో సైబర్ సెల్ సీఐ దాసు, చేబ్రోలు ఎస్సై సూర్యభగవాన్, ఎస్సై వై.సుధాకర్, ఎస్బీ ఎస్సై వీరప్రసాద్, ఎస్సై వల్లి పద్మ, ఏఎస్సై అహ్మద్, హెడ్ కానిస్టేబుళ్లు రవికుమార్, శ్రీనివాస్, సెల్ ట్రాకింగ్ హెచ్సీ వెంకట సత్యనారాయణ, సైబర్ సెల్ కానిస్టేబుల్ శివకుమార్, బి.నాగరాజు, బి.రామకృష్ణ తదితరులున్నారు. -
రైతు సమక్షంలో నష్టం అంచనా వేయాలి
ఉద్యాన పంటలు, వరి తుపాను కారణంగా నష్టపోయాయి. అధికారులు నష్టాలు అంచనా వేస్తున్నా సమయంలో రైతులను కూడా అధికారులతో పాటు భాగస్వాముల్ని చేయాలి. రైతులందరికీ న్యాయం జరగాలంటే అధికారులతో రైతులు ఉండాలి. – సున్నా వెంకటరావు, ఏపీ రైతు సంఘం కార్యదర్శి ఈ సంవత్సరం 4 ఎకరాల్లో మొక్కజొన్న సాగు చేశా. ఇంతవరకు రూ.2 లక్షలు ఖర్చు చేశాను. తుపాను, ఈదురు గాలుల దెబ్బకు మొక్కజొన్న కంకులు విరిగిపోయి నీళ్లలో నాను తున్నాయి. ఖరీఫ్లో మొక్కజొన్న పంటకు బీమా లేదని అధికారులు చెబుతున్నారు. ప్రభుత్వం ఆదుకోకపోతే అప్పుల్లో కూరుకుపోతాం. – గురజాల రమేష్, రైతు, కనసానపల్లి, ఆగిరిపల్లి మండలం -
కార్మికులు పస్తులుంటే పట్టించుకోరా!
కై కలూరు పంచాయతీ కార్మికులకు 8 నెలల జీతాలు బకాయి కై కలూరు: పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, కాంట్రాక్టు సిబ్బందికి 8 నెలలుగా జీతాలు ఇవ్వకపోతే వారి కుటుంబాలను ఏలా పోషిస్తారు? ఇదేనా ప్రభుత్వాధికారుల తీరు అని వైఎస్సార్సీపీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు నిలదీశారు. కై కలూరు మేజర్ పంచాయతీలో పనిచేసే పారిశుద్ధ్య కార్మికులు, విద్యుత్, నీటి సరఫరా, రిక్షా వర్కర్లు, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా 85 మందికి 8 నెలలుగా జీతాలు చెల్లిండడం లేదు. దీంతో స్థానిక ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్, పంచాయతీ ఈవో దృష్టికి తీసుకువెళ్లారు. నవంబరు 1 నుంచి విధులను బహిష్కరిస్తున్నామని సమ్మె నోటీసు అందించారు. శనివారం విధులు బహిష్కరించి నీటి సరపరా, చెత్త సేకరణ నిలిపేశారు. పంచాయతీ భవానమ్మ చెరువు విద్ద నిరసన తెలిపారు. మద్దతుగా డీఎన్నార్ వెళ్లి సంఘీభావం ప్రకటించారు. జీతాలు చెల్లించకపోతే పనులు ఎలా జరుగుతాయని అన్నారు. ఎమ్మెల్యే చొరవ తీసుకుని జీతాలు చెల్లించే చర్యలు తీసుకోవాలని కోరారు. కార్మికులకు అన్యాయం జరిగితే సహించమన్నారు. డీఎన్నార్తో పాటు కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, వివిధ హోదాల నాయకులు పంజా రామారావు, సయయం అంజి, కన్నా బాబు, సిరాజుద్ధిన్, పంజా నాగు, ఎండీ.గాలిబ్బాబు, మడక శ్రీను, ఉండ్రమట్ల ఏసుకుమార్ ఉన్నారు. టీడీపీ కవ్వింపు చర్యలు పంచాయతీ కార్మికులు జీతాల కోసం చేస్తున్న సమ్మె వల్ల పరువు పోతుందని భావించిన టీడీపీ నాయకులు త్రినాథరాజు, పోలవరపు రాణి, జానీ, పడమటి వాసు, మల్యాద్రి కార్మికులతో మాట్లాడారు. ఆ సమయంలో డీఎన్నార్ సంఘీభావం ప్రకటించడానికి వచ్చారు. పంచాయతీ ఈవో ప్రసాద్ను పిలిచి జీతాల ఆలస్యానికి కారణాలు అడిగారు. ఇంతలో కార్మికులు డీఎన్నార్ వద్దకు వెళ్ళి గోడు చెప్పడం జీర్ణించుకోలేక టీడీపీ నాయకుడు జానీ డీఎన్నార్ను ఉద్దేశించి కవ్వింపు చర్యలకు దిగాడు. దీంతో డీఎన్నార్ కూడా ఘటుగా సమాధానం చెప్పారు. 8 నెలలుగా జీతాలు చెల్లించకపోతే టీడీపీ నాయకులు ఎందుకు ప్రశ్నించలేదని వైఎస్సార్సీపీ నేతలు ఘటుగా సమాధానం చెప్పారు. ఒకానొక సందర్భంలో ఇరు పార్టీల కేకలతో గందరగోళం ఏర్పడింది. చివరికు వైఎస్సార్సీపీ నుంచి పంజా రామారావు, టీడీపీ నుంచి పోలవరపు రాణి, త్రినాథరాజు, తాత్కాలిక సర్పంచ్ కేవీఎన్ఎం నాయుడు గొడవ పెద్దది కాకుండా చూశారు. విధుల్లోకి కార్మికులు పంచాయతీ కార్మికులకు రావల్సిన 8 నెలల జీతాలను ఈ నెల 11 లోపు కొంత, మిగిలిన బాకీ ఈ నెలాఖరుకు అందిస్తామనే హామీతో కార్మికులు సమ్మెను విరమించారు. యథావిధిగా పనులు మొదలుపెట్టారు. వైఎస్సార్సీపీ నాయకులు అండగా రావడంతోనే జీతాలు చెల్లింపు హామీ వచ్చిందనే భావన కార్మికులతో కనిపించింది. -
విహారం.. కారాదు విషాదం
నరసాపురం: ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లాలో ఉన్న ఏకై క పేరుపాలెం బీచ్ నేటి నుంచి కళకళలాడనుంది. కార్తీకమాసం ప్రారంభమైన తరువాత మోంథా తుపాను కారణంగా వారంరోజుల నుంచి బీచ్కు పర్యాటకులను అనుమతించ లేదు. తుపాను ప్రభావం తగ్గడం, నేడు ఆదివారం కావడంతో బీచ్లో పర్యాటకుల సందడి పెరగనుంది. అయితే ప్రతి ఏటా బీచ్లో మరణాలు నమోదు కావడం, అధికారులు మాత్రం ఎలాంటి భద్రతా చర్యలు చేపట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. బీచ్లో మృత్యుఘంటికలు ఏడాది పొడువునా బీచ్కు విహారం కోసం జనం వస్తుంటారు. వారాంతరాలు, సెలవు దినాల్లో బీచ్కు వచ్చేవారి సంఖ్య మరింత ఎక్కువ. ఇక కార్తీక మాసంలో అయితే లక్షల్లో వస్తుంటారు. పక్కజిల్లాలు నుంచి కూడా శని, ఆదివారాల్లో పెద్దసంఖ్యలో హాజరవుతారు. కార్తీకమాసం నెలరోజుల్లో సుమారు 3 లక్షల మంది బీచ్ను సందర్శిస్తుంటారు. అయితే ఇక్కడ సరైన భద్రతా చర్యలు చేపట్టకపోవడం వలన బీచ్లో మృత్యుఘంటికలు ఆందోళన కలిగిస్తున్నాయి. గత 15 ఏళ్లలో బీచ్లో 150 మంది వరకూ ప్రమాదవశాత్తు మృత్యువాత పడ్డారు. వీరంతా యువకులే కావడం గమనార్హం. సముద్రంలో గల్లంతైన వారికి సంబంధించి కొన్ని సందర్భాల్లో కనీసం మృతదేహాలు కూడా దొరకవు. గత పదేళ్లలో ఇప్పటికీ 25 మంది వరకూ మృతదేహాలు సైతం లభ్యం కాలేదు. పేరుపాలెం బీచ్ స్నానాలకు అనువుకాదా..? పేరుపాలెం బీచ్ ప్రాంతంలో సముద్రంలో గుంటలు, గుంటలుగా ఉంటాయని మత్స్యకారులు చెబుతారు. దీంతో అలలు పెద్దపెద్దగా వచ్చినప్పుడు, కాళ్ల క్రింద ఇసుక విపరీతంగా కోతకు గురవుతుంది. దీనినే నిపుణులు అండర్ కరెంట్గా పేర్కొంటారు. ఇలా పెద్ద అలలు, కాళ్లక్రింద కోత జరిగినప్పుడు సముద్రంలో ఉన్నవారు శరీరంపై నియంత్రణను కోల్పోతారు. వెంటనే సముద్ర అలలకు కొట్టుకుపోతారు. సరిగ్గా ఇక్కడా ఇదే జరుగుతుందనేది వాదన. నిపుణులతో సమగ్ర సర్వే చేయించి, బీచ్లో సేఫ్జోన్ ప్రాంతాలను గుర్తించి, భద్రత కట్టుదిట్టం చేసే వరకూ పర్యాటకులను అనుమతించకూడదనే డిమాండ్ గతంలో వినిపించింది. గడిచిన మూడు దశాబ్ధాల కాలంలో టీడీపీ ప్రభుత్వం ఎక్కవకాలం అధికారంలో ఉన్నా ఆ దిశగా చర్యలు చేపట్టలేదు. అసాంఘిక కార్యక్రమాలకు అడ్డుకట్ట పడేనా పేరుపాలెం బీచ్ ఇటీవల అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారింది. కూటమి ప్రభుత్వంలో తీర గ్రామాలను బెల్ట్షాపులతో నింపేయడంతో బీచ్లో మద్యం ఏరులై పారడం, పేకాట సర్వసాధారణమైపోయాయి. కనీసం బీచ్ వద్దకు మద్యం సేవించి రాకుండా చర్యలు తీసుకోవడంలో అధికారులు విఫలమవుతున్నారు. అలాగే ప్రమాదాలు జరుతున్న ప్రాంతాన్ని నిషేధిత జోన్గా ప్రకటించకపోవడం పైనే ప్రజలు తీవ్రంగా విమర్శిస్తున్నారు. నేటినుంచి పేరుపాలెం బీచ్లో సందడి కార్తీక ఆదివారం కావడంతో పెరగనున్న పర్యాటకుల తాకిడి తుపాను ప్రభావం తగ్గడంతో విహారానికి ఆసక్తి ఏటా బీచ్లో మోగుతున్న మృత్యుఘంటికలతో ఆందోళన భద్రతా చర్యలపై అధికారుల నిర్లక్ష్యం -
కన్నులపండువగా శ్రీవారికి ఏకాదశి ఉత్సవం
ద్వారకాతిరుమల: చినవెంకన్న దివ్య క్షేత్రంలో శనివారం రాత్రి శ్రీవారికి తిరువీధి సేవ అట్టహాసంగా జరిగింది. ఏకాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని నిర్వహించిన ఈ వేడుక భక్తులకు నేత్రపర్వమైంది. ముందుగా ఆలయంలో స్వామి, అమ్మవార్ల ఉత్సవ మూర్తులను తొళక్క వాహనంపై ఉంచి, సుగంధ భరిత పుష్పమాలికలతో విశేషంగా అలంకరించారు. అనంతరం అర్చకులు పూజాధికాలను జరిపి, హారతులిచ్చారు. ఆ తరువాత స్వామివారి వాహనం మేళతాళాలు, మంగళ వాయిద్యాలు, అర్చకులు, పండితుల వేద మంత్రోచ్ఛరణల నడుమ ఆలయ ప్రధాన రాజగోపురం మీదుగా క్షేత్ర పురవీధులకు పయనమైంది. దీపావళి పండుగ తరువాత స్వామివారు తొలిసారిగా పురవీధులకు రావడంతో భక్తులు ప్రతి ఇంటి ముంగిటా పెద్ద ఎత్తున బాణసంచా కాల్చారు. అలాగే స్వామి, అమ్మవార్లకు నీరాజనాలు సమర్పించారు. పోటెత్తిన శ్రీవారి క్షేత్రం ద్వారకాతిరుమల: శ్రీవారి దివ్య క్షేత్రంలో శనివారం భక్తులు పోటెత్తారు. స్వామివారికి ప్రీతికరమైన రోజు, ఏకాదశి, కార్తీకమాస పర్వదినాలను పురస్కరించుకుని వేలాది మంది భక్తులు ఆలయానికి తరలివచ్చారు. దీంతో అన్నివిభాగాలు భక్తులతో కిటకిటలాడాయి. స్వామివారి దర్శనానంతరం పెద్ద ఎత్తున భక్తులు ఆలయ తూర్పు రాజగోపురం వద్ద ఉన్న దీపారాధన మండప ప్రాంతంలో కార్తీక దీపాలను వెలిగించారు. వేలాది మంది భక్తులు శ్రీవారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. అనివేటి మండపంలో పలు భజన మండలి సభ్యులు ప్రదర్శించిన కోలాట నృత్యాలు చూపరులను అలరించాయి. క్షేత్రంలో రాత్రి వరకు భక్తుల రద్దీ కొనసాగింది. -
రైతులను ఆదుకోవాలి
ఎన్నాళ్లీ ‘సెల్’ కష్టాలు.! శ్రీవారిని దర్శించడం కంటే.. సెల్ఫోన్లను భద్రపరచడమే భక్తులకు కష్టంగా మారింది. కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. 8లో uమాజీ ఎమ్మెల్యే వాసుబాబు ఉంగుటూరు: రైతుల తరఫు బీమా చెల్లించి వైఎస్సార్సీపీ ప్రభుత్వం ఆదుకుంటే ఈ ప్రభుత్వం చెల్లించకుండా రైతులను నట్టేట ముంచిందని మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. శనివారం ఉంగుటూరు మండలంలో దెబ్బతిన్న వరిపొలాలను పరిశీలించారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ రైతులు తీవ్రంగా నష్టపోయారని, బేషరతుగా నిబంధనలు సడలించి రైతులను ఆదుకోవాలని కోరారు. 20 బస్తాలకు మంచి అవ్వని పరిస్థితి ఏర్పడిందని తెలిపారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 5,500 ఎకరాల పంట దెబ్బతిందని చెప్పారు. ఉచిత పంటల బీమా అమలుచేసింది జగన్ ప్రభుత్వమేనని అన్నారు. తడిసిన ధాన్యాన్ని కొనుగోలు చేయాలని కోరారు. రైతు భరోసా రూ.20 వేలు ఇస్తానని చెప్పి.. కేవలం రూ.5 వేలు ఇచ్చి చేతులు దులుపుకోవడం విడ్డూరంగా ఉందన్నారు. జగన్ హయాంలో ఇన్ఫుట్ సబ్సిడీ ఇచ్చేవారని తెలిపారు. చంద్రబాబు రూ.2 లక్షల కోట్లు అప్పు చేశారని, అదంతా ఏం చేశారో తెలియదన్నారు. రైతుల వద్ద ధాన్యాన్ని ప్రభుత్వమే కొనుగోలు చేయాలని అన్నారు. ఆయన మండల పార్టీ అధ్యక్షుడు మరడా మంగరావు, బూత్ విభాగం కార్యదర్శి యెలిశెట్టి పాపారావు, పంచాయతీరాజ్ విభాగం అధ్యక్షుడు పుప్పాల గోపి, వీవర్సు విభాగం అధ్యక్షుడు దొంతంశెట్టి సత్యనారాయణ, పెనుగొండ బాలక్రష్ణ, షేక్ బాజి, మంద జయలక్ష్మి తదితరులున్నారు. -
భక్తులకు ఎన్నాళ్లీ ‘సెల్’ కష్టాలు.!
ద్వారకాతిరుమల: ప్రముఖ పుణ్యక్షేత్రమైన ద్వారకాతిరుమలలో శ్రీవారిని దర్శించడం కంటే.. సెల్ఫోన్లను భద్రపరచడమే భక్తులకు కష్టంగా మారింది. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు సెల్ఫోన్లను డిపాజిట్ చేసేందుకు, దర్శనానంతరం వాటిని తిరిగి తీసుకునేందుకు భక్తులు కౌంటర్ వద్ద గంటల తరబడి క్యూలైన్లలో నిలబడాల్సి వస్తోంది. దాంతో స్వామీ.. మాకేమిటీ కష్టాలని భక్తులు గగ్గోలు పెడుతున్నారు. వివరాల్లోకి వెళితే. శ్రీవారి దివ్య క్షేత్రాన్ని నిత్యం వేలాది మంది భక్తులు దర్శిస్తుంటారు. శని, ఆదివారాలు, ఇతర పర్వదినాల్లో ఈ సంఖ్య మరింత అధికంగా ఉంటుంది. ఇదిలా ఉంటే భక్తులు ఆలయంలోకి సెల్ఫోన్లు తీసుకెళ్లడంపై నిషేదం ఉంది. వైకుంఠం క్యూ కాంప్లెక్స్, తూర్పు రాజగోపురం వద్ద భక్తులను తనిఖీ చేసిన తరువాతే సెక్యూరిటీ సిబ్బంది ఆలయంలోకి అనుమతిస్తారు. దాంతో భక్తులు తప్పనిసరిగా తమ సెల్ఫోన్లను ఆలయ తూర్పు ప్రాంతంలో ఉన్న డిపాజిట్ కౌంటర్లో భద్రపరచుకుంటున్నారు. భక్తుడి నుంచి ఒక్కో సెల్ఫోన్కు దేవస్థానం రూ. 5 రుసుమును వసూలు చేస్తోంది. అయితే నిర్వహణ లోపాలే భక్తుల ఇక్కట్లకు కారణమని పలువురు ఆరోపిస్తున్నారు. తిరిగి తీసుకునేందుకూ అవస్థలే.. శ్రీవారి దర్శనం క్యూలైన్ కంటే.. సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద ఉండే క్యూలైనే పెద్దగా ఉంటోందని భక్తులు వాపోతున్నారు. ఇదంతా ఒకైతెతే స్వామివారి దర్శనానంతరం తిరిగి సెల్ఫోన్లు పొందేందుకు మళ్లీ భక్తులు క్యూలైన్లో నిలబడాల్సి వస్తోంది. దాంతో వారు విస్తుపోతున్నారు. సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద గంటల తరబడి సమయం వృథా అవుతోందని బాధిత భక్తులు మండిపడుతున్నారు. కష్టాలు పడలేక.. కార్లలో వచ్చే భక్తులు సెంట్రల్ పార్కింగ్లో తమ వాహనాలను పార్క్ చేసుకుని, సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్దకు వస్తున్నారు. అక్కడ క్యూ చూసి వెనక్కి వెళ్లిపోయి వారి ఫోన్లను కార్లలో పెట్టుకుంటున్నారు. బస్సులు, బైక్లు, కాలినడకన వచ్చే భక్తులకు మాత్రం కష్టాలు తప్పడం లేదు. కార్తీక మాసం శనివారం కావడంతో ఈ సమస్య స్పష్టంగా కనిపించింది. అధికారులు ఇందుకు పరిష్కార మార్గం ఎలా చూపిస్తారో?సెల్ఫోన్ డిపాజిట్ కౌంటర్ వద్ద భారీ క్యూలు -
అదుపు తప్పి ఆటో బోల్తా
తణుకు అర్బన్: ఆటో అదుపు తప్పి ఓ సైక్లిస్టును ఢీకొట్టి బోల్తా పడిన ఘటనలో ఇద్దరు తీవ్రంగా గాయపడ్డారు. ఈ ఘటన తేతలి జాతీయ రహదారిపై శనివారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం తణుకు బ్యాంక్ కాలనీలోని గుఱజాడ స్కూలుకు మండలంలోని ముద్దాపురం గ్రామం నుంచి ఆటో బయలుదేరింది. ఇందులో 9 మంది విద్యార్థులు ప్రయాణిస్తున్నారు. జాతీయ రహదారిపైకి వచ్చే సరికి ఆటో అదుపు తప్పి సైకిల్పై వెళ్తున్న సత్యనారాయణను ఢీకొట్టి బోల్తా కొట్టింది. ఈ ప్రమాదంలో సత్యనారాయణకు, ఆటోలో ప్రయాణిస్తున్న విద్యార్థిని తిరుపతిపాటి ఆకాంక్షకు తీవ్ర గాయాలయ్యాయి. మిగిలిన విద్యార్థులు స్వల్పగాయాలతో బయటపడ్డారు. క్షతగాత్రులను తణుకులోని ప్రెవేటు ఆసుపత్రికి తరలించారు. స్వల్పగాయాలైన విద్యార్థులను యాజమాన్యం మరొక వాహనంలో పాఠశాలకు పంపించారు. విషయం తెలిసిన వెంటనే తహసీల్దార్ దండు అశోక్వర్మ, తణుకు మోటారు వెహికల్ ఇన్స్పెక్టర్ శ్రీనివాస్ ఘటనా ప్రాంతంతోపాటు ఆస్పత్రికి వచ్చి బాధితులను పరామర్శించారు. ఎంవీఐ శ్రీనివాస్ మాట్లాడుతూ ఆటో డ్రైవర్ దివ్యాంగుడు కాగా ఇతనికి డ్రైవింగ్ లైసెన్సు లేదన్నారు. ఎడమకాలు పనిచేయకపోయినప్పటికీ ఆటో నడుపుతున్నాడని దీంతో అదుపు తప్పిన ఆటో ప్రమాదానికి గురైందని చెబుతున్నారు. రూరల్ ఎస్సై కె.చంద్రశేఖర్ కేసు నమోదుచేసి దర్యాప్తు చేస్తున్నారు. చికిత్స పొందుతున్న విద్యార్థిని ఆకాంక్ష తీవ్రంగా గాయపడ్డ సైక్లిస్టు సత్యనారాయణ సైక్లిస్టుకు, విద్యార్థినికి తీవ్ర గాయాలు -
శ్రీవారి కొండపై కొమ్మల తొలగింపు
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపైన, శివాలయం–పాత కేశఖండనశాల మెట్ల మార్గంలో పెరిగిన చెట్ల కొమ్మలను, పొదలను దేవస్థానం సిబ్బంది తొలగిస్తున్నారు. క్షేత్ర పరిసరాల్లో విష సర్పాల బెడదపై శనివారం సాక్షి దినపత్రికలో ‘పాములు కరుస్తున్నా.. పట్టదా?’ శీర్షికన ప్రచురితమైన కథనానికి ఆలయ అధికారులు స్పందించారు. వెంటనే శివాలయం– పాత కేశఖండనశాల మెట్ల మార్గంలో ఇరువైపులా ఉన్న పొదలను, దారి కనబడకుండా మూసివేసిన చెట్ల కొమ్మలను తొలగించారు. కొండపైన రహదారికి ఇరువైపులా, పలు ప్రాంతాలో దట్టంగా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలను తొలగిస్తున్నారు. -
వైఎస్సార్ సీపీ యూత్ వింగ్కు జిల్లా నుంచి ఇద్దరు
ఏలూరు టౌన్: వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్రెడ్డి ఆదేశాల మేరకు ఏలూరు జిల్లాకు చెందిన ఇద్దరు నేతలకు రాష్ట్ర పదవులు కేటాయిస్తూ పార్టీ కేంద్ర కార్యాలయం శనివారం ఉత్తర్వులు జారీ చేసింది. చింతలపూడి నియోజకవర్గానికి చెందిన కందుల దినేష్ రెడ్డిని వైఎస్సార్సీపీ యూత్ వింగ్ రాష్ట్ర అధికార ప్రతినిధిగా నియమించారు. అలాగే ఏలూరు నియోజకవర్గానికి చెందిన గేదెల సూర్యప్రకాష్ను వైఎస్సార్సీపీ రాష్ట్ర యూత్ వింగ్ ప్రధాన కార్యదర్శిగా నియమించారు. వీరిద్దరూ క్షేత్రస్థాయిలో చురుగ్గా పనిచేస్తూ పార్టీ బలోపేతానికి విశేష కృషి చేస్తున్నారు. -
ధాన్యం కమీషన్.. సొసైటీల పరేషాన్
● సుమారు రూ.92 కోట్లు బకాయిలు పడ్డ కూటమి ప్రభుత్వం ● ఆర్థిక భారంతో కష్టతరంగా సొసైటీల మనుగడ భీమవరం: ధాన్యం కొనుగోలు కమీషన్ అందక సహకార సంఘాల మనుగడ కష్టతరంగా మారింది. కూటమి ప్రభుత్వం జిల్లాలోని సహకార సంఘాలకు సుమారు రూ.92 కోట్లు బకాయిలు పడడంతో వాటిని వెంటనే చెల్లించాలని సహకార సంఘాల పాలకవర్గాలు, ఉద్యోగులు ఆందోళన చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడు. ఒకప్పుడు రైతులనుంచి మిల్లర్లు, ధాన్యం కమీషన్ ఏజెంట్ల ధాన్యం కొనుగోలు చేసేవారు. దీంతో వారి ఇష్టారాజ్యంగా ఉండేది. రాష్ట్రంలో వైఎస్సార్సీపీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక ప్రభుత్వం రైతు భరోసా కేంద్రాలను ఏర్పాటుచేసి రైతులనుంచి ధాన్యం కొనుగోలు చేపట్టడంతో మిల్లర్లు, ఏజెంట్ల హవాకు గండిపడింది. ధాన్యం అమ్ముకున్న రైతులకు వారి బ్యాంక్ ఖాతాల్లో నేరుగా ప్రభుత్వం సొమ్ములు జమచేయడంతో రైతుల సంతోషానికి అవధుల్లేవు. రైతు భరోసా కేంద్రాలతోపాటు సహకార సంఘాల ద్వారా ధాన్యం కొనుగోలు చేయిస్తూ సహకార సంఘాలు ధాన్యం కొనుగోలు చేసినందుకు క్వింటాళ్లకు సుమారు రూ.32.50 కమీషన్ చెల్లించేది. జిల్లాలోని 20 మండలాల పరిధిలో దాదాపు 122 సహకార సంఘాలుండగా వాటిలో 115 సంఘాలు ధాన్యం కొనుగోలు చేస్తున్నాయి. కాగా ప్రస్తుతం కూటమి ప్రభుత్వం సహకార సంఘాలకు ధాన్యం కొనుగోలు కమీషన్ సక్రమంగా చెల్లించడం లేదు. దీంతో దాదాపు రూ.92 కోట్లు ప్రభుత్వం నుంచి రావాల్సి ఉంది. కమీషన్ సొమ్ములు బకాయి పడడంతో ప్రస్తుత సార్వా సీజన్లో ధాన్యం కొనుగోలులో వాటి పాత్ర ఏమిటనేది ప్రశ్నర్థాకంగా మారింది. కమీషన్ బకాయిలు చెల్లించాలని ఇటీవల సహకార సంఘాల పాలకవర్గాలు, అధికారులు ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులకు మొరపెట్టుకున్నారు. సంచుల భారం సైతం సొసైటీలదే అసలే ధాన్యం కొనుగోలు కమీషన్ అందక అవస్థలు పడుతున్న సహకార సంఘాలకు రైతులకు ఇవ్వాల్సిన సంచుల భారం కూడా పడడంతో రవాణా, హమాలీల చార్జీలతో తలకుబొప్పికడుతోందని ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలోని ఇతర జిల్లాల్లో రైతులకు ధాన్యం పట్టుబడికి సంచులు రైస్ మిల్లర్ల నుంచి సరఫరా అవుతుండగా జిల్లాలో సహకార సంఘాలు సరఫరా చేయాలని అధికారులు ఆదేశించడం విడ్డూరంగా ఉందని సహకార సంఘాల ఉద్యోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. రైస్ మిల్లర్ల నుంచి సహకార సంఘాలు సంచులు తెచ్చి రైతులకు ఇవ్వాల్సి ఉండడంతో వారినుంచి వచ్చే సంచుల కట్టల్లో తక్కువగా ఉండడం, చిరిగిన సంచులు రావడం వంటి సమస్యలతో ఇబ్బందులు పడుతున్నామని వాపోతున్నారు. రైతులకు ప్రభుత్వం ఇవ్వాల్సిన టార్ఫాలిన్స్ కూడా సహకార సంఘాలే సమకూర్చాలని ఆదేశించడం సంఘాలకు ఆర్థిక భారంగా మారిందంటున్నారు. దీనికితోడు రైతు సేవా కేంద్రాల్లోని కొందరు అధికారులు ధాన్యం కమీషన్ ఏజెంట్లను ప్రోత్సహిస్తున్నారనే ఆరోపణలున్నాయి. జిల్లాలో ఇప్పటికే తాడేపల్లిగూడెంలో ధాన్యం కొనుగోలు కేంద్రాలు ప్రారంభించగా మిగిలిన చోట్ల మరో 10, 15 రోజుల్లో ప్రారంభం కానున్నాయి. ఇప్పటికై నా ప్రభుత్వం కమీషన్ సొమ్ములు చెల్లిస్తే సహకార సంఘాలు మనుగడ సాగిస్తాయని లేకుంటే ఆర్థిక ఇబ్బందులతో ఉద్యోగులకు జీతాలు కూడా చెల్లించలేమని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. -
పోలవరం ప్యాకేజీపై దర్యాప్తు చేయాలి
కొయ్యలగూడెం: పోలవరం ప్రాజెక్టు నిర్వాసితులకు అందజేస్తున్న ప్యాకేజీపై ప్రభుత్వం అత్యున్నత స్థాయి దర్యాప్తు చేపట్టాలని మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు పేర్కొన్నారు. శనివారం రామానుజపురం గ్రామంలో నిర్వహించిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమంలో ఆయన పాల్గొని మాట్లాడారు. నిర్వాసితులకు అందజేస్తున్న నష్టపరిహారం గురించి కూటమి పెద్దలే స్వయంగా అవినీతి జరుగుతోందంటూ ఆరోపణలు చేయడం అనుమానాలకు తావిస్తోందన్నారు. నష్ట పరిహారాన్ని అందజేయడంలో దళారులు రాజ్యమేలుతుందని ఇటీవల డీసీఈబీ మాజీ చైర్మన్ కరాటం రాంబాబు ఆరోపించడాన్ని ప్రభుత్వం పరిగణలోకి తీసుకోవాలన్నారు. కోటి సంతకాల సేకరణ కార్యక్రమానికి ప్రజాదరణను చూసి కూటమి ప్రభుత్వం వెన్నులో వణుకు ప్రారంభమైందన్నారు. పార్టీ మండల కన్వీనర్ తుమ్మలపల్లి గంగరాజు, వైఎస్సార్సీపీ జిల్లా కార్యదర్శి గొడ్డటి నాగేశ్వరరావు, ఎంపీపీ గంజిమాల రామారావు, పార్టీ నాయకులు పసుపులేటి వెంకటేశ్వరరావు, కోనే నాగసూరి, తోట జయబాబు, చిక్కాల దుర్గాప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. -
మోంథా ముంచేసింది
పెదపాడు మండలం వట్లూరుకు చెందిన ఇంటూరి నాగు కౌలు రైతు. ఎకరాకు ఇంతవరకూ రూ.30 వేల నుంచి రూ.40 వేలు ఖర్చు చేశాడు. మరో 10 రోజులు ఆగితే కోతలు పూర్తయ్యేవని, కనీసం పెట్టుబడులైనా దక్కేవని ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. పంట పూర్తిగా నేలవాలిందని, గింజ రంగు మారిపోయి తాలుగింజలు అవ్వడంతో భారీ నష్టం మిగిలిందని వాపోతున్నాడు. ప్రభుత్వం సాయం చేయకపోతే అప్పుల పాలుకాక తప్పదంటున్నాడు. పెదపాడుకు చెందిన మానం సత్యనారాయణ పెద్ద కౌలు రైతు. 40 ఎకరాలు కౌలుకు తీసుకుని సాగు చేస్తున్నాడు. వాతావరణం గత వారం వరకు బాగుండటంతో వచ్చే నెలాఖరుకల్లా పంట అమ్మకం పూర్తి చేసి పెట్టుబడుల కోసం తెచ్చిన అప్పులు జమ చేయాలనుకున్నాడు. ఈలోపు తుపాను దెబ్బకు పంట నేలకొరగడం, కుళ్ళిపోవడంతో ఏం చేయాలో అర్థంకాని పరిస్థితి నెలకొంది. ఎకరాకు 35 నుంచి 40 బస్తాల దిగుబడి వచ్చే పంట ఇప్పుడు 15 బస్తాలు కూడా దాటదు. దానిలో రంగుమారిన గింజ ఎక్కువగా ఉంటే ప్రభుత్వ కొనుగోలు కేంద్రాల్లో కొనుగోలు చేయరు. కౌలురైతు కావడంతో తమకేమీ రాదని, తమను పట్టించుకునేవారే లేరంటూ ఆవేదన వ్యక్తం చేస్తున్నాడు. మళ్ళీ ఎకరాకు రూ.10 వేల నుంచి రూ.12 వేలు పెట్టుబడి పెడితేనే గానీ ఉన్న నాలుగు గింజలు బయటకు రాని పరిస్థితని వాపోతున్నాడు. -
రచయిత్రి సత్యవతికి సాహిత్య పురస్కారం
ఏలూరు (ఆర్ఆర్పేట): ప్రముఖ కథా రచయిత్రి పీ సత్యవతికి 2025 సంవత్సరానికి శ్రీ కృష్ణమూర్తి సాహిత్య పురస్కారం అందచేయనున్నట్టు గుప్తా ఫౌండేషన్ వ్యవస్థాపకుడు మడుపల్లి మోహన గుప్తా ప్రకటించారు. శుక్రవారం నగరంలో విలేకరుల సమావేశంలో మాట్లాడుతూ ఏటా తన జన్మదినం సందర్భంగా తన తండ్రి కృష్ణమూర్తి పేరిట ఏర్పాటు చేసిన సాహిత్య పురస్కారాన్ని ప్రకటిస్తున్నామని, ఈ ఏడాది ఎంపికై న సత్యవతికి పురస్కారంతోపాటు ప్రశంసా పత్రం, జ్ఞాపిక, రూ.3 లక్షల నగదు అందజేయనున్నట్లు తెలిపారు. 1989లో ప్రారంభించిన గుప్తా ఫౌండేషన్ ద్వారా ఏటా సామాజిక సేవా కార్యక్రమాలు నిర్వహిస్తున్నామన్నారు. ఈ ఏడాది ఏలూరు ప్రభుత్వ ఆసుపత్రిలోని రెడ్క్రాస్ భవనం తలసేమియా బ్లాక్పై రెండో అంతస్తు నిర్మాణా నికి రూ.60 లక్షలు, రూరల్ మండలం శ్రీపర్రులో కమ్యూనిటీ హాలు నిర్మాణానికి రూ.20 లక్షలు ఇస్తామని ప్రకటించారు. రూ.లక్ష రూపాయలు వ్యయంతో 15 మంది పోలియో వ్యాధిగ్రస్తులకు కృత్రిమ అవయవాలు, కాలిపర్స్ అందజేశారు. కార్యక్రమంలో ఆడిటర్ డీవీ సుబ్బారావు, అంబికా గ్రూప్ సంస్థల అధినేత అంబికా కృష్ణ, నగర ప్రముఖులు పాల్గొన్నారు. -
మోంథా పంజా
ఆటపాక కేంద్రంపై కై కలూరు: పక్షి ప్రేమికుల స్వర్గథామంగా రాష్ట్రంలో పేరు గడించిన ఆటపాక పక్షుల విహార కేంద్రంపై మోంథా తుపాను విరుచుకుపడింది. ఆహ్లాదాన్ని ఆవిరి చేసింది. అతిథ్యం కోసం విదేశాల నుంచి వస్తున్నా వలస పక్షులను భయపెట్టింది. తుపాను దాటికి గూళ్ళలో పక్షి కూనలు అల్లాడిపోయాయి. దీంతో పక్షుల కేంద్రాన్ని ఆరు రోజులుగా మూసివేశారు. శీతాకాలం వలస పక్షులకు అనువైన కాలం. ఇటువంటి తరుణంలో తుపాను ప్రభావం పక్షులపై పడుతోంది. ప్రతతి ఏటా కార్తీకమాసంలో పక్షుల వీక్షణకు పర్యాటకులు ఎక్కువగా వస్తారు. వేసవి కాలంలో నీరు లేకపోవడం, వర్షాకాలంలో గట్లు కొట్టుకపోవడం పరిపాటిగా మారుతుంది. ఆటపాక పక్షుల విహార కేంద్రం చెరువు 275 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. అరుదైన విదేశీ పెలికాన్ పక్షులు అధిక సంఖ్యలో ఇక్కడకు రావడంతో పెలికాన్ ప్యారడైజ్గా దీనికి నామకరణ చేశారు. కొల్లేరులో దాదాపు 186 రకాల పక్షి జాతులు సంచరిస్తాయి. ఆటపాక పక్షుల కేంద్రంలో 156 కృత్రిమ ఇనుప స్టాండ్లను అటవీశాఖ ఏర్పాటు చేసింది. వీటిపై పెలికాన్ పక్షులు సంతానోత్పత్తి గావిస్తున్నాయి. ప్రస్తుతం 3,500 పెలికాన్ పక్షులు నివసిస్తున్నాయి. సాధారణ సమయంలో ఆటపాక విహార చెరువు 3 అడుగుల లోతు మాత్రమే ఉంటుంది. దీనిని మరింత లోతు చేయాలని ప్రతిపాదనలు పెడుతున్నా అటవీశాఖ అధికారుల నిర్లక్ష్యం, నిధుల కొరతతో కార్యరూపం దాల్చడం లేదు. మోంథా మోత మోగించింది మోంథా తుపాను కొల్లేరు ప్రక్షుల కేంద్రంపై ప్రభావం చూపింది. ఆటపాక పక్షుల కేంద్రం సమీపంలో పోల్రాజ్ డ్రెయిన్(నాగరాజు కాల్వ) ఉంది. ఇది బుడమేరు, తమ్మిలేరు వంటి ఏరుల నుంచి వచ్చే నీటిని కొల్లేరుకు చేరుస్తుంది. ప్రతి ఏటా డ్రెయిన్ నుంచి ఏర్పరిచిన తూములతో నీటిని పక్షుల కేంద్రానికి నింపుతారు. పక్షుల కేంద్రం, పోల్రాజ్ డ్రెయిన్ గట్టు ఒకటే కావడంతో గట్లు మునిగి నీరు ప్రవహిస్తుంది. ప్రస్తుతం నీటి వరవడికి పక్షుల కేంద్రం గట్లు పూర్తిగా కోతగా గురయ్యాయి. కేంద్రంలో ఈసీ సెంటర్ ఆవరణలో నీరు చేరింది. నీటి ప్రవాహం తగ్గకపోతే పక్షుల కేంద్రం చెరువు మరింత ప్రమాదంలో పడుతుంది. పట్టించుకోని ప్రభుత్వం పర్యాటక రంగానికి పెద్ద పీట వేస్తామని గొప్పలు చెబుతున్నా ప్రభుత్వం కొల్లేరు పర్యాటక అభివృద్ధికి పైసా విదల్చడం లేదు. ఇటీవల ప్రకటించిన పర్యాటకాభివృద్ధి ప్రణాళికలో కొల్లేరు అంశమే లేదు. ప్రధానంగా ఆటపాక పక్షుల కేంద్రం అభివృద్ధి పట్టించుకోవడం లేదు. నెల్లూరు జిల్లాలో ప్లేమింగో ఫెస్టివల్ పేరుతో ప్రతి ఏటా పర్యాటకులను ఆకర్షించడానికి ప్రభుత్వపరంగా సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. గతంలో ఒక్క పర్యాయం పెలికాన్ ఫెస్టివల్ చేసినా ఇప్పటి వరకు దాని ఊసే లేదు. ఆటపాక పక్షుల కేంద్ర అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవాలని పక్షి ప్రేమికులు కోరుతున్నారు. ఆటపాక పక్షుల కేంద్రం నుంచి ఈసీ కేంద్రం వరకు 600 మీటర్ల రోడ్డులో మోంథా తుపాను వల్ల 200 మీటర్లు కోతకు గురైంది. చెరువు చుట్టూ పలు ప్రాంతాల్లో గట్లు దెబ్బతిన్నాయి. పక్షుల కేంద్రాన్ని పూర్తిగా ఎండగట్టి మార్చి నెలలో లోతు తవ్వడంతో పాటు గట్లును ఎత్తు పెంచుతాం. ప్రస్తుతం నీరు తగ్గగానే దెబ్బతిన్న గట్లుకు మరమ్మతులు చేస్తాం. – కే.రామలింగాచార్యులు, ఫారెస్టు రేంజర్, కై కలూరు. ఆపదలో ఆటపాక పక్షుల కేంద్రం తుపాను దాటికి చెరువు గట్లు ధ్వంసం భారీ వర్షాలకు విహార కేంద్రం మూసివేత అటవీశాఖ నిర్లక్ష్యంతో గట్ల పటిష్ట పనుల ఆలస్యం -
తప్పు ఒప్పుకున్న టీడీపీ నేత
● ఐఎస్ జగన్నాథపురంలో శాంతించిన వరి రైతులు ● న్యాయం చేస్తామని హామీ ఇచ్చిన అధికారులు ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్ జగన్నాథపురంలో వరి పంటలు నీట మునగడానికి ఓ టీడీపీ నేత కారణమైన విషయం తెలిసిందే. దీనిని పురస్కరించుని ఆ నేత సోదరుడు (టీడీపీ నేత) శుక్రవారం రైతుల ముందు తప్పయ్యిందని ఒప్పుకున్నాడు. అలాగే రెవెన్యూ అధికారులు న్యాయం చేస్తామని హామీ ఇవ్వడంతో బాధిత రైతులు శాంతించారు. వివరాల్లోకి వెళితే.. గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు రైతులకు, అధికారులకు సమాచారం ఇవ్వకుండా గురువారం ఉదయం ఎర్రచెరువు తూముకు ఉన్న లాకును ఎత్తేశాడు. దీంతో సుమారు 30 మంది రైతులకు చెందిన 40 ఎకరాల వరి పంట నీట మునిగింది. చేతికొచ్చిన పంట నీటిపాలైందని రైతులు గగ్గోలు పెట్టారు. అలాగే తహసీల్దార్కు ఫిర్యాదు చేశారు. దీనిపై ‘సాక్షి’లో శుక్రవారం ‘పచ్చనేత నిర్వాకంపై రైతుల గగ్గోలు’ శీర్షికన కథనం ప్రచురితమైంది. ఈ నేపథ్యంలో డిప్యూటీ తహసీల్దార్ దుర్గా మహాలక్ష్మి, మండల వ్యవసాయాధికారి చెన్నకేశవులు, ఆర్ఐ సత్యం, వీఆర్వో సత్యనారాయణ శుక్రవారం నీట మునిగిన వరి పంటలను పరిశీలించారు. అయితే పంట పొలాల్లోకి నీరు ఎందుకు వదిలారో సమాధానం చెప్పాలని రైతులు పట్టుబట్టారు. దీంతో నీరు వదిలిన నాయకుడి సోదరుడు వచ్చి, తన అన్న అందుబాటులో లేడని, జరిగింది తప్పేనని ఒప్పుకున్నాడు. అలాగే అధికారులు న్యాయం చేస్తామని రైతులకు హామీ ఇచ్చారు. ఇకపై రైతులు ఎవరైనా పొలాలకు నీరు పెట్టుకోవాలంటే ముందుగా పంచాయతీ అధికారుల అనుమతి పొందిన తర్వాతే చెరువు తూముకు ఉన్న లాకును ఎత్తాలని అధికారులు సూచించారు. -
నేటి నుంచి కాంట్రాక్టు సిబ్బంది సమ్మె
కై కలూరు: కై కలూరు మేజర్ పంచాయతీలో కాంట్రాక్టు సిబ్బందికి ఏడు నెలలుగా జీతాలు చెల్లించకపోవడంతో శనివారం నుంచి విధులకు హాజరుకాలేమని పంచాయతీ ఈఓ ప్రసాద్కు కార్మికులు శుక్రవారం నోటీసు అందించారు. శానిటేషన్, విద్యుత్, వాటర్ వర్ట్స్, రిక్షా పుల్లర్స్, కంప్యూటర్ ఆపరేటర్లు ఇలా దాదాపు 85 మందికి రూ.56 లక్షల జీతాలను చెల్లించాల్సి ఉంది. జీతాలు చెల్లించకపోతే విధులకు రాలేమని కార్మికులు తెగేసి చెప్పారు. దీనిపై పంచాయతీ ఈవో ప్రసాద్ను వివరణగా కోరగా సమస్యను ఎమ్మెల్యే కామినేని శ్రీనివాస్ దృష్టికి తీసుకువెళ్లానని, జిల్లా పంచాయతీ అధికారిని కలిసి సమస్యను తెలియజేశానన్నారు. సర్పంచ్ చెక్ పవర్ రద్దు, సాంకేతిక అంశాల వల్ల జీతాలు చెల్లింపు ఆలస్యమైందని, ప్రత్యేకాధికారి ద్వారా సమస్యను పరిష్కారిస్తామని చెప్పారు. ఏలూరు(మెట్రో): మీ డబ్బు.. మీ హక్కు నినాదంతో కేంద్ర ప్రభుత్వం దేశవ్యాప్తంగా మూడు నెలల పాటు ప్రత్యేక కార్యక్రమం నిర్వహించనుందని కలెక్టర్ కె.వెట్రిసెల్వి తెలిపారు. శుక్రవారం కార్యక్రమం పోస్టర్లను కలెక్టరేట్లో ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడు తూ పౌరులు తమ పేరు మీద ఉన్న క్లయిమ్ చేయని లేదా మరిచిపోయిన ఆర్థిక ఆస్తులను తిరిగి పొందే అవకాశం కల్పిస్తున్నట్టు చెప్పారు. బ్యాంకుల్లో డిపాజిట్లు, షేర్లు, మ్యూచువల్ ఫండ్లు, బీమా పాలసీలు, ఇతర ఆర్థిక సాధనాల్లో పెట్టుబడులను సరైన పత్రాలతో పొందవచవ్చన్నారు. కార్యక్రమంపై శనివారం కలెక్టరేట్లో లీడ్ బ్యాంకు మేనేజర్తో పాటు జిల్లాలోని బ్యాంకుల ప్రతినిధులకు అవగాహన కల్పిస్తా మన్నారు. లీడ్ బ్యాంక్ మేనేజర్ నీలాద్రి, బ్యాంక్ అధికారులు పాల్గొన్నారు. ఆగిరిపల్లి: ఆగిరిపల్లిలో శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహస్వామి వార్షిక బ్రహ్మోత్సవాలు, కృత్తిక దీపోత్సవాలు శుక్రవారం ఘనంగా ప్రా రంభమయ్యాయి. అర్చకులు వేదాంతం శేషు ఆధ్వర్యంలో పుణ్యాహవచనం, నవ కలశ పంచామృత స్నపన, స్వామి వారి ప్రత్యేక అలంకరణ, పూర్ణాహుతి, నీరాజన మంత్రపుష్పం, తీర్థ ప్రసాదం వినియోగం నిర్వహించారు. ఆ లయ ఈఓ సాయి పర్యవేక్షించారు. అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. భీమవరం అర్బన్: మండలంలోని గొల్లవానితిప్ప, యనమదుర్రు, దిరుసుమర్రు, దెయ్యాలతిప్ప, గూట్లపాడు, తోకతిప్ప, నాగిడిపాలెం, లోసరి గ్రామాలను ఆనుకుని యనమదుర్రు డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. మోంథా తుపాను కారణంగా ఎగువన భారీ వర్షాలు కురవడంతో ఎర్రకాలువకు వరద పోటు ఎక్కువై యనమదుర్రు డ్రెయిన్ ద్వారా నీరు ఉప్పుటేరులో కలుస్తోంది. డ్రెయిన్ను ఆనుకుని వరి చేలు, చేపలు, రొయ్యలు చెరువులు ఉన్నాయి. డ్రెయిన్ ఉధృతంగా ప్రవహించడంతో తమ చేలల్లోని ముంపు నీరు లాగడం లేదని రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇప్పటికే వరి దుబ్బులు కుళ్లిపోతున్నాయని, మరో మూడు, నాలుగు రోజులు ఇలానే ఉంటే తీవ్ర నష్టం తప్పదని వాపోతున్నారు. -
ఉమా సోమేశ్వర స్వామికి లక్ష బిల్వార్చన
భీమవరం (ప్రకాశంచౌక్): కార్తీకమాసం పదో రోజు గునుపూడి పంచారామ క్షేత్రం సోమేశ్వర జనార్ధన స్వామి ఆలయంలో సీహెచ్ రవిబాబు కుటుంబ సభ్యులు లక్ష పత్రి పూజ నిర్వహించారు. స్వామికి ఏకాదశి మహా రుద్రాభిషేకం అనంతరము లక్ష బిల్వార్చన, రుద్ర హోమం నిర్వహించారు. గునుపూడిలో శ్రీ సోమేశ్వర జనార్ధన స్వామి దేవస్థానంలో కార్తీకమాసం 10వ రోజు సుమారు 4 వేల మంది భక్తులు స్వామిని దర్శించుకున్నారు. జంగారెడ్డిగూడెం: గుర్వాయిగూడెం మద్ది క్షేత్రంలో కార్తీక మాసోత్సవాలు, సప్తాహ మహోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయి. సప్తాహ మహోత్సవాల ముగింపు కార్యక్రమంలో భాగంగా ఆలయంలో శుక్రవారం మహాపూర్ణాహుతి నిర్వహించారు. ఆలయ ఈవో ఆర్వీ చందన మాట్లాడుతూ ఆలయ కమిటీ, భక్తుల సహకారంతో కార్తీక మాసోత్సవాలు ఘనంగా జరుగుతున్నాయని, సప్తాహ మహోత్సవాలు సైతం మహాపూర్ణాహుతితో ఘనంగా ముగిసినట్లు చెప్పారు. ఈ సందర్భంగా 7 రోజుల పాటు నిర్విరామంగా భక్తి సంకీర్తనలు చేసిన భక్త బృందాలకు వేదాశీర్వాదం గావించినట్లు చెప్పారు. నవంబర్ 2న గ్రామోత్సవం నిర్వహిస్తున్నట్లు ఈవో తెలిపారు. భీమడోలు: జాతీయ రహదారి కురెళ్లగూడెం వద్ద వృద్ధురాలి మెడలోంచి ఐదు కాసుల బంగారు ఆభరణాలను తెంపుకపోయారు. ఉంగుటూరు మండలం కై కరానికి చెందిన కుమారి బైక్పై భర్తతో కలిసి వ్యక్తిగత పనుల నిమిత్తం భీమడోలు వచ్చింది. పనులు ముగించుకుని కై కరం వెళ్తుండగా కురెళ్లగూడెం కొండాలమ్మ గుడి వద్దకు వచ్చేసరికి గుర్తు తెలియని ఇద్దరు వ్యక్తులు మోటార్ సైకిల్పై వచ్చి కుమారి మెడలోని సుమారు ఐదు కాసుల సూత్రాల నానుతాడు, నల్లపూసల తాడును లాక్కుని తాడేపల్లిగూడెం వైపు పరారయ్యారు. బాధితురాలు ఇచ్చిన ఫిర్యాదు మేరకు భీమడోలు ఎస్సై మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఉంగుటూరు: బైక్పై ఉంగుటూరు వస్తున్న తండ్రీ కూతుళ్లు యర్రచెరువు వద్ద ట్రాక్టరును తప్పించే క్రమంలో అదుపు తప్పి కింద పడిపోయారు. ప్రమాదంలో కూతురు ఓలేటి వరలక్ష్మికి కాలు విరిగింది. ఆనందరాజుకు తీవ్ర గాయాలయ్యాయి. వారిని తాడేపల్లిగూడెం ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ముదినేపల్లి రూరల్: రోడ్డుపై నడిచి వెళుతున్న మహిళ మెడలోని బంగారు గొలుసును ద్విచక్ర వాహనంపై వెళ్తున్న ఇద్దరు తెంపుకుని పారిపోయిన సంఘటన మండలంలోని వడాలిలో శుక్రవారం సాయంత్రం జరిగింది. పోలీసుల కథనం ప్రకారం గ్రామానికి చెందిన నక్కా సత్యవతి కిరాణా షాపులోకి వెళ్లి సరుకులు కొనుక్కుని ఇంటికి తిరిగి వెళుతుండగా ఇద్దరు వ్యక్తులు మోటారుసైకిల్పై వేగంగా వచ్చి సత్యవతి మెడలో ఉన్న రెండు కాసుల బంగారు నానుతాడు లాక్కొని పరారయ్యారు. సత్యవతి ఫిర్యాదు మేరకు ఎస్సై వీరభధ్రరరావు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు తెలిపారు. -
పాములు కరుస్తున్నా.. పట్టదా?
ద్వారకాతిరుమల శ్రీవారి కొండపై విషసర్పాల సంచారం ఎక్కువైంది. భక్తులతో పాటు దేవస్థానం సిబ్బంది ఆందోళన చెందుతున్నారు. 8లో uచంద్రబాబు పాలనలో రైతులకన్నీ కష్టాలే మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు గణపవరం: చంద్రబాబు పాలనలో రైతులకు ఎప్పు డూ న్యాయం జరగలేదని, కనీసం ఇప్పుడైనా మోంథా తుపానుతో నష్టపోయిన రైతులందరినీ ఆదుకోవాలని వైఎస్సార్సీపీ పీఏసీ సభ్యుడు, ఉంగుటూరు మాజీ ఎమ్మెల్యే పుప్పాల వాసుబాబు అన్నారు. శుక్రవారం ఆయన కాశిపాడు, పిప్పర, కోమట్లపాలెం గ్రామాల్లో పర్యటించి పంట నష్టపోయిన రైతులను పరామర్శించారు. రైతులకు న్యాయం జ రిగేలా ప్రభుత్వంపై ఒత్తిడి తెస్తామని, పార్టీ పరంగా అండగా ఉంటామని భరోసా ఇచ్చారు. ఎకరాకు రూ.30 వేల వరకు పెట్టుబడి పెట్టామని, మరో 20 రోజుల్లో పంట చేతికి వస్తుందన్న సమయంలో తు పాను తుడిచి పెట్టేసిందని రైతులు బోరుమన్నారు. ఈ సందర్భంగా వాసుబాబు మాట్లాడుతూ గత ప్ర భుత్వంలో మాజీ సీఎం వైఎస్ జగన్ రైతులకు ఉ చిత పంటల బీమా అమలు చేసి ఆదుకున్నారని, అ యితే కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీమాను దూరం చేసి రైతులకు తీరని నష్టాన్ని తెచ్చిపెట్టిందన్నారు. గణపవరం మండలంలో 2,000 ఎకరాల్లో పంట పూర్తిగా దెబ్బతిన్నట్టు అఽధికారులు అంచనా వేశారని, నష్టపోయిన రైతులందరికీ పంట రుణా లు రద్దుచేసి ఆదుకోవాలని డిమాండ్ చేశారు. కౌలు రైతులనూ ఆదుకోవాలన్నారు. జిల్లా వ్యవసాయ స లహాసంఘం మాజీ అధ్యక్షుడు వెజ్జు వెంకటేశ్వరరావు, సర్పంచ్లు కురెళ్ల వెంకటరత్నం, మల్లంపల్లి సు రేష్, నాయకులు ఐఎన్ రాజు తదితరులు ఉన్నారు. -
పాముకాటుతో మహిళ మృతి
కలిదిండి(కై కలూరు): పాము కాటుకు గురైన వివాహిత చికిత్స పొందుతూ శుక్రవారం మరణించింది. కలిదిండి పోలీసుల వివరాల ప్రకారం వెంకటాపురం గ్రామానికి చెందిన సిద్ధాబత్తుల విజయ(32) భర్త దుర్గారావుతో కలసి చిల్లర దుకాణం నిర్వహిస్తోంది. దుర్గారావు పెయింటర్గా పనిచేస్తున్నాడు. గురువారం సాయంత్రం కొట్టులో పాల ప్యాకెట్టు తీసుకురావడానికి వెళ్ళిన ఆమె కాలిని పాము కరిచింది. గమనించి కలిదిండి ప్రభుత్వాసుపత్రి, అక్కడ నుంచి కై కలూరు సీహెచ్సీ, చివరకు ఏలూరు ప్రభుత్వాసుపత్రికి తరలించారు. చికిత్స పొందుతూ మృతిచెందింది. భర్త దుర్గారావు ఫిర్యాదుతో కలిదిండి పోలీసులు కేసు నమోదు చేశారు. -
క్రీడలతో దేహదారుఢ్యం
చింతలవల్లి(ముసునూరు): క్రీడలతో దేహదారుఢ్యం, మానసిక ఉల్లాసంతో పాటు సమయ పాలన వంటి లక్షణాలు అలవడతాయని మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు అన్నారు. మండలంలోని చింతలవల్లి శివారు గోగులంపాడు–కొత్తూరులో గత వారం రోజులుగా జరిగిన 70 వ రాష్ట్రస్థాయి చెడుగుడు పోటీల విజేతలకు సర్పంచ్ పి.సత్యనారాయణ అధ్యక్షతన శుక్రవారం రాత్రి బహుమతి ప్రదానోత్సవ కార్యక్రమం నిర్వహించారు. ముఖ్య అతిథిగా పాల్గొన్న ఆయన మాట్లాడుతూ గ్రామంలో గత 70 ఏళ్ళ నుంచి, చెడుగుడు పోటీలు నిర్వహించడం అభినందనీయమన్నారు. ప్రథమ, ద్వితీయ స్థానాలను విజయవాడ స్కై టీమ్, గోగులంపాడు శ్రీకృష్ణ టీమ్, జూనియర్స్ విభాగంలో గోగులంపాడు–1, గోగులంపాడు–2 టీంలు మొదటి రెండు స్థానాల్లో నిలిచాయి. విజయం సాధించిన జట్లను మాజీ ఎమ్మెల్యే అభినందించి సీనియర్లకు నగదు బహుమతులు అందించారు. జూనియర్లకు తాడిగడప శ్రీనివాస రావు, తొర్లపాటి శ్రీనివాసరావు బహుమతులు అందించారు. కార్యక్రమంలో కృష్ణా జిల్లా వైస్ చైర్మన్ కృష్ణంరాజు, వైస్ ఎంపీపీ రాజానాయన, సొసైటీ మాజీ అధ్యక్షుడు సుగసాని శ్రీనివాసరావు, మండల వైఎస్సార్సీపీ అధ్యక్షుడు ఎం.నాగవల్లేశ్వరరావు, గ్రామ పార్టీ అధ్యక్షుడు పల్లిపాము సూర్య, మాజీ ఉపసర్పంచ్ చాకిరి రామకృష్ణ, చింతా వీరభద్రరావు, తదితరులు పాల్గొన్నారు. -
రేపే శ్రీవారి తెప్పోత్సవం
ద్వారకాతిరుమల: చిన వెంకన్న తెప్పోత్సవానికి శ్రీవారి పుష్కరిణి (నృసింహ సాగరం) సర్వాంగ సుందరంగా ముస్తాబవుతోంది. క్షీరాబ్ధి ద్వాదశి పర్వదినాన్ని పురస్కరించుకుని ఈనెల 2న రాత్రి స్వామివారి తెప్పోత్సవ వేడుకను వైభవంగా నిర్వహించేందుకు దేవస్థానం అధికారులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. పుష్కరిణి మధ్యలో ఉన్న మండపానికి, ఆంజనేయ స్వామి ఆలయానికి, గట్లపైన, పుష్కరణి పరిసరాల్లోని చెట్లకు విద్యుద్దీప అలంకారాలు చేశారు. దాంతో అవి విద్యుద్దీప కాంతులీనుతున్నాయి. పుష్కరిణి ముందు ఏర్పాటు చేసిన స్వామి భారీ విద్యుత్ కటౌట్ ప్రత్యేక ఆకర్షణగా ఉంది. తెప్పను రంగులతో తీర్చిదిద్దుతున్నారు. ఉత్సవం జరిగే ఆదివారం నాడు రాత్రి స్వామివారు ఉభయ దేవేరులతో కలసి తొళక్క వాహనంపై క్షేత్ర పురవీధుల్లో ఊరేగి, 8 గంటల సమయంలో పుష్కరిణి వద్దకు చేరుకుంటారు. ఆ తరువాత తెప్పోత్సవం ప్రారంభమవుతుందని ఆలయ ఈఓ ఎన్వీఎస్ఎన్ మూర్తి తెలిపారు. భారీగా జరుగుతున్న ఏర్పాట్లు -
ప్రైవేటీకరణ ప్రయత్నాలను తిప్పికొడదాం
ఏలూరు (ఆర్ఆర్పేట): రాష్ట్రంలో పేదలకు వైద్య విద్యను దూరం చేసేలా కూటమి సర్కారు ప్రభుత్వ మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు చేస్తున్న ప్రయత్నాలను ప్రజలు తిప్పికొట్టాలని వైఎస్సార్సీపీ ఏ లూరు నియోజకవర్గ సమన్వయకర్త మామిళ్లపల్లి జ యప్రకాష్ (జేపీ) పిలుపునిచ్చారు. మెడికల్ కా లేజీల ప్రైవేటీకరణను వ్యతిరేకిస్తూ వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో చేపట్టిన కోటి సంతకాల సేకరణ కార్యక్రమాన్ని జిల్లా బీసీ సెల్ అధ్యక్షుడు నెరుసు చిరంజీవులు ఆధ్వర్యంలో శుక్రవారం స్థానిక కండ్రికగూడెం సెంటర్లో నిర్వహించారు. ఈ సందర్భంగా జేపీ మాట్లాడుతూ పేదలకు ఉచిత వైద్యం, విద్య అందించలేక కూటమి ప్రభుత్వం ఆ బాధ్యతల నుంచి పారిపోతోందని ఆగ్రహం వ్యక్తం చేశా రు. ఆరోగ్యశ్రీ ఆస్పత్రులకు బకాయిలు చెల్లించకుండా పేదలకు వైద్యాన్ని దూరం చేసిందన్నారు. రాష్ట్రంలో కార్పొరేట్ వైద్య వ్యాపారానికి ఊతమిచ్చేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. నాయకులు గుడిదేసి శ్రీనివాసరావు, నూకపెయ్యి సుధీర్ బాబు, మున్నుల జాన్ గురునాథ్, దాసరి రమేష్, జిజ్జువరపు విజయ నిర్మల, పిట్టా ధనుంజయ్, చిలకపాటి డింపుల్ జాబ్, కిలారపు బుజ్జి, కొల్లిపాక సురేష్, మరడా అనిల్, బుద్దాల రాము, సముద్రాల చిన్ని తదితరులు పాల్గొన్నారు. ప్రజలు స్వచ్ఛందంగా పాల్గొని ప్రభుత్వానికి వ్యతిరేకంగా సంతకాలు చేశారు. -
9,200 హెక్టార్లలో వరికి నష్టం
ఉంగుటూరు: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో 9,200 హెక్టార్లలో వరి పంట దెబ్బతిన్నట్టు ప్రాథమిక అంచనాల్లో తెలుస్తుందని కలెక్టర్ వెట్రిసెల్వి అన్నారు. శుక్రవారం మండలంలోని ఉంగుటూరు, నాచుగుంట కాగుపాడు, నారాయణపురం ఆయకట్టులో దెబ్బతిన్న చేలను ఎమ్మెల్యే ప త్సమట్ల ధర్మరాజుతో కలిసి పరిశీలించారు. బాధిత రైతులతో మాట్లాడారు. పంట రక్షణకు వ్యవసాయ అధికారుల సూచనలు పాటించాలన్నారు. ఉంగుటూరు నియోజకవర్గంలో 3,200 హెక్టార్లలో వరి దెబ్బతిందని, అరటి, మినుము పంటలు కూడా దెబ్బతిన్నాయని కలెక్టర్ అన్నారు. ఆర్డీఓ అచ్చుత అంబరీష్, వ్యవసాయ శాఖ జేసీ హబీబ్ బాషా తదితరులు ఉన్నారు. -
పాములు కరుస్తున్నా.. పట్టదా?
ద్వారకాతిరుమల: శ్రీవారి కొండపై విష సర్పాల సంచారం అధికమైంది. దాంతో భక్తులతో పాటు క్వార్టర్స్లో నివాసం ఉంటున్న దేవస్థానం సిబ్బంది సైతం భయాందోళనకు గురవుతున్నారు. ఏ సమయంలో ఎటు నుంచి పాములు వస్తాయోనని బిక్కుబిక్కుమంటున్నారు. ఇక పాదయాత్ర భక్తులైతే ప్రాణాలను అరచేతిలో పెట్టుకుని ఆలయానికి చేరుకుంటున్నారు. భక్తులు అధికంగా సంచరించే ప్రాంతాలపై అధికారులు పూర్తి స్థాయిలో దృష్టి సారించడం లేదు. ఫలితంగా పలు ప్రధాన మార్గాల్లో పొదలు, చెట్ల కొమ్మలు పెరిగిపోయాయి. అయినా వాటిని పట్టించుకునే నాధుడు లేడు. కనీసం భక్తులు ప్రమాదాల భారిన పడుతున్న మార్గాల వైపు కూడా అధికారులు కన్నెత్తి చూడటం లేదు. ఇటీవల జరిగిన ఒక ఘటనే ఇందుకు దర్పణంగా నిలుస్తోంది. చాట్రాయి మండలం, చిన్నంపేట గ్రామానికి చెందిన అన్నపరెడ్డి భారతి, మరో పది మంది భక్తురాళ్లు పాదయాత్రగా ఈనెల 26న రాత్రి క్షేత్రానికి చేరుకున్నారు. ముందుగా వారు నిత్యాన్నదాన భవనంలో స్వామివారి ఉచిత అన్నప్రసాదాన్ని స్వీకరించారు. ఆ తరువాత శివాలయం–పాత కేశఖండనశాల మెట్లు మార్గం గుండా నడుచుకుంటూ ఆలయానికి వెళుతున్నారు. ఆ సమయంలో కట్లపాము భారతి చేతి వేలుపై కరిచింది. వెంటనే ఆలయ ప్రథమచికిత్సా కేంద్రం సిబ్బంది ఆమెను దేవస్థానం ఆంబులెన్స్లో స్థానిక పీహెచ్సీకి, అక్కడి నుంచి మెరుగైన చికిత్స నిమిత్తం ఏలూరు ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు. శ్రీవారి దయవల్ల భారతికి ఏమీ కాలేదు. జరిగి ఐదు రోజులైనా.. ఈ ప్రమాదం జరిగి ఐదు రోజులైనా శివాలయం–పాత కేశఖండనశాల మెట్లు మార్గంపై అధికారులు దృష్టి సారించలేదు. ఫలితంగా ఆ మార్గం ఇంకా పొదలు, చెట్ల కొమ్మలతోనే దర్శనమిస్తోంది. ప్రస్తుతం కొందరు భక్తులు ఆ మార్గంలోంచే రాకపోకలు సాగిస్తున్నారు. దాంతో భక్తులకు ఏదీ.. రక్షణ అని అధికారుల తీరుపై పలువురు ధ్వజమెత్తుతున్నారు. సిబ్బంది క్వార్టర్స్లలోకి.. శ్రీవారి దేవస్థానం ఈఓ డ్రైవర్ శ్రీనివాస్ నివాసం ఉంటున్న క్వార్టర్స్లోకి ఇటీవల తాచుపాము ప్రవేశించి, పెంపుడు హచ్ కుక్కను కరవడంతో అది మృతి చెందింది. పది రోజుల క్రితం అవుట్సోర్సింగ్ ఉద్యోగి ఫణి క్వార్టర్స్లోకి, తాజాగా గురువారం ఉదయం సీనియర్ అసిస్టెంట్ శ్రీనివాస్ క్వార్టర్స్లోకి పాములు ప్రవేశించాయి. గోసంరక్షణశాలలోకి తరచూ పాములు వెళుతున్నాయని స్థానికులు చెబుతున్నారు. చుట్టూ పొదలు పెరగడమే ఇందుకు కారణం. ఇప్పటికై నా అధికారులు స్పందించి పాముల నివారణకు చర్యలు చేపట్టాలని భక్తులు, స్థానికులు కోరుతున్నారు. శ్రీవారి భక్తులకు ఏదీ రక్షణ.! శివాలయం పాత మెట్ల మార్గంలో.. ఇరు పక్కలా పెరిగిన పొదలు, చెట్ల కొమ్మలు ఐదు రోజుల క్రితం పాదయాత్ర భక్తురాలిని కరిచిన కట్లపాము ఆ మార్గాన్ని నేటికీ పట్టించుకోని అధికారులు -
రహ‘దారుణాలు’
● నరకానికి ‘దారులు’ ● అడుగడుగునా గోతులు ● వర్షం కురిస్తే చెరువులే.. కై కలూరు: చినుకుపడితే రోడ్లు తటాకాలుగా మారుతున్నాయి.. ఏ రోడ్డు చూసినా భారీ గోతులు, వర్షం నీటితో నరకానికి నకళ్లుగా భయపెడుతున్నాయి. ఇప్పటికే అంతంతమాత్రంగా ఉన్న రహదారులు మోంథా తుపాను తాకిడికి మరింత దెబ్బతిన్నాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లావ్యాప్తంగా రోడ్లు మరింత అధ్వానంగా మారి ప్రమాదాలకు నిలయమయ్యాయి. ప్రధానంగా కొల్లేరు పరీవాహక ప్రాంతమైన కై కలూరు నియోజకవర్గంలో రోడ్లపై అడుగుపెట్టేందుకు ప్రజలు హడలిపోతున్నారు. నియోజకవర్గంలోని నాలుగు మండలాల పరిధిలో సుమారు 84 వేల ఎకరాల్లో ఆక్వా సాగవుతోంది. దీంతో ఆక్వా ఉత్పత్తులతో భారీ లారీల రాకపోకలు ఎక్కువగా ఉంటాయి. అధిక లోడు వాహనాలతో గ్రామీ ణ రోడ్లు ధ్వంసమవుతున్నాయి. ఇప్పటికే గుంతల పడిన రోడ్లలో వర్షం నీరు నిలిచి మరింత దెబ్బతింటున్నాయి. జాతీయ రహ‘దారి’ద్య్రం పామర్రు–దిగమర్రు జాతీయ రహదారి (ఎన్హెచ్–165) కూడా అధ్వానంగా మారింది. ఏళ్ల తరబడి జాతీయ రహదారి విస్తరణ పనులు నత్తనడకన సాగుతున్నాయి. ఇటీవల విస్తరణ పనులకు డబుల్ లైన్ల రోడ్డుగా తవ్వారు. అయితే పలుచోట్ల పనులు ఆలస్యం కావడంతో వాహనచోదకులు ఇబ్బంది పడుతున్నారు. ఎన్హెచ్పై పలు ప్రాంతాల్లో గుంతలు పడ్డాయి. ఈ గుంతల్లో వర్షం నీరు నిలిచి ప్రమాదకరంగా మారాయి. చెరువు ఊటతో దెబ్బ అక్వా చెరువులు అధికంగా రహదారుల సమీపంలో ఉన్నాయి. జాతీయ, గ్రామీణ రహదారుల కిందకు చెరువుల నీటి ఊట చేరడంతో భూమి గుల్లగా మారి త్వరగా పాడవుతున్నాయి. కలిదిండి మండలంలో మద్వానిగూడెం–పెదలంక, మూలలంక–పెదలంక, ఆరుతెగళపాడు, కాళ్లపాలెం, కొండూరు రహదారులు, ముదినేపల్లి మండలం సింగరాయపాలెం–కోరుకొల్లు, జాతీయ రహదారి నుంచి కోడూరు వెళ్లే రోడ్లు అధ్వానంగా మారాయి. కలిదిండి మండలంలో పెదలంక రోడ్డుముదినేపల్లి మండలం పెదకామనపూడి వద్ద.. -
పచ్చనేత నిర్వాకంపై రైతుల గగ్గోలు
● ఐఎస్ జగన్నాధపురంలో నీట మునిగిన 40 ఎకరాల వరి పంట ● లబోదిబోమంటున్న బాధిత రైతులు ద్వారకాతిరుమల: మండలంలోని ఐఎస్ జగన్నాధపురంలో ఓ టీడీపీ నాయకుడి నిర్వాకం కారణంగా చేతికొచ్చిన వరి పంట నీట మునిగిందని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. స్థానికుల కథనం ప్రకారం. ఇటీవల కురిసిన వర్షాలకు గ్రామంలోని ఎర్ర చెరువు పూర్తిగా నిండిపోయింది. అయితే గ్రామానికి చెందిన ఓ టీడీపీ నాయకుడు గురువారం ఉదయం రైతులకు గాని, అధికారులకు గాని సమాచారం ఇవ్వకుండా చెరువు తూముకు ఉన్న గేటును ఎత్తేశాడు. దాంతో చెరువు కింద ఉన్న ఆయకట్టులో సుమారు 40 ఎకరాల వరి పంట నీట మునిగింది. విషయం తెలుసుకున్న దాదాపు 30 మంది బాధిత రైతులు తమ పొలాల వద్దకు చేరుకుని, నీటమునిగిన పంటను చూసి లబోదిబోమన్నారు. వెంటనే లాకును మూసివేసి, ద్వారకాతిరుమల తహసీల్దార్ జేవీ సుబ్బారావుకు ఫిర్యాదు చేశారు. తహసీల్దార్ ఆదేశాలతో ఆర్ఐ సత్యం, వీఆర్వో సత్యన్నారాయణ, పంచాయతీ కార్యదర్శి సాయిరామ్ నీట మునిగిన పంట పొలాలను పరిశీలించారు. రేపు తహసీల్దార్ వచ్చి చూస్తారని చెప్పి ఆర్ఐ సత్యం అక్కడి నుంచి వెళ్లిపోయారు. లాకు ఎందుకు ఎత్తావని టీడీపీ నాయకుడిని ప్రశ్నించగా, మీకు చేతనైంది చేసుకోమన్నాడని రైతులు అంటున్నారు. రెవెన్యూ అధికారులను టీడీపీ నాయకులు బెదిరిస్తున్నారని రైతులు ఆరోపించారు. మరో రెండు రోజుల్లో కోతకు సిద్ధంగా ఉన్న వరి పంట పూర్తిగా నీట మునిగిందని, మొలకలు వచ్చి, పంట కుళ్లిపోతే తమకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని రైతులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. సదరు టీడీపీ నాయకుడు అసలు లాకు ఎందుకు ఎత్తాడో తెలియడం లేదని వాపోతున్నారు. అధికారులు తమకు న్యాయం చేయాలని కోరుతున్నారు. -
నేటినుంచి శోభనాచలుని బ్రహ్మోత్సవాలు
ఆగిరిపల్లి: కలియుగ వైకుంఠం.. శోభనగిరి క్షేత్రంలో శ్రీ శోభనాచల వ్యాఘ్ర లక్ష్మీ నరసింహ స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవం, కృత్తిక దీపోత్సవ కార్యక్రమాలను శుక్రవారం నుంచి ఈనెల 6వ తేదీ వరకు ఘనంగా నిర్వహించినున్నట్లు ఆలయ కార్యనిర్వాహణాధికారి సీహెచ్ సాయి, ఆలయ ప్రధాన అర్చకులు వేదాంతం శేషుబాబు తెలిపారు. బ్రహ్మోత్సవాల్లో భాగంగా ప్రతిరోజు ఉదయం 6 నుంచి సాయంత్రం 9 గంటల వరకు విశేష పూజలు జరుపనున్నారు. శుక్రవారం ఉదయం స్వామివారికి సుప్రభాత సేవ, విష్వక్సేన పూజ, నవ కలశ పంచామృత స్నపన, పూర్ణహుతి, 1వ తేదీన అష్టోత్తర శత రజిత తులసీదళార్చన, నిత్య హోమం, బేరి పూజ, బేరి తాడనం, ధ్వజారోహణం, 2 వ తేదీన శ్రీవారి శోభనగిరి ప్రదక్షిణ జరుగుతుందన్నారు. 3న కొండపై స్వామివారు వెలిసిన మూడు గుళ్ల వద్ద స్వామివారికి శాంతి కల్యాణం, 4న దివ్య తిరు కల్యాణం, గరుడ వాహనోత్సవం, 5న కార్తీక పౌర్ణమి సందర్భంగా స్వామివారికి అవబృదోత్సవం, చక్రస్నానం, సాయంత్రం ఆలయం కోవెల వద్ద కృత్తికా దీపోత్సవం కార్యక్రమాలు జరగనున్నట్లు ఆలయ అర్చకులు పేర్కొన్నారు. వీటితోపాటు ప్రతిరోజు స్వామి వారికి సుప్రభాత సేవ, ఆలయ నిత్య పూజ కార్యక్రమాలు, బ్రహ్మోత్సవ విశేష పూజలు, నిత్య హోమాలు, సాయంకాలార్చనలు, నీరాజన మంత్రపుష్ప తీర్థ ప్రసాద వినియోగలను ఆలయ అర్చకులు ఆధ్వర్యంలో నిర్వహించినట్లు ఆలయ ఈవో సాయి తెలిపారు. -
నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలి
తాడేపల్లిగూడెం (టీఓసీ): విద్యార్థులు నూతన ఆవిష్కరణలపై దృష్టి సారించాలని ఏపీ నిట్ రిజిస్ట్రార్ డాక్టర్ పి.దినేష్ శంకర్ రెడ్డి సూచించారు. నిట్ విద్యా సంస్థలోని ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ విభాగం ఆధ్వర్యంలో స్కిల్ స్పార్క్ 1.0 అనే అంశంపై రెండు రోజుల పాటు నిర్వహించనున్న వర్క్షాపు గురువారం ప్రారంభించారు. విభాగం అధిపతి డాక్టర్ కర్రి ఫణికృష్ణ అధ్యక్షత వహించారు. దినేష్ శంకరరెడ్డి మాట్లాడుతూ విద్యార్థులు లక్ష్యాలను నిర్ధేశించకుని వాటి సాధనకు నిరంతరం పాటుపడాలని సూచించారు. ఆధునిక పోటీ ప్రపంచంలో రాణించాలంటే విద్యార్థులు అధునాతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలని చెప్పారు. విద్యార్ధులు ఇన్నోవేటివ్ ప్రాజెక్టులను సాధించే దిశగా అడుగులు వేసి, బంగారు భవిష్యత్తుకు బాటలు వేసుకోవాలన్నారు. డీన్లు ఎన్.జయరామ్, వి.సందీప్ మాట్లాడుతూ విద్యార్థులు సాంకేతిక నైపుణ్యాలపై పట్టు సాధించాలన్నారు. కంపెనీలు, పరిశ్రమల అవసరాలకు తగ్గట్టుగా విద్యార్థులను తీర్చిదిద్దుతున్నామని వెల్లడించారు. ఫణికృష్ణ మాట్లాడుతూ వర్క్షాపులు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. కోఆర్డినేటర్లు డాక్టర్ శంకర్ పెద్దపాటి, తేజావతు రమేష్, డాక్టర్ కిరణ్ తీపర్తి, అల్లంశెట్టి శ్రీకాంత్ తదితరులు మాట్లాడారు. -
కలెక్టరమ్మా.. మా కన్నీళ్లు చూడమ్మా!
● కొల్లేరు ప్రజల వేడుకోలు ● మోంథా తుపానుకు మునిగిన కీలక రోడ్డు కై కలూరు: కలెక్టరమ్మా.. మా రోడ్డు దుస్థితి చూడమ్మా.. అంటూ కై కలూరు మండలం శృంగవరప్పాడు, గుమ్మళ్లపాడు, పందిరిపల్లిగూడెం, లక్ష్మీపురం, గోకర్ణపురం ప్రజలు వేడుకున్నారు. మోంథా తుపాను దాటికి గోకర్ణపురం నుంచి పైడిచింతపాడు రోడ్డులో మూడు ప్రాంతాల్లో రోడ్డుపై నుంచి నీరు ప్రవహిస్తోంది. దీంతో రాకపోకలు నిలిచిపోయాయి. రాష్ట్ర వడ్డీ సాధికారిత కమిటీ చైర్మన్ బలే ఏసురాజు ఆధ్వర్యంలో ఐదు గ్రామాల ప్రజలు ముంపు బారిన పడిన రోడ్డును గురువారం పరిశీలించారు. పలువురు మాట్లాడుతూ గోకర్ణపురం నుంచి పైడిచింతపాడు, ప్రత్తికోళ్ళలంక, గుడివాకలంక, చాటపర్రు మీదుగా ఏలూరు పట్టణం, అదే విధంగా పైడిచింతపాడు నుంచి చెట్నెంపాడు, ఆగడాలలంక, గుండుగొలును మీదుగా ద్వారకాతిరుమల సమీపంలో హైవే వెళ్లడానికి ఈ రోడ్డు ఎంతో కీలకమన్నారు. ప్రముఖ కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం చేరడానికి ఈ రోడ్డును భక్తులు, ప్రజలు ఉపయోగిస్తారన్నారు. అటువంటిది మూడు చోట్ల నీరు రోడ్డు పైనుంచి ప్రవహిస్తుండటంతో ప్రయాణాలు నిలిచాయన్నారు. దీంతో కై కలూరు, ఉండి, ఆకివీడు మీదుగా 20 కిలోమీటర్లు చుట్టూ తిరిగి రావాల్సి వస్తోందన్నారు. ఎత్తుతో రోడ్డు నిర్మాణానికి అనుమతులు మంజూరు చేయాలని ఏలూరు జిల్లా కలెక్టర్ను కోరారు. బలే ఏసురాజు మాట్లాడుతూ ఇటీవల ఏలూరు జిల్లా కలెక్టర్కు రోడ్డు నిర్మాణం కోసం వినతిపత్రం అందించినట్లు తెలిపారు. అనుమతులు త్వరగా మంజూరు చేయాలని కోరారు. కార్యక్రమంలో గమ్మళ్లపాడు సర్పంచ్ కొయ్యే గంగయ్య, ఆయా గ్రామాల పెద్దలు బలే సముద్రుడు, ఘంటసాల జగన్నాథం, రామారావు, దుర్గారావు ప్రజలు పాల్గొన్నారు. -
ఏరు దాటితేనే.. బతుకు పోరు
● కోమటిలంక ప్రజల అవస్థలు ● మోంథా తుపాను ధాటికి పొంగిన డ్రెయిన్ ● విద్యకు దూరమవుతున్న చిన్నారులు కై కలూరు: ప్రభుత్వాలు మారుతోన్నా.. ఏలూరు జిల్లా కోమటిలంక ప్రజల కష్టాలు తీరడం లేదు. మోంథా తుపాను దాటికి పోల్రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. దెందులూరు నియోజకవర్గ పరిధిలోని కోమటిలంక గ్రామం చుట్టూ నీటితో కొల్లేరులో ద్వీపకల్పంగా ఉంటుంది. గ్రామ ప్రజల రాకపోకలకు కై కలూరు మండలం ఆటపాక పక్షుల దొడ్డి గట్టు ఒక్కటే ఆధారం. కోమటిలంక గ్రామంలో దాదాపు 110 మంది విద్యార్థులు పాఠశాల, కాలేజీ చదువులు కై కలూరులో కొనసాగిస్తున్నారు. కోమటిలంక నుంచి సమీప సరిహద్దు ఆటపాక పక్షుల విహార చెరువు గట్టు దాటడానికి మధ్యలో పోల్రాజ్ కాల్వ ఉంటుంది. ఇక్కడ నుంచి పడవలో ప్రజలు దాటి పక్షుల కేంద్రం గట్టుపై నుంచి ద్విచక్ర వాహనాల్లో కై కలూరు చేరతారు. ఇలా నిత్యం జరుగుతుంది. పక్షుల విహార కేంద్రం అటవీశాఖ అభయారణ్య పరిధిలో ఉండటంతో పూర్తి స్థాయి రోడ్డు నిర్మాణానికి అటంకాలు ఏర్పడుతున్నాయి. గర్భిణుల పాట్లు వర్ణనాతీతం కోమటిలంక గ్రామంలో గర్భిణుల పరిస్థితి దారుణంగా ఉంటుంది. ఆస్పత్రికి తీసుకురావడానికి పోల్రాజ్ డ్రెయిన్ దాటాల్సి వస్తుంది. పూర్వం అనేక మంది తుపాను సమయాల్లో డ్రెయిన్ దాటి మృత్యువాత పడిన సందర్భాలు ఉన్నాయి. విషపురుగులు కరిస్తే సరైన సమయానికి ఆస్పత్రికి తీసుకువెళ్లలేకపోతున్నారు. తక్కువ నీరు ఉన్నప్పుడు తాత్కలిక రోడ్డు ద్వారా వాహనాలతో కోమటిలంక ప్రజలు రాగలుతున్నారు. భారీ వర్షాలు, తుపాను సమయాల్లో పడవలపై దాటుతున్నారు. మోంథా తుపాను కారణంగా పోల్రాజ్ డ్రెయిన్ ఉధృతంగా ప్రవహిస్తోంది. నాలుగు రోజులుగా చిన్నారులు పాఠశాలలకు రావడం లేదు. గురువారం కై కలూరులో డిగ్రీ చదువుతున్నా విద్యార్థి అతికష్టం మీద పడవపై ప్రయాణం చేయాల్సి వచ్చింది. మా గ్రామం నుంచి ప్రతి రోజూ డ్రెయిన్ దాటి కై కలూరు కాలేజీకి వెళుతున్నాను. పాఠశాలలకు వెళ్లే చిన్నారులు ఎక్కువ మంది ఉన్నారు. వంతెన నిర్మించాలని ఎంతో మంది కోరుతున్నాం. గ్రామంలో గర్భిణులు ఇబ్బందులు పడుతున్నారు. తుపానుల సమయంలో దినదిన గండంగా బయటకు వస్తున్నాం. ఇప్పటికై నా వంతెన నిర్మించండి. – పి.మంజు, డిగ్రీ ద్వితీయ సంవత్సర విద్యార్థి, కోమటిలంకఉధృతంగా ప్రవహిస్తున్న పోల్రాజ్ డ్రెయిన్ అవతల కోమటిలంక గ్రామం -
అన్నదాత కుదేలు
అన్నదాతను మోంథా తుపాను కుదిపేసింది. వారం రోజుల్లో కోతలకు సిద్ధమవుతున్న తరుణంలో తుపాను ధాటికి వరి కంకులు నేలకొరిగాయి. వేలాది ఎకరాల్లో వరితో పాటు మినుము, ఇతర వాణిజ్య పంటలు, పూల సాగు ఇలా అన్నీ భారీ నష్టాన్ని చవిచూశాయి. జిల్లాలో తుపాను నష్టం అంచనా రూ.100 కోట్లపై మాటే. మళ్లీ కోతలకు పెట్టుబడులు రెట్టింపు కావడం, తాలు గింజలతో పాటు దిగుబడి గణనీయంగా పడిపోవడం ఇలా ఎటు వైపు చూసినా పూర్తి నష్టాన్ని రైతులు ఎదుర్కోవాల్సిన పరిస్థితి. సాక్షి ప్రతినిధి, ఏలూరు: జిల్లాలో మోంథా తుపాను ప్రభావంతో సుమారు 26 వేల ఎకరాలకుపైగా పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా ఉంగుటూరు, దెందులూరు, కై కలూరు, ఏలూరు నియోకవర్గాల్లో వరికి అపారనష్టం వాటిల్లగా చింతలపూడి, పోలవరం, నూజివీడు నియోజకవర్గాల్లో మినుము, పత్తి ఇతర వాణిజ్య పంటలతో పాటు పూల తోటలకు నష్టం వాటిల్లింది. ఖరీఫ్ వరి సీజన్ మరో వారంలో ముగింపు దశకు చేరి జిల్లావ్యాప్తంగా కోతలు ప్రారంభం కానున్నాయి. ఇప్పటికే గోనె సంచులు మొదలు కొనుగోళ్ల వరకూ అన్నీ సమస్యలతో ఇబ్బందులు పడుతున్న రైతుల నెత్తిన తుపాను పిడుగుపడటంతో కనీసం పెట్టుబడులు కూడా దక్కక పూర్తిగా విలవిలాడుతున్నారు. ఎకరాకు రూ.20 వేలు అదనపు భారం సాధారణంగా ఖరీఫ్ సీజన్లో ఎకరాకు 30 నుంచి 35 బస్తాల దిగుబడి వస్తుందని అంచనా. అయితే వరి పూర్తిగా నేలకొరగడంతో ఎకరాకు 15 బస్తాల తాలు గింజలు రావడం, దీంతో పాటు సాధారణంగా గంటన్నరలో ఎకరా పంట కోత పూర్తయ్యే పరిస్థితి. అయితే పొలాల్లో నీరు నిలవడం, పంట నేలకొరగడంతో 4 నుంచి 5 గంటల కోత సమయం పట్టనుంది. దీంతో పెట్టుబడులు పెరగడం, కోత, కూలీ ఖర్చులు పెరగడం, నాణ్యత తగ్గిపోయి గింజ నల్లబడటంతో కనీస ధరలు కూడా దక్కని పరిస్థితి. మొత్తంగా ఎకరాకు సుమారు రూ.20 వేల వరకూ అదనపు భారం పడనుందని అంచనా. ‘కౌలు’కునేదెలా..? జిల్లాలో 2 లక్షలకుపైగా కౌలు రైతులు ఉన్నారు. కౌలు రైతులకు బీమా, సబ్సిడీ, ఎటువంటి పథకాలు వర్తించడం లేదు. దీంతో కౌలురైతులు పరిస్థితి మరింత దయనీయంగా మారింది. గత వైఎస్సార్సీపీ ప్రభుత్వ హయాంలో ప్రతి పంటకు ఉచిత పంటల బీమాను వర్తింపజేశారు. అయి తే ప్రస్తుత కూటమి ప్రభుత్వం ఉచిత పంటల బీ మాకు స్వస్తి పలికింది. దీంతో జిల్లావ్యాప్తంగా 10 శాతం రైతులు కూడా బీమా చేయించని పరిస్థితి. ప్ర భుత్వం ఆదుకుంటామని, ఎన్యూమరేషన్ ఇస్తామ ని ప్రకటించిందిగానీ ఆంక్షలు విధిస్తే రైతులు నష్టపోవాల్సి వస్తుంది. ఈ–క్రాప్తో నిమిత్తం లేకుండా క్షేత్రస్థాయిలో పంట నష్టాలను నమోదు చేయడంతో పాటు కౌలు రైతుల పేర్లను కూడా నమోదుచేసి ఆహార పంటలకు రూ.25 వేలు, వాణిజ్య పంటలకు ఎకరాకు రూ.50 వేలు చొప్పున ఇస్తేనేగానీ అన్నదాత కోలుకోలేని పరిస్థితి. తుపానుతో పంగిడిగూడెంలో సుమారు వెయ్యి ఎకరాల వరకు పంటకు నష్టం వాటిల్లింది. కూటమి ప్రభుత్వంలో పంటల బీమాకు ఇబ్బంది పడ్డాం. బీమా ఉంటే ఇప్పుడు పరిహారం వచ్చేది. అయితే ఆ పరిస్థితి లేదు. బాధిత రైతులందరికీ నష్టపరిహారం తక్షణం అందించాలి. నేలవాలిన వరి పంట కోత కోస్తే ఎకరానికి 5 నుంచి 10 బస్తాలు మాత్రమే వస్తుంది. యంత్రంతో కోతకు గంటకు రూ.6 వేల వరకూ ఖర్చవుతుంది. అధికారులు నిష్పక్షపాతంగా పంట నష్టం సర్వే చేయాలి. – కోట వెంకటేశ్వరరావు, వరి రైతు, పంగిడిగూడెం, జంగారెడ్డిగూడెం మండలం బుట్టాయగూడెం మండలం నూ తిరామన్నపాలెం సమీపంలో నే ను నాలుగు ఎకరాల్లో 1001 రకం వరి పంట వేశాను. సుమా రు రూ.2 లక్షల వరకూ పెట్టుబడి పెట్టాను. ప్రస్తుతం పంట కోత దశకు వచ్చింది. మరికొద్ది రోజుల్లో పంట కోసేందుకు సన్నాహాలు చేస్తున్నాం. అయితే తుపాను ప్రభావంతో పండిన పంటలో మూడున్నర ఎకరాలు నీట మునిగింది. వరి కంకులు నీటిలో తడిసిపోయాయి. దీంతో నాకు రూ.1.50 లక్షల వరకు నష్టం వచ్చింది. ప్రభుత్వం నన్ను ఆదుకోవాలి. – కోర్సా లక్ష్మి, గిరిజన రైతు, ఎన్ఆర్పాలెం, బుట్టాయగూడెం మండలం పెదపాడు మండలంలో నేలకొరిగిన వరిచేను కొవ్వలి హైవే సమీపంలో నేలకొరిగిన పంట నిండా ముంచిన ‘మోంథా’ వరిసాగు అతలాకుతలం జిల్లాలో 26 వేల ఎకరాలకు పైగా పంట నష్టం మినుము రైతులకూ అపార నష్టం వాణిజ్య పంటలదీ అదే పరిస్థితి రైతులపై అదనపు పెట్టుబడుల భారం జిల్లాలో అన్నదాతలకురూ.100 కోట్లకు పైగా నష్టం నియోజకవర్గాల వారీగా కై కలూరులో 3,330 ఎకరాలు, పోలవరంలో 4,485, ఉంగుటూరులో 5,540, దెందులూరులో 1,050, ఏలూరు రూరల్లో 1,500 ఎకరాల్లో వరి పంటకు నష్టం వాటిల్లింది. ఇక నూజివీడులో 1,900 ఎకరాల్లో, చింతలపూడిలో 813 ఎకరాల్లో పంట నష్టం వాటిల్లింది. ప్రధానంగా 20 వేల ఎకరాల్లో వరి, 3 వేల ఎకరాల్లో మినుము, 2,400 ఎకరాల్లో పత్తి, 120 ఎకరాల్లో మొక్కజొన్న, 167 ఎకరాల్లో వేరుశెనగ, 80 ఎకరాల్లో పూలతోటలకు నష్టం వాటిల్లినట్లు అంచనా. -
ఆకట్టుకున్న పోలీస్ ఓపెన్ హౌస్
ఏలూరు టౌన్: ఏలూరు పోలీస్ పరేడ్ గ్రౌండ్స్లో నిర్వహించిన పోలీస్ ఓపెన్ హౌస్ ఆ కట్టుకుంది. ఏలూరులోని పాఠశాలల, కళాశాలల విద్యార్థులు, ఎన్సీసీ క్యాడెట్లు, ప్రజలు భారీ సంఖ్యలో ఓపెన్ హౌస్ను సందర్శించా రు. కేసుల దర్యాప్తులో వినియోగించే అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కూడిన పరికరా లు, ఆధునిక డ్రోన్స్, పోలీస్ జాగిలాలు, ఆ యుధాలు ఆకట్టుకున్నాయి. పోలీస్ అమరవీరుల సంస్మరణ వారోత్సవాల్లో భాగంగా గురువారం ఓపెన్ హౌస్ను నిర్వహించగా జిల్లా ఎ స్పీ ప్రతాప్ శివకిషోర్ విద్యార్థులతో మమేకమయ్యారు. పోలీస్ దర్యాప్తులో క్లూస్టీం, కమ్యూనికేషన్ వ్యవస్థ, బాంబ్ డిటెక్షన్, డిస్పోజల్ పరికరాలు, డ్రోన్స్, డాగ్ స్క్వాడ్స్ పనితీరును వివరించారు. పోలీస్ విధుల్లో వినియోగించే ఆయుధాలు ఎస్ఎల్ఆర్, ఏకే–47, ఎంపీ5కే, టియర్గ్యాస్ గన్స్, జాకెట్స్, ఆర్మ్డ్ రిజర్వ్ సిబ్బంది విధులపై అవగాహన కల్పించారు. విద్యార్థులు ఉన్నత లక్ష్యాలను నిర్దేశించుకుని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణ, పట్టుదల, ఓర్పుతో కృషి చేయాలని సూచించారు. జిల్లా అదనపు ఎస్పీ నక్కా సూర్యచంద్రరావు, ఏఆర్ డీఎస్పీ చంద్రశేఖర్, ఎస్బీ సీఐ మల్లేశ్వరరావు, డీసీఆర్బీ సీఐ హబీబ్ బాషా, ఏలూరు త్రీటౌన్ సీఐ కోటేశ్వరరావు, ఏఆర్ ఆర్ఐలు పవన్కుమార్, సతీష్, ఈగల్ ఆర్ఎస్ఐ ఉదయ్భాస్క ర్, ఐటీ కోర్ ఇన్చార్జి నరేంద్ర, అమరేశ్వరరావు, సత్యనారాయణ, వెంకటేశులు తదితరు లు పాల్గొన్నారు. -
చెరువుల్లా రోడ్లు.. ప్రజలకు పాట్లు
చేపలకు గాలం వేస్తూ వైఎస్సార్సీపీ నిరసనఏలూరు టౌన్: తాము అధికారంలోకి వస్తే రోడ్లన్నీ తళతళా మెరిపిస్తామంటూ కూటమి నేతలు ప్రగల్భాలు పలికారు. తీరా అధికారం చేపట్టి 18 నెలలు కావస్తున్నా హామీలు తీరే ‘దారి’ కానరావడం లేదు. ఏలూరులోని 18వ డివిజన్ వంగాయగూడెం నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన రహదారి చెరువును తలపిస్తోంది. ఈ నేపథ్యంలో వైఎస్సార్సీపీ ఎస్సీ సెల్ నగర అధ్యక్షుడు ఇనపనూరి జగదీష్, కార్పొరేటర్ కేదారేశ్వరి, నగర మహిళా అధ్యక్షురాలు జిజ్జువరపు విజయనిర్మల, వైఎస్సార్టీయూసీ నగర అధ్యక్షు డు ఘంటా రాజేశ్వరరావు ఆధ్వర్యంలో ఏలూరు సమన్వయకర్త మామిళ్లపల్లి జయప్రకాష్ (జేపీ) గురువారం వినూత్నంగా నిరసన తెలిపారు. పార్టీ నేతలతో కలిసి రోడ్డు గుంతల్లో చేపలు పట్టేందుకు గాలం వేస్తూ నిరసన తెలిపారు. ఈ సందర్భంగా జే పీ మాట్లాడుతూ కూటమి నేతలకు ప్రజలు పడు తున్న కష్టాలు కనిపించటం లేదనీ, 18 నెలలుగా గత ప్రభుత్వంపై బురదజల్లే ప్రయత్నాలు చేయటాన్ని ప్రజలు హర్షించరన్నారు. మాజీ సీఎం వైఎస్ జగన్పై విమర్శలు చేస్తూ ప్రజలను మభ్యపెట్టాలని చూడటాన్ని జేపీ తప్పుబట్టారు. త్వరలో రోడ్డు నిర్మాణం చేపట్టకుంటే ప్రజలతో కలిసి ఆందోళనలు తీవ్రతరం చేస్తామన్నారు. క్యాన్సర్ హాస్పిటల్ కు వెళ్లేందుకు రోగులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారనీ, వాహనదారులు తరచూ ప్రమాదాల బారి న పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నగర అ ధ్యక్షుడు గుడిదేశి శ్రీనివాస్, ఎస్సీ సెల్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి నూకపెయ్యి సుధీర్బాబు, జిల్లా అధికార ప్రతినిధి మున్నల జాన్, రాష్ట్ర మహిళా ప్రధాన కార్యదర్శి తుమరాడ స్రవంతి, జిల్లా మహిళ ఉపాధ్యక్షురాలు చిలకపాటి డింపుల్ జాబ్, బీసీ సెల్ రాష్ట్ర కార్యదర్శి కిలారపు బుజ్జి తదితరులు ఉన్నారు. -
తుపాను బాధిత రైతులను ఆదుకోవాలి
మండవల్లి: మోంథా తుపాను వల్ల నష్టపోయిన పంట పొలాలకు తక్షణమే నష్టపరిహారం అందజేయాలని వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు (డీఎన్నార్) అన్నారు. మండలంలోని అయ్యవారిరుద్రవరంలో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను పార్టీ రాష్ట్ర పంచాయతీరాజ్ విభాగ కార్యదర్శి, ఎంపీపీ పెద్దిరెడ్డి శ్రీరామదుర్గాప్రసాద్తో కలిసి గురువారం ఆయన పరిశీలించారు. రైతులతో మాట్లాడి పంట నష్టం అంచనాలను అడిగి తెలుసుకున్నారు. సుమారు 800 ఎకరాలు దెబ్బతిన్నట్టు రైతులు చెప్పారు. ఈ సందర్భంగా డీఎన్నార్ మాట్లాడుతూ నష్టపోయిన రైతులను ప్రభుత్వం వెంటనే ఆదుకొని వారికి పరిహారం అందజేయాలని డిమాండ్ చేశారు. జిల్లా ఉపాధ్యక్షుడు చేబోయిన వీర్రాజు, రాష్ట్ర ముదిరాజ్ సంఘ అధ్యక్షులు కోమటి విష్ణువర్ధన్, రాష్ట్ర వాణిజ్యవిభాగ కార్యదర్శి, ముదినేపల్లి ఎంపీపీ రామిశెట్టి సత్యనారాయణ, మైనార్టీ విభాగ కార్యదర్శి ఎండి గాలీబ్, మండల పార్టీ అధ్యక్షుడు బేతపూడి యేసోబురాజు, మండల రైతువిభాగ అధ్యక్షుడు బొమ్మనబోయిన గోకర్ణయాదవ్, జిల్లా బీసీ సెల్ కార్యదర్శి బోణం శేషగిరి, జిల్లా యాక్టివ్ సెక్రెటరీ నాగదాసి థామస్, కై కలూరు మండల పార్టీ అధ్యక్షుడు సింగంశెట్టి రాము, నియోజకవర్గ ప్రచార విభాగ అధ్యక్షుడు పాము రవికుమార్, మెండా సురేష్బాబు, కై కలూరు టౌన్ పార్టీ అధ్యక్షుడు సమయం రామాంజనేయలు, కై కలూరు మండల రైతు విభాగ అధ్యక్షుడు సలాది వెంకటేశ్వరరావు, మండల పార్టీ ఉపాధ్యక్షుడు చిన్ని కృష్ణ, మండల పార్టీ ఉపాధ్యక్షుడు పెంటా అనిల్, నియోజకవర్గ సోషల్ మీడియా విభాగ అధ్యక్షులు మండా నవీన్, గ్రామ పార్టీ అధ్యక్షుడు ఇంటి నాగరాజు, కుంచే రాజేష్, కుంచే వెంకన్న తదితరులు పాల్గొన్నారు. వైఎస్సార్సీపీ జిల్లా అధ్యక్షుడు డీఎన్నార్ -
రైతులను ఆదుకుంటాం
నూజివీడు: మోంథా తుపానుతో నష్టపోయిన ప్రతి రైతునూ ఆదుకుంటామని, పంటలు దెబ్బతిన్న ప్రతి రైతు వివరాలను నమోదు చేస్తామని కలెక్టర్ కె.వెట్రిసెల్వీ తెలిపారు. గురువారం ఆమె మండలంలో సుడిగాలి పర్యటన చేశారు. రామన్నగూడెంలో దెబ్బతిన్న మినుము, పత్తి, మీర్జాపురంలో వరి పంటలను పరిశీలించారు. తుక్కులూరులో రామిలేరుపై ఉన్న లోలెవెల్ కాజ్వేను పరిశీలించారు. అలాగే తుక్కులూరు పునరావాస కేంద్రంలోని ఐదుగురు వరద బాధితులకు 25 కిలోల బియ్యం, నిత్యావసర సరుకులు, నగదును పంపిణీ చేశారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తుపాను వల్ల జిల్లాలో ఎలాంటి ప్రాణ, పశు నష్టం జరగలేదని, వరి, మినము పంటలకు నష్టం వాటిల్లిందన్నారు. క్షేత్రస్థాయిలో పారదర్శకంగా నష్టపోయిన రైతుల జాబితాలను తయారు చేయాలని అధికారులకు ఆ దేశించారు. నూజివీడు మండలంలో మినుము పంట ఎక్కువగా దెబ్బతిందన్నారు. ఎకరాకు రూ.25 వేల పెట్టుబడి పెట్టామని, తుపానుతో నష్టపోయా మని పలువురు రైతులు కలెక్టర్ వద్ద వాపోయారు. సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్న, జిల్లా వ్యవసాయ శాఖాధికారి షేక్ హబీబ్ బాషా, నూజివీడు మండల ప్రత్యేక అధికారి, ఉద్యాన శాఖ సహాయ సంచాలకులు కె.సంతోష్, తదితరులు ఉన్నారు. -
ఏజెన్సీలో భారీ వర్షం
బుట్టాయగూడెం: ఏజెన్సీ ప్రాంతంలో బుధవారం అర్ధరాత్రి సుమారు 4 గంటలకు పైగా భారీ వర్షం కురిసింది. పోలవరం నియోజకవర్గ పరిధిలోని ఏడు మండలాల్లో సుమారు 43 సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్టు అధికారులు చెప్పారు. బుట్టాయగూడెంలో 9 సెం.మీ, కొయ్యలగూడెంలో 7, జీలుగుమిల్లిలో 2, టి.నర్సాపురంలో 8, కుక్కునూరులో 4, వేలేరుపాడులో 4, పోలవరంలో 9 సెంటీమీటర్ల వర్షం కురిసంది. దీంతో కొండవాగులు పొంగిపొర్లాయి. కేఆర్పురం సమీపంలోని కొండవాగు ఉధృతంగా ప్రవహించింది. దీంతో వాగుకు ఇరువైపు లా రాకపోకలు మూడు గంటలపాటు నిలిచిపోయాయి. ఐటీడీఏ పీఓ రాములునాయక్, బుట్టాయగూడెం తహసీల్దార్ చలపతిరావు ప్రవాహం తగ్గే వరకూ ప్రజలెవ్వరూ వాగు దాటకుండా చర్యలు చేపట్టారు. నందాపురం సమీపంలోని అల్లికాల్వ, బైనేరు వాగుతోపాటు పలు వాగులు ఉధృతంగా ప్రవహించాయి. కొయ్యలగూడెం: తుపాను ప్రభావంతో కురి సిన భారీ వర్షాలకు కాలువలు, వాగులు ఉధృతంగా ప్రవహిస్తున్నాయి. కన్నాపురంలో కాజ్వేపై నుంచి పడమటి కాలువ ప్రవహించడంతో కొయ్యలగూడెం–బుట్టాయగూడెం మధ్య రాకపోకలు నిలిచిపోయాయి. అలాగే రాజ వరం వద్ద బైనేరు, పులివాగు కాలువలు కలవడంతో ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహిస్తూ వంతెనను తాకుతూ పరవళ్లు తొక్కింది. కొయ్యలగూడెం మండలంలో మంగపతిదేవిపాలెం, జంగారెడ్డిగూడెం మండలం పంగిడిగూడెం గ్రామాల మధ్య ఉన్న సప్టాపై ఎర్రకాలువ ఉధృతంగా ప్రవహించడంతో ఇటుగా రాకపోకలకు ఆటంకం కలిగింది. ఏజెన్సీ కొండ ప్రాంతాల నుంచి వర్షం నీరు ముంచెత్తుతోంది. పొక్లయిన్తో తూర్పుకాలువ వద్ద అడ్డుగా ఉన్న తూడును తొలగించారు. -
దోపిడీకే మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ
మాజీ ఎమ్మెల్యే ప్రతాప్ అప్పారావు నూజివీడు: గత ప్రభుత్వంలో రాష్టంలో 17 ప్ర భుత్వ మెడికల్ కళాశాలలను ఏర్పాటు చేస్తే కూ టమి ప్రభుత్వం మాత్రం దోపిడీ చేసేందుకే వాటిని పీపీపీ పద్ధతిలో ప్రైవేట్ వ్యక్తులకు కట్టబెట్టనుందని మాజీ ఎమ్మెల్యే, వైఎస్సార్సీపీ నియోజకవర్గ ఇన్చార్జి మేకా వెంకట ప్రతాప్ అప్పారావు ధ్వజమెత్తారు. మండలంలోని సిద్ధార్ధనగర్, సుంకొల్లు గ్రా మాల్లో మెటికల్ కాలేజీల ప్రైవేటీకరణను నిరసిస్తూ గురువారం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో కోటి సంతకాల కార్యక్రమాన్ని చేపట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రాష్ట్రంలో పేద విద్యార్థులు వైద్య విద్యను అభ్యసించడంతో పాటు పేదలకు మెరుగైన వైద్యసేవలందించేలా మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్రెడ్డి 17 ప్రభుత్వ మెడికల్ కాలేజీలను తీసుకువచ్చారన్నారు. ఐదు కళాశాలలు పూర్తికాగా విద్యార్థులు చదువుకుంటున్నారని, మిగిలినవి వివిధ దశల్లో ఉండగా కూటమి ప్రభుత్వం ప్రైవేటు వ్యక్తులకు అప్పగించడానికి సిద్ధమవ్వడం దారుణమన్నారు. రూ.4 వేల కోట్లు ఖర్చుచేస్తే అన్ని కళాశాలలూ అందుబాటులోకి వస్తాయని, అయితే ప్రభుత్వం ఆ పని చేయకుండా మాయమాటలతో ప్రజలను దారుణంగా మోసం చేస్తోందన్నారు. భవిష్యత్ తరాల ఆస్తి అయిన వైద్య కళాశాలలను కాపాడుకోవాల్సిన అవసరం ప్రజలందరిపై ఉందన్నారు. ప్రజలు పెద్ద ఎత్తున తరలివచ్చి సంతకాలు చేశారు. జెడ్పీ వైస్ చైర్మన్ గుడిమళ్ల కృష్ణంరాజు, నాయకులు రామిశెట్టి కృష్ణ, కిషోర్, మాజీ జెడ్పీటీసీ బాణావతు రాజు, సుంకొల్లు సర్పంచ్ దుడ్డు నాగమల్లేశ్వరరావు, కొనకాల శ్రీనివాసరావు, ముల్లంగి జమలయ్య, మాజీ సర్పంచ్ కొనకాల తిరుపతిరావు తదితరులు పాల్గొన్నారు. కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించాలి ఈ ఏడాది జూన్లోనే ప్రారంభించాల్సిన కేంద్రీయ విద్యాలయాన్ని ప్రారంభించకుండా కావాలని జా ప్యం చేస్తున్నారని, దీంతో ఈ ప్రాంత విద్యార్థులకు తీరని నష్టం జరుగుతోందని, కేంద్రీయ విద్యాల యాన్ని ప్రారంభించేలా చర్యలు తీసుకోవాలని సబ్ కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నను మాజీ ఎమ్మెల్యే మేకా వెంకట ప్రతాప్ అప్పారావు కోరారు. గురువారం ఆయన సబ్ కలెక్టర్ను కలిసి సమస్యలను ఆమె దృష్టికి తీసుకువెళ్లారు. -
జీఎస్టీ జాయింట్ కమిషనర్ తీరుపై నిరసన
ఏలూరు టౌన్: సీఎం చంద్రబాబు సొంత జిల్లా చిత్తూరులో వాణిజ్య పన్నుల శాఖలో సిబ్బంది పట్ల ఉన్నతాధికారి వ్యవహరిస్తున్న తీరు ఆక్షేపణీయంగా ఉందని.. ఆధునిక యుగంలోనూ కిందిస్థాయి సిబ్బంది పట్ల అంటరానితనం ప్రదర్శిస్తున్న అధికారులపై ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరుతూ ఏలూరు వన్టౌన్ జీఎస్టీ కార్యాలయం వద్ద వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం నేతలు, సిబ్బంది నిరసన ప్రదర్శన చేశారు. చిత్తూరులో వాణిజ్య పన్నుల శాఖ (జీఎస్టీ) జాయింట్ కమిషనర్ రవీంద్రనాథ్రెడ్డి కార్యాలయంలో పనిచేస్తున్న ఇద్దరు అటెండర్ల పట్ల చులకన భావనతో చూడటంతో పాటు తీవ్ర అసభ్య పదజాలంతో దూషిస్తూ సిబ్బంది మనోభావాలను దెబ్బతీస్తున్నారని వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగుల సంఘం ఉపాధ్యక్షుడు కే.చిట్టిబాబు తెలిపారు. తన ముందు చెప్పులు వేసుకుని రాకూడదంటూ చెప్పటం అతని అహంకారానికి నిదర్శనం అన్నారు. వాణిజ్య పన్నుల శాఖ ఉద్యోగ సంఘాల జేఏసీ పిలుపులో భాగంగా ఏలూరులోనూ విధులను బహిష్కరించి నిరసన తెలిపామన్నారు. జాయింట్ సెక్రటరీ జీ.జాన్బాబు మాట్లాడుతూ రాష్ట్ర జేఏసీ పిలుపులో భాగంగా నిరసన తెలిపుతున్నామని, వెంటనే అధికారిని బదిలీ చేయటంతోపాటు, మరోసారి కార్యాలయాల్లో ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా ప్రభుత్వం చర్యలు చేపట్టాలని కోరారు. -
పంట నష్ట నివారణ చర్యలు ఇలా
కై కలూరు : మోంథా తుపాను ప్రభావంతో వరి పొలాల్లో వర్షపు నీరు చేరిన రైతులు నీటిని బయటకు తోడి గింజ మొలకెత్తకుండా 5 శాతం ఉప్పుద్రావణం పిచికారీ చేయాలని కై కలూరు వ్యవసాయశాఖ సహాయసంచాలకులు ఏ.పార్వతీ చెప్పారు. కలిదిండి మండలం కోరుకొల్లు గ్రామంలో తుపాను దాటికి పంట ఒరిగిన చేలను వ్యవసాయాధికారి విద్యాసాగర్తో కలసి బుధవారం పరిశీలించారు. ఏడీ మాట్లాడుతూ కై కలూరు మండలంలో 2,500 వరి విస్తీర్ణానికి 300 ఎకరాలు, కలిదిండి మండలంలో 1,500 ఎకరాలకు 600 ఎకరాల్లో పంట నేలకొరగడం, నీరు చేరడం జరిగిందన్నారు. పూర్తి నష్ట అంచనాలను వేస్తున్నామన్నారు. సాధారణంగా ఈ ప్రాంతంలో 1310, స్వర్ణ, సంపద స్వర్ణ, 1140 రకాలను సాగు చేస్తున్నారన్నారు. పంట నష్ట నివారణ చర్యలపై పలు సూచనలు చేశారు. రైతులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు ● వీలైనంత వరకు పొలంలో నిలచిన నీటిని అంతర్గత కాలువల ద్వారా తొలగించాలి. ● గింజలు రంగు మారడం, మాగుడు తెగులు, మానిపండు తెగులు వ్యాప్తి నివారణకు ఎకరాకు 200 మి.లీ. ప్రోపికొనజోల్ పిచికారీ చేయాలి. ● వర్షాలు తగ్గిన తరువాత బ్యాక్టీరియా ఎండాకు తెగులు కనిపిస్తే ప్లాంటోమైసిన్ 1మి.లీ/లీటరు, కొసైడ్ (కాపర్ హైడ్రాకై ్సడ్) 2.0 గ్రా/లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ● తక్కువ సమయంలో, ఎక్కువ విస్తీర్ణంలో పిచికారీకి అందుబాటులో ఉన్న డ్రోన్లను ఉపయోగించుకోవాలి. ● నిలిచిఉన్న, పడిపోయిన చేలలో కంకిపై గింజ మొలకెత్తకుండా ఉండటానికి 5 శాతం ఉప్పు ద్రావణం (50 గ్రాములు కల్లుప్పు / లీటరు నీటికి)కలిపి పిచికారీ చేయాలి. ● నూర్చిన ధాన్యం 2 – 3 రోజులు ఎండ బెట్టడానికి వీలు కాకపోతే కుప్పల్లో గింజ మొలకెత్తడమే కాక రంగు మారి చెడు వాసన వస్తుంది. ● ఇటువంటి పరిస్థితుల్లో నష్టాన్ని నివారించడానికి ఒక క్వింటాలు ధాన్యానికి ఒక కిలో ఉప్పు,, 20 కిలోల పొడి ఊక లేదా ఎండుగడ్డి కలిపి ధాన్యం పోగు పెట్టడం వల్ల వారం రోజులపాటు గింజ మొలకెత్తకుండా, చెడిపోకుండా నివారించుకోవచ్చు. ● ఎండ కాసిన తరువాత ధాన్యాన్ని ఎండబోసి, తూర్పార బట్టి నిలవ చేసుకోవాలి. -
మురుగునీటి పారుదలకు మార్గం సుగమం
పాలకొల్లు సెంట్రల్: అగ్రికల్చరల్ మార్కెట్ యార్డు ప్రహరీ గోడ మునిసిపల్ డ్రెయినేజీలో పడిపోవడంతో మురుగునీరు పారుదల లేకుండా పోయింది. దీనిపై ఈ నెల 25వ తేదీన ‘వర్షానికి కూలిన ఏఎంసి ప్రహరీ’ శీర్షికన సాక్షి కథనం ప్రచురించింది. దీనిపై మునిసిపల్ అధికారులు స్పందించారు. మురుగునీరు పారుదలకు ఎటువంటి ఇబ్బంది లేకుండా పొక్లెయిన్తో ప్రహరీగోడ శిథిలాలను తొలగించారు. మురుగునీటి పారుదలకు మార్గం సుగమం చేశారు. దీంతో తుపాను ప్రభావం వల్ల కురిసిన వర్షానికి మురుగునీరు పారుదలకు ఎటువంటి ఇబ్బందులు లేకుండా అధికారులు ముందస్తు చర్యలు చేపట్టడంతో స్థానిక ప్రజలు ‘సాక్షి’కి కృతజ్ఞతలు తెలియజేశారు. మిగిలిన ప్రహరీగోడను తొలగించడంలో మాత్రం స్పందించాల్సిన ఏఎంసీ అధికారులు మొద్దునిద్రను వీడడం లేదని స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఆకివీడు: ఖరీఫ్ సాగులో రైతులు తెగుళ్ల బెడదతో బెంబేలెత్తుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లోని వరి చేలకు ఆకుపచ్చ తెగులు, ముడత, పండాకు తెగులు, కోడు వంటివాటితో సతమతమవుతున్నారు. మండలంలోని పలు గ్రామాల్లో వరి చేలు ఈనిక, గింజ పాలుపోసుకునే దశలో ఉన్నాయి. ఈ దశలో తెగుళ్ల బారిన పడటం వల్ల కుదుళ్లకు నష్టం వాటిల్లి దిగుబడులు తగ్గుతాయని రైతులు ఆందోళన చెందుతున్నారు. కాగా మోంథూ తుపాను తాకిడికి మండలంలోని పలు గ్రామాల్లో 600 ఎకరాలకు పైగా వరి పంట నీట మునిగింది. దీనికితోడు ఎగువ ప్రాంతం నుంచి ముంపునీరు భారీగా చొచ్చుకువస్తుండడంతో రానున్న రోజుల్లో ఇంకా వందల ఎకరాలు నీట మునిగే ప్రమాదం ఉందని రైతులు చెబుతున్నారు. తాడేపల్లిగూడెం (టీఓసీ): పట్టణంలోని కడకట్ల ఫ్లైౖఓవర్ రోడ్డులోని లక్ష్మీసాహితీ ఆటో కన్సల్టెన్సీ ఫైనాన్స్ షాప్లో బుధవారం ఉదయం అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాపు నుంచి పొగలు రావడంతో స్థానికులు ఫైర్ స్టేషన్కు సమాచారం అందించగా వారు వచ్చి మంటలను అదుపు చేశారు. షాపులో 44 ద్విచక్రవాహనాలు ఉండగా 2 పూర్తిగా దగ్ధమయ్యాయి. 3 వాహనాలు పాక్షికంగా దెబ్బతిన్నాయి. సకాలంలో స్పందించి మంటలను అదుపు చేసినట్లు ఫైర్ ఆఫీసర్ కేవీ మురళీ కొండబాబు వెల్లడించారు. అగ్ని ప్రమాదానికి కారణం తెలియరాలేదని అధికారులు చెప్పారు. నష్టం వివరాలు తెలియరాలేదు. -
కొల్లేరులో కల్లోలం
కై కలూరు: కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. కొల్లేరుకు చేరే నీటిని సముద్రానికి పంపించే మార్గాలైన పెదఎడ్లగాడి వంతెన, పోల్రాజ్ కాల్వ, ఉప్పుటేరులో రోజురోజుకు నీటిమట్టం పెరుగుతోంది. ఇప్పటికే పెనుమాకలంక రహదారి రెండు వారాలుగా నీటిలో నానుతోంది. తాజాగా గోకర్ణపురం – పైడిచింతపాడు రోడ్డు వరద నీటికి మునిగింది. రహదారి మార్గాలు మూసుకుపోవడంతో సమీప గ్రామాల ప్రజలు పనులు లేక అల్లాడుతున్నారు. సాధారణంగా తుపానులు, భారీ వర్షాలు కురిసిన నాలుగు రోజులకు కొల్లేరులో నీటి ఉధృతి పెరుగుతోంది. మోంథా తుపానుకు ముందు బంగాళాఖాతంలో అల్పపీడనంతో కురిసిన భారీ వర్షాలకు కొల్లేరుకు భారీ వర్షపు నీరు చేరింది. తాజాగా తెలంగాణలో సైతం తుపాను ప్రభావంతో వర్షాలు కురుస్తున్నాయి. ఏలూరు, పశ్చిమగోదావరి జిల్లాల్లో 12 మండలాల పరిధిలో 2,22,300 ఎకరాల విస్తీర్ణంలో కొల్లేరు సరస్సు విస్తరించి ఉంది. మొత్తం 122 పరివాహక గ్రామాలు ఉన్నాయి. కొల్లేరుకు 67 డ్రెయిన్లు, వాగుల ద్వారా లక్షా 10 వేల క్యూసెక్కుల నీరు చేరుతోంది. ప్రధానంగా బుడమేరు, తమ్మిలేరు నుంచి నీరు ఎక్కువగా వస్తుంది. రోజురోజుకు నీటిమట్టం పెరగడంతో కొల్లేరు ప్రజలు భయాందోళన చెందుతున్నారు. రహదారులకు రాకపోకలు బంద్ కొల్లేరుకు చేరుతున్న భారీ వర్షాలకు రహదారులు నీట మునుగుతున్నాయి. ప్రజల రాకపోకలకు తీవ్ర అంతరాయం ఏర్పడుతోంది. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వంతెన నుంచి పెనుమాకలంక గ్రామానికి చేరే రోడ్డు రెండు వారాలుగా నీటిలో నానుతోంది. దీంతో పెనుమాకలంక, ఇంగిలిపాకలంక, శ్రీరామ్నగర్ వెళ్లే ప్రజలకు రహదారి సౌకర్యం లేదు. అదే విధంగా మోంథా తుపాను దాటికి కై కలూరు మండలం గోకర్ణపురం నుంచి ఏలూరు చేరే రహదారిపై నుంచి కొల్లేరు నీరు ప్రవహిస్తోంది. ప్రధానంగా ఏలూరు, చాటపర్రు, గుడివాకలంక, ప్రత్తికోళ్ళలంక, పైడి చింతపాడు మీదుగా కొల్లేటికోట పెద్దింట్లమ్మ దేవస్థానం చేరడానికి 22 కిలోమీటర్లతో దగ్గర మార్గంగా ఉంది. రోడ్డు మూసుకుపోవడంతో 35 కిలోమీటర్లు చుట్టూ తిరిగి కై కలూరు మీదుగా రావాల్సి వస్తుంది. మరిన్ని రహదారులు మునిగే అవకాశం కనిపిస్తోంది. ఉప్పుటేరు ఉధృతం కొల్లేరు నీటిని సముద్రానికి పంపించడానికి ఏకై క మార్గంగా ఉన్న ఉప్పుటేరు ఉధృతంగా ప్రవహిస్తోంది. ఉప్పుటేరు పరివాహక గ్రామాలకు మంపు ముప్పు పొంచి ఉంది. కై కలూరు మండలం కొట్టాడ, రాజుల కొట్డాడ, జంగంపాడు పల్లెపాలెం రేవుల వద్ద నీటి మట్టం పెరిగింది. కొల్లేరులో ఇప్పటికే చేపల చెరువుల్లో నీరు గట్టుల వరకు ఉంది. భారీ వరద నీటికి గట్లు తెగితే ఆ నీటితో మరింత ప్రమాదంగా మారుతుంది. పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.57 మీటర్ల నీటి మట్టం ఉంది. ఇది 3 మీటర్లకు చేరితే ప్రమాదమని అధికారులు చెప్పారు. వలలను కాపాడుకోడానికి పోల్రాజ్ కాల్వ వద్ద సిద్ధంగా ఉంచిన ఇసుక బస్తాలు మండవల్లి మండలం కాకతీయనగర్ వద్ద ఉధృతంగా పోల్రాజ్ కాల్వ మోంథా తుపానుతో భారీగా వర్షంనీరు కొల్లేరులో నీట మునిగిన రహదారులు చిగురుటాకుల వణుకుతున్న లంక గ్రామాల ప్రజలు పెదఎడ్లగాడి వంతెన వద్ద 2.57 మీటర్ల నీటిమట్టం నమోదు -
నిండు జీవితాల్లో విషాదం
● ఆత్మహత్యకు పాల్పడిన భార్యాభర్తలు ● ఒక్క రోజు వ్యవధిలో ఇద్దరూ మృతి భీమడోలు: సంసారంలో ఒడిదిడుకులను తట్టుకోలేక, అవమానభారంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. గుంటూరు ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ భార్య గుండుమోలు భానుపూర్ణిమ (22) సోమవారం రాత్రి మృతి చెందగా భర్త సుధాకర్ (29) బుధవారం వేకువజామున మృతి చెందాడు. భానుపూర్ణిమ మృతదేహానికి విజయవాడలో అంత్యక్రియలు నిర్వహించారు. సుధాకర్ మృతదేహానికి గుంటూరు ఆసుపత్రిలో పోలీసులు పోస్ట్మార్టమ్ నిర్వహించి ఏలూరు జిల్లా భీమడోలు గ్రామానికి బుధవారం సాయంత్రం తరలించారు. దీంతో భీమడోలు గ్రామంలో విషాదఛాయలు అలముకున్నాయి. సంసారంలో కుదుపు ఐదేళ్ల కితం గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ ప్రేమ వివాహం చేసుకున్నారు. వారికి మూడేళ్ల బాలుడు ఉన్నాడు. సుధాకర్ మంచి వ్యక్తిగా అందరితో కలివిడిగా ఉండేవాడు. గ్రామంలోని కటారి మోహన్ నాగ వెంకట సాయి అనే యువకుడు భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి అమ్మవారి కుంకుమను ఇచ్చి నమ్మబలికి ఈనెల 6న ఆమెను ఇంటి నుంచి తీసుకుని వెళ్లాడు. బాధితురాలిని విజయవాడ తీసుకుని వెళ్లగా చనిపోతానని, ఇంటికి తీసుకు వెళ్లమని గొడవ చేయగా ఈనెల 19న భీమడోలు తీసుకువచ్చాడు. దీంతో భార్యాభర్తలిద్దరూ తీవ్ర అవమానభారంతో బాధపడ్డారు. ప్రేమించి పెళ్లి చేసుకున్న సుధాకర్ తన భార్యను వదులుకోలేక తీవ్ర వేదనకు గురయ్యాడు. తాను మానసిక వేదనకు గురయ్యాయని, నా జీవితాన్ని నాశనం చేశాడని, మోహన్పై కఠిన చర్యలు తీసుకోవాలంటూ వారిద్దరూ సెల్ఫీ వీడియో తీసి సోషల్ మీడియాల్లో పంపి ఈనెల 25న రాత్రి కూల్డ్రింక్లో కలుపు మందు కలిపి తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. గుంటూరు ఆసుపత్రిలో చిక్సి పొందుతున్న ఆ భార్యాభర్తలు ఇద్దరూ ఒక్కరోజు గడువులో కన్నుమూశారు. నిందితుడు కటారి మోహన్ నాగ వెంకటసాయిను ఇప్పటికే పోలీసులు అరెస్ట్ చేసి కోర్టులో హాజరుపర్చారు. -
అపార పంట నష్టం
కొల్లేరులో కల్లోలం కొల్లేరు ఉగ్రరూపం దాల్చుతోంది. మోంథా తుపాను ప్రభావానికి ఎగువ నుంచి చేరిన వర్షపు నీటితో కొల్లేరు సరస్సు నిండుకుండలా మారింది. 8లో uసంసారంలో ఒడిదొడుకులు తట్టుకోలేక, అవమానభారంతో విషం తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో దంపతులు మృతి చెందారు. 8లో uగురువారం శ్రీ 30 శ్రీ అక్టోబర్ శ్రీ 2025మోంథా తుపాను ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా విద్యుత్ సంస్థకు రూ.35.96 లక్షల నష్టం వాటిల్లింది. 20 11 కేవీ ఫీడర్లు తుపాను కారణంగా ప్రభావితమయ్యాయి. ఎనిమిది 33 కేవీ స్తంభాలు, 11 కేవీ స్తంభాలు 66, 109 లో టెన్షన్ స్తంభాలు దెబ్బతిన్నాయి. 22 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు దెబ్బతిన్నాయని ఈపీడీసీఎల్ ఏలూరు ఆపరేషన్ ఎస్ఈ పీ.సాల్మన్ రాజు తెలిపారు. విద్యుత్ పునరుద్ధరణ పనుల్లో 129 మంది అధికారులు, సిబ్బంది పాల్గొన్నారని తెలిపారు. మోంథా తుఫాన్ ప్రభావంతో జిల్లా వ్యాప్తంగా 107 చెట్లు కూలిపోయాయి. 4 పశువులు మృతి చెందగా ఒక ఇల్లు దెబ్బతింది. తుపాను నిమిత్తం వైద్యారోగ్యశాఖ 318 మంది గర్భిణులను సురక్షిత ప్రాంతాలకు తరలించారు. 148 వైద్యశిబిరాలు ఏర్పాటు చేశారు. పంచాయితీరాజ్ శాఖ ఆధ్వర్యంలో 474 డ్రెయిన్లలో సిల్ట్ తొలగించారని సంబంధిత శాఖాధికారులు నష్టం వివరాలను అంచనా వేశారు. గురువారంలోపు నష్టం అంచనాలు తుపాను తీవ్రత తగ్గడంతో గురువారం నుంచి యథావిధిగా విద్యాసంస్థలు నిర్వహించాలని కలెక్టర్ ఆదేశించారు. తుపాను ముగిసిపోవడంతో బుధవారం రాత్రి వరకే 90 సహాయ కేంద్రాలను నిర్వహిస్తామని, 3,420 కుటుంబాలకు చెందిన 7 వేల మందికి భోజన వసతి కల్పించామని, బాధిత కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంటనూనె, రెండు రకాల కూరగాయలు 2 కిలోల చొప్పున, మనిషికి రూ. వెయ్యి, కుటుంబానికి గరిష్టంగా రూ.3 వేలు అందిస్తామని ప్రకటించారు. శాఖల వారీగా గురువారంలోపు నష్టం అంచనాలను సిద్ధం చేయనున్నారు. ప్రధానంగా విద్యుత్, వ్యవసాయ, ఆర్అండ్బీ శాఖలతో పాటు ఇతర శాఖల నుంచి నష్టం అంచనా నివేదికలు తెప్పించి ప్రభుత్వానికి పంపనున్నారు. కై కలూరు: మోంథా తుపాను నష్టాలను ప్రభుత్వ శాఖల సమన్వయంతో పూర్తి స్థాయిలో నివారించామని జిల్లా ఎస్పీ కె.ప్రతాప్ శివ కిషోర్ చెప్పారు. నియోజకవర్గంలో కై కలూరు, భైరవపట్నం గ్రామాల్లో కొనసాగుతున్న తుపాను పునరావాస కేంద్రాలను బుధవారం సందర్శించారు. నిర్వాసితులకు సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. ఎస్పీ మాట్లాడుతూ పెద్ద తుపానును పోలీసు, రెవెన్యూ ఇతర శాఖలతో కలసి ఒక్క ప్రాణనష్టం లేకుండా సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లా వ్యాప్తంగా చెట్లు, విద్యుత్ స్తంభాలు కూలినా తక్షణం తొలగించారన్నారు. ముందస్తు చర్యల వల్ల ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్ సహాయం అవసరం రాలేదన్నారు. పునరావాస కేంద్రాల్లో నిర్వాసితులకు అన్ని సౌకర్యాలు కల్పించాలన్నారు. కార్యక్రమంలో కై కలూరు టౌన్, రూరల్ సర్కిల్ సీఐలు ఏవీఎస్.రామకృష్ణ, వి.రవికుమార్, ఎస్ఐలు డి.వెంకట్ కుమార్, ఆర్.శ్రీనివాస్, రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు. ఏలూరు (ఆర్ఆర్పేట): జిల్లాలో తుపాను ప్రభావం తగ్గడం వల్ల జిల్లాలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు యాజమాన్యాలలోని అన్ని పాఠశాలలు గురువారం నుంచి యథావిధిగా నిర్వహించాలని జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఆదేశించారు. ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు పాఠశాల భవనం, ప్రాంగణం మొత్తం పరిశీలించాలని, ఎక్కడైనా తుపాను వల్ల చెట్లు, లేదా కొమ్మలు లేదా బిల్డింగు పైకప్పు పెచ్చులు సరిగా ఉన్నాయా, టైల్స్ ఊడిపోయాయా అని పరిశీలించాలని సూచించారు. తాగునీటి ట్యాంకులు, హ్యాండ్ పంప్లు, ట్యాపులు పరిశీలించి నీరు కలుషితం కాకుండా చూడాలన్నారు. పాఠశాల పరిసరాలలోని విద్యుత్ లైన్న్లు, సాకెట్లు సురక్షితంగా ఉన్నాయా లేదా సరిచూడాలని, ఎక్కడైనా నీరు నిలిచిపోవడం, విద్యుత్ ప్రమాదం, గోడ కూలే పరిస్థితి, లేదా విద్యార్థులకు ప్రమాదకర వాతావరణం ఉంటే పాఠశాలను తాత్కాలికంగా మూసివేసి వెంటనే ఎంఈఓ/డీవైఈఓ/డీఈఓ కార్యాలయానికి తెలియజేయాలని సూచించారు. ఏలూరు(మెట్రో): ప్రస్తుత సీజన్లో రైతుల నుంచి రికార్డు స్థాయిలో 51 లక్షల టన్నుల ధాన్యం సేకరిస్తామని పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ చెప్పారు. కలెక్టరేట్లో బుధవారం మాట్లాడుతూ తుపాను వల్ల నష్టపోయిన ప్రతి రైతును ఆదుకుంటామన్నారు. తడిసిన ధాన్యం కొనుగోలుకు రైస్ మిల్లర్లతో చర్చించామన్నారు. పంట నష్టాలపై ఈ నెల 30 లోగా నివేదికలు అందించాలని ఆదేశించామన్నారు. ప్రతి రైతు సేవా కేంద్రంలో 10 నుంచి 30 టార్పాలిన్లు అందుబాటులో ఉంచామని, అవసరం ఉన్న రైతులకు ఉచితంగా అందిస్తున్నామన్నారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా పొగాకు ధర పెరుగుదల కొనసాగుతోంది. వరుసగా మూడో రోజు ధర పెరిగింది. మంగళవారం ధర రూ.455 ఉండగా.. బుధవారం మరో రూపాయి పెరిగి రూ.456కు చేరింది. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా పరిధిలోని ఎన్ఎల్ఎస్ ఏరియాలో ఐదు వేలం కేంద్రాల్లో నమోదైన ధరలు ఇలా ఉన్నాయి. జంగారెడ్డిగూడెం 1, 2 వేలం కేంద్రాలతో పాటు కొయ్యలగూడెం వేలం కేంద్రంలో అత్యధికంగా కేజీ ఒక్కింటికి రూ.456 లభించింది. గోపాలపురం, దేవరపల్లి వేలం కేంద్రాల్లో రూ.455 లభించింది. లోగ్రేడ్ పొగాకుకు మాత్రం సరైన ధర లభించడం లేదు. లోగ్రేడ్ పొగాకు బుధవారం కేజీ ఒక్కింటికి రూ.50 మాత్రమే లభించింది. ఎన్ఎల్ఎస్ పరిధిలో ఇప్పటి వరకు సరాసరి ధర కేజీ ఒక్కింటికి రూ.305.01 లభించింది. విశాఖ సిటీ: మోంథా తుపాను ప్రభావంతో ఏపీఈపీడీసీఎల్కు రూ.10.47 కోట్లు నష్టం సంభవించింది. అధికారులు విద్యుత్ పునరుద్ధరణ పనులు వేగవంతంగా చేపడుతున్నారు. 7,973 మంది విద్యుత్ సిబ్బందితో 523 బృందాలుగా నిరంతరం శ్రమిస్తున్నారు. ఎక్కువ నష్టం జరిగిన కోనసీమ, కాకినాడ, పశ్చిమ గోదావరి సర్కిళ్లలో ఇప్పటివరకు 13,56,415 సర్వీసు కనెక్షన్లకు గాను 13,02,948 పునరుద్ధరించారు. గురువారం నాటికి విద్యుత్ పునరుద్ధరణ పనులు పూర్తి చేసే దిశగా చర్యలు చేపడుతున్నారు. దెబ్బతిన్న విద్యుత్తు సరఫరా వ్యవస్థను యుద్ధప్రాతిపదికన పునరుద్ధరిస్తున్నామని ఏపీఈపీడీసీఎల్ సీఎండీ పృథ్వీతేజ్ ఇమ్మడి పేర్కొన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు: మోంథా తుపాను తీరం దాటింది. భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడకపోవడంతో అన్నదాతలు కొంతమేర ఊపిరిపీల్చుకున్నా.. తుపాను తీవ్రతతో గత నాలుగు రోజులుగా కురిసిన వర్షాలకు జిల్లాలో పంటలకు అపారనష్టం వాటిల్లింది. 20 వేలకుపైగా ఎకరాల్లో వివిధ పంటలు నష్టపోయాయి. కోత దశకు వచ్చిన వరి, మినుము, ఇతర ఉద్యానవన పంటలకు భారీ నష్టం వాటిల్లింది. ఇంకోవైపు వందల సంఖ్యలో విద్యుత్ స్తంభాలు నేలకొరిగాయి. పదుల సంఖ్యలో చెట్లు నేలకూలాయి. తుపాను తీవ్రతకు గత మూడు రోజులుగా కురిసిన వర్షాలకు అన్ని నియోజకవర్గాల్లో పంట నష్టం భారీగా వాటిల్లింది. ప్రధానంగా కై కలూరు, ఉంగుటూరు, దెందులూరు నియోజకవర్గాల్లో ఎక్కువ నష్టం జరిగింది. వ్యవసాయశాఖాధికారుల పంట నష్టం అంచనాలు సిద్ధం చేస్తున్నారు. ప్రధానంగా ఉంగుటూరు నియోజకవర్గంలో 5,540 ఎకరాలు, కై కలూరు నియోజకవర్గంలో 3,336 ఎకరాలు, పోలవరంలో 4,487, ఏలూరులో 1,500 ఎకరాలు, చింతలపూడిలో 813, దెందులూరులో 1050, నూజివీడులో 1700 ఎకరాల్లో పంట నష్టం జరిగింది. మొత్తం నష్టపోయిన పంటల్లో 80 శాతానికిపైగా వరి పంటే. మరో వారం రోజుల్లో కోతలు ప్రారంభం కావాల్సి ఉన్న తరుణంలో పొలాల్లోకి నీరు చేరడం, వరి కంకులు నేలకొరగడంతో నష్టం వాటిల్లింది. నూజివీ నియోజకవర్గంలో 1700 ఎకరాల్లో మినుము పంటతో పాటు 120 ఎకరాల్లో పత్తి పంటకు నష్టం వాటిల్లింది. మోంథా తుఫాన్ నేపథ్యంలో మంగళవారం జిల్లాలో 4.6 సెంటిమీటర్ల వర్షపాతం నమోదైంది. అత్యధికంగా జీలుగుమిల్లిలో 1.8 సెంటిమీటర్ల వర్షం కురిసింది. దాదాపు 31 మండలాలకుగాను 25 మండలాల్లో వర్షం జాడే లేకపోవడంతో ప్రజలు ఊపిరిపీల్చుకున్నారు. కొల్లేరు, ఉప్పుటేరు పెరుగుతున్న వరద : ఎగువ నుంచి వస్తున్న ప్రవాహంతో కొల్లేరు సరస్సు, ఉప్పుటేరు వాగులు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. మోంథా తుపానుకు ముందే ఈ రెండూ నిండుగా ఉన్నాయి. సుమారు 64 ప్రధాన కాల్వల నీరు కొల్లేరుకు అక్కడి నుంచి ఉప్పుటేరుకు చేరుకున్నాయి. ఈ క్రమంలో రెండు గరిష్ట నీటిమట్టానికి చేరాయి. పెద ఎడ్లగాడి వంతెన వద్ద కొల్లేరు 2.57 మీటర్ల ఎత్తులో ప్రవహిస్తుంది. ఇప్పటికే పెనుమాలంక వంతెన వారం రోజులుగా జలదిగ్భందంలో చిక్కుకుంది. 3 మీటర్ల ఎత్తు దాటితే కొల్లేరులోని చెరువుల గట్లు తెగి మత్స్యసంపదంతా కొల్లేరు పాలవడటంతో పాటు 15 లంక గ్రామాల్లోకి వరదనీరు చేరే ప్రమాదముంది. వర్షాలు తగ్గుముఖం పట్టినా కాల్వల్లో నీరు భారీగా కొల్లేరులోకి చేరుతుంది. మరోవైపు ఉప్పుటేరుకూడా అదే స్థాయిలో కొనసాగుతుంది. 6 అడుగుల ఎత్తులో బలమైన ప్రవాహం ఉంది. ఉప్పుటేరు వద్ద 7 అడుగులు దాటితే పలు గ్రామాల్లోకి నీరు చేరే ప్రమాదం ఉంది. ప్రత్తికోళ్లలంకలో రోడ్డుపైకి చేరిన వర్షం నీరు భీమడోలు మండలంలో మొలకలు వచ్చిన వరి ఏలూరులో లునానినగర్ నుంచి బీడీ కాలనీకి వెళ్లే రోడ్డు ఇలా.. బుట్టాయగూడెం మండలం ఎన్ఆర్పాలెంలో మునిగిన వరి చేను వద్ద రైతు బుట్టాయగూడెం: తుపాను ప్రభావంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లిందని వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని నూతిరామన్నపాలెం, అచ్చియ్యపాలెం గ్రామాల్లో తుపాను వల్ల దెబ్బతిన్న పంటలను బుధవారం మాజీ ఎమ్మెల్యే బాలరాజు పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పంట నష్టపోయిన రైతులను ప్రభుత్వం ఆదుకోవాలన్నారు. తడిసిన ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేయాలని కోరారు. ఎన్నో కష్టాలు పడి రైతులు పంటలు వేశారని పంట చేతికి వచ్చే సమయానికి కురిసిన వర్షాలకు పంటలు దెబ్బతినడంతో రైతులు తీవ్ర ఆందోళన చెందుతున్నారని అన్నారు. ముఖ్యంగా పలు చోట్ల వరిపంట పొలాల్లోకి వర్షపు నీరు చేరి అన్నిట్లోనూ వరి కంకులు నానుతున్నాయని చెప్పారు. ఈ పరిస్థితుల్లో ధాన్యాన్ని ప్రభుత్వం కొనుగోలు చేసి రైతులను ఆదుకోవాలని అన్నారు. కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, సర్పంచ్ మొడియం లక్ష్మి, నాయకులు కిరణ్, పెంటపాటి శ్రీను, పూనెం వెంకటేశ్వరరావు, ఏలేటి చంద్రం, రైతులు, తదితరులు పాల్గొన్నారు.వైఎస్సార్సీపీ నియోజకవర్గ సమన్వయకర్త తెల్లం బాలరాజు సహాయక చర్యలు ముమ్మరం చేయాలి ఏలూరు(మెట్రో): జిల్లాలో తుపాను సహాయక కార్యక్రమాలను ముమ్మరం చేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అధికారులను ఆదేశించారు. కలెక్టరేట్లో బుధవారం సహాయ కార్యక్రమాలపై జిల్లా ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, కలెక్టర్ వెట్రిసెల్వితో కలిసి మంత్రి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న ముందస్తు జాగ్రత్త చర్యలతో తుపానును సమర్థవంతంగా ఎదుర్కొన్నామన్నారు. జిల్లా యంత్రాంగం మంచి స్పూర్తితో పనిచేసిందని, అదే స్పూర్తితో సహాయక కార్యక్రమాలను చేపట్టాలని, ఆస్తి, పంట, పశు నష్టం అంచనాలను ఈనెల 30 నాటికి పూర్తి చేయాలని మంత్రి చెప్పారు. అంటువ్యాధులు ప్రబలకుండా చర్యలు తీసుకోవాలని, పారిశుద్ధ్య చర్యలు చేపట్టాలన్నారు. నదులు, చెరువులు, వాగులు, కాలువల గట్ల పటిష్టతను పరిశీలించాలని, బలహీనంగా గట్లను పటిష్టం చేయాలన్నారు. సహాయక శిబిరాలు బుధవారం రాత్రి వరకు నిర్వహిస్తామని, బాధిత కుటుంబాలకు కేంద్రం నుంచి వెళ్లే సమయంలో కుటుంబాలకు 25 కేజీల బియ్యం, కందిపప్పు, పంచదార, వంట నూనె, రెండు రకాల కూరగాయలు అందిస్తామని, చెప్పారు. తుపాను కారణంగా దెబ్బతిన్న రోడ్లు, విద్యుత్ స్తంభాలను వెంటనే పునరుద్ధరించాలన్నారు. ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే మాట్లాడుతూ తుపాను అనంతరం సహాయక చర్యలను అదే స్పూర్తితో అధికారులు, సిబ్బంది చేపట్టాలన్నారు. కలెక్టర్ మాట్లాడుతూ మంత్రులు, ప్రజాప్రతినిధులు, తుపాను ప్రత్యేక అధికారులు అందించిన సూచనలతో ముందుగానే ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించడంతో ఎలాంటి ప్రాణ నష్టం సంభవించలేదన్నారు. ఎమ్మెల్యే పత్సమట్ల ధర్మరాజు, ఆర్టీసీ రీజినల్ చైర్మన్ రెడ్డి అప్పలనాయుడు, జిల్లా రెవిన్యూ అధికారి వి.విశ్వేశ్వరరావు, వివిధ శాఖల అధికారులు పాల్గొన్నారు. 19 వేల ఎకరాల్లో దెబ్బతిన్న పంటలు వరి పంటకు భారీ నష్టం ప్రమాద స్థాయిలో కొల్లేరు, ఉప్పుటేరు ఆక్వా చెరువుల్లో పడిపోతున్న ఆక్సిజన్ లెవల్స్ నేలకొరిగిన వందల విద్యుత్ స్తంభాలు -
కామిరెడ్డి నానీకి బెయిల్ మంజూరు
దెందులూరు: వైఎస్సార్సీపీ యువజన విభాగం ఏలూరు జిల్లా అధ్యక్షుడు కామిరెడ్డి నానికి బుధవారం రాష్ట్ర హైకోర్టు షరతులతో కూడిన యాంటిస్పేటరీ బెయిల్ మంజూరు చేసింది. ఈ సందర్భంగా కామిరెడ్డి నాని మాట్లాడుతూ అక్రమ కేసులు పెట్టి 55 రోజుల పాటు తనను ఇబ్బంది పెట్టారని, ఈ రోజు న్యాయం గెలిచిందని అన్నారు. తన కష్టాల్లో వెన్నంటి ఉంటూ పూర్తి సహాయ సహకారాలు, మనోధైర్యాన్ని ఇచ్చిన పార్టీ అధినేత మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్రెడ్డికి, దెందులూరు మాజీ ఎమ్మెల్యే కొఠారు అబ్బయ్య చౌదరి, ఏలూరు పార్లమెంట్ ఇన్చార్జి కారుమూరి వెంకట సునీల్, పార్టీ ఏలూరు జిల్లా అధ్యక్షుడు దూలం నాగేశ్వరరావు, రాష్ట్ర యువజన విభాగం అధ్యక్షుడు జక్కంపూడి రాజా, యువజన విభాగం వర్కింగ్ ప్రెసిడెంట్ బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి, వైఎస్సార్సీపీ కుటుంబ సభ్యులకు, న్యాయవాది ఈడ్పుగంటి శ్రీనివాస్కు రుణపడి ఉంటానన్నారు. -
ఆధ్యాత్మిక సేవలు విస్తరించాలి
దెందులూరు: ఆధ్యాత్మిక సేవలు మరింత విస్తరింపజేయాలని పోప్ లియో సూచించారని ఆర్సీఎం ఏలూరు పీఠం జనరల్ డాక్టర్ పి.బాల తెలిపారు. బుధవారం ఇటలీలో వాటికన్ జూబ్లీ వేడుకల్లో భాగంగా పోప్ లియోను ఆయన అధికార బంగ్లాలో కలిశామన్నారు. 38వ గురుత్వ పట్టాభిషేకంలోకి ప్రవేశించిన బాలను ఆశీర్వదించి శుభాకాంక్షలు తెలిపారు. తెలంగాణ, ఆంధ్రా నుంచి ఏలూరు పీఠం ప్రతినిధులుగా వెళ్లిన చాన్సలర్ ఇమ్మానుయేల్, భీమవరం ఫాదర్ స్టాలిన్ మస్కాలి, పట్టణ మేయర్ వేరోనికా లుండిన్ స్కోల్ద్కి ఉన్నారు. ఇటలీలోని సిసిలీలో సెయింట్ ఆంథోనీ చర్చిలో డాక్టర్ బాల ఇటాలియన్లో ప్రత్యేక దివ్య పూజ బలి అర్పించారు. ఏలూరు టౌన్: విద్యుదాఘాతంతో ఓ వ్యక్తి మృతి చెందాడు. పోలీసులు తెలిపిన వివరాలు ఇలా ఉన్నాయి. వంగాయగూడెం ప్రాంతానికి చెందిన వీ.జోజి (52) స్థానికంగా ఉన్న కేన్సర్ హాస్పిటల్లో సహాయకుడిగా పనిచేస్తున్నాడు. మంగళవారం రాత్రి డ్రెయినేజీలో చెత్త తొలగించేందుకు ఇనుప ఊచతో శుభ్రం చేస్తుండగా అదే సమయంలో పక్కనే ఉన్న నీటి మోటరుకు చెందిన విద్యుత్ వైరుకు ఇనుప ఊచ తగలటంతో విద్యుదాఘాతానికి గురై మృతిచెందాడు. ఏలూరు రూరల్ ఎస్సై నాగబాబు ఘటనా స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. -
ఆత్మహత్యాయత్నం ఘటనలో భార్య మృతి
భీమడోలు: తీవ్ర మనోవేదన, అవమానాన్ని భరించలేక కలుపు మందు తాగి భార్యభర్తలు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలో భార్య గుండుమోలు భానుపూర్ణిమ (22) సోమవారం రాత్రి మృతి చెందింది. ఆసుపత్రి నుంచి సమాచారం అందుకున్న భీమడోలు పోలీసులు మృతదేహానికి శవపంచనామా నిర్వహించి మంగళవారం కుటుంబ సభ్యులకు అందజేశారు. వివరాల ప్రకారం.. భీమడోలు గ్రామానికి చెందిన గుండుమోలు సుధాకర్, భానుపూర్ణిమ దంపతులు. వీరికి మూడేళ్ల బాబు ఉన్నాడు. గ్రామానికి చెందిన కటారి మోహన్ నాగ వెంకట సాయి భానుపూర్ణిమకు మాయమాటలు చెప్పి ఆమెను 15 రోజుల పాటు గ్రామాంతరం తీసుకుని వెళ్లాడు. ఆమె తనను కుటుంబ సభ్యుల వద్దకు తీసుకువెళ్లాలని గొడవ చేయడంతో ఈనెల 19వ తేదీన భీమడోలు తీసుకుని వచ్చాడు. అయితే తీవ్ర మనోవేదన, అవమానాన్ని తట్టుకోలేక ఈనెల 25వ తేదీ రాత్రి భీమడోలు సమీపంలోని ఓ పశువుల పాకలో భార్యాభర్తలు సుధాకర్, భానుపూర్ణిమ కూల్డ్రింక్లో కలుపు మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డారు. వారి ఆరోగ్య పరిస్థితి విషమించడంతో వారిని గుంటూరు ఆసుపత్రికి మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం తరలించారు. అక్కడ చికిత్స పొందుతూ భానుపూర్ణిమ మృతి చెందింది. భర్త సుధాకర్ పరిస్థితి విషమంగా ఉంది. ఏఎస్సై చలపతిరావు, వీఆర్వో సింహాచలం సమక్షంలో మృతురాలి మృతదేహానికి శవ పంచనామా నిర్వహించి అనంతరం కుటుంబ సభ్యులకు అందజేశారు. భానుపూర్ణిమ మృతితో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. భీమడోలు ఎస్సై షేక్ మదీనా బాషా కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. భర్త పరిస్థితి విషమం -
కొల్లేరులో పడవ ప్రయాణాలు వద్దు
కై కలూరు/మండవల్లి: మోంథా తుపాను నేపథ్యంలో కొల్లేరు ప్రజలు పడవ ప్రయాణాలు చేయవద్దని ఆహార, పౌర సరఫరాలు, వినియోగదారుల వ్యవహరాల మంత్రి, జిల్లా ఇన్చార్జి నాదెండ్ల మనోహర్ సూచించారు. మండవల్లి మండలం పెదఎడ్లగాడి వద్ద నీటి ప్రవాహాన్ని మంగళవారం ఆయన పరిశీలించారు. పెదఎడ్లగాడిలో గుర్రపుడెక్కను తొలగించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్సీ జయమంగళ వెంకటరమణ, రాష్ట్ర వడ్డీ కార్పోరేషన్ చైర్పర్సన్ ఘంటసాల వెంకటలక్ష్మీ, అధికారులు పాల్గొన్నారు. కొల్లేరు నీటిని సముద్రానికి పంపించే ఉప్పుటేరు ప్రవాహాన్ని ఏలూరు ఎంపీ పుట్టా మహేష్కుమార్ యాదవ్, డెప్యూటీ స్పీకర్, ఉండి ఎమ్మెల్యే కనుమూరి రాఘరామకృష్ణంరాజు పరిశీలించారు. జంగారెడ్డిగూడెం: మోంథా తుపాను బాధితుల కోసం వైఎస్సార్సీపీ ఆధ్వర్యంలో షెల్టర్ను ఏర్పాటు చేశారు. పార్టీ పట్టణాధ్యక్షుడు కర్పూరం గుప్త మాట్లాడుతూ రాష్ట్ర కార్యదర్శి జెట్టి గురునాథరావు, చింతలపూడి నియోజకవర్గ కన్వీనర్ కంభం విజయ రాజు, బత్తిన నాగలక్ష్మి నేతృత్వంలో జంగారెడ్డిగూడెం లోతట్టు ప్రాంతాల్లో ఉన్న ప్రజలకు ఇబ్బంది కలగకుండా వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరుఫున బత్తిన చిన్న కళ్యాణ మండపం వద్ద తుపాను బాధితులకు షెల్టర్, భోజన సదుపాయం ఏర్పాటు చేసినట్లు చెప్పారు. బత్తిన చిన్న, పార్టీ శ్రేణులు పాల్గొన్నారు. -
యోగాసన పోటీల్లో సత్తా చాటిన జిల్లా జట్టు
నూజివీడు: విశాఖపట్టణంలోని సీఎంఆర్ ఫంక్షన్ హాల్లో నిర్వహించిన రాష్ట్రస్థాయి యోగాసనా పోటీల్లో జిల్లాలోని నూజివీడు, ఆగిరిపల్లి, శోభనాపురం, వడ్లమాను తదితర గ్రామాలకు చెందిన యోగ సాధకులు ఉత్తమ ప్రతిభ కనబరిచి తమ సత్తా చాటారు. 38వ యోగాసనా చాంపియన్షిప్ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ అధ్యక్షుడు యండూరు నరసింహమూర్తి, ప్రధాన కార్యదర్శి బొద్దూరు సాంబశివరావు, కోశాధికారి ఏపీవీ బ్రహ్మచారి, యోగ గురువులు టీవీకె కుమార్ నేతృత్వంలో 35 మంది యోగ సాధకులు పాల్గొన్నారు. ఈనెల 25, 26 తేదీలలో జరిగిన ఈ పోటీల్లో ఏలూరు జిల్లా యోగ అసోసియేషన్ నుంచి పది డివిజన్లో పోటీపడగా ఏడింటిలో విజయం సాధించారు. మహిళల విభాగంలో బొద్దూరు పద్మశ్రీలత 3వ స్థానం సాధించగా, పురుషుల విభాగంలో మూడో స్థానంలో నూజివీడుకు చెందిన పత్రి కనకభూషణం, 5వ స్థానంలో టి.సాయి ప్రసన్నలక్ష్మి, 7వ స్థానంలో కే శ్రీనివాసరావు, 8వ స్థానంలో ఎం జ్యోతి కుమారి, 9వ స్థానంలో యండూరు నరసింహమూర్తి, 10వ స్థానంలో భావన, జూనియర్స్లో ఆరో స్థానంలో ఎల్ అను నిలిచారు. విజేతలకు ఆంధ్రప్రదేశ్ యోగ అసోసియేషన్ అధ్యక్షుడు కోన కృష్ణదేవరాయలు. ప్రధాన కార్యదర్శి అల్లాడి రవికుమార్లచే షీల్డ్స్, మెడల్స్ అందజేశారు. -
తుపాను రక్షణ చర్యలపై సమీక్ష
ఏలూరు టౌన్: జిల్లాలో మోంథా తుపాను రక్షణ చర్యలపై ఎస్పీ ప్రతాప్ శివకిషోర్తో ప్రత్యేక అధికారి ఆక్టోపస్ డీఐజీ ఎస్.సెంఽథిల్కుమార్ మంగళవారం రాత్రి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఏలూరు జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో తుపాను ముందస్తు రక్షణ చర్యలపై ఆయన సమీక్షించారు. కమాండ్ కంట్రోల్ రూమ్ను సందర్శించిన డీఐజీ సంతృప్తి వ్యక్తం చేశారు. జిల్లాలో చేపట్టిన ముందస్తు సహాయక చర్యలపై ఎస్పీ వివరించారు. తుపాను కారణంగా ప్రజలకు ఇబ్బందులు లేకుండా జాగ్రత్త చర్యలు తీసుకున్నామని తెలిపారు. ప్రాణ, ఆస్తి నష్టం లేకుండా పటిష్టమైన చర్యలు తీసుకున్నామని, ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించామని చెప్పారు. లోతట్టు ప్రాంతాల్లోని ప్రజలను పునరావాస కేంద్రాలకు తరలించి, వసతి సౌకర్యాలు కల్పించామన్నారు. డ్రోన్ నిఘా నిరంతరం కొనసాగేలా చర్యలు తీసుకున్నామని, పోలీస్ యంత్రాంగం పూర్తిస్థాయిలో సహాయక చర్యలకు సిద్ధంగా ఉందన్నారు. ఎలాంటి పరిస్థితులనైనా ఎదుర్కొనేందుకు ఎన్డీఆర్ఎఫ్, ఎస్డీఆర్ఎఫ్, ఏలూరు డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ (ఈడీఆర్ఎఫ్) బృందాలు సన్నద్దం చేశామన్నారు. ఆక్టోపస్ డీఐజీ సెంథిల్ కుమార్ -
మద్ది క్షేత్రంలో విశేష పూజలు
జంగారెడ్డిగూడెం: కార్తీక మాసం మంగళవారం సందర్భముగా గురవాయిగూడెం శ్రీ మద్ది ఆంజనేయస్వామి ఆలయంలో విశేష పూజలు నిర్వహించారు. భక్తులు అధిక సంఖ్యలో విచ్చేసి 108 ప్రదక్షణలు చేసి, స్వామిని దర్శించి మొక్కుబడులు తీర్చుకున్నారు. స్వామి వారికి అత్యంత ప్రీతికరమైన తమలపాకులతో అష్టోత్తరం పూజలు నిర్వహించారు. దేవస్థానంలోని ఉసిరి చెట్టు వద్ద కార్తీక దీపాలను వెలిగించారు. ఆలయానికి మధ్యాహ్నం వరకు వివిధ సేవల రూపేణా రూ.4,05,550 ఆదాయం వచ్చినట్లు ఈవో ఆర్వీ చందన తెలిపారు. అన్నదాన సత్రంలో సుమారు 7,300 భక్తులు అన్నప్రసాదాన్ని స్వీకరించినట్లు చెప్పారు. ఉంగుటూరు: కడుపు నొప్పి తాళలేక ఓ వివాహిత ఆత్మహత్యకు పాల్పడింది. వివరాల ప్రకారం ఉంగుటూరు మండలం గొల్లగూడెం గ్రామానికి చెందిన వెదురు పావులూరి జీవమణి (33) సోమవారం రాత్రి సమయంలో పురుగుమందు తాగి అనంతరం గ్రామ ఊరచెరువులో పడి మృతి చెందింది. ఆమెకు భర్త శ్రీహరి, ఇద్దరు పిల్లలు ఉన్నారు. జీవమణి కడుపునొప్పి తాళలేక చనిపోయిందని ఆమె కుటుంబ సభ్యులు చెబుతున్నారు. జీవమణి తల్లి నూజివీటి అనుసూయ ఫిర్యాదు మేరకు చేబ్రోలు ఎస్సై సూర్య భగవాన్ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. జంగారెడ్డిగూడెం: కంపెనీలో పనిచేసి అదే కంపెనీ పేరు వచ్చేలా నకిలీ కంపెనీ పెట్టి కొందరిని మోసం చేసిన నేరంపై ఇద్దరు వ్యక్తులను అరెస్టు చేసినట్లు ఎస్సై షేక్ జబీర్ చెప్పారు. తాళ్లపూడి మండలం తిరుగుడుమెట్టకు చెందిన వంకాయల సతీష్, పట్టణానికి చెందిన మండపాక వినోద్కుమార్లను అరెస్టు చేశామన్నారు. వివరాల ప్రకారం.. బొమ్మగాని బాలకృష్ణ ఛైర్మన్గా ఉన్న ఐఎఫ్ఎల్ గ్రీన్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ సంస్ధలో కొంతకాలం వీరంకి శ్రీరాములు, వంకాల సతీష్, మండపాక వినోద్కుమార్ సభ్యులుగా ఉన్నారు. వీరు కంపెనీ నుంచి బయటకు వచ్చి అదే పేరు వచ్చేలా ఇనాకుల ఫార్మర్స్ లైఫ్ ప్రొడ్యూసర్ కంపెనీ లిమిటెడ్ (ఐఎఫ్ఎల్) పేరుతో మరో కంపెనీ ప్రారంభించి బాలకృష్ణ కంపెనీకి చెందిన ఖాతాదారులను, రైతులను మభ్యపెట్టి మోసం చేశారని బాలకృష్ణ గతంలో ఫిర్యాదు చేశారు. దీంతో అప్పట్లో వీరంకి శ్రీరాములను అరెస్టు చేయగా, అతను హైకోర్టు నుంచి ఉత్తర్వులు పొందినట్లు ఎస్సై చెప్పారు. కాగా ఈ కేసులో వంకాయల సతీష్, మండపాక వినోద్కుమార్లను అరెస్టు చేసి కోర్టులో హాజరుపరచగా, కోర్టు రిమాండ్ విధించినట్లు తెలిపారు. -
నీటమునిగిన పంటలు
మరో పది రోజుల్లో వరికోతలు జరగనున్న నేపథ్యంలో పొలాల్లోకి నీరు చేరడంతో రైతుల పరిస్థితి ఇబ్బందికరంగా మారింది. భీమడోలు, దెందులూరు, చింతలపూడి అనేకచోట్ల వరిచేలు నీటమునిగాయి. 2239 ఎకరాల వరిచేలల్లోకి నీరు చేరాయని, మినుము, ఇతర పంటలకు కూడా నష్టం వాటిల్లిందని అధికారులు తెలిపారు. జిల్లా వ్యాప్తంగా 46 చెట్లు నేలకొరగగా, వాటిని యుద్ధప్రాతిపదికన తొలగించారు. కొల్లేరు, ఉప్పుటేరులో ప్రమాదకర స్థాయిలో నీరు చేరింది. 64 ప్రధాన కాల్వల నుంచి కొల్లేరుకు ఉద్ధృతంగా నీరు చేరడంతో నిండుకుండలా మారింది. పెదయడ్లగాడి వంతెన సమీపంలోని పెనమాకలంక రహదారిపై వరద నీరు ప్రవహిస్తోంది. కలిదిండి మండలంలో కోరుకొల్లు, ఎస్ఆర్పీ అగ్రహారం, గుర్వాయిపాలెం, ముదినేపల్లి మండలంలో పలు గ్రామాల్లో చెట్లు నేలకొరిగాయి. మరోవైపు రాష్ట్ర గృహనిర్మాణ, సమాచార పౌర సంబంధాల శాఖ మంత్రి కొలుసు పార్థసారథి నూజివీడులో తుపాను పరిస్థితులపై అధికారులతో సమీక్షించారు. ఏలూరు (ఆర్ఆర్పేట): మోంథా తుపాను ప్రభావంతో బుధవారం అతి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉండటంతో బుధవారం సైతం పాఠశాలలకు సెలవు ప్రకటిస్తున్నట్టు జిల్లా విద్యాశాఖాధికారి ఎం.వెంకట లక్ష్మమ్మ ఒక ప్రకటనలో తెలిపారు. జిల్లా కలెక్టర్ వెట్రిసెల్వి ఆదేశాల మేరకు జిల్లా వ్యాప్తంగా అన్ని యాజమాన్యాల్లోని పాఠశాలలకూ డిజాస్టర్ సెలవుగా ప్రకటించినట్టు స్పష్టం చేశారు. ఉత్తర్వులు మీరి ఎవరైనా పాఠశాలలు నిర్వహిస్తే శాఖాపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. -
కుదించిన బోగీలు.. ప్రయాణికుల అగచాట్లు
ఉంగుటూరు: ఒకప్పటి పాస్టు ప్యాసింజరు.. ప్రస్తుతం విజయవాడ మొము ఎక్సుప్రెస్గా నడుపుతున్న నం.17258 రైలులో బోగీలు తగ్గించేయడంతో రైల్వే ప్రయాణికులకు ప్రయాణం కష్టతరంగా మారింది. గతంలో ఈ రైలులో 13 బోగీలు ఉండగా ప్రస్తుతం వాటిని 7కి పరిమితం చేశారు. దీంతో ప్రయాణికులు నిలబడే ప్రయాణం సాగించాల్సిన పరిస్థితి. బోగీలు తగ్గించేసి గోదావరి జిల్లాల ప్రజలపై రైల్వే శాఖ చిన్నచూపు చూస్తోందంటూ సర్వత్రా విమర్శిస్తున్నారు. అనువైన రైలు.. సౌకర్యాలు లేవు ఈ రైలు కాకినాడలో తెల్లారుజాము 4.10 గంటలకు బయలుదేరి ఉదయం 9 గంటలకు విజయవాడ చేరుతుంది. తిరిగి కాకినాడకు చేరుకునేందుకు సాయంత్రం 6.15కి విజయవాడ నుంచి బయలుదేరుతుంది. దీంతో ఉదయం, సాయంత్రం వేళల్లో అనువైన సమయంలో ఈ రైలు ప్రయాణం ఉండడంతో ఎక్కువమంది ఈ రైలులో ప్రయాణం సాగిస్తుంటారు. ఉదయం వచ్చే రైలులో సామర్లకోట, రాజమండ్రిలోనే ఈ రైలులోని సీట్లు పుల్ అయిపోతుంటాయి. ఆతరువాత నుంచి రైలు ఎక్కిన ప్రయాణికులు నిలబడి ప్రయాణం సాగించాల్సిందే. అలాగే ఈ రైలులో మరుగుదొడ్లు కూడా రెండుకు మించి లేవు. దాంతో అవసరాలకు ఇబ్బందులు తప్పని పరిస్థితి. ఉద్యోగులకు సరైన సమయం ఈ రైలు ఉదయం వేళ గోదావరి, కొవ్వూరు, పశివేదల నిడదవోలు, తాడేపల్లిగూడెం, చేబ్రోలు, పూళ్ల, భీమడోలు, ఏలూరు, పవరుపేట, నూజువీడు స్టేషన్లలో ఆగుతూ విజయవాడ చేరుతుంది. ఉద్యోగస్తులకు సరైన సమయం కావడంతో ఎక్కువగా సీజన్ టికెట్లు తీసుకుని ఈ రైలును ఆశ్రయిస్తున్నారు. అలాగే మార్కెటు పనులమీద వెళ్లేవారికి, దైవక్షేత్రాలకు వెళ్లే వారికి ఈ రైలు చాలా అనుకూలంగా ఉంటుంది. తెలంగాణ, రాయలసీమ, పల్నాడు ప్రాంతాల వైపు వెళ్లే ప్రయాణికులు ఈ రైలు ద్వారా విజయవాడ చేరుకుని అక్కడ నుంచి మరో రైలు పట్టుకుని ప్రయాణం సాగిస్తుంటారు. ఇదే రైలు గుంటూరు కూడా వెళుతుంది. దాంతో ఎక్కువమంది ఈ రైలును ఆశ్రయిస్తుంటారు. ఇలాంటి రైలులో సౌకర్యాలు పెంచాల్సి ఉండగా బోగీలను ఇంకా తగ్గించేయడంపై ప్రయాణికులు తీవ్ర నిరసన వ్యక్తం చేస్తున్నారు. రైలు ప్రయాణికుల బాధలు పట్టించేకునే రైల్వే అధికారులు గానీ, పార్లమెంటు సభ్యులు గాని ఎవరూ లేరా అని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పాస్టుప్యాసింజరుగా పిలుచుకునే మెము ఎక్స్ప్రెస్ రైలులో బోగీల కుదింపు ప్రయాణికులకు తప్పని పాట్లు గోదావరి జిల్లాలపై రైల్వే శాఖ చిన్నచూపు! -
హడలెత్తించిన పొగ
కొయ్యలగూడెం: బయ్యన్నగూడెం సమీపంలోని పవర్ గ్రిడ్ ఎదురుగా ఓ రైతు చేలో నుంచి వచ్చిన పొగ ప్రయాణికులను, సమీపంలోని రైతులను హడలెత్తించింది. జాతీయ ప్రధాన రహదారికి ఆనుకుని పవర్ గ్రిడ్ సమీపంలోని ఎదురుగా ఉన్న మేకల సత్యనారాయణకి చెందిన వ్యవసాయ భూమిలో మంగళవారం మధ్యాహ్నం పెద్ద ఎత్తున దట్టంగా తెల్లని పొగ అలముకుంది. ఆ ప్రాంతంలో గ్యాస్ పైపులైను ఉందని, గ్యాస్ పైప్ లైన్ లీకు కావడం వల్లే పొగ పైకి వస్తోందని ప్రచారం జరిగింది. విషయం తెలుసుకున్న తహసీల్దార్ ఎన్.నాగరాజు వెంటనే డిప్యూటీ తహసీల్దారు వెంకటలక్ష్మి, రెవెన్యూ అధికారులను ఘటనా స్థలానికి పంపారు. సత్యనారాయణ తన పొలంలో ఉన్న మినప పంటను తగలబెట్టడం వల్ల పొగ దట్టంగా కమ్ముకుందని తెలపడంతో అంతా ఊపిరి పీల్చుకున్నారు. -
మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీ
ఏలూరు (ఆర్ఆర్పేట): మున్సిపల్ కార్మికుల సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఐటీయూసీ ఆధ్వర్యంలో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. స్థానిక ఆర్ఆర్ పేట పార్క్ వద్ద నుంచి విజయ విహార్ సెంటర్, రైతు బజార్, శంకర మఠం, సుబ్బమ్మ దేవి స్కూలు, రమా మహల్ సెంటర్ మీదుగా ఈ బైక్ ర్యాలీ సాగింది. అనంతరం మున్సిపల్ వాటర్ సప్లై ఎస్ఆర్ 2 పాయింట్ వద్ద నిరసన ప్రదర్శన చేశారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి సీపీఐ ఏలూరు ఏరియా కార్యదర్శి ఉప్పులూరి హేమ శంకర్, ఏఐటీయూసీ జిల్లా నాయకుడు పీ. కిషోర్, మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (ఏఐటీయూసీ) జిల్లా కార్యదర్శి భజంత్రీ శ్రీనివాస్, ది జోనల్ మున్సిపల్ ఎంప్లాయిస్ యూనియన్ కార్యదర్శి ఏ. అప్పలరాజు మాట్లాడుతూ మున్సిపల్ ఉద్యోగులు, కార్మికులకు రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చిన హామీలు అమలు చేయాలని డిమాండ్ చేశారు. సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం మున్సిపల్ కార్మికులకు ఇంజనీరింగ్ ఉద్యోగులకు కనీస వేతనం రూ. 26వేలు చెల్లించాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల పెండింగ్ డీఏలు, ఇంక్రిమెంట్లు ఇవ్వాలని, 12వ పీఆర్సీని ప్రకటించాలని, మధ్యంతర భృతి 30 శాతం చెల్లించాలని, కూటమి ప్రభుత్వం మున్సిపాలిటీల్లో పనులను ప్రైవేటుకు అప్పగించడాన్ని నిలుపుదల చేయాలని డిమాండ్ చేశారు. మున్సిపల్ ఉద్యోగుల కార్మికుల సమస్యలను రాష్ట్ర ప్రభుత్వం పరిష్కరించకపోతే నవంబర్ 3 నుంచి రాష్ట్రవ్యాప్తంగా నిరవధిక సమ్మెను చేపడుతున్నట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సీపీఐ నాయకులు అడ్డకర్ల లక్ష్మీ ఇందిర, కురెళ్ళ వరప్రసాద్, మున్సిపల్ ఇంజనీరింగ్ ఉద్యోగులు బీ.నారాయణరావు, సీహెచ్.అప్పారావు, డీ. అప్పారావు, డీ.వేంకటేశ్వరరావు, కే.శ్రీనివాసరావు, బీ.దుర్గారావు, ఎస్కే.ఆలీ, పీ.దుర్గారావు, ఎస్.గౌరీ శంకర్, ఎన్.శ్రీనివాసరావు, జీ.రవి, కే.బాల కిషోర్ తదితరులు పాల్గొన్నారు. -
హడలెత్తించిన మోంథా
మున్సిపల్ కార్మికుల బైక్ ర్యాలీ సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ ఏఐటీయూసీ ఆధ్వర్యంలో ఏలూరులో మంగళవారం బైక్ ర్యాలీ నిర్వహించారు. 8లో uకూటమికి బుద్ధొచ్చేలా ప్రజా ఉద్యమం బుధవారం శ్రీ 29 శ్రీ అక్టోబర్ శ్రీ 2025బుట్టాయగూడెం: తుపాను కారణంగా భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఏజెన్సీలోని కొండవాగులు పొంగే ప్రదేశాలను పోలవరం డీఎస్పీ ఎం.వెంకటేశ్వరరావు మంగళవారం పరిశీలించారు. కొండవాగులు పొంగే అవకాశం ఉన్నందున ఎవ్వరూ వాగులు దాటే ప్రయత్నం చెయొద్దని సూచించారు. బుట్టాయగూడెం, జీలుగుమిల్లి మండలాల్లో ఉద్ధృతంగా ప్రవహించే కొండవాగులను సందర్శించిన అనంతరం ఆయన మాట్లాడుతూ మోంథా తుపాను తీవ్రంగా ఉంటుందని వాతావరణ శాఖ చేసిన హెచ్చరికల నేపథ్యంలో ప్రజలు అప్రమత్తంగా ఉండాలన్నారు. జీలుగుమిల్లి సీఐ వెంకటేశ్వరరావు, ఎస్సై క్రాంతికుమార్, సిబ్బంది పాల్గొన్నారు. చింతలపూడి : మోంథా తుపాను ప్రభావంతో కురుస్తున్న వర్షాలకు తమ్మిలేరు రిజర్వాయర్ పూర్తిస్థాయి నీటి మట్టానికి చేరుకుంది. దీంతో మంగళవారం అధికారులు 1200 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం కారణంగా గత రెండు నెలలుగా పడుతున్న భారీ వర్షాలకు తమ్మిలేరు పూర్తిస్థాయి నీటిమట్టానికి చేరుకుంది. తమ్మిలేరు ప్రాజెక్టు నీటిమట్టం ప్రస్తుతం 347.45 అడుగులకు చేరుకుందని తమ్మిలేరు ఇరిగేషన్ ఏఈ లాజరుబాబు తెలిపారు. ప్రస్తుతం ప్రాజెక్టులోకి 100 క్యూసెక్కుల వరద నీరు ప్రవహిస్తోందన్నారు. ప్రాజెక్టులో 350 అడుగుల వరకు నీటిని నిల్వ చేసుకోవచ్చనని అధికారులు చెప్పారు. మంగళవారం రాత్రి, బుధవారం భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారుల హెచ్చరికల నేపథ్యంలో వరద పరిస్థితిని ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నట్టు డీఈ తెలిపారు. పెనుగొండ: తుపాను ప్రభావిత ప్రాంతాల్లో వైఎస్సార్ సీపీ శ్రేణులు సహాయక చర్యల్లో పాల్గొనాలని మాజీ మంత్రి, వైఎస్సార్సీపీ అడ్వైజరీ కమిటీ సభ్యుడు చెరుకువాడ శ్రీరంగనాథరాజు మంగళవారం సూచించారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని కోరారు. ఈదురుగాలుల బీభత్సం అధికంగా ఉండడంతో రక్షణ చర్యలు తీసుకోవాలన్నారు. సాక్షి ప్రతినిధి, ఏలూరు : మోంథా తుపాను ప్రభావంతో వీచిన ఈదురుగాలులు.. కురిసిన వర్షపు జల్లులతో జిల్లా తడిసి ముద్దయ్యింది. మంగళవారం మధ్యాహ్నం నుంచి తుపాను తీరాన్ని సమీపిస్తుండటంతో బలమైన ఈదురుగాలులు వీచాయి. ఉమ్మడి పశ్చిమగోదావరి జిల్లా సమీపంలోని బియ్యపుతిప్ప వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో అధికార యంత్రాంగం ఆమేరకు ముందస్తు రక్షణ చర్యలు చేపట్టింది. మరోవైపు జిల్లాలోని కొల్లేరు, ఉప్పుటేరు ప్రమాదకర స్థాయిలో ప్రవహిస్తున్నాయి. ఈదురుగాలుల ధాటికి జిల్లాలోని అనేక చోట్ల చెట్లు కూలిపోయాయి. పునరావాస కేంద్రాలకు 1203 మంది తరలింపు మోంథా తుఫాన్ ప్రభావం జిల్లాలో బలంగా ఉంది. 13 మండలాల్లో భారీ ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని జిల్లా యంత్రాంగం ముందస్తుగా ప్రకటించి అక్కడ అవసరమైన రక్షణ చర్యలు చేపట్టింది. మంగళవారం సాయంత్రం 6.30 గంటల వరకు జిల్లాలో 201.4 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. తుపాను తీవ్రత నేపథ్యంలో బుధవారం జిల్లా వ్యాప్తంగా విద్యాసంస్థలకు సెలవు ప్రకటించారు. జాతీయ రహదారులు సహా జిల్లాలో ప్రధాన రహదారులపై వాహనాల రాకపోకలు నిలిపివేశారు. అధికారిక లెక్కల ప్రకారం జిల్లాలో 13 మండలాల్లో 29 గ్రామాలు తుపాను ధాటికి నష్టపోయాయని, 1203 మంది 49 పునరావాస కేంద్రాల్లో ఉన్నారని, జిల్లాలో ఇప్పటి వరకు ఎటువంటి ఆస్తి నష్టం సంభవించలేదని, ఆర్అండ్బీ రహదారులు 3.5 మీటర్ల మేర ధ్వంసమయ్యాయని అధికారులు ప్రభుత్వానికి నివేదిక పంపారు. పునరావాస కేంద్రాల్లో 1122 ఆహార పొట్లాలు, 4500 వాటర్ ప్యాకెట్లు అందుబాటులో ఉంచారు. ఇక ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ కై కలూరు నియోజకవర్గంలోని మండవల్లి మండలం మణుగూరులో పర్యటించి కొల్లేరు పెద యడ్లగాడి వంతెనను, ఉప్పుటేరును పరిశీలించారు. అధికారుల ఏర్పాట్లు.. మంగళవారం రాత్రి నర్సాపురం సమీపంలోని బియ్యపుతిప్ప వద్ద తుపాను తీరం దాటే అవకాశం ఉండటంతో జిల్లాలో 100 నుంచి 110 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులతో కూడిన వర్షం కురిసే అవకాశం ఉందని, ముందస్తు ఏర్పాట్లలో భాగంగా ముంపు ప్రాంతాల్లో ఉన్నవారందరినీ పునరావాస కేంద్రాలకు తరలించాలని కలెక్టర్ ఆదేశించారు. కలెక్టరేట్లోని కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని సమీక్షిస్తూ గ్రామ, వార్డు సచివాలయ సిబ్బందితో టెలీ కాన్ఫరెన్స్ నిర్వహించారు. కై కలూరు, ఉంగుటూరు, నూజివీడుకు ఎన్డీఆర్ఎఫ్ బృందాలను పంపారు. జిల్లాలో ప్రమాదకర స్థాయిలో ఉన్న చెరువుల వద్ద పోలీస్ పికెట్ ఏర్పాటు చేశారు. అవసరమైనచోట్ల చెరువులకు గండికొట్టేలా ఆదేశాలిచ్చారు. బుట్టాయగూడెం: దేశ రాజకీయ చరిత్రలో ఏ ప్రభుత్వంలో జరగని ప్రజా ఉద్యమం కూటమి ప్రభుత్వంలో మొదలైందని వైఎస్సార్సీపీ పోలవరం నియోజకవర్గ సమన్వయకర్త, మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు అన్నారు. మండలంలోని కోయరాజమండ్రి పంచాయతీ మెట్టగూడెంలో మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా మంగళవారం రచ్చబండ, కోటి సంతకాల కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్న ఆయన మాట్లాడుతూ బ్రిటిష్ కాలం నుంచి 2019 వరకు కేవలం 12 మెడికల్ కాలేజీలు మాత్రమే ఉండేవని గుర్తు చేశారు. ఐదేళ్ళ జగనన్న పాలనలో కరోనా వంటి విపత్కర పరిస్థితులు ఎదురైనప్పటికీ కేవలం రెండేళ్లలోనే 17 మెడికల్ కాలేజీలను తీసుకువచ్చి అందులో 7 కాలేజీలను పూర్తి చేసి అడ్మిషన్ల దశకు తీసుకువచ్చారని చెప్పారు. మిగిలిన 10 మెడికల్ కాలేజీలు వివిధ దశల్లో పూర్తయ్యాయని తెలిపారు. వీటి పనులు పూర్తవ్వడానికి కేవలం రూ.5 వేల కోట్లు ఖర్చవుతుందన్నారు. ఈ కళాశాలలు పూర్తయితే పేదలందరికీ మెరుగైన వైద్యం అందడంతో పాటు పేద విద్యార్థులు ఉచితంగా వైద్య విద్యను అభ్యసించగలరని చెప్పారు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఏడాదిన్నర కాలంలో ఈ కళాశాలల పనులు చేపట్టడంలో పూర్తి నిర్లక్ష్యం వహించిందని విమర్శించారు. మెడికల్ కాలేజీలను ప్రైవేటీకరణ చేసేందుకు కుట్ర పన్నిందన్నారు. కూటమి ప్రభుత్వ నిర్ణయానికి వ్యతిరేకంగా కోటి సంతకాల కార్యక్రమం ప్రారంభమైందని చెప్పారు. కూటమి ప్రభుత్వం మెడలు వంచైనా ప్రైవేటీకరణను అడ్డుకుంటామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో వైస్ ఎంపీపీ గగ్గులోతు మోహన్రావు, వైఎస్సార్సీపీ నాయకులు బానోతు బాబూరావు, బానోతు కృష్ణనాయక్, కుర్సం ప్రసాద్, తెల్లం రాజు పాల్గొన్నారు. మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా కోటి సంతకాలు మాజీ ఎమ్మెల్యే తెల్లం బాలరాజు తుపాను ప్రభావంతో భారీ ఈదురుగాలులు, వర్షాలు అనేక మండలాల్లో నేలకొరిగిన చెట్లు వేలాది ఎకరాల్లో వరి, మినుముకు అపార నష్టం ప్రమాదకర స్థాయిలో ఉప్పుటేరు, కొల్లేరు ప్రవాహం 13 మండలాల్లో కొనసాగుతున్న హై అలెర్ట్ భారీ వాహనాలను ఎక్కడికక్కడ నిలిపివేసిన వైనం తుపాను ప్రభావంతో నేడు విద్యా సంస్థలకు సెలవు జిల్లా వ్యాప్తంగా అనేక చోట్ల విద్యుత్ సరఫరా నిలిపివేత -
గుంతల రోడ్లపై పెల్లుబికిన ప్రజాగ్రహం
ఏలూరు (ఆర్ఆర్పేట): గుంతల రోడ్లపై ప్రజాగ్రహం పెల్లుబికింది. రోడ్లకు మరమ్మతులు చేయలేరా అంటూ ఏలూరులోని వంగాయగూడెం ప్రాంత ప్రజలు మంగళవారం రోడ్డెక్కి నిరసన తెలిపారు. మోంథా తుపాను ప్రభావంతో ఏలూరు నగరంలో ఉదయం నుంచి వర్షం కురుస్తున్నా లెక్కచేయకుండా కూటమి ప్రభుత్వ తీరును ఎండగట్టారు. ఏలూరు నుంచి పెదపాడు వెళ్లే ప్రధాన మార్గంగా ఉపయోగపడుతున్న వంగాయగూడెం – కేన్సర్ ఆసుపత్రి రోడ్డులో ప్రమాదకర గుంటలు ఏర్పడి, ప్రజల ప్రాణాలను ప్రమాదంలోకి నెడుతున్నా అధికార యంత్రాంగం నిర్లక్ష్యంగా వ్యవహరించడం స్థానికుల్లో తీవ్ర ఆగ్రహానికి గురిచేసింది. ప్రత్యేకంగా ఈ ప్రాంతంలో షెడ్యూల్డ్ కులాలకు చెందిన ప్రజలు అధిక సంఖ్యలో నివసిస్తుండగా, గత ఏడాది నుంచి రోడ్డు మరమ్మతులు చేపట్టకుండా వదిలివేయడంతో వర్షాలు మొదలైనప్పుడల్లా రహదారి మొత్తం బురద గుంటలుగా మారుతోంది. చిన్న వాహనాలు, టూ–వీలర్ ప్రయాణికులు మరింత ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఆరోగ్యపరమైన అత్యవసర తరుణాల్లో కేన్సర్ ఆసుపత్రికి వెళ్లే రోగుల ప్రయాణం కూడా ప్రాణాంతకంగా మారుతోందని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. వంగాయగూడెం మాత్రమే కాకుండా, ఏలూరులోని హనుమాన్ నగర్ నుంచి కొత్తూరు వెళ్తున్న కాలువ పక్క రోడ్డుతో పాటు అనేక కనెక్టింగ్ రోడ్లు కూడా ఇదే దుస్థితిలో ఉన్నాయని నివాసితులు వాపోయారు. పూర్తి స్థాయిలో రోడ్డు వేయలేకపోయినా కనీసం గుంటలను కూడా పూడ్చలేరా అని ప్రజలు నిలదీస్తున్నారు. స్థానికులు రోడ్డుపైకి వచ్చి ధర్నా చేయడంతో అటువైపు ట్రాఫిక్ భారీగా నిలిచిపోయింది. ఈ విషయం తెలుసుకుని అక్కడికి వచ్చిన పోలీసులు వారిని వారించి ధర్నా విరమించాలని సూచించినా వారు నిరాకరించారు. కొంతసేపు ధర్నా నిర్వహించిన అనంతరం అధికార యంత్రాంగం అంతా తుపాను విధుల్లో ఉన్నట్టు తెలుసుకుని తాత్కాలికంగా ధర్నాను విరమించారు. తుఫాను ప్రభావం ముగిసిన అనంతరం అధికారులు తమ సమస్య పరిష్కరించకుంటే రోజంతా ధర్నా చేస్తామని హెచ్చరించారు. -
సమన్వయంతో పనిచేయాలి
ఏలూరు(మెట్రో): విపత్తు నిర్వహణ విధుల్లో అధికారులు సమన్వయంతో, సమర్థవంతంగా పనిచేయాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్ నుంచి కలెక్టర్ కె.వెట్రిసెల్వితో కలసి అత్యవసర సమీక్ష సమావేశాన్ని ఆయన నిర్వహించారు. మండలాల వారీగా అధికారులతో తుపాను ప్రభావం, పునరావాస కేంద్రాల నిర్వహణ, రక్షణ ఏర్పాట్లు వంటి అంశాలపై సమీక్షించారు. తుపాను తీరం దాటే సమయంలో విపరీతమైన వేగంతో గాలులతో కూడిన భారీ వర్షాలు కురుస్తాయని, ఫోన్ కాల్స్కి స్పందించి సహాయ కార్యక్రమాలను అందించాలని చెప్పారు. -
పారా షూటింగ్లో సిల్వర్ మెడల్
అత్తిలి: పారా షూటింగ్లో అత్తిలికి చెందిన యడ్లపల్లి సూర్యనారాయణ సిల్వర్ మెడల్ సాధించినట్టు పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ ఆంధ్రప్రదేశ్ కార్యదర్శి వి రామస్వామి ప్రకటనలో తెలిపారు. విజయవాడ ది ఇండియన్ అకాడమీ ఆఫ్ షూటింగ్ స్పోర్ట్ వారి సహకారంతో పారా స్పోర్ట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ఆధ్వర్యంలో 4వ రాష్ట్ర పారా షూటింగ్ చాపియన్ షిప్ –2025లో ఎస్హెచ్ – సిట్టింగ్ విభాగంలో సూర్యనారాయణ ఈ ప్రతిభ సాధించారన్నారు. షూటింగ్ అకాడమీ డైరెక్టర్, చీఫ్ కోచ్ ఎన్.సుబ్రహ్మణ్యశ్వరరావు, అసోసియేషన్ సభ్యులు కె.దయానంద్ చేతుల మీదుగా సూర్యనారాయణ మెమొంటో, సర్టిఫికెట్ అందుకున్నారు. పారా స్పోర్ట్స్లో దివ్యాంగులు ఉన్నతస్థాయికి చేరుకునేలా కృషి చేస్తున్న రాష్ట్ర గ్రంథాలయాల శాఖా చైర్మన్ పారా స్పోర్ట్స్ అసోసియేషన్ అఫ్ అంద్రప్రదేశ్ అధ్యక్షుడు గోనుకుంట్ల కోటేశ్వరరావు, కార్యదర్శి రామస్వామికి సూర్యనారాయణ కృతజ్ఞతలు తెలిపారు. -
లారీ ఢీకొని భార్యాభర్తలకు గాయాలు
చింతలపూడి: లారీ ఢీకొని భార్యాభర్తలు గాయపడిన ఘటన చింతలపూడి మండలం, ప్రగడవరం గ్రామ శివారులో మంగళవారం చోటుచేసుకుంది. వివరాల ప్రకారం కామవరపుకోట మండలం, దొండపాటివారి గ్రామానికి చెందిన భార్యాభర్తలు తాడిగడప రాజారావు, జ్యోతి వైద్యం నిమిత్తం చింతలపూడి ఆసుపత్రికి వచ్చి తిరిగి స్వగ్రామం వెళుతుండగా కామవరపుకోట వైపు నుంచి చింతలపూడి వస్తున్న పామాయిల్ లోడ్ లారీ రాంగ్ రూట్లో వచ్చి వీరి ద్విచక్ర వాహనాన్ని ఢీకొంది. ఈ ప్రమాదంలో రాజారావు, జ్యోతిలకు తీవ్ర గాయాలయ్యాయి. ఎస్సై కె రమేష్ రెడ్డి ఘటనా స్ధలానికి చేరుకుని గ్రామస్తుల నుంచి సమాచారం సేకరించారు. లారీ డ్రైవర్ పరారు కావడంతో కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు తెలిపారు. ఆపదలో రాని 108.. వైఎస్సార్ సీపీ నేత సాయం క్షతగాత్రులను ఆస్పత్రికి తరలించేందుకు 108కి ఎన్నిసార్లు ఫోన్ చేసినా రాలేదు. అదే సమయంలో అటువైపు వెళుతున్న వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు ఎస్ రమేష్రెడ్డి స్పందించి స్థానికుల సహకారంతో తన వాహనంలో క్షతగాత్రులను ప్రభుత్వ ఆసుపత్రిలో చేర్చారు. -
కై కలూరు, పెదపాడుపై ప్రత్యేక దృష్టి
ఆస్తి, ప్రాణనష్ట నివారణకు చర్యలు: ఎస్పీ శివకిషోర్ ఏలూరు టౌన్: మోంఽథా తుపాను సమర్థవంతంగా ఎదుర్కొని ఆస్తి, ప్రాణనష్టాన్ని సాధ్యమైనంత మేర నివారించేందుకు శక్తివంచన లేకుండా కృషి చేయాలని, ముఖ్యంగా కై కలూరు, పెదపాడు ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి సారించామని జిల్లా ఎస్పీ కొమ్మి ప్రతాప్ శివకిషోర్ చెప్పారు. ఏలూరు జిల్లాలో తొలిసారిగా.. ఏలూరు డిస్ట్రిక్ట్ రెస్పాన్స్ ఫోర్స్(ఈడీఆర్ఎఫ్) బృందాలను ఏర్పాటు చేసినట్లు ఆయన చెప్పారు. ఈడీఆర్ఎఫ్లో ప్రత్యేక శిక్షణ పొందిన సిబ్బంది ఉన్నారని చెప్పారు. తుపాను ప్రభావిత ప్రాంతాలల్లో డ్రోన్ కెమెరాలతో నిత్యం పర్యవేక్షించేలా చర్యలు తీసుకున్నామని తెలిపారు. అత్యవసర సేవలకు 112కు కాల్ చేయాలన్నారు. ఏలూరు నగరం, ఇతర ముఖ్య పట్టణాల్లో పెద్ద హోర్డింగ్లు వెంటనే తొలగించేందుకు చర్యలు చేపట్టాలని ఆదేశించారు. యజమానిదే బాధ్యత కై కలూరు: చేపలు, రొయ్యల చెరువులపై కపాలాదారులుగా పనిచేస్తున్న కుటుంబాలకు మోంథా తుపానులో ప్రమాదం జరిగితే పూర్తి బాధ్యత చెరువుల యాజమానులే భరించాల్సి వస్తుందని ఎస్పీ హెచ్చరించారు. కై కలూరు, కలిదిండి మండలాల్లో సోమవారం ఆయన పర్యటించారు. ఎస్డీఆర్ఎఫ్, ఈడీఆర్ఎఫ్ బృందాలకు పలు సూచనలు చేశారు. జిల్లాలో కలిదిండి, ముదినేపల్లి, మండవల్లి, నూజివీడు, పెదవేగి మండలాల్లో అత్యధిక వర్షం కురిసే అవకాశం ఉందన్నారు. ప్రజలు ఎవరూ ఇళ్లు వదిలి బయటకు రావద్దన్నారు. రోడ్లు సమీపంలో హోర్డింగ్లు, ఫ్లెక్సీలు తొలగించాలన్నారు. నూజివీడు పెద్ద చెరువు పరిశీలన నూజివీడు: భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున నూజివీడులోని పెద్దచెరువుకు వరదను ఎప్పటికప్పుడు బయటకు పంపేంలా చర్యలు తీసుకోవాలని ఎస్పీ కొమ్మి ప్రతాప శివ కిషోర్ పేర్కొన్నారు. పట్టణంలోని పెద్దచెరువు, మొఘల్ చెరువును సబ్కలెక్టర్ బొల్లిపల్లి వినూత్నతో కలిసి సోమవారం ఆయన పరిశీలించారు. కట్టలు బలహీనంగా ఉన్నచోట ఇసుక బస్తాలు వేయాలని, అదనంగా సిద్ధంగా ఉంచుకోవాలన్నారు. కనకదుర్గమ్మ ఆలయం వద్ద గృహాలు ముంపుకు గురయ్యే ప్రమాదం ఉంటే వెంటనే అక్కడి వారిని పునరావాస కేంద్రాలకు తరలించాలన్నారు. వరద పెరిగినప్పుడు దిగవ ప్రాంతాల వారిని అప్రమత్తం చేయాలన్నారు. -
అధికారులు అప్రమత్తంగా ఉండాలి
ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ ఏలూరు(మెట్రో): తుపాను కారణంగా ప్రాణ, ఆస్తి నష్టం కలగకుండా అప్రమత్తంగా ఉండి పటిష్ట చర్యలు చేపట్టాలని జిల్లా ఇన్చార్జి మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు. కలెక్టరేట్లో జిల్లా తుపాను ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే, కలెక్టరు కె.వెట్రిసెల్వి, ఎస్పీ కె.శివ కిషోర్, జాయింటు కలెక్టర్ ఎంజే అభిషేక్, ఎంపీ పుట్టా మహేష్ కుమార్, ఎమ్మెల్యే బడేటి చంటి, జిల్లా అధికారులతో కలిసి సమీక్షించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రమాదం తగ్గే వరకు మండల, నియోజకవర్గ ప్రత్యేక అధికారులు క్షేత్రస్థాయిలోనే ఉండి సహాయక చర్యలను పర్యవేక్షించాలని ఆదేశించారు. లోతట్టు ప్రాంతాల ప్రజలను సహాయక కేంద్రాలకు తరలించాలన్నారు. సహాయక కేంద్రాలలో వైద్య శిబిరాలు ఏర్పాటుచేసి, మందులు సిద్ధంగా ఉంచాలన్నారు. రైతు సేవా కేంద్రాల్లో టార్ఫాలిన్ సిద్ధం చేశామని రైతులకు అందజేయాలని అన్నారు. ముఖ్యమంత్రి సూచనతో పౌర సరఫరాల శాఖ తరఫున అన్ని ఏర్పాట్లు పూర్తి చేసామన్నారు. జిలాల్లోని 583 రేషన్ షాపులలో ప్రజలకు అవసరమైన నిత్యావసర సరుకులు, ఆహార ధాన్యాలను సిద్ధం చేశామన్నారు. మిగిలిన రేషన్ షాపులలో రేపు మధ్యాహ్నానికి పూర్తి స్థాయిలో నిల్వ చేస్తామన్నారు. రైతు పండించిన ప్రతీ ధాన్యం గింజను ప్రభుత్వం కొనుగోలు చేస్తుందని, రైతులు అధైర్యపడొద్దన్నారు. ప్రజలు అప్రమత్తంగా ఉండాలి తుపాను ప్రభావంతో పెను గాలులతో పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ప్రజలు, అధికారులందరూ అప్రమత్తంగా ఉండాలని ప్రత్యేక అధికారి కాంతిలాల్ దండే చెప్పారు. కలెక్టరేట్లో తుపాను ముందస్తు జాగ్రత్త చర్యలపై కలెక్టర్, జాయింట్ కలెక్టర్తో కలిసి మాట్లాడారు. -
కడలి అల్లకల్లోలం
నరసాపురం: నరసాపురం తీరప్రాంతంలో సముద్రం అల్లకల్లోలంగా ఉంది. సోమవారం తెల్లవారుజాము నుంచి ఎడతెరిపిలేని వర్షం పడింది. తీరం పొడవునా సముద్రం 50 మీటర్లు మేర ముందుకు చొచ్చుకు వచ్చింది. ఆదివారం రాత్రి నుంచి తీరం వెంట సముద్ర అలల తీవ్రత ఎక్కువగానే ఉంది. నరసాపురం, మొగల్తూరు మండలాలల్లో 19 కిలోమీటర్లు మేర సముద్ర తీరం విస్తరించి ఉంది. నరసాపురం మండలం చినమైనవానిలంక, పెదమైనవానిలంక, మొగల్తూరు మండలంలో పేరుపాలెం బీచ్ల్లో ఒక్కసారిగా పరిస్థితి మారింది. పేరుపాలెం బీచ్లో ఏర్పాటు చేసిన వైఎస్సార్ విగ్రహం సమీపం వరకూ కెరటాలు చొచ్చుకు వస్తున్నాయి. జంగారెడ్డిగూడెం: మోంథా తుఫాను ప్రభావంతో ఆకస్మిక వరదలు సంభవించే అవకాశం ఉన్నందున కేకేఎం ఎర్రకాలువ జలాశయాన్ని ఇరిగేషన్ అధికారులు సోమవారం పరిశీలించారు. ఒక్కసారిగా వచ్చే వరద ప్రవాహాన్ని తట్టుకునేలా ముందస్తుగానే జలాశయం నుంచి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు. ప్రస్తుతం జలాశయంలోకి 900 క్యూసెక్కులు నీరు వచ్చి చేరుతుండగా, దిగువకు 3,500 క్యూసెక్కులు విడుదల చేస్తున్నట్లు డీఈ సునీత, ఏఈ రాహుల్ భాస్కర్లు తెలిపారు. జలాశయం సామర్థ్యం 83.50 మీటర్లు కాగా, ప్రస్తుతం 82.30 మీటర్లు ఉన్నట్లు తెలిపారు. మండలంలోని పంగిడిగూడెం వద్ద ఉన్న ఎర్రకాలువ ప్రవాహాన్ని సోమవారం ఆర్డీవో ఎంవీ రమణ పరిశీలించారు. జలాశయం నుంచి ముందస్తుగా నీరు వదులుతున్న నేపథ్యంలో ఎర్రకాలువ కాజ్వే పై నుంచి రాకపోకలు సాగించకుండా చర్యలు తీసుకున్నారు. చినమైనవానిలంకలో పాత తుపాను షెల్టర్ బిల్డింగ్ సమీపం వరకూ సముద్రం చొచ్చుకు వచ్చింది. పెదలంక, తూర్పుతాళ్లు, మోళ్లపర్రు ప్రాంతాల్లో సముద్రగట్టు కోతకు గురైంది. మంగళవారం కాకినాడ పరిసర ప్రాంతాల్లో తుపాను తీరం దాటే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించడంతో అధికార యంత్రాంగం అప్రమత్తమైంది. దీంతో నరసాపురం, మొగల్తూరు మండలాల్లో దాదాపు 25 గ్రామాలపై తుపాన్ ప్రభావం ఉండొచ్చని అధికారులు గుర్తించారు. జంగారెడ్డిగూడెం: వర్జీనియా ధర ఆల్ టైం రికార్డు ధర పలికింది. కేజీ రూ.454 పలికి వేలం ప్రక్రియలోనే చరిత్ర సృష్టించింది. సోమవారం ఉమ్మడి పశ్చిమ గోదావరి జిల్లాలోని ఎన్ఎల్ఎస్ ఏరియా పరిధిలోని ఐదు వర్జీనియా వేలం కేంద్రాల్లో వేలం ఉత్సాహంగా సాగింది. గోపాలపురం వర్జీనియా వేలం కేంద్రంలో ధర రూ.454 పలికి కొత్త రికార్డు సృష్టించింది. ఇటీవల అత్యధికంగా రూ.430 లభించింది. ఆ తరువాత పడిపోయి రూ.420, రూ.415 వరకు దిగజారింది. వేలం చివరి దశకు వచ్చే సరికి మళ్లీ రికార్డు ధర నమోదైంది. గత ఏడాది అత్యధికంగా రూ.411 ధర పలకగా, ఆ ఏడాది ఎన్ఎల్ఎస్ పరిధిలో సరాసరి ధర రూ.300 వచ్చింది. దీంతో రైతులు ఉత్సాహంగా వర్జీనియా సాగు చేశారు. ఈ ఏడాది మొదట్లో చాలా నిరాశగా ప్రారంభమైంది. కేజీ ధర రూ.290 పలకడంతో ఒక దశలో రైతులు అసంతృప్తి వ్యక్తం చేశారు. తరువాత క్రమంగా ఈ ధర రూ.390 వరకు పెరిగి తరువాత తగ్గుతూ రూ.350కు చేరుకుంది. ఈ ధర వద్దే ఎక్కువ కాలం వేలం ప్రక్రియ కొనసాగింది. సెప్టెంబర్ 1 నుంచి మళ్లీ పెరుగుతూ ధర రూ.430కు చేరుకుంది. ఏలూరు రూరల్: తుపాను కారణంగా ఈ నెల 29న అల్లూరి సీతారామరాజు స్టేడియంలో తలపెట్టిన సివిల్ సర్వీస్ క్రీడా జట్ల ఎంపిక పోటీలు వాయిదా వేసామని డీఎస్డీఓ ఎస్ఏ అజీజ్ ఓ ప్రకటనలో తెలిపారు. ఎంపిక వివరాలను త్వరలో వెల్లడిస్తామన్నారు. -
కార్తీక శోభ
బినామీలకు దోచిపెట్టేందుకే ప్రైవేటీకరణ కార్తీక మాసం మొదటి సోమవారం జిల్లాలోని శివాలయాలు శివనామస్మరణతో మార్మోగాయి. భీమవరం పంచారామక్షేత్రంలో ఉమాసోమేశ్వరస్వామికి విశేష పూజలు నిర్వహించారు. పాలకొల్లు క్షీరారామలింగేశ్వర స్వామి ఆలయంలో తెల్లవారుజాము నుంచే మహన్యాసపూర్వక రుద్రాభిషేకాలు, పంచామృతాభిషేకాలు నిర్వహించారు. ఈ రెండు క్షేత్రాలకు జిల్లా నలుమూలతో పాటు ఇతర జిల్లాల నుంచి యాత్రికులు భారీగా తరలిరావడంతో ప్రత్యేక క్యూలైన్లు ఏర్పాటు చేశారు. ద్వారకా తిరుమల శివాలయం, మద్ది క్షేత్రంలో ప్రత్యేక పూజలు చేశారు. – సాక్షి నెట్వర్క్ ముంచుకొస్తున్న మోంథా


