పే స్కేల్‌ అమలు చేయాలి | - | Sakshi
Sakshi News home page

పే స్కేల్‌ అమలు చేయాలి

Feb 19 2026 10:00 AM | Updated on Feb 19 2026 10:00 AM

పే స్కేల్‌ అమలు చేయాలి

పే స్కేల్‌ అమలు చేయాలి

పే స్కేల్‌ అమలు చేయాలి

భీమవరం: గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం సీఐటీయు ఆధ్వర్యంలో గ్రామ రెవెన్యూ సహాయకులకు తెలంగాణలో మాదిరిగా పేస్కేలు అమలు చేయాలని జిల్లా కమిటీ ఆధ్వర్యంలో బుధవారం కలెక్టర్‌కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా ప్రధాన కార్యదర్శి పిల్లి సుబ్బారావు, గౌరవ అధ్యక్షుడు ఎం.ఆంజనేయులు మాట్లాడుతూ గ్రామ రెవెన్యూ సహాయకుల సంఘం రాష్ట్ర కమిటీ పిలుపులో భాగంగా కలెక్టర్‌కు వినతిపత్రం అందజేశామని అన్నారు. ప్రభుత్వం చేపట్టే అన్ని కార్యకలాపాలలో క్షేత్రస్థాయిలో కీలక పాత్ర పోషిస్తున్న వీఆర్‌ఏలు కనీస వేతనాలు లేక పెరిగిన ధరలతో తీవ్ర ఇబ్బందులలో ఉన్నారని అన్నారు. ప్రమోషన్ల పేరుతో హడావుడి చేసిన ప్రభుత్వం ప్రమోషన్లు ఇవ్వడానికి అభ్యంతరాల పేరుతో మధ్యలోనే ఆగిపోయిందని అన్నారు. పని ఒత్తిడి, ఆర్థిక ఇబ్బందులు ఉన్నప్పటికీ అదనపు డ్యూటీలు కూడా వీఆర్‌ఏలపై మోపుతున్నారని అన్నారు. ఈ సమస్యలు పరిష్కరించమని శాంతియుతంగా అడుగుతున్నప్పటికీ ప్రభుత్వం స్పందించకపోవడం అన్యాయమని అన్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement